rabi
-
చౌడు పీడ రబీలోనే ఎక్కువ!
చౌడు సమస్య ఖరీఫ్లో కన్నా రబీలోనే ఎక్కువగా ఇబ్బందిపెడుతుంది. చౌడు వల్ల ధాన్యం దిగుబడి తగ్గడం కూడా రబీలోనే ఎక్కువని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. చౌడును తట్టుకొని 20–25 బస్తాల దిగుబడినిచ్చే డి.ఆర్.ఆర్. ధన్ 39, జరవ, వికాస్ అనే వరి వంగడాలు ఉన్నాయి. ఇవి 120–130 రోజుల్లో కోతకొస్తాయి. కోస్తా ఆంధ్ర ప్రాంతంలో సుమారు 3 లక్షల ఎకరాల్లో చౌడు సమస్య ఉంది. మట్టిలో లవణ సూచిక (ఇ. సి.) 4 వరకు ఉంటే కొంత ఫర్వాలేదు. కానీ, మా క్షేత్రంలో ఈ ఏడాది 10.9 ఉంది. ఎక్స్ఛేంజబుల్ సోడియం పర్సంటేజ్ (ఈ.ఎస్.పి.) 15% కన్నా పెరిగితే చౌడు సమస్య తలెత్తుతుంది. చౌడు భూముల్లో కాలువ నీటితో సాగు చేయడానికి అనువైన మూడు వరి వంగడాలను శాస్త్రవేత్తలు గతంలోనే రూపొందించారు. ఎం.సి.ఎం. 100 అనేది రబీకి అనుకూలం. 125 రోజులు. 28–30 బస్తాల దిగుబడి వచ్చింది. ఎం.సి.ఎం. 101 రకం 140 రోజుల పంట. ఖరీఫ్కు అనుకూలం. 35 బస్తాల దిగుబడి. అగ్గి తెగులును, దోమను తట్టుకుంది. ఎం.సి.ఎం. 103 ఖరీఫ్ రకం. ఇది రాయలసీమ జిల్లాల్లోనూ మంచి దిగుబడులనిస్తోంది. చౌడు భూముల్లో నాట్లకు ముందు జీలుగ సాగు చేసి కలియదున్నాలి. ఇతర పచ్చిరొట్ట పైర్లు వేస్తే ఉపయోగం ఉండదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. పైపైనే దమ్ము చేయాలి. సమతూకంగా ఎరువులు వాడాలి. సేంద్రియ ఎరువులు వేయడం మంచిది. రబీలో పొలాన్ని ఖాళీగా ఉంచితే, ఖరీఫ్లో చౌడు సమస్య ఎక్కువ అవుతుందట. (చదవండి: నౌకాయానంలో వర్చువల్ వ్యవసాయ శాస్త్రవేత్త) -
దిక్కులు చూస్తున్న దుక్కులు!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో తీవ్ర ఒడిదుడుకుల మధ్య రైతన్నలు ఖరీఫ్ సాగు చేపట్టగా ముందస్తు రబీ ఏర్పాట్లు మందకొడిగా సాగుతున్నాయి. రైతన్న చేతికి ఇంతవరకూ పెట్టుబడి సాయం అందకపోవడం.. డిమాండ్ మేరకు విత్తనాలు, ఎరువులను సమకూర్చకపోవడం, ఇన్నాళ్లూ చేయి పట్టి నడిపించిన ఆర్బీకేలను ప్రభుత్వం నిర్వీర్యం చేయడం దీనికి కారణం. ఒకపక్క ప్రాజెక్టులన్నీ నిండుకుండల్లా ఉన్నాయి..! కానీ రెండో పంటకు నీరు అందుతుందనే భరోసాను ప్రభుత్వం కల్పించకపోవడంతో రైతన్న కదం తొక్కుతున్నాడు!! ప్రకృతి వైపరీత్యాలకు తోడు ప్రభుత్వ నిర్లక్ష్యం అన్నదాతల ఆశలను నీరుగార్చేసింది. గతంలో ఎన్నడూ లేని రీతిలో ఖరీఫ్ సాగు ఆలస్యం కావడంతో ఆ ప్రభావం రబీ పంటల సాగుపై పడింది. గతేడాది ఈపాటికి 40 శాతానికి పైగా కోతలు పూర్తి కాగా ఈ ఏడాది 5–10 శాతం కూడా పూర్తి కాని పరిస్థితి నెలకొంది. రబీ సాగు కోసం ముందస్తుగా ఏర్పాట్లు చేయడంలో ప్రభుత్వం విఫలమైంది. రెండో పంటకు నీరివ్వడంపై సర్కారు ఇప్పటివరకు స్పష్టత ఇవ్వకపోవడంతో కృష్ణా జిల్లా సహా పలు చోట్ల రైతులు సాగునీటి కోసం రోడ్డెక్కి ధర్నాలు చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఈ ఏడాది కనిష్టంగా సాగు..ఈ ఏడాది పెట్టుబడి సాయం లేక, సకాలంలో విత్తనం అందక, ఆర్బీకే స్థాయిలో అవగాహన కల్పించే నాథుడు లేక రబీ సాగు నత్తనడకన సాగుతోంది. 3.65 లక్షల క్వింటాళ్ల విత్తనం అవసరమని జిల్లాల నుంచి ఇండెంట్ రాగా ఇప్పటి వరకు కేవలం 1.41 లక్షల క్వింటాళ్ల విత్తనాన్ని పొజిషన్ చేయగలిగారు. వాటిలో 1.12 లక్షల క్వింటాళ్ల విత్తనాన్ని రైతులకు సరఫరా చేశారు. ప్రధానంగా 2.64 లక్షల క్వింటాళ్ల శనగ విత్తనం కావాలని రైతులు కోరగా 1.10 లక్షల విత్తనాన్ని మాత్రమే సరఫరా చేశారు. దీంతో ముందస్తు రబీ సాగు జరగని పరిస్థితి నెలకొంది. ఈ ఏడాది నవంబర్ 11 నాటికి అత్యల్పంగా 4.65 లక్షల ఎకరాల్లో మాత్రమే రబీ ప్రధాన పంటల సాగు కావడమే ఇందుకు నిదర్శనం. ఇదే పరిస్థితి కొనసాగితే సీజన్ ముగిసే నాటికి కనిష్ట స్థాయిలో రబీ పంటల సాగు నమోదయ్యే ప్రమాదం ఉందని వ్యవసాయ రంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఐదేళ్లూ.. సాధారణం కంటే మిన్నగారబీ సాధారణ సాగు విస్తీర్ణం 56.19 లక్షల ఎకరాలు కాగా ఈ ఏడాది సాగు లక్ష్యం 57.50 లక్షల ఎకరాలు. గతేడాది తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్న సమయంలో కూడా 8.75 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. గతేడాది రబీ సీజన్ ప్రారంభంలో వర్షాలు, వరదలతో నారుమళ్లు దెబ్బతిన్నప్పటికీ 80 శాతం సబ్సిడీపై వైఎస్ జగన్ ప్రభుత్వం విత్తనాలను సమకూర్చింది. బోర్ల కింద వరికి బదులు ప్రత్యామ్నాయ పంటల సాగును ప్రోత్సహించడం, సీజన్కు ముందుగానే పెట్టుబడి సాయంతో పాటు ఖరీఫ్లో దెబ్బతిన్న పంటలకు పంట నష్టపరిహారం అందించడం లాంటి చర్యల కారణంగా రైతులు రబీ సాగుకు ముందుకొచ్చారు. నవంబర్ 10వ తేదీ నాటికి 2019–20లో 18.45 లక్షల ఎకరాలు, 2020–21లో 15.85 లక్షల ఎకరాలు, 2022–23లో 16.85 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి.ప్రత్యామ్నాయ పంటల ప్రణాళికలో విఫలంఖరీఫ్ సాగు లక్ష్యం 85.65 లక్షల ఎకరాలు కాగా ఈసారి అతి కష్టంమ్మీద 70 లక్షల ఎకరాల్లో సాగైంది. దాదాపు 16 లక్షల ఎకరాల్లో పంటలు సాగుకాని దుస్థితి నెలకొంది. సాగైన చోట్ల కూడా వర్షాలు, వరదలు, వర్షాభావ పరిస్థితుల ప్రభావంతో దాదాపు 10 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. ప్రభుత్వానికి కొరవడిన ముందు చూపు కారణంగా ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక విఫలమైంది. ఖరీఫ్లో నష్టపోయిన రైతులు ముందస్తు రబీకి సిద్ధమైనప్పటికీ ప్రభుత్వం నుంచి తగిన సహకారం లభించకపోవడంతో రెండో పంట సాగు కోసం దిక్కులు చూస్తున్నారు. -
పంటల బీమా.. లేదిక ధీమా
పంటల బీమా పథకం అమలులోనూ కూటమి ప్రభుత్వం అన్నదాతలను దగా చేస్తోంది. ఉచిత పంటల బీమా పథకానికి మంగళం పాడేసి రైతుల వెన్ను విరుస్తోంది. రబీ సీజన్ నుంచి వలంటరీ ఎన్రోల్మెంట్ మోడల్ (స్వచ్ఛంద నమోదు పద్ధతి)లో పంటల బీమాను అమలు చేస్తున్నట్టు ప్రభుత్వం చేసిన అధికారిక ప్రకటనతో తమకు మళ్లీ చీకటి రోజులు దాపురించాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. తాము సాగు చేసిన పంటలను పంటల బీమా పరిధిలోకి తీసుకు రావాలంటే ప్రీమియం వాటా మొత్తం చెల్లించాల్సి రావడం రైతులకు పెనుభారంగా మారనుంది. - సాక్షి, అమరావతిరబీలోనే రూ.300 కోట్ల భారం రైతులకు ఎంతో మేలు చేసిన ఉచిత పంటల బీమా పథకాన్ని రద్దు చేసి పాత పద్ధతిలో రైతులను భాగస్వామ్యం చేస్తూ పంటల బీమాను అమలు చేయబోతున్నట్టు తొలి సమీక్షలోనే సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. సమయంలేని కారణంగా ఖరీఫ్ సీజన్ వరకు ఈ–పంట నమోదు ప్రామాణికంగా ఉచిత పంటల బీమాను కొనసాగించాలని, రబీ 2024–25 సీజన్ నుంచి వలంటరీ ఎన్రోల్మెంట్ మోడల్ పద్ధతి అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఖరీఫ్లో 15 దిగుబడి ఆధారిత, 7 వాతావరణ ఆధారిత పంటలకు ఉచిత బీమా కవరేజీ కల్పించగా, రబీలో 11 దిగుబడి ఆధారిత, 2 వాతావరణ ఆధారిత పంటలకు వలంటరీ ఎన్రోల్మెంట్ మోడల్ కింద బీమా కవరేజీ కల్పిస్తూ నోటిఫికేషన్ జారీ చేశారు. వీటికి అదనంగా మామిడికి త్వరలో నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. రబీ సీజన్ వరకు నోటిఫై చేసిన పంటలు 44.75 లక్షల ఎకరాల్లో సాగవుతాయని అంచనా వేశారు. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన (పీఎంఎఫ్బీవై) కింద కంపెనీలు నిర్దేశించిన ప్రీమియం మొత్తం (8 శాతం)లో నోటిఫై చేసిన వ్యవసాయ పంటలకు గరిష్టంగా ఖరీఫ్లో 2 శాతం, రబీలో 1.6 శాతం, వాణిజ్య పంటలకు 5 శాతం చొప్పున రైతులు తమ వాటాగా చెల్లించాలి. మిగిలిన మొత్తాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమానంగా భరిస్తాయి. ఇలా ఒక్క రబీ సీజన్లోనే రైతులపై రూ.300 కోట్లకు పైగా భారం పడతుందని అంచనా వేస్తున్నారు. వెన్నుదన్నుగా ఉచిత పంటల బీమా గతంలో ప్రీమియం మొత్తాన్ని మినహాయించుకుని రైతులకు బ్యాంకులు రుణాలు మంజూరు చేసేవి. అయితే, బ్యాంకుల నుంచి రుణాలు పొందని రైతులు ప్రీమియం భారం అధికంగా ఉండటం, ఆర్థిక స్తోమత, అవగాహన లేకపోవడం వంటి కారణాలతో బీమా చేయించుకునేందుకు ముందుకొచ్చేవారు కాదు. ఫలితంగా రైతుల్లో అత్యధికులు బీమా చేయించుకోలేక విపత్తుల వేళ పంటలకు పరిహారం దక్కక నష్టపోయేవారు. ఈ పరిస్థితికి చెక్ పెడుతూ రైతులపై పైసా భారం పడకుండా ఈ క్రాప్ నమోదే ప్రామాణికంగా నోటిఫై చేసిన ప్రతి పంటకు, సాగు చేసిన ప్రతి ఎకరాకు యూనివర్సల్ కవరేజీ కల్పిస్తూ వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఉచిత పంటల బీమా పథకాన్ని విజయవంతంగా అమలు చేసింది. పంట నష్టానికి మరుసటి ఏడాది అదే సీజన్ ప్రారంభానికి ముందే నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేసేవారు. ఇలా గడచిన ఐదేళ్లలో 5.42 కోట్ల ఎకరాలకు బీమా కవరేజీ కల్పించారు. ఏటా సగటున 40.5 లక్షల మంది చొప్పున ఐదేళ్లలో 2.04 కోట్ల మందికి బీమా కవరేజీ కల్పించారు. రైతుల తరఫున రూ.3,022.26 కోట్లను ప్రీమియం రూపంలో బీమా కంపెనీలకు చెల్లించగా.. ఐదేళ్లలో 54.55 లక్షల మంది రైతులు రూ.7,802.08 కోట్ల బీమా పరిహారం పొందగలిగారు. ఎన్రోల్మెంట్ ఎలాగంటే.. రైతులు బ్యాంకుల్లో రుణాలు తీసుకునే ముందు తాము సాగు చేసే పంటల వివరాలను తొలుత ఎన్సీఐపీ (జాతీయ పంటల బీమా పోర్టల్)లో ఎన్రోల్ చేస్తారు. ఆయా పంటలకు కంపెనీలు నిర్దేశించిన ప్రీమియం మొత్తంలో రైతులు చెల్లించాల్సిన వాటా మొత్తాన్ని బ్యాంకులు మినహాయించుకుని మిగిలిన రుణాలను మంజూరు చేస్తాయి. ఆ మొత్తాన్ని బీమా కంపెనీలకు జమ చేస్తాయి. ఇక రుణాలు తీసుకోని (నాన్ లోనీ ఫార్మర్స్) మాత్రం తగిన ధ్రువీకరణ పత్రాలతో కామన్ సర్విస్ సెంటర్స్ (సీఎస్సీ), బ్యాంక్ బ్రాంచీలు, ఐసీ అపాయింట్మెంట్ చేసిన వ్యక్తుల ద్వారా లేదా వ్యక్తిగతంగా ఎన్సీఐసీ పోర్టల్లో ఎన్రోల్ చేసుకోవచ్చు. భూ యజమానులైతే ల్యాండ్ డాక్యుమెంట్స్, కౌలు రైతులైతే సీసీఆర్సీ కార్డులు తప్పనిసరిగా ఉండాలి. రైతులు సాగు చేసిన పంటలను ధ్రువీకరిస్తూ వీఏఏ/వీహెచ్ఏ/వీఎస్ఎలు జారీచేసే సర్టిఫికెట్లు ఉండాలి. రైతుల మొబైల్ నంబర్, ఆధార్తో సీడింగ్ అయిన బ్యాంక్ పాస్ పుస్తకం కాపీ లేదా క్యాన్సిల్ చేసిన చెక్ కాపీలను అప్లోడ్ చేయాలి. రబీ సీజన్లో వరి మినహా మిగిలిన నోటిఫైడ్ పంటలకు అక్టోబర్ 1వ తేదీ నుంచి డిసెంబర్ 15వ తేదీలోగా ఎన్రోల్ చేసుకోవాలి. జీడిమామిడికి నవంబర్ 15వ తేదీ, టమాటాకు డిసెంబర్ 15వ తేదీ వరకు, వరికి మాత్రం డిసెంబర్ 31 వరకు గడువు ఇచ్చారు. కటాప్ తేదీకి 7 రోజులు ముందుగా ఆప్షన్ మార్చుకుంటూ డిక్లరేషన్ ఇవ్వొచ్చు. బీమా చేయించుకునే పంటను మారుస్తున్నట్టయితే కటాప్ డేట్కు రెండు రోజులు ముందుగా చెప్పాలి. చలానా మొత్తాన్ని 15 రోజులు ముందుగా చెల్లించాలి. అలాగే 15 రోజులు ముందుగా రిజెక్ట్ చేసుకునే వెసులుబాటు కూడా కల్పించారు. రైతులను నట్టేట ముంచుతున్న కూటమి ప్రభుత్వంవైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్రెడ్డి ధ్వజంవ్యవసాయం దండగ అని చెప్పే చంద్రబాబు రైతులకు మేలు చేస్తారనుకోవడం భ్రమే. ఎన్నికల్లో అనేక హామీలతో రైతులను మభ్య పెట్టడం, అధికారంలోకి వచ్చాక వారిని నిలువునా ముంచడం చంద్రబాబుకు అలవాటే. ఇప్పుడూ రైతు వ్యతిరేక విధానాలనే కొనసాగిస్తూ అన్నదాతల నడ్డి విరుస్తున్నారు. అన్నదాతలపై పైసా భారం పడకుండా ఈ క్రాప్ నమోదే ప్రామాణికంగా జగన్ ప్రభుత్వం ఐదేళ్లు విజయవంతంగా అమలు చేసిన వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా పథకాన్ని చంద్రబాబు ప్రభుత్వం ఎత్తివేయడం దుర్మార్గం. ఈ కుట్రలో భాగంగానే పంటల బీమాపై అధ్యయనం కోసం కేడినెట్ సబ్ కమిటీ వేశారు. ప్రభుత్వ సూచన మేరకే సబ్ కమిటీ రైతులకు వ్యతిరేకంగా నివేదిక ఇచ్చింది. వైఎస్ జగన్ ప్రవేశ పెట్టిన వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా పథకం దేశంలోనే అత్యుత్తమ పథకమని కేంద్ర ప్రభుత్వమే ప్రకటించింది. మిగిలిన రాష్ట్రాలూ ఈ విధానాన్ని అమలు చేయాలని కూడా సూచించింది. ఇలాంటి అద్భుత పథకాన్ని ఎత్తివేయడం రైతులను నట్టేట ముంచడమే.జగన్పై కోపాన్ని రైతులపై చూపొద్దుసీఎం చంద్రబాబుకు వైఎస్ జగన్పై ఉన్న కోపాన్ని రైతులపై చూపడం నైతికత అనిపించుకోదు. ఉచిత పంటల బీమాను ఎత్తేసి, రైతులే ప్రీమియం కట్టుకోవాలనడం అన్యాయం. కూటమి హామీ ఇచ్చిన మేరకు రైతులకు రూ.20 వేలు ఇవ్వకపోగా, పంటల బీమా ప్రీమియం భారాన్ని కూడా వేయడం బాధాకరం. వైఎస్ జగన్ సీఎంగా ఉన్న ఐదేళ్లలో వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా పథకం ద్వారా రైతులకు రూ. వందల కోట్ల లబ్ధి కలిగింది. – వంగాల భరత్కుమార్రెడ్డి, వైఎస్సార్సీపీ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడురైతులపై పెనుభారంవైఎస్ జగన్ ప్రభుత్వం గత ఐదేళ్లలో రూ.3,411 కోట్లు పంటల బీమా పరిహారంగా చెల్లించింది. సుమారు 30.85 లక్షల మంది రైతులకు ప్రయోజనం కలిగింది. ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన అమలు పేరుతో కూటమి ప్రభుత్వం వైఎస్ఆర్ ఉచిత పంటల బీమాను ఎత్తివేసి, అన్నదాతపై భారం వేయడం దుర్మార్గమే. దీనివల్ల ఖరీఫ్లో వరి రైతులు ఎకరాకు రూ.630 చెల్లించాల్సి ఉంటుంది. ఇది రైతులపై పెనుభారమే. – కొవ్వూరి త్రినాధ్ రెడ్డి, వైఎస్సార్సీపీ రైతు విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడురైతును ఆదుకొనే పథకాన్ని ఎత్తివేస్తారా?కరువు పీడిత అనంతపురం జిల్లా రైతాంగాన్ని ఉచిత పంటల బీమా పథకం ఎంతో ఆదుకుంది. అలాంటి మంచి పథకాన్ని కూటమి ప్రభుత్వం ఎత్తివేయడం దుర్మార్గం. రైతులను ఆదుకొని, ఆత్మహత్యలు నివారించేందుకు వైఎస్ జగన్ ప్రభుత్వం ఉచిత పంటల బీమా పథకాన్ని తెచ్చింది. అన్ని పంటలకూ ఈ పథకాన్ని వర్తింపజేసింది. ఇప్పుడీ పథకాన్ని చంద్రబాబు నిలిపివేయడంతో జిల్లా రైతాంగంపై రూ.110 కోట్ల భారం పడుతుంది. – వై.విశ్వేశ్వరరెడ్డి, మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ -
రబీ సాగు లక్ష్యం 57.65 లక్షల ఎకరాలు
సాక్షి, అమరావతి: ఖరీఫ్ కలిసి రాలేదు. వరుస వైపరీత్యాలకు తోడు ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ఖరీఫ్లో రైతులు దెబ్బ తిన్నారు. అతి కష్టం మీద లక్ష్యానికంటే తక్కువగా 69.70 లక్షల ఎకరాల్లో సాగు చేసినా, పంటలు దెబ్బతిన్నాయి. దీంతో రైతులు ముందస్తుగా రబీ సాగుకు సన్నద్ధమయ్యారు. ఆ మేరకు రబీ 2024–25 ప్రణాళికను వ్యవసాయ శాఖ సిద్ధం చేసింది. రబీ సాధారణ విస్తీర్ణం 56.58 లక్షల ఎకరాలు. ఈ ఏడాది సాగు లక్ష్యం 57.65 లక్షల ఎకరాలుగా నిర్దేశించారు. 19.87 లక్షల ఎకరాల్లో వరి, 11.17 లక్షల ఎకరాల్లో శనగ, 8.44 లక్షల ఎకరాల్లో మినుము, 5.23 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న, 2.74 లక్షల ఎకరాల్లో జొన్న, 2.51 లక్షల ఎకరాల్లో వేరుశనగ, 2.46లక్షల ఎకరాల్లో పెసలు, 1.77లక్షల ఎకరాల్లో పొగాకు పంటలు సాగు చేయనున్నారు. కాగా ఈ ఏడాది 94.69 లక్షల టన్నుల దిగుబడులు లక్ష్యంగా వ్యవసాయ శాఖ నిర్దేశించింది. రబీకి 3.85 లక్షల క్వింటాళ్ల విత్తనం రబీ కోసం 8.88 లక్షల క్వింటాళ్ల విత్తనం అవసరం. రూ.94.96 కోట్ల సబ్సిడీతో 3.85 లక్షల క్వింటాళ్ల విత్తనాలను సబ్సిడీపై పంపిణీ చేసేందుకు అధికారులు సిద్ధం చేస్తున్నారు. సీజన్లో 2.64 లక్షల క్వింటాళ్ల శనగ విత్తనం అవసరం కాగా, ఇప్పటివరకు 26 వేల క్వింటాళ్లను సిద్ధం చేశారు. వరి, ఇతర విత్తనాలను ఈ నెల 25వ తేదీ నుంచి పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 50,076 క్వింటాళ్ల వరి, 45,647 క్వింటాళ్ల వేరుశనగ, 16,249 క్వింటాళ్ల మినుము విత్తనాల పంపిణీకి ఏర్పాట్లు చేశారు. ఎరువుల సరఫరాలో ఆర్బీకేలకు కోత ఈ ఏడాది 20.05లక్షల టన్నుల ఎరువులు అవసరమని అధికారులు అంచనా వేశారు. ఇప్పటికే 6.95 లక్షల టన్నుల ఎరువులు ఉండగా, కేంద్రం నుంచి ఈ నెలలో 1.47 లక్షల టన్నులు వచ్చాయి. ప్రస్తుతం 8.42 లక్షల టన్నుల ఎరువులు అందుబాటులో ఉన్నాయని చెబుతున్నారు. గత నాలుగేళ్లుగా సబ్సిడీ విత్తనం, ఎరువుల పంపిణీలో రైతు భరోసా కేంద్రాలకు (ఆర్బీకేలకు) అధిక ప్రాధాన్యతనిచ్చారు. కానీ చంద్రబాబు కూటమి ప్రభుత్వం ఆర్బీకేలకు ప్రాధాన్యత లేకుండా చేసింది. గడిచిన ఖరీఫ్లో అతికష్టమ్మీద 1.50 లక్షల టన్నుల ఎరువులను మాత్రమే ఆర్బీకేల ద్వారా సరఫరా చేశారు. రబీలో కూడా ఆర్బీకేలకు సరఫరాలో భారీగా కోత పెడుతున్నారు. రబీలో రూ.68వేల కోట్లు పంట రుణాలు ప్రస్తుత రబీలో రైతులకు లక్ష కోట్ల రుణ పరపతి కల్పించాలని లక్ష్యంగా నిర్దేశించారు. దాంట్లో రూ.68,060 కోట్లు పంట రుణాలు, 32,390 కోట్లు టర్మ్ రుణాలు ఇవ్వనున్నారు. గతేడాది 3.60 లక్షల మంది కౌలుదారులకు రూ.4,100 కోట్లు ఇవ్వగా, ఈ ఏడాది కనీసం 5 లక్షల మందికి రూ.5 వేల కోట్లు రుణాలివ్వాలని నిర్ణయించారు. -
శనగ విత్తనం కోసం రైతుల ఎదురుచూపులు
సాక్షి, అమరావతి : వర్షాభావంతో పంటలు దెబ్బతిన్న రాయలసీమ జిల్లాల్లో రైతులు ముందస్తు రబీకి సిద్ధమైనా, ప్రభుత్వం నుంచి సహకారం లభించడంలేదు. ముందస్తు రబీలో అవసరమైన విత్తనాలు, ముఖ్యంగా శనగ విత్తనం కోసం రైతులు కళ్లల్లో వత్తులేసుకొని ఎదురు చూస్తున్నారు. అయినా ప్రభుత్వం నుంచి స్పందన లేదు. గతేడాది ఈపాటికే విత్తనం సరఫరా అవగా రైతులు పంటలు వేసుకున్నారు. ఈ ఏడాది అవసరమైన విత్తనంలో పదో వంతు మాత్రమే అందుబాటులో ఉంది. దీంతో రైతులు రైతు సేవా కేంద్రాల్లో రిజి్రస్టేషన్ చేయించుకొని, విత్తనం కోసం ప్రదక్షిణాలు చేస్తున్నారు.ఖరీఫ్లో రాయలసీమ జిల్లాల్లో 7 లక్షల ఎకరాల్లో వేరుశనగ, 4 లక్షల ఎకరాల్లో పత్తి పంటలు సాగవలేదు. సాగైన ప్రాంతాల్లోనూ వర్షాల్లేక సగానికిపైగా ఎండిపోయాయి. ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక అమలులో ప్రభుత్వం విఫలమైంది. ఈ రబీ సీజన్లో రాష్ట్రవ్యాప్తంగా 57.67 లక్షల ఎకరాల్లో పంటల సాగు లక్ష్యంగా నిర్దేశించారు. ప్రధానంగా 19.87 లక్షల ఎకరాల్లో వరి, 11.17 లక్షల ఎకరాల్లో శనగ, 8.45 లక్షల ఎకరాల్లో మినుము, 5.27 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న, 2.75 లక్షల ఎకరాల్లో జొన్నలు, 2.47 లక్షల ఎకరాల్లో పెసలు, 2.52 లక్షల ఎకరాల్లో వేరుశనగ పంటలు సాగు చేయనున్నారు.ఇందు కోసం రూ.94.96 కోట్ల సబ్సిడీతో 3.85 లక్షల టన్నుల విత్తనం అవసరమని అంచనా వేశారు. గతేడాది మాదిరిగానే విత్తన రాయితీలు ఇవ్వాలని కోరుతూ అధికారులు పంపిన ప్రతిపాదనలకు ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ముందస్తు రబీకి 17 జిల్లాల్లో 2.64 లక్షల క్వింటాళ్ల శనగ విత్తనం అవసరం కాగా, ఇప్పటివరకు 6 జిల్లాలకు 26 వేల క్వింటాళ్లే చేరాయి. గతేడాది ఈపాటికే పంపిణీ.. వాస్తవానికి అక్టోబర్ 1వ తేదీ నుంచి శనగ విత్తనం, 15వ తేదీ నుంచి మిగిలిన విత్తనాల పంపిణీ చేయాలి. గత ఏడాది ప్రణాళిక ప్రకారం పంటల సాగు సాఫీగా సాగిపోయింది. గతేడాది సెపె్టంబర్ మూడో వారం నుంచే రిజి్రస్టేషన్స్ చేపట్టగా, అక్టోబర్ 1 నుంచి తొలుత శనగ విత్తనం, 12వ తేదీ నుంచే మిగిలిన విత్తనాల పంపిణీ మొదలెట్టారు. ఈ ఏడాది ఆ పరిస్థితి కన్పించడం లేదు. సోమవారం నుంచి పంపిణీ మొదలు పెడతామని చెబుతున్నప్పటికీ, గ్రామాలకు విత్తనాలే చేరలేదు. గతేడాది వర్షాభావ పరిస్థితుల వల్ల పంటలు వేసుకోలేని ప్రాంతాల్లో 80 శాతం సబ్సిడీపై విత్తనం పంపిణీ చేశారు. కానీ ఈసారి ఆరి్థక భారం సాకుతో సబ్సిడీకి భారీగా కోత పెట్టే అవకాశాలున్నాయని చెబుతుండడంతో రైతుల్లో ఆందోళన నెలకొంది. -
రబీ నుంచి రైతులపైనే బీమా భారం
సాక్షి, అమరావతి : ఉచిత పంటల బీమాపై రాష్ట్ర ప్రభుత్వం చేతులెత్తేసింది. ఆ భారాన్ని రైతులే భరించాలని తేల్చి చెప్పేసింది. రైతులపై పైసా భారం పడకుండా యూనివర్శల్ కవరేజ్ కల్పిస్తూ వైఎస్ జగన్ ప్రభుత్వం ఐదేళ్లుగా అమలు చేస్తున్న ఉచిత పంటల బీమా పథకానికి మంగళం పాడేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించింది. 2024–25 వ్యవసాయ సీజన్కు సంబంధించి నోటిఫై చేసిన పంటలకు బీమా వర్తింపజేస్తూ నోటిఫికేషన్ జారీచేసింది. ప్రస్తుత ఖరీఫ్ వరకు మాత్రమే.. అది కూడా సమయం లేని కారణంగా రైతుల తరపున ప్రీమియం ప్రభుత్వం చెల్లిస్తుందని, రబీ నుంచి మాత్రం ప్రీమియం రైతులే చెల్లించుకోవాలని, వారికే పంటల బీమా వర్తిస్తుందని స్పష్టం చేసింది.ఈ పంట ఆధారంగానే పంటల బీమాఖరీఫ్– 2024, రబీ 2024–25 సీజన్లలో దిగుబడి ఆధారిత పంటలకు అమలు చేసే ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన (పీఎంఎఫ్బీవై), వాతావరణ ఆధారిత పంటలకు అమలు చేసే పునర్వ్యవస్థీకరించిన వాతావరణ ఆధారిత పంటల బీమా పథకం (ఆర్డబ్ల్యూ బీసీఐ)పై శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేసింది. ఖరీఫ్ సీజన్ వరకు ఈ పంట డేటా ఆధారంగా సోషల్ ఆడిట్ పూర్తయిన తర్వాత తుది జాబితాలో అర్హత పొంది, నోటిఫై చేసిన పంటలు సాగు చేసిన వారికి బీమా వర్తింపచేస్తామని ప్రకటించింది. ఖరీఫ్ సీజన్ వరకు గతంలో మాదిరిగా రాష్ట్ర ప్రభుత్వ వాటాతో పాటు రైతులు చెల్లించాల్సిన ప్రీమియంను కూడా రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తుందని తెలిపింది. ఖరీఫ్లో దిగుబడి ఆధారిత పంటల పథకం కింద వరి, సజ్జ, జొన్న, మొక్కజొన్న, కొర్ర, రాగి, పెసర, మినుము, కంది, వేరుశనగ, నువ్వులు, ఆముదం, మిర్చి, పసుపు, ఉల్లి పంటలకు, వాతావరణ ఆధారిత పథకం కింద వేరుశనగ, ప్రత్తి, టమాటా, నిమ్మ, దానిమ్మ, బత్తాయి, అరటి పంటలకు బీమా వర్తింపచేయనుంది. ప్రీమియం చెల్లించిన వారికే బీమారబీ–2024–25 సీజన్ నుంచి పంటల బీమాలో రైతులు స్వచ్చందంగా చేరాల్సిందేనని స్పష్టం చేసింది. రబీ సీజన్లో దిగుబడి ఆధారిత పథకం కింద వరి, జొన్న, మొక్కజొన్న, రాగి, పెసర, మినుము, వేరుశనగ, నువ్వులు, ప్రొద్దుతిరుగుడు, శనగ, రాజ్మా, మిర్చి, ఉల్లి, వాతావరణ ఆధారిత పథకం కింద జీడిమామిడి, టమాటా పంటలకు బీమా వర్తింపచేయనున్నారు. రబీ సీజన్లో బీమా చేయించుకోవాలంటే రైతుల వాటా ప్రీమియంను వారే చేయించాలని ప్రభుత్వం తెగేసి చెప్పింది. ప్రీమియం మొత్తంలో ఆహార ధాన్యాలు, నూనెగింజల పంటలకు 1.5 శాతం, వాణిజ్య, ఉద్యాన పంటలకు 5 శాతం ప్రీమియం రైతులు స్వచ్ఛందంగా చెల్లిస్తేనే బీమా వర్తిస్తుందని పేర్కొంది. పీఎంఎఫ్బీవై లో పంటకోత ప్రయోగాల ఆధారంగా వాస్తవ దిగుబడి లెక్కించి హామీ దిగుబడి కన్నా తగ్గిన సందర్భంలో ఇన్సూ్యరెన్స్ యూనిట్ పరిధిలోని రైతులందరికీ నష్ట శాతం లెక్కించి బీమా పరిహారం చెల్లిస్తారు. పీఎంఎఫ్బీవై పథకాన్ని 9 క్లస్టర్స్ పరిధిలోనూ ఐదు బీమా కంపెనీలను, ఆర్డబ్ల్యూబీసీఐఎస్ పథకాన్ని ఐదు క్లస్టర్స్ పరిధిలో నాలుగు బీమా కంపెనీలను ఎంపిక చేసారు. -
ధాన్యం బకాయిలివ్వరా?
