President Rule
-
మణిపూర్ సంక్షోభం.. కేంద్రం కీలక ఆదేశాలు
న్యూఢిల్లీ: సంక్షోభంలో ఉన్న మణిపూర్కు కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. జనసంచారంపై ఉన్న ఆంక్షలను ఎత్తేయాలని.. మార్చి 8వ తేదీ నుంచి ఆ రాష్ట్రంలో సాధారణ స్థితి నెలకొల్పాల్సిందేనని స్పష్టం చేసింది. ఈ మేరకు ఇవాళ జరిగిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో హోం శాఖ మంత్రి అమిత్ షా(Amit Shah) సంబంధిత ఆదేశాలను జారీ చేశారు.మార్చి 8వ తేదీ నుంచి మణిపూర్(Manipur)లో అన్ని రోడ్లపై ప్రజలు స్వేచ్ఛగా తిరగాలి. ఎవరైనా జనసంచారానికి ఆటంకం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకోండి అని అమిత్ షా మణిపూర్ అధికార యంత్రాంగానికి సూచించారు. మణిపూర్లో రాష్ట్రపతి విధింపు తర్వాత.. అక్కడి శాంతి భద్రతలపై జరిగిన తొలి సమీక్షా సమావేశం ఇదే కావడం గమనార్హం.ఈ సమావేశానికి మణిపూర్ గవర్నర్ అజయ్ కుమార్ భల్లా(Ajay Kumar Bhalla), ఇతర ఉన్నతాధికారులు, సైన్యం.. పారామిలిటరీ తరపున ప్రతినిధులు హాజరయ్యారు. 2023 మే నుంచి ఈ ఈశాన్య రాష్ట్రంలో తెగల వైరంలో అల్లకల్లోల పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అక్కడ సాధారణ పరిస్థితులు నెలకొనేలా ప్రయత్నాలను కేంద్రం ఇప్పుడు ముమ్మరం చేసింది.దాదాపు రెండేళ్లుగా జాతుల మధ్య వైరంతో రగులుతున్న మణిపుర్లో కల్లోల పరిస్థితుల నేపథ్యంలో.. ఇటీవల ఫిబ్రవరి 13వ తేదీన సీఎం బీరెన్ సింగ్ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. దీంతో అక్కడ రాష్ట్రపతి పాలన విధించిన కేంద్ర ప్రభుత్వం అధికారాలన్నింటినీ అక్కడి గవర్నర్కు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే కల్లోల పరిస్థితులను ఆసరాగా చేసుకుని భద్రతా బలగాలకు చెందిన ఆయుధాలను కొందరు ఎత్తుకెళ్లారు. ఈ నేపథ్యంలో.. అక్కడి ప్రజలకు గవర్నర్ అజయ్ కుమార్ భల్లా కీలక విజ్ఞప్తి చేశారు. తమ వద్ద ఉన్న అక్రమ ఆయుధాలు, పేలుడు పదార్థాలను ఏడు రోజుల్లోగా అప్పగించాలని అన్ని వర్గాల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. నిర్ణీత సమయంలోగా ఆయుధాలను తిరిగి ఇస్తే ఎలాంటి చర్యల ఉండవని.. లేదంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. -
రాష్ట్రపతి పాలన తొలిగా ఏ రాష్ట్రంలో ఎందుకు విధించారు?
ఇంఫాల్: మణిపూర్లో గురువారం(ఫిబ్రవరి 15) నుంచి రాష్ట్రపతి పాలన విధించారు. దీనికిముందు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్ తన పదవికి రాజీనామా చేశారు. ఈ నేపధ్యంలో రాష్ట్రంలో రాజకీయ అనిశ్చితి నెలకొంది. మణిపూర్లో అధికార భారతీయ జనతా పార్టీ (బీజేపీ) కొత్త నేత విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకోనందున రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించారు. దేశంలో ఎటువంటి పరిస్థితుల్లో రాష్ట్రపతి పాలన విధిస్తారనే విషయానికొస్తే..రాజ్యాంగాన్ని అమలు చేసే యంత్రాంగం విఫలమైనప్పుడు ఏ రాష్ట్రంలోనైనా రాష్ట్రపతి పాలన(President's rule) విధించవచ్చని రాజ్యాంగంలోని ఆర్టికల్ 356 చెబుతోంది. అలాగే ఆర్టికల్ 356 ప్రకారం కేంద్ర ప్రభుత్వం ఏ రాష్ట్ర ప్రభుత్వాన్నయినా తొలగించి, ఆ రాష్ట్రాన్ని తన ఆధీనంలోకి తీసుకునే అవకాశం ఉంది. రాష్ట్రపతి పాలన విధించడానికి రెండు ప్రధాన కారణాలు ఉన్నాయి. ఏదైనా రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగం ప్రకారం పరిపాలించలేని స్థితిలో ఉన్నప్పుడు లేదా ఏదైనా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ సూచనలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైనప్పుడు కేంద్రం ఆ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించేందుకు అవకాశం ఉంది. 1950లో రాజ్యాంగం అమలులోకి వచ్చిన తర్వాత నుంచి కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్ 356(Article 356)ను ఉపయోగిస్తూ వస్తోంది.దేశ మొదటి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ 1951 జూన్ 20న పంజాబ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తొలిసారిగా ఆర్టికల్ 356ను ఉపయోగించారు. ఆయన పంజాబ్ కమ్యూనిస్ట్ ప్రభుత్వాన్ని రద్దు చేసి, రాష్ట్రపతి పాలన విధించారు. నాడు పంజాబ్ కమ్యూనిస్ట్ ప్రభుత్వం(Communist government)లో నెలకొన్న అంతర్గత విభేదాలను పరిష్కరించడానికే ఆ రాష్ట్రంలో రాష్ట్రపతిని విధించారని కొందరు రాజకీయ నిపుణులు చెబుతుంటారు. కాగా అధికారిక రికార్డుల ప్రకారం 1959లో మొదటిసారిగా కేరళలో ఎన్నికైన కమ్యూనిస్ట్ ప్రభుత్వాన్ని ఆర్టికల్ 356 ఉపయోగించి రాష్ట్రపతి పాలన విధించారు. జవహర్లాల్ నెహ్రూకు కేరళ వామపక్ష ప్రభుత్వం నచ్చకపోవడమే దీనికి ప్రధాన కారణమనే ఆరోపణలున్నాయి. ఇది కూడా చదవండి: బీపీకి ఆయుర్వేద ఔషధం.. త్వరలో అందుబాటులోకి.. -
మణిపూర్లో రాష్ట్రపతి పాలన
ఢిల్లీ: మణిపూర్లో రాష్ట్రపతి పాలన విధిస్తూ కేంద్ర హోంశాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. గవర్నర్ నివేదిక ఆధారంగా రాష్ట్రపతి పాలనకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నెల తొమ్మిదిన ముఖ్యమంత్రి పదవికి బీరెన్ సింగ్ రాజీనామా చేయడంతో కేంద్రం.. రాష్ట్రపతి పాలన విధించింది మణిపూర్లో గిరిజన జాతుల మధ్య హింస నేపథ్యంలో శాంతిభద్రతలు దిగజారాయి. దీంతో రాజకీయంగా అనిశ్చితి ఏర్పడింది. రెండు జాతుల మధ్య రేగిన వైరం.. ఎంతటి హింసకు దారి తీసిందో తెలిసిందే.. ఇప్పటికీ ఇదే విషయంలో మణిపూర్ రగులుతూనే ఉంది. ఈ హింసకు మూల కారణమైన కుకీ, మైతేయ్ తెగల మధ్య వైరం ఇప్పుడు యావత్ ప్రపంచం దృష్టి నిలిపేలా చేసింది. అయితే, ఈ అల్లర్ల వెనుక బీరేన్ సింగ్ ఉన్నారనే ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. ఎట్టకేలకు మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్. బీరేన్ సింగ్ తన పదవికి రాజీనామా చేశారు.దాదాపు రెండేళ్లనాడు హత్యలూ, అత్యాచారాలూ, గృహదహనాలతో అట్టుడికి ప్రపంచవ్యాప్తంగా మన దేశ పరువు ప్రతిష్ఠలను మంటగలిపిన ఆ రాష్ట్రం ఇప్పటికీ పూర్తిగా కోలుకోలేదు. 2023 మే 3న రాష్ట్రంలో ప్రధాన తెగలైన మెయితీలకూ, కుకీలకూ మధ్య రాజుకున్న ఘర్షణలు చూస్తుండ గానే కార్చిచ్చులా వ్యాపించగా అధికారిక లెక్కల ప్రకారమే 260 మంది ప్రాణాలు కోల్పోయారు.60,000 మంది ఇప్పటికీ తమ స్వస్థలాలకు వెళ్లలేక సహాయ శిబిరాల్లో బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. భద్రతా బలగాల పహారా కొనసాగుతున్నా మెయితీలు, కుకీలు ఒకరి ప్రాబల్య ప్రాంతాల్లోకి మరొకరు ప్రవేశించే సాహసం చేయటం లేదు. అందువల్ల నిరుపేదల జీవనోపాధి తీవ్రంగా దెబ్బతింది. మణిపూర్ హింసాకాండ సాధారణమైనది కాదు. అనేకచోట్ల మహిళలను వివస్త్రలను చేసి, వారిపై అత్యాచారాలకు పాల్పడిన ఉదంతాలు దిగ్భ్రాంతికి గురిచేశాయి.ఇదీ చదవండి: మణిపూర్ శాంతిస్తుందా? -
గూండాల చేతిలో పశ్చిమ బెంగాల్: సువేందు అధికారి
కోల్కతా: పశ్చిమ బెంగాల్లో వరుసగా జరుగుతున్న లైంగిక వేధింపుల ఘటనలు మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఈ నేపధ్యంలో తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) నేతృత్వంలోని మమత ప్రభుత్వంపై బీజేపీ నేత సువేందు అధికారి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వెంటనే రాజీనామా చేయాలని, రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని సువేందు అధికారి డిమాండ్ చేశారు. పశ్చిమ బెంగాల్ గూండాలు, రేపిస్టుల చేతుల్లో ఉందని సువేందు ఆరోపించారు. శనివారం నుంచి ఇప్పటి వరకు ఏడు లైంగిక వేధింపుల ఘటనలు జరిగాయని అన్నారు. నిందితులు టీఎంసీతోప్రత్యక్ష సంబంధం కలిగినవారేనని, వీరని మమతా బెనర్జీ పెంచిపోషిస్తున్నారని ఆరోపించారు. మమతా సాగిస్తున్న అవినీతిని బీజేపీ బయటపెడుతుందని అన్నారు. అంతకుముందు బీర్భూమ్లో నర్సుపై వేధింపుల ఘటనపై కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సుకాంత్ మజుందార్ సీఎం మమతపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పరిపాలనతో పాటు పోలీసింగ్ వైఫల్యమే ఇటువంటి ఘటనలకు కారణమన్నారు. మమతకు పదవిలో కొనసాగే నైతిక హక్కు లేదన్నారు. ఆమె తప్పుకుంటే రాష్ట్రానికి మేలు జరుగుతుందని వ్యాఖ్యానించారు. -
రాష్ట్రపతి పాలనే శరణ్యం!
‘‘మేం అధికారంలోకి వస్తున్నాం, రాగానే ‘అకౌంట్స్’ సెటిల్ చేస్తాం. ఒక ఆరు నెలలపాటు మాలో కొందరం ఇదే పని మీద ఉంటాం. అందరి అకౌంట్లూ సెటిల్ చేస్తాం’’. ఎన్నికలకు ముందు ఒక తెలుగుదేశం నాయకురాలు టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో చెప్పిన మాటలివి. ఇప్పుడా నాయకురాలు హోం మంత్రిగా పని చేస్తున్నారు.తెలుగుదేశం పార్టీ యువనేత అనేక సభల్లో తన చేతుల్లోని ‘రెడ్ బుక్’ను ప్రజలకు చూపెట్టారు. ఈ ‘రెడ్ బుక్’లో ప్రత్యర్థుల పేర్లను రాసుకుంటున్నాననీ, అధికారంలోకి రాగానే వారి సంగతి తేల్చేస్తాననీ హెచ్చరికలు జారీ చేశారు. తమ మాట వినని అధికారులకు కూడా ఈ హెచ్చరికలు వర్తిస్తాయనే బెదిరించే ప్రయత్నం చేశారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే ఆంధ్రప్రదేశ్ అంతటా యువనేత, ‘రెడ్ బుక్’ బొమ్మలతో కూడిన హోర్డింగులు ప్రత్యక్షమయ్యాయి. ఆ యువనేత ఇప్పుడు క్యాబినెట్లో ఉన్నారు. కీలక నిర్ణయాలన్నీ ఆయనే తీసుకుంటున్నారని సమాచారం. ఈ రెండు ఉదాహరణలు మచ్చుకు మాత్రమే! తెలుగుదేశం ప్రభుత్వం కక్షపూరిత పాలనా విధానానికి దిగజారిందని చెప్పడానికి ఇటువంటి డజన్లకొద్దీ ఉదాహరణలు ఇవ్వవచ్చు. రాజ్యాంగ వ్యవస్థల్లోని అతి ప్రధాన విభాగమైన ఎగ్జిక్యూటివ్ వ్యవస్థ బాహాటంగానే రాజ్యాంగేతర పాలనా పద్ధతులను ఎంచుకుంటున్నది. పర్యవసానాలు జనజీవితాన్ని భయ కంపితం చేస్తున్నాయి.అధికార పార్టీ కక్షలకూ, కార్పణ్యాలకూ ఆరు వారాల స్వల్పకాలంలోనే 32 మంది వైసీపీ అభిమానులు హతమైనట్టు వార్తలందుతున్నాయి. వినుకొండలోని ఒక ప్రధానమైన సెంటర్లో వేలాది మంది ప్రజల సమక్షంలో వైసీపీ కార్యకర్త రషీద్ను నరికి చంపిన దృశ్యం రాష్ట్ర ప్రజలకు దిగ్భ్రాంతిని కలిగించింది. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులకు అద్దం పట్టింది. వైసీపీకి అనుకూలంగా ఉండే ఒక దళిత మహిళా రైతును తెలుగుదేశం కార్యకర్త అత్యంత పాశవికంగా ట్రాక్టర్తో తొక్కించి చంపిన దారుణం జరిగిన వారం రోజుల్లోనే రషీద్ దారుణ హత్య జరగడం రాష్ట్ర ప్రజలను కలవరపరుస్తున్నది.వైసీపీ కార్యకర్తలూ, అభిమానులపై ఈ ఆరు వారాల్లో 305 హత్యాయత్నాలు జరిగినట్టు వివరాలు అందుతున్నాయి. తిరువూరులో ఒక మునిసిపల్ కౌన్సిలర్నే రోడ్లపై పరుగెత్తిస్తూ కత్తులతో పొడిచిన వీడియో చిత్రం కూడా కలకలం సృష్టించింది. అధికార పార్టీ నాయకుల బెదిరింపులకు భయపడి 35 మంది ఆత్మహత్యలు చేసుకున్నట్టు వైసీపీ చెబుతున్నది. దాదాపు నాలుగు వేల కుటుంబాలు సొంత ఊరును వదిలి దూరంగా శరణార్థుల మాదిరిగా తలదాచుకుంటున్నాయి.వైసీపీ పార్లమెంట్ సభ్యుడు, లోక్సభలో ఆ పార్టీ నాయకుడైన మిథున్రెడ్డిపై దాడి చేశారు. ఆయన సొంత నియోజక వర్గంలో మాజీ ఎంపీ రెడ్డప్ప ఇంట్లో కూర్చుని మాట్లాడుతున్న సందర్భంలో పథకం ప్రకారం రౌడీ మూకల్ని తరలించి రాళ్ల దాడి చేశారు. ఎంపీ వాహనంతో సహా డజనుకు పైగా వాహనాలకు నిప్పుపెట్టారు. 560 కుటుంబాల ఆస్తులను అధికార పార్టీ మూకలు ధ్వంసం చేశాయి. పరిపాలనా వికేంద్రీకరణకు ఆయువుపట్టు వంటి గ్రామ సచివాలయాలు, ఆర్బీకే సెంటర్లపై వందల సంఖ్యలో దాడులు జరిగాయి. వైఎస్ జగన్ ఆనవాళ్లు కనిపించకూడదన్న కక్షతో వేలాది శిలాఫలకాలను పగుల గొట్టారు.జరిగిన సంఘటనలనూ, వాటి తీవ్రతనూ గమనంలోకి తీసుకుంటే ఈ ఆరు వారాల కాలాన్ని ‘బీభత్స పాలన’ (reign of terror) గా పరిగణించాలి. ఈ నేపథ్యంలోనే నిన్న రషీద్ కుటుంబ పరామర్శకు వెళ్లిన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మాట్లాడిన మాటలను అర్థం చేసుకోవాలి. రాష్ట్రంలో శాంతిభద్రతలకు తీవ్ర భంగం వాటిల్లిన నేపథ్యంలో రాష్ట్రపతి పాలన విధించాలని ఆయన డిమాండ్ చేశారు. బెంగాల్, తమిళనాడుల్లో ఎన్నికల తర్వాత బీజేపీ కార్యకర్తలపై జరిగిన స్వల్ప దాడులకే ఆ రాష్ట్రాలకు కేంద్ర బలగాలను పంపిన మోదీ సర్కార్ ఆంధ్రప్రదేశ్లోని తమ కూటమి ప్రభుత్వం బీభత్సపాలన చేస్తున్నా మిన్నకుండటం ద్వంద్వ ప్రమాణాలకు నిదర్శనం.ఒకపక్క తెలుగునాట మెజారిటీ మీడియా సంస్థలపై తెలుగుదేశం అనుకూలవర్గ గుత్తాధిపత్యం కొనసాగుతున్నది. మరోపక్క కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏలో తెలుగుదేశం పార్టీ భాగస్వామి. ఈ పరిస్థితుల్లో దేశంలో ఉన్న ప్రజాస్వామ్య మద్దతుదారులందరి దృష్టికీ జరుగుతున్న ఆగడాలను తీసుకురావడం కోసం ఈ బుధవారం ఢిల్లీలో ధర్నా చేయాలని వైసీపీ సంకల్పించింది. రాష్ట్రపతి పాలన అంశాన్ని గత కేంద్ర ప్రభుత్వాలు ఒక రాజకీయ ఆయుధంగా వాడుకున్నందు వల్ల దానిపై ప్రజాస్వామికవాదుల్లో భిన్నాభిప్రాయాలు నెలకొని ఉన్నాయి. ఈ కారణంగా ఆంధ్రప్రదేశ్లో నెలకొని ఉన్న యథార్థ పరిస్థితులను జాతీయ స్థాయికి తీసుకొని వెళ్లడం వైసీపీకి అవసరం.భారత రాజ్యాంగం ఆర్టికల్ 355 ప్రకారం ‘విదేశీ దాడుల నుంచీ, అంతర్గత కల్లోలం నుంచీ రాష్ట్రాలను కాపాడే బాధ్యత యూనియన్ ప్రభుత్వానిదే. ఆ రాష్ట్రాల్లో రాజ్యాంగబద్ధమైన పాలన కొనసాగేలా చూడటం కూడా కేంద్రం బాధ్యత’. ఈ ఆర్టికల్ను మరింత విశదీకరిస్తే ‘రాజ్యాంగ సూత్రాలకు అనుగుణంగానే రాష్ట్రాల ప్రభుత్వాలు పరిపాలించాలి. రాష్ట్రంలోని ప్రతి పౌరుడికీ భద్రత కల్పించడంతోపాటు, అతని ఆత్మగౌరవానికి భంగం కలగకుండా చూడటం కూడా రాష్ట్ర ప్రభుత్వం విధి’. రాష్ట్రాల్లో రాజ్యాంగబద్ధమైన పరిపాలన జరగడం కోసం అవసరాన్ని బట్టి రాష్ట్రపతి పాలన విధించే విశేషాధికారాన్ని ఆర్టికల్ 356 ద్వారా రాష్ట్రపతికి రాజ్యాంగం కట్టబెట్టింది.రాష్ట్రాల్లో రాజ్యాంగ సూత్రాలకు అనుగుణంగా పరిపాలించడం కుదరని పరిస్థితులు ఏర్పడినట్లయితే ఆర్టికల్ 356 (1) ప్రకారం రాష్ట్రపతి పాలన విధించవచ్చు. ఆంధప్రదేశ్లో ఇప్పుడు శాంతిభద్రతల పరిస్థితికి ఏర్పడిన విఘాతం సాధారణమైనది కాదు. జరుగుతున్నవి చెదురుమదురు సంఘటనలు అసలే కావు. సీనియర్ జర్నలిస్టు కృష్ణంరాజు లెక్కగట్టిన వివరాల ప్రకారం శుక్రవారం నాటికే రోజుకు సగటున 130 హింసాత్మక సంఘటనలు జరిగాయి. నెలరోజుల్లో 22 మంది మహిళలు అత్యాచారాలకు గురయ్యారు. ఇందులో నలుగురిని చంపేశారు. అభం శుభం తెలియని చిన్నారులను కూడా చిదిమేశారు. ఒక బాలిక చనిపోయిందని చెబుతున్న పోలీసు యంత్రాంగం ఆమె శవాన్ని కూడా రెండు వారాలు దాటినా గుర్తించలేక పోయింది.‘ఎస్ఆర్ బొమ్మై వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా’ కేసులో రాష్ట్రపతి పాలనపై సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పును చెప్పింది. రాజకీయ కారణాలతో ఎడాపెడా రాష్ట్రపతి పాలన విధించే సంప్రదాయాలకు చెక్ పెడుతూనే, ఏయే సందర్భాల్లో విధించడం సమర్థనీయమో కూడా రాజ్యాంగ విస్తృత ధర్మాసనం తీర్పు (1994) చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వ చర్యలు రాజ్యాంగ మౌలిక స్వరూపానికి విరుద్ధంగా ఉంటే రాష్ట్రపతి పాలన విధించవచ్చని అభిప్రాయపడింది. ఉదాహరణకు సెక్యులరిజం అనే అంశం రాజ్యాంగ మౌలిక స్వరూపంలో భాగం. రాష్ట్ర ప్రభుత్వ చర్యలు సెక్యులరిజాన్ని బలహీనపరిచేవిగా ఉంటే ఆ రాష్ట్ర పరిస్థితులు 356వ అధికరణంలో పేర్కొన్నట్టుగా ఉన్నాయనే భావించాలి.రాజ్యాంగ పీఠికను రాజ్యాంగ మౌలిక స్వరూపానికి గుర్తుగా భావిస్తారు. ప్రజాస్వామ్యం, సెక్యులరిజంతోపాటు ప్రజలందరికీ సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం – ఆలోచనా, భావప్రకటన, విశ్వాసం, ఆరాధనా స్వేచ్ఛ – అవకాశాల్లో, హోదాల్లో సమానత్వం – వ్యక్తిగత గౌరవం వంటి అంశాలకు కూడా పీఠిక ప్రాధాన్యమిచ్చింది. ఇందులో దేనికి భంగం కలిగినా రాజ్యాంగ మౌలిక స్వరూపంపై జరిగిన దాడిగానే పరిగణించాలి. భిన్నమైన రాజకీయ అభిప్రాయాలు కలిగి ఉండటాన్ని ప్రస్తుత ఏపీ ప్రభుత్వం నేరంగా పరిగణిస్తున్నది. ప్రతిపక్ష కార్యకర్తలను మోకాళ్లపై కూర్చోబెట్టి చేతులు జోడింపజేసి అధికారపక్షీయులు తమ నాయకునికి జైకొట్టించుకుంటున్నారు. ఇటువంటి వీడియోలు అసంఖ్యాకంగా యూట్యూబ్లో కనిపిస్తున్నాయి. ఈ చర్యలు అనైతికమే కాదు రాజ్యాంగ విరుద్ధం కూడా!రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్దేశపూర్వకంగా రాజ్యాంగ విరుద్ధ చర్యలకు పాల్పడడం, హింసను రెచ్చగొట్టడం కూడా రాష్ట్రపతి పాలన విధించడానికి అనువైన చర్యలుగా బొమ్మై కేసులోనే సుప్రీంకోర్టు తేల్చింది. ఉద్దేశపూర్వకంగానే తమ ప్రత్యర్థులపై దాడులు చేస్తామని, ‘అకౌంట్లు’ సెటిల్ చేస్తామని ఎన్నికల ముందునుంచే తెలుగుదేశం నాయకులు బహిరంగంగా చెబుతున్నారు. ప్రత్యర్థులపై కక్ష సాధించడమే ధ్యేయంగా ‘ఉద్దేశపూర్వకంగా’ రెడ్బుక్ హోర్డింగులను రాష్ట్రవ్యాపితంగా నెలకొల్పి, తమ పార్టీ కార్యకర్తల హింసాప్రవృత్తిని రెచ్చగొడుతున్నారు.రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా తన రాజ్యాంగ విధులను, బాధ్యతలను విస్మరించడం కూడా రాష్ట్రపతి పాలనకు దారితీయాల్సిన పరిస్థితిగానే సర్వోన్నత న్యాయస్థానం పరిగణించింది. ఈ నలభై రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఐదువేల పైచిలుకు హింసాయుత ఘటనల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తన రాజ్యాంగ బాధ్యతలను విస్మరించింది. ఏ సందర్భంలోనూ పోలీసు యంత్రాంగం స్పందించకపోవడానికి వెనుకనున్న కారణం – రాష్ట్ర ప్రభుత్వ మౌఖిక ఆదేశాలే! ఎంపీ మిథున్రెడ్డిని తన నియోజకవర్గంలో పర్యటించకుండా రౌడీ మూకలు అడ్డుకున్న సందర్భంలో గానీ, వినుకొండ నడిబజారులో రషీద్ను తెగనరుకుతున్న సందర్భంలో గానీ పోలీసులు ప్రేక్షకపాత్రనే పోషించారు.ఈ హింసాకాండ – నరమేధం ఆరు మాసాలపాటు కొనసాగిస్తామని ఆ పార్టీ నాయకులు చెప్పుకొస్తున్నారు. ఇక ఉపేక్షించడం క్షంతవ్యం కాదు. తన కూటమి భాగస్వామ్య పక్షం పట్ల మోదీ ప్రభుత్వం ఒలకబోస్తున్న ధృతరాష్ట్ర ప్రేమకు వారు కూడా మూల్యం చెల్లించవలసి ఉంటుంది. ఈ ఆటవిక పాలనను ఇంకా కొనసాగించడం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక అవసరంగా మారింది. తమ పార్టీ ఇచ్చిన అలవికాని హామీలను అమలు చేయడం సాధ్యం కాదు. ప్రశ్నించడానికి ప్రతిపక్షాలు, ప్రజలు భయపడాలి. అందుకోసం ఈ బీభత్స పాలన కొనసాగాలి. రేపటి బడ్జెట్లో తమ ’సూపర్ సిక్స్’ హామీల అమలుకు అదనంగా లక్ష కోట్ల పైచిలుకు కావాలి. అందువల్ల పూర్తి బడ్జెట్ను మరోసారి వాయిదా వేసి, మళ్లీ ‘ఓట్ ఆన్ అకౌంట్’ పెట్టే అవకాశాలను రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. అదే జరిగితే ఇది కూడా అసాధారణ చర్యే!వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
దేశం దృష్టికి ఏపీ అరాచక పాలన.. ఢిల్లీలో వైఎస్ జగన్ ధర్నా
పల్నాడు, సాక్షి: రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని, దానిని దేశం దృష్టికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి అంటున్నారు. వినుకొండలో హత్యకు గురైన యువ కార్యకర్త రషీద్ కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం.. ఆయన ఓ జాతీయ మీడియాతో మాట్లాడారు. ‘‘రషీద్ను దారుణంగా హత్య చేశారు. వ్యక్తిగత కారణాలని క్రియేట్ చేశారు. కానీ, కేవలం వైఎస్సార్సీపీ కోసం పని చేశాడని రషీద్ను హత్య చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయి. హత్యలు చేస్తున్నారు. మా ఎంపీ, ఎమ్మెల్యేలపై కూడా దాడి చేశారు. మిథున్రెడ్డి, రెడ్డప్పపై దాడి చేశారు. దాడి చేసింది కాకుండా.. వాళ్లపైనే మర్డర్ కేసు పెట్టారు. గత ఐదేళ్లలో ఎన్నాడూ ఇలాంటి ఘటనలు జరగలేదు. లోకేష్ రెడ్బుక్ ప్రకారమే ఇదంతా జరుగుతోంది. దాడులపై కేంద్ర దర్యాప్తు సంస్థలు దర్యాప్తు చేయాలి. త్వరలో జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లో నిరసన తెలియజేస్తాం. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకుంటాం... ఏపీలో జరుగుతున్న దాడులపై, అరాచకపాలనపై ప్రధాని మోదీ సహా అందరినీ కలుస్తాం. రాష్ట్రంలో జరుగుతున్న దాడుల్ని వివరిస్తాం. రాష్ట్రపతి పాలన పెట్టాలని డిమాండ్ చేస్తాం. రాష్ట్ర అరాచక పాలనకు నిరసనగా ఢిల్లీలో ధర్నా చేస్తాం’’ అని అన్నారాయన. ఇక.. వచ్చే బుధవారం ఢిల్లీలో జగన్ నేతృత్వంలో ధర్నా జరుగుతుందని, ఇందులో వైఎస్సార్సీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అంతా పాల్గొంటారని వైఎస్సార్సీపీ ప్రకటించింది. -
ఢిల్లీలో రాష్ట్రపతి పాలన!.. మంత్రి సంచలన కామెంట్స్
సాక్షి, ఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సీఎం కేజ్రీవాల్ అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆప్ నేతలు ప్రతీరోజు కేంద్రంలోని బీజేపీ, దర్యాప్తు సంస్థలతో తీవ్ర విమర్శలు చేస్తూనే ఉన్నారు. తాజాగా ఆప్ మంత్రి అతిశి సంచలన కామెంట్స్ చేశారు. కాగా, మంత్రి అతిశి శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. ఢిల్లీలో ఆప్ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు రంగం సిద్ధమైంది. ఇందు కోసం కుట్రలు జరుగుతున్నాయి. ఎలాంటి ఆధారాలు లేకుండా కేజ్రీవాల్ను తప్పుడు కేసులో అరెస్టు చేశారు. గతంలోని అనుభవాలు ఈ విషయాన్ని వెల్లడిస్తున్నాయి. పలు విభాగాల్లో ఖాళీలు ఉన్నప్పటికీ.. అధికారులను కేటాయించడం లేదు. ఎన్నికల తేదీలు ప్రకటించిన నాటి నుంచి అధికారులు సమావేశాలకు హాజరుకావడం మానేశారు. ఈ కుట్రలో భాగంగానే సీఎం వ్యక్తిగత కార్యదర్శి(పీఎస్)ని పదవి నుంచి తొలగించారు. రానున్న రోజుల్లో దేశ రాజధానిలో రాష్ట్రపతి పాలన విధించేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. #WATCH | Delhi Minister & AAP leader Atishi says, "Let me warn the BJP that imposing President's rule in Delhi will be illegal, unconstitutional and against the mandate of the people of Delhi. The people of Delhi have given a clear mandate to Arvind Kejriwal and Aam Aadmi Party." pic.twitter.com/IbcVTnpkNK — ANI (@ANI) April 12, 2024 దీంతో, మంత్రి అతిశి వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. అతిశి వ్యాఖ్యలకు బీజేపీ నేతలు కౌంటరిచ్చారు. ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు ప్రతిరోజు కొన్ని అందమైన కథల్ని వండి వార్చుతున్నారని కాషాయ పార్టీ నేతలు ఎద్దేవా చేసింది. ఇక, ఆప్ సర్కార్పై అవినీతి ఆరోపణలు చేస్తూ ఒక మంత్రి రాజీనామా చేయగా.. సీఎం పీఎస్ వైభవ్ కుమార్ను విధుల నుంచి తొలగించారు. అతడి నియామక ప్రక్రియలో నిబంధనల ఉల్లంఘన జరిగినట్లు ఢిల్లీ ప్రభుత్వ విజిలెన్స్ విభాగం ప్రకటించింది. కాగా, ఎన్నికల నేపథ్యంలో ఆప్ సర్కార్కు దెబ్బమీద దెబ్బ తగులుతోంది. #WATCH | Delhi Minister & AAP leader Atishi says, "Arvind Kejriwal has been arrested in a fake case and that too without any proof because there is a conspiracy to topple the elected govt of Delhi. when we see a few things from the past, it shows that there has been a… pic.twitter.com/kcGcqRIpde — ANI (@ANI) April 12, 2024 -
రాష్ట్రపతి పాలనలో ముందస్తు ఎన్నికలు.. ఉత్తమ్ ఆసక్తికర వ్యాఖ్యలు
సూర్యాపేట: నల్లగొండ కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ నెలలో తెలంగాణ శాసనసభ రద్దు కాబోతుందన్నారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన రాబోతుందని జోస్యం చెప్పారు. తెలంగాణలో ముందస్తు ఎన్నికలను రాష్ట్రపతి పాలనలో జరపాలని పార్లమెంటులో చర్చించబోతున్నట్లు పేర్కొన్నారు. కోదాడ కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ ఉత్తమ్ ఈ వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో కోదాడలో 50వేల మెజార్టీతో కాంగ్రెస్ విజయం ఖాయమని దీమా వ్యక్తం చేశారు. ఈ మెజారిటీ తగ్గితే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని సవాల్ చేశారు. దేశాన్ని బీజేపీ ఛిన్నాభిన్నం చేయబోతుందని ఉత్తమ్ హెచ్చరించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో రూ.లక్ష కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించారు. మోదీ, కేసీఆర్ మోసాలు ఎండగట్టేందుకే హాత్ సే హాత్ జోడో యత్ర చేపడుతున్నట్లు చెప్పారు. చదవండి: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పాదయాత్ర షెడ్యూల్ ఇదే.. -
ఫెడరల్ వ్యవస్థకు రోజులు మూడాయా?
కేంద్ర ప్రభుత్వం కత్తినీ, కలాన్నీ సమంగా శత్రువుగా భావిస్తోందా? ఉగ్రవాదులనూ, సమాజాన్ని చైతన్యపరిచే రచయితలనూ ఒకటిగానే చూస్తోందా? అన్యాయాన్ని ప్రశ్నిస్తున్నవారిని నిర్బంధించడానికి వెనుకాడటం లేదు. ఈ క్రమంలో అధికారం మొత్తాన్నీ తన చేతుల్లోకి తీసుకోవడానికీ వెరవడం లేదు. దీంతో దేశ ఫెడరల్ వ్యవస్థ మనుగడకు రోజులు మూడాయన్న భావన దేశ ప్రజల మనసుల్లో పాదుకుపోతున్నది. దీనికితోడుగా రాజ్యాంగ పరిధుల్ని కాలదన్నుతూ తాజాగా కేరళ, తమిళనాడు గవర్నర్లు రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయాలను ప్రశ్నించే దశకు దిగజారడాన్ని సుప్రీంకోర్టు గమనిస్తూనే ఉంది. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే, 2024 సంవత్సరానికి ముందే దేశమంతటా రాష్ట్రపతి పాలన విధించే అవకాశాలున్నాయని పలువురు అనుమానిస్తున్నారు. ‘‘దేశంలో శాంతి భద్రతలకు ఏర్పడుతున్న సవాళ్లను ఎదుర్కోవడానికి అన్ని ప్రభుత్వ శాఖలు, భద్రతా సంస్థలు సిద్ధంగా ఉండాలి. శాంతి, భద్రతలను కాపాడే బాధ్యత రాష్ట్రాలకు ఉన్నదని రాజ్యాంగం నిర్దేశించినా... దేశ సమైక్యతతో ఈ సమస్య ముడిపడి ఉంది కాబట్టే మా ఆవేదనంతా. మనది ఒకే దేశం కాబట్టి దేశవ్యాప్తంగా పోలీసులకు ఒకే రకం యూని ఫామ్ ఉండాలి. దేశ యువకుల ఉద్రేక స్వభావాల్ని ఆసరా చేసుకొని కొందరు తమ కలాల ద్వారా ఉగ్రవాద ప్రచారానికి తోడ్పడుతున్నారు. ఉగ్రవాద కార్యకలాపాల నిరోధానికి రూపొందిన ‘ఉపా’ చట్టం ప్రభుత్వానికి ఎంతో వెన్నుదన్నుగా ఉపయోగపడుతోంది. అయినా ‘ఉపా’ చట్టాన్ని, దాని సామంజస్యాన్ని ప్రశ్నించే కొన్ని పిటిషన్లు సుప్రీంకోర్టు పరిశీలనకు వచ్చాయి.’’ – అక్టోబర్ 28–29 తేదీల్లో ప్రధాని మోదీ ప్రసంగాల సారాంశం. ‘‘ప్రతీ రాష్ట్రమూ శాంతి భద్రతల రక్షణకు దేశవ్యాప్తంగా ఒకే ఒక విధానం రూపొందించి తీరాలి. ఇది 2024 లోగానే రూపొంది తీరాలి.’’ – హోంమంత్రి అమిత్ షా (27 అక్టోబర్ 2022) దేశ ఫెడరల్ వ్యవస్థ మనుగడకు ‘రోజులు మూడాయన్న’ భావన క్రమంగా దేశ ప్రజల మనసుల్లో పాదుకుపోతున్నది. ఇటీవలనే పదవీ కాలం ముగిసిన సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి రమణతో ప్రారంభమైన కొన్ని అభ్యుదయకర తీర్పుల ఫలితంగా దేశవ్యాప్తంగా ఉన్నత న్యాయస్థానం మీద కొంత విశ్వాసం బలపడింది. అయితే భారతదేశ చైతన్యవంతులైన, పాలక శక్తుల అక్రమాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న దేశ యువతరంపై దారుణమైన నిర్బంధ విధానానికి బీజేపీ ప్రభుత్వం పాల్పడింది. చివరికి నిలువెల్లా వికలాంగుడైన అభ్యుదయవాది, భావ విప్లవ స్ఫూర్తికి దోహదం చేస్తూ అనేక సంవత్సరాలుగా దేశ పాలక వర్గాల అధికార దుర్వినియోగాన్ని సహిస్తూ వచ్చిన సాయిబాబాను వెంటనే విడుదల చేయాలని ఒక రాష్ట్ర హైకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చినా, దాన్ని రద్దు చేయించడానికి పాలకవర్గం సాహసించి, తిరిగి జైలుకు పంపించింది. అంత బలహీన స్థితికి దేశ బీజేపీ నాయకత్వ పాలనా పద్ధతులు దిగజారిపోయాయని ప్రజలు నిర్ణయానికి వచ్చే అవకాశాన్ని పాలకులు కల్పించకూడదు. సుప్రసిద్ధ సుప్రీంకోర్టు న్యాయమూర్తి డి.వై.చంద్రచూడ్ స్వయంగా తన తండ్రి జస్టిస్ చంద్రచూడ్ ఇచ్చిన తీర్పును కూడా తిరగదోడారు. ఆయన బిడ్డగా ఎదిగివచ్చినా తన తనాన్ని, తన స్వతంత్ర ప్రతిపత్తిని సదా ఈ క్షణం దాకా కాపాడుకుంటూ వచ్చిన ఉద్దండుడు నేటి సుప్రీంకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తి. తన సొంత తండ్రిగారిచ్చిన తీర్పునే కొట్టి పారేయడానికి రక్త సంబంధం ఏమాత్రం ఆయనకు అడ్డు నిలువక పోవడం అత్యంత ప్రశంసనీయం. ఈ పరిణామం గమనించి ఉన్న బీజేపీ పాలకులు నవంబర్ 9న నూతన ప్రధాన న్యాయమూర్తిగా డి.వై.చంద్రచూడ్ పదవీ స్వీకారం చేయకుండా నిరోధించేందుకు ఎవరి చేతనో ఒక అడ్డుపుల్ల పిటిషన్ వేయించారు. కానీ తాజా మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యు.యు. లలిత్ ఆ ‘కొంటి’ పిటిషన్ను ‘సరుకులేని కాగితం’గా కొట్టి పారవేశారు. ఇలా బీజేపీ హయాంలో ఒకటిగాదు, ఎన్నో పిటిషన్లు! ‘ది వైర్’ లాంటి ప్రముఖ దేశీయ వార్తా సంస్థకు వ్యతిరేకంగా వచ్చిన ఫిర్యాదులపై నిష్పాక్షిక విచారణ జరిపి తీరాలని ఢిల్లీ పోలీసుల్ని దేశ ప్రఖ్యాత ‘ఎడిటర్స్ గిల్డ్’ పోలీసులను కోరింది. ఇంత కన్నా బీజేపీ పాలకుల అసమర్థ దుర్జనత్వానికి నిదర్శనం మరొక టుంది. ‘జాతీయ భద్రతా ప్రయోజనాల’ పేరిట ఇతరులు తెరచి చూడటానికి వీలు లేదన్న మిషపైన పాలకులు కొత్తగా ‘సీల్డ్ కవర్’ ఎత్తుగడలు పాటిస్తూ వచ్చారు. కానీ, ఆ ఎత్తుగడలను బహిర్గతం చేస్తూ జస్టిస్ డి.వై.చంద్రచూడ్, జస్టిస్ హిమా కోహ్లీల సుప్రీం బెంచ్ ‘మీడియా వన్ ఛానల్’ టెలికాస్ట్పై నిషేధాన్ని సవాలు చేస్తూ వచ్చిన పిటిషన్ను పక్కకి తోసేసింది. ఎందుకంటే, ఆ ఛానల్కు ఎప్పటి నుంచో ఉన్న సెక్యూరిటీ అనుమతిని కూడా అకస్మాత్తుగా పాలకులు రద్దు చేశారు. ఎవరు ఫిర్యాదు చేసినా, అసలు ఫైల్లో ఉన్నదేమిటో, బయటికి పొక్కకుండా రహస్యంగా దాచిన విషయం జాతీయ భద్రతకు ఏ విధంగా విఘాతం కల్గిస్తుందో కోర్టు వారికి విధిగా బహిరంగపరచాల్సిందేననీ, ‘సీల్డ్ కవర్’ల తతంగం ఇక మీదట కొనసాగరాదనీ కోర్టు తీర్పు చెప్పవలసి వచ్చింది. ఈ భాగోతం ఇలా ఉండగానే, రాజ్యాంగ పరిధుల్ని కాల దన్నుతూ తాజాగా కేరళ, తమిళనాడు గవర్నర్లు రాష్ట్ర ప్రభుత్వాల రాజ్యాంగబద్ధమైన నిర్ణయాలను ప్రశ్నించే దశకు దిగజారడాన్ని సుప్రీం గమనిస్తూనే ఉంది. గతంలో బొమ్మై (కర్ణాటక) ప్రభుత్వ హయాంలో ఆ ప్రభుత్వాన్ని దించేయడానికి జరిగిన ప్రయత్నంలో శాసనసభ చర్చకు, దాని అనుమతికి బద్ధమై మాత్రమే నిర్ణయాలు జరగాలన్న జస్టిస్ జయచంద్రారెడ్డి హెచ్చరికను ఆనాటి ప్రతిపక్షం పాటించక తప్పలేదు. అటు కేరళ బీజేపీ గవర్నర్, ఇటు తమిళనాడు గవర్నర్, మరికొన్ని ఇతర రాష్ట్రాల గవర్నర్లు రాజ్యాంగ బాధ్యతలకు విరుద్ధంగా నిర్ణయాలు తీసుకోవడంపై దేశవ్యాప్తంగా నేడు పెద్ద అలజడి విద్వత్ వర్గాలలో ప్రారంభమైంది. బహుశా 2024వ ఏడాదికి ముందే అర్ధంతరంగా దేశవ్యాప్తంగా రాష్ట్రపతి పాలన వచ్చే అవకాశం ఉందన్న ఊహాగానాలు నిజమే అవుతాయేమో అన్నంతగా ప్రజా బాహుళ్యంలో ఆందోళన ప్రారంభమైంది. ఎందుకంటే – భారత రాజ్యాంగం ప్రకారం, గవర్నర్ పని, ప్రజలెన్నుకున్న రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన విధానాలకు బద్ధమై ఉండవలసిందేగానీ, వ్యతిరేకించ కూడదు. రాజ్యాంగం తనను అనుమతించిన మేరకే రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయాలలో 163(2) అధికరణ గవర్నర్ల జోక్యానికి అనుమతిస్తుంది. అంతేగానీ, ప్రజలు ప్రత్యక్ష ఎన్నికల ద్వారా ఎన్నుకొన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలను ధిక్కరించి ‘సొంత దుకాణం’ తెరచుకునే అధికారం నామినేటెడ్ గవర్నర్లకు లేదు. సుప్రసిద్ధ సుప్రీం మాజీ న్యాయమూర్తి జస్టిస్ వి.ఆర్. కృష్ణయ్యర్... షంషేర్ సింగ్ కేసులో చెప్పిన తీర్పులో ఇలా పేర్కొ న్నారు: ‘‘శాసనసభ (లెజిస్లేచర్)కు ఆయా శాఖల మంత్రులు జరూరుగా సమాధానాలు చెప్పవలసి ఉంటుంది. వీరు ఆశువుగా చెప్పే పద్ధతికి ప్రజలూ అలవాటు పడ్డారు. ఎవరో ఒకే ఒక నాయకుడి ఆత్మకు దాసోహమని కూర్చోకుండా ప్రజలు ఈ రకపు ప్రజాస్వా మ్యానికి కూడా అలవాటుపడ్డారనుకోవాలి. కాకపోతే, భారతదేశపు సంక్లిష్ట రాజకీయ నిర్మాణ సూత్రాలకు ఒదిగి ఉండక తప్పదేమో’’! కాబట్టి ఈ పరిస్థితుల్లో కోర్టు రాజ్యాంగ ధర్మాసనం గవర్నర్ల అనవసర జోక్యానికి చోటివ్వకుండా చూడాలని ప్రసిద్ధ సుప్రీంకోర్టు న్యాయవాది కాళేశ్వరం రాజ్ అభిప్రాయం. చివరికి, త్వరలో దేశమంతటా రాష్ట్రపతి పాలన విధించే అవకాశాల గురించి పలువురి అనుమానాలకు తగి నట్టుగానే గుజరాత్ విద్యాపీఠ్కు 12వ అధ్యక్షుడిగా గుజరాత్ గవర్నర్, బీజేపీ అనుయాయి అయిన దేవవ్రత్ను నియమించాలని కేంద్రం నిర్ణయించినట్టు వార్తలు వెలువడ్డాయి. ఈ విద్యాపీఠ్ను స్వతంత్ర సంస్థగా 1920లో గాంధీజీ నెలకొల్పారని మరవరాదు. నిజమైన గాంధేయవాది మాత్రమే ఈ విద్యాపీఠ్ను అలంకరించాలని నాడు నిర్ణయమయింది. కానీ, ఆ ఆశయానికి విరుద్ధంగా దేవవ్రత్ను (రాజ కీయ గవర్నర్) నియమించినందుకు నిరసనగా విద్యాపీఠ్ ట్రస్టీల బోర్డునుంచి గత నెల 18న తొమ్మిదిమంది సభ్యులు రాజీనామాలు చేశారు. ఏతావాత మన పాలకులు కూడా కలాన్నీ, కత్తినీ సమ పాళ్లలోనే ఒకే బాటలో నిలబెట్టడానికి అంగీకరిస్తున్నందువల్ల గాంధీ విద్యాపీఠ్ నెత్తిపైన కూడా ఈ రెండు రకాల ఆయుధాలను – సమంగా మోపడానికి వెనుదీయలేదన్నమాట! ఏబీకే ప్రసాద్, సీనియర్ సంపాదకులు abkprasad2006@yahoo.co.in -
రాష్ట్రపతి పాలనలోనూ యూపీదే రికార్డు
సంకీర్ణ ప్రభుత్వాలు విఫలమైనపుడు, శాంతి భద్రతలు అదుపు తప్పినప్పుడు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలను రద్దు చేసి రాష్ట్రపతి పాలనను విధిస్తూ ఉంటుంది. దేశంలో అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్లోనే ఇప్పటిదాకా అధికసార్లు రాష్ట్రపత్రి పాలన విధించారు. ఏ ఒక్క ముఖ్యమంత్రి కూడా ఈ రాష్ట్రంలో వరుసగా రెండోసారి సీఎం సీఠును అధిరోహింకలేకపోయారు. రాష్ట్రం రాష్ట్రపతి పాలన ఎన్నిసార్లంటే మొత్తం రోజులు ఉత్తరప్రదేశ్ 10 1,689 మణిపూర్ 10 2,337 జమ్మూ కశ్మీర్ 9 3,892 బిహార్ 8 1,001 పంజాబ్ 8 3,477 -
‘ఏం చేయలేకపోతున్నా.. ఢిల్లీలో రాష్ట్రపతి పాలన పెట్టండి’
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో 24,235 పాజిటివ్ కేసులు నమోదవ్వగా 395 మంది మృత్యువాతపడ్డారు. ఇప్పటి వరకు ఢిల్లీలో యాక్టివ్ కేసులు లక్షకు చేరువయ్యాయి. తాజాగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఢిల్లీలో వెంటనే రాష్ట్రపతి పాలన విధించాలని ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే ఇక్భాల్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో పరిస్థితి చేయి దాటిపోయిందని, ప్రజలకు ఎలాంటి సాయం చేయలేకపోతున్నామని ఆందోళన వ్యక్తం చేశారు. ఈమేరకు శుక్రవారం ఓ వీడియో విడుదల చేశారు. ‘ఢిల్లీలో కోనా పరిస్థితి చూసి చాలా బాధపడుతున్నారు. రాత్రిళ్లు నిద్రపట్టడం లేదు. ప్రజలకు ఆక్సిజన్, ముందులు ఆందడం లేదు. నా స్నేహితుడే కరోనాతో పోరాడుతున్నాడు. అతనికి ఆసుపత్రిలో ఆక్సిజన్, వెంటిలేటర్ దొరకడం లేదు. తనకు కావాల్సిన రెమెడిసివిర్ ప్రిస్కిప్షన్ నా దగ్గర ఉంది. కానీ నేను అది ఎక్కడి నుంచి తీసుకు రావాలి?. సాయం చేయలేక ఈ రోజు ఒక ఎమ్మెల్యేగా ఉండి నేను సిగ్గుతో తలదించుకుంటున్నాను. ప్రభుత్వం కూడా సహాయం చేయలేకపోతుంది. ఆరుసార్లు ఎమ్మెల్యేగా పనిచేశాను. సీనియర్ వ్యక్తిని. అయినప్పటికీ ఎవరూ స్పందించడం లేదు. ఏ అధికారిని సంప్రదించలేకపోతున్నాను. ఆ పరిస్థితుల్లో ఢిల్లీలో రాష్ట్రపతి పాలని అమలు చేయాలని ఢిల్లీ హైకోర్టును కోరుతున్నారు. ఇదే గనుక జరగకపోతే రోడ్లపై శవాలు పడి ఉంటాయి’ అని విజ్ఙప్తి చేశారు. కాగా ఇక్బాల్ 1993 నుంచి ఢిల్లీలోని మాటియా మహల్ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా పనిచేస్తున్నారు. అయితే ఇప్పటి వరకు ఇక్బాల్ కామెంట్పై ఆమ్ ఆద్మీ పార్టీ స్పందించలేదు. చదవండి: ‘కరోనా కేసులు పెరగడానికి మేం కారణం కాదు’ -
రాష్ట్రపతి పాలన?!: బీజేపీ నేత వ్యాఖ్యల కలకలం
సాక్షి, ముంబై: మహారాష్ట్రలో శివసేన అధికారం చేపట్టింది మొదలు బీజేపీ, శివసేన మధ్య ఏదో ఒక రూపంలో విభేదాల సెగలు రగులుతూనే ఉన్నాయి. తాజాగా స్థానిక బీజేపీ నేత శివసేన నేతృత్వంలోని మహా వికాస్ అగాధి(ఎంవీఏ) సర్కార్పై సంచలన వ్యాఖ్యలు చేశారు. రానున్న పదిహేనురోజుల్లో మరో ఇద్దరు మంత్రులు రాజీనామా చేయడం ఖాయమని, దాంతో రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనకు సమయం రానుందంటూ మహారాష్ట్ర బీజేపీ చీఫ్ చంద్రకాంత్ పాటిల్ పేర్కొన్నారు. కొంతమంది ఈ మంత్రులకు వ్యతిరేకంగా కోర్టుకు వెళతారు, ఇక ఆ తరువాత సదరు మంత్రులు వైదొలగవలసి ఉంటుందంటూ వ్యాఖ్యానించారు. అయితే ఆ మంత్రులు ఎవరనేది మాత్రం ఆయన స్పష్టం చేయలేదు. రాష్ట్ర బడ్జెట్ సమావేశాల్లో వాజ్ను సర్కార్ భారీగా వెనకేసుకొచ్చిందని ఆరోపించారు. దీంతో అసెంబ్లీని తొమ్మిది సార్లు వాయిదా వేయాల్సి ఉందని కూడా ఆయన గుర్తు చేశారు. శివసేన, ఎన్సిపి, కాంగ్రెస్ కూటమి రాష్ట్రంలో వ్యవస్ధీకృత నేరాలకు పాల్పడుతోందంటూ పాటిల్ ధ్వజమెత్తారు. (అనిల్ దేశ్ముఖ్ 2 కోట్లు అడిగారు) అవినీతి ఆరోపణలపై రాష్ట్ర హోంమంత్రి పదవికి అనిల్ దేశ్ముఖ్ రాజీనామా నేపథ్యంలో , మరిన్ని అవినీతా ఆరోపణలతో రానున్న పదిహేను రోజుల్లో మరో ఇద్దరు మంత్రులు రాజీనామా చేయాల్సి ఉంటుందని బీజేపీ చంద్రకాంత్ పాటిల్ పేర్కొన్నారు. రాష్ట్రపతి పాలన దిశగా రాష్ట్రంలో పరిణామాలు మారబోతున్నాయని వ్యాఖ్యానించారు. తాను సర్వీసులో కొన సాగాలంటే రెండు కోట్ల రూపాయలు చెల్లించాలని మాజీ రాష్ట్ర హోంమంత్రి, ఎన్సీపీకి చెందిన అనిల్ దేశముఖ్ డిమాండ్ చేశారని సస్పెన్షన్కు గురైన ముంబై మాజీ పోలీస్ అధికారి సచిన్ వాజే ఆరోపించిన క్రమంలో చంద్రకాంత్ పాటిల్ ఈ వ్యాఖ్యలు చేశారు. కాంట్రాక్టర్ల నుంచి డబ్బులు వసూలుచేయాలని మరో మంత్రి అనిల్ పరాబ్ కోరారంటూ వాజే ఒక లేఖ రాసిన సంగతి తెలిసిందే. (ఇది ఆరంభం మాత్రమే : కంగనా సంచలన వ్యాఖ్యలు) కాగా ముంబై మాజీ పోలీసు కమిషనర్ పరంబీర్ సింగ్ అవినీతి ఆరోపణలపై సీబీఐ దర్యాప్తునకు బాంబే హైకోర్టు ఆదేశించడంతో సోమవారం రాష్ట్ర హోంమంత్రి పదవికి అనిల్దేశ్ముఖ్ రాజీనామా చేశారు. -
మాట వినకపోతే.. సుప్రీం హెచ్చరిక
సాక్షి, న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్లో రాష్ట్రపతి పాలన విధించాల్సిందిగా కేంద్రాన్ని ఆదేశించాలంటూ దాఖలైన ఓ పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. పిటిషనర్ వాదనలు కొనసాగిస్తే భారీ జరిమానా విధిస్తామని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బోబ్డే విచారణ సందర్భంగా వ్యాఖ్యానించారు. ఉత్తరప్రదేశ్లో శాంతి భద్రతలు లోపించాయని ఆర్టికల్ 356 ప్రకారం రాష్ట్రపతి పాలన విధించేలా కేంద్రాన్ని ఆదేశించాలంటూ న్యాయవాది సీఆర్ జయ సుకిన్ దాఖలు చేసిన పిటిషన్ను సోమవారం జస్టిస్ ఎస్ఏ బోబ్డే, జస్టిస్ ఏఎస్ బోపన్న , వి.రామస్రుబమణియన్లతో కూడినధర్మాసనం విచారించింది. యూపీలో అనేక హత్యలు జరుగుతున్నాయని, కేంద్రం రాష్ట్రానికి ఎలాంటి సూచనలు చేయలేదని న్యాయవాది సుకిన్ పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాల క్రిమినల్ రికార్డులు కూడా పరిశీలించారా అని జస్టిస్ బోబ్డే ప్రశ్నించగా.. దేశవ్యాప్తంగా జరుగుతున్న నేరాల్లో 30 శాతం నేరాలు ఉత్తరప్రదేశ్లో జరుగుతున్నాయని సుకిన్ తెలిపారు. ‘ఇంతకు మించి ఎక్కువ వాదనలు కొనసాగిస్తే భారీ జరిమానా విధిస్తాం’అంటూ జస్టిస్ బోబ్డే పిటిషన్ను కొట్టివేశారు. చదవండి: ఉత్తరాఖండ్ : 12 మందిని కాపాడిన ఫోన్ కాల్ -
యోగీ రాజీనామా చెయ్యి.. రాష్ట్రపతి పాలన పెట్టండి!
