Rahul
-
అతనితో హీరోయిన్ డేటింగ్.. ఊహించని విధంగా దొరికేసింది!
బాలీవుడ్ భామ శ్రద్ధాకపూర్ పేరు ఇటీవల తెగ మార్మోగిపోతోంది. కొద్ది రోజుల క్రితమే ఓ పెళ్లిలో సందడి చేసిన ఈ ముద్దుగుమ్మ.. మరోసారి తన బాయ్ఫ్రెండ్గా భావిస్తోన్న రాహుల్ మోడీతో కనిపించింది. వీరిద్దరు కలిసి జంటగా సన్నిహితుల వివాహా వేడుకలో పాల్గొన్నారు. దీంతో మరోసారి వీరిపై డేటింగ్ రూమర్స్ మొదలయ్యాయి. గతంలోనూ అనిల్ అంబానీ పెళ్లి వేడుకలోనూ జంటగా కనిపించారు. అంతేకాదు పలు ఈవెంట్లలో శ్రద్ధా కపూర్ అతనితో పాటు కనిపించింది. దీంతో వీరిద్దరి డేటింగ్ నిజమేనని బాలీవుడ్లో టాక్ తరచుగా వినిపిస్తూనే ఉంది.అయితే తాజాగా శ్రద్ధాకపూర్ మరోసారి హాట్టాపిక్గా మారింది. ముంబయిలో ఓ ఈవెంట్కు హాజరైన ఈ ముద్దుగుమ్మ ఫోటోగ్రాఫర్ల చేతికి చిక్కింది. దీంతో ఆమెను తమ కెమెరాల్లో బంధిస్తుండగా తన ఫోన్ కూడా కనిపించింది. ఆ ఫోన్లో తన బాయ్ఫ్రెండ్గా భావిస్తోన్న రాహుల్ మోడీతో దిగిన ఫోటో వాల్పేపర్గా కనిపించింది. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇది చూసిన కొందరు నెటిజన్స్ వీరిద్దరి డేటింగ్ నిజమేనంటూ కామెంట్స్ చేస్తున్నారు.కాగా.. ఇక సినిమాల విషయానికొస్తే శ్రద్ధా కపూర్ చివరిసారిగా హారర్ కామెడీ ఫిల్మ్ స్త్రీ- 2లో కనిపించింది. రాజ్ కుమార్ రావు కీలక పాత్రలో కనిపించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ. 800 కోట్లకు పైగా వసూలు చేసింది. ప్రస్తుతం ఆమె బాలీవుడ్లో మరో మూడు సినిమాల్లో కనిపించనుంది. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
ప్రియుడితో కలిసి పెళ్లికి హాజరైన స్టార్ హీరోయిన్.. వీడియో వైరల్
సాహో మూవీతో తెలుగు వారికి పరిచయమైన బాలీవుడ్ భామ శ్రద్ధాకపూర్ (Shraddha Kapoor). ఆ తర్వాత తెలుగు సినిమాల్లో పెద్దగా కనిపించలేదు. అయితే గతేడాది విడుదలైన స్త్రీ-2 మూవీతో బ్లాక్బస్టర్ హిట్ను తన ఖాతాలో వేసుకుంది. గతంలో వచ్చిన స్త్రీ చిత్రానికి సీక్వెల్గా ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ.500 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ చిత్రంలో రాజ్ కుమార్ రావు కీలక పాత్రలో కనిపించారు.రైటర్తో డేటింగ్..అయితే ఈ బాలీవుడ్ ముద్దుగుమ్మపై కొన్ని రోజులుగా డేటింగ్ రూమర్స్ వినిపిస్తోన్న సంగతి తెలిసిందే. ప్రముఖ బాలీవుడ్ సినీ రచయిత రాహుల్ మోదీతో పీకల్లోతు ప్రేమలో ఉన్నట్లు గతంలో వార్తలొచ్చాయి. అంతేకాదు వీరిద్దరు చాలాసార్లు ఈవెంట్లలో జంటగా కనిపించారు. అప్పటి నుంచే ఈ జంట రిలేషన్లో ఉన్నారంటూ బీటౌన్లో టాక్ వినిపిస్తూనే ఉంది. అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలోనూ తాను ప్రేమలో ఉన్నట్లు తెలిపింది శ్రద్ధాకపూర్. తమ రిలేషన్ గురించి అధికారికంగా ప్రకటించకపోయినా దీన్ని బట్టి వీరిద్దరు డేటింగ్లో ఉన్నారని అర్థమవుతోంది.పెళ్లిలో జంటగా..తాజాగా తన ప్రియుడిగా భావిస్తోన్న రాహుల్ మోదీతో కలిసి ఓ పెళ్లి వేడుకకు హాజరైంది ముద్దుగుమ్మ. గుజరాత్లో అహ్మదాబాద్లో జరిగిన స్నేహితుల పెళ్లిలో బాయ్ఫ్రెండ్తో కలిసి సందడి చేసింది. ఇద్దరు కలిసి నూతన వధూవరులతో ఫోటోలకు పోజులిచ్చారు. దీనికి సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. ఆ తర్వాత శ్రద్ధా కపూర్ సైతం పెళ్లికి హాజరైన చిత్రాలను సోషల్ మీడియాలో పంచుకుంది. ఈ పెళ్లి వేడుకలో పాల్గొనేందుకు శ్రద్దాకపూర్, రాహుల్ విమానంలో ఎకానమీ క్లాస్లో ప్రయాణించారు. కాగా.. గతేడాది జామ్నగర్లో జరిగిన అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ ప్రీ-వెడ్డింగ్ బాష్లో శ్రద్ధా కపూర్, రాహుల్ జంటగా కనిపించారు. అప్పటి నుంచే వీరిద్దరిపై డేటింగ్ రూమర్స్ మరింత వైరలయ్యాయి. Shraddha Kapoor and Rahul Mody at a friend's wedding in Ahmedabad last night ♥️ pic.twitter.com/PBRanqJeoR— 𝒔𝒉𝒓𝒂𝒅𝒅𝒉𝒂__𝒎𝒚__𝒋𝒂𝒂𝒏🦋 (@shraddhasmehnaz) February 22, 2025 -
ఓటీటీకి హ్యాపీ డేస్ హీరో మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
హ్యాపీ డేస్లో నటించిన హీరో రాహుల్ టైసన్, చేతన్ కుమార్, సాక్షి చౌదరి, అమీ ఏల, ఐశ్వర్య రాజ్ నటించిన చిత్రం "100 క్రోర్స్"(100 crores). గతేడాది సెప్టెంబర్ 20న థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమాకు బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. ఎస్ ఎస్ స్టూడియోస్ పతాకంపై దివిజ కార్తీక్, సాయి కార్తీక్ నిర్మించారు. ఈ చిత్రానికి విరాట్ చక్రవర్తి దర్శకత్వం వహించారు.తాజాగా ఈ మూవీ ఓటీటీలో సందడి చేసేందుకు సిద్ధమైంది. ఈనెల 11 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఈ సినిమా ప్రతి సన్నివేశం ఉత్కంఠభరితంగా ఉంటుంది. తర్వాత ఏం జరుగుతుందో ప్రేక్షకులు ఊహించలేరు. ఊహించని మలుపులతో, థ్రిల్లింగ్ యాక్షన్ సీక్వెన్సులతో కథ నడుస్తుంది. 2016లో జరిగిన యథార్థ కథ ఆధారంగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈ సినిమాకు సాయి కార్తీక్ సంగీతాన్ని అందించారు. నేనే నా, కాజల్ కార్తీక, కాళరాత్రి, లిటిల్ హార్ట్స్, టీనెజర్స్, శాకాహారి లాంటి మంచి చిత్రాలని ఆహా ఓటీటీ ద్వారా తెలుగు ప్రేక్షకులకు అందించిన హనుమాన్ మీడియా ఇప్పుడు "100 క్రోర్స్" చిత్రంతో మీ ముందుకు వస్తోంది.ఈ సందర్భంగా హనుమాన్ మీడియా అధినేత బాలు చరణ్ మాట్లాడుతూ..'100 క్రోర్స్ ఒక అద్భుతమైన యాక్షన్ క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్. జనవరి 11న ఆహా లో విడుదలయ్యే ఈ చిత్రం ఓటీటీ ప్రేక్షకులను తప్పకుండా అలరిస్తుంది. అందరూ తప్పక చూడండి. థియేటర్లలో ఈ చిత్రాన్ని మిస్ అయిన వారు, మళ్లీ చూడాలనుకునే వారు ఈ అవకాశాన్ని మిస్ చేసుకోకండి. 100 క్రోర్స్ ఆహాలో సూపర్ హిట్ అవుతుంది" అని తెలిపారు. -
క్రికెట్ జట్టులోకి పుల్వామా అమరవీరుడి కుమారుడు.. సెహ్వాగ్ పోస్ట్ వైరల్
టీమిండియా దిగ్గజ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ ఉద్వేగానికి లోనయ్యాడు. తమ పాఠశాలలో విద్యనభ్యసిస్తున్న రాహుల్ సోరెంగ్ విజయ్ మర్చంట్ ట్రోఫీ ఆడే జట్టుకు ఎంపిక కావడం గర్వంగా ఉందన్నాడు. కాగా రాహుల్ మరెవరో కాదు.. పుల్వామా ఘటనలో నింగికేగిన అమర వీరుడు విజయ్ సోరెంగ్ కుమారుడు.నాడు శోక సంద్రంలోకాగా కశ్మీర్లో 2019లో జరిగిన ఉగ్రదాడిలో నలభై మందికి పైగా భద్రతా బలగాల జవాన్లు అమరులైన విషయం తెలిసిందే. దేశం మొత్తాన్ని శోక సంద్రంలో ముంచిన ఈ ఘటన నేపథ్యంలో వీరూ భాయ్ నాడు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. అదే సమయంలో గొప్ప మనసు కూడా చాటుకున్నాడు.అమర వీరుల పిల్లలకు హర్యానాలోని సెహ్వాగ్ ఇంటర్నేషనల్ స్కూల్లో ఉచితంగా విద్యనందిస్తామని వాగ్దానం చేశాడు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన సైనికులకు తమకు చేతనైంత మేర రుణం తీర్చుకుంటామని పేర్కొన్నాడు. పిల్లలను ప్రయోజకులు చేయడంలో తమ వంతు పాత్ర పోషిస్తామని తెలిపాడు. ఆ హామీని వీరూ భాయ్ నిలబెట్టుకున్నాడు కూడా!సెహ్వాగ్ భావోద్వేగంఇప్పుడు అందుకు తగ్గ ప్రతిఫలం లభించింది. సెహ్వాగ్ స్కూళ్లో చదువుతూనే.. క్రికెట్లోనూ శిక్షణ తీసుకుంటున్న రాహుల్ సోరెంగ్.. హర్యానా అండర్-16 జట్టుకు ఎంపికయ్యాడు. ఈ నేపథ్యంలో హర్షం వ్యక్తం చేసిన వీరేంద్ర సెహ్వాగ్.. ‘‘రాహుల్ సోరెంగ్. ఈ పేరును గుర్తు పెట్టుకోండి.నా జీవితంలోని అత్యంత సంతోషకరమైన క్షణాల్లో ఇదీ ఒకటి. పుల్వామా దాడి వంటి విషాదకర ఘటన తర్వాత.. అమరుల పిల్లలకు సెహ్వాగ్ ఇంటర్నేషనల్ స్కూళ్లో ఉచిత విద్య, ఆవాసం కల్పిస్తానని మాట ఇచ్చాను.పుల్వామా అమరవీరుడు విజయ్ సోరెంగ్ గారి కుమారుడు రాహుల్ సోరెంగ్ 2019లో సెహ్వాగ్ ఇంటర్నేషనల్ స్కూల్లో చేరాడు. నాలుగేళ్లుగామ మాతో ప్రయాణం సాగిస్తున్న రాహుల్.. విజయ్ మర్చంట్ ట్రోఫీ అండర్-16 హర్యానా జట్టుకు ఎంపికయ్యాడు. కొన్ని విషయాలు మనసును రంజింపజేస్తాయి. మన జవాన్లకు ధన్యవాదాలు’’ అని సెహ్వాగ్ ఎక్స్ వేదికగా తన మనసులోని భావాలు పంచుకున్నాడు. చదవండి: D Gukesh: ప్రైజ్మనీలో టాక్స్ మినహాయింపు ఇవ్వండి: లేఖ రాసిన ఎంపీRemember the Name- Rahul Soreng. This is one of the happiest feelings in life. After the tragic Pulwama attack, had made an appeal to offer free education to children of our martyr’s study and stay in my @sehwagschool . I feel so privileged that Rahul Soreng , son of Pulwama… https://t.co/gKvrcyy767 pic.twitter.com/L0Qlc1hh3j— Virender Sehwag (@virendersehwag) December 18, 2024 -
‘ఇండియా’కు ఎవరు బెస్ట్? రాహుల్.. మమత బలాబలాలేమిటి?
న్యూఢిల్లీ: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల అనంతరం ఇండియా కూటమిలో చీలికలు మొదలయ్యాయి. అలాగే ఈ కూటమి నాయకత్వానికి సంబంధించిన చర్చలు జోరుగా సాగుతున్నాయి. ఇదే నేపధ్యంలో ఇండియా కూటమి సారధ్యంపై అటు కాంగ్రెస్, ఇటు టీఎంసీల మధ్య వాగ్వాదం కొనసాగుతోంది.‘ఇండియా’ సారధ్యం ఎవరికి?కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమికి వరుస అపజయాలు ఎదురవుతున్న నేపధ్యంలో ఇప్పుడు కూటమి సారధ్య బాధ్యతలు టీఎంసీ అధినేత మమతా బెనర్జీకి అప్పగించాలనే వాదన వినిపిస్తోంది. దీనికితోడు ఆమె కూడా ప్రతిపక్ష కూటమికి నాయకత్వ బాధ్యతలు వహించాలనే ఆకాంక్షను వ్యక్తం చేశారు. ఇటువంటి తరుణంలో దేశంలోని పలువురు మేధావులు, రాజకీయ పార్టీలు మమతా బెనర్జీవైపు మొగ్గుచూపడం ప్రారంభించారు. ఈ విషయంలో ప్రముఖ నేతలు లాలూ ప్రసాద్ యాదవ్, శరద్ యాదవ్లు మమతకు తమ ఓటు వేశారు.రాహుల్ గాంధీ నాయకత్వ లోపంఅటు హర్యానా, ఇటు మహారాష్ట్రలలో బీజేపీతో జరిగిన ప్రత్యక్ష పోరులో కూటమి ఓటమికి కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ నాయకత్వ లోపమే కారణమంటూ పలువురు ఆరోపిస్తున్నారు. ఇవి తృణమూల్ అధినేత మమతకు ఎక్స్ ఫ్యాక్టర్గా మారుతున్నాయి. ఈ నేపధ్యంలో అటు రాహుల్ గాంధీ, ఇటు మమతా బెనర్జీలలో ఎవరి బలాలు ఏమిటనేది చర్చనీయాంశంగా మారింది.మమతకు పెరుగుతున్న మద్దతుమమతా బెనర్జీకి ఇండియా కూటమి బాధ్యతలు అప్పగించే ప్రయత్నాలు జోరుగా జరుగుతున్నాయనే మాట వినిపిస్తోంది. టీఎంసీ నేతలు కూడా మమతనే కూటమికి తగిన సారధి అంటూ ప్రచారం సాగిస్తున్నారు. మమతా బెనర్జీ ఏడుసార్లు ఎంపీగా, నాలుగుసార్లు కేంద్రమంత్రిగా, మూడుసార్లు సీఎంగా రాజకీయాల్లో అపార అనుభవం సంపాదించారని టీఎంసీ నేతలు, కార్యకర్తలు చెబుతున్నారు. అందుకే ఆమెనే కూటమికి తగిన సారధి అంటూ స్పష్టం చేస్తున్నారు. సుపరిపాలనలో ఆమె రికార్డు అద్భుతంగా ఉందని, గత ఎన్నికల్లో బీజేపీని ఆమె చిత్తుగా ఓడించారని పలువురు విశ్లేషిస్తున్నారు. దేశవ్యాప్తంగా పలువురు నేతలు కూడా కూటమి సారధిగా ఆమె ఉంటేనే అధికార పక్షానికి తగిన సమాధానం చెప్పగలమని అంటున్నారు. అంతేకాకుండా మమత నేతలనందరినీ తన వెంట తీసుకెళ్లగల సామర్థ్యాన్ని కలిగివున్నారని వారు విశ్లేషిస్తున్నారు. ఇండియా కూటమికి అధినేత్రిగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఉండేందుకు మద్దతు పలికిన ప్రతిపక్ష నేతల జాబితాలో రాష్ట్రీయ జనతాదళ్ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్, సమాజ్వాదీ నేతలు అఖిలేష్ యాదవ్, రామ్ గోపాల్ యాదవ్ ఉన్నారు.మమతా బెనర్జీ సత్తా ఇదే..మమతా బెనర్జీ ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. 2011లో తొలిసారిగా ఆమె ముఖ్యమంత్రి అయ్యారు. మూడు సార్లు సీఎంగా ఉన్నారు. ఆమె టీఎంసీ అధినేత్రిగానూ వ్యవహరిస్తున్నారు. 1998లో కాంగ్రెస్ నుంచి విడిపోయి టీఎంసీ అంటే తృణమూల్ కాంగ్రెస్ను స్థాపించారు. మమత పలుమార్లు కేంద్రంలో మంత్రిగా ఉన్నారు. రెండుసార్లు రైల్వే మంత్రిగా ఉన్నారు. బొగ్గు మంత్రిత్వ శాఖ, మానవ వనరుల మంత్రిత్వ శాఖ, మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖలకు కూడా సారధ్యం వహించారు. ఆమె 2011 నుంచి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. మమతా బెనర్జీ ఏడుసార్లు ఎంపీగా ఉన్నారు.రాహుల్ గాంధీ అనుభవంయూపీలోని రాయ్బరేలీ ఎంపీ రాహుల్ గాంధీ ప్రస్తుతం లోక్సభలో ప్రతిపక్ష నేతగా కొనసాగుతున్నారు. మొన్నటి లోక్సభ ఎన్నికల్లో రాహుల్ రాయ్బరేలీ, వయనాడ్ రెండు స్థానాల్లోనూ గెలుపొందారు. అయితే ఆయన తన పార్లమెంటరీ నియోజకవర్గంగా రాయ్బరేలీని ఎంచుకున్నారు. ఆయన సోదరి ప్రియాంక వయనాడ్ ఎంపీగా ఇటీవలే ఎన్నికయ్యారు. రాహుల్ గాంధీ 2017 నుంచి 2019 వరకు కాంగ్రెస్ అధ్యక్షునిగా ఉన్నారు. ఆయన 2004లో క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చారు. అమేథీ నుంచి తొలిసారి ఎంపీగా గెలిచారు. 2009, 2014 ఎన్నికల్లో కూడా అమేథీ నుంచి గెలుపొందారు. 2019లో రాహుల్ గాంధీ అమేథీ స్థానం నుంచి స్మృతి ఇరానీ చేతిలో ఓటమిని చవిచూశారు. 2019లో ఆయన వయనాడ్ ఎంపీగా ఎన్నికయ్యారు. 2024 ఎన్నికల్లో రాయ్బరేలీ నుంచి పోటీ చేసిన ఆయన అక్కడి ఎంపీగా కొనసాగుతున్నారు. రాహుల్ గాంధీ ఒక్కసారి కూడా కేంద్ర మంత్రి కాలేదు.ఇది కూడా చదవండి: నేడు గీతా జయంతి: రూపాయికే భగవద్గీతను అందిస్తూ.. గీతాప్రెస్ వందేళ్ల ఘన చరిత్ర -
ఈడీ డైరెక్టర్గా రాహుల్ నవీన్
న్యూఢిల్లీ: ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) పూర్తికాలపు డైరెక్టర్గా రాహుల్ నవీన్ నియమితులయ్యారు. ఈడీ తాత్కాలిక చీఫ్గా వ్యవహరిస్తున్న ఆయనను బుధవారం పూర్తిస్థాయి డైరెక్టర్గా నియమించారు. నవీన్ ఇండియన్ రెవెన్యూ సరీ్వసు (ఐఆర్ఎస్) 1993 బ్యాచ్.. ఇన్కంట్యాక్స్ కేడర్కు చెందిన అధికారి. రాహుల్ నవీన్ను రెండేళ్ల కాలానికి, లేదా తదుపరి ఆదేశాలు వచ్చేవరకు (ఇందులో ఏది ముందైతే అది వర్తిస్తుంది) ఈడీ డైరెక్టర్గా నియమిస్తున్నట్లు క్యాబినెట్ నియామకాల కమిటీ ఆదేశాలు జారీచేసింది. 57 ఏళ్ల నవీన్ 2019 నవంబరులో స్పెషల్ డైరెక్టర్గా ఈడీలో చేరారు. ఈడీ డైరెక్టర్గా సంజయ్కుమార్ మిశ్రా పదవీకాలం గత ఏడాది సెపె్టంబరు 15న ముగియడంతో.. నవీన్ అప్పటినుండి తాత్కాలిక డైరెక్టర్గా వ్యవహరిస్తున్నారు. అంతర్జాతీయ పన్ను వ్యవహారాల్లో నవీన్ నిపుణులు. తాత్కాలిక డైరెక్టర్గా నవీన్ వ్యవహరించిన కాలంలోనే మనీలాండరింగ్ కేసుల్లో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ల సంచలన అరెస్టులు జరిగాయి. ఐఐటీ ఖరగ్పూర్ నుంచి ఎంటెక్ రాహుల్ నవీన్ బిహార్కు చెందిన వారు. ఐఐటీ ఖరగ్పూర్ నుంచి బీటెక్, ఎంటెక్ చేశారు. మెల్బోర్న్ (ఆ్రస్టేలియా)లోని స్విన్బుర్నే యూనివర్శిటీ ఆఫ్ టెక్నాలజీ నుంచి ఎంబీఏ పూర్తిచేశారు. ఆదాయపు పన్ను శాఖలో 30 ఏళ్లు పనిచేశారు. అంతర్జాతీయ ట్యాకేషన్స్పై నవీన్ రాసిన పలు వ్యాసాలను నాగ్పూర్లోని నేషనల్ అకాడమీ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్లో ట్రైనీ ఐఆర్ఎస్ విద్యార్థులకు పాఠాలుగా బోధిస్తున్నారు. ‘‘ఇన్ఫ్మర్మేషన్ ఎక్చేంజ్ అండ్ ట్యాక్స్ ట్రాన్స్పరెన్సీ: టాక్లింగ్ గ్లోబల్ ట్యాక్స్ ఎవాషన్ అండ్ అవాయిడెన్స్’’ శీర్షినక నవీన్ రాసిన పుస్తకం 2017లో ప్రచురితమైంది. -
తనకంటే చిన్నవాడితో హీరోయిన్ డేటింగ్.. క్లారిటీ ఇచ్చేసిందా?
బాలీవుడ్ భామ శ్రద్ధా కపూర్ గురించి పరిచయం చేయాల్సిన పనిలేదు. తెలుగులో సాహో చిత్రంలో మెప్పించింది. ప్రస్తుతం ఆమె బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉంది. స్ట్రీ-2, చందు ఛాంపియన్ చిత్రాల్లో నటిస్తోంది. గతేడాది తు ఝూథీ మెయిన్ మక్కార్ తన అభిమానులను అలరించింది. ఈ సినిమాలో రణబీర్ కపూర్ సరసన కనిపించింది. అయితే ఈ చిత్రానికి రాహుల్ మోడీ రచయితగా, అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశారు.ఇదిలా ఉండగా.. తాజాగా శ్రద్ధా కపూర్.. అతనితో ఉన్న ఫోటోలను ఇన్స్టా స్టోరీస్లో పంచుకుంది. అవీ కాస్తా వైరల్ కావడంతో ఇంతకీ అతను ఎవరా? అంటూ నెటిజన్స్ తెగ ఆరా తీస్తున్నారు. అయితే తు ఝూథీ మెయిన్ మక్కార్ సినిమా రిలీజ్ తర్వాత వీరిపై డేటింగ్ రూమర్స్ వచ్చాయి. సోషల్ మీడియాలో పెద్దఎత్తున వైరలయ్యాయి. ఈ నేపథ్యంలో తాజా పోస్ట్తో డేటింగ్పై క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ టాపిక్ బీ టౌన్లో హాట్ టాపిక్గా మారింది. కాగా.. రాహుల్ మోడీ ప్యార్ కా పంచ్నామా 2, సోను కే టిటు కి స్వీటీ, ప్యార్ కా పంచ్నామా పలు చిత్రాలకు రచయితగా పనిచేశారు. మరోవైపు అతను శ్రద్ధా కపూర్ కంటే మూడేళ్లు చిన్న అని తెలుస్తోంది. ప్రస్తుతం రాహుల్కు 34 ఏళ్లు కాగా..శ్రద్ధా కపూర్ 37 ఏళ్లు. కొద్దికాలంగా ఈ జంట పలు ఈవెంట్లలో సందడి చేశారు. దీంతో డేటింగ్ రూమర్స్ మరింత ఊపందుకున్నాయి. జామ్నగర్లో అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ బాష్లో శ్రద్ధా, రాహుల్ జంటగా కనిపించారు. -
నేడు రాయ్బరేలీ సీటుపై రాహుల్ కీలక ప్రకటన?
కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తన తల్లి సోనియా, సోదరి ప్రియాంకతో కలిసి నేడు (మంగళవారం) యూపీలోని రాయ్బరేలీకి వస్తున్నారు. ఈ సందర్భంగా జరిగే కార్యక్రమంలో ఆయన పార్టీ నేతలు, కార్యకర్తలు, ఓటర్లకు కృతజ్ఞతలు చెప్పనున్నారు. దీనితోపాటు రాయ్బరేలీ సీటు విషయంలో తన నిర్ణయం వెలిబుచ్చనున్నారని సమాచారం.గాంధీ కుటుంబానికి దశాబ్దాలుగా యూపీలోని అమేథీ, రాయ్బరేలీతో అనుబంధం ఉంది. అందుకే రాయ్బరేలీ ఎంపీగా రాహుల్గాంధీ కొనసాగుతారనే వాదన చాలాకాలంగా వినిపిస్తోంది. రాహుల్ రాయ్బరేలీతో పాటు కేరళలోని వయనాడ్ స్థానం నుంచి కూడా విజయం సాధించారు. ఉత్తరప్రదేశ్లోని 17 స్థానాల్లో కాంగ్రెస్ పోటీ చేసింది. అందులో ఆరుగురు ఎంపీలుగా ఎన్నికయ్యారు. కాంగ్రెస్ ఓటు బ్యాంకు 6.36 శాతం నుంచి 9.46 శాతానికి పెరిగింది. దాదాపు 40 ఏళ్ల తర్వాత ప్రయాగ్రాజ్, సహరాన్పూర్లలో కాంగ్రెస్ ఖాతా తెరిచింది.రాయ్బరేలీలో రాహుల్ గాంధీకి 66.17 శాతం ఓట్లు రాగా, 2019లో సోనియా గాంధీకి ఇదే సీటు నుంచి 55.80 శాతం ఓట్లు వచ్చాయి. 2019లో రాహుల్ గాంధీ అమేథీలో ఓటమిని చవిచూశారు. అయితే ఈసారి గాంధీ కుటుంబానికి సన్నిహుతుడైన కిషోరి లాల్ శర్మ 54.99 శాతం ఓట్లు దక్కించుకున్నారు. ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్ రాయ్బరేలీలో ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తోంది. దీనిలో రాహుల్ తాను రాయ్ బరేలీ ఎంపీగా కొనసాగుతాననే సందేశాన్ని ఇస్తారని పలువురు కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు.భూమా అతిథి గృహంలో జరిగే ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యురాలు సోనియా గాంధీ, రాయ్బరేలీ ఎంపీ రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ, అమేథీ ఎంపీ కేఎల్ శర్మ, రాష్ట్ర అధ్యక్షుడు అజయ్ రాయ్, ఇతర సీనియర్ నేతలు, కార్యకర్తలు పాల్గొననున్నారు. -
రాహుల్ వయనాడ్ వదిలి.. రాయ్బరేలీ ఎంపీ అవుతారా?
2024 లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రెండు స్థానాల్లో పోటీ చేసి, రెండు చోట్లా విజయం సాధించారు. నిబంధనల ప్రకారం ఒక నేత రెండు స్థానాలలో ఎంపీగా ఉండకూడదు. దీంతో రాహుల్ గాంధీ వయనాడ్ సీటును వదులుకుంటారా లేక రాయ్ బరేలీ సీటును వదులుకుంటారా అనే ప్రశ్న అందరిలో తలెత్తుతోంది. అయితే తాజా సమాచారం ప్రకారం ఆయన వయనాడ్ సీటును వదిలి, రాయ్ బరేలీకి ఎంపీగా కొనసాగుతారని తెలుస్తోంది.రాహుల్ గాంధీ కేరళలోని వయనాడ్ లోక్సభ స్థానాన్ని వదిలిపెట్టడానికి కారణం సోనియా గాంధీ అని చెబుతున్నారు. ఎందుకంటే రాయ్బరేలీ సీటు కాంగ్రెస్కు సాంప్రదాయక స్థానం. రాహుల్ గాంధీ తల్లి సోనియా గాంధీ మాజీ పార్లమెంటు స్థానం కూడా ఇదే. గతంలో సోనియా గాంధీ రాయ్బరేలీ ప్రజలను ఉద్దేశిస్తూ ఉద్వేగభరితమైన విజ్ఞప్తి చేశారు.తన జీవితమంతా రాయ్బరేలీ ప్రజల ప్రేమ, ఆశీర్వాదాలతో నడిచిందని, ఒంటరితనాన్ని దూరం చేసిందని పేర్కొన్నారు. తన కుమారుడని రాయ్బరేలీ ప్రజలకు అప్పగిస్తున్నానని, రాహుల్ను మీవాడిగా చూసుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు.కేరళలోని వయనాడ్ లోక్సభ స్థానం నుంచి రాహుల్ గాంధీ వరుసగా రెండోసారి విజయం సాధించారు. లోక్సభ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత రాహుల్ మాట్లాడుతూ తాను రాయ్బరేలీ, వయనాడ్ స్థానాలను గెలుచుకున్నానని, ఈ రెండు లోక్సభ స్థానాల ఓటర్లకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని పేర్కొన్నారు. తాను ఈ రెండు స్థానాలకు ఎంపీని కావాలనుకుంటున్నానని, అయితే ఏదో ఒకటే ఎంపిక చేసుకోవాలని, దీనిపై చర్చించి ఏ సీటును ఎంపిక చేసుకోవాలో నిర్ణయించుకుంటానని రాహుల్ తెలిపారు. -
స్మృతి ఇరానీకి చుక్కలు చూపించిన కేఎల్ శర్మ ఎవరు?
లోక్సభ ఎన్నికల ఫలితాలు సంచలనం రేపుతున్నాయి. యూపీలోని అమేథీ లోక్సభ స్థానం నుంచి పోటీకి దిగిన కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ వెనుకంజలో ఉండటం పలువురిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇక్కడి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన కిషోరి లాల్ శర్మ (కేఎల్ శర్మ) ఓట్ల ఆధిక్యంతో స్మృతీ ఇరానికి చుక్కలు చూపిస్తున్నారు. కాంగ్రెస్ వ్యూహం, దూకుడుతనం, ఎన్నికల ప్రచారం కేఎల్ శర్మకు కలసివచ్చే అంశాలుగా పరిణమించాయని అంటున్నారు. ఈ నేపధ్యంలో కేఎల్ శర్మ బ్యాక్ గ్రౌండ్ ఏమిటో తెలుసుకునేందుకు పలువురు ఆసక్తి చూపిస్తున్నారు.కెఎల్ శర్మకు గాంధీ కుటుంబంతో పాత పరిచయం ఉంది. చాలా కాలంగా రాయ్బరేలీలో ఉంటూ, కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి సలహాదారుగా శర్మ వ్యవహరిస్తున్నారు. పార్టీ కార్యకలాపాల్లో కీలకపాత్ర పోషించే ఆయన గాంధీ కుటుంబపు ఎన్నికల ప్రచారంలోనూ కీలకపాత్ర పోషిస్తుంటారు. కెఎల్ శర్మ రాజీవ్ గాంధీకి కూడా అత్యంత సన్నిహితునిగా పేరొందారు.కేఎల్ శర్మ అమేథీలో 1983, 1991 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ఎంతగానో పాటుపడ్డారు. 1999లో సోనియా గాంధీ మొదటి ఎన్నికల ప్రచారంలో కూడా శర్మ కీలక పాత్ర పోషించారు. ఆయన కృషి కారణంగానే అమేథీలో సోనియా విజయం సాధించారని చెబుతారు. అయితే 2019 లోక్సభ ఎన్నికల్లో రాహుల్ గాంధీని బీజేపీ అభ్యర్థి స్మృతి ఇరానీ ఓడించారు. మరి ఇప్పుడు కెఎల్ శర్మ ఎటువంటి ఫలితాలు రాబడతారనే దానిపై అందరి దృష్టి నెలకొంది. -
ఢిల్లీ మెట్రోలో రాహుల్.. ఫొటో వైరల్
దేశంలో లోక్సభ ఎన్నికలు జరుగుతున్నాయి. ఐదు దశల ఎన్నికలు ఇప్పటికే ముగియగా, ఇంకా మరో రెండు దశల ఎన్నికలు మిగిలివున్నాయి. ఈ క్రమంలో మే 25న ఢిల్లీలో ఆరో దశలో ఎన్నికలు జరగనున్నాయి.ఈ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సామాన్య ప్రజలకు చేరువయ్యేందుకు ఢిల్లీ మెట్రోలో ప్రయాణించారు. రాహుల్ గాంధీ మెట్రోలో ప్రయాణిస్తున్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఢిల్లీ మెట్రోలో ప్రయాణిస్తున్న రాహుల్ గాంధీ సామాన్య ప్రజలతో మమేకమై, వారితో ఫొటోలు కూడా దిగారు. రాహుల్ గాంధీ ఢిల్లీ మెట్రోలో మంగోల్పురిలో జరిగే ర్యాలీకి బయలుదేరారు. ఆయనతో పాటు ఈశాన్య ఢిల్లీ లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థి కన్హయ్య కుమార్ కూడా ఉన్నారు. ఢిల్లీలో మే 25వ తేదీన ఓటింగ్ జరగనుంది. -
‘బీజేపీ చేయలేని పని రాహుల్ చేస్తున్నారు’
లోక్సభ ఎన్నికలు చివరి దశకు చేరుకుంటున్నాయి. ఐదు దశల ఎన్నికల ఓటింగ్ పూర్తియ్యింది. ఇక రెండు దశలు మాత్రమే మిగిలివున్నాయి. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి 400పైగా సీట్లను దక్కించుకుంటామని చెబుతోంది. అదే సమయంలో ఇండియా కూటమి కూడా తాము సాధించే సీట్లపై అంచనాలు వేసుకుంటోంది. ఇదిలా ఉంటే తాజాగా కాంగ్రెస్ పార్టీ మాజీ నేత ఆచార్య ప్రమోద్ కృష్ణం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాహుల్ గాంధీ అందరికన్నా మహనీయుడని వ్యంగ్యంగా అన్నారు.రాహుల్ గాంధీ గొప్ప వ్యక్తి అని, ఆయన దేనికైనా సమాధానం చెప్పగలరని ప్రమోద్ కృష్ణం అన్నారు. మొదటి నుంచి రాహుల్ అన్ని విషయాలను ఎక్కువ చేసి చెబుతారని, అతని గురించి ఏమి చెప్పగలనని ప్రశ్నించారు. రాహుల్ గాంధీకి కృతజ్ఞతలు. నాడు కాంగ్రెస్ను రద్దు చేయాలని మహాత్మా గాంధీ కలలు కన్నారు. అయితే బీజేపీ కూడా ఆ పని చేయలేకపోయింది. ఇప్పుడు రాహుల్ గాంధీ ఆ పని చేస్తున్నారని ప్రమోద్ కృష్ణం పేర్కొన్నారు.కాంగ్రెస్ను నాశనం చేసేందుకు రాహుల్ గాంధీ కంకణం కట్టుకున్నారని ప్రమోద్ కృష్ణం ఆరోపించారు. ఈ విషయంలో రాహుల్ తన బాధ్యతలను చాలా చక్కగా నిర్వర్తిస్తున్నారు. ఈ విషయం దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది కాంగ్రెస్ కార్యకర్తలకు తెలుసు. జూన్ 4 తర్వాత ఇప్పటి వరకు అతి తక్కువ సీట్లు గెలుచుకున్న పార్టీగా కాంగ్రెస్ నిలుస్తుందని ప్రమోద్ కృష్ణం అన్నారు. -
రేపే లోక్సభ ఐదో దశ పోలింగ్.. అందరి చూపు వీళ్లపైనే!
2024 లోక్సభ ఎన్నికల్లో ఐదో దశ పోలింగ్ మే 20న జరగనుంది. ఈ దశలో 8 రాష్ట్రాల్లోని 49 స్థానాలలో ఓటింగ్ జరగనుంది. పలువురు ప్రముఖులు ఈ దశలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ యూపీలోని లక్నో లోక్సభ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. అతనిపై సమాజ్వాదీ పార్టీ రవిదాస్ మెహ్రోత్రాను తమ అభ్యర్థిగా నిలబెట్టింది. మంత్రిగా పనిచేసిన మెహ్రోత్రా ప్రస్తుతం లక్నో సెంట్రల్ అసెంబ్లీ స్థానానికి చెందిన ఎమ్మెల్యేగా ఉన్నారు.రాహుల్ గాంధీ ఉత్తరప్రదేశ్లోని రాయ్బరేలీ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. భారతీయ జనతా పార్టీ ఇక్కడి నుంచి దినేష్ ప్రతాప్ సింగ్ను అభ్యర్థిగా ప్రకటించింది. సోనియా గాంధీ తన కుమారుడు రాహుల్ గాంధీ కోసం తన సీటును వదులుకున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.భారతీయ జనతా పార్టీ కేంద్ర మంత్రి స్మృతి ఇరానీని అమేథీ అభ్యర్థిగా నిలబెట్టింది. ఇక్కడి నుంచి గాంధీ కుటుంబానికి సన్నిహితుడైన కేఎల్ శర్మను కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థిగా నిలబెట్టింది.చిరాగ్ పాశ్వాన్ బీహార్లోని హాజీపూర్ లోక్సభ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. ఈయన ఎన్డీఏ కూటమిలోని ఎల్జేపీ (ఆర్)కి చెందిన నేత. కాగా ఇదే స్థానం నుంచి శివచంద్ర రామ్ను ఆర్జేడీ తమ అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దించింది.ఒమర్ అబ్దుల్లా కాశ్మీర్లోని బారాముల్లా స్థానం నుంచి జమ్ముకశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ తరపున ఎన్నికల బరిలోకి దిగారు. ఒమర్పై మెహబూబా ముఫ్తీ పార్టీ పీడీపీ నుంచి ఫయాజ్ అహ్మద్ పోటీకి దిగారు. గత ఎన్నికల్లో నేషనల్ కాన్ఫరెన్స్ అభ్యర్థి అక్బర్ లోన్ ఈ స్థానంలో విజయం సాధించారు.ఐదో దశ ఎన్నికల పోరులో మోదీ ప్రభుత్వానికి చెందిన పలువురు మంత్రులు రంగంలోకి దిగారు. ముంబై నార్త్ నుండి పీయూష్ గోయల్, మోహన్లాల్గంజ్ నుండి కౌశల్ కిషోర్, లక్నో నుండి రాజ్నాథ్ సింగ్, అమేథీ నుండి స్మృతి ఇరానీ, ఫతేపూర్ నుండి సాధ్వి నిరంజన్ జ్యోతి, దిండోరి నుండి డాక్టర్ భారతీ ప్రవీణ్ పవార్, కోడెర్మా నుండి అన్నపూర్ణా దేవి, భివాండి నుండి కపిల్ పాటిల్ ఈ జాబితాలో ఉన్నారు. -
స్మృతితో రాహుల్ ఎందుకు పోటీ పడలేదు?.. గెహ్లాట్ వివరణ!
ఉత్తరప్రదేశ్లోని అమేథీ నియోజకవర్గం 2024- లోక్సభ ఎన్నికల్లో చర్చనీయాంశంగా మారింది. చాలా ఏళ్లుగా కాంగ్రెస్, రాహుల్ గాంధీలకు కంచుకోటగా ఉన్న ఈ స్థానం ఆ తరువాత బీజేపీకి దక్కింది. ఇక్కడి నుంచి స్మృతి ఇరానీ ఎంపీ అయ్యారు. ఈసారి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తిరిగి అమేథీ నుంచి పోటీ చేయనున్నారనే ప్రచారం గతంలో జోరుగా సాగినా అది కార్యరూపం దాల్చలేదు. కాంగ్రెస్ హైకమాండ్ స్మృతి ఇరానీ ఎదుట కేఎల్ శర్మను తమ అభ్యర్థిగా ప్రకటించింది. రాహుల్ గాంధీకి రాయ్ బరేలీ స్థానాన్ని అప్పగించింది. అదిమొదలు బీజేజీ ప్రతిపక్ష పార్టీపై మాటల దాడి చేస్తూనే ఉంది. స్మృతి ఇరానీపై రాహుల్ గాంధీ ఎన్నికల్లో ఎందుకు పోటీకి దిగలేదంటూ ప్రశ్నిస్తోంది.దీనికి రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత అశోక్ గెహ్లాట్ సమాధానం ఇచ్చారు. కేఎల్ శర్మ 40 ఏళ్లుగా కాంగ్రెస్ కార్యకర్తగా ఉన్నారని, గాంధీ కుటుంబం ఆధ్వర్యంలో పగలు రాత్రి పనిచేసిన శర్మను అమేథీ అభ్యర్థిగా ఎంపిక చేయడంలో తప్పేముంది? రాహుల్ గాంధీనే అమేథీకి ఎందుకు వెళ్లాలని, కేఎల్ శర్మ సరిపోతారని గెహ్లాట్ అన్నారు.రాహుల్ గాంధీని రాయ్బరేలీ నుంచి పోటీ చేయించాలని పార్టీ భావించిందని, అక్కడ రాహుల్ గెలుస్తారని అన్నారు. అమేథీలో కెఎల్ శర్మ విపక్షాలను ఎదుర్కొంటారని పేర్కొన్నారు. శర్మ అటు పార్టీ కోసం ఇటు ప్రజల కోసం పనిచేస్తున్నారని తెలిపారు. సోనియా గాంధీ కూడా శర్మను మెచ్చుకున్నారని, అతనికి అమేథీ ప్రజల సమస్యల గురించి తెలుసని, అక్కడి సమస్యల పరిష్కారానికి ఆయన ఒక ప్రణాళిక రూపొందించారని గెహ్లాట్ వివరించారు. -
వయనాడ్, రాయ్బరేలీ.. గెలిస్తే రాహుల్ దేనిని వదిలేస్తారు?
ఐదో దశ నామినేషన్ల చివరి రోజు వరకు యూపీలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఎక్కడి నుంచి పోటీ చేయనున్నారనే ఉత్కంఠను ఆ పార్టీ కొనసాగించింది. అయితే చివరికి ఆయన రాయ్బరేలీ నుంచి పోటీ చేస్తున్నట్లు పార్టీ వెల్లడించింది. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ మరో సస్పెన్స్కు తెరలేపింది. ఈ లోక్సభ ఎన్నికల్లో ఒకవేళ రాహుల్ అటు కేరళలోని వయనాడ్, ఇటు యూపీలోని రాయ్బరేలీలలో గెలిస్తే ఏ సీటును వదులుకుంటారనే ప్రశ్న ఇప్పుడు అందరిలోనూ మెదులుతోంది.గాంధీ కుటుంబానికి కంచుకోటగా ఉన్న రాయ్బరేలీ నుంచి మే 3న రాహుల్ గాంధీ నామినేషన్ దాఖలు చేశారు. రాహుల్కు ముందు ఆయన తల్లి సోనియా గాంధీ ఈ స్థానానికి వరుసగా 20 ఏళ్ల పాటు ప్రాతినిధ్యం వహించారు. ఇప్పుడు ఆమె రాజ్యసభ సభ్యురాలు. ఇదిలా ఉండగా వయనాడ్, రాయ్బరేలీలలో గెలిస్తే రాహుల్ దేనిని వదిలేస్తారు? అనే ప్రశ్నకు లక్నో యూనివర్శిటీ రాజనీతి శాస్త్ర విభాగాధిపతి ప్రొఫెసర్ సంజయ్ గుప్తా విశ్లేషణ చేశారు.తల్లి రాజకీయ వారసత్వం కోసం రాహుల్ గాంధీ అమేథీని వదిలి, రాయ్బరేలీ నుంచి నామినేషన్ దాఖలు చేశారు. ఈ నిర్ణయం ద్వారా రాహుల్ గాంధీ సురక్షితమైన పందెం ఆడారు. మొదటిది బీజేపీ మహిళా నేత, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీతో పోటీపడితే గతంలో మాదిరిగా పరాభవం ఎదురుకాకుండా చూసుకున్నారు. మరోవైపు తన తల్లి గతంలో పోటీ చేసి, విజయం సాధించిన రాయ్బరేలీ స్థానాన్ని కాపాడుకునే ప్రయత్నం కూడా చేశారు.ఇక వయనాడ్ విషయానికొస్తే ముస్లిం, క్రైస్తవ ఓటర్లు అధికంగా ఉన్న ఈ లోక్సభ స్థానం సురక్షితమని రాహుల్ గాంధీ భావించారు. అలాగే అమేథీలో కన్నా రాయ్బరేలీలో పోటీ చేయడమే సరైనదని రాహుల్ నిర్ణయించుకున్నారు. 2019 లోక్సభ ఎన్నికల్లో వయనాడ్లో రాహుల్కు 7 లక్షల 6,000 ఓట్లు వచ్చాయి. ఆయన ప్రత్యర్థికి కేవలం రెండు లక్షల నాలుగు వేల ఓట్లు మాత్రమే దక్కాయి.అయితే ఈసారి వయనాడ్లో పరిస్థితులు మారాయి. రాష్ట్రంలోని అధికార వామపక్ష కూటమి ఈసారి అభ్యర్థిని మార్చింది. ఈసారి బీజేపీ ప్రధాన కార్యదర్శి డి.రాజా భార్య అన్నే రాజాపై రాహుల్ ఎన్నికల బరిలోకి దిగారు. గతంలో మాదిరిగానే ఈసారి కూడా రాహుల్కు ఇండియన్ ముస్లిం లీగ్ మద్దతు ఉంది. అయితే ఇక్కడ బీజేపీ కూడా తన సత్తాను చాటుకునే ప్రయత్నంలో ఉంది. ఒకవేళ రాహుల్ అటు వయనాడ్, ఇటు రాయ్బరేలీ రెండింటిలో గెలిస్తే రాయ్బరేలీని వదులుకుని, వయనాడ్కు ప్రాతినిధ్యం వహించే అవకాశాలున్నాయని ప్రొఫెసర్ సంజయ్ గుప్తా అన్నారు. అయితే అటువంటి సందర్భం ఏర్పడినప్పుడు రాయ్బరేలీకి జరిగే ఉప ఎన్నికలో రాహుల్ సోదరి ప్రియాంక పోటీ చేసి, గాంధీ కుటుంబపు కంచుకోటకు కాపాడే ప్రయత్నిం చేస్తారని ఆయన తన అభిప్రాయం తెలిపారు. -
రాయ్బరేలీలో రాహుల్కు దినేష్ పోటీనివ్వగలరా?
ఎట్టకేలకు రాయ్బరేలీ కాంగ్రెస్ అభ్యర్థి ఎవరనేది తేలిపోయింది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇక్కడి నుంచి బీజేపీ అభ్యర్థి దినేష్ ప్రతాప్ సింగ్పై పోటీకి దిగారు. మరి దినేష్.. రాహుల్కు తగిన పోటీని ఇవ్వగలరా? బీజేపీ అభ్యర్థి బ్యాక్గ్రౌండ్ ఏమిటి?ఉత్తరప్రదేశ్లోని రాయ్బరేలీని గాంధీ కుటుంబానికి కంచుకోటగా పరిగణిస్తుంటారు. ఈసారి ఇక్కడ నుంచి ఎన్నికల్లో పోటీ చేసేందుకు సోనియా గాంధీ నిరాకరించారు. దీంతో ఆమె కుమారుడు రాహుల్ గాంధీ రాయ్బరేలీ నుంచి పోటీకి దిగారు. ఇదే స్థానం నుంచి బీజేపీ తన అభ్యర్థిగా దినేష్ ప్రతాప్ సింగ్ను బరిలో నిలిపింది.2018లో దినేష్ కాంగ్రెస్ను వీడి బీజేపీలో చేరారు. ఆ మరుసటి ఏడాది ఆయనకు బీజేపీ లోక్సభ టిక్కెట్ ఇచ్చింది. 2019 లోక్సభ ఎన్నికల్లో సోనియా గాంధీపై దినేష్ ప్రతాప్ సింగ్ పోటీ చేశారు. అయితే సోనియా గాంధీ 1,67,178 ఓట్లతో విజయం సాధించారు. ప్రస్తుతం యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వంలో ఎమ్మెల్సీ దినేష్ ప్రతాప్ సింగ్ రాష్ట్ర మంత్రిగా ఉన్నారు. రాయ్బరేలీ రాజకీయాలలో పంచవటి వర్గం ఆధిపత్యం చెలాయిస్తుంది. దినేష్ పంచవటి వర్గానికి చెందినవారు. ఆయన గుణవర్ కమంగల్పూర్ గ్రామ నివాసి.రాయ్బరేలీ రాజకీయాలలో దినేష్ కుటుంబానికి ఆదరణ ఉంది. ఒకప్పుడు ఆయన సోనియా గాంధీకి అత్యంత సన్నిహితునిగా పేరొందారు. 2010లో తొలిసారిగా, 2016లో రెండోసారి కాంగ్రెస్ నుంచి దినేష్ ప్రతాప్ సింగ్ ఎమ్మెల్సీ అయ్యారు. 2018లో కాంగ్రెస్ను వీడి, బీజేపీలో చేరారు. మరి ఈ లోక్సభ ఎన్నికల్లో బీజేపీ నేత దినేష్ కాంగ్రెస్కు ఎంతవరకూ పోటీనివ్వగలరో వేచిచూడాలి. -
నేడు అమేథీలో స్మృతి ఇరానీ నామినేషన్
ఈరోజు (ఆదివారం) భారతీయ జనతా పార్టీ(బీజేపీ) మహిళా నేత స్మృతి ఇరానీ యూపీలోని అమేథీ లోక్సభ స్థానానికి తన నామినేషన్ దాఖలు చేయనున్నారు. దీనికి ముందు ఆమె అయోధ్యలోని రామ్లల్లాను దర్శించుకోనున్నారు. అనంతరం ఆమె తన లోక్సభ నియోజకవర్గానికి వెళ్లి నామినేషన్ పత్రాలను దాఖలు చేయనున్నారు. మే 20న అమేథీలో ఐదో దశలో ఓటింగ్ జరగనుంది. అభ్యర్థుల నామినేషన్ ప్రక్రియ శుక్రవారం (ఏప్రిల్ 26) ప్రారంభమైంది. ఐదో దశలో మొత్తం 49 స్థానాలకు పోలింగ్ జరగనుంది.అమేథీలో నామినేషన్కు చివరి తేదీ మే 3. దీంతో కాంగ్రెస్కు ఈ సీటు నుంచి పోటీచేయబోయే అభ్యర్థిని ప్రకటించడానికి ఎక్కువ సమయం లేదు. కాంగ్రెస్ పార్టీ అమేథీలో తన అభ్యర్థిని ఇంకా నిర్ణయించలేదు. అయితే రాహుల్ గాంధీ ఈ స్థానం నుండి మరోసారి పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అమేథీ నియోజకవర్గం చాలాకాలంపాటు గాంధీ కుటుంబం ఆధీనంలో ఉంది. అయితే 2019లో రాహుల్ను ఓడించడం ద్వారా స్మృతి ఇరానీ ఇక్కడ కాంగ్రెస్ ఆధిపత్యానికి స్వస్తి పలికారు. అయితే ఇప్పుడు స్మృతిని ఓడించి, కాంగ్రెస్ కోల్పోయిన స్థానాన్ని తిరిగి పొందేందుకు రాహుల్ ప్రయత్నించనున్నారని సమాచారం.అమేథీతో పాటు రాయ్బరేలీ లోక్సభ స్థానానికి కూడా ఇప్పటివరకు కాంగ్రెస్ ఎవరికీ టిక్కెట్ కేటాయించలేదు. ఈ సీటు కూడా కాంగ్రెస్ సంప్రదాయ సీటు. 2019లో కాంగ్రెస్ గెలిచిన ఏకైక సీటు ఇదే. సోనియాగాంధీ ఇక్కడి నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. ఇప్పుడు ఆమె ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో ఈ సీటు నుంచి సోనియా కుమార్తె ప్రియాంక ఎన్నికల బరిలో దిగవచ్చని తెలుస్తోంది. ప్రియాంక భర్త రాబర్ట్ వాద్రా కూడా ఎన్నికల్లో పోటీ చేస్తారని తెలుస్తున్నప్పటికీ ఆయన ఎక్కడి నుంచి పోటీ చేయనున్నారనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. -
అమేథీ నుంచి రాహుల్.. రాయ్బరేలీ నుంచి ప్రియాంక? నామినేషన్లకు సన్నాహాలు?
