Stock Market Trend
-
లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్మార్కెట్లు సోమవారం లాభాల్లో ముగిశాయి. మార్కెట్లు ముగిసే సమయానికి నిఫ్టీ 111 పాయింట్లు లాభపడి 22,508 వద్దకు చేరింది. సెన్సెక్స్ 341 పాయింట్లు ఎగబాకి 74,169 వద్దకు చేరింది.సెన్సెక్స్ 30 సూచీలో బజాజ్ ఫిన్సర్వ్, ఎం అండ్ ఎం, యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, అదానీ పోర్ట్స్ అండ్ సెబ్, జొమాటో, ఐసీఐసీఐ బ్యాంక్, సన్ ఫార్మా, అల్ట్రాటెక్ సిమెంట్, టాటా మోటార్స్, టాటా స్టీల్, ఇన్ఫోసిస్, హెచ్సీఎల్ టెక్నాలజీస్, ఇండస్ఇండ్ బ్యాంక్ స్టాక్లు లాభాల్లో ముగిశాయి. ఐటీసీ, నెస్లే, ఎస్బీఐ, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఏషియన్ పెయింట్స్, ఎల్ అండ్ టీ, టీసీఎస్, పవర్ గ్రిడ్ స్టాక్లు భారీగా నష్టపోయాయి.మార్కెట్ లాభాలకు కొన్ని కారణాలు..అమెరికా ఈక్విటీలు పుంజుకోవడం, దేశీయ వినియోగాన్ని పెంచడానికి చైనా తాజా చర్యలను ప్రకటించడం ప్రపంచ సెంటిమెంట్ను మెరుగుపరిచింది. ఆటో, ఫైనాన్షియల్, బ్యాంకింగ్ రంగ షేర్లలో లాభాలు ర్యాలీకి గణనీయంగా దోహదం చేశాయి. చైనా విధానపరమైన చర్యలతో నడిచే ఆసియా మార్కెట్లలో సానుకూలత నెలకొనడంతో ఇండియన్ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాలతో ముగిసినట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు.ఇదీ చదవండి: భారత్లో యాపిల్-గూగుల్ భాగస్వామ్యం..?(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
స్థిరంగా స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నిన్నటి ముగింపుతో పోలిస్తే గురువారం స్థిరంగా కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 9:34 సమయానికి నిఫ్టీ(Nifty) 10 పాయింట్ పెరిగి 22,484కు చేరింది. సెన్సెక్స్(Sensex) 83 పాయింట్లు పెరిగి 74,124 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 103.59 పాయింట్ల వద్దకు చేరింది. బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 70.94 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.29 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో లాభాల్లో ముగిశాయి. ఎస్ అండ్ పీ గత సెషన్తో పోలిస్తే 0.49 శాతం పెరిగింది. నాస్డాక్ 1.22 శాతం పుంజుకుంది.ఇదీ చదవండి: మూడేళ్లలో రూ.52 లక్షల కోట్ల పెట్టుబడులు..అమెరికా ఆర్థిక వృద్ధిపై ఆందోళనలు రేకెత్తడంతో నిన్నటి మార్కెట్ సెషన్లో ఐటీ రంగ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. అంతర్జాతీయ వాణిజ్య సుంకాల అనిశ్చితి కూడా సెంటిమెంట్ను దెబ్బతీసింది. కూరగాయలు, గుడ్లు, ప్రొటీన్లు సమృద్ధిగా ఉండే ఇతరత్రా పదార్ధాల రేట్లు నెమ్మదించడంతో ఫిబ్రవరిలో రిటైల్ ద్రవ్యోల్బణం ఏడు నెలల కనిష్టమైన 3.61 శాతానికి దిగి వచ్చింది. ఇది గతేడాది జులై తర్వాత కనిష్ట స్థాయి. తాజా పరిణామం నేపథ్యంలో వచ్చే నెలలో రిజర్వ్ బ్యాంక్ మరోసారి కీలక వడ్డీ రేట్ల కోతపై దృష్టి పెట్టడానికి కాస్త అవకాశం లభించినట్లవుతుందని పరిశీలకులు అభిప్రాయపడ్డారు.ఈ నెల 14వ తేదీన హోలీ పండుగ సందర్భంగా మార్కెట్లకు సెలవు.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
స్వల్ప లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం స్వల్ప లాభాల్లో కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 9:22 సమయానికి నిఫ్టీ(Nifty) 10 పాయింట్లు ఎగబాకి 22,5001కు చేరింది. సెన్సెక్స్(Sensex) 82 పాయింట్లు పెరిగి 74,183 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 103.55 పాయింట్ల వద్దకు చేరింది. బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 70.04 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.27 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో నష్టాల్లో ముగిశాయి. ఎస్ అండ్ పీ గత సెషన్తో పోలిస్తే 0.75 శాతం దిగజారింది. నాస్డాక్ 0.18 శాతం నష్టపోయింది.ఇదీ చదవండి: ఎస్బీఐ యూపీఐ సేవల్లో అంతరాయంయూఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ టారిఫ్ల విధింపు చర్యలపై వివిధ దేశాలు ప్రతికార సుంకాలు అమలు చేస్తున్నట్లు ప్రకటిస్తున్నాయి. దాంతో యూఎస్ మార్కెట్లు ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. ఆసియా మార్కెట్లు లాభాల్లో ట్రేడవడం, అమెరికా మార్కెట్లు నష్టాల్లో ముగియడం సహా ప్రపంచ మార్కెట్ల మిశ్రమ సంకేతాలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్కు కీలకంగా మారుతున్నాయి. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల(ఎఫ్ఐఐలు) అమ్మకాలు కొనసాగుతుండటం భారతీయ ఈక్విటీలపై ఒత్తిడి పెంచుతోంది. ఫిబ్రవరి నెలకు భారత వినియోగదారుల ధరల సూచీ (సీపీఐ) ద్రవ్యోల్బణ డేటాను ఇన్వెస్టర్లు పరిశీలించనున్నారు. ఈ నెల 14వ తేదీన హోలీ పండుగ సందర్భంగా మార్కెట్లకు సెలవు.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
తీవ్ర ఒడిదొడుకులు.. లాభాల్లో ముగిసిన మార్కెట్లు
దేశీయ స్టాక్మార్కెట్లు మంగళవారం తీవ్ర ఒడిదొడుకుల మధ్య లాభాల్లో ముగిశాయి. మార్కెట్లు ముగిసే సమయానికి నిఫ్టీ 37 పాయింట్లు లాభపడి 22,497 వద్దకు చేరింది. సెన్సెక్స్ 12 పాయింట్లు దిగజారి 74,102 వద్దకు చేరింది. ఇటీవల భారీగా పడి క్రమంగా పంజుకుంటున్న మార్కెట్లు సోమవారం తీవ్ర ఒడిదొడుకులకు గురయ్యాయి. ప్రధానంగా మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ షేర్లు పతనమయ్యాయి.సెన్సెక్స్ 30 సూచీలో సన్ ఫార్మా, ఐసీఐసీఐ బ్యాంక్, భారతీ ఎయిర్టెల్, హెచ్సీఎల్ టెక్నాలజీస్, మారుతీ సుజుకీ, టైటాన్, ఎల్ అండ్ టీ, రిలయన్స్, ఎన్టీపీసీ, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఐటీసీ, నెస్లే, ఎస్బీఐ, టాటా మోటార్స్ స్టాక్లు లాభాల్లో ముగిశాయి. ఇండస్ఇండ్ బ్యాంక్, ఇన్ఫోసిస్, బజాజ్ ఫిన్సర్వ్, ఎం అండ్ ఎం, జొమాటో, హెచ్యూఎల్, పవర్గ్రిడ్ స్టాక్లు భారీగా నష్టపోయాయి.ఇదీ చదవండి: ఆన్లైన్ మోసాల కట్టడికి వినూత్న విధానంమార్కెట్ ఒడిదొడుకులకు కారణాలు..ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ఆందోళనలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్ను ప్రతికూలంగా ప్రభావితం చేశాయి. విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు (ఎఫ్ఐఐ) విచ్చలవిడిగా అమ్మకాలు జరుపుతుండడంతో భారత మార్కెట్ల నుంచి ఇతర ప్రాంతాలకు నిధులు తరలిపోతున్నాయి. మిడ్క్యాప్, స్మాల్క్యాప్ స్టాక్ల వాల్యుయేషన్ ఆందోళనల వల్ల ఆయా సెగ్మెంట్లు తీవ్ర దిద్దుబాట్లకు లోనయ్యాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
స్థిరంగా కదలాడుతున్న స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం అంతకుముందు సెషన్తో పోలిస్తే స్థిరంగా కదలాడుతున్నాయి. ఉదయం 9:30 సమయానికి నిఫ్టీ(Nifty) 8 పాయింట్లు పెరిగి 22,556కు చేరింది. సెన్సెక్స్(Sensex) 15 పాయింట్లు పుంజుకొని 74,626 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 106.6 పాయింట్ల వద్దకు చేరింది. బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 72.75 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.28 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో స్వల్ప లాభాలతో ముగిశాయి. ఎస్ అండ్ పీ గత సెషన్తో పోలిస్తే 0.01 శాతం పెరిగింది. నాస్డాక్ 0.26 శాతం లాభపడింది.మూడేళ్లుగా అలుపెరుగని లాభాల పరుగు తీసిన నిఫ్టీ, సెన్సెక్స్ ప్రభావంతో లార్జ్ క్యాప్స్తోపాటు.. పలు మధ్య, చిన్నతరహా స్టాక్స్ సైతం భారీగా ఎగశాయి. దీంతో దేశీ స్టాక్ మార్కెట్లు ఖరీదుగా మారినట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇదే సమయంలో తలెత్తిన ప్రపంచ రాజకీయ, భౌగోళిక అనిశ్చితులు సెంటిమెంటును బలహీనపరిచాయి. యూఎస్ ప్రెసిడెంట్గా రిపబ్లికన్ ట్రంప్ ఎన్నికవడంతో ఇన్వెస్టర్లలో ఆందోళనలు అధికమయ్యాయి. ట్రంప్ విధానాలపై అంచనాలతో డాలరు బలపడటం, ట్రెజరీ ఈల్డ్స్ మెరుగుపడటం రూపాయినీ దెబ్బతీసింది.ఇదీ చదవండి: పెట్రోల్లో కలిపే ఇథనాల్ 20 శాతానికి పెంపుఅధికారం చేపట్టాక భారత్సహా పలు దేశాలపై ట్రంప్ ప్రతీకార టారిఫ్లకు దిగడం ప్రతికూల ప్రభావం చూపిస్తోంది. మరోపక్క జీడీపీ వృద్ధికి దన్నుగా చైనా సహాయక ప్యాకేజీలకు ప్రకటించింది. భారత్తో పోలిస్తే చౌకగా ట్రేడవుతున్న చైనా స్టాక్స్ విదేశీ ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటున్నట్లు నిపుణులు తెలియజేశారు. ఇవి చాలదన్నట్లు దేశ జీడీపీ వృద్ధి కొంత నెమ్మదించడం, అంచనాలు అందుకోని దేశీ కార్పొరేట్ల క్యూ3 ఫలితాలు తదితర అంశాలు ఎఫ్పీఐలను నిరాశపరచినట్లు వివరించారు. దీంతో ప్రధాన ఇండెక్సులను మించి మిడ్, స్మాల్ క్యాప్ కౌంటర్లు పతనమవుతున్నట్లు తెలియజేశారు.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
నష్టాల్లో స్టాక్మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:42 సమయానికి నిఫ్టీ(Nifty) 137 పాయింట్లు నష్టపోయి 23,419కు చేరింది. సెన్సెక్స్(Sensex) 402 పాయింట్లు దిగజారి 77,442 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 108.41 పాయింట్ల వద్దకు చేరింది. బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 75.06 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.48 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో నష్టాల్లో ముగిశాయి. ఎస్ అండ్ పీ గత సెషన్తో పోలిస్తే 0.95 శాతం నష్టపోయింది. నాస్డాక్ 1.36 శాతం దిగజారింది.ఈ ఏడాదిలో తొలిసారి పరపతి సమీక్షను చేపట్టిన రిజర్వ్ బ్యాంక్ విధాన నిర్ణయాలను శుక్రవారం ప్రకటించింది. దాదాపు ఐదేళ్ల తదుపరి ఆర్బీఐ వడ్డీ రేట్లను తగ్గించింది. గత 11 సమావేశాల్లో వడ్డీ రేట్లకు కీలకమైన రెపోను 6.5 శాతం నుంచి 6.25కు తగ్గిస్తున్నట్లు తెలిపింది. ఈ నిర్ణయం బ్యాంకింగ్ రంగ స్థాక్లకు కొంత ఊరట కలిగించే అంశంగా నిపుణులు భావిస్తున్నారు.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
స్వల్ప లాభాల్లో స్టాక్మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:31 సమయానికి నిఫ్టీ 24 పాయింట్లు నష్టపోయి 23,253కు చేరింది. సెన్సెక్స్ 682 పాయింట్లు దిగజారి 76,802 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్ 107.9 పాయింట్ల వద్దకు చేరింది. బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 75.8 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.51 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో లాభాల్లో ముగిశాయి. ఎస్ అండ్ పీ గత సెషన్తో పోలిస్తే 0.72 శాతం లాభపడింది. నాస్డాక్ 1.35 శాతం ఎగబాకింది.ఇదీ చదవండి: అక్రమ జామర్స్తోనే కాల్ డ్రాప్స్అమెరికా సుంకాల విషయంలో మెక్సికో, కెనడాకు తాత్కాలిక ఊరట లభించడంతో అంతర్జాతీయ మార్కెట్లలోనూ సానుకూల సంకేతాలు నెలకొన్నాయి. ఆసియా, యూరప్ మార్కెట్లు నిన్నటి సెషన్లో అరశాతం పెరిగాయి. కొత్త ఏడాదిలో తొలిసారి పరపతి సమీక్షను చేపట్టనున్న రిజర్వ్ బ్యాంక్ శుక్రవారం(7న) విధాన నిర్ణయాలను ప్రకటించనుంది. దాదాపు ఐదేళ్ల తదుపరి ఆర్బీఐ వడ్డీ రేట్లను తగ్గించవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. గత 11 సమావేశాలలో వడ్డీ రేట్లకు కీలకమైన రెపోను 6.5 శాతం వద్దే యథాతథంగా కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. 2022 మే నుంచి 2023 ఫిబ్రవరి కాలంలో రెపో రేటులో 2.5 శాతం కోతను అమలు చేసింది. రిటైల్ ధరల ఇండెక్స్(సీపీఐ) డిసెంబర్లో 4 నెలల కనిష్టం 5.22 శాతానికి దిగివచ్చింది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో 4 శాతానికి పరిమితంకానున్న అంచనాల నేపథ్యంలో ఈసారి ఆర్బీఐ రెపో రేటును పావు శాతం తగ్గించవచ్చని ఆర్థికవేత్తలు భావిస్తున్నారు.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