సాక్షి, లక్నో: ఉత్తరప్రదేశ్లో వరుస హత్యాచార ఘటనలు దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహ జ్వాలల్ని రగిలిస్తున్నాయి. ఉత్తరప్రదేశ్లో హత్రాస్, బలరాంపూర్ ఘటనలపై బీఎస్పీ అధినేత మాయావతి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నేతృత్వంలో నేరస్థులు, మాఫియా, రేపిస్టులకు అడ్డూ అదుపూలేకుండా పోతోందన్నారు. 'జంగిల్రాజ్' యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగానే రాష్ట్రంలో నేరాలు, ముఖ్యంగా దళిత బాలికలపై నేరాలు పెరిగిపోతున్నాయంటూ యోగిపై ధ్వజమెత్తారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి యోగీ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని ఆమె డిమాండ్ చేశారు. (నడుం, కాళ్లు విరిచి.. వరుస అఘాయిత్యాలు) రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి క్షీణిస్తోందని, మహిళలకు రక్షణ లేకుండా పోయిందని మాయావతి ఆందోళన వ్యక్తం చేశారు. సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు యోగీ ప్రభుత్వంపై అసంతృప్తితో ఉన్నారన్నారు. మహిళలకు భద్రత కల్పించడంలో విఫలమైన రాష్ట్రంలో కేంద్రం రాష్ట్రపతి పాలన విధించాలని ఆమె డిమాండ్ చేశారు. హత్రాస్ బల్రాంపూర్ ఘటనలు తనను తీవ్రంగా కలిచి వేశాయని, నిర్భయ కేసును గుర్తుకు తెచ్చాయని మాయావతి ఆవేదన వ్యక్తంచేశారు. రాష్ట్రంలో మహిళలపై నేరాలు జరగని రోజు ఒక్కటి కూడా లేదని విమర్శించారు. తనకూ ఒక ఆడకూతురు ఉందనే విషయాన్ని సీఎం గుర్తుంచుకోవాలని, ఆడబిడ్డలను రక్షించ లేని యోగి వెంటనే రాజీనామా చేయాలని మాయావతి ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాదు స్వస్థలమైన గోరఖ్పూర్ మఠానికి యోగిని పంపించాలని మాయావతి వ్యాఖ్యానించారు. (కాల్చి బూడిద చేసేశారు.. ఇదెక్కడి న్యాయం!) అలాగే హత్రాస్ హత్యాచార బాధితురాలి మృతదేహాన్ని ఆమె కుటుంబానికి అప్పగించకుండా, అర్ధరాత్రి దహనం చేసిన యూపీ పోలీసులపై మాయావతి మండిపడ్డారు. ఇది సిగ్గుచేటైన సంఘటన అని బీఎస్పీ చీఫ్ దుయ్యబట్టారు. ఇది జంగిల్రాజ్యం కాకపోతే, మరేంటి? అని ప్రశ్నించారు. బాధితుల కుటుంబానికి అండగా నిలిచిన ప్రతిపక్షాలను ప్రశంసించిన మాయవతి తమ పార్టీ కూడా బాధిత కుటుంబం తరపున పోరాడు తుందన్నారు. మరోవైపు ఉత్తరప్రదేశ్ బలరాంపూర్, ఆజంగర్ వరుస దారుణాలపై మహిళా సంఘాలు మండిపడుతున్నాయి. యోగి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. కాగా హత్రాస్ సంఘటనపై దర్యాప్తునకు ముగ్గురు సభ్యుల సిట్ ఏర్పాటు చేసినట్లు సీఎం యోగి బుధవారం తెలిపారు. రాష్ట్ర హోంశాఖ కార్యదర్శి భగవాన్ స్వరూప్తో కూడిన ముగ్గురు సభ్యుల బృందంలో మహిళా సభ్యులతో పాటు దళిత వర్గానికి చెందిన సభ్యులు కూడా ఉంటారు ఈ బృందం ఏడు రోజుల్లో నివేదిక సమర్పించనుందని, ఈ కేసు విచారణను ఫాస్ట్ ట్రాక్ కోర్టుకు అప్పగించనున్నామని తెలిపారు. అలాగే బాధిత కుటుంబంలో ఒకరికి ఉద్యోగంతో పాటు రూ .25 లక్షల ఎక్స్గ్రేషియా, ఇల్లు ఇస్తామని రాష్ట్రం ప్రకటించింది. వీడియోలింక్ ద్వారా కుటుంబ సభ్యులతో మాట్లాడిన సీఎం నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. -
‘రాజస్తాన్లో రాష్ట్రపతి పాలన విధించాలి’
న్యూఢిల్లీ: ఆడియో టేపుల వ్యవహారం రాజస్తాన్ రాజకియాల్లో మరింత దుమారం రేపుతోంది. ఈ నేపథ్యంలో బీఎస్పీ అధినేత్రి మాయావతి రాజస్తాన్లో రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేశారు. అశోక్ గహ్లోత్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యే భన్వర్లాల్ శర్మతో కలిసి కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, బీజేపీ నేత సంజయ్ జైన్ కుట్రలు పన్నారని కాంగ్రెస్ రాజస్తాన్ పోలీస్ స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ (ఎస్ఓజీ)నకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ మహేష్ జోషి ఫిర్యాదు మేరకు ఎస్ఓజీ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. అయితే, ఫేక్ ఆడియో టేపులతో రాజకీయంగా తమపై బురదజల్లే యత్నం చేస్తున్నారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. అదే విధంగా ఈ వ్యవహారంపై సీబీఐ దర్యాప్తు జరిపాలని డిమాండ్ చేశారు. (రాజస్తాన్ హైడ్రామా: పోలీసులకు బీజేపీ ఫిర్యాదు) ఇక దీనిపై మాయావతి స్పందిస్తూ.. రాజస్తాన్ సీఎం అశోక్ గహ్లోత్ మొదట ఫిరాయింపుల వ్యతిరేక చట్టాన్ని ఉల్లంఘించారని మండిపడ్డారు. బీఎస్పీ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ చేర్చుకున్నారని దుయ్యబట్టారు. ఆడియో టేపుల విషయంలో మరో చట్టవిరుద్ధమైన నిర్ణయం తీసుకున్నారని తీవ్రంగా విమర్శించారు. రాజస్తాన్లో రాష్ట్రపతి పాలనను గవర్నర్ సిఫార్సు చేయాలన్నారు. రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ ప్రతిష్టంభన, అస్థిరతను గవర్నర్ పూర్తిస్థాయిలో తెలుసుకొని రాష్ట్రపతి పాలనకు సిఫార్సు చేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని మాయావతి ట్విటర్లో పేర్కొన్నారు. (‘105 మంది ఎమ్మెల్యేల్లో కొందరు టచ్లో ఉన్నారు’) -
ఇంత అకస్మాత్తుగా రాష్ట్రపతి పాలన ఎలా ఎత్తివేస్తారు?
జైపూర్: మహారాష్ట్ర రాజకీయంలో రాత్రికి రాత్రికే చోటు చేసుకున్న అనూహ్య పరిణామాలు ఆశ్చర్యంలో ముంచెత్తాయి. మహా సీఎం పీఠం బీజేపీకి చేజారిపోయినట్టేనని భావిస్తున్న తరుణంలో శనివారం తెల్లవారేసరికి పరిస్థితి మొత్తం బీజేపీకి అనుకూలంగా మారిపోయింది. ఈ మహా ట్విస్ట్ షాక్ నుంచే తేరుకునేలోపే ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవిస్ ప్రమాణం చేశారు. అటు ఎన్సీపీ కీలక నేత, ఎన్సీపీ అధినేత శరద్ పవార్ సమీప బంధువు అజిత్ పవార్ డిప్యూటీ ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు. ఈ హఠాత్పరిణామాలపై రాజస్తాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ స్పందించారు. ఇంత అకస్మాత్తుగా రాష్ట్రపతి పాలనను ఉపసంహరించాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. బీజేపీ-ఎన్సీపీ కూటమి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన వైనాన్ని ఆయన విమర్శించారు. ప్రజాస్వామ్యాన్ని ఏ దిశకు తీసుకువెళుతున్నారంటూ ఆయన బీజేపీపై విమర్శలు గుప్పించారు. సరియైన సమయంలో ప్రజలు బీజేపీకి తగిన బుద్ధి చెపుతారని ట్వీట్ చేశారు. సీఎం ఫడ్నవిస్, ఉప ముఖ్యమంత్రి ఇద్దరూ అపరాధ భావనతో ఉన్నారని, తాము మంచి పాలనను అందించగలమనే విశ్వాసమే వారికి లేదని ఆరోపించారు. అంతేకాదు దేవేంద్ర ఫడ్నవిస్ ముఖ్యమంత్రిగా విజయవంతమై సుపరిపాలన ఇస్తారా అనే సందేహం తనకు ఉందని, అంతిమంగా మహారాష్ట్ర ప్రజలు నష్టపోనున్నారని గెహ్లాట్ పేర్కొన్నారు. కాగా రాష్ట్రంలో ఎన్నికల తరువాత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో విఫలం కావడంతో ఈ నెల 12న అక్కడ రాష్ట్రపతి పాలన విధించిన సంగతి తెలిసిందే. తాజాగా రాష్ట్రపతి పాలనను ఎత్తివేస్తూ శనివారం రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారు. మరోవైపు ఫడ్నవిస్ ప్రభుత్వ బల నిరూపణకు నవంబర్ 30వ తేదీ గడువు విధించారు గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ. బిగ్ ట్విస్ట్: సీఎంగా ఫడ్నవిస్ ప్రమాణం महाराष्ट्र में जो हुआ वह छिपकर करने की क्या आवश्यकता थी, इस प्रकार अचानक राष्ट्रपति शासन का हटना और इस प्रकार शपथ दिलाना कौनसी नैतिकता है? ये लोग देश में लोकतंत्र को किस दिशा में ले जा रहे हैं? समय आने पर देशवासी इसका जवाब देंगे और बीजेपी को सबक सिखाएंगे। — Ashok Gehlot (@ashokgehlot51) November 23, 2019 -
రాష్ట్రపతి పాలన మాటున బేరసారాలు
ముంబై: మహారాష్ట్రలో ఎన్సీపీ, కాంగ్రెస్ మద్దతుతో గద్దెనెక్కాలని ప్రయత్నాలు చేస్తున్న శివసేన చిరకాల మిత్రుడైన కమలదళంపై కస్సుమంటోంది. రాష్ట్రపతి పాలన ముసుగులో బీజేపీ ఎమ్మెల్యేలతో బేరసారాలు సాగిస్తోందని శివసేన పార్టీ పత్రిక సామ్నా ఎడిటోరియల్లో ధ్వజమెత్తింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, రాష్ట్ర అధ్యక్షుడు చంద్రకాంత్ పాటిల్లు తమ పార్టీకి 119 (స్వతంత్ర అభ్యర్థులు 14 మందితో కలిపి) ఎమ్మెల్యేల మద్దతు ఉందని, తమ పార్టీ సహకారం లేకుండా మరెవరూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం అసాధ్యమని వ్యాఖ్యలు చేయడాన్ని తప్పు పట్టింది. మేజిక్ ఫిగర్ అయిన 145 మంది ఎమ్మెల్యేలు మద్దతు లేకపోవడం వల్లే బీజేపీ అతి పెద్ద పార్టీగా అవతరించినప్పటికీ, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్న గవర్నర్ భగత్ సింగ్ కోష్యారి ఆహ్వానాన్ని ఆ పార్టీ తిరస్కరించిందని గుర్తు చేసింది. క్రికెట్లోనూ, రాజకీయాల్లోనూ ఆఖరి క్షణంలో ఏదైనా జరగొచ్చునన్న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వ్యాఖ్యలపైనా సామ్నా ఎడిటోరియల్ విరుచుకుపడింది. ఇవాళ, రేపు క్రికెట్ అంటే ఆట తక్కువ, వ్యాపారం ఎక్కువ అన్నట్టుగా తయారయ్యాయని వ్యాఖ్యానించింది. అంతేకాదు క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ సర్వసాధారణమైపోయిందని, అప్పుడే విజయం వరిస్తోందని పేర్కొంది. బీజేపీ ఇతర పార్టీల ఎమ్మెల్యేలపై వలవేసి రాజకీయ క్రీడలో గెలవాలని చూస్తోందని సామ్నా తన సంపాదకీయంలో ఆరోపించింది. మరోవైపు ఎన్సీపీ కూడా బీజేపీపై ఇదే అనుమానాన్ని వ్యక్తం చేసింది. తమ పార్టీ త్వరలోనే ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని బీజేపీ నేతలు ఒక్కొక్కరుగా చేస్తున్న వ్యాఖ్యలపై ఎన్సీపీ అధికార ప్రతినిధి నవాబ్ మాలిక్ మండిపడ్డారు. ఇలాంటి వ్యాఖ్యల ద్వారా ఇతర పార్టీల నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసి, ఎమ్మెల్యేలను తమ గూటికి లాగాలని కమలనాథులు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. గవర్నర్తో భేటీ వాయిదా శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్న ప్రయత్నాలు ఇంకా ముందుకు కదలలేదు. వాస్తవానికి శనివారమే శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే, ఎన్సీపీ అధినేత శరద్ పవార్ను కలిసి చర్చించి, ఆ తర్వాత గవర్నర్తో భేటీ కావాలని భావించారు. కానీ ఈ సమావేశాలన్నీ వాయిదా పడ్డాయి. ఆదివారం శరద్ పవార్, సోనియాతో కలిసే అవకాశాలున్నాయి. కనీస ఉమ్మడి కార్యక్రమం, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే అనుసరించాల్సిన విధివిధానాలపై పవార్ సోనియాతో చర్చించాక మహారాష్ట్రలో కొనసాగుతున్న రాజకీయ ఉత్కంఠపై ఒక స్పష్టత రానుంది. ఎన్డీయే భేటీకి సేన దూరం ఈ నెల 18న ప్రారంభం కానున్న పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఆదివారం ఎన్డీయే సమావేశం కానుంది. ఈ సమావేశానికి తాము హాజరు కాబోమని శివసేన స్పష్టం చేసింది. ఎన్డీయేకి రాం రాం చెప్పడం ఇక లాంఛనప్రాయమేనని శివసేన నాయకుడు సంజయ్ రౌత్ విలేకరులకు చెప్పారు. మోదీ ప్రభుత్వంలో ఉన్న శివసేనకు చెందిన ఒకే ఒక మంత్రి అరవింద్ సావంత్ ఇప్పటికే రాజీనామా చేసిన విషయం తెలిసిందే. మహారాష్ట్రలో ఎప్పుడైతే 50:50 ఫార్ములాకు బీజేపీ అంగీకరించలేదో అప్పట్నుంచే తాము ఎన్డీయేకి దూరమయ్యామని రౌత్ స్పష్టం చేశారు. పార్లమెంటులో విపక్ష స్థానాల్లో సేన ఎంపీలు పార్లమెంటు సమావేశాల్లో శివసేన పార్టీ ఎంపీలు కూర్చొనే స్థానాలు ఇకపై మారిపోనున్నాయి. శివసేన ఎంపీలు పార్లమెంటు ఉభయ సభల్లోనూ ప్రతిపక్షం వైపు అయిదో వరసలో ఇక కూర్చోనున్నట్టు ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి. -
ఎక్కడ తగ్గాలో తెలుసు..!
-
మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన
-
రంగంలోకి రాష్ట్రపతి ఎప్పుడొస్తారంటే...
న్యూఢిల్లీ: రాజ్యాంగ బద్ధంగా రాష్ట్రంలో పరిపాలన సాగనప్పుడు భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 356 ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాన్ని సస్పెండ్ చేసి, నేరుగా ఆ రాష్ట్రాన్ని కేంద్రమే పరిపాలిస్తుంది. ఆ రాష్ట్రానికి సంబంధించిన మొత్తం పాలనా యంత్రాంగాన్ని చేతుల్లోకి తీసుకుంటుంది. కేంద్రం నియమించిన గవర్నర్ నేతృత్వంలో పాలన సాగుతుంది. పాలనా విషయాల్లో తనకు సాయపడేందుకు అధికారులను సైతం నియమించుకునే హక్కు గవర్నర్కి ఉంటుంది. 1950లో భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన నాటి నుంచి దేశంలో అనేక రాష్ట్రాల్లో ప్రభుత్వాలను రద్దుచేసి, రాష్ట్రపతి పాలన విధించారు. 1954లో ఉత్తరప్రదేశ్లో తొలిసారి ఆర్టికల్ 356ని ప్రయోగించారు. రాష్ట్రపతి పాలన విధించని రాష్ట్రాలు ఛత్తీస్గఢ్, తెలంగాణ మాత్రమే. ఏఏ సందర్భాల్లో అవకాశముందంటే... - ఒక రాష్ట్ర శాసన సభ ఆ రాష్ట్ర గవర్నర్ నిర్దేశించిన సమయంలో సీఎంను ఎన్నుకోలేనప్పుడు. - సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలి ముఖ్యమంత్రికి మైనారిటీ సభ్యుల మద్దతు మాత్రమే మిగిలినప్పుడు, గవర్నర్ ఇచ్చిన. సమయంలో తిరిగి ప్రభుత్వ ఏర్పాటులో వైఫల్యం చెందినప్పుడు. - సభలో అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టిన సందర్భంలో మెజారిటీ సభ్యుల మద్దతు కోల్పోయినా రాష్ట్రపతి పాలనకు అవకాశం. - రాష్ట్రంలో యుద్ధపరిస్థితులు తలెత్తినప్పుడు, లేదా తీవ్రమైన ప్రకృతి వైపరీత్యాల కారణంగా ఎన్నికలు వాయిదా వేయాల్సిన సందర్భాల్లో కూడా అవకాశం ఉంది. - రాజ్యాంగ బద్దంగా రాష్ట్రంలో పాలన సాగడం లేదని గవర్నర్ రిపోర్టు ఇచ్చినప్పుడు కూడా రాష్ట్రపతి పాలన విధించే అవకాశం ఉంటుంది. - 1994లో ఎస్ఆర్.»ొమ్మై వర్సెస్, యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో... రాష్ట్రపతి పాలన విధించే విషయంలో సుప్రీంకోర్టు కఠినమైన నిబంధనలను పొందుపరిచింది. అప్పటిదాకా దేశంలో చాలా సార్లు రాష్ట్రపతిపాలన విధించారు. ఆర్టికల్ 356 దురి్వనియోగానికి సుప్రీంకోర్టు మార్గదర్శకాలు అడ్డుకట్ట వేయగలిగాయి. 2000వ సంవత్సరం తరువాత దేశంలో రాష్ట్రపతి పాలన విధించిన సందర్భాలు బాగా తగ్గాయి. ఎంతకాలం ఉండొచ్చు పార్లమెంటులోని రెండు సభలు ఆమోదిస్తే రాష్ట్రపతి పాలన ఆరునెలల పాటు కొనసాగించవచ్చు. ఆ తరువాత ఎన్నికల కమిషన్ తదుపరి ఎన్నికలను ఖరారు చేయొచ్చు. రాష్ట్రపతి పాలనను గరిష్టంగా మూడళ్ల వరకు కొనసాగించవచ్చు. అయితే ఈ కాలంలో ఆరు నెలలకోసారి పార్లమెంటు ఆమోదం తీసుకోవాల్సి ఉంటుంది. ఎప్పుడు ఎత్తివేయొచ్చు పార్లమెంటు ఆమోదంతో పనిలేకుండా ఏ క్షణంలోనైనా రాష్ట్రపతి పాలనను ఎత్తివేసే హక్కు రాష్ట్రపతికి ఉంటుంది. సర్కారియా కమిషన్ ఏం చెప్పింది? రాష్ట్రంలో రాజ్యాంగబద్ధ పాలనను కొనసాగించడంలో అన్ని అవకాశాలూ మూసుకుపోయినప్పుడు, రాష్ట్రప్రభుత్వ పాలన కొనసాగింపునకు అన్ని ప్రత్యామ్నాయాలూ అంతరించి పోయినప్పుడు, తీవ్రమైన పరిస్థితుల్లో మాత్రమే చిట్టచివరి ప్రయత్నంగా రాష్ట్రపతి పాలన విధించాలని 1983లో సర్కారియా కమిషన్ స్పష్టం చేసింది. డాక్టర్ అంబేద్కర్ సైతం రాష్ట్రపతి పాలనను ‘‘డెడ్ లెటర్’’అని (అతి తక్కువగా ఉపయోగించాలని) అభివర్ణించారు. -
గవర్నర్ సిఫారసుపై భిన్నస్వరాలు
ముంబై: మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన కోసం గవర్నర్ బీకే కోష్యారీ చేసిన సిఫారసుకు గల రాజ్యాంగ బద్ధతపై నిపుణులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. గవర్నర్ సిఫారసు రాజ్యాంగ వ్యతిరేక నిర్ణయమని రాజ్యాంగ నిపుణుడు ఉల్లాస్ బాపట్ అన్నారు. ‘ప్రభుత్వ ఏర్పాటుపై సానుకూలంగా స్పందించాలంటూ బీజేపీకి రెండు రోజులు గడువిచి్చన గవర్నర్.. ఇతర పార్టీలకు 24 గంటలు మాత్రమే సమయమివ్వడం, కాంగ్రెస్ను పట్టించుకోకపోవడం పక్షపాత ధోరణిగా కనిపిస్తోంది’అని అన్నారు. అత్యవసరం అయినప్పుడు ఒక ఔషధంగా మాత్రమే రాష్ట్రపతి పాలన అ్రస్తాన్ని వాడాలని అభిప్రాయం వ్యక్తం చేశారు. మహారాష్ట్ర మాజీ అడ్వకేట్ జనరల్, సీనియర్ లాయర్ శ్రీహరి ఆనె∙మాట్లాడుతూ.. ఏ పార్టీ కూడా సుస్థిర ప్రభుత్వం ఏర్పాటు చేయలేదని గవర్నర్ సకారణంగా భావించినప్పుడు రాష్ట్రపతి పాలనకు సిఫారసు చేయవచ్చు. ఎన్నికల ఫలితాలు వెలువడిన అక్టోబర్ 24 నాటి నుంచి ప్రభుత్వం ఏర్పాటు కోసం ప్రయత్నాలు చేసుకునేందుకు అన్ని పక్షాలకు తగిన సమయం ఉంది. గవర్నర్ పిలిచే దాకా వారు ఆ ప్రయత్నాలు చేయలేదనడం అర్థరహితం. ప్రభుత్వం ఏర్పాటుపై సంసిద్ధత తెలిపేందుకు ప్రతి పార్టీకి ఇచ్చే గడువు పై నిర్దిష్టత అంటూ ఏమీ లేదు’ అని తెలిపారు. ముచ్చటగా మూడోసారి... మహారాష్ట్రలో ఇప్పటిదాకా రెండుసార్లు రాష్ట్రపతి పాలన విధించారు. 1980, ఫిబ్రవరి 17న మొదటిసారి మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించారు. 1980లో శరద్పవార్కి మెజారిటీ ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దుచేసి, రాష్ట్రపతి పాలన విధించారు. ఫిబ్రవరి 17, 1980 నుంచి, 1980 జూన్ 8 వరకు అంటే 112 రోజుల పాటు అది కొనసాగింది. 2014లో సైతం మరోమారు మహారాష్ట్ర రాష్ట్రపతి పాలనను చవిచూడాల్సి వచ్చింది. సెపె్టంబర్ 28, 2014 నుంచి అక్టోబర్ 31, 2014 వరకు రాష్ట్రపతి పాలన విధించారు. అప్పుడు మొత్తం 33 రోజుల పాటు రాష్ట్రపతి పాలన అమలులో ఉంది. -
'మహా'రాష్ట్రపతి పాలన
సాక్షి, ముంబై/న్యూఢిల్లీ: మహారాష్ట్ర రాజకీయాల్లో మంగళవారం మరిన్ని కీలక మలుపులు చోటు చేసుకున్నాయి. ఎన్నికల ఫలితాలు వెలువడి పక్షం రోజులు గడిచినా.. స్థిరమైన ప్రభుత్వం ఏర్పడకపోవడంతో కేంద్రం మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించింది. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితుల్లో స్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం సాధ్యం కాదంటూ గవర్నర్ భగత్సింగ్ కోష్యారీ ఇచ్చిన నివేదిక ఆధారంగా కేంద్ర కేబినెట్ రాష్ట్రపతి పాలనకు సిఫారసు చేసింది. కేబినెట్ ప్రతిపాదనకు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆమోద ముద్ర వేశారు. మరోవైపు, శివసేనతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంపై కాంగ్రెస్, ఎన్సీపీల చర్చలు మంగళవారం కూడా కొనసాగాయి. కాంగ్రెస్ తరఫున ఢిల్లీ నుంచి వచ్చిన సీనియర్ నేతలు మల్లిఖార్జున్ ఖర్గే, అహ్మద్ పటేల్, కేసీ వేణుగోపాల్.. ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ తదితరులతో ముంబైలో చర్చలు జరిపారు. శివసేనతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే ముందుగా.. మూడు పార్టీల మధ్య కనీస ఉమ్మడి ప్రణాళిక (కామన్ మినిమమ్ ప్రోగ్రామ్–సీఎంపీ)పై అవగాహన కుదరాలని, పొత్తుపై విధివిధానాలను నిర్ణయించుకోవాలని, అందుకు మరింత సమయం అవసరమని ఎన్సీపీ– కాంగ్రెస్ నిర్ణయించాయి. ముఖ్యంగా సైద్ధాంతిక విబేధాలున్న శివసేనతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే స్పష్టమైన ప్రణాళిక అవసరమని ఆ రెండు పార్టీలు ఒక అభిప్రాయానికి వచ్చాయి. కాగా, సాయంత్రం సేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మద్దతు సాధించేందుకు గవర్నర్ తమకు 24 గంటల సమయం మాత్రమే ఇవ్వడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. రాష్ట్రపతి పాలన విధించడంపై స్పందిస్తూ.. మేం మూడురోజుల సమయం అడిగితే, ఆరునెలల సమయమిచ్చారని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. కాంగ్రెస్, ఎన్సీపీలతో చర్చలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమయ్యేందుకు తమకు గడువును పొడిగించకుండా రాష్ట్రపతి పాలనకు గవర్నర్ సిఫారసు చేయడాన్ని సవాలు చేస్తూ శివసేన సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. ఇదిలా ఉండగా, ప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నాలు కొనసాగిస్తామని బీజేపీ ప్రకటించింది. శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం అసాధ్యమని ఆ పార్టీ నేత నారాయణ రాణె వ్యాఖ్యానించారు. మహారాష్ట్రలో ఆర్టికల్ 356 ఎన్నికల ఫలితాలు వచ్చి 15 రోజులు గడిచిపోయినా, స్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితులు నెలకొనలేదని, ప్రభుత్వ ఏర్పాటుకు తాను చేసిన అన్ని ప్రయత్నాలు విఫలమయ్యాయని పేర్కొంటూ గవర్నర్ భగత్సింగ్ కోష్యారీ మంగళవారం కేంద్రానికి నివేదిక అందించారు. బీజేపీ, శివసేనలు ప్రభుత్వ ఏర్పాటులో విఫలమవడంతో మూడో అతిపెద్ద పార్టీ అయిన ఎన్సీపీని ఆహా్వనించామని, అయితే, ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమయ్యేందుకు ఎన్సీపీ 3 రోజుల గడువు కోరిందని కేంద్రానికిచ్చిన నివేదికలో గవర్నర్ వివరించారు. ‘రాష్ట్రపతి పాలన సాధారణంగా ఆరునెలల పాటు ఉంటుంది, కానీ స్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అనువైన పరిస్థితులు నెలకొంటే.. ఆరు నెలల ముందే రాష్ట్రపతి పాలనను ఎత్తేసేందుకు అవకాశముంది’ అని అధికార వర్గాలు తెలిపాయి. అయితే, ఈ నిర్ణయాన్ని విపక్ష కాంగ్రెస్ తప్పుబట్టింది. కేంద్రం తీసుకున్న నిర్ణయం ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని అపహస్యం చేయడమేనని ఆ పార్టీ అధికార ప్రతినిధి రణ్దీప్ సూర్జేవాలా వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ చర్చలు ఢిల్లీలో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ నివాసంలో మంగళవారం ఉదయం కూడా ముఖ్య నేతల చర్చలు కొనసాగాయి. ఎన్సీపీ చీఫ్ శరద్పవార్తో సోనియా మరోసారి ఫోన్లో సంభాశించారు. అనంతరం, ముంబై వెళ్లి పవార్తో చర్చలు జరపాల్సిందిగా సీనియర్ నేతలు ఖర్గే, అహ్మద్ పటేల్, కేసీ వేణుగోపాల్లను ఆదేశించారు. చర్చల అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. శివసేనకు మద్దతునిచ్చే విషయంలో మరింత స్పష్టత అవసరమని, చర్చలు కొనసాగించాలని నిర్ణయించినట్లు అహ్మద్పటేల్ తదితర నేతలు తెలిపారు. మాకూ స్పష్టత కావాలి ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి కాంగ్రెస్, ఎన్సీపీలతో ఒక ప్రణాళిక రూపొందిస్తామని శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే తెలిపారు. కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే.. కాంగ్రెస్, ఎన్సీపీల మాదిరిగానే శివసేనకు కూడా ప్రభుత్వ ప్రాథమ్యాలకు సంబంధించిన కామన్ మినిమమ్ ప్రోగ్రామ్పై స్పష్టత అవసరమన్నారు. సోమవారమే మద్దతు కోరుతూ ఎన్సీపీ, కాంగ్రెస్లను తొలిసారి సంప్రదించామని, బీజేపీ పాటించే హిందూత్వ.. నకిలీ హిందూత్వ అని ఉద్ధవ్ విమర్శించారు. హిందూత్వ అంటే కేవలం రామ మందిర నిర్మాణం కాదని, హిందూత్వ అంటే రాముని మార్గంలో సత్యసంధతతో వ్యవహరించడమని వ్యాఖ్యానించారు. సుప్రీంకోర్టుకు శివసేన ప్రభుత్వ ఏర్పాటుకు మరో రెండు రోజుల గడువు కావాలని కోరినా గవర్నర్ ఇవ్వలేదని పేర్కొంటూ, గవర్నర్ నిర్ణయాన్ని సవాలు చేస్తూ శివసేన సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్ను అత్యవసరంగా మంగళవారమే విచారించాలని కోరినా.. సుప్రీంకోర్టు రిజిస్ట్రీ అంగీకరించలేదు. ఇప్పటికిప్పుడు బెంచ్ను ఏర్పాటుచేయలేమని రిజిస్ట్రీ స్పష్టం చేసింది. దాంతో ఆ పిటిషన్ నేడు విచారణకు రానుంది. రాష్ట్రపతి పాలన విధించడాన్ని సవాలు చేస్తూ కూడా ఒక పిటిషన్ వేయాలనుకుంటున్నామని, అయితే దానిపై తుది నిర్ణయం బుధవారం తీసుకుంటామని సేన తరఫు న్యాయవాది ఫెర్నాండెజ్ తెలిపారు. -
‘మహా’ సంక్షోభం
ఊహించని మలుపులు తిరుగుతూ ఉత్కంఠ రేపిన మహారాష్ట్ర రాజకీయానికి రాష్ట్రపతి పాలన విధింపుతో తాత్కాలికంగా బ్రేకు పడింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికివ్వాల్సిన వ్యవధి విష యంలో రాష్ట్ర గవర్నర్ భగత్సింగ్ కోష్యారీ తమపట్ల వివక్ష ప్రదర్శించారని శివసేన సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అసెంబ్లీ ఎన్నికలు ముగిశాక వివిధ చానెళ్లు ఎగ్జిట్ పోల్స్ పేరిట ప్రసారం చేసిన అతిశయోక్తుల మాటెలా ఉన్నా, ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవసరమైనంత మెజారిటీనైతే ఎన్డీఏ సొంతం చేసుకుంది. 288మంది సభ్యులుండే అసెంబ్లీలో ఎన్డీఏ ప్రధాన పక్షమైన బీజేపీ 105 స్థానాలతో అతి పెద్ద పార్టీగా అవతరించగా, భాగస్వామ్య పక్షమైన శివసేనకు 56 స్థానాలు దక్కాయి. అంటే...ఇంతక్రితంలాగే ఈ రెండు పార్టీలూ కలిసి సుస్థిర ప్రభుత్వం ఏర్పాటు చేయడం సాధ్యమే. కానీ ఫలితాలు వెలువడి పక్షం రోజులు దాటుతున్నా ఆ రెండు పార్టీలూ తమ విభేదాలను పరిష్కరించుకోలేక పోయాయి. పర్యవసానంగా ప్రభుత్వం ఏర్పాటు తమ వల్ల కాదని ఆదివారం బీజేపీ చేతులెత్తేసింది. నిజానికి మహారాష్ట్రతోపాటే ఎన్నికలు జరిగిన హరియాణాలో బీజేపీకి అవసరమైన మెజారిటీ రాకపోయినా విపక్షమైన జననాయక్ జనతాపార్టీ(జేజేపీ), మరికొందరు స్వతంత్రుల అండతో అక్కడ సునాయాసంగా బీజేపీ సర్కారు ఏర్పాటు చేయగలి గింది. కానీ అయిదేళ్లపాటు అధికారంలో కొనసాగి,పెద్దగా అవినీతి ఆరోపణలు రాని మహారాష్ట్రలో మాత్రం అడుగు ముందుకేయలేక ఆపసోపాలు పడింది. పైగా శివసేనతో బీజేపీకి ఉన్న బంధం ఈనాటిది కాదు. ఆ రెండు పార్టీలూ మూడు దశాబ్దాలుగా రాజకీయాల్లో కలిసి నడుస్తున్నాయి. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో సీట్ల పంపకంపై విభేదాలొచ్చి రెండు పార్టీలూ వేర్వేరుగా పోటీ చేసినా, ఎన్నికల ఫలితాలు వెలువడ్డాక ఇద్దరూ రాజీకొచ్చి సుస్థిర ప్రభుత్వాన్ని అందించారు. ఈసారి కలిసి పోటీ చేసి నెగ్గినా, ఫలితాలు వెలువడ్డాక ఇద్దరూ విడిపోయారు! ఎన్నికల్లో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పుడు ముఖ్యమంత్రి పదవిని రెండున్నరేళ్ల చొప్పున పంచుకుందామని సీట్ల పంపకం సమయంలో తమకు బీజేపీ హామీ ఇచ్చిందని శివసేన చెబుతుండగా...అదంతా నిజం కాదని బీజేపీ కొట్టిపారేస్తోంది. ఇందులో ఎవరు నిజం చెబుతున్నారో తెలిసే అవకాశం లేదు. ఎందుకంటే ఈ అంశం ఎన్నికల ప్రచార పర్వంలో ఏనాడూ చర్చనీయాంశం కాలేదు. ఫలితాలు వెలువడ్డాకే శివసేన ఈ హామీ సంగతిని బయటి ప్రపంచానికి వెల్లడించింది. దేశంలో సంపన్నవంతమైన రాష్ట్రంగా పేరుబడిన మహారాష్ట్రలో తమ కూటమికి మెజారిటీ దక్కినా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేని నిస్సహాయ స్థితిలో పడిపోవడం బీజేపీకి అప్రతిష్టే. అందుకే ఆ పార్టీ అధిష్టానం చివరి వరకూ శివసేనను బుజ్జగించేందుకు తీవ్ర ప్రయత్నం చేసింది. మంత్రివర్గంలో సగం స్థానాలు ఇవ్వడానికి సంసిద్ధత వ్యక్తం చేసింది. అయినా శివసేన ఎక్కడా తగ్గలేదు. బీజేపీతో పోలిస్తే దాదాపు సగం స్థానాలే వచ్చినా అది రాజీకి ససేమిరా అంది. పొత్తు పేరుతో తమను క్రమేపీ బీజేపీ తుడిచి పెట్టేస్తున్నదన్న శంక ఆ పార్టీలో బయల్దేరబట్టే ఈసారి పాలన పగ్గాలు తీసుకోవాలన్న పట్టుదలతో శివసేన ఉన్నదంటున్నారు. సిద్ధాంత సారూప్యం ఉన్న ఈ రెండు పార్టీలే కలిసి మనుగడ సాగించలేనప్పుడు...ఎన్సీపీ, కాంగ్రెస్లతో శివసేన చెలిమి ఎన్నాళ్లుంటుందన్న అనుమానాలు అందరిలోనూ ఉన్నాయి. ఇటీవలికాలంలో సిద్ధాంతాలకు కాంగ్రెస్ పెద్దగా విలువిస్తున్న దాఖలాలు లేవు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల అనంతరం వేసిన ఎత్తుగడల పర్యవసానంగా పార్టీకి జరిగిన నష్టమేమిటో ఆ పార్టీకి గుర్తుంది. అందుకే శివసేనకు మద్దతివ్వాలా వద్దా, ఏ ప్రాతిపదికన దానికి మద్దతివ్వాలి, ఎలాంటి షరతులు విధించాలి, ప్రభుత్వంలో చేరాలా వద్దా అనే అంశాల్లో అది ఎటూ తేల్చుకోలేక అయోమయంలో పడింది. పార్టీలో మెజారిటీ ఎమ్మె ల్యేలు కోరుకుంటున్నట్టు శివసేనకు మద్దతిస్తే మహారాష్ట్రలో ముస్లిం ఓటర్లను శాశ్వతంగా దూరం చేసుకోకతప్పదన్న ఆందోళన ఆ పార్టీలో ఉంది. అలాగే కేరళలో సైతం దాని ప్రభావం బలంగా పడుతుందన్న భయం ఉంది. త్వరలో రాబోయే జార్ఖండ్ ఎన్నికల్లో కూడా ఈ నిర్ణయం ప్రభావం ఉంటుందన్న అంచనాలు కూడా ఉన్నాయి. కనుకనే గవర్నర్ శివసేనకిచ్చిన గడువు ముగుస్తున్నా నిర్ణయం తీసుకోలేక కాంగ్రెస్ చేష్టలుడిగినట్టు ఉండిపోయింది. కాంగ్రెస్ మద్దతు కూడగట్టడం విషయంలో శివసేనకు ఎన్సీపీ ఏం హామీ ఇచ్చిందోగానీ ఆ పార్టీ కూడా ఇరకాటంలో పడింది. ఇంతకూ శివసేన–ఎన్సీపీల మధ్య కుదిరిన అవగాహనేమిటో తెలియదు. ఈ పరిణామాలన్నీ సహజంగానే బీజేపీకి లాభిస్తాయి. సిద్ధాంత సారూప్యం ఉన్న తమను కాదని శివసేన అవకాశవా దాన్ని ఆశ్రయించిందని చెప్పడానికి దానికి అవకాశం ఏర్పడింది. గవర్నర్ కోష్యారీ ప్రభుత్వం ఏర్పాటు కోసం వివిధ పార్టీలకిచ్చిన గడువు గురించి విమర్శలొ స్తున్నాయి. బీజేపీకి 48 గంటల గడువిచ్చి, తమకు మాత్రం అందులో సగం వ్యవధే ఇచ్చారని శివసేన గుర్రుగా ఉంది. ఎన్సీపీకి ఇచ్చిన వ్యవధి ఇంకా తక్కువ. ఆ పార్టీని 17 గంటల్లో నిర్ణయం చెప్పాలని గవర్నర్ కోరారు. సంక్షోభాలొచ్చినప్పుడు కేంద్రంలోని పాలకపక్షం అభీష్టానికి అనుగు ణంగానే గవర్నర్లు వ్యవహరిస్తారన్నది కొత్తేమీ కాదు. కానీ రాజకీయంగా ఆరితేరిన ఎన్సీపీ, కాం గ్రెస్లు బీజేపీ–శివసేనల మధ్య విభేదాలొచ్చే అవకాశం ఉన్నదని, అదే జరిగితే శివసేన తమను ఆశ్రయించక తప్పదని అంచనా వేయలేకపోవడం, తమ వ్యూహానికి పదును పెట్టుకోకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఫలితాలొచ్చి పక్షం రోజులు దాటినా ఆ రెండు పార్టీలూ వివిధ సంభావ్యతల గురించి చర్చించుకోలేకపోవడం వాటి వైఫల్యాన్ని సూచిస్తుంది. ఇప్పుడు రాష్ట్రపతి పాలన విధించినంత మాత్రాన దారులన్నీ మూసుకుపోయినట్టు కాదు. కొత్త ఎత్తులకూ, వ్యూహాలకూ కావలసినంత సమయం ఉంటుంది. కనీసం ఇప్పుడైనా పార్టీలన్నీ మిత్రుల్ని ఖరారు చేసుకుని సుస్థిర ప్రభుత్వం ఏర్పాటుకు ప్రయత్నించాలి. -
మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన
-
మహా ఉత్కంఠకు తెర : రాష్ట్రపతి పాలనకు ఆమోదం
సాక్షి, న్యూఢిల్లీ : మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధిస్తూ కేంద్ర మంత్రిమండలి చేసిన సిఫార్సుకు రాష్ట్రపతి ఆమోద ముద్రవేశారు. మంత్రిమండలి తీర్మానాన్ని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆమోదించారు. నవంబర్ 8న అసెంబ్లీ పదవీకాలం ముగిసినా తదుపరి ప్రభుత్వ ఏర్పాటులో ప్రతిష్టంభన నెలకొనడంతో గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారి రాష్ట్రపతి పాలనకు సిఫార్సు చేస్తూ కేంద్ర హోంశాఖకు లేఖ పంపారు. గవర్నర్ సిఫార్సును కేంద్ర మంత్రిమండలి ఆమోదించి రాష్ట్రపతికి నివేదించింది. మహారాష్ట్రలో ఏ పార్టీకి ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మేజిక్ ఫిగర్ దక్కపోవడంతో సంకీర్ణ ప్రభుత్వాల ఏర్పాటుకు చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాయి. సీఎం పదవిని చెరి రెండున్నరేళ్లు పంచుకోవాలన్న శివసేన ఫిఫ్టీఫిఫ్టీ ఫార్ములాకు బీజేపీ సమ్మతించలేదు. మరోవైపు ప్రభుత్వ ఏర్పాటుకు శివసేన చేసిన ప్రయత్నాలకు ఎన్సీపీ, కాంగ్రెస్లు గవర్నర్ విధించిన డెడ్లైన్లోగా సహకరించలేదు. ఎన్సీపీని ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఆహ్వానించి మంగళవారం రాత్రి 8.30 గంటల్లోగా అసెంబ్లీలో బలం నిరూపించుకోవాలని కోరారు. అయితే తమకు మరో 48 గంటల గడువు కావాలని ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ కోరడంతో గవర్నర్ రాష్ట్రపతి పాలన దిశగా నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో రాజ్యంగ బద్ధంగా ప్రభుత్వ ఏర్పాటయ్యే పరిస్థితి లేదని గవర్నర్ స్పష్టం చేశారు. మొత్తంమీద రాష్ట్రపతి పాలనతో రెండు వారాలు పైగా సాగిన మహా డ్రామాకు తెరపడింది. -
మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలనకు మంత్రిమండలి ఓకే
సాక్షి, న్యూఢిల్లీ : మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలనకు గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారి సిఫార్సుకు అనుగుణంగా ఆ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనకు మంగళవారం మధ్యాహ్నం జరిగిన కేంద్ర మంత్రిమండలి ఆమోద ముద్ర వేసింది ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మహారాష్ట్రలో ఏ పార్టీకి ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమై సంఖ్యా బలం లేనందున గవర్నర్ సిఫార్సును పరిగణనలోకి తీసుకుని మంత్రిమండలి రాష్ట్రపతి పాలనకు ప్రతిపాదించింది. మహారాష్ట్ర అసెంబ్లీలో బీజేపీ ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించినా ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 145 స్ధానాల మేజిక్ ఫిగర్కు చాలా దూరంలో నిలవడంతో ప్రభుత్వ ఏర్పాటుకు ఆసక్తి కనబరచలేదు. మరోవైపు రెండో అతిపెద్ద పార్టీగా శివసేనను గవర్నర్ ఆహ్వానించినా బలనిరూపణకు డెడ్లైన్ పొడిగించాలన్న వినతిని గవర్నర్ తోసిపుచ్చారు. ఇక మూడో అతిపెద్ద పార్టీ ఎన్సీపీని మంగళవారం రాత్రి 8.30 గంటల్లోగా బలనిరూపణ చేసుకోవాలని కోరుతూ ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానం అందింది. ఈ దిశగా ఎన్సీపీ..కాంగ్రెస్, శివసేనలతో సంప్రదింపులు జరుపుతుండగానే రాష్ట్రపతి పాలనకు గవర్నర్ సిఫార్సు చేయడం, ఇందుకు కేంద్ర మంత్రిమండలి ఆమోద ముద్ర వేయడంపై విపక్షాలు విస్మయం వ్యక్తం చేశాయి. -
శివసేనకు షాకిచ్చిన గవర్నర్..!