దేశంలో లోకసభ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికలల్లో తమ నామినేషన్లు వేసేముందు వయనాడ్ కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రాలు అయోధ్యలోని రామ్ లల్లాను దర్శించుకోనున్నారని సమాచారం. కాంగ్రెస్ వర్గాల నుంచి మీడియాకు అందిన సమాచారం ప్రకారం ఏప్రిల్ 26న కేరళలోని వయనాడ్కు పోలింగ్ పూర్తయిన తర్వాత గాంధీ కుటుంబం అమేథీ, రాయ్బరేలీ లోక్సభ నియోజకవర్గాలపై దృష్టి పెట్టనున్నదని సమాచారం. అమేథీలో రాహుల్ గాంధీ, రాయ్బరేలీలో ప్రియాంక గాంధీ వాద్రా నామినేషన్ వేయనున్నారని, దీనికి ముందు వారు అయోధ్యలో కొలువైన రామ్లల్లాను దర్శించుకోనున్నారని సమాచారం. వయనాడ్లో ఓటింగ్ ఏప్రిల్ 26న ముగియనుంది. అదే రోజున రాయ్బరేలీ, అమేథీ స్థానాలకు నామినేషన్ ప్రక్రియ మొదలు కానుంది.మీడియాకు అందిన సమాచారం ప్రకారం అమేథీ, రాయ్బరేలీలలో పోటీ విషయమై ఏప్రిల్ 30లోపు కాంగ్రెస్ అధికారిక ప్రకటన చేయనున్నదని సమాచారం. ఈ స్థానాల అభ్యర్థుల విషయంలో కాంగ్రెస్ హైకమాండ్ మౌనం వహిస్తూ వస్తోంది. అయితే రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రాలు.. అమేథీ, రాయ్బరేలీ నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకున్న పక్షంలో మే ఒకటి నుంచి మూడవ తేదీలోపు నామినేషన్లు దాఖలు చేసే అవకాశముంది. ఈ రెండు నియోజకవర్గాల్లో నామినేషన్లకు మే 3 చివరి రోజు. మే 20న ఐదవ విడతలో ఈ రెండు లోక్సభ నియోజకవర్గాలకు పోలింగ్ జరగనుంది.రాహుల్, ప్రియాంకలు యూపీ లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తారని కాంగ్రెస్ కమ్యూనికేషన్ సెల్ ఇన్చార్జి జైరాం రమేష్తో పాటు పలువురు నేతలు గతంలోనే సూచన ప్రాయంగా తెలియజేశారు. తాజాగా అమేథీలోని రాహుల్ నివసించే బంగ్లాను శుభ్రం చేసి, పెయింటింగ్ వేస్తున్న ఫొటోలు సోషల్ మీడియాలో కనిపించాయి. ఈ నేపధ్యంలో రాహుల్ అమేథీ నుంచి, ప్రియాంక రాయ్బరేలీ నుంచి పోటీచేయవచ్చని స్పష్టమవుతోంది. -
అమేథీ కాంగ్రెస్ అభ్యర్థి రాబర్ట్ వాద్రా?
ఉత్తరప్రదేశ్లోని అమేథీ లోక్సభ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థి ఎవరనేదానిపై ఇంకా సస్పెన్స్ వీడలేదు. మే 20న ఐదవ దశలో అమేథీ లోక్సభ స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి. అయితే కాంగ్రెస్ ఇక్కడి అభ్యర్థి ఎవరనేది వెల్లడించకముందే స్థానికంగా వెలసిన పోస్టర్లు కాంగ్రెస్ అభ్యర్థి ఎవరనేది తెలియజేస్తున్నాయి. కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ అల్లుడు, ప్రియాంకా గాంధీ భర్త రాబర్ట్ వాద్రా.. అమేథీ ఎన్నికల్లో పోటీ చేయాలని డిమాండ్ చేస్తూ పలు చోట్ల పోస్టర్లు వెలిశాయి. ‘అమేథీ ప్రజలు ఈసారి రాబర్ట్ వాద్రాను ఆహ్వానించాలి’ అని పోస్టర్పై రాశారు. రాబర్ట్ వాద్రా అమేథీ నుంచి పోటీ చేయాలనే డిమాండ్ గత కొంతకాలంగా వినిపిస్తోంది. అమేథీ, గౌరీగంజ్లలోని కాంగ్రెస్ కార్యాలయాలు, హనుమాన్ తిరహా, రైల్వే స్టేషన్ రోడ్డు తదితర ప్రాంతాల్లో ఈ తరహా పోస్టర్లను గోడలపై అతికించారు. ఈ పోస్టర్ గురించి స్థానిక కాంగ్రెస్ నేత సోను సింగ్ రఘువంశీ మాట్లాడుతూ రాబర్ట్ వాద్రా ఈసారి అమేథీ నుండి ఎన్నికల్లో పోటీ చేయాలని స్థానికులు కోరుతున్నారు. రాహుల్ గాంధీ వయనాడ్ నుంచి పోటీ చేస్తున్నారు. ప్రియాంక గాంధీ రాయ్ బరేలీ నుంచి పోటీ చేస్తారు. అందుకే రాబర్ట్ వాద్రా ఇక్కడి నుంచి పోటీచేయాలని స్థానిక కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారన్నారు. -
వింత రాజకీయం.. పొత్తు ఉన్నా ఎవరి ప్రచారం వారిదే?
పశ్చిమ యూపీలో ఎన్నికల కోసం సమాజ్వాదీ పార్టీ, కాంగ్రెస్లు పొత్తు కుదుర్చుకున్నప్పటికీ, ప్రచారం చేపట్టే విషయంలో ఇరు పార్టీల మధ్య సయోధ్య కనిపించడం లేదు. తొలి విడత లోక్సభ ఎన్నికల ప్రచారం బుధవారం సాయంత్రంతో ముగిసింది. అయితే ప్రచారం చివరి రోజున ఇరు పార్టీలు ఉమ్మడి ర్యాలీకి హాజరుకాకపోవడం చర్చనీయాంశంగా మారింది. పశ్చిమ యూపీలో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. సమాజ్వాదీ పార్టీ, కాంగ్రెస్ల తీరుకు భిన్నంగా బీజేపీ-ఆర్ఎల్డీల దోస్తీ పటిష్టంగా కొనసాగుతోంది. ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, హోంమంత్రితో ఆర్ఎల్డీ చీఫ్ జయంత్ చౌదరి పలుమార్లు సమావేశమయ్యారు. ఇదే సమయంలో ఎస్పీ, కాంగ్రెస్ హైకమాండ్ విడివిడిగా తమ గొంతు వినిపించడం విచిత్రంగా మారింది. ఎస్పీ తో పొత్తు ఉన్నప్పటికీ కాంగ్రెస్ మహిళా నేత ప్రియాంక గాంధీ విడిగా ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో ఇరు పార్టీల మధ్య దూరానికి కారణమేమిటనే దానిపై పలు విశ్లేషణలు వినిపిస్తున్నాయి. పశ్చిమ ఉత్తరప్రదేశ్లోని ఎనిమిది లోక్సభ స్థానాలకు ఏప్రిల్ 19న తొలి దశలో పోలింగ్ జరగనుంది. సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ వివిధ లోక్సభ స్థానాలకు వెళ్లి తమ కూటమి అభ్యర్థిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. అఖిలేష్ యాదవ్ పిలిభిత్ నుంచి ముజఫర్ నగర్ వరకు బహిరంగ సభలు నిర్వహించారు. అయితే ముజఫర్నగర్కు సమీపంలో జరిగిన ప్రియాంక గాంధీ రోడ్ షోలో అఖిలేష్ కనిపించలేదు. సహరాన్పూర్ లోక్సభ అభ్యర్థి ఇమ్రాన్ మసూద్కు మద్దతుగా ప్రియాంక గాంధీ రోడ్ షో నిర్వహించారు. ప్రచారం చివరి రోజున ఎస్పీ, కాంగ్రెస్లు ఉమ్మడి ర్యాలీ నిర్వహించకపోవడానికి ప్రధాన కారణం ముస్లిం ఓటు బ్యాంకు అని రాజకీయ విశ్లేషకులు జ్ఞాన్ ప్రకాశ్ తెలిపారు. 2019 నాటి ఎస్పీ, బీఎస్పీ పొత్తును ఉదహరిస్తూ, అప్పట్లో ఆ రెండు పార్టీల అధినేతలు ఉమ్మడి ర్యాలీని నిర్వహించారన్నారు. అయితే నాడు బహుజన సమాజ్ పార్టీ.. కూటమి వల్ల ప్రయోజనం పొందిందని, ఎస్పీ ఎటువంటి ప్రత్యేక ప్రయోజనం పొందలేకపోయిందన్నారు. ఈ సారి ఎస్పీ-కాంగ్రెస్ కూటమి ఉమ్మడి ర్యాలీ నిర్వహించకపోవడానికి ఇదే కారణం కావచ్చన్నారు. -
అవినీతిపై ఉక్కుపాదమే: ప్రధాని మోదీ
రుద్రపూర్/జైపూర్: అవినీతిలో కూరుకుపోయిన కొందరు నాయకులు తనను బెదిరించేలా మాట్లాడుతున్నారని, నిస్సిగ్గుగా దూషిస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మండిపడ్డారు. అలాంటి వారికి భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో నెగ్గి, మూడోసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అవినీతిపై మరింత కఠిన చర్యలు తీసుకుంటానని వెల్లడించారు. అవినీతిపై ఇక ఉక్కుపాదమేనని, ఇది తన గ్యారంటీ అని స్పష్టం చేశారు. అవినీతికి వ్యతిరేకంగా దేశం గొంతు విప్పుతోందని అన్నారు. ప్రతి ఒక్క అవినీతిపరుడిపై చర్యలు ఉంటాయని, ఎవరినీ వదిలిపెట్టబోమని పేర్కొన్నారు. తప్పుడు పనులు చేసినవారు జైలుకు వెళ్లాల్సిందేనని పేర్కొన్నారు. తనను తిట్టొచ్చు, బెదిరించవచ్చు గానీ అవినీతిపై చర్యల విషయంలో మాత్రం ఎవరూ అడ్డుకోలేరని తెలిపారు. మోదీ మూడోసారి ప్రధాని అయితే దేశమంతటా మంటలు తప్పవంటూ కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ చేసిన వ్యాఖ్యలను ఖండించారు. కాంగ్రెస్ను దేశం నుంచి తుడిచిపెట్టేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారానికి ప్రధాని మోదీ శ్రీకారం చుట్టారు. మంగళవారం ఉత్తరాఖండ్లోని రుద్రపూర్లో తొలి బహిరంగ సభలో ప్రసంగించారు. కాంగ్రెస్, ‘ఇండియా’ కూటమి ఉద్దేశాలు బయటపడుతున్నాయని చెప్పారు. అధికారం కోల్పోయి నిరాశలో ఉన్న కాంగ్రెస్ రాజకుటుంబ వారసుడు దేశంలో మంటలు సృష్టించడం గురించి మాట్లాడుతున్నాడని, అలాంటివి మీరు అనుమతిస్తారా? అని ప్రజలను ప్రశ్నించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఈ విధమైన అనుచిత భాష మాట్లాడవచ్చా? వారిని మీరు శిక్షిస్తారా? లేదా? అని అడిగారు. బుజ్జగింపు రాజకీయాలే కాంగ్రెస్ నైజం ‘ఎమర్జెన్సీ’ ఆలోచనా ధోరణి ఉన్న కాంగ్రెస్కు ప్రజాస్వామ్యంపై ఏమాత్రం విశ్వాసం లేదని ప్రధానమంత్రి ఆరోపించారు. ఎన్నికల్లో రాబోయే ఫలితాలపై ప్రజలను రెచ్చగొట్టాలని కుట్ర పన్నిందని ధ్వజమెత్తారు. దేశాన్ని అస్థిరత, అరాచకం వైపు మళ్లించాలన్నదే కాంగ్రెస్ ధ్యేయమని ఆక్షేపించారు. ఆ పారీ్టకి తగిన బుద్ధి చెప్పాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. దేశాన్ని విడగొట్టాలన్న కాంగ్రెస్ నాయకుడిని శిక్షించాల్సింది పోయి లోక్సభ బరిలో దింపుతోందని ఆక్షేపించారు. ఆ అగ్నిని పదేళ్లుగా ఆర్పేస్తున్నా... విపక్ష ‘ఇండియా’ కూటమిపై ప్రధాని మోదీ విరుచుకుపడ్డారు. ‘‘అవినీతిపై చర్యలను అడ్డుకోవడానికి అవినీతిపరులంతా చేతులు కలిపిన తొలి లోక్సభ ఎన్నికలివి. సొంత కుటుంబాలను కాపాడుకోవడానికి కుటుంబ పార్టీలు ర్యాలీల మీద ర్యాలీలు వరుసగా నిర్వహిస్తున్న తొలి ఎన్నికలు కూడా ఇవే’’ అన్నారు. రాజస్తాన్లోని కోట్పుత్లీలో ఆయన ఎన్నికల ప్రచార సభలో మాట్లాడారు. సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ మళ్లీ గెలిస్తే దేశం అగి్నగుండం అవుతుందంటూ కాంగ్రెస్ నేతలు బెదిరింపులకు దిగుతున్నారని విమర్శించారు. అలాంటి అగ్నిని గత పదేళ్లుగా తాను ఆర్పేస్తూనే ఉన్నానని స్పష్టం చేశారు. -
బీజేపీకి షాక్.. కాంగ్రెస్లో చేరిన ఎంపీ రాహుల్ కుశ్వాన్
జైపూర్: లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ పలువురు నేతలు పార్టీల మారుతూ సార్వత్రిక సమరాన్ని మరింత ఆసక్తి రేపుతున్నారు. కాంగ్రెస్ నేతలు బీజేపీలోకి.. బీజేపీ నేతలు కాంగ్రెస్లోకి వరుస కడుతున్నారు. తాజాగా రాజస్తాన్లోని చురూ సెగ్మెంట్కు చెందిన ఎంపీ బీజేపీకి షాక్ ఇచ్చారు. రాహుల్ కుశ్వాన్ బీజేపీ ప్రాథమిక సభ్యత్వానికి, ఎంపీ పదవకి రాజీనామా చేసి.. సోమవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ‘నేను కాంగ్రెస్ పార్టీలో చేరడానికి సహకరించిన కాంగ్రెస్ అధ్యక్షుడు మళ్లికార్జున ఖర్గే, సీనియర్ నేత సొనియా గాంధీ, రాహుల్ గాంధీ, గోవింద్ సింగ్ దోస్తారా, ఇతర నేతలకు ధన్యవాదాలు’ అని కాంగ్రెస్ చేరిన అనంతరం మీడియాతో మాట్లాడారు. అంతకంటే ముందు.. ప్రజాజీవితంగా గురించి పెద్ద నిర్ణయం తీసుకోబోతున్నానని రాహుల్ కుశ్వాన్ ‘ఎక్స్’(ట్వీటర్) వేదికగా వెల్లడించారు. ‘కొన్ని రాజకీయ కారణాల రీత్యా ఈ రోజు కీలక పరిణామం జరగబోతుంది. నేను బీజేపీ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నా. ఎంపీ పదవికి కూడా రాజీనామా చేస్తున్నా’అని పేర్కొన్నారు. అదేవిధంగా చురూ నియోజకవర్గ ప్రజలకు పదేళ్లపాటు సేవ చేయడానికి అవకాశం ఇచ్చిన.. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ధన్యవాదాలు తెలిపారు. వచ్చే లోక్సభలో ఎన్నికల్లో చురూ సెగ్మెంట్ నుంచి బీజేపీ టికెట్ తిరస్కరించిన నేపథ్యంలో రాహుల్ కుశ్వాన్ పార్టీ మారటం గమనార్హం. బీజేపీ మొదటి జాబితాలో చురూ లోక్సభ స్థానంలో రాహుల్ కుశ్వాన్ బదులు పారా ఒలింపియన్ దేవేంద్ర ఝఝరియాను బరిలోకి దించిన విషయం తెలిసిందే. చదవండి: డీప్ఫేక్ బారినపడ్డ యోగి ఆదిత్యనాథ్ -
ఏమిటి నేను చేసిన నేరం? బీజేపీ ఎంపీ తీవ్ర ఆవేదన!
భారతీయ జనతా పార్టీ వచ్చే లోక్సభ ఎన్నికలకు అభ్యర్థుల తొలిజాబితాను ప్రకటించింది. రాజస్థాన్లోని చురు లోక్సభ స్థానం నుంచి కొత్త వ్యక్తి దేవేంద్ర ఝజారియాకు టిక్కెట్ ఇచ్చింది. అయితే ప్రస్తుతం చురు ఎంపీగా ఉన్న రాహుల్ కశ్వాన్.. తనను తప్పించడంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. రానున్న లోక్సభ ఎన్నికలకు తన చురు స్థానం నుంచి మరో అభ్యర్థిని బీజేపీ బరిలోకి దించగా రాహుల్ కశ్వాన్ సోషల్ మీడియాలో తన స్పందనను తెలియజేశారు. కస్వాన్ తన ‘ఎక్స్’ (ట్విటర్) ఖాతాలో పోస్ట్ చేశారు. "నా నేరం ఏమిటి? నేను నిజాయితీగా లేనా? కష్టపడి పనిచేయలేదా? విధేయుడిని కాదా? నేను ఏమి కళంకం తెచ్చాను? చురు లోక్సభలో పనిచేయలేదా? ఏదైనా పొరపాటు జరిగిందా?" అంటూ ప్రశ్నలు సంధించారు. "ప్రధానమంత్రి అన్ని పథకాల అమలులో నేను ముందంజలో ఉన్నాను. ఇంకా ఏమి కావాలి? ఈ ప్రశ్న ఎవరిని అడిగినా మౌనమే వినిపిస్తోంది. ఎవరూ సమాధానం చెప్పలేక పోతున్నారు" అంటూ వాపోయారు. అయితే రాజకీయాల్లో ఇలాంటివి సర్వసాధారణమని, టిక్కెట్ దక్కలేదన్న నైరాశ్యంలో ఈ వ్యాఖ్యలు చేసినట్లుగా భావిస్తున్నారు. కాగా రాహుల్ కస్వాన్ తండ్రి రామ్ సింగ్ కూడా చురు నుంచి బీజేపీ ఎంపీగా, ఎమ్మెల్యేగా పని చేశారు. అలాగే రాహుల్ తల్లి కమలా కశ్వాన్ కూడా సాదుల్పూర్ నుంచి బీజేపీ ఎమ్మెల్యేగా చేశారు. రానున్న లోక్సభ ఎన్నికలకు రాజస్థాన్లోని 25 స్థానాలకు గాను 15 స్థానాలకు బీజేపీ అభ్యర్థులను ప్రకటించింది. అందులో లోక్సభ స్పీకర్ ఓం బిర్లాతో పాటు నలుగురు కేంద్ర మంత్రుల పేర్లు కూడా ఉన్నాయి. -
భారత్ జోడో న్యాయ యాత్రలో రాహుల్, ప్రియాంక!
కాంగ్రెస్ రెండో దశ భారత్ జోడో న్యాయ యాత్ర ఉత్తరప్రదేశ్లోని మొరాదాబాద్ నుంచి తిరిగి ప్రారంభమైంది. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ, పార్టీ అధినేత్రి ప్రియాంక గాంధీ ఓపెన్ జీపులో యాత్రలో పాల్గొన్నారు. వీరిని చూసేందుకు జనం తరలివచ్చారు. రాహుల్, ప్రియాంకలను స్వాగతిస్తూ జనం వారిపై పూల వర్షం కురిపించారు. ఈ సమయంలో సమాజ్ వాదీ పార్టీ కార్యకర్తలు కూడా యాత్రలో పాల్గొన్నారు. అమ్రోహా, సంభాల్, బులంద్షహర్, అలీఘర్, హత్రాస్, ఆగ్రా, ఫతేపూర్ సిక్రీ వరకు జరిగే ఈ యాత్రలో రాహుల్ గాంధీతో పాటు ప్రియాంక గాంధీ కూడా పాల్గొంటున్నారు. ఆదివారం ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ కూడా ఈ యాత్రలో పాల్గొననున్నారు. ఆగ్రా అనంతరం ఈ యాత్ర రాజస్థాన్లోకి ప్రవేశిస్తుంది. మార్చి 26న ఈ యాత్రకు విరామం కల్పించనున్నారు. రాహుల్ గాంధీ ఫిబ్రవరి 27, 28 తేదీలలో న్యూఢిల్లీలో జరిగే పార్టీ సమావేశాలకు హాజరుకానున్నారు. అనంతరం భారత్ జోడో న్యాయ యాత్ర మార్చి 2న మధ్యాహ్నం 2 గంటలకు ధోల్పూర్ నుంచి తిరిగి ప్రారంభంకానుంది. ఈ యాత్ర మొరెనా, గ్వాలియర్, శివపురి, గుణ, షాజాపూర్, ఉజ్జయిని, మధ్యప్రదేశ్లోని పలు జిల్లాల మీదుగా సాగనుంది. -
సోనియా రాజ్యసభ నామినేషన్.. వెంటవచ్చిన రాహుల్, ప్రియాంక!
రాజ్యసభ ఎన్నికల్లో రాజస్థాన్ నుంచి కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ పోటీ చేస్తున్నారు. ఇందుకోసం ఆమె ఈరోజు(బుధవారం) నామినేషన్ దాఖలు చేయనున్నారు. రాజధాని జైపూర్ చేరుకున్న ఆమె వెంట రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కూడా ఉన్నారు. సోనియా గాంధీ లోక్సభ నుంచి కాకుండా రాజ్యసభ నుంచి పార్లమెంటుకు చేరుకుంటున్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రియాంక గాంధీ యూపీలోని రాయ్బరేలీ స్థానం నుంచి లోక్సభ ఎన్నికల్లో బరిలోకి దిగుతారనే ప్రచారం జరుగుతోంది. రాజస్థాన్ కాంగ్రెస్ అధ్యక్షుడు గోవింద్ సింగ్ దోటసార నివాసంలో సోనియాగాంధీ నామినేషన్ సెట్పై ఎమ్మెల్యేలందరూ సంతకాలు చేశారు. #WATCH कांग्रेस संसदीय दल की अध्यक्ष सोनिया गांधी राज्यसभा चुनाव के लिए अपना नामांकन दाखिल करने के लिए जयपुर, राजस्थान पहुंचीं। उनके बेटे और पार्टी सांसद राहुल गांधी और उनकी बेटी और पार्टी महासचिव प्रियंका गांधी वाड्रा उनके साथ हैं। pic.twitter.com/0oGUmMr1to — ANI_HindiNews (@AHindinews) February 14, 2024 సీనియర్ కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ 1999 లోక్సభ సభ్యురాలుగా కొనసాగుతున్నారు. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్లోని రాయ్బరేలి లోక్సభ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆమె అమేథీ లోక్సభ సభ్యురాలిగానూ ఉన్నారు. ఆమె పార్లమెంటు ఎగువ సభకు వెళ్లడం ఇదే తొలిసారి. ఫిబ్రవరి 8వ తేదీ నుంచి రాజ్యసభ ఎన్నికలకు నామినేషన్ల దాఖలు ప్రక్రియ ప్రారంభమైంది. నామినేషన్ పత్రాల పరిశీలన ఫిబ్రవరి 16న జరగనుంది. అభ్యర్థులు ఫిబ్రవరి 20లోగా తమ పేర్లను ఉపసంహరించుకోవచ్చు. అవసరమైతే ఫిబ్రవరి 27న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఓటింగ్ నిర్వహించి, అదే రోజు సాయంత్రం 5 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభించనున్నారు. -
నేడు ఒడిశాకు రాహుల్ భారత్ జోడో న్యాయ యాత్ర
మణిపూర్ నుంచి ప్రారంభమైన భారత్ జోడో న్యాయ యాత్ర 24వ రోజు అంటే నేడు (మంగళవారం)ఒడిశాలోకి ప్రవేశించనుంది. జనవరి 14న ఈశాన్య భారతం నుంచి ప్రారంభమైన ఈ యాత్రలో రాహుల్ గాంధీ సహా పలువురు కాంగ్రెస్ నేతలు వివిధ రాష్ట్రాలలోని ప్రజలను కలుస్తున్నారు. జార్ఖండ్ యాత్ర పూర్తయ్యాక కాంగ్రెస్ ఇప్పుడు ఒడిశా వైపు వెళ్లనుంది. మంగళవారం సుందర్గఢ్ జిల్లా నుంచి రాహుల్ ఒడిశాలో అడుగుపెట్టనున్నారు. రాహుల్కు స్వాగతం పలికేందుకు ఒడిశా కాంగ్రెస్ నేతలు సన్నాహాలు చేశారు. సుందర్గఢ్ జిల్లాలోని పారిశ్రామిక పట్టణం బిరామిత్రపూర్లో ఒడిశా కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీకి స్వాగతం పలుకనున్నారు. రాహుల్ గాంధీ మంగళవారం మధ్యాహ్నం బిర్మిత్రాపూర్ చేరుకుంటారని ఒడిశా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు శరత్ పట్నాయక్ తెలిపారు. భారత్ జోడో న్యాయ యాత్ర బిజా బహల్ ప్రాంతంలో విరామం తీసుకోనుంది. బుధవారం రూర్కెలాలోని ఉదిత్నగర్ నుండి పాన్పోష్ వరకు 3.4 కిలోమీటర్ల మేర యాత్ర సాగనుంది. రాహుల్ పాన్పోష్లో ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు. మరుసటి రోజు రాణిబంద్ నుంచి యాత్ర తిరిగి ప్రారంభమవుతుంది. రాజ్గంగ్పూర్లో జరిగే ర్యాలీలో కూడా రాహుల్ ప్రసంగించనున్నారు. ఫిబ్రవరి 8న రాహుల్ గాంధీ జర్సుగూడ పాత బస్టాండ్ నుంచి యాత్రను ప్రారంభిస్తారు. అనంతరం ర్యాలీలో ప్రసంగిస్తారు. జార్సుగూడలోని కనక్తోరా నుంచి యాత్ర మొదలై అనంతరం ఛత్తీస్గఢ్లోకి ప్రవేశిస్తుంది. -
ఆ రోజే భ్రమయుగం
మమ్ముట్టి ప్రధాన పాత్రలో నటిస్తున్న మలయాళ చిత్రం ‘భ్రమయుగం’. రాహుల్ సదాశివన్ దర్శకత్వం వహిస్తున్నారు. చక్రవర్తి రామచంద్ర, ఎస్. శశికాంత్ నిర్మిస్తున్న ఈ సినిమా థియేటర్స్కి వచ్చే రోజు ఖరారైంది. ఫిబ్రవరి 15న ఈ చిత్రాన్ని మలయాళంతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ‘‘హారర్–థ్రిల్లర్ జానర్లో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న చిత్రమిది’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి కెమెరా: షెహనాద్ జలాల్, సంగీతం: క్రిస్టో జేవియర్. -
దరఖాస్తు ఫారాలు విక్రయిస్తే కేసులు.. : కలెక్టర్ రాహుల్రాజ్
ఆదిలాబాద్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా అభయహస్తం ఆరు గ్యారంటీలకు సంబంధించి దరఖాస్తుల ను అర్హులైన ప్రతీ కుటుంబానికి ఉచితంగా అందజేస్తున్నామని కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. జిల్లాలో దరఖాస్తుల కొరత లేదని ప్రతి గ్రామం, ము న్సిపల్ వార్డులో ఉన్న కుటుంబాల కంటే పది శా తం అదనంగా పంపించామన్నారు. మీసేవ, జిరా క్స్ కేంద్రాలు, దళారులు విక్రయించినట్లైతే చర్యలు తప్పవన్నారు. మీసేవ కేంద్రాల లైసెన్స్ రద్దుతో పాటు బాధ్యులపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన ఆరు గ్యారంటీల దరఖాస్తుల వివరాలు వెల్లడించారు. దరఖాస్తు నింపేందుకు కొంతమంది రూ.50వరకు తీసుకుంటున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. అలా జరుగకుండా అన్ని చోట్ల వాటిని నింపేందుకు ప్రత్యేక హెల్ప్ డెస్కులు ఏర్పాటు చేశామన్నారు. ఆరు గ్యారంటీలకు ఒకే కా మన్ దరఖాస్తు పత్రం ఉంటుందని, అందులో అవసరమైన సాయంతో పాటు కుటుంబ సభ్యుల వివరాలు నమోదు చేయాల్సి ఉంటుందన్నారు. రేషన్కార్డు లేని వారు, ఆధార్కార్డులో ఆంధ్రప్రదేశ్ అని ఉన్న వారు కూడా నిరభ్యంతరంగా దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. పింఛన్ పొందుతున్న ల బ్ధిదారులు కొత్తగా దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదని, రైతుబంధు సాయం పొందుతున్న రైతులు మాత్రం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందన్నారు. కొత్తగా రేషన్కార్డు పొందాలనుకునే వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. అద్దె ఇళ్లలో నివసించేవారు గృహజ్యోతి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ కోసం అద్దె ఇంటి విద్యుత్ సర్వీస్ నంబర్తోనూ దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ప్రజలు ఇ బ్బందులు పడుకుండా ఉండేలా అన్ని కేంద్రాల్లో షామియానాలు, తాగునీటి వసతి కల్పించామన్నారు. జనవరి 6వరకు కేంద్రాల్లో దరఖాస్తుల స్వీకరణ ఉంటుందని, అప్పటికీ అందించలేని వారు కూడా ఎంపీడీవో, మున్సిపల్ కార్యాలయాల్లో అందజేయవచ్చని తెలిపారు. క్షేత్రస్థాయి పరిశీలన అనంతరం అర్హులైన ప్రతి ఒక్కరికి పారదర్శకంగా సంక్షేమ ఫలాలు అందజేస్తామన్నారు. డబ్బులిస్తే ఇప్పిస్తామని నమ్మబలికే దళారులను నమ్మి మోసపోవద్దని సూచించారు. సంక్షేమ ఫలాల కోసం మహారాష్ట నుంచి వచ్చే వారికి తప్పుడు ధ్రువీకరణ పత్రాలు జారీ చేస్తే మాత్రం బాధ్యులైన వారిపై కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. ఆదిలాబాద్ మున్సిపల్ పరిధిలోని వార్డుల్లో జనాభా ఎక్కువగా ఉన్నందున ప్రతి వార్డుకు ఓ జిల్లా స్థాయి అధికారిని ప్రత్యేకాధికారిగా నియమించినట్లుగా వెల్లడించారు. అర్హులైన ప్రతి ఒక్కరూ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. సమావేశంలో జిల్లా స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ ఖుష్బూ గుప్తా పాల్గొన్నారు. -
ఎల్గర్ అజేయ సెంచరీతో...
‘బాక్సింగ్ డే’ టెస్టుపై దక్షిణాఫ్రికా ఆధిక్యం కనబరుస్తోంది. రెండో రోజు ఆటలో భారత్ను తొలి ఇన్నింగ్స్లో 245 పరుగులకు ఆలౌట్ చేసిన సఫారీ బ్యాటింగ్లోనూ సత్తా చాటుకుంది. దక్షిణాఫ్రికా ఆరంభానికి సిరాజ్ తూట్లు పొడిచినప్పటికీ ఓపెనర్ డీన్ ఎల్గర్ (అజేయ) శతకంతో సాఫీగా సాగిపోయింది. రెండు పటిష్టమైన భాగస్వామ్యాలతో సఫారీ తొలి ఇన్నింగ్స్లో ఆధిక్యం సంపాదించేందుకు ఎల్గర్ కీలకపాత్ర పోషించాడు. సెంచూరియన్: ఓవర్నైట్ బ్యాటర్ కేఎల్ రాహుల్ సెంచరీ మినహా తొలి టెస్టులో రెండో రోజంతా దక్షిణాఫ్రికా హవానే నడిచింది. ఓపెనర్ ఎల్గర్ చక్కని సెంచరీతో సఫారీ భారీ స్కోరుపై కన్నేసింది. తద్వారా దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్లో ఆధిక్యాన్ని పెంచుకునేందుకు పట్టుబిగిస్తోంది. బుధవారం రెండో రోజు ఆటలో తొలుత భారత్ తొలి ఇన్నింగ్స్ 67.4 ఓవర్లలో 245 పరుగుల వద్ద ముగిసింది. రాహుల్ (137 బంతుల్లో 101; 14 ఫోర్లు, 4 సిక్స్లు) టెస్టుల్లో ఎనిమిదో శతకం సాధించాడు. మొదటి రోజే రబడ 5 వికెట్లు తీయగా, రెండో రోజు మిగిలిన రెండు వికెట్లలో కొయెట్జీ (1/74), బర్గర్ (3/50) చెరొకటి తీశారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన దక్షిణాఫ్రికా వెలుతురు మందగించి ఆట నిలిచే సమయానికి 66 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 256 పరుగులు చేసి 11 పరుగుల ఆధిక్యం దక్కించుకుంది. ఎల్గర్ (140 బ్యాటింగ్; 23 ఫోర్లు), జాన్సెన్ (3 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. బుమ్రా, సిరాజ్ చెరో 2 వికెట్లు పడగొట్టాడు. శతకం పూర్తయ్యాక ఆలౌట్! వర్షం, గ్రౌండ్ తడి ఆరడానికి సమయం పట్టడంతో రెండో రోజు కూడా ఆట ఆలస్యంగానే మొదలైంది. ఓవర్నైట్ స్కోరు 208/8తో తొలి ఇన్నింగ్స్ను కొనసాగించిన భారత్ తొలి సెషన్లో 8.4 ఓవర్లు మాత్రమే ఆడగలిగింది. ఓవర్నైట్ బ్యాటర్లు రాహుల్, సిరాజ్ (5) తొమ్మిదో వికెట్కు 47 పరుగులు జోడించారు. రాహుల్ సెంచరీకి చేరువయ్యాక కొయెట్టీ 65వ ఓవర్ తొలి బంతికి సిరాజ్ను అవుట్ చేశాడు. అదే ఓవర్ ఆఖరి బంతికి భారీ సిక్సర్తో రాహుల్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కాసేపటికే బర్గర్ అతన్ని బౌల్డ్ చేయడంతో 245 పరుగుల వద్ద తొలి ఇన్నింగ్స్కు తెరపడింది. సిరాజ్ దెబ్బ తీసినా... దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ ఆరంభంలోనే సిరాజ్ దెబ్బకొట్టాడు. ఓపెనర్ మార్క్రమ్ (5) కీపర్ క్యాచ్తో వెనుదిరిగేలా చేశాడు. అయితే భారత శిబిరానికి ఈ ఆనందం తర్వాత శ్రమించక తప్పలేదు. క్రీజులో ఉన్న మరో ఓపెనర్ ఎల్గర్కు జతయిన టోనీ డి జార్జి (62 బంతుల్లో 28; 5 ఫోర్లు) భారత బౌలర్లను తేలిగ్గా ఎదుర్కొన్నారు. 49/1 స్కోరువద్ద తొలి సెషన్ ముగియగా... రెండో సెషన్లోనూ ఈ జోడీ భారత బౌలింగ్ దళాన్ని కష్టపెట్టింది. ఎల్గర్ అర్ధసెంచరీ పూర్తి చేసుకోగా... సఫారీ స్కోరు వంద దాటింది. ఈ దశలో బుమ్రా వైవిధ్యమైన బంతులతో రెండు కీలక వికెట్లను పడగొట్టి టీమిండియాను ఊరడించాడు. రెండో వికెట్కు 93 పరుగులు జోడించాక జార్జిని, తన మరుసటి ఓవర్లో పీటర్సన్ (2)ను పెవిలియన్ చేర్చాడు. 113 పరుగుల వద్ద 3 వికెట్లను కోల్పోయి ఆత్మరక్షణలో పడింది. అయితే క్రీజులో పాతుకుపోయిన ఎల్గర్కు బడింగ్హామ్ చక్కని సహకారం ఇవ్వడంతో మరో భారీ భాగస్వామ్యం దక్షిణాఫ్రికాను నిలబెట్టింది. ఎల్గర్ శతకాన్ని పూర్తి చేసుకోగా... టీ విరామం (194/3) వరకు మరో వికెట్ పడకుండా జాగ్రత్తపడ్డారు. ఆఖరి సెషన్లోనూ ఎల్గర్–బడింగ్హామ్ జోడీ భారత బౌలర్లకు పరీక్షపెట్టింది. ఈ క్రమంలో బడింగ్హామ్ ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. నాలుగో వికెట్కు 131 పరుగులు జోడించాక సిరాజ్ ఓవర్లో బడింగ్హామ్ (56; 7 ఫోర్లు, 2 సిక్స్లు) నిష్క్రమించాడు. వెరిన్ (4)ను ప్రసిధ్ అవుట్ చేశాడు. తర్వాత కాసేపటికే బ్యాడ్లైట్తో ఆటను నిలిపివేశారు. స్కోరు వివరాలు భారత్ తొలి ఇన్నింగ్స్: యశస్వి (సి) వెరిన్ (బి) బర్గర్ 17; రోహిత్ (సి) బర్గర్ (బి) రబడ 5; శుబ్మన్ (సి) వెరిన్ (బి) బర్గర్ 2; కోహ్లి (సి) వెరిన్ (బి) రబడ 38; అయ్యర్ (బి) రబడ 31; రాహుల్ (బి) బర్గర్ 101; అశ్విన్ (సి) సబ్–ముల్డర్ (బి) రబడ 8; శార్దుల్ (సి) ఎల్గర్ (బి) రబడ 24; బుమ్రా (బి) జాన్సెన్ 1; సిరాజ్ (సి) వెరిన్ (బి) కొయెట్జీ 5; ప్రసిధ్ కృష్ణ (నాటౌట్) 0; ఎక్స్ట్రాలు 13; మొత్తం (67.4 ఓవర్లలో ఆలౌట్) 245. వికెట్ల పతనం: 1–13, 2–23, 3–24, 4–92, 5–107, 6–121, 7–164, 8–191, 9–238, 10–245. బౌలింగ్: రబడ 20–4–59–5, మార్కొ జాన్సెన్ 16–2–52–1, బర్గర్ 15.4–4–50–3, కొయెట్జీ 16–1–74–1. దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్: మార్క్రమ్ (సి) రాహుల్ (బి) సిరాజ్ 5; ఎల్గర్ (బ్యాటింగ్) 140; టోని జార్జి (సి) యశస్వి (బి) బుమ్రా 28; పీటర్సన్ (బి) బుమ్రా 2; బెడింగ్హమ్ (బి) సిరాజ్ 56; వెరిన్ (సి)రాహుల్ (బి) ప్రసిధ్కృష్ణ 4; జాన్సెన్ (బ్యాటింగ్) 3; ఎక్స్ట్రాలు 18; మొత్తం (66 ఓవర్లలో 5 వికెట్లకు) 256. వికెట్ల పతనం: 1–11, 2–104, 3–113, 4–244, 5–249. బౌలింగ్: బుమ్రా 16–3–48–2, సిరాజ్ 15–0–63–2, శార్దుల్ 12–2–57–0, ప్రసిధ్కృష్ణ 15–2–61–1, అశ్విన్ 8–3–19–0. -
లోక్సభ ఎన్నికల్లో యూపీ నుంచి రాహుల్, ప్రియాంక పోటీ?
ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ నేతలు ఢిల్లీలో అధిష్టానంతో సమావేశమయ్యారు. అనంతరం యూపీ కాంగ్రెస్ అధ్యక్షుడు అజయ్ రాయ్ మీడియాతో మాట్లాడారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ లోక్సభ ఎన్నికల్లో యూపీ నుంచి పోటీ చేయడం గురించి ఆయన మాట్లాడుతూ..‘అది వారి ఇల్లు. అక్కడి నుంచే వారు పోటీ చేస్తారు. అలహాబాద్, ప్రయాగ్రాజ్, రాయ్ బరేలీ, అమేథీలలోని వారి పూర్వీకులతో వారికి మంచి సంబంధాలు ఉన్నాయి. 40 ఏళ్లుగా అక్కడి ప్రజలతో వారికి దృఢమైన అనుబంధం ఉంది. ఈ బంధం ఎప్పటికీ కొనసాగుతూనే ఉంటుంది’ అని అన్నారు. పార్టీ అధిష్టానం ఉత్తరప్రదేశ్పై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాలని, ఖర్గే , రాహుల్, ప్రియాంక తదితర జాతీయ నాయకులు యూపీ నుంచి లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయాలని తాము కోరామన్నారు. యూపీలో పొత్తుల గురించి అజయ్ రాయ్ మాట్లాడుతూ దీనిపై నిర్ణయాన్ని పూర్తిగా జాతీయ నాయకత్వానికే వదిలేశామని అన్నారు. తాము ఏకగ్రీవ తీర్మానం చేసి, ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. కాగా ఢిల్లీలో అధిష్టానంతో జరిగిన సమావేశంలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, ఎంపీ రాహుల్ గాంధీ, పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు. ఇది కూడా చదవండి: నేడు అయోధ్యకు శ్రీరామ పాదుకలు कांग्रेस मुख्यालय, दिल्ली में राष्ट्रीय अध्यक्ष श्री @kharge जी, जननायक श्री @RahulGandhi जी, कांग्रेस महासचिव/प्रभारी, UP श्रीमती @priyankagandhi जी व राष्ट्रीय महासचिव संगठन @kcvenugopalmp जी ने प्रदेश अध्यक्ष श्री @kashikirai जी, CLP लीडर श्रीमती @aradhanam7000 जी व प्रदेश के… pic.twitter.com/Yp4vbrcIxZ — UP Congress (@INCUttarPradesh) December 18, 2023 -
అధికారం కోసం కాంగ్రెస్ వంద అబద్ధాలు
సిద్దిపేటజోన్: పక్కనున్న కర్ణాటకలో ఐదు గ్యారంటీలను ప్రకటించిన రాహుల్, ప్రియాంకాగాంధీ పత్తా లేకుండాపోయారని, అక్కడ పరిస్థితి గందరగోళంగా మారిందని మంత్రి హరీశ్రావు అన్నారు. ఆదివారం సిద్దిపేట జిల్లాకేంద్రంలో జరిగిన పలు సంఘాల ఆత్మీయ సమ్మేళనంలో పలు పార్టీల ప్రతినిధులు, నాయకులు మంత్రి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. హరీశ్రావు మాట్లాడుతూ వంద అబద్ధాలు ఆడైనా సరే అధికారంలోకి రావా లని కాంగ్రెస్ తాపత్రయపడుతోందని అన్నారు. మనకు బూతు మాటలు మాట్లాడే నేతలు కాదని, భవిష్యత్తు అందించే నాయకులు కావాలన్నారు. బట్టేబాజ్ మాటలు చెప్పే కాంగ్రెస్ పార్టీ నిజస్వరూ పాన్ని ప్రజలకు వివరించాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో మోకాలిచిప్పకు ఉచితంగా ఆపరేషన్లు అని పెట్టారని, కానీ తెలంగాణ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ ద్వారా ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఇప్పటికే ఉచితంగా మోకాలి చిప్ప ఆపరేషన్లు చేస్తోందని, కాంగ్రెస్ వాళ్లకు అది కూడా తెలవదని ఎద్దేవా చేశారు. భవిష్యత్తులో 112 నియోజక వర్గాల్లో అగ్రవర్ణ కులాల పిల్లలకు కూడా గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేయబోతున్నట్టు తెలిపారు. తొమ్మిదేళ్లు వర్గీకరణ అంశంపై జాప్యం చేసి ఇప్పుడు ఎన్నికల ముందు కేంద్రం కమిటీ అని కొత్త నాటకానికి తెర తీసిందని హరీశ్ విమర్శించారు. టీఎస్ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కమిటీ నాయ కులు మంత్రి హరీశ్ను కలిసి బీఆర్ఎస్కు మద్దతు ప్రకటించారు. వర్గీకరణకు బీఆర్ఎస్ కట్టుబడి ఉందని, తెలంగాణ ఏర్పడిన తొలి నాళ్లలోనే అసెంబ్లీలో తీర్మానం చేసి బిల్లును కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం పంపిందన్నారు. మనకు కావాల్సింది కమిటీ కాదనీ, బిల్లు రావాలని, వెంటనే పార్లమెంటులో బిల్లు పెట్టాలని స్పష్టం చేశారు.బీఆర్ఎస్లో చేరిన బాబుమోహన్ తనయుడు సంగారెడ్డి జిల్లా బీజేపీ అందోల్ నియోజకవర్గ అభ్యర్థి బాబుమోహన్ కుమారుడు ఉదయ్భాస్కర్ ఆదివారం సిద్దిపేటలో మంత్రి హరీశ్రావు సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. -
16 నుంచి కాంగ్రెస్ ప్రచార హోరు
సాక్షి, హైదరాబాద్: నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగియగానే రాష్ట్రంలో ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తించేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతోంది. ఏఐసీసీ అగ్రనేతలు రాహుల్, ప్రియాంకా గాందీలతోపాటు కీలక నేతలను రంగంలోకి దింపేందుకు ఏర్పాట్లు చేస్తోంది. వారు వారం రోజుల పాటు ఇక్కడే మకాం వేసి, జిల్లాల్లో విస్తృతంగా పర్యటించేలా షెడ్యూల్ రూపొందిస్తోంది. ఈ నెల 15న నాలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచార గడువు ముగియనున్న నేపథ్యంలో 16వ తేదీ నుంచి కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలనూ ప్రచార బరిలోకి దింపాలని భావిస్తోంది. అయితే భారీ సభలు కాకుండా రోడ్షోలు, కార్నర్ మీటింగ్ల ద్వారా ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించింది. అన్ని ఉమ్మడి జిల్లాల్లో పర్యటించేలా.. ఈ నెల 16 తర్వాత రాహుల్, ప్రియాంకా గాందీలతో రాష్ట్రంలోని అన్ని ఉమ్మడి జిల్లాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించేలా షెడ్యూల్ తయారవుతోంది. పెద్ద సభలను ఏర్పాటుచేసి ప్రజలను అక్కడికి తీసుకురావడం కంటే ప్రజల వద్దకే వెళ్లేలా కార్యక్రమాలు నిర్వహించేందుకు టీపీసీసీ సిద్ధమైంది. అన్ని కొత్త జిల్లాల్లో ఇద్దరు అగ్రనేతలతో రోడ్షోలు చేయించాలని, అక్కడే కార్నర్ మీటింగ్ల ద్వారా కాంగ్రెస్ ఎన్నికల గ్యారంటీలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించింది. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలు సిద్ధరామయ్య, అశోక్గెహ్లోత్, సుఖ్విందర్సింగ్ సుక్కు, భూపేశ్ బఘేల్లను కూడా ఎన్నికల ప్రచారానికి తీసుకురానుంది. హిమాచల్ప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్తాన్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ అమలు చేసిన పథకాల గురించి వారు వివరించనున్నట్టు టీపీసీసీ వర్గాలు చెప్తున్నాయి. ఇక కర్ణాటకలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదంటూ బీఆర్ఎస్ చేస్తున్న విమర్శలను తిప్పికొట్టేలా సిద్ధరామయ్య, డీకే శివకుమార్ వంటి నేతలను ప్రచార భాగస్వాములను చేయనుంది. ఈ ప్రచారమంతాపూర్తయ్యాక చివరిగా ఏఐసీసీ అగ్రనేత, యూపీఏ చైర్పర్సన్ సోనియాగాంధీతో హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోగానీ, ఉత్తర తెలంగాణలోని కీలక ప్రాంతంలోగానీ భారీ బహిరంగ సభ నిర్వహించి, పోలింగ్ మూడ్లోకి వెళ్లిపోవాలని కాంగ్రెస్ భావిస్తోంది. నేడు కామారెడ్డిలో బీసీ గర్జన సభ కాంగ్రెస్ పార్టీ శుక్రవారం కామారెడ్డిలో బీసీ గర్జన సభ నిర్వహించనుంది. నామినేషన్ల దాఖలుకు చివరిరోజు కావడంతో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి కామారెడ్డిలో కాంగ్రెస్ అభ్యర్థి గా నామినేషన్ వేయనున్నారు. ఆ కార్యక్రమం ముగిశాక బీసీ గర్జన సభ నిర్వహించనున్నారు. దీనిలో బీసీ డిక్లరేషన్ను ప్రకటించనున్నారు. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఈ సభలో పాల్గొంటున్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు, అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి ఆయన స్పష్టమైన ప్రకటన చేస్తారని.. బీఆర్ఎస్ ఆరోపణలకు తగిన విధంగా బదులిస్తారని టీపీసీసీ వర్గాలు చెప్తున్నాయి. -
వచ్చే ఏడాది భ్రమ యుగం
మమ్ముట్టి ప్రధాన పాత్రలో నటించిన హారర్–థ్రిల్లర్ ఫిల్మ్ ‘భ్రమ యుగం’. రాహుల్ సదాశివన్ రచన–దర్శకత్వంలో చక్రవర్తి రామచంద్ర, ఎస్. శశికాంత్ నిర్మించారు. ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది. వచ్చే ఏడాది ప్రారంభంలో ఏకకాలంలో మలయాళం, తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమాను విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. ‘‘ఈ ఏడాది ఆగస్టులోప్రారంభమైన ఈ సినిమాను ఓట్టపాలెం, కొచ్చి, అతిరాపల్లి వంటి లొకేషన్స్లో చిత్రీకరించాం. ప్రస్తుతం పోస్ట్ ప్రోడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. -
డేటింగ్లో స్టార్ హీరోయిన్.. ముచ్చటగా మూడోసారి!
