Rahul
-
ఓటీటీకి హ్యాపీ డేస్ హీరో మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
హ్యాపీ డేస్లో నటించిన హీరో రాహుల్ టైసన్, చేతన్ కుమార్, సాక్షి చౌదరి, అమీ ఏల, ఐశ్వర్య రాజ్ నటించిన చిత్రం "100 క్రోర్స్"(100 crores). గతేడాది సెప్టెంబర్ 20న థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమాకు బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. ఎస్ ఎస్ స్టూడియోస్ పతాకంపై దివిజ కార్తీక్, సాయి కార్తీక్ నిర్మించారు. ఈ చిత్రానికి విరాట్ చక్రవర్తి దర్శకత్వం వహించారు.తాజాగా ఈ మూవీ ఓటీటీలో సందడి చేసేందుకు సిద్ధమైంది. ఈనెల 11 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఈ సినిమా ప్రతి సన్నివేశం ఉత్కంఠభరితంగా ఉంటుంది. తర్వాత ఏం జరుగుతుందో ప్రేక్షకులు ఊహించలేరు. ఊహించని మలుపులతో, థ్రిల్లింగ్ యాక్షన్ సీక్వెన్సులతో కథ నడుస్తుంది. 2016లో జరిగిన యథార్థ కథ ఆధారంగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈ సినిమాకు సాయి కార్తీక్ సంగీతాన్ని అందించారు. నేనే నా, కాజల్ కార్తీక, కాళరాత్రి, లిటిల్ హార్ట్స్, టీనెజర్స్, శాకాహారి లాంటి మంచి చిత్రాలని ఆహా ఓటీటీ ద్వారా తెలుగు ప్రేక్షకులకు అందించిన హనుమాన్ మీడియా ఇప్పుడు "100 క్రోర్స్" చిత్రంతో మీ ముందుకు వస్తోంది.ఈ సందర్భంగా హనుమాన్ మీడియా అధినేత బాలు చరణ్ మాట్లాడుతూ..'100 క్రోర్స్ ఒక అద్భుతమైన యాక్షన్ క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్. జనవరి 11న ఆహా లో విడుదలయ్యే ఈ చిత్రం ఓటీటీ ప్రేక్షకులను తప్పకుండా అలరిస్తుంది. అందరూ తప్పక చూడండి. థియేటర్లలో ఈ చిత్రాన్ని మిస్ అయిన వారు, మళ్లీ చూడాలనుకునే వారు ఈ అవకాశాన్ని మిస్ చేసుకోకండి. 100 క్రోర్స్ ఆహాలో సూపర్ హిట్ అవుతుంది" అని తెలిపారు. -
క్రికెట్ జట్టులోకి పుల్వామా అమరవీరుడి కుమారుడు.. సెహ్వాగ్ పోస్ట్ వైరల్
టీమిండియా దిగ్గజ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ ఉద్వేగానికి లోనయ్యాడు. తమ పాఠశాలలో విద్యనభ్యసిస్తున్న రాహుల్ సోరెంగ్ విజయ్ మర్చంట్ ట్రోఫీ ఆడే జట్టుకు ఎంపిక కావడం గర్వంగా ఉందన్నాడు. కాగా రాహుల్ మరెవరో కాదు.. పుల్వామా ఘటనలో నింగికేగిన అమర వీరుడు విజయ్ సోరెంగ్ కుమారుడు.నాడు శోక సంద్రంలోకాగా కశ్మీర్లో 2019లో జరిగిన ఉగ్రదాడిలో నలభై మందికి పైగా భద్రతా బలగాల జవాన్లు అమరులైన విషయం తెలిసిందే. దేశం మొత్తాన్ని శోక సంద్రంలో ముంచిన ఈ ఘటన నేపథ్యంలో వీరూ భాయ్ నాడు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. అదే సమయంలో గొప్ప మనసు కూడా చాటుకున్నాడు.అమర వీరుల పిల్లలకు హర్యానాలోని సెహ్వాగ్ ఇంటర్నేషనల్ స్కూల్లో ఉచితంగా విద్యనందిస్తామని వాగ్దానం చేశాడు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన సైనికులకు తమకు చేతనైంత మేర రుణం తీర్చుకుంటామని పేర్కొన్నాడు. పిల్లలను ప్రయోజకులు చేయడంలో తమ వంతు పాత్ర పోషిస్తామని తెలిపాడు. ఆ హామీని వీరూ భాయ్ నిలబెట్టుకున్నాడు కూడా!సెహ్వాగ్ భావోద్వేగంఇప్పుడు అందుకు తగ్గ ప్రతిఫలం లభించింది. సెహ్వాగ్ స్కూళ్లో చదువుతూనే.. క్రికెట్లోనూ శిక్షణ తీసుకుంటున్న రాహుల్ సోరెంగ్.. హర్యానా అండర్-16 జట్టుకు ఎంపికయ్యాడు. ఈ నేపథ్యంలో హర్షం వ్యక్తం చేసిన వీరేంద్ర సెహ్వాగ్.. ‘‘రాహుల్ సోరెంగ్. ఈ పేరును గుర్తు పెట్టుకోండి.నా జీవితంలోని అత్యంత సంతోషకరమైన క్షణాల్లో ఇదీ ఒకటి. పుల్వామా దాడి వంటి విషాదకర ఘటన తర్వాత.. అమరుల పిల్లలకు సెహ్వాగ్ ఇంటర్నేషనల్ స్కూళ్లో ఉచిత విద్య, ఆవాసం కల్పిస్తానని మాట ఇచ్చాను.పుల్వామా అమరవీరుడు విజయ్ సోరెంగ్ గారి కుమారుడు రాహుల్ సోరెంగ్ 2019లో సెహ్వాగ్ ఇంటర్నేషనల్ స్కూల్లో చేరాడు. నాలుగేళ్లుగామ మాతో ప్రయాణం సాగిస్తున్న రాహుల్.. విజయ్ మర్చంట్ ట్రోఫీ అండర్-16 హర్యానా జట్టుకు ఎంపికయ్యాడు. కొన్ని విషయాలు మనసును రంజింపజేస్తాయి. మన జవాన్లకు ధన్యవాదాలు’’ అని సెహ్వాగ్ ఎక్స్ వేదికగా తన మనసులోని భావాలు పంచుకున్నాడు. చదవండి: D Gukesh: ప్రైజ్మనీలో టాక్స్ మినహాయింపు ఇవ్వండి: లేఖ రాసిన ఎంపీRemember the Name- Rahul Soreng. This is one of the happiest feelings in life. After the tragic Pulwama attack, had made an appeal to offer free education to children of our martyr’s study and stay in my @sehwagschool . I feel so privileged that Rahul Soreng , son of Pulwama… https://t.co/gKvrcyy767 pic.twitter.com/L0Qlc1hh3j— Virender Sehwag (@virendersehwag) December 18, 2024 -
‘ఇండియా’కు ఎవరు బెస్ట్? రాహుల్.. మమత బలాబలాలేమిటి?
న్యూఢిల్లీ: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల అనంతరం ఇండియా కూటమిలో చీలికలు మొదలయ్యాయి. అలాగే ఈ కూటమి నాయకత్వానికి సంబంధించిన చర్చలు జోరుగా సాగుతున్నాయి. ఇదే నేపధ్యంలో ఇండియా కూటమి సారధ్యంపై అటు కాంగ్రెస్, ఇటు టీఎంసీల మధ్య వాగ్వాదం కొనసాగుతోంది.‘ఇండియా’ సారధ్యం ఎవరికి?కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమికి వరుస అపజయాలు ఎదురవుతున్న నేపధ్యంలో ఇప్పుడు కూటమి సారధ్య బాధ్యతలు టీఎంసీ అధినేత మమతా బెనర్జీకి అప్పగించాలనే వాదన వినిపిస్తోంది. దీనికితోడు ఆమె కూడా ప్రతిపక్ష కూటమికి నాయకత్వ బాధ్యతలు వహించాలనే ఆకాంక్షను వ్యక్తం చేశారు. ఇటువంటి తరుణంలో దేశంలోని పలువురు మేధావులు, రాజకీయ పార్టీలు మమతా బెనర్జీవైపు మొగ్గుచూపడం ప్రారంభించారు. ఈ విషయంలో ప్రముఖ నేతలు లాలూ ప్రసాద్ యాదవ్, శరద్ యాదవ్లు మమతకు తమ ఓటు వేశారు.రాహుల్ గాంధీ నాయకత్వ లోపంఅటు హర్యానా, ఇటు మహారాష్ట్రలలో బీజేపీతో జరిగిన ప్రత్యక్ష పోరులో కూటమి ఓటమికి కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ నాయకత్వ లోపమే కారణమంటూ పలువురు ఆరోపిస్తున్నారు. ఇవి తృణమూల్ అధినేత మమతకు ఎక్స్ ఫ్యాక్టర్గా మారుతున్నాయి. ఈ నేపధ్యంలో అటు రాహుల్ గాంధీ, ఇటు మమతా బెనర్జీలలో ఎవరి బలాలు ఏమిటనేది చర్చనీయాంశంగా మారింది.మమతకు పెరుగుతున్న మద్దతుమమతా బెనర్జీకి ఇండియా కూటమి బాధ్యతలు అప్పగించే ప్రయత్నాలు జోరుగా జరుగుతున్నాయనే మాట వినిపిస్తోంది. టీఎంసీ నేతలు కూడా మమతనే కూటమికి తగిన సారధి అంటూ ప్రచారం సాగిస్తున్నారు. మమతా బెనర్జీ ఏడుసార్లు ఎంపీగా, నాలుగుసార్లు కేంద్రమంత్రిగా, మూడుసార్లు సీఎంగా రాజకీయాల్లో అపార అనుభవం సంపాదించారని టీఎంసీ నేతలు, కార్యకర్తలు చెబుతున్నారు. అందుకే ఆమెనే కూటమికి తగిన సారధి అంటూ స్పష్టం చేస్తున్నారు. సుపరిపాలనలో ఆమె రికార్డు అద్భుతంగా ఉందని, గత ఎన్నికల్లో బీజేపీని ఆమె చిత్తుగా ఓడించారని పలువురు విశ్లేషిస్తున్నారు. దేశవ్యాప్తంగా పలువురు నేతలు కూడా కూటమి సారధిగా ఆమె ఉంటేనే అధికార పక్షానికి తగిన సమాధానం చెప్పగలమని అంటున్నారు. అంతేకాకుండా మమత నేతలనందరినీ తన వెంట తీసుకెళ్లగల సామర్థ్యాన్ని కలిగివున్నారని వారు విశ్లేషిస్తున్నారు. ఇండియా కూటమికి అధినేత్రిగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఉండేందుకు మద్దతు పలికిన ప్రతిపక్ష నేతల జాబితాలో రాష్ట్రీయ జనతాదళ్ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్, సమాజ్వాదీ నేతలు అఖిలేష్ యాదవ్, రామ్ గోపాల్ యాదవ్ ఉన్నారు.మమతా బెనర్జీ సత్తా ఇదే..మమతా బెనర్జీ ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. 2011లో తొలిసారిగా ఆమె ముఖ్యమంత్రి అయ్యారు. మూడు సార్లు సీఎంగా ఉన్నారు. ఆమె టీఎంసీ అధినేత్రిగానూ వ్యవహరిస్తున్నారు. 1998లో కాంగ్రెస్ నుంచి విడిపోయి టీఎంసీ అంటే తృణమూల్ కాంగ్రెస్ను స్థాపించారు. మమత పలుమార్లు కేంద్రంలో మంత్రిగా ఉన్నారు. రెండుసార్లు రైల్వే మంత్రిగా ఉన్నారు. బొగ్గు మంత్రిత్వ శాఖ, మానవ వనరుల మంత్రిత్వ శాఖ, మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖలకు కూడా సారధ్యం వహించారు. ఆమె 2011 నుంచి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. మమతా బెనర్జీ ఏడుసార్లు ఎంపీగా ఉన్నారు.రాహుల్ గాంధీ అనుభవంయూపీలోని రాయ్బరేలీ ఎంపీ రాహుల్ గాంధీ ప్రస్తుతం లోక్సభలో ప్రతిపక్ష నేతగా కొనసాగుతున్నారు. మొన్నటి లోక్సభ ఎన్నికల్లో రాహుల్ రాయ్బరేలీ, వయనాడ్ రెండు స్థానాల్లోనూ గెలుపొందారు. అయితే ఆయన తన పార్లమెంటరీ నియోజకవర్గంగా రాయ్బరేలీని ఎంచుకున్నారు. ఆయన సోదరి ప్రియాంక వయనాడ్ ఎంపీగా ఇటీవలే ఎన్నికయ్యారు. రాహుల్ గాంధీ 2017 నుంచి 2019 వరకు కాంగ్రెస్ అధ్యక్షునిగా ఉన్నారు. ఆయన 2004లో క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చారు. అమేథీ నుంచి తొలిసారి ఎంపీగా గెలిచారు. 2009, 2014 ఎన్నికల్లో కూడా అమేథీ నుంచి గెలుపొందారు. 2019లో రాహుల్ గాంధీ అమేథీ స్థానం నుంచి స్మృతి ఇరానీ చేతిలో ఓటమిని చవిచూశారు. 2019లో ఆయన వయనాడ్ ఎంపీగా ఎన్నికయ్యారు. 2024 ఎన్నికల్లో రాయ్బరేలీ నుంచి పోటీ చేసిన ఆయన అక్కడి ఎంపీగా కొనసాగుతున్నారు. రాహుల్ గాంధీ ఒక్కసారి కూడా కేంద్ర మంత్రి కాలేదు.ఇది కూడా చదవండి: నేడు గీతా జయంతి: రూపాయికే భగవద్గీతను అందిస్తూ.. గీతాప్రెస్ వందేళ్ల ఘన చరిత్ర -
ఈడీ డైరెక్టర్గా రాహుల్ నవీన్
న్యూఢిల్లీ: ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) పూర్తికాలపు డైరెక్టర్గా రాహుల్ నవీన్ నియమితులయ్యారు. ఈడీ తాత్కాలిక చీఫ్గా వ్యవహరిస్తున్న ఆయనను బుధవారం పూర్తిస్థాయి డైరెక్టర్గా నియమించారు. నవీన్ ఇండియన్ రెవెన్యూ సరీ్వసు (ఐఆర్ఎస్) 1993 బ్యాచ్.. ఇన్కంట్యాక్స్ కేడర్కు చెందిన అధికారి. రాహుల్ నవీన్ను రెండేళ్ల కాలానికి, లేదా తదుపరి ఆదేశాలు వచ్చేవరకు (ఇందులో ఏది ముందైతే అది వర్తిస్తుంది) ఈడీ డైరెక్టర్గా నియమిస్తున్నట్లు క్యాబినెట్ నియామకాల కమిటీ ఆదేశాలు జారీచేసింది. 57 ఏళ్ల నవీన్ 2019 నవంబరులో స్పెషల్ డైరెక్టర్గా ఈడీలో చేరారు. ఈడీ డైరెక్టర్గా సంజయ్కుమార్ మిశ్రా పదవీకాలం గత ఏడాది సెపె్టంబరు 15న ముగియడంతో.. నవీన్ అప్పటినుండి తాత్కాలిక డైరెక్టర్గా వ్యవహరిస్తున్నారు. అంతర్జాతీయ పన్ను వ్యవహారాల్లో నవీన్ నిపుణులు. తాత్కాలిక డైరెక్టర్గా నవీన్ వ్యవహరించిన కాలంలోనే మనీలాండరింగ్ కేసుల్లో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ల సంచలన అరెస్టులు జరిగాయి. ఐఐటీ ఖరగ్పూర్ నుంచి ఎంటెక్ రాహుల్ నవీన్ బిహార్కు చెందిన వారు. ఐఐటీ ఖరగ్పూర్ నుంచి బీటెక్, ఎంటెక్ చేశారు. మెల్బోర్న్ (ఆ్రస్టేలియా)లోని స్విన్బుర్నే యూనివర్శిటీ ఆఫ్ టెక్నాలజీ నుంచి ఎంబీఏ పూర్తిచేశారు. ఆదాయపు పన్ను శాఖలో 30 ఏళ్లు పనిచేశారు. అంతర్జాతీయ ట్యాకేషన్స్పై నవీన్ రాసిన పలు వ్యాసాలను నాగ్పూర్లోని నేషనల్ అకాడమీ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్లో ట్రైనీ ఐఆర్ఎస్ విద్యార్థులకు పాఠాలుగా బోధిస్తున్నారు. ‘‘ఇన్ఫ్మర్మేషన్ ఎక్చేంజ్ అండ్ ట్యాక్స్ ట్రాన్స్పరెన్సీ: టాక్లింగ్ గ్లోబల్ ట్యాక్స్ ఎవాషన్ అండ్ అవాయిడెన్స్’’ శీర్షినక నవీన్ రాసిన పుస్తకం 2017లో ప్రచురితమైంది. -
తనకంటే చిన్నవాడితో హీరోయిన్ డేటింగ్.. క్లారిటీ ఇచ్చేసిందా?
బాలీవుడ్ భామ శ్రద్ధా కపూర్ గురించి పరిచయం చేయాల్సిన పనిలేదు. తెలుగులో సాహో చిత్రంలో మెప్పించింది. ప్రస్తుతం ఆమె బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉంది. స్ట్రీ-2, చందు ఛాంపియన్ చిత్రాల్లో నటిస్తోంది. గతేడాది తు ఝూథీ మెయిన్ మక్కార్ తన అభిమానులను అలరించింది. ఈ సినిమాలో రణబీర్ కపూర్ సరసన కనిపించింది. అయితే ఈ చిత్రానికి రాహుల్ మోడీ రచయితగా, అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశారు.ఇదిలా ఉండగా.. తాజాగా శ్రద్ధా కపూర్.. అతనితో ఉన్న ఫోటోలను ఇన్స్టా స్టోరీస్లో పంచుకుంది. అవీ కాస్తా వైరల్ కావడంతో ఇంతకీ అతను ఎవరా? అంటూ నెటిజన్స్ తెగ ఆరా తీస్తున్నారు. అయితే తు ఝూథీ మెయిన్ మక్కార్ సినిమా రిలీజ్ తర్వాత వీరిపై డేటింగ్ రూమర్స్ వచ్చాయి. సోషల్ మీడియాలో పెద్దఎత్తున వైరలయ్యాయి. ఈ నేపథ్యంలో తాజా పోస్ట్తో డేటింగ్పై క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ టాపిక్ బీ టౌన్లో హాట్ టాపిక్గా మారింది. కాగా.. రాహుల్ మోడీ ప్యార్ కా పంచ్నామా 2, సోను కే టిటు కి స్వీటీ, ప్యార్ కా పంచ్నామా పలు చిత్రాలకు రచయితగా పనిచేశారు. మరోవైపు అతను శ్రద్ధా కపూర్ కంటే మూడేళ్లు చిన్న అని తెలుస్తోంది. ప్రస్తుతం రాహుల్కు 34 ఏళ్లు కాగా..శ్రద్ధా కపూర్ 37 ఏళ్లు. కొద్దికాలంగా ఈ జంట పలు ఈవెంట్లలో సందడి చేశారు. దీంతో డేటింగ్ రూమర్స్ మరింత ఊపందుకున్నాయి. జామ్నగర్లో అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ బాష్లో శ్రద్ధా, రాహుల్ జంటగా కనిపించారు. -
నేడు రాయ్బరేలీ సీటుపై రాహుల్ కీలక ప్రకటన?
కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తన తల్లి సోనియా, సోదరి ప్రియాంకతో కలిసి నేడు (మంగళవారం) యూపీలోని రాయ్బరేలీకి వస్తున్నారు. ఈ సందర్భంగా జరిగే కార్యక్రమంలో ఆయన పార్టీ నేతలు, కార్యకర్తలు, ఓటర్లకు కృతజ్ఞతలు చెప్పనున్నారు. దీనితోపాటు రాయ్బరేలీ సీటు విషయంలో తన నిర్ణయం వెలిబుచ్చనున్నారని సమాచారం.గాంధీ కుటుంబానికి దశాబ్దాలుగా యూపీలోని అమేథీ, రాయ్బరేలీతో అనుబంధం ఉంది. అందుకే రాయ్బరేలీ ఎంపీగా రాహుల్గాంధీ కొనసాగుతారనే వాదన చాలాకాలంగా వినిపిస్తోంది. రాహుల్ రాయ్బరేలీతో పాటు కేరళలోని వయనాడ్ స్థానం నుంచి కూడా విజయం సాధించారు. ఉత్తరప్రదేశ్లోని 17 స్థానాల్లో కాంగ్రెస్ పోటీ చేసింది. అందులో ఆరుగురు ఎంపీలుగా ఎన్నికయ్యారు. కాంగ్రెస్ ఓటు బ్యాంకు 6.36 శాతం నుంచి 9.46 శాతానికి పెరిగింది. దాదాపు 40 ఏళ్ల తర్వాత ప్రయాగ్రాజ్, సహరాన్పూర్లలో కాంగ్రెస్ ఖాతా తెరిచింది.రాయ్బరేలీలో రాహుల్ గాంధీకి 66.17 శాతం ఓట్లు రాగా, 2019లో సోనియా గాంధీకి ఇదే సీటు నుంచి 55.80 శాతం ఓట్లు వచ్చాయి. 2019లో రాహుల్ గాంధీ అమేథీలో ఓటమిని చవిచూశారు. అయితే ఈసారి గాంధీ కుటుంబానికి సన్నిహుతుడైన కిషోరి లాల్ శర్మ 54.99 శాతం ఓట్లు దక్కించుకున్నారు. ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్ రాయ్బరేలీలో ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తోంది. దీనిలో రాహుల్ తాను రాయ్ బరేలీ ఎంపీగా కొనసాగుతాననే సందేశాన్ని ఇస్తారని పలువురు కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు.భూమా అతిథి గృహంలో జరిగే ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యురాలు సోనియా గాంధీ, రాయ్బరేలీ ఎంపీ రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ, అమేథీ ఎంపీ కేఎల్ శర్మ, రాష్ట్ర అధ్యక్షుడు అజయ్ రాయ్, ఇతర సీనియర్ నేతలు, కార్యకర్తలు పాల్గొననున్నారు. -
రాహుల్ వయనాడ్ వదిలి.. రాయ్బరేలీ ఎంపీ అవుతారా?
2024 లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రెండు స్థానాల్లో పోటీ చేసి, రెండు చోట్లా విజయం సాధించారు. నిబంధనల ప్రకారం ఒక నేత రెండు స్థానాలలో ఎంపీగా ఉండకూడదు. దీంతో రాహుల్ గాంధీ వయనాడ్ సీటును వదులుకుంటారా లేక రాయ్ బరేలీ సీటును వదులుకుంటారా అనే ప్రశ్న అందరిలో తలెత్తుతోంది. అయితే తాజా సమాచారం ప్రకారం ఆయన వయనాడ్ సీటును వదిలి, రాయ్ బరేలీకి ఎంపీగా కొనసాగుతారని తెలుస్తోంది.రాహుల్ గాంధీ కేరళలోని వయనాడ్ లోక్సభ స్థానాన్ని వదిలిపెట్టడానికి కారణం సోనియా గాంధీ అని చెబుతున్నారు. ఎందుకంటే రాయ్బరేలీ సీటు కాంగ్రెస్కు సాంప్రదాయక స్థానం. రాహుల్ గాంధీ తల్లి సోనియా గాంధీ మాజీ పార్లమెంటు స్థానం కూడా ఇదే. గతంలో సోనియా గాంధీ రాయ్బరేలీ ప్రజలను ఉద్దేశిస్తూ ఉద్వేగభరితమైన విజ్ఞప్తి చేశారు.తన జీవితమంతా రాయ్బరేలీ ప్రజల ప్రేమ, ఆశీర్వాదాలతో నడిచిందని, ఒంటరితనాన్ని దూరం చేసిందని పేర్కొన్నారు. తన కుమారుడని రాయ్బరేలీ ప్రజలకు అప్పగిస్తున్నానని, రాహుల్ను మీవాడిగా చూసుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు.కేరళలోని వయనాడ్ లోక్సభ స్థానం నుంచి రాహుల్ గాంధీ వరుసగా రెండోసారి విజయం సాధించారు. లోక్సభ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత రాహుల్ మాట్లాడుతూ తాను రాయ్బరేలీ, వయనాడ్ స్థానాలను గెలుచుకున్నానని, ఈ రెండు లోక్సభ స్థానాల ఓటర్లకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని పేర్కొన్నారు. తాను ఈ రెండు స్థానాలకు ఎంపీని కావాలనుకుంటున్నానని, అయితే ఏదో ఒకటే ఎంపిక చేసుకోవాలని, దీనిపై చర్చించి ఏ సీటును ఎంపిక చేసుకోవాలో నిర్ణయించుకుంటానని రాహుల్ తెలిపారు. -
స్మృతి ఇరానీకి చుక్కలు చూపించిన కేఎల్ శర్మ ఎవరు?