ముంబై: మహారాష్ట్ర రాజకీయాలు అనూహ్య మలుపులు తిరుగుతున్నాయి. గవర్నర్ భగత్సింగ్ కోశ్యారీ అనూహ్యంగా రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనకు సిఫారసు చేస్తూ కేంద్రానికి లేఖ పంపినట్టు ప్రచారం జరగడంతో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ప్రభుత్వ ఏర్పాటు కోసం నిన్న (సోమవారం) శివసేనకు అవకాశమిచ్చిన గవర్నర్.. నేడు (మంగళవారం) ఎన్సీపీని ఆహ్వానించారు. ఎన్సీపీ తన నిర్ణయాన్ని వెల్లడించడానికి రాత్రి 8.30 గంటలవరకు గడువు కూడా ఇచ్చారు. ఆ గడువు ముగియకముందే గవర్నర్ రాష్ట్రపతి పాలనకు సిఫారసు చేస్తూ.. కేంద్రానికి లేఖ పంపారని ప్రసార భారతి వర్గాలు వెల్లడించాయి. ఒకవైపు తాము అడిగిన గడువు ఇవ్వకపోగా.. మరోవైపు ప్రభుత్వ ఏర్పాటుకు వీలులేకుండా రాష్ట్రపతి పాలన దిశగా గవర్నర్ సాగుతున్నట్టు వస్తున్న వార్తలతో శివసేన, ఎన్సీపీ కంగుతిన్నాయి. ఒకవేళ గవర్నర్ రాష్ట్రపతి పాలన విధిస్తే.. ఆయన నిర్ణయాన్ని సవాలుచేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించాలని శివసేన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ విషయమై కాంగ్రెస్ నేతలు కపిల్ సిబల్, అహ్మద్ పటేల్తో శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే చర్చలు జరిపారు. ప్రభుత్వ ఏర్పాటు కోసం బీజేపీకి మూడు రోజుల గడువు ఇచ్చిన గవర్నర్.. తమకు అంత గడువు ఇవ్వడానికి నిరాకరించడంపైనా శివసేన సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ మేరకు గవర్నర్ నిర్ణయాన్ని తప్పుబడుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. మరోవైపు గవర్నర్ తీరుపై ఎన్సీపీ కూడా గుర్రుగా ఉంది. తమకు ఇచ్చిన గడువు ముగియకముందే రాష్ట్రపతి పాలన అంటూ లీకులు ఇస్తున్నారని మండిపడింది. ఇక, శివసేనకు మద్దతిచ్చే విషయమై ఎన్సీపీ-కాంగ్రెస్ మధ్య జోరుగా చర్చలు కొనసాగుతున్నాయి. ఎన్సీపీ నేతలతో చర్చించేందుకు కాంగ్రెస్ సీనియర్ నేతలు మల్లిఖార్జున్ ఖర్గే, అహ్మద్ పటేల్ ముంబై చేరుకున్నారు. సేనకు మద్దతుపై కాంగ్రెస్-ఎన్సీపీ కలిసి ఉమ్మడిగా నిర్ణయం తీసుకుంటాయని ఖర్గే తెలిపారు. -
మహా మలుపు : రాష్ట్రపతి పాలనకు గవర్నర్ సిఫార్సు
ముంబై : మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై నెలకొన్న ప్రతిష్టంభన నేపథ్యంలో గవర్నర్ భగత్ సింగ్ కోష్యారి రాష్ట్రపతి పాలనకు సిఫార్సు చేసింది.గవర్నర్ నిర్ణయంతో మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక మలుపు చోటుచేసుకుంది. మరోవైపు ప్రభుత్వ ఏర్పాటుకు ఎన్సీపీకి ఇచ్చిన గడువు మంగళవారం రాత్రి 8.30 గంటలతో ముగియనుండగా ఈలోగానే గవర్నర్ రాష్ట్రపతి పాలనకు సిఫార్సు చేయడం పట్ల విపక్షాలు భగ్గుమన్నాయి. కాగా, బలనిరూపణ గడువును మరో 48 గంటలు పొడిగించాలని ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ గవర్నర్ కోరిన అనంతరం రాజ్భవన్ ఈ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో రాజ్యాంగ బద్ధంగా ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం లేదని గవర్నర్ పేర్కొన్నారు. ఆర్టికల్ 356 కింద రాష్ట్రపతి పాలన విధించాలని ఆయన సిఫార్సు చేశారు. ఇక కేంద్ర హోంశాఖకు గవర్నర్ లేఖ చేరడంతో కేంద్ర క్యాబినెట్ గవర్నర్ సిఫార్సును ఆమోదించింది. కాగా, ప్రభుత్వ ఏర్పాటుకు శివసేనకు ఇచ్చిన గడువు పొడిగించేందుకు నిరాకరించిన గవర్నర్ ఎన్సీపీని మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించి మంగళవారం రాత్రి 8.30 గంటల్లోగా అసెంబ్లీలో బలనిరూపణ చేసుకోవాలని డెడ్లైన్ విధించారు. ప్రభుత్వ ఏర్పాటుపై ఎన్సీపీ, కాంగ్రెస్, శివసేనలు సంప్రదింపులు జరుపుతుండగానే గవర్నర్ కీలక నిర్ణయం తీసుకోవడం పట్ల విపక్షాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. -
‘శివ’సైనికుడే సీఎం
ముంబై: మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటులో సస్పెన్స్ కొనసాగుతోంది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలొచ్చి వారం గడిచినా.. మెజారిటీ సాధించిన మిత్రపక్షాలు బీజేపీ, శివసేనల మధ్య అధికారం పంపిణీపై అవగాహన కుదరకపోవడంతో ఈ ప్రతిష్టంభన ఏర్పడిన విషయం తెలిసిందే. నవంబర్ 7వ తేదీలోగా కొత్త ప్రభుత్వం ఏర్పడనట్టయితే రాష్ట్రపతి పాలన విధించే అవకాశముందని బీజేపీ నేత, ఆర్థికమంత్రి ముంగంతివార్ పేర్కొన్నారు. ప్రస్తుత అసెంబ్లీ కాల పరిమితి నవంబర్ 8వ తేదీతో ముగుస్తుంది. దీపావళి పండుగ కారణంగా శివసేన, బీజేపీల మధ్య చర్చలు ప్రారంభం కాలేదని, ఒకట్రెండు రోజుల్లో అవి ప్రారంభమవుతాయని ముంగంటివార్ తెలిపారు. ఏ ఒక్క పార్టీకో అనుకూలంగా ప్రజలు తీర్పునివ్వలేదని, బీజేపీ, సేన కూటమికి వారు మద్దతిచ్చారని ఆయన వ్యాఖ్యానించారు. ‘మా కూటమి ఫెవికాల్ కన్నా, అంబుజా సిమెంట్ కన్నా దృఢమైనది’అని వ్యాఖ్యానించారు. మరోవైపు, శివసేన వ్యక్తే మహారాష్ట్ర ముఖ్యమంత్రి అవుతాడంటూ సేన నేత సంజయ్ రౌత్ శుక్రవారం వ్యాఖ్యానించారు. ‘సేన కోరుకుంటే.. సుస్థిర ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన సభ్యుల మద్దతు కూడగట్టుకోగలదు’అన్నారు. అధికారాన్ని సమంగా పంచుకోవాలనే ప్రతిపాదనకే మహారాష్ట్ర ప్రజలు ఓటేశారన్నారు. అతివృష్టితో తీవ్రంగా నష్టపోయిన రైతులకు తక్షణమే పరిహారం అందాల్సి ఉందని శివసేన పత్రిక సామ్నా పేర్కొంది. ప్రత్యామ్నాయం కోసం ప్రయత్నిస్తాం ఒకవేళ బీజేపీ, శివసేన ప్రభుత్వ ఏర్పాటులో విఫలమైతే.. ప్రత్యామ్నాయ ప్రభుత్వ ఏర్పాటుకు తాముప్రయత్నిస్తామని ఎన్సీపీ ముఖ్య అధికార ప్రతినిధి నవాబ్ మాలిక్ వ్యాఖ్యానించారు. మరోవైపు, అదే పార్టీ సీనియర్ నేత, మాజీ ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ మాత్రం.. ప్రతిపక్షంలో కూర్చోమనే ప్రజలు తీర్పిచ్చారని, తాము అదే పాటిస్తామని వక్కాణించారు. గురువారం రాత్రి శరద్పవార్ నివాసంలో ఎన్సీపీ నేతల భేటీ అనంతరం అజిత్ పవార్ పై వ్యాఖ్యలు చేశారు. అది బీజేపీ, శివసేన డ్రామా బీజేపీ, శివసేన డ్రామాలో పావు కావద్దొని కాంగ్రెస్కు ఆ పార్టీ నేత సంజయ నిరుపమ్ సూచించారు. ప్రభుత్వ ఏర్పాటులో శివసేనకు మద్దతివ్వాలన్న కాంగ్రెస్ ఆలోచనను ఆయన తప్పుబట్టారు. బీజేపీ, శివసేనల మధ్య విభేదాలను ‘అధికారంలో ఎక్కువ వాటా కోసం ఆడుతున్న తాత్కాలిక డ్రామా’అని ఆయన అభివర్ణించారు. ‘బీజేపీ నీడ నుంచి శివసేన ఎన్నటికీ బయటకు రాదు’అని కాంగ్రెస్లో చేరకముందు శివసేనలో కీలక నేతగా వ్యవహరించిన సంజయ్ వ్యాఖ్యానించారు. పొత్తు తేలే దాకా నేనే సీఎం! ఔరంగాబాద్: రాజకీయ అనిశ్చితి కొనసా గుతున్న మహారాష్ట్రలో ఓ ఆసక్తికరమైన ఘటన చోటు చేసుకుంది. బీజేపీ, శివసేనల మధ్య ఒప్పందం కుదిరేవరకూ తనను ముఖ్యమంత్రిగా చేయాలని ఓ రైతు అధికారులకు విజ్ఞప్తి చేశాడు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 105 స్థానాలు, శివసేన 56 స్థానాలు గెలుచుకున్నాయి. అయితే, ముఖ్యమంత్రి పదవిపై ఇరుపార్టీల మధ్య సయోధ్య కుదరకపోవడంతో ప్రభుత్వం ఏర్పాటు సందిగ్ధంలో పడింది. ఈ నేపథ్యంలో బీడ్ జిల్లాకు చెందిన రైతు శ్రీకాంత్ విష్ణూ గడాలే గురువారం కలెక్టర్ను కలిసి సీఎం పీఠంపై అస్పష్టత తొలిగే వరకు ముఖ్యమంత్రిగా వ్యవహరించి, రైతుల సమస్యలు పరిష్కరిస్తానంటూ వినతి పత్రం అందించారు. లేదంటే ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఆందోళనకు దిగుతా నంటూ ఆ రైతు హెచ్చరించడం కొసమెరుపు! -
వీడని ఉత్కంఠ.. ఇక రాష్ట్రపతి పాలనే!
సాక్షి, ముంబై: మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై అనిశ్చితి ఇంకా కొనసాగుతూనే ఉంది. సీఎం పీఠం కోసం ఏర్పడిన ప్రతిష్టంభనకు అసలైన పరిష్కారం దొరకడం లేదు. ఈ నేపథ్యంలో బీజేపీ సీనియర్ నేత, రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి సుధీర్ మృదుగంటివార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నవంబర్ 7లోపు ప్రభుత్వ ఏర్పాటుకు ఏ పార్టీలూ ముందుకు రాకపోతే రాష్ట్రపతి పాలన ఒక్కటే మార్గమని అన్నారు. రాష్ట్ర అసెంబ్లీ పదవీ కాలం నవంబర్ 8న ముగియనుందని, ఆ లోపే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సి ఉంటుందన్నారు. బీజేపీ -శివసేన కూటమిగా ఎన్నికల్లో పోటీ చేసినప్పటికీ ప్రజలు ఏ పార్టీకీ తగిన మద్దతు ఇవ్వలేదని పేర్కొన్నారు. బీజేపీకి ప్రత్యామ్నాయ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం కంటే శివసేన-బీజేపీ కలిసి పనిచేయడమే మేలని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం ఏర్పాటులో శివసేన నేతలు కఠినంగా వ్యవహరిస్తున్నారని, మరో రెండు రోజుల్లో సేన నాయకులతో చర్చలు జరిపే అవకాశం ఉన్నట్టు సుధీర్ వెల్లడించారు. కాగా ఐదేళ్లపాటు తానే మహారాష్ట్ర సీఎంగా ఉంటానని బీజేపీ శాసనసభా పక్షనేత దేవేంద్ర ఫడ్నవిస్ స్పష్టం చేయగా.. బీజేపీ లేకుండానే ప్రభుత్వం ఏర్పాటు చేయగల సత్తా తమకు ఉందని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ బదులిచ్చారు. కాగా ఇటీవల జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 105, శివసేన 56, ఎన్సీపీ 54, కాంగ్రెస్ 44 సీట్లు గెలుచుకున్న విషయం తెలిసిందే. -
అవసరమైతే నేనే కశ్మీర్కు వెళ్తా
న్యూఢిల్లీ/శ్రీనగర్: కశ్మీర్ స్వతంత్రప్రతిపత్తి రద్దు అనంతరం అక్కడి పరిస్థితులపై దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కశ్మీర్లో పరిస్థితులపై నివేదిక ఇవ్వాలని హైకోర్టును ఆదేశించింది. దీంతోపాటు అవసరమైతే శ్రీనగర్కు వెళ్లి పరిస్థితులను స్వయంగా పరిశీలిస్తానని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ అన్నారు. కశ్మీర్ హైకోర్టును ఆశ్రయించడంలో ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయంటూ దాఖలైన పిటిషన్పై ఈ మేరకు స్పందించారు. కశ్మీర్ లోయలో మొబైల్, ఇంటర్నెట్, రవాణా సేవలను నిలిపివేయడంతో జర్నలిస్టులకు విధి నిర్వహణతోపాటు హైకోర్టును ఆశ్రయించడం ప్రజలకు కష్టంగా మారిందంటూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు సోమవారం విచారించింది. ‘హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితో ఈరోజే మాట్లాడతా. అవసరమైతే శ్రీనగర్ వెళ్లి, పరిస్థితిని స్వయంగా పరిశీలిస్తా’ అని ఈ సందర్భంగా సీజేఐ జస్టిస్ గొగోయ్ పేర్కొన్నారు. ఆరోపణలు తప్పని తేలితే తదనంతర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని పిటిషనర్లను హెచ్చరించారు. ఆ రాష్ట్రంలో సాధారణ పరిస్థితులను నెలకొల్పేందుకు సాధ్యమైన అన్ని చర్యలు తీసుకోవాలని కేంద్రం, జమ్మూకశ్మీర్ పరిపాలన యంత్రాంగాన్ని ధర్మాసనం ఆదేశించింది. అయితే, ఈ ప్రక్రియ ప్రాధాన్యతా క్రమంలో, జాతి ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని చేపట్టాలని స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించి ఇప్పటికే తీసుకున్న చర్యలపై అఫిడవిట్ దాఖలు చేయాలని అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ను ఆదేశించింది. వాస్తవ పరిస్థితులపై రాష్ట్ర హైకోర్టుకే అవగాహన ఉంటుంది కాబట్టి..మోబైల్, ఇంటర్నెట్ సేవల నిలిపివేతపై అక్కడే తేల్చుకోవాలని పిటిషనర్కు సూచించింది. హైకోర్టుతోపాటు అన్ని కోర్టులు, లోక్ అదాలత్లు కూడా సక్రమంగా పనిచేస్తున్నాయని కశ్మీర్ ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తెలిపారు. 370 రద్దుపై విచారణకు ఓకే ఆర్టికల్–370 రద్దు, కశ్మీర్లో రాష్ట్రపతి పాలన విధించడాన్ని సవాల్ చేస్తూ పీపుల్స్ కాన్ఫరెన్స్ పిటిషన్పై విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. పార్లమెంట్ నిర్ణయం చట్టబద్ధతను ప్రశ్నిస్తూ దాఖలైన పిటిషన్ల విచారణకు ఏర్పాటైన రాజ్యాంగ ధర్మాసనానికి ఈ పిటిషన్ను పంపింది. ఆర్టికల్–370 రద్దుకు వ్యతిరేకంగా ఇంకా పిటిషన్లను స్వీకరించబోమని, ఈ విషయంలో ఇంప్లీడ్మెంట్ అప్లికేషన్ మాత్రం వేసుకోవచ్చని బెంచ్ తెలిపింది. ‘పార్లమెంట్ నిర్ణయంలో చట్టబద్ధతపై అక్టోబర్లో విచారిస్తాం’ అని కోర్టు తెలిపింది. ఆజాద్కు అనుమతి కాంగ్రెస్ సీనియర్ నేత గులామ్ నబీ ఆజాద్ కశ్మీర్ వెళ్లేందుకు సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. అయితే, ఆయన అక్కడ రాజకీయ సమావేశాలు చేపట్టరాదని స్పష్టం చేసింది. శ్రీనగర్, జమ్మూ, బారాముల్లా, అనంత్నాగ్ జిల్లాలకు వెళ్లి ప్రజలను కలసుకోవచ్చని పేర్కొంది. తన కుటుంబ సభ్యులు, బంధువులను కలుసుకునేందుకు అనుమతించాలంటూ ఆజాద్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. అలాగే, అస్వస్థతకు గురై ఎయిమ్స్లో చికిత్స పొందుతున్న కశ్మీర్ సీపీఎం నేత యూసఫ్ తారిగమి సొంత రాష్ట్రం వెళ్లేందుకు కోర్టు ఓకే చెప్పింది. ఫరూక్ అబ్దుల్లాకు సొంతిల్లే జైలు కశ్మీర్ మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లా(81) సోమవారం ప్రజాభద్రత చట్టం(పీఎస్ఏ)లోని ‘పబ్లిక్ ఆర్డర్’ నిబంధన కింద పోలీసులు అరెస్ట్ చేశారు. ఎటువంటి విచారణ లేకుండా ఆరు నెలలపాటు జైల్లో ఉంచేందుకు అవకాశం కల్పించే, కశ్మీర్కు మాత్రమే వర్తించే చట్టం ఇది. శ్రీనగర్లోని గుప్కార్ రోడ్డులోని ఫరూక్ నివాసాన్నే తాత్కాలిక జైలుగా అధికారులు ప్రకటించారు. ఆర్టికల్ 370ను కేంద్రప్రభుత్వం రద్దుచేసిన నాటి నుంచీ అంటే ఆగస్టు 5వ తేదీ నుంచి ఫరూక్ అబ్దుల్లా గృహ నిర్బంధంలోనే ఉన్నారు. -
కర్ణాటకలో రాష్ట్రపతి పాలన?
సాక్షి, బెంగళూరు: కర్ణాటక రాజకీయం ప్రస్తుతం అనూహ్య మలుపులతో సాగుతోంది. అసెంబ్లీలో మెజారిటీని నిరూపించుకోవాలని గవర్నర్ వజూభాయ్వాలా రెండుసార్లు లేఖలు రాసినా సీఎం కుమారస్వామి పట్టించుకోకపోవడం, స్పీకర్ రమేశ్ కుమార్ సభను సోమవారానికి వాయిదా వేయడంతో ఏం జరగబోతోందో అని సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ సందర్భంగా కర్ణాటకలో రాష్ట్రపతి పాలన విధించాల్సిందిగా గవర్నర్ వజూభాయ్వాలా కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సుచేసే అవకాశముందని రాజకీయవర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. కర్ణాటక అసెంబ్లీలో జరుగుతున్న పరిణామాలు, రాష్ట్రంలో పరిస్థితులపై గవర్నర్ ఇప్పటికే కేంద్ర హోం శాఖ కార్యదర్శికి నివేదిక పంపినట్లు విశ్వసనీయవర్గాలు తెలిపాయి. ఒకవేళ సోమవారం కూడా అసెంబ్లీలో బలపరీక్ష జరగకపోతే వజూభాయ్వాలా నేరుగా రాష్ట్రపతి పాలనకు సిఫార్సు చేయొచ్చని వెల్లడించాయి. ఈ విషయమై ప్రముఖ రాజ్యాంగ నిపుణుడు సుభాష్ కశ్యప్ మాట్లాడుతూ..‘ఇలాంటి పరిస్థితుల్లో గవర్నర్ నిర్ణయమే శిరోధార్యం. ప్రభుత్వానికి సభలో మెజారిటీ లేదని గవర్నర్ భావిస్తే, రాజీనామా చేయమని ముఖ్యమంత్రికి చెప్పే అధికారం గవర్నర్కు ఉంది. ఇక చట్టపరంగా కూడా కాంగ్రెస్–జేడీఎస్ కూటమికి మార్గాలన్నీ మూసుకుపోయినట్లే’ అని అభిప్రాయపడ్డారు. రాష్ట్రపతిపాలన ఎప్పుడు పెట్టొచ్చు? రాజ్యాంగంలోని ఆర్టికల్ 356 ప్రకారం ఏదైనా రాష్ట్రంలో సంక్షోభ పరిస్థితులు నెలకొంటే రాష్ట్రపతి పాలన విధించాలని కేంద్రానికి గవర్నర్ సిఫార్సు చేయవచ్చు. ఆ పరిస్థితులు ఏమిటంటే.. ► రాష్ట్ర శాసనసభ ముఖ్యమంత్రిని ఎన్నుకోలేని పరిస్థితులు నెలకొన్నప్పుడు ► సంకీర్ణ ప్రభుత్వం మెజారిటీ శాసనసభ్యుల మద్దతు కోల్పోయినప్పుడు ► గవర్నర్ ఆదేశించిన సమయంలోగా సీఎం అసెంబ్లీలో మెజారిటీ నిరూపించుకోలేకపోతే ► అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టినప్పుడు సభలో మెజారిటీ కోల్పోతే ► రాష్ట్రంలో శాంతిభద్రతలకు ముప్పు వాటిల్లినా, యుద్ధ పరిస్థితులు, ప్రకృతి వైపరీత్యాలు సంభవించి పాలన గాడితప్పితే రాష్ట్రపతి పాలన విధించవచ్చు రాష్ట్రంలో గతంలో రాష్ట్రపతి పాలన ► 1971, మార్చి 9: వీరేంద్ర పాటిల్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మెజార్టీ కోల్పోయింది (ఏడాది మీద ఒక్క రోజు) ► 1977, డిసెంబర్ 31: ముఖ్యమంత్రి దేవరాజ్ (కాంగ్రెస్)కు సంపూర్ణ మెజార్టీ ఉన్నప్పటికీ గవర్నర్ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేశారు(59 రోజులు) ► 1989, ఏప్రిల్ 21: ఎస్.ఆర్.బొమ్మై ప్రభుత్వం మెజారిటీ కోల్పోయింది(223 రోజులు) ► 1990, అక్టోబర్ 10: వీరేంద్ర పాటిల్ ప్రభుత్వం బర్తరఫ్ (ఏడు రోజులు) ► 2007, అక్టోబర్ 9: బీజేపీ–జేడీఎస్ సంకీర్ణ కూటమిలో అధికార మార్పిడిపై ప్రతిష్టంభనతో మెజారిటీ కోల్పోయిన ప్రభుత్వం (33 రోజులు) ► 2007, నవంబర్ 20: అసెంబ్లీలో మెజారిటీ లేకపోవడంతో సీఎం యడ్యూరప్ప రాజీనామా(189 రోజులు) నేడు సీఎల్పీ భేటీ బెంగళూరు: కాంగ్రెస్ నేతలు జి.పరమేశ్వర, డి.కె.శివకుమార్తో శనివారం బెంగళూరులో సమావేశమైన సీఎం కుమారస్వామి, సభలో అనుసరించాల్సిన వ్యూహంపై సమాలోచనలు జరిపారు. ఓటింగ్ నేపథ్యంలో ఆదివారం సీఎల్పీ భేటీకి హాజరు కావాలని కాంగ్రెస్ ఎమ్మెల్యేలను మాజీ సీఎం, సీఎల్పీ నేత సిద్దరామయ్య ఆదేశించారు. విశ్వాసపరీక్షలో తాము మెజారిటీని నిరూపించుకుంటామని మంత్రి శివకుమార్ ఈ సందర్భంగా ధీమా వ్యక్తం చేశారు. ఇటీవల రాజీనామాను వెనక్కితీసుకున్న కాంగ్రెస్ రెబెల్ ఎమ్మెల్యే రామలింగారెడ్డితో జేడీఎస్ అధినేత దేవెగౌడ సమావేశమయ్యారు. మరోవైపు, ప్రతిపక్ష నేత యడ్యూరప్ప బీజేపీ ఎమ్మెల్యేలతో చర్చించారు. ఆయనే కీలకం! కర్ణాటకలో 16 మంది రెబెల్ ఎమ్మెల్యేలు రాజీనామా చేయగానే అందరి దృష్టి ఓ వ్యక్తివైపు కేంద్రీకృతమైంది. ఆయన ఏ నిర్ణయం తీసుకుంటారన్న విషయమై రాజకీయ పార్టీలతో పాటు సామాన్య ప్రజల్లో సైతం ఆసక్తి నెలకొంది. ఆయనే కర్ణాటక అసెంబ్లీ స్పీకర్ రమేశ్ కుమార్. టీవీ సీరియల్స్లో నటించిన రమేశ్ తన తెలివితేటలూ, పంచ్ డైలాగులతో అసెంబ్లీని నిర్వహించారు. విశ్వాసపరీక్ష నేపథ్యంలో తీవ్రమైన ఒత్తిడి నెలకొన్నప్పటికీ అటు అధికార కాంగ్రెస్–జేడీఎస్, ఇటు ప్రతిపక్ష బీజేపీ ఎమ్మెల్యేలను నియంత్రిస్తూ విధానసౌధను సజావుగా నడిపించారు. రెబెల్ ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టును ఆశ్రయించినప్పటికీ, తాను రాజ్యాంగ నిబంధనల మేరకే ముందుకెళతాననీ, తప్పుడు నిర్ణయాలతో చరిత్రలో ద్రోహిగా మిగిలిపోవాలనుకోవడం లేదన్నారు. 1978లో కోలార్ జిల్లా శ్రీనివాసపుర అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరఫున గెలవడంతో రమేశ్ రాజకీయ ప్రస్థానం మొదలైం ది. అప్పటినుంచి పలు రాజకీయ పార్టీల తరఫున పోటీచేసిన రమేశ్ 5సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. అసెంబ్లీలో అనుచిత వ్యాఖ్యలు.. కర్ణాటకలో కాంగ్రెస్–జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడగానే స్పీకర్గా ఎవరిని నియమించాలన్న ప్రశ్న తలెత్తింది. ఓవైపు బీజేపీ 105 మంది ఎమ్మెల్యేలతో అతిపెద్ద పార్టీగా అవతరించడం, మరోవైపు ఇద్దరు స్వతంత్రులు, ఓ బీఎస్పీ ఎమ్మెల్యేతో ప్రభుత్వం అతుకులబొంతగా మారిన నేపథ్యంలో సభను సజావుగా ఎవరు నడిపించగలరన్న కాంగ్రెస్ పెద్దల ప్రశ్నకు రమేశ్ కుమార్ సమాధానంగా నిలిచారు. 2018లో కర్ణాటక అసెంబ్లీ స్పీకర్గా బాధ్యతలు స్వీకరించిన రమేశ్.. తన నటనానుభవాన్ని ప్రదర్శిస్తూ అసెంబ్లీని సజావుగా నడుపుతూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అయితే ఈ క్రమంలో కొన్నిసార్లు ఆయన నోరు జారారు. తాను అత్యాచార బాధితుడినని అసెంబ్లీ సాక్షిగా రమేశ్ వ్యాఖ్యానించడం పెనుదుమారాన్ని రేపింది. తర్వాత సారీ చెప్పారు. -
కశ్మీర్లో రాష్ట్రపతి పాలన మరో ఆరు నెలలు
న్యూఢిల్లీ: జమ్మూ కశ్మీర్లో రాష్ట్రపతి పాలనను మరో ఆరు నెలలు పాడిగించేం దుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది. ఈ నెల 3వ తేదీ నుంచి అమల్లోకి రానున్న ఈ పొడిగింపు ప్రతిపాదనకు ఇటీవలే లోక్సభ అంగీకారం తెలిపింది. ఈ ఏడాది చివర్లో కశ్మీర్లో ఎన్నికలు జరపాలని భావిస్తున్నందున రాష్ట్రపతి పాలనను పొడిగించడం తప్ప తమకు మరో ప్రత్యామ్నాయం లేదని ఈ సందర్భంగా హోం మంత్రి అమిత్ షా రాజ్యసభకు తెలిపారు. అసెంబ్లీ ఎన్నికలను ప్రభుత్వం ఆలస్యం చేస్తోందంటూ ప్రతిపక్షం చేస్తున్న ఆరోపణలకు ఆయన బదులిస్తూ.. గతంలో ఎన్నడూ రంజాన్ మాసం (మే 7–జూన్4)లో రాష్ట్రంలో ఎన్నికలు జరపలేదన్నారు. అదేవిధంగా, జూన్ 30 నుంచి ఆగస్టు 15 వరకు అమర్నాథ్ యాత్ర సాగుతోం దని తెలిపారు. రాష్ట్రంలో 2018 డిసెంబర్ 20వ తేదీ నుంచి రాష్ట్రపతి పాలన కొనసాగుతోంది. ఈ సందర్భంగా హోం మంత్రి అమిత్ షా.. కశ్మీర్లోని అంతర్జాతీయ సరిహద్దు వెంబడి ఉన్న ప్రజలకు ఉద్యోగాలు, ప్రమోషన్లు, ప్రవేశాల్లో రిజర్వేషన్లు కల్పించే బిల్లును సభలో ప్రవేశపెట్టారు. 2030 కల్లా దేశంలోని ప్రజలందరికీ సురక్షిత నీటిని అందించాలన్న లక్ష్యాన్ని 2024 సంవత్సరానికి కుదించినట్లు జల్శక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెఖావత్ రాజ్యసభకు తెలిపారు. ఐక్యరాజ్యసమితి తీర్మానానికి లోబడే ఈ చర్య తీసుకున్నామ న్నారు. నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్న జిల్లాల్లో వృథా జలాన్ని శుద్ధిచేసి వాడుకునే అంశాన్ని పరిశీలిస్తున్నామన్నారు. నీటి కొరతను నివారించే విషయంలో రాష్ట్రాలతో కలిసి పనిచేస్తున్నట్లు వివరించారు. -
కశ్మీర్లోని పరిస్థితిని అర్థం చేసుకోండి
-
కశ్మీర్లోని పరిస్థితిని అర్థం చేసుకోండి
న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్ రిజర్వేషన్ (సవరణ) బిల్లు 2019ను కేంద్ర హోంమంత్రి అమిత్ షా సోమవారం రాజ్యసభలో ప్రవేశపెట్టారు. బిల్లుతోపాటు జమ్మూకశ్మీర్లో రాష్ట్రపతి పాలనను మరో ఆరు నెలలపాటు పొడిగించే తీర్మానాన్ని కూడా ఆయన ప్రవేశపెట్టారు. జమ్మూకశ్మీర్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితిని అర్థం చేసుకొని బిల్లుకు, తీర్మానానికి రాజ్యసభ మద్దతు పలుకుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. జమ్మూకశ్మీర్లో రాష్ట్రపతి పాలన పొడగింపునకు సమాజ్వాదీ పార్టీ మద్దతు తెలుపగా.. కాంగ్రెస్ పార్టీ మాత్రం వ్యతిరేకిస్తోంది. రంజాన్ పండుగ, అమర్నాథ్ యాత్ర వంటి సాకులతో జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలను వాయిదా వేయడం సరికాదని కాంగ్రెస్ ఎంపీ విప్లవ్ ఠాకూర్ కేంద్రం తీరును తప్పుబట్టారు. జమ్మూకశ్మీర్లో రాష్ట్రపతి పాలన జూలై 3వ తేదీతో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఆర్టికల్ 356 ప్రకారం ఆ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనను పొడగించే తీర్మానాన్ని ఇప్పటికే కేంద్రం లోక్సభలో ప్రవేశపెట్టింది. త్వరలో అమర్నాథ్ యాత్ర ఉన్న నేపథ్యంలో రాష్ట్రంలో ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించే పరిస్థితి లేదని హోంమంత్రి అమిత్ షా ఇప్పటికే తెలిపారు. -
జమ్మూకశ్మీర్లో మరో 6 నెలలు రాష్ట్రపతి పాలన
-
ఏడాది చివర్లో జమ్ము కశ్మీర్ ఎన్నికలు
సాక్షి, న్యూఢిల్లీ : ఈ ఏడాది చివర్లో జమ్ము కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. ప్రస్తుతం కశ్మీర్లో ఎన్నికలు నిర్వహించే పరిస్థితి లేదని చెప్పారు. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్ధితిని కేంద్రం పర్యవేక్షిస్తోందని అన్నారు. జమ్ము కశ్మీర్లో రాష్ట్రపతి పాలనను పొడిగిస్తూ తీర్మానాన్ని అమిత్ షా శుక్రవారం పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. ఈ బిల్లు రాష్ట్ర ప్రజలకు మేలు చేకూరుస్తుందని చెప్పారు. కాగా జమ్ము కశ్మీర్లో రాష్ట్రపతి పాలనను పొడిగిస్తూ అంతకుముందు కేంద్ర కేబినెట్ తీర్మానం చేసిన సంగతి తెలిసిందే. -
ఆధార్ సవరణ బిల్లుకు కేబినెట్ ఆమోదం
న్యూఢిల్లీ: బ్యాంకు అకౌంట్లు తెరిచేందుకు, మొబైల్ ఫోన్ కనెక్షన్లు పొందేందుకు ఆధార్ను గుర్తింపు ధ్రువీకరణగా వాడుకునేందుకు వీలు కల్పిస్తూ రూపొందించిన సవరణ బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. మార్చిలో విడుదల చేసిన ఆర్డినెన్స్ స్థానంలో రూపొందించిన ఈ సవరణ బిల్లును 17వ తేదీ నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్ సమావేశాల్లో ప్రవేశపెట్టనుంది. నిబంధనలు ఉల్లంఘించిన వారికి భారీ జరిమానాలను కూడా బిల్లులో ప్రతిపాదించింది. అదేవిధంగా, 18 ఏళ్లు నిండిన వారు బయోమెట్రిక్ గుర్తింపు విధానం నుంచి బయటికి వచ్చేందుకు వీలు కల్పించే ప్రతిపాదన కూడా ఉంది. కశ్మీర్లో రాష్ట్రపతి పాలన పొడిగింపు జమ్మూకశ్మీర్లో రాష్ట్రపతి పాలనను మరో ఆరు నెలలు పొడిగించేందుకు ప్రధాని మోదీ నేతృత్వంలో సమావేశమైన కేబినెట్ ఆమోదం తెలిపిందని కేంద్ర మంత్రి ప్రకాశ్ జవడేకర్ వెల్లడించారు. రాష్ట్రంలో 2018 జూన్ 20వ తేదీ నుంచి రాష్ట్రపతి పాలన అమల్లో ఉంది. అమర్నాథ్ యాత్ర ముగిసిన తర్వాత రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల తేదీలను ప్రకటిస్తామంటూ ఎన్నికల సంఘం ఇటీవల ప్రకటించిన నేపథ్యంలో రాష్ట్రపతి పాలనకు ఇదే ఆఖరి పొడిగింపు కావచ్చని భావిస్తున్నారు. ప్రస్తుత గడువు జూలై 2వ తేదీతో ముగియనుండగా తాజా పొడిగింపు జూలై 3వ తేదీ నుంచి అమలు కానుంది. రానున్న పార్లమెంట్ సమావేశాల్లో ఈ మేరకు ప్రభుత్వం బిల్లును ప్రవేశపెట్టనుంది. ట్రిపుల్ తలాక్ బిల్లుకు ఆమోదం ట్రిపుల్ తలాక్ విధానంపై నిషేధం విధిస్తూ రూపొందించిన బిల్లును కేబినెట్ ఆమోదించింది. ఇందుకు సంబంధించి ఫిబ్రవరిలో జారీ చేసిన ఆర్డినెన్స్ స్థానంలో ఈ బిల్లును ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశపెట్టనుంది. 16వ లోక్సభ రద్దు కావడంతో రాజ్యసభ వద్ద పెండింగ్లో ఉన్న ఈ బిల్లుకు కాలపరిమితి తీరింది. దీంతో ప్రభుత్వం మళ్లీ ఈ బిల్లు రూపొందించింది. ట్రస్టులకు ప్రత్యేక ఆర్థిక మండలా(ఎస్ఈజెడ్)లను ఏర్పాటు చేసుకునేందుకు వీలు కల్పించే ఎస్ఈజెడ్ సవరణ బిల్లుపైనా కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. -
బెంగాల్లో రాష్ట్రపతి పాలన తప్పదా!
సాక్షి, న్యూఢిల్లీ : చినికి చినికి గాలి వానలా మారినట్లు పశ్చిమ బెంగాల్లో పార్టీ జెండాలు, బ్యానర్ల విషయంలో బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ప్రారంభమైన తగువు తుపాకులు పట్టుకొని పరస్పరం కాల్చుకునే పరిస్థితికి దారితీసింది. ఇరువర్గాల మధ్య గత పక్షం రోజులుగా కొనసాగుతున్న ఘర్షణల్లో ఇప్పటివరకు 13 మంది మరణించారు. వారిలో ఎనిమిది మంది బీజేపీ కార్యకర్తలుకాగా, ఐదుగురు తణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు. ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం నుంచి 24 పరగణాల జిల్లా ఉత్తరాదిలోనే ఘర్షణలు ఎక్కువగా జరుగుతున్నాయి. వీటికి ఇంతటితో తెరదించకపోతే మరింత తీవ్ర పరిణామాలు ఉంటాయని సామాజిక శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. జాతి విద్వేషాలు రగులుకునే ప్రమాదం కూడా ఉందని వారంటున్నారు. బంగ్లాదేశ్కు సరిహద్దులో ఉన్న ఈ జిల్లాలో 2017, 2010లో హిందూ, ముస్లింల మధ్య అల్లర్లు చెలరేగాయి. బీహార్ నుంచి జార్ఖండ్ నుంచి వచ్చిన వలసదారులు స్థానిక బెంగాలీలను స్థానభ్రంశం చేశారని తణమూల్ మంత్రి ఒకరు ఆరోపించడం అంటే జాతి విద్వేషాలకు అవకాశం ఇవ్వడమే. 50 సంవత్సరాల క్రితం కాంగ్రెస్ పార్టీని కమ్యూనిష్టులు సవాల్ చేసినప్పుడు రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితి ఉండేదో, 2000 సంవత్సరంలో కమ్యూనిస్టులను, మమతా బెనర్జీ సవాల్ చేసినప్పుడు ఎలాంటి పరిస్థితి ఉందో, ఇప్పుడు మమతా పార్టీని బీజేపీ సవాల్ చేస్తున్నప్పుడు కూడా రాష్ట్రంలో అలాంటి పరిస్థితే ఏర్పడిందని సామాజిక శాస్త్రవేత్తలు వ్యాఖ్యానిస్తున్నారు. అధికారంలో ఉన్న పార్టీగా అల్లర్లను అరికట్టాల్సిన బాధ్యత తణమూల్ కాంగ్రెస్ పార్టీకి ఎక్కువగా ఉంది. మమత అధికార యంత్రాంగం కూడా పార్టీ లాగా వ్యవహరిస్తుండడంతో పరిస్థితి తీవ్రమైంది. ఇరువర్గాల మధ్య కొనసాగుతున్న ఘర్షణలను అరికట్టడం చేతకాక బెంగాల్ పోలీసులు చేతులు కట్టుకు కూర్చున్నారని అనడంకన్నా వాటిని ఆపడం ఇష్టంలేక మిన్నకుంటున్నట్లు కనిపిస్తోంది. గత ఎన్నికల్లో 40 శాతం ఓట్లను గెలుచుకున్న ప్రతిపక్ష పార్టీగా బీజేపీ కూడా అల్లర్లను అరికట్టేందుకు బాధ్యత తీసుకోవాలి. లేకపోతే పరిస్థితి తీవ్రమవడం, కేంద్రం రాష్ట్రపతి పాలనను విధించడం తప్పదు. -
బెంగాల్లో రాష్ట్రపతి పాలన??
కోల్కతా: లోక్సభ ఎన్నికల ఫలితాలు వెలువడినప్పటికీ.. పశ్చిమబెంగాల్లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఎన్నికల సందర్భంగా అధికార తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ), బీజేపీ శ్రేణుల మధ్య తీవ్ర ఘర్షణలు జరిగి.. హింస చెలరేగిన సంగతి తెలిసిందే. ఎన్నికల తర్వాత కూడా బెంగాల్ రాజకీయ వాతావరణం ఉద్రిక్తంగానే ఉంది. శనివారం రాష్ట్రంలో జరిగిన ఘర్షణల్లో నలుగురు చనిపోయినట్టు తెలుస్తోంది. ఈ ఘర్షణలకు మీరే కారణమంటూ టీఎంసీ, బీజేపీ పరస్పరం విమర్శించుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో బెంగాల్లోని పరిస్థితులను ప్రధాని నరేంద్రమోదీకి, కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ఆ రాష్ట్ర గవర్నర్ కేశరినాథ్ త్రిపాఠి తెలియజేశారు. రాష్ట్రంలోని శాంతిభద్రతలపై కేంద్రానికి నివేదిక అందజేశారు. ఈ క్రమంలో జాతీయ మీడియా సంస్థ ఇండియా టుడేతో మాట్లాడిన త్రిపాఠి.. బెంగాల్లో రాష్ట్రపతి పాలన విధించాల్సిన అవసరం రావొచ్చునని పేర్కొన్నారు. ఎన్నికల తర్వాత జరిగిన ఘర్షణల్లో డజను మంది వరకు ప్రాణాలు కోల్పోయారని, ఈ క్రమంలో బెంగాల్లో పరిస్థితులు ఇంకా దిగజారితే.. రాష్ట్రపతి పాలన విధించాల్సిన అవసరముంటుందని ఆయన అన్నారు. బెంగాల్లో రాష్ట్రపతి పాలన విధించాల్సిన అవసరముందన్న బీజేపీ నేత కైలాశ్ విజయ్వార్గియా వ్యాఖ్యలపై ఆయన స్పందిస్తూ.. ‘ఆ అవసరం రావొచ్చు. అలాంటి డిమాండ్ వస్తే కేంద్రం దానిని పరిశీలిస్తుంది. అయితే, ప్రస్తుతం రాష్ట్రపతి పాలన గురించి ప్రధానితోగానీ, హోంమంత్రితోగానీ నేను చర్చించలేదు’ అని పేర్కొన్నారు. బెంగాల్లో హింసకు మీరే కారణమంటూ బీజేపీ, టీఎంసీ పరస్పరం వేలెత్తి చూపించుకోవడంపై స్పందిస్తూ.. రాజకీయ పార్టీలు సంయమనం పాటిస్తూ.. రాష్ట్రంలో శాంతిభద్రతలు పరిరక్షించేందుకు పాటుపడాలని సూచించారు. -
రాష్ట్రపతి పాలనలోకి జమ్మూకశ్మీర్
న్యూఢిల్లీ: రాజకీయ సందిగ్ధత కారణంగా గత ఆరు నెలలుగా గవర్నర్ పాలనలో ఉన్న జమ్మూకశ్మీర్ తాజాగా రాష్ట్రపతి పాలనలోకి వెళ్లింది. బుధవారం అర్ధరాత్రి నుంచి కశ్మీర్ను రాష్ట్రపతిపాలనలోకి తెస్తూ రాష్ట్రపతి కోవింద్ అధికార ప్రకటన వెలువరించారు. రాష్ట్రంలో రాష్ట్రపతిపాలన విధించాలని సిఫార్సు చేస్తూ గవర్నర్ సత్యపాల్ మాలిక్ నివేదించిన నేపథ్యంలో సోమవారం మోదీ నేతృత్వంలోని మంత్రివర్గం రాష్ట్రపతిపాలనకు పచ్చజెండా ఊపింది. జూన్లో కశ్మీర్లో మెహబూబా ముఫ్తీ నేతృత్వంలోని అధికార పీడీపీ సర్కారుకు బీజేపీ మద్దతు ఉపసంహరించడంతో రాజకీయసంక్షోభం మొదలైంది. కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీల మద్దతు తమకుందని, ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతినివ్వాలని ఆ తర్వాత గవర్నర్ను పీడీపీ కోరింది. అదే సమయంలో బీజేపీ, మరికొందరు ఇతర సభ్యుల మద్దతుతో ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమని సజ్జద్ లోన్ నేతృత్వంలోని పీపుల్స్ కాన్ఫరెన్స్ సైతం గవర్నర్ను కలిసింది. సుస్థిర ప్రభుత్వం ఏర్పాటుచేసే సామర్థ్యం రెండు కూటములకు లేవని భావిస్తూ గవర్నర్ అసెంబ్లీని రద్దుచేశారు. -
జమ్ముకశ్మీర్లో రాష్ట్రపతి పాలన
శ్రీనగర్ : జమ్ముకశ్మీర్లో బుధవారం అర్థరాత్రి నుంచి రాష్ట్రపతి పాలన అమలులోకి రానుంది. ఆరు నెలల గవర్నర్ పాలన ముగియడంతో ఆ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని కేంద్రం నిర్ణయించింది. గవర్నర్ సత్యపాల్ మాలిక్ ఇప్పటికే ఒక నివేదికను కేంద్రానికి పంపడం, కేంద్ర కేబినెట్తోపాటూ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కూడా ఆమోద ముద్ర వేయడంతో బుధవారం అర్థరాత్రి నుంచి రాష్ట్రపతి పాలన అమలులోకి రానుంది. ఈ ఏడాది జూన్ నెలలో సంకీర్ణ కూటమి నుంచి బీజేపీ వైదొలుగడంతో మెహబూబా ముఫ్తీ ప్రభుత్వం మైనారిటీలో పడిపోయిన సంగతి తెలిసిందే. ఆ రాష్ట్ర ప్రత్యేక రాజ్యాంగం ప్రకారం, ప్రభుత్వం పడిపోతే ఆరు నెలల పాటు గవర్నర్ పాలన విధిస్తారు. గవర్నర్ ఈ ఆరు నెలల్లో వీలైతే కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి లేదా అసెంబ్లీ రద్దు చేయాల్సి ఉంటుంది. ఆ తరువాత ఆరు నెలలపాటు రాష్ట్రపతి పాలన కొనసాగుతుంది. ఈ కాలంలోనే రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహించాలి. ఎన్నికలు జరుగకపోతే మరో ఆరు నెలలు రాష్ట్రపతి పాలనను పొడిగించవచ్చు. -
రాష్ట్రపతి పాలనకు ఆదేశించండి
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో శాసనసభ ఎన్నికలు నిష్పాక్షికంగా, స్వేచ్ఛగా జరిగేందుకు వీలుగా రాష్ట్రపతి పాలన విధించేలా కేంద్రాన్ని ఆదేశించాలంటూ సుప్రీం కోర్టులో బుధవారం పిటిషన్ దాఖలైంది. తాము 18 ఏళ్లు నిండినప్పటికీ 2018 జనవరి 1ని అర్హత తేదీగా తీసుకోవడం వల్ల ఓటు హక్కు కోల్పోతున్నామని పోతుగంటి శశాంక్రెడ్డి, ఆర్.అభిలాష్ రెడ్డి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఎన్నికలకు స్వేచ్ఛాయుత, నిష్పాక్షిక వాతావరణం ఉండాలంటే రాష్ట్రపతి పాలనే శరణ్యమని పిటిషన్లో తెలిపారు. ప్రతివాదులుగా కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘాలు, తెలంగాణ ప్రభుత్వం, గవర్నర్ను చేర్చారు. న్యాయవాది ఆర్.చంద్రశేఖర్రెడ్డి దాఖలు చేసిన ఈ పిటిషన్ సోమవారం విచారణకు వచ్చే అవకాశం ఉంది. అధికార పార్టీకి అనుకూలమని.. తెలంగాణ శాసనసభ ఎన్నికలు సాధారణ షెడ్యూలు ప్రకారం జరిగితే 20 లక్షల మంది కొత్త ఓటర్లు ఓటు హక్కు పొంది వినియోగించుకునేవారని, కానీ కేంద్ర ఎన్నికల సంఘం అర్ధంతరంగా ఓటర్ల నమోదు షెడ్యూలును కుదించిందని పిటిషన్లో పేర్కొన్నారు. ‘శాసనసభను విశ్వాసంలోకి తీసుకోకుండా ముందస్తుగా సభ రద్దు చేస్తూ మంత్రిమండలి సిఫారసు చేయగలదా? ఏ అత్యవసర పరిస్థితి లేకున్నా సభ అభిప్రాయాన్ని తెలుసుకోకుం డానే ఇలా రద్దు చేయడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం కాదా? అధికార పార్టీకి సానుకూల సమయమని చెప్పి ఓటర్ల నమోదుకు 2018 జనవరి 1ని అర్హత తేదీగా ప్రకటించడం స్వేచ్ఛ గా, నిష్పాక్షికంగా ఎన్నికలు నిర్వహించడమవుతుం దా?ఎన్నికలు నిష్పాక్షికంగా జరిగేందుకు కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్రపతి పాలనకు ఎందుకు సిఫారసు చేయదు?’ వంటి ప్రశ్నలను పిటిషన్లో లేవనెత్తారు. ‘రద్దు’పై న్యాయ సమీక్ష జరపాలి తెలంగాణ ఎన్నికలు 4 రాష్ట్రాలతో పాటే వస్తాయని, తాను ఎన్నికల సంఘంతో మాట్లాడానని సీఎం ప్రకటన చేశారని పిటిషనర్లు ఆక్షేపించారు. ఖమ్మం జిల్లా నుంచి 7 మండలాలను ఏపీలో విలీనం చేయగా సం బంధిత ఓటరు జాబితాను ఇప్పటికీ సవరించలేదని వివరించారు. 18 ఏళ్లు నిండిన వారిని ఓటరు జాబి తాలో చేర్చేలా ఆదేశాలివ్వాలని, కొత్తగా 20 లక్షల మంది ఓటు హక్కును వినియోగించుకోలేని రీతిలో అసాధారణంగా అసెంబ్లీని రద్దు చేయడంపై న్యాయ సమీక్ష జరపాలని.. ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పాక్షికంగా జరిగేలా తెలంగాణలో రాష్ట్రపతి పాలన విధిం చేలా కేంద్రానికి ఆదేశాలివ్వాలని కోరారు. -
‘ఏపీలో రాష్ట్రపతి పాలన పెట్టండి’
-
‘ఏపీలో రాష్ట్రపతి పాలన పెట్టండి’
సాక్షి, హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రపతి పాలనకు సిఫారసు చేయాలని బీజేపీ నేతలు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ను కోరారు. ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజుతో పాటు పలువురు బీజేపీ నేతలు మంగళవారం రాజ్భవన్లో గవర్నర్ను కలిశారు. ఏపీలో శాంతి భద్రతలు కరువయ్యయాని వారు గవర్నర్కు ఫిర్యాదు చేశారు. గవర్నర్తో సమావేశం అనంతరం బీజేవైఎం ఏపీ అధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ.. ‘ఏపీలో మానవహక్కుల ఉల్లంఘన, రాజ్యాంగ హక్కుల ఉల్లంఘన జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్లో అప్రకటిత ఎమర్జెన్సీ కొనసాగుతోంది. పౌరుల హక్కులు, ప్రతిపక్ష పార్టీల హక్కులు కాలరాయబడుతున్నాయి. బీజేపీ నేతలు అమిత్ షా, కన్నా లక్ష్మీనారాయణ, సోము వీర్రాజులపై దాడులు జరిగినా పోలీసులు పట్టించుకోవడం లేదు. ఏలూరులో సీఎం పర్యటన పేరిట బీజేపీ శ్రేణులను అరెస్ట్ చేయడం దారుణం. ఏపీలో ఇంత దుర్మార్గంగా దాడులు జరగడం ఇదే తొలిసారి. రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారు కూడా పార్టీ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారు. ఏపీలో ప్రజలకు రక్షణ లేదు కాబట్టే గవర్నర్ను జోక్యం చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేశాం. రాష్ట్రపతి పాలన తప్ప మరో మార్గం లేదు. టీడీపీ అధికారం ఇంకో ఆరు నెలలు మాత్రమేన’ని తెలిపారు. బీజేపీ నేత త్రిపురనేని చిట్టిబాబు మాట్లాడుతూ.. టీడీపీ నిరాశ నిస్పృహలతోనే ఇలాంటి దారుణాలకు పాల్పడుతుందన్నారు. సీఎం దివాళా కోరు తనం వదిలి సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. విష్ణువర్ధన్ రెడ్డి, నటి కవిత, అడ్వకేట్ హంస, త్రిపురనేని చిట్టిబాబు గవర్నర్ను కలసినవారిలో ఉన్నారు. -
సిగ్గులేని ప్రభుత్వం.. రాష్ట్రపతి పాలన పెట్టండి
కోల్కతా: పంచాయితీ ఎన్నికల వేళ పశ్చిమ బెంగాల్లో నెలకొన్న హింసాత్మక ఘటనలపై బీజేపీ స్పందించింది. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షిణించిపోయాయని, వెంటనే రాష్ట్రపతి పాలన విధించాలని కోరుతోంది. ఈ మేరకు కేంద్రమంత్రి, అస్నాసోల్ ఎంపీ బాబుల్ సుప్రియో మాట్లాడుతూ.. ‘రాష్ట్రంలో అధికార తృణమూల్ రాజ్యాంగ సూత్రాలను పాటించట్లేదు. ఓటర్లను భయబ్రాంతులకు గురిచేస్తోంది’ అని టీఎంసీపై విమర్శలు గుప్పించారు. ‘ఉదయం నుంచి జరిగిన పరిణామాలు నాకు పెద్దగా ఆశ్చర్యాన్ని కలిగించలేదు. ఎందుకంటే టీఎంసీ ఓ రౌడీల పార్టీ. మమతా బెనర్జీ ప్రభుత్వం సుపారీలు ఇచ్చి ఎన్నికల్లో హింసను ప్రేరేపించింది. ఈ ప్రభుత్వానికి సిగ్గు లేదు. నైతికత అంతకన్నా లేదు. తక్షణమే ప్రభుత్వాన్ని రద్దు చేసి, రాష్ట్రపతి పాలన విధించాలి. అప్పుడే బెంగాల్ ప్రజలు ప్రశాంతంగా బతకగలుగుతారు’ అని బాబుల్ ఓ మీడియా ఛానెల్తో పేర్కొన్నారు. కాగా, తృణమూల్ నేత, పశ్చిమ బెంగాల్ మంత్రి రవీంద్రనాద్ ఘోష్, పోలింగ్ బూత్ వద్దనున్న బీజేపీ ఏజెంట్పై దాడి చేసిన ఘటనను ఈ సందర్భంగా బాబుల్ ప్రస్తావించారు. పంచాయతీ ఎన్నికల్లో తృణమూల్ అధికార బలంతో ఓటర్లను మభ్యపెడుతోందని, తృణమూల్ కార్యకర్తలు కర్రలు, ఇనుప రాడ్లతో బీజేపీ కార్యకర్తలపై ఇష్టానుసారం దాడులకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు.మరోవైపు ఉదయం నుంచి జరిగిన పరిణామాలను ఆయన తన ట్విటర్లో పోస్ట్ చేశారు. ఇదిలా ఉంటే పంచాయితీ ఎన్నికల సందర్భంగా రాజకీయ ప్రత్యర్థుల మధ్య జరిగిన చెలరేగిన ఘర్షణలో ఐదుగురు ఓటర్లు మరణించగా, 25 మంది తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. -
జమ్మూకశ్మీర్లో రాష్ట్రపతి పాలన విధించాలి
ఢిల్లీ: జమ్మూకశ్మీర్ లో రాష్ట్రపతి పాలన విధించాలని బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి అన్నారు. మహబూబా ముఫ్తీ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని ఆయన మంగళవారమిక్కడ వ్యాఖ్యానించారు. సర్కార్ వైఫల్యం వల్లే అనంత్నాగ్ లో యాత్రికులపై ఉగ్రదాడి జరిగిందన్నారు. జమ్మూ ప్రజలకు భద్రత కరువైందని సుబ్రహ్మణ్యస్వామి వ్యాఖ్యానించారు. కాగా జమ్మూకశ్మీర్లోని అనంత్నాగ్ జిల్లాలో ఉగ్రవాదులు నిన్న అమర్నాథ్ యాత్రికుల బస్సుపై జరిపిన కాల్పుల్లో ఆరుగురు మహిళలు సహా ఏడుగురు మృతి చెందిన విషయం తెలిసిందే. మరో 32 మంది గాయపడ్డారు. మృతులంతా గుజరాత్ వాసులు. 2000 సంవత్సరం తర్వాత ఉగ్రవాదులు అమర్నాథ్ యాత్రికులపై భీకరంగా దాడి చేయడం ఇదే తొలిసారి. మరోవైపు ముఖ్యమంత్రి ముఫ్తీ తాజా పరిణామాలతో పాటు, శాంతి భద్రతలపై మంత్రివర్గంతో సమావేశమయ్యారు. ఈరోజు ఉదయం ఆమె ఉగ్రవాదిలో గాయపడ్డవారిని పరామర్శించారు. ఉగ్రదాడితో కాశ్మీరీలందరూ సిగ్గుతో తలదించుకోవాల్సిన ఘటన ఇది అని ఆమె అన్నారు. -
‘ఢిల్లీలో రాష్ట్రపతిపాలన’
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ఎమ్మెల్యేలకు బీజేపీ గాలం వేస్తోందని చాందినీ చౌక్ ఎమ్మెల్యే అల్కా లంబా ఆరోపించారు. పార్టీ ఫిరాయిస్తే తనకు లోక్సభ టికెట్ ఇస్తానని బీజేపీ బేరం పెట్టిందని ఆమె వెల్లడించారు. బీజేపీ మహిళా నేత షాజియా ఇల్మితో సమానంగా పార్టీలో హోదా కల్పిస్తామని ఆశ పెట్టినట్టు తెలిపారు. ‘ఆప్ పనైపోయిందని మా పార్టీ ఎమ్మెల్యేలకు బీజేపీ నాయకులు ఫోన్లు చేస్తున్నారు. ఎంపీ టికెట్ లేదా ప్రభుత్వంలో కీలకమైన పదవి ఇస్తామని నాకు ఆశచూపారు. అరుణాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లో మాదిరిగా ప్రధాని నరేంద్ర మోదీ త్వరలో ఢిల్లీలో రాష్ట్రపతి పాలన విధిస్తారని బీజేపీ నాయకులు నాతో చెప్పార’ని అల్కా లంబా తెలిపారు. బీజేపీ నాయకులు తనతో మాట్లాడిన వివరాలను ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాకు తెలిపినట్టు చెప్పారు. తాజాగా జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో అధికార ఆమ్ ఆద్మీ పార్టీకి బీజేపీ షాక్ ఇచ్చింది. ఎంసీడీ ఎన్నికల్లో కమలం వికసించింది. ఈవీఎంల మోసం వల్లే బీజేపీ గెలిచిందని ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. -
'తమిళనాడులో రాష్ట్రపతి పాలన విధించాలి'
-
'తమిళనాడులో రాష్ట్రపతి పాలన విధించాలి'
చెన్నై: తమిళనాడులో రాష్ట్రపతి పాలన విధించాలని కేంద్ర హోంశాఖ మంత్రి రాజనాథ్ సింగ్కు బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు శుక్రవారం రాజనాథ్కు సుబ్రహ్మణ్యస్వామి లేఖ రాశారు. సీఎం అనారోగ్యంతో విధులు నిర్వహించలేక పోతున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఆమె కోలుకునే వరకు రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేశారు. తమిళనాడులోని కొన్ని జిల్లాల్లో ఐసిస్ స్లీపర్ సెల్స్ ఉన్నాయని... అవి ఎప్పుడైనా విధ్వంసం సృష్టించే అవకాశం ఉందని సుబ్రహ్మణ్యస్వామి ఆందోళన వ్యక్తం చేశారు. తీవ్ర అనారోగ్యం పాలైన సీఎం జయలలిత గత 15 రోజులుగా చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. జయలలిత అనారోగ్యంపై అపోలో ఆసుపత్రి గురువారం హెల్త్ బులెటిన్ విడుదల చేసిన విషయం విదితమే. మరికొంత కాలం పాటు జయ ఆసుపత్రిలోనే ఉండాలని వైద్యులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని రాజనాథ్కు రాసిన లేఖలో ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి పేర్కొన్నారు. సీఎం జయ అనారోగ్యంపై పుకార్లు షికార్లు చేశాయి. దాంతో జయ ఆరోగ్యంపై వెంటనే ప్రకటన చేయాలని గవర్నర్ను ప్రతిపక్షం డీఎంకే డిమాండ్ చేసింది. దాంతో జయను రాష్ట్ర ఇంచార్జ్ గవర్నర్ సీహెచ్ విద్యాసాగరరావు పరామర్శించారు. అనంతరం ఆమె ఆసుపత్రిలో కోలుకుంటున్నట్లు తమిళనాడు రాజ్భవన్ లేఖను విడుదల చేసింది. ఆ తర్వాత జయ ఆరోగ్యంపై అపోలో ఆసుపత్రి వెంటనే ప్రకటన చేయాలని పలువురు మద్రాసు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఆ పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. దీంతో గురువారం అపోలో ఆసుపత్రి ఆమె హెల్ బులెటిన్ విడుదల చేసింది. -
ఈ దేశాన్ని సుప్రీంకోర్టు రక్షించింది
-
అరుణాచల్ సంక్షోభంపై సుప్రీం సంచలన తీర్పు
-
ఈ దేశాన్ని సుప్రీంకోర్టు రక్షించింది: నబం తుకీ
న్యూఢిల్లీ: భారత రాజ్యాంగాన్ని సర్వోన్నత న్యాయస్థానం రక్షించిందని అరుణాచల్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నబం తుకీ వ్యాఖ్యానించారు. అరుణాచల్ ప్రదేశ్ సంక్షోభంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఆయన స్వాగతించారు. నబం తుకీ బుధవారమిక్కడ మాట్లాడుతూ సుప్రీంకోర్టు తమకు న్యాయం చేసిందని, ఈ దేశాన్ని ఉన్నత న్యాయస్థానం రక్షించిందని అన్నారు. ఈ ఏడాది జనవరి 26న అరుణాచల్ ప్రదేశ్లో రాష్ట్రపతి పాలన విధించిన విషయం తెలిసిందే. కాగా ప్రభుత్వాల తొలగింపు విషయంలో బీజేపీకి ఇది రెండో ఎదురుదెబ్బ. ఇంతకుముందు ఉత్తరాఖండ్ వ్యవహారంలోనూ కమలదళం ఇలాగే దెబ్బతింది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను చీల్చి, వారి సాయంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ప్రయత్నం చేసింది. అయితే సుప్రీం కోర్టు దగ్గర కేంద్రం పప్పులుడకలేదు. తాజాగా అరుణాచల్ ప్రదేశ్ వ్యవహారంలోనే బీజేపీకి చుక్కెదురు అయింది. మరోవైపు అరుణాచల్ ప్రదేశ్ గవర్నర్ను రీకాల్ చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. -
అరుణాచల్ సంక్షోభంపై సుప్రీం సంచలన తీర్పు
న్యూఢిల్లీ : అరుణాచల్ ప్రదేశ్ వ్యవహారంలో భారతీయ జనతా పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. అరుణాచల్ ప్రదేశ్ సంక్షోభంపై సుప్రీంకోర్టు బుధవారం చరిత్రాత్మక తీర్పును ఇచ్చింది. ఆ రాష్ట్ర గవర్నర్ ఇచ్చిన ఆదేశాలన్నింటినీ న్యాయస్థానం రద్దు చేసింది. అసెంబ్లీ సమావేశాల తేదీని ముందుకు జరుపుతూ.... గవర్నర్ తీసుకున్న నిర్ణయం న్యాయసమ్మతం కాదని ధర్మాసనం స్పష్టం చేసింది. డిసెంబర్ 15, 2015 నాటి యథాతథ పరిస్థితి ఉండాలని సూచించింది. సుప్రీంకోర్టు తాజా తీర్పుతో కాంగ్రెస్ ప్రభుత్వం తిరిగి పునరుద్ధరణకు ఆదేశాలు ఇచ్చింది. సుప్రీం తీర్పు నేపథ్యంలో నబమ్ టుకీ మళ్లీ ముఖ్యమంత్రి పదవిలో కూర్చునేందుకు మార్గం సుగమమైంది. కాగా 60 మంది సభ్యులున్న అరుణాచల్ అసెంబ్లీలో కాంగ్రెస్కు 47 మంది సభ్యులుండగా.. అసమ్మతి నేత కాలిఖోపుల్ సారథ్యంలో 21 మంది అధికార పార్టీ ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేయటం తెలిసిందే. నబమ్ టుకీ సీఎంగా గల ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు తిరుగుబాటు ఎమ్మెల్యేలకు 11 మంది బీజేపీ ఎమ్మెల్యేలు, ఇద్దరు స్వతంత్ర సభ్యులు మద్దతిచ్చారు. నాటకీయ పరిణామాల్లో రాష్ట్రపతి పాలన విధించారు. దీనిపై కాంగ్రెస్ నేతలు ‘సుప్రీం’ను ఆశ్రయించగా.. గవర్నర్ విచక్షణాధికారాల పరిధిపై సుప్రీంకోర్టు తాజాగా తీర్పు వెల్లడించారు. మరోవైపు సుప్రీంకోర్టు నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ స్వాగతించింది. ఇది ప్రజాస్వామ విజయమని ఆ పార్టీ అభివర్ణించింది. -
విశ్వాస పరీక్షకు కేంద్రం సిద్ధం
ఉత్తరాఖండ్: ఉత్తరాఖండ్ అసెంబ్లీలో విశ్వాస పరీక్షకు కేంద్ర ప్రభుత్వం అంగీకారం తెలిపింది. దీంతో బలనిరూపణ పరీక్షను పర్యవేక్షించనున్నట్లు సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. రిటైర్డ్ సీఈసీని పరిశీలకుడిగా నియమించాలని సుప్రీంకోర్టును కేంద్ర ప్రభుత్వం కోరిన నేపథ్యంలో అందుకు ఉన్నత న్యాయస్థానం అంగీకరించింది. ఉత్తరాఖండ్ లో రాష్ట్రపతి పాలనపై సుప్రీంకోర్టులో విచారణ సందర్భంగా ఈ నిర్ణయం జరిగింది. -
‘సుప్రీం సూచన’ను పరిశీలిస్తున్నాం
ఉత్తరాఖండ్ బలపరీక్షపై 6న చెబుతాం: కేంద్రం న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ఉత్తరాఖండ్ అసెంబ్లీలో బలపరీక్ష నిర్వహణ సాధ్యాసాధ్యాలపై కసరత్తు చేస్తున్నామని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు చెప్పింది. సుప్రీం చేసిన ఈ సూచనపై తుది నిర్ణయాన్ని శుక్రవారం నాటికి చెబుతామని తెలిపింది. దీనికి న్యాయమూర్తులు జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ శివకీర్తి సింగ్ నేతృత్వంలోని ధర్మాసనం బుధవారం ఆమోదం తెలుపుతూ కేంద్రానికి రెండు రోజులు గడువు ఇచ్చింది. తదుపరి విచారణను ఈనెల 6కు వాయిదావేసింది. ఉత్తరాఖండ్లో రాష్ట్రపతి పాలనను రద్దుచేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు స్టే కొనసాగుతుందని స్పష్టంచేసింది. సుప్రీం పర్యవేక్షణలో విశ్వాస పరీక్ష నిర్వహించేందుకు ప్రభుత్వం ఒప్పుకుంటే తమకు అభ్యంతరం లేదని పదవీచ్యుత సీఎం రావత్ లాయర్లు కపిల్ సిబల్, అభిషేక్ మను సింఘ్వీ చెప్పారు. అడ్వొకేట్ జనరల్ (ఏజీ) తమ సూచనపై తదుపరి విచారణ నాటికి నివేదించకపోతే, ఈ అంశపైనా విచారణ చేపడతామన్నారు. బలపరీక్ష రావత్కు విశ్వాస పరీక్ష లాంటిది అని అది అవిశ్వాస పరీక్ష కాదని సిబల్, సింఘ్వీ వాదించారు. దీన్ని ఏజీ రోహత్గీ ఆక్షేపిస్తూ... సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన ఉన్న సమయంలో రావత్ సీఎంగావిశ్వాస పరీక్షను ఎదుర్కొనలేరని చెప్పారు. ఆ సమయంలో ధర్మాసనం జోక్యం చేసుకొని 2005, మార్చి 9న సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను ప్రస్తావిస్తూ దాని ప్రకారం జార్ఖండ్ నమూనాలో సంయుక్త బలపరీక్ష ఉండొచ్చని చెప్పింది. అప్పుడు జార్ఖండ్లో శిబూ సోరెన్ ప్రభుత్వ ఏర్పాటును సవాల్చేస్తూ బీజేపీ నేత అర్జున్ ముండా కోర్టును ఆశ్రయించగా కోర్టు సంయుక్త బలపరీక్షకు ఆదేశించింది. -
పార్లమెంట్ సమావేశాల కుదింపు?
