revenue department
-
కాలం చెల్లిన చైనా ‘చేప కథ’
ఏ శాస్త్రంలోని నూతన ఆవిష్కరణ అయినా సామాజిక శాస్త్ర పర్యావరణ గీటురాయి మీద దాని మానవీయ విలువను నిర్ధారించుకోక తప్పదు. 2004 డిసెంబర్లో ‘ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ’ (ఐసీటీ) మన బడుల్లో పాఠంగా మొదలయింది. అది మొదలు గత రెండు దశాబ్దాలలో దానికి మొలకెత్తిన చిలవలు పలవలు... ఊడలు దిగిన మ్రానులైన పరిస్థితుల్లో, మన మానసిక వైఖరులు మన మానవీయ విలువలను ఎలా ప్రభావితం చేస్తున్నాయి? అన్నప్పుడు కొంచెం తేడాతో అందరం అందులో మునకలు వేయడం అయితే నిజం. మనకంటే ముందే ఈ అనుభవమున్న సంపన్న దేశాల్లో దీని పర్యవసానాలపై అధ్యయనం మొదలయింది కనుక ఈ ప్రపంచీకరణ కాలంలో ఆ కొలమానాలు మనమూ వాడుకోవచ్చు. గత పదేళ్ళలో పెరిగిన ‘సోషల్ మీడియా’ మన మీద పెంచుతున్న ఒత్తిడితో ఏర్పడిన ‘ఇన్ఫర్మేషన్ ఎకో సిస్టం’లో ఇప్పుడు మనం ఉన్నాం. అదొక నూతన పర్యావరణంగా మారి, మన ఆలోచనలు అభిప్రాయాలు అందుకు అనుగుణంగా మార్చుతూ, మూడు రంగాలలో మన జీవితాల్ని అది ప్రభావితం చేస్తున్న దని ఫిబ్రవరి 2023లో ఎవాన్ కుహెన్ ఒక వెబ్సైట్కు రాసిన ‘వాట్ ఈజ్ ఇన్ఫర్మేషన్ ఎకో సిస్టం?’ వ్యాసంలో అంటారు. గుర్తించిన ఆ మూడింటిలో ‘సివిల్ సొసైటీ’ (పౌరసమాజం) ఒకటి. ఈ పరిశీలన వెలుగులో కొత్త రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ ‘పౌర సమాజం’ సంగతి ఏమిటి? మన పండితులు పామ రుల అభిప్రాయాలపై ఎటువంటి ‘సమాచార’ పర్యా వరణ ప్రభావం ఉంది. ప్రభావశీలురైన ముగ్గురు ప్రముఖులు 2025 ఫిబ్రవరిలో వెలుబుచ్చిన అభిప్రా యాలలో నుంచి వాటిపై ‘సమాచార పర్యావరణ’ ప్రభావం ఏ మేర ఉందో చూద్దాం. ఫిబ్రవరి మొదటివారంలో ప్రభుత్వ కార్యదర్శులతో ఏర్పాటుచేసిన ఒక సమీక్ష సమావేశంలో ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ – ‘‘మీరు ఫిర్యాదుల పరిష్కారం మొదటి ప్రాధాన్యతగా చూడాలి, రెవెన్యూశాఖ నుంచి భూ కబ్జాలు వల్ల లా అండ్ ఆర్డర్ సమస్యలు తలెత్తుతున్నాయి. డాక్యుమెంట్స్ ఫోర్జరీ ఎక్కువ అయిపోయింది... వీటిని మీరు ఎలా పరిష్కరిస్తారు అనేది మీకే వదిలి పెడుతున్నాను’’ అన్నారు. ఇది విన్నాక ఈ ధోరణి మూలాలు ఎక్కడ ఎందుకు మొదలయింది వెతికితే, రాజధాని హైదరాబాద్ నుంచి విజయవాడకు మారిన 2015 తర్వాత నుంచి రాజకీయం అంటేనే ‘భూమి విలువ’ అన్నట్టుగా మారింది. ‘‘అమరావతిలో అన్నీ పోను ఎనిమిది వేల ఎకరాలు మిగులుతాయి, ఎకరం 20 కోట్లు చొప్పున అమ్మితే 160 కోట్లు వస్తాయి...’’ తరహా మాటలు అధికార కేంద్రాల నుంచి వస్తే, ‘సోషల్ మీడియా’ దానికి విస్తృత ప్రచారం ఇచ్చింది. ఇప్పుడు తెనాలి ప్రాంతానికి చెందిన ఏ.పి. ‘ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెవలప్మెంట్ స్టడీస్’ చైర్మన్ ప్రొఫెసర్ ఎస్. మహేంద్ర దేవ్ కూడా విశాఖలో– ‘‘కొత్త రాష్ట్రానికి అమరావతి వంటి ‘గ్రీన్ ఫీల్డ్ కేపిటల్’ ఉండడం అవసరం’’ అంటూ పనిలో పనిగా –‘‘ఉచితాలు అనుచితం’’ అని కూడా అనేశారు. పోనీ అది నిజమనుకుందాం. మరి వారే ‘‘బాపట్ల సమీపాన 20 ఏళ్ళనాడు ఆగిపోయిన ‘వాన్ పిక్’ ఈ పదేళ్లలో పూర్తి అయివుంటే, ‘ఉచితాలు’ తీసుకునేవారు అవి మాని అక్కడే ఏదో ఒక ‘లేబర్’ పని చేసుకుని బతికేవారు’’ అని కూడా అనొచ్చు కదా? చివరికి ఏమైంది గత పదేళ్ళలో ‘రాజధాని’ చుట్టూ ‘సోషల్ మీడియా’ వ్యాప్తి చేసిన ‘ఇన్ఫర్మేషన్ ఎకో సిస్టం’ కింద నలిగి కేంద్ర హోంశాఖ నియమించిన శివరామకృష్ణన్ కమిషన్ నిపుణుల అభిప్రాయాలు ఇటువంటి ప్రకట నల కింద సమాధి అయ్యాయి.రిజర్వ్ బ్యాంకు మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బా రావు కూడా ఇదే విశాఖ నుంచి ఉచితాలు గురించి – ‘ఫ్రీబీస్’ ఎందుకు? అంటూ ఎప్పుడో పాతదైన ‘చైనా వారి చేప’ కథ చెప్పారు. అది చైనాలో నిజమేమో. ఇక్కడ ‘చేపలు’ పట్టడం నేర్పడం కోసం పెట్టిన ‘స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం’ ఏమైందో చూశాం. అయినా – ‘ఫ్రీబీస్’ ఎందుకు? అంటే, ఈ ‘ఉచితాలు’ పొందే వారు కూడా ఏమంత సంతోషంగా ఏమీ లేరు. కారణం కళ్ళముందు సంపన్న వర్గాల వద్దకు చేరుతున్న సంపద, వారి విజయగాథలు, వైభవంగా జరిగే వారి పెళ్ళిళ్ళు, ఫ్యామిలీ ఫంక్షన్స్... వాటి గురించి ‘సోషల్ మీడియా’ కథలుగా చెబుతుంటే వింటూ, తమకు అందే అరకొరను వాళ్ళు తూకం వేస్తున్నారు. అధికార కేంద్రాలకు దగ్గరయితే, అక్రమ ఆదాయ వనరులు ఎలా పెరుగుతాయో ‘సోషల్ మీడియా’ వారికి నిత్యం కళ్ళకు కట్టిస్తున్నది.విషయం ఏమంటే, ప్రభుత్వ పరిపాలనలోకి ‘టెక్నాలజీ’ వచ్చాక, అవినీతికి చిల్లులున్న చీకటి మార్గాలు మూతపడి అదాయ వనరులకు గండి పడితే, ప్రత్యామ్నాయాన్ని ప్రకృతి వనరుల్లో వెతు క్కుంటున్నారు. అభివృద్ధి మారుమూల గ్రామాలకు ప్రవేశిస్తుంటే, బయటకు వెళుతున్న మట్టి, కంకర చూస్తున్నదే. వాటి వివరాలు ‘సోషల్ మీడియా’ 24 గంటలూ జనానికి చూపిస్తున్నది. ఈ అక్రమ లావా దేవీల చిట్టా సామాన్యుడికి అరచేతిలో ‘ఫోన్’లో దొరుకుతుంటే, ప్రభుత్వం అరాకొరా ఉచితంగా ఇచ్చే రొట్టె ముక్కను ఇవ్వాలా వద్దా? అంటూ మళ్ళీ అదే పాత చర్చ అంటే, వారి వద్ద పాండిత్యం పరిహాసం అవుతుందేమో!జాన్సన్ చోరగుడి వ్యాసకర్త అభివృద్ధి – సామాజిక అంశాల వ్యాఖ్యాత -
ఎఫ్టీఎల్ సమీప సర్వే నంబర్లివ్వండి
సాక్షి, హైదరాబాద్: చెరువులు, కుంటల పూర్తి నీటిమట్టం స్థాయి (ఎఫ్టీఎల్) నుంచి 200 మీటర్ల లోపు ఉన్న భూముల సర్వే నంబర్ల వివరాలతోపాటు ప్రభుత్వ భూములకు సమీపంలో ఉన్న సర్వే నంబర్లను సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్కు పంపాలని వివిధ శాఖలు, సంస్థల అధిపతులను ప్రభుత్వం ఆదేశించింది. మున్సిపల్ కమిషనర్లు, పట్టణాభివృద్ధి సంస్థల వీసీలు, హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ కమిషనర్లు, డీటీసీపీలు తమ పరిధిలోని నీటి వనరుల ఎఫ్టీఎల్ నుంచి 200 మీటర్ల లోపు ఉన్న సర్వే నంబర్లను పంపించాల్సి ఉంటుందని పేర్కొంది. ప్రభుత్వ భూములకు సమీపంలో ఉన్న భూముల సర్వే నంబర్లలో ఉన్న ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను నీటిపారుదల, రెవెన్యూ శాఖల పరిశీలన, క్షేత్రస్థాయి తనిఖీకి పంపుతారు. డీటీసీపీ ఈ ప్రక్రియను సమన్వయం చేసుకోవాల్సి ఉంటుంది. ఈ మేరకు ప్రభుత్వం తాజాగా ముసాయిదా మార్గదర్శకాలను విడుదల చేసింది. ఇదీ ప్రక్రియ.. ⇒ ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిశీలన అనంతరం రిజిస్ట్రేషన్ శాఖ ద్వారా ఫీజుల చెల్లింపు ప్రక్రియ జరపాలని నిర్ణయించిన ప్రభుత్వం, ఎల్ఆర్ఎస్ పోర్టల్తో రిజిస్ట్రేషన్ల శాఖ సర్వర్ను అనుసంధానం చేస్తోంది. ఈ అనుసంధాన ప్రక్రియను పర్యవేక్షిస్తున్న సీజీజీకి సర్వే నంబర్ల వివరాలను అందిస్తే, ఆన్లైన్లో వాటిని అందుబాటులో ఉంచనుంది. తదనుగుణంగా ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను మున్సిపల్ లేదా పంచాయతీ రాజ్ , నీటిపారుదల, రెవెన్యూ శాఖలు పరిశీలించి నిర్ణయం తీసుకుంటాయి. ⇒ ఆ తర్వాత ఆన్లైన్లోనే ఎల్ఆర్ఎస్ ఫీజు నిర్ణయించబడుతుంది. ⇒ ఒకవేళ దరఖాస్తు తిరస్కరణకు గురైతే, గతంలో చెల్లించిన మొత్తం ఫీజు నుంచి 10 శాతం ప్రాసెసింగ్ చార్జీలను మినహాయించుకుంటారు. ⇒ వెంచర్లోని 10 శాతం ప్లాట్లను 2020 ఆగస్టు 26కు ముందు విక్రయించి ఉంటే, మిగతా ప్లాట్ల క్రమబధ్ధీకరణ కోసం.. విక్రయించిన ప్లాట్ల వివరాలను ఈసీ రూపంలో సమర్పించాల్సి ఉంటుంది. ⇒ లేఅవుట్ క్రమబధ్ధీకరణ చార్జీలు, ఓపెన్ స్పేస్ చార్జీలు చెల్లించిన తర్వాత తాత్కాలిక ఫీజు నిర్ణయమవుతుందని ప్రభుత్వం తెలిపింది. ⇒ సబ్–రిజి్రస్టార్ సంబంధిత ప్లాట్ను నమోదు చేసి, ఎల్ఆర్ఎస్ దరఖాస్తు వివరాలు, సేకరించిన చార్జీలను ఎల్ఆర్ఎస్ పోర్టల్కు ప్రాసెసింగ్ కోసం పంపితే క్రమబధ్ధీకరణ చార్జీలు ఆన్లైన్లోనే నిర్ణయమవుతాయి. -
భూముల లెక్కలు పక్కా!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో భూముల లెక్కలను పక్కాగా తేల్చేందుకు, భూవివాదాలకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. ఇందుకోసం విస్తృత స్థాయిలో భూముల సర్వే చేపట్టాలని ప్రాథమికంగా నిర్ణయానికి వచ్చింది. 2025–26 ఆర్థిక సంవత్సర బడ్జెట్ రూపకల్పనలో భాగంగా రెవెన్యూ శాఖ పద్దుపై జరిగిన సమీక్ష సందర్భంగా ఆ శాఖ ఉన్నతాధికారులు ప్రభుత్వం ముందు భూముల సర్వే ప్రతిపాదన చేసినట్టు తెలిసింది. రాష్ట్రంలో భూముల డిజిటల్ సర్వేకు అనుమతివ్వాలని, నిధులు కేటాయిస్తే.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే 150 మండలాల్లోని ఒక్కో గ్రామంలో పైలట్ ప్రాజెక్టు చేపడతామని కోరినట్టు సమాచారం. దీనిపై సానుకూలంగా స్పందించిన ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క... సర్వే నిర్వహణ కోసం అవసరమైన ఆధునిక సాంకేతిక పరికరాలను కొనుగోలు చేసుకోవాలని సూచించినట్టు తెలిసింది. గత ప్రభుత్వ హయాంలో ఆలోచన చేసినా.. రాష్ట్రంలో భూముల సర్వే చేపట్టాలనే ప్రతిపాదన చాలాకాలం నుంచి ఉంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పలుమార్లు ఈ ప్రతిపాదన వచ్చింది. రాష్ట్ర బడ్జెట్లో సర్వే కోసం నిధులు కేటాయించారు. కేంద్రం నుంచి కూడా నిధులు వచ్చాయి. కానీ భూముల సర్వే ఆచరణలోకి రాలేదు. ఇటీవల భూభారతి చట్టం ద్వారా రాష్ట్రంలోని రెవెన్యూ సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం పేర్కొంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో భూముల సర్వేకు మార్గం సుగమం అయినట్టేనని రెవెన్యూ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇందుకు అవసరమైన నిధులు కోరామని, ప్రభుత్వం అంగీకరిస్తే భూముల పైలట్ సర్వే ప్రారంభం అమవుతుందని ఆ శాఖ వర్గాలు చెప్తున్నాయి. రూ.800 కోట్లపైనే అవసరం తెలంగాణలో భూముల సర్వే కోసం రూ.800 కోట్ల నుంచి రూ.1,000 కోట్ల వరకు అవసరమని భూచట్టాల నిపుణులు చెప్తున్నారు. గతంలో అంచనా వేసినప్పుడే రాష్ట్రంలోని భూములన్నింటినీ సర్వే చేసేందుకు రూ.560 కోట్లు కావాలని తేలిందని, ప్రస్తుతం అధునాతన సాంకేతిక నైపుణ్యాలతో కచి్చతమైన సర్వే చేసేందుకు రూ.800 కోట్లు అవసరమని అంచనా వేశారు. అయితే భూముల సర్వే కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా బడ్జెట్లో నిధులు చూపాల్సిన అవసరం లేదని, కేంద్రానికి ప్రతిపాదనలు పంపి భూముల సర్వేకు సిద్ధమైతే కేంద్రమే పూర్తిస్థాయిలో నిధులిస్తుందని చెబుతున్నారు. సర్వే ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం... తెలంగాణలో భూముల డిజిటల్ సర్వేను 3–6 నెలల్లో పూర్తి చేయవచ్చని, ప్రస్తుతం అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానం ప్రకారం భూముల సర్వే పెద్ద సమస్య కాబోదని భూచట్టాల నిపుణులు పేర్కొంటున్నారు. కానీ భూముల సర్వే తర్వాత సెటిల్మెంట్ అవసరమని, భూమిని కొలవడమే కాకుండా ల్యాండ్ పార్శిల్ ఎవరిదో నిర్ధారణ చేయడమే అసలు సమస్య అని చెబుతున్నారు. ఇందుకు నిధులతో పనిలేదని రాజకీయ నిబద్ధత, ప్రజల భాగస్వామ్యంతోపాటు రెవెన్యూ శాఖకు అవసరమైన సిబ్బంది కావాలని పేర్కొంటున్నారు. పదేళ్ల క్రితం గుజరాత్లో ప్రైవేటు సంస్థలతో భూముల సర్వే నిర్వహించినా.. ఇప్పటికీ సెటిల్మెంట్ సమస్యతో ఇబ్బందులు వస్తున్నాయని వివరిస్తున్నారు. అలా సర్వే పూర్తయిన తర్వాత సమస్యలు రాకుండా తెలంగాణలో కూడా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ఇప్పటివరకు ఈటీఎస్ విధానంలో... భూముల సర్వే కోసం రాష్ట్రంలో గతంలో చైన్, క్రాస్ టాప్ పద్ధతులను అనుసరించేవారు. గొలుసు పద్ధతిలో సర్వే నిర్వహించడం చాలా కష్టమన్న ఉద్దేశంతో అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానంపై దృష్టిపెట్టారు. ప్రస్తుతం రాష్ట్రంలో భూముల సర్వే కోసం ఎలక్ట్రానిక్ టోటల్ స్టేషన్ (ఈటీఎస్) పద్ధతిని ఉపయోగిస్తున్నారు. మండల సర్వేయర్లు, రెవెన్యూ శాఖ ఇదే పద్ధతిలో అవసరమైన చోట భూముల సర్వే చేస్తున్నారు. అయితే ప్రస్తుతం గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ (జీపీఎస్), డిఫరెన్షియల్ గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ (డీజీపీఎస్) అందుబాటులోకి వచ్చాయని.. అన్నింటికంటే ఉత్తమమైన డ్రోన్ సర్వే కూడా చేయవచ్చని.. వీటితో మైదాన ప్రాంతాల్లో 99.9 శాతం కచి్చతత్వంతో సర్వే చేయవచ్చని రెవెన్యూ వర్గాలు చెప్తున్నాయి. అత్యాధునిక ‘రియల్టైమ్ కైనమాటిక్’ పద్ధతిలో లైడార్ స్కానింగ్, మొబైల్ మ్యాపింగ్ల ద్వారా డ్రోన్ ఆధారిత ఏరియల్ సర్వే ఉత్తమమైనదని పేర్కొంటున్నాయి. అయితే రెవెన్యూ శాఖ చేసిన భూముల సర్వే ప్రతిపాదనపై ప్రభుత్వం చివరికి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది తేలాల్సి ఉంది. ఎన్నో ప్రయోజనాలు.. కొన్ని సమస్యలు.. రాష్ట్రంలో భూముల సర్వేతో అనేక ప్రయోజనాలు చేకూరుతాయని నిపుణులు చెబుతున్నారు. తెలంగాణలో ఎప్పుడో నిజాం కాలంలో భూముల సర్వే జరిగింది. ఆ తర్వాత ఇప్పటివరకు రీసర్వే జరగలేదు. నాటి రికార్డులే ఇప్పటికీ కొనసాగుతున్నాయి. ఇప్పుడు పూర్తిస్థాయిలో భూముల సర్వే జరిగితే రికార్డులు మరింత పకడ్బందీగా రూపొందుతాయని భూచట్టాల నిపుణులు చెబుతున్నారు. భూముల సర్వేతో దాదాపు అన్ని రకాల భూవివాదాలకు చెక్ పడుతుందని, ప్రతి భూకమతం హద్దులు పక్కాగా తేలుతాయని వివరిస్తున్నారు. ప్రభుత్వ, రెవెన్యూ, అటవీ భూముల సరిహద్దులు కూడా పక్కగా గుర్తించవచ్చని అంటున్నారు. సర్వే ద్వారా వ్యక్తులు, సంస్థల మధ్య ఉండే భూవివాదాలే కాకుండా.. ప్రభుత్వ శాఖల మధ్య ఉండే భూవివాదాలు కూడా పరిష్కారమయ్యే అవకాశాలు ఉంటాయని పేర్కొంటున్నారు. ఏ సర్వే నంబర్లో ఎవరికి ఎంత భూమి ఉందనే అంశం కూడా వెల్లడవుతుందని స్పష్టం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఆమోదించిన భూభారతి చట్టంలో కూడా భూముల రీసర్వేకు అవకాశం కల్పించడంతోపాటు ప్రతి భూకమతానికి పక్కాగా భూదార్ నంబర్ ఇచ్చేలా నిబంధనలు పొందుపరిచారని అధికారులు గుర్తు చేస్తున్నారు. ‘‘తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో రైతుల భూమి ఒక సర్వే నంబర్లో ఉంటే.. వారి రికార్డుల్లో మరో సర్వే నంబర్ నమోదైంది. ఇలాంటి సమస్యలకు కూడా భూముల సర్వేతో పరిష్కారం లభించే అవకాశం ఉంది..’’ అని రెవెన్యూ వర్గాలు అంటున్నాయి. సిబ్బంది కొరతతో ఇబ్బంది భూముల సర్వేలో కొన్ని సమస్యలు కూడా ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయని రెవెన్యూ శాఖ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా సర్వేయర్లు, రెవెన్యూ సిబ్బంది కొరత భూముల సర్వేకు విఘాతంగా మారుతుందని.. కొన్ని సందర్భాల్లో రైతుల నుంచి కూడా ప్రతిఘటన ఎదురయ్యే అవకాశాలు కూడా ఉన్నాయని పేర్కొంటున్నాయి. భూవిస్తీర్ణంలో తేడాలు, కబ్జాలోని తేడాలను రైతులు అంగీకరించే పరిస్థితి ఉండదని.. ఇలాంటి సమస్యలకు సంబంధించి ప్రభుత్వం ముందుగానే ఓ నిర్ణయం తీసుకుంటే మంచిదని భూచట్టాల నిపుణులు సూచిస్తున్నారు. ఈ సమస్యలకు పరిష్కారం చూపి, పక్కాగా లెక్కలు తేల్చగలిగితేనే భూముల సర్వే వల్ల ప్రయోజనం ఉంటుందని పేర్కొంటున్నారు. -
అదీనమా?.. పరాధీనమా?
సాక్షి ప్రతినిధి, వరంగల్: భూములను గుర్తించడంలో అధికారుల కాలయాపన వల్ల అటవీ భూములు అన్యాక్రాంతం అవుతున్నాయి. పర్యావరణం, జీవవైవిధ్యానికి దోహదపడాల్సిన సామాజిక అడవుల పెంపకం ఆగిపోగా.. ఆ భూములు సైతం ఆక్రమణలకు గురయ్యాయి. రెవెన్యూ, అటవీశాఖల్లోని కొందరు అధికారుల ఉదాసీనత వల్ల అడవులు (Forest) పెరిగిన భూములు సైతం ఆక్రమణదారుల పేరిట రిజిస్ట్రేషన్ కాగా.. వారు ‘రైతుబంధు’ను సైతం పొందుతున్నారు. ఉమ్మడి వరంగల్లో పలుచోట్ల ఇలాంటి సంఘటనలు చోటుచేసుకోగా, తెలంగాణ (Telangana) వ్యాప్తంగా అటవీ భూముల ఆక్రమణల వివాదాలున్నాయి. చాలాచోట్ల కోర్టుల ద్వారా పరిష్కారమయ్యాయి. భూపాలపల్లి జిల్లా కేంద్రం సమీపంలోని కొంపెల్లి గ్రామ పరిధిలో 106.34 ఎకరాల భూమి ప్రైవేటు వ్యక్తులది కాదని.. అది అటవీ భూమేనని సుప్రీంకోర్టు సుమారు ఆరు నెలల కిందట తీర్పు ఇచ్చింది. హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలంలో ఇనుపరాతి గుట్టల చుట్టూ ఆక్రమణలకు గురైన అటవీ భూములపై రెవెన్యూ, అటవీశాఖలు ఎటూ తేల్చడం లేదు. సర్వేల పేరిట సాగదీత నేపథ్యంలో రూ.కోట్ల విలువైన అటవీ భూములు స్వాదీనం చేసుకుంటారా? పరాదీనమవుతాయా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అధికారుల సాయంతోనే యథేచ్ఛగా ఆక్రమణలు.. హనుమకొండ జిల్లా ధర్మసాగర్, ఎల్కతుర్తి, భీమదేవరపల్లి, వేలేరు మండలాల శివార్లలోని ఇనుపరాతి గుట్టల చుట్టూ అటవీశాఖ లెక్కల ప్రకారం 3,952 ఎకరాలు ఉంది. నిజాంకాలంలో మొత్తం 4 వేల ఎకరాలకుపైగా భూమిని అటవీశాఖకు అప్పగించినట్టు రికార్డుల్లో ఉంది. కొత్తపల్లి బ్లాక్లో 594 ఎకరాలు, దామెరలో 560, ఎర్రబెల్లిలో 820, దేవనూరులో 1,095, ముప్పారం బ్లాక్లో 906 ఎకరాలుగా ఉంది. కాలక్రమంలో రెవెన్యూ అధికారుల తీరు వల్ల అటవీ భూమికి చుట్టుపక్కల పట్టాలు పుట్టుకొచ్చాయి. ఈ వ్యవహారంపై కొన్నేళ్లుగా రెవెన్యూ, అటవీశాఖలు కలిసి సర్వే పేరుతో కాలయాపన చేస్తుండటంతో ఇంకా ప్రైవేటు వ్యక్తులు యథేచ్ఛగా ఆక్రమిస్తూ పట్టాలు చేసుకుంటున్నారు. రెవెన్యూ అధికారులు కొందరు సర్వేనంబర్లకు బై నంబర్లు వేసి పట్టాదారు పాసుపుస్తకాలు కూడా అందజేస్తున్నారు. గతంలో పనిచేసిన ఓ రెవెన్యూ అధికారి ఏకంగా 40 ఎకరాలకు పట్టాలు ఇచ్చేయడం తీవ్ర విమర్శలకు దారితీసింది. 30 ఎకరాల వరకు ధర్మారం మండలంలోని అటవీ శివారుల్లోని భూములు కూడా కబ్జాదారుల చేతుల్లో ఉన్నాయి. పల్లగుట్ట, చాకలిగుట్ట, ఎదురుగుట్ట, పందిఅడుగుగుట్ట పరిధిలోని భూములు కొందరి కబ్జాలో ఉన్నాయి. ఏడాది క్రితం 102 ఎకరాలు కొందరికి పట్టా చేసేందుకు ప్రయత్నాలు జరగ్గా.. ఇంటెలిజెన్స్ హెచ్చరికలతో ఉన్నతాధికారులు చెక్ పెట్టారు. అయినా 40 ఎకరాల వరకు పట్టా అయ్యిందని చెబుతున్నారు. కాగా కొన్నేళ్లుగా ఈ భూములను పట్టాలు చేసుకుంటున్నవారిలో రియల్ ఎస్టేట్ వ్యాపారులే ఎక్కువగా ఉండగా.. కొందరు ఫారెస్టు, రెవెన్యూ అధికారుల ప్రమేయంతోనే వారి రంగప్రవేశం జరిగిందన్న చర్చ సాగుతోంది. ఇదిలా వుండగా ఈ స్థలాల్లోని కొన్ని సర్వే నంబర్లలో దశాబ్దాల కిందట కొందరు చిన్న సన్నకారు రైతులకు ప్రభుత్వం భూములను అసైన్డ్ చేయగా, వారికి సైతం రెవెన్యూ అధికారులు సాగు చేసుకునేందుకు హద్దులు నిర్ణయించి ఇవ్వడం లేదు. కబ్జాదారులకు మాత్రం ముడుపులు తీసుకుని చకచకా పట్టాలు చేసేయడం వల్ల పట్టాదారులు ఇబ్బంది పడాల్సి వస్తుందంటున్నారు.తెలంగాణలో తగ్గిన అటవీ విస్తీర్ణం.. ‘ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్టు– 2023’ప్రకారం తెలంగాణలో 2021–23 మధ్యకాలంలో 100.42 చదరపు కిలోమీటర్లు అటవీ విస్తీర్ణం తగ్గింది. 2021లో 21,279.46 చ.కి.మీ.లు ఉన్న రాష్ట్ర అటవీ విస్తీర్ణం.. 2023 నాటికి 21,179.04కు తగ్గింది. ఈ తరుగుదలలో మధ్యప్రదేశ్ (371.54 చ.కి.మీ.లు), ఆంధ్రప్రదేశ్ (138.66 చ.కి.మీ.లు) తర్వాత స్థానంలో తెలంగాణ ఉంది. రాష్ట్రంలోని 33 జిల్లాలకుగాను 13 జిల్లాల్లో అటవీ విస్తీర్ణం తగ్గగా 20 జిల్లాల్లో పెరిగినట్లు నివేదిక పేర్కొంది. తగ్గిన 13 జిల్లాలలో మహబూబాబాద్లో 26.98 చ.కి.మీ.లు, ములుగులో 25.91 చ.కి.మీ.లు, జయశంకర్ భూపాలపల్లిలో 15.43 చ.కి.మీ.లు, వరంగల్లో 2.51 చ.కి.మీ.లు, జనగామలో 2.13 చ.కి.మీ.లు తగ్గింది.‘ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్టు– 2023’ప్రకారం తెలంగాణలో 2021–23 మధ్యకాలంలో 100.42 చదరపు కిలోమీటర్లు అటవీ విస్తీర్ణం తగ్గింది. 2021లో 21,279.46 చ.కి.మీ.లు ఉన్న రాష్ట్ర అటవీ విస్తీర్ణం.. 2023 నాటికి 21,179.04కు తగ్గింది. ఈ తరుగుదలలో మధ్యప్రదేశ్ (371.54 చ.కి.మీ.లు), ఆంధ్రప్రదేశ్ (138.66 చ.కి.మీ.లు) తర్వాత స్థానంలో తెలంగాణ ఉంది. రాష్ట్రంలోని 33 జిల్లాలకుగాను 13 జిల్లాల్లో అటవీ విస్తీర్ణం తగ్గగా 20 జిల్లాల్లో పెరిగినట్లు నివేదిక పేర్కొంది. తగ్గిన 13 జిల్లాలలో మహబూబాబాద్లో 26.98 చ.కి.మీ.లు, ములుగులో 25.91 చ.కి.మీ.లు, జయశంకర్ భూపాలపల్లిలో 15.43 చ.కి.మీ.లు, వరంగల్లో 2.51 చ.కి.మీ.లు, జనగామలో 2.13 చ.కి.మీ.లు తగ్గింది.ధర్మసాగర్ మండలం దేవునూర్ శివారులోని ప్రభుత్వ నోటిఫికేషన్లో ఉన్న భూములు, నోటిఫికేషన్లో లేని భూములు గుర్తించాం. ఆ భూముల్లో సాగు చేస్తున్న రైతుల వివరాలు సేకరించి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. దీనిపై ఉన్నతాధికారుల ఆదేశానుసారం నిర్ణయం తీసుకుంటాం. దేవునూర్, ముప్పారం గ్రామాల శివారులోని ఇనుపరాతి గుట్టల్లో ఫారెస్ట్ అధికారులకు– రైతులకు మధ్య జరుగుతున్న వివాదం పరిష్కారమయ్యేలా ఫారెస్ట్ భూములు, రైతుల పట్టా భూములు సర్వే చేశాం. – బి.సదానందం, తహసీల్దార్, ధర్మసాగర్, హనుమకొండ జిల్లా సర్వే వివరాలు అందాల్సి ఉంది.. ఇనుపరాతి గుట్టలు, నాలుగు మండలాల పరిధిలో ఉన్న సర్వే ఇంకా కొంతమేర మిగిలి ఉంది. ధర్మసాగర్ మండలంలోని ముప్పారం, దేవనూరు, వేలేరు మండలంలోని ఎర్రబెల్లి, భీమదేవరపల్లి మండలంలోని కొత్తపల్లి, ఎల్కతుర్తి మండలంలోని దామెర గ్రామాల శివారులో ఇనుపరాతి గుట్టలు ఉన్నాయి. మొత్తం ఫారెస్ట్ భూమి 3,750 ఎకరాలకుపైన ఉండాలి. ఈ భూమికి రెవెన్యూ అధికారులు హద్దులు ఏర్పాటు చేసి ఇస్తే ఫారెస్ట్ అధికారులు ఆ భూముల చుట్టూ ఫెన్సింగ్ చేస్తారు. జిల్లా ఉన్నతాధికారులు తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. – భిక్షపతి, ఫారెస్ట్ రేంజ్ అధికారి, ధర్మసాగర్, హనుమకొండ జిల్లా -
రెవెన్యూలో కొత్త విభాగం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రెవెన్యూ వ్యవస్థలో సరికొ త్త విభాగం ఏర్పాటైంది. భూపరిపాలన ఆవిష్కరణలు, న్యాయ సహకారం కోసం ప్రత్యేక సెల్ ఏర్పా టు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. భూ చట్టాల విషయంలో సుదీర్ఘ అనుభవం ఉన్న నిష్ణాతులైన ముగ్గురితో ఈ విభాగాన్ని ఏర్పాటు చేస్తూ రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిత్తల్ బుధవారం జీవో నెం.8 జారీ చేశారు. న్యాయశాస్త్రంలో డిగ్రీ చదివి, భూమి సమస్యలపై న్యాయపరంగా కనీసం 20 ఏళ్ల అనుభవం ఉన్న నిపుణుడు ముఖ్య సలహాదారుగా, 10 ఏళ్ల అనుభవం ఉన్న ఇద్దరు సలహాదారులుగా ఈ సెల్ను ఏర్పాటు చేస్తున్నట్టు ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ సెల్ ఏం చేయాలన్న దానిపై కూడా ఈ ఉత్తర్వుల్లో స్పష్టత ఇచ్చారు. ఆ ఉత్తర్వుల ప్రకారం... » రాష్ట్రంలో ఇప్పటికే అమల్లో ఉన్న భూమి చట్టాల్లో సవరణలు సూచించడంతోపాటు అవసరమైనప్పుడు కొత్త చట్టాల రూపకల్పనకు ఈ సెల్ పనిచేస్తుంది. » అన్ని రకాల భూమి సమస్యల పరిష్కారానికి ఏం చేయాలన్నది సూచిస్తుంది. » ఇతర రాష్ట్రాల్లో జరుగుతున్న భూ రికార్డుల కంప్యూటరీకరణ ప్రక్రియ, కేంద్ర ప్రభుత్వం చేపట్టిన డీఐఎల్ఆర్ఎంపీ కార్యక్రమాన్ని అధ్యయనం చేయడం ద్వారా తెలంగాణలో భూమి రికార్డుల కంప్యూటరీకరణ చేపట్టాల్సిన చర్యలను సూచిస్తుంది. » ప్రస్తుత భూ, రెవెన్యూ వ్యవస్థలను పరిశీలించి మరింత మెరుగ్గా ఈ వ్యవస్థలను మార్చేందుకు అవసరమైన సలహాలు ఇస్తుంది. » భూసంబంధిత అంశాల్లో అవసరమైనప్పుడు న్యాయసలహాలు అందజేస్తుంది. -
రహస్య జీవోలిస్తూ పారదర్శక పాలనంటే ఎలా?
సాక్షి, అమరావతి: ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రహస్య జీవోలపై నీతులు చెప్పిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్.. అధికారంలోకి వచ్చాక పారదర్శకతకు పాడె కట్టేశారని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ అన్నారు. ఆయన సోమవారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వ చ్చిన ఏడు నెలల్లోనే 78 రహస్య జీవోలు విడుదల చేసి, పైకి మాత్రం పారదర్శక ప్రభుత్వం అని చెప్పుకుంటోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ కూడా ఆయన నేతృత్వం వహించే పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో ఒకేరోజు ఏకంగా 6 రహస్య జీవోలు ఇచ్చి ఆయనేమీ తక్కువ తినలేదని నిరూపించుకున్నాడని చెప్పారు.ఆ రహస్య జీవోలన్నీ కాంట్రాక్టర్లకు పనులు అప్పజెప్పేవి, కన్సల్టెన్సీలకు బిల్లులు చెల్లించేవే అని తెలిపారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఒకలా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరోలా మాట్లాడటం ఆయనకు వెన్నుపోటుతో పెట్టిన విద్య అని, పవన్ సైతం అబద్ధాల్లో చంద్రబాబునే మించిపోయారని అన్నారు. తాము ఏ వివరాలను గోప్యంగా ఉంచబోమని, ప్రభుత్వ ఉత్తర్వులు ప్రజలు ఎప్పటికప్పుడు చూసుకోవచ్చని, ఇదే పారదర్శక పాలనకు సాక్ష్యమంటూ గత ఏడాది ఆగస్టు 30న ప్రకటించిన చంద్రబాబు, పవన్.. వాస్తవంలో అందుకు విరుద్ధంగా పనిచేస్తున్నారని వివరించారు.కీలకమైన రెవెన్యూ శాఖకు సంబంధించి 36, మున్సిపల్ శాఖలో 14, జనరల్ అడ్మినిస్ట్రేషన్కు సంబంధించి 4, ఆర్థిక శాఖకు చెందినవి 5, ఇరిగేషన్లో 6, హోంశాఖలో 4 జీవోలు రహస్యంగా ఇచ్చారని తెలిపారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేతిలో ఉన్న పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలోనూ ఒకే రోజు 6 రహస్య జీవోలిచ్చారని, ఇవన్నీ కీలకమైన జీవోలేనని చెప్పారు. ప్రభుత్వం వెంటనే ఆ జీవోలన్నీ బహిర్గతం చేసి చిత్తశుద్ధి నిరూపించుకోవాలని నాగార్జున యాదవ్ డిమాండ్ చేశారు. -
సర్కారు బడులపై కర్ర పెత్తనం!
సాక్షి, అమరావతి: విద్యార్థులకు అందించాల్సిన సంక్షేమ పథకాలకు ఎగనామం పెట్టేందుకు చంద్రబాబు కూటమి ప్రభుత్వం నెలకో కొత్త నాటకం ఆడుతోంది. ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉంటే అంతమందికీ తల్లికి వందనం కింద రూ.15 వేలు సహా పలు హామీలిచ్చిన కూటమి పెద్దలు అధికారంలోకి వచ్చి ఏడు నెలలు దాటినా ఒక్క పథకం అమలు చేయకుండా కుంటి సాకులు వెదుకుతోంది. తాజాగా ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల సంఖ్య వాస్తవంకంటే అధికంగా ఉందని, తప్పుడు ఎన్రోల్మెంట్పై చర్యలు తీసుకుంటామని ఉపాధ్యాయులను హెచ్చరిస్తోంది. అంతేగాక, విద్యార్థుల సంఖ్యపై లెక్కలంటూ ప్రభుత్వ పాఠశాలలపై రెవెన్యూ శాఖకు పెత్తనం అప్పగించింది. విద్యార్థుల లెక్క తీసేందుకు ఎమ్మార్వో, ఎండీవో, ఇతర రెవెన్యూ సిబ్బందిని ప్రభుత్వ స్కూళ్లకు పంపిస్తోంది. వాస్తవానికి ఆధార్ నంబర్ ఆధారంగా విద్యార్థులను బడుల్లో చేర్చుకున్నారు. ఆ వివరాలు ఇప్పుడు యూడైస్తో సరిపోవడంలేదని, డ్రాప్ బాక్స్లో కనిపిస్తున్న 2,02,791 మంది విద్యార్థులు వాస్తవానికి లేకున్నా అదనంగా నమోదు చేశారని చెబుతోంది. వారందరినీ తొలగించేందుకు ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసిందని అధికారవర్గాలు చెబుతున్నాయి. గత ప్రభుత్వంలో బడి బయట పిల్లలను స్థానికంగా గ్రామ/వార్డు వలంటీర్లు, సచివాలయ విద్యా కార్యదర్శులు కలిసి గుర్తించేవారు. వారిని తిరిగి పాఠశాలల్లో చేరి్పంచే బాధ్యత తీసుకునేవారు. దీంతో డ్రాప్బాక్స్ ఖాళీగా ఉండేది. ప్రస్తుతం వలంటీర్లు, సచివాలయ కార్యదర్శులను కూటమి ప్రభుత్వం పక్కన పెట్టడంతో బడిబయటి పిల్లలు ఎక్కడున్నారో తెలియని పరిస్థితి నెలకొంది. డ్రాప్ బాక్స్ లెక్కలు బోగస్ అంటూ.. పాఠశాల విద్యా శాఖ లెక్కల ప్రకారం ప్రస్తుతం 1 నుంచి 10వ తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలల్లో సుమారు 37 లక్షల మంది చదువుతున్నారు. విద్యార్థుల చేరికలు, వారి ఆధార్ వివరాలను యూడైస్తో అనుసంధానం చేశారు. దీంతో అందరి పిల్లల వివరాలు చిరునామాలతో సహా ప్రభుత్వం వద్ద ఉన్నాయి. ఓ విద్యార్థి వరుసగా 30 రోజులు బడికి హాజరు కాకపోతే ఆ వివరాలు పాఠశాల విద్య డేటా బేస్లోని ‘డ్రాప్బాక్స్’లోకి వెళ్లిపోతాయి. అంటే వారు డ్రాప్ అవుట్స్గా లెక్కించాలి. ఇలా ప్రతి పాఠశాలకు నెల రోజులకు మించి హాజరు కాని వారు 10 నుంచి 50 మంది వరకు ఉంటారని అంచనా.దాని ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా డ్రాప్ బాక్స్లో నమోదైన విద్యార్థుల సంఖ్య గతేడాది అక్టోబర్ నాటికి 2,02,791 మందికి చేరింది. ఇప్పుడు ఈ వివరాలను బోగస్ ఎన్రోల్మెంట్గా గుర్తించనుంది. ఇలా బోగస్ ఎన్రోల్మెంట్ చేసినందుకు ఉపాధ్యాయులపై చర్యలు తీసుకుంటామని ఇటీవల ఒంగోలులో జరిగిన సమావేశంలో పాఠశాల విద్య డైరెక్టర్ విజయ్ రామరాజు తీవ్రంగా హెచ్చరించారు. టీచర్ పోస్టులు పోకుండా కాపాడుకునేందుకు నకిలీ ఎన్రోల్మెంట్ చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్ఎంలను హెచ్చరించారు. బోగన్ హాజరు వేసే హెచ్ఎంలపై క్రిమినల్ కేసులు కూడా నమోదు చేస్తామన్నారు. బోగస్ హాజరును నిగ్గు తేల్చేందుకు రెవెన్యూ అధికారుల బృందాలు ప్రతి పాఠశాలను తనిఖీ చేసేలా ఆదేశాలిచ్చారు. ప్రభుత్వ పాఠశాలలపై తప్పుడు ముద్ర గత ప్రభుత్వంలో సర్కారు బడుల్లో విద్యార్థులకు నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందేది. అలాగే, ఏటా అమ్మ ఒడి కింద రూ.15 వేల చొప్పున నగదు తల్లుల ఖాతాల్లో జమయ్యేది. దీంతో నిరుపేదలు సైతం తమ పిల్లలను బడులకు పంపేవారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల డ్రాప్ అవుట్స్ దాదాపు తగ్గిపోయాయి. ఒకవేళ ఎక్కడైనా డ్రాపవుట్స్ ఉంటే వలంటర్లు, సచివాలయ సిబ్బంది వారిని తిరిగి బడుల్లో చేర్చించేవారు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చాక బడి బయట పిల్లలను గుర్తించే బాధ్యతను ఉపాధ్యాయులకే అప్పగించింది. పైగా తల్లికి వందనం కింద ఇస్తామన్న రూ.15 వేలు ఇవ్వనేలేదు.దీంతో చాలామంది నిరుపేదలు, కూలీలు పిల్లలను తీసుకుని ఉపాధి కోసం వలసపోయారు. పిల్లలు కూడా బాల కార్మికులుగా మారుతున్నారు. దీంతో బడుల్లో చేరిన విద్యార్థుల డ్రాప్ అవుట్స్ పెరిగాయి. 2024 అక్టోబర్ నాటికి 2,02,791 మంది విద్యార్థులు డ్రాప్ బాక్స్లోకి చేరగా, ఈ మూడు నెలల్లో మరో 50 వేల మందికి పైగా పెరిగి ఉండవచ్చని అంచనా. కానీ, ఈ లెక్కలను బోగస్ అంటూ రెవెన్యూ అధికారులు తనిఖీలకు వచ్చినప్పుడు లెక్క సరిపోవాలని, లేకుంటే కఠిచర్యలు తప్పవంటూ విద్యా శాఖ హెచ్చరించడంపై టీచర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అన్ని విషయాలు ప్రభుత్వానికి తెలిసినప్పటికీ, తాము తప్పు చేశామని అనడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
వడివడిగా ‘భూభారతి’
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో భూభారతి చట్టం అమలు దిశగా రెవెన్యూ శాఖ వడివడిగా కసరత్తు చేస్తోంది. ఈ నెలలోనే గవర్నర్ ఆమోదం పొందిన ఈ చట్టం అమలులో భాగంగా అవసరమైన మార్గదర్శకాల రూపకల్పనలో ఉన్నతాధికారులు నిమగ్నమయ్యారు. చట్టంలోని సెక్షన్లు, సబ్ సెక్షన్లవారీగా మార్గదర్శకాలను రూపొందించే పనిలోపడ్డారు. ఇందుకోసం త్వరలోనే భాగస్వామ్య పక్షాలతో వర్క్షాప్ నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఈ వర్క్షాప్లో మార్గదర్శకాలు ఎలా ఉండాలనే విషయమై స్పష్టత రానుంది. మార్గదర్శకాల రూపకల్పన వచ్చే నెల మూడో వారానికల్లా పూర్తయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ కసరత్తు పూర్తయ్యాక వాటిని మళ్లీ క్షుణ్ణంగా పరిశీలించి ఈ చట్టం ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుందన్న దానిపై ప్రభుత్వం ప్రకటన చేయనుంది. అయితే వచ్చే నెలలో భూభారతి చట్టం అమల్లోకి వస్తుందని రెవెన్యూ శాఖ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ చట్టం అమల్లోకి వచ్చే వరకు ప్రస్తుతం అమల్లో ఉన్న ధరణి పోర్టల్ ద్వారానే వ్యవసాయ భూముల క్రయవిక్రయ లావాదేవీలు జరుగుతాయని ఆ శాఖ వర్గాలు వెల్లడించాయి. మాతో చర్చించి నిర్ణయం తీసుకోండి: వీఆర్వోల జేఏసీ గ్రామ రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేయడంలో భాగంగా గతంలో గ్రామ రెవెన్యూ అధికారులు (వీఆర్వో)గా పనిచేసిన తమను షరతుల్లేకుండా మళ్లీ రెవెన్యూ వ్యవస్థలోకి తీసుకోవాలని తెలంగాణ విలేజ్ రెవెన్యూ ఆఫీసర్స్ జేఏసీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. గతంలో పనిచేసిన అనుభవాన్ని పరిగణనలోకి తీసుకొని పరీక్షలు పెట్టకుండా సర్వీస్కు భద్రత కల్పిస్తూ నియమించాలని జేఏసీ చైర్మన్ గోల్కొండ సతీశ్, సెక్రటరీ జనరల్ హరాలే సుధాకర్రావు, అదనపు సెక్రటరీ జనరల్ పల్లెపాటి నరేశ్, వైస్చైర్మన్లు చింతల మురళి, ప్రతిభలు ఆదివారం ఒక ప్రకటనలో కోరారు. హైకోర్టులో ఉన్న కేసులను పరిష్కరించకుండా, తమతో చర్చలు జరపకుండా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం తగదని వారు ప్రభుత్వానికి సూచించారు. -
స్వతంత్రంగా ధరణి ఫోరెన్సిక్!
సాక్షి, హైదరాబాద్: ధరణి పోర్టల్ ద్వారా రాష్ట్రంలో జరిగిన భూముల క్రయ, విక్రయాలపై ఫోరెన్సిక్ ఆడిటింగ్ చేయాలని నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వం.. ఆ ఆడిటింగ్ చేసే ఫోరెన్సిక్ బృందాలకు స్వయం ప్రతిపత్తి కల్పించాలని భావిస్తోంది. డిజిటల్ ఫుట్ ప్రింట్స్ ఆధారంగా భూ లావాదేవీల్లో జరిగిన అవకతవకలను గుర్తించే ప్రక్రియలో నిపుణులను మాత్రమే భాగస్వాములను చేయాలని నిర్ణయించింది. జిల్లాలవారీగా భూములను ఆడిటింగ్ చేసేందుకు రెవెన్యూ శాఖలోని ఉన్నతస్థాయి అధికారులతో సంబంధం లేకుండా ఈ నిపుణుల బృందాలను నేరుగా ఆయా జిల్లాల కలెక్టర్లతో అటాచ్ చేయాలని నిర్ణయించినట్టు సమాచారం. ఈ బాధ్యతలు అప్పగించేందుకు హైదరాబాద్కు చెందిన రెండు, ముంబైకి చెందిన ఒక కంపెనీ సామర్థ్యాలను ప్రభుత్వం పరిశీలిస్తోంది. రెవెన్యూ వ్యవహారాలు, సాఫ్ట్వేర్ అంశాల్లో ఆ కంపెనీల బలమే ప్రాతిపదికగా ఈ మూడింటిలో ఒక దానిని ఎంపిక చేయనుంది. ఇప్పటికే ధరణి పోర్టల్ వివరాల రీవ్యాంప్ ప్రక్రియ జరుగుతోంది. రానున్న 10–15 రోజుల్లో ఆ ప్రక్రియను పూర్తి చేసి, అనంతరం ఫోరెన్సిక్ ఆడిటింగ్ బాధ్యతలు అప్పగించే కంపెనీని ఎంపిక చేయాలన్న యోచనలో ప్రభుత్వ వర్గాలున్నట్టు సమాచారం. భూముల స్వాదీనమే! ఫోరెన్సిక్ ఆడిటింగ్లో భాగంగా తొలుత హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల్లోని భూముల లావాదేవీలను మాత్రమే పరిశీలించాలని ప్రభుత్వం భావించింది. తాజాగా సిరిసిల్ల, సిద్దిపేట జిల్లాల్లో భూ అక్రమాలు బయటపడటంతో రాష్ట్ర వ్యాప్తంగా అనుమానం ఉన్న ప్రతి లావాదేవీని ఫోరెన్సిక్ ఆడిటింగ్లో పరిశీలించాలని నిర్ణయించింది. ఇందుకు 2014 కంటే ముందు ఉన్న నిషేధిత భూముల జాబితాను ప్రాతిపదికగా తీసుకో నుంది. ఈ జాబితాలోని భూముల్లో ఎన్ని పట్టా భూములుగా మారాయి? ఎందుకు మారాయి? కోర్టు ఉత్తర్వుల పరిస్థితి ఏంటి? కోర్టు ఉత్తర్వులను సవాల్ చేశారా? అసలు కోర్టు ఉత్తర్వులు నిజమైనవేనా? మాజీ సైనికుల పేరిట మార్చిన భూముల్లో ఎన్ని అసలైనవి? మాజీ సైనికులకు ఆవార్డు చేసినట్టు బోగస్ డాక్యుమెంట్లు సృష్టించారా? పనివేళల్లో జరిగిన లావాదేవీలెన్ని? అర్ధరాత్రి తర్వాత ఏయే లావాదేవీలు జరిగాయి? ఏ కంప్యూటర్ నుంచి జరిగాయి? అనుమతి ఇచ్చింది ఎవరు? అనే అంశాలను సాంకేతిక సమాచారంతో సరిపోల్చి ఏం జరిగిందో నిర్ధారించనున్నారు. ఈ ప్రక్రియ అనంతరం అక్రమాలు జరిగాయని తేలిన పక్షంలో వెంటనే సదరు భూములను స్వాధీనం చేసుకొని.. బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు సమాచారం. -
సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు ‘కార్పొరేట్’ లుక్
సాక్షి, హైదరాబాద్: రిజిస్ట్రేషన్ల కోసం వచ్చే ప్రజలకు మెరుగైన సేవలతోపాటు వారికి అవసరమైన వసతులు కల్పించడమే ధ్యేయంగా స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ కార్య కలాపాలు ఉండాలని రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి చెప్పారు. ప్రజలు చెట్ల కింద నిరీక్షించే పరి స్థితిని నివారించేలా ప్రస్తుతమున్న సబ్ రిజిస్ట్రార్ కార్యా లయాలను పునర్వ్యవస్థీకరించడంతోపాటు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబులిటీ (సీఎస్ఆర్) నిధులతో అత్యాధునిక హంగులతో శాశ్వత భవనాలు నిర్మిస్తామన్నారు. ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురామిరెడ్డితో కలిసి మంగళ వారం ఆయన రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల కలెక్టర్లు, జిల్లా రిజిస్ట్రార్లతో సమీక్ష నిర్వహించారు.తొలుత పటాన్చెరు, మేడ్చల్, కుత్బుల్లాపూర్, ఉప్పల్, ఫోర్త్సిటీలో నిర్మాణంఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ సబ్ రిజి స్ట్రార్ కార్యాలయాల శాశ్వత భవనాల కోసం స్థలాలను గుర్తించాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. దశలవారీగా ఈ నిర్మా ణాలు ఉంటాయని, తొలిదశలో పటాన్చెరు, సంగా రెడ్డి, మేడ్చల్, కుత్బుల్లాపూర్, ఉప్పల్తోపాటు రంగారెడ్డి జిల్లా కందుకూరు సబ్రిజిస్ట్రార్ కార్యాలయాన్ని ఫోర్త్ సిటీ లో నిర్మి స్తామని చెప్పారు. గండిపేట, శేరిలింగంపల్లి, రంగా రెడ్డి జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయాలను కలిపి గచ్చిబౌలిలోని తెలంగాణ అకాడమీ ఆఫ్ ల్యాండ్ ఇన్ఫర్మేషన్ అండ్ మేనేజ్మెంట్ (తాలిమ్) కార్యాలయంలో సమీకృత సబ్రిజి స్ట్రార్ నమూనా కార్యాలయాన్ని నిర్మిస్తామని వివరించారు. ఈ నెలలో శంకు స్థాపనలు చేస్తామని చెప్పారు. హైదరాబాద్ జిల్లాలోని బంజా రాహిల్స్, ఎస్ఆర్నగర్, గోల్కొండ సబ్ రిజిస్ట్రార్ కార్యాల యాలను షేక్పేటలో నిర్మించాలని నిర్ణయించామన్నారు.వెయిటింగ్ హాల్, విశాల పార్కింగ్ సదుపాయాలతో..మొదటి దశలో నిర్మించే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు కనీ సం 3 ఎకరాల్లో ఉంటాయని, 10–15 వేల చదరపు అడు గుల్లో కార్యాలయాల భవన నిర్మాణాలు చేపడతామని పొంగులేటి చెప్పారు. వెయిటింగ్ హాల్, తాగునీటి సదుపాయం, విశాల పార్కింగ్ వసతులుండేలా డిజైన్లు రూపొందించా లని అధికారులను ఆదేశించారు. ఇంటిగ్రేటెడ్ సబ్రిజిస్ట్రార్ కార్యాలయాల వల్ల పనితీరు మెరుగుపడుతుందని, పర్యవే క్షణ సులభతరం అవుతుందని.. దస్త్రాల పరిశీలిన వేగవంతం అవుతుందన్నారు. సబ్రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అవినీ తిని నిర్మూలించేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని విరివిగా వాడేలా తక్షణమే కార్యాచరణ రూపొందించాలని రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులను మంత్రి పొంగులేటి ఆదేశించారు. ఈ సమావేశంలో రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిత్తల్, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ జ్యోతి బుద్ధప్రకాశ్ పాల్గొన్నారు. -
Telangana: గ్రామాల్లో జేఆర్వోలు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో తిరిగి గ్రామ రెవెన్యూ అధికారుల నియామకానికి రంగం సిద్ధమైంది. గ్రామస్థాయిలో రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేస్తామన్న రాష్ట్ర సర్కారు... ఆ దిశగా చర్యలకు ఉపక్రమించింది. ప్రతి గ్రామంలో రెవెన్యూ సిబ్బంది అందుబాటులో ఉండేలా... ‘జూనియర్ రెవెన్యూ అధికారి (జేఆర్ఓ)’ పేరుతో పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించినట్టు తెలిసింది. రాష్ట్రంలో మొత్తం 10,911 రెవెన్యూ గ్రామాలు ఉండగా.. ప్రతి గ్రామానికి ఒక రెవెన్యూ అధికారిని నియమించనుంది. దీనిపై విధాన నిర్ణయం తీసుకునేందుకు వీలుగా.. గతంలో వీఆర్వోలు, వీఆర్ఏలుగా పనిచేసి, ఇతర శాఖల్లోకి మార్చి న వారి నుంచి ఆప్షన్లు తీసుకోవాలని నిర్ణయించింది. ఈ మేరకు భూపరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్ఏ) నవీన్ మిత్తల్ సోమవారం జిల్లాల కలెక్టర్లకు సర్క్యులర్ పంపారు. కొత్త చట్టం మేరకు నియామకాలు: ఇటీవల అసెంబ్లీ ఆమోదం పొందిన భూభారతి చట్టం–2024 ద్వారా సంక్రమించే అధికారాల మేరకు గ్రామాల్లో రెవెన్యూ అధికారులను నియమించే ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. గతంలో వీఆర్వో వ్యవస్థ రద్దుకు ముందు ఆ పోస్టుల్లో పనిచేసినవారు, వీఆర్ఏలుగా పనిచేస్తూ వివిధ శాఖల్లోకి పంపిన వారికి ఈ నియామకాల్లో ప్రాధాన్యత ఇవ్వనుంది. డిగ్రీ చదివిన పూర్వ వీఆర్వో, వీఆర్ఏలను నేరుగా రెవెన్యూ శాఖలోకి తీసుకోనున్నారు. ఈ క్రమంలో 3,600 మంది పూర్వ వీఆర్వోలు, 2,000 మంది వరకు పూర్వ వీఆర్ఏలకు ఈ అర్హత ఉన్నట్టు అంచనా. మిగతా సుమారు 5,300 పోస్టులను ఏ విధంగా భర్తీ చేయాలన్న దానిపై రాష్ట్ర ప్రభుత్వం సమాలోచనలు చేస్తోంది. ఇంటర్ పూర్తిచేసిన వారు, ముఖ్యంగా ఇంటర్మీడియట్లో గణిత శాస్త్రం చదివిన వారిని కూడా నేరుగా తీసుకునే అవకాశాలు ఉన్నాయని రెవెన్యూ వర్గాలు చెబుతున్నాయి. అంతేకాదు వీరిలో కొందరిని సర్వేయర్లుగా నియమించే అవకాశం ఉంది. రాష్ట్రవ్యాప్తంగా వెయ్యి మంది కొత్త సర్వేయర్లను నియమించాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో... ఇంటర్ పూర్తి చేసిన పూర్వ వీఆర్వోలు, వీఆర్ఏలను సర్వేయర్లుగా నియమించే అవకాశం ఉందని సమాచారం. ఇలా నేరుగా భర్తీ చేసే జూనియర్ రెవెన్యూ అధికారి, సర్వేయర్ పోస్టులు పోగా... మిగతా పోస్టులకు రాతపరీక్ష నిర్వహించి భర్తీ చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నట్టు తెలిసింది. డైరెక్ట్ రిక్రూట్మెంట్ విధానంలో ఓపెన్గా దరఖాస్తులు స్వీకరించి ఈ పోస్టులను భర్తీ చేస్తారా? లేక పూర్వ వీఆర్వోలు, వీఆర్ఏలకు మాత్రమే పరీక్ష నిర్వహించి, అందులో ఉత్తీర్ణులైన వారిని ఎంపిక చేస్తారా అన్నదానిపై స్పష్టత రావాల్సి ఉంది. అంగీకారం తెలిపితేనే! పూర్వ వీఆర్వోలు, వీఆర్ఏలలో తిరిగి రెవెన్యూ శాఖలోకి వచ్చేందుకు సుముఖత వ్యక్తం చేసిన వారినే జూనియర్ రెవెన్యూ అధికారులుగా నియమించనున్నారు. వాస్తవానికి 2022కు ముందు రాష్ట్రంలో 5వేల మందికిపైగా ‘గ్రామ రెవెన్యూ అధికారులు (వీఆర్వో)’గా పనిచేశారు. అయితే రెవెన్యూ శాఖలో పెరిగిపోయిన అవినీతిని నియంత్రించడం కోసమంటూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం వీఆర్వోల వ్యవస్థను రద్దు చేసింది. ఆ పోస్టుల్లో ఉన్నవారిని వివిధ ప్రభుత్వ శాఖల్లోకి పంపింది. ఆ నిర్ణయంపై కోర్టుకు వెళ్లిన సుమారు 70 మంది కోర్టు తీర్పు ఆధారంగా రెవెన్యూ శాఖలోనే కొనసాగుతున్నారు. మిగతా వారంతా వివిధ ప్రభుత్వ శాఖల్లో జూనియర్ అసిస్టెంట్లు, రికార్డ్ అసిస్టెంట్లుగా పనిచేస్తున్నారు. మున్సిపాలిటీలలో వార్డు అధికారులుగా విధులు నిర్వహిస్తున్నారు. వీరిలో కొందరు సీనియర్ అసిస్టెంట్లుగా పదోన్నతులు కూడా పొందారు. ఈ క్రమంలో మళ్లీ రెవెన్యూ శాఖలోకి వచ్చేందుకు సుముఖత వ్యక్తం చేసిన వారిని మాత్రమే జూనియర్ రెవెన్యూ అధికారులుగా నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇక వీఆర్ఏల విషయానికొస్తే... 2023 జూలై నాటికి 22 వేల మందికిపైగా వీఆర్ఏలుగా పనిచేస్తున్నారు. అందులో 61 ఏళ్లలోపు వయసున్న, 2011 సంవత్సరంలోపు నియమితులైన 16,758 మందిని వివిధ ప్రభుత్వ శాఖల్లోకి పంపారు. మరో 3,797 మంది వయసు 61 ఏళ్లు దాటడంతో.. వారి వారసులకు వేరే శాఖలో ఉద్యోగాలు ఇస్తామని అప్పటి ప్రభుత్వం ప్రకటించింది. ఇలా వివిధ శాఖల్లోకి వెళ్లిన వీఆర్ఏలలో కూడా సుముఖత వ్యక్తం చేసినవారిని మాత్రమే మళ్లీ రెవెన్యూ శాఖలోకి తీసుకోనున్నారు. ప్రస్తుతం పంచాయతీ కార్యదర్శులపై భారం గత ప్రభుత్వం వీఆర్ఏ, వీఆర్వోలను రెవెన్యూ శాఖ నుంచి పంపించేశాక.. గ్రామస్థాయిలో రెవెన్యూ కార్యకలాపాల పర్యవేక్షణ బాధ్యతల్లో కొన్నింటిని పంచాయతీ కార్యదర్శులకు అప్పగించింది. చాలా చోట్ల పెద్ద గ్రామ పంచాయతీలు ఉండటం, రెవెన్యూ వ్యవహారాలపై పంచాయతీ కార్యదర్శులకు అవగాహన లేకపోవడంతో క్షేత్రస్థాయిలో సమస్యలు తలెత్తాయి. ప్రభుత్వ భూములను కాపాడటం, గ్రామాల్లోని రెవెన్యూ అంశాలను ప్రభుత్వానికి నివేదించడం వంటి పనులతో పంచాయతీ కార్యదర్శులపై అదనపు భారం పడింది. మరోవైపు గ్రామాల్లో రెవెన్యూ సిబ్బంది లేని కారణంగా ధ్రువీకరణ పత్రాల జారీ, సంక్షేమ పథకాలకు అర్హుల ఎంపిక, వివిధ ప్రభుత్వ కార్యక్రమాల నిర్వహణ వంటి అంశాల్లో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని తిరిగి గ్రామ రెవెన్యూ వ్యవస్థను అందుబాటులోకి తీసుకువస్తున్నట్టు ప్రకటించింది. గ్రామ రెవెన్యూ రికార్డుల నిర్వహణ మినహా గతంలో వీఆర్వోలు, వీఆర్ఏలు నిర్వహించిన బాధ్యతలన్నీ ‘జూనియర్ రెవెన్యూ అధికారుల’కు అప్పగించే అవకాశం ఉందని రెవెన్యూ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే దీనిపై ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ప్రభుత్వ నిర్ణయం పట్ల టీజీఆర్ఎస్ఏ హర్షం భూభారతి చట్టం కింద రాష్ట్రంలో గ్రామానికో రెవెన్యూ అధికారిని నియమించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం పట్ల తెలంగాణ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ (టీజీఆర్ఎస్ఏ) రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు బాణాల రాంరెడ్డి, వి.భిక్షం హర్షం వ్యక్తం చేశారు. పూర్వ వీఆర్వో, వీఆర్ఏల నుంచి ఆప్షన్లను కోరుతూ సీసీఎల్ఏ ఉత్తర్వులు జారీ చేశారని.. తెలంగాణ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్, డిప్యూటీ కలెక్టర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వి.లచ్చిరెడ్డి కృషి ఫలితంగానే ఇది సాధ్యమైందని పేర్కొన్నారు. ఈ నిర్ణయం పట్ల రాష్ట్ర ప్రభుత్వానికి సోమవారం ఒక ప్రకటనలో ధన్యవాదాలు తెలిపారు. పూర్వ వీఆర్ఏల సంఘం రాష్ట్ర సలహాదారు వింజమూరు ఈశ్వర్ కూడా మరొక ప్రకటనలో ప్రభుత్వం నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేశారు. వీఆర్వోలు, వీఆర్ఏలను గూగుల్ ఫామ్లో ఏమడిగారంటే..గ్రామ రెవెన్యూ అధికారి లేదా సర్వేయర్ పోస్టులలో పనిచేసేందుకు సుముఖంగా ఉన్న పూర్వ వీఆర్వోలు, వీఆర్ఏల నుంచి వివరాలు తీసుకోవాలంటూ సీసీఎల్ఏ కలెక్టర్లను ఆదేశించారు. ఇందుకోసం గూగుల్ ఫామ్ ద్వారా ప్రత్యేక ఫార్మాట్ను పంపారు. ఈ నెల 28లోగా జిల్లాల వారీగా వివరాలన్నీ సేకరించి, ప్రభుత్వానికి పంపాలని ఆదేశించారు. అయితే ఈ ఫార్మాట్లో... వీఆర్వో/వీఆర్ఏ పేరు, తండ్రి పేరు, పుట్టిన తేదీ, ప్రస్తుతం పనిచేస్తున్న ఉద్యోగం, ప్రస్తుతం పనిచేస్తున్న శాఖ, ఎంప్లాయి ఐడీ, ఆ శాఖలో చేరిన తేదీ, రెవెన్యూ శాఖలో నియమితులైన తేదీ, విద్యార్హతలు, ఫోన్ నంబర్, సర్వేయర్గా పనిచేసేందుకు అంగీకారమా లేదా?, వారి సొంత జిల్లా, ప్రస్తుతం పనిచేస్తున్న జిల్లా, ప్రస్తుత చిరునామా వంటివి అడుగుతూ గూగుల్ ఫామ్ను రూపొందించారు. ఇందులో విద్యార్హతలపై ప్రత్యేకంగా ఫోకస్ చేశారు. ముఖ్యంగా మేథమేటిక్స్ సబ్జెక్టుకు ప్రాధాన్యం ఇచ్చినట్టు కనిపిస్తోంది. గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారా? అనే అంశంలో మేథమేటిక్స్ సబ్జెక్టుతో గ్రాడ్యుయేటా? అని.. ఇంటర్ పూర్తి చేశారా అనే అంశంలో మేథమేటిక్స్ సబ్జెక్టు ఉందా? అని అదనపు ప్రశ్నలు అడిగారు. ఇక సర్వేయర్ పోస్టుకు సుముఖత వ్యక్తం చేసేవారిని కూడా గ్రాడ్యుయేషన్/ ఇంటర్మీడియట్లో మేథమేటిక్స్ సబ్జెక్టు ఉందా? అని అడగటం గమనార్హం. -
జీవో 59తో రూ.6 వేల కోట్లు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో సుమారు ఏడాది నుంచి పెండింగ్లో ఉన్న జీవో 59ను అమలు చేయడం ద్వారా ప్రభుత్వ ఖజానాకు పెద్ద ఎత్తున ఆదాయం రానుంది. ఈ జీవో కింద వచ్చిన 50వేలకుపైగా దరఖాస్తులను పరిష్కరించడం ద్వారా సుమారు రూ.6 వేల కోట్ల వరకు ఖజానాకు సమకూరుతుందని రెవెన్యూ శాఖ అంచనా వేసింది. ఆదాయ వనరుల సమీకరణపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేతృత్వంలో ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘానికి దీనిపై నివేదిక కూడా సమర్పించింది. ఈ జీవో అమలును నిలిపివేయడానికి ముందువరకు రూ.534 కోట్ల ఆదాయం వచ్చిoదని.. మిగతా దరఖాస్తుల పరిష్కారం ద్వారా మరో రూ.500 కోట్లు వస్తాయని పేర్కొన్నట్టు తెలిసింది. ఇదే జీవో కింద అధిక విలువ గల భూములను క్రమబద్దీకరిస్తే ఇంకో రూ.5,500 కోట్లు వస్తాయని... జీవో 76, 118 దరఖాస్తుల పరిష్కారం ద్వారా అదనంగా రూ.300 కోట్లు అందుతాయని వివరించినట్టు సమాచారం. ఏడాది నుంచి ఎదురుచూపులే.. జీవో 59 కింద భూముల క్రమబద్దీకరణ కోసం దరఖాస్తు చేసుకున్నవారు ఏడాది నుంచి ఎదురుచూపులు చూస్తున్నారు. ఈ జీవోను అడ్డుపెట్టుకుని గత ప్రభుత్వ హయాంలో కొందరు అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలున్నా... ఎలాంటి పలుకుబడి లేని సాధారణ ప్రజలు మాత్రం వీటి పరిష్కారం ఇంకెప్పుడు అంటూ ఆందోళన చెందుతున్నారు. ఈ జీవో కింద పరిశీలన పూర్తయి డిమాండ్ నోటీసు మేరకు డబ్బులు పూర్తిగా చెల్లించినవారు, పాక్షిక మొత్తం చెల్లించినవారు, తనిఖీలు పూర్తిచేసుకున్న వారు, కన్వేయన్స్ డీడ్లు వచ్చిన తర్వాత కూడా ప్రభుత్వం విధించిన స్టేతో ఆ భూములపై ఎలాంటి లావాదేవీలు నిర్వహించడానికి వీల్లేనివారు వేల మంది ఉన్నారు. వారంతా కాంగ్రెస్ సర్కారు నిర్ణయం పట్ల ఆశతో ఉన్నారు. అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాల్సిందేనని, అదే క్రమంలో అర్హులైన వారికి భూములపై హక్కులు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రక్రియ కొనసాగుతుండగానే.. జీవో 59 కింద ప్రభుత్వ స్థలాల క్రమబద్ధీకరణ కోసం 2022, 2023 సంవత్సరాల్లో రంగారెడ్డి, మేడ్చల్, హైదరాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో కలిపి 31 వేలు, మిగతా అన్ని జిల్లాల్లో 26 వేల వరకు.. మొత్తంగా 57 వేల వరకు దరఖాస్తులు వచ్చాయి. ఇందులో ప్రభుత్వం 32,788 దరఖాస్తులను ఆమోదించి సదరు లబ్దిదారులకు డిమాండ్ నోటీసులు జారీ చేసింది. 10వేల మందికిపైగా ప్రభుత్వం నిర్ణయించిన ధర చెల్లించి కన్వేయన్స్ డీడ్ (రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు) కూడా పొందారు. డిమాండ్ నోటీసుల మేరకు డబ్బులు కట్టినా.. కన్వేయన్స్ డీడ్లు జారీకానివారు మరో 3 వేల మందికి పైగా ఉన్నారు. ఈ ప్రక్రియ కొనసాగుతుండగానే ఎన్నికలు రావడం, ప్రభుత్వం మారడం జరిగింది. గత ఏడాది డిసెంబర్ 7న కాంగ్రెస్ సర్కారు ఏర్పాటవగా.. అదే నెల 11వ తేదీ నుంచి ఈ జీవోకు సంబంధించిన పోర్టల్ను నిలిపివేశారు. ఆ జీవో కింద అప్పటికే చేసిన క్రమబద్దీకరణలను నిలిపివేస్తున్నట్టు ప్రకటించారు. ఈ జీవోను అడ్డుపెట్టుకుని విలువైన భూములను బీఆర్ఎస్ నేతలు క్రమబద్ధీకరించుకున్నారనే ఆరోపణలతో ఈ చర్య తీసుకున్నట్టు ప్రకటించింది. అయితే అలాంటివన్నీ ముందే జరిగిపోయాయని... సాధారణ ప్రజల దరఖాస్తులే ఇంకా పెండింగ్లో ఉన్నాయని దరఖాస్తు దారులు పేర్కొంటున్నారు. హక్కులు కల్పించని కారణంగా ఈ భూములు ఇటు తమవి కాకుండా, అటు ప్రభుత్వానివి కాకుండా మిగిలిపోతున్నాయని పేర్కొంటున్నారు. అసలు జీవో 59 ఏంటి?తెలంగాణ ఏర్పాటయ్యాక ప్రభుత్వ స్థలాల్లో ఇళ్లు కట్టుకుని ఉంటున్న పేదలకు ఆ భూములను క్రమబద్ధీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు 2014 డిసెంబర్ 30న తొలిసారి జీవో 59 విడుదల చేసింది. ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించింది. 2022, 2023 సంవత్సరాల్లో ఆ జీవోలో స్వల్ప మా ర్పులు చేస్తూ పొడిగింపు ఉత్తర్వులు జారీ చేశారు.చివరిగా 2023లో విడుదల చేసిన జీవో ప్రకారం... క్రమబద్దీకరణ కోసం 125 నుంచి 250 గజాల వరకు స్థలాలకు మార్కెట్ విలువలో 25 శాతం... 250 గజాల నుంచి 500 గజాల ఉన్న స్థలాలకు 50శాతం, 500–750 గజాల స్థలాలకు 75శాతం, 750 గజాలపైన ఉంటే మార్కెట్ విలువలో 100 శాతం సొమ్ము చెల్లించాలి. క్రమబద్దీకరణ సంబంధించిన మరో జీవో 58 ప్రకారం... 125 చదరపు గజాలలోపు భూమిలో నిర్మాణాలుంటే ప్రభుత్వం ఉచితంగా క్రమబద్దీకరిస్తుంది. తొలుత 2014 జూన్ 2 నాటికి ఆక్రమణలో ఉన్న భూములను క్రమబద్దీకరిస్తామని జీవోలో పేర్కొన్నా.. 2023లో విడుదల చేసిన జీవోలో దరఖాస్తు చేసుకునే నాటికి ఆక్రమణలో ఉన్నా క్రమబద్దీకరిస్తామని సర్కారు పేర్కొంది. -
ఆ భూములు ఇవ్వండి!
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల (పీఎస్యూ)లకు గతంలో కేటాయించిన భూము ల్లో.. ఏళ్ల తరబడి నిరుపయోగంగా ఉన్నవాటిని తిరిగి ఇవ్వాలని రాష్ట్రప్రభుత్వం కోరుతోంది. మొత్తంగా 10 వేల ఎకరాలకుపైగానే నిరుపయోగంగా ఉన్నాయని ఇప్పటికే గుర్తించింది. ప్రధాన ప్రాంతాల్లో ఉన్న ఈ భూములను ప్రభుత్వ ధర తీసుకుని తమకు అప్పగించాలని కోరుతోంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు ప్రారంభమయ్యాయని.. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసిందని రెవెన్యూ వర్గాల సమాచారం. మిధాని, డీఆర్డీవో, బీడీఎల్, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ, బీహెచ్ఈఎల్, హెచ్ఏ ఎల్, ఈసీఐఎల్, డీఆర్డీఎల్ వంటి సంస్థల భూములు ఈ జాబితాలో ఉన్నట్టు తెలిసింది. బీజేపీ అధికారంలో ఉన్న హరియాణా రాష్ట్రంలో కూడా ఇలాంటి డిమాండ్ ఉందని, దీంతో ఈ డిమాండ్ల పట్ల కేంద్రం సానుకూలంగా స్పందించే అవకాశముందని రెవెన్యూ వర్గాలు భావిస్తున్నాయి. దశాబ్దాల కింద కేటాయింపు.. రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ రంగ సంస్థల ఏర్పాటు కోసం దశాబ్దాల క్రితం పెద్ద సంఖ్యలో రాష్ట్ర ప్రభుత్వ భూములను కేటాయించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పరస్పర అంగీకారంతోపాటు నిబంధనలకు అనుగుణంగా అప్పగించిన ఈ భూములను ఆయా సంస్థలు తమ అవసరాల కోసం వినియోగించుకుంటున్నాయి. అయితే ఆ సంస్థలు ఏ మేరకు భూములను వినియోగించుకుంటున్నాయన్న దానిపై రాష్ట్ర రెవెన్యూ శాఖ ఇటీవల వివరాలు సేకరించింది.రాష్ట్రంలోని 11 కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు మొత్తం 8,900 ఎకరాలు కేటాయించగా.. అందులో 2,300 ఎకరాలు మాత్రమే ఉపయోగంలో ఉన్నాయని, మిగతా భూములను నిరుపయోగంగా వదిలేశారని తేలింది. వీటితోపాటు ఇప్పటికే మూతపడిన సిమెంట్ కార్పొరేషన్, డ్రగ్స్ లిమిటెడ్, హెచ్ఎంటీల పరిధిలో మరో 3,300 ఎకరాల వరకు భూమి ఉందని రెవెన్యూ శాఖ గుర్తించింది. రూ.45 వేల కోట్ల విలువతో.. హైదరాబాద్ నగరానికి శివార్లలో, ప్రధాన ప్రాంతాల్లో ఉన్న ఈ నిరుపయోగ భూముల విలువ ప్రస్తుతం బహిరంగ మార్కెట్ ప్రకారం రూ.45 వేల కోట్ల వరకు ఉంటుందని రెవెన్యూ శాఖ అంచనా వేసింది. ఈ భూములను ప్రభుత్వ ధరకు తిరిగి తీసుకోవడం ద్వారా... పరిశ్రమల ఏర్పాటు, వాణిజ్య అవసరాలకు, వేలం వేసి నిధుల సమీకరణ చేసుకోవడానికి ఉపయోగపడతాయని ప్రభుత్వానికి ఇచి్చన నివేదికలో పేర్కొన్నట్టు తెలిసింది.ఆ నివేదిక ప్రకారం... ప్రభుత్వ ధరతో ఆ భూములను తిరిగి తీసుకోవాలంటే రూ.8 వేల కోట్ల వరకు అవసరమని అంచనా వేసినట్టు సమాచారం. దీనిపై కేంద్ర ప్రభుత్వ శాఖలతో సంప్రదింపులు జరపాలని సీఎం రేవంత్రెడ్డి అధికారులకు సూచించారని, ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా సంప్రదింపుల ప్రక్రియ ప్రారంభించిందని రెవెన్యూ వర్గాలు చెప్తున్నాయి. గత ప్రభుత్వ హయాంలోనే కోరినా.. కేంద్ర ప్రభుత్వ సంస్థలకు చెందిన నిరుపయోగ భూములను ఇవ్వాలని గత బీఆర్ఎస్ సర్కారు కూడా కేంద్రాన్ని కోరింది. రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి హోదాలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 2022లో కేంద్రానికి లేఖ రాశారు. పెట్టుబడుల ఉపసంహరణలో భాగంగా కేంద్ర పీఎస్యూల భూములను ప్రైవేటు వ్యక్తులకు అమ్మవద్దని... రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వడం ద్వారా ఆర్థికాభివృద్ధికి సహకరించాలని కోరారు. కానీ కేంద్రం అప్పట్లో సానుకూలంగా స్పందించలేదు. ఇప్పుడు ఎలా స్పందిస్తున్నదని తేలాల్సి ఉంది. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తే రాష్ట్ర ప్రభుత్వానికి కాసుల పంట పండే అవకాశాలు ఉన్నాయని రెవెన్యూ వర్గాలు పేర్కొంటున్నాయి. -
హరీశ్రావు కొన్న భూములపై విచారణ: పొంగులేటి
సాక్షి, హైదరాబాద్: కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్ దగ్గర రైతులను బెదిరించి అప్పటి మంత్రి హరీశ్రావు భూములు కొనుగోలు చేశారని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ఆరోపించారు. ఈ వ్యవహారంపై విచారణ జరుగుతోందని చెప్పారు. ఈ రిజర్వాయర్ కోసం తొలుత భూసేకరణ నోటిఫికేషన్ జారీ చేశారని.. దీనివల్ల రైతుల భూములు పోతాయని బెదిరించి హరీశ్ ఆ భూములు కొన్నారని ఆయన ఆరోపణలు గుప్పించారు. హరీశ్ భూములు కొన్నాక భూసేకరణ నోటిఫికేషన్ను రద్దు చేశారని దుయ్యబట్టారు. రైతుల నుంచి చట్టబద్ధంగా భూములు కొన్నానని... ధరణిలో రికార్డు కోసం ఎమ్మార్వో కార్యాలయానికి వెళ్లాలని చెబుతున్న హరీశ్రావు.. భూసేకరణ నోటిఫికేషన్ విషయాన్ని ఎందుకు ప్రస్తావించట్లేదని పొంగులేటి ప్రశ్నించారు. గురువారం హైదరాబాద్లో తనను కలిసిన మీడియా ప్రతినిధులతో పొంగులేటి ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ఒకసారి నోటిఫికేషన్ జారీ అయ్యాక దాన్ని రద్దు చేయలేరని.. గతంలో రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో హైదరాబాద్ శివార్లలో భూసేకరణ కోసం జారీ చేసిన నోటిఫికేషన్ ఇప్పటికీ మనుగడలో ఉందని ఆయన పేర్కొన్నారు. కేటీఆర్ను కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు ఆరెస్టు చేయట్లేదంటూ ప్రశ్నిస్తున్న కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్రెడ్డి.. అందుకు వీలుగా గవర్నర్ చేత అనుమతి ఇప్పించాలని సూచించారు. పక్కా ఆధారాలతోనే ముందుకు వెళ్తున్నామని, తొందరపడి ఏదో ఒకటి చేయాలన్న ఆలోచన తమకు లేదని మంత్రి చెప్పారు. డిసెంబర్ 9 నుంచి అసెంబ్లీ శీతాకాల సమావేశాలు.. అసెంబ్లీ శీతాకాల సమావేశాలు డిసెంబర్ 9 నుంచి ప్రారంభం అవుతాయని మంత్రి పొంగులేటి చెప్పారు. ఈ సమావేశాల్లో రికార్డ్స్ ఆఫ్ రైట్స్(ఆర్వోఆర్) చట్టాన్ని తీసుకొస్తామన్నారు. అలాగే కులగణన, రైతు రుణమాఫీ, మూసీ పునరుజ్జీవం తదితర అంశాలను చర్చించే అవకాశం ఉందని చెప్పారు. డిసెంబర్ 9న అసెంబ్లీ సమావేశాల అనంతరం సచివాలయంలో తెలుగుతల్లి విగ్రహావిష్కరణ, సోనియాగా>ంధీ జన్మదిన వేడుకలతోపాటు బహిరంగ సభను నిర్వహించనున్నట్లు వివరించారు. కాగా, ఛత్తీస్గఢ్తో నాటి ప్రభుత్వం కుదుర్చుకున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందంతోపాటు యాదాద్రి పవర్ ప్లాంట్ నిర్మాణానికి సంబంధించి జస్టిస్ మదన్ బి. లోకూర్ ఏకసభ్య కమిషన్ ఇచ్చిన నివేదికను ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టి చర్చంచనున్నట్లు సమాచారం. కేంద్రం స్పష్టత ఇస్తే ఇందిరమ్మ ఇళ్లలో వేగం.. ఇందిరమ్మ ఇళ్ల విషయంలో కేంద్ర ప్రభుత్వ నిబంధనలు కాస్త అస్పష్టంగా ఉన్నాయని, వాటిపై స్పష్టత కోరుతున్నామని మంత్రి పొంగులేటి చెప్పారు. కేంద్రం నుంచి స్పష్టత వస్తే ఇందిరమ్మ ఇళ్లలో వేగం పెరుగుతుందన్నారు. ఒకసారి లబ్ధిదారుల ఎంపిక ప్రారంభమైతే పథకం వేగం పుంజుకుంటుందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. స్థానిక ఎన్నికల్లోగా రైతులందరికీ రుణమాఫీ చేస్తామని ఓ ప్రశ్నకు బదులిచ్చారు. మంత్రివర్గ విస్తరణ! మహారాష్ట్ర అసెంబ్లీ ఫలితాల తర్వాత రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణ ఉండే అవకాశం ఉందని మంత్రి పొంగులేటి అన్నారు. మంత్రులుగా ఎవరెవరికి అవకాశం ఉంటుందన్న ప్రశ్నకు ఆయన నేరుగా స్పందించలేదు. తాను మంత్రిని మాత్రమేనని, మంత్రి పదవులు ఇప్పించే స్థాయిలో లేనని వ్యాఖ్యానించారు. -
ప్రజాభిప్రాయ సేకరణ ముగిసిన 45 రోజుల్లోగా కొత్త రెవెన్యూ చట్టం
త్వరలో జీవో 59 దరఖాస్తుల పరిష్కారంజీవో 59 కింద అక్రమంగా భూములను క్రమ బద్ధీకరించుకున్నారు. నానక్రాంగూడలో రూ.3 వేల కోట్ల ఖరీదైన 32 ఎకరాలను రెగ్యులరైజ్ చేసుకున్నారు. మేం రాగానే వాటిని వెనక్కు తీసుకున్నాం. అర్హులకు న్యాయం జరిగేలా త్వరలో జీవో 59 దరఖాస్తులను పరిష్కరిస్తాం.సాక్షి, హైదరాబాద్: రికార్డ్ ఆఫ్ రైట్స్ (ఆర్వోఆర్)–2020 స్థానంలో త్వరలో కొత్త చట్టాన్ని అమల్లోకి తెస్తామని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి తెలిపారు. వీలైతే అసెంబ్లీలో పెట్టి లేదంటే ఆర్డినెన్స్ రూపంలో తీసుకురానున్నట్టు స్పష్టం చేశారు. ఇప్పటికే రూపొందించిన ముసా యిదా చట్టంపై ప్రజల నుంచి సలహాలు, సూచ నలు వస్తున్నాయన్నారు. సూచనలు తీసుకునే గడువును ఈనెల 23నుంచి మరో వారం పొడిగి స్తామని చెప్పారు. గడువు ముగిసిన 45 రోజుల్లో గా కొత్త చట్టం అందుబాటులోకి వస్తుందని తెలిపారు. కొత్త ఆర్వోఆర్ చట్టంపై రాష్ట్ర వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతున్న నేపథ్యంలో పలు రెవె న్యూ సంబంధిత అంశాలపై ఆయన శనివారం ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. కొత్త చట్టం, ధరణి పోర్టల్లో తెస్తున్న మార్పులు, సాదా బైనామాలు, అసైన్డ్ భూములకు హక్కుల కల్పన, భూముల విలువల సవరణ, జీవో 59 దరఖా స్తులు వంటి అంశాలపై పొంగులేటి మాట్లాడారు. ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే..ధరణితో ప్రజలు కుదేలు: గత ప్రభుత్వం భూ సమస్యలను శాశ్వతంగా పరిష్కరిస్తామని చెప్పి రాష్ట్రంలోని 1.50 కోట్ల ఎకరాల భూమి డేటాను విదేశీ కంపెనీకి అప్పగించినందుకే మేం ధరణి పోర్టల్ను తప్పుపడుతున్నాం. ఇది రైతుల మెడలో పెద్ద గుదిబండ. ఈ పోర్టల్ కారణంగా ప్రజలు కుదేలయ్యారు.. తీవ్ర నష్టం జరిగింది. ఇద్దరు వ్యక్తులు నాలుగు గోడల మధ్య కూర్చుని తెచ్చిన చట్టం ఇది. ప్రజలు తమ భూమి తమకు రావాలని దేవుళ్లకు దండం పెట్టారో లేదో తెలియదు కానీ, దొరకు, కలెక్టర్లకు మాత్రం పొర్లు దండాలు పెట్టాల్సి వచ్చింది. భారత రాజ్యాంగం కల్పించిన హక్కులను ధరణి హరించింది. తినీతినక కూడబెట్టుకున్న కష్టార్జితాన్ని అమ్ముకునే హక్కును కాలరాసింది. పుట్టలో పాముల్లా అక్రమాలుమేం అధికారంలోకి వచ్చాక పరిశీలిస్తే పుట్టలో పాముల్లాగా ధరణిలో వందలాది అక్రమాలు బయటకు వస్తున్నాయి. రెండు నిమిషాల్లో రిజిస్ట్రేషన్, మూడు నిమిషాల్లో మ్యుటేషన్ అని చెప్పి భూముల రిజిస్ట్రేషన్లలో అవకతవకలకు ఆస్కారం కల్పించారు. అర్ధరాత్రి 12 గంటల నుంచి తెల్లవారుజామున 4 గంటల వరకు నిషేధిత జాబితాలోని భూములను రిజిస్ట్రేషన్లు చేసుకుని తాళాలు వేసుకున్నారు. వాళ్లేం చేశారో కలెక్టర్లకు కూడా తెలియదు. హెడ్ ఆఫీస్, విదేశీ కంపెనీకి మాత్రమే తెలుసు. మేం అధికారంలోకి వచ్చిన 15 రోజుల్లో అన్ని వివరాలు ప్రజా బాహుళ్యంలో పెట్టించాం లొసుగులు సవరించేందుకే చట్టం ధరణిని బంగాళాఖాతంలో వేస్తామన్నామంటే.. తెలివి తక్కువ నిర్ణయాలు తీసుకోవడం కాదు. ఆత్రుతగా తప్పులు చేయడం కాదు. పేరు మార్చడం వల్ల ప్రజల సమస్యలు పరిష్కారం కావు. మన నిర్ణయాలతో తరతరాలు ముందుకెళ్లాలి. అందుకే భేషజాలకు పోకుండా ధరణి పోర్టల్ను మాత్రమే కాదు. చట్టంలోని లొసుగులను సవరించాలనే ప్రయత్నం చేస్తున్నాం. అందుకే కొత్త చట్టం తెస్తున్నాం. ఆర్వోఆర్ చట్టం–2020 కారణంగానే సమస్యలన్నీ వచ్చాయి.80–85 వేల దరఖాస్తులే పెండింగ్లో..మేం అధికారంలోకి వచ్చాక ధరణి పోర్టల్ ద్వారా సమస్యలు పరిష్కరించే అధికారాలను వికేంద్రీకరించాం. అప్పటికే 2.45 లక్షల దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. ప్రతిరోజూ 3–5 వేల కొత్త దరఖాస్తులు వస్తున్నాయి. స్పెషల్ డ్రైవ్ పెట్టి 1.28 లక్షల దరఖాస్తులు పరిష్కరించాం. అంతేకాదు రోజూ పరిష్కరిస్తూనే ఉన్నాం. ఇప్పుడు పోర్టల్లో 80–85 వేల దరఖాస్తులు మాత్రమే పెండింగ్లో ఉన్నాయి. రైతుల దరఖాస్తులను తిరస్కరిస్తే అందుకు గల కారణాలను కూడా నమోదు చేయిస్తున్నాం. అభిప్రాయ సేకరణకు జిల్లా స్థాయిలో సదస్సులుకొత్త చట్టం ముసాయిదాపై చెట్టుకింద కూర్చునే సామాన్య రైతు నుంచి దొర వారు ఇచ్చే సూచనలు కూడా పరిగణనలోకి తీసుకుంటాం. జిల్లా స్థాయిలో సదస్సులు నిర్వహించి అభిప్రాయ సేకరణ జరుపుతాం. దేశంలోనే రోల్మోడల్ చట్టంగా రూపొందిస్తాం. దీని ద్వారా ధరణి దరఖాస్తుల పరిష్కారానికి మార్గదర్శకాలు రూపొందుతాయి. పోర్టల్లోని దరఖాస్తు పద్ధతిని మార్చేస్తాం. ఇప్పటివరకు ఉన్న 33 మాడ్యూళ్ల స్థానంలో ఒకటే మాడ్యూల్ తెస్తాం. రైతుల ఏ సమస్యపై అయినా ఈ మాడ్యూల్లోనే దరఖాస్తు చేసుకోవచ్చు. పాత పహాణీలో 35 కాలమ్లు ఉండేవి. 100 ఏళ్ల చరిత్ర ఉండేది. ఇప్పుడు ఒక్కటే కాలమ్ ఉంది. దీని స్థానంలో 14–16 కాలమ్లతో కొత్త పహాణీ అందుబాటులోకి తెస్తాం. సీసీఎల్ఏ స్థాయిలో కూడా ధరణి దరఖాస్తుల పరిష్కారానికి కటాఫ్ డేట్ నిర్ణయిస్తున్నాం. సీసీఎల్ఏకు వచ్చిన దరఖాస్తులు వారం రోజుల్లోగా పరిష్కారం కావాలని ఆదేశిస్తా. ఎలుక వచ్చిందని ఇంటిని తగులబెట్టుకోలేం కదా?దొరగారు చెపితే వినలేదని 23 వేల మందిని అర్ధరాత్రి వేరే శాఖకు బదిలీ చేశారు. వీఆర్వో, వీఆర్ఏల వ్యవస్థను లేకుండా చేయడం ద్వారా గ్రామ స్థాయిలో రెవెన్యూకు సాక్ష్యాలు లేకుండా చేశారు. మేం రాష్ట్రంలోని 10,945 గ్రామాల్లో రెవెన్యూ వ్యవస్థకు కాపలాదారులను నియమించాలన్న కృతనిశ్చయంతో ఉన్నాం. ఇంట్లోకి ఎలుక వచ్చిందని ఇంటిని తగులబెట్టుకోలేం కదా? పేదోళ్ల భూములు వారికే పంచుతాంపేదలకు ఇందిరమ్మ పంచిన భూములు లాగేసుకున్నారు. అలాంటి భూములు గుర్తించాం. వ్యవసాయ యోగ్యమైన భూములన్నింటినీ తిరిగి పేదలకు పంచుతాం. పేదోడి భూమి ధనికుల చేతికి వెళ్లనివ్వం. ఆ కోణంలోనే అసైన్డ్ భూములపై అమ్మకపు హక్కు కల్పిస్తాం. కొత్త చట్టం ఏర్పాటు కాగానే మళ్లీ సాదాబైనామాల దరఖాస్తులు స్వీకరిస్తాం. ఇప్పటివరకు పెండింగ్లో ఉన్న 9 లక్షల దరఖాస్తులకు తోడు కొత్తగా వచ్చే వాటిని ఏకకాలంలో శాశ్వతంగా పరిష్కరిస్తాం. గత ప్రభుత్వం భూముల విలువల సవరణలో శాస్త్రీయత పాటించలేదు. మేం అధికారులు, థర్డ్ పార్టీ నుంచి వివరాలు సేకరించాం. రెండింటినీ క్రోడీకరించి త్వరలోనే న్ణియం తీసుకుంటాం. పార్టీ ఆస్తులు ఏం చేయాలా అని దొర ఆలోచిస్తున్నాడు‘బీజేపీలో బీఆర్ఎస్ విలీనం 100 శాతం ఖాయం. అయితే బీఆర్ఎస్ పేరిట ఉన్న ఆస్తులు, డబ్బులు ఏం చేయాలనేదానిపై దొర ఆలోచిస్తున్నాడు. పార్టీని విలీనం చేయకుండా కవితకు బెయిల్ రాదు. మేం కేంద్రంలో అధికారంలో లేము కనుక ఆ కేసులు తప్పించడం మాతో కాదు. అందుకే ఆయన కాంగ్రెస్ జోలికి రాడు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరికకు బ్రేక్ మాత్రమే పడింది. ప్రతి దానికీ ఆషాఢాలు, శ్రావణాలు ఉంటాయి కదా! జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలిచ్చేందుకు కట్టుబడి ఉన్నాం. నెలాఖరులోనే జేఎన్జే సొసైటీకి భూమిని సీఎం చేతుల మీదుగా అప్పగిస్తాం. ఈ సొసైటీలో లేని మిగిలిన వారికి ఎలా ఇవ్వాలన్న దానిపైనా ఆలోచిస్తున్నాం. ఇతర సొసైటీల సభ్యత్వాలను పరిగణనలోకి తీసుకుని నిర్ణయం తీసుకుంటాం. -
భూ అక్రమాలు క్షేత్ర స్థాయిలో కనిపించలేదు
సాక్షి, విశాఖపట్నం : వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో విశాఖ జిల్లాలో భూ అక్రమాలు జరిగాయంటూ కూటమి నేతలు చేస్తున్న దు్రష్పచారానికి తెరపడినట్లే. భూ అక్రమాలను పరిశీలించడానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున క్షేత్ర స్థాయి పరిశీలనకు వచ్చిన రెవెన్యూ శాఖ స్పెషల్ సెక్రటరీ ఆర్పీ సిసోడియా.. జిల్లా కలెక్టర్ హరేందిర ప్రసాద్, జేసీ మయూర్ అశోక్తో కలిసి శనివారం జిల్లాలోని పలు ప్రాంతాల్లో పర్యటించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ భూ అక్రమాలు క్షేత్రస్థాయిలో కనిపించలేదని చెప్పారు. మాజీ సీఎస్ జవహర్రెడ్డి, ఆయన కుమారుడు దాదాపు 2 వేల ఎకరాల ఫ్రీ హోల్డ్ భూములను బెదిరించి రాయించుకున్నారనే ప్రచారంపైనా పరిశీలించామని చెప్పారు. అయితే, జిల్లాలో 2,600 ఎకరాలు ప్రీహోల్డ్కు అవకాశం ఉండగా, వాటిలో 626 ఎకరాలు ఫ్రీహోల్డ్ చేసి 22ఎ నుంచి తీసివేశారని తెలిపారు. ఇందులో 4 మండలాల పరిధిలోని 133 ఎకరాలు మాత్రమే కొత్త వారి పేరుతో రిజి్రస్టేషన్ జరిగిందని చెప్పారు. ఇందులో మాజీ సీఎస్కు ప్రమేయం ఉందని చెప్పలేమని స్పష్టం చేశారు. చట్టం ప్రకారం 20 ఏళ్లు దాటిన డి పట్టా భూములను ఎవరైనా కొనొచ్చని తెలిపారు. జిల్లాలో అసైన్డ్, డి పట్టా భూములను ఫ్రీ హోల్డ్ చేసి, రిజి్రస్టేషన్ వంటివి ఎక్కువగా జరుగుతున్నాయన్నారు. త్వరలో జీవీఎంసీ, రెవెన్యూ అధికారుల సమన్వయంతో భూ సమస్యలు పరిష్కరిస్తామని చెప్పారు. నగరం విస్తరించడం, భోగాపురం ఎయిర్పోర్టు వల్ల విశాఖలో భూముల ధరలు పెరిగాయని చెప్పారు. ఏడాది క్రితం వరకు లేఅవుట్లకు అనుమతి ఉందో లేదో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో తెలిసేది కాదని, నూతన విధానం వల్ల ఆ సమస్య పరిష్కారమైందని చెప్పారు. ఎర్రమట్టి దిబ్బల్లో అనుమతులివ్వలేదు ఎర్రమట్టి దిబ్బల్లో ఎలాంటి నిర్మాణాలకు అనుమతులివ్వలేదని తెలిపారు. అక్కడ కొంత భూమిని చదును చేస్తుండగా, జిల్లా యంత్రాంగం నిలిపేసిందని తెలిపారు. దసపల్లా ఎస్టేట్ భూములపై కోర్టు కేసులున్నాయన్నారు. 60 ఎకరాల్లో 14.5 ఎకరాల ప్రభుత్వ భూమిని 22ఎ లో పెట్టారని, మిగతా భూమిని ఏ విధంగా పరిష్కరించాలో మార్గాలను వెదుకుతున్నామని అన్నారు. ఎస్టేట్ భూములపై సెటిల్మెంట్ ఆఫీసర్ ల్యాండ్ రెంట్ పట్టా ఇవ్వడాన్నీ పరిశీలించి చర్యలు తీసుకుంటామన్నారు. కొత్త సాంకేతిక పరిజ్ఞానంతో సిటీ మ్యాప్ తయారుచేసి, ప్రభుత్వ, ప్రభుత్వేతర భూములను, రోడ్లు, పార్కులు వంటివి రంగులతో చూపుతామని, దీనివల్ల ఆక్రమణలకు ఆస్కారం ఉండదని తెలిపారు. అంతకు ముందు ఆయన కలెక్టర్ కార్యాలయంలో భూ సమస్యలపై ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. -
రూ.250 కోట్ల మఠం భూమి హాంఫట్.. కబ్జా చేసిన టీడీపీ ఎమ్మెల్యే
సాక్షి టాస్క్ఫోర్స్: ఆధ్యాత్మిక నగరి తిరుపతిలో చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే పులివర్తి నాని గ్యాంగ్ అక్రమాలు, అరాచకాలకు పాల్పడుతోంది. అధికారమే అండగా రూ.250 కోట్ల విలువ చేసే దేవుడి మాన్యాన్ని అమాంతం మింగేసింది. నాని అనుచరులు.. అభ్యంతరం చెప్పిన దేవదాయశాఖ సిబ్బంది బట్టలు విప్పి, వారిని మోకాళ్లపై కూర్చోబెట్టారు.. అధికారులతో గోడ కుర్చీ వేయించారు. నానాబూతులు తిట్టి నిర్బంధించారు. కోర్టు ఉత్తర్వులు ఉన్నాయన్నా ‘డోంట్ కేర్’ అంటూ వారి ఎదుటే.. దేవుడి మాన్యానికి దర్జాగా ప్రహరీ నిర్మించారు. నానీస్ గ్యాంగ్ అక్రమాలపై ‘సాక్షి’ బుధవారం ప్రచురించిన కథనం తిరుపతి రియల్ ఎస్టేట్ వ్యాపారుల్లోనూ, దేవదాయ, రెవెన్యూ శాఖ అధికారుల్లో చర్చనీయాంశంగా మారింది. అప్పనంగా కొట్టేసి.. సొమ్ము చేసుకోవడమే లక్ష్యం.. తిరుపతి రూరల్ మండలం అవిలాల లెక్క దాఖలాలోని సర్వే నంబర్ 145, 147/1లో సుమారు 10 ఎకరాల విలువైన దేవుడి మాన్యం భూమిని నాని గ్యాంగ్ ఆక్రమించుకుంది. ఇక్కడ అంకణం కనీసం రూ.4 లక్షల వరకూ ఉంది. మొత్తం10 ఎకరాలు బహిరంగ మార్కెట్లో రూ.250 కోట్లు పలుకుతోంది. నాని గ్యాంగ్ దీన్ని అప్పనంగా కొట్టేసి, అమ్మేసి సొమ్ము చేసుకునే ప్రయత్నం చేస్తోంది. రూ.250 కోట్లకు స్కెచ్ వేశారంటే అధికార పారీ్టలోని ఎవరో ‘ముఖ్య’నేత ప్రమేయం ఉండకుండా ఉండదనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నాకు మూడు.. మీకు ఏడు హథీరాంజీ మఠానికి చెందిన భూమిని స్వాదీనం చేసుకోవడానికి చూస్తున్న ముగ్గురు వ్యక్తులతో టీడీపీ ఎమ్మెల్యే పులివర్తి నాని డీల్ కుదుర్చుకున్నారని తెలుస్తోంది. ఈ భూమికి సంబంధించి మఠం, ప్రభుత్వం నుంచి ఎటువంటి ఇబ్బంది రాకుండా తాను చూసుకుంటానని ఆయన హామీ ఇచ్చారని సమాచారం. తనకు మూడెకరాలు కేటాయించాలని.. మీరు ఏడెకరాలు తీసుకోవాలని వారితో చెప్పినట్టు తెలుస్తోంది. అంతటితో ఆగని నాని ఆ తర్వాత ఆ ఏడెకరాలను కూడా తానే కొనుగోలు చేసుకుంటానని చెప్పడంతో ఆ ముగ్గురు షాక్ అయ్యారు. ‘ఆ ఏడెకరాలకు రూ.25 కోట్లు ఇస్తా.. ఆ నగదును ముగ్గురు పంచుకోండి. దీంట్లో అమరావతి పెద్దలకు కూడా వాటా ఉంది’ అని స్పష్టం చేయడంతో చేసేదేమీ లేక ఆ ముగ్గురూ తెల్లముఖం వేశారని సమాచారం. పనులు ప్రారంభం ఆ పదెకరాలు చుట్టూ జూన్ 9న ఉదయం 7 గంటలకు ప్రహరీ గోడ వేయడానికి నానీస్ గ్యాంగ్ పనులు ప్రారంభించింది. ఈ సమాచారం అందుకున్న దేవదాయ శాఖ అధికారులు, మఠం సిబ్బంది అందరూ కలిసి జూన్ 10న ఆ స్థలం వద్దకెళ్లి ప్రహరీ నిర్మించడానికి వీల్లేదని అభ్యంతరం వ్యక్తం చేశారు. అప్పటికే అక్కడ 100 మందికిపైగా నాని గూండాలు కాపుకాస్తున్నారు. ‘మేమెవరో తెలియదా?, ఎంత ధైర్యం ఉంటే ఇక్కడికి వస్తారు? మూసుకుని వెళ్లండి’ అంటూ బెదిరింపులకు దిగారు. అయితే మఠం అధికారులు పనులు ఆపాల్సిందేనంటూ గట్టిగా వాదించారు. దీంతో కోపోద్రిక్తులయిన టీడీపీ గూండాలు మఠం సిబ్బందిని తాత్కాలికంగా నిర్మించుకున్న గదిలోకి తీసుకెళ్లి బట్టలు ఊడదీయించారు. అధికారులతో గోడ కుర్చీ వేయించారు. నోటికొచ్చినట్లు బండ బూతులు తిట్టారు. దీంతో అధికారులు, సిబ్బంది ప్రాణ భయంతో అక్కడే బిక్కుబిక్కుమంటూ గడిపారు. చివరకు కాళ్లా వేళ్లా పడి బతుకుజీవుడా అంటూ అక్కడి నుంచి మఠం కార్యాలయానికి చేరుకున్నారు. అనంతరం మఠం అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై చంద్రగిరి డీఎస్పీ జూన్ 11న నాని గ్యాంగ్ను, దేవదాయ శాఖ అధికారులను అక్కడకు పిలిపించుకున్నారు. పోలీస్ స్టేషన్లో సైతం గ్యాంగ్ ఓ దశలో అధికారులపై దాడి చేయడానికి ప్రయత్నించింది. ఈ నేపథ్యంలో దేవదాయ అధికారులకు ‘నాని గ్యాంగ్’ వారి్నంగ్ ఇచి్చనట్లు తెలుస్తోంది. ఎక్కడా ఈ అంశంపై నోరు మెదపవద్దని మండిపడినట్లు సమాచారం. తమకు వ్యతిరేకంగా నివేదికలు ఇవ్వడానికి లేదని హుకుం జారీచేసినట్లు తెలుస్తోంది. ఆందోళనకు ప్రజా సంఘాలు సిద్ధం చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నానికి ఒక ఆర్యవైశ్య వ్యాపారి రూ.రెండు కోట్లు ఇవ్వనందుకు ఇటీవల రైస్మిల్లు మూయించారు. అదే క్రమంలో టీటీడీ కాంట్రాక్టర్ నుంచి రెండెకరాలు రాయించుకున్నారు. ఇప్పుడు రూ.250 కోట్ల విలువైన పదెకరాల మఠం భూమిని ఆక్రమించుకుంటున్నారంటూ విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రజా సంఘాలు, కమ్యూనిస్టు పార్టీలు ఆందోళనకు సిద్ధమవుతున్నాయి.ఆ భూమి హథీరాంజీ మఠందే.. తిరుపతి రూరల్ మండలం అవిలాల పరిధిలో ఆక్రమణకు గురైన భూమి హథీరాంజీ మఠానిదే. మఠానికి చెందిన భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. దానిని అడ్డుకునేందుకు వెళ్లిన మఠం సిబ్బందిని వంద మంది గూండాలతో రూమ్లో బంధించి, బట్టలూడదీసి.. నానా దుర్భాషలాడుతూ అంతు చూస్తామని బెదిరించారు. ఈ మేరకు తిరుపతి రూరల్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాం. దీనిపై జిల్లా కలెక్టర్, ఎస్పీలకు కూడా ఫిర్యాదు ఇచ్చాం. ఈ భూకబ్జాలో ల్యాండ్ మాఫియా పాత్ర ఉంది. – రమేష్ నాయుడు, హథీరాంజీ మఠం పరిపాలనాధికారి భూములను సంరక్షించాలి.. చంద్రగిరి, తిరుపతి నియోజకవర్గాల పరిధిలో ఉన్న హథీరాంజీ మఠం, పరకాల మఠం, దేవదాయ భూములను ప్రభుత్వం సంరక్షించాలి. తిరుపతి నగర నడిబొడ్డున 10 ఎకరాల భూమిని గత నెల నుంచి అధికార పార్టీ నేతలు, ప్రజాప్రతినిధి కొట్టేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ విషయం తెలిసి అడ్డుకున్న మఠం అధికారులను బట్టలూడదీయించి.. నానా బూతులు తిడుతూ భయకంపితులను చేశారు. ఈ భూముల కబ్జాను తక్షణం ఆపాలని సీఎం చంద్రబాబుకి విజ్ఞప్తి చేస్తున్నా. – కందారపు మురళి, సీపీఎం నేత -
ప్రజా‘వాణి’ వినిపించదా?