లోక్సభ ఎన్నికల ఫలితాలు సంచలనం రేపుతున్నాయి. యూపీలోని అమేథీ లోక్సభ స్థానం నుంచి పోటీకి దిగిన కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ వెనుకంజలో ఉండటం పలువురిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇక్కడి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన కిషోరి లాల్ శర్మ (కేఎల్ శర్మ) ఓట్ల ఆధిక్యంతో స్మృతీ ఇరానికి చుక్కలు చూపిస్తున్నారు. కాంగ్రెస్ వ్యూహం, దూకుడుతనం, ఎన్నికల ప్రచారం కేఎల్ శర్మకు కలసివచ్చే అంశాలుగా పరిణమించాయని అంటున్నారు. ఈ నేపధ్యంలో కేఎల్ శర్మ బ్యాక్ గ్రౌండ్ ఏమిటో తెలుసుకునేందుకు పలువురు ఆసక్తి చూపిస్తున్నారు.కెఎల్ శర్మకు గాంధీ కుటుంబంతో పాత పరిచయం ఉంది. చాలా కాలంగా రాయ్బరేలీలో ఉంటూ, కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి సలహాదారుగా శర్మ వ్యవహరిస్తున్నారు. పార్టీ కార్యకలాపాల్లో కీలకపాత్ర పోషించే ఆయన గాంధీ కుటుంబపు ఎన్నికల ప్రచారంలోనూ కీలకపాత్ర పోషిస్తుంటారు. కెఎల్ శర్మ రాజీవ్ గాంధీకి కూడా అత్యంత సన్నిహితునిగా పేరొందారు.కేఎల్ శర్మ అమేథీలో 1983, 1991 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ఎంతగానో పాటుపడ్డారు. 1999లో సోనియా గాంధీ మొదటి ఎన్నికల ప్రచారంలో కూడా శర్మ కీలక పాత్ర పోషించారు. ఆయన కృషి కారణంగానే అమేథీలో సోనియా విజయం సాధించారని చెబుతారు. అయితే 2019 లోక్సభ ఎన్నికల్లో రాహుల్ గాంధీని బీజేపీ అభ్యర్థి స్మృతి ఇరానీ ఓడించారు. మరి ఇప్పుడు కెఎల్ శర్మ ఎటువంటి ఫలితాలు రాబడతారనే దానిపై అందరి దృష్టి నెలకొంది. -
ఢిల్లీ మెట్రోలో రాహుల్.. ఫొటో వైరల్
దేశంలో లోక్సభ ఎన్నికలు జరుగుతున్నాయి. ఐదు దశల ఎన్నికలు ఇప్పటికే ముగియగా, ఇంకా మరో రెండు దశల ఎన్నికలు మిగిలివున్నాయి. ఈ క్రమంలో మే 25న ఢిల్లీలో ఆరో దశలో ఎన్నికలు జరగనున్నాయి.ఈ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సామాన్య ప్రజలకు చేరువయ్యేందుకు ఢిల్లీ మెట్రోలో ప్రయాణించారు. రాహుల్ గాంధీ మెట్రోలో ప్రయాణిస్తున్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఢిల్లీ మెట్రోలో ప్రయాణిస్తున్న రాహుల్ గాంధీ సామాన్య ప్రజలతో మమేకమై, వారితో ఫొటోలు కూడా దిగారు. రాహుల్ గాంధీ ఢిల్లీ మెట్రోలో మంగోల్పురిలో జరిగే ర్యాలీకి బయలుదేరారు. ఆయనతో పాటు ఈశాన్య ఢిల్లీ లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థి కన్హయ్య కుమార్ కూడా ఉన్నారు. ఢిల్లీలో మే 25వ తేదీన ఓటింగ్ జరగనుంది. -
‘బీజేపీ చేయలేని పని రాహుల్ చేస్తున్నారు’
లోక్సభ ఎన్నికలు చివరి దశకు చేరుకుంటున్నాయి. ఐదు దశల ఎన్నికల ఓటింగ్ పూర్తియ్యింది. ఇక రెండు దశలు మాత్రమే మిగిలివున్నాయి. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి 400పైగా సీట్లను దక్కించుకుంటామని చెబుతోంది. అదే సమయంలో ఇండియా కూటమి కూడా తాము సాధించే సీట్లపై అంచనాలు వేసుకుంటోంది. ఇదిలా ఉంటే తాజాగా కాంగ్రెస్ పార్టీ మాజీ నేత ఆచార్య ప్రమోద్ కృష్ణం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాహుల్ గాంధీ అందరికన్నా మహనీయుడని వ్యంగ్యంగా అన్నారు.రాహుల్ గాంధీ గొప్ప వ్యక్తి అని, ఆయన దేనికైనా సమాధానం చెప్పగలరని ప్రమోద్ కృష్ణం అన్నారు. మొదటి నుంచి రాహుల్ అన్ని విషయాలను ఎక్కువ చేసి చెబుతారని, అతని గురించి ఏమి చెప్పగలనని ప్రశ్నించారు. రాహుల్ గాంధీకి కృతజ్ఞతలు. నాడు కాంగ్రెస్ను రద్దు చేయాలని మహాత్మా గాంధీ కలలు కన్నారు. అయితే బీజేపీ కూడా ఆ పని చేయలేకపోయింది. ఇప్పుడు రాహుల్ గాంధీ ఆ పని చేస్తున్నారని ప్రమోద్ కృష్ణం పేర్కొన్నారు.కాంగ్రెస్ను నాశనం చేసేందుకు రాహుల్ గాంధీ కంకణం కట్టుకున్నారని ప్రమోద్ కృష్ణం ఆరోపించారు. ఈ విషయంలో రాహుల్ తన బాధ్యతలను చాలా చక్కగా నిర్వర్తిస్తున్నారు. ఈ విషయం దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది కాంగ్రెస్ కార్యకర్తలకు తెలుసు. జూన్ 4 తర్వాత ఇప్పటి వరకు అతి తక్కువ సీట్లు గెలుచుకున్న పార్టీగా కాంగ్రెస్ నిలుస్తుందని ప్రమోద్ కృష్ణం అన్నారు. -
రేపే లోక్సభ ఐదో దశ పోలింగ్.. అందరి చూపు వీళ్లపైనే!
2024 లోక్సభ ఎన్నికల్లో ఐదో దశ పోలింగ్ మే 20న జరగనుంది. ఈ దశలో 8 రాష్ట్రాల్లోని 49 స్థానాలలో ఓటింగ్ జరగనుంది. పలువురు ప్రముఖులు ఈ దశలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ యూపీలోని లక్నో లోక్సభ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. అతనిపై సమాజ్వాదీ పార్టీ రవిదాస్ మెహ్రోత్రాను తమ అభ్యర్థిగా నిలబెట్టింది. మంత్రిగా పనిచేసిన మెహ్రోత్రా ప్రస్తుతం లక్నో సెంట్రల్ అసెంబ్లీ స్థానానికి చెందిన ఎమ్మెల్యేగా ఉన్నారు.రాహుల్ గాంధీ ఉత్తరప్రదేశ్లోని రాయ్బరేలీ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. భారతీయ జనతా పార్టీ ఇక్కడి నుంచి దినేష్ ప్రతాప్ సింగ్ను అభ్యర్థిగా ప్రకటించింది. సోనియా గాంధీ తన కుమారుడు రాహుల్ గాంధీ కోసం తన సీటును వదులుకున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.భారతీయ జనతా పార్టీ కేంద్ర మంత్రి స్మృతి ఇరానీని అమేథీ అభ్యర్థిగా నిలబెట్టింది. ఇక్కడి నుంచి గాంధీ కుటుంబానికి సన్నిహితుడైన కేఎల్ శర్మను కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థిగా నిలబెట్టింది.చిరాగ్ పాశ్వాన్ బీహార్లోని హాజీపూర్ లోక్సభ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. ఈయన ఎన్డీఏ కూటమిలోని ఎల్జేపీ (ఆర్)కి చెందిన నేత. కాగా ఇదే స్థానం నుంచి శివచంద్ర రామ్ను ఆర్జేడీ తమ అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దించింది.ఒమర్ అబ్దుల్లా కాశ్మీర్లోని బారాముల్లా స్థానం నుంచి జమ్ముకశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ తరపున ఎన్నికల బరిలోకి దిగారు. ఒమర్పై మెహబూబా ముఫ్తీ పార్టీ పీడీపీ నుంచి ఫయాజ్ అహ్మద్ పోటీకి దిగారు. గత ఎన్నికల్లో నేషనల్ కాన్ఫరెన్స్ అభ్యర్థి అక్బర్ లోన్ ఈ స్థానంలో విజయం సాధించారు.ఐదో దశ ఎన్నికల పోరులో మోదీ ప్రభుత్వానికి చెందిన పలువురు మంత్రులు రంగంలోకి దిగారు. ముంబై నార్త్ నుండి పీయూష్ గోయల్, మోహన్లాల్గంజ్ నుండి కౌశల్ కిషోర్, లక్నో నుండి రాజ్నాథ్ సింగ్, అమేథీ నుండి స్మృతి ఇరానీ, ఫతేపూర్ నుండి సాధ్వి నిరంజన్ జ్యోతి, దిండోరి నుండి డాక్టర్ భారతీ ప్రవీణ్ పవార్, కోడెర్మా నుండి అన్నపూర్ణా దేవి, భివాండి నుండి కపిల్ పాటిల్ ఈ జాబితాలో ఉన్నారు. -
స్మృతితో రాహుల్ ఎందుకు పోటీ పడలేదు?.. గెహ్లాట్ వివరణ!
ఉత్తరప్రదేశ్లోని అమేథీ నియోజకవర్గం 2024- లోక్సభ ఎన్నికల్లో చర్చనీయాంశంగా మారింది. చాలా ఏళ్లుగా కాంగ్రెస్, రాహుల్ గాంధీలకు కంచుకోటగా ఉన్న ఈ స్థానం ఆ తరువాత బీజేపీకి దక్కింది. ఇక్కడి నుంచి స్మృతి ఇరానీ ఎంపీ అయ్యారు. ఈసారి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తిరిగి అమేథీ నుంచి పోటీ చేయనున్నారనే ప్రచారం గతంలో జోరుగా సాగినా అది కార్యరూపం దాల్చలేదు. కాంగ్రెస్ హైకమాండ్ స్మృతి ఇరానీ ఎదుట కేఎల్ శర్మను తమ అభ్యర్థిగా ప్రకటించింది. రాహుల్ గాంధీకి రాయ్ బరేలీ స్థానాన్ని అప్పగించింది. అదిమొదలు బీజేజీ ప్రతిపక్ష పార్టీపై మాటల దాడి చేస్తూనే ఉంది. స్మృతి ఇరానీపై రాహుల్ గాంధీ ఎన్నికల్లో ఎందుకు పోటీకి దిగలేదంటూ ప్రశ్నిస్తోంది.దీనికి రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత అశోక్ గెహ్లాట్ సమాధానం ఇచ్చారు. కేఎల్ శర్మ 40 ఏళ్లుగా కాంగ్రెస్ కార్యకర్తగా ఉన్నారని, గాంధీ కుటుంబం ఆధ్వర్యంలో పగలు రాత్రి పనిచేసిన శర్మను అమేథీ అభ్యర్థిగా ఎంపిక చేయడంలో తప్పేముంది? రాహుల్ గాంధీనే అమేథీకి ఎందుకు వెళ్లాలని, కేఎల్ శర్మ సరిపోతారని గెహ్లాట్ అన్నారు.రాహుల్ గాంధీని రాయ్బరేలీ నుంచి పోటీ చేయించాలని పార్టీ భావించిందని, అక్కడ రాహుల్ గెలుస్తారని అన్నారు. అమేథీలో కెఎల్ శర్మ విపక్షాలను ఎదుర్కొంటారని పేర్కొన్నారు. శర్మ అటు పార్టీ కోసం ఇటు ప్రజల కోసం పనిచేస్తున్నారని తెలిపారు. సోనియా గాంధీ కూడా శర్మను మెచ్చుకున్నారని, అతనికి అమేథీ ప్రజల సమస్యల గురించి తెలుసని, అక్కడి సమస్యల పరిష్కారానికి ఆయన ఒక ప్రణాళిక రూపొందించారని గెహ్లాట్ వివరించారు. -
వయనాడ్, రాయ్బరేలీ.. గెలిస్తే రాహుల్ దేనిని వదిలేస్తారు?
ఐదో దశ నామినేషన్ల చివరి రోజు వరకు యూపీలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఎక్కడి నుంచి పోటీ చేయనున్నారనే ఉత్కంఠను ఆ పార్టీ కొనసాగించింది. అయితే చివరికి ఆయన రాయ్బరేలీ నుంచి పోటీ చేస్తున్నట్లు పార్టీ వెల్లడించింది. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ మరో సస్పెన్స్కు తెరలేపింది. ఈ లోక్సభ ఎన్నికల్లో ఒకవేళ రాహుల్ అటు కేరళలోని వయనాడ్, ఇటు యూపీలోని రాయ్బరేలీలలో గెలిస్తే ఏ సీటును వదులుకుంటారనే ప్రశ్న ఇప్పుడు అందరిలోనూ మెదులుతోంది.గాంధీ కుటుంబానికి కంచుకోటగా ఉన్న రాయ్బరేలీ నుంచి మే 3న రాహుల్ గాంధీ నామినేషన్ దాఖలు చేశారు. రాహుల్కు ముందు ఆయన తల్లి సోనియా గాంధీ ఈ స్థానానికి వరుసగా 20 ఏళ్ల పాటు ప్రాతినిధ్యం వహించారు. ఇప్పుడు ఆమె రాజ్యసభ సభ్యురాలు. ఇదిలా ఉండగా వయనాడ్, రాయ్బరేలీలలో గెలిస్తే రాహుల్ దేనిని వదిలేస్తారు? అనే ప్రశ్నకు లక్నో యూనివర్శిటీ రాజనీతి శాస్త్ర విభాగాధిపతి ప్రొఫెసర్ సంజయ్ గుప్తా విశ్లేషణ చేశారు.తల్లి రాజకీయ వారసత్వం కోసం రాహుల్ గాంధీ అమేథీని వదిలి, రాయ్బరేలీ నుంచి నామినేషన్ దాఖలు చేశారు. ఈ నిర్ణయం ద్వారా రాహుల్ గాంధీ సురక్షితమైన పందెం ఆడారు. మొదటిది బీజేపీ మహిళా నేత, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీతో పోటీపడితే గతంలో మాదిరిగా పరాభవం ఎదురుకాకుండా చూసుకున్నారు. మరోవైపు తన తల్లి గతంలో పోటీ చేసి, విజయం సాధించిన రాయ్బరేలీ స్థానాన్ని కాపాడుకునే ప్రయత్నం కూడా చేశారు.ఇక వయనాడ్ విషయానికొస్తే ముస్లిం, క్రైస్తవ ఓటర్లు అధికంగా ఉన్న ఈ లోక్సభ స్థానం సురక్షితమని రాహుల్ గాంధీ భావించారు. అలాగే అమేథీలో కన్నా రాయ్బరేలీలో పోటీ చేయడమే సరైనదని రాహుల్ నిర్ణయించుకున్నారు. 2019 లోక్సభ ఎన్నికల్లో వయనాడ్లో రాహుల్కు 7 లక్షల 6,000 ఓట్లు వచ్చాయి. ఆయన ప్రత్యర్థికి కేవలం రెండు లక్షల నాలుగు వేల ఓట్లు మాత్రమే దక్కాయి.అయితే ఈసారి వయనాడ్లో పరిస్థితులు మారాయి. రాష్ట్రంలోని అధికార వామపక్ష కూటమి ఈసారి అభ్యర్థిని మార్చింది. ఈసారి బీజేపీ ప్రధాన కార్యదర్శి డి.రాజా భార్య అన్నే రాజాపై రాహుల్ ఎన్నికల బరిలోకి దిగారు. గతంలో మాదిరిగానే ఈసారి కూడా రాహుల్కు ఇండియన్ ముస్లిం లీగ్ మద్దతు ఉంది. అయితే ఇక్కడ బీజేపీ కూడా తన సత్తాను చాటుకునే ప్రయత్నంలో ఉంది. ఒకవేళ రాహుల్ అటు వయనాడ్, ఇటు రాయ్బరేలీ రెండింటిలో గెలిస్తే రాయ్బరేలీని వదులుకుని, వయనాడ్కు ప్రాతినిధ్యం వహించే అవకాశాలున్నాయని ప్రొఫెసర్ సంజయ్ గుప్తా అన్నారు. అయితే అటువంటి సందర్భం ఏర్పడినప్పుడు రాయ్బరేలీకి జరిగే ఉప ఎన్నికలో రాహుల్ సోదరి ప్రియాంక పోటీ చేసి, గాంధీ కుటుంబపు కంచుకోటకు కాపాడే ప్రయత్నిం చేస్తారని ఆయన తన అభిప్రాయం తెలిపారు. -
రాయ్బరేలీలో రాహుల్కు దినేష్ పోటీనివ్వగలరా?
ఎట్టకేలకు రాయ్బరేలీ కాంగ్రెస్ అభ్యర్థి ఎవరనేది తేలిపోయింది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇక్కడి నుంచి బీజేపీ అభ్యర్థి దినేష్ ప్రతాప్ సింగ్పై పోటీకి దిగారు. మరి దినేష్.. రాహుల్కు తగిన పోటీని ఇవ్వగలరా? బీజేపీ అభ్యర్థి బ్యాక్గ్రౌండ్ ఏమిటి?ఉత్తరప్రదేశ్లోని రాయ్బరేలీని గాంధీ కుటుంబానికి కంచుకోటగా పరిగణిస్తుంటారు. ఈసారి ఇక్కడ నుంచి ఎన్నికల్లో పోటీ చేసేందుకు సోనియా గాంధీ నిరాకరించారు. దీంతో ఆమె కుమారుడు రాహుల్ గాంధీ రాయ్బరేలీ నుంచి పోటీకి దిగారు. ఇదే స్థానం నుంచి బీజేపీ తన అభ్యర్థిగా దినేష్ ప్రతాప్ సింగ్ను బరిలో నిలిపింది.2018లో దినేష్ కాంగ్రెస్ను వీడి బీజేపీలో చేరారు. ఆ మరుసటి ఏడాది ఆయనకు బీజేపీ లోక్సభ టిక్కెట్ ఇచ్చింది. 2019 లోక్సభ ఎన్నికల్లో సోనియా గాంధీపై దినేష్ ప్రతాప్ సింగ్ పోటీ చేశారు. అయితే సోనియా గాంధీ 1,67,178 ఓట్లతో విజయం సాధించారు. ప్రస్తుతం యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వంలో ఎమ్మెల్సీ దినేష్ ప్రతాప్ సింగ్ రాష్ట్ర మంత్రిగా ఉన్నారు. రాయ్బరేలీ రాజకీయాలలో పంచవటి వర్గం ఆధిపత్యం చెలాయిస్తుంది. దినేష్ పంచవటి వర్గానికి చెందినవారు. ఆయన గుణవర్ కమంగల్పూర్ గ్రామ నివాసి.రాయ్బరేలీ రాజకీయాలలో దినేష్ కుటుంబానికి ఆదరణ ఉంది. ఒకప్పుడు ఆయన సోనియా గాంధీకి అత్యంత సన్నిహితునిగా పేరొందారు. 2010లో తొలిసారిగా, 2016లో రెండోసారి కాంగ్రెస్ నుంచి దినేష్ ప్రతాప్ సింగ్ ఎమ్మెల్సీ అయ్యారు. 2018లో కాంగ్రెస్ను వీడి, బీజేపీలో చేరారు. మరి ఈ లోక్సభ ఎన్నికల్లో బీజేపీ నేత దినేష్ కాంగ్రెస్కు ఎంతవరకూ పోటీనివ్వగలరో వేచిచూడాలి. -
నేడు అమేథీలో స్మృతి ఇరానీ నామినేషన్
ఈరోజు (ఆదివారం) భారతీయ జనతా పార్టీ(బీజేపీ) మహిళా నేత స్మృతి ఇరానీ యూపీలోని అమేథీ లోక్సభ స్థానానికి తన నామినేషన్ దాఖలు చేయనున్నారు. దీనికి ముందు ఆమె అయోధ్యలోని రామ్లల్లాను దర్శించుకోనున్నారు. అనంతరం ఆమె తన లోక్సభ నియోజకవర్గానికి వెళ్లి నామినేషన్ పత్రాలను దాఖలు చేయనున్నారు. మే 20న అమేథీలో ఐదో దశలో ఓటింగ్ జరగనుంది. అభ్యర్థుల నామినేషన్ ప్రక్రియ శుక్రవారం (ఏప్రిల్ 26) ప్రారంభమైంది. ఐదో దశలో మొత్తం 49 స్థానాలకు పోలింగ్ జరగనుంది.అమేథీలో నామినేషన్కు చివరి తేదీ మే 3. దీంతో కాంగ్రెస్కు ఈ సీటు నుంచి పోటీచేయబోయే అభ్యర్థిని ప్రకటించడానికి ఎక్కువ సమయం లేదు. కాంగ్రెస్ పార్టీ అమేథీలో తన అభ్యర్థిని ఇంకా నిర్ణయించలేదు. అయితే రాహుల్ గాంధీ ఈ స్థానం నుండి మరోసారి పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అమేథీ నియోజకవర్గం చాలాకాలంపాటు గాంధీ కుటుంబం ఆధీనంలో ఉంది. అయితే 2019లో రాహుల్ను ఓడించడం ద్వారా స్మృతి ఇరానీ ఇక్కడ కాంగ్రెస్ ఆధిపత్యానికి స్వస్తి పలికారు. అయితే ఇప్పుడు స్మృతిని ఓడించి, కాంగ్రెస్ కోల్పోయిన స్థానాన్ని తిరిగి పొందేందుకు రాహుల్ ప్రయత్నించనున్నారని సమాచారం.అమేథీతో పాటు రాయ్బరేలీ లోక్సభ స్థానానికి కూడా ఇప్పటివరకు కాంగ్రెస్ ఎవరికీ టిక్కెట్ కేటాయించలేదు. ఈ సీటు కూడా కాంగ్రెస్ సంప్రదాయ సీటు. 2019లో కాంగ్రెస్ గెలిచిన ఏకైక సీటు ఇదే. సోనియాగాంధీ ఇక్కడి నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. ఇప్పుడు ఆమె ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో ఈ సీటు నుంచి సోనియా కుమార్తె ప్రియాంక ఎన్నికల బరిలో దిగవచ్చని తెలుస్తోంది. ప్రియాంక భర్త రాబర్ట్ వాద్రా కూడా ఎన్నికల్లో పోటీ చేస్తారని తెలుస్తున్నప్పటికీ ఆయన ఎక్కడి నుంచి పోటీ చేయనున్నారనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. -
అమేథీ నుంచి రాహుల్.. రాయ్బరేలీ నుంచి ప్రియాంక? నామినేషన్లకు సన్నాహాలు?
దేశంలో లోకసభ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికలల్లో తమ నామినేషన్లు వేసేముందు వయనాడ్ కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రాలు అయోధ్యలోని రామ్ లల్లాను దర్శించుకోనున్నారని సమాచారం. కాంగ్రెస్ వర్గాల నుంచి మీడియాకు అందిన సమాచారం ప్రకారం ఏప్రిల్ 26న కేరళలోని వయనాడ్కు పోలింగ్ పూర్తయిన తర్వాత గాంధీ కుటుంబం అమేథీ, రాయ్బరేలీ లోక్సభ నియోజకవర్గాలపై దృష్టి పెట్టనున్నదని సమాచారం. అమేథీలో రాహుల్ గాంధీ, రాయ్బరేలీలో ప్రియాంక గాంధీ వాద్రా నామినేషన్ వేయనున్నారని, దీనికి ముందు వారు అయోధ్యలో కొలువైన రామ్లల్లాను దర్శించుకోనున్నారని సమాచారం. వయనాడ్లో ఓటింగ్ ఏప్రిల్ 26న ముగియనుంది. అదే రోజున రాయ్బరేలీ, అమేథీ స్థానాలకు నామినేషన్ ప్రక్రియ మొదలు కానుంది.మీడియాకు అందిన సమాచారం ప్రకారం అమేథీ, రాయ్బరేలీలలో పోటీ విషయమై ఏప్రిల్ 30లోపు కాంగ్రెస్ అధికారిక ప్రకటన చేయనున్నదని సమాచారం. ఈ స్థానాల అభ్యర్థుల విషయంలో కాంగ్రెస్ హైకమాండ్ మౌనం వహిస్తూ వస్తోంది. అయితే రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రాలు.. అమేథీ, రాయ్బరేలీ నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకున్న పక్షంలో మే ఒకటి నుంచి మూడవ తేదీలోపు నామినేషన్లు దాఖలు చేసే అవకాశముంది. ఈ రెండు నియోజకవర్గాల్లో నామినేషన్లకు మే 3 చివరి రోజు. మే 20న ఐదవ విడతలో ఈ రెండు లోక్సభ నియోజకవర్గాలకు పోలింగ్ జరగనుంది.రాహుల్, ప్రియాంకలు యూపీ లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తారని కాంగ్రెస్ కమ్యూనికేషన్ సెల్ ఇన్చార్జి జైరాం రమేష్తో పాటు పలువురు నేతలు గతంలోనే సూచన ప్రాయంగా తెలియజేశారు. తాజాగా అమేథీలోని రాహుల్ నివసించే బంగ్లాను శుభ్రం చేసి, పెయింటింగ్ వేస్తున్న ఫొటోలు సోషల్ మీడియాలో కనిపించాయి. ఈ నేపధ్యంలో రాహుల్ అమేథీ నుంచి, ప్రియాంక రాయ్బరేలీ నుంచి పోటీచేయవచ్చని స్పష్టమవుతోంది. -
అమేథీ కాంగ్రెస్ అభ్యర్థి రాబర్ట్ వాద్రా?
ఉత్తరప్రదేశ్లోని అమేథీ లోక్సభ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థి ఎవరనేదానిపై ఇంకా సస్పెన్స్ వీడలేదు. మే 20న ఐదవ దశలో అమేథీ లోక్సభ స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి. అయితే కాంగ్రెస్ ఇక్కడి అభ్యర్థి ఎవరనేది వెల్లడించకముందే స్థానికంగా వెలసిన పోస్టర్లు కాంగ్రెస్ అభ్యర్థి ఎవరనేది తెలియజేస్తున్నాయి. కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ అల్లుడు, ప్రియాంకా గాంధీ భర్త రాబర్ట్ వాద్రా.. అమేథీ ఎన్నికల్లో పోటీ చేయాలని డిమాండ్ చేస్తూ పలు చోట్ల పోస్టర్లు వెలిశాయి. ‘అమేథీ ప్రజలు ఈసారి రాబర్ట్ వాద్రాను ఆహ్వానించాలి’ అని పోస్టర్పై రాశారు. రాబర్ట్ వాద్రా అమేథీ నుంచి పోటీ చేయాలనే డిమాండ్ గత కొంతకాలంగా వినిపిస్తోంది. అమేథీ, గౌరీగంజ్లలోని కాంగ్రెస్ కార్యాలయాలు, హనుమాన్ తిరహా, రైల్వే స్టేషన్ రోడ్డు తదితర ప్రాంతాల్లో ఈ తరహా పోస్టర్లను గోడలపై అతికించారు. ఈ పోస్టర్ గురించి స్థానిక కాంగ్రెస్ నేత సోను సింగ్ రఘువంశీ మాట్లాడుతూ రాబర్ట్ వాద్రా ఈసారి అమేథీ నుండి ఎన్నికల్లో పోటీ చేయాలని స్థానికులు కోరుతున్నారు. రాహుల్ గాంధీ వయనాడ్ నుంచి పోటీ చేస్తున్నారు. ప్రియాంక గాంధీ రాయ్ బరేలీ నుంచి పోటీ చేస్తారు. అందుకే రాబర్ట్ వాద్రా ఇక్కడి నుంచి పోటీచేయాలని స్థానిక కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారన్నారు. -
వింత రాజకీయం.. పొత్తు ఉన్నా ఎవరి ప్రచారం వారిదే?