సాక్షి, న్యూఢిల్లీ: షెడ్యూలు ప్రకారం మే 13 వరకు జరగాల్సిన పార్లమెంటు సమావేశాలు 6నే ముగిసే సూచనలు కనిపిస్తున్నాయి. తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికలు, పలు రాష్ట్రాల్లో ఉప ఎన్నికల వల్ల డీఎంకే, ఏఐడీఎంకే, సీపీఎంలు సమావేశాలను కుదించాలని కేంద్రాన్ని కోరాయి. సమావేశాలు ముగిస్తే ఎంపీలు నియోజకవర్గాల్లో ప్రచారానికి వెళ్తారు. ఏప్రిల్ 25న ప్రారంభమైన సమావేశాల్లో రాజ్యసభలో ప్రధానమైన సభావ్యవహారా లేవీ సాగలేదు. ఉత్తరాఖండ్లో రాష్ట్రపతి పాలనపై బుధవారం సుప్రీం కోర్టు విచారణ ఉంది. ఒకవేళ ఈ విచారణలో ఏమీ తేలకుండా వాయిదాపడితే పార్లమెంటు సమావేశాలు ముందస్తుగా ముగిసే వీలుంది. లోక్సభలో ఆర్థిక బిల్లు మంగళవారం ఆమోదం పొందే అవకాశం ఉంది. ఇది సాధ్యం కానిపక్షంలో ఐదున ఆమోదం పొందనుంది. అదే రోజు గానీ, 6న గానీ రాజ్యసభ ఆమోదం పొందొచ్చు. దీంతో సమావేశాలు 6నే ముగుస్తాయని అధికార పార్టీ భావిస్తోంది. -
ఆ సీడీలో ఉన్నా.. మాజీ సీఎం అంగీకారం!
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి హరీశ్ రావత్ ఆదివారం ఓ స్టింగ్ ఆపరేషన్ విషయమై సంచలన అంగీకారం చేశారు. ఉత్తరాఖండ్లో రాజకీయ సంక్షోభానికి కారణమైన కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేలను ప్రలోభపెడుతున్నట్టు భావిస్తున్న స్టింగ్ ఆపరేషన్ సీడీలో తాను ఉన్న విషయం వాస్తవమేనని ఆయన అంగీకరించారు. ఇప్పటివరకు ఈ స్టింగ్ ఆపరేషన్ ఓ బూటకమని కొట్టిపారేస్తూ వచ్చిన రావత్ తొలిసారి ఈ సీడీలో తాను ఉన్నానని అంగీకరించారు. అసెంబ్లీలో బలపరీక్ష సందర్భంగా ఎమ్మెల్యేలను కొనేందుకు ఓ జర్నలిస్టుతో అప్పటి సీఎం రావత్ ఒప్పందం కుదుర్చుకున్నట్టు వెలుగులోకి వచ్చిన ఓ స్టింగ్ ఆపరేషన్ కలకలం రేపింది. ఓ ప్రైవేటు న్యూస్ చానెల్ ఎడిటర్ ఈ స్టింగ్ ఆపరేషన్ను నిర్వహించారు. ఈ సీడీ కాపీలను కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేలు మీడియాకు పంపారు. స్టింగ్ ఆపరేషన్కు పాల్పడిన జర్నలిస్టుతో తాను సమావేశమైన విషయం వాస్తవమేనని రావత్ తాజాగా స్పష్టం చేశారు. 'ఓ జర్నలిస్టుతో సమావేశం కావడం నేరమా? అప్పటికీ సాంకేతికంగా అనర్హత పడిన ఓ ఎమ్మెల్యేతో నేను మాట్లాడటం తప్పా? రాజకీయాల్లో మేం ఏదైనా చానెల్ను నిషేధించామా' అని రావత్ ఆదివారం డెహ్రాడూన్లో విలేకరులతో అన్నారు. రావత్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తొమ్మిదిమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎదురుతిరగడం, అసెంబ్లీలో బలపరీక్షకు ఉత్తరాఖండ్ హైకోర్టు ఆదేశించడం, అంతకుముందే కేంద్ర ప్రభుత్వం ఉత్తరాఖండ్లో రాష్ట్రపతి పాలన విధించడంతో ఆ రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. -
మూడు కాళ్ల కుందేళ్లు
జీవన కాలమ్ ఈ మధ్య పేపర్లో చదివాను. ఒకానొక గ్రామంలో ప్రజలెవరూ ఇంతవరకూ న్యాయస్థానం ఎలా ఉంటుందో ఎరగరట. ఈ దేశంలో కోట్ల వ్యాజ్యాలు కోర్టుల్లో మురుగుతున్న నేపథ్యంలో ఇది పెద్ద విడ్డూరం. ఇదేమిటి? వీళ్లకి సమస్యలు రావా? తగాదాలు ఉండవా? తేల్చుకోవలసిన అంశాలు ఉండవా? ఉంటాయి. కానీ ఉండవలసిన గొప్ప సంప్రదాయం వారి దగ్గర ఉంది. తమ పెద్దల మాటనీ, తీర్పునీ గౌరవించే సంస్కారం. ఇది చాలా గొప్ప పరిణతి. మనదేశంలో రాజకీయ నాయకులు, మంత్రులు పాలన జరపడం మానేసి చాలా కాలమయింది. కేవలం సుప్రీంకోర్టు మాత్రమే పాలన ఎలా జరగాలో ప్రతీ చిన్న విషయాన్నీ నిర్దేశిస్తోంది. కేంద్రం ఉత్తరాఖండ్ ప్రభుత్వాన్ని దించి రాష్ట్రపతి పాలనని విధించింది. న్యాయస్థానం అది సబబుకాదంది. ప్రభుత్వం ఫలానా పార్టీ సొంత కంపెనీ కాదంది. ప్రజాస్వామ్యాన్ని నమ్మే ప్రజల మనసుల్లో అలాంటి చర్య ఒక ‘నిస్పృహ’ని కలిగిస్తుందంది. 10 రాష్ట్రాలలో 33 కోట్ల మంది ప్రజలు తాగడానికి మంచినీళ్లు లేక అలమటిస్తూంటే లక్షల లీటర్ల నీటిని క్రికెట్ మైదానాల్ని తడపడానికి ఖర్చు చేసి కోట్ల ఆదాయాన్ని సంపాదించే క్రికెట్ ఆటకి పూనుకున్నారు. రెండు రోజులకొకసారి లభించే గుక్కెడు నీళ్లు 41 అడుగుల లోతు నూతిలోంచి తోడు కోడానికి వెళ్లిన 11 ఏళ్ల పిల్ల చచ్చిపోయింది. ‘‘నీళ్లు వృథా చెయ్యకండి బాబూ! మనుషులు చచ్చి పోతున్నారు’’ అని న్యాయస్థానం చెప్పాల్సి వచ్చింది. ఆ మాత్రం కనీస బాధ్యతని ఈ దేశపు పెద్దలకి కోర్టులు తమ అధికారంతో నేర్పాలా? 9000 కోట్లు ఎగవేసి పరాయి దేశంలో సేద తీర్చుకుంటున్న ఓ పెద్ద మనిషిని ఈ దేశపు న్యాయస్థానం అరెస్టు చేసి తీసుకురావలసిన చర్యకు పూనుకోవ లసి వచ్చింది. ‘‘మీ గుడిలో దేవుడికి మొక్కు కోవడానికి మీ అమ్మకీ, మీ బిడ్డకీ, మీ భార్యకీ అవకాశం ఇవ్వండి బాబూ! ’’ అని సుప్రీంకోర్టు మగభక్తులకి చెప్పాల్సి వచ్చింది. మా ఇంట్లో తెలంగాణ పనిమనిషి పనిచేస్తోంది. ఆంధ్రరాష్ట్రం ఏర్పడింది కనుక- మా రాష్ట్రంలో తెలంగాణ పని మనిషి- పనిచేస్తున్నా జీతం ఇవ్వను అన్నాను. ‘‘కాదు బాబూ! ఆమె మీ పనిచేస్తోంది. మీ ఇంట్లో పని చేస్తోంది. మీరు ఇవ్వాల్సిందే’’ అని 1250 మంది ఆంధ్రా విద్యుచ్ఛక్తి సిబ్బందికి జీతాలివ్వమని తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు చెప్పాల్సి వచ్చింది. నూడుల్స్ అమ్మకాన్ని, ఇసుక పంపకాన్ని, నీటి వనరుల కేటాయింపుల్ని, ఆస్తుల పంపకాల్ని - అన్నిటిని ఎల్లవేళలా సుప్రీంకోర్టే నిర్ణయిస్తోంది. ఒక నాయకుడు మూతి బిగించి - ‘‘నా మెడ మీద కత్తి పెట్టినా నేను ‘భారత్ మాతాకీ జై’ అనను’’ అన్నారు. సభలో ఆ వర్గం వారు చప్పట్లు కొట్టారు. ఈ దేశంలో ఎవరూ ఈయన్ని అనమనలేదు. కానీ ఆయనే అన్నారు. ఎందుకట? రాజ్యాంగం ఆ పని చెయ్యమని చెప్పలేదు కనుక. ‘‘మనం ఏం ఒప్పుకోవాలో వీళ్లు చెప్పనక్కరలేదు’’ అనే అరాచకం నేలబారు ప్రజలకి నచ్చుతుంది కనుక. ప్రజల్ని మెప్పించే ఇచ్చకం నేటి రాజకీయం. ఇలాంటి మెచ్చుకోలు కబుర్లకి ‘చట్టపరమైన’ ఔచిత్యం ఉన్నదీ లేనిదీ ఎప్పటికప్పుడు కోర్టులు చెప్పాలి. తాము చేసే పనులు సబబు కాదని తెలిసినా-పైన చెప్పినవేవీ చట్టానికి నిలవవని వారికి తెలుస్తున్నా - సుప్రీంకోర్టు దాకా లాగి- న్యాయస్థానం తీర్పు వింటే కానీ అంగీకరించని స్థితికి నేటి నాయకత్వం వచ్చింది. ఇది ఎంత అనవసరమో, హాస్యాస్పదమో, అనర్ధమో- విచక్షణనీ, పెద్దరికాన్నీ తమ గ్రామ పెద్దల్లోనే నిలుపుకున్న ఓ చిన్నగ్రామం నిరూపించడం విశేషం. మన అదృష్టం బాగుండి ఈ దేశంలో న్యాయస్థానాలున్నాయి కనుక బతికిపోయాం గానీ లేకపోతే ఈ దేశంలో అన్ని కుందేళ్లకూ మూడే కాళ్లుండేవి. గొల్లపూడి మారుతీరావు -
రాష్ట్రపతి పాలన కొనసాగింపు
ఉత్తరాఖండ్లో రేపు బలపరీక్ష ఉండదన్న సుప్రీంకోర్టు ♦ తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు హైకోర్టు ఉత్తర్వులపై స్టే ♦ కేంద్రానికి ఏడు ప్రశ్నలు సంధించిన ధర్మాసనం న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్లో రాష్ట్రపతి పాలన కొనసాగుతుందని సుప్రీంకోర్టు పేర్కొంది. ఈనెల 29న అసెంబ్లీలో బలపరీక్ష లేదని స్పష్టంచేసింది. రాష్ట్రపతి పాలనను రద్దుచేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై తదుపరి ఉత్తర్వుల వరకు స్టే కొనసాగుతుందని తెలిపింది. హైకోర్టు తీర్పును సవాల్చేస్తూ కేంద్ర ప్రభుత్వం దాఖలుచేసిన పిటిషన్ను సుప్రీం ధర్మాసనం బుధవారం విచారించింది. ఈ సందర్భంగా న్యాయయూర్తులు జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ శివకీర్తి సింగ్లతో కూడిన ధర్మాసనం కేంద్రానికి ఏడు క్లిష్టమైన ప్రశ్నలు సంధించింది. వీటితోపాటు అవసరమనుకుంటే మరికొన్ని ప్రశ్నలు రూపొందించి ప్రభుత్వానికి పంపాలని అటార్నీ జనరల్ (ఏజీ)కు సూచించింది. తదుపరి విచారణను మే 3కు వాయిదావేసింది. వచ్చే నెల మధ్య నుంచి కోర్టుకు వేసవి సెలవులు ఉన్నందున ఆలోపే తీర్పు రావచ్చు. విచారణలో తనను అనుమతించాలన్న రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వినతిపై బెంచ్ మండిపడింది. ఆయన చేసేదేం లేదంది. కేసు పరిష్కారానికి బలపరీక్ష నిర్వహించడమొక్కటే మార్గంగా కనిపిస్తోందని పేర్కొంది. ప్రజాస్వామ్య పరిరక్షణ బాధ్యత తమపై ఉందని రాష్ట్రపతి పాలన నిర్ణయంలో సహేతుకత లేకపోతే బలపరీక్ష జరపాల్సి వుంటుందని పేర్కొంది. దీనిపై సూచనలు ఇవ్వాలని అటార్నీ జనరల్ రోహత్గీని కోరింది. రాష్ట్రపతి పాలనను కోర్టు ఎత్తివేయకపోతే మే 27 వరకు అది అమల్లో ఉంటుందని, తర్వాత బలపరీక్ష నిర్వహణ ప్రభుత్వ విచక్షణపైన ఆధారపడి ఉంటుందని రోహత్గీ చెప్పారు. కేంద్రానికి ఏడు ప్రశ్నాస్త్రాలు సబలపరీక్ష ఆలస్యమైతే రాష్ట్రపతి పాలనకు దారితీస్తుందా? సఎమ్మెల్యేలపై స్పీకర్ వేసిన అనర్హత వేటుకు ఆర్టికల్ 356 కింద రాష్ట్రపతిపాలనకూ సంబంధముందా? సకేంద్ర పాలననిర్ణయం కోసం అసెంబ్లీ వ్యవహారాలను రాష్ట్రపతి పరిగణనలోకి తీసుకుంటారా?సఆర్టికల్ 175(2) ప్రకారం బలపరీక్ష నిర్వహిస్తున్నట్లు గవర్నర్ చెప్పారా?సగవర్నర్, స్పీకర్ ఇద్దరూ రాజ్యాంగ అధికారాలున్న వారైనందున డివిజన్ ఓటింగ్ నిర్వహించాలని గవర్నర్ సూచించవచ్చా?సనిబంధనల ప్రకారం ద్రవ్య వినిమయ బిల్లు ఆమోదం పొందకపోతే ప్రభుత్వం వెళ్లిపోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఆ బిల్లు ఆమోదం పొందనప్పుడు ఆ విషయాన్ని స్పీకర్ చెప్పకపోతే ఎవరు చెప్తారు?రాష్ట్రపతి పాలన విధిస్తే ద్రవ్యవినిమయ బిల్లు పరిస్థితి ఏంటి? -
ఉత్తరాఖండ్లో రాష్ట్రపతి పాలన కొనసాగింపు
న్యూఢిల్లీ : ఉత్తరాఖండ్లో రాష్ట్రపతి పాలనను సుప్రీంకోర్టు పొడిగించింది. ఈ మేరకు ఉన్నత న్యాయస్థానం బుధవారం ఆదేశాలు జారీ చేసింది. సుప్రీంకోర్టు తాజా తీర్పుతో ఈ నెల 29న అసెంబ్లీలో హరీష్ రావత్ బలపరీక్ష రద్దు అయింది. కేసు తదుపరి విచారణను న్యాయస్థానం మే 3వ తేదీకి వాయిదా వేసింది. దీంతో సుప్రీంకోర్టులో కాంగ్రెస్ కు ఎదురు దెబ్బ తగిలినట్లు అయింది. కాగా రాష్ట్రపతి పాలన విధింపును రద్దు చేయటంతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పునరుద్ధరిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ కేంద్రం సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. కాగా అంతకు ముందు ఉత్తరాఖండ్లో రాష్ట్రపతి పాలన విధించడంపై సుప్రీంకోర్టు మొత్తం ఏడు రకాల ప్రశ్నలను సంధించింది. సభలో విశ్వాస పరీక్షకు సంబంధించి ఆర్టికల్ 175 (2) గవర్నర్ చెప్పారా? ఎమ్మెల్యేలపై స్పీకర్ అనర్హత వేటు వేయడమే ఆర్టికల్ 356 కింద రాష్ట్రపతి పాలన విధించడానికి కారణమా? అసెంబ్లీలో జరిగిన పరిణామాలే రాష్ట్రపతి పాలనకు దారి తీశాయా? ద్రవ్ వినిమయ బిల్లు సందర్భంగా జరిగిన పరిణామాలు రాష్ట్రపతి పాలనకు కారణాల్లో ఒకటా? విశ్వాస పరీక్ష ఆలస్యం కావడం కూడా రాష్ట్రపతి పాలనకు దారితీసిందా? ఉత్తరాఖండ్ సీఎస్కు ప్రస్తుత పరిణామాలతో ఎలాంటి సంబంధం లేదని న్యాయస్థానం స్పష్టం చేసింది. -
రెండో రోజూ రభస
రాజ్యసభను కుదిపేసిన ‘ఉత్తరాఖండ్’ కార్యకలాపాలను అడ్డుకున్న విపక్షాలు న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్లో రాష్ట్రపతి పాలనపై కాంగ్రెస్ నాయకత్వంలో విపక్షాలన్నీ రాజ్యసభలో మంగళవారం రెండో రోజూ నిరసన తెలియజేశాయి. వెల్లోకి వచ్చి నినాదాలు చేస్తూ కార్యకలాపాలను అడ్డుకున్నాయి. సభ ప్రారంభం కాగానే ఐదుగురు కొత్త సభ్యులు సుఖ్దేవ్ సింగ్ ధిండ్సా, స్వపన్ దాస్గుప్తా, సుబ్రమణ్యస్వామి, మేరీకోమ్, నరేంద్ర జాదవ్ ప్రమాణస్వీకారం చేశారు. ప్రధాన మంత్రి మోదీతోపాటు పలువురు కొత్త సభ్యులను అభినందించారు. అనంతరం సభాకార్యక్రమాలు మొదలవగానే కాంగ్రెస్ సభ్యులు వెల్లోకి దూసుకొచ్చి నినాదాలు ప్రారంభించారు. ఉత్తరాఖండ్లో రావత్ ప్రభుత్వ బర్తరఫ్పై చర్చకు పట్టుబట్టారు. దీనికి ప్రభుత్వం నిరాకరించింది. దీంతో పలుమార్లు సభ వాయిదా పడింది. తిరిగి సమావేశమైనా చర్చకు సర్కారు నిరాకరించటంతో సభను బుధవారానికి వాయిదా వేశారు. చర్చే లేదు: విపక్షాల ఆందోళనపై జోక్యం చేసుకున్న రాజ్యసభ నాయకుడు అరుణ్ జైట్లీ ఈ అంశంపై చర్చకు అవకాశమే లేదని స్పష్టం చేశారు. రాష్ట్రపతి పాలన ప్రకటనను సభ ముందు ప్రవేశపెట్టాకే చర్చ జరుగుతుందన్నారు. ఉత్తరాఖండ్లో ద్రవ్యవినిమయ బిల్లును 35 మంది వ్యతిరేకించినా స్పీకర్ బిల్లు నెగ్గిందని చెప్పినపుడే రాజ్యాంగం అపహాస్యం పాలైందన్నారు. స్వతంత్ర భారత చరిత్రలోనే స్పీకర్ ఇలా వ్యవహరించటం జరగలేదన్నారు. దీంతో విపక్ష సభ్యులు ‘మోదీ మీ నియంతృత్వాన్ని సహించం’ అంటూ నినాదాలు చేశారు. రాష్ట్రపతి పాలనను సమర్థిస్తూ.. స్పీకర్ వ్యవస్థపై జైట్లీ చేసిన వ్యాఖ్యలను రికార్డులనుంచి తొలగించాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. సభ చర్చకు అనుకూలంగానే ఉందని, విపక్షాలు సభ సజావుగా జరిగేందుకు సహకరించాలంటూ డిప్యూటీ చైర్మన్ పీజే కురియన్ పలుమార్లు అభ్యర్థన చేశారు. కాంగ్రెస్, ఎస్పీ నేతలు చర్చకు నోటీసులివ్వగా.. బీఎస్పీ దీన్ని బలపరిచింది. ఆందోళన మధ్యే రెండు బిల్లులు సభలో విపక్షాల నిరసనల మధ్యే ప్రభుత్వం రెండు బిల్లులు(ద్రవ్య వినిమయ చట్టం-2015 సవరణ, రద్దు బిల్లు-2015) ప్రవేశపెట్టింది. దీంతో పాటు రాజ్యాంగ(ఎస్సీ) సవరణ బిల్లు-2016ను డిప్యూటీ చైర్మన్ చర్చకు అనుమతించాలని నక్వీ కోరారు. దీనిపై విపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. విద్యార్థులపై జరిమానా క్రూరం జేఎన్యూ విద్యార్థిసంఘం నేత కన్హయ్యతోపాటు పలువురు విద్యార్థులపై జరిమానా విధించటం, కాలేజీనుంచి వెళ్లగొట్టడాన్ని రాజ్యసభలో విపక్షాలు లేవనెత్తాయి. ఇది క్రూరమైన చర్య అని వామపక్షాలు ప్రభుత్వంపై ధ్వజమెత్తాయి. చర్చ జరపాలంటూ సీపీఎం నేత తపన్ సేన్ డిమాండ్ చేశారు. విపక్ష నేతలతో మోదీ కరచాలనం సభ ప్రారంభానికంటే ముందుగానే సభకు వచ్చిన ప్రధాని మోదీ విపక్ష నేతలతో కరచాలనం చేశారు. ఆంటోనీ, ఆనంద్ శర్మ(కాంగ్రెస్)లతోపాటు బీఎస్పీ చీఫ్ మాయావతినీ పలకరించారు. సీతారాం ఏచూరి(సీపీఎం) భుజంపై చేయివేసి కాసేపు ఆత్మీయంగా మాట్లాడారు. -
ఉత్తరాఖండ్ మలుపులు
రోజుకో మలుపు తీసుకుంటున్న ఉత్తరాఖండ్ పరిణామాలు ఇంకా పరిణతి చెందని మన ప్రజాస్వామ్య వ్యవస్థ తీరుతెన్నులను పట్టిచూపుతున్నాయి. తన ప్రభుత్వాన్ని పునరుద్ధరిస్తూ రాష్ట్ర హైకోర్టులో గురువారం తీర్పు వెలువడటంతో శుక్రవారం ఉదయం మాజీ సీఎం హరీశ్ రావత్ సీఎంగా కేబినెట్ సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసి వేర్వేరు నిర్ణయాలు తీసుకున్నారు. సాయంత్రానికల్లా హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు నుంచి స్టే ఉత్తర్వులు రావడంతో ఆయన ‘మాజీ’గా మారిపోయారు! మొత్తానికి 18 గంటలపాటు ఆయన ముఖ్యమంత్రి పీఠంపై ఉన్నారనుకోవాలి. స్టే వచ్చాక బీజేపీ నేతలు ఏమైనా చెప్పుకోవచ్చుగానీ...జరిగిన పరిణా మాలు ఎన్డీఏ ప్రభుత్వ ప్రతిష్టనుగానీ, దేశ గౌరవాన్నిగానీ పెంచేవి కాదు. వాస్తవానికి కేంద్ర ప్రభుత్వం సక్రమంగా వ్యవహరించి ఉంటే హరీశ్ రావత్ నేతృత్వంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పునరుద్ధరిస్తూ గురువారం హైకోర్టులో తీర్పు వెలువడేది కాదు. దానిపై సుప్రీంకోర్టు తలుపు తట్టాల్సిన అవసరం వచ్చేది కాదు. ఉత్తరాఖండ్ హైకోర్టు తీర్పుపై శుక్రవారం సుప్రీంకోర్టు స్టే విధించడాన్ని తమకనుకూలమైన పరిణామంగా చెప్పుకుంటున్న బీజేపీ నేతలు ఆ సందర్భంగా విధించిన షరతును మరిచిపోతున్నారు. తుది తీర్పు వెలువడే వరకూ ఆ రాష్ట్రంలో ప్రభుత్వ పునరుద్ధరణకు ప్రయత్నించబోమన్న హామీని తీసుకున్నాకే సుప్రీంకోర్టు ఈ స్టే ఉత్తర్వులిచ్చింది. గురువారం హైకోర్టు కోరిన హామీ ఇదేనని వారు గుర్తుంచు కోవడం మంచిది. ఉత్తరాఖండ్ హైకోర్టులో గత నెల 18న మొదలైన వివాదం ఎన్నెన్ని మలుపులు తిరిగిందో గమనిస్తే మనది మేడిపండు ప్రజాస్వామ్యమేమోనన్న అనుమానాలు తలెత్తుతాయి. అసెంబ్లీలో ద్రవ్య వినియోగ బిల్లు మూజువాణి ఓటుతో ఆమోదం పొందిందని స్పీకర్ కుంజ్వాల్ ప్రకటించడాన్ని సవాల్ చేస్తూ కాంగ్రెస్ అసమ్మతి వర్గం, బీజేపీ ఎమ్మెల్యేలు హైకోర్టును ఆశ్రయించడంతో వివాదం న్యాయస్థానాని కెక్కింది. 28లోగా బల నిరూపణ చేసుకోవాలని రావత్ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించినా...అంతవరకూ ఓపిక పట్టలేని కేంద్ర ప్రభుత్వం ఉన్నట్టుండి ఒకరోజు ముందు రావత్ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేసింది. ఎమ్మెల్యేల కొనుగోలుకు సీఎం ప్రయత్నిస్తున్నట్టు చూపే ‘స్టింగ్’ వీడియోను అందుకు కారణంగా చూపింది. ద్రవ్య వినియోగ బిల్లు విషయంలో స్పీకర్ వైఖరిని, 9మంది తిరుగుబాటు ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటిస్తూ ఆయన తీసుకున్న నిర్ణయాన్ని కూడా ఎత్తిచూపింది. ఈ కారణాలు హేతుబద్ధమైనవే అనుకున్నా...ఒక ప్రభుత్వాన్ని రద్దు చేయడానికి అవసరమైన ప్రాతిపదికను అవి ఎలా ఏర్పరచగలవో అనూహ్యం. వీడియోలోని సంభాషణలు వాస్తవమైనవో, కాదో ఫోరెన్సిక్ నిపుణులు తేల్చాలి. బలపరీక్ష సమ యంలో స్పీకర్ తీరు ఎలా ఉంటుందో వేచి చూడాలి. ఆయన సక్రమంగా వ్యవ హరించలేదనుకుంటే కోర్టులో సవాల్ చేయడానికి ఎటూ అవకాశం ఉండేది. ఈలోగానే 356వ అధికరణను ఉపయోగించడం తొందరపాటు చర్య అని, సర్వో న్నత న్యాయస్థానం గతంలో ఇచ్చిన తీర్పునకు విరుద్ధమని కేంద్రంలోని పెద్దలకు అనిపించకపోవడం ఆశ్చర్యకరం. సభాపతులుగా ఎన్నికయ్యాక తటస్థంగా, నిష్పక్షపాతంగా ఉండవలసిన స్పీకర్లు అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని వస్తున్న ఆరోపణల్లో అవాస్తవేమీ లేదు. అది అన్నిచోట్లా బాహాటంగానే కనబడుతోంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానం విషయంలోనూ, ద్రవ్య వినియోగ బిల్లు విషయంలోనూ విపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ ఓటింగ్కు పట్టుబట్టినా మూజువాణి ఓటుతో కానిచ్చేసిన తీరు అందరికీ తెలుసు. చట్టాలకు, రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఎవరు ప్రవర్తించినా చర్య తీసుకోవడానికి న్యాయస్థానాలున్నాయి. ఉత్తరాఖండ్లో ఏడాది వ్యవధిలో ఎటూ అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్నాయి. అసెంబ్లీలో బలపరీక్షను జరగనిచ్చి అక్కడ అన్యాయం జరిగిందనుకున్న పక్షంలో న్యాయస్థానం గడప తొక్కి ఉంటే పద్ధతిగా ఉండేది. విపక్షంలో ఉండి తామే అనేకసార్లు తీవ్రంగా వ్యతిరేకించిన, తప్పుబట్టిన 356 అధికరణాస్త్రాన్ని ఇలాంటి సమయంలో ప్రయోగించడం నైతి కంగా సరికాదని ఎన్డీఏ ప్రభుత్వంలోని పెద్దలు భావించకపోవడం వింత. ఎస్ఆర్ బొమ్మైకేసులో సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు తర్వాత రాష్ట్రపతి తీసు కున్న నిర్ణయాలు న్యాయ సమీక్షకు లోబడే ఉంటాయని స్పష్టమైంది. ఆ సంగతి ప్రభుత్వంలోని పెద్దలకు తెలియదనుకోవడానికి లేదు. ఉత్తరాఖండ్ హైకోర్టు అయినా, సుప్రీంకోర్టు అయినా తుది తీర్పు వెలువడేలోగా రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనను రద్దు చేసి ప్రభుత్వాన్ని ఏర్పర్చడానికి వేరేవారికి అవకాశం ఇవ్వబోమన్న హామీని ఇవ్వాలని కోరడాన్ని ప్రత్యేకించి ప్రస్తా వించుకోవాలి. న్యాయస్థానాలు ఏం చెప్పినా తమ రాజకీయపుటెత్తులకు అనుగు ణంగా ప్రభుత్వాలు వ్యవహరించడం ఈమధ్య కాలంలో పెరిగింది. ఉత్తరాఖండ్లో పావులు కదిపి, అక్కడ బీజేపీ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పర్చబోరన్న గ్యారెంటీ ఏమీ లేకపోబట్టే న్యాయస్థానాలు ఈ విషయంలో పట్టుబట్టాయి. హైకోర్టులోనే ఇందుకు సంబంధించి నిర్దిష్టమైన హామీని ఇవ్వగలిగి ఉంటే రావత్ ప్రభుత్వాన్ని పునరుద్ధరిస్తూ న్యాయస్థానం తీర్పునిచ్చేది కాదు. ప్రజలిచ్చే తీర్పు ఎంత పవి త్రమైనదో, దాన్ని కాపాడటం ఎంత ముఖ్యమో ఉత్తరాఖండ్ హైకోర్టు స్పష్టంగా చెప్పింది. ఆ విషయంలో సుప్రీంకోర్టుది సైతం అదే అభిప్రాయం. జనం ఎన్ను కున్న ప్రభుత్వాలను ఏకపక్షంగా రద్దు చేయడం లేదా అస్థిరపరిచే ప్రయత్నాలు చేయడం సరికాదని న్యాయస్థానాలు మొదటినుంచీ చెబుతున్నాయి. అధికారంలో ఉండగా కాంగ్రెస్ ఆ మాటను బేఖాతరు చేసింది. ఇప్పుడు అదే పని బీజేపీ చేస్తోంది. ఇలాంటి ధోరణులు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యంపాలు చేస్తాయని, సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీస్తాయని, వ్యవస్థపట్ల ప్రజల్లో అవిశ్వాసాన్ని పెంచు తాయని అందరూ గుర్తించాలి. -
‘ఉత్తరాఖండ్’ తీర్పుపై సుప్రీం స్టే
రాష్ట్రపతి పాలనను రద్దు చేసిన హైకోర్టు ఉత్తర్వుల నిలిపివేత ♦ ఈ నెల 27 వరకూ స్టే విధించిన సుప్రీం కోర్టు ♦ 26 నాటికి హైకోర్టు తీర్పు ప్రతులు ఇరు పక్షాలకూ ఇవ్వాలని ఆదేశం ♦ తదుపరి విచారణ వరకూ రాష్ట్రపతి పాలనను తొలగించబోమంటూ కేంద్రం నుంచి హామీ తీసుకున్న వైనం న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్ రాజకీయ సంక్షోభంలో మరో నాటకీయ మలుపు! రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనను రద్దు చేస్తూ ఆ రాష్ట్ర హైకోర్టు గురువారం ఇచ్చిన సంచలన తీర్పుపై సుప్రీం కోర్టు ఈ నెల 27 వరకూ స్టే విధించింది. దీంతో రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పునరుద్ధరణ జరిగింది. స్టే ఉత్తర్వులు జారీ చేసే ముందుగా.. కేసు తదుపరి విచారణ తేదీ వరకూ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనను కేంద్ర ప్రభుత్వం తొలగించబోదంటూ అటార్నీ జనరల్ ముకుల్రోహత్గీ హామీని ధర్మాసనం నమోదు చేసుకుంది. తదుపరి విచారణను 27కు వాయిదా వేసింది. రాష్ట్రపతి పాలన విధింపును రద్దు చేయటంతో పాటుచ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పునరుద్ధరిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ కేంద్రం శుక్రవారం సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. దీనిని జస్టిస్ దీపక్మిశ్రా, శివకీర్తిసింగ్ల బెంచ్ శుక్రవారం మధ్యాహ్నం కిక్కిరిసిన కోర్టులో విచారించింది. కేంద్రం తరఫున అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ, సీనియర్ న్యాయవాది హరీశ్ సాల్వేలు, ఉత్తరాఖండ్లో రద్దయిన ప్రభుత్వ సీఎం హరీశ్రావత్, రాష్ట్ర శాసనసభ స్పీకర్ల తరఫున సీనియర్ న్యాయవాదులు అభిషేక్ మనుసింఘ్వీ, కపిల్ సిబల్లు వాదనలు వినిపించారు. ఎమ్మెల్యేల కొనుగోళ్లు, బేరసారాలపై ఇరు పక్షాల వారూ ఆవేశంగా వాదించారు. హైకోర్టు తీర్పుపై స్టే విధించాలని కేంద్రం తరఫు న్యాయవాదులు కోరారు. ‘తీర్పు ఇంకా అందనందున.. ఒక పక్షం సీఎంగా బాధ్యతలు చేపట్టటానికి సానుకూలంగా ఉంటూ.. మరొక పక్షాన్ని ప్రతికూల పరిస్థితిల్లోకి ఎలా నెట్టేస్తారు?’ అని ప్రశ్నించారు. హైకోర్టు తీర్పు అమలుపై స్టే విధించటమంటే రాష్ట్రపతి పాలన ప్రకటనను అమలు చేయటమే అవుతుందని రావత్, స్పీకర్ తరఫు న్యాయవాదులు అభ్యంతరం వ్యక్తంచేశారు. ఇరు పక్షాలు తమ తమ వాదనలపై బలంగా పట్టుబట్టటంతో బెంచ్ స్పందిస్తూ.. తమది రాజ్యాంగ కోర్టు అయినందున తాము సమతుల్య దృష్టితో చూడాల్సి ఉంటుందని పేర్కొంది. హైకోర్టు తన తీర్పుపై సంతకాలు చేసి, ప్రతివాదులు అప్పీలు చేసేందుకు వీలుగా అందుబాటులో ఉంచి ఉండాల్సింద పేర్కొంది. హైకోర్టు తీర్పు ప్రతులు కేసులో ఇరు పక్షాలకూ వెంటనే అందనందున.. ఈ నెల 27న తదుపరి విచారణ వరకూ ఆ తీర్పును నిలుపుదల చేస్తున్నట్లు పేర్కొంది. ఈ నెల 26 కల్లా తీర్పు ప్రతులను ఇరు పక్షాలకు అందించటంతో పాటు సుప్రీంకోర్టుకూ అందుబాటులో ఉంచాలని హైకోర్టుకు సూచించింది. హైకోర్టు తీర్పు ప్రతినిఅధికారికంగా అందుకుని పరిశీలిస్తామని.. ఈ అంశం రాజ్యాంగ ధర్మాసనం ఎదుటకు వెళ్లే అవకాశముందని వివరించింది. రావత్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు సుప్రీంకోర్టు నోటీసు జారీ చేసింది. సుప్రీం స్టే విధించటంతోగురువారం హైకోర్టు తీర్పుతో జరిగిన రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వ పునరుద్ధరణ రద్దయింది. మళ్లీ రాష్ట్రపతి పాలన పునరుద్ధరణ జరిగింది. న్యాయవ్యవస్థపై పూర్తివిశ్వాసం: కాంగ్రెస్ న్యాయవ్వస్థపై తమకు పూర్తి విశ్వాసముందని కాంగ్రెస్ పేర్కొంది. రాష్ట్రంలో ఎన్నికైన ప్రభుత్వాన్ని మోదీ సర్కారు రాజ్యాంగ వ్యతిరేకంగా, అక్రమంగా, ఏకపక్షంగా రద్దు చేసిందని, కోర్టు ఎదుట వాస్తవాలను ప్రవేశపెడతామని చెప్పింది. సుప్రీం తాజా ఉత్తర్వులు.. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనను తొలగించి అక్రమ ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం లేకుండా అడ్డుకుందని రావత్ అన్నారు. సుప్రీంకోర్టు స్టే విధించకముందు.. ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేసేలా కేంద్ర ప్రభుత్వం అనుమతించాలన్నారు. రాష్ట్రపతి పాలన తాత్కాలిక చర్య: వెంకయ్య ఉత్తరాఖండ్లో రాష్ట్రపతి పాలన తాత్కాలిక చర్య అని.. గవర్నర్ నివేదిక వచ్చిన తర్వాత శాసనసభను పునరుద్ధరించవచ్చునని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు చెప్పారు. తొమ్మిది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను అనర్హులను చేసిన తర్వాత.. ఏప్రిల్ 29న బలపరీక్ష నిర్వహించాలనటం ప్రజాస్వామ్య ప్రాథమిక సూత్రాలకు విరుద్ధమన్నారు. హైకోర్టు తీర్పు ప్రతులు కేంద్రం, గవర్నర్లకు అందకుముందే.. రావత్ తనకు తానుగా రాజ్యాంగ వ్యతిరేకంగా సీఎం బాధ్యతలు చేపట్టటం అక్రమమని బీజేపీ ఆరోపించింది. హైకోర్టు తీర్పుతో రాష్ట్రంలో నెలకొన్న అసాధారణ పరిస్థితిని సుప్రీంకోర్టు స్టే నిలిపివేసిందని పేర్కొంది. -
సీఎం కుర్చీలో రావత్.. 11 అత్యవసర నిర్ణయాలు
డెహ్రాడూన్: రాష్ట్రపతి పాలనను హైకోర్టు కొట్టివేసిన అనంతరం ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిగా తిరిగి హరీశ్ రావత్ బాధ్యతలు చేపట్టారు. శుక్రవారం ముఖ్యమంత్రి కార్యాలయానికి వచ్చిన ఆయన ఆఘమేఘాల మీద కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా పన్నెండు నిర్ణయాలు తీసుకొని వాటిని శీఘ్రంగా అమలు చేయాలని ఆదేశించారు. వీటిలో నీటి సంక్షోభం అనే అంశం ప్రధానంగా ఉంది. రావత్ ఉత్తరాఖండ్ లో మెజారిటీ కోల్పోయారని ఆరోపిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తరాఖండ్లో రాష్ట్రపతి పాలన విధించిన విషయం తెలిసిందే. అయితే, తనకు కనీసం మెజార్టీ నిరూపించుకునే అవకాశం కూడా ఇవ్వకుండా ఉద్దేశ పూర్వకంగా రాష్ట్రపతి పాలన విధించారని హైకోర్టులో పిటిషన్ వేయగా దానిని విచారణకు స్వీకరించిన కోర్టు కేంద్రాన్ని తప్పుబట్టింది. ఈ నెల 29న బల పరీక్షను ఎదుర్కోనున్నారు. -
మోదీ సర్కారుకు హైకోర్టు శరాఘాతం