సాక్షి, హైదరాబాద్: ఇబ్బంది ఏదైనా, పరిష్కార వేదిక ఏదైనా.. రాష్ట్రంలో రెవెన్యూ సమస్యలు మాత్రం పెండింగ్లోనే ఉండిపోతున్నాయి. భూసంబంధిత సమస్యలను త్వరితగతిన పరిష్కరించడంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టిపెట్టినా.. క్షేత్రస్థాయిలో మాత్రం ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్టుగా పరిస్థితి మారిపోయింది. ఎక్కడికక్కడ ప్రజా సమస్యల అర్జీలు పేరుకుపోతూనే ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సీఎం ప్రజావాణికి వచ్చిన దరఖాస్తుల్లో రెవెన్యూ వర్గాలు పరిష్కరించినవి 30శాతం కూడా దాటలేదు. ప్రతి మంగళ, శుక్రవారాల్లో నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమంలో ఇప్పటివరకు రెవెన్యూ శాఖకు 13,513 దరఖాస్తులు రాగా.. అందులో పరిష్కారమైనవి 3,147 దరఖాస్తులు మాత్రమే. మిగతా 10,366 దరఖాస్తులు ఇంకా పెండింగ్లోనే ఉన్నట్టు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. రెవెన్యూ శాఖకు వెళ్లే దరఖాస్తుల్లో ఎక్కువశాతం ధరణి సంబంధిత సమస్యలే ఉంటాయని.. కొన్నిచోట్ల పింఛన్లు, షాదీముబారక్, కల్యాణలక్ష్మి వంటి దరఖాస్తులు వచ్చాయని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. కేవలం విచారణతోనే సరి! ప్రజావాణి కింద వస్తున్న దరఖాస్తుల్లో ఎక్కువగా ధరణికి సంబంధించినవే ఉంటున్నాయని రెవెన్యూ వర్గాలు చెప్తున్నాయి. ధరణి పోర్టల్లో తమకు వచ్చిన లాగిన్ల ఆధారంగా సదరు దరఖాస్తులను పరిశీలించి, విచారణ జరిపి రిపోర్టు పంపించే అధికారం మాత్రమే తమకు ఉందని తహసీల్దార్ కార్యాలయాల సిబ్బంది స్పష్టం చేస్తున్నారు. నిజానికి ఈ దరఖాస్తులను విచారించేందుకు క్షేత్రస్థాయిలో సిబ్బంది కూడా లేరని.. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఛిన్నాభిన్నమైన రెవెన్యూ వ్యవస్థ ఇంకా కోలుకోలేదని అంటున్నారు. మండలంలో ఉన్న ఒకరిద్దరు రెవెన్యూ ఇన్స్పెక్టర్లే (ఆర్ఐలే) ఈ దరఖాస్తులన్నింటినీ విచారించాల్సి వస్తోందని చెప్తున్నారు. విచారణ అనంతరం రిపోర్టులను పంపినా పైస్థాయిలో పరిష్కారం కావడం లేదని.. కొన్ని దరఖాస్తులు పరిష్కారమైనా ఆన్లైన్లో అప్డేట్ కావడం లేదని వివరిస్తున్నారు. తహసీల్దార్ల స్థాయిలోనే చాలా దరఖాస్తులు పెండింగ్లో ఉండగా.. పైస్థాయికి పంపిన వాటిని కలెక్టర్లు పట్టించుకోకపోవడంతో అక్కడా ఆగిపోతున్నాయని అంటున్నారు. నాలుగు జిల్లాల్లోనే కాస్త మెరుగు.. ‘సీఎం ప్రజావాణి’ దరఖాస్తుల గణాంకాలను పరిశీలిస్తే.. రాష్ట్రవ్యాప్తంగా నాలుగు జిల్లాల్లో మాత్రమే పరిష్కార కార్యక్రమం చురుగ్గా జరుగుతోంది. జగిత్యాల, కరీంనగర్, సంగారెడ్డి, సూర్యాపేట జిల్లాల్లో 80శాతానికిపైగా దరఖాస్తులను పరిష్కరించారు. ఆరు జిల్లాలు వరంగల్, హన్మకొండ, హైదరాబాద్, కామారెడ్డి, నాగర్కర్నూల్, భువనగిరి జిల్లాల్లో అయితే 100శాతం దరఖాస్తులు పెండింగ్లోనే ఉన్నాయి. అంటే ప్రజావాణి కార్యక్రమం ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటివరకు ఆ జిల్లాల్లో ఒక్క రెవెన్యూ అర్జీ కూడా పరిష్కారం కాకపోవడం గమనార్హం. మిగతా జిల్లాల్లో మొక్కుబడిగా ప్రజావాణి దరఖాస్తుల పరిష్కార కార్యక్రమం జరుగుతోందన్న విమర్శలు ఉన్నాయి. సీఎం రేవంత్రెడ్డి సొంత జిల్లా మహబూబ్నగర్లో కూడా దరఖాస్తులు పెద్ద సంఖ్యలో పెండింగ్లో ఉండటం రెవెన్యూ యంత్రాంగం నిర్లిప్తతకు అద్దం పడుతోందన్న విమర్శలు వస్తున్నాయి. వారానికి వెయ్యి దాకా దరఖాస్తులు రాష్ట్రస్థాయిలో ప్రతి మంగళ, శుక్రవారాల్లో నిర్వహిస్తున్న ప్రజావాణికి వెయ్యి వరకు దరఖాస్తులు వస్తున్నాయి. అందులో రెవెన్యూ శాఖకు సంబంధించినవే ఎక్కువగా ఉంటున్నాయి. గత శుక్రవారం 494 దరఖాస్తులురాగా.. వీటిలో రెవెన్యూ శాఖకు సంబంధించి 125, హౌసింగ్ 43, పౌరసరఫరాల శాఖ 71, హోంశాఖ 45, పంచాయతీరాజ్ శాఖ 47, ఇతర శాఖలకు సంబంధించి 48 దరఖాస్తులు ఉన్నట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. -
టార్గెట్ రూ.5,000 కోట్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో భూముల విలువల సవరణ ప్రక్రియ అధికారికంగా ప్రారంభమైంది. ఇందుకోసం రెవెన్యూ, పంచాయతీరాజ్, మున్సిపల్ వర్గాలతో రిజిస్ట్రేషన్ల శాఖ రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం ప్రాథమిక స్థాయి సమావేశాలను పూర్తిచేసింది. ఈ నేపథ్యంలో భూములు, ఆస్తుల విలువలను పెంచడం ద్వారా 20 నుంచి 35 శాతం వరకు ప్రభుత్వానికి అదనపు ఆదాయం సమకూరే అవకాశముందని రిజి్రస్టేషన్ల శాఖ అంచనా వేస్తోంది. అన్ని ప్రక్రియలు పూర్తి చేసిన అనంతరం ఆగస్టు 1 నుంచి అమల్లోకి వచ్చే కొత్త విలువల ద్వారా రూ.3,500 కోట్ల నుంచి రూ.5వేల కోట్ల వరకు ఆదాయం పెరగొచ్చని రిజి్రస్టేషన్ల శాఖ వర్గాలంటున్నాయి. గజం రూ.1,000... ఎకరం రూ. 4లక్షలు పెంపు! రాష్ట్రంలో ప్రస్తుతం చేస్తున్న సవరణ ప్రక్రియ అనంతరం గజం నివాస స్థలం విలువ కనీసం రూ.1,000 పెరిగే అవకాశముందని తెలుస్తోంది. ఈ మేరకు కనీస విలువతో పట్టణ ప్రాంతాల్లో నివాస స్థలాల విలువల పెంపు ప్రక్రియను మొదలు పెట్టాలని ప్రభుత్వ వర్గాల ద్వారా రిజి్రస్టేషన్ల శాఖకు మౌఖిక ఆదేశాలు అందినట్టు తెలుస్తోంది. ఇక, ఎకరం వ్యవసాయ భూమి కనీస విలువ ఏ మేరకు సవరించాలన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదు. ప్రస్తుతం మారుమూల ప్రాంతాల్లోని వ్యవసాయ భూముల బహిరంగ మార్కెట్ విలువ ఎంతుందన్న దానిపై రెవెన్యూ వర్గాలతో చర్చించిన అనంతరం దీనిపై ఓ అంచనాకు రానున్నారు. అయితే, రిజి్రస్టేషన్ల శాఖ అంచనా ప్రకారం ఆగస్టు 1 నుంచి అమల్లోకి వచ్చే కొత్త విలువల ప్రకారం రాష్ట్రంలో ఎకరం వ్యవసాయ భూమి విలువ రూ.4 లక్షల వరకు పెరగనుందని తెలుస్తోంది. ఇక, విలువల సవరణ కోసం గ్రామీణ, పట్టణ ప్రాంతాలు, వ్యవసాయ, వ్యవసాయేతర భూములు, నివాస, వాణిజ్య సముదాయాలను కేటగిరీలుగా తీసుకోనున్నారు. ప్రధాన రహదారులకు ఇరువైపులా ఉన్న నివాస, వాణిజ్య సముదాయాల ప్రభుత్వ విలువలను 100 శాతం పెంచనున్నట్టు తెలుస్తోంది. ఈనెల 29 కల్లా కమిటీల సంతకాలు విలువల సవరణ ప్రక్రియలో భాగంగా రిజిస్ట్రేషన్ల శాఖ రూపొందించిన షెడ్యూల్ ప్రకారం ఈనెల 29 నాటికి అన్ని రకాల భూములు, ఆస్తుల విలువల పెంపుపై సవరణ కమిటీలు సంతకాలు చేయనున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో జేసీ, ఆర్డీవో, ఎమ్మార్వో, సబ్రిజిస్ట్రార్లతో; పట్టణ ప్రాంతాల్లో మున్సిపల్ కమిషనర్, ఆర్డీవో, ఎమ్మార్వో, సబ్రిజి్రస్టార్లతో; హెచ్ఎండీఏ పరిధిలో కమిషనర్, ఆర్డీవో, ఎమ్మార్వో, సబ్రిజి్రస్టార్లతో విలువల సవరణ కమిటీలను ఏర్పాటు చేశారు. ఈ కమిటీలు సంతకాలు చేసిన అనంతరం ప్రతిపాదిత విలువలను ఆన్లైన్లో ఉంచి 15 రోజులపాటు ప్రజల నుంచి అభిప్రాయాలు, అభ్యంతరాలు తీసుకుని జూలై 24 కల్లా విలువల సవరణకు తుదిరూపు ఇవ్వనున్నారు. ఆ తర్వాత వాటిని కంప్యూటరీకరించి ఆగస్టు 1 నుంచి కొత్త విలువలను అమలు చేయనున్నారు. -
TG: ఆగస్టు 1 నుంచి భూముల విలువ పెంపు
సాక్షి, హైదరాబాద్: ఈ ఏడాది ఆగస్టు 1 నుంచి రాష్ట్రంలోని భూములు, ఆస్తులకు కొత్త ప్రభుత్వ విలువలు అమల్లోకి రానున్నాయి. ఈనెల 18 నుంచి ప్రభుత్వ విలువల సవరణ ప్రక్రియ ప్రారంభం కానుండగా, జూలై 31 నాటికి పూర్తి కానుంది. అనంతరం ఆగస్టు 1 నుంచి కొత్త ప్రభుత్వ విలువల ప్రకారం రాష్ట్రంలోని వ్యవసాయ, వ్యవసాయేతర భూములు, ఆస్తుల రిజిస్ట్రేషన్లు జరగనున్నాయి. భూములు, ఆస్తుల విలువలను మరోమారు సవరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో ఇందుకు అవసరమైన ప్రక్రియను పూర్తి చేసేందుకు స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ మార్గదర్శకాలు విడుదల చేసింది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో విలువల నిర్ధారణకు అనుసరించాల్సిన పద్ధతులు, ఇరు ప్రాంతాల్లో తీసుకోవాల్సిన ప్రాతిపదికలు, విలువల సవరణ ప్రక్రియ షెడ్యూల్తో కూడిన ఈ మార్గదర్శకాలను ఆ శాఖ కమిషనర్ నవీన్మిత్తల్ సంబంధిత అధికారులకు పంపారు. వీటి ప్రకారం సవరించిన విలువలను ప్రజలకు అందుబాటులో ఉంచి వారి అభిప్రాయాలు, అభ్యంతరాలు తీసుకునేందుకు 15 రోజులు గడువు ఇవ్వనున్నారు. ఈ అభ్యంతరాలను పరిష్కరించిన తర్వాతే అధికారంగా కొత్త విలువలను నమోదు చేయనున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో సవరణ ప్రక్రియ ఇలా... ⇒ వ్యవసాయేతర వినియోగానికి అనువుగా (ప్లాట్లు, ఇళ్ల నిర్మాణం, పరిశ్రమలు, సెజ్లు, వినోద సౌకర్యాల ఏర్పాటు) జాతీయ, రాష్ట్ర రహదారులకు ఆనుకుని ఉన్న గ్రామాలను గుర్తించి ఆయా గ్రామాల్లోని భూముల విలువను అధికంగా పెంచాలి. ⇒ ఈ క్రమంలో గ్రామపటాలను తీసుకుని ఇప్పటికే ఇంటి స్థలాలుగా మారిన సర్వే నంబర్లు, మారే యోగ్యత ఉన్న సర్వే నంబర్లు, జాతీయ, రాష్ట్ర రహదారులకు ఆనుకుని ఉన్న సర్వే నంబర్లను వేర్వేరుగా గుర్తించాలి. ⇒ సబ్రిజి్స్ట్రార్, జిల్లాల రిజి్స్ట్రార్లు ఈ గ్రామాలకు ప్రత్యేకంగా వెళ్లి సమాచారం సేకరించాలి. ఆయా గ్రామాల్లోని పెద్దలు, రెవెన్యూ పంచాయతీ అధికారులతో మాట్లాడి ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో భూములు, ఆస్తులకు ఉన్న విలువను గుర్తించాలి. ⇒ బహిరంగ మార్కెట్ విలువలను సేకరించే విషయంలో ఎలాంటి తప్పులకు అవకాశం ఇవ్వొద్దు. రియల్ ఎస్టేట్ కంపెనీల బ్రోచర్లు, భూసేకరణ పరిహారం, బ్యాంకులు, రెవెన్యూ వర్గాలు నిర్వహించిన వేలం లాంటి వివరాలను విలువల నిర్ధారణకు వాడుకోవచ్చు. బహిరంగ మార్కెట్ విలువలను సేకరించిన తర్వాత ప్రస్తుతమున్న ప్రభుత్వ విలువలతో పోల్చుకుని సవరించాల్సిన విలువలను ప్రతిపాదించాలి. ⇒ 5–6 కిలోమీటర్ల రేడియస్లోని గ్రామాల్లో ఉండే తేడాలను జాగ్రత్తగా గమనించాలి. ఆ వ్యాసార్థంలోని గ్రామాల్లో ఏ పాయింట్లో ఎంత విలువ ఉంది, ఏయే పాయింట్కు ఎంత మారుతోందనే అంశాలను జాగ్రత్తగా గమనించాలి. ⇒ ఒకే గ్రామంలో ఉన్నా వేర్వేరు చోట్ల ఉన్న భూములు, ఆస్తులకు రెండు కంటే ఎక్కువ విలువలను కూడా ప్రతిపాదించవచ్చు. ⇒ వ్యవసాయ భూముల విషయంలో ప్రస్తుత బహిరంగ మార్కెట్ విలువలను రెవెన్యూ, పంచాయతీ అధికారుల నుంచి తీసుకోవాలి. ⇒ గతంలో పొరపాటుగా బహిరంగ మార్కెట్ విలువల కంటే ప్రభుత్వ విలువలను ఎక్కువగా నమోదు చేసి ఉంటే వాటిని వ్యక్తిగతంగా డీఐజీ స్థాయి అధికారులు పరిశీలించి కమిటీ ముందు పెట్టి నిర్ణయం తీసుకోవాలి. వ్యవసాయ భూముల విషయంలోనూ ఇదే వర్తిస్తుంది. పట్టణ ప్రాంతాల్లో ఇలా... ⇒ మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు అధికారికంగా నిర్ధారించిన ప్రాంతాల వివరాలను సేకరించి నివాస ప్రాంతాలు, వాణిజ్య ప్రాంతాలకు వేర్వేరుగా ఆ ప్రాంతం మొత్తానికి ఒకే విలువ నిర్ధారించాలి. సదరు ప్రాంతాల్లో కొన్ని కాలనీలు, వీధులను కలపాల్సి వచి్చనా విలువలు మాత్రం ఒకేలా ఉండాలి. ⇒ రోడ్డుకిరువైపులా ఉన్న ఆస్తులకు ఒకే విలువ ప్రతిపాదించాలి. మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల నుంచి తాజా డోర్ నంబర్ల వివరాలను ఫామ్–2లో పొందుపరచాలి. ⇒ మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో కొత్తగా విలీనం చేసిన గ్రామాల్లో విలువల ప్రతిపాదన కసరత్తు క్షేత్రస్థాయి పరిస్థితులకు తగినట్టు ఉండాలి. ఈ గ్రామాలను ఆనుకుని ఇప్పటికే వార్డులు, బ్లాక్లుగా ఉన్న మున్సిపల్ ప్రాంతాల్లో విలువలు ఆయా గ్రామాలకు సమీపంగా ఉంటే వాటిని పరిగణనలోకి తీసుకోవచ్చు. ⇒ నివాస ప్రాంతాల్లో ఉన్న డోర్ నంబర్లను వాణిజ్య ప్రాంతాలుగా పొరపాటున నమోదు చేసినా, వాణిజ్య ప్రాంతాల డోర్ నంబర్లను నివాస ప్రాంతాలుగా నమోదు చేసినా వాటిని సవరించాలి. ⇒ గ్రౌండ్ ఫ్లోర్, ఇతర ఫ్లోర్లకు వేర్వేరు విలువలు నిర్ధారించే అంశాన్ని కేవలం ప్రధాన రహదారుల పక్కన ఉండే నివాస సముదాయాలకు మాత్రమే వర్తింపజేయాలి. సాధారణ మార్గదర్శకాలు: ⇒ భారత స్టాంపుల చట్టం–1899లోని సెక్షన్ 47(ఏ) ప్రకారం ఆస్తుల విలువలను సవరించే సమయంలో క్రమానుగుణంగా జరిగిన ప్రక్రియ, విలువలను పరిగణనలోకి తీసుకుని సవరణ విలువలను ప్రతిపాదించాలి. (అంటే ఒకేసారి పెద్ద ఎత్తున పెంపు, తగ్గింపు ఉండకూడదు.) –గ్రామీణ ప్రాంతాల డేటా, రికార్డులను తహశీల్దార్లు, గ్రామపంచాయతీల నుంచి తీసుకోవాలి. ⇒ ప్రస్తుతమున్న ప్రభుత్వ విలువల కంటే ఎక్కువ విలువలతో ఒక ప్రాంతంలో పలు లావాదేవీలు జరిగి ఉంటే ఆ విలువను సవరణకు ప్రాతిపదికగా తీసుకోవచ్చు. ⇒ హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి, యాదాద్రి, ఖమ్మం, సిద్దిపేట, కరీంనగర్, వరంగల్ పట్టణాభివృద్ధి సంస్థల పరిధిలో జోనల్ అభివృద్ధి మ్యాప్లను, మిగిలిన పట్టణ ప్రాంతాల్లో ఆయా ప్రాంతాల మాస్టర్ప్లాన్లను విలువల సవరణకు ప్రాతిపాదికగా తీసుకోవాల్సి ఉంటుంది. -
అన్ని వైద్య కళాశాలల్లోఈడబ్ల్యూఎస్ కోటా!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ వైద్య కళాశాలల్లో ఆర్థికంగా బలహీనమైన వర్గాలకు (ఈడబ్ల్యూఎస్) రిజర్వేషన్ అమలు చేయాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) ఆదేశాల మేరకు ఈ ఏడాది నుంచే రిజర్వేషన్లు అమలు చేయనుంది. ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లోని అన్ని సీట్లలో 10 శాతం, ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లోని (మైనారిటీ కాలేజీలు మినహా) సగం కనీ్వనర్ కోటా సీట్లలో 10 శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కోసం కేటాయించనున్నారు. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ నుంచి ఈ మేరకు అందిన ప్రతిపాదనకు ప్రభుత్వం సూత్రప్రాయ ఆమోదం తెలిపినట్లు అధికారులు చెబుతున్నారు. ఇప్పటివరకు 7 కాలేజీల్లోనే.. రాష్ట్రంలో ప్రస్తుతం కేవలం 7 ప్రభుత్వ వైద్య కళాశాలలు.. హైదరాబాద్లోని గాందీ, ఈఎస్ఐ మెడికల్ కాలేజీలు, మహబూబ్నగర్, నిజామాబాద్, సిద్దిపేట మెడికల్ కాలేజీలు, వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీ, ఆదిలాబాద్లోని రాజీవ్గాంధీ మెడికల్ కాలేజీల్లోనే ఎన్ఎంసీ అనుమతి మేరకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అమలవుతున్నాయి. గతేడాది వరకు ఆయా కాలేజీల్లో 103 ఎంబీబీఎస్ సీట్లు ఈ కోటా కింద అగ్రవర్ణాల్లోని పేదలకు ఇచ్చారు. కాగా ఈ ఏడాది నుంచి అన్ని మెడికల్ కాలేజీల్లోని కనీ్వనర్ కోటా సీట్లకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ను అమలు చేస్తే మరో 350 వరకు ఎంబీబీఎస్ సీట్లు అగ్రవర్ణ పేదలకు దక్కే అవకాశం ఉందని వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే దీనిపై పూర్తిస్థాయిలో స్పష్టత రావాల్సి ఉంది. నీట్ ప్రవేశ పరీక్ష ఫలితాలు వెలువడిన తర్వాత, అడ్మిషన్ నోటిఫికేషన్ కంటే ముందే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్కు సంబంధించిన ఉత్తర్వులు వెలువడుతాయని వైద్యశాఖ వర్గాలు వెల్లడించాయి. జనరల్ కోటా సీట్లకు గండిరాష్ట్రంలో గతేడాది వరకు 56 మెడికల్ కాలేజీల్లో 8,490 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో 27 ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 3,790 ఎంబీబీఎస్ సీట్లున్నాయి. అలాగే 29 ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో 4,700 ఎంబీబీఎస్ సీట్లున్నాయి. అయితే ఇప్పటివరకు 10 శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అమలుకు గాను అంతే మొత్తంలో సీట్లను ఆయా మెడికల్ కాలేజీలకు ఎన్ఎంసీ మంజూరు చేసింది. దీనివల్ల ఇతర రిజర్వేషన్ కేటగిరీ విద్యార్థులకు కానీ, జనరల్ కేటగిరీ కోటా సీట్లకు కానీ కోత పడేది కాదు. కానీ తాజాగా ఎన్ఎంసీ అదనపు సీట్లు మంజూరు చేయడం కుదరదని, ఉన్న సీట్లలోనే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అమలు చేయాలని ఆదేశించింది. అయితే బీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లలో ఎలాంటి కోత ఉండదని అంటున్నారు. అంటే జనరల్ కేటగిరీ సీట్లకు కోత పెట్టి వాటిని ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్కు కేటాయిస్తారు. అలాగైనా తమకు నష్టం జరుగుతుందని ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు అంటున్నారు. జనరల్ కేటగిరీలోనూ తమకు ప్రతిభ ప్రకారం రావాల్సిన సీట్లకు గండి పడుతుందని, దీనివల్ల తమకు తీవ్రమైన అన్యాయం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రూ.8 లక్షల ఆదాయ పరిమితి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వర్తించాలంటే ఆదాయం రూ.8 లక్షల లోపు ఉండాలి. ఈ మేరకు ఆదాయ ధ్రువీకరణ పత్రాలు ఇచ్చేలా రెవెన్యూ శాఖకు ఆదేశాలున్నాయి. అన్ని మెడికల్ కాలేజీల్లో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అమలయ్యే పక్షంలో ఈ మేరకు విద్యార్థులు ఆదాయ ధ్రువీకరణ పత్రాలు తీసుకోవాల్సి ఉంటుంది. -
అన్నీ కలెక్టర్లే అంటే సరికాదు
సాక్షి, హైదరాబాద్: ధరణి దరఖాస్తుల పరిష్కారంలో అధికారాలను వికేంద్రీకరించడమే మేలని పలు జిల్లాల కలెక్టర్లు అభిప్రాయం వ్యక్తం చేశారు. ధరణి పరిధిలోని ప్రతి మాడ్యూల్ ద్వారా వచ్చే దరఖాస్తులన్నింటినీ జిల్లా కలెక్టర్లే పరిష్కరించే పద్ధతి సరైంది కాదని, ఇందుకు పరిస్థితులు కూడా అనుకూలంగా ఉండవని తెలిపారు. ఈ నేపథ్యంలోనే ధరణి దర ఖాస్తులు పేరుకుపోయాయని వెల్లడించారు. ధరణి పునర్నిర్మాణ కమిటీ బుధవారం సచివాలయంలో ఐదు జిల్లాల కలెక్టర్లతో సమావేశమైంది. కమిటీ సభ్యులు ఎం.కోదండరెడ్డి, ఎం.సునీల్కుమార్, రేమండ్ పీటర్, మధుసూదన్, నవీన్ మిత్తల్తో పాటు సీఎంఆర్వో పీడీ వి.లచ్చిరెడ్డి, జిల్లాల కలెక్టర్లు ప్రశాంత్ పాటిల్ (సిద్దిపేట), రాజీవ్గాంధీ హనుమంతు (నిజామాబాద్), ప్రావీణ్య (వరంగల్), గౌతమ్ కుమార్ (ఖమ్మం), శశాంక్ (రంగారెడ్డి), రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ధరణి దరఖాస్తుల పరిష్కారంలో ఎదురవుతున్న సమస్యలు, అనుభవాలను కమిటీ సభ్యులకు కలెక్టర్లు వివరించారు. అన్ని సమస్యలకూ తగిన మాడ్యూల్స్ లేవు ధరణి పోర్టల్లో అన్ని సమస్యల పరిష్కారానికి అవసరమైన మాడ్యూల్స్ లేవని, తమకు ఉన్న పని ఒత్తిడిలో అన్ని దరఖాస్తులు పరిశీలించి పరిష్కరించేందుకు జాప్యం జరుగుతోందని కలెక్టర్లు తెలిపారు. ఈ మేరకు అవసరమైన సిబ్బంది కూడా క్షేత్రస్థాయిలో లేరని చెప్పినట్టు తెలిసింది. సమస్యల పరిష్కార అధికారాలను కేవలం కలెక్టర్లకే కాకుండా కేటగిరీల వారీగా తహశీల్దార్లకు, ఆర్డీవోలకు కూడా ఇవ్వాలని సూచించారు. సాదా బైనామా దరఖాస్తుల పరిష్కారంపై ప్రభుత్వం నుంచి ఎలాంటి మార్గదర్శకాలు లేనందున వాటిని పరిష్కరించలేకపోయామని వివరించినట్టు సమాచారం. టెర్రాసిస్ కాంటెల్లా ప్రతినిధులతోనూ సమావేశం ధరణి పోర్టల్ నిర్వహిస్తోన్న టెర్రాసిస్ కాంటెల్లా కంపెనీ ప్రతినిధులతోనూ కమిటీ సభ్యులు భేటీ అయ్యారు. ధరణి పోర్టల్ పనితీరు, ఇందులో ఇమిడి ఉన్న సాంకేతిక అంశాలు, సమస్యల పరిష్కారానికి ఉన్న మార్గాల గురించి చర్చించారు. ఉదయం 10:30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరిగిన ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్లు, కంపెనీ ప్రతినిధుల నుంచి అవసరమైన సమాచారాన్ని కమిటీ సభ్యులు సేకరించారు. 27న అటవీ, వ్యవసాయ అధికారులతో భేటీ ఈ నెల 27న మరోమారు భేటీ కావాలని, ఉదయం అటవీ, గిరిజన శాఖలతో, మధ్యాహ్నం వ్యవసాయ శాఖ అధికారులతో సమావేశం కావాలని నిర్ణయించారు. ఆ తర్వాత స్టాంపులు, రిజి్రస్టేషన్లు, సర్వే సెటిల్మెంట్, దేవాదాయ, వక్ఫ్ ఉన్నతాధికారులతో సమావేశం కావాలని, ఆ భేటీ తర్వాతే ప్రభుత్వానికి మధ్యంతర నివేదిక సమర్పించాలని నిర్ణయించారు. -
పేదలకు ఇళ్ల స్థలాల్లో సరికొత్త చరిత్ర
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పేదల పక్షపాతి అని మరోసారి రుజువు అవుతోంది. రాష్ట్రంలో పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేసిన వైఎస్ జగన్ ప్రభుత్వం.. ఇప్పుడు వాటికి రిజిస్ట్రేషన్లు కూడా చేయడం ద్వారా కొత్త చరిత్ర సృష్టించనుంది. తద్వారా పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాలను రిజిస్టర్ చేసిన తొలి ప్రభుత్వంగా రికార్డులకెక్కనుంది. ప్రభుత్వాలు పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడం సాధారణమే అయినా ఒకేసారి 30 లక్షల మందికిపైగా ఇవ్వడం, వాటికి రిజిస్టర్ చేస్తుండటం దేశంలోనే ప్రప్రథమం. దీనివల్ల పేదలకు ఆ స్థలాలపై పూర్తి హక్కులు లభిస్తాయి. ఈ నెల 27వ తేదీ నుంచి రిజిస్ట్రేషన్లు చేసే కార్యక్రమం భారీ ఎత్తున మొదలు కానుంది. ఇందుకు సంబంధించిన ఆర్డినెన్స్ నేడో, రేపో జారీ కానుంది. ఈలోపు రిజిస్ట్రేషన్లు చేసేందుకు రెవెన్యూ శాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ కార్యక్రమం కింద వైఎస్ జగన్ ప్రభుత్వం రాష్ట్రంలో 31.19 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చింది. ఇందుకోసం 17 వేలకుపైగా వైఎస్సార్ జగనన్న కాలనీలు నిర్మించింది. గతంలో ఇళ్ల పట్టాలు పంపిణీ చేసినా వాటిపై పేదలకు హక్కులు దక్కేవి కాదు. డి–పట్టాలు కావడంతో అనుభవించడం మినహా వాటిపై సర్వ హక్కులు లేకపోవడంతో పేదలు వాటిని అవసరానికి వినియోగించుకునే అవకాశం ఉండేది కాదు. అందుకే ఇళ్ల పట్టాలు పొందిన పదేళ్ల తర్వాత వాటిపై లబ్ధిదారులు సర్వ హక్కులు పొందేలా ప్రభుత్వం అసైన్డ్ భూముల చట్టాన్ని సవరించింది. ఇప్పుడు దాని ప్రకారమే 30 లక్షల ఇళ్ల స్థలాలకు సంబంధించిన యజమానులకు కన్వేయన్స్ డీడ్లు అందించనుంది. అంటే పట్టాలు పొందిన వారికి ఆ స్థలాలను రిజిస్టర్ చేయనుంది. ఈ పట్టాలు పదేళ్ల గడువు ముగిసిన తర్వాత ఆటోమేటిక్గా సేల్ డీడ్లుగా మారతాయి. అప్పుడు ప్రభుత్వం జోక్యం లేకుండానే నేరుగా ఆ స్థలాలను అమ్ముకోవడానికి, ఇతర ప్రయోజనాల కోసం వినియోగించుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. పేదలు ఇబ్బంది పడకూడదనే.. చాలా ఏళ్ల క్రితం ఇచ్చిన డి–పట్టాలను క్రమబద్ధీకరించుకోవడం ప్రస్తుతం ఎంత కష్టమో తెలిసిన విషయమే. దానికి రెవెన్యూ శాఖ ఎన్ఓసీ ఇవ్వడం, ఆ తర్వాత రిజిస్ట్రేషన్ శాఖ దాన్ని మార్చే ప్రక్రియ ఎంతో క్లిష్టంగా ఉంది. పేదలు అలా ఇబ్బందులు పడకుండా ఆ స్థలాలను వారి పేరుతోనే ఇప్పుడు ప్రభుత్వం రిజిస్టర్ చేసి కన్వేయన్స్ డీడ్లు ఇస్తోంది. పదేళ్ల తర్వాత అవి సేల్ డీడ్లుగా మారతాయి. ఇళ్ల పట్టాల చరిత్రలోనే ఇది గొప్ప ముందడుగు. యుద్ధప్రాతిపదికన రిజిస్ట్రేషన్లు.. ఈ నెల 27 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ల ప్రక్రియ మొదలు కానుంది. ప్రభుత్వం తరఫున వీఆర్వో పేదలకు రిజిస్ట్రేషన్ చేస్తారు. ఇందుకోసం గ్రామ, వార్డు సచివాలయాలను జాయింట్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలుగా గుర్తిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. పంచాయతీ కార్యదర్శులు, వార్డు పరిపాలన కార్యదర్శులు జాయింట్ సబ్ రిజిస్ట్రార్లుగా వ్యవహరించనున్నారు. సీఎం వైఎస్ జగన్ ఆదేశాలతో యుద్ధప్రాతిపదికన ఈ పట్టాలకు రిజిస్ట్రేషన్ చేసే కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఇందుకోసం మంగళవారం రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులు జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వచ్చే నెల 9వ తేదీకల్లా రాష్ట్ర వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ల ప్రక్రియ పూర్తి చేయాలని నిర్ణయించారు. ఆర్డీవోలు, సబ్ కలెక్టర్లు, తహశీల్దార్లు ఆయా మండలాల్లో ప్రభుత్వం పంపిణీ చేసిన ఇళ్ల పట్టాల డేటా, లబ్ధిదారుల వివరాలు, వారికి కేటాయించిన ప్లాట్లు, వాటి నంబర్లు, హద్దులు పరిశీలించి రిజిస్ట్రేషన్లకు సిద్ధంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. జాయింట్ కలెక్టర్లు పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన జగనన్న కాలనీలను సందర్శించి క్షేత్ర స్థాయిలో అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించింది. పేదలకిచ్చే కన్వేయన్స్ డీడ్లు సరిగా ఉన్నాయో లేదా, అందులో కచ్చితమైన డేటా ఉందా లేదా చూడడంతో పాటు రిజిస్ట్రేషన్కు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాలని ఆదేశించింది. రిజిస్ట్రేషన్ పూర్తవగానే అర్హులకు కన్వేయన్స్ డీడ్లను పంపిణీ చేయాలని స్పష్టం చేసింది. అందుకు అవసరమైన ప్రింటింగ్ ఏర్పాట్లను కూడా పూర్తి చేసింది. ఈ మొత్తం కార్యక్రమం సజావుగా జరిగేందుకు అన్ని జిల్లా కలెక్టరేట్లలో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేయనుంది. అక్కడి నుంచి జేసీలు గంట గంటకు రిజిస్ట్రేషన్ల కార్యక్రమాన్ని పర్యవేక్షించాలని ఆదేశించింది. ఈ సమయంలో వీఆర్వోలు సచివాలయాల్లోనే అందుబాటులో ఉండేలా చూసే బాధ్యతను తహశీల్దార్లకు అప్పగించింది. -
పక్కాగా ధరణి అధ్యయనం!
సాక్షి, హైదరాబాద్: వ్యవసాయ భూముల రికార్డుల నుంచి క్రయ విక్రయ లావాదేవీల వరకు అన్ని రకాల అంశాలతో ముడిపడి ఉన్న ధరణి పోర్టల్ను పక్కాగా అధ్యయనం చేసిన తర్వాతే తదుపరి చర్యలకు ఉపక్రమించాలని దీనిపై కొత్తగా ఏర్పాటైన కమిటీ భావిస్తోంది. రైతులు తక్షణం ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రధానంగా ఫోకస్ చేసి పనిచేయాలని, పూర్తి సమాచారాన్ని సేకరించి, రెవెన్యూ వ్యవహారాలతో సంబంధమున్న భాగస్వామ్య పక్షా లన్నింటితో చర్చించి ఫార్మర్స్ ఫ్రెండ్లీ (రైతులకు సులభంగా ఉండే)వెబ్సైట్ తయారు చేసే లక్ష్యంతో ముందుకెళ్లే ఆలోచనలో ఉంది. పోర్టల్లో ఎదురవుతున్న సాంకేతిక సమస్యలను పరిష్కరించడం కూడా సవాలేనని, ఇందుకోసం సాంకేతిక నిపుణులతో కూడా సంప్రదింపులు జరపాలని ప్రాథమికంగా భావిస్తోంది. ధరణి పోర్టల్ను ప్రక్షాళన చేయడంతో పాటు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంగా చెప్పిన విధంగా భూమాత పోర్టల్ను రూపొందించే దిశలో భవిష్యత్ కార్యాచరణను నిర్ణయించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన కమిటీ తొలిసారిగా గురువారం సమావేశం కానుంది. నిషేధిత భూములు పెద్ద సవాల్! కొత్తగా ఏర్పాటైన ధరణి కమిటీ ముందున్న ప్రధాన సమస్యల్లో నిషేధిత జాబితా భూములే ప్రధానాంశంగా మారనున్నాయి. ధరణి రికార్డుల ప్రకారం నిషేధిత (22ఏ) జాబితాలో చేరిన రైతుల పట్టా భూములను తిరిగి వారి పేరిట రికార్డు చేయడమే పెద్ద సవాల్గా మారనుంది. ధరణి పోర్టల్ అందుబాటులోకి వచ్చి ఆరేళ్లు గడుస్తున్నా ఈ సమస్య పరిష్కారం కావడం లేదు. వాస్తవానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే నిషేధిత భూముల జాబితా రూపొందించారు. రెవెన్యూ వర్గాలిచ్చిన ఆ జాబితా ప్రకారం అప్పటి స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ సాఫ్ట్వేర్లో ఆయా భూముల సర్వే నంబర్లను అప్లోడ్ చేశారు. ఈ సర్వే నంబర్ల పరిధిలోనే రైతుల పట్టా భూములు కూడా ఉండేవి. అయితే రైతుల పట్టా భూములకు, నిషేధిత జాబితాలో పేర్కొన్న ప్రభుత్వ భూములకు వేర్వేరు బై నంబర్లు ఇవ్వడంతో ప్రభుత్వ భూముల లావాదేవీలు మాత్రమే నిలిచిపోయి, ప్రైవేటు భూముల లావాదేవీలు నిరాటంకంగా జరిగిపోయేవి. కానీ ధరణి పోర్టల్ ఏర్పాటైన తర్వాత స్టాంపుల శాఖ వద్ద ఉన్న సాఫ్ట్వేర్ను ధరణి పోర్టల్లో అప్లోడ్ చేసేటప్పుడు నిషేధిత జాబితాలో ఉన్న సర్వే నంబర్ ఎక్కించినా ఎలాంటి బై నంబర్లు ఇవ్వకపోవడంతో సదరు సర్వే నంబర్లోని భూమి పూర్తిగా నిషేధిత జాబితాలోకి వెళ్లింది. దీంతో రైతులు తమ పట్టా భూముల్లోనూ ఎలాంటి లావాదేవీలు జరిపే అవకాశం లేకుండా పోయింది. ఈ సమస్య ఇప్పటివరకు పరిష్కారం కాలేదు. ఇలా నిషేధిత జాబితాలో పడిన పట్టా భూములు 10 లక్షల ఎకరాల వరకు ఉంటాయని భూసమస్యలపై పనిచేస్తున్న వారు చెపుతున్నారు. గత ఏడాదిలోనే 30 వేల దరఖాస్తులు తమ భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించాలని కోరుతూ టీఎం15 కింద ఒక్క 2023లోనే 30 వేల దరఖాస్తులు ధరణిలో వచ్చినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో కొత్తగా ఏ ర్పాటైన కమిటీ ప్రధానంగా ఈ అంశంపైనే దృష్టి సారించనుందని, ధరణి పోర్టల్లోని సాంకేతిక సమస్యలు పరిష్కారమయ్యేలోపు నిషేధిత జాబితాను కొత్తగా తయారు చేసేలా సిఫారసు చేసే అవకాశమున్నట్టు తెలుస్తోంది. ఆ జాబితాను మళ్లీ ధరణి లేదా భూమాత పోర్టల్లో అప్లోడ్ చేస్తేనే రైతుల సమస్య శాశ్వతంగా పరిష్కారమవుతుందని, లేదంటే మళ్లీ రెవెన్యూ వర్గాల దయాదాక్షిణ్యాల మీద ఆధారపడాల్సిందేననే అభిప్రాయం వ్యక్తమవుతోంది. నిషేధిత జాబితాలో పట్టా భూములు రైతుల పట్టా భూములను కూడా నిషేధిత జాబితాలో పెట్టారు. వీటిని తొలగించుకోవడం కోసం రైతులు 2,3 ఏళ్లు తిరిగినా పరిష్కారం కావడం లేదు. అసలు 22ఏ జాబితాలోనే చాలా తప్పులున్నాయి. 2007 నుంచి 2023 వరకు తప్పులతో కూడిన డేటా ఎక్కించారు. రెవెన్యూ శాఖ కొత్త జాబితా తయారు చేసి దాన్ని అటు స్టాంపుల శాఖ, ఇటు ధరణి పోర్టల్లో అప్లోడ్ చేయాలి. ఈ నిషేధిత జాబితా సమస్య పరిష్కారం కాకుండా ధరణి సమస్యలు తేలవు. – మన్నె నర్సింహారెడ్డి, ధరణి భూ సమస్యల వేదిక కన్వినర్ -
భారమైతే బదిలీ!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 28 నుంచి జనవరి 6 వరకు ఎనిమిది పనిదినాల్లో ‘ప్రజాపాలన’కార్యక్రమాన్ని నిర్వహించాలని కలెక్టర్లు, ఎస్పీలను ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్రెడ్డి ఆదేశించారు. రెవెన్యూ శాఖ గ్రామసభలను నిర్వహిస్తుందని, పోలీసుశాఖ వాటిని గాడిలో పెట్టాలని సూచించారు. ఈ కార్యక్రమం అమల్లో ఏవైనా ఇబ్బందులుంటే సీఎస్, డీజీపీకి ఫోన్ చేసి తెలియజేయాలన్నారు. పని చేయడానికి ఇబ్బందిగా ఉన్నా, ఇష్టం లేకపోయినా చెప్పాలని.. వేరే చోటికి బదిలీ చేయడానికి ప్రభుత్వానికి ఎటువంటి అభ్యంతరం లేదని స్పష్టం చేశారు. జిల్లాల్లో ఉండి ఏమీ చేయబోమంటే అంగీకరించే ప్రసక్తే లేదన్నారు. ఆదివారం రాష్ట్ర సచివాలయంలో జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ వారి నుంచి సూచనలు, సలహాలు తీసుకున్నారు. పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు. ‘‘ప్రభుత్వ లక్ష్యాలను ప్రజలకు చేరవేయడం ఎవరికైనా ఇష్టం లేకున్నా.. ఎక్కువగా పనిచేయాల్సి వస్తోందని, 18 గంటలు పనిచేయాల్సి వస్తోందని, మానసికంగా, శారీరకంగా ఇబ్బంది ఎందుకని అనిపించినా చెప్పండి. అలాంటి వారిని వేరే చోటికి బదిలీ చేస్తాం. 18 గంటల పని ఉండని ప్రాంతానికి బదిలీ చేయడంలో అభ్యంతరం లేదు. అధికారుల సూచనలు, సలహాలను ఓపెన్ మైండ్తో స్వీకరిస్తాం. అధికారుల పనితీరుకు నీతి, నిజాయతీలే పెద్ద కొలమానం. పోస్టింగ్స్లో వాటినే పరిగణనలోకి తీసుకుంటాం..’’అని రేవంత్ చెప్పారు. ప్రజా పాలనకు ప్రత్యేకాధికారులు ప్రజాపాలనలో భాగంగా ప్రతి మండలంలో రోజూ రెండు గ్రామాల్లో సభలు నిర్వహించాలని సీఎం ఆదేశించారు. మండలంలో రెండు బృందాలుంటే ఒక బృందానికి ఎమ్మార్వో, మరో బృందానికి ఎంపీడీవో బాధ్యత తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమం కోసం 119 నియోజకవర్గాలకు 119 మంది ప్రత్యేకాధికారులను నియమిస్తామని చెప్పారు. ముందుగా గ్రామాలకు వెళ్లి ప్రణాళికతో సభ నిర్వహించాలని.. మహిళల కోసం ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రభుత్వ సందేశాన్ని చదివి వినిపించిన తర్వాత కార్యక్రమాన్ని చేపట్టాలన్నారు. నిరక్షరాస్యుల దరఖాస్తులను నింపించడానికి అంగన్వాడీలు, ఆశా వర్కర్ల సేవలను వినియోగించుకోవాలన్నారు. దరఖాస్తులకు అవసరమైన డేటా, ఆధార్కార్డు, ఫోటో వంటివి తేవాలని ప్రజలకు ముందే తెలియజేయాలని ఆదేశించారు. అమరవీరులు, ఉద్యమకారులపై ఎఫ్ఐఆర్, కేసుల వివరాలను సేకరించాల్సి ఉంటుందని, ముందే అప్లికేషన్లు పంపిణీ చేయాలని సూచించారు. ప్రజాపాలన కింద సేకరించిన దరఖాస్తులను డిజిటలైజ్ చేసి ప్రభుత్వానికి పంపిస్తే.. వాటిని స్రూ్కటినీ చేసి అర్హులైన వారికి సంక్షేమ పథకాలను అందిస్తామని చెప్పారు. ప్రతి నాలుగు నెలలకోసారి గ్రామసభలు, ప్రజాపాలన పరిస్థితిని సమీక్షించుకుందామన్నారు. అద్దాల మేడలు కట్టి అభివృద్ధి అంటే ఎలా? ‘‘అభివృద్ధి అంటే అద్దాల మేడలు, రంగుల గోడలు కాదు. పౌరుల నైతికాభివృద్ధే నిజమైన దేశాభివృద్ధి అని అంబేడ్కర్ ఎప్పుడో చెప్పారు. అద్దాల మేడలు, రంగుల గోడలు చూపించి అభివృద్ధి జరిగిందని ఎవరైనా భ్రమపడితే పేద ప్రజలకు ఎలాంటి ప్రయోజనం ఉండదు. చివరి వరసలోని పేదలకు సంక్షేమ పథకాలు అందినప్పుడే ఈ రాష్ట్రం గానీ, దేశం గానీ అభివృద్ధి చెందినట్టు కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది..’’అని రేవంత్ చెప్పారు. ఆరు గ్యారంటీల అమలుపై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలపైనే పూర్తి బాధ్యత పెట్టామని, వారిపై నమ్మకంతో దరఖాస్తుల స్వీకరణ కోసం ప్రజాపాలన కార్యక్రమాన్ని చేపట్టామని పేర్కొన్నారు. ప్రజలతో జాగ్రత్తగా వ్యవహరించాలి ‘‘తెలంగాణ ప్రజలు గౌరవంగా, మర్యాదగా వ్యవహరిస్తారు. అభివృద్ధిని విస్మరిస్తే వారి ప్రతిస్పందన చాలా కటువుగా ఉంటుంది. అది మీరంతా ఇటీవలే చూశారు..’’అని అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను ఉద్దేశిస్తూ సీఎం రేవంత్ పేర్కొన్నారు. ప్రజల ఆలోచనలను అర్థం చేసుకోకుంటే ఎంతటి వారినైనా ఇంటికి పంపించగలరని.. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని సూచించారు. ప్రజలకు అందుబాటులో ఉండి బాధ్యతాయుతంగా, జవాబుదారీతనంతో వారి సమస్యలను పరిష్కరించాలని కోరారు. మాది ఫ్రెండ్లీ ప్రభుత్వమే.. కానీ.. తమది ఫ్రెండ్లీ ప్రభుత్వమేనని.. అయితే ప్రజలతో శభాష్ అనిపించుకున్నంత వరకే ఈ ప్రభుత్వం అధికారులతో ఫ్రెండ్లీగా ఉంటుందని సీఎం రేవంత్ పేర్కొన్నారు. నిర్లక్ష్యం వహించినా, ఉద్దేశపూర్వకంగా తప్పుడు నిర్ణయాలు తీసుకున్నా ప్రభుత్వం సమీక్షిస్తుందని చెప్పారు. అధికారుల్లో మానవీయ కోణం ఉంటే ప్రజల సమస్యల్లో 90శాతం సమస్యలు అక్కడే పరిష్కరించవచ్చని స్పష్టం చేశారు. రూల్స్ను అమలు చేస్తున్నామని అనుకోవడం కంటే, ప్రజల సమస్యలను పరిష్కరించడానికే ఉన్నామన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు. సమస్యల పరిష్కారంలో సానుకూల (పాజిటివ్) దృక్పథం, ధోరణితో ముందుకెళ్లాలన్నారు. అలా కాకుండా ఏ కాగితం వచ్చినా ఎలా తిరస్కరించాలన్న ఆలోచనా ధోరణి ఉంటే అభివృద్ధి, సంక్షేమం సరైన దిశగా ప్రయాణించవని స్పష్టం చేశారు. పాత ప్రభుత్వ పద్ధతులను మానుకుంటే మంచిది డిప్యూటీ సీఎం భట్టి కాంగ్రెస్ ప్రభుత్వ పాలనకు అనుగుణంగా అధికారుల పనితీరు ఉండాలని.. విధుల్లో అలసత్వాన్ని సహించేది లేదని కలెక్టర్లు, ఎస్పీలకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ప్రభుత్వం అమలు చేసే ప్రతి కార్యక్రమాన్ని క్షేత్రస్థాయి వరకు తీసుకెళ్లడంలో అధికారులు అంకిత భావంతో పనిచేయాలని సూచించారు. తెలంగాణ వచ్చిన దశాబ్దకాలం తర్వాత ప్రజల ప్రభుత్వం ఏర్పడిందని.. ఈ ప్రభుత్వం తమదేనన్న నమ్మకం, భరోసాను ప్రజల్లో కల్పించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని స్పష్టం చేశారు. అందుకు తగ్గట్టుగా అధికార యంత్రాంగం పనితీరు ఉండాలని సూచించారు. పాత ప్రభుత్వ పద్ధతులను అధికారులు మార్చుకోవాలని, ఆ మైండ్సెట్ ఇక ముందు ఉండకూడదని పేర్కొన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన రెండు రోజుల్లోనే రెండు గ్యారంటీలు అమలు చేశామని.. మిగతా గ్యారంటీలను కూడా వంద రోజుల్లో కచ్చితంగా అమలు చేస్తామని చెప్పారు. ఈ గ్యారంటీలను ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రతి లబ్ధిదారుకు అందించాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. -
రిజిస్ట్రేషన్లకే పరిమితం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 15 రోజుల తర్వాత కూడా రెవెన్యూ కార్యకలాపాల్లో కదలిక కనిపించడం లేదు. వాస్తవానికి ఎన్నికలకు ముందే (షెడ్యూల్ వెలువడి ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినప్పుడే) రెవెన్యూ లావాదేవీలు నిలిచిపోయాయి. ఎన్నికల విధుల్లో నిమగ్నమైన జిల్లాల కలెక్టర్లు కీలకమైన ధరణి పోర్టల్తోపాటు ఇతర కార్యకలాపాలన్నింటినీ పక్కన పెట్టేశారు. ఎన్నికల ఫలితాలు వెలువడి పక్షం దాటినా వాటిని పట్టించుకోకపోవడంతో రెవెన్యూ వ్యవస్థ సుప్తచేతనావస్థకు చేరిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కొత్త ప్రభుత్వం అధికారం చేపట్టిన నేపథ్యంలో ఆ ప్రభుత్వ విధానాలు ఎలా ఉంటాయోనన్న ఆలోచనతో కలెక్టర్లు తమ దగ్గరకు వచ్చిన ఫైళ్లపై ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా పక్కన పెట్టేయడం, భూపరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్ఏ) కూడా పట్టించుకోకపోవడంతో తహసీల్దార్ కార్యాలయాల సిబ్బంది రెవెన్యూ పనులు తప్ప మిగిలిన పనులతో కాలం వెళ్లదీస్తుండటం గమనార్హం. ధరణిపై సమీక్షించినా... వాస్తవానికి కాంగ్రెస్ అధికారంలోకి రాగానే సీఎం రేవంత్రెడ్డి ధరణి పోర్టల్పై సమీక్షించి 10 రోజుల్లో సమగ్ర నివేదిక ఇవ్వాలని రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిత్తల్ను ఆదేశించారు. కానీ రెవెన్యూ ఫైళ్ల పరిష్కారం అంశం ఈ సమావేశంలో చర్చకు రాలేదు. ధరణి పోర్టల్ కింద 2.3 లక్షల దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయని సమావేశంలో భాగంగా రెవెన్యూ అధికారులు సీఎంకు వివరించారు. ఈ సమస్యల పరిష్కారంపైన ఆయన ఎలాంటి ఆదేశాలివ్వకపోవడం గమనార్హం. దీనికితోడు రాష్ట్రంలో భూముల క్రమబద్ధీకరణ ప్రక్రియ కూడా నిలిచిపోయింది. జీవో 58, 59తోపాటు ఇతర జీవోల ద్వారా జరగాల్సిన ఈ ప్రక్రియ కూడా ఎన్నికల కారణంగానే ఆగిపోయింది. ఎన్నికల తర్వాత తమ విన్నపాలకు పరిష్కారం లభిస్తుందని దరఖాస్తుదారులు ఎదురుచూస్తున్నప్పటికీ ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు రాకపోవడంతో ఆ దరఖాస్తులను కూడా కలెక్టర్లు పరిష్కరించడం లేదు. అటు ధరణి పోర్టల్, ఇటు భూముల క్రమబద్ధీకరణ నిలిచిపోయిన నేపథ్యంలో కేవలం ధరణి పోర్టల్ ద్వారా భూములను రిజిస్ట్రేషన్ చేసేందుకు, ఆదాయ, కుల తదితర ధ్రువీకరణ పత్రాలు ఇవ్వడానికి, క్రిస్మస్ తోఫాను పంపిణీ చేయడానికే పరిమితమయ్యామని, భూ సంబంధిత సమస్యలపై తమ కార్యాలయాలకు వచ్చే వారికి సమాధానం చెప్పుకోలేక పోతున్నామని తహసీల్ కార్యాలయాల సిబ్బంది వాపోతున్నారు. అటు ధరణి పోర్టల్ సమస్యల పరిష్కారంతోపాటు భూముల క్రమబద్ధీకరణ విషయంలో ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు రాలేదని, కేవలం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఉన్నతాధికారులు మౌఖిక ఆదేశాలిచ్చారనే కారణంతోనే వ్యవస్థ స్తంభించిందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం జరగనున్న కలెక్టర్ల సదస్సులో రెవెన్యూ వ్యవహారాలపై స్పష్టతనివ్వాలని, అప్పుడే భూ సంబంధిత సమస్యలు పరిష్కారమవుతాయని కలెక్టర్ల నిర్ణయాల కోసం ఎదురుచూస్తున్న లక్షలాది మంది రైతులు, ప్రజలు కోరుతున్నారు. -
చిటికెలో ‘మ్యుటేషన్’
సాక్షి, అమరావతి: కృష్ణా జిల్లా మచిలీపట్నం మండలం అరిశేపల్లి గ్రామానికి చెందిన నంద్యాల తేజస్ ఒక ఎకరం పొలాన్ని కొనుగోలు చేశారు. బందరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లి తన పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. రిజిస్ట్రేషన్ జరిగిన వెంటనే రెవెన్యూ రికార్డుల్లో ఆయన పేరు నమోదైంది. ఒకే రోజు రిజిస్ట్రేషన్తో పాటు ఆటోమెటిక్గా మ్యుటేషన్ కూడా జరిగిపోయింది. సరళంగా ప్రక్రియ ఆస్తి ఒకరి పేరు మీద నుంచి మరొకరి పేరిట మారాలంటే కొద్ది రోజుల క్రితం వరకు పెద్ద ప్రహసనమే. తహశీల్దార్ కార్యాలయం చుట్టూ రోజుల తరబడి తిరిగినా మ్యుటేషన్ జరగక కొనుగోలుదారులు అవస్థలు పడాల్సి వచ్చేది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ముందుచూపుతో ప్రవేశపెట్టిన విధానాలు, రెవెన్యూ సంస్కరణల ఫలితంగా ఇప్పుడు చాలా తేలిగ్గా ఆటో మ్యుటేషన్ జరిగిపోతోంది. వ్యవస్థలు వాటి పని అవి చేసుకుంటూ వెళుతున్నాయి. రిజిస్ట్రేషన్ జరిగిన వెంటనే ఆటోమేటిక్గా వెబ్ల్యాండ్లో యాజమాన్య హక్కుల బదలాయింపు జరుగుతోంది. ఎక్కడికి తిరగాల్సిన పనిలేకుండా ప్రభుత్వం కొత్తగా అమలు చేస్తున్న కార్డ్ ప్రైమ్ రిజిస్ట్రేషన్ల విధానంలో మ్యుటేషన్ ప్రక్రియ అత్యంత సరళంగా ముగుస్తోంది. ఎన్టీఆర్ జిల్లా నందిగామ, కృష్ణా జిల్లా మచిలీపట్నంలో రిజిస్ట్రేషన్లు, ఆటో మ్యుటేషన్ల తీరును ‘సాక్షి’ ప్రతినిధి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పూర్తయ్యేదాకా ఉత్కంఠే! స్థిరాస్థుల క్రయవిక్రయాలు జరిగిన తర్వాత వాటిని తమ పేరు మీదకు మార్చుకోవడం ఇన్నాళ్లూ క్లిష్టతరంగా ఉండేది. రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత మళ్లీ మ్యుటేషన్ కోసం రెవెన్యూ శాఖకు దరఖాస్తు చేసుకోవడం, ఆ ప్రక్రియ పూర్తయ్యేందుకు కొంత సమయం పట్టడంతో కొనుగోలుదారులకు కునుకు పట్టేది కాదు. ఆస్తిని రిజిష్టర్ చేసేది రిజిస్ట్రేషన్ శాఖ అయితే దాన్ని రెవెన్యూ రికార్డుల్లో అప్డేట్ చేసేది రెవెన్యూ శాఖ. రెండు శాఖల మధ్య సమన్వయం లేకపోవడం, ఏళ్ల తరబడి అదే విధానం కొనసాగడంతో రిజిస్ట్రేషన్ పూర్తయినా మ్యుటేషన్ కోసం నిరీక్షణ తప్పని పరిస్థితి. కొన్ని సందర్భాల్లో రిజిస్టర్ అయిన ఆస్తికి సంబంధించి వివాదాలు తలెత్తడంతో మ్యుటేషన్ జరిగేది కాదు. అవతవకలకు ఆస్కారం ఉండేది. సంక్లిష్టంగా ఉన్న మ్యుటేషన్ల విధానాన్ని సీఎం జగన్ ప్రభుత్వం సరళంగా మార్చింది. ఎంతోకాలం నుంచి కాగితాలకే పరిమితమైన ఆటో మ్యుటేషన్ ప్రతిపాదనను వాస్తవ రూపంలోకి తెచ్చి ప్రజల అవస్థలను తొలగించింది. రిజిస్ట్రేషన్ల శాఖకు వెబ్ల్యాండ్ అనుసంధానం నూతన విధానంలో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ సాఫ్ట్వేర్ను, రెవెన్యూ శాఖ వెబ్ల్యాండ్ సాఫ్ట్వేర్ను అనుసంధానం చేశారు. దానికి ముందు రిజిస్ట్రేషన్ల శాఖ సాఫ్ట్వేర్ కార్డ్ స్థానంలో కార్డ్ ప్రైమ్ను ప్రవేశపెట్టారు. ఆటో మ్యుటేషన్తోపాటు ఆన్లైన్లోనే డాక్యుమెంట్ తయారు చేసుకోవడం, సర్వే నెంబర్ ఎంటర్ చేయగానే మార్కెట్ విలువ కనిపించడం, అందుకు తగ్గట్టుగా ఆన్లైన్లోనే చలానాలు కట్టడం, అనంతరం రిజిస్ట్రేషన్ కోసం స్లాట్ బుక్ చేసుకోవడం కార్డ్ ప్రైమ్ విధానంలో కొత్తగా అందుబాటులోకి వచ్చాయి. నిర్దేశించిన స్లాట్ ప్రకారం రిజిస్టార్ ఆఫీసు లేదంటే గ్రామ, వార్డు సచివాలయానికి వెళితే అక్కడ కొత్త విధానంలో వెంటనే రిజిస్ట్రేషన్తోపాటు ఆ వివరాల ప్రకారం ఆటోమేటిక్గా మ్యుటేషన్ జరిగిపోతోంది. మళ్లీ మ్యుటేషన్ కోసం ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవడం, రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. రిజిస్ట్రేషన్ చేసే సమయంలోనే అన్నింటినీ పక్కాగా నిర్థారిస్తారు. సబ్ రిజి్రస్టార్లు రెవెన్యూ రికార్డులను పూర్తిగా పరిశీలించి రిజిస్ట్రేషన్కు అనుమతిస్తారు. రిజిస్ట్రేషన్ జరగగానే రెవెన్యూ రికార్డుల్లో యాజమాన్య హక్కు దానంతట అదే మారిపోతుంది. త్వరలో అర్బన్ ప్రాంతాల్లోనూ కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో మూడు నెలల క్రితం నూతన విధానాన్ని ప్రయోగాత్మకంగా పరిశీలించారు. ప్రస్తుతం రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు, గ్రామ, వార్డు సచివాలయాల్లో కొత్త విధానంలోనే రిజిస్ట్రేషన్లతోపాటు ఆటో మ్యుటేషన్లు జరుగుతున్నాయి. కొత్త విధానం వచ్చాక 26 జిల్లాల్లో ఇప్పటివరకు 7 వేలకుపైగా ఆటో మ్యుటేషన్లు జరిగాయి. వ్యవసాయ భూములకు సంబంధించి అమలవుతున్న ఆటో మ్యుటేషన్ విధానాన్ని త్వరలో అర్బన్ ప్రాంతాల్లోనూ అమలు చేయడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. నగరాలు, పట్టణాల్లో ఆస్తుల రికార్డులు మున్సిపల్ శాఖ నిర్వహిస్తుండడంతో రిజిస్ట్రేషన్ల శాఖ అందుబాటులోకి తెచ్చిన కార్డ్ ప్రైమ్ సాఫ్ట్వేర్ను దానికి అనుసంధానించాల్సి ఉంది. ఇప్పటికే రిజిస్ట్రేషన్ల శాఖ అందుకు సిద్ధమవగా మున్సిపల్ శాఖ కసరత్తు చేస్తోంది. సులభతరం రిజిస్ట్రేషన్ సేవలతోపాటు మ్యుటేషన్ విధానాన్ని సులభతరం చేశాం. కార్డ్ ప్రైమ్ విధానంలో ఆటో మ్యుటేషన్ వెంటనే జరిగిపోతోంది. ఇందుకోసం రెవెన్యూ, రిజిస్ట్రేషన్ల శాఖల సాఫ్ట్వేర్లను పూర్తిగా మార్చాం. ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలన్న ప్రభుత్వ ఆదేశాల మేరకు కొత్త విధానాన్ని అమలు చేస్తున్నాం. రాష్ట్రవ్యాప్తంగా వ్యవసాయ భూములకు ఆటో మ్యుటేషన్లు జరుగుతున్నాయి. మరికొద్ది రోజుల్లో అర్బన్ ఆస్తులకూ ఇదే విధానాన్ని తెచ్చే ప్రయత్నం జరుగుతోంది. రిజిస్ట్రేషన్ల విధానం, ఆటో మ్యుటేషన్ చాలా బాగా అమలవుతోంది. దుష్ప్రచారాలను నమ్మవద్దు. – వి రామకృష్ణ, కమిషనర్ అండ్ ఐజీ, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ వెంటనే ఆన్లైన్లో.. మా గ్రామ సమీపంలో రెండు ఎకరాల వ్యవసాయ భూమిని కొనుగోలు చేశా. నందిగామ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో రిజిస్ట్రేషన్ అరగంటలోనే పూర్తయింది. ఆ తర్వాత వెంటనే నా పేరు మీద ఆన్లైన్లో కూడా మారింది. ఇంతకుముందు ఆన్లైన్లో పేరు చేర్చాలంటే రిజిస్ట్రేషన్ పత్రాలతో ఎమ్మార్వో ఆఫీసు చుట్టూ తిరగాల్సి వచ్చేది. ఇప్పుడు వెంటనే మ్యుటేషన్ జరగడం బాగుంది. – నల్లపోతుల నాగరాజు, నందిగామ మండలం, రాఘవాపురం తిరిగే తిప్పలు లేవు.. నా పేరుతో ఉన్న 33 సెంట్ల భూమిని నా కుమార్తె వెంకటేశ్వరమ్మ పేరిట రాశాను. రిజిస్ట్రేషన్ జరిగిన రోజే ఆమె పేరిట భూమి మారిపోయింది. ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన బాధ లేకుండా వెంటనే పని పూర్తయింది. – చల్లా ఆంజనేయులు, కొండూరు, నందిగామ మండలం. -
అరవింద్ కుమార్కు ‘విపత్తు’
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ను ప్రభుత్వం రెవెన్యూ శాఖ పరిధిలోని విపత్తుల నిర్వహణ విభాగం ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బదిలీ చేసింది. హైదరాబాద్ జలమండలి మేనేజింగ్ డైరెక్టర్ ఎం.దాన కిశోర్ను పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శిగా స్థానచలనం కల్పించింది. కీలకమైన హెచ్ఎండీఏ కమిషనర్, పురపాలక శాఖ కమిషనర్ అండ్ డైరెక్టర్ పదవుల అదనపు బాధ్యతల నుంచి సైతం అరవింద్కుమార్ను తప్పించింది. ఆ రెండు పోస్టుల అదనపు బాధ్యతలనూ దానకిశోర్కే అప్పగించింది. ఈ మేరకు రాష్ట్రంలో పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. గత ప్రభుత్వ హయాంలో లీజుపై అవుటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) అప్పగింతపై నిర్వహించిన టెండర్లలో అక్రమాలు చోటుచేసుకున్నాయని అప్పట్లో రేవంత్రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. దీనిపై హెచ్ఎండీఏ కమిషనర్గా అరవింద్ కుమార్ స్పందిస్తూ రేవంత్రెడ్డికి లీగల్ నోటీసులు పంపారు. ఈ పరిణామాల నేపథ్యంలో అరవింద్కుమార్ను అప్రధానమైన విపత్తుల నిర్వహణ విభాగానికి బదిలీ చేయడం గమనార్హం. గత ప్రభుత్వంలో సీఎం కార్యదర్శిగా వ్యవహరించిన రాహుల్ బొజ్జాను సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శిగా ప్రభుత్వం బదిలీ చేసింది. ఎస్సీల అభివృద్ధి శాఖ కార్యదర్శి, కమిషనర్గా అదనపు బాధ్యతల్లో ఆయన్ను కొనసాగించింది. విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణను తప్పించి ఆమెను స్త్రీ, శిశు సంక్షేమ శాఖకు బదిలీ చేసింది. ఆమె స్థానంలో బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశంను విద్యాశాఖ కార్యదర్శిగా బదిలీ చేసింది. గత ప్రభుత్వంలో అప్రాధాన్య పోస్టుల్లో ఉన్న వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ క్రిస్ట్రీనా జెడ్.చొంగ్తును కీలకమైన వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శిగా నియమించడం విశేషం. -
10 రోజుల్లో నివేదిక ఇవ్వండి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని భూసంబంధిత సమస్యలు, ధరణి పోర్టల్ అంశాలపై పది రోజుల్లో సమగ్ర నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్రెడ్డి రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు. ‘ధరణి పోర్టల్ను ఎలా డిజైన్ చేశారు? భూ రికార్డులు అందులో ఎలా భద్రపరిచారు? సదరు డేటా ఎక్కడ ఉంది? పోర్టల్ నిర్వహిస్తున్న కంపెనీ కాంట్రాక్టు ఎప్పటివరకు ఉంది? ఆ కంపెనీ మళ్లీ ఎందుకు వేరే కంపెనీలకు లీజుకిచ్చింది? ఈ పోర్టల్ నిర్వహిస్తున్న, నిర్వహించిన కంపెనీలకు ఉన్న చట్టబద్ధత ఏంటి? ఒకవేళ పోర్టల్లోని రికార్డులు కరప్ట్ అయి వివరాలన్నీ పోతే రాష్ట్రంలోని భూములకు మాన్యువల్ రికార్డులు అందుబాటులో ఉన్నాయా? ఈ పోర్టల్ ద్వారా వస్తున్న దరఖాస్తులు ఏడాదిన్నరగా ఎందుకు పెండింగ్లో ఉంటున్నాయి?’ అని ప్రశ్నించారు. అన్ని అంశాల తో నివేదిక రూపొందించిన తర్వాత మళ్లీ సమావేశమవుదామని అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పాటు చేసిన కోనేరు రంగారావు కమిటీ తరహాలో రాష్ట్రంలోని భూసమస్యల అధ్యయనానికి క మిటీ కూర్పుపై అధ్యయనం చేయాలని చెప్పారు. భూదాన్, అసైన్డ్ భూముల అంశాలపై ఇంకోసారి సమావేశమై సమగ్రంగా చర్చిద్దామని అన్నారు. బు ధవారం మధ్యాహ్నం సచివాలయంలో ధరణి పోర్ట ల్ నిర్వహణపై సీఎం సమీక్ష నిర్వహించారు. డిప్యూ టీ సీఎం భట్టి విక్రమార్క, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, సీఎస్ శాంతికుమారి, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి, సీసీఎల్ఏ నవీన్ మిత్తల్, అధికారులు, రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులు, సిబ్బంది, కాంగ్రెస్ పార్టీ నేతలు, ఎమ్మెల్యేలు, భూచట్టాల నిపుణుడు సునీల్కుమార్, రెవెన్యూ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. అధికారులపై ప్రశ్నల వర్షం సమీక్ష సందర్భంగా సీఎంతో పాటు పలువురు మంత్రులు రెవెన్యూ అధికారులపై ప్రశ్నల వర్షం కురిపించారు. ‘నారాయణపేట జెడ్పీ చైర్మన్ ధరణి పోర్టల్లో దరఖాస్తు చేసుకున్నాడు. తన దరఖాస్తు పరిష్కారం కాకపోగా ఆ డబ్బులు మీరు తిరిగి ఇవ్వలేదు. ఆయన కోర్టుకు వెళ్లి తన డబ్బులు తనకివ్వాలని ఆర్డర్ తెచ్చుకున్నా మీరు స్పందించలేదు. ధరణి పోర్టల్ కింద చేసుకునే ప్రతి దరఖాస్తుకు రైతుల నుంచి డబ్బు వసూలు చేస్తున్నారు? ఎందుకు వసూలు చేస్తున్నారు? ఆ డబ్బులు నేరుగా ప్రభుత్వ ఖాతాకే వస్తున్నాయా? ప్రైవేటు కంపెనీకి వెళ్లి మళ్లీ ప్రభుత్వానికి వస్తున్నాయా? భూముల రికార్డులు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఉండడం వల్ల భూ యజమానుల హక్కులకు భంగం కలుగుతుంది కదా? డేటాను దుర్వినియోగం చేయకుండా నియంత్రించే మెకానిజం ఏంటి? స్లాట్ బుక్ చేసుకున్న తర్వాత రద్దు చేసుకుంటే ఆ డబ్బులు రైతులకు ఎందుకు ఇవ్వడం లేదు? నిషేధిత భూముల జాబితాలో ఉన్న భూములపై విచారణ సుమోటోగా ఎందుకు చేయొద్దు? నోషనల్ ఖాతా అంటే ఏంటి? ఆ ఖాతాలో భూములెందుకున్నాయి? 31 కాలమ్స్ ఉన్న పహాణీలో 16వది అయిన అనుభవదారు కాలమ్ ఎందుకు తీసేశారు?..’ అని రేవంత్ ప్రశ్నించారు. నివేదికపై సంతకం పెట్టి ఇవ్వండి ధరణి పోర్టల్కు, రైతుబంధుకు సంబంధమేంటని సీసీఎల్ఏ మిత్తల్ను సీఎం ప్రశ్నించారు. సంబంధమేమీ లేదని మిత్తల్ చెప్పగా, ఇదే విషయాన్ని ప్రభుత్వానికి ఇచ్చే నివేదికలో పొందుపర్చాలని రే వంత్ సూచించినట్టు తెలిసింది. నివేదికను పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ రూపంలో కాకుండా అధికారికంగా సంతకం పెట్టి ఇవ్వాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. వైఎస్ జగన్ వేగం మీకెందుకు లేదు? కాంగ్రెస్ హయాంలో రెవెన్యూ సదస్సులు పెట్టిన తీరు, అనుసరించాల్సిన విధివిధానాలపై కాంగ్రెస్ నేత కోదండరెడ్డి నివేదికను సమర్పించారు. పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వానికి ఉన్న వేగం మీకెందుకు లేకుండా పోయిందని ప్రశ్నించారు. భూముల సర్వే, టైటిల్ గ్యారంటీ, అసైన్డ్ భూముల చట్టం, కౌలు రైతుల చట్టం అమలు లాంటి విషయాల్లో జగన్ వేగంగా దూసుకుపోతుంటే మీరేం చేశారని ప్రశ్నించారు. కమిటీ ఏర్పాటు చేయండి: భూమి సునీల్ రాష్ట్రంలోని భూసమస్యలపై సమగ్రంగా ఆలోచించాల్సిన సమయం వచ్చిందని, ఈ సమస్యలపై అధ్యయనం చేయడానికి ఓ కమిటీని ఏర్పాటు చేయాలని భూమి సునీల్ కోరారు. భూ సంబంధిత అంశాలపై ఆయన ప్రెజెంటేషన్ ఇచ్చారు. సాదా బైనామాల చట్ట సవరణ చేయాలని, రెవెన్యూ సదస్సులు పెట్టి సుమోటోగా రైతుల సమస్యలు పరిష్కరించాలని సూచించారు. పెండింగ్లో 2.30 లక్షల దరఖాస్తులు సమీక్షలో భాగంగా రెవెన్యూ శాఖ, సీసీఎల్ఏ అధికారులు ధరణిపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఈ పోర్టల్ ద్వారా భూ సంబంధిత సమస్యల పరిష్కారం కోసం రూపొందించిన మాడ్యూల్స్లో ఎన్ని దరఖాస్తులు వస్తే ఎన్ని పరిష్కారమయ్యాయో వివరించారు. టెక్నికల్ మాడ్యూల్ 1 నుంచి టీఎం 33 వరకు మొత్తం 2.30 లక్షల దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయని, 1.80 లక్షల ఎకరాలకు పాస్ పుస్తకాలు ఇవ్వాల్సి ఉందని తెలిపారు. సమీక్షలో కాంగ్రెస్ నేతలు అన్వేష్ రెడ్డి, హర్కర వేణుగోపాల్, మన్నె నర్సింహారెడ్డి, మల్రెడ్డి రాంరెడ్డి, ఎన్నం శ్రీనివాస్రెడ్డి, వేం నరేందర్రెడ్డి, రాజ్ ఠాకూర్లతో పాటు ట్రెసా ప్రతినిధులు వంగ రవీందర్రెడ్డి, కె.గౌతమ్కుమార్, డిప్యూటీ కలెక్టర్ల సంఘం తరఫున వి.లచ్చిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
కోడ్ మూడ్లోనే రెవెన్యూ!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రెవెన్యూ కార్యకలాపాలు స్తంభించిపోయాయి. ధరణి పోర్టల్ ద్వారా వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు మినహా ఆ శాఖ పరిధిలో ఎలాంటి లావాదేవీలు జరగడం లేదని, ఎన్నికల కోడ్ కారణంగా గత రెండున్నర నెలలుగా ఇదే పరిస్థితి నెలకొందని తెలుస్తోంది. రాష్ట్రంలో ప్రభుత్వం మారిందన్న సాకుతో ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న ధరణి సమస్యలను పరిష్కరించేందుకు కూడా రెవెన్యూ వర్గాలు ముందుకు రాకపోవడం గమనార్హం. ధరణి పోర్టల్తో పాటు జీవో 59 కింద పెండింగ్లో ఉన్న దరఖాస్తులపై నిర్ణయాలు తీసుకోవాల్సిన కలెక్టర్లు ఆ ఫైళ్లన్నింటినీ పక్కన పెట్టేయడం, తాజాగా ఎన్నికల కోడ్ ముగిసిన తర్వా త కూడా వాటిని పరిశీలించకపోవడంతో ఏం చేయాలో పాలుపోని స్థితి నెలకొందని రెవెన్యూ వర్గాలే అంటున్నాయి. దీనికి తోడు భూ పరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్ఏ) కార్యాలయం కూడా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి సుప్త చేతనావస్థలోకి వెళ్లిపోయిందని, కనీసం క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో కూడా ఆరా తీసే పరిస్థితి లేకుండా పోయిందని రెవెన్యూ సిబ్బంది వాపోతున్నారు. కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు ఈ ఏడాది సెపె్టంబర్ నుంచే రాష్ట్రంలో ఎన్నికల సందడి ప్రారంభమయింది. అక్టోబర్లో ఎన్నికల షెడ్యూల్రాగా, నవంబర్లో నోటిఫికేషన్ వెలువడింది. అయితే షెడ్యూల్ వెలువడిన నాటి నుంచే కోడ్ అమల్లోకి రావడంతో అప్పటి నుంచి రెవెన్యూ లావాదేవీలు పూర్తిగా నిలిచిపోయాయి. ఎన్నికల నిర్వహణలో రెవెన్యూ సిబ్బందిదే కీలక పాత్ర కావడం, తహసీల్దార్లు అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులుగా, ఆర్డీవోలు రిటర్నింగ్ అధికారులుగా వ్యవహరించాల్సి ఉండటంతో వారు రెవెన్యూ పనులన్నింటినీ పక్కన పెట్టి ఎన్నికల విధుల్లో నిమగ్నమయ్యారు. ఇక కలెక్టర్లు జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారులుగా ఈనెల 4వ తేదీ వరకు (ఎన్నికల కోడ్ ముగిసే వరకు) బిజీబిజీగా ఉన్నారు. దీంతో తహసీల్దార్ నుంచి కలెక్టర్ స్థాయి వరకు రెవెన్యూ వ్యవహారాలు పూర్తి స్థాయిలో నిలిచిపోయాయి. కనీసం విరాసత్, పెండింగ్ డిజిటల్ సంతకాల దరఖాస్తులను కూడా పరిష్కరించలేదు. దీంతో ప్రస్తుతం ధరణి, జీవో 59 (ప్రభుత్వ భూముల క్రమబద్ధికరణ)లకు చెందిన లక్షలాది మంది దరఖాస్తుదారులు రెవెన్యూ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి వస్తోంది. తదుపరి ఆదేశాల వరకు పెండింగ్లోనే? రాష్ట్రంలో అధికారం చేతులు మారిన నేపథ్యంలో రెవెన్యూ శాఖకు సంబంధించి ఆసక్తికర ప్రచారం జరుగుతోంది. తదుపరి ఆదేశాలు వచ్చేంతవరకు రెవెన్యూ కార్యకలాపాలు ముట్టుకో వద్దని, అన్ని ఫైళ్లు పెండింగ్లో పెట్టాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాయని, ఈ మేరకు కలెక్టర్లతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్లో చెప్పా రని అంటున్నారు. మరోవైపు రెవెన్యూ కార్యకలాపాలపై ఎలాంటి నిర్ణయాలూ తీసుకోవద్దని సీసీఎల్ఏ కార్యాలయానికి స్పష్టమైన ఆదేశాలు జారీ అయ్యాయని కూడా సమాచారం. అయితే ఇవి కేవలం మౌఖిక ఆదేశాలు మాత్రమేనని స్పష్టం చేస్తున్నారు. ఈ ఆదేశాల నేపథ్యంలోనే రెవెన్యూ వ్యవహారాలు స్తబ్దుగా మారాయని ఆ శాఖ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ‘రెవెన్యూ వ్యవహారాలపై ప్రభుత్వం ఆదేశాలివ్వడం కొత్తేమీ కాదు. కానీ అధికారంలో ఉన్న పార్టీ మారడంతో రెవెన్యూ సిబ్బందిలో కొంత కంగాళీ ఉన్న మాట మాత్రం వాస్తవం. ఏం చేస్తే ఏం జరుగుతుందోననే ఆందోళనతో ప్రభుత్వ ప్రకటన కోసం ఎదురుచూస్తున్నారు..’ఈ శాఖ ముఖ్య అధికారి ఒకరు చెప్పారు. అయితే ‘ఎప్పటివో పాత దరఖాస్తులు పరిష్కరించేందుకు అడ్డు వచ్చిందెవరు? జీవో 59 కింద దరఖాస్తులు స్వీకరించి ఆరు నెలలు దాటిపోయింది. వాటి పరిష్కారం వద్దని ప్రభుత్వం ఎందుకు అంటుంది?’అని ప్రశ్నించారు. పైగా వీటి పరిష్కారం ద్వారా ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది కదా? ’అని అన్నారు. -
ఐడీ లేక.. వేతనం రాక..
సాక్షి, కామారెడ్డి: గ్రామ రెవెన్యూ అసిస్టెంట్ (వీఆర్ఏ) వ్యవస్థను రద్దు చేసిన గత ప్రభుత్వం వారిని వివిధ శాఖల్లో సర్దుబాటు చేసి నాలుగు నెలలు గడుస్తున్నా ఎంప్లాయ్ ఐడీ ఇవ్వకపోవడంతో వేతనాలు అందడం లేదు. జీతాల కోసం రాష్ట్రంలో 14,954 మంది వీఆర్ఏలు ఎదురు చూస్తున్న దుస్థితి నెల కొంది. రెవెన్యూ శాఖను ప్రక్షాళన చేయాలని భా వించిన గత సర్కారు.. మొదట వీఆర్వో వ్యవస్థను రద్దు చేసి, ఉద్యోగులను వివిధ శాఖల్లో సర్దుబాటు చేసింది. తర్వాత వీఆర్ఏలను కూడా వారి విద్యార్హతలను బట్టి వివిధ శాఖల్లో జూనియర్ అసిస్టెంట్లుగా, రికార్డు అసిస్టెంట్లుగా, ఆఫీసు సబార్డినేట్లు గా సర్దుబాటు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 23 వేల మంది గ్రామ సేవకులు (వీఆర్ఏ) ఉండగా వారిలో తొలి విడతలో 14,954 మందిని వివిధ శాఖల్లో స ర్దుబాటు చేశారు. రెవెన్యూ శాఖలో జూనియర్ అసిస్టెంట్లుగా 2,451 మంది, మున్సిపాలిటీల్లో జూనియర్ అసిస్టెంట్లు, వార్డ్ ఆఫీసర్లుగా 1,266 మంది, రెవెన్యూ శాఖలో రికార్డు అసిస్టెంట్లుగా 2,113 మంది, ఆఫీసు సబార్డినేట్లుగా 680 మంది, నీటి పా రుదల శాఖలో 5వేల మంది, మిషన్ భగీరథలో 3, 372 మందిని సర్దుబాటు చేశారు. మరికొన్ని శాఖ ల్లో మరో 72 మందిని సర్దుబాటు చేసినట్టు తెలుస్తోంది. ఇక వృద్ధాప్యంతో ఉన్న వారు, వారసులు లేకపోవడం వంటి కారణాలతో కొందరి ఉద్యోగా లు సర్దుబాటు కాలేదు. ఈ ఏడాది ఆగస్టు 10న వీఆర్ఏలను వివిధ శాఖల్లో సర్దుబాటు చేస్తూ పోస్టింగ్లు కూడా ఇచ్చారు. ఎక్కడ పోస్టింగ్ ఇచ్చారో అక్కడే జాయిన్ కావాలని ఉన్నతాధికారులు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడంతో దూరమైనా సరే వెళ్లి ఉద్యోగాల్లో జాయిన్ అయి పని చేస్తున్నారు. ఇంకా ఎంప్లాయ్ ఐడీ జనరేట్ కాలేదు ఎంప్లాయ్ ఐడీ నమోదైన తర్వాతనే వారిని ప్రభు త్వ ఉద్యోగుల కింద లెక్కగట్టి వేతనాల ప్రక్రియను మెదలుపెడతారు. వీఆర్ఏలను ఆయా ఉద్యోగాల్లో సర్దుబాటు ప్రక్రియను చేపట్టిన గత ప్రభుత్వం వారికి ఐడీ ఇంకా ఇవ్వలేదు. ఇంతలో ఎన్నికల ప్రక్రియ మొదలుకావడంతో ఆ విషయం పక్కకు వెళ్లింది. ఫలితంగా నాలుగు నెలలుగా వేతనాలు అందక వీఆర్ఏలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బదీలీలతో ఊరు కాని ఊరు వెళ్లిన తాము అప్పులు చేసి జీవనం సాగించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొత్త ప్రభుత్వం పరిష్కరించాలి వీఆర్ఏలుగా పనిచేస్తున్న మమ్మల్ని వివిధ శాఖల్లో రెగ్యులర్ ఉద్యోగాల్లో సర్దుబాటు చేయడంతో ఎంతో సంతోషించాం. అయితే మాకు వేతనాలు రాకపోవడంతో ఇబ్బందులు పడుతున్నాం. కొత్తగా కొలువుదీరిన ప్రభుత్వం మా సమస్యను వెంటనే పరిష్కరించాలి. – ముదాం చిరంజీవి, వీఆర్ఏల సంఘం ప్రతినిధి, కామారెడ్డి -
AP: ఇటు ప్రకటన.. అటు సాయం..