పశ్చిమ యూపీలో ఎన్నికల కోసం సమాజ్వాదీ పార్టీ, కాంగ్రెస్లు పొత్తు కుదుర్చుకున్నప్పటికీ, ప్రచారం చేపట్టే విషయంలో ఇరు పార్టీల మధ్య సయోధ్య కనిపించడం లేదు. తొలి విడత లోక్సభ ఎన్నికల ప్రచారం బుధవారం సాయంత్రంతో ముగిసింది. అయితే ప్రచారం చివరి రోజున ఇరు పార్టీలు ఉమ్మడి ర్యాలీకి హాజరుకాకపోవడం చర్చనీయాంశంగా మారింది. పశ్చిమ యూపీలో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. సమాజ్వాదీ పార్టీ, కాంగ్రెస్ల తీరుకు భిన్నంగా బీజేపీ-ఆర్ఎల్డీల దోస్తీ పటిష్టంగా కొనసాగుతోంది. ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, హోంమంత్రితో ఆర్ఎల్డీ చీఫ్ జయంత్ చౌదరి పలుమార్లు సమావేశమయ్యారు. ఇదే సమయంలో ఎస్పీ, కాంగ్రెస్ హైకమాండ్ విడివిడిగా తమ గొంతు వినిపించడం విచిత్రంగా మారింది. ఎస్పీ తో పొత్తు ఉన్నప్పటికీ కాంగ్రెస్ మహిళా నేత ప్రియాంక గాంధీ విడిగా ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో ఇరు పార్టీల మధ్య దూరానికి కారణమేమిటనే దానిపై పలు విశ్లేషణలు వినిపిస్తున్నాయి. పశ్చిమ ఉత్తరప్రదేశ్లోని ఎనిమిది లోక్సభ స్థానాలకు ఏప్రిల్ 19న తొలి దశలో పోలింగ్ జరగనుంది. సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ వివిధ లోక్సభ స్థానాలకు వెళ్లి తమ కూటమి అభ్యర్థిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. అఖిలేష్ యాదవ్ పిలిభిత్ నుంచి ముజఫర్ నగర్ వరకు బహిరంగ సభలు నిర్వహించారు. అయితే ముజఫర్నగర్కు సమీపంలో జరిగిన ప్రియాంక గాంధీ రోడ్ షోలో అఖిలేష్ కనిపించలేదు. సహరాన్పూర్ లోక్సభ అభ్యర్థి ఇమ్రాన్ మసూద్కు మద్దతుగా ప్రియాంక గాంధీ రోడ్ షో నిర్వహించారు. ప్రచారం చివరి రోజున ఎస్పీ, కాంగ్రెస్లు ఉమ్మడి ర్యాలీ నిర్వహించకపోవడానికి ప్రధాన కారణం ముస్లిం ఓటు బ్యాంకు అని రాజకీయ విశ్లేషకులు జ్ఞాన్ ప్రకాశ్ తెలిపారు. 2019 నాటి ఎస్పీ, బీఎస్పీ పొత్తును ఉదహరిస్తూ, అప్పట్లో ఆ రెండు పార్టీల అధినేతలు ఉమ్మడి ర్యాలీని నిర్వహించారన్నారు. అయితే నాడు బహుజన సమాజ్ పార్టీ.. కూటమి వల్ల ప్రయోజనం పొందిందని, ఎస్పీ ఎటువంటి ప్రత్యేక ప్రయోజనం పొందలేకపోయిందన్నారు. ఈ సారి ఎస్పీ-కాంగ్రెస్ కూటమి ఉమ్మడి ర్యాలీ నిర్వహించకపోవడానికి ఇదే కారణం కావచ్చన్నారు. -
అవినీతిపై ఉక్కుపాదమే: ప్రధాని మోదీ
రుద్రపూర్/జైపూర్: అవినీతిలో కూరుకుపోయిన కొందరు నాయకులు తనను బెదిరించేలా మాట్లాడుతున్నారని, నిస్సిగ్గుగా దూషిస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మండిపడ్డారు. అలాంటి వారికి భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో నెగ్గి, మూడోసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అవినీతిపై మరింత కఠిన చర్యలు తీసుకుంటానని వెల్లడించారు. అవినీతిపై ఇక ఉక్కుపాదమేనని, ఇది తన గ్యారంటీ అని స్పష్టం చేశారు. అవినీతికి వ్యతిరేకంగా దేశం గొంతు విప్పుతోందని అన్నారు. ప్రతి ఒక్క అవినీతిపరుడిపై చర్యలు ఉంటాయని, ఎవరినీ వదిలిపెట్టబోమని పేర్కొన్నారు. తప్పుడు పనులు చేసినవారు జైలుకు వెళ్లాల్సిందేనని పేర్కొన్నారు. తనను తిట్టొచ్చు, బెదిరించవచ్చు గానీ అవినీతిపై చర్యల విషయంలో మాత్రం ఎవరూ అడ్డుకోలేరని తెలిపారు. మోదీ మూడోసారి ప్రధాని అయితే దేశమంతటా మంటలు తప్పవంటూ కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ చేసిన వ్యాఖ్యలను ఖండించారు. కాంగ్రెస్ను దేశం నుంచి తుడిచిపెట్టేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారానికి ప్రధాని మోదీ శ్రీకారం చుట్టారు. మంగళవారం ఉత్తరాఖండ్లోని రుద్రపూర్లో తొలి బహిరంగ సభలో ప్రసంగించారు. కాంగ్రెస్, ‘ఇండియా’ కూటమి ఉద్దేశాలు బయటపడుతున్నాయని చెప్పారు. అధికారం కోల్పోయి నిరాశలో ఉన్న కాంగ్రెస్ రాజకుటుంబ వారసుడు దేశంలో మంటలు సృష్టించడం గురించి మాట్లాడుతున్నాడని, అలాంటివి మీరు అనుమతిస్తారా? అని ప్రజలను ప్రశ్నించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఈ విధమైన అనుచిత భాష మాట్లాడవచ్చా? వారిని మీరు శిక్షిస్తారా? లేదా? అని అడిగారు. బుజ్జగింపు రాజకీయాలే కాంగ్రెస్ నైజం ‘ఎమర్జెన్సీ’ ఆలోచనా ధోరణి ఉన్న కాంగ్రెస్కు ప్రజాస్వామ్యంపై ఏమాత్రం విశ్వాసం లేదని ప్రధానమంత్రి ఆరోపించారు. ఎన్నికల్లో రాబోయే ఫలితాలపై ప్రజలను రెచ్చగొట్టాలని కుట్ర పన్నిందని ధ్వజమెత్తారు. దేశాన్ని అస్థిరత, అరాచకం వైపు మళ్లించాలన్నదే కాంగ్రెస్ ధ్యేయమని ఆక్షేపించారు. ఆ పారీ్టకి తగిన బుద్ధి చెప్పాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. దేశాన్ని విడగొట్టాలన్న కాంగ్రెస్ నాయకుడిని శిక్షించాల్సింది పోయి లోక్సభ బరిలో దింపుతోందని ఆక్షేపించారు. ఆ అగ్నిని పదేళ్లుగా ఆర్పేస్తున్నా... విపక్ష ‘ఇండియా’ కూటమిపై ప్రధాని మోదీ విరుచుకుపడ్డారు. ‘‘అవినీతిపై చర్యలను అడ్డుకోవడానికి అవినీతిపరులంతా చేతులు కలిపిన తొలి లోక్సభ ఎన్నికలివి. సొంత కుటుంబాలను కాపాడుకోవడానికి కుటుంబ పార్టీలు ర్యాలీల మీద ర్యాలీలు వరుసగా నిర్వహిస్తున్న తొలి ఎన్నికలు కూడా ఇవే’’ అన్నారు. రాజస్తాన్లోని కోట్పుత్లీలో ఆయన ఎన్నికల ప్రచార సభలో మాట్లాడారు. సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ మళ్లీ గెలిస్తే దేశం అగి్నగుండం అవుతుందంటూ కాంగ్రెస్ నేతలు బెదిరింపులకు దిగుతున్నారని విమర్శించారు. అలాంటి అగ్నిని గత పదేళ్లుగా తాను ఆర్పేస్తూనే ఉన్నానని స్పష్టం చేశారు. -
బీజేపీకి షాక్.. కాంగ్రెస్లో చేరిన ఎంపీ రాహుల్ కుశ్వాన్
జైపూర్: లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ పలువురు నేతలు పార్టీల మారుతూ సార్వత్రిక సమరాన్ని మరింత ఆసక్తి రేపుతున్నారు. కాంగ్రెస్ నేతలు బీజేపీలోకి.. బీజేపీ నేతలు కాంగ్రెస్లోకి వరుస కడుతున్నారు. తాజాగా రాజస్తాన్లోని చురూ సెగ్మెంట్కు చెందిన ఎంపీ బీజేపీకి షాక్ ఇచ్చారు. రాహుల్ కుశ్వాన్ బీజేపీ ప్రాథమిక సభ్యత్వానికి, ఎంపీ పదవకి రాజీనామా చేసి.. సోమవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ‘నేను కాంగ్రెస్ పార్టీలో చేరడానికి సహకరించిన కాంగ్రెస్ అధ్యక్షుడు మళ్లికార్జున ఖర్గే, సీనియర్ నేత సొనియా గాంధీ, రాహుల్ గాంధీ, గోవింద్ సింగ్ దోస్తారా, ఇతర నేతలకు ధన్యవాదాలు’ అని కాంగ్రెస్ చేరిన అనంతరం మీడియాతో మాట్లాడారు. అంతకంటే ముందు.. ప్రజాజీవితంగా గురించి పెద్ద నిర్ణయం తీసుకోబోతున్నానని రాహుల్ కుశ్వాన్ ‘ఎక్స్’(ట్వీటర్) వేదికగా వెల్లడించారు. ‘కొన్ని రాజకీయ కారణాల రీత్యా ఈ రోజు కీలక పరిణామం జరగబోతుంది. నేను బీజేపీ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నా. ఎంపీ పదవికి కూడా రాజీనామా చేస్తున్నా’అని పేర్కొన్నారు. అదేవిధంగా చురూ నియోజకవర్గ ప్రజలకు పదేళ్లపాటు సేవ చేయడానికి అవకాశం ఇచ్చిన.. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ధన్యవాదాలు తెలిపారు. వచ్చే లోక్సభలో ఎన్నికల్లో చురూ సెగ్మెంట్ నుంచి బీజేపీ టికెట్ తిరస్కరించిన నేపథ్యంలో రాహుల్ కుశ్వాన్ పార్టీ మారటం గమనార్హం. బీజేపీ మొదటి జాబితాలో చురూ లోక్సభ స్థానంలో రాహుల్ కుశ్వాన్ బదులు పారా ఒలింపియన్ దేవేంద్ర ఝఝరియాను బరిలోకి దించిన విషయం తెలిసిందే. చదవండి: డీప్ఫేక్ బారినపడ్డ యోగి ఆదిత్యనాథ్ -
ఏమిటి నేను చేసిన నేరం? బీజేపీ ఎంపీ తీవ్ర ఆవేదన!
భారతీయ జనతా పార్టీ వచ్చే లోక్సభ ఎన్నికలకు అభ్యర్థుల తొలిజాబితాను ప్రకటించింది. రాజస్థాన్లోని చురు లోక్సభ స్థానం నుంచి కొత్త వ్యక్తి దేవేంద్ర ఝజారియాకు టిక్కెట్ ఇచ్చింది. అయితే ప్రస్తుతం చురు ఎంపీగా ఉన్న రాహుల్ కశ్వాన్.. తనను తప్పించడంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. రానున్న లోక్సభ ఎన్నికలకు తన చురు స్థానం నుంచి మరో అభ్యర్థిని బీజేపీ బరిలోకి దించగా రాహుల్ కశ్వాన్ సోషల్ మీడియాలో తన స్పందనను తెలియజేశారు. కస్వాన్ తన ‘ఎక్స్’ (ట్విటర్) ఖాతాలో పోస్ట్ చేశారు. "నా నేరం ఏమిటి? నేను నిజాయితీగా లేనా? కష్టపడి పనిచేయలేదా? విధేయుడిని కాదా? నేను ఏమి కళంకం తెచ్చాను? చురు లోక్సభలో పనిచేయలేదా? ఏదైనా పొరపాటు జరిగిందా?" అంటూ ప్రశ్నలు సంధించారు. "ప్రధానమంత్రి అన్ని పథకాల అమలులో నేను ముందంజలో ఉన్నాను. ఇంకా ఏమి కావాలి? ఈ ప్రశ్న ఎవరిని అడిగినా మౌనమే వినిపిస్తోంది. ఎవరూ సమాధానం చెప్పలేక పోతున్నారు" అంటూ వాపోయారు. అయితే రాజకీయాల్లో ఇలాంటివి సర్వసాధారణమని, టిక్కెట్ దక్కలేదన్న నైరాశ్యంలో ఈ వ్యాఖ్యలు చేసినట్లుగా భావిస్తున్నారు. కాగా రాహుల్ కస్వాన్ తండ్రి రామ్ సింగ్ కూడా చురు నుంచి బీజేపీ ఎంపీగా, ఎమ్మెల్యేగా పని చేశారు. అలాగే రాహుల్ తల్లి కమలా కశ్వాన్ కూడా సాదుల్పూర్ నుంచి బీజేపీ ఎమ్మెల్యేగా చేశారు. రానున్న లోక్సభ ఎన్నికలకు రాజస్థాన్లోని 25 స్థానాలకు గాను 15 స్థానాలకు బీజేపీ అభ్యర్థులను ప్రకటించింది. అందులో లోక్సభ స్పీకర్ ఓం బిర్లాతో పాటు నలుగురు కేంద్ర మంత్రుల పేర్లు కూడా ఉన్నాయి. -
భారత్ జోడో న్యాయ యాత్రలో రాహుల్, ప్రియాంక!
కాంగ్రెస్ రెండో దశ భారత్ జోడో న్యాయ యాత్ర ఉత్తరప్రదేశ్లోని మొరాదాబాద్ నుంచి తిరిగి ప్రారంభమైంది. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ, పార్టీ అధినేత్రి ప్రియాంక గాంధీ ఓపెన్ జీపులో యాత్రలో పాల్గొన్నారు. వీరిని చూసేందుకు జనం తరలివచ్చారు. రాహుల్, ప్రియాంకలను స్వాగతిస్తూ జనం వారిపై పూల వర్షం కురిపించారు. ఈ సమయంలో సమాజ్ వాదీ పార్టీ కార్యకర్తలు కూడా యాత్రలో పాల్గొన్నారు. అమ్రోహా, సంభాల్, బులంద్షహర్, అలీఘర్, హత్రాస్, ఆగ్రా, ఫతేపూర్ సిక్రీ వరకు జరిగే ఈ యాత్రలో రాహుల్ గాంధీతో పాటు ప్రియాంక గాంధీ కూడా పాల్గొంటున్నారు. ఆదివారం ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ కూడా ఈ యాత్రలో పాల్గొననున్నారు. ఆగ్రా అనంతరం ఈ యాత్ర రాజస్థాన్లోకి ప్రవేశిస్తుంది. మార్చి 26న ఈ యాత్రకు విరామం కల్పించనున్నారు. రాహుల్ గాంధీ ఫిబ్రవరి 27, 28 తేదీలలో న్యూఢిల్లీలో జరిగే పార్టీ సమావేశాలకు హాజరుకానున్నారు. అనంతరం భారత్ జోడో న్యాయ యాత్ర మార్చి 2న మధ్యాహ్నం 2 గంటలకు ధోల్పూర్ నుంచి తిరిగి ప్రారంభంకానుంది. ఈ యాత్ర మొరెనా, గ్వాలియర్, శివపురి, గుణ, షాజాపూర్, ఉజ్జయిని, మధ్యప్రదేశ్లోని పలు జిల్లాల మీదుగా సాగనుంది. -
సోనియా రాజ్యసభ నామినేషన్.. వెంటవచ్చిన రాహుల్, ప్రియాంక!
రాజ్యసభ ఎన్నికల్లో రాజస్థాన్ నుంచి కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ పోటీ చేస్తున్నారు. ఇందుకోసం ఆమె ఈరోజు(బుధవారం) నామినేషన్ దాఖలు చేయనున్నారు. రాజధాని జైపూర్ చేరుకున్న ఆమె వెంట రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కూడా ఉన్నారు. సోనియా గాంధీ లోక్సభ నుంచి కాకుండా రాజ్యసభ నుంచి పార్లమెంటుకు చేరుకుంటున్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రియాంక గాంధీ యూపీలోని రాయ్బరేలీ స్థానం నుంచి లోక్సభ ఎన్నికల్లో బరిలోకి దిగుతారనే ప్రచారం జరుగుతోంది. రాజస్థాన్ కాంగ్రెస్ అధ్యక్షుడు గోవింద్ సింగ్ దోటసార నివాసంలో సోనియాగాంధీ నామినేషన్ సెట్పై ఎమ్మెల్యేలందరూ సంతకాలు చేశారు. #WATCH कांग्रेस संसदीय दल की अध्यक्ष सोनिया गांधी राज्यसभा चुनाव के लिए अपना नामांकन दाखिल करने के लिए जयपुर, राजस्थान पहुंचीं। उनके बेटे और पार्टी सांसद राहुल गांधी और उनकी बेटी और पार्टी महासचिव प्रियंका गांधी वाड्रा उनके साथ हैं। pic.twitter.com/0oGUmMr1to — ANI_HindiNews (@AHindinews) February 14, 2024 సీనియర్ కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ 1999 లోక్సభ సభ్యురాలుగా కొనసాగుతున్నారు. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్లోని రాయ్బరేలి లోక్సభ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆమె అమేథీ లోక్సభ సభ్యురాలిగానూ ఉన్నారు. ఆమె పార్లమెంటు ఎగువ సభకు వెళ్లడం ఇదే తొలిసారి. ఫిబ్రవరి 8వ తేదీ నుంచి రాజ్యసభ ఎన్నికలకు నామినేషన్ల దాఖలు ప్రక్రియ ప్రారంభమైంది. నామినేషన్ పత్రాల పరిశీలన ఫిబ్రవరి 16న జరగనుంది. అభ్యర్థులు ఫిబ్రవరి 20లోగా తమ పేర్లను ఉపసంహరించుకోవచ్చు. అవసరమైతే ఫిబ్రవరి 27న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఓటింగ్ నిర్వహించి, అదే రోజు సాయంత్రం 5 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభించనున్నారు. -
నేడు ఒడిశాకు రాహుల్ భారత్ జోడో న్యాయ యాత్ర
మణిపూర్ నుంచి ప్రారంభమైన భారత్ జోడో న్యాయ యాత్ర 24వ రోజు అంటే నేడు (మంగళవారం)ఒడిశాలోకి ప్రవేశించనుంది. జనవరి 14న ఈశాన్య భారతం నుంచి ప్రారంభమైన ఈ యాత్రలో రాహుల్ గాంధీ సహా పలువురు కాంగ్రెస్ నేతలు వివిధ రాష్ట్రాలలోని ప్రజలను కలుస్తున్నారు. జార్ఖండ్ యాత్ర పూర్తయ్యాక కాంగ్రెస్ ఇప్పుడు ఒడిశా వైపు వెళ్లనుంది. మంగళవారం సుందర్గఢ్ జిల్లా నుంచి రాహుల్ ఒడిశాలో అడుగుపెట్టనున్నారు. రాహుల్కు స్వాగతం పలికేందుకు ఒడిశా కాంగ్రెస్ నేతలు సన్నాహాలు చేశారు. సుందర్గఢ్ జిల్లాలోని పారిశ్రామిక పట్టణం బిరామిత్రపూర్లో ఒడిశా కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీకి స్వాగతం పలుకనున్నారు. రాహుల్ గాంధీ మంగళవారం మధ్యాహ్నం బిర్మిత్రాపూర్ చేరుకుంటారని ఒడిశా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు శరత్ పట్నాయక్ తెలిపారు. భారత్ జోడో న్యాయ యాత్ర బిజా బహల్ ప్రాంతంలో విరామం తీసుకోనుంది. బుధవారం రూర్కెలాలోని ఉదిత్నగర్ నుండి పాన్పోష్ వరకు 3.4 కిలోమీటర్ల మేర యాత్ర సాగనుంది. రాహుల్ పాన్పోష్లో ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు. మరుసటి రోజు రాణిబంద్ నుంచి యాత్ర తిరిగి ప్రారంభమవుతుంది. రాజ్గంగ్పూర్లో జరిగే ర్యాలీలో కూడా రాహుల్ ప్రసంగించనున్నారు. ఫిబ్రవరి 8న రాహుల్ గాంధీ జర్సుగూడ పాత బస్టాండ్ నుంచి యాత్రను ప్రారంభిస్తారు. అనంతరం ర్యాలీలో ప్రసంగిస్తారు. జార్సుగూడలోని కనక్తోరా నుంచి యాత్ర మొదలై అనంతరం ఛత్తీస్గఢ్లోకి ప్రవేశిస్తుంది. -
ఆ రోజే భ్రమయుగం
మమ్ముట్టి ప్రధాన పాత్రలో నటిస్తున్న మలయాళ చిత్రం ‘భ్రమయుగం’. రాహుల్ సదాశివన్ దర్శకత్వం వహిస్తున్నారు. చక్రవర్తి రామచంద్ర, ఎస్. శశికాంత్ నిర్మిస్తున్న ఈ సినిమా థియేటర్స్కి వచ్చే రోజు ఖరారైంది. ఫిబ్రవరి 15న ఈ చిత్రాన్ని మలయాళంతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ‘‘హారర్–థ్రిల్లర్ జానర్లో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న చిత్రమిది’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి కెమెరా: షెహనాద్ జలాల్, సంగీతం: క్రిస్టో జేవియర్. -
దరఖాస్తు ఫారాలు విక్రయిస్తే కేసులు.. : కలెక్టర్ రాహుల్రాజ్
ఆదిలాబాద్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా అభయహస్తం ఆరు గ్యారంటీలకు సంబంధించి దరఖాస్తుల ను అర్హులైన ప్రతీ కుటుంబానికి ఉచితంగా అందజేస్తున్నామని కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. జిల్లాలో దరఖాస్తుల కొరత లేదని ప్రతి గ్రామం, ము న్సిపల్ వార్డులో ఉన్న కుటుంబాల కంటే పది శా తం అదనంగా పంపించామన్నారు. మీసేవ, జిరా క్స్ కేంద్రాలు, దళారులు విక్రయించినట్లైతే చర్యలు తప్పవన్నారు. మీసేవ కేంద్రాల లైసెన్స్ రద్దుతో పాటు బాధ్యులపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన ఆరు గ్యారంటీల దరఖాస్తుల వివరాలు వెల్లడించారు. దరఖాస్తు నింపేందుకు కొంతమంది రూ.50వరకు తీసుకుంటున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. అలా జరుగకుండా అన్ని చోట్ల వాటిని నింపేందుకు ప్రత్యేక హెల్ప్ డెస్కులు ఏర్పాటు చేశామన్నారు. ఆరు గ్యారంటీలకు ఒకే కా మన్ దరఖాస్తు పత్రం ఉంటుందని, అందులో అవసరమైన సాయంతో పాటు కుటుంబ సభ్యుల వివరాలు నమోదు చేయాల్సి ఉంటుందన్నారు. రేషన్కార్డు లేని వారు, ఆధార్కార్డులో ఆంధ్రప్రదేశ్ అని ఉన్న వారు కూడా నిరభ్యంతరంగా దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. పింఛన్ పొందుతున్న ల బ్ధిదారులు కొత్తగా దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదని, రైతుబంధు సాయం పొందుతున్న రైతులు మాత్రం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందన్నారు. కొత్తగా రేషన్కార్డు పొందాలనుకునే వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. అద్దె ఇళ్లలో నివసించేవారు గృహజ్యోతి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ కోసం అద్దె ఇంటి విద్యుత్ సర్వీస్ నంబర్తోనూ దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ప్రజలు ఇ బ్బందులు పడుకుండా ఉండేలా అన్ని కేంద్రాల్లో షామియానాలు, తాగునీటి వసతి కల్పించామన్నారు. జనవరి 6వరకు కేంద్రాల్లో దరఖాస్తుల స్వీకరణ ఉంటుందని, అప్పటికీ అందించలేని వారు కూడా ఎంపీడీవో, మున్సిపల్ కార్యాలయాల్లో అందజేయవచ్చని తెలిపారు. క్షేత్రస్థాయి పరిశీలన అనంతరం అర్హులైన ప్రతి ఒక్కరికి పారదర్శకంగా సంక్షేమ ఫలాలు అందజేస్తామన్నారు. డబ్బులిస్తే ఇప్పిస్తామని నమ్మబలికే దళారులను నమ్మి మోసపోవద్దని సూచించారు. సంక్షేమ ఫలాల కోసం మహారాష్ట నుంచి వచ్చే వారికి తప్పుడు ధ్రువీకరణ పత్రాలు జారీ చేస్తే మాత్రం బాధ్యులైన వారిపై కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. ఆదిలాబాద్ మున్సిపల్ పరిధిలోని వార్డుల్లో జనాభా ఎక్కువగా ఉన్నందున ప్రతి వార్డుకు ఓ జిల్లా స్థాయి అధికారిని ప్రత్యేకాధికారిగా నియమించినట్లుగా వెల్లడించారు. అర్హులైన ప్రతి ఒక్కరూ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. సమావేశంలో జిల్లా స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ ఖుష్బూ గుప్తా పాల్గొన్నారు. -
ఎల్గర్ అజేయ సెంచరీతో...