► ఉత్తరాఖండ్లో రాష్ట్రపతి పాలన రద్దు ► రావత్ సర్కారును పునరుద్ధరిస్తూ హైకోర్టు తీర్పు ► 29న మెజారిటీ నిరూపించుకోవాలని ఆదేశం ► కేంద్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా తప్పుబట్టిన ధర్మాసనం ► ప్రజాస్వామ్య వ్యవస్థ మొత్తం ప్రమాదంలో ఉంది ► ‘356’ విధింపు సుప్రీంకోర్టు నిబంధనలకు విరుద్ధం ► ‘రాష్ట్రపతి పాలన’కు చూపిన ప్రాతిపదిక బలంగా లేదు ► తీర్పు వెలువరించే వరకూ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనను తొలగించబోమని కేంద్రం హామీ ఇవ్వాలన్న ధర్మాసనం ► ఇవ్వలేమన్న కేంద్ర న్యాయవాది.. మండిపడ్డ హైకోర్టు ► తీర్పుపై స్టేకూ నిరాకరణ.. నేడు సుప్రీంలో కేంద్రం సవాల్ నైనిటాల్ కేంద్రంలో నరేంద్రమోదీ ప్రభుత్వానికి భారీ ఎదురు దెబ్బ తగిలింది. ఉత్తరాఖండ్లో కేంద్రం విధించిన రాష్ట్రపతి పాలనను ఆ రాష్ట్ర హైకోర్టు రద్దు చేసింది. హరీశ్ రావత్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పునరుద్ధరించింది. ఈ నెల 29వ తేదీన శాసనసభలో మెజారిటీని నిరూపించుకోవాలని ఆ సర్కారును ఆదేశించింది. హైకోర్టు తీర్పును సుప్రీం కోర్టులో సవాల్ చేయనున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఈ పరిణామంతో.. సోమవారం నుంచి మొదలుకానున్న పార్లమెంటు బడ్జెట్ సమావేశాల రెండో విడతలో గందరగోళం చెలరేగే సూచనలు ప్రస్ఫుటమయ్యాయి. ఉత్తరాఖండ్లో రాష్ట్రపతి పాలన విధించటంపై మోదీ సర్కారు తీరును ఖండించాలంటూ ప్రతిపక్ష కాంగ్రెస్ రాజ్యసభ చైర్మన్ హమీద్ అన్సారీకి నోటీసు ఇచ్చింది. ఉత్తరాఖండ్లో రాజ్యాంగంలోని 356వ అధికరణ కింద రాష్ట్రపతి పాలన విధిస్తున్నట్లు కేంద్రం గత నెల (మార్చి) 27వ తేదీన ప్రకటించిన విషయం తెలిసిందే. ఇది సుప్రీంకోర్టు ఆదేశించిన చట్టానికి విరుద్ధమంటూ ఉత్తరాఖండ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ కె.ఎం.జోసెఫ్, జస్టిస్ వి.కె.బిస్త్లతో కూడిన ధర్మాసనం గురువారం నాడు కొట్టివేసింది. ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని రద్దు చేయటంలో కేంద్రం వ్యవహరిస్తున్న తీరును తీవ్రస్థాయిలో తప్పుపట్టింది. అదేసమయంలో.. తిరుగుబాటు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు 9 మందిపై అనర్హత వేటును కూడా హైకోర్టు ధర్మాసనం సమర్థించటం విశేషం. పార్టీ ఫిరాయింపు అనే రాజ్యాంగ పాపానికి ఒడిగట్టినందుకు.. స్పీకర్ అనర్హత వేటు ద్వారా వారు మూల్యం చెల్లించాల్సి ఉంటుందంటూ వ్యాఖ్యానించింది. వారం పాటు తొలగించబోమని హామీ ఇస్తారా? ధర్మాసనం గురువారం బహిరంగ కోర్టులో దాదాపు రెండున్నర గంటల పాటు తీర్పును మౌఖికంగా ప్రకటించింది. ఈ తీర్పు ప్రకటన వరకూ.. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనను వారం రోజుల పాటు తొలగించబోమని, వేరొకరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవకాశం కల్పించబోమని హామీ ఇవ్వాల్సిందిగా కేంద్ర ప్రభుత్వ న్యాయవాదిని ధర్మాసనం కోరింది. అటువంటి హామీ ఇచ్చే అవకాశం తనకు లేదని న్యాయవాది పేర్కొనగా ధర్మాసనం తీవ్రంగా స్పందించింది. ‘‘తీర్పు ఇవ్వకముందే రాష్ట్రపతి పాలన తొలగించి, మరొకరికి ప్రమాణం చేసే అవకాశం ఇస్తే.. న్యాయాన్ని వక్రీకరించటం కాదా? మీరు ప్రతి రాష్ట్రంలోనూ ఇలా చేయగలరు. పది, పదిహేను రోజులు రాష్ట్రపతి పాలన విధించి.. మరొకరిని ప్రమాణ స్వీకారం చేయమనటం’’ అని విమర్శించింది. ‘‘మీరు ఇలా ప్రవర్తించటం పట్ల మాకు కోపం కన్నా ఎక్కువగా బాధ కలుగుతోంది. అత్యున్నత అధికారం - భారత ప్రభుత్వం - ఇలా ప్రవర్తిస్తోంది. కోర్టుతో ఆటలాడవచ్చని మీరు ఎలా భావిస్తారు?’’ అని మండిపడింది. అనంతరం మౌఖికంగా తీర్పును ప్రకటిస్తూ.. ప్రస్తుత కేసు మార్చి 18వ తేదీ నుంచి మొదలైందని.. ఆ రోజును తొలి రోజుగా లెక్కిస్తే 356వ అధికరణ ప్రకటనను పది రోజుల లోగానే చేశారని.. ఇది సుప్రీంకోర్టు విధించిన చట్టానికి విరుద్ధమని స్పష్టంచేసింది. రాష్ట్రపతి పాలన విధించటానికి పరిగణనలోకి తీసుకున్న అంశాలు బలంగా లేవని.. కాబట్టి రాష్ట్రపతి పాలన ప్రకటనను న్యాయసమీక్ష చేయటం సరైనదేనని పేర్కొంది. రాష్ట్రపతి పాలన ప్రకటించిన రోజు నాటి పరిస్థితి యథాతథంగా కొనసాగుతుందని.. అంటే పిటిషనర్ (హరీశ్రావత్) సారథ్యంలోని ప్రభుత్వం పునరుద్ధరణ అవుతుందని తీర్పు చెప్పింది. కేంద్ర ప్రభుత్వ ఇష్టానుసారమా..? ‘‘రాష్ట్ర ప్రభుత్వాలను వదిలించుకోవటం, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని రద్దుచేయటం లేదా తొలగించటం, గందరగోళం ప్రవేశపెట్టం, తద్వారా.. ఎండ, వాన, మంచులను తట్టుకుంటూ ఓటు వేయటానికి తెల్ల కాగితంతో నిలుచునే సామాన్యుడి విశ్వాసాన్ని దెబ్బతీయటం.. కేంద్ర ప్రభుత్వ ఇష్టానుసారమా అన్నది ఈ అంశంలో అతి కీలకం. సస్పెన్షన్ అయినా, రద్దు చేయటమైనా.. దాని ప్రభావం ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని కూలదోయటమేనన్నది మా అభిప్రాయం. అది ప్రజాస్వామ్య ప్రక్రియలో పాలు పంచుకునే పౌరుల మనసుల్లో నిస్పృహకు అంకురార్పణ చేస్తుంది. ప్రజాస్వామ్యాన్ని, సమాఖ్య పునాదిని బలహీనపరుస్తుంది. ఇక్కడ మొత్తంగా ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉంది. భారతదేశం రాష్ట్రాల సమాఖ్య. కేంద్రం, రాష్ట్రాలు తమ తమ పరిధుల్లో సార్వభభౌమత్వం కలిగి ఉన్నాయి. కాబట్టి ఈ అంశాన్ని విస్తృత పరిధిలో చూడాలి. 356 అధికరణను చివరి అవకాశంగా, అత్యంత జాగరూకతతో ఉపయోగించాలన్నది స్పష్టం’’ అని తన సుదీర్ఘ తీర్పులో పేర్కొంది. సుప్రీంకోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకోండి... ఈ తీర్పుకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో అప్పీలు చేసేందుకు వీలుగా.. తీర్పును నిలుపదల చేయాలన్న కేంద్ర ప్రభుత్వ న్యాయవాది విజ్ఞప్తిని హైకోర్టు తిరస్కరించింది. ‘‘ఇప్పుడు రాష్ట్రపతి పాలన లేదు. ప్రభుత్వ పునరుద్ధరణ జరిగింది. (తీర్పు రాసేందుకు) మాకు సమయం ఇవ్వాలని మేం మీకు చెప్పాం. కానీ.. ఇప్పుడే ప్రకటించేలా మీరు మమ్మల్ని బలవంతం చేశారు. మీరు సుప్రీంకోర్టుకు వెళ్లి (ఈ తీర్పును) నిలుపదల చేయించుకోండి’’ అని వ్యాఖ్యానించింది. ప్రస్తుత కేసులో రాష్ట్రపతి నిర్ణయంపై న్యాయ సమీక్షకు గల అవకాశంపై కేంద్రం వాదనలను తోసిపుచ్చుతూ.. ‘‘న్యాయబద్ధమైన ప్రయోజనం కోసం అన్నట్లుగా కనిపించినప్పటికీ.. అనుషంగిక ప్రయోజనం పొందటం అంగీకారయోగ్యం కాదు’’ అని పేర్కొంది. వినియోగ బిల్లు వివాదంతో మొదలై... ఉత్తరాఖండ్ శాసనసభలో మార్చి 18వ తేదీన వినియోగ బిల్లు ఆమోదంపై వివాదం చెలరేగటం.. ఆ ద్రవ్య బిల్లు ఓడిపోయిందని, ప్రభుత్వం మెజారిటీ కోల్పోయిందని బీజేపీ, కాంగ్రెస్ అసమ్మతి ఎమ్మెల్యేలు వాదించటంతో.. అదే నెల 28వ తేదీన ప్రభుత్వం శాసనసభలో మెజారిటీ నిరూపించుకోవాలని హైకోర్టు ఏకసభ్య ధర్మాసనం ఆదేశించింది. విశ్వాసపరీక్ష జరగాల్సిన ఒక రోజు ముందు మార్చి 27వ తేదీన.. రాష్ట్రంలో రాజ్యాంగ వ్యవస్థ కుప్పకూలిందన్న ప్రాతిపదికగా చూపుతూ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనను విధించింది. రాష్ట్రపతి పాలన విధింపును సవాల్ చేస్తూ హరీశ్రావత్ హైకోర్టు ధర్మాసనాన్ని ఆశ్రయించారు. దీనిపై గత మూడు రోజుల విచారణలో హైకోర్టు.. ఉత్తరాఖండ్లో రాష్ట్రపతి పాలన విధించటానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీవ్ర వ్యాఖ్యలు చేసింది. విశ్వాస పరీక్షకు కేవలం ఒక్క రోజు ముందు 356 అధికరణ కింద రాష్ట్రపతి పాలనను ప్రకటించటం.. ప్రజాస్వామ్య మూలాలను నరికివేయటమేనని సోమవారం నాడు అభివర్ణించింది. ఆ తర్వాతి రోజు.. ఒక ఎన్నికైన ప్రభుత్వాన్ని పక్కనపెట్టి కేంద్రం గందరోళాన్ని ప్రవేశపెడుతోందని విమర్శించింది. బుధవారం నాడు.. రాష్ట్రపతి కూడా తీవ్ర పొరపాటు చేయవచ్చునంటూ.. రాష్ట్రపతి పాలనపై న్యాయసమీక్ష చేయవచ్చునని పేర్కొంది. నేడు ‘సుప్రీం’లో సవాల్ చేయనున్న కేంద్రం న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం శుక్రవారం నాడు సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నట్లు అటార్నీ జనరల్ ముకుల్ రోహ్తగి గురువారం సాయంత్రం ఢిల్లీలో మీడియాకు తెలిపారు. హైకోర్టు తీర్పును నిలిపివేయాలని కోరుతూ శుక్రవారం ఉదయం ప్రధాన న్యాయమూర్తి టి.ఎస్.ఠాకూర్ ధర్మాసనం ఎదుట ప్రస్తావిస్తానని ఆయన చెప్పారు. మార్చి 18వ తేదీన వినియోగ బిల్లు శాసనసభలో వాస్తవానికి ఆమోదం పొందలేదని.. స్పీకర్ స్వయంగా దీనిని నిర్ధారించారని, అంటే ప్రభుత్వం పడిపోయినట్లేనని ఆయన పేర్కొన్నారు. మోదీజీ కలిసి పనిచేద్దాం ‘మాకన్నా బలమైన కేంద్రంతో విరోధం పెట్టుకోవాలని మేం అనుకోవటం లేదు. పరస్పర సహకారంతో సమాఖ్య పద్థతిలో కలిసి పనిచేసుకుందాం. ఇటీవల జరిగిన పరిణామాలను ప్రధాని మరిచిపోయి.. రాష్ట్రాభివృద్ధికి సహకరించాలి’ - హరీశ్ రావత్, ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి మోదీ, షా క్షమాపణలు చెప్పాలి: కాంగ్రెస్ ‘రాజ్యాంగాన్ని హత్యచేసి, ప్రజాస్వామ్యాన్ని అణగదొక్కేందుకు ప్రయత్నించిన ప్రధాని మోదీ, బీజేపీ చీఫ్ అమిత్ షా దేశానికి క్షమాపణలు చెప్పాలి. హైకోర్టు తీర్పు బీజేపీకి చెంపపెట్టు వంటిది. ఇది కాంగ్రెస్ విజయం మాత్రమే కాదు. ప్రజాస్వామ్య విజయం. విశ్వాస పరీక్షలోనూ మాదే విజయం’ ఈ తీర్పు ఊహించిందే: బీజేపీ ‘ఈ నిర్ణయంపై మాకేం పెద్దగా ఆశ్చర్యం కలిగించలేదు. మూడురోజులుగా జరుగుతున్న పరిణామాలతో దీన్ని ముందుగానే ఊహించాం. కాంగ్రెస్ ప్రతిదానికీ కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించటం దురదృష్టకరం. ఇప్పటికీ ఉత్తరాఖండ్ ప్రభుత్వం మైనారిటీలోనే ఉంది. ఏప్రిల్ 29నే వారి భవితవ్యం తేలుతుంది’ బీజేపీకి చెంపదెబ్బ ‘ఉత్తరాఖండ్ పరిణామాలు బీజేపీ ప్రభుత్వానికి చెంపదెబ్బలాంటివి. రాజ్యాంగ వ్యతిరేకమైన పనులు చేస్తే కోర్టులు చూస్తూ ఊరుకోవనేదానికి ఇదో మంచి ఉదాహరణ. కేంద్ర ప్రభుత్వ అధికార దుర్వినియోగం బట్టబయలైంది’ - సీతారాం ఏచూరీ, సీపీఎం ప్రధాన కార్యదర్శి ప్రజాస్వామ్యాన్ని గౌరవించండి ‘మోదీ ప్రభుత్వానికి ఇదో ఎదురుదెబ్బ. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాల విషయంలో మోదీ జోక్యం తగ్గించుకుని ప్రజాస్వామ్యాన్ని గౌరవించాలి’ - అరవింద్ కేజ్రీవాల్, ట్విట్టర్లో ప్రజాస్వామ్య విజయమిది ‘బలవంతంగా అధికారాన్ని చేజిక్కించుకుందామనుకున్న బీజేపీ ఆశలు అడియాసలయ్యాయి. ఇది ప్రజాస్వామ్య విజయం. మోదీజీ రాజ్యాంగం దాడి చేద్దామని మీరు చేస్తున్న ప్రయత్నానని ఉత్తరాఖండ్ ప్రజలు, యావద్భారతం గమనిస్తోంది’ - రాహుల్ గాంధీ, ట్వీట్టర్లో -
కేంద్రానికి ఎదురుదెబ్బ.. రాష్ట్రపతి పాలన రద్దు
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం విధించిన రాష్ట్రపతి పాలనను ఉత్తరాఖండ్ హైకోర్టు రద్దు చేసింది. 356 అధికరణంపై గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునకు ఈ నిర్ణయం విరుద్ధమని ఈ సందర్భంగా హైకోర్టు పేర్కొంది. ఉత్తరాఖండ్ లో రాష్ట్రపతి పాలనను సవాల్ చేస్తూ కాంగ్రెస్ నేత హరీశ్ రావత్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్ ను కోర్టు విచారణకు స్వీకరించింది. హైకోర్టు నిర్ణయంతో కాంగ్రెస్ పార్టీ వర్గాలు సంబరాల్లో మునిగి తేలాయి. కేంద్ర ప్రభుత్వం తమకు క్షమాపణ చెప్పి తీరాలని డిమాండ్ చేశాయి. హైకోర్టు తీర్పు ప్రజాస్వామ్య విజయం అని ఉద్ఘాటించాయి. కాగా, 29న హరీశ్ రావత్ బల పరీక్షను ఎదుర్కోనున్నారు. హైకోర్టు ఏం వ్యాఖ్యానించిందంటే.. 'ఉత్తరాఖండ్ లో తప్పుడు విధంగా రాష్ట్రపతి పరిపాలన విధించారు. ఈ రాష్ట్రం విషయంలో కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేక శ్రద్ధ ఉన్నట్లు కనిపిస్తోంది. రాష్ట్రపతి పరిపాలన అనేది అన్ని ప్రయత్నాలు చేసిన తర్వాత చివరి ప్రయత్నంగా మాత్రమే విధించాలి. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికైనా ప్రజాప్రతినిధులను ఇలా అనూహ్యంగా తొలగించడమనేది పౌరుల హృదయాలపై మూర్ఖంగా దెబ్బకొట్టడమే. ఉత్తరాఖండ్ లో రాష్ట్రపతి పాలన విధించేందుకు కేంద్రం ఎంతో తొందరపడినట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా మెజారిటీ నిరూపించుకునేందుకు మరో రోజు ఉండగానే ఇలా త్వరత్వరగా రాష్ట్రపతి పాలన విధించడం అనేది కేంద్రం చేసిన అనాధికార కార్యక్రమంలాగా కనిపిస్తోంది' అని కోర్టు వ్యాఖ్యానించింది. కాంగ్రెస్లో సంబరాల కోలాహలం ఉత్తరాఖండ్ లో రాష్ట్రపతి పాలనను రద్దు చేస్తూ హైకోర్టు తీర్పు వెలువరించిన మరుక్షణమే కాంగ్రెస్ పార్టీలో సంబరాలు మొదలయ్యాయి. ముఖ్యంగా సీఎం హరీశ్ రావత్ ఇంటి వద్ద పెద్ద ఎత్తున సంబరాలు ప్రారంభమయ్యాయి. భారీ సంఖ్యలో మద్దతుదారులు ఆయన నివాసం వద్దకు చేరుకొని టపాకాయలు కాల్చారు. పలువురు పత్రికా ప్రకటనలు చేశారు. కేంద్ర ప్రభుత్వం తమకు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నేత హృదయేష్ స్పందిస్తూ మరోసారి సత్యాన్ని, ధర్మాన్ని కాపాడిన మన న్యాయ వ్యవస్థకు నా సెల్యూట్ అంటూ వ్యాఖ్యానించారు. 29న బల పరీక్ష హైకోర్టు తీర్పు నేపధ్యంలో హరీశ్ రావత్ కు మరోసారి సీఎం పదవిని నిలబెట్టుకునే అవకాశం వచ్చింది. ఈ నెల 29న ఆయన బలపరీక్ష ఎదుర్కోనున్నారు. ఇప్పటికే తనకు మద్దతుగా ఉన్న ఎమ్మెల్యేలతోపాటు బీజేపీతో చేతులు కలిపేందుకు వెళ్లిన కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేలతో కూడా కాంగ్రెస్ పెద్దలు సమీక్షలు జరిపి బలపరీక్షకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. -
కేంద్రంపై హైకోర్టు సీరియస్
డెహ్రడూన్: ఉత్తరాఖండ్ లో రాష్ట్రపతి పాలన విధింపుపై రాష్ట్ర హైకోర్టు మరోసారి కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడింది. రాష్ట్రపతి పాలనను వెంటనే ఎందుకు ఎత్తేయలేదని ప్రశ్నించింది. స్పష్టమైన ఆదేశాలిచ్చి వారం రోజుల్లోనే రాష్ట్రపతి పాలనను ఎందుకు ఉపసంహరించలేదని నిలదీసింది. కేంద్ర ప్రభుత్వం చర్యలతో తమకు కోపం కంటే బాధ కలుగుతోందని ఉన్నత న్యాయస్థానం గురువారం వ్యాఖ్యానించింది. కోర్టులతో ఎందుకు ఆడుకుంటున్నారని సూటిగా అడిగింది. 'రేపు రాష్ట్రపతి పాలన ఎత్తేసి, ప్రభుత్వం ఏర్పాటు చేయాలని మరొకరిని ఆహ్వానిస్తారు. ఇది న్యాయవ్యవస్థను అపహాస్యం చేయడం కాదా. ప్రభుత్వం ఏమైనా ప్రైవేటు పార్టీయా' అని ఘాటుగా ప్రశ్నించింది. తాము తీర్పు ఇచ్చే వరకూ రాష్ట్రపతి పాలన ఎత్తివేయొద్దని కేంద్రానికి ఆదేశాలు జారీచేసింది. కేంద్రం తమ ఆదేశాలను శిరసావహిస్తుందని భావిస్తున్నట్టు వెల్లడించింది. రాష్ట్రపతి పాలనను ఎత్తివేసే ప్రయత్నం చేయదని, తమను రెచ్చగొట్టదన్న నమ్మకాన్ని ఉత్తరాఖండ్ హైకోర్టు వ్యక్తం చేసింది. -
రాష్ట్రపతి నిర్ణయాన్నీ సమీక్షించొచ్చు
రాష్ట్రపతి పాలనపై ఉత్తరాఖండ్ హైకోర్టు వ్యాఖ్య ♦ ఒక్కోసారి రాష్ట్రపతి నిర్ణయం కూడా పొరపాటు కావచ్చు ♦ రాష్ట్రపతి పాలన ఎత్తేసి మమ్మల్ని రెచ్చగొట్టొద్దు ♦ తీర్పు ఇచ్చే వరకూ రాష్ట్రపతి పాలన ఎత్తివేయొద్దని కేంద్రానికి ఆదేశం నైనిటాల్: ఉత్తరాఖండ్లో రాష్ట్రపతి పాలన విధించడంపై ఆ రాష్ట్ర హైకోర్టు మరోసారి కేంద్రానికి మొట్టికాయలు వేసింది. రాష్ట్రపతి పాలనను ఎత్తివేసే ప్రయత్నం చేసి తమను రెచ్చగొట్టవద్దని తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. రాష్ట్రపతి పాలన విధింపునకు సంబంధించి దాఖలైన పిటిషన్పై తీర్పు వెలువరించే వరకూ దానిని ఎత్తివేయొద్దని బుధవారం ఆదేశించింది. కోర్టు తీర్పు ఇవ్వక ముందే లేదా తీర్పును రిజర్వు చేయడానికి ముందే ఉత్తరాఖండ్లో రాష్ట్రపతి పాలనను ఎత్తివేసే అవకాశం ఉందని సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ న్యాయస్థానం దృష్టికి తీసుకురావడంతో కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. అంతకుముందు ఉత్తరాఖండ్లో రాష్ట్రపతి పాలనను వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్పై వాదనలు విన్న న్యాయస్థానం అసెంబ్లీని సస్పెండ్ చేయాలన్న రాష్ట్రపతి నిర్ణయానికి చట్టబద్ధత ఉందా? లేదా? అనే అంశాన్ని న్యాయ సమీక్ష చేయొచ్చని స్పష్టం చేసింది. ఒక్కోసారి రాష్ట్రపతి తీసుకునే నిర్ణయం కూడా పొరపాటు కావచ్చని, అందువల్ల దానిపై సమీక్ష జరపవచ్చని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి కేఎం జోసెఫ్, జస్టిస్ వీకే బిస్త్ పేర్కొన్నారు. న్యాయమూర్తులు ఎన్డీఏ ప్రభుత్వ వాదనలను ప్రస్తావిస్తూ.. తన రాజకీయ విజ్ఞతతో ఆర్టికల్ 356 విధింపుపై రాష్ట్రపతి నిర్ణయం తీసుకున్నారన్నారు. ‘ఎవరైనా తప్పులు చేయొచ్చు.. అది రాష్ట్రపతి అయినా కావచ్చు లేదా జడ్జీలైనా కావచ్చు’ అని అన్నారు. రాష్ట్రపతి పాలనను సవాల్ చేస్తూ పదవీచ్యుత ముఖ్యమంత్రి హరీశ్ రావత్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. రావత్ తరఫున సింఘ్వీ వాదనలు వినిపిస్తూ.. తీర్పు వెలువడక ముందే లేదా రిజర్వ్ చేయడానికి ముందే రాష్ట్రపతి పాలన ఎత్తివేయకుండా.. అలాగే ప్రతిపక్షాన్ని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించకుండా చూడాలని కోర్టును కోరారు. కోర్టు త్వరితగతిన తీర్పు వెలువరించేలా కేంద్రం ఎటువంటి కుట్రలు పన్నకుండా చూడాలని విన్నవించారు. అయితే కేంద్రం తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ (ఏఎస్జీ) తుషార్ మెహతా వాదనలు వినిపిస్తూ.. రాష్ట్రపతి పాలనను ఎత్తివేయడానికి సంబంధించి కేంద్రం ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని కోర్టుకు తెలిపారు. బీజేపీ ఎమ్మెల్యే బీమ్లాల్ ఆర్యాపై అనర్హత పిటిషన్ను స్పీకర్ పక్కన పెట్టారన్న కేంద్ర ఆరోపణలపైనా కోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ‘‘రాష్ట్రపతి పాలన విధించిన తర్వాత ఏప్రిల్ 5న అనర్హత ఫిర్యాదు ఎందుకు చేశారు? మీరు స్పీకర్పై దారుణమైన ఆరోపణలు చేశారు. భారత ప్రభుత్వం పనిచేసేది ఇలాగేనా? దీని గురించి కేంద్రం ఏం చెబుతుంది. దీనిని అంత తేలిగ్గా తీసుకోవడం సాధ్యం కాదు. దీనిపై మేము దృష్టి పెట్టాం’’ అని ధర్మాసనం ఘాటుగా వ్యాఖ్యానించింది. దీనికి సంబంధించి తాను ప్రభుత్వం నుంచి సూచనలు తీసుకోవాల్సిన అవసరం ఉందని, వాటిని గురువారం కోర్టుకు వివరిస్తామని ఏఎస్జీ మెహతా చెప్పారు. దీంతో కోర్టు విచారణను గురువారానికి వాయిదా వేసింది. రాష్ట్రపతి పాలనను సవాల్ చేస్తూ రావత్ దాఖలు చేసిన పిటిషన్పై తీర్పును కూడా గురువారం కోర్టు రిజర్వ్ చేసే అవకాశం ఉంది. -
రాష్ట్రపతి పొరపాటు చేసుండొచ్చు
డెహ్రడూన్: ఉత్తరాఖండ్ లో రాష్ట్రపతి పాలన విధించడాన్ని రాష్ట్ర హైకోర్టు తప్పుబట్టింది. రాష్ట్రపతి నిర్ణయాన్ని ప్రశ్నించే అధికారం కోర్టుకు లేదన్న కేంద్ర ప్రభుత్వ వాదనను తోసిపుచ్చింది. రాష్ట్రపతి కూడా ఒక్కోసారి పొరపాటు నిర్ణయాలు తీసుకునే అవకాశముందని, న్యాయసమీక్షకు అనుగుణంగా నిర్ణయాలు ఉండాలని సూచించింది. రాష్ట్రపతి పాలనను కోర్టులు సమీక్షించజాలవని కేంద్రం వాదించింది. రాచరికపాలనలో మాదిరిగా నిర్ణయాలు తీసుకోవడం కుదరదని, రాజ్యాంగ పరిధికి లోబడి వ్యవహరించాలని ఉన్నత న్యాయస్థానం పేర్కొంది. రాష్ట్రపతి విజ్ఞతపై తమకు ఎటువంటి అనుమానం లేదని, ఏది చేసినా న్యాయసమీక్షకు అనుగుణంగా చేయాలని తెలిపింది. హరీశ్ రావత్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గతనెలలో కేంద్రం రద్దు చేసింది. కేంద్ర ప్రభుత్వ సిఫార్సు మేరకు శాసనసభను రాష్ట్రపతి సుప్తచేతనావస్థలో ఉంచారు. ఉత్తరాఖండ్ లో రాష్ట్రపతి పాలన విధించడంపై ఉన్నత న్యాయస్థానాల్లో వాదోపవాదనలు జరుగుతున్నాయి. -
గందరగోళం సృష్టించారు
♦ కేంద్రానికి ఉత్తరాఖండ్ హైకోర్టు అక్షింతలు ♦ ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వ హక్కును లాగేసుకున్నారు నైనిటాల్: ఉత్తరాఖండ్లో రాష్ట్రపతి పాలన విధిస్తూ కేంద్రం హడావిడిగా తీసుకున్న నిర్ణయంపై రాష్ట్ర హైకోర్టు మరోసారి కేంద్రంపై అక్షింతలు వేసింది. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించి ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వ అధికారాలను లాగేసుకున్నారని, అలాగే రాష్ట్రంలో గందరగోళ పరిస్థితిని సృష్టించారని ఆక్షేపించింది. అవినీతి, ఎమ్మెల్యేల బేరసారాల్లాంటి ఆరోపణలు కాకుండా అసెంబ్లీలో బలపరీక్ష నిర్వహించడమొక్కటే రాజ్యాంగబద్ధ పరిష్కారమంది. రాష్ర్టపతి పాలనను సవాల్చేస్తూ పదవీచ్యుత సీఎం రావత్, ఇతర పిటిషన్లపై కోర్టు మంగళవారం విచారణ జరిపింది. రాష్ట్రపతిపాలనపై హైకోర్టు డివిజన్ బెంచ్ కేంద్రంపై ప్రశ్నలు సంధించింది. కేంద్రంలో, రాష్ట్రంలో అధికార పార్టీలు వేరైనప్పుడు రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించడానికి ఎలాంటి అవకాశం దొరుకుతుందా అని కేంద్ర ప్రభుత్వం భూతద్దం పెట్టుకొని వెతుకుతున్నట్లు ఉందని వ్యాఖ్యానించింది. ప్రభుత్వాన్ని రద్దుచేసేందుకు అవినీతి ఆరోపణలే సరిపోతే దేశంలో ఏ ప్రభుత్వమైనా కనీసం ఐదు నిమిషాలైనా మనుగడ సాగిస్తుందా అని ప్రశ్నించింది. -
'ఆ సీన్ రిపీటవనివ్వను'
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో మరోసారి రాష్ట్రపతి పాలనకు అవకాశం ఇవ్వబోనని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. అరుణా చల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లో ప్రస్తుతం ఈ పరిస్ధితి తలెత్తిన నేపథ్యంలో అలాంటిది ఢిల్లీలో పునావృతం కానివ్వబోనని స్పష్టం చేశారు. అధికారంలో ఉన్న చట్టప్రతినిధులు ఏం చెప్తున్నారో అనే విషయాన్ని ప్రతిపక్ష పార్టీలు తప్పనిసరిగా వినాలని, ప్రజల అవసరాల మేరకే ప్రతిపక్షాల డిమాండ్లు ఉండాలని హితవు పలికారు. అరుణాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లో రాష్ట్రపతి పాలనపై స్పందన కోరగా 'ఢిల్లీలో మేం ఎప్పటికీ అలాంటి పరిస్థితికి అవకాశం ఇవ్వబోం. వచ్చే రెండేళ్లలో జరిగే ఎన్నికల్లో ఒక్క సీటుకూడా గెలుచుకోలేదని బీజేపీకి తెలుసు. అందుకే గుంఢాగిరి మార్గాన్ని ఎంచుకుంది. దానిని హిమాచల్ ప్రదేశ్లో తర్వాత ఢిల్లీలో ప్రయోగించాలనుకుంటున్నారు. ఢిల్లీలో తొలుత 21మంది ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసి.. మరో 23మంది ఎమ్మెల్యేలను కొనేయాలని అనుకుంటున్నారు' అని కేజ్రీవాల్ ఆరోపించారు. -
ఉత్తరాఖండ్ డ్రామా!
అవసరార్ధం అభిప్రాయాలు ప్రకటించడం తప్ప దేనిపైనా నికరమైన, సూత్రబద్ధమైన వైఖరిని ప్రదర్శించలేని రాజకీయ పక్షాలు ప్రజాస్వామ్యాన్ని భ్రష్టు పట్టిస్తున్నాయి. అందుకు ఉత్తరాఖండ్ తాజా ఉదాహరణ. ఆ రాష్ట్రాన్ని పాలిస్తున్న కాంగ్రెస్ పార్టీలో చిన్నగా మొదలైన ఎమ్మెల్యేల తిరుగుబాటు చివరకు ఆ ప్రభుత్వ మనుగడకే ముప్పు కలిగించే స్థాయికి చేరుకోవడం... కేంద్రం అక్కడ రాష్ట్రపతి పాలన విధించడం లాంటి పరిణామాలు అందరినీ విస్మయపరిచాయి. రాష్ట్ర ప్రభు త్వానికి బలం ఉన్నదో లేదో నిర్ణయించడానికి ఈ నెల 31న అసెంబ్లీలో బలపరీక్ష నిర్వహించాలని ఉత్తరాఖండ్ హైకోర్టు మంగళవారం ఆదేశాలు జారీ చేయడంతో అక్కడి రాజకీయ సంక్షోభం కొత్త మలుపు తిరిగింది. ఏ ప్రభుత్వానికైనా అసెంబ్లీలో జరిగే బలపరీక్షే కీలకం. ఆ బలపరీక్షలో నెగ్గితేనే, అత్యధిక సభ్యుల విశ్వాసం చూరగొంటేనే ఏ ప్రభుత్వమైనా మనుగడ సాగించాలి. ఈ సంగతిని ఎస్ఆర్ బొమ్మైకేసులో సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం చెప్పి 22 ఏళ్లు దాటుతోంది. అంతకు ముందుతో పోలిస్తే ఆ తీర్పు వెలువడ్డాక కేంద్రంలో అధికారం చలాయించే పాలకులు కాస్త తగ్గిన మాట వాస్తవమే అయినా అలాంటి చర్యలకు పూర్తిగా స్వస్తి పలకలేదు. బొమ్మైకేసుకు ముందు 15 సంవత్సరాలు...ఆ తర్వాత 15 సంవత్స రాలు కొలమానంగా తీసుకుని రాష్ట్రపతి పాలనకు వీలుకల్పించే 356వ అధికరణను కేంద్రంలో అధికారంలో ఉండే పాలకులు ఎన్నిసార్లు ప్రయోగించారని ఒక సామాజిక శాస్త్రవేత్త లెక్కలుగట్టినప్పుడు ఆసక్తికరమైన అంశాలు వెల్లడయ్యాయి. బొమ్మైకేసుకు ముందు ఈ అధికరణను 40 సార్లు...ఆ తర్వాత 11 సార్లు అమలు చేశారని ఆయన 2012లో తేల్చిచెప్పారు. న్యాయస్థానాల భయంతో పాలకులు కాస్త తగ్గారని ఈ లెక్కలు చూస్తే తెలుస్తుంది. ఏ రాష్ట్రంలోనైనా రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగా పరిపాలన సాగించలేని పరిస్థితులు ఏర్పడ్డాయని రాష్ట్రపతి భావించినపక్షంలో రాష్ట్రపతి పాలన విధించవచ్చునని 356 అధికరణ చెబుతోంది. కానీ తమకు నచ్చని ప్రభుత్వాన్ని సాగనంపడానికే ఈ అధికరణ కేంద్రంలోని పాలకులకు అక్కరకొస్తున్నది. రాష్ట్రపతి పదవిలో ఉండేవారు ఇలాంటి చర్యల విషయంలో నిర్మొహమాటంగా వ్యవహరిస్తే ఈ రకమైన పోకడలకు ఆస్కారం ఉండేది కాదు. కానీ కె.ఆర్. నారాయణన్ ఒక్కరే రాష్ట్రపతిగా ఈ విషయంలో దృఢంగా వ్యవహరించారు. యూపీలో రాష్ట్రపతి పాలన విధిస్తూ కేంద్ర కేబినెట్ పంపిన సిఫార్సును ఒకసారి, బిహార్ సర్కార్ను బర్తరఫ్ చేసే సిఫార్సును మరొ కసారి 1997లో ఆయన తోసిపుచ్చారు. అంతకుముందూ, ఆ తర్వాతా ఎవరూ ఇంత స్వతంత్రంగా వ్యవహరించిన సందర్భాలు కనబడవు. కేంద్ర-రాష్ట్ర సంబం ధాలపై నియమించిన సర్కారియా కమిషన్ సైతం 356వ అధికరణ దుర్విని యోగాన్ని తప్పుబట్టింది. అప్పటివరకూ మొత్తంగా 75 సందర్భాల్లో ఈ అధికర ణాన్ని ఉపయోగిస్తే అందులో కేవలం 26 సార్లు మాత్రమే ‘సరైన కారణాలు’ ఉన్నాయని 1988లో సమర్పించిన నివేదికలో తేల్చిచెప్పింది. ఈనెల 31న బలనిరూపణ చేసుకోవాలని ఉత్తరాఖండ్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలతో విచిత్రమైన పరిస్థితి నెలకొంది. ఈ ఆదేశాల ద్వారా రాష్ట్రపతి పాలన విధింపుపై స్టే విధించి హరీష్ రావత్ ప్రభుత్వాన్ని పునరుద్ధరించినట్టు భావించ వచ్చునని రాజ్యాంగ నిపుణులు చెబుతున్నారు. అదే నిజమైతే కేంద్ర ప్రభుత్వానికి నైతికంగానూ, చట్టపరంగానూ ఎదురుదెబ్బ తగిలినట్టే. వాస్తవానికి ఈ నెల 28న అసెంబ్లీలో బలపరీక్షకు సిద్ధపడాలని రావత్ సర్కారుకు ఆ రాష్ట్ర గవర్నర్ కెకె పాల్ చేసిన సూచనను సజావుగా అమలు జరగనిచ్చి ఉంటే ఆ ప్రభుత్వం ఉండటమో, ఊడటమో తేలిపోయేది. కేంద్ర ప్రభుత్వం అందుకు అవకాశం ఇవ్వకుండా హఠాత్తుగా ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేసి, రాష్ట్రపతి పాలన విధించింది. ఇది తొందర పాటు చర్యేనని హైకోర్టు ఆదేశాలు తెలియజెబుతున్నాయి. రావత్ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ తిరుగుబాటు చేసిన 9మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల సభ్యత్వాన్ని స్పీకర్ రద్దు చేయడాన్ని కూడా హైకోర్టు ఒకరకంగా నిలిపివేసినట్టే లెక్క. 31న జరిగే బలపరీక్షలో వారు కూడా ఓటేసే అవకాశాన్ని కల్పించడం ఇందువల్లే కావొచ్చు. అయితే, ఆ ఎమ్మెల్యేల సభ్యత్వం రద్దుపై ఉన్న వివాదాన్ని తేల్చేవరకూ వారి ఓట్లను పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని చెప్పింది. మొత్తంమీద హైకోర్టు ఉత్తర్వులు అధికారాన్ని కోల్పోయిన రావత్కూ, సభ్యత్వం రద్దయిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలకూ సమాన అవకాశాన్ని కల్పిస్తున్నాయి. లోగడ అరుణాచల్ ప్రదేశ్లోనూ, ఇప్పుడు ఉత్తరాఖండ్లోనూ విపక్ష ప్రభుత్వాలను రద్దు చేయడం ద్వారా తనదీ కాంగ్రెస్ చూపిన బాటేనని ఎన్డీఏ సర్కారు చెప్పినట్టయింది. ఉత్తరాఖండ్లో ద్రవ్య వినిమయ బిల్లు ఆమోదం విషయంలో తిరుగుబాటు ఎమ్మెల్యేలు కోరినట్టు ఓటింగ్కు స్పీకర్ అనుమ తించకపోయి ఉండొచ్చు. రాజ్యాంగపరంగా, నైతికంగా అది దోషమే కావొచ్చు. ఆ విషయంలో న్యాయస్థానాలు రాజ్యాంగం అనుమతించిన మేరకు జోక్యం చేసు కుంటాయి. జనం అంతిమంగా తీర్పునిస్తారు. అంతేతప్ప దాన్ని ఆసరా చేసుకుని ప్రభుత్వాన్ని రద్దు చేయాలనుకోవడం మంచిది కాదు. ఈ విషయంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేయకుండా ఉంటే మంచిదని కేంద్రం గుర్తించాలి. తాము విపక్షంలో ఉండగా కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ సర్కారు కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వాన్ని ఇబ్బందులు పాలు చేయడాన్నీ, అప్పుడు తాము తీసుకున్న వైఖరినీ బీజేపీ నేతలు మర్చిపోకూడదు. ఉత్తరాఖండ్ అనుభవంతో కాంగ్రెస్కు తత్వం బోధపడినట్టుంది. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలను రద్దు చేయడం అప్రజాస్వామికమని వాదిస్తోంది. అంతకన్నా ముందు పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యాన్ని అమలు చేస్తే ఇలాంటి తిప్పలు రావని ఆ పార్టీ నేతలు తెలుసుకోవాలి. ఆ పని చేస్తే కనీసం మణిపూర్లోనైనా ప్రభుత్వాన్ని రక్షించు కోగలుగుతామని గ్రహించాలి. -
విశ్వాస పరీక్ష నిర్వహించాల్సిందే: హైకోర్టు
ఉత్తరాఖండ్ ప్రభుత్వానికి హైకోర్టులో ఊరట లభించింది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కొనసాగాలా వద్దా అన్న విషయాన్ని తేల్చుకోడానికి గురువారం.. అంటే ఈనెల 31వ తేదీన విశ్వాస పరీక్ష నిర్వహించాలని హైకోర్టు ఆదేశించింది. ఉత్తరాఖండ్లో రాష్ట్రపతి పాలన విధించాలంటూ నిర్ణయం తీసుకున్న కేంద్రప్రభుత్వానికి ఇది పెద్ద ఎదురుదెబ్బే అవుతుంది. గత కొన్ని నెలలుగా ఆ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తి సెగలు కక్కుతోంది. తొమ్మిది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కీలకమైన ఆర్థికబిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేశారు. దాంతో ప్రభుత్వం మైనారిటీలో పడిందన్న విషయం రుజువైందని కేంద్రం చెప్పింది. అయితే.. మార్చి 28న తాను విశ్వాసపరీక్ష ఎదుర్కొంటానని గవర్నర్ కేకే పాల్ను కోరినా, ఈలోపే కేంద్రం అక్కడ రాష్ట్రపతి పాలన విధించింది. 70 మంది సభ్యులున్న ఉత్తరాఖండ్ అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీకి ఝలక్ ఇచ్చి బీజేపీ పక్షాన చేరిన తొమ్మిది మంది రెబెల్ ఎమ్మెల్యేలపై ఉత్తరాఖండ్ స్పీకర్ సస్పెన్షన్ వేటు వేశారు. దీంతో అసెంబ్లీలో విశ్వాస పరీక్షను రావత్ ప్రభుత్వం అలవోకగా ఎదుర్కొని నిలబడగలుగుతుంది. స్పీకర్ సస్పెన్షన్ నిర్ణయంతో సభలో మొత్తం సంఖ్య 61 పడిపోయింది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి 27 మంది సభ్యులుండగా, మరో ఆరుగురు స్వతంత్ర సభ్యులు కూడా సర్కారుకు మద్దతిస్తారని అంటున్నారు. అదే నిజమైతే 33 మంది సభ్యుల బలంతో రావత్ సర్కార్ విశ్వాస పరీక్షలో గట్టెక్కే అవకాశం ఉంటుంది. కానీ ఒకవేళ స్వతంత్ర సభ్యులు సర్కారుకు వ్యతిరేకంగా ఓటు వేస్తే మాత్రం హరీష్ రావత్ ఇంటిదారి చూసుకోక తప్పదు. -
సీఎంను ప్రత్యక్షంగా ఎన్నుకోవాలి: జేపీ
అప్పుడే ఎమ్మెల్యేలు పార్టీలు ఫిరాయించరు సాక్షి, హైదరాబాద్: ప్రత్యక్ష ఎన్నిక ద్వారా సీఎంలను ఎన్నుకునే విధానాన్నితీసుకురావాలని లోక్సత్తా వ్యవస్థాపకుడు జయప్రకాశ్ నారాయణ సోమవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. అప్పుడే ఎమ్మెల్యేలు పార్టీలు ఫిరాయించరని అన్నారు. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఎమ్మెల్యేలు పార్టీలు మారడం నుంచి రాష్ట్రపతి పాలన వరకు జరుగుతున్న పరిణామాలు ప్రేక్షకపాత్ర వహించాల్సినవి కాదన్నారు. విలువలకు, ప్రజా ప్రయోజనాలకు అధికారం ఎంతో దూరమైందనడానికి పలు రాష్ట్రాల్లో జరుగుతున్న ప్రస్తుత రాజకీయ పరిణామాలే తాజా రుజువని పేర్కొన్నారు. -
'9 మంది ఎమ్మెల్యేలకు వెయ్యి కోట్లు ఇచ్చారు'
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ ప్రభుత్వాన్ని, రాష్ట్ర గవర్నర్ పై కేంద్రంలోని నరేంద్ మోదీ సర్కారు బెదిరింపులకు పాల్పడిందని ముఖ్యమంత్రి హరీష్ రావత్ వ్యాఖ్యానించారు. 9 మంది తిరుగుబాటు ఎమ్మెల్యేలకు భారీగా ముడుపులు ముట్టాయని, రూ.1000 కోట్లకు పైగా చేతులు మారాయని ఆయన ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం తమ పార్టీ నేతలను ప్రలోభపెట్టిందని, తమ ప్రభుత్వాన్ని కూల్చేయడానకి విశ్వప్రయత్నాలు చేసిందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తిరుగుబాటు ఎమ్మెల్యేలకు ఇక భవిష్యత్తు ఉండదని వారి రాజకీయ జీవితానికి తెరపడినట్లేనని అభిప్రాయపడ్డారు. ఉత్తరాఖండ్ లో రాష్ట్రపతి పాలన విధించడం, అందుకు దారితీసిన పరిస్థితులపై ఆయన చాలా ఆగ్రహంగా ఉన్నారు. కేంద్ర కేబినెట్ రాష్ట్రపతి పాలన విధించాలని గవర్నర్ కు శనివారం సిఫార్స్ చేయగా, ఈ విషయాన్ని గవర్నర్, రాష్ట్రపతికి సిఫార్సు చేశారు. రాష్ట్రపతిపాలన విధిస్తున్నట్లు ప్రణబ్ ముఖర్జీ ఆదివారం నిర్ణయాన్ని ప్రకటించారు. గత రెండు రోజులుగా బీజేపీ కారణంగా రాష్ట్ర రాజకీయాల్లో ఎన్నో నాటకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయని, బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వ చర్యల వల్ల ఇలా జరిగిందని రావత్ ఆరోపించారు. 2014 ఫిబ్రవరిలో తాను అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మా ప్రభుత్వాన్ని కూల్చేయాలని బీజేపీ కుట్రలు పన్నిందని, మెజారిటీ సంఖ్యా బలం ఉన్నప్పటికీ ఈ విధంగా జరగడంపై సీఎం హరీష్ రావత్ విచారం వ్యక్తంచేశారు. -
పంతం నెగ్గించుకున్న మోదీ సర్కారు!