బాలీవుడ్ భామ శ్రద్ధా కపూర్ బీ టౌన్లో పరిచయం అక్కర్లేని పేరు. ఆమె ప్రముఖ నటుడు శక్తి కపూర్ కుమార్తెగా ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. 2010లో టీన్ పట్టి సినిమాలో ఒక చిన్న పాత్ర ద్వారా కెరీర్ ప్రారంభించిన శ్రద్ధా.. లవ్ కా ది ఎండ్ సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. 2013లో విడుదలైన ఆషికి- 2 చిత్రంలో నటనకు విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ సినిమాలోని ఆమె నటనకు ఫిలింఫేర్ ఉత్తమ నటి పురస్కారానికి నామినేషన్ కూడా లభించింది. శ్రద్దా సినిమాల్లో నటించడంతో పాటు మంచి సింగర్ కూడా. తన సినిమాల్లో చాలా పాటలు పాడింది. (ఇది చదవండి: ప్రతి తండ్రికి ఈ పాట అంకితం: మహేశ్ బాబు ప్రశంసలు) అయితే తాజాగా ఈ భామకు సంబంధించిన ఓ న్యూస్ నెట్టింట తెగ వైరలవుతోంది. గతంలో ఆషికి-2 నటుడు ఆదిత్య రాయ్కపూర్తో డేటింగ్లో ఉన్నట్లు రూమర్స్ వచ్చిన సంగతి తెలిసిందే. వారి ఆన్-స్క్రీన్ కెమిస్ట్రీ చూసి.. ఆఫ్ స్క్రీన్లోనూ రిలేషన్లో ఉన్నారని అప్పట్లో టాక్ వినిపించింది. ఆ తర్వాత ప్రముఖ ఫోటోగ్రాఫర్ రోహన్ శ్రేష్ఠతో చెట్టాపట్టాలేసుకుని పలు పార్టీలకు హాజరైంది. ఆ సమయంలో శ్రద్దా కపూర్పై డేటింగ్ రూమర్స్ వచ్చాయి. తాజాగా శ్రద్ధా కపూర్ అతనితో డేటింగ్లో ఉందన్న వార్త బీటౌన్లో హాట్టాపిక్గా మారింది. తు జూతీ మైన్ మక్కర్' చిత్రానికి సహ రచయితగా పనిచేసిన రాహుల్ మోడీతో శ్రద్ధా కపూర్ డేటింగ్ చేస్తోందని బీ టౌన్ టాక్. అయితే ఈ రూమర్స్పై ఇప్పటివరకు అధికారికంగా ఎవరూ స్పందించలేదు. అయితే ఈ జోడీ రిలేషన్లో ఉన్నట్లు వస్తున్న వార్తలపై ఫ్యాన్స్ ఆసక్తి చూపుతున్నారు. నెటిజన్స్ సైతం న్యూ లవ్ బర్డ్స్ ఇన్ బాలీవుడ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా.. ఇటీవలే మహాదేవ్ బెట్టింగ్ యాప్ కేసులో శ్రద్ధా కపూర్కు ఈడీ సమన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే. (ఇది చదవండి: 'నా భార్య అర్థం చేసుకుంటది.. నువ్వు నా మాట విను'.. ప్రశాంత్పై శివాజీ ఎమోషనల్!) కాగా.. తూ ఝూతీ మైన్ మక్కర్ చిత్రం 2023లో విడుదలైంది. లవ్ ఫిల్మ్స్, టి-సిరీస్ ఫిల్మ్స్ బ్యానర్లపై లవ్ రంజన్, అంకుర్ గార్గ్ నిర్మించిన ఈ సినిమాకు లవ్ రంజన్ దర్శకత్వం వహించాడు. ఈ చిత్రంలో రణ్బీర్ కపూర్, శ్రద్ధా కపూర్, డింపుల్ కపాడియా, అనుభవ్ సింగ్ బస్సీ ప్రధాన పాత్రల్లో నటించారు. -
విధుల్లో చేరిన రాజమండ్రి జైలు సూపరిండెంట్ రాహుల్
సాక్షి, తూర్పుగోదావరి: రాజమండ్రి సెంట్రల్ జైలు సూపరిండెంట్ రాహుల్ విధుల్లోకి చేరారు. కొద్దిరోజుల క్రితం అనారోగ్యంతో భార్య మృతి చెందడంతో సూపరిండెంట్ రాహుల్ విధులకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. జైలు సూపరిండెండెంట్ భార్య అనారోగ్య కారణాలతో సెలవు పెడితే పచ్చ మీడియా విపరీతార్థాలు తీసింది. దీంతో పచ్చ మీడియా తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. కాగా, రాజమండ్రి సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ భార్య ఎస్ రాహుల్ భార్య కిరణ్మయి(46) ఈ నెల 15న మృతిచెందారు. అనారోగ్యంతో బాధపడుతున్న కిరణ్మయి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. మృతదేహాన్ని అంబులెన్సులో గుంటూరు తీసుకెళ్లారు. భార్య అనారోగ్యం కారణంతో జైలు సూపరింటెండెంట్ రాహుల్ సెలవులపై వెళ్లారు. అయితే టీడీపీ అధినేత చంద్రబాబు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న నేపథ్యంలో ఒత్తిడిపై రాహుల్ సెలవులపై వెళ్లారని పలువురు దుష్ప్రచారం చేశారు. ఈ క్రమంలో ఎస్పీ జగదీష్ స్పందిస్తూ ఆ వార్తలను కొట్టిపారేశారు. భార్య అనారోగ్యం కారణంగానే ఆయన సెలవుపై వెళ్లారని పేర్కొన్నారు. సోషల్ మీడియాలో వచ్చిన అవాస్తవ కథనాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తమపై ఒత్తిళ్లు లేవని, తమ డ్యూటీ తాము చేస్తున్నానమని స్పష్టం చేశారు. -
ఈడీ ఇన్ఛార్జ్ డైరెక్టర్గా రాహుల్ నవీన్
సాక్షి, ఢిల్లీ: ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ఇన్ఛార్జ్ డైరెక్టర్గా రాహుల్ నవీన్ నియామకమయ్యారు. కాగా, ప్రస్తుతం రాహుల్ నవీన్.. ఈడీ స్పెషల్ డైరెక్టర్గా కొనసాగుతున్నారు. అయితే, పూరిస్థాయి డైరెక్టర్ నియామకం వరకు ఇన్ఛార్జ్గా రాహుల్ కొనసాగనున్నారు. రాహుల్ 1993 ఐఆర్ఎస్ బ్యాచ్కు చెందిన ఆఫీసర్. ఇదిలా ఉండగా.. ప్రస్తుత ఈడీ డైరెక్టర్ సంజీవ్ కుమార్ మిశ్రా పదవీకాలం నిన్నటితో ముగిసింది. కాగా.. ఈడీ, సీబీఐ ఉమ్మడి కొత్తగా బాస్గా సంజీవ్ను నియమించే దిశగా కేంద్రం కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగానే కొత్తగా చీఫ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ పదవి సృష్టించే దిశగా కేంద్రం ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. President Droupadi Murmu appointed an Indian Revenue Service (IRS) officer of the 1993 batch, #RahulNavin, as the incharge Director of #EnforcementDirectorate. #ED #cliQIndia pic.twitter.com/pVf7RM6TS9 — cliQ India (@cliQIndiaMedia) September 16, 2023 ఇది కూడా చదవండి: కల్నల్ మన్ప్రీత్కు సైనిక దుస్తుల్లో చిన్నారుల కడసారి వీడ్కోలు.. -
నేడు సోనియా సమక్షంలో కాంగ్రెస్ గూటికి తుమ్మల
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ అసంతృప్తనేత, మాజీమంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు శనివారం(నేడు) కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. సీడ బ్ల్యూసీ సమావేశాల విరామ సమయంలో శనివారం ఆ పార్టీ అగ్ర నేతలు సోనియా, రాహుల్గాంధీల సమక్షంలో ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. పార్టీలోకి రావాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, టీపీసీసీ ప్రచార కమిటీ కో చైర్మన్ పొంగులేటి శ్రీనివాస్రెడ్డి తదితరులు ఇప్ప టికే తుమ్మలను ఆహ్వానించిన విషయం తెలిసిందే. శుక్రవారం మధ్యాహ్నం హైదరాబాద్లోని తుమ్మల నివాసా నికి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్రావ్ ఠాక్రేతోపాటు రేవంత్, భట్టి విక్ర మార్క, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి వెళ్లారు. పార్టీలోకి రావాలని మరోమారు ఆహ్వానించగా సానుకూలంగా స్పందించిన తుమ్మల శనివారం కాంగ్రెస్ కండువా కప్పుకుంటారని గాంధీభవన్ వర్గాలు తెలిపా యి. కాగా, సీడబ్ల్యూసీ సమావేశాల సందర్భంగా రాష్ట్రంలోని పలువురు మాజీమంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్లో చేరనున్నట్లు సమా చారం. వీరిని ఈ నెల 17న తుక్కుగూడ సభా వేదికగా పార్టీలో చేర్చుకోవాలని నిర్ణయించినప్ప టికీ అనివార్య కారణాల వల్ల దానిని మార్చారని తెలిసింది. శని, ఆదివారాల్లో జరిగే సీడబ్ల్యూసీ సమావేశాల విరామ సమయంలోనే వీరిని సోని యా, రాహుల్, ఖర్గే సమక్షంలో పార్టీలో చేర్చుకోవా లని నిర్ణయించినట్టు సమాచారం. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం అసెంబ్లీ స్థానం నుంచి తుమ్మల పోటీ చేసే అవకాశముందని సమాచారం. -
రామోజీ పైశాచికత్వం
సాక్షి, అమరావతి: ‘ఈనాడు’ పత్రిక, దాన్ని నడిపిస్తున్న రామోజీరావు ఇంత పైశాచికంగా ఆలోచిస్తున్నారెందుకు? తెలుగుదేశం పార్టీ దారుణంగా దిగజారిపోయి చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ‘ఈనాడు’ కూడా తన సొంత స్టోరీల మాదిరిగా రాస్తూ ఎందుకింత నీచానికి ఒడిగడుతోంది? ఒక జైలు సూపరింటెండెంటు... అనారోగ్యంతో ఉన్న తన భార్య ఆరోగ్యం విషమించిందని తెలుసుకుని అప్పటికప్పుడు సెలవు పెట్టి వెళితే దానిక్కూడా ఊహలు, అతిశయోక్తులు జోడించి ‘రాజమండ్రి జైల్లో ఏం జరుగుతోంది?’ అంటూ కథనాన్ని వండేశారంటే ఏమనుకోవాలి? చంద్రబాబుతో, పవన్ కళ్యాణ్, లోకేశ్, బాలకృష్ణ ములాఖత్ అయిన కాసేపటికే జైలు సూపరింటెండెంట్ రాహుల్ సెలవు పెట్టారని, ప్రభుత్వ పెద్దలు బలవంతంగా సెలవుపై పంపించటం వల్లే ఇదంతా జరుగుతోందని, జైలును కుట్రలకు కేంద్రంగా మారుస్తున్నారని... ఇలా చేతికొచ్చిన అక్షరాలన్నిటినీ రాసేసింది. దాన్నే తెలుగుదేశం పార్టీ తన విషప్రచారానికి వాడుకుంటోంది. జనం మెదళ్లలో వీలైనంత విషం నింపటానికి ఎల్లో ముఠాలన్నీ ఒక్కటై సాగిస్తున్న ఈ దుష్ప్రచారం హద్దుల్లేకుండా సాగిపోతోంది. భార్య అనారోగ్యం అని చెప్పినా.... వాస్తవానికి జైలు సూపరింటెండెంట్ రాహుల్ భార్య కిరణ్మయి (46) కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఔట్ పేషెంట్గానే చికిత్స పొందుతున్న కిరణ్మయిని.. ఆరోగ్యం విషమించటంతో ఈ నెల 14న ఆసుపత్రిలో చేర్చారు. ఆమెను దగ్గరుండి చూసుకోవాల్సిన పరిస్థితి ఉండటంతో రాహుల్ కూడా సెలవు పెట్టారు. దురదృష్టవశాత్తూ పరిస్థితి విషమించి శుక్రవారం ఆమె మరణించారు కూడా. ‘ఈనాడు’ పత్రిక గానీ, టీడీపీ గానీ ఇలాంటి వార్త రాసేముందు రాహుల్ సెలవు పెట్టిన కారణాన్ని తెలుసుకుని... అది వాస్తవమో కాదో ఒక్కసారి ధ్రువపరుచుకుని ఉంటే సరిపోయేది. అలా చేస్తే.. ఇంతటి హేయమైన, నీచమైన దౌర్భాగ్యపు రాతలు రాసి ఉండేవారు కాదేమో!!. వాస్తవానికి అలా అనుకోవటానికి లేదు. ఎందుకంటే వీళ్లెవరికీ నిజాలతో పనిలేదు. నిజం తెలిసినా దాన్ని బయటకు చెప్పరు కూడా. ఎన్ని అబద్ధాలు చెప్పయినా... జనం మెదళ్లలో ఎంతటి విషాన్ని నింపయినా చంద్రబాబును వీలైతే జైల్లోంచి బయటకు తేవటం, లేకపోతే సానుభూతి సంపాదించి రాజకీయంగా లబ్ధి పొందటమే వాళ్ల లక్ష్యాలు. దీనికోసం తాము అధికారాన్ని అడ్డం పెట్టుకుని విచ్చలవిడిగా సంపాదించిన కోట్ల రూపాయల డబ్బు మూటల్ని వెదజల్లటానికి ఎల్లో ముఠా వెనకాడటం లేదు. కోట్లాది రూపాయలు ఫీజులివ్వటంతో పాటు ప్రత్యేక విమానాల్లో లాయర్లను తీసుకురావటం... దత్తపుత్రుడితో సహా కుటుంబ సభ్యులంతా హైదరాబాద్ – విజయవాడ– ఢిల్లీ అంటూ స్పెషల్ ఫ్లైట్లలో తిరుగుతుండటం... జాతీయ మీడియాకు ఢిల్లీలో చినబాబు లోకేశ్ ఇంటర్వ్యూలు... స్కిల్డెవలప్మెంట్పై నిజాలు అంటూ గాలి మాటలతో ఓ వెబ్సైట్ను ప్రారంభించటం.. ఇవన్నీ ఈ అక్రమ సంపాదనకు పుట్టిన సంతానమే అనుకోవాలి. దొంగతనం చేసి ఇంత యాగీ చేయటమా? దేశంలోనే కాదు... ఒక దొంగని అరెస్టు చేస్తే ఇంత యాగీ చెయ్యటమనేది ప్రపంచంలో ఎక్కడా ఉండదు. ఒక్క ఏపీలో తప్ప... అదీ చంద్రబాబునాయుడి విషయంలో తప్ప. ఒకవైపేమో సీమెన్స్ సంస్థ తమతో ఎవరూ ఎలాంటి ఒప్పందమూ చేసుకోలేదని చెబుతోంది... కానీ ఎల్లో మీడియా మాత్రం సీమెన్స్ పెద్ద సంస్థకాదా? సీమెన్స్ అంతర్జాతీయ దిగ్గజం కాదా? అని వాదిస్తోంది. నిజాలకు మసిపూస్తోంది. నిజంగా సీమెన్స్ సంస్థతో ఒప్పందం చేసుకున్నట్టే ఎదురు ప్రశ్నలు వేస్తోంది. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ తరఫున విడుదల చేసిన డబ్బులు బయటకు పోయాయన్నది నిజం. అవి సీమెన్స్కు చేరలేదని ఆ సంస్థే చెబుతోంది. అవి షెల్ కంపెనీల ద్వారా చంద్రబాబును చేరాయని కేంద్ర దర్యాప్తు సంస్థలే తేల్చాయి. మరి ఇంత రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయి కూడా.. హైదరాబాద్లో ఐటీ ఉద్యోగుల సంఘీభావమంటూ, బెంగళూరులో తమకు మద్దతు తెలిపారంటూ పదేసి మందిని పోగేసి ఇంత యాగీ చేయటమెందుకు? మణిపూర్ పోరాట యోధురాలు ఇరోమ్ షర్మిల ద్వారా కూడా ట్వీట్ చేయించారంటే చంద్రబాబు ఎల్లో నెట్వర్క్ ఏ స్థాయిలో ఉందో చెప్పకనే తెలుస్తుంది. అసలు ఇరోమ్ షర్మిలకు ఏపీ గురించి తెలుసా? ఇక్కడ ఏం జరిగిందో తెలుసా? చంద్రబాబు ఎంత లూటీ చేశాడో తెలుసా? నిజంగా తప్పు చేయకపోతే... తాము అన్నీ సక్రమంగానే చేసి ఉంటే ఆ విషయాలన్నీ కోర్టులో చెప్పొచ్చు కదా? చంద్రబాబును వదిలేయాలంటూ వాట్సాప్ మెసేజ్లు, ఆడియో సందేశాలు... ఎందుకిదంతా? 40 ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు... ఈ 40 ఏళ్లుగా తాను పెంచి పోషించిన విష వ్యవస్థను తనకు మద్దతివ్వటానికి ఉపయోగించుకుంటున్నారని తెలియటానికి ఇంకేం కావాలి? తనకు వ్యతిరేకంగా తీర్పునిస్తే న్యాయమూర్తిపై కూడా దారుణంగా దు్రష్పచారం చేసిన ఈ ఎల్లో ముఠా తన అబద్ధాలతో ఇంకెన్నాళ్లు మనుగడ సాగించగలదు?. సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ భార్య కిరణ్మయి మృతి కంబాలచెరువు (రాజమహేంద్రవరం):రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ ఎస్.రాహుల్ సతీమణి కిరణ్మయి (46) శుక్రవారం అనారోగ్యంతో మృతి చెందారు. కొంతకాలంగా అనారోగ్యంతో కిరణ్మయి బాధపడుతున్నారు. ఆమెకు ఆరోగ్యం బాగోకపోవడంతో నగరంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. రాహుల్, కిరణ్మయి దంపతులకు ఇద్దరు కుమార్తెలు. పోలీసు యంత్రాంగం తీవ్రమైన ఒత్తిడి ఎదుర్కొంటోంది స్థితిగతులు తెలుసుకుని వాస్తవాలను ప్రచురించండి జైళ్లశాఖ డీఐజీ రవికిరణ్,తూర్పు గోదావరి ఎస్పీ పి.జగదీష్ కంబాలచెరువు(రాజమహేంద్రవరం): జిల్లా పోలీసు యంత్రాంగం తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటోందని, స్థితిగతులు తెలుసుకుని రాయాలని, అవాస్తవాలను ప్రచురించవద్దని కోస్తా, ఆంధ్ర రీజియన్ జైళ్లశాఖ డీఐజీ రవికిరణ్, తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ పి.జగదీష్ చెప్పారు. సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ రాహుల్ భార్య కిరణ్మయి అనారోగ్యంతో మృతిచెందడంతో డీఐజీ రవికిరణ్, ఎస్పీ జగదీష్ శుక్రవారం హుటాహుటిన ఆసుపత్రికి వెళ్లి సూపరింటెండెంట్ను పరామర్శించి ఓదార్చారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ పలు వార్తాపత్రికల్లో జైలు సూపరింటెండెంట్ రాహుల్ సెలవుపై వెళ్లిన తీరుపై పలు అనుమానాలు వ్యక్తపరుస్తూ వార్తలు వచ్చాయన్నారు. ఆయన సతీమణి గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారని, ఈ నెల 14న ఉదయం 6గంటలకు ఆసుపత్రిలో చేర్చారన్నారు. ఆమెను చూసుకునేందుకు రాహుల్ రెండు రోజులు సెలవుపై వెళ్లారన్నారు. దీనికి ఈ ఒక్క కారణమే తప్ప మరేకారణం లేదన్నారు. రాహుల్ భయపడి వెళ్లిపోయారు, అధికారులు బలవంతంగా పంపించారు అనేవి పూర్తిగా అవాస్తవాలన్నారు. -
జిమ్ ట్రైనర్ రాహుల్ హత్య కేసులో ట్విస్ట్
సాక్షి, హైదరాబాద్: రాజేంద్రనగర్ జిమ్ ట్రైనర్ రాహుల్ హత్య కేసులో ట్విస్ట్ చోటుచేసుకుంది. రాహుల్ హత్యకు, ప్రేమ వ్యవహారానికి సంబంధం లేదని, ఆ రోజు వీడియో కాల్ మాట్లాడింది ఎంగేజ్మెంట్ అయిన అమ్మాయితో అని పోలీసులు తేల్చారు. రాహుల్ను హత్య చేసిన నలుగురు హంతకులను రాజేంద్రనగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. వ్యక్తిగత కారణాల వల్లే హత్య చేసినట్లు సమాచారం. చిన్నపాటి గొడవే కారణంగానే రాహుల్ హత్యకు గురైనట్లు తెలుస్తోంది. పోలీసులు లోతుగా విచారణ చేపట్టారు. రాహుల్ను హత మార్చాలని రెక్కీ నిర్వహించిన దుండగులు.. అదును చూసి రాహుల్ను అతి కిరాతకంగా కత్తులతో పొడిచి చంపారు. రాహుల్ బలం అంచనా వేసి పెప్పర్ స్ప్రే వాడారు. వర్కట్ ముగించుకొని లిఫ్ట్లో కిందకు రాగానే కంట్లో పెప్పర్ స్ప్రేను ఓ యువకుడు కొట్టగా, మరో ముగ్గురు రాహుల్పై కత్తులతో దాడి చేశారు. రాహుల్ తేరుకునే లోపు విచక్షణారహితంగా పొడిచి చంపారు. చదవండి: కోరుట్ల దీప్తి కేసు.. పోలీసుల అదుపులో చందన, ఆమె బాయ్ ఫ్రెండ్? -
అమేథీతో గాంధీ- నెహ్రూ కుటుంబానికున్న సంబంధం ఏమిటి?
కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ 2024 లోక్సభ ఎన్నికల్లో అమేథీ నుంచి పోటీ చేస్తారని ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ కొత్త చీఫ్ అజయ్ రాయ్ ప్రకటించారు. గత సార్వత్రిక ఎన్నికల్లో రాహుల్ గాంధీ ఇదే స్థానంలో బీజేపీ నాయకురాలు స్మృతి ఇరానీ చేతిలో ఓడిపోయారు. 1967లో ఏర్పడిన అమేథీ.. నాటి నుంచి కాంగ్రెస్కు కంచుకోటగా ఉంది. గత నాలుగు సంవత్సరాలుగా 1970-1990వ దశకాల ప్రారంభంలో మినహా, నెహ్రూ-గాంధీ కుటుంబానికి చెందిన వారు లేదా వారి విధేయులు ఈ నియోజకవర్గంలో గెలుపొందుతూ వస్తున్నారు. అమేథీతో నెహ్రూ-గాంధీ కుటుంబానికి గల దశాబ్దాల నాటి సంబంధం గురించి ఇప్పుడు తెలుకుందాం. సంజయ్ గాంధీ (1980–81) గాంధీ-నెహ్రూ కుటుంబంలో అమేథీ లోక్సభ నుంచి పోటీ చేసిన తొలి వ్యక్తి సంజయ్ గాంధీ. ఎమర్జెన్సీ ముగిసిన వెంటనే జరిగిన 1977 లోక్సభ ఎన్నికల్లో సంజయ్ అమేథీ నుంచి పోటీ చేశారు. అయితే జనాభా నియంత్రణ కోసం సంజయ్ చేపట్టిన బలవంతపు స్టెరిలైజేషన్ కార్యక్రమం కారణంగా అతను ఘోరమైన ఓటమిని ఎదుర్కోవలసి వచ్చింది. నాటి ఎన్నికల్లో జనతా పార్టీకి చెందిన రవీంద్ర ప్రతాప్ సింగ్ విజయం సాధించారు. సంజయ్ గాంధీ తిరిగి 1980 లోక్సభ ఎన్నికల్లో ఇక్కడి నుంచే పోటీ చేసి, ఎంపీ అయ్యారు. అయితే 1981లో జరిగిన విమాన ప్రమాదంలో సంజయ్ మరణించారు. అమేథీ ఎంపీగా స్వల్పకాలమే పనిచేశారు. రాజీవ్ గాంధీ (1981–1991) సంజయ్ మరణంతో రాజీవ్ గాంధీ క్రియాశీల రాజకీయాల్లోకి ప్రవేశించారు. 1981 మే 4న అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సమావేశంలో ఇందిరా గాంధీ తన చిన్న కుమారుని పేరును అమేథీ అభ్యర్థిగా ప్రతిపాదించారు. సమావేశానికి హాజరైన కాంగ్రెస్ సభ్యులందరూ ఈ సూచనను ఆమోదించారు. అనంతరం రాజీవ్ అమేథీ నుంచి తన అభ్యర్థిత్వాన్ని దాఖలు చేశారు. రాజీవ్ నాటి ఉప ఎన్నికలో అఖండ విజయాన్ని సాధించారు. లోక్దళ్ అభ్యర్థి శరద్ యాదవ్పై 2 లక్షలకు పైగా ఓట్ల తేడాతో విజయం సాధించారు. రాజీవ్ 1981 ఆగస్టు 17న అమేథీ నుంచి ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారు. దీని తరువాత కూడా రాజీవ్ 1984, 1989,1991లో అమేథీ నుండి గెలిచారు. దాదాపు దశాబ్దం పాటు ఈ సీటును నిలబెట్టుకున్నారు. 1991లో లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం రాజీవ్ గాంధీని హత్య చేసిన తర్వాత అమేథీలో తిరిగి ఉప ఎన్నిక జరిగింది. కాంగ్రెస్ అభ్యర్థి సతీష్ శర్మ విజయం సాధించారు. 1996 ఎన్నికల్లోనూ ఆయన తన విజయాన్ని పునరావృతం చేశారు. ఇది కూడా చదవండి: నకిలీ టీచర్లకు ప్రమోషన్లు.. దర్జాగా విద్యార్థులకు పాఠాలు.. 14 ఏళ్ల ముసుగు తొలగిందిలా! సోనియా గాంధీ (1999–2004) 1999లో రాజీవ్ గాంధీ సతీమణి సోనియా గాంధీ అమెథీ నియోజకవర్గం నుంచి పోటీ చేసినప్పుడు ఇక్కడి జనం నెహ్రూ-గాంధీ కుటుంబానికిచెందిన చెందిన నేతకు మరోసారి ఓటు వేశారు. అయితే అదే స్థానం నుంచి ఆమె మరోమారు ఎన్నికల బరిలోకి దిగలేదు. 2004 లోక్సభ ఎన్నికల్లో సోనియా స్వయంగా రాయ్బరేలీ నుంచి పోటీ చేయగా, రాహుల్ గాంధీ అమేథీ నుంచి నామినేషన్ దాఖలు చేశారు. రాహుల్ గాంధీ (2004-2019) రాహుల్ తన తొలి ప్రయత్నం(2004)లోనే అమేథీ నుంచి గెలుపొందారు. 2009లో 3.70 లక్షల ఓట్ల భారీ తేడాతో తిరిగి ఎన్నికయ్యారు. 2014లో కూడా రాహుల్ ఇక్కడి నుంచే గెలిచారు. అయితే నాడు అతని ప్రత్యర్థి స్మృతి ఇరానీ అతనికి గట్టి పోటీనిచ్చారు. అయితే స్మృతి ఇరానీ 2019 లోక్సభ ఎన్నికల్లో రాహుల్ను ఓడించారు. 2024 లోక్సభ ఎన్నికల్లో రాహుల్ మళ్లీ అమేథీలో సత్తా చాటుతారని కాంగ్రెస్ భావిస్తోంది. రాహుల్ ఇటీవల చేపట్టిన భారత్ జోడో యాత్ర, కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ విజయం ఇందుకు కలసివస్తాయనే అంచనాలున్నాయి. ఇది కూడా చదవండి: కళలతో కోట్లు.. వీరి టర్నోవర్ చూస్తే దిమ్మతిరిగిపోవాల్సిందే..! -
కండల పిచ్చి.. సూదిగుచ్చి..
నగర యువతలో పెరుగుతున్న కండల పిచ్చి వారిని పెడదారి పట్టిస్తోంది. వేగంగా ఆరు పలకల శరీరాకృతిని సొంతం చేసుకొనేందుకు ప్రమాదకర సూదిమందులను తీసుకుంటుండటం అందరినీ కలవరపెడుతోంది. మైలార్దేవ్పల్లిలోని ఓ జిమ్లో 400 మెఫెంటెర్మైన్ సల్ఫేట్ ఇంజక్షన్లను సోమవారం డ్రగ్ కంట్రోల్ విభాగం అధికారులు, పోలీసులతో కలిసి సీజ్ చేయడం, జిమ్ ట్రైనర్ నితీశ్, అతని స్నేహితులు సొహైల్, రాహుల్లను అరెస్ట్ చేయడం యువతలో మజిల్ మేనియాకు.. ఈ ఇంజక్షన్ల విచ్చలవిడి విక్రయాలకు అద్దం పడుతోంది. – సాక్షి, హైదరాబాద్ కండల కోసం తహతహలాడే వారే టార్గెట్... సాధారణంగా పోటీలలో పాల్గొనే బాడీ బిల్డర్లు ఇంజక్షన్లను ఎంచుకుంటారు. గంటల తరబడి మజిల్ బిల్డింగ్ వర్కవుట్స్ చేయడానికి, పోటీల సమయానికి మజిల్స్ బాగా కనిపించేందుకు వాటిని వినియోగిస్తారు. అయితే అసాధారణ మార్గాల ద్వారా శరీరాన్ని బిల్డప్ చేయాలనే తపన ఉన్న యువకులకు కొన్ని జిమ్లలోని కోచ్లు ఈ ఇంజెక్షన్లు సిఫారసు చేస్తున్నారు. తక్కువ సమయంలోనే మంచి శరీరాకృతిని పొందుతారని చెబుతూ జిమ్ల యజమానులు ఇంజక్షన్లను అధిక ధరలకు విక్రయిస్తున్నారు. ఒక్కోటి సుమారు రూ. 300 పలికే ఇంజక్షన్ను కనీసం రూ. 1,500 నుంచి రూ. 2,000 వరకూ పెంచి అమ్ముతున్నారని సమాచారం. ఇంజక్షన్లను అక్రమంగా విక్రయిస్తున్న వారిలో జిమ్ ట్రైనర్ల నుంచి ఫార్మా, మెడికల్ రిప్రజెంటేటివ్స్ దాకా ఉన్నారు. డిమాండ్నుబట్టి పుణే, ఢిల్లీ వంటి నగరాల నుంచి కూడా ఇంజక్షన్లను వారు దిగుమతి చేసుకుంటున్నారు. వినియోగం... ప్రాణాంతకం ఈ ఇంజక్షన్లు యాంటిహైపోటెన్సివ్స్ అనే మందుల శ్రేణిలో భాగంగా వైద్యులు చెబుతున్నారు. వాటిని సాధారణంగా లోబీపీ చికిత్సలో భాగంగా వినియోగిస్తామని... రోగి రక్తపోటును సాధారణ స్థితికి చేర్చడానికి ఆపరేషన్ థియేటర్లలో సర్జరీల సమయంలో వినియోగిస్తామని వైద్యులు అంటున్నారు. ఇది ఒక వ్యక్తి గుండె స్పందనను ఆకస్మికంగా పెంచేందుకు కూడా కారణమవడంతో అది కఠినమైన వర్కవుట్స్ చేసేందుకు ఉ్రత్పేరకంగా పనిచేస్తుందని వివరించారు. అయితే పర్యవేక్షణ లేని మెఫెంటెర్మైన్ ఇంజక్షన్ల వినియోగం వల్ల యువకుల్లో సైకోసిస్ లక్షణాలు పెరిగిపోతాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. వాటిని దీర్ఘకాలం వాడితే అలవాటుగా మారి చర్మంపై దద్దుర్లు, రక్తపోటులో హెచ్చుతగ్గులు, శ్వాస ఆడకపోవడం, నిద్రలేమి, వికారం, వాంతులు, దృష్టి లోపాలు, భ్రాంతులు.. చివరకు గుండెపోటుకు కూడా సంభవించొచ్చని స్పష్టం చేస్తున్నారు. -
త్వరలో పేరెంట్స్గా ప్రమోషన్.. బుల్లితెర జంట కుప్పిగంతులు, ట్రోలింగ్
బిగ్బాస్ జోడీ సింగర్ రాహుల్.. నటి దిశా పార్మర్ త్వరలో పేరెంట్స్గా ప్రమోషన్ పొందనుండటంతో వారి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఇటీవలే మెటర్నటీ ఫోటోషూట్ కూడా చేసి ఆయా ఫోటోలను ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశారు. అయితే మెటర్నటీ షూట్ సందర్భంలో చేసిన చిలిపి పనులను, కుప్పి గంతులను తాజాగా వీడియో రూపంలో రిలీజ్ చేశారు. నలుపు రంగు దుస్తుల్లో ఉన్న రాహుల్- దిశా సంతోషంతో ఎగిరి గంతేస్తున్నారు. దిశా బేబీ బంప్ను ఆప్యాయంగా తడుముతూ ముద్దు పెట్టాడు రాహుల్. అభిమానులు వీరి ఆనందాన్ని చూసి మురిసిపోతుంటే మరికొందరు మాత్రం ఇంత ఓవరాక్షన్ అవసరమా? అని కామెంట్లు చేస్తున్నారు. ప్రెగ్నెన్సీని కూడా అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నారు, ప్రపంచంలో పిల్లలను కంటున్న మొదటి జంట మీదే అన్నట్లుగా బిల్డప్ ఇస్తున్నారే అని ట్రోల్ చేస్తున్నారు. అలా మొదలైంది.. సింగర్ రాహుల్ హిందీ బిగ్బాస్ 14వ సీజన్లో పాల్గొన్నాడు. వీకెండ్ కా వార్ ఎపిసోడ్లో దిశా బిగ్బాస్ ఇంట్లో ఎంట్రీ ఇచ్చింది. ఈ క్రమంలో ఆమె బర్త్డే రోజు తన మనసులో ఉన్న ప్రేమను బయటపెట్టాడు రాహుల్. మోకాళ్ల మీద కూర్చుని పెళ్లి చేసుకోమని అడిగాడు. అందుకు ఆమె పచ్చజెండా ఊపడంతో 2021 జూలై 16న పెద్దల సమక్షంలో వీరి పెళ్లి జరిగింది. 2023 మే 18న అమ్మానాన్న కాబోతున్నామంటూ రాహుల్, దిశ గుడ్న్యూస్ చెప్పారు. View this post on Instagram A post shared by Disha Parmar Vaidya (@dishaparmar) చదవండి: మళ్లీ పెళ్లి ఏ ఓటీటీలోకి రానుందంటే? -
సింటెక్స్ మాజీ ఎండీకి ఎన్సీఎల్ఏటీలో ఎదురుదెబ్బ
న్యూఢిల్లీ: కార్పొరేట్ దివాలా ప్రక్రియకు వ్యతిరేకంగా సింటెక్స్ ఇండస్ట్రీస్ మాజీ చైర్మన్, ఎండీ రాహుల్ అరుణ్ప్రసాద్ పటేల్ దాఖలు చేసిన పిటిషన్ను నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్ (ఎన్సీఎల్ఏటీ) కొట్టివేసింది. సింటెక్స్ ఇండస్ట్రీస్పై కార్పొరేట్ దివాలా ప్రక్రియ(సీఐఆర్పీ)ను ఆమోదిస్తూ, 2021 ఏప్రిల్ 6న ఎన్సీఎల్టీ అహ్మదాబాద్ బెంచ్ ఇచ్చిన తీర్పును ఇద్దరు సభ్యుల ఎన్సీఎల్ఏటీ బెంచ్ తాజాగా సమర్థించింది. ఇన్వెస్కో అసెట్ మేనేజ్మెంట్(ఇండియా) అభ్యర్థనకు అనుగుణంగా అహ్మదాబాద్ బెంచ్ గతంలో సింటెక్స్పై ఐసీఆర్పీకి ఆదేశాలు జారీ చేసింది. ఈ అంశాన్ని వ్యతిరేకిస్తూ రాహుల్ అరుణ్ప్రసాద్ పెట్టుకున్న అభ్యర్ధనలో ఎలాంటి మెరిట్ కనిపించలేదని బెంచ్ పేర్కొంది. దీంతో మధ్యంతర అప్పీల్ను తిరస్కరిస్తున్నట్లు స్పష్టం చేసింది. కాగా.. సింటెక్స్ ఇండస్ట్రీస్పై సీఐఆర్పీ దాదాపు పూర్తికానుంది. డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్, అసెట్స్ కేర్ అండ్ రీకన్స్ట్రక్షన్ ఎంటర్ప్రైజ్ సంయుక్తంగా వేసిన బిడ్కు 98.88 శాతం వోటింగ్ లభించింది. వెరసి 2023 ఫిబ్రవరి 10న ఎన్సీఎల్టీ రుణ పరిష్కార ప్రణాళికను ఆమోదించింది. -
అప్పులే దారుణానికి ఒడిగట్టేలా చేశాయి.. వీడిన టెక్కీ రాహుల్ అదృశ్యం మిస్టరీ
సాక్షి, కోలారు: బెంగళూరు రూరల్లోని బాగలూరులో నివాసం ఉండే టెక్కీ రాహుల్(27) తన మూడేళ్ల వయసున్న కుమార్తెతో కలిసి ఈనె 16న కోలారులోని కెందెట్టి చెరువులో దూకాడన్న మిస్టరీ వీడింది. కుమార్తెను నీటిలోకి తోసి హత్య చేసి అనంతరం ఆచూకీ లేకుండా పోయిన టెక్కీ ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. గుజరాత్కు చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ రాహుల్.. భవ్య అనే యువతిని ప్రేమించి వివాహం చేసుకున్నాడు. వీరికి జియా అనే కూతురు ఉంది. ఏడాదిన్నర క్రితం ఉద్యోగం కోల్పోయిన రాహుల్ బిట్ కాయిన్లో డబ్బు పెట్టుబడి పెట్టి నష్టపోయాడు. ఖర్చుల కోసం విపరీతంగా అప్పులు చేయడంతో అప్పులబాధ ఎక్కువైంది. గతంలో ఇంట్లో బంగారం చోరీ అయిందని తప్పుడు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో పోలీసులు విచారణకు హాజరు కావాలని తెలపడంతో రాహుల్ భయపడ్డాడు. ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయం కూతురిని స్కూల్కు వదలి రావడానికి కారులో బయలుదేరిన సమయంలోనే అప్పుల వారు ఇంటి వద్దకు వచ్చి వేధించడంతో ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. తాను చనిపోతే భార్య కూతురును సరిగా చూడదని భావించి కూతురుతో సహా ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. నవంబర్ 15వ తేదీన కూతురిని స్కూల్కు వదిలి వస్తానని కారులో బయలుదేరి నేరుగా కోలారు జాతీయ రహదారి పక్కనే ఉన్న కెందట్టి చెరువు వద్దకు వచ్చాడు. చదవండి: (మహా నగరంలో మాయగాడు.. సివిల్ సప్లయీస్ డెప్యూటీ కలెక్టర్నంటూ..) కూతురిని కారులోనే ఊపిరాడకుండా చేసి చంపి మృతదేహాన్ని చెరువులో పారవేశాడు. అనంతరం తాను కూడా చెరువులోకి దూకాడు. అయితే లోతు తక్కువగా ఉండడం వల్ల బతికి పోయాడు. ఎలాగైనా చనిపోవాలని భావించిన రాహుల్ రైలు కిందపడేందుకు బంగారుపేట రైల్వే స్టేషన్కు చేరుకున్నాడు. రైలు కింద దూకడానికి భయపడి పలు ప్రాంతాల్లో రైలులోనే తిరిగి చివరికి చెన్నై చేరుకున్నాడు. చెన్నైలో తన సంబందీకులకు ఫోన్ చేసి తనను ఎవరో కిడ్నాప్ చేశారని నాటకం ఆడాడు. మొబైల్ నెట్వర్క్ ఆధారంగా రాహుల్ ఆంధ్రప్రదేశ్ నుంచి బెంగళూరుకు రైలులో వస్తున్నాడని తెలుసుకుని గురువారం రాత్రి పోలీసులు అతనిని అరెస్టు చేశారు. పోలీసు విచారణలో రాహుల్ అన్ని విషయాలు బయటపెట్టాడు. -
వైశాలి సూసైడ్ కేసు..సంచలన విషయాలు బయటపెట్టిన సహనటుడు..!
బాలీవుడ్ బుల్లితెర నటి వైశాలి టక్కర్ ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈ కేసులో ప్రధాన నిందితుడైన ఆమె మాజీ బాయ్ఫ్రెండ్ రాహుల్ నవ్లానీతో పాటు అతని భార్య దిశను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమె ఆత్మహత్యపైసహనటుడు నిశాంత్ సంచలన విషయాలు బయటపెట్టాడు. వైశాలి సూసైడ్ చేసుకునేలా రాహుల్ చిత్రహింసలకు గురిచేశాడని నిశాంత్ మల్ఖానీ ఆరోపించారు. రాహుల్తో వైశాలి సన్నిహితంగా ఉన్న ఫోటోలు బహిర్గతం చేస్తానని పలుసార్లు బెదిరింపులకు పాల్పడ్డారని తెలిపారు. వైశాలి ఆత్మహత్య తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని నిశాంత్ అన్నారు. ఆమె తనతో వ్యక్తిగత విషయాలను పంచుకునేదని వెల్లడించారు. నిశాంత్ మల్ఖానీ కథానాయకుడిగా నటించిన రక్షాబంధన్ - రసల్ అప్నే భాయ్ కి ధాల్ షోలో వైశాలి కూడా భాగమైంది. ('చదవండి: నటి వైశాలి సూసైడ్ కేసులో నిందితుడు రాహుల్ అరెస్ట్) రాహుల్ పెళ్లి చేసుకున్నా కూడా ఆమెను వేధిస్తూనే ఉన్నాడని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో నిశాంత్ మల్ఖానీ తెలిపారు. వైశాలి నిశ్చితార్థం జరిగిన తర్వాత వేధింపులు మరింత ఎక్కువయ్యాయని పేర్కొన్నారు. వైశాలికి కాబోయే భర్తకు మెసేజ్లు పంపి ఆమెను మానసికంగా హింసించేవాడని వెల్లడించారు. రాహుల్ వేధింపులకు తట్టుకోలేక డిప్రెషన్లో ఉన్న వైశాలి మానసిక వైద్యుడిని కూడా సంప్రదించిందని అన్నారు. రాహుల్ వైశాలితో ఉన్న సన్నిహిత చిత్రాలను కాబోయే భర్తకు చూపిస్తానని బెదిరించడంతోనే ఆత్మహత్య చేసుకుందని నిశాంత్ వెల్లడించారు. -
తీవ్ర విషాదం.. 'ఛెల్లో షో' మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ మృతి
సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆర్ఆర్ఆర్ సినిమాను సైతం వెనక్కు నెట్టి.. ఆస్కార్కు నామినేట్ అయిన ఛెల్లో షో (ద లాస్ట్ షో) సినిమాలో నటించిన బాల నటుడు రాహుల్ కోలీ (10) కన్నుమూశారు. గత కొంతకాలంగా క్యాన్సర్తో పోరాడుతున్న రాహుల్ తుదిశ్వాస విడిచాడు. కాగా ఛెల్లో షో సినిమా ఈనెల 14న విడుదల కానుంది. అంతలోనే రాహుల్ మరణించడంతో చిత్రబృందంతో పాటు కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. పదేపదే జ్వరం బారిన పడుతున్న రాహుల్, ఇటీవలె రక్తపు వాంతులు చేసుకున్నాడని రాహుల్ తండ్రి రాము కోలీ తెలిపారు. అక్టోబర్ 2న ఆసుపత్రిలో చికిత్స పొందుతూనే తము కళ్ల ముందే బిడ్డ చనిపోయాంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నెల 14వ తేదీన తాము ఛెల్లో షో సినిమా చూడాలనుకున్నామని, కానీ ఇంతలోనే తమ కుమారుడు తిరిగిరాని లోకాలకు వెళ్లాలండూ రాహుల్ తండ్రి కన్నీటిపర్యంతం అయ్యాడు. కాగా సినిమాలపై ఎంతో ఇష్టం కలిగిన తొమ్మిదేళ్ల యువకుడి జీవితం ఎలా సాగిందన్న నేపథ్యంతో ఛెల్లో షో సినిమా సాగుతుంది. ఇందులో మొత్తం ఆరుగురు పిల్లలు నటించగా వారిలో రాహుల్ కోలీ ఒకడు. అతని మృతి పట్ల పలువురు ప్రముఖులు, నెటిజన్లు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. -
‘రాహుల్ అంటే భారత్.. భారత్ అంటే రాహుల్’
లక్నో: భారత్ జోడో యాత్ర చేబడుతున్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై ప్రశంసలు కురిపించారు ఉత్తర్ప్రదేశ్ పార్టీ నూతన అధ్యక్షుడు బ్రిజ్లాల్ ఖబ్రీ. రాహుల్ అంటే భారత్.. భారత్ అంటే రాహుల్ అని నినదించారు. దేశాన్ని, రాజ్యాంగాన్ని కాపాడటమే లక్ష్యంగా రాహుల్ భారత్ జోడో యాత్ర చేబడుతున్నారని నొక్కి చెప్పారు. యూపీసీసీ అధ్యక్షుడిగా ఎన్నికైన క్రమంలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు దేవ్ కాంత్ బరూవా పాపులర్ డైలాగ్ ‘ఇండియా అంటే ఇందిరా, ఇందిరా అంటే ఇండియా’ను ఉద్ఘాటించారు. ఈ నినాదాన్ని తరుచుగా ప్రత్యర్థులు ఉపయోగిస్తూ కాంగ్రెస్ పార్టీ, గాంధీలపై విమర్శలు చేస్తుంటారు. ఎన్నికల పరంగా కీలకమైన ఉత్తర్ప్రదేశ్లో కేవలం ఒకే ఒక్క జిల్లా బులంద్షహర్లో మాత్రమే రాహుల్ భారత్ జోడో యాత్ర చేపట్టటంపై ప్రశ్నించగా.. వివరణ ఇచ్చారు ఖబ్రీ. ‘భారత్ అంటే ఒక జిల్లా కాదు, ఒక రాష్ట్రం కాదు. రాష్ట్రాల సమహారం. రాహుల్ 13 రాష్ట్రాల్లో యాత్ర చేస్తారు. ఆయనకు పెద్ద లక్ష్యం ఉంది. బీజేపీ ప్రభుత్వం దేశాన్ని అమ్మేసి రాజ్యాంగాన్ని నాశనం చేయాలని చూస్తోంది. 2024 ఎన్నికల్లో యూపీ మొత్తం 80 సీట్లు గెలవాలని కాంగ్రెస్ లక్ష్యంగా పెట్టుకుంది. బరేలీ, అమేఠీల్లో బీజేపీ డిపాజిట్లు కోల్పోతుంది. దేశాన్ని, రాజ్యాంగం, ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు రాహుల్ గాంధీ పాదయాత్ర చేపట్టారు. రాహుల్ పాదయాత్ర చేస్తే కొందరికి కడుపు మంట ఎందుకు వస్తోంది? లక్షల మంది రాహుల్తో కలిసి నడుస్తున్నారు. రాహుల్ అంటే భారత్, భారత్ అంటే రాహుల్ అని చెప్పగలను.’ అని పేర్కొన్నారు ఖబ్రీ. కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టటంపై సంతోషం వ్యక్తం చేశారు ఖబ్రీ. రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన ప్రణాళిక, వ్యూహాలను క్షేత్రస్థాయి నుంచి తీసుకొస్తామని తెలిపారు. 2024 ఎన్నికల్లో ఉత్తర్ప్రదేశ్లోని మొత్తం స్థానాలను గెలవాలనే లక్ష్యంగా పని చేస్తామన్నారు. ఇదీ చదవండి: కార్పొరేట్లకు కాదు, గుత్తాధిపత్యాలకే వ్యతిరేకం -
ఆ బాలుడు మృత్యుంజయుడు.. అయిదు రోజులు బోరుబావిలో ఉండి..
జనిగిరి: చుట్టూ చిమ్మ చీకటి, 68 అడుగుల లోతైన బోరుబావిలో పాము, తేళ్లు, కప్పలు తిరుగుతూ ఉంటే మానసిక వికలాంగుడైన 11 ఏళ్ల బాలుడు దాదాపు 5 రోజులు గడిపాడు. బావిలో ఆడుకుంటూ పడిపోయిన రాహుల్ సాహు అనే బాలుడు బుద్ధిమాంద్యం ఉన్నప్పటికీ అంతులేని ధైర్యాన్ని ప్రదర్శించాడు. ఎట్టకేలకు 104 గంటల సేపు శ్రమించిన 500 మంది సహాయ సిబ్బంది రోబో సాంకేతికతో బయటకు తీసుకువచ్చారు. బావిలో ఉన్న పాము ఆ బాలుడిని ఏమీ చేయలేదని సహాయ సిబ్బంది వెల్లడించారు. ఛత్తీస్గఢ్లోని జహ్నగిరి–చంపా జిల్లాలోని పిర్హిడ్ గ్రామంలో రాహుల్ సాహు బోరు బావిలో పడిపోయిన ఘటన ఈ నెల 10న జరిగింది. రామ్కుమార్, గీతాసాహుల కుమారుడైన రాహుల్ శుక్రవారం మధ్యాహ్నం భోజనం చేశాక ఆడుకోవడానికి పొలాల్లోకి వెళ్లాడు. బోరు తవ్వి నీళ్లు పడకపోవడంతో దానిపై ఒక షీట్ కప్పి ఉంచారు. రాహుల్ సాహు మానసికంగా పూర్తిగా ఎదగకపోవడంతో ఆ షీట్ చూసుకోలేదేమో ఏమో బావిలోకి జారిపోయాడు. విషయం తెలిసిన వెంటనే హుటాహుటిన రంగంలోకి దిగిన సహాయ సిబ్బంది సమాంతరంగా మరో బోరు తవ్వినా మొదట్లో ఉపయోగం లేకుండా పోయింది. ఆ తర్వాత అయిదు రోజులు శ్రమించి రోబో టెక్నాలజీ సాయంతో ఆ బాలుడిని మంగళవారం అర్ధరాత్రి క్షేమంగా బయటకు తీసుకువచ్చారు. రాహుల్కి ప్రథమ చికిత్స చేసిన అనంతరం బిలాస్పూర్లోని అపోలో ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం రాహుల్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. మానసిక వికలాంగుడైనప్పటికీ రాహుల్ సాహు మొదట్నుంచి పోరాటపటిమ ప్రదర్శించేవాడు. సైకిల్ తొక్కడం, ఈత కొట్టడం వంటివి చేసేవాడు. తబలా కూడా బాగా వాయిస్తాడని తల్లిదండ్రులు చెప్పారు. -
బన్నీని మెగాస్టార్గా అభివర్ణించిన క్రికెటర్!
'పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా ఫైరూ..', 'పుష్ప.. పుష్పరాజ్.. తగ్గేదేలే..' ఎక్కడ చూసినా ఈ పుష్ప డైలాగులు, పాటలు మార్మోగిపోతున్నాయి. సౌత్ ,నార్త్ తేడా లేకుండా అంతటా పుష్ప ప్రభంజనమే కనిపిస్తోంది. సినిమా వచ్చి 20 రోజులవుతున్నా దాని క్రేజ్ మాత్రం ఇసుమంతైనా తగ్గలేదు. బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల మోత మోగిస్తున్న ఈ సినిమాను ఈ మధ్యే టీమిండియా ఆటగాళ్లు వీక్షించిన విషయం తెలిసిందే. తాజాగా మరో ఇండియన్ క్రికెటర్ రాహుల్ శర్మ 'పుష్ప' చిత్రాన్ని వీక్షించాడు. ఇదే విషయాన్ని ఆయన ట్విటర్లో వెల్లడించాడు. 'పుష్ప సినిమా చూశాను. మొదటిసారి దక్షిణాది చిత్రం చూసి అద్భుతంగా ఫీలయ్యాను. మరీ ముఖ్యంగా మెగాస్టార్ అల్లు అర్జున్ మరో లెవల్లో కనిపించాడు. రష్మిక మందన్నా కూడా అదరగొట్టేసింది. పుష్ప టీమ్ మొత్తానికి శుభాకాంక్షలు' అని రాసుకొచ్చాడు. ఇది చూసిన బన్నీ.. 'పుష్ప చిత్రం మీకు నచ్చినందుకు సంతోషంగా ఉంది. మీ ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు' అంటూ రిప్లై ఇచ్చాడు. అయితే ఇది చూసిన సినీప్రియులు మాత్రం ఈయనేంటి? బన్నీని మెగాస్టార్ అని పిలిచాడు? అంటూ కామెంట్లు చేస్తున్నారు. Saw #pushpa last night , wow what a experience to watch South movies first time in 🎭! Specially my fav megastar @alluarjun u r another level ❤️✊👏👏👏 and @iamRashmika u r amazing too 😊👏👏 congrats to the team Pushpa 😊🙌 — Rahul Sharma (@ImRahulSharma3) January 4, 2022 -
సింగర్ రాహుల్ను చంపేస్తామంటూ బెదిరింపు కాల్స్
Rahul Vaidya Gets Death Threats : ప్రముఖ సింగర్, బిగ్బాస్14 రన్నరప్ రాహుల్ వైద్య వివాదంలో చిక్కుకున్నారు. ఇటీవలె నవరాత్రి స్పెషల్ సందర్బంగా రాహుల్ ‘గర్బే కి రాత్’అనే పాటను కంపోజ్ చేశాడు. రాహుల్, భూమి త్రివేది కలిసి పాడిన ఈ పాట విడుదలైన కాసేపటికే తీవ్ర వివాదాస్పదం అయ్యింది. తమ మనోభావాలను కించపరిచే విధంగా పాటను కంపోజ్ చేశారంటూ సోషల్ మీడియాలో తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ పాటలో గుజరాతీ జానపద పాట 'రమ్వా ఆవో మది' అనే పదాన్ని అభ్యంతరకరంగా ఉపయోగించారంటూ గుజరాతీలు ఆగ్రహం వ్యక్తం చేశారు.తమ ఆచారాలను కించపరిచారనే కారణంతో రాహుల్, భూమి త్రివేదిలపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఇద్దరిపై ఎఫ్ఐఆర్ నమోదైంది. అయితే ఇప్పటికీ బెదిరింపులు ఆగడం లేదని, రాహుల్ను కొడతం, చంపేస్తామంటూ గుర్తు తెలియని వ్యక్తుల నుంచి ఫోన్ కాల్స్ వస్తున్నాయంటూ రాహుల్ టీం పేర్కొంది. మనోబావాలను దెబ్బతీయడం తమ ఉద్దేశం కాదని, ఆ పదాలు తీసేయడానికి తమ బృందం పని చేస్తుదని తెలిపారు. అప్పటివరకు అందరూ శాంతంగా ఉండాలని, దాన్ని సరిదిద్దడానికి కొంచెం సమయం ఇవ్వాల్సిందిగా కోరారు. చదవండి: త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కనున్న హీరో సాయితేజ్? పెళ్లికాకుండా బిడ్డను కనకుండా ఉండాల్సింది: నటి -
ట్విట్టర్ వార్ కేటీఆర్ V/S రేవంత్
-
Rahul Case Update: మరింత లోతుగా దర్యాప్తు ముమ్మరం
-
రాహుల్ హత్య కేసు: పోలీసుల అదుపులో గాయత్రి?
-
రాహుల్ హత్య కేసు: పోలీసుల అదుపులో గాయత్రి?
సాక్షి, విజయవాడ: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన వ్యాపారి కరణం రాహుల్ హత్య కేసులో కీలక నిందితురాలైన గాయత్రి పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలిసింది. నేడు విజయవాడ కోర్టులో గాయత్రిని హాజరుపరిచే అవకాశం ఉంది. ఇప్పటికే రాహుల్ హత్య కేసులో 11 మందిని పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. తన కూతురికి ఎయిమ్స్లో మెడికల్ సీటు ఇప్పించాలని రాహుల్కు గాయత్రి రూ.6 కోట్లు ఇచ్చింది. మెడికల్ సీటు రాకపోగా ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వకపోవడంతో విజయకుమార్, కోగంటి సత్యంలతో కలిసి రాహుల్ హత్యకు కుట్ర పన్నినట్లు పోలీసులు వెల్లడించిన విషయం విదితమే. కాగా, ఈ హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న కోగంటి సత్యాన్ని గురువారం పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. ఆయనను విజయవాడ సబ్జైలు నుంచి మాచవరం పీఎస్కు తరలించారు. ఇవీ చదవండి: చార్జర్ వైర్తో చంపేశారు... ఇలాంటి పందుల పోటీలు ఎప్పుడైనా చూశారా? -
రాహుల్ హత్య కేసు: పోలీసు కస్టడీకి కోగంటి సత్యం
సాక్షి, విజయవాడ: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన వ్యాపారి కరణం రాహుల్ హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న కోగంటి సత్యాన్ని గురువారం పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా కోగంటి సత్యాన్ని విజయవాడ సబ్జైలు నుంచి మాచవరం పీఎస్కు తరలించారు. కాగా పోలీసులు రాహుల్ హత్య కేసు విషయమై కోగంటి సత్యాన్ని నేడు, రేపు విచారించనున్నారు. ఇక ఈ హత్య కేసులో ఇప్పటివరకు 11 మందిని అరెస్ట్ అయ్యారు. పరారీలో ఉన్న మరో ఇద్దరి కోసం పోలీసులు గాలిస్తున్నారు. రాహుల్ హత్యకు కారణాలివే.. కోరాడ విజయ్కుమార్, ఆయన స్నేహితురాలు గాయత్రి గత కొన్నేళ్లుగా కోరాడ చిట్ఫండ్ కంపెనీ నడుపుతున్నారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్కుమార్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయారు. ఎన్నికల్లో భారీగా ఖర్చు చేసి నష్టపోయిన ఆయనపై అప్పులవాళ్లు తమ డబ్బు ఇవ్వాలని తీవ్ర ఒత్తిడి చేయసాగారు. మరోవైపు చిట్ఫండ్ కంపెనీ డబ్బు సైతం ఎన్నికల్లో వినియోగించడంతో.. అక్కడా ఒత్తిళ్లు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో రాహుల్, విజయ్కుమార్ భాగస్వామ్యంలో నిర్వహిస్తున్న జిక్సిన్ సిలిండర్స్ కంపెనీలోని తన వాటా తీసుకుని డబ్బు ఇవ్వాల్సిందిగా విజయ్కుమార్ రాహుల్ను కోరాడు. అయితే ఈ విషయంలో స్పందించకపోవడంతో రాహుల్పై ఆగ్రహంతో ఉన్నాడు. ఇదిలా ఉండగా విజయ్కుమార్ స్నేహితురాలు గాయత్రికి రాహుల్ రూ.6 కోట్లు ఇవ్వాల్సి ఉంది. ఆమెకు సైతం ఆ డబ్బు తిరిగి ఇవ్వకపోవడంతో తీవ్ర అసంతృప్తితో ఉంది. అలాగే జిక్సిన్ సిలిండర్స్ కంపెనీలో పనిచేస్తున్న సీతయ్యకు లాజిస్టిక్స్ బిజినెస్లో కాంట్రాక్ట్ ఇస్తానని హామీ ఇచ్చి నేరవేర్చకపోవడంతో రాహుల్పై కక్ష పెంచుకున్నాడు. ఈ పరిస్థితులే రాహుల్ హత్యకు దారితీశాయి. చదవండి: రాహుల్ హత్య కేసు: మరో నలుగురు అరెస్ట్ రాహుల్ హత్యకేసు: వెలుగులోకి సంచలన విషయాలు -
రాహుల్ హత్య కేసు: మరో నలుగురు అరెస్ట్
సాక్షి, విజయవాడ: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన యువ వ్యాపారవేత్త కరణం రాహుల్ హత్య కేసులో మరో నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీతయ్య, బాబురావు, రాజబాబు, కరణం రమేష్లను అరెస్ట్ చేశారు. ఇప్పటివరకు 13 మందిలో 11 మంది నిందితులు అరెస్ట్ అయ్యారు. మిగిలిన ఇద్దరు నిందితుల కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. ఈ హత్య కేసులో ప్రధాన నిందితులను పోలీసులు విచారిస్తున్నారు. హత్యకు కారణాలివే.. కోరాడ విజయ్కుమార్, ఆయన స్నేహితురాలు గాయత్రి గత కొన్నేళ్లుగా కోరాడ చిట్ఫండ్ కంపెనీ నడుపుతున్నారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్కుమార్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయారు. ఎన్నికల్లో భారీగా ఖర్చు చేసి నష్టపోయిన ఆయనపై అప్పులవాళ్లు తమ డబ్బు ఇవ్వాలని తీవ్ర ఒత్తిడి చేయసాగారు. మరోవైపు చిట్ఫండ్ కంపెనీ డబ్బు సైతం ఎన్నికల్లో వినియోగించడంతో.. అక్కడా ఒత్తిళ్లు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో రాహుల్, విజయ్కుమార్ భాగస్వామ్యంలో నిర్వహిస్తున్న జిక్సిన్ సిలిండర్స్ కంపెనీలోని తన వాటా తీసుకుని డబ్బు ఇవ్వాల్సిందిగా విజయ్కుమార్ రాహుల్ను కోరాడు. అయితే ఈ విషయంలో స్పందించకపోవడంతో రాహుల్పై ఆగ్రహంతో ఉన్నాడు. ఇదిలా ఉండగా విజయ్కుమార్ స్నేహితురాలు గాయత్రికి రాహుల్ రూ.6 కోట్లు ఇవ్వాల్సి ఉంది. ఆమెకు సైతం ఆ డబ్బు తిరిగి ఇవ్వకపోవడంతో తీవ్ర అసంతృప్తితో ఉంది. అలాగే జిక్సిన్ సిలిండర్స్ కంపెనీలో పనిచేస్తున్న సీతయ్యకు లాజిస్టిక్స్ బిజినెస్లో కాంట్రాక్ట్ ఇస్తానని హామీ ఇచ్చి నేరవేర్చకపోవడంతో రాహుల్పై కక్ష పెంచుకున్నాడు. ఈ పరిస్థితులే రాహుల్ హత్యకు దారితీశాయి. ఇవీ చదవండి: రాహుల్ హత్య: చార్జర్ వైర్తో చంపేశారు మనబడి నాడు-నేడు: టీచర్గా మారిన ఎమ్మెల్యే రోజా -
రాహుల్ హత్య కేసులో మరో నలుగురు నిందితుల అరెస్ట్
-
రాహుల్ హత్య కేసును ఛేదించిన విజయవాడ పోలీసులు
-
చార్జర్ వైర్తో చంపేశారు...