‘బాక్సింగ్ డే’ టెస్టుపై దక్షిణాఫ్రికా ఆధిక్యం కనబరుస్తోంది. రెండో రోజు ఆటలో భారత్ను తొలి ఇన్నింగ్స్లో 245 పరుగులకు ఆలౌట్ చేసిన సఫారీ బ్యాటింగ్లోనూ సత్తా చాటుకుంది. దక్షిణాఫ్రికా ఆరంభానికి సిరాజ్ తూట్లు పొడిచినప్పటికీ ఓపెనర్ డీన్ ఎల్గర్ (అజేయ) శతకంతో సాఫీగా సాగిపోయింది. రెండు పటిష్టమైన భాగస్వామ్యాలతో సఫారీ తొలి ఇన్నింగ్స్లో ఆధిక్యం సంపాదించేందుకు ఎల్గర్ కీలకపాత్ర పోషించాడు. సెంచూరియన్: ఓవర్నైట్ బ్యాటర్ కేఎల్ రాహుల్ సెంచరీ మినహా తొలి టెస్టులో రెండో రోజంతా దక్షిణాఫ్రికా హవానే నడిచింది. ఓపెనర్ ఎల్గర్ చక్కని సెంచరీతో సఫారీ భారీ స్కోరుపై కన్నేసింది. తద్వారా దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్లో ఆధిక్యాన్ని పెంచుకునేందుకు పట్టుబిగిస్తోంది. బుధవారం రెండో రోజు ఆటలో తొలుత భారత్ తొలి ఇన్నింగ్స్ 67.4 ఓవర్లలో 245 పరుగుల వద్ద ముగిసింది. రాహుల్ (137 బంతుల్లో 101; 14 ఫోర్లు, 4 సిక్స్లు) టెస్టుల్లో ఎనిమిదో శతకం సాధించాడు. మొదటి రోజే రబడ 5 వికెట్లు తీయగా, రెండో రోజు మిగిలిన రెండు వికెట్లలో కొయెట్జీ (1/74), బర్గర్ (3/50) చెరొకటి తీశారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన దక్షిణాఫ్రికా వెలుతురు మందగించి ఆట నిలిచే సమయానికి 66 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 256 పరుగులు చేసి 11 పరుగుల ఆధిక్యం దక్కించుకుంది. ఎల్గర్ (140 బ్యాటింగ్; 23 ఫోర్లు), జాన్సెన్ (3 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. బుమ్రా, సిరాజ్ చెరో 2 వికెట్లు పడగొట్టాడు. శతకం పూర్తయ్యాక ఆలౌట్! వర్షం, గ్రౌండ్ తడి ఆరడానికి సమయం పట్టడంతో రెండో రోజు కూడా ఆట ఆలస్యంగానే మొదలైంది. ఓవర్నైట్ స్కోరు 208/8తో తొలి ఇన్నింగ్స్ను కొనసాగించిన భారత్ తొలి సెషన్లో 8.4 ఓవర్లు మాత్రమే ఆడగలిగింది. ఓవర్నైట్ బ్యాటర్లు రాహుల్, సిరాజ్ (5) తొమ్మిదో వికెట్కు 47 పరుగులు జోడించారు. రాహుల్ సెంచరీకి చేరువయ్యాక కొయెట్టీ 65వ ఓవర్ తొలి బంతికి సిరాజ్ను అవుట్ చేశాడు. అదే ఓవర్ ఆఖరి బంతికి భారీ సిక్సర్తో రాహుల్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కాసేపటికే బర్గర్ అతన్ని బౌల్డ్ చేయడంతో 245 పరుగుల వద్ద తొలి ఇన్నింగ్స్కు తెరపడింది. సిరాజ్ దెబ్బ తీసినా... దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ ఆరంభంలోనే సిరాజ్ దెబ్బకొట్టాడు. ఓపెనర్ మార్క్రమ్ (5) కీపర్ క్యాచ్తో వెనుదిరిగేలా చేశాడు. అయితే భారత శిబిరానికి ఈ ఆనందం తర్వాత శ్రమించక తప్పలేదు. క్రీజులో ఉన్న మరో ఓపెనర్ ఎల్గర్కు జతయిన టోనీ డి జార్జి (62 బంతుల్లో 28; 5 ఫోర్లు) భారత బౌలర్లను తేలిగ్గా ఎదుర్కొన్నారు. 49/1 స్కోరువద్ద తొలి సెషన్ ముగియగా... రెండో సెషన్లోనూ ఈ జోడీ భారత బౌలింగ్ దళాన్ని కష్టపెట్టింది. ఎల్గర్ అర్ధసెంచరీ పూర్తి చేసుకోగా... సఫారీ స్కోరు వంద దాటింది. ఈ దశలో బుమ్రా వైవిధ్యమైన బంతులతో రెండు కీలక వికెట్లను పడగొట్టి టీమిండియాను ఊరడించాడు. రెండో వికెట్కు 93 పరుగులు జోడించాక జార్జిని, తన మరుసటి ఓవర్లో పీటర్సన్ (2)ను పెవిలియన్ చేర్చాడు. 113 పరుగుల వద్ద 3 వికెట్లను కోల్పోయి ఆత్మరక్షణలో పడింది. అయితే క్రీజులో పాతుకుపోయిన ఎల్గర్కు బడింగ్హామ్ చక్కని సహకారం ఇవ్వడంతో మరో భారీ భాగస్వామ్యం దక్షిణాఫ్రికాను నిలబెట్టింది. ఎల్గర్ శతకాన్ని పూర్తి చేసుకోగా... టీ విరామం (194/3) వరకు మరో వికెట్ పడకుండా జాగ్రత్తపడ్డారు. ఆఖరి సెషన్లోనూ ఎల్గర్–బడింగ్హామ్ జోడీ భారత బౌలర్లకు పరీక్షపెట్టింది. ఈ క్రమంలో బడింగ్హామ్ ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. నాలుగో వికెట్కు 131 పరుగులు జోడించాక సిరాజ్ ఓవర్లో బడింగ్హామ్ (56; 7 ఫోర్లు, 2 సిక్స్లు) నిష్క్రమించాడు. వెరిన్ (4)ను ప్రసిధ్ అవుట్ చేశాడు. తర్వాత కాసేపటికే బ్యాడ్లైట్తో ఆటను నిలిపివేశారు. స్కోరు వివరాలు భారత్ తొలి ఇన్నింగ్స్: యశస్వి (సి) వెరిన్ (బి) బర్గర్ 17; రోహిత్ (సి) బర్గర్ (బి) రబడ 5; శుబ్మన్ (సి) వెరిన్ (బి) బర్గర్ 2; కోహ్లి (సి) వెరిన్ (బి) రబడ 38; అయ్యర్ (బి) రబడ 31; రాహుల్ (బి) బర్గర్ 101; అశ్విన్ (సి) సబ్–ముల్డర్ (బి) రబడ 8; శార్దుల్ (సి) ఎల్గర్ (బి) రబడ 24; బుమ్రా (బి) జాన్సెన్ 1; సిరాజ్ (సి) వెరిన్ (బి) కొయెట్జీ 5; ప్రసిధ్ కృష్ణ (నాటౌట్) 0; ఎక్స్ట్రాలు 13; మొత్తం (67.4 ఓవర్లలో ఆలౌట్) 245. వికెట్ల పతనం: 1–13, 2–23, 3–24, 4–92, 5–107, 6–121, 7–164, 8–191, 9–238, 10–245. బౌలింగ్: రబడ 20–4–59–5, మార్కొ జాన్సెన్ 16–2–52–1, బర్గర్ 15.4–4–50–3, కొయెట్జీ 16–1–74–1. దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్: మార్క్రమ్ (సి) రాహుల్ (బి) సిరాజ్ 5; ఎల్గర్ (బ్యాటింగ్) 140; టోని జార్జి (సి) యశస్వి (బి) బుమ్రా 28; పీటర్సన్ (బి) బుమ్రా 2; బెడింగ్హమ్ (బి) సిరాజ్ 56; వెరిన్ (సి)రాహుల్ (బి) ప్రసిధ్కృష్ణ 4; జాన్సెన్ (బ్యాటింగ్) 3; ఎక్స్ట్రాలు 18; మొత్తం (66 ఓవర్లలో 5 వికెట్లకు) 256. వికెట్ల పతనం: 1–11, 2–104, 3–113, 4–244, 5–249. బౌలింగ్: బుమ్రా 16–3–48–2, సిరాజ్ 15–0–63–2, శార్దుల్ 12–2–57–0, ప్రసిధ్కృష్ణ 15–2–61–1, అశ్విన్ 8–3–19–0. -
లోక్సభ ఎన్నికల్లో యూపీ నుంచి రాహుల్, ప్రియాంక పోటీ?
ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ నేతలు ఢిల్లీలో అధిష్టానంతో సమావేశమయ్యారు. అనంతరం యూపీ కాంగ్రెస్ అధ్యక్షుడు అజయ్ రాయ్ మీడియాతో మాట్లాడారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ లోక్సభ ఎన్నికల్లో యూపీ నుంచి పోటీ చేయడం గురించి ఆయన మాట్లాడుతూ..‘అది వారి ఇల్లు. అక్కడి నుంచే వారు పోటీ చేస్తారు. అలహాబాద్, ప్రయాగ్రాజ్, రాయ్ బరేలీ, అమేథీలలోని వారి పూర్వీకులతో వారికి మంచి సంబంధాలు ఉన్నాయి. 40 ఏళ్లుగా అక్కడి ప్రజలతో వారికి దృఢమైన అనుబంధం ఉంది. ఈ బంధం ఎప్పటికీ కొనసాగుతూనే ఉంటుంది’ అని అన్నారు. పార్టీ అధిష్టానం ఉత్తరప్రదేశ్పై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాలని, ఖర్గే , రాహుల్, ప్రియాంక తదితర జాతీయ నాయకులు యూపీ నుంచి లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయాలని తాము కోరామన్నారు. యూపీలో పొత్తుల గురించి అజయ్ రాయ్ మాట్లాడుతూ దీనిపై నిర్ణయాన్ని పూర్తిగా జాతీయ నాయకత్వానికే వదిలేశామని అన్నారు. తాము ఏకగ్రీవ తీర్మానం చేసి, ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. కాగా ఢిల్లీలో అధిష్టానంతో జరిగిన సమావేశంలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, ఎంపీ రాహుల్ గాంధీ, పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు. ఇది కూడా చదవండి: నేడు అయోధ్యకు శ్రీరామ పాదుకలు कांग्रेस मुख्यालय, दिल्ली में राष्ट्रीय अध्यक्ष श्री @kharge जी, जननायक श्री @RahulGandhi जी, कांग्रेस महासचिव/प्रभारी, UP श्रीमती @priyankagandhi जी व राष्ट्रीय महासचिव संगठन @kcvenugopalmp जी ने प्रदेश अध्यक्ष श्री @kashikirai जी, CLP लीडर श्रीमती @aradhanam7000 जी व प्रदेश के… pic.twitter.com/Yp4vbrcIxZ — UP Congress (@INCUttarPradesh) December 18, 2023 -
అధికారం కోసం కాంగ్రెస్ వంద అబద్ధాలు
సిద్దిపేటజోన్: పక్కనున్న కర్ణాటకలో ఐదు గ్యారంటీలను ప్రకటించిన రాహుల్, ప్రియాంకాగాంధీ పత్తా లేకుండాపోయారని, అక్కడ పరిస్థితి గందరగోళంగా మారిందని మంత్రి హరీశ్రావు అన్నారు. ఆదివారం సిద్దిపేట జిల్లాకేంద్రంలో జరిగిన పలు సంఘాల ఆత్మీయ సమ్మేళనంలో పలు పార్టీల ప్రతినిధులు, నాయకులు మంత్రి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. హరీశ్రావు మాట్లాడుతూ వంద అబద్ధాలు ఆడైనా సరే అధికారంలోకి రావా లని కాంగ్రెస్ తాపత్రయపడుతోందని అన్నారు. మనకు బూతు మాటలు మాట్లాడే నేతలు కాదని, భవిష్యత్తు అందించే నాయకులు కావాలన్నారు. బట్టేబాజ్ మాటలు చెప్పే కాంగ్రెస్ పార్టీ నిజస్వరూ పాన్ని ప్రజలకు వివరించాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో మోకాలిచిప్పకు ఉచితంగా ఆపరేషన్లు అని పెట్టారని, కానీ తెలంగాణ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ ద్వారా ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఇప్పటికే ఉచితంగా మోకాలి చిప్ప ఆపరేషన్లు చేస్తోందని, కాంగ్రెస్ వాళ్లకు అది కూడా తెలవదని ఎద్దేవా చేశారు. భవిష్యత్తులో 112 నియోజక వర్గాల్లో అగ్రవర్ణ కులాల పిల్లలకు కూడా గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేయబోతున్నట్టు తెలిపారు. తొమ్మిదేళ్లు వర్గీకరణ అంశంపై జాప్యం చేసి ఇప్పుడు ఎన్నికల ముందు కేంద్రం కమిటీ అని కొత్త నాటకానికి తెర తీసిందని హరీశ్ విమర్శించారు. టీఎస్ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కమిటీ నాయ కులు మంత్రి హరీశ్ను కలిసి బీఆర్ఎస్కు మద్దతు ప్రకటించారు. వర్గీకరణకు బీఆర్ఎస్ కట్టుబడి ఉందని, తెలంగాణ ఏర్పడిన తొలి నాళ్లలోనే అసెంబ్లీలో తీర్మానం చేసి బిల్లును కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం పంపిందన్నారు. మనకు కావాల్సింది కమిటీ కాదనీ, బిల్లు రావాలని, వెంటనే పార్లమెంటులో బిల్లు పెట్టాలని స్పష్టం చేశారు.బీఆర్ఎస్లో చేరిన బాబుమోహన్ తనయుడు సంగారెడ్డి జిల్లా బీజేపీ అందోల్ నియోజకవర్గ అభ్యర్థి బాబుమోహన్ కుమారుడు ఉదయ్భాస్కర్ ఆదివారం సిద్దిపేటలో మంత్రి హరీశ్రావు సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. -
16 నుంచి కాంగ్రెస్ ప్రచార హోరు
సాక్షి, హైదరాబాద్: నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగియగానే రాష్ట్రంలో ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తించేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతోంది. ఏఐసీసీ అగ్రనేతలు రాహుల్, ప్రియాంకా గాందీలతోపాటు కీలక నేతలను రంగంలోకి దింపేందుకు ఏర్పాట్లు చేస్తోంది. వారు వారం రోజుల పాటు ఇక్కడే మకాం వేసి, జిల్లాల్లో విస్తృతంగా పర్యటించేలా షెడ్యూల్ రూపొందిస్తోంది. ఈ నెల 15న నాలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచార గడువు ముగియనున్న నేపథ్యంలో 16వ తేదీ నుంచి కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలనూ ప్రచార బరిలోకి దింపాలని భావిస్తోంది. అయితే భారీ సభలు కాకుండా రోడ్షోలు, కార్నర్ మీటింగ్ల ద్వారా ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించింది. అన్ని ఉమ్మడి జిల్లాల్లో పర్యటించేలా.. ఈ నెల 16 తర్వాత రాహుల్, ప్రియాంకా గాందీలతో రాష్ట్రంలోని అన్ని ఉమ్మడి జిల్లాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించేలా షెడ్యూల్ తయారవుతోంది. పెద్ద సభలను ఏర్పాటుచేసి ప్రజలను అక్కడికి తీసుకురావడం కంటే ప్రజల వద్దకే వెళ్లేలా కార్యక్రమాలు నిర్వహించేందుకు టీపీసీసీ సిద్ధమైంది. అన్ని కొత్త జిల్లాల్లో ఇద్దరు అగ్రనేతలతో రోడ్షోలు చేయించాలని, అక్కడే కార్నర్ మీటింగ్ల ద్వారా కాంగ్రెస్ ఎన్నికల గ్యారంటీలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించింది. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలు సిద్ధరామయ్య, అశోక్గెహ్లోత్, సుఖ్విందర్సింగ్ సుక్కు, భూపేశ్ బఘేల్లను కూడా ఎన్నికల ప్రచారానికి తీసుకురానుంది. హిమాచల్ప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్తాన్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ అమలు చేసిన పథకాల గురించి వారు వివరించనున్నట్టు టీపీసీసీ వర్గాలు చెప్తున్నాయి. ఇక కర్ణాటకలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదంటూ బీఆర్ఎస్ చేస్తున్న విమర్శలను తిప్పికొట్టేలా సిద్ధరామయ్య, డీకే శివకుమార్ వంటి నేతలను ప్రచార భాగస్వాములను చేయనుంది. ఈ ప్రచారమంతాపూర్తయ్యాక చివరిగా ఏఐసీసీ అగ్రనేత, యూపీఏ చైర్పర్సన్ సోనియాగాంధీతో హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోగానీ, ఉత్తర తెలంగాణలోని కీలక ప్రాంతంలోగానీ భారీ బహిరంగ సభ నిర్వహించి, పోలింగ్ మూడ్లోకి వెళ్లిపోవాలని కాంగ్రెస్ భావిస్తోంది. నేడు కామారెడ్డిలో బీసీ గర్జన సభ కాంగ్రెస్ పార్టీ శుక్రవారం కామారెడ్డిలో బీసీ గర్జన సభ నిర్వహించనుంది. నామినేషన్ల దాఖలుకు చివరిరోజు కావడంతో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి కామారెడ్డిలో కాంగ్రెస్ అభ్యర్థి గా నామినేషన్ వేయనున్నారు. ఆ కార్యక్రమం ముగిశాక బీసీ గర్జన సభ నిర్వహించనున్నారు. దీనిలో బీసీ డిక్లరేషన్ను ప్రకటించనున్నారు. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఈ సభలో పాల్గొంటున్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు, అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి ఆయన స్పష్టమైన ప్రకటన చేస్తారని.. బీఆర్ఎస్ ఆరోపణలకు తగిన విధంగా బదులిస్తారని టీపీసీసీ వర్గాలు చెప్తున్నాయి. -
వచ్చే ఏడాది భ్రమ యుగం
మమ్ముట్టి ప్రధాన పాత్రలో నటించిన హారర్–థ్రిల్లర్ ఫిల్మ్ ‘భ్రమ యుగం’. రాహుల్ సదాశివన్ రచన–దర్శకత్వంలో చక్రవర్తి రామచంద్ర, ఎస్. శశికాంత్ నిర్మించారు. ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది. వచ్చే ఏడాది ప్రారంభంలో ఏకకాలంలో మలయాళం, తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమాను విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. ‘‘ఈ ఏడాది ఆగస్టులోప్రారంభమైన ఈ సినిమాను ఓట్టపాలెం, కొచ్చి, అతిరాపల్లి వంటి లొకేషన్స్లో చిత్రీకరించాం. ప్రస్తుతం పోస్ట్ ప్రోడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. -
డేటింగ్లో స్టార్ హీరోయిన్.. ముచ్చటగా మూడోసారి!
బాలీవుడ్ భామ శ్రద్ధా కపూర్ బీ టౌన్లో పరిచయం అక్కర్లేని పేరు. ఆమె ప్రముఖ నటుడు శక్తి కపూర్ కుమార్తెగా ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. 2010లో టీన్ పట్టి సినిమాలో ఒక చిన్న పాత్ర ద్వారా కెరీర్ ప్రారంభించిన శ్రద్ధా.. లవ్ కా ది ఎండ్ సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. 2013లో విడుదలైన ఆషికి- 2 చిత్రంలో నటనకు విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ సినిమాలోని ఆమె నటనకు ఫిలింఫేర్ ఉత్తమ నటి పురస్కారానికి నామినేషన్ కూడా లభించింది. శ్రద్దా సినిమాల్లో నటించడంతో పాటు మంచి సింగర్ కూడా. తన సినిమాల్లో చాలా పాటలు పాడింది. (ఇది చదవండి: ప్రతి తండ్రికి ఈ పాట అంకితం: మహేశ్ బాబు ప్రశంసలు) అయితే తాజాగా ఈ భామకు సంబంధించిన ఓ న్యూస్ నెట్టింట తెగ వైరలవుతోంది. గతంలో ఆషికి-2 నటుడు ఆదిత్య రాయ్కపూర్తో డేటింగ్లో ఉన్నట్లు రూమర్స్ వచ్చిన సంగతి తెలిసిందే. వారి ఆన్-స్క్రీన్ కెమిస్ట్రీ చూసి.. ఆఫ్ స్క్రీన్లోనూ రిలేషన్లో ఉన్నారని అప్పట్లో టాక్ వినిపించింది. ఆ తర్వాత ప్రముఖ ఫోటోగ్రాఫర్ రోహన్ శ్రేష్ఠతో చెట్టాపట్టాలేసుకుని పలు పార్టీలకు హాజరైంది. ఆ సమయంలో శ్రద్దా కపూర్పై డేటింగ్ రూమర్స్ వచ్చాయి. తాజాగా శ్రద్ధా కపూర్ అతనితో డేటింగ్లో ఉందన్న వార్త బీటౌన్లో హాట్టాపిక్గా మారింది. తు జూతీ మైన్ మక్కర్' చిత్రానికి సహ రచయితగా పనిచేసిన రాహుల్ మోడీతో శ్రద్ధా కపూర్ డేటింగ్ చేస్తోందని బీ టౌన్ టాక్. అయితే ఈ రూమర్స్పై ఇప్పటివరకు అధికారికంగా ఎవరూ స్పందించలేదు. అయితే ఈ జోడీ రిలేషన్లో ఉన్నట్లు వస్తున్న వార్తలపై ఫ్యాన్స్ ఆసక్తి చూపుతున్నారు. నెటిజన్స్ సైతం న్యూ లవ్ బర్డ్స్ ఇన్ బాలీవుడ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా.. ఇటీవలే మహాదేవ్ బెట్టింగ్ యాప్ కేసులో శ్రద్ధా కపూర్కు ఈడీ సమన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే. (ఇది చదవండి: 'నా భార్య అర్థం చేసుకుంటది.. నువ్వు నా మాట విను'.. ప్రశాంత్పై శివాజీ ఎమోషనల్!) కాగా.. తూ ఝూతీ మైన్ మక్కర్ చిత్రం 2023లో విడుదలైంది. లవ్ ఫిల్మ్స్, టి-సిరీస్ ఫిల్మ్స్ బ్యానర్లపై లవ్ రంజన్, అంకుర్ గార్గ్ నిర్మించిన ఈ సినిమాకు లవ్ రంజన్ దర్శకత్వం వహించాడు. ఈ చిత్రంలో రణ్బీర్ కపూర్, శ్రద్ధా కపూర్, డింపుల్ కపాడియా, అనుభవ్ సింగ్ బస్సీ ప్రధాన పాత్రల్లో నటించారు. -
విధుల్లో చేరిన రాజమండ్రి జైలు సూపరిండెంట్ రాహుల్
సాక్షి, తూర్పుగోదావరి: రాజమండ్రి సెంట్రల్ జైలు సూపరిండెంట్ రాహుల్ విధుల్లోకి చేరారు. కొద్దిరోజుల క్రితం అనారోగ్యంతో భార్య మృతి చెందడంతో సూపరిండెంట్ రాహుల్ విధులకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. జైలు సూపరిండెండెంట్ భార్య అనారోగ్య కారణాలతో సెలవు పెడితే పచ్చ మీడియా విపరీతార్థాలు తీసింది. దీంతో పచ్చ మీడియా తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. కాగా, రాజమండ్రి సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ భార్య ఎస్ రాహుల్ భార్య కిరణ్మయి(46) ఈ నెల 15న మృతిచెందారు. అనారోగ్యంతో బాధపడుతున్న కిరణ్మయి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. మృతదేహాన్ని అంబులెన్సులో గుంటూరు తీసుకెళ్లారు. భార్య అనారోగ్యం కారణంతో జైలు సూపరింటెండెంట్ రాహుల్ సెలవులపై వెళ్లారు. అయితే టీడీపీ అధినేత చంద్రబాబు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న నేపథ్యంలో ఒత్తిడిపై రాహుల్ సెలవులపై వెళ్లారని పలువురు దుష్ప్రచారం చేశారు. ఈ క్రమంలో ఎస్పీ జగదీష్ స్పందిస్తూ ఆ వార్తలను కొట్టిపారేశారు. భార్య అనారోగ్యం కారణంగానే ఆయన సెలవుపై వెళ్లారని పేర్కొన్నారు. సోషల్ మీడియాలో వచ్చిన అవాస్తవ కథనాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తమపై ఒత్తిళ్లు లేవని, తమ డ్యూటీ తాము చేస్తున్నానమని స్పష్టం చేశారు. -
ఈడీ ఇన్ఛార్జ్ డైరెక్టర్గా రాహుల్ నవీన్
సాక్షి, ఢిల్లీ: ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ఇన్ఛార్జ్ డైరెక్టర్గా రాహుల్ నవీన్ నియామకమయ్యారు. కాగా, ప్రస్తుతం రాహుల్ నవీన్.. ఈడీ స్పెషల్ డైరెక్టర్గా కొనసాగుతున్నారు. అయితే, పూరిస్థాయి డైరెక్టర్ నియామకం వరకు ఇన్ఛార్జ్గా రాహుల్ కొనసాగనున్నారు. రాహుల్ 1993 ఐఆర్ఎస్ బ్యాచ్కు చెందిన ఆఫీసర్. ఇదిలా ఉండగా.. ప్రస్తుత ఈడీ డైరెక్టర్ సంజీవ్ కుమార్ మిశ్రా పదవీకాలం నిన్నటితో ముగిసింది. కాగా.. ఈడీ, సీబీఐ ఉమ్మడి కొత్తగా బాస్గా సంజీవ్ను నియమించే దిశగా కేంద్రం కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగానే కొత్తగా చీఫ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ పదవి సృష్టించే దిశగా కేంద్రం ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. President Droupadi Murmu appointed an Indian Revenue Service (IRS) officer of the 1993 batch, #RahulNavin, as the incharge Director of #EnforcementDirectorate. #ED #cliQIndia pic.twitter.com/pVf7RM6TS9 — cliQ India (@cliQIndiaMedia) September 16, 2023 ఇది కూడా చదవండి: కల్నల్ మన్ప్రీత్కు సైనిక దుస్తుల్లో చిన్నారుల కడసారి వీడ్కోలు.. -
నేడు సోనియా సమక్షంలో కాంగ్రెస్ గూటికి తుమ్మల
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ అసంతృప్తనేత, మాజీమంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు శనివారం(నేడు) కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. సీడ బ్ల్యూసీ సమావేశాల విరామ సమయంలో శనివారం ఆ పార్టీ అగ్ర నేతలు సోనియా, రాహుల్గాంధీల సమక్షంలో ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. పార్టీలోకి రావాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, టీపీసీసీ ప్రచార కమిటీ కో చైర్మన్ పొంగులేటి శ్రీనివాస్రెడ్డి తదితరులు ఇప్ప టికే తుమ్మలను ఆహ్వానించిన విషయం తెలిసిందే. శుక్రవారం మధ్యాహ్నం హైదరాబాద్లోని తుమ్మల నివాసా నికి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్రావ్ ఠాక్రేతోపాటు రేవంత్, భట్టి విక్ర మార్క, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి వెళ్లారు. పార్టీలోకి రావాలని మరోమారు ఆహ్వానించగా సానుకూలంగా స్పందించిన తుమ్మల శనివారం కాంగ్రెస్ కండువా కప్పుకుంటారని గాంధీభవన్ వర్గాలు తెలిపా యి. కాగా, సీడబ్ల్యూసీ సమావేశాల సందర్భంగా రాష్ట్రంలోని పలువురు మాజీమంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్లో చేరనున్నట్లు సమా చారం. వీరిని ఈ నెల 17న తుక్కుగూడ సభా వేదికగా పార్టీలో చేర్చుకోవాలని నిర్ణయించినప్ప టికీ అనివార్య కారణాల వల్ల దానిని మార్చారని తెలిసింది. శని, ఆదివారాల్లో జరిగే సీడబ్ల్యూసీ సమావేశాల విరామ సమయంలోనే వీరిని సోని యా, రాహుల్, ఖర్గే సమక్షంలో పార్టీలో చేర్చుకోవా లని నిర్ణయించినట్టు సమాచారం. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం అసెంబ్లీ స్థానం నుంచి తుమ్మల పోటీ చేసే అవకాశముందని సమాచారం. -