సాక్షి, అమరావతి: తుపాను బాధితులకు నిత్యావసరాల సరుకులతోపాటు ఆర్థికంగా ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణకు ఉపక్రమించింది. ప్రతి బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం అందిస్తామన్న ముఖ్యమంత్రి జగన్ ప్రకటనకు అనుగుణంగా రెవెన్యూ శాఖ శుక్రవారం సాయంత్రం జీవో ఆర్టీ నెంబర్ 67 జారీ చేసింది. ఇప్పటివరకు పునరావాస కేంద్రాల్లో ఆశ్రయం పొందిన బాధితులు ఇళ్లకు తిరిగి వెళ్లేటప్పుడు కుటుంబానికి రూ.2,500 చొప్పున అందిస్తూ వస్తున్నారు. తాజాగా పునరావాస కేంద్రాలకు రాని బాధిత కుటుంబాలకు సైతం ఈ ఆర్థిక సాయాన్ని ఇవ్వాలని సీఎం ఆదేశించారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో నిత్యావసర సరుకుల పంపిణీ మాదిరిగానే ఈ ఆర్థిక సాయం అందించాలని కలెక్టర్లకు సూచించారు. తిరుపతి, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్, పశ్చిమ గోదావరి, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, కాకినాడ, తూర్పు గోదావరి జిల్లాల్లోని తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ఈ పంపిణీ చేపట్టాలని స్పష్టం చేశారు. ఇప్పటికే 10 వేల కుటుంబాలకు ఆర్థిక సాయాన్ని పంపిణీ చేయగా మిగిలిన కుటుంబాలకు కూడా అందించాలని కలెక్టర్లను ఆదేశించారు. 2,068 గ్రామాలపై ప్రభావం మిచాంగ్ తుపాను 15 జిల్లాల పరిధిలో 240 మండలాల్లోని 2,068 గ్రామాలపై ప్రభావం చూపినట్లు తేలింది. ఆయా గ్రామాల్లో బాధితుల కోసం 494 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి 31,628 మందికి ఆశ్రయం కల్పించారు. 1,32,569 ఆహార పొట్లాలు పంపిణీ చేశారు. 3.71 లక్షల మంచినీళ్ల ప్యాకెట్లను సరఫరా చేశారు. తక్షణ వైద్యం కోసం 355 శిబిరాలను ఏర్పాటు చేసి చికిత్స అందించారు. మరోవైపు నిత్యావసరాల పంపిణీ ముమ్మరంగా సాగుతోంది. దెబ్బతిన్న ప్రతి కుటుంబానికి 25 కేజీల బియ్యం, కేజీ చొప్పున కందిపప్పు, బంగాళాదుంపలు, ఉల్లిపాయలు, లీటర్ వంట నూనె అందించారు. ఇప్పటివరకు 1,02,844 కుటుంబాలకు నిత్యావసరాలు అందించారు. పశ్చిమ గోదావరి జిల్లాలో తుపాను ప్రభావిత 16 మండలాల్లో రెండో రోజు వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో 22 వైద్య శిబిరాలు నిర్వహించి 1,500 మందికి వైద్యసేవలు అందించారు. జ్వర పీడితులను గుర్తించేందుకు ఆరోగ్య సిబ్బంది, వలంటీర్లు ఇంటింటికీ వెళ్లి సర్వే నిర్వహిస్తున్నారు. పొలాల్లో ముంపు నీటిని తొలగించేందుకు 1,080 మంది ఉపాధి కూలీలను వ్యవసాయ సహాయక చర్యలకు వినియోగించారు. వరద నీటితో యనమదుర్రు డ్రెయిన్ ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో పరీవాహక ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టాలని కలెక్టర్ పి.ప్రశాంతి అధికారులను ఆదేశించారు. తడిచిన ధాన్యం కొనుగోలు తడిచిన ధాన్యం కొనుగోలుపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో శుక్రవారం 6,252 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. దీనిలో చాలా వరకు తేమ ఉన్న ధాన్యం కావడం గమనార్హం. కలెక్టర్ హిమాన్షు శుక్లా, జేసీ నపూర్ అజయ్, సివిల్ సప్లయిస్ జిల్లా అధికారి సుధాసాగర్లు ధాన్యం కొనుగోలును పర్యవేక్షిస్తున్నారు. మేజర్ డ్రెయిన్లలో పూడిక తొలగింపు పనులను వేగవంతం చేశారు. -
కొత్తగా 40 డిప్యూటీ కలెక్టర్ పోస్టులు
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఎప్పటికప్పుడు కొత్త పోస్టుల మంజూరుతో వీఆర్ఏల నుంచి తహశీల్దార్ల వరకు పదోన్నతులు దక్కుతున్నాయి. తాజాగా రెవెన్యూ శాఖలో కొత్తగా 40 డిప్యూటీ కలెక్టర్ పోస్టులు మంజూరయ్యాయి. ఈ మేరకు ఇటీవల ప్రభుత్వం జీవో ఎంఎస్ నంబర్ 973 జారీ చేసింది. దీంతో అతి త్వరలో రాష్ట్రంలో 44 మంది తహశీల్దార్లకు డిప్యూటీ కలెక్టర్లుగా పదోన్నతి లభించనుంది. ఆరు నెలల క్రితం కూడా 63 డిప్యూటీ కలెక్టర్ పోస్టులను ప్రభుత్వం మంజూరు చేసిన సంగతి తెలిసిందే. దీంతో అప్పుడు 63 మంది తహశీల్దార్లు పదోన్నతి పొందారు. వీరంతా ఆయా శాఖల్లో పనిచేస్తున్నారు. అంటే.. 6 నెలల కాలంలోనే ప్రభుత్వం 107 డిప్యూటీ కలెక్టర్ పోస్టుల్ని మంజూరు చేసింది. పోస్టులను మంజూరు చేయడంతోపాటు పదోన్నతుల అంశంలో ఇదొక రికార్డుని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వ శాఖల్లో డిప్యూటీ కలెక్టర్ల స్థాయి అధికారుల అవసరం ఎక్కువ ఉన్నా గత ప్రభుత్వం పట్టించుకోలేదు. తమ శాఖల్లో డిప్యూటీ కలెక్టర్ల అవసరం ఉందని, వారిని తమకు డిప్యుటేషన్పై పంపించాలని వివిధ శాఖలు గత ప్రభుత్వాన్ని కోరాయి. అదే సమయంలో చాలామంది అధికారులు పదవీ విరమణ చేయడంతో డిప్యూటీ కలెక్టర్ల కొరత ఇంకా ఎక్కువైంది. దీంతో రెవెన్యూ శాఖ గత ప్రభుత్వాన్ని పదే పదే కోరడంతో నామమాత్రంగా కొన్ని పోస్టులు మంజూరు చేసి చేతులు దులుపుకుంది. దీంతో ఆయా శాఖల్లో అవసరాల మేరకు అధికారులు లేక ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఇప్పటివరకు మూడు విడతల్లో మంజూరు.. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే వివిధ ప్రభుత్వ శాఖల వినతులను పరిగణనలోకి తీసుకుని ఇప్పటివరకు మూడు విడతల్లో కొత్తగా డిప్యూటీ కలెక్టర్ పోస్టుల్ని మంజూరు చేసింది. అధికారంలోకి వచ్చిన కొద్దికాలానికే మొదట 20, ఈ ఏడాది రెండు విడతలుగా 107 పోస్టుల్ని మంజూరు చేసింది. తాజాగా మంజూరైన 40 డిప్యూటీ కలెక్టర్ పోస్టులకు సంబంధించి సీనియారిటీ జాబితా కూడా సిద్ధమైంది. త్వరలో దాన్ని విడుదల చేయనున్నారు. ఈసారి 44 మంది (మంజూరైన పోస్టులకి 10 శాతం అదనంగా నియమిస్తారు) తహశీల్దార్లు డిప్యూటీ కలెక్టర్లుగా పదోన్నతి పొందనున్నారు. ఉద్యోగుల సర్వీస్ అంశాల విషయంలో గతంలో ఏ ప్రభుత్వం చేయనంత మేలును ఈ ప్రభుత్వం చేసిందని ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు కొనియాడారు. వేలాది పోస్టుల మంజూరుతోపాటు పదోన్నతులు.. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో విడతల వారీగా 370 తహశీల్దార్ పోస్టులు కొత్తగా మంజూరయ్యాయి. దీంతో అంతే సంఖ్యలో డిప్యూటీ తహశీల్దార్లకు తహశీల్దార్లుగా పదోన్నతులు లభించాయి. అలాగే వెయ్యి మందికిపైగా సీనియర్ అసిసెంట్లు.. డిప్యూటీ తహశీల్దార్లు అయ్యారు. అదేవిధంగా 670 మంది కంప్యూటర్ అసిస్టెంట్లను రెవెన్యూ శాఖలో కొత్తగా నియమించారు. సీనియర్ అసిస్టెంట్ల కోసం నిర్వహించిన పదోన్నతుల్లో వీఆర్వోలకు 40 శాతం కేటాయించడంతో వేలాది మంది వీఆర్వోలకు లబ్ధి చేకూరింది. అలాగే ప్రభుత్వం ఇచ్చిన అవకాశంతో 3,600 మంది వీఆర్ఏలు వీఆర్వోలు అయ్యారు. సర్వే సెటిల్మెంట్, భూరికార్డుల శాఖలోనూ 30 ఏళ్ల తర్వాత అవకాశం కల్పించడంతో వందలాది మందికి లబ్ధి కలిగింది. కొత్త పోస్టుల మంజూరు, పదోన్నతుల విషయంలో గతంలో ఎప్పుడూ లేనివిధంగా రెవెన్యూ శాఖను ప్రభుత్వం బలోపేతం చేసింది. -
కుల ధ్రువీకరణ పత్రం ఇక శాశ్వతం
సాక్షి, అమరావతి: ప్రజలు కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు తీసుకునే విషయంలో ప్రభుత్వం వారికి మరింత వెసులుబాటు కల్పించింది. ఒకసారి కుల ధ్రువీకరణ పత్రాన్ని జారీ చేస్తే దాన్ని శాశ్వతంగా పరిగణించాలని అన్ని ప్రభుత్వ శాఖలకు స్పష్టం చేసింది. అలాగే ఆదాయ ధ్రువీకరణ పత్రాల కోసం ప్రభుత్వ శాఖలు, విద్యా సంస్థలు.. విద్యార్థులు, లబ్ధిదారులను ఒత్తిడి చేయొద్దని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ఆదాయ ధ్రువీకరణకు గ్రామ సచివాలయాల్లోనే ఆరు దశల తనిఖీ సరిపోతుందని స్పష్టం చేసింది. ఈ మేరకు ఈ సర్టిఫికెట్ల కోసం ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా కొత్త నిబంధనలు అమల్లోకి తెచ్చింది. డిజీ లాకర్లలో సర్టిఫికెట్లు కులం, స్థానికత, పుట్టిన తేదీ సర్టిఫికెట్ల నిబంధనలకు సంబంధించి జీవో ఎంఎస్ నంబర్ 469, ఆదాయ ధ్రువీకరణ పత్రాలకు సంబంధించి జీవో ఎంఎస్ నంబర్ 484ను తాజాగా విడుదల చేసింది. ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడకుండా కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాల జారీకి పలు మార్గదర్శకాలు ఇచ్చింది. వాటికి సంబంధించి అన్ని శాఖలకు త్వరలో శిక్షణ కూడా ఇవ్వనున్నారు. ఏటా కుల, ఆదాయ ధ్రువీకరణకు సంబంధించి 1.20 కోట్ల సర్టిఫికెట్లను రెవెన్యూ శాఖ జారీ చేస్తోంది. కొత్త నిబంధనలతో 95 శాతం సర్టిఫికెట్ల జారీ తగ్గిపోనుంది. ప్రభుత్వ శాఖలు మళ్లీ మళ్లీ అడగకూడదు.. సంక్షేమ పథకాల కోసం వచ్చే లబ్ధిదారులను ఆయా ప్రభుత్వ శాఖలు తాజా కుల ధ్రువీకరణ పత్రాలు అడుగుతున్నాయి. దీనివల్ల ప్రజలు వాటికోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సివస్తోంది. గతేడాది 52 లక్షల కుల ధ్రువీకరణ పత్రాలు జారీ చేశారు. అలాగే ఇటీవల ప్రభుత్వం నిర్వహించిన జగనన్న సురక్ష కార్యక్రమంలో 42 లక్షలకుపైగా పత్రాలు అందజేశారు. వాటికి సంబంధించిన డేటా బేస్ మొత్తం మీసేవ, ఏపీ సేవ కేంద్రాల్లో ఉంది. వాటిద్వారా ఈ సర్టిఫికెట్లను ఎలాంటి విచారణ లేకుండా మళ్లీ జారీ చేసేలా కొత్త నిబంధనలు రూపొందించారు. వీటి ప్రకారం.. ఒకసారి జారీ చేసిన కుల ధ్రువీకరణ పత్రం ఎప్పుడైనా చెల్లుబాటవుతుంది. లబ్ధిదారుడు గతంలో జారీ చేసిన సర్టిఫికెట్ సమర్పించినప్పుడు ప్రభుత్వ శాఖలు మళ్లీ తాజా సర్టిఫికెట్ను అడగకూడదు. అలాగే మీసేవ ద్వారా గతంలో కుల ధ్రువీకరణ పత్రం పొందిన వారికి ఎ–కేటగిరీ సేవగా తక్షణమే తాజా ధ్రువీకరణ పత్రాన్ని ఇవ్వాలి. వారి కుల నిర్ధారణ కోసం తహశీల్దార్, ఇతర అధికారులు దానిపై మళ్లీ విచారణ చేయాల్సిన అవసరం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఒకవేళ లబ్ధిదారుడి తండ్రి, సోదరులు ఎవరైనా గతంలో కుల ధ్రువీకరణ పత్రం పొంది ఉంటే వారి బంధుత్వాన్ని పౌరసరఫరాల శాఖ డేటాబేస్ ద్వారా నిర్ధారించుకుని ఈకేవైసీ పూర్తయితే విచారణ లేకుండా వెంటనే సర్టిఫికెట్ జారీ చేయాలి. ఈకేవైసీ పెండింగ్లో ఉంటే గ్రామ, వార్డు సచివాలయాల్లో దాన్ని పూర్తి చేసి సర్టిఫికెట్ అందించాలి. ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, ప్రభుత్వ ఉద్యోగాలు, పథకాల కోసం ప్రస్తుత విధానంలోనే సర్టిఫికెట్లు జారీ చేయాలని ప్రభుత్వం పేర్కొంది. ఆదాయ ధ్రువీకరణకు ఆరు దశల నిర్ధారణే దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నవారి (బీపీఎల్) గురించి తెలుసుకోవడానికి, విద్యా సంస్థల్లో స్కాలర్షిప్లు, ప్రభుత్వ పథకాలు, ఫీజు మినహాయింపులు పొందేందుకు ఆదాయ ధ్రువీకరణ పత్రం తప్పనిసరిగా మారింది. గత రెండేళ్లలో 75 లక్షల ఆదాయ ధ్రువీకరణ పత్రాలు జారీ చేశారు. వీటికోసం రెవెన్యూ అధికారులు ప్రతిసారి విచారణ చేయకుండా గ్రామ, వార్డు సచివాలయాల్లో నిర్వహించే 6 దశల నిర్ధారణ ప్రక్రియనే ఉపయోగించుకోవాలని ప్రభుత్వం ఆయా శాఖలకు తాజాగా స్పష్టం చేసింది. సంక్షేమ, విద్యా, ఇతర శాఖలు తమ పథకాల అమలుకు సంబంధించి ఇకపై ఆదాయ ధ్రువీకరణ పత్రాలు అవసరం లేదు. 6 దశల నిర్ధారణ ప్రక్రియనే ఇందుకు వినియోగించుకోవాలి. ఒకవేళ అందులో దరఖాస్తుదారులు ఎంపిక కాకపోతే ఆ శాఖలు సమాచారాన్ని గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా రెవెన్యూ శాఖకు పంపాలి. పది, ఇంటర్ విద్యార్థుల డేటాబేస్ను విద్యా శాఖలు గ్రామ, వార్డు సచివాలయాలకు పంపితే అక్కడ 6 దశల నిర్ధారణ ప్రక్రియతో వారి ఆదాయ స్థాయిని నిర్ధారిస్తారు. ఒకవేళ అక్కడ విద్యార్థులు అర్హత సాధించకపోతే ఆ వివరాలను ఆయా శాఖలు గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా రెవెన్యూ శాఖకు పంపాలి. రెవెన్యూ శాఖ విచారణ చేసి వారికి సర్టిఫికెట్లు జారీ చేస్తుంది. స్కాలర్షిప్లు, పోస్ట్మెట్రిక్ స్కాలర్షిప్లకు ఆరు దశల నిర్ధారణ ప్రక్రియ సరిపోతుంది. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్లు, ఇతర కేంద్ర ప్రభుత్వ అవసరాల కోసం జారీ చేసే సర్టిఫికెట్లకు కూడా ప్రస్తుత విధానాన్నే కొనసాగించాలి. -
సర్వీస్ ఈనాం భూములపై మరింత స్పష్టత
సాక్షి, అమరావతి: సర్వీస్ ఈనాం భూములపై హక్కులు కల్పించే క్రమంలో అనుసరించాల్సిన విధానాలపై జిల్లా కలెక్టర్లకు ప్రభుత్వం మరింత స్పష్టత ఇచ్చింది. నిషేధిత జాబితా 22 (ఎ)లో ఉన్న వివిధ కేటగిరీ భూములపై ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో వివరణ ఇస్తూ రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్ తాజాగా మెమో జారీ చేశారు. 2013లో ఈనాం చట్టానికి చేసిన సవరణలో దేవాలయాల ఈనాం భూములతోపాటు సర్వీస్ ఈనాం భూములు కూడా నిషేధిత జాబితాలో చేరిపోయాయి. వాటిని ఇప్పుడు ఆ జాబితా నుంచి తొలగించి లక్షలాది మంది సర్వీస్ ఈనాం రైతులకు వైఎస్ జగన్ ప్రభుత్వం మేలు చేయాలని నిర్ణయించింది. ఈ క్రమంలో జిల్లాల్లో జరుగుతున్న వెరిఫికేషన్లో అధికారులు పలు అంశాలు లేవనెత్తారు. ఈ భూములు 1908 రిజిస్ట్రేషన్ల చట్టంలోని సెక్షన్ 22(ఎ)లోని 1(ఎ) అసైన్డ్ భూములు, 1(బి)– ప్రభుత్వ పోరంబోకు భూములు, 1(సి)–దేవదాయ, వక్ఫ్ భూములు.. 1(డి)–మిగులు భూములు, సీలింగ్ భూములు, 1(ఈ)– కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఆసక్తి ఉన్న భూములు, చుక్కల భూములు, అనాధీన భూముల కేటగిరీల్లో ఉన్నాయి. వివిధ కేటగిరీల్లో ఉన్న సర్వీస్ ఈనాం భూముల విషయంలో ఏం చేయాలని పలువురు కలెక్టర్లు, భూ పరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్ఎ)ను స్పష్టత కోరగా.. వీటిన్నింటిపైనా సీసీఎల్ఏ ఈ మెమోలో వివరణ ఇచ్చారు. వెరిఫికేషన్లో తొలగించడానికి ఎంపికైన నిషేధిత జాబితాలోని 22(ఎ)1(ఎ), (బి), (డి) కేటగిరీ భూముల వివరాలను కలెక్టర్లు నేరుగా జిల్లా రిజిస్ట్రార్లకు పంపి తొలగింపు ప్రక్రియ చేపట్టాలని సూచించారు. 22(ఎ)1 (ఈ) కేటగిరీ భూముల వివరాలను ప్రభుత్వానికి పంపాలని, సీసీఎల్ఏ ద్వారా ప్రభుత్వం వీటిపై నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. 22 (ఎ)1(సి) కేటగిరీలోని భూముల దేవదాయ శాఖ కమిషనర్ లేదా వక్ఫ్ బోర్డు సీఈఓకు తగిన నిర్ణయం తీసుకునేందుకు పంపాలని స్పష్టం చేశారు. 22ఎ జాబితాలో చేర్చని ఈ తరహా భూముల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం లేదని, వాటిని అలాగే ఉంచాలని సూచించారు. -
రెవె'న్యూ' విధానాలతో భూ హక్కు
సాహసోపేత నిర్ణయాలతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రెవిన్యూ సంస్కరణలు, కొత్త కార్యక్రమాలతో ఇటు ప్రజలు, అటు ప్రభుత్వ ఆదాయం గణనీయంగా పెరుగుతోంది. ప్రధానంగా భూముల విలువ అనూహ్యంగా పెరిగిపోవడంతో పేద రైతుల తల రాత మారిపోతోంది. ఎందుకూ పనికి రావనుకున్న భూములకు సైతం మంచి ధరలు కళ్లెదుటే కనిపిస్తుండటంతో అసైన్డ్ రైతుల పంట పండింది. ‘కొనుగోళ్లు – అమ్మకాలు – రిజిస్ట్రేషన్లు’ చక్రం ద్వారా లక్షల కోట్ల రూపాయల లావాదేవీలు ఇకపై మరింతగా ఊపందుకోనున్నాయి. తద్వారా రాష్ట్రంలో సంపద సృష్టి ఏమేరకు జరిగిందన్నది ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. వీటన్నింటికీ తోడు ఇన్నాళ్లూ అనుభవంలో ఉన్నప్పటికీ రికార్డు పరంగా హక్కు లేని భూమికి ఇప్పుడు ‘ఇది నా భూమి’ అని సంతృప్తిగా చెప్పుకునే పరిస్థితిని రైతులకు కలిగించింది. సాక్షి, అమరావతి : వివాదాలు, సమస్యలు, ఎడతెగని జాప్యంతో కునారిల్లిన రెవెన్యూ శాఖను వైఎస్ జగన్ ప్రభుత్వం నాలుగేళ్లలో సమూలంగా మార్చేసింది. ఆ వ్యవస్థలో వేళ్లూనుకుపోయిన ప్రతి సమస్యను పరిష్కరించేందుకు మార్గం చూపింది. సర్టిఫికెట్లు పొందడాన్ని సులభతరం చేయడం దగ్గర నుంచి కుప్పలు తెప్పలుగా పేరుకుపోయిన నిషేధిత భూముల చిక్కు ముడులు విప్పడం, సాహసోపేతమైన రీతిలో అసైన్డ్ భూములపై యాజమాన్య హక్కులు కల్పించడం ద్వారా లక్షలాది రైతుల కుటుంబాల్లో వెలుగులు నింపింది. భూ వివాదాలను శాశ్వతంగా పరిష్కరించే లక్ష్యంతో స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయని విధంగా తొలిసారి భూముల రీ సర్వేను చేపట్టి విజయవంతంగా నిర్వహిస్తోంది. రాష్ట్ర విభజన తర్వాత పరిపాలనా సౌలభ్యం కోసం అన్ని ప్రాంతాల అభిప్రాయాలు, సంప్రదాయాలను గౌరవిస్తూ పార్లమెంటు నియోజకవర్గాల వారీగా జిల్లాలు ఏర్పాటు చేసి రాష్ట్రానికి ఒక కొత్త స్వరూపాన్ని ఇచ్చింది. మొత్తంగా నాలుగేళ్లలో రెవెన్యూ శాఖలో చోటుచేసుకున్న మార్పులు ఇలా ఉన్నాయి. మహా యజ్ఞంలా భూముల రీ సర్వే ► అస్తవ్యస్థంగా మారిన భూముల వ్యవస్థను గాడిలో పెట్టేందుకు చరిత్రలో ఏ ప్రభుత్వం చేయని విధంగా సాహసోపేతంగా భూముల రీ సర్వే చేపట్టిన వైఎస్ జగన్ ప్రభుత్వం సత్ఫలితాలు సాధిస్తోంది. బ్రిటీష్ కాలం నాటి భూముల రికార్డుల స్థానంలో ఆధునిక డిజిటల్ భూ రికార్డులను అందుబాటులోకి తీసుకువస్తోంది. దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలోనూ ఇప్పటి వరకు జరగని విధంగా మొత్తం భూ విస్తీర్ణాన్ని కొలిచే బృహత్తర కార్యక్రమం ఇది. ఇందుకోసం ఏకంగా 14,630 మంది సర్వేయర్లను నియమించడం ఒక రికార్డు. ► రికార్డుల ట్యాంపరింగ్కు అవకాశం లేకుండా భూ యజమానులకు స్పష్టమైన హక్కు కల్పించడం, అక్షాంశాలు, రేఖాంశాల ద్వారా భూముల హద్దులను గుర్తించి.. ఆ భూమికి రక్షణ కల్పించడమే ధ్యేయంగా రీ సర్వే అత్యంత ఆధునిక రీతిలో సాగుతోంది. అత్యంత సంక్లిష్టమైన ఈ సర్వే తొలి దశలో 2 వేల గ్రామాల్లో అన్ని దశల్లోనూ పూర్తి కాగా, మరో 2 వేల గ్రామాల్లో త్వరలో పూర్తవనుంది. ప్రతి మూడు నెలలకు 2 వేల గ్రామాల చొప్పున సర్వే పూర్తికానుంది. ► సర్వే పూర్తయిన గ్రామాల్లో ఇప్పటి వరకు 4.80 లక్షల మ్యుటేషన్లు జరిగాయి. 16.55 లక్షల మంది రైతులకు భూ హక్కు పత్రాలు పంపిణీ చేశారు. 8.70 లక్షల భూ కమతాలకు సంబంధించి ల్యాండ్ పార్సిల్ మ్యాప్లు తయారయ్యాయి. రైతులకు శ్రమ లేకుండా, వారి డబ్బు ఖర్చు కాకుండా రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా ఎంతో క్లిష్టమైన ఈ పనుల్ని పూర్తి చేసింది. ► ఆయా గ్రామాల్లోని గ్రామ సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ సేవలు సైతం అందుబాటులోకి వచ్చాయి. తొలిసారి భూముల హద్దులను నిర్ధారించి, భూ రక్ష సర్వే రాళ్లను రాష్ట్ర ప్రభుత్వ ఖర్చుతో పాతుతున్నారు. గ్రామాలు, మున్సిపాల్టీల్లోని భూములను కూడా తొలిసారి సర్వే చేసి, ఇళ్ల యజమానులకు ఓనర్షిప్ సర్టిఫికెట్లు ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రతి దళితవాడకు శ్మశాన వాటిక రాష్ట్రంలోని దళిత వాడలకు శ్మశాన వాటిక సమస్య లేకుండా చేసేందుకు ఆ దిశగా నడుం బిగించింది. శ్మశాన వాటికలు లేని దళిత వాడలను గుర్తించి, వెంటనే ఏర్పాటు చేస్తోంది. రాష్ట్రంలోని 1,700 గ్రామాల్లో 1050.08 ఎకరాల భూమిని శ్మశాన వాటికలకు కేటాయించింది. సుదీర్ఘకాలం తర్వాత భూ పంపిణీ రాష్ట్రంలో సుదీర్ఘ కాలం తర్వాత నిరుపేదలకు వ్యవసాయ భూములు పంపిణీ చేయడానికి వైఎస్ జగన్ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. 23 జిల్లాల్లో 50 వేల ఎకరాలను అర్హులైన పేదలకు పంచనున్నారు. 46 వేల మందికి భూములివ్వడానికి ఎంపిక చేయగా, అందులో ఎక్కువ మంది దళితులే. వ్యవసాయ కూలీలుగా, ఇతర పనులు చేసుకుంటూ జీవించే వారిని ప్రభుత్వం రైతులుగా మార్చనుంది. రాష్ట్రంలో 2013 తర్వాత మళ్లీ భూ పంపిణీకి వైఎస్సార్సీపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అసైన్డ్ భూములకు యాజమాన్య హక్కులు ► అసైన్డ్ భూములపై యాజమాన్య హక్కులు కల్పించడంతో లక్షలాది మంది దళిత, పేద రైతుల ఆర్థిక స్థితి ఒక్కసారిగా పెరిగిపోయింది. అసైన్ చేసిన 20 ఏళ్ల తర్వాత అసైన్దారులు లేకపోతే వారి వారసులకు పూర్తి యాజమాన్య హక్కులు లభించేలా వైఎస్ జగన్ ప్రభుత్వం అసైన్డ్ భూముల చట్టాన్ని సవరించింది. ► తమ భూములపై తమకు హక్కులు ఇవ్వాలని అసైన్డ్ రైతులు చాలా ఏళ్లుగా కోరుతున్నారు. దీనిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టిన వైఎస్ జగన్ ప్రభుత్వం అసైన్ చేసిన 20 ఏళ్ల తర్వాత హక్కుదారులు వారికి అవసరమైనప్పుడు అమ్ముకునే అవకాశం కల్పించింది. దీనివల్ల తమ భూములపై హక్కులు లేని 15,21,160 మంది పేద దళిత, ఇతర పేద వర్గాల రైతులకు సంబంధించిన 27,41,698 ఎకరాల భూమిపై యాజమాన్య హక్కులు లభిస్తున్నాయి. ‘ఇక ఇది నా భూమి’ అని ఆ రైతులు గర్వంగా చెప్పుకునే పరిస్థితి కల్పించింది. ► ఇన్ని లక్షల ఎకరాల లావాదేవీలు మార్కెట్లోకి రావడంతో ఆర్థిక వృద్ధి కూడా పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. విలువ లేని పేద రైతుల భూమికి విలువ పెంచడంతోపాటు రాష్ట్ర ఆర్థిక వృద్ధికి ఊతమిచ్చే నిర్ణయంగా దీన్ని నిపుణులు అభివర్ణిస్తున్నారు. కొత్త జిల్లాల కల సాకారం ► ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు వైఎస్ జగన్ ప్రభుత్వం పార్లమెంటు నియోజకవర్గాల వారీగా జిల్లాలను పునర్వ్యవస్థీకరించింది. 13 జిల్లాలను 26 జిల్లాలుగా, 51 రెవెన్యూ డివిజన్లను 77 డివిజన్లుగా పునర్వ్యవస్థీకరించింది. జిల్లా కేంద్రాలు, భౌగోళిక, సామాజిక, ఆర్థిక, చారిత్రక, సాంస్కృతిక అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని విభజన పూర్తి చేసింది. ► పార్లమెంటు నియోజకవర్గాన్ని ఒక యూనిట్గా తీసుకుని 25 జిల్లాలు ఏర్పాటు చేయాల్సి ఉన్నప్పటికీ, గిరిజన ప్రాంతం విస్తృతి దృష్ట్యా అరకు పార్లమెంట్ను రెండు జిల్లాలుగా ఏర్పాటు చేసింది. పరిపాలనా వికేంద్రీకరణ, భౌగోళిక అనుకూలతలతోపాటు ప్రజల మనోభావాలకు ప్రాధాన్యత ఇచ్చింది. ► ప్రతి జిల్లాకు అక్కడి పరిస్థితులను బట్టి పేరు పెట్టి, ఆయా ప్రాంతాల ప్రాధాన్యాన్ని మరింత పెంచింది. గత టీడీపీ ప్రభుత్వం ఎన్టీఆర్ను విస్మరిస్తే.. ఆయన జన్మించిన కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టడం ద్వారా వైఎస్ జగన్ ప్రభుత్వం ఆయన గౌరవాన్ని నిలబెట్టింది. 1.68 లక్షల సర్వీసు ఈనాం భూములకు విముక్తి గ్రామాల్లో కుల వృత్తుల వారికి ఇచ్చిన ఈనాం భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించాలని నిర్ణయించారు. 1,68,604 ఎకరాల ఈనాం భూమిని నిషేధిత జాబితా నుంచి తొలగించి యాజమాన్య హక్కులు కల్పిస్తున్నారు. లంక భూములకు డి పట్టాలు అనేక సంవత్సరాలుగా అపరిష్కృత సమస్యగా ఉన్న లంక భూములకు డీకేటీ పట్టాలిస్తున్నారు. 8 జిల్లాల్లో ఉన్న కృష్ణా, గోదావరి లంకల్లోని 9,062 ఎకరాలకు సంబంధించిన 19,176 మంది రైతులకు పట్టాలు దక్కనున్నాయి. మూడు కేటగిరీల్లో లంక భూములను సాగు చేసుకుంటున్న రైతులు తమకు పట్టాలు ఇవ్వాలని కోరుతుండడంతో వివాదాల్లేకుండా సాగు చేసుకుంటున్న అర్హులకు పట్టాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. సి కేటగిరీలోని కొన్ని భూములకు ఐదేళ్ల లీజుకు ఇవ్వనుంది. చుక్కల భూముల సమస్యకు పరిష్కారం ► అత్యంత వివాదాస్పదమై ఏళ్ల తరబడి లక్షలాది మంది రైతుల కుటుంబాల్లో చీకట్లు నింపిన చుక్కల భూముల సమస్యను రాష్ట్ర ప్రభుత్వం సునాయాసంగా పరిష్కరించింది. 15 జిల్లాల్లో 2.06 లక్షల ఎకరాల చుక్కల భూములను నిషేధిత ఆస్తుల జాబితా (22 ఏ (1) ఇ) నుంచి ఒకేసారి తొలగించి చరిత్ర సృష్టించింది. ► చుక్కల భూములుగా ఆర్ఎస్ఆర్లో రికార్డు చేసిన భూములు ప్రభుత్వానికి చెందినవా, ప్రైవేటు పట్టాదారులవా అనే అంశాన్ని గత ప్రభుత్వం ఖరారు చేయకుండా నిషేధిత భూముల జాబితాలో చేర్చింది. ఆ రికార్డులన్నింటినీ పరిశీలించి చుక్కల భూములకు విముక్తి కల్పించింది. ఈ నిర్ణయం వల్ల 1,07,134 మంది రైతులకు వారి భూములపై శాశ్వత హక్కులు లభించాయి. షరతులు గల పట్టా భూములపై తొలగిన ఆంక్షలు ► చుక్కల భూముల తరహాలోనే సమస్యాత్మకంగా తయారైన షరతులు గల పట్టా భూములకు ప్రభుత్వం పరిష్కారం చూపింది. 33 వేల ఎకరాల షరతులు గల పట్టా భూములను నిషేధిత ఆస్తుల జాబితా నుంచి తొలగించి ఆ రైతులకు మేలు చేకూర్చింది. ► బ్రిటీష్ హయాం నుంచి రైతుల చేతుల్లో ఉన్న భూములను తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 22ఏ కేటగిరీలో పెట్టగా, అలా పెట్టడం అన్యాయమని భావించి నిబంధనల ప్రకారమే వాటిని ఆ జాబితా నుంచి ఈ ప్రభుత్వం తీసివేసింది. ► ఇలా ఒక్క కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలోనే 18 వేలకుపైగా ఎకరాలను 22ఏ నుంచి తీసివేశారు. 2022 అక్టోబర్ 20న అవనిగడ్డలో బహిరంగ సభలో సీఎం వైఎస్ జగన్ నిషేధిత భూముల జాబితా నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించి కొందరికి పట్టాలిచ్చారు. అనాదీనం, ఖాళీ కాలమ్ భూముల సమస్యకు చెక్ అనాదీనం, ఖాళీ కాలమ్ భూములను చుక్కల భూముల చట్టం పరిధిలోకి తీసుకువచ్చి, వాటిని నిషేధిత భూముల జాబితా నుంచి తొలగించేందుకు ప్రభుత్వం మార్గం సుగమం చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 50 వేల ఎకరాలకు సంబంధించిన 35 నుంచి 40 వేల మంది రైతులు దీనివల్ల లబ్ధి పొందారు. సాదాబైనామా కేసుల పరిష్కారం గతంలో భూముల లావాదేవీలను తెల్ల కాగితాల మీద రాసుకోవడం, నోటి మాటగా జరిగిన భూముల లావాదేవీల (సాదాబైనామా విధానం) సమస్యకు పరిష్కారం చూపింది. ఒక నిర్ధిష్ట విధానాన్ని రూపొందించడం ద్వారా ఈ సమస్యను పరిష్కరించింది. మ్యుటేషన్లలో పారదర్శకత ► మ్యుటేషన్ల పేరుతో జరిగే అక్రమాలకు ముగింపు పలికేలా ప్రభుత్వం అనేక మార్పులు చేపట్టింది. ఇష్టానుసారం మ్యుటేషన్లు చేయడాన్ని నిలిపివేసి, పట్టాదారుకు నోటీసు ఇచ్చి, విచారణ జరిగిన తర్వాతే రెవెన్యూ రికార్డులో మార్పు జరిగేలా సాఫ్ట్వేర్ను మార్చారు. దీంతో కరెక్షన్ పేరుతో జరిగే మ్యుటేషన్లు నిలిచిపోయాయి. ► మ్యుటేషన్లు తిరస్కరించే అధికారాన్ని తహశీల్దార్లకు తీసివేసి ఆర్డీఓలకు అప్పగించడంతో ఇబ్బందులు తగ్గిపోయాయి. రిజిస్ట్రేషన్కు ముందే సర్వే నంబర్ సబ్ డివిజన్ చేసుకునే విధానాన్ని ప్రవేశ పెట్టడంతో డబుల్ రిజిస్ట్రేషన్లు తగ్గాయి. రీ సర్వే పూర్తయిన గ్రామాల్లో ఆటో మ్యుటేషన్ విధానాన్ని తీసుకువస్తున్నారు. ఇప్పటికే పలుచోట్ల ఈ విధానం అందుబాటులోకి వచ్చింది. సర్టిఫికెట్ల జారీ సులభతరం ► ప్రజలకు అవసరమైన ముఖ్యమైన సర్టిఫికెట్ల జారీ ప్రక్రియను వైఎస్ జగన్ ప్రభుత్వం సులభతరం చేసింది. సర్టిఫికెట్లు జారీ చేయడానికి దరఖాస్తులు తీసుకునే గ్రామ, వార్డు సచివాలయం, మీసేవా కేంద్రాలు, ఆన్లైన్ వెబ్ అప్లికేషన్, కాల్ సెంటర్ వంటి వ్యవస్థలన్నింటికీ స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చి వాటి ప్రకారమే పని చేయిస్తోంది. ► హౌస్ హోల్డ్ డేటా బేస్లో ఉన్న కుటుంబానికి వెంటనే ఫ్యామిలి మెంబర్ సర్టిఫికెట్ ఇవ్వడం, ఇంటిగ్రేటెడ్ సర్టిఫికెట్ గతంలో జారీ అయి ఉంటే ప్రస్తుత తహశీల్దార్ డిజిటల్ సంతకం, ప్రస్తుత తేదీతో మళ్లీ వెంటనే ఇవ్వడం లాంటి అనేక మార్పులు తీసుకువచ్చి అమలు చేస్తోంది. ఆస్తిని సంపదగా మార్చే ప్రక్రియ ముమ్మరం భూములకు సంబంధించి అంతర్జాతీయ సంస్థలు ఏదైతే జరగాలని చెబుతున్నారో.. అలాంటి మార్పులన్నీ ఇప్పుడు ఏపీలో జరుగుతున్నాయి. ఎక్కడైనా సరే ఆస్తిని సంపదగా మార్చుకున్న దేశాలు అభివృద్ధి చెందుతాయి. ఆస్తి సంపదగా మారాలంటే అడ్డంకులను ప్రభుత్వమే తొలగించాలి. ఆ పని ఏపీ ప్రభుత్వం చేస్తోంది. భూ హక్కులకు భద్రత కల్పించడం, సరిహద్దుల స్పష్టత, అమ్మకాలు–కొనుగోళ్లను సులభం చేయడం, ఆంక్షలను తొలగించడం, మంచి భూ పరిపాలన యంత్రాంగాన్ని తయారు చేయడం ప్రధానమైనవి. ఏపీ ప్రభుత్వం ఈ పనులన్నీ చేస్తోంది. అసైన్డ్ భూములపై ఆంక్షలు ఎత్తేయడం, చుక్కల భూములు, అనా«దీనం భూములపైనా ఆంక్షలు తొలగించడం ఇందులో భాగమే. రిజిస్ట్రేషన్ ప్రక్రియ గ్రామ స్థాయికి రావడం పెద్ద మార్పు. ఇలా ఆస్తిని సంపదగా మార్చే ప్రక్రియలో ప్రభుత్వం వేగంగా అడుగులు ముందుకు వేసింది. తద్వారా వేల కోట్ల సంపద ఆవిష్కృతమైంది. – ఎం.సునీల్కుమార్, భూ చట్టాల నిపుణుడు, నల్సార్ వర్సిటీ అసోసియేట్ ప్రొఫెసర్, హైదరాబాద్ -
మరింత సులభంగా ఆదాయ ధ్రువీకరణ పత్రాలు
సాక్షి, అమరావతి: ఆదాయ ధ్రువీకరణ పత్రాల జారీని రాష్ట్ర ప్రభుత్వం మరింత సులభతరం చేసింది. విద్యా సంస్థల్లోకి ప్రవేశాలు, స్కాలర్షిప్లు, ప్రభుత్వ ఉద్యోగాల కోసం రాసే పరీక్షల్లో ఫీజు మినహాయింపు, సంక్షేమ పథకాల కోసం ఆదాయ ధ్రువీకరణ పత్రాలు తప్పనిసరి కావడంతో వాటన్నింటికీ గ్రామ, వార్డు సచివాలయాల్లో చేసే ఆరు దశల ధృవీకరణ సరిపోతుందని స్పష్టం చేసింది. ఈమేరకు తాజాగా రెవెన్యూ శాఖ జీవో జారీ చేసింది. పేద కుటుంబాల ఆదాయన్ని బియ్యం కార్డు ద్వారా నిర్థారించవచ్చని, ఆ కార్డును చూపించినప్పుడు ప్రభుత్వ సంస్థలు ఆదాయ ధృవీకరణ పత్రాలు అడగకూడదని గతంలోనే ప్రభుత్వం స్పష్టం చేసింది. అయినా పలు శాఖలు ప్రత్యేకంగా వీటిని అడుగుతున్నాయి. గ్రామ, వార్డు సచివాలయాల్లో ఆరు దశల ధ్రువీకరణ అమలవుతున్న నేపథ్యంలో దరఖాస్తుదారులు మళ్లీ ప్రత్యేకంగా సర్టీఫికెట్ సమర్పించాల్సిన అవసరం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ఈ సమస్య పరిష్కారానికి రెవెన్యూ శాఖ అన్ని శాఖల ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో వచ్చిన అభిప్రాయాల మేరకు తాజా ఆదేశాలు జారీ చేసింది. ఆదాయ ధృవీకరణ పత్రాలు లేని పదో తరగతి, ఇంటర్ విద్యార్థులందరికీ రెవెన్యూ శాఖ వాటిని ఇస్తుంది. రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలకు, విద్యార్థుల స్కాలర్షిప్లకు సంబంధిత శాఖలు ఇకపై ఆదాయ ధ్రువీకరణ పత్రాలు అడగకూడదు. గ్రామ, వార్డు సచివాలయాలు జారే చేసే ధృవీకరణ పత్రం వీటికి సరిపోతుంది. ఆ శాఖలు సచివాలయాల ద్వారా ధ్రువీకరణ పత్రాలను తెప్పించుకుని పని పూర్తి చేయాలి. ఇందుకోసం మూడు రోజుల సమయాన్ని నిర్దేశించారు. పోస్ట్ మెట్రిక్యులేషన్ స్కాలర్షిప్లకు కూడా ఆరు దశల ధ్రువీకరణ పత్రాన్నే తీసుకుంటారని తెలిపింది. ఆరు దశల ధ్రువీకరణ ప్రక్రియను రియల్ టైమ్లో పూర్తి చేయడానికి గ్రామ, వార్డు సచివాలయాల శాఖ సాఫ్ట్వేర్ను ఆయా సంక్షేమ పథకాలు, సిటిజన్ సర్వీసుల సాఫ్ట్వేర్లతో అనుసంధానం చేసుకోవాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఈడబ్ల్యూఎస్ సర్టీఫికేషన్, ఇతర కేంద్ర ప్రభుత్వ సంబంధిత వినియోగం, జగనన్న విదేశీ విద్యా దీవెన పథకం వంటి నిర్దిష్ట కేసులకు మాత్రం ఆదాయ ధృవీకరణ పత్రాలను జారీకి ప్రస్తుత విధానం కొనసాగుతుంది. ఏ అవసరం కోసం ఆదాయ ధ్రువీకరణ పత్రం కోరుతున్నారో, అందుకోసం మాత్రమే పత్రాలను గ్రామ, వార్డు సచివాలయాల శాఖ జారీ చేస్తుంది. ఆరు దశల ధ్రువీకరణ ఇలా.. ఆదాయ ధ్రువీకరణ పత్రాన్ని జారీ చేయడానికి గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ఆరు దశల్లో దరఖాస్తుదారు ఆర్థిక స్థితిని అంచనా వేస్తారు. ఆధార్ కార్డు, ఇతర వివరాల ద్వారా ఆ వ్యక్తికి ఉన్న భూమి, మున్సిపల్ ఆస్తి, 4 చక్రాల వాహనం ఉందా? ప్రభుత్వ ఉద్యోగమా? ఆదాయపు పన్ను వివరాలు, వారు వినియోగించే విద్యుత్ యూనిట్లను పరిశీలిస్తారు. వీటి ద్వారా వారి ఆరి్థక స్థితిని నిర్ధారిస్తారు. -
మధురవాడలో రాష్ట్ర పన్నుల శాఖ కార్యాలయం!
సాక్షి, విశాఖపట్నం: దసరా నుంచి పరిపాలన రాజధానిగా మారనున్న విశాఖపట్నంలో రాష్ట్రస్థాయి కార్యాలయాలకు భవనాల ఎంపిక కోసం అధికారులు కసరత్తు ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా రాష్ట్ర పన్నుల శాఖ కార్యాలయాన్ని మధురవాడలో ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. దసరా నుంచి రాష్ట్ర పరిపాలన రాజధాని విశాఖ కేంద్రంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కార్యకలాపాలు ప్రారంభించనున్నట్లు ఇటీవల కేబినెట్ సమావేశంలో స్పష్టం చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రితోపాటు విశాఖ వచ్చే ఉన్నతాధికారులు, ప్రభుత్వ కార్యాలయాల కోసం భవనాలను సిద్ధం చేసేందుకు అధికార యంత్రాంగం ప్రయత్నాలను వేగవంతం చేసింది. ఇందులో భాగంగా రాష్ట్ర పన్నుల శాఖ కార్యాలయాల ఏర్పాటు, పని విభజనపై కసరత్తు వడివడిగా జరుగుతోంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలు విశాఖ డివిజన్ పరిధిలోకి వస్తాయి. ప్రస్తుతం జాయింట్ కమిషనర్(జేసీ)–1, 2 కార్యాలయాలు, కొన్ని సర్కిల్ కార్యాలయాలు ముడసర్లోవ సమీపంలో ఉన్నాయి. ఈ భవనాన్నే రాష్ట్ర ప్రధాన కార్యాలయానికి కేటాయించాలని భావించారు. కానీ, సరిపడా గదులు లేకపోవడంతో దానికి ఎదురుగా నిర్మాణంలో ఉన్న ఐదు అంతస్తుల భవనాన్ని అద్దెకు తీసుకుని పన్నుల శాఖ కమిషనర్, ప్రిన్సిపల్ సెక్రటరీ, ఇతర అధికారుల కోసం కేటాయించాలని ప్రయత్నించారు. దీనిపై ఉన్నతాధికారులకు విశాఖ డివిజన్ అధికారులు నివేదిక పంపించారు. అయితే ముఖ్యమంత్రి కార్యాలయానికి సమీపంలో భవనాన్ని పరిశీలించాలని ఉన్నతాధికారులు స్పష్టంచేశారు. దీంతో విశాఖ డివిజన్ జాయింట్ కమిషనర్ కార్యాలయ అధికారులు మధురవాడలో ఉన్న భవనాలను పరిశీలించారు. నాలుగు అంతస్తులు ఉన్న మూడు భవనాలను పరిశీలించి వాటి వివరాలను ఉన్నతాధికారులకు పంపినట్లు సమాచారం. రెండు వారాల్లోపు ఉన్నతాధికారుల బృందం వచ్చి ఆ భవనాలను పరిశీలించి ఒకదానికి ఆమోదం తెలిపే అవకాశం ఉందని తెలుస్తోంది. -
రెవెన్యూలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చం: శ్రీకాంత్ రెడ్డి
-
ఒకే భూమి.. ఇద్దరికి డీ ఫారం పట్టాలు
ఆత్మకూరురూరల్(మర్రిపాడు): మర్రిపాడు మండలం చిలకపాడు రెవెన్యూ పరిధిలో రెవెన్యూ లీలలు వెలుగుచూశాయి. సర్వే నంబర్ 682–పీ లోని భూమికి సంబంధించి రెవెన్యూ అధికారులు ఇద్దరికి డీ ఫారం పట్టాలు అందజేశారు. 1997లో రసం రామయ్యకు రెండెకరాలకు పట్టా ఇవ్వగా, అదే భూమిని 2005లో కొక్కంటి పద్మావతి పేరుతో 2.90 ఎకరాలకు డీ ఫారం పట్టాగా ఇచ్చారు. భూమి లబ్ధిదారులు ఇద్దరూ ఏపిలగుంటకు చెందిన వారు కావడంతో నిత్యం ఈ విషయమై ఇరువర్గాల మధ్యన గొడవలు చెలరేగుతున్నాయి. రెవెన్యూ వర్గాలు మాత్రం ముందుగా పట్టా పొందిన వారు భూమిని తమ అనుభవంలో ఉంచుకోలేదని, రెండో వారు గత 19 ఏళ్లుగా వివిధ పంటలు సాగు చేసుకుంటూ అనుభవంలో ఉంచుకున్నారని చెబుతున్నారు. అయితే పట్టా లబ్ధిదారుల కంటే వారి బంధువుల ప్రమేయంతో వివాదాస్పద భూమి సమస్య రోజురోజుకు జఠిలంగా మారి గ్రామస్తులు, రెవెన్యూ అధికారులకు తలనొప్పిగా మారింది. ఈ విషయమై ప్రస్తుతం సాగులో ఉన్న కొక్కంటి పద్మావతి భర్త శ్రీనివాసులు రెవెన్యూ కార్యాలయాల చుట్టూ ప్రదక్షణలు చేస్తూ తహసీల్దార్ నుంచి కలెక్టర్ వరకు తరచూ వినతి పత్రాలు ఇస్తున్నారు. తన పొలంలోకి తనను వెళ్లనీయకుండా అడ్డుకుంటున్నారని ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్రెడ్డికి సైతం ఫిర్యాదు చేశారు. అలాగే రసం రామయ్య భార్య తమకు ఎఫ్డీస్ 16/1407/97 ప్రకారం రెండెకరాలకు పట్టా ఇచ్చారని, అందులో ఉన్న 90 సెంట్లను మాత్రమే కొక్కంటి పద్మావతికి డీ ఫారం పట్టా గా మంజూరు చేసే వీలుందన్నారు. రెవెన్యూ అధికారులను లోబరుచుకుని పద్మావతి భర్త శ్రీనివాసులు 90 సెంట్ల్లకు బదులుగా 2.90 ఎకరాలకు డీ ఫారం పట్టా పొందారని, తప్పుడు ధ్రువపత్రాలతో అధికారులను తప్పుదోవపట్టిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఈ విషయమై మర్రిపాడు తహసీల్దార్గా విధులు నిర్వహిస్తున్న ట్రెయినీ కలెక్టర్ సంజనా సిన్హా శనివారం రెవెన్యూ సిబ్బందితో కలిసి వివాదాస్పద భూమిని క్షేత్ర పరిశీలన చేశారు. ఇరువర్గాలు తమ వద్దనున్న అన్ని ఆధారాలతో సోమవారం మర్రిపాడు తహసీల్దార్ కార్యాలయానికి వచ్చి తనను కలవాలని ఆదేశించారు. -
రెండో దశ భూ హక్కు పత్రాల పంపిణీ
సాక్షి, అమరావతి: భూముల రీ సర్వే పూర్తయిన రెండో దశలోని 2 వేల గ్రామాల్లో భూ హక్కు పత్రాల పంపిణీని రెవెన్యూ శాఖ ప్రారంభించింది. మొదటి దశ సర్వే పూర్తయిన 2 వేల గ్రామాల్లో 7.50 లక్షలకుపైగా భూ హక్కు పత్రాలను ఇప్పటికే రైతులకు అందించారు. ఇప్పుడు రెండో దశలోని 2 వేల గ్రామాల్లో సర్వే చివరి దశకు చేరుకోవడంతో ఆ గ్రామాల్లోని రైతులకు విడతల వారీగా భూ హక్కు పత్రాల పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నారు. 26 జిల్లాల్లో 8.68 లక్షల భూ హక్కు పత్రాలు పంపిణీ చేయాల్సివుండగా ఇప్పటికే 5.12 లక్షల పత్రాలను ముద్రించి ఆయా జిల్లాలకు పంపారు. ఇందులో 2.48 లక్షల పత్రాలు ఈ–కేవైసీ పూర్తి చేసి పంపిణీ కూడా చేశారు. మిగిలిన పత్రాలను పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎన్టీఆర్, అనంతపురం జిల్లాల్లో పంపిణీ దాదాపు పూర్తయింది. గుంటూరు, శ్రీ సత్యసాయి జిల్లాల్లో ఇంకా 5 శాతం లోపు పంపిణీ చేయాల్సి ఉంది. బాపట్ల, వైఎస్సార్, పార్వతీపురం మన్యం, అన్నమయ్య, శ్రీకాకుళం, తిరుపతి జిల్లాల్లో ఇంకా 30 శాతం వరకు పూర్తి చేయాల్సివుంది. పశ్చిమగోదావరి, కర్నూలు, అనకాపల్లి, విజయనగరం జిల్లాల్లో 90 శాతం పెండింగ్ ఉండటంతో అక్కడ భూ హక్కు పత్రాల పంపిణీపై ప్రత్యేక దృష్టి పెట్టారు. మరో నెల రోజుల్లో పంపిణీ పూర్తి చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. -
‘అసైన్డ్’ సవరణపై వివరాలు అందజేయండి
సాక్షి, హైదరాబాద్: అసైన్డ్దారులకు హక్కులు కల్పించే తెలంగాణ అసైన్డ్ భూముల చట్ట సవరణపై వివరాలు అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. రెండు వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వ ప్రధాన న్యాయమూర్తి, రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శితోపాటు చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ (సీసీఎల్ఏ)కు ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ అసైన్డ్ భూముల చట్టం–1977కు 2018లో సవరణ చేయడాన్ని సవాల్ చేస్తూ తెలంగాణ రిపబ్లికన్ పార్టీ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేసింది. చట్టంలోని సెక్షన్ 4(1)(b) ప్రకారం నిర్దేశించిన విధంగా 2007, జనవరి 29 నుంచి థర్డ్ పార్టీలకు అనుకూలంగా అసైన్డ్ భూముల రీఅసైన్మెంట్ కోసం కటాఫ్ తేదీని 2017, డిసెంబర్ 31 వరకు పొడిగించిందని.. ఇది చట్టవిరుద్ధమని, రాజ్యాంగ వ్యతిరేకమని పేర్కొన్నారు. ఈ మేరకు ప్రభుత్వం తీసుకొచ్చిన యాక్ట్ నంబర్ 12ను కొట్టివేయాలని కోరారు. ఈ పిల్పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ ఎన్వీ శ్రవణ్కుమార్ ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. పిటిషనర్ న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. పేదల ఆర్థిక స్వావలంబన కోసం ప్రభుత్వం అర్హులైన వారికి 1969లో సాగు భూమిని అందజేసిందని చెప్పారు. అయితే వారి నిరక్ష్యరాస్యత, అజ్ఞానం, సామాజిక, ఆర్థిక వెనుకబాటును అలుసుగా తీసుకున్న కొందరు వారి భూములను స్వల్ప ధరలకు కొనుగోలు చేశారన్నారు. రూ.50 లక్షల నుంచి కోటి విలువైన భూములను రూ.5 లక్షలు చెల్లించి పలుకుబడి ఉన్న వారు సొంతం చేసుకున్నారని వెల్లడించారు. అసలు లబ్ధిదారులు ఆ భూముల ద్వారా లబ్ధిపొందలేకపోయారని పేర్కొన్నారు. లబ్దిదారుల నుంచి కొనుగోలు చేసిన వ్యక్తుల నుంచి భూములను స్వాదీనం చేసుకుని, అంతకు ముందు కేటాయించిన వారికి తిరిగి ఇచ్చేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. 1977, తెలంగాణ అసైన్డ్ భూముల చట్టం సెక్షన్ 3 ప్రకారం అసైన్డ్ భూముల అమ్మకం చెల్లదన్నారు. ఇప్పుడు అసైన్డ్ భూములను థర్డ్ పార్టీల (ఇప్పుడు అ«దీనంలో ఉన్న వారు)కు అప్పగించేలా ప్రభుత్వం చట్ట సవరణ చేయడం సమర్థనీయం కాదని చెప్పారు. ఇలాంటి భూములు రాష్ట్ర వ్యాప్తంగా 2 లక్షల ఎకరాలు ఉండగా, ఒక్క రంగారెడ్డి జిల్లాలోనే 74 వేల ఎకరాలున్నాయన్నారు. వాదనలు విన్న ధర్మాసనం.. ప్రభుత్వానికి నోటీసులు జారీ చేస్తూ, విచారణ వాయిదా వేసింది. -
కొత్త రిజిస్ట్రేషన్ల విధానంపై.. అపోహలొద్దు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కొత్త రిజిస్ట్రేషన్ల విధానంపై ఎటువంటి అపోహలు పెట్టుకోవద్దని ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి. సాయిప్రసాద్ ప్రజలను కోరారు. ఈ విధానం అత్యంత సురక్షితమైంది.. పారదర్శకమైందని చెప్పారు. భౌతికంగా దస్తావేజులు ఉండవనే విషయంలో వ్యక్తమవుతున్న అభిప్రాయాల్లో ఎలాంటి వాస్తవం లేదన్నారు. దస్తావేజులు భౌతికంగా కావాలనుకునే వారు ఇప్పుడు కూడా పొందే అవకాశం ఉందని ఆయనస్పష్టంచేశారు. వెలగపూడి సచివాలయంలో సోమవారం స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ కమిషనర్ అండ్ ఐజీ వి. రామకృష్ణతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. వినియోగదారులకు రెండు ఆప్షన్లు ఉంటాయని, ఆన్లైన్ రిజిస్ట్రేషన్తోపాటు భౌతికంగా దస్తావేజులు పొందే ఆప్షన్ కూడా అందుబాటులో ఉందని తెలిపారు. డాక్యుమెంట్లను ఆన్లైన్లో అప్లోడ్ చేసి టైమ్స్లాట్ బుక్ చేసుకున్న వారు సబ్రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లి తమకు భౌతికంగా డాక్యుమెంట్లు కావాలంటే అక్కడే వారి సంతకాలు తీసుకుని గతంలో మాదిరిగా డాక్యుమెంట్లు ఇస్తారని చెప్పారు. ఇందుకు సంబంధించిన కార్డ్ ప్రైమ్ 2.0 విధానాన్ని అత్యంత కట్టుదిట్టంగా ఎంతో అధ్యయనం చేసిన తర్వాతే రూపొందించామన్నారు. ఈ కొత్త విధానం గతం కంటే ఎంతో మెరుగైందని, సురక్షితమైనదని తెలిపారు. ప్రస్తుతం ఉన్న కార్డ్ 1.0 విధానం 1999లో రూపొందించారని.. అప్పట్లో ఏడాదికి రెండు లక్షల రిజిస్ట్రేషన్లు జరిగేవని, ఇప్పుడు ఏడాదికి 25 లక్షల రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయని తెలిపారు. ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా కొత్త టెక్నాలజీ, భద్రత, ప్రజల సౌలభ్యం వంటి అన్ని అంశాలతో కార్డ్ 2.0ను అందుబాటులోకి తీసుకువచ్చామని ఆయన చెప్పారు. ఆటో సబ్ డివిజన్.. ఆటో మ్యుటేషన్.. కొత్త విధానంలో పబ్లిక్ డేటా ఎంట్రీ ద్వారా అమ్మేవాళ్లు, కొనేవాళ్లు తమ వివరాలను ఆన్లైన్లో పొందుపరిస్తే ఒక మోడల్ డాక్యుమెంట్ (దస్తావేజు) జనరేట్ అవుతుందన్నారు. అందులో ఇంకా అదనంగా ఏమైనా వివరాలు చేర్చాలనుకుంటే అందుకు అవకాశం ఉంటుందన్నారు. రిజిస్ట్రేషన్కు సంబంధించిన సర్వే నెంబర్ను ఎంటర్ చేయగానే దానికి సంబంధించిన లింకు డాక్యుమెంట్లు, రెవెన్యూ వెబ్ల్యాండ్లో ఎవరి పేరు ఉందో చూపిస్తుందని తెలిపారు. గతంలో నాలుగు రకాల చలానాలు కట్టే పరిస్థితి ఉండగా, ఇప్పుడు ఆన్లైన్లో ఆ సర్వే నెంబర్కు సంబంధించి ఎంత స్టాంప్ డ్యూటీ కట్టాలో చూపిస్తుందని.. దాన్ని వెంటనే ఆన్లైన్లోనే చెల్లించవచ్చని సాయిప్రసాద్ చెప్పారు. వ్యవసాయ భూములైతే ఈ దశలోనే సబ్ డివిజన్ అవసరమైతే ఆటోమేటిక్గా జరిగిపోతుందన్నారు. రిజిస్ట్రేషన్ పూర్తవగానే మ్యుటేషన్ కూడా ఆటోమేటిగ్గా జరిగిపోతుందని, గతంలో మాదిరిగా మళ్లీ రెవెన్యూ శాఖ దగ్గరకు వెళ్లాల్సిన అవసరం ఉండదని తెలిపారు. భూముల రీసర్వే అయిన గ్రామాల్లో అయితే అమ్మేవాళ్లు ముందుగానే సబ్ డివిజన్ చేయించుకోవాలని, అప్పుడే రిజిస్ట్రేషన్కు అనుమతిస్తారని చెప్పారు. ఐటీ చట్టం మార్పుతో ఇ–సైన్లు చెల్లుబాటవుతున్నాయి ఇక గత సంవత్సరం అక్టోబర్ నుంచి ఆస్తుల రిజిస్ట్రేషన్లకు సైతం ఇ–సైన్లు చెల్లుబాటయ్యేలా ఐటీ చట్టంలో కేంద్రం మార్పులు చేసిందని సాయంప్రసాద్ గుర్తుచేశారు. ఆస్తి అమ్మేవాళ్ల నుంచి బయోమెట్రిక్ అథెంటికేషన్ ద్వారా ఇ–సైన్ తీసుకుంటారని, సబ్ రిజిస్ట్రార్ కూడా అదే విధంగా ఇ–సైన్ చేస్తారని తెలిపారు. ఈ ప్రక్రియ పూర్తయ్యాక రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ను వినియోగదారులకు ఇస్తారని, అది ఆన్లైన్లోనూ అందుబాటులో ఉంటుందన్నారు. ఒకవేళ ఎవరైనా భౌతికంగా తమకు డాక్యుమెంట్ కావాలంటే వాళ్లతో సంతకాలు చేయించుకుని గతంలో మాదిరిగా డాక్యుమెంట్ ఇస్తారని తెలిపారు. ఇందులో ఎలాంటి అనుమానాలకు ఆస్కారంలేదన్నారు. ఆన్లైన్ డాక్యుమెంట్వల్ల కూడా ఎవరికీ అభ్యంతరం ఉండాల్సిన అవసరంలేదని, ఐటీ రిటర్నులన్నీ ఆన్లైన్లోనే జరుగుతున్నాయన్నారు. అలాగే, అనేక ప్రభుత్వ సేవలు ఆన్లైన్లోనే జెనరేట్ అవుతున్నాయని, రిజిస్ట్రేషన్ చేసిన డాక్యుమెంట్లు కూడా అంతేనన్నారు. ఆన్లైన్ దస్తావేజులు పొందిన వారికి బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి ఎటువంటి ఇబ్బందులు ఉండవని సాయంప్రసాద్ స్పష్టంచేశారు. ఆన్లైన్ ప్రక్రియను డాక్యుమెంట్ రైటర్లూ చెయ్యొచ్చు.. ఇక గతంలో దస్తావేజులు పోతే కేసులు పెట్టి అనేక అవస్థలుపడాల్సి వచ్చేదని, కొత్త విధానంలో అలాంటి వాటికి ఆస్కారం ఉండదని, ఎప్పుడైనా ప్రజలు తమ ఆస్తుల డాక్యుమెంట్ను పొందే అవకాశం ఉంటుందని తెలిపారు. కానీ, భౌతికంగా దస్తావేజులు కావాలనే ప్రజల సెంటిమెంట్ను దృష్టిలో ఉంచుకుని వారికి ఆ ఆప్షన్ కూడా ఇచ్చామన్నారు. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ల ప్రక్రియను డాక్యుమెంట్ రైటర్లు కూడా చేయవచ్చని, వారి స్కిల్ను అక్కడ కూడా ఉపయోగించవచ్చని చెప్పారు. ఆటోమ్యుటేషన్ విధానం నెలరోజుల్లో మున్సిపాల్టీల్లోనూ అమలుచేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో రిజిస్ట్రేషన్ల శాఖ అదనపు ఐజీ ఉదయభాస్కర్ తదితరులు పాల్గొన్నారు. -
పదోన్నతులకు ‘సర్దుబాటు’ గండం
సాక్షి, హైదరాబాద్: గ్రామ రెవెన్యూ అధికారుల (వీఆర్వో) సర్దుబాటు ప్రక్రియ కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతోంది. వీఆర్వోల వ్యవస్థను రద్దు చేసిన తర్వాత కొత్త రెవెన్యూ చట్టం ప్రకారం గతేడాది ఆగస్టులో రాష్ట్రంలోని 5,138 మంది వీఆర్వోలను వివిధ ప్రభుత్వ శాఖల్లో ప్రభుత్వం సర్దుబాటు చేసింది. జూనియర్ అసిస్టెంట్ కేడర్లో వీరిని నియమించింది. అయితే రెవెన్యూ శాఖలో సుదీర్ఘంగా పనిచేసిన తమ సీనియా ర్టీ ని పరిగణనలోకి తీసుకుని తాము వెళ్లిన కొత్త శాఖల్లో పదోన్నతులు కల్పించాలని, అప్పటివరకు ఆయా శాఖల్లో పదో న్నతులు ఇవ్వద్దని పాత వీఆర్వోలు కోర్టులకు వెళ్లడం, వీరి అభ్యర్థన మేరకు కోర్టులు స్టేలు ఇస్తుండడంతో పలు శాఖల్లో శాఖాపరమైన పదోన్నతులకు బ్రేక్ పడుతోంది. ఈ తరుణంలో పదోన్నతులకు కోర్టుల రూపంలో రెడ్ సిగ్నల్ పడుతుండడంతో ఆయా శాఖల ఉద్యోగులు, ఉన్నతాధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఉన్నత విద్య, వైద్య శాఖల్లో ఆటంకాలు ఉన్నత విద్యాశాఖలో జూనియర్ లెక్చరర్ల పదోన్నతుల్లో అర్హత గల జూనియర్ అసిస్టెంట్లకు 10% కోటా ఉంది. ఈ మేరకు ఉన్నత విద్యాశాఖలో పనిచేస్తున్న సిబ్బందితో ఆ శాఖ అధికారులు జేఎల్ పదోన్నతుల కోసం సీనియార్టీ జాబితా తయారు చేశారు. అయితే ఇదే శాఖలో సర్దుబాటు అయిన వీఆర్వో ఒకరు తనకు కూడా జేఎల్ ఉద్యోగం చేసేందుకు అన్ని అర్హతలు ఉన్నాయని, రెవెన్యూ శాఖలో పనిచేసిన తన సీనియా ర్టీ ని పరిగణనలోకి తీసుకుని సీనియార్టీ జాబితాలో తన పేరు కూడా చేర్చేలా ఆదేశాలివ్వాలని, అప్పటివరకు ప్రక్రియను నిలిపివేయాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు. దీంతో కోర్టు ఆయన అభ్యర్థన మేరకు జేఎల్ పదోన్నతులపై స్టే విధిస్తూ ఆగస్టు నెలలో ఉత్తర్వులు జారీ చేసింది. వైద్య ఆరోగ్య శాఖలో సీనియర్ అసిస్టెంట్ పదోన్నతుల విషయంలోనూ ఇదే జరిగింది. సీనియర్ అసిస్టెంట్ పదోన్నతుల జాబితాలో తమ పేర్లు కూడా చేర్చాలంటూ పలువురు సర్దుబాటు వీఆర్వోలు కోర్టును ఆశ్రయించడంతో కోర్టు స్టేటస్కో ఉత్తర్వులు జారీ చేసింది. -
అసైన్డ్ భూముల సవరణ చట్టం అమలుకు మార్గదర్శకాలు జారీ
సాక్షి, అమరావతి: అసైన్డ్ భూములపై యాజమాన్య హక్కులు కల్పిస్తూ అసైన్డ్ చట్టంలో సవరణలు చేస్తూ ఆర్డినెన్స్ జారీ చేసిన ప్రభుత్వం దాన్ని అమలు చేసేందుకు మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ మేరకు భూ పరిపాలన ప్రధాన కమిషనర్, రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్ ఆదివారం జిల్లా కలెక్టర్లకు ఈ–ఫైల్ విధానంలో ఆదేశాలిచ్చారు. ప్రభుత్వం భూమి కేటాయించిన వ్యక్తి, అతను లేకపోతే అతని వారసుల ఆదీనంలో ఆ భూమి ఉంటేనే యాజమాన్య హక్కులు కల్పించాలని సూచించారు. ఆ భూములను 1908 రిజిస్ట్రేషన్ల చట్టంలోని నిషేధిత ఆస్తుల జాబితా 22 (ఎ) నుంచి తొలగించాలని ఆదేశించారు. లంక భూములు, నీటి వనరులకు సంబంధించిన భూములకు ఇందులో నుంచి మినహాయించాలని సూచించారు. ఇందుకోసం వీఆర్ఓలు, తహశీల్దార్లు, ఆర్డీఓలు–సబ్ కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, కలెక్టర్లు ఏం చేయాలనే అంశాలను నిర్దిష్టంగా మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. వీఆర్ఓలు ఇలా చేయాలి.. రికార్డులను సంస్కరించడంలో (పీఓఎల్ఆర్–ప్యూరిఫికేషన్ ఆఫ్ ల్యాండ్ రికార్డ్స్) భాగంగా తహశీల్దార్లు వ్యవసాయం, ఇళ్ల పట్టాల కోసం అసైన్ చేసిన భూములను గుర్తించారు. వాటిని బట్టి వీఆర్ఓలు ఆన్లైన్ అప్లికేషన్ కోసం వివరాలను సమకూర్చాలి. ఇప్పటికే గుర్తించిన సర్వే నంబర్ల ప్రకారం ఆ భూముల డీకేటీ రిజిష్టర్లు, 1బీ, అడంగల్, 22 (ఎ) జాబితా, ఇతర రెవెన్యూ రికార్డులను పరిశీలించి క్షేత్ర స్థాయిలో వంద శాతం తనిఖీలు నిర్వహించాలి. ప్రతి సర్వే నంబర్కు సంబంధించిన పట్టాను పరిశీలించి, ఆ పట్టాదారు.. ప్రభుత్వం భూమి కేటాయించిన వ్యక్తా లేక అతని వారసుడా? (ఒరిజినల్ అసైనీనా లేక లీగల్ హైరా), సంబంధిత భూమి వారి ఆ«దీనంలోనే ఉందా? రెవెన్యూ రికార్డుల ప్రకారం అది లంక భూమా? లేక నీటి వనరులకు సంబంధించిన భూమా? ఆ భూమి అతనికి ప్రభుత్వం ఎప్పుడు అసైన్ చేసింది? వంటి వివరాలను కచ్చితంగా సేకరించాలి. ఇందుకోసం అన్ని రికార్డులను పరిశీలించి క్షేత్ర స్థాయి విచారణ నిర్వహించాలి. తహశీల్దార్ల పాత్ర వీఆర్ఓలు ఇచ్చిన అసైన్డ్ భూముల సర్వే నంబర్లను తహశీల్దార్లు క్షుణ్ణంగా పరిశీలించాలి. మండలంలోని అన్ని అసైన్డ్ భూముల వివరాలు ఆ జాబితాలో ఉన్నాయో.. లేదో.. చూడాలి. ఈ కసరత్తులో ఏ అసైన్డ్ భూమిని వదిలి వేయకూడదు. ఒకవేళ ఏదైనా భూమిని వదిలివేసినట్లు గుర్తిస్తే వెంటనే ఆ వివరాలను సీసీఎల్ఏ కార్యాలయంలోని సీఎంఆర్ఓ (కంప్యూటరైజేషన్ ఆఫ్ మండల రెవెన్యూ ఆఫీసెస్) సెక్షన్కు ఈ–ఫైల్ విధానంలో పంపి కసరత్తులో చేర్చాలి. పక్కాగా తనిఖీ చేసిన తర్వాత తహశీల్దార్ అసైన్డ్ భూముల జాబితాను గ్రామ, వార్డు సచివాలయాల్లో పబ్లిక్ నోటీస్ బోర్డులో పెట్టాలి. సూచనలు, అభ్యంతరాల కోసం 7 రోజుల సమయం ఇవ్వాలి. ఏవైనా అభ్యంతరాలు వస్తే పరిశీలించి, నిబంధనల ప్రకారం వాటిని వెంటనే క్లియర్ చేయాలి. ఆ తర్వాత మొత్తం రికార్డుల్లో 5 శాతాన్ని ఆర్డీఓలు తనిఖీ చేయాలి. జాయింట్ కలెక్టర్ల పాత్ర ఆర్డీఓలు/సబ్ కలెక్టర్లు తనిఖీ చేసిన 5 శాతం రికార్డుల్లో 1 శాతం రికార్డులను జాయింట్ కలెక్టర్ తనిఖీ చేసి, అన్నీ సరిగా ఉన్నాయో లేదో చూడాలి. వీఆర్వో నుంచి ఆర్డీఓ స్థాయి వరకు జరిగిన కసరత్తును పూర్తిగా పర్యవేక్షిస్తూ అన్ని దశల్లోనూ పారదర్శకంగా జరిగిందో లేదో పరిశీలించాలి. వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత 22 (ఎ) జాబితా నుంచి ఎంపిక చేసిన సర్వే నంబర్లను తొలగించాలని కోరుతూ జిల్లా రిజిస్ట్రార్లకు ముసాయిదా లేఖ సిద్ధం చేయాలి. కలెక్టర్ దాన్ని జిల్లా రిజిస్ట్రార్కు పంపాలి. ప్రతి సంవత్సరం ఆగస్టు 5వ తేదీన ఇదే విధంగా నిబంధనల ప్రకారం 22 (ఎ) నుంచి తొలగించాల్సిన అసైన్డ్ భూముల వివరాలను జిల్లా రిజిస్ట్రార్లకు పంపాలి. అసైన్డ్ భూములను 22 (ఎ) జాబితా నుంచి తొలగించే ప్రక్రియను జిల్లా కలెక్టర్లు జాగ్రత్తగా పరిశీలించాలి. మొత్తం కసరత్తు పూర్తయిన తర్వాత కలెక్టర్.. జిల్లా రిజిస్ట్రార్కు 22 (ఎ) నుంచి తొలగించాల్సిన సర్వే నంబర్ల జాబితాను పంపి, తర్వాత దాన్ని జిల్లా గెజిట్లో ప్రచురించాలి. -
అసైన్డ్ భూములపై పేదలకు హక్కులు కల్పిస్తాం
కోటబొమ్మాళి: రాష్ట్రంలోని 27 లక్షల ఎకరాల అసైన్డ్ భూములపై పేదలకు హక్కులు కల్పిస్తున్నామని రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు చెప్పారు. ఈ మేరకు రానున్న అసెంబ్లీ సమావేశాల్లో అసైన్డ్ భూములు పేదలకు చెందేలా... జిరాయితీ భూముల మాదిరిగానే పేదలు అన్ని హక్కులు పొందేలా ఆర్డినెన్స్ తెస్తామని ఆయన తెలిపారు. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలం రేగులపాడులో రూ.80 లక్షలతో నిర్మించిన గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రం, వెల్నెస్ సెంటర్లను శుక్రవారం మంత్రి ధర్మాన ప్రసాదరావు ప్రారంభించారు.ఈ సందర్భంగా ధర్మాన మాట్లాడుతూ అనుకున్న పనిని ఎలాగైనా సాధించగలిగే ధీరుడు సీఎం వైఎస్ జగన్ అని, ఎలాంటి వాగ్దానాన్ని అయినా ఆయన అమలు చేయగలరని ప్రశంసించారు. అమరావతిలో ఒకేసారి 50వేల మందికి పైగా పేదలకు ఇళ్ల పట్టాలు, ఇళ్లు మంజూరుచేసి సీఎం జగన్ తన మానవత్వాన్ని చాటుకున్నారని పేర్కొన్నారు. అమరావతిలో పేదలకు నివేశన స్థలాలు, ఇళ్లు ఇస్తే చంద్రబాబుకు ఎందుకు కడుపు మంట... అని ప్రశ్నించారు. రాష్ట్రం అభివృద్ధి చెందకూడదనే చంద్రబాబు అండ్కో ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. అన్ని పార్టీలు ఏకమైనా రానున్న ఎన్నికల్లో వైఎస్ జగనే మళ్లీ సీఎం అవుతారని ధర్మాన స్పష్టంచేశారు. సచివాలయ వ్యవస్థతో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో సమూల మార్పులు తెచ్చామన్నారు. కరోనా సమయంలో వలంటీర్లు అందించిన సేవలు మరువలేనివని తెలిపారు. -
‘అడ్రస్’లేని భూములకు సర్వేనంబర్
ఏ భూమి అయినా ధరణిలో రిజిస్ట్రేషన్ చేయాలంటే ముందుగా స్లాట్ బుక్ చేయాలి. పట్టాదారు పాస్బుక్, ఖాతా నంబర్, సర్వే నంబర్, క్రయ విక్రయాలు చేసే వ్యక్తుల పేర్లు, వారి ఆధార్కార్డు, ఫోన్నంబర్లు ఆ స్లాట్లో పొందుపరచాలి. కానీ ఇక్కడ ఆ భూమికి సంబంధించి ఎలాంటి సపోర్టింగ్ డాక్యుమెంట్ లేకపోయినా, సర్వే నంబర్, ఖాతా నంబర్తో పనిలేకుండా స్లాట్ ఎలా బుక్ అయ్యింది? రిజిస్ట్రేషన్ ఎలా జరిగింది? అనేది అంతుచిక్కని ప్రశ్నగా మిగిలింది. సాక్షి, రంగారెడ్డి జిల్లా: ప్రభుత్వంలోని కొందరు పెద్దలు.. రెవెన్యూ అధికారులు కుమ్మక్కై ఏకంగా ‘బిలా దాఖలా’ భూమికి ఎసరు పెట్టారు. రికార్డులు లేవనే సాకుతో పొజి షన్లో ఉన్న రైతులను మభ్యపెట్టి బహిరంగ మార్కెట్ కంటే.. చౌకధరకు ఈ భూములు కొట్టేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఆ వెంటనే వాటికి సర్వే నంబర్ సృష్టించి, ధరణిలో రిజిస్ట్రేషన్ కోసం స్లాట్ బుక్ చేసుకుంటున్నారని, వారు దరఖాస్తు చేసిందే తడవుగా అధికారు లు ఈ భూములను వారి పేరున బదలాయిస్తున్నారని అంటున్నారు. బహిరంగ మార్కెట్లో రూ.వెయ్యి కోట్లకుపైగా విలువ చేసే ఈ భూమిని.. చాలా తక్కువ రేటుకు కొనేస్తున్నారని సమాచారం. కోకాపేట సమీపంలో ఉండడంతోనే... రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం మోకిల–కొండకల్ గ్రామాల మధ్యన కొండకల్ రెవెన్యూ పరిధిలో 76.24 ఎకరాల ఏ అడ్రస్ లేని(బిలా దాఖలా) భూమి ఉంది. దీనికి సంబంధించి రెవెన్యూ శాఖ వద్ద ఎలాంటి రికార్డులు లేవు. 45 మంది స్థానిక రైతులు ఏళ్ల తరబడి ఈ భూములను సాగు చేసుకుంటున్నారు. పొజిషన్లో ఉన్నా వారి పేర్లు కూడా రికార్డుల్లో లేవు. పహాణీలు, పట్టాదారు పాసు పుస్తకాలు అసలే లేవు. కనీసం వీటి సర్వే నంబర్ ఏమిటో కూడా చాలామందికి తెలియదు. బహిరంగ మార్కెట్లో ఎకరా రూ.15 కోట్ల పైమాటే. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్స్కు ముఖ్యంగా కోకాపేటకు అతిసమీపంలో ఉన్న ఈ భూములపై కొంతమంది ప్రభుత్వ పెద్దల కన్నుపడింది. ఎలాగైనా వీటిని చేజిక్కించుకోవాలని భావించి తెరవెనుక కథ నడిపించారు. ఏ అడ్రస్ లేని ఈ మిగులు భూములు ప్రభుత్వానికి చెందుతాయని, ఈ విషయం బయటకు చెబితే..వాటిని సర్కారు లాగేసుకుంటుందని చెప్పి రైతుల నోరు మూయిస్తున్నారు. అంతా కలిసి.. ఓ వైపు రికార్డులు లేవని, ప్రభుత్వ భూములని ప్రచారం చేస్తూ పొజిషన్లో ఉన్న రైతులను భయాందోళనకు గురి చేస్తూ.. మరోవైపు రెవెన్యూ అధికారులతో ఈ భూములకు ఎంజాయ్మెంట్ సర్వే చేయించారు. తహసీల్దార్ ఇచ్చిన రిపోర్టు ఆధారంగా పాత రికార్డులను పరిశీలించి ఏడీ రిపోర్టు జారీ చేశారు. దీని ఆధారంగా కలెక్టర్ సూచన మేరకు సీసీఎల్ఏ ఈ భూములకు క్లియరెన్స్ కూడా ఇచ్చినట్టు సంబంధిత అధికారులు చెబుతున్నారు. అయితే అప్పటికే ఈ భూములపై కన్నేసిన బడా నేతలు, రియల్టర్లు, వ్యాపారులు పహాణీలు, పట్టాదారు పాసుపుస్తకాలు, సర్వే నంబర్, ఖాతా నంబర్లు లేవనే అంశాన్ని తెరపైకి తెచ్చారు. ప్రభుత్వం నుంచి ఏదైనా ఇబ్బంది ఉంటే తాము చూసుకుంటామని నమ్మ బలికారు. భూములు అమ్మాల్సిందిగా వారిపై ఒత్తిడి తీసు కొచ్చారు. చేసేది లేక రైతులు కూడా తలవంచక తప్ప లేదు. రైతుల్లో ఉన్న ఈ బలహీనతను ఆసరాగా చేసుకుని రూ.2 కోట్లకు ఎకరం చొప్పున 21 ఎకరాలకుపైగా కొల్లగొట్టారు. అంతేకాదు ఎలాంటి సపోర్టింగ్ డాక్యుమెంట్లు సమర్పించకుండానే ‘ధరణి’లో స్లాట్ బుక్ చేసి.. గుట్టుగా రిజిస్ట్రేషన్ కూడా చేసుకున్నారు. సర్వే నంబరు 555..దానికి బై నంబర్లు వేసి... ఇప్పటి వరకు ఏ అడ్రస్ లేని ఈ భూములకు రైతుల నుంచి చేతులు మారిన వెంటనే కొత్త అడ్రస్ సృష్టించారు. సర్వే నంబర్ 555గా నామకరణం చేసి..బై నంబర్లతో ఆయా భూములను బడాబాబులకు కట్టబెడుతున్నారు. ఈ విషయం బయటకు పొక్కితే.. ఎక్కడ తన ఉద్యోగానికి ఎసరు వస్తుందోననే భయంతో ఈ భూముల రిజిస్ట్రేషన్ సమయంలో ప్రస్తుత తహసీల్దార్ సెలవులో వెళ్లి.. డిప్యూటీ తహసీల్దార్లతో పని కానిచ్చేసినట్టు విశ్వసనీయ సమాచారం. శేరిగూడ భూములపైనా కన్ను సంగారెడ్డి– రంగారెడ్డి జిల్లాల సరిహద్దులోని శేరిగూడ రెవెన్యూ పరిధిలోనూ 90 ఎకరాలకు పైగా బిలా దాఖలా భూములు ఉన్నాయి. వీటిని కూడా కొల్లగొట్టేందుకు రెవెన్యూ అధికారులు, నేతలు, రియల్టర్లు, వ్యాపారులు తెరవెనుక ప్రయత్నాలు ముమ్మరం చేసినట్టు తెలిసింది. విచిత్రమేమంటే.. ఏళ్ల తరబడి కబ్జాలో ఉండి.. సాగు చేస్తున్న రైతుల పేర్లు మాత్రం ఇప్పటికీ ధరణిలో కనిపించడం లేదు. కానీ వారి నుంచి కొనుగోలు చేసిన నేతలు, వ్యాపారులు, రియల్టర్ల పేర్లు మాత్రం ఆ వెంటనే నమోదవుతున్నాయి. ఇదే అంశంపై ఇటీవల కొంత మంది రైతులు మండల ఆఫీసులో ఆందోళనకు దిగారు. ప్రభుత్వం అనుమతించింది కొండకల్ రెవెన్యూ పరిధిలో ‘బిలా దాఖలా’ భూములు ఉన్న మాట వాస్తవమే. వీటికి సంబంధించి గతేడాది ప్రభుత్వం ఎంజాయ్మెంట్ సర్వే చేయించింది. ఆ నివేదిక ఆధారంగా భూ రికార్డులు, సర్వే శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ పాత రికార్డులను పరిశీలించి, వాటికి సర్వే నం.555గా నిర్ధారించింది. కలెక్టర్ సిఫార్సు మేరకు సీసీఎల్ఏ ఈ భూముల రిజిస్ట్రేషన్లకు అనుమతి ఇచ్చింది. ఆ మేరకే రిజిస్ట్రేషన్లు చేస్తున్నాం.’ అని చెప్పిన తహసీల్దార్ నయీమొద్దీన్.. పొజిషన్లో ఉన్న రైతుల వివరాలు ధరణిలో ఎందుకు నమోదు చేయడం లేదని ‘సాక్షి’ ప్రతినిధి అడిగిన ప్రశ్నకు సమాధానం దాటవేయడం విశేషం. – తహసీల్దార్, నయీమొద్దీన్ -
ప్రభుత్వ ఉద్యోగులుగా వీఆర్ఏలు.. ఉత్తర్వులు జారీచేసిన సర్కార్
సాక్షి, హైదరాబాద్: వీఆర్ఏలను ప్రభుత్వ ఉద్యోగులుగా పర్మినెంట్ చేస్తూ, వారి పేస్కేల్ విడుదల చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు సోమవారం జారీ చేసింది. సీఎం ఆదేశాల మేరకు సీఎస్ శాంతి కుమారి సోమవారం సచివాలయంలో వీఆర్ఏల క్రమబద్ధీకరణకు సంబంధించిన ఉత్తర్వులను విడుదల చేశారు. ఈ ఉత్తర్వుల కాపీని కేసీఆర్ వీఆర్ఏ జేఏసీ నేతలకు అందజేశారు. (మరో కీలక నిర్ణయం తీసుకున్న సీఎం కేసీఆర్) కాగా నీరటి, మస్కూరు, లష్కర్ వంటి కాలం చెల్లిన పేర్లతో పిలువబడుతూ, భూస్వామ్య వ్యవస్థకు చిహ్నాలుగా మిగిలిన వీఆర్ఏ వ్యవస్థను శాశ్వతంగా రద్దు చేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ చారిత్రక నిర్ణయం తీసుకున్నారు. తాతల తండ్రుల కాలం నుంచి తరతరాలుగా గ్రామాల్లో సహాయకులుగా(వీఆర్ఏ) పనిచేస్తున్న సిబ్బందిని రెవెన్యూ శాఖలో సూపర్ న్యూమరరీ పోస్టుల్లో క్రమబద్ధీకరించనున్నట్టు సీఎం పేర్కొన్నారు. వీఆర్ఏలను ప్రభుత్వ ఉద్యోగులుగా పర్మినెంట్ చేస్తూ, వారికి పే స్కేలు అమలు పరుస్తున్నట్లు తెలిపారు. చదవండి: TSPSC: టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ కేసులో కీలక పరిణామం తమకు 'పే స్కేలు' నిర్ణయించి ప్రభుత్వ ఉద్యోగులుగా పర్మినెంట్ చేస్తూ చారిత్రక నిర్ణయం తీసుకున్నందుకు ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావును ఈరోజు సచివాలయంలో కలిసి ధన్యవాదాలు తెలిపిన వీఆర్ఏ జేఏసీ నేతలు. pic.twitter.com/19qJReFhdo — Telangana CMO (@TelanganaCMO) July 23, 2023 -
Telangana: వీఆర్ఏ వ్యవస్థ రద్దు
మానవీయ కోణంలో నిర్ణయం కాలానుగుణంగా కనుమరుగవుతున్న వృత్తుల్లో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులకు ప్రత్యామ్నాయ ఉద్యోగ భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే.. ఈ క్రమంలోనే వీఆర్ఏ వ్యవస్థను రద్దు చేస్తున్నాం.వీఆర్ఏలను రెవెన్యూ శాఖలోనే క్రమబద్ధీకరించి.. తర్వాత వివిధ శాఖల్లో సర్దుబాటు చేస్తాం. అట్టడుగు స్థాయి నుంచి త్యాగాలు, శ్రమతో సమాజ శ్రేయస్సు కోసం పనిచేస్తున్న వారిపట్ల మా ప్రభుత్వం మానవీయ కోణంలో నిర్ణయాలు తీసుకుంటుంది. – సీఎం కేసీఆర్ సాక్షి, హైదరాబాద్: నీరటి, మస్కూరు, లష్కర్ వంటి కాలం చెల్లిన పేర్లతో పిలవబడుతూ భూస్వామ్య వ్యవస్థకు చిహ్నాలుగా మిగిలిన గ్రామ రెవెన్యూ సహాయకుల (వీఆర్ఏ) వ్యవస్థను శాశ్వతంగా రద్దు చేస్తున్నట్టు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా వీఆర్ఏలుగా పనిచేస్తున్న సిబ్బందిని రెవెన్యూ శాఖలో సూపర్ న్యూమరరీ పోస్టుల్లో క్రమబద్ధీకరిస్తామన్నారు. తర్వాత మంత్రివర్గ ఉప సంఘం సిఫార్సుల మేరకు వీఆర్ఏలను అర్హతల ఆధారంగా పురపాలక, మిషన్ భగీరథ, నీటిపారుదల తదితర శాఖల్లో సర్దుబాటు చేస్తామని తెలిపారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను సోమవారమే జారీ చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని ఆదేశించారు. వీఆర్ఏల క్రమబద్ధీకరణ అంశంపై ఆదివారం సచివాలయంలో నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్షలో సీఎం కేసీఆర్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు సీఎం కార్యాలయం ప్రకటించింది. వీఆర్ఏ వృత్తికి ప్రాధాన్యత తగ్గింది సమీక్ష సందర్భంగా.. సామాజిక పరిణామ క్రమంలో మార్పులకు అనుగుణంగా, ప్రజల అవసరాలను అనుసరించి పాలకులు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. కాలానుగుణంగా కనుమరుగవుతున్న వృత్తుల్లో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులకు ప్రత్యామ్నాయ ఉద్యోగ భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలదేనని.. ఈ క్రమంలోనే వీఆర్ఏ వ్యవస్థను రద్దు చేస్తున్నామని స్పష్టం చేశారు. ‘‘వ్యవసాయం అభివృద్ధి చెంది సాగునీటి విధానం అమల్లోకి వచ్చినకాలంలో గ్రామాల్లో నీటి వ్యవస్థను సక్రమంగా నిర్వహించడం, గ్రామ రెవెన్యూ, ఇతర విభాగాల అవసరాల కోసం ఏర్పాటైన గ్రామ సహాయకుల వ్యవస్థ తర్వాత వీఆర్ఏలుగా రూపాంతరం చెందింది. తరతరాలుగా సామాజిక సేవ చేస్తున్న వీఆర్ఏల త్యాగపూరిత సేవ గొప్పది. నేటి మారిన పరిస్థితుల్లో వీఆర్ఏ వృత్తికి ప్రాధాన్యత తగ్గింది. ఈ నేపథ్యంలో వారిని రెవెన్యూ శాఖలో క్రమబద్ధీకరించి ప్రభుత్వ ఉద్యోగులుగా తీసుకుంటున్నాం..’’ అని సీఎం కేసీఆర్ తెలిపారు. అట్టడుగు స్థాయి నుంచి త్యాగాలు, శ్రమతో సమాజ శ్రేయస్సు కోసం పనిచేస్తున్న వారిపట్ల తమ ప్రభుత్వం మానవీయ కోణంలో ఆలోచించి, నిర్ణయాలు తీసుకుంటుందని పేర్కొన్నారు. పలుమార్లు ఎవరూ అడగకుండానే ఉద్యోగ వర్గాలకు జీతాలు పెంచి వారి సంక్షేమానికి పాటుపడ్డామని వివరించారు. విద్యార్హతల ఆధారంగా పోస్టులు రాష్ట్రంలో 20,555 మంది వీఆర్ఏలు పనిచేస్తున్నారని.. వారిలో నిరక్షరాస్యులతోపాటు ఏడో తరగతి, పదో తరగతి, ఇంటర్, డిగ్రీ ఆపై ఉన్నత చదువులు చదివినవారూ ఉన్నారని సీఎం కేసీఆర్ గుర్తు చేశారు. ఈ క్రమంలో వారి విద్యార్హతను బట్టి ప్రభుత్వం ఉద్యోగ కేటగిరీలను నిర్ధారిస్తుందని.. నిబంధనలకు అనుగుణంగా ఆయా శాఖల్లో భర్తీ చేస్తామని తెలిపారు. ఉన్నత చదువులు చదివి ప్రమోషన్లకు అర్హులైన వారిని అందుకు అనుగుణమైన పోస్టుల్లో నియమిస్తామన్నారు. ఇందుకు సంబంధించిన విధివిధానాలను వెంటనే ఖరారు చేయాలని రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్ను ఆదేశించారు. కారుణ్య నియామకాలు కూడా.. 61 ఏళ్ల వయసుపైబడిన వీఆర్ఏల వారసులకు కారుణ్య నియామకం కింద ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. దీనితోపాటు 61 ఏళ్లలోపు వయసు ఉండి 2014 జూన్ 2న తర్వాత ఏదైనా కారణంతో మరణించిన వీఆర్ఏల వారసులకు కూడా ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని ప్రకటించారు. చనిపోయిన వీఆర్ఏల వారసులు, వారి విద్యార్హతల వివరాలను త్వరగా సేకరించాలని అధికారులకు, వీఆర్ఏల జేఏసీ నేతలకు సూచించారు. వారిని అర్హతలు, ప్రభుత్వ నిబంధనల మేరకు వివిధ శాఖల్లో సర్దుబాటు చేయాలని అధికారులను ఆదేశించారు. సామాజిక వివక్ష నుంచి విముక్తినిచ్చారు: వీఆర్ఏ జేఏసీ మస్కూరు వంటి పేర్లతో తరతరాలుగా ఎదుర్కొన్న సామాజిక వివక్ష నుంచి విముక్తి కల్పించి ప్రభుత్వ ఉద్యోగులుగా క్రమబద్ధీకరించడం ద్వారా సీఎం కేసీఆర్ వీఆర్ఏల ఆత్మగౌరవాన్ని నిలబెట్టారని వీఆర్ఏ జేఏసీ నేతలు హర్షం వ్యక్తం చేశారు. తమకు పేస్కేల్ వర్తింపజేసినందుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. -
ఆ రైత్వారీ పట్టాలు చెల్లుతాయి
సాక్షి, అమరావతి : గ్రామ సర్వీసు ఈనాం భూములను నిషేధిత ఆస్తుల జాబితా నుంచి తొలగించడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఆ భూములపై ఉన్న ఆంక్షలను తొలగించేందుకు ఇటీవలే రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అందుకనుగుణంగా గ్రామ సర్విసు ఈనాం భూములకు జారీ చేసిన రైత్వారీ పట్టాలు చెల్లుబాటవుతాయని రెవెన్యూ శాఖ తెలిపింది. ఈ మేరకు రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి సాయిప్రసాద్ జీఓ నంబర్ 310 జారీ చేశారు. ఈ భూములకు గతంలో జారీ చేసిన రైత్వారీ పట్టాదారుల పేర్లను అన్ని రికార్డుల్లోకి ఎక్కించాలని రెవెన్యూ యంత్రాంగాన్ని ఆదేశించారు. పట్టాదారులు లేని పక్షంలో వారి వారసులు (లీగల్ హైర్స్), లేకపోతే వారి నుంచి కొనుగోలు చేసిన వ్యక్తుల పేర్లను రికార్డుల్లో నమోదు చేయాలని సూచించారు. రీ సర్వే రికార్డుల్లోనూ వారి పేర్లను చేర్చాలని స్పష్టం చేశారు. దీంతో 1.13 లక్షల మందికి చెందిన 1.68 లక్షల ఎకరాలు గ్రామ సర్విసు ఈనాం భూములు 22 (ఎ) జాబితా నుంచి తొలగి, ఆ కుటుంబాలకు మేలు కలుగుతుంది. ఈనాం భూముల చట్ట సవరణతో 22 (ఎ)లోకి సర్విసు ఈనాం భూములు దశాబ్దాల క్రితం గ్రామానికి సేవ చేసే కుల వృత్తుల వారి జీవన భృతి కోసం ఈనాంగా భూములిచ్చారు. 1956 ఈనాం (రద్దు, రైత్వారీ పట్టాలుగా మార్పు) చట్టం ప్రకారం కొన్ని ఈనాం భూములు రద్దవగా, కొన్ని రైత్వారీ భూములుగా మారాయి. రైత్వారీ భూములకు అప్పట్లోనే రైత్వారీ పట్టాలు జారీ చేశారు. ఈనాందారులు తమ భూములను ఎవరికైనా అమ్ముకునే హక్కు కూడా ఈనాం చట్టం కల్పించింది. దీంతో ఆ భూములను కొన్న వారికి రక్షణ ఏర్పడింది. అయితే గ్రామ సర్వీసు చేసిన వారికే కాకుండా ధా ర్మిక సంస్థలు, దేవాలయాల మనుగడ కోసం వాటికి ఈనాంగా భూములిచ్చారు. ఆ దేవాలయాల భూములు చాలావరకు ఇతరుల చేతుల్లోకి వెళ్లిపోయాయి. ఆ దేవాలయాల్లో ఏ సేవల కోసం భూమి ఇచ్చారో ఆ సేవలు కూడా ప్రస్తుతం లేవు. దీంతో వాటి రక్షణ కోసం 2013లో ఈనాం చట్టానికి సవరణలు చేశారు. దీని ప్రకారం ఈనాం భూములన్నింటిపైనా ఆంక్షలు విధించి వాటిని నిషేధిత జాబితా 22 (ఎ)లో చేర్చారు. దీంతో దేవాలయాల ఈనాం భూములతోపాటు గ్రామ సర్విసు ఈనాం కింద పొందిన రైత్వారీ పట్టా భూములు కూడా 22 (ఎ) జాబితాలో చేరిపోయాయి. రాష్ట్రంలో భూముల రీ సర్వే జరుగుతున్న క్రమంలో గ్రామ సర్విసు ఈనాం భూములపై రైతుల నుంచి పెద్దఎత్తున వినతులు వచ్చాయి. రైత్వారీ పట్టాలు పొందిన వారి నుంచి తాము కొన్నామని, తమ పేర్లను రెవెన్యూ రికార్డుల్లోకి ఎక్కించడంలేదని, తమకు న్యాయం చేయాలని కోరారు. ధార్మిక సంస్థల ఈనాం, సర్విసు ఈనాం భూముల మధ్య తేడా ఇదే ఈ వినతులను పరిశీలించిన ప్రభుత్వం దేవాలయ, ధార్మిక సంస్థల ఈనాం, గ్రామ సర్వీసు ఈనాం భూముల మధ్య ఉన్న తేడాపై స్పష్టత ఇచ్చింది. ధా ర్మిక సంస్థల ఈనాం భూములను కేవలం ఆ దేవాలయాలు, అందులోని దేవుడి సేవల కోసం మాత్రమే ఇచ్చారు. అవి ఎప్పటికీ దేవాలయాలవే తప్ప వేరే వ్యక్తులు పొందే అవకాశం ఉండదు. గ్రామ సర్విసు ఈనాం భూములను అందరి మేలు కోసం పనిచేసిన కుల వృత్తుల వారికి (క్షురకులు, చాకలి, మంగలి వంటి వృత్తులు) ఇచ్చారు. ఆ భూములు ఆ వ్యక్తులు, వారి వారసులకు వస్తాయి. ఇలా సర్వీసు చేసిన కుల వృత్తుల వారి సంఖ్య గ్రామాల్లో చాలా పెద్ద సంఖ్యలో ఉండడం వల్లే వారికి రైత్వారీ పట్టాలు మంజూరు చేశారు. ఈ నేపథ్యంలో 2013లో ఈనాం చట్టానికి చేసిన సవరణలు గ్రామ సర్వీసు ఈనాం భూములకు వర్తించవని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. ఈ భూములన్నింటినీ 22(ఎ) నుంచి తొలగించాలని, వారి పేర్లను రికార్డుల్లోకి ఎక్కించాలని జిల్లా కలెక్టర్లు, ఆర్డీవోలు, తహసీల్దార్లను ఆదేశించారు. -
అక్టోబర్లో అసెంబ్లీ షెడ్యూల్!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల కోసం రెవెన్యూ శాఖ సమాయత్తం అవుతోంది. ఈ ఏడాది అక్టోబర్ 5–15 తేదీల మధ్యలో ఎన్నికల షెడ్యూల్ వెలువడే అవకాశం ఉందని, అందుకు తగినట్టుగా కార్యాచరణ మొదలైందని రెవెన్యూ వర్గాలు వెల్లడించాయి. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా రిటర్నింగ్ అధికారులు (ఆర్వో), అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారుల (ఏఆర్వో)తోపాటు క్షేత్రస్థాయిలో ఎంత మంది సిబ్బంది అవసరమనే దానిపై కసరత్తు జరుగుతోందని తెలిపాయి. ఆర్వోలుగా డిప్యూటీ కలెక్టర్లు, జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్లతోపాటు ఈసారి జిల్లాల అదనపు కలెక్టర్లకు బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని వివరించాయి. ఈ మేరకు 74 మంది డిప్యూటీ కలెక్టర్లు (ఇటీవలే పదోన్నతి పొందిన వారితో కలిపి), 14 మంది డిప్యూటీ కమిషనర్లు, 31 మంది అదనపు కలెక్టర్లను సిద్ధం చేయనున్నట్టు సమాచారం. ఇక అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులుగా 119 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోనికి వచ్చే అన్ని మండలాల తహసీల్దార్లకు బాధ్యతలు అప్పగించనున్నట్టు తెలిసింది. ఏఆర్వోల పర్యవేక్షణలో క్షేత్రస్థాయి ఏర్పాట్లు నామినేషన్ల ప్రక్రియతోపాటు పోలింగ్ సామాగ్రి సమకూర్చుకోవడం, పోలింగ్ బూత్ల ఏర్పాటు, ఈవీఎంలు, బ్యాలెట్ పేపర్లు సిద్ధం చేయడం, పోలింగ్ స్టేషన్లలో కనీస సౌకర్యాల కల్పన వంటి ఏర్పాట్లన్నీ ఏఆర్వోల పర్యవేక్షణలో జరగనున్నాయి. ప్రస్తుతం ఓటర్ల జాబితా తయారీలో భాగంగా అసిస్టెంట్ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ (ఏఈఆర్వో) అధికారులుగా తహసీల్దార్లు పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో అక్టోబర్ 4న ఓటర్ల తుది జాబితా ప్రచురణ ఉండటంతో, ఆ తర్వాతే షెడ్యూల్ వస్తుందని రెవెన్యూ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇక వచ్చే ఏడాది జరగనున్న లోక్సభ ఎన్నికలకు మార్చి 5–15వ తేదీ మధ్య షెడ్యూల్ వచ్చే అవకాశం ఉందని చెప్తున్నాయి. 2018లో ముందస్తు ఎన్నికలతో.. గత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు లోక్సభ ఎన్నికలతోపాటు 2019 ఏప్రిల్–మే నెలల్లో జరగాలి. కానీ రాష్ట్రంలో రాజకీయ కంగాళీ వాతావరణం ఏర్పడిందని.. తనను, ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసేందుకు ప్రతిపక్షాలు నిరాధార ఆరోపణలు చేస్తున్నాయని పేర్కొంటూ.. సీఎం కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లారు. 2018 సెప్టెంబర్ 6న ప్రభుత్వాన్ని రద్దు చేస్తూ కేబినెట్లో తీర్మానించి.. అప్పటి గవర్నర్ను నరసింహన్కు అందజేయడం, ఆయన వెంటనే ఆమోదించడం, అదే రోజున 105 మంది బీఆర్ఎస్ అభ్యర్థులను కేసీఆర్ ప్రకటించడం చకచకా జరిగాయి. అప్పుడు దేశంలో మరో నాలుగు రాష్ట్రాలకూ ఎన్నికల సమయం కావడంతో.. వాటితోపాటు తెలంగాణనూ కలిపి అక్టోబర్ 6న ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. నవంబర్ 12న నోటిఫికేషన్ జారీకాగా డిసెంబర్ 7న పోలింగ్, 11న ఓట్ల లెక్కింపు జరిగాయి. ఆ ఎన్నికల్లో బీఆర్ఎస్ మెజారిటీ సీట్లు గెల్చుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈసారి అదే సమయంలో..! ఈసారి కూడా ఆ నాలుగు రాష్ట్రాలతో కలిపి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలను నిర్వహించే అవకాశాలు ఉన్నాయని అధికార వర్గాలు చెప్తున్నాయి. 2018లో జరిగిన 5 రాష్ట్రాల్లో ఎన్నికల్లో భాగంగా.. ఛత్తీస్గఢ్లో నవంబర్ 12, 20 తేదీల్లో రెండు దశల్లో పోలింగ్ జరిగింది. మధ్యప్రదేశ్, మిజోరం రాష్ట్రాల్లో నవంబర్ 28న, రాజస్థాన్, తెలంగాణ రాష్ట్రాల్లో డిసెంబర్ 7న పోలింగ్ నిర్వహించారు. ఈసారి కూడా ఐదు రాష్ట్రాల పోలింగ్ ప్రక్రియ డిసెంబర్ 5–9 తేదీల మధ్య ముగిసే అవకాశాలు ఉన్నాయని.. ఇందుకు అనుగుణంగా అక్టోబర్ రెండో వారంలోనే షెడ్యూల్ రావొచ్చని అధికార వర్గాలు చెప్తున్నాయి. -
కౌలు రైతులకు చకచకా కార్డుల పంపిణీ
సాక్షి, అమరావతి: కౌలు రైతులకు పెద్దఎత్తున కౌలు కార్డులు జారీ చేసే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక సీసీఆర్సీ (క్రాప్ కల్టివేషన్ రైట్స్ కార్డ్స్) మేళాలు నిర్వహిస్తోంది. ఆర్బీకే స్థాయిలో మేళాలు నిర్వహించేలా వ్యవసాయ, రెవెన్యూ శాఖలు చర్యలు చేపట్టాయి. కౌలు రైతులకు నూరు శాతం పంట రుణాలు ఇవ్వాలన్న సంకల్పంతో ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల(పీఏసీఎస్ల)ను ప్రభుత్వం ఇప్పటికే ఆర్బీకేలతో అనుసంధానించింది. ప్రతి కౌలు రైతుకు రుణంతోపాటు ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందించాలన్న భావనతో కౌలుదారులందరికీ పంట సాగు హక్కు పత్రాలు (కౌలు కార్డులు) జారీ చేయాలని లక్ష్యంగా నిర్దేశించింది. ఈ ఏడాది ఇప్పటికే 1.10 లక్షల మంది కౌలు రైతులకు కౌలు కార్డులను అధికారులు జారీ చేశారు. మిగిలిన వారికి జారీ చేసే ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. ఈ ప్రక్రియ పూర్తి కాగానే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన కౌలుదారుల వివరాలను రైతు భరోసా పోర్టల్లో అప్లోడ్ చేసి ఆగస్టు లేదా సెప్టెంబర్లో వైఎస్సార్ రైతు భరోసా కింద ఈ ఏడాది తొలివిడత సాయం అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. రక్షణ కవచం సీసీఆర్సీ చట్టం రాష్ట్రంలో 76.21 లక్షల మంది రైతులు ఉండగా.. వీరిలో కౌలు రైతులు ఎంతమంది ఉన్నారనే దానిపై వేర్వేరు అంచనాలు ఉన్నాయి. గతంలో కౌలుదారులు రుణాలు, ప్రభుత్వ సంక్షేమ ఫలాల కోసం నానాఅగచాట్లు పడేవారు. వీరికి ఎలాంటి పూచీకత్తు లేకుండా రూ.1.60 లక్షల వరకు పంట రుణం అందించే అవకాశం ఉన్నా.. బ్యాంకులు నిబంధనల పేరుతో మొండిచేయి చూపేవి. ఈ నేపథ్యంలో కౌలుదారులకు మేలు చేయాలన్న సంకల్పంతో 2019లో తెచ్చిన పంట సాగుదారుల హక్కు పత్రాల (సీసీఆర్సీ) చట్టంతో 11 నెలల కాల పరిమితితో ప్రభుత్వమే కౌలు కార్డులు జారీ చేస్తోంది. వీటిద్వారా కౌలు రైతులకు నాలుగేళ్లుగా పంట రుణాలతో పాటు వైఎస్సార్ రైతు భరోసా, సున్నా వడ్డీ రాయితీ, పంటల బీమా, పంట నష్టపరిహారం (ఇన్పుట్ సబ్సిడీ) వంటి సంక్షేమ ఫలాలు అందిస్తున్నారు. వీరు పండించిన పంటలను ఈ క్రాప్ ఆధారంగా ఆర్బీకేల ద్వారా కనీస మద్దతు ధరకు కొనుగోలు చేస్తున్నారు. నూరు శాతం కౌలు కార్డుల జారీ లక్ష్యం సీసీఆర్సీ మేళాలకు మంచి స్పందన వస్తోంది. ఇప్పటికే 1.10 లక్షల మందికి కౌలు కార్డులు జారీ చేశాం. భూ యజమానులు సహకరిస్తే మరింత మందికి మేలుచేసే అవకాశం ఉంటుంది. సీసీఆర్సీ కార్డుల ఆధారంగా పంట రుణాలతో పాటు అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందచేస్తాం. – చేవూరు హరికిరణ్, స్పెషల్ కమిషనర్, వ్యవసాయ శాఖ -
బదిలీలకు వేళాయె!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర భూపరిపాలన (ల్యాండ్ రెవెన్యూ) శాఖ పరిధిలో భారీ ఎత్తున బదిలీలకు రంగం సిద్ధమవుతోంది. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల నిర్వహణలో ప్రత్యక్ష, పరోక్ష సంబంధముండే అధికారుల బదిలీలు చేపట్టాలని కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) ఆదేశించిన మేరకు ప్రభుత్వం ఈ చర్యలు చేపడుతోంది. ఇటీవలే ఉమ్మడి మెదక్ జిల్లాలోని రెవెన్యూ డివిజనల్ అధికారుల (ఆర్డీవో) బదిలీలు జరిగాయి. ఈక్రమంలో రాష్ట్రవ్యాప్తంగా ఆర్డీవోల బదిలీలకు సర్వం సిద్ధమైందని, ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు త్వరలో ఉత్తర్వులు వెలువడతాయని సమాచారం. ప్రస్తుతం రాష్ట్రంలో దశాబ్ది ఉత్సవాలు జరుగుతుండటంతో.. ఈ కార్యక్రమాలు ముగిశాక బదిలీలు ఉంటాయని భూపరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్ఏ) కార్యాలయ వర్గాలు చెప్తున్నాయి. తహసీల్దార్ల బదిలీలపై కొంత కసరత్తు జరిగిందని.. సీఈసీ ఆదేశించిన విధంగా జూలై నెలాఖరుకల్లా ఆ ప్రక్రియ కూడా పూర్తవుతుందని అంటున్నాయి. 70 శాతం తహసీల్దార్లకు బదిలీ! గత లోక్సభ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో తహసీల్దార్ల బదిలీలు జరగలేదు. ఈ నేపథ్యంలో కొత్తగా విధుల్లో చేరినవారు, 317 జీవో ద్వారా స్థానికత ప్రాతిపదికన సర్దుబాటైనవారు మినహా 70% తహసీల్దార్లకు ట్రాన్స్ఫర్లు ఉంటాయని అంచనా. రాష్ట్రంలో తహసీల్దార్లు అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా అసిస్టెంట్ ఎలక్షన్ రిజిస్ట్రేషన్ అధికారులు (ఏఈఆర్వో)గా పనిచేస్తున్నారు. ఈ ప్రక్రియలో నిమగ్నమయ్యే అధికారులను అక్టోబర్ 4న ఓటర్ల తుది జాబితా ప్రచురించే వరకు.. అదే స్థానాల్లో పనిచేయించుకోవాలని, అనివార్యంగా బదిలీ చేయాల్సి వస్తే తమ అనుమతి తీసుకోవాలని ఎన్నికల సంఘం వెల్లడించింది. ప్రభుత్వానికి ఉన్న వెసులుబాటు మేరకు అవసరమైతే దశాబ్ది ఉత్సవాల తర్వాత బదిలీలు ఉంటాయని.. లేదంటే అక్టోబర్ 4 వరకు ఆగాల్సి ఉంటుందనే చర్చ జరుగుతోంది. పదోన్నతులిస్తేనే సజావుగా ఎన్నికల విధులు రెవెన్యూ శాఖలో పదోన్నతులు కల్పిస్తేనే ఎన్నికల విధుల నిర్వహణ సజావుగా సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు రిటర్నింగ్ అధికారి (ఆర్వో)గా విధులు నిర్వహించడం కోసం 119 మంది డిప్యూటీ కలెక్టర్ (ఆర్డీవో) స్థాయి అధికారులు కావాలి. ప్రస్తుతం రాష్ట్రంలో 74 మంది డిప్యూటీ కలెక్టర్లు మాత్రమే డివిజన్లలో పనిచేస్తున్నారు. ఇందులోనూ 19 ఖాళీలున్నాయి. అయితే ఈ 19 ఖాళీలకుగాను 19 మంది తహసీల్దార్లు, సెక్షన్ అధికారులు, సూపరిండెంట్లకు పదోన్నతులు కల్పించారు. వీరితోపాటు జీహెచ్ఎంసీ పరిధిలో 14 మంది డిప్యూటీ కమిషనర్లు కూడా రిటర్నింగ్ అధికారి బాధ్యతలు నిర్వహించాల్సి ఉంటుంది. వీరిని కలిపినా మరో 50 మంది వరకు ఆర్వోల కొరత ఉంటుంది. ఇక డిప్యూటీ కలెక్టర్ల హోదాలో ఉన్న పలువురు ఇతర శాఖల్లో డిప్యుటేషన్పై పనిచేస్తున్నారు. వారిని రిటర్నింగ్ అ«ధికారులుగా నియమిస్తే.. అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలు ముగిసేదాకా దాదాపు ఏడాది పాటు ఆయా శాఖల్లో పనులకు ఆటంకం కలగనుంది. ఈ క్రమంలో తహసీల్దార్లకు డిప్యూటీ కలెక్టర్లుగా పదోన్నతులు ఇవ్వడం ద్వారా రిటర్నింగ్ అధికారుల కొరత ఏర్పడకుండా ఉంటుందని రెవెన్యూ ఉద్యోగుల సంఘం (ట్రెసా) అంటోంది. 19 మందికి ఆర్డీవోగా పదోన్నతులు రెవెన్యూ శాఖలో తహసీల్దార్లు, సెక్రటేరియట్లో సెక్షన్ ఆఫీసర్లు, సీసీఎల్ఏ కార్యాలయంలో సూపరింటెండెంట్లుగా పనిచేస్తున్న 19 మందికి డిప్యూటీ కలెక్టర్లు (ఆర్డీవో)లుగా పదోన్నతి కల్పిస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. తహసీల్దార్లు కె.మహేశ్వర్, ఎం.సూర్యప్రకాశ్, మురళీకృష్ణ, కె.మాధవి, ఎల్.అలివేలు, బి.శకుంతల, కె.సత్యపాల్రెడ్డి, వి.సుహాసిని, భూక్యా బన్సీలాల్, బి.జయశ్రీ, ఎం.శ్రీనివాసరావు, డి.దేవుజా, డి.ప్రేమ్రాజ్, ఉప్పల లావణ్య, డి.చంద్రకళ పదోన్నతులు పొందారు. -
AP: చిట్స్ నిర్వహణలో ఇక కొత్త విధానం
సాక్షి, అమరావతి: ఏపిలో చిట్ ఫండ్ వ్యాపారం పారదర్శకంగా జరిగేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో.. చిట్స్ నిర్వహణలో ఏపీ ప్రభుత్వం కొత్త విధానాన్ని తీసుకొచ్చింది. ఇక నుంచి అంతా ఆన్ లైన్ విధానంలోనే సాగనుందని ఏపీ రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు వెల్లడించారు. అంతేకాదు.. ఇ -చిట్స్ అనే ఎలక్ట్రానిక్ అప్లికేషన్ ను ప్రారంభించారాయన. కొత్త విధానం ప్రకారం అన్ని చిట్ ఫండ్ కంపెనీలు అన్ లైన్ ద్వారా మాత్రమే లావాదేవీలు నిర్వహించాలి. ఇందుకోసం ఏపీ రెవిన్యూ రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖలు ఇ-చిట్స్ అనే ఎలక్ట్రానిక్ను రూపొందించాయి. చందాదారులు అంతా ఇ- చిట్స్ ద్వారా తన డబ్బు సురక్షితంగా ఉందో లేదో.. ఈ కొత్త విధానం ద్వారా తెలుసుకోవచ్చు. చందాదారు మోసపోకుండా చూడాలనే ఈ విధానం తీసుకొచ్చినట్లు మంత్రి ధర్మాన వెల్లడించారు. రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు ఆన్లైన్లో పరిశీలించి ఆమోదం తెలియజేస్తారు. ఈ విధానం ద్వారా మాత్రమే ఇక నుంచి చిట్ లు నిర్వహించాల్సి ఉంటుంది. అలాగే.. గతంలో నమోదు అయిన సంస్థలు క్రమంగా ఈ విధానంలోకి రావాల్సిందేనని మంత్రి ధర్మాన స్పష్టం చేశారు. -
రూ. 260 కోట్ల వక్ఫ్ భూమికి ఎసరు! చక్రం తిప్పిన రియల్ ఎస్టేట్ సంస్థ
సాక్షి, హైదరాబాద్: వక్ఫ్బోర్డు భూములు దర్జాగా రియల్ ఎస్టేట్ వెంచర్లుగా మారిపోతున్నాయి. రెవెన్యూ శాఖ (ధరణి)తో పాటు స్టాంప్లు, రిజిస్ట్రేషన్ల శాఖ నిషేధిత జాబితాలో పొందుపర్చిన భూములకు కనీస పరిశీలన లేకుండానే లేఅవుట్ అవుట్ పర్మిషన్లు జారీ అవుతుండగా, ప్లాట్ల రిజిస్ట్రేషన్ల ప్రక్రియ యథేచ్ఛగా కొనసాగుతోంది. తాజాగా హైదరాబాద్ శివారులో ఔటర్ రింగ్ రోడ్డును ఆనుకుని ఉన్న కొంగర కుర్దు–ఏలో ఈ విధంగా ఓ భారీ రియల్ వెంచర్ వెలుగుచూసింది. సుమారు రూ.260 కోట్ల విలువైన 52.25 ఎకరాల వక్ఫ్ భూములకు సంబంధించి హైకోర్టులో వివాదం కొనసాగుతుండటం గమనార్హం. ఇంత జరుగుతున్నా వక్ఫ్ బోర్డు ప్రేక్షక పాత్ర పోషించడం అనుమానాలకు తావిస్తోంది. ఇదీ కథ..: రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం కొంగరకుర్దు–ఏలో సర్వే నంబర్ 2 నుంచి 400 వరకు దర్గా సయ్యద్ శారాజ్ ఖత్తాల్ హుస్సేనీ ఖిబ్లా పేరిట సుమారు 500 ఎకరాలకు పైగా వక్ఫ్ భూమి ఉంది. 1954 నుంచి ఇప్పటివరకు పహాణీల్లో పట్టాదారు కాలంలో దర్గా పేరే నమోదై ఉంది. 2007లో వక్ఫ్బోర్డు గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయగా ఆ భూమిని సాగు చేసుకుంటున్న రైతులందరితో పాటు సర్వే నంబర్ 86, 87, 88, 89లోని సుమారు 52.25 ఎకరాల భూమి సాగు చేసే చెట్కూరి వంశీయులు కూడా గెజిట్ను సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు. కోర్టు స్టేటస్ కో ఆర్డర్ జారీ చేయడంతో అప్పటి నుంచి కేసు పెండింగ్లోనే ఉంది. ప్రభుత్వ రెవెన్యూ రికార్డులతో పాటు రిజిస్ట్రేషన్ల శాఖ నిషేధిత జాబితాలో సైతం ఆయా సర్వే నంబర్ల వివరాలు పొందుపర్చారు. ఫలితంగా భూముల రిజిస్ట్రేషన్లు కూడా నిలిచిపోయాయి. పహాణీ, ధరణిలో కబ్జాదారుడు (పీటీ)ల కాలమ్లో చెట్కూరి కుటుంబ వంశీయుల పేర్లు, పట్టాదారుల కాలమ్లో దర్గా సయ్యద్ శారాజ్ ఖత్తాల్ హుస్సేనీ ఖిబ్లా పేరు కొనసాగుతూ వస్తోంది. కాగా 2010లో రోడ్డు కోసం సేకరించిన భూమికి గాను ప్రభుత్వం చెట్కూరి కుటుంబాలకు పరిహారం అవార్డు ప్రకటించింది. అయితే కోర్టు వివాదం కారణంగా తుది తీర్పును బట్టి పరిహారం చెల్లింపు వర్తించే విధంగా నిబంధన చేర్చింది. సందట్లో సడేమియా.. హైకోర్టులో వివాదం కొనసాగుతుండగానే ఒక రియల్ ఎస్టేట్ సంస్థ రంగ ప్రవేశం చేసింది. గ్రామంలో లేని ఇద్దరు రైతుల పేరిట సుమారు 52.25 ఎకరాలకు సంబంధించి పాత తేదీలతో తప్పుడు పత్రాలు çసృష్టించినట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఒక రైతు పేరిట సర్వే నంబర్ 86, 87లోని 24.15 ఎకరాలు, మరొకరి పేరిట సర్వే నంబర్ 88, 89లోని 28.10 ఎకరాలకు సంబంధించి తప్పుడు పత్రాలు సృష్టించారు. అప్పటి తూర్పు డివిజన్ (గోషామహల్) రెవెన్యూ అధికారి జారీ చేసినట్లుగా.. ఓఆర్సీ (ఆక్యుపెన్సీ రైట్స్ సర్టిఫికెట్) ప్రొసీడింగ్, తప్పుడు పట్టాదారు పాస్ బుక్, టైటిల్ నంబర్, ఖాతా నంబర్, వారసత్వం, భూ మార్పిడి పత్రాలు సృష్టించినట్లు తెలుస్తోంది. మరోవైపు మండల రెవెన్యూ శాఖ అధీనంలో ఉండే కచ్చా పహాణీలో రైతుల పేర్లు చేర్చారు. అయితే ధరణికి ముందు ల్యాండ్ రెవెన్యూ రికార్డుల్లో (ఆన్లైన్) కానీ, తాజా ధరణి రికార్డులో కానీ ఈ వివరాలు లేకపోవడం ఇవి తప్పుడు పత్రాలేనన్న అనుమానాలకు బలం చేకూర్చుతోంది. పాస్బుక్ ఖాతా నంబర్లను పరిశీలిస్తే సర్వే నంబర్ల వాస్తవ పరిస్థితికి భిన్నంగా కనిపిస్తోంది. కాగా సదరు రియల్ ఎస్టేట్ సంస్థ ఆ భూమిపై జీపీఏ తీసుకుంది. దీని ఆధారంగా వెంచర్ వేసి భూమి రిజిస్ట్రేషన్కు ప్రయత్నించగా నిషేధిత జాబితాలో ఈ భూమి వివరాలు ఉండటంతో చుక్కెదురయ్యింది. దీంతో రిజిస్ట్రేషన్కు అనుమతి కోరుతూ రియల్ సంస్థ కోర్టును ఆశ్రయించి తమకు అనుకూలంగా తాత్కాలిక ఆదేశాలు పొందింది. అయితే ఇది తుది తీర్పుపై ఆధారపడి ఉంటుందని కోర్టు స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో పోలీసుల సహకారంతో సదరు రియల్ ఎస్టేట్ సంస్థ భూములను తమ అధీనంలోకి తీసుకుంది. విషయం తెలిసిన చెట్కూరి వంశీయులు ఈ కేసులో తమను ఇంప్లీడ్ చేయాలని కోర్టును కోరారు. దీనిపై విచారణ పెండింగ్లో ఉంది. కోర్టు ఆదేశాల సాకుతో.. దర్గాకు సంబంధించి సర్వే నంబర్ 82లోని ఆరు ఎకరాలకు గతంలో లేఅవుట్ పర్మిషన్ (ఎల్పీ) జారీ చేసిన హెచ్ఎండీఏ..రియల్ సంస్థ దరఖాస్తు మేరకు తాజాగా ఈ 52.25 ఎకరాలకు ఎల్పీ జారీ చేసింది. సదరు రియల్ ఎస్టేట్ సంస్థ ఎల్పీ కోసం దరఖాస్తు చేసుకున్న సమాచారం తెలిసి ధరణిలో పట్టాదారుగా నమోదైన రైతులు.. ఎల్పీ జారీ చేయవద్దని, ఆ భూములపై 12 కేసులు ఉన్నాయంటూ, హెచ్ఎండీఏ వద్ద పలు ఆధారాలతో సహా అభ్యంతరాలు వ్యక్తం చేశారు. అయినప్పటికీ భూములపై కోర్టు తుది తీర్పు షరతును సాకుగా తీసుకుని, భూముల వివరాలను పూర్తి స్థాయిలో పరిశీలించకుండానే హెచ్ఎండీఏ ఎల్పీ జారీ చేయడం అనుమానాలకు తావిస్తోంది. రిజిస్ట్రేషన్ శాఖ కూడా ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేయడం గమనార్హం. కాగా వక్ఫ్ బోర్డు మౌనంగా ఉండటంపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాగా ఒకవేళ కోర్టు తుది తీర్పు ప్రతికూలంగా వస్తే ప్లాట్ల కొనుగోలుదారుల పరిస్థితేంటనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. దీనిపై వివరణ కోరేందుకు ఫోన్లో ప్రయత్నించగా హెచ్ఎండీఏ అధికారులు, వక్ఫ్బోర్డు చైర్మన్ స్పందించక పోవడం గమనార్హం. ‘సర్వే నంబర్లు నిషేదిత జాబితాలో ఉన్నమాట వాస్తవమే. అయితే కోర్టు ఆదేశాల మేరకు రిజిస్ట్రేషన్లు చేస్తున్నాం..’అని మహేశ్వరం సబ్ రిజిస్ట్రార్ మహేందర్ స్పష్టం చేశారు. -
కుల ధ్రువీకరణ పత్రాలు రెడీ..