గుణదల (విజయవాడ తూర్పు): ఏపీలో సంచలనం రేకెత్తించిన యువ వ్యాపారవేత్త కరణం రాహుల్ హత్య కేసు మిస్టరీ వీడింది. సెల్ఫోన్ చార్జర్ వైర్ మేడకు బిగించి, దిండుతో ఊపిరాడకుండా చేసి రాహుల్ను చంపేశారని విజయవాడ నగర పోలీస్ కమిషనర్ బత్తిన శ్రీనివాసులు తెలిపారు. కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి కీలక ఆధారాలు సేకరించి, పలువురు నిందితులను శుక్రవారం అరెస్టు చేశారు. కేసుకు సంబంధించిన పలు కీలక విషయాలను కమిషనర్ శుక్రవారం మీడియాకు వివరించారు. ఆర్థిక లావాదేవీలే ముఖ్య కారణం.. కోరాడ విజయ్కుమార్, ఆయన స్నేహితురాలు గాయత్రి గత కొన్నేళ్లుగా కోరాడ చిట్ఫండ్ కంపెనీ నడుపు తున్నారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్కుమార్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయారు. ఎన్నికల్లో భారీగా ఖర్చు చేసి నష్టపోయిన ఆయనపై అప్పులవాళ్లు తమ డబ్బు ఇవ్వాలని తీవ్ర ఒత్తిడి చేయసాగారు. మరోవైపు చిట్ఫండ్ కంపెనీ డబ్బు సైతం ఎన్నికల్లో వినియోగించడంతో.. అక్కడా ఒత్తిళ్లు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో రాహుల్, విజయ్కుమార్ భాగస్వామ్యంలో నిర్వహిస్తున్న జిక్సిన్ సిలెండర్స్ కంపెనీలోని తన వాటా తీసుకుని డబ్బు ఇవ్వాల్సిందిగా విజయ్కుమార్ రాహుల్ను కోరాడు. అయితే ఈ విషయంలో స్పందించకపోవడంతో రాహుల్పై ఆగ్రహంతో ఉన్నాడు. ఇదిలా ఉండగా విజయ్కుమార్ స్నేహితురాలు గాయత్రికి రాహుల్ రూ.6 కోట్లు ఇవ్వాల్సి ఉంది. ఆమెకు సైతం ఆ డబ్బు తిరిగి ఇవ్వకపోవడంతో తీవ్ర అసంతృప్తితో ఉంది. అలాగే జిక్సిన్ సిలెండర్స్ కంపెనీలో పనిచేస్తున్న సీతయ్యకు లాజిస్టిక్స్ బిజినెస్లో కాంట్రాక్ట్ ఇస్తానని హామీ ఇచ్చి నేరవేర్చపోవడంతో రాహుల్పై కక్ష పెంచుకున్నాడు. ఈ పరిస్థితులే రాహుల్ హత్యకు దారితీశాయి. నిందితుల అరెస్టు.. మృతుని తండ్రి కరణం రాఘవరావు మాచవరం పోలీస్స్టేషన్లో ఇచ్చిన పిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. దర్యాప్తు ప్రారంభించిన పది రోజుల వ్యవధిలోనే కీలక ఆధారాలు సేకరించి, పరారీలో ఉన్న నిందితుల్లో ఆరుగురిని శుక్రవారం అరెస్టు చేశారు. -
రాహుల్ హత్య.. కారణాలివే: విజయవాడ సీపీ
-
రాహుల్ హత్య: చార్జర్ వైర్తో చంపేశారు
గుణదల (విజయవాడ తూర్పు) : రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన యువ వ్యాపారవేత్త కరణం రాహుల్ హత్య కేసు మిస్టరీ వీడింది. సెల్ఫోన్ చార్జర్ వైర్ మెడకు బిగించి, దిండుతో ఊపిరాడకుండా చేసి రాహుల్ను చంపేశారని విజయవాడ నగర పోలీస్ కమిషనర్ బత్తిన శ్రీనివాసులు తెలిపారు. కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి కీలక ఆధారాలు సేకరించి, పలువురు నిందితులను శుక్రవారం అరెస్టు చేశారు. కేసుకు సంబంధించిన పలు కీలక విషయాలను కమిషనర్ శుక్రవారం మీడియాకు వివరించారు. ఆర్థిక లావాదేవీలే ముఖ్య కారణం.. కోరాడ విజయ్కుమార్, ఆయన స్నేహితురాలు గాయత్రి గత కొన్నేళ్లుగా కోరాడ చిట్ఫండ్ కంపెనీ నడుపుతున్నారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్కుమార్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయారు. ఎన్నికల్లో భారీగా ఖర్చు చేసి నష్టపోయిన ఆయనపై అప్పులవాళ్లు తమ డబ్బు ఇవ్వాలని తీవ్ర ఒత్తిడి చేయసాగారు. మరోవైపు చిట్ఫండ్ కంపెనీ డబ్బు సైతం ఎన్నికల్లో వినియోగించడంతో.. అక్కడా ఒత్తిళ్లు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో రాహుల్, విజయ్కుమార్ భాగస్వామ్యంలో నిర్వహిస్తున్న జిక్సిన్ సిలిండర్స్ కంపెనీలోని తన వాటా తీసుకుని డబ్బు ఇవ్వాల్సిందిగా విజయ్కుమార్ రాహుల్ను కోరాడు. అయితే ఈ విషయంలో స్పందించకపోవడంతో రాహుల్పై ఆగ్రహంతో ఉన్నాడు. ఇదిలా ఉండగా విజయ్కుమార్ స్నేహితురాలు గాయత్రికి రాహుల్ రూ.6 కోట్లు ఇవ్వాల్సి ఉంది. ఆమెకు సైతం ఆ డబ్బు తిరిగి ఇవ్వకపోవడంతో తీవ్ర అసంతృప్తితో ఉంది. అలాగే జిక్సిన్ సిలిండర్స్ కంపెనీలో పనిచేస్తున్న సీతయ్యకు లాజిస్టిక్స్ బిజినెస్లో కాంట్రాక్ట్ ఇస్తానని హామీ ఇచ్చి నేరవేర్చకపోవడంతో రాహుల్పై కక్ష పెంచుకున్నాడు. ఈ పరిస్థితులే రాహుల్ హత్యకు దారితీశాయి. హత్య జరిగిందిలా.. ఈ నెల 18వ తేదీ రాత్రి విజయ్కుమార్తో పాటు సీతయ్య, బాబూరావు అనే వ్యక్తి కలిసి రాహుల్ను తమ కారులో సీతారామపురంలోని కోరాడ చిట్ఫండ్ కంపెనీకి తీసుకెళ్లారు. అక్కడ రాహుల్కు, విజయకుమార్కు కంపెనీల వాటాల విషయమై వాగ్వాదం జరిగింది. దీంతో విజయ్కుమార్ రాహుల్పై దాడి చేశాడు. కోగంటి సత్యం సూచన మేరకు అక్కడ నుంచి రాహుల్ను తీసుకుని దుర్గా కళామందిరం వద్దకు చేరుకున్నారు. అప్పటికే సిద్ధం చేసిన డాక్యుమెంట్లపై రాహుల్పై దాడి చేసి బలవంతంగా సంతకాలు చేయించుకున్నారు. అనంతరం పథకం ప్రకారం రాహుల్ను బందరు రోడ్డులో పార్క్ చేసిన కారు వద్దకు తెచ్చారు. కారులో ఎక్కాక రాహుల్కు విజయ్కుమార్, సీతయ్య, బాబురావు మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ముందు సీటులో ఉన్న రాహుల్ను చిత్రహింసలు పెట్టి.. సెల్ఫోన్ చార్జర్ వైర్ మెడకు బిగించి, దిండుతో ఊపిరాడకుండా చేసి చంపేశారు. నిందితుల అరెస్ట్.. మృతుని తండ్రి కరణం రాఘవరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. దర్యాప్తు ప్రారంభించిన పది రోజుల వ్యవధిలోనే కీలక ఆధారాలు సేకరించి, పరారీలో ఉన్న నిందితుల్లో ఆరుగురిని శుక్రవారం అరెస్టు చేశారు. ఇదిలా ఉండగా, రాహుల్ హత్య కేసులో మొత్తం 13 మందిని నిందితులుగా గుర్తించామని కమిషనర్ బత్తిన శ్రీనివాసులు తెలిపారు. కోరాడ విజయ్కుమార్ (ఏ1), నల్లూరు రవికాంత్ (ఏ14), కఠారపు కోటేశ్వరరావు అలియాస్ కోటి (ఏ10), కఠారపు గాంధీబాబు అలియాస్ గాంధీ (ఏ11), కిలారి అనంత సత్యనారాయణ (ఏ6), షేక్ మహబూబ్ జానీ (ఏ8)ని శుక్రవారం అరెస్టు చేశామని, కేసులో కీలక నిందితుడు, ప్రధాన సూత్రధారి కోగంటి సత్యంను ఈనెల 23న అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచామని వివరించారు. మిగిలిన ఆరుగురు నిందితులను కూడా 48 గంటల్లోపు అరెస్టు చేస్తామని కమిషనర్ చెప్పారు. కాగా, తొలుత 14 మంది నిందితులుగా గుర్తించినప్పటికీ ఓ మహిళ ప్రమేయంపై ఆధారాలు లేకపోవడంతో.. 13 మందినే నిందితులుగా గుర్తించామని పోలీసులు పేర్కొంటున్నారు. ఇవీ చదవండి: పవన్ కల్యాణ్ రాజకీయాలకు పనికిరాడు: ధర్మాన కృష్ణదాస్ అంతర్వేది సాగర తీరం.. విభిన్న స్వరూపం! -
రాహుల్ హత్య కేసు: మరో 11 మంది నేడు కోర్టు ముందుకు
-
రాహుల్ హత్య కేసు: మరో 11 మంది నేడు కోర్టు ముందుకు
సాక్షి, విజయవాడ: జిల్లాలో వ్యాపారి రాహుల్ హత్య సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో మరో 11 మంది నిందితులని పోలీసులు నేడు కోర్టు ముందు ప్రవేశపెట్టనున్నారు. ఇప్పటికే కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న కోగంటి సత్యం అరెస్ట్ కాగా.. మరో 11 మందిని అదుపులోకి తీసుకున్నారు. కోరాడ విజయ్ కుమార్, గాయత్రి, సీతయ్య, సుబ్బారావులతో పాటు మరో ఆరుగురిని గుర్తించారు. వీరందరిని వైద్య పరీక్షల అనంతరం సాయంత్రం కోర్టు ముందుకు తీసుకురానున్నారు. అనంతరం రాహుల్ హత్య కేసుపై కమిషనర్ మీడియాతో మాట్లాడనున్నారు. కాగా ఆర్థిక లావాదేవీల నేపథ్యంలోనే రాహుల్ను హత్య చేశారని, సాక్ష్యాదారాలను తారుమారు చేసేందుకు నిందితులు ప్రయత్నించారని పోలీసులు సీసీటీవీ, బ్యాంక్ లావాదేవీల ఆధారంగా ఇప్పటికే వెల్లడించారు. చదవండి: రాహుల్ హత్యకేసు: వెలుగులోకి సంచలన విషయాలు -
రాహుల్ హత్యకేసు: వెలుగులోకి సంచలన విషయాలు
సాక్షి, విజయవాడ: రాహుల్ హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రాహుల్ హత్యలో కోగంటి సత్యం ప్రధాన సూత్రధారి కాగా.. కోరాడ విజయ్కుమార్ పాత్రధారిగా వ్యవహరించాడు. వీరిద్దరు కలిసి రాహుల్ను అత్యంత దారుణంగా హత్య చేసినట్లు తెలిసింది. తలపై పలుమార్లు బలంగా మోదడంతో మెదడు నరాలు చిట్లాయి. కారులోనే తాడుతో గొంతుకి ఉరేసి చంపి మరొక తాడుని సంఘటనా స్ధలంలో ఉంచారు. సాక్ష్యాదారాలని తారుమారు చేయడానికి రకరకాల ఎత్తుగడలకు పాల్పడ్డారు. హత్య కోసం కొత్త ఫోన్లు, కొత్త సిమ్లు బినామీ పేర్లతో కొనుగోలు చేశారు. రాహుల్ హత్యకేసులో మొత్తం 12 మంది పాత్ర ఉన్నట్లు తెలిసింది. వాహనాలు మార్చి... మనుషులని మార్చి.. పోలీసులని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు. ఇక రాహుల్ హత్య జరిగిన ప్రాంతంలో ఉన్న వంద సీసీ కెమెరాలు, సెల్ఫోన్ కాల్డేటా, బ్యాంకు లావాదేవీలతో నిజాలు బయటపడ్డాయి. ఫ్యాక్టరీని కోగంటి సత్యానికి అమ్మేసి తన 30 శాతం వాటా డబ్బులు ఇవ్వాలని కోరాడ విజయ్ రాహుల్పై ఒత్తిడికి పాల్పడ్డారు. రాహుల్ మాట వినకపోవడంతో కోగంటి ఆదేశాలతో కారులోనే అతనిపై హత్యకు పాల్పడ్డారు ఇక వ్యాపారి కరణం రాహుల్ హత్య కేసులో ఏ2 నిందితుడు కోగంటి సత్యంకు విజయవాడ 1వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ 14 రోజుల రిమాండ్ విధించారు. నిందితుడిని మచిలీపట్నం సబ్ జైలుకు తరలించేందుకు ఎర్పాట్లు చేయవలసిందిగా పోలీసులను ఆదేశించారు. చదవండి: వ్యాపారి హత్య కేసులో కోగంటి సత్యంకు రిమాండ్ -
రాహుల్ హత్య కేసులో విచారణ ముమ్మరం
-
రాహుల్ హత్య కేసు: విజయవాడ మెజిస్ట్రేట్ ముందుకు కోగంటి సత్యం
విజయవాడ: పారిశ్రామికవేత్త రాహుల్ హత్య కేసులో కీలక నిందితుడిగా ఉన్న కోగంటి సత్యంను పోలీసులు విజయవాడ మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచనున్నారు. అంతకముందు కేసులో ఏ-2గా ఉన్న కోగంటి సత్యంను బెంగళూరులో అరెస్ట్ చేశారు. కాగా విజయవాడ విడిచివెళ్లొదంటూ రెండు రోజుల క్రితం కోగంటి సత్యంకు పోలీసులు నోటీసులు అందించారు. తాను విజయవాడలోనే ఉంటానని.. ఎప్పుడు పిలిచినా వస్తానని కోగంటి సత్యం పోలీసులకు వివరించాడు. అయితే సోమవారం మధ్యాహ్నం కోగంటి సత్యం విజయవాడ నుంచి బెంగళూరుకు వెళ్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో అప్రమత్తమై విజయవాడ మాచవరం పోలీసులు బెంగళూరు పోలీసులకు సమాచారం అందించగా.. సత్యంను బెంగళూరు ఎయిర్పోర్ట్లోనే అరెస్టు చేసి దేవనపల్లి మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. -
రాహుల్ హత్యకేసు కొలిక్కి
సాక్షి, అమరావతి బ్యూరో: పారిశ్రామికవేత్త రాహుల్ హత్యకేసు కొలిక్కి వచ్చింది. ఇప్పటికే ప్రధాన నిందితుడు కోరాడ విజయకుమార్తోపాటు మిగిలిన నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని రహస్య ప్రదేశంలో విచారిస్తున్నారు. కోగంటి సత్యంను సోమవారం బెంగళూరు విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్నారు. నిందితులను విచారిస్తున్న పోలీసులు.. హత్యకు దారితీసిన పరిస్థితులు, ఎలా హత్య చేశారనే దానిపై అవగాహనకు వచ్చినట్లు తెలిసింది. కోరాడ విజయకుమార్ వద్ద పనిచేసే వారే ఈ హత్య చేసినట్లు తెలుస్తోంది. హత్యలో 10 మందికిపైగా పాత్ర ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. కేసులో గాయత్రి అనే మహిళ పాత్ర పరోక్షంగా ఉన్నట్లు తెలిసింది. రాహుల్కు, ఆమెకు కూడా ఆర్థిక లావాదేవీల విషయమై విభేదాలున్నట్లు సమాచారం. ప్రధానంగా కంపెనీ లావాదేవీలకు సంబంధించి రాహుల్, కోరాడ విజయకుమార్ల పంచాయితీలో కోగంటి సత్యం ఉన్నట్లు తెలిసింది. హత్య జరిగిన వెంటనే వేగంగా స్పందించిన పోలీసులు వీలైనంత త్వరగా నిందితులను బహిరంగపరిచి కేసును తేల్చే దిశగా అడుగులు వేస్తున్నారు. -
రాహుల్ హత్య కేసులో కీలక పరిణామం, A1 లొంగుబాటు
-
రాహుల్ హత్య కేసులో కీలక పరిణామం, A1 లొంగుబాటు
సాక్షి, విజయవాడ: స్థానికంగా కలకలం రేపిన వ్యాపారి రాహుల్ హత్యకేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. రాహుల్ హత్య కేసు ప్రధాన నిందితుడు కోరాడ విజయ్ మాచవరం పోలీసుల ఎదుట ఆదివారం లొంగిపోయాడు. రాహుల్ హత్య కేసులో ఇప్పటికే ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు A-1 కోరాడ విజయ్, A-2 కోగంటి సత్యం, A-3 విజయ్ భార్య పద్మజ, A-4 పద్మజ, A-5 గాయత్రి పేర్లను పేర్కొన్నారు. రాహుల్ తండ్రి రాఘవరావు స్టేట్మెంట్ ఆధారంగా సెక్షన్ 302, 120బి, రెడ్విత్ 34 కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ హత్య కేసులో ఇప్పటికే కొంతమందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కోరాడ విజయ్తో కలిపి పోలీసులు అదుపులో ఉన్నవారి సంఖ్య 6కు చేరింది. మాచవరం పోలీసుల ముమ్మర విచారణ కొనసాగుతోంది. (చదవండి: King Cobra: 13 అడుగుల గిరినాగు) హత్యకు గురైన రాహుల్.. అతని మృతదేహం లభ్యమైన కారు -
రాహుల్ హత్య కేసు.. సంచలన విషయాలు వెలుగులోకి
విజయవాడ: రాహుల్ హత్య కేసు దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. రాహుల్ హత్య కేసులో కీలక ఆధారాలు సేకరిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. రాహుల్ కారు వెనుక నిందితులు ఫాలో అయ్యారనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. 76 సీసీ కెమెరాల ఫుటేజ్లను సేకరించి పోలీసులు పరిశీలిస్తున్నారు. విజయ్తో పాటు మరో పది మంది ప్రమేయం ఉన్నట్లు పోలీసులు పేర్కొంటున్నారు. రాహుల్ రెండ్ ఫోన్ కాల్స్ డేటాను పోలీసులు విశ్లేషిస్తున్నారు. హత్య తర్వాత రాహుల్ రెండు ఫోన్లలో ఒక ఫోన్ మాయమైనట్లు తెలిపారు. మాయమైన ఫోన్కు విజయ్, గాయత్రి ఫోన్ చేసినట్లు గుర్తించారు. అనుమానితులను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు. చదవండి: చార్టర్డ్ అకౌంటెంట్ సింధు అనుమానాస్పద మృతి -
రాహుల్ హత్య కేసు: A1 కోరాడ విజయ్, A2 కోగంటి సత్యం
సాక్షి, విజయవాడ: కృష్ణా జిల్లాలోని విజయవాడలో సంచలనం రేపిన యువ వ్యాపారి కరణం రాహుల్ హత్య కేసులో రాత్రి 11 గంటల ప్రాంతంలో ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. సెక్షన్ 302, 120 B రెడ్ విత్ 34 ఐపీసీ కింద కేసు నమోదు చేశారు. రాహుల్ తండ్రి కరణం రాఘవరావు ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. చదవండి: రాహుల్ హత్య కేసులో కొత్త కోణం, ఇద్దరు మహిళల ప్రమేయం? A1 కోరాడ విజయ్, A2 కోగంటి సత్యం, A3 విజయ్ భార్య పద్మజ A4 పద్మజ, A5 గాయత్రిగా ఎఫ్ఐఆర్లో పోలీసులు వెల్లడించారు. ఈ హత్య కేసులో నిందితుడైన కోరాడ విజయ్.. రాహుల్ వ్యాపార భాగస్వాములని పేర్కొన్నారు. 2016లో జి.కొండూరులో జిక్సన్ సిలిండర్ కంపెనీ ప్రారంభించినట్లు వెల్లడించారు. 2019 ఎన్నికల్లో పోటీ చేసి విజయ్ నష్టపోయాడని తెలిపారు. తన షేర్లు తీసుకుని డబ్బు ఇవ్వాలని రాహుల్పై విజయ్ ఒత్తిడి తెచ్చాడని, రాహుల్ వద్ద డబ్బు లేకపోవడంతో షేర్లు తీసుకోలేదని వివరించారు. చదవండి: రూ.15 కోట్లు కోసం ఒత్తిడి.. పక్కా ప్రణాళికతో హత్య అదేవిధంగా కోగంటి సత్యంకు కంపెనీ అమ్మాలని విజయ్ ఒత్తిడి తెచ్చాడని, అయితే కంపెనీ అమ్మేందుకు రాహుల్ అంగీకరించలేదని పేర్కొన్నారు. కోగంటి సత్యం, విజయ్, భార్య పద్మజ, గాయత్రి రాహుల్పై ఒత్తిడి తెచ్చారని వెల్లడించారు. రాహుల్ ఇళ్లు విడిచి వెళ్లేటప్పుడు రెండు ఫోన్లు తీసుకెళ్లాడని తెలిపారు. 18వ తేదీన రాత్రి 7 గంటలకు రాహుల్ బయటకు వెళ్లాడని, అతను తిరిగి రాకపోవడంతో 19న తండ్రి కరణం రాఘవరావు ఫిర్యాదు చేశారని పోలీసులు తెలిపారు. ఈ హత్య కేసులో ప్రధాన సూత్రధారిగా కోరాడ విజయ్ కుమార్ అనే వ్యక్తిని పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం అతను పరారీలో ఉన్నాడు. అతని కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. -
రాహుల్ హత్య కేసులో తెరపైకి కోగంటి సత్యం అనుచరుడు
-
రూ.15 కోట్లు కోసం ఒత్తిడి.. పక్కా ప్రణాళికతో హత్య
సాక్షి, విజయవాడ : నగరంలో జరిగిన యువ పారిశ్రామికవేత్త రాహుల్ హత్య కేసు దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు. పక్కా స్కెచ్తోనే హత్య చేసినట్లు పోలీసులు నిర్థారించారు. మెడకు తాడు బిగించి, ముక్కుపై దిండు అదిమిపెట్టి చంపినట్లు పోస్టుమార్టం నివేదికలో వెల్లడైంది. ఈ కేసులో లభించిన సాక్ష్యాధారాలతో విజయ్కుమార్ను ప్రధాన ముద్దాయిగా గుర్తించారు. వ్యాపార లావాదేవీలే రాహుల్ హత్యకు కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. కొన్నిరోజులుగా రాహుల్, వ్యాపార భాగస్వామి విజయ్కు మధ్య విభేదాలు నడుస్తున్నాయి. తన వాటా రూ.15 కోట్లు ఇచ్చేయాలంటూ రాహుల్పై విజయ్ ఒత్తిడి తెచ్చాడు. నిందితుడు విజయ్ గత ఎన్నికల్లో విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీచేసి ఓడాడు. ఎన్నికల్లో ఓటమితో భారీగా నష్టపోయానని.. వెంటనే డబ్బులివ్వాలంటూ ఒత్తిడి తెచ్చాడు. రాహుల్ కాలయాపన చేస్తుండటంతో పక్కా ప్రణాళికతో హత్య చేశాడు. ఈ కేసులో విజయ్తో పాటు మరో 8 మంది ప్రమేయం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. రాహుల్ హత్య కేసులో తెరపైకి కోగంటి సత్యం అనుచరుడు రాహుల్ హత్య కేసులో పారిశ్రామికవేత్త రాంప్రసాద్ హత్య కేసు ప్రధాన నిందితుడు శ్యామ్ పేరు తెరపైకి వచ్చింది. శ్యామ్ని పోలీసులు అనుమానిస్తున్నారు. శ్యామ్ పారిశ్రామికవేత్త కోగంటి సత్యం అనుచరుడు. రాహుల్ హత్య కేసులో కోగంటి సత్యంపై కూడా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పోలీసు విచారణలో రాహుల్ కుటుంబ సభ్యులు కోగంటి సత్యం పేరు చెప్పారు. టాస్క్ఫోర్స్ పోలీసులు ఇప్పటికే కోగంటి సత్యంను విచారించారు. చదవండి : రాహుల్ హత్య కేసులో కొత్త కోణం, ఇద్దరు మహిళల ప్రమేయం? -
ప్రియురాలితో బిగ్బాస్ కంటెస్టెంట్ పెళ్లి, సందడి షురూ!
Rahul Vaidya Disha Parmar Wedding: హిందీ బిగ్బాస్ కంటెస్టెంట్, సింగర్, రాహుల్, దిశా పార్మర్ పెళ్లి చేసుకుంటున్న విషయం తెలిసిందే కదా! జూలై 16న వీరిద్దరూ వివాహ బంధంతో ఒక్కటికానున్నారు. ఇప్పటికే ఇరువురి ఇంట పెళ్లి సంబరాలు షురూ అయ్యాయి. ఈ క్రమంలో మంగళవారం జరిగిన మెహందీ ఫంక్షన్లో కొత్త పెళ్లికూతురు దిశా మెరిసిపోయింది. ఈ మేరకు నెట్టింట మెహందీ వీడియోలు హల్చల్ చేస్తున్నాయి. ఇందులో అమ్మాయిలందరూ నటి కాళ్లు, చేతులను మెహందీతో నింపేస్తుండగా కొత్త పెళ్లికూతురు తెగ సిగ్గుపడుతోంది. మరోవైపు అక్కడే ఉన్న ఆమె స్నేహితులిద్దరరూ హిందీ పాటకు డ్యాన్స్ చేస్తూ వేడుకను హుషారెత్తిస్తున్నారు. ఇక మరో వీడియోలో సింగర్ రాహుల్ తన ప్రేయసి కోసం పాట పాడి అక్కడున్న అందరినీ ఫిదా చేశాడు. కాగా రాహుల్ హిందీ బిగ్బాస్ 14వ సీజన్లో కంటెస్టెంట్గా ఎంట్రీ ఇచ్చాడు. వీకెండ్ కా వార్ ఎపిసోడ్లో దిశా హౌస్లో అడుగు పెట్టింది. ఈ క్రమంలో దిశా బర్త్డే రోజు రాహుల్ తన మనసులోని ప్రేమను వ్యక్తీకరిస్తూ ఆమెకు ప్రపోజ్ చేశాడు. మోకాళ్ల మీద కూర్చుని తనను పెళ్లి చేసుకోమని అడిగాడు. అంతేకాకుండా మ్యారీ మీ? (నన్ను పెళ్లి చేసుకుంటావా?) అని రాసి ఉన్న టీషర్ట్ను సైతం ధరించాడు. View this post on Instagram A post shared by Welcome to the world of RKV ✨💫 (@rkv.an.inspiration.for.youth) అతడి ప్రపోజల్తో తొలుత షాకైన దిశా ఆ వెంటనే తేరుకుని పెళ్లికి గ్రీన్సిగ్నల్ ఇస్తూ సిగ్గుతో ముడుచుకుపోయింది. బిగ్బాస్ షో ముగిసిన తర్వాత కూడా వీరిద్దరూ బయట షికార్లకు వెళుతూ, వీడియోలు చేస్తూ తెగ సందడి చేశారు. ఈ క్రమంలో గతవారమే తమ పెళ్లితేదీని ప్రకటించి అభిమానులను సర్ప్రైజ్ చేసిందీ జంట. పెద్దల ఆశీర్వాదంతో పెళ్లి చేసుకుంటున్నామని వెల్లడించింది. View this post on Instagram A post shared by Welcome to the world of RKV ✨💫 (@rkv.an.inspiration.for.youth) View this post on Instagram A post shared by RAHUL VAIDYA RKV 💫 (@rahulvaidyarkv) View this post on Instagram A post shared by DP (@dishaparmar) -
‘టైసన్’ ఇలా మారిపోయాడేంటి? షాక్లో ఫ్యాన్స్!
హ్యాపీడేస్.. 14 ఏళ్ల కిందట వచ్చిన ఈ సినిమా అప్పట్లో ఓ సెన్సేషన్. పెద్ద సినిమాలను సైతం వెనక్కు నెట్టిన ఈ సినిమా శేఖర్ కమ్ములను డైరెక్టర్గా మరో మెట్టు ఎక్కించింది. అంతేకాదు ఎంతోమంది కొత్తవారిని ప్రేక్షకులకు పరిచయం చేసిందీ చిత్రం.. వారందరికీ మంచి గుర్తింపు వచ్చినప్పటికీ కొందరికి మాత్రమే అవకాశాలను తెచ్చిపెట్టింది. ఇక ఈ సినిమాలో జనాలకు బాగా కనెక్ట్ అయిన పాత్ర టైసన్. అదిరిపోయే డైలాగ్లతో, రివర్స్ పంచులతో టైసన్ పాత్రలో ఆకట్టుకున్నాడు రాహుల్. View this post on Instagram A post shared by Rahul Dayakiran (@raahultyson) ఇందులో అతడు మరీ బక్కగా ఉండటంతో అందరూ అతడిని వెటకారంగా ‘టైసన్’ అని ఆటపట్టిస్తుంటారు. అంతెందుకు ఓ సన్నివేశంలో తనకు మంచి బాడీ లేదంటూ తను ప్రేమించిన శ్రావ్స్తోనే చెప్తాడు. కానీ ఇప్పుడు రాహుల్ గుర్తుపట్టకుండా మారిపోయాడు. కండలు తిరిగిన దేహం, మీసకట్టుతో కొత్త లుక్లో కనిపిస్తున్నాడు. అతడిని ఈ గెటప్లో చూసిన అభిమానులు అసలు ఆ టైసన్ నువ్వేనా? అని షాకవుతున్నారు. నిన్ను అసలు గుర్తుపట్టలేకపోతున్నాం, మాస్ చేంజ్ ఓవర్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. View this post on Instagram A post shared by Rahul Dayakiran (@raahultyson) ఇప్పుడు కానీ శ్రావ్స్ నిన్ను చూస్తే ఫ్లాట్ అయిపోద్ది అన్నా.. అంటూ ఫన్నీగా మెసేజ్ చేస్తున్నారు. ఈ రోజు కష్టపడితేనే రేపు మరింత బలంగా తయారవుతాం, నేను ఇక్కడివరకు చేరుకుంటానని అస్సలు ఊహించలేదు. నన్ను సపోర్ట్ చేసిన అందరికీ కృతజ్ఞతలు అంటూ తన ఫొటోలను షేర్ చేశాడు. కాగా రాహుల్ ఆ మధ్య వెంకటాపురం సినిమాలో నటించాడు. ఇది అతడి కెరీర్కు ఏమాత్రం ప్లస్ కాలేదు. కొన్నేళ్ల గ్యాప్ తర్వాత 100 క్రోర్స్ అనే మరో కొత్త చిత్రంలో నటించనున్నాడు. చదవండి: నేను తాగింది మందు కాదు: హీరోయిన్ -
ప్రియురాలిని వదిలి వెళ్లలేక, షోను వదులుకోలేక..
ముంబై : ప్రముఖ రియాలిటీ షో 'ఖత్రోన్ కే ఖిలాడీ' పదకొండవ సీజన్ మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది. దక్షిణాఫ్రికాలోని కేప్టౌన్లో జరిగే ఈ షోలో పాల్గొనేందుకు ఇప్పటికే కంటెస్టెంట్లు సన్నద్ధం అయ్యారు. ప్రముఖ సింగర్, బిగ్బాస్ ఫేం రాహుల్ వైద్య, వరుణ్ సూద్, దివ్యంకా త్రిపాఠి అర్జున్ బిజ్లాని, నిక్కి తంబోలి, అభినవ్ శుక్లా సహా పలువురు ఈ షోలో పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో గత రాత్రి ముంబై ఏయిర్పోర్టుకు చేరుకున్న రాహుల్ ప్రియురాలు దిషా పర్మార్ని వదిలి వెళ్లేటప్పుడు ఎమోషల్ అయ్యారు. ప్రియురాలికి ముద్లులు, హగ్గులు ఇచ్చి విడ్కోలు పలికారు. ఈ ఫోటోలను క్లిక్ మనిపించిన ఫోటోగ్రాఫర్లు వీరిది ఎంతో క్యూట్ జోడీ అంటూ కొనియాడారు. ఇక ఈ పోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. హిందీ బిగ్బాస్-14లో రుబీనా దిలైక్తో తలపడి రాహుల్ రన్నరప్గా నిలిచిన సంగతి తెలిసిందే. ఇదే షోలో ప్రియురాలు దిశా పర్మార్ని కూడా పరిచయం చేసిన రాహుల్ మరొకొద్ది నెలల్లోనే తమ వివాహం ఉంటుందని ప్రకటించారు. ఇప్పటికే పెళ్లి పనులు మొదలు పెట్టినా కరోనా కారణంగా వాయిదా పడింది. ప్రస్తుతం ఖత్రోన్ కే ఖిలాడీ షోలో పాల్గొనేందుకు సన్నద్ధం అయ్యారు. అయితే ఏయిర్పోర్టులో ప్రేయసిని వదిలి వెళ్లలేక, షోను వదులుకోలేక రాహుల్ మదనపడుతూ కనిపించాడు. View this post on Instagram A post shared by Rahul Vaidya world (@mad_fan_of_rahul_vaidya_) ఛదవండి : 'బిగ్బాస్' వల్ల నాకు ఒరింగిందేమీ లేదు : నటి నా కుమారులు నన్ను మళ్లీ పెళ్లి చేసుకోమంటున్నారు: నటి -
ఢిల్లీ క్యాపిటల్స్ లక్ష్యం 196
ముంబై: ఓపెనర్లు మయాంక్ అగర్వాల్ (36 బంతుల్లో 69; 7 ఫోర్లు, 4 సిక్స్లు), రాహుల్ (51 బంతుల్లో 61; 7 ఫోర్లు, 2 సిక్స్లు) చెలరేగడంతో పంజాబ్ కింగ్స్ భారీ స్కోరు చేసింది. ఐపీఎల్లో ఆదివారం ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో మొదట బ్యాటింగ్కు దిగిన పంజాబ్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది. ఓపెనర్లిద్దరు దంచేసేందుకు పోటీపడటంతో 5వ ఓవర్లోనే పంజాబ్ స్కోరు 50 పరుగులకు చేరింది. 10.1 ఓవర్లోనే వందను దాటేసింది. మయాంక్ 25 బంతుల్లోనే ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. మిగతా వారిలో క్రిస్ గేల్ (11) విఫలమైనా... దీపక్ హుడా (13 బంతుల్లో 22 నాటౌట్ 2 సిక్సర్లు), షారుఖ్ (5 బంతుల్లో 15; 2 ఫోర్లు, 1 సిక్స్) ఆఖర్లో ధాటిగా ఆడారు. ఢిల్లీ బౌలర్లలో వోక్స్, మెరివాలా, రబడా, అవేశ్ ఖాన్– తలా ఒక వికెట్ పడగొట్టారు. 196 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ కడపటి వార్తలందేసరికి 13 ఓవర్లలో రెండు వికెట్లకు 125 పరుగులు చేసింది. క్రీజులో ధావన్ 78 పరుగులతో, పంత్ 4 పరుగులతో ఉన్నారు. -
బిగ్బాస్ రన్నర్కు సల్మాన్ ఖాన్ గిఫ్ట్
బాలీవుడ్ భాయ్జాన్ సల్మాన్ ఖాన్ హిందీ బిగ్బాస్ సీజన్కు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే! ఈ మధ్యే పద్నాలుగో సీజన్ విజయవంతంగా పూర్తైంది. ఇందులో రుబీనా దిలైక్ విజేతగా అవతరించగా సింగర్ రాహుల్ వైద్య రన్నరప్గా నిలిచాడు. అయితే ఈ రన్నరప్కు సల్మాన్ ఊహించని గిఫ్ట్ ఇచ్చాడు. ఈ బైక్ను కానుకగా పంపి అతడిని ఆశ్చర్యంలో ముంచెత్తాడు. దీన్ని అందుకున్న రాహుల్ సంతోషాన్ని మాటల్లో చెప్పలేము. "సల్మాన్ ఖాన్ ఇచ్చిన బీయింగ్ హ్యుమన్ ఈ బైక్. దీని మీద బయట చక్కర్లు కొడుతుంటే చాలా సంతోషంగా అనిపిస్తోంది.." అంటూ దాని ఫొటోలను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశాడు. దీనిపై బిగ్బాస్ కంటెస్టెంట్ షెఫాలీ బాగా స్పందిస్తూ సల్మాన్ సర్ గిఫ్ట్ ఇచ్చాడంటే అది ఎంతో విలువైనది అని చెప్పుకొచ్చింది. కాగా బీయింగ్ హ్యుమన్ వెబ్సైట్లో పొందుపర్చిన వివరాల ప్రకారం దీని ధర రూ.53,999. దీన్ని చార్జ్ చేయాలంటే సుమారు 3-4 గంటల సమయం పడుతుంది. బ్లాక్ అండ్ రెడ్ కలర్లో ఉన్న ఇది రాహుల్కు సరిగ్గా సరిపోయింది. View this post on Instagram A post shared by Rahul Vaidya 🇮🇳🎤 (@rahulvaidyarkv) చదవండి: సల్మాన్, రణ్దీప్ల మధ్య ఉండే స్మోక్ ఫైట్ హైలైట్ గంగవ్వకు పట్టీలు కొనిచ్చిన అఖిల్ -
పంచె ఊడదీసి వికృతంగా ప్రవర్తించిన నటి
బిగ్బాస్లో గొడవలు సర్వసాధారణం. కానీ అవి శృతి మించితేనే అసలు సమస్య. ప్రస్తుతం హిందీ బిగ్బాస్ 14వ సీజన్ పరిస్థితి కూడా అలానే ఉంది. మాజీ కంటెస్టెంట్లను లోనికి పంపించగా వారు చేసే పనులతో ఇంటిసభ్యులు తలలు పట్టుకుంటున్నారు. ఈ క్రమంలో నటి, మాజీ కంటెస్టెంట్ రాఖీ సావంత్ వికృత చేష్టలకు కంటెస్టెంట్లు హడలెత్తిపోతున్నారు. ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తుందోనని భయంతో ఆమె దరిదాపుల్లోకి వెళ్లడానికి కూడా ధైర్యం చేయట్లేదు. ప్రస్తుతం హౌస్లో జరుగుతున్న కెప్టెన్సీ టాస్కులో రాక్షసి అవతారం ఎత్తిన రాఖీ.. అంతకు ముందు రోజు తనతో గొడవకు దిగిన జాస్మిన్ భాసిన్ను కెప్టెన్ కానివ్వనంటూ శపథం చేసింది. అటు కంటెస్టెంట్లను ఇబ్బందులకు గురి చేస్తూ ముప్పు తిప్పలు పెట్టింది.(చదవండి: రాహుల్ లేకపోతే బిగ్బాస్ చూడం!) మాజీ కంటెస్టెంట్ రాహుల్ మహాజన్ పంచె పట్టుకుని లాగారు. దాన్ని కర్చీఫ్లా ముక్కలు ముక్కలు చేస్తానని హెచ్చరించడమే కాకుండా నిజంగానే పంచె ఊడదీసి పేలికలుగా మార్చారు. దీంతో ఆమె విపరీత ప్రవర్తనపై హౌస్మేట్స్ గరమయ్యారు. ఇదే ఒక అమ్మాయికి జరిగితే ఇలాగే ఊరుకుంటారా? అని ప్రశ్నిస్తూ అలీ గోనీ టాస్కులో పాల్గొనేందుకు నిరాకరించాడు. అటు సోషల్ మీడియాలో సైతం రాఖీపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఒక యువకుడిని దాదాపు నగ్నంగా నిలబెట్టినంత పని చేసిందని రాఖీపై ఫైర్ అవుతున్నారు. టాస్క్ను టాస్క్లా ఆడాలి కానీ అంత అతి పనికి రాదని ఘాటుగా కామెంట్లు చేస్తున్నారు. మరి రాఖీ ప్రవర్తనపై సల్మాన్ ఖాన్ ఎలా స్పందిస్తారో చూడాలి! (చదవండి: బిగ్బాస్: కంటెస్టెంట్ను దూషించిన తల్లి) View this post on Instagram A post shared by ColorsTV (@colorstv) View this post on Instagram A post shared by ColorsTV (@colorstv) -
ప్రేయసిని పెళ్లాడిన యువ నటుడు
తిరువనంతపురం: మలయాళ నటుడు రాహుల్ రవి వివాహ బంధంలో అడుగుపెట్టాడు. చిరకాల స్నేహితురాలు లక్ష్మీ నాయర్ను అతడు మనువాడాడు. అత్యంత సన్నిహితుల మధ్య ఆదివారం వారి వివాహం జరిగింది. సంప్రదాయ వస్త్రధారణలో వధూవరులు చూడ ముచ్చటగా ఉన్నారు. ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం చక్కర్లు కొడుతున్నాయి. ఈ క్రమంలో రాహుల్ రవి- లక్ష్మీ నాయర్లకు తోటి ఆర్టిస్టులు, నెటిజన్ల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. కాగా మోడల్గా కెరీర్ ఆరంభించిన రాహుల్.. బుల్లితెరపై తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. పూనంబిలి సిరీస్లో ప్రధాన పాత్రలో మెప్పించి ప్రశంసలు అందుకున్నాడు. (చదవండి: పెళ్లిలో సూపర్ స్టార్ సందడి, వైరల్ వీడియో) తనే నా జీవితం ఇక లక్ష్మీతో ప్రేమలో ఉన్నట్లు ఇటీవల ప్రకటించిన రాహుల్.. ‘‘తనను మొదటి రోజు కలిసినపుడు ఎలాంటి ఉద్వేగానికి లోనయ్యానో.. ఇప్పుడు కూడా అంతే. అయితే ఈరోజు ఇంకాస్త ఆనందంగా ఉంది... రోజురోజుకీ తను నాకెంతో ప్రత్యేకంగా కనిపిస్తోంది. తను అందమైన చిరునవ్వు.. తను చెప్పే మాటలు.. వింటూ ఉంటే ప్రపంచాన్నే మైమరిచిపోతా.. తను కేవలం నా జీవితంలో ప్రవేశిస్తున్న అమ్మాయి మాత్రమే కాదు.. తనే నా జీవితం.. నా జీవితాన్ని నీ నవ్వులతో వెలిగించినందుకు థాంక్యూ లక్ష్మీ నాయర్.. మన పెళ్లిరోజు కోసం ఎదురు చూస్తున్నా’’ అంటూ సోషల్ మీడియా వేదికగా తమ పెళ్లి వార్తను పంచుకున్నాడు. -
‘తన ప్రపోజల్ను దిశ అంగీకరించింది’
ముంబై: బిగ్బాస్-14 కంటెస్టెంట్, సింగర్ రాహుల్ వైద్య త్వరలోనే పెళ్లి పీటలెక్కనున్నట్లు తెలుస్తోంది. నటి దిశా పర్మార్ను అతడు వివాహమాడనున్నట్లు సమాచారం. కాగా ఆదివారం రాహుల్ బిగ్బాస్ హౌజ్ను వీడిన సంగతి తెలిసిందే. కుటుంబ సభ్యులకు దూరంగా ఉండలేకపోతున్నానని, అదే విధంగా తనకంటే గొప్పగా ఆడుతున్న వారికి టాప్లో చోటు దక్కాలనే ఉద్దేశంతో తనకు తానుగా వెళ్లిపోతున్నట్లు పేర్కొన్నాడు. తన నిర్ణయంతో అభిమానులను నిరాశపరిచానని, అందుకు క్షమించాలని కోరాడు. ఇక హౌజ్లో ఉన్న సమయంలో బంధుప్రీతిని కారణంగా చూపి తోటి కంటెస్టెంట్ జాన్ కుమార్ను నామినేట్ చేసి హోస్ట్ సల్మాన్ ఖాన్ ఆగ్రహానికి గురైన రాహుల్ వైద్య, ఆ తర్వాత కూడా తన నోటి దురుసు కారణంగా తరచూ వార్తల్లో నిలిచాడు. ఈ క్రమంలో అనూహ్యంగా షో నుంచి బయటకు వస్తున్నట్లు ప్రకటించాడు. ఇదిలా ఉండగా.. బిగ్బాస్ ద్వారా కావాల్సినంత పాపులారిటీ పొందిన రాహుల్ తన ప్రేమ వ్యవహారం వల్ల కూడా సోషల్ మీడియాలో హాట్టాపిక్గా మారాడు. నటి దిశా పర్మార్ను ప్రేమిస్తున్న అతడు.. ఇటీవల ఆమె పుట్టిన రోజు సందర్భంగా.. ‘‘నన్ను పెళ్లిచేసుకుంటావా’’ అని ట్విటర్ వేదికగా ప్రతిపాదన చేశాడు. ఇందుకు నేరుగా సమాధానం ఇవ్వని దిశ.. తనకు సమాధానం చెప్పేశానంటూ నెటిజన్లను అయోమయంలోకి నెట్టారు.(చదవండి: ప్లేట్లు పగులగొడుతూ డ్యాన్స్.. వైరల్!) ఈ విషయం గురించి ఓ వెబ్సైట్తో మాట్లాడిన రాహుల్ తల్లి గీత వైద్య.. దిశ తమ ఇంటి కోడలిగా వస్తే సంతోషపడతానని తన మనసులో మాట బయటపెట్టారు. ‘‘అవును.. వీలైనంత త్వరలో రాహుల్ పెళ్లి చేసేయాలనుకుంటున్నాం. నాకు తెలిసి దిశ తన ప్రపోజల్ను అంగీకరించింది. ఓ తల్లిగా నాకు ఇంతకన్నా సంతోషం ఏముంటుంది. తను చాలా మంచి అమ్మాయి. మా ఇంటికి కూడా వచ్చింది. వాళ్లిద్దరి మధ్య స్నేహం మాత్రమే ఉందనుకున్నా. కానీ ప్రేమలో ఉన్నారని ఇటీవలే తెలిసింది. అయితే దిశ కుటుంబంతో మేం ఇంతవరకు మాట్లాడలేదు. తను చెబితే వాళ్లింట్లో వాళ్లతో మాట్లాడి విషయాన్ని ముందుకు తీసుకువెళ్తా’’అని చెప్పుకొచ్చారు. ఇక రాహుల్ వైద్య ఇప్పుడు ఇంటికి చేరడంతో త్వరలోనే అతడు పెళ్లి జరిగే అవకాశం ఉందంటూ అభిమానులు ఖుషీ అవుతున్నారు. కాగా ఇండియన్ ఐడల్ షోతో గుర్తింపు పొందిన రాహుల్ వైద్య దో చార్ దిన్, కహ్ దోనా, తేరా ఇంతెజార్ వంటి పాటలు ఆలపించాడు. -
రాహుల్ లేకపోతే బిగ్బాస్ చూడం!