న్యూఢిల్లీ/డెహ్రాడూన్: ఉత్తరాఖండ్లోని నెలకొన్న రాజకీయ సంక్షోభం ఊహించని మలుపు తీసుకుంది. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించారు. కేంద్ర కేబినేట్ రాష్ట్రపతి పాలన విధించాలని గవర్నర్ కు శనివారం సిఫార్స్ చేశారు. గవర్నర్ తన నివేదిక, సిఫార్సును ప్రణబ్ ముఖర్జీకి అందజేశారు. ఈ మేరకు ప్రణబ్ ముఖర్జీ, గవర్సర్ సిఫార్సు మేరకు రాష్ట్రపతి పాలన అమలుచేశారు. కాంగ్రెస్ పార్టీకి సీఎం హరీశ్ రావత్ ప్రభుత్వం సోమవారం అసెంబ్లీలో విశ్వాస పరీక్ష ఎదుర్కొనుండగా.. అంతకుముందే కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించే దిశగా పావులు కదిపిన విషయం తెలిసిందే. బలం ఉన్నా... హైడ్రామా జరిగింది! కాంగ్రెస్ పార్టీకి ఝలక్ ఇచ్చి బీజేపీ పక్షాన చేరిన తొమ్మిది మంది రెబెల్ ఎమ్మెల్యేలపై ఉత్తరాఖండ్ స్పీకర్ సస్పెన్షన్ వేటు వేయడం.. ఈ సస్పెన్షన్ కనుక నిజమైతే, అసెంబ్లీలో విశ్వాస పరీక్షను రావత్ ప్రభుత్వం అలవోకగా ఎదుర్కొని నిలబడగలుగుతుంది. ప్రస్తుతం 70 మంది సభ్యులున్న ఉత్తరాఖండ్ అసెంబ్లీలో స్పీకర్ సస్పెన్సన్ నిర్ణయంతో ఆ సంఖ్య 61 పడిపోయింది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి 27 మంది సభ్యులుండగా, మరో ఆరుగురు సభ్యుల అండ కూడా రావత్ ప్రభుత్వానికి ఉంది. దీంతో 33 మంది సభ్యుల బలంతో రావత్ సర్కార్ విశ్వాస పరీక్షలో బలనిరూపణ చేసుకుంటుంది. ఈ నేపథ్యంలో మోదీ సర్కారు రాష్ట్రపతి పాలన కోసం శతవిధాలా ప్రయత్నించి తమ పంతం నెగ్గించుకుంది. -
కాంగ్రెస్ను కాపీ కొడుతున్న బీజేపీ
డెహ్రాడూన్: ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ర్ట ప్రభుత్వాలను తమ తైనాతీలైన గవర్నర్లను ఉపయోగించి పడగొట్టడం కాంగ్రెస్ పార్టీకి అలవాటే. ఇప్పుడు అదే అలవాటును కేంద్రంలో అధికారంలోవున్న భారతీయ జనతా పార్టీ పుణికి పుచ్చుకుంది. అరుణాచల్ ప్రదేశ్లోని కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలోని ప్రభుత్వాన్ని పడగొట్టడంలో విజయం సాధించిన బీజేపీ మణిపూర్లో అధికారాన్ని కైవసం చేసుకునేందుకు ఎప్పటి నుంచో ప్రయత్నిస్తోంది. ప్రస్తుతం ఉత్తరఖండ్పై దృష్టిని సారించింది. కాంగ్రెస్కు చెందిన తిరుగుబాటు ఎమ్మెల్యేల సహకారంతో రాష్ట్రంలో పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు బీజేపీ పావులు కదుపుతోంది. అందులో భాగంగానే 35 మంది బీజేపీ ఎమ్మెల్యేలు, తొమ్మిది మంది కాంగ్రెస్ తిరుగుబాటు ఎమ్మెల్యేలతో కలసి సోమవారం ఢిల్లీలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలసుకున్నారు. హరీష్ రావత్ నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మైనారిటీలో పడిపోయిందని ఫిర్యాదు చేశారు. మార్చి 28వ తేదీన విశ్వాస పరీక్షను ఎదుర్కోవాల్సిందిగా రావత్కు ఆదేశాలు జారీ అయ్యాయి. దెబ్బకు దెబ్బ తీయాలనే ఉద్దేశంతో రావత్ తిరుగుబాటు రాజకీయాలను నెరపుతున్న నేతలను సభ నుంచి సస్పెండ్ చేశారు. పార్టీ ఫిరాయింపుల కింద వారిని అనర్హులుగా ప్రకటించాలని కూడా సభాపతిని కోరారు. మాజీ ముఖ్యమంత్రి విజయ్ బహుగుణ, సీనియర్ నాయకుడు హరక్ సింగ్ రావత్, బహుగుణ కుమారుడు సాకేత్, కాంగ్రెస్ పార్టీ సంయుక్త కార్యదర్శి అనిల్ గుప్తా సహా తిరుగుబాటు ఎమ్మెల్యేలందరికి అనర్హత నోటీసులు జారీ అయ్యాయి. ఈ పరిణామాల నేపథ్యంలో రాష్ట్రంలో రావత్ ప్రభుత్వం బల పరీక్షలో ఓడిపోతుందా? ఓడిపోతే బీజేపీ అధికారంలోకి వస్తుందా? వస్తే ఎవరు ముఖ్యమంత్రి అవుతారు అన్న అంశాలపై రాజకీయ చర్చలు కొనసాగుతున్నాయి. రావత్ బల పరీక్షలో నెగ్గేందుకు బీజేపీ అసమ్మతి ఎమ్మెల్యేలను దువ్వుతున్నారు. వారి మద్దతుతో రావత్ బల పరీక్ష నెగ్గినట్లయితే వెంటనే అసెంబ్లీని రద్దు చేస్తారు. ఆ వెంటనే ఎన్నికలను కోరుకుంటారు. ఎలాగు ఎన్నికలు మరో ఏడాదిలో జరగాల్సి ఉంది. అలా కాకుండా బల పరీక్షలో రావత్ ఓటమి పాలైతే కాంగ్రెస్ పార్టీ తిరుగుబాటు సభ్యుల మద్దతుతో బీజేపీ అధికారంలోకి వస్తుంది. మరీ అప్పుడు ముఖ్యమంత్రి పదవిని కాంగ్రెస్ తిరుగుబాటు నాయకులకు కట్టబెడతారా, లేక పార్టీకి చెందిన నాయకులకు అప్పగిస్తారా? అన్న అంశం తెర ముందుకు వస్తుంది. కాంగ్రెస్ తిరుగుబాటు నాయకుల్లో విజయ్ బహుగుణ, హరక్ సింగ్ రావత్లు ఉన్నారు. కానీ వారికి మంచి ఇమేజ్ లేదు. 2013లో రాష్ట్రాన్ని వరదలు ముంచెత్తినప్పుడు ప్రాణ, ఆస్తి నష్టాలను నివారించడంలో ఘోరంగా విఫలమయ్యారన్న కారణంగా బహుగుణ ముఖ్యమంత్రి పదవిని కోల్పోయారు. ఆయన స్థానంలోనే రావత్ ముఖ్యమంత్రిగా వచ్చారు.హరక్ సింగ్ రావత్ అంత పాపులర్ లీడర్ కాకపోవడమే కాకుండా సెక్స్ కుంభకోణంలో ఇరుక్కుని అభాసుపాలయ్యారు. బీజేపీకి సొంత పార్టీలోనూ చరిస్మాటిక్ నాయకుడు లేరు. ఉన్న హైప్రోఫైల్ లీడర్ బీసీ ఖండూరికి 85 ఏళ్లు. ఆయన ముఖ్యమంత్రిగా ఉండి కూడా 2012 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారు. వయోభారం కారణంగా ఆయన సీఎం బాధ్యతలను నిర్వహించలేరు. ఏదేమైనా ఎన్నికలు జరిగే వరకు రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన తప్పదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. -
అరుణాచల్ లో ప్రభుత్వ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్
న్యూఢిల్లీ: రాజకీయ సంక్షోభం బారిన అరుణాచల్ ప్రదేశ్ లో ప్రభుత్వ ఏర్పాటుకు అడ్డంకులు తొలిగిపోయాయి. అరుణాచల్ లో రాష్ట్రపతి పాలనపై విధించిన స్టేటస్ కోను సుప్రీంకోర్టు గురువారం ఎత్తివేసింది. కొత్త ప్రభుత్వం చేత ప్రమాణ స్వీకారం చేయించకుండా గవర్నర్ను నియంత్రించటంతో పాటు యథాతథ స్థితిని కొనసాగిస్తూ ఆదేశాలు జారీ చేయాలన్న కాంగ్రెస్ అభ్యర్థనను అత్యున్నత న్యాయస్థానం నిన్న తిరస్కరించింది. రాష్ట్రపతి పాలనను ఉపసంహరించాలని రాష్ట్రపతికి కేంద్ర కేబినెట్ బుధవారం సిఫారసు చేసింది. కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు తమకు మెజారిటీ ఉందని కాంగ్రెస్ అసమ్మతి నేత పుల్ సారథ్యంలోని 31 మంది ఎమ్మెల్యేలు సోమవారం గవర్నర్ను కలిశారు. 60 మంది సభ్యులున్న అరుణాచల్ అసెంబ్లీలో కాంగ్రెస్కు 47 మంది సభ్యులుండగా.. అసమ్మతి నేత కాలిఖోపుల్ సారథ్యంలో 21 మంది అధికార పార్టీ ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేయటం తెలిసిందే. నబమ్ టుకీ సీఎంగా గల ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు తిరుగుబాటు ఎమ్మెల్యేలకు 11 మంది బీజేపీ ఎమ్మెల్యేలు, ఇద్దరు స్వతంత్ర సభ్యులు మద్దతిచ్చారు. -
అరుణాచల్ లో తొలగనున్న రాజకీయ సంక్షోభం
ఢిల్లీ: అరుణాచల్ ప్రదేశ్ లో నెలకొన్న రాజకీయ అనిశ్చితి తొలగిపోయే సూచనలు కన్పిస్తున్నాయి. రాష్ట్రపతి పాలన ఎత్తివేయాలని కేంద్ర కేబినెట్ సిఫారసు చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. రాజకీయ సంక్షోభం నేపథ్యంలో అరుణాచల్ప్రదేశ్లో గతనెల రాష్ట్రపతి పాలన విధించారు. కేబినెట్ ప్రతిపాదనకు రాష్ట్రపతి ఆమోదముద్ర వేస్తే రాష్ట్రపతి పాలన ముగుస్తుంది. రాష్ట్రపతి పాలన అమలులో ఉన్న అరుణాచల్ ప్రదేశ్లో కొత్త ప్రభుత్వం బాధ్యతలు స్వీకరించకుండా గవర్నర్ జేపీ రాజ్ఖోవాకు మధ్యంతర ఆదేశాలివ్వాలంటూ కాంగ్రెస్ రాష్ట్ర నేతలు దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు నేడు తోసిపుచ్చింది. మరోవైపు ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమని కాంగ్రెస్ అసమ్మతి నేత కాలిఖొ పాల్ ప్రకటించారు. కాంగ్రెస్ పాలనలో ఉన్న అరుణాచల్లో సీఎం నబమ్ టుకీపై అసంతృప్తితో 21మంది ఎమ్మెల్యేలు డిసెంబర్ 16న తిరుగుబాటు చేశారు. 11 మంది ఎమ్మెల్యేలున్న బీజేపీ.. కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేలతో కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనుకుంది. గతేడాది డిసెంబర్ 16, 17 తేదీల్లో రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు హోటల్లో జరిగాయి. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీలోని అసమ్మతి ఎమ్మెల్యేలు, బీజేపీ ఎమ్మెల్యేలు ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. 60 మంది ఎమ్మెల్యేలు గల ఆ రాష్ట్ర అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీకి 47 సీట్లు ఉన్నాయి. అయితే ముఖ్యమంత్రి నబమ్ టుకీకి కేవలం 26 మంది ఎమ్మెల్యేలు మాత్రమే మద్దతు ఇస్తున్నారు. -
'రాష్ట్రపతి పాలన పెట్టాలనుకుంటున్నారు'
న్యూఢిల్లీ: ఢిల్లీలో రాష్ట్రపతి పాలన విధించేందుకు ప్రధాని నరేంద్రమోదీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆమ్ఆద్మీపార్టీ అధినేత, ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. అలా విధించేందుకు ఢిల్లీలో మున్సిపల్ కార్మికుల సమ్మెను సాకుగా ఉపయోగించుకోవాలనుకుంటుందని చెప్పారు. చాలా రోజులుగా వేతనాల చెల్లింపుల కోసం బీజేపీ పాలిత మున్సిపల్ కార్పొరేషన్లకు చెందిన కార్మికులు రోడ్డెక్కి ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. వీరు తమ విధులను పక్కకు పెట్టడంతో ఢిల్లీలో చెత్త పేరుకుపోయింది. ఫలితంగా ఆప్ మంత్రులే ఈ మధ్య మున్సిపల్ కార్మికుల అవతారం ఎత్తి వీధులు శుభ్రం చేస్తున్నారు. ఈ సందర్భంగా కేజ్రీవాల్ బుధవారం మీడియాతో మాట్లాడుతూ 'మోదీ ప్రభుత్వం ఢిల్లీలో కూడా అరుణాచల్ ప్రదేశ్లో మాదిరిగా రాష్ట్రపతి పాలన విధించాలని అనుకుంటుంది' అని కేజ్రీవాల్ అన్నారు. బీజేపీ ఆధ్వర్యంలో ఉన్న పలు శాఖల్లో భారీ అవినీతి చోటుచేసుకుందని, తమ ప్రభుత్వం మున్సిపల్ కార్మికులకు ఎలాంటి బాకీ లేదని, వారి జీతభత్యాలు తాము చెల్లిస్తునే ఉన్నామని అన్నారు. -
గవర్నర్కు నోటీసు ఇవ్వడం పొరపాటే
అరుణాచల్ గవర్నర్కు నోటీసును వాపసు తీసుకున్న సుప్రీంకోర్టు న్యూఢిల్లీ: అరుణాచల్ప్రదేశ్లో రాష్ట్రపతి పాలన విధించటంపై నమోదైన కేసుల్లో.. ఆ రాష్ట్ర గవర్నర్కు తాము నోటీసు జారీ చేయటం పొరపాటని సుప్రీంకోర్టు సోమవారం అంగీకరించింది. రాజ్యాంగంలోని 361వ అధికరణం ప్రకారం ప్రకారం కోర్టు విచారణల నుంచి గవర్నర్కు పూర్తి మినహాయింపు (ఇమ్యూనిటీ) ఉంటుందన్న విషయాన్ని.. దీనికి సంబంధించి గతంలో తానే ఇచ్చిన ఆదేశాలను పరిగణనలోకి తీసుకున్న సుప్రీంకోర్టు.. అరుణాచల్ గవర్నర్ జ్యోతిప్రసాద్ రాజ్ఖోవాకు జనవరి 28వ తేదీన జారీ చేసిన నోటీసును ఉపసంహరించుకుంది. ఈ ఉత్తర్వులు గవర్నర్ తన అభిప్రాయాలను కోర్టుకు సమర్పించకుండా నిరోధించబోవని జస్టిస్ జె.ఎస్.ఖేహర్ సారథ్యంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం స్పష్టం చేసింది. ఇదిలావుంటే.. రాష్ట్రపతి పాలనను సవాల్ చేస్తూ అరుణాచల్ మాజీ సీఎం నబమ్ టుకి, కాంగ్రెస్ నేత బమాంగ్ ఫెలిక్స్లు కొత్తగా వేసిన పిటిషన్లపై ధర్మాసనం కేంద్ర ప్రభుత్వానికి తాజా నోటీసులు జారీ చేసింది. బీజేపీకి మద్దతిచ్చే ప్రశ్నే లేదు: కాంగ్రెస్ తిరుగుబాటు ఎమ్మెల్యేలు మరోవైపు కాంగ్రెస్ తిరుగుబాటు ఎమ్మెల్యేలు.. తాము బీజేపీకి మద్దతిచ్చే ప్రశ్నే లేదని.. ముఖ్యమంత్రిగా నబమ్టుకీని తొలగిస్తే, తిరిగి కాంగ్రెస్సే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవచ్చని స్పష్టం చేశారు. నేనెవరికీ ఏజెంటును కాను: గవర్నర్ ఈటానగర్: బీజేపీ, ఆర్ఎస్ఎస్లకు ప్రధాన కార్యాలయంగా రాజ్భవన్ను ఉపయోగించుకుంటున్నానంటూ తనపై వచ్చిన ఆరోపణను గవర్నర్ జె.పి.రాజ్ఖోవా ఖండిస్తూ.. తాను రాజ్యాంగ పరిధిలోనే పనిచేస్తున్నానని పేర్కొన్నారు. గవర్నర్ పక్షపాతపూరితంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణల గురించి సోమవారం ఇటానగర్లో మీడియాతో మాట్లాడిన రాజ్ఖోవా వద్ద ప్రస్తావించగా.. ‘‘నేను రాజకీయేతర వ్యక్తిని. రాజ్భవన్ను రాజకీయ పార్టీల కార్యాలయం లాగా ఎన్నడూ వినియోగించలేదు. ఏ రాజకీయ పార్టీలకూ నేను అనుకూలంగా లేను. నేను ఎవరికీ ఏజెంటును కాను’’ అని ఆయన బదులిచ్చారు. -
అరుణాచల్ ప్రదేశ్లో రాష్ట్రపతి పాలన
-
దేశవిదేశాల్లో అంగరంగ వైభవంగా
లండన్/న్యూఢిల్లీ: భారత 67వ గణతంత్ర వేడుకలు దేశంలోని వివిధ రాష్ట్రాల్లోనే కాకుండా, విదేశాల్లోనూ ఘనంగా జరిగాయి. రాష్ట్రాల రాజధానుల్లో ఆయా రాష్ట్రాల గవర్నర్లు జాతీయ పతాకాలు ఎగురవేశారు. రాష్ట్రపతి పాలనలో ఉన్న జమ్మూకశ్మీర్లో గవర్నర్ ఎన్ఎన్ వోహ్రా జమ్మూలోని ఎంఏ స్టేడియంలో జరిగిన గణతంత్ర వేడుకల్లో పాల్గొన్నారు. రాష్ట్రంలోని నియంత్రణ రేఖ వద్ద 3 చోట్ల భారత్, పాక్ సైనికులు మిఠాయిలను పంచుకున్నారు. ముంబై శివాజీ పార్క్లో జరిగిన గణతంత్ర వేడుకల్లో మహారాష్ట్ర గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావు పాల్గొన్నారు. మరోవైపు విశ్వవ్యాప్తంగా ఉన్న భారతీయులు ఘనంగా గణతంత్ర వేడుకలు జరుపుకున్నారు. పలు దేశాల్లో ఎంబసీల వద్ద జాతీయ పతాకాలను ఎగురవేశారు.లండన్లో ఇండియన్ హై కమిషనర్ నవతేజ్ సర్నా జెండా వందనం చేశారు. రిపబ్లిక్ డేసందర్భంగా నేపాల్కు భారత్ 40 అంబులెన్స్లను, 8 బస్సులను బహూకరించింది. ఆస్ట్రేలియాలో ఆ దేశ జాతీయ దినోత్సవం ఆస్ట్రేలియా డే’ కూడా జనవరి 26వ తేదీనే కావడం విశేషం. కాన్బెర్రా, సిడ్నీ, మెల్బోర్న్ సహా ఆస్ట్రేలియాలోని పలు నగరాల్లో జరిగిన గణతంత్ర వేడుకలో భారతీయులు ఉత్సాహంగా పాల్గొన్నారు. థాయ్లాండ్, వియత్నాం సహా పలు దేశాల్లో జరిగిన భారత గణతంత్ర వేడుకలకు వణికిస్తున్న చలిని కూడా లెక్కచేయకుండా స్థానిక భారతీయులతో పాటు ఆయా దేశస్తులు ఉత్సాహంగా హాజరయ్యారు. శ్రీలంక, కంబోడియా, ఇండోనేసియా.. తదితర దేశాల్లో వేడుకలు జరిగాయి. -
అరుణాచల్ ప్రదేశ్లో రాష్ట్రపతి పాలన
- రాష్ట్రపతికి కేంద్ర కేబినెట్ సిఫారసు - కేంద్ర కేబినెట్ నిర్ణయాన్ని ఆమోదించిన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ న్యూఢిల్లీ: అరుణాచల్ప్రదేశ్లో రాష్ట్రపతి పాలనకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోదం తెలిపారు. రాజకీయ సంక్షోభం నేపథ్యంలో అరుణాచల్ప్రదేశ్లో రాష్ట్రపతి పాలన విధించాలని కేంద్ర కేబినెట్ సిఫార్సు మేరకు మంగళవారం ప్రణబ్ కేంద్ర కేబినెట్ నిర్ణయాన్ని ఆమోదించారు. అరుణాచల్ప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీని రద్దు చేసే కంటే.... దానిని సుప్తచేతనావస్థలో ఉంచి... రాష్ట్రపతి పాలన వైపే కేంద్రమంత్రి వర్గం ఇటీవల నిర్ణయించింది. కాంగ్రెస్ పాలనలో ఉన్న అరుణాచల్లో సీఎం నబమ్ టుకీపై అసంతృప్తితో 21మంది ఎమ్మెల్యేలు డిసెంబర్ 16న తిరుగుబాటు చేశారు. 11 మంది ఎమ్మెల్యేలున్న బీజేపీ.. కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేలతో కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనుకుంది. గతేడాది డిసెంబర్ 16, 17 తేదీల్లో రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు హోటల్లో జరిగాయి. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీలోని అసమ్మతి ఎమ్మెల్యేలు, బీజేపీ ఎమ్మెల్యేలు ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. 60 మంది ఎమ్మెల్యేలు గల ఆ రాష్ట్ర అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీకి 47 సీట్లు ఉన్నాయి. అయితే ముఖ్యమంత్రి నబమ్ టుకీకి కేవలం 26 మంది ఎమ్మెల్యేలు మాత్రమే మద్దతు ఇస్తున్నారు. -
రాష్ట్రపతి పర్యటన ప్రతిపక్షాలకు చెప్పొద్దా?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రపతి రాష్ట్ర పర్యటనకు వస్తున్నప్పుడు ప్రతిపక్షాలకు చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వంపై లేదా అని శాసనమండలిలో కాంగ్రెస్ ఉపనాయకుడు పొంగులేటి సుధాకర్ రెడ్డి ప్రశ్నించారు. అసెంబ్లీ ఆవరణలో సోమవారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ ప్రజా ప్రతినిధులకు సమాచారం ఇవ్వాల్సిన బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం విస్మరించిందని విమర్శించారు. ప్రజల నుంచి ఎన్నికైన ప్రజా ప్రతినిధులకు సమాచారం ఇవ్వకుండా అవమానించడం దారుణమన్నారు. రాష్ట్ర ప్రభుత్వ తీరుపై సభాహక్కుల ఉల్లంఘన కమిటీకి ఫిర్యాదు చేస్తామని చెప్పారు. ఓటుకు నోటు, సెక్షన్ 8 వంటివాటిని రాష్ట్రపతి దృష్టికి తీసుకుపోతామని చెప్పారు. రాజకీయ అవినీతికి పాల్పడిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై చర్యలు తీసుకోవాలని కోరనున్నట్టుగా సుధాకర్ రెడ్డి వెల్లడించారు. -
రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలి
రాజమండ్రి సిటీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏడాది పాలన తుగ్లక్ పాలనను మించిందని మాజీ ఎంపీ జి.వి.హర్షకుమార్ విమర్శించారు. కేంద్రం జోక్యం చేసుకుని రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేశారు. సోమవారం రాజమండ్రి ప్రెస్క్లబ్లో విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణ , ఆంధ్రప్రదేశ్ల వివాదాలు చూస్తుంటే భారతదేశంలోనే ఉన్నామా అనే అనుమానం వస్తోందన్నారు. ఇద్దరు వ్యక్తుల మధ్య వివాదాన్ని రెండు రాష్ర్టాల మధ్య వివాదంగా మార్చేస్తున్నారన్నారు. రెండు రాష్ర్టాలలో పాలనపై దృష్టి పెట్టాల్సిన గవర్నర్ గుళ్లుగోపురాలకు తిరుగుతూ కళ్లు మూసుకున్నారని విమర్శించారు. ఆయనను తక్షణమే మార్చాలని డిమాండ్ చేశారు. ప్రత్యేక హోదావల్లే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. తాను ఏ పార్టీలోనూ లేకుండా స్వతంత్రునిగా ఉన్నానన్నారు. రాజమండ్రిలో ఎస్సీ భూముల వివాదంపై సిటింగ్ జడ్జితో విచారణ జరిపించి న్యాయం చేయాలన్నారు. -
విశ్వాసం నెగ్గుతాం.. రాష్ట్రపతి పాలన ఉండదు
తమ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించే ప్రసక్తే లేదని బీహార్ ముఖ్యమంత్రి జితన్ రామ్ మాంఝీ అన్నారు. తప్పుకుండా విశ్వాస పరీక్షలో నెగ్గితీరుతామని చెప్పారు. బీజేపీతో చేతులు కలిపి రాష్ట్రపతి పాలనకు తాను ప్రయత్నిస్తున్నాని మాజీ సీఎం నితీష్కుమార్ చేసిన వ్యాఖ్యలు అవాస్తవమని చెప్పారు. ఆయన అనవసరపు వదంతులతో పార్టీ ఎమ్మెల్యేలను భయాందోళనలకు గురిచేస్తున్నారన్నారు. ఢిల్లీలో సోమవారం పలువురు కేంద్రమంత్రులను, బీహార్ గవర్నర్ను కలిసిన అనంతరం మాంఝీ మీడియాతో మాట్లాడారు. తమ సర్కారుకు మద్దతు ఇవ్వాలా.. లేదా అన్న విషయంలో బీజేపీ సొంతంగా నిర్ణయం తీసుకుంటుందన్నారు. రాష్ట్రపతి పాలన తీసుకురావాలన్న ఉద్దేశం తనకు లేదని, ఫిబ్రవరి 20న జరిగే విశ్వాస పరీక్షలో నెగ్గి తీరుతానని ధీమా వ్యక్తం చేశారు. తనకు మద్దతివ్వాల్సిందిగా అన్ని పార్టీలను కోరినట్లు చెప్పారు. నితీష్ వద్ద ఉన్న ఎమ్మెల్యేలంతా బోగస్ అన్నారు. -
ఉత్తమ వర్సిటీగా హెచ్సీయూకు అవార్డు
న్యూఢిల్లీ: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ(హెచ్సీయూ) ‘ఉత్తమ విశ్వవిద్యాలయం’ విభాగంలో విజిటర్స్ అవార్డుకు ఎంపికైంది. ఈ మేరకు గురువారం రాష్ట్రపతి భవన్ ఒక ప్రకటనలో తెలిపింది. కేంద్రీయ విశ్వవిద్యాలయాలకు సందర్శకునిగా వ్యవహరిస్తున్న రాష్ట్రపతి ‘ఉత్తమ విశ్వవిద్యాలయం’, ‘నవీకరణ’, ‘పరిశోధన’ విభాగాలలో వాటికి విజిటర్స్ అవార్డులు అందజేస్తారు. తక్కువ సమయంలోనే టీబీ నిర్ధారణ చేసే పరీక్షను కనుగొన్న ఢిల్లీ వర్సిటీకి చెందిన ప్రొఫెసర్లు విజయ్ కే చౌదరి, డా.అమితా గుప్తాలకు ‘నవీకరణ’ విభాగంలో ఈ అవార్డు దక్కింది. అలాగే ‘పరిశోధన’ విభాగంలో జామియా మిలియా ఇస్లామియా విశ్వవిద్యాలయంలోని కాస్మోలజీ, ఆస్ట్రోఫిజిక్స్ రీసెర్చ్ గ్రూపు దీనికి ఎంపికైంది. ఈ అవార్డులను రాష్ట్రపతి భవన్లో వచ్చే నెల 4, 5 తేదీల్లో నిర్వహించనున్న కేంద్రీయ విశ్వవిద్యాలయాల వైస్ చాన్స్లర్ల మూడో సమ్మేళనంలో రాష్ట్రపతి ప్రదానం చేయనున్నారు. వర్సిటీని విజిటర్స్ అవార్డుకు ఎంపిక చేయ డం హర్షణీయమని, ఈ అవార్డుతో వర్సిటీ ప్రతిష్ట మాత్రమే కాదు.. బాధ్యత కూడా మరింత పెరిగిందని హెచ్సీయూ వీసీ ఈ.హరిబాబు పేర్కొన్నారు. -
రాష్ట్రపతి పాలన తప్పదా?
జమ్ము కశ్మీర్ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన తప్పేలా లేదు. ఆ రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు ప్రస్తుతం ఉన్న పరిస్థితులపై గవర్నర్ ఓహ్రా కేంద్ర ప్రభుత్వానికి ఓ నివేదిక సమర్పించారు. అత్యధిక స్థానాలు సాధించిన పీడీపీ, ఆ తర్వాతి స్థానంలో ఉన్న బీజేపీల మధ్య ఇంకా ప్రభుత్వ ఏర్పాటుపై ఎలాంటి అవగాహన కుదరని విషయం తెలిసిందే. తాత్కాలిక ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించేందుకు మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా విముఖత వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ ఇక్కడ ప్రభుత్వ ఏర్పాటుకు అనుకూలించే పరిస్థితులు లేకపోతే.. రాష్ట్రపతి పాలన విధించాలని గవర్నర్ ఓహ్రా సిఫార్సు చేసినట్లు తెలుస్తోంది. -
దమ్ముంటే రాష్ట్రపతి పాలన విధించండి!
-
దమ్ముంటే రాష్ట్రపతి పాలన విధించండి: మమత
పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీకి ఆగ్రహం వచ్చినా, అనుగ్రహం వచ్చినా పట్టడం కష్టమే. తాజాగా ఆమెకు కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం మీద ఎక్కడలేని కోపం వచ్చింది. సెక్యులరిజం మీద ఏర్పాటైన సదస్సుకు హాజరుకావడం వల్లే తమ పార్టీ ఎంపీ శ్రింజయ్ బోస్ను అరెస్టు చేశారని ఆమె ఆరోపించారు. ఇలాంటి సదస్సులకు వేలసార్లు తాను హాజరవుతానని స్పష్టం చేశారు. దమ్ముంటే పశ్చిమబెంగాల్లో రాష్ట్రపతి పాలన విధించాలని మమత సవాలు చేశారు. తమపై దాడి చేయడానికి ప్రయత్నిస్తే తాము ప్రతిఘటిస్తామని, అన్ని రకాల సవాళ్లను ఎదుర్కోడానికి తాను సిద్ధమని సవాలు చేశారు. ఇక సీబీఐ తీరుపై కూడా మమతాబెనర్జీ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. గడిచిన ఆరు నెలల్లో దేశవ్యాప్తంగా అనేక అల్లర్లు జరిగాయన్నారు. ఈ దేశాన్ని నడపడం అంత సులభం కాదంటూ బీజేపీకి కూడా హెచ్చరిక జారీ చేశారు. -
ఢిల్లీలో ఎన్నికలకే బీజేపీ మొగ్గు?
న్యూఢిల్లీ : ఢిల్లీలో ఎన్నికలకే ప్రధాని నరేంద్ర మోడీ మొగ్గు చూపుతున్నట్లు బీజేపీ వర్గాలు వెల్లడించాయి. ఇతరుల మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేసే బదులు సొంతంగా బలం తెచ్చుకొని ప్రభుత్వం ఏర్పాటు చేస్తేనే బాగుంటుందని మోదీ అభిప్రాయపడుతున్నట్లు బీజేపీ నేతలు మీడియాకు తెలిపారు. ప్రస్తుతం పరిస్థితి ఆశావహంగా ఉండడం, ప్రజల్లో వ్యతిరేకత ఏర్పడకపోవడం తదితర పరిణామాలను అనుకూలంగా మార్చుకోవాలనేది మోదీ వ్యూహాంగా కనిపిస్తోంది. దాంతో ఢిల్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటుకు మేము సుముఖంగా లేము అని బీజేపీ నేతలు సోమవారం లెప్ట్నెంట్ గవర్నర్తో అన్నట్లు సమాచారం. కాగా రాష్ట్రపతి పాలనలో ఉన్న ఢిల్లీలో ప్రభుత్వ ఏర్పాటుపై దృష్టి పెట్టాలంటూ గత వారం సుప్రీంకోర్టు సూచించిన విషయం తెలిసిందే. కోర్టు సూచనలతో లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ పార్టీలతో చర్చలు చేపట్టారు. మైనార్టీ ప్రభుత్వాన్ని అయినా ఏర్పాటు చేయాలంటూ కోర్టు సూచించడంతో అందరూ బీజేపీకి అవకాశం లభిస్తుందని అనుకున్నా.... కమలదళం కూడా మొదట్లో ఆ దిశగా ప్రయత్నించింది. అయితే మోదీ మాత్రం ఎన్నికలకే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. -
అగ్నిగుండంగా మారుతున్న తమిళనాడు: స్వామి
తమిళనాడు అగ్నిగుండంగా మారుతోందని, అందువల్ల అక్కడ రెండు నెలల పాటు రాష్ట్రపతి పాలన విధించాలని కేంద్ర ప్రభుత్వాన్ని బీజేపీ నాయకుడు సుబ్రమణ్యస్వామి కోరారు. అక్రమాస్తుల కేసులో జయలలితను జైల్లో పెట్టడంతో అన్నాడీఎంకే వర్గాలు తీవ్ర ఆగ్రహానికి గురై బస్సులను తగలబెట్టడం లాంటి సంఘటనలు జరుగుతున్న నేపథ్యంలో ఆయనిలా అన్నారు. మరోవైపు తమిళనాడుకు వెళ్లాల్సిన ప్రయాణికులు తీవ్ర అవస్థల పాలవుతున్నారు. తిరుపతి నుంచి చెన్నైకి బస్సులు నడపలేమంటూ ఆర్టీసీ అధికారులు చేతులెత్తేశారు. దాంతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోలేక ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. ఇదే అదనుగా భావించి ప్రైవేటు ట్రావెల్స్ వాళ్లు అధిక రేట్లు వసూలు చేస్తున్నారు. -
మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధింపు
-
మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధింపు
న్యూఢిల్లీ: మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించారు. మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధింపునకు కేంద్ర మంత్రివర్గం శనివారం చేసిన సిఫార్సుకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆదివారం ఆమోదముద్ర వేశారు. ముఖ్యమంత్రి పదవికి పృథ్వీరాజ్ చవాన్ రాజీనామా చేయడంతో రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం తలెత్తంది. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకోవడంతో చవాన్ శుక్రవారం ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. కాగా, వచ్చే నెల 15న మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. నామినేషన్ల పర్వం శనివారంతో ముగిసింది. -
‘ప్రజా’పాలన షురూ
ఏలూరు (ఆర్ఆర్ పేట), న్యూస్లైన్ : ఆం ధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం కొలువుతీరడంతో ఆరు నెలలుగా కొనసాగుతున్న రాష్ట్రపతి పాలనకు తెరపడింది. ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబునాయుడు, కేబినెట్ మంత్రులు ప్రమాణ స్వీకారం చేయడంతో ప్రజాపాలన మొదలు కానుంది. దీంతో పాలన గాడిన పడనుంది. కొత్త ప్రజాప్రతినిధులు ఎప్పుడు వచ్చి తమ సమస్యలు పరిష్కరిస్తారని ఆశగా ఎదురుచూసిన జిల్లా ప్రజల కోరిక నెరవేరనుంది. గతేడాది రాష్ట్ర విభజన పరిణామాలతో ఆరు నెలలకు పైగా పాలన స్తంభించగా ప్రజలు ఇబ్బంది పడ్డారు. మరలా ఈ ఏడాదిలో ప్రాదేశిక, మునిసిపల్, సార్వత్రిక ఎన్నికల నిర్వహణ కారణంగా గత మూడు నెలలుగా ప్రజలకు పూర్తిస్థాయిలో అధికారులు అందుబాటులో లేకుండా పోయారు. దీంతో పలు కార్యక్రమాలు నిలిచి ప్రజలు అవస్థలు పడ్డారు. ఈ నేపథ్యంలో ఆదివారం ప్రభుత్వం కొలువు తీరడంతో తమ సమస్యలను పరిష్కరించే నాథులు కనిపించారనే ఆనందంలో ప్రజలు ఉన్నారు. మంత్రులదే అభివృద్ధి బాధ్యత రాష్ట్ర కేబినెట్లో జిల్లాకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు కేటాయించడంతో జిల్లాలో అభివృద్ధిపై ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కాగా రాష్ట్ర విభజన అనంతరం పదవి చేపడుతున్న నూతన ప్రభుత్వానికి ఎదురుకానున్న సవాళ్లకు జిల్లా మంత్రులు ఏవిధంగా స్పందిస్తారోనని ఎదురుచూస్తున్నారు. జిల్లాకు సమీపంలోని విజయవాడ-గుంటూరు మధ్య రాష్ట్ర రాజధాని ఏర్పాటులో జిల్లా మంత్రులు తమ వాణిని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి వినిపించి ఆ మేరకు సఫలీకృతం కావాలని కోరుకుంటున్నారు. త ద్వారా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడంలో జిల్లా మంత్రులు కీలక పాత్ర పోషిస్తారనే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. -
'యూపీలో రాష్ట్రపతి పాలన విధించాల్సిందే'
ఉత్తరప్రదేశ్లో వరుసపెట్టి జరుగుతున్న అత్యాచారాలు, హత్యలను చూస్తుంటే అక్కడ పరిపాలన పూర్తిగా స్తంభించిందని, అందువల్ల రాష్ట్రపతి పాలన విధించడానికి అనువైన పరిస్థితులన్నీ అక్కడ ఉన్నాయని కేంద్ర హోం శాఖ మాజీ కార్యదర్శి, బీజేపీ ఎంపీ ఆర్కే సింగ్ అన్నారు. అక్కడి ప్రభుత్వం విఫలమైందని, శాంతిభద్రతలు అన్నవే లేవని, హత్యలు, అత్యాచారాలు సర్వసాధారణం అయిపోయాయని సింగ్ చెప్పారు. అందుకే అక్కడ రాష్ట్రపతి పాలన విధించాలని అన్నారు. రాష్ట్ర పరిపాలనలోని ప్రతి విభాగంలోను రాజకీయ జోక్యం బాగా ఎక్కువైపోయిందని, ముఖ్యంగా పోలీసు విభాగంలోనూ రాజకీయ జోక్యం ఉండటంతో పాలన కుప్పకూలిందని సింగ్ విశ్లేషించారు. అలీగఢ్లో ఓ మహిళా జడ్జిపై అత్యాచారం, హత్య సంఘటనను ఆయన ప్రస్తావిస్తూ, చివరకు జడ్జికి కూడా.. తన సొంతింట్లోనూ రక్షణ లేదని, ఇలాగైతే ఎలాగని ప్రశ్నించారు. -
తెలంగాణలో 2 వరకే రాష్ట్రపతి పాలన.. ఆంధ్రాలో కొనసాగింపు
-
తెలంగాణలో 2 వరకే రాష్ట్రపతి పాలన.. ఆంధ్రాలో కొనసాగింపు
తెలంగాణలో జూన్ రెండో తేదీతో రాష్ట్రపతి పాలన ముగుస్తోంది. అయితే ఆంధ్రప్రదేశ్లో మాత్రం తర్వాత కూడా కొనసాగనుంది. రెండో తేదీనే ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయాలని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిర్ణయించుకోవడం, 8వ తేదీ వరకు ఆగాలని చంద్రబాబు భావించడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. అపాయింటెడ్ డే అయిన జూన్ రెండోతేదీన రాష్ట్ర విభజన సజావుగా సాగేందుకు అటు కేంద్ర హోం మంత్రిత్వ శాఖలోను, ఇటు ఆంధ్రప్రదేశ్లోను ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. తెలంగాణలో రాష్ట్రపతి పాలనను ఎత్తేస్తూ జూన్ రెండోతేదీనే నోటిఫికేషన్ రావచ్చు. అప్పుడే కేసీఆర్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసేందుకు వీలవుతుంది. ముఖ్యమంత్రి పదవికి కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామా చేసిన తర్వాత మార్చి ఒకటో తేదీ నుంచి రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించారు. రాష్ట్రపతి పాలనలో ఉండగానే ఉమ్మడి రాష్ట్రంలో ఎన్నికలు జరిగాయి. తెలంగాణలో టీఆర్ఎస్, ఆంధ్రప్రదేశ్లో టీడీపీ అధికారంలోకి వచ్చాయి. తెలంగాణ రాష్ట్రానికి కూడా గవర్నర్గా ప్రస్తుత గవర్న్రర్ ఈఎస్ఎల్ నరసింహన్ వ్యవహరించనున్నారు. -
ప్రస్తుత చార్జీలనే కొనసాగించండి!
ఈఆర్సీకి ఇంధన శాఖ లేఖ సాక్షి, హైదరాబాద్: ప్రస్తుతమున్న విద్యుత్ చార్జీలనే కొనసాగించాలని రాష్ర్ట విద్యుత్ నియంత్రణ మండలి(ఏపీఈఆర్సీ)ని ఇంధన శాఖ కోరింది. ఈ మేరకు ఆ శాఖ ప్రత్యేక కార్యదర్శి మంగళవారం లేఖ రాశారు. రాష్ట్ర విభజన, రాష్ర్టపతి పాలన నేపథ్యంలో కొత్త విద్యుత్ చార్జీలపై తాము నిర్ణయం ప్రకటించలేమని ఆయన పేర్కొన్నట్టు తెలిసింది. జూన్ 2 తర్వాత కొత్త ప్రభుత్వాలు ఏర్పాటయ్యాకే నిర్ణయం తీసుకోవాలని కూడా సూచించినట్టు సమాచారం. వాస్తవానికి ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చేలా 2014-15 ఆర్థిక సంవత్సరానికి విద్యుత్ చార్జీలను మార్చి చివరి వారంలోనే ఈఆర్సీ నిర్ణయించాల్సి ఉంది. అయితే, కోడ్ నేపథ్యంలో ఈ ప్రక్రియ నిలిచిపోయింది. ఎన్నికల తర్వాత చార్జీలపై నిర్ణయం తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘం సూచించింది. దీంతో తదుపరి నిర్ణయం ప్రకటించే వరకూ ప్రస్తుత చార్జీలే కొనసాగుతాయని ఈఆర్సీ ప్రకటించింది. -
ఏపీలో రాష్ట్రపతి పాలన ఎత్తేసి మళ్లీ విధింపు!
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్లో మార్చి 1న విధించిన రాష్ట్రపతి పాలనను కేంద్రం ఉపసంహరించి ఆపై వెంటనే తిరిగి విధించే అవకాశం ఉన్నట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. దీనివల్ల రాజ్యాంగంలోని ఆర్టికల్ 356 ప్రకారం రాష్ట్రపతి పాలన విధించిన రెండు నెలల్లోగా ఆ నిర్ణయాన్ని తప్పనిసరిగా ఆమోదించేలా పార్లమెంటు ప్రత్యేక సమావేశాలను ఏర్పాటు చేసేందుకు మరో రెండు నెలల సమయం లభిస్తుందని ఆ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం లోక్సభ ఎన్నికలు జరుగుతుండటం, ఎంపీలంతా ఎన్నికల ప్రచారంలో తలమునకలు కావడంతో కేవలం రాష్ట్రపతి పాలనకు ఆమోదం తెలిపేందుకే పార్లమెంటును సమావేశపరచడం కష్టమని...అందుకే ఈ చర్యకు అవకాశం కల్పించే రాజ్యాంగంలోని నిబంధనను కేంద్రం ఉపయోగించుకోనున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. -
పోలీస్ వాహనాలకూ 'పెట్రోల్' కష్టాలు..!