సాక్షి, అమరావతి: పదో తరగతి విద్యార్థులు అడక్కుండానే.. వారికి కుల ధ్రువీకరణ సర్టీఫికెట్లు జారీచేసే కొత్త విధానానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. గ్రామ, వార్డు సచివాలయాల స్థాయిలో మెరుగైన సేవల్ని అందించే క్రమంలో ఎక్కడా, ఎప్పుడూ లేనివిధంగా సరికొత్తగా రాష్ట్రంలో ఈ విధానాన్ని తీసుకువచ్చారు. సాధారణంగా పదో తరగతి పూర్తయిన విద్యార్థులు.. ఇంటర్, ఆపై చదువుల కోసం తప్పనిసరిగా కుల ధ్రువీకరణ సర్టిఫికెట్లు ఇవ్వాల్సి ఉంటుంది. అంతకుముందు కుల ధ్రువీకరణ సర్టిఫికెట్లు తీసుకున్నా.. పదో తరగతి ఉత్తీర్ణులయ్యాక తాజా సర్టిఫికెట్ తీసుకోవడం తప్పనిసరి. దీంతో విద్యా సంవత్సరం ప్రారంభంలో ఈ సర్టిఫికెట్ల కోసం గతంలో మీసేవ, తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ విద్యార్థులు తిరిగేవారు. దీంతో ఆయా కార్యాలయాలు విద్యార్థులతో కిటకిటలాడేవి. దీనిని గమనించిన ప్రభుత్వం విద్యార్థులు అడక్కుండానే కుల ధ్రువీకరణ పత్రాల జారీని చేపట్టింది. ఇందుకోసం ఈ సంవత్సరం పదో తరగతి పరీక్షలు రాసిన 10 లక్షల మంది విద్యార్థుల వివరాల డేటాను విద్యా శాఖ ద్వారా తీసుకున్నారు. ఆ డేటా మొత్తాన్ని గ్రామ, వార్డు సచివాలయం డేటాబేస్కు అనుసంధానించారు. వీఆర్వోల ద్వారా తనిఖీ చేయించి.. సేకరించిన డేటాను రెవెన్యూ శాఖ గ్రామాల వారీగా విభజించి గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో పనిచేసే వీఆర్వో లాగిన్లకు పంపించింది. వీఆర్వోలు తమ పరిధిలోని పదో తరగతి విద్యార్థుల ఇళ్లకు వెళ్లి వారి కుల ధ్రువీకరణను పరిశీలించి నివేదికలు రూపొందించారు. విద్యార్థితోపాటు వారి కుటుంబ సభ్యులందరి సామాజిక వర్గాన్ని కూడా నిర్ధారించారు. అంటే ఒక్కో కుటుంబానికి నలుగురు సభ్యుల లెక్కన దాదాపు 40 లక్షల మంది సామాజిక వర్గాన్ని ధ్రువీకరించారు. ఈ సర్టిఫికెట్లు వీఆర్వో లాగిన్ నుంచి తహసీల్దార్లకు పంపించారు. అక్కడి నుంచి సర్టీఫికెట్లు జారీ చేస్తున్నారు. ఇప్పుడు పదో తరగతి విద్యార్థి ఎవరైనా తమ పరిధిలోని గ్రామ, వార్డు సచివాలయానికి వెళ్లి.. వెంటనే తమ కుల ధ్రువీకరణ పత్రం పొందే అవకాశం కల్పించారు. దరఖాస్తులతో పని లేదు గతంలో మాదిరిగా విద్యార్థులు కుల ధ్రువీకరణ పత్రం కోసం దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేకుండా.. వెరిఫికేషన్ చేయాల్సిన పని లేకుండా నేరుగా విద్యార్థులకు సర్టీఫికెట్లు జారీ చేస్తారు. ప్రస్తుతం సేకరించిన 40 లక్షల మంది వివరాలు గ్రామ, వార్డు సచివాలయ డేటాబేస్లో నిక్షిప్తమై ఉంటాయి. భవిష్యత్లో 40 లక్షల మందిలో ఎవరికైనా కుల ధ్రువీకరణ పత్రం కావాల్సి వస్తే.. గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలోనే ఎలాంటి వెరిఫికేషన్ లేకుండానే తక్షణం జారీ చేస్తారు. గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా పల్లె ముంగిటకు వచ్చిన పరిపాలన, సాంకేతికతను అనుసంధానించి సర్టిఫికెట్ల జారీని ప్రభుత్వం సులభతరం చేసింది. తద్వారా 10 లక్షల మంది విద్యార్థులు, వారి కుటుంబాలకు ప్రయోజనం చేకూర్చిపెట్టింది. -
మూడొంతులు గల్లంతు!
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం కొంగర కుర్దులో సయ్యద్ శారాజ్ ఖత్తాల్ హుస్సేన్ దర్గాకు సుమారు 500 ఎకరాల భూమి ఉంది. చాలావరకు భూమి సాగులో ఉంది. 2008లో వక్ఫ్బోర్డు గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయడంతో కొందరు రైతులు కోర్టును ఆశ్రయించి స్టే పొందారు. ఇలావుండగా సర్వే నంబర్ 82/అ/1/1లోని ఆరు ఎకరాలకు సంబంధించి ఒక రైతు పేరిట 2018లో పట్టాదారు పాస్బుక్ జారీ అయింది. తర్వాత తప్పిదాన్ని గుర్తించిన రెవెన్యూ అధికారులు 2021లో పాస్బుక్ను రద్దు చేశారు. అయితే అప్పటికే సదరు రైతు నుంచి భూమిని కొనుగోలు చేసిన రియల్టర్లు రిజిస్ట్రేషన్ కు ప్రయత్నించగా నిషేధిత జాబితా కారణంగా ప్రక్రియ నిలిచిపోయింది. మరోవైపు హెచ్ఎండీఏఅధికారులు అవగాహన రాహిత్యంతో భూమికి లే అవుట్ పర్మిషన్స్ (ఎల్పీ) నంబర్ జారీ చేయడంతో, ఫైనల్ లే అవుట్ అప్రూవల్ కోసం సదరు రియల్టర్లు తీవ్ర ప్రయత్నాలు సాగిస్తున్నారు. సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వక్ఫ్ భూములు యథేచ్చగా ఆక్రమణలకు గురవుతున్నాయి. ఇప్పటికే వేలాది ఎకరాలు కబ్జాలో ఉన్నాయి. వక్ఫ్బోర్డు సిబ్బందే స్థిరాస్తి వ్యాపా రులతో కుమ్మక్కై రికార్డులు తారు మారు చేస్తున్నారనే ఆరోపణలు ఉండగా, ప్రభుత్వం కూడా వీటిని రెవెన్యూ భూములుగా పేర్కొంటూ అడ్డగోలుగా ధారాదత్తం చేస్తోందనే విమర్శలున్నాయి. మరోవైపు లీజులకు ఇచ్చిన భూములు సైతం క్రమంగా చేజారిపోతున్నాయి. నిజాం కాలం నుంచి వక్ఫ్ ఆస్తుల రికార్డులు ఉర్దూ, పార్సీ భాషల్లో ఉండగా, భద్రపరచాల్సిన వారే చేతివాటం ప్రదర్శిస్తున్నారనే ఆరోపణలూ ఉన్నాయి. రిటైరైన పర్మినెంట్ సిబ్బంది స్థానంలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ సిబ్బంది విధులు నిర్వర్తిస్తుండటం అక్రమార్కులకు కలిసి వస్తోంది. నామమాత్రపు చర్యలే.. వక్ఫ్బోర్డు రికార్డుల ప్రకారం రాష్ట్రంలోని దర్గాలు, మసీదులు, ఆషూర్ ఖానాలు, చిల్లాలతో పాటు స్మశానవాటికలు తదితరాల (మొత్తం 33,929) కింద సుమారు 77,588.07 ఎకరాల భూమి ఉంది. అందులో మూడొంతులు అంటే.. ఏకంగా 57,423.91 ఎకరాలు (74 శాతం) ఆక్రమణలో ఉండటం విస్మయం కలిగించే అంశం. ఉమ్మడి రంగారెడ్డి, మెదక్, ఆదిలాబాద్, హైదరాబాద్ జిల్లాల్లో అధిక శాతం భూములు కబ్జాకు గురైనట్లు తెలుస్తోంది. మెదక్లో దాదాపు పూర్తిగా పరాధీనమయ్యాయి. బోర్డు సుమారు 2,186 మంది ఆక్రమణదారులకు నోటీసులు జారీ చేసినా తదుపరి చర్యలు ముందుకు సాగలేదు. ఇటీవల హైకోర్టు ఆదేశాలతో కబ్జాలపై ఉక్కుపాదం కోసం రెవెన్యూ, పోలీసు, వక్ఫ్ బోర్డు అధికారులతో కూడిన ఒక టాస్్కఫోర్స్ ఏర్పాటైనా చలనం మాత్రం లేదు. మరోవైపు రాష్ట్ర వక్ఫ్ బోర్డులోని రికార్డుల గదికి ఐదేళ్లుగా తాళం చిప్ప వేలాడుతోంది. అవినీతి ఆరోపణలు దష్ట్యా సీఎం ఆదేశాలతో రెవెన్యూ అధికారులు కీలక రికార్డులను స్వా«దీనం చేసుకొని రికార్డు రూమ్ను సీజ్ చేశారు. అది ఇప్పటివరకు తెరుచుకోక పోవడంతో సుమారు 3,400 ఎకరాల భూమికి సంబంధించిన కోర్టు కేసులు సరైన ఆధారాలు లేక వీగిపోయాయి. కబ్జాల పర్వం.. ♦ నల్లగొండ జిల్లా దేవరకొండలో 111 ఎకరాల 8 గుంటల వక్ఫ్ భూమిలో సుమారు 83 ఎకరాలు కబ్జా కోరల్లో చిక్కుకుంది. ♦ మల్కాజిగిరిలో హజరత్ మీర్ మెహమూద్ సాహబ్ పహాడి దర్గాకు సర్వే నంబర్ 659, 660లో సుమారు మూడు ఎకరాల వక్ఫ్ భూమి ఉంది. తాజాగా ఒక వ్యక్తి ఈ భూమిపై తిష్ట వేశాడు. ఫెన్సింగ్ వేసి ప్లాటింగ్కు సిద్ధమవుతున్నాడు. ♦ చిల్లా కోహ్–ఎ–మౌలా–అలీకి మల్లాపూర్, కీసర రాంపల్లిలో సుమారు 232 ఎకరాల భూమి ఉండగా సగానికి పైగా భూబకాసురుల ఆక్రమణలో ఉంది. ♦ మణికొండ దర్గాకు 1,654 ఎకరాల భూమి ఉన్నట్టు రికార్డులుండగా ప్రస్తుతం ఎకరం భూమి కూడా కన్పించడం లేదు. ♦ హకీముల్ మునవీ అల్ మారూఫ్ హకీం బాబా దర్గాకు కుతుబ్షాహీల కాలంలో దర్గా నిర్మాణం కోసం 4,448 గజాలు, దర్గా నిర్వహణ కోసం 323 ఎకరాల 18 గుంటల భూమిని వక్ఫ్ చేయగా, ప్రస్తుతం దర్గా మినహా మిగతా భూమి ఉనికి లేకుండా పోయింది. ధారాదత్తం ఇలా.. ♦ ఐదో నిజాం రాజు అఫ్జల్ దౌలా మణికొండ గ్రామ పరిధిలో హుస్సే¯న్ షావలి దర్గాకు 1,898 ఎకరాలు రాసిచ్చారు. 1959లో గెజిట్ కూడా విడుదల అయ్యింది. అయితే రికార్డుల్లో సర్కారీ పేరుతో ఉన్న వక్ఫ్ భూముల్ని రెవెన్యూగా పేర్కొంటూ ప్రభుత్వం ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టింది. ♦ పహడీషరీఫ్లో బాబా షర్ఫొద్దీన్ దర్గాకు మామిడిపల్లిలో 2,131 ఎకరాల భూమి ఉండగా, దీంట్లోంచి 1,051 ఎకరాల భూమిని వక్ఫ్బోర్డు అనుమతి లేకుండానే ప్రభుత్వం విమానాశ్రయానికి, మరో 91 ఎకరాల భూమిని ఏపీఐఐసీకి అప్పగించింది. ♦ సూర్యాపేట జిల్లా మోతె మండలం మామిళ్లగూడెంలో ఈద్గాకు చెందిన సర్వే నంబర్ 290లోని 9.20 ఎకరాల భూమిని ప్రభుత్వం రోడ్డు విస్తరణలో భాగంగా ప్రభుత్వం జాతీయ రహదారుల సంస్థ (ఎన్హెచ్ఏఐ)కు అప్పగించింది. న్యాయాధికారాలు ఉండాలి వక్ఫ్ బోర్డుకు ప్రత్యేక న్యాయాధికారాలు ఉండాలి. వక్ఫ్, రెవెన్యూ భూములపై స్పష్టత రావాలి. కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ సిబ్బంది స్థానంలో శాశ్వత ఉద్యోగులను నియమించాలి. రికార్డులు గల్లంతు కాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి. అక్రమణలను తొలగించేందుకు పోలీసు, రెవెన్యూ యంత్రాంగం సహకరించాలి. – అబుల్ పత్హే బందగి బద్షా రియాజ్ ఖాద్రీ, పాలక మండలి సభ్యుడు, వక్ఫ్బోర్డు. హైదరాబాద్ రికార్డుల గదిని తక్షణమే తెరిపించాలి వక్ఫ్ భూముల రికార్డుల గదిని తక్షణమే తెరిపించాలి. కోర్టు వివాదాల్లోని భూములపై సమగ్ర ఆధారాలు సమర్పించే విధంగా చర్యలు అవసరం. అప్పుడే వక్ఫ్ భూముల పరిరక్షణ సాధ్యమవుతుంది. ప్రభుత్వం దీనిని సీరియస్గా తీసుకోవాలి. – సయ్యద్ ఇఫ్తేకర్ హుస్సేనీ, వక్ఫ్ భూముల పరిరక్షణ కమిటీ గద్వాలలోని హజరత్ సయ్యద్ షా మరూఫ్ పీర్ ఖాద్రీ దర్గాకు 39.8 ఎకరాల భూమి ఉంది. సంగాలలోని సర్వే నంబర్ 95, 96, 97, 98లోని 27.9 ఎకరాల భూమిని దర్గా ముతవల్లి ద్వారా స్థానిక రైతు ఒకరు సాగు కోసం లీజుపై తీసుకున్నారు. తర్వాత ఆ రైతు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడటంతో అతని సోదరుడు రెవెన్యూ శాఖ ద్వారా యాజమాన్య హక్కు సర్టిఫికెట్ (ఓఆర్సీ) పొందాడు. తర్వాత తన పేరిట మారి్పడి చేసుకొని ప్లాటింగ్కు ప్రయత్నించాడు. దర్గాకు చెందినవారి ఫిర్యాదుతో జాయింట్ కలెక్టర్ కోర్టు ఓఆర్సీపై స్టే ఇవ్వగా దానిపై హైకోర్టు స్టే విధించింది. -
వీడిన ‘షరతుల’ చెర
భూమి(తల) రాత మార్పు నాలుగైదు తరాల నుంచి వారసత్వంగా వచ్చిన ఆ భూమి ఉన్నట్టుండి ప్రభుత్వ భూమిగా మారిపోయింది. చెమటోడ్చి సంపాదించిన సొమ్ముతో కష్టపడి అలాంటి భూమిని కొనుక్కుని, రిజిస్ట్రేషన్ చేయించుకున్న వారు అన్యాయమైపోయారు. ఆ భూమిలో పంటలు పండిస్తూ సంతోషంగా ఉన్న రైతులు ఒక్కసారిగా కుదేలైపోయారు. తమకు న్యాయం చేయాలని అధికారులు, ప్రజాప్రతినిధుల చుట్టూ తిరిగినా ఎవరూ పట్టించుకోలేదు. తెలుగుదేశం ప్రభుత్వంలో ఇలా వేలాది మంది రైతులకు అన్యాయం జరిగింది. ఈ సమస్యలను వైఎస్ జగన్ ప్రభుత్వం సానుకూలంగా పరిష్కరించింది. బ్రిటీష్ కాలం నుంచి రైతుల చేతుల్లో ఉండి, రిజిస్ట్రేషన్లు కూడా జరిగిన భూములను నిషేధిత జాబితాలో చేర్చడం దారుణమని.. ఆ జాబితా నుంచి వాటిని తొలగించింది. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 17,730 సర్వే నంబర్లకు సంబంధించి 33 వేలకుపైగా ఎకరాలను 22ఏ నుంచి తీసేసింది. మోడు వారిన సుమారు 50 వేల మంది రైతుల జీవితాల్లో వెలుగులు నింపింది. ఒక్క కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలోనే 18 వేలకుపైగా ఎకరాలను 22ఏ నుంచి తీసివేశారు. కోడూరు మండలంలో 9,600 ఎకరాలను తొలగించారు. బొల్లికొండ ఫణికుమార్ – సాక్షి, అమరావతి: ఆర్ఎస్ఆర్లో షరతులు గల పట్టా అని ఉన్న 33 వేల ఎకరాల భూములను 2016లో తెలుగుదేశం ప్రభుత్వం 22ఏ (1)ఇ జాబితాలో చేర్చడంతో రైతులు కుదేలయ్యారు. 1910లో బ్రిటీష్ ప్రభుత్వం ఈ భూములను రైతులకు వేలం ద్వారా ఇచ్చినట్లు రెవెన్యూ శాఖ భావిస్తోంది. వేలం కాదు రైతులకు అసైన్డ్ చేసిందనే వాదన కూడా ఉంది. ఏదైనా వందేళ్లకు ముందు నుంచే ఆ భూములు రైతుల చేతుల్లో ఉన్నాయి. వారికి పట్టాలుండటంతోపాటు,ఆర్ఎస్ఆర్లో వారి పేర్లు నమోదయ్యాయి. అప్పటి నుంచి శిస్తు కడుతూనే ఉన్నారు. అవసరానికి వాటిని అమ్ముకున్నారు. రిజిస్ట్రేషన్లు కూడా జరుగుతున్నాయి. బ్రిటీష్ హయాం నుంచి లావాదేవీలున్న ఆ భూములను 2016 మే 5న జీఓ ఎంఎస్ నెంబర్ 196 ద్వారా టీడీపీ ప్రభుత్వం 22ఏ(1)ఇ కేటగిరీలో పెట్టేసింది. అప్పటి వరకు సర్వ హక్కులతో ఏళ్ల తరబడి ఆ భూములను అనుభవించిన రైతులు ఒక్కసారిగా రోడ్డున పడ్డారు. అమ్మకాలు, కొనుగోళ్లు నిలిచిపోయాయి. బ్యాంకు రుణాలు కూడా ఆగిపోయాయి. అప్పటికే బేరం కుదుర్చుకున్న వారు కొనడానికి ముందుకు రాలేదు. కొందరైతే కొంత డబ్బు తీసుకుని భూమిని వదులుకున్నారు. తమ కూతుళ్లకు ఆ భూమిని ఇచ్చిన తండ్రులు కొందరు అల్లుళ్లకు సమాధానం చెప్పలేక నానా బాధలు పడ్డారు. గత ప్రభుత్వం ఆ భూములపై పంట నష్టం కూడా ఇవ్వలేదు. తహశీల్దార్ నుంచి కలెక్టర్ వరకు, ఎమ్మెల్యే నుంచి మంత్రుల వరకు అనేక మంది చుట్టూ తిరిగినా ఎవరూ పట్టించుకోలేదు. ధర్నాలు చేసినా అప్పట్లో చంద్రబాబు ప్రభుత్వం కనికరించలేదు. దీంతో వేలాది రైతు కుటుంబాలకు తీరని కష్టంగా మారింది. జగన్ రాకతో మంచి రోజులు 2019లో వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో వారిలో ఆశలు చిగురించాయి. తమ సమస్యను వైఎస్సార్సీపీ ప్రజాప్రతినిధులకు చెప్పుకున్నారు. అప్పటికే ఈ సమస్యపై పోరాడిన అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ ఈ విషయాన్ని సీఎం వైఎస్ జగన్ దృష్టికి తీసుకెళ్లి రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని వివరించారు. ఈ సమస్యను పరిష్కరించి రైతులకు న్యాయం చేయాలని సీఎం ఆదేశించడంతో రెవెన్యూ శాఖ షరతులు గల పట్టా భూములపై ప్రత్యేకంగా దృష్టి సారించి అధ్యయనం చేసింది. వందేళ్ల నుంచి రైతులు అనుభవిస్తున్న భూములను 22ఏ కేటగిరీలో చేర్చడం తప్పని నిర్ధారించింది. ఒకవేళ ప్రభుత్వం రైతులకు అసైన్డ్ చేసిందనుకున్నా.. 1954కు ముందే అది జరిగింది కాబట్టి నిరభ్యంతరంగా వాటిపై రైతులకు హక్కులు ఉంటాయని తేల్చింది. దీంతో ప్రభుత్వం వాటిని రిజిస్ట్రేషన్ల చట్టం 1908 22ఏ(1)ఇ కేటగిరీ నుంచి తొలగిస్తూ 2022 అక్టోబర్ 7న జీఓ ఎంఎస్ నంబర్ 667ను జారీ చేసింది. గత ఏడాది అక్టోబర్ 20న అవనిగడ్డలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం వైఎస్ జగన్.. నిషేధిత భూముల జాబితా నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించి కొందరికి పట్టాలిచ్చారు. ఇప్పుడు ఆ భూముల రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. బ్యాంకు రుణాలు వస్తున్నాయి. ఆ భూములను సర్వ హక్కులతో రైతులు అనుభవిస్తున్నారు. అవనిగడ్డ నియోజకవర్గంలోని ఈ షరతుల బారిన పడిన ఏ రైతును కదిలించినా జగన్ ప్రభుత్వం తమకు చేసిన మేలు మరచిపోలేమని భావోద్వేగంతో చెబుతున్నారు. నా జీవితాన్ని నిలబెట్టారు.. షరతులు గల పట్టా పేరుతో నా లాంటి వేల మంది రైతుల జీవితాలను గత ప్రభుత్వం తలకిందులు చేస్తే, ప్రస్తుత సీఎం జగన్ మళ్లీ జీవితాలు ఇచ్చారు. నాకు 7.21 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. మా తాత అల్లపర్తి రామబ్రహ్మం నుంచి మా నాన్న రాధాకృష్ణకు, ఆయన నుంచి నాకు ఆ భూమి వచ్చింది. 1920 నుంచి ఆ భూమిని మా కుటుంబం సాగు చేసుకుంటోంది. అప్పటి నుంచి శిస్తు కట్టాం. అవసరమైనప్పుడు బ్యాంకుల్లో తనఖా పెట్టాం. ఏటా పంట రుణాలు తీసుకున్నాం. మూడు తరాల నుంచి మాకున్న భూమిని 2016లో ఉన్నట్టుండి ప్రభుత్వ భూమిగా ప్రకటించారు. బ్యాంకు రుణం కోసం వెళితే ప్రభుత్వ భూమి కాబట్టి ఇవ్వమన్నారు. పంట దెబ్బతింటే ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వలేదు. తనఖా పెట్టడానికి, అమ్ముకోవడానికి అవకాశం లేదు. భూమి చేతిలోనే ఉంది.. కానీ ఎందుకూ పనికిరానిదిగా మారిపోయింది. నా కూతురు పెళ్లి చేసినప్పుడు ఉన్న భూమిలో కొంత ఆమెకు ఇచ్చా. అది విలువ లేనిదంటూ ఆమె ఇబ్బందులు ఎదుర్కొంది. ఎంత మంది చుట్టూ తిరిగామో లెక్కలేదు. మేం పడిన బాధలు అన్నీ ఇన్నీ కావు. ఆ సమయంలో వైఎస్ జగన్ ఆపద్భాందవుడిలా మమ్మల్ని ఆదుకున్నారు. ఇప్పుడు సర్వ హక్కులూ వచ్చాయి. చాలా సంతోషంగా ఉంది. – అల్లపర్తి హరి మోహనరావు, భావదేవరపల్లి, నాగాయలంక మండలం, కృష్ణా జిల్లా మా పొలం మాకు దక్కింది కోడూరు మండలం మాచవరంలో సర్వే నంబర్ 446/ఏలో నాకు 83 సెంట్ల పొలం ఉంది. 2006లో బడే వాసుదేవరావు నుంచి కొనుగోలు చేశాం. రిజిస్ట్రేషన్ కూడా అయింది. ఏడాది క్రితం నా భర్తకు గుండె సమస్య రావడంతో బైపాస్ చేయాలని చెప్పారు. రూ.6 లక్షలు అవసరమవడంతో పొలం అమ్ముదామని బేరం పెడితే ఇది రిజిస్ట్రేషన్కు పనికిరాదన్నారు. కో ఆపరేటివ్ సొసైటీ రుణం కోసం వెళ్లినా ఇవ్వలేదు. పంట నష్టం కూడా ఇవ్వలేదు. చాలా బాధపడ్డాం. ఈ ప్రభుత్వం వచ్చాక మా పొలాన్ని మాకు దక్కేలా చేశారు. షరతులు గల పట్టా నుంచి తీసి దానిపై మాకు పూర్తి హక్కు కల్పించారు. చాలా ఆనందంగా ఉంది. ఈ ప్రభుత్వం మేలు మరచిపోము. – సనకా గోవర్ధన, వి.కొత్తపాలెం, కోడూరు మండలం పనికి రాదన్న భూమికి విలువ వచ్చింది నా తండ్రి సనకా కృష్ణమూర్తి నాకు 2.20 ఎకరాలు ఇచ్చారు. 2003లోనే దాన్ని నా పేరుతో రిజిష్టర్ చేసి అప్పగించారు. అప్పటి నుంచి ఆ పొలాన్ని సాగు చేసుకుంటూ అన్ని హక్కులతో ఉపయోగించుకున్నాం. 2018లో పెద్ద రుణం (ఎల్టీ లోన్) కోసం బ్యాంకుకు వెళితే ఈ భూమి 22ఏ జాబితాలో ఉందని, రాదని చెప్పారు. చాలా బాధలు పడ్డాం. ఇప్పుడు దాన్ని సరి చేశారు. జగన్ ప్రభుత్వానికి ఎంతో రుణ పడి ఉంటాం. పనికిరాదన్న మా భూమికి తిరిగి విలువ కల్పించారు. – రేపల్లె నాగరాజ, వి.కొత్తపాలెం, కోడూరు మండలం ఎంతో సంతోషంగా ఉన్నాం 2001లో మా గ్రామంలోని సర్వే నంబర్ 226/1, 228/1లో 3.31 ఎకరాలు కొని రిజిస్ట్రేషన్ చేయించుకున్నాం. 2017 తర్వాత అందులో ఒక ఎకరం మా అబ్బాయి పేరు మీద మార్చాలని వెళితే ఇది 22–ఏ జాబితాలో ఉన్నందున కుదరదన్నారు. చాలా మంది చుట్టూ తిరిగాం. ఎవరూ పట్టించుకోలేదు. అన్నం పెట్టే భూమిని ఇలా చేశారేంటని చాలా బాధ పడ్డాం. ఇప్పుడు దాన్ని సరి చేశారు. అమ్ముకోవడానికి, నా కొడుకు పేర రాయడానికి ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. సంతోషంగా ఉంది. – చిట్టిప్రోలు రామ్మోహనరావు, లింగారెడ్డిపాలెం, కోడూరు మండలం, కృష్ణా జిల్లా -
గీతం యూనివర్శిటీలో ప్రభుత్వ భూములు స్వాధీనం
సాక్షి, విశాఖపట్నం: గీతం యూనివర్శిటీలో ప్రభుత్వ భూములను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రెండేళ్ల క్రితం 36 ఎకరాల భూమిని అధికారులు స్వాధీనం చేసుకోగా, గతంలో ప్రారంభించిన ప్రక్రియకు కొనసాగింపుగా తాజాగా సర్వే నంబర్ 15,16,19,20 పరిధిలోని 4.36 ఎకరాల భూమి చుట్టూ ఫెన్సింగ్ను రెవెన్యూ సిబ్బంది వేయిస్తున్నారు. కొన్ని దశాబ్దాలుగా గీతం వర్శిటీ అవసరాలకు ప్రభుత్వ భూములను వినియోగించుకుంటోంది. అన్యాక్రాంతమైన భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. చదవండి: సాక్షి ఎఫెక్ట్: ‘సెల్ఫీ’ మాయం.. తోకముడిచిన టీడీపీ నేతలు -
సాదా బైనామాల 'రాత మారలేదు'.. కోర్టు చెప్పినా పట్టించుకోని రెవెన్యూ శాఖ
సాక్షి, హైదరాబాద్: సాదా బైనామాల ద్వారా క్రయ విక్రయాలు జరిగిన గ్రామీణ ప్రాంతాల్లోని వ్యవసాయ భూములకు హక్కులు కల్పించే అంశం పరిష్కారానికి నోచుకోవడం లేదు. ఎప్పటికప్పుడు నిర్ణయం తీసుకుంటామంటూ ప్రభుత్వం సాదా బైనామా దరఖాస్తుదారులను ఊరిస్తోందే తప్ప అడుగు ముందుకు పడటం లేదు. వీటి విషయంలో ఎలాంటి విధానపరమైన నిర్ణయమూ తీసుకోవడం లేదు. దీంతో సాదా బైనామాల క్రమబద్ధీకరణకు దాదాపు రెండున్నరేళ్లుగా ఎదురుచూస్తున్న 9.24 లక్షల మంది దరఖాస్తుదారులకు ఎదురుచూపులు మాత్రమే మిగులుతున్నాయి. సాదా బైనామాల అంశం ఇప్పటికే కోర్టులో ఉండగా, కోర్టు గ్రీన్సిగ్నల్ ఇచ్చిన దరఖాస్తులను పరిష్కరించే అంశంపై కూడా ప్రభుత్వం దృష్టి సారించకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 2.24 లక్షల దరఖాస్తులకు కోర్టు ఓకే తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాల్లో సాదా బైనామాల (రిజిష్ట్రేషన్ లేకుండా కేవలం కాగితాలపై రాసుకోవడం) ద్వారా వ్యవసాయ భూముల క్రయ విక్రయాలు కొన్ని దశాబ్దాలుగా జరుగుతున్నాయి. అయితే ఇలా అమ్మిన, కొన్న భూములపై క్షేత్రస్థాయిలో హక్కులే తప్ప చట్టబద్ధమైన హక్కులు లభించవు. ఈ చట్టబద్ధమైన హక్కుల కల్పన (క్రమబద్ధీకరణ) కోసం 2020లో ప్రభుత్వం రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించింది. అయితే 2020 అక్టోబర్ 30 నుంచి కొత్త రెవెన్యూ చట్టం అమల్లోకి వచ్చినందున దరఖాస్తు ప్రక్రియను ఆ ఏడాది నవంబర్ 10 వరకు పొడిగించింది. అయితే అక్టోబర్ 29లోపు 2.24 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా, అక్టోబర్ 30 నుంచి నవంబర్ 10 వరకు అంటే 12 రోజుల్లో మరో 7 లక్షల దరఖాస్తుల వరకు వచ్చాయి. కానీ ఈ దరఖాస్తులను పరిష్కరించే క్రమంలో న్యాయపరమైన ఇబ్బందులు ఎదురయ్యాయి. కొందరు దీనిపై హైకోర్టును ఆశ్రయించడంతో కొత్త రెవెన్యూ చట్టం అమల్లోకి రాకముందు.. అంటే 2020 అక్టోబర్ 29 వరకు వచ్చిన దరఖాస్తులను మాత్రం పరిశీలించి హక్కులు కల్పించవచ్చని తెలిపింది. అయితే కోర్టు తీసుకునే తుది నిర్ణయం మేరకు వాటి పరిష్కారం పూర్తవుతుందంటూ స్పష్టం చేసింది. 13–బీ సర్టిఫికెట్ జారీకి ఇబ్బందులు కోర్టు తీర్పు వచ్చేసరికి రాష్ట్రంలో కొత్త రెవెన్యూ చట్టం అమల్లోకి రావడంతో సాదా బైనామాల పరిష్కారం ఓ ప్రహసనంగా మారిపోయింది. వాస్తవానికి సాదా బైనామా దరఖాస్తులను పరిశీలించి హక్కులు కల్పించడం కోసం 13–బీ సర్టిఫికెట్ జారీ చేసే అధికారం పాత రెవెన్యూ చట్టం ప్రకారం తహశీల్దార్లకు ఉండేది. కానీ కొత్త చట్టంలో.. జిల్లాల కలెక్టర్లు గ్రామాలకు వెళ్లి పరిశీలించి వాటి పరిష్కారానికి సిఫారసు చేస్తేనే తహశీల్దార్లు 13–బీ సర్టిఫికెట్ జారీ చేయాలనే నిబంధన చేర్చారు. కానీ జిల్లా కలెక్టర్లు పని ఒత్తిడి కారణంగా గ్రామాలకు వెళ్లి సాదా బైనామాలను పరిష్కరించే పరిస్థితి లేకుండా పోయింది. దీంతో రెవెన్యూ శాఖ ఈ అంశాన్ని పూర్తిగా పక్కన పడేసింది. అయితే సాదా బైనామాల క్రమబద్ధీకరణ ద్వారా ప్రభుత్వానికి ఆదాయం రాదని, 5 ఎకరాల లోపు లావాదేవీలకు కనీసం స్టాంపు డ్యూటీ కూడా వసూలు చేయవద్దని పేర్కొంటూ కొత్త రెవెన్యూ చట్టంలో మార్పులు చేసినందునే ప్రభుత్వం కానీ, రెవెన్యూ అధికారులు కానీ ఈ అంశాన్ని పట్టించుకోవడం లేదనే విమర్శలు వ్యక్తమవుతుండటం గమనార్హం. పరిష్కారానికి రెండు మార్గాలు! సాదా బైనామాల అంశాన్ని ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని రాష్ట్రంలోని 9.24 లక్షల మంది దరఖాస్తుదారులు కోరుతున్న నేపథ్యంలో.. ఇందుకు రెండు మార్గాలున్నాయని భూచట్టాల నిపుణులు చెబుతున్నారు. 2020 అక్టోబర్ 29లోపు వచ్చిన 2.4 లక్షల దరఖాస్తులను పరిష్కరించవచ్చని హైకోర్టు చెప్పినందున, పాత చట్టం ప్రకారం ఫీజు కట్టించుకుని తహశీల్దార్ల ద్వారా క్రమబద్ధీకరణ కోసం 13–బీ సర్టిఫికెట్ జారీ చేయించవచ్చని అంటున్నారు. ఇక అక్టోబర్ 29 తర్వాత వచ్చిన 7 లక్షల దరఖాస్తులను పరిష్కరించాలంటే మాత్రం కొత్త చట్టంలోని కలెక్టర్ల సిఫారసు నిబంధనను మార్చాలని, ఇందుకోసం ఆర్డినెన్స్ లేదంటే అసెంబ్లీలో చట్ట సవరణ తేవాలని చెబుతున్నారు. కాగా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా సాదా బైనామాల పరిష్కారంపై దృష్టి పెట్టాలని, రెవెన్యూ ఉన్నతాధికారులు ఈ కోణంలో ఆలోచించాలని రైతు సంఘాలు కోరుతున్నాయి. -
నెల్లూరు, బాపట్ల జిల్లాల్లో చుక్కల భూములకు విముక్తి
సాక్షి, అమరావతి: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, బాపట్ల జిల్లాల్లో భారీ స్థాయిలో చుక్కల భూములకు ప్రభుత్వంవిముక్తి కల్పించింది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోనే 41,041 ఎకరాల భూములను నిషేధిత ఆస్తుల జాబితా నుంచి తొలగించింది. బాపట్ల జిల్లాలో 5,776 ఎకరాలను ఈ జాబితా నుంచి తొలగించింది. ఈ మేరకు రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి. సాయిప్రసాద్ శనివారం వేర్వేరు గెజిట్ నోటిఫికేషన్లు జారీ చేశారు. చుక్కల భూములకు విముక్తి కల్పించేందుకు రాష్ట్రవ్యాప్తంగా సుమోటో వెరిఫికేషన్ నిర్వహించిన విషయం తెలిసిందే. అందులో భాగంగా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కలెక్టర్ సుమోటో వెరిఫికేషన్ నిర్వహించి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. దీని ఆధారంగా ఆ జిల్లాలో 41,041 ఎకరాల చుక్కల భూములను 1908 రిజిస్ట్రేషన్ల చట్టంలోని సెక్షన్ 22ఎ(1)ఇ నుంచి తొలగించారు. ఇవి కాకుండా సెక్షన్ 22ఎ(1)ఇ లోనే ఉన్న 13,883 ఎకరాలను 22ఎ(1)ఎ లోకి, 14,133 ఎకరాలను 22ఎ(1)బి లోకి, 751 ఎకరాలను 22ఎ(1)సి లోకి, 62 ఎకరాలను 22ఎ(1) డి లోకి మార్చారు. కేవలం 10 సెంట్లను మాత్రమే 22ఎ(1)ఇ లో కొనసాగిస్తున్నారు. అలాగే, బాపట్ల జిల్లాలో 5,776 ఎకరాల చుక్కల భూములను 22ఎ(1)ఇ నుంచి తొలగించారు. ఇవి కాకుండా సెక్షన్ 22ఎ(1)ఇలోనే ఉన్న 1,080 ఎకరాలను 22ఎ(1)ఎ లోకి, 89 ఎకరాలను 22ఎ(1)బి లోకి, 858 ఎకరాలను 22ఎ(1)సి లోకి మార్చారు. 13,461 ఎకరాలను మాత్రం 22ఎ(1)ఇ లోనే ఉంచారు. ఇప్పటికే పలు జిల్లాల్లో చుక్కల భూములను నిషేధిత ఆస్తుల జాబితా నుంచి తొలగిస్తూ గెజిట్ నోటిఫికేషన్లు జారీ చేయగా, తాజాగా ఈ రెండు జిల్లాలకు నోటిఫికేషన్లు ఇచ్చారు. ఎప్పుడూ లేని విధంగా 15 జిల్లాల్లో ఒకేసారి 2.06 లక్షల ఎకరాలను చుక్కల భూముల నుంచి తొలగించడం ద్వారా లక్ష మంది రైతులకు ప్రభుత్వం మేలు చేకూరుస్తోంది. -
భోగాపురంలో బట్టబయలైన అక్రమాలు.. ‘మిరాకిల్’ భూ కబ్జాలు
సాక్షి ప్రతినిధి, విజయనగరం: అంతర్జాతీయ గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయం ఏర్పాటు కానున్న విజయనగరం జిల్లా భోగాపురం మండలంలో భూముల ధరలు బంగారంతో పోటీ పడుతున్నాయి. అలాంటి చోట నెల్లిమర్ల నియోజకవర్గ జనసేన నాయకురాలు మాధవి భర్త లోకం ప్రసాద్ 14.22 ఎకరాల ప్రభుత్వ భూములను గత సర్కారు హయాంలో ఆక్రమించారు. అవన్నీ ఇటు చెన్నై–హౌరా జాతీయ రహదారి (ఎన్హెచ్ 16), విమానాశ్రయ నిర్మాణం కోసం సేకరించిన భూమికి ఆనుకుని ఉన్నాయి. ప్రస్తుతం మార్కెట్ ధరల ప్రకారం అక్కడ ఎకరా విలువ రూ.2 కోట్లకు పైమాటే! ఆక్రమించి.. ప్రహరీ కట్టేసి భోగాపురం మండలం ముంజేరు గ్రామ పరిధిలో మిరాకిల్ సాఫ్ట్వేర్ సిస్టమ్స్, మిరాకిల్ ఇంజనీరింగ్ కళాశాలను లోకం ప్రసాద్ ఏర్పాటు చేశారు. కాలేజీ హాస్టళ్లు, కెఫేటేరియా, సాఫ్ట్వేర్ సంస్థ భవనాలు, ఉద్యోగుల వసతి కోసం సమీపంలోని ప్రభుత్వ భూములన్నీ ఆక్రమించేశారు. గెడ్డలు, కాలువలతో పాటు కాలి బాటలన్నీ కలిపేసి రోడ్డు నిర్మించారు. కొన్ని కల్వర్టులను సొంతంగా కట్టుకుని భూముల చుట్టూ ప్రహరీ కట్టేసి పెద్ద గేట్లను పెట్టేశారు. కన్నెత్తి చూడని టీడీపీ సర్కారు.. ముంజేరు రెవెన్యూ పరిధిలోని సర్వే నంబరు 293/1లో ఎకరా, 293/5లో 60 సెంట్లు, 296లో అర ఎకరా, 337లో 0.61 సెంట్లు, 343లో 3.52 ఎకరాలు, 342లో 5.02 ఎకరాలు, 391లో 1.52 ఎకరాలు, 392లో 1.16 ఎకరాలు, సర్వే నంబరు 393లో 29 సెంట్ల మేర ప్రభుత్వ భూమి ఆక్రమణలకు గురైనట్లు తాజాగా రెవెన్యూ అధికారులు గుర్తించారు. ఆ పక్కనే కొంగవానిపాలెం గ్రామ రెవెన్యూ పరిధి 98/2పీ సర్వే నంబరులో 40 సెంట్ల బంజరు భూమి కూడా ‘మిరాకిల్’ ఆక్రమణలోనే ఉంది. ఈ వ్యవహారం అంతా గత టీడీపీ పాలనలో దఫాదఫాలుగా జరిగింది. గత పాలకులు అటువైపు కన్నెత్తి కూడా చూడలేదు. ఇటీవల ఆ భూముల చుట్టూ మిరాకిల్ యజమానులు ప్రహరీ నిర్మించి పెద్ద గేట్లు అమర్చడంతో రెవెన్యూ అధికారులు అప్రమత్తమయ్యారు. పక్కాగా సర్వే నిర్వహించడంతో మిరాకిల్ ఆక్రమణల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. డీ పట్టా భూములనూ వదల్లేదు.. మిరాకిల్ యజమానుల గుప్పిట్లో డీ పట్టా భూములు కూడా ఉన్నట్లు రెవెన్యూ అధికారులు గుర్తించారు. కంచేరు, ముంజేరు, కొంగవానిపాలెం గ్రామాల పరిధిలో మొత్తం 8.52 ఎకరాల వరకు ఉన్నట్లు తెలిసింది. వాటిని స్వాధీనం చేసుకునేందుకు రెవెన్యూ అధికారులు సన్నద్ధమవుతున్నారు. నిజమేనంటూనే.. ఆక్రమణలు నిజమేనని లోపాయికారీగా అంగీకరించిన మిరాకిల్ యాజమాన్యం ప్రభుత్వ భూమి చేజారిపోకుండా ఎత్తుగడలు వేస్తోంది. మిరాకిల్ ఉద్యోగులను, స్థానిక జనసేన కార్యకర్తలను ఆందోళనకు పురిగొల్పుతున్నారు. ప్రభుత్వ భూముల్లో తమ సంస్థ భవనాలేవీ నిర్మించనప్పుడు ఎలా స్వాధీనం చేసుకుంటారని అడ్డగోలుగా వాదిస్తున్నారు. గెడ్డలు కప్పేసి తయారు చేసిన మైదానం యువత క్రికెట్ ఆడుకోవడానికి ఉపయోగపడుతోందంటూ రెవెన్యూ అధికారులతో వాదనకు దిగుతున్నారు. ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకుంటాం.. ముంజేరు, కొంగవానిపాలెం రెవెన్యూ గ్రామాల పరిధిలో ప్రభుత్వ భూమి ఆక్రమణలకు గురైంది. స్థానికులు ఇచ్చిన ఫిర్యాదుల మేరకు క్షేత్రస్థాయి సర్వేతో పాటు డ్రోన్ సర్వే చేశాం. పక్కాగా ఆక్రమణలను గుర్తించాం. ఆ భూముల్లో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేస్తున్నాం. స్వాధీనం చేసుకోవడానికి పోలీసు శాఖ సాయం కోరాం. అవన్నీ కచ్చితంగా స్వాధీనం చేసుకుంటాం. – కోరాడ శ్రీనివాసరావు, తహసీల్దారు, భోగాపురం, విజయనగరం జిల్లా -
వీఆర్వోలు, గ్రామ సర్వేయర్లకు కొత్త జాబ్ చార్ట్
సాక్షి, అమరావతి: వీఆర్వోలు, గ్రామ సర్వేయర్లకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త జాబ్ చార్ట్ ఇచ్చింది. గ్రామ సచివాలయాల్లో పనిచేసే వీఆర్వోలు, వార్డు సచివాలయాల్లో పనిచేసే వార్డు రెవెన్యూ కార్యదర్శులకు కంబైన్డ్ జాబ్ చార్ట్, గ్రేడ్–1, 2, 3 గ్రామ సర్వేయర్లకు జాబ్ చార్ట్లపై రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్ రెండు వేర్వేర్లు ఉత్తర్వులిచ్చారు. వీఆర్వోల జాబ్ చార్ట్.. తుపాన్లు, వరదలు, ప్రమాదాలు లాంటి విపత్తు నిర్వహణ విధులు, ఓటర్ల జాబితా అప్డేషన్, ప్రభుత్వం నిర్దేశించే ఇతర ఎన్నికల విధులు, రెవెన్యూ రికార్డుల మ్యుటేషన్ పనులు, భూముల రీ సర్వే కార్యకలాపాలు, నివాస, నేటివిటీ లాంటి సర్టిఫికెట్ల జారీ విధులను నిర్వర్తించాలని పేర్కొన్నారు. గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో రెవెన్యూ శాఖకు సంబంధించిన అన్ని వినతులను పరిశీలించి తీసుకున్న చర్యలపై ఆయా శాఖలకు నివేదికలు పంపడం లాంటి పనుల్ని నిర్దేశించారు. పంటల అజమాయిషీ, సర్వే రాళ్ల తనిఖీ, ప్రభుత్వ భూములు, ఆస్తుల రక్షణ, రోడ్లు, వీధులు, ప్రభుత్వ స్థలాలు ఆక్రమణకు గురి కాకుండా కాపాడటం, రెవెన్యూ సెస్, పన్నులు వసూలు చేయాలి. హత్యలు, ఆత్మహత్యలు, అసహజ మరణాలు, గ్రామాల్లో శాంతి భద్రతకు విఘాతం కలిగించే అంశాలను తహశీల్దార్కు నివేదించడంతోపాటు తహశీల్దార్, కలెక్టర్, సీసీఎల్ఏ, ప్రభుత్వం నిర్దేశించే ఇతర పనుల్ని ఎప్పటికప్పుడు నిర్వర్తించాలని జాబ్ చార్ట్లో పేర్కొన్నారు. ఒకే సమయంలో ఎక్కువ పనులు చేయాల్సి వచ్చినప్పుడు ప్రాధాన్యతకు అనుగుణంగా చేపట్టాలని సూచించారు. గ్రామ సర్వేయర్ల జాబ్ చార్ట్ వ్యక్తులు, ప్రభుత్వ సంస్థలతోపాటు అనుమతించిన లేఅవుట్లకు సంబంధించి ఎఫ్లైన్ పిటిషన్లు (సరిహద్దు వివాదాలు, హద్దులు–విస్తీర్ణంలో తేడాలు లాంటి వాటిపై అందే దరఖాస్తులు) స్వీకరించి పరిష్కరించాలి. సర్వే సబ్ డివిజన్, సంబంధిత మార్పులు చేసే బాధ్యత వారిదే. గ్రామ కంఠాలు, పూర్తిస్థాయి స్ట్రీట్/టౌన్ సర్వే, కొత్త సబ్ డివిజన్, పాత సబ్ డివిజన్లను కలపడంపై అందే దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిష్కరించి గ్రామ రికార్డుల్లో చేర్చాలి. సచివాలయాల పరిధిలో అందే అన్ని వినతులతోపాటు వివిధ శాఖల అధికారులు రిఫర్ చేసే అంశాలపై నివేదికలు ఇవ్వాలి. మిస్ అయిన, దెబ్బతిన్న, తొలగించిన సర్వే పాయింట్లు, మార్క్లు, గ్రౌండ్ కంట్రోల్ పాయింట్లు సర్వే, సరిహద్దు చట్టం ప్రకారం ముసాయిదా నోటీసు ఇచ్చి రెన్యువల్ చేయాలి. తన పరిధిలోని 10 శాతం సర్వే పాయింట్లు, మార్క్లు, గ్రౌండ్ కంట్రోల్ పాయింట్లను ప్రతి నెలా తనిఖీ చేయాలి. కాంపిటెంట్ అథారిటీ అధికారుల ఆదేశాల ప్రకారం రికార్డుల్లో తప్పులను సరి చేయాలి. పై అధికారులకు సమాచారమిచ్చి అన్ని తనిఖీలకు గ్రామ సర్వేయర్లు హాజరు కావాలి. సర్వే పరికరాలు, ఇతర వస్తువులను సర్వీస్ చేయించి నిర్వహణ చేపట్టాలి.నెలవారీ టూర్ డైరీలు, ప్రోగ్రెస్ స్టేట్మెంట్లు ఇతర నిర్దేశిత సమాచారాన్ని సర్వే సెటిల్మెంట్ కమిషనర్కు పంపాలి. సర్వే కార్యకలాపాలను ఈటీఎస్, డీజీపీఎస్, కార్స్ లాంటి అత్యాధునిక సాంకేతిక పరికరాలతోనే నిర్వహించాలి. వీఆర్వోలకు సహకరించాలి. ఈ జాబ్ చార్ట్ ఆధారంగా పెర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ కూడా ఇచ్చారు. -
రెవెన్యూశాఖలో కలకలం.. ముగ్గురు తహసీల్దార్ల సస్పెన్షన్
సాక్షి, నెల్లూరు(అర్బన్): జిల్లా రెవెన్యూశాఖలో అవినీతి అధికారులపై వరుసగా వేటు పడుతోంది. ఇటీవల బుచ్చిరెడ్డిపాళెం తహసీల్దార్ ప్రమీలను కలెక్టర్ సస్పెండ్ చేశారు. తాజాగా వెంకటాచలం తహసీల్దార్ నాగరాజు, తోటపల్లిగూడూరు తహసీల్దార్ హమీద్, గుడ్లూరు తహసీల్దార్ లావణ్యను సస్పండ్ చేస్తూ కలెక్టర్ కేవీఎన్ చక్రధర్బాబు మంగళవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. అవినీతికి అలవాటుపడిన అధికారులు రెవెన్యూ రికార్డులు తారుమారు చేయడం, ప్రభుత్వ భూములను పట్టా భూములుగా చూపించి పరిహారం ఇవ్వడం, చివరికి మర్రిపాడు ప్రాంతంలో అటవీశాఖ భూములను సైతం పట్టా భూములుగా చూపడం వంటి అక్రమాలకు పాల్పడుతున్నారు. వీటిపై చివరకు స్పందన కార్యక్రమంలో సైతం ప్రజలు తహసీల్దార్లు అర్జీలు సమర్పిస్తున్నారు. విషయాన్ని పరిశీలించిన కలెక్టర్ చక్రధర్బాబు విచారణాధికారిగా జేసీ కూర్మనాథ్ను నియమించారు. జేసీ విచారణలో విస్తూ పోయే నిజాలు వెలుగు చూశాయి. కలువాయి మండలంలో ప్రభుత్వ భూమిని ప్రైవేట్ వ్యక్తులదిగా చూపి అక్రమార్కులకు అండగా నిలిచారు. గుడ్లూరు మండలంలో ప్రభుత్వ భూమిని మ్యుటేషన్ చేశారు. ఇలా పలు చోట్ల అక్రమాలకు పాల్పడిన తహసీల్దార్లను గుర్తించి సస్పెండ్ వేటు వేశారు. ఈ విషయం రెవెన్యూ శాఖలో జిల్లా వ్యాప్తంగా కలకలం రేగింది. మరో ఆరుగురిని విచారించేందుకు జేసీ నోటీసులు సిద్ధం చేస్తున్నారు. ఇందులో రిటైర్డ్ అయిన రెవెన్యూ అధికారులు సైతం ఉన్నారు. పూర్తి స్థాయిలో విచారణ జరిగితే మరి కొంత మందిపై వేటు పడే అవకాశం ఉంది. చదవండి: (విమాన ప్రమాదం: అంజూను మర్చిపోలేం.. షాక్కు గురైన సహ విద్యార్థులు) -
ఐశ్వర్య రాయ్కి లీగల్ నోటీసులు!
మాజీ విశ్వసుందరి, సినీ నటి ఐశ్వర్యరాయ లీగల్ నోటీసులు అందాయి. నాసిక్లోని తన భూమిక ఏడాది కాలంగా ఆమె పన్ను చెల్లించని నేపథ్యంలో రెవెన్యూ శాఖ తాజాగా ఐశ్వర్యకు నోటీసులు జారీ చేసింది. వివరాలు.. నాసిక్లో జిల్లాలోని సిన్నార్లో ఐశ్వర్య పేరు మీదహెక్టారు భూమి ఉందట. ఈ భూమి సంబంధించి ఐశ్వర్య ఏడాది కాలం నుంచి పన్ను చెల్లించలేదు. దీంతో జిల్లా యంత్రాంగంలోని రెవెన్యూ అధికారులు జనవరి 9న ఐశ్వర్యకు లీగల్ నోటీసులు ఇచ్చారు. చదవండి: పఠాన్ మూవీ రన్ టైం లాక్.. ‘బెషరమ్ రంగ్’ పాటకు 3 సెన్సార్ కట్స్! దీని ప్రకారం ఐశ్వర్య రూ. 21, 960 వేలు చెల్లించాల్సి ఉందట. కాగా మండల తాహసిల్థా ఆమెతో మరో 1200 వందల మందికి తాసిల్దార్ ఈ నోటీసులు ఇచ్చారని సమాచారం. ఇందులో పలువురు సినీ సెలబ్రెటీలు, బడా వ్యాపారవేత్తలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఏడాది మార్చి చివరి నాటికి పన్ను బకాయిలు వసూలు చేయాలని మహారాష్ట్రలోని భూ రెవెన్యూ విభాగానికి ఆదేశాలు అందాయి. అందుకే ఈ చర్యలు తీసుకుంటున్నామని అధికారులు తెలిపారు. చదవండి: అమలాపాల్కు చేదు అనుభవం, వివాదాస్పదంగా టెంపుల్ సంఘటన! -
ముమ్మరంగా రీ సర్వే
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూముల రీ సర్వే ముమ్మరంగా జరుగుతోంది. కీలకమైన డ్రోన్ సర్వే, ఆ తర్వాత దశల్లో జరిగే క్షేత్రస్థాయి నిజ నిర్ధారణ, గ్రౌండ్ వాలిడేషన్ వంటి పనులన్నీ చకచకా ముందుకు సాగుతున్నాయి. డ్రోన్ సర్వేను 7,744 గ్రామాల్లో పూర్తిచేశారు. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 766 గ్రామాల్లో డ్రోన్ సర్వే పూర్తికాగా, శ్రీకాకుళం జిల్లాలో 758 గ్రామాలు, విజయనగరం జిల్లాలో 737, తిరుపతి జిల్లాలో 726, అనకాపల్లి జిల్లాలో 604 గ్రామాల్లో ఈ సర్వేను పూర్తిచేశారు. అతి తక్కువగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో కేవలం రెండు గ్రామాల్లో మాత్రమే డ్రోన్ సర్వే పూర్తయింది. ఆ జిల్లా అంతా కొండ ప్రాంతాలతో నిండి ఉండడంతో సర్వే సాధ్యం కావడంలేదు. దీంతో అక్కడ డీజీపీఎస్ సర్వే నిర్వహిస్తున్నారు. నంద్యాల, తూర్పు, పశ్చిమ గోదావరి, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, కర్నూలు జిల్లాల్లోనూ డ్రోన్ సర్వే ఆశించిన స్థాయిలో జరగడంలేదని గుర్తించారు. దీంతో ఏరియల్ సర్వే ద్వారా ఈ ప్రాంతాల్లో వేగంగా సర్వే చేపడుతున్నారు. 47 లక్షల ఎకరాలకు ఓఆర్ఐల జారీ డ్రోన్ సర్వే నిర్వహిస్తేనే మిగిలిన దశల సర్వే పూర్తిచేయడానికి అవకాశం ఏర్పడుతుంది. డ్రోన్ కెమెరాల ద్వారా తీసిన ఫొటోలను అభివృద్ధి చేసి ఓఆర్ఐ (ఆర్థో రెక్టిఫైడ్ ఇమేజెస్)లు జారీచేస్తారు. వాటిని బట్టి క్షేత్రస్థాయిలో సర్వే బృందాలు నిజ నిర్ధారణ, రైతుల సమక్షంలో గ్రౌండ్ వాలిడేషన్ చేపడతాయి. ఇప్పటివరకు 47,33,454 ఎకరాల విస్తీర్ణానికి సంబంధించి 4,006 గ్రామాలకు ఓఆర్ఐలు జారీ అయ్యాయి. అవి సర్వే బృందాలకు చేరడంతో వాటిని బట్టి 2,790 గ్రామాల్లో గ్రౌండ్ ట్రూతింగ్ (క్షేత్రస్థాయి నిజ నిర్ధారణ)ను పూర్తిచేశారు. ఈ గ్రామాల్లోని భూముల విస్తీర్ణం 32,40,618 ఎకరాలు కాగా.. ఈ ప్రాంతం మొత్తం గ్రౌండ్ ట్రూతింగ్ పూర్తయింది. 18,717 వినతులకు పరిష్కారం ఇక చివరిగా.. రైతుల సమక్షంలో చేసే గ్రౌండ్ వాలిడేషన్ను 2,325 గ్రామాల్లో పూర్తిచేశారు. ఈ గ్రామాలకు సంబంధించి ఇప్పటివరకు 18,855 వినతులు, అభ్యంతరాలు రాగా వాటిలో 18,717 వినతుల్ని మొబైల్ మెజిస్ట్రేట్ బృందాలు పరిష్కరించాయి. ఇన్ని దశల తర్వాత చివరిగా రీ సర్వే పూర్తయినట్లు ప్రకటించే నెంబర్–13 నోటిఫికేషన్లను 2,119 గ్రామాల్లో పబ్లిష్ చేశారు. ఆ గ్రామాల్లోని రెండువేల గ్రామాలకు సంబంధించి భూహక్కు పత్రాల జారీ ప్రక్రియ నడుస్తోంది. వచ్చే రెండు నెలల్లో మరో రెండువేల గ్రామాల్లో అన్ని దశల సర్వేను పూర్తిచేసి భూహక్కు పత్రాల జారీకి రెవెన్యూ శాఖ వడివడిగా అడుగులు వేస్తోంది. -
డిప్యూటీ కలెక్టర్గా జ్యోతి సురేఖ నియామకం
సాక్షి, అమరావతి: అర్జున అవార్డు గ్రహీత, అంతర్జాతీయ ఆర్చరీ క్రీడాకారిణి వెన్నం జ్యోతి సురేఖను డిప్యూటీ కలెక్టర్గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అంతర్జాతీయ స్థాయిలో అద్భుత ప్రతిభను కనబరుస్తూ దేశ, రాష్ట్ర ఖ్యాతిని ఇనుమడింపజేస్తున్న సురేఖకు క్రీడాకారుల కోటాలో డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగం ఇచ్చారు. ముఖ్యమంత్రి జగన్ ఆదేశాల మేరకు రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయి ప్రసాద్ శుక్రవారం నియామక ఉత్తర్వులు జారీ చేశారు. స్పోర్ట్స్ కోటాలో ఆమె నియామకం కోసం ప్రభుత్వం కేబినెట్ ఆమోదంతో ఏపీ యాక్ట్–1994ను సవరించింది. ఉత్తర్వులు అందిన 30 రోజుల్లోగా భూ పరిపాలనా ప్రధాన కమిషనర్కు రిపోర్టు చేయాలని ఉత్తర్వుల్లో ఆదేశించారు. -
వివాదాస్పద భూమినే.. వివాద రిజిస్టర్లో ఉంచాలి
సాక్షి, అమరావతి: ఏదైనా భూమికి సంబంధించి వివాదం తలెత్తితే.. ఆ భూమిని మాత్రమే వివాద రిజిస్టర్లో ఉంచాలని రెవెన్యూ యంత్రాంగానికి ప్రభుత్వం స్పష్టం చేసింది. దానికి సంబంధించిన సర్వే నంబర్ మొత్తాన్ని వివాద రిజిస్టర్లో నమోదు చేయొద్దని ఆదేశించింది. ఉదాహరణకు ఒక సర్వే నంబర్లో 10 ఎకరాల భూమి ముగ్గురి పేరు మీద ఉండి.. వారు సబ్ డివిజన్ చేసుకోకుండా దాన్ని సాగు చేస్తున్నారనుకుందాం. వారిలో ఒకరి పేరు మీద ఉన్న భూమిపై వివాదం ఏర్పడితే మొత్తం ఆ సర్వే నంబర్ అంతటినీ వెబ్ల్యాండ్లోని వివాద రిజిస్టర్లో పెడుతున్నారు. దీంతో వివాదం లేని ఇద్దరి భూమి కూడా వివాదంలోకి వెళ్తోంది. గ్రామాల్లో ఇలాంటి కేసులు చాలా ఉండడంతో రైతులు, భూ యజమానుల నుంచి ఎన్నో ఏళ్లుగా ఆందోళన వ్యక్తమవుతోంది. రీ సర్వే జరుగుతున్న క్రమంలోనూ దీనిపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. వాటాల పంపకాలు, అమ్మకాలు, కొనుగోళ్ల తర్వాత సబ్ డివిజన్ చేసుకోకపోవడంతో ఈ సమస్య ఏర్పడుతోంది. ఈ నేపథ్యంలో సబ్ డివిజన్ జరగకుండా ఉన్న భూమికి సంబంధించి.. వివాదం ఏర్పడిన భూమి పోర్షన్ వరకే వివాద రిజిస్టర్లో చేర్చాలని, డిజిటల్ సిగ్నేచర్ తొలగించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇప్పటికే మొత్తం సర్వే నంబర్ను వివాద రిజిస్టర్లో పెట్టిన కేసులపై తహశీల్దార్లు వెంటనే స్పందించి.. పక్కాగా అమలు చేయాలని ఆదేశించింది. కలెక్టర్లు కూడా దీనిపై ఆర్డీఓలు, తహశీల్దార్లకు స్పష్టమైన ఆదేశాలిచ్చి అమలయ్యేలా చూడాలని భూ పరిపాలన ప్రధాన కమిషనర్ సాయిప్రసాద్ సర్క్యులర్ జారీ చేశారు. -
సీఎం జగన్ ఉద్దేశంలో ప్రభుత్వం, ఉద్యోగులు వేరు కాదు: సజ్జల
సాక్షి, అమరావతి: మూడున్నరేళ్ల పాలనలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెచ్చిన అనేక విప్లవాత్మక మార్పుల్లో ఉద్యోగుల పాత్ర ఎంతో ఉందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. సీఎం జగన్ ఉద్దేశంలో ప్రభుత్వం, ఉద్యోగులు వేరు కాదన్నారు. గవర్నమెంట్కు రెవెన్యూ వ్యవస్థ అనేది నాడీ వ్యవస్థ లాంటిదని చెప్పారు. గుంటూరు నాగార్జున యూనివర్సిటీలో ఆదివారం 26వ స్టేట్ రెవెన్యూ స్పోర్ట్స్ అండ్ కల్చలర్ మీట్ జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. సీఎం జగన్కు ఉద్యోగులపై విశ్వాసం ఉండడం వల్లే సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. చారిత్రాత్మకమైన సమగ్ర సర్వేకి శ్రీకారం చుట్టారు. దశాబ్దాల నాటి నుంచి కలగా మిగిలిపోయిన వాటిని చక్కదిద్దేపనిలో నిమగ్నమయ్యారు. ఎలాంటి లిటికేషన్లు, అనుమానాలు ఉండకూడదనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నారు. 71వేల ఎకరాలు పేదలకు పంచడం అంటే ఊహలకు కూడా అందని అంశం అని పేర్కొన్నారు. 'మూడున్నరేళ్ల పాలనలో కరోనా రెండేళ్లు ఇబ్బంది పెట్టింది. పేదలకు ఇచ్చిన జగనన్న ఇళ్ల పట్టాలు ప్రస్తుతం కన్స్ట్రక్షన్ స్టేజ్కి వచ్చాయి. సీఎం జగన్ ఏం చేసినా ఎంత ఎక్కువ మందికి మేలు జరుగుతుంది అనేదే ఆలోచిస్తారు. టీమ్ స్పిరిట్కి బేస్ క్రీడలు మాత్రమే. ఉద్యోగులు మానసిక ఒత్తిడి నుంచి బయటపడేలా క్రీడల్లో పాల్గొనడం సంతోషకరమైన విషయమని' సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. చదవండి: (CM Jagan: 25న నరసన్నపేటకు సీఎం వైఎస్ జగన్!) -
రెవెన్యూ సమస్యలు పరిష్కరించండి
సాక్షి, హైదరాబాద్: రెవెన్యూ శాఖలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీసెస్ అసోసియేషన్ (ట్రెసా) మంత్రి కేటీఆర్కు విజ్ఞప్తి చేసింది. మంగళవారం తమ రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించిన ట్రెసా.. ఉద్యోగుల సమస్యలపై పలు తీర్మానాలు చేసింది. సమావేశం అనంతరం సంస్థ ప్రతినిధి బృందం ప్రగతిభవన్కు వెళ్లి మంత్రి కేటీఆర్ను కలిసి తమ సమస్యలను వివరించింది. శాఖలో పనిభారం ఎక్కువయిందని, వెంటనే కేడర్ స్ట్రెంగ్త్ను నిర్ధారించాలని, పదోన్నతులివ్వాలని, కారుణ్య నియామకాలు చేపట్టాలని, ధరణి అంశాలను పరిష్కరించాలని, వీఆర్ఏలకు పేస్కేల్ అమలు చేయాలని కోరింది. తమ వినతి పట్ల మంత్రి కేటీఆర్ సానుకూలంగా స్పందించారని, హామీల అమలుకు రెండు రోజుల్లో చర్యలు తీసుకుంటామని చెప్పారని ట్రెసా ప్రతినిధులు వెల్లడించారు. కార్యవర్గ సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు వంగ రవీందర్రెడ్డి, ప్రధాన కార్యదర్శి కె. గౌతమ్కుమార్, అసోసియేట్ అధ్యక్షుడు మన్నె ప్రభాకర్, ఉపాధ్యక్షుడు బాణాల రాంరెడ్డి, ఆర్గనైజింగ్ కార్యదర్శి జగన్మోహన్రెడ్డి, నిర్మల, శ్రవణ్లతో పాటు పలు జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులు, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. -
భూ రికార్డుల స్వచ్ఛీకరణ వేగవంతం
సాక్షి, అమరావతి: భూముల రీ సర్వే నేపథ్యంలో భూ రికార్డుల స్వచ్ఛీకరణ (ప్యూరిఫికేషన్ ఆఫ్ ల్యాండ్స్) కార్యక్రమం వేగంగా జరుగుతోంది. వైఎస్సార్ జగనన్న భూరక్ష, శాశ్వత భూ హక్కు పథకం కింద వందేళ్ల తర్వాత నిర్వహిస్తున్న రీ సర్వేలో రికార్డుల స్వచ్ఛీకరణ అత్యంత కీలకం కావడంతో ప్రభుత్వం దానిపై ప్రత్యేక దృష్టి పెట్టింది. రికార్డుల స్వచ్ఛీకరణ పూర్తయితేనే ఆయా గ్రామాల్లో రీ సర్వే ప్రక్రియ ప్రారంభమవుతుంది. అంటే రీ సర్వే ప్రారంభానికి ముందే గ్రామాల్లో భూ రికార్డులను అప్డేట్ చేయాల్సి ఉంటుంది. వెబ్ల్యాండ్ అడంగల్స్ను ఆర్ఎస్ఆర్తో పోల్చి చూడటం, అడంగల్లో పట్టాదారుని వివరాలన్నీ సక్రమంగా ఉన్నాయో లేదో చూసి సరిచేయడం వంటి పనులు పక్కాగా చేయాలి. ఈ పనిని కింది స్థాయిలో రెవెన్యూ యంత్రాంగం చేయాలి. రికార్డుల స్వచ్ఛీకరణ పూర్తయిన గ్రామాల్లోనే రీ సర్వేలో మొదట నిర్వహించే డ్రోన్ ఫ్లైయింగ్ను సర్వే బృందాలు చేపట్టడానికి అవకాశం ఉంటుంది. అందుకే ప్రభుత్వం రికార్డుల స్వచ్ఛీకరణపై ఫోకస్ పెట్టింది. మొత్తంగా 17,564 గ్రామాలను మూడు కేటగిరీలుగా విభజించి స్వచ్ఛీకరణ చేయిస్తున్నారు. అనంతపురంలో నూరు శాతం పూర్తి అనంతపురం జిల్లాలోని మొత్తం 504 గ్రామాల్లోనూ రికార్డుల స్వచ్ఛీకరణ పూర్తయింది. బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో 315 గ్రామాలకు గాను.. 314 గ్రామాల్లో స్వచ్ఛీకరణను పూర్తి చేశారు. చిత్తూరు జిల్లాలో 846 గ్రామాలకు గాను 835 గ్రామాల్లోను, సత్యసాయి జిల్లాలో 461 గ్రామాలకు గాను 455 గ్రామాల్లో స్వచ్ఛీకరణ పూర్తయింది. విశాఖ, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాల్లో స్వచ్ఛీకరణ నెమ్మదిగా జరుగుతుండటంతో వేగం పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నారు. రీ సర్వే షెడ్యూల్కు అనుగుణంగా భూ రికార్డుల స్వచ్ఛీకరణను పూర్తి చేసేందుకు గడువును నిర్దేశించారు. దాని ప్రకారం ఆరు రకాల సర్క్యులర్ ప్రకారం రికార్డులను అప్డేట్ చేసే పని వేగంగా జరుగుతోంది. తద్వారా రీ సర్వే కార్యక్రమాన్ని షెడ్యూల్ ప్రకారం సర్వే బృందాలు వడివడిగా నిర్వహిస్తున్నాయి. ప్రతి నెలా సమీక్ష స్వచ్ఛీకరణ ఎలా చేయాలనే దానిపై రెవెన్యూ శాఖ ఆరు సర్క్యులర్లు జారీ చేసింది. ఒక్కో సర్క్యులర్ ప్రకారం ఒక్కో దశను పూర్తి చేయాల్సి ఉంటుంది. వీటి ప్రకారం స్వచ్ఛీకరణ ఎంత మేరకు జరిగిందనే దానిపై ప్రతి నెలా కలెక్టర్లు, జేసీలతో భూ పరిపాలన ప్రధాన కమిషనర్ సమీక్ష నిర్వహిస్తున్నారు. జిల్లాల వారీగా ఎన్ని గ్రామాల్లో ఆరు రకాల సర్క్యులర్ల ప్రకారం పని జరిగిందో పరిశీలిస్తూ తగిన సూచనలు చేస్తున్నారు. -
ఆదాయాలను సమకూరుస్తున్న శాఖలపై సీఎం జగన్ సమీక్ష
-
సర్టిఫికెట్ల జారీ సమయం తగ్గింపు?
సాక్షి, అమరావతి: రెవెన్యూ సర్వీసుల్లో ప్రధానమైన సర్టిఫికెట్ల జారీ సమయాన్ని తగ్గించేందుకు కసరత్తు జరుగుతోంది. ఇంటిగ్రేటెడ్, ఇన్కమ్, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్, లేట్ రిజిస్ట్రేషన్ ఆఫ్ బర్త్/డెత్ సర్టిఫికెట్లను ఇంకా సులభంగా, తక్కువ సమయంలో జారీచేసేందుకు రెవెన్యూ శాఖ ప్రతిపాదనలు సిద్ధంచేసింది. అన్ని జిల్లాల జాయింట్ కలెక్టర్లతో ఇటీవల నిర్వహించిన ఒకరోజు సదస్సులో ఈ అంశంపై రెవెన్యూ మంత్రి, సీసీఎల్ఏ ఉన్నతాధికారులు సుదీర్ఘంగా చర్చించారు. జిల్లాల వారీగా వస్తున్న దరఖాస్తులు, క్షేత్రస్థాయి పరిస్థితులు, ప్రజల నుంచి వస్తున్న విజ్ఞప్తుల ఆధారంగా ప్రతిపాదనలు తయారుచేసి వాటి జారీ సమయంపై ఒక అంచనాకు వచ్చారు. ► కమ్యూనిటీ, నేటివిటీ, డేట్ ఆఫ్ బర్త్లను కలిపి ఒకటిగా ఇచ్చే ఇంటిగ్రేటెడ్ సర్టిఫికెట్ను ఇచ్చేందుకు ప్రస్తుతం 30 రోజుల గడువు ఉంది. దీన్ని ఎనిమిది రోజుల్లో జారీచేయాలని ప్రతిపాదించారు. ► గతంలో వీఆర్ఓ వెరిఫికేషన్కు ఉన్న ఏడురోజుల సమయాన్ని మూడ్రోజులకు, ఆర్ఐ వెరిఫికేషన్కు 10 రోజుల సమయాన్ని రెండ్రోజులకు తగ్గించాలని ప్రతిపాదించారు. ఈ రెండు దశల వెరిఫికేషన్ల తర్వాత మూడో దశలో చివరిగా తహసీల్దార్ 13 రోజుల్లో సర్టిఫికెట్ జారీచేయాల్సి వుంది. కానీ, చివరి దశను డిప్యూటీ తహసీల్దార్కు అప్పగించి సమయాన్ని మూడ్రోజులకు కుదించాలని భావిస్తున్నారు. గతంలో ఈ సరి్టఫికెట్ జారీచేసి ఉంటే ఏ–కేటగిరీ కింద వెంటనే సర్టిఫికెట్ జారీచేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ► ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ జారీకి సమయాన్ని 15 రోజుల నుంచి 10 రోజులకు తగ్గించాలని ప్రతిపాదించారు. వీఆర్ఓ వెరిఫికేషన్ సమయాన్ని ఏడు నుంచి మూడ్రోజులకు, ఆర్ఐ వెరిఫికేషన్ సమయాన్ని ఐదు నుంచి రెండ్రోజులకు తగ్గించాలని ప్రతిపాదించారు. చివరిగా తహసీల్దార్ వద్దకు వెళ్లాక ఆయన పరిశీలించి జారీచేసే సమయాన్ని మూడు నుంచి ఐదు రోజులకు పెంచారు. మొత్తంగా జారీ సమయం 5 రోజులు తగ్గించాలని చూస్తున్నారు. ► ఇక లేట్ రిజిస్ట్రేషన్ ఆఫ్ బర్త్/డెత్ సర్టిఫికెట్ల జారీని 60 నుంచి 20 రోజులకు తగ్గించాలని ప్రతిపాదించారు. వీఆర్ఓ వెరిఫికేషన్ సమయాన్ని ఏడు నుంచి మూడ్రోజులు, ఆర్ఐ వెరిఫికేషన్ 10 నుంచి మూడ్రోజులు, తహసీల్దార్ వెరిఫికేషన్ 10 నుంచి మూడ్రోజులు, చివరిగా ఆర్డీఓ/సబ్ కలెక్టర్ వెరిఫికేషన్ సమయాన్ని 33 నుంచి 11 రోజులకు తగ్గించాలని ప్రతిపాదించారు. ► అలాగే, ఆదాయ ధ్రువీకరణ (ఇన్కమ్) పత్రం జారీకి ప్రస్తుతం ఏడురోజుల గడువు వుండగా దాన్ని మాత్రం 10 రోజులకు పెంచాలని ప్రతిపాదించారు. వీఆర్ఓ వెరిఫికేషన్కు ప్రస్తుతం ఉన్న రెండ్రోజుల్ని మూడ్రోజులకు, డిప్యూటీ తహసీల్దార్ పరిశీలనకు ప్రస్తుతమున్న మూడ్రోజుల గడువుని ఐదు రోజులుగా ప్రతిపాదించారు. మధ్యలో ఆర్ఐ వెరిఫికేషన్కు రెండ్రోజుల సమయాన్ని కొనసాగించాలని భావిస్తున్నారు. ► భూమి సరిహద్దుల కొలతలు నిర్ధారించే ఎఫ్–లైన్ దరఖాస్తులు గతంలో మాదిరిగానే 30 రోజుల సమయాన్ని నిర్దేశించారు. పట్టా సబ్ డివిజన్కు ఉన్న 30 రోజులు, చుక్కల భూముల వినతులకు 180 రోజులు, నిషేధిత భూముల జాబితా 22 (ఎ) నుంచి తొలగించే దరఖాస్తుల పరిష్కారానికి ఉన్న 30 రోజుల సమయాన్ని అలాగే ఉంచాలని భావిస్తున్నారు. వీలైనంత సులభంగా, ప్రజల నుంచి వచ్చే దరఖాస్తుల్ని త్వరగా జారీచేయడమే లక్ష్యంగా రెవెన్యూ శాఖ మార్పులు ప్రతిపాదించింది. త్వరలో ప్రభుత్వం ఆమోదం పొందిన తర్వాత వీటిని ఆమల్లోకి తేవాలని రెవెన్యూ ఉన్నతాధికారులు భావిస్తున్నారు. -
Telangana Revenue Department: రెవెన్యూలో పదోన్నతులు!