సాక్షి, అమలాపురం: భారీ వర్షాలు.. వరదలతో వరి చేలు చెరువులుగా మారిపోయాయి. మరోవైపు ప్రభుత్వం నుంచి రైతు భరోసా సాయం అందలేదు. ఇంకోవైపు రబీకి సంబంధించి ధాన్యం బకాయిలు సైతం రెండు, మూడు నెలలుగా జమ కావడం లేదు. దిక్కుతోచని పరిస్థితుల్లో కడుపుమండిన అంబేడ్కర్ కోనసీమ జిల్లా రైతులు సోమవారం అమలాపురం కలెక్టరేట్ను ముట్టడించి ధర్నా చేశారు. అధికారులు, పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ప్రభుత్వానికి, సీఎం చంద్రబాబుకు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు వ్యతిరేకంగా పెద్దఎత్తున నినాదాలు చేశారు. కలెక్టరేట్కు వచి్చన జేసీ నుపూర్ అజయ్ కారును పది నిమషాల పాటు అడ్డుకున్నారు. మూడు మండలాల నుంచి తరలివచ్చి.. అల్లవరం, ఉప్పలగుప్తం, అయినవిల్లి మండలాలకు చెందిన సుమారు 60 మంది రైతులు కలెక్టరేట్కు తరలివచ్చి ధర్నా చేపట్టారు. మే నెలలో అమ్మిన ధాన్యానికి ప్రభుత్వం ఇప్పటికీ సొమ్ములు చెల్లించకపోవడంపై మండిపడ్డారు. తమకు రావాల్సిన సొమ్ములు కోసం జిల్లా ఉన్నతాధికారులకు, గ్రీవెన్స్లో కలెక్టర్కు ఫిర్యాదు చేసిన ఫలితం లేకుండాపోయింది. జిల్లాలో సుమారు 8 వేల మంది రైతులకు రూ.154 కోట్ల వరకు ధాన్యం సొమ్ములు చెల్లించాల్సి ఉంది. డీఆర్వో వి.వెంకటేశ్వర్లు రైతులతో చర్చించినా ఫలితం లేకపోయింది. కలెక్టర్ ఆర్.మహేష్కుమార్ వచ్చి స్పష్టమైన హామీ ఇవ్వాలని పట్టుబట్టారు. కలెక్టర్ వరద పర్యటనలో ఉన్నందున జేసీ నుపూర్ కార్యాలయానికి వచ్చి ఐదుగురు రైతులు మాట్లాడాలని డీఆర్వో సూచించారు. దీంతో రైతులు వాగి్వవాదానికి దిగారు. రైతులంతా వస్తామని పట్టుబట్టారు. ఆయన వెంట ప్రధాన గేట్లును నెట్టుకుంటూ కార్యాలయం వైపు చొచ్చుకురాగా.. పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా జేసీ నుపూర్ అజయ్ రైతులతో మాట్లాడుతూ.. ధాన్యం సొమ్ములు నెలాఖరులోగా రైతుల ఖాతాలలో జమ అవుతాయని చెప్పారు. జేసీ హామీతో రైతులు వెనుదిరిగారు. ఆత్మహత్యలే శరణ్యం ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ.. మే నెలలో ధాన్యం విక్రయించగా అప్పట్లో ఎన్నికల కోడ్ ఉండటంతో ప్రభుత్వం సొమ్ము చెల్లించడానికి వీలు కాలేదని, ఎన్నికల కోడ్ ముగిసిన అనంతరం అధికారం చేపట్టిన కూటమి ప్రభుత్వం తమను పట్టించుకోవడం లేదని వాపోయారు. ధాన్యం అమ్మకాలు చేసి 70 రోజులు అవుతున్నా సొమ్ములు ఖాతాల్లో జమ చేయకపోవడంతో నష్టపోతున్నామని వాపోయారు. ప్రభుత్వం ఇదే విధంగా వ్యవహరిస్తే ఆత్మహత్యలు చేసుకోవాల్సి వస్తుందని, నెలాఖరు నాటికి ధాన్యం సొమ్ములు ఇవ్వకుంటే సాగు సమ్మె చేపడతామని హెచ్చరించారు. జగన్ ప్రభుత్వంలో సకాలంలో సొమ్ములు వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ధాన్యం సొమ్ములు 21 రోజుల్లోనే రైతుల ఖాతాల్లో జమయ్యేవి. గత ఏడాది ఖరీఫ్ ధాన్యం అమ్మకాలు చేసిన వారంలోనే సొమ్ములు పడడాన్ని రైతులు గుర్తు చేసుకున్నారు. ఈ ఏడాది రబీ ధాన్యం కొనుగోలు సొమ్ములు కూడా మొదట్లో సకాలంలో వేశారు. అదేవిధంగా మే 24, 25 తేదీలలో రెమాల్ తుపాను సమయంలో వర్షాలు కురుస్తుండగా రైతుల వద్ద నుంచి ఏకంగా 3,300 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సైతం కొనుగోలు చేశారు. ఆ సమయంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో చెల్లింపులు నిలిచిపోయాయి. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచి్చన తరువాత ఒకసారి రూ.117 కోట్లు మాత్రమే రైతుల ఖాతాలో జమ చేశారు. మిగతా రైతులకు చెల్లింపులు చేయలేదు.మే మొదటి వారంలో అమ్మాం నేను మే మొదటి వారంలో ధాన్యం విక్రయించాను. రూ.1.20 లక్షల వరకు సొమ్ములు రావాల్సి ఉంది. రబీ కోతలకు మెషీన్ ఖర్చులు నుంచి కూలీలు, ఖరీఫ్ విత్తనాలు, దమ్ములు వరకు అప్పులు చేశాను. 70 రోజులు దాటుతున్నా సొమ్ములు ఇవ్వకపోవడం అన్యాయం. – చొల్లంగి రామకృష్ణ, దేవగుప్తం గ్రామంఆత్మహత్యలే శరణ్యం ధాన్యం అమ్మిన సొమ్ముల్లో ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా వేయలేదు. ఇలాగే ఉంటే మాకు ఆత్మహత్యలే శరణ్యం. జేసీ మేడమ్ శనివారం చివరిలో సొమ్ములు మా ఖాతాలో పడతాయని చెప్పారు. అలా జరగకపోతే నిరాహార దీక్షలు చేపడతాం. – కర్రి రాములు, జనుపల్లి గ్రామం -
ధాన్యం సేకరణ పూర్తి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో రబీ సీజన్లో రైతులు పండించిన ధాన్యం సేకరణ దాదాపు ముగిసింది. రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణ మద్దతు ధర అందించడంతో పాటు దేశంలోనే తొలిసారిగా గన్నీ, హమాలీ, రవాణా (జీఎలీ్ట) చార్జీల కింద టన్నుకు రూ.2,523 అదనంగా చెల్లిస్తూ రైతులకు ఆర్థికంగా అండగా నిలిచింది. ఫలితంగా రైతులు ఆర్బీకేల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాల వైపే మొగ్గు చూపారు. దీంతో దళారులు, కొంతమంది మిల్లర్ల దోపిడీకి పూర్తిస్థాయిలో అడ్డుకట్ట పడింది. ప్రైవేటు వ్యాపారులు తమకు గతంలో మాదిరిగా ధాన్యం అమ్మకానికి రాకపోవడంతో చేసేదేమీ లేక రైతులకు పూర్తి మద్దతు ధర ఇవ్వక తప్పని పరిస్థితి ఏర్పడింది. 2023–24 రబీలో 25 లక్షల టన్నుల ధాన్యం వస్తుందని పౌర సరఫరాల సంస్థ ప్రాథమికంగా అంచనా వేసింది. అయితే.. మార్కెట్లో డిమాండ్ బాగుండటంతో ఎక్కువ భాగం వ్యాపారులే రైతులకు మంచి ధర చెల్లించి కొనుగోలు చేయడంతో ఆర్బీకేల్లో అనుకున్న స్థాయి కంటే ధాన్యం సేకరణ తక్కువగా ఉంది. డబ్బుల కోసం ఎదురుచూపు: రబీ సీజన్లో ఇప్పటివరకు 1.32 లక్షల మంది రైతుల నుంచి రూ.2,767.90 కోట్ల విలువైన 12.63 లక్షల టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం సేకరించింది. రైతులు ధాన్యం విక్రయించిన తర్వాత డబ్బుల కోసం అవస్థలు పడకూడదనే ఉద్దేశంతో 21 రోజుల్లో తప్పనిసరిగా చెల్లింపుల చేసేలా వ్యవస్థను తీసుకొచ్చి0ది. చాలా సందర్భాల్లో ఒకట్రెండు రోజుల్లోనే రైతులకు డబ్బులు జమయ్యాయి కూడా. ఈ రబీలో ఎన్నికల హడావుడిలోనూ రైతులకు సకాలంలో చెల్లింపులు చేసింది. మే 12న 45,468 మంది రైతుల ఖాతాల్లో రూ.1,008.93 కోట్లు జమ చేసింది. ఆ తర్వాత చెల్లింపులు నెమ్మదించాయి. ఇప్పటివరకు 49,894 మంది రైతులకు రూ.1,104.46 కోట్లు మాత్రమే అందాయి. ఇంకా 82,825 మంది రైతులకు రూ.1,657.44 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఇందులో ధాన్యం సేకరణ తర్వాత నిర్ణీత గడువు ముగిసిన రైతులు చాలామంది ఉండటం.. ఖరీఫ్ సాగు కోసం సమాయత్తం కావడానికి చేతిలో డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారు. -
92% మందికి ఇన్పుట్ సబ్సిడీ
సాక్షి, అమరావతి: ఎన్నికల దృష్టితో కాకుండా అన్నదాతల సంక్షేమమే లక్ష్యంగా సంతృప్త స్థాయిలో లబ్ధి చేకూరుస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం గతేడాది ఖరీఫ్, రబీ సీజన్లలో కరువు, ప్రకృతి విపత్తులతో నష్టపోయిన 92 శాతం మంది రైతుల ఖాతాల్లోకి పెట్టుబడి రాయితీని జమ చేసి ఆదుకుంది. 8.89 లక్షల మంది రైతన్నల ఖాతాల్లోకి రూ.1,126.31 కోట్లు జమ చేయగా మరో 1.54 లక్షల మందికి రూ.163.12 కోట్లు మాత్రమే ఇవ్వాల్సి ఉంది.అది కూడా ఖాతాల వివరాలు, ఐఎఫ్ఎస్సీ కోడ్, ఆధార్ నంబర్లు సరిపోలకపోవడం లాంటి సాంకేతిక కారణాలతో జాప్యం జరుగుతోంది. బ్యాంకర్లు, అధికార యంత్రాంగం ఈ సమస్యను పరిష్కరించిన వెంటనే మిగిలిన అర్హులకూ ప్రయోజనం చేకూరేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. వీటిని వక్రీకరిస్తూ పెట్టుబడి సాయం ఏమైపోయిందంటూ రామోజీ శోకాలు పెడుతున్నారు. ఒకపక్క ఈసీ ద్వారా అన్నదాతలకు సాయం అందకుండా అడ్డుపడ్డ చంద్రబాబు మరోవైపు ఎల్లో మీడియాలో నిస్సిగ్గుగా అబద్ధాలను ప్రచారం చేస్తున్నారు.ప్రకృతి వైపరీత్యాలతో పంట నష్టపోయిన రైతులకు ఆ సీజన్ ముగిసే లోగానే పరిహారం అందిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఐదేళ్లుగా అండగా నిలుస్తోంది. దేశవ్యాప్తంగా నెలకొన్న వర్షాభావ పరిస్థితులతో ఖరీఫ్–23లో ఏడుజిల్లాల పరిధిలోని 103 కరువు మండలాల్లో 14.24 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్లు గుర్తించారు. 6.60 లక్షల మందికి రూ.847.22 కోట్ల కరువు సాయం చెల్లించాలని లెక్క తేల్చారు. గతేడాది రబీ ఆరంభంలో మిచాంగ్ తుపాను ప్రభావంతో కురిసిన వర్షాలకు 6.64 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బ తిన్నట్లు తేలింది. దీనికి సంబంధించి 4.61 లక్షల మందికి రూ.442.36 కోట్ల నష్టపరిహారం చెల్లించాలని అంచనా వేశారు.ఈ రెండు విపత్తుల్లోనూ 77 వేల మంది ఉండటంతో నష్టపోయిన వారి సంఖ్య మొత్తం 10.44 లక్షలుగా తేల్చారు. ఈమేరకు రూ.1,289.57 కోట్లు జమ చేసేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేయగా కోడ్ సాకుతో ఈసీని అడ్డంపెట్టుకుని చంద్రబాబు బృందం అడ్డుకుంది. ఈసీ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ రైతులు హైకోర్టును ఆశ్రయిస్తే మే 10న జమ చేసేందుకు కోర్టు అనుమతినిచ్చింది. అయినప్పటికీ ఈసీ తాత్సారం చేయడం వెనుక ఎవరున్నారో అందరికీ తెలిసిందే. తుది జాబితాలు రాగానే మిగతా వారికీ..నష్టపోయిన 10.44 లక్షల మంది రైతులకు రూ.1,289.57 కోట్లు ఇన్పుట్ సబ్సిడీ జమ చేయాల్సి ఉండగా ఆ ఖాతాల వివరాలను వ్యవసాయ శాఖ సీఎంఎఫ్ఎస్కు పంపించింది. అయితే 46,226 మంది రికార్డులు సరిగా లేవని వెనక్కి పంపారు. వీరికి రూ.57.15 కోట్లు జమ కావాల్సి ఉంది. మిగిలిన 9,97,925 మంది రైతులకు సంబంధించి రూ.1,232.43 కోట్లు జమ చేసేందుకు వ్యవసాయ శాఖ తిరిగి సీఎఫ్ఎంఎస్కు ప్రతిపాదనలు పంపింది.ఇందులో 8,89,784 మంది రైతులకు రూ.1,126.31 కోట్లు జమ అయింది. మరో 1,08,141 మందికి సంబంధించి రూ.106.12 కోట్లు సాంకేతిక కారణాలతో జమ కాలేదు. ఇలా 1.54 లక్షల మందికి రూ.163.27 కోట్లు జమ కావాల్సి ఉంది. బ్యాంక్ ఖాతా, ఆధార్ నెంబర్లు, రైతుల వివరాలు మిస్ మ్యాచ్ అయినట్టు గుర్తించడంతో ఆ వివరాలను జిల్లాలకు పంపి క్షేత్ర స్థాయి పరిశీలన జరుపుతున్నారు. జిల్లాల నుంచి తుది జాబితాలు రాగానే వారికి కూడా సొమ్ములు జమ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.త్వరలో రబీ 2023–24 కరువు జాబితాలుదేశవ్యాప్తంగా నెలకొన్న వర్షాభావ పరిస్థితులు రబీ 2023–24 సీజన్లో కూడా కొనసాగాయి. ఆరు జిల్లాల్లో 87 మండలాల్లో కరువు ప్రభావం ఉన్నట్లు గుర్తించారు. 2.37 లక్షలమంది రైతులకు చెందిన 2.52 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో పంటలు దెబ్బతిన్నట్లు ప్రాథమికంగా తేలింది.తుది జాబితాల రూపకల్పన జరగకుండా కోడ్ సాకుతో చంద్రబాబు బృందం అడ్డుకోగా ఇటీవలే పోలింగ్ ముగియడంతో ఈసీ అనుమతితో తుది నివేదిక రూపకల్పనకు శ్రీకారం చుట్టారు. ఇప్పటికే సోషల్ ఆడిట్, అర్జీల స్వీకరణ, పరిష్కార ప్రక్రియ పూర్తిచేశారు. జిల్లాల నుంచి తుదిజాబితాలు రాగానే పెట్టుబడి రాయితీ విడుదలకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. నాడు ప్రకటనలోనూ అంతులేని ఆలస్యం..చంద్రబాబు పాలనలో ఏటా కరువు కాటకాలే తాండవించడంతో సగటున 324 మండలాలు కరువు ప్రభావానికి గురయ్యాయి. ఖరీఫ్–2014లో 238, ఖరీఫ్–2015లో 359, ఖరీఫ్–2016లో 301, రబీ 2017–18లో 121, ఖరీఫ్–2018లో 347, రబీ 2018–19లో 257 మండలాల్లో కరువు విలయ తాండవం చేసింది. అయితే నాడు కరువు మండలాలను ఏ సీజన్కు ఆ సీజన్లో ప్రకటించిన దాఖలాలే లేవు. 2014 ఖరీఫ్లో కరువు వస్తే 2015 మార్చి 10 వరకు మూడుసార్లుగా కరువు మండలాలను నోటిఫై చేశారు.2015లో కరువు వస్తే నవంబరు నెలాఖరు వరకు ప్రకటించనే లేదు. 2016 ఖరీఫ్లో కరువు వస్తే 2017 ఫిబ్రవరి వరకు మూడు దఫాలుగా ప్రకటించారు. 2017 రబీలో కరువు వస్తే 2018 మార్చి నెలాఖరు వరకు మూడుసార్లు ప్రకటించారు. 2018 ఖరీఫ్లో కరువు వస్తే 2018 అక్టోబరు వరకు ఏకంగా ఐదు దఫాలుగా కరువు మండలాలను వెల్లడించారు. రబీ 2018–19లో కరువు వస్తే.. ఎన్నికలకు ముందు ఫిబ్రవరి 2019లో కరువు మండలాలను ప్రకటించారు.రూ.2,558 కోట్లు ఎగ్గొట్టిన బాబునాడు 2014 ఖరీఫ్ కరువు సాయాన్ని చంద్రబాబు సర్కారు 2015 నవంబరు వరకు అందజేయలేదు. 2015 కరువు సాయం 2016 నవంబరులో విదిల్చింది. 2016లో కరువు వస్తే 2017 జూన్లో, 2017లో కరువు వస్తే 2018 ఆగస్టులో సరిపుచ్చారు. 2018లో కరువు వల్ల ఖరీఫ్లో రూ.1,832.28 కోట్లు, రబీలో రూ.356.45 కోట్ల పంటనష్టం జరిగితే చంద్రబాబు ప్రభుత్వం అందించిన సహాయం సున్నా. 24.80 లక్షల మంది రైతులకు రూ.2,558 కోట్లు ఎగ్గొట్టిన నిర్వాకం చంద్రబాబుదే. తిత్లీ తుపాను బాధితులకు బాబు ఎగ్గొట్టిన రూ.182.60 కోట్ల పరిహారంతో సహా ఈ ఐదేళ్లలో 34.41 లక్షల రైతులకు రూ.3,261.60 కోట్ల పెట్టుబడి రాయితీని అందించి ఆదుకున్నది సీఎం జగన్ ప్రభుత్వమే.ఆ కథనాల్లో నిజం లేదు..ఖరీఫ్ 2023 కరువు, రబీ 2023–24లో మిచాంగ్ తుపానుకు సంబంధించి అర్హత పొందిన వారిలో ఇప్పటికే 8.89 లక్షల మందికి రూ.1,126.31 కోట్ల పెట్టుబడి రాయితీ జమచేశాం. మరో 1.54 లక్షల మందికి రూ.163.12 కోట్లు జమ చేయాల్సి ఉంది. సాంకేతిక సమస్యల్ని పరిష్కరించి త్వరలోనే వీరికి పరిహారం జమ చేస్తాం. 50 శాతం మందికి ఇంకా పరిహారం జమ కాలేదన్న కథనాల్లో వాస్తవం లేదు. ఇప్పటికే 92 శాతం మందికి జమ చేశాం. రబీ 2023–24 సీజన్లో కరువు నష్టానికి సంబంధించి తుది జాబితాల రూపకల్పన జరుగుతోంది. కలెక్టర్ల ఆమోదంతో తుది జాబితాలు రాగానే సకాలంలో పరిహారం జమ చేసేందుకు ఏర్పాట్లు చేస్తాం. – చేవూరు హరికిరణ్, స్పెషల్ కమిషనర్, వ్యవసాయశాఖ -
పద్ధతి ప్రకారం పరిహారం
సాక్షి, అమరావతి: ప్రభుత్వ ప్రక్రియలో దేనికైనా ఓ పద్ధతి అనుసరించడం తప్పనిసరి. నిబంధనల ప్రకారం నడుచుకుంటే వ్యవస్థలూ సజావుగా పనిచేస్తాయి. రైతన్నలకు ఓ రైతు భరోసా అయినా ఇన్పుట్ సబ్సిడీ అయినా టంఛన్గా క్యాలండర్ ప్రకారం అందుతున్నాయంటే ఇదే కారణం! గతేడాది దేశవ్యాప్తంగా వర్షాభావ పరిస్థితుల కారణంగా అన్నదాతలు ఇబ్బంది పడ్డారు. 2023 రబీలో కరువు బారిన పడ్డ ప్రాంతాల జాబితాను నిబంధనల ప్రకారం ఈ ఏడాది మార్చి 31 నాటికి ప్రకటించాలి. ఇందుకు ఆరు ప్రామాణికాలను పాటించడం తప్పనిసరి.ఈ క్రమంలో రబీ సీజన్లో రాష్ట్రంలో ఆరు జిల్లాల పరిధిలో 87 మండలాలు కరువు ప్రభావానికి గురైనట్లు నిర్ధారించారు. 63 మండలాల్లో తీవ్రంగా, 24 మండలాల్లో స్వల్పంగా కరువు ఉన్నట్లు లెక్క తేల్చారు. 2.37 లక్షల మంది రైతులు నష్టపోయినట్లు అంచనా వేశారు. 2.52 లక్షల హెక్టార్లలో 33 శాతానికిపైగా వ్యవసాయ పంటలకు నష్టం వాటిల్లినట్లు తేలింది. ఈ మేరకు మార్చి 16వతేదీన గెజిట్ నోటిఫికేషన్ కూడా విడుదలైంది. కరువు మండలాలను గుర్తించిన సమయంలోనే ప్రాథమిక నష్టాన్ని అంచనా వేశారు. నిబంధనల ప్రకారం ప్రక్రియ కొనసాగుతున్న సమయంలో ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది.చంద్రబాబు బృందం ఫిర్యాదుతో రెండు నెలల పాటు ర్యాండమ్ శాంపిల్ సర్వేను ఎన్నికల సంఘం నిలిపివేసింది. పోలింగ్ ముగిశాక ఈసీ ఆంక్షలు సడలించడంతో ర్యాండమ్ శాంపిల్ సర్వే జరిపి తుది అంచనాల నివేదిక తయారీలో అధికారులు నిమగ్నమయ్యారు. మరి ఇందులో అలసత్వానికి ఎక్కడ తావుంది? రైతుల నోటి కాడ ముద్దను నేల పాలు చేస్తూ చంద్రబాబు బృందం ఫిర్యాదు చేయడం వల్లే కదా ఈసీ అడ్డుకుంది? జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ (ఎన్డీఏంఏ) విధివిధానాల ప్రకారమే కరువు మండలాలను ప్రకటిస్తారు. అంతేగానీ డ్రైస్పెల్స్ ఆధారంగా కాదు. దీని ప్రకారమే 2023 ఖరీఫ్ సీజన్లో 80 మండలాల్లో తీవ్రంగా, 23 మండలాల్లో స్వల్పంగా కరువు ఉన్నట్లు గుర్తించారు. రూ.2,558.07 కోట్ల ఇన్పుట్ సబ్సిడీ ఎగ్గొట్టిన బాబు కరువు మండలాల్లో ఆ సీజన్లో తీసుకున్న పంట రుణాలను ఆర్నెళ్ల పాటు రీ షెడ్యూల్ చేస్తారు. పంటలు కోల్పోయిన వారికి ఇన్పుట్ సబ్సిడీ (పంట నష్టపరిహారం) చెల్లిస్తారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏ సీజన్లో నష్టపోతే అదే సీజన్ చివరిలో ఇన్పుట్ సబ్సిడీ అందించి ఆదుకుంటోంది. గత ఖరీఫ్లో కరువు ప్రభావిత మండలాల్లో పంట నష్టపోయిన 6.60 లక్షల మంది రైతులకు రూ.847.22 కోట్లు జమ చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తే ఎన్నికల కోడ్ సాకుతో చంద్రబాబు బృందం రెండు నెలల పాటు అడ్డుకుంది.పోలింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాత కరువు సాయాన్ని జమ చేసి సీఎం జగన్ ప్రభుత్వం రైతుల పట్ల తన చిత్తశుద్ధిని చాటుకుంది. చంద్రబాబు అధికారంలో ఉండగా ఏనాడూ సీజన్లో కరువు మండలాలను ప్రకటించిన పాపాన పోలేదు. సకాలంలో పరిహారం జమ చేసి రైతులకు అండగా నిలిచిన దాఖలాలు లేవు. 24.80 లక్షల మంది రైతన్నలకు రూ.2,558.07 కోట్ల ఇన్పుట్ సబ్సిడీని ఎగ్గొట్టిన చరిత్ర చంద్రబాబుదే. ఈసీని పలుమార్లు అభ్యర్థించాం.. ⇒ ప్రాథమిక అంచనా ప్రకారం ఆరు జిల్లాల్లో 87 మండలాలు కరువు ప్రభావానికి గురైనట్లు గుర్తించాం. ప్రాథమిక నివేదిక తయారీ సమయంలోనే నష్టపోయిన పంటల వివరాలు సేకరించాలని ఆదేశించాం. ఏప్రిల్లో పలుమార్లు ఎన్నికల కమిషన్ను కలిసి అనుమతి కోసం అభ్యరి్థంచాం. పంట కోతలు పూర్తయినప్పటికీ పొలంలో పంట ఉన్నప్పుడు సేకరించిన వివరాల ఆధారంగా ఎన్యుమరేషన్ పూర్తి చేసి సామాజిక తనిఖీతో జాబితాలు సిద్ధం అవుతాయి. తద్వారా రైతులెవరూ నష్టపోయే ఆస్కారం ఉండదు. – చేవూరు హరికిరణ్, వ్యవసాయ శాఖ స్పెషల్ కమిషనర్ ఎలాంటి జాప్యం జరగలేదు.. ⇒ కేంద్ర వ్యవసాయ శాఖ కరువు మాన్యువల్ 2020 ప్రకారం ఖరీఫ్ కరువు మండలాలను అక్టోబర్ 31వ తేదీలోగా, రబీ కరువు మండలాలను మార్చి 31లోపు ప్రకటించాలి. దీని ప్రకారమే రబీ కరువు మండలాలను మార్చి 16న ప్రకటించారు. ఇందులో ఎలాంటి జాప్యం జరగలేదు. కరువు మాన్యువల్ ప్రకారం డ్రైస్పెల్ ఒక్కటే పరిగణలోకి తీసుకోడానికి వీల్లేదు. దేశవ్యాప్తంగా దశల వారీ ఎన్నికల దృష్ట్యా కేంద్ర బృందం పర్యటన కొంత ఆలస్యమైంది. – కూర్మనాథ్, ఏపీ విపత్తుల సంస్థ ఎండీ -
అన్నదాతల్లో ఆనందం
సాక్షి, అమరావతి: ఎంతో శ్రమించి పండించిన పంటకు రాష్ట్ర ప్రభుత్వం ఒక్కరోజులోనే చెల్లింపులు జరపడంతో అన్నదాతల ఇళ్లల్లో ఆనందం వెల్లివిరిసింది. మద్దతు ధరతో కొనుగోలు చేసిన ధాన్యానికి గానూ వైఎస్ జగన్ ప్రభుత్వం మంగళవారం రూ.815 కోట్లు చెల్లించింది. దీంతో ఖరీఫ్లో సేకరించిన రూ.6,541.23 కోట్ల విలువైన ధాన్యానికి రూ.6,514.59 కోట్లు చెల్లించినట్లయ్యింది. సాంకేతిక కారణాల వల్ల ఆలస్యమైన మిగిలిన స్వల్ప మొత్తాన్ని కూడా పౌరసరఫరాల సంస్థ డీఎం అనుమతి రాగానే రైతుల ఖాతాల్లోకి జమ చేసేందుకు వీలుగా ప్రభుత్వం షెడ్యూల్ చేసింది. రైతు సంక్షేమమే లక్ష్యంగా వైఎస్ జగన్ ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్లలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. దళారులు, మిల్లర్ల దోపిడీ నుంచి రైతులను రక్షిస్తూ ఆర్బీకే స్థాయిలోనే సంపూర్ణ మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు చేయడంతో పాటు సకాలంలో చెల్లింపులు చేస్తోంది. ఖరీఫ్ సీజన్లో 29.93 లక్షల టన్నులు ధాన్యాన్ని కొనుగోలు చేసి.. 4.96 లక్షల మంది రైతులకు మద్దతు ధరను అందించింది. ఇలా ఈ ఐదేళ్లలో ధాన్యం కొనుగోళ్లలో ఒక్క రూపాయి కూడా బకాయి లేకుండా రైతులకు సంపూర్ణ మద్దతు ధరను అందించిన ప్రభుత్వంగా రికార్డు సృష్టించింది. ఏ ఒక్క రైతూ ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో 21 రోజుల్లోనే నగదు చెల్లిస్తోంది. పెరిగిన ధాన్యం సేకరణ.. గత చంద్రబాబు ప్రభుత్వం ఖరీఫ్, రబీ సీజన్లలో కలిపి ఏడాదికి సగటున 56 లక్షల టన్నులు ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు చేసింది. అదే సగటు ప్రస్తుత ప్రభుత్వంలో 77 లక్షల టన్నులుగా ఉంది. దీనికి తోడు ఆర్బీకే పరిధిలోని రైతులు బయటకు వెళ్లాల్సిన అవసరం లేకుండా.. వారి కల్లాల వద్దనే ధాన్యం సేకరణ చేపట్టింది. ఆర్బీకేల్లో.. ధాన్యం సేకరణకు అవసరమైన శాశ్వత ఏర్పాట్లు చేసింది. టీడీపీ ప్రభుత్వం ఐదేళ్లలో 17.94 లక్షల మంది రైతుల నుంచి రూ.40,236.91 కోట్ల విలువైన 2.65 కోట్ల టన్నుల ధాన్యాన్ని మాత్రమే సేకరించగా.. ప్రస్తుత ప్రభుత్వం ఇప్పటివరకు ఏకంగా 37.68 లక్షల మంది రైతుల నుంచి రూ.65,142.29 కోట్ల విలువైన 3.40 కోట్ల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసింది. టీడీపీ ప్రభుత్వంతో పోలిస్తే సీఎం జగన్ ప్రభుత్వంలో అదనంగా దాదాపు 20 లక్షల మంది రైతులకు సంపూర్ణ మద్దతు ధర దక్కింది. తడిచిన ధాన్యమూ కొనుగోలు.. అలాగే వైఎస్ జగన్ ప్రభుత్వం ఏపీలో గతంలో ఎన్నడూ లేని విధంగా జయ రకం(బొండాలు/దుడ్డు బియ్యం) ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేసింది. దీంతో ఉభయ గోదావరి జిల్లాల్లో జయ రకం పండించే రైతులు చాలా లాభపడ్డారు. ప్రకృతి విపత్తులు, అకాల వర్షాల వల్ల తడిచిన ధాన్యాన్ని తెచ్చిన రైతులకు సైతం అండగా నిలిచిన ఏకైక ప్రభుత్వంగా గుర్తింపు తెచ్చుకుంది. కేంద్ర ప్రభుత్వ నిబంధనలను సైతం పక్కనపెట్టి తడిచిన ధాన్యాన్ని ఆఫ్లైన్లో సేకరించి మరీ రైతులకు మద్దతు ధర అందించడంలో రికార్డు నెలకొల్పింది. ఆఫ్లైన్లో సేకరించిన ధాన్యాన్ని దూరాభారాలు చూడకుండా డ్రయ్యర్ సౌకర్యం, డ్రయ్యర్ ప్లాట్ఫాం ఉన్న మిల్లులకు తరలించి ఆరబోసి మరీ కొనుగోలు చేసింది. జగన్ ప్రభుత్వం అదనపు భారాన్నైనా మోసింది గానీ ఒక్క రైతు కూడా నష్టపోకుండా చర్యలు చేపట్టింది. బాబు హయాంలో బకాయిలు.. చంద్రబాబు హయాంలో రైతులు ధాన్యం డబ్బుల కోసం అహోరాత్రులు ఎదురు చూడాల్సి వచ్చేది. రైతులు తాము కష్టపడి పండించిన పంటను ప్రభుత్వంపై నమ్మకంతో విక్రయిస్తే.. వారికి చెల్లించాల్సిన డబ్బులను సైతం చంద్రబాబు పక్కదారి పట్టించారు. ఇలా 2019 ఎన్నికలకు ముందు పౌరసరఫరాల సంస్థకు చెందిన రూ.4,838.03 కోట్లను వేరే కార్యక్రమాలకు మళ్లించి రైతులను నట్టేట ముంచారు. చివరకు సీఎం పదవి నుంచి దిగిపోతూ రూ.960 కోట్లు చెల్లించకుండా రైతులను మోసం చేశారు. సీఎం జగన్ వచ్చిన తర్వాత టీడీపీ ప్రభుత్వంలోని బకాయిలను కూడా తీర్చి.. పారదర్శక ధాన్యం కొనుగోలు విధానాన్ని తీసుకొచ్చారు. అదనంగా టన్నుకు రూ.2,523 గత ప్రభుత్వం పేరుకే ధాన్యం సేకరణ చేసేది. కొనేదంతా మిల్లర్లు.. దళారులే. వారంతా రైతుల అవసరాలను ఆసరాగా చేసుకుని 75 కేజీల బస్తాకు మద్దతు ధర కంటే రూ.200 వరకు తగ్గించి ఇచ్చేవారు. ఇలా ఎకరానికి తక్కువలో తక్కువ 30 నుంచి 33 బస్తాల దిగుబడి వేసుకున్నా.. రూ.6 వేలకు పైగా రైతులు నష్టపోయేవారు. వైఎస్ జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ–క్రాప్ డేటా ఆధారంగా నేరుగా రైతుల నుంచే ధాన్యం సేకరిస్తోంది. దీంతో మిల్లర్లు, దళారుల దందాకు చెక్పడింది. అలాగే రైతులపై ఆర్థిక భారం తగ్గించడంలో భాగంగా ప్రతి టన్ను ధాన్యం కొనుగోలులో రవాణా, హమాలీ, గోనె సంచుల వినియోగం నిమిత్తం రైతులకు రూ.2,523 అందిస్తోంది. గతంలో రైతులే సొంత ఖర్చులతో ధాన్యాన్ని మిల్లులకు తరలిస్తే.. వాటిని ప్రభుత్వ వాహనాల్లో తరలించినట్టు రికార్డుల్లో నమోదు చేసి టీడీపీ నాయకులే కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని అప్పనంగా మింగేశారు. -
నేడు మూడో విడత రైతు భరోసా జమ
సాక్షి, అమరావతి: వరుసగా ఐదో ఏడాది.. వైఎస్సార్ రైతు భరోసా కింద మూడో విడత పెట్టుబడి సాయం సొమ్మును రైతుల ఖాతాల్లో బుధవారం జమ చేసేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. దీంతోపాటు రబీ 2021–22, ఖరీఫ్–2022 సీజన్లకు గాను అర్హులైన రైతు కుటుంబాలకు సున్నా వడ్డీ రాయితీ సొమ్మును సైతం చెల్లించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ రెండు పథకాలకు అర్హత పొందిన 64.37 లక్షల రైతు కుటుంబాల ఖాతాలకు రూ.1,294.34 కోట్ల సాయాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయం నుంచి బటన్ నొక్కి జమ చేయనున్నారు. ఐదేళ్లలో రైతు భరోసా కింద రూ.34,228 కోట్ల లబ్ధి ఎన్ని కష్టాలు ఎదురైనా.. ఇచ్చిన మాట కంటే మిన్నగా చెప్పిన సమయానికి వైఎస్సార్ రైతు భరోసా కింద పెట్టుబడి సాయం అందిస్తున్న వైఎస్ జగన్ ప్రభుత్వం దేశానికే ఆదర్శంగా నిలిచింది. నాలుగేళ్ల పాటు ప్రతి రైతు కుటుంబానికి రూ.13,500 చొప్పున పెట్టుబడి సాయం అందించిన ప్రభుత్వం వరుసగా ఐదో ఏడాది ఇప్పటికే రెండు విడతల్లో రూ.11,500 చొప్పున జమ చేసింది. మూడో విడతగా ఒక్కొక్కరికి మరో రూ.2 వేల చొప్పున 53.58 లక్షల మంది రైతన్నల ఖాతాలకు రూ.1,078.36 కోట్లను బుధవారం జమ చేయనుంది. దేశంలో మరెక్కడా లేనివిధంగా సొంత భూమి సాగు చేసుకుంటున్న రైతన్నలతో పాటు సెంటు భూమి కూడా లేని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, కౌలు రైతులు, ఆర్వోఎఫ్ఆర్ (అటవీ), దేవదాయ భూములు సాగు చేసుకుంటున్న రైతన్నలకు కూడా ‘వైఎస్సార్ రైతు భరోసా‘ కింద ఏటా రూ.13,500 చొప్పున పెట్టుబడి సాయం అందిస్తున్న ఏకైక ప్రభుత్వంగా నిలిచింది. ఏటా రూ.12,500 చొప్పున ఐదేళ్లలో రూ.50 వేలు అందిస్తామన్న ఎన్నికల హామీకి మిన్నగా ఏటా రూ.13,500 చొప్పున రూ.67,500 జమ చేసింది. బుధవారం అందిస్తున్న సాయంతో కలిపి రూ.34,288 కోట్లు జమ చేసినట్టవుతుంది. క్రమం తప్పకుండా సున్నా వడ్డీ రాయితీ రూ.లక్షలోపు పంట రుణాలు తీసుకుని సమయానికి తిరిగి చెల్లించిన రైతన్నలకు వైఎస్సార్ సున్నా వడ్డీ పంట రుణాల పథకం కింద పూర్తి వడ్డీ రాయితీని రాష్ట ప్రభుత్వం చెల్లిస్తోంది. రబీ 2021–22, ఖరీఫ్–2022లో రుణాలు తీసుకుని సకాలంలో చెల్లించిన 10,78,615 మంది రైతన్నలకు రూ.215.98 కోట్ల వడ్డీ రాయితీ సొమ్మును బుధవారం జమ చేయనున్నారు. 2014–15 నుంచి 2018–19 వరకు పెండింగ్ పెట్టిన బకాయిలతో సహా బుధవారం అందిస్తున్న రూ.215.98 కోట్లతో కలిపి.. 57 నెలల్లో వైఎస్సార్ సున్నా వడ్డీ పంట రుణాల కింద 84.66 లక్షల మంది రైతులకు అందించిన వడ్డీ రాయితీ మొత్తం రూ.2,050.53 కోట్లు అవుతోంది. తాజాగా జమ చేస్తున్న సాయంతో కలిపి 57 నెలల్లో రైతులకు వివిధ పథకాల కింద రాష్ట్ర ప్రభుత్వం రూ.1,84,567 కోట్ల సాయం అందించింది. -
రబీ ఉత్పత్తుల కొనుగోళ్లకు శ్రీకారం
సాక్షి, అమరావతి: మార్కెట్లో కనీస మద్దతు ధర దక్కని రబీ ఉత్పత్తుల కొనుగోలుకు ప్రభుత్వం సన్నద్ధమైంది. శనగల కొనుగోలుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో ఆర్బీకేల ద్వారా రైతుల రిజిస్ట్రేషన్కు శ్రీకారం చుట్టారు. త్వరలో పెసలు, మినుముల కొనుగోలుకు సన్నాహాలు చేస్తున్నారు. మద్దతు ధరకు సేకరణ... రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది క్వింటాల్కు శనగలకు రూ.5440, పెసలకు రూ.8558, మినుముకు రూ.6950, వేరుశనగకు రూ.5850 చొప్పున కనీస మద్దతు ధరలను నిర్ణయించింది. రబీ–2023 –24 సీజన్లో 7 లక్షల ఎకరాల్లో శనగ, 7.50 లక్షల ఎకరాల్లో మినుము, 1.92 లక్షల ఎకరాల్లో పెసలు, 1.61 లక్షల ఎకరాల్లో వేరుశనగ పంటలు సాగయ్యాయి. శనగ 4.50 లక్షల టన్నులు, మినుము 3.89 లక్షల టన్నులు, వేరుశనగ 1.86 లక్షల టన్నులు, పెసలు 84 వేలటన్నుల దిగుబడులొస్తాయని అంచనా. ప్రస్తుతం మార్కెట్లో క్వింటాల్కు పెసలకు రూ.9 వేల నుంచి 9300, మినుముకు రూ.9 వేల నుంచి 9500 ఉండగా, శనగలు మాత్రం రూ.5300 నుంచి రూ.5600 మధ్య ఉంది. కనీస మద్దతు ధరకు 1.14,163 టన్నుల కొనుగోలుకు ప్రభుత్వం అనుమతిచ్చింది. ప్రస్తుతం ప్రభుత్వం ఇచ్చిన అనుమతి మేరకు ఆర్బీకేల ద్వారా శనగలు కొనుగోలుకు మార్క్ఫెడ్ ఏర్పాట్లు చేసింది. గురువారం నుంచి రైతుల రిజిస్ట్రేషన్లకు శ్రీకారం చుడుతున్నారు. 26వతేదీ నుంచి కొనుగోలు చేపట్టనున్నారు. అదే రీతిలో మిగిలిన పంట ఉత్పత్తుల కొనుగోలుకు కూడా అనుమతి కోరుతూ మార్క్ఫెడ్ కేంద్రానికి ప్రతిపాదనలు పంపించింది. కేంద్రం నుంచి అనుమతి రాగానే మినుము, పెసలు, వేరుశనగ కొనుగోళ్లకు శ్రీకారం చుట్టనున్నారు. సన్న, చిన్నకారు రైతులకు ప్రాధాన్యం పంట నమోదు (ఈ–క్రాప్) ఆధారంగానే ఉత్పత్తులను కొనుగోలు చేస్తున్నారు. ప్రతి రైతు రబీలో సాగుచేసిన పంట వివరాలను సమీప ఆర్బీకేలో నమోదు చేసుకోవాలి. కొనుగోలు సందర్భంగా సన్న, చిన్నకారు రైతులకే తొలుత ప్రాధాన్యతనిస్తారు. పంట కోతల తేదీ ఆధారంగా కొనుగోలు తేదీని నిర్ధారిస్తారు. పంట సేకరణ తేదీ, కొనుగోలు కేంద్రం సమాచారాన్ని ఎస్ఎంఎస్ ద్వారా పంపిస్తారు దళారుల బెడద లేకుండా బయోమెట్రిక్ తప్పనిసరి చేశారు. కొనుగోలు వేళ రైతులకు ఈ–రసీదు ఇస్తారు. సేకరించిన ఉత్పత్తులను సులభంగా ట్రాక్ చేయడానికి వీలుగా సంచులకు క్యూఆర్ కోడ్/ఆర్ఎఫ్ ఐడీట్యాగ్ వేస్తున్నారు. చెల్లింపుల కోసం ప్రత్యేకంగా ఈ–సైన్ అమలు చేస్తున్నారు. నాణ్యత ప్రమాణాలకనుగుణంగా కొనుగోళ్లు జరిగేలా థర్డ్ పార్టీ ఆడిట్ చేస్తున్నారు. పారదర్శకంగా కొనుగోళ్లు... కనీస మద్దతు ధరకు రైతుల నుంచి శనగల సేకరణకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఆర్బీకేల్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న రైతుల నుంచి కొనుగోలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. చిన్న, సన్న కారు రైతులకు తొలుత ప్రాధాన్యతనిస్తాం. ప్రభుత్వం అనుమతి రాగానే మినుము, పెసలు, వేరుశనగ కూడా మద్దతు ధరకు కొనుగోలు చేస్తాం. – డాక్టర్ గెడ్డం శేఖర్బాబు, ఎండీ, ఏపీ మార్క్ఫెడ్ -
22లోగా రబీ ఈ క్రాప్, ఈ కేవైసీ పూర్తి చేయాలి
సాక్షి, అమరావతి: ప్రస్తుత రబీలో ఈ–క్రాప్, ఈకేవైసీల నమోదు ప్రక్రియను ఈ నెల 22లోగా పూర్తి చేయాలని వ్యవసాయశాఖ ఇన్చార్జి కమిషనర్ డాక్టర్ గెడ్డం శేఖర్ బాబు ఆదేశించారు. మంగళగిరిలోని క్యాంప్ కార్యాలయం నుంచి జిల్లాల వ్యవసాయ అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడుతూ.. రబీలో ఎక్కువ సాగయ్యే శనగ, మొక్కజొన్న, మినుము వంటి మెట్టపంటలు కోతకు వచ్చే సమయం దగ్గర పడుతుందని, అందువలన సాధ్యమైనంత త్వరగా ఈ క్రాప్, ఈ కేవైసీల నమోదు ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. క్షేత్రస్థాయిలో నియమించిన సూపర్ చెక్ బృందాల ప్రగతిపై ఆయన సమీక్షించారు. ఈ కేవైసీలో నూరుశాతం సాధించే దిశగా ఈ నెల 12 నుంచి 21వ తేదీ వరకు జరుగుతున్న క్యాంపెయిన్ను సద్వినియోగం చేసుకోవాలన్నారు. వచ్చే ఖరీఫ్ 2024లో అవసరమైన ఎరువులు, విత్తనాల కోసం జిల్లాల వారీగా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని సూచించారు. పీఎం కిసాన్ 16వ విడత నిధులు త్వరలో విడుదల కానున్న నేపథ్యంలో ఇంకా ఆధార్తో బ్యాంక్ ఖాతాలను అనుసంధానం చేయని వారిని గుర్తించి సత్వరమే ఆ ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. -