హిందీ బిగ్బాస్ 14వ సీజన్లో పాల్గొన్న సింగర్ రాహుల్ వైద్య తరచూ వార్తల్లో ఉంటున్నాడు. ఆ మధ్య తనకు బంధుప్రీతి అంటే అసహ్యమని చెప్తూ జాన్ కుమార్ను నామినేట్ చేశాడు. జాన్కు అంత పాపులారిటీ లేదని, కేవలం ప్రముఖ సింగర్ కుమార్ సను కొడుకు కావడం వల్లే ఈ షోలో ఉండగల్గుతున్నాడని విమర్శా బాణాలు ఎక్కుపెట్టాడు. హౌస్లో నెపోటిజమ్ ప్రస్తావన తీసుకువచ్చినందుకు వ్యాఖ్యాత సల్మాన్ ఖాన్ తీవ్రంగా మండిపడ్డారు. ఈ ఒక్క విషయమనే కాదు ఆయన చాలామటుకు ఇతర కంటెస్టెంట్లపై నోరు పారేసుకుంటూ నిత్యం వార్తల్లో నిలుస్తూ వస్తున్నాడు. కానీ ఈసారి మాత్రం ఎలిమినేట్ అవుతున్నందున రాహుల్ పేరు సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది. (చదవండి: టాప్ సెర్చ్డ్ సెలబ్రిటీ లిస్ట్ : అల్లు అర్జున్ ఏ ప్లేస్) ఈ ఎలిమినేషన్ వాస్తవమే అన్నట్లుగా కలర్స్ టీవీ తాజాగా ప్రోమోను సైతం రిలీజ్ చేసింది. అందులో రాహుల్తో మాటలు కలిపిన సల్మాన్ తర్వాత అతడిని బయటకు రమ్మని ఫైర్ అయ్యాడు. సల్మాన్ ఆదేశాల మేరకు బిగ్బాస్ గేట్లు కూడా తెరుచుకున్నట్లు ప్రోమోలో చూపించారు. దీంతో నిజంగానే రాహుల్ను ఎలిమినేట్ చేస్తున్నారా? అని అతడి అభిమానులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. రాహుల్ లేకపోతే బిగ్బాస్ షో లేదని విమర్శలు గుప్పిస్తున్నారు. అతడిని పంపించేస్తే షో చూడబోమని తేల్చి చెప్తున్నారు. మరోవైపు రాహుల్తో పాటు నిక్కీ తంబోళి కూడా ఎలిమినేట్ కానున్నట్లు మరో వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. మరి రాహుల్ ఎలిమినేట్ అయ్యాడా? సేవ్ అయ్యాడా? లేదా డబుల్ ఎలిమినేషన్ జరగనుందా? అనే విషయం తెలియాలంటే ఎపిసోడ్ ప్రసారమయ్యేవరకు వేచి చూడాల్సిందే. (చదవండి: ఆ నటి నా భార్య, కానీ మరొకరితో ఎఫైర్..) #BiggBoss14 ke ghar ke exit door khul gaye hain @rahulvaidya23 ke liye. Kya woh lenge yeh step aur ho jayenge finale ki raat ko beghar? Dekhiye aaj raat 9 baje, #Colors par. Catch it before TV on @VootSelect.#BiggBoss2020 #BB14 #WeekendKaVaar pic.twitter.com/J66nPEshoU — ColorsTV (@ColorsTV) December 5, 2020 -
కామెడీ.. థ్రిల్
‘హ్యాపీడేస్’ ఫేమ్ రాహుల్, చేతన్, సాక్షీ చౌదరి, ఐశ్వర్య, యమీ ప్రధాన పాత్రల్లో విరాట్ చక్రవర్తి దర్శకత్వంలో ఓ సినిమా ప్రారంభమైంది. దివిజా సమర్పణలో సాయి కార్తీక్, నాగం తిరుపతి రెడ్డి, శ్రీకాంత్ దీపాల నిర్మిస్తున్నారు. నిర్మాత ‘మధుర’ శ్రీధర్ పూజ కార్యక్రమాలు మొదలుపెట్టగా నాగం తిరుపతి రెడ్డి కెమెరా స్విచ్చాన్ చేశారు. సాయి కార్తీక్ క్లాప్ ఇవ్వగా, చిత్ర సహనిర్మాత శ్రీకాంత్ దీపాల గౌరవ దర్శకత్వం వహించారు. ‘‘ఇంతకాలం మ్యూజిక్ డైరెక్టర్గా చేసిన నేను తొలిసారి ప్రొడక్షన్లోకి ప్రవేశించాను’’ అన్నారు సాయి కార్తీక్. ‘‘నిర్మాతగా నాకిది నాలుగో చిత్రం’’ అన్నారు నాగం తిరుపతి రెడ్డి. ‘‘వైవిధ్యమైన కామెడీ థ్రిల్లర్ ఇది’’ అన్నారు విరాట్ చక్రవర్తి. ‘‘ఈ కథ విని, థ్రిల్ అయ్యాను’’ అన్నారు రాహుల్. ‘‘కన్నడలో 10 సినిమాలు చేసిన నాకు తెలుగులో ఇది మొదటి సినిమా’’ అన్నారు చేతన్. ఈ చిత్రానికి సంగీతం: సాయి కార్తీక్, కెమెరా: ముర్గిల్. -
టర్మ్ ప్లాన్లకు డిమాండ్ జోరు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కరోనా వైరస్ మహమ్మారి, లాక్డౌన్ అంశాలు జీవిత బీమా రంగంపైనా ప్రతికూల ప్రభావాలు చూపించాయి. అయితే, దీని వల్ల ఆర్ధిక భద్రతపై అవగాహన పెరిగిందని, టర్మ్ ప్లాన్లకు డిమాండ్ పెరుగుతోందని చెబుతున్నారు ఎక్సైడ్ లైఫ్ ఇన్సూరెన్స్ చీఫ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫీసర్ రాహుల్ అగర్వాల్. పాలసీదారులకు మరింత మెరుగైన సర్వీసులు అందించేందుకు డిజిటల్ మాధ్యమాన్ని మెరుగుపర్చుకుంటున్నామని సాక్షి బిజినెస్ బ్యూరోకి ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఆ వివరాలు.. మీ వ్యాపారంపై కరోనా వైరస్ ప్రభావమేంటి? కరోనా వైరస్ మహమ్మారి, దాని కట్టడికి విధించిన లాక్డౌన్లతో ఇతర రంగాల్లాగానే జీవిత బీమా రంగంపైనా ప్రతికూల ప్రభావం పడింది. మార్చి, ఏప్రిల్లో కస్టమర్లతో సంప్రదింపులు లేకపోవడం లేదా పాలసీలు తీసుకుందామనుకున్న వారు కూడా వాయిదా వేసుకోవడమో జరిగింది. మేం ప్రధానంగా కరోనా సమయంలో ఉద్యోగుల భద్రతకు అత్యంత ప్రాధాన్యమిచ్చాం. సరిగ్గా లాక్డౌన్కు ముందు ప్రవేశపెట్టిన వర్చువల్, యాప్ ఆధారిత శిక్షణా కార్యక్రమాలు మా సేల్స్ సిబ్బందికి ఉపయోగపడ్డాయి. దీనితో పరిస్థితులు కొంత మెరుగుపడ్డాక అత్యంత వేగంగా మా కార్యకలాపాలు సాధారణ స్థాయికి రాగలిగాయి. తొలి త్రైమాసికంలో మా ఏజెన్సీ శాఖల్లో 99 శాతం శాఖలు తెరిచే ఉన్నాయి. బ్రాంచీ ఉత్పాదకతలో కూడా మెరుగుదల కనిపించింది. మీ వృద్ధి ప్రణాళికలపై ఎలాంటి ప్రభావం పడింది? పరిశ్రమకు రెట్టింపు స్థాయిలో వృద్ధి లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ కరోనా వైరస్, లాక్డౌన్ అంశాల కారణంగా మా అంచనాలు మార్చుకోవాల్సి వచ్చింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఎకాయెకిన భారీ వృద్ధిని ఆశించడం లేదు. అయితే, కరోనా నేపథ్యంలో ఆర్థిక భద్రతపై అవగాహన పెరిగింది. జీవిత బీమా ప్లాన్లకు.. ముఖ్యంగా టర్మ్ ప్లాన్లకు డిమాండ్ పెరిగింది. ఈ కష్టకాలంలో హామీతో కూడిన రాబడులను కస్టమర్లు కోరుకుంటున్నారు. కాబట్టి మా సాంప్రదాయ ప్లాన్లపై మరింతగా దృష్టి పెడుతున్నాం. డిజిటల్ సర్వీసులు మెరుగుపర్చుకునే ప్రక్రియ కొనసాగిస్తాం. కోవిడ్–19 సంబంధ క్లెయిమ్స్ ఏమైనా వచ్చాయా? జూలై మధ్య నాటి దాకా రెండు క్లెయిమ్స్ వచ్చాయి. అవసరమైన పత్రాలన్నీ అందిన వెంటనే సెటిల్ కూడా చేశాం. పాలసీదారులకు తోడ్పాటుగా ఉండేందుకు మా వెబ్సైట్లో ప్రత్యేకంగా కోవిడ్–19 సెక్షన్ కూడా ఏర్పాటు చేశాం. ఆయా క్లెయిమ్స్కి సంబంధించిన ముఖ్యమైన సమాచారం ఇందులో పొందుపర్చాం. కొత్త పాలసీలేవైనా ప్రవేశపెడుతున్నారా? సవరించిన ప్రీమియంలకు అనుగుణంగా రెండు టర్మ్ ప్లాన్ల కోసం బీమా రంగ నియంత్రణ, అభివృద్ధి సంస్థ (ఐఆర్డీఏఐ)కి దరఖాస్తు చేసుకున్నాం. స్మార్ట్ టర్మ్ ప్లాన్, స్మార్ట్ టర్మ్ ప్లస్ ప్లాన్ వీటిలో ఉన్నాయి. ఐఆర్డీఏఐ తుది అనుమతుల కోసం ఎదురుచూస్తున్నాం. బీమా తీసుకునేవారి సంఖ్య తక్కువగానే ఉన్న తరుణంలో ప్రీమియంల పెంపు వల్ల ప్రతికూల పరిస్థితులు ఎదురైతే పరిశ్రమ ఎలా వ్యవహరించబోతోంది? టర్మ్ ప్లాన్ల ప్రీమియంలలో పెంపు చాలా స్వల్పమే. ఆర్థిక ప్రణాళిలకలపై క్రమంగా అవగాహన పెరుగుతోంది. కరోనా పరిణామాలతో ఇది వేగవంతమైంది. గతానికి భిన్నంగా జీవిత బీమాను తప్పనిసరైన సాధనంగా కస్టమర్లు పరిగణిస్తున్నారు. కనిపిస్తున్న ట్రెండ్స్ను బట్టి చూస్తే టర్మ్ పాలసీల విభాగం ఈ ఏడాది మరింతగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. మీ ప్రస్తుత వ్యాపార పరిమాణమెంత? ప్రస్తుతం 15 లక్షల పైచిలుకు కస్టమర్లు, 44,000 పైచిలుకు అడ్వైజర్లు (మార్చి 31 నాటికి) ఉన్నారు. వీరితో పాటు బిజినెస్ పార్ట్నర్స్ మొదలైన వారు ఉన్నారు. 2019–20 ఆర్థిక సంవత్సరంలో అత్యధికంగా 98.15 శాతం క్లెయిమ్ సెటిల్మెంట్ నిష్పత్తి నమోదు చేశాం. గడిచిన ఎనిమిదేళ్లుగా లాభసాటిగానే ఉంటున్నాం. ప్రస్తుతం రూ. 15,795 కోట్ల ఆస్తులు నిర్వహణలో (ఏయూఎం) ఉన్నాయి. కస్టమర్ల పెట్టుబడులకు భద్రతనిచ్చేలా డెట్ పోర్ట్ఫోలియోలోని 99 శాతం సాధనాలకు సార్వభౌమ లేదా ట్రిపుల్ ఏ రేటింగ్ ఉన్నాయి. కొత్తగా నియామకాల విషయానికొస్తే.. ప్రస్తుత మార్కెట్ పరిస్థితుల కారణంగా కాస్త నెమ్మదిగానే అయినా దేశవ్యాప్తంగా అడ్వైజర్లను నియమించుకుంటున్నాం. కొత్త ప్రాంతాలకు విస్తరించే క్రమంలో రిలేషన్షిప్ మేనేజర్లు, సూపర్వైజర్ స్థాయి సిబ్బందిని రిక్రూట్ చేసుకుంటున్నాం. -
నీడనిచ్చి ఆదుకున్న మన హీరో!
వాషింగ్టన్: అపరిచితులకు ఆశ్రయమిచ్చి, పోలీసుల నుంచి సుమారు 70 మందిని రక్షించినందుకు భారతీయ అమెరికన్ వ్యాపారవేత్త రాహుల్ దూబేను మీడియా హీరోగా కొనియాడుతోంది. అమెరికాలోని మినియాపోలిస్లో గత వారం ఒక పోలీస్ అధికారి చేతిలో ఆఫ్రికన్ అమెరికన్ జార్జ్ ఫ్లాయిడ్ మృతి చెందగా.. దానికి నిరసనగా దేశవ్యాప్తంగా అల్లర్లు, ఆందోళనలు కొనసాగుతున్నాయి. వాషింగ్టన్లో రాహుల్ దూబే ఇంటికి సమీపంలో కొంతమంది ఆందోళనలు నిర్వహిస్తూండగా.. కర్ఫ్యూ సమయం సమీపిస్తున్న తరుణంలో పోలీసులు వారిని చుట్టుముట్టారు. ఆ సమయంలో రాహుల్ వారందరినీ తన ఇంట్లోకి రావాల్సిందిగా కోరారు. వాషింగ్టన్లో 17 ఏళ్లుగా ఉంటున్న రాహుల్ అల్వారేజ్ దూబే ట్రేడింగ్ కంపెనీని నడుపుతున్నారు. ఇంట్లోకి వచ్చిన అపరిచితులకు ఆహారం ఇవ్వడంతోపాటు రాత్రంతా ఉండేందుకు, తద్వారా వారు పోలీసుల చేత చిక్కకుండా కాపాడారని పలు పత్రికలు కథనాలు ప్రచురించాయి. ‘దాదాపు 75 మంది ఉన్నారు. కొందరు సోఫాల్లో సర్దుకున్నారు. వచ్చిన వాళ్లలో తల్లీ బిడ్డలతో కూడిన కుటుంబం ఉంది. వాళ్లు నా కొడుకు గదిలో విశ్రాంతి తీసుకున్నారు’అని 44 ఏళ్ల దూబే చెప్పారు. చేసింది గొప్ప పనేమీ కాదు: రాహుల్ తాను కొంతమందికి ఆశ్రయం కల్పించడం గొప్ప పనేమీ కాదని రాహుల్ వ్యాఖ్యానించారు. ‘రాత్రి 8.30 గంటలపుడు పోలీసులు ఆందోళనకారులను అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు. అకస్మాత్తుగా వారందరూ మా ఇంటివైపు పరుగెత్తుతూ వచ్చారు. వచ్చినవాళ్లను వచ్చినట్లే లోపలకు లాగేసుకున్నాం’అని రాహుల్ చెప్పారు. -
పరీక్షలు పెంచడమే మార్గం
సాక్షి, హైదరాబాద్: మన దేశంలో కరోనా నియంత్రణ జరగాలంటే ఆ వైరస్ సోకిందా లేదా అనే నిర్ధారణ పరీక్షలు వేగవంతం చేయడమే మార్గమని యూకేకు చెందిన ఆక్లామ్ విశ్వవిద్యాలయ స్టడీ యూనిట్ వ్యవస్థాపకుడు, భారత సంతతికి చెందిన శాస్త్రవేత్త డాక్టర్ రాహుల్ పొట్లూరి అభిప్రాయపడ్డారు. దేశవ్యాప్తంగా కనీసం 10 లక్షల మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు జరగాల్సి ఉందని, ఆ తర్వాతే దీనిపై ఓ నిర్ధారణకు రావాల్సి ఉంటుందని పేర్కొన్నారు. అప్పుడే సామాజిక, ఆర్థిక మాంద్యాలను తగ్గించుకునే వీలు కలుగుతుందని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాప్తి నియంత్రణపై 50 దేశాలు తీసుకుంటున్న చర్యలను అధ్యయనం చేసిన ఆక్లామ్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తల బృందంలో సభ్యుడు కూడా అయిన రాహుల్ పొట్లూరి భారతదేశంలో కరోనా నియంత్రణ మార్గాలపై మంగళవారం ‘సాక్షి’తో మాట్లాడారు. ఈ అంశంపై రాహుల్ ఏమన్నారో ఆయన మాటల్లోనే... సంబంధాలను అధ్యయనం చేశాం ప్రపంచంలోని పలుదేశాల్లో కరోనా కేసుల సంఖ్య, అక్కడ జరుగుతోన్న పరీక్షల సంఖ్య మధ్య ఉన్న సంబంధాన్ని విస్తృతంగా అధ్యయనం చేశాం. కరోనా కేసులు, మరణాల నిష్పత్తి చాలా వైవిధ్యంగా ఉందని మా పరిశోధనలో తేలింది. ఏ దేశాల్లో అయితే జనాభా ఆధారంగా కరోనా కేసుల సంఖ్య ఎక్కువగా ఉందో అక్కడ మరణాల రేటు తక్కువగా ఉంది. వైరస్ నిర్ధారణ పరీక్షలు ఎక్కువగా చేయడం వల్లే పాజిటివ్ కేసులను నిర్ధారించి వారికి చికిత్స అందించి మరణించకుండా చర్యలు తీసుకునే వీలు కలిగింది. మరణాల సంఖ్యను నియంత్రించడంలో బాగా కృషి చేసింది దక్షిణ కొరియానే. కనీసం ఒక శాతం పరీక్షలు చేయాలి వివిధ దేశాల్లో ఈ వైరస్ వ్యాప్తిని పరిశీలించిన తర్వాత ఏ దేశంలోనైనా ఆ దేశ జనాభాలో 1 శాతం మందికి పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుంది. అలా అయితే మన దేశంలో కనీసం కోటిన్నర మందికి ఈ పరీక్షలు జరపాలి. కానీ సాధ్యాసాధ్యాల దృష్ట్యా మనదేశంలో పది లక్షల మందికైనా పరీక్షలు నిర్వహిస్తేనే ఫలితం ఉంటుంది. ఈ పరీక్షలను విస్తృతంగా నిర్వహించడం ద్వారా ఆరోగ్య ప్రణాళికలను అమలు చేయడమే కాకుండా హాట్స్పాట్లను గుర్తించి ఆయా ప్రాంతాల్లో వైరస్ నిరోధానికి తగిన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. అవసరమనుకంటే క్వారంటైన్ లేదా ఐసోలేషన్ గడువును కూడా పెంచుకోవచ్చు. వ్యాక్సినేషన్ లేదు కరోనా నియంత్రణకు వ్యాక్సినేషన్ లేనందువల్ల పరీక్షలు నిర్వహించి తగిన చర్యలు తీసుకోవడమే మార్గం. ప్రపంచవ్యాప్తంగా కనీసం 5 లక్షల మంది ఈ వైరస్ బారిన పడి మరణించే ప్రమాదాన్ని తప్పించుకోవాలన్నా గణనీయంగా పరీక్షలు నిర్వహించడమే ఉత్తమ మార్గం. అందుకే మా పరిశోధన బృందం ప్రపంచంలో ఈ విధానం అమలు చేయాలని సిఫారసు చేస్తోంది. -
నా మూడేళ్ల కల ఇది
రాహుల్, త్రిష్నా ముఖర్జీ జంటగా నటించిన చిత్రం ‘మధ’. ఇందిరా బసవ నిర్మించిన ఈ చిత్రానికి శ్రీవిద్య దర్శకురాలు. ఈ నెల 13న విడుదలవుతున్న ఈ చిత్రం మోషన్ పోస్టర్ను విడుదల చేశారు. ఈ సందర్భంగా హరీశ్ శంకర్ మాట్లాడుతూ– ‘‘యంగ్ ఏజ్లో అందరూ డబ్బులు పెట్టి సినిమా చూస్తే ఈ చిత్రదర్శకురాలు శ్రీదివ్య మాత్రం డబ్బులు పెట్టి సినిమా తీశారు. ఈ సినిమా ట్రైలర్ చూసినప్పుడు ఆమెలో చాలా ప్యాషన్ కనిపించింది’’ అన్నారు. నవదీప్ మాట్లాడుతూ– ‘‘శ్రీవిద్య నాకు ఫేస్బుక్ ఫ్రెండ్. నేనీ సినిమా చూశాను. నెక్ట్స్ లెవల్ మూవీ అని ఓ ప్రేక్షకునిగా చెప్పగలను. ఈ సినిమాను ఓ పెద్ద హీరోయిన్తో చేయమంటే తన టీమ్ కోసం ఆమె ఒప్పుకోలేదు’’ అన్నారు. శ్రీవిద్య మాట్లాడుతూ– ‘‘నా మూడేళ్ల కల ఇది. ‘మధ’ ప్యారలల్ మూవీ అనొచ్చు. స్త్రీ ఎదుర్కొంటున్న సమస్యలతో తీసిన ఈ చిత్రం ప్రతి అమ్మాయికి నచ్చుతుంది’’ అన్నారు. ‘‘శ్రీవిద్య కాన్సెప్ట్ చెప్పగానే, సినిమాలో ఉన్న అన్ని ఎమోషన్స్కి కనెక్ట్ అయ్యాను అన్నారు’’ త్రిష్నా. -
సుశీల్ ఆశలకు జితేందర్ దెబ్బ
న్యూఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్లో పాల్గొనాలని ఆశిస్తోన్న భారత రెజ్లింగ్ దిగ్గజం సుశీల్ కుమార్ ఆశలకు జితేందర్ దెబ్బ కొట్టాడు. ఆదివారం ముగిసిన ఆసియా సీనియర్ రెజ్లింగ్ చాంపియన్షిప్లో జితేందర్ 74 కేజీల విభాగంలో రజత పతకం సాధించాడు. తద్వారా మార్చి 27 నుంచి 29 వరకు కిర్గిస్తాన్లో జరిగే ఆసియా ఒలింపిక్ క్వాలిఫయింగ్ టోర్నమెంట్లో భారత్కు ప్రాతినిధ్యం వహించే అవకాశాన్ని దక్కించుకున్నాడు. సుశీల్ కూడా 74 కేజీల విభాగంలోనే పోటీపడతాడు. ఆసియా చాంపియన్షిప్ కోసం నిర్వహించిన ట్రయల్స్కు సుశీల్ డుమ్మా కొట్టాడు. గాయం కారణంగా తాను ట్రయల్స్కు హాజరుకాలేనని... ఒలింపిక్ క్వాలిఫయింగ్ టోర్నీ కోసం 74 కేజీల విభాగంలో మళ్లీ ట్రయల్స్ నిర్వహించాలని భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ)ను కోరాడు. అయితే సుశీల్ అభ్యర్థనను డబ్ల్యూఎఫ్ఐ పట్టించుకోలేదు. ఒకవేళ ఆసియా చాంపియన్షిప్లో జితేందర్ విఫలమైతేనే ఒలింపిక్ క్వాలిఫయింగ్ టోర్నీకి మళ్లీ ట్రయల్స్ నిర్వహిస్తామని స్పష్టం చేసింది. అయితే జితేందర్ రజత పతకం గెలవడంతో ఎలాంటి ట్రయల్స్ లేకుండానే అతను ఆసియా ఒలింపిక్ క్వాలిఫయింగ్ టోర్నీలో భారత్కు ప్రాతినిధ్యం వహిస్తాడని డబ్ల్యూఎఫ్ఐ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ ఆదివారం ప్రకటించారు. ఒలింపిక్ క్వాలిఫయింగ్ టోర్నీలో జితేందర్ ఫైనల్ చేరుకుంటే అతనికి ‘టోక్యో’ బెర్త్ లభిస్తుంది. సుశీల్కు అధికారికంగా ‘టోక్యో’ దారులు కూడా మూసుకుపోతాయి. ఒకవేళ జితేందర్ ఒలింపిక్ క్వాలిఫయింగ్ టోర్నీలో ఫైనల్కు చేరుకోకపోతే ఏప్రిల్ 30 నుంచి మే 3 వరకు బల్గేరియాలో జరిగే వరల్డ్ క్వాలిఫయింగ్ టోర్నమెంట్ రూపంలో సుశీల్, జితేందర్లకు చివరి అవకాశం లభిస్తుంది. ఆదివారం జరిగిన 74 కేజీల విభాగం ఫైనల్లో జితేందర్ 1–3తో డిఫెండింగ్ చాంపియన్ దనియర్ కైసనోవ్ (కజకిస్తాన్) చేతిలో ఓడిపోయాడు. 86 కేజీల విభాగంలో దీపక్ పూనియా, 61 కేజీల విభాగంలో రాహుల్ అవారె కాంస్య పతకాలు నెగ్గారు. కాంస్య పతక బౌట్లలో దీపక్ పూనియా 10–0తో అబ్దుల్ సలామ్ (ఇరాక్)పై, రాహుల్ 5–2తో మాజిద్ దస్తాన్ (ఇరాన్)పై గెలిచారు. సతీందర్ (125 కేజీలు), సోమ్వీర్ (92 కేజీలు) విఫలమయ్యారు. ఓవరాల్గా భారత్ ఆసియా చాంపియన్షిప్లో 5 స్వర్ణాలు, 6 రజతాలు, 9 కాంస్య పతకాలు సాధించింది. దీపక్, రాహుల్ -
కళ్యాణ్రామ్ ‘జాతరో జాతర’ సాంగ్ రిలీజ్
-
నేరానికో సెల్ ఫోన్– కొత్త సిమ్ కార్డు
బంజారాహిల్స్: అతనో ఉన్నత విద్యావంతుడు..ఎంబీఏ పూర్తి చేశాడు.. జల్సాలకు అలవాటు పడి అప్పుల పాలై వాటిని తీర్చుకునేందుకు మోసాలకు తెరలేపాడు. గత రెండు నెలలుగా పూణే పోలీసులకు చిక్కకుండా తప్పించుకు తిరుగుతున్న డాలర్ మోసగాడిని బంజారాహిల్స్ క్రైం పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. శుక్రవారం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెస్ట్జోన్ డీసీపీ ఏఆర్ శ్రీనివాస్ వివరాలు వెల్లడించారు. ముంబైలోని మలబార్ హిల్స్ 98 నిపినాసియా రోడ్డులోని శాంతినగర్లో ఉంటున్న రాహుల్ కిరణ్ ఘాటియా అలియాస్ నిఖిల్(31) ఎంబీఏ చదివాడు. అనంతరం మూడు కంపెనీలు ప్రారంభించాడు. అన్నిట్లోనూ నష్టాలే వచ్చాయి. ఒక వైపు జల్సాలకు అలవాటు పడి మరోవైపు వ్యాపారంలో నష్టాల కారణంగా అప్పులపాలయ్యాడు. దాదాపు రూ. 50 లక్షలు అప్పులు చేశాడు. వీటిని తీర్చుకునేందుకు మోసాలకు తెరలేపాడు. అందులో భాగంగానే డాలర్ ఎక్సైంజ్ పేరుతో మోసాలకు శ్రీకారం చుట్టాడు. గత నెల 26న బంజారాహిల్స్ రోడ్ నెం. 10లోని స్టార్ ఆస్పత్రి సమీపంలోని అట్లాస్ అపార్ట్మెంట్స్లో ఓ ప్లాట్ అద్దెకు తీసుకున్నాడు. జస్ట్ డయల్ ద్వారా ఓ మనీ ఎక్సైంజ్ సెంటర్కు ఫోన్ చేసిన అతను తనకు 7 వేల డాలర్లు కావాలని కోరాడు. డాలర్లు తీసుకొని వచ్చిన శ్రీధర్గౌడ్ నుంచి వాటిని తీసుకొని నగదు తెస్తానంటూ లోపలికి వెళ్లిన నిఖిల్ అటు నుంచి అటే జారుకున్నాడు. అదే రోజు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఓ వైపు పోలీసులు అతడికోసం గాలిస్తుండగానే ఈ నెల 3న బంజారాహిల్స్లోని శాంతానివాస్లో ప్లాట్ అద్దెకు తీసుకున్న అతను మరో ఎక్సైంజ్ సంస్థకు ఫోన్ చేసి 7 వేల డాలర్లు కావాలని కోరాడు. మహేష్ అనే వ్యక్తి డాలర్లు తీసుకుని అక్కడికి రాగా వాటిని తీసుకొని నగదు ఇస్తానంటూ లోపలికి వెళ్లి జారుకున్నాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన బంజారాహిల్స్ క్రైం పోలీసులు పక్కా నిఘా వేశారు. ఇందుకుగాను టెక్నాలజీని వినియోగించిన పోలీసులు నగరంలోని అన్ని ఫోరెక్స్ ఎక్సైంజ్ సంస్థలకు ఈ తరహా మోసాలపై సమాచారం అందించారు. మూడు రోజుల క్రితం మళ్లీ ఇదే తరహాలో ఓ సంస్థకు ఫోన్ రావడంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వలపన్ని నిందితుడిని రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. గత నెల 8, 20 తేదీల్లో పూణేలో కూడా ఇదే తరహాలో డాలర్లు కావాలంటూ ఫోన్ చేసి వాటితో ఉడాయించినట్లు విచారణలో వెల్లడైంది. కోల్కతాలోనూ అతడిపై చెక్బౌన్స్ కేసు ఉన్నట్లు తెలిపారు. నెల రోజుల వ్యవధిలో పూణే, హైదరాబాద్లో నాలుగు చోట్ల డాలర్ కేసులు నమోదయ్యాయి. కాగా పూణే పోలీసులు గత నెల 3 నుంచి నిందితుడి కోసం గాలిస్తున్నారు. అయితే బంజారాహిల్స్ క్రైం పోలీసులు నిందితుడిని చాకచక్యంగా అరెస్ట్ చేసి అతడి నుంచి రూ.7.5 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని పట్టుకోవడంలో ప్రతిభ చూపిన బంజారాహిల్స్ క్రైం ఎస్ఐ భరత్ భూషణ్ను డీసీపీ అభినందించారు. సమావేశంలో ఏసీపీ కే.ఎస్.రావు, ఇన్స్పెక్టర్ ఆర్. కళింగరావు తదితరులు పాల్గొన్నారు. నేరానికో సెల్ ఫోన్– కొత్త సిమ్ కార్డు నిందితుడు రాహుల్ కిరణ్ అలియాస్ నిఖిల్ ఓ సారి మోసానికి పాల్పడిన అనంతరం అందుకు వినియోగించిన సెల్ఫోన్, సిమ్కార్డులను వాడడు. డాలర్లతో ఉడాయించిన మరుక్షణమే ఈ సెల్ఫోన్ను బద్దలు కొట్టి సిమ్కార్డును జేబులో వేసుకుంటాడు. ఇలా నెల రోజుల వ్యవధిలోనే నాలుగు సెల్ఫోన్లు, నాలుగు సిమ్కార్డులు వినియోగించాడు. పోలీసులకు చిక్కకుండా ఈ తరహా సిమ్లు వినియోగిస్తున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఇదిలా ఉండగా తనను ఎవరూ గుర్తు పట్టకుండాముఖానికి సగం వరకు మాస్క్ ధరించే ఇతను నకిలీ గుర్తింపు కార్డులతో మోసాలకు పాల్పడుతుంటాడని తెలిపారు. -
రాహుల్ వ్యాఖ్యలు జాతీయస్థాయికే పరిమితం
-
మన ‘పట్టు’ పెరిగింది
నూర్–సుల్తాన్ (కజకిస్తాన్): ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్షిప్ చరిత్రలో భారత్ తమ అత్యుత్తమ పతక ప్రదర్శనతో ఘనతకెక్కింది. ఇంతకుముందెన్నడు లేని విధంగా ఈ పోటీల్లో ఐదు పతకాలను సాధించింది. స్వర్ణం బరిలో నిలిచిన దీపక్ పూనియా (86 కేజీలు) పోటీకి దూరమయ్యాడు. గాయంతో అతను తలపడలేకపోయాడు. దీంతో రజతంతో తృప్తిచెందాల్సి వచ్చింది. రాహుల్ కాంస్య పతకం సాధించాడు. ఈ పోటీల్లో ఇదివరకే బజరంగ్ పూనియా (65 కేజీలు), రవి దహియా (57 కేజీలు), మహిళల కేటగిరీలో వినేశ్ ఫొగాట్ (53 కేజీలు) కాంస్య పతకాలు దక్కించుకున్నారు. ఓవరాల్గా భారత్ టీమ్ చాంపియన్షిప్లో 79 పాయింట్లతో ఆరో స్థానంలో నిలవడం విశేషం. రష్యా (190 పాయింట్లు), కజకిస్తాన్ (103 పాయింట్లు), అమెరికా (94 పాయింట్లు) వరుసగా తొలి మూడు స్థానాల్లో నిలిచాయి. గతంలో భారత్ మెరుగైన ప్రదర్శన 3 పతకాలే! 2013 ప్రపంచ రెజ్లింగ్లో భారత్ ఒక రజతం, రెండు కాంస్యాలు నెగ్గింది. ఈవెంట్కు చివరి రోజైన ఆదివారం జరిగిన 61 కేజీల కాంస్య పతక పోరులో రాహుల్ అవారే ప్రదర్శనతో అదరగొట్టాడు. ఈ మహారాష్ట్ర రెజ్లర్ 11–4తో 2017 పాన్ అమెరికా చాంపియన్ టైలర్ గ్రాఫ్ (అమెరికా)ను మట్టికరిపించాడు. గతేడాది కామన్వెల్త్ గేమ్స్లో రాహుల్ చాంపియన్గా నిలిచాడు. ఆసియా చాంపియన్íÙప్ (2009, 2011)లలో రెండు కాంస్యాలు కూడా సాధించాడు. 86 కేజీల విభాగం ఫైనల్లో ఇరాన్ రెజ్లర్ హసన్ యజ్దానీతో పోటీపడాల్సిన యువ రెజ్లర్ దీపక్ పూనియా చీలమండ గాయంతో బరిలోకి దిగలేదు. దాంతో యజ్దానిని విజేతగా ప్రకటించగా, దీపక్ ఇప్పటి వరకు భారత్ నుంచి దీపక్ సహా ఐదుగురే రెజ్లర్లు ప్రపంచ పోటీల్లో ఫైనల్ చేరగా... సుశీల్ (2010) మాత్రమే విజేతగా నిలిచాడు. బిషంబర్ సింగ్ (1967), అమిత్ దహియా (2013), బజరంగ్ (2018) ఫైనల్లో ఓడిపోయారు. -
దీపక్ వెలుగులు
గత నెలలో దీపక్ పూనియా జూనియర్ వరల్డ్ రెజ్లింగ్ చాంపియన్షిప్లో విజేతగా నిలిచాడు. జూనియర్ స్థాయి ఆటగాడు సీనియర్కు వచ్చేసరికి ఫలితాలు అంత సులువుగా రావనేది క్రీడా వర్గాల్లో ప్రచారం ఉన్న మాట. కానీ కేవలం నెల రోజుల వ్యవధిలోనే దానిని దీపక్ తప్పుగా నిరూపించాడు.ఆడుతున్న తొలి సీనియర్ వరల్డ్ చాంపియన్షిప్లోనే సత్తా చాటుతూ 86 కేజీల విభాగంలో ఫైనల్కు అర్హత సాధించి కనీసం రజతం ఖాయం చేసుకున్నాడు. తుది పోరులోనూ ఇదే జోరు కొనసాగిస్తే సుశీల్ కుమార్ తర్వాత విశ్వవిజేతగా నిలిచిన రెండో భారత్ రెజ్లర్గా చరిత్రకెక్కుతాడు. 61 కేజీల విభాగం సెమీస్లో ఓడిన మరో భారత రెజ్లర్ రాహుల్ అవారే ఆదివారం కాంస్య పతక పోరులో బరిలోకి దిగుతాడు. నూర్–సుల్తాన్ (కజకిస్తాన్): ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్షిప్లో భారత యువ కెరటం దీపక్ పూనియా సత్తా చాటాడు. ఈ పోటీల 86 కేజీల విభాగంలో దీపక్ ఫైనల్లోకి అడుగు పెట్టాడు. శనివారం ఏకపక్షంగా సాగిన సెమీస్ పోరులో 20 ఏళ్ల దీపక్ 8–2 తేడాతో స్టెఫాన్ రీచ్మత్ (స్విట్జర్లాండ్)ను చిత్తు చేశాడు. అంతకుముందు సెమీస్ చేరడంతోనే దీపక్ వచ్చే ఏడాది టోక్యోలో జరిగే ఒలింపిక్స్కు కూడా అర్హత సాధించాడు. నేడు జరిగే ఫైనల్లో ఇరాన్కు చెందిన హసన్ యజ్దానీచరాతితో దీపక్ తలపడతాడు. పోటీ లేకుండా... మూడేళ్ల క్రితం తొలిసారి వరల్డ్ క్యాడెట్ టైటిల్ గెలుచుకొని వెలుగులోకి వచి్చన దీపక్ ఆ తర్వాత నిలకడగా విజయాలు సాధించాడు. గత నెలలో జూనియర్ వరల్డ్ చాంపియన్గా నిలవడంతో అతనిపై అంచనాలు పెరిగాయి. సెమీఫైనల్ మ్యాచ్లో అతనికి ప్రత్యర్థి నుంచి ఎలాంటి పోటీ ఎదురు కాలేదు. తొలి పీరియడ్లో 1–0తో ముందంజ వేసిన దీపక్ రెండో పీరియడ్లో ప్రత్యరి్థని పడగొట్టి 4–0తో దూసుకుపోయాడు. ఆ తర్వాత రెండు పాయింట్లు కోల్పోయినా... మరోసారి రీచ్మత్పై సంపూర్ణ ఆధిక్యం కనబర్చి 8–2తో బౌట్ను ముగించాడు. సుశీల్ 2010లో ప్రపంచ చాంపియన్షిప్లో స్వర్ణం గెలిచిన తర్వాత మరే భారత రెజ్లర్ ఈ ఘనతను అందుకోలేదు. ఇప్పుడు దీపక్ దానికి విజయం దూరంలో నిలిచాడు. అంతకుముందు హోరాహోరీ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో దీపక్ 7–6తో కార్లోస్ మెండెజ్ (కొలంబియా)ను ఓడించి ఒలింపిక్స్ బెర్త్ ఖాయం చేసుకున్నాడు. ►4 దీపక్ ఫైనల్ చేరడంతో భారత్ ప్రపంచ చాంపియన్షిప్ చరిత్రలోనే తమ అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేసినట్లయింది. 2013లో భారత్కు అత్యధికంగా మూడు పతకాలు రాగా... ఈసారి నాలుగు ఖాయమయ్యాయి. ఒకవేళ నేటి బౌట్లో రాహుల్ కూడా గెలిస్తే భారత్ ఖాతాలో ఐదు పతకాలు చేరుతాయి. ►5 ప్రపంచ చాంపియన్షిప్ చరిత్రలో ఫైనల్కు అర్హత పొందిన ఐదో భారత రెజ్లర్ దీపక్ పూనియా. గతంలో బిషంబర్ సింగ్ (1967లో), సుశీల్ కుమార్ (2010లో), అమిత్ దహియా (2013లో), బజరంగ్ (2018లో) ఈ ఘనత సాధించారు. ఈ నలుగురిలో సుశీల్ ఫైనల్లో నెగ్గి స్వర్ణం సాధించగా... మిగతా ముగ్గురు రజతం దక్కించుకున్నారు. రాహుల్కు నిరాశ 61 కేజీల నాన్ ఒలింపిక్ కేటగిరీలో భారత రెజ్లర్ రాహుల్ అవారే సెమీస్లో ఓటమి పాలయ్యాడు. బెకా లోమ్టాదె (జార్జియా) 10–6 స్కోరుతో రాహుల్పై గెలిచాడు. నేడు జరిగే కాంస్యపతక పోరులో టైలర్ గ్రాఫ్ (అమెరికా) లేదా మిహై ఇసాను (మాల్డొవా) లతో రాహుల్ తలపడతాడు. ఇతర భారత రెజ్లర్లలో జితేందర్ (79 కేజీలు) క్వార్టర్ ఫైనల్లో, మౌసమ్ ఖత్రీ (97 కేజీలు) తొలి రౌండ్లోనే ఓడిపోయారు. -
‘మానాన్న పోలీసు.. మానాన్న మాజీ ఎంపీ’ !
సాక్షి, హైదరాబాద్ : అమీర్పేట ఎల్లారెడ్డిగూడలో నడి రోడ్డుపై మద్యం మత్తులో పోలీసు అధికారి, మాజీ ఎంపీ తనయులమంటూ ఇద్దరు యువకులు హల్ చల్ చేశారు. దారిన పోయే వారిని అటకాయిస్తూ గొడవకు దిగారు. అమీర్పేట కీర్తి అపార్ట్మెంట్ సమీపంలో శనివారం అర్ధరాత్రి బహిరంగంగా మద్యం సేవిస్తూ నానా హంగామా సృష్టించారు. ఎల్లారెడ్డిగూడకు చెందిన ప్రైవేటు ఉద్యోగి అశోక్ తాను పనిచేస్తున్న హైటెక్ సిటీ ప్రాంతం నుంచి శనివారం రాత్రి 1.45 గంటల సమయంలో ఇంటికి వస్తుండగా అడ్డుకొని అగ్గిపెట్టె కావాలని అడగగా... తన వద్ద లేదని చెప్పడంతో దాడి చేశారని తెలిపాడు. ఒకరు తాను ఏసీపీ కుమారుడినని, మరో యువకుడు తాను మాజీ ఎంపీ కొడుకునంటూ కొట్టారని తెలిపాడు. వారి నుంచి తప్పించుకున్న బాధితుడు ఎస్ఆర్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అశోక్ను అటకాయించిన యువకులు కూడా పోలీస్స్టేషన్కు చేరుకుని అక్కడ కూడా హంగామా చేశారు. పోలీసులు మద్యం మత్తులో ఉన్న వారిని అదుపులోకి తీసుకుని బ్రీతింగ్ ఎనలైజర్ ద్వారా పరీక్షించి చర్యలు తీసుకోకపోగా ముందుగా వచ్చిన బాధితుడి సెల్ ఫోన్ తీసుకుని అతడిని స్టేషన్లోనే ఉంచారు. ఆ తరువాత వచ్చిన యువకులని వెళ్లిపోవాలని ఆదేశించారు. ఆదివారం మధ్యాహ్నం వరకు అశోక్ పోలీస్స్టేషన్లోనే ఉన్నట్లు తెలిసింది. అయితే రాత్రి జరిగిన సంఘటన మొత్తం సీసీ కెమెరాల్లో రికార్డు అయి ఉండటంతో వాటిని సేకరించిన బాధితుడి స్నేహితులు వాటిని ప్రసార మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. దీంతో పోలీసులు ఇరు వర్గాలపై కేసులు నమోదు చేశారు. రాత్రి రోడ్డుపై గొడవ పడిన వారిలో ఏపీసీ, మాజీ ఎంపీ కుమారులు ఎవరూ లేరని ఎస్ఆర్ నగర్ ఇన్స్పెక్టర్ మురళీకృష్ణ తెలిపారు. అది చిన్నపాటి ఘర్షణ కావడంతో అశోక్, రాహుల్ అనే వ్యక్తిపై పెట్టి కేసు నమోదు చేశామన్నారు. -
ప్రిక్వార్టర్స్లో రాహుల్, రోహిత్ యాదవ్
గువాహటి: జాతీయ సీనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్ పురుషుల సింగిల్స్ విభాగంలో తెలంగాణకు చెందిన చిట్టబోయిన రాహుల్ యాదవ్, రోహిత్ యాదవ్ ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. బుధవారం జరిగిన నాలుగో రౌండ్ మ్యాచ్ల్లో రాహుల్ 21–12, 21–11తో డి. జశ్వంత్ (ఆంధ్రప్రదేశ్)పై... రోహిత్ 21–19, 21–19తో ప్రతుల్ జోషి (రైల్వేస్)పై విజయం సాధించారు. ఈ ఇద్దరితోపాటు లక్ష్య సేన్ (ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా), ఆలాప్ మిశ్రా (మధ్యప్రదేశ్), హర్షీల్ డాని (మహారాష్ట్ర), ఆర్యమాన్ టాండన్ (ఎయిరిండియా), కౌశల్ (మహారాష్ట్ర), సౌరభ్ వర్మ (పీఎస్పీబీ) కూడా ప్రిక్వార్టర్ ఫైనల్కు చేరారు. మహిళల సింగిల్స్ విభాగంలో పుల్లెల గాయత్రి (తెలంగాణ), గుమ్మడి వృశాలి (ఆంధ్రప్రదేశ్) నాలుగో రౌండ్లో ఓటమి చవిచూశారు. గాయత్రి 17–21, 17–21తో రియా ముఖర్జీ (రైల్వేస్) చేతిలో ఓడిపోగా... శ్రుతి ముందాడ (మహారాష్ట్ర)తో జరిగిన మ్యాచ్లో తొలి గేమ్ను 19–21తో కోల్పోయి... రెండో గేమ్లో 2–10తో వెనుకబడిన దశలో వృశాలి గాయం కారణంగా వైదొలిగింది. -
ఆడదన్నవాళ్లే అభినందిస్తున్నారు
‘‘ప్రేక్షకులు కొత్తదనం కోరుకుంటున్నారు. మంచి కంటెంట్ ఉంటనే సినిమా చూడటానికి థియేటర్స్కు వస్తున్నారు’’ అని దర్శకుడు హర్ష కొనుగంటి అన్నారు. తేజస్ కంచర్ల, దక్షా, ప్రియా వడ్లమాని, రమ్య, తేజ్, అభినవ్, దినేష్ ముఖ్యతారలుగా ‘హుషారు’ అనే చిత్రం రిలీజైన సంగతి తెలిసిందే. బెక్కెం వేణుగోపాల్ నిర్మాత. ఇందులో రాహుల్ రామకృష్ణ కీలక పాత్ర చేశారు. వచ్చే నెల 1కి ఈ సినిమా 50రోజులు పూర్తి చేసుకుంటుంది. ఈ సందర్భంగా చిత్రదర్శకుడు హర్ష మాట్లాడుతూ– ‘‘దర్శకునిగా నా సినిమా 50 రోజుల పూర్తి చేసుకోబోతుండటం చాలా హ్యాపీగా ఉంది. ఈ సందర్భంగా ఈ శుక్రవారం ఓ వేడుక నిర్వహించాలనుకుంటున్నాం. ఈ సినిమాను స్టార్ట్ చేసిన తర్వాత సరిగ్గా ఆడదని చాలామంది నాతో అన్నారు. అయినప్పటికీ నా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోలేదు. నటీనటులందరూ బాగా నటించారు. రథన్ మంచి మ్యాజిక్ ఇచ్చారు. ఎవరైతే ఈ సినిమా ఆడదు అన్నారో రిజల్ట్ వచ్చిన తర్వాత వారే శుభాకాంక్షలు చెప్పారు. మా టార్గెట్ ఆడియన్స్ యూత్ అనుకున్నాం. వాళ్లు మళ్లీ మళ్లీ మా సినిమాను చూశారు. ఇందులో ‘ఉండిపోరాదే’ సాంగ్కు మంచి స్పందన లభిస్తోంది. ఈ పాట బాగుందని అల్లు అర్జున్గారు ట్వీట్ చేయడం హ్యాపీ. ఈ సినిమా తమిళం, హిందీలో రీమేక్ కాబోతుంది. నేను డైరెక్ట్ చేయడం లేదు. నా నెక్ట్స్ మూవీ కోసం రెండు సబ్జెక్ట్స్ను అనుకుంటున్నాను. ఇందులో ఒక యూత్ఫుల్ మూవీ ఉంది. విజయ్ దేవరకొండకు వినిపించాలనుకుంటున్నాను’’ అని అన్నారు. -
దీటుగా... ధాటిగా..!