సాక్షి, హైదరాబాద్: రెవెన్యూ శాఖలో పదోన్నతుల ప్రక్రియకు తెరలేవనుంది. ముందుగా 31 మంది డిప్యూటీ కలెక్టర్లకు స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లుగా పదోన్నతి లభించనుంది. ఈ మేరకు డిప్యూటీ కలెక్టర్ల సీనియారిటీ జాబితాను పంపాలని భూపరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్ఏ)ను రెవెన్యూ శాఖ ఆదేశించింది. ఈ జాబితాను ఈ నెల 6లోగా సీసీఎల్ఏ ప్రభుత్వానికి సమర్పించనుండగా ఈ నెల 7 నుంచి వారి పదోన్నతుల ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశముందని సమాచారం. ప్రస్తుతం డిప్యూటీ కలెక్టర్లుగా పనిచేస్తూ పదోన్నతులకు అర్హులైన వారందరికీ స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ (ఎస్జీడీసీ) హోదా కల్పించనున్నారు. జిల్లాల విభజన అనంతరం ఏర్పాటైన తర్వాత కూడా భర్తీ కాకుండా మిగిలిపోయిన జిల్లా రెవెన్యూ అధికారుల (డీఆర్వో)తోపాటు నాలుగు జిల్లాల అదనపు కలెక్టర్లుగా వారికి పోస్టింగులు ఇచ్చేందుకు సీఎం గ్రీన్సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో డిప్యూటీ కలెక్టర్ల పదోన్నతుల ప్రక్రియ ప్రారంభమైంది. వాటితోపాటు భూసేకరణ, భూముల రక్షణ, అర్బన్ ల్యాండ్ సీలింగ్ విభాగాలు, న్యాయాధికారులుగా కూడా ఎస్జీడీసీలను నియమించే అవకాశం ఉంది. ఈ పోస్టుల్లో డిప్యూటీ కలెక్టర్లను కూడా నియమించనున్నారు. రెండేళ్ల కిందటే ఆదేశాలు వాస్తవానికి రెవెన్యూ శాఖలో పదోన్నతుల ప్ర క్రియ చాలా కాలంగా నిలిచిపోయింది. వివిధ హోదాల్లో ఉన్న 88 మంది రెవెన్యూ సిబ్బందికి 2016లో పదోన్నతులు ఇచ్చాక ఇంతవరకు ప్రమోషన్లు ఇవ్వలేదు. 2020 ఫిబ్రవరిలో 193 మంది నాయబ్ తహసీల్దార్లకు తహసీల్దార్లుగా పదోన్నతులు కల్పించినా మిగిలిన స్థాయిలో ఫైళ్లు కదల్లేదు. ఇప్పుడు డిప్యూటీ కలెక్టర్లకు పదోన్నతులు ఇవ్వడం ప్రారంభమైనందున అర్హులైన తహసీల్దార్లకు డిప్యూటీ కలెక్టర్లుగా, నాయబ్ తహసీల్దార్లకు తహసీల్దార్లుగా, సీనియర్ అసిస్టెంట్లకు నాయబ్ తహసీల్దార్లుగా, జూనియర్ అసిస్టెంట్లకు సీనియర్ అసిస్టెంట్లుగా పదోన్నతులు లభించనున్నాయి. ఖాళీ అయ్యే జూనియర్ అసిస్టెంట్, తత్సమాన పోస్టులను డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేసే అవకాశం ఏర్పడనుంది. రెవెన్యూ శాఖలో ని అన్ని స్థాయిల్లో పదోన్నతులు చేపట్టాలని రెండేళ్ల క్రితమే సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. నిజానికి 2020 సెప్టెంబర్ 12న ప్రగతిభవన్లో జరిగిన సమావేశంలో భాగంగా రెవెన్యూ సిబ్బందికి పదోన్నతులు ఇవ్వాలంటూ తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీసెస్ అసోసియేషన్ (ట్రెసా) విజ్ఞప్తి మేరకు సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. కానీ అనివార్య కారణాలతో ఈ ప్రక్రియ నిలిచిపోయింది. ఎట్టకేలకు రెండేళ్ల తర్వాత రెవెన్యూ శాఖలో పదోన్నతుల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఎదురుచూపులకు మోక్షం తాజాగా డిప్యూటీ కలెక్టర్ల పదోన్నతుల ప్రక్రియ ప్రారంభమవుతున్న నేపథ్యంలో తమ ప్రమోషన్ల కోసం ఇతర హోదాల్లో ఉన్న రెవెన్యూ సిబ్బంది ఎదురుచూపులకు కూడా త్వరలోనే మోక్షం కలగనుంది. 31 మంది డిప్యూటీ కలెక్టర్లకు పదోన్నతులు లభిస్తే వారి స్థానంలో 120 మంది వరకు తహశీల్దార్లకు, 350 మంది వరకు నాయబ్తహశీల్దార్లకు పదోన్నతులు రానున్నాయి. వారి స్థానంలో ఆ మేరకు సీనియర్, జూనియర్ అసిస్టెంట్లు కూడా పదోన్నతులు పొందనున్నారు. నాయబ్ తహసీల్దార్ల విషయానికి వస్తే 2015–16, 2016–17 ప్యానెల్ సంవత్సరాల్లోనే 375 మంది నాయబ్ తహసీల్దార్లు తహసీల్దార్లుగా పదోన్నతులు పొందేందుకు ఎంపికయ్యారు. 2017–18 సంవత్సరంలో మరో 200 మంది వరకు అర్హత పొందనున్నారు. గతంలో 193 మందికి తహసీల్దార్లుగా ప్రమోషన్లు వచ్చిన నేపథ్యంలో ఇంకా 350 మంది వరకు నాయబ్ తహసీల్దార్లు పదోన్నతుల కోసం ఎదురుచూస్తున్నారు. పదోన్నతి సర్వీసును మూడేళ్ల నుంచి రెండేళ్లకు ప్రభుత్వం ఇటీవల కుదించిన నేపథ్యంలో వీరి సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. అన్ని స్థాయిలో ఈ సంఖ్య పెరుగుతుందని రెవెన్యూ వర్గాలు చెపుతున్నాయి. ప్రస్తుతం రీజినల్ రింగురోడ్డు (ఆర్ఆర్ఆర్) భూసేకరణ కోసం 20 మంది ఆర్డీవో (డిప్యూటీ కలెక్టర్లు)లు ఇంచార్జులుగా పనిచేస్తున్నారు. కొత్తగా తహసీల్దార్లకు డిప్యూటీ కలెక్టర్లుగా పదోన్నతులు వస్తే వారి స్థానంలో రెగ్యులర్ ఆర్డీవోలను నియమించే అవకాశం ఉంది. వీటితో పాటు పలు దేవాలయాలకు ఈవోలుగా, ఇతర సంస్థల్లో, ప్రాజెక్టుల పరిధిలో భూసేకరణ అధికారులుగా కూడా వీరిని నియమించే అవకాశాలున్నాయి. పదోన్నతులిస్తే ఉత్సాహంగా పనిచేస్తాం రెవెన్యూ శాఖలో పనిభారం చాలా ఎక్కు వగా ఉంటుంది. అన్ని శాఖల్లో పదోన్నతు లు లభించినా రెవెన్యూలో కొంత ఆలస్యమైంది. ఇప్పటికి ఈ ప్రక్రియ ప్రారంభం కావడం సంతోషకరం. అన్ని స్థాయిల్లోని సిబ్బందికి వీలైనంత త్వరగా పదోన్నతులు కల్పించేలా ఉన్నతాధికారులు చర్యలు చేపట్టాలి. ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా మా వంతు ఇప్పటికే పనిచేస్తున్నాం. పదోన్నతులు కల్పిస్తే పనిభారం ఎక్కువైనా ఉత్సాహంగా పనిచేస్తాం. – కె. గౌతమ్కుమార్, ట్రెసా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి -
తహసీల్దార్ సస్పెన్షన్.. కుందుర్పి దాటి వెళ్లొద్దు
సాక్షి, అనంతపురం అర్బన్: ప్రభుత్వ శాఖల్లో అవినీతి, అక్రమాలను జగన్ సర్కార్ తీవ్రంగా పరిగణిస్తోంది. ఇందుకు అనుగుణంగా కలెక్టర్ నాగలక్ష్మి చర్యలు చేపట్టారు. అవకతవకలు, అక్రమాలపై విచారణ చేయించడమే కాక, తప్పు చేసినట్లు నిర్ధారణ అయితే వెంటనే చర్యలు చేపడుతున్నారు. ఈ క్రమంలోనే కొద్ది రోజుల క్రితం కూడేరు తహసీల్దారు శ్రీనివాసులపై చర్యలు తీసుకున్నారు. తాజాగా కుందుర్పి తహసీల్దారు తిప్పేస్వామిపై సస్పెన్షన్ వేటు వేశారు. ఈ మేరకు ఉత్తర్వులను మంగళవారం జారీ చేశారు. ముందస్తు అనుమతి లేకుండా కుందుర్పి విడిచి వెళ్లకూడదని ఆదేశాలిచ్చారు. ఇక కుందుర్పి తహసీల్దారుగా అదనపు బాధ్యతలను బ్రహ్మసముద్రం తహసీల్దారు బాలకిషన్కు అప్పగించారు. అత్మకూరులో ఉండగా అవినీతి కుందుర్పి తహసీల్దారు తిప్పేస్వామి గతంలో ఆత్మకూరు తహసీల్దారుగా విధులు నిర్వర్తించారు. ఆ సమయంలో గొరిదిండ్ల, సనప, ఆత్మకూరు, మదిగుబ్బ, పి.యాలేరు. బి.యాలేరు రెవెన్యూ గ్రామాల్లో నిబంధనలకు విరుద్ధంగా పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. వీటిపై స్పందించిన కలెక్టర్ సంబంధిత ఆర్డీఓ ద్వారా విచారణ జరిపించారు. వెబ్ల్యాండ్లో అవకతవకలకు పాల్పడి పట్టాదారు పాసు పుస్తకాలు ఇచ్చినట్లు నిర్ధారణ కావడంతో కలెక్టర్ చర్యలు తీసుకున్నారు. అవకతవకలు నిర్ధారిస్తూ ఆర్డీఓ ఇచ్చిన నివేదిక ►గొరిదిండ్ల రెవెన్యూ గ్రామంలో సర్వే నెంబరు 5–6లో 5.17 ఎకరాలు అన్సెటిల్డ్ భూమికి (ఖాతా నెంబరు 1000010) వెబ్ల్యాండ్లో రేనాటి వరలక్ష్మి పేరును పట్టాదారుగా మార్చారు. 788–3 సర్వే నెంబరులో 4.90 ఎకరాలు అన్సెటిల్డ్ భూమి (ఖాతా నెంబరు 1000010) డి.భీమానాయక్ పేరును పట్టాదారుగా మార్చారు. సర్వే నెంబరు 604–3లో నాగలక్ష్మికి చెందిన 2.85 ఎకరాలు భూమిని కొలిమి సల్మా అనే మహిళను పట్టాదారుగా మార్చారు. సర్వే నెంబరు 1122–1లో ఎలమకూరి తనుజాకు చెందిన 4.98 ఎకరాలను డి.గీంతాజలి పేరున మార్చారు. ►సనప రెవెన్యూ గ్రామంలో సర్వే నెంబరు 282–11లో చిన్నప్పకు చెందిన 4.15 ఎకరాల భూమిని పి.వై.ఎల్లప్ప పేరున మార్చారు. ►ఆత్మకూరు రెవెన్యూ గ్రామంలో సర్వే నెంబరు 373లో హరిజన మంత్రి ముత్యాలప్పకు చెందిన 0.50 ఎకరాల భూమిని వై.సుందరమ్మ పేరున మార్చారు. సర్వే నెంబరు 261–1లో ఎస్.నల్లమ్మకు చెందిన 3.42 ఎకరాల భూమిని లలితమ్మ పేరున పట్టా చేశారు. సర్వే నెంబరు 502–3లో అంకంపల్లి ఓబుళపతికి చెందిన 2.10 ఎకరాల భూమిని ఎ.సోమశేఖర్ పేరున మార్చారు. సర్వే నెంబరు 2–1లో బోడిపాటి నరసమ్మకు చెందిన ఐదు ఎకరాల భూమిని వెంటేసులు, బి.హరికుమార్ పేరున మార్చారు. సర్వే నెంబరు 122–బి1ఎ3లో ఎస్.జగన్మోహన్రెడ్డికి చెందిన ఐదు ఎకరాలను ఎస్.నాగరత్నమ్మ పేరున మార్చారు. ►మదిగుబ్బలో సర్వే నెంబరు 136–6లో 1.25 ఎకరాల మిగులు భూమిని సద్దల పెద్ద నారాయణ పేరున మార్చారు. సర్వే నెంబరు 35–5లో బండి అపర్ణమ్మకు చెందిన 3.85 ఎకరాలను బండి ముత్యాలమ్మ పేరున మార్చారు. సర్వే నెంబరు 143–5బిలో 0.80 ఎకరాలు (లేని భూమి) తలారి నరసింహులు పేరున మార్చారు. ►పి.యాలేరులో సర్వే నెంబరు 403–1ఎలో మండల బొమ్మయ్యకు చెందిన ఐదు ఎకరాలను ఎం.మంజుల పేరున మార్చారు. సర్వే నెంబరు 181–1లో 2.50 ఎకరాల మిగులు భూమిని వై.సౌభాగ్య పేరున మార్చారు. సర్వే నెంబరు 58–1, 2లో ఎస్.దుబ్బరామయ్యకు చెందిన 0.98 ఎకరాలు, 0.96 ఎకరాల భూమిని సుగాలి బాబు పేరున మార్చారు. అదే సర్వే నెంబర్లలో దుబ్బరామయ్యకు చెందిన 0.97 ఎకరాలు, 0.96 ఎకరాల భూమిని సుగాలి లక్ష్మీనారాయణ పేరున మార్చారు. సర్వే నెంబరు 7–3లో జి.లక్ష్మన్నకు చెందిన 2.09 ఎకరాలను జి.శివారెడ్డి పేరున మార్చారు. సర్వే నెంబరు 453–6లో 4 ఎకరాల మిగులు భూమిని జె.మమత పేరున మార్చారు. ►బి.యాలేరులో సర్వే నెంబరు 85–1లో అన్సెటిల్డ్ భూమిని ఎనుముల అఖిల పేరున మార్చారు. సర్వే నెంబరు 224–1ఎలోని 2.20 ఎకరాలను (లేని భూమి) టి.లక్ష్మిదేవి పేరున మార్చారు. -
సాదాబైనామా..50 ఏళ్ల హైరానా..! 9.24 లక్షల దరఖాస్తులు పెండింగ్
సాక్షి, హైదరాబాద్: సాదాబైనామా.. తెల్ల కాగితాలపై రాసుకుని జరిపే భూముల క్రయ విక్రయ లావాదేవీలకు పెట్టిన పేరు ఇది. ఈ సాదాబైనామాలు సాధారణమైనవేమీ కాదు.. రామాయణమంత చరిత్ర ఉంది అంటే అతిశయోక్తి కాదు. వందల ఏళ్ల చరిత్ర ఉన్న సాదాబైనామాలు సమస్యల్లో చిక్కుకుని 50 ఏళ్లు గడిచినా ఇంతవరకు శాశ్వత పరిష్కారం మాత్రం లభించడం లేదు. ఇప్పటికీ రాష్ట్రంలో 9.24 లక్షల దరఖాస్తులు సాదాబైనామా కింద పరిష్కారం కోసం పెండింగ్లో ఉన్నాయంటే పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఆర్వోఆర్ (రికార్డ్ ఆఫ్ రైట్స్) చట్టం–1971 అమల్లో ఉన్నప్పుడు 2.4 లక్షల దరఖాస్తులు పెండింగ్లో ఉండగా, కొత్త రెవెన్యూ చట్టం (2020) అమల్లోకి వచ్చాక మరో 7 లక్షల దరఖాస్తులు పరిష్కారం కోసం వచ్చాయి. 12 రోజుల్లోనే 7 లక్షల మంది కేవలం తెల్లకాగితంపై రాసుకున్నవి కావడం, ఎలాంటి రిజిస్ట్రేషన్ పత్రాలూ లేకపోవడంతో ఏళ్లు గడిచే కొద్దీ వివాదాలు పెరుగుతూ వచ్చాయి. ఈ నేపథ్యంలోనే సాదాబైనామాల క్రమబద్ధీకరణ మొదలయ్యింది. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ఇప్పటివరకు రెండుసార్లు సాదాబైనామా దరఖాస్తులు స్వీకరించారు. 2014 జూన్ 2 లోపు తెల్లకాగితాలపై రాసుకున్న లావాదేవీల క్రమబద్ధీకరణ కోసం దరఖాస్తులు ఆహ్వానించగా 2.4 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఆ దరఖాస్తులు వచ్చి ఏళ్లు గడుస్తున్నా పరిష్కారం లభించలేదు. 2020లో రాష్ట్ర ప్రభుత్వం కొత్త రెవెన్యూ చట్టాన్ని అమల్లోకి తెచ్చింది. అప్పటివరకు అమల్లో ఉన్న ఆర్వోఆర్ చట్టం–1971కి సవరణలు చేసి ఆర్వోఆర్ చట్టం–2020ని అమల్లోకి తెచ్చింది. 2020, అక్టోబర్ 29న ఈ చట్టం అమల్లోకి రాగా, అక్టోబర్ 30 నుంచి నవంబర్ 10 వరకు మరోమారు సాదాబైనామాల క్రమబద్ధీకరణకు అవకాశం కల్పించారు. ఈ 12 రోజుల్లోనే 7 లక్షల మంది తమ సాదాబైనామా లావాదేవీలను క్రమబద్ధీకరించాలని కోరుతూ ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకోవడం గమనార్హం. కాగా రెండోసారి దరఖాస్తులు తీసుకున్నప్పుడు కూడా 2014, జూన్ 2నే కటాఫ్ డేట్గా నిర్ణయించారు. కానీ ఇప్పటివరకు ఆ 9.4 లక్షల దరఖాస్తులకు మోక్షం లభించలేదు. 1971 చట్టం అమల్లోకి వచ్చిన తర్వాతే.. సాదాబైనామా లావాదేవీలు గతంలో అధికారికంగా చెల్లుబాటు అయ్యేవి. 1948లో హైదరాబాద్ రాష్ట్రంగా ఉన్నప్పుడు హైదరాబాద్ రికార్డ్ ఆఫ్ రైట్స్ యాక్ట్–1948 ప్రకారం సాదాబైనామా లావాదేవీలను తహశీల్దార్లు క్రమబద్ధీకరించే వారు. రిజిస్ట్రేషన్లు, నోటిమాట, తెల్ల కాగితాల ద్వారా జరిగిన భూముల క్రయవిక్రయ లావాదేవీలను పరిగణనలోకి తీసుకుని జమాబందీ ద్వారా తహశీల్దార్లు పట్టాదారు పాస్ పుస్తకం జారీ చేసేవారు. 1970 వరకు ఇదే విధానం అమల్లో ఉంది. ఆ తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1948 చట్టాన్ని సవరించి 1971 ఆర్వోఆర్ చట్టాన్ని అమల్లోకి తెచ్చినప్పుడు ఈ సాదాబైనామాల విషయంలో నిబంధనలు మార్చారు. భూమి కొనుగోలు లావాదేవీలపై రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఉంటేనే పట్టాదారు పాస్పుస్తకం ఇవ్వాలనే నిబంధన పెట్టారు. దీంతో తెల్లకాగితాలు, నోటిమాట లావాదేవీలు అధికారికంగా చెల్లకుండా పోయాయి. ఆ తర్వాత 1989లో ఓసారి 1971 చట్టాన్ని సవరించారు. దీని ప్రకారం తహశీల్దార్లకు సాదాబైనామాలను పరిష్కరించే అధికారం కల్పించారు. అప్పటి నుంచి ఇప్పటివరకు ఈ సవరణ చట్టం ద్వారానే సాదాబైనామాలను క్రమబద్ధీకరిస్తున్నారు. 1989, 2000, 2014, 2020లో నాలుగుసార్లు ఇలా సాదాబైనామాల పరిష్కారానికి దరఖాస్తులు స్వీకరించారు. కొత్త చట్టంలో అధికారాలేవీ..? అయితే 2020లో అమల్లోకి వచ్చిన కొత్త రెవెన్యూ చట్టంలో తహశీల్దార్లకు గానీ, ఇతర ఏ స్థాయి రెవెన్యూ యంత్రాంగానికి గానీ సాదాబైనామాలను పరిష్కరించే అధికారం కల్పించలేదు. అసలు సాదాబైనామాల ప్రస్తావనే లేదని భూచట్టాల నిపుణులు చెపుతున్నారు. కొత్త చట్టం అమల్లోకి వచ్చాక నోటిఫికేషన్ ఇచ్చి మరీ 7 లక్షల దరఖాస్తులు స్వీకరించిన ప్రభుత్వం.. పరిష్కార వ్యవస్థను కొత్త చట్టంలో ఏర్పాటు చేయకపోవడం గమనార్హం. ఇప్పుడు మొత్తం 9.4 లక్షల (20 లక్షల ఎకరాల విస్తీర్ణం ఉంటుందని అంచనా.) సాదాబైనామాల దరఖాస్తులను పరిష్కరించాలంటే చట్ట సవరణే మార్గమని, ఆర్వోఆర్ చట్టం–2020కి సవరణ జరిగేంతవరకు ఈ సాదాబైనామాల క్రమబద్ధీకరణ సాధ్యం కాదని నిపుణులు చెబుతున్నారు. ఇప్పటివరకు వచ్చిన దరఖాస్తుల మాట అలా ఉంచితే... 2014 జూన్ 2 తర్వాత జరిగిన సాదాబైనామాల పరిస్థితి ఏంటనేది అంతుచిక్కని ప్రశ్నగా మారింది. మరి, చట్ట సవరణ, కొత్త దరఖాస్తుల స్వీకరణ, కటాఫ్ డేట్ మార్పు లాంటి అంశాల్లో ప్రభుత్వం ఏం చేస్తుందో..సాదాబైనామాల అంశాన్ని ఎప్పటికి శాశ్వతంగా పరిష్కరిస్తుందో వేచి చూడాల్సిందే. -
సర్వే రికార్డే ఇక ఆర్ఎస్ఆర్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో భూముల రీసర్వే కార్యక్రమాన్ని మరింత వేగంగా ముందుకు తీసుకెళ్లేందుకు ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది. రీసర్వే ల్యాండ్ రిజిస్టర్నే ఆర్ఎస్ఆర్గా పరిగణించేలా ఏపీ రైట్స్ ఇన్ ల్యాండ్ అండ్ పట్టాదార్ పాస్బుక్ రూల్స్కు సవరణలు ప్రతిపాదిస్తూ ప్రాథమిక గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. రీసర్వేలో భాగంగా రెవెన్యూ శాఖ ఆర్ఓఆర్ (రికార్డ్ ఆఫ్ రైట్స్)లో ఫారమ్–1 తయారు చేయాలి. అందుకోసం ఆర్ఓఆర్ ప్రక్రియ అంతటినీ అనుసరించాల్సి ఉంటుంది. ఇందుకోసం 80 నుంచి 90 రోజుల సమయం పడుతుంది. సర్వే శాఖ రీసర్వే పూర్తి చేసిన తర్వాత దీన్ని రెవెన్యూ శాఖ చేపడుతుంది. సర్వే శాఖ కొన్ని రోజులు, ఆ తర్వాత రెవెన్యూ శాఖ మరికొన్ని రోజులు ఇదే ప్రక్రియను చేయడం వల్ల సమయం వృథా అవుతున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. సర్వే శాఖ ఇప్పటికే రీసర్వే ద్వారా భూములను కొలిచి తయారు చేసే రికార్డును (రీసర్వే ల్యాండ్ రిజిస్టర్) ఆర్ఎస్ఆర్గా చూడాలని ఏపీ రైట్స్ ఇన్ ల్యాండ్ అండ్ పట్టాదార్ పాస్బుక్ రూల్స్కు సవరణ చేయనున్నారు. సర్వే శాఖ భూముల్ని కొలిస్తే దానికి ఎవరు యజమాని అనే విషయాన్ని రెవెన్యూ శాఖ నిర్ధారిస్తుంది. ఇప్పుడు సర్వే సమయంలోనే రెండు పనులు అయ్యేలా నిబంధనల్ని సవరిస్తున్నారు. రీసర్వే పూర్తయినట్లు గ్రామాల్లో ఫారమ్–13 నోటిఫికేషన్ ఇవ్వకముందు తయారు చేసే రీసర్వే ల్యాండ్ రిజిస్టర్నే ఆర్ఎస్ఆర్గా పరిగణిస్తామని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. అంటే సర్వే రికార్డునే ఆర్ఎస్ఆర్గా పరిగణిస్తారు. ఆ తర్వాత పూర్తి వివరాలతో ఫామ్–1బీ తయారు చేస్తారు. సాంకేతిక కారణాల వల్ల ఆలస్యమవుతున్న భూముల రీసర్వే దీనివల్ల వేగం పుంజుకుంటుందని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. ఈ నోటిఫికేషన్ ఇచ్చిన 12 రోజుల తర్వాత సవరణలు అమల్లోకి వస్తాయని రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్ అందులో పేర్కొన్నారు. -
‘రెవెన్యూ’కు 250 ఏళ్లు
ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాలన్నీ వ్యవసాయాదాయం పెంచుకునే ఇతర రంగాలను అభివృద్ధి చేసుకున్నాయి. భారతదేశ ప్రాచీన, మధ్యయుగ కాలాల్లోని రాజ్యాల ప్రధాన వనరు అయిన భూమిశిస్తును వసూలు చేసింది సాంప్రదాయ రెవెన్యూ ఉద్యోగులే. అంటే దేశంలో అతి పురాతన శాఖ రెవెన్యూ శాఖే. అయితే ఆధునిక రెవెన్యూ శాఖ సృష్టి, రూపురేఖలన్నీ బ్రిటిష్ రాజ్ కాలంలోనే సంతరించుకున్నాయి. బ్రిటిష్ వలస పాలనలో స్థాపితమైన అనేక వ్యవస్థలూ, చట్టాలూ కొన్ని యథాతథం గానూ, కొన్ని మార్పు చేర్పుల తోనూ ఇప్పటికీ కొనసాగు తున్నాయి. ముఖ్యంగా ప్రస్తుతం దేశ వ్యాప్తంగా అమలులో ఉన్న రెవెన్యూ వ్యవస్థ ఆ కాలంలో పురుడుపోసుకున్నదే. ప్లాసీ యుద్ధం (1757) భారత దేశంలో బ్రిటిష్ అధికార స్థాపనకు వీలుకల్పించింది. బక్సార్ యుద్ధం (1764) ఆంగ్లేయుల అధికారాన్ని పటిష్ఠపరచింది. ఆ యుద్ధం తరువాత జరిగిన అలహా బాద్ సంధి ద్వారా మొగల్ చక్రవర్తి షా ఆలం నుండి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వారు బెంగాల్, బిహార్, ఒరిస్సా, సుబాలలో దివానీ (శిస్తు వసూలు చేసుకునే) అధికారం పొందారు. ఉత్తర భారతంలో 1765 నుండి 1772 వరకు, అలాగే కర్ణాటక యుద్ధాలు విజయాల తరువాత దక్షిణాదిన కూడా బ్రిటిష్వాళ్లు శిస్తు వసూలుకు వివిధ పద్ధతులను పాటించారు. బెంగాల్ గవర్నర్ వారెన్ హేస్టింగ్స్ 1772 మే 14న భూమిశిస్తు వసూలుకు ప్రతి జిల్లాకి ఒక కలెక్టర్ను నియమించారు. అంటే కలెక్ట్టర్ ఉద్యోగ సృష్టి జరిగి మే 14 నాటికి 250 ఏళ్ళు పూర్తవుతుందన్న మాట! బెంగాల్ మొత్తంలో శిస్తు వసూలును పర్య వేక్షించడానికి ‘బోర్డ్ ఆఫ్ రెవెన్యూ’ గవర్నర్ ఆధ్వ ర్యంలో ఏర్పాటయింది. తరువాత కాలంలో బెంగాల్ గవర్నర్ జనరల్గా వచ్చిన కారన్ వాలీస్ ‘బోర్డ్ ఆఫ్ రెవెన్యూ’ను సంస్కరించి, అన్ని బ్రిటిష్ ప్రావిన్స్ల లోనూ ఈ బోర్డులను ఏర్పాటు చేశాడు. ఆ విధంగా మద్రాస్ ప్రావిన్స్లో ఏర్పడిన ఈ వ్యవస్థ 1977లో íసీఎల్ఆర్ శాఖ ఏర్పాటు వరకూ కొనసాగింది. ప్రస్తుతం దాని స్థానంలో సీసీఎల్ఏ 1999 నుంచి కొనసాగుతోంది. స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్ళలో దేశంలో రెవెన్యూ సిబ్బంది నెరవేర్చిన బాధ్యతలు మరువ లేనివి. జమిందార్లకు శిస్తు వసూలు అధికారాలను రద్దు చేస్తూ, సాగుచేసే వాడికి భూమిపై హక్కులు కల్పిస్తూ చేసిన ‘ఎస్టేట్ రద్దు చట్టం–1948’ను అమలు చేయడం, ప్రతి పేదోడికి భూమిపై హక్కులను గుర్తించడానికి చేసిన ‘సర్వే అండ్ సెటిల్మెంట్’లో రెవెన్యూ శాఖవారి సేవ జీతంతో కొలవలేనిది. అలాగే ‘ల్యాండ్ సీలింగ్ యాక్ట్’ అమలు, ‘మిగులు భూమి’ని అర్హులుకు పంపిణీ చేయడం వంటివన్నీ రెవెన్యూ వారిని మరింత ప్రజల మనుషులను చేశాయి. ఒక్క మాటలో చెప్పాలంటే భూ సంస్కరణ ఫలాలు పేదోడికి చేర్చిన ఘనత రెవెన్యూ శాఖదే! స్వాతంత్య్రం వచ్చిన తరువాత పంచవర్ష ప్రణా ళికలో ఎన్నో లక్ష్యాల కొరకు ఎంతో భూసేకరణ చేయవలసి వచ్చింది. రెవెన్యూశాఖే ఆ బాధ్యతను తలకెత్తుకొంది. దేశాభివృద్ధి దృష్ట్యా కొత్త ప్రాజెక్టులు – ఇరిగేషన్, రోడ్లు, నౌకాశ్రయాలు, విమానాశ్రయాలు, ఉన్నత విద్యా సంస్థలు, భారీ పరిశ్రమలు వంటి ఎన్నో నిర్మాణాలకు భూసేకరణ అనే మహా యజ్ఞం రెవెన్యూ శాఖతోనే జరిగింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన ‘జగనన్న శాశ్వత భూ హక్కు పథకం/ రీ సర్వే’ రెవెన్యూ శాఖ ద్వారానే జరుగుతోంది. పేదలందరికీ ఇళ్ళ పథకంలో 30 లక్షల పైగా ఇంటి పట్టాల పంపిణీకి భూసేకరణ అంతా రెవెన్యూ శాఖ చేతుల మీదుగానే జరిగింది. సంక్షేమ పథకాలలో అగ్రగామి అయిన నిత్యావసర వస్తువుల పంపిణీ రెవెన్యూ శాఖ భుజస్కంధాల పైనే నేటికీ నడుస్తోంది. తుపానులు, వరదలు అగ్ని ప్రమాదాల ఇతర ప్రకృతి వైపరీత్యాలు వంటివి సంభవించినప్పుడు రెవెన్యూ శాఖ పాత్రే ఎంతో కీలకం. ఒక్క మాటలో చెప్పాలంటి సామా న్యుడి జననం నుండి మరణం వరకు కావలసిన ఎన్నో ధ్రువీకరణ పత్రాలను మంజూరు చేయడమే కాక సామాన్యుడి సేవలో నిరంతరం పనిచేసేది రెవెన్యూ శాఖే! కోరాడ శ్రీనివాసరావు వ్యాసకర్త తహశీల్దారు, సాలూరు మండలం, పార్వతీపురం మన్యం జిల్లా ‘ 94410 08574 -
పాట్లు లేకుండా సర్టిఫికెట్లు
సాక్షి, అమరావతి: ప్రజలకు అవసరమైన కీలక సర్టిఫికెట్ల జారీ ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం మరింత సరళతరం చేసింది. సర్టిఫికెట్ల కోసం ఎవరూ రెవెన్యూ కార్యాలయాలు, అధికారులు చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా సులభంగా జారీ చేసేలా చర్యలు చేపట్టింది. దరఖాస్తులు పెండింగ్లో ఉండేందుకు ప్రధాన కారణాలను గుర్తించి వేగంగా సర్టిఫికెట్లు జారీ చేసేలా కొత్త మార్గదర్శకాలు వెలువరించింది. సరైన కారణాలు లేకుండా ఏ దరఖాస్తునూ తిరస్కరించరాదని స్పష్టం చేసింది. ధృవపత్రాలు సులభంగా ప్రజలకు అందేలా చూడాలని ఆదేశించింది. సర్టిఫికెట్ల జారీ రెవెన్యూ శాఖ ముఖ్య విధుల్లో ఒకటని పేర్కొంటూ గ్రామ సచివాలయం నుంచి జిల్లా కలెక్టర్ల వరకు ఈ మార్గదర్శకాలను పాటించాలని నిర్దేశించింది. ఈ మేరకు భూపరిపాలన ప్రధాన కమిషనర్, రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్ సర్క్యులర్ జారీ చేశారు. దరఖాస్తు సమయంలోనే అన్నీ.. సర్టిఫికెట్ల జారీకి దరఖాస్తులను స్వీకరించే గ్రామ, వార్డు సచివాలయాలు, మీసేవా కేంద్రం, ఆన్లైన్ వెబ్అప్లికేషన్, కాల్ సెంటర్ లాంటి వ్యవస్థలన్నీ ఈ మార్గదర్శకాల ప్రకారమే పని చేయాలి. దరఖాస్తు స్వీకరించే సమయంలోనే అర్జీదారుడికి సంబంధించిన బయోమెట్రిక్ గుర్తింపు సహా అన్ని వివరాలను తప్పనిసరిగా తీసుకుని అనుమతి ప్రక్రియ పూర్తి కాగానే అందులో ఇచ్చిన చిరునామాకు సర్టిఫికెట్ పంపాలి. ర్యాండమ్గా తనిఖీలు... తిరస్కరించిన అర్జీల్లో 25 శాతం, అనుమతి ఇచ్చిన వాటిల్లో 5 శాతం అర్జీలను తహశీల్దార్లు, ఆర్డీవోలు, కలెక్టర్లు తనిఖీ చేయాలి. ప్రతి వారం కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు కొన్ని తిరస్కరించిన అర్జీలను పరిశీలించి కారణాలను సమీక్షించాలి. తిరస్కరణకు సరైన కారణాలు ఉన్నాయా? నిర్దేశించిన ప్రకారమే తిరస్కరించారా? లేక వేరే కారణాలు ఏమైనా ఉన్నాయా? అనే అంశాలను పరిశీలించాలి. సులభంగా ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నప్పుడు ఆ కుటుంబ పెద్ద గతంలోనే సర్టిఫికెట్ పొంది ఉంటే అప్పటికప్పుడు జారీ చేయాలి. హౌస్హోల్డ్ డేటాబేస్లో ఉన్న కుటుంబానికి వెంటనే ఫ్యామిలీ సర్టిఫికెట్ ఇవ్వాలి. ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసుకున్న సమయంలో కుటుంబ సభ్యులందరి ఆధార్ కార్డులు తీసుకుంటారు కాబట్టి వారందరి స్టేట్మెంట్లు రికార్డు చేయాల్సిన అవసరం లేదు. ఎవరైనా ఒక కుటుంబ సభ్యుడు అందుబాటులో లేరనే కారణంతో దరఖాస్తును తిరస్కరించకూడదు. ఒక ఫ్యామిలీ కింద మరొకరు ఎవరైనా సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసిన సందర్భాల్లో ఆ యజమాని చుట్టుపక్కల వారు, గ్రామ పెద్దల స్టేట్మెంట్లను రికార్డు చేయడం తప్పనిసరి. టెన్త్ సర్టిఫికెట్ను బట్టి... ఆలస్యంగా పుట్టిన తేదీ కోసం దరఖాస్తు చేసుకున్న సందర్భాల్లో పదో తరగతి సర్టిఫికెట్ ఆధారంగా జన్మదిన ధ్రువీకరణ పత్రాన్ని ఇవ్వాలి. పాస్పోర్ట్ కోసం దర ఖాస్తు చేసుకున్నప్పుడు అనుమతించే 13 గుర్తింపు పత్రాల్లో ఏది చూపినా ఎలాంటి తదుపరి విచారణ లేకుండా ఈ ధ్రువీకరణ పత్రం ఇవ్వాలి. ఆలస్యంగా మరణ ధ్రువీకరణకు నమోదు చేసుకున్నప్పుడు అంత్యక్రియల సర్టిఫికెట్తో పాటు గ్రామ పెద్దలు, సంబంధిత ఇంటి యజమాని చుట్టుపక్కల వారిని విచారించాలి. ఐదేళ్ల తర్వాత జనన, మరణ ధ్రువీకరణ పత్రాలను కోరే ప్రతి కేసులోనూ ఈ విధానం పాటించాలి. గతంలో తీసుకుంటే వెంటనే.. ఇంటిగ్రేటేడ్ సర్టిఫికెట్ (కమ్యూనిటీ, నేటివిటీ, పుట్టిన తేదీ) గతంలో జారీ అయి ఉంటే ప్రస్తుత తహశీల్దార్ డిజిటల్ సంతకం, ప్రస్తుత తేదీతో మళ్లీ వెంటనే జారీ చేయాలి. హౌస్హోల్డ్ డేటాబేస్లో ఉన్న ఏ వ్యక్తికైనా గ్రామ సచివాలయాల స్థాయిలో వీఆర్వో గుర్తింపుతో ఇంటిగ్రేటెడ్ సర్టిఫికెట్ను కేటగిరీ ‘ఏ’ సర్వీసు కింద (అక్కడికక్కడే) జారీ చేయవచ్చు. దరఖాస్తుదారుడి తండ్రి గతంలోధ్రువీకరణ పత్రం పొంది ఉంటే వెంటనే ఇంటిగ్రేటెడ్ సర్టిఫికెట్ ఇవ్వాలి. పుట్టిన తేదీ సర్టిఫికెట్ జారీలోనూ ఇదే విధానం పాటించాలి. దరఖాస్తు చేసిన 8 రోజుల్లోగా ఇంటిగ్రేటెడ్ సర్టిఫికెట్ జారీ చేయాలి. తెల్లకార్డుదారులకు.. ఐదేళ్ల క్రితం ఆదాయ ధ్రువీకరణ సర్టిఫికెట్ పొందినవారు మళ్లీ దరఖాస్తు చేసుకుంటే అప్పటికప్పుడే ఇవ్వాలి. గడువు సమయం దాటితే కొత్త సర్టిఫికెట్ జారీ చేయాలి. దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న సంవత్సరానికి రూ.లక్ష ఆదాయం ఉన్న తెల్లకార్డుదారులంతా ఆటోమేటిక్గా ఆదాయ ధ్రువీకరణ సర్టిఫికెట్లు పొందవచ్చు. కొత్తగా సర్టిఫికెట్ ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఆరు దశల ధ్రువీకరణ ప్రక్రియను పూర్తి చేసి 10 రోజుల్లో ఇవ్వాలి. ఆదాయ ధ్రువీకరణ పత్రాల దరఖాస్తులను తిరస్కరించకూడదు. -
AP High Court: వేలంలో కొన్న అసైన్డ్ భూమి నిషేధిత జాబితాలోకి రాదు
సాక్షి, అమరావతి: బహిరంగ వేలంలో కొన్న అసైన్డ్ భూమిని నిషేధిత భూముల జాబితా (22ఏ)లో చేర్చడం చట్టవిరుద్ధమని హైకోర్టు స్పష్టం చేసింది. అసైన్డ్ భూమిని ఎవరైనా బహిరంగ వేలం ద్వారా కొనుగోలు చేసినప్పుడు దాన్ని అసైన్డ్ భూమిగా పరిగణించడానికి వీల్లేదంది. ఈ మేరకు చిత్తూరు జిల్లా రేణిగుంట మండలం కొట్రమంగళంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం నిర్వహించిన బహిరంగ వేలంలో కొనుగోలు చేసిన 10 ఎకరాల భూమిని నిషేధిత భూముల జాబితాలో చేరుస్తూ రెవెన్యూ శాఖ జారీ చేసిన ఉత్తర్వులను హైకోర్టు చట్టవిరుద్ధంగా ప్రకటించింది. ఆ ఉత్తర్వులకు అనుగుణంగా సీసీఎల్ఏ జారీ చేసిన ప్రొసీడింగ్స్ను రద్దు చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ మల్లవోలు సత్యనారాయణమూర్తి ఇటీవల తీర్పు ఇచ్చారు. నిషేధిత భూముల జాబితాలో చేర్చడం సరికాదు.. బహిరంగ వేలం ద్వారా కొనుగోలు చేసిన అసైన్డ్ భూమిని నిషేధిత భూముల జాబితాలో చేరుస్తూ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ పి.గీత, ఇ.మోహన్ రామిరెడ్డి, ఎం.విజయభాస్కరరాజు హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై న్యాయమూర్తి జస్టిస్ సత్యనారాయణమూర్తి విచారణ జరిపారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి ‘పిటిషనర్లు వ్యవసాయ సహకార సంఘం నిర్వహించిన బహిరంగ వేలంలో భూములు కొన్నారు. రెవెన్యూ రికార్డుల్లో కూడా వారి పేర్లు నమోదయ్యాయి. పాసు పుస్తకాలు కూడా జారీ అయ్యాయి. తుడా అధికారులు కూడా ఎన్వోసీ ఇచ్చారు. ఇన్ని జరిగినప్పటికీ ప్రభుత్వం పిటిషనర్ల భూములను నిషేధిత భూముల జాబితాలో చేర్చింది’ అని ఆక్షేపించారు. అంతేకాకుండా ‘భూమిని అసైన్డ్దారుకి కేటాయించినప్పుడు ఆ భూమికి ప్రభుత్వం యజమాని కాదు. ఆ భూమికి అన్ని రకాలుగా అసైన్డ్దారే యజమాని. భూమిని తాకట్టుపెట్టి అసైన్డ్దారు రుణం తీసుకోవచ్చు. తీసుకున్న రుణాన్ని అసైన్డ్దారు చెల్లించలేకపోతే ఆ భూమిని వేలం వేయొచ్చు. వేలంలో ఆ భూమిని ఎవరైనా కొనుగోలు చేస్తే అప్పటి నుంచి ఆ భూమిని అసైన్డ్ భూమిగా పరిగణించరాదు’ అని తీర్పులో పేర్కొన్నారు. -
లాడ్జికి రావాలని ఒకర్ని.. ఇంట్లో ఎవరూ లేకుంటే వచ్చేస్తా అని మరొకర్ని..
తుమకూరు (కర్ణాటక): నగరంలోని బెస్కాం ఆఫీసులో మహిళా సిబ్బందిని తిపటూరు సబ్టౌన్ రెవెన్యూ శాఖలో అసిస్టెంట్గా పనిచేసే బీకే జగదీశ్ లైంగిక వేధిస్తున్నట్లు ఏడుగురు మహిళా సిబ్బంది ఫిర్యాదు చేశారు. ఓ ఉద్యోగిని మాట్లాడుతూ జగదీశ్ను తాను అన్న అని పిలుస్తానని, అలా పిలవరాదని అసభ్యంగా మాట్లాడాడని తెలిపారు. డ్యూటీ అయిపోయాక ఫోన్లు చేస్తూ ఇంట్లో ఎవరూ లేకుంటే.. వచ్చేస్తా.. ఓకేనా అంటూ వేధిస్తున్నట్లు వాపోయారు. లాడ్జికి రావాలని వేధించినట్లు మరో ఉద్యోగిని తెలిపారు. ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ సోమశేఖర్గౌడ స్పందిస్తూ జగదీశ్ను మరో ప్రాంతానికి బదిలీ చేస్తామని చెప్పారు. చదవండి: (ఆరు నెలలుగా బాలికపై లైంగిక దాడి.. ఒంటిపై పంటిగాట్లు గుర్తించి..) -
నమోదులో తప్పులు .. రైతుల తిప్పలు
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం పోచారం గ్రామానికి చెందిన దాయాదుల మధ్య భూమి పంచాయితీ వచ్చింది. ఈ పంచాయితీ కారణంగా ఒకరు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేయడంతో భూరికార్డుల ప్రక్షాళన సమయంలో ఆ భూమిని పార్ట్–బీలో పెట్టారు. ఆ భూమిపై ఎవరికీ పాసు పుస్తకాలు ఇవ్వలేదు. ఇప్పుడు ఆ దాయాదుల మధ్య రాజీ కుదిరింది. భూమి పంపకాలపై ఓ స్పష్టత వచ్చింది. దీంతో దాయాదులు పాత పట్టాదారు పేరు మీద పాసు పుస్తకం కోసం ధరణిలో దరఖాస్తు చేసుకునేందుకు వెళితే సాఫ్ట్వేర్ అంగీకరించడం లేదు. ఈ భూమిపై ఏదో కేసు ఉందని చెబుతోంది. ఏం కేసు ఉందో, కేసు నంబర్ ఏంటో.. వివరాలు తెలియక, ఏం చేయాలో లబోదిబోమంటున్నారు. సాక్షి, హైదరాబాద్: భూములకు సంబంధించిన హక్కులు, వాటి రికార్డుల విషయంలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాల్సిన రెవెన్యూ యంత్రాంగం చేసిన తప్పుల కారణంగా రాష్ట్రవ్యాప్తంగా రైతులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. పాసుపుస్తకాల కోసం చేసుకున్న దరఖాస్తులు ఎటు వెళ్లాయో కూడా అర్థం కాక రాష్ట్రంలోని దాదాపు 25 లక్షలకు పైగా ఎకరాలకు చెందిన రైతులు తలలు పట్టుకుంటున్నారని రెవెన్యూ వర్గాలే చెబుతున్నాయి. ఇదిలావుంటే వచ్చిన పాసు పుస్తకాల్లో తప్పులు సరిచేసేందుకు ధరణి పోర్టల్ ద్వారా చేసుకున్న దరఖాస్తులు పరిష్కారానికి నోచుకోవడం లేదు. పాసుపుస్తకాల్లో పేరు, ఊరు, తండ్రిపేరు, విస్తీర్ణం, భూమి రకం, సంక్రమించిన విధానం... ఇలా పలు అంశాల్లో రెవెన్యూ సిబ్బంది నిర్వాకం కారణంగా దొర్లిన తప్పులు రైతులను ఇబ్బందుల పాలు చేస్తున్నాయి. వీటిని సవరించాలంటూ పెట్టుకున్న దరఖాస్తులు కలెక్టర్ల లాగిన్లలోనే ఉండిపోతున్నాయి. ఈ దరఖాస్తులను రెవెన్యూ సిబ్బంది కూడా పెద్దగా పట్టించుకోవడం లేదని, కలెక్టర్లకు నివేదికలు పంపడం లేదని తెలుస్తోంది. దీంతో తప్పుల సవరణలకు సంబంధించిన దరఖాస్తులు నెలలు, ఏళ్ల తరబడి అలా పెండింగ్లోనే ఉండిపోతున్నాయి. గుట్టలుగా పాసుపుస్తకాలు ఇక, కొత్త పాసుపుస్తకాల కోసం చేసుకున్న దరఖాస్తులు అతీగతీ లేకుండా పోతున్నాయి. ఈ పాసుపుస్తకాలను బయట ముద్రించాల్సి ఉండడం, వాటిని భూపరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్ఏ) ద్వారా రైతులకు పంపాల్సి ఉండడంతో అసలు ఆ పుస్తకాలను ముద్రించారో లేదో కూడా అర్థం కావడం లేదు. మరోవైపు, ముద్రించిన పాసుపుస్తకాలు గుట్టల కొద్దీ సీసీఎల్ఏ కార్యాలయంలో పేరుకుపోతున్నాయని, వాటిని రైతులకు పంపేందుకు గాను అవసరమైన స్టాంపులు కొనేందుకు కూడా సీసీఎల్ఏ వర్గాల వద్ద నిధుల్లేవని తెలుస్తోంది. దీంతో వచ్చిన పుస్తకాలు వచ్చినట్టు సీసీఎల్ఏ కార్యాలయంలో ఉండిపోతున్నాయే తప్ప రైతుల దరి చేరడం లేదు. ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలి రైతుల భూములకు సంబంధించిన పాసుపుస్తకాలు, ఆ పుస్తకాల్లో నమోదైన తప్పులు, భూరికార్డుల ప్రక్షాళనలో పార్ట్బీ (వివాదంలో ఉన్న భూములు) కింద నమోదు చేసిన భూముల విషయంలో ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని రైతు సంఘాలంటున్నాయి. లేకపోతే ఈ సమస్యలకు పరిష్కారం లభించే అవకాశం కనిపించడం లేదని పేర్కొంటున్నాయి. -
ఫోన్ కొట్టు.. అవినీతి ఆటకట్టు
సాక్షి, అమరావతి: ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులపై వచ్చే అవినీతి ఆరోపణలపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) దూకుడుగా వ్యవహరిస్తోంది. అవినీతికి ఆస్కారం లేని, పారదర్శకమైన వ్యవస్థను రూపొందించాలన్న రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా రెండేళ్లుగా క్రియాశీలక పాత్ర పోషిస్తోంది. బాధితులు టోల్ ఫ్రీ నంబర్ 14400కు ఫోన్ చేస్తే చాలు క్షణాల్లోనే యాక్షన్లోకి దిగిపోతోంది. ఫిర్యాదుల తీరును బట్టి తగిన చర్యలు తీసుకుంటోంది. అవినీతి ఆరోపణలు వాస్తవమని తేలితే కఠినంగా వ్యవహరిస్తోంది. ప్రభుత్వ అధికారులు, ఉద్యోగుల అవినీతిపై బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించేందుకు ఏసీబీ ‘స్పందన’ వ్యవస్థను విజయవంతంగా నిర్వహిస్తోంది. 97 శాతం కేసులు నిర్ణీత వ్యవధిలో పరిష్కారం బాధితుల ఫిర్యాదులను తక్షణం పరిష్కరించడంపై ఏసీబీ ప్రత్యేక శ్రద్ధ వహిస్తోంది. అందుకోసం విశాఖపట్నంలో కాల్ సెంటర్ ఏర్పాటు చేసి టోల్ఫ్రీ నంబర్ 14400 కేటాయించింది. బాధితులు ఆ నంబర్కు ఫోన్ చేస్తే విజయవాడలోని ఏసీబీ ప్రధాన కా ర్యాలయానికి వెంటనే సమాచారమిస్తారు. ఏసీబీ అధికారులు వెంటనే రంగంలోకి దిగి ఆరోపణల తీరును బట్టి నిర్ణీత కాల వ్యవధిలోగా పరిష్కరిస్తున్నారు. సాధారణ ఫిర్యాదులైతే 10 రోజులు, లోతుగా దర్యాప్తు చేయాల్సిన ఫిర్యాదులైతే నెల రోజుల్లో పరిష్కరించాలన్నది గడువు. 2019 నవంబర్ నుంచి 2021 అక్టోబర్ 4 వరకు 97% ఫిర్యాదులను నిర్ణీత వ్యవధిలో పరిష్కరించడం విశేషం. ఇప్పటివరకు 5,155 ఫిర్యాదులు రాగా.. వాటిలో నిర్ణీత గడువులోగా ఏకంగా 5,037 ఫిర్యాదులను ఏసీబీ పరిష్కరించింది. కేవలం 118 మాత్రమే పెండింగ్లో ఉన్నాయి. వాటికి కూడా ఇంకా గడువు ఉంది. ఏసీబీకి ఫిర్యాదు చేశారని తెలియగానే చాలా వరకు కేసులు పరిష్కారమైపోతున్నాయి. ప్రభుత్వం కఠినంగా ఉండటంతో సంబంధిత అధికారులు, ఉద్యోగులు తక్షణం బాధితుల సమస్యలు పరిష్కరిస్తున్నారు. కాగా, వచ్చిన ఫిర్యాదులను విచారించి అవినీతి ఆరోపణలు వాస్తవమని గుర్తించిన కేసుల్లో తదనుగుణంగా తక్షణం చర్యలు తీసుకుంటోంది. అత్యధిక ఫిర్యాదులు రెవెన్యూ, పంచాయతీరాజ్ శాఖల పైనే.. రెండేళ్లలో అధికారులు, ఉద్యోగుల అవినీతికి సంబంధించి వచ్చిన ఫిర్యాదుల విషయంలో రెవెన్యూ శాఖ మొదటి స్థానంలో, పంచాయతీరాజ్ శాఖ రెండో స్థానంలో ఉన్నాయి. రెవెన్యూ శాఖలో పట్టాదార్ పాస్ పుస్తకాలు, భూ రికార్డుల్లో తప్పుల సవరణ, సర్టిఫికెట్ల మంజూరు, భూముల సర్వేకు సంబంధించిన అంశాలపై ఎక్కువగా ఫిర్యాదులు వచ్చాయి. పంచాయతీరాజ్ శాఖలో సర్టిఫికెట్ల జారీ, రుణాలు/పింఛన్లు/ఇళ్లపట్టాల మంజూరు, ఉపాధి హామీ పథకానికి సంబంధించిన అంశాల్లో ఎక్కువ ఫిర్యాదులు వచ్చాయి. -
వెబ్ ల్యాండ్ దోపిడి.. వేల ఎకరాలను కాజేసిన వైనం
మాజీ వీఆర్ఓ మోహన్గణేష్ పిళ్లై భూ దోపిడీ రెవెన్యూశాఖలోని లొసుగులను బట్టబయలు చేసింది. వేల ఎకరాల ప్రభుత్వ భూమిని కాజేయడంలో పలువురు అధికారుల పాత్ర ఉన్నట్లు తేటతెల్లమవుతోంది. రికార్డుల డిజిటలైజేషన్ పేరుతో ప్రారంభించిన వెబ్ ల్యాండ్ విధానమే అక్రమాలకు అండగా నిలిచినట్లు తెలుస్తోంది. ఉద్యోగ విరమణ పొందే సమయంలోనే ఈ కొత్త పద్ధతి మొదలవడంతో అప్పనంగా భూకబ్జాలకు పాల్పడేందుకు పిళ్లైకు అవకాశం చిక్కింది. తన భూబాగోతాన్ని ఎవరూ కనిపెట్టలేరనే నమ్మకంతోనే యథేచ్ఛగా దందా సాగించినట్లు వెల్లడవుతోంది. కలెక్టరేట్ సిబ్బంది ప్రమేయం లేకుండా భారీస్థాయిలో వెబ్ల్యాండ్ నమోదు సాధ్యం కాదని స్పష్టమవుతోంది. సాక్షి, చిత్తూరు కలెక్టరేట్: కొండ నాలుకకు మందు వేస్తే.. ఉన్న నాలుక పోయిందన్నట్లు తయారైంది వెబ్ ల్యాండ్ పరిస్థితి. రెవెన్యూ రికార్డుల డిజిటలైజేషన్ పేరుతో కిరణ్ సర్కార్ ఈ విధానానికి శ్రీకారం చుట్టింది. ఇదే మాజీ వీఆర్ఓ మోహన్గణేష్ పిళ్లైకు వరంగా మారింది. తప్పుడు పత్రాలను సృష్టించి వాటిని డిజిటలైజేషన్లో భాగంగా రికార్డుల్లో నమోదు చేయించాడు. 2010లో పిళ్లై ఉద్యోగ విరమణ పొందే సమయంలోనే ఆయా భూములను నొక్కేశాడు. జిల్లాలోని 13 మండలాలు.. 18 గ్రామాల పరిధిలో సుమారు 2,320 ఎకరాల భూకుంభకోణం 11 ఏళ్ల తర్వాత వెలుగులోకి రావడం గమనార్హం. దీనిపై విచారణ చేపట్టిన సీఐడీ అధికారులు నిందితులైన మోహన్గణేష్ పిళ్లై, మధుసూదన్, రాజన్, కోమల, అడవి రమణలను అరెస్ట్ చేశారు. అయితే పూర్తిస్థాయి దర్యాప్తు అనంతరం ఇలాంటి ఘటనలు మరిన్ని బయటపడే అవకాశముందని రెవెన్యూశాఖలో గుసగుసలు వినిపిస్తున్నాయి. బోగస్ పట్టాలతో వేల ఎకరాలను వెబ్ల్యాండ్కు ఎక్కించారంటే అందులో కలెక్టరేట్ సిబ్బంది పాత్ర కచ్చితంగా ఉంటుందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వెబ్ల్యాండ్ నమోదుకు వినియోగించిన నకిలీ పత్రాలు తప్పుల తడకగా రెవెన్యూ రికార్డులు వెబ్ల్యాండ్ రాకముందు రికార్డులన్నీ మాన్యువల్గానే నిర్వహించారు. అడంగళ్, 1(బి), ఆర్ఎస్ఆర్ వంటివి రెవెన్యూ శాఖ పర్యవేక్షణలో ఉండేవి. ఈ రికార్డులను డిజిటలైజ్ చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చేలా వెబ్ల్యాండ్ను రూపొందించారు. అయితే వీఆర్ఓల చేతుల మీదుగా ప్రక్రియ మొత్తం కొనసాగడంతో అప్పడు విధులు నిర్వర్తిస్తున్న మోహన్గణేష్ పిళ్లై మోసాలకు పాల్పడ్డాడు. దీనికితోడు వెబ్ల్యాండ్ ప్రక్రియను పర్యవేక్షించిన అప్పటి జాయింట్ కలెక్టర్లు సురేష్కుమార్, ప్రద్యుమ్న అలసత్వం కూడా సదరు మోహన్గణేష్ పిళ్లైకు అవకాశంగా మారింది. చదవండి: (చిత్తూరు జిల్లాలో భారీ భూ కుంభకోణం.. రూ.500 కోట్లు..!) అందుకే భూముల రీసర్వే భూ సమస్యల కారణంగా నిత్యం వందలాది మంది రెవెన్యూ కార్యాలయాల చుట్టూ కాళ్లు అరిగేలా తిరుగుతున్నారు. ఇలాంటి సమస్యలకు ఫుల్స్టాప్ పెట్టేందుకే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి భూ రీసర్వేకు శ్రీకారం చుట్టారు. రెవెన్యూ సమస్యలకు చరమగీతం పాడేందుకు రీసర్వేను పకడ్బందీగా జరిపిస్తున్నారు. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా రీసర్వే వేగవంతంగా జరుగుతోంది. దీంతో భూ సమస్యలకు శాశ్వతంగా చెక్ పడనుంది. రెవెన్యూ రికార్డులు పరిశీలించండి: తహసీల్దార్ యాదమరి: మండలంలోని 184 గొల్లపల్లె మాజీ వీఆర్ఓ మోహన్గణేష్ పిళ్లై అక్రమాలను పూర్తిస్థాయిలో బయటపెట్టేందుకు రికార్డులను పకడ్బందీగా పరిశీలించాలని తహసీల్దార్ చిట్టిబాబు ఆదేశించారు. బోదగుట్టపల్లె రెవెన్యూ పరిధిలో పిళ్లై 200 ఎకరాలకు పైగా కాజేసినట్లు సమాచారం అందిందన్నారు. ముఖ్యంగా కొటాల, నడింపల్లె, వరదరాజులపల్లె, యాదమరి, దాసరాపల్లె, ఓటివారిపల్లె గ్రామాల పరిధిలో వందల ఎకరాల ప్రభుత్వ భూమి పరుల పాలైనట్లు ఆరోపణలు వస్తున్నాయని చెప్పారు. రెవెన్యూ రికార్డుల పరిశీలన అనంతరం వాస్తవాలు తెలుస్తాయని వెల్లడించారు. -
భార్య గురించి చెడుగా మాట్లాడినందుకు వియ్యంకుడి హత్య
సాక్షి, అనంతపురం క్రైం: తన భార్య గురించి చెడుగా మాట్లాడిన వియ్యంకుడిని హతమార్చిన ఘటన అనంతపురం నగరంలో సంచలనం రేకెత్తించింది. ఒకటో పట్టణ సీఐ ప్రతాపరెడ్డి తెలిపిన మేరకు... నగరంలోని ఐదో రోడ్డుకు చెందిన గోగుల జగన్నాథ్(63).. రెవెన్యూ శాఖలో డ్రైవర్గా పనిచేస్తూ ఉద్యోగ విరమణ పొందారు. ఇతనికి ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు రామ్మోహన్... నగరంలోని రాణి నగర్కు చెందిన ఎలక్ట్రీషియన్ ఇబ్రహీం ఖలీల్, నజీమా బేగం దంపతుల ఒక్కగానొక్క కుమార్తె ఖమర్తాజ్ను రెండేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా రెండు కుటుంబాలు సంతోషంగా జీవిస్తూ వచ్చాయి. ఐదు నెలల క్రితం కోవిడ్ బారిన పడి జగన్నాథ్ భార్య మృతి చెందారు. ఇటీవల రెండో కుమారుడు శివకృష్ణకు కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో అందరూ కలిసి రాణినగర్లోని వియ్యంకుడు ఇబ్రహీం ఖలీల్ ఇంటికి చేరుకున్నారు. చదవండి: (మూడేళ్ల ప్రేమ.. ఇంకొకరితో నిశ్చితార్థం జరగడంతో..) ఈ నెల 27న (సోమవారం) ఇబ్రహీంను విడిగా కలిసి జగన్నాథ్ మాట్లాడాడు. నజీమా బేగం నడవడిక సరిగా లేదని విమర్శించాడు. తన భార్య గురించి చెడుగా మాట్లాడడంతో ఇబ్రహీం కోపోద్రిక్తుడయ్యాడు. అదే రోజు రాత్రి వియ్యంకులిద్దరూ ఒకే గదిలో నిద్రించారు. మంగళవారం వేకువజామున నిద్రలో ఉన్న జగన్నాథ్పై ఇబ్రహీం కత్తితో దాడి చేశాడు. ఛాతి, కడుపుపై విచక్షణారహితంగా పొడవడంతో జగన్నాథ్ అక్కడికక్కడే మృతి చెందాడు. అనంతరం ఇబ్రహీం అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. ఉదయం నిద్ర లేచి కుటుంబీకులు చూడగా రక్తపు మడుగులో జగన్నాథ్ పడిఉన్నాడు. ఘటనా స్థలాన్ని డీఎస్పీ వీర రాఘవరెడ్డి, వన్టౌన్ సీఐ ప్రతాపరెడ్డి పరిశీలించారు. బాధిత కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. చదవండి: (మరొకరితో పెళ్లి.. హైదరాబాద్కు వెళ్తూ ప్రియున్ని రమ్మని..) -
పదోన్నతులు ఇవ్వాలి.. జాబ్చార్ట్ ప్రకటించాలి
సాక్షి, హైదరాబాద్: రెవెన్యూ ఉద్యోగులకు తక్షణమే పదోన్నతులు ఇవ్వాలని తెలంగాణ రెవెన్యూ ఉద్యోగుల సేవా సంఘం (ట్రెసా) రాష్ట్ర అధ్యక్షుడు వంగ రవీందర్రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన నూతన రెవెన్యూ చట్టం ప్రకారం ఉద్యోగుల జాబ్చార్ట్ ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు. ఆదివారం మేడ్చల్ జిల్లా శామీర్పేట లో ట్రెసా విస్తృత స్థాయి సమావేశం జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు ఆరువందల మంది ప్రతినిధులు పాల్గొన్నారు. వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగులందరికీ పదోన్నతులు ఇచ్చినప్పటికీ.. రెవెన్యూ శాఖలో మాత్రం ఇవ్వలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. క్షేత్రస్థాయిలో రెవెన్యూ ఉద్యోగుల సమస్యలు, ఇతరత్రా పలు అంశాలపై చర్చించి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించాలని తీర్మానించారు. రవీందర్రెడ్డి అధ్యక్షత వహించిన ఈ సమావేశంలో రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు మన్నె ప్రభాకర్, పూల్సింగ్, రాజ్కుమార్, రియాజుద్దీన్, ఉపాధ్యక్షులు రామకృష్ణ, యాదగిరి, ఎల్బీ శాస్త్రి తదితరులు పాల్గొన్నారు. తీర్మానాలివే.. ♦కేడర్ స్ట్రెంగ్త్ వెంటనే నిర్ధారించి అన్ని తహసీల్ కార్యాలయాల్లో ఖాళీలు భర్తీ చేయాలి. ♦సుదూర జిల్లాలకు పోస్టింగులు ఇవ్వడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రొబేషనరీ నాయబ్ తహసీల్దార్లను ముఖ్యంగా మహిళా ఉద్యోగినులను వారి ఆప్షన్ల ప్రకారం జిల్లాలకు కేటాయించాలి ♦ఉద్యోగుల బదిలీల్లో నూతన జోనల్ విధానం ప్రకారం ఆప్షన్లు ఇవ్వాలి. దీర్ఘకాలంగా ఒకే ప్రాం తంలో పని చేస్తున్న తహసీల్దార్లు, ఇతర ఉద్యోగుల విజ్ఞప్తి మేరకు బదిలీలకు అనుమతించాలి ♦వీఆర్వోలను రెవెన్యూ శాఖలో సర్దుబాటు చేయాలి. -
"తెల్ల" దొరలపై కొరడా
సాక్షి,కడప: పేదల పేరుతో తెల్ల రేషన్ కార్డులు పొంది చౌక దుకాణాలలో బియ్యం, ఇతర నిత్యావసరాలు తీసుకుంటున్న అక్రమార్కులపై ప్రభుత్వం దృష్టి సారించింది. నిబంధనలను కాదని పేదలకు దక్కాల్సిన సౌకర్యాలను పొందుతున్న ఉద్యోగుల నుంచి కార్డులను స్వాదీనం చేసుకునే చర్యలను ముమ్మరం చేసింది. కార్డును అడ్డం పెట్టుకుని సరుకులతో పాటు సంక్షేమ పథకాలను పొందుతున్న వేతనదారులపై కొరడా ఝుళిపించేందుకు యంత్రాంగం సన్నద్ధమవుతోంది. గతంలో కొంతమంది చిరుద్యోగులు రేషన్ కార్డు పొంది ఉన్నా.. వారు పదోన్నతి పొందిన తరువాత కూడా కార్డును ప్రభుత్వానికి అప్పజెప్పకుండా అలాగే కొనసాగిస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులుగా ఉండి రేషన్ కార్డులు పొందిన వైనంపై ఉన్నతాధికారులు సీరియస్గా ఉన్నారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే పౌరసరఫరాల శాఖ అధికారులు వివరాలు సేకరించారు. నిబంధనలకు విరుద్ధం జమ్మలమడుగు, కడప, రాజంపేట రెవెన్యూ డివిజన్ల పరిధిలో వందల సంఖ్యలో కార్డులను గుర్తించి స్వాదీనం చేసుకుంటున్నారు. ఉద్యోగులకు సంబంధించిన కార్డులను వీఆర్ఓలు తనిఖీ చేయాల్సి ఉంది. జిల్లాలోని అనేక మండలాల్లో పలువురు ఉద్యోగులు రైస్ కార్డులు పొందారు. జిల్లా వ్యాప్తంగా 7600 మందికి పైగా ఉద్యోగుల వద్ద తెల్లరేషన్ కార్డులు ఉన్నట్లు గుర్తించారు. నిబంధనల ప్రకారం ప్రభుత్వ ఉద్యోగులు రైస్ కార్డులు పొందడానికి అనర్హులు. కానీ పలువురు వీటిని తమ పలుకుబడితో సొంతం చేసుకున్నారు. బయోమెట్రిక్, ఆధార్ నంబర్ లాంటివి కార్డులకు జత చేసినా వారి వివరాలు బయటపడలేదు. ఆదాయపు పన్ను, పాన్ కార్డుల అనుసంధానంతో ఇటీవల ఈ అక్రమాలు వెలుగు చూశాయి. ప్రభుత్వ ఉద్యోగులు రేషన్ కార్డులు కలిగి ఉండకూడదంటూ ప్రభుత్వం ప్రత్యేక జీవో విడుదల చేసింది. కార్డులు మాత్రమే జిల్లా వ్యాప్తంగా వీఆర్ఓలు, సచివాలయ ఉద్యోగులు, ఇతర శాఖలకు చెందిన ఉద్యోగుల వద్ద తెల్లరేషన్ కార్డులు ఉన్నాయి. మరోవైపు ప్రభుత్వ ఉద్యోగులుగా ఉంటూనే వీరు అమ్మఒడి, రైతు భరోసా, ఆరోగ్యశ్రీ పథకాలను పొందుతున్నారు. ప్రస్తుతానికి కార్డులను మాత్రమే స్వాధీనం చేసుకోనున్నారు. వీరి వివరాలను పూర్తిస్థాయిలో వారం రోజుల్లో ఇవ్వాలనే ఆదేశాలు మండలస్థాయి అధికారులకు జారీ అయ్యాయి. ఆ మేరకు నివేదికలు తయారు అవుతున్నాయి. విచారణ జరుపుతున్నాం ప్రభుత్వ ఆదేశాల మేరకు ఉద్యోగుల నుంచి తెల్లరేషన్ కార్డులు స్వా«దీనం చేసుకునేందుకు అవసరమైన విచారణ చేస్తున్నాం. ఇప్పటికే కార్డులున్న ఉద్యోగులను గుర్తించాం. గ్రామ, పట్టణ స్థాయిలో కచ్చితంగా ఉద్యోగుల వద్ద ఉన్న రేషన్కార్డులను స్వాధీనం చేసుకుంటాం. త్వరలోనే ఈ ప్రక్రియ పూర్తి చేస్తాం. – సౌభాగ్యలక్షి, డీఎస్ఓ, కడప చదవండి: CM KCR Review On Heavy Rains: భారీ వర్షాలు, వరదలపై సీఎం కేసీఆర్ సమీక్ష -
కోర్టు ధిక్కార కేసులో.. పలువురు ఐఏఎస్లకు జైలుశిక్ష
సాక్షి, అమరావతి: 2015 నాటి భూసేకరణకు సంబంధించిన ఒక కోర్టు ధిక్కార కేసులో పలువురు ఐఏఎస్ అధికారులకు హైకోర్టు జైలుశిక్ష, జరిమానా విధించింది. అప్పటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి మన్మోహన్సింగ్కు నాలుగు వారాల జైలుశిక్ష, రూ.వెయ్యి జరిమానా.. ప్రస్తుత ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి షంషేర్సింగ్ రావత్కి నెలరోజుల జైలు, రూ.2వేల జరిమానా.. అప్పటి జిల్లా కలెక్టర్ రేవు ముత్యాలరాజుకు రెండు వారాల జైలుశిక్ష, రూ.1000 జరిమానా.. అప్పటి మరో కలెక్టర్ ఎంవీ శేషగిరిబాబు, ప్రస్తుత కలెక్టర్ ఎన్వీ చక్రధర్లకు రూ.2వేల చొప్పున జరిమానా విధించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ గురువారం తీర్పు వెలువరించారు. అప్పీల్కు వెళ్లేందుకు వీలుగా న్యాయమూర్తి తన తీర్పు అమలును నాలుగు వారాలపాటు నిలుపుదల చేశారు. కేసు పూర్వాపరాలివీ.. నెల్లూరు జిల్లాలో నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెంటల్లీ హ్యాండీక్యాప్డ్ కోసం భూమిని కేటాయించాలని ఆ సంస్థ డైరెక్టర్ జిల్లా కలెక్టర్ను కోరారు. దీనికి స్పందించిన కలెక్టర్ పదెకరాలు కేటాయించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా.. నెల్లూరు జిల్లా, వెంకటాచలం మండలం, ఎర్రగుంటకు చెందిన తాళ్లపాక సావిత్రికి అదే మండలం కనుపూరు బిట్–2లో ఉన్న మూడెకరాలను కూడా తీసుకోవాలని నిర్ణయించారు. అనంతరం.. ఆ భూమిని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెంటల్లీ హ్యాండీక్యాప్డ్ డైరెక్టర్కు స్వాధీనం చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులిచ్చారు. అయితే, సావిత్రమ్మకు ఎలాంటి పరిహారం ఇవ్వలేదు. దీంతో ఆమె 2017లో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విచారణ జరిపిన హైకోర్టు, ఆమెకు పరిహారం ఇవ్వాలంటూ జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించింది. అయితే.. హైకోర్టు ఆదేశించినా అధికారులు ఎలాంటి పరిహారం ఇవ్వకపోవడంతో సావిత్రమ్మ 2018లో కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేశారు. ఇందులో నాటి రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి మన్మోహన్ సింగ్, ప్రస్తుత ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రావత్, అప్పటి సీసీఎల్ఏ అనిల్ పునేఠా, జిల్లా కలెక్టర్లు ముత్యాలరాజు, ఇంతియాజ్, చక్రధర్, ఆర్డీఓ హరిత, తహసీల్దార్ సోమ్లా బాణావత్ తదితరులను ప్రతివాదులుగా చేర్చింది. ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన హైకోర్టు కౌంటర్లు దాఖలు చేయాలని అధికారులందరినీ ఆదేశించింది. ఈ ఆదేశాల మేరకు వారు కౌంటర్లు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యం న్యాయమూర్తి జస్టిస్ దేవానంద్ ముందుకు విచారణకు రాగా.. ఆయన అధికారులందరి వ్యక్తిగత హాజరుకు ఆదేశాలిచ్చారు. చివరకు ఈ ఏడాది మార్చి 3న పరిహారం మొత్తాన్ని సావిత్రమ్మ బ్యాంకు ఖాతాలో జమచేశారు. అందరి కౌంటర్లు పరిశీలించిన న్యాయమూర్తి, కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేసిన నాలుగేళ్ల తర్వాత అధికారులు పరిహారం మొత్తాన్ని పిటిషనర్ ఖాతాలో జమచేశారన్నారు. కోర్టు ధిక్కారం కింద అధికారులను శిక్షించేందుకు ఇది తగిన కేసని తెలిపారు. పరిహారం చెల్లింపులో జరిగిన జాప్యానికి రెవెన్యూ, ఆర్థిక శాఖల ముఖ్య కార్యదర్శులు, అప్పటి, ప్రస్తుత కలెక్టర్లే బాధ్యులని తేల్చారు. వారికి జైలుశిక్ష, జరిమానా విధించి మిగిలిన అధికారులపై కోర్టు ధిక్కార చర్యలు మూసివేశారు. సావిత్రమ్మను ఇబ్బందిపెట్టినందుకు ఆమెకు ఖర్చుల కింద రూ.లక్ష చెల్లించాలని ఆదేశించారు. ఈ మొత్తాన్ని బాధ్యులైన అధికారుల నుంచి వసూలుచేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించారు. -
రెవెన్యూ శాఖలో పదోన్నతులు!