రామోజీ పైశాచికత్వం
సాక్షి, అమరావతి: ‘ఈనాడు’ పత్రిక, దాన్ని నడిపిస్తున్న రామోజీరావు ఇంత పైశాచికంగా ఆలోచిస్తున్నారెందుకు? తెలుగుదేశం పార్టీ దారుణంగా దిగజారిపోయి చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ‘ఈనాడు’ కూడా తన సొంత స్టోరీల మాదిరిగా రాస్తూ ఎందుకింత నీచానికి ఒడిగడుతోంది? ఒక జైలు సూపరింటెండెంటు... అనారోగ్యంతో ఉన్న తన భార్య ఆరోగ్యం విషమించిందని తెలుసుకుని అప్పటికప్పుడు సెలవు పెట్టి వెళితే దానిక్కూడా ఊహలు, అతిశయోక్తులు జోడించి ‘రాజమండ్రి జైల్లో ఏం జరుగుతోంది?’ అంటూ కథనాన్ని వండేశారంటే ఏమనుకోవాలి? చంద్రబాబుతో, పవన్ కళ్యాణ్, లోకేశ్, బాలకృష్ణ ములాఖత్ అయిన కాసేపటికే జైలు సూపరింటెండెంట్ రాహుల్ సెలవు పెట్టారని, ప్రభుత్వ పెద్దలు బలవంతంగా సెలవుపై పంపించటం వల్లే ఇదంతా జరుగుతోందని, జైలును కుట్రలకు కేంద్రంగా మారుస్తున్నారని... ఇలా చేతికొచ్చిన అక్షరాలన్నిటినీ రాసేసింది. దాన్నే తెలుగుదేశం పార్టీ తన విషప్రచారానికి వాడుకుంటోంది. జనం మెదళ్లలో వీలైనంత విషం నింపటానికి ఎల్లో ముఠాలన్నీ ఒక్కటై సాగిస్తున్న ఈ దుష్ప్రచారం హద్దుల్లేకుండా సాగిపోతోంది. భార్య అనారోగ్యం అని చెప్పినా.... వాస్తవానికి జైలు సూపరింటెండెంట్ రాహుల్ భార్య కిరణ్మయి (46) కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఔట్ పేషెంట్గానే చికిత్స పొందుతున్న కిరణ్మయిని.. ఆరోగ్యం విషమించటంతో ఈ నెల 14న ఆసుపత్రిలో చేర్చారు. ఆమెను దగ్గరుండి చూసుకోవాల్సిన పరిస్థితి ఉండటంతో రాహుల్ కూడా సెలవు పెట్టారు. దురదృష్టవశాత్తూ పరిస్థితి విషమించి శుక్రవారం ఆమె మరణించారు కూడా. ‘ఈనాడు’ పత్రిక గానీ, టీడీపీ గానీ ఇలాంటి వార్త రాసేముందు రాహుల్ సెలవు పెట్టిన కారణాన్ని తెలుసుకుని... అది వాస్తవమో కాదో ఒక్కసారి ధ్రువపరుచుకుని ఉంటే సరిపోయేది. అలా చేస్తే.. ఇంతటి హేయమైన, నీచమైన దౌర్భాగ్యపు రాతలు రాసి ఉండేవారు కాదేమో!!. వాస్తవానికి అలా అనుకోవటానికి లేదు. ఎందుకంటే వీళ్లెవరికీ నిజాలతో పనిలేదు. నిజం తెలిసినా దాన్ని బయటకు చెప్పరు కూడా. ఎన్ని అబద్ధాలు చెప్పయినా... జనం మెదళ్లలో ఎంతటి విషాన్ని నింపయినా చంద్రబాబును వీలైతే జైల్లోంచి బయటకు తేవటం, లేకపోతే సానుభూతి సంపాదించి రాజకీయంగా లబ్ధి పొందటమే వాళ్ల లక్ష్యాలు. దీనికోసం తాము అధికారాన్ని అడ్డం పెట్టుకుని విచ్చలవిడిగా సంపాదించిన కోట్ల రూపాయల డబ్బు మూటల్ని వెదజల్లటానికి ఎల్లో ముఠా వెనకాడటం లేదు. కోట్లాది రూపాయలు ఫీజులివ్వటంతో పాటు ప్రత్యేక విమానాల్లో లాయర్లను తీసుకురావటం... దత్తపుత్రుడితో సహా కుటుంబ సభ్యులంతా హైదరాబాద్ – విజయవాడ– ఢిల్లీ అంటూ స్పెషల్ ఫ్లైట్లలో తిరుగుతుండటం... జాతీయ మీడియాకు ఢిల్లీలో చినబాబు లోకేశ్ ఇంటర్వ్యూలు... స్కిల్డెవలప్మెంట్పై నిజాలు అంటూ గాలి మాటలతో ఓ వెబ్సైట్ను ప్రారంభించటం.. ఇవన్నీ ఈ అక్రమ సంపాదనకు పుట్టిన సంతానమే అనుకోవాలి. దొంగతనం చేసి ఇంత యాగీ చేయటమా? దేశంలోనే కాదు... ఒక దొంగని అరెస్టు చేస్తే ఇంత యాగీ చెయ్యటమనేది ప్రపంచంలో ఎక్కడా ఉండదు. ఒక్క ఏపీలో తప్ప... అదీ చంద్రబాబునాయుడి విషయంలో తప్ప. ఒకవైపేమో సీమెన్స్ సంస్థ తమతో ఎవరూ ఎలాంటి ఒప్పందమూ చేసుకోలేదని చెబుతోంది... కానీ ఎల్లో మీడియా మాత్రం సీమెన్స్ పెద్ద సంస్థకాదా? సీమెన్స్ అంతర్జాతీయ దిగ్గజం కాదా? అని వాదిస్తోంది. నిజాలకు మసిపూస్తోంది. నిజంగా సీమెన్స్ సంస్థతో ఒప్పందం చేసుకున్నట్టే ఎదురు ప్రశ్నలు వేస్తోంది. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ తరఫున విడుదల చేసిన డబ్బులు బయటకు పోయాయన్నది నిజం. అవి సీమెన్స్కు చేరలేదని ఆ సంస్థే చెబుతోంది. అవి షెల్ కంపెనీల ద్వారా చంద్రబాబును చేరాయని కేంద్ర దర్యాప్తు సంస్థలే తేల్చాయి. మరి ఇంత రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయి కూడా.. హైదరాబాద్లో ఐటీ ఉద్యోగుల సంఘీభావమంటూ, బెంగళూరులో తమకు మద్దతు తెలిపారంటూ పదేసి మందిని పోగేసి ఇంత యాగీ చేయటమెందుకు? మణిపూర్ పోరాట యోధురాలు ఇరోమ్ షర్మిల ద్వారా కూడా ట్వీట్ చేయించారంటే చంద్రబాబు ఎల్లో నెట్వర్క్ ఏ స్థాయిలో ఉందో చెప్పకనే తెలుస్తుంది. అసలు ఇరోమ్ షర్మిలకు ఏపీ గురించి తెలుసా? ఇక్కడ ఏం జరిగిందో తెలుసా? చంద్రబాబు ఎంత లూటీ చేశాడో తెలుసా? నిజంగా తప్పు చేయకపోతే... తాము అన్నీ సక్రమంగానే చేసి ఉంటే ఆ విషయాలన్నీ కోర్టులో చెప్పొచ్చు కదా? చంద్రబాబును వదిలేయాలంటూ వాట్సాప్ మెసేజ్లు, ఆడియో సందేశాలు... ఎందుకిదంతా? 40 ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు... ఈ 40 ఏళ్లుగా తాను పెంచి పోషించిన విష వ్యవస్థను తనకు మద్దతివ్వటానికి ఉపయోగించుకుంటున్నారని తెలియటానికి ఇంకేం కావాలి? తనకు వ్యతిరేకంగా తీర్పునిస్తే న్యాయమూర్తిపై కూడా దారుణంగా దు్రష్పచారం చేసిన ఈ ఎల్లో ముఠా తన అబద్ధాలతో ఇంకెన్నాళ్లు మనుగడ సాగించగలదు?. సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ భార్య కిరణ్మయి మృతి కంబాలచెరువు (రాజమహేంద్రవరం):రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ ఎస్.రాహుల్ సతీమణి కిరణ్మయి (46) శుక్రవారం అనారోగ్యంతో మృతి చెందారు. కొంతకాలంగా అనారోగ్యంతో కిరణ్మయి బాధపడుతున్నారు. ఆమెకు ఆరోగ్యం బాగోకపోవడంతో నగరంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. రాహుల్, కిరణ్మయి దంపతులకు ఇద్దరు కుమార్తెలు. పోలీసు యంత్రాంగం తీవ్రమైన ఒత్తిడి ఎదుర్కొంటోంది స్థితిగతులు తెలుసుకుని వాస్తవాలను ప్రచురించండి జైళ్లశాఖ డీఐజీ రవికిరణ్,తూర్పు గోదావరి ఎస్పీ పి.జగదీష్ కంబాలచెరువు(రాజమహేంద్రవరం): జిల్లా పోలీసు యంత్రాంగం తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటోందని, స్థితిగతులు తెలుసుకుని రాయాలని, అవాస్తవాలను ప్రచురించవద్దని కోస్తా, ఆంధ్ర రీజియన్ జైళ్లశాఖ డీఐజీ రవికిరణ్, తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ పి.జగదీష్ చెప్పారు. సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ రాహుల్ భార్య కిరణ్మయి అనారోగ్యంతో మృతిచెందడంతో డీఐజీ రవికిరణ్, ఎస్పీ జగదీష్ శుక్రవారం హుటాహుటిన ఆసుపత్రికి వెళ్లి సూపరింటెండెంట్ను పరామర్శించి ఓదార్చారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ పలు వార్తాపత్రికల్లో జైలు సూపరింటెండెంట్ రాహుల్ సెలవుపై వెళ్లిన తీరుపై పలు అనుమానాలు వ్యక్తపరుస్తూ వార్తలు వచ్చాయన్నారు. ఆయన సతీమణి గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారని, ఈ నెల 14న ఉదయం 6గంటలకు ఆసుపత్రిలో చేర్చారన్నారు. ఆమెను చూసుకునేందుకు రాహుల్ రెండు రోజులు సెలవుపై వెళ్లారన్నారు. దీనికి ఈ ఒక్క కారణమే తప్ప మరేకారణం లేదన్నారు. రాహుల్ భయపడి వెళ్లిపోయారు, అధికారులు బలవంతంగా పంపించారు అనేవి పూర్తిగా అవాస్తవాలన్నారు. -
జిమ్ ట్రైనర్ రాహుల్ హత్య కేసులో ట్విస్ట్
సాక్షి, హైదరాబాద్: రాజేంద్రనగర్ జిమ్ ట్రైనర్ రాహుల్ హత్య కేసులో ట్విస్ట్ చోటుచేసుకుంది. రాహుల్ హత్యకు, ప్రేమ వ్యవహారానికి సంబంధం లేదని, ఆ రోజు వీడియో కాల్ మాట్లాడింది ఎంగేజ్మెంట్ అయిన అమ్మాయితో అని పోలీసులు తేల్చారు. రాహుల్ను హత్య చేసిన నలుగురు హంతకులను రాజేంద్రనగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. వ్యక్తిగత కారణాల వల్లే హత్య చేసినట్లు సమాచారం. చిన్నపాటి గొడవే కారణంగానే రాహుల్ హత్యకు గురైనట్లు తెలుస్తోంది. పోలీసులు లోతుగా విచారణ చేపట్టారు. రాహుల్ను హత మార్చాలని రెక్కీ నిర్వహించిన దుండగులు.. అదును చూసి రాహుల్ను అతి కిరాతకంగా కత్తులతో పొడిచి చంపారు. రాహుల్ బలం అంచనా వేసి పెప్పర్ స్ప్రే వాడారు. వర్కట్ ముగించుకొని లిఫ్ట్లో కిందకు రాగానే కంట్లో పెప్పర్ స్ప్రేను ఓ యువకుడు కొట్టగా, మరో ముగ్గురు రాహుల్పై కత్తులతో దాడి చేశారు. రాహుల్ తేరుకునే లోపు విచక్షణారహితంగా పొడిచి చంపారు. చదవండి: కోరుట్ల దీప్తి కేసు.. పోలీసుల అదుపులో చందన, ఆమె బాయ్ ఫ్రెండ్? -
అమేథీతో గాంధీ- నెహ్రూ కుటుంబానికున్న సంబంధం ఏమిటి?
కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ 2024 లోక్సభ ఎన్నికల్లో అమేథీ నుంచి పోటీ చేస్తారని ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ కొత్త చీఫ్ అజయ్ రాయ్ ప్రకటించారు. గత సార్వత్రిక ఎన్నికల్లో రాహుల్ గాంధీ ఇదే స్థానంలో బీజేపీ నాయకురాలు స్మృతి ఇరానీ చేతిలో ఓడిపోయారు. 1967లో ఏర్పడిన అమేథీ.. నాటి నుంచి కాంగ్రెస్కు కంచుకోటగా ఉంది. గత నాలుగు సంవత్సరాలుగా 1970-1990వ దశకాల ప్రారంభంలో మినహా, నెహ్రూ-గాంధీ కుటుంబానికి చెందిన వారు లేదా వారి విధేయులు ఈ నియోజకవర్గంలో గెలుపొందుతూ వస్తున్నారు. అమేథీతో నెహ్రూ-గాంధీ కుటుంబానికి గల దశాబ్దాల నాటి సంబంధం గురించి ఇప్పుడు తెలుకుందాం. సంజయ్ గాంధీ (1980–81) గాంధీ-నెహ్రూ కుటుంబంలో అమేథీ లోక్సభ నుంచి పోటీ చేసిన తొలి వ్యక్తి సంజయ్ గాంధీ. ఎమర్జెన్సీ ముగిసిన వెంటనే జరిగిన 1977 లోక్సభ ఎన్నికల్లో సంజయ్ అమేథీ నుంచి పోటీ చేశారు. అయితే జనాభా నియంత్రణ కోసం సంజయ్ చేపట్టిన బలవంతపు స్టెరిలైజేషన్ కార్యక్రమం కారణంగా అతను ఘోరమైన ఓటమిని ఎదుర్కోవలసి వచ్చింది. నాటి ఎన్నికల్లో జనతా పార్టీకి చెందిన రవీంద్ర ప్రతాప్ సింగ్ విజయం సాధించారు. సంజయ్ గాంధీ తిరిగి 1980 లోక్సభ ఎన్నికల్లో ఇక్కడి నుంచే పోటీ చేసి, ఎంపీ అయ్యారు. అయితే 1981లో జరిగిన విమాన ప్రమాదంలో సంజయ్ మరణించారు. అమేథీ ఎంపీగా స్వల్పకాలమే పనిచేశారు. రాజీవ్ గాంధీ (1981–1991) సంజయ్ మరణంతో రాజీవ్ గాంధీ క్రియాశీల రాజకీయాల్లోకి ప్రవేశించారు. 1981 మే 4న అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సమావేశంలో ఇందిరా గాంధీ తన చిన్న కుమారుని పేరును అమేథీ అభ్యర్థిగా ప్రతిపాదించారు. సమావేశానికి హాజరైన కాంగ్రెస్ సభ్యులందరూ ఈ సూచనను ఆమోదించారు. అనంతరం రాజీవ్ అమేథీ నుంచి తన అభ్యర్థిత్వాన్ని దాఖలు చేశారు. రాజీవ్ నాటి ఉప ఎన్నికలో అఖండ విజయాన్ని సాధించారు. లోక్దళ్ అభ్యర్థి శరద్ యాదవ్పై 2 లక్షలకు పైగా ఓట్ల తేడాతో విజయం సాధించారు. రాజీవ్ 1981 ఆగస్టు 17న అమేథీ నుంచి ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారు. దీని తరువాత కూడా రాజీవ్ 1984, 1989,1991లో అమేథీ నుండి గెలిచారు. దాదాపు దశాబ్దం పాటు ఈ సీటును నిలబెట్టుకున్నారు. 1991లో లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం రాజీవ్ గాంధీని హత్య చేసిన తర్వాత అమేథీలో తిరిగి ఉప ఎన్నిక జరిగింది. కాంగ్రెస్ అభ్యర్థి సతీష్ శర్మ విజయం సాధించారు. 1996 ఎన్నికల్లోనూ ఆయన తన విజయాన్ని పునరావృతం చేశారు. ఇది కూడా చదవండి: నకిలీ టీచర్లకు ప్రమోషన్లు.. దర్జాగా విద్యార్థులకు పాఠాలు.. 14 ఏళ్ల ముసుగు తొలగిందిలా! సోనియా గాంధీ (1999–2004) 1999లో రాజీవ్ గాంధీ సతీమణి సోనియా గాంధీ అమెథీ నియోజకవర్గం నుంచి పోటీ చేసినప్పుడు ఇక్కడి జనం నెహ్రూ-గాంధీ కుటుంబానికిచెందిన చెందిన నేతకు మరోసారి ఓటు వేశారు. అయితే అదే స్థానం నుంచి ఆమె మరోమారు ఎన్నికల బరిలోకి దిగలేదు. 2004 లోక్సభ ఎన్నికల్లో సోనియా స్వయంగా రాయ్బరేలీ నుంచి పోటీ చేయగా, రాహుల్ గాంధీ అమేథీ నుంచి నామినేషన్ దాఖలు చేశారు. రాహుల్ గాంధీ (2004-2019) రాహుల్ తన తొలి ప్రయత్నం(2004)లోనే అమేథీ నుంచి గెలుపొందారు. 2009లో 3.70 లక్షల ఓట్ల భారీ తేడాతో తిరిగి ఎన్నికయ్యారు. 2014లో కూడా రాహుల్ ఇక్కడి నుంచే గెలిచారు. అయితే నాడు అతని ప్రత్యర్థి స్మృతి ఇరానీ అతనికి గట్టి పోటీనిచ్చారు. అయితే స్మృతి ఇరానీ 2019 లోక్సభ ఎన్నికల్లో రాహుల్ను ఓడించారు. 2024 లోక్సభ ఎన్నికల్లో రాహుల్ మళ్లీ అమేథీలో సత్తా చాటుతారని కాంగ్రెస్ భావిస్తోంది. రాహుల్ ఇటీవల చేపట్టిన భారత్ జోడో యాత్ర, కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ విజయం ఇందుకు కలసివస్తాయనే అంచనాలున్నాయి. ఇది కూడా చదవండి: కళలతో కోట్లు.. వీరి టర్నోవర్ చూస్తే దిమ్మతిరిగిపోవాల్సిందే..! -
కండల పిచ్చి.. సూదిగుచ్చి..
నగర యువతలో పెరుగుతున్న కండల పిచ్చి వారిని పెడదారి పట్టిస్తోంది. వేగంగా ఆరు పలకల శరీరాకృతిని సొంతం చేసుకొనేందుకు ప్రమాదకర సూదిమందులను తీసుకుంటుండటం అందరినీ కలవరపెడుతోంది. మైలార్దేవ్పల్లిలోని ఓ జిమ్లో 400 మెఫెంటెర్మైన్ సల్ఫేట్ ఇంజక్షన్లను సోమవారం డ్రగ్ కంట్రోల్ విభాగం అధికారులు, పోలీసులతో కలిసి సీజ్ చేయడం, జిమ్ ట్రైనర్ నితీశ్, అతని స్నేహితులు సొహైల్, రాహుల్లను అరెస్ట్ చేయడం యువతలో మజిల్ మేనియాకు.. ఈ ఇంజక్షన్ల విచ్చలవిడి విక్రయాలకు అద్దం పడుతోంది. – సాక్షి, హైదరాబాద్ కండల కోసం తహతహలాడే వారే టార్గెట్... సాధారణంగా పోటీలలో పాల్గొనే బాడీ బిల్డర్లు ఇంజక్షన్లను ఎంచుకుంటారు. గంటల తరబడి మజిల్ బిల్డింగ్ వర్కవుట్స్ చేయడానికి, పోటీల సమయానికి మజిల్స్ బాగా కనిపించేందుకు వాటిని వినియోగిస్తారు. అయితే అసాధారణ మార్గాల ద్వారా శరీరాన్ని బిల్డప్ చేయాలనే తపన ఉన్న యువకులకు కొన్ని జిమ్లలోని కోచ్లు ఈ ఇంజెక్షన్లు సిఫారసు చేస్తున్నారు. తక్కువ సమయంలోనే మంచి శరీరాకృతిని పొందుతారని చెబుతూ జిమ్ల యజమానులు ఇంజక్షన్లను అధిక ధరలకు విక్రయిస్తున్నారు. ఒక్కోటి సుమారు రూ. 300 పలికే ఇంజక్షన్ను కనీసం రూ. 1,500 నుంచి రూ. 2,000 వరకూ పెంచి అమ్ముతున్నారని సమాచారం. ఇంజక్షన్లను అక్రమంగా విక్రయిస్తున్న వారిలో జిమ్ ట్రైనర్ల నుంచి ఫార్మా, మెడికల్ రిప్రజెంటేటివ్స్ దాకా ఉన్నారు. డిమాండ్నుబట్టి పుణే, ఢిల్లీ వంటి నగరాల నుంచి కూడా ఇంజక్షన్లను వారు దిగుమతి చేసుకుంటున్నారు. వినియోగం... ప్రాణాంతకం ఈ ఇంజక్షన్లు యాంటిహైపోటెన్సివ్స్ అనే మందుల శ్రేణిలో భాగంగా వైద్యులు చెబుతున్నారు. వాటిని సాధారణంగా లోబీపీ చికిత్సలో భాగంగా వినియోగిస్తామని... రోగి రక్తపోటును సాధారణ స్థితికి చేర్చడానికి ఆపరేషన్ థియేటర్లలో సర్జరీల సమయంలో వినియోగిస్తామని వైద్యులు అంటున్నారు. ఇది ఒక వ్యక్తి గుండె స్పందనను ఆకస్మికంగా పెంచేందుకు కూడా కారణమవడంతో అది కఠినమైన వర్కవుట్స్ చేసేందుకు ఉ్రత్పేరకంగా పనిచేస్తుందని వివరించారు. అయితే పర్యవేక్షణ లేని మెఫెంటెర్మైన్ ఇంజక్షన్ల వినియోగం వల్ల యువకుల్లో సైకోసిస్ లక్షణాలు పెరిగిపోతాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. వాటిని దీర్ఘకాలం వాడితే అలవాటుగా మారి చర్మంపై దద్దుర్లు, రక్తపోటులో హెచ్చుతగ్గులు, శ్వాస ఆడకపోవడం, నిద్రలేమి, వికారం, వాంతులు, దృష్టి లోపాలు, భ్రాంతులు.. చివరకు గుండెపోటుకు కూడా సంభవించొచ్చని స్పష్టం చేస్తున్నారు. -
త్వరలో పేరెంట్స్గా ప్రమోషన్.. బుల్లితెర జంట కుప్పిగంతులు, ట్రోలింగ్
బిగ్బాస్ జోడీ సింగర్ రాహుల్.. నటి దిశా పార్మర్ త్వరలో పేరెంట్స్గా ప్రమోషన్ పొందనుండటంతో వారి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఇటీవలే మెటర్నటీ ఫోటోషూట్ కూడా చేసి ఆయా ఫోటోలను ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశారు. అయితే మెటర్నటీ షూట్ సందర్భంలో చేసిన చిలిపి పనులను, కుప్పి గంతులను తాజాగా వీడియో రూపంలో రిలీజ్ చేశారు. నలుపు రంగు దుస్తుల్లో ఉన్న రాహుల్- దిశా సంతోషంతో ఎగిరి గంతేస్తున్నారు. దిశా బేబీ బంప్ను ఆప్యాయంగా తడుముతూ ముద్దు పెట్టాడు రాహుల్. అభిమానులు వీరి ఆనందాన్ని చూసి మురిసిపోతుంటే మరికొందరు మాత్రం ఇంత ఓవరాక్షన్ అవసరమా? అని కామెంట్లు చేస్తున్నారు. ప్రెగ్నెన్సీని కూడా అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నారు, ప్రపంచంలో పిల్లలను కంటున్న మొదటి జంట మీదే అన్నట్లుగా బిల్డప్ ఇస్తున్నారే అని ట్రోల్ చేస్తున్నారు. అలా మొదలైంది.. సింగర్ రాహుల్ హిందీ బిగ్బాస్ 14వ సీజన్లో పాల్గొన్నాడు. వీకెండ్ కా వార్ ఎపిసోడ్లో దిశా బిగ్బాస్ ఇంట్లో ఎంట్రీ ఇచ్చింది. ఈ క్రమంలో ఆమె బర్త్డే రోజు తన మనసులో ఉన్న ప్రేమను బయటపెట్టాడు రాహుల్. మోకాళ్ల మీద కూర్చుని పెళ్లి చేసుకోమని అడిగాడు. అందుకు ఆమె పచ్చజెండా ఊపడంతో 2021 జూలై 16న పెద్దల సమక్షంలో వీరి పెళ్లి జరిగింది. 2023 మే 18న అమ్మానాన్న కాబోతున్నామంటూ రాహుల్, దిశ గుడ్న్యూస్ చెప్పారు. View this post on Instagram A post shared by Disha Parmar Vaidya (@dishaparmar) చదవండి: మళ్లీ పెళ్లి ఏ ఓటీటీలోకి రానుందంటే? -
సింటెక్స్ మాజీ ఎండీకి ఎన్సీఎల్ఏటీలో ఎదురుదెబ్బ
న్యూఢిల్లీ: కార్పొరేట్ దివాలా ప్రక్రియకు వ్యతిరేకంగా సింటెక్స్ ఇండస్ట్రీస్ మాజీ చైర్మన్, ఎండీ రాహుల్ అరుణ్ప్రసాద్ పటేల్ దాఖలు చేసిన పిటిషన్ను నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్ (ఎన్సీఎల్ఏటీ) కొట్టివేసింది. సింటెక్స్ ఇండస్ట్రీస్పై కార్పొరేట్ దివాలా ప్రక్రియ(సీఐఆర్పీ)ను ఆమోదిస్తూ, 2021 ఏప్రిల్ 6న ఎన్సీఎల్టీ అహ్మదాబాద్ బెంచ్ ఇచ్చిన తీర్పును ఇద్దరు సభ్యుల ఎన్సీఎల్ఏటీ బెంచ్ తాజాగా సమర్థించింది. ఇన్వెస్కో అసెట్ మేనేజ్మెంట్(ఇండియా) అభ్యర్థనకు అనుగుణంగా అహ్మదాబాద్ బెంచ్ గతంలో సింటెక్స్పై ఐసీఆర్పీకి ఆదేశాలు జారీ చేసింది. ఈ అంశాన్ని వ్యతిరేకిస్తూ రాహుల్ అరుణ్ప్రసాద్ పెట్టుకున్న అభ్యర్ధనలో ఎలాంటి మెరిట్ కనిపించలేదని బెంచ్ పేర్కొంది. దీంతో మధ్యంతర అప్పీల్ను తిరస్కరిస్తున్నట్లు స్పష్టం చేసింది. కాగా.. సింటెక్స్ ఇండస్ట్రీస్పై సీఐఆర్పీ దాదాపు పూర్తికానుంది. డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్, అసెట్స్ కేర్ అండ్ రీకన్స్ట్రక్షన్ ఎంటర్ప్రైజ్ సంయుక్తంగా వేసిన బిడ్కు 98.88 శాతం వోటింగ్ లభించింది. వెరసి 2023 ఫిబ్రవరి 10న ఎన్సీఎల్టీ రుణ పరిష్కార ప్రణాళికను ఆమోదించింది. -
అప్పులే దారుణానికి ఒడిగట్టేలా చేశాయి.. వీడిన టెక్కీ రాహుల్ అదృశ్యం మిస్టరీ
సాక్షి, కోలారు: బెంగళూరు రూరల్లోని బాగలూరులో నివాసం ఉండే టెక్కీ రాహుల్(27) తన మూడేళ్ల వయసున్న కుమార్తెతో కలిసి ఈనె 16న కోలారులోని కెందెట్టి చెరువులో దూకాడన్న మిస్టరీ వీడింది. కుమార్తెను నీటిలోకి తోసి హత్య చేసి అనంతరం ఆచూకీ లేకుండా పోయిన టెక్కీ ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. గుజరాత్కు చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ రాహుల్.. భవ్య అనే యువతిని ప్రేమించి వివాహం చేసుకున్నాడు. వీరికి జియా అనే కూతురు ఉంది. ఏడాదిన్నర క్రితం ఉద్యోగం కోల్పోయిన రాహుల్ బిట్ కాయిన్లో డబ్బు పెట్టుబడి పెట్టి నష్టపోయాడు. ఖర్చుల కోసం విపరీతంగా అప్పులు చేయడంతో అప్పులబాధ ఎక్కువైంది. గతంలో ఇంట్లో బంగారం చోరీ అయిందని తప్పుడు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో పోలీసులు విచారణకు హాజరు కావాలని తెలపడంతో రాహుల్ భయపడ్డాడు. ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయం కూతురిని స్కూల్కు వదలి రావడానికి కారులో బయలుదేరిన సమయంలోనే అప్పుల వారు ఇంటి వద్దకు వచ్చి వేధించడంతో ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. తాను చనిపోతే భార్య కూతురును సరిగా చూడదని భావించి కూతురుతో సహా ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. నవంబర్ 15వ తేదీన కూతురిని స్కూల్కు వదిలి వస్తానని కారులో బయలుదేరి నేరుగా కోలారు జాతీయ రహదారి పక్కనే ఉన్న కెందట్టి చెరువు వద్దకు వచ్చాడు. చదవండి: (మహా నగరంలో మాయగాడు.. సివిల్ సప్లయీస్ డెప్యూటీ కలెక్టర్నంటూ..) కూతురిని కారులోనే ఊపిరాడకుండా చేసి చంపి మృతదేహాన్ని చెరువులో పారవేశాడు. అనంతరం తాను కూడా చెరువులోకి దూకాడు. అయితే లోతు తక్కువగా ఉండడం వల్ల బతికి పోయాడు. ఎలాగైనా చనిపోవాలని భావించిన రాహుల్ రైలు కిందపడేందుకు బంగారుపేట రైల్వే స్టేషన్కు చేరుకున్నాడు. రైలు కింద దూకడానికి భయపడి పలు ప్రాంతాల్లో రైలులోనే తిరిగి చివరికి చెన్నై చేరుకున్నాడు. చెన్నైలో తన సంబందీకులకు ఫోన్ చేసి తనను ఎవరో కిడ్నాప్ చేశారని నాటకం ఆడాడు. మొబైల్ నెట్వర్క్ ఆధారంగా రాహుల్ ఆంధ్రప్రదేశ్ నుంచి బెంగళూరుకు రైలులో వస్తున్నాడని తెలుసుకుని గురువారం రాత్రి పోలీసులు అతనిని అరెస్టు చేశారు. పోలీసు విచారణలో రాహుల్ అన్ని విషయాలు బయటపెట్టాడు. -
వైశాలి సూసైడ్ కేసు..సంచలన విషయాలు బయటపెట్టిన సహనటుడు..!