ఎనిమిది పరుగులకే రెండు వికెట్లు... పెర్త్ టెస్టు తొలి ఇన్నింగ్స్లో భారత్కు లభించిన ఆరంభం ఇది. ప్రత్యర్థి బౌలింగ్ పదును చూస్తుంటే ఇన్నింగ్స్ కుప్పకూలుతుందేమో అనిపించింది. అయితే తన స్థాయికి తగిన ఆటతో కెప్టెన్ విరాట్ కోహ్లి, కౌంటర్ అటాక్తో వైస్ కెప్టెన్ అజింక్య రహానే భారత్ను కాపాడారు. పట్టు చిక్కిందనుకున్న ఆస్ట్రేలియాను సమర్థంగా అడ్డుకొని రెండో రోజును సంతృప్తిగా ముగించారు. ఇంకా 154 పరుగులు వెనుకబడి ఉండటంతో పూర్తిగా సురక్షిత స్థితికి వచ్చిందని చెప్పలేం కానీ ఇప్పటి వరకు జరిగిన ఆటను బట్టి చూస్తే భారీ ఆధిక్యం కోల్పోయే ప్రమాదం మాత్రం తక్కువగా ఉంది. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కీలకంగా మారిన నేపథ్యంలో... 2014 మెల్బోర్న్ టెస్టు భాగస్వామ్యాన్ని గుర్తుకు తెచ్చేలా ఆడిన కోహ్లి, రహానే జోడి మూడో రోజు ఎంత సేపు నిలబడుతుందనే దానిపైనే భారత్ ఆశలు నిలిచాయి. పెర్త్: ఆస్ట్రేలియాతో రెండో టెస్టులో భారత్ నిలకడగా ఆడుతోంది. మ్యాచ్ రెండో రోజు శనివారం ఆట ముగిసే సమయానికి భారత్ 3 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. విరాట్ కోహ్లి (181 బంతుల్లో 82 బ్యాటింగ్; 9 ఫోర్లు), అజింక్య రహానే (103 బంతుల్లో 51 బ్యాటింగ్; 6 ఫోర్లు, 1 సిక్స్) క్రీజ్లో ఉన్నారు. వీరిద్దరు ఇప్పటికే నాలుగో వికెట్కు అభేద్యంగా 90 పరుగులు జోడించారు. మూడో వికెట్కు కూడా పుజారా (103 బంతుల్లో 24; 1 ఫోర్)తో కలిసి కోహ్లి కీలక 74 పరుగులు జత చేశాడు. అంతకుముందు ఓవర్నైట్ స్కోరు 277/6తో ఆట కొనసాగించిన ఆస్ట్రేలియా తమ తొలి ఇన్నింగ్స్లో 326 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ టిమ్ పైన్ (89 బంతుల్లో 38; 5 ఫోర్లు) రాణించాడు. భారత బౌలర్లలో ఇషాంత్ శర్మకు 4 వికెట్లు దక్కగా... బుమ్రా, విహారి, ఉమేశ్ తలా 2 వికెట్లు పడగొట్టారు. 49 పరుగులు జోడించి... రెండో రోజు ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ మరో 18.3 ఓవర్ల పాటు సాగింది. ఓవర్నైట్ బ్యాట్స్మన్ పైన్, కమిన్స్ (19) భాగస్వామ్యం ఆసీస్ను ముందుకు నడిపించింది. వీరిద్దరు కలిసి స్కోరును 300 పరుగులు దాటించారు. ఏడో వికెట్కు 59 పరుగులు జోడించిన అనంతరం కమిన్స్ను బౌల్డ్ చేసి ఉమేశ్ ఈ జోడీని విడదీశాడు. మరో రెండు బంతులకే బుమ్రా బౌలింగ్లో పైన్ కూడా వెనుదిరిగాడు. ఆ తర్వాత కొద్ది సేపటికే వరుస బంతుల్లో స్టార్క్ (6), హాజల్వుడ్ (0)లను ఔట్ చేసి ఆసీస్ ఇన్నింగ్స్కు ఇషాంత్ తెర దించాడు. కోహ్లి, పుజారా జాగ్రత్తగా... భారత ఓపెనర్లు మరోసారి తీవ్రంగా నిరాశపర్చారు. ఇంగ్లండ్లో రెండో టెస్టులో రెండు డకౌట్లతో చోటు కోల్పోయి అడిలైడ్లో పునరాగమనం చేసిన మురళీ విజయ్ మరో ‘డక్’ను తన ఖాతాలో వేసుకున్నాడు. స్టార్క్ వేసిన చక్కటి బంతికి విజయ్ (0) క్లీన్బౌల్డయ్యాడు. లంచ్ విరామం తర్వాత హాజల్వుడ్ యార్కర్ రాహుల్ (2) వికెట్లను గిరాటేసింది. ఈ దశలో కోహ్లి, పుజారా చాలా జాగ్రత్త పడ్డారు. పరుగులు రాకపోయినా వికెట్ కాపాడుకునేందుకే ప్రాధాన్యతనిచ్చారు. ఆరంభంలో హాజల్వుడ్ ఓవర్లో కోహ్లి మూడు ఫోర్లు కొట్టి దూకుడుగా ఆడే ప్రయత్నం చేశాడు. అయితే ఆ తర్వాత పరిస్థితిని అర్థం చేసుకొని సంయమనం ప్రదర్శించగా, పుజారా కూడా తనదైన శైలిలో అండగా నిలిచాడు. ముఖ్యంగా కమిన్స్, లయన్ జోడి భారత్ బ్యాట్స్మెన్ను పూర్తిగా కట్టి పడేయడంతో పరుగులు రావడమే గగనంగా మారింది. ఈ జోడి అర్ధ సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పేందుకు ఏకంగా 135 బంతులు తీసుకుంది. టీ విరామం తర్వాత 23 పరుగుల వద్ద కమిన్స్ బౌలింగ్లో పుజారా ఎల్బీ కోసం ఆస్ట్రేలియా రివ్యూ కోరినా ఫలితం దక్కలేదు. అయితే మరో పరుగు మాత్రమే జోడించిన పుజారాను స్టార్క్ వెనక్కి పంపడంతో కంగారూలు ఊపిరి పీల్చుకున్నారు. రహానే దూకుడు... కీలకమైన పుజారాను ఔట్ చేశామన్న ఆసీస్ ఆనందంపై రహానే నీళ్లు చల్లాడు. వచ్చీ రాగానే ధాటిని ప్రదర్శించిన అతను చకచకా బౌండరీలతో దూసుకుపోయాడు. స్టార్క్ బౌలింగ్లో అప్పర్కట్తో అతను కొట్టిన సిక్సర్ ఇన్నింగ్స్కే హైలైట్గా నిలిచింది. మరోవైపు 109 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న కోహ్లి కూడా జోరు పెంచాడు. చివరి గంటలో వీరిద్దరు పూర్తి ఆధిపత్యం ప్రదర్శించారు. హాజల్వుడ్ ఓవర్లో వరుస బంతుల్లో రెండు అద్భుతమైన షాట్లతో ఫోర్లు కొట్టిన రహానే 92 బంతుల్లో హాఫ్ సెంచరీ మార్క్ను చేరుకున్నాడు. 8/2 స్కోరు వద్ద భారత్ ఇన్నింగ్స్ను కాపాడాల్సిన బాధ్యత కోహ్లి, పుజారాలపై పడింది. ఒకవైపు పేసర్ కమిన్స్ కచ్చితత్వంతో అద్భుతంగా బౌలింగ్ చేస్తుంటే... మరో ఎండ్లో లయన్ టర్న్, బౌన్స్తో బ్యాట్స్మెన్ను కదలనీయలేదు. ఫలితంగా భారత్ పరుగు పరుగుకూ శ్రమించింది. కమిన్స్, లయన్ కలిపి వరుసగా వేసిన పది ఓవర్లలో (13 నుంచి 22 ఓవర్ల వరకు) టీమిండియా 12 పరుగులు మాత్రమే చేయగలిగింది. బ్యాట్కు అతి సమీపంగా వెళ్లి కీపర్ చేతుల్లో పడిన బంతులు... ఫీల్డర్లకు కాస్త ముందుగా పడి అదృష్టవశాత్తూ క్యాచ్ కాకుండా ఉండి పోయిన షాట్లు... స్టంప్స్ను దాదాపు తాకుతూ వెళ్లిన బంతి... ఇలా అనేక ఉత్కంఠభరిత క్షణాలను భారత బ్యాట్స్మెన్ అధిగమించారు. అయితే వికెట్ మాత్రం చేజార్చుకోకపోవడం విశేషం. కోహ్లిలాంటి ఆటగాడు క్రీజ్లో ఉన్నప్పటికీ 22 ఓవర్ల పాటు ఒక్క బౌండరీ రాలేదు. 10వ ఓవర్లో 3 ఫోర్లు కొట్టిన తర్వాత 32వ ఓవర్లో గానీ కోహ్లి ఫోర్ బాదలేదు. రెండో సెషన్లో 29 ఓవర్లు ఆడిన భారత్ 64 పరుగులు మాత్రమే చేసింది. స్కోరు వివరాలు ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్: హారిస్ (సి) రహానే (బి) విహారి 70; ఫించ్ (ఎల్బీ) (బి) బుమ్రా 50; ఖాజా (సి) పంత్ (బి) ఉమేశ్ 5; షాన్ మార్‡్ష (సి) రహానే (బి) విహారి 45; హ్యాండ్స్కోంబ్ (సి) కోహ్లి (బి) ఇషాంత్ 7; హెడ్ (సి) షమీ (బి) ఇషాంత్ 58; పైన్ (ఎల్బీ) (బి) బుమ్రా 38; కమిన్స్ (బి) ఉమేశ్ 19; స్టార్క్ (సి) పంత్ (బి) ఇషాంత్ 6; లయన్ (నాటౌట్) 9; హాజల్వుడ్ (సి) పంత్ (బి) ఇషాంత్ 0; ఎక్స్ట్రాలు 19; మొత్తం (108.3 ఓవర్లలో ఆలౌట్) 326. వికెట్ల పతనం: 1–112; 2–130; 3–134; 4–148; 5–232; 6–251; 7–310; 8–310; 9–326; 10–326. బౌలింగ్: ఇషాంత్ 20.3–7–41–4; బుమ్రా 26–8–53–2; ఉమేశ్ 23–3–78–2; షమీ 24–3–80–0; విహారి 14–1–53–2; విజయ్ 1–0–10–0. భారత్ తొలి ఇన్నింగ్స్: రాహుల్ (బి) హాజల్వుడ్ 2; విజయ్ (బి) స్టార్క్ 0; పుజారా (సి) పైన్ (బి) స్టార్క్ 24; కోహ్లి (బ్యాటింగ్) 82; రహానే (బ్యాటింగ్) 51; ఎక్స్ట్రాలు 13; మొత్తం (69 ఓవర్లలో 3 వికెట్లకు) 172. వికెట్ల పతనం: 1–6; 2–8; 3–82. బౌలింగ్: స్టార్క్ 14–4–42–2; హాజల్వుడ్ 16–7–50–1; కమిన్స్ 17–3–40–0; లయన్ 22–4–34–0. -
సన్యాసిని పొట్టన బెట్టుకున్న చిరుత
ముంబై: మహారాష్ట్రలో అటవీ ప్రాంతంలో ధ్యానం చేసుకుంటున్న బౌద్ధ సన్యాసిని చిరుత పులి చంపేసిన ఘటన కాస్త ఆలస్యంగా వెలుగుచూసింది. రాజధాని ముంబైకి సుమారు 800 కి.మీ దూరంలో ఉన్న రామ్దేగి అడవిలో మంగళవారం రాహుల్ వాల్కే(35) అనే సన్యాసి ధ్యానం చేస్తుండగా చిరుత దాడిచేసి తీవ్రంగా గాయపర్చి అడవిలోనికి లాక్కెళ్లింది. ఆ సమయంలో ఆయనతోనే ఉన్న మరో ఇద్దరు సన్యాసులు తప్పించుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు. వాల్కే శరీరాన్ని అడవిలో చాలా దూరం లాక్కెళ్లి వదిలేసినట్లు పోలీసులు గుర్తించారు. వార్షిక ప్రార్థనల కోసం రామ్దేగికి వచ్చిన సన్యాసులు..అడవి లోనికి వెళ్లొద్దని ప్రజలు హెచ్చరించినా పట్టించుకోలేదని తెలిసింది. -
అభిమానికి నటుడు కిచ్చ సుదీప్ భరోసా
సాండల్వుడ్ స్టార్ హీరో కిచ్చ సుదీప్ లేదనకుండా సహాయం చేయడంలో పైచేయి. అనారోగ్యంతో బాధపడుతున్న ఓ యువ అభిమానిని కలిసి ఆర్థిక సాయం చేయటానికి ముందుకొచ్చారు సుదీప్. బెంగళూరుకు చెందిన 12 ఏళ్ల రాహుల్ అనే బాలుడు బ్రెయిన్ ట్యూమర్, రక్తస్రావం వ్యాధితో పడుతున్నాడు. బాలుడి శస్త్ర చికిత్సకు రూ. 8 లక్షలు ఖర్చువుతాయని వైద్యులు సూచించారు. రాహుల్ తల్లిదండ్రులు జలందర్ వెల్డర్గా పనిచేస్తూ రూ. 4 లక్షలు సమకూర్చుకున్నాడు. మరో మూడు లక్షల అవసరం ఉంది. అయితే రాహుల్ తన అభిమాన హీరో సుదీప్కు ట్విట్టర్ ద్వారా సందేశం పంపాడు. దీనిని గమనించి సుదీప్ దానికి సమాధానమిస్తూ స్వయంగా వచ్చి కలవాలని సూచించాడు. దీంతో రాహుల్ తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సుదీప్ తమకు దేవుడిలా వచ్చి సాయం చేస్తున్నారని అన్నారు. -
కాంగ్రెస్ పార్టీ మావోయిస్టులకు ఉద్యమకారులని బిరుదులిస్తుంది: మోదీ
జైపూర్ : ‘26/11 ముంబై దాడులు కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడే జరిగాయి. వాళ్ళ ప్రభుత్వ హయంలో జరిగిన దాడులను ఆపలేని వాళ్లే.. పాకిస్తాన్ ఉగ్రవాదులపై భారత జవానులు జరిపిన సర్జికల్ స్ట్రైక్స్కు ఆధారాలడుగుతున్నారు. జవానులు ఏదైనా ఆపరేషన్లో ఉన్నప్పుడు కెమెరాలు తీసుకువెళ్లి ఫొటోలకు పోజులిస్తారా? ఈ నాలుగేళ్లలో కశ్మీరులో అడుగుపెట్టిన ఏ ఉగ్రవాదైనా తప్పించుకోగలిగాడా? మా ప్రభుత్వం మావోయిస్టులు, ఉగ్రవాదుల సమస్యను తీవ్రంగా తీసుకుంది’అని ప్రధానమంత్రి నరేంద్రమోదీ కాంగ్రెస్ను విమర్శించారు. రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలు డిసెంబర్ 7 న జరగనున్న నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారాన్ని మ్మురం చేశారు. ప్రచారంలో భాగంగా గిరిజన ప్రాంతమైన బాన్సవారలో నిర్వహించిన సభలో మోదీ కాంగ్రెస్ పార్టీపై మండిపడ్డారు. రాహుల్గాంధీ పేరును ప్రస్తావించకుండా గోల్డెన్ స్పూన్తో పుట్టిన వారసుడికి పేదప్రజల కష్టాలెలా తెలుస్తాయని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ మావోయిస్టులకు ఉద్యమకారులని బిరుదులిస్తుందని, రాహుల్కు ఎన్సీసీ అంటే ఏమిటో తెలియదని, మానిఫెస్టో అంటే ఏమిటో కూడా తెలియని వ్యక్తి, మానససరోవరం వెళ్తారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. -
‘విధి’ విజయం సాధించాలి
రామ్, విష్ణుప్రియ, కల్పన ముఖ్య తారాగణంగా మారుతీ క్రియేషన్స్ పతాకంపై అరుణ్రెడ్డి బిల్లా దర్శకత్వంలో హనుమంతరెడ్డి నిర్మించిన చిత్రం ‘విధి’. ఈ చిత్రం పోస్టర్ను వైఎస్ఆర్సీపీ అధినేత వై.ఎస్. జగన్మోహన్రెడ్డి ఆవిష్కరించి, ‘‘ఈ చిత్రం విజయవంతం కావాలి’’ అన్నారు. విజయనగరం జిల్లా కురుపాం నియోజకవర్గంలో జరుగుతున్న ప్రజా సంకల్ప యాత్రలో ఉన్న వై.ఎస్. జగన్ను శనివారం చిత్రబృందం కలిసింది. చిత్రదర్శకుడు అరుణ్రెడ్డి మాట్లాడుతూ– ‘‘జగనన్న పాదయాత్ర మహోన్నతమైనది. ఆయన చేపట్టిన పాదయాత్రకు సంఘీభావంగా ఆయనతో కలిసి నడుస్తున్నాం. రాబోయే ఎన్నికల్లో జగన్ అన్న ముఖ్యమంత్రి కావడం ఖాయం’’ అన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ సీపీ విద్యార్థి విభాగం కడప జిల్లా ప్రధాన కార్యదర్శి రాజారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
అరిన్ డాటర్ ఆఫ్ అసిన్
‘అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి, గజిని’ తదితర సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అలరించిన మలబార్ బ్యూటీ ఆసిన్. 2016లో రాహుల్ అనే వ్యాపారవేత్తని వివాహం చేసుకుని సినిమాలకు దూరంగా ఉంటున్నారు. 2015లో విడుదలైన ‘ఆల్ ఈజ్ వెల్’ అసిన్ చివరి చిత్రం. గతేడాది ఆమె ఓ పాపకు జన్మనిచ్చారు. అయితే ఆ పాప ఫొటోలను కానీ, పేరుని కానీ మీడియాతో పంచుకోలేదు. ఇప్పుడు మా అమ్మాయి ‘అరిన్’ అంటూ పాప మొదటి పుట్టిన రోజు సందర్భంగా ఫస్ట్ బర్త్డే ఫొటోలను పంచుకున్నారామె. ‘‘మా చిన్నారి పాప అరిన్కి హ్యాపీ ఫస్ట్ బర్త్డే’’ అన్నారు అసిన్. ప్రస్తుతం కుటుంబ సభ్యులతో ముంబైలో ఉంటున్నారు అసిన్. -
విదేశాలకు మేకర్స్ ఆఫ్ మిల్క్షేక్స్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మిల్క్షేక్స్ తయారీలో ఉన్న హైదరాబాద్ ఫుడ్ స్టార్టప్ ‘మేకర్స్ ఆఫ్ మిల్క్షేక్స్’ విదేశాల్లో అడుగుపెడుతోంది. అక్టోబర్లో అమెరికాలోని కాలిఫోర్నియాలో స్టోర్ను తెరవనుంది. ఇటలీ, దుబాయి, సింగపూర్, ఆస్ట్రేలియా నుంచి ఫ్రాంచైజీల కోసం ఎంక్వైరీలు వస్తున్నాయని మేకర్స్ ఆఫ్ మిల్క్షేక్స్ ఫౌండర్ రాహుల్ తిరుమలప్రగడ బుధవారమిక్కడ మీడియాకు చెప్పారు. ‘హైదరాబాద్ సహా దక్షిణాదిన 12 నగరాల్లో మొత్తం 75 స్టోర్లున్నాయి. ఢిల్లీ, పుణే నగరాలకు త్వరలో విస్తరిస్తున్నాం. ఈ ఏడాది డిసెంబరుకల్లా 100 స్టోర్లు, 2019 చివరినాటికి 200 ఔట్లెట్ల స్థాయికి చేరుకుంటాం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.40 కోట్ల టర్నోవర్ ఆశిస్తున్నాం’ అని పేర్కొన్నారు. కంపెనీ 2017–18లో రూ.25 కోట్ల టర్నోవర్ నమోదు చేసింది. -
మూవీ ఫ్రెండ్స్
హీరో విజయ్ దేవరకొండతో ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ... నాని, నిఖిల్తో సత్య... రానా, రాజ్ తరుణ్తో నవీన్... వీరందరిప్పుడు ఫ్రెండ్స్ అయిపోయారు. తెరపై నవ్వులు పూయిస్తున్నారు. ప్రతి సినిమాలో ఫ్రెండ్ క్యారెక్టర్కు ప్రాధాన్యం ఉంటుంది. ఆ పాత్రల్లో ఒకప్పుడు సీనియర్ నటులు రాణించగా... ఇప్పుడు నయా ఆర్టిస్టులు దూసుకొచ్చారు. అలాంటి కొందరు మూవీ ఫ్రెండ్స్ గురించి.. శ్రీనగర్కాలనీ: ఓ హీరోయిన్.. ఓ హీరో.. ఓ ఫ్రెండ్.. ఈ ట్రాక్ సినిమాల్లో సూపర్ హిట్. మూవీస్లో ఫ్రెండ్ క్యారెక్టర్ ఓ ట్రెండ్ సెట్టర్. అప్పట్లో నటుడు చంద్రమోహన్ ఫ్రెండ్గా నటిస్తే చిత్రాలు హిట్ అనే అభిప్రాయం ఉండేది. ఆ తర్వాత హీరో ఫ్రెండ్స్ లిస్టులో అలీ, వేణుమాధవ్, సునీల్, రాజీవ్ కనకాల, ఉత్తేజ్ చేరారు. వీరి తర్వాత శ్రీనివాసరెడ్డి, వేణు, సత్యం రాజేష్, వెన్నెల కిషోర్, ప్రవీణ్, గిరిధర్, చిత్రం శ్రీను, సప్తగిరి తదితరులు ప్రధానంగా ఉండేవారు. ఇప్పుడు కొన్ని కొత్త ముఖాలు తెరపైకనిపిస్తున్నాయి. సోషల్ మీడియా ప్రభావంతో పాపులర్ అయినకొంతమంది ఆర్టిస్టుల పరిచయమిది... ♦ అభినవ్ గోమటం థియేటర్ ఆర్టిస్ట్గా చేస్తూనే షార్ట్ఫిలిమ్స్ కూడా చేశాడీ హైదరాబాదీ కుర్రాడు. జగన్నాటకం అనే చిత్రంలో అవకాశం వచ్చింది. ఆ తర్వాత సుమంత్ హీరోగా తెరకెక్కిన ‘మళ్లీరావా’లో మంచి పాత్ర చేశాడు. తరుణ్భాస్కర్ ‘ఈ నగరానికి ఏమైంది’ చిత్రంలో కామెడీ టచ్ ఉన్న పాత్ర ఇవ్వడంతో ప్రేక్షకులు కడుపుబ్బా నవ్వుకున్నారు. దర్శకుడు తేజ, ఆది సాయికిరణ్ చిత్రాల్లో నటిస్తున్నాడు. ♦ ప్రియదర్శి ప్రియదర్శి పక్కా హైదరాబాదీ. 20కి పైగా షార్ట్ఫిల్మ్స్ చేశాడు. బైపాస్ రోడ్ మూవీతో సినీ జర్నీ ప్రారంభించగా... మూడో చిత్రం ‘పెళ్లిచూపులు’తో బ్రేకొచ్చింది. ‘నా చావు నేను చస్తా.. నీకెందుకు’ అనే డైలాగ్ బాగా పాపులర్ అయింది. ఆ తర్వాత వరుసగా అవకాశాలు అందిపుచ్చుకున్నాడు. టైమింగ్తో కూడిన పంచ్లతో ప్రియదర్శి హీరో ఫ్రెండ్గా అదరగొడుతూ కడుపుబ్బా నవ్విస్తున్నాడు. ప్రస్తుతం అఖిల్, వెంకటేష్–వరుణ్తేజ్, సుధీర్బాబు చిత్రాల్లో నటిస్తున్నాడు. ♦ రాహుల్ రామకృష్ణ ‘సైన్మా’ షార్ట్ఫిల్మ్తో కెరీర్ ప్రారంభించాడు. అర్జున్రెడ్డి సినిమాతో అందరికీ సుపరిచితుడయ్యాడు. తెలంగాణ యాసలో కామెడీ పండిస్తూ అలరిస్తున్నాడు. ఇటీవల విడుదలై ఘనవిజయం సాధించిన ‘గీత గోవిందం’లోనూ రాహుల్ తనదైన శైలిలో ఆకట్టుకున్నాడు. ఇప్పటి వరకు 16 చిత్రాల్లో నటించాడు. ప్రస్తుతం రాజశేఖర్, శ్రీవిష్ణు, సందీప్కిషన్ చిత్రాల్లో నటిస్తున్నాడు. ♦ సత్య అక్కల హావభావాలతోనే కామెడీ రక్తికట్టిస్తాడు. తూర్పుగోదావరి అమలాపురానికి చెందిన సత్య అక్కల అసిస్టెంట్ డైరెక్టర్గా కెరీర్ ప్రారంభించాడు. ‘పిల్ల జమిందార్’ చిత్రానికి అసిస్టెంట్ డెరెక్టర్గా చేస్తూ నటించాడు. అనంతరం ‘స్వామిరారా’తో ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. రౌడీఫెల్లో, కార్తికేయ, జైలవకుశ, ఎక్కడికిపోతావు చిన్నవాడా, రంగస్థలం తదితర చిత్రాల్లో నటించి మెప్పించాడు. ప్రస్తుతం నాగచైతన్య ‘సవ్యసాచి’, నిఖిల్ ‘ముద్ర’, నాగార్జున–నానిల ‘దేవదాస్’, రవితేజ ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ చిత్రాల్లో నటిస్తున్నాడు. ♦ నవీన్ నవీన్ది రాజమండ్రి. 100 పర్సంట్ లవ్ చిత్రంలో పాపులర్ అయ్యాడు. ‘5డేస్ ఇన్ హైదరాబాద్’ అనే షార్ట్ఫిల్మ్లో నటించాడు. అనంతరం పిల్ల జమిందార్, కుమారి 21ఎఫ్, నాన్నకు ప్రేమతో, మళ్లీ మళ్లీ ఇది రానిరోజు, నేనే రాజు నేనే మంత్రి, ఆటోనగర్ సూర్య చిత్రాల్లో ఫ్రెండ్గా తనదైన ముద్ర వేశాడు. ఆకతాయిగా ఉంటూ సరదాగా కామెడీ పండిస్తాడు. ఇప్పుడు సుధీర్బాబు, శ్రీవిష్ణు, మారుతి దర్శకత్వంలోని చిత్రాలతో పాటు మరోదాంట్లో లీడ్రోల్ చేస్తున్నాడు. ♦ సుదర్శన్రెడ్డి ‘మచ్చా’ అంటూ చిత్తూరు యాసతో అరదగొడతాడు సుదర్శన్రెడ్డి. బీటెక్ పూర్తయ్యాక యూఎస్ ప్లాన్స్ కోసం సిటీకొచ్చిన మనోడు... ‘నాకు కోపం వచ్చింది’, ‘ఇదిగో ప్రియాంక’ లాంటి షార్ట్ఫిల్మ్స్తో పాపులర్ అయ్యాడు. ఆ తర్వాత రన్ రాజా రన్, పటాస్, కుమార్ 21ఎఫ్, చలో, కిట్టు ఉన్నాడు జాగ్రత్త సినిమాలు చేశాడు. ప్రస్తుతం శర్వానంద్, రామ్, నాగచైతన్య చిత్రాల్లో నటిస్తున్నాడు. ♦ మహేష్ విట్టా ఎంబీఏ పూర్తి చేసి, ఉద్యోగం చేయమని తల్లిండ్రులు చెబితే... నేను నటుడు, డెరెక్టర్ అవుతానంటూ హైదరాబాద్ వచ్చాడు. కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన మహేష్... రాయలసీమ యాసతో షార్ట్ఫిల్మ్స్, ఫన్ బకెట్లో పాపులర్ అయ్యాడు. ‘నేనే రాజు నేనే మంత్రి’ చిత్రంతో ఎంట్రీ ఇచ్చి... కృష్ణార్జున యుద్ధం, చలో, విజేత, నా నువ్వే సినిమాల్లో చేశాడు. పేపర్బోయ్, పడి పడి లేచె మనసు చిత్రాల్లో నటిస్తున్నాడు. ♦ వెన్నెలకంటి రాకెందుమౌళి రచయిత వెన్నెలకంటి కుమారుడు రాకెందుమౌళి. పాటలు, మాటల రచయితగా, డబ్బింగ్ ఆర్టిస్ట్గా, సింగర్, డ్యాన్సర్గా సుపరిచితుడు. షార్ట్ఫిల్మ్స్, వెబ్ సీరిస్లలో నటించాడు. చాలా చిత్రాలకు డబ్బింగ్ చెప్పడంతో పాటు పాటలు రాశాడు. నాగచైతన్య హీరోగా నటించిన సాహసం శ్వాసగా సాగిపో, కిరాక్ పార్టీ చిత్రాల్లో నటించాడు. పల్లెవాసి, మైడియర్ మార్తాండం, బియాండ్లైఫ్ చిత్రాల్లో లీడ్ రోల్ చేస్తున్నాడు. ♦ అభయ్ బేతిగంటి సిద్దిపేటకు చెందిన అభయ్ ‘సోడాబుడ్డి భాస్కర్’, ‘లగ్గం’ షార్ట్ఫిల్మ్స్ చేశాడు. ‘పెళ్లిచూపులు’ చిత్రంతో సినీ పరిశ్రమకు పరిచయమయ్యాడు. పక్కింటి కుర్రాడిలా ఉంటూ కామెడీని పండిస్తున్నాడు. ప్రస్తుతం జార్జిరెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న జార్జిరెడ్డి, నాగశౌర్య చిత్రాల్లో నటిస్తున్నాడు. ♦ వైవా రాఘవ వైజాగ్కు చెందిన రాఘం వైవా షార్ట్ఫిల్మ్స్తో సోషల్ మీడియాలో వైవా రాఘవగా పరిచయమయ్యాడు. గలగల మాట్లాడుతూ అల్లరి పిల్లోడిగా కనిపిస్తాడు. రాజా ది గ్రేట్, కిరాక్ పార్టీ సినిమాల్లో నటించాడు. శివాజీరాజా కుమారుడి చిత్రం, నర్తనశాల, ఫన్ అండ్ ఫస్ట్రేషన్ చిత్రాల్లో నటిస్తున్నాడు. -
అనుభవం ఉన్న హీరోలా...
‘‘తెలుగు ఫిలిం ఇండస్ట్రీ గర్వంగా చెప్పుకునే ఫైట్మాస్టర్ విజయ్. మూడేళ్ల ముందు ఆయన కొడుకు రాహుల్ జిమ్నాస్టిక్స్ వీడియో చూసి స్టన్ అయిపోయా. అటువంటి రాహుల్ సినిమాకు నేను సమర్పకుడిగా వ్యవహరించడం ఆనందంగా, గర్వంగా ఉంది. భవిష్యత్తులో తను మంచి హీరోగా ఎదుగుతాడు’’ అని రచయిత, నిర్మాత కోన వెంకట్ అన్నారు. సీనియర్ ఫైట్ మాస్టర్ విజయ్ తనయుడు రాహుల్ విజయ్ హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ‘ఈ మాయ పేరేమిటో’. కావ్యా థాపర్ కథానాయిక. రాము కొప్పుల దర్శకత్వంలో దివ్యా విజయ్ నిర్మించారు. ఫైట్ మాస్టర్ విజయ్ మాట్లాడుతూ– ‘‘మా సినిమా చూసిన సెన్సార్ సభ్యులు మంచి సినిమా చేశారని అభినందించడం ఆనందంగా ఉంది. ఈ నెల 24న సినిమాను విడుదల చేద్దామనుకున్నాం. కానీ, కొన్ని కారణాల వల్ల విడుదల చేయడం లేదు. త్వరలోనే రిలీజ్ తేదీని ప్రకటిస్తాం’’ అన్నారు. ‘‘మా సినిమా ప్రివ్యూ చూస్తున్నప్పుడు కోనగారు ఏమంటారోనని చాలా టెన్షన్ పడ్డా. మూడు నాలుగు సినిమాలు చేసిన అనుభవం ఉన్న హీరోలా చేశావని అనగానే హ్యాపీగా అనిపించింది’’ అన్నారు రాహుల్ విజయ్. నిర్మాత దివ్యా విజయ్, హీరోయిన్ కావ్యా థాపర్ పాల్గొన్నారు. -
ఓయూలో రాహుల్ సదస్సుకు అనుమతి నిరాకరణ
-
మారా కోసం మారా
‘ఇరుది సుట్రు (తెలుగు ‘గురు’), విక్రమ్ వేదా’ చిత్రాల్లో రఫ్ లుక్లో కనిపించిన మాధవన్ ఈసారి లవర్బాయ్లా చేంజ్ అయిపోయారు. నూతన దర్శకుడు దిలీప్ రూపొందించనున్న రొమాంటిక్ లవ్ స్టోరీ ‘మారా’ కోసం మాధవన్ ఇలా మారిపోయారు. ఈ సినిమాలో తనతో పాటు ‘విక్రమ్ వేదా’లో యాక్ట్ చేసిన శ్రద్ధా శ్రీనాథ్తో కలసి మళ్లీ వర్క్ చేయనున్నారు. ఈ సినిమా లుక్ టెస్ట్ మంగళవారం జరిగింది. ‘‘రెండు గంటల్లో నా లుక్ని మార్చేశారు నా స్టైలిస్ట్. ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను’’ అన్నారు మాధవన్. జిబ్రాన్ సంగీతం అందించనున్న ఈ చిత్రం షూటింగ్ వచ్చే నెలలో స్టార్ట్ కానుంది. ఇదిలా ఉంటే.. షారుక్ ఖాన్ ‘జీరో’, నాగచైతన్య ‘సవ్యసాచి’లో కనిపించనున్నారు మాధవన్. ఈ రెండు చిత్రాల్లోనూ కీలక పాత్రలు చేశారాయన. -
రాహుల్ను వదులుకున్న టైటాన్స్
చెన్నై: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్)లో తెలుగు టైటాన్స్ ఆశ్చర్యకరంగా తమ స్టార్ ఆటగాడు రాహుల్ చౌదరిని వద్దనుకుంది. ఆరో సీజన్ కోసం అతను వేలానికి రానున్నాడు. ఈ నెల 30, 31 తేదీల్లో ఆటగాళ్ల వేలం నిర్వహించనున్నారు. రెండు రోజుల పాటు ముంబైలో జరిగే ఈ వేలం ప్రక్రియలో 422 మంది ఆటగాళ్లు అందుబాటులో ఉన్నట్లు పీకేఎల్ వర్గాలు వెల్లడించాయి. ఈ జాబితాలో 14 దేశాలకు చెందిన 58 మంది విదేశీ ఆటగాళ్లుండగా, 87 మంది ఫ్యూచర్ కబడ్డీ హీరోస్ (ఎఫ్కేహెచ్) కార్యక్రమం ద్వారా అర్హత సాధించిన వారున్నారు. దేశవ్యాప్తంగా నిర్వహించిన ప్రతిభాన్వేషణ పోటీల ద్వారా వీరంతా వేలానికి అర్హత పొందారు. మొత్తం 12 ఫ్రాంచైజీల్లో 9 ఫ్రాంచైజీలు 21 మంది ఆటగాళ్లను అట్టిపెట్టుకున్నాయి. మూడు ఫ్రాంచైజీలు మాత్రం ఏ ఒక్కరినీ రిటెయిన్ చేసుకోలేదు. జట్టు మొత్తానికి కొత్త రూపు ఇచ్చేందుకు సిద్ధమయ్యాయి. క్రికెట్ దిగ్గజం సచిన్ సహ యజమానిగా ఉన్న తమిళ్ తలైవాస్ అజయ్ ఠాకూర్, అమిత్ హుడా, అరుణ్లను అట్టి పెట్టుకుంది. తెలుగు టైటాన్స్ ఫ్రాంచైజీ రాహుల్ను కాదని నితేశ్ సాలుంకే, మోసెన్ (ఇరాన్)లను రిటెయిన్ చేసుకుంది. -
గాయం కారణంగానే రాహుల్కు ఉద్వాసన
న్యూఢిల్లీ: గాయం కారణంగానే ఆంధ్రప్రదేశ్ వెయిట్లిఫ్టర్ రాగాల వెంకట్ రాహుల్ (85 కేజీలు) పేరును టార్గెట్ ఒలింపిక్ పోడియం (టాప్) పథకం నుంచి తొలగించినట్లు భారత వెయిట్లిఫ్టింగ్ సమాఖ్య (ఐడబ్ల్యూఎల్ఎఫ్) తెలిపింది. అతనితో పాటు సతీశ్ శివలింగం (77 కేజీలు) గాయాలతో బాధపడుతుండటంతో వారి పేర్లను ఈ జాబితా నుంచి తప్పించినట్లు పేర్కొంది. ‘కామన్వెల్త్ గేమ్స్లో స్వర్ణాలు నెగ్గిన వారిద్దరు గాయాల నుంచి కోలుకొని తిరిగి ‘టాప్’లో చోటు దక్కించుకుంటారని భావిస్తున్నా’ అని ఐడబ్ల్యూఎల్ఎఫ్ కార్యదర్శి సహదేవ్ తెలిపారు. ఈ ఇద్దరితో పాటు పూనమ్ యాదవ్ను కూడా ఈ జాబితా నుంచి తొలిగించారు. ఆమె చెప్పాపెట్టకుండా జాతీయ శిబిరం నుంచి గైర్హాజరు అయిన నేపథ్యంలో ఆమె పేరు తొలగించారు. ఈ ముగ్గురి స్థానంలో కొత్తగా మరో ముగ్గురికి చోటు కల్పించారు. సంజిత చాను (53 కేజీలు), పర్దీప్ సింగ్ (105 కేజీలు), రాఖీ (63 కేజీలు)లను ఈ జాబితాలో చేర్చారు. -
ఈ మాయ పేరేమిటో
సీనియర్ ఫైట్ మాస్టర్ విజయ్ తనయుడు రాహుల్ విజయ్ హీరోగా పరిచయమవుతోన్న విషయం తెలిసిందే. రాము కొప్పుల దర్శకత్వంలో దివ్య విజయ్ నిర్మించిన ఈ చిత్రానికి ‘ఈ మాయ పేరేమిటో’ అనే టైటిల్ ఖరారు చేశారు. కావ్యా థాపర్ కథానాయిక. సినిమాలోని కొన్ని సన్నివేశాలను, ఓ పాటను ప్రత్యేకంగా ప్రదర్శించారు. ఫైట్ మాస్టర్ విజయ్ మాట్లాడుతూ– ‘‘నన్ను ఎంతో ఆదరించిన ఇండస్ట్రీకి మా అబ్బాయి రాహుల్ని హీరోగా, అమ్మాయి దివ్యని నిర్మాతగా పరిచయం చేయడం ఆనందంగా ఉంది. రాము కొప్పులగారు మంచి కథను అద్భుతంగా తెరకెక్కించారు. నన్ను ఆదరించిన తరహాలోనే మా అబ్బాయి, అమ్మాయిని ఆదరించాలని కోరుకుంటున్నా’’ అన్నారు. ‘‘లవ్, కామెడీ, ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన చిత్రమిది. అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించేలా ఉంటుంది’’ అన్నారు రాము కొప్పుల. ‘‘రాముగారు సినిమాను అందంగా తీశారు. ఈ చిత్రం అందరూ ఎంజాయ్ చేసేలా ఎంటర్టైనింగ్గా, కూల్గా ఉంటుంది’’ అన్నారు రాహుల్ విజయ్. ‘‘ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. వీలైనంత త్వరగా సినిమా రిలీజ్ చేస్తాం’’ అన్నారు దివ్యా విజయ్. ఈ చిత్రానికి ఫైట్స్: విజయ్, ఎడిటర్: నవీన్ నూలి, సంగీతం: మణిశర్మ, సినిమాటోగ్రఫీ: శ్యామ్ కె.నాయుడు. -
వెయిట్లిఫ్టర్ రాహుల్ స్వస్థలంలో సంబరాలు
-
కామన్వెల్త్ గేమ్స్లో స్వర్ణం నెగ్గిన తెలుగు తేజం
-
జయహో రాహుల్
ఒకవైపు పూర్తిస్థాయి ఫిట్నెస్ లేకున్నా... మరోవైపు ఫిజియో సేవలు అందుబాటులో లేకున్నా ... ఇంకోవైపు గాయాలు వేధిస్తున్నా... కామన్వెల్త్ గేమ్స్లో భారత వెయిట్లిఫ్టర్ల పతకాల వేట మాత్రం నిరాటంకంగా కొనసాగుతోంది. తొలి రెండు రోజుల్లో మహిళల విభాగంలో మీరాబాయి చాను, సంజిత చాను పసిడి పతకాలతో మెరవగా... మూడో రోజు పురుషుల విభాగంలో రాగాల వెంకట్ రాహుల్, సతీశ్ కుమార్ శివలింగం ‘స్వర్ణ’ కాంతులు విరజిమ్మారు. వీరిద్దరి ప్రతిభతో మూడో రోజు పోటీలు ముగిసేసరికి భారత్ నాలుగు స్వర్ణాలు, ఒక రజతం, ఒక కాంస్యంతో కలిపి మొత్తం ఆరు పతకాలతో నాలుగో స్థానానికి చేరుకుంది. గోల్డ్కోస్ట్: తమపై పెట్టుకున్న అంచనాలను నిజం చేస్తూ భారత వెయిట్లిఫ్టర్లు కామన్వెల్త్ గేమ్స్లో అద్వితీయ ప్రదర్శన చేస్తున్నారు. తమ ప్రతిభతో వరుసగా మూడో రోజు భారత్ ఖాతాలో రెండు పతకాలను జమ చేశారు. తొలి రోజు స్వర్ణం, రజతం... రెండో రోజు స్వర్ణం, కాంస్యం రాగా... మూడో రోజు మాత్రం రెండూ స్వర్ణాలే కావడం విశేషం. పురుషుల 77 కేజీల విభాగంలో డిఫెండింగ్ చాంపియన్ సతీశ్ కుమార్ 317 కేజీలు (స్నాచ్లో 144+క్లీన్ అండ్ జెర్క్లో 173) బరువెత్తి విజేతగా నిలిచాడు. 85 కేజీల విభాగంలో ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా స్టువర్ట్పురం ప్రాంతానికి చెందిన రాగాల వెంకట్ రాహుల్ 338 కేజీలు (స్నాచ్లో 151+క్లీన్ అండ్ జెర్క్లో 187) బరువెత్తి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. డాన్ ఒపెలోగ్ (సమోవా–331 కేజీలు) రజతం... ఫజ్రుల్ (మలేసియా–328 కేజీలు) కాంస్య పతకాలు గెల్చుకున్నారు. మహిళల 63 కేజీల విభాగంలో భారత లిఫ్టర్ వందన గుప్తా ఐదో స్థానంలో నిలిచింది. పోటాపోటీ... గతేడాది ఇదే వేదికపై జరిగిన కామన్వెల్త్ చాంపియన్షిప్లో స్వర్ణం గెలిచిన రాహుల్ ఏడాదిలోపే మళ్లీ పసిడితో మెరిశాడు. స్నాచ్ తొలి ప్రయత్నంలో 147 కేజీలు ఎత్తిన రాహుల్... రెండో ప్రయత్నంలో 151 కేజీలు ఎత్తబోయి విఫలమయ్యాడు. చివరిదైన మూడో ప్రయత్నంలో సఫలమయ్యాడు. స్నాచ్ ఈవెంట్ ముగిశాక రాహుల్, డాన్ ఒపెలోగ్ 151 కేజీలతో సమంగా నిలిచారు. అనంతరం క్లీన్ అండ్ జెర్క్లో రాహుల్ తొలి ప్రయత్నంలో 182 కేజీలు, రెండో ప్రయత్నంలో 187 కేజీలు బరువెత్తాడు. మూడో ప్రయత్నంలో 191 కేజీలకు ప్రయత్నించి విఫలమయ్యాడు. రాహుల్కు గట్టిపోటీనిచ్చిన సమోవా లిఫ్టర్ డాన్ ఒపెలోగ్ స్వర్ణం సాధించేందుకు చివరి ప్రయత్నంగా ఒపెలోగ్ ఈసారి 191 కేజీలకు వెళ్లి ఫెయిల్ కావడంతో రాహుల్కు స్వర్ణం ఖాయమైంది. మరోవైపు తమిళనాడులోని వేలూరు జిల్లాకు చెందిన 25 ఏళ్ల సతీశ్కిది కామన్వెల్త్ గేమ్స్లో రెండో స్వర్ణం. 2014 గ్లాస్గో గేమ్స్లోనూ అతను పసిడి పతకం గెలిచాడు. సతీశ్ తండ్రి శివలింగం కూడా మాజీ వెయిట్లిఫ్టర్. ప్రస్తుతం ఆయన వీఐటీ యూనివర్సిటీ లో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నారు. సతీశ్ సాధించిన ఘనతలతో తానెంతో గర్వపడుతున్నానని అన్నారు. రూ. 50 లక్షలు నజరానా సతీశ్ ప్రదర్శనకు ప్రోత్సాహకంగా తమిళనాడు ప్రభుత్వం అతనికి రూ. 50 లక్షలు నగదు పురస్కారం ప్రకటించింది. గవర్నర్, వైఎస్ జగన్ అభినందనలు సాక్షి, అమరావతి: స్వర్ణం నెగ్గిన ఏపీ లిఫ్టర్ రాహుల్ను గవర్నర్ నరసింహన్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభినందించారు. తన ప్రదర్శనతో భారత్ పేరు నిలబెట్టాడని ప్రశంసించారు. గత ఏడాది మోకాలికి గాయమైంది. కొన్నాళ్ల క్రితం కామెర్లు రావడంతో ఒక్కసారిగా 20 కిలోల బరువు తగ్గిపోయాను. వీటన్నింటిని అధిగమించి ఇక్కడ పతకం గెలవడం చాలా ఆనందంగా ఉంది. నా జీవితంలో ఇది అత్యంత విలువైన విజయం. అమ్మ మెట్టెలను అదృష్టంగా భావించాను. అందుకే వాటిని ధరించాను. ఆమె నా తోడుండి ఆశీర్వదించినట్లుగా అని పించింది. - రాహుల్ -
కాలి మెట్టెను నుదుట ధరించి...
రెండేళ్ల క్రితం 19 ఏళ్ల ఆ కుర్రాడు రియో ఒలింపిక్స్ ట్రయల్స్ కోసం సన్నద్ధమవుతున్నాడు. అంతలో అమ్మ చనిపోయిందంటూ ఇంటినుంచి విషాద వార్త. ఆ దశలో అతను ఆటపై మనసును లగ్నం చేయలేకపోయాడు. ఫలితంగా ఒలింపిక్స్ అవకాశాలు దూరం! అయితే అలాంటి సమయంలోనూ ప్రపంచ వేదికపై పతకం గెలుస్తానంటూ అతను గతంలో అమ్మకు ఇచ్చిన మాటను మరచిపోలేదు. అందుకే తన లక్ష్యాన్ని నిరంతరం గుర్తుకు తెచ్చేలా అమ్మ జ్ఞాపకాలను తనతోనే ఉంచుకున్నాడు. ఆమె కాలి మెట్టెని తన నుదుటన పట్టీలా కట్టి పోటీల్లోకి అడుగు పెట్టాడు. దివి నుంచి అమ్మ ఆశీర్వాదంతో స్వర్ణం సాధించి ఆమెకు అంకితం ఇచ్చాడు. ఇది సినిమాల్లో కనిపించే నాటకీయ సన్నివేశం కాదు... కష్టాలకు ఎదురొడ్డి విజేతగా నిలిచిన ఒక యువ ఆటగాడి వాస్తవ కథ. మన తెలుగు కుర్రాడు రాగాల వెంకట రాహుల్ విజయగాథ. బరువులెత్తే క్రమంలో సమస్యల భారాన్ని కూడా ఎత్తి పడేసిన ఈ వెయిట్లిఫ్టర్ నేడు సగర్వంగా కామన్వెల్త్ వేదికపై భారత జాతీయ గీతాన్ని వినిపించాడు. ఎన్నో ఏళ్లుగా తన ఊరు ‘స్టువర్ట్పురం’కు ఉన్న ఇమేజీని తుడిచేసే విధంగా కొత్త ‘బ్రాండ్’గా అతను తయారయ్యాడు. యూత్, జూనియర్ స్థాయిల్లో విజయాలతో తన విలువేమిటో చూపించిన రాహుల్, ఇప్పుడు సరైన సమయంలో సరైన వేదికపై సత్తా చాటి భవిష్యత్తు తారగా అందరి దృష్టినీ ఆకర్షించాడు. సాక్షి క్రీడా విభాగం : కామన్వెల్త్ క్రీడల్లో రాహుల్ విజయం అనూహ్యమేమీ కాదు. గత ఏడాది ఇదే గోల్డ్కోస్ట్ వేదికగా జరిగిన కామన్వెల్త్ చాంపియన్షిప్లో కూడా అతను అగ్రస్థానంలో నిలిచాడు. అంతకుముందు రెండేళ్ల క్రితం ఇదే ఈవెంట్లో రజతం కూడా సాధించాడు. జూనియర్ స్థాయి విజయాలతో వేగంగా దూసుకుపోయిన తర్వాత జాతీయ సీనియర్ శిక్షణా శిబిరంలో చేరడంతో రాహుల్ ఆట మారిపోయింది. మున్ముందు ఒలింపిక్స్లో కూడా పతకం సాధించే అవకాశాలు ఉన్న మన లిఫ్టర్ల జాబితాలో రాహుల్ ఎప్పటి నుంచో ఉన్నాడు. ఇప్పుడు కామన్వెల్త్ పతకం అందులో తొలి అడుగు. ఎలాంటి హంగూ ఆర్భాటాలు, అండా దండా లేకుండా కేవలం తన శ్రమను, పట్టుదలను మాత్రమే నమ్ముకొని అతను ఈ స్థాయికి చేరడం విశేషం. సానబెట్టిన స్పోర్ట్స్ స్కూల్... గిరిజన కుటుంబం... సొంత ఊరి వాతావరణం చూస్తే ఎప్పుడైనా కుర్రాళ్లు దారి తప్పే ప్రమాదం... ఇలాంటి స్థితిలో క్రీడలు తమకు కొత్త దారి చూపిస్తాయని రాహుల్ తండ్రి మధు నమ్మారు. అందుకే అతడిని ఆటగాడిగా తీర్చిదిద్దేందుకు సర్వస్వం ధారబోశారు. యూనివర్సిటీ స్థాయి వరకు క్రీడల్లో పాల్గొన్న మధు తన కొడుకును హైదరాబాద్లోని ఏపీ స్పోర్ట్స్ స్కూల్లో చేర్చాలని ప్రయత్నించగా రాహుల్ ప్రవేశ పరీక్షలో విఫలమయ్యాడు. అయితే అప్పటికే తండ్రి నేర్పించిన ఆటతో రాష్ట్ర స్థాయిలో చక్కటి ప్రదర్శన చేసిన రాహుల్కు స్పోర్ట్స్ స్కూల్ కోచ్ మాణిక్యాల రావు నేరుగా స్కూల్లో ప్రవేశం కల్పించారు. ఇక అప్పటినుంచి రాహుల్ ఆటకు ఎదురు లేకుండా పోయింది. స్కూల్ శిక్షణలో అతను అద్భుతంగా ఎదిగాడు. స్కూల్గేమ్స్ నుంచి మొదలు పెడితే జాతీయ సబ్ జూనియర్, జూనియర్, యూత్, సీనియర్... ఇలా ప్రతీ చోటా అతను విజయాలు అందుకున్నాడు. వరుసగా ఆరు సార్లు జాతీయ జూనియర్ చాంపియన్గా నిలిచిన తర్వాత 2012లో జూనియర్/యూత్ కామన్వెల్త్ చాంపియన్షిప్లో స్వర్ణంతో అతని అంతర్జాతీయ పతకాల బోణీ మొదలైంది. వెంటాడిన సమస్యలు... స్పోర్ట్స్ స్కూల్లో చదువు ముగిసిన తర్వాత రాహుల్కు ఆట కొనసాగించడంలో చాలా ఇబ్బందులు ఎదురయ్యాయి. తీవ్రమైన ఆర్థిక సమస్యలతో పాటు సరైన సౌకర్యాలు, మార్గనిర్దేశనం లేక ఆటను మధ్యలోనే ఆపేసే పరిస్థితి వచ్చింది. వెయిట్లిఫ్టింగ్ కిట్ కోసం తండ్రి మధు ఎంత మందిని కలిసినా స్పందన లభించలేదు. ప్రభుత్వం నుంచి కూడా ఎలాంటి సహకారం లభించలేదు. పాత ఎక్విప్మెంట్తోనే తండ్రి శిక్షణను కొనసాగించారు. సరైన డైట్ కోసం, టోర్నీలకు వెళ్లేందుకు సొంత డబ్బులు ఖర్చు చేయాల్సి వచ్చినా ఆయన వెనుకంజ వేయలేదు. ఈ క్రమంలో తన రెండెకరాల పొలం, ఇల్లు కూడా మధు అమ్ముకున్నారు. పాటియాలాలోని ఎన్ఐఎస్లో చేరిన తర్వాత మాత్రమే పరిస్థితి మెరుగైంది. ఆ తర్వాత రైల్వేస్లో రాహుల్కు ఉద్యోగం రావడం కూడా అతని ఆర్థిక సమస్యలను కాస్త దూరం చేసింది. ‘కామన్వెల్త్లో పతకంతో చాలా గర్వంగా ఉంది. ఇలాంటి రోజు కోసమే ఎన్నో ఏళ్లుగా మేం కష్టపడ్డాం. భవిష్యత్తులో రాహుల్ దేశం తరఫున మరిన్ని విజయాలు సాధిస్తాడు. ఒలింపిక్స్లో పతకం గెలుచుకునే రోజు కోసం ఎదురు చూస్తున్నాం’ అని విజయానంతరం మధు ఉద్వేగంగా వ్యాఖ్యానించారు. తమ్ముడు, చెల్లి కూడా... రాహుల్ విజయాలతోనే తండ్రి మధు ఆగిపోలేదు. తన మరో కొడుకు వరుణ్, కూతురు మధుప్రియలను కూడా ఆయన వెయిట్ లిఫ్టర్లుగా తీర్చిదిద్దారు. ఇప్పటికే తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న వరుణ్ గత ఏడాది కామన్వెల్త్ చాంపియన్షిప్లో 77 కేజీల విభా గంలో స్వర్ణం గెలిచాడు. మున్ముందు అతను కూడా అన్న బాటలో అగ్రస్థాయికి చేరాలని పట్టుదలగా ఉన్నాడు. రాష్ట్ర, జాతీయ స్థాయిలో పలు పతకాలు గెలుచుకున్న అనంతరం మధుప్రియ ఇప్పుడు చదువుపై దృష్టి పెట్టింది. -
ప్రియుడితో పెళ్లి జరిపించండి ..
కొమరాడ: ప్రేమించానన్నాడు.. పెళ్లి చేసుకుంటానన్నాడు.. మాయమాటలతో లొంగదీసుకున్నాడు.. పెళ్లి అనేసరికి కనిపించకుండా పోయాడు.. దీంతో మోసపోయానని గ్రహించిన బాధితురాలు ప్రియుడు ఇంటి ముందు నిరసన వ్యక్తం చేస్తోంది. వివరాల్లోకి వెళితే.. కొమరాడ గ్రామానికి చెందిన కాగిన సౌజన్య (22) పార్వతీపురంలో ఉన్న రాహుల్ రడీమేడ్ దుకాణంలో పనిచేసేది. అదే దుకాణంలో మండలంలోని ఎగువ గంగురేగువలసకు చెందిన యామిని కృపారావు కూడా పనిచేసేవాడు. వీరిద్దరి మధ్య ఏర్పడిన స్నేహం చివరకు ప్రేమకు దారితీసింది. పెళ్లి చేసుకుంటానని నమ్మబలికిన కృపారావు ప్రియురాలు సౌజన్యను లొంగదీసుకుని గంగురేగువలసలో ఒకే ఇంటిలో ఉంటూ సహజీవనం కూడా చేశాడు. సౌజన్య పెళ్లి మాట ఎత్తినప్పుడల్లా ఇల్లు కడుతున్నామని, పూర్తవగానే పెళ్లి చేసుకుందామని నమ్మబలికాడు. పెళ్లికోసం సౌజన్య ఇటీవల ఎక్కువ ఒత్తిడి చేయడంతో సంక్రాంతి పండుగ తర్వాత నుంచి కృపారావు కనిపించకుండా పోయాడు. దీంతో బాధితురాలు అతని తల్లిని నిలదీయగా, మొదట్లో ఎటో పనిమీద వెళ్లాడని చెప్పిన ఆమె కొద్ది రోజుల కిందట ఇంటికి తాళం వేసి ఎటో వెళ్లిపోయింది. దీంతోతాను మోసపోయానని గ్రహించిన బాధితురాలు తన ప్రియుడ్ని తనకు అప్పగించాలని కోరుతూ అతని ఇంటిముందు నిరసన చేపట్టింది. -
ఫేస్బుక్ గుణపాఠం
తమిళసినిమా: ఫేస్బుక్ ఉపయోగించే అమ్మాయిలందరికీ ఒక పాఠంగా ‘కరుత్తుగళ్ పదివు చెయ్’ చిత్రం ఉంటుందని ఆ చిత్ర దర్శకుడు రాహుల్ అంటున్నారు. చిత్ర నిర్మాణ రంగంలోనూ, డిస్ట్రిబ్యూటర్స్ రంగంలోనూ మంచి అనుభవం గడించిన ఆర్పీఎం సినిమాస్ అధినేత రాహుల్ ఇంతకుముందు ‘జిత్తన్ 2’, ‘1ఏఎం’ వంటి విభిన్న కథా చిత్రాలను నిర్మించడంతో పాటు ‘కళత్తూర్ గ్రామం’, ‘143’ చిత్రాలను విడుదల చేశారు. తాజాగా ఆయన మెగాఫోన్ పట్టి నిర్మిస్తున్న చిత్రం ‘కరుత్తుగళ్ పదివు చెయ్’. ఈ చిత్రం ద్వారా దివంగత ప్రఖ్యాత నటుడు ఎస్ఎస్ఆర్ మనుమడు ఎస్ఎస్ఆర్.ఆరియన్ హీరోగా పరిచయం అవుతున్నారు. హీరోయిన్గా ఉపాసనరాయ్ నటిస్తోంది. మిర్చి శివ హీరోగా నటించిన ‘యా యా’ చిత్ర దర్శకుడు రాజశేఖర్ ఈ సినిమాకు కథ, కథనం, మాటలను అందిస్తున్నారు. రాహుల్ దర్శకత్వం వహించి నిర్మించిన ‘కరుత్తుగళ్ పదివు చెయ్’ చిత్ర ఫస్ట్లుక్ పోస్టర్ను ప్రపంచ మహిళాదినోత్సవం సందర్భంగా గురువారం విడుదల చేశారు. ఈ పోస్టర్కు మంచి స్పందన వస్తోందని దర్శక నిర్మాత ఆనందం వ్యక్తం చేశారు. దీనికి మనోహర్ ఛాయాగ్రహణం, గణేశ్ రాఘవేంద్ర సంగీతం అందిస్తున్నారు. -
లవ్ అండ్ ఫ్యామిలీ
ఫైట్మాస్టర్ విజయ్ తనయుడు రహుల్ హీరోగా కావ్య థాపర్ హీరోయిన్గా రాము కొప్పుల దర్శకత్వంలో వి.ఎస్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్పై దివ్య విజయ్ నిర్మాతగా ఓ సినిమా రూపొందనున్న విషయం తెలిసిందే. ఈ చిత్ర టాకీ పార్ట్ కంప్లీట్ అయ్యింది. దర్శకుడు రాము మాట్లాడుతూ– ‘‘టాకీ పార్ట్ అనుకున్న విధంగా కంప్లీట్ అయింది. రాహుల్ బాడీ లాంగ్వేజ్కు సరిపోయే కథ. అద్భుతంగా నటించాడు. మేకింగ్లో ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు’’ అన్నారు. నిర్మాత దివ్య విజయ్ మాట్లాడుతూ –‘‘దర్శకుడు చాలా బాగా తెరకెక్కించాడు.లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమా అందర్ని ఆకట్టుకుంటుంది. రాహుల్, కావ్య పెయిర్ స్క్రీన్పై చాలా బావుంది. మణిశర్మ సంగీతం, శ్యామ్ కె నాయుడు సినిమాటోగ్రఫీ సినిమాకు ప్లస్ అవుతాయి. పోస్ట్ ప్రొడక్షన్ పనులు త్వరలోనే స్టార్ట్ చేస్తాం’’ అని అన్నారు. రాజేంద్ర ప్రసాద్, మురళీ శర్మ, పవిత్రా లోకేష్ తదితరులు నటించిన ఈ సినిమాకు లైన్ ప్రొడ్యూసర్: రాజు ఓలేటి. -
‘రొటొమ్యాక్’ కొఠారి అరెస్టు
ముంబై/న్యూఢిల్లీ: రూ. 3,695 కోట్ల రొటొమ్యాక్ కుంభకోణం కేసులో అరెస్టుల పర్వం మొదలైంది. గత నాలుగు రోజులుగా రొటొమ్యాక్ యజమాని విక్రమ్ కొఠారి, అతని కుమారుడు రాహుల్ను విచారించిన సీబీఐ గురువారం వారిని అదుపులోకి తీసుకుంది. సీబీఐ ప్రధాన కార్యాలయానికి హాజరైన వారిద్దరూ విచారణకు సహకరించకపోవడంతో అరెస్టు చేశామని సీబీఐ ప్రతినిధి వెల్లడించారు. విక్రమ్, రాహుల్లు డైరెక్టర్లుగా ఉన్న ‘రొటొమ్యాక్ గ్లోబల్ ప్రైవేట్ లిమిటెడ్’ 2008 నుంచి ఏడు జాతీయ బ్యాంకుల నుంచి రూ. 2,919 కోట్ల రుణాలు తీసుకుని దారి మళ్లించినట్లు ఎఫ్ఐఆర్లో సీబీఐ ఆరోపించిన సంగతి తెలిపిందే. అసలు, వడ్డీ కలిపి బ్యాంకులకు రొటొమ్యాక్ కంపెనీ రూ. 3,695 కోట్లకు పైగా చెల్లించాలని తేల్చింది. హైదరాబాద్ సెజ్లో.. పంజాబ్ నేషనల్ బ్యాంకును రూ. 11,400 కోట్లకు నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీలు మోసగించిన కేసులో.. పన్ను ఎగవేత ఆరోపణలపై హైదరాబాద్ సెజ్లో గీతాంజలి గ్రూపునకు చెందిన రూ.1200 కోట్ల ఆస్తిని ఆదాయపు పన్ను శాఖ గురువారం అటాచ్ చేసింది. ఇప్పటికే గీతాంజలి గ్రూపు, దాని ప్రమోటర్ మెహుల్ చోక్సీకి చెందిన 9 బ్యాంకు ఖాతాల్ని, ఏడు ఆస్తుల్ని ఐటీ శాఖ నిలుపుదల చేసిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా పలు నగరాల్లో గురువారం ఎనిమిదో రోజూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాడులు కొనసాగిస్తూ.. చోక్సీ, అతని గ్రూపునకు చెందిన రూ. 86.72 కోట్లు, మోదీ గ్రూపునకు చెందిన రూ. 7.8 కోట్ల మ్యూచువల్ ఫండ్లు, షేర్లు స్వాధీనం చేసుకుంది. రూ.కోట్ల రూపాయల విలువైన కార్లను కూడా స్వాధీనం చేసుకున్నామని.. సీజ్ చేసిన ఆస్తుల మొత్తం విలువ రూ. 100 కోట్లకు పైనే ఉంటుందని ఈడీ తెలిపింది. ఈ కేసులో ఇంతవరకూ రూ. 5,826 కోట్ల ఆస్తుల్ని స్వాధీనం చేసుకుంది. సీజ్ చేసిన కార్లలో రోల్స్రాయిస్ ‘ఘోస్ట్’, మెర్సిడెస్ బెంజ్, పోర్షే పనమెరా, మూడు హోండా కంపెనీ కార్లు, ఒక టయోటా ఫార్చూనర్, ఇన్నోవా ఉన్నాయి. ఇప్పటికే ఈ కేసులో నీరవ్ కుచెందిన 15 విలాసవంతమైన కార్లను స్వాధీనం చేసుకున్నారు. నీరవ్ గురువారం తన ముందు హాజరుకాకపోవడంతో .. ఈడీ తాజాగా మరోసారి సమన్లు జారీచేసింది. ఫిబ్రవరి 26లోపు హాజరుకావాలని ఆదేశించింది. అయితే తన పాస్పోర్టును తాత్కాలికంగా రద్దు చేయడం వల్లే హాజరుకాలేదని ఈడీకి నీరవ్ చెప్పినట్లు సమాచారం. ఆచరణసాధ్య ఆలోచనతో రండి! బకాయిల చెల్లింపునకు స్పష్టమైన, ఆచరణ సాధ్యమైన ప్రణాళికతో ముందుకు రావాలని పీఎన్బీ కుంభకోణం సూత్రధారి నీరవ్ మోదీని పంజాబ్ నేషనల్ బ్యాంకు లేఖలో కోరింది. పీఎన్బీ అత్యుత్సాహం వల్లే బకాయిలు చెల్లించే సామర్థ్యం తగ్గిపోయిందని మోదీ రాసిన లేఖకు సమాధానమిస్తూ.. ‘కొందరు బ్యాంకు అధికారులు అక్రమంగా జారీ చేసిన ఎల్వోయూల్ని తప్పుడు మార్గాల్లో మీరు పొందారు. ఏ దశలోను అలాంటి సదుపాయాల్ని మీ కంపెనీలకు మా బ్యాంకు కల్పించలేదు’ అని లేఖలో పీఎన్బీ జనరల్ మేనేజర్ (అంతర్జాతీయ బ్యాంకింగ్ విభాగం) అశ్వినీ వత్స్ పేర్కొన్నారు. ‘మొత్తం అప్పును తీర్చేందుకు మీరు చూపిన నిబద్ధత, చొరవలో ఎక్కడా కూడా ముందస్తు చెల్లింపుల ప్రస్తావన, నిర్దేశిత సమయం పేర్కొనలేదు. ఏదేమైనా బకాయిల్ని తీర్చేందుకు మీ వద్ద సరైన ప్రణాళిక ఉంటే.. ఇప్పటికైనా సమాధానమివ్వండి’ అని లేఖలో పీఎన్బీ పేర్కొంది. సంస్థ వాటాలు, ఆస్తులు అమ్మి రుణం చెల్లిస్తానని చెప్పినా.. అత్యుత్సాహంతో ఆస్తుల్ని సీజ్ చేసి తన బ్రాండ్ పేరును నాశనం చేశారంటూ ఫిబ్రవరి 13, 15 తేదీల్లో పీఎన్బీకి నీరవ్ లేఖ రాశారు. ఈ పరిస్థితుల్లో బకాయిలు చెల్లించడం కష్టమేనని అందులో పేర్కొన్న సంగతి తెలిసిందే. -
ప్రాణం కోసం.. పన్నెండేళ్ల పోరాటం
జూలపల్లి(పెద్దపల్లి): వైద్యరంగంలో విప్లవాత్మకమైన మార్పులు తమ బిడ్డ ప్రాణాలను కాపాడతాయని 12 ఏళ్లుగా ఆ తల్లిదండ్రులు ఎదురుచూస్తున్నారు. ఆస్పత్రుల చుట్టూ తిరిగి చేతిలో ఉన్నకాడికి ఖర్చు చేసి వైద్యం చేయించారు. అయి నా తగ్గని వ్యాధి తమ కుమారుడిని ఎక్కడ పొట్టనపెట్టుకుంటుందోనని ఆ తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. జూలపల్లికి చెందిన వడ్లూరి చంద్రమౌళి– స్వరూపలకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు రాహుల్(16)కు 12 ఏళ్ల క్రితం బ్రెయిన్ ట్యూమర్ వ్యాధి సోకింది. అప్పట్లో అప్పు లు తెచ్చి లక్ష రూపాయలు ఖర్చు చేసి ఆపరేషన్ చేయించారు. డాక్లర్లు 12 ఏళ్లపాటు మందులు వాడి తిరిగి పరీక్షలు చేయించుకోవాలని చెప్పారు. కొంత మేరకు దాతల సహకారం అందడంతో మందులు వాడుతూ వచ్చారు. అప్పట్లో చేసిన అప్పులు నేటికి తీరకపోగా వారి వద్ద ప్రస్తుతం చేతిలో చిల్లిగవ్వ లేదు. వైద్య పరీక్షలకు వెళ్లక పోవడంతో నెల రోజుల నుంచి బాలుడు తీవ్ర అస్వస్థతకు గురై నడవలేని పరిస్థితికి వచ్చాడు. మలమూత్రాలు సైతం మంచంలోనే సాగుతున్నాయి. పరీక్షలకు కనీసం రూ.30 వేలు అవసరం ఉంటాయని, కూలీ చేసుకుని జీవనం సాగించే తమవద్ద ఆ డబ్బులు లేకపోవడంతో నిస్సహాయ స్థితిలో ఉన్నామని అతని తల్లిదండ్రులు దీనంగా చెప్పారు. బ్రెయిన్ ట్యూమర్ సోకిన తమ 16 ఏళ్ల కుమారుడికి వైద్యం చేయించుకోలేని స్థితితో ఆ నిరుపేద కుటుంబం ఆర్థిక సహాయం కోసం ఎదురుచూస్తోంది. దాతలు స్పందించి తమ కుమారుని ప్రాణాలు కాపాడాలని వారు వేడుకుంటున్నారు. దాతలు సెల్: 7799816260కు సంప్రదించగలరు. -
నాలుగో వరుస
ఢిల్లీలో ఇవాళ గణతంత్ర వేడుకలు జరుగుతున్నాయి. ఢిల్లీలోనే అనేముందీ.. దేశమంతటా రిపబ్లిక్ డేనే కదా! అవుననుకోండీ, ఈసారి ఢిల్లీ సెలబ్రేషన్స్ కొంచెం డిఫరెంట్గా జరుగుతున్నాయి. రాహుల్ గాంధీకి స్టేజీకి దూరంగా వెనక ఎక్కడో నాలుగో వరుసలో సీటువేసి కూర్చోబెట్టి ఆయనకు వివిధ దళాల విన్యాసాలను చూపించాలని మోదీ డిసైడ్ చేశారు! కాంగ్రెస్ ప్రెసిడెంట్ సీటు ప్రతి రిపబ్లిక్ డేకి ప్రముఖులతో పాటు ముందు వరుసలో ఉంటుంది. రాహుల్ ప్రెసిడెంట్ అయ్యాక మోదీ ఆ సంప్రదాయాన్ని మార్చేశారు! ‘‘అబ్బే ఆయనకేం తెలీదు పాపం’’ అని బీజేపీ అంటుంటే... ‘‘అవును పాపం. మోదీకి ఏ పాపమూ తెలీదు. రాహుల్బాబుని అవమానించడానికి పుణ్యం కట్టుకుంది మాత్రం మోదీనే’’ అని కాంగ్రెస్ వాళ్లు అంటున్నారు. ‘‘ఇందులో అవమానించడానికి ఏముందీ.. వీఐపీలకు సీట్లు సరిపోకనే అలా సెట్ చేశాం’’ అని బీజేపీ అంటోంది. ఇంతకీ ఎవరా వీఐపీలు? ఆసియన్ దేశాల నుంచి వచ్చిన పదిమంది ప్రతినిధులట. వాళ్లను గౌరవించినట్లూ ఉంటుందనీ, రాహుల్ను అవమానించినట్లూ ఉంటుందని ఇలా రాహుల్కి బ్యాక్ సీట్ వేయించిన ట్లున్నారు మోదీ! ఒకటి మాత్రం తేల్లేదు. వాళ్లను గౌరవించడానికి ఈయన్ని అవమానించారా? ఈయన్ని అవమానించడానికి వాళ్లను గౌరవించారా? -
అగ్రికల్చర్ వర్సిటీ విద్యార్థి అదృశ్యం
సాక్షి,హైదరాబాద్: రంగారెడ్డి జిల్లాలోని రాజేంద్రనగర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ విద్యార్థి అదృశ్యమవడం కలకలం రేపుతోంది. యూనివర్సిటీలో చదువుతున్న రాహుల్ నాయక్ అనే విద్యార్థి సోమవారం నుంచి కనిపించడం లేదు. దీంతో తోటి విద్యార్థులు తల్లిదండ్రులకు సమాచారం అందించారు. ప్రాక్టికల్ ఎగ్జామ్స్లో అధ్యాపకులు కావాలనే ఫెయిల్ చేశారని రాహుల్ మనస్థాపం చెందినట్టు తెలుస్తోంది. రాహుల్ అదృశ్యంపై అతని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. -
‘మిస్టర్ తెలంగాణ’ రాహుల్
సాక్షి, హైదరాబాద్: ‘మిస్టర్ తెలంగాణ’ ఓపెన్ బాడీ బిల్డింగ్ చాంపియన్షిప్–2017 పోటీల్లో అల్వాల్కు చెందిన రాహుల్ విజేతగా నిలిచాడు. సుల్తాన్షాహి జీహెచ్ఎంసీ ప్లే గ్రౌండ్లో జరిగిన ఈ పోటీల్లో పలు జిల్లాలకు చెందిన బాడీ బిల్డర్లు బరిలోకి దిగారు. ‘మిస్టర్ తెలంగాణ’ టైటిల్ గెలిచిన రాహుల్కు టోర్నీ చైర్మన్ సుంకరి రంగారావు ట్రోఫీని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ బండారు దత్తాత్రేయ, మాజీ కార్పొరేటర్ పాశం సురేందర్, ట్రాఫిక్ ఏసీపీ రాజ్ కుమార్, టోర్నీ నిర్వాహకులు రషీద్ షరీఫ్, నరేశ్ కుమార్, శివకాంత్, లక్ష్మణ్ రావు పాల్గొన్నారు. -
ధావన్... ధన్ ధనాధన్ కోలుకున్న భారత్
-
తేరుకున్నాం...కానీ!