Fact Check: తొందరపడి తప్పుడు రాతలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో రబీ సాధారణ విస్తీర్ణం 55.27 లక్షల ఎకరాలు. ఇప్పటి వరకు 18.84 లక్షల ఎకరాల విస్తీర్ణంలో పంటలు సాగయ్యాయి. రబీ సీజన్ అక్టోబర్ నుంచి డిసెంబర్ చివరి వరకూ వరినాట్లు వేస్తారు. ఒకవేళ వర్షాభావ పరిస్థితులు ఏర్పడితే జనవరి 15 వరకు వేసుకోవచ్చన్నది ఆచార్య ఏన్జీ రంగా వ్యవసాయ విశ్వ విద్యాలయం శాస్త్రవేత్తల సూచన. సాధారణంగా ఖరీఫ్ వరికోతలు పూర్తయిన తర్వాత అదే పొలంలో జొన్న, నువ్వులు, కొర్ర పంటలను జనవరి నెలవరకు వేసుకోవచ్చు. ప్రాంతాల వారీగా చూస్తే కోస్తా జిల్లాల్లో ఖరీఫ్ వరి కోతలు పూర్తయిన తర్వాత అదే పొలంలో అపరాలు, మొక్కజొన్న, జొన్న, రాగి పంటలను డిసెంబర్ చివరి వరకూ వేయడం ఆనవాయితీ. చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో వేరుశనగకు ప్రత్యామ్నాయంగా మినుములు, మేత మొక్కజొన్న, మేత జొన్న, మేత అలసంద డిసెంబర్ చివరి వరకూ విత్తుతారు. కర్నూలు, నంద్యాల జిల్లాల్లో వరికి ప్రత్యామ్నాయంగా శనగ, అపరాలు, ప్రొద్దుతిరుగుడు, మొక్కజొన్న డిసెంబర్ చివరి వరకూ సాగు చేస్తారు. తిరుపతి జిల్లాలో మొక్క జొన్నకు ప్రత్యామ్నాయంగా సజ్జ, రాగి, కొర్ర పంటలను జనవరి 2వ వారం వరకు వేస్తారు. నెల్లూరు జిల్లాలో నువ్వులకు ప్రత్యామ్నాయంగా పెసర పంటను జనవరి 3వ వారం వరకు వేస్తారు. ఈ లెక్కన వచ్చే మూడు వారాల్లో వరి, జొన్న, రాగి, మొక్కజొన్న, అపరాలు, సజ్జ పంటల విస్తీర్ణం భారీగా పెరిగే అవకాశం ఉంది. ఇంతలోనే రబీ విస్తీర్ణం 12 లక్షల ఎకరాలు తగ్గిందంటూ ఓ కథనాన్ని ఈనాడు వండి వార్చింది. అడ్డగోలు రాతలు... అబద్ధాలు వండివార్చడం... ప్రభుత్వంపై దుష్ప్రచారానికి పూనుకోవడం... ఇవి ఈనాడుకు అలవాటుగా మారింది. ఎంత చేస్తున్నా... ఏమీ చేయలేదన్నట్టు తప్పుడు కథనాలు అల్లడం రామోజీకి నిత్యకృత్య మైపోయింది. ఇప్పుడు తాజాగా రబీపై సర్కారు నిర్లక్ష్యం వహిస్తోందంటూ మరో కట్టుకథ అచ్చేశారు. రబీ సీజన్ గడువు ఇంకా ముగిసి పోలేదు... ఇప్పటివరకూ పండిన పంటలపై ఇంకా లెక్క తేలలేదు. అయినా సాగు విస్తీర్ణం తగ్గిపోయిందంటూ అడ్డగోలు రాతలు. రబీ సాగుపై ఒక్కసారి కూడా సమీక్ష జరపలేదంటూ దొంగ ఏడుపులు. వర్షాభావ పరిస్థితులు నెలకొన్నప్పటికీ ప్రత్యామ్నాయ పంటల రాయితీ విత్తనంపై సర్కార్ సన్నాయి నొక్కులు నొక్కుతోందంటూ విషపు రాతలు. ‘రబీలోనూ సర్కార్ మొద్దు నిద్రే’ అంటూ వండివార్చిన ఈ అడ్డగోలు కథనంపై వాస్తవాలు ఒక్కసారి పరిశీలిద్దాం. నష్టపరిహారం పంపిణీకి చర్యలు ♦ ఖరీఫ్ పంట కాలంలో కరువు పరిస్థితులు, మిచాంగ్ తుఫాన్ ప్రభావంతో కురిసిన వర్షాల వల్ల దెబ్బతిన్న çపంటలకు నష్టపరిహారం అందించేందు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ♦నష్టపోయిన రైతులకు మెరుగైన సాయం అందించాలన్న సంకల్పంతో నష్టపరిహారాన్ని భారీగా పెంచుతూ ఉత్తర్వులు కూడా జారీ చేసింది. కేంద్రం ఇచ్చే పెట్టుబడి రాయితీ కంటే మెరుగైన రీతిలో ఇచ్చేలా మార్పులు చేసింది. ♦ పంట నష్టం ప్రాధమిక అంచనా వివరాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్ల డంతో కేంద్ర బృందాలు రాష్ట్రంలో పర్యటించి కేంద్రానికి నివేదిక కూడా సమర్పించాయి. ♦ ఖరీఫ్ సీజన్లో ప్రకటించిన కరువు మండలాల పరిధిలో పంట దెబ్బతిన్న రైతులకు పంట నష్టపరిహారం ఇచ్చేందుకు, కరువు, తుఫాన్ ప్రభావంతో పంటలు దెబ్బతిన్న రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ♦ తుఫాన్ ప్రభావం వల్ల ధాన్యం రంగు మారినా, పాడైనా, తేమ శాతంలో నిబంధనలను సడలించి మరీ కొనుగోలుచేసింది. ఇలా డిసెంబర్ 1 నుంచి 14 వరకు తుఫాన్ తర్వాత నిబంధనలు సడలించి 12.70లక్షల క్వింటాళ్ల వరి ధాన్యాన్ని రైతుల నుంచి కొనుగోలు చేశారు. ♦ వాస్తవాలు ఇలా ఉంటే ప్రభుత్వ ప్రతిష్టను దిగజార్చడమే లక్ష్యంగా రైతులను గందరగోళ పర్చేలా బురద రాతలు రాయడం ఈనాడుకే చెల్లింది. ఎప్పటికప్పుడు సాగుపై సమీక్షలు ♦ఈ సీజన్లో సాగు పరిస్థితులపై వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్దన్రెడ్డి నవంబర్ 3న, 23న వ్యవసాయ, ఉద్యాన శాఖాధికారులతో ఉన్నత స్థాయిలో సమీక్షించారు. ♦ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి తరఫున ఆయన కార్యదర్శి నవంబర్ 8న, ముఖ్యకార్యదర్శి నవంబర్ 9, 25, డిసెంబర్ 15న, ప్రత్యేక ముఖ్య కార్యదర్శి నవంబర్ 3, 17, 20, 29, డిసెంబర్ 18న సమీక్షించారు. ♦ శాస్త్రజ్ఞులు సిఫార్సు చేసిన ప్రత్యామ్నాయాలను రైతులు పాటించేందుకు వీలుగా నవంబర్ 10 నుంచి 28 వరకు జాయింట్ ఇరిగేషన్ – వ్యవసాయ అడ్వైజరీ బోర్డు సమావేశాలు నిర్వహించారు. ♦ దెబ్బతిన్న నారు మళ్ళు, లేత దశలో వున్న రబీ పంటలకు తిరిగి విత్తుకునేందుకు 80 శాతం రాయితీపై ప్రత్యామ్నాయ పంటల విత్తనాల (86వేల క్వింటాళ్లు) సరఫరాకు ఏర్పాటు చేశారు. ♦ ఇప్పటి వరకు 24 జిల్లాల్లోని అర్హులైన రైతులకు 31వేల క్వింటాళ్ల వరి, వేరుశనగ, శనగ, మినుములు, పెసర, నువ్వులు, ఉలవలు విత్తనాలను పంపిణీ చేశారు. ఇందుకోసం రూ.16.63 కోట్ల రాయితీ రూపంలో ప్రభుత్వం అందించింది. ♦ కానీ ఇవేవీ పట్టించుకోకుండా అసలు ప్రభుత్వం సమీక్షలే నిర్వక్షించలేదంటూ తప్పుడు ఆరోపణలు ఈనాడు చేసింది. ఖరీఫ్కు అనుకూలించని వర్షాలు ♦ ఈ ఏడాది తీవ్ర వర్షాభావ పరిస్థితుల వల్ల ఖరీఫ్కు తీవ్ర జాప్యం ఏర్పడింది. సెప్టెంబర్ చివరి వరకు పంటలు వేసుకోవడం వల్ల, పంట కోతలు ఇç³్పటికీ జరుగుతూనే ఉన్నాయి. దానివల్ల రబీ పంటల సాగులోనూ ఆలస్యం అయింది. ఖరీఫ్ సాధారణ విస్తీర్ణం 84.94 లక్షల ఎకరాలకు 61.70 లక్షల ఎకరాల్లోనే వేశారు. అంటే 23. 24లక్షల ఎకరాల్లో సాగు తగ్గింది. కానీ ఖరీఫ్లో 31 లక్షల ఎకరాల్లో పంటలు వేయలేదంటూ ఈనాడు ఆరోపించింది. ♦ ఖరీఫ్ సాగు చేయ లేని చోట ప్రత్యామ్నాయంగా వరి, మొక్క జొన్నతో పాటు చిరుధాన్యాలు, అపరాలు సాగు చేసేందుకు ముందుకొచ్చిన 1.16 లక్షల మంది రైతులకు 80 శాతం సబ్సిడీపై 30,977 క్వింటాళ్ల విత్తనాలను పంపిణీ చేశారు. ఇందుకోసం రూ.26.46 కోట్లు వెచ్చించారు. మరో వైపు రబీ ముందస్తు ప్రణాళికలో భాగంగా 2.70 లక్షల క్వింటాళ్ల శనగ, వేరుశనగ,వరి, మినుములు, పెసర పంటల విత్తనాలను సరఫరా చేశారు. -
రబీలోనూ ప్రత్యామ్నాయ పంటలు
సాక్షి, అమరావతి : రబీ సీజన్లోనూ నెలకొన్న వర్షాభావ పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు రాష్ట్ర వ్యవసాయ శాఖ సన్నద్ధమైంది. సీజన్లో నెలకొన్న బెట్ట పరిస్థితులకనుగుణంగా అవసరమైన ప్రాంతాల్లో ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక అమలుచేసేందుకు కార్యాచరణ సిద్ధంచేసింది. సీజన్ ఆరంభమై నెలన్నర రోజులైన నేపథ్యంలో.. రబీసాగు లక్ష్యం 55.96 లక్షల ఎకరాలుగా కాగా, ఇందుకు 3,64,372 క్వింటాళ్ల విత్తనం అవసరమని వ్యవసాయ శాఖ ఇండెంట్ పెట్టింది. దీంతో 3,78,200 టన్నులను ఆర్బీకేల్లో పొజిషన్ చేయగా, ఇప్పటివరకు 2,49,647 క్వింటాళ్ల విత్తనాలను పంపిణీ చేశారు. ప్రధానంగా 2.45 లక్షల క్వింటాళ్ల శనగ, 3,500 క్వింటాళ్ల వేరుశనగ, 500 క్వింటాళ్ల చొప్పున వరి, పచ్చిరొట్ట విత్తనాలు పంపిణీ చేశారు. గతేడాది ఇదే సమయానికి 10.81 లక్షల ఎకరాల్లో పంటలు సాగుకాగా.. ఈ ఏడాది ఇప్పటివరకు 8.5 లక్షల ఎకరాల్లో సాగయ్యాయి. ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ప్రత్యామ్నాయ పంటల ప్రణాళికపై వ్యవసాయ శాఖ దృష్టిసారించింది. ఇప్పటికే ఆ శాఖ మంత్రి కాకాణి గోవర్థన్రెడ్డి ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. సీజన్లో నెలకొన్న వాతావరణ పరిస్థితులను ప్రతీ 15 రోజులకోసారి సమీక్షిస్తూ తదనుగుణంగా ముందుకు సాగాలని నిర్ణయించారు. అలాగే, అచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తల సిఫార్సులకనుగుణంగా ప్రత్యామ్నాయ పంటల ప్రణాళికను రూపొందించారు. గోదావరి ప్రాజెక్టు కింద సాగునీరు గోదావరిలో పుష్కలంగా నీరుండడంతో ఈ ప్రాజెక్టు పరిధిలో వ్యవసాయ, ఆక్వా అవసరాలకు తగినంత నీరివ్వనున్నారు. ఐఏబీ–డీఏఏబీ సమావేశంలో ఏ మేరకు సాగునీరు ఉందో అంచనావేస్తూ ఎంత విస్తీర్ణంలో సాగుకు నీరు ఇవ్వగలమో రైతులకు ముందుగానే చెబుతున్నారు. సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాల మేరకు కాలువల కింద నీటి సరఫరాను నిలిపివేసే తేదీలపై ఆర్బీకేల ద్వారా విస్తృత ప్రచారం కల్పింస్తున్నారు. ఇక శివారు ప్రాంతాల్లో (టెయిల్ ఎండ్ ఏరియాస్) సాధ్యమైనంత త్వరగా నాట్లు వేసుకునేలా అవగాహన కల్పింంచడంతో పాటు నీటి యాజమాన్య పద్ధతులు విధిగా పాటించేలా రైతులను అప్రమత్తం చేయనున్నారు. గోదావరి డెల్టా పరిధిలో వెదజల్లు సాగును ప్రోత్సహించడంతో పాటు అత్యధిక నీటి వినియోగమయ్యే పంటల్లో ఒకటైన మొక్కజొన్న సాగును కాలువల కింద ప్రోత్సహించకూడదని నిర్ణయించారు. వరికి ప్రత్యామ్నాయంగా అపరాలు బాపట్ల, పల్నాడు, కర్నూలు జిల్లాలు మినహా మిగిలిన జిల్లాల్లో ఐఏబీ, డీఏఏబీ సమావేశాలను సంయుక్తంగా నిర్వహించనున్నారు. మిగిలిన ప్రాంతాల్లో మాత్రం మెట్ట ప్రాంతాల్లో వరికి ప్రత్యామ్నాయంగా అపరాల సాగును, కాలువల ఎగువ ప్రాంతాల్లో అపరాలతో పాటు మొక్కజొన్న సాగును ప్రోత్సహిస్తారు. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులకనుగుణంగా 14 జిల్లాల పరిధిలో కనీసం 60వేల ఎకరాల్లో కంటిజెంట్ ప్లానింగ్ అమలుచేస్తారు. ఆయా ప్రాంతాల్లో ప్రత్యామ్నాయ పంటల సాగు కోసం 6,229 క్వింటాళ్ల విత్తనం అవసరమని గుర్తించారు. వీటిని సబ్సిడీపై రైతులకు అందించేందుకు ఏర్పాట్లుచేస్తున్నారు. ఆర్బీకే స్థాయిలో విస్తృత ప్రచారం స్వల్పకాలంలో చేతికొచ్చే పంటల సాగును ప్రోత్సహించేలా రూపొందించిన ఈ కార్యాచరణను ఆర్బీకేల ద్వారా కరపత్రాలు, వాల్ పోస్టర్లతో ప్రచారం చేస్తున్నారు. అంతేకాక.. ప్రత్యామ్నాయ పంటల ప్రణాళికనుగుణంగా సాగులో పాటించాల్సిన యాజమాన్య పద్ధతులకు సంబంధించి శాస్త్రవేత్తల సలహాలు, సూచనలతో కూడిన చిన్నపాటి వీడియో, ఆడియో సందేశాలతో రైతులకు అవగాహన కల్పింస్తున్నారు. -
ఆ వడ్లకు పైసలిచ్చేస్తాం!
సాక్షి, హైదరాబాద్: రైతుల నుంచి ప్రభుత్వం కొనుగోలు చేసి మిల్లులకు పంపిన 83 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఏమైందో లెక్క తెలియడం లేదని సాక్షాత్తూ పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో మిల్లర్లు బెంబేలెత్తుతున్నారు. కొత్త ప్రభుత్వం కొలువు తీరిన వెంటనే మంత్రి ఉత్తమ్ పౌరసరఫరాల సంస్థ పనితీరుపై సమీక్ష నిర్వహించి రూ.56 వేల కోట్ల అప్పులు, రూ.11 వేల కోట్ల నష్టాల్లో ఉన్నట్లు తేల్చారు. ధాన్యం కొనుగోళ్లు, మిల్లింగ్లలో చోటు చేసుకున్న అవకతవకలే అందుకు కారణమని, మిల్లర్లు ఇప్పటికే ధాన్యాన్ని విక్రయించడంతో మిల్లుల్లో ధాన్యం నిల్వలు కూడా లేవని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో మిల్లర్లలో ఆందోళన మొదలైంది. సర్కార్ ధాన్యం విషయంలో కఠిన నిర్ణయాలు తీసుకోకముందే రాజీ చేసుకోవాలని భావిస్తున్నారు. తమ వద్ద ఉన్న ధాన్యం నిల్వ విలువను ఖర్చులతో కలిపి ప్రభుత్వానికి చెల్లించాలని ప్రతిపాదనలు పంపించినట్లు సమాచారం. అయితే దీనిపై ఇంకా ప్రభుత్వం విధానపరమైన నిర్ణయమేదీ తీసుకోలేదు. మిల్లర్ల వద్ద 83 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం గత సంవత్సరం రబీ(యాసంగి)లో సేకరించిన 67 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ముడిబియ్యంగా మిల్లింగ్ చేసేందుకు పనికిరాదని, బాయిల్డ్ రైస్గా మాత్రమే మిల్లింగ్ చేయడానికి వీలవుతుందని మిల్లర్లు తేల్చి చెప్పారు. ఈ మేరకు 67 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మిల్లుల్లోనే నిల్వ చేసినట్లు లెక్కలు చూపించారు. ఇదే కాకుండా గత సంవత్సరం వానకాలానికి సంబంధించిన మరో 16 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కూడా మిల్లింగ్ చేసి, ఎఫ్సీఐకి సీఎంఆర్ అప్పగించడంలో మిల్లర్లు విఫలమయ్యారు. ఈ మొత్తం 83 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం విలువ సుమారు రూ. 18 వేల కోట్లుగా ప్రభుత్వం నిర్ధారించింది. సంస్థకున్న రూ.56 వేల కోట్ల అప్పుల్లో ఈ రూ.18 వేల కోట్లు చెల్లిస్తే తప్ప మళ్లీ అప్పు పుట్టని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో మిల్లర్ల వద్ద ఉన్నట్లు చెపుతున్న 83 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యంపై కీలక నిర్ణయం తీసుకోవాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. దీనిపై పౌరసరఫరాల సంస్థ సీఎండీ అనిల్ కుమార్, ఇతర అధికారులు ప్రణాళిక రూపొందించారని తెలిసింది. మిల్లర్లు స్వయంగా ధాన్యం విలువ చెల్లించేందుకు ముందుకు వస్తున్న నేపథ్యంలో రైతుల నుంచి కొనుగోలు చేసిన కనీస మద్ధతు ధరకు తోడు, రవాణా, నిర్వహణ ఖర్చులన్నీ మిల్లర్ల నుంచి వసూలు చేయాలని భావిస్తున్నట్లు తెలిసింది. వేలం ప్రయత్నాలు విఫలం.. మిల్లర్లు సీఎంఆర్కు తిరస్కరించిన యాసంగి ధాన్యాన్ని విక్రయించాలని గత ప్రభుత్వం ఆగస్టు నెలలో నిర్ణయించింది. ఇందులో భాగంగా తొలుత 25 లక్షల మెట్రిక్ టన్నుల దాన్యాన్ని అమ్మేందుకు బిడ్డర్ల నుంచి టెండర్లను ఆహ్వానించారు. ఈ టెండర్లకు 10 సంస్థలే అర్హత సాధించడంతో పాటు ధాన్యం క్వింటాలుకు సగటు ధరను రూ.1865 గా కోట్ చేయడంతో ఈ ప్రక్రియను ప్రభుత్వం రద్దు చేసింది. దాంతో ప్రభుత్వం అక్టోబర్లో రెండో దఫా టెండర్లను ఆహ్వానించింది. నిబంధనలను సడలించి సాధారణ మిల్లర్లు కూడా బిడ్డింగ్లో పాల్గొనేలా టెండర్లను ఆహ్వానించింది. అయితే ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో ఆ టెండర్లకు ఎన్నికల సంఘం బ్రేక్ వేసింది. ఎన్నికలు ముగిసి కొత్త ప్రభుత్వం కొలువు దీరినప్పటికీ, పాత టెండర్లను రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. మిల్లర్ల వద్ద 83 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉన్నట్లు లెక్కల్లో కనిపిస్తున్నప్పటికీ, అందులో సగానికి పైగా విక్రయించినట్లు పౌరసరఫరాల సంస్థ ఇప్పటికే గుర్తించింది. కర్ణాటక, తమిళనాడుకు భారీ ఎత్తున ధాన్యాన్ని, బియ్యాన్ని విక్రయించినట్లు ప్రభుత్వం వద్ద సమాచారం ఉంది. ఈ పరిస్థితుల్లో మిల్లర్ల నుంచి ధాన్యం విలువకు సమానమైన మొత్తాన్ని ( క్వింటాలుకు రూ. 2,350) చొప్పున ముక్కు పిండి వసూలు చేయాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఒకటి రెండు రోజుల్లో మిల్లుల్లో ఉన్న ధాన్యంపై కీలక నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. -
సీఎం జగన్ ఆదేశాలు.. గోదావరి డెల్టాకు రబీకి సాగు నీరు..
-
శనగ విత్తనాల పంపిణీకి శ్రీకారం
సాక్షి, అమరావతి: ముందస్తు రబీకి సిద్ధమైన రైతులకు అవసరమైన విత్తన సరఫరాకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. సోమవారం నుంచి శనగ విత్తనాల పంపిణీ ప్రారంభించగా.. మిగిలిన విత్తనాలను అక్టోబర్ మొదటి వారం నుంచి పంపిణీకి ఏర్పాట్లు చేస్తోంది. రబీలో 10.92 లక్షలు ఎకరాల్లో శనగ సాగవుతోంది. వర్షాభావ పరిస్థితుల వల్ల ఖరీఫ్కు దూరంగా ఉన్న రైతులు ముందస్తు రబీలో శనగ సాగువైపు మొగ్గు చూపుతుండటంతో ఈసారి విస్తీర్ణం పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఆ మేరకు రబీ కోసం 3 లక్షల క్వింటాళ్ల శనగ విత్తనాన్ని సబ్సిడీపై పంపిణీ చేసేందుకు సిద్ధం చేశారు. అదేవిధంగా 36,121 క్వింటాళ్ల వరి, 14,164 క్వింటాళ్ల మినుము, 4,353 క్వింటాళ్ల పెసలు, 142 క్వింటాళ్ల కందులు, 833 క్వింటాళ్ల ఉలవలు, 502 క్వింటాళ్ల చిరుధాన్యాలు, 367 క్వింటాళ్ల నువ్వులు, 727 క్వింటాళ్ల వేరుశనగ, 1,697 క్వింటాళ్ల పచ్చిరొట్ట విత్తనాలను సబ్సిడీపై పంపిణీకి సిద్ధం చేశారు. పకడ్బందీగా విత్తన పంపిణీ ముందస్తు రబీ సీజన్కు సిద్ధమైన రైతులకు శనగ విత్తన పంపిణీకి శ్రీకారం చుట్టాం. గతేడాది 25 శాతం సబ్సిడీపై పంపిణీ చేయగా.. ఈ సారి రైతుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని 40 శాతం సబ్సిడీపై పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అక్టోబర్ 1వ తేదీ నుంచి వరితో సహా మిగిలిన విత్తన పంపిణీకి ఏర్పాట్లు చేశాం. – గెడ్డం శేఖర్బాబు, ఎండీ, ఏపీ విత్తనాభివృద్ధి సంస్థ ధ్రువీకరించిన నాణ్యమైన విత్తనం గడిచిన సీజన్లో ఎంపిక చేసిన రైతు క్షేత్రాల్లో శనగ విత్తనాన్ని సేకరించారు. ఏపీ సీడ్ సర్టిఫికేషన్ ఏజెన్సీ ద్వారా పరీక్షించి నాణ్యతను ధ్రువీకరించారు. 3.44 లక్షల క్వింటాళ్ల నాణ్యమైన విత్తనాన్ని ఆర్బీకేల ద్వారా సరఫరా చేసేందుకు ఏర్పాట్లు చేశారు. ఎకరం లోపు రైతుకు బస్తా (25 కేజీలు), ఆ తర్వాత ఎకరానికి ఒకటి చొప్పున ఐదెకరాల్లోపు రైతులకు ఐదు బస్తాల చొప్పున విత్తనాలు పంపిణీ చేయనున్నారు. గతేడాది 25 శాతం సబ్సిడీపై పంపిణీ చేసిన శనగ విత్తనాలపై ఈ సారి 40 శాతం సబ్సిడీపై పంపిణీ చేస్తున్నారు. పచ్చిరొట్టతో పాటు చిరుధాన్యాల విత్తనాలను 50 శాతం సబ్సిడీపై పంపిణీ చేయనుండగా.. వేరుశనగ, నువ్వుల విత్తనాలను 40 శాతం సబ్సిడీ, మినుము, పెసలు, కందులు, అలసందల విత్తనాలను 30 శాతం సబ్సిడీపై పంపిణీ చేయనున్నారు. వరి విత్తనాలను క్వింటాల్కు ఆహార భద్రత పథకం వర్తించే జిల్లాల్లో రూ.1000, వర్తించని జిల్లాల్లో రూ.500 చొప్పున సబ్సిడీ ఇవ్వనున్నారు. సబ్సిడీ రూపంలో రాష్ట్ర ప్రభుత్వం గతేడాది 58 కోట్లు భరించగా, ఈసారి రూ.120 కోట్లు భరించేందుకు సిద్ధమైంది. -
సుజలాం.. సుఫలాం.. సస్యశ్యామలం
సాక్షి, అమరావతి: కడలి పాలవుతున్న నదీ జలాలను ఒడిసిపట్టేందుకు దివంగత వైఎస్సార్ చేపట్టిన జలయజ్ఞాన్ని పూర్తి చేసి రైతులకు ఫలాలను అందించే దిశగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నాలుగేళ్లుగా శ్రమిస్తున్నారు. కరోనా ప్రతికూల పరిస్థితులు, ఆర్థిక ఇబ్బందులను అధిగమిస్తూ ప్రాధాన్యత క్రమంలో ప్రణాళికాబద్ధంగా ప్రాజెక్టులను పూర్తి చేసేలా చర్యలు చేపట్టారు. గోదావరి, కృష్ణా, పెన్నా, వంశధార, నాగావళి, ఏలేరు జలాలను గరిష్టంగా వినియోగించుకోవడం ద్వారా వరుసగా నాలుగేళ్లు ఖరీఫ్, రబీలో కోటి ఎకరాలకు నీళ్లందించారు. ఉమ్మడి రాష్ట్ర చరిత్రలో సైతం వరుసగా నాలుగేళ్లు ఏటా కోటి ఎకరాలకు నీళ్లందించిన దాఖలాలు లేవు. టీడీపీ హయాంలో ఏటా సగటున 50 లక్షల ఎకరాలకు కూడా నీళ్లందించిన దాఖలాలు లేకపోవడం గమనార్హం. నాడు దుర్భిక్షం.. నేడు సుభిక్షం ♦ టీడీపీ హయాంలో 2014–19 దుర్భిక్ష పరిస్థితులు నెలకొనగా సీఎం జగన్ అధికారంలోకి వచ్చాక గత నాలుగేళ్లుగా సమృద్ధిగా వర్షాలు కురుస్తుండటంతో రాష్ట్రం సుభిక్షంగా మారింది. ♦ నిర్వాసితులకు పూర్తి స్థాయిలో పునరావాసం కల్పించడం ద్వారా పులిచింతల (45.77 టీఎంసీలు), గండికోట (26.85 టీఎంసీలు), చిత్రావతి (పది టీఎంసీలు), సోమశిల (78 టీఎంసీలు), కండలేరు(68.03 టీఎంసీలు), గోరకల్లు (12.44 టీఎంసీలు), అవుకు (4.15 టీఎంసీలు) రిజర్వాయర్లలో పూర్తి సామర్థ్యం మేరకు నీటిని నిల్వ చేసి ఆయకట్టుకు నీళ్లందించారు. ♦ తెలుగుగంగ ప్రాజెక్టులో అంతర్భాగమైన వెలిగోడు రిజర్వాయర్లో 2019 నుంచే ఏటా గరిష్ట స్థాయిలో 16.95 టీఎంసీలను నిల్వ చేస్తున్నారు. ఇదే ప్రాజెక్టులో అంతర్భాగమైన బ్రహ్మంసాగర్ మట్టికట్టకు డయాఫ్రమ్వాల్ ద్వారా లీకేజీలకు అడ్డుకట్ట వేసి 2020లో గరిష్ట స్థాయిలో 17.74 టీఎంసీలను నిల్వ చేశారు. తద్వారా తెలుగుగంగ ప్రాజెక్టు ఆయకట్టు చివరి భూములకు నీళ్లందించేలా మార్గం సుగమం చేశారు. ♦ శ్రీశైలానికి వరద వచ్చే 30 నుంచి 40 రోజుల్లోనే రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలో ప్రాజెక్టులను నింపేలా ప్రవాహ సామర్థ్యాన్ని పెంచేలా పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్, కాలువలను ఆధునికీకరించే పనులను చేపట్టారు. మహోజ్వల ఘట్టం సాగునీటి ప్రాజెక్టులను సీఎం వైఎస్ జగన్ ప్రాధాన్యత క్రమంలో చకచకా పూర్తి చేస్తున్నారు. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో పెన్నా డెల్టా జీవనాడులైన సంగం, నెల్లూరు బ్యారేజ్లను యుద్ధప్రాతిపదికన పూర్తి చేసి గతేడాది సెప్టెంబరు 6న జాతికి అంకితం చేశారు. ఈ రెండు బ్యారేజ్ల ద్వారా నెల్లూరు జిల్లాలో 4,84,525 ఎకరాల ఆయకట్టును సస్యశ్యామలం చేశారు. నెల్లూరు నగరంతోపాటు పెన్నా పరీవాహక ప్రాంతంలో తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించారు. జలాశయంగా రూపుదిద్దుకున్న పోలవరం పోలవరం ప్రాజెక్టును సాకారం చేస్తూ మహానేత వైఎస్సార్ జలయజ్ఞంలో భాగంగా చేపట్టారు. వంద శాతం వ్యయం భరించి పోలవరాన్ని తామే పూర్తి చేస్తామని విభజన చట్టం సాక్షిగా కేంద్రం హామీ ఇచ్చింది. కమీషన్ల దాహంతో 2013–14 ధరలకు తామే పూర్తి చేస్తామని నాడు చంద్రబాబు చెప్పడంతో 2016 సెపె్టంబర్ 7న ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలను రాష్ట్రానికి అప్పగించింది. ఆ తర్వాత లాభాలు వచ్చే పనులను చేపట్టి ప్రాజెక్టును చంద్రబాబు గాలికి వదిలేశారు. కమీషన్ల కోసం చంద్రబాబు ఏటీఎంలా మార్చుకున్నారని ప్రధాని మోదీ సైతం వ్యాఖ్యానించడం అందుకు నిదర్శనం. చంద్రబాబు పాపాల ఫలితంగా గోదావరి వరద ఉద్ధృతికి ప్రధాన డ్యామ్ పునాది డయాఫ్రమ్ వాల్ కోతకు గురై దెబ్బతింది. ప్రధాన డ్యామ్ నిర్మాణ ప్రాంతంలో నాలుగు చోట్ల భారీ గోతులు ఏర్పడ్డాయి. సీఎం వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక పోలవరాన్ని పూర్తి చేసేలా కార్యాచరణ రూపొందించి పనులు చేపట్టారు. -
భూగర్భజలాల్లో 650.22 టీఎంసీలు మిగులు
సాక్షి, అమరావతి: ప్రస్తుత నీటి సంవత్సరంలో రాష్ట్రంలో భూగర్భజలాల్లో 650.22 టీఎంసీలు మిగిలాయి. నీటి సంవత్సరం జూన్ 1తో ప్రారంభమై మరుసటి ఏడాది మే 31తో ముగుస్తుంది. ప్రస్తుత అంటే 2022–23 నీటి సంవత్సరం మరో మూడురోజుల్లో ముగియనుంది. రాష్ట్రంలో ప్రస్తుత నీటి సంవత్సరంలో నైరుతి, ఈశాన్య రుతుపవనాల ప్రభావం వల్ల సగటున 967 మిల్లీమీటర్ల వర్షం కురవాల్సి ఉండగా 1,046.9 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. వర్షాలు సమృద్ధిగా కురవడం.. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన జలసంరక్షణ చర్యల వల్ల రికార్డు స్థాయిలో వర్షపు నీరు భూగర్భంలోకి ఇంకింది. భూగర్భజలాలు 961.42 టీఎంసీలయ్యాయి. ఇందులో సాగు, తాగు, గృహ తదితర అవసరాలకు 913.35 టీఎంసీలు వినియోగించుకోవడానికి వీలుందని భూగర్భజలవనరుల అధికారులు లెక్కగట్టారు. కానీ నీటి సంవత్సరం ముగింపు దశకు చేరుకునేటప్పటికి అంటే ఆదివారానికి కేవలం 263.13 టీఎంసీల భూగర్భజలాలను మాత్రమే ప్రజలు వినియోగించుకున్నారు. దీంతో భూగర్భజలాల్లో 650.22 టీఎంసీలు మిగిలాయి. జలసంరక్షణ చర్యల ద్వారా వర్షపు నీటిని ఒడిసి పట్టి భూగర్భంలోకి ఇంకేలా చేసి, భూగర్భజలాలను పెంచడంతోపాటు వాటిని పొదుపుగా వినియోగించుకోవడం ద్వారా భూగర్భజలాల పరిరక్షణలో మన రాష్ట్రం దేశంలోనే అగ్రగామిగా నిలిచిందని అధికారవర్గాలు తెలిపాయి. రబీలోనే భారీగా తోడివేత అక్టోబర్ ఆఖరుకు వర్షాకాలం ముగిసిన తరువాత నవంబర్లో రాష్ట్రంలో భూగర్భజలాలు సగటున 6.13 మీటర్లలో లభ్యమయ్యేవి. రాష్ట్రంలో 15 లక్షల వ్యవసాయ బోరుబావులను భూగర్భజలవనరుల శాఖ జియోట్యాగింగ్ చేసింది. వాటికి అదనంగా మరో లక్షకుపైగా వ్యవసాయ బోరుబావులు ఉంటాయని అంచనా. భూగర్భజలమట్టాన్ని 1,806 పిజియోమీటర్ల ద్వారా భూగర్భజలవనరుల శాఖ అధికారులు ఎప్పటికప్పుడు లెక్కిస్తూ పర్యవేక్షిస్తున్నారు. రబీలో, వేసవిలో సాగు, తాగు, గృహ అవసరాల కోసం బోరుబావుల నుంచి భారీ ఎత్తున ప్రజలు నీటిని తోడేశారు. తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 3.95 మీటర్ల మేర భూగర్భజలాలను తోడేయగా, నెల్లూరు జిల్లాలో అత్యల్పంగా 0.37 మీటర్ల మేర భూగర్భజలాలను వినియోగించుకున్నారు. వర్షాభావ ప్రాంతాలైన అనంతపురం జిల్లాలో 2.79, శ్రీసత్యసాయి జిల్లాలో 3.29 మీటర్ల మేర రబీలో భూగర్భజలాలను వినియోగించుకున్నారు. నవంబర్ నుంచి మే వరకు సగటున 2.54 మీటర్ల మేర భూగర్భజలాలను వాడుకోవడంతో భూగర్భజలమట్టం 8.67 మీటర్లకు పడిపోయింది. బాపట్లలో కనిష్ఠం.. ఏలూరులో గరిష్ఠం.. నీటి సంవత్సరం ముగిసేటప్పటికి రాష్ట్రంలో సగటున 8.67 మీటర్లలో భూగర్భజలాలు లభ్యమవుతున్నాయి. బాపట్ల జిల్లాలో కనిష్ఠంగా 3.59 మీటర్లలోనే భూగర్భజలాలు లభ్యమవుతుండగా.. ఏలూరు జిల్లాలో గరిష్ఠంగా 20.95 మీటర్ల లోతుకు వెళ్తేగానీ భూగర్భజలాలు దొరకని పరిస్థితి. వర్షాభావ ప్రాంతాలైన అనంతపురం జిల్లాలో 7.84, శ్రీసత్యసాయి జిల్లాలో 8.35 మీటర్లలోనే భూగర్భజలాలు లభ్యమవుతుండటం గమనార్హం. జూన్ 1 నుంచి కొత్త నీటి సంవత్సరం 2023–24 ప్రారంభమవుతుంది. గతేడాదిలానే ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా కురుస్తాయన్న వాతావరణశాఖ అంచనాల నేపథ్యంలో.. భూగర్భజలాలు పుష్కలంగా పెరిగే అవకాశం ఉందని అధికారవర్గాలు అంచనా వేస్తున్నాయి. -
అన్నదాతల్లో ‘ధర’హాసం
గోదావరి జిల్లాల నుంచి సాక్షి ప్రతినిధి వరదా ఎస్వీ కృష్ణకిరణ్ : రాష్ట్రంలో రబీ ధాన్యం కొనుగోళ్లు వెల్లువలా కొనసా గుతున్నాయి. అకాల వర్షాల సమయంలో కోసిన ధాన్యాన్ని.. కోసినట్టుగా ప్రభుత్వం కొనుగోలు చేసింది. తడిసిన, నూక ధాన్యాన్ని సైతం (బ్రోకెన్ రైస్) ప్రభుత్వం కొనుగోలు చేసి నష్టాల ఊబి నుంచి రైతులను గట్టెక్కించడంతో అన్నదాతల్లో హర్షం వ్యక్తమవుతోంది. తొలిసారిగా జయ రకం (బొండా లు) ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తుండటంతో ప్రైవేట్ మార్కెట్లో ఆ పంటకు మంచి ధర పలుకుతోంది. బుధవారం సాయంత్రానికి రూ. 2,541.51 కోట్ల విలువైన 12.45 లక్షల టన్నుల ధాన్యాన్ని ఆర్బీకే ద్వారా ప్రభుత్వం కొనుగోలు చే సింది. ఇందులో ధాన్యం విక్రయించిన 1.38 లక్షల మంది రైతులకు గాను 96 వేల మందికి రూ.1,673 కోట్లకు పైగా చెల్లింపులు పూర్తి చేసింది. బాయిల్డ్ మిల్లులకు తరలింపు వరి కోతలు ప్రారంభమైన దశలో అకాల వర్షాలు కు రవడం.. ఆ తరువాత అధిక ఉష్ణోగ్రతలతో ధాన్యంలో ముక్క విరుగుడు సమస్య తలెత్తింది. దీనిని సా కుగా చూపించి రైతులను మిల్లర్లు మోసం చేయకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అంబేడ్కర్ కోనసీ మ, పశ్చిమ గోదావరి జిల్లాల్లో మండలానికి ఒకటి చొప్పున.. ఏలూరు, కాకినా డ, తూర్పు గోదావరి జిల్లా ల్లో బ్రోకెన్స్ అధికంగా వ స్తు న్న ప్రాంతాల్లో మొబైల్ మి ల్లులను ప్రభుత్వం ఏర్పా టు చేసింది. రైతులు ముందుగా నే శాంపిళ్లను మొబైల్ మి ల్లు ల్లో మరాడించి.. అక్కడ ఇచ్చే రశీదు ఆధారంగా ధా న్యాన్ని విక్రయించుకునే సౌకర్యాన్ని కల్పించింది. ముక్క విరుగు డు ధాన్యాన్ని బాయిల్డ్ రకంగా పరిగణించి కొనుగోలు చేస్తూ ప్రభుత్వం రైతులకు అండగా నిలుస్తోంది. జయ రకం (బొండాలు) ధాన్యానికి కూడా ప్రభుత్వం మద్దతు ధర కల్పిస్తుండటంతో మార్కెట్లో పోటీ పెరిగింది. ప్రైవేట్ వ్యాపారులు మంచి ధరకు రైతుల నుంచి నేరుగా కొనుగోలు చేస్తున్నారు. జయ రకం ఎక్కువగా పండించిన ప్రాంతంలో కళ్లాల్లోకి వచ్చి మరీ బస్తా (75 కేజీలు) రూ.1,500 చొప్పున కొనుగోలు చేస్తున్నారు. ఈ రకాన్ని తక్కువ పండించిన ప్రాంతాల్లో అయితే.. బస్తాకు రూ. 1,600–రూ.1,700 కూడా చెల్లిస్తున్నారు. రూ.5 కోట్ల కార్పస్ ఫండ్ రైతుల నుంచి ధాన్యాన్ని కొనుగోలు చేయడంతోపాటు వేగంగా మిల్లులకు తరలించేందుకు ప్రభుత్వం తొలిసారిగా ఉమ్మడి గోదావరి పరిధిలోని 5 జిల్లాలకు రూ.కోటి చొప్పున రూ.5 కోట్ల కార్పస్ ఫండ్ను ముందుగానే విడుదల చేసింది. ఫలితంగా ఆయా జిల్లాల్లో అధికారులు క్షేత్రస్థాయి పరిస్థితు లకు అనుగుణంగా వాహనాలు, కూలీలను ఏ ర్పాటు చేస్తూ రైతులకు భారాన్ని తగ్గిస్తున్నారు. ఒకవేళ రైతులే సొంతంగా ధాన్యాన్ని మిల్లులకు తరలిస్తే ఆ మొత్తాన్ని కూడా మద్దతు ధరతో కలిపి రైతుల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేస్తోంది. వాస్తవ పరిస్థితి ఇదీ.. ♦ పశ్చిమ గోదావరి జిల్లాలో దాదాపు 90 శాతం ధాన్యాన్ని కొనుగోలు చేశారు. పాలకొల్లు, నరసాపురం, ఆచంట ప్రాంతాల్లో ఇంకా కోతలు జరగాల్సి ఉందని పౌర సరఫరాల సంస్థ డీఎం శివరామ్ చెప్పారు. ♦ తూర్పు గోదావరి జిల్లాలో 4 లక్షల టన్నుల దిగుబడిలో సగానికి పైగా ధాన్యం కొనుగోళ్లు జరిగాయి. బొండాలు రకం సాగు చేసిన రైతులు బయట మార్కెట్లోనే ఎక్కువగా విక్రయిస్తున్నారని పౌర సరఫరాల సంస్థ జిల్లా అధికారి కుమార్ తెలిపారు. ♦ కాకినాడ జిల్లాలో 10 శాతం విస్తీర్ణంలో కోతలు జరగాల్సి ఉందని పౌర సరఫరాల సంస్థ డీఎం పుష్పమణి చెప్పారు. ♦ ఏలూరు జిల్లాలో ధాన్యంలో ముక్క విరుగుడు సమస్య అధికంగా ఉంది. ఆ ధాన్యాన్ని కృష్ణా జిల్లాలోని బాయిల్డ్ మిల్లులకు తరలిస్తున్నట్టు పౌర సరఫరాల సంస్థ డీఎం భార్గవి చెప్పారు. చింతలపూడి, లింగపాలెం, చాట్రాయి, పోలవరం ప్రాంతాల్లో కోతలు ఆలస్యంగా జరుగుతున్నాయి. ♦ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో కోతలు ఆలస్యం కావడంతో ధాన్యం ఇంకా పొలాలు, కళ్లాల్లోనే ఉంది. ఇక్కడ పంటను వేగంగా కొనుగోలు చేసేందుకు వీలుగా దగ్గర మిల్లులకే ధాన్యం తరలించేలా సాఫ్ట్వేర్లో మార్పులు చేసినట్టు పౌర సరఫరాల సంస్థ డీఎం సాగర్ తెలిపారు. మొత్తంగా అన్నిచోట్లా జూన్ రెండో వారంలోగా కొనుగోళ్లు పూర్తవుతాయని అంచనా వేస్తున్నారు వర్షాల్లోనూ కొన్నారు ఇటీవల కురిసిన వర్షాల్లో ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేసిన తీరు రైతుల్లో భరోసా నింపింది. అంత యుద్ధప్రాతిపదికన ఎక్కడి ధాన్యాన్ని అక్కడే ఆఫ్లైన్లో కొనేసి వెంటనే మిల్లులకు తరలించారు. నేను కూడా ఆ సమయంలో కొంత, వారం కిందట 582 బస్తాల (ఒక్కో బస్తా 40 కేజీలు) ధాన్యాన్ని విక్రయించాను. డబ్బులు కూడా చాలా వేగంగా ఖాతాల్లో జమ అవుతున్నాయి. – సూర్య నారాయణరాజు, లొల్ల, అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఎంతైనా కొంటాం అకాల వర్షాల్లోనూ రైతులు ఇబ్బందులు పడకుండా ధాన్యం కొనుగోలు చేశాం. ఇప్పటికీ చాలా జిల్లాల్లో ఇంకా కోతలు చేయాల్సి ఉంది. రైతులు తెచి్చన ప్రతి గింజను కూడా కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. – వీరపాండియన్, ఎండీ, పౌర సరఫరాల సంస్థ రైతులు నష్టపోకుండా చర్యలు ధాన్యం సేకరణ పూర్తయ్యే వరకు ఈ ఫీడ్బ్యాక్ కొనసాగుతుంది. ఈ విధానం ద్వారా వ్యవస్థలో జవాబుదారీ పెంచడం, రైతులు నష్టపోకుండా కాపాడటమే ప్రధాన ఉద్దేశం. ఎప్పటికప్పుడు ఫీడ్బ్యాక్ను ఆయా జిల్లాలకు పంపిస్తున్నాం. రైతులను ఇబ్బంది పెట్టినా, డబ్బులు వసూలు చేసినా మిల్లులను కస్టమ్ మిల్లింగ్ నుంచి తొలగిస్తున్నాం. జేసీలకు చెప్పి ఆ మొత్తాన్ని రైతులకు వెనక్కి ఇప్పిస్తున్నాం. – హెచ్.అరుణ్కుమార్, కమిషనర్, పౌర సరఫరాల శాఖ -
రైతన్నలకు విత్తనాలు రెడీ
సాక్షి, అమరావతి: ఖరీఫ్ సీజన్ కోసం ప్రభుత్వం విత్తనాలను సిద్ధం చేసింది. ఆర్బీకేల ద్వారా రైతులకు అందించేందుకు ప్రణాళిక రూపొందించింది. రబీ కోతలు జోరందుకోవడంతో ఇప్పటికే పచ్చిరొట్ట విత్తనాలను పంపిణీకి సిద్ధం చేయగా.. మే 1 నుంచి వేరుశనగ, జూన్ 1 నుంచి వరి, ఇతర విత్తనాల పంపిణీకి ఏర్పాట్లు చేస్తోంది. 2023–24 ఆరి్థక సంవత్సరంలో 9.15 లక్షల క్వింటాళ్ల సబ్సిడీ విత్తనాలు అవసరమవుతాయని అంచనా వేసిన అధికారులు ఖరీఫ్ సీజన్ కోసం 6.18 లక్షల క్వింటాళ్లను ఆర్బీకేల ద్వారా రైతులకు అందించనున్నారు. రబీ సీజన్ కోసం 2.97 లక్షల క్వింటాళ్లను సిద్ధం చేయనున్నారు. జాతీయ ఆహార భద్రతా మిషన్ అమలవుతున్న జిల్లాల్లో క్వింటాల్కు రూ.1,000, మిషన్ పరిధిలో లేని జిల్లాల్లో క్వింటాల్కు రూ.500 చొప్పున సబ్సిడీ ఇవ్వనున్నారు. పచ్చిరొట్ట విత్తనాలతో పాటు చిరుధాన్యాల విత్తనాలపై 50 శాతం, వేరుశనగ, నువ్వుల విత్తనాలపై 40 శాతం, అపరాలపై 30 శాతం, శనగ విత్తనాలపై 25 శాతం చొప్పున సబ్సిడీ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఏజెన్సీ మండలాల్లో గిరిజన రైతులకు అన్నిరకాల విత్తనాలను 90 శాతం సబ్సిడీపై, కంటింజెన్సీ కింద 80 శాతం సబ్సిడీపై ఇవ్వనున్నారు. ఆర్బీకేల ద్వారా అందిస్తాం ఖరీఫ్ సీజన్కు సరిపడా విత్తనాలను ఆర్బీకేల ద్వారా పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నాం. రైతుల ద్వారా సేకరించిన విత్తనాలతో పాటు ఏపీ విత్తనాభివృద్ధి సంస్థ, ప్రైవేట్ కంపెనీల నుంచి సేకరించి అగ్రి ల్యాబ్లలో నాణ్యత ధ్రువీకరించిన తర్వాత ఆర్బీకేల్లో అందుబాటులో ఉంచే ఏర్పాట్లు చేస్తున్నాం. ఇప్పటికే పచ్చిరొట్ట విత్తనాల పంపిణీ జరుగుతోంది. -
వేసవిలోనూ పెన్నా బేసిన్లో జలరాశి
సాక్షి, అమరావతి: పెన్నా నది పరీవాహక ప్రాంతం (బేసిన్)లోని రిజర్వాయర్లలో వేసవిలోనూ పుష్కలంగా నీటి నిల్వలు ఉన్నాయి. శుక్రవారానికి రిజర్వాయర్లలో 151.94 టీఎంసీలు ఉన్నాయి. పెన్నా బేసిన్లోని రిజర్వాయర్ల పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 239.59 టీఎంసీలు. అంటే.. ఖరీఫ్ పూర్తయి, రబీ పంటలు కోత దశలో ఉన్న సమయంలో పెన్నా రిజర్వాయర్ల సామర్ధ్యంలో ఇప్పటికీ 63.42 శాతం నీరు నిల్వ ఉండటం గమనార్హం. సోమశిల రిజర్వాయర్లో 78 టీఎంసీలకుగానూ 52.62 టీఎంసీలు, కండలేరులో 68.3 టీఎంసీలకుగాను 38.65 టీఎంసీలు, గండికోటలో 26.85 టీఎంసీలకుగాను 25.37 టీఎంసీలు, చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లో 10 టీఎంసీలకుగాను 8.16 టీఎంసీలు, వెలిగల్లు ప్రాజెక్టులో 4.64 టీఎంసీలకుగాను 4.41 టీఎంసీలు జలాలు ఉన్నాయి. పెన్నా బేసిన్ చరిత్రలో ఏప్రిల్ రెండో వారంలో ఈ స్థాయిలో నీరు ఉండటం ఇదే ప్రథమమని అధికారవర్గాలు తెలిపాయి. రిజర్వాయర్లలో గతేడాది ఇదే రోజుకు 134.74 టీఎంసీలు.. 2021లో 127.6 టీఎంసీలు నిల్వ ఉండేవి. కర్ణాటకలో వర్షాఛాయ ప్రాంతమైన నంది కొండల్లో జన్మించే పెన్నా నది.. జయమంగళి, కుందేరు, సగిలేరు, చిత్రావతి, బాహుదా, పించా, పాపాఘ్ని వంటి ఉప నదులను కలుకుకొని శ్రీ సత్యసాయి, అనంతపురం, వైఎస్సార్, నెల్లూరు జిల్లాల మీదుగా ప్రవహించి.. ఊటుకూరు వద్ద సముద్రంలో కలుస్తుంది. వర్షఛాయ ప్రాంతంలో ఉన్న ఈ నదీ పరీవాహక ప్రాంతంలో వర్షాలు కురవకపోడంతో 2019 వరకూ పెన్నాలో ప్రవాహం పెద్దగా ఉండేది కాదు. కానీ.. గత నాలుగేళ్లుగా బేసిన్లో సమృద్ధిగా వర్షాలు కురుస్తుండటంతో పెన్నా నది ఉరకలెత్తింది. చిన్న, మధ్య తరహా, భారీ ప్రాజెక్టులు నిండటంతో ఖరీఫ్లో భారీ ఎత్తున రైతులు పంటలు సాగుచేసుకున్నారు. రబీలోనూ నీరు పుష్కలంగా ఉండటంతో రైతులు అదే రీతిలో పంటలు సాగుచేసుకున్నారు. ప్రస్తుతం రబీ పంటలు కోత దశలో ఉన్నాయి. నీటి నిల్వలు సమృద్ధిగా ఉన్నందున పెన్నా బేసిన్లో వేసవిలో తాగునీటికి ఇబ్బందులు ఉండవని అధికారవర్గాలు చెప్పాయి. గతేడాది తరహాలోనే ఈ ఏడాదీ ఖరీఫ్లో పంటల సాగుకు ముందస్తుగా నీటిని విడుదల చేయవచ్చని తెలిపాయి. -
ధాన్యం కొనుగోలుకు రెడీ..!