బాలీవుడ్ బుల్లితెర నటి వైశాలి టక్కర్ ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈ కేసులో ప్రధాన నిందితుడైన ఆమె మాజీ బాయ్ఫ్రెండ్ రాహుల్ నవ్లానీతో పాటు అతని భార్య దిశను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమె ఆత్మహత్యపైసహనటుడు నిశాంత్ సంచలన విషయాలు బయటపెట్టాడు. వైశాలి సూసైడ్ చేసుకునేలా రాహుల్ చిత్రహింసలకు గురిచేశాడని నిశాంత్ మల్ఖానీ ఆరోపించారు. రాహుల్తో వైశాలి సన్నిహితంగా ఉన్న ఫోటోలు బహిర్గతం చేస్తానని పలుసార్లు బెదిరింపులకు పాల్పడ్డారని తెలిపారు. వైశాలి ఆత్మహత్య తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని నిశాంత్ అన్నారు. ఆమె తనతో వ్యక్తిగత విషయాలను పంచుకునేదని వెల్లడించారు. నిశాంత్ మల్ఖానీ కథానాయకుడిగా నటించిన రక్షాబంధన్ - రసల్ అప్నే భాయ్ కి ధాల్ షోలో వైశాలి కూడా భాగమైంది. ('చదవండి: నటి వైశాలి సూసైడ్ కేసులో నిందితుడు రాహుల్ అరెస్ట్) రాహుల్ పెళ్లి చేసుకున్నా కూడా ఆమెను వేధిస్తూనే ఉన్నాడని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో నిశాంత్ మల్ఖానీ తెలిపారు. వైశాలి నిశ్చితార్థం జరిగిన తర్వాత వేధింపులు మరింత ఎక్కువయ్యాయని పేర్కొన్నారు. వైశాలికి కాబోయే భర్తకు మెసేజ్లు పంపి ఆమెను మానసికంగా హింసించేవాడని వెల్లడించారు. రాహుల్ వేధింపులకు తట్టుకోలేక డిప్రెషన్లో ఉన్న వైశాలి మానసిక వైద్యుడిని కూడా సంప్రదించిందని అన్నారు. రాహుల్ వైశాలితో ఉన్న సన్నిహిత చిత్రాలను కాబోయే భర్తకు చూపిస్తానని బెదిరించడంతోనే ఆత్మహత్య చేసుకుందని నిశాంత్ వెల్లడించారు. -
తీవ్ర విషాదం.. 'ఛెల్లో షో' మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ మృతి
సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆర్ఆర్ఆర్ సినిమాను సైతం వెనక్కు నెట్టి.. ఆస్కార్కు నామినేట్ అయిన ఛెల్లో షో (ద లాస్ట్ షో) సినిమాలో నటించిన బాల నటుడు రాహుల్ కోలీ (10) కన్నుమూశారు. గత కొంతకాలంగా క్యాన్సర్తో పోరాడుతున్న రాహుల్ తుదిశ్వాస విడిచాడు. కాగా ఛెల్లో షో సినిమా ఈనెల 14న విడుదల కానుంది. అంతలోనే రాహుల్ మరణించడంతో చిత్రబృందంతో పాటు కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. పదేపదే జ్వరం బారిన పడుతున్న రాహుల్, ఇటీవలె రక్తపు వాంతులు చేసుకున్నాడని రాహుల్ తండ్రి రాము కోలీ తెలిపారు. అక్టోబర్ 2న ఆసుపత్రిలో చికిత్స పొందుతూనే తము కళ్ల ముందే బిడ్డ చనిపోయాంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నెల 14వ తేదీన తాము ఛెల్లో షో సినిమా చూడాలనుకున్నామని, కానీ ఇంతలోనే తమ కుమారుడు తిరిగిరాని లోకాలకు వెళ్లాలండూ రాహుల్ తండ్రి కన్నీటిపర్యంతం అయ్యాడు. కాగా సినిమాలపై ఎంతో ఇష్టం కలిగిన తొమ్మిదేళ్ల యువకుడి జీవితం ఎలా సాగిందన్న నేపథ్యంతో ఛెల్లో షో సినిమా సాగుతుంది. ఇందులో మొత్తం ఆరుగురు పిల్లలు నటించగా వారిలో రాహుల్ కోలీ ఒకడు. అతని మృతి పట్ల పలువురు ప్రముఖులు, నెటిజన్లు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. -
‘రాహుల్ అంటే భారత్.. భారత్ అంటే రాహుల్’
లక్నో: భారత్ జోడో యాత్ర చేబడుతున్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై ప్రశంసలు కురిపించారు ఉత్తర్ప్రదేశ్ పార్టీ నూతన అధ్యక్షుడు బ్రిజ్లాల్ ఖబ్రీ. రాహుల్ అంటే భారత్.. భారత్ అంటే రాహుల్ అని నినదించారు. దేశాన్ని, రాజ్యాంగాన్ని కాపాడటమే లక్ష్యంగా రాహుల్ భారత్ జోడో యాత్ర చేబడుతున్నారని నొక్కి చెప్పారు. యూపీసీసీ అధ్యక్షుడిగా ఎన్నికైన క్రమంలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు దేవ్ కాంత్ బరూవా పాపులర్ డైలాగ్ ‘ఇండియా అంటే ఇందిరా, ఇందిరా అంటే ఇండియా’ను ఉద్ఘాటించారు. ఈ నినాదాన్ని తరుచుగా ప్రత్యర్థులు ఉపయోగిస్తూ కాంగ్రెస్ పార్టీ, గాంధీలపై విమర్శలు చేస్తుంటారు. ఎన్నికల పరంగా కీలకమైన ఉత్తర్ప్రదేశ్లో కేవలం ఒకే ఒక్క జిల్లా బులంద్షహర్లో మాత్రమే రాహుల్ భారత్ జోడో యాత్ర చేపట్టటంపై ప్రశ్నించగా.. వివరణ ఇచ్చారు ఖబ్రీ. ‘భారత్ అంటే ఒక జిల్లా కాదు, ఒక రాష్ట్రం కాదు. రాష్ట్రాల సమహారం. రాహుల్ 13 రాష్ట్రాల్లో యాత్ర చేస్తారు. ఆయనకు పెద్ద లక్ష్యం ఉంది. బీజేపీ ప్రభుత్వం దేశాన్ని అమ్మేసి రాజ్యాంగాన్ని నాశనం చేయాలని చూస్తోంది. 2024 ఎన్నికల్లో యూపీ మొత్తం 80 సీట్లు గెలవాలని కాంగ్రెస్ లక్ష్యంగా పెట్టుకుంది. బరేలీ, అమేఠీల్లో బీజేపీ డిపాజిట్లు కోల్పోతుంది. దేశాన్ని, రాజ్యాంగం, ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు రాహుల్ గాంధీ పాదయాత్ర చేపట్టారు. రాహుల్ పాదయాత్ర చేస్తే కొందరికి కడుపు మంట ఎందుకు వస్తోంది? లక్షల మంది రాహుల్తో కలిసి నడుస్తున్నారు. రాహుల్ అంటే భారత్, భారత్ అంటే రాహుల్ అని చెప్పగలను.’ అని పేర్కొన్నారు ఖబ్రీ. కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టటంపై సంతోషం వ్యక్తం చేశారు ఖబ్రీ. రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన ప్రణాళిక, వ్యూహాలను క్షేత్రస్థాయి నుంచి తీసుకొస్తామని తెలిపారు. 2024 ఎన్నికల్లో ఉత్తర్ప్రదేశ్లోని మొత్తం స్థానాలను గెలవాలనే లక్ష్యంగా పని చేస్తామన్నారు. ఇదీ చదవండి: కార్పొరేట్లకు కాదు, గుత్తాధిపత్యాలకే వ్యతిరేకం -
ఆ బాలుడు మృత్యుంజయుడు.. అయిదు రోజులు బోరుబావిలో ఉండి..
జనిగిరి: చుట్టూ చిమ్మ చీకటి, 68 అడుగుల లోతైన బోరుబావిలో పాము, తేళ్లు, కప్పలు తిరుగుతూ ఉంటే మానసిక వికలాంగుడైన 11 ఏళ్ల బాలుడు దాదాపు 5 రోజులు గడిపాడు. బావిలో ఆడుకుంటూ పడిపోయిన రాహుల్ సాహు అనే బాలుడు బుద్ధిమాంద్యం ఉన్నప్పటికీ అంతులేని ధైర్యాన్ని ప్రదర్శించాడు. ఎట్టకేలకు 104 గంటల సేపు శ్రమించిన 500 మంది సహాయ సిబ్బంది రోబో సాంకేతికతో బయటకు తీసుకువచ్చారు. బావిలో ఉన్న పాము ఆ బాలుడిని ఏమీ చేయలేదని సహాయ సిబ్బంది వెల్లడించారు. ఛత్తీస్గఢ్లోని జహ్నగిరి–చంపా జిల్లాలోని పిర్హిడ్ గ్రామంలో రాహుల్ సాహు బోరు బావిలో పడిపోయిన ఘటన ఈ నెల 10న జరిగింది. రామ్కుమార్, గీతాసాహుల కుమారుడైన రాహుల్ శుక్రవారం మధ్యాహ్నం భోజనం చేశాక ఆడుకోవడానికి పొలాల్లోకి వెళ్లాడు. బోరు తవ్వి నీళ్లు పడకపోవడంతో దానిపై ఒక షీట్ కప్పి ఉంచారు. రాహుల్ సాహు మానసికంగా పూర్తిగా ఎదగకపోవడంతో ఆ షీట్ చూసుకోలేదేమో ఏమో బావిలోకి జారిపోయాడు. విషయం తెలిసిన వెంటనే హుటాహుటిన రంగంలోకి దిగిన సహాయ సిబ్బంది సమాంతరంగా మరో బోరు తవ్వినా మొదట్లో ఉపయోగం లేకుండా పోయింది. ఆ తర్వాత అయిదు రోజులు శ్రమించి రోబో టెక్నాలజీ సాయంతో ఆ బాలుడిని మంగళవారం అర్ధరాత్రి క్షేమంగా బయటకు తీసుకువచ్చారు. రాహుల్కి ప్రథమ చికిత్స చేసిన అనంతరం బిలాస్పూర్లోని అపోలో ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం రాహుల్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. మానసిక వికలాంగుడైనప్పటికీ రాహుల్ సాహు మొదట్నుంచి పోరాటపటిమ ప్రదర్శించేవాడు. సైకిల్ తొక్కడం, ఈత కొట్టడం వంటివి చేసేవాడు. తబలా కూడా బాగా వాయిస్తాడని తల్లిదండ్రులు చెప్పారు. -
బన్నీని మెగాస్టార్గా అభివర్ణించిన క్రికెటర్!
'పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా ఫైరూ..', 'పుష్ప.. పుష్పరాజ్.. తగ్గేదేలే..' ఎక్కడ చూసినా ఈ పుష్ప డైలాగులు, పాటలు మార్మోగిపోతున్నాయి. సౌత్ ,నార్త్ తేడా లేకుండా అంతటా పుష్ప ప్రభంజనమే కనిపిస్తోంది. సినిమా వచ్చి 20 రోజులవుతున్నా దాని క్రేజ్ మాత్రం ఇసుమంతైనా తగ్గలేదు. బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల మోత మోగిస్తున్న ఈ సినిమాను ఈ మధ్యే టీమిండియా ఆటగాళ్లు వీక్షించిన విషయం తెలిసిందే. తాజాగా మరో ఇండియన్ క్రికెటర్ రాహుల్ శర్మ 'పుష్ప' చిత్రాన్ని వీక్షించాడు. ఇదే విషయాన్ని ఆయన ట్విటర్లో వెల్లడించాడు. 'పుష్ప సినిమా చూశాను. మొదటిసారి దక్షిణాది చిత్రం చూసి అద్భుతంగా ఫీలయ్యాను. మరీ ముఖ్యంగా మెగాస్టార్ అల్లు అర్జున్ మరో లెవల్లో కనిపించాడు. రష్మిక మందన్నా కూడా అదరగొట్టేసింది. పుష్ప టీమ్ మొత్తానికి శుభాకాంక్షలు' అని రాసుకొచ్చాడు. ఇది చూసిన బన్నీ.. 'పుష్ప చిత్రం మీకు నచ్చినందుకు సంతోషంగా ఉంది. మీ ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు' అంటూ రిప్లై ఇచ్చాడు. అయితే ఇది చూసిన సినీప్రియులు మాత్రం ఈయనేంటి? బన్నీని మెగాస్టార్ అని పిలిచాడు? అంటూ కామెంట్లు చేస్తున్నారు. Saw #pushpa last night , wow what a experience to watch South movies first time in 🎭! Specially my fav megastar @alluarjun u r another level ❤️✊👏👏👏 and @iamRashmika u r amazing too 😊👏👏 congrats to the team Pushpa 😊🙌 — Rahul Sharma (@ImRahulSharma3) January 4, 2022 -
సింగర్ రాహుల్ను చంపేస్తామంటూ బెదిరింపు కాల్స్
Rahul Vaidya Gets Death Threats : ప్రముఖ సింగర్, బిగ్బాస్14 రన్నరప్ రాహుల్ వైద్య వివాదంలో చిక్కుకున్నారు. ఇటీవలె నవరాత్రి స్పెషల్ సందర్బంగా రాహుల్ ‘గర్బే కి రాత్’అనే పాటను కంపోజ్ చేశాడు. రాహుల్, భూమి త్రివేది కలిసి పాడిన ఈ పాట విడుదలైన కాసేపటికే తీవ్ర వివాదాస్పదం అయ్యింది. తమ మనోభావాలను కించపరిచే విధంగా పాటను కంపోజ్ చేశారంటూ సోషల్ మీడియాలో తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ పాటలో గుజరాతీ జానపద పాట 'రమ్వా ఆవో మది' అనే పదాన్ని అభ్యంతరకరంగా ఉపయోగించారంటూ గుజరాతీలు ఆగ్రహం వ్యక్తం చేశారు.తమ ఆచారాలను కించపరిచారనే కారణంతో రాహుల్, భూమి త్రివేదిలపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఇద్దరిపై ఎఫ్ఐఆర్ నమోదైంది. అయితే ఇప్పటికీ బెదిరింపులు ఆగడం లేదని, రాహుల్ను కొడతం, చంపేస్తామంటూ గుర్తు తెలియని వ్యక్తుల నుంచి ఫోన్ కాల్స్ వస్తున్నాయంటూ రాహుల్ టీం పేర్కొంది. మనోబావాలను దెబ్బతీయడం తమ ఉద్దేశం కాదని, ఆ పదాలు తీసేయడానికి తమ బృందం పని చేస్తుదని తెలిపారు. అప్పటివరకు అందరూ శాంతంగా ఉండాలని, దాన్ని సరిదిద్దడానికి కొంచెం సమయం ఇవ్వాల్సిందిగా కోరారు. చదవండి: త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కనున్న హీరో సాయితేజ్? పెళ్లికాకుండా బిడ్డను కనకుండా ఉండాల్సింది: నటి -
ట్విట్టర్ వార్ కేటీఆర్ V/S రేవంత్
-
Rahul Case Update: మరింత లోతుగా దర్యాప్తు ముమ్మరం
-
రాహుల్ హత్య కేసు: పోలీసుల అదుపులో గాయత్రి?
-
రాహుల్ హత్య కేసు: పోలీసుల అదుపులో గాయత్రి?
సాక్షి, విజయవాడ: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన వ్యాపారి కరణం రాహుల్ హత్య కేసులో కీలక నిందితురాలైన గాయత్రి పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలిసింది. నేడు విజయవాడ కోర్టులో గాయత్రిని హాజరుపరిచే అవకాశం ఉంది. ఇప్పటికే రాహుల్ హత్య కేసులో 11 మందిని పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. తన కూతురికి ఎయిమ్స్లో మెడికల్ సీటు ఇప్పించాలని రాహుల్కు గాయత్రి రూ.6 కోట్లు ఇచ్చింది. మెడికల్ సీటు రాకపోగా ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వకపోవడంతో విజయకుమార్, కోగంటి సత్యంలతో కలిసి రాహుల్ హత్యకు కుట్ర పన్నినట్లు పోలీసులు వెల్లడించిన విషయం విదితమే. కాగా, ఈ హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న కోగంటి సత్యాన్ని గురువారం పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. ఆయనను విజయవాడ సబ్జైలు నుంచి మాచవరం పీఎస్కు తరలించారు. ఇవీ చదవండి: చార్జర్ వైర్తో చంపేశారు... ఇలాంటి పందుల పోటీలు ఎప్పుడైనా చూశారా? -
రాహుల్ హత్య కేసు: పోలీసు కస్టడీకి కోగంటి సత్యం
సాక్షి, విజయవాడ: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన వ్యాపారి కరణం రాహుల్ హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న కోగంటి సత్యాన్ని గురువారం పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా కోగంటి సత్యాన్ని విజయవాడ సబ్జైలు నుంచి మాచవరం పీఎస్కు తరలించారు. కాగా పోలీసులు రాహుల్ హత్య కేసు విషయమై కోగంటి సత్యాన్ని నేడు, రేపు విచారించనున్నారు. ఇక ఈ హత్య కేసులో ఇప్పటివరకు 11 మందిని అరెస్ట్ అయ్యారు. పరారీలో ఉన్న మరో ఇద్దరి కోసం పోలీసులు గాలిస్తున్నారు. రాహుల్ హత్యకు కారణాలివే.. కోరాడ విజయ్కుమార్, ఆయన స్నేహితురాలు గాయత్రి గత కొన్నేళ్లుగా కోరాడ చిట్ఫండ్ కంపెనీ నడుపుతున్నారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్కుమార్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయారు. ఎన్నికల్లో భారీగా ఖర్చు చేసి నష్టపోయిన ఆయనపై అప్పులవాళ్లు తమ డబ్బు ఇవ్వాలని తీవ్ర ఒత్తిడి చేయసాగారు. మరోవైపు చిట్ఫండ్ కంపెనీ డబ్బు సైతం ఎన్నికల్లో వినియోగించడంతో.. అక్కడా ఒత్తిళ్లు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో రాహుల్, విజయ్కుమార్ భాగస్వామ్యంలో నిర్వహిస్తున్న జిక్సిన్ సిలిండర్స్ కంపెనీలోని తన వాటా తీసుకుని డబ్బు ఇవ్వాల్సిందిగా విజయ్కుమార్ రాహుల్ను కోరాడు. అయితే ఈ విషయంలో స్పందించకపోవడంతో రాహుల్పై ఆగ్రహంతో ఉన్నాడు. ఇదిలా ఉండగా విజయ్కుమార్ స్నేహితురాలు గాయత్రికి రాహుల్ రూ.6 కోట్లు ఇవ్వాల్సి ఉంది. ఆమెకు సైతం ఆ డబ్బు తిరిగి ఇవ్వకపోవడంతో తీవ్ర అసంతృప్తితో ఉంది. అలాగే జిక్సిన్ సిలిండర్స్ కంపెనీలో పనిచేస్తున్న సీతయ్యకు లాజిస్టిక్స్ బిజినెస్లో కాంట్రాక్ట్ ఇస్తానని హామీ ఇచ్చి నేరవేర్చకపోవడంతో రాహుల్పై కక్ష పెంచుకున్నాడు. ఈ పరిస్థితులే రాహుల్ హత్యకు దారితీశాయి. చదవండి: రాహుల్ హత్య కేసు: మరో నలుగురు అరెస్ట్ రాహుల్ హత్యకేసు: వెలుగులోకి సంచలన విషయాలు -
రాహుల్ హత్య కేసు: మరో నలుగురు అరెస్ట్
సాక్షి, విజయవాడ: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన యువ వ్యాపారవేత్త కరణం రాహుల్ హత్య కేసులో మరో నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీతయ్య, బాబురావు, రాజబాబు, కరణం రమేష్లను అరెస్ట్ చేశారు. ఇప్పటివరకు 13 మందిలో 11 మంది నిందితులు అరెస్ట్ అయ్యారు. మిగిలిన ఇద్దరు నిందితుల కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. ఈ హత్య కేసులో ప్రధాన నిందితులను పోలీసులు విచారిస్తున్నారు. హత్యకు కారణాలివే.. కోరాడ విజయ్కుమార్, ఆయన స్నేహితురాలు గాయత్రి గత కొన్నేళ్లుగా కోరాడ చిట్ఫండ్ కంపెనీ నడుపుతున్నారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్కుమార్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయారు. ఎన్నికల్లో భారీగా ఖర్చు చేసి నష్టపోయిన ఆయనపై అప్పులవాళ్లు తమ డబ్బు ఇవ్వాలని తీవ్ర ఒత్తిడి చేయసాగారు. మరోవైపు చిట్ఫండ్ కంపెనీ డబ్బు సైతం ఎన్నికల్లో వినియోగించడంతో.. అక్కడా ఒత్తిళ్లు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో రాహుల్, విజయ్కుమార్ భాగస్వామ్యంలో నిర్వహిస్తున్న జిక్సిన్ సిలిండర్స్ కంపెనీలోని తన వాటా తీసుకుని డబ్బు ఇవ్వాల్సిందిగా విజయ్కుమార్ రాహుల్ను కోరాడు. అయితే ఈ విషయంలో స్పందించకపోవడంతో రాహుల్పై ఆగ్రహంతో ఉన్నాడు. ఇదిలా ఉండగా విజయ్కుమార్ స్నేహితురాలు గాయత్రికి రాహుల్ రూ.6 కోట్లు ఇవ్వాల్సి ఉంది. ఆమెకు సైతం ఆ డబ్బు తిరిగి ఇవ్వకపోవడంతో తీవ్ర అసంతృప్తితో ఉంది. అలాగే జిక్సిన్ సిలిండర్స్ కంపెనీలో పనిచేస్తున్న సీతయ్యకు లాజిస్టిక్స్ బిజినెస్లో కాంట్రాక్ట్ ఇస్తానని హామీ ఇచ్చి నేరవేర్చకపోవడంతో రాహుల్పై కక్ష పెంచుకున్నాడు. ఈ పరిస్థితులే రాహుల్ హత్యకు దారితీశాయి. ఇవీ చదవండి: రాహుల్ హత్య: చార్జర్ వైర్తో చంపేశారు మనబడి నాడు-నేడు: టీచర్గా మారిన ఎమ్మెల్యే రోజా -
రాహుల్ హత్య కేసులో మరో నలుగురు నిందితుల అరెస్ట్
-
రాహుల్ హత్య కేసును ఛేదించిన విజయవాడ పోలీసులు
-
చార్జర్ వైర్తో చంపేశారు...