ఓపెనర్ల శుభారంభంతో భారత్ రెండో ఇన్నింగ్స్లో తేరుకుంది. కానీ కేవలం 49 పరుగుల స్వల్ప ఆధిక్యంలోనే ఉండటంతో ముప్పు మాత్రం తొలగలేదు. ఇంకా 90 ఓవర్లు... మూడు సెషన్లు ఉన్నాయి. ఏమైనా జరగొచ్చు. ‘డ్రా’ కావొచ్చు. ‘డ్రామా’తో ఫలితం తేలొచ్చు. ఈ నేపథ్యంలో టీమిండియా ‘డ్రా’ కోసం పోరాడాలనుకుంటే తొలి సెషన్ను జాగ్రత్తగా ఆడాలి. ఆదమరిస్తే... అనూహ్య డ్రామాతో మ్యాచ్ చేజారే పరిస్థితి కూడా ఉంది. కోల్కతా: భారత ఓపెనర్లు రాహుల్, శిఖర్ ధావన్ ఓపిగ్గా పోరాడారు. ప్రత్యర్థి 122 పరుగుల ఆధిక్యం దృష్ట్యా ప్రతీ షాట్ను జాగ్రత్తగా ఆడారు. తొలి వికెట్కు 166 పరుగులతో శుభారంభమిచ్చారు. ఇక మిగతా భారాన్ని మిడిలార్డర్ మోస్తే టీమిండియా గెలవకపోయినా... ‘డ్రా’ చేసుకొని ఓటమి నుంచి తప్పించుకోవచ్చు. అంతకుముందు నాలుగో రోజు ఆటలో శ్రీలంక తొలి ఇన్నింగ్స్లో 83.4 ఓవర్లలో 294 పరుగుల వద్ద ఆలౌటైంది. హెరాత్ (105 బంతుల్లో 67; 9 ఫోర్లు) లంక ఆధిక్యానికి వెన్నెముకగా నిలిచాడు. తర్వాత రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన భారత్ ఆట నిలిచే సమయానికి 39.3 ఓవర్లలో వికెట్ నష్టానికి 171 పరుగులు చేసింది. శిఖర్ ధావన్ (116 బంతుల్లో 94; 11 ఫోర్లు, 2 సిక్సర్లు), లోకేశ్ రాహుల్ (113 బంతుల్లో 73 బ్యాటింగ్; 8 ఫోర్లు) లంకేయులకు తమ బ్యాటింగ్ ప్రతాపాన్ని చూపారు. సీమర్ల చేతికే... పదికి పది: ఓవర్నైట్ స్కోరు 165/4తో ఆదివారం ఆట కొనసాగించిన లంక... భారత సీమర్ల ధాటికి తొలి సెషన్లో తడబడింది. డిక్వెలా (35; 5 ఫోర్లు), కెప్టెన్ చండిమాల్ (28; 3 ఫోర్లు) జట్టు స్కోరు 200 పరుగులు దాటగానే నిష్క్రమించారు. షనక డకౌటయ్యాడు. దీంతో లంక 201 స్కోరు వద్దే ఏడో వికెట్ను కోల్పోయింది. తర్వాత వచ్చిన టెయిలెండర్లలో హెరాత్ ఒక్కడే పోరాడాడు. లంచ్ తర్వాత కాసేపటికే లంక ఇన్నింగ్స్ ముగిసింది. భువనేశ్వర్, షమీ చెరో 4 వికెట్లు పడగొట్టగా... ఉమేశ్కు 2 వికెట్లు దక్కాయి. 1983 తర్వాత స్వదేశంలో భారత పేస్ బౌలర్లు ఇన్నింగ్స్లో పదికి పది వికెట్లు పడగొట్టడం ఇదే తొలిసారి. ధావన్... ధన్ ధనాధన్: రాహుల్తో కలిసి ధావన్ భారత రెండో ఇన్నింగ్స్ను ధాటిగా ప్రారంభించాడు. ఇద్దరు ఇంచుమించు వన్డేను తలపించే ఇన్నింగ్స్తో అదరగొట్టారు. దీంతో 70/0 స్కోరుతో టీ విరామానికి వెళ్లారు. అనంతరం కూడా తమ ధాటిని కొనసాగించడంతో మొదట రాహుల్ (65 బంతుల్లో 7 ఫోర్లతో), తర్వాత ధావన్ (74 బంతుల్లో 7 ఫోర్లతో) ఫిఫ్టీలు పూర్తి చేసుకున్నారు. శిఖర్ జోరు పెంచడంతో వేగంగా సెంచరీ దిశగా కదిలాడు. కానీ 6 పరుగుల తేడాతో శతకాన్ని చేజార్చుకున్నాడు. దీంతో ఆట నిలిచే సమయానికి రాహుల్తో పుజారా (2 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు. సోమవారం పుజారా బ్యాటింగ్ను కొన సాగిస్తే ఒక టెస్టులో ఐదు రోజులూ బ్యాటింగ్ చేసిన తొమ్మిదో క్రికెటర్గా నిలుస్తాడు. గతంలో భారత్ తరఫున హైదరాబాద్ క్రికెటర్ ఎంఎల్ జయసింహ (కోల్కతాలో ఆస్ట్రేలియాపై 1960లో); రవిశాస్త్రి (కోల్కతాలో ఇంగ్లండ్పై 1984లో) ఈ ఘనత సాధించడం విశేషం. స్కోరు వివరాలు భారత్ తొలి ఇన్నింగ్స్: 172; శ్రీలంక తొలి ఇన్నింగ్స్: సమరవిక్రమ (సి) సాహా (బి) భువనేశ్వర్ 23; కరుణరత్నే ఎల్బీడబ్ల్యూ (బి) భువనేశ్వర్ 8; తిరిమన్నె (సి) కోహ్లి (బి) ఉమేశ్ 51; మాథ్యూస్ (సి) రాహుల్ (బి) ఉమేశ్ 52; చండిమాల్ (సి) సాహా (బి) షమీ 28; డిక్వెలా (సి) కోహ్లి (బి) షమీ 35; షనక ఎల్బీడబ్ల్యూ (బి) భువనేశ్వర్ 0; పెరీరా (సి) సాహా (బి) షమీ 5; హెరాత్ (సి) షమీ (బి) భువనేశ్వర్ 67; లక్మల్ (బి) షమీ 16; గమగే నాటౌట్ 0; ఎక్స్ట్రాలు 9; మొత్తం (83.4 ఓవర్లలో ఆలౌట్) 294. వికెట్ల పతనం: 1–29, 2–34, 3–133, 4–138, 5–200, 6–201, 7–201, 8–244, 9–290, 10–294. బౌలింగ్: భువనేశ్వర్ 27–5–88–4, షమీ 26.3–5–100–4, ఉమేశ్ 20–1–79–2, అశ్విన్ 8–2–13–0, జడేజా 1–0–1–0, కోహ్లి 1.1–0–5–0. భారత్ రెండో ఇన్నింగ్స్: రాహుల్ బ్యాటింగ్ 73; ధావన్ (సి) డిక్వెలా (బి) షనక 94; పుజారా బ్యాటింగ్ 2; ఎక్స్ట్రాలు 2; మొత్తం (39.3 ఓవర్లలో వికెట్ నష్టానికి) 171. వికెట్ల పతనం: 1–166. బౌలింగ్: లక్మల్ 8–0–29–0, గమగే 9–0–47–0, షనక 9.3–1–29–1, పెరీరా 10–1–41–0, హెరాత్ 3–0–25–0. -
ప్రేమ కోసం రషీద్ .. రాహుల్గా మారాడు
చిన్నశంకరంపేట (మెదక్): ప్రియురాలి కోసం ఓ రాజు భాగ్యనగరం నిర్మించారని విన్నాం. ప్రేమ కోసం తాజ్ మహల్ నిర్మించారని చరిత్రలో చూస్తున్నాం. లవ్ జిహాద్ ఆరోపణలనూ గమనిస్తున్నాం. కానీ, ప్రేమించిన అమ్మాయి కోసం మతం మారిన ముస్లిం యువకుడి కథ ఇది. మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం అంబాజిపేట గ్రామానికి చెందిన ఎండీ రషీద్ మండల కేంద్రానికి చెందిన ఓ యువతి ప్రేమించుకున్నారు. విషయం పెద్దలకు తెలిస్తే తమ ప్రేమ పెళ్లికి అడ్డుగా నిలుస్తారని భావించారు. ఎవరికీ తెలియకుండా సికింద్రాబాద్లోని న్యూ బోయిన్పల్లి ఆర్య సమాజ్లో పెళ్లి చేసుకునేందుకు నిర్ణయించుకున్నారు. అక్కడ హిందూ వివాహ చట్టం ప్రకారం పెళ్లి చేయాలంటే ఇద్దరు హిందువులే అయి ఉండాలని చెప్పడంతో రషీద్ మతం మారేందుకు నిర్ణయించుకున్నాడు. తన పేరును రాహుల్గా మార్చుకుని హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లికి సిద్ధపడ్డాడు. ఈ నెల 25న మతం మారడంతోపాటు, పెళ్లి చేసుకున్నాడు. అనంతరం ఆ జంట చిన్న శంకరంపేట పోలీస్లను కలిసి ఇక ముందు తాము తల్లిదండ్రులతో సంబంధం లేకుండా స్వతంత్రంగా జీవిస్తామని, ఇందుకు సహకరించాలని కోరారు. యువకుడు హైదరాబాద్లోని జియో టెలికాం సంస్థలో పనిచేస్తుండగా, అమ్మాయి డీఈడీ చదువుతోంది. -
‘ట్రంప్కు మీ కౌగిలి మరోసారి అవసరం’
న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల పాకిస్తాన్ను పొగడ్తలతో ముంచెత్తడంపై ప్రధాని మోదీని ఉద్దేశిస్తూ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ వ్యంగ్యంగా స్పందించారు. ‘మోదీ గారూ.. త్వరపడండి. చూస్తుంటే ట్రంప్కు మీ కౌగిలి మరోసారి అవసరమైనట్లుంది’ అని ట్వీటర్లో వ్యాఖ్యానించారు. దీంతో పాటు పాక్ను ప్రశంసిస్తూ ట్రంప్ చేసిన ట్వీట్ ఫొటోను కూడా ఈ వ్యాఖ్యలకు జతచేశారు. గతంలో అమెరికా పర్యటన సందర్భంగా మోదీ ట్రంప్ను ఆత్మీయంగా కౌగిలించుకోవడాన్ని గుర్తుచేస్తూ ఈ మేరకు చురకలంటించారు. -
ఐన్స్టీన్నే మించినోడు!
లండన్: బ్రిటన్లో ఓ టీవీ షోలో పాల్గొన్న 12 ఏళ్ల భారత సంతతి బాలుడు ఒక్కరోజులో హీరో అయ్యాడు. చానెల్ 4లో ప్రసారమైన ‘చైల్డ్ జీనియస్’ కార్యక్రమం తొలిరౌండ్లో రాహుల్ అనే బాలుడు 14 ప్రశ్నలకు సరిగా సమాధానమిచ్చి అబ్బురపరిచాడు. వారం పాటు నిర్వహించే ఈ పోటీలో పాల్గొంటున్న 8–12 ఏళ్లున్న 20 మంది బాలల నుంచి ఒకరిని విజేతగా ప్రకటిస్తారు. ఈ వారాంతంలో ఫైనల్ జరుగుతుంది. స్పెల్లింగ్ టెస్ట్లో రాహుల్ పూర్తి మార్కులు పొందగా, జ్ఞాపక శక్తి పరీక్షలో 15 ప్రశ్నల్లో 14 ప్రశ్నలకు సరిగా సమాధానం చెప్పాడు. అతని ఐక్యూ 162గా నిర్ధారించారు. ప్రముఖ శాస్త్రవేత్తలు ఐన్స్టీన్, స్టీఫెన్ హాకింగ్ కన్నా ఇది ఎక్కువ కావడం విశేషం. ప్రపంచంలో అత్యధిక ఐక్యూ కలిగిన వారి క్లబ్ అయిన మెన్సాలో సభ్యుడయ్యేందుకు రాహుల్ అర్హత సాధించాడు. -
నితీశ్ ఓ అవకాశవాది: లాలూ
స్వార్థ, రాజకీయ ప్రయోజనాల కోసమే: రాహుల్ రాంచీ: బిహార్ ముఖ్యమంత్రిగా ఆరోసారి గురువారం ప్రమాణం చేసిన నితీశ్ ఓ అవకాశవాది అని ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ దుయ్యబట్టారు. ఇదంతా బీజేపీ వెన్నుదన్నులతోనే జరిగిందని ఆరోపించారు. బిహార్ తాజా పరిణామాలపై తాము న్యాయపరంగా ముందుకెళ్తామని లాలూ పేర్కొన్నారు. ఒకప్పుడు బీజేపీ వ్యతిరేకిగా నితీశ్ వ్యవహరించడమంతా ఆ రెండు పార్టీలు (జేడీయూ, బీజేపీ) కలిసి ఆడిన డ్రామానేనని అన్నారు. ‘ఆయన ఓ అవకాశవాది. మతవాద శక్తులకు వ్యతిరేకంగా బిహార్ ప్రజలు ఇచ్చిన తీర్పును ఆయన తుంగలో తొక్కారు. 2015 ఎన్నికల్లో సొంత బలంపై గెలవలేనని తెలుసుకుని...అల్పసంఖ్యాక, వెనుకబడిన వర్గాల్లో మా పార్టీకి మంచి పట్టుండటంతో నా సాయం కోరారు. మా అవినీతిని గురించి ప్రశ్నించడానికి ఆయనేమైన సీబీఐ డైరెక్టరా లేక పోలీసు శాఖ డైరెక్టరా?’ అని లాలూ ప్రశ్నించారు. ‘రాష్ట్ర శాసనసభలో మాదే అతిపెద్ద పార్టీ. గవర్నర్ కేసరీనాథ్ త్రిపాఠీ ముందు మమ్మల్ని పిలిచి బలం నిరూపించుకునేందుకు అవకాశం ఇచ్చి ఉండాల్సింది. మేం విఫలమై ఉంటే, జేడీయూను పిలిచి ఉండాల్సింది’ అని లాలూ చెప్పుకొచ్చారు. ఆర్జేడీ అధికార ప్రతినిధి మనోజ్ ఝా మాట్లాడుతూ గవర్నర్ నిర్ణయంపై తాము కోర్టుకు వెళ్తామన్నారు. మళ్లీ మతవాదులతో కలిశారు: రాహుల్ బిహార్లో ప్రస్తుత పరిస్థితులపై కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ మాట్లాడుతూ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసమే నితీశ్ మళ్లీ బీజేపీతో చేతులు కలిపారని అన్నారు. గత మూడు నాలుగు నెలల నుంచే కూటమి నుంచి బయటకు వెళ్లేందుకు నితీశ్ ప్రయత్నిస్తున్నట్లు తమకు సమాచారం ఉందన్నారు. ‘మతవాద వ్యతిరేక పోరాటంలో నితీశ్ మాతో చేతులు కలిపారు. కానీ ఇప్పుడు ఆయన వ్యక్తిగత స్వార్థ, రాజకీయ ప్రయోజనాల కోసం...మేం ఉమ్మడిగా ఎవరిపై పోరాటం జరిపామో వారికి చేరువయ్యారు’ అని రాహుల్ పేర్కొన్నారు. నాపై కక్షతోనే ఇలా చేశారు: తేజస్వి బీజేపీ, జేడీయూలు కలిసి తనపై కక్షగట్టి, తనను మంత్రిపదవి నుంచి తప్పించేందుకే ఇదంతా చేశాయని బిహార్ మాజీ ఉపముఖ్యమంత్రి, లాలూ కొడుకు తేజస్వి ఆరోపించారు. ‘నా మంచి పనితీరు మా మాజీ మిత్రపక్షాన్ని, బీజేపీని ఆందోళనకు గురిచేసింది. నాపై పన్నిన ఈ కుట్ర వారి క్రూరత్వాన్ని బయటపెట్టింది’ అని తేజస్వీ ఓ ట్వీట్లో పేర్కొన్నారు. ‘ఏ మచ్చా లేకుండా నేను ప్రభుత్వంలో అడుగుపెట్టాను. బిహార్ ప్రజలకు మంచి భవిష్యత్తునివ్వాలన్న ఆకాంక్షతో వచ్చాను. అవకాశవాద ప్రత్యర్థిగా జేడీయూని గుర్తించడానికే నేను ఇక్కడకు వచ్చానని అర్థమవుతోంది’ అంటూ మరో ట్వీట్ చేశారు. -
సెమీస్లో రాహుల్ ఓటమి
న్యూఢిల్లీ: రష్యా ఓపెన్ గ్రాండ్ప్రి బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో హైదరాబాద్ ప్లేయర్ చిట్టబోయిన రాహుల్ యాదవ్ సంచలన ప్రదర్శన ముగిసింది. శనివారం జరిగిన పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లో 19 ఏళ్ల రాహుల్ యాదవ్ 11–5, 10–12, 11–7, 6–11, 8–11తో రెండో సీడ్ వ్లాదిమిర్ మల్కోవ్ (రష్యా) చేతిలో పోరాడి ఓడిపోయాడు. పురుషుల డబుల్స్ సెమీస్లో అర్జున్–శ్లోక్ రామచంద్రన్ జంట 3–11, 2–11, 4–11తో ఇవనోవ్–సొజోనోవ్ (రష్యా) జోడీ చేతిలో ఓటమి పాలైంది. -
లాలూకు మద్దతు ఆపండి
రాహుల్కు స్పష్టం చేసిన నితీశ్కుమార్ న్యూఢిల్లీ: అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న లాలూ ప్రసాద్ కుటుంబానికి మద్దతుగా మాట్లాడడం ఆపాలని రాహుల్కి బిహార్ సీఎం నితీశ్ కుమార్ స్పష్టం చేశారు. మహాకూటమి ప్రభుత్వంలో సంక్షోభం నేపథ్యంలో శనివారం ఆయన రాహుల్తో భేటీ అయ్యారు. దోషులుగా తేలిన ప్రజాప్రతినిధులపై అనర్హత వేటును అడ్డుకునేందుకు తెచ్చిన ఆర్డినెన్స్ చించివేయాలని 2013లో రాహుల్ గాంధీ చెప్పిన విషయాన్ని ఈ భేటీలో నితీశ్ గుర్తు చేశారని ఆయన సన్నిహితుడొకరు వెల్లడించారు. తేజస్వీ రాజీనామా చేయాల్సిందేనని నితీశ్ తన నిర్ణయాన్ని స్పష్టం చేశారని చెప్పారు. బిహార్ సీఎంపై విమర్శలతో కాంగ్రెస్ పార్టీ మహాకూటమిలో మరింత గందరగోళం సృష్టించిందని, తేజస్వీ యాదవ్పై కాంగ్రెస్ నాయకత్వం తన వైఖరిని స్పష్టం చేయాలని జేడీయూ వర్గాలు డిమాండ్ చేశాయి. కాగా రాహుల్తో నితీశ్ భేటీ మర్యాదపూర్వకమేనని, తేజస్వీ యాదవ్ పై పార్టీ వైఖరిలో ఎలాంటి మార్పులేదని జేడీయూ ప్రతినిధి అజయ్ అలోక్ చెప్పారు. బిహార్లో సంకీర్ణ కూటమి ప్రభుత్వాన్ని కాపాడేందుకు రాహుల్ గాంధీ ప్రయత్నిస్తున్నారని, నితీశ్తో భేటీలో ఆ అంశంపై చర్చించారని సీనియర్ కాంగ్రెస్ నేత ప్రేమ్చంద్ మిశ్రా పేర్కొన్నారు. లాలూకు మరో షాక్! న్యూఢిల్లీ: బిహార్ మాజీ సీఎంలు లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన సతీమణి రబ్రీదేవికి కల్పిస్తున్న వీవీఐపీ సౌకర్యాన్ని కేంద్రం రద్దు చేసింది. పట్నా విమానాశ్రయంలో లాలు దంపతుల వాహనం నేరుగా విమానాల వద్దకు వెళ్లే సౌకర్యాన్ని కల్పిస్తూ 2009లో అప్పటి యూపీఏ సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై పౌర విమానయానశాఖ స్పందిస్తూ వారికి కల్పి స్తున్న సౌకర్యాన్ని రద్దు చేశామని, దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాల్సిందిగా బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరి టీకి లేఖ రాసింది. -
ప్రిక్వార్టర్స్లో రాహుల్
న్యూఢిల్లీ: రష్యా ఓపెన్ గ్రాండ్ప్రి గోల్డ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో హైదరాబాద్ ప్లేయర్ చిట్టబోయిన రాహుల్ యాదవ్ ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. రష్యాలోని వ్లాదివోస్తోక్ నగరంలో బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో రాహుల్ 11–5, 11–8, 11–5తో కొజి నైతో (జపాన్)పై, రెండో రౌండ్లో 11–2, 11–1, 11–4తో అర్తెమ్ సెర్పియనోవ్ (రష్యా)పై గెలుపొందాడు. హైదరాబాద్కే చెందిన మరో ప్లేయర్ సిరిల్ వర్మ రెండో రౌండ్లో 7–11, 11–5, 5–11, 7–11తో ర్యోటారో మరువో (జపాన్) చేతిలో ఓడిపోయాడు. భారత్కే చెందిన శుభాంకర్, ఆనంద్ పవార్ కూడా ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. రెండో రౌండ్లో ఆనంద్ పవార్ 11–4, 11–6, 11–7తో హెంగ్ లిన్ ఎన్గాన్ (ఇంగ్లండ్)పై, శుభాంకర్ 6–11, 13–11, 11–6, 11–4తో థామస్ (ఫ్రాన్స్)పై గెలిచారు. మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో తెలుగు అమ్మాయి గుమ్మడి వృశాలి 11–7, 11–2, 11–5తో ఎనిమిదో సీడ్ సెనియా ఎవ్జెనోవా (రష్యా)పై విజయం సాధించింది. -
భయపెట్టి నోర్లు మూయిస్తున్నారు!
► జర్నలిస్టులు, అధికారులు వాస్తవాలు చెప్పలేకపోతున్నారు ► మోదీ ప్రభుత్వంపై ధ్వజమెత్తిన రాహుల్ ► బెంగళూరులో నేషనల్ హెరాల్డ్ స్మారక సంచిక విడుదల సాక్షి, బెంగళూరు: దేశంలో జర్నలిస్టులు స్వేచ్ఛగా నిజాలురాసే పరిస్థితి లేదని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ విమర్శించారు. మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం జర్నలిస్టులను, అధికారులను భయపెట్టడంతోపాటు దళితులు, మైనారిటీలను చితగ్గొడుతూ నోరు మూయిస్తోందన్నారు. నేషనల్ హెరాల్డ్ పత్రిక స్థాపించి 70 ఏళ్లు పూర్తయిన సందర్భంగా బెంగళూరులో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో పాల్గొన్న రాహుల్.. ‘సత్యానికుండే గొప్ప శక్తిని అణగదొక్కుతున్నారు. ఎవరైనా నిజం మాట్లాడాలని ప్రయత్నిస్తే వారిని పక్కకు నెట్టేస్తున్నారు. వేల మంది జర్నలిస్టులు వారు రాయాలనుకున్నది రాసే పరిస్థితుల్లేవు’ అని అన్నారు. నేషనల్ హెరాల్డ్లో పనిచేసే పాత్రికేయులకు పూర్తి స్వేచ్ఛ ఉంటుందని.. తప్పు ఎక్కడ జరిగినా ప్రజలు తెలియజేయటంలో వీరిపై ఎవరి ఒత్తిడులూ ఉండవన్నారు. నెహ్రూ స్థాపించిన నేషనల్ హెరాల్డ్ పత్రికను ఇంగ్లీషుతోపాటుగా హిందీ, ఉర్దూ భాషల్లో తీసుకురానున్నట్లు కాంగ్రెస్ సీనియర్ నేత, ఈ పత్రిక డైరెక్టర్లలో ఒకరైన ఆస్కార్ ఫెర్నాండెజ్ తెలిపారు. ఈ సందర్భంగా నేషనల్ హెరాల్డ్ 70 ఏళ్ల స్మారక సంచికను రాహుల్, అన్సారీ తదితరులు విడుదల చేశారు. భారత్లో మీడియా స్వేచ్ఛ అవసరం: అన్సారీ దేశ ప్రజల హక్కులను కాపాడేందుకు భారత మీడియాకు స్వేచ్ఛ అవసరమని ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ ఈ సందర్భంగా పేర్కొన్నారు. మీడియా స్వేచ్ఛతోనే సమాజానికి మేలు జరుగుతుందన్నారు. మీడియా, జర్నలిస్టులపై ఇలాంటి దాడుల వల్ల మీడియా స్వీయనియంత్రణ కోల్పోవాల్సి వస్తుందన్నారు. తాజాగా ఎన్డీటీవీపై సీబీఐ దాడుల నేపథ్యంలో అన్సారీ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. దీక్షిత్కు రాహుల్ మందలింపు ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ను ‘వీధి రౌడీ’ అని సంబోధించిన కాంగ్రెస్ నేత సందీప్ దీక్షిత్ను రాహుల్ తీవ్రంగా మందలించారు. ‘భారత ఆర్మీ దేశం కోసం పనిచేస్తుంది. అలాంటి వ్యవస్థపై రాజకీయ నేతలెవరూ ఎలాంటి వ్యాఖ్యలు చేయరాదన్నారు. ప్రజలు ఆర్మీ చీఫ్కు వ్యతిరేకంగా విమర్శలు చేయొద్దు’ అని రాహుల్ అన్నారు. -
ఆత్మీయ పెన్నిధి!
► ఘనంగా కరుణ జన్మదిన వేడుకలు ► వజ్రోత్సవానికి వెల్లువెత్తిన అభిమానులు ► అభినందనలతో ముంచెత్తిన రాజకీయ నేతలు ► కరుణది ప్రజల వాణి: రాహుల్ ► అవిశ్రాంత నాయకుడు నాన్న : స్టాలిన్ తమిళనాట శనివారం పండగ వాతావరణం నెలకొంది. రాజకీయ కురువృద్ధుడు, డీఎంకే అధినేత కరుణానిధి 94వ జన్మదిన వేడుకలు అంబరాన్నంటాయి. 50 ఏళ్ల రాజకీయ ప్రస్థానాన్ని పురస్కరించుకుని వజ్రోత్సవ సంబరాలు అంగరంగవైభవంగా సాగాయి. చెన్నై రాయపేట వైఎమ్సీఏ మైదానం అభిమానులతో కిక్కిరిసిపోయింది. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన జాతీయ నాయకులు కరుణానిధి సేవలను కొనియాడారు. ఆయన మరిన్ని సేవలు చేయాలని, ఆయురారోగ్యాలతో ఆనందంగా గడపాలని శుభాకాంక్షలు తెలిపారు. ట్విట్టర్లు, ఈమెయిళ్ల ద్వారా దేశం మొత్తం నుంచి 60 లక్షల మంది శుభాభినందనలు తెలిపారు. సాక్షి ప్రతినిధి, చెన్నై: ప్రజావేదికపై కరుణానిధి చేసేది రాజకీయ ప్రసంగాలు కాదు, ప్రపంచం నలుమూలలా ఉన్న తమిళప్రజల వాణిగా అఖిలభారత కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్గాంధీ అభివర్ణించారు. ద్రవిడ మున్నేట్ర కళగం (డీఎంకే) అధ్యక్షుడు కరుణానిధి 94వ జన్మదిన వేడుకలు, 60 ఏళ్లపాటు ఎమ్మెల్యేగా వజ్రోత్సవ వేడుకలు చెన్నై రాయపేట వైఎంసీఏ మైదానంలో శనివారం సాయంత్రం అత్యంత వైభవంగా సాగాయి. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన జాతీయ నాయకులు కరుణానిధిని కీర్తిస్తూ ప్రసంగించారు. రాహుల్ మాట్లాడుతూ శరద్పవార్, నితీష్కుమార్, మమతా బెనర్జీ, స్టాలిన్ వీరి మాటలు, వారివారి రాష్ట్రాల ప్రజల మనోభావాలకు అద్దంపడతాయని అన్నారు. పార్టీలు, సిద్ధాంతాలువేరు కావచ్చు, కానీ తామంతా దేశ ప్రజల సంక్షేమ కోసమే పాటుపడుతున్నామని అన్నారు. కరుణానిధి సైతం ప్రతి క్షణం ప్రజల కోసం ఆలోచిస్తారు, అవన్నీ కల్పనలు కాదు వాస్తవాల కోసం పాటుపడుతున్నారని చెప్పారు. గత 70 ఏళ్లుగా తమిళ భాష ప్రాధాన్యతను దేశవ్యాప్తంగా చాటుతున్నారు. తమిళభాష బలమే దేశ బలమని అన్నారు. దేశంలోసాగుతున్న ఏకపక్ష పాలనకు చరమగీతం పాడేలా భారతదేశం తామంతా సమష్టిగా పోరాడుతాం, పాటుపడతామని అన్నారు. దేశంలోని ప్రతి ఒక్కరి సమస్యకు పరిష్కారం చూపుతామని అన్నారు. సుదీర్ఘ ప్రసంగాలు చేస్తూ మాటలతో ప్రజలను మభ్యపెట్టడం కాదు చేతలతో చూపెట్టాలని ప్రధాని మోదీని అయన ఎద్దేవా చేశారు. ఇంత పెద్ద సభను నిర్వహించిన స్టాలిన్ను అభినందిస్తున్నా, ఒక గొప్ప మనిషి బాధ్యతలను స్టాలిన్ త్వరలో చేపట్టబోతారని చెప్పారు. స్టాలిన్ సరైన బాటలో పయనిస్తున్నారు. ఒకనాడు నేడు కరుణలా స్టాలిన్ గురించి మాట్లాడుకోవడం ఖాయమని అన్నారు. పార్టీ ప్రధాన కార్యదర్శి అన్బళగన్ అధ్యక్షతన, కార్యనిర్వాహక అధ్యక్షులు స్టాలిన్ నేతృత్వంలో జరిగిన సభకు భారీ సంఖ్యలో పార్టీ కార్యకర్తలు, ప్రజలు హాజరై కరుణకు జేజేలు పలికారు. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన జాతీయస్థాయి ప్రతిపక్షనేతలు కరుణానిధి రాజకీయ జీవితాన్ని ప్రస్తావించి కీర్తించారు. ఒక రాజకీయ వేత్తగా 60 ఏళ్లపాటు ఎమ్మెల్యేగా కొనసాగడం ద్వారా తమిళనాడు ప్రజల్లో ఆయనకున్న సముచిత స్థానాన్ని చాటుకుంటున్నారని చెప్పారు. ముఖ్యమంత్రిగా ఐదుసార్లు పనిచేసిన కీర్తి కరుణకు సొంతమని అన్నారు. 94 ఏళ్ల వృద్ధాప్యంలోనూ ఆయనలోని రాజకీయ చతురత, పరిజ్ఞానం, జ్ఞాపకశక్తి ఏ మాత్రం తగ్గలేదని ఆశ్చర్యం వ్యక్తం చేశారు.అయితే అనారోగ్యకారణంగా ఈ వేడుకల్లో మనమధ్య ఆయన లేకపోవడం బాధాకరమన్నారు. ప్రజల ముందుకు కరుణ గళం: స్టాలిన్ తమ అభిమాన నేతను కలుసుకోవాలని పార్టీ కార్యకర్తలు, చూడాలని ప్రజలు ఎంతోకాలంగా తహతహలాడుతున్నారి స్టాలిన్ అన్నారు. త్వరలో ఈ ఆశ తీరుతుంది, కరుణ గళాన్ని వినే అవకాశం ముందుందని చెప్పారు.ప్రజల మేలు గురించి కరుణానిధి ఆలోచనలకు విశ్రాంతి లేదని స్టాలిన్ అన్నారు. రాజకీయాల్లోకి అడుగిడిన నాటి నుంచి ప్రజలకు అంకితమయ్యారని చెప్పారు. రాష్ట్ర రాజకీయాలకు ఆయన ఒక దిక్సూచీ అని అన్నారు. ఆయన ఆశయాలు, లక్ష్యాలను నెరవేర్చడమే ఆయనకు మనమిచ్చే జన్మదిన బహుమతి అని అన్నారు. కరుణకు 60 లక్షల మంది శుభాకాంక్షలు: భారత రాష్ట్రపతి ప్రణబ్ముఖర్జి, ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్, కేరళ గవర్నర్ సదాశివం, తమిళనాడు ఇన్చార్జ్ గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్రావు, జార్ఖండ్ గవర్నర్ ద్రౌపది మూర్ము, ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, కేంద్ర మంత్రి పొన్ రాధాకృష్ణన్, రాష్ట్రీయ జనతాదళ్ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్, కేరళ సీఎం పినరాయ్ విజయన్, పీఎంకే అధినేత రాందాస్, సహా మొత్తం 60 లక్షల మంది కరుణానిధికి శుభాకాంక్షలు అందజేశారు. సోనియా పంపిన సందేశాన్ని కరుణకు చదివి వినిపించారు. డీఎండీకే అధ్యక్షులు విజయకాంత్, వీసీకే అధినేత తిరుమావళవన్, పుదియనీది నిరువణ అధ్యక్షుడు ఏసీ షణ్ముగం, పెరుంతలైవర్ మక్కల్ కట్చి అధ్యక్షులు ఎన్ఆర్ ధనపాళన్, సమత్తువ మక్కల్ కళగ నేత ఏ నారాయణన్, చెంగల్పట్టు ఎమ్మెల్యే వరలక్ష్మి మధుసూదనన్ తన సొంతూరైన అంబూరులో పార్టీ జెండా ఎగురవేసి ప్రజలకు మిఠాయిలు పంచిపెట్టారు. ఎక్కడిక్కడక డీఎంకే అనుబంధ కార్మిక సంఘాలు మిఠాయిలు పంచుకుని సంబరం జరుపుకున్నాయి. తన తండ్రిపై ఎంపీ కనిమొళి కవితను రాసి విడుదల చేశారు. పార్టీ కార్యకర్తలు కరుణ జీవితంపై ఒక డాక్యుమెంటరీ తీశారు. -
దేశంలో ఏకపక్ష పాలన: రాహుల్
సాక్షి ప్రతినిధి, చెన్నై: కోట్లాదిమంది భారతీయులను ఒకే వ్యక్తి తన ఏకపక్ష నిర్ణయాలతో శాసిస్తున్నారని ప్రధానిని ఉద్దేశించి కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ విమర్శించారు. ఎవ్వరికీ చెప్పకుండా తీసుకున్న పెద్దనోట్ల నిర్ణయం దేశాన్ని ఆర్థికంగా తిరోగమనం వైపు నెట్టేసిందని దుయ్యబట్టారు. రాజకీయ కురువృద్ధుడు, డీఎంకే అధ్యక్షుడు కరుణానిధి 94వ జన్మదినంతోపాటు ఆయన ఎమ్మెల్యే అయ్యి 60 ఏళ్లు అయిన సందర్భంగా వజ్రోత్సవాలను శనివారం చెన్నైలో వైభవంగా నిర్వహించారు. అనారోగ్యంతో కరుణానిధి వేడుకకు రాలేదు. ఈ వేడుకలకు రాహుల్తోపాటు బిహార్ ముఖ్యమంత్రి నితీశ్, పుదుచ్చేరి సీఎం నారాయణస్వామి, సీపీఐ, సీపీఎంల ప్రధాన కార్యదర్శులు సురవరం సుధాకర రెడ్డి, సీతారాం ఏచూరి తదితర ప్రముఖులు విచ్చేశారు. ఈ సభలో రాహుల్ మాట్లాడుతూ పెద్ద నోట్ల ఉపసంహరణ నిర్ణయాన్ని ప్రధాని కనీసం ఆర్థికమంత్రికి కూడా చెప్పలేదని, కేవలం ఒకే వ్యక్తి ఆలోచనలతో ఈ దేశం నడుస్తోందని విమర్శించారు. -
ప్రతిష్టాత్మకంగా రాహుల్ సభ
- టీపీసీసీ చీఫ్ ఉత్తమ్కుమార్రెడ్డి పిలుపు - కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరును ఎండగడతాం - పార్టీ శ్రేణుల్లో విశ్వాసం పెంచడానికి ప్రజాగర్జన - పీసీసీ అనుబంధ సంఘాలు, జిల్లాల నేతలతో భేటీ సాక్షి, హైదరాబాద్: మూడేళ్ల కాలంలో కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీఆర్ఎస్ అనుసరించిన ప్రజావ్యతిరేక విధానాలను ఎండగట్టడంతో పాటు పార్టీ శ్రేణుల్లో విశ్వాసాన్ని పెంచడానికి సంగారెడ్డిలో నిర్వహించబోయే తెలంగాణ ప్రజాగర్జనను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని టీపీసీసీ చీఫ్ ఎన్. ఉత్తమ్కుమార్రెడ్డి పిలుపునిచ్చారు. పీసీసీ అనుబంధ సంఘాల అధ్యక్షులు, పలు జిల్లాల పార్టీ ముఖ్యులతో గాంధీభవన్లో మంగళవారం వేర్వేరుగా సమావేశమయ్యారు. ఏఐసీసీ కార్యదర్శి రామచంద్ర కుంతియాతో పాటు పలువురు ముఖ్యనేతలు ఈ సమావేశాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలు, విధానాలపై సంగారెడ్డిలో జరిగే సభలో చార్జిషీట్ ప్రకటిస్తామన్నారు. ఎన్నికల సమయంలో బీజేపీ ఇచ్చిన హామీలైన నల్లధనం తెప్పిస్తామని, ఉద్యోగాలను ఇస్తామని, ఉపాధి కల్పిస్తామని, ధరలను నియంత్రిస్తామని, నోట్ల రద్దు, కార్పొరేట్ సంస్థలకు కొమ్ముగాయడం, రైతులపై నిర్లక్ష్యం, ఆత్మహత్యలు వంటి అంశాలను ప్రజల్లో ఎండగడతామని చెప్పారు. తెలంగాణ ఏర్పాటైన తర్వాత అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన ప్రజావ్యతిరేక విధానాలు, రైతుల ఆత్మహత్యలు, రైతులకు బేడీలు వేయడం, మద్దతుధర ఇవ్వకపోవడం, డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు, కేజీ టు పీజీ ఉచిత విద్య, నిరుద్యోగం, ఫీజుల రీయింబర్స్మెంటు, ధర్నాచౌక్ వంటి అంశాలపై బహిరంగ సభలో ప్రజల ముందు పెడతామని ఉత్తమ్ చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు రెండు లక్షల రుణాలను ఏకకాలంలో మాఫీ చేస్తామన్నారు. నిరుద్యోగులకు నెలకు రూ. మూడు వేల భృతి, పంటలకు మద్దతు ధర, లక్షన్నర ఉద్యోగాలను వెంటనే చేపడతామన్నారు. సంగారెడ్డి వేదిక కాంగ్రెస్ పార్టీకి ఎంతో సెంటిమెంట్ ఉన్న ప్రాంతమని, ఇందిరాగాంధీ ఈ ప్రాంతంలో సమావేశం నిర్వహిస్తే కాంగ్రెస్ పార్టీ బలోపేతమైందని, తిరుగు లేకుండా అధికారంలో ఉందని చెప్పారు. సమావేశంలో అనుబంధ సంఘాల అధ్యక్షులు ఎం.కోదండరెడ్డి, చిత్తరంజన్ దాస్, ఆరేపల్లి మోహన్, అనిల్కుమార్యాదవ్, నేరేళ్ల శారద, కె.జనార్దన్రెడ్డి, ఫకృద్దీన్ తదితరులు పాల్గొన్నారు. మహిళల రిజర్వేషన్లకు మద్దతు చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ల చట్టం తీసుకురావడానికి కాంగ్రెస్ సంపూర్ణ మద్దతునిస్తుందని ఉత్తమ్ ప్రకటించారు. చట్టసభలలో మహిళలకు 33శాతం రిజర్వేషన్లు కావాలంటూ టీపీసీసీ మహిళా విభాగం మంగళవారం ప్రారంభించిన సంతకాల సేకరణలో ఉత్తమ్, కుంతియా తదితరులు సంతకాలు చేశారు. నియోజకవర్గాలవారీగా సమావేశాలు సంగారెడ్డిలో జరగనున్న సమావేశానికి ఏర్పాట్లు, జనసమీకరణపై నియోజకవర్గ సమావేశాలు ఏర్పాటు చేసి చర్చించుకోవాలని ఉత్తమ్కుమార్రెడ్డి సూచించారు. రంగారెడ్డి, మహబూబ్ నగర్, హైదరాబాద్ జిల్లాల ముఖ్య నేతలతో ఆయన సమావేశమయ్యారు. నియోజకవర్గంలోని ప్రతీ పల్లె నుంచి పది మంది తప్పకుండా సమావేశానికి వచ్చేలా చూడాలని, పెద్ద ఎత్తున జన సమీకరణ చేయాలని సూచించారు. ఈ నెల 25న జిల్లాల్లో, 27న అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో సభలను నిర్వహించాలని ఆయన ఆదేశించారు. -
నాలో కాన్ఫిడెన్స్ పెరిగింది
‘‘సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు దర్శకుడు ఓ సస్పెన్స్ ఫ్యాక్టర్ మెయిన్టైన్ చేశాడు. ఆ పాయింట్తో పాటు స్క్రీన్ప్లే నాకు నచ్చింది. ఈ రోజు ప్రేక్షకులు సైతం వీటి గురించి మాట్లాడు తుంటే హ్యాపీగా ఉంది’’ అన్నారు రాహుల్. వేణు మడికంటి దర్శకత్వంలో రాహుల్ హీరోగా తూము ఫణికుమార్, ‘శ్రేయాస్’ శ్రీనివాస్ నిర్మించిన ‘వెంకటాపురం’ శుక్రవారం విడుదలైంది. మౌత్ టాక్ వల్ల సింగిల్ స్క్రీన్స్లో ప్రతి షోకి కలెక్షన్స్ పెరుగుతున్నాయని, మల్టీప్లెక్స్లలో హౌస్ఫుల్స్ అవుతున్నాయన్నారు రాహుల్. ఇంకా ఆయన మాట్లాడుతూ – ‘‘ఇప్పటివరకు రొమాంటిక్ ఫిల్మ్స్, సాఫ్ట్ క్యారెక్టర్స్ చేశా. ‘వెంకటాపురం’కు ముందు ఓ కొత్త జోనర్లో చేయాలని క్లియర్ కట్గా డిసైడయ్యా. ఆ టైమ్లో వేణు ఈ కథ చెప్పారు. అయితే సెకండాఫ్లో నా క్యారెక్టర్ గ్రాఫ్ ఛేంజ్ అయ్యి రివెంజ్ మోడ్లోకి వెళ్తుంది. స్టేషన్లో పోలీసులను కొడతా. జనాలు నన్ను ఆ సీన్స్లో యాక్సెప్ట్ చేస్తారా? లేదా? అనే భయం ఉండేది. అక్కణ్ణుంచి సినిమా పీక్స్లోకి వెళ్లిందని చాలామంది చెప్పారు. ప్రేక్షకుల ప్రశంసలతో భవిష్యత్తులోనూ ఇలాంటి కొత్త కథలు చేయొచ్చనే కాన్ఫిడెన్స్ నాలో పెరిగింది. నేను పదిమందిని కొడితే ప్రేక్షకులు నమ్మాలని సిక్స్ ప్యాక్ చేశా. సినిమా చూసి లక్ష్మీ మంచు, మనోజ్, సాయిధరమ్ తేజ్, సుధీర్బాబు వంటి ప్రముఖులు ఫోన్ చేసి మెచ్చుకున్నారు. ఈ సినిమాతో నాకో కొత్త ఇమేజ్ రావడం హ్యాపీ’’ అన్నారు. -
రాహుల్ని ఆనంద్గానే గుర్తు పెట్టుకుంటారు!
రాహుల్, మహిమా మక్వాన్ జంటగా గుడ్ సినిమా గ్రూప్ పతాకంపై శ్రేయాస్ శ్రీనివాస్, తుము ఫణికుమార్ నిర్మించిన చిత్రం ‘వెంకటాపురం’. మాధికంటి వేణు దర్శకత్వం వహించారు. ఈ నెల 12న సినిమా విడుదల కానుంది. నిర్మాతలు మాట్లాడుతూ –‘‘ఓ యువతి హత్య చుట్టూ కథంతా తిరుగుతుంటుంది. వైజాగ్ నేపథ్యంలో సాగే యూత్పుల్ థ్రిల్లర్ మూవీ. ఈ సినిమా చూసిన తర్వాత ప్రేక్షకులందరూ ‘రాహుల్’ను ఆనంద్గానే గుర్తుపెట్టుకుంటారు. డైరెక్టర్ వేణు టేకింగ్ బాగుంది’’ అని అన్నారు. రాహుల్ మాట్లాడుతూ –‘‘కంటెంట్ను నమ్ముకుని సినిమా తీస్తే కచ్చితంగా విజయం సాధిస్తుంది. మా సినిమా కూడా హిట్ అవుతుందని నమ్ముతున్నాను. ఇందులో మంచి పాత్ర చేశాను’’ అని అన్నారు. -
సస్పెన్స్.. థ్రిల్...
‘‘వెంకటాపురం’ పాటలు బాగున్నాయి. సినిమా కూడా పెద్ద హిట్ అయ్యి వంద రోజులు ఆడాలి. తెలంగాణ కళాకారులు సినిమా ఇండస్ట్రీలో ముందుకు వచ్చి తెలంగాణ వాడీ వేడీ చూపించాలి. హైదరాబాద్లో, తెలంగాణలో ఉండే ఆంధ్రావాళ్లంతా తెలంగాణావాదులే. మనం రెండు రాష్ట్రాలుగా విడిపోయినా, కలిసి మెలిసి ఉండాలి’’ అని తెలంగాణ రాష్ట్ర హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. ‘హ్యాపీడేస్’ ఫేమ్ రాహుల్, మహిమా మక్వాన్ జంటగా వేణు దర్శకత్వంలో గుడ్ సినిమా గ్రూప్ పతాకంపై శ్రేయాస్ శ్రీనివాస్, తుము ఫణికుమార్ నిర్మించిన సస్పెన్స్ థ్రిల్లర్ ‘వెంకటాపురం’. అచ్చు సంగీతం అందించిన ఈ సినిమా బిగ్ సీడీని నాయిని, పాటల సీడీని దర్శకుడు మారుతి విడుదల చేశారు. హీరో శర్వానంద్ మాట్లాడుతూ– ‘‘రాహుల్ నాకు మంచి మిత్రుడు. ఈ చిత్రకథ నాకు తెలుసు. చాలా బాగుంటుంది. అచ్చు పాటలు, రీ–రికార్డింగ్ బాగుంటాయి. తనతో ఎప్పటికైనా ఓ సినిమా చేస్తా’’ అన్నారు. ఇందులో మంచి పాత్ర చేశానని రాహుల్ తెలిపారు. -
సమం... సమం...