-
రాష్ట్రపతి పాలన - రాజ్యాంగం
ఆంధ్రప్రదేశ్లో దాదాపు 41 ఏళ్ల తర్వాత రాష్ట్రపతి పాలన విధించారు.. ముఖ్యమంత్రి పదవికి కిరణ్కుమార్ రెడ్డి రాజీనామా తర్వాత ఏర్పడిన అనిశ్చితిని తొలగించడానికి రాష్ట్రపతి పాలన విధించాలన్న కేంద్ర మంత్రి వర్గ సిఫార్సుకూ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మార్చి 2న ఆమోదం తెలిపారు.. దీంతో ఆంధ్రప్రదేశ్ పాలన వ్యవహారాలు గవర్నర్ నరసింహన్ చేతుల్లోకి వెళ్లాయి.. ఈ నేపథ్యంలో ‘రాష్ట్రపతి పాలన’ అంశం సమకాలీన ప్రాముఖ్యతను సంతరించుకుంది. రాష్ట్రపతి పాలన అంటే ఏమిటి? ఏయే పరిస్థితుల్లో రాష్ట్రపతి పాలన అనివార్యం అవుతుంది? ఈ అంశానికి సంబంధించి రాజ్యాంగ స్ఫూర్తి ఎలా ఉంది? దీనిపై సుప్రీంకోర్టు తీర్పు, న్యాయ సమీక్ష తదితర అంశాలపై విశ్లేషణ.. భారత సమాఖ్య వ్యవస్థలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాజ్యాంగం నిర్దేశించిన పరిధిలో తమ అధికార, విధులను నిర్వర్తించాలి. సాధారణంగా ఒకరిపై ఒకరు ఆధిపత్య ధోరణిని ప్రదర్శించకూడదు. కానీ దేశ ఐక్యత, సమగ్రత, రక్షణ దృష్ట్యా అనూహ్యమైన పరిస్థితులు తలెత్తినప్పుడు వాటిని ఎదుర్కోవడానికి ఉద్దేశించిన అధికారాలకు ‘అత్యవసర అధికారాలు’గా పేరు పెట్టారు. రాజ్యాంగం 18వ భాగంలో ప్రకరణ 352 నుంచి 360 వరకు మూడు రకాల అత్యవసర అధికారాలను పేర్కొన్నారు. అవి.. 1. జాతీయ అత్యవసర పరిస్థితి (ప్రకరణ 352) 2. రాష్ట్రంలో రాజ్యాంగపరమైన అత్యవసర పరిస్థితి లేదా రాష్ట్రపతి పాలన (ప్రకరణ 356) 3. ఆర్థిక అత్యవసర పరిస్థితి (ప్రకరణ 360) రాష్ట్రపతి పాలన విధింపు - కారణాలు ప్రకరణ 355 ప్రకారం ప్రతీ రాష్ట్రంలో రాజ్యాంగబద్ధంగా పాలన కొనసాగేలా చూడాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే. అలాకాకుండా ఏదైనా రాష్ట్రంలో రాజ్యాంగ బద్ధంగా పరిపాలన కొనసాగించడానికి అవకాశం లేనప్పుడు లేదా రాజ్యాంగ సంక్షోభం ఏర్పడిన పరిస్థితుల్లో.. గవర్నర్ పంపిన నివేదిక ద్వారా లేదా మరో విధంగా గానీ, రాష్ట్రపతి భావించినప్పుడు ఆ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించవచ్చు. అలాగే ప్రకరణ 365 ప్రకారం కేంద్ర ఆదేశాలను రాష్ట్రాలు ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘిస్తే కూడా రాష్ట్రపతి పాలన విధించే అవకాశం ఉంది. రాష్ట్రపతి పాలన విధించిన రోజు నుంచి రెండు నెలల్లోగా పార్లమెంట్ రాష్ట్రపతి పాలనను సాధారణ మెజారిటీతో ఆమోదించాల్సి ఉంటుంది. పార్లమెంట్ ఆమోదించిన రోజు నుంచి ఆరు నెలల వరకూ రాష్ట్రపతి పాలన కొనసాగుతుంది. అలా ప్రతి ఆరు నెలలకోసారి పార్లమెంట్ ఆమోదాన్ని పొందాలి. ఎటువంటి పరిస్థితుల్లోనూ రాష్ట్రపతి పాలనను మూడు సంవత్సరాలకు మించి కొనసాగనివ్వకూడదు. రాష్ట్రపతి పాలన - పరిణామాలు రాష్ట్రపతి పాలన విధించినప్పుడు చోటు చేసుకునే పరిణామాలు 1. రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేస్తారు. 2. రాష్ట్ర విధాన సభను రద్దు చేయవచ్చు లేదా సుప్తచేతనావస్థలో ఉంచవచ్చు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీని సుప్తచేతనావస్థలోనే ఉంచారు (అంటే అసెంబ్లీ రద్దు కాకుండా నిద్రాణ స్థితిలో ఉంటుంది). ఈ వ్యవస్థలో ఉన్నప్పుడు అసెంబ్లీని తిరిగి పునరుద్ధరించవచ్చు. 3. రాష్ట్రపతి.. రాష్ట్ర పాలన బాధ్యతను స్వీకరించి దాన్ని గవర్నర్ ద్వారా నిర్వహిస్తాడు. 4. గవర్నర్కు సహకరించడానికి సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను సలహాదారులుగా నియమిస్తారు. 5. రాష్ట్ర జాబితాలోని అంశాలపైన పార్లమెంట్, రాష్ట్రపతి ఆర్డినెన్స ద్వారా చట్టాలను రూపొందించవచ్చు. 6. రాష్ట్ర బడ్జెట్ను కూడా పార్లమెంట్ ఆమోదిస్తుంది. సుప్రీంకోర్టు తీర్పులు - న్యాయసమీక్ష 1975లో చేసిన 38వ రాజ్యాంగ సవరణ ప్రకారం.. రాష్ట్రపతి తన అభీష్టం మేరకు లేదా సంతృప్తి మేరకు ప్రకరణ 356ను ప్రయోగించవచ్చు. ఈ విషయంలో రాష్ట్రపతిదే తుది నిర్ణయం. ఆ నిర్ణయాన్ని న్యాయస్థానంలో ప్రశ్నించరాదు అనే ఉద్దేశంతో రాజ్యాంగ సవరణ చేశారు. అయితే 1978లో 44వ రాజ్యాంగ సవరణ ద్వారా దాన్ని తొలగించారు. ఆ మేరకు రాష్ట్రపతి తీసుకున్న నిర్ణయాన్ని న్యాయస్థానంలో ప్రశ్నించవచ్చు. న్యాయ సమీక్షకు అతీతం కాదు. ఈ మధ్యనే ఢిల్లీలో విధించిన రాష్ట్రపతి పాలనను ప్రశ్నిస్తూ ఆమ్ ఆద్మీ పార్టీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దుర్వినియోగం-సమీక్ష అత్యవసర అధికారాలు సమాఖ్య వ్యవస్థకు ప్రమాదం తెస్తాయని, ప్రతిపక్షాలకు చెందిన ప్రభుత్వాలను అణచివేస్తాయని, కేంద్రం నియంతృత్వంగా వ్యవహరించే అవకాశం ఉందని రాజ్యాంగ నిర్మాతలే భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. అటువంటి అభిప్రాయాలకు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్, అల్లాడి కృష్ణస్వామి అయ్యర్లు ఇచ్చిన సమాధానం..‘‘సమాఖ్య వ్యవస్థ కంటే జాతి శ్రేయస్సు మిన్న. చైతన్యవంతమైన ప్రజాభిప్రాయం, చురుగ్గా ఉన్న పార్లమెంట్ గల దేశంలో నియంతృత్వానికి చోటులేదు’’. ‘‘356వ అధికరణం దుర్వినియోగం కావచ్చు. అయినా అది అవసరమైన చెడు’’ అని టి.టి. కృష్ణమాచారి పేర్కొన్నారు. దేశ విభజన సందర్భంలో మతోన్మాదానికి లక్షలాది మంది అమాయకులు బలి అవుతున్న సమయం, జమ్మూకాశ్మీర్లో పాకిస్థాన్ దండయాత్రతో ఏర్పడిన విపత్కర పరిస్థితుల్లో జాతి మనుగడకు అలాంటి అధికరణలు అవసరమని రాజ్యాంగ నిర్మాతలు గుర్తించారు. అందువల్లనే నజీరుద్దీన్ అహ్మద్ దాన్ని ‘రాజ్యాంగంలోని అత్యంత ముఖ్యమైన అంశం’ అని కొనియాడారు. ప్రమాదకర పరిస్థితులను ఎదుర్కోవడానికి పటిష్టమైన ఏర్పాట్లు అవసరమని కె.సంతానం వంటి వారు అభిప్రాయం వ్యక్తం చేశారు. గత 63 ఏళ్ల అనుభవాలు.. రాజ్యాంగ నిర్మాతలు ఆశించిన దానికి పూర్తి భిన్నంగా ఉన్నాయి. 1950 నుంచి 2014 వరకు (కేంద్ర పాలిత ప్రాంతాలతో సహా) సుమారు 120 కంటే ఎక్కువ సార్లు రాష్ట్రపతి పాలన విధించారు. ఈ ప్రకరణను కేంద్రం రాజకీయ స్వప్రయోజనాలకే దుర్వినియోగం చేసిన సందర్భాలే ఎక్కువని ప్రతిపక్షాలు, రాజ్యాంగ నిపుణులు విమర్శించారు. 1977లో జనతాపార్టీ ప్రభుత్వం కాంగ్రెస్ పాలనలోని 9 రాష్ట్ర ప్రభుత్వాలను రద్దు చేసింది. 1980లో కాంగ్రెస్ ప్రభుత్వం జనతాపార్టీ పాలన లో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలను రద్దు చేసింది. 1984లో ఆంధ్రప్రదేశ్లో ఎన్.టి. రామారావు ప్రభుత్వాన్ని అకారణంగా బర్తరఫ్ చేసి మెజారిటీ లేని నాదెండ్ల భాస్కరరావును ముఖ్యమంత్రిగా నియమించడం దుర్వినియోగానికి పరాకాష్టగా పేర్కొనవచ్చు. రక్షణ కవాటంగా (సేఫ్ బై వాల్యూ)గా ఉద్దేశించిన ఈ అధికరణం ఆచరణలో కేంద్రానికి అయిష్టంగా ఉన్న రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేయడానికి ఉపయోగపడే రాజకీయ ఆయుధంగా మారడం దురదృష్టకరం. మృత శాసనమా లేదా మరణ శాసనమా? రాష్ట్రపతి పాలనను రాజ్యాంగంలో చేర్చడంపై రాజ్యాంగ పరిషత్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ దీనికి సమాధానం చెబుతూ ప్రకరణ.. 356 రాజ్యాంగంలో మృత శాసనంగా (డెడ్ ఆర్టికల్) ఉంటుందని, దీన్ని చాలా జాగ్రత్తగా, అతి తక్కువగా తుది ప్రత్యామ్నాయంగానే వినియోగిస్తారని భరోసా ఇచ్చారు. కానీ తర్వాతి కాలంలో దీనికి భిన్నంగా ఈ ప్రకరణ రాష్ట్రాల పాలిట మరణ శాసనంగా (డెత్ లెటర్)గా పరిణమించిందనేది జగమెరిగిన సత్యం. రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరించడం పాలకులకు పరిపాటిగా మారిపోయింది. రాజ్యాంగం ప్రకారం రాజకీయ వ్యవస్థ నడవాలి. కానీ రాజ్యాంగాన్ని రాజకీయ అవసరాలకనుగుణంగా మార్చుకోవడం ప్రజాస్వామ్య విలువలకు విఘాతం కలిగించడమే అవుతుంది. ప్రపంచ ప్రజాస్వామ్య రాజ్యాంగాల్లో మరెక్కడా లేని ఈ అధికరణను రాష్ట్రపతి ఉపయోగించే రోజు బాధాకరమైంది, అవమానకరమైంది అని రాజ్యాంగ పరిషత్ సభ్యుడు హెచ్.వి.కామత్ అభిప్రాయపడ్డారు. ఎస్ఆర్ బొమ్మై కేసు - మార్గదర్శకాలు 1994లో కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ఎస్ ఆర్ బొమ్మైకేసు సందర్భంగా సుప్రీంకోర్టు రాష్ట్రపతి పాలన విధించడానికి సంబంధించి కొన్ని మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ కేసును ప్రకరణ 356 విషయంలో అత్యంత ప్రామాణికంగా పరిగణిస్తారు. గవర్నర్ నివేదిక రాష్ట్రంలోని వాస్తవిక పరిస్థితులను ప్రతిబింబించేలా ఉండాలి. వ్యక్తిగత అభిప్రాయాలను వ్యక్తీకరించరాదు. రాష్ట్ర ప్రభుత్వానికి మెజారిటీ ఉందా లేదా అనే అంశాన్ని శాసనసభలో మాత్రమే పరీక్షించాలి. బల నిరూపణ కోసం ముఖ్యమంత్రికి తగిన సమయం ఇవ్వాలి. పార్లమెంట్.. రాష్ట్రపతి పాలనను ఆమోదించే వరకు రాష్ట్ర అసెంబ్లీని రద్దు చేయరాదు. లౌకిక తత్వానికి విఘాతం కలిగించినా లేదా దాన్ని కాపాడలేకపోయినా రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రకరణ 356 ప్రకారం రద్దు చేయవచ్చు. శాంతి భద్రతలకు భంగం వాటిల్లడం వేరు, రాజ్యాంగపరమైన వైఫల్యం వేరు. కాబట్టి శాంతి భద్రతలకు విఘాతం కలిగిందనే సాకుతో రాష్ట్రపతి పాలన విధించడం సమంజసం కాదు. ప్రకరణ 356ను ప్రయోగించడాన్ని అంతిమ ప్రత్యామ్నాయంగానే చూడాలి. రాష్ట్రంలోని పరిస్థితులను చక్కబెట్టేందుకు రాజ్యాంగంలోని ఇతర ప్రత్యామ్నాయాలైన ప్రకరణ 256, 257లను కూడా ఉపయోగించాలి. రాష్ట్రపతి పాలనను దురుద్దేశంతో విధించినా లేదా రాష్ట్రపతి పాలన విధించడానికి సమంజసమైన కారణాలు లేకపోయినా న్యాయస్థానం జోక్యం చేసుకొని రాష్ట్రపతి ఆదేశాలను కొట్టివేయవచ్చు. రాష్ట్రపతి పాలనను సుప్రీంకోర్టు కొట్టివేస్తే రద్దు చేసిన ప్రభుత్వాన్ని, విధానసభను పునరుద్ధరిస్తారు. దేశంలో ఎప్పుడెప్పుడు? దేశంలో ఇప్పటి వరకూ దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ రాష్ట్రపతి పాలన ఏదో ఒక సందర్భంలో అమల్లోకి వచ్చిందని చెప్పొచ్చు. ఛత్తీస్గఢ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో ఇప్పటి వరకూ రాష్ట్రపతి పాలన విధించలేదు. అన్నిటి కంటే ఎక్కువగా ఉత్తరప్రదేశ్లో 9 సార్లు రాష్ట్రపతి పాలన విధించారు. తర్వాత వరుసగా బీహార్, పంజాబ్లలో 8 పర్యాయాలు రాష్ట్రపతి పాలన అమల్లోకి వచ్చింది. ఆంధ్ర రాష్ట్రంలో 1954, నవంబర్ 15 నుంచి 1955, మార్చి 28 వరకు ఒక పర్యాయం రాష్ట్రపతి పాలన విధించారు. సారా వ్యతిరేకోద్యమం, ఆనాటి ముఖ్యమంత్రి ప్రకాశం పంతులుపై పెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గడంతో రాష్ట్రపతి పాలన అమల్లోకి వచ్చింది. 1973లో జై ఆంధ్ర ఉద్యమ నేపథ్యంలో అప్పటి ముఖ్యమంత్రి పి.వి.నరసింహారావు రాజీనామాతో 1973, జనవరి 11 నుంచి డిసెంబర్ 10 వరకు ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రపతి పాలన విధించారు. ఈ ఏడాది రెండు రాష్ట్రాల్లో (ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ) రాష్ట్రపతి పాలన విధించారు. బి. కృష్ణారెడ్డి, డెరైక్టర్, క్లాస్-1 స్టడీ సర్కిల్, హైదరాబాద్ -
బూత్ల బాధ్యత పరాయి దళాలకు
సాక్షి, హైదరాబాద్: ‘పోలింగ్ బూత్ల్లో ఉండేది మన పోలీసులే కదా! మేనేజ్ చేయెచ్చులే...’ అనుకునే రాజకీయ నాయకుల పప్పులు ఈసారి ఉడకవు. సార్వత్రిక ఎన్నికల ఓటింగ్ సరళిలో ఏ కోణంలోనూ స్థానిక అధికారుల ప్రభావం లేకుండా ఉండేలా ఎన్నికల సంఘం (ఈసీ) పటిష్ట చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా గతానికి భిన్నంగా ఈసారి పోలింగ్ బూత్ల బాధ్యతల్ని ఇతర ప్రాంతాల నుంచి వచ్చే కేంద్ర సాయుధ బలగాలకు అప్పగించాలని నిర్ణయించింది. ఆ స్థాయిలోనే అదనంగా బలగాలను రప్పిస్తోంది. పరోక్ష సహకారానికి అడ్డుకట్ట: ప్రస్తుతం రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన అమలులో ఉండటంతో రాజకీయ నాయకుల ప్రాబల్యం దాదాపు లేనట్లే. స్థానికంగా పనిచేసే పోలీసు అధికారులు ఫలానా వ్యక్తి గెలుస్తాడనో, ఫలానా పార్టీ అధికారంలోకి వస్తుందనే ఉద్దేశంతో పరోక్షంగా వారికి సహకరించే అవకాశాలు ఉన్నాయని ఈసీ అనుమానిస్తోంది. దీనికి పూర్తిస్థాయిలో అడ్డుకట్ట వేయడం కోసం సిక్కింలో అమలు చేసిన విధానాన్నే రాష్ట్రంలోనూ పరిచయం చేస్తోంది. అక్కడ నెలకొన్న ప్రత్యేక పరిస్థితులను పరిగణలోకి తీసుకున్న ఈసీ.. స్టేషన్ హౌస్ ఆఫీసర్లుగా వ్యవహరించే స్థానిక పోలీసుస్టేషన్ ఇన్చార్జ్ (జిల్లాల్లో ఎస్సై, కమిషనరేట్లలో ఇన్స్పెక్టర్)లతో పాటు పోలీసు సిబ్బందికి బూత్ల బాధ్యతలు అప్పగించలేదు. అక్కడి భద్రత, బందోబస్తుల్ని కేంద్ర బలగాలైన బీఎస్ఎఫ్, సీఆర్పీఎఫ్ తదితర విభాగాలకు అప్పగించింది. ఇదే విధానాన్ని రాష్ట్రంలో జరిగే సార్వత్రిక ఎన్నికల్లోనూ అమలు చేయాలని నిర్ణయించింది. స్థానిక, రాష్ట్ర పోలీసులు కేవలం ఓటర్లు ఉండే క్యూలను పర్యవేక్షించే వరకు మాత్రమే అనుమతిస్తారు. ఎన్నికల విధుల్లో ఉన్న అధికారుల నుంచి ఫిర్యాదు రావడమో, శాంతిభద్రతలకు సంబంధించిన సమస్య తలెత్తడమో జరిగితేనే స్థానిక పోలీసులు పోలింగ్ బూత్ పరిసరాల్లోకి చేరుకుంటారు. గతంలో స్థానిక పోలీసు అధికారులకు పర్యవేక్షణ బాధ్యతలు మాత్రమే ఉండేవి. తాజా మార్పుల నేపథ్యంలో వీరికి గస్తీ బాధ్యతలు అప్పగిస్తున్నారు. ఫ్లయింగ్ స్క్వాడ్లు: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ప్రతి నియోజకవర్గానికి ఒక స్థానిక కంట్రోల్ రూమ్, మూడు స్టాటిక్ సర్వైలెన్స్ టీమ్స్, ఫ్లయింగ్ స్క్వాడ్లు ఏర్పాటు చేస్తున్నారు. ఫ్లయింగ్ స్క్వాడ్ స్థానిక కంట్రోల్ రూమ్తో పాటు జిల్లా కంప్లైంట్స్ మానిటరింగ్ సెల్ నుంచి వచ్చే ఫిర్యాదుల ఆధారంగా చర్యలు తీసుకుంటుంది. సర్వైలెన్స్ బృందాలు నిత్యం గస్తీ నిర్వహిస్తూ అనుమానిత ప్రాంతాల్లో సోదాలు చేస్తుంటాయి. -
ఇద్దరు మాజీ మంత్రులు, ఎమ్మెల్యేకు షోకాజ్ నోటీసులు
ఎన్నికల కోడ్ ఉల్లంఘనే కారణం మహబూబ్నగర్, న్యూస్లైన్ : అసలే రాష్ట్రపతి పాలన, ఆపై ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించిన ఇద్దరు మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలకు ఆదివారం మహబూబ్నగర్ కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఎం.గిరిజాశంకర్ షోకాజ్ నోటీసులు జారీ చేశారు. వివరాలిలా ఉన్నాయి. శనివారం మహబూబ్నగర్లోని బృందావన్ గార్డెన్, గద్వాలలో మహిళా దినోత్సవం సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశానికి మాజీ మంత్రి డీకే.అరుణ హాజరై ప్రసంగించారు. అలాగే, వనపర్తి పట్టణంలో బహిరంగ ర్యాలీ నిర్వహించిన మాజీ మంత్రి జి.చిన్నారెడ్డితోపాటు, అభివృద్ధి పనులు మంజూరు చేయించానని పేపర్లో ప్రకటించిన ఎమ్మెల్యే రావుల చంద్రశేఖర్రెడ్డి ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని అధికారులు ధ్రువీకరించారు. వారం రోజుల్లో వారిచ్చే సమాధానాన్ని బట్టి తదుపరి చర్యలుంటాయని వారు చెబుతున్నారు. -
గవర్నర్కూ ఎన్నికల కోడ్
కలెక్టర్లు, ఎస్పీలతో పథకాల సమీక్ష కుదరదు: భన్వర్లాల్ స్పష్టీకరణ సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర గవర్నర్కు ఎన్నికల ప్రవర్తనా నియమావళి (కోడ్) వర్తిస్తుందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్లాల్ స్పష్టం చేశారు. రాష్ర్టపతి పాలన నేపథ్యంలో గవర్నర్ నరసింహన్ సోమవారం సాధారణ ఎన్నికల ఏర్పాట్లతో పాటు కీలకమైన ఏడు అంశాలపై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, పలు శాఖల ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించనున్న విషయాన్ని ‘సాక్షి’ పాఠకులకు తెలియజేసిన సంగతి తెలిసిందే. - గవర్నర్ ప్రధానంగా సాధారణ ఎన్నికల ఏర్పాట్లతోపాటు శాంతిభద్రతలు, గ్రామీణ త్రాగునీటి సరఫరా, వాతావరణ పరిస్థితులు, విద్యుత్ సరఫరా, పాఠశాల విద్య, వైద్య ఆరోగ్యం రంగాలపై కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించాలని నిర్ణయించారు. - ఎన్నికల ప్రవర్తనా నియావళి అమల్లో ఉన్నందున సీఎస్ మహంతి ఈ సమీక్ష విషయాన్ని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి దృష్టికి తీసుకువెళ్లారు. సంబంధిత ఫైలును పరిశీలించిన భన్వర్లాల్... కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్తో సంప్రదించారు. తర్వాత రాష్ట్రప్రభుత్వ అధిపతిగా ఉన్న గవర్నర్ సమీక్ష చేయకూడదని నేరుగా చెప్పకుండా, ఎన్నికలకోడ్ అమల్లో ఉన్నందువల్ల ప్రభుత్వ పథకాల సమీక్షలు కుదరవని పరోక్షంగా స్పష్టంచేశారు. - ఎన్నికల కోడ్ అమల్లోకి రాగానే సీఎం, మంత్రు లు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనడం, సమీక్షలు నిర్వహించడంపై నిషేధం ఉందని... ఇప్పుడు రాష్ట్ర అధిపతిగా ఉన్న గవర్నర్ కలెక్టర్లు, ఎస్పీలతో ప్రభుత్వ పథకాలపై సమీక్షలు చేయడం ఎన్నికల నియామవళిని అతిక్రమించడమే అవుతుందనేది కమిషన్ అభిప్రాయంగా ఉంది. ఎన్నికల ఏర్పాట్లతోపాటు విద్యుత్ సరఫరా వంటి అంశాలపై సమీక్షించడం ఓటర్లను ప్రభావితం చేయడమే అవుతుందని కమిషన్ వర్గాలు పేర్కొన్నాయి. - ఎన్నికల ఏర్పాట్లను కేవలం సీఎస్, డీజీపీ, సీఈఓ మాత్రమే అధికార యంత్రాంగంతో సమీక్షిస్తారని, ఎన్నికల షెడ్యూల్ ప్రకటించాక మొత్తం అధికార యంత్రాంగమంతా కేంద్ర ఎన్నికల కమిషన్ పరిధిలోకి వెళ్లిపోతుందని, ఏదైనా సరే కమిషన్ అనుమతితో చేయాల్సి ఉంటుందన్నాయి. రాజకీయ నేతలు లేకుండా ఉగాది ఉత్సవాలు ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చినందున ఈనెల 17న హోలీతో పాటు 30వ తేదీ ఉగాది ఉత్సవాలను రాజకీయ నేతలు లేకుండా పూర్తిగా అధికారులతో నిర్వహించనున్నట్లు గవర్నర్ కార్యాలయం శనివారం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్లాల్కు తెలిపింది. రాజకీయ నేతల భాగస్వామ్యం లేకుండా కేవలం అధికారులతో ఉగాది ఉత్సవాలను నిర్వహించడానికి ఎటువంటి ఆంక్షలు ఉం డబోవని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. -
వసూలు చేసిన ప్రతి పైసా ఖజానాకు చేరాల్సిందే
వసూలుచేసిన పన్నుల్లో ప్రతి పైసా ఖజానాకు చేరాలని గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ తెలిపారు. ప్రభుత్వానికి ఆదాయం కల్పించే వివిధ శాఖల ఉన్నతాధికారులతో ఆయన శనివారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఢిల్లీ పర్యటన ముగించుకుని తిరిగి వచ్చిన ఆయన నిర్వహించిన ఈ సమావేశంలో ఆర్థిక, రెవెన్యూ, ఎక్సైజ్ శాఖలకు చెందిన పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాన్ని పూర్తి స్థాయిలో రాబట్టాలని, వసూలు చేసిన దాంట్లో ప్రతి ఒక్క పైసా ప్రభుత్వ ఖజానాకు జమ కావాలని అధికారులకు గవర్నర్ స్పష్టం చేశారు. ఆ విషయంలో ఉపేక్షిస్తే పథకాలు ప్రజలకు చేరవని ఆయన తెలిపారు. అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులకు వెంటనే సహాయం అందేలా చర్యలు చేపట్టాలని వివిధ శాఖలకు చెందిన అధికారులకు గవర్నర్ సూచన చేశారు. -
ప్రధానితో ముగిసిన గవర్నర్ భేటీ
ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్తో గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ భేటీ ముగిసింది. ఉదయం 11.30 గంటల ప్రాంతంలో ఆయన ప్రధానమంత్రిని కలిశారు. రాష్ట్ర విభజన ప్రక్రియ, అనంతర పరిణామాలను ప్రధానమంత్రికి నరసింహన్ వివరించారు. రాష్ట్రంలో తాజా పరిణామాలను కూడా ఆయన చెప్పినట్లు తెలుస్తోంది. ఇక వీరిద్దరి మధ్య గవర్నర్ సలహాదారుల గురించి కూడా చర్చ జరిగినట్లు సమాచారం. ముగ్గురు సలహాదారుల నియామకానికి కూడా దాదాపుగా అంగీకారం కుదిరిందంటున్నారు. ఎ.ఎన్.తివారీ, విజయకుమార్ల పేర్లు వినిపిస్తున్నాయి. వీరిద్దరితో పాటు మరొకరిని కూడా సలహాదారులుగా పంపే అవకాశం ఉంది. -
నేడు ఖరారు కానున్న గవర్నర్ సలహాదారులు
-
ప్రధానితో భేటీ కానున్న గవర్నర్
న్యూఢిల్లీ : రాష్ట్రపతి పాలన విధింపుతో రాష్ట్ర పరిపాలన పగ్గాలు చేపట్టిన గవర్నర్ నరసింహన్ నేడు కూడా అధిష్టానం పెద్దలను కలవనున్నారు. నిన్న రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, కేంద్ర హోం మంత్రి సుశీల్కుమార్ షిండే, ఆర్థిక మంత్రి చిదంబరంతో భేటీ అయిన ఆయన నేడు ప్రధానమంత్రి, సోనియాగాంధీని కలవనున్నారు. ఈ రోజు ఉదయం 11.30గంటలకు మన్మోహన్ సింగ్తో గవర్నర్ సమావేశం అవుతారు. ఈ సందర్భంగా గవర్నర్ రాష్ట్రంలోని శాంతిభద్రతలపై నివేదికను సమర్పించనున్నారు. అలాగే సలహాదారుల నియామకంపైనా చర్చించే అవకాశం ఉంది. పనిలో పనిగా ఆయన కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో భేటీ కానున్నారు. సాయంత్రం నరసింహన్ ....హైదరాబాద్ తిరిగి రానున్నారు. -
గవర్నర్ హుకుంపై బతకాలా?: అసదుద్దీన్ ఒవైసీ
ఆయన ఆకాశం నుంచి ఊడిపడ్డాడా? ప్రభుత్వం ఏర్పాటు చేసే దమ్ము లేదా? కాంగ్రెస్పై అసదుద్దీన్ ధ్వజం నిజావూబాద్, న్యూస్లైన్: ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధులు ఉండగా కేంద్రం.. రాష్ట్రపతి పాలన విధించటం ఏమిటని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ప్రశ్నించారు. నిజామాబాద్లో బుధవారం రాత్రి జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ప్రజాప్రతినిధులకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దమ్ములేదా.. గవర్నర్ ఆదేశాల మేరకు బతకాలా..ప్రజాస్వామ్య దేశంలో ఆయన హుకుం ఏందీ.. ఆయన ఆకాశం నుంచి ఊడిపడ్డారా? అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ ముస్లింలను ఊచకోత కోశారని, ఆ విషయం మరిచిపోయి ప్రస్తుతం అభివృద్ధిని చూడండి.. అంటూ ప్రకటనలు చేస్తున్నారని విమర్శించారు. మోడీ సాధించిన అభివృద్ధి ఏమీ లేదని ఎద్దేవాచేశారు. తెలంగాణ బిల్లును పార్లమెంట్లో ప్రవేశ పెట్టిన సందర్భంగా తాము పలు డిమాండ్లను తెరపైకి తెచ్చినప్పటికీ యూపీఏ ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. ఎంఐఎం నుంచి 10 మం ది ఎంపీలు ఉంటే దేశ భవిష్యత్తునే మార్చేస్తానని అసదుద్దీన్ పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఎంతో మంది ముస్లింలను కాంగ్రెస్ పార్టీ పొట్టనపెట్టుకుందని ఆరోపించా రు. ములాయం తనకు తాను రక్షకుడనని చెప్పుకుంటున్నాడని, అయితే యూపీలో ఎందరో ముస్లింలు మృతి చెందారని గుర్తుచేశారు. దేశ వ్యాప్తంగా మజ్లిస్ జెండాను ఎగురవేద్దామని పిలుపునిచ్చారు. కాంగ్రెస్, టీడీపీలకు మీరు సత్తా చూపించండి, అసెంబ్లీలో బీజేపీకి మా సత్తా చూపిస్తామన్నారు. -
రాష్ట్రపతి పాలనలో కీలకంగా సలహాదారులు
హైదరాబాద్: రాష్ట్రపతి పాలన సమయంలో గవర్నర్ సలహాదారులు కీలకంగా ఉంటారు. గవర్నర్ సలహాదారుల కోసం పలువురి పేర్లను పరిశీలిస్తున్నారు. ఆంధ్రా క్యాడర్ 1969 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అనుగ్రహ నారాయణ్ తివారి పేరును పరిశీలిస్తున్నారు. కృష్ణకాంత్ మన రాష్ట్రానికి గవర్నర్గా ఉన్న సమయంలో తివారి సెక్రటరీగా పనిచేశారు. ఆయన గతంలో డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ సెక్రటరీగా కూడా పనిచేశారు. గవర్నర్ మరో సలహాదారుగా మాజీ ఐపీఎస్ విజయ్కుమార్ పేరును కూడా పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం కేంద్ర అంతర్గత భద్రత సలహాదారుగా ఆయన ఉన్నారు. విభజన విషయంలోనూ ఆయన సలహాదారుగా వ్యవహరిస్తున్నారు. ఆపరేషన్ వీరప్పన్ కేసుతో విజయ్కుమార్ వెలుగులోకి వచ్చారు. మాజీ ఐఏఎస్ అధికారి పి.సి.పరేఖ్ పేరును కూడా పరిశీలిస్తున్నారు. -
హస్తినలో నరసింహన్ బిజీ బిజీ
గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ హస్తినలో బిజీబిజీగా గడుపుతున్నారు. బుధవారం మధ్యాఃహ్నం 12 గంటలకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో ఆయన భేటీ కానున్నారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించిన నేపథ్యంలో ఎలాంటి చర్యలు తీసుకోవాలి, పరిపాలన విషయంలో ఎలా వ్యవహరించాలనే విషయంలో ఆయనతో చర్చిస్తారని భావిస్తున్నారు. ఇక బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరంతో గవర్నర్ నరసింహన్ భేటీ అవుతారు. అలాగే ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్, ఏఐసీసీ అధినేత్రి సోనియాగాంధీ, కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండేల అపాయింట్మెంట్ కూడా గవర్నర్ కోరినట్లు సమాచారం. -
హస్తినకు చేరిన గవర్నర్
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించిన తర్వాత తొలిసారిగా గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ మంగళవారం సాయంత్రం ఢిల్లీకి వచ్చారు. బుధ, గురువారాల్లో ఇక్కడే ఉండి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని మన్మోహన్సింగ్, యూపీఏ అధ్యక్షురాలు సోనియాగాంధీ, కేంద్ర హోంమంత్రి సుశీల్కుమార్ షిండే, ఆర్థిక మంత్రి పి.చిదంబరంలతో ఆయన భేటీ అవుతారని తెలుస్తోంది. షిండే, చిదంబరంలతో బుధవారం గవర్నర్ భేటీ ఖరారైంది. గురువారం ప్రధానిని కలుసుకొనే అవకాశ ం ఉందని ఏపీభవన్ వర్గాలు వెల్లడించాయి. కేంద్ర హోంశాఖ ఉన్నతాధికారులతో కూడా గవర్నర్ ప్రత్యేకంగా భేటీ అవుతారని సమాచారం. ఈ సందర్భంగా గవర్నర్ ప్రధానంగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం రాష్ట్రంలో పాలనా పరిస్థితులు, శాంతిభద్రతల అంశాలను పెద్దలతో చర్చిస్తారని తెలుస్తోంది. అలాగే రానున్న సార్వత్రిక ఎన్నికలకు రాష్ట్రానికి అదనపు బలగాల కేటాయింపుపైనా విజ్ఞప్తులు చేస్తారని సమాచారం. ఇక పాలనాపరంగా సహాయం అందించేందుకు ప్రత్యేక ప్రధాన కార్యదర్శి హోదా గల ఇద్దరు అధికారుల నియామకంపైనా ఆయన పెద్దలతో చర్చించవచ్చు. గవర్నర్కు భద్రత పెంపు: రాష్ట్రపతి పాలన విధింపుతో రాష్ట్ర పాలనాపగ్గాలు చేపట్టిన గవర్నర్ నరసింహన్కు ఏపీభవన్ అధికారులు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు. ఆయన బస చేసే శబరి బ్లాక్ పరిధిలో భద్రతా సిబ్బందిని పెంచారు. అనుమతి లేనిదే వేరెవర్నీ ఆ బ్లాక్లోకి పంపరాదన్న గవర్నర్ కార్యాలయ ఆదేశాలతో అక్కడి గేటును పూర్తిగా మూసేశారు. ఇక గోదావరి బ్లాక్లోకి సైతం గుర్తింపు కార్డులు, అనుమతి ఉన్నవారినే పంపిస్తున్నారు. ఇక ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా ఉపయోగించే బుల్లెట్ప్రూఫ్ స్కార్పియో వాహనాన్ని, అదనపు భద్రతా సిబ్బందిని గవర్నర్ కాన్వాయ్లో చేర్చారు. అయితే గవర్నర్ నరసింహన్ తానెప్పుడూ ప్రయాణించే హోండా సిటీ కారునే ఈసారి కూడా ఉపయోగించారు. -
ఛాంబర్లు ఖాళీ చేస్తున్న మాజీమంత్రులు
మాజీమంత్రులంతా ఒక్కొక్కరుగా సచివాలయంలోని తమ చాంబర్లను ఖాళీ చేస్తున్నారు. వాస్తవానికి ఆయా చాంబర్లను ఖాళీ చేసేందుకు సాధారణ పరిపాలన శాఖ మాజీ మంత్రులందరికీ ఈనెల 7వ తేదీ వరకు గడువు ఇచ్చింది. అయినా కూడా రాష్ట్రపతి పాలన ఉండటం, గవర్నర్ నరసింహన్ ప్రతి విషయంలోనూ కఠినంగా వ్యవహరిస్తుండటంతో ఎందుకైనా మంచిదని తమ వ్యక్తిగత వస్తువులను ఇళ్లకు తరలించుకుంటున్నారు. అలాగే, ఆయా మంత్రుల వద్ద ఇంతకుముందు పనిచేసిన పీఏలు, పీఎస్లో కూడా సాధారణ పరిపాలన శాఖకు రిపోర్టు చేస్తున్నారు. వారంతా మాతృశాఖలలో చేరేందుకు నిరభ్యంతర సర్టిఫికెట్లు తీసుకుంటున్నారు. -
హస్తిన బయల్దేరిన నరసింహన్
హైదరాబాద్ : గవర్నర్ నరసింహన్ మరోసారి ఢిల్లీ పర్యటనకు బయల్దేరారు. ఇవాళ, రేపు హస్తినలో మకాం వేసి కేంద్ర ప్రభుత్వ పెద్దలతో పలు అంశాలపై ఆయన మంతనాలు జరపనున్నారు. రాష్ట్ర పాలనా పగ్గాలు చేపట్టిన తర్వాత నరసింహన్ తొలిసారి హస్తినకు వెళుతున్నారు. హస్తిన పర్యటనలో భాగంగా ఆయన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని మన్మోహన్సింగ్తో పాటు కేంద్రంలోని పలువురు పెద్దలను కలిసే అవకాశముందని అధికార వర్గాలు పేర్కొన్నాయి. త్వరలో లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితితో పాటు పాలనాపరంగా తాను తీసుకోదలచుకున్న చర్యలను రాష్ట్రపతికి గవర్నర్ నివేదించే అవకాశాలున్నాయని తెలుస్తోంది. అలాగే పాలనాపరంగా సహకరించేందుకు సలహాదారులుగా ప్రత్యేక ప్రధాన కార్యదర్శి హోదా గల పదవీ విరమణ చేసిన రాష్ట్రేతర అధికారులను నియమించుకోవాలని గవర్నర్ భావిస్తున్నారు. ఈ విషయంపై కూడా గవర్నర్... కేంద్ర హోంశాఖ, ప్రధానమంత్రి కార్యాలయ అధికారులతో చర్చించనున్నట్లు సమాచారం. -
పదేళ్లు ప్రత్యేక హోదా: వెంకయ్య నాయుడు
సాక్షి, కాకినాడ: కేంద్రంలో అధికారంలోకి రాగానే సీమాంధ్రకు కల్పించిన ప్రత్యేక హోదాను ఐదేళ్ల నుంచి పదేళ్లకు పొడిగిస్తామని బీజేపీ అగ్రనేత ఎం. వెంకయ్యనాయుడు చెప్పారు. ‘మోడీఫర్ పీఎం’ కార్యక్రమాన్ని సోమవారం తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో వెంకయ్య మాట్లాడుతూ రాష్ట్ర విభజనపై సీడబ్ల్యూసీ నిర్ణయం తీసుకున్నప్పుడే ముఖ్యమంత్రి, మంత్రులు రాజీనామా చేసి ఉంటే కాంగ్రెస్ అధిష్టానం కచ్చితంగా దిగివచ్చేదన్నారు. వారి చేతకానితనం వల్లే రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన వచ్చిందని, ఇది అప్రజాస్వామికమని పేర్కొన్నారు. తెలంగాణకు కట్టుబడి ఉన్నందునే అనైతికపద్దతిలో ప్రవేశపెట్టినా బిల్లుకు మద్దతు ఇవ్వాల్సి వచ్చిందన్నారు. విభజన అనివార్యం కావడంతో సీమాంధ్రులకు అన్యాయం జరగకుండా ఉండేందుకు ఉభయసభల్లో తమ పార్టీ చేసిన పోరాటం ఫలితంగానే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీలు ప్రకటించిందన్నారు. అయితే వాటిని అమలు చేసే సత్తా కాంగ్రెస్కు లేదని, మరో మూడు నెలల్లో అధికారంలోకి రానున్న బీజేపీ ప్రభుత్వం వాటిని సమర్థంగా అమలు చేస్తుందన్నారు. -
వర్సిటీల ఈసీలపై గవర్నర్ ఆరా !
వర్సిటీల వారీగా పేర్ల మార్పుపై నివేదిక ఆదేశం కొలీజియం సిఫారసు ఒకటీ.. ఆమోదం పొందింది మరొకటి ఒక్కో ఈసీలోని 9 పేర్లలో ముగ్గురు నలుగురి పేర్లు మార్పు 19 వర్సిటీల్లోనూ ఇదే తంతు సాక్షి, హైదరాబాద్: యూనివర్సిటీల్లో పాలక మండళ్లపై (ఈసీ) గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ దృష్టిసారించారు. మూడేళ్లుగా పాలకమండళ్లు లేక యూనివర్సిటీలు సమస్యలతో సతమతం అవుతున్న వైనంపై సోమవారం ‘వర్సిటీలకు పాలక మండళ్లేవీ? శీర్షికన సాక్షి ప్రచురించిన కథనంపై ఆయన స్పందించారు. యూనివర్సిటీలను గాడిలో పెట్టే పనిపై దృష్టి పెట్టారు. ఈసీలను నియమించేందుకు సిద్ధమయ్యారు. అంతేకాదు కొలీజియం సిఫారసులను పక్కనబెట్టి ఈసీల్లోని సభ్యులను మార్చిన వైనంపైనా ఆరా తీశారు. వర్సిటీల వారీగా కొలీజియం సిఫారసు చేసిన పేర్లు.. ఉపముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి స్థాయిలో జరిగిన మార్పులపైనా నివేదిక ఇవ్వాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించినట్లు తెలిసింది. చాలానే మార్పు చేశారు: రాష్ట్రంలోని 19 వర్సిటీలకు పాలక మండలి సభ్యులను గుర్తించి నియామకం కోసం 2011 మే నెలలో కొలీజియం ప్రభుత్వానికి సిఫారసు చేసింది. అయితే ఆ పేర్లలో ఉప ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి స్థాయిలో మార్పులు చోటు చేసుకున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. అయితే చివరగా ముఖ్యమంత్రి ఆమోదం పొందిన తరువాత ఫైళ్లు ఇటీవల ఉప ముఖ్యమంత్రికి వెళ్లాయి. ఈలోగా రాష్ట్రపతి పాలన రావడంతో ఫైళ్లన్నింటినీ ఉన్నత విద్యాశాఖకు పంపించారు. సోమవారం ఈ వ్యవహారంపై సాక్షి కథనం ప్రచురించడంతో ఈసీల నియామకాల ఫైలు కదిలింది. వాటిలో చాలా పేర్లు మారిపోయినట్లు అధికారులు గుర్తించారు. ఒక్కో యూనివర్సిటీ ఈసీకి కొలీజియం సిఫారసు చేసిన పేర్లలో మూడు నాలుగు మారిపోయినట్లు తెలిసింది. ఇలా 19 వర్సిటీల్లోనూ మార్పులు జరిగినట్లు సమాచారం. మరోవైపు స్థానికత విషయంలో సమస్యలున్నట్లు తెలిసింది. అందుకే కొలీజియం పంపిన పేర్లు.. మార్పు జరిగిన పేర్లు.. వారి స్థానికత వంటి అంశాలతో ఉన్నత విద్యాశాఖ నివేదిక రూపొందించే పనిలో పడింది. ఇదీ విధానం: యూనివర్సిటీ ఈసీలో 14 మంది సభ్యులు ఉంటారు. ఉన్నత విద్య, ఆర్థిక శాఖల ముఖ్య కార్యదర్శులు, వర్సిటీ ఉపకులపతి, కళాశాల విద్య కమిషనర్ లేదా సాంకేతిక వర్సిటీ అయితే సాంకేతిక విద్య కమిషనర్ ఎక్స్-అఫీషియో సభ్యులుగా ఉంటారు. వీరితోపాటు 9 మంది ఇతర సభ్యులు ఉంటారు. వారిని కొలీజియం ఎంపికచేస్తుంది. వర్సిటీ కళాశాల నుంచి సీనియర్ ప్రొఫెసర్, ప్రిన్సిపల్, టీచర్, అఫ్లియేటెడ్ కళాశాల నుంచి ప్రిన్సిపల్, టీచర్, వివిధ రంగాల్లోని నలుగురు ప్రముఖులు ఈసీ లో ఉంటారు. ఈసీ లేనపుడు ఎక్స్-అఫీషియో సభ్యులే పాలిస్తారు. -
'తక్షణమే ఛాంబర్లు ఖాళీ చేయండి'
-
'తక్షణమే ఛాంబర్లు ఖాళీ చేయండి'
హైదరాబాద్ : మాజీ మంత్రులు తక్షణమే ఛాంబర్లు ఖాళీ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఆ మేరకు సాధారణ పరిపాలన శాఖ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించిన నేపథ్యంలో ఈనెల 7వ తేదీలోగా తాజా మాజీ మంత్రులు అంతా ఛాంబర్లు ఖాళీ చేయాలని సూచించింది. అలాగే ఆయా శాఖల అంతర్గతంగా ఆదేశాలు ఇచ్చింది. కాగా కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి రాజీనామా చేశారని సమాచారం అందగానే మంత్రుల కార్యాలయాల్లో పనిచేసే సిబ్బంది (పర్సనల్ సెక్రటరీలు, ఆఫీసర్ ఆన్ డ్యూటీ, పర్సనల్ అసిస్టెంట్లు, పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్లు) తమ వ్యక్తిగత సరంజామాను సర్దుకుని వెళ్లిపోయిన విషయం తెలిసిందే. -
రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన దురదృష్టకరం
ప్రకాశం: రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించడంపై వైఎస్సార్ సీపీ నేత బాలినేని శ్రీనివాస్ రెడ్డి మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన, రాష్ట్రపతి పాలన రెండూ దురదృష్టకరమని తెలిపారు. ఈ సందర్భంగా ఆదివారం మీడియాతో మాట్లాడిన బాలినేని.. కాంగ్రెస్ పార్టీని దివంగత నేత వైఎస్సార్ రెండుసార్లు అధికారంలోకి తెస్తే అదే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని ముక్కలు చేసిందన్నారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన రావడం కాంగ్రెస్ కే సిగ్గుచేటన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీలకు ప్రజలు బుద్ధి చెపుతారని విమర్శించారు. -
శాంతి భద్రతలకు పటిష్టచర్యలు: గవర్నర్
-
రాష్ట్రానికి అదనపు బలగాలు: డీజీపీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రపతిపాలన నేపథ్యంలో రాష్ట్రంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని రకాల ముందు జాగ్రత్త చర్యలను తీసుకుంటున్నామని డీజీపీ బి.ప్రసాదరావు తెలిపారు. హైదరాబాద్లో శనివారం జరిగిన పోలీసు అధికారుల సంఘం విస్తృతస్థాయి సమావేశానికి హాజరైన ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రపతిపాలన పురస్కరించుకుని శాంతిభద్రతలపరంగా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని విలేకరులు అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ ప్రస్తుతం ఉన్న కేంద్ర బలగాలకు తోడు ముందు జాగ్రత్తలో భాగంగా మరికొన్ని అదనపు బలగాలను కేంద్రం నుంచి రప్పిస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో శాంతిభద్రతలు సవ్యంగా ఉన్నాయని చెప్పారు. నగర పోలీసు కమిషనరేట్లు, ఇతర జిల్లాల్లో ముందస్తు చర్యగా పలు జాగ్రత్తలను తీసుకున్నామని వెల్లడించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలమేరకే భారీ ఎత్తున డీఎస్పీల బదిలీలు జరిపామని, మరికొన్ని బదిలీలు జరుగుతాయని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. సాధారణ ఎన్నికల్లో ప్రతి ఓటరు స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకునేలా చూస్తామని ఆయన తెలిపారు. -
కిరణ్ ‘చివరి’ సంతకాలపై గవర్నర్ సమీక్ష?