లాభాల్లో స్టాక్మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:30 సమయానికి నిఫ్టీ(Nifty) 231 పాయింట్లు నష్టపోయి 23,253కు చేరింది. సెన్సెక్స్(Sensex) 682 పాయింట్లు దిగజారి 76,802 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 108.71 పాయింట్ల వద్దకు చేరింది. బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 75.5 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.57 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో నష్టాల్లో ముగిశాయి. ఎస్ అండ్ పీ గత సెషన్తో పోలిస్తే 0.76 శాతం నష్టపోయింది. నాస్డాక్ 1.2 శాతం దిగజారింది.7న పాలసీ నిర్ణయాలు కొత్త ఏడాదిలో తొలిసారి పరపతి సమీక్షను చేపట్టనున్న రిజర్వ్ బ్యాంక్ శుక్రవారం(7న) విధాన నిర్ణయాలను ప్రకటించనుంది. దాదాపు ఐదేళ్ల తదుపరి ఆర్బీఐ వడ్డీ రేట్లను తగ్గించవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. గత 11 సమావేశాలలో వడ్డీ రేట్లకు కీలకమైన రెపోను 6.5 శాతం వద్దే యథాతథంగా కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. 2022 మే నుంచి 2023 ఫిబ్రవరి కాలంలో రెపో రేటులో 2.5 శాతం కోతను అమలు చేసింది. రిటైల్ ధరల ఇండెక్స్(సీపీఐ) డిసెంబర్లో 4 నెలల కనిష్టం 5.22 శాతానికి దిగివచ్చింది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో 4 శాతానికి పరిమితంకానున్న అంచనాల నేపథ్యంలో ఈసారి ఆర్బీఐ రెపో రేటును పావు శాతం తగ్గించవచ్చని ఆర్థికవేత్తలు భావిస్తున్నారు.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
నష్టాలతో ప్రారంభమైన స్టాక్మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:21 సమయానికి నిఫ్టీ(Nifty) 231 పాయింట్లు నష్టపోయి 23,253కు చేరింది. సెన్సెక్స్(Sensex) 682 పాయింట్లు దిగజారి 76,802 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(US Index) 109.7 పాయింట్ల వద్దకు చేరింది. బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 76.12 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.51 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో నష్టాల్లో ముగిశాయి. ఎస్ అండ్ పీ గత సెషన్తో పోలిస్తే 0.5 శాతం నష్టపోయింది. నాస్డాక్ 0.28 శాతం దిగజారింది.7న పాలసీ నిర్ణయాలు కొత్త ఏడాదిలో తొలిసారి పరపతి సమీక్షను చేపట్టనున్న రిజర్వ్ బ్యాంక్ శుక్రవారం(7న) విధాన నిర్ణయాలను ప్రకటించనుంది. దాదాపు ఐదేళ్ల తదుపరి ఆర్బీఐ వడ్డీ రేట్లను తగ్గించవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. గత 11 సమావేశాలలో వడ్డీ రేట్లకు కీలకమైన రెపోను 6.5 శాతం వద్దే యథాతథంగా కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. 2022 మే నుంచి 2023 ఫిబ్రవరి కాలంలో రెపో రేటులో 2.5 శాతం కోతను అమలు చేసింది. రిటైల్ ధరల ఇండెక్స్(సీపీఐ) డిసెంబర్లో 4 నెలల కనిష్టం 5.22 శాతానికి దిగివచి్చంది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో 4 శాతానికి పరిమితంకానున్న అంచనాల నేపథ్యంలో ఈసారి ఆర్బీఐ రెపో రేటును పావు శాతం తగ్గించవచ్చని ఆర్థికవేత్తలు భావిస్తున్నారు.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
త్వరలో ఫెడ్ వడ్డీరేట్లపై నిర్ణయం.. లాభాల్లో స్టాక్మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:20 సమయానికి నిఫ్టీ(Nifty) 70 పాయింట్లు లాభపడి 23,021కు చేరింది. సెన్సెక్స్(Sensex) 219 పాయింట్లు ఎగబాకి 76,124 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 107.88 పాయింట్ల వద్దకు చేరింది. బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 77.28 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.52 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో లాభాల్లో ముగిశాయి. ఎస్ అండ్ పీ గత సెషన్తో పోలిస్తే 0.92 శాతం లాభపడింది. నాస్డాక్ 2.03 శాతం ఎగబాకింది.అమెరికాలోని అక్రమ వలసదారులను వారి స్వదేశాలకు పంపే చర్యల్లో భాగంగా ట్రంప్ తాజాగా కొలంబియాపై 25% సుంకాలు విధించారు. ఇప్పటికే మెక్సికో, కెనడాలపై ఫిబ్రవరి 1 నుంచి 25% వాణిజ్య సుంకాల విధింపును ప్రకటించారు. ఇది అంతర్జాతీయ వాణిజ్య యుద్ధాలకు దారితీయొచ్చనే భయాలు పెరిగాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ బుధవారం రాత్రి వడ్డీ రేట్ల కోతపై నిర్ణయం వెలువరించనుంది. ఈ ధఫా వడ్డీరేట్ల తగ్గింపు ఉండదని అంచనాలున్నాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
లాభాల్లో స్టాక్మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:30 సమయానికి నిఫ్టీ 76 పాయింట్లు లాభపడి 22,904కు చేరింది. సెన్సెక్స్ 326 పాయింట్లు ఎగబాకి 75,692 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్ 107.85 పాయింట్ల వద్దకు చేరింది. బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 77.14 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.55 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో భారీ నష్టాల్లో ముగిశాయి. ఎస్ అండ్ పీ గత సెషన్తో పోలిస్తే 1.46 శాతం నష్టపోయింది. నాస్డాక్ 3.07 శాతం దిగజారింది.ఇదీ చదవండి: హైదరాబాద్ అమెజాన్లో రూ.102 కోట్ల మోసంఅమెరికాలోని అక్రమ వలసదారులను వారి స్వదేశాలకు పంపే చర్యల్లో భాగంగా ట్రంప్ తాజాగా కొలంబియాపై 25% సుంకాలు విధించారు. ఇప్పటికే మెక్సికో, కెనడాలపై ఫిబ్రవరి 1 నుండి 25% వాణిజ్య సుంకాల విధింపును ప్రకటించారు. ఇది అంతర్జాతీయ వాణిజ్య యు ద్దాలకు దారితీయొచ్చనే భయాలు పెరిగాయి. చైనా ఏఐ స్టార్టప్ డీప్సీక్ ఆర్1 ప్రపంచవ్యాప్తంగా టెక్ పరిశ్రమను కుదిపేస్తుంది. అమెరికా దిగ్గజ టెక్ కంపెనీల షేర్లు భారీగా పతనమయ్యాయి. ఈ ప్రభావం మన స్టాక్ మార్కెట్పై పడింది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ బుధవారం వడ్డీ రేట్ల కోతపై నిర్ణయం వెలువరించనుంది. ఈ ధఫా వడ్డీరేట్ల తగ్గింపు ఉండదని అంచనాలున్నాయి. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
బడ్జెట్, ఫెడ్ రేట్లపైనే దృష్టి
న్యూఢిల్లీ: వారాంతాన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభలో 8వసారి బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. ఇప్పటికే ఆర్థిక శాఖకు పలు రంగాలు వినతులను అందించగా.. ఆదాయపన్ను సవరణలపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మరోవైపు డొనాల్డ్ ట్రంప్ ప్రెసిడెంట్గా ప్రమాణ స్వీకారం చేశాక తొలిసారి కొత్త ఏడాదిలో యూఎస్ ఫెడరల్ రిజర్వ్ పరపతి సమావేశాన్ని నిర్వహిస్తోంది. దీంతో ఈ వారం దేశీ స్టాక్ మార్కెట్ల నడకను పలు దేశ, విదేశీ అంశాలు ప్రభావితం చేయనున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. శనివారం ట్రేడింగ్కేంద్ర బడ్జెట్ నేపథ్యంలో శనివారం(ఫిబ్రవరి 1) స్టాక్ మార్కెట్లు పనిచేయనున్నాయి. పూర్తిస్థాయిలో ట్రేడింగ్ను నిర్వహించనుండటంతో ఈ వారం స్టాక్ ఎక్స్ఛేంజీలు ఆరు రోజులపాటు లావాదేవీలకు వేదిక కానున్నాయి. అయితే బడ్జెట్ సెంటిమెంటుపై తీవ్ర ప్రభావాన్ని చూపనున్నట్లు నిపుణులు భావిస్తున్నారు. వెరసి మార్కెట్ల ట్రెండ్కు దిక్సూచిగా నిలవనున్నట్లు పేర్కొంటున్నారు. ఇన్వెస్టర్ల చూపు బడ్జెట్ ప్రతిపాదనలపై నిలవనున్నట్లు స్వస్తికా ఇన్వెస్ట్మార్ట్ రీసెర్చ్ హెడ్ సంతోష్ మీనా తెలియజేశారు. ప్రధానంగా నిరుత్సాహకర క్యూ3(అక్టోబర్–డిసెంబర్) ఫలితాల నేపథ్యంలో బడ్జెట్కు ప్రాధాన్యత ఉన్నట్లు అభిప్రాయపడ్డారు. వినియోగం, ఫైనాన్షియల్ రంగాలు పేలవ పనితీరు చూపుతున్నట్లు పేర్కొన్నారు. ఆర్థిక విధానాలు, వివిధ రంగాలకు నిధుల కేటాయింపు వంటి అంశాలపై ఇన్వెస్టర్లు దృష్టి సారించనున్నారు. మౌలికం, తయారీ, టెక్నాలజీలకు ప్రభుత్వం ప్రాధాన్యమిచ్చే వీలున్నట్లు ఆర్థికవేత్తలు భావిస్తున్నారు.యూఎస్ జీడీపీయూఎస్ ఫెడ్ గురువారం(30న) పాలసీ నిర్ణయాలు ప్రకటించనుంది. అయితే ద్రవ్యోల్బణ పరిస్థితులు బలపడుతుండటంతో వడ్డీ రేట్ల తగ్గింపు బాటను వీడి కఠిన విధానాలవైపు దృష్టిపెట్టవలసి రావచ్చునని ఆర్థికవేత్తలు చెబుతున్నారు. అంతేకాకుండా ట్రంప్ విధానాలు సైతం ఫెడ్ నిర్ణయాలను ప్రభావితం చేసే వీలున్నట్లు విశ్లేషకుల అంచనా. ఇక 2024 చివరి క్వార్టర్(అక్టోబర్–డిసెంబర్)కు జీడీపీ గణాంకాలు సైతం ఇదే రోజు వెలువడనున్నాయి. క్యూ3(జులై–సెప్టెంబర్)లో యూఎస్ జీడీపీ 3.1 శాతం ఎగసింది.క్యూ3 జాబితాలో..దేశీయంగా ఈ వారం మరికొన్ని కంపెనీల అక్టోబర్–డిసెంబర్(క్యూ3) ఫలితాలు వెల్లడికానున్నాయి. జాబితాలో దిగ్గజాలు ఎన్టీపీసీ, ఐవోసీ, టాటా స్టీల్, టాటా మోటార్స్, మారుతీ, బజాజ్ ఆటో, సిప్లా, ఓఎన్జీసీ, అంబుజా సిమెంట్స్, బజాజ్ ఫైనాన్స్, ఇండస్ఇండ్ బ్యాంక్, సన్ ఫార్మాస్యూటికల్, బయోకాన్, మారికో, గెయిల్ ఇండియా, బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్, అదానీ పవర్ చేరాయి. ఇదీ చదవండి: స్వల్పకాల పెట్టుబడికి దారేదీ?ఇతర కీలక అంశాలుఇన్వెస్టర్ల సెంటిమెంటును ప్రభావితం చేయగల ఇతర అంశాలలో డాలరు మారకం, యూఎస్ ట్రెజరీ ఈల్డ్స్, ముడిచమురు ధరలు సైతం ఉన్నట్లు రెలిగేర్ బ్రోకింగ్ రీసెర్చ్ ఎస్వీపీ అజిత్ మిశ్రా తెలియజేశారు. విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు, ప్రపంచ మార్కెట్ల పరిస్థితులకు సైతం ప్రాధాన్యత ఉన్నట్లు వెల్లడించారు. దీంతో మార్కెట్లు మరోసారి ఆటుపోట్లను చవిచూసే వీలున్నట్లు మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ వెల్త్ మేనేజ్మెంట్ రీసెర్చ్ హెడ్ సిద్ధార్థ ఖేమ్కా పేర్కొన్నారు. బడ్జెట్లో పెట్టుబడుల కేటాయింపులకు వీలున్న రైల్వే, డిఫెన్స్, క్యాపిటల్ గూడ్స్ రంగాలతోపాటు పీఎస్యూ షేర్లపై ఇన్వెస్టర్లు దృష్టి పెట్టనున్నట్లు వివరించారు. -
లాభాల్లో కదలాడుతున్న స్టాక్మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:30 సమయానికి నిఫ్టీ(Nifty) 33 పాయింట్లు లాభపడి 23,241కు చేరింది. సెన్సెక్స్(Sensex) 129 పాయింట్లు ఎగబాకి 76,655 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 107.8 పాయింట్ల వద్దకు చేరింది. బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 78.17 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.62 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో లాభాల్లో ముగిశాయి. ఎస్ అండ్ పీ గత సెషన్తో పోలిస్తే 0.53 శాతం లాభపడింది. నాస్డాక్ 0.22 శాతం ఎగబాకింది.ఇదీ చదవండి: రోల్స్రాయిస్కు రూ.90,200 కోట్ల కాంట్రాక్ట్దేశీయ కార్పొరేట్ క్యూ3 ఆర్థిక ఫలితాలు నిరాశపరుస్తున్నాయి. ఇప్పటి వరకు ఫలితాలు వెల్లడించిన లిస్టెడ్ కంపెనీల సగటు నికరలాభ వృద్ధి కేవలం 4%గా మాత్రమే నమోదైంది. వార్షిక ప్రాతిపదిక డిసెంబర్ త్రైమాసికంలో నిఫ్టీ50 కంపెనీల ఈపీఎస్(ఎర్నింగ్స్ పర్ షేర్) 3% మాత్రమే ఉంటుందని బ్లూమ్బర్గ్ ఇటీవల అంచనా వేసింది. రానున్న బడ్జెట్లో ప్రభుత్వం మూలధన పెట్టుబడులకు సంబంధించి కీలక నిర్ణయాలు ప్రకటించే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. దాంతో మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
23,100 మార్కు వద్ద నిఫ్టీ సూచీ
దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:21 సమయానికి నిఫ్టీ(Nifty) 46 పాయింట్లు నష్టపోయి 23,106కు చేరింది. సెన్సెక్స్(Sensex) 121 పాయింట్లు పడిపోయి 76,294 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 108.31 పాయింట్ల వద్దకు చేరింది. బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 78.71 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.6 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో లాభాల్లో ముగిశాయి. ఎస్ అండ్ పీ గత సెషన్తో పోలిస్తే 0.61 శాతం లాభపడింది. నాస్డాక్ 1.28 శాతం ఎగబాకింది.‘అమెరికా ఫస్ట్’ నినాదంతోట్రంప్ మెక్సికో, కెనడాలపై ఫిబ్రవరి 1 నుంచి 25% వాణిజ్య సుంకాల విధింపునకు సిద్ధమయ్యారు. భారత్తో సహా ఇతర దేశాలపై సుంకాల విధింపు తప్పదని గతంలో వ్యాఖ్యానించారు. ట్రంప్ టారిఫ్ ఆందోళనలతో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. దేశీయ కార్పొరేట్ క్యూ3 ఆర్థిక ఫలితాలు నిరాశపరుస్తున్నాయి. ఇప్పటి వరకు ఫలితాలు వెల్లడించిన లిస్టెడ్ కంపెనీల సగటు నికరలాభ వృద్ధి కేవలం 4%గా మాత్రమే నమోదైంది. వార్షిక ప్రాతిపదిక డిసెంబర్ త్రైమాసికంలో నిఫ్టీ50 కంపెనీల ఈపీఎస్(ఎర్నింగ్స్ పర్ షేర్) 3% మాత్రమే ఉంటుందని బ్లూమ్బర్గ్ ఇటీవల అంచనా వేసింది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