గుణదల (విజయవాడ తూర్పు): ఏపీలో సంచలనం రేకెత్తించిన యువ వ్యాపారవేత్త కరణం రాహుల్ హత్య కేసు మిస్టరీ వీడింది. సెల్ఫోన్ చార్జర్ వైర్ మేడకు బిగించి, దిండుతో ఊపిరాడకుండా చేసి రాహుల్ను చంపేశారని విజయవాడ నగర పోలీస్ కమిషనర్ బత్తిన శ్రీనివాసులు తెలిపారు. కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి కీలక ఆధారాలు సేకరించి, పలువురు నిందితులను శుక్రవారం అరెస్టు చేశారు. కేసుకు సంబంధించిన పలు కీలక విషయాలను కమిషనర్ శుక్రవారం మీడియాకు వివరించారు. ఆర్థిక లావాదేవీలే ముఖ్య కారణం.. కోరాడ విజయ్కుమార్, ఆయన స్నేహితురాలు గాయత్రి గత కొన్నేళ్లుగా కోరాడ చిట్ఫండ్ కంపెనీ నడుపు తున్నారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్కుమార్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయారు. ఎన్నికల్లో భారీగా ఖర్చు చేసి నష్టపోయిన ఆయనపై అప్పులవాళ్లు తమ డబ్బు ఇవ్వాలని తీవ్ర ఒత్తిడి చేయసాగారు. మరోవైపు చిట్ఫండ్ కంపెనీ డబ్బు సైతం ఎన్నికల్లో వినియోగించడంతో.. అక్కడా ఒత్తిళ్లు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో రాహుల్, విజయ్కుమార్ భాగస్వామ్యంలో నిర్వహిస్తున్న జిక్సిన్ సిలెండర్స్ కంపెనీలోని తన వాటా తీసుకుని డబ్బు ఇవ్వాల్సిందిగా విజయ్కుమార్ రాహుల్ను కోరాడు. అయితే ఈ విషయంలో స్పందించకపోవడంతో రాహుల్పై ఆగ్రహంతో ఉన్నాడు. ఇదిలా ఉండగా విజయ్కుమార్ స్నేహితురాలు గాయత్రికి రాహుల్ రూ.6 కోట్లు ఇవ్వాల్సి ఉంది. ఆమెకు సైతం ఆ డబ్బు తిరిగి ఇవ్వకపోవడంతో తీవ్ర అసంతృప్తితో ఉంది. అలాగే జిక్సిన్ సిలెండర్స్ కంపెనీలో పనిచేస్తున్న సీతయ్యకు లాజిస్టిక్స్ బిజినెస్లో కాంట్రాక్ట్ ఇస్తానని హామీ ఇచ్చి నేరవేర్చపోవడంతో రాహుల్పై కక్ష పెంచుకున్నాడు. ఈ పరిస్థితులే రాహుల్ హత్యకు దారితీశాయి. నిందితుల అరెస్టు.. మృతుని తండ్రి కరణం రాఘవరావు మాచవరం పోలీస్స్టేషన్లో ఇచ్చిన పిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. దర్యాప్తు ప్రారంభించిన పది రోజుల వ్యవధిలోనే కీలక ఆధారాలు సేకరించి, పరారీలో ఉన్న నిందితుల్లో ఆరుగురిని శుక్రవారం అరెస్టు చేశారు. -
రాహుల్ హత్య.. కారణాలివే: విజయవాడ సీపీ
-
రాహుల్ హత్య: చార్జర్ వైర్తో చంపేశారు
గుణదల (విజయవాడ తూర్పు) : రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన యువ వ్యాపారవేత్త కరణం రాహుల్ హత్య కేసు మిస్టరీ వీడింది. సెల్ఫోన్ చార్జర్ వైర్ మెడకు బిగించి, దిండుతో ఊపిరాడకుండా చేసి రాహుల్ను చంపేశారని విజయవాడ నగర పోలీస్ కమిషనర్ బత్తిన శ్రీనివాసులు తెలిపారు. కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి కీలక ఆధారాలు సేకరించి, పలువురు నిందితులను శుక్రవారం అరెస్టు చేశారు. కేసుకు సంబంధించిన పలు కీలక విషయాలను కమిషనర్ శుక్రవారం మీడియాకు వివరించారు. ఆర్థిక లావాదేవీలే ముఖ్య కారణం.. కోరాడ విజయ్కుమార్, ఆయన స్నేహితురాలు గాయత్రి గత కొన్నేళ్లుగా కోరాడ చిట్ఫండ్ కంపెనీ నడుపుతున్నారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్కుమార్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయారు. ఎన్నికల్లో భారీగా ఖర్చు చేసి నష్టపోయిన ఆయనపై అప్పులవాళ్లు తమ డబ్బు ఇవ్వాలని తీవ్ర ఒత్తిడి చేయసాగారు. మరోవైపు చిట్ఫండ్ కంపెనీ డబ్బు సైతం ఎన్నికల్లో వినియోగించడంతో.. అక్కడా ఒత్తిళ్లు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో రాహుల్, విజయ్కుమార్ భాగస్వామ్యంలో నిర్వహిస్తున్న జిక్సిన్ సిలిండర్స్ కంపెనీలోని తన వాటా తీసుకుని డబ్బు ఇవ్వాల్సిందిగా విజయ్కుమార్ రాహుల్ను కోరాడు. అయితే ఈ విషయంలో స్పందించకపోవడంతో రాహుల్పై ఆగ్రహంతో ఉన్నాడు. ఇదిలా ఉండగా విజయ్కుమార్ స్నేహితురాలు గాయత్రికి రాహుల్ రూ.6 కోట్లు ఇవ్వాల్సి ఉంది. ఆమెకు సైతం ఆ డబ్బు తిరిగి ఇవ్వకపోవడంతో తీవ్ర అసంతృప్తితో ఉంది. అలాగే జిక్సిన్ సిలిండర్స్ కంపెనీలో పనిచేస్తున్న సీతయ్యకు లాజిస్టిక్స్ బిజినెస్లో కాంట్రాక్ట్ ఇస్తానని హామీ ఇచ్చి నేరవేర్చకపోవడంతో రాహుల్పై కక్ష పెంచుకున్నాడు. ఈ పరిస్థితులే రాహుల్ హత్యకు దారితీశాయి. హత్య జరిగిందిలా.. ఈ నెల 18వ తేదీ రాత్రి విజయ్కుమార్తో పాటు సీతయ్య, బాబూరావు అనే వ్యక్తి కలిసి రాహుల్ను తమ కారులో సీతారామపురంలోని కోరాడ చిట్ఫండ్ కంపెనీకి తీసుకెళ్లారు. అక్కడ రాహుల్కు, విజయకుమార్కు కంపెనీల వాటాల విషయమై వాగ్వాదం జరిగింది. దీంతో విజయ్కుమార్ రాహుల్పై దాడి చేశాడు. కోగంటి సత్యం సూచన మేరకు అక్కడ నుంచి రాహుల్ను తీసుకుని దుర్గా కళామందిరం వద్దకు చేరుకున్నారు. అప్పటికే సిద్ధం చేసిన డాక్యుమెంట్లపై రాహుల్పై దాడి చేసి బలవంతంగా సంతకాలు చేయించుకున్నారు. అనంతరం పథకం ప్రకారం రాహుల్ను బందరు రోడ్డులో పార్క్ చేసిన కారు వద్దకు తెచ్చారు. కారులో ఎక్కాక రాహుల్కు విజయ్కుమార్, సీతయ్య, బాబురావు మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ముందు సీటులో ఉన్న రాహుల్ను చిత్రహింసలు పెట్టి.. సెల్ఫోన్ చార్జర్ వైర్ మెడకు బిగించి, దిండుతో ఊపిరాడకుండా చేసి చంపేశారు. నిందితుల అరెస్ట్.. మృతుని తండ్రి కరణం రాఘవరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. దర్యాప్తు ప్రారంభించిన పది రోజుల వ్యవధిలోనే కీలక ఆధారాలు సేకరించి, పరారీలో ఉన్న నిందితుల్లో ఆరుగురిని శుక్రవారం అరెస్టు చేశారు. ఇదిలా ఉండగా, రాహుల్ హత్య కేసులో మొత్తం 13 మందిని నిందితులుగా గుర్తించామని కమిషనర్ బత్తిన శ్రీనివాసులు తెలిపారు. కోరాడ విజయ్కుమార్ (ఏ1), నల్లూరు రవికాంత్ (ఏ14), కఠారపు కోటేశ్వరరావు అలియాస్ కోటి (ఏ10), కఠారపు గాంధీబాబు అలియాస్ గాంధీ (ఏ11), కిలారి అనంత సత్యనారాయణ (ఏ6), షేక్ మహబూబ్ జానీ (ఏ8)ని శుక్రవారం అరెస్టు చేశామని, కేసులో కీలక నిందితుడు, ప్రధాన సూత్రధారి కోగంటి సత్యంను ఈనెల 23న అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచామని వివరించారు. మిగిలిన ఆరుగురు నిందితులను కూడా 48 గంటల్లోపు అరెస్టు చేస్తామని కమిషనర్ చెప్పారు. కాగా, తొలుత 14 మంది నిందితులుగా గుర్తించినప్పటికీ ఓ మహిళ ప్రమేయంపై ఆధారాలు లేకపోవడంతో.. 13 మందినే నిందితులుగా గుర్తించామని పోలీసులు పేర్కొంటున్నారు. ఇవీ చదవండి: పవన్ కల్యాణ్ రాజకీయాలకు పనికిరాడు: ధర్మాన కృష్ణదాస్ అంతర్వేది సాగర తీరం.. విభిన్న స్వరూపం! -
రాహుల్ హత్య కేసు: మరో 11 మంది నేడు కోర్టు ముందుకు
-
రాహుల్ హత్య కేసు: మరో 11 మంది నేడు కోర్టు ముందుకు
సాక్షి, విజయవాడ: జిల్లాలో వ్యాపారి రాహుల్ హత్య సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో మరో 11 మంది నిందితులని పోలీసులు నేడు కోర్టు ముందు ప్రవేశపెట్టనున్నారు. ఇప్పటికే కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న కోగంటి సత్యం అరెస్ట్ కాగా.. మరో 11 మందిని అదుపులోకి తీసుకున్నారు. కోరాడ విజయ్ కుమార్, గాయత్రి, సీతయ్య, సుబ్బారావులతో పాటు మరో ఆరుగురిని గుర్తించారు. వీరందరిని వైద్య పరీక్షల అనంతరం సాయంత్రం కోర్టు ముందుకు తీసుకురానున్నారు. అనంతరం రాహుల్ హత్య కేసుపై కమిషనర్ మీడియాతో మాట్లాడనున్నారు. కాగా ఆర్థిక లావాదేవీల నేపథ్యంలోనే రాహుల్ను హత్య చేశారని, సాక్ష్యాదారాలను తారుమారు చేసేందుకు నిందితులు ప్రయత్నించారని పోలీసులు సీసీటీవీ, బ్యాంక్ లావాదేవీల ఆధారంగా ఇప్పటికే వెల్లడించారు. చదవండి: రాహుల్ హత్యకేసు: వెలుగులోకి సంచలన విషయాలు -
రాహుల్ హత్యకేసు: వెలుగులోకి సంచలన విషయాలు
సాక్షి, విజయవాడ: రాహుల్ హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రాహుల్ హత్యలో కోగంటి సత్యం ప్రధాన సూత్రధారి కాగా.. కోరాడ విజయ్కుమార్ పాత్రధారిగా వ్యవహరించాడు. వీరిద్దరు కలిసి రాహుల్ను అత్యంత దారుణంగా హత్య చేసినట్లు తెలిసింది. తలపై పలుమార్లు బలంగా మోదడంతో మెదడు నరాలు చిట్లాయి. కారులోనే తాడుతో గొంతుకి ఉరేసి చంపి మరొక తాడుని సంఘటనా స్ధలంలో ఉంచారు. సాక్ష్యాదారాలని తారుమారు చేయడానికి రకరకాల ఎత్తుగడలకు పాల్పడ్డారు. హత్య కోసం కొత్త ఫోన్లు, కొత్త సిమ్లు బినామీ పేర్లతో కొనుగోలు చేశారు. రాహుల్ హత్యకేసులో మొత్తం 12 మంది పాత్ర ఉన్నట్లు తెలిసింది. వాహనాలు మార్చి... మనుషులని మార్చి.. పోలీసులని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు. ఇక రాహుల్ హత్య జరిగిన ప్రాంతంలో ఉన్న వంద సీసీ కెమెరాలు, సెల్ఫోన్ కాల్డేటా, బ్యాంకు లావాదేవీలతో నిజాలు బయటపడ్డాయి. ఫ్యాక్టరీని కోగంటి సత్యానికి అమ్మేసి తన 30 శాతం వాటా డబ్బులు ఇవ్వాలని కోరాడ విజయ్ రాహుల్పై ఒత్తిడికి పాల్పడ్డారు. రాహుల్ మాట వినకపోవడంతో కోగంటి ఆదేశాలతో కారులోనే అతనిపై హత్యకు పాల్పడ్డారు ఇక వ్యాపారి కరణం రాహుల్ హత్య కేసులో ఏ2 నిందితుడు కోగంటి సత్యంకు విజయవాడ 1వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ 14 రోజుల రిమాండ్ విధించారు. నిందితుడిని మచిలీపట్నం సబ్ జైలుకు తరలించేందుకు ఎర్పాట్లు చేయవలసిందిగా పోలీసులను ఆదేశించారు. చదవండి: వ్యాపారి హత్య కేసులో కోగంటి సత్యంకు రిమాండ్ -
రాహుల్ హత్య కేసులో విచారణ ముమ్మరం
-
రాహుల్ హత్య కేసు: విజయవాడ మెజిస్ట్రేట్ ముందుకు కోగంటి సత్యం
విజయవాడ: పారిశ్రామికవేత్త రాహుల్ హత్య కేసులో కీలక నిందితుడిగా ఉన్న కోగంటి సత్యంను పోలీసులు విజయవాడ మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచనున్నారు. అంతకముందు కేసులో ఏ-2గా ఉన్న కోగంటి సత్యంను బెంగళూరులో అరెస్ట్ చేశారు. కాగా విజయవాడ విడిచివెళ్లొదంటూ రెండు రోజుల క్రితం కోగంటి సత్యంకు పోలీసులు నోటీసులు అందించారు. తాను విజయవాడలోనే ఉంటానని.. ఎప్పుడు పిలిచినా వస్తానని కోగంటి సత్యం పోలీసులకు వివరించాడు. అయితే సోమవారం మధ్యాహ్నం కోగంటి సత్యం విజయవాడ నుంచి బెంగళూరుకు వెళ్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో అప్రమత్తమై విజయవాడ మాచవరం పోలీసులు బెంగళూరు పోలీసులకు సమాచారం అందించగా.. సత్యంను బెంగళూరు ఎయిర్పోర్ట్లోనే అరెస్టు చేసి దేవనపల్లి మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. -
రాహుల్ హత్యకేసు కొలిక్కి
సాక్షి, అమరావతి బ్యూరో: పారిశ్రామికవేత్త రాహుల్ హత్యకేసు కొలిక్కి వచ్చింది. ఇప్పటికే ప్రధాన నిందితుడు కోరాడ విజయకుమార్తోపాటు మిగిలిన నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని రహస్య ప్రదేశంలో విచారిస్తున్నారు. కోగంటి సత్యంను సోమవారం బెంగళూరు విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్నారు. నిందితులను విచారిస్తున్న పోలీసులు.. హత్యకు దారితీసిన పరిస్థితులు, ఎలా హత్య చేశారనే దానిపై అవగాహనకు వచ్చినట్లు తెలిసింది. కోరాడ విజయకుమార్ వద్ద పనిచేసే వారే ఈ హత్య చేసినట్లు తెలుస్తోంది. హత్యలో 10 మందికిపైగా పాత్ర ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. కేసులో గాయత్రి అనే మహిళ పాత్ర పరోక్షంగా ఉన్నట్లు తెలిసింది. రాహుల్కు, ఆమెకు కూడా ఆర్థిక లావాదేవీల విషయమై విభేదాలున్నట్లు సమాచారం. ప్రధానంగా కంపెనీ లావాదేవీలకు సంబంధించి రాహుల్, కోరాడ విజయకుమార్ల పంచాయితీలో కోగంటి సత్యం ఉన్నట్లు తెలిసింది. హత్య జరిగిన వెంటనే వేగంగా స్పందించిన పోలీసులు వీలైనంత త్వరగా నిందితులను బహిరంగపరిచి కేసును తేల్చే దిశగా అడుగులు వేస్తున్నారు. -
రాహుల్ హత్య కేసులో కీలక పరిణామం, A1 లొంగుబాటు
-
రాహుల్ హత్య కేసులో కీలక పరిణామం, A1 లొంగుబాటు
సాక్షి, విజయవాడ: స్థానికంగా కలకలం రేపిన వ్యాపారి రాహుల్ హత్యకేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. రాహుల్ హత్య కేసు ప్రధాన నిందితుడు కోరాడ విజయ్ మాచవరం పోలీసుల ఎదుట ఆదివారం లొంగిపోయాడు. రాహుల్ హత్య కేసులో ఇప్పటికే ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు A-1 కోరాడ విజయ్, A-2 కోగంటి సత్యం, A-3 విజయ్ భార్య పద్మజ, A-4 పద్మజ, A-5 గాయత్రి పేర్లను పేర్కొన్నారు. రాహుల్ తండ్రి రాఘవరావు స్టేట్మెంట్ ఆధారంగా సెక్షన్ 302, 120బి, రెడ్విత్ 34 కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ హత్య కేసులో ఇప్పటికే కొంతమందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కోరాడ విజయ్తో కలిపి పోలీసులు అదుపులో ఉన్నవారి సంఖ్య 6కు చేరింది. మాచవరం పోలీసుల ముమ్మర విచారణ కొనసాగుతోంది. (చదవండి: King Cobra: 13 అడుగుల గిరినాగు) హత్యకు గురైన రాహుల్.. అతని మృతదేహం లభ్యమైన కారు -
రాహుల్ హత్య కేసు.. సంచలన విషయాలు వెలుగులోకి
విజయవాడ: రాహుల్ హత్య కేసు దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. రాహుల్ హత్య కేసులో కీలక ఆధారాలు సేకరిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. రాహుల్ కారు వెనుక నిందితులు ఫాలో అయ్యారనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. 76 సీసీ కెమెరాల ఫుటేజ్లను సేకరించి పోలీసులు పరిశీలిస్తున్నారు. విజయ్తో పాటు మరో పది మంది ప్రమేయం ఉన్నట్లు పోలీసులు పేర్కొంటున్నారు. రాహుల్ రెండ్ ఫోన్ కాల్స్ డేటాను పోలీసులు విశ్లేషిస్తున్నారు. హత్య తర్వాత రాహుల్ రెండు ఫోన్లలో ఒక ఫోన్ మాయమైనట్లు తెలిపారు. మాయమైన ఫోన్కు విజయ్, గాయత్రి ఫోన్ చేసినట్లు గుర్తించారు. అనుమానితులను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు. చదవండి: చార్టర్డ్ అకౌంటెంట్ సింధు అనుమానాస్పద మృతి -
రాహుల్ హత్య కేసు: A1 కోరాడ విజయ్, A2 కోగంటి సత్యం
సాక్షి, విజయవాడ: కృష్ణా జిల్లాలోని విజయవాడలో సంచలనం రేపిన యువ వ్యాపారి కరణం రాహుల్ హత్య కేసులో రాత్రి 11 గంటల ప్రాంతంలో ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. సెక్షన్ 302, 120 B రెడ్ విత్ 34 ఐపీసీ కింద కేసు నమోదు చేశారు. రాహుల్ తండ్రి కరణం రాఘవరావు ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. చదవండి: రాహుల్ హత్య కేసులో కొత్త కోణం, ఇద్దరు మహిళల ప్రమేయం? A1 కోరాడ విజయ్, A2 కోగంటి సత్యం, A3 విజయ్ భార్య పద్మజ A4 పద్మజ, A5 గాయత్రిగా ఎఫ్ఐఆర్లో పోలీసులు వెల్లడించారు. ఈ హత్య కేసులో నిందితుడైన కోరాడ విజయ్.. రాహుల్ వ్యాపార భాగస్వాములని పేర్కొన్నారు. 2016లో జి.కొండూరులో జిక్సన్ సిలిండర్ కంపెనీ ప్రారంభించినట్లు వెల్లడించారు. 2019 ఎన్నికల్లో పోటీ చేసి విజయ్ నష్టపోయాడని తెలిపారు. తన షేర్లు తీసుకుని డబ్బు ఇవ్వాలని రాహుల్పై విజయ్ ఒత్తిడి తెచ్చాడని, రాహుల్ వద్ద డబ్బు లేకపోవడంతో షేర్లు తీసుకోలేదని వివరించారు. చదవండి: రూ.15 కోట్లు కోసం ఒత్తిడి.. పక్కా ప్రణాళికతో హత్య అదేవిధంగా కోగంటి సత్యంకు కంపెనీ అమ్మాలని విజయ్ ఒత్తిడి తెచ్చాడని, అయితే కంపెనీ అమ్మేందుకు రాహుల్ అంగీకరించలేదని పేర్కొన్నారు. కోగంటి సత్యం, విజయ్, భార్య పద్మజ, గాయత్రి రాహుల్పై ఒత్తిడి తెచ్చారని వెల్లడించారు. రాహుల్ ఇళ్లు విడిచి వెళ్లేటప్పుడు రెండు ఫోన్లు తీసుకెళ్లాడని తెలిపారు. 18వ తేదీన రాత్రి 7 గంటలకు రాహుల్ బయటకు వెళ్లాడని, అతను తిరిగి రాకపోవడంతో 19న తండ్రి కరణం రాఘవరావు ఫిర్యాదు చేశారని పోలీసులు తెలిపారు. ఈ హత్య కేసులో ప్రధాన సూత్రధారిగా కోరాడ విజయ్ కుమార్ అనే వ్యక్తిని పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం అతను పరారీలో ఉన్నాడు. అతని కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. -
రాహుల్ హత్య కేసులో తెరపైకి కోగంటి సత్యం అనుచరుడు
-
రూ.15 కోట్లు కోసం ఒత్తిడి.. పక్కా ప్రణాళికతో హత్య
సాక్షి, విజయవాడ : నగరంలో జరిగిన యువ పారిశ్రామికవేత్త రాహుల్ హత్య కేసు దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు. పక్కా స్కెచ్తోనే హత్య చేసినట్లు పోలీసులు నిర్థారించారు. మెడకు తాడు బిగించి, ముక్కుపై దిండు అదిమిపెట్టి చంపినట్లు పోస్టుమార్టం నివేదికలో వెల్లడైంది. ఈ కేసులో లభించిన సాక్ష్యాధారాలతో విజయ్కుమార్ను ప్రధాన ముద్దాయిగా గుర్తించారు. వ్యాపార లావాదేవీలే రాహుల్ హత్యకు కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. కొన్నిరోజులుగా రాహుల్, వ్యాపార భాగస్వామి విజయ్కు మధ్య విభేదాలు నడుస్తున్నాయి. తన వాటా రూ.15 కోట్లు ఇచ్చేయాలంటూ రాహుల్పై విజయ్ ఒత్తిడి తెచ్చాడు. నిందితుడు విజయ్ గత ఎన్నికల్లో విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీచేసి ఓడాడు. ఎన్నికల్లో ఓటమితో భారీగా నష్టపోయానని.. వెంటనే డబ్బులివ్వాలంటూ ఒత్తిడి తెచ్చాడు. రాహుల్ కాలయాపన చేస్తుండటంతో పక్కా ప్రణాళికతో హత్య చేశాడు. ఈ కేసులో విజయ్తో పాటు మరో 8 మంది ప్రమేయం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. రాహుల్ హత్య కేసులో తెరపైకి కోగంటి సత్యం అనుచరుడు రాహుల్ హత్య కేసులో పారిశ్రామికవేత్త రాంప్రసాద్ హత్య కేసు ప్రధాన నిందితుడు శ్యామ్ పేరు తెరపైకి వచ్చింది. శ్యామ్ని పోలీసులు అనుమానిస్తున్నారు. శ్యామ్ పారిశ్రామికవేత్త కోగంటి సత్యం అనుచరుడు. రాహుల్ హత్య కేసులో కోగంటి సత్యంపై కూడా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పోలీసు విచారణలో రాహుల్ కుటుంబ సభ్యులు కోగంటి సత్యం పేరు చెప్పారు. టాస్క్ఫోర్స్ పోలీసులు ఇప్పటికే కోగంటి సత్యంను విచారించారు. చదవండి : రాహుల్ హత్య కేసులో కొత్త కోణం, ఇద్దరు మహిళల ప్రమేయం? -
ప్రియురాలితో బిగ్బాస్ కంటెస్టెంట్ పెళ్లి, సందడి షురూ!