సాక్షి, హైదరాబాద్: ఐదేళ్లుగా పదోన్నతుల కోసం ఎదురుచూస్తున్న రెవెన్యూ ఉద్యోగులకు ఎట్టకేలకు ఊరట. ఈ శాఖ పరిధిలోని ఉద్యోగులకు సెప్టెంబర్లో పదోన్నతులిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఇటీవల తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయిస్ సర్వీసెస్ అసోసియేషన్ (ట్రెసా) నేతలు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) సోమేశ్కుమార్ను కలిసినప్పుడు ఆయన ఈ మేరకు స్పష్టమైన హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ల నుంచి సీనియర్ అసిస్టెంట్ హోదా వరకు పలుస్థాయిల్లో పదోన్నతులు వస్తాయని ఉద్యోగ సంఘాల నేతలు చెబుతున్నారు. 40–50 స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లు, 90–100 డిప్యూటీ కలెక్టర్లు, 160 తహశీల్దార్ పోస్టులు ఖాళీలున్నాయని తెలుస్తోంది. ఈ ఏడాదిలో 369 మంది నాయిబ్ తహశీల్దార్లకు తహశీల్దార్లుగా ప్రమోషన్లు ఇవ్వాలని శాఖాపరమైన పదోన్నతుల కమిటీ (డీపీసీ) నిర్ణయించిందని, అయితే ఇందులో 190 మందికి మాత్రమే పదోన్నతులు ఖరారు చేయగా, మిగిలిన వారికి ఇవ్వలేదని సమాచారం. ఈ నేపథ్యంలో త్వరలోనే పదోన్నతుల ప్రక్రియ ప్రారంభం కానున్నప్పటికీ ప్యానెల్ ఇయర్ ఈనెల 31తో ముగియనున్న నేపథ్యంలో డీపీసీ ఆమోదం వచ్చినా పదోన్నతులు రాని నాయబ్ తహసీల్దార్ల విషయంలో ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటుందోనన్న ఆందోళన కూడా ఆ వర్గాల్లో వ్యక్తమవుతోంది. గ్రామానికి ఒక్కరే వీఆర్ఏ! సీఎస్ సోమేశ్కుమార్తో ట్రెసా నేతల భేటీ సందర్భంగా వీఆర్ఏలకు పేస్కేల్ ఇస్తామని, వీఆర్వోల వ్యవస్థను రద్దు చేసినందున వారిని ఇతర శాఖల్లో సర్దుబాటు చేస్తామని హామీ ఇచ్చారు. అయితే, రాష్ట్రంలో ప్రస్తుతం (వ్యవస్థను ప్రభుత్వం రద్దు చేయడానికి ముందు) 5,836 మంది వీఆర్వోలుగా పనిచేస్తున్నారు. వీరి భవిష్యత్తు ఏమవుతుందనే ఆందోళన సిబ్బందిలో కనిపిస్తున్నా, వారిలో అర్హులను రెవెన్యూ శాఖలోనే కొనసాగించి, మిగిలిన వారిని ఇతర శాఖలకు బదిలీ చేస్తారని తెలుస్తోంది. వీఆర్ఏల విషయానికి వస్తే గ్రామానికి ఒక్కరిని మాత్రమే వీఆర్ఏగా కొనసాగిస్తారని సమాచారం. రాష్ట్రంలో ప్రస్తుతం 22 వేల మంది వీఆర్ఏలు ఉండగా, గ్రామానికి ఒకరి చొప్పున కొనసాగిస్తే 10 వేల మందికి ఊరట కలగనుంది. మిగిలిన వారిని అర్హతలకు అనుగుణంగా ఇతర శాఖల్లో సర్దుబాటు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. సీనియార్టీ సమస్యలు రాష్ట్రంలో రెవెన్యూ శాఖలో స్పెషల్గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ (ఎస్జీడీసీ)ల వరకే పదోన్నతులు లభిస్తున్నాయి. ఆ తర్వా త రెవెన్యూ కోటాలో కన్ఫర్డ్ ఐఏఎస్లుగా మాత్రమే అవకాశముంది. దీంతో సీనియార్టీ సమస్యలు వస్తున్నాయని రెవె న్యూ సంఘాలంటున్నాయి. డీఆర్వో, జేసీలాంటి పోస్టుల్లో ఈ సమస్యలు వస్తున్నాయని, డీఆర్వో పోస్టుకు స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లను పరిగణనలోకి తీసుకుంటుండటంతో ఆ తర్వాత పదోన్నతులు రావడం లేదని అంటున్నాయి. ఈ నేపథ్యంలోనే రెవెన్యూ శాఖ పరిధిలో సెలక్షన్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ (ఎస్జీడీసీ) పోస్టు సృష్టించాలని ‘ట్రెసా’విజ్ఞప్తి చేసినా ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఈసారి ఐదు ఆప్షన్లు రెవెన్యూ ఉద్యోగుల బదిలీలకు కూడా ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. గతంలో ఈ బదిలీలకు ఒకట్రెండు ఆప్షన్లు ఇచ్చే సంప్రదాయం ఉండగా, ఈసారి ఐదు రకాల ఆప్షన్లు ఇస్తామని సీఎస్ హామీ ఇచ్చారు. ఇందులో స్పౌస్, మెడికల్, పీహెచ్సీ, జిల్లా, మల్టీజోన్ ఆప్షన్లు ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. -
అవినీతికి తావివ్వద్దు : సీఎం జగన్
ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి నిరోధానికి ఒక నిర్దిష్ట విధానం (ఎస్ఓపీ–స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్) తీసుకు రావాలి. అవినీతిపై ఫిర్యాదులు చేస్తూ వచ్చే కాల్స్పై దృష్టి పెట్టాలి. ఈ ఫిర్యాదుల పట్ల అధికారులు సొంతంగా బాధ్యత తీసుకోవాలి. క్షేత్ర స్థాయి నుంచి ఇంటెలిజెన్స్ సమాచారం తెప్పించుకొని ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించాలి. ప్రభుత్వ పథకాలు, కార్య క్రమాల ద్వారా ప్రజలకు లబ్ధి కలిగేలా చేయడం కలెక్టర్లు, జేసీల బాధ్యత. ఇదే సమ యంలో ప్రభుత్వానికి రావా ల్సిన రెవెన్యూ వసూళ్లపైనా కూడా దృష్టి పెట్టడం ఇంకో బాధ్యత. రాష్ట్రానికి ఆదాయం వచ్చే కొత్త మార్గాలపై దృష్టి సారించాలి. ఇందుకోసం వినూత్న సంస్కరణలు తీసుకురావాలి. – సీఎం వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: ప్రభుత్వ శాఖల్లో అవినీతికి అడ్డుకట్ట పడే విధంగా కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. అవినీతికి సంబంధించి ఫిర్యాదు చేయాల్సిన ఫోన్ నంబర్ ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో కనిపించేలా ప్రదర్శించాలని స్పష్టం చేశారు. కాల్ సెంటర్కు వచ్చే కాల్స్పై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని చెప్పారు. తన క్యాంపు కార్యాలయంలో గురువారం ఆయన రాష్ట్ర ఆదాయ వనరులపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రిజిస్ట్రేషన్ల శాఖలో వెలుగు చూసిన నకిలీ చలాన్ల వ్యవహారానికి సంబంధించి ఆగ్రహం వ్యక్తం చేస్తూ అధికారులపై ప్రశ్నల వర్షం కురిపించారు. ఏసీబీ దాడులు చేస్తే కానీ ఈ వ్యవహారం వెలుగులోకి రాలేదని, అసలు సబ్రిజిస్ట్రార్ కార్యాలయాల్లో నకిలీ చలాన్లు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. ‘ఈ స్థాయిలో తప్పులు జరుగుతుంటే మీ దృష్టికి ఎందుకు రాలేదు.. ఎన్ని రోజుల నుంచి ఈ తప్పులు జరుగుతున్నాయి.. క్షేత్ర స్థాయిలో వ్యవస్థలు సరిగా పని చేస్తున్నాయా లేదా.. అన్న విషయం ఎందుకు పరిశీలించడం లేదు.. తప్పు చేసిన వారిపై ఎటువంటి చర్యలు తీసుకున్నారు..’ అంటూ అధికారులను ప్రశ్నించారు. దీనిపై అధికారులు స్పందిస్తూ తప్పు చేసిన అధికారులను సస్పెండ్ చేశామని వివరించారు. కేవలం సబ్ రిజిస్ట్రార్ కార్యలయాల్లోనే కాకుండా అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లోని చెల్లింపుల ప్రక్రియను పరిశీలించాలని సీఎం ఆదేశించారు. దీనిపై ఆర్థిక శాఖ అధికారులు స్పందిస్తూ.. ఇప్పటికే సాఫ్ట్వేర్ను నిశితంగా గమనించామని, అవినీతికి చోటు లేకుండా పూర్తి స్థాయిలో మార్పులు చేశామని తెలిపారు. ఈ సందర్భంగా ‘మీ సేవ’ల్లో పరిస్థితులను కూడా పరిశీలించాలని సీఎం సూచించారు. ఈ సమీక్షలో సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. సహజ మార్గంలో ఆదాయం పెరిగేలా చూడండి ► క్షేత్ర స్థాయి నుంచి ఎప్పటికప్పుడు సమాచారం తెప్పించుకోవలి. వారం లేదా పది రోజులకు ఒకసారి ఆదాయ వనరులు, పరిస్థితులపై సమీక్ష నిర్వహించాలి. ప్రతి సమావేశంలో ఒక రంగంపై దృష్టి సారించాలి. ఆ సమావేశంలో తీసుకున్న నిర్ణయాల అమలు ఎలా ఉందన్న విషయం తదుపరి సమావేశంలో పరిశీలించాలి. ► రాష్ట్ర ఆదాయ వనరులను మెరుగు పరుచుకోవడానికి చర్యలు తీసుకోవాలి. ఏటా సహజంగా పెరిగే ఆదాయ వనరులతో పాటు, రావాల్సిన బకాయిలపై దృష్టి పెట్టాలి. జీఎస్టీ వసూళ్లు, ఇతరత్రా ఆదాయం పూర్తి స్థాయిలో వచ్చేలా చూడాలి. ► వివిధ శాఖలు సరైన కార్యచరణ ద్వారా సమన్వయంతో పనిచేస్తే ప్రజలకు చక్కటి సేవలను అందించడంతోపాటు ఆదాయాలు కూడా పెరుగుతాయి. ముఖ్యంగా మున్సిపల్, విద్యుత్, తదితర శాఖల మధ్య సమన్వయం బావుండాలి. మద్యం అక్రమ రవాణాను అడ్డుకోవాలి ► సరిహద్దుల నుంచి అక్రమంగా రాష్ట్రంలోకి మద్యం వస్తున్న సంఘటనలు చూస్తున్నాం. దీనిని పూర్తిగా అడ్డుకోవాలి. మద్యం అక్రమ రవాణా, అక్రమ మద్యంపై ఉక్కుపాదం మోపాలి. ► మద్య నియంత్రణకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుండటంతో పొరుగు రాష్ట్రాల నుంచి అక్రమ మద్యం రాష్ట్రంలోకి వస్తోంది. ఇలాంటి వ్యవహరాలపై అధికారులు కఠినంగా వ్యవహరించాలి. ► ఈ సమీక్షలో ప్రణాళిక శాఖ స్పెషల్ సీఎస్ డాక్టర్ సమీర్ శర్మ, ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ చీఫ్ కమిషనర్ నీరబ్ కుమార్ ప్రసాద్, రెవెన్యూ శాఖ స్పెషల్ సీఎస్ రజత్ భార్గవ, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ఎస్ రావత్, చీఫ్ కమిషనర్ ఆఫ్ స్టేట్ టాక్స్ పియూష్ కుమార్, ఆర్థిక శాఖ కార్యదర్శి కేవీవీ సత్యనారాయణ, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ కమిషనర్ అండ్ ఐజీ ఎంవీ శేషగిరిబాబు, ఎస్ఈబీ కమిషనర్ పీహెచ్డీ రామకృష్ణ, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
అక్రమార్కులపై వేటు.. ఆపరేషన్ రెవెన్యూ
జిల్లా రెవెన్యూ శాఖలో ప్రక్షాళన మొదలైంది. అవినీతి తిమింగళాలు, భూ బకాసురులు, అక్రమార్కులపై వేటుపడుతోంది. ఏళ్ల తరబడి కొందరు రెవెన్యూ అధికారులు, సిబ్బంది అవినీతి, అక్రమాలకు పాల్పడుతూ ప్రతి పనికో రేటు కట్టి రోజువారీ రాబడికి అలవాటుపడ్డారు. అలాంటి కలుపు మొక్కల ఏరివేత యజ్ఞానికి కలెక్టర్ ప్రవీణ్కుమార్ శ్రీకారం చుట్టారు. కలెక్టర్ చర్యలు అక్రమార్కుల వెన్నులో వణుకుపుట్టిస్తున్నాయి. ప్రభుత్వ భూములు కాపాడుతూ రెవెన్యూ యంత్రాంగాన్ని గాడిలో పెట్టే దిశగా అడుగులు వేయడం శుభపరిణామంగా మారింది. సాక్షి ప్రతినిధి, ఒంగోలు: సరిగ్గా రెండు నెలల క్రితం జూన్ 2వ తేదీ కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన ప్రవీణ్ కుమార్ జిల్లాలో విస్తృతంగా పర్యటించారు. అధికంగా భూ సమస్యలు ఉండటాన్ని గమనించారు. ప్రభుత్వ భూముల కబ్జాలకు సంబంధించిన వ్యవహారాలను సీరియస్గా తీసుకున్నారు. వాటిలో కొన్నింటిపై విచారణ చేయించారు. అవినీతికి పాల్పడిన ముగ్గురు తహసీల్దార్లతో పాటు రెవెన్యూ సిబ్బందిపై సస్పెన్షన్ వేటు వేశారు. దీంతో జిల్లా రెవెన్యూ శాఖ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. గంటల వ్యవధిలో ఉద్యోగ విరమణ చేసే తహసీల్దార్ను కూడా సస్పెండ్ చేసి తప్పుచేస్తే ఎవరినీ వదిలిపెట్టేదిలేదన్న సంకేతాలు పంపారు. కోవిడ్ సెకండ్ వేవ్ సమయంలో కలెక్టర్గా ప్రవీణ్కుమార్ బాధ్యతలు చేపట్టారు. సెకండ్ వేవ్ కాస్త తగ్గుముఖం పట్టిన తర్వాత రెండు సోమవారాలు మాత్రమే స్పందన కార్యక్రమాలు నిర్వహించారు. వాటిలో దాదాపు 400కుపైగా రెవెన్యూ పరమైన సమస్యలపై ఫిర్యాదులు అందాయి. దీంతో అవినీతి అధికారులపై చర్యలు చేపట్టే దిశగా కలెక్టర్ వేగంగా అడుగులు వేశారు. గత వారంలో రెవెన్యూ అధికారులతో నిర్వహించిన సమీక్షలో సున్నితంగా మందలించారు. తప్పుచేసిన వారిని వదలబోనని, అక్రమాలకు పాల్పడిన వారిని ఎందుకు సస్పెండ్ చేయకూడదో చెప్పాలని నిలదీశారు. వారం తిరగకుండానే అమలుచేశారు. ముగ్గురు తహసీల్దార్లపై సస్పెన్షన్ వేటు... ప్రభుత్వ భూములను రక్షించలేకపోవడం, ఇతరులకు అక్రమంగా కట్టబెట్టడం లాంటి వాటితో పాటు భూ రికార్డులు తారుమారు చేయడం వంటి అక్రమాలకు పాల్పడిన జిల్లాలోని ముగ్గురు తహసీల్దార్లను కలెక్టర్ సస్పెండ్ చేశారు. వారికి సహకరించిన ఆర్ఐలు, వీఆర్వోలను కూడా వదల్లేదు. పొదిలి తహసీల్దార్ ఏవీ హనుమంతరావుతో పాటు ఏఆర్ఐ శివరామ ప్రసన్న, కంబాలపాడు వీఆర్వో కె.కమలాకర్పై సస్పెన్షన్ వేటు పడింది. అదేవిధంగా సిలికా సాండ్ భూముల లీజ్ అంశంలో అక్రమాలకు పాల్పడిన చినగంజాం తహసీల్దార్ కె.విజయకుమారిని కూడా సస్పెండ్ చేశారు. తాజాగా గత శనివారం హనుమంతునిపాడు తహసీల్దార్ ఎన్.సుధాకరరావు, ఆర్ఐ పి.వి.శివప్రసాదు, వేములపాడు వీఆర్వో బి.నరసింహం, సీఎస్ పురం మండలం పెదగోగులపల్లి వీఆర్వో జే నాగేశ్వరరావును సస్పెండ్ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ భూములను అక్రమార్కులకు కట్టబెట్టి ఆన్లైన్ చేసినట్లు వీరందరిపై ఆరోపణలు ఉండగా, విచారణలో రుజువు కావడంతో కలెక్టర్ కఠినంగా స్పందించారు. ప్రత్యేకంగా రెవెన్యూ ‘స్పందన’కు చర్యలు... జిల్లాలోని ప్రభుత్వ భూములను ఆక్రమణదారులు, కబ్జాదారుల బారి నుంచి కాపాడటంతో వారికి సహకరించిన రెవెన్యూ అధికారులు, సిబ్బందిపై కఠిన చర్యలకు కలెక్టర్ ఉపక్రమించారు. జిల్లాలోని అన్ని గ్రామాల్లో ఉన్న సచివాలయాల ద్వారా ప్రభుత్వ భూముల వివరాలు సేకరించి కబ్జాలకు గురైన ప్రభుత్వ భూముల వివరాలు సేకరించే పనిలో పడ్డారు. ప్రభుత్వ భూములను ఆక్రమించిన వారితో పాటు వారికి అప్పనంగా కట్టబెట్టిన అవినీతి అధికారులపై విచారణ నిర్వహించి వారందరినీ ఏరివేసేందుకు చర్యలు చేపట్టారు. ఇదిలా ఉండగా, కొందరు అవినీతి రెవెన్యూ అధికారులు, సిబ్బంది ధనార్జనే ధ్యేయంగా ప్రైవేటు వ్యక్తుల భూములు సైతం సంబంధం లేని వ్యక్తుల పేర్లపై మారుస్తూ రికార్డులు తారుమారు చేస్తున్నారు. రైతులకు సంబంధించిన భూ సమస్యలు కోకొల్లలుగా ఉన్నాయి. ఇలాంటి ఫిర్యాదులు కూడా ‘స్పందన’లో కలెక్టర్ దృష్టికి వచ్చాయి. వీటన్నింటి పరిష్కారం కోసం గ్రామాల వారీగా భూ రికార్డులు పరిశీలించి ‘రెవెన్యూ స్పందన’ పేరుతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని కలెక్టర్ ఏర్పాట్లు చేస్తున్నారు. ముందుగా మూడు నెలల వ్యవధిలో ప్రైవేటు భూములకు సంబంధించిన సమస్యలన్నీ పరిష్కరించే దిశగా చర్యలు చేపడుతున్నారు. ఫిర్యాదుల్లో సగానికిపైగా భూ సమస్యలే... ఎన్ని స్పందన కార్యక్రమాలు నిర్వహించినా, ఎన్ని సమస్యలు పరిష్కరించినా.. రెవెన్యూ విభాగంలోని కొందరు అధికారులు, సిబ్బంది చేస్తున్న తప్పుల కారణంగా భూ సమస్యలు అధికంగా వస్తున్నాయని కలెక్టర్ గుర్తించారు. గత సంవత్సరం, ఈ సంవత్సరం రెవెన్యూ పరమైన ఫిర్యాదుల్లో భూ సమస్యలు వేలల్లో ఉన్నాయి. 2020 జూన్ నుంచి అక్టోబర్ వరకు జిల్లా మొత్తం మీద భూ సమస్యలు, రెవెన్యూ అంశాలపై 13,766 అర్జీలు రాగా, 2020 నవంబర్ నుంచి ఇప్పటి వరకు 2,583 ఫిర్యాదులు వచ్చాయి. పాస్ పుస్తకాలు ఇవ్వాలని, వాటిని ఆన్లైన్ చేయాలని, ఒకరి భూమిని మరొకరి పేరుమీద ఆన్లైన్ చేశారని.. ఇలా జిల్లా వ్యాప్తంగా ఫిర్యాదులు వస్తూనే ఉన్నాయి. అవినీతికి పాల్పడితే ఉపేక్షించం : కలెక్టర్ ప్రవీణ్కుమార్ అవినీతికి పాల్పడిన ఏ ఒక్కరినీ వదిలిపెట్టేది లేదు. ఎంతటి అధికారినైనా ఉపేక్షించేది లేదు. ప్రజలకు సేవ చేస్తూ మంచి పేరు తెచ్చుకునే అధికారులకు అండగా ఉంటా. అధికారుల సంక్షేమాన్ని ఏ విధంగా చూస్తానో, అవినీతికి పాల్పడే అధికారులపై చర్యలకు కూడా అదేవిధంగా వెనకాడేది లేదు. అన్ని శాఖల అధికారులు దీనిని గుణపాఠంగా తీసుకుని కార్యాలయాలకు వచ్చే ప్రజలకు నిస్వార్థంగా సేవ చేయాలి. -
జీఎస్టీ ఎగవేతదారులను పట్టేద్దాం
సాక్షి, అమరావతి: కరోనా కారణంగా తగ్గుతున్న ఆదాయాన్ని పెంచుకోవడంపై కేంద్ర, రాష్ట్ర జీఎస్టీ అధికారులు దృష్టిసారించారు. సమాచార మార్పిడి ద్వారా పన్ను ఎగవేతదారులను గుర్తించి, ఆదాయ నష్టానికి అడ్డుకట్ట వేయాలని నిర్ణయించారు. ఇందుకోసం గురువారం రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ ప్రధాన కార్యాలయంలో రాష్ట్ర రెవెన్యూ శాఖ(వాణిజ్యం, ఎక్సైజ్, రిజిస్ట్రేషన్స్) ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ నేతృత్వంలోని రాష్ట్ర అధికారులు, విశాఖ జోన్ కస్టమ్స్ అండ్ ఎక్సైజ్ ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ నరేష్ నేతృత్వంలోని కేంద్ర అధికారుల సమన్వయ సమావేశం నిర్వహించారు. కేంద్ర, రాష్ట్ర అధికారులు తరుచూ సమావేశమవుతూ సమాచారం మార్పిడి ద్వారా పన్ను ఎగవేతదారులను గుర్తించాలని నిర్ణయం తీసుకున్నట్టు రజత్భార్గవ చెప్పారు. ఇరు విభాగాల్లో ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేయనున్నారు. ముఖ్యంగా జీఎస్టీ ఆదాయానికి నకిలీ ఇన్వాయిస్లతో భారీగా గండి కొడుతున్న ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ క్లయిమ్లకు అడ్డుకట్ట వేయాలని నిర్ణయించారు. ఇందుకోసం ఎన్ఫోర్స్మెంట్ సంస్థలు డీజీజీఐ, ఏపీఎస్డీఆర్ఐ వంటి వాటి సహకారంతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి సమాచారం తీసుకుని విశ్లేషించనున్నారు. సమావేశంలో రాష్ట్ర పన్నుల చీఫ్ కమిషనర్ పీయూష్ కుమార్, వైజాగ్ కమిషనరేట్ ప్రిన్సిపల్ కమిషనర్ ఫాహీమ్ అహ్మద్ పాల్గొన్నారు. -
జగనన్న స్మార్ట్ టౌన్షిప్లకు ప్రభుత్వ భూముల సేకరణ
సాక్షి, అమరావతి: మధ్యతరగతి ప్రజలకు అందుబాటు ధరల్లో ప్రణాళికాబద్ధమైన ఇళ్ల స్థలాలు సమకూర్చే జగనన్న స్మార్ట్ టౌన్షిప్ల (ఎంఐజీ లేఅవుట్లు) నిర్మాణానికి నిరుపయోగంగా ఉన్న ప్రభుత్వ భూములు సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇలాంటి భూములను గుర్తించి ముందస్తుగా మునిసిపల్ శాఖకు అప్పగించాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించింది. విధివిధానాలను ఖరారు చేస్తూ మంగళవారం రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి ఉషారాణి ఉత్తర్వులిచ్చారు. ప్రభుత్వ సంస్థలు, శాఖలు, ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రభుత్వ కార్పొరేషన్లు, పట్టణాభివృద్ధి సంస్థలు, నగరపాలక సంస్థలు ప్రజోపయోగం కోసం గతంలో సేకరించి అందుకు ఉపయోగించకుండా ఉన్న భూములను సేకరించాలని ఆదేశించారు. స్మార్ట్ టౌన్షిప్ల నిర్మాణానికి ఉపయోగపడే ఇలాంటి భూములను క్రమబద్ధీకరించి మునిసిపల్, పట్టణాభివృద్ధి శాఖకు నేరుగా ఇచ్చే అధికారాలను జిల్లా కలెక్టర్లకు అప్పగించారు. అలాంటి భూముల వివరాలను సీసీఎల్ఏకు పంపాలని కలెక్టర్లకు సూచించారు. జగనన్న స్మార్ట్ టౌన్షిప్ల అభివృద్ధి కోసం మాత్రమే కలెక్టర్లకు ఈ అధికారాలు కల్పిస్తున్నట్లు స్పష్టం చేశారు. దేవదాయ, వక్ఫ్, విద్యా సంస్థలు, ఆధ్యాత్మిక సంబంధిత భూములు, పర్యావరణ సున్నితమైన భూములను ఈ సేకరణ నుంచి మినహాయిస్తున్నట్లు తెలిపారు. చెరువు, కాలువ కట్టలు, నీటి వనరులున్న భూములు, అడవులతో నిండిన కొండ ప్రాంతాలతోపాటు అభ్యంతరకరమైన ప్రభుత్వ పోరంబోకు, కమ్యూనిటీ పోరంబోకు భూములను సైతం సేకరించవద్దని ఆదేశించారు. మధ్యతరగతి వర్గాల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రణాళికాబద్ధంగా, అన్ని సౌకర్యాలతో కూడిన నివాస స్థలాలను తక్కువ ధరలకు అందుబాటులోకి తెచ్చే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ స్మార్ట్ టౌన్షిప్లను అభివృద్ధి చేయనుంది. -
రిజిస్ట్రేషన్ల కుంభకోణంపై ‘సీఐడీ’ వేయండి
నరసాపురం: గత సర్కార్ హయాంలో అన్నదాతలను మోసం చేస్తూ టీడీపీ నేతలు చేసిన రిజిస్ట్రేషన్ల కుంభకోణంపై సీఐడీతో దర్యాప్తు జరిపించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని రెవెన్యూ శాఖ కోరింది. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం మండలంలో లీజు ముగిసిన భూములను రిజిస్ట్రేషన్ చేయిస్తామంటూ అమాయకులైన రైతుల నుంచి డబ్బులు దండుకున్న వ్యవహారంపై సమగ్ర దర్యాపునకు ఆదేశాలివ్వాలని రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఉషారాణి ఇటీవల విజ్ఞప్తి చేశారు. ‘నర్సాపురం అగ్రికల్చర్ కంపెనీ’ భూముల రిజిస్ట్రేషన్కు కోట్లాది రూపాయలు వసూలు చేసిన వ్యవహారాన్ని గతేడాది సెప్టెంబర్ 16న ‘టీడీపీ తీరంతా అవినీతి’ శీర్షికతో ‘సాక్షి’ వెలుగులోకి తీసుకువచ్చింది. ఈ కుంభకోణంపై అప్పటి నరసాపురం సబ్ కలెక్టర్ విచారణ చేసి.. అక్రమాలు జరిగినట్టు ప్రాథమికంగా నిర్ధారించారు. బ్రిటిష్ హయాంలో ఇచ్చిన భూములు.. బ్రిటిష్ హయాంలో నరసాపురం తీర ప్రాంతమంతా ఇసుక భూములే. ఇక్కడి ప్రజలకు ఉపాధి దొరకని పరిస్థితి. ఈ నేపథ్యంలో కొందరు రైతులు కలిసి అప్పటి బ్రిటిష్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసుకున్నారు. తమకు భూములిస్తే.. సాగు చేసుకుని ఉపాధి పొందుతామన్నారు. దీనికి బ్రిటిష్ ప్రభుత్వం కూడా అంగీకరించింది. స్థానిక రైతులంతా కలిసి నరసాపురం అగ్రికల్చర్ కంపెనీగా ఏర్పడ్డారు. దర్భరేవు, మర్రితిప్ప, వేములదీవి ప్రాంతాల్లోని 1,811.33 ఎకరాలను ఈ కంపెనీ పరిధిలోకి తీసుకొచ్చారు. వీటిని 99 ఏళ్ల పాటు లీజుకు ఇచ్చేందుకు బ్రిటిష్ ప్రభుత్వం 1920లో ఆమోదం తెలిపింది. అమలు కాని జీవోను అడ్డంపెట్టుకొని.. మొత్తం 1,811.33 ఎకరాల్లో గట్లు, నీటి కుంటలను తీసివేయగా.. నికరంగా 1,754.49 ఎకరాలను 1,485 మంది రైతులు తరతరాలుగా సాగు చేసుకుంటున్నారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో లీజు గడువు ముగింపునకు వచ్చింది. ఈ భూములను ఉచితంగా ఇస్తామంటూ సాగుదారులకు టీడీపీ పాలకులు సరిగ్గా ఎన్నికలకు ముందు హామీ ఇచ్చారు. 2019 జనవరి 24న జీవో కూడా విడుదల చేశారు. ఎకరాకు రూ.1,000 చొప్పున రైతులకు శాశ్వతంగా రిజిస్ట్రేషన్ చేయించి ఇస్తామని ఆ జీవోలో పేర్కొన్నారు. ఈ భూముల వ్యవహారాలు చూసేందుకు రైతులు సభ్యులుగా ఉన్న ‘కంపెనీ’ బోర్డుకు టీడీపీ నేత కోట్ల సాయి వెంకట రాజా అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయనతో కలిసి బోర్డు డైరెక్టర్లు, టీడీపీ స్థానిక నేతలు సజ్జా వీర వెంకట సత్యనారాయణ, మేకా శ్రీధర్ చౌదరి రంగంలోకి దిగారు. రైతుల నుంచి ఎకరాకు రూ.20 వేల నుంచి రూ.50 వేల వరకు వసూలు చేశారు. డబ్బులివ్వకపోతే రిజిస్ట్రేషన్ చేసేది లేదంటూ బెదిరించారు. దీంతో 1,485 మంది సాగుదారుల్లో 760 మంది రూ.1.58 కోట్లు ఇచ్చారు. కానీ అప్పటి టీడీపీ ప్రభుత్వం జీవోను మాత్రం అమలు చేయలేదు.. రైతుల పేర్ల మీద భూములు కూడా రిజిస్ట్రేషన్ చేయలేదు. ఈ కుంభకోణాన్ని గతేడాది ‘సాక్షి’ పత్రిక వెలుగులోకి తెచ్చింది. బాధిత రైతులు నరసాపురం ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు, అప్పటి సబ్ కలెక్టర్ విశ్వనాథన్కు ఫిర్యాదు చేశారు. రూ.1.05 లక్షలు కట్టించుకున్నారు మా కుటుంబానికి కంపెనీ భూముల్లో 5 ఎకరాలున్నాయి. తరతరాలుగా వాటిని సాగు చేసుకుంటున్నాం. 2019 ఎన్నికలకు ముందు మీ భూములు మీకే రిజిస్ట్రేషన్ చేసేస్తాం.. ఎకరాకు రూ.21 వేలు కట్టాలని చెప్పారు. రూ.1,000 ప్రభుత్వానికి, మిగిలినవి ఖర్చులకని చెప్పి.. నా నుంచి రూ.1.05 లక్షలు కట్టించుకున్నారు. రిజిస్ట్రేషన్ మాత్రం చేయలేదు. మా నుంచి వసూలు చేసిన డబ్బులను బోర్డు పెద్దలే జేబులో వేసుకున్నారు. దీనిపై ప్రశ్నిస్తే వారేమీ జవాబివ్వట్లేదు. సీఐడీ విచారణతో న్యాయం జరుగుతుందని ఆశ పడుతున్నాం. – జి.బంగార్రాజు, రైతు, దర్భరేవు -
ఆధార్ నంబర్తో.. భూమిని కొట్టేసేందుకు కుట్ర
సాక్షి, హైదరాబాద్: భూమి ఉన్నది 20 గుంటలే... కానీ మార్కెట్లో దాని ధర కోట్లు పలుకుతోంది. ఆ భూమి యజమాని దాదాపు రెండేళ్ల క్రితం మరణించారు. సదరు యజమాని కుటుంబీకులు ఆ భూమిని తమ పేరు మీద బదలాయించుకోలేదు. దీన్ని గమనించిన కొందరు ప్రబుద్ధులు భూమిని కొట్టేసేందుకు కుట్రపన్నారు. ఒక్క ఆధార్ నంబర్తో అప్పనంగా భూమిని సొంతం చేసుకుందామనుకున్నారు. రెవెన్యూ అధికారుల విచారణలో అసలు విషయం తేలడంతో అడ్డంగా బుక్కయ్యారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం భానూర్ గ్రామంలో సర్వే నంబర్ 497/ఇలో 20 గుంటల భూమి ఉంది. గత ఏప్రిల్ 19న తోట హనుమంతరావు పేరుతో ధరణి పోర్టల్కు ఒక దరఖాస్తు వచ్చింది. ఆ భూమికి ఈకేవైసీ కోసం తన ఆధార్ నంబర్ను నమోదు చేయాలని ఆ దరఖాస్తులో కోరారు. దీన్ని విచారిస్తుండగానే మే 6న తోట కనకదుర్గ పేరుతో మరో దరఖాస్తు వచ్చింది. తన భర్త తోట హనుమంతరావు 2019, ఆగస్టు 9న మరణించారని, ఆయన పేరు మీద ఉన్న భూమిని తనకు వారసత్వ మార్పు చేయాలని కనకదుర్గ కోరారు. రెండు దరఖాస్తుల్లోని సర్వే నంబర్లు, ఖాతా నంబర్లు ఒకటే ఉండటంతో జూన్ 5న విచారణకు రావాలని ఇరుపార్టీలకు రెవెన్యూ అధికారులు నోటీసులు పంపారు. ధ్రువీకరణలు తీసుకుని సదరు భూమిని క్లెయిమ్ చేసుకోవాలని కోరారు. పౌరసరఫరాల డేటా బేస్తో.. విచారణ సమయంలో తోట హనుమంతరావు పేరు మీద దరఖాస్తు చేసుకున్న వ్యక్తి ఆ భూమికి సంబంధించిన ధ్రువీకరణలు చూపలేకపోయాడు. ఆ వ్యక్తి నమోదు చేయాలని కోరిన ఆధార్ కార్డులోని చిరునామాలో ఎంక్వైరీ చేయగా సదరు పేరున్న వ్యక్తి అక్కడ లేడని తేలింది. పౌరసరఫరాల డేటాలో వెతకగా ఆ ఆధార్ నంబర్తో లింక్ అయి ఉన్న రేషన్కార్డు దొరికింది. ఈ కార్డులో తోట హనుమంతరావు కాకుండా గుర్రం పాండు అనే పేరు వచ్చింది. ఇతనిది యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ కాగా, ఆ రేషన్కార్డుపై తన బయోమెట్రిక్ వివరాలను నమోదు చేసి 2020, నవంబర్లో రేషన్ బియ్యం తీసుకున్నాడని, ఆ తర్వాత వరుసగా అతని భార్య ఈ రేషన్ తీసుకుంటున్నట్లు వెల్లడైంది. రెవెన్యూ అధికారులు మరింత విచారించగా, గుర్రం పాండు తన ఆధార్ కార్డులోని పేరును తోట హనుమంతరావుగా 2021లో మార్చుకున్నాడని, ఆ తర్వాత అదే పేరుతో ఆ కార్డులోని నంబర్ను నమోదు చేసుకుని విలువైన భూమిని కొట్టేసేందుకు కుట్రపన్నాడని తేలింది. దీంతో గుర్రం పాండుపై చీటింగ్ కేసు నమోదు చేయాలని సంబంధిత తహశీల్దార్ సోమవారం పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. రెండు దరఖాస్తులు రావడంతోనే.. వాస్తవానికి రెండు దరఖాస్తులు ఒకే సమయంలో రావడంతోనే ఇది గుర్తించగలిగాం. లేదంటే ఆధార్కార్డులోని పేరు, పహాణీలో పేరు చూసి ఆ దరఖాస్తును ఆమోదించడమో, తిరస్కరించడమో జరిగేది. విచారణలో తప్పని తేలడంతో పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాం. ఇలాంటి వాటిపై ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎప్పటికప్పుడు తమ భూమి రికార్డులను ఆన్లైన్లో అయినా చెక్ చేసుకుంటూ ఉండాలి. –కె. మహిపాల్రెడ్డి, పటాన్చెరు తహశీల్దార్ -
గ్రామ–వార్డు సచివాలయాల సేవలకు సలాం
సాక్షి, అమరావతి: పాలన వికేంద్రీకరణలో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థను ఏర్పాటు చేయడం ద్వారా ఉన్న ఊరు దాటకుండానే ప్రజల ముంగిటకే ప్రభుత్వ సేవలను అందించి రికార్డు సృష్టించారు. రెండేళ్లు దాటక ముందే గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ఏకంగా 2.22 కోట్ల సేవలను ప్రజలకు అందించారు. ఇది దేశంలోనే రికార్డు. ఏపీలో తప్ప మరే రాష్ట్రంలోనూ ఇలా గ్రామ, వార్డు ప్రజల ముంగిటకే ప్రభుత్వ సేవలందిస్తున్న దాఖలాలు లేవు. 2019 అక్టోబర్ 2వ తేదీన గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థ ఏర్పాటు చేయడం ద్వారా గాంధీజీ కలలుకన్న గ్రామ స్వరాజ్యాన్ని ఆవిష్కృతం చేశారు. అంతటితో ఆగకుండా ఈ వ్యవస్థ ద్వారా ఉన్న ఊరు, వార్డు దాట కుండా అక్కడి ప్రజలకు 544 ప్రభుత్వ సేవలను అందించే కార్యక్రమానికి గత ఏడాది జనవరి 26వ తేదీన శ్రీకారం చుట్టారు. అప్పటి నుంచి ఈ నెల 13వ తేదీ వరకు రాష్ట్రంలోని 15,004 గ్రామ, వార్డు సచివాలయాలకు ప్రభుత్వ పథకాలు, సేవల కోసం 2.27 కోట్ల దరఖాస్తులు రాగా, అందులో ఇప్పటి వరకు 2.22 కోట్ల దరఖాస్తులను పరిష్కరించడం ద్వారా గ్రామ స్వరాజ్యం అంటే ఇది అని నిరూపించారు. అర్హతే ప్రామాణికంగా సేవలు గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ప్రజలకు సేవలందించేందుకు కొత్తగా 1.34 లక్షల ఉద్యోగాలను యువతకు కల్పించడమే కాకుండా ఆయా గ్రామ, వార్డుల్లో నివసించే రైతు నుంచి కూలీ వరకు అన్ని వర్గాలకు అవసరమైన సేవలను నిర్ణీత కాల వ్యవధిలో అందిస్తున్నారు. తద్వారా ఎవరి సిఫార్సులు లేకుండా, రాజకీయ జోక్యం లేకుండా, పైసా లంచం లేకుండా అర్హతే ప్రామాణికంగా ఉన్న ఊరు, వార్డుల్లోనే ప్రజల ముంగిటకు ప్రభుత్వ సేవలు, పథకాలు అందుతున్నాయి. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా జనన ధ్రువీకరణపత్రం నుంచి బియ్యం కార్డు, ఆరోగ్య శ్రీ కార్డు, పెన్షన్ కార్డు, ఇంటి స్థలం పట్టా, ఆదాయ ధ్రువీకరణ పత్రం, రైతులకు అవసరమైన భూ రికార్డులు, విద్యుత్, మంచినీటి కనెక్షన్ వంటి మొత్తం 544 సేవలను నిర్ణీత గడువులోగా ప్రజలకు అందిస్తున్నారు. ఇందులో రెవెన్యూ శాఖకు చెందిన 1.29 కోట్ల వినతులను గ్రామ, వార్డు సచివాలయాలు తీర్చాయి. పౌర సరఫరాల శాఖకు చెందిన 37.02 లక్షల వినతులను, ఇంధన శాఖకు చెందిన 15.62 లక్షల వినతులను, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు చెందిన 7.61 లక్షల వినతులను, మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖకు చెందిన 7.48 లక్షల వినతులను ఈ వ్యవస్థ తీర్చింది. గతంలో ప్రభుత్వ సేవలతో పాటు రేషన్ కార్డు కావాలన్నా, పెన్షన్ కావాలన్నా జన్మభూమి కమిటీలతో పాటు మండల, డివిజన్, జిల్లా కార్యాలయాల చుట్టూ కాళ్లు అరిగేలా ప్రదక్షిణలు చేసినా మంజూరు అయ్యేవి కావు. పైగా లంచాలు ఇచ్చిన వారికి, పార్టీకి చెందిన వారికే అరకొర మంజూరు అయ్యేవి. ఇప్పుడు అందుకు పూర్తి భిన్నంగా సేవలు అందుతున్నాయి. బర్త్ సర్టిఫికెట్ గడువులోగా వచ్చింది ఇదివరకు ఉద్యోగ విషయమై బర్త్ సర్టిఫికెట్ కోసం కళ్యాణదుర్గంలోని తహసీల్దార్ కార్యాయానికి వెళ్లాను. పట్టణ వీఆర్వో, ఆర్ఐ, తహశీల్దార్ నివేదికలు ఇచ్చాకే సర్టిఫికెట్ వస్తుందని, ఎన్ని రోజులు పడుతుందో చెప్పలేమన్నారు. నాకు ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం కోసం సర్టిఫికెట్ వెంటనే అవసరం అయ్యింది. కానీ ఇచ్చే పరిస్థితి లేదు. నానా తిప్పలు పడినా సర్టిఫికెట్ రాలేదు. చివరికి వేరే కంపెనీలో ఉద్యోగంలో చేరాను. ఇటీవల పాస్పోర్ట్ కోసం బర్త్ సర్టిఫికెట్ తప్పనిసరి అయ్యింది. 9వ వార్డు సచివాలయానికి వెళ్లి ఆధార్, స్టడీ సర్టిఫికెట్లతో దరఖాస్తు చేశాను. 15 రోజుల్లోనే సర్టిఫికెట్ వచ్చింది. – అరుణ్కుమార్, ప్రైవేట్ ఉద్యోగి, కళ్యాణదుర్గం, అనంతపురం జిల్లా సచివాలయ వ్యవస్థతో ఆధారం నేను 20 సంవత్సరాల క్రితం ఆర్డీసీ డిపోలో శ్రామిక్ (కూలీ)గా పని చేసి, రిటైరయ్యాను. ప్రస్తుతం రూ.1,100 మాత్రమే పింఛన్ వస్తోంది. వృద్ధాప్యంలో నేను, నాభార్య జీవనోపాధి లేక ఇబ్బందులు పడేవాళ్లం. ఆధార్ కార్డు నమోదు చేసిన కొత్తలో నేను ప్రభుత్వ ఉద్యోగిగా నమోదు చేశారు. దీంతో నాకు వృద్ధాప్య పెన్షన్ కూడా రాని పరిస్థితి. అయితే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏర్పాటు చేసిన వలంటీరు వ్యవస్థ, గ్రామ/వార్డు సచివాలయ వ్యవస్థల పుణ్యమా అని ప్రస్తుతం నా భార్య నాగమణికి ప్రభుత్వ వృద్ధాప్య పింఛన్ మంజూరు అయ్యింది. ముఖ్యమంత్రి జగన్ నిండు నూరేళ్లు చల్లగా ఉండాలి. – విల్లా కృష్ణ, రామచంద్రాపురం, తూర్పుగోదావరి జిల్లా ఆరేళ్ల ఎదురు చూపు.. సచివాలయంతో నెరవేరింది నాకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అద్దె ఇంట్లో కాపురం ఉంటున్నాం. ఊరూరా గాజులు అమ్ముకుని జీవనోపాధి పొందుతున్నాను. నాకు పెళ్ళై ఆరేళ్లు అయ్యింది. టీడీపీ ప్రభుత్వ హయాంలో రేషన్కార్డుకు దరఖాస్తు చేసుకుంటే నా భార్య పేరు లేకుండా నా ఒక్కడికే వచ్చింది. పేరు చేర్చాలని ఎన్నో సార్లు దరఖాస్తు చేసుకున్నా ఫలితం లేకుండా పోయింది. ఐదు కిలోల బియ్యంతోనే సరిపెట్టుకున్నాం. రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గ్రామ సచివాలయాలు అందుబాటులోకి వచ్చాయి. రేషన్ కార్డులో నా భార్య, ఇద్దరు పిల్లల్ని చేర్చాలని రమణయ్యపేట గ్రామ సచివాలయం–1లో దరఖాస్తు చేశాను. రెండు రోజుల్లోనే కార్డు మంజూరు అయ్యిందని వీఆర్వో సత్యనారాయణ ఫోన్ చేశారు. మా కుటుంబ సభ్యులందరూ చాలా సంతోషించాం. సచివాలయం ద్వారా సకాలంలో పనులు పూర్తవుతున్నాయి. – బత్తుల శ్రీనివాస్, రమణయ్యపేట, తూర్పుగోదావరి జిల్లా ఉన్న ఊరిలోనే సేవలకు సచివాలయ వ్యవస్థ కేంద్ర బిందువు గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థ ద్వారా ఉన్న ఊరిలోనే ప్రజలకు ప్రభుత్వ సేవలందుతున్నాయి. ప్రతి సేవకు ముఖ్యమంత్రి నిర్ధిష్ట గడువు విధించారు. ఆ గడువులో 85.36 శాతం ప్రజల దరఖాస్తులు పరిష్కారమయ్యాయి. సచివాలయాల వ్యవస్థతో గ్రామాల్లోని ప్రజలు మండల కేంద్రాలకు, రెవెన్యూ డివిజన్ కేంద్రాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ప్రభుత్వ పథకాలు, సేవలు అందుతున్నాయి. గతంలో రేషన్ కార్డు పొందడానికే సంవత్సరాలు పట్టేది. ఇప్పుడు అర్హతే ప్రామాణికంగా నిర్ణీత గడువులోనే గ్రామ సచివాయాల్లో కార్డు మంజూరు చేస్తున్నారు. ఉన్న కార్డుల్లో సభ్యుల సంఖ్య పెంచడం గతంలో జరిగేది కాదు. ఇప్పుడు అలాంటి 21.70 లక్షల దరఖాస్తులను పరిష్కరించాం. – అజయ్ జైన్, గ్రామ, వార్డు సచివాలయాల శాఖ ప్రత్యేక సీఎస్ తిప్పలు తప్పాయి గ్రామ సచివాలయాల ఏర్పాటు వల్ల ప్రతి చిన్న పనికి మండల కేంద్రాలకు వెళ్లి కార్యాలయాల చుట్టూ తిరిగే తిప్పలు తప్పాయి. నాకు 70 ఏళ్ల వయసు ఉండటంతో పింఛన్ కోసం గతంలో అనేక సార్లు మా గ్రామానికి 13 కిలో మీటర్ల దూరంలోని పుట్లూరుకు వెళ్లి దరఖాస్తు చేసుకున్నా ఫలితం లేదు. ఇప్పుడు మా గ్రామానికి ఆనుకొని ఉన్న తక్కళ్లపల్లిలో ప్రభుత్వం సచివాలయాన్ని ఏర్పాటు చేసింది. అక్క డికి వెళ్తే రేషన్కార్డుతోపాటు పింఛన్ అందే లా వలంటీర్లు, సచివాలయ అధికారులు చర్యలు తీసుకున్నారు. – ఎస్. రామాంజులు, తిమ్మాపురం, అనంతపురం జిల్లా -
తహసీల్దార్ .. పనితో బేజార్
‘‘మీ సేవ కేంద్రాల నుంచి ఒక్క ధరణి పోర్టల్కు సంబంధించినవే వారానికి కనీసం 100 నుంచి 300 వరకు దరఖాస్తులు వస్తున్నాయని, వీటన్నింటినీ పరిశీలించి రికార్డులు తయారు చేయడానికే తమకు సమయం సరిపోవడం లేదని తహసీల్దార్లు అంటున్నారు..’’ ‘‘ప్రత్యేక రెవెన్యూ ట్రిబ్యునళ్ల ద్వారా పరిష్కరించాల్సిన భూ సమస్యలు కోర్టు ఉత్తర్వులతో మళ్లీ విచారించాల్సి రావడంతో ఆయా కేసులకు సంబంధించిన రిపోర్టులు ఇచ్చే పనిని కూడా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు.. తహసీల్దార్లకే అప్పజెబుతున్నారు..’’ ధరణి పోర్టల్ ద్వారా భూ సమస్యల పరిష్కారం ఈ పోర్టల్ ద్వారా వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు రైతుల వద్ద ధాన్యం కొనుగోలు బాధ్యత కోవిడ్ క్వారంటైన్ సెంటర్ల నిర్వహణ, వ్యాక్సిన్పై అవగాహన కల్యాణలక్ష్మి, షాదీముబారక్, ప్రొటోకాల్ విధులు సాక్షి, హైదరాబాద్: ఒక్కటి కాదు, రెండు కాదు.. అనేక బాధ్యతలతో రాష్ట్రంలోని తహసీల్దార్లు తీవ్ర పని ఒత్తిడికి లోనవుతున్నారు. ఒకదానిపై మరొకటిగా మీద పడుతున్న పనులు వారికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. బాధ్యతలన్నీ సమన్వయం చేసుకోవడం కష్టతరమవుతోంది. ధరణి పోర్టల్ ద్వారా భూసమస్యల పరిష్కారం నుంచి ధాన్యం కొనుగోళ్ల వరకు అన్ని బాధ్యతలూ రెవెన్యూ సిబ్బందిపైనే పెట్టడంతో అన్నింటినీ సమన్వయపర్చుకోవడం కష్టతరమవుతోంది. ముఖ్యంగా ధరణి సమస్యల పరిష్కారం తహసీల్దార్లకు తలకు మించిన భారంగా పరిణమించింది. ఈ సమస్యల పరిష్కారం కోసం రికార్డులు తనిఖీ చేసి, స్వయం అధీకృత (అటెస్టెడ్) కాపీలు తయారు చేసేందుకే ఉన్న సమయం సరిపోతోందని తహసీల్దార్లు వాపోతున్నారు. మరోవైపు వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు, కోవిడ్ బాధ్యతలు, ధాన్యం కొనుగోళ్లు, ప్రకృతి వనాల భూసేకరణ, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, ఆసరా పింఛన్లు, ప్రొటోకాల్ విధులు...ఇలా లెక్కకు మిక్కిలి పనులు అప్పగించడంతో ఒత్తిడికి గురవుతున్నామని చెబుతున్నారు. పని ఒత్తిడి తగ్గించేలా, ఆయా పనులకు తగిన సమయం ఇచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. జాయింట్ సబ్ రిజిస్ట్రార్ బాధ్యతలు కూడా ధరణి పోర్టల్ ద్వారా భూసమస్యల పరిష్కారానికి తోడు ఈ పోర్టల్ ద్వారా వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు కూడా తహసీల్దార్లే చేయాల్సి వస్తోంది. తహసీల్దార్ విధులు నిర్వహిస్తూనే జాయింట్ సబ్ రిజిస్ట్రార్ బాధ్యతలు కూడా నిర్వర్తించాల్సి వస్తోందని, తమకుండే సాధారణ పని బాధ్యతలకు తోడు వీటిని సమన్వయం చేసుకోవడం కష్టతరమవుతోందనేది తహసీల్దార్ల వాదన. ఇంకా ఎన్నో... అదనంగా ప్రభుత్వం కొత్తగా మరిన్ని బాధ్యతలను తహసీల్దార్లకు అప్పజెప్పింది. ముఖ్యంగా కోవిడ్ క్వారంటైన్ సెంటర్ల ఎంపిక, అక్కడ అన్ని సౌకర్యాలు ఉండేలా చూసుకోవడం, వ్యాక్సిన్పై ప్రజల్లో అవగాహన కల్పించడం, కోవిడ్ నిర్ధారణ కేంద్రాల వద్ద జన సమ్మర్ధ నియంత్రణ బాధ్యతలను కూడా రెవెన్యూకే ఇవ్వడంతో తహసీల్దార్లు ఆయా మండలాల్లోని వీఆర్ఏలు, వీఆర్వోలతో ఈ పనులు చేయిస్తూ పర్యవేక్షించాల్సి వస్తోంది. మరోవైపు రబీ ధాన్యం కొనుగోళ్లు పేరుకే పౌరసరఫరాల శాఖ ద్వారా చేస్తున్నా అన్ని పనులూ రెవెన్యూ సిబ్బందే చూసుకోవాల్సి వస్తోందని, ఈ పనిని కూడా జిల్లా కలెక్టర్లు తమకే అప్పగించారని తహసీల్దార్లు వాపోతున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల ఎంపిక, మద్దతు ధర అందేలా చూడడం, రవాణా సౌకర్యాలు ఏర్పాటు చేయడం, కొనుగోలు కేంద్రాల్లో గన్నీ బ్యాగులు అందుబాటులో ఉండేలా చూడడం, ప్యాడీ క్లీనర్లు, మంచినీళ్లు లాంటి కనీస సౌకర్యాల కల్పన పనులు కూడా తహసీల్దార్లకే అప్పగించడం గమనార్హం. దీనికి తోడు పల్లె ప్రకృతి వనాలకు భూసేకరణ, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, ఆసరా పింఛన్లు లాంటి సంక్షేమ పథకాల లబ్ధిదారుల గుర్తింపు, ప్రొటోకాల్ విధులు వారే చేయాల్సి వస్తోంది. ఇక ధరణి ద్వారా మరిన్ని ఆప్షన్లు ఇస్తే దరఖాస్తులు ఇంకా పెరుగుతాయని, అప్పుడు ఈ రికార్డులు తయారు చేసుకోవడం తప్ప ఎలాంటి పనులూ చేయలేమని అంటున్నారు. పని భారంతో తప్పులు జరుగుతాయేమోననే ఆందోళన ఎక్కువ అవుతోందని, ముఖ్యంగా భూముల విషయంలో పొరపాట్లు జరిగితే ప్రజలు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుందని, ప్రభుత్వం ఈ విషయంలో తగిన విధంగా ఆలోచించి ధరణి సమస్యలు పరిష్కారం అయ్యేంతవరకు కొన్ని బాధ్యతల నుంచి తమను తప్పించాలని తహసీల్దార్లు కోరుతున్నారు. పేరుకే కలెక్టర్లు.. చేసేదంతా తహసీల్దార్లే... ధరణి పోర్టల్ ద్వారా భూసమస్యల పరిష్కారం విషయంలో తహసీల్దార్లను జిల్లాల కలెక్టర్లు తీవ్ర ఒత్తిడికి గురి చేస్తున్నారని సమాచారం. ఈ పోర్టల్ ద్వారా 11 రకాల సమస్యలు పరిష్కరించుకునేందుకు గత వారం రోజులుగా ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఆధార్లో తప్పులు, ఆధార్ అనుసంధానం, తండ్రి/భర్త పేరులో మార్పు, ఫోటో తప్పులు, లింగ నమోదులో తప్పులు, కులం తప్పులు, సర్వే నంబర్ల మిస్సింగ్, భూసేకరణ పద్ధతుల్లో మార్పు, భూమి స్వభావ రికార్డు సరిచేయడం, భూ వర్గీకరణ, డిజిటల్ సంతకాలు... ఇలా 11 రకాల సమస్యల పరిష్కారానికి భూ యజమానులు మీసేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ దరఖాస్తులు నేరుగా తహసీల్దార్లకు వస్తాయి. కానీ, వీటిపై నిర్ణయం తీసుకునే అధికారం తహసీల్దార్లకు లేదు. కేవలం వీటిని తనిఖీ చేసి రిపోర్టు ఇస్తే జిల్లా కలెక్టర్లే నేరుగా ఆన్లైన్లో సరిచేస్తారు. అయితే కలెక్టర్లు కూడా పని ఒత్తిడితో భారమంతా తమపై వేసి చేతులు దులుపుకుంటున్నారని, తగిన సమయం ఇవ్వకుండా ఒత్తిడికి గురిచేస్తున్నారని తహసీల్దార్లు వాపోతున్నారు. ఏదైనా సమస్య పరిష్కారం కోసం మీ సేవ నుంచి దరఖాస్తు వస్తే ఆ దరఖాస్తుతో పాటు అందుకు సంబంధించిన సాక్ష్యాలను సిటిజన్ లాగిన్లో డౌన్లోడ్ చేసుకుని, రికార్డులను పరిశీలించి, జిరాక్సులు తీసి, ప్రతి దానికి ఫార్మాట్ రూపంలో సమాధానమిస్తూ వాటిని మళ్లీ తామే అటెస్ట్ చేస్తూ ఆర్డీవోలకు ఆఫ్లైన్లో సమర్పించాల్సి వస్తోందని చెబుతున్నారు. ఆ తర్వాత వాటిని ఆర్డీవోలు కూడా పరిశీలించి, ప్రతి సమస్యకూ ఓ ప్రొసీడింగ్ ఇచ్చి కౌంటర్ సంతకం పెట్టి వాటిని కలెక్టరేట్లో సమర్పిస్తేనే ధరణి సమస్యలను కలెక్టర్లు ఆన్లైన్లో పరిష్కరిస్తున్నారు. ఆ విధంగా కలెక్టర్లు ఓకే చేసిన దరఖాస్తులు తిరిగి తమ వద్దకు వస్తే వాటికి పూర్తి బాధ్యత వహిస్తూ తహసీల్దార్లే సంతకాలు చేయాల్సి వస్తోంది. ఇలా ప్రతి తహసీల్దార్ కార్యాలయంలో వారానికి కనీసం 100 నుంచి 300 వరకు దరఖాస్తులు వస్తున్నాయని, వీటన్నింటినీ పరిశీలించి రికార్డులు తయారు చేయడానికే తమకు సమయం సరిపోడం లేదంటున్నారు. ఇక, ప్రభుత్వ భూముల నిర్ధారణ కోసం అయితే 1954 కంటే ముందు నుంచి రికార్డులన్నింటినీ (పహాణీలు) పరిశీలించాల్సి వస్తోందని, కలెక్టర్లు మాత్రం అన్ని బాధ్యతలూ తమపై వేసి త్వరగా పూర్తి చేయాలంటూ ఒత్తిడి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శని, ఆదివారాలు సెలవు ఇవ్వాలి రాష్ట్రంలోని తహసీల్దార్లకు ఇప్పుడు 24 గంటల సమయం సరిపోవడం లేదు. ప్రభుత్వం అప్పగించిన పనులు చేయడంలో మాకు ఎలాంటి ఇబ్బందీ లేదు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకాంక్షల మేరకు పనిచేసేందుకు మేం సిద్ధంగా ఉన్నాం. కానీ ఒక్క తహసీల్దార్ ఇన్ని పనులు చేయడం చాలా ఇబ్బందికరంగా మారుతోంది. ముఖ్యంగా ధరణి పోర్టల్ ద్వారా పరిష్కరించాల్సిన సమస్యల భారమంతా మాపై వేసి కలెక్టర్లు చేతులు దులుపుకుంటున్నారు. పని ఒత్తిడి తగ్గించేలా, తగిన సమయం ఇచ్చేలా ప్రభుత్వం చొరవ తీసుకుంటేనే అప్పగించిన పనులను సజావుగా పూర్తి చేయగలం. కోవిడ్ విజృంభిస్తున్న సమయంలో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పని చేస్తున్న రెవెన్యూ సిబ్బందికి శని, ఆదివారాలు సెలవు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. - వంగా రవీందర్రెడ్డి, తెలంగాణ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షుడు -
ఏసీబీకి చిక్కిన రెవెన్యూ సిబ్బంది
సాక్షి, రంగారెడ్డి: ఏసీబీ అధికారులు సర్వేయర్తోపాటు కంప్యూటర్ ఆపరేటర్ను వలపన్ని పట్టుకున్నారు. భూ సర్వే రిపోర్టు కోసం సర్వేయర్ డబ్బులు డిమాండ్ చేశారు. రూ. 3 వేలు తీసుకుంటుండగా కంప్యూటర్ ఆపరేటర్ను రెడ్హ్యాండెడ్గా అరెస్టు చేశారు. అనంతరం సర్వేయర్ను అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటన దోమ మండల కేంద్రంలో సోమవారం జరిగింది. ఏసీబీ డీఎస్పీ సూర్యనారాయణ కథనం ప్రకారం.. మండల పరిధిలోని ఐనాపూర్కు సయ్యద్ ఖాజా యాదుల్లా హుస్సేని తాను కొనుగోలు చేసిన సర్వేనంబర్ 445లో ఉన్న 3 ఎకరాల భూమిని సర్వే చేయాలని 2018లో మీసేవలో దరఖాస్తు చేసుకున్నాడు. అధికారుల నుంచి స్పందన లేకపోవడంతో తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి సర్వేయర్ భాగ్యవతిని అడుగగా.. మళ్లీ దరఖాస్తు చేసుకొని రావాలని సూచించారు. దీంతో బాధితుడు 2019లో మళ్లీ దరఖాస్తు చేసుకున్నాడు. కార్యాలయానికి పలుమార్లు తిరుగగా గత ఏడాది డిసెంబర్ 7న సర్వేకోసం ఇరుగుపొరుగు రైతులకు నోటీసులు ఇవ్వాలని ఆయనకు అందజేసింది. దీంతో యాదుల్లా హుస్సేని కావలికార్ సాయంతో చుట్టుపక్కల రైతులకు నోటీసులు ఇచ్చాడు. రూ. 10 వేలు డిమాండ్ డిసెంబర్ 15న సర్వే చేసిన సర్వేయర్ భాగ్యవతి రూ.10 వేల లంచం అడిగారు. బాధితుడు తాను అంత ఇచ్చుకోలేనని చెప్పి రూ. 2,000 ఇచ్చాడు. అనంతరం సర్వే రిపోర్టు ఇచ్చేందుకు సర్వేయర్ భాగ్యవతి.. యాదుల్లా హుస్సేన్ను సతాయించింది. చివరకు రూ. 3 వేలు ఇస్తానని అతడు అంగీకరించాడు. దీంతో బాధితుడు ఈనెల 18న యాదుల్లా హుస్సేని ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. అధికారులు శనివారం పథకం ప్రకారం దాడులు చేసేందుకు సిద్ధమవగా ఆమె విధులకు హాజరు కాలేదు. దీంతో సోమవారం బాధితుడు కార్యాలయానికి వచ్చి సర్వేయర్కు ఫోన్ చేశాడు. తాను ఫీల్డ్లో ఉన్నానని.. రావడానికి సమయం పడుతుందని, తహసీల్దార్ కార్యాలయంలోని కంప్యూటర్ ఆపరేటర్కు డబ్బులు ఇవ్వమని భాగ్యవతి సూచించారు. దీంతో బాధితుడు కంప్యూటర్ ఆపరేటర్ ప్రేమ్కుమార్కు రూ. 3 వేలు ఇస్తుండగా ఏసీబీ అధికారులు దాడి చేసి అతడిని పట్టుకున్నారు. క్షేత్రస్థాయిలో ఉన్న సర్వేయర్ భాగ్యవతిని కూడా అదుపులోకి తీసుకుని విచారించారు. ఇద్దరినీ ఏసీబీ కోర్టులో హాజరుపరిచి జైలుకు తరలిస్తామని ఏసీబీ డీఎస్పీ సూర్యనారాయణ తెలిపారు. -
అదనపు కలెక్టర్లకు ఆరునెలలుగా జీతాల్లేవ్!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో అదనపు కలెక్టర్లుగా నియమితులైన స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లకు (ఎస్జీడీసీ) అటు వేతన, ఇటు పాలనాపర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ పోస్టులకు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా అనుమతులు ఇవ్వకపోవడంతో 18 మంది అదనపు కలెక్టర్లకు ఆరునెలలుగా వేతనాలు కూడా రాలేదని తెలుస్తోంది. గతంలో పనిచేసిన స్థానం నుంచే కొందరు ఇప్పటికీ వేతనాలు డ్రా చేస్తున్నారని, ఆ పోస్టుల్లో ఇతర అధికారులు వచ్చి చేరితే వేతనాలు రావడం లేదని సమాచారం. వేతనాలతో పాటు జాబ్ చార్ట్ లేకపోవడం మరో సమస్యగా మారింది. వారి విధులు, అధికారాలకు సంబంధించిన మార్గదర్శకాలు లేకపోవడంతో కలెక్టర్లు ఇచ్చిన అసైన్మెంట్లకే అదనపు కలెక్టర్లు పరిమితం అవుతున్నారని రెవెన్యూ సంఘాలు చెబుతున్నాయి. చదవండి: (స్మార్ట్ సిటీలు.. కావాలా..వద్దా?) జూనియార్టీతో తిప్పలు రాష్ట్రంలోని చాలా జిల్లాలకు అదనపు కలెక్టర్లుగా స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ హోదా ఉన్న అధికారులను నియమించారు. వీరికి ప్రభుత్వంలో జాయింట్ డైరెక్టర్ స్థాయి హోదా కూడా లేదు. కానీ, జిల్లాల్లో సూపరిండెంట్ ఇంజనీర్లు, డీఎంహెచ్వో, ఆర్జేడీ, జేడీ అగ్రికల్చర్ లాంటి అధికారులు ప్రభుత్వంలో అడిషనల్ డైరెక్టర్ హోదా స్థాయిలో పనిచేస్తున్నారు. దీంతో అధికారుల మధ్య జూనియర్, సీనియర్ సమస్యలు వస్తున్నాయని, రోజువారీ కార్యకలాపాల్లో భాగంగా సీనియర్ అధికారులతో సమన్వయం చేసుకుని సమీక్షలు నిర్వహించడం, ఆదేశాలివ్వడం అదనపు కలెక్టర్లకు ఇబ్బందిగా మారిందని రెవెన్యూ సంఘాలంటున్నాయి. ఈ నేపథ్యంలో స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లుగా పనిచేస్తున్న వారిలో 40–50 మంది అధికారులకు సెలక్షన్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లుగా పోస్టులు సృష్టించి ఇవ్వాలని, తద్వారా జిల్లాల్లో పాలన మరింత మెరుగవుతుందని సంఘాలు చెబుతున్నాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు కూడా వెళ్లినట్టు తెలుస్తోంది. నాలుగేళ్ల క్రితమే అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శులు కూడా సెలక్షన్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ పోస్టుల సృష్టికి సిఫారసు చేశారని, 2016లో తయారైన ఫైలు రెవెన్యూ శాఖలో పెండింగ్లో ఉన్నట్టు సమాచారం. కాగా, ఈ పోస్టులను మంజూరు చేయాలని కోరుతూ తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయిస్ సర్వీసెస్ అసోసియేషన్ (ట్రెసా), డిప్యూటీ కలెక్టర్ల అసోసియేషన్లు కూడా సీఎస్ సోమేశ్కుమార్ను కలిసి విజ్ఞప్తి చేయడం గమనార్హం. -
పట్టాల పండుగకు చురుగ్గా ఏర్పాట్లు
సాక్షి, అమరావతి: ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’లో భాగంగా డిసెంబర్ 25న రాష్ట్రవ్యాప్తంగా ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో అధికారులు చురుగ్గా ఏర్పాట్లు చేస్తున్నారు. పేదలకు ఇళ్ల స్థలాలను ఇవ్వనీయకుండా ప్రతిపక్ష నేత చంద్రబాబు తన పార్టీ నేతలతో కోర్టుల్లో కేసులు వేయించడంతో కోర్టు స్టేలు ఇచ్చినచోట మినహా మిగిలిన అన్ని ప్రాంతాల్లో అర్హులందరికీ ఇళ్ల స్థల పట్టాలు ఇవ్వాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించిన విషయం తెలిసిందే. ప్రతి చోటా లేఔట్లను పరిశీలించి.. ప్లాట్లవారీగా నంబర్ రాళ్లు ఏర్పాటు చేయడంతోపాటు రహదారులకు ఇరువైపులా మొక్కలు నాటాలని ప్రభుత్వం సూచించింది. లబ్ధిదారులకు ప్లాట్ల కేటాయింపులకు సంబంధించి లాటరీ పూర్తి కాని చోట్ల త్వరగా పూర్తి చేయాలని తహసీల్దార్లకు ఆదేశాలిచ్చింది. ఏయే లేఔట్లపై కోర్టు స్టేలు ఉన్నాయో.. ఇందుకు కారణాలేమిటో తెలుసుకుని వాస్తవాలు వివరించడం ద్వారా ‘స్టే’ వెకేట్ చేయించడంపై కలెక్టర్లు దృష్టి సారించారు. ఇందులో భాగంగా ‘నవరత్నాలు – పేదలందరికీ ఇళ్లు’ పథకం ప్రగతిపై సంబంధిత అధికారులతో జిల్లాల కలెక్టర్లు శుక్ర, శనివారాల్లో సమీక్షించారు. జిల్లాల వారీగా కోర్టు వివాదాలు లేకుండా పంపిణీకి సిద్ధం చేస్తున్న లేఔట్లు, లబ్ధిదారుల డేటా పంపాలని రెవెన్యూ శాఖ కలెక్టర్లను ఆదేశించింది. 15 లక్షల ఇళ్ల నిర్మాణానికి భూమి పూజ రాష్ట్రవ్యాప్తంగా ఇళ్ల స్థలాల పంపిణీ కోసం 30,68,281 మంది అర్హులను అత్యంత పారదర్శకంగా ఎంపిక చేసి సచివాలయాల నోటీసు బోర్డుల్లో జాబితాను పొందుపరిచారు. అర్హుల్లో ఏ ఒక్కరికీ ఇంటి స్థలం రాలేదనే మాట వినిపించరాదని సీఎం వైఎస్ జగన్ పలుమార్లు స్పష్టం చేశారు. ఏవైనా కారణాలతో ఎక్కడైనా అర్హుల పేర్లు లబ్ధిదారుల జాబితాలో లేకపోతే మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది. ఇలా వచ్చిన దరఖాస్తులను పరిశీలించి.. 90 రోజుల్లోగా ఎంపిక ప్రక్రియను పూర్తి చేసి స్థలాలు కేటాయిస్తామని ప్రకటించింది. ఇళ్ల పట్టాల పంపిణీ కోసం రాష్ట్రవ్యాప్తంగా 66,518 ఎకరాల భూమిని సేకరించి లేఔట్లు వేసి మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నారు. చివరిలో దరఖాస్తు చేసుకుని అర్హులుగా ఎంపికైన 80 వేల మంది కోసం వచ్చే నెల 10లోగా స్థల సేకరణతోపాటు ప్లాట్ల గుర్తింపు ప్రక్రియ పూర్తి చేయాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. స్థలాల పంపిణీతోపాటు వచ్చే నెల 25న 15 లక్షల ఇళ్ల నిర్మాణానికి భూమి పూజ కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. వీలైనంత ఎక్కువ మందికి ఇచ్చేందుకు ఏర్పాట్లు కోర్టు వివాదాలు ఉన్న స్థలాలను పక్కన పెట్టి.. ప్రత్యామ్నాయ స్థలాలు చూసి వీలైనంత ఎక్కువమందికి ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు అధికారులు చూస్తున్నారు. చిత్తూరు జిల్లాలో మొత్తం 1,42,976 మంది అర్హులను ఎంపిక చేయగా 4,316 మందికి ఎంపిక చేసిన లేఔట్ల విషయంలో కోర్టు స్టేలు ఉన్నాయి. దీంతో 4,316 మందికి ప్రత్యామ్నాయ స్థలాలు చూసి మొత్తం 1,42,976 మందికి లబ్ధి చేకూర్చే దిశగా ఏర్పాట్లు చేస్తున్నామని అధికారులు తెలిపారు. గుంటూరు జిల్లాలో ప్రస్తుతం 2,88,384 మందికి స్థలాలు ఇచ్చేందుకు ఎలాంటి వివాదం లేదు. కోర్టు కేసుల వల్ల పెండింగ్లో ఉన్నవారిలో మరో నాలుగైదువేల మందికి ప్రత్యామ్నాయ స్థలాలు చూసి ఇచ్చే ప్రయత్నాల్లో ఉన్నారు. విజయనగరం జిల్లాలో 71,237 మందిని ఎంపిక చేయగా కోర్టు స్టేల వల్ల 1,711 మందికి ఇవ్వలేని పరిస్థితి ఏర్పడింది. వీరిలో కొందరికి ప్రత్యామ్నాయ స్థలాలు చూడాలని అధికారులు ప్రయత్నిస్తున్నారు. కోర్టు స్టేల వల్ల ఈ నెల 25న పంపిణీ చేయని వారికి స్టేలు వెకేట్ చేయించి లేదా ప్రత్యామ్నాయ స్థలాలు చూసి తర్వాత పంపిణీ చేయనున్నారు. పారదర్శకంగా అర్హుల ఎంపిక ప్రతి ఒక్కరికీ ఇల్లు ఉండాలన్న సీఎం వైఎస్ జగన్ ఆశయానికి అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నాం. జిల్లాలో ఎక్కడా కోర్టు స్టేలు లేవు. అత్యంత పారదర్శకంగా 1,10,634 మంది అర్హులను ఎంపిక చేశాం. డిసెంబర్ 25న వీరందరికీ పట్టాలను అందజేస్తాం. – సి.హరికిరణ్, కలెక్టర్, వైఎస్సార్ జిల్లా దేశంలోనే ఎక్కడా లేదు దేశ చరిత్రలోనే ఎక్కడా ఒకేసారి ఇంతమందికి నివాస స్థల పట్టాలిచ్చిన దాఖలాలు లేవు. ముఖ్యమంత్రి దీన్ని యజ్ఞంలా భావించడం వల్లే పేదల కల సాకారమవుతోంది. కోర్టు స్టేలు ఉన్నవి మినహాయించి జిల్లాలో సుమారు 1.15 లక్షల మందికి టిడ్కో ఇళ్లు, పొజిషన్ సర్టిఫికెట్లు, నివాస స్థలాలకు డి.ఫారం పట్టాలు ఇవ్వనున్నాం. – వేణుగోపాల్రెడ్డి, జాయింట్ కలెక్టర్, విశాఖపట్నం -
గీతం వర్సిటీలో ఆక్రమణల తొలగింపు
సాక్షి, విశాఖ : గీతం యూనివర్సిటీలో ఆక్రమణలను రెవెన్యూ శాఖ అధికారులు తొలగించారు. విశాఖ నగర శివారు రుషికొండ సమీపాన పెద్ద ఎత్తున ప్రభుత్వ భూమిని ఆధీనంలో ఉంచుకున్న గీతం యూనివర్సిటీ నుంచి అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దాదాపు 40 ఎకరాలు గీతం యూనివర్సిటీ ప్రభుత్వ భూమిని అనుభవిస్తున్నట్లు రెవెన్యూ అధికారుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. దీంతో ఆర్డీవో కిషోర్ పర్యవేక్షణలో రెవిన్యూ సిబ్బంది ఉదయం 6 గంటల నుంచి ప్రభుత్వ భూమిని గుర్తించి వాటిని స్వాధీనం చేసుకునే ప్రక్రియ కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో వర్సిటీకి వెళ్లే మార్గాన్ని పోలీసులు మూసివేశారు. (చదవండి: గీతం ఆక్రమణలకు చెక్) అక్రమాల ‘గీతం’పై ప్రభుత్వం ఆరా.. గీతం విశ్వవిద్యాలయ యాజమాన్యం గుప్పిట్లో 40.51 ఎకరాల ప్రభుత్వ భూములున్నాయని జిల్లా రెవిన్యూ అధికారులు ఇచ్చిన నివేదికపై ప్రభుత్వం దృష్టి సారించింది. గత ప్రభుత్వ హయాంలో అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఎండాడ, రుషికొండ పరిసరాల్లోని భూముల్ని ఆక్రమించేసుకుని సంస్థ పరిధిలో కలిపేసుకున్నట్లు రెవిన్యూ అధికారులు గుర్తించారు. దీనిపై సమగ్ర దర్యాప్తు చేపట్టి సవివర నివేదికని ప్రభుత్వానికి మరోసారి అందించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. గీతం పరిధిలో కోర్టు కేసుల్లో ఉన్న భూములు ఏఏ గ్రామాల పరిధిలో ఉన్నాయి.? ఆక్రమణలు ఎంత మేర జరిగాయన్నదానిపై నివేదిక అందించనున్నారు. దీనికి తోడు.. అడ్డగోలుగా.. అప్పటి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి.. విద్యా సంస్థల మధ్యలో అండర్ పాసేజ్ రహదారి నిర్మాణంపైనా అధికారులు ప్రభుత్వానికి నివేదిక అందించారు. రుషికొండ, ఎండాడ గ్రామాల్లో ఉన్న గీతం ఇంజినీరింగ్ కాలేజ్కి మెడికల్ కళాశాలకు అనుసంధానం చేస్తూ సొరంగ మార్గాన్ని నిర్మించేశారు. గత ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి.. ఎలాంటి పూర్తి స్థాయి అనుమతులూ తీసుకోకుండా.. జీవో పేరుతో అండర్ పాసేజ్ నిర్మాణం పూర్తి చేసేశారు. ఈ వ్యవహారంపైనా ప్రభుత్వం దృష్టి సారించింది. -
దొనకొండలో సోలార్ 'వెలుగులు'
దొనకొండ: రైతులకు ఉచిత విద్యుత్ అందించేందుకు ప్రకాశం జిల్లా దొనకొండలో 1,000 మెగా వాట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. రెవెన్యూ సిబ్బంది సుమారు 5,000 ఎకరాల భూమిని సర్వేచేసి నివేదిక తయారుచేశారు. మండలంలోని రుద్రసముద్రం, భూమనపల్లి, మంగినపూడి ప్రాంతాల్లోని పలు సర్వే నంబర్లకు సంబంధించిన భూమిని గుర్తించారు. రూ.4,000 కోట్లతో ఈ ప్రాజెక్టు ఏడాదిలోనే పూర్తి చేసి మరో ఏడాది నాటికి విద్యుదుత్పత్తి చేయనున్నట్టు సమాచారం. ఈ ప్రాజెక్టు పూర్తయితే 10,000 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగాలు లభిస్తాయి. నేరుగా రైతుల అకౌంట్లలోకి నగదు సోలార్ ప్రాజెక్టుకు అవసరమైన 5,000 ఎకరాల ప్రభుత్వ భూమి మొత్తం ఒకే చోట లేనందున ప్రభుత్వం రైతుల నుంచి 2,000 ఎకరాల దాకా లీజుకు తీసుకోవాల్సి ఉంది. అలా 30 ఏళ్ల పాటు లీజుకు తీసుకుని ఎకరాకు రూ.25,000 చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేస్తుంది. అలాగే రెండేళ్లకోసారి ఐదు శాతం అధికంగా చెల్లిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. గతంలో కలెక్టర్ పోల భాస్కర్తో కలసి నెట్ క్యాప్ బృందం ఈ భూములను పరిశీలించింది. నివేదిక తయారు చేశాం.. సర్వేయర్లు, వీఆర్వోలు రుద్రసముద్రం, భూమనపల్లి, మంగినపూడి గ్రామాల్లోని పొలాలను సర్వే చేసి ప్రభుత్వ, అసైన్మెంట్, పట్టా భూములను గుర్తించారు. నివేదిక పూర్తి చేశాం. ప్రభుత్వం అడిగిన వెంటనే అందజేసేందుకు రెవెన్యూ శాఖ సిద్ధంగా ఉంది. – తహసీల్దార్ కాలే వెంకటేశ్వరరావు -
‘నకిలీ చెక్కుల’పై ఏసీబీ విచారణ
సాక్షి, అమరావతి/ తాడికొండ: ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్)ని కొల్లగొట్టాలనే పెద్ద కుట్రతో నకిలీ చెక్కులు జారీచేసిన ముఠాతోపాటు దాని వెనుక ఉన్న అదృశ్య శక్తుల నిగ్గుతేల్చాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయించారు. ఈ బాగోతాన్ని ఆయన తీవ్రంగా పరిగణించి ముఠా గుట్టురట్టు చేయాలని అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ)ని ఆదేశించారు. ఫోర్జరీ సంతకాలు, స్టాంపులతో నకిలీ చెక్కులు జారీచేసిన ముఠా పాత్రధారులతోపాటు దీని వెనుక సూత్రధారులను కూడా పట్టుకోవాలన్నారు. (బెడిసికొట్టిన బడా మోసం) దీంతో ఈ వ్యవహారంపై లోతైన విచారణ జరిపి దోషులను పట్టుకోవాలంటూ రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి వి. ఉషారాణి ఏసీబీ డైరెక్టర్ జనరల్ పీఎస్ఆర్ ఆంజనేయులుకు ఆదివారం లేఖ రాశారు. మరోవైపు.. వెలగపూడి తాత్కాలిక సచివాలయంలోని భారతీయ స్టేట్ బ్యాంకు (ఎస్బీఐ)లోని సీఎంఆర్ఎఫ్ అకౌంట్ హ్యాక్ అయినట్లు అనుమానం ఉన్నందున దీని నుంచి చెల్లింపులను తాత్కాలికంగా నిలిపివేయాలని కూడా ఆమె బ్యాంకు మేనేజరుకు లేఖ రాశారు. అలాగే, బ్యాంకు అధికారుల అప్రమత్తతవల్ల నిధులు విడుదల కాలేదని.. కుట్ర చాలా పెద్దదైనందున విచారణ లోతుగా జరిపి దోషులను తేల్చాలని సీఎం ఆదేశించినట్లు అధికారులు పేర్కొన్నారు. మూడు రాష్ట్రాలల్లో వేర్వేరు పేర్లతో.. ఏపీకి చెందిన సీఎంఆర్ఎఫ్ నిధులను కొల్లగొట్టేందుకు ఒకేసారి న్యూఢిల్లీ, కోల్కత, కర్ణాటక నుంచి వేర్వేరు కంపెనీల పేరుతో నకిలీ చెక్కులు జారీ చేయడం వెనుక పెద్ద ముఠా ఉండి ఉంటుందని అధికారులు అనుమానిస్తున్నారు. వీటిని ఈ ముఠానే ముద్రించిందా? లేక ఇందుకు బ్యాంకు, సీఎంఆర్ఎఫ్ విభాగాల్లోని వారు ఎవరైనా సహకరించారా? అనేది కూడా తేల్చనున్నారు. అద్వైతా వీకే హాలో బ్లాక్స్ అండ్ ఇంటర్లాక్స్, మల్లాబ్పూర్ పీపుల్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ, శర్మ ఫోర్జింగ్ పేర్లతో ఈ నకిలీ చెక్కులు జారీ అయ్యాయి. పక్కా స్కెచ్తోనే.. సీఎంఆర్ఎఫ్ నిధులను కొట్టేయాలనే భారీ కుట్రతో ఆ ముఠా పక్కా స్కెచ్తోనే యత్నించిందని ఉన్నతాధికారులు అంటున్నారు. వేర్వేరు రాష్ట్రాల్లో వేర్వేరు కంపెనీల పేరుతో కోట్ల రూపాయలు కొల్లగొట్టేందుకు చెక్కులు ఇచ్చారంటే ఆ కంపెనీలు బోర్డుకే పరిమితమైనవి ఉంటాయని అధికారులు భావిస్తున్నారు. దర్యాప్తులో భాగంగా ఏసీబీ బృందాలు మూడుచోట్లకు వెళ్లి విచారణ చేయనున్నాయి. తుళ్లూరులో కేసు నమోదు కాగా, సీఎంఆర్ఎఫ్ చెక్కుల పేరిట భారీగా నగదు విత్డ్రా చేసేందుకు గుర్తుతెలియని వ్యక్తులు పన్నిన పన్నాగంపై ఆదివారం గుంటూరు జిల్లా తుళ్ళూరు పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. సచివాలయం రెవెన్యూ విభాగం అసిస్టెంట్ సెక్రటరీ పి.మురళీకృష్ణ ఫిర్యాదు మేరకు తుళ్ళూరు–1 సీఐ ధర్మేంద్రబాబు కేసు నమోదు చేశారు. కాగా, ప్రభుత్వ రికార్డుల ప్రకారం రూ.16 వేలు, రూ.45 వేలు, రూ.45 వేలు చొప్పున ముగ్గురు వ్యక్తులకు జారీచేసిన చెక్కుల స్థానంలో రూ.117.15 కోట్లు విత్డ్రా చేసుకునేందుకు కొందరు వ్యక్తులు నకిలీ చెక్కులు సృష్టించి ఈ ఘరానా మోసానికి యత్నించారు. -
మరో 'కోటి'గారు దొరికారు!
సాక్షి, మెదక్: రెవెన్యూ విభాగంలో వేళ్లూనుకున్న అవినీతిని కూకటివేళ్లతో పెకిలించాలనే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఇందులో భాగంగా బుధవారం వీఆర్వో వ్యవస్థను రద్దు చేయడంతోపాటు నూతన రెవెన్యూ చట్టానికి సంబంధించిన బిల్లును అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టింది. అయితే ఇదే రోజు మెదక్ జిల్లా అడిషనల్ కలెక్టర్ (ఏసీ) నగేశ్ ఇంట్లో అవినీతి నిరోధక శాఖ అధికారులు సోదాలు నిర్వహించడం.. లంచావతారమెత్తిన సదరు అధికారి భారీ డీల్ వెలుగులోకి రావడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ అవినీతి బాగోతంలో ఏసీతోపాటు నర్సాపూర్ ఆర్డీవో అరుణారెడ్డి, తహసీల్దార్ సత్తార్, సర్వేల్యాండ్ జూనియర్ అసిస్టెంట్ వాసిం అహ్మద్ను రాత్రి అరెస్ట్ చేశారు. ఏసీబీ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ రమణకుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. అవినీతి బాగోతం ఇలా.. మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం చిప్పల్తుర్తి గ్రామంలో 112.21 ఎకరాల వ్యవసాయ భూమికి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్(ఎన్వోసీ) కో సం రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లికి చెందిన లింగమూర్తి ఇటీవల అడిషనల్ కలెక్టర్ (ఏసీ) నగేశ్ను ఆశ్రయించాడు. ఎకరాకు రూ.లక్ష చొప్పున మొత్తం రూ.1.12 కోట్లు ఇవ్వాలని ఏసీ డిమాండ్ చేశారు. ఈ మేరకు వివిధ దశల్లో ఇప్పటివరకు రూ.40 లక్షలు ముట్టినవి. మిగిలిన రూ.72 లక్షలకు బదులుగా ఐదెకరాల భూమి ఇచ్చేందుకు అంగీకరించినా పని ముందుకు కదలకపోవడంతో సదరు బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. 12 బృందాలు.. 12 చోట్ల దాడులు బాధితుడి ఫిర్యాదు మేరకు పూర్తి స్థాయిలో ఆరా తీసిన అవినీతి నిరోధక శాఖ అధికారులు బుధవారం రంగంలోకి దిగారు. 12 బృందాలుగా విడిపోయి ఏకకాలంలో 12 చో ట్ల సోదాలు నిర్వహించారు. ఏసీ నివాసముం టున్న మెదక్ జిల్లా మాచవరంతోపాటు కొం పల్లిలోని ఆయన స్వగృహంలో, భూబాగోతానికి సంబంధించి నర్సాపూర్ ఆర్డీవో కార్యాల యం, క్యాంప్ ఆఫీస్లో.. ఘట్కేసర్లోని ఆర్డీవో అరుణ నివాసంలో, సంగారెడ్డిలోని చిలప్చెడ్ తహసీల్దార్ సత్తార్ నివాసంలో తనిఖీలు చేపట్టారు. మాచవరంలోని ఏసీ ఇంట్లో ఉదయం 7 గంటలకు తనిఖీలు ప్రారంభం కాగా.. రాత్రి 10 తర్వాత కూడా కొనసాగుతున్నాయి. ఏసీ ఇంట్లో 8 చెక్కులు.. ఆర్డీవో నివాసంలో రూ.28 లక్షలు మాచవరంలోని అదనపు కలెక్టర్ ఇంట్లో సోదాల సందర్భంగా లింగమూర్తి సైన్ చేసిన ఎనిమిది చెక్కులు, పలు కీలక డాక్యుమెంట్లు లభించాయి. మరోవైపు అడిషనల్ కలెక్టర్ భార్య మమతను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ బోయిన్పల్లిలో ఉన్న బ్యాంక్ లాకర్ను తెరిచేందుకు ఆమెను తీసుకెళ్లారు. మరోవైపు ఘట్కేసర్ మండలంలోని చౌదరిగూడ వెంకటసాయినగర్ ఫేజ్ 1లోని నర్సాపూర్ ఆర్డీవో అరుణారెడ్డి ఇంట్లో నిర్వహించిన సోదాల్లో లెక్కలోకి రాని రూ.28 లక్షలు, అరకిలో బంగారు ఆభరణాలు పట్టుబడ్డాయి. వీటిని ఏసీబీ అధికారులు సీజ్ చేశారు. నర్సాపూర్ ఆర్డీవో ఆఫీసుతోపాటు ఆర్డీవో క్యాంపు కార్యాల యంలో ఏసీబీ అధికారులు బుధవారం ఉద యం నుంచి తనిఖీలు చేపట్టారు. తహసీల్దార్ కార్యాలయం నుంచి చిప్పల్తుర్తికి చెందిన భూముల రికార్డులను అక్కడికి తెప్పించడంతో పాటు తహసీల్దార్ మాలతిని అక్కడికి పిలిపించి విచారణ చేపట్టారు. అనంతరం అక్కడి నుంచి ఏసీబీ అధికారులు ఆర్డీఓ అరుణారెడ్డిని తమ వెంట తీసుకుని ఆర్డీఓ ఆఫీసుకు వెళ్లి పలురికార్డులను తనిఖీ చేశారు. ఆయాసం.. వైద్యుల రాక మాచవరంలోని ఇంట్లో సోదాలు జరుపుతున్న క్రమంలో ఏసీ నగేశ్ ఆయాసంతో ఇబ్బంది పడ్డారు. ఏసీబీ అధికారుల సూచన మేరకు సాయంత్రం 6 గంటల సమయంలో ప్రైవేట్ వైద్యులు వచ్చి పరీక్షించారు. దీనిపై ఏసీబీ డీఎస్పీ సూర్యనారాయణను ప్రశ్నించగా ప్రస్తు తం ఆయన బాగానే ఉన్నారని చెప్పారు. సో దాలు కొనసాగుతుండగానే అదనపు కలెక్టర్ నగేశ్తోపాటు నర్సాపూర్ ఆర్డీవో అరుణారె డ్డి, చిలప్చెడ్ ఎమ్మార్వో సత్తార్, సర్వేల్యాండ్ రికార్డ్స్ జూనియర్ అసిస్టెంట్ వాసిం అహ్మద్, ఏసీకి బినామీగా వ్యవహరించిన జీవన్గౌడ్పై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు. మా చవరంలో అదనపు కలెక్టర్ను, హైదరాబాద్ లో ఆర్డీవో, ఏసీ బినామీ, సంగారెడ్డిలో ఎమ్మార్వోతోపాటు సర్వేల్యాండ్ రికార్డ్స్ జూనియర్ అసిస్టెంట్ను అరెస్ట్ చేశారు. ఏసీబీ ప్రత్యేక జడ్జి ఎదుట వారిని హాజరుపరచనున్నారు. ఫిర్యాదు.. ఆ తర్వాత ఇలా.. ► ఈ ఏడాది ఫిబ్రవరి 29న శేరిలింగంపల్లికి చెందిన లింగమూర్తి మరో నలుగురు మెదక్ జిల్లా నర్సాపూర్ మండలంలోని చిప్పల్తుర్తి గ్రామంలో ఉన్న సర్వే నంబర్ 59/31, 59/40, 58/1, 58/2లో ఉన్న 112.21 ఎకరాల భూమి ని కొనేందుకు ఒప్పందం చేసుకున్నారు. ► జూలై 21న సదరు భూమికి సంబంధించి ఎన్వోసీ కోసం నర్సాపూర్ తహసీల్దార్ సత్తార్కు దరఖాస్తు చేసుకున్నాడు. అదే నెల 23న సదరు అధికారి ఆర్డీవో అరుణారెడ్డికి పంపించాడు. ఆ తర్వాత అదే నెల 25న సదరు అధికారిణి ఈ దరఖాస్తును కలెక్టర్కు ఫార్వర్డ్ చేశారు. ► ఇక ఆ తర్వాత అడిషనల్ కలెక్టర్ నగేశ్ రంగంలోకి దిగాడు. ఎకరాకు రూ.లక్ష చొప్పున 112 ఎకరాలకు రూ.1.12 కో ట్లు ఇవ్వాలని లింగమూర్తితో జూలై 31న ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఒప్పం దం మేరకు అదేరోజు ఏసీకి తొలి విడతలో రూ.19.05 లక్షలు అందజేశాడు. అనంతరం ఆగస్టు 7న మరో రూ.20.05 లక్షలు ఇచ్చాడు. రెండు విడతల్లో అదన పు కలెక్టర్కు రూ.40 లక్షలు ముట్టాయి. ► అయితే మిగిలిన రూ.72 లక్షలు ఇవ్వడంలో జాప్యం జరగడంతో అడిషనల్ కలెక్టర్ తనకు నమ్మకం లేదంటూ లింగమూర్తి కొనుగోలు చేసిన భూమిలో ఐదు ఎకరాలు తనకు సంబంధించిన బినామీకి అమ్మినట్లు ఆగస్టు 21న అగ్రిమెంట్ చేసుకున్నాడు. సికింద్రాబాద్కు చెందిన కోల జీవన్గౌడ్ (ఏసీ బినామీ)కు అమ్మినట్లు ఒప్పంద పత్రం రాయించాడు. దీంతోపాటు లింగమూర్తి సంతకం చేసిన 8 బ్లాంక్ చెక్లను ష్యూరిటీ కింద తీసుకున్నాడు. ► జూలై 31న అదనపు కలెక్టర్ ఆదేశాల మేరకు లింగమూర్తి నుంచి సర్వేల్యాండ్ రికార్డ్స్ జూనియర్ అసిస్టెంట్ వాసిం అహ్మద్ రూ.5 లక్షలు తీసుకొన్నారు. అదేవిధంగా ఆర్డీవో అరుణారెడ్డి, చిలప్చెడ్ తహసీల్దార్ సత్తార్కు లక్ష చొప్పున ముట్టాయి. కొత్త చట్టంతో బేరం బెడిసికొట్టింది.. 112 ఎకరాల వ్యవసాయ పొలం.. ఎన్వోసీ ఎకరానికి లక్ష చొప్పున మొత్తం రూ.1.12 కోట్ల బేరం కుదిరింది. అడిషనల్ కలెక్టర్ నగేశ్ నుంచి వీఆర్ఏ దాకా అంతా అనుకూలంగా పనిచేసేందుకు రూ.40 లక్షల నగదు, మరో రూ.72 లక్షల విలువ చేసే స్థలం అడిషనల్ కలెక్టర్కు అదనపు బహుమతి.. అంతా బానే ఉంది. వాస్తవానికి ఈ డీల్ దాదాపు గా పూర్తికావొచ్చింది. కానీ, ఆఖరు నిమి షంలో ఏదో తేడా వచ్చింది. అధికారులపై ఫిర్యాదుదారుడికి ఎందుకు అనుమానమొచ్చింది? అందరి మదిలోనూ ఇదే ప్రశ్న. విశ్వసనీయవర్గాల సమాచారం ప్రకారం.. ఈ మొత్తం డీల్ రద్దవడానికి, రద్దయిన డీల్ వ్యవహారం అవినీతి నిరోధకశాఖ దాకా వెళ్లడానికి అసలైన కారణం కొత్త చట్టమే అని సమాచారం. కొత్తచట్టంలో అధికారాలకు కోత పెడుతున్నారన్న ప్రచారమే రెవె న్యూ అధికారులను ఏసీబీకి పట్టించిందని సమాచారం. బాధితుడు తన పనికోసం అధికారులపై ఒత్తిడి తీసుకువస్తున్నా.. వా రు పని నెమ్మదిగా చేయసాగారు. ఈలోపు అసెంబ్లీ సమావేశాలు ఖరారు కావడం, తొ లిరోజే కేబినెట్ సమావేశంలో రెవెన్యూ చట్టానికి ఆమోదం తెలపడంతో బాధితుల్లో అధికారుల తీరుపై అనుమానాలు చెలరేగా యి. అధికారులు ఈ పని చేసినా.. చెల్లుబా టు అవుతుందా? అన్న అనుమానాలు రో జురోజుకూ పెరిగిపోయాయి. కానీ, ఈ వ్య వహారంతో సంబం«ధమున్న అధికారులు మాత్రం పనిపై ధీమాగానే ఉన్నారు. అయి తే, మంగళవారం వీఆర్వో వ్యవస్థ రద్దు కా వడం, భూరికార్డులు స్వాధీనం చేసుకోవడంతో బాధితులకు ఈ పని కాద ని తేలిపోయింది. అందుకే, తాను అధికారులతో మాట్లాడిన ఆడియోటేపులు, చెక్కులు, డాక్యుమెంట్లు తీసుకుని నేరుగా ఏసీబీ అధికారులను సంప్రదించాడని సమాచారం. -
చరిత్రాత్మకం
సాక్షి, హైదరాబాద్: ‘ఈ రోజు చరిత్రాత్మకమైనది. ప్రజలు అనుభవిస్తున్న బాధలకు చరమగీతం పాడే రోజు. రైతులకు సరళీకృతమైనటువంటి చట్టం కోసం కొత్త బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టాం. తెలంగాణ వచ్చినప్పుడు ఎంత సంతోషంగా ఉన్నానో.. ఇప్పుడు అంతే సంతోషంగా ఉన్నా. ప్రతీ కుటుంబానికి వర్తించే బిల్లు ఇది’అని సీఎం కె.చంద్రశేఖర్రావు అన్నారు. శాసనసభలో బుధవారం రెవెన్యూ చట్ట సవరణ బిల్లును ప్రవేశపెట్టిన అనంతరం ఆయన బిల్లులోని ముఖ్యాంశాలను వివరించారు. ప్రపంచంలో ఇంతటి అత్యుత్తమైన బిల్లు మరోటి లేదన్నారు. ‘కొత్త చట్టంతో ఏళ్లుగా ప్రజలు ఎదుర్కొంటున్న భూతగాదాల పీడ విరగడవుతుంది. అధికారుల దయాదక్షిణ్యాల మీద ప్రజలు ఆధారపడాల్సిన పని ఉండదు. వారసత్వ భూ మార్పిడి సమస్యలు కూడా తీరిపోతాయి. కుటుంబ సభ్యులు తమ సమాచారాన్ని రాసి ఇస్తే ధరణి పోర్టల్ ద్వారా పరిష్కారమవుతాయి. ఇకనైనా అవినీతి అంతం కావాలి’అని అన్నారు. అంతులేని అవినీతికి ఈ బిల్లు అడ్డుకట్ట వేస్తుందన్నారు. ‘భూములన్నింటినీ డిజిటలైజ్డ్ సర్వే చేస్తాం. డిజిటల్ మ్యాప్ ఆఫ్ తెలంగాణ తయారవుతుంది. అది కూడా ప్రజలకు ఐటీ నెట్వర్క్ ద్వారా అందుబాటులో ఉంటుంది. ఈ సందర్భంగా ఆయన ఇంకేం అన్నారంటే... వారి ఉద్యోగాలకు ఢోకా లేదు... ‘వీఆర్వో, వీఆర్ఏల ఉద్యోగాల భద్రతకు ఎటువంటి డోకా లేదు. అవసరాల మేరకు వేర్వేరు శాఖల్లో సర్దుబాటు చేస్తాం. భూసంస్కరణలను క్రమబద్ధీకరించడానికి గతంలో అనేక ప్రయత్నాలు జరిగాయి. సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందినా పాలకులు పూర్తిస్థాయిలో మార్పును తీసుకురాలేకపోయారు. అంతులేని అవినీతి కారణంగా ప్రజలకు, రెవెన్యూ శాఖకు మధ్య విద్వేషపూరిత వాతావరణం ఏర్పడింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మూడేళ్లుగా దీన్ని చక్కదిద్దడానికి కసరత్తు చేస్తున్నాం. భూరికార్డుల ప్రక్షాళన మొదలుపెట్టాం. మధ్యలో ఎన్నికలు రావడంతో ప్రక్రియ ఆగింది. కరోనా మహమ్మారి రాకతో ఆరేడు మాసాలుగా ఈ కార్యక్రమం నిలిచిపోయింది. రెవెన్యూ బాధ్యతలను నేనే స్వీకరించా. సెక్రటరీని కూడా నియమించలేదు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శే దీన్ని చూస్తున్నారు. మూణ్నాలుగు నెలలుగా మళ్లీ భూరికార్డుల ప్రక్షాళనపై దృష్టి పెట్టా. రెవెన్యూ ఉద్యోగులతోనూ నేరుగా మాట్లాడా. తమకు గౌరవం, ఉద్యోగ భద్రత కావాలని అడిగారు. వారి ఉద్యోగ భద్రతకు డోకా ఉండదు. ప్రజలకు దీంతో మేలు జరుగుతుంది. రాష్ట్రంలో వీఆర్ఏలు 22,900 మంది ఉన్నారు. వీరిలో దళితులు, బీసీలే ఎక్కువ. ఇప్పుడు వీరికి స్కేల్ ఇచ్చి గుర్తిస్తాం. కొందరిని రెవెన్యూలో, మరికొందరిని ఇరిగేషన్, మున్సిపల్ తదితర శాఖల్లో సర్దుబాటు చేస్తాం. ఈ ప్రక్రియ మూణ్నాలుగు నెలల్లో పూర్తవుతుంది. వీరికి స్కేల్ పోస్టులు కల్పించడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వంపై ఏడాదికి రూ. 260 కోట్ల వరకూ అదనపు భారం పడుతుంది. వారి అధికారాలకు కత్తెర... ‘సత్వర పరిష్కారానికి ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేస్తాం. రాష్ట్రంలో ఉన్న 5,480 మంది వీఆర్వోలను తీసేయం. ఆ వ్యవస్థను రద్దు చేస్తున్నాం. వీరికి ప్రత్యామ్నాయ సేవలు ఐటీ ద్వారానే జరుగుతాయి. తహసీల్దార్లు, ఆర్టీఓలు ఉంటారు. అయితే వారి అధికారాలు పోతాయి. రాజ్యాంగం ప్రకారం చట్టం నిర్దేశించినట్లుగా పనిచేయాలి. ప్రస్తుతం ఎలా ఉందంటే తహసీల్దార్, ఆర్డీఓ, జాయింట్ కలెక్టర్లే ఉత్తర్వులు జారీ చేస్తారు. మళ్లీ వీరే కోర్టులు నిర్వహిస్తారు. ఇది కొంచెం వికారంగా ఉంది. అందుకే కొత్త చట్టం అమల్లోకి వచ్చాక, ఈ మూడు రెవెన్యూ కోర్టులుండవు. సివిల్ కోర్టు, సెషన్ కోర్టు, హైకోర్టు, ఆపై సుప్రీంకోర్టు వంటి న్యాయ వ్యవస్థ ఉండగా మళ్లీ ఈ రెవెన్యూ కోర్టులెందుకు?. ఈ మూడు కోర్టుల్లో కలుపుకొని మొత్తం 16,137 కేసులున్నాయి. వీటి పరిష్కారానికి ప్రత్యేకంగా ఫాస్ట్ట్రాక్ ట్రిబ్యునల్స్ను ఏర్పాటుచేస్తాం. మూడునాలుగు నెలల్లో కేసులు పరిష్కరించేలా కృషిచేస్తాం. ఆ తర్వాత భూ తగాదా కేసులుండవు. ఒకటో అరో కేసులొచ్చినా వారు న్యాయస్థానాలను ఆశ్రయిస్తారు. తెలంగాణలో భూముల ధరలు పెరిగాయి. ఎక్కడికెళ్లినా ఎకరా రూ.10 లక్షలకు పైనే ఉంది. ప్రస్తుత భూ వివాదాలు తీవ్ర రూపం దాల్చకుండా ఉండాలంటే భూరికార్డుల క్రమబద్ధీకరణ జరగాల్సిందే. రెవెన్యూ చట్టంలో ఎలాంటి మార్పులు చేస్తారా? అని ప్రజలంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. నూతన విధాన అమలుకు ఎంత ఖర్చైనా వెనుకాడవద్దని చెప్పా. గతంలో నిజాం హయాంలో తర్వాత ఇప్పటి వరకూ భూరికార్డుల సర్వే చేయలేదు. అక్షాంశాలు, రేఖాంక్షాల ఆధారంగా.. ‘ఇప్పుడు తెలంగాణలో ఈ ప్రక్రియ ప్రారంభమైన తర్వాత ప్రతి భూమిని సర్వే చేయిస్తాం. ప్రతి ఇంచునూ కొలుస్తాం. అక్షాంశాలు, రేఖాంశాలతో భూమి హద్దుల(కోఆర్డీనేట్)ను నిర్ణయిస్తాం. ఇక బలహీనుల భూమిని బలవంతులు దౌర్జన్యంగా ఆక్రమించుకోలేరు. ఇటువంటి పోర్టల్ ప్రపంచంలో ఎక్కడా లేదు. హరియాణాలో ఉన్నా ఇంత లోతుగా లేదు. ఎలక్ట్రానిక్ ధరణి పోర్టల్ త్వరలో అందుబాటులోకి వస్తుంది. ఇందులో రెండు విభాగాలుంటాయి. ఒకటి వ్యవసాయ భూములు.. రెండోది వ్యవసాయేతర భూములు. రాష్ట్రంలో 1.12 లక్షల చదరపు కిలోమీటర్ల భూభాగముంది. ఈ పోర్టల్ పూర్తి పారదర్శకంగా ఉంటుంది. ఎవరైనా చూసుకోవచ్చు. డౌన్లోడ్, కాపీ కూడా చేసుకోవచ్చు. మల్టీపుల్ సర్వర్లలో, దేశంలో సురక్షితమైన ప్రాంతాల్లో వీటి రికార్డులు భద్రపరుస్తారు. ఒకవేళ ఏదైనా విపత్తు వచ్చినా ఇతర ప్రాంతాల్లో వీటి రికార్డులుంటాయి. కొన్ని బ్యాంకులు రుణాలివ్వడానికి రైతులను తిప్పించుకుంటున్నాయి. ఇకపై ఆ పరిస్థితి ఉండదు. భూమికి సంబంధించిన సమగ్ర సమాచారం (ఎన్కంబెన్స్) ధరణి పోర్టల్లో లభ్యమవుతుంది. గతంలో కొందరు న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ను కూడా రిజిస్ట్రేషన్ చేశారు. కొత్త టెక్నాలజీతో రాష్ట్రంలో ఇటువంటి వాటికి తావుండదు. ప్రసిద్ధ స్థలాల వివరాలను ముందే పొందుపర్చి ఉంచుతాం గనుక సాఫ్ట్వేర్ ఆటోమెటిక్గా తిరస్కరిస్తుంది. అన్ లాక్ చూపిస్తుంది. జాయింట్ రిజిస్ట్రార్లుగా తహసీల్దార్లు... తహసీల్దార్లను జాయింట్ రిజిస్ట్రార్లుగా చేస్తాం. వ్యవసాయ భూములను వీరు రిజిస్ట్రేషన్ చేస్తారు. నిర్ణీత సమయంలోనే రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తిచేయాలి. స్లాట్ను రైతులే బుక్ చేసుకోవచ్చు. ఆ సమయానికి వచ్చి పోతే సరిపోతుంది. వెంటనే సంబంధిత డాక్యుమెంట్లు కూడా అందజేస్తారు. వ్యవసాయేతర భూములను ఇప్పుడున్న సబ్ రిజిస్ట్రార్లు రిజిస్ట్రేషన్ చేస్తారు. మొత్తం రాష్ట్రంలో గ్రామ, పురపాలక, జీహెచ్ఎంసీ పరిధిలో కలుపుకొని 89.47 లక్షల ఆస్తులు ఆన్ లైన్లో ఉన్నాయి. ధరణి పోర్టల్లోకి ఇవన్నీ వస్తాయి. రిజిస్ట్రేషన్, ఎమ్మార్వో కార్యాలయాల్లో డాక్యుమెంట్లను ఎవరికి వారు సొంతంగా రాసుకోవచ్చు. దానికి సంబంధించిన నమూనా కాపీని ఆయా కార్యాలయాల్లో ప్రభుత్వమే అందుబాటులో ఉంచుతుంది. ఒకవేళ డాక్యుమెంట్ రాసుకోవడానికి వీలు పడని వారు నిర్దేశిత ఫీజు చెల్లించి రాయించుకోవచ్చు. అలా రాసే వారికి లైసెన్సు కూడా ప్రభుత్వమే ఇస్తుంది. కుల ధ్రువీకరణ పత్రాలను కూడా ఇక నుంచి గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీల్లోనే ఇస్తారు. ఆదాయ ధ్రువీకరణ పత్రాల జారీలోనూ ఆస్తుల ప్రాతిపదికన జారీచేస్తారు. ఆ డేటా బేస్ అంతా ప్రభుత్వం వద్ద ఉంటుంది’అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. దీనిపై సుదీర్ఘంగా శుక్రవారం చర్చ జరుగుతుందన్నారు. దీనికి ముందు ముఖ్యమంత్రి వీఆర్వో పోస్టుల రద్దు బిల్లును కూడా సభలో ప్రవేశపెట్టారు. అలాగే మంత్రి కేటీఆర్.. మున్సిపల్ లా సవరణ బిల్లును ప్రవేశపెట్టారు. మరో మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు.. పంచాయతీరాజ్ సవరణ బిల్లును ప్రవేశపెట్టారు. -
ఏసీబీ వలలో మెదక్ జిల్లా అడిషనల్ కలెక్టర్
-
ఏసీబీ వలలో మెదక్ జిల్లా అడిషనల్ కలెక్టర్
సాక్షి, హైదరాబాద్ : కీసర మాజీ తాహసీల్దార్ నాగరాజు ఉదంతం మరవకముందే ఓ భూ వివాదంలో పెద్ద మొత్తంలో లంచం తీసుకుంటూ మెదక్ అడిషనల్ కలెక్టర్ గడ్డం నగేష్ అవినీతి నిరోధక శాఖ అధికారులకు అడ్డంగా దొరికిపోయారు. రూ.40 లక్షలు లంచం తీసుకుంటూ ఆడియో టేపులతో సహా ఏసీబీకి పట్టుబడ్డారు. దీంతో అడిషనల్ కలెక్టర్ నగేష్ వ్యవహారంపై ఇప్పుడు తెలంగాణలో సంచలనంగా మారింది. మెదక్ జిల్లా నర్సపూర్ మండలం చిప్పల్తుర్తి గ్రామంలో 112 ఎకరాల భూమికి ఎన్వోసీ ఇచ్చేందుకు రూ. కోటి 12 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నారు. అందులో భాగంగా రూ.40 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్హ్యాండెడ్గా చిక్కారు. దీంతో బుధవారం ఉదయం మాచవరంలోని నగేష్ ఇంట్లో సోదాలు నిర్వహించారు. అలాగే ఆయన బంధువులకు సంబంధించిన ఇళ్లపై ఏకకాలంలో 12 చోట్ల సోదాలు నిర్వహిస్తున్నారు. (మొన్న నాగరాజు.. నేడు వెంకటేశ్వర్రెడ్డి) అడిషనల్ కలెక్టర్ నగేష్.. ఒక ఎకరానికి లక్ష రూపాయల చొప్పున ఒప్పందం కుదుర్చుకున్నట్టు ఏసీబీ డీఎస్పీ సూర్యనారాయణ తెలిపారు. 15 రోజులుగా తిరుగుతున్నా పని కాకపోవడంతో హైదరాబాద్కు చెందిన మూర్తి ఏసీబీని ఆశ్రయించాడు. దీంతో రంగంలోకి దిగిన ఏసీబీ లంచం తీసుకుంటుండగా నగేష్ను రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. మెదక్ మాచవరంలో లక్ష రూపాయల నగదుతో పాటు హైదరాబాద్ బోయినపల్లిలో లాకర్ ను గుర్తించారు. బ్లాంక్ చెక్కులు, అగ్రిమెంట్ పేపర్లు, విలువైన డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ రోజు మొత్తం ఈ సోదాలు కొనసాగే అవకాశం ఉంది.ఏసీబీ తనిఖీల్లో ఇంకా ఎన్ని ఆస్తులు బయటపడతాయనేది ఆసక్తిగా మారింది. (రూ.కోటి 10 లక్షలు ఎవరివని ఏసీబీ ఆరా) అయితే, నర్సాపూర్ మండలం చిప్పలకుర్తిలో 113 ఎకరాల ల్యాండ్ ఎన్వోసీ కోసం.. ఏకంగా అడిషనల్ కలెక్టర్ నగేష్ రూ.కోటి 40 లక్షలు లంచం డిమాండ్ చేశారు. ఆ తర్వాత ఎకరాకు లక్ష చొప్పున రూ.కోటి 12 లక్షలకు డీల్ కుదిరింది. రూ.40 లక్షల నగదుతో పాటు తన పేరిట రూ.72 లక్షల విలువైన భూములు రిజిస్ట్రేషన్కు ఒప్పందం కుదిరింది. ఇక, ఏసీబీ తనిఖీల్లో నగేష్ ఇంట్లో బ్లాంక్ చెక్కులు, అగ్రిమెంట్ పేపర్లు స్వాధీనం చేసుకున్నారు. జాయింట్ కలెక్టర్ గడ్డం నగేష్, ఆర్డీవో బండారు అరుణా రెడ్డి, ఎమ్మార్వో సత్తార్, విఆర్వో, విఆర్ఏ,జూనియర్ అసిస్టెంట్ల నివాసాలు, కార్యాలయాలపై ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే నగేష్ భార్యను విచారణ నిమిత్తం బోయిన్పల్లికి తరలించారు.ఇతర రెవిన్యూ సిబ్బంది నివాసాలపై సోదాలు జరుపుతున్నారు. చౌదరిగూడా ఆర్డీవో నివాసం, కొంపల్లి జేసీ నివాసంలో సోదాలు కొనసాగుతున్నాయి. పెద్ద ఎత్తున నగలు, నగదు స్వాదీనం చేసుకున్నారు. (పాసు పుస్తకాలకెళ్తే.. ఆర్ఐకి రూ. 35 లక్షల అప్పు) -
ఉద్యోగులకు ఎలాంటి ఢోకా లేదు
-
దేవుడి మాన్యాల ఆక్రమణలపై డ్రోన్లతో సర్వే
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో దేవుడి మాన్యాల ఆక్రమణలను గుర్తించేందుకు డ్రోన్ల ద్వారా ప్రత్యేక సర్వే నిర్వహించాలని దేవదాయ శాఖ నిర్ణయించింది. దేవదాయ శాఖ పరిధిలోని దాదాపు 22 వేల ఆలయాలు, సత్రాలు, మఠాల పేరిట 4,09,229.99 ఎకరాల భూమి ఉండగా 67,525.06 ఎకరాలు ఏళ్ల తరబడి ఆక్రమణదారుల చెరలోనే ఉన్నాయి. 3,613.62 ఎకరాలను లీజుకు తీసుకున్న కౌలుదారులు నిర్ణీత గడువు ముగిసినా ఖాళీ చేయడం లేదు. ► ఆక్రమణలకు గురైన భూముల్లో డ్రోన్లతో సర్వే నిర్వహించి ఆలయాలవారీగా రికార్డులను సిద్ధం చేసేందుకు దేవదాయ శాఖ కమిషనర్ కార్యాలయం సన్నద్ధమైంది. ► రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేస్తున్న డ్రోన్ కార్పొరేషన్ – దేవదాయ శాఖ అధికారుల మధ్య ఇప్పటికే ప్రాథమిక చర్చలు జరిగాయి. డ్రోన్లతో చిత్రీకరించిన ఫోటోలు, వీడియోల ఆధారంగా తదుపరి దశలో చర్యలు చేపట్టనున్నట్లు కమిషనర్ కార్యాలయ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. -
అంతుబట్టని రెవెన్యూ లీలలు
సాక్షి .మహబూబ్నగర్: పాలమూరులో రెవెన్యూ లీలలు ఓ నిండు ప్రాణాన్ని తీసుకున్నాయి. ఏళ్లు గడుస్తున్నా.. కొలిక్కిరాని భూ సమస్యతో ఓ బాధితుడి గుండె ఆగి చనిపోయాడు. మారుతున్న ప్రొసీడింగ్స్, తాజాగా న్యాయవాది నుంచి అందిన నోటీసును చూసి ఆ భూమి తమకు దక్కదనే ఆందోళనతో హఠాన్మరణం చెందినట్లు మృతుడి కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. 1994లోనే అప్పటి ఆర్డీఓ, తహసీల్దార్ ఆ భూమి సదరు కుటుంబానికి చెందినదని ప్రొసీడింగ్ ఇచ్చారు. అప్నట్నుంచీ పట్టా పాస్ పుస్తకాల కోసం తిప్పించుకున్న అధికారులు చివరకు 2018లో ఆ భూమిని వారి పేరు మీద చేశారు. తర్వాత రెండుసార్లు రైతుబంధు కింద ప్రభుత్వం పెట్టుబడి సాయం కూడా అందింది. కానీ ఆ తర్వాత అధికారులు ఆ భూమి అదే గ్రామానికి చెందిన రాంచంద్రమ్మ పేరిట ఈ ఏడాది జూలై నాలుగో తేదీన ప్రొసీడింగ్స్ జారీ చేశారు. ఏళ్లు గడుస్తున్నా ఆ భూమి ఎవరిదో అని తేల్చలేకపోతున్న అధికారుల తీరుపై తీవ్ర విమర్శలొస్తున్నాయి. అధికారుల తప్పిదాలతో అన్యాయమైన మహబూబ్నగర్ మండలం ధర్మాపూర్కు చెందిన ఆర్మీ ఉద్యోగి గుంటి లక్ష్మయ్య దీనగాథ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్టాపిక్గా మారింది. ఆర్మీ మాజీ ఉద్యోగి గుంటి లక్ష్మయ్యకు 1970లో ప్రభుత్వం ధర్మాపూర్లోని సర్వే నంబర్ 538లో ఐదెకరాల వ్యవసాయయోగ్యమైన భూమి ఇచ్చింది. అప్పటి నుంచి లక్ష్మయ్య, అతని కుటుంబం ఆ భూమిలో కాస్తులో ఉంది. 25, మార్చి 1990లో లక్ష్మయ్య గుండెపోటుతో చనిపోయాడు. తర్వాత లక్ష్మయ్య కుమారులు వెంకటరమణ, ప్రకాశ్బాబు ఆ భూమిని అదే గ్రామానికి చెందిన వెంకటయ్యకు కౌలుకు ఇచ్చారు. రెండేళ్ల వరకు ఆ భూమిపై అంతగా దృష్టి సారించలేదు. తర్వాత భూమికి సంబంధించిన పట్టాదారు పాస్ పుస్తకాల కోసం ప్రయత్నించారు. ఎట్టకేలకు 2018లో లక్ష్మయ్య కుమారులు ఇద్దరికి రెండున్నర ఎకరాల చొప్పున అధికారులు పట్టాలు ఇచ్చారు. 2019 జూన్, 2020 మార్చిలో ఇరువురూ రూ.12,500 చొప్పున రైతుబంధు సాయం కూడా పొందారు. తర్వాత ఏం జరిగిందో తెలియదు. కానీ ఆ భూమి వెంకటయ్య కుటుంబీకులదిగా నిర్ధారిస్తూ ఈ ఏడాది జూలైలో ఆర్డీఓ శ్రీనివాసులు, తహసీల్దార్ కిషన్ ప్రొసీడింగ్స్ జారీ చేశారు. దీనిపై హైకోర్టుకు వెళ్లిన లక్ష్మయ్య కుమారులిద్దరూ ఆగస్టు 13న ఆ ప్రొసీడింగ్స్పై స్టే తీసుకొచ్చారు. చివరగా ఈ నెల 20న సాయంత్రం స్థానిక న్యాయవాది ద్వారా వచ్చిన నోటీసులు అందుకున్న ప్రకాశ్బాబు మరుసటి రోజు ఉదయమే గుండె ఆగి చనిపోయాడు. ఈ వ్యవహారంలో జిల్లాకు చెందిన బడా ప్రజాప్రతినిధి ఆదేశాల మేరకే రెవెన్యూ అధికారులు రికార్డులు తారుమారు చేసి లక్ష్మయ్య కుటుంబానికి అన్యాయం చేయాలని చూస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉంటే వెంకటయ్య కూడా మృతి చెందడంతో ఆయన కుమారుడు హరీశ్ ఆ భూమి కోసం ప్రయత్నిస్తున్నారు. ఆ భూమిని అమ్ముకున్నారు.. ఆర్మీ మాజీ ఉద్యోగి లక్ష్మయ్యకు 1970లో ప్రభుత్వం ఐదెకరాలు ఇచ్చింది. నిబంధనల మేరకు పదేళ్ల తర్వాత ఆ భూమిని ఇతరులకు అమ్ముకునే అధికారం లక్ష్మయ్యకు, వారి కుటుంబసభ్యులకు ఉంది. దీంతో వాళ్లు ఆ భూమిని వెంకటయ్యకు విక్రయించారు. అప్పట్లో వెంకటయ్య పేరు మీద పట్టాపాస్ పుస్తకాలు జారీ అయ్యాయి. దీంతో లక్ష్మయ్య కుమారులు కోర్టుకు వెళ్లి స్టే తీసుకొచ్చారు – కిషన్, తహసీల్దార్, మహబూబ్నగర్ రూరల్ మండలం మేం అమ్మలేదు దేశానికి మా నాన్న చేసిన సేవలను గుర్తించి ప్రభుత్వం ఇచ్చిన భూమి అది. అలాంటి భూమిని మేం అమ్ముకున్నామంటూ అధికారులు చెబుతున్న దాంట్లో ఎలాంటి వాస్తవం లేదు. మేం ఆ భూమిని ఎవరికీ అమ్మలేదు. వెంకటయ్యకు కౌలుకు మాత్రమే ఇచ్చాం. దీన్ని సాకుగా చేసుకుని మా నాన్న చనిపోయిన తర్వాత దాన్ని కాజేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో రెవెన్యూ అధికారులు అవినీతికి పాల్పడ్డారు. ఒకవేళ మేం అమ్మితే ఎన్ఓసీ తీసుకోవాలి. అది లేకుండా మేము ఆ భూమిని అమ్మామని చెప్పడం అన్యాయం. – వెంకటరమణ, లక్ష్మయ్య పెద్దకుమారుడు ఆ భూమి మాదే ధర్మాపూర్లోని సర్వేనంబర్ 538లో ఉన్న ఐదెకరాలు లక్ష్మయ్య నుంచి కొనుగోలు చేశాం. అప్పట్లో వెంకటరమణ, ఆయన సోదరుడు ప్రకాశ్బాబు కూడా సంతకాలు చేశారు. అందరి సమక్షంలోనే ఇదంతా జరిగింది. 1992 నుంచి 2018 వరకు ఆ భూమి మా నానమ్మ రాంచంద్రమ్మ పేరు మీదే ఉంది. ఆ భూమి మాదే అనడానికి ఆధారాలన్నీ మా వద్ద ఉన్నాయి. తర్వాత పట్టా వారి పేరు మీద ఎలా మారిందో మాకు తెలియదు – హరీశ్, వెంకటయ్య కుమారుడు -
రెవెన్యూ శాఖలో భారీ ప్రక్షాళనలు
సాక్షి, మేడ్చల్ జిల్లా : రెవెన్యూ శాఖలో భారీ ప్రక్షాళనకు జిల్లా అధికార యంత్రాంగం శ్రీకారం చుట్టింది. తాజాగా మేడ్చల్ జిల్లాలో 11 మంది తహసీల్దార్లను బదిలీ చేసిన యంత్రాంగం మంగళవారం మరో 12 మంది ఆర్ఐలు, సీనియర్ అసిస్టెంట్లను బదిలీ చేస్తూ ఉత్తర్వులను జారీ చేసింది. ఇటీవల కీసర తహసీల్దార్ నాగరాజు రాంపల్లి దాయార రెవెన్యూ పరిధిలో భూ మార్పిడి, పట్టాదారు పాసు పుస్తకాల జారీ విషయంలో రియల్టర్ బ్రోకర్ల వద్ద నుంచి రూ. 1.10 కోట్ల లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రెవెన్యూ శాఖ ప్రక్షాళనపై జిల్లా అదనపు కలెక్టర్ కె.విద్యాసాగర్ ప్రత్యేక దృష్టిని సారించినట్లు తెలుస్తున్నది. జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు ఆదేశాల మేరకు రెవెన్యూ శాఖలో అవినీతి ఉద్యోగుల ఏరివేత ప్రక్రియలో భాగంగా పెద్ద ఎత్తున బదిలీలకు శ్రీకారం చుట్టినట్లు తెలుస్తున్నది. గ్రేటర్ హైదరాబాద్ సమీపంలోని మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలోని భూముల ధరలకు రెక్కలు రావటంతో రెవెన్యూ శాఖలో అవినీతికి అందులేకుండా పోయింది. భూరికార్డుల ప్రక్షాళనతో ఆరంభమైన రెవెన్యూ శాఖ అవినీతి భాగోతం పరాకాష్టకు చేరుకుంది. అందులో భాగంగా కీసర నుంచి మొదలుకొని అనేక సంఘటనలు వెలుగు చూశాయి. (చదవండి : గిన్నిస్ బుక్ రికార్డులోకి కీసర తహసీల్దార్) ఇదిలా ఉండగా, జిల్లాలో 12 వేల ఎకరాలకు సంబంధించిన భూములు పలు వివాదాలతో పలు కోర్టుల్లో మగ్గుతుండగా, వందలాది ఎకరాల ప్రభుత్వ, అసైన్డ్ భూములపై కన్నేసిన కొందరు కబ్జాదారులు అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. నగర శివారులోని కోట్లాది రూపాయల విలువ చేసే భూములను పరిరక్షించాల్సిన బాధ్యత జిల్లా అధికార యంత్రాంగంపై ముఖ్యంగా రెవెన్యూ శాఖపై ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ, అసైన్డ్ భూములు పరిరక్షణ, వివాదాల్లోని భూములకు సత్వర పరిష్కారం తదితర విషయాలపై ప్రత్యేక దృష్టి సారించిన అధికార యంత్రాంగం రెవెన్యూ శాఖ ప్రక్షాళనలో భాగంగా బదిలీలకు తెరలేపినట్లు తెలుస్తున్నది.(చదవండి : విచారణకు సహకరించని ఎమ్మార్వో నాగరాజు!) అందులో భాగంగా జిల్లాలో 12 మంది ఆర్ఐలు (గీర్దావరులు), సీనియర్ అసిస్టెంట్లను బదిలీ చేస్తూ కలెక్టర్ మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. గీర్దార్వర్ (ఆర్ఐ) కిరణ్కుమార్ కీసర మండలంతోపాటు శామీర్పేట్లో పని చేసిన కాలంలో పలు అవినీతి ఆరోపణలను ఎదుర్కొన్నారు. కీసరలో ఏసీబీకి చిక్కిన తహసీల్దార్ నాగరాజుకు ఆర్ఐ కిరణ్కుమార్ ప్రధాన అనుచరుడిగా పేరుంది. అలాగే నాగారం మున్సిపాలిటీ పరిధిలోని అహ్మద్గూడలో అసైన్డ్ భూముల్లో ఇళ్లు వేసుకున్న పేదల నుంచి ఒక్కొకరి నుంచి రూ. 50 వేల నుంచి రూ. లక్ష స్థానిక వీఆర్ఓతో కలిసి వసూలు చేశారనే ఆరోపణల్లో కిరణ్ కుమార్ ప్రధాన వ్యక్తిగా స్థానిక ప్రజల్లో ప్రచారం ఉంది. వెలుగులోకి రాని అవినీతి ఆర్ఐలకు కూడా బదిలీల్లో చోటు లభించింది. త్వరలో పెద్ద ఎత్తున వీఆర్ఓ, వీఆర్ఏల బదిలీలు కూడా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
‘మ్యుటేషన్లు’ మూలకే!