23,100 మార్కు వద్ద కదలాడుతున్న నిఫ్టీ
దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:41 సమయానికి నిఫ్టీ(Nifty) 60 పాయింట్లు లాభపడి 23,085కు చేరింది. సెన్సెక్స్(Sensex) 297 పాయింట్లు ఎగబాకి 76,139 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 108.11 పాయింట్ల వద్దకు చేరింది. బ్రెంట్ క్రూడ్ఆయిల్(Crude Oil) బ్యారెల్ ధర 79.37 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.59 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో లాభాల్లో ముగిశాయి. ఎస్ అండ్ పీ గత సెషన్తో పోలిస్తే 0.88 శాతం లాభపడింది. నాస్డాక్ 0.64 శాతం ఎగబాకింది.‘అమెరికా ఫస్ట్’ నినాదంతోట్రంప్ మెక్సికో, కెనడాలపై ఫిబ్రవరి 1 నుంచి 25% వాణిజ్య సుంకాల విధింపునకు సిద్ధమయ్యారు. భారత్తో సహా ఇతర దేశాలపై సుంకాల విధింపు తప్పదని గతంలో వ్యాఖ్యానించారు. ట్రంప్ టారిఫ్ ఆందోళనలతో ఇన్వెస్టర్లు అప్రమత్తత వహిస్తూ నిన్నటి మార్కెట్లో అమ్మకాలకు పాల్పడ్డారు. దేశీయ కార్పొరేట్ క్యూ3 ఆర్థిక ఫలితాలు నిరాశపరుస్తున్నాయి. ఇప్పటి వరకు ఫలితాలు వెల్లడించిన లిస్టెడ్ కంపెనీల సగటు నికరలాభ వృద్ధి కేవలం 4%గా మాత్రమే నమోదైంది. వార్షిక ప్రాతిపదిక డిసెంబర్ త్రైమాసికంలో నిఫ్టీ50 కంపెనీల ఈపీఎస్(ఎర్నింగ్స్ పర్ షేర్) 3% మాత్రమే ఉంటుందని బ్లూమ్బర్గ్ అంచనా వేసింది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:30 సమయానికి నిఫ్టీ(Nifty) 72 పాయింట్లు లాభపడి 23,416కు చేరింది. సెన్సెక్స్(Sensex) 92 పాయింట్లు ఎగబాకి 77,164 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 108.29 పాయింట్ల వద్దకు చేరింది. బ్రెంట్ క్రూడ్ఆయిల్(Crude Oil) బ్యారెల్ ధర 80.07 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.54 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో లాభాల్లో ముగిశాయి. ఎస్ అండ్ పీ గత సెషన్తో పోలిస్తే ఎలాంటి మార్పు చెందలేదు. నాస్డాక్ 1 శాతం ఎగబాకింది.క్యూ3 ఫలితాలతోపాటు వచ్చే నెలలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న సార్వత్రిక బడ్జెట్పై ఇన్వెస్టర్లు దృష్టి పెట్టనున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. ఆదాయపన్నుసహా పలు రంగాల నుంచి సంస్కరణలకోసం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు వినతులు అందుతున్న విషయం విదితమే. ద్రవ్య విధానాలు, ఆర్థిక వృద్ధి చర్యలు, పెట్టుబడుల కేటాయింపు, కీలక రంగాలలో సంస్కరణలు వంటి పలు అంశాలకు ప్రాధాన్యత ఉన్నట్లు చెబుతున్నారు. ఇదేవిధంగా దేశ, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు, ముడిచమురు ధరలు సైతం మార్కెట్లలో సెంటిమెంటుకు కీలకంగా నిలవనున్నట్లు వివరించారు.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
భారతీయ స్టాక్ మార్కెట్లు సోమవారం సానుకూలంగా ముగిశాయి. 30-షేర్ల సెన్సెక్స్ 454 పాయింట్లు లేదా 0.59 శాతం లాభపడి 77,073.44 వద్ద స్థిరపడింది. ఈరోజు ఈ ఇండెక్స్ 76,584.84- 77,318.94 రేంజ్లో ట్రేడ్ అయింది. ఎన్ఎస్ఈ (Nifty) నిఫ్టీ 50 కూడా 141 పాయింట్లు లేదా 0.61 శాతం లాభంతో 23,344.75 వద్ద గ్రీన్ జోన్లో స్థిరపడింది. నిఫ్టీ 50 ఈరోజు గరిష్ట స్థాయి 23,391.10 వద్ద కనిపించగా, కనిష్ట స్థాయి 23,170.65 వద్ద ఉంది.కోటక్ మహీంద్రా బ్యాంక్, విప్రో, బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సర్వ్, ఎన్టిపిసి, ఎస్బిఐ, అదానీ ఎంటర్ప్రైజెస్, భారత్ ఎలక్ట్రానిక్స్, బిపిసిఎల్ నేతృత్వంలోని లాభాలతో నిఫ్టీ50లోని 50 స్టాక్లలో 29 సానుకూలంగా ముగిశాయి. దీనికి విరుద్ధంగా ఎస్బీఐ లైఫ్, ట్రెంట్, శ్రీరామ్ ఫైనాన్స్, అదానీ పోర్ట్స్ నష్టాల్లో ముగిశాయి. దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం స్వల్ప నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:28 సమయానికి నిఫ్టీ(Nifty) 8 పాయింట్లు నష్టపోయి 23,194కు చేరింది. సెన్సెక్స్(Sensex) 16 పాయింట్లు ఎగబాకి 76,663 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్ 109.19 పాయింట్ల వద్దకు చేరింది. బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్(Crude Oil) ధర 80.77 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.62 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో లాభాల్లో ముగిశాయి. ఎస్ అండ్ పీ 1 శాతం లాభపడింది. నాస్డాక్ 1.51 శాతం ఎగబాకింది.క్యూ3 ఫలితాలతోపాటు వచ్చే నెలలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న సార్వత్రిక బడ్జెట్పై ఇన్వెస్టర్లు దృష్టి పెట్టనున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. ఆదాయపన్నుసహా పలు రంగాల నుంచి సంస్కరణలకోసం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు వినతులు అందుతున్న విషయం విదితమే. ద్రవ్య విధానాలు, ఆర్థిక వృద్ధి చర్యలు, పెట్టుబడుల కేటాయింపు, కీలక రంగాలలో సంస్కరణలు వంటి పలు అంశాలకు ప్రాధాన్యత ఉన్నట్లు చెబుతున్నారు. ఇదేవిధంగా దేశ, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు, ముడిచమురు ధరలు సైతం మార్కెట్లలో సెంటిమెంటుకు కీలకంగా నిలవనున్నట్లు వివరించారు.ప్రపంచ దేశాలన్నీ అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న అమెరికా ప్రెసిడెంట్ ప్రమాణ స్వీకారానికి నేడు(20న) తెరలేవనుంది. రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ రెండోసారి యూఎస్ ప్రెసిడెంట్గా బాధ్యతలు స్వీకరించనుండటంతో కొంతకాలంగా వాణిజ్య వర్గాలు అధికంగా ప్రభావితం కానున్నట్లు అంచనాలు వెలువడుతున్నాయి. వాణిజ్యంతోపాటు ఫైనాన్షియల్ మార్కెట్లపైనా ట్రంప్ ఎఫెక్ట్ ఉండబోతున్నట్లు మరోపక్క ఆర్థికవేత్తలు పేర్కొంటున్నారు.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
లాభాలకు బ్రేక్.. నష్టాల్లో సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:34 సమయానికి నిఫ్టీ(Nifty) 66 పాయింట్లు నష్టపోయి 23,249కు చేరింది. సెన్సెక్స్(Sensex) 279 పాయింట్లు దిగజారి 76,761 వద్ద ట్రేడవుతోంది. దాంతో గత రెండు రోజుల లాభాలకు బ్రేక్ పడినట్లయింది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 108.98 పాయింట్ల వద్దకు చేరింది. బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 81.64 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.61 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో నష్టాల్లో ముగిశాయి. ఎస్ అండ్ పీ 0.21 శాతం నష్టపోయింది. నాస్డాక్ 0.89 శాతం దిగజారింది.ఇదీ చదవండి: భారత్లో టాప్ 5 బ్రాండ్ లిస్ట్లోకి యాపిల్రిటైల్ ద్రవ్యోల్బణం మరింత తగ్గి, 5 శాతం లోపునకు పడిపోయే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఆర్బీఐ ద్రవ్యోల్బణం నుంచి వృద్ధి వైపు దృష్టి సారిస్తుందని నమ్ముతున్నారు. కరెన్సీ అస్థిరత కొంత అనిశ్చితిని సృష్టిస్తున్నప్పటికీ, ఆర్బీఐ సరళతర ఆర్థిక విధానంవైపు అడుగులు వేయవచ్చని భావిస్తున్నారు. కేంద్ర బడ్జెట్ నేపథ్యంలో ఫిబ్రవరి పాలసీ సమీక్ష జరుగుతుంది. ఫిబ్రవరి 1వ తేదీన ఆర్థిక మంత్రి పార్లమెంటులో ప్రవేశపెట్టే బడ్జెట్లోని పలు అంశాలు ప్రస్తుత ఆర్బీఐ పాలసీని ప్రాతిపదికగా తీసుకునే అవకాశం ఉంది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
స్వల్ప లాభాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ ముగిసే సమయానికి లాభాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 273.66 పాయిట్లు లేదా 0.36 శాతం లాభంతో.. 76,773.30 వద్ద, నిఫ్టీ 51.75 పాయింట్లు లేదా 0.22 శాతం లాభంతో 23,227.80 వద్ద నిలిచాయి.ట్రెంట్, నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ (NTPC), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, కోటక్ మహీంద్రా బ్యాంక్, మారుతి సుజుకి ఇండియా వంటి సంస్థలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. మహీంద్రా అండ్ మహీంద్రా, బజాజ్ ఫిన్సర్వ్, యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, శ్రీరామ్ ఫైనాన్స్ వంటి కంపెనీలు నష్టాలను చవిచూశాయి.దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:25 సమయానికి నిఫ్టీ(Nifty) 52 పాయింట్లు లాభపడి 23,229కు చేరింది. సెన్సెక్స్(Sensex) 252 పాయింట్లు ఎగబాకి 76,767 వద్ద ట్రేడవుతోంది. ఇటీవల భారీగా పడిపోయిన మార్కెట్లో రిలీఫ్ ర్యాలీ కనిపిస్తున్నట్లు మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ స్థాయిల్లో మార్కెట్ స్థిరపడాలంటే కొంత సమయం వేచి ఉండాలని సూచిస్తున్నారు.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 109.23 పాయింట్ల వద్దకు చేరింది. బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 80 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.79 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో మిశ్రమంగా ముగిశాయి. ఎస్ అండ్ పీ 0.1 శాతం లాభపడింది. నాస్డాక్ 0.2 శాతం దిగజారింది.ఇదీ చదవండి: ‘మీ లాభాల కోసం మేం చావలేం’రూపాయి భారీగా పతనమవుతుంది. అమెరికా 10 ఏళ్లకు సంబంధించి బాండ్ ఈల్డ్లు పెరుగుతున్నాయి. యూఎస్ డాలర్ ఇండెక్స్ అధికమవుతుంది. ఈరోజు రిలీఫ్ ర్యాలీ ట్రాప్లోపడి ట్రేడర్లు ఎలాంటి పొజిషన్లు తీసుకోకూడదని నిపుణులు సూచిస్తున్నారు. ఇంకొంత కాలం వేచి చూసి సూచీలు ముఖ్యమైన లెవల్స్ దాటి స్థిరపడితేనే పొజిషన్ తీసుకోవాలని చెబుతున్నారు.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు
మంగళవారం ఉదయం లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ ముగిసే సమయానికి లాభాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 169.62 పాయింట్లు లేదా 0.22 శాతం లాభంతో 76,499.63 వద్ద, నిఫ్టీ 121.65 పాయింట్లు లేదా 0.53 శాతం లాభంతో 23,207.60 వద్ద నిలిచాయి.అదానీ ఇండస్ట్రీస్, హిందాల్కో ఇండస్ట్రీస్, అదానీ పోర్ట్స్, శ్రీరామ్ ఫైనాన్స్, నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (NTPC) వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. HCL టెక్నాలజీస్, హిందూస్తాన్ యూనీలీవర్ కంపెనీ, అపోలో హాస్పిటల్, టైటాన్ కంపెనీ, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ వంటి కంపెనీలు నష్టాల జాబితాలో నిలిచాయి.దేశీయ స్టాక్ మార్కెట్లు(Stock Market) ఉదయం లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:23 సమయానికి నిఫ్టీ(Nifty) 135 పాయింట్లు లాభపడి 23,221కు చేరింది. సెన్సెక్స్(Sensex) 418 పాయింట్లు ఎగబాకి 76,741 వద్ద ట్రేడవుతోంది. ఇటీవల భారీగా పడిపోయిన మార్కెట్లో రిలీఫ్ ర్యాలీ కనిపిస్తున్నట్లు మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ స్థాయిల్లో మార్కెట్ స్థిరపడాలంటే కొంత సమయం వేచి ఉండాలని సూచిస్తున్నారు.అమెరికా డాలర్ ఇండెక్స్ 109.65 పాయింట్ల వద్దకు చేరింది. బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 80.72 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.76 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో మిశ్రమంగా ముగిశాయి. ఎస్ అండ్ పీ 0.16 శాతం లాభపడింది. నాస్డాక్ 0.38 శాతం దిగజారింది.ఇదీ చదవండి: హైదరాబాద్లో ఆఫీస్ స్పేస్ ఖాళీరూపాయి భారీగా పతనమవుతుంది. అమెరికా 10 ఏళ్లకు సంబంధించి బాండ్ ఈల్డ్లు పెరుగుతున్నాయి. యూఎస్ డాలర్ ఇండెక్స్ అధికమవుతుంది. ఈరోజు రిలీఫ్ ర్యాలీ ట్రాప్లోపడి ట్రేడర్లు ఎలాంటి పొజిషన్లు తీసుకోకూడదని నిపుణులు సూచిస్తున్నారు. ఇంకొంత కాలం వేచి చూసి సూచీలు ముఖ్యమైన లెవల్స్ దాటి స్థిరపడితేనే పొజిషన్ తీసుకోవాలని చెబుతున్నారు.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
బేర్.. ఎటాక్! మార్కెట్ నేల చూపులు ఎందుకంటే..
ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలోని బలహీన సంకేతాల ప్రభావంతో స్టాక్ సూచీలు సోమవారం ఒకశాతానికిపైగా నష్టపోయాయి. అంతర్జాతీయంగా చమురు ధరలు పెరగడమూ, విదేశీ ఇన్వెస్టర్ల విక్రయాలూ సెంటిమెంట్ను దెబ్బతీశాయి. సెన్సెక్స్ 1,049 పాయింట్లు క్షీణించి 76,330 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 346 పాయింట్లు కోల్పోయి 23,086 వద్ద ముగిసింది. సూచీలకిది నాలుగోరోజూ నష్టాల ముగింపు. ఉదయం స్వల్ప నష్టాలతో మొదలైన సూచీలు రోజంతా అదే బాటలో నడిచాయి. అన్ని రంగాల షేర్లలో విక్రయాలు వెల్లువెత్తాయి. ఒక దశలో సెన్సెక్స్ 1,129 పాయింట్లు క్షీణించి 76,250, నిఫ్టీ 384 పాయింట్లు పతనమై 23,047 వద్ద ఇంట్రాడే కనిష్టాలు తాకాయి. ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్ల తగ్గింపుపై అనుమానాలు, ద్రవ్యల్బోణం పెరగొచ్చనే ఆందోళనలతో ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.మార్కెట్లో మరిన్ని సంగతులుఅధిక వాల్యుయేషన్లు, వృద్ధిపై ఆందోళనలతో ఇన్వెస్టర్లు భారీ ఎత్తున చిన్న, మధ్య తరహా షేర్లను భారీగా విక్రయించారు. బీఎస్ఈ స్మాల్ క్యాప్ సూచీ 4.17%, మిడ్క్యాప్ ఇండెక్స్ 4.14 శాతం నష్టపోయాయి. బీఎస్ఈ ఎక్సే్చంజీలో మొత్తం 3,562 కంపెనీల షేర్లలో 2,876 షేర్లు నష్టపోగా, 508 షేర్లు ఏడాది కనిష్టాన్ని తాకింది. సూచీల వారీగా బీఎస్ఈ రియల్టీ ఇండెక్స్ 6.50% అత్యధికంగా పతనమైంది. యుటిలిటీ 4.50%, సర్వీసెస్ 4.35% చొప్పున పడ్డాయి.4 రోజుల్లో 24.7 లక్షల కోట్లు ఆవిరిస్టాక్ మార్కెట్ వరుస పతనంలో భాగంగా నాలుగు రోజుల్లో రూ.24.69 లక్షల కోట్ల సంపద ఆవిరైంది. సోమవారం ఒక్కరోజే రూ.12.61 లక్షల కోట్లు హరించుకుపోయింది. దీంతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈలోని కంపెనీల మొత్తం మార్కెట్ విలువ రూ.417.05 లక్షల కోట్ల(4.82 ట్రిలియన్ డాలర్లు)కు దిగివచ్చింది. అమెరికా డిసెంబర్ వ్యవసాయేతర ఉద్యోగాలు (2.56 లక్షలు) అంచనాలను మించాయి. నిరుద్యోగ రేటు 4.2% నుంచి 4.1 శాతానికి దిగివచ్చింది. అధిక ఉద్యోగాల నియామకంతో ఫెడరల్ రిజర్వ్ ఈ ఏడాదిలో వడ్డీరేట్ల తగ్గింపుపై అనుమానాలు తలెత్తాయి. ద్రవ్యోల్బణం పెరగొచ్చనే ఆందోళనలు మెదలయ్యాయి. బాండ్లపై రాబడులు 14 ఏళ్ల గరిష్టం 4.79% భారీగా పెరిగాయి. దీంతో ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులు ఈక్విటీల్లోంచి బాండ్లలోకి మళ్లిస్తున్నారు.భారత్, చైనాకు చౌకగా చమురును అందిస్తున్న రష్యా క్రూడాయిల్ ఉత్పత్తి సంస్థలపై అమెరికా కఠిన ఆంక్షలు విధించడంతో అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు మూడు నెలల గరిష్టానికి చేరుకున్నాయి. భారత్ దిగుమతి చేసుకొనే బ్రెంట్ క్రూడాయిల్ ధర 1.5% పెరిగి 81.67 స్థాయికి చేరింది. తన చమురు అవసరాల్లో 85 శాతాన్ని దిగుమతి చేసుకొనే భారత్కు అధిక ధరలు నష్టదాయకం. పెరిగిన దిగుమతుల బిల్లు చెల్లించేందుకు ప్రభుత్వం వద్దనున్న విదేశీ మారక నిల్వలు కరిగించాల్సి వస్తుంది.ఇదీ చదవండి: మరింత క్షీణిస్తున్న రూపాయి!ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధి 6.4 శాతానికి పరిమితమవుతుందని కేంద్రం ముందస్తు అంచనా వేసింది. పలు అంతర్జాతీయ బ్రోకరేజ్ సంస్థలు 2024–25 ఏడాది కార్పొరేట్ ఆదాయాలు ఒక అంకె వృద్ధికే పరిమితం కావచ్చని చెబుతున్నాయి. కార్పొరేటు ఆదాయాలు, జీడీపీ వృద్ధి అంచనాలు మార్కెట్ వర్గాలను నిరాశపరిచాయి. -
అంతర్జాతీయ పరిణామాలు.. భారీ నష్టాల్లో మార్కెట్లు
దేశీయ స్టాక్మార్కెట్లు సోమవారం భారీ నష్టాలతో ముగిశాయి. మార్కెట్లు ముగిసే సమయానికి నిఫ్టీ 165 పాయింట్లు లాభపడి 23,735 వద్దకు చేరింది. సెన్సెక్స్ 498 పాయింట్లు పుంజుకుని 78,540 వద్దకు చేరింది. ఇటీవల భారీగా మార్కెట్లు పడిపోతున్నాయి. గతవారం ట్రెండ్ ఈవారం కొనసాగే అవకాశం ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. ట్రంప్ ప్రమాణ స్వీకారం వరకు ఈ ఒడిదొడుకులు తప్పవని అంచనా వేస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్ల పరిణామాలు దేశీయ మార్కెట్లపై ప్రభావం చూపుతున్నాయి. బాండ్ ఈల్డ్లు భారీగా పెరుగుతున్నాయి. డాలర్తో పోలిస్తే రూపాయి విలువ జీవితకాల గరిష్టాలను చేరుతోంది.ఇదీ చదవండి: ఏడాదిలో రికార్డు స్థాయిలో ఐఫోన్ ఎగుమతులుసెన్సెక్స్ 30 సూచీలో టీసీఎస్, యాక్సిస్ బ్యాంక్, ఇండ్స్ ఇండ్ బ్యాంక్, హిందుస్థాన్ యూనిలివర్ స్టాక్లు లాభాల్లో ముగిశాయి. జొమాటో, అదానీ పోర్ట్స్ అండ్ సెజ్, పవర్గ్రిడ్, టాటా స్టీల్, ఎన్టీపీసీ, టాటా మోటార్స్, టెక్ మహీంద్రా, ఎం అండ్ ఎం, ఏషియన్ పెయింట్స్, సన్ఫార్మా, ఎస్బీఐ, ఆల్ట్రాటెక్ సిమెంట్, ఎల్ అండ్ టీ, టైటాన్ స్టాక్లు భారీగా నష్టపోయాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
ఏది కొంటే ఎంత లాభం..?
స్టాక్ మార్కెట్ ట్రేడింగ్(Trading) అనేది ఇప్పుడు సర్వ సాధారణమైపోయింది. గత సెప్టెంబర్ నాటికి దేశంలో 17.5 కోట్ల డీమ్యాట్ ఖాతాలు ఉన్నాయి. ఇక 2023-24 గణాంకాల ప్రకారం 96 లక్షల మంది ట్రేడింగ్ పైనే ప్రధానంగా దృష్టి పెడుతున్నారు. దానికి ముందు ఆర్థిక సంవత్సరంలో ట్రేడర్లు 51 లక్షల మందే. 96 లక్షల మందిలో 86 లక్షల మంది కేవలం ఆప్షన్స్(Options)లోనే ట్రేడింగ్ చేస్తున్నారు. అంత క్రితం ఏడాది ఇదే కాలంలో ఆప్షన్స్ ట్రేడర్ల సంఖ్య 42 లక్షలు ఉంది. అంటే ఏడాది వ్యవధిలోనే ఆప్షన్స్ ట్రేడింగ్లోకి అడుగుపెట్టిన వారి సంఖ్య రెట్టింపుపైనే పెరిగిందన్న మాట.తొందరగా లాభాలు సంపాదించాలని..స్మార్ట్ ఫోన్ల వాడకం పెరగడం, టెక్నాలజీ విస్తృతం కావడం, ఆన్లైన్లో వివిధ మార్కెట్ సమాచారం అందుబాటులో ఉండటం, తొందరగా లాభాలు సంపాదించేయవచ్చన్న అభిప్రాయం జనాల్లో పెరిగిపోవడం, ఆర్థిక సంబంధమైన అంశాల్లో గతంతో పోలిస్తే ప్రజల్లో అవగాహన పెరగడం వంటివి స్టాక్ మార్కెట్ వైపు అడుగులు వేయడానికి కారణాలుగా ఉన్నాయి. గత ఆర్టికల్లో మనం ఆప్షన్స్కు సంబంధించి ప్రాథమిక అంశాలను తెలుసుకున్నాం. ఇప్పుడు ట్రేడింగ్లో వాటికి ఎంత ప్రాధాన్యం ఉంది.. అవి ఎలాంటి పాత్ర పోషిస్తాయో తెలుసుకుందాం.కాల్, పుట్ తీసుకోవడం తెలియాలి..తాజా నిబంధనల ప్రకారం ఇకపై సెన్సెక్స్, నిఫ్టీ(Nifty)లకు మాత్రమే వారాంతపు ఎక్సపైరీలు ఉంటాయి. బ్యాంకు నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ, మిడ్ నిఫ్టీలకు నెలవారీ ఎక్సపైరీలు ఉంటాయి. ఈ ఎక్సపైరీల్లో ఆప్షన్స్ గ్రీక్స్ (డెల్టా, గామా, తీటా, వెగాలు) కీలక పాత్ర పోషిస్తాయి. వీటిని బట్టే ఒక ఆప్షన్ ధర ఏ స్థాయిలో పెరుగుతుంది.. ఏ స్థాయిలో పడిపోతుంది అన్న విషయం తెలుస్తుంది. వీటి కంటే ముందు అసలు ఆప్షన్స్లో ట్రేడ్ చేయాలంటే ఏ కాల్ కొనాలి, ఏ పుట్ తీసుకోవాలో తెలిసి ఉండాలి. ఆప్షన్స్లో మనం నేరుగా షేర్లు కొనం. ఆ షేర్ల తాలూకు కాల్స్, పుట్స్(Puts) మాత్రమే తీసుకుంటాం. వాటిని సెలెక్ట్ చేసుకోవడానికి మూడు మార్గాలు ఉంటాయి.ఎట్ ది మనీ (ఏటీఎం)ఇన్ ది మనీ (ఐటీఎమ్)అవుట్ ఆఫ్ ది మనీ (ఓటీఎం)ఎస్బీఐ షేరును ఉదాహరణగా తీసుకొని ఈ మూడింటి గురించి తెలుసుకుందాం. ప్రస్తుతం ఎస్బీఐ షేరు ధర రూ.744 వద్ద ఉంది. దీని స్ట్రైక్ ప్రైస్లు రూ 700, 710, 720, 730, 740, 750, 760, 770, 780, 790, 800.. ఇలా ఉంటాయి. ఎస్బీఐ షేర్ ధర ప్రస్తుతం ఎంత ఉందో దానికి దరిదాపుల్లో ఉండే స్ట్రైక్ ప్రైస్(Strike Price)ను తీసుకుంటే అది ఏటీఎం అవుతుంది. అంటే రూ.740 అన్న మాట. ఆ షేరు భవిష్యత్లో పెరుగుతుందనుకుంటే 740 రూపాయల కాల్, పడుతుంది అనుకుంటే 740 రూపాయల పుట్ కొనుగోలు చేయాలి. ఇవి ఏటీఎం కాంట్రాక్టులు అవుతాయి.షేర్లలో నెలవారీ కాంట్రాక్టులు మాత్రమే ఉంటాయి. దీని లాట్ సైజు 750. రూ.740 కాల్ ధర ప్రస్తుతం రూ.21గా ఉంది. పుట్ ధర రూ.14 ఉంది. షేర్ పెరుగుతుంది అని భావించిన A అనే వ్యక్తి జనవరి నెలకు సంబంధించి 740 కాల్ను రూ.21 పెట్టి కొన్నాడు. అంటే అతని పెట్టుబడి (21X750 లాట్) = రూ.15,750 అన్నమాట.B అనే వ్యక్తి షేరు పడిపోవచ్చు అన్న ఉద్దేశంతో జనవరి నెల 740 పుట్ కొన్నాడు. దీని ధర రూ.14గా ఉంది. అంటే అతను పెట్టిన పెట్టుబడి (14X750) = రూ.10,500.షేరు ధర నెల మధ్యలో ఎప్పుడైనా అటూ ఇటూ ఊగిసలాడుతూ మొత్తం మీద జనవరి నెలాఖరుకు రూ.780 దరిదాపుల్లోకి వెళ్లింది అనుకుందాం. అప్పుడు 740 కాల్ సుమారు 45-50 దాకా పెరగొచ్చు. అంటే 15,750 పెట్టుబడి రెట్టింపు అవుతుంది. లాట్ పెరిగి సుమారు రూ.18,000 నుంచి రూ.22,000 దాకా ప్రాఫిట్ వస్తుంది. అదే సమయంలో పుట్ కొన్న వ్యక్తి మొత్తం పోగొట్టుకుంటాడు. అతను కొన్న స్ట్రైక్ ప్రైస్ తాలూకు పుట్ నెలాఖరుకు సున్నా అయిపోతుంది.ఇదీ చదవండి: సందర్శకులను ఆకర్శించేలా మహా ‘బ్రాండ్’ మేళా!పైన తెలిపిన దానికి రివర్స్లో జరిగితే.. పుట్ పెరుగుతుంది. కాల్ పడిపోతుంది. పుట్ కొన్న వ్యక్తి మంచి లాభం సంపాదిస్తే, కాల్ కొన్న వ్యక్తి మొత్తం పోగొట్టుకుంటాడు. అలాకాకుండా వచ్చిన ప్రాఫిట్ చాలు అనుకునే వ్యక్తి నెలాఖరు దాకానే వేచి ఉండక్కర్లేదు. మధ్యలో ఎప్పుడు కావాలంటే అప్పుడు ప్రాఫిట్ బుక్ చేసి బయటకు రావొచ్చు. సగటు ట్రేడర్ ఈ మార్గాన్ని అనుసరిస్తూ, ఎప్పటికప్పుడు లాభాలు బుక్ చేసుకుంటూ ఉంటే అతని ప్రయాణం సవ్యంగా సాగుతుంది. లేదంటే నష్టాలు తప్పవు.పైన తెలిపిన ఉదాహరణ బేసిక్ వివరాలు తెలిపేందుకే. టెక్నికల్గా ఒక షేరుకు ఎక్కడ సపోర్ట్ దొరుకుతోంది.. ఎక్కడ రెసిస్టన్స్ ఎదురవుతోంది.. ఆప్షన్ గ్రీక్స్ వల్ల ఏం తెలుసుకోవచ్చు.. టైం డికే ప్రాధాన్యం ఏమిటో.. ఐటీఎమ్, ఓటీఎంల గురించి తదుపరి ఆర్టికల్లో తెలుసుకుందాం.- బెహరా శ్రీనివాస రావు, స్టాక్ మార్కెట్ విశ్లేషకులు -
వరుస నష్టాలు.. నిఫ్టీ@23,440
దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:38 సమయానికి నిఫ్టీ(Nifty) 79 పాయింట్లు నష్టపోయి 23,448కు చేరింది. సెన్సెక్స్(Sensex) 229 పాయింట్లు దిగజారి 77,395 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్ 109.2 పాయింట్ల వద్దకు చేరింది. బ్రెంట్ క్రూడ్ఆయిల్(Crude Oil) బ్యారెల్ ధర 77.22 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.69 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో స్వల్ప లాభాలతో ముగిశాయి. ఎస్ అండ్ పీ 0.16 శాతం లాభపడింది. నాస్డాక్ 0.06 శాతం దిగజారింది.ఇదీ చదవండి: రేడియో వ్యాపారం మూసివేతమార్కెట్ రేటింగ్కు హెచ్ఎస్బీసీ కోత..అంతర్జాతీయ బ్రోకరేజ్ దిగ్గజం హెచ్ఎస్బీసీ(HSBC).. భారత ఈక్విటీ మార్కెట్ రేటింగ్ను ‘ఓవర్వెయిట్’ నుంచి ‘న్యూట్రల్’కి తగ్గించింది. కార్పొరేట్ ఆదాయాలు నెమ్మదించడం, అధిక వాల్యుయేషన్లు ఇందుకు కారణాలుగా చెప్పుకొచ్చింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి(2025)గానూ నిఫ్టీ 50 కంపెనీల ఆదాయ వృద్ధి అంచనాలను గణనీయంగా 15% నుంచి 5%కి తగ్గించింది. ఈ ఏడాది చివరి నాటికి సెన్సెక్స్ 85,990 స్థాయికి చేరొచ్చని అంచనా వేసింది. గురువారం సెన్సెక్స్ ముగింపు (77,620)తో పోలిస్తే 10% మాత్రమే అధికం.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
గురువారం ఉదయం స్వల్ప నష్టాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు, ట్రేడింగ్ ముగిసే సమయానికి భారీ నష్టాలను చవిచూశాయి. సెన్సెక్స్ 528.28 పాయింట్లు లేదా 0.68 శాతం నష్టంతో.. 77,620.21 వద్ద, నిఫ్టీ 162.45 పాయింట్లు లేదా 0.69 శాతం నష్టంతో 23,526.50వద్ద నిలిచాయి.బజాజ్ ఆటో, నెస్లే ఇండియా (Nestle India), హిందూస్తాన్ యూనీలీవర్ కంపెనీ, బ్రిటానియా ఇండస్ట్రీస్, మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. శ్రీరామ్ ఫైనాన్స్, ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ONGC), భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL), కోల్ ఇండియా, టాటా స్టీల్ వంటి కంపెనీలు నష్టాల జాబితాలో చేరాయి.దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:48 సమయానికి నిఫ్టీ(Nifty) 88 పాయింట్లు నష్టపోయి 23,602కు చేరింది. సెన్సెక్స్(Sensex) 267 పాయింట్లు దిగజారి 77,890 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్ 109 పాయింట్ల వద్దకు చేరింది. బ్రెంట్ క్రూడ్ఆయిల్(Crude Oil) బ్యారెల్ ధర 76.2 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.69 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో స్వల్ప లాభాలతో ముగిశాయి. ఎస్ అండ్ పీ 0.16 శాతం లాభపడింది. నాస్డాక్ 0.06 శాతం దిగజారింది.ఇదీ చదవండి: వడ్డీరేట్ల కోత పక్కా..?అమెరికాకు కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొత్త ఆర్థిక విధానాలపై అనిశ్చితులు, ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్ల తగ్గింపుపై అనుమానాలు నెలకొన్నాయి. యూఎస్ బాండ్లపై రాబడులు 4.68 శాతానికి చేరుకోవడంతో ఎఫ్ఐఐల పెట్టుబడులు తరలిపోతున్నాయి. మరోవైపు డాలర్ ర్యాలీ ఆగడం లేదు. ఈ పరిణామాలు భారత్ లాంటి వర్థమాన దేశాలకు ప్రతికూలంగా మారాయి. వీటికి తోడు భారత్లో హెచ్ఎంపీవీ కేసులు వెలుగులోకి వచ్చాయి. దేశీయ కంపెనీల మూడో త్రైమాసిక ఆర్థిక ఫలితాలు అంతంత మాత్రంగా ఉండొచ్చని అంతర్జాతీయ బ్రోకరేజ్ సంస్థలు చెబుతున్నాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
బుధవారం ఉదయం నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ ముగిసే సమయానికి నష్టాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 50.62 పాయింట్లు లేదా 0.065 శాతం నష్టంతో 78,148.49 వద్ద, నిఫ్టీ 18.95 పాయింట్లు లేదా 0.080 శాతం నష్టంతో 23,688.95 వద్ద నిలిచాయి.ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ONGC), రిలయన్స్ ఇండస్ట్రీస్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS), ఐటీసీ, ఏషియన్ పెయింట్స్ వంటివి టాప్ గెయిన్ర్స్ జాబితాలో చేరాయి. అపోలో హాస్పిటల్, ట్రెంట్, శ్రీరామ్ ఫైనాన్స్, బజాజ్ ఆటో, అల్ట్రాటెక్ సిమెంట్ వంటి సంస్థలు నష్టాలను చవిచూశాయి.దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:35 సమయానికి నిఫ్టీ(Nifty) 73 పాయింట్లు నష్టపోయి 23,628కు చేరింది. సెన్సెక్స్(Sensex) 289 పాయింట్లు దిగజారి 77,910 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్ 108.55 పాయింట్ల వద్దకు చేరింది. బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 77 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.69 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు(stock market) గడిచిన సెషన్లో నష్టాల్లో ముగిశాయి. ఎస్ అండ్ పీ 1.1 శాతం నష్టపోయింది. నాస్డాక్ 1.9 శాతం దిగజారింది.ఇదీ చదవండి: అమెజాన్ తొలి రాకెట్ ప్రయోగం.. స్పేస్ఎక్స్కు ముప్పు?అమెరికాకు కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొత్త ఆర్థిక విధానాలపై అనిశ్చితులు, ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్ల తగ్గింపుపై అనుమానాలు నెలకొన్నాయి. యూఎస్ బాండ్లపై రాబడులు 4.69 శాతానికి చేరుకోవడంతో ఎఫ్ఐఐల పెట్టుబడులు తరలిపోతున్నాయి. మరోవైపు డాలర్ ర్యాలీ ఆగడం లేదు. ఈ పరిణామాలు భారత్ లాంటి వర్థమాన దేశాలకు ప్రతికూలంగా మారాయి. వీటికి తోడు భారత్లో హెచ్ఎంపీవీ కేసులు వెలుగులోకి వచ్చాయి. దేశీయ కంపెనీల మూడో త్రైమాసిక ఆర్థిక ఫలితాలు అంతంత మాత్రంగా ఉండొచ్చని అంతర్జాతీయ బ్రోకరేజ్ సంస్థలు చెబుతున్నాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
పుంజుకున్న మార్కెట్లు.. లాభాల్లో సూచీలు
మంగళవారం ఉదయం లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ ముగిసే సమయానికి లాభాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 177.70 పాయింట్లు లేదా 0.23 శాతం లాభంతో 78,142.69 పాయిట్ల వద్ద, నిఫ్టీ 81.20 పాయింట్లు లేదా 0.34 శాతం లాభంతో 23,697.25 వద్ద నిలిచాయి.ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ONGC), SBI లైఫ్ ఇన్సూరెన్స్, HDFC లైఫ్ ఇన్సూరెన్స్, అదానీ ఎంటర్ప్రైజెస్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. HCL టెక్నాలజీస్, ట్రెంట్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS), ఐషర్ మోటర్స్, హీరో మోటోకార్ప్ వంటి కంపెనీలు నష్టాలను చవిచూశాయి.దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:34 సమయానికి నిఫ్టీ(Nifty) 157 పాయింట్లు లాభపడి 23,775కు చేరింది. సెన్సెక్స్(Sensex) 435 పాయింట్లు ఎగబాకి 78,414 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 108.2 పాయింట్ల వద్దకు చేరింది. బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 76 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.62 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో లాభాల్లో ముగిశాయి. ఎస్ అండ్ పీ 0.55 శాతం లాభపడింది. నాస్డాక్ 1.2 శాతం ఎగబాకింది.ఇదీ చదవండి: చాట్జీపీటీకి ‘గ్రోక్’ స్ట్రోక్!అమెరికాకు కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొత్త ఆర్థిక విధానాలపై అనిశ్చితులు, ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్ల తగ్గింపుపై అనుమానాలు నెలకొన్నాయి. యూఎస్ బాండ్లపై రాబడులు 4.62 శాతానికి చేరుకోవడంతో ఎఫ్ఐఐల పెట్టుబడులు తరలిపోతున్నాయి. మరోవైపు డాలర్ ర్యాలీ ఆగడం లేదు. ఈ పరిణామాలు భారత్ లాంటి వర్థమాన దేశాలకు ప్రతికూలంగా మారాయి. వీటికి తోడు తాజాగా భారత్లో హెచ్ఎంపీవీ కేసులు వెలుగులోకి వచ్చాయి. దేశీయ కంపెనీల మూడో త్రైమాసిక ఆర్థిక ఫలితాలు అంతంత మాత్రంగా ఉండొచ్చని అంతర్జాతీయ బ్రోకరేజ్ సంస్థలు చెబుతున్నాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
దలాల్ స్ట్రీట్లో వైరస్ సైరన్!
ముంబై: చైనాలో కలకలం సృష్టిస్తున్న హ్యూమన్ మెటా న్యూమో వైరస్(HMPV) కేసులు భారత్లో నమోదవడంతో దలాల్ స్ట్రీట్లో అమ్మకాల అలజడి రేగింది. ఇన్వెస్టర్లు అప్రమత్తత వహిస్తూ విక్రయాలకు పాల్పడటంతో సోమవారం స్టాక్ సూచీలు ఒకటిన్నర శాతానికి పైగా కుప్పకూలాయి. డిసెంబర్ క్వార్టర్ కార్పొరేట్ ఆర్థిక ఫలితాలపై ఆందోళనలు, విదేశీ ఇన్వెస్టర్ల వరుస పెట్టుబడుల ఉపసంహరణ మరింత ఒత్తిడి పెంచాయి.సెన్సెక్స్(Sensex) 1,258 పాయింట్లు పతనమై 78వేల స్థాయి దిగువన 77,965 వద్ద స్థిరపడింది. నిఫ్టీ(NIFTY) 24 వేల స్థాయిని కోల్పోయి 389 పాయింట్ల నష్టంతో 23,616 వద్ద నిలిచింది. ఆసియా మార్కెట్ల నుంచి బలహీన సంకేతాలు అందుకున్న సూచీలు ఉదయం స్వల్ప నష్టాలతో మొదలయ్యాయి. ట్రేడింగ్ ప్రారంభం నుంచీ అన్ని రంగాల షేర్లలో విక్రయాలు వెల్లువెత్తాయి. మెటల్, బ్యాంకులు, రియల్ ఎస్టేట్, ఆయిల్అండ్గ్యాస్, ఫైనాన్స్ షేర్లు భారీగా నస్టపోయాయి. ఒక దశలో సెన్సెక్స్ 1,441 పాయింట్లు క్షీణించి 77,782 వద్ద, నిఫ్టీ 453 పాయింట్లు పతనమై 23,552 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకాయి. ముఖ్యంగా చిన్న, మధ్య తరహా షేర్లలో పెద్ద ఎత్తున అమ్మకాలు జరిగాయి. బీఎస్ఈ స్మాల్ క్యాప్ ఇండెక్స్ 3%, మిడ్ క్యాప్ సూచీ 2.50 శాతం పతనాన్ని చవిచూశాయి. హెచ్ఎంపీవీ వ్యాప్తి భయాలతో అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లు బలహీనంగా ట్రేడవుతున్నాయి.ఇదీ చదవండి: తాళి కట్టు శుభవేళ..బహుమతులపై పన్ను భారం ఉండదా?నష్టాలు ఎందుకంటే... అమెరికాకు కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొత్త ఆర్థిక విధానాలపై అనిశ్చితులు, ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్ల తగ్గింపుపై అనుమానాలు నెలకొన్నాయి. యూఎస్ బాండ్లపై రాబడులు 4.62 శాతానికి చేరుకోవడంతో ఎఫ్ఐఐల పెట్టుబడులు తరలిపోతున్నాయి. మరోవైపు డాలర్ ర్యాలీ ఆగడం లేదు. ఈ పరిణామాలు భారత్ లాంటి వర్థమాన దేశాలకు ప్రతికూలంగా మారాయి. వీటికి తోడు తాజాగా భారత్లో హెచ్ఎంపీవీ కేసులు వెలుగులోకి వచ్చాయి. దేశీయ కంపెనీల మూడో త్రైమాసిక ఆర్థిక ఫలితాలు అంతంత మాత్రంగా ఉండొచ్చని అంతర్జాతీయ బ్రోకరేజ్ సంస్థలు చెబుతున్నాయి. సాంకేతికంగా నిఫ్టీ, బ్యాంకు నిఫ్టీ 200 రోజుల మూవింగ్ యావరేజీ(డీఎంఏ) స్థాయిని కోల్పోవడంతో దలాల్ స్ట్రీట్లో అమ్మకాల సునామీ నెలకొంది. -
ఆర్థిక ఫలితాలతో దిశా నిర్దేశం!