సాక్షి, రాజమహేంద్రవరం: రబీ ముందస్తు వరి కోతలు ప్రారంభమయ్యాయి. అనపర్తి, బిక్కవోలు, రంగంపేట, చాగల్లు, తాళ్లపూడి మండలాల్లో ఊపందుకుంటున్నాయి. మరో పది రోజుల వ్యవధిలో మరికొన్ని ప్రాంతాల్లో వేగం పుంజుకునే ఆవస్యకత ఉంది. రైతు పండించిన ప్రతి గింజా కొనుగోలు చేసి దన్నుగా నిలవాలన్నది ప్రభుత్వ ఆకాంక్ష. అందుకు అనుగుణంగా అధికార యంత్రాంగం సన్నద్ధమవుతోంది. దిగుబడి అందే నాటి కంటే ముందుగానే ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాలు అందుబాటులోకి తీసువచ్చేలా ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తోంది. సేకరణకు అవసరమైన ఏర్పాట్లలో తలమునకలైంది. కొనుగోలుకు అవసరమైన గన్నీ బ్యాగులు, యంత్రాలు సిద్ధం చేస్తున్నారు. ఈనెల 15వ తేదీ తర్వాత ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. 4.55 లక్షల మెట్రిక్ టన్నులే లక్ష్యం జిల్లా వ్యాప్తంగా రబీ సాధారణ సాగు 83,880 హెక్టార్లు. అత్యధికంగా వరి సాగవుతోంది. వరి సాధారణ సాగు విస్తీర్ణం 56,433 హెక్టార్లు కాగా.. 55,095 హెక్టార్లు సాగై 95 శాతానికి పైగా లక్ష్యాన్ని అధిగమించింది. ఈ ఏడాది 5.25 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని వ్యవసాయ శాఖ అంచనా. ఇందులో రైతులు, స్థానిక అవసరాలకు మినహాయించగా 4,55,845 మెట్రిక్ టన్నులు కొనుగోలుకు జిల్లా యంత్రాంగం సిద్ధమైంది. రైతులకు అనుకూలమైన మద్దతు ధర నిర్ణయించింది. సాధారణ రకం బస్తాకు (75 కిలోల బస్తా) రూ.1530, గ్రేడ్–ఏ రకానికి రూ.1545గా నిర్ణయించింది. 233 ఆర్బీకేల్లో.. జిల్లా వ్యాప్తంగా 18 మండలాల్లో 315 ఆర్బీకేలుండగా 233 రైతు భరోసా కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. వాటిని 147 మిల్లులకు అనుసంధానం చేశారు. ఆయా కేంద్రాలకు నియమించిన సాంకేతిక సిబ్బందికి ఇప్పటికే శిక్షణ ఇచ్చారు. సేకరణకు జిల్లా వ్యాప్తంగా 70 లక్షల గన్నీ బ్యాగుల అవసరం ఉందని, ఏ మండలానికి ఎన్ని కావాలో ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసి అమలు చేస్తున్నారు. ఆర్బీకేల వద్ద సిబ్బందిని సిద్ధంగా ఉంచారు. విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్లు ఈ–క్రాప్, తేమ శాతం నిబంధనల ప్రకారం ధాన్యం సేకరిస్తారు. అనంతరం మొబైల్ యాప్లో రైతులకు కూపన్లు ఇస్తారు. కొనుగోళ్లకు మండల వ్యవసాయ అధికారులు ఇన్చార్జ్లుగా వ్యవహరించనున్నారు. గ్రామ వలంటీర్లను సైతం భాగస్వాముల్ని చేస్తున్నారు. ధాన్యం రవాణా చేసే వాహనాలపై నిఘా పెడుతున్నారు. రవాణా చార్జీలు ఎవరికి చెల్లించాలనే విషయమై జాగ్రత్తలు తీసు కుంటున్నారు. ఎకరానికి 53 బస్తాల దిగుబడి రబీ ధాన్యం దిగుబడులు ఆశాజనకంగా ఉంటున్నాయి. ఎకరానికి 52 నుంచి 53 బస్తాల దిగుబడి అందుతోంది. జిల్లాలో అత్యధికంగా ఎంటీయూ–1121 రకం ధాన్యం సేకరించనున్నారు. 3.39 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి అందే అవకాశం ఉందని వ్యవసాయ శాఖ అధికారులు భావిస్తున్నారు. 76,000 మెట్రిక్ టన్నులు బోండాలు, 30 వేల మెట్రిక్ టన్నుల సన్న రకాలు ఉత్పత్తి అయ్యే సూచనలున్నట్లు వెల్లడించారు. ఈ పరిణామం రైతుల్లో ఆనందాన్ని నింపుతోంది. పెట్టుబడులకు పోను లాభాలు గడించవచ్చన్న ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మూడేళ్లుగా దిగుబడులు టాప్.. జిల్లాలో 2021 ఖరీఫ్లో 82,695 హెక్టార్లలో వరి సాగు చేపట్టారు. ఎకరానికి (75 కిలోల బస్తా) 28 బస్తాల ధాన్యం దిగుబడి వస్తే.. 2022 ఖరీఫ్లో 73,606 హెక్టార్లలో వరి సాగయ్యింది. ఎకరానికి 33 బస్తాల దిగుబడి వచ్చింది. ఏడాది వ్యవధిలో ఎకరం పొలానికి 5 బస్తాలు వృద్ధి చెందింది. 2021 ఖరీఫ్లో మొత్తం 4,29,990 మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి అందితే.. 2022లో 4,52,368 మెట్రిక్ టన్నులు.. అంటే 22,378 మెట్రిక్ టన్నులు అదనంగా దిగుబడి వచ్చింది. గత ఐదేళ్లుగా ఇలాంటి దిగుబడులు ఎప్పుడూ నమోదు కాలేదని వ్యవసాయ శాఖ చెబుతోంది. ఇప్పటికే 2321 హెక్టార్లలో కోతలు పూర్తయినట్లు సమాచారం. ప్రతి గింజా కొంటాం:– రబీలో ప్రభుత్వ ఆదేశాల మేరకు ధాన్యం కొనుగోలుకు సర్వం సిద్ధం చేశాం. ఇప్పటికే సమావేశం ఏర్పాటు చేసి సేకరణపై అధికారులు, సిబ్బందికి సలహాలు సూచనలు చేశాం. ముందస్తు కోతలు వచ్చే ప్రాంతాల్లో కేంద్రాలు ప్రారంభానికి చర్యలు తీసుకుంటున్నాం. 4.55 లక్షల మెట్రిక్ టన్నులు సేకరించడమే లక్ష్యంగా నిర్దేశించుకున్నాం. 233 ఆర్బీకేలు సిద్ధం చేస్తున్నాం. వారం రోజుల తర్వాత కొనుగోళ్లు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. –ఎన్.తేజ్ భరత్, జాయింట్ కలెక్టర్ -
అది రామోజీ అబద్ధాల సాగు
సాక్షి, అమరావతి : నిత్యం ఏదో ఒక అంశాన్ని పట్టుకుని వైఎస్ జగన్ ప్రభుత్వంపై బురదచల్లుడు వంటకాన్ని వండి వార్చడమే పనిగా పెట్టుకున్న ‘ఈనాడు’ ప్రత్యక్షంగా అందరికీ కళ్లెదుటే కనిపిస్తున్న నిజాన్ని అబద్ధం చేసింది. సకాలంలో మంచి వర్షాలు.. సీజన్లో కళకళలాడుతున్న రిజర్వాయర్లు.. నిర్ణీత సమయానికి ముందే నీటి విడుదల.. నాణ్యమైన ఎరువులు, పురుగు మందులు.. ప్రతి దశలోనూ అన్నదాతకు తోడుగా నిలిచిన రాష్ట్ర ప్రభుత్వం.. వెరసి రాష్ట్రంలో నాలుగేళ్లుగా వ్యవసాయం పండగైంది. ఈ విషయాన్ని ఏ ఊరికి వెళ్లి ఎవరిని అడిగినా నిస్సందేహంగా నిజమేనని చెబుతారు.. ఒక్క రామోజీ, చంద్రబాబులతో కూడిన దుష్టచతుష్టయం తప్ప. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పంటల మార్పిడి ఫలించడం మీకు తెలీదా రామోజీ? మెట్ట ప్రాంతాల్లో లాభదాయకం కాని వ్యవసాయ పంటలు సాగు చేసే రైతులు ఉద్యాన పంటల వైపు మళ్లుతుండటం వాస్తవమో కాదో గ్రామీణ ప్రాంతాల్లోని మీ నెట్వర్క్నే అడిగి చూడండి. డ్రైస్పెల్స్ నమోదైనా ఆ ప్రభావం దిగుబడులపై చూపక పోవడం, నాలుగేళ్లలో ఒక్కటంటే ఒక్క కరువు మండలాన్ని నమోదు చేసే పరిస్థితి రాకపోవడం నిజం. ఫలితంగా ఆహార ధాన్యాల ఉత్పత్తి గణనీయంగా పెరిగింది. హెక్టార్కు సగటు దిగుబడులు పెరిగాయి. వ్యవసాయ రంగంలోనే కాదు.. ఉద్యాన, పశుగణాభివృద్ధి, మత్స్య తదితర వ్యవసాయ అనుబంధ రంగాల్లో సైతం జాతీయ సగటు వృద్ధిరేటు కంటే గణనీయమైన వృద్ధి రేటు నమోదు చేసుకుంది. ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా రాసుకునే లెక్కలు కావు. కేంద్ర ఆర్థిక, గణాంకాల శాఖ రూపొందించిన గణాంకాలని మీకు తెలియదా రామోజీ? ఇంతకూ మీరు చెప్పిన అంశాల్లో నిజానిజాలు ఏమిటో చూద్దాం. ఆరోపణ: సాగు విస్తీర్ణం తగ్గింది వాస్తవం : పంటల మార్పిడి కింద మెట్ట ప్రాంతాల్లో బోర్ల కింద సాగయ్యే పంటల స్థానే ఉద్యాన పంటలను రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. పెద్ద ఎత్తున ప్రోత్సాహకాలు అందిస్తోంది. ఫలితంగా నాలుగేళ్లలో 5.52 లక్షల ఎకరాల్లో కొత్తగా ఉద్యాన పంటలు సాగులోకి వచ్చాయి. మెట్ట ప్రాంతాల్లో ఎక్కువగా సాగయ్యే వరి, పొగాకు, చెరకు, మొక్కజొన్న వంటి పంటల స్థానంలో ఉద్యాన పంటలైన మామిడి, అరటితో పాటు డ్రాగన్ ఫ్రూట్, అవొకాడో, కాఫీ, అల్లం, పసుపు, అనాస, బొప్పాయి, కమల, జామ వంటి పంటలు సాగు చేస్తున్నారు. ఆరోపణ: పొడి వాతావరణాన్ని పట్టించుకోలేదు వాస్తవం : రాష్ట్రంలో 2022 ఖరీఫ్ పంట కాలంలో జూన్–జూలైలో 172 మండలాల్లో బెట్ట వాతావరణం (డ్రై స్పెల్స్) కనిపించినప్పటికీ, ఆయా మండలాల్లో పంటల సాగు ఆలస్యమైందే తప్ప సాగు ఆగలేదు. మరో 101 మండలాల్లో ఆగస్టు, సెపె్టంబర్ మధ్య డ్రైస్పెల్స్ సంభవించాయి. ఆ సమయంలో పంటలు కీలక దశకు రాకపోవడంతో దిగుబడులపై ఎలాంటి ప్రభావం చూపలేదు. ఈ విషయాన్ని కేంద్ర ఆర్థిక గణాంకాల శాఖ తన నివేదికలో తేల్చి చెప్పింది. ఆరోపణ: దిగుబడులు ఎక్కువ చేసి చూపిస్తున్నారు వాస్తవం : 2021–22లో వరి సగటున హెక్టార్కు ఖరీఫ్లో 4,800 కిలోలు, రబీలో 6,601 కిలోల దిగుబడులొస్తే, మూడో ముందస్తు అంచనా ప్రకారం 2022–23 ఖరీఫ్లో 5,195 కిలోలు, రబీలో 6,944 కిలోల దిగుబడులు వస్తాయని అంచనా వేశారు. 2021–22లో ఆహార ధాన్యాల ఉత్పత్తి 154 లక్షల టన్నులు రాగా, 2022–23లో 166.63 లక్షల టన్నుల దిగుబడులు వస్తాయని అంచనా వేశారు. ఆహార ధాన్యాల ఉత్పత్తి 2014–19 మధ్యలో సగటున 153.95 లక్షల టన్నులుగా నమోదైతే, 2019–23 మధ్య 165.40 లక్షల టన్నులుగా నమోదైంది. అంటే 11.45 లక్షల టన్నుల మేర పెరిగింది. ఉద్యాన పంటల విషయానికి వస్తే టీడీపీ హయాంలో 2018–19లో 17.40 లక్షల హెక్టార్లలో సాగవ్వగా, 305 లక్షల టన్నుల దిగుబడులొచ్చాయి. ప్రస్తుతం 18.03 లక్షల హెక్టార్లకు విస్తరించగా, 363.04 లక్షల టన్నుల దిగుబడులు నమోదయ్యాయి. ఫలితంగా హెక్టార్కు సగటు దిగుబడులు పెరిగాయి. ఆరోపణ: సాగు తగ్గితే వృద్ధి రేటు ఎలా పెరుగుతుంది? వాస్తవం : వృద్ధి రేటు పెరుగుదల, తగ్గుదల అనేది సాగు విస్తీర్ణం మీద మాత్రమే ఆధారపడి ఉండదు. ఇది వ్యవసాయ అనుబంధ రంగాలైన మత్స్య, పశుగణాభివృద్ధి, అటవీ, ఉద్యాన రంగాల పురోగతి మీద ఆధారపడి ఉంటుంది. పంటల సగటు దిగుబడి, విలువ ఆధారిత ఉత్పత్తుల పెరుగుదల వంటి కారణాలతో వృద్ధి రేటు పెరుగుతుంది. వ్యవసాయ అనుబంధ రంగాల్లో 2022–23లో వృద్ధి రేటు 13.18 శాతం నమోదు కాగా, ఇది జాతీయ వృద్ధి రేటు కంటే 2 శాతం ఎక్కువ. వ్యవసాయ రంగంలో 20.72 శాతం, ఉద్యాన రంగంలో 12.58 శాతం, పశుగణాభివృద్ధి రంగంలో 7.32 శాతం, మత్స్య రంగంలో 19.41 శాతం వృద్ధి రేటు నమోదైంది. ఇవన్నీ కేంద్ర ఆర్థిక గణాంకాల శాఖ విడుదల చేసిన లెక్కలే. రాష్ట్రంలో ఎక్కడా పంట విరామం ప్రకటించే పరిస్థితులే లేవు. కోనసీమ, పశ్చిమగోదావరి, వైఎస్సార్, బాపట్ల జిల్లాల్లో గతం కంటే మిన్నగా పంటలు సాగయ్యాయి. sak -
పుష్కలంగా ఆహార ధాన్యాలు
సాక్షి, అమరావతి : ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలో ఆహార ధాన్యాల ఉత్పత్తిలో 9.3 శాతం వృద్ధి నమోదైంది. సాగువిస్తీర్ణం స్వల్పంగా తగ్గినప్పటికీ ఆహారధాన్యాల ఉత్పత్తి మాత్రం గణనీయంగా పెరిగింది. 2020–21 ఆర్థిక సంవత్సరంతో పోల్చి చూస్తే ఆహార ధాన్యాల ఉత్పత్తిలో 9.3 శాతం వృద్ధి నమోదైనట్లు 2022–23 రాష్ట్ర సామాజిక ఆర్థిక సర్వే స్పష్టం చేసింది. ధాన్యం ఉత్పత్తిలో కూడా 9.8 శాతం వృద్ధి నమోదైంది. గత ఆర్థిక ఏడాది ఖరీఫ్, రబీలో కలిపి 121.76 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి కాగా 2022–23 ఆర్థిక ఏడాదిలో 133.65 లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం ఉత్పత్తి జరుగుతుందని తొలి ముందస్తు అంచనాల్లో సర్వే పేర్కొంది. డిసెంబర్ ఆఖరు వరకు రాష్ట్రంలో 109.33 లక్షల మెట్రిక్ టన్నుల పాలు, 7,34,157 మెట్రిక్ టన్నుల మాంసం, 1784.01 లక్షల గుడ్లు ఉత్పత్తి జరిగినట్లు సర్వే పేర్కొంది. 2021–22లో రాష్ట్రం 2645.03 లక్షల గుడ్ల ఉత్పత్తితో అగ్రస్థానంలో, 1025.59 లక్షల మెట్రిక్ టన్నుల మాంసం ఉత్పత్తితో రెండో స్థానంలో, 154.03 లక్షల మెట్రిక్ టన్నుల పాల ఉత్పత్తితో ఐదో స్థానంలో నిలిచిందని సర్వే స్పష్టం చేసింది. 2021–22లో రాష్ట్రంలో 48.13 లక్షల మెట్రిక్ టన్నుల చేపల ఉత్పత్తి జరిగితే, 2022–23 ఆర్థిక ఏడాది డిసెంబర్ వరకు 37.18 లక్షల మెట్రిక్ టన్నుల చేపల ఉత్పత్తి జరిగిందని చెప్పింది. 2023–24 ఆర్థిక ఏడాదిలో రూ.1,66,390 కోట్లు వ్యవసాయ వార్షిక రుణ ప్రణాళికగా నిర్ణయించినట్లు నివేదిక పేర్కొంది. ఇది గత ఆర్థిక ఏడాదితో పోల్చితే పది శాతం అదనం అని తెలిపింది. 2023–24లో రూ.1,395.45 కోట్ల వ్యయంతో కొత్తగా 1.50 లక్షల హెక్టార్ల విస్తీర్ణాన్ని మైక్రో ఇరిగేషన్ కిందకు తీసుకురానున్నట్లు తెలిపింది. ఇందులో రూ.1,171.81 కోట్లు సబ్సిడీగా ఉంటుందని వెల్లడించింది. -
తొలకరి సాగులో సరికొత్త ఒరవడి
మండపేట: పొద్దస్తమానూ పొలంలో పనిచేసే రైతు తన కష్టానికి తగిన ప్రతిఫలం ఆశిస్తాడు. అందుకోసం వీరిపక్షాన చేదోడు వాదోడుగా నిలిచేందుకు ఇప్పటికే ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటుచేసింది. నవంబరులో వచ్చే తుఫానుల బెడదను తప్పించడంతో పాటు మూడవ పంటకు మార్గం సుగమం చేసేందుకు ముందస్తు సాగుకు శ్రీకారం చుట్టింది. జిల్లాలలో తొలకరి సాగుకు రైతులు సన్నద్దమవుతున్న నేపథ్యంలో మార్కెట్లో మంచి రాబడి తెచ్చే వంగడాలు, సాగులో మెళకువలపై రైతులకు అవగాహన కల్పిస్తోంది. తూర్పున 93,204 ఎకరాలు, మధ్య డెల్టాలోని 98,258 ఎకరాల్లోను తొలకరి సాగు ఏర్పాట్లలో రైతులు నిమగ్నమయ్యారు. సాధారణంగా జూన్ రెండో వారం తర్వాత కాలువలకు నీటిని విడుదల చేసేవారు. ఆగస్టు నెలాఖరు వరకూ నాట్లు వేసేవారు. ఏటా నవంబరులో వచ్చే తుపానులు పంటకు తీవ్ర నష్టం కలుగజేస్తుండటంతో ప్రభుత్వం ముందస్తు సాగు చేపట్టేలా రైతును ప్రోత్సహిస్తోంది. మునుపెన్నడూ లేని విధంగా ఈ సీజన్లో జూన్ 1వ తేదీన కాలువలకు నీటిని విడుదల చేసింది. జూలై రెండవ వారం నాటికి నాట్లు వేసుకోవడం ద్వారా అక్టోబరు నెలాఖరు నాటికి కోతలు పూర్తవుతాయని భావిస్తున్నారు. దీనివలన నవంబరులో వచ్చే ప్రకృతి వైపరీత్యాల నుంచి పంటను కాపాడుకోవచ్చునని వ్యవసాయశాఖ విశ్వసిస్తోంది. డిసెంబరు చివరి నాటికి రబీ నాట్లు వేసుకుని మార్చి నెలాఖరవుకు కోతలు కోయడం ద్వారా మూడవ పంటగా అపరాల సాగుకు మార్గం సుగమమవుతుంది. భూసారం పెరగడంతో పాటు రైతులకు మూడు నుంచి నాలుగు బస్తాల అదనపు దిగుబడి వస్తుందంటున్నారు. తొలకరిని లాభసాటి చేసేందుకు మార్కెట్లో రాబడినిచ్చే వంగడాల సాగు చేసేలా రైతులను చైతన్యవంతం చేస్తోంది. సాగుకు అనుకూల రకాలు, మెళకువలపై వ్యవసాయ సిబ్బంది పొలాల్లో రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. తూర్పుడెల్టాలోని మండపేట, రామచంద్రపురం నియోజకవర్గాల్లో ఇప్పటికే నారుమడులు వేసే పనిలో రైతులు నిమగ్నమయ్యారు. ఇవి సాగు చేయాలి ఎంటీయూ 7029 (స్వర్ణ), ఎంటీయూ 1121 (శ్రీధతి), ఎంటీయూ 1064 (అమర), ఎంటీయూ 1061 (ఇంద్ర), బీపీటీ – 5204 (సాంబ మసూరి) ఇన్ని విత్తనాలు అవసరం ∙దుక్కిదున్ని వెదజల్లే పద్ధతిలో ఎకరానికి 20–25 కిలోల విత్తనం అవసరం ∙దమ్ముచేసి వెదజల్లే విధానం కింద 12–15 కిలోల విత్తనం ∙నారుమడికి ఎకరానికి 20 కిలోల విత్తనం మాత్రమే వాడాలి ఈ జాగ్రత్తలు పాటించాలి ∙పడిపోయే స్వభావం ఉన్న ఎంటీయూ 7029, ఎంటీయూ 1061, బీపీటీ 5204 వరి రకాలను ముంపు ప్రాంతాల్లో వెదజల్లే పద్దతిలో సాగుచేయవద్దని వ్యవసాయాధికారులు సూచిస్తున్నారు. ∙అవసరానికి మించి ఎరువులు వాడటం వలన ఎంటీయూ 1121, బీపీటీ 5204 రకాలను ఎండాకు తెగులు ఆశించి నష్టం కలుగచేస్తుంది. విత్తనశుద్ధి చేసుకోవాలి సాగుకు విత్తన ఎంపిక ఎంత కీలకమో పంట తెగుళ్ల బారిన పడకుండా, ఆరోగ్యవంతమైన, ధృడమైన నారుకు విత్తనశుద్ది అంతే అవసరం. విత్తన దశలో మొలక రావడాన్ని అడ్డుకునే శిలీంద్రాల నివారణకు విత్తన శుద్ధి దోహదం చేస్తుంది. లేనిపక్షంలో మొలక సక్రమంగా రాకపోవడంతో పాటు పంటపై అగ్గి తెగులు, పొడ తెగులు, వేరుకుళ్లు తెగుళ్లు ఆశిస్తాయి. విత్తన శుద్ధి రెండు రకాలుగా చేయవచ్చు. పొడి విత్తనశుద్ధిలో కేజీ విత్తనాలకు మూడు గ్రాముల కార్భండైజం మందును కలపాలి. తడి విత్తనశుద్ధిలో కేజీ విత్తనాలకు ఒక గ్రాము కార్భండైజం ఒక లీటరు నీటిలో కలిపి ఆ మందు ద్రావణంలో విత్తనాలు శుద్ధి చేయాలని ఆయన సూచించారు. – సీహెచ్కేవీ చౌదరి, ఆలమూరు ఏడీఏ -
AP: రబీలో 37 లక్షల టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యం
సాక్షి, అమరావతి: రబీలో రైతులు పండించిన ధాన్యం కొనుగోలు ప్రక్రియ చురుగ్గా సాగుతోంది. ఖరీఫ్లో మాదిరిగానే ఆర్బీకేల ద్వారా కనీస మద్దతు ధరకు రైతుల నుంచి నూరుశాతం ధాన్యం సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. క్వింటాలు ధాన్యం గ్రేడ్ ‘ఏ‘ రకాన్ని రూ.1,960కి, సాధారణ రకాన్ని రూ.1,940కి కొనుగోలు చేస్తోంది. రబీలో రాష్ట్రవ్యాప్తంగా 21.57 లక్షల ఎకరాల్లో వరి సాగవగా 62.57 లక్షల టన్నుల దిగుబడి వస్తుందని అంచనా వేస్తున్నారు. చదవండి: ఏపీలో తొలి ఎయిర్ బెలూన్ థియేటర్.. ఎక్కడో తెలుసా? గతేడాది రబీలో 2.90 లక్షలమంది రైతుల నుంచి రూ.6,628 కోట్లు విలువైన 35.40 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. ఇప్పుడు సుమారు రూ.7 వేలకోట్లకుపైగా విలువైన 37 లక్షల టన్నుల ధాన్యం సేకరించాలని లక్ష్యంగా నిర్దేశించారు. దాన్ని కస్టమ్ మిల్లింగ్ చేస్తే 24.79 లక్షల టన్నుల బియ్యం వస్తుందని అంచనా వేస్తున్నారు. మరోవైపు గడిచిన ఖరీఫ్లో రూ.7,904.34 కోట్ల విలువైన 40.61 లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించగా.. 5,83,803 మంది రైతులు మద్దతు ధర పొందారు. ఇప్పటికే రూ.205.28 కోట్ల ధాన్యం కొనుగోలు మార్చితో ఖరీఫ్ ధాన్యం సేకరణ పూర్తవడంతో.. వెంటనే ఆర్బీకేల్లో ఈనెల నుంచి రబీ ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించారు. ఇప్పటివరకు 5,306 మంది రైతుల నుంచి రూ.205.28 కోట్ల విలువైన 1,04,800 టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. రాష్ట్రంలోని 26 జిల్లాల్లో 6,884 ఆర్బీకేల ద్వారా ధాన్యం కొనుగోలు చేస్తోంది. ఈ ధాన్యం సేకరణకు అవసరమైన గోనెసంచులు, హమాలీలు, రవాణా వాహనాలను ప్రభుత్వం ఏజెన్సీల ద్వారా సమకూరుస్తోంది. ఈ–క్రాప్ పోర్టల్లో నమోదు చేసుకున్న రైతులందరి నుంచి (కౌలు రైతులతో సహా) కళ్లాల నుంచే ధాన్యం కొనుగోలు చేయనుంది. కేంద్రం నిర్దేశించిన నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా రైతులు ధాన్యంలో తేమ/నిమ్ము 17 శాతానికి మించకుండా ఉండేలా చూడాలి. దళారుల దోపిడీకి అడ్డుకట్ట తొలిసారి వికేంద్రీకృత విధానంలో ఖరీఫ్లో ధాన్యం సేకరించిన ప్రభుత్వం చాలావరకు దళారుల దోపిడీకి అడ్డుకట్ట వేసింది. గత పరిణామాలను దృష్టిలో పెట్టుకుని ఈ–క్రాప్తో పాటు రైతుల ఈ–కేవైసీ (వేలిముద్రలు) సేకరణలో ఎటువంటి లోపాలు తలెత్తకుండా చర్యలు చేపడుతోంది. గడువులోగా ఆధార్ ఆధారిత చెల్లింపులను వేగవంతంగా చేసేలా ప్రణాళికలు రూపొందిస్తోంది. ప్రతి రైతుకి మద్దతు ధర రాష్ట్రంలో వరి సాగుచేసిన ప్రతి రైతుకి మద్దతు ధర కల్పించి పంటను కొనుగోలు చేస్తాం. ఈ ప్రక్రియను పూర్తి పారదర్శకతతో చేపడతాం. ఎక్కడైనా రైతులకు సమస్యలుంటే వెంటనే సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తాం. మిల్లర్లతో కూడా మాట్లాడి వేగంగా ధాన్యం సేకరణ జరిగేలా చర్యలు చేపడతాం. ఎప్పటికప్పుడు అధికారులు ధాన్యం సేకరణ కేంద్రాలను తనిఖీ చేస్తూ లోపాలను వెంటనే సరిదిద్దుతారు. -కారుమూరి వెంకట నాగేశ్వరరావు, పౌరసరఫరాలశాఖ మంత్రి పకడ్బందీగా కొనుగోళ్లు రబీ ధాన్యం సేకరణకు 26 జిల్లాల్లోను ఏర్పాట్లు చేశాం. ఈనెల 5వ తేదీ నుంచి కొనుగోళ్లు జరుగుతున్నాయి. గతంలో చేపట్టినట్టే ఆర్బీకేల ద్వారా ధాన్యాన్ని క్షేత్రస్థాయిలోనే కొంటున్నాం. ఈ–కేవైసీ, ఈ–క్రాప్ నమోదులో సమస్యలు తలెత్తకుండా వ్యవసాయశాఖ అధికారుల సమన్వయంతో పనిచేస్తున్నాం. నగదు జమచేసే సమయంలో సాంకేతిక సమస్యలు రాకుండా చర్యలు చేపడుతున్నాం. –వీరపాండియన్, ఎండీ, పౌరసరఫరాలసంస్థ -
గోదావరి గట్టెక్కింది
సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం/ధవళేశ్వరం: సాగు నీటి ఎద్దడి లేకుండా రబీ రైతు గట్టెక్కేసినట్టే. ప్రభుత్వ సంకల్పానికి గోదారమ్మ తోడైంది. సహజ జలాలు తక్కువగా ఉండటంతో పూర్తి ఆయకట్టుకు సాగునీరందదని ఆందోళన చెందినా ప్రభుత్వ పట్టుదలకు పరిస్థితులు సానుకూలంగా కలిసొచ్చాయి. దీంతో రైతులు గుండె నిండా ఊపిరి పీల్చుకుంటున్నారు. ఈ ఏడాది జనవరి 10న కాటన్ బ్యారేజ్ వద్ద గోదావరి నీటి మట్టం 5.50 అడుగుల కనిష్టానికి నమోదైంది. ఈ పరిస్థితులను అధిగమించేందుకు పోలవరం ప్రాజెక్టు వద్ద నీటిని డెల్టాల సాగు కోసం విడిచిపెట్టారు. అరకొరగా సాగునీరు అందుతోందని అందోళన చెందుతోన్న సమయంలో అఖండ గోదావరి ఎగువన వర్షాలు పడ్డాయి. ఈ వర్షాలతో తెలంగాణాలోని లక్ష్మీ ప్రాజెక్టు నుంచి నీటిని దిగువకు విడుదల చేశారు. దీంతో జనవరి 14 నాటికి బ్యారేజ్ వద్ద నీటి సామర్థ్యం పూర్తి స్థాయికి చేరుకుంది. అప్పటివరకూ ఆందోళన చెందిన రైతులు ఉపసమనం చెందారు. జనవరి నెలాఖరుకు సాగు వసరాలకు నిల్వలు సరిపోవడంతో ఈ సారి అనూహ్యంగా మిగులు జలాలను సముద్రంలోకి విడుదల చేశారు. గడచిన పదేళ్లలో జనవరిలో మిగులు జలాలను విడుదల చేయడం తొలిసారిగా బ్యారేజీ రికార్డులకు ఎక్కింది. ఫలితంగా నెలంతా సాఫీగానే సాగునీరు సరఫరా సాగింది. ఫిబ్రవరిలోనే ఏర్పడిన ధీమా ఫిబ్రవరి 13 నుంచి నీటి మట్టం తగ్గడంతో మరోసారి రబీ రైతులు టెన్షను పడ్డారు. సరిగ్గా ఇదే సమయంలో బ్యారేజ్ ఎగువ ప్రాంతంలో భారీగా వర్షాలు కురిశాయి. ఆ వర్షాలతో గోదావరి జలాలు కాటన్ బ్యారేజ్కి చేరాయి. ఫలితంగా ఫిబ్రవరి నెలంతా సాగునీటికి ఇబ్బంది లేకుండా నీరు విడుదలైంది. ప్రభుత్వ భరోసాతో రైతులు ధైర్యంగా చేపట్టిన పూర్తి స్థాయి ఆయకట్టుకు సాగునీటికి ఇబ్బంది లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో ఈ రబీకి సాగునీటి కొరత లేదనే విషయం దాదాపు ఖాయమైంది. సాగు, తాగు నీటికి మొత్తం 94టీఎంసీలు అవసరమని ప్రాథమికంగానే నీటిపారుదలశాఖాధికారులు అంచనా వేశారు. ఇప్పటివరకు 62.82 టీఎంసీలు ఉభయగోదావరి జిల్లాల్లోని మూడు డెల్టాలకు విడుదల చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో రబీ సీజన్ ముగిసే నాటికి మరో 32 టీఎంసీల నీరు విడుదలచేస్తే సరిపోతుంది. అవసరమైతే రెడీగా సీలేరు నీరు విశాఖ జిల్లా సీలేరు నుంచి మన డెల్టాలకు 38 టీఎంసీలు వినియోగించుకోవాల్సి ఉంది. ఇప్పటివరకు 9.09 టీఎంసీలు మాత్రమే వినియోగించుకున్నాం. భవిష్యత్ అవసరాల కోసం సీలేరులో 29 టీఎంసీలు అందుబాటులో ఉన్నాయి. అంటే ప్రభుత్వం రబీ సాగు ప్రణాళిక ప్రకటన రోజు ఏమని చెప్పిందో దానిని నిజం చేసి చూపించిందని చెప్పవచ్చు. ఇందుకు ప్రకృతి కూడా తోడ్పాటునందించడంతో ఎలాంటిì ప్రతిబంధకాలు లేకుండా రబీ గట్టెక్కినట్టేనని అధికారులు ధీమా వ్యక్తంచేస్తున్నారు. ఈ రబీలో 8,96,533 లక్షల ఎకరాలకు 87టీఎంసీల సాగు నీరు అవసరమని ఇరిగేషన్ అధికారులు తొలుత అంచనా వేశారు. సాగు, తాగు నీటికి మరో 7 టీఎంసీలతో కలిపి మొత్తం 94 టీఎంసీలు అవసరమని లెక్కతేల్చారు. సోమవారం నాటికి మూడు డెల్టాలకు కలిపి బ్యారేజ్ నుంచి 62.82 టీఎంసీలు విడుదల చేశారు. తూర్పు డెల్టాకు 18.37టీఎంసీలు, మధ్య డెల్టాకు 12.01టీఎంసీలు, పశ్చిమ డెల్టా 32.44టీఎంసీలు విడుదలయ్యాయి. రబీకి పుష్కలంగా సాగునీరు రబీలో ముందస్తుగా వేసుకున్న ప్రణాళిక ప్రకారం ప్రతి ఎకరాకు సాగు నీరందించగలగుతున్నాం. అవసర సమయంలో ఎగువన వర్షాలు కురవడం, పోలవరం ప్రాజెక్టులో నీరు కూడా ఈ సీజన్లో కలిసి వచ్చింది. వ్యవసాయ, రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు సమన్వయంతో పనిచేయడంతో ఇది సాధ్యమైంది. మార్చి నెలలో కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా సాగునీరందిస్తాం. – పి.రాంబాబు, సూపరింటెండెంట్ ఇంజినీర్, నీటి పారుదల శాఖ, ధవళేశ్వరం -
ఈ ఏడాది రూ.8,600 కోట్లతో ధాన్యం కొనుగోళ్లు: కోన శశిధర్
సాక్షి, అమరావతి: ఈ ఏడాది రూ.8,600 కోట్లతో ధాన్యం కొనుగోళ్లు చేస్తున్నట్లు పౌర సరఫరాల శాఖ కమిషనర్ కోన శశిధర్ తెలిపారు. గతం కంటే ఎక్కువ ధాన్యం కొనుగోళ్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రబీ సీజన్ ధాన్యం కొనుగోళ్లు చేస్తున్నామన్నారు. ఇప్పటివరకు 25 లక్షల 25 వేల మెట్రిక్ టన్నుల కొనుగోళ్లు చేయగా ఎప్పుడూ లేని విధంగా కడప, కర్నూల్లో అధికంగా కొనుగోళ్లు చేసినట్లు తెలిపారు. ఇక రైతులు, దళారుల చేతిలో మోసపోకుండా నేరుగా కొంటున్నామని, ఈ క్రమంలో రైతుల పొలాలకు వెళ్లి ధాన్యం కోనుగోలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఆర్బీకేల్లో రైతులకు రిజిస్ట్రేషన్, కొనుగోలు కూపన్లు ఇవ్వడం ద్వారా రైతులకు పేమెంట్ ఆలస్యం లేకుండా చేస్తున్నామని వెల్లడించారు. కేంద్రం నుంచి రూ.3,900 కోట్లు రావాల్సి ఉండగా, కేంద్రం ఏటా ఇచ్చే అడ్వాన్స్ కూడా ఇవ్వలేదని అయినా పెండింగ్లో ఉన్న రూ.300 కోట్లు విడుదల చేస్తున్నామన్నారు. జులై నెలాఖరు వరకు ధాన్యం సేకరణ చేస్తామని అన్నారు. చదవండి: Jagananna Vidya Kanuka: నాణ్యమైన ‘కానుక’.. ఈ ఏడాది అవి అదనం -