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కన్నెర్ర జేసినా.. లంచాలు తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడినా.. ఆఖరికి భౌతికదాడులు జరిగినా.. చాలామంది రెవెన్యూ అధికారుల పనితీరు మారడంలేదు. ఆంధ్రప్రదేశ్లో పక్షం రోజుల్లోనే మ్యుటేషన్ ప్రక్రియను పూర్తి చేస్తుండగా మన రాష్ట్రంలో మాత్రం దరఖాస్తుదారులు నెలల తరబడి ఎదురుచూడాల్సి వస్తోంది. దీంతో భూ యాజమాన్య హక్కుల కోసం పట్టాదారులు తహసీళ్ల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. మ్యుటేషన్లు, విరాసత్ల అమలు ఆలస్యానికి కరోనా వ్యాప్తి కూడా ఒక కారణమే అయినా.. రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యమే ఎక్కువగా కనిపిస్తోంది. రిజిస్ట్రేషన్ పూర్తి కాగానే 24 గంటల్లోనే ఆన్లైన్ మ్యుటేషన్ ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం ఒకవైపు ఆలోచిస్తుండగా క్షేత్రస్థాయి యంత్రాంగం మాత్రం షరా మామూలుగానే స్పందిస్తున్నట్లు పెండింగ్ దరఖాస్తుల సంఖ్యను చూస్తే అర్థమవుతోంది. మీ–సేవలో దరఖాస్తు చేసుకొని నెలలు గడుస్తున్నా పట్టించుకోని రెవెన్యూ యంత్రాంగం.. మ్యుటేషన్ల జారీలో జాప్యం చేస్తోంది. దీంతో పట్టాదార్ పాస్ పుస్తకాల జారీలోనూ ఆలస్యం జరుగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా 16,14,725 దరఖాస్తులు భూ యాజమాన్య హక్కులు, వారసత్వ భూ బదలాయింపులు కోరుతూ ప్రభుత్వానికి రాగా.. వాటిలో ఇప్పటివరకు 11,89,951 దరఖాస్తులకు మోక్షం కలిగింది. ఇంకా 1,16,476 దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. ఇందులో 74,610 దరఖాస్తులు తహసీల్దార్ల వద్ద పెండింగ్లో ఉండటం గమనార్హం. తహసీళ్ల చుట్టూ చక్కర్లు : సుపరిపాలన, జవాబుదారీతనాన్ని పెంపొందించడానికి ఆన్లైన్ సేవలను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చినా చాలా మంది అధికారులు ఇంకా వాటికి అలవాటుపడలేదు. మీ–సేవ కేంద్రంలో దరఖాస్తు చేసిన 15 రోజుల్లోనే మ్యుటేషన్ వ్యవహారం కొలిక్కి రావాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. మీ–సేవ కేంద్రంలో దరఖాస్తు సహా సేల్డీడ్, 1బీ, పహాణీ నకలు జతపరిస్తే.. వాటిని డౌన్లోడ్ చేసుకొని క్షేత్రస్థాయిలో పరిశీలించి.. భూ యాజమాన్య హక్కుల మార్పిడి ప్రక్రియను పూర్తి చేయడం రెవెన్యూ అధికారుల విధి. అయితే క్షేత్రస్థాయిలో ఇది అమలు కావడంలేదు. మీ–సేవ కేంద్రంలో దరఖాస్తు చేసిన కాపీల నకళ్లను తహసీల్దార్ కార్యాలయంలో వ్యక్తిగతంగా అందజేస్తే తప్ప వాటికి మోక్షం కలగడంలేదు. పట్టాదార్లను కార్యాలయాల చుట్టూ తిప్పించుకోవద్దనే ఉద్ధేశంలో దాదాపుగా అన్ని సేవలను ప్రభుత్వం ఆన్లైన్ చేసింది. మీ–సేవలో చేసుకున్న అర్జీ జత పరిచిన డాక్యుమెంట్లను డౌన్లోడ్ చేసే వాటికి జిరాక్స్ల కోసం రెవెన్యూ శాఖ నెలవారీగా నిధులు విడుదల చేస్తోంది. అయితే ఒరిజినల్ డాక్యుమెంట్ల వెరిఫికేషన్ నెపంతో దరఖాస్తుదారులను కార్యాలయాలకు పిలిపించి.. బేరసారాలు మొదలుపెడుతున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. -
రీ సర్వేకి 'రెడీ'
సాక్షి, అమరావతి: పొలం గట్లు (సరిహద్దు), భూ వివాదాల పరిష్కారమే లక్ష్యంగా రాష్ట్రంలోని భూముల సమగ్ర రీ సర్వేకి రంగం సిద్ధమవుతోంది. మూడు దశల్లో ఈ ప్రక్రియ పూర్తి చేసేందుకు రెవెన్యూ శాఖ కార్యాచరణ రూపొందించింది. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలంలో రీ సర్వే పైలట్ ప్రాజెక్ట్ ఇప్పటికే పూర్తయ్యింది. ఇందుకు సంబంధించిన నివేదికను రెవెన్యూ శాఖ ఈనెల 18న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి సమర్పించనుంది. ప్రయోగాత్మకంగా చేసిన రీ సర్వేలో ఎదురైన అనుభవాలు, వచ్చిన ఫలితాలను పరిగణనలోకి తీసుకుని రాష్ట్రవ్యాప్తంగా కచ్చితత్వంతో రీ సర్వే చేపట్టేందుకు అధికారులు ఇప్పటికే కార్యాచరణ ప్రణాళిక రూపొందించారు. దీనిపై ఈనెల 21న రెవెన్యూ అధికారులతో సీఎం సమీక్షించి మార్గనిర్దేశం చేయనున్నారు. మూడు దశల్లో చేపడతాం ప్రతి మండలంలో మూడోవంతు గ్రామాల్లో మూడు దశల్లో రీ సర్వే పూర్తి చేయాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర రీ సర్వేకు ఎప్పుడు శ్రీకారం చుట్టాలనేది ముఖ్యమంత్రి ప్రకటిస్తారు. – వి.ఉషారాణి, ముఖ్య కార్యదర్శి, రెవెన్యూ శాఖ కార్స్ టెక్నాలజీతో.. ► రాష్ట్ర భౌగోళిక విస్తీర్ణం 1.63 లక్షల చదరపు కిలోమీటర్లు. ఇందులో అటవీ విస్తీర్ణం పోగా రీ సర్వే చేయాల్సిన విస్తీర్ణం 1.22 లక్షల చదరపు కిలోమీటర్లు. ► ప్రభుత్వం గ్రామ సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసి.. కొత్తగా నియమించిన 11,158 మంది గ్రామ సర్వేయర్లకు శిక్షణ ఇస్తున్నారు. ఇది పూర్తయిన తర్వాత వీరిని రీ సర్వేకి వినియోగించుకుంటారు. ► ఇప్పటివరకూ మలేషియా, సింగపూర్, అమెరికా, ఆస్ట్రేలియా దేశాల్లో అమల్లో ఉన్న అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన కంటిన్యూస్లీ ఆపరేటింగ్ రెఫరెన్స్ స్టేషన్స్ (కార్స్) టెక్నాలజీతో దేశంలోనే మొదటిసారి మన రాష్ట్రంలో రీ సర్వే మహా క్రతువు నిర్వహించేందుకు చకచకా ఏర్పాట్లు చేస్తున్నారు. ► ప్రతి గ్రామ సచివాలయానికి ఒకరు చొప్పున సర్వేయర్లు అందుబాటులోకి రావడంతో సమగ్ర రీ సర్వేతోపాటు గ్రామాల్లో ఎప్పుడు భూములు కొలతలు వేయాలన్నా, సబ్ డివిజన్ చేయాలన్నా ఇక సర్వేయర్ల కొరత మాటే ఉండదు. ► కోవిడ్–19 నియంత్రణ చర్యల కారణంగా నిలిచిపోయిన రికార్డుల స్వచ్ఛీకరణను త్వరితగతిన పూర్తి చేసేలా అధికారులు కసరత్తు చేపట్టారు. -
అవినీతికి పడగలెత్తిన నాగరాజు
సాక్షి, మేడ్చల్ జిల్లా : అక్రమాలతో కోట్లకు పడగలెత్తిన తహసీల్దార్ నాగరాజుది ఆది నుంచీ అవినీతి చరిత్రేనని తెలుస్తోంది. రెవెన్యూ శాఖలో 15 ఏళ్లుగా టైపిస్టు నుంచి ఆర్ఐ, డీటీ, తహసీల్దార్ వరకు పనిచేసిన ప్రతి స్థాయిలో ఆయన ‘చేతివాటం’ చూపించాడని రెవెన్యూ వర్గాల సమాచారం. మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కీసర మండలం రాంపల్లిదాయర రెవెన్యూ గ్రామ పరిధిలో సర్వేనంబర్ 604 నుంచి 614 వరకు గల కోర్ట్ ఆఫ్ వార్డ్స్ (గవర్నమెంట్ కస్టోడియన్ ల్యాండ్) 53 ఎకరాల భూముల్లోని 28 ఎకరాలకు సంబంధించి ఓ వర్గానికి అనుకూలంగా రెవెన్యూ రికార్డులో పేర్ల నమోదుతోపాటు, పట్టాదారు పాసుపుస్తకాలు ఇచ్చేందుకు తహసీల్దార్ నాగరాజు రియల్ బ్రోకర్ కందాడి అంజిరెడ్డి ఇంట్లో రూ.1.10 కోట్ల నగదు తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కిన విషయం తేల్సిందే. నాగరాజు.. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని సరూర్నగర్ , ఘట్కేసర్, హయత్నగర్, శామీర్పేట, కూకట్పల్లి, కీసర మండలాల్లో టైపిస్టుగా, ఆర్ఐ, డీటీ, తహసీల్దార్గా పనిచేశారు. దాదాపు రెండేళ్లు కీసరలో పనిచేసిన సందర్భంలో ఆయన అవినీతిపై ఆరోపణలు అంతులేకుం డా ఉన్నాయి. కీసర, కీసర దాయర, చీర్యాల, భోగారం, అంకిరెడ్డిపల్లి, తిమ్మాయిపల్లి, రాంపల్లిదాయర గ్రామాలతోపాటు నాగారం, దమ్మాయిగూడ మున్సిపాలిటీల్లో మట్టి నుంచి మొదలుకుని రికార్డుల ప్రక్షాళన, పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ, రైతుబంధు వరకు దేన్ని వదలకుండా సొమ్ము చేసుకునే ప్రయత్నం చేసినట్లు తెలుస్తున్నది. రియల్ వెంచర్లు, ప్లాట్లుగా మారిన భూములకు పట్టాదారు పాసుపుస్తకాలు జారీచేసి రైతుబంధు వచ్చేలా చేశారనే ఆరోపణలున్నాయి. దమ్మాయిగూడ మున్సిపాలిటీ పరిధి అహ్మద్గూడలోని అసైన్డ్ భూముల్లో ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి ఒక్కో ఇంటి యాజమాని వద్ద నుంచి అప్పటి మహిళా వీఆర్ఓ, వీఆర్ఏ సాయంతో రూ.లక్ష వరకు వసూలు చేసినట్లు ఆరోపణలున్నాయి. 2011లో శామీర్పేట మండలంలో డీటీగా పనిచేసినపుడు వచ్చిన అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఆయన ఇంటిపై ఏసీబీ అధికారులు దాడిచేసి జైలుకు పంపారు. 25 ఏళ్లుగా ఆ భూముల వివాదం.. ప్రస్తుతం నాగరాజు పట్టుబడటానికి కారణమైన రాంపల్లిదాయర రెవెన్యూ పరిధిలోని 53 ఎకరాల భూములకు సంబంధించి షరీఫ్, గాలిజంగ్ తదితర 20 మంది కుటుంబసభ్యులకు, రాంపల్లి దాయర గ్రామానికి చెందిన వేల్పుల ఆంజనేయులు, నర్సింగ్రావు, శ్రీనివాస్ మరో 25 మంది కుటుంబాల మధ్య 25 ఏళ్లుగా వివాదం కొనసాగుతోంది. ఈ సర్వేనంబర్లలోని 53 ఎకరాల భూముల్లోని 28 ఎకరాలకు సంబంధిం చి ఇరువర్గాల మధ్య భూవివాదంపై హైకోర్టు స్థాయిలో విచారణ కొనసాగుతుండగా, మిగతా భూములకు సంబంధించి కొందరికి ఓఆర్సీలు అందజేసినట్లు తెలుస్తోంది. ఒక వర్గానికి అనుకూలంగా వ్యవహరిస్తున్న రియల్టర్ బ్రోకర్లు అంజిరెడ్డి, శ్రీనాథ్ తదితరులు భూమార్పిడి, పట్టాదారు పాసు పుస్తకాల జారీకి కీసర తహసీల్దార్ నాగరాజుతో రూ.2 కోట్లకు డీల్ కుదుర్చుకున్నటు తెలుస్తున్నది. కూకట్పల్లిలోనూ అదేతీరు.. కూకట్పల్లి తహసీల్దార్గా 2017 జూన్ 20న బాధ్యతలు చేపట్టిన నాగరాజు ఏడాది పాటు ఇక్కడ పనిచేశారు. ఇక్కడి ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమయ్యేందుకు సహకరించారనే ఫిర్యాదులు వచ్చాయి. సర్వే నంబర్ 91లో చిత్తారమ్మ ఆలయానికి చెందిన భూమిని సర్వే నంబర్ 90 పేరుతో కబ్జాదారులకు రిజిస్ట్రేషన్ చేయటం వివాదాస్పదమైం ది. కూకట్పల్లిలో సర్వే నంబర్ 1007 హైటెక్ సిటీకి కూతవేటు దూరంలో ఉన్న సుమారు 340 ఎకరాల భూమిలో ఓ నిర్మాణ సంస్థకు అనుకూలంగా మ్యుటేషన్ చేసేందుకు రంగం సిద్ధం చేసుకుని నోటీసులు జారీ చేయటం సైతం అప్పట్లో వివాదాస్పదమైంది. -
పనేదైనా...పైసలివ్వాల్సిందే..!
సాక్షి, హైదరాబాద్: అవినీతికి చిరునామా గా మారిన రెవెన్యూ వ్యవస్థను సంస్కరించాలని సీఎం కేసీఆర్ ఒకవైపు ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు లంచావతారాల లీలలు బట్టబయలవుతున్నాయి. రియల్ ఎస్టేట్ బూమ్ ఉన్నచోట ఏరికోరి పెద్దతలలకు రూ.లక్షలు ఎదురిచ్చి మరీ.. పోస్టింగులు తెచ్చుకుంటున్నారు. ఏడాది క్రితం రంగారెడ్డి జిల్లా కేశంపేట మండల తహసీల్దార్ లావణ్యపై ఏసీబీ దాడులు జరిగాయి. వీటి లో ఆమె ఇంట్లో ఏకంగా రూ.93 లక్షల నగదు కట్టలు లభించాయి. ఈ తహసీల్దార్ అవినీతి పర్వంలో ఆఖరికి ఆమె భర్త హస్తం కూడా ఉన్నట్లు తేలడం.. ఇద్దరిపై నా సస్పెన్షన్ వేటు విదితమే. తాజాగా ‘షాక్’పేట తాజాగా మరో ఇద్దరు రెవెన్యూ అధికారులు ఏసీబీ వలలో పడ్డారు. హైదరాబాద్ సంపన్నవర్గాలు నివసించే షేక్పేట మండ ల తహసీల్దార్ వివాదాస్పద భూ వ్యవహారంలో తలదూర్చి ఏసీబీకి చిక్కా రు. శనివారం తహసీల్దార్ సుజాత ఇంటి పై దాడి చేసిన అధికారులు.. రూ.30 లక్షలను స్వాధీనం చేసుకున్నారు. ఇదే భూ వివాదంలో ప్రైవేటు వ్యక్తులకు అండగా నిలిచిన ఆర్ఐ కూడా పట్టుబడ్డారు. జేసీలు మొదలు.. వీఆర్వో వరకు..! గతంలో శివారు జిల్లా జాయింట్ కలెక్టర్పై ఏసీబీ దాడులు చేసి ఆదాయానికి మించి ఆస్తులున్నాయని కటకటాల వెనక్కి నెట్టిం ది. ఇదే జిల్లాలో పనిచేసిన ఓ ఆర్డీవో కూడా ఏసీబీ వలలో చిక్కారు. ఆ తర్వాత శేరిలిం గంపల్లి తహసీల్దార్గా పనిచేసిన మహిళాధికారి కూడా పట్టుబడ్డారు. ఇక అబ్దుల్లాపూర్మెట్ తహసీల్దార్ సజీవదహనం కేసులోను అవినీతి ఆరోపణలు వచ్చాయి. ఆ జిల్లాల్లోనే తిష్ట.. రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ జిల్లాల్లో పనిచేస్తున్న అధికారులు అక్కడి నుంచి కదలడానికి ఇష్టపడరు. దశాబ్ధాల కాలంగా నయాబ్ తహసీల్దార్ నుంచి అదనపు కలెక్టర్ల వరకు అదే జిల్లాలో కొలువులు వెలగబెడుతున్నారు. ఒకవేళ ప్రభుత్వం ఇతర జి ల్లాలకు బదిలీ చేసినా.. సెలవుపై వెలుతున్నారే తప్ప బాధ్యతలు తీసుకోవడంలేదు. -
ఏపీ: త్వరలో వీఆర్వో పోస్టుల భర్తీ
సాక్షి, అమరావతి : రెవెన్యూ శాఖలో 3,795 గ్రామ రెవెన్యూ అధికారుల (వీఆర్వో) గ్రేడ్ –2 పోస్టుల భర్తీకి లైన్ క్లియర్ అయింది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే గ్రామ, వార్డు సచివాలయాలు ఏర్పాటు చేసి వీఆర్వో (గ్రేడ్–2) పోస్టులను భర్తీ చేసిన విషయం విదితమే. ఇదే సమయంలో ఎన్నో ఏళ్ల నుంచి గ్రామ రెవెన్యూ సహాయకులు (వీఆర్ఏ)గా పనిచేస్తున్న అర్హులకు ఒకే పర్యాయం (వన్టైమ్) ప్రాతిపదికన వీఆర్వోలుగా ఎంపిక చేయాలని వివిధ అసోసియేషన్లు విజ్ఞప్తులు చేశాయి. వీటిని పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం ఐదు నెలల కిందటే సానుకూల నిర్ణయం తీసుకుంది. 3,795 వీఆర్వో పోస్టులను ఇంటర్మీడియెట్ తత్సమాన విద్యార్హతలు ఉన్న వీఆర్ఏలతో భర్తీ చేయడానికి జిల్లా కలెక్టర్లకు అనుమతినిచ్చింది. (మరో ఐదు ‘శ్రీసిటీ’లు) ఈ మేరకు రెవెన్యూ శాఖ ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ సాంకేతిక కారణాల వల్ల జిల్లా కలెక్టర్లు ఈ ఫైలును పక్కన పెట్టారు. గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం మరోసారి విజ్ఞప్తి చేయడంతో ఈ పోస్టుల భర్తీకి ఉన్న అర్హతలపై సందిగ్ధతను తొలగిస్తూ, చిన్న సడలింపు ఇస్తూ రెవెన్యూ శాఖ తాజాగా అన్ని జిల్లాల కలెక్టర్లకు అంతర్గత ఉత్తర్వులు జారీ చేసింది. దీని ప్రకారం తక్షణమే జిల్లాల వారీగా ఖాళీలను ప్రకటించి సీనియారిటీ ప్రాతిపదికన అర్హులైన వీఆర్ఏలను వీఆర్వోలుగా ఎంపిక చేయాలని రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి వి.ఉషారాణి రాష్ట్ర భూపరిపాలన ప్రధాన కమిషనర్ ద్వారా ఆదేశాలు జారీ చేశారు. (మీ అన్నగా, తమ్ముడిగా సాయం ) మార్గదర్శకాలివీ... ► కచ్చితంగా ఇంటర్మీడియెట్ లేదా తత్సమాన కోర్సు ఉత్తీర్ణులై ఉండాలి. ► ఈ ఏడాది జనవరి ఒకటి నాటికి వీఆర్ఏలుగా ఐదేళ్ల సర్వీసు పూర్తయి ఉండాలి. ► ఇంటర్మీడియట్ చదవకుండా నేరుగా డిగ్రీ, పీజీ చేసిన వారు కూడా అర్హులే. ► ఉద్యోగంలో చేరిన తర్వాత ఎవరైనా కోర్సు చేసి ఉంటే అందుకు ముందస్తు అనుమతి తీసుకున్నారో లేదో పరిశీలించాలంటూ గతంలో ఇచ్చిన ఆదేశాలను పరిగణనలోకి తీసుకోరు. ఈ నిబంధనను మినహాయించి సర్టిఫికెట్లు సరైనవో కావో నిర్ధారించుకోవాలని ప్రభుత్వం కలెక్టర్లకు జారీ చేసిన మెమోలో పేర్కొంది. ► అర్హులైన వీఆర్ఏలను వీఆర్వోలుగా ఎంపిక చేసేందుకు వన్టైమ్ ప్రాతిపదికన అనుమతించింది. ఈ మేరకు సర్వీసు నిబంధనలను ఒకే పర్యాయానికి అనే షరతుతో మినహాయింపు ఇచ్చింది. -
7 వేల ఎకరాలు.. 90 రోజులు!
సాక్షి, హైదరాబాద్: ఔషధనగరికి త్వరలోనే పునాదిరాయి పడనుంది. ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఈ ప్రాజెక్టుకు ఈ ఏడాది చివరలో కార్యరూపం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఈ నేపథ్యంలో రెండో విడత భూసేకరణకు 90 రోజుల గడువు విధించింది. ఈ భూసేకరణ ప్రక్రియ పూర్తికాగానే.. ఫార్మాసిటీకి శంకుస్థాపన చేయనుంది. రంగారెడ్డి జిల్లాలో 19,333 ఎకరాల్లో ప్రతిపాదించిన ఈ ప్రాజెక్టును అంతర్జాతీయ ప్రమాణాలతో ఏర్పాటు చేసే దిశగా ప్రభుత్వం కార్యాచరణ ప్రణాళిక తయారు చేసింది. ఔషధనగరి ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం నుంచి పర్యావరణ అనుమతి, నిమ్జ్ హోదా లభించినా.. భూసేకరణలో జాప్యంతో ముందడుగు పడలేదు. ఇటీవల అంతర్గత రహదారుల నిర్మాణ పనులు మొదలుపెట్టిన ప్రభుత్వం.. త్వరలోనే దీనికి ముహూర్తం ఖరారు చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. తొలిదశలో 7,414 ఎకరాలు..! రెండేళ్ల క్రితమే 7,414 ఎకరాల భూమిని సేకరించిన రెవెన్యూశాఖ.. ఫార్మాసిటీకి నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తున్న టీఎస్ఐఐసీకి బదలాయించింది. ఈ మేరకు తొలిదశ పనులు చేపట్టేందుకు మార్గం సుగమం చేసింది. ఈ ప్రాజెక్టుకు 2018 చివర్లోనే అంకురార్పణ చేయాలని ప్రభుత్వం భావించినా.. శాసనసభ ఎన్నికలు రావడంతో వాయిదా పడింది. ఆ తర్వాత భూసేకరణపై స్థానికుల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో వెనక్కి తగ్గింది. జంటనగరాల నుంచి కాలుష్య ఉద్గారాలు వెదజల్లే పరిశ్రమలను నగరం వెలుపలికి తరలించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం, ఫార్మాసిటీని కాలుష్య రహితంగా అభివృద్ధి చేయనున్నట్లు ప్రకటించడంతో అనేక కంపెనీలు అక్కడ కార్యకలాపాలు మొదలు పెట్టడానికి ఆసక్తి చూపాయి. బల్క్ డ్రగ్ మ్యానుఫాక్చరింగ్ అసోసియేషన్ ద్వారా ఇప్పటికే పలు పరిశ్రమలు ఔషధనగరిలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రభుత్వాన్ని ఆశ్రయించాయి కూడా.. దీనికి తోడు ఫార్మా దిగ్గజాలు కూడా ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చాయి. కరోనా సంక్షోభంతో అనేక కంపెనీలు చైనాను వీడి.. భారత్ వైపు తరలిరావడానికి ఆసక్తి చూపుతున్నట్లు సంకేతాలు వెలువడుతున్న నేపథ్యంలో ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. టైమ్లైన్ 90 రోజులు ఈ నేపథ్యంలోనే రెండో విడత భూసేకరణను 90 రోజుల్లో పూర్తి చేయాలని రెవెన్యూ శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. మొదటి విడతలో సింహభాగం ప్రభుత్వ, అసైన్డ్ భూమి సేకరించిన రెవెన్యూ యంత్రాంగం.. రెండో దశలో అధిక శాతం పట్టా భూములనే తీసుకుంటోంది. నష్ట పరిహారంపై స్థానికుల నుంచి తీవ్ర స్థాయిలో అభ్యంతరాలు వ్యక్తమవుతున్నప్పటికీ, న్యాయపర చిక్కులు ఎదురవుతున్న కూడా వెనుకడుగు వేయకుండా.. కోర్డుల్లో పరిహారాన్ని జమ చేసి ముందుకు కదలాలని నిర్ణయించింది. 6,813.88 ఎకరాలను ఆగస్టు నాటికి సేకరించేందుకు గడువు పెట్టుకుంది. ఇందులో ఫార్మాసిటికీ గుండెకాయగా చెప్పుకుంటున్న ముచ్చర్ల, మేడిపల్లి, కుర్మిద్ద, నానక్నగర్, తాడిపర్తి, పంజాగూడ గ్రామాల భూములున్నాయి. తాజాగా భూసేకరణ జరిపే ప్రాంతాలివే.. -
పోలీస్,రెవెన్యూ సిబ్బందికి కృతఙ్ఞతలు తెలిపిన రోజా
-
వైఎస్సార్ జగనన్న కాలనీలు
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం పేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇచ్చి.. ఇళ్లు కట్టించే కాలనీలకు వైఎస్సార్ జగనన్న కాలనీలు అని పేరు ఖరారు చేసింది. ఈ మేరకు రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి వి.ఉషారాణి శుక్రవారం జీవో జారీ చేశారు. ‘రాష్ట్ర ప్రభుత్వ అత్యంత ప్రాధాన్య కార్యక్రమమైన ‘నవరత్నాలు – పేదలందరికీ ఇళ్లు’ కింద పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో 25 లక్షల మందికి ఇళ్ల స్థల పట్టాలు ఇవ్వాలని నిర్ణయించింది. సంతృప్త స్థాయిలో కులం, జాతి, మతంతో సంబంధం లేకుండా అర్హులందరికీ నివాస స్థల పట్టాలు ఇచ్చి ఇళ్లు నిర్మించనుంది. మిషన్ మోడ్లో స్థలాలు ఇచ్చి.. ఇళ్లు నిర్మించేందుకు విధివిధానాలు రూపొందించి అర్హులను ఎంపిక చేసింది. ఇందుకు అనుగుణంగా రాష్ట్ర భూపరిపాలన ప్రధాన కమిషనర్, జిల్లాల కలెక్టర్లు చర్యలు తీసుకోవాలి.’ అని జీవోలో పేర్కొన్నారు. -
పంట సమస్యలకు 24 గంటల్లో పరిష్కారం
సాక్షి, అమరావతి: పంటలకు సంబంధించి రైతు నుంచి ఏదైనా సమస్య వస్తే 24 గంటల్లో పరిష్కారం అయ్యేలా వ్యవసాయాధికారులు కృషి చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. పంట సమస్యలపై ఏర్పాటు చేసే కాల్ సెంటర్ను అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పాటు సమర్థవంతంగా పని చేసేలా తీర్చిదిద్దాలన్నారు. ఎలక్ట్రానిక్ పంటల నమోదు (ఇ–క్రాప్ బుకింగ్) విధానం వ్యవసాయ రంగంలో కీలక మలుపని అభివర్ణించారు. మంగళవారం ఆయన తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో వ్యవసాయ, రెవిన్యూ శాఖ అధికారులతో సమావేశమయ్యారు. ఇ–పంట నమోదు, రైతు భరోసా కేంద్రాల ఏర్పాటు, పని తీరు గురించి ఆరా తీశారు. గత సమావేశాల్లో వచ్చిన సూచనలు, సలహాల మేరకు ఆండ్రాయిడ్ ఆధారిత అప్లికేషన్ను రూపొందించామని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఇ–పంట నమోదుతో పంటల బీమా, వ్యవసాయ ఉత్పత్తులకు తగిన ధరలు, ఏయే పంట ఎన్ని ఎకరాల్లో సాగయిందీ, ధరల స్థిరీకరణ నిధిని ఉపయోగించాల్సి వస్తే లబ్ధిదారులు ఎవరనేది సత్వరమే గుర్తించి చర్యలు చేపట్టేందుకు వీలుంటుందని సీఎం అన్నారు. ఇ–పంట విధానాన్ని బ్యాంకులకు అనుసంధానం చేస్తే సకాలంలో రుణాలు ఇవ్వడానికి, వేసిన పంటలకు తగినట్టుగా రుణం పొందడానికి ఉపయోగపడుతుందన్నారు. సమగ్ర వివరాలతో ఆండ్రాయిడ్ అప్లికేషన్ – గ్రామ సచివాలయాల్లోని వ్యవసాయ, అనుబంధ రంగాల అసిస్టెంట్లు ఇ–పంట నమోదు వ్యవహారం చూస్తారు. – ఆహార పంటలతో పాటు ఉద్యాన, పట్టు (సెరికల్చర్), పశు దాణాకు సంబంధించిన పంటల, సాగు వివరాలు ఇందులో ఉంటాయి. – ఏ తరహా సాగు, ఎన్నో పంట, చేపల పెంపకమా? ఉద్యాన పంటా? అంతర పంటలు ఏమైనా సాగు చేస్తున్నారా? వంటి వివరాలు సైతం నమోదు చేస్తారు. – ప్రస్తుత రబీ సీజన్లో ఈ అప్లికేషన్ను ప్రయోగాత్మకంగా పరిశీలిస్తారు. ఇవీ ముఖ్యమంత్రి ఆదేశాలు, సూచనలు – గతంలో మాదిరి వెబ్ల్యాండ్ నమోదులో రైతులు ఈసారి ఇబ్బందులు పడకూడదు. – సాగు చేసే ప్రతి పంటను, రైతును నమోదు చేయాలి. – ఇ–పంట నమోదు డేటా బ్యాంకులతో అనుసంధానం చేయాలి. – ఇందు వల్ల సాగు చేసిన పంటలకు తగిన రీతిలో రుణాలు పొందే అవకాశం లభిస్తుంది. – ఇ–పంటతో పంటల బీమా సమగ్రంగా, వేగంగా పొందవచ్చు. – ఏ పంట సాగు చేస్తున్నది ముందుగానే తెలుస్తున్నందున ఆయా ఉత్పత్తులకు మార్కెట్లో ఎలాంటి రేట్లు లభిస్తున్నాయో పర్యవేక్షించొచ్చు. – నష్టపోయే పరిస్థితి ఉంటే ప్రభుత్వం జోక్యం చేసుకుని మార్కెట్లో పోటీ పెంచడానికి రైతు భరోసా కేంద్రాల ద్వారా ప్రయత్నించాలి. – ముందుగానే కనీస గిట్టుబాటు ధరలు ప్రకటించి వాటికన్నా తక్కువకు రైతులు అమ్ముకునే దుస్థితి లేకుండా చూడాలి. – రెవెన్యూ, వ్యవసాయ శాఖలు సంయుక్త బాధ్యతగా ఇ–క్రాపింగ్ను చేపట్టాలి. – దీనిపై స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్ను రూపొందించుకోవాలి. – ఇ–పంట నమోదు చేసేటప్పుడే బోర్ల కింద సాగవుతున్న భూములనూ గుర్తించాలి. డేటాలో ఆ విషయమూ ఉండాలి. రైతు భరోసా కేంద్రాలపై సీఎం సూచనలు – ఏ పంటలు వేయాలనే దానిపై రైతులకు సూచనలు, సలహాలు ఇవ్వాలి. – మెరుగైన సాగు పద్ధతులపై శిక్షణ ఇవ్వాలి. – సేంద్రీయ, సహజ వ్యవసాయ పద్ధతులను రైతులకు నేర్పించాలి. – నాణ్యమైన విత్తనాలు, పురుగు మందులు, ఎరువులను అందుబాటులో ఉంచి పంపిణీ అయ్యేలా చూడాలి. – థర్డ్ పార్టీ కింద ఒక ప్రతిష్టాత్మక సంస్థ ద్వారా విత్తనాలు, ఎరువుల నాణ్యత నిర్ధారణ పరీక్షలు చేయించాలి. – ఇ–పంట కింద వివరాలు నమోదు చేయాలి. – గిరాకీ– సరఫరాను దృష్టిలో ఉంచుకుని వేయాల్సిన పంటలపై రైతులకు సూచనలు చేయాలి. – పంటల వివరాలను గ్రామ సచివాలయాల్లో పొందుపరచాలి. – రైతు భరోసా కేంద్రాల్లో పెట్టే కియోస్క్లో ఉంచాల్సిన వివరాలు, డేటాపై శ్రద్ధ పెట్టాలి. ఇ–పంట అంటే? ఎలక్ట్రానిక్ పంట నమోదే ఇ–క్రాప్ బుకింగ్. ఇదో మొబైల్ ఆండ్రాయిడ్ అప్లికేషన్. దీన్ని స్థానికంగా ఇ–పంటగా పిలుస్తున్నారు. వాస్తవ సాగు వివరాలను తెలుసుకునేందుకు రూపొందించిన అప్లికేషన్ ఇది. ఏయే గ్రామంలో ఎన్నెన్ని ఎకరాల్లో ఏయే పంటలు సాగు చేస్తున్నారో, ఎవరెవరు చేస్తున్నారో, ఏ రకంగా సాగు చేస్తున్నారో వంటి వివరాలు ఇందులో ఉంటాయి. కాలం (ఖరీఫ్, రబీ), వర్షపాతం, భూసారం, విత్తనం, సర్వే నంబర్, గ్రామం పేరు, సాగు నీటి పారుదల సమాచారం ఇందులో ఉంటుంది. దీని ద్వారా ఎప్పటికప్పుడు రైతులకు సంబంధించిన సమగ్ర సమాచారం తెలుసుకోవచ్చు. -
‘ఈ- పంటతో వ్యవసాయరంగంలో మేలి మలుపు’
సాక్షి, అమరావతి: ఈ-పంట విధానం వ్యవసాయరంగంలో కీలక మలుపు అవుతుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. ఈ-పంట వల్ల పంటల బీమా రిజిస్ట్రేషన్, వ్యవసాయ ఉత్పత్తులకు తగిన ధరలు లభించేందుకు ప్రభుత్వం సత్వరమే చర్యలు తీసుకునే వీలు కలుగుతుందన్నారు. ఈ- పంట విధానాన్ని బ్యాంకులకు అనుసంధానం చేయడం ద్వారా సకాలంలో రుణాలు లభ్యం కావడానికి, వేసిన పంటలకు తగినట్టుగా రుణం పొందడానికి ఉపయోగపడుతుందని తెలిపారు. నాలుగు కీలక బాధ్యతలను రైతు భరోసాకేంద్రాలు నిర్వర్తించేలా దిశా నిర్దేశం చేశారు. మంగళవారం తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్తో వ్యవసాయ, రెవిన్యూశాఖ అధికారులు సమావేశమయ్యారు. ఈ- పంట విధానంపై వివరాలను సీఎంకు తెలిపారు. ఇదివరకటి సమావేశాల్లో ముఖ్యమంత్రి సూచనలను పరిగణలోకి తీసుకుని ఆండ్రాయిడ్ ఆధారిత అప్లికేషన్ను రూపొందించామని వివరించారు. గ్రామ సచివాలయాల్లోని అగ్రికల్చర్ సహా ఇతర అనుబంధ రంగాల బాధ్యతలు నిర్వర్తిస్తున్న అసిస్టెంట్లు ఈ–పంట రిజిస్ట్రేషన్ చూస్తారని, వ్యవసాయంతోపాటు ఉద్యానవన, సెరికల్చర్, పశుదాణాకు సంబంధించిన పంటలు కూడా ఈ రిజిస్ట్రేషన్లో ఉంటాయని వివరించారు. పంటలతోపాటుగా వెరైటీలనుకూడా ఈ అప్లికేషన్లో పొందుపరుస్తున్నట్టు వెల్లడించారు. సాగు చేస్తున్న పంట మొదటి పంటా, రెండో పంటా, మూడో పంటా, లేక చేపలు పెంచుతున్నారా? ఉద్యాన వన పంటలు వేస్తున్నారా? ఈ పంటల్లో అంతర పంటగా మరో పంటను ఏదైనా వేశారా? సమగ్ర వివరాలు అప్లికేషన్లో పొందుపరచామన్నారు. రబీ సీజన్లో ఈ అప్లికేషన్ను ప్రయోగాత్మకంగా పరిశీలించామని చెప్పారు. వెబ్ల్యాండ్ నమోదు సందర్భంగా ఇదివరకు రైతులు ఇబ్బందులు పడ్డారని, ఈసారి ఆ సమస్యలు లేకుండా చూడాలని సీఎం ఆదేశించారు. సాగుచేసే ప్రతి రైతు ఈ-పంట కింద రిజిస్టర్ అయ్యేలా చూడాలని సీఎం స్పష్టంచేశారు. ఈ పంట కింద వివరాల నమోదు డేటా బ్యాంకులతో అనుసంధానం చేయాలని, దీనివల్ల సాగు చేసిన పంటలకు తగిన రీతిలో రుణాలు పొందే అవకాశం లభిస్తుందని, అంతేకాకుండా పంట బీమాకూడా సమగ్రంగా, వేగంగా పొందే అవకాశం ఉంటుందన్నారు. రైతులు ఏ పంటలు వేశారన్నది ముందుగానే తెలుస్తుంది కాబట్టి సంబంధిత ఉత్పత్తులకు మార్కెట్లో ఎలాంటి రేట్లు లభిస్తున్నాయో పర్యవేక్షణ చేయడంతోపాటు, రైతు నష్టపోతున్న పరిస్థితుల్లో ప్రభుత్వమే జోక్యం చేసుకుని మార్కెట్లో పోటీ పెంచడానికి రైతు భరోసా కేంద్రాల ద్వారా ప్రయత్నాలు చేస్తుందన్నారు. అంతేకాదు రైతులు సాగుచేస్తున్న పంటలకు సంబంధించి ముందస్తుగానే కనీస గిట్టుబాటు ధరలు ప్రకటించి... ఆ రేటుకన్నా.. తక్కువ ధరకు రైతుకు అమ్ముకునే పరిస్థితిని నివారించేలా ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంటుందన్నారు. రెవెన్యూ, వ్యవసాయ శాఖల సంయుక్త బాధ్యతగా ఈ క్రాపింగ్ను చేపట్టాలని, దీనిపై స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్లను రూపొందించుకోవాలన్నారు. ఈ–క్రాపింగు చేసేటప్పుడే బోర్లకింద సాగవుతున్న భూములనుకూడా గుర్తించాలని, డేటాలో ఆ విషయాన్ని కూడా పొందుపరచాలని సీఎం చెప్పారు. వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాల విధివిధానాలపై సీఎం దిశానిర్దేశం చేశారు. ఏ పంటలు వేయాలన్నదానిపై రైతులకు సలహాలు, సూచనలు ఇవ్వడమే కాకుండా మెరుగైన సాగు పద్ధతుల్లో ఈ కేంద్రాలు శిక్షణ ఇవ్వాలన్నారు. సేంద్రీయ, సహజ వ్యవసాయ పద్దతులను రైతులకు నేర్పించాలన్నారు. నాణ్యతతో కూడిన విత్తనాలు, పురుగు మందులు, ఎరువులు పంపిణీ అయ్యేలా చూడాలని, దీంతో పాటు ఈ–పంట కింద వివరాలు నమోదు చేయాలన్నారు. డిమాండు – సప్లయిలను దృష్టిలో ఉంచుకుని వేయాల్సిన పంటలపై రైతులకు సూచనలు చేయాలని, ఈ వివరాలను గ్రామ సచివాలయాల్లో పొందుపరచాలని సీఎం ఆదేశించారు. నాణ్యమైన విత్తనాలు, పురుగు మందులు రైతులకు అందుబాటులో ఉంచడంలో రాజీ వద్దని, ఒక ప్రతిష్టాత్మక సంస్థతో థర్డ్పార్టీ కింద నాణ్యత నిర్ధారణ పరీక్షలు కూడా చేయించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. రైతు భరోసా కేంద్రాల్లో పెడుతున్న కియోస్క్లో ఉంచాల్సిన వివరాలు, డేటాపైన కూడా శ్రద్ధపెట్టాలని, పలానా సమస్య వల్ల తన పంట దెబ్బతింటోందని రైతు నివేదించిన 24 గంటల్లోగా ఆ రైతుకు పరిష్కారం లభించాలని స్పష్టంచేశారు. దీనికోసం ఏర్పాటు చేస్తున్న కాల్సెంటర్ అత్యంత సమర్థవంతంగా పనిచేయాలని, కాల్సెంటర్ను అత్యాధునిక పరిజ్ఞానంతో రూపొందించాలని అధికారులకు నిర్దేశించారు. ఈ సమావేశంలో వ్యవసాయ, రెవిన్యూ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు. -
ల్యాండ్ ఫర్ సేల్!
సాక్షి, హైదరాబాద్: ‘దిల్’మళ్లీ తెరపైకి వచ్చింది. భూముల అమ్మకమే లక్ష్యంగా ఏర్పడ్డ డక్కన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ అనే ఈ సంస్థకు ఊపిరిలూదాలని ప్రభుత్వం నిర్ణయించింది. దిల్ పేరిట గతంలో భూ విక్రయాలు/లీజులు చేపట్టిన ఈ సంస్థను మనుగడలోకి తెచ్చే దిశగా అడుగులు వేస్తోంది. దిల్ అంశాన్ని బడ్జెట్ అనంతరం విలేకరులతో మాట్లాడిన ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్రావు ప్రస్తావించారు కూడా. ఆర్థిక మాంద్యం నేపథ్యంలోప్రభుత్వ ఖజానా ఒడిదుడుకులు ఎదుర్కొంటోంది. ప్రధాన ఆదాయార్జన శాఖలు చతికిలపడటంతో భూముల అమ్మకాలతో పన్నేతర ఆదాయం సమకూర్చుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. రియల్టీ రంగం ఒడిదుడుకులను ఎదుర్కొంటుండటం, కోవిడ్–19తో ఆర్థిక వ్యవస్థ ఆటుపోట్లకు గురవుతున్న తరుణంలో దీని ప్రభావం జీఎస్టీ వసూళ్లపై ఉంటుందని అనుమానిస్తోంది. పదేళ్ల క్రితం ప్రభుత్వ భూముల సేకరణ అమ్మకం/లీజుల్లో క్రియాశీలకంగా పనిచేసిన ‘దిల్’సంస్థకు జవసత్వా లు తీసుకురావాలని నిర్ణయించింది. తద్వారా 2019–20 సవరించిన అంచనాల్లో రూ.12,275 కోట్లు మాత్రమే ఉన్న పన్నేతర ఆదాయాన్ని 2020–21 ఆర్థిక సంవత్సరంలో రూ. 30,600 కోట్లకు పెంచింది. 2,084 ఎకరాలపైనే ఆశ.. హైదరాబాద్ రాజధాని చుట్టూ 2,084 ఎకరాలను దిల్ సంస్థకు గతంలో ప్రభుత్వం కట్టబెట్టింది. ఈ భూములను వినియోగిం చుకోవడంలో ఆ సంస్థ చేతులెత్తేసింది. దీంతో ఇందులో 400 ఎకరాలను రెవెన్యూ శాఖ వెనక్కి తీసుకోగా.. సుమారు 1,584 ఎకరాలు ఆ సంస్థ అధీనంలోనే ఉన్నాయి. ఈ క్రమంలో నిరుపయోగంగా ఉన్న విలువైన భూములను విక్రయించడం ద్వారా ఖజానాను పరిపుష్టం చేసుకోవాలని యోచిస్తోంది. బాచుపల్లిలో 100, గాజుల రామారం 40.33, కుర్మల్గూడ 23.29, కోహెడ 239, అబ్దుల్లాపూర్మెట్ 161, అజీజ్నగర్ 126.29, కొత్వాల్గూడ 265, కొంగరకుర్దు 100, ధర్మారం 65.05, జవహర్నగర్ 60.25, తోలుకట్ట 16.26 ఎకరాలే కాకుండా చాలాచోట్ల దిల్ సంస్థకు భూములు ఉన్నాయి. వీటిని అభివృద్ధి చేసి వేలం వేస్తే పన్నేతర ఆదాయంగా ప్రతిపాదించిన రూ.30,600 కోట్లను సమీకరించడం పెద్దగా కష్టంకాబోదని ప్రభుత్వం అంచనా వేస్తోంది. అందుకే ఈసారి పన్నేతర ఆదాయాన్ని రూ.18వేల కోట్లకు పైగా పెంచి అంచనాలను ప్రతిపాదించింది. బుద్వేల్ భూములు కూడా... ఇదిలావుండగా, నిధుల సమీకరణలో భాగంగా రాజేంద్రనగర్ మండలం బుద్వేల్, శేరిలింగంపల్లి మండలం ఖానామెట్లో కొన్ని భూములున్నాయి. ఐటీ హబ్ కోసం ప్రతిపాదించిన బుద్వేల్లోని టూరిజం, హెచ్ఎండీఏ భూమిలో 50 ఎకరాలను విక్రయించడం ద్వారా ఖజానాకు కాసుల పంట పండుతుందని ప్రభుత్వం భావిస్తోంది. అలాగే, ఖానామెట్ సర్వే నం.41/14లోని 27.04 ఎకరాలను కూడా వేలం వేసేందుకు టీఎస్ఐఐసీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. బహిరంగ మార్కెట్లో ఇక్కడ ఎకరా రూ.40–45 కోట్ల వరకు పలుకుతోంది. -
ఏపీలో ఇకపై ఆటో మ్యుటేషన్ సేవలు..
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్లో రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో ఇకపై ఆటో మ్యుటేషన్ సేవలు అమలు కానున్నాయి. ఆటో మ్యుటేషన్ సేవల పోస్ట్ర్ను మంగళవారం సచివాలయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, రెవెన్యూ శాఖ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ విడుదల చేశారు. దీంతో భూయాజమాన్య హక్కుల మార్పిడి(మ్యుటేషన్) ప్రక్రియలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో ముందడుగు వేసినట్టయింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో రైతులకు చెందిన క్రయ, విక్రయ భూమి వివరాలు రిజిస్ట్రేషన్ చేయబడినప్పటి రెవెన్యూ రికార్డులలో మార్పుల కోసం తహసీల్దారు కార్యాలయం, మీ సేవా కేంద్రాల చుట్టూ తిరగవలసి వచ్చేది. ఈ ప్రక్రియ వల్ల రైతులకు ఆసౌకర్యం కలుగడమే కాకుండా రెవెన్యూ కార్యాలయాల్లో అవినీతికి ఆస్కారం ఏర్పడింది. ఈ నేపథ్యంలో రిజిస్ట్రేషన్ చేయబడిన భూముల వివరాలు రెవెన్యూ రికార్డులలో సత్వరం మార్చడానికి రాష్ట్ర ప్రభుత్వం ఆటో మ్యుటేషన్ సేవలను అందుబాటులోకి తీసుకోచ్చింది. ఆంధ్రప్రదేశ్ భూమి హక్కులు మరియు పట్టాదార్ పాస్బుక్ చట్టం- 1971 ను సవరించడం ద్వారా భూ బదలాయింపు వివరాలు రికార్డు చేయడం కోసం రిజిస్ట్రేషన్ శాఖకు చెందిన అధికారులను తాత్కాలిక(ప్రొవిజనల్) రికార్డింగ్ అధికారులుగా గుర్తించారు. వీరి నియామక అధికారం సంబంధిత జిల్లా కలెక్టర్లకు అప్పగించారు. రిజిస్ట్రేషన్ జరిగిన వెంటనే రెవెన్యూ రికార్డుల ఆన్లైన్ భూమి బదలాయింపు కోసం ఎటువంటి రుసుము చెల్లించనవసరం లేకుండా భూ రికార్డుల మార్పిడి నమూనా (ఆర్ఓఆర్ –1బీ, అడంగల్) వివరాలు ఆన్లైన్ ద్వారా రెవెన్యూశాఖకు పంపబడతాయి. అలాగే ఈ భూ మార్పిడి వివరాలను మీభూమి పబ్లిక్ పోర్టల్ (www.meebhoomi.ap.gov.in) లో సరిచూసుకునే సదుపాయం కూడా ప్రభుత్వం కల్పించింది. కాగా, కృష్ణా జిల్లా కంకిపాడు మండలంలో ఆటో మ్యుటేషన్ సేవలను పైలట్ ప్రాజెక్టుగా చేపట్టిన ప్రభుత్వం.. దానిని విజయవంతంగా అమలు చేసింది. ఈ క్రమంలో ఆటో మ్యుటేషన్ విధానాన్ని రాష్ట్రమంతటా అమలు చేసే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఆటో మ్యుటేషన్ వల్ల ఉపయోగాలు భూ రిజిస్ట్రేషన్ మొదలు, ఈ - పాసుబుక్ జారీ వరకు మొత్తం ప్రక్రియ ఆన్లైన్లో జరగనుంది. ఇకపై పట్టాదారులు ఆన్లైన్ భూ బదలాయింపు కోసం మీ సేవా కేంద్రాలు, తహసీల్దార్ కార్యాలయాల్లో ప్రత్యేకంగా దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదు. భూ బదలాయింపు ప్రక్రియ ప్రతి దశకు సంబంధించిన అప్డేట్ పట్టాదారు మొబైల్ నంబరుకు సంక్షిప్త సమాచారం ద్వారా అందనుంది. 30 రోజుల్లో తహసీల్దార్ ధ్రువీకరణ, తర్వాత రెవెన్యూ రికార్డుల నందు ఆర్ఓఆర్-1బీ లో శాశ్వత నమోదు అనంతరం ఈ - పాసుబుక్ వెంటనే పొందే అవకాశం -
బిగుస్తున్న ఉచ్చు..!
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్/ ఊట్కూరు: ఎట్టకేలకు... రెవెన్యూలో అవినీతి ఉద్యోగుల ఆట కట్టయింది. ప్రభుత్వ భూములను తమ కుటుంబీకులు, బంధువుల పేర్ల మీద పట్టా చేసుకున్న నారాయణపేట జిల్లా ఊట్కూరు మండలానికి చెందిన ముగ్గురు వీఆర్ఏలపై సస్పెన్షన్ వేటు పడింది. ఓ వీఆర్వోపై మంగళవారం చర్యలు తీసుకునే అవకాశం ఉంది. సర్కారు భూములను కాపాడాల్సిన ఉద్యోగులే వాటిని కబ్జా చేసిన తీరుపై ఈ నెల ఎనిమిదో తేదీన ‘సాక్షి’ దినపత్రికలో ‘సర్కారు భూమికి ఎసరు?’ అనే శీర్షికతో కథనం ప్రచురితమైంది. దీనిపై స్పందించిన జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి ఊట్కూర్ వీఆర్వో భీమయ్య, వీఆర్ఏ రాజప్ప, భీంరావు, బాపూర్ వీఆర్ఏ జ్యోతిలను సస్పెండ్ చేయాలని అధికారులను ఆదేశించారు. దీంతో వీఆర్ఏలను తహసీల్దార్ దానయ్య సస్పెండ్ ఉత్తర్వులు జారీ చేయగా.. వీఆర్వో భీమయ్యపై నివేదికను సిద్ధం చేసి కలెక్టర్కు పంపారు. ఆయన్ను కలెక్టర్ మంగళవారం సస్పెండ్ చేయవచ్చని అధికార వర్గాలు తెలిపాయి. ఊట్కూర్ శివారులోని సర్వే నం. 708/2, 3–11 ఎకరాలు, సర్వే నం. 194అ లో 1–12 గుంటలు, సర్వే నం. 702అ లో ఎకరం, సర్వే నం. 703/2లో 3–38 ఎకరాలు, దంతన్పల్లి శివారులోని సర్వే నం.189/ఉ,, సర్వే నం. 189/ఊ, రెండెకరాల చొప్పున, బాపూర్ గ్రామ శివారులోని సర్వే నం. 30/ఎఅ లో ఐదెకరాలు మొత్తం 21.81ఎకరాలనుతమ కుటుంబీకుల పేరిట పట్టా చేసుకున్న విషయాన్ని ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చింది. దీనిపై విచారణ జరిపిన తహసీల్దార్ దానయ్య అక్రమాలు వాస్తవమేనని నిర్ధారణకు వచ్చారు. నివేదికను కలెక్టర్ను పంపడంతో ఆమె నలుగురు రెవెన్యూ ఉద్యోగులను సస్పెండ్ చేయాలని ఆదేశింశారు. పాత్రధారులా? సూత్రధారులా? నారాయణపేట జిల్లా ఊట్కూరు మండలంలో ప్రభుత్వ భూముల అక్రమ బదలాయింపులపై ‘సాక్షి’ వరుస కథనాలు సంచలనం రేపిన విషయం తెలిసిందే. ఈ నెల 8న ‘సర్కారు భూమికి ఎసరు?’ శీర్షికతో 21.81 ఎకరాల ప్రభుత్వ భూమి అన్యాక్రాంతంపై కథనం ప్రచురించగా.. 10వ తేదీన ‘భూ మాయ’ శీర్షికతో అదే మండలంలో మరో 75 ఎకరా ల ప్రభుత్వ స్థలం బయటి వ్యక్తులకు అక్రమంగా ప ట్టా చేసిన ఉదంతంపై కథనం ప్రచురించింది. కథనా లపై స్పందించిన కలెక్టర్ హరిచందన దాసరి.. అక్రమాల వ్యవహారంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యతాయుత ఉద్యోగాల్లో కొనసాగుతూ ప్రభుత్వ భూ ముల్నే కాజేసిన సిబ్బందిపై వేటు వేశారు. అలాగే.. అక్రమ పట్టాలు సృష్టించి ఇతరులకు 75 ఎకరాలు ధారాదత్తం చేసిన ఉద్యోగులపైనా కూడా చర్యలు తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక్కడి వరకు బాగానే ఉన్నా.. ఈ అక్రమ వ్యవహారంలో వేటు పడ్డ ఉద్యోగులు కేవలం పాత్రధారులేనని.. అసలు సూత్రధారులు పైస్థాయి అధికారులేననే చర్చ ఉమ్మడి జిల్లాలోనే హాట్టాపిక్గా మారింది. పైస్థాయి అధికారుల ప్రమేయం లే కుండా భూ అక్రమం అసాధ్యమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అందుకే ఇంత పెద్ద మొత్తంలో ప్రభుత్వ భూములు ఇతరుల పేరిట పట్టాలుగా మారినా పైస్థాయి అధికారులు ఉద్యోగులపై చర్యలు తీసుకోలేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గతంలో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు విచారణ జరిపించిన అధికారులు తప్పుడు నివేదికలు సమర్పించిన ట్లు ప్రచా రం జరుగుతోంది. తాజాగా ఇటీవల నూత న బాధ్య తలు చేపట్టిన కలెక్టర్ హరిచందన ఈ వ్యవహారాన్ని సీరియస్గా పరిగణిస్తున్నారు. దీంతో అక్రమ పట్టాల విషయంలో సమగ్ర విచారణ జరిపించి సస్పెండ్ అయిన ఉద్యోగులకు అండగా నిలిచిన అధికారులపైనా వేటు వేస్తారనే చర్చ జోరుగా సాగుతోంది. సమగ్ర సర్వే చేపడతాం.. మండలంలో ప్రభుత్వ భూములు పెద్ద మొత్తంలో ఇతరుల పేరిట పట్టాలుగా మారాయని తెలుస్తోంది. ఇప్పటికే ఈ వ్యవహారంలో జిల్లా కలెక్టర్ సీరియస్గా ఉన్నారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ముగ్గురు వీఆర్ఏలను సస్పెండ్ చేశాను. ఓ వీఆర్వో అక్రమాలపై ఉన్నతాధికారులకు నివేదిక పంపాను. మండలంలో ఉన్న ప్రభుత్వ భూములన్నింటినీ సర్వే చేస్తాం. అక్రమ పట్టా, రైతుబంధుతో లబ్ధిపొందిన వారిపై క్రిమినల్ చర్యలు తీసుకుంటాం. ఈ విషయంలో ఎవరినీ ఉపేక్షించేది లేదు. – దానయ్య, తహసీల్దార్, ఊట్కూరు -
ఆధార్ ఉంటే చాలు.. నిమిషాల్లోనే పాన్ కార్డ్!
న్యూఢిల్లీ: పాన్ కార్డ్ పొందడం అత్యంత సులభతరం కానుంది. ఇక నుంచి ఎటువంటి ఇబ్బంది లేకుండా, కేవలం ఆధార్ నంబర్ ఆధారంగా సత్వరమే పాన్ కార్డును అందుకోవచ్చని రెవెన్యూ శాఖ కార్యదర్శి అజయ్ భూషణ్ పాండే వెల్లడించారు. ఆదాయ పన్ను శాఖ వెబ్సైట్లో ఆధార్ నెంబర్ను ఎంటర్ చేయగానే నమోదిత మొబైల్కు వన్ టైం పాస్ వార్డ్ (ఓటీసీ) వస్తుందని, దీనిని ఎంట్రీ చేసి వెంటనే ఈ–పాన్ కార్డును డౌన్లోడ్ చేసుకోవచ్చని వివరించారు. ఈ నెలాఖరు నాటికే నూతన సేవలను అందించాలని భావిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. -
ఇక ఆటోమేటిక్ మ్యుటేషన్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో భూముల క్రయ విక్రయాలకు సంబంధించి ఆటోమేటిక్ మ్యుటేషన్ను పక్కాగా అమలులోకి తేవాలని ప్రభుత్వం నిర్ణయించింది. భూములు కొనుగోలు చేసిన వారు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ చేసుకోగానే రెవెన్యూ అధికారులే వారి పేరుతో రికార్డులను సవరించటాన్ని ఆటోమేటిక్ మ్యుటేషన్ అంటారు. తద్వారా కొనుగోలుదారులు రెవెన్యూ రికార్డుల్లో సవరణ కోసం ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఇన్నాళ్లూ మీ–సేవే శరణ్యం ప్రస్తుతం భూములను కొన్నవారే రెవెన్యూ రికార్డుల్లో తమ పేరుతో మార్చాలని కోరుతూ నిర్దిష్ట రుసుము చెల్లించి మీ–సేవలో దరఖాస్తు చేసుకుంటున్నారు. ఇందుకు రిజిస్ట్రేషన్ దస్తావేజులు, ఇతర పత్రాలను స్కాన్చేసి ఆధారాలుగా చూపాల్సి ఉంటుంది. అయితే ఇలా మ్యుటేషన్ కోసం దరఖాస్తు చేసినా రెవెన్యూ సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ముడుపులిస్తేనే మ్యుటేషన్లు చేస్తున్నారనే విమర్శలు గత ప్రభుత్వ హయాంలో తీవ్ర స్థాయిలో వ్యక్తమయ్యాయి. సబ్ రిజిస్ట్రార్ నుంచి రోజూ వివరాలు.. అవినీతి రహితంగా, ప్రజలకు పారదర్శక పాలన అందించాలన్న ముఖ్యమంత్రి జగన్ ఆదేశాలు, డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్ మార్గనిర్దేశం మేరకు రెవెన్యూ శాఖలో ఆటోమేటిక్ మ్యుటేషన్ దిశగా కసరత్తు ఆరంభమైంది. ఆటోమేటిక్ మ్యుటేషన్, ఇతర అంశాలపై రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి వి.ఉషారాణి సోమవారం సచివాలయంలో అధికారులతో సమీక్షించారు. ఆటోమేటిక్ మ్యుటేషన్కు ఏర్పాట్లు చేయాలని ఆమె అధికారులను ఆదేశించారు. ఇది అమల్లోకి వచ్చిన తర్వాత జరిగే భూముల రిజిస్ట్రేషన్లు అన్నీ నెల రోజుల్లోగా రెవెన్యూ రికార్డుల్లో మార్పుచేర్పులు చేస్తారు. రిజిస్ట్రేషన్ వివరాలను సబ్ రిజిస్ట్రారు కార్యాలయం ఏ రోజుకారోజు సంబంధిత తహసీల్దారు కార్యాలయానికి పంపుతుంది. తహసీల్దారు దీన్ని పరిశీలించి నెల రోజుల్లోగా రెవెన్యూ రికార్డుల్లో మార్పులు చేస్తారు. గ్రామ సచివాలయాల్లోనే 63 సర్టిఫికెట్ల జారీ ప్రజలకు ఆదాయ ధ్రువీకరణ, కుల ధ్రువీకరణ లాంటి 63 రకాల సర్టిఫికెట్లను గ్రామ సచివాలయాల్లోనే జారీ చేయాలని రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి ఉషారాణి ఆదేశించారు. గ్రామ సచివాలయాలు అందుబాటులోకి వచ్చినందున ప్రజలు సర్టిఫికెట్ల కోసం తహసీల్దారు కార్యాలయాలకు వెళ్లాల్సిన పని లేదని స్పష్టం చేశారు. చుక్కల భూముల పరిస్థితిపై కూడా ఆమె సమీక్షించారు. -
రైతును ‘రెవెన్యూ’తో కలపాలి
ఇటీవల అబ్దుల్లాపూర్మెట్ తహసీల్దారు విజయారెడ్డి సజీవదహనం ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ ఘటనకు కారణమైన భూములు, దాని వెనుక ఉన్న రాజకీయ నాయకుల వంటి అంశాలు పక్కకు పోయి రెవెన్యూ శాఖపై ప్రజల ఆగ్రహానికి దారి తీయడం కొంత ఇబ్బంది కలిగించే అంశం. ఈ వివాదాలన్నిటికీ నిజాం కాలం నాటి సర్వేనే ఇప్పటికీ అమల్లోకి ఉండడం, చట్టాలలో లొసుగులు కారణం. 1936– 42 వరకు తెలంగాణ వ్యాప్తంగా భూ సర్వే జరిగింది. అప్పుడే రికార్డులు అమలు అయినాయి. ఎక్కువ భాగం భూములన్నీ భూస్వాముల చేతుల్లో కేంద్రీకృతమైనందున, సన్న, చిన్నకారు రైతులకు నామ మాత్రంగా భూములుండటంతో భూ వివాదాలు చోటు చేసుకోలేదు. తెలంగాణ సాయుధ పోరాట నేపథ్యంలో ‘‘దున్నే వాడికే భూమి’’ అనే నినాదం తెరపైకి రావడంతో లక్షలాది ఎకరాల ప్రభుత్వ భూములు, కౌలు భూములు పేదలకు ధారాదత్తం అయినాయి. అయితే చాలా చోట్ల సర్వే నంబర్ల హద్దు తొలగించడంతో భూ వివాదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఫలితంగా రెవెన్యూ చట్టానికి కొన్ని సవరణలు తెచ్చారు. అందులో అసైన్మెంట్ చట్టం, కౌలుదారుల హక్కుల చట్టం, ఇనాం భూముల చట్టం, దేవాదాయ, వక్ఫ్ భూములలాంటివి ఎన్నో. అంతే కాకుండా రికార్డులను సరి చేయడానికి ‘‘రికార్డ్స్ ఆఫ్ రైట్’’ ద్వారా పాసు పుస్తకాలివ్వడంలాంటివి జరిగాయి. పహానిలో విధిగా అనుభవదారు కాలం పెట్టి, ప్రతి సంవత్సరం పంట వివరాలు రాస్తూ, గ్రామసభల ద్వారా తెలియపరచాలి. అప్పుడు రైతు భూమి వివరాలు, రెవెన్యూ శాఖకు సంబంధం ఏర్పడుతుంది. ప్రభుత్వం తక్షణమే రెవెన్యూ చట్టాల మార్పు నకు నడుం బిగించాలి. ప్రజలు కేంద్రంగా ఉండే విధంగా రెవెన్యూ చట్టాలు మార్చాలి. అందుకు కొన్ని సూచనలు 1.గ్రామస్థాయిలో శాస్త్రీయ పద్ధతులలో సమగ్ర భూసర్వే ప్రక్షాళన కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టాలి. అందుకు తగిన రీతిలో ప్రభుత్వం రూపొందించే రెవెన్యూ బిల్లుపై విస్తృతస్థాయి చర్చకు అవకాశం కల్పించాలి. 2.తక్షణమే శాస్త్రీయ పద్ధతిలో భూ సర్వే చేపట్టాలి. గ్లోబల్ పొజిషనింగ్ సిస్టం, సాటిలైట్ ఇమేజినరీ టెక్నాలజీ, జియోగ్రాఫికల్ ఇన్ఫర్మేషన్ వంటి టెక్నాలజీని వినియోగించాలి. ప్రతి సర్వే నెంబర్ హద్దులను నిర్ణయించి, హద్దురాళ్ళును పాతించి, శాశ్వతంగా వివాదాలను పరిష్కరించాలి. 3.రెవెన్యూ పరిపాలన గ్రామస్థాయి నుండి వేళ్ళూనటానికి, సమస్యలు పరిష్కారం కావడానికి గ్రామస్థాయిలో విధిగా రెవెన్యూ అధికారిని నియమించాలి. 4.వారసత్వం, కుటుంబ భూ పంపకం, క్రయవిక్రయాలు, గిఫ్టు డీడ్, కోర్టు డిక్రి, అసైన్మెంట్ ద్వారా పొందే భూములకు భూమిపై హక్కు కల్పించే క్రమాన్ని పూర్తి చేయడానికి సంబంధిత రెవెన్యూ అధికారికి నిర్ధిష్టకాల పరిమితి విధించాలి. 5.పెండింగ్లో వున్న సాదాబైనామాల క్రయవిక్రయాల దరఖాస్తులను వీలైనంత త్వరగా క్రమబద్దీకరణ చేయడానికి పూనుకోవాలి. 6.రికార్డు ఆఫ్ రైటస్ (ఆర్.వొ.ఆర్) చట్టంలో వున్న లొసుగులను తొలగించాలి. 7.పట్టాదారు పాసుపుస్తకాలలో అవకతవకలను సరిదిద్దాలి. 8.అటవీ శాఖ, రెవెన్యూశాఖల స్వాధీనంలోని భూముల హద్దులను తక్షణమే సరిచేయాలి. 9.పోడు భూముల సమస్యను పరిష్కరించాలి. అటవీ హక్కుల చట్టం కింద గిరిజనులకు పట్టాలివ్వాలి. 10.కోనేరు రంగారావు కమిటీ చేసిన 104 సిఫారసులను దృష్టిలో ఉంచుకొని రెవెన్యూ చట్టాలను సవరించడం సబబుగా ఉంటుంది. 11.రికార్డులను తారుమారు చేసినా, తప్పులతో నమోదు చేసినా కారకులైన సిబ్బందిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలి. 12.రెవెన్యూ శాఖతో రైతుల సంబంధాల పునరుద్ధరణ కొరకు తగు కార్యాచరణ ఉండాలి. 13.హైదరాబాద్, పరిసర ప్రాంతాల్లో భూములను హెచ్ఎండిఎ తదితర సంస్థలు వేలం వేసే భూముల్లో ప్రభుత్వమే అపార్ట్మెంట్లు కట్టించి అందుబాటు ధరలో కేటాయించాలి. వ్యాసకర్త: చాడ వెంకటరెడ్డి సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి మొబైల్ : 94909 52301 -
కృష్ణా, గోదావరి బోర్డుల్లో అడ్మినిస్ట్రేటివ్ సభ్యుడిగా సోమేశ్ కుమార్
సాక్షి, హైదరాబాద్: కృష్ణా, గోదావరి బోర్డుల్లో రాష్ట్రం తరఫున అడ్మినిస్ట్రేటివ్ సభ్యుడిగా రెవెన్యూ శాఖ స్పెషల్ చీఫ్సెక్రటరీ సోమేశ్ కుమార్ని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నిజానికి ఈ పోస్టులో నీటి పారుదల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సభ్యుడిగా ఉంటారు. అయితే గతంలో శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా సోమేశ్ ఉండటంతో ఆయన్నే సభ్యుడిగా నియమించారు. తర్వాత ఆయన్ను రెవెన్యూ శాఖకు బదిలీ చేయడంతో ఆ బాధ్యతలు సీఎస్ జోషి చూడాల్సి ఉంది. జోషి వచ్చే నెలలో రిటైర్ అవుతుండటంతో సోవేశ్నే సభ్యుడిగా నియమిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. -
రెవె‘న్యూ’ ఆలోచన!
సాక్షి, నల్లగొండ : రెవెన్యూ సమస్యల పరిష్కారానికి ఇన్చార్జ్జ్ కలెక్టర్ వనమాల చంద్రశేఖర్ కొత్త ఆలోచనకు శ్రీకారం చుట్టారు. జిల్లాలో పెండింగ్ సమస్యల పరిష్కారం కోసం నెల రోజుల పాటు ప్రత్యేక గ్రీవెన్స్ను నిర్వహించాలని నిర్ణయించారు. ప్రభుత్వం భూ ప్రక్షాళన సందర్భంగా పాత పాస్పుస్తకాల స్థానంలో కొత్త పాస్ పుస్తకాలను ఇస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఎలాంటి సమస్యలు లేని భూములను కేటగిరీ–ఏలో, సమస్యలు ఉన్న వాటిని కేటగిరీ–బీలో చేర్చారు. ఏ–కేటగిరీలో ఉన్న భూములకు సంబంధించి పాస్ పుస్తకాల పంపిణీ 95శాతం పైబడి పూర్తయ్యాయి. పార్ట్–బీలోనే సమస్యలు వివిధ స్థాయిల్లో ఉన్నాయి. జిల్లాలో ఇప్పటివరకు 4,46,345 పట్టాదారు పాస్ పుస్తకాలకు సంబంధించి డిజిటల్ సంతకాలు అయ్యాయి. అందులో 4,35,350 పాస్ బుక్లు రైతులకు అందించారు. 7,294 పాస్ పుస్తకాలు వివిధ దశల్లో పెండింగ్లో ఉన్నాయి. 12,488 నాన్ అగ్రికల్చర్ ఖాతాలను పరిష్కరించారు. ఇదిలా ఉంటే బీ– కేటగిరీలో దాదాపు 23,161 వరకు పెండింగ్ ఖాతాలు ఉన్నాయి. కాగాఇటీవల చందంపేట మండలంలో అటవీభూములకు అధికారులు అక్రమంగా పాస్ పుస్తకాలు జారీ చేయగా.. ప్రస్తుతం వాటిని రద్దు చేశారు. పెండింగ్ ఖాతాల పరిష్కారానికి కసరత్తు జిల్లాలో బీ–కేటగిరీలో ఉన్న పెండింగ్ ఖాతా లను పరిష్కరించేందుకు ఇన్చార్జ్ కలెక్టర్ ఆధ్వర్యంలో జిల్లా యంత్రాంగం ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేసింది. వివిధ స్థాయిల్లో పెండింగ్లో ఉన్న సమస్యలపై నిత్యం రైతులు ఉన్నతాధికారుల వద్దకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇన్చార్జ్ కలెక్టర్, జాయింట్ కలెక్టర్ వనమాల చంద్రశేఖర్ రెండు మాసాల క్రితమే ఈ సమస్యలపై ప్రత్యేక గ్రీవెన్స్ను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అయితే కలెక్టర్ బదిలీ కావడంతో ఆయన ఇన్చార్జ్ బాధ్యతలు తీసుకోవాల్సి వచ్చింది. కాగా ఇటీవల తహసీల్దార్ విజయారెడ్డి హత్య నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా రెవె న్యూ అధికారులు భయాందోళనకు గురయ్యా రు. విధులు బహిష్కరించారు. కేటీఆర్ హామీ తో ఇటీవలే విధుల్లో చేరిన విషయం తెలిసిందే. కాగా తహసీల్దార్ల బదిలీలు కూడా అవు తా యన్న నేపథ్యంలో ఈ ప్రక్రియ ఆ లస్యమైంది. తహసీల్దార్ల బదిలీలు పూర్త వ్వడంతో ఈ కార్యక్రమం ముందుకు పోనుంది. 20లోగా పార్ట్–బీలోని సమస్యపై నివేదిక ఇవ్వాలని ఆదేశం ఈ నెల 20వ తేదీలోగా ఆయా మండలాల వారీగా తహసీల్దార్లంతా పార్ట్ బీలో ఎన్ని సమస్యలు ఉన్నాయో జాబితాను సమర్పించాలని ఇన్చార్జ్ కలెక్టర్ ఆదేశించారు. సోమవారం ఆయా మండలాల వారీగా తహసీల్దార్లు, డీటీలు, సూపరింటెండెంట్లు, వీఆర్ఓ, వీఆర్ఏలు, సర్వేయర్లతో పాటు కార్యాలయ సిబ్బంది అంతా కూర్చొని పెండింగ్ ఖాతాలపై చర్చిస్తారు. సంబంధిత ఖాతా సమస్య పరిష్కారం అవుతుందా, కాదా, కాకపోతే ఎందుకు కాలేకపోతుంది, అనే విషయాలపై చర్చించి ఆ వివరాల జాబితాను బుధవారంలోగా కలెక్టరేట్కు పంపించాలి. 21న ఉదయం, సాయంత్రం పెండింగ్ ఖాతాలపై చర్చ ఈనెల 21న డీఆర్ఓ, ఆర్డీఓలు, తహసీల్దార్లతో ఉదయం కలెక్టర్ ఆయా మండలాల వారీగా ఉన్న పెండింగ్ ఖాతాలపై చర్చిస్తారు. పరిష్కారం అయ్యేవి ఎన్ని, కానివి ఎన్ని, ఒకవేళ అయితే అవి ఏ స్థాయిలో ఆగాయి అనేది చర్చించనున్నారు. అదే రోజు మధ్యాహ్నం 2గంటలకు ఉదయాదిత్య భవన్లో డీఆర్ఓ, ఆర్డీఓలు, ఏఓ, డీఏఓలు, తహసీల్దార్లు, డీటీలు, సూపరింటెండెంట్లు, గ్రామస్థాయిలో వీఆర్ఏ, వీఆర్ఓలతో పాటు రెవెన్యూ సిబ్బందితో సమావేశం ఉంటుంది. ఆయా డివిజన్ల వారీగా ఉన్న పెండింగ్ సమస్యలను క్షుణ్ణంగా చర్చిస్తారు. ఏయే ఖాతా, ఏ స్థాయిలో నిలిచిపోయింది. ఆ ఖాతా స్వరూపమేంటీ, ప్రస్తుతం తహసీల్దారా, ఇతర సిబ్బంది స్థాయిలో ఆగిపోయిందా, ఆగితే ఎందుకు ఆగింది అనే విషయాలపై చర్చిస్తారు. అందులో వీలైనన్ని ఖాతాలను పరిష్కరిస్తారు. మిగతా వాటిని ఎలా పరిష్కరించాలనే దానిపై చర్చిస్తారు. ఒకవేళ పరిష్కారం కాకపోతే రాత పూర్వకంగా ఆ ఖాతాదారుడు ఏ అధికారి వద్దకు వెళ్లాలనేది తెలియజేస్తారు. 25 నుంచి భూ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక గ్రీవెన్స్ ఈ సమావేశాల అనంతరం కలెక్టరేట్లో ఈ నెల 25వ తేదీనుంచి భూ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక గ్రీవెన్స్ను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. నెలరోజులపాటు ప్రతి సోమవారం ఇది ఉంటుంది. వీడియో కాన్ఫరెన్స్ హాల్లో గ్రీవెన్స్ ఏర్పాటు చేసి ఎవరైతే భూ సమస్యలపై రైతులు వస్తారో వారి వద్దనుంచి ఫిర్యాదు తీసుకొని అక్కడే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంబంధిత మండల తహసీల్దార్తో మాట్లాడుతారు. ఆ రైతు ఏ గ్రామానికి చెందిన వ్యక్తో ఆ వీఆర్ఏ, వీఆర్ఓ, సర్వేయర్ తదితర వారితో ముఖాముఖి మాట్లాడిస్తారు. ఆ సమస్య పరిష్కారం అవుతుందా, కాదా, అయితే ఎన్ని రోజుల్లో అవుతుంది, ఆ తేదీని చెబితే అదే రోజు మండలానికి వెళ్లాలని కలెక్టరేట్ అధికారులు ఆ రైతుకు సూచిస్తారు. ఒకవేళ ఆ సమస్య మండల స్థాయిలో పరిష్కారం కాకుంటే అక్కడి తహసీల్దార్ పరిష్కారం కాదు అంటూ అక్కడినుంచే మెయిల్లో సమాచారాన్ని కలెక్టరేట్కు పంపిస్తారు. అది తీసుకొని ఆ పట్టాదారు ఎక్కడికి వెళ్లే పరిష్కారం అవుతుందో అంటే ఆర్డీఓ కోర్టు లేదా జేసీ కోర్టు లేదా సివిల్ కోర్టుకు వెళ్లాలా అనేది రాతపూర్వకంగా సూచించనున్నారు. పారదర్శకంగా భూ సమస్యల పరిష్కారం పారదర్శకంగా భూ సమస్యల పరిష్కారానికి జిల్లా యంత్రాంగం పనిచేస్తోంది. ఇప్పటికే పార్ట్–ఏ లోని భూమికి సంబంధించి పాస్ పుస్తకాలు దాదాపు అందించాం. మిగిలినవి అందించేందుకు ప్రక్రియ కొనసాగుతోంది. పార్ట్బీలోని పెండింగ్ ఖాతాల పరిష్కారానికి జిల్లా స్థాయిలో రెవెన్యూ అధికారులు, సిబ్బందితో చర్చించి చర్యలు తీసుకోబోతున్నాం. ఈనెల 21న జిల్లా స్థాయిలో పెండింగ్ ఖాతాలపై సమావేశం నిర్వహిస్తున్నాం. ఆ తర్వాత ప్రతి సోమవారం కలెక్టరేట్లో భూ సమస్యలపై ప్రత్యేక గ్రీవెన్స్ నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమంతో జిల్లాలో చాలా వరకు పెండింగ్లో ఉన్న సమస్యలు పరిష్కారమవుతాయని ఆశిస్తున్నాం. – చంద్రశేఖర్, ఇన్చార్జ్ కలెక్టర్ -
ఫారెస్ట్, రెవెన్యూ ‘బార్డర్ వార్’
సాక్షి, హైదరాబాద్: అటవీ, రెవెన్యూ శాఖల మధ్య హద్దుల వివాదాలు ఎంతకీ తెగడం లేదు. ఏవి అటవీ భూములు, ఏవి రెవెన్యూ భూములు అన్న దానిపై స్పష్టత సాధించే ప్రయత్నాలు కొలిక్కి రావడంలేదు. ఈ రెండు శాఖల మధ్య భూవివాదాలకు సంబంధించి రికార్డుల రూపంలో స్పష్టత సాధించకపోవడం సమస్యగా మారింది. వివాదాల పరిష్కారానికి రెవెన్యూ శాఖ తగిన చొరవ తీసుకోవడం లేదని అటవీశాఖ అధికారులు భావిస్తున్నారు. కొన్నేళ్లుగా ఈ పంచాయతీకి తాము తెరదించాలని చూస్తున్నా రెవెన్యూశాఖ పెద్దగా స్పందించకపోవడంతో సమస్య పరిష్కారం కావడం లేదని అటవీశాఖ అధికారులు మండిపడుతున్నారు. గ్రామస్థాయి మొదలుకుని రాష్ట్రస్థాయి వరకు భూములకు సంబంధించి అటవీశాఖ వద్ద పక్కా రికార్డులున్నా, వివాదాలుగా పేర్కొంటున్న భూముల్లో సమస్య పరిష్కారానికి రెవెన్యూశాఖ ఎలాంటి చర్యలు చేపట్టడం లేదన్నారు.అయితే ఏ శాఖకు ఆ శాఖ వేర్వేరుగా రికార్డులను నిర్వహించడంతో పాటు, వాటి నమోదు కూడా సరిగా చేయకపోవడం వల్ల సమస్యలు తలెత్తుతున్నాయని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. పూరిస్థాయిలో అటవీ భూముల సర్వే చేయకపోవడం, తమ భూమి అంటే తమ భూమి అని రెండుశాఖలు రికార్డులకు ఎక్కించడం వల్ల వివాదాలు ఏర్పడ్డాయని అంటున్నారు. మొత్తం 60 లక్షల ఎకరాల్లో... తెలంగాణలో మొత్తం 60 లక్షల 646 ఎకరాల మేర అటవీశాఖ భూమి ఉన్నట్టుగా రికార్డులు చెబుతున్నాయి. ఇందులో 49.80 లక్షల ఎకరాలు ఎలాంటి వివాదాలు లేకుండా, రికార్డుల పరంగా క్లియర్గా ఉన్నాయి. ఇటీవల వరకు సిద్ధం చేసిన లెక్కల ప్రకారం ప్రధానంగా పదిన్నర లక్షల ఎకరాల్లోని భూముల పరిధిలో అటవీ, రెవెన్యూ శాఖల మధ్య సరిహద్దు వివాదాలు నెలకొన్నాయి. మహబూబాబాద్ జిల్లాలో 3.44 లక్షల ఎకరాలుండగా అందులో అత్యధికంగా 2.89 లక్షల ఎకరాలు ఈ వివాదాల్లో ఉంది. వరంగల్ రూరల్ జిల్లాలో 38 వేల ఎకరాలుండగా, వాటిలో 26 వేల ఎకరాల్లో.. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో మొత్తం 5.29 లక్షల ఎకరాలుండగా వివాదాల్లో 1.86 లక్షల ఎకరాలు, ఆదిలాబాద్ జిల్లాలో 4.33 లక్షల ఎకరాలకుగాను 1.50 లక్షల ఎకరాల్లో వివాదాలు, వికారాబాద్ జిల్లాలో 1.08 లక్షల ఎకరాలకు గాను 42వేల ఎకరాలు, నిర్మల్ జిల్లాలో 3.16 లక్షల ఎకరాలకు గాను 70 వేల ఎకరాల్లో, ఖమ్మం జిల్లాలో 1.42 లక్షల ఎకరాలుండగా వాటిలో 35 వేల ఎకరాలు, నల్లగొండ జిల్లాలో 52 వేల ఎకరాలకు గాను 13 వేల ఎకరాలు భూ వివాదాల్లో ఉన్నట్టుగా ఈ లెక్కలను బట్టి తెలుస్తోంది. ఇదిలా ఉంటే అటవీ శాఖకు చెందిన ఎలాంటి వివాదాలకు తావులేని భూమిగా గుర్తించిన 49.80 లక్షల ఎకరాలకు సంబంధించి గత నెల చివరి వరకు ఇంటిగ్రేటెడ్Š ల్యాండ్ రికార్డ్ మేనేజ్మెంట్ సిస్టమ్ (ఐఎల్ఆర్ఎంఎస్–నోషనల్ ఖాటా మార్కింగ్)లో 28.50 లక్షల ఎకరాలు రికార్డ్ అయ్యాయి. ఇంకా 21.30 లక్షల ఎకరాలు నోషనల్ ఖాటా మార్కింగ్ చేపట్టాల్సి ఉంది. -
మూడు రోజులు విధుల బహిష్కరణ
సాక్షి, హైదరాబాద్: తహశీల్దార్ విజయారెడ్డి హత్యకు నిరసనగా మూడు రోజులపాటు విధులు బహిష్కరించాలని తెలంగాణ రెవెన్యూ ఉద్యోగుల సంఘం అధ్యక్ష, కార్యదర్శు లు వంగా రవీందర్రెడ్డి, గౌతమ్కుమార్ పిలుపునిచ్చారు. మహిళా అధికారిని హత్య చేయడం అత్యంత దుర్మార్గమైన, హేయమైన చర్య అని ఓ ప్రకటనలో ఖండించారు. విజయారెడ్డి అంతిమ యాత్రలో పాల్గొనేందుకు రెవెన్యూ ఉద్యోగులంతా హైదరాబాద్ తరలిరావాలని కోరారు. నిందితుల వెనుక ఉన్న కుట్రదారులను గుర్తించి కఠినంగా శిక్షించాలని, మహిళా ఉద్యోగులకోసం రక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులకు రక్షణ కల్పించాలి: తెలంగాణ ఉద్యోగుల జేఏసీ తహసీల్దార్ విజయారెడ్డి దారుణహత్యకు గురికావడం దురదృష్టకరమని తెలంగాణ ఉద్యోగుల జేఏసీ అధ్యక్ష, కార్యదర్శులు కారం రవీందర్రెడ్డి, వి.మమత అన్నారు. ఇటువంటి ఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా అధికారులు, ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం రక్షణ కలి్పంచాలని డిమాండ్ చేశారు. మృతురాలి కుటుంబ సభ్యులకు తెలంగాణ ఉద్యోగ ఉపాధ్యాయ గెజిటెడ్ అధికారుల పెన్షనర్లు, కారి్మకుల ఐక్యత కార్యాచరణ సమితి ప్రగాఢ సానుభూతి తెలిపింది. -
రెవెన్యూలో భయం.. భయం!