⇒ దీటుగా బదులిస్తున్న భారత్ ⇒ తొలి ఇన్నింగ్స్లో 120/1 ⇒ ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ 451 ⇒ ఐదు వికెట్లతో చెలరేగిన జడేజా రెండో రోజు ఆటలో భారత్, ఆస్ట్రేలియా జట్లు సమ ఉజ్జీ ఆటతీరును ప్రదర్శించాయి. పిచ్ కాస్త టర్న్ అయినప్పటికీ ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ అదే నిలకడ.. అదే ఏకాగ్రతను ప్రదర్శించాడు. భారత బౌలర్లపై సంపూర్ణ ఆధిపత్యం చూపుతూ అజేయంగా నిలిచాడు. స్మిత్, మ్యాక్స్వెల్ కలిసి ఐదో వికెట్కు191 పరుగులు జోడించడంతో ఇక భారీ స్కోరు ఖాయమే అనుకున్న తరుణంలో జడేజా జట్టుకు ఆపద్బాంధవుడిలా మారాడు. తన స్పిన్ మ్యాజిక్తో ఆసీస్ భరతం పట్టగా... అటు పేసర్ ఉమేశ్ యాదవ్ కూడా తన పదునైన బంతులతో ప్రత్యర్థిపై ఉచ్చు బిగించడంతో 152 పరుగులు జోడించి ఆసీస్ తమ చివరి ఆరు వికెట్లను కోల్పోయింది. ఇక ఆసీస్కు దీటుగా భారత్ తమ తొలి ఇన్నింగ్స్ను ఆరంభించడంతో జట్టుకు శుభారంభం అందింది. చక్కటి స్ట్రోక్ప్లేతో ఆకట్టుకున్న ఓపెనర్ కేఎల్ రాహుల్ సిరీస్లో తన నాలుగో అర్ధ సెంచరీని సాధించగా మురళీ విజయ్, పుజారా క్రీజులో పాతుకుపోయి మ్యాచ్పై పట్టు బిగించే అవకాశాన్ని కల్పించారు. మూడో రోజు ఆటలో టీమిండియా బ్యాట్స్మెన్ ఏ స్థాయిలో ఆసీస్ బౌలర్లకు బదులిస్తారనేది ఇప్పుడు కీలకంగా మారనుంది. రాంచీ: కెప్టెన్ విరాట్ కోహ్లి గాయం కారణంగా రెండో రోజు కూడా మైదానంలో దిగకపోయినా భారత జట్టు స్ఫూర్తిదాయక ప్రదర్శన కనబర్చింది. రహానే నాయకత్వంలో తొందరగానే ఆసీస్ ఇన్నింగ్స్ను ముగించిన జట్టు, ఆ తర్వాత బ్యాటింగ్లో దీటుగా బదులిచ్చింది. ఫామ్లో ఉన్న ఓపెనర్ కేఎల్ రాహుల్ (102 బంతుల్లో 67; 9 ఫోర్లు) ఈ సిరీస్లో ఆడిన ఐదు ఇన్నింగ్స్లో నాలుగో అర్ధ సెంచరీ సాధించడంతో శుక్రవారం ఆట ముగిసే సమయానికి భారత్ తమ తొలి ఇన్నింగ్స్లో వికెట్ నష్టానికి 120 పరుగులు చేసి మంచి స్థితిలో నిలిచింది. ప్రస్తుతం క్రీజులో మురళీ విజయ్ (112 బంతుల్లో 42 బ్యాటింగ్; 6 ఫోర్లు), చతేశ్వర్ పుజారా (10 బ్యాటింగ్) ఉన్నారు. ఆసీస్కన్నా భారత్ మరో 331 పరుగులు వెనకబడి ఉంది. అంతకుముందు రవీంద్ర జడేజా (5/124) ధాటికి ఆస్ట్రేలియా తమ తొలి ఇన్నింగ్స్లో 137.3 ఓవర్లలో 451 పరుగులకు ఆలౌట్ అయ్యింది. కెప్టెన్ స్టీవ్ స్మిత్ (361 బంతుల్లో 178 నాటౌట్; 17 ఫోర్లు) చివరి వరకు అజేయంగా నిలవగా మ్యాక్స్వెల్ (185 బంతుల్లో 104; 9 ఫోర్లు, 2 సిక్సర్లు) సెంచరీ పూర్తి చేసుకున్నాడు. పేసర్ ఉమేశ్ యాదవ్కు మూడు వికెట్లు దక్కాయి. తొలి సెషన్: జడేజా జోరు 299/4 ఓవర్నైట్ స్కోరుతో ఆసీస్ ఆట ప్రారంభించగా.. తొలి బంతికే బ్యాట్ విరగ్గొట్టుకున్న మ్యాక్స్వెల్ చివరి బంతిని బౌండరీగా మలిచి రెండో రోజు పరుగుల ఖాతా తెరిచాడు. కొద్దిసేపటికే మరో బౌండరీతో మ్యాక్స్ కెరీర్లో తొలి సెంచరీని అందుకున్నాడు. అయితే ఈ సంతోషం ఎంతోసేపు నిలవకుండానే జడేజా వేసిన ఓ అద్భుత బంతికి తను సాహాకు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. దీంతో ఐదో వికెట్కు 191 పరుగుల భారీ భాగస్వామ్యం ముగిసింది. మరోవైపు స్మిత్ మాత్రం ఫోర్లతో స్కోరును పెంచే ప్రయత్నం చేశాడు. వేడ్ (50 బంతుల్లో 37; 6 ఫోర్లు) కూడా నిలకడగా ఆడుతుండడంతో మరో మంచి భాగస్వామ్యం వైపు ఆసీస్ వెళ్లింది. అయితే జడేజా మరోసారి తన స్పిన్ సత్తాను ప్రదర్శించి మూడు బంతుల వ్యవధిలో వేడ్, కమ్మిన్స్ వికెట్లు తీసి ఆసీస్ను దెబ్బతీశాడు. వేడ్తో కలిసి స్మిత్ ఆరో వికెట్కు 64 పరుగులు జత చేశాడు. లంచ్ విరామానికి ముందు ఓవర్లో స్మిత్ 315 బంతుల్లో 150 పరుగులు పూర్తి చేశాడు. ఓవర్లు: 28, పరుగులు: 102, వికెట్లు: 3. రెండో సెషన్: వికెట్లు టపటపా బ్రేక్ తర్వాత కాసేపు స్మిత్, ఒకీఫ్ జోడి భారత బౌలర్ల సహనాన్ని పరీక్షించింది. ముఖ్యంగా ఒకీఫ్ చక్కటి డిఫెన్స్తో స్మిత్కు సహకారం అందించాడు. అయితే ఐదు ఫోర్లు బాదిన తను ఉమేశ్ బౌలింగ్లో ఫైన్ లెగ్లో విజయ్కు క్యాచ్ ఇచ్చాడు. తర్వాతి ఓవర్లోనే జడేజా.. లయన్ను అవుట్ చేసి ఐదు వికెట్లను పూర్తి చేశాడు. మరో రెండు ఓవర్ల అనంతరం హాజల్వుడ్ను జడేజా వికెట్ల వైపు చూడకుండానే మెరుపు వేగంతో రనౌట్ చేయడంతో ఆసీస్ తొలి ఇన్నింగ్స్ ముగిసింది. ఆ తర్వాత భారత్ తొలి ఇన్నింగ్స్ ఆరంభించగా వికెట్ నష్టపోకుండా 20 పరుగులతో టీ విరామానికి వెళ్లింది. ఆసీస్ ఆడిన ఓవర్లు: 18.4, పరుగులు: 49, వికెట్లు: 3 భారత్ ఆడిన ఓవర్లు: 8, పరుగులు: 20, వికెట్: 0. చివరి సెషన్: రాహుల్ దూకుడు బ్రేక్ తర్వాత ఫామ్లో ఉన్న రాహుల్ చక్కటి కవర్ డ్రైవ్లతో బౌండరీలు బాదుతూ స్కోరును పెంచాడు. ఇదే జోరుతో 69 బంతుల్లోనే స్వీప్ షాట్తో ఫోర్ బాది అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మంచి ఆత్మవిశ్వాసాన్ని కనబరుస్తూ సాగుతున్న రాహుల్ జోరును కమ్మిన్స్ అడ్డుకున్నాడు. 31.2 ఓవర్లో తను విసిరిన స్లో బౌన్సర్ను ఆడటంలో విఫలమైన రాహుల్, కీపర్కు క్యాచ్ ఇచ్చాడు. దీంతో తొలి వికెట్కు 91 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ఆ తర్వాత ఓవర్లోనే కెరీర్లో 50వ టెస్టు ఆడుతున్న మురళీ విజయ్ నాలుగు బంతుల వ్యవధిలో మూడు ఫోర్లు బాది ఒత్తిడి పెంచాడు. 39వ ఓవర్లో విజయ్ ఎల్బీ కోసం ఆసీస్ రివ్యూకు వెళ్లినా నిరాశే ఎదురైంది. అయితే భారత్ ఆడిన 40 ఓవర్లలో ఆసీస్ ఒక్క ఎక్స్ట్రా పరుగే ఇవ్వడం విశేషం. ఓవర్లు: 32, పరుగులు: 100, వికెట్: 1. ఉమేశ్ దెబ్బకు బ్యాట్ ముక్కలు! రెండో రోజు ఆటలో మొదటి బంతికే మైదానంలో నవ్వులు పూశాయి. 137కి.మీ వేగంతో ఉమేశ్ సంధించిన బంతిని మ్యాక్స్వెల్ డిఫెన్స్ ఆడాడు. వెంటనే పరుగు కోసం ప్రయత్నించి ముందుకు చూడగా మ్యాక్సీ చేతిలో బ్యాట్ హ్యాండిల్ మాత్రమే ఉంది. ఉమేశ్ వేగానికి బ్యాట్ రెండు ముక్కలైంది. ఈ ఘటనతో మ్యాక్సీ కన్ఫ్యూజ్ అయ్యాడు. దీన్ని గమనించిన ఉమేశ్ వెంటనే సరదాగా నవ్వుతూ తన కండలు ప్రదర్శించాడు. దాంతో మ్యాక్స్వెల్ కూడా నవ్వాపుకోలేకపోయాడు. విరాట్ కోలుకుంటున్నాడు తొలిరోజు ఆటలో మైదానంలో గాయపడిన భారత కెప్టెన్ కోహ్లి వేగంగా కోలుకుంటున్నాడు. అతను రెండోరోజు ఆటలో ఫీల్డ్లో కనిపించకపోయినా... మ్యాచ్కు ముందు జరిగిన వార్మప్లో టీమ్ తో ఉత్సాహంగా పాల్గొన్నాడు. కోచ్ కుంబ్లేతో పాటు ఆటగాళ్లతో సరదాగా ముచ్చటించాడు. మరోవైపు పేసర్ ఉమేశ్యాదవ్ ఈ మ్యాచ్లో విరాట్ బ్యాటింగ్ చేస్తాడని వెల్లడించాడు. ‘కోహ్లి ఫిట్గా ఉన్నాడు. నెట్స్లో అతను ప్రాక్టీస్ చేశాడు కూడా. మ్యాచ్లో అ తను బ్యాటింగ్కు దిగుతాడు’ అని ఉమేశ్ అన్నాడు. ► 3 ఓ టెస్టు సిరీస్లో సెంచరీ లేకుండా నాలుగు అర్ధ సెంచరీలు చేసిన మూడో భారత ఓపెనర్ రాహుల్. ఇంతకుముందు చేతన్ చౌహాన్, సిద్ధూ ఈ జాబితాలో ఉన్నారు. ► 1 భారత గడ్డపై అత్యధి క వ్యక్తిగత స్కోరు చేసిన ఆసీస్ కెప్టెన్గా క్లార్క్ (130)ను అధిగమించిన స్మిత్ (178). ► 8 జడేజా ఇన్నింగ్స్లో 5 వికెట్లు పడగొట్టడం ఇది 8వ సారి. ► 2 మూడు ఫార్మాట్లలో సెంచరీ సాధించిన రెండో ఆసీస్ ఆటగాడిగా (వాట్సన్ తర్వాత) మ్యాక్స్వెల్ నిలిచాడు. -
రాహుల్ ఇమేజ్ పోయింది!
న్యూఢిల్లీ : ఐదు రాష్ట్రాలకు చెందిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు రాహుల్ ఇమేజ్ ను భారీగా దెబ్బతీశాయి. ఐదు రాష్ట్రాల్లో నాలుగు బీజేపీకే వశం కాబోతున్నట్టు వెల్లడికావడంతో, యువరాజుపై ఇన్నిరోజులు కాంగ్రెస్ పెట్టుకున్న ఆశలన్నీ తలకిందులయ్యాయి. ఇక కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా పదవిలో కొనసాగుతున్న రాహుల్ గాంధీ రాజకీయ భవితవ్యం కూడా ప్రశ్నార్థకంగా మారబోతుంది. అన్ని పార్టీలకు ఎంతో కీలకమైన అతిపెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్ లో రాహుల్ గాంధీని ప్రచారంలోకి దించి, కాంగ్రెస్ పెద్ద ప్రయత్నమే చేసింది. కానీ వారి ఆశలన్నింటిన్నీ రాహుల్ ఆవిరిచేయబోతున్నారని వెల్లడైంది. ఒంటరిగా కాకుండా సమాజ్ వాద్ పార్టీలో పొత్తులో బరిలో దిగినప్పటికీ, రాహుల్ ప్రయత్నాలు ఫలించడం లేదు. ముందు నుంచి సీనియర్ లీడర్లు ఉత్తరప్రదేశ్ లో రాహుల్ ప్రచార నాయకత్వంపై అసంతృప్తి వ్యక్తంచేస్తూనే ఉన్నారు. కానీ క్యాంపెయిన్ భారాన్నంతటిన్నీ రాహుల్ తన భుజాలపై వేసుకున్నారు. ఒకవేళ కాంగ్రెస్ సత్తా చాటుతుందని వెల్లడవుతున్న పంజాబ్ రాష్ట్ర గెలుపు క్రెడిట్ కూడా రాహుల్ కు దక్కేలా కనిపించడం లేదు. పంజాబ్ రాష్ట్రంలో విక్టరీ అమరేందర్ సింగ్ ఖాతాల్లోకి వెళ్తుండగా.. ఉత్తరాఖాండ్ విజయం హరీశ్ రావత్ సొంతం కాబోతుందని వెల్లడవుతోంది. కానీ ఏ ఒక్క క్రెడిట్ రాహుల్ కు రాదట. రాహుల్ కు ఇన్నిరోజులు నాయకత్వ బాధ్యతలు అప్పజెప్పకుండా ఉత్తరప్రదేశ్ గెలుపుకోసం ఎదురుచూస్తున్న హైకమాండ్ కూడా ఇక దీనిపై పునరాలించాల్సిన పరిస్థితి వచ్చింది. పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి ఎన్ని అనారోగ్య సమస్యలు వచ్చినప్పటికీ ఆమెనే ప్రెసిడెంట్ గా కొనసాగిస్తూ పార్టీ సీనియర్ లీడర్లందరూ రాహుల్ బలబలాలను నిశీతంగా పరిశీలిస్తూ వస్తున్నారు. అటు రాహుల్ కు ఎన్ని అవకాశాలు ఇచ్చినప్పటికీ, తన బలాన్ని ఆయన నిరూపించుకోలేకపోతున్నారు. 2012 ఉత్తరప్రదేశ్ ఎన్నికల నుంచి ఇటీవల జరిగిన లోకల్ బాడీ ఎన్నికల వరకు రాహుల్ ఫెయిల్ అవుతూనే వస్తున్నాయి. ఈ దెబ్బతో రాహుల్ స్థానంలో ఆయన సోదరి ప్రియాంకకు పార్టీ నాయకత్వ బాధ్యతలు అప్పజెప్పాలని పలువురు భావిస్తున్నట్టు తెలుస్తోంది. తర్వాత వచ్చే లోక్ సభ పోల్ క్యాంపయిన్ కు ప్రియాంకను రంగంలోకి దించాలని కూడా వారు పట్టుబట్టే అవకాశముందట. -
వారిది ‘ప్రజాపతి’ మంత్రం
అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని కాపాడుతున్నారు ♦ కొందరి కోసం.. కొందరి అభివృద్ధికే వారు పనిచేస్తున్నారు ♦ అఖిలేశ్, ఎస్పీ–కాంగ్రెస్లపై ప్రధాని మోదీ విమర్శలు ♦ వారణాసిలో ప్రత్యేక పూజలు చేసిన ప్రధాని జౌన్ పూర్(ఉత్తర్ప్రదేశ్): అత్యాచారం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సమాజ్వాదీ పార్టీ నాయకుడు గాయత్రి ప్రజాపతి విషయంలో యూపీ సీఎం అఖిలేశ్ నిద్రపోతున్నారని ప్రధాని మోదీ మండిపడ్డారు. ప్రజలను హింసించిన వారికి బుద్ది చెప్పే అవకాశం ఓటర్లకు వచ్చిందని, చిత్రహింసలకు గురిచేసిన వారికి పిండప్రదానం చేయాలని పిలుపునిచ్చారు. బీజేపీ మాదిరి ‘అందరి కోసం.. అందరి అభివృద్ధికే..’ నినాదంలా కాకుండా.. ‘ప్రతిపక్షాలు కొందరి కోసం.. కొందరి అభివృద్ధికే..’’అనే నినాదంతో పనిచేస్తున్నాయని విమర్శించారు. దేశంలో మనం ఏదైనా మంచిపని చేసేటప్పుడు లేదా చేసినప్పుడు గాయత్రి మంత్రం పఠిస్తామని, కానీ, ఎస్పీ–కాంగ్రెస్ కూటమి మాత్రం ‘గాయత్రి ప్రజాపతి’ మంత్రాన్ని పఠిస్తోందన్నారు. ప్రజాపతిపై ఓ కేసు నమోదైందని, కానీ సీఎం ఆయన కోసం ప్రచారం చేశారని, అప్పుడు ప్రజాపతి అక్కడికి వచ్చారని, కానీ ఇప్పుడు పోలీసులకు ప్రజాపతి ఎక్కడ ఉన్నారో తెలియడం లేదని చెపుతున్నారని విమర్శించారు. ఓ కూతురు న్యాయం కోసం ఎదురుచూస్తోందని, కానీ సీఎం నిందితునికి కొమ్ముకాస్తున్నారని ఇంతకంటే దౌర్భాగ్యం ఏముంటుందన్నారు. ఓ మంత్రి గేదెలు తప్పిపోతే మాత్రం.. మొత్తం ప్రభుత్వమే వాటి కోసం పరుగులు పెడుతుందని.. అదే న్యాయం కోసం ఓ కూతురు కన్నీరు పెట్టుకుంటున్నా.. ముఖ్యమంత్రి, పోలీసులు నిద్రపోతున్నారని.. ఇలాంటి ప్రభుత్వానికి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పారు. అమేథీలో ఎస్పీ టికెట్పై పోటీచేస్తున్న ప్రజాపతి తరఫున ఇటీవల అఖిలేశ్ ప్రచారం నిర్వహించారు. అయితే ఓ మైనర్ బాలికపై అత్యాచారం.. ఆమె తల్లిపై సామూహిక అత్యాచారం అభియోగాలకు సంబంధించి సుప్రీంకోర్టు ఆదేశాలతో ప్రజాపతిపై కేసు నమోదైన సంగతి తెలిసిందే. అఖిలేశ్ కామ్ బోల్తా హై(పనే మాట్లాడుతుంది) నినాదంపై ప్రధాని స్పందిస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం కార్యకలాపాలపై తాను కొన్ని ఎన్నికల సభల్లో ప్రశ్నించగానే.. దానికి సంబంధించిన సమాచారాన్ని ప్రభుత్వ వెబ్సైట్ల నుంచి తొలగించారని, ఇదేనా మీరు చెప్పే పని మాట్లాడే పద్ధతి అని ప్రశ్నించారు. ఉత్తరప్రదేశ్కు విద్యుత్ ఇస్తామంటే ముఖ్యమంత్రి వద్దన్నారంటూ.. విద్యుత్ విషయంలో ముఖ్యమంత్రి నిజాలే చెపుతున్నారా అని ప్రజలను ప్రశ్నించారు. ‘లక్నో–ఆగ్రా ఎక్స్ప్రెస్వేపై ప్రయాణం చేస్తే.. నేను (మోదీ) ఎస్పీకి ఓటేస్తానని అఖిలేశ్జీ చెప్పారు. కానీ.. జౌన్ పూర్లోని ఖేతాసరాయ్–ఖుతాన్ రోడ్లపై కొత్త మిత్రుడు (రాహుల్)తో కలిసి సైకిల్పై ప్రయాణించండని అఖిలేశ్ను కోరుతున్నా. ఆ తర్వాత ఆయనే ఎస్పీకి ఓటేయరు’ అని ప్రధాని మోదీ విమర్శించారు. మోదీపై కేసు నమోదుచేయండి: కాంగ్రెస్ న్యూఢిల్లీ: ముందస్తు అనుమతి లేకుండా వారణాసిలో రోడ్షో నిర్వహించి ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించిన ప్రధాని మోదీతో పాటు ఇతర బీజేపీ నేతలపై కేసులు నమోదుచేయాలని శనివారం కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సంఘాన్ని(ఈసీ) కోరింది. దీంతో ఈ వ్యవహారానికి సంబంధించి పూర్తి నివేదిక సమర్పించాలని ఈసీ రాష్ట్ర ఎన్నికల అధికారులను ఆదేశించింది. సంబంధిత అధికారుల నుంచి అనుమతి తీసుకోకుండానే ప్రధాని మోదీ వారణాసిలో రోడ్షో నిర్వహించారని కాంగ్రెస్ ఈసీకి చేసిన ఫిర్యాదులో పేర్కొంది. వారణాసిలో మోదీ పూజలు.. వారణాసి: లోక్సభకు తాను ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రముఖ పుణ్యక్షేత్రం వారణాసిలోని కాశీవిశ్వనాథునికి, కాల భైరవునికి ప్రధాని మోదీ ప్రత్యేక పూజలు నిర్వహించారు. శనివారం వారణాసిలో ప్రధాని రోడ్షో నిర్వహించారు. బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం నుంచి ప్రారంభైన ఈ రోడ్షో వారణాసి వీధుల గుండా సాగింది. ఈ రోడ్షోలో ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా హిందూత్వ సిద్ధాంతకర్త మదనమోహన మాలవ్య విగ్రహానికి మోదీ నివాళులర్పించారు. ఆఖరి దశ ఎన్నికలు జరగనున్న వారణాసి ప్రాంతంలో మొత్తం 49 నియోజకవర్గాలు ఉన్నాయి. -
'లయన్' ముందు లేడి కూనల్లా...
►బెంబేలెత్తిన భారత బ్యాట్స్మెన్ ►తొలి ఇన్నింగ్స్లో 189 పరుగులకే ఆలౌట్ ►నాథన్ లయన్కు 8 వికెట్లు ►ఆస్ట్రేలియా 40/0 కోహ్లి మాట తప్పాడు. పుణేలాంటి చెత్త ఆటను మళ్లీ చూపించబోమని హామీ ఇస్తున్నానని చెప్పిన అతను దాదాపు అదే సినిమాను మళ్లీ చూపించాడు. జట్టు పేలవంగా కుప్పకూలడమే కాదు, కోహ్లి కూడా ‘బ్యాట్ ఎత్తేసి’ మరీ ప్రత్యర్థికి దారి చూపించాడు. మిగతా బ్యాట్స్మెన్ తమ కెప్టెన్ను అనుసరించారంతే! పిచ్ తొలి టెస్టులో ఉన్నంత ప్రమాదకరంగా లేదు. బ్యాటింగ్కు స్వర్గధామం కాకపోయినా, మరీ 200 పరుగులు కూడా చేయలేనంత ఘోరంగా కూడా ఏమీ లేదు. కాస్త జాగ్రత్తగా ఆడితే పరుగులు సాధించవచ్చని రాహుల్ చూపిస్తే... మిగతా వారంతా కలిసి రాహుల్ చేసినన్ని పరుగులు కూడా చేయలేదు. గత మ్యాచ్ హీరో ఒకీఫ్ను అతి జాగ్రత్తగా ఎదుర్కోవడంపై మనోళ్లు దృష్టి పెడితే... మనం పట్టించుకోని మరో స్పిన్నర్ లయన్ ఈసారి మన బ్యాట్స్మెన్ పాలిట ‘సింహ’ స్వప్నంలా మారాడు. ఒకదాని తర్వాత మరో వికెట్... ఒక రికార్డు తర్వాత మరో రికార్డు తన ఖాతాలో వేసుకున్న లయన్ వేటకు భారత ఆటగాళ్లు జింకల్లా బెదిరిపోయారు. బోర్డర్–గవాస్కర్ ట్రోఫీని నిలబెట్టుకునేందుకు రెండు సెషన్ల దూరంలో ఉన్నామని స్మిత్ చెబితే కోహ్లి నవ్వేశాడు! కానీ తొలి ఇన్నింగ్స్ను మెరుగ్గా ప్రారంభించి ఆసీస్ ఇప్పటికే పట్టుదలను ప్రదర్శించింది. లయన్ తరహాలోనే రెండో రోజు అశ్విన్ ఆఫ్ స్పిన్ తిరిగితే సరి... లేదంటే ఆదివారం సాయంత్రానికి మ్యాచ్ ఆసీస్ చేతుల్లోకి వచ్చేసినట్లే! బెంగళూరు: భారత బ్యాటింగ్ వ్యథ తీరలేదు. మరో మ్యాచ్లో కూడా మన స్టార్ల ‘స్పిన్’ వేదన అలాగే కొనసాగింది. ఫలితంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్లో తొలి రోజే టీమిండియాకు భంగపాటు ఎదురైంది. ఇక్కడి చిన్నస్వామి స్టేడియంలో శనివారం ప్రారంభమైన ఈ మ్యాచ్లో తొలి ఇన్నింగ్స్లో భారత్ 71.2 ఓవర్లలో 189 పరుగులకే ఆలౌటైంది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్న కోహ్లి సేన దానిని సద్వినియోగం చేసుకోలేకపోయింది. కేఎల్ రాహుల్ (205 బంతుల్లో 90; 9 ఫోర్లు) మినహా అంతా విఫలమయ్యారు. ఆస్ట్రేలియా స్పిన్నర్ నాథన్ లయన్ (8/50) భారత గడ్డపై అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన కనబర్చిన విదేశీ ఆటగాడిగా నిలిచాడు. అనంతరం ఆసీస్ ఆట ముగిసేసరికి వికెట్ నష్టపోకుండా 40 పరుగులు చేసింది. వార్నర్ (23 బ్యాటింగ్), రెన్షా (15 బ్యాటింగ్) క్రీజ్లో ఉన్నారు. సెషన్–1: రాహుల్ నిలకడ భుజం గాయం కారణంగా విజయ్ ఈ మ్యాచ్కు దూరం కాగా... అతని స్థానంలో ముకుంద్ను, జయంత్కు బదులుగా బ్యాట్స్మన్ కరుణ్ నాయర్ను భారత్ తుది జట్టులోకి తీసుకుంది. తొలి ఓవర్లోనే రెండు ఫోర్లు కొట్టి రాహుల్ ధాటిగా ఇన్నింగ్స్ను ప్రారంభించినా, ఆ తర్వాత స్టార్క్, హాజల్వుడ్ చక్కటి బౌలింగ్తో భారత్ను కట్టడి చేశారు. భారత్ ఎదుర్కొన్న తొలి 12 ఓవర్లలో 6 మెయిడిన్లే ఉన్నాయి. ఐదున్నరేళ్ల తర్వాత టెస్టు ఆడే అవకాశం దక్కించుకున్న ముకుంద్ (0) ఆ అవకాశాన్ని ఉపయోగించుకోలేకపోయాడు. 30 పరుగుల వద్ద షార్ట్లెగ్లో కష్టసాధ్యమైన క్యాచ్ను హ్యాండ్స్కోంబ్ వదిలేయడంతో రాహుల్ బతికిపోయాడు. అయితే క్రీజ్లో ఉన్నంతసేపు ఇబ్బంది పడ్డ పుజారా (17) మరోసారి తక్కువ స్కోరు వెనుదిరిగాడు. ఓవర్లు: 27.5, పరుగులు: 72: వికెట్లు: 2 సెషన్–2: కోహ్లి విఫలం లంచ్ తర్వాత 105 బంతుల్లో రాహుల్ అర్ధ సెంచరీ పూర్తయింది. కానీ లయన్ వేసిన బంతికి కోహ్లి (12) వికెట్ల ముందు దొరికిపోవడంతో భారత్కు షాక్ తగిలింది. తడబడుతూనే ఆడిన రహానే (17) కూడా ఎక్కువసేపు నిలవలేక లయన్ బౌలింగ్లో అనూహ్యంగా స్టంపౌ టయ్యాడు. ‘ట్రిపుల్ సెంచరీ’ మ్యాచ్ తర్వాత తిరిగి జట్టులోకి వచ్చిన కరుణ్ నాయర్ (39 బంతుల్లో 26; 3 ఫోర్లు) కొన్ని చక్కటి షాట్లు ఆడినా... ఒకీఫ్ బౌలింగ్లో ముందుకు దూసుకొచ్చే సాహసం చేసి స్టంపౌట్గా వెనుదిరిగాడు. మరో ఎండ్లో పట్టుదలగా నిలబడిన రాహుల్ మాత్రం సమస్య లేకుండా చకచకా పరుగులు చేస్తూ పోయాడు. ఓవర్లు: 31.1, పరుగులు: 96, వికెట్లు: 3 Üషన్–3: టపటపా టీ విరామం తర్వాత భారత బ్యాటింగ్ ఎంతోసేపు సాగలేదు. 14 పరుగుల వ్యవధిలో అశ్విన్ (7), సాహా (1), జడేజా (3) వెనుదిరిగారు. సెంచరీకి చేరువగా వచ్చినా... మరో ఎండ్ నుంచి సహకారం లేకపోవడంతో భారీ షాట్ ఆడే ప్రయత్నంలో రాహుల్ తొమ్మిదో వికెట్గా వెనుదిరిగాడు. మరుసటి బంతికే ఇషాంత్ (0) పని పట్టిన లయన్ భారత్ ఆట కట్టించాడు. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ను వార్నర్, రెన్షా జాగ్రత్తగా ప్రారంభించారు. ఎంత ప్రయత్నించినా భారత్ తొలి రోజు వికెట్ తీయడంలో విఫలమైంది. కొన్ని ఉత్కంఠ క్షణాలు ఎదురైనా ఆసీస్ ఓపెనర్లు ప్రమాదం లేకుండా రోజును ముగించారు. 9 పరుగుల వద్ద ఇషాంత్ బౌలింగ్లో వార్నర్ ఇచ్చిన క్యాచ్ను గల్లీలో రహానే వదిలేయడం ఆట ముగింపు సమయంలో భారత్ను మరింతగా బాధ పెట్టింది. ఓవర్లు: 12.2, పరుగులు: 21, వికెట్లు: 5 (భారత్) ఓవర్లు: 16, పరుగులు: 40, వికెట్లు: 0 (ఆస్ట్రేలియా) కోహ్లి ఆర్ట్ ఆఫ్ ‘లీవింగ్’ కోహ్లి మళ్లీ అదే చేశాడు... పుణే టెస్టులో ఒకీఫ్ బంతిని ఆడకుండా వదిలేసి క్లీన్బౌల్డ్ అయిన అతను ఈసారి లయన్కు అలాగే వికెట్ అందించాడు. నేరుగా వచ్చిన బంతి గమనాన్ని పొరబడి షాట్ ఆడకుండా బ్యాట్ ఎత్తాడు. బంతి ప్యాడ్కు తగలగానే మరో సందేహం లేకుండా అంపైర్ అవుట్గా ప్రకటించేశారు. అంతకుముందు లయన్ బంతులు అనూహ్యంగా టర్న్ కావడం, ఒక బంతి ఎక్కువగా బౌన్స్ అయి అతని ప్యాడ్ పైభాగంలో కూడా తగలడం కూడా జరిగాయి. దాంతో ఇది కూడా టర్న్ కావచ్చని అతను వేసిన అంచనా తప్పింది. పుణే టెస్టులో నేరుగా వెళుతుందనుకున్న ఒకీఫ్ బాల్ టర్న్ కాగా, ఈసారి బాల్ నేరుగా వచ్చింది. ఇలాంటి బంతికి తాను కచ్చితంగా అవుట్ అని కనిపిస్తున్నా కూడా ఆశగా రాహుల్ను సంప్రదించి మరీ కోహ్లి రివ్యూ కోరడం కూడా ఆశ్చర్యకరంగా అనిపించింది. అయితే భారీ స్క్రీన్పై రీప్లే చూపించగానే అంపైర్ నిర్ణయం కోసం కూడా వేచి చూడకుండా కోహ్లి నిష్క్రమించాడు! ఏం మాట్లాడాలో తెలియడం లేదు. ఈ రోజు నేను చాలా అదృష్టవంతుడిని. పిచ్పై కొన్ని చోట్ల ఉన్న పగుళ్ళపై పదే పదే బౌలింగ్ చేశాను. భారత్లో ఎలా బౌలింగ్ చేయాలో దుబాయ్లో బాగా ప్రాక్టీస్ చేశాం. సాధనలో నేను కనీసం 1200 బంతులు విసిరాను. గత మ్యాచ్ తర్వాత మాలో పెరిగిన ఆత్మవిశ్వాసానికి ఇది సూచన. అశ్విన్ వీడియోలను చాలా చూశాను కానీ నాదైన శైలిలోనే బౌలింగ్ చేశాను. ఉపఖండంలో ఎలా బౌలింగ్ చేయాలో లంక స్పిన్నర్ హెరాత్నుంచి నేర్చుకున్న సూచనలు పనికొచ్చాయి. కోహ్లిలాంటి స్టార్ ఆటగాడి వికెట్ తీయడమే నాకు అమిత సంతృప్తినిచ్చిన క్షణం. నాకు తగిన టర్న్ కూడా లభించింది. రెండో ఇన్నింగ్స్లో ఇలాంటి ప్రదర్శనే ఇచ్చి జట్టును గెలిపించాలని కోరుకుంటున్నా. – లయన్, ఆసీస్ బౌలర్ ఆరంభంలో బంతి చక్కగా బ్యాట్పైకి వచ్చింది. ఆ తర్వాత స్పిన్నర్లు రంగంలోకి దిగాకే పరిస్థితి మారింది. అయితే మా జట్టులోనూ అశ్విన్లాంటి అగ్రశ్రేణి బౌలర్ ఉన్నాడు. రెండో రోజు ఆరంభంలో ఒకటి రెండు వికెట్లు తీయగలిగితే ఆ తర్వాత ఆసీస్ను అతను సునాయాసంగా కుప్పకూల్చగలడు. మాకు ఆ నమ్మకముంది. తొలి రోజు జడేజా పెద్దగా బౌలింగ్ చేయలేదు కానీ అతను కూడా ఎడమచేతి వాటం బ్యాట్స్మెన్ ఆఫ్ స్టంప్పై కచ్చితత్వంతో బౌలింగ్ చేయగలిగితే మరిన్ని వికెట్లు లభిస్తాయి. – రాహుల్, భారత బ్యాట్స్మన్ ►1 భారత గడ్డపై ఒక విదేశీ బౌలర్ ఇచ్చిన అత్యుత్తమ ప్రదర్శన లయన్ (8/50)దే. గతంలో క్లూస్నెర్ (8/64) పేరిట ఈ రికార్డు ఉంది. మొత్తంగా ఏ బౌలర్కైనా భారత్లో ఇది నాలుగో అత్యుత్తమ ప్రదర్శన కావడం విశేషం. ► 40 భారత్ వరుసగా మూడు ఇన్నింగ్స్లలో 200 పరుగుల లోపు ఆలౌట్ కావడం 40 ఏళ్ల తర్వాత (1977) ఇదే తొలిసారి. ► 1 భారత్పై అత్యధిక వికెట్లు (58) తీసిన ఆసీస్ బౌలర్గా లయన్ నిలిచాడు. అతను భారత్పై 12 టెస్టులు ఆడగా, ఇన్నింగ్స్లో ఐదు వికెట్లు పడగొట్టడం ఇది నాలుగోసారి. -
ఎవరో ఎవరో ఎదురుగ కలలా..!
ఆగస్టు 28న విశాఖ, భీమిలి బీచ్లో చైత్ర అనే అమ్మాయి శవం పోలీసులకు కనిపిస్తుంది. చైత్రను ఎవరు చంపారు? ఆమె బాయ్ఫ్రెండ్ ఆనందేనా? హత్యకు ముందు ఏం జరిగింది? అనే కథతో రూపొందిన సినిమా ‘వెంకటాపురం’. ‘హ్యాపీడేస్’ ఫేమ్ రాహుల్, మహిమా మక్వాన్ జంటగా వేణు దర్శకత్వంలో ‘శ్రేయాస్’ శ్రీనివాస్, తుము ఫణికుమార్ నిర్మించిన ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఇందులోని ‘ఎవరో ఎవరో ఎదురుగ కలలా.. కలలా..’ అనే మొదటి పాటను ప్రముఖ దర్శకుడు వీవీ వినాయక్ మంగళవారం విడుదల చేశారు. నిర్మాతలు మాట్లాడుతూ – ‘‘ట్రైలర్కు మంచి స్పందన వస్తోంది. ప్రేక్షకుల ఊహకు అందని మలుపులతో ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతుందీ సినిమా. రాహుల్ లుక్, న్యూ మేకోవర్ సినిమాకి స్పెషల్ అట్రాక్షన్గా నిలుస్తుంది’’ అన్నారు. అజయ్, జోగి బ్రదర్స్, శశాంక్ తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమేరా: సాయిప్రకాశ్, సంగీతం: అచ్చు. -
అఖిలేష్ క్లీన్ ఇమేజ్కు ప్రజల్లో ఆదరణ
-
ప్రజలను ఆకర్షిస్తున్న కాంగ్రెస్ 'షోలే' పోస్టర్
-
బాత్రూముల్లోకి తొంగిచూస్తారు
మోదీపై విరుచుకుపడ్డ రాహుల్ ► కనీస ఉమ్మడి కార్యక్రమాన్ని విడుదల చేసిన అఖిలేశ్–రాహుల్ సాక్షి, న్యూఢిల్లీ: మాజీ ప్రధాని మన్మోహన్పై ప్రధాని మోదీ చేసిన ‘రెయిన్ కోట్ షవర్’ వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ ధీటుగా స్పందించారు. మోదీకి ఇతరుల బాత్రూంలోకి తొంగి చూడడం అంటే ఇష్టమని విమర్శించారు. లక్నోలో శనివారం యూపీ సీఎం అఖిలేశ్తో కలసి రెండు పార్టీల కనీస ఉమ్మడి కార్యాచరణ ప్రణాళికను విడుదల చేసే కార్యక్రమంలో రాహుల్ మాట్లాడారు. ‘మోదీకి వారఫలాలు (జ్యోతిష్యం), గూగుల్లో సెర్చ్ చేయటం.. ఖాళీ సమయాల్లో ఇతరుల స్నానపు గదుల్లోకి తొంగిచూడటమే పని’ అని అన్నారు. ‘మోదీకి గూగుల్లో వెతకటమే పని. ఖాళీగా ఉన్నప్పుడు సాయంత్రం.. మోదీని ఈ పన్నులన్నీ చేసుకోమనండి. ప్రధానిగా నిర్వర్తించాల్సిన పని సక్రమంగా చేస్తే చాలు. ఈ ఎన్నికల ఫలితాలతో ఆయన ఖంగుతింటారు’ అని రాహుల్ అన్నారు. ఇద్దరు యువ నాయకుల మధ్య ఏర్పడిన కూటమి యూపీ భవితను మారుస్తుందని.. ‘ఎస్పీ–కాంగ్రెస్ కూటమి’నుద్దేశించి వ్యాఖ్యానించారు. కాగా, ఎస్పీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ .. ఈ ఎన్నికల్లో తొలి ర్యాలీలో ప్రసంగించారు. తమ్ముడు శివ్పాల్ ప్రాతినిధ్యం వహిస్తున్న జశ్వంత్నగర్ నియోజకవర్గంలో జరిగిన ర్యాలీలో పాల్గొన్నారు. తమ్ముడికి ఓటువేయాలని మాత్రమే అభ్యర్థించారు. కనీసం 300 సీట్లలో గెలవాలనే లక్ష్యంతో ఎస్పీ–కాంగ్రెస్ కూటమి 10 పాయింట్లతో కనీస ఉమ్మడి కార్యాచరణను శనివారం లక్నోలో విడుదల చేసింది. అధికారంలోకి వస్తే యువకులకు ఉచిత స్మార్ట్ ఫోన్ . 20 లక్షల మంది నిరుద్యోగులకు నైపుణ్యాభివృద్ధి ద్వారా ఉపాధి, రైతులకు రుణాలనుంచి విముక్తి. తక్కువ ధరకే విద్యుత్తు. పంటలకు సరైన ధర, కోటిమంది పేదల కుటుంబాలకు నెలకు రూ.వెయ్యి పింఛను. పట్టణ పేదలకు రూ.10కే భోజనం, ప్రభుత్వోద్యోగాల్లో మహిళలకు 33 శాతం, పంచాయతీ, స్థానిక ఎన్నికల్లో 50 శాతం రిజర్వేషన్ తదితర పది పాయింట్లతో సీఎంపీని వెల్లడించింది. -
ప్రధాని మోదీని బహిష్కరిస్తాం
కేంద్ర ప్రభుత్వానికి కాంగ్రెస్ హెచ్చరిక ► మన్మోహన్ ను ఉద్దేశించి మోదీ వ్యాఖ్యలపై ఉభయ సభల్లో రభస ► ప్రధాని క్షమాపణకు డిమాండ్ ► మోదీ మూర్ఖుడు, అహంకారి: కాంగ్రెస్ ఎంపీ ఆనంద్ శర్మ ► ప్రధాని పదవి ఔన్నత్యాన్ని మోదీ దిగజార్చారు: రాహుల్ ► కాంగ్రెస్కు క్షమాపణలు కోరే నైతిక హక్కు లేదన్న బీజేపీ ► సోనియా ‘మృత్యు బేహారీ’ విమర్శను గుర్తు చేసిన అమిత్షా న్యూఢిల్లీ: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్పై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ తీవ్రంగా మండిపడింది. ప్రధాని మోదీతోపాటు అధికార బీజేపీపై ఘాటైన విమర్శలు చేసింది. ప్రధాని క్షమాపణలు చెప్పని పక్షంలో బడ్జెట్ సమావేశాల్లో మోదీని బహిష్కరిస్తామని హెచ్చరించింది. మాజీ ప్రధానిపై చేసిన వ్యాఖ్యలపై నిరసన తెలిపేందుకు విపక్షాలన్నింటినీ ఏకతాటిపైకి తీసుకురానున్నట్లు ప్రకటించింది. ‘పార్లమెంటులో మేం ప్రధానిని బహిష్కరిస్తాం. ఆయన మాటలను మేం వినదలచుకోలేదు. అలాగని ప్రధానమంత్రి కార్యాలయం గౌరవమర్యాదలకు భంగం కలిగించకుండానే మా నిరసన కొనసాగిస్తాం. ఆయనో మూర్ఖుడని మాకు తెలుసు. ఓ అహంకారి ప్రధానమంత్రి సీట్లో కూర్చోవటం బాధాకరం’ కాంగ్రెస్ అధికార ప్రతినిధి ఆనంద్ శర్మ ఘాటుగా విమర్శించారు. రాజకీయ చర్చల్లో వినకూడని భాషను మోదీ వాడతారని పేర్కొన్నారు. ప్రధానమంత్రి కార్యాలయం పరువుతీస్తున్నారని.. ఆయనపై వస్తున్న విమర్శలపై మోదీ అసహనంతో ఉన్నారన్నారు. ఎన్నిసార్లు చెప్పినా ఆయన భాష మారటం లేదన్నారు. మన్మోహన్ సింగ్ను, మాజీ ప్రధాని ఇందిర గురించి అవమానకర రీతిలో మాట్లాడారన్నారు. పార్లమెంటు సాక్షిగా భారత రాజ్యాంగాన్ని మోదీ అవమానించటాన్ని సహించేది లేదని శర్మ స్పష్టం చేశారు. ఉభయసభల్లో నిరసన మోదీ వ్యాఖ్యలపై కాంగ్రెస్ గురువారం ఉభయ సభల్లో నిరసనను వ్యక్తం చేసింది. ప్రధాని క్షమాపణకు పట్టుబట్టడంతో రాజ్యసభ పలుమార్లు వాయిదా పడింది. అటు లోక్సభలోనూ జైట్లీ ప్రసంగాన్ని విపక్షం పలుమార్లు అడ్డుకుంది. గురువారం ఉదయం కాంగ్రెస్ పార్టీ.. జేడీయూ, వామపక్షాలు, డీఎంకే, సమాజ్వాదీ పార్టీల నేతలతో వ్యూహాత్మక సమావేశం ఏర్పాటుచేసింది. మలిదశ బడ్జెట్ సమావేశాల్లో తమ వ్యూహాన్ని అమలుచేస్తామని ప్రకటించింది. అటు, ఉత్తరాఖండ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రాహుల్ గాంధీ.. ‘ప్రధాని పదవి ఔన్నత్యాన్ని మోదీ దిగజార్చారు’ అని విమర్శించారు. బీజేపీ ఎదురుదాడి: కాంగ్రెస్ హెచ్చరికలపై బీజేపీ తీవ్రంగా ప్రతిఘటించింది. మోదీ క్షమాపణలు చెప్పాలని కోరే నైతిక హక్కు కాంగ్రెస్కు లేదని, కాంగ్రెస్సే మోదీకి క్షమాపణలు చెప్పాలని బీజేపీ డిమాండ్ చేసింది. ప్రధాని వ్యాఖ్యలు దురదృష్టకరమంటూ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్గాంధీ చేసిన విమర్శలను బీజేపీ చీఫ్ అమిత్షా తిప్పికొట్టారు. మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన్నుద్దేశించి ‘మృత్యు బేహారీ’ అని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ చేసిన వ్యాఖ్యలు గుర్తుచేసుకోవాలని సూచించారు. ‘కాంగ్రెస్కు ఆ హక్కు లేదు’ పార్లమెంట్ కార్యకలాపాలను ప్రతిపక్షా లు అడ్డుకోవడంపై పార్లమెంటరీ వ్యవహా రాల మంత్రి ఎం. వెంకయ్య నాయుడు మండిపడ్డారు. ప్రధానిని క్షమాపణలు కోరే నైతిక హక్కు పత్రిపక్షాలనికి లేదని, గతంలో వారు ప్రధానిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై పార్లమెంట్కు, ప్రధానికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. గతంలో ప్రధానిపై ఆరోపణలు చేసి ఇప్పుడు ప్రవచనాలు చెప్పడం సరికాదని హితవు పలికారు. -
ఆఖరి ఓవర్లో గెలిపించిన ’బుమ్రా’
-
భళా... బుమ్రా
ఆఖరి ఓవర్లో గెలిపించిన పేసర్ ఇంగ్లండ్పై రెండో టి20లో భారత్ గెలుపు రాణించిన రాహుల్, నెహ్రా సిరీస్లో నిలవాలంటే కచ్చితంగా నెగ్గాల్సిన మ్యాచ్లో భారత జట్టు అద్భుత పోరాటాన్ని ప్రదర్శించింది. రాహుల్ మినహా బ్యాట్స్మెన్ విఫలమైన చోట.. బౌలర్లు మాత్రం స్ఫూర్తిదాయక ప్రదర్శనతో జట్టుకు కీలక విజయాన్ని అందించారు. ప్రారంభంలో వరుస బంతుల్లో రెండు వికెట్లు తీసిన నెహ్రా ఇంగ్లండ్ పతనానికి బాట వేయగా... ఆఖరి ఓవర్లో బుమ్రా రెండు వికెట్లు తీసి సూపర్ ఫినిషింగ్ ఇచ్చాడు. నాగ్పూర్: చివరి ఓవర్లో ఇంగ్లండ్ విజయానికి కావాల్సిన పరుగులు 8... క్రీజులో ఉన్నది స్టార్ బ్యాట్స్మన్ జో రూట్తో పాటు బౌండరీలతో జోరు మీదున్న బట్లర్. భారత అభిమాని ఆశలు అడుగంటిన ఈ పరిస్థితిలో మీడియం పేసర్ జస్ప్రీత్ బుమ్రా అద్భుతమే చేశాడు. నాలుగు బంతుల వ్యవధిలో వీరిద్దరిని పెవిలియన్కు పంపించడంతోపాటు కేవలం రెండు పరుగులే ఇవ్వడంతో భారత జట్టు 5 పరుగుల తేడాతో విజయం సాధించింది. వెటరన్ పేసర్ ఆశిష్ నెహ్రా (3/28) కూడా గెలుపులో కీలక పాత్ర పోషించాడు. ఫలితంగా మూడు మ్యాచ్ల టి20 సిరీస్ను భారత్ 1–1తో సమం చేసింది. మూడో టి20 ఫిబ్రవరి 1న బెంగళూరులో జరుగుతుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 144 పరుగులు చేసింది. ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడుతున్న ఓపెనర్ కేఎల్ రాహుల్ (47 బంతుల్లో 71; 6 ఫోర్లు; 2 సిక్సర్లు) సూపర్ ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నాడు. మనీష్ పాండే (26 బంతుల్లో 30; 1 సిక్స్), కోహ్లి (15 బంతుల్లో 21; 2 ఫోర్లు, 1 సిక్స్) మినహా మిగిలిన బ్యాట్స్మెన్ సింగిల్ డిజిట్కే పరిమితమయ్యారు. అనంతరం బ్యాటింగ్కు దిగిన ఇంగ్లండ్ 20 ఓవర్లలో ఆరు వికెట్లకు 139 పరుగులు చేసి ఓడిపోయింది. రాహుల్ ఒక్కడే: టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన భారత్కు మరోసారి శుభారంభం దక్కలేదు. తొలి మూడు ఓవర్లలో ఐదు పరుగులే రాగా... నాలుగో ఓవర్లో కోహ్లి వరుసగా సిక్స్, ఫోర్తో 15 పరుగులు రాబట్టి టచ్లోకి వచ్చాడు. అయితే మరుసటి ఓవర్లో జోర్డాన్ వేసిన స్లో బంతిని లాంగ్ ఆన్లో భారీ షాట్ ఆడి క్యాచ్ అవుటయ్యాడు. కొద్దిసేపటికే రైనా (7), యువరాజ్ (4) కూడా అవుట్ కావడంతో భారత్ 69 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. ఈ దశలో మనీష్ పాండేతో కలిసి ఓపెనర్ రాహుల్ తన జోరును కొనసాగిస్తూ రన్రేట్ పెంచే ప్రయత్నం చేశాడు. అయితే చివరి ఐదు ఓవర్లలో ఇంగ్లండ్ బౌలర్లు 36 పరుగులు ఇచ్చి ఐదు వికెట్లు తీసి భారత్ను కట్టడి చేశారు. నెహ్రా ఝలక్: స్వల్ప లక్ష్యం కోసం బరిలోకి దిగిన ఇంగ్లండ్కు నాలుగో ఓవర్లోనే పేసర్ ఆశిష్ నెహ్రా గట్టి ఝలక్ ఇచ్చాడు. అంతకుముందు ఓవర్లో ఓపెనర్లు బిల్లింగ్స్ (12), రాయ్ (10) చెరో సిక్స్ బాదినా నెహ్రా వీరిద్దరిని వరుస బంతుల్లో పెవిలియన్కు చేర్చాడు. ఈ దశలో రూట్, మోర్గాన్ (17; 1 ఫోర్) పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రయత్నించారు. మిశ్రా వేసిన ఇన్నింగ్స్ తొమ్మిదో ఓవర్లో రూట్ వరుసగా రెండు ఫోర్లు బాదాడు. అయితే తన తర్వాతి ఓవర్ తొలి బంతికే మోర్గాన్ వికెట్ తీసి ఇంగ్లండ్కు షాక్ ఇచ్చాడు. ఆ తర్వాత స్టోక్స్ రెచ్చిపోయి రైనా ఓవర్లో వరుసగా 4, 6.. చాహల్ బౌలింగ్లో మరో సిక్స్తో బ్యాట్ను ఝళిపించాడు. నెహ్రా 17వ ఓవర్లో స్టోక్స్ను ఎల్బీగా అవుట్ చేయగా... 18వ ఓవర్లో బుమ్రా కేవలం మూడు పరుగులు మాత్రమే ఇచ్చి ఇంగ్లండ్ను ఒత్తిడిలోకి నెట్టడంతో పాటు చివరి ఓవర్లో మాయే చేసి అనూహ్య ఫలితాన్ని అందించాడు. -
ఓయూలో జరిగే సభకు రాహుల్
యూపీ ఎన్నికల తర్వాత వచ్చేందుకు సుముఖత: కాంగ్రెస్ సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఉద్యమానికి ఊపిరిగా ఉస్మానియా యూనివర్సిటీలో నిర్వహించబోయే సభకు రాహుల్గాంధీని పీసీసీ నేతలు ఆహ్వానించారు. యూపీ ఎన్ని కల తర్వాత ఓయూలోని విద్యార్థి, యువ జన సభకు హాజరుకావడానికి రాహుల్ కూడా హామీ ఇచ్చినట్టుగా పీసీసీ నేతలు వెల్లడించారు. టీఆర్ఎస్ ఇచ్చిన హామీల అమలులో వైఫల్యాలపై ఇప్పటికే అధ్యయ నం జరుపుతున్న పీసీసీ.. యువకులు, ఉద్యోగులు, రైతులకు చేరువ కావడానికి వర్గాల వారీగా కార్యాచరణకు దిగాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో సమాజంలో ఎక్కువ శాతం ఉండి, ప్రభావవంతమైన యువతను లక్ష్యం చేసుకుని కార్యాచరణకు దిగాలని యోచిస్తోంది. ఓటు హక్కును మొదటిసారి పొందిన యువకుల నుంచి ఉద్యోగాలు పొందడానికి అర్హత ఉన్న 30 ఏళ్ల వయసుదాకా ఉన్నవారి ఓట్లు గత ఎన్నికల్లో కాంగ్రెస్కు పడలేదనే అంచనాకు వచ్చింది. ఇటీవల పీసీసీ నేతల తో సమావేశం సంద ర్భంగా.. యువత ఓట్లు కాంగ్రెస్కు రాకపోవడా నికి కారణాలు ఏమిట ని ఏఐసీసీ ఉపాధ్యక్షు డు రాహుల్గాంధీ ప్రశ్నించినట్టుగా తెలిసిం ది. తెలంగాణ ఏర్పాటైతే ఇంటికో ఉద్యోగం వస్తుందంటూ జరిగిన ప్రచారం కారణంగా టీఆర్ఎస్కు యువకుల ఓట్లు పడ్డాయని రాహుల్కు పీసీసీ నేతలు వివరించినట్టు తెలిసింది. తెలంగాణలో ఇప్పటిదాకా జరిగి న ఉద్యోగాల భర్తీ.. ఎంతమంది రాష్ట్ర యువ కులకు ఉద్యోగాలు వచ్చాయో అధ్యయనం చేసి, ఉద్యోగాల విషయంలో టీఆర్ఎస్ హామీల అమలు వైఫల్యాలపై వాస్తవాలను యువతకు వివరించేలా కార్యాచరణ చేపడ తామని రాహుల్కు పీసీసీ నేతలు చెప్పారు. మరోవైపు ఓయూలో నిర్వహించే సభకే పరిమితం కాకుండా గ్రామ, మండల స్థాయి ల్లోనూ యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో పలు చైతన్య కార్యక్రమాలను నిర్వహించా లని పీసీసీ భావిస్తోంది.