ఎకరం కూడా ఎండకుండా.. రైతన్న సంబరపడేలా
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో చిన్న, మధ్య, భారీతరహా ప్రాజెక్టుల కింద రబీలో 35.21 లక్షల ఎకరాల ఆయకట్టుకు ప్రభుత్వం నీటిని సరఫరా చేస్తోంది. గతేడాది రబీలో 24 లక్షల ఎకరాలకు నీళ్లందించి రికార్డు సృష్టించిన సర్కార్.. ప్రస్తుత రబీలో అదనంగా 11.21 లక్షల ఎకరాలకు నీళ్లందించడం ద్వారా సరికొత్త రికార్డును నెలకొల్పింది. యాజమాన్య పద్ధతుల ద్వారా ‘ఆన్ అండ్ ఆఫ్’ విధానంలో చివరి భూములకూ సమృద్ధిగా నీరందేలా జలవనరుల శాఖ అధికారులు చర్యలు తీసుకున్నారు. దీంతో రికార్డు స్థాయిలో పంట దిగుబడులు వస్తుండటంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గోదావరి, కృష్ణా డెల్టాలు, సాగర్ కుడి కాలువ, గుండ్లకమ్మ తదితర ప్రాజెక్టుల కింద వరి ఎకరానికి సగటున 40 నుంచి 45 బస్తాల దిగుబడి వస్తుండటంతో వారిలో సంతోషం వెల్లివిరుస్తోంది. చిన్న, మధ్య, భారీతరహా ప్రాజెక్టులు, ఏపీఎస్ఐడీసీ (ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల అభివృద్ధి సంస్థ) నేతృత్వంలోని ఎత్తిపోతల పథకాల కింద 1.05 లక్షల ఎకరాల ఆయకట్టును ప్రభుత్వం అభివృద్ధి చేసింది. నైరుతి, ఈశాన్య రుతుపవనాలతో భారీ వర్షాలు పడడంతో గోదావరి, కృష్ణా, వంశధార, నాగావళి, పెన్నా, ఏలేరు, వాగులు, వంకలు ఉప్పొంగాయి. వరద నీటిని ఒడిసి పట్టిన సర్కార్.. గతంలో ఎన్నడూ నిండని ప్రాజెక్టులను సైతం నింపింది. దీంతో ఖరీఫ్లో రికార్డు స్థాయిలో 78 లక్షల ఎకరాలకు నీళ్లందాయి. రికార్డు స్థాయిలో రబీలో నీటి సరఫరా.. రాష్ట్ర విభజన తర్వాత.. 2014 నుంచి 2019 వరకు గరిష్టంగా 2018లో మాత్రమే రబీలో 11.23 లక్షల ఎకరాలకు నీళ్లందించారు. అయితే గోదావరి డెల్టాలో పంటలను రక్షించడంలో నాటి సర్కార్ పూర్తిగా విఫలమైంది. గతేడాది రబీలో 24 లక్షల ఎకరాలకు నీళ్లందించిన జలవనరుల శాఖ.. రాష్ట్ర చరిత్రలోనే తొలిసారిగా ఈ ఏడాది రికార్డు స్థాయిలో 35.21 లక్షల ఎకరాలకు నీటిని అందించింది. ప్రకాశం జిల్లా మల్లవరంలో గుండ్లకమ్మ ప్రాజెక్ట్ కింద రబీలో సాగుచేసిన వరిపంట కోత పనులు కృష్ణా డెల్టా చరిత్రలో తొలిసారిగా.. కృష్ణా డెల్టాలో ఖరీఫ్లో 13.08 లక్షల ఎకరాలకు నీటిని సరఫరా చేస్తారు. కానీ.. 2019 వరకు రబీలో ఈ డెల్టాకు నీటిని సరఫరా చేసిన దాఖలాలు లేవు. గతేడాది 1.50 లక్షల ఎకరాలకు రబీలో నీటిని విడుదల చేసిన ప్రభుత్వం.. ఈ ఏడాది ఏకంగా 4.26 లక్షల ఎకరాలకు నీటిని అందించి చరిత్ర సృష్టించింది. దుర్భిక్ష సీమ కళకళ.. దుర్భిక్ష రాయలసీమలో రబీలో ఆయకట్టులో రైతులు భారీ ఎత్తున పంటలు సాగు చేశారు. తుంగభద్ర హెచ్చెల్సీ (ఎగువ ప్రధాన కాలువ) కింద అనంతపురం జిల్లాలో తొలిసారిగా గరిష్టంగా 1.10 లక్షల ఎకరాలకు అధికారులు నీటిని సరఫరా చేస్తున్నారు. వైఎస్సార్ జిల్లాలో తెలుగుగంగ, హెచ్చెల్సీ, పులివెందుల బ్రాంచ్ కెనాల్ కింద 2.01 లక్షల ఎకరాల్లో, కేసీ కెనాల్, తుంగభద్ర ఎల్లెల్సీ (దిగువ కాలువ) కింద 2.44 లక్షల ఎకరాల్లో రైతులు పంటలు సాగు చేశారు. రికార్డు స్థాయిలో నీటి సరఫరా.. గోదావరి డెల్టాతో పోటీపడుతూ నెల్లూరు జిల్లాలో పెన్నా డెల్టా, తెలుగుగంగ, సోమశిల ప్రాజెక్టులు, కాన్పూర్ కెనాల్ కింద రైతులు 7.28 లక్షల ఎకరాల్లో పంటలు సాగు చేశారు. పెన్నా వరదను ఒడిసి పట్టి సోమశిల, కండలేరు ప్రాజెక్టులను నింపడం వల్లే నీటిని సరఫరా చేయడం సాధ్యమైందని అధికారవర్గాలు చెబుతున్నాయి. ప్రకాశం జిల్లాలో గుండ్లకమ్మ ప్రాజెక్టు కింద 40 వేల ఎకరాలకు, శ్రీకాకుళం జిల్లాలో వంశధార ప్రాజెక్టు కింద వరుసగా రెండో ఏడాది రబీలో పంటల సాగుకు నీటిని విడుదల చేశారు. గోదావరిలో సహజసిద్ధ ప్రవాహం తగ్గినా.. గోదావరి డెల్టాలో రబీలో 8,96,538 ఎకరాల్లో రైతులు వరి పంటను సాగు చేశారు. రబీ పంట పూర్తి కావాలంటే 94.50 టీఎంసీలను సరఫరా చేయాలని అధికారులు లెక్కలు కట్టారు. డిసెంబర్లో గోదావరిలో 26.502 టీఎంసీలుగా నమోదైన సహజసిద్ధ ప్రవాహం జనవరిలో 11.560, ఫిబ్రవరిలో 3.387, మార్చిలో 1.957 టీఎంసీలకు తగ్గింది. దీంతో సీలేరు నుంచి డిసెంబర్లో 10.260, జనవరిలో 12.668, ఫిబ్రవరిలో 13.871, మార్చిలో 18.882 టీఎంసీలను విడుదల చేసి గోదావరి డెల్టాకు సరఫరా చేశారు. మంగళవారం వరకు డెల్టాకు 92.87 టీఎంసీలను సరఫరా చేశారు. మరో పది రోజుల్లో పంట కోతలను ప్రారంభిస్తారు. సమృద్ధిగా నీటిని అందించడంతో వరి పంట రికార్డు స్థాయిలో దిగుబడులు ఇస్తోంది. చివరి భూములకూ నీళ్లందించాం.. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు.. కృష్ణా, గోదావరి, వంశధార, పెన్నా, ఏలేరు, నాగావళి వరద నీటిని ఒడిసి పట్టి ప్రాజెక్టులను నింపాం. ఖరీఫ్లో రికార్డు స్థాయిలో ఆయకట్టుకు నీటిని విడుదల చేశాం. రబీలోనూ గతంలో ఎన్నడూ లేని రీతిలో ఆయకట్టుకు నీటిని విడుదల చేశాం. ఆన్ అండ్ ఆఫ్ విధానంలో.. యాజమాన్య పద్ధతులను అమలు చేయడం ద్వారా చివరి భూములకు నీళ్లందేలా చేశాం. ఒక్క ఎకరంలో కూడా పంట ఎండకుండా జాగ్రత్తలు తీసుకున్నాం. – సి.నారాయణరెడ్డి, ఇంజనీర్–ఇన్–చీఫ్, జలవనరుల శాఖ -
గత ఏడాది లక్ష్యానికి మించి పంట రుణాలు
సాక్షి, అమరావతి: గత ఆర్థిక సంవత్సరం (2019–20)లో ఖరీఫ్, రబీతో కలిపి బ్యాంకర్లు రైతులకు లక్ష్యాన్ని మించి పంట రుణాలను అందించాయి. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు సున్నా వడ్డీ పథకాన్ని పునరుద్ధరించడమే కాకుండా గత ప్రభుత్వం బకాయి పెట్టిన సున్నా వడ్డీ సొమ్మును కూడా చెల్లిస్తామని ప్రకటించడంతో బ్యాంకులు లక్ష్యానికి మించి పంట రుణాలను మంజూరు చేశాయి. నిజానికి గత ఏడాది ఖరీఫ్ రుణాల లక్ష్యం రూ.51,240 కోట్లు కాగా.. రూ.51,511 కోట్లను అందించాయి. అలాగే.. గత రబీలో పంట రుణాలు రూ.32,760 కోట్లకుగాను రూ.37,762 కోట్లను బ్యాంకులు మంజూరు చేశాయి. ఇది లక్ష్యంలో 115.27 శాతం. మొత్తం వ్యవసాయ రంగానికి గత ఆర్థిక ఏడాది రూ.1,15,000 కోట్ల రుణాలివ్వాలని లక్ష్యంగా పెట్టుకోగా.. రూ.1,13,997 కోట్ల రూపాయల మేర బ్యాంకులు రుణాలను మంజూరు చేశాయి. ఇది లక్ష్యంలో 99.13 శాతం. సర్కారు దన్నుతో రుణాలకు బ్యాంకుల ఆసక్తి ఇదిలా ఉంటే.. ఈ ఆర్థిక ఏడాది ఇప్పటికే మంచి వర్షాలు పడుతుండటంతో వ్యవసాయ పనులు ఊపందుకున్నాయి. ఈ సంవత్సరం ఖరీఫ్, రబీ కలిపి రూ.94,524 కోట్లు పంట రుణాలను మంజూరు చేయాలని లక్ష్యంగా నిర్ధారించగా ఇప్పటికే రూ.18,323 కోట్లను బ్యాంకులు మంజూరు చేశాయి. అలాగే, ఖరీఫ్, రబీ కలిపి వ్యవసాయ టర్మ్ రుణాల కింద రూ.34,036 కోట్లను మంజూరు చేయాలని లక్ష్యంగా నిర్ధారించగా ఇప్పటికే రూ.1,639 కోట్లను మంజూరు చేశాయి. సకాలంలో పంట రుణాలను చెల్లించే రైతులకు సున్నా వడ్డీని వర్తింపజేస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో బ్యాంకులు కూడా పంట రుణాలను మంజూరు చేయడానికి ఆసక్తి చూపుతున్నాయి. -
ఇకపై వానాకాలం, యాసంగి!
సాక్షి, హైదరాబాద్ : ఖరీఫ్, రబీ పేర్లను వానాకాలం, యాసంగిగా మారుస్తూ రాష్ట్ర వ్యవసాయ శాఖ నిర్ణయం తీసుకుంది. సీఎం కేసీఆర్ ఆదేశాలకు అనుగుణంగా వ్యవసాయ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ఈ ఆదేశాలు జారీచేసినట్లు ఆయన కార్యాలయం శనివారం ఓ ప్రకటనలో తెలిపింది. పంట సీజన్లలో ఖరీఫ్, రబీ పదాలు రద్దు చేస్తున్నట్లు పేర్కొన్నారు. సామాన్యులకు అర్థమయ్యే రీతిలో వ్యవసాయ సీజన్లు ఉండాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. శాఖాపరమైన ఉత్తర్వుల్లో వానాకాలం, యాసంగి అనే పేర్కొనాలని సూచించారు. -
పాక్ పాప్ సింగర్ రబీ పిర్జాదాపై కేసు నమోదు
-
యాసంగి పంటలకు నిలిచిన నీటి విడుదల
బాల్కొండ: శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ నుంచి ప్రస్తుత సంవత్సరం యాసంగి పంటలకు అన్ని కాలువల ద్వారా నీటి విడుదలను ప్రాజెక్ట్ అధికారులు నిలిపివేశారు. ఎస్సారెస్పీ నుంచి ప్రస్తుత యాసంగి సీజన్లో కాకతీయ కాలువ ద్వారా, లక్ష్మి, సరస్వతి కాలువల ద్వారా నీటిని విడుదల చేసిన విషయం తెలిసిందే.. ప్రాజెక్ట్ నుంచి జనవరి 15 నుంచి నీటి విడుదల చేపట్టి మార్చి 31 న పూర్తి చేయాలని మొదట ప్రణాళిక రూపొందించారు. కానీ చివరికి నీటి ఎద్దడిని దృష్టిలో ఉంచుకుని ప్రాజెక్ట్ నుంచి ఫిబ్రవరి 1 నుంచి వారబందీ ప్రకారం నీటి విడుదల చేపట్టారు. నాలుగు విడతలు అందించారు. 19.5 టీఎంసీల నీటి వినియోగం ప్రాజెక్ట్ నుంచి యాసంగి పంటల కోసం అన్ని కాలువలతోపాటు, తాగు నీటి అవసరాల కోసం 19.5 టీఎంసీల నీటిని వినియోగించినట్లు అధికారులు చెబుతున్నారు. కాకతీయ కాలువ ద్వారా 14.5 టీఎంసీలు, సరస్వతి కాలువ ద్వారా 1.41 టీఎంసీలు, లక్ష్మి కాలువ ద్వారా 1.31 టీఎంసీలు, అలీసాగర్ గుత్ప ఎత్తిపోతల పథకం ద్వారా 1.98 టీఎంసీల నీటిని విడుదల చేశామని, తాగు నీటి పథకాల కోసం 0.79 టీఎంసీల నీటిని అందించామని అధికారులు తెలిపారు. ఆవిరి రూపంలో 1.18 టీఎంసీల నీరు వృథా అయ్యిందంటున్నారు. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 1,091(90 టీఎంసీలు) అడుగులు కాగా బుధవారం సాయంత్రానికి 1,053.30(8.05 టీఎంసీలు) అడుగుల నీరు నిల్వ ఉంది. -
28న కొర్నెపాడులో రబీలో వరి, కూరగాయల సాగుపై శిక్షణ
గుంటూరు జిల్లా పుల్లడిగుంట కొర్నెపాడులో ఈ నెల 28(ఆదివారం)న రబీలో సేంద్రియ వరి, కూరగాయల సాగుపై రైతులు శివనాగమల్లేశ్వరరావు, మీసాల రామకృష్ణ, ఉద్యాన అధికారి రాజా కృష్ణారెడ్డి శిక్షణ ఇస్తారు. వివరాలకు.. 0863–2286255 -
22 నుంచి పెట్టుబడి సొమ్ము?
సాక్షి, హైదరాబాద్: రైతులకు రబీ పెట్టుబడి సొమ్మును ఈ నెల 22 నుంచే అందజేయాలని వ్యవసాయ శాఖ సూత్రప్రాయంగా నిర్ణయించింది. మొదటి దశలో ఇప్పటివరకు సేకరించిన 10 లక్షల మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో సొమ్ము జమ చేయనుంది. అందుకు సంబంధించి ముమ్మరంగా సన్నాహాలు చేస్తుంది. ‘పండుగ తర్వాత ఈ నెల 22 నుంచి ఇవ్వాలనుకుంటున్నాం. అన్నీ సక్రమంగా జరిగితే అంతకుముందే రైతుల ఖాతాల్లోకి రబీ పెట్టుబడి సొమ్ము జమ చేస్తాం’అని వ్యవసాయ శాఖ ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’కి తెలిపారు. రైతుల ఖాతాలను ఎప్పటికప్పుడు వేగంగా అప్లోడ్ చేసేలా మొబైల్ యాప్ కూడా వ్యవసాయ శాఖ రూపొందించింది. దానివల్ల గ్రామాల్లో వ్యవసాయాధికారులు వీలైనంత త్వరగా రైతుల బ్యాంకు ఖాతాలను సేకరించడం సాధ్యపడుతుంది. వేగంగా బ్యాంకు ఖాతాల సేకరణ.. గత ఖరీఫ్లో ప్రభుత్వం రైతులకు పెట్టుబడి చెక్కులను గ్రామసభల్లో అందజేసిన సంగతి తెలిసిందే. దాదాపు 51 లక్షల మంది రైతులకు రూ.5,200 కోట్ల వరకు ప్రభుత్వం అందజేసింది. ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో రబీలో చెక్కుల రూపంలో ఇవ్వకూడదని, ఎన్నికల కమిషన్ స్పష్టం చేసిన విషయం తెలిసిందే. అందుకు ప్రత్యామ్నాయంగా రైతుల బ్యాంకు ఖాతాల్లోనే రైతుబంధు సొమ్ము జమ చేయాలని స్పష్టం చేసింది. దీంతో వ్యవసాయ శాఖ రైతుల నుంచి బ్యాంకు ఖాతా నంబర్లను సేకరించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఆ ఖాతాల నంబర్లను ప్రత్యేక సాఫ్ట్వేర్ ద్వారా అప్లోడ్ చేసి రిజర్వ్ బ్యాంకుకు పంపించాల్సి ఉంది. రిజర్వ్ బ్యాంకు వద్ద ఉన్న ఈ–కుబేర్ సాఫ్ట్వేర్ ద్వారా రైతులకు పెట్టుబడి సొమ్ము వెళ్తుంది. రైతుకు ఖాతా ఉన్న బ్యాంకుతో సంబంధం లేకుండా ఒకేసారి వారి ఖాతాల్లోకి సొమ్ము చేరుతుంది. -
అక్టోబర్ తొలివారంలోనే చెక్కుల పంపిణీ
సాక్షి, హైదరాబాద్: రబీ సీజన్కు సంబంధించిన రైతుబంధు చెక్కులను అక్టోబర్ మొదటి వారం లో రైతులకు పంపిణీ చేస్తామని వ్యవసాయ శాఖ రాష్ట్ర ఎన్నికల కమిషన్కు తెలిపింది. ఈ మేరకు వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి సి.పార్థసారథి శనివారం లేఖ రాశారు. రబీ సాగు అక్టోబర్ తొలి వారం నుం చి ప్రారంభమవుతున్నందున చెక్కుల పంపిణీ కూడా అప్పట్నుంచే ప్రారంభించాలని నిర్ణయిం చినట్లు ఆయన పేర్కొన్నారు. రైతుబంధు పథకం ఇంతకుముందు నుంచీ కొనసాగుతున్న కార్యక్రమం కాబట్టి ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినప్పటికీ పెట్టుబడి చెక్కులు పంపిణీ చేయాలని నిర్ణయించామన్నారు. రాష్ట్ర బడ్జెట్లో రైతుబంధు కోసం రూ.12 వేల కోట్లను కేటా యించినట్లు తెలిపారు. అక్టోబర్ 2 నుంచి క్రిషి కల్యాణ్ అభియాన్ పథకాన్ని కూడా అమలు చేస్తామని మరో లేఖలో తెలిపారు. -
రబీ విత్తనాలు రెడీ
సాక్షి, హైదరాబాద్: రబీ విత్తన ప్రణాళికను వ్యవసాయ శాఖ ఖరారు చేసింది. అక్టోబర్ 1 నుంచి ప్రారంభమయ్యే రబీ సీజన్కు అవసరమైన విత్తనాలను ఇప్పటికే సిద్ధం చేసినట్లు ఆ శాఖ వర్గాలు తెలిపాయి. మొత్తం 4.19 లక్షల క్వింటాళ్ల వివిధ విత్త నాలు రబీకి అందుబాటులో ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. అందులో వరి విత్తనాలే 3.16 లక్షల క్వింటాళ్లున్నాయి. వీటిలో 25 వేల క్వింటాళ్లు ఇప్పటికే సిద్ధంగా ఉండగా, ప్రస్తుత ఖరీఫ్లో విత్తనోత్పత్తి కార్యక్రమం కింద మరో 2.91 లక్షల క్వింటాళ్లు సిద్ధం చేయనున్నారు. వరిలో ఎంటీయూ–1010 విత్తనాలు 1.22 లక్షల క్వింటాళ్లు, బీపీటీ–5204 విత్తనాలు 87,654 క్వింటాళ్లు సరఫరా చేయనున్నారు. కేఎన్ఎం–118 వరి విత్తనాలను 57,740 క్వింటాళ్లు, ఆర్ఎన్ఆర్–15048 విత్తనాలను 31 వేల క్వింటాళ్లు సరఫరా చేస్తారు. అలాగే ఎంటీయూ–1061, ఎంటీయూ–1001, జేజీఎల్–18047 రకం వరి విత్తనాలను కూడా పంపిణీ చేయనున్నారు. ఇవిగాక 64,880 క్వింటాళ్ల శనగ విత్తనాలు, 8,666 క్వింటాళ్ల వేరుశనగ విత్తనాలు, మినుములు, ఆముదం విత్తనాలను కూడా అందుబాటులో ఉంచనున్నట్లు వెల్లడించారు. అయితే వీటిని సబ్సిడీపై అందజేయనున్నా రు. ఎంత సబ్సిడీ ఇవ్వాలనే దానిపై త్వరలోనే నిర్ణయించనున్నారు. ఇటీవల విస్త్రృతంగా వర్షాలు కురవడం, జలాశయాల్లోకి పెద్ద ఎత్తున నీరు చేరడంతో రబీలో వరి సాగు భారీగా పుంజుకోనుందని వ్యవసాయ శాఖ అంచనా వేస్తోంది. అంతేకాకుండా కొత్తగా పూర్తయ్యే ప్రాజెక్టుల కింద అదనంగా 6.50 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరుగనుండటంతో ఆ మేరకు అదనంగా వరి విత్తనాలను సరఫరా చేసేందుకు సిద్ధమైంది. -
ఆర్డీఎస్ ఆశలు గల్లంతు!
సాక్షి, హైదరాబాద్: రాజోలిబండ ఎత్తిపోతల పథకం (ఆర్డీఎస్) కింది ఆయకట్టు రైతాంగానికి ఈ ఏడాదీ నిరాశే మిగిలింది. నాలుగేళ్లుగా ఊరిస్తున్న ఆధునీకరణ పనులు ఈ ఏడాది సైతం మూలన పడటంతో వారి ఆశలన్నీ అడియాసలే అయ్యాయి. ప్రస్తుతం పనులు చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ముందుకొచ్చినా.. వర్షాకాలం ఆరంభమైన నేపథ్యంలో పనులు ముందుకు కదిలే ప్రసక్తే లేదు. దీంతో రబీ ఆశలు గల్లంతయినట్టే కనబడుతోంది. నిజానికి ఆర్డీఎస్ కింద తెలంగాణకు 15.9 టీఎంసీల నీటి వాటా ఉండగా, పాత పాలమూరు జిల్లాలోని 87,500 ఎకరాలకు సాగునీరిచ్చే అవకాశం ఉంది. కర్ణాటక నుంచి ఆర్డీఎస్కు నీటిని తరలించే కాల్వలన్నీ పూడికతో నిండిపోవడంతో ఆశించిన మేర నీరు రావడం లేదు. ఈ దృష్ట్యా ఆర్డీఎస్ కాల్వల మరమ్మతులు చేసి, ఎత్తును పెంచాలని నిర్ణయించగా, ఇందుకు కర్ణాటక సైతం అంగీకరించింది. ఈ కాల్వల ఆధునీకరణ కోసం కర్ణాటకకు రాష్ట్రం రూ.72 కోట్ల మేర డిపాజిట్ సైతం చేసింది. అయితే ఆనకట్టకు మరోవైపున ఉన్న కర్నూలు జిల్లా నేతలు, రైతులు ఆధునీకరణ పనులకు నాలుగేళ్లుగా అడ్డుపడుతున్నారు. దీంతో ఆర్డీఎస్ కింద సాగు ముందుకు సాగడం లేదు. కర్ణాటక మంత్రితో హరీశ్ చర్చలు జరిపినా.. గత ఏడాది డిసెంబర్లో రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్రావు దీనిపై కర్ణాటక మంత్రి ఎంబీ పాటిల్తో చర్చలు జరపగా వారు పనులకు ఓకే చెప్పారు. దీంతో ప్యాకేజీ–1లోని హెడ్వర్క్స్ అంచనాను రూ.మూడు కోట్ల నుంచి రూ.13 కోట్లకు పెంచి.. ఈ నిధులను కర్ణాటక ప్రభుత్వ ఖాతాలో జమ చేసినా, ప్యాకేజీ–1లో భాగంగా పూడికమట్టి తొలగింపు, షట్టర్ల నిర్మాణ పనులు జరుగలేదు. ఈ పనుల కొనసాగింపుపై ఇటీవల జరిగిన దక్షిణాది రాష్ట్రాల ఇరిగేషన్ మంత్రుల సమావేశంలో చర్చించగా, అందులో పనులకు సహకరిస్తామని ఏపీ హామీ ఇచ్చింది. అయినా అది అమలవలేదు. దీంతో పాటే గత నెలలో తుంగభద్ర బోర్డు సమావేశంలోనే ఆర్డీఎస్ అంశాన్ని బోర్డు పరిధిలోకి తేవాలని తెలంగాణ ఒత్తిడి చేయగా, ఏపీ అంగీకరించింది. బోర్డు దీనిపై ఎలాంటి నిర్ణయం చేయకపోవడంతో ఆ అంశం మూలన పడింది. ప్రస్తుతం పనులు మొదలుపెట్టినా వర్షాల కారణంగా ఆర్డీఎస్ కాల్వల్లోకి నీరు చేరింది. దీంతో పనులు చేసేలా పరిస్థితి లేదు. దీంతో రైతాంగం ఆశలు ఆవిరయ్యాయి. ఈ నేపథ్యంలో తీవ్ర అసంతృప్తితో ఉన్న తెలంగాణ.. రాష్ట్రాల మధ్య సుహృద్భావ వాతావరణం నెలకొనేలా కృషి చేయాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని, పరస్పర సహకార ధోరణిని పొరుగు రాష్ట్రాలు పాటించేలా వారికి ఆదేశాలు ఇవ్వాలని కేంద్రానికి లేఖ రాయాలనే నిర్ణయానికి వచ్చింది. ఆర్డీఎస్ పనుల పూర్తికి సహకరించేలా ఏపీని ఒప్పించి, తెలంగాణ రైతాంగానికి సహకరించాలని కోరనుంది. -
దిగులే దిగుబడి
సాక్షి, హైదరాబాద్: వరి దిగుబడి రైతన్నకు దిగులు మిగిల్చింది. ఈసారి వరి ధాన్యం ఉత్ప త్తి గణనీయంగా తగ్గింది. గత ఏడాది కంటే ఈసారి వరి సాగు విస్తీర్ణం పెరిగినా, ఉత్పత్తి తగ్గడం గమనార్హం. 2017–18లో 94.31 లక్షల మెట్రిక్ టన్నుల వరి ఉత్పత్తి అయింది. అర్థగణాంక శాఖ వర్గాలు తయారు చేసిన 2017–18 ఖరీఫ్, రబీ మూడో ముందస్తు అంచనా నివేదికను వ్యవసాయశాఖ తాజాగా వెల్లడించింది. 2016–17లో ఖరీఫ్, రబీల్లో 45.72 లక్షల ఎకరాల్లో వరి సాగు కాగా, 97.04 లక్షల మెట్రిక్ టన్నుల్లో ధాన్యం పండింది. 2017–18 వ్యవసాయ సీజన్లో 48.15 లక్షల ఎకరాల్లో వరి సాగు కాగా, 94.31 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి అయింది. గతం కంటే ఈసారి 2.43 లక్షల ఎకరాల్లో అదనంగా వరి సాగైనా, ఉత్పత్తి మాత్రం 2.73 లక్షల మెట్రిక్ టన్నులు తగ్గడం విస్మయం కలిగిస్తోంది. ఖరీఫ్లో ఆకుచుట్టు పురుగు, కాండం తొలిచే పురుగు తదితర చీడపీడల కారణంగా ఉత్పత్తి గణనీయంగా తగ్గినట్లు వ్యవసాయశాఖ నిర్దారణకు వచ్చింది. రబీలోనూ కాండం తొలిచే పురుగుతో వరికి నష్టం వాటిల్లిందని అంచనా వేసింది. కామారెడ్డి, జోగులాంబ గద్వాల, నల్ల గొండ, పెద్దపల్లి, కరీంనగర్, నాగర్కర్నూలు జిల్లా ల్లో చీడపీడలతో పెద్దఎత్తున వరికి నష్టం వాటిల్లినట్లు అంచనా వేసింది. కాగా, వరి ఉత్పత్తి పడిపోయినా పత్తి, కంది పంట దిగుబడులు ఆశాజనకంగా ఉన్నాయి. -
పరిహారం..పరిహాసం
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: వరుస కరువులతో జిల్లా యంత్రాంగం తీవ్రంగా నష్టపోయినా ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. ఖరీఫ్, రబీ పంట నష్టం అంచనాలను అధికారులు మొక్కుబడిగా ప్రభుత్వానికి నివేదించగా ఆ మొత్తాన్ని కూడా ప్రభుత్వం ఇచ్చే పరిస్థితి కానరావడం లేదు. దీంతో జిల్లా రైతాంగం మరింత ఆందోళన చెందుతోంది. జూన్ ఒకటినుంచి మే 31 వరకు ఈ ఏడాది సాధారణ వర్షపాతం 871.5 ఎంఎం కాగా గత జూన్ నుంచి డిసెంబర్ వరకు కేవలం 385.2 ఎంఎం వర్షపాతమే నమోదైంది. రబీలో 43.5 శాతం మాత్రమే వర్షపాతం నమోదైంది. జనవరి నుంచి చినుకు లేదు. చెరువులు ఎండిపోయాయి. బోర్లు ఒట్టిపోయాయి. పశ్చిమ ప్రాంతంలో దాహం కేకలు వినిపిస్తున్నాయి. పశువులకు మేత, దప్పిక తీరే దారిలేని పరిస్థితి ఉంది. మొత్తంగా 88 శాతం లోటు వర్షపాతం నమోదైంది. దీంతో సాగైన పంటలు ఆదిలోనే ఎండిపోయాయి. అరకొరగా పండినా దిగుబడులు తగ్గాయి. గిట్టుబాటు ధరల్లేకపోవడంతో సగం పెట్టుబడులు కూడా రాని పరిస్థితి. దీంతో జిల్లా రైతాంగం తీవ్రంగా నష్టపోయింది. జిల్లాలో 14 లక్షల ఎకరాలకుపైగా సాగు భూమి ఉండగా ఖరీఫ్, రబీలో రైతులు 10 లక్షల ఎకరాల్లో పత్తి, కంది, శనగ, మిర్చి పంటలు సాగు చేశారు. ఎకరాకు 30 వేలకు తగ్గకుండా పెట్టుబడులు పెట్టారు. ఇక కౌలు లెక్కలు సరేసరి. రైతులు ఎకరాల్లెక్కన పెట్టిన పెట్టుబడే రూ.3 వేల కోట్లు దాటింది. తీవ్ర వర్షాభావంతో ఇందులో 70 నుంచి 80 శాతం పంటలు చేతికి రాకుండా పోయాయి. ప్రధానంగా గిద్దలూరు, యర్రగొండపాలెం, కనిగిరి, కందుకూరు, మార్కాపురం తదితర పశ్చిమ ప్రకాశం ప్రాంతాల్లో పంటలు తీవ్రంగా దెబ్బతిని రైతులు నష్టపోవాల్సి వచ్చింది. మొత్తంగా రైతులు రూ.2400 కోట్లు నష్టపోయారు. అయితే పంట నష్టం అంచనాలను గణించిన ప్రభుత్వ అధికారులు జిల్లాలోని కరువు కింద ప్రకటించిన 55 మండలాల పరిధిలో 1,23,233.58 హెక్టార్లలో అన్ని పంటలు దెబ్బతిన్నట్లు లెక్కలు తేల్చారు. 1,65,086 మంది రైతులకు రూ.125,60,36,502 చెల్లించాల్సి ఉందని అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. అధికారిక లెక్కల ప్రకారమే ఇందులో ప్రధానంగా 50 వేల హెక్టార్లలో కంది, 25 వేల హెక్టార్లలో శనగతో పాటు పత్తి, మిర్చి తదితర పంటలు ఉన్నట్లు లెక్కలు తేల్చారు. వాస్తవానికి అధికారులు పేర్కొంటున్న 1.23 లక్షల హెక్టార్లలో కంది, మిర్చి, పత్తి, శనగ సాగుకు సైతం రైతులు రూ.863 కోట్ల పెట్టుబడులు పెట్టినట్లు అంచనా. అయితే అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదించింది కేవలం రూ.125 కోట్లు మాత్రమే కావడం గమనార్హం. వాస్తవానికి 8 లక్షల ఎకరాల్లో రైతుల పెట్టుబడులు రూ.2,400 కోట్లు ఉన్నాయి. కానీ అధికారులు అంచనాలకు క్షేత్ర స్థాయిలో వాస్తవ పరిస్థితికి ఏ మాత్రం పొంతన లేదు. మొక్కుబడిగా అధికారులిచ్చిన గణాంకాలను, దానికి సంబంధించిన పరిహారం ఇచ్చే పరిస్థితి కానరావడం లేదు. -
భగీరథ యత్నం
కొత్తకోట: రబీలో జిల్లాలోని కొత్తకోట ప్రాంతంలో పంటల పరిస్థితి దయనీయంగా మారింది. భీమా ఫేస్–1 కాల్వ వెంట తిర్మలాయపల్లి, వడ్డేవాట, అమడబాకుల, కొత్తకోట, కానాయపల్లి గ్రామాల రైతులు వరిసాగు చేస్తున్నారు. వారబందీగా నీరు విడుదల చేస్తామని అధికారులు చెప్పడంతో సుమారు 400ఎకరాలకు పైగా వరి వేశారు. ఒకసారి కాల్వ ద్వారా నాలుగు గంటల పాటు విడుదల చేస్తే నెల రోజులకు సరిపడా నీరందుతుంది. కానీ అధికారులు నెలరోజులుగా కాల్వ ద్వారా విడుదల చేయడం లేదు. దీంతో కంకిదశలో ఉన్న వరి ఎండిపోతోంది. ఈ విషయాన్ని ప్రజాప్రతినిధులు, అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోలేదు. ఓ వైపు పంట ఎండిపోతుండడం.. మరోవైపు చేసిన అప్పులు ఎలా తీర్చాలనే బెంగతో రైతులు భగీరథ ప్రయత్నం చేస్తున్నారు. అద్దె ట్యాంకర్ల ద్వారా పంటలకు నీరందిస్తూ పంటలను కాపాడుకుంటున్నారు. రూ.వేలల్లో పెట్టిన పెట్టుబడులు నష్టపోవద్దంటే ఇంతకంటే తమకు మరోమార్గం లేదని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొత్తకోటకు చెందిన రైతులు మోహన్రెడ్డి, దాబా శ్రీనివాస్రెడ్డి తదితరులు వరి పొలాలకు ట్యాంకర్లకు ద్వారా నీరు పారిస్తూ ఇలా కనిపించారు. -
రబీ వరి నాట్లు 120%
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రబీ వరి నాట్లు రికార్డు స్థాయిలో పడ్డాయి. తెలంగాణలో రబీ సీజన్ వరి సాధారణ సాగు విస్తీర్ణం 15.37 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 18.52 లక్షల ఎకరాల్లో నాట్లు పడినట్లు వ్యవసాయశాఖ బుధవారం విడుదల చేసిన నివేదికలో తెలిపింది. గతేడాది ఇదే సమయానికి 17.10 లక్షల ఎకరాల్లో నాట్లుపడడం గమనార్హం. వరితో కలిపి రాష్ట్రంలో ఆహారధాన్యాల సాధారణ సాగు విస్తీర్ణం 24.12 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు లక్ష్యానికి మించి 25.82 లక్షల (107%) ఎకరాల్లో సాగు కావడం విశేషం. అందులో శనగ సాధారణ సాగు విస్తీర్ణం 2.37 లక్షల ఎకరాలుకాగా, ఇప్పటివరకు 2.52 లక్షల (106%) ఎకరాల్లో సాగైంది. ఇక వేరుశనగ సాధారణ సాగు విస్తీర్ణం 3.77 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 3.52 లక్షల (93%) ఎకరాల్లో సాగైంది. -
పుంజుకోని రబీ సాగు