సాక్షి, హైదరాబాద్: పట్టపగలే ఓ మహిళాధికారి దారుణహత్యకు గురికావడం రాష్ట్ర ప్రజలను ఉలికిపాటుకు గురిచేసింది. తహసీల్దార్ విజయారెడ్డిని ఆమె పనిచేస్తున్న చోటే సజీవదహనం చేసిన ఘటన సంచలనం సృష్టించింది. ఈ ఘటనకు కారణమేదైనా రాష్ట్ర రెవెన్యూ యంత్రాంగం మాత్రం ఆందోళనకు గురైంది. భూరికార్డుల ప్రక్షాళన అనంతరం రెవెన్యూ వ్యవస్థపై వస్తున్న ఆరోపణలు, నిందలతో సతమతమవుతున్న రెవెన్యూ యంత్రాంగం తాజా ఘటనతో మరింత ఆందోళనకు లోనైంది. విషయం తెలుసుకున్న వెంటనే రెవెన్యూ సంఘాల నేతలు ఘటనను తీవ్రంగా ఖండించడంతోపాటు విధులను కూడా బహిష్కరించాలని పిలుపునిచ్చినా.. ఎప్పుడు ఏం జరుగుతుందోననే భయం వారిని వెంటాడుతోంది. రెవెన్యూ వ్యవస్థలో ఉన్న తీవ్ర ఒత్తిడితో పాటు బదిలీపై వెళ్లి కుటుంబానికి దూరంగా ఉండాల్సి వస్తోందన్న మనస్తాపంతో నెల కింద నిజామాబాద్ తహసీల్దార్ జ్వాలాగిరిరావు ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఉద్యోగవర్గాలను కలవరపరిచింది. ఈ ఘటన మరువక ముందే ఇప్పు డు మహిళా తహసీల్దార్ను ఏకంగా హత్య చేయడం రెవెన్యూ వర్గాలను కలవరపరుస్తోంది. ఎవరికీ తెలియలేదు.. మండలాల పునర్విభజనలో భాగంగా ఏర్పడిన అబ్దుల్లాపూర్మెట్ మండల తహసీల్దార్ కార్యాలయం అద్దె భవనంలో కొనసాగుతోంది. ఈ కార్యాలయంలో విధి నిర్వహణలో తలమునకలైన ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ స్థాయి అధికారిపై సులువుగా దాడి జరగడానికి భద్రతా లోపాలే ప్రధాన కారణంగా కనిపిస్తోంది. తహసీల్దార్ గదికి రానుపోను ఒకే ద్వారం ఉండడం, మిగతా సిబ్బంది గదులకు దూరంగా, వేరుగా ఉండటంతో తహసీల్దార్ రూమ్లో ఎవరున్నారనేది కూడా గమనించలేని పరిస్థితి ఉంది. సోమవారం తహసీల్దార్ ఉండే గది లోపలికి నిందితుడు వెళ్లి గడియ వేసుకున్నా.. ఆమెతో వాగి్వవాదానికి దిగినా.. ఆఖరికిపై ఆమెపై పెట్రోల్ పోసి తగలబెట్టినా వెలుపల హాల్లో పనిచేసేవారికి తెలియలేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఆఖరికి విజయారెడ్డికి నిప్పంటించే క్రమంలో కాలిన గాయాలతో భరించలేక నిందితుడు గడియ తీసుకొని బయటకు పరుగులు తీస్తే కానీ, లోపలేం జరిగిందో తెలియని అయోమయం నెలకొంది. ప్రైవేటు సెక్యూరిటీని కూడా నియమించుకోకపోవడం.. తహసీల్దార్ను కలిసిన సమయంలో అక్కడే ఉండాల్సిన సిబ్బంది లేకపోవడం కూడా ఘటనకు ఊతమిచ్చింది. రికార్డుల నవీకరణతో సతమతం.. భూ రికార్డుల ప్రక్షాళన అనంతరం చోటుచేసుకున్న పరిణామాలు రెవెన్యూ వర్గాలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. రికార్డుల నవీకరణ అనంతరం రెవెన్యూ ఉద్యోగులపై పనిభారమే కాకుండా ఒత్తిడీ పెరిగిపోయింది. ముఖ్యంగా చాలాచోట్ల క్షేత్రస్థాయి పరిస్థితులకు, రికార్డులకు పొంతన కుదరకపోవడంతో వివాదాలు పెరిగిపోయాయి. సాంకేతిక సమస్యలు, కౌలుదారులు, పట్టాదారులు, సోదరులు, కుటుంబ తగాదాలు, కోర్టు కేసులు, ప్రభుత్వ భూములుగా తేలిన వంటి వాటికి పాస్ పుస్తకాలు ఇవ్వకుండా పక్కనపెట్టడంతో రెవెన్యూ ఉద్యోగులే ఉద్దేశపూర్వకంగా చేస్తున్నారనే అపవాదు ఎదుర్కొంటున్నారు. కబ్జా కాలమ్ను ప్రభుత్వం తొలగించడం రెవెన్యూ యంత్రాంగానికి పెద్ద తలనొప్పిగా మారింది. న్యాయపరమైన వివాదాలపై అర్జీదారులను సముదాయించినా.. సమాధానం చెప్పినా.. శాంతించకపోవడంతో రెవెన్యూ వర్గాలు ఒత్తిడికి గురవుతున్నాయి. ధరణి సాఫ్ట్వేర్ లోపాలూ వీరిని ఉక్కిరిబిక్కిరి చేశాయి. విచారణకు ఆదేశించిన ప్రభుత్వం అబ్దుల్లాపూర్మెట్ తహసీల్దార్ విజాయారెడ్డి హత్యపై ప్రభుత్వం విచారణకుఆదేశించింది. -
ప్రక్షాళన చేయండి: డిప్యూటీ సీఎం
భూ యజమానుల హక్కులను కాపాడేందుకు రెవెన్యూ రికార్డులను ప్రక్షాళన చేయాలని డిప్యూటీ సీఎం, రెవెన్యూ శాఖ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ అధికారులను ఆదేశించారు. జిల్లాలో ఇళ్ల పట్టాల మంజూరుకు భూసేకరణ, భూ రికార్డుల స్వచ్ఛీకరణ తీరును గురువారం కలెక్టరేట్లోని రెవెన్యూభవన్లో మంత్రులు చెరుకువాడ శ్రీరంగనాథరాజు, శంకరనారాయణ, విప్ కాపురామచంద్రారెడ్డితో కలిసి అధికారులతో సమీక్షించారు. జిల్లాలో ఆర్ఎస్ఆర్ తో పోలిస్తే క్షేత్రస్థాయిలో ఉన్న భూమికి వ్యత్యాసం చాలా ఉందన్నారు. దీనిని సరిచేయాల్సిన బాధ్యత రెవెన్యూ శాఖపై ఉందన్నారు. సాక్షి, అనంతపురం : ‘ప్రభుత్వ భూమి ప్రతి ఎకరమూ ప్రభుత్వ ఆధీనంలోనే ఉండాలి. లేదా ప్రజావసరాలకు వినియోగించబడాలి, పేదల వద్దనైనా ఉండాలి. అంతే తప్ప పెద్దలు, సంపన్నల వద్ద ప్రభుత్వ భూమి ఉందంటే దానిని వెంటనే స్వాధీనం చేసుకోండి. బలవంతుడైన ముఖ్యమంత్రి మీ వెనుక ఉన్నాడు. ఎవరికీ తలవంచకండి’ అంటూ అధికారులకు డిప్యూటీ సీఎం, రెవెన్యూశాఖ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్, గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు ఆదేశాలతో కూడిన పిలుపునిచ్చారు. జిల్లాలో ఇళ్ల పట్టాల మంజూరుకు భూసేకరణ, భూ రికార్డులు స్వచ్ఛీకరణ తీరును గురువారం కలెక్టరేట్లోని రెవెన్యూ భవన్లో జిల్లా మంత్రి శంకరనారాయణ, విప్ కాపురామచంద్రారెడ్డితో కలిసి అధికారులతో వారు సమీక్షించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ ప్రభుత్వ భూమి బలవంతులు, సంపన్నులు చేతిలో ఉంటే వెంటనే స్వాధీనం చేసుకోవాలని ఆదేశించారు. 1983 వరకు అమలులో ఉన్న జమాబందీ విధానం వల్ల భూ రికార్డులు సక్రమంగా ఉండేవని గుర్తు చేశారు. ఆ విధానం రద్దు అయిన తర్వాతే వ్యవస్థ గాడితప్పిందన్నారు. భూ యజమానుల హక్కులను కాపాడాలనే లక్ష్యంతో రికార్డులను ప్రక్షాళన చేయడంతోపాటు పాత విధానాన్ని కొనసాగించే సాహసోపేత నిర్ణయంతో ప్రభుత్వం ముందుకు పోతోందని తెలిపారు. జిల్లాలో ప్రభుత్వ భూమి ఎంత ఉంది. గృహ నిర్మాణానికి ఉపయోగపడేది ఎంత. ఇంకా ఎంత అవసరం ఉంది, ఇందుకు నిధులు ఎంత అవసరం అనేదానిపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. మూడు గ్రామాలను యూనిట్గా తీసుకోండి మూడు గ్రామాలను యూనిట్గా తీసుకుని భూ రికార్డుల స్వచ్ఛీకరణ చేపట్టాలని ఆదేశించారు. ప్రతి గ్రామంలో ఒక వీఆర్వో, సర్వేయర్తో కలిపి రికార్డులను పరిశీలించి తప్పులు సరిచేయాలన్నారు. జిల్లాలో ఆర్ఎస్ఆర్తో పోలిస్తే క్షేత్రస్థాయిలో ఉన్న భూమికి వ్యత్యాసం చాలా ఉందన్నారు. దీనిని సరిచేయాల్సిన బాధ్యత రెవెన్యూ శాఖపై ఉందన్నారు. ముఖ్యంగా జాయింట్ కలెక్టర్ భూ పరిపాలనలో నిమగ్నం కావాలని సూచించారు. ఆర్డీఓల నిరంతర పర్యవేక్షణ ఉండాలన్నారు. ఉగాది నాటికి అర్హులందరికీ ఇళ్ల పట్టాలు ఉగాది నాటికి సంతృప్తి స్థాయిలో అర్హులైన పేదలందరికీ ఇళ్ల పట్టాలు మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు మంత్రి శ్రీరంగనాథరాజు తెలిపారు. అధికారులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని భూ సేకరణ వేగవంతం చేయాలన్నారు. జిల్లాలో ఇళ్ల పట్టాల కోసం అందిన 1.89 లక్షల దరఖాస్తులను విచారణ చేసి అర్హులను గుర్తించాలన్నారు. ఒక కుటుంబం తెల్లకార్డులో తండ్రితో పాటు అతని పిల్లలు ఉంటారన్నారు. వారిలో ఒక కుమారునికి వివాహం జరిగి సంతానం కూడా ఉంటారని, అయితే వారికి వేరే కార్డు ఉండదన్నారు. ఈ క్రమంలో ఉదారంగా వ్యవహరించి వివాహం జరిగిన కుమారునికి కూడా ఇంటి పట్టా మంజూరు చేయాలన్నారు. వితంతు, ఒంటరి మహిళ, దివ్యాంగులకు ప్రభుత్వం ద్వారా ఎమ్మెల్యేల సహకారంతో ఇళ్లను నిర్మించి ఇస్తామన్నారు. గతంలో జిల్లాలో 57 వేల ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి పెండింగ్లో ఉన్న రూ.91 కోట్లు బిల్లులు చెల్లించేందుకు ముఖ్యమంత్రి ఆమోదం తెలిపారన్నారు. వీటిపై విచారణ చేసి నివేదిక ఇస్తే ప్రభుత్వం నిధులు విడుదల చేస్తుందన్నారు. సమావేశంలో కలెక్టర్ ఎస్.సత్యనారాయణ, జాయింట్ కలెక్టర్ ఎస్.డిల్లీరావు, నగర పాలక కమిషనర్ ప్రశాంతి, పెనుకొండ సబ్కలెక్టర్ టి.నిశాంతి, అసిస్టెంట్ కలెక్టర్ జాహ్నవి, డీఆర్ఓ ఎం.వి.సుబ్బారెడ్డి, రెవెన్యూ, హౌసింగ్ శాఖల అధికారులు పాల్గొన్నారు. మాట్లాడుతున్న హౌసింగ్ మినిస్టర్ చెరుకువాడ శ్రీరంగనాథరాజు పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం పేదల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు వెళుతోందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి మాలగుండ్ల శంకరనారాయణ అన్నారు. ఇల్లు లేని ప్రతి పేదవానికి ఇంటి స్థలం ఇచ్చి ఇల్లు నిర్మించిఇవ్వాలనేది నవరత్నాల్లో ప్రధామైన అంశమన్నారు. ఈ కార్యక్రమాన్ని పటిష్టంగా అమలు చేసేందుకు అధికార యంత్రాగం అంకితభావంతో పనిచేయాలన్నారు. గత ప్రభుత్వ హాయంలో కొండలు, గుట్టలు, వంక పోరంబోకు స్థలాలు అన్యాక్రాంతం అయ్యాయని, సమగ్ర విచారణ చేసి వాటికి ఇచ్చిన పట్టాలను రద్దు చేసి స్వాధీనం చేసుకోవాలన్నారు. రెవెన్యూ రికార్డులు సరిచేసి భూ వివాదాలు లేకుండా చూడాలన్నారు. నిబంధనలు సడలించండి కరవును దృష్టిలో ఉంచుకుని ఇళ్ల పట్టాల మంజూరులో నిబంధనలు సడలించాలని ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి కోరారు. 5 ఎకరాల మాగాణి, 10 ఎకరాల మెట్ట అర్హతగా తీసుకునేలా ప్రభుత్వానికి ప్రతిపాదించాలని సూచించారు. శ్మశాన వాటికలకు స్థలాలు కేటాయించాలి చాలా గ్రామాల్లో శ్మశాన వాటికలు లేవని, అధికారులు గుర్తించి తక్షణమే స్థలాలు కేటాయించాలని ఎంపీ గోరంట్ల మాధవ్ సూచించారు. కియా పరిశ్రమకు, ఎన్పీకుంట సోలార్ హబ్కు భూములు ఇచ్చిన రైతుల్లో కొందరికి పరిహారం అందలేదని వారందరికీ పరిహారం ఇవ్వడంతో పాటు ఆయా కుటుంబాల్లోని వారికి ఆయా సంస్థల్లో ఉద్యోగాలు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. తహసిల్దారు కార్యాలయం అవసరం నగర పరిధిలో 3 లక్షల జనాభా, రూరల్ పరిధిలో 2 లక్షల జనాభా ఉన్నా.. ఒకటే తహసీల్దారు కార్యాలయం ఉండడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి తెలిపారు. అదనంగా మరో తహసీల్దారు కార్యాలయం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. గుంతకల్లును రెవెన్యూ డివిజన్గా ప్రకటించాలని, చుక్కల భూముల సమస్యలకు ముగింపు పలకాలని, ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి నగర పరిధిలో 2014 వరకు 14 వేల ఇళ్లకు బిల్లులు బకాయిలో ఉన్నాయని, చెల్లించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. చుక్కల భూముల సమస్యలు అలాగే ఉన్నాయి చుక్కల భూముల సమస్యలు పరిష్కారం కావడం లేదని ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి తెలిపారు. గతంలో ఇళ్లను పొందిన వారు కూడా ప్రస్తుతం ఇళ్ల పట్టాల కోసం దరఖాస్తు చేస్తున్నారని, ప్రభుత్వం అందజేస్తున్న ఇళ్ల పట్టాలు అనర్హుల చేతిలోకి వెళ్లకూడదని సూచించారు. మైనారిటీలకు కాలనీలు ఏర్పాటు చేయాలి అనంతపురం, రాప్తాడు నియోజకవర్గాల పరిధిలో పేద మైనారిటీలకు ఇళ్ల పట్టాలు మంజూరు చేయడంతో పాటు ప్రత్యేకంగా కాలనీలు ఏర్పాటు చేయాలని రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్రెడ్డి సూచించారు. 2014 నుంచి 2019 వరకు భూ అక్రమాలు పెద్ద ఎత్తున చోటు చేసుకున్నాయని, ఐదారు వేల ఎకరాల ప్రభుత్వ భూములకు పట్టాలిచ్చారని గుర్తు చేశారు. ఉద్యోగులు, సంపన్నులకు కట్టబెట్టిన భూములను స్వాధీనం చేసుకోవాలన్నారు. గ్రామ సభలు నిర్వహించి త్వరితగతిన భూ రికార్డులను సరిచేయాలని సూచించారు. గత ప్రభుత్వ హయాంలో అనర్హులకు మంజూరు చేసిన ఇళ్లను రద్దు చేయాలన్నారు. కంప్యూటర్ ఆపరేటర్ల చేతిలో వ్యవస్థ కంప్యూటర్ ఆపరేటర్ల చేతిలో రెవెన్యూ వ్యవస్థ నడుస్తోందని పుట్టపర్తి ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్రెడ్డి విమర్శించారు. ఇష్టానుసారంగా ఆన్లైన్లో భూముల వివరాలను వారు మార్చేస్తున్నారన్నారు. తప్పుడు పనులు చేస్తున్న ఆపరేటర్లను తొలగించాలన్నారు. లక్ష లోపు జనాభా ఉండే పట్టణాల్లో అపార్ట్మెంట్ పద్ధతిలో కాకుండా వ్యక్తిగత (ఇండిపెండెంట్) ఇళ్లను కేటాయించాలని సూచించారు. సాహసోపేత నిర్ణయం రెవెన్యూ భూ రికార్డుల స్వచ్ఛీకరణ అనేది సాహసోపేత నిర్ణయమని ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ అన్నారు. ఈ ప్రక్రియ ద్వారా భూముల సమస్యలు పరిష్కారమవుతాయని, ప్రభుత్వాన్ని తప్పుదారి పట్టించకుండా స్వచ్ఛీకరణ సక్రమంగా చేయాలని అధికారులకు సూచించారు. క్రాస్ చెకింగ్ సిస్టం ఉండాలన్నారు. పాస్పోర్ట్ తరహా పట్టా పాసు పుస్తకం విధానం తీసుకొస్తే భూముల వివరాలు మార్పు సాధ్యం కాదని సూచించారు. ఇళ్ల పట్టాల కోసం సేకరిస్తున్న భూమి ఆయా గ్రామల ప్రజలకు నివాసయోగ్యమా కాదా అనేది నిర్ధారించుకోవాలని, లేదంటే పథకం నిరుపయోగమవుతుందని హెచ్చరించారు. వేల ఎకరాలకు పట్టాలిచ్చారు తహసీల్దార్లు బదిలీపై వెళుతూ వేల ఎకరాలకు పట్టాలు ఇచ్చేశారని మడకశిర ఎమ్మెల్యే డా.తిప్పేస్వా మి తెలిపారు. వీటన్నింటిపై విచారణ జరిపించాలన్నారు. ‘ఎస్ఈజె డ్ కోసం 1,600 ఎకరాల భూమిని రైతుల నుంచి 2014లో సేకరించారు. 1బిని రద్దు చేశారు. అయితే 600 ఎకరాలకు మాత్రమే పరిహారం ఇచ్చి, మిగిలిన భూమి ఇవ్వలేదు. దానికీ పరిహారం ఇవ్వాలి’ అని కోరారు. బీఎస్సీ అగ్రికల్చర్ కళాశా లకు, అమరాపురంలో ఐటీఐ ఏర్పాటుకు, బాలికల ప్రభుత్వ జూనియర్ కళాశాల నిర్మాణానికి భూములు కేటాయించాలన్నారు. -
భూ సమస్యల భరతం పడదాం
రాష్ట్ర వ్యాప్తంగా ఫీల్డ్ మెజర్మెంట్ పుస్తకంలోని భూ విస్తీర్ణం కంటే అడంగల్లో16 లక్షల ఎకరాలకు పైగా అధిక భూమి ఉంది.అంటే లేని భూమి ఉన్నట్లు నమోదు చేశారు. ‘రెవెన్యూ రికార్డుల్లో తప్పులు వెతకడమంటే గొంగళిలో వెంట్రుకలు వెతకడం లాంటిదే. అందుకే వీటిని స్వచ్ఛీకరించడం అనడం కంటే ప్రక్షాళన చేయాలనడం సబబుగా ఉంటుంది’ అని రెవెన్యూ నిపుణులు చెబుతున్న మాటలు ఈ శాఖలో కుప్పలు తెప్పలుగా ఉన్న లోపాలకు అద్దం పడుతున్నాయి. సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అస్తవ్యస్తంగా, తప్పుల తడకలుగా ఉన్న రెవెన్యూ రికార్డులను ప్రక్షాళన (స్వచ్ఛీకరించి) చేసి, లోప రహితంగా రూపొందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. క్లిష్టమైన ఈ ప్రక్రియను యుద్ధ ప్రాతిపదికన చేపట్టి రెండు నెలల్లో పూర్తి చేయాలని సర్కారు నడుం బిగించింది. ఇందులో భాగంగా ఒక్కో మండలం నుంచి ఒక్కో గ్రామం చొప్పున ఎంపిక చేసి రాష్ట్రంలోని మొత్తం 670 మండలాల్లోని 670 గ్రామాల్లో ప్రయోగాత్మకంగా (పైలెట్) తక్షణమే అమలు చేయాలని రెవెన్యూ శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ గ్రామాల్లో రికార్డుల అప్డేషన్లో వచ్చే అనుభవాలను పరిగణనలోకి తీసుకుని అవస రమైన మార్పులు చేర్పులతో రెండు నెలల్లోగా రాష్ట్రమంతటా రికార్డుల ప్రక్షాళన/ స్వచ్ఛీకరణ యజ్ఞాన్ని పూర్తి చేయాలని ప్రభుత్వం అన్ని జిల్లాల అధికార యంత్రాంగానికి మార్గనిర్దేశం చేసింది. ఈ నెలాఖరులోగా 670 గ్రామాల్లో ఈ ప్రక్రియను పూర్తి చేసి.. తద్వారా వచ్చిన అనుభవాలు, మార్పుచేర్పులపై నివేదికను రాష్ట్ర భూపరిపాలన ప్రధాన కమిషనరేట్కు పంపించాలని ఆదేశించింది. సులభంగా ఈ కార్యక్రమం పూర్తి చేయడం కోసం ఆరు రకాల నమూనా పత్రాలను కూడా తహసీల్దారు కార్యాలయాలకు పంపింది. గ్రామసభలు పెట్టి అందరితో చర్చించి రికార్డులు, ఆధారాలు పరిశీలించి ఈ నమూనా పత్రాలను నింపాలని ఆదేశించింది. ఈ ప్రక్రియ పర్యవేక్షణకు డిప్యూటీ కలెక్టర్ స్థాయి అధికారులను నియమించింది. రాష్ట్రంలో ప్రధాన సమస్యలు ఇవీ.. – వారసత్వంగా తమ తండ్రి నుంచి తమకు రావాల్సిన భూమిని కూడా తమకు ఆన్లైన్, మ్యుటేషన్ చేయడం లేదని కొందరు.. తమ తండ్రి భూమిని వేరేవారు అక్రమంగా నకిలీ పాసుపుస్తకాలతో ఆక్రమించారని మరికొందరు ఫిర్యాదు చేస్తున్నారు. – కొన్ని ప్రాంతాల్లో చట్టప్రకారం రిజిస్ట్రేషన్ చేయించుకున్నప్పటికీ ఆన్లైన్ కావడంలో ఇబ్బందులు, పాసు పుస్తకం చేతికి అందక సమస్యలు ఎదుర్కొంటున్నారు. – మరి కొద్దిమంది అయితే.. నమ్మకంతో రిజిస్ట్రేషన్ లేకుండానే కేవలం అగ్రిమెంటు ప్రకారం భూమిని కొనుగోలు చేశారు. దీనిని సాధారణంగా సాదాబైనామాగా పేర్కొంటారు. అయితే, తమ పేరు మీద చట్టప్రకారం రిజిస్ట్రేషన్ కాకపోవడంతో పాసుపుస్తకం రాక ఇబ్బందులు పడుతున్న వారు మరికొందరు. – కొన్ని ప్రాంతాల్లో ఉన్న భూమి సబ్డివిజన్ చేసి పంపకాలు జరిగి ఉంటాయి. అయితే, ఇవి రికార్డుల్లోకి ఎక్కకుండా కేవలం నోషనల్గానే ఉన్నాయి. అయితే, రికార్డుల్లోకి ఎక్కకపోవడంతో ఆన్లైన్ చేయడంలో ఇబ్బందులు వస్తున్నాయి. – కొన్నిచోట్ల ఒకే పేరు మీద వివిధ ఖాతా నంబర్లు ఉంటున్నాయి. వాస్తవానికి ఒక వ్యక్తికి ఒకే ఖాతా నంబరు ఉండాలి. సదరు వ్యక్తికి ఎన్ని సర్వే నంబర్లలో భూమి ఉన్నప్పటికీ ఖాతా నంబరు మాత్రం ఒక్కటే ఉండాలి. అయితే, అనేక ప్రాంతాల్లో డూప్లికేట్ ఖాతా నంబర్లతో ఒకే భూమికి ఇద్దరు, ముగ్గురు పేర్లతో దొంగ పాసుపుస్తకాలు పుట్టించుకుని నిజమైన లబ్ధిదారులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. – అన్నింటికీ మించి.. రెవెన్యూ సిబ్బంది మాయతో అనేక ప్రాంతాల్లో ఉన్న భూ విస్తీర్ణం కంటే అదనంగా పాసుపుస్తకాల్లో భూమి రికార్డు అయ్యింది. తద్వారా వెబ్ల్యాండ్లో ఉన్న భూ విస్తీర్ణానికి, ఆర్ఎస్ఆర్ (రెవెన్యూ సర్వీసు రికార్డ్)కు మధ్య వ్యత్యాసం వస్తోంది. – ప్రైవేటు భూమి ప్రభుత్వ భూమిగా, ప్రభుత్వ భూమి ప్రైవేట్ వ్యక్తుల పేర్లతో రికార్డులున్న సంఘటనలు అనేకం. – వివిధ కారణాల వల్ల భూ యాజమాన్య హక్కు పత్రాలు లేకుండానే వంశపారంపర్యంగా భూములను అనుభవిస్తున్న వారు కూడా పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. ఆరు నమూనా పత్రాలతో మార్గదర్శకాలు 1. వారసుల పేరుతో మార్పు (చనిపోయిన పట్టాదారు పేరు, ఇతర వివరాలకు సంబంధించి మొత్తం పది కాలంలు పెట్టారు. ఈ నమూనా పత్రం ప్రకారం మృతుల పేర్లతో ఉన్న భూములను వారి వారసుల పేర్లతో మ్యుటేషన్ చేస్తారు.) 2. భూమి కొనుగోలు చేసిన వారి పేరుతో మార్పు (అమ్మిన వ్యక్తి పేరుతో ఉన్న భూమిని కొనుగోలు చేసిన వారి పేరుతో మార్చడం. రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఆధారంగా గ్రామంలో విచారించి కొనుగోలుదారుల పేర్లతో అడంగల్, 1బీలో మార్పులు చేస్తారు. ఇందుకోసం గత అయిదేళ్లలో జరిగిన క్రయ, విక్రయ రిజిస్ట్రేషన్ వివరాలను తహసీల్దార్లకు పంపించాలని ఇప్పటికే రిజిస్ట్రేషన్ శాఖ రిజిస్ట్రార్లకు ఆదేశాలు జారీ చేసింది. అవసరమైతే గత 20 ఏళ్ల రిజిస్ట్రేషన్ డేటా కూడా పంపాలని కూడా ఆదేశించింది. ఈ వివరాల ప్రకారం విచారించి మ్యుటేషన్లు చేస్తారు.) 3. వారసత్వం, రిజిస్ట్రేషన్ ద్వారా కాకుండా ఇతరత్రా మ్యుటేషన్లు (ఆధారాలను పరిశీలించి గ్రామసభలో చర్చించి అనుభవదారు/ పిటిషనర్ పేరుతో భూమిని మ్యుటేషన్ చేస్తారు. సాదాబైనామా కింద అంటే.. రిజిస్ట్రేషన్ లేకుండా కేవలం అగ్రిమెంట్ ద్వారా జరిగిన భూ లావాదేవీలను పరిష్కరించడం.) 4. ఒక వ్యక్తి పేరుతో ఒకే ఖాతా (ఒక వ్యక్తి పేరుతో రెండు మూడు ఖాతాలు ఉంటే తొలగించి ఒకే ఖాతాగా మార్పు చేస్తారు. గ్రామ సభలో చర్చించి పట్టాదారుకు నోటీసు జారీ చేసి, నిబంధనల ప్రకారం డూప్లికేట్ ఖాతాలను తొలగిస్తారు.) 5. శాశ్వత ఖాతాలుగా మార్పు (వివిధ కారణాల వల్ల రాష్ట్రంలో 10 లక్షలకు పైగా తాత్కాలిక (నోషనల్) ఖాతాలు ఉన్నాయి. వీటిని శాశ్వత ఖాతాలుగా మారుస్తారు. ఇందులో భాగంగా గ్రామ రెవెన్యూ అధికారులందరూ తమ పరిధిలోని గ్రామాల్లో తాత్కాలిక ఖాతాలన్నింటినీ శాశ్వత ఖాతాలుగా మార్చడానికి తహసీల్దారుకు ప్రతిపాదనలు ఇవ్వాలి. అనంతరం తహసీల్దారు వీటిని శాశ్వత ఖాతాగా మార్పు చేస్తారు.) 6. భూ విస్తీర్ణం తేడాల్లో మార్పు (రీసర్వే సెటిల్మెంట్ రిజిస్టర్ (ఆర్ఎస్ఆర్), వెబ్ల్యాండ్ అడంగల్/ మాన్యువల్ అడంగల్ మధ్య భూమి విస్తీర్ణం చాలా సర్వే నంబర్లలో తేడా ఉంది. దీని ప్రకారం గ్రామ రెవెన్యూ అధికారి క్షేత్రస్థాయిలో పరిశీలించి తహసీల్దారుకు నివేదిక ఇచ్చిన అనంతరం సరిచేస్తారు.) గ్రామ సభల్లో ఇలా.. రెవెన్యూ రికార్డుల స్వచ్ఛీకరణకు ఆరు రకాల నమూనా పత్రాలను పంపిన ఉన్నతాధికారులు గ్రామసభల్లోనే వీటిని పూరించాలని పేర్కొన్నారు. ఇందుకు అనుసరించాల్సిన విధి విధానాలను స్పష్టంగా వివరించారు. ఏ తేదీన ఏ రెవెన్యూ గ్రామంలో గ్రామసభ నిర్వహిస్తారో ముందుగా తెలియజేస్తారు. రెవెన్యూ రికార్డులను ఆ గ్రామానికి తీసుకెళ్లి సర్వే నంబర్ల వారీగా భూమి విస్తీర్ణం, అది ఎవరి పేర్లతో ఉందో చదువుతారు. మార్పులు, చేర్పులు ఎవరైనా కోరితే వారి వద్ద ఉన్న ఆధారాలు తీసుకుని గ్రామ సభలో చర్చిస్తారు. అనంతరం ఆర్ఎస్ఆర్లో ఉన్న భూ విస్తీర్ణానికి, వెబ్ల్యాండ్లో ఉన్న భూ విస్తీర్ణానికి మధ్య వ్యత్యాసం లేకుండా వాస్తవ భూ విస్తీర్ణానికి అనుగుణంగా రికార్డులను సరిచేస్తారు. ఈ గ్రామ సభలకు గ్రామ రెవెన్యూ అధికారి, రెవెన్యూ ఇన్స్పెక్టర్, సర్వేయర్, డిప్యూటీ తహసీల్దారు/ తహసీల్దారు హాజరవుతారు. పైలెట్ ప్రాజెక్టు తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టేప్పుడు తహసీల్దార్ నేతృత్వంలో ఒక బృందం, డిప్యూటీ తహసీల్దార్ అధ్యక్షతన మరో బృందం వేర్వేరు గ్రామాలకు వెళతాయి. – వైస్సార్ జిల్లా రాజంపేట మండలం ఊటుకూరు గ్రామంలో 10 ఎకరాల భూమిని ప్రభుత్వం 15–20 ఏళ్ల క్రితం కొనుగోలు చేసింది. ఇప్పటికీ అడంగల్లో ఈ భూమి ప్రైవేట్ వ్యక్తి పేరుతోనే ఉంది. – గుంటూరు జిల్లా బొల్లాపల్లి మండలం రేమిడిచర్ల గ్రామంలో వందలాది ఎకరాల పట్టా భూములు ప్రైవేట్ వ్యక్తులవి అయినప్పటికీ అమ్మడానికి, కొనడానికి వీల్లేకుండా నిషేధిత ఆస్తుల జాబితాలో చేర్చారు. – వైఎస్సార్ జిల్లా పుల్లంపేట మండలం అనంత సముద్రం గ్రామంలో ఒకే సర్వే నంబరులోని ఒకే భూమికి ఓబుల గంగిరెడ్డి (పట్టా నంబరు 514), హెచ్.చంగమ్మ (పట్టా నంబరు 537) పట్టాదారులుగా ఉన్నారు. – రాష్ట్ర వ్యాప్తంగా ఫీల్డ్ మెజర్మెంట్ పుస్తకంలోని భూ విస్తీర్ణం కంటే అడంగల్లో 16 లక్షల ఎకరాలకు పైగా అధిక భూమి ఉంది. అంటే లేని భూమి ఉన్నట్లు నమోదు చేశారు. – శ్రీకాకుళం జిల్లాలోని 95 గ్రామాల్లో అధికారులు సర్వే చేయగా ఒక్కో గ్రామంలో 40 నుంచి 80 శాతం వరకు తప్పులు ఉన్నట్లు తేలింది. – రాష్ట్రంలో మొత్తం భూ కమతాలు, సబ్ డివిజన్ల మధ్య 77 లక్షల భారీ వ్యత్యాసం ఉంది. కష్టమైనా సరే చేయాల్సిందే.. భూముల సమగ్ర రీసర్వే చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సాహసోపేత నిర్ణయం తీసుకున్నారు. ఈ బృహత్తర కార్యక్రమం చేపట్టాలంటే ముందుగా భూ రికార్డులు సరిదిద్దాలి. ఇందుకోసమే ప్రక్షాళన చేయాలని నిర్ణయించి ఆదేశాలు జారీ చేశాం. దశాబ్దాలుగా బూజుపట్టిన రెవెన్యూ రికార్డుల ప్రక్షాళన సులభమైన ప్రక్రియ కాదు. కానీ, ఎంత కష్టమైనా ప్రజల కోసం ఈ మార్పు చేయాలనుకున్నాం. రాష్ట్రమంతా రెవెన్యూ రికార్డులను ప్రక్షాళన చేయాలని నిర్ణయించాం. క్షేత్ర స్థాయిలో వచ్చే సమస్యలను గుర్తించి పరిష్కార మార్గాలతో ముందుకెళ్లేందుకే ఒక్కో మండలంలో ఒక్కో రెవెన్యూ గ్రామాన్ని ఎంచుకున్నాం. ఆ తర్వాత రాష్ట్రమంతటా రికార్డుల ప్రక్షాళన ప్రక్రియ చేపడతాం. వీలైనంత త్వరగా ఈ ప్రక్రియ పూర్తి చేస్తాం. – పిల్లి సుభాష్ చంద్రబోస్, రెవెన్యూ శాఖ మంత్రి, ఉప ముఖ్యమంత్రి -
ఆ అధికారి బదిలీ మేము జీర్ణించుకోలేకపోతున్నాం
సాక్షి,మేడ్చల్(హైదరాబాద్) : మేడ్చల్ జిల్లా జాయింట్ కలెక్టర్ డి శ్రీనివాస్ రెడ్డి ఆకస్మికంగా రెవెన్యూ శాఖకు బదిలీ కావడం జిల్లా ప్రజలు, ప్రజాప్రతినిధులు, ఉద్యోగులు జీర్ణించుకోలేకపోతున్నారు. డిప్యూటీ తహసీల్దార్ నుంచి అంచెలు అంచెలుగా ఎదిగిన శ్రీనివాస్రెడ్డి జాయింట్ కలెక్టర్ స్థాయికి చేరుకున్నారు. మేడ్చల్ జాయింట్ కలెక్టర్గా పదవీ బాధ్యతలు స్వీకరించిన ఏడాదిన్నర కాలంలో రెవెన్యూశాఖలో ఎన్నో మార్పులు తీసుకువచ్చారు. రిజర్వాయర్ నిర్మాణం కోసం బొమ్మరాసిపేటలో రైతులను ఒప్పించి భూములను సేకరించగలిగారు. ప్రభుత్వ పథకాలు నేరుగా పేద ప్రజలకు అందే విధంగా చర్యలు తీసుకున్నారు. ప్రభుత్వ భూములను పరిరక్షించడంలో శ్రీనివాస్ రెడ్డి ప్రత్యేక చొరవ చూపారు.జిల్లా కలెక్టర్ కార్యాలయానికి సందర్శకులు, బాధితులు ఎవరొచ్చినా ఆప్యాయంగా పలకరిస్తూ మర్యాదపూర్వకంగా మెలిగేవారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం.వి రెడ్డి ఆదేశాలను పాటిస్తూనే ఉద్యోగులందరితో ఐక్యంగా మెలుగుతూ మంచి అధికారిగా గుర్తింపు సాధించారు. జిల్లా ప్రజల హృదయాన్ని గెలుచుకున్న శ్రీనివాస రెడ్డి బదిలీ ఆగిపోతే బాగుంటుందని ప్రజాప్రతినిధులు కోరుకుంటున్నారు. -
భూకబ్జాలపై కొరడా
ఐదేళ్ల టీడీపీ హయాంలో విశాఖ పెను భూకంపంతో చిగురుటాకులా వణికిపోయింది. అధికారం దన్నుతో పచ్చ నేతలు సృష్టించిన భూదందాల విలయం రాష్ట్రమంతటా కలకలం రేపింది. అడ్డగోలుగా డీ పట్టాలు, పోరంబోకు, ఈనాం, భూదాన భూములు..ఇలా దేన్నీ వదలకుండా.. ఖాళీగా కనిపించిన భూమినల్లా కబ్జా చేసేశారు.. భూహక్కుదారులు, అనుభవదారులు, యజమానులపై సకల మాయోపాయాలు ప్రయోగించారు. అధికారులనూ పావులను చేశారు. ఫలితంగా ఎందరో అధికారులు జైళ్లపాలయ్యారు.ఇప్పుడు పాలన మారింది. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన వందరోజుల్లోనే సమూల మార్పుల దిశగా వడివడిగా అడుగులు పడుతున్నాయి. ఆ క్రమంలోనే విశాఖలో పచ్చనేతల భూ దాహానికి బలైన సర్కారీ భూములను రక్షించేందుకు అధికారులు రంగంలోకి దిగారు. ఎక్కడెక్కడ ప్రభుత్వ భూములు ఆక్రమణలకు గురయ్యాయో సర్వే చేపట్టారు. మరో పక్క ఆక్రమిత భూముల్లో ఉన్న నిర్మాణాలను తొలగించే పని కూడా మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే ఇన్నాళ్ళూ ఆక్రమణలో ఉన్న మధురవాడలోని రూ.100 కోట్ల విలువైన 10 ఎకరాలకు పైగా భూమిని శనివారం స్వాధీనం చేసుకున్నారు. ఆక్రమణలను తొలగించారు. ఇది ప్రారంభం మాత్రమేనని.. విశాఖ.. ఈ చుట్టుపక్కల భూ ఆక్రమణలపై కొరడా ఝుళిపిస్తామని విశాఖ ఆర్డీవో కిషోర్ స్పష్టం చేశారు. కబ్జాదారులు స్వచ్ఛందంగా భూములు ఖాళీ చేసి వెళ్ళిపోవాలని లేదంటే కఠిన చర్యలు తప్పవని ఆర్డీవో హెచ్చరించారు. సాక్షి, మధురవాడ(భీమిలి): ‘అవినీతి, అక్రమాలు సహించం. వాటి వెనుక ఎంతటి వారున్నా.. వదిలిపెట్టేది లేదు.’ అన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హెచ్చరికలు ఆక్రమణదారుల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తున్నాయి. సీఎం ఆదేశాలు తూ.చ తప్పకుండా అమలు చేయాలని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్ని స్థాయిల్లో అధికారులకు ఇప్పటికే సూచించారు. ముఖ్యంగా మధురవాడ ప్రాంతంలో ఆక్రమణలు నియంత్రించడానికి రెవెన్యూ, జీవీఎంసీ, విద్యుత్ శాఖలు కలసి పనిచేయాలని కొద్ది రోజుల కిందటే వారిని ఏకం చేశారు. పోలీసు అధికారులు కూడా సహాయ సహకారాలు అందించడంతో ఆక్రమణల తొలగింపులో రెవెన్యూ అధికారులు వేగం పెంచారు. ఆక్రమణదారులపై కొరడా ఝుళిపించడంతో కాకుండా కేసులు కూడా పెట్టి, వారిని అరెస్ట్లు చేయిస్తున్నారు. ఈ క్రమంలో శనివారం రూ.100 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిలో ఆక్రమణలు తొలగించి, స్వాధీనం చేసుకున్నారు. విశాఖ రూరల్ మండలం మధురవాడ సర్వే నంబర్ 367, 368లలో లా కళాశాల మాస్టర్ ప్లాన్ రోడ్డు నుంచి మధురవాడ మిథిలాపురి వుడా కాలనీకి వెళ్లే రోడ్డును ఆనుకుని శ్రీరామ్ ప్రోపర్టీస్కు చేరువలో 10.5 ఎకరాలు విలువైన ప్రభుత్వ గయాలు భూమి ఉంది. ఈ భూమి విలువ రూ.100 కోట్లు ఉంటుంది. శ్రీరామ్ ప్రోపర్టీస్ ప్రాజెక్టులో పనిచేస్తున్న ఆంధ్రా, తెలంగాణ, ఒడిశా, తదితర ప్రాంతాల నుంచి వచ్చిన కూలీల నివాసాల కోసం నిబంధనలకు విరుద్ధంగా ఈ భూమిలో 70 వరకు రేకు షెడ్లు నిర్మించారు. ఈ ఆక్రమణల తొలగింపునకు రెవెన్యూ అధికారులు శనివారం చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో ఆ భూమి తమదని, వ్యవహారం కోర్టులో ఉండగా ఎలా తొలగిస్తారని ఆక్రమణదారులు అధికారులతో వాగ్వాదానికి దిగారు. మీరెంతా అన్న స్థాయిలో హెచ్చరికలు జారీ చేశారు. దీనిపై సమాచారం అందుకున్న విశాఖ నార్త్(మధురవాడ) ఏసీపీ ఆర్. రవిశంకర్రెడ్డి ఆధ్వర్యంలో భారీగా పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సుబ్బరాజు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. దీంతో విశాఖ రూరల్ డిప్యూటీ తహసీల్దార్ బెహరా రవిశంకర్ ఆధ్వర్యంలో ఆర్ఐలు సత్యనారాయణ, గ్లోరి, సర్వేయర్లు సత్యనారాయణ, వేణుగోపాల్, వీఆర్వోలు కె.అప్పారావు, సూరిబాబు తదితరులు ఆక్రమణలు తొలగించారు. ఈ సందర్భంగా డీటీ రవిశంకర్ మాట్లాడుతూ కోర్టు వివాదంలో ఉన్న 10.5 ఎకరాల ప్రభుత్వ గయాలు భూమిలో యథాస్థితిని కొనసాగించాల్సి ఉందన్నారు. కానీ ఇక్కడ కొందరు షెడ్ల నిర్మాణంతో పాటు భూమి స్వరూపాన్ని మార్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని వెల్లడించారు. చాలా సార్లు వారిని హెచ్చరించినా ఫలితం లేకపోయిందన్నారు. ఆక్రమణల విషయంలో కఠినంగా వ్యవహరించాలన్న ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇక్కడ షెడ్లు తొలగించామన్నారు. పీఎంపాలెం ఎస్ఐ రవికుమార్, వీఆర్వోలు దొర, రాధాబాయి తదితరులు పాల్గొన్నారు. -
తహసీల్దార్ల అధికారాలకు కత్తెర!
సాక్షి, హైదరాబాద్: తహసీల్దార్ల అధికారాలకు కత్తెర పెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. రెవెన్యూ రికార్డుల మార్పులు, చేర్పుల్లో వారి భాగస్వామ్యాన్ని తగ్గించే దిశగా ఆలోచిస్తోంది. రెవెన్యూ శాఖలో భారీ సంస్కరణలు తీసుకురావాలని యోచిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్.. కొత్త రెవెన్యూ చట్టంలో తహసీల్దార్ల అధికారాల కుదింపుపై స్పష్టతనిచ్చే అవకాశముంది. సెప్టెంబర్లో జరిగే శాసనసభ సమావేశాల్లో ముసాయిదా రెవెన్యూ కొత్త చట్టాన్ని ప్రవేశపెట్టేలా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. గత కొన్నాళ్లుగా నూతన రెవెన్యూ చట్టంలో పొందుపరచాల్సిన అంశాలపై ప్రభుత్వ సలహాదారు రాజీవ్శర్మ నేతృత్వంలోని నిపుణుల కమిటీ చర్చోపచర్చలు సాగిస్తోంది. అయితే, పురపాలక సంఘాల పదవీకాలం ముగియడం.. కొత్త చట్టంతోనే మున్సి‘పోల్స్’కు వెళ్లాలని కేసీఆర్ నిర్ణయించడంతో రెవెన్యూ చటాన్ని తాత్కాలికంగా పక్కనబెట్టింది. ఈ చట్టం మనుగడలోకి రావడంతో ఇక కొత్త రెవెన్యూ చట్టం రూపకల్పనపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ మేరకు ముసాయిదా చట్టం తయారీలో తలమునకలైంది. తేలనున్న వీఆర్ఓల భవితవ్యం... రెవెన్యూ వ్యవస్థను సంస్కరించనున్నట్లు పలు సందర్భాల్లో ప్రకటించిన సీఎం.. ఇటీవల పంద్రాగస్టు ప్రసంగంలోనూ బూజుపట్టిన చట్టాలకు పాతర వేయనున్నట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం అమలులో ఉన్న 124 రెవెన్యూ చట్టాల్లో కాలం చెల్లినవాటికి మంగళం పాడనున్నట్లు తెలుస్తోంది. అలాగే, కొన్ని చట్టాలను ఒకే గొడుగు కిందకు తేవాలని యోచిస్తున్నట్లు అధికారవర్గాలు తెలిపాయి. భూ యాజమాన్య హక్కు (మ్యుటేషన్) జారీని సరళతరం చేయడమే గాకుండా.. పారదర్శకంగా చేసే విధానాన్ని ప్రవేశపెట్టే అవకాశముంది. ఈ క్రమంలోనే మ్యుటేషన్ చేసే అధికారాలను తహసీల్దార్లకు కాకుండా ఆర్డీఓ లేదా జాయింట్ కలెక్టర్లకు కట్టబెట్టే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. తద్వారా అవినీతికి అడ్డుకట్ట వేయవచ్చని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. రెవెన్యూ శాఖ భ్రష్టు పట్టడానికి కిందిస్థాయి ఉద్యోగుల అవినీతే కారణమని బలంగా విశ్వసిస్తున్న సీఎం.. వీఆర్ఓ, వీఆర్ఏ వ్యవస్థ రద్దు లేదా పంచాయతీరాజ్, వ్యవసాయశాఖలో విలీనం చేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. పరిశీలనలో ‘టైటిల్ గ్యారంటీ’చట్టం... భూమి హక్కులకు సంపూర్ణ భద్రత, పూర్తి భరోసా ఇచ్చే ‘టైటిల్ గ్యారంటీ’చట్టాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఇటీవల ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఈ బిల్లుకు ఆమోదముద్ర వేసిన నేపథ్యంలో.. మన రాష్ట్రంలో కూడా దీని అమలుకు సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేస్తోంది. మూడేళ్ల క్రితమే రాజస్తాన్.. పట్టణ ప్రాంత భూముల కోసం ‘టైటిల్ సర్టిఫికేషన్’చట్టాన్ని తీసుకొచ్చింది. గోవా, మహారాష్ట్ర ప్రభుత్వాలు ముసాయిదాలను రూపొందించుకున్నాయి. భూ హక్కుకు పూర్తి హామీ ఇచ్చే ఈ చట్టం అమలులోకి వస్తే పదుల సంఖ్యలో ఉన్న భూరికార్డుల స్థానంలో భూ యాజమాన్య హక్కులకు అంతిమ సాక్ష్యంగా టైటిల్ రిజిస్టర్ ఉండనుంది. తద్వారా భవిష్యత్లో భూ వివాదాలకు ఆస్కారం ఉండదని సర్కార్ భావిస్తోంది. అయితే, ఈ చట్టం మనుగడలోకి తేవాలంటే భూ సమగ్ర సర్వే తప్పనిసరి. ఈ సాధకబాధకాలను అంచనా వేసిన తర్వాతే దీనిపై ముందడుగు వేసే అవకాశముంది. నీతి ఆయోగ్ సిఫార్సులు, పక్క రాష్ట్రం అమలు చేస్తున్న తరుణంలో ఇక్కడ కూడా ఈ చట్టాన్ని తీసుకొస్తే ఎలా ఉంటుందనే అంశాన్ని నిపుణుల కమిటీ సూక్ష్మంగా పరిశీలిస్తోంది. -
అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇంటి స్థలం
సాక్షి, అమరావతి : అర్హత గల ప్రతి కుటుంబానికి ఇంటి స్థలం కేటాయించాలన్నదే సర్కారు ధ్యేయమని, ఇందుకు అవసరమైన ముందస్తు ఏర్పాట్లు త్వరగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. ఉగాది పర్వదినం సందర్భంగా అర్హతగల ప్రతి కుటుంబానికి నివాస స్థల పట్టా అందించాలని సూచించారు. బుధవారం ఆయన క్యాంపు కార్యాలయంలో రెవెన్యూ శాఖపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామాన్ని యూనిట్గా తీసుకుని ఎన్ని కుటుంబాలకు ఇల్లు, ఇంటి జాగా లేదో పరిశీలించి అర్హులను ఖరారు చేయాలన్నారు. వారందరికీ నివాస స్థలాలు ఇవ్వడానికి ఎంత భూమి అవసరం అవుతుందో.. ప్రభుత్వ భూమి ఎంత అందుబాటులో ఉందో అంచనా వేయాలని ఆదేశించారు. ఎలాంటి లోపాలు లేకుండా అత్యంత కచ్చితత్వంతో సమగ్ర భూ సర్వేకు ఆధునిక పరికరాలు వినియోగించాలని చెప్పారు. భూ వివాదాల కట్టడి, భూ రికార్డుల మ్యుటేషన్, భూ యజమానులకు శాశ్వత భూ హక్కుల కల్పన కోసం అత్యంత కచ్చితత్వంతో భూములు రీసర్వే చేయాలని ఆదేశించారు. ఉగాదికి నెల రోజుల ముందే భూమిని సిద్ధం చేస్తామని ఈ సందర్భంగా అధికారులు ముఖ్యమంత్రికి తెలియజేశారు. గ్రామాల్లో 20,800 ఎకరాలు, పట్టణ ప్రాంతాల్లో 2,580 ఎకరాలు అందుబాటులో ఉందని, ఇందులో ఎంత భూమి ఇళ్ల స్థలాలకు అనువైనదో నిర్ధారించే కార్యక్రమం చేపట్టామని వివరించారు. గ్రామాల్లో దాదాపు 14.06 లక్షల మంది, పట్టణాల్లో 12.69 లక్షల మంది ఇళ్ల స్థలాల కోసం ఎదురు చూస్తున్నారని తెలిపారు. ఇందులో 15.75 లక్షల మందికి భూమిని సమకూర్చాల్సి ఉందన్నారు. లోపరహితంగా భూ రీసర్వే ఇప్పటి వరకు అభివృద్ధి చెందిన దేశాల్లో మాత్రమే వినియోగిస్తున్న కంటిన్యూస్ ఆపరేటింగ్ రిఫరెన్స్ స్టేషన్ (సీఓఆర్ఎస్.. కార్స్) టెక్నాలజీని దేశంలోనే మొదటిసారిగా మన రాష్ట్రం భూముల రీసర్వేకి వినియోగించనున్నామని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ప్రతి చదరపు కిలోమీటర్కు రూ.1.10 లక్షలు ఖర్చవుతుందని, అమెరికా, ఆస్ట్రేలియా, ఇండోనేషియా, మలేషియా, సింగపూర్, గ్రీస్ దేశాల్లో కార్స్ ద్వారా రోవర్స్తో ఉపగ్రహ సేవలను వినియోగించుకుని సర్వే చేస్తున్నారని చెప్పారు. ఇప్పుడు దేశంలో మొదటిసారి మనం ఖర్చుకు వెనకాడకుండా ఈ విధానంతో సర్వేకు సన్నద్ధమవుతున్నామన్నారు. రూ.300 కోట్లతో పరికరాల కొనుగోలు రాష్ట్రంలో 670 మండలాల పరిధిలోని 17,460 రెవెన్యూ గ్రామాల్లో 2.36 లక్షల మందికి చెందిన 1.22 లక్షల చదరపు కిలోమీటర్లలో భూములను రీసర్వే చేయడానికి రూ.1,688 కోట్లతో కార్యాచరణ ప్రణాళిక రూపొందించామని అధికారులు చెప్పారు. రూ.300 కోట్లతో పరికరాలు కొనుగోలు చేస్తున్నామన్నారు. ‘1880 – 1930 మధ్య తొలిసారి రైత్వారీ గ్రామాలపై రికార్డులు రూపొందించారు. 1960 – 80 మధ్య మరోసారి సెటిల్మెంట్ గ్రామాలపై రికార్డులు రూపొందించారు. ప్రస్తుతం అన్ని భూ సమస్యల పరిష్కారానికి రీసర్వేనే మార్గం. అందుకే 75 బేస్ స్టేషన్లు, 3,440 రోవర్స్, ఒక కంట్రోల్ సెంటర్, 1,850 లాప్టాప్స్, 700 డెస్క్ టాప్స్ వినియోగించి ఒకేసారి మూడు వేల గ్రామాల్లో రీసర్వే చేపడతాం. అన్ని శాఖలకు ఉపయోగపడేలా డేటా పక్కాగా ఉంటుంది. మూడు విడతల్లో రెండున్నరేళ్లలో సర్వే పూర్తి చేస్తాం’ అని అధికారులు సీఎంకి వివరించారు. ఈ సమీక్షలో డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్, రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి మన్మోహన్సింగ్, సర్వే సెటిల్మెంట్ డైరెక్టర్ ప్రభాకర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
‘అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ఇంటి స్థలం’
సాక్షి, అమరావతి : అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ఇంటి స్థలం ఇవ్వడమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. సీఎం క్యాంపు కార్యాలయంలో బుధవారం రెవెన్యూ శాఖపై సీఎం వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ ఉగాది నాటికి ఇళ్లపట్టాలు సంతృప్తికర స్థాయిలో ఇవ్వాలని అధికారులకు సూచించారు. ప్రతి గ్రామాన్ని యూనిట్గా తీసుకోవాలని, అందుబాటులో ఉన్న ప్రభుత్వ భూమిని గుర్తించాలని ఆదేశాలు ఇచ్చారు. అత్యాధునిక పరికరాలు ఉపయోగించి భూముల సమగ్ర రీసర్వేను త్వరగా పూర్తి చేయాలని, ఈ సందర్భంగా ఎక్కడా, ఎలాంటి పొరపాట్లు జరగకూడదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. గ్రామ వాలంటీర్లు ప్రతి ఇంటికి వెళ్లి అర్హులైనవారిని గుర్తిస్తారని అన్నారు. ఈ సందర్భంగా ఉగాది నాటికి ఇళ్ల స్థలాల పంపిణీ ఏర్పాట్లను అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఉగాదికి నెలరోజులకు ముందే భూమిని అందుబాటులో ఉంచే ప్రయత్నాలు చేశామని, ఇళ్ల స్థలాల కోసం 23,448 ఎకరాలు గుర్తించామని, ఈ భూములపై పరిశీలన చేస్తున్నట్లు చెప్పారు. గ్రామాల్లో 20,800 ఎకరాలు, అర్బన్ ప్రాంతాల్లో 2,580 ఎకరాలు అందుబాటులో ఉందని, ఈ భూమి ఏ స్థితిలో ఉందన్న దానిపై పరిశీలన చేస్తున్నామన్నారు. ఇంటి నిర్మాణానికి అనుకూలంగా ఉందా? లేదా? అన్న పరిశీలన వేగంగా జరుగుతోందని తెలిపారు. గ్రామాల్లో దాదాపు 14.06 లక్షల మంది, పట్టణాల్లో 12.69 లక్షలమంది ఇళ్లస్థలాల కోసం ఎదురు చూస్తున్నారని అంచనా ఉందని,ప్రస్తుతం గుర్తించిన భూమి ద్వారా దాదాపు 9 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వగలుగుతామని అధికారులు వివరించారు. పట్టణాల్లో మరో 2 లక్షలమందికి ఇళ్లస్థలాలు ఇవ్వడానికి భూమి అందుబాటులో ఉందని, దాదాపు 15.75 లక్షలమందికి ఇంకా భూమిని సమకూర్చాల్సి ఉందంటూ ముఖ్యమంత్రికి అధికారులు నివేదిక అందించారు. భూముల సమగ్ర సర్వేకి సన్నద్ధం రాష్ట్రంలో భూముల సమగ్ర సర్వేకు సన్నద్ధంగా ఉన్నట్లు రెవెన్యూ శాఖ తెలిపింది. రీసర్వే ప్రణాళికను అధికారులు ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి వివరించారు. ‘సమగ్ర సర్వే కోసం రూ. 1688 కోట్లతో ప్రతిపాదనలు సిద్దం చేశాం. మొత్తం రాష్ట్ర విస్తీర్ణం 1.63 లక్షల చ.కి.మీలు కాగా, అందులో 1.22 లక్షల చ.కి.మీ మేర సర్వే చేయనున్నాం. మిగతా 38,8000 చ.కి.మీ అటవీ భూమి కాగా, మరో 2,200 కి.మీ మేర జనావాసాలు ఉన్నాయి. మొత్తం 679 మండలాలు, 17,460 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. మొత్తం ఎఫ్ఎంబీలు 49 లక్షలు కాగా, సబ్ డివిజనల్ రికార్డెడ్ ఎఫ్ఎంబీలు 159 లక్షలు ఉన్నాయి. అలాగే భూ యజమానులు 2.36 కోట్ల మంది ఉన్నార’ని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు రీ సర్వే ఎందుకంటే.. తొలిసారిగా 1880-1930ల మధ్య రైత్వారీ గ్రామాలపై రికార్డు జరిగింది. ఆ తర్వాత 1960-80 మధ్య మరోసారి సెటిల్మెంట్ గ్రామాలపై రికార్డు నిర్వహించారు. అయితే చాలా వరకు రికార్డులు పోవడం, ఉన్నదాంట్లో కూడా సమాచారం సరిగా అప్డేట్ కాకపోవడం. అలాగే క్షేత్ర స్థాయిలో ఉన్న భూములకీ, రికార్డులకూ పొంతన లేకుండా పోయింది. సర్వే చేయమంటూ వస్తున్న దరఖాస్తుల సంఖ్య ఎక్కువగా ఉన్నందునా.. భూ వివాదాలను తగ్గించాల్సిన అవసరం ఉంది. రెవెన్యూ వ్యవస్థ మీద ప్రజలకు నమ్మకం కుదరడం కోసం. విప్లవాత్మక మార్పుకు నాంది.. భూముల సమగ్ర సర్వే ఒక విప్లవాత్మక మార్పుకు నాంది పలుకబోతుందని అధికారులు వివరించారు. మొత్తంగా 3,17,44,060 ఎకరాల సర్వే చేపడతామని.. సర్వే మౌలిక సదుపాయాల కోసం రూ. 346 కోట్లు, ఫీల్డ్ సర్వే, టైటిల్ ఎౖంక్వెరీ కోసం రూ. 1342 కోట్లు ఖర్చు కానుందని చెప్పారు. ఇందుకోసం సీఓఆర్ఎస్ (కంటిన్యూస్ ఆపరేటింగ్ రిఫరెన్స్ స్టేషన్, కార్స్) నెట్వర్క్ వినియోగిస్తామని తెలిపారు. ప్రతి చదరపు కిలోమీటర్ సర్వేకు రూ. 1.1 లక్ష ఖర్చు అవుతుందన్నారు. ఈ సర్వే ద్వారా సేకరించే డేటాను రైతులకే కాకుండా గనులు, అటవీశాఖ, వ్యవసాయం, నీటిపారుదల, పోలీస్, పట్టణాభివృద్ధి, గ్రామీణాభివృద్ధి, రోడ్లు మరియు భవనాలు, ఇతర శాఖలకు ఉపయోగించనున్నట్టు వెల్లడించారు. ఎలక్ట్రానిక్ టోటల్ స్టేషన్, జీపీఎస్ పరికరాల వినియోగం. రోవర్స్ ద్వారా సమాచారణ సేకరణ చేయడంతోపాటు ఉపగ్రహాల సేవల పొందడం. అర నిమిషంలో రీడింగ్ వచ్చేలా ఏర్పాట్లు. రెండు సెంటీమీటర్లు అటు ఇటుగా ఉన్న పరిమాణంలో స్ధలాన్ని కూడా కచ్చితత్వంతో సర్వే చేయడం. ఎక్కువ పరికరాలు కొంటున్నందున సర్వే ఖర్చు తగ్గించడం. ఒకేసారి మూడు వేల గ్రామాల్లో సర్వే. 75 బేస్ స్టేషన్లు, 3440 రోవర్స్ ఫీల్డ్సర్వే, ఒక కంట్రోల్ సెంటర్. సర్వే కోసం 1850 లాప్టాప్స్ వినియోగం, 700 డెస్క్ టాప్స్ వినియోగం. జీఐఎస్ సాఫ్ట్వేర్ వినియోగం. మొత్తం పరికరాల కోసం దాదాపు రూ.300 కోట్లు. సర్వే సిబ్బందికి శిక్షణ, ప్రతి మూడు గ్రామాలకూ ఒక టీం. ప్రతి టీంలో ముగ్గురు సర్వేయర్లు.. వీరిని పర్యవేక్షించేందుకు మండలస్థాయి సర్వేయర్. మండల స్థాయిలో మానిటరింగ్ అధికారిగా తహశీల్దార్. ప్రతి గ్రామానికి ముగ్గురు చొప్పున సర్వేకోసం కేటాయింపు. మూడు విడతల్లో సర్వే.. రెండున్నర సంవత్సరాల్లో నాణ్యతతో సర్వే పూర్తిచేయాలని నిర్ణయం చదవండి : అర్బన్ హౌసింగ్పై సీఎం జగన్ సమీక్ష -
అర్బన్ హౌసింగ్పై సీఎం జగన్ సమీక్ష
సాక్షి, అమరావతి : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రెవెన్యూశాఖపై నిర్వహిస్తున్న సమీక్ష ముగిసింది. సీఎం క్యాంపు కార్యాలయంలో బుధవారం జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రులు పిల్లి సుభాష్ చంద్రబోస్, బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. అనంతరం అర్బన్ హౌసింగ్, టౌన్షిప్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్(టిడ్కో) పై సీఎం సమీక్ష ప్రారంభమైంది. కేబినెట్ సబ్ కమిటీ కూడా ఈ రివ్యూలో భాగమైంది. మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కురసాల కన్నబాబు, అనిల్కుమార్ యాదవ్, మేకపాటి గౌతమ్రెడ్డి, బొత్స సత్యనారాయణ, ఎంపీ మిథున్రెడ్డి, సంబంధిత అధికారులు ఈ సమీక్షలో పాల్గొన్నారు. టిడ్కోలో రివర్స్ టెండరింగ్ అంశం చర్చకు వచ్చే అవకాశమున్నట్టు తెలుస్తోంది. -
ఏమీ పదాలు.. విచిత్రంగా ఉన్నాయే!
సాక్షి, దర్శి (ప్రకాశం): రెవెన్యూ.. భూ పరిపాలన వ్యవహారాలు చూసే అతి ముఖ్యమైన వ్యవస్థ. మిగిలిన ప్రభుత్వ శాఖల మాదిరిగా కాకుండా రెవెన్యూ శాఖకు ఓ విశిష్టత ఉంది. వందేళ్ల క్రితం బ్రిటిష్ హయాలో నిర్దేశించిన చట్టాలకు లోబడి ఇంకా రెవెన్యూ వ్యవస్థ పనిచేస్తోంది. వాడుకలో ఉన్న రెవెన్యూ పద బంధాలు అన్నీ దాదాపు ఆంగ్లంలోనే ఉంటాయి. భారత్ను బ్రిటిష్ పాలకులకు ముందు మొఘలాయిలు పాలించే వారు. అప్పట్లో పారశీ, అరబ్ పదాలు చలామణిలో ఉండేవి. బ్రిటిషర్లు తమ ఆంగ్ల పదాలతోపాటు పారశీ, అరబ్ పదాలను వినియోగించడంతో రెవెన్యూ వ్యవస్థలో పదాలు చిత్రవిచిత్రంగా మారాయి. రెవెన్యూ వ్యవహారాలు తెలిసిన వారికి మినహా ఇతరులకు అవి అంతగా అర్థం కావు. రెవెన్యూలో అవినీతి మేట వేయడానికి ఆ పదాల అంతరార్థం తెలియకపోవడం కూడా ఒక కారణం. ఈ తరం రెవెన్యూ అధికారుల్లో చాలా మందికి కూడా ఆ పదాలతో తగిన పరిచయం లేదనడంలో సందేహమే లేదు. ఈ నేపథ్యంలో రెవెన్యూ పదాలు, వాటి అర్థాలు ‘సాక్షి’ పాఠకుల కోసం.. రీ సెటిల్మెంట్ రిజిష్టర్ (ఆర్ఎస్ఆర్) రెవిన్యూ అధికారులకు కీలకమైన రికార్డు ఇది. ప్రజా అవసరాల కోసం ప్రభుత్వం భూమి సేకరణ చేయాలంటే ఈ రికార్డునే ఆధారంగా చేసుకుని ధర నిర్ణయిస్తారు. ఆర్ఎస్ఆర్ రిజిష్టర్ల్లో ప్రభుత్వ భూమి, ప్రైవేట్ భూమి(వ్యక్తులు), ఈనాం భూములు, దేవదాయ, వక్ఫ్ భూములు, వాగులు, వంకలు తదితర భూముల వివరాలు ఉంటాయి. దీనికి సంబంధించిన రికార్డులు వీఆర్ఓ, తహసీల్దార్, ఆర్డీఓ కార్యాలయాలతోపాటు జిల్లా స్థాయిలో ఏడీ కార్యాలయంలో అందుబాటులో ఉంటాయి. 1బీ రికార్డు ఒక రైతుకు రెవెన్యూ విలేజ్లో ఏఏ సర్వే నంబర్లో ఎంత విస్తీర్ణం భూములు ఉన్నాయో 1బీ రికార్డులో నమోదు చేస్తారు. రైతుకు సంబంధించిన పట్టాదారు పాస్ పుస్తకంలో ఉన్న ఖాతా నంబర్ ఆధారంగా 1బీ రికార్డులో వరుసగా ఆ రైతు భూముల వివరాలు అన్నింటినీ నమోదు చేస్తారు. రైతు వ్యక్తిగత రికార్డు ఇది. ఎవరెవరికి ఎంత పొలం ఉంది?, పట్టాదారు ఎవరు?, అనుభవదారుడు ఎవరు? లాంటి వివరాలు నమోదై ఉంటాయి. గతంలో దీనిని 10(1) అడంగల్ అని పిలిచేవారు. రికార్డ్ ఆఫ్ రైట్ (ఆర్ఓఆర్) భూమి యాజమాన్య హక్కుపై వివాదం తలెత్తినప్పుడు రికార్డ్ ఆఫ్ రైట్(ఆర్వోఆర్)ను ప్రామాణికంగా తీసుకుంటారు. ఇందులో ప్రభుత్వ భూములు, బంజరు భూములు, వక్ఫ్ బోర్డు భూముల వివరాలు నమోదై ఉంటాయి. డైగ్లాట్ గ్రామ రెవెన్యూ రికార్డులన్నింటికీ మూల స్తంభం ఇది. ప్రతి గ్రామంలో సర్వే సెటిల్మెంటు భూమి వివరాలు నమోదు చేస్తారు. అన్ని రకాల భూములు, వాటి సర్వే నంబర్లు, విస్తీర్ణం, వాటి వర్గీకరణ, శిస్తు వివరాలు ఇందులో ఉంటాయి. ఈ రిజిష్టర్లో వివరాలు తెలుగు, ఇంగ్లిష్లో రాస్తారు. అడ్వర్స్ పొసెషన్ భూమిపై హక్కు ఉన్న వ్యక్తి అనుమతి పొందకుండా ఆ భూమిని స్వాధీనంలో(వాస్తవంగా, శాంతియుతంగా, బహిరంగంగా) ఉంచుకుని దానిపై నియంత్రణాధికారాన్ని కలిగి ఉండటాన్ని అడ్వర్స్ పొసెషన్ అంటారు. ఇలా పట్టా భూమి 12 సంవత్సరాలు, ప్రైవేట్ భూమి 30 సంవత్సరాలు స్వాధీనంలో ఉన్నట్లయితే సివిల్ కోర్టు ద్వారా యాజమాన్య హక్కులు పొందవచ్చు. అజమాయిషీ గ్రామ రెవెన్యూ అధికారి నిర్వహించే లెక్కలను తనిఖీ చేయడాన్ని అజమాయిషీ అంటారు. వీఆర్ఓ, మండల ఆర్ఐ పొందుపరిచిన లెక్కల్లో వివరాలను కొన్నింటినైనా డిప్యూటీ తహసీల్దార్, తహసీల్దార్ తనిఖీ చేయాలి. అలా తనిఖీ చేసిన వివరాలను గ్రామ లెక్క నం.3లో నమోదు చేస్తారు. ప్రతి సంవత్సరం నిర్వహించే ప్రక్రియ ఇది. ఆవాదీ/గ్రామ కంఠం గ్రామంలో ప్రజలు నివసించే భూమిని ఆవాది అంటారు. గ్రామ ఉమ్మడి స్థలాన్ని గ్రామ కంఠంగా పిలుస్తారు. అగ్రహారం బ్రాహ్మణులకు శిస్తు లేకుండా లేదా రాయితీ శిస్తుతో గ్రాంటుగా వచ్చిన గ్రామం లేదా గ్రామంలోని కొంత భాగాన్ని అగ్రహారం అని పిలుస్తారు. ఫసలీ ఏటా జూలై 1 నుంచి మరుసటి ఏడాది జూన్ 30వ తేదీ వరకు మొత్తం 12 నెలల పంట కాలాన్ని బట్టి దీన్ని నిర్ణయించారు. ఇందులో అడంగల్లో నమోదైన వివరాలు ఉంటాయి. ఏ ఏటికాఏడు రైతులు క్రయవిక్రయాలు జరిపితే ప్రస్తుత రైతు పేరును రౌండప్ చేసి కొత్త రైతు పేరును చేరుస్తారు. ఎవరైనా భూమిని కొనుగోలు చేస్తే ఆ డాక్యుమెంట్ తీసుకుని రెవెన్యూ అధికారులను సంప్రదించి అడంగల్లో వివరాలు నమోదు చేసుకోవాలి. ఫీల్డ్ మెజర్మెంట్ బుక్ (ఎఫ్ఎంబీ) గ్రామ రెవెన్యూ రికార్డుల్లో ఎఫ్ఎంబీ ఒకటి. అన్ని సర్వే నంబర్ల పటాలు ఇందులో ఉంటాయి. వాటి నిర్ధిష్ట కొలతలు కూడా ఇందులో నమోదు చేసి ఉంటాయి. జమాబందీ జమాబందీ అంటే ప్రభుత్వానికి రావాల్సిన భూమి పన్ను, నీటి పన్ను ఇతర బకాయిలు సక్రమంగా లెక్క కట్టడం. మండల స్థాయి అధికారులు తమ విధులను సక్రమంగా నిర్వర్తిస్తున్నారా లేదా అనేది పరిశీలించేందుకు ఈ ప్రక్రియ దోహదపడుతుంది. రైతులు తమ సాధకబాధకాలను రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకువెళ్లడానికి కూడా జమాబందీ అవసరం. ఏడాదికి ఒకసారి కలెక్టర్, జాయింట్ కలెక్టర్, జిల్లా రెవెన్యూ అధికారి, ఇతర డిప్యూటీ కలెక్టర్లు పరిశీలిస్తారు. అడంగల్/పహాని సాగు భూముల వివరాలు నమోదు చేసే రిజిష్టర్ ఇది. మన రాష్ట్రంలో అడంగల్ అని, తెలంగాణలో పహాని అని అని పిలుస్తారు. అడంగల్లో రైతుల పేర్లు నమోదై ఉంటే ఆ భూమిపై పూర్తి హక్కు వచ్చినట్లే. భూముల క్రయ విక్రయాలు చేయాలంటే అధికారులు ఈ రిజిష్టర్నే ప్రామాణికంగా తీసుకుంటారు. గతంలో ‘గ్రామ లెక్క నంబర్’గా ఈ రిజిష్టర్ను పిలిచేవారు. ఏటా గ్రామంలోని అన్ని భూముల వివరాలను నమోదు చేస్తారు. సర్వే నంబర్ల వారీగా మొత్తం విస్తీర్ణం ఎంత?, ఎవరి పేరుతో ఎంత భూమి ఉంది?, హక్కు దారులు ఎవరు?, పట్టాదారు ఎవరు? తదితర పూర్తి వివరాలు అడంగల్లో ఉంటాయి. -
కలెక్టర్ కట్టె పట్టినా అంతే!
జిల్లాలో మొత్తం రైతుల ఖాతాలకు గాను 2,121 ఖాతాలకు సంబంధించి భూములకు ఎలాంటి ఇబ్బందులు లేకున్నా కేవలం సాంకేతిక కారణాలతో డిజిటల్ సంతకాలు కాలేదు. రైతులకు సంబంధించి ఆధార్ కార్డు నంబర్లు లేవని చెప్పడంతో పాటు ఇతర కారణాలతో వీటిని పక్కన పెట్టారు. ప్రభుత్వం పదేపదే చెబుతున్నా... జిల్లా కలెక్టర్ బరిగె పట్టుకున్నట్లుగా వెంటపడుతున్నా క్షేత్రస్థాయిలో రెవెన్యూ సిబ్బంది తీరు మాత్రం మారడం లేదని చెప్పడానికి ఈ ఉదాహరణలు చాలేమో! సాక్షి, హన్మకొండ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెవెన్యూ రికార్డుల ప్రక్షాళన(ఎల్ఆర్యూపీ) కార్యక్రమం జిల్లాలో ప్రహసనంగా కొనసాగుతోంది. రాష్ట్రంలో ఎక్కడాలేని విధంగా జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్పాటిల్ ప్రతీ శనివారం ఎల్ఆర్యూపీ సమస్యలపై డీఆర్వో నుంచి వీఆర్వో స్థాయి వరకు అధికారులతో నేరుగా సమీక్ష నిర్వహిస్తున్నారు. ఆ వారంలో సాధించిన, ఇంకా సాధించాల్సిన ప్రగతిపై అధికారులకు దిశానిర్దేశం చేస్తున్నారు. ముఖ్యంగా ప్రజావాణికి వచ్చిన భూసమస్యల విషయంలో అధికారులు తక్షణం స్పందించాలని, రైతుల సమస్యలు పరిష్కారానికి ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశిస్తున్నారు. అయినా కొందరు అధికారుల్లో మార్పు రావడంలేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. మూలాల్లోకి వెళ్లి సమస్యలు పరిష్కారం చేసే ఉద్దేశం వారిలో కనిపించడంలేదు. అలా కాకపోతే ఉద్యోగులు ‘ఆశించిన ఫలితం’ దక్కడం లేదనే భావనతో కొన్ని పనులు పక్కన పడేస్తున్నారు. మరికొన్నిచోట్ల సర్వేల పేరుతో పెండింగ్లో పెడుతున్నారు. సర్వే పూర్తి చేసుకుని తమ భూమి రికార్డుల్లో నమోదు చేయమని వెళ్తే ఆ సర్వే నంబర్లో ఖాళీ లేదని చెబుతున్నారు. లేదంటే చుట్టుపక్కల ఉన్న అందరూ కలిపి సర్వే చేయించుకోండి అంటూ ఉచిత సలహా ఇస్తున్నారు. దీంతో రైతులు వీఆర్వోలు, మండల కార్యాలయాల చుట్టూ తిరగలేక అలిసిపోతున్నారు. చివరకు మళ్లీ కలెక్టర్కు ఫిర్యాదు చేయడానికి ప్రతీ సోమవారం కలెక్టరేట్కు వస్తున్నారు. పైసలిస్తేనే పని... అర్బన్ జిల్లాలో మెజార్టీ మండలాల్లో భూములు విలువ ఎకరానికి రూ.కోట్లల్లో ఉంది. ఇలాంటి చోట రైతు బందు పథకంతో పాటు విలువైన భూమిని తమ పేరుతో భద్రంగా ఉంచుకోవాలని రైతులు ఆరాటపడటం సహజం. దీనిని అదనుగా తీసుకుని రెవెన్యూ సిబ్బంది తమకు అడినంత ఇస్తేనే పనిచేస్తున్నారు. కొన్నిచోట్ల రియల్ ఎస్టేట్ వ్యాపారులతో మిలాఖత్ అయి పక్కన భూములు ఉన్న రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. భూమికి మార్కెట్లో ఉన్న ధరను బట్టి రెవెన్యూ సిబ్బంది తమ కమీషన్ డిమాండ్ చేన్నారు. రూ.కోట్లల్లో ధర ఉన్నచోట రూ.లక్షల్లో ఇవ్వాల్సిందే. రైతులకు సంబంధించి అన్ని రుజువులు ఉన్నా అడిగినంత ఇస్తేనే పనులు చేస్తున్నారు. 21 శాతం పార్ట్ బీలో... రెవెన్యూ రికార్డుల ప్రక్షాళన ప్రారంభం నుంచి ఇప్పటివరకు జిల్లాలో మొత్తం 1,31,210 ఖాతాలతో పాస్ పుస్తకాలు మంజూరు చేశారు. ఇందులో 89,243 ఖాతాలు అంటే 68శాతం వ్యవసాయ భూములకు సంబంధించినవి ఉన్నాయి. మిగతా వాటిలో 14,430 అంటే 11శాతం వ్యవసాయేతర భూములు, ప్రభుత్వ అసైన్డ్ లాండ్స్కు ఖాతాలు మంజూరు చేశారు. ఈ లెక్కన వ్యవసాయ, వ్యవసాయేతర భూములకు మొత్తంగా 1,03,673 ఖాతాలతో రైతులకు పట్టాదార్ పాస్ పుస్తకాలు మంజూరు చేశారు. మిగతా 21 శాతం అంటే 27,537 ఖాతాలు పార్ట్ ‘బీ’ భూములకు సంబంధించినవి ఉన్నాయి. -
సామూహిక సెలవులకు వెళ్దామా?
సాక్షి, హైదరాబాద్: కోడ్ కూత ముగిసినా.. సర్కారు కరుణిం చడంలేదు. తహసీల్దార్లు కుటుంబ సభ్యులను వదిలి పది నెలలైనా పాత జిల్లాలకు తిరిగి పంపేందుకు అంగీకరించడంలేదు. నేడో, రేపో బదిలీ ఉత్తర్వులు అందుతాయని దాటవేస్తూ వచ్చిన రెవెన్యూ ఉద్యోగ సంఘాలకు ఇప్పుడు ఈ వ్యవహారం తలనొప్పిగా మారింది. తహసీల్దార్ల బదిలీల మాట అటుంచితే అన్ని కేడర్లలోనూ బదిలీలు, పదోన్నతులతోపాటు రెవెన్యూశాఖ ప్రక్షాళనపై ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో సామూహిక సెలవుల ప్రతిపాదన తెరపైకి వచ్చింది. సామూహిక సెలవులకు వెళ్దామని ఉద్యోగుల నుంచి వస్తున్న ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలో అర్థంగాక రెవెన్యూ సంఘాలు తర్జనభర్జన పడుతున్నాయి. ఉంటాయా... ఉండవా? సొంత జిల్లాలో పనిచేస్తున్న లేదా మూడేళ్లుగా ఒకే జిల్లాలో పోస్టింగ్ నిర్వర్తిస్తున్న తహసీల్దార్లను ఎన్నికల కోడ్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం గతేడాది సెప్టెంబర్లో ఇతర జిల్లాలకు బదిలీ చేసింది. ఎన్నికల నియమావళి ముగిసిన అనంతరం వారికి తిరిగి పాత జిల్లాల్లో పోస్టింగ్లు ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. ఈసారి కూడా అలాగే ఉంటుందని భావించిన తహసీల్దార్లు.. వారి కుటుంబ సభ్యులను పూర్వ జిల్లాల్లోనే ఉంచేసి పొరుగు జిల్లాల్లో సేవలందించేందుకు వెళ్లారు. ఎన్నికలు అయిపోగానే వెనక్కి వస్తామనే భరోసాతో పిల్లల చదువులకు ఇబ్బంది రాకుండా వారిని అక్కడే కొనసాగించారు. మే నెలాఖరులో కోడ్ ముగియడంతో ఇక పాత జిల్లాలకు వెళ్తామని భావించారు. ఈ మేరకు బదిలీ ఉత్తర్వుల గురించి ఎదురుచూశారు. అయితే ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు స్పందన రాకపోవడంతో తహసీల్దార్లలో ఆందోళన మొదలైంది. బదిలీలు ఉంటాయా లేదా అనే అనుమానం వారిని తొలిచేస్తోంది. సీఎంఓ చుట్టూ చక్కర్లు..? ముఖ్యమంత్రి కేసీఆర్ పరిధిలోనే రెవెన్యూశాఖ కూడా ఉండటంతో బదిలీలపై సీఎం నిర్ణయం తీసుకుంటే కానీ ముందడుగు వేసే పరిస్థితి కనిపించడంలేదు. ఎన్నికల వేళ వివిధ జిల్లాలకు బదిలీ అయిన 466 మందిని తిరిగి పూర్వ జిల్లాలకు పంపాలని ప్రతిపాదిస్తూ సీఎం పేషీకి చేరిన ఫైలుకు ఇప్పటివరకు మోక్షం కలగకపోవడంతో తహసీల్దార్లు లబోదిబోమంటున్నారు. ఇప్పటికే పాఠశాలలు ప్రారంభమై నెల రోజులు గడిచిపోయాయి. మరో పక్షం రోజుల్లో మున్సిపల్ ఎన్నికల కోడ్ కూడా వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఒకవేళ ఆలోగా గనుక బదిలీల ప్రక్రియ పూర్తి కాకపోతే తమ పరిస్థితేంటనే ఆవేదన వ్యక్తమవుతోంది. మరోవైపు బదిలీల వ్యవహారం రెవెన్యూ ఉద్యోగ సంఘాలకు తలనొప్పిగా పరిణమించింది. రొటీన్గా జరిగే ఎన్నికల బదిలీల ఉత్తర్వులను కూడా ఇప్పించలేకపోయామనే ప్రచారం జరుగుతుండటంతో పరిస్థితిని అధిగమించేందుకు భవిష్యత్తు కార్యాచరణపై సమాలోచనలు జరుపుతున్నారు. ఇప్పటికే సీఎంఓ చుట్టూ ప్రదిక్షణలు చేస్తున్న ఉద్యోగ సంఘాల నేతలకు తాజాగా ఏపీలో ఎన్నికల వేళ స్థానచలనం జరిగిన తహసీల్దార్లను పాత జిల్లాలకు పంపుతూ గురువారం ఉత్తర్వులు వెలువడటం పుండు మీద కారం చల్లినట్లుగా మారింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఒకట్రెండు రోజుల్లో బదిలీలపై నిర్ణయం తీసుకోకపోతే సామూహిక సెలవులపై వెళ్లాలని భావిస్తున్నట్లు రెవెన్యూ ఉద్యోగ సంఘం నేత ఒకరు ‘సాక్షి’కి తెలిపారు. -
బడ్జెట్లో విద్యా రంగానికి పెద్దపీట
-
బడ్జెట్లో రూ.5,116 కోట్లు కేటాయించండి
సాక్షి, అమరావతి: రాష్ట్ర బడ్జెట్లో తమ శాఖకు రూ.5,116.40 కోట్లు కేటాయించాలని రెవెన్యూ శాఖ కోరింది. ఈ మేరకు రెవెన్యూ శాఖ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్, ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు డాక్టర్ మన్మోహన్సింగ్, సాంబశివరావు (స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ) ఆర్థిక శాఖకు ప్రతిపాదనలు సమర్పించారు. బడ్జెట్ ముందస్తు కసరత్తులో భాగంగా ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ మంగళవారం వివిధ శాఖల మంత్రులు, అధికారులతో విభాగాల వారీగా సమావేశమయ్యారు. భూ పరిపాలన, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖలకు సంబంధించి రూ.5,116.40 కోట్లు కేటాయించాలని మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ ఆర్థిక శాఖ మంత్రికి నివేదించారు. సాధారణ బడ్జెట్ కింద రూ.1,430.40 కోట్లు, వైఎస్సార్సీపీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల అమలుకు రూ.3,686 కోట్లు కలిపి మొత్తం రూ.5,116.40 కోట్లు బడ్జెట్లో కేటాయించాలని పిల్లి సుభాష్ చంద్రబోస్ విజ్ఞప్తి చేశారు. కొత్త జిల్లాల ఏర్పాటుకు రూ.25 కోట్లు ఇవ్వండి ప్రతి పార్లమెంటరీ నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా మారుస్తామని వైఎస్సార్సీపీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించింది. దీని ప్రకారం రాష్ట్రంలో 25 జిల్లాలు ఏర్పాటు చేయాల్సి ఉంది. అయితే, అరకు పార్లమెంటరీ నియోజకవర్గాన్ని మూడు జిల్లాలుగా మార్చేసి, అందులో రెండింటిని గిరిజన జిల్లాలుగా చేయాలని, దీంతోపాటు ఏలూరు పార్లమెంటరీ నియోజకవర్గంలోని ఏజెన్సీ ప్రాంతాన్ని విడగొట్టి పోలవరం గిరిజన జిల్లాను ఏర్పాటు చేయాలని రెవెన్యూ శాఖ యోచిస్తోంది. జిల్లాల ఏర్పాటు ఈ ఆర్థిక సంవత్సరంలో చేపట్టే అవకాశం లేదని, తర్వాత చేపడతామని, అయినప్పటికీ ఇందుకోసం రూ.25 కోట్ల బడ్జెట్ కావాలంటూ ప్రతిపాదించామని అధికార వర్గాలు తెలిపాయి. ప్రభుత్వ ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు ఇస్తామని వైఎస్సార్సీపీ పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ హామీ అమలుకు రూ.13 కోట్లు కేటాయించాలని రెవెన్యూ శాఖ విన్నవించింది. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో దారిద్య్ర రేఖకు దిగువనున్న కుటుంబాలకు ఇళ్ల స్థలాలు ఇస్తామని కూడా వైఎస్సార్సీపీ మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది. ఇందుకోసం మొదటి ఏడాది రూ.3,648 కోట్లు కావాలని రెవెన్యూ శాఖ ప్రతిపాదించింది. సాగునీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యం రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తుందని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ పేర్కొన్నారు. 2019–20 బడ్జెట్ ప్రతిపాదనలపై మంగళవారం సచివాలయంలో జలవనరుల శాఖ మంత్రి అనిల్కుమార్ యాదవ్, ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ఎస్ రావత్ తదితరులతో ఆయన సమీక్ష నిర్వహించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జలయజ్ఞం కింద చేపట్టిన ప్రతి ప్రాజెక్టును పూర్తి చేసి.. రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయించారని జలవనరుల శాఖ మంత్రి అనిల్కుమార్ యాదవ్ తెలిపారు. పోలవరం ప్రాజెక్టును శరవేగంగా పూర్తి చేయడానికి ప్రణాళికలు రూపొందించామని.. ఆ మేరకు బడ్జెట్లో నిధులు కేటాయించాలని కోరారు. దీనిపై ఆర్థిక మంత్రి బుగ్గన స్పందిస్తూ సాగునీటి ప్రాజెక్టులకు నిధుల కేటాయింపులో అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారని చెప్పారు. తక్కువ నిధులతో పూర్తయ్యే ప్రాజెక్టులకు సరిపడా నిధులు కేటాయిస్తామని.. తద్వారా అధిక శాతం ఆయకట్టుకు నీళ్లందించవచ్చునని పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టుతోపాటు పెండింగ్ ప్రాజెక్టులను దశలవారీగా పూర్తి చేసేలా నిధులు కేటాయింపు చేస్తామని తెలిపారు. బడ్జెట్లో విద్యా రంగానికి పెద్దపీట విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడి రాష్ట్రంలో ప్రస్తుత ఆర్థిక (2019–20) సంవత్సరానికి సంబంధించి బడ్జెట్ కేటాయింపుల్లో విద్యా రంగానికి అత్యధిక ప్రాధాన్యం ఇవ్వనున్నారని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విద్యారంగానికి పెద్దపీట వేస్తున్నారని, అందుకు తగ్గట్టుగా బడ్జెట్ కేటాయింపులు చేస్తామని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ పేర్కొన్నారని ఆయన తెలిపారు. ముందస్తు బడ్జెట్ కసరత్తులో భాగంగా మంగళవారం సచివాలయంలో ఆర్థిక శాఖ నిర్వహించిన సమావేశంలో ఆదిమూలపు సురేష్ పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలలో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందన్నారు. విద్యా సంస్థల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేయనున్నట్లు చెప్పారు. అమ్మ ఒడి పథకాన్ని ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియెట్ వరకు అమలు చేయడానికి అయ్యే మొత్తం నిధులు కేటాయించనున్నారని తెలిపారు. కేంద్ర ప్రాయోజిత కార్యక్రమాలకు రాష్ట్ర వాటా నిధులు కూడా అందించడానికి ఆర్థిక మంత్రి సానుకూలంగా స్పందించారని వెల్లడించారు. పాఠశాల విద్యకు 39,897 కోట్లు ఇవ్వండి 2019–20 ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో పాఠశాల విద్యకు రూ.39,897.42 కోట్లు కేటాయించాలని విద్యాశాఖ ప్రతిపాదించింది. నవరత్నాల హామీల్లో ఒకటైన అమ్మ ఒడి పథకంతోపాటు మధ్యాహ్న భోజన పథకం అమలు, విద్యాసంస్థల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ఈ మేరకు నిధులు అవసరమని పేర్కొంది. ఇక ఉన్నత విద్యాశాఖకు రూ.5,027.15 కోట్లు అవసరమని ఆర్థిక శాఖకు బడ్జెట్ ప్రతిపాదనలు అందజేసింది. -
ఆత్మరక్షణకు ఆయుధాలివ్వండి..!
సాక్షి, హైదరాబాద్: ‘మాకు రక్షణ ఏర్పాట్లు చేయకపోతే అడవుల్లోకి వెళ్లలేం. మాపై దాడులు పెరుగుతున్న నేపథ్యంలో అడవుల సంరక్షణ బాధ్యతలు చేపట్టలేం. అడవుల్లో స్థానికంగా రాజకీయ జోక్యం పెరుగుతోంది. పోలీసు, రెవెన్యూ శాఖలు సహకరించడం లేదు. మమ్మల్ని మేము రక్షించుకునేందుకు అధికారులు, సిబ్బంది వద్ద ఆయుధాలు కూడా లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. మా రక్షణకు ప్రభుత్వపరంగా స్పష్టమైన హామీ ఇవ్వకపోతే ఇకముందు విధుల నిర్వహణ కష్టమవుతుంది..’అని రాష్ట్ర ప్రభుత్వానికి ఐఎఫ్ఎస్ స్థాయి మొదలుకుని వివిధ స్థాయిల్లోని అటవీ అధికారులు విజ్ఞప్తి చేశారు. తాజాగా కాగజ్నగర్లో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ అనితపై దాడి జరిగిన నేపథ్యంలో తమపై దాడులు జరగకుండా నిరోధించాలని, బాధ్యులపై పీడీయాక్ట్ పెట్టాలని, ఈ దాడి వెనక రాజకీయంగా ఎవరున్నారో తేల్చి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. అటవీ కేసులను త్వరితంగా పరిష్కరించేందుకు వీలుగా ఫాస్ట్ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. సోమవారం అరణ్యభవన్లో ఐఎఫ్ఎస్ స్టేట్ ఫారెస్ట్ సర్వీస్, రేంజ్ ఆఫీసర్స్, జూనియర్ ఫారెస్ట్ ఆఫీసర్స్, తదితర సంఘాల నేతలు సమావేశమై కాగ జ్నగర్ దాడి పరిణామాల నేపథ్యంలో సర్కార్ నుంచి అన్నివిధాలా సహకారం అందించాలని పీసీసీఎఫ్ పీకే ఝాకు వినతిపత్రాన్ని సమర్పించాయి. అధికారులు, సిబ్బంది అధైర్యపడొద్దని, శాఖాపరంగా అన్నివిధాలా మద్దతుగా నిలుస్తామని, ప్రభు త్వపరంగా పూర్తి సహాయ సహకారాలు అందించేలా చర్యలు తీసుకుంటామని పీకే ఝా పేర్కొన్నట్టు సమాచారం. అటవీ సిబ్బంది ప్రభుత్వ నిబంధనల ప్రకారమే హరితహారంలో భాగంగా ప్రత్యామ్నాయ అటవీ పెంపకం చేస్తున్నట్టు సమావేశంలో వివిధ స్థాయిల అధికారులు పేర్కొన్నారు. అటవీ భూములను ఆక్రమించటమే కాకుండా తమపైనే దాడికి దిగుతున్న వారిపై ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించాలని, వేగంగా విచారణ చేయటంతో పాటు చట్ట ప్రకారం నిందితులను శిక్షించాలని కోరా రు. సమావేశంలో ఐఎఫ్ఎస్ అధికారుల సంఘం అధ్యక్షుడు పి.రఘువీర్, వైస్ ప్రెసిడెంట్ మునీంద్ర, సెక్రటరీ లోకేష్ జైస్వాల్, జాయింట్ సెక్రటరీ స్వర్గం శ్రీనివాస్, స్టేట్ ఫారెస్ట్ సర్వీస్ అసోసియేషన్, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ల అసోసియేషన్, జూనియర్ ఫారెస్ట్ ఆఫీసర్ల అసోసియేషన్ ప్రతినిధులు, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. అడవుల్లోని పరిస్థితులపై సర్కార్కు నివేదిక.. కాగజ్నగర్ ఘటన నేపథ్యంలో అడవుల్లో చోటు చేసుకుంటున్న పరిస్థితులు, అధికారులు, సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలు, ఇతరత్రా అంశాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి పీసీసీఎఫ్ పీకే ఝా నివేదిక సమర్పించినట్టు సమాచా రం. ప్రస్తుతం వర్షాల సీజన్ మొదలవుతుండటం తో అటవీ ఆక్రమణలు వేగం పుంజుకుంటున్నాయని, కొత్తగా పెరుగుతున్న ఆక్రమణలను అరికట్టే క్రమంలో దాడులు పెరుగుతున్నాయని అటవీ శాఖ ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చినట్టు తెలుస్తోంది. కొత్తగా అటవీభూమిని సాగులోకి తెచ్చేందుకు దున్నడం, ఇతర పొలం పనులు మొదలుపెట్టి దానిని కొన్నేళ్లుగా సాగు చేస్తున్నట్టుగా చూపే యత్నం జరుగుతోందని, రాజకీయ నేతల జోక్యం పెరగడంతో, స్థానిక స్థాయిల్లో వారి అండతో అనుచరుల దాడులు పెరిగాయని పేర్కొన్నట్టు తెలిసింది. అడవుల్లో హరితహారం, ప్రత్యామ్నాయ అడవుల పెంపకం వంటి కార్యక్రమాలకు వీరి నుంచి ఇబ్బందులు ఎదురవుతున్నాయని వివరించినట్టు సమాచారం. అటవీ ఆక్రమణలు బాగా పెరుగుతు న్నాయని వరంగల్ రూరల్ జిల్లాలో అత్యధికంగా 85 శాతం, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లో 27 శాతం, ఆదిలాబాద్ జిల్లాలో 21 శాతం, భద్రాద్రి కొత్తగూడెంలో 18 శాతం, కొమురం భీం జిల్లాలో 15 శాతం ఆక్రమణలు చోటుచేసుకున్నట్టు ప్రభు త్వం దృష్టికి తెచ్చినట్టు సమాచారం. -
రెవెన్యూశాఖలో ప్రక్షాళన షురూ..!
సాక్షి, హైదరాబాద్: రెవెన్యూశాఖను సంస్కరించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా.. దీర్ఘకాలికంగా ఒకే చోట తిష్టవేసిన ఉద్యోగులను ఆయా స్థానాలనుంచి బదిలీ చేయాలని నిర్ణయించింది. రెవెన్యూశాఖను అవినీతిరహితంగా మార్చేందుకు సంకల్పించిన నేపథ్యంలో మూకుమ్మడి బదిలీలతో కొంతమేర మార్పు తీసుకురావొచ్చని సర్కారు భావిస్తోంది. ఈ క్రమంలో కంప్యూటర్ ఆపరేటర్ నుంచి మొదలుపెట్టి.. రెవెన్యూ డివిజనల్ అధికారి (ఆర్డీఓ) స్థాయి వరకు అందరికీ స్థానచలనం చేయాల్సిందేనని యోచిస్తోంది. రెవెన్యూ శాఖలో పైసలివ్వందే ఫైలు ముందుకు కదలడంలేదని సర్వత్రా ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో.. ఈ శాఖను ప్రక్షాళన చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఒకవైపు కొత్త రెవెన్యూ చట్టానికి పదును పెడుతూనే.. మరోవైపు ఉద్యోగులను సమూల మార్పులు చేసేలా విధానాన్ని రూపొందించాలని మాజీ సీఎస్, ప్రభుత్వ సలహాదారు రాజీవ్ శర్మ నేతృత్వంలోని నిపుణుల కమిటీ సూచించారు. ఈ మేరకు నిపుణుల కమిటీ నూతన రెవెన్యూ చట్టం, ఉద్యోగుల విలీనం తదితర అంశాలను లోతుగా అధ్యయనం చేస్తోంది. అయితే, చట్టం మనుగడలోకి రావడం ఆలస్యమవుతున్నందున.. ఆ లోపు ఉద్యోగుల బదిలీల ద్వారా కాస్తయినా మార్పు తీసుకువచ్చేందుకు రంగం సిద్ధం చేసింది. దిగువ నుంచి ఎగువ వరకు ఈ విషయంలో ఎలాంటి తారతమ్యాల్లేకుండా.. దిగువస్థాయి నుంచి ఎగువస్థాయి వరకు తేడాల్లేకుండా బదిలీలు వర్తింపజేయాలని ముఖ్యమంత్రి కార్యాలయం మౌఖిక ఆదేశాలు జారీ చేసినట్లు విశ్వసనీయంగా తెలిసింది. రంగారెడ్డి జిల్లాలో ఇప్పటికే తహసీల్దార్ కార్యాలయాల్లోని కంప్యూటర్ ఆపరేటర్లు, వీఆర్ఓ, ఆర్ఐ, జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్, నయాబ్ (ఉప) తహసీల్దార్లను ఆ జిల్లా యంత్రాంగం బదిలీ చేసింది. ఇదే విధానాన్ని ఇతర జిల్లాల్లో కూడా అమలు చేయడం ద్వారా కుర్చీలకు అతుక్కుపోయిన సిబ్బందిని తప్పించవచ్చని, తద్వారా అవినీతిని కొంతమేరనైనా తగ్గించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. అయితే, తహసీల్దార్లు, డిప్యూటీ కలెక్టర్లు, స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లను బదిలీచేసే అధికారం ప్రభుత్వానికి ఉన్నందున.. స్థానచలనం చేయాల్సిన అధికారుల జాబితాను రెవెన్యూశాఖ తయారు చేస్తోంది. కొత్త రెవెన్యూ చట్టాన్ని తీసుకురావడంలో జాప్యం జరుగుతుండడంతో ఆలోపే ఉద్యోగుల బదిలీ ప్రక్రియను పూర్తి చేయాలని యోచిస్తోంది. సమాచార సేకరణ! దీర్ఘకాలికంగా ఒకే చోట పనిచేస్తున్న ఉద్యోగుల డేటాబేస్ను ఇటీవల సీసీఎల్ఏ కార్యాలయం సేకరించింది. ఈ మేరకు నిర్దేశిత ఫార్మాట్లో వివరాలను రాబట్టింది. సర్వీసులో చేరిన తర్వాత ఏయే చోట్ల, ఏయే పోస్టుల్లో ఎన్నాళ్లు పనిచేశారు? సొంత జిల్లా ఏదీ? తదితర సమాచారాన్ని సేకరించింది. దిగువస్థాయి సిబ్బంది మొదలు.. తహసీల్దార్ వరకు ఈ వివరాలను పంపాలని కోరింది. జూనియర్ అసిస్టెంట్/టైపిస్ట్, సీనియర్ అసిస్టెంట్, డీటీ/పీడీటీ, తహసీల్దార్ల సమాచారాన్ని సేకరించింది. ఈ వివరాలకు అనుగుణంగా బదిలీల క్రతువును పూర్తి చేయాలనే యోచనలో ఉంది. ఒకే జిల్లాల్లో ఎన్నాళ్ల నుంచి పనిచేస్తున్నారనే లెక్క ఆధారంగా బదిలీలు చేపట్టే అంశాన్ని పరిశీలిస్తోంది. ఈ డేటాను ముఖ్యమంత్రి కార్యాలయానికి రెవెన్యూ శాఖ నివేదించినట్లు తెలిసింది. అయితే, ఇప్పటికే రంగారెడ్డి జిల్లాలో తహసీల్దార్లు మినహా మిగతా స్టాఫ్ను జిల్లా యంత్రాంగం బదిలీ చేసింది. దీంతో ఇదే విధానాన్ని ఇతర జిల్లాల్లో అమలు చేయాలని రెవెన్యూశాఖకు సీఎంవో మౌఖిక ఆదేశాలు జారీ చేసినట్లు ఉన్నతస్థాయి అధకారి ఒకరు ‘సాక్షి’కి తెలిపారు. తహసీల్దార్లను కూడా.. తహసీల్దార్ల బదిలీకి కూడా రంగం సిద్ధమైంది. గతేడాది అసెంబ్లీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో సొంత జిల్లాలో పనిచేస్తున్న, మూడేళ్లుగా ఒకేచోట విధులు నిర్వహిస్తున్న వారిని ఈసీ ఆదేశాలకు అనుగుణంగా ప్రభుత్వం స్థానచలనం కలిగించింది. తాజాగా ఎన్నికల ప్రక్రియ ముగియడంతో పాత జిల్లాలకు పంపాలని తహసీల్దార్లు సచివాలయం చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. 466 మంది తహసీల్దార్ల బదిలీలకు ఒకట్రెండు రోజుల్లో ఉత్తర్వులు వెలువడే అవకాశముంది. అదే క్రమంలో పూర్వపు జిల్లాలకు కేటాయించిన అనంతరం.. పాత పోస్టింగ్లు ఇవ్వకుండా నిర్ణయం తీసుకోవాలని కలెక్టర్లకుప్రభుత్వం సూచనలు జారీ చేయనుందని సమాచారం. అలాగే ఇతర తహసీల్దార్లను జోనల్ పరిధిలో ఏ జిల్లాకైనా పంపడంలో ఉద్యోగ సంఘాల ఒత్తిడికి తలొగ్గవద్దని సీఎం పేషీ సంకేతాలిచ్చినట్లు సమాచారం. కాగా, వచ్చే నెలలో మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తున్న నేపథ్యంలో సత్వరమే బదిలీలు జరగాల్సివుంది. ఎన్నికల ప్రక్రియను పరిగణనలోకి తీసుకుంటే మాత్రం రెవెన్యూ అధికారుల బదిలీల్లో మరికొంత ఆలస్యం జరిగే అవకాశముంది. -
అర్హులందరికీ ఇళ్ల స్థలాలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అర్హులందరికీ ఇంటి స్థలం ఇచ్చి తీరుతామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రంలో నివాస స్థలాలు లేని 25 లక్షల మందికి ఇళ్ల స్థలాలివ్వాలంటే రూ.40 వేల కోట్లు కావాలని రెవెన్యూ శాఖ తయారు చేసిన గణాంకాలను ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. సరైన అంచనాలు, ప్రణాళికలు లేకుండా ఇలాంటి అంచనాలు వేసి భయపెట్టొద్దని హితవు పలికారు. ఇచ్చిన హామీని తక్కువ ఖర్చుతో అమలు చేసే మార్గాలు చూడాలన్నారు. 25 లక్షల ఇళ్ల స్థల పట్టాల జారీకి రూ.40 వేల కోట్లు అవుతుందని లెక్కలు వేయడమంటే ఇక దాన్ని ముట్టుకోవద్దని చెప్పడమేనని, ఇలా భయపడేలా చేస్తారా? అంటూ అసహనం వ్యక్తం చేశారు. 25 లక్షల మందికి ఇళ్ల స్థల పట్టాలు ఇవ్వడానికి 83,833 ఎకరాలు అవసరమని, ఇందుకు రూ.40 వేల కోట్లు అవసరమవుతాయని రెవెన్యూ శాఖ పవర్ పాయింట్ ప్రజంటేషన్ సిద్ధం చేసింది. రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్ మన్మోహన్సింగ్ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చేందుకు సిద్ధం కాగానే ముఖ్యమంత్రి కలుగజేసుకుని ఆ గణాంకాలు అవసరం లేదని, పక్కన పడేయాలని ఆదేశించారు. ‘రాష్ట్రంలో ఇంటి స్థలం లేని అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇంటి స్థలం ఇచ్చి తీరుతాం. 25 లక్షల మంది మహిళల పేరుతో నివాస స్థలాలు పంపిణీ చేస్తామని చెప్పాం. వచ్చే ఉగాది నాడు పండుగలా నివాస స్థలాలు పంపిణీ చేస్తాం. గత పాలకుల్లాగా పట్టాలు ఇచ్చి స్థలాలెక్కడో చూపని పరిస్థితి ఉండకూడదు. ఏయే గ్రామాల్లో ఎంతమందికి ఇంటి స్థలాలు లేవో గ్రామ వలంటీర్లు లెక్క తీస్తారు. ఆయా గ్రామాల్లో వారికి పట్టాలు ఇవ్వడానికి ఎంత భూమి కావాలో.. ప్రభుత్వ భూమి ఎంత ఉందో చూడండి. ఎక్కడైనా కొంత తక్కువ ఉంటే కొనుగోలు చేద్దాం. ఎకరా రూ.20 లక్షలు అని, రూ.40 లక్షలు అని ఏవేవో లెక్కలు వేస్తే ఎలా?’ అని సీఎం ప్రశ్నించారు. దీంతో మన్మోహన్సింగ్ పట్టణ ప్రాంతాల్లో స్థలం కొరత ఉన్నందున మల్టీ స్టోరీడ్ భవనాలు ఇద్దామని, గ్రామాల్లో ఇళ్ల స్థలాలు ఇద్దామని ప్రతిపాదించారు. దీనికి స్పందించిన సీఎం పట్టణ ప్రాంతాల్లో జీ ప్లస్ 3, జీ ప్లస్ 4కు అనుగుణంగా నంబర్ ఆఫ్ ప్లాట్లు ప్లాన్ చేసుకుని అన్ డివైడెడ్ షేర్కు పట్టాలు ఇవ్వాలని ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం స్థలాలు ఇద్దామన్నారు. కాగా పట్టణ గృహ నిర్మాణంలో గతంలో భారీ స్కామ్ జరిగిందని సీఎం వైఎస్ జగన్ ఎత్తి చూపారు. ‘300 చదరపు అడుగుల ఇంటి నిర్మాణానికి అవసరమైన ఇసుక ఉచితమే. సబ్సిడీతో సిమెంటు వస్తోంది. అలాంటప్పుడు చదరపు అడుగుకు రూ.1,100 మించి కాదు. వాస్తవం ఇది కాగా.. గత ప్రభుత్వం చదరపు అడుగుకు రూ.2,200 పెట్టి స్కామ్గా మార్చింది. ఇంటి నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.1.50 లక్షలు, కేంద్ర ప్రభుత్వం 1.50 లక్షలు కలిపి రూ.3 లక్షలు ఇస్తున్నాయి. ఇంటి నిర్మాణానికి ఇది సరిపోతుంది. కానీ గత పాలకులు దీన్ని రూ.6 లక్షలకు పెంచారు. ఇంత ఎందుకవుతుందో నాకు అర్థం కావడం లేదు. రివర్స్ టెండరింగ్కు వెళదాం’ అని సీఎం పేర్కొన్నారు. మానవత్వంతో ముందుకెళ్దాం గిరిజన ప్రాంతాల్లో ఎస్సీలకు, ఇతరులకు ఇళ్ల స్థలాలు ఇవ్వడం లేదని, ఇవ్వాలన్నా చట్టం అంగీకరించదనే విషయాన్ని ఉప ముఖ్యమంత్రి, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పుష్పశ్రీవాణి ప్రస్తావించారు. ఈ అంశంపై గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా కలుగజేసుకుని 1/70 చట్టం అమల్లో ఉన్న ప్రాంతాల్లో గిరిజనేతరులకు ఇళ్ల పట్టాలు ఇవ్వడానికి వీలులేదని తెలిపారు. మంత్రి మోపిదేవి వెంకటరమణ జోక్యం చేసుకుని కోస్తాలో భూముల ధరలు ఎక్కువగా ఉన్నాయని గ్రామాల పక్కనే అటవీ ప్రాంతం ఉన్నందున ఐదు ఎకరాల వరకూ ఇళ్ల స్థలాలకు వినియోగించుకునేలా చట్ట సవరణ చేసే విషయం పరిశీలించాలని కోరారు. ‘రమణన్న చెప్పినట్లుగా చేద్దాం. ముఖేష్ అన్నా (ముఖేష్ కుమార్ మీనాను ఉద్దేశించి) ముందు గిరిజన ప్రాంతాల్లో గిరిజనులకు పట్టాలు ఇవ్వండి. మిగిలినవారికి ఎలా ఇవ్వాలో ఆలోచిద్దాం’ అని సీఎం పేర్కొన్నారు. -
సీఎం ఆమోద ముద్ర
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో అగ్రవర్ణాల్లోని బలహీన వర్గాల (ఈడబ్ల్యూఎస్)కు 10% రిజర్వేషన్లు కల్పించే ఫైలుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆమోదం తెలిపినట్లు వైద్య ఆరోగ్య శాఖ వర్గాలు వెల్లడించాయి. అనంతరం సంబంధిత ఫైలుపై ఉన్నతాధికారుల సంతకం కూడా పూర్తయింది. ఆ ఫైలుపై వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ సంతకం తీసుకొని తక్షణమే ఉత్తర్వులు జారీచేయాలని అధికారులు భావిస్తున్నారు. ఉత్తర్వులు జారీ అయిన వెంటనే ఎంబీబీఎస్ సీట్ల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేస్తామని కాళోజీ నారాయణరావు ఆరోగ్య వర్సిటీ వర్గాలు తెలిపాయి. 2019–20 వైద్య విద్యా ఏడాదిలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అమలు చేయాలని మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రాష్ట్రాలను ఆదేశించిన సంగతి తెలిసిందే. 10% రిజర్వేషన్ల అమలుకు 25% సీట్ల పెంపు తప్పనిసరి కావడంతో ఆ మేరకు ప్రతిపాదలను పంపాలని కోరింది. దీంతో రాష్ట్ర వైద్య విద్య డైరెక్టర్ (డీఎంఈ) ప్రతిపాదనలు పంపారు. ఆ ప్రకారం రాష్ట్రంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో దాదాపు 312 ఎంబీబీఎస్ అదనపు సీట్లకు ప్రతిపాదనలు పంపారు. ఈ సీట్ల పెంపునకు కూడా ఎంసీఐ తాజాగా సుము ఖత వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఆరోగ్య వర్సిటీ ఎదురుచూపు.. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల అమలుకు సంబంధించి వారం కిందటే ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేయాల్సి ఉంది. ఆ మేరకు సన్నాహాలు జరిగాయి. కానీ వివిధ కారణాలతో అప్పుడు ఉత్తర్వులు జారీకాలేదు. నీట్ ఫలితాలు వచ్చి అఖిల భారత కోటా సీట్లకు కౌన్సెలింగ్ కూడా బుధవారం ప్రారంభమైంది. రాష్ట్ర స్థాయి ర్యాంకులు కూడా విద్యార్థుల చేతికి వచ్చాయి. దీంతో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల అమలుపై విద్యార్థుల్లో ఆందోళన మొదలైంది. ఇప్పటికే మెడికల్ సీట్ల భర్తీకి నోటిఫికేషన్ జారీచేయాల్సిన ఆరోగ్య వర్సిటీ ప్రభుత్వ ఉత్తర్వుల కోసమే ఎదురుచూస్తోంది. ఉత్తర్వులు రాకుండా నోటిఫికేషన్ జారీచేస్తే రిజర్వేషన్లు ఈ ఏడాదికి అమలు కాకుండా పోతాయి. వైద్య ఆరోగ్యశాఖలో కొందరు అధికారుల తీరువల్ల ఉత్తర్వుల జారీ కాస్తంత ఆలస్యమైందన్న విమర్శలు వచ్చాయి. ఇప్పుడు సీఎం ఆమోదం తెలపడంతో ఉత్తర్వులు రానున్నాయి. ఆదాయ ధ్రువీకరణ పత్రాల జారీ.. ప్రభుత్వం జారీచేసే ఉత్తర్వులో ప్రధానంగా అమలుతీరుపైనే మార్గదర్శకాలు ఉంటాయని వైద్య ఆరోగ్య శాఖ వర్గాలు తెలిపాయి. ఈడబ్ల్యూఎస్ ఆదాయ పరిమితి రూ.8 లక్షల లోపు ఉంటుందని, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు ఇచ్చేలా రెవెన్యూ శాఖకు ఈ మేరకు ఆదేశాలిస్తారని చెబుతున్నారు. ఇప్పటికే రెవెన్యూ శాఖకు మౌఖిక ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది. అఖిల భారత సీట్లలో చేరే విద్యార్థుల కోసం ఈడబ్ల్యూఎస్ ఆదాయ ధ్రువీకరణ పత్రాలను రాష్ట్రంలో రెవెన్యూ అధికారులు ఇస్తున్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని మెడికల్ కాలేజీ సీట్ల భర్తీకి తాజాగా ధ్రువీకరణ పత్రాలు జారీచేయాల్సి ఉంది. కేంద్ర ప్రభుత్వం మాదిరిగానే రాష్ట్ర ప్రభుత్వమూ రూ.8 లక్షల లోపు ఆదాయమే నిర్ణయిస్తే, ఇప్పటికే కేంద్ర సీట్ల కోసం తీసుకున్న ఆదాయ ధ్రువీకరణ పత్రాలు చెల్లుబాటు అవుతాయా లేదా అన్నదానిపై సందేహాలు నెలకొన్నాయి. ఇక ఈడబ్ల్యూఎస్ ధ్రువీకరణ పత్రాలను ఎలా ఇవ్వాలి.. ఎవరు ఇవ్వాలి.. అనే అంశాలపైనా మార్గదర్శకాల్లో సర్కారు స్పష్టత ఇచ్చే అవకాశముంది. -
వారంలోగా బెల్టు షాపులు నిర్మూలించాలి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో వారంలోగా బెల్టు షాపుల్ని సమూలంగా నిర్మూలించాలని రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డి.సాంబశివరావు ఎక్సైజ్ అధికారులను ఆదేశించారు. విజయవాడలోని ఎక్సైజ్ శాఖ కమిషనరేట్లో మంగళవారం అన్ని జిల్లాల అధికారులతో బెల్టు షాపుల నిర్మూలనపై ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. కొద్ది రోజుల కిందట సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎక్సైజ్ శాఖపై సమీక్ష నిర్వహించి ఇచ్చిన ఆదేశాలతో ఎక్సైజ్ యంత్రాంగం కదిలింది. మద్యాన్ని ప్రజలకు దూరం చేసే విధంగా కార్యాచరణ రూపొందించాలని, బెల్టు షాపులు కనిపించకుండా చేయాలని సీఎం ఆదేశించడంతో ఎక్సైజ్ అధికారులు రంగంలోకి దిగారు. ఎమ్మార్పీ ధరలకే మద్యం విక్రయించాలని, తప్పు చేస్తే ఎవరినీ ఉపేక్షించబోమని స్పెషల్ సీఎస్ సాంబశివరావు స్పష్టం చేశారు. సీఎం ఆదేశాల ప్రకారం మద్యాన్ని ప్రజలకు దూరం చేసేందుకు విద్యార్థుల్లో, యువతలో చైతన్య కార్యక్రమాలతోపాటు గ్రామాల్లో అవగాహన కల్పించాలన్నారు. బెల్టు షాపుల నిర్మూలన, మద్యాన్ని దూరం చేసే చైతన్య కార్యక్రమాలు బాగా నిర్వహించిన అధికారులకు రివార్డులు కూడా అందిస్తామన్నారు. గంజాయిపై సాగు దశ నుంచే నిఘా పెట్టి ధ్వంసం చేయాలని సూచించారు. తప్పు జరిగినట్లు నిర్ధారణ అయితే ఏ స్థాయి అధికారినైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. ఈ ఏడాది జనవరి నుంచి మే 27 వరకు రాష్ట్రంలో 9,246 బెల్టు షాపులపై కేసులు నమోదు చేసి 9,355 మందిని అరెస్ట్ చేశామన్నారు. అలాగే 644 వాహనాలను సీజ్ చేశామని తెలిపారు. బెల్టు షాపుల నిర్మూలనకు ప్రతి గ్రామానికి ఒక్కో కానిస్టేబుల్, ప్రతి మండలానికి ఒక్కో ఎస్సైకు బాధ్యతలు అప్పగిస్తామని ఎక్సైజ్ కమిషనర్ ముకేష్కుమార్ మీనా చెప్పారు. బెల్టు షాపుల నిర్మూలనపై రోజూ నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.