Rahul Vaidya Disha Parmar Wedding: హిందీ బిగ్బాస్ కంటెస్టెంట్, సింగర్, రాహుల్, దిశా పార్మర్ పెళ్లి చేసుకుంటున్న విషయం తెలిసిందే కదా! జూలై 16న వీరిద్దరూ వివాహ బంధంతో ఒక్కటికానున్నారు. ఇప్పటికే ఇరువురి ఇంట పెళ్లి సంబరాలు షురూ అయ్యాయి. ఈ క్రమంలో మంగళవారం జరిగిన మెహందీ ఫంక్షన్లో కొత్త పెళ్లికూతురు దిశా మెరిసిపోయింది. ఈ మేరకు నెట్టింట మెహందీ వీడియోలు హల్చల్ చేస్తున్నాయి. ఇందులో అమ్మాయిలందరూ నటి కాళ్లు, చేతులను మెహందీతో నింపేస్తుండగా కొత్త పెళ్లికూతురు తెగ సిగ్గుపడుతోంది. మరోవైపు అక్కడే ఉన్న ఆమె స్నేహితులిద్దరరూ హిందీ పాటకు డ్యాన్స్ చేస్తూ వేడుకను హుషారెత్తిస్తున్నారు. ఇక మరో వీడియోలో సింగర్ రాహుల్ తన ప్రేయసి కోసం పాట పాడి అక్కడున్న అందరినీ ఫిదా చేశాడు. కాగా రాహుల్ హిందీ బిగ్బాస్ 14వ సీజన్లో కంటెస్టెంట్గా ఎంట్రీ ఇచ్చాడు. వీకెండ్ కా వార్ ఎపిసోడ్లో దిశా హౌస్లో అడుగు పెట్టింది. ఈ క్రమంలో దిశా బర్త్డే రోజు రాహుల్ తన మనసులోని ప్రేమను వ్యక్తీకరిస్తూ ఆమెకు ప్రపోజ్ చేశాడు. మోకాళ్ల మీద కూర్చుని తనను పెళ్లి చేసుకోమని అడిగాడు. అంతేకాకుండా మ్యారీ మీ? (నన్ను పెళ్లి చేసుకుంటావా?) అని రాసి ఉన్న టీషర్ట్ను సైతం ధరించాడు. View this post on Instagram A post shared by Welcome to the world of RKV ✨💫 (@rkv.an.inspiration.for.youth) అతడి ప్రపోజల్తో తొలుత షాకైన దిశా ఆ వెంటనే తేరుకుని పెళ్లికి గ్రీన్సిగ్నల్ ఇస్తూ సిగ్గుతో ముడుచుకుపోయింది. బిగ్బాస్ షో ముగిసిన తర్వాత కూడా వీరిద్దరూ బయట షికార్లకు వెళుతూ, వీడియోలు చేస్తూ తెగ సందడి చేశారు. ఈ క్రమంలో గతవారమే తమ పెళ్లితేదీని ప్రకటించి అభిమానులను సర్ప్రైజ్ చేసిందీ జంట. పెద్దల ఆశీర్వాదంతో పెళ్లి చేసుకుంటున్నామని వెల్లడించింది. View this post on Instagram A post shared by Welcome to the world of RKV ✨💫 (@rkv.an.inspiration.for.youth) View this post on Instagram A post shared by RAHUL VAIDYA RKV 💫 (@rahulvaidyarkv) View this post on Instagram A post shared by DP (@dishaparmar) -
‘టైసన్’ ఇలా మారిపోయాడేంటి? షాక్లో ఫ్యాన్స్!
హ్యాపీడేస్.. 14 ఏళ్ల కిందట వచ్చిన ఈ సినిమా అప్పట్లో ఓ సెన్సేషన్. పెద్ద సినిమాలను సైతం వెనక్కు నెట్టిన ఈ సినిమా శేఖర్ కమ్ములను డైరెక్టర్గా మరో మెట్టు ఎక్కించింది. అంతేకాదు ఎంతోమంది కొత్తవారిని ప్రేక్షకులకు పరిచయం చేసిందీ చిత్రం.. వారందరికీ మంచి గుర్తింపు వచ్చినప్పటికీ కొందరికి మాత్రమే అవకాశాలను తెచ్చిపెట్టింది. ఇక ఈ సినిమాలో జనాలకు బాగా కనెక్ట్ అయిన పాత్ర టైసన్. అదిరిపోయే డైలాగ్లతో, రివర్స్ పంచులతో టైసన్ పాత్రలో ఆకట్టుకున్నాడు రాహుల్. View this post on Instagram A post shared by Rahul Dayakiran (@raahultyson) ఇందులో అతడు మరీ బక్కగా ఉండటంతో అందరూ అతడిని వెటకారంగా ‘టైసన్’ అని ఆటపట్టిస్తుంటారు. అంతెందుకు ఓ సన్నివేశంలో తనకు మంచి బాడీ లేదంటూ తను ప్రేమించిన శ్రావ్స్తోనే చెప్తాడు. కానీ ఇప్పుడు రాహుల్ గుర్తుపట్టకుండా మారిపోయాడు. కండలు తిరిగిన దేహం, మీసకట్టుతో కొత్త లుక్లో కనిపిస్తున్నాడు. అతడిని ఈ గెటప్లో చూసిన అభిమానులు అసలు ఆ టైసన్ నువ్వేనా? అని షాకవుతున్నారు. నిన్ను అసలు గుర్తుపట్టలేకపోతున్నాం, మాస్ చేంజ్ ఓవర్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. View this post on Instagram A post shared by Rahul Dayakiran (@raahultyson) ఇప్పుడు కానీ శ్రావ్స్ నిన్ను చూస్తే ఫ్లాట్ అయిపోద్ది అన్నా.. అంటూ ఫన్నీగా మెసేజ్ చేస్తున్నారు. ఈ రోజు కష్టపడితేనే రేపు మరింత బలంగా తయారవుతాం, నేను ఇక్కడివరకు చేరుకుంటానని అస్సలు ఊహించలేదు. నన్ను సపోర్ట్ చేసిన అందరికీ కృతజ్ఞతలు అంటూ తన ఫొటోలను షేర్ చేశాడు. కాగా రాహుల్ ఆ మధ్య వెంకటాపురం సినిమాలో నటించాడు. ఇది అతడి కెరీర్కు ఏమాత్రం ప్లస్ కాలేదు. కొన్నేళ్ల గ్యాప్ తర్వాత 100 క్రోర్స్ అనే మరో కొత్త చిత్రంలో నటించనున్నాడు. చదవండి: నేను తాగింది మందు కాదు: హీరోయిన్ -
ప్రియురాలిని వదిలి వెళ్లలేక, షోను వదులుకోలేక..
ముంబై : ప్రముఖ రియాలిటీ షో 'ఖత్రోన్ కే ఖిలాడీ' పదకొండవ సీజన్ మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది. దక్షిణాఫ్రికాలోని కేప్టౌన్లో జరిగే ఈ షోలో పాల్గొనేందుకు ఇప్పటికే కంటెస్టెంట్లు సన్నద్ధం అయ్యారు. ప్రముఖ సింగర్, బిగ్బాస్ ఫేం రాహుల్ వైద్య, వరుణ్ సూద్, దివ్యంకా త్రిపాఠి అర్జున్ బిజ్లాని, నిక్కి తంబోలి, అభినవ్ శుక్లా సహా పలువురు ఈ షోలో పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో గత రాత్రి ముంబై ఏయిర్పోర్టుకు చేరుకున్న రాహుల్ ప్రియురాలు దిషా పర్మార్ని వదిలి వెళ్లేటప్పుడు ఎమోషల్ అయ్యారు. ప్రియురాలికి ముద్లులు, హగ్గులు ఇచ్చి విడ్కోలు పలికారు. ఈ ఫోటోలను క్లిక్ మనిపించిన ఫోటోగ్రాఫర్లు వీరిది ఎంతో క్యూట్ జోడీ అంటూ కొనియాడారు. ఇక ఈ పోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. హిందీ బిగ్బాస్-14లో రుబీనా దిలైక్తో తలపడి రాహుల్ రన్నరప్గా నిలిచిన సంగతి తెలిసిందే. ఇదే షోలో ప్రియురాలు దిశా పర్మార్ని కూడా పరిచయం చేసిన రాహుల్ మరొకొద్ది నెలల్లోనే తమ వివాహం ఉంటుందని ప్రకటించారు. ఇప్పటికే పెళ్లి పనులు మొదలు పెట్టినా కరోనా కారణంగా వాయిదా పడింది. ప్రస్తుతం ఖత్రోన్ కే ఖిలాడీ షోలో పాల్గొనేందుకు సన్నద్ధం అయ్యారు. అయితే ఏయిర్పోర్టులో ప్రేయసిని వదిలి వెళ్లలేక, షోను వదులుకోలేక రాహుల్ మదనపడుతూ కనిపించాడు. View this post on Instagram A post shared by Rahul Vaidya world (@mad_fan_of_rahul_vaidya_) ఛదవండి : 'బిగ్బాస్' వల్ల నాకు ఒరింగిందేమీ లేదు : నటి నా కుమారులు నన్ను మళ్లీ పెళ్లి చేసుకోమంటున్నారు: నటి -
ఢిల్లీ క్యాపిటల్స్ లక్ష్యం 196
ముంబై: ఓపెనర్లు మయాంక్ అగర్వాల్ (36 బంతుల్లో 69; 7 ఫోర్లు, 4 సిక్స్లు), రాహుల్ (51 బంతుల్లో 61; 7 ఫోర్లు, 2 సిక్స్లు) చెలరేగడంతో పంజాబ్ కింగ్స్ భారీ స్కోరు చేసింది. ఐపీఎల్లో ఆదివారం ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో మొదట బ్యాటింగ్కు దిగిన పంజాబ్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది. ఓపెనర్లిద్దరు దంచేసేందుకు పోటీపడటంతో 5వ ఓవర్లోనే పంజాబ్ స్కోరు 50 పరుగులకు చేరింది. 10.1 ఓవర్లోనే వందను దాటేసింది. మయాంక్ 25 బంతుల్లోనే ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. మిగతా వారిలో క్రిస్ గేల్ (11) విఫలమైనా... దీపక్ హుడా (13 బంతుల్లో 22 నాటౌట్ 2 సిక్సర్లు), షారుఖ్ (5 బంతుల్లో 15; 2 ఫోర్లు, 1 సిక్స్) ఆఖర్లో ధాటిగా ఆడారు. ఢిల్లీ బౌలర్లలో వోక్స్, మెరివాలా, రబడా, అవేశ్ ఖాన్– తలా ఒక వికెట్ పడగొట్టారు. 196 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ కడపటి వార్తలందేసరికి 13 ఓవర్లలో రెండు వికెట్లకు 125 పరుగులు చేసింది. క్రీజులో ధావన్ 78 పరుగులతో, పంత్ 4 పరుగులతో ఉన్నారు. -
బిగ్బాస్ రన్నర్కు సల్మాన్ ఖాన్ గిఫ్ట్
బాలీవుడ్ భాయ్జాన్ సల్మాన్ ఖాన్ హిందీ బిగ్బాస్ సీజన్కు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే! ఈ మధ్యే పద్నాలుగో సీజన్ విజయవంతంగా పూర్తైంది. ఇందులో రుబీనా దిలైక్ విజేతగా అవతరించగా సింగర్ రాహుల్ వైద్య రన్నరప్గా నిలిచాడు. అయితే ఈ రన్నరప్కు సల్మాన్ ఊహించని గిఫ్ట్ ఇచ్చాడు. ఈ బైక్ను కానుకగా పంపి అతడిని ఆశ్చర్యంలో ముంచెత్తాడు. దీన్ని అందుకున్న రాహుల్ సంతోషాన్ని మాటల్లో చెప్పలేము. "సల్మాన్ ఖాన్ ఇచ్చిన బీయింగ్ హ్యుమన్ ఈ బైక్. దీని మీద బయట చక్కర్లు కొడుతుంటే చాలా సంతోషంగా అనిపిస్తోంది.." అంటూ దాని ఫొటోలను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశాడు. దీనిపై బిగ్బాస్ కంటెస్టెంట్ షెఫాలీ బాగా స్పందిస్తూ సల్మాన్ సర్ గిఫ్ట్ ఇచ్చాడంటే అది ఎంతో విలువైనది అని చెప్పుకొచ్చింది. కాగా బీయింగ్ హ్యుమన్ వెబ్సైట్లో పొందుపర్చిన వివరాల ప్రకారం దీని ధర రూ.53,999. దీన్ని చార్జ్ చేయాలంటే సుమారు 3-4 గంటల సమయం పడుతుంది. బ్లాక్ అండ్ రెడ్ కలర్లో ఉన్న ఇది రాహుల్కు సరిగ్గా సరిపోయింది. View this post on Instagram A post shared by Rahul Vaidya 🇮🇳🎤 (@rahulvaidyarkv) చదవండి: సల్మాన్, రణ్దీప్ల మధ్య ఉండే స్మోక్ ఫైట్ హైలైట్ గంగవ్వకు పట్టీలు కొనిచ్చిన అఖిల్ -
పంచె ఊడదీసి వికృతంగా ప్రవర్తించిన నటి
బిగ్బాస్లో గొడవలు సర్వసాధారణం. కానీ అవి శృతి మించితేనే అసలు సమస్య. ప్రస్తుతం హిందీ బిగ్బాస్ 14వ సీజన్ పరిస్థితి కూడా అలానే ఉంది. మాజీ కంటెస్టెంట్లను లోనికి పంపించగా వారు చేసే పనులతో ఇంటిసభ్యులు తలలు పట్టుకుంటున్నారు. ఈ క్రమంలో నటి, మాజీ కంటెస్టెంట్ రాఖీ సావంత్ వికృత చేష్టలకు కంటెస్టెంట్లు హడలెత్తిపోతున్నారు. ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తుందోనని భయంతో ఆమె దరిదాపుల్లోకి వెళ్లడానికి కూడా ధైర్యం చేయట్లేదు. ప్రస్తుతం హౌస్లో జరుగుతున్న కెప్టెన్సీ టాస్కులో రాక్షసి అవతారం ఎత్తిన రాఖీ.. అంతకు ముందు రోజు తనతో గొడవకు దిగిన జాస్మిన్ భాసిన్ను కెప్టెన్ కానివ్వనంటూ శపథం చేసింది. అటు కంటెస్టెంట్లను ఇబ్బందులకు గురి చేస్తూ ముప్పు తిప్పలు పెట్టింది.(చదవండి: రాహుల్ లేకపోతే బిగ్బాస్ చూడం!) మాజీ కంటెస్టెంట్ రాహుల్ మహాజన్ పంచె పట్టుకుని లాగారు. దాన్ని కర్చీఫ్లా ముక్కలు ముక్కలు చేస్తానని హెచ్చరించడమే కాకుండా నిజంగానే పంచె ఊడదీసి పేలికలుగా మార్చారు. దీంతో ఆమె విపరీత ప్రవర్తనపై హౌస్మేట్స్ గరమయ్యారు. ఇదే ఒక అమ్మాయికి జరిగితే ఇలాగే ఊరుకుంటారా? అని ప్రశ్నిస్తూ అలీ గోనీ టాస్కులో పాల్గొనేందుకు నిరాకరించాడు. అటు సోషల్ మీడియాలో సైతం రాఖీపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఒక యువకుడిని దాదాపు నగ్నంగా నిలబెట్టినంత పని చేసిందని రాఖీపై ఫైర్ అవుతున్నారు. టాస్క్ను టాస్క్లా ఆడాలి కానీ అంత అతి పనికి రాదని ఘాటుగా కామెంట్లు చేస్తున్నారు. మరి రాఖీ ప్రవర్తనపై సల్మాన్ ఖాన్ ఎలా స్పందిస్తారో చూడాలి! (చదవండి: బిగ్బాస్: కంటెస్టెంట్ను దూషించిన తల్లి) View this post on Instagram A post shared by ColorsTV (@colorstv) View this post on Instagram A post shared by ColorsTV (@colorstv) -
ప్రేయసిని పెళ్లాడిన యువ నటుడు
తిరువనంతపురం: మలయాళ నటుడు రాహుల్ రవి వివాహ బంధంలో అడుగుపెట్టాడు. చిరకాల స్నేహితురాలు లక్ష్మీ నాయర్ను అతడు మనువాడాడు. అత్యంత సన్నిహితుల మధ్య ఆదివారం వారి వివాహం జరిగింది. సంప్రదాయ వస్త్రధారణలో వధూవరులు చూడ ముచ్చటగా ఉన్నారు. ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం చక్కర్లు కొడుతున్నాయి. ఈ క్రమంలో రాహుల్ రవి- లక్ష్మీ నాయర్లకు తోటి ఆర్టిస్టులు, నెటిజన్ల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. కాగా మోడల్గా కెరీర్ ఆరంభించిన రాహుల్.. బుల్లితెరపై తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. పూనంబిలి సిరీస్లో ప్రధాన పాత్రలో మెప్పించి ప్రశంసలు అందుకున్నాడు. (చదవండి: పెళ్లిలో సూపర్ స్టార్ సందడి, వైరల్ వీడియో) తనే నా జీవితం ఇక లక్ష్మీతో ప్రేమలో ఉన్నట్లు ఇటీవల ప్రకటించిన రాహుల్.. ‘‘తనను మొదటి రోజు కలిసినపుడు ఎలాంటి ఉద్వేగానికి లోనయ్యానో.. ఇప్పుడు కూడా అంతే. అయితే ఈరోజు ఇంకాస్త ఆనందంగా ఉంది... రోజురోజుకీ తను నాకెంతో ప్రత్యేకంగా కనిపిస్తోంది. తను అందమైన చిరునవ్వు.. తను చెప్పే మాటలు.. వింటూ ఉంటే ప్రపంచాన్నే మైమరిచిపోతా.. తను కేవలం నా జీవితంలో ప్రవేశిస్తున్న అమ్మాయి మాత్రమే కాదు.. తనే నా జీవితం.. నా జీవితాన్ని నీ నవ్వులతో వెలిగించినందుకు థాంక్యూ లక్ష్మీ నాయర్.. మన పెళ్లిరోజు కోసం ఎదురు చూస్తున్నా’’ అంటూ సోషల్ మీడియా వేదికగా తమ పెళ్లి వార్తను పంచుకున్నాడు. -
‘తన ప్రపోజల్ను దిశ అంగీకరించింది’
ముంబై: బిగ్బాస్-14 కంటెస్టెంట్, సింగర్ రాహుల్ వైద్య త్వరలోనే పెళ్లి పీటలెక్కనున్నట్లు తెలుస్తోంది. నటి దిశా పర్మార్ను అతడు వివాహమాడనున్నట్లు సమాచారం. కాగా ఆదివారం రాహుల్ బిగ్బాస్ హౌజ్ను వీడిన సంగతి తెలిసిందే. కుటుంబ సభ్యులకు దూరంగా ఉండలేకపోతున్నానని, అదే విధంగా తనకంటే గొప్పగా ఆడుతున్న వారికి టాప్లో చోటు దక్కాలనే ఉద్దేశంతో తనకు తానుగా వెళ్లిపోతున్నట్లు పేర్కొన్నాడు. తన నిర్ణయంతో అభిమానులను నిరాశపరిచానని, అందుకు క్షమించాలని కోరాడు. ఇక హౌజ్లో ఉన్న సమయంలో బంధుప్రీతిని కారణంగా చూపి తోటి కంటెస్టెంట్ జాన్ కుమార్ను నామినేట్ చేసి హోస్ట్ సల్మాన్ ఖాన్ ఆగ్రహానికి గురైన రాహుల్ వైద్య, ఆ తర్వాత కూడా తన నోటి దురుసు కారణంగా తరచూ వార్తల్లో నిలిచాడు. ఈ క్రమంలో అనూహ్యంగా షో నుంచి బయటకు వస్తున్నట్లు ప్రకటించాడు. ఇదిలా ఉండగా.. బిగ్బాస్ ద్వారా కావాల్సినంత పాపులారిటీ పొందిన రాహుల్ తన ప్రేమ వ్యవహారం వల్ల కూడా సోషల్ మీడియాలో హాట్టాపిక్గా మారాడు. నటి దిశా పర్మార్ను ప్రేమిస్తున్న అతడు.. ఇటీవల ఆమె పుట్టిన రోజు సందర్భంగా.. ‘‘నన్ను పెళ్లిచేసుకుంటావా’’ అని ట్విటర్ వేదికగా ప్రతిపాదన చేశాడు. ఇందుకు నేరుగా సమాధానం ఇవ్వని దిశ.. తనకు సమాధానం చెప్పేశానంటూ నెటిజన్లను అయోమయంలోకి నెట్టారు.(చదవండి: ప్లేట్లు పగులగొడుతూ డ్యాన్స్.. వైరల్!) ఈ విషయం గురించి ఓ వెబ్సైట్తో మాట్లాడిన రాహుల్ తల్లి గీత వైద్య.. దిశ తమ ఇంటి కోడలిగా వస్తే సంతోషపడతానని తన మనసులో మాట బయటపెట్టారు. ‘‘అవును.. వీలైనంత త్వరలో రాహుల్ పెళ్లి చేసేయాలనుకుంటున్నాం. నాకు తెలిసి దిశ తన ప్రపోజల్ను అంగీకరించింది. ఓ తల్లిగా నాకు ఇంతకన్నా సంతోషం ఏముంటుంది. తను చాలా మంచి అమ్మాయి. మా ఇంటికి కూడా వచ్చింది. వాళ్లిద్దరి మధ్య స్నేహం మాత్రమే ఉందనుకున్నా. కానీ ప్రేమలో ఉన్నారని ఇటీవలే తెలిసింది. అయితే దిశ కుటుంబంతో మేం ఇంతవరకు మాట్లాడలేదు. తను చెబితే వాళ్లింట్లో వాళ్లతో మాట్లాడి విషయాన్ని ముందుకు తీసుకువెళ్తా’’అని చెప్పుకొచ్చారు. ఇక రాహుల్ వైద్య ఇప్పుడు ఇంటికి చేరడంతో త్వరలోనే అతడు పెళ్లి జరిగే అవకాశం ఉందంటూ అభిమానులు ఖుషీ అవుతున్నారు. కాగా ఇండియన్ ఐడల్ షోతో గుర్తింపు పొందిన రాహుల్ వైద్య దో చార్ దిన్, కహ్ దోనా, తేరా ఇంతెజార్ వంటి పాటలు ఆలపించాడు. -
రాహుల్ లేకపోతే బిగ్బాస్ చూడం!
హిందీ బిగ్బాస్ 14వ సీజన్లో పాల్గొన్న సింగర్ రాహుల్ వైద్య తరచూ వార్తల్లో ఉంటున్నాడు. ఆ మధ్య తనకు బంధుప్రీతి అంటే అసహ్యమని చెప్తూ జాన్ కుమార్ను నామినేట్ చేశాడు. జాన్కు అంత పాపులారిటీ లేదని, కేవలం ప్రముఖ సింగర్ కుమార్ సను కొడుకు కావడం వల్లే ఈ షోలో ఉండగల్గుతున్నాడని విమర్శా బాణాలు ఎక్కుపెట్టాడు. హౌస్లో నెపోటిజమ్ ప్రస్తావన తీసుకువచ్చినందుకు వ్యాఖ్యాత సల్మాన్ ఖాన్ తీవ్రంగా మండిపడ్డారు. ఈ ఒక్క విషయమనే కాదు ఆయన చాలామటుకు ఇతర కంటెస్టెంట్లపై నోరు పారేసుకుంటూ నిత్యం వార్తల్లో నిలుస్తూ వస్తున్నాడు. కానీ ఈసారి మాత్రం ఎలిమినేట్ అవుతున్నందున రాహుల్ పేరు సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది. (చదవండి: టాప్ సెర్చ్డ్ సెలబ్రిటీ లిస్ట్ : అల్లు అర్జున్ ఏ ప్లేస్) ఈ ఎలిమినేషన్ వాస్తవమే అన్నట్లుగా కలర్స్ టీవీ తాజాగా ప్రోమోను సైతం రిలీజ్ చేసింది. అందులో రాహుల్తో మాటలు కలిపిన సల్మాన్ తర్వాత అతడిని బయటకు రమ్మని ఫైర్ అయ్యాడు. సల్మాన్ ఆదేశాల మేరకు బిగ్బాస్ గేట్లు కూడా తెరుచుకున్నట్లు ప్రోమోలో చూపించారు. దీంతో నిజంగానే రాహుల్ను ఎలిమినేట్ చేస్తున్నారా? అని అతడి అభిమానులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. రాహుల్ లేకపోతే బిగ్బాస్ షో లేదని విమర్శలు గుప్పిస్తున్నారు. అతడిని పంపించేస్తే షో చూడబోమని తేల్చి చెప్తున్నారు. మరోవైపు రాహుల్తో పాటు నిక్కీ తంబోళి కూడా ఎలిమినేట్ కానున్నట్లు మరో వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. మరి రాహుల్ ఎలిమినేట్ అయ్యాడా? సేవ్ అయ్యాడా? లేదా డబుల్ ఎలిమినేషన్ జరగనుందా? అనే విషయం తెలియాలంటే ఎపిసోడ్ ప్రసారమయ్యేవరకు వేచి చూడాల్సిందే. (చదవండి: ఆ నటి నా భార్య, కానీ మరొకరితో ఎఫైర్..) #BiggBoss14 ke ghar ke exit door khul gaye hain @rahulvaidya23 ke liye. Kya woh lenge yeh step aur ho jayenge finale ki raat ko beghar? Dekhiye aaj raat 9 baje, #Colors par. Catch it before TV on @VootSelect.#BiggBoss2020 #BB14 #WeekendKaVaar pic.twitter.com/J66nPEshoU — ColorsTV (@ColorsTV) December 5, 2020