సాక్షి, హైదరాబాద్: రబీ పంటల సాగు ఇంకా పుంజుకోవడంలేదు. ఈ సీజన్లో సాధారణంగా 31.92 లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతాయి. కానీ ఇప్పటివరకు కేవలం 11.25 లక్షల (35%) ఎకరాల్లోనే రబీ పంటలు సాగయ్యాయని వ్యవసాయశాఖ బుధవారం విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. వాస్తవంగా గతేడాది రబీలో ఇదే సమయానికి 12.70 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. గతేడాది ఇదే సమయంతో పోలిస్తే ఈసారి ఏకంగా 1.45 లక్షల ఎకరాలు తేడా కనిపిస్తుంది. ఇక రబీలో పప్పుధాన్యాల సాధారణ సాగు విస్తీర్ణం 3.22 లక్షల ఎకరాలు కాగా, గతేడాది ఇదే సమయానికి 3.37 లక్షల ఎకరాల్లో సాగైతే, ఇప్పుడు 2.67 లక్షల ఎకరాలకే పరిమితమైంది. రబీ వరినాట్లు కూడా పెద్దగా పుంజుకోలేదు. రబీలో వరి సాధారణ సాగు విస్తీర్ణం 15.37 లక్షల ఎకరాలు కాగా, కేవలం 2.02 లక్షల (13%) ఎకరాలకే నాట్లు పరిమితమయ్యాయి. వచ్చే నెల నుంచి వరి నాట్లు పుంజుకుంటాయని వ్యవసాయశాఖ వర్గాలు చెబుతున్నాయి. -
రబీ పంటల బీమా ఖరారు
సాక్షి, హైదరాబాద్: రబీలో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన(పీఎంఎఫ్బీవై), పునర్వ్యవస్థీకరించిన వాతావరణ పంటల బీమా పథకాలను అమలు చేసేందుకు వ్యవసాయశాఖ బుధవారం నోటిఫికేషన్ ఇస్తూ ఉత్తర్వులు జారీచేసింది. 30 జిల్లాలను ఆరు క్లస్టర్లుగా విభజించి ఐదు ప్రైవేటు కంపెనీలకు పంటల బీమా అమలుచేసే బాధ్యత అప్పగించింది. ఒక్కో క్లస్టర్లో ఐదు జిల్లాలను చేర్చారు. బ్యాంకుల నుంచి రుణాలు తీసుకోని రైతులు ఇష్టమైతేనే బీమా తీసుకోవచ్చు. బ్యాంకు రుణాలు తీసుకునే రైతులు తప్పనిసరిగా పంటల బీమా ప్రీమియాన్ని చెల్లించాల్సిందే. పీఎంఎఫ్బీవై పథకంలో వరి, జొన్న, మొక్కజొన్న, పెసర, మినుములు, శనగ, వేరుశనగ, పొద్దుతిరుగుడు, ఎర్ర మిరప, ఉల్లిగడ్డ, నువ్వుల పంటలకు బీమా అమలుచేస్తారు. స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం బీమా మొత్తాన్ని ఖరారు చేస్తారు. -
రబీని ‘వరి’oచేనా..!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు చెరువులు, జలాశయాలు నిండటంతో రబీలో వరిపై ప్రధానంగా దృష్టి సారించాలని వ్యవసాయ శాఖ నిర్ణయించింది. 2017–18 రబీ సీజన్కు సంబంధించి అన్ని పంటల సాధారణ సాగు విస్తీర్ణాన్ని తాజాగా ఖరారు చేసింది. సంబంధిత నివేదికను ప్రభుత్వ ఆమోదానికి పంపినట్లు ఆ శాఖ వర్గాలు తెలిపాయి. నివేదిక ప్రకారం 2016–17 రబీలో అన్ని పంటల సాధారణ సాగు విస్తీర్ణం 30.22 లక్షల ఎకరాలు కాగా, ప్రస్తుత రబీలో సాధారణ సాగు విస్తీర్ణ లక్ష్యం 31.80 లక్షల ఎకరాలుగా వ్యవసాయ శాఖ నిర్ధారించింది. ఇందులో సగం విస్తీర్ణంలో వరి సాగు చేయాలని లక్ష్యంగా నిర్ణయించింది. గతేడాది రబీ వరి సాధారణ సాగు విస్తీర్ణం 13.32 లక్షల ఎకరాలు కాగా.. ఈసారి 1.78 లక్షల ఎకరాలు అదనంగా 15.10 లక్షల ఎకరాలు లక్ష్యంగా ప్రకటించింది. ఖరీఫ్లో నిరాశే.. ఈ ఏడాది ఖరీఫ్లో వరి నిరాశే మిగిల్చింది. ఖరీఫ్లో వరి సాధారణ సాగు విస్తీర్ణం 23.35 లక్షల ఎకరాలు కాగా, సరైన వర్షాలు కురవక 19.07 లక్షల (82%) ఎకరాలకే పరిమితమైంది. ఈ ఏడాది జూన్–సెప్టెంబర్ మధ్య 13 శాతం లోటు వర్షపాతం నమోదైంది. జూన్లో 49 శాతం అధిక వర్షపాతం నమోదు కాగా, జూలైలో 41 శాతం లోటు నమోదై పరిస్థితి తిరగబడింది. ఆగస్టులో 8, సెప్టెంబర్లో 30 శాతం లోటు వర్షపాతం నమోదైంది. లోటు వర్షపాతం కారణంగా ఖరీఫ్ కాలంలో 184 మండలాల్లో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. అయితే అక్టోబర్ ఒకటి నుంచి 22 (ఆదివారం) నాటికి రాష్ట్రంలో 51 శాతం అధిక వర్షపాతం నమోదైంది. దీంతో ఖరీఫ్ సీజన్లో నిండని జలాశయాలు, చెరువులు 22 రోజుల్లో నిండాయి. కాబట్టి రబీలో వరి నాట్లు గణనీయంగా పెరుగుతాయని వ్యవసాయ శాఖ అంచనా వేస్తోంది. కాగా ఈ రబీలో వరి నాట్లు ఎక్కువగా పడతాయని ఆశిస్తున్నట్లు వ్యవసాయ శాఖ కార్యదర్వి పార్థసారథి ఆశాభావం వ్యక్తపరిచారు. కావల్సిన విత్తనాలు సిద్ధం చేసినట్లు వెల్లడించారు. -
వ్యవసాయానికి 7,100 మెగావాట్లు
► రబీ నుంచి 24 గంటల వ్యవసాయ కరెంటు సరఫరా ► 11 వేల మెగావాట్లకు పెరగనున్న రాష్ట్ర గరిష్ట విద్యుత్ డిమాండ్ ► రూ.1,293 కోట్లతో కొత్త సబ్ స్టేషన్లు, కొత్త లైన్లు ► సీఎం కేసీఆర్ ఆదేశాలతో యుద్ధ ప్రాతిపదికన చర్యలు సాక్షి, హైదరాబాద్: వచ్చే రబీ నుంచి వ్యవ సాయానికి 24 గంటలపాటు ఉచిత విద్యుత్ను సరఫరా చేసేందుకు తెలంగాణ విద్యుత్ సంస్థ లు సన్నద్ధమవుతున్నాయి. రైతులు ఎప్పుడు కావాలంటే అప్పుడు మోటార్లు వేసుకునే విధంగా 24 గంటలూ విద్యుత్ సరఫరా చేయా లని సీఎం కేసీఆర్ జారీ చేసిన ఆదేశాలను అమలు చేసేందుకు విద్యుత్ సంస్థలు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాయి. ప్రస్తుతం వ్యవసాయానికి 9 గంటలు విద్యుత్ను సర ఫరా చేస్తుండడంతో గత మార్చి నెలలో రాష్ట్ర విద్యుత్ డిమాండ్ అత్యంత గరిష్ట స్థాయికి పెరిగి 9,191 మెగావాట్లుగా నమోదైంది. ఇందులో దాదాపు 5 వేల మెగావాట్లను వ్యవసాయానికి సరఫరా చేసినట్లు అంచనా. 5 వేల నుంచి 7,100 మెగావాట్ల వరకు... రాష్ట్ర ఆవిర్భావం నాటికి మొత్తం విద్యుత్ సరఫరా 5 వేల మెగావాట్లు ఉండగా, అందు లో 2,500 మెగావాట్లు వ్యవసాయానికి సర ఫరా జరిగేది. అప్పట్లో రాష్ట్ర విద్యుదుత్పత్తి స్థాపిత సామర్థ్యం 6,553 మెగావాట్లు కాగా, ఆ తర్వాత కొత్త విద్యుత్ ప్లాంట్ల నిర్మాణం పూర్తయ్యాక మరో 4,426 మెగావాట్ల విద్యుత్ లభ్యత పెరిగింది. రాష్ట్ర విద్యుదుత్పత్తి స్థాపిత సామర్థ్యం 16,336 మెగావాట్లకు పెరిగింది. దీంతో వ్యవసాయానికి 6 గంటల నుంచి 9 గంటలకు విద్యుత్ సరఫరాను పెంచడంలో ప్రభుత్వం విజయవంతమైంది. వ్యవసాయ విద్యుత్ సరఫరాను 9 నుంచి 24 గంటలకు పెంచితే విద్యుత్ డిమాండ్ సైతం 5 వేల మెగా వాట్ల నుంచి 7,100 మెగావాట్లకు పెరుగుతుం దని అంచనా. గృహ, వాణిజ్య, పారిశ్రామిక ఇతర రంగాలను సైతం పరిగణనలోకి తీసు కుంటే రాష్ట్ర గరిష్ట విద్యుత్ డిమాండ్ 11 వేల మెగావాట్లకు పైనే ఉంటుంది. జెన్కో, ట్రాన్స్కో సీఎండీ డి.ప్రభాకర్రావు నేతృత్వం లోని టీఎస్పీసీసీ వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ సరఫరా కోసం విద్యుదుత్పత్తి, సరఫరా, పంపిణీలలో తీసుకోవాల్సిన చర్య లను పర్యవేక్షిస్తోంది. వ్యవసాయ మోటార్లు ఎక్కువగా ఉదయం 6 నుంచి 9 గంటల వరకు పనిచేస్తాయి. అదే సమయంలో గృహ విద్యుత్ డిమాండ్ అధి కంగా ఉంటోంది. మరోవైపు ఆ సమయంలో సోలార్ విద్యుత్ ఉత్పత్తి ఉండక పోవడంతో గ్రిడ్పై ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ప్రస్తుత ఖరీఫ్లోనే ప్రయోగాత్మ కంగా కొన్ని ప్రాంతాల్లో 24 గంటల విద్యుత్ సరఫరా జరిపేందుకు విద్యుత్ సంస్థలు సన్నద్ధమవుతున్నాయి. గత రబీలో సైతం కొన్ని చోట్లలో 24 గంటల కరెంటు సరఫరా చేసి పరీక్షించారు. రూ.1,293 కోట్లతో కొత్త సబ్ స్టేషన్లు.. వ్యవసాయానికి 24 గంటల కరెంటు సరఫరా కోసం రూ.1,293 కోట్ల వ్యయంతో విద్యుత్ సరఫరా, పంపణీ వ్యవస్థలను బలోపేతం చేసేందుకు విద్యుత్ సంస్థలు చర్యలు తీసుకుంటున్నాయి. ఇందులో భాగంగా 400 కె.వి.సబ్ స్టేషన్లు ఆరు, 220 కె.వి.సబ్ స్టేషన్లు 12, 132 కె.వి.సబ్ స్టేషన్లు 21, 33 కె.వి./11 కె.వి. సబ్ స్టేషన్లు 30, పవర్ ట్రాన్స్ ఫార్మర్స్ 230, 689 కిలోమీటర్ల మేర 33 కె.వి. లైన్లను కొత్తగా నిర్మిస్తున్నాయి. 24 గంటల విద్యుత్ సరఫరా చేస్తాం వచ్చే రబీ నుంచి 24 గంటలు కరెంటు సరఫరా చేయ గలమనే నమ్మకముంది. రైతులకు 24 గంటల విద్యుత్ అందివ్వా లన్న సీఎం కేసీఆర్ సంకల్పాన్ని నెరవేర్చేందుకు విద్యుత్ శాఖ సర్వశక్తులు ఒడ్డి పనిచేస్తోంది. 24 గంటల విద్యుత్ సరఫరా కోసం అవసరమైన కరెం టును సమకూర్చు కోవడంతో పాటు ఎలాం టి ఆటంకాలు లేకుండా దాన్ని సరఫరా చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నాం. సాంకే తికం గానే కాకుండా, అవసరమైన ఉద్యోగులనూ పెద్ద ఎత్తున నియ మించుకుం టున్నాం. దేశంలో ఏ రాష్ట్రంలోనూ వ్యవసాయానికి 24 గంటల కరెంటు ఇవ్వడం లేదు. వచ్చే రబీ నుంచి ఈ ఫీట్తో మేము కొత్త అధ్యాయం సృష్టి స్తామని నమ్మకంగా చెప్పగలను. – ట్రాన్స్కో సీఎండీ డి.ప్రభాకర్రావు -
రబీ నష్టం రూ.1,023 కోట్లు
- అక్టోబరు నుంచి చినుకు జాడ కరువు - దారుణంగా పడిపోయిన దిగుబడులు - పతనమైన ధరలు - నట్టేట మునిగిన శనగ రైతులు కర్నూలు(అగ్రికల్చర్): రబీ సీజన్ రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. అక్టోబరు నుంచి చినుకు జాడ లేకపోవడంతో భూమిలో తేమ ఆరిపోయింది. శనగతో పాటు ఇతర పంటలు దెబ్బతిన్నాయి. ఎన్నడూ లేని విధంగా దిగుబడులు గణనీయంగా తగ్గిపోయాయి. విత్తన సమయంలో ఉన్న ధర.. పంట చేతికొచ్చే సమయానికి తగ్గిపోయింది. రైతులకు పెట్టిన పెట్టుబడుల్లో 50 శాతం కూడా దక్కలేదు. వర్షాభావ పరిస్థితుల్లో ఈ ఏడాది ఖరీఫ్ పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఎన్నో ఆశలతో రబీ పంటలు సాగు చేసిన రైతులకు అప్పులే మిగిలాయి. రబీ సీజన్లో ప్రధానంగా శనగ సాగు అయింది. ఈ పంట సాధారణ సాగు విస్తీర్ణం 1,92,744 హెక్టార్లు. అయితే ఈ ఏడాది 1.79,027 హెక్టార్లలో శనగను సాగు చేశారు. హెక్టారుకు సగటున రూ.30 వేల ప్రకారం ఒక్క శనగ పంటపైనే రూ.537 కోట్ల పెట్టుబడి పెట్టారు. బ్యాంకులు సహకరించక పోవడంతో రైతులు బంగారం ఆభరణాలు తాకట్టు పెట్టి అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి పంట సాగు చేశారు. వర్షాలు లేకపోవడం, భూమిలో తేమ శాతం పడిపోవడం, కనీసం మంచు కూడా కురవకపోవడంతో శనగ పంటకు అపార నష్టం వాటిల్లింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఖరీఫ్, రబీ పంటలు పూర్తిగా దెబ్బతినడంతో జిల్లాలో ఏ రైతును కదిలించినా కన్నీళ్లు ఉబికి వస్తున్నాయి. శనగ ధరలు డమాల్.. విత్తనం సమయంలో క్వింటాల్ శనగ ధర రూ.10వేలకు పైగా ఉంది. డిసెంబరు నెలలో శనగ ధర గరిష్టంగా రూ.8840 ఉంది. ఫిబ్రవరి, మార్చి నెలకు వచ్చే సరికి ఈ ధర రూ.5000కు పడిపోయింది. రైతులు కష్టనష్టాల్లో ఉన్నపుడే ధరలు పడిపోయాయి. కర్నూలు, ఓర్వకల్లు, ఆలూరు తదితర ప్రాంతాల్లో శనగ విత్తనాలకు పెట్టిన ఖర్చు కూడ దక్కక రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. పెట్టుబడి మట్టిపాలు.. జిల్లాలో రబీ సాధారణ సాగు 3,54,341 హెక్టార్లు. ఈ ఏడాది 2,92,381 హెక్టార్లలో పంటలు సాగు అయ్యాయి. విత్తనాలు, ఎరువులు, బాడుగలు, పురుగు మందులు, కూలీలు తదితర వాటికి హెక్టారుకు సగటున రూ.35వేలు పెట్టుబడి పెట్టారు. మొత్తంగా ఒక్క రబీ పంటలపై రైతులు రూ.1023 కోట్లకు పైగా పెట్టుబడి పెట్టారు. పంటలు బాగా పండి ఉంటే.. ఈ పెట్టుబడి అదనంగా రూ. 1023 కోట్లు రావాల్సి ఉంది. అయితే పెట్టుబడిలో 50 శాతం కూడా దక్కలేదంటే రైతుల దుస్థితి ఏ విధంగా ఉంటుందో ఉహించవచ్చు. రబీ వేసిన శనగ, జొన్న, ధనియాలు, కుసుమ, మినుము తదితర పంటలన్ని దెబ్బతిన్నాయి. రబీలో శనగ తర్వాత అత్యధికంగా జొన్న సాగు చేశారు. వర్షాభావ పరిస్థితుల వెంటాడటంతో జొన్నలో కూడా దిగుబడులు పడిపోయాయి. రబీ పంటలు బ్బతినడంతో వీటికీ..పరిహారం చెల్లించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. రబీ పంటలకు బ్యాంకులు.. పంట రుణాలు ఇవ్వకపోవడంతో రైతులు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనకు దూరం అయ్యారు. -
గట్టెక్కుతుందా..!.
కీలక సమయంలో కాటన్ బ్యారేజ్వద్ద తగ్గుతున్న నీటిరాక నీరు పెంచాలి్సన సమయంలో పడిపోయిన సహజ జలాలు ఆందోళన చెందుతున్న అన్నదాతలు సీలేరుపైనే ఆశలు ఇప్పటికే బైపాస్ పద్ధతిలో సాగునీరు ఆంధ్రుల అన్నపూర్ణగా భాసిల్లుతున్న గోదావరి డెల్టాలో రబీ కీలక దశకు చేరింది. పాలు పోసుకుని గింజ గట్టిపడే దశకు వరి చేలు చేరుకున్నాయి. ఈ తరుణంలో రైతులు చేలల్లో ఎక్కువగా నీరు నిల్వ చేసూ్తంటారు. ఇదే సమయంలో ధవళేశ్వరం సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజ్ వద్ద నీటి రాక తగ్గుతూండడం రైతులను కలవరపాటుకు గురి చేస్తోంది. రబీ వరిసాగును గట్టెక్కించేదెలాగని వారు ఆందోళన చెందుతున్నారు. అమలాపురం : ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ దిగువన ఉభయ గోదావరి జిల్లాల్లోని గోదావరి డెల్టాలో అధికారుల లెక్కల ప్రకారం 8.86 లక్షల ఎకరాల్లో రబీ వరి సాగు జరుగుతోంది. ఇంత విస్తీర్ణంలో సాగుకు కనీసం 85 టీఎంసీల నీరు అవసరం. గత ఏడాది వరదలను దృష్టిలో పెట్టుకుని సాగునీటి ఎద్దడి ఉండదని భావించారు. కానీ, డిసెంబరు నెలలో అనూహ్యంగా సహజ జలాల రాక పడిపోవడంతో ఆందోళన నెలకొంది. దీనికితోడు సాగు ఆరంభంలో నీటి సరఫరా అస్తవ్యస్తంగా మారడంతో సాగు ప్రశ్నార్థకంగా మారింది. వంతులవారీ విధానంతో పరిస్థితి కొంత సానుకూలంగా మారింది. డెల్టా శివారుల్లో మినహా మిగిలిన ప్రాంతాల్లో రబీ వరి చేలు ప్రస్తుతం గింజ గట్టిపడే దశలో ఉన్నాయి. మధ్య డెల్టాలోని ముమ్మిడివరం, అమలాపురం, పి.గన్నవరం, రాజోలు; తూర్పు డెల్టాలోని కరప, రామచంద్రపురం, కాకినాడ, పిఠాపురం వ్యవసాయ సబ్ డివిజన్ల పరిధిలో సాగు ఆలస్యమైన చోట చేలు ఇప్పుడిప్పుడే పాలు పోసుకుంటున్నాయి. ఈ దశలో చేలల్లో ఎక్కువగా నీరు పెడతారు. కాలువల ద్వారా సమృద్ధిగా సాగు నీరందించాల్సి ఉంది. కానీ ప్రస్తుతం ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద ఇన్ఫ్లో 8,540 క్యూసెక్కులుగా ఉంది. దీనిలో సీలేరు నుంచి పవర్ జనరేషన్ ద్వారా 4,863, బైపాస్ పద్ధతిలో 2,712 క్యూసెక్కుల చొప్పున 7,575 క్యూసెక్కుల నీరు వస్తోంది. అంటే బ్యారేజ్ వద్ద సహజ జలాలు 965 క్యూసెక్కులు మాత్రమే. తూర్పు డెల్టాకు 2,520, మధ్య డెల్టాకు 1,640, పశ్చిమ డెల్టాకు 4,380 క్యూసెక్కుల చొప్పున నీరు విడుదల చేస్తున్నారు. ఇప్పుడు 105 డ్యూటీ(ఒక క్యూసెక్కు 105 ఎకరాల చొప్పున)లో నీరు అందిస్తున్నారు. పాలు పోసుకుంటున్న సమయంలో డెల్టా కాలువకు 90 డ్యూటీ(ఒక క్యూసెక్కు 90 ఎకరాల చొప్పున)లో నీరు విడుదల చేయాల్సి ఉంది. అంటే మూడు కాలువలకు 8,800 క్యూసెక్కుల చొప్పున నీరు విడుదల చేయాలి. వేసవి ఎండలు పెరుగుతున్నందున్న ఆవిరి రూపంలో ఎక్కువ నీరు పోతుంది. కాబట్టి కనీసం 9 వేల క్యూసెక్కుల నీరు ఇస్తే శివారుకు సాగునీరందుతుంది. కానీ సహజ జలాల రాక వెయ్యి క్యూసెక్కుల లోపునే ఉంది. ముందు ముందు ఇది మరింత తగ్గే అవకాశం కూడా ఉంది. పోనీ సీలేరు నుంచి ఇప్పుడొస్తున్నట్టుగా నీరు వస్తుందనే నమ్మకం కూడా రైతులకు లేదు. ఇప్పటికే బైపాస్లో 2,712 క్యూసెక్కులు ఇస్తున్నారు. వేసవి విద్యుత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని బైపాస్ను నిలిపివేస్తే రైతులకు కష్టాలు తప్పవు. నీరు తగ్గడానికి తోడు, వేసవి ఎండలు పెరిగితే చి‘వరి’లో రైతులు నీటి ఎద్దడిని ఎదుర్కొనే ప్రమాదం నెలకొంది. -
రబీలో మురిపించిన వరి
గతేడాది కంటే 13.73 లక్షల ఎకరాలు అధికం వ్యవసాయశాఖ నివేదిక వెల్లడి... ముగిసిన రబీ సాగు సాక్షి, హైదరాబాద్ : ఈసారి రబీలో వరి సాగు విస్తీర్ణం అంచనాలకు మించి పెరిగింది. దీనికి గతేడాది సెప్టెంబర్లో కురిసిన కుండపోత వర్షాల కారణంగా భూగర్భ జలాలు పెరగడమే కారణం. ఈ రబీలో అన్ని పంటల సాధారణ సాగు విస్తీర్ణం 30.22 లక్షల ఎకరాలు కాగా... 35.47 లక్షల (117%) ఎకరాల్లో పంటలు సాగయ్యాయని రాష్ట్ర వ్యవసాయశాఖ తన నివేదికలో పేర్కొంది. గత రబీలో 17.05 లక్షల ఎకరాల్లోనే పంటలు సాగయ్యాయి. అంటే గతేడాది కంటే 18.42 లక్షల ఎకరాల్లో అదనంగా పంటలు సాగు కావడం గమనార్హం. అందులో ఆహారధాన్యాల సాగు సాధారణ విస్తీర్ణం 21.90 లక్షల ఎకరాలు కాగా... ఇప్పటివరకు 29.07 లక్షల (133%) ఎక రాల్లో ఆయా పంటలు సాగయ్యాయి. ఇక వరిసాగు మాత్రం ఇటీవల ఎన్నడూ లేనంత ఎక్కువగా సాగవడం గమనార్హం. రబీలో వరి సాధారణ సాగు విస్తీర్ణం 13.32 లక్షల ఎకరాలు కాగా 19.30 లక్షల (145%) ఎకరాల్లో నాట్లు పడ్డాయి. గతేడాది రబీలో కేవలం 5.57 లక్షల ఎకరాల్లోనే వరినాట్లు పడ్డాయి. గతేడాదితో పోలిస్తే ఏకంగా 13.73 లక్షల ఎకరాల్లో అధికంగా వరినాట్లు పడటం గమనార్హం. పప్పుధాన్యాల సాధారణ సాగు విస్తీర్ణం 3.17 లక్షల ఎకరాలు కాగా ఇప్పటి వరకు 4.65 లక్షల (147%) ఎకరాల్లో పంటలు వేశారు. వేరుశనగ సాధారణంగా 3.80 లక్షల ఎకరాల్లో సాగు కావాల్సి ఉండగా, అంతే సాగు జరిగింది. మిరప సాగు కూడా సాధారణంతో పోలిస్తే 121 శాతం అయింది. మిరప సాధారణ సాగు విస్తీర్ణం 50 వేల ఎకరాలు కాగా... 60 వేల ఎకరాల్లో సాగైంది. అయితే, ఉల్లిగడ్డ సాగు సగానికి పడిపోయింది. సాధారణ ఉల్లిసాగు విస్తీర్ణం 25 వేల ఎకరాలు కాగా... 12 వేల ఎకరాలకే పరిమితమైంది. ఆదిలాబాద్లో అధికంగా సాగు: రబీలో ఆదిలాబాద్లో అధికంగా పంటలు సాగయ్యాయి. సాధారణంతో పోలిస్తే ఏకంగా 168 శాతం విస్తీర్ణంలో అన్ని పంటలూ సాగయ్యాయి. ఆ జిల్లాలో రబీలో సాధారణ పంటల సాగు విస్తీర్ణం 39,377 ఎకరాలు కాగా... 66,242 ఎకరాల్లో సాగయ్యాయి. వంద శాతానికి మించి పంటలు సాగైన జిల్లాలు 22 ఉండటం గమనార్హం. మహబూబ్నగర్ జిల్లాలో అత్యంత తక్కువగా 54 శాతం విస్తీర్ణంలోనే పంటలు సాగయ్యాయి. ఆ జిల్లా సాధారణ సాగు విస్తీర్ణం 1.50 లక్షల ఎకరాలు కాగా... 81,900 ఎకరాల్లోనే సాగవడం గమనార్హం. ఇక ఈశాన్య రుతుపవనాలు ఈసారి నిరాశపరిచాయి. మొత్తంగా 45 శాతం లోటు వర్షపాతం రికార్డు అయింది. అక్టోబర్లో 30 శాతం, నవంబర్లో 96 శాతం, డిసెంబర్లో 95 శాతం లోటు వర్షపాతం నమోదైంది. -
సాగునీటి కోసం ఐక్యంగా ఉద్యమిద్దాం
- వైఎస్ఆర్సీపీ శ్రీశైలం నియోజకవర్గ ఇన్చార్జ్ బుడ్డా శేషారెడ్డి వెలుగోడు: రబీ పంటలకు సాగునీటి సాధనకు పార్టీలకు అతీతంగా ఉద్యమిద్దామని వైఎస్ఆర్ సీపీ శ్రీశైలం నియోజకవర్గ ఇన్చార్జ్ బుడ్డా శేషారెడ్డి పిలుపునిచ్చారు. సాగునీటి సాధనకు చేపట్టాల్సిన కార్యాచరణ రూపొదించేందుకు బుధవారం స్థానిక తెలుగు గంగ అతిథి గృహం వద్ద రైతులు, రైతు సంఘాల నాయకులతో బుడ్డా శేషారెడ్డి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో వెలుగోడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లో 2 టీఎంసీల నీరు ఉన్నప్పుడే రబీ పంటలకు నీరు ఇచ్చారన్నారు. ప్రస్తుతం 6 టీఎంసీల నీరు ఉన్నా ఆయకట్టుకు ఇవ్వమని చెప్పడం దారుణమన్నారు. అధికార పార్టీ నేతల మాటలు నమ్మి రైతులు ఇప్పటికే ఎకరాకు రూ.10 నుంచి రూ.20 వేలు ఖర్చు చేసి వరి మడులు సాగు చేశారన్నారు. మరో పది రోజుల్లో నీరందకపోతే నారుమడులకు ఎండిపోతాయన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పోరాటమే శరణ్యమన్నారు. ప్రతి గ్రామంలో రైతు సంఘాలు ఏర్పాటు చేద్దామన్నారు. అనంతరం తెలుగుగంగ ఎస్ఈ రాఘవరెడ్డి, ఈఈ పుల్లారావులకు వేరు వేరుగా వినతిపత్రాలు అందజేశారు. సమావేశానికి వెలుగోడు, మహానంది, బండిఆత్మకూరు మండలాల రైతులు, రైతు సంఘాల నాయకులు పాల్గొన్నారు. -
ఇక సాగునీటి వంతు
భీమవరం : జిల్లాలోని రైతులకు సాగునీటి ఇబ్బందులు తప్పడం లేదు. ఈ ఏడాది దాళ్వాలోనూ వంతులవారీ విధానం అమలు చేయాల్సిన పరిస్థితులు తలెత్తుతున్నాయి. ప్ర«ధానంగా డెల్టా ప్రాంతంలోని యలమంచిలి, పాలకొల్లు, ఆచంట, పెనుగొండ, పెనుమంట్ర, నరసాపురం, మొగల్తూరు మండలాల్లో సాగునీటి ఇబ్బందుల కారణంగా ఇప్పటివరకు 70 శాతం విస్తీర్ణంలో మాత్రమే వరినాట్లు పూర్తయ్యాయి. ఉండి వ్యవసాయ సబ్ డివిజన్ పరిధిలో 75 శాతం వరకు నాట్లు పడ్డాయి. ఇప్పటివరకు పాలకొల్లు మండలంలో 60 శాతం మాత్రమే నాట్లు పూర్తవగా, పోడూరు మండలంలో 80 శాతం, ఆచంట మండలంలో 70 శాతం, భీమవరం వ్యవసాయ డివిజన్ పరిధిలోని వీరవాసరం, భీమవరం, పాలకోడేరు మండలాల్లో 80 శాతం నాట్లు పూర్తయినట్టు అధికారిక గణాంకాలు సూచిస్తున్నాయి. జనవరి మొదటి వారానికే నాట్లు పూర్తి చేయాలని వ్యవసాయ అధికారులు విస్తృత ప్రచారం చేశారు. ఈ నెలాఖరు నాటికి గాని పూర్తిస్థాయిలో ఊడ్పులు అయ్యే అవకాశం లేదు. 5,100 క్యూసెక్కులతో సరి డెల్టాకు రోజూ 6 వేల క్యూసెక్కుల నీరు విడుదల చేస్తే సాగు సజావుగా సాగిపోతుంది. నీటి కొరత ఉండటంతో ప్రస్తుతం 5,100 క్యూసెక్కులు మాత్రమే విడుదల చేస్తున్నారు. దీనివల్ల శివారు ప్రాంతాలకు నీరందటం లేదు. సాగునీటికి ఇబ్బంది లేదని అధికారులు చెబుతున్నా శివారు భూములకు సక్రమంగా అందటం లేదని రైతులు చెబుతున్నారు. తొలి దశలోనే పరిస్థితి ఇలా ఉంటే కీలకమైన సమయాల్లో సాగునీటి పంపిణీ ఎలా ఉంటుందోనని ఆందోళన చెందుతున్నారు. గోదావరిలో లభ్యత 10 వేల క్యూసెక్కులే ప్రస్తుతం గోదావరిలో 10 వేల క్యూసెక్కుల నీరు మాత్రమే అందుబాటులో ఉంటోంది. ఉభయ గోదావరి జిల్లాల్లోని డెల్టాలకు 9,500 క్యూసెక్కుల నీటిని పంపిణీ చేస్తున్నారు. ఇప్పటికే సీలేరు నుంచి నీరు తీసుకోవాల్సిన పరిస్థితి ఉండటంతో రానున్న రోజుల్లో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని గుర్తించిన జల వనరుల శాఖ అధికారులు ఈనెల 10వ తేదీ నుంచి వంతుల వారీ విధానం అమలు చేయాలని నిర్ణయించారు. అయితే, చాలా ప్రాంతాల్లో నాట్లు పూర్తికాకపోవడంతో వంతుల వారీ విధానాన్ని సాగునీటి సంఘాలు, రైతులు వ్యతిరేకించారు. దీంతో ప్రస్తుతానికి అన్ని ప్రాంతాలకు సాధారణ పద్ధతిలోనే నీటిని పంపిణీ చేస్తున్నారు. ఈనెల 20వ తేదీ నాటికి నాట్లు వేసే ప్రక్రియ ఒక కొలిక్కి వస్తుందని.. ఆ తరువాత వంతులవారీ విధానాన్ని అమలు చేసేందుకు సన్నద్ధమవుతున్నామని జల వనరుల శాఖ అధికారులు చెబుతున్నారు. 20 తరువాత నిర్ణయం ప్రస్తుతం సాగునీటి సరఫరాకు ఎటువంటి ఇబ్బందులు లేవు. వంతులవారీ విధానాన్ని ఎప్పటినుంచి అమలు చేయాలనే దానిపై ఈనెల 20వ తేదీ తరువాత నిర్ణయం తీసుకుంటాం. 20వ తేదీ నాటికి రైతులంతా నాట్లు పూర్తి చేయాలని చెబుతున్నాం. – పొత్తూరి రామాంజనేయరాజు, చైర్మన్, పశ్చిమ డెల్టా ప్రాజెక్ట్ కమిటీ -
20 వేల ఎకరాలకు కంది విత్తనాల పంపిణీ
పెదనిండ్రకొలను (నిడమర్రు) : జిల్లావ్యాప్తంగా 20 వేల ఎకరాల విస్తీర్ణానికి సరిపడా కంది విత్తనాలు ఉచితంగా రైతులకు పంపిణీ చేయనున్నట్టు వ్యవసాయశాఖ సంయుక్త సంచాలకులు వై.సాయిలక్షీశ్వరి అన్నారు. ఆదివారం పెదనిండ్రకొలనులో కంది పంట క్షేత్ర దినోత్సవం నిర్వహించారు. గ్రామంలో వ్యవసాయశాఖ, ఆత్మ సంయుక్త ఆధ్వర్యంలో సుమారు 100 ఎకరాల చేపల చెరువు గట్లపై సాగు చేసిన కంది పంట దిగుబడిని రైతులకు ప్రదర్శించారు. జిల్లాలో చేపల చెరువుల విస్తీర్ణం పెరుగుతున్న నేపథ్యంలో చెరువు గట్లపై కంది సాగు చేయాలని ఆత్మ చైర్మన్ పసల గంగరామచంద్రం సూచించారు. చెరువు గట్టుపై కంది పంట యాజమాన్య పద్ధతులను అధికారులు వివరించారు. ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు, సర్పంచ్ వంగా సీతాకుమారి, తాడేపల్లిగూడెం ఏఎంసీ చైర్మన్ పాతూరి రాంప్రసాద్ చౌదరి తదితరులు పాల్గొన్నారు. -
జీడీపీపై కచ్చిత అంచనాల్ని వెల్లడించడం సాధ్యం కాదు
మాజీ చీఫ్ స్టాటిస్టీసియన్ ప్రణబ్ సేన్ న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2016–17 ఏప్రిల్, మార్చి) సంబంధించి స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) అంచనాలను ముందస్తుగా సమగ్రంగా అంచనావేయడం సాధ్యంకాదని మాజీ చీఫ్ స్టాటిస్టీసియన్ ప్రణబ్ సేన్అభిప్రాయపడ్డారు. 2016–17 జీడీపీ అంచనాలను వచ్చేనెల 6న కేంద్ర గణాంకాల కార్యాలయం (సీఎస్ఓ) విడుదల చేయనున్న నేపథ్యంలో ప్రణబ్ సేన్ చేసిన వ్యాఖ్యలకు ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రతియేడాది ఫిబ్రవరి 28న బడ్జెట్ సమర్పిస్తుండగా, ఈ ఏడాది ఇందుకు భిన్నంగా ఫిబ్రవరి 1వ తేదీనే బడ్జెట్ను కేంద్రం సమర్పించే అవకాశం ఉందన్న వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే మామూలు షెడ్యూల్ సమయానికన్నా దాదాపు నెలరోజుల ముందే కీలక అంచనాల వెల్లడికి గణాంకాల మంత్రిత్వశాఖ కూడా సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ప్రణబ్ సేన్ చేసిన వ్యాఖ్యలు ... ► రబీ పంటకు సంబంధించి తగిన గణాంకాలు అందుబాటులో ఉండవు. అలాగే పెద్ద నోట్ల నిషేధం ప్రభావం ఆర్థిక వ్యవస్థపై ఎంతస్థాయిలో ఉందన్న విషయమూ అప్పుడే చెప్పలేం. ► డిసెంబర్ పారిశ్రామిక ఉత్పత్తి గణాంకాలు కూడా జనవరి 6 నాటికి వెలువడవు. ► ఆర్థిక సంవత్సరం ద్వితీయార్థం పరిస్థితులు చాలా క్లిష్టంగా ఉన్నాయి. ఏ అంచనా అయినా ఊహాజనితమే తప్ప, వాస్తవ ప్రాతిపదికలు ఏమీ ఉండవు. ► డీమోనిటైజేషన్ నేపథ్యంలో– జీడీపీ 2 శాతం వరకూ పడిపోవచ్చన్న పలువురి ఆర్థికవేత్తల అంచనాల నేపథ్యంలో ప్రణబ్సేన్ ప్రకటనకు ప్రాధాన్యత ఏర్పడింది. -
రబీకి కన్నీళ్లే!