గత వారం మార్కెట్లో బుల్స్(Market Bulls) హడావుడి కనిపించింది. వాస్తవానికి అంతక్రితం వారం రావాల్సిన షార్ట్ కవరింగ్ కిందటి వారం రావడం ఇందుకు ప్రధాన కారణం. ముఖ్యంగా గత గురువారం సెన్సెక్స్ 1400 పాయింట్లు, నిఫ్టీ(Nifty) 400 పాయింట్ల దాకా పెరిగాయి. మళ్లీ శుక్రవారం కొంతమేర నష్టాల్లో నడిచినప్పటికీ పెద్దగా ప్రభావం చూపించలేదు. డిసెంబర్ నెలకు సంబంధించి వాహన విక్రయాలు సానుకూలంగా ఉండటం... మరీ ముఖ్యంగా మారుతీ షేర్ల దూకుడు, ఐటీరంగం(IT Sector)లో మళ్లీ కొనుగోళ్లు పుంజుకోవడం, జీఎస్టీ వసూళ్లు బావుండటం..వంటి కారణాలు మార్కెట్ను ముందుకు నడిపాయి. వారం మొత్తానికి సెన్సెక్స్ 79223, నిఫ్టీ 24004 పాయింట్ల వద్ద ముగిశాయి. అంత క్రితం వారంతో పోలిస్తే గత వారం మొత్తం మీద సెన్సెక్స్ దాదాపు 525 పాయింట్లు లాభపడగా, నిఫ్టీ సుమారు 191 పాయింట్లు పెరిగింది.ఈవారం ఇలా..తెలుగు వాళ్లకు సంక్రాంతి ఎంత పెద్ద పండుగో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. స్టాక్ మార్కెట్కు సంబంధించి అలాంటి పండగే రాబోతోంది. అదే ఆర్థిక ఫలితాలు. అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికానికి సంబంధించిన ఆర్థిక ఫలితాలు ఈవారం నుంచే మొదలు కాబోతున్నాయి. ఈ నెల 9న టీసీఎస్ ఫలితాలతో సందడి మొదలవుతుంది. ఇక ఈ ఫలితాలు మార్కెట్లకు రాబోయే రోజుల్లో దిశానిర్దేశం చేయబోతున్నాయి. ఈసారి ఫలితాలు కొంత ప్రొత్సాహకారంగా ఉండొచ్చన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇది సానుకూల సంకేతం. మరోపక్క క్రిస్మస్, కొత్త సంవత్సర వేడుకల నేపథ్యంలో పలచబడ్డ విదేశీ మదుపర్ల లావాదేవీలు మళ్లీ జోరు అందుకుంటాయి. అయితే గత వారం చివర్లో కనిపించిన కొనుగోళ్ల ఉద్ధృతి కొనసాగడం అనేది ఆర్థిక ఫలితాలు, విదేశీ మదుపర్ల చర్య పైనే పూర్తిగా ఆధారపడి ఉంది. ఎఫ్ఐఐల తీరువిదేశీ సంస్థాగత మదుపర్లు (ఎఫ్ఐఐలు) గత డిసెంబర్ నెల మొత్తం మీద రూ.16,982 కోట్ల నికర విక్రయాలు జరపగా, దేశీయ మదుపర్లు రూ.34,194 కోట్ల నికర కొనుగోళ్లు జరిపారు. ఇక ఈ ఏడాది తొలి మూడు రోజుల్లోనూ విదేశీ మదుపర్లు రూ.4500 కోట్ల నికర విక్రయాలు చేశారు. అదే సమయంలో దేశీయ మదుపర్లు మాత్రం రూ.2500 కోట్ల నికర కొనుగోళ్లతో మార్కెట్కు అండగా నిలిచారు. సాంకేతిక స్థాయులుసెన్సెక్స్, నిఫ్టీల్లో ఒడుదొడుకులు కొంత మేర తగ్గే అవకాశం ఉంది. ముఖ్యంగా బుల్స్ పుంజుకోవడానికి చేస్తున్న ప్రయత్నమే ఇందుకు కారణం. కొనుగోళ్ల జోరు కొనసాగితే నిఫ్టీ 24250 పాయింట్ల వరకు పరుగులు తీయొచ్చు. ఈ స్థాయిని కూడా అధిగమిస్తే 24600 వరకు పెద్దగా ఇబ్బంది ఎదురుకాకపోవచ్చు. ఒకవేళ అమ్మకాలు పెరిగితే 23800 కీలక స్థాయిని మార్కెట్ చూసే అవకాశం ఉంటుంది. దాన్ని కూడా బ్రేక్ చేస్తే పతనం మరింత పెరిగి గతంలోని కనిష్టస్థాయులను టచ్ చేసే అవకాశం లేకపోలేదు. అదే జరిగితే గత మద్దతు స్థాయి అయిన 23300 మార్కెకు పడిపోవచ్చు. ఆ స్థాయికి క్షీణించడానికి ముందు కొద్దిపాటి రికవరీకి ఆస్కారం ఉంటుంది.ఇదీ చదవండి: మానసిక ఆరోగ్యానికీ బీమా ధీమారంగాలవారీగా...ఆటోమొబైల్ రంగంలో జోరు కొనసాగే అవకాశం ఉంది. డిసెంబర్ నెలకు ఈ కంపెనీలు ప్రకటించిన విక్రయ గణాంకాలు చాలావరకు మదుపర్లను మెప్పించాయి. మారుతీ షేర్లలో దూకుడు కొనసాగే అవకాశం ఉన్నప్పటికీ ప్రాఫిట్ బుకింగ్కు అవకాశం ఉంటుంది. గత కొద్దివారాలుగా లాభాల్లో సాగుతున్న ఫార్మా రంగం ర్యాలీ ఈవారం కూడా ముందుకు వెళ్లే అవకాశం ఉంది. ముఖ్యంగా మార్కెట్లో ఒడుదొడుకులు ఎదురవుతున్నప్పుడు మదుపర్లు ముందుగా సురక్షితంగా భావించి కొనుగోళ్లు జరిపేది ఈ రంగంలోని షేర్లనే. ఇక టీసీఎస్ ఆర్థిక ఫలితాలు రాబోయే రోజుల్లో ఇన్ఫోసిస్, హెచ్సీఎల్ టెక్ వంటి ఐటీ కంపెనీల షేర్లను ప్రభావితం చేస్తాయి. అల్ట్రాటెక్, అంబుజా షేర్లకు మద్దతు దొరికే అవకాశం ఉన్నప్పటికీ సిమెంట్ షేర్లలో పెద్దగా దూకుడు ఉండకపోవచ్చు. అలాగే ఎఫ్ఎంసిజీ, యంత్ర పరికరాల రంగానికి చెందిన షేర్లు సైతం ఒత్తిళ్లు ఎదుర్కొనే అవకాశం ఉంది. టెలికం, ఆయిల్ రంగాల షేర్లలో స్థిరీకరణ జరగొచ్చు.-బెహరా శ్రీనివాస రావు, స్టాక్ మార్కెట్ విశ్లేషకులు -
ఐటీ స్టాక్ల ర్యాలీ.. లాభాల్లో సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్లు(Stock Market) సోమవారం లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:28 సమయానికి నిఫ్టీ(Nifty) 74 పాయింట్లు లాభపడి 24,082కు చేరింది. సెన్సెక్స్(Sensex) 286 పాయింట్లు ఎగబాకి 79,523 వద్ద ట్రేడవుతోంది. ఈరోజు ఈ సమయం వరకు ఐటీ స్టాక్లు ఎక్కువగా ర్యాలీ అవుతున్నట్లు తెలుస్తుంది.అమెరికా డాలర్ ఇండెక్స్ 108.91 పాయింట్ల వద్దకు చేరింది. బ్రెంట్ క్రూడ్ఆయిల్(Crude Oil) బ్యారెల్ ధర 76.3 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.6 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో లాభాల్లో ముగిశాయి. ఎస్ అండ్ పీ 1.26 శాతం లాభపడింది. నాస్డాక్ 1.77 శాతం ఎగబాకింది.దేశీ స్టాక్ మార్కెట్లను ఈ వారం ప్రధానంగా కార్పొరేట్ ఫలితాలు నడిపించనున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సర(2024–25) మూడో త్రైమాసిక ఫలితాల సీజన్ ప్రారంభంకానుంది. దీనికితోడు పారిశ్రామికోత్పత్తి గణాంకాలు సైతం విడుదలకానున్నాయి. దీంతో ఇన్వెస్టర్లు అక్టోబర్–డిసెంబర్(క్యూ3) ఫలితాలు, ఆర్థిక గణాంకాలపై దృష్టి పెట్టనున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. ఇవికాకుండా ప్రపంచ రాజకీయ, భౌగోళిక అంశాలకూ ప్రాధాన్యత ఉన్నట్లు తెలియజేశారు.ఇదీ చదవండి: మానసిక ఆరోగ్యానికీ బీమా ధీమావారాంతాన(10న) ప్రభుత్వం నవంబర్ నెలకు పారిశ్రామికోత్పత్తి ఇండెక్స్(ఐఐపీ) గణాంకాలు వెల్లడించనుంది. అక్టోబర్లో ఐఐపీ వార్షికంగా 3.5 శాతం పుంజుకుంది. అంతేకాకుండా డిసెంబర్ నెలకు హెచ్ఎస్బీసీ సర్వీసెస్ పీఎంఐ గణాంకాలు విడుదలకానున్నాయి. వచ్చే నెల మొదట్లో కేంద్ర ప్రభుత్వం సార్వత్రిక బడ్జెట్ను ప్రకటించనుంది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
స్టాక్ మార్కెట్లకు భారీ నష్టాలు
దేశీయ బెంచ్మార్క్ ఈక్విటీ సూచీలు బీఎస్ఈ (BSE) సెన్సెక్స్, ఎన్ఎస్ఈ (NSE) నిఫ్టీ50 వారం చివరి ట్రేడింగ్ సెషన్ను ప్రతికూలంగా ముగించాయి. 30 షేర్ల సెన్సెక్స్ 720.60 పాయింట్లు లేదా 0.90 శాతం క్షీణించి 79,223.11 వద్ద స్థిరపడింది. ఈరోజు ఈ ఇండెక్స్ 80,072.99 నుండి 79,147.32 రేంజ్లో ట్రేడ్ అయింది.ఇక నిఫ్టీ50 183.90 పాయింట్లు లేదా 0.76 శాతం నష్టంతో 24,004.75 వద్ద రెడ్లో స్థిరపడింది. నిఫ్టీ 50 ఈరోజు గరిష్ట స్థాయి 24,196.45 వద్ద, కనిష్ట స్థాయి 23,978.15 వద్ద నమోదైంది.నిఫ్టీ50లోని 50 స్టాక్స్లో 32 రెడ్లో ముగిశాయి. విప్రో, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, టెక్ మహీంద్రా, అదానీ పోర్ట్స్, సిప్లా టాప్ లూజర్స్గా నిలిచాయి. మరోవైపు ఓఎన్జీసీ, టాటా మోటార్స్, టైటాన్, నెస్లే ఇండియా, ఎస్బీఐ లైఫ్ లాభాలతో ముగిసిన 18 స్టాక్లలో ఉన్నాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:57 సమయానికి నిఫ్టీ 125 పాయింట్లు నష్టపోయి 24,064కు చేరింది. సెన్సెక్స్ 501 పాయింట్లు దిగజారి 79,454 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్ 109.22 పాయింట్ల వద్దకు చేరింది. బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 75.88 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.56 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో నష్టాల్లో ముగిశాయి. ఎస్ అండ్ పీ 0.2 శాతం నష్టపోయింది. నాస్డాక్ 0.16 శాతం దిగజారింది.బలహీన డిమాండ్కు భిన్నంగా డిసెంబర్లో అంచనాలకు మించి వాహన విక్రయాలు జరడంతో ఆటో రంగ షేర్లు నిన్నటి మార్కెట్ సెషన్లో దూసుకెళ్లాయి. అంతర్జాతీయ బ్రోకరేజ్ సంస్థలైన సీఎల్ఎస్ఏ, సిటీ డిసెంబర్ క్వార్టర్తో పాటు 2025 ఏడాది మొత్తంగా ఐటీ కంపెనీల ఆదాయాల్లో వృద్ధి బలంగా ఉండొచ్చనే తాజాగా అంచనా వేశాయి. ఫలితంగా ఈ రంగంలోని షేర్లు రాణించాయి. ఈరోజు మార్కెట్ ప్రారంభం నుంచి కొంత ఒడిదొడుకుల్లో ఉంది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:55 సమయానికి నిఫ్టీ(Nifty) 109 పాయింట్లు లాభపడి 23,855కు చేరింది. సెన్సెక్స్(Sensex) 373 పాయింట్లు ఎగబాకి 78,873 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్ 108.29 పాయింట్ల వద్దకు చేరింది. బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్(Barrel Crude) ధర 74.92 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.57 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో స్వల్ప నష్టాల్లో ముగిశాయి. ఎస్ అండ్ పీ 0.03 శాతం నష్టపోయింది. నాస్డాక్(Nasdaq) 0.9 శాతం దిగజారింది.కొత్త సంవత్సరానికి స్టాక్ మార్కెట్ బుధవారం లాభాలతో స్వాగతం పలికింది. మెటల్, రియల్టీ(Realty) మినహా అన్ని రంగాల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో బుధవారం ఇండెక్సులు అరశాతం మేర లాభపడ్డాయి. కొత్త సంవత్సరం రోజున ఆసియా, యూరప్ మార్కెట్లు పనిచేయలేదు. వినియోగ ధోరణులు, సేవల వృద్ధి, ఎగుమతుల్లో తయారీ రంగం వాటా పెరగడం, పెట్టుబడులకు సంబంధించి మూలధన మార్కెట్ల స్థిరత్వం వంటి కొన్ని ముఖ్య అంశాల్లో భారత్ ఇప్పటికీ పటిష్టంగా ఉందని కొందరు నిపుణులు చెబుతున్నారు.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
తొలిరోజు లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు
బెంచ్మార్క్ ఈక్విటీ సూచీలు బీఎస్ఈ (BSE) సెన్సెక్స్, ఎన్ఎస్ఈ (NSE) నిఫ్టీ50 కొత్త సంవత్సరం మొదటి ట్రేడింగ్ సెషన్ను లాభాలతో ముగించాయి. 30 షేర్ల సెన్సెక్స్ బుధవారం 368.40 పాయింట్లు లేదా 0.47 శాతం పెరిగి 78,507.41 వద్ద స్థిరపడింది. ఈ ఇండెక్స్ ఈరోజు 78,756.49 - 77,898.30 రేంజ్లో ట్రేడ్ అయింది.అదేవిధంగా నిఫ్టీ 50 దాని మునుపటి ముగింపుతో పోలిస్తే 98.10 పాయింట్లు లేదా 0.41 శాతం పెరిగి 23,742.90 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 50 రోజు గరిష్ట స్థాయి 23,822.80 వద్ద కనిపించగా, రోజు కనిష్ట స్థాయి 23,562.80 వద్ద ఉంది.మారుతీ సుజుకీ ఇండియా, మహీంద్రా అండ్ మహీంద్రా, బజాజ్ ఫైనాన్స్, లార్సెన్ & టూబ్రో, టాటా మోటార్స్ 3.01 శాతం వరకు లాభపడటంతో నిఫ్టీ50లోని 50 స్టాక్స్లో 37 గ్రీన్లో ముగిశాయి. మరోవైపు డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, హిందాల్కో, అదానీ పోర్ట్స్, ఓఎన్జీసీ, టాటా స్టీల్ నష్టాలతో ముగిశాయి. దేశీయ స్టాక్ మార్కెట్లు 2025 మొదటి ట్రేడింగ్ రోజు బుధవారం ఉదయం స్వల్ప నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:37 సమయానికి నిఫ్టీ(Nifty) 26 పాయింట్లు నష్టపోయి 23,617కు చేరింది. సెన్సెక్స్(Sensex) 82 పాయింట్లు దిగజారి 78,067 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్ 108.48 పాయింట్ల వద్దకు చేరింది. బ్రెంట్ క్రూడ్ఆయిల్(Crude Oil) బ్యారెల్ ధర 74.64 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.57 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో నష్టాల్లో ముగిశాయి. ఎస్ అండ్ పీ 0.43 శాతం నష్టపోయింది. నాస్డాక్ 0.9 శాతం దిగజారింది.ఈవారం మార్కెట్లు స్తబ్దుగానే సాగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. మార్కెట్లను ఉత్తేజపరిచే సంఘటనలు ఏవీ లేకపోవడం, విదేశీ మదుపర్ల నిరాసక్తత ఇందుకు ప్రధాన కారణాలుగా చెప్పుకోవచ్చు. మరోపక్క రూపాయి(Rupee) బలహీనపడటం, అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికానికి సంబంధించి త్వరలో వెలువడబోయే త్రైమాసిక ఫలితాలపై అంచనాలు అంతంతమాత్రంగా ఉండటం కూడా సెంటిమెంట్ను ప్రభావితం చేయవచ్చు. అలాగే ఒకటో తేదీన వెలువడే, జీఎస్టీ వసూళ్ల గణాంకాలు, వాహన విక్రయాల వివరాలు మార్కెట్ ను ప్రభావితం చేస్తాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు
మంగళవారం ఉదయం నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ ముగిసే సమయానికి నష్టాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 109.12 పాయింట్లు లేదా 0.14 శాతం నష్టంతో 78,139.01 వద్ద, నిఫ్టీ 0.100 పాయింట్లు లేదా 0.00042 శాతం నష్టంతో 23,644.80 వద్ద నిలిచాయి.భారత్ ఎలక్ట్రానిక్స్, ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ONGC), కోటక్ మహీంద్రా బ్యాంక్, ట్రెంట్, కోల్ ఇండియా వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. అదానీ ఎంటర్ప్రైజెస్, టెక్ మహీంద్రా, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS), ఇన్ఫోసిస్, శ్రీరామ్ ఫైనాన్స్ వంటి కంపెనీలు నష్టాల జాబితాలోకి చేరాయి.దేశీయ స్టాక్ మార్కెట్లు(Stock Market) ఉదయం నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:27 సమయానికి నిఫ్టీ(Nifty) 96 పాయింట్లు నష్టపోయి 23,545కు చేరింది. సెన్సెక్స్(Sensex) 425 పాయింట్లు దిగజారి 77,831 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్ 108.07 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 74.4 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.53 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో నష్టాల్లో ముగిశాయి. ఎస్ అండ్ పీ 0.64 శాతం నష్టపోయింది. నాస్డాక్ 2.3 శాతం దిగజారింది.2024–25 ఆర్థిక సంవత్సరపు మొదటి అర్ధభాగంలో వృద్ధి రేట్లు అంచనాలకు తగ్గట్టుగా లేవని డెలాయిట్ ఇండియా ఆర్థిక శాస్త్రవేత్త రుమ్కీ మజుందార్ పేర్కొన్నారు. ఎన్నికల అనిశ్చితి, భారీ వర్షపాతం, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు డిమాండ్–ఎగుమతులపై ప్రభావం చూపినట్లు ఆయన విశ్లేషించారు. అయితే, వినియోగ ధోరణులు, సేవల వృద్ధి, ఎగుమతుల్లో తయారీ రంగం వాటా పెరగడం, పెట్టుబడులకు సంబంధించి మూలధన మార్కెట్ల స్థిరత్వం వంటి కొన్ని ముఖ్య అంశాల్లో భారత్ ఇప్పటికీ పటిష్టంగా ఉందని అన్నారు.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
స్వల్ప స్థాయిలోనే కదలికలు
విదేశీ మదుపర్లు గతవారం పెద్దగా స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ కార్యకలాపాలు చేయనందున సూచీలు నత్తనడకన సాగాయి. బీఎస్ఈ(BSE) వారం మొత్తానికి దాదాపు 650 పాయింట్లు లాభపడి 78700 పాయింట్ల స్థాయిలో స్థిరపడగా, ఎన్ఎస్ఈ నిఫ్టీ(Nifty) ఇంచుమించు 200 పాయింట్లు పెరిగి 23813 పాయింట్ల దరిదాపుల్లో క్లోజయింది. సెన్సెక్స్, నిఫ్టీలు ఒకవారం రోజుల వ్యవధిలో కేవలం 0.8 శాతం లాభపడ్డాయన్నమాట.విదేశీ మదుపర్లుడిసెంబర్ చివరి వారంలో విదేశీమదుపర్ల(FII) లావాదేవీలు పరిమిత సంఖ్యలోనే ఉంటాయి. ముఖ్యంగా క్రిస్మస్, కొత్త సంవత్సర వేడుకల కోసం వీరు అధికశాతం ట్రేడింగ్పై పెద్దగా ఆసక్తి చూపరు. ఇప్పటికే మన మార్కెట్లో వీరి కొనుగోళ్లు బాగా పడిపోయాయి. ఒకరకంగా చెప్పాలంటే మన ఈక్విటీల్లో వీరి అమ్మకాలు 82 శాతానికి చేరాయి. నికర కొనుగోళ్లు కేవలం 18 శాతం స్థాయిలోనే ఉన్నాయి. ఈ తరుణంలో వాస్తవానికి గతవారం షార్ట్కవరింగ్ లావాదేవీల రూపంలో కొనుగోళ్ల మద్దతు లభించాల్సి ఉంది. కానీ అలాంటిదేమీ చోటుచేసుకోలేదు. పైగా గత శుక్రవారం ఆప్షన్స్ ట్రేడింగ్ను పరిశీలిస్తే భారీగా అమ్మకాలు ఒత్తిళ్లు ఉన్నాయి. ఎఫ్ఐఐలు మళ్లీ పూర్తి స్థాయిలో మార్కెట్లోకి అడుగుపెట్టేవరకు జోష్ తక్కువగానే ఉంటుంది. గత వారం విదేశీ మదుపర్లు దాదాపు రూ.11,000 కోట్ల షేర్లను నికరంగా కొనుగోలు చేశారు.ఈవారం అంచనాలుఈవారం మార్కెట్లు స్తబ్దుగానే సాగే అవకాశం ఉంది. మార్కెట్లను ఉత్తేజపరిచే సంఘటనలు ఏవీ లేకపోవడం, విదేశీ మదుపర్ల నిరాసక్తత ఇందుకు ప్రధాన కారణాలుగా చెప్పుకోవచ్చు. మరోపక్క రూపాయి బలహీనపడటం, అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికానికి సంబంధించి త్వరలో వెలువడబోయే త్రైమాసిక ఫలితాలపై అంచనాలు అంతంతమాత్రంగా ఉండటం కూడా సెంటిమెంట్ను ప్రభావితం చేయవచ్చు. అలాగే ఒకటో తేదీన వెలువడే, జీఎస్టీ వసూళ్ల గణాంకాలు, వాహన విక్రయాల వివరాలు మార్కెట్ ను ప్రభావితం చేస్తాయి. ఈ వారం నిఫ్టీకి 23650 పాయింట్లు తక్షణ మద్దతుగా కనిపిస్తోంది. ఆ స్థాయిని బ్రేక్ చేసిన పక్షంలో మాత్రమే 23500 దిగువకు వెళ్తుంది. అక్కడ మార్కెట్కు మద్దతు దొరికి సూచీలు బలంగా పుంజుకునే సూచనలు ఉన్నప్పటికీ అమ్మకాలు వెల్లువెత్తితే మాత్రం 23350 -23000 వరకు పతనం కొనసాగవచ్చు. అలాకాక ముందుకు కదిలితే 23940 వద్ద మొదటి నిరోధం ఎదురవుతుంది. దాన్ని అధిగమిస్తే తదుపరి నిరోధం 24000 వద్ద ఉంది. దీన్నీదాటుకుని ముందుకెళ్తే 24200 వరకు ఎలాంటి ఇబ్బందీ ఉండకపోవచ్చు. ఇప్పటికే మార్కెట్లు ఓవర్ సోల్డ్ జోన్లో ఉన్నాయన్నది వాస్తవం. ముఖ్యంగా సూచీల్లో ఎక్కువస్థాయిలో షార్ట్స్ బిల్డ్ అయి ఉన్నాయి. షార్ట్ కవరింగ్ లావాదేవీలకు అవకాశం ఉన్నప్పటికీ అంత సులువుగా కనిపించడం లేదు. ఇక బ్యాంకు నిఫ్టీ విషయానికొస్తే.. 51300 దిగువన కొనసాగితే మాత్రం 50500-50250 వరకు క్షీణించే అవకాశం ఉంది. అలా కాకుండా మార్కెట్లు ముందుకెళ్తే మొదటి దశలో 52000 వరకు సూచీ దూసుకెళ్ళవచ్చు. ఆపై 52500-52800 వరకు పరుగులు తీయొచ్చు.ఇదీ చదవండి: తప్పుల మీద తప్పులు... అప్పుల మీద అప్పులుసెక్టార్ల విషయానికొస్తే..మిగతా రంగాలతో పోలిస్తే ఈవారం ఫార్మా రంగం లాభాల బాటలో పయనించే అవకాశం ఉంది. రూపాయి క్షీణత ఈ రంగానికి కలిసొచ్చే ప్రధానాంశంగా చెప్పవచ్చు. అలాగే ఐటీ షేర్లకూ రూపాయి క్షీణత సానుకూలమే అయినప్పటికీ, వచ్చే నెలారంభంలో వెలువడే టీసీఎస్, ఇన్ఫోసిస్ వంటి ప్రముఖ కంపెనీల ఫలితాలు ఈ రంగంలోని షేర్ల దూకుడుకు అడ్డుకట్ట వేయొచ్చు. యంత్ర పరికరాల రంగానికి సాధారణ స్థాయిలోనే మద్దతు లభిస్తుంది. ఈ షేర్లు పెరిగేది తక్కువే. బ్యాంకింగ్ రంగంలో ప్రైవేటు బ్యాంకుల జోరు కొనసాగుతుంది. ముఖ్యంగా యాక్సిస్ బ్యాంక్, ఇండస్ ఇండ్ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంకులపై ఇన్వెస్టర్లు ఓ కన్నేయవచ్చు. టెలికాం, ఎఫ్ఎంసీజీ, లోహ , సిమెంట్ రంగాలకు చెందిన షేర్లలో కదలికలు స్వల్ప స్థాయికి పరిమితమవుతాయి. ఆటో మొబైల్, చమురు షేర్లు నష్టాల్లోనే కొనసాగే అవకాశం ఉంది.-బెహరా శ్రీనివాస రావు స్టాక్ మార్కెట్ విశ్లేషకులు -
లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. మెరిసిన ఫార్మా, ఆటో షేర్లు
దేశీయ బెంచ్మార్క్ ఈక్విటీ సూచీలు వారాంతపు ట్రేడింగ్ సెషన్ను సానుకూలంగా ముగించాయి. 30 షేర్ల సెన్సెక్స్ 226 పాయింట్లు లేదా 0.29 శాతం పెరిగి 78,699.07 వద్ద స్థిరపడింది. ఈరోజు ఇండెక్స్ 79,043.15 - 78,598.55 రేంజ్లో ట్రేడయింది. ఇక ఎన్ఎస్ఈ నిఫ్టీ50 ( NSE Nifty 50 ) 63 పాయింట్లు లేదా 0.27 శాతం లాభంతో 23,813.40 వద్ద గ్రీన్లో స్థిరపడింది. నిఫ్టీ ఈరోజు గరిష్ట స్థాయి 23,938.85 వద్ద కనిపించగా, రోజు కనిష్ట స్థాయి 23,800.60 వద్ద ఉంది.డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, ఇండస్ఇండ్ బ్యాంక్, ఐషర్ మోటార్స్, విప్రో 2.51 శాతం వరకు లాభపడటంతో నిఫ్టీలోని 50 స్టాక్లలో 29 గ్రీన్లో ముగిశాయి. మరోవైపు హిందాల్కో, కోల్ ఇండియా, ఎస్బీఐ, ఒఎన్జిసి, టాటా స్టీల్ 1.81 శాతం వరకు నష్టాలు మూటకట్టుకుని నష్టాలతో ముగిసిన 21 స్టాక్లలో ఉన్నాయి.దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం ఉదయం ఫ్లాట్గా ట్రేడవుతున్నాయి. ఉదయం 9:46 సమయానికి నిఫ్టీ(Nifty) 124 పాయింట్లు లాభపడి 23,877కు చేరింది. సెన్సెక్స్(Sensex) 397 పాయింట్లు పుంజుకుని 78,891 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 108.14 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్ఆయిల్(Crude Oil) బ్యారెల్ ధర 71.9 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.57 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో ఫ్లాట్గా ముగిశాయి. ఎస్ అండ్ పీ 0.15 శాతం నష్టపోయింది. నాస్డాక్ 0.02 శాతం దిగజారింది.ఫెడరల్ రిజర్వ్ వచ్చే ఏడాది నుంచి ఆశించిన స్థాయిలో వడ్డీరేట్ల తగ్గింపు ఉండకపోవచ్చని సంకేతాలివ్వడంతో ఈక్విటీ మార్కెట్లు ఇటీవల కాలంలో ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. కొన్ని రోజుల్లో కొత్త సంవత్సరం ప్రారంభం అవుతుండడంతో యూఎస్లో మదుపర్లు పెట్టుబడులను ఉపసంహరిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ నెల 31తో అమెరికాలో ఈ ఆర్థిక సంవత్సరం ముగియనుంది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
మిశ్రమ ఫలితాల్లో స్టాక్ మార్కెట్లు
గురువారం ఉదయం లాభాల్లో లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ ముగిసే సమయానికి మిశ్రమ ఫలితాలను చవిచూశాయి. సెన్సెక్స్ 0.39 పాయింట్లు లేదా 0.00050 శాతం నష్టంతో 78,472.48 వద్ద, నిఫ్టీ 22.55 పాయింట్లు లేదా 0.095 శాతం లాభంతో 23,750.20 వద్ద నిలిచాయి.అదానీ పోర్ట్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, SBI లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ, శ్రీరామ్ ఫైనాన్స్, మారుతి సుజుకి ఇండియా వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. ఏషియన్ పెయింట్స్, టైటాన్ కంపెనీ, JSW స్టీల్, గ్రాసిమ్ ఇండస్ట్రీస్, నెస్లే ఇండియా వంటి సంస్థలు నష్టాలను చవి చూశాయి.స్థిరమైన గ్లోబల్ సూచనలు, ఆసియా మార్కెట్ల ఉత్తేజం నేపథ్యంలో ఇండియన్ ఈక్విటీ సూచీలు బీఎస్ఈ సెన్సెక్స్ (Sensex), నిఫ్టీ 50 (Nifty) గురువారం లాభాల్లో ప్రారంభమయ్యాయి. ప్రారంభ సమయానికి, సెన్సెక్స్ 238.27 పాయింట్లు లేదా 0.30 శాతం పెరిగి 78,711 వద్ద, నిఫ్టీ 56.45 పాయింట్లు లేదా 0.24 శాతం లాభంతో 23,784.10 వద్ద ఉన్నాయి.ఓపెనింగ్ బెల్ తర్వాత ఏషియన్ పెయింట్, టెక్ మహీంద్రా స్టాక్లు మాత్రమే నష్టాల్లో ట్రేడవుతుండగా, మిగిలినవి లాభాల్లో పయనిస్తున్నాయి. వీటిలో బ్యాంక్ స్టాక్లు ముందు వరుసలో ఉన్నాయి. లాభాల్లో అగ్రగామిగా ఎస్బీఐ (SBI) ఉండగా, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, మారుతీ సుజుకీ ఇండియా, యాక్సిస్ బ్యాంక్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.నిఫ్టీ50లో ఏషియన్ పెయింట్స్, డాక్టర్ రెడ్డీస్, సిప్లా, ట్రెంట్, టీసీఎస్లతో సహా ఐదు స్టాక్లు మాత్రమే దిగువన ట్రేడింగ్లో ఉన్నాయి. బిపిసిఎల్, ఎస్బిఐ, ఐసీఐసీఐ బ్యాంక్ (ICICI Bank) మారుతీ సుజుకి ఇండియా, యాక్సిస్ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్ టాప్ గెయినర్స్.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