సాక్షి, హైదరాబాద్: నిన్నటి వరకు ముఖ్యమంత్రిగా పనిచేసిన కిరణ్కుమార్రెడ్డికి రాష్ట్ర గవర్నర్ నరసింహన్ ఝలక్ ఇవ్వనున్నారా? ముఖ్యమంత్రిగా గత మూడు నెలల్లో కిరణ్కుమార్రెడ్డి తీసుకున్న నిర్ణయాలను.. రాష్ట్రపతి పాలనతో రాష్ట్ర పాలనా పగ్గాలు అందుకున్న గవర్నర్ సమీక్షించనున్నారా? అధికార వర్గాల నుంచి అవుననే సమాధానం వస్తోంది. ముఖ్యమంత్రిగా కిరణ్ గత డిసెంబర్ నుంచి.. రాజీనామా చేసిన రోజు ఫిబ్రవరి 19వ తేదీ వరకు తీసుకున్న నిర్ణయాలను గవర్నర్ నరసింహన్ తిరగతోడనున్నట్లు అధికార వర్గాల సమాచారం. కిరణ్ సీఎం పదవిలో ఉన్న చివరి రోజుల్లో నిబంధనలను తుంగలో తొక్కి అనేక నిర్ణయాలను తీసుకున్నారని, నిబంధనలకు విరుద్ధంగా, అధికారులు వద్దన్నా పట్టించుకోకుండా కొన్ని కేసుల్లో భూముల కేటాయింపులు చేశారని అధికార వర్గాలు చెప్తున్నాయి. ఈ భూముల కేటాయింపులకు సంబంధించి రెవెన్యూ శాఖ ఫైళ్లపై కిరణ్ సీఎంగా చివరి రోజుల్లో సంతకాలు చేశారు. ళ పరిశ్రమలు, స్టాంపులు - రిజస్ట్రేషన్లు, విద్యాశాఖలకు సంబంధించిన పలు అంశాల ఫైళ్లపై కిరణ్ ముఖ్యమంత్రిగా చివరి రోజుల్లో సంతకాలు చేశారు. ఆయన రాజీనామా చేయటంతో ఆ సంతకాలు చేసిన ఫైళ్లకు సంబంధించిన జీవోలను అధికారులు జారీ చేయలేదు. ఆ ఫైళ్లను పక్కన పెట్టారు. ళ కిరణ్ రాజీనామా చేయటానికి ఒక్క రోజు ముందు సామూహికంగా 600 మంది ఉపాధ్యాయులను ఒక్క సంతకంతో బదిలీలు చేయటానికి ఆమోదం తెలిపారు. ఆయన రాజీనామా చేయటంతో విద్యాశాఖ అధికారులు ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించి ఉత్తర్వులు జారీ చేయకుండా నిలుపుదల చేశారు. విద్యా సంవత్సరం మధ్యలో పైరవీలు, సిఫారసులతో పెద్ద ఎత్తున ఉపాధ్యాయులను బదిలీలు చేయటంతో విద్యార్థులకు చేటు జరుగుతుందని, కౌన్సెలింగ్ విధానానికి తూట్లు పొడిచారని ‘సాక్షి’ వెలుగులోకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే. ళ 800 మంది కాంట్రాక్టు రెసిడెంట్ టీచర్ల సర్వీసును క్రమబద్ధీకరణ చేస్తూ కిరణ్ సీఎంగా చివరి రోజుల్లో నిర్ణయం తీసుకున్నారు. ఆర్థికశాఖ అధికారులు.. ఇలా సర్వీసు క్రమబద్ధీకరణ రాజ్యాగ నిబంధనలకు విరుద్ధమని పేర్కొన్నప్పటికీ కిరణ్ సంబంధిత ఫైలుపై సంతకం చేశారు. ఈ ఫైలును కూడా విద్యాశాఖ అమలు చేయకుండా ఆర్థికశాఖకు పంపగా ఆర్థికశాఖ ఉన్నతాధికారి ఉత్తర్వులు జారీ చేయకుండా నిలుపుదల చేశారు. ళ కమిషనర్ ఆఫ్ ఇంక్వైరీస్ అధికారుల పదవీ కాలం ఫిబ్రవరిలో ముగియనుండగా వారినే మరో రెండేళ్ల పాటు కొనసాగించేందుకు గత డిసెంబర్లోనే సీఎంగా కిరణ్ ఆమోదం తెలిపారు. వీటితో పాటు మరి కొన్ని సంస్థల్లో నామినేటెడ్ పోస్టులనూ కిరణ్ భర్తీ చేశారు. ఈ అన్ని అంశాలపై గవర్నర్ నరసింహన్ సమీక్షించనున్నట్లు అధికార వర్గాలు చెప్తున్నాయి. గతంలోనూ కిరణ్తో గవర్నర్కు విభేదాలు... ముఖ్యమంత్రిగా కిరణ్కుమార్రెడ్డి తీసుకున్న సమాచార హక్కు కమిషనర్ల నియామకం విషయంలోను, అలాగే ఇటీవల ఎమ్మెల్సీగా రఘురామిరెడ్డి నియామక నిర్ణయం విషయంలోను ఆయనతో గవర్నర్ నరసింహన్ విభేదించిన విషయం తెలిసిందే. ఇటీవల ఎమ్మెల్సీగా రఘురామిరెడ్డిని నియమించాల్సిందేనని సీఎం లేఖ రాస్తూ సంబంధిత ఫైలును రెండోసారి గవర్నర్కు పంపటం.. దానిపై గవర్నర్ ఇప్పటి వరకు స్పందించకపోవటం విదితమే. అలాగే సీఎంగా కిరణ్ గతంలో గవర్నర్ నరసింహన్ వ్యక్తిగతంగా బాధపడేలా వ్యవహరించారు. తిరుపతి నుంచి చెన్నై వెళ్లటానికి హెలికాప్టర్ను ఏర్పాటు చేయాల్సిందిగా గవర్నర్ కోరగా అందుకు కిరణ్ నిరాకరించినప్పుడు గవర్నర్ ఆవేదన చెందారు. నేడు గవర్నర్ విలేకరుల సమావేశం.. సాక్షి, హైదరాబాద్: గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ఆదివారం సాయంత్రం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించిన నేపథ్యం లో.. రాష్ట్ర పాలనా యంత్రాంగం మొత్తం ఇకపై ఆయన కనుసన్నల్లో నడవాల్సి ఉన్న విషయం విదితమే. అందు లో భాగంగా రాష్ట్రపతి పాలన సమయంలో ఏ విధంగా వ్యవహారాలు ఉంటాయి, పాలన ఎలా కొనసాగుతుంది, పాటించాల్సిన నియమ నిబంధనలకు సంబంధించిన అంశాల గురించి గవర్నర్ వివరించే అవకాశం ఉన్నట్లు సమాచారం. కిరణ్కుమార్రెడ్డి ఫిబ్రవరి 19న రాజీనామా చేసినప్పటి నుంచి సీఎం సహాయ నిధి నుంచి రోగులకు అందే సాయం అందడం లేదు. దీనిపై రోగులు క్యాంపు కార్యాలయం, సచివాలయం చుట్టూ తిరుగుతున్నా.. ఎవ రూ దీనిపై సరిగా స్పందించడం లేదు. రాష్ట్రపతి పాలన సమయంలో ఈ సహాయాన్ని ఎవరు అందిస్తారన్న అంశంపై సందిగ్ధత నెలకొంది. గవర్నర్ను సాధారణంగా కలవడం సాధ్యం కానందున ఈ బాధ్యతలను గవర్నర్ ఎవరికైనా అప్పగిస్తారేమో వేచి చూడాల్సి ఉంది. -
పెండింగ్లో టీచర్ల సమస్యలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రపతి పాలన కారణంగా ఉపాధ్యాయుల సమస్యలు పెండింగ్లో ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. సీఎం ఆమోదిం చిన ఫైళ్లకు కూడా మోక్షం లభించడం అనుమానమేనని అధికారవర్గాలు చెబుతున్నా యి. రాష్ట్ర విభజన ప్రక్రియ పూర్తయిన తర్వాతే వీటికి పరిష్కారం లభిస్తుందని ఆ వర్గాలు అంటున్నాయి. సమస్యల పరిష్కారానికి అధికారవర్గాలు చొరవ తీసుకోవాలని ఉపాధ్యాయ సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ఉపాధ్యాయుల ముఖ్యమైన సమస్యలు ఇవీ.. 2,500 పండిట్, 2,500 పీఈటీ పోస్టుల అప్గ్రెడేషన్కు సీఎం, ఆర్థిక శాఖల ఆమోదముద్ర పడింది. ఈ ఫై లు విద్యాశాఖకు చేరేసరికి ఆ శాఖ కార్యదర్శి రాజేశ్వర్ తివారీ సెలవులో వెళ్లడంతో జీవో నిలిచి పోయింది. పంచాయతీరాజ్ ఉపాధ్యాయులకు హాఫ్ పే లీవ్ను నగదుగా మార్చుకొనే ప్రతిపాదనకు సీఎం ఆమోదం తెలిపారు. కానీ ఆర్థిక శాఖ కొర్రీ వేయడంతో ఫైల్ నిలిచిపోయింది. ప్రతి ఏటా ఉత్తమ ఉపాధ్యాయులకు ఇచ్చే జాతీయ అవార్డులకు రాష్ట్ర ప్రభుత్వం సిఫార్సు చేసే పేర్లతో కూడిన ఫైల్ ఇంకా కేంద్ర ప్రభుత్వానికి చేరలేదు. ఎయిడెడ్ టీచర్లకు గ్రాంట్ విడుదల చేయకపోవడం వల్ల జనవరి నుంచి జీతాలు రావడంలేదు. గవర్నర్ గ్రాంట్ విడుదల చేయిస్తేనే జీతాలు అందుతాయి. లేదంటే కొత్త ప్రభుత్వం ఏర్పడేవరకు ఎయిడెడ్ టీచర్లకు పస్తులే. స్పెషల్ టీచర్లకు నోషనల్ ఇంక్రిమెంట్లు మంజూరు చేసే ఫైలు ఆర్థిక, విద్యాశాఖల మధ్య తిరుగుతోంది. ఎన్నికల ముందు ఉత్తర్వులు రావడం అనుమానమే. ఎయిడెడ్ స్కూళ్ల సిబ్బందికి 2009 నుంచి కారుణ్య నియామకాలు అమలు చేస్తున్నారు. ఉపాధ్యాయ సంఘాల డిమాండ్ మేరకు 2004-09 మధ్య కూడా ఈ నియామకాలు వర్తింపజేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఇప్పుడు దీనికి పరిష్కారం లభించే అవకాశం లేనట్లేనని అధికారవర్గాలు అంటున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా రాజకీయ నేతల జోక్యంతో జరిగిన 800 మంది టీచర్ల బదిలీలు, ఏపీ రెసిడెన్షియల్ స్కూళ్ల కాంట్రాక్టు టీచర్ల సర్వీసు క్రమబద్దీకరణ కూడా రాష్ట్రపతి పాలన కారణంగా నిలిచిపోయినట్లేనని అధికారులు చెబుతున్నారు. -
రాజముద్ర
రాష్ట్రపతి పాలనకు.. విభజన బిల్లుకు.. ఆంధ్రప్రదేశ్ గవర్నర్ నుంచి నాకు నివేదిక అందింది. ఆ నివే దికను, నాకు అందిన ఇతర సమాచారాన్ని పరిగణనలోకి తీసుకున్నాను. భారత రాజ్యాంగం ప్రకారం రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం లేని పరిస్థితి ఏర్పడిందని అర్థం చేసుకున్నాను. అందువల్ల రాజ్యాంగంలోని ఆర్టికల్ 356 కింద నాకు సంక్రమించిన అధికారాల మేరకు రాష్ట్రంలో ప్రభుత్వ పాలనను భారత రాష్ట్రపతిగా నేను చేపడుతున్నట్లు ప్రకటిస్తున్నాను. 2014 మార్చి ఒకటో తేదీ నుంచి నా మార్గదర్శకంలో రాష్ట్ర గవర్నర్ రాష్ట్ర ప్రభుత్వ విధులను నిర్వర్తిస్తారు. రాష్ట్ర శాసన వ్యవస్థ అధికారాలను నేరుగా పార్లమెంటు ద్వారా గానీ పార్లమెంటు యంత్రాంగం ద్వారా గానీ నిర్వర్తించటం జరుగుతుందని ప్రకటిస్తున్నాను... - రాజపత్రంలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సాక్షి, న్యూఢిల్లీ/హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్కు సంబంధించి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ రెండు కీలకమైన నిర్ణయాలపై శనివారం చరిత్రాత్మక సంతకాలు చేశారు. ఒకటి- రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధిస్తూ అధికారికంగా ప్రకటన జారీచేశారు. అలాగే శాసనసభను సుప్తచేతనావస్థలో ఉంచుతున్నట్లు కూడా ఆదేశాలు జారీచేశారు. ఈ ప్రకటనను రాజపత్రం రూపంలో కేంద్ర హోంశాఖ భారత గెజిట్లో ప్రచురించింది. దీంతో రాష్ట్రంలో అధికారికంగా రాష్ట్రపతి పాలన అమలులోకి వచ్చింది. రెండోది- రాష్ట్రాన్ని విభజించి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చేయటానికి ఉద్దేశించిన ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు - 2014కు కూడా రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారు. ఫిబ్రవరి 18న లోక్సభ, 20న రాజ్యసభ ఆమోదించిన ఈ బిల్లు రాష్ట్రపతి ఆమోదంతో చట్టరూపం దాల్చినట్లయింది. అయితే ఈ చట్టానికి సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ను ప్రచురించటానికి మరికొంత సమయం పడుతుందని కేంద్ర హోంశాఖ వర్గాలు తెలిపాయి. అలాగే.. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర అవతరణ తేదీ (అపాయింటెడ్ డే) ఎప్పుడు ఉంటుందన్న సస్పెన్స్ మాత్రం ఇంకా వీడలేదు. దీనిపై కేంద్ర హోంశాఖ విడిగా ప్రకటన చేసే అవకాశముంది. మరోవైపు.. రాష్ట్రపతి పాలన గెజిట్ వెలువడటంతోనే రాష్ట్రంలో ముఖ్యమంత్రి, మంత్రి పదవులను రద్దు చేస్తూ సాధారణ పరిపాలన శాఖ జీవో నంబర్లు 58, 59 ఉత్తర్వులు జారీచేసింది. ప్రభుత్వ వెబ్సైట్లతో పాటు కార్యాలయాల్లో సైతం.. సీఎం, మంత్రుల ఫొటోలను తొలగించి గవర్నర్ నరసింహన్ ఫొటోలు పెట్టారు. గవర్నర్ ఆదివారం ఉదయం అధికారికంగా పాలనా బాధ్యతలు చేపట్టనున్నారు. చట్టంగా మారిన విభజన బిల్లు... ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లును సీమాంధ్ర ప్రాంత కేంద్రమంత్రులు, పార్లమెంటు సభ్యులతో పాటు.. పలు జాతీయ పార్టీల తీవ్ర వ్యతిరేకత మధ్య ఫిబ్రవరి 20వ తేదీన పార్లమెంటులో ఆమోదించిన విషయం తెలిసిందే. ఈ బిల్లు ఆ తర్వాత న్యాయశాఖ, హోంశాఖల నుంచి రాష్ట్రపతి వద్దకు చేరగా.. ఆయన దానికి ఆమోదముద్ర వేయటంతో బిల్లు చట్టరూపంలోకి వచ్చింది. ఈ చట్టం ప్రకారం పది జిల్లాలతో హైదరాబాద్ రాజధానిగా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడనుంది. సీమాంధ్రలోని 13 జిల్లాలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కొనసాగుతుంది. ఈ విభజన అమలులోకి వచ్చే తేదీ (అపాయింటెడ్ డే)ను కేంద్రం ఇంకా ప్రకటించాల్సి ఉంది. దీనిపై కేంద్ర హోంశాఖ ప్రత్యేకంగా ప్రకటన చేసే అవకాశం ఉంది. విభజనకు పట్టే సమయాన్ని అంచనావేసి అపాయింటెడ్ డేను ప్రకటించనున్నట్లు సమాచారం. లోక్సభ సాధారణ ఎన్నికలతో పాటు రాష్ట్ర శాసనసభకు ఎన్నికలు ఏప్రిల్ నెలాఖరుకు పూర్తయి మే మూడో వారంలో ఫలితాలు వెలువడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో.. రెండు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు కొలువు దీరేందుకు వీలుగా జూన్ 1వ తేదీని అపాయింటెడ్ డేగా ప్రకటించే అవకాశం ఉందని పరిశీలకులు భావిస్తున్నారు. ఎన్నికల షెడ్యూలు కంటే ముందుగా అపాయింటెడ్ డే ఉండే అవకాశం లేదని అంచనా వేస్తున్నారు. అలాగే.. విభజన తర్వాత మిగిలే 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్కు కొత్త రాజధాని ఏర్పాటుపై అధ్యయనం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నిపుణుల కమిటీని కూడా త్వరలో ప్రకటించనుంది. గెజిట్ నోటిఫికేషన్ తేదీ నుంచి ఆరు నెలల్లోగా ఈ కమిటీ రాజధాని ఎంపికపై అధ్యయనం చేసి నివేదిక సమర్పిస్తుంది. సీమాంధ్ర అభివృద్ధికి ప్రత్యేక హోదా, ఇతర ప్యాకేజీలు అందిస్తామని కేంద్రం ప్రకటించినప్పటికీ.. వాటిని బిల్లులో చేర్చలేదు. రాష్ట్ర పాలన నేను స్వీకరిస్తున్నా... ముఖ్యమంత్రి రాజీనామా, మరో ప్రభుత్వ ఏర్పాటు చేసే పరిస్థితి లేకపోవటం నేపథ్యంలో.. భారత రాజ్యాంగంలోని 356వ అధికరణ కింద తనకు సంక్రమించిన అధికారాల మేరకు ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ పాలనను తాను స్వీకరిస్తున్నట్లు రాష్ట్రపతి ప్రణబ్ముఖర్జీ అధికారికంగా ప్రకటించారు. మార్చి ఒకటో తేదీ నుంచి (శనివారం నుంచే) తన మార్గదర్శకంలో గవర్నర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ విధులను నిర్వర్తిస్తారని ఆయన పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లుకు పార్లమెంటు ఆమోదం నేపథ్యంలో.. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తున్నానంటూ కిరణ్కుమార్రెడ్డి ఫిబ్రవరి 19వ తేదీన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. గవర్నర్ విజ్ఞప్తి మేరకు అప్పటి నుంచీ శనివారం వరకూ కిరణ్ ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఈ మధ్య పది రోజుల పాటు రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటుపై కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తీవ్రస్థాయిలో మల్లగుల్లాలు పడింది. రెండు ప్రాంతాల సీనియర్ నేతలనూ ఢిల్లీకి పిలిపించి విడతల వారీగా చర్చలు జరిపింది. ముఖ్యమంత్రి పదవిని ఆశిస్తున్న పలువురు నేతలు ఢిల్లీలో మకాం వేసి పైరవీలు సైతం చేశారు. అయితే.. పార్టీ రాష్ట్ర నేతల్లో.. ముఖ్యంగా సీమాంధ్ర నేతల మధ్య అనైక్యత బయటపడటంతో హైకమాండ్ పెద్దలు వెనుకంజ వేశారు. ఎవరికి సీఎం పీఠం ఇచ్చినా నేతల మధ్య లుకలుకలు బట్టబయలై పార్టీకి మరింత చేటు చేస్తుందని.. ఒక వర్గం వారికి సీఎం పదవి ఇస్తే.. మరొక వర్గం వారు పార్టీకి దూరమవుతారని ఆందోళనలో పడింది. తీవ్ర తర్జనభర్జనల అనంతరం.. ఎన్నికలు సమీపించిన తరుణంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటంకన్నా రాష్ట్రపతి పాలన విధించటమే ఉత్తమమన్న నిర్ణయానికి వచ్చింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ప్రభుత్వ పాలనకు ప్రత్యామ్నాయం ఏర్పాటు చేయాల్సిన అవసరముందని గవర్నర్ నరసింహన్ కేంద్ర హోంశాఖకు నివేదిక ఇచ్చారు. ఈ మేరకు శుక్రవారం జరిగిన కేంద్ర కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకుని.. రాష్ట్రంలో శాసనసభను సుప్తచేతనావస్థలో ఉంచి, రాష్ట్రపతి పాలన విధించాల్సిందిగా ప్రణబ్ముఖర్జీకి సిఫారసు చేయగా ఆయన శనివారం దీనిని ఆమోదిస్తూ అధికారిక ప్రకటన జారీచేశారు. దీంతో.. రాష్ట్రపతి ప్రతినిధిగా గవర్నర్ నరసింహన్ రాష్ట్రంలో పాలనా వ్యవహారాలను నడిపించనున్నారు. వెబ్సైట్లలో గవర్నర్ ఫొటోలు ప్రత్యక్షం రాష్ట్ర ప్రభుత్వ అధికారిక వెబ్సైట్లు, సీఎం, మంత్రుల వెబ్సైట్లలో ఇప్పటివరకూ ఆయా పదవుల్లో ఉన్న నాయకుల ఫొటోలను తొలగించారు. ఆ స్థానంలో గవర్నర్ నరసింహన్ ఫొటోలు ప్రత్యక్షమయ్యాయి. అధికారిక వెబ్సైట్లో సీఎం ఫొటో కోసం క్లిక్ చేస్తే రాష్ట్రపతి పాలన అని ఉంది. ఇక ప్రభుత్వ కార్యాలయాలన్నింటిలోను ముఖ్యమంత్రి ఫొటోకు బదులుగా గవర్నర్ నరసింహన్ ఫొటోలు పెట్టనున్నారు. అమాత్యుల అధికార దర్పానికి సెలవు... సాక్షి, హైదరాబాద్: రాష్ట్రపతి పాలన విధిస్తూ గెజిట్ నోటిఫికేషన్ జారీ కావటంతో ముఖ్యమంత్రితో పాటు రాష్ట్ర మంత్రులందరినీ తొలగిస్తూ సాధారణ పరిపాలన శాఖ శనివారం ఉత్తర్వులు జారీచేసింది. మంత్రుల అధికార వాహనాలను, సిబ్బందిని సాధారణ పరిపాలన శాఖ వెనక్కు తీసేసుకోనుంది. ఇన్ని రోజులు ఐదారుగురు సెక్యూరిటీ సిబ్బందితో పాటు బుగ్గ కార్లలో అధికార దర్పాన్ని ప్రదర్శించిన మంత్రులు ఇక సాధారణ పౌరులుగా మిగిలిపోనున్నారు. వారి అధికారిక వాహనాలను వెంటనే తొలగించనున్నారు. ప్రభుత్వ సెక్యూరిటీని కుదించనున్నారు. వ్యక్తిగతంగా ఎవరినుంచైనా ప్రాణహాని ముప్పు ఉన్న వారికి మాత్రమే పరిమితంగా ప్రభుత్వ సెక్యూరిటీని కల్పించనున్నారు. ఇప్పటికే కిరణ్కుమార్రెడ్డి సీఎం అధికార నివాసాన్ని ఖాళీ చేయగా.. తాజాగా మాజీ అయిన మంత్రు లు కూడా అధికార నివాసాలను ఖాళీ చేయాల్సి ఉంది. ఇందుకు నెల రోజుల సమయం ఇవ్వనున్నారు. సీఎం, మంత్రుల పేషీల్లోని సిబ్బంది వారి వారి సొంత శాఖలకు వెళ్లిపోనున్నారు. ఎమ్మెల్యేలకు ఇక జీతాలు మాత్రమే... మంత్రులతో పాటు ఎమ్మెల్యేలు కూడా సాధారణ పౌరులుగానే ఉంటారు. శాసనసభ సుప్తచేతనావస్థలో ఉన్నందున వారికి కేవలం ఎమ్మెల్యేలుగా వేతనాలు మాత్రం ఇస్తారు. ఇన్ని రోజులూ జిల్లాలకు వెళితే ఉండే ప్రొటోకాల్ దూరం కానుంది. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు వచ్చే పరిస్థితి ఉండదు. దీనికి తోడు వెంటనే ఎన్నికల షెడ్యూల్ వెలువడనున్నందన ఎమ్మెల్యేల హోదాలో కూడా ఎటువంటి అధికారాన్ని చెలాయించలేరని అధికార వర్గాలు పేర్కొన్నాయి. రాష్ట్రపతి పాలనకు గెజిట్ నోటిఫికేషన్ జారీ కావటంతో సాధారణ పరిపాలన శాఖ కూడా సీఎం, మంత్రులను తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. -
'కాంగ్రెస్ది అవకాశవాద రాజకీయం'
-
ఇకపై పాలన సలహాదారులదే
-
'రాష్ట్రపతి పాలన దృష్ట్యా పటిష్ట భద్రత'
-
పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు: డీజీపీ
రాష్ట్రపతి పాలన విధించిన దృష్ట్యా పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు డీజీపీ బయ్యారపు ప్రసాదరావు తెలిపారు. అవసరమైతే అదనపు బలగాలను దింపుతామని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. మరోవైపు రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన, ఎన్నికల నేపథ్యంలో నగర పోలీస్ అధికారులతో పోలీసు కమిషనర్ అనురాగ్శర్మ సమావేశమయ్యారు. నగర పోలీసులను ఆయన అప్రమత్తం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ హైదరాబాద్, సికింద్రాబాద్ ప్రాంతాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. -
విభజన బిల్లుకు, రాష్ట్రపతి పాలనకు ప్రణబ్ ఆమోదం
న్యూఢిల్లీ: పార్లమెంటు ఉభయ సభలు ఆమోదించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లు(తెలంగాణ బిల్లు)కు, కేంద్ర మంత్రి మండలి సిఫారసు చేసిన రాష్ట్రపతి పాలనకు ప్రణబ్ ముఖర్జీ ఆమోదం తెలిపారు. కాసేపట్లో గెజిట్ నోటిఫికేషన్ విడుదలవుతుంది. నోటిఫికేషన్ విడుదల కాగానే రాష్ట్ర పాలన పగ్గాలు గవర్నర్ చేతిలోకి వెళతాయి. రాష్ట్రపతి పాలన ఉన్నన్ని రోజులూ రాష్ట్రానికి సంబంధించిన పాలనా కార్యక్రమాలన్నీ రాష్ట్రపతి, గవర్నర్ల ద్వారా కేంద్రమే నిర్వహిస్తుంది. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనకు కేంద్ర మంత్రి మండలి నిన్న సిఫారసు చేసిన విషయం తెలిసిందే. కేంద్ర మంత్రి మండలి నిన్న ప్రధానమంత్రి మన్మోహన్సింగ్ నివాసంలో సమావేశమే ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. సమావేశం అనంతరం కేంద్ర హోంమంత్రి సుశీల్కుమార్షిండే రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలసి మంత్రివర్గ సిఫారసును ఆయనకు నివేదించారు. కేబినెట్ నిర్ణయానికి రాష్ట్రపతి ఆమోద ముద్ర వేశారు. ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రపతి పాలన విధించడం ఇది రెండోసారి. తొలిసారి 1973 జనవరి 11 నుంచి 1973 డిసెంబరు 10 వరకు 11 నెలల పాటు రాష్ట్రపతి పాలన విధించారు. అప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పి.వి.నరసింహారావు ఉన్నారు. జై ఆంధ్ర ఉద్యమం కారణంగా శాంతిభద్రతలు అదుపు తప్పటంతో అనివార్య పరిస్థితుల్లో రాష్ట్రపతి పాలన విధించారు. ఆంధ్రప్రదేశ్ ఏర్పడక ముందు ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఒకసారి రాష్ట్రపతి పాలన విధించారు. 1954 నవంబర్ 15 నుంచి 1955 మార్చి 29 వరకు రాష్ట్రపతి పాలన విధించారు. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో కేంద్రం ఇప్పటివరకు సుమారు 120 సార్లు రాష్ట్రపతి పాలన విధించింది. -
విభజన బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం
-
రాష్ట్రంలో రెండోసారి
-
గవర్నర్ పాలన దురదృష్టకరం: మైసూరా
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పరిపాలన సాగించలేక ప్రజల జీవితాలను ఛిద్రం చేసిన కాంగ్రెస్ పార్టీ ఆఖరికి చేతులెత్తేసి గవర్నర్ పాలనకు సిఫార్సు చేయడం దురదృష్టకరమని వైఎస్సార్సీపీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు ఎంవీ మైసూరారెడ్డి వ్యాఖ్యానించారు. ఆయన శుక్రవారమిక్కడ విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రం లోనూ కేంద్రంలోనూ సుస్థిర ప్రభుత్వాలు ఏర్పాటు చేయండంటూ ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా కాంగ్రెస్కు ఓట్లేసి గెలిపిస్తే రాష్ట్ర పురోభివృద్ధిని కుక్కలు చింపిన విస్తరిలా మార్చి, చివరికి రాష్ట్రపతి పాలనకు సిఫార్సు చేయడం దారుణమన్నారు. ‘‘నాలుగున్నరేళ్లుగా టీడీపీ మద్దతు, కుమ్మక్కు వల్లే కాంగ్రెస్.. ప్రభుత్వాన్ని నిలుపుకోగలిగింది. లేకపోతే ఎప్పుడో కూలిపోయేది. పడవ మునిగేటప్పుడు ప్రాణరక్షణ కోసం పరుగులు తీసినట్టు అధికార కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆ పార్టీ మునిగిపోతుండటంతో ఇతర పార్టీల్లోకి పరుగులు తీస్తున్నారు. దాంతో ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి వారం రోజులుగా అనేక డ్రామాలాడారు. ఫలానా వ్యక్తి సీఎం అంటూ లీకులిచ్చారు. కానీ ఎవరూ నిలబడలేకపోవడంతో కాంగ్రెస్ పలాయనమంత్రం పఠించింది. గవర్నర్ పాలనకు మొగ్గుచూపింది’’ అని ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాలంటూ కర్ణాటకకు చెందిన ఒక పెద్దమనిషిని రెండుసార్లు రాజ్యసభకు పం పిస్తే, ఆ వ్యక్తే 3 ప్రాంతాల్లోని తెలుగు ప్రజలమధ్య చిచ్చు పెట్టారని కేంద్రమంత్రి జైరాం రమేశ్నుద్దేశించి వ్యాఖ్యానించారు. కేంద్రం ప్రకటనలకు విలువుండదు: మూడు నెలల తర్వాత దేశంలో నామరూపాల్లేకుండా పోయే పార్టీ చేసే ప్రకటనలకు ఏం విలువ ఉంటుం దని మైసూరా ప్రశ్నించారు. తుమ్మితే ఊడిపోయే ప్రధాని పార్లమెంటులో చేసిన ప్రకటనలకు విలువే లేదన్నారు. వచ్చే ఎన్నికల తర్వాత సోనియా, రాహుల్లు పెట్టె సర్దుకుని ఇటలీకి వెళ్లాల్సిందేనన్నారు. ‘‘దేశవ్యాప్తంగా కాంగ్రెస్కు 60కి మించి లోక్సభ సీట్లొచ్చే పరిస్థితే లేదని లోకం కోడై కూస్తోంది. కానీ మతిభ్రమించిన చంద్రబాబు మాత్రం వైఎస్సార్సీపీ పట్ల పిచ్చిపిచ్చిగా అవాకులు పేలుతున్నారు. దేశంలో బిచాణా ఎత్తేసి కనుమరుగయ్యే కాంగ్రెస్తో మేమెందుకు జతకడతాం? తెలుగు ప్రజల మధ్య చిచ్చుపెట్టిన వారితో ఎట్టి పరిస్థితిలోనూ కలిసే ప్రసక్తే లేదు. తెలుగు ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం రాష్ట్రాన్ని ఆదుకోవడానికి ముందుకొచ్చే వారికి మాత్రమే కేంద్రంలో వైఎస్సార్సీపీ మద్దతిస్తుంది’’ అని చెప్పారు. ఆ పత్రిక రాతలు తెలుగు ప్రజలందరికీ తెలుసు: ఆపద్ధర్మ మంత్రి టీజీ వెంకటేశ్తో ఇప్పటిదాకా తాను ఏ ఒక్కరోజు కూడా నేరుగాగానీ, ఫోన్లో గానీ మాట్లాడిన దాఖలాలు లేవని మైసూరా స్పష్టంచేశారు. టీజీని టీవీల్లో తప్పితే ఇప్పటిదాకా నేరుగా కూడా చూడలేదన్నారు. టీజీని వైఎస్సార్సీపీలోకి రావాలని తాను కోరినట్టుగా ‘ఆంధ్రజ్యోతి’లో వచ్చిన కథనాన్ని విలేకరులు ప్రస్తావించగా మైసూరా ఇలా స్పందించారు. తమ పార్టీపై, తమ అధినేత జగన్పై ఆ పత్రిక ఏం రాస్తుందో, ఎలా రాస్తుందో, ఎందుకలా రాస్తుందో తెలుగు ప్రజానీకానికి తెలుసనన్నారు. వైఎస్సార్సీపీలో స్థానం దొరకని, అవకాశంలేనివారే ఇతర పార్టీల్లోకి వెళ్తున్నారని చెప్పారు. -
రాష్ట్రంలో రెండోసారి
రాష్ట్రపతి పాలనకు కేంద్ర కేబినెట్ సిఫారసు రాష్ట్రపతికి నివేదించిన షిండే.. ఇక ప్రణబ్ ఆమోదమే తరువాయి సుప్తచేతనావస్థలో శాసనసభ.. జూన్ 2 వరకూ ప్రాణమున్నట్టే ఆలోపు రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసే అవకాశం సజీవం కాంగ్రెస్లో లుకలుకలు బయటపడతాయనే అధిష్టానం వెనకంజ! ఇక ఎన్నికల తర్వాతే రెండు రాష్ట్రాల్లో కొత్త ప్రభుత్వాల ఏర్పాటు? సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయటంపై సుదీర్ఘంగా తర్జనభర్జనలు పడ్డ కాంగ్రెస్ పార్టీ చివరకు చేతులు ఎత్తేసింది. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనకు కేంద్ర మంత్రివర్గం సిఫారసు చేసింది. అలాగే.. శాసనసభను సుప్తచేతనావస్థలో ఉంచాలని కూడా రాష్ట్రపతికి నివేదించింది. శుక్రవారం ఉదయం 10.40 గంటల నుంచి గంట పాటు ప్రధానమంత్రి మన్మోహన్సింగ్ నివాసంలో జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. సమావేశం అనంతరం కేంద్ర హోంమంత్రి సుశీల్కుమార్షిండే రాష్ట్రపతి ప్రణబ్ముఖర్జీని కలసి మంత్రివర్గ సిఫారసును ఆయనకు నివేదించారు. కేబినెట్ నిర్ణయానికి రాష్ట్రపతి ఆమోద ముద్ర లభించగానే రాష్ట్ర పాలన పగ్గాలు గవర్నర్ చేతికి అందనున్నాయి. రాష్ట్రపతి పాలన ఉన్నన్ని రోజులూ రాష్ట్రానికి సంబంధించిన పాలనా కార్యక్రమాలన్నీ.. రాష్ట్రపతి, గవర్నర్ల ద్వారా కేంద్రమే నడిపించనుంది. సర్కారు ఏర్పాటు అవకాశం సజీవం రాష్ట్రపతి పాలనకు పార్లమెంటు ఆమోదముద్ర వేసే వరకు అసెంబ్లీని సుప్తచేతనావస్థలో ఉంచడం ద్వారా ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం కల్పించాలని గతంలో సుప్రీంకోర్టు ఒక కేసులో ఇచ్చిన తీర్పు మేరకు.. రాష్ట్ర అసెంబ్లీని సుప్తచేతనావస్థలో ఉంచాలని కేంద్రం సిఫారసు చేసింది. అంటే.. అసెంబ్లీ రద్దుకాకుండా నిద్రాణ స్థితిలో ఉంటుంది. ప్రస్తుత అసెంబ్లీకి జూన్ 2 వరకు గడువు ఉంది. ఈలోగా ఎప్పుడైనా రాష్ట్రపతి పాలనను తొలగించి తిరిగి ఇదే సభ్యులతో ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది. ఇటీవల ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా అనంతరం కూడా కేంద్రం ఇదే రీతిలో వ్యవహరించింది. గవర్నర్ నివేదికతో నిర్ణయం: ఫిబ్రవరి 20న రాజ్యసభలో ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు ఆమోదం పొందిన మరుసటి రోజు.. కిరణ్కుమార్రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. అనంతరం గవర్నర్ కోరిక మేరకు ఆయన ఇప్పటివరకు ఆపధ్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగారు. ముఖ్యమంత్రి రాజీనామా విషయాన్ని గవర్నర్ ప్రతిపక్షాల నేతలకు సమాచారమిచ్చారు. అలాగే ప్రభుత్వ ఏర్పాటుపై ఆలోచించాలని కూడా కోరారు. కానీ అధికార కాంగ్రెస్ సహా ఏ పక్షమూ సర్కారు ఏర్పాటుకు ముందుకు రాలేదు. దీంతో గవర్నర్ ప్రత్యామ్నాయ ఏర్పాటు కోసం కేంద్ర హోంశాఖకు నివేదిక సమర్పించారు. హోంశాఖ నివేదన మేరకు కేంద్ర కేబినెట్ శుక్రవారం రాష్ట్రపతి పాలనకు సిఫారసు చేస్తూ నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్లో రెండోసారి: ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రపతి పాలన విధించడం ఇది రెండోసారి. తొలిసారి 1973 జనవరి 11 నుంచి 1973 డిసెంబరు 10 వరకు 11 నెలల పాటు రాష్ట్రపతి పాలన విధించారు. అప్పుడు రాష్ట్రముఖ్యమంత్రిగా పి.వి.నరసింహారావు ఉన్నారు. జై ఆంధ్ర ఉద్యమం కారణంగా శాంతిభద్రతలు అదుపు తప్పటంతో అనివార్య పరిస్థితుల్లో రాష్ట్రపతి పాలన విధించారు. ఆంధ్రప్రదేశ్ ఏర్పడకముందు ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఒకసారి రాష్ట్రపతి పాలన విధించారు. 1954 నవంబర్ 15 నుంచి 1955 మార్చి 29 వరకు రాష్ట్రపతి పాలన విధించారు. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో కేంద్రం ఇప్పటివరకు సుమారు 120 సార్లు రాష్ట్రపతి పాలన విధించింది. జూన్ 1న కొత్త రాష్ట్రాల్లో కొత్త ప్రభుత్వాలు! రాష్ట్ర విభజన నేపథ్యంలో పంపకాలు, ఇతరత్రా అంశాల్లో పార్టీ చేతికి మట్టి అంటకుండా చేసుకునేందుకు, ప్రభుత్వ వ్యతిరేకత ఎన్నికల వరకు కొనసాగకుండా ఉండేందుకు ఈ తాజా నిర్ణయం దోహదపడుతుందన్న ఆలోచన కూడా కాంగ్రెస్ పెద్దల్లో ఉంది. రాష్ట్ర విభజనను తొలుత ఆగమేఘాలపై ఐదారు రోజుల్లో పూర్తిచేయాలని భావించినా.. హడావుడిగా చేశారన్న అపప్రథ రావటం ఎందుకని మిన్నకుంది. గతంలో రాష్ట్ర విభజనకు కనీసం 90 రోజుల సమయం పట్టిన దాఖలాలు ఉన్న నేపథ్యంలో ఆ విధానాలనే అనుసరించాలని భావించింది. మరోవైపు ప్రస్తుత అసెంబ్లీకి మరో 90 రోజుల గడువు మాత్రమే ఉంది. జూన్ 1 నాటికి ఎన్నికలు పూర్తయి, ఫలితాలు కూడా వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో విభజన తేదీ కూడా జూన్ 1నే పెట్టుకుని అప్పుడే రెండు రాష్ట్రాల్లో రెండు ప్రభుత్వాలు కొలువుదీరేలా చేయొచ్చని కేంద్రం భావిస్తున్నట్లు సమాచారం. లుకలుకలు బయటపడతాయనే భయం? సాధారణంగా రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు వీలుకాని పక్షంలోనే రాష్ట్రపతి పాలన విధించేందుకు కేంద్రం సుముఖత వ్యక్తంచేస్తుంది. కానీ రాష్ట్రంలో నాలుగున్నరేళ్లకు పైగా ప్రభుత్వాన్ని నడిపించి.. ఇప్పటికీ అత్యధిక సభ్యులు గల పార్టీగా ఉన్న కాంగ్రెస్.. రాష్ట్రంలో తమ నేతల్లో ఉన్న అనైక్యత, పార్టీ నుంచి వలసల కారణంగా ప్రభుత్వ ఏర్పాటు ప్రయత్నాలను విరమించుకుంది. అయితే చివరి క్షణంలో కాపు సామాజిక వర్గం వారికి ముఖ్యమంత్రి పదవి ఇచ్చి.. ఆ వర్గం వారిని ఆకట్టుకోవాలని వ్యూహం సిద్ధం చేసుకున్నా.. అది నేతల అనైక్యతతో బెడిసికొట్టినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ ఏర్పాటుతో పార్టీలో లుకలుకలు బయటపడటం మినహా పెద్దగా ఒరిగేదేమీ లేదని భావించటంతో ప్రభుత్వ ఏర్పాటు విషయాన్ని పక్కనపెట్టేసినట్లు చెప్తున్నారు. ఇక తెలంగాణ, సీమాంధ్రలకు రెండు వేర్వేరు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీలు ఏర్పాటు చేసుకుని ఎన్నికలకు వెళ్లేందుకు సిద్ధమైంది. పైకి మాత్రం ప్రస్తుతం ఎన్నికలు రాబోతున్నందున ఇక ఈ కొద్ది కాలం కోసం ప్రభుత్వ ఏర్పాటు ఎందుకని వ్యాఖ్యానిస్తోంది. -
రాష్ట్రపతి ఉత్తర్వుల అనంతరం ప్రెసిడెంట్ రూల్
-
రాష్ట్రపతి పాలనకు కేబినెట్ ఆమోదం
-
'హైకమాండ్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం'
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రపతి పాలనపై హైకమాండ్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని కాంగ్రెస్ సీనియర్ నేత గీతారెడ్డి అన్నారు. రాష్ట్రపతి పాలన విషయంలో కేంద్రం ఆచితూచి నిర్ణయం తీసుకుందని ఆమె శుక్రవారమిక్కడ తెలిపారు. ఇకనుంచి నియోజకవర్గ సమస్యలపై దృష్టి పెడతామని గీతారెడ్డి అన్నారు. అలాగే పార్టీ విజయానికి కృషి చేస్తామని గీతారెడ్డి తెలిపారు. కేంద్ర కేబినెట్ ఈరోజు ఉదయం రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనకు ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. -
రాష్ట్రపతి పాలనకు కేబినెట్ ఆమోదం
ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రపతి పాలన విధించాలని, అసెంబ్లీని సుప్త చేతనావస్థలో ఉంచాలని కేంద్ర మంత్రివర్గం నిర్ణయించింది. రాష్ట్రంలో రాజకీయంగా అస్తవ్యస్థ పరిస్థితులు ఉన్న నేపథ్యంలో రాజ్యాంగంలోని 356(1) అధికరణం కింద రాష్ట్రపతి పాలన విధించాలని కేంద్ర కేబినెట్ సమావేశంలో నిర్ణయించారు. రాష్ట్ర విభజన బిల్లును రాజ్యసభ కూడా ఆమోదించిన తర్వాత ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామా చేయడం, తదుపరి పరిణామాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రపతి పాలన సమయంలో గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ పాలనా బాధ్యతలు నిర్వర్తిస్తారు. అసెంబ్లీ పదవీ కాలం ఈ సంవత్సరం జూన్ 2వ తేదీతో ముగుస్తుంది. కొద్ది రోజుల్లోనే అసెంబ్లీతో పాటు లోక్సభకు కూడా ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేయనుంది. రాష్ట్రంలో 41 సంవత్సరాల తర్వాత మళ్లీ రాష్ట్రపతి పాలన విధిస్తున్నారు. కేంద్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకోవడంతో ఇక రాష్ట్రపతి ఆమోదమే తరువాయి. అది వచ్చిన తర్వాత, రాష్ట్ర చరిత్రలో రెండోసారి రాష్ట్రపతి పాలన వచ్చినట్లవుతుంది. తొలిసారిగా 1973లో పీవీ నరసింహారావు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జై ఆంధ్ర ఉద్యమం ఉధృతంగా రావడంతో శాంతి భద్రతల సమస్య తలెత్తింది. శాంతి భద్రతలను అదుపు చేయడం అప్పటి రాష్ట్ర ప్రభుత్వం వల్ల కాలేదు. దాంతో జనవరి 11 నుంచి డిసెంబర్ 10వ తేదీ వరకు రాష్ట్రపతి పాలన విధించారు. దేశంలో ఇప్పటివరకు 122 సార్లు రాష్ట్రపతి పాలన విధించారు. అత్యధికంగా మణిపూర్ రాష్ట్రంలో ఇప్పటికి 10 సార్లు విధించారు. తర్వాత ఉత్తరప్రదేశ్లో 9 సార్లు, బీహార్లో 8 సార్లు, పంజాబ్లో 8 సార్లు రాష్ట్రపతి పాలన విధించారు. ఇక కర్ణాటక, ఒడిశా, పుదుచ్చేరిలలో ఆరేసి సార్లు రాష్ట్రపతి పాలన వచ్చింది. మన రాష్ట్రంలో మాత్రం ఇప్పటికి ఒక్కసారే విధించగా, మరోసారి ఇప్పుడు రాష్ట్రపతి పాలన పెడుతున్నారు. రాష్ట్రపతి పాలన వస్తే.. శాసన వ్యవస్థ అంటూ ఉండదు. అధికారాలన్నీ గవర్నర్ చేతిలో ఉంటాయి. రాష్ట్రపతి ప్రతినిధిగా గవర్నరే పాలన కొనసాగిస్తారు. ప్రస్తుత గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ గతంలో రాష్ట్రపతి పాలన విధించినప్పుడు మన రాష్ట్రంలోనే ఐపీఎస్ అధికారిగా పనిచేశారు. కాబట్టి, రాష్ట్రపతి పాలన గురించి కూడా ఆయనకు అవగాహన ఉంది. రాష్ట్రపతి పాలన నేపథ్యంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రసన్న కుమార్ మహంతిని గవర్నర్ నరసింహన్ ప్రత్యేక కార్యదర్శి రమేష్ కుమార్ కలిశారు. వారిద్దరి మధ్య పాలనకు సంబంధించిన చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. వాస్తవానికి మహంతి పదవీ కాలం పూర్తయినా.. రాష్ట్ర విభజన, రాష్ట్రపతి పాలన లాంటి కీలక ఘట్టాలు ఉండటంతో ఆయన పదవీ కాలం పొడిగించిన విషయం తెలిసిందే. -
రాష్ట్రపతి పాలనకు కేబినెట్ సిఫార్సు?
-
కేబినెట్ సమావేశం ప్రారంభం..
-
కేబినెట్ సమావేశం ప్రారంభం.. రాష్ట్రపతి పాలనవైపే మొగ్గు!
ముఖ్యమంత్రి పదవికి కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామా చేయడంతో రాష్ట్రంలో అస్తవ్యస్త పరిస్థితులు ఏర్పడిన నేపథ్యంలో రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించేందుకు రంగం సిద్ధమైపోయింది. ఈ విషయమై నిర్ణయం తీసుకునేందుకు కేంద్ర మంత్రివర్గం శుక్రవారం ఉదయం సమావేశమైంది. ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశంలో తెలంగాణ అంశంపై కేంద్రం నియమించిన జీవోఎం సభ్యులు, ఇతర సీనియర్ మంత్రులు కూడా పాల్గొన్నట్లు సమాచారం.సీమాంధ్ర ప్రాంతానికి చెందిన కేంద్ర మంత్రులు పళ్లంరాజు, కావూరి సాంబశివరావు, చిరంజీవి కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని సిఫార్సు చేస్తూ ఇప్పటికే కేంద్ర కేబినెట్ ఒక నోట్ సిద్ధం చేసింది. ఆ నోట్ గురించి సమావేశంలో చర్చించి, ఆపై ఒక నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నారు. ప్రభుత్వం ఏర్పాటుచేసే పరిస్థితి లేదని, అందువల్ల రాష్ట్రపతి పాలన తప్పదని ఇప్పటికే పలువురు కేంద్ర మంత్రులు అంటున్నారు. దీంతో ఆర్టికల్ 356 ప్రకారం రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని సిఫార్సు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంకా, త్వరలోనే సార్వత్రిక ఎన్నికలు రానున్న నేపథ్యంలో ఎన్నికలకు ముందు తాయిలాలు ఇచ్చే నిర్ణయాలకు కూడా కేబినెట్ గ్రీన్సిగ్నల్ ఇవ్వనుంది. రాహుల్ బిల్లులను ఆర్డినెన్స్ రూపంలో తేవాలని నిర్ణయిస్తున్నారు. లోక్సభ అభ్యర్థుల ఖర్చును 40 నుంచి 70లక్షలకు పెంచేలా కేబినెట్ నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది. డీఏ, పెన్షన్ల పథకాలకు కూడా ఓకే చెప్పే అవకాశం కనిపిస్తోంది. -
సోనియాతో దిగ్విజయ్ భేటీ
-
రాష్ట్రపతి పాలన వివాదం‘ఆప్’ వాదనపై ఏమంటారు?
సాక్షి, న్యూఢిల్లీ:ఢిల్లీలో రాష్ట్రపతి పాలన విధించడాన్ని సవాలుచేస్తూ ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు సోమవారం కేంద్ర ప్రభుత్వానికి నోటీసు జారీ చేసింది. ఆప్ లేవనెత్తిన అంశాలపై పది రోజులలో జవాబు ఇవ్వాలని న్యాయమూర్తులు ఆర్.ఎం. లోధా, దీపక్మిశ్రాతో కూడిన ధర్మాసనం కేంద్రాన్ని ఆదేశించింది. ఈ కేసుపై తదుపరి విచారణను న్యాయస్థానం మార్చి ఏడో తేదీకి వాయిదా వేసింది. ఆమ్ ఆద్మీ పార్టీ ఈ పిటిషన్లో బీజేపీ, కాంగ్రెస్ను కూడా ప్రతివాదులుగా పేర్కొన్నప్పటికీ న్యాయస్థానం ఈ రెండు పార్టీలకు నోటీసు జారీ చేయలేదు. తాను రాజ్యాంగపరమైన అంశాలను మాత్రమే పరిశీలిస్తానని, రాజకీయ పార్టీల జోలికి పోనని పేర్కొంటూ న్యాయస్థానం ఈ రెండు పార్టీలకు నోటీసు జారీ చేయడానికి నిరాకరించింది. పిటిషనర్ ఈ రెండు రాజకీయపార్టీలపై కూడా ఆరోపణలు చేసినట్లు కోర్టు దృష్టికి తెచ్చినప్పుడు, కేసు విచారణకు వచ్చినప్పుడు ఆ విషయాన్ని పరిశీలిస్తామని బెంచ్ స్పష్టం చేసింది. ఢిల్లీలో రాష్ట్రపతి పాలనను సవాలు చేస్తూ ఆమ్ ఆద్మీ పార్టీతోపాటు కేజ్రీవాల్ సర్కారులో రవాణామంత్రిగా పనిచేసిన సౌరభ్ భరద్వాజ్ ఇటీవల పిటిషన్ దాఖలు చేశారు. ఢిల్లీ అసెంబ్లీని రద్దు చేసి లోక్సభ ఎన్నికలతోపాటు అసెంబ్లీ ఎన్నికలు జరిపించేలా చర్యలు తీసుకోవాలని ఆప్ న్యాయవాదులు కోర్టుకు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రపతిపాలన బీజేపీకి సౌలభ్యంగా ఉన్నందు వల్లే ఆ పార్టీ రాష్ట్రపతి పాలనను వ్యతిరేకించడం లేదని పిటిషనర్లు ఆరోపించారు. బీజేపీ, కాంగ్రెస్ ఢిల్లీలో రాష్ట్రపతి పాలనను కోరుతున్నాయన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ తరపున వాదించిన సీనియర్ న్యాయవాది ఫాలీ ఎస్ నారిమన్ ఢిల్లీలో రాష్ట్రపతి పాలనను సవాలు చేస్తూ పిటిషన్ దాఖలు చేయడానికి దారితీసిన పరిస్థితులను ఈ సందర్భంగా న్యాయస్థానానికి వివరించారు. ‘ఢిల్లీలో ప్రత్యామ్నాయ ప్రభుత్వం ఏర్పాటయ్యే అవకాశం లేదు కాబట్టి లెఫ్టినెంట్ గవర్నర్ అసెంబ్లీని రద్దు చేసి తాజాగా ఎన్నికలు నిర్వహించాలి. అవినీతి ఆరోపణలు ఉన్న కాంగ్రెస్ నాయకులు, మాజీ సీఎం షీలా దీక్షిత్ను కాపాడుకునేందుకే కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వం ఢిల్లీలో రాష్ట్రపతి విధించింది. కాంగ్రెస్ నాయకులకు వ్యతిరేకంగా కేజ్రీవాల్ ఫిర్యాదుతో నమోదైన అవినీతి కేసులపై విచారణ జరగడంతో కాంగ్రెస్ నిరాశకు గురై ఈ నిర్ణయం తీసుకుంది. గత ఎన్నికల్లోనూ ఆ పార్టీ భారీ పరాజయాన్ని చవిచూసింది. ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ సహా చాలా మంది మంత్రులు ఓడిపోయారు. కేంద్రంలో తామే అధికారంలో ఉన్నాం కాబట్టి ఢిల్లీ రాష్ట్రాన్నికూడా పరోక్షంగా పాలించాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఫలితంగా కేసుల విచారణను నీరుగార్చేందుకు ప్రయత్నిస్తోంది. కాబట్టి రాష్ట్రపతి పాలన విధింపు ఏకపక్షమేగాక చట్టవిరుద్ధం. రాజ్యాంగంలోని 14 అధికరణానికి పూర్తి విరుద్ధం. ఇది ఢిల్లీవాసుల ప్రజాస్వామిక హక్కులను కాలరాస్తోంది. ఏ ఒక్క పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసే స్థితిలో లేనప్పుడు తాజాగా ఎన్నికలు నిర్వహించాలని చట్టాలు చెబుతున్నాయి. అసెంబ్లీని సుప్తచేతనావస్థలో ఉంచడం ద్వారా కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడింది’ అని ఆప్ న్యాయవాదులు ప్రశాంత్ భూషణ్, నారిమన్ బెంచ్కు వివరించారు. రాష్ట్రంలోని అతిపెద్ద పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ తమకు ప్రభుత్వం ఏర్పాటు చేసే సత్తా లేదని చెప్పినందున, ఎల్జీ అసెంబ్లీని రద్దు చేసి ఉండాల్సిందని ఆప్ అభిప్రాయపడింది. అవినీతి నిరోధానికి ఉద్దేశించిన జన్లోక్పాల్ బిల్లును కాంగ్రెస్ వ్యతిరేకించడంపై ఆగ్రహించిన ఆప్.. ప్రభుత్వం నుంచి వైదొలగడం తెలిసిందే. ఈ బిల్లు చట్టరూపం దాల్చితే చాలా మంది కాంగ్రెస్ నాయకులు జైలు పాలు అవుతారు కాబట్టి బీజేపీ, కాంగ్రెస్ కమ్మక్కై అడ్డుకున్నారని ఆప్ ఆరోపించింది. జన్లోక్పాల్ బిల్లు రాజ్యాంగవిరుద్ధం కాబట్టే దానిని వ్యతిరేకించామని ఈ రెండు పార్టీలు వాదించాయి. అవినీతి నిరోధంపై అరవింద్ కేజ్రీవాల్కు చిత్తశుద్ధి లేదని విమర్శించాయి. -
రాష్ట్రపతి పాలనకు నో?
-
రాష్ట్రపతి పాలనకు నో?
సర్కారును కొనసాగిద్దాం పునరాలోచనలో అధిష్టానం సీమాంధ్రకు చాన్సివ్వాలంటూ ఒత్తిళ్లు ముఖ్యమంత్రులు ఇద్దరా, ఒక్కరా? ఎటూ తేల్చుకోలేకపోతున్న కాంగ్రెస్ పార్టీ కేంద్రానికి చేరిన గవర్నర్ నరసింహన్ నివేదిక.. నేడో రేపో కేంద్ర మంత్రివర్గ భేటీ సోమ, మంగళవారాల్లో తెలంగాణ బిల్లుకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోదం! 26న గెజిట్ నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉందంటున్న హోంశాఖ వర్గాలు ఆ తర్వాత వారంలోపే ‘అపాయింటెడ్ డే’? సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రపతి పాలన విధింపుపై కాంగ్రెస్ అధిష్టానం విముఖంగా ఉంది. వీలైతే రెండు ప్రభుత్వాలను, లేదంటే ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా యోచిస్తోంది. ముఖ్యమంత్రి రాజీనామాతో తలెత్తిన పరిస్థితులు, విభజనకు సంబంధించి రాష్ట్రపతి గెజిట్ నోటిఫికేషన్, అపాయింటెడ్ డే వంటి కీలకాంశాలను తేల్చాల్సి ఉన్నందున రాజకీయ వ్యూహంతో అడుగులు వేస్తోంది. గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ఇచ్చిన నివేదికలోని పాలన, సాంకేతికపరమైన అంశాల కన్నా కూడా తన రాజకీయ అనివార్యతలు, అవసరాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్టు తెలుస్తోంది. విభజన ప్రక్రియలో చోటుచేసుకునే సంక్లిష్టతలు ఎన్నికలపై ప్రతికూల ప్రభావం చూపుతాయేమోనన్న ఆందోళన కూడా కాంగ్రెస్ పెద్దల్లో ఉంది. దీన్ని అధిగమించడానికి ఉమ్మడి రాష్ట్రంలోనే ఎన్నికల ప్రక్రియ నిర్వహించి తర్వాత రెండు ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన కూడా చేస్తున్నట్టు సమాచారం. అలాంటి పరిస్థితుల్లో అపాయింటెడ్ డే పై నిర్ణయాన్ని జాప్యం చేసి, రాష్ట్రపతి పాలన విధించకుండా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని యథాతథంగా కొనసాగించాలన్న ఆలోచన చేస్తున్నట్టు కూడా పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ముఖ్యమంత్రి పదవికి కిరణ్కుమార్రెడ్డి రాజీనామా నేపథ్యంలో తలెత్తిన పరిస్థితిని చక్కదిద్దడంపై గురు, శుక్రవారాల్లో అధిష్టానం తీవ్ర సమాలోచనలు జరిపింది. గవర్నర్ నివేదిక మేరకు రాష్ట్రపతి పాలన విధించాలా, అపాయింటెడ్ డే నిర్ణయమయ్యేదాకా అసెంబ్లీని సుప్తచేతనావస్థలో ఉంచి రాష్ట్రపతి పాలన కొనసాగించడమా, సీమాంధ్ర నేతలను సంతృప్తి పరచే ప్రయత్నాల్లో భాగంగా విభజన ప్రక్రియ పూర్తయ్యేదాకా ఆ ప్రాంతానికి చెందిన మరో నేతను సీఎం చేయడమా అంటూ తర్జనభర్జన సాగించింది. అయితే రాష్ట్రపతి పాలనపై రెండు ప్రాంతాల నాయకత్వం లాగే అధిష్టానం కూడా విముఖంగా ఉన్నట్టు తెలుస్తోంది. తమ పాలనలోని రాష్ట్రంలో ఏ కోణంలో చూసినా ఆ అవసరం లేదని అది భావిస్తోంది. నిర్దిష్టమైన, అర్థవంతమైన కారణం లేకుండా, ఒక సీఎం తప్పుకున్నంత మాత్రాన రాష్ట్రపతి పాలన అవసరం ఏముందన్న అభిప్రాయంతోఉన్నట్టు ఏఐసీసీ నేతల సమాచారం. శుక్రవారం సాయంత్రం కాంగ్రెస్ కోర్ కమిటీ సమావేశమై వీటిపై చర్చించినా తుది నిర్ణయానికి రాలేకపోయింది. విభజన దిశగా చర్యలన్నీ చకచకా సాగుతున్నా, రెండు రాష్ట్రాలూ అధికారికంగా మనుగడలోకి వచ్చే వఅపాయింటెడ్ డే ఎప్పట్నుంచన్న దానిపై తేల్చుకోలేకపోయినట్టు తెలిసింది. అయితే సీమాంధ్రకే మళ్లీ సీఎం పదవి ఇస్తే రెండు రకాలుగా ప్రయోజనమన్నది కాంగ్రెస్ నేతల ఆలోచన. ఎన్నికలకు ముందు ఆ ప్రాంతంలో పార్టీని నడిపించేందుకైనా, కనీసం తమ వాదన వినిపించేందుకైనా అక్కడ సీఎం స్థాయి నాయకుడుంటే బాగుంటుందని అక్కడి నేతలు పలువురు విన్నవించడంతో అధిష్టానం పునరాలోచనలో పడింది. ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్గాంధీ శుక్రవారం పార్టీ వర్కింగ్ కమిటీ సభ్యులతో మర్యాదపూర్వకంగా సమావేశమై మేనిఫెస్టో అంశాలపై చర్చించినప్పటికీ, రాష్ట్ర అంశాలేవీ ప్రస్తావనకు రాలేదని చెబుతున్నారు. సీఎం రాజీనామాపై గవర్నర్ నివేదిక అందిన నేపథ్యంలో శని, ఆదివారాల్లోగానీ, సోమవారం గానీ కేంద్ర మంత్రివర్గం భేటీ అయ్యే అవకాశముందని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. ఒకే సీఎంపై దిగ్విజయ్ ఆరా సీమాంధ్ర నేతల వాదనపై కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్సింగ్ శుక్రవారం ఉదయం తనను కలిసిన తెలంగాణ ప్రాంత ప్రజాప్రతినిధులను ఆరా తీశారు. రాష్ట్రపతి పాలన వద్దని వారు కోరగా, ‘ఎన్నికలయ్యాక రెండు ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుంది? ఇప్పుడు సీఎం పదవిని సీమాంధ్ర వారికే ఇస్తే ఎలా ఉంటుంది? వారు కొంత నష్టపోయారు కదా? ఒప్పుకుంటారా?’ అని అడిగినట్టు సమాచారం. అందుకు ఒకరిద్దరు సరేనన్నా ఎక్కువ మంది మాత్రం తెలంగాణలో తప్పుడు సంకేతాలు వెళ్లే ప్రమాదముందన్నట్టు సమాచారం. సాధ్యమైనంత త్వరగా రాష్ట్రాన్ని విడదీసి రెండు ప్రభుత్వాలు ఏర్పాటు చేయాలని కూడా కోరారంటున్నారు. ఈ నేపథ్యంలో సీమాంధ్ర నేతల వాదనతో ఏకీభవించాల్సి వస్తే ఎన్నికలయేదాకా విభజనను వాయిదా వేయాల్సి వస్తుందని కోర్కమిటీ అభిప్రాయపడ్డట్టు తెలుస్తోంది. తద్వారా సీమాంధ్రలో పార్టీపై నెలకొన్న వ్యతిరేకత అప్పటిదాకా తీవ్రస్థాయిలో కొనసాగుతుందని, దానివల్ల నష్టమే ఎక్కువని అభిప్రాయడ్డట్టు తెలుస్తోంది. వీలైనంత త్వరగారాష్ట్రాన్ని విడదీసి రెండు ప్రభుత్వాలను ఏర్పాటు చేసే దిశగానే కసరత్తు చేయాలని నిర్ణయించినట్టు సమాచారం. విభజన వ్యవహారాలను దగ్గరుండి చూస్తున్న ఓ కేంద్ర మంత్రిని రాష్ట్రపతి పాలనపై ఆరా తీయగా, ‘అసలు ఆ అవసరం ఎక్కడ కనిపిస్తోంది? నేనలా అనుకోను’ అని బదులివ్వడం ఇందుకు బలం చేకూరుస్తోంది.‘త్వరతగతిన రెండు రాష్ట్రాలు ఏర్పడే అవకాశముందని కూడా ఆయన పరోక్షంగా తెలిపారు. 26న విభజన గెజిట్? పార్లమెంటు ఉభయ సభల్లో ఆమోదం పొందిన విభజన బిల్లును రాష్ట్రపతికి పంపేముందు మరోసారి న్యాయ శాఖ పరిశీలనకు కేంద్రం పంపింది. బిల్లు, సవరణల్లో అక్షర దోషాలు, టైపింగ్ వంటి సాంకేతిక దోషాలను శాఖ పరిశీలిస్తోంది. బిల్లుపై సోమ లేదా మంగళవారాల్లో రాష్ట్రపతి ఆమోదముంద్ర పడే అవకాశాలున్నట్టు చెబుతున్నారు. ఆ వెంటనే, అంటే 26న బుధవారం గెజిట్ నోటిఫికేషన్ వెలువడవచ్చని కేంద్ర హోం శాఖ వర్గాలు వెల్లడించాయి. ఆ తర్వాత వారం రోజుల్లోనే ‘అపాయింటెడ్ డే’ ఉంటుందని కూడా సమాచారం. అదే జరిగితే మార్చి తొలి వారంలో రెండు రాష్ట్రాలు ఏర్పడేందుకు ఎలాంటి అడ్డంకులూ లేవని ఆ వర్గాలు వెల్లడించాయి. -
'రాష్ట్రపతి పాలనకు ఆస్కారం లేదు'
ఢిల్లీ: రాజ్యసభలో తెలంగాణ బిల్లు ఆమోదం పొందడం, ఆపై సీఎం కిరణ్ కుమార్ రెడ్డి సీఎం పదవికి, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడంతో రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధిస్తారనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ మాట్లాడుతూ.. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనకు ఆస్కారం లేదని చెప్పారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. సీమాంధ్రకు చెందిన వారిని సీఎం చేసినా తాము మద్దతిస్తామని ఆయన అన్నారు. లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి వచ్చే అవకాశం ఉన్నట్టు దామోదర రాజనర్సింహ తెలిపారు. కాగా, కేంద్రం అడ్డగోలుగా రాష్ట్రాన్ని విభజించినందుకు నిరసనగా సీఎం కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. -
రాష్ట్రపతి పాలనవైపే కేంద్రం మొగ్గు
-
కాంగ్రెస్ కోర్ కమిటీ భేటీ
ప్రధాని కార్యాలయంలో కాంగ్రెస్ కోర్ కమిటీ భేటీ అయ్యింది. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామా చేయడం, దాన్ని గవర్నర్ నరసింహన్ కూడా ఆమోదించడంతో ఇక రాష్ట్ర మంత్రివర్గం మొత్తం రద్దు అయినట్లయింది. ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉండాలని కిరణ్ కుమార్ రెడ్డిని గవర్నర్ కోరడం, ఆయన దానికి ఏమీ సమాధానం చెప్పకపోవడం వంటి పరిణామాలు అన్నీ కోర్ కమిటీలో చర్చకు వచ్చాయి. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలా, అసెంబ్లీని సుప్త చేతనావస్థలో ఉంచాలా.. ఏం చేయాలనే విషయాలపై కూడా కాంగ్రెస్ పెద్దలు మల్లగుల్లాలు పడుతున్నట్లు తెలిసింది. రాష్ట్రపతి పాలన వద్దని, అవసరమైతే తాము నలుగురిలో ఎవరైనా సరే ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయడానికి సిద్ధమేనని కూడా నలుగురు రాష్ట్ర మంత్రులు గవర్నర్ నరసింహన్కు తెలియజేయడం కూడా కోర్ కమిటీలో చర్చకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.