శ్రీశైలం నీటి పంపకాల్లో సీమకు అన్యాయం - హంద్రీనీవాకు మాత్రమే 7 టీఎంసీలు కేటాయింపు - తెలుగుగంగ, ఎస్ఆర్బీసీలకు మొండిచేయి - బోర్డుకు నీరు కావాలని ప్రతిపాదించని ప్రభుత్వం - పట్టిసీమ నీరు డెల్టాకు.. డెల్టా వాటా నీరు సీమకు ఇస్తామన్న ప్రభుత్వం - ప్రకటనకే పరిమితమైన బాబు హామీ - సీమలో రబీ ఆయకట్టు లేనట్లే పట్టిసీమ నుంచి కృష్ణా డెల్టాకు ఎంత నీరు తరలిస్తామో అంతే మొత్తం నీటిని రాయలసీమ సాగునీటి కాల్వలకు ఇస్తాం. శ్రీశైలం జలాశయం నుంచి చుక్క నీరు కూడా దిగువకు తీసుకుపోం. - గత రెండేళ్లుగా చంద్రబాబు హామీ ఇది. కర్నూలు సిటీ: ఖరీఫ్ ఆయకట్టుకు మాత్రమే నీరిచ్చి రబీని ఎండబెట్టేందుకు ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తోంది. ఈ ఏడాది శ్రీశైలం ప్రాజెక్టుకు ఆగస్టు మొదటి వారం వరకు ఎగువ నుంచి చుక్కనీరు చేరని పరిస్థితి. ఆ తర్వాత కృష్ణానది పరీవాహక ప్రాంతంలో కురిసిన వర్షాలతో రెండు వారాలకే జలాశయం కనీస నీటి మట్టానికి చేరుకుంది. ఆ సమయంలో మొదట కృష్ణా పుష్కరాల కోసమని, ఆ తర్వాత తాగునీటి కోసం అధికారం చేతిలో ఉండడంతో కృష్ణానది యాజమాన్య బోర్డు అనుమతిచ్చిన దాని కంటే అదనంగా నీటిని దిగువకు తరలించారు. ఫలితంగా నేడు రాయలసీమ రబీ సాగుకు దూరమవుతోంది. ఇటీవల కృష్ణా జలాల పంపకాలు కూడా ప్రభుత్వ కుట్రకు అద్దం పడుతోంది. ప్రస్తుతం శ్రీశైలంలో 868 అడుగుల నీటి మట్టం, 135 టీఎంసీల నీరు ఉంది. వెలుగోడులో 11.5 టీఎంసీలు ఉండగా కడపకు 5 టీఎంసీలు, తెలుగుగంగ కింద స్టాండింగ్ క్రాప్నకు 3 టీఎంసీలు పోగా.. మిగిలిన 3 టీఎంసీలు తాగునీటి అవసరాలకు వినియోగించనున్నారు. నీటి పంపకాల్లో అన్యాయం రెండు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి ప్రాజెక్టు అయిన శ్రీశైలం జలాశయం నీటి పంపకాల్లో రాయలసీమకు మరోసారి అన్యాయం జరిగింది. ప్రాజెక్టులు 150 టీఎంసీల నీటిని విడతల వారీగా దిగువకు తీసుకెళ్లే కుట్ర జరుగుతోంది. ఇప్పటికే 51 టీఎంసీలను అనుమతులు లేకుండా సాగర్కు తరలించారు. మరో 60 టీఎంసీల నీటిని వచ్చే ఏడాది జనవరి, ఫిబ్రవరిలో తీసుకెళ్లేందుకు అధికార పార్టీ ఎత్తుగడ వేస్తోంది. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నీటి పంపకాల్లో ఒక్కో ప్రాంతానికి ఒక్కో విధంగా నిర్ణయాలు తీసుకుంటుండడంతో సీమ జిల్లాలకు తీవ్ర అన్యాయం జరుగుతోంది. ఇంత జరుగుతున్నా టీడీపీ నేతలు ఒక్కరు కూడా స్పందించకపోవడం చూస్తే ఈ ప్రాంత ఆయకట్టుదారులపై వారికున్న ప్రేమ అర్థమవుతోంది. సీమ సాగునీటి కాల్వల కింద రబీ ఆయకట్టు లేనట్లే! శ్రీశైలం ప్రాజెక్టు ద్వారా తెలుగుగంగ, శ్రీశైలం కుడి కాలువ కింద కర్నూలు జిల్లాలో 1.08 లక్షలు, కడపలో 1.67 లక్షలు, నెల్లురులో 2.54 లక్షలు, చిత్తూరు జిల్లాలో 0.46 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. ఎస్ఆర్బీసీ కింద కర్నూలులో 1.60 లక్షలు, కడపలో 30వేల ఎకరాల ఆయకట్టు ఉంది. ఇందులో ప్రస్తుతం తెలుగుగంగ కింద 3లక్షలు, ఎస్ఆర్బీసీ కింద 1.14 లక్షల ఎకరాలకు మాత్రమే సాగునీరు అందుతుంది. రబీలో ఆరుతడి పంటలు సాగు చేసేందుకూ శ్రీశైలంలో నీరు అందుబాటులో ఉంది. అయితే ప్రభుత్వం కృష్ణాడెల్టాకు సాగు నీరు ఇచ్చేందుకు మాత్రమే కృష్ణాబోర్డుకు ప్రతిపాదించింది. సీమలోని హంద్రీనీవాకు మాత్రమే 7 టీఎంసీల నీరు ఇచ్చేందుకు అనుమతులు తీసుకున్నారు. ఈ నీరంతా అనంతపురం జిల్లాకేనని చెబుతున్నారు. వాస్తవానికి ఇప్పటికే 20 టీఎంసీలకు పైగా కృష్ణాజలాలు తరలించారు. కానీ కర్నూలు జిల్లాకు మాత్రం 3 టీఎంసీలు కూడా ఇవ్వకపోవడం గమనర్హం. రబీకి నీరివ్వలేం ఖరీఫ్లో సాగు చేసిన పంటలకు మాత్రమే నీరిస్తాం. రబీకి నీరు ఇవ్వలేమని ఇప్పటికే తెలుగుగంగ, ఎస్ఆర్బీసీ ఎస్ఈలు ఆయా గ్రామాల రైతులకు తెలిపేలా ఆదేశించాం. 6.6 టీఎంసీల నీరు అవసరమని ప్రభుత్వం ద్వారా ప్రతిపాదించాం. ఇప్పటికే మా ఇంజినీర్లు గ్రామాల్లో డప్పు వేయిస్తున్నారు. దిగువకు నీరు వదిలితే నీటి మట్టం తగ్గుతుందని, ఆ తర్వాత సాగు చేసిన పంటలకు నీరు ఇవ్వలేమని ఈ నిర్ణయం తీసుకున్నాం. – నారాయణరెడ్డి, సీఈ -
రబీకి సాగునీరు లేనట్లే
నంద్యాల: రబీ సీజన్కు సాగునీరు అందించే అవకాశం లేదని తెలుగుగంగ సూపరింటెండింగ్ ఇంజినీర్ రాఘవరెడ్డి తెలిపారు. ఆయన బుధవారం అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ప్రస్తుతం వెలుగోడు రిజర్వాయర్లో నాలుగు టీఎంసీల నీరు నిల్వ ఉంది. కడపకు తెలుగుగంగ ద్వారా 14టీఎంసీల నీరు ఇవ్వాల్సి ఉండగా ఇప్పటి వరకు 12టీఎంసీలు నీరు విడుదల చేశారు. ఇక రెండు టీఎంసీల నీరు ఇవ్వాల్సి ఉంది. ఈ నీటిని విడుదల చేశాక మిగిలిన రెండు టీఎంసీల నీటిని వేసవిలో నంద్యాల, ఆళ్లగడ్డ, ఆత్మకూరు, వెలుగోడు మున్సిపాలిటీల తాగునీటికి వినియోగించాల్సి వస్తుంది. దీంతో రబీ సీజన్లో సాగునీటిని అందించే అవకాశం లేదని అధికారులు ప్రకటించారు. -
‘కొత్త’ లక్ష్యం 8.73 లక్షల ఎకరాలు
నేడు కలెక్టర్లతో సీఎం సమీక్ష సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయడం, నిర్మాణాలు మొదలైన ప్రాజెక్టులను వేగిరం చేయడం లక్ష్యంగా ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేసింది. 2017 డిసెంబర్ నాటికి కొత్తగా 8.73 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరిచ్చేలా ప్రణాళిక రూపొందించింది. ఈ నేపథ్యంలో ప్రాజెక్టుల పరిధిలో నెలకొన్న సమస్యల పరిష్కారం దిశగా తీసుకోవాల్సిన చర్యలపై బుధవారం జరిగే కలెక్టర్ల సదస్సులో సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. 12 నెలల్లో 12 ప్రాజెక్టులు... కలెక్టర్ల సదస్సులో చర్చించాల్సిన అంశాలపై నీటిపారుదలశాఖ నివేదిక రూపొందించింది. ఇందులో ఇప్పటివరకు పూర్తయిన ప్రాజెక్టులు, వచ్చే మూడేళ్లకు నిర్దేశించుకున్న లక్ష్యాలు, ఆయకట్టు అంశాలను పొందు పరిచారు. దీని ప్రకారం రాష్ట్రంలో సాగుకు యోగ్యమైన 1.67 కోట్ల ఎకరాల ఆయకట్టుకుగానూ ఇప్పటివరకు మొత్తంగా 1.18 కోట్ల ఎకరాలకు సాగునీరిచ్చే ప్రణాళిక వేశారు. ఇందులో ఇప్పటికే 48.15 లక్షల ఎకరాలకు నీరందుతుండగా నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల కింద 69.97 లక్షల ఎకరాలకు నీరివ్వాల్సి ఉంది. మొత్తంగా 36 ప్రాజెక్టులు చేపట్టగా మొత్తం 1.96 లక్షల కోట్లకుగానూ రూ. 54 వేల కోట్ల మేర ఖర్చు చేశారు. 2004 నుంచి ఇప్పటివరకు 11.21 లక్షల ఎకరాలకు నీరందించగా మరో 3.43 లక్షల ఎకరాలను స్థిరీకరించారు. 2017 డిసెంబర్ నాటికి ఆరు భారీ, ఆరు మధ్యతరహా ప్రాజెక్టులను పూర్తి చేసి 4.47లక్షల ఎకరాలు, మరో 5 ప్రాజెక్టులను పాక్షికంగా పూర్తిచేసి 4.26 లక్షలు కలిపి మొత్తంగా 8.73 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టును సాగులోకి తేవాలని లక్ష్యంగా నిర్ణయించారు. అలాగే 2018 నాటికి 2.83 లక్షల ఎకరాలు, 2019 జూన్ నాటికి 23.19 లక్షల ఎకరాలు, 2020 నాటికి 11.10 లక్షల ఎకరాలకు సాగునీరిచ్చేలా ప్రణాళిక వేశారు. దీనిపై సీఎం జిల్లాలవారీగా సమీక్షించి కలెక్టర్లకు లక్ష్యాలు వివరించనున్నారు. రబీపైనా స్పష్టత... రబీ సాగుపైనా ఇదే సమావేశంలో ముఖ్యమంత్రి స్పష్టత ఇవ్వనున్నారు. ఎస్సారెస్పీ కింద సుమారు 9.5 లక్షలు, గోదావరి బేసిన్ పరిధిలో 43 వేలు, జూరాల కింద 60 వేలు, ఆదిలాబాద్ ప్రాజెక్టు కింద 65 వేలు, ఖమ్మం ప్రాజెక్టు కింద 26 వేల ఎకరాలు, నాగార్జున సాగర్ కింద 5 లక్షల ఎకరాల మేర రబీకి సాగు నీటిని అందించే విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఆరుతడి పంటల సాగుపై కేసీఆర్ స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. అలాగే ప్రాజెక్టుల పరిధిలో చేయాల్సిన భూసేకరణపై సదస్సులో సీఎం దృష్టి సారించనున్నారు. ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టులోని మల్లన్న సాగర్ పరిధిలో ఇంకా జరగాల్సిన (మొత్తం 13,983 ఎకరాల్లో 10,925 ఎకరాల భూసేకరణ పూర్తయింది) 3,057 ఎకరాల భూసేకరణను వేగిరం చేయాలని సూచించే అవకాశం ఉంది. -
చేతులెత్తేసిన కృష్ణా త్రిసభ్య కమిటీ!
► తేలని నీటి కేటాయింపులు ► రెండు తెలుగు రాష్ట్రాలు పట్టవదలకపోవడంతో తల పట్టుకున్న బోర్డు ► పూర్తి బోర్డు సమావేశం నిర్వహణకు యోచన సాక్షి, హైదరాబాద్: కృష్ణా జలాల పంపిణీ విషయంలో కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ పూర్తిగా చేతులెత్తేసింది. నీటి కేటాయింపుల విషయంలో తెలంగాణ, ఏపీ రాష్ట్రాలతో బోర్డు సభ్య కార్యదర్శి విడివిడిగా చర్చలు జరిపినా ఎలాంటి ఫలితం రాకపోవడంతో ఇక పూర్తి స్థాయి సమావేశంలోనే దీన్ని తేల్చాలనే ఉద్దేశంతో బోర్డు ఉంది. గురువారం ఏపీ జల వనరుల శాఖ ముఖ్య కార్యదర్శితో చర్చించిన తర్వాత పూర్తి సమావేశంపై బోర్డు స్పష్టత ఇవ్వనుంది. ప్రస్తుత రబీ అవసరాలకు గానూ తెలంగాణ 103 టీఎంసీలు కోరుతుండగా, ఏపీ 107 టీఎంసీలు అడుగుతోంది. అయితే కృష్ణా బేసిన్లోని శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల్లో మాత్రం లభ్యత జలం 130 టీఎంసీల మేర మాత్రమే ఉంది. ఈ 130 టీఎంసీల్లో తెలంగాణకు కేవలం 30 టీఎంసీలు మాత్రమే దక్కుతాయని ఏపీ వాదిస్తుండగా, గరి ష్టంగా 74 టీఎంసీలు, కనిష్టంగా 56 టీఎం సీలు దక్కుతాయని తెలంగాణ అంటోంది. దీనిపై పది రోజుల కిందటే బోర్డు సభ్య కార్యదర్శి నేతృత్వంలోని త్రిసభ్య కమిటీ చర్చించినా ఇంతవరకూ ఓ నిర్ణయానికి రాలేదు. దీంతో బోర్డు సభ్య కార్యదర్శి విడిగా రాష్ట్ర నీటి పారుదల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎస్కే జోషితో చర్చిం చినా, తమకు 50 టీఎంసీలకు తక్కువ కాకుండా చూడాలని స్పష్టం చేశారు. దీనిపై ఏపీతో చర్చించగా, 50 టీఎంసీలు ఇచ్చేం దుకు సానుకూలత వ్యక్తంచేయలేదు. దీంతో చర్చలు అసంపూర్తిగా మిగిలాయి. ఈఎన్సీల స్థాయిలో మళ్లీ చర్చలు జరిపినా పరిష్కారం దొరకడం కష్టమని భావిస్తున్న బోర్డు, పూర్తి సభ్యులతో సమావేశం ఏర్పాటు చేసి సమస్యను కొలిక్కి తేవాలని యోచిస్తోంది. కాగా ఇరు రాష్ట్రాలు తమ రబీ అవసరాలను దృష్టిలో పెట్టుకొని బోర్డు అనుమతి లేకున్నా, సాగర్ ఎడమ కాల్వ ద్వారా తెలంగాణ, హంద్రీనీవా ద్వారా ఏపీ.. నీటిని విడుదల చేసి వినియోగం మొదలు పెట్టాయి. -
‘రబీలో విత్తనాలు, ఎరువులు ఉచితంగా ఇవ్వాలి’
సాక్షి, హైదరాబాద్: రబీ సాగు కోసం 5 ఎకరాలలోపు ఉన్న రైతులకు విత్తనాలు, ఎరువు లు, పురుగుమందులు ఉచితంగా పంపిణీ చేయాలని ప్రభుత్వానికి సీపీఎం విజ్ఞప్తి చేసింది. రుణమాఫీతో సంబంధం లేకుండా బ్యాంకుల ద్వారా రైతులకు కొత్త అప్పులు ఇచ్చే విధంగా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావుకు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం బుధవారం లేఖ రాశారు. ఈ ఏడాది ఖరీఫ్లో 313 మండలాల్లో పంటనష్టం వాటిల్లినా కరువును ప్రకటించకుండా రైతులు సంతోషంగా ఉన్నారని సీఎం బాధ్యతారహిత ప్రకటనలు చేశారన్నారు. పంటనష్టపోరుున రైతులను ఆదుకునేందుకు కేంద్రం రూ.1,350 కోట్లు కరువు సాయం కింద విడుదల చేసిందని, 6 నెలలు గడుస్తున్నా ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం రైతాంగానికి ఒక్కపైసా ఇవ్వలేదన్నారు. -
రబీకి నీరందేనా!
-గాజులదిన్నె ప్రాజెక్టు కింద రబీలో 24,372 ఎకరాల ఆయకట్టు – అధికారుల ప్రకటనలతో పంటలు వేసిన రైతులు – ఈ మొత్తానికి నీరు ఇవ్వాలంటే 2.5 టీఎంసీల నీరు అవసరం – అందుబాటులో ఉండేది...1.7 టీఎంసీలు మాత్రమే – నీటి విడుదలపై స్పష్టత ఇవ్వని ఇంజినీర్లు కర్నూలు సిటీ: గాజులదిన్నె ప్రాజెక్టు (జీడీపీ) కింద కోడుమూరు, గోనెగండ్ల, దేవనకొండ, కృష్ణగిరి మండలాలకు చెందిన 24,372 ఎకరాలకు సాగునీరు, 21 గ్రామాలకు తాగు నీరు అందించాలని లక్ష్యం. 4.5 టీఎంసీల సామర్థ్యంలో 1987లో నిర్మించిన ఈ ప్రాజెక్టు కింద ఖరీఫ్లో ఆయకట్టు లేదు. రబీలో మాత్రమే సాగుకు నీరు ఇవ్వాలి. అయితే, ప్రాజెక్టు అధికారుల నిర్లక్ష్యం, అధికారుల అవగహన రాహిత్యంతో సాగు నీటి ఇబ్బందులు తలెత్తుతున్నాయి. సాగునీటి జలాశయాన్ని కాస్త సమ్మర్ స్టోరేజీ ట్యాంకులా మార్చేశారు. అధికారపార్టీనేతలకు తలొగ్గి ఇష్టారాజ్యంగా నీటి విడుదల ఈ ఏడాది జీడీపీకి గతంలో ఎప్పుడు కూడా లేనంతా నీరు వచ్చింది. అయితే తుంగభద్ర దిగువ కాలువ నీరు చివరి ఆయకట్టుకు రాకపోవడం, వర్షాలు లేకపోవడంతో పంటలకు నీరు ఇచ్చారు. అధికార పార్టీ నేతల ఒత్తిళ్లకు తలొగ్గిన అధికారులు వారు అడగ్గానే కాదనకుండా నీరు ఇచ్చారు. ఈ నీటితో అధికార పార్టీ నేతలు వ్యాపారం చేసి లక్షల్లో మామూళ్లు వసూళ్లు చేశారనే విమర్శలు ఉన్నాయి. ఆ సమయంలో ఆయకట్టుతో పాటు నాన్ ఆయకట్టుకు సైతం నీరు ఇచ్చినట్లు కొందరు రైతులు కలెక్టర్ను కలిసి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. రబీకి నీరు అందేనా? ఈ నెల మొదటి వారంలో జీడీపీ ప్రాజెక్టు కమిటీ, రైతులతో జరిగిన సమావేశంలో ఇంజినీర్లు రబీలో ఆరుతడి పంటలకు మాత్రమే నీరు ఇస్తామని మాటిచ్చారు. దీంతో రైతులు పంటలను సాగు చేస్తున్నారు. అయితే, అధికార పార్టీ నేతల కాసుల దాహానికి ప్రాజెక్టు నీరంతా ఆవిరి అయినట్లు తెలుస్తోంది. అయితే, రబీకి నీరు ఇస్తామని అధికారులు ముందే చెప్పడంతో ఇప్పుడు వారు ఇరకాటంలో పడ్డారు. జీడీపీ నుంచి తాగుకు నీరు వాడుకుంటున్నందుకు ప్రత్యామ్నయంగా పందికొన నుంచి హంద్రీనీవా నీరు జీడీపీకి రోజుకు 200 క్యుసెక్కుల చొప్పున వదులుతున్నారు. కానీ ప్రాజెక్టులోకి ఈ నెల 3 నుంచి వదిలిన నీరు 200 ఎంసీఎఫ్టీ మాత్రమే వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. జీడీపీలో అరకొర నీరు 24,372 ఎకరాల ఆయకట్టుకు నీరు ఇవ్వాలంటే కనీసం 2.5 టీఎంసీల నీరు అవసరం కాగా, ప్రస్తుతం 1.7 టీఎంసీల నీరు మాత్రమే అందుబాటులో ఉంది. ఈ నీటిని వచ్చే ఏడాది జూలై వరకు తాగడానికి ఇచ్చేందుకే సరిపోదు. ఇలాంటి సమయంలో ఆయకట్టుకు నీరు ఎక్కడి నుంచి ఇస్తారో అర్థం కానీ పరిస్థితి. అయితే, అధికారులు మాత్రం 24,372 ఎకరాల ఆయకట్టులో సాధారణంగా 17,400 ఎకరాలకే నీరు ఇచ్చేదని, ఇందులో ఖరీఫ్లోని 13 వేల ఎకరాలకు నీరు ఇచ్చామని చెబుతున్నారు. ఇక మిగిలిన 4,400 ఎకరాలకు మాత్రమే రబీలో నీరు ఇస్తామని, అది కూడా పత్తికి ఒక తడి నీరు ఇస్తే సరిపోతుందని అధికారులు తప్పించుకునే ధోరణిలో మాట్లాడుతున్నారు. వాస్తవానికి అధికారులు ముందుగా చేసిన ప్రకటనతో కుడి కాలువ కింద రబీ పంటలు సాగు చేశారు. ఇప్పుడు అధికారుల వ్యవహార తీరు ఆయకట్టుదారులను ఆందోళనకు గురిచేస్తోంది. నీటి నిల్వ తక్కువగా ఉంది గాజులదిన్నె ప్రాజెక్టులో నీటి నిల్వ తక్కువగా ఉంది. ఈ ప్రాజెక్టు కింద ఖరీఫ్ ఆయకట్టు లేదు. అయితే వర్షాలు కురవక పోవడం, ఎల్ఎల్సీ నీరు చివరి ఆయకట్టుకు నీరు రాకపోవడంతో ఎండుతున్న పంటలను కాపాడేందుకు జీడీపీ నీరు ఇచ్చాం. మొత్తం ఆయకట్టులో ఖరీఫ్లో 6 వేల ఎకరాలకు మాత్రమే నీరు ఇవ్వలేదు. రబీ కింద ఈ ఆయకట్టుకు నీరు ఇచ్చేందుకు సాధ్యమవుతుందా లేదా అనేది పరిశీలిస్తున్నాం. కలెక్టర్ సైతం ఖరీఫ్లో నీరు ఇవ్వని ఆయకట్టుకు మాత్రమే నీరు ఇవ్వాలని సూచించారు. – చంద్రశేఖర్ రావు, ఎస్ఈ జల వనరుల శాఖ -
రబీ వేళ ఆంధ్రప్రదేశ్ రచ్చ!
• కృష్ణా జలాల్లో రాష్ట్ర నీటి వాడకానికి కోత పెట్టే ప్రయత్నం •తెలంగాణ 36 శాతం అధికంగా నీరు వాడుకుందని • బోర్డుకు ఫిర్యాదు.. రాష్ట్రాన్ని వివరణ కోరిన కృష్ణా బోర్డు సాక్షి, హైదరాబాద్: కృష్ణా నదీ జలాల్లో రాష్ట్ర వాటాపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరోసారి పేచీకి దిగింది. రాష్ట్ర రబీ అవసరాలకు నీటిని విడుదల చేయాలని కృష్ణా బోర్డును తెలంగా ణ ప్రభుత్వం కోరిన సమయంలో..అందులో కోత పెట్టించేందుకు ఏపీ ప్రయత్నిస్తోంది. ప్రస్తుత వాటర్ ఇయర్లో తెలంగాణలో సగటు వర్షపాతం అధికంగా నమోదైందని, ఆ ప్రకారం తెలంగాణ వాటాలకు మించి కృష్ణా జలాలను వాడుకుందని వాదిస్తూ బోర్డుకు ఫిర్యాదు చేసింది. ఏపీ ఫిర్యాదుపై కదిలిన బోర్డు.. దీనిపై వివరణ ఇవ్వాలని తెలంగాణకు లేఖ రాసింది. బోర్డు సభ్య కార్యదర్శి సమీర్ చటర్జీ సోమవారం తెలంగాణకు లేఖ రాశారు. చిచ్చు పెట్టే లెక్కలు... గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది కృష్ణా బేసిన్ ప్రాజెక్టుల్లో నీటి లభ్యత పుష్కలంగా ఉండ టంతో రబీ అవసరాలకు నీటిని విడుదల చేయాలంటూ తెలంగాణ, ఏపీ ఇప్పటికే బోర్డును కోరారుు. నీటి అవసరాల జాబితా ను సమర్పించారుు. మొత్తంగా కృష్ణాలో 103 టీఎంసీ లు తెలంగాణ కోరింది. ఈ ఏడాది లభ్యత నీటిలో ఏపీ 187.18 టీఎంసీలు వాడుకోగా తాము 64.8 టీఎంసీలనే వినియోగించు కున్నామని బోర్డుకు తెలిపింది. తెలంగాణ నీటి విడుదల విజ్ఞప్తిపై అభ్యం తరం వ్యక్తం చేస్తూ ఏపీ సోమవారం బోర్డుకు లేఖ రాసింది. తెలంగాణ ఇప్పటికే అధికంగా నీటిని వాడుకుందని ఫిర్యాదు చేసింది. లేఖలో ఏపీ ఏం చెప్పిందంటే... ‘ఈ ఏడాది తెలంగాణలో సగటు కంటే 18 శాతం అధికంగా 982.7 మి.మీ. వర్షం కురిసింది. ఏపీలో 582.50 మి.మీ.యే కురిసింది. తెలంగాణలో భారీ వర్షాలతో చెరువుల కింద 89.15 టీఎంసీల నీటి వినియోగం జరిగింది. దీన్ని నమోదు చేయకుండా కృష్ణా జలాల్లో అధిక వాటా కొట్టేసేందుకు తెలంగాణ ప్రయత్నిస్తోందంటూ కొత్త వాదన తెరపైకి తెచ్చింది. రాష్ట్రంలోని చిన్న నీటివనరుల కోసం బచావత్ ట్రిబ్యునల్ 89.11 టీఎంసీలు కేటరుుంచినా 30 టీఎంసీలకు మించి వాడుకోలేని స్థితి ఉందని గతంలోనే స్పష్టం చేసినా ఏపీ మళ్లీ ఫిర్యాదు చేయడం రబీ అవసరాల్లో కోత పెట్టజూడటమేనని తెలంగాణ మండిపడుతోంది. -
రబీ కి తొమ్మిది గంటల విద్యుత్
టీఎస్ఎన్పీడీసీఎల్ సీఎండీ గోపాల్రావు ప్రణాళికలు రూపొందించాలని అధికారులకు ఎన్పీడీసీఎల్ సీఎండీ గోపాల్రావు ఆదేశం -కొత్తపల్లి కొత్తపల్లి : రబీలో వ్యవసాయానికి తొమ్మిది గంటల నాణ్యమైన విద్యుత్ సరఫరాకు ప్రణాళికలు సిద్ధం చేయాలని విద్యుత్ అధికారులకు తెలంగాణ రాష్ట్ర నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్(టీఎస్ఎన్పీడీసీఎల్) చైర్మన్ అండ్ మేనేజింగ్ డెరైక్టర్ అన్నమనేని గోపాల్రావు తెలిపారు. కరీంనగర్సర్కిల్ పరిధిలోని పాత జిల్లా విద్యుత్ అధికారులతో బుధవారం స్థానిక జెడ్పీ సమావేశ మందిరంలో సమీక్ష నిర్వహించారు. విద్యుత్పంప్సెట్ల అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్న ప్రతి రైతుకు డిసెంబర్ 31లోగా కనెక్షన్లు అందించాలని ఆదేశిం చారు. తరచూ ట్రాన్సఫార్మర్లు ఎందుకు పాడవుతున్నాయో తె లుసుకోవాలన్నారు. కొత్త సబ్స్టేషన్లను నిర్మించి ఓవర్లోడ్ను తగ్గించాలన్నారు. ట్రాన్సఫార్మర్లు పాడరుున వెంటనే మార్చేం దుకు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి వినియోగదారుడికి కొత్త మీటర్లు అందుబాటులోకి తేవాలన్నారు. పెండింగ్లో ఉన్న వర్క్ ఆర్డర్ను మూసివేయాలని, సోలార్ విద్యుత్ను ప్రోత్సహించాలని సూచించారు. సీఎండీగా తొలిసారిగా కరీం నగర్కు వచ్చిన సందర్భంగా ఎస్ఈ కె.మాధవరావుతోపాటు ఐదు జిల్లాల అధికారులు పుష్పగుచ్ఛాలతో అభినందించారు. -
‘నీరు’పయోగమే..!
► రబీ పంటలకు సాగునీటి కష్టాలు ► ఏళ్ల తరబడిగా మరమ్మతుకు నోచుకోని కాలువలు ► చెరువులకు కాలువలు కరువు ఇచ్చోడ : ఈ ఏడాది విస్తారంగా కురిసిన వర్షాలతో ప్రాజెక్టులు, చెరువులు జల కళను సంతరించుకున్నారుు. ప్రభుత్వం మిషన్ కాకతీయ పథకంలో భాగంగా చెరువుల్లో పూడిక తొలగించడం, తూములు, కట్టల మరమ్మతు చేపట్టడం కారణంగా నీటితో నిండుకుండలా దర్శనమిస్తున్నారుు. కాని ఆయకట్టులో సాగవుతున్న పంటలకు చుక్క నీరందే పరిస్థితి లేకపోవడం రైతులను ఆందోళనకు గురి చేస్తోంది. జిల్లాలో రబీ పంటలు 70 శాతం వరకు సాగయ్యూరుు. ప్రాజెక్టు, చెరువుల కాలువలు ఏళ్ల తరబడిగా మరమ్మతుకు నోచుకోకపోవడంతో పిచ్చిమొక్కలు పెరిగిపోయూరుు. దీంతో చివరి ఆయకట్టులోని పంటలకు నీరందుతుందో లేదోననే ఆందోళన వ్యక్తమవుతోంది. ఆదిలాబాద్ జిల్లాలో రెండు మధ్య తరహా ప్రాజెక్టులు తాంసి మండలం మత్తడివాగు ప్రాజెక్టు, ఆదిలాబాద్ మండలం సాత్నాల ప్రాజెక్టు ఉన్నారుు. సాత్నాల ప్రాజెక్టు కింద 14 వేల ఎకరాలకు సాగునీరు అందాల్సి ఉండగా.. కాలువలు మరమ్మతుకు నోచుకోకపోవడంతో లక్ష్యం మేరకు సాగునీరు అందడం లేదు. చివరి ఆయకట్టుకు నీరు అందని పరిస్థితి నెలకొంది. మత్తడివాగు ప్రాజెక్టు కుడి కాలువ దాదాపుగా ఎనిమిది కిలోమీటర్ల మేరకు నిర్మించినా సాగునీరు అందించే పరిస్థితి లేదు. కాలువలో పిచ్చిమొక్కలు పెరిగిపోరుు మరమ్మతులకు నోచుకోవడం లేదు. ప్రాజెక్టు నిర్మించి 12 ఏళ్లు కావస్తున్నా కుడి కాలువ పనులు నేటికీ ప్రారంభానికి నోచుకోలేదు. ఈ ప్రాజెక్టు కింద దాదాపు 8వేల ఎకరాలకు సాగు నీరందించాల్సి ఉన్నా.. వందల ఎకరాలకు కూడా నీరందడం లేదని రైతులు వాపోతున్నారు. కాలువలు లేని చెరువులే అధికం.. జిల్లాలో కాలువలు లేని చెరువులే అధికంగా ఉన్నారుు. ఇచ్చోడ మండలం అడేగామ కే, గేర్జం, సిరికొండ, గుడిహత్నూర్ మండలం మూత్నూర్, తొషం, సీతాగొంది గ్రామాల్లో చెరువులకు కాలువలు లేవు. బేల మండలంలో ఆరు చెరువుల ఉండగా వాటిలో సోన్కాస్ చెరువుకు మాత్రమే మట్టికాలువ ఉంది. వరూర్, సాంగ్వి, సాక్లి, పీడ్గావ్, కాప్సి గ్రామాల చెరువులకు కాలువల నిర్మాణం జరగలేదు. నేరడిగొండ మండలంలో వడూర్, కుమారి, వాంకిడి, పురుషోత్తంపూర్, బజార్హత్నూర్ మండలం భూతయి, జాతర్ల, కాండ్లి, తలమడుగు మండలంలో లింగి, ఝరి, బరంపూర్, నందిగామ, తాంసి మండలం తాంసి, అర్లి జల్కొటి గ్రామాల్లో చెరువులకు కాలువలు లేవు. బజార్హత్నూర్ మండలం దెగామ చెరు వు కుడి కాలువ పనులకు సిమెంట్ లైనింగ్ ప నులు ప్రారంభించి సంవత్సరం గడుస్తున్నా ప నులు పూర్తి కాలేదు. దీంతో రబీలో నీటిని వి డుదల చేసినా మూడు కిలోమీటర్ల దూరం కం టే ఎక్కువ పారే అవకాశాలు లేవు. ఇంద్రవెల్లి, నార్నూర్ మండలాల్లో చెరువుల ద్వారా రబీకి నీరందించే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో ఈ ఏడాది రబీలో ఒక్క సాత్నాల ఆయకట్టుకు మినహా మరెక్కడా నీరందే అవకాశాలు లేవు. -
గోధుమ, పప్పులకు ‘మద్దతు’
► కనీస మద్దతు ధరలను పెంచిన కేంద్రం ► గోధుమలకు రూ.100, పప్పుధాన్యాలకు రూ.550 వరకు న్యూఢిల్లీ: రబీ సాగు పెంపు,, ధరల నియంత్రణకు కేంద్రం గోధుమలు, పప్పుధాన్యాలకు కనీస మద్దతు ధర (ఎంఎస్పీ)ను పెంచింది. గోధుమలకు క్వింటాల్కు రూ.100, పప్పు ధాన్యాలకు రూ.550 వరకు పెంచింది. ప్రధాని మోదీ నేతృత్వంలోని ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ మంగళవారం సమావేశమై 2016-17 రబీ పంటలపై ఈమేరకు నిర్ణయం తీసుకుంది. గోధుమలకు గత ఏడాది రూ.1,525గా ఉన్న కనీస మద్దతు ధరను క్వింటాల్కు రూ.100 పెంచి రూ.1,625 చేసింది. శనగలకు మద్దతు ధరను బోనస్తో కలిపి రూ.500 పెంచి రూ.4 వేలు చేశారు. గతంలో ఇది రూ.3,500గా ఉంది. ఆవాలకు ప్రస్తుతం రూ.3,350 ఉన్న ఎంఎస్పీని రూ.350 పెంచి రూ.3,700 చేశారు. ఆవాలకు రూ.400 పెంచడంతో మద్దతు ధర రూ.3,700కి చేరింది. బార్లీ గింజల మద్దతు ధరను క్వింటాల్కు రూ.100 పెంచడంతో అది రూ.1,325కు చేరింది. కుసుమలకు మద్దతు ధరను రూ.400 పెంచడంతో అది రూ.3,700కు చేరింది. ఎర్ర కందిపప్పుకు రూ.550 పెంచి రూ. 3,950 చేశారు. గత ఏడాది ఈ ధర రూ.3,400గా ఉంది. శనగలు, ఎర్ర కందిపప్పుకు మద్దతు ధరను రూ.4వేలు చేయాలని వ్యవసాయ శాఖ ప్రతిపాదించింది. ఇలాచేస్తే రబీ సాగు పెరగడంతోపాటు ఇతర దేశాల దిగుమతులపై ఆధారపడాల్సిన అవసరం తగ్గుతుందని తెలిపింది. గోధుమలకు 6.6 శాతం పెంచామని, అయితే ఇది బోనస్తో కలిపి 8.2 శాతం అవుతుందని అధికార ప్రతినిధి ఒకరు చెప్పారు. శనగలకు 14.3 శాతం, ఎర్ర కందిపప్పుకు 16.2, ఆవాలకు 10.4, కుసుమలకు 12.1 శాతం పెంచారన్నారు. పప్పుధాన్యాలు, నూనెగింజల సాగుకు ఇది ఎంతగానో దోహదం చేస్తుందని చెప్పారు. వ్యవసాయ ఖర్చులు, ధరల కమిషన్ (సీఏసీపీ) సిఫార్సుల మేరకు మద్దతు ధరలను పెంచినట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ ఏడాది మంచి వర్షాలు పడినందున 20.75 మిలియన్ టన్నులను ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. కేబినెట్ నిర్ణయాలు: వివాదాస్పద మత ప్రచారకుడు జకీర్ నాయక్కు చెందిన ఇస్లామిక్ రీసెర్చ్ ఫౌండేషన్ ను చట్టవ్యతిరేక సంస్థగాప్రకటించాలని కేబినెట్ నిర్ణయి0ది. సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు నదుల అనుసంధాన స్పెషల్ కమిటీకి చట్టబద్దత కల్పించే అంశానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. -
శనగ బీమాపై హైకోర్టులో వాదనలు
వేంపల్లి: 2012–13 రబీ సీజన్కు సంబంధించి బీమా మంజూరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.మంగళవారం హైకోర్టులో బీమా ఆలస్యంపై ప్రధాన న్యాయమూర్తి ఎదుట ఎంపీపీ రవికుమార్ రెడ్డి తరఫు న్యాయవాది జానకి రామిరెడ్డి,బీమా కంపెనీకి చెందినన్యాయవాది మధ్య వాదోపవాదాలు జరిగాయి.వైఎస్సార్సీపీ నాయకులు,వేంపల్లి మండలాధ్యక్షులు మాచిరెడ్డి రవికుమార్రెడ్డి,2012–13 రబీ సీజన్లో శనగ పంటకు బీమా అందక పోవడంతో రైతులను ఆదుకోవాలన్న ఉద్దేశంతో హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు.ఈ నేపథ్యంలో ఈ వాదనలు జరిగాయి. చిన్న సాకులు చూపించి బీమా ఇవ్వకపోవడం ఎంతవరకు సమంజసమని హైకోర్టు బీమా కంపెనీ అధికారులను, వారి తరపు న్యాయవాదులను ప్రశ్నించింది.దీంతో వారు హైకోర్టుకు ఈ విధంగా విన్నవించారు.ప్రభుత్వం తన వాటా నిధులు విడుదల చేయకపోవడంతోనే ఇవ్వలేక పోతున్నామని చెప్పారు. రైతులకు బీమా సొమ్మును ఎప్పుడు ఇచ్చేది రెండువారాల్లోగా తెలియజేయాలని కోర్టు ఆదేశించింది.ప్రభుత్వం తమ వాటా నిధులు విడుదల చేయగలిగితే కడప జిల్లాలో 50,000మంది రైతులకు మేలు చేకూరుతుంది. దాదాపు రూ.130 కోట్ల మేర బీమా పరిహారం అందే అవకాశం ఉంది. -
ఇక కష్టాల ‘వంతు’
– రబీకి సాగునీటి కష్టాలు షరామాములే – 10 టీఎంసీలకుపైనే లోటు – సాగు గట్టెక్కాలంటే 77 నుంచి 80 టీఎంసీలు అవసరం – అందుబాటులో ఉండేది 68 టీఎంసీలే – 75 శాతం ఆయకట్టుకు మాత్రమే సరిపోతుందంటున్న అధికారులు – వంతులవారీ విధానం అమలు చేయాలని నిర్ణయం కొవ్వూరు : ఖరీఫ్ వరి కోతలు మొదలయ్యాయి. మాసూళ్లు పూర్తికాగానే.. రబీ నారుమడులు పోసేందుకు రైతులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈసారి కూడా రబీ పంటకు సాగునీటి కష్టాలు తప్పని పరిస్థితి ఏర్పడింది. గోదావరిలో 10 టీఎంసీలకు పైగా నీటి లోటు ఉంటుందని, రబీ గట్టెక్కాలంటే మరో 15 టీఎంసీల వరకు నీరు అవసరమవుతుందని జల వనరుల శాఖ అంచనా వేస్తోంది. ఉభయ గోదావరి జిల్లాల్లోని మూడు డెల్టాలకు పూర్తిస్థాయిలో సాగు నీరు అందించడం కష్టమని అధికారులు తేల్చేశారు. రెండు జిల్లాల్లోని 8.86 లక్షల ఎకరాల్లో వరి సాగవుతుండగా 75.74 శాతం ఆయకట్టుకు మాత్రమే సాగునీరు అందుబాటులో ఉంటుందని లెక్కగట్టారు. గురువారం కాకినాడలో నిర్వహించిన సాగునీటి సలహా మండలి (ఐఏబీ) సమావేశంలో ఉభయ గోదావరిలో పూర్తి ఆయకట్టుకు నీరిస్తామని జల వనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ప్రకటించారు. అధికారులు ఇందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు. మొత్తం ఆయకట్టుకు నీరివ్వాలంటే వంతులవారీ విధానం అమలు చేయక తప్పని పరిస్థితి నెలకొంది. ఈ దిశగా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అందుబాటులో 68 టీఎంసీలు రబీ పంటకు పూర్తిస్థాయిలో నీరందించాలంటే 77 నుంచి 80 టీఎంసీల నీరు అవసరమవుతుంది. అయితే, గోదావరిలో 33 టీఎంసీలు, సీలేరు ద్వారా 35 టీఎంసీలు కలిపి మొత్తంగా 68 టీఎంసీలు అందుబాటులోకి వస్తుందని లెక్కగట్టారు. సాగు అవసరాలు తీరాలంటే మరో 15 టీఎంసీలు అవసరం అవుతుందని చెబుతున్నారు. మురుగు కాలువలకు అడ్డుకట్టలు వేయడం, ఆయిల్ ఇంజిన్ల వినియోగించడం ద్వారా మరికొంత నీటిని అందుబాటులోకి తెచ్చినా మరో 10 టీఎంసీలకు పైగా లోటు ఉంటుందని చెబుతున్నారు. ఈ దష్ట్యా వంతులవారీ విధానం, నీటి పొదుపు చర్యలు పాటించడం ద్వారా పంటల్ని గట్టెక్కించాలని నిర్ణయించారు. ఈ పరిస్థితుల వల్ల శివారు ప్రాంత రైతులు ఈ ఏడాది రబీలోనూ సాగునీటికి కటకటలాడక తప్పని పరిస్థితి ఉంది. పొదుపు ^è ర్యలు పాటిస్తాం ఉభయ గోదావరి డెల్టా ఆయకట్టు అంతటికీ నీరందించడానికి సుమారు కనీసం 76 టీఎంసీల నీరు అవసరం. అందుబాటులో ఉన్న నీరు 75 శాతం ఆయకట్టుకు మాత్రమే సరిపోతుంది. నీటి పొదుపు చర్యల ద్వారా కొరతను అధిగమిస్తాం. ఆయిల్ ఇంజిన్ల వినియోగం, వంతులవారీ విధానం అమలు, మురుగు కాలువలకు అడ్డుకట్టలు వేయడం వంటి చర్యలు చేపడతాం. నీటి వినియోగం విషయంలో క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ పెంచుతాం. – పి.రాంబాబు, ఎస్ఈ, గోదావరి హెడ్వర్క్స్, ధవళేశ్వరం -
వారి పోరాటాలు ఉనికి కోసమే!
♦ ప్రతిపక్షాలపై హరీశ్రావు మండిపాటు ♦ కరువు పేరిట రెచ్చగొట్టే ప్రయత్నం ♦ రబీలో 9 గంటల విద్యుత్ సాక్షి, సంగారెడ్డి: రాష్ట్రంలో ప్రతిపక్షాల పరిస్థితి ఊరందరిదీ ఒకదారి.. ఉలిపికట్టెది ఒకదారి అన్నట్లుగా ఉందని నీటి పారుదలశాఖ మంత్రి హరీశ్రావు ఎద్దేవా చేశారు. బీజేపీ, కాంగ్రెస్లకు ఎప్పుడు ఏం చేయాలో తెలియదని.. సమయం, సందర్భం, సమస్య లేకుండా జనంలోకి వెళ్లి రెచ్చగొట్టాలని చూస్తున్నాయని మండిపడ్డారు. ప్రజలు భూములివ్వకుండా రెచ్చగొడుతున్నాయని, కోర్టు కేసుల ద్వారా ప్రాజెక్టులకు అడ్డుపడే ప్రయత్నం చేస్తున్నాయని ఆరోపించారు. రబీ సాగుపై రైతులు సంతోషంగా ఉంటే ప్రతిపక్షాలు జీర్ణించుకోలేకపోతున్నాయని విమర్శించారు. శుక్రవారం సంగారెడ్డి జిల్లా కేంద్రంలో ఆ జిల్లాకు చెందిన ప్రజా ప్రతినిధులు, అధికారులలో మంత్రి హరీశ్రావు సమన్వయ సమావేశం నిర్వహించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. ప్రతిపక్షాలది ఉనికి కోసమే పోరాటం తప్ప ప్రజల కోసం ఆరాటం కాదని విమర్శించారు. అదనంగా విద్యుత్ సరఫరా... పదేళ్ల తర్వాత రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిసిన నేపథ్యంలో రబీలో వ్యవసాయ విద్యుత్ వినియోగం రెండింతలు అవుతుందని అంచనా వేస్తున్నట్లు మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 6,500 మెగావాట్ల విద్యుత్ సరఫరా అవుతోందని.. పది వేల మెగావాట్లు సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. అవసరమైతే అదనంగా విద్యుత్ సరఫరా చేస్తామన్నారు. రాష్ట్రంలో నకిలీ విత్తనాల వ్యవహారాన్ని పెంచి పోషించిన ఘనత గత ప్రభుత్వాలకే దక్కుతుందని ఆరోపించారు. నకిలీ విత్తనాల విషయంలో ఇప్పటికే 90 మంది డీలర్లపై కేసులు నమోదు చేశామని, ఇద్దరిని అరెస్టు చేశారని తెలిపారు. నకిలీ విత్తన సరఫరాదారులపై అవసరమైతే పీడీ యాక్టు కింద కేసుల నమోదుకు కూడా వెనుకాడమని హెచ్చరించారు. గతంలో చేపపిల్లల పంపిణీకి నామమాత్రంగా రూ.5 లక్షలు కేటారుుంచగా.. ఈ ఏడాది జిల్లాకు రూ.4 కోట్ల చొప్పున విడుదల చేసినట్లు హరీశ్ పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీలు భూపాల్రెడ్డి, ఫరీదుద్దీన్, ఎమ్మెల్యేలు చింత ప్రభాకర్, మహిపాల్రెడ్డి, బాబూమోహన్, భూపాల్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ప్రాజెక్టులు నిండుగా.. రబీ దండిగా
• 30 లక్షల ఎకరాలకు సాగునీరిచ్చేలా ప్రణాళిక • భారీ ప్రాజెక్టుల కింద 22 లక్షల ఎకరాలకు నీరు • ఎస్సారెస్పీ కింద 9.68 లక్షల ఎకరాలు • నాగార్జునసాగర్ కింద 6.40 లక్షల ఎకరాలు • మధ్య తరహా ప్రాజెక్టుల కింద 3 లక్షల ఎకరాలకు.. • చెరువుల కింద మరో 5 లక్షల ఎకరాలకు నీరు • 18న రబీ తుది కార్యాచరణ రూపొందించనున్న నీటి పారుదల శాఖ సాక్షి, హైదరాబాద్: సాగునీటి ప్రాజెక్టుల కింద ఆయకట్టుకు మళ్లీ పునర్జీవం రానుంది. ఈసారి భారీ వర్షాలతో ప్రాజెక్టులన్నీ నిండుకుండల్లా మారడంతో వాటి కింద పూర్తిస్థాయి ఆయకట్టు సాగులోకి వచ్చే అవకాశం ఉంది. రబీలో ప్రాజెక్టుల కింద మొత్తంగా 30 లక్షల ఎకరాల మేర పంటలకు నీరిచ్చేందుకు నీటిపారుదల శాఖ రంగం సిద్ధం చేస్తోంది. ఇందులో భారీ ప్రాజెక్టుల కిందే 22 లక్షల ఎకరాలకు నీరిచ్చేలా ప్రణాళికలు రచిస్తోంది. ఇక మధ్య, చిన్న తరహా ప్రాజెక్టు కింద మరో 8 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరందించాలని భావిస్తోంది. ఇప్పటివరకు సగటు 23.35 లక్షలే రాష్ట్రంలో భారీ, మధ్య, చిన్న తరహా, ఐడీసీ పథకాల కింద ఏటా 63.52 లక్షల ఎకరాలకు సాగునీరిచ్చే అవకాశం ఉండగా.. సగటున 23.35 లక్షల ఎకరాలకు మాత్రమే నీరందుతోంది. గడిచిన ఎనిమిదేళ్ల లెక్కలు చూస్తే 2013-14లో అత్యధికంగా అన్ని ప్రాజెక్టుల కింద కలిపి 28.15 లక్షల ఎకరాలకు నీరందింది. 2014-15లో అత్యల్పంగా 9.74 లక్షల ఎకరాలకే నీరందింది. 2015-16లో 21.57 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరందింది. ఈ ఏడాది విస్తారంగా వర్షాలు కురవడంతో నాగార్జునసాగర్ మినహా అన్ని ప్రాజెక్టులు నిండుకుండల్లా మారాయి. శ్రీశైలం పూర్తిగా నిండటం, కృష్ణా బేసిన్ పరిధిలో డిసెంబర్ వరకూ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నందున సాగర్ కూడా నిండుతుందని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో రబీలో అన్ని ప్రధాన ప్రాజెక్టుల కింద పంటలకు నీరిచ్చేందుకు సిద్ధమవుతోంది. ప్రధాన ప్రాజెక్టులైన నాగార్జునసాగర్, శ్రీరాంసాగర్, నిజాంసాగర్, జూరాల, ఆర్డీఎస్, కడెం, మూసీ తదితర ప్రాజెక్టుల పరిధిలో 21.29 లక్షల మేర ఆయకట్టు ఉంది. ఇందులో ఆర్డీఎస్ మినహా మిగతా ప్రాజెక్టుల కింద మొత్తం 20 లక్షల ఎకరాలకు సాగునీరిచ్చే అవకాశాలున్నాయి. ఇందులో అధికంగా ఎస్సారెస్పీ కింద 9.68 లక్షల ఎకరాలు, నాగార్జునసాగర్ కింద 6.40 లక్షల ఎకరాలకు నీరిచ్చే అవకాశాలున్నాయి. వీటితోపాటు పాక్షికంగా పూర్తయిన ఏఎంఆర్పీ, ఎస్సారెస్పీ-2, దేవాదుల, ఎల్లంపల్లి, కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు, కొమురంభీం, కోయిల్సాగర్, వరద కాల్వ, సింగూరు వంటి ప్రాజెక్టుల కింద 2 నుంచి 3 లక్షల ఎకరాలకు సాగునీరిచ్చే అవకాశం ఉంది. ఇందులో అధికంగా ఏఎంఆర్పీ కింద 1.3 లక్షల ఎకరాలకు సాగునీరిచ్చే ప్రణాళికలున్నాయి. ప్రస్తుత నీటితో సింగూరు కింద 40 వేల ఎకరాలు, ఎల్లంపల్లి కింద 30 వేల ఎక రాలకు నీరు అందించవచ్చు. మొత్తంగా భారీ ప్రాజెక్టు కింద 22 నుంచి 23 లక్షల ఎకరాలకు నీరిచ్చే అవకాశాలున్నాయి. మధ్య తరహా ప్రాజెక్టుల కింద ఇలా రాష్ట్రంలో మధ్య తరహా ప్రాజెక్టుల కింద 3.22 లక్షల ఎకరాల ఆయకట్టు ఉండగా సగటున 2.08 లక్షల ఎకరాలకు నీరందుతోంది. ఇక చిన్న తరహా వనరుల కింద 24.39 లక్షల ఎకరాలు ఉండగా.. 6 లక్షల ఎకరాలకు నీరందించే అవకాశాలున్నాయి. ఈ ఏడాది రాష్ట్రంలో 28 మధ్యతరహా ప్రాజెక్టులు నిండటంతో సుమారు 3 లక్షల ఎకరాలకు నీరిచ్చే అవకాశం ఉంది. 20 వేలకు పైగా చెరువులు పూర్తిస్థాయిలో నిండటం, మిగతాచోట్ల ఆశాజనకంగా నీరు అందుబాటులో ఉన్నందున 5 లక్షల నుంచి 6 లక్షల ఎకరాలకు నీరిచ్చే అవకాశాలున్నాయి. దీనిపై ఈ నెల 18న పూర్తిస్థాయిలో సమీక్షించి తుది రబీ ప్రణాళికను నీటి పారుదల శాఖ ఖరారు చేయనుంది. -
విత్తన పంపిణీ ప్రారంభం
– మొదటి రోజు ట్రయల్కే పరిమితం – సెల్ ఉంటేనే విత్తనాలు – ఆన్లైన్లో భూముల వివరాలు లేపోతే మొండిచేయి కర్నూలు(అగ్రికల్చర్): ఎట్టకేలకు రబీ సీజన్కు సంబంధించి శనగ విత్తనాల పంపిణీ ప్రారంభమైంది. శనివారం మండల వ్యవసాయాధికారులు బయోమెట్రిక్ విధానంలో విత్తనాల పంపిణీ ప్రారంభించారు. మొదటి రోజు మూడు, నాలుగు మండలాల్లోనే విత్తన పంపణీ చేపట్టారు. సోమవారం దాదాపు అన్ని మండలాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. కర్నూలు మండల వ్యవసాయాధికారి కార్యాలయంలో జరిగిన కార్యక్రమాన్ని జేడీఏ ఉమామహేశ్వరమ్మ పరిశీలించారు. 51 మండలాల్లో విత్తన పంపిణీ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. సబ్సిడీ విత్తనాలు పొందాలంటే రైతుకు విధిగా సెల్ఫోన్ ఉండాల్సి ఉంది. సెల్ లేకపోతే కనీసం ఎవరిదైనా తెచ్చుకోవాల్సి ఉంది. ఆధార్ కార్డు విధిగా తీసుకెళ్లాలి. యూప్ను డౌన్లోడ్ చేసిన ట్యాబ్ల్లో రైతుల ఆధార్ నెంబరు నమోదు చేస్తే వెబ్ల్యాండ్ డేటా వస్తుంది. భుముల వివరాలు ఆన్లైన్లో ఉన్నా వాటిని ఆధార్తో లింకప్ చేసి ఉండాలి. లింకప్ అయి ఉంటేనే వెబ్ల్యాండ్ డేటా వస్తుంది. వెబ్ల్యాండ్లో ఉన్న భూములకు అనుగుణంగా గరిష్టంగా ఒక రైతుకు 125 కిలోలు ఇస్తారు. రైతులు బయోమొట్రిక్ డివైజ్పై వేలిముద్ర వేసిన వెంటనే వారి ఫోన్కు వన్ టైమ్ పాస్ వర్డ్ వస్తుంది. ఆ తర్వాత విత్తన పంపిణీ కేంద్రానికి పాస్వర్డ్ చూపించాలి. దాని ద్వారా రైతు వివరాలను తమ దగ్గర ఉన్న ట్యాబ్లో సరిపోల్చుకున్న తర్వాత నాన్ సబ్సిడీ మొత్తాన్ని తీసుకుని విత్తనాలు ఇస్తారు. భూముల వివరాలు ఆన్లైన్లో లేకపోతే రైతులు వెంటనే సంబంధిత తహసీల్దారును కలసి నమోదు చేయించుకోవాలని కర్నూలు మండల వ్యవసాయాధికారి అశోక్కుమార్రెడ్డి సూచించారు. -
రబీ ప్రణాళిక ఖరారు
3,16,800 హెక్టార్లలో వివిధ పంటల సాగు 38,100 క్వింటాళ్ల విత్తనాలు అవసరం 1.70 మెట్రిక్ టన్నుల ఎరువులకు ప్రతిపాదనలు కరీంనగర్ అగ్రికల్చర్ : జిల్లా రబీ ప్రణాళికను వ్యవసాయశాఖ ఖరారు చేసింది. అక్టోబర్ నుంచి రబీ సీజన్ మొదలవుతుండగా.. జిల్లావ్యాప్తంగా 3,16,800 హెక్టార్లలో వివిధ పంటలు సాగవుతాయని అధికారులు ప్రణాళిక రూపొందించారు. ప్రధానంగా పప్పుదినుసులు, ఆరుతడి పంటల సాగును ప్రోత్సహించాలని నిర్ణయించినప్పటికీ వరి, మెుక్కజొన్న సాగుపైనే రైతులు మెుగ్గుచూపుతారని అంచనా వేశారు. ఈ మేరకు అవసరమైన విత్తనాలు, ఎరువుల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. జిల్లాకు 38,100 క్వింటాళ్ల వివిధ రకాల విత్తనాలు, 1,70,500 మెట్రిక్ టన్నుల ఎరువులు సరఫరా చేయాలని కోరారు. ఇప్పటికే కొన్ని రకాల విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచామని వ్యవసాయ శాఖ అధికారులు పేర్కొన్నారు. వివిధ పంటల సాగు అంచనా (హెక్టార్లలో) : వరి 22500, జొన్న 1500, సజ్జ 2వేలు, మక్క 55000, పెసర్లు 5వేలు, మినుములు 5500, కంది 400, శనగలు 1500, బబ్బెర్లు 3500, పల్లి 10వేలు, సన్ఫ్లవర్ 600, నువ్వులు 500. ఎరువులు (మెట్రిక్ టన్నుల్లో) : యూరియా 77,500, డీఏపీ 15500, ఎంవోపీ 23250, కాంప్లెక్స్ 54250. విత్తనాలు (క్వింటాళ్లలో) : పల్లి 9500, శనగలు 2300, మినుములు 300, పెసర్లు 800, కందులు 50, వరి 20వేలు, మక్కలు 5వేలు, నువ్వులు 50 క్వింటాళ్ల చొప్పున ఇప్పటికే అందుబాటులో ఉంచారు. -
రబీ రుణ లక్ష్యం రూ.932.19 కోట్లు
– లీడ్ బ్యాంక్ మేనేజర్ ధీరావత్ సూర్యం పెద్దవూర: ఈ ఏడాది రబీ సీజన్లో జిల్లాకు రూ.932.19 కోట్ల వ్యవసాయ రుణాలను రైతులకు అందించేందుకు ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించిందని లీడ్ బ్యాంక్ మేనేజర్ ధీరావత్ సూర్యం చెప్పారు. గురువారం మండల సమావేశ మందిరంలో జరిగిన పెద్దవూర, అనుముల, నిడమనూరు, త్రిపురారం మండలాల జాయింట్ మండల్ లెవల్ బ్యాంకర్స్ కమిటీ(జేఎంఎల్బీసీ) సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. గత ఖరీఫ్ సీజన్లో జిల్లా రైతులకు రూ.1654.60 కోట్లు వ్యవసాయ రుణాలను లక్ష్యంగా నిర్దేశించగా ఇప్పటివరకు రూ.1050 కోట్ల రుణాలిచ్చినట్టు పేర్కొన్నారు. పీఎం ముద్రా పథకం రుణాలను లబ్ధిదారులకు జమానతు తీసుకోకుండా, వయస్సుతో సంబంధం లేకుండా ఇచ్చి తోడ్పాడు అందించాలన్నారు. స్టాండప్ అప్ ఇండియా పథకం ద్వారా రూ. 10లక్షల నుంచి రూ.కోటి వరకు ప్రతి బ్యాంకు ఖచ్చితంగా రెండు యూనిట్లు ఎస్సీ, ఎస్టీ పురుషులకు, మహిళలకు అయితే ఎవరికైనా ఇవ్వాల్సి ఉంటుందన్నారు. ఈ ఎస్సీ, ఎస్టీ మహిళలను పారిశ్రామికవేత్తలుగా తయారు చేయలన్నదే స్టాండప్ అప్ ఇండియా పథక ఉద్దేశమన్నారు. ప్రభుత్వం 12.5 శాతం రుణమాఫీని విడుదల చేసిందని రెండు, మూడు రోజుల్లో రైతుల బ్యాంకు ఖాతాలో జమ అవుతాయన్నారు. సంవత్సరం లోపు అప్పు తిరిగి చెల్లించకుంటే వడ్డీ లేని రుణం పథకం వర్తించదని, సకాలంలో చెల్లించిన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం 4 శాతం, కేంద్రం 3 శాతం చెల్లిస్తుందన్నారు. రైతులు సంవత్సరం లోపు వ్యవసాయ రుణాలను రెన్యువల్ చేసుకుంటే వడ్డీ తీసుకోవద్దని బ్యాంకర్లకు సూచించారు. బ్యాంకర్లు, అధికారులు సమన్వయంతో పనిచేసి ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలను లబ్ధిదారులకు సక్రమంగా చేరే విధంగా చూడాలన్నారు. సమావేశంలో బీసీ, ఎస్సీ కార్పొరేషన్ ఈడీలు బి.గోపాలకృష్ణ, కె.బ్రహ్మచారి, డీఆర్డీఏ బీపీఎం ఆర్.రామకృష్ణ, గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ జిల్లా డైరెక్టర్ సీ.నాగేశ్వర్రావు, జెఎల్ఎంబీసీ కన్వీనర్ పీవీ రత్నం, ఎంపీడీఓ వెంకటాచారి, ఎంపీడీఓలు, బ్యాంకర్లు, వెలుగు ఏపీఎంలు తదితరులు పాల్గొన్నారు. -
ఊరట కరువు
ఆకాశంలో రబీ విత్తన ధర – వర్షాభావంతో నష్టాల్లో అన్నదాత – కిలో శనగ ధర రూ.98.66 – సబ్సిడీ 40 శాతమే.. – కిలోకు చెల్లించాల్సిన మొత్తం రూ.59.20 – మార్కెట్లో తక్కువ ధరకే లభ్యం – 24 నుంచి విత్తన పంపిణీ కర్నూలు(అగ్రికల్చర్): ఖరీఫ్ పంట కళ్లెదుటే కరిగిపోయింది. కరువు కోరల్లో చిక్కుకున్న రైతు పట్ల ప్రభుత్వానికి కనీస సానుభూతి కరువైంది. సీజన్లో వర్షాభావం కారణంగా 2,66,428 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్లు వ్యవసాయ యంత్రాంగమే అంచనా వేసింది. చాలా వరకు ఈ భూముల్లో రబీ పంటల సాగుకు అన్నదాత సిద్ధమవుతున్నాడు. తాజా పరిస్థితుల నేపథ్యంలో కరువు రైతుకు ఊరటనిచ్చేలా రబీ సీజన్కు అవసరమైన శనగ విత్తనాల ధర నిర్ణయించాల్సి ఉంది. అయితే వ్యాపారులకు ప్రయోజనం చేకూర్చేలా ధర నిర్ణయించడం చర్చనీయాంశంగా మారింది. గత ఏడాదితో పోలిస్తే కిలో శనగ విత్తనాలపై ఏకంగా రూ.34.16 పెంచి రైతుల నడ్డి విరిచింది. గత ఏడాదితో పోలిస్తే ఈ అదనపు భారం రూ.15.88 కోట్లు. మార్కెట్ రేటును మించి ధర పెంచి.. కంటి తుడుపుగా 40 శాతం సబ్సిడీ ఇస్తున్నట్లు ప్రకటించడం గమనార్హం. ధర లు ఖారారు కావడంతో విత్తనాలను కూడా వెంటనే పొజిషన్ చేస్తున్నట్లు జేడీఏ ఉమామహేశ్వరమ్మ విలేకరులకు తెలిపారు. ఈ నెల 24 నుంచి బయోమెట్రిక్ సిస్టమ్ ద్వారా విత్తనాలు పంపిణీ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. శనగ ధరలు ఇలా.. రబీలో శనగ సాగు ప్రధానమైంది. జిల్లాలో ఈసారి 2 లక్షలకు పైగా హెక్టార్లలో సాగు చేసే అవకాశం ఉంది. ఈ సారి జిల్లాకు 98వేల క్వింటాళ్లు సబ్సిడీపై పంపిణీ చేసేందుకు అలాట్మెంట్ ఇచ్చింది. వీటిని అయిల్ఫెడ్, ఎపీ సీడ్స్, మార్క్ఫెడ్ సరఫరా చేస్తాయి. గత ఏడాది కిలో విత్తనం ధర రూ.64.50 ప్రకటించి.. రూ.21.50(33.33 శాతం) సబ్సిడీ ఇచ్చింది. ఈ లెక్కన రైతు కిలో విత్తనాలకు రూ.43 చెల్లించాలి. కమీషన్ మత్తులో పడిన ఉన్నతాధికారులు వ్యాపారులు సంక్షేమం లక్ష్యంగా ఈ సారి కిలో పూర్తి ధర రూ.98.66లుగా నిర్ణయించింది. మార్కెట్లో క్వింటా ధర రూ.8వేల వరకు ఉండగా.. ప్రభుత్వం క్వింటా ధర రూ.10వేలుగా ప్రకటించడం గమనార్హం. సబ్సిడీ కూడా 40 శాతం ప్రకటించడంతో.. రైతులు కిలోకు రూ.59.20 చెల్లించాల్సి వస్తోంది. -
రబీ విత్తనం..పంపిణీ ప్రశ్నార్థం
– జాడలేని బయోమెట్రిక్లు – ఇంతవరకు ఖరారు రాని ధరలు –వర్షాలు పడుతుండడంతో రైతుల ఎదురు చూపు కర్నూలు(అగ్రికల్చర్): రబీ సీజన్ ముంచుకొస్తున్నా.. విత్తనాల పంపిణీ ఇంకా ప్రారంభం కాలేదు. మరోవైపు వర్షాలు విస్తారంగా పడుతుండటంతో రైతులు రబీ సీజన్కు సిద్ధం అవుతున్నారు. జిల్లాలో ప్రధానంగా రబీలో శనగ పంటను సాగు చేస్తారు. ప్రతి ఏడాది జిల్లాలో రెండు లక్షల హెక్టార్లకు పైగా ఈ పంట సాగవుతోంది. ఖరీఫ్లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొనడం.. వేరుశనగ, కొర్ర, మొక్కజొన్న వంటి పంటలు దెబ్బతినడంతో ఈ ఏడాది శనగ సాగు పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే వివిధ మండలాల్లో రైతులు దెబ్బతిన్న పంటలను దున్నేసి రబీకి సిద్ధం అవుతున్నారు. ఆలూరు, ఎమ్మిగనూరు, మంత్రాలయం తదితర ప్రాంతాల్లో రైతులు ఈ మేరకు పొలాలను సిద్ధం చేసుకున్నారు. అయితే విత్తనాల పంపిణీ ఎప్పుడనేది ప్రశ్నార్థకంగా మారింది. కేటాయింపులు ఇలా... జిల్లాకు శనగ విత్తనాలు 98వేల క్వింటాళ్లు కేటాయించారు. సాగు విస్తీర్ణాన్ని బట్టి మండలాల వారీగా వీటిని పంపిణీ చేయాల్సి ఉంది. ఈ సారి బయోమెట్రిక్ ద్వారా పంపిణీ చేయాలని వ్యవసాయ శాఖ నిర్ణయించింది. దీనిపై ఇంతవరకు ఎలాంటి చర్యలు లేవు. ఇంతవరకు బయోమెట్రిక్ మిషన్లు జిల్లాకు రాలేదు. బయోమెట్రిక్ ద్వారా విత్తనాలు పంపిణీ చేయాలంటే ముందుగా వ్యవసాయాధికారులకు, సిబ్బందికి శిక్షణ ఇవ్వాల్సి ఉంది. ఇంతవరకు దీనిపై ఎలాంటి చర్యలు లేవు. ముఖ్యంగా సబ్సిడీపై పంపిణీ చేసే శనగ విత్తనాలు ధర, సబ్సిడీలు ఖరారు కాలేదు. ధరలు ఖరారు కానిదే విత్తనాలను పంపిణీకి పొజిషన్ చేయలేరు. ఇందువల్ల విత్తనాల పంపిణీలో ఈ సారి జాప్యం జరిగే ప్రమాదం ఉందని వ్యవసాయ అధికారులే పేర్కొంటున్నారు. ఏవోల చుట్టూ ప్రదక్షిణ.. రబీ సీజన్ ముంచుకొస్తున్నా విత్తనాల పంపిణీ అతీగతీ లేకుండా పోయింది. దీంతో విత్తనాల పంపిణీ ఎపుడూ అంటూ రైతులు కొద్ది రోజులుగా వ్యవసాయ అధికారుల(ఏవోల) చుట్టూ తిరుగుతున్నారు. ప్రభుత్వం నుంచి తగిన స్పందన లేకపోవడంతో వ్యవసాయాధికారులు ఏమీ చేయలేకపోతున్నారు. గత ఏడాది సెప్టెంబర్ 22 నుంచి విత్తనాల పంపిణీ మొదలైంది. ఈ సారి ఇప్పటి వరకు విత్తనాల పంపిణీపై ప్రభుత్వం నుంచే తగిన చర్యలు లేకపోవడంతో అధికారులు కూడ కొంత ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయమై జేడీఏ ఉమామహేశ్వరమ్మను వివరణ కోరగా.. విత్తనాలు సిద్ధంగా ఉన్నాయని.. ధరలు ఖరారు అయిన వెంటనే పొజిషన్ చేస్తామని చెప్పారు. -
రబీ సాగుకు సమాయత్తం కండి
– సబ్సిడీలో రైతులకు విత్తనాలు ఆర్ఏఆర్ఎస్ ఏడీఆర్, వ్యవసాయ శాఖ జేడీ వెల్లడి నంద్యాలరూరల్: రైతులు రబీసాగుకు సమాయత్తం కావాలని, ఇందుకు వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తలు కృషి చేయాలని నంద్యాల ఆర్ఏఆర్ఎస్ ఏడీఆర్ గోపాల్రెడ్డి, వ్యవసాయ శాఖ జిల్లా జాయింట్ డైరెక్టర్ ఉమామహేశ్వరమ్మ పిలుపునిచ్చారు. శుక్రవారం నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలోని ఏడీఆర్ సమావేశ మందిరంలో జిల్లాలోని ఏడీఏలు, వ్యవసాయ శాస్త్రవేత్తలతో ట్రై నింగ్ అండ్ విజిట్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఖరీఫ్లో వేసిన పంటలకు ఇటీవల కురిసిన వర్షాలు ప్రాణం పోశాయని, రబీ సాగుకు కూడా ఈ వర్షాలు ఎంతో మేలు చేస్తాయన్నారు. ప్రస్తుతం తెగుళ్లు సోకే అవకాశం ఉందని వాటి నివారణపై అధికారులు దృష్టి సారించాలని సూచించారు. పత్తిలో గులాబీ రంగు తెగుళ్లు ఆశించిందని, అయితే ఇటీవల భారీ వర్షం కారణంగా వాటి ఉద్ధ్ధృతి తగ్గిందని శాస్త్రవేత్తలు వివరించారు. జిల్లాలో రబీ కింద 3.8హెక్టార్లు సాగు అవుతుందని వారు వివరించారు. 98వేల క్వింటాళ్ల శనగ విత్తనాలు సబ్సిడీతో ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు. శనగ, వేరుశనగ, మినుము, పెసలు, పొద్దుతిరుగుడు, జొన్న తదితర పంటలను రైతులు రబీలో సాగు చేస్తారని శాస్త్రవేత్తలు, వ్యవసాయాధికారులు సంయుక్తంగా వారికి అవసరమైన సలహాలు, సూచనలు అందజేయాలని జేడీఏ, ఏడీఆర్ స్పష్టం చేశారు. ఈ విషయంలో నిర్లక్ష్యం ప్రదర్శించవద్దని స్పష్టం చేశారు. సమావేశంలో జిల్లాలోని అన్ని డివిజన్ల వ్యవసాయ సహాయ సంచాలకులు, ఆర్ఏఆర్ఎస్ సీనియర్, జూనియర్ వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారులు పాల్గొన్నారు. -
సరిపడా ఎరువులు తెప్పించండి
– కంపెనీల ప్రతినిధులకు జేడీఏ ఆదేశాలు కర్నూలు(అగ్రికల్చర్): వ్యవసాయశాఖ కమిషనర్ ఇచ్చిన సప్లయి ప్లాన్ మేరకు జిల్లాకు అవసరమైన మేరకు ఎరువులు తెప్పించాలని జేడీఏ ఉమామహేశ్వరమ్మ ఆదేశించారు. ఈ మేరకు గురువారం తన చాంబర్లో ఎరువుల కంపెనీల ప్రతినిధులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా వర్షాలు పడుతుండటం, రబీ సీజన్ కూడా ప్రారంభం కానుండటంతో అందుకు సరిపడా ఎరువులను సిద్ధంగా ఉంచాలని సూచించారు. మార్క్పెడ్, కంపెనీ గోదాములు, ప్రయివేటు డీలర్ల దగ్గర ఉన్న ఎరువుల నిల్వలపై సమీక్షించారు. ఈ నెలలో కంపెనీ వారీగా ఎన్ని ర్యాక్లు రావాలి, ఎన్ని వచ్చాయనే విషయంపై ఆరా తీశారు. రానున్న రోజుల్లో అవసరాలను కూడా దష్టిలో ఉంచుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా కంపెనీల ప్రతినిధులు మాట్లాడుతూ జిల్లాలో ఎరువులు పుష్కలంగా ఉన్నాయని, పెద్దగా డిమాండ్ లేదని తెలిపారు. సమావేశంలో డీడీఏ(పీపీ) మల్లికార్జునరావు, కర్నూలు ఏడీ రమణారెడ్డి, పర్టిలైజర్ ఏఓ వేదమణి తదితరులు పాల్గొన్నారు. -
కొనసాగుతున్న వర్షాలు
– పగిడ్యాలలో అత్యధికంగా 59.2 మి.మీ. వర్షపాతం – ఆదోని డివిజన్పై చిన్నచూపే – వర్షాలు పడితే రబీ పంటల సాగుకు అవకాశం కర్నూలు(అగ్రికల్చర్): బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం వల్ల జిల్లాలో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం ఉదయం నుంచి బుధవారం ఉదయం వరకు జిల్లాలోని 36 మండలాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిశాయి. జిల్లా మొత్తంగా సగటున 8.8 మి.మీ. వర్షపాతం నమోదైంది. అయితే ఆదోని రెవెన్యూ డివిజన్లో మాత్రమ చినుకు రాలలేదు. అత్యధికంగా పగిడ్యాలలో 59.2 మి.మీ. వర్షపాతం నమోదైంది. శ్రీశైలంలో 54 మి.మీ., ఆత్మకూరు 52, పాములపాడు 50.4, కొత్తపల్లి 43, వెలుగోడు 32.4, నందికొట్కూరు 28.2, జూపాడుబంగ్లా 28.2, మహానంది 12.2,గడివేములలో 10 మిమీ ప్రకారం వర్షాలు కురిశాయి. 26 మండలాల్లో తేలికపాటి వర్షాలు కురిశాయి. సెప్టంబర్ నెల సాధారణ వర్షపాతం 125.7 మిమీ ప్రకారం వర్షపాతం నమోదైంది. -
మేం కొనలేం..
ధాన్యం తీసుకెళ్లండి కొనుగోలు కేంద్రాల దుస్థితి ఇది ఇంకా తెరుచుకోని కొనుగోలు కేంద్రాలు దళారుల ఇష్టారాజ్యం.. రోజురోజుకు తగ్గిపోతున్న ధర నిల్వచేసుకునే వీలు లేక తెగనమ్మేస్తున్న అన్నదాత సర్కారు నిబంధనలతో దక్కని మద్దతు ధర గూడూరుకు చెందిన రంగయ్యనాయుడుకు రెండెకరాల పొలం ఉంది. ఎకరాకు 4 పుట్లు చొప్పున 8 పుట్ల ధాన్యం పండింది. నూర్పిళ్లు చేశాక ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తీసుకెళ్లారు. అక్కడ కేంద్రానికి తాళం వేసి ఉంది. అక్కడి నుంచి అధికారికి ఫోన్చేయగా ‘మేం కొనలేం.. తీసుకొచ్చిన ధాన్యాన్ని వెనక్కు తీసుకెళ్లండి’ అంటూ కట్చేశారు. ధాన్యాన్ని ఇంట్లో ఉంచుకునే చోటులేక.. మధ్యలోనే వ్యాపారస్తుడికి ఫోన్చేశారు. ఆ వ్యాపారి బస్తా రూ.వెయ్యికి అడిగారు. రంగయ్య బతిమలాడితే మరో రూ.50 పెంచాడు. బస్తా రూ.1050కి తెగనమ్మేసి ఇంటికి చేరుకున్నాడు. సాక్షి ప్రతినిధి, నెల్లూరు: జిల్లాలో ఎన్నడూలేని విధంగా రబీలో అధికారికంగా 5.4 లక్షల ఎకరాల్లో వరి పంటను సాగుచేశారు. పంటంతా దాదాపు కోతకు వచ్చింది. కొందరు నూర్పిళ్లు చేసి నివాసాల్లో దాచి ఉంచితే.. మరికొందరు పొలాల్లోనే నిల్వచేసుకుని మద్దతు ధర కోసం వేచిచూస్తున్నారు. రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం మద్దతు ధరకు కొనుగోలు చేయాల్సి ఉంది. అందుకోసం 164 కొనుగోలు కేంద్రాల ను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. వాటి ద్వారా 5లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అలా కొనుగోలు చేసిన ధాన్యాన్ని జిల్లా వ్యాప్తంగా ఉన్న మిల్లుల్లో నిల్వ చేయాలనుకున్నారు. ఆదిలో హంసపాదు జిల్లాలో ఈ ఏడు వరిని విస్తారంగా సాగుచేశారు. దిగుబడి కూడా ఆశించిన స్థాయిలో చేతికొచ్చింది. దీంతో రైతుల సంతోషానికి అవధుల్లేకుండా పోయింది. అయితే గిట్టుబాటుధర వారిని భయపెడుతోంది. ప్రభుత్వం ఇప్పటికే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాల్సి ఉంది. అయితే ఇప్పటివరకు జిల్లావ్యాప్తంగా కేవలం 16 కేంద్రాలను మాత్రమే ఏర్పాటు చేసింది. అందులో ఇంతవరకు ధాన్యం కొనుగోలు ప్రారంభించలేదు. రైతులు ధాన్యాన్ని కేంద్రాల వద్దకు తీసుకెళితే చేదు అనుభవం ఎదురవుతోంది. రైతులకు అన్యాయం ప్రభుత్వం రైతులు పండించిన ధాన్యాన్ని గిట్టుబాటు ధరకు కొనుగోలు చేసి మిల్లుల్లో నిల్వచేస్తుంది. అయితే ఈసారి ధాన్యాన్ని నిల్వ చేసుకునేందుకు మిల్లర్లు ముందుకు రాలేదు. అందుకు ప్రభుత్వం విధించిన నిబంధనలే కారణం. గతేడాది ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లర్ల వద్ద నిల్వచేశారు. ప్రభుత్వం అప్పగించిన ధాన్యానికి 60 శాతం బియ్యం ఇచ్చేవారు. అయితే ఈసారి ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లులో నిల్వచేయాలంటే ఆ వ్యాపారి బ్యాంకు గ్యారెంటీ చూపించాలని నిబంధన పెట్టింది. రూ.కోటి విలువచేసే ధాన్యం నిల్వచేసుకోవాలంటే అంతే మొత్తానికి ష్యూరిటీ ఇవ్వాలని అధికారులు చెబుతున్నారు. అయితే మిల్లర్లు మాత్రం ‘మాకు అంత అవసరం ఏముంది. 25 శాతం మాత్రం గ్యారెంటీ ఇస్తాం. నిల్వచేసేపనైతే చేయండి.. లేదంటే మీ ఇష్టమొచ్చినచోట్ల ఉంచుకోండి’ అని తెగేసి చెబుతున్నారు. అన్నదాతకు దక్కని మద్దతు ధర ధాన్యాన్ని నిల్వచేసుకునేందుకు ఐదారుగురు మిల్లర్లు తప్ప మిగిలిన వారు ముందుకు రావటం లేదు. దీంతో ఇప్పటివరకు ఏర్పాటు చేసిన 16 కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు ప్రారంభింలేదు. అదేవిధంగా కొత్తవాటిని ఏర్పాటు చేయలేని దుస్థితి. ప్రభుత్వ చర్యలతో దళారులు, వ్యాపారుల పంట పండుతోంది. మొదటి రకం ధాన్యానికి ప్రభుత్వ మద్దతు ధర రూ.1,450 ఉంటే.. వ్యాపారులు బస్తా రూ.1,200 నుంచి రూ.1,100కి కొనుగోలు చేసుకుంటున్నారు. అదేవిధంగా సాధారణ రకం రూ.1,410 ఉంటే.. వ్యాపారులు మాత్రం రూ.1,050 నుంచి రూ.1,070 వరకు కొనుగోలు చేస్తున్నారు. ప్రభుత్వ నిబంధనల పుణ్యమా అంటూ రైతులు పండించిన ధాన్యానికి మద్దతు ధర దక్కకటం లేదు. చేసిన అప్పులు తీర్చలేక వడ్డీలు మాత్రం చెల్లించి మిగిలిన మొత్తాన్ని వచ్చే ఏడాది తీరుస్తానని వ్యాపారులను వేడుకుంటున్నారు. అప్పులబాధతో తక్కువ ధరలకే విక్రయించాం: వ్యవసాయ పెట్టుబడుల కోసం అప్పులు చేశాం. పంట వచ్చింది. అప్పులవాళ్లు అడుగుతున్నారు. ఇటుచూస్తేమో మేం అనుకున్న ధరకు ధాన్యం అమ్ముడుపోయేలా కనిపించడం లేదు. అటు చూస్తేనేమో అప్పులబాధ తట్టుకోలేకపోతున్నాం. వడ్డీ భారం పెరుగుతుండటంతో తక్కువ ధరలకే ధాన్యం అమ్మేశాం. -మోపూరు చెంచురామయ్య, రైతు అధికారులు పట్టించుకోలేదు: వరికోతలు చివరి దశలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించారు. అయితే వాటి ద్వారా ఇంకా కొనుగోలు చేయటం లేదు. అప్పులబాధ భరించలేక వ్యాపారులకు విక్రయించాల్సి వస్తోంది. అయితే దళారులు మమ్మల్ని నిలువునా మోసం చేస్తున్నా అధికారులు పట్టించుకోలేదు. -మధుసూధన్రాజు,రైతు. -
సాగులో రెండంకెల వృద్ధికి ప్రణాళికలు - జేడీఏ కృపాదాసు
కొరిటెపాడు(గుంటూరు) : రాష్ట్ర ప్రభుత్వం అన్ని శాఖల్లో రెండంకెల వృద్ధి సాధించేందుకు లక్ష్యాలను నిర్ధేశించిందని జిల్లా వ్యవసాయశాఖ సంయుక్త సంచాలకుడు వి.డి.వి.కృపాదాసు పేర్కొన్నారు. స్థానిక కృషీ భవన్లో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. గతేడాది వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడంతో రెండంకెల వృద్ధి సాధించలేకపోయూమని తెలిపారు. రాబోయే ఖరీఫ్, రబీలలో పరిస్థితులను అధిగమించేందుకు ప్రణాళికలను సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు. భూసార పరీక్షా ఫలితాల ఆధారంగా వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తల సూచనల మేరకు ఎరువులు, పురుగుమందులు వాడుకోవాలని రైతులకు సూచించారు. ఈ ఏడాది 83 వేల మట్టినమూనాలు సేకరించి జూన్ నాటికి రైతులకు భూసార పరీక్షా ఫలితాలను అందిస్తామన్నారు. అలాగే ఈ ఏడాది 3 లక్షల మందికి సాయిల్ హెల్త్ కార్డులు ఇవ్వాలని నిర్ణయించామని తెలిపారు. భూసార పరీక్షా ఫలితాల ఆధారంగా భూమిలో సూక్ష్మధాతు లోపాలను గుర్తించి 50 శాతం రాయితీతో ఎరువులు, పురుగు మందులు సరఫరా చేయనున్నట్లు వెల్లడించారు. ఖరీఫ్ సీజన్కు ముందు అపరాలు, నూనెగింజలు, తృణధాన్యాలు వంటి పంటలను సాగు చేసుకోగలిగితే రైతులకు కొంత ఆదాయం చేకూరుతుందని తెలిపారు. జిల్లాలో లక్ష నీటి గుంతలు తవ్వించడానికి కసరత్తు చేస్తున్నామన్నారు. కస్టమ్స్ హైరింగ్ సెంటర్లు మాదిరిగానే రెయిన్ గన్స్ను రైతులకు ఇప్పించే ఆలోచన చేస్తున్నట్లు తెలిపారు. ఖరీఫ్ సీజన్ నాటికి పూర్తి స్థాయిలో జీరో బడ్జెట్ సేద్యాన్ని అందుబాటులోకి తీసుకురావాలనే అంశంపై ఎంపీఈవోలు, వ్యవసాయ విస్తరణ అధికారులకు పూర్తి స్థాయిలో శిక్షణ ఇస్తున్నట్లు వెల్లడించారు. పంట ఉత్పత్తులు మార్కెటింగ్ చేసుకునేందుకు రైతులను (500మంది) గ్రూపుగా ఏర్పాటు చేసి, ఆ గ్రూపును రిజిస్ట్రేషన్ చేసి వారికి అవసరమైన వనరులను నేరుగా మ్యాన్ఫ్యాక్చర్, ఎగుమతిదారుల ద్వారా మెరుగైన ధర లభించే ఏర్పాటు చేస్తున్నామని ఆయన వివరించారు. వ్యవసాయశాఖ డిప్యూటీ డెరైక్టర్ జి.వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.