లాభాలకు బ్రేక్.. నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
మంగళవారం ఉదయం స్వల్ప లాభాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు (Stock Market).. ట్రేడింగ్ ముగిసే సమయానికి నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 85.93 పాయింట్లు లేదా 0.11 శాతం నష్టంతో.. 78,454.24 వద్ద, నిఫ్టీ 23.85 పాయింట్లు లేదా 0.10 శాతం నష్టంతో 23,729.60 వద్ద నిలిచాయి.టాటా మోటార్స్, అదానీ ఎంటర్ప్రైజెస్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL), ఐషర్ మోటార్స్, ఐటీసీ కంపెనీ వంటివి టాప్ గెయినర్స్ జాబితాలో నిలిచాయి. పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, జేఎస్డబ్ల్యు స్టీల్, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, టైటాన్ కంపెనీ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) వంటివి నష్టాలను చవిచూశాయి. దేశీయ స్టాక్ మార్కెట్లు ఉదయం ఫ్లాట్గా ట్రేడవుతున్నాయి. ఉదయం 9:24 సమయానికి నిఫ్టీ 21 పాయింట్లు లాభపడి 23,775కు చేరింది. సెన్సెక్స్ 71 పాయింట్లు పుంజుకుని 78,611 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్ 108.08 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 72.9 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.59 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో లాభాల్లో ముగిశాయి. ఎస్ అండ్ పీ 0.43 శాతం నష్టపోయింది. నాస్డాక్ 1.92 శాతం దిగజారింది.ఫెడరల్ రిజర్వ్ వచ్చే ఏడాది నుంచి ఆశించిన స్థాయిలో వడ్డీరేట్ల తగ్గింపు ఉండకపోవచ్చని సంకేతాలివ్వడంతో ఈక్విటీ మార్కెట్లు ఇటీవల కాలంలో ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. రేపు క్రిస్మస్ నేపథ్యంలో మార్కెట్లకు సెలవు. తిరిగి గురువారం యథావిధిగా స్టాక్మార్కెట్లు పని చేస్తాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
వరుస నష్టాలకు బ్రేక్.. లాభాల్లో ముగిసిన మార్కెట్లు
దేశీయ స్టాక్మార్కెట్లు సోమవారం లాభాలతో ముగిశాయి. మార్కెట్లు ముగిసే సమయానికి నిఫ్టీ 165 పాయింట్లు లాభపడి 23,735 వద్దకు చేరింది. సెన్సెక్స్ 498 పాయింట్లు పుంజుకుని 78,540 వద్దకు చేరింది. ఇటీవల భారీగా పడిపోయిన మార్కెట్లు సోమవారం కాస్త పుంజుకోవడంతో మదుపర్లు ఊపిరి పీల్చుకున్నారు. ఇటీవల మార్కెట్ నుంచి భారీగా అమ్మకాలు చేస్తున్న విదేశీ సంస్థగత పెట్టుబడిదారుల సరళిని గమనించాలని మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు.ఇదీ చదవండి: జనవరి 1 నుంచి వాట్సప్ పని చేయదు! కారణం..సెన్సెక్స్ 30 సూచీలో ఐటీసీ, టెక్ మహీంద్రా, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఇండస్ఇండ్ బ్యాంక్, టైటాన్, ఎస్బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్, టాటా స్టీల్, అదానీ పోర్ట్స్ అండ్ సెజ్, భారతీ ఎయిర్టెల్, యాక్సిస్ బ్యాంకు, బజాజ్ ఫైనాన్స్, ఎల్ అండ్ టీ కంపెనీ స్టాక్లు లాభాల్లోకి చేరుకున్నాయి. జొమాటో, మారుతీసుజుకీ, హెచ్సీఎల్ టెక్నాలజీస్, బజాజ్ ఫిన్సర్వ్, టాటా మోటార్స్, ఏషియన్ పెయింట్స్, టీసీఎస్, నెస్లే కంపెనీ షేర్లు భారీ నష్టాల్లోకి జారుకున్నాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు
శుక్రవారం ఉదయం నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ ముగిసే సమయానికి భారీ నష్టాలను చవిచూశాయి. సెన్సెక్స్ 1,176.45 పాయింట్లు లేదా 1.49 శాతం నష్టంతో 78,041.59 వద్ద, నిఫ్టీ 364.20 పాయింట్లు లేదా 1.52 శాతం నష్టంతో 23,587.50 వద్ద నిలిచాయి.డాక్టర్ రెడ్డీస్ ల్యాబరెటరీస్, నెస్లే ఇండియా, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ లైఫ్ ఇన్సూరెన్స్, టైటాన్ కంపెనీ వంటివి టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. టెక్ మహీంద్రా, ట్రెంట్, ఇండస్ఇండ్ బ్యాంక్, మహీంద్రా అండ్ మహీంద్రా, యాక్సిస్ బ్యాంక్ మొదలైన సంస్థలు నష్టాలను చవిచూశాయి.దేశీయ స్టాక్ మార్కెట్లు ఉదయం నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:24 సమయానికి నిఫ్టీ 41 పాయింట్లు నష్టపోయి 23,911కు చేరింది. సెన్సెక్స్ 186 పాయింట్లు దిగజారి 79,027 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్ 108.43 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 72.6 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.56 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో ఫ్లాట్గా ముగిశాయి. ఎస్ అండ్ పీ 0.09 శాతం నష్టపోయింది. నాస్డాక్ 0.12 శాతం దిగజారింది.ఫెడరల్ రిజర్వ్ వచ్చే ఏడాది నుంచి ఆశించిన స్థాయిలో వడ్డీరేట్ల తగ్గింపు ఉండకపోవచ్చని సంకేతాలివ్వడంతో ఈక్విటీ మార్కెట్లు అమ్మకాల ఒత్తిడికి లోనవుతున్నాయి. అమెరికా బాండ్లపై రాబడులు ఏడు నెలల గరిష్టానికి, డాలర్ ఇండెక్స్ రెండున్నర ఏళ్ల గరిష్టానికి చేరుకోవడమూ ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. దేశీయ ఈక్విటీ మార్కెట్లో విదేశీ ఇన్వెస్టర్ల వరుస విక్రయాలు కొనసాగుతున్నాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
లాభాలకు బ్రేక్.. నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు
గురువారం స్వల్ప లాభాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ ముగిసే సమయానికి నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 236.18 పాయింట్లు లేదా 0.29 శాతం నష్టంతో 81,289.96 వద్ద, నిఫ్టీ 93.10 పాయింట్లు లేదా 0.38 శాతం నష్టంతో 24,548.70 వద్ద నిలిచాయి.అదానీ ఎంటర్ప్రైజెస్, భారతి ఎయిర్టెల్, టెక్ మహీంద్రా, ఇండస్ ఇండ్ బ్యాంక్, అదానీ పోర్ట్స్ వంటి కంపెనీలు లాభాల జాబితాలో నిలువగా.. నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (NTPC), హిందూస్తాన్ యూనీలీవర్, హీరో మోటోకార్ప్, కోల్ ఇండియా, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ వంటి కంపెనీలు నష్టాల జాబితాలో చేరాయి.దేశీయ స్టాక్ మార్కెట్లు ఉదయం ఫ్లాట్గా ట్రేడవుతున్నాయి. ఉదయం 9:54 సమయానికి నిఫ్టీ 4 పాయింట్లు లాభపడి 24,646కు చేరింది. సెన్సెక్స్ 53 పాయింట్లు ఎగబాకి 81,591 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్ 106.63 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 73.5 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.28 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో లాభాల్లో ముగిశాయి. ఎస్ అండ్ పీ 0.82 శాతం లాభపడింది. నాస్డాక్ 1.77 శాతం పుంజుకుంది.దేశీయంగా అక్టోబర్ నెలకు సంబంధించి పారిశ్రామికోత్పత్తి సూచీ వివరాలు గురువారం(12న) వెల్లడికానున్నాయి. సెప్టెంబర్లో పారిశ్రామికోత్పత్తి వార్షికంగా 3.1 శాతం పుంజుకుంది. ఆర్థికవేత్తల 2.5 శాతం అంచనాలను అధిగమించింది. ఇదేవిధంగా నవంబర్ నెలకు సంబంధించిన రిటైల్ ధరల ద్రవ్యోల్బణం(సీపీఐ) గణాంకాలు 12న వెలువడనున్నాయి. అక్టోబర్లో సీపీఐ వార్షిక రేటు 6.21 శాతంగా నమోదైంది. ఎఫ్ఐఐలు పెట్టుబడులకు ఆసక్తి చూపడం ట్రేడర్లను ప్రభావితం చేసే వీలున్నట్లు నిపుణులు చెబుతున్నారు.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
స్టాక్ మార్కెట్లో చేయాల్సినవి.. చేయకూడనివి!
స్టాక్ మార్కెట్ను ఎలాంటి కష్టం లేకుండా డబ్బు సంపాదించే మార్గంగా చాలా మంది భావిస్తుంటారు. ఇందులో కొంతవరకు వాస్తవం లేకపోలేదు. కానీ, ఫ్రీగా డబ్బులు రావన్న విషయాన్ని మాత్రం విస్మరించకూడదు. గతంలో స్టాక్ మార్కెట్ లావాదేవీలన్నీ కాగితాల మీదే జరిగేవి. ఒక షేర్ కొనాలన్నా, అమ్మలన్నా పెద్ద తతంగమే ఉండేది. పైగా ఆ షేర్లు మన అకౌంట్లో జమ అయ్యేందుకు రోజులే పట్టేది. కానీ ప్రస్తుతం టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. దాంతో ట్రేడింగ్ చాలా సులువైంది. అరచేతిలో క్షణాల్లో స్టాక్స్ అమ్మడం, కొనడం జరిగిపోతుంది. కానీ గతంలో స్టాక్ మార్కెట్లోకి వచ్చిన వ్యక్తులు డబ్బు పోగుట్టుకున్నా అనుభవం గడించేవారు. ప్రస్తుతం పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి.స్టాక్ మార్కెట్ గ్యాంబ్లింగ్..?ఎవరో చెప్పారని, యూట్యూబ్లో ఏదో వీడియోలు చూశామని స్టాక్స్లో పెట్టుబడి పెట్టి భారీగా నష్టపోతున్నారు. దాంతో మార్కెట్పై నిందలేస్తూ, ఇదో జూదమని, గ్యాంబ్లింగని స్టాక్ మార్కెట్ నుంచి విరమించుకుంటున్నారు. సరైన అవగాహన పెంపొందించుకోకుండా మార్కెట్లోకి ప్రవేశించి చేతులు కాల్చుకుని మార్కెట్ను నిందించడం సరికాదు. మార్కెట్లోకి రావాలనుకునేవారు, ఇప్పటికే వచ్చినవారు ముందుగా అవగాహన పెంచుకోవాలి. కేవలం స్టాక్స్లోనే కాకుండా ఇండెక్స్లు, మ్యుచువల్ ఫండ్స్, ఈటీఎఫ్లు వంటి ఎన్నో మార్గాల్లో పెట్టుబడి పెట్టవచ్చు. స్టాక్స్ కొనాలంటే ఎలాంటి సమయంలో తీసుకోవాలి.. ఎందుకు వాటినే ఎంచుకోవాలి.. వాల్యుయేషన్ల మాటేంటి.. త్రైమాసిక ఫలితాలు ఎలా ఉన్నాయి.. కంపెనీ కాన్ఫరెన్స్కాల్లో ఏం చెబుతున్నారు.. భవిష్యత్తు ప్రణాళికలేంటి.. వంటి ఎన్నో అంశాలను పరిగణించాలి. మార్కెట్లో ఉన్నవారు చేయాల్సిన, చేయకూడని కొన్ని అంశాలను పరిశీలిద్దాం.ఇలా చేయొద్దుఅవగాహన లేనప్పుడు ట్రేడింగ్కు దూరంగా ఉండండి.ఇన్స్టంట్ మనీ కోసం తాపత్రయపడకండి.పెట్టిన గంటలోనో, ఒక రోజులోనో లాభాలు వచ్చేయాలని ఆశించకండి.ట్రేడింగ్లో లాభాలతో పోలిస్తే నష్టపోయేది ఎక్కువ. కాబట్టి దానిపై పూర్తి పరిజ్ఞానం లేకుండా డబ్బులతో ప్రయోగాలు చేయకండి.సామాజిక మాధ్యమాల్లో రకరకాల వ్యక్తులు ఊదరగొట్టే సిఫారసులు చూసి మీ కష్టార్జితంతో చెలగాటమాడుతారు. వారి మాటలు నమ్మకండి.‘మీరు ట్రేడింగ్ చేస్తున్నారా..’ అంటూ ఫోన్ కాల్స్ చేసి మీకు సిఫారసులు అందిస్తాం.. అనేవాళ్లను నమ్మకూడదు.ఏ పని చేసిన మీపై ఆధారపడి కుటుంబం ఉందనే విషయాన్ని మరవకూడదు.ఇదీ చదవండి: ‘వాతావరణ మార్పునకు ఈవీలు పరిష్కారం కాదు’ఇలా చేయండిముందు స్టాక్ మార్కెట్ మీద ఉన్న అపోహలు, భయాలను వదిలేయండి.స్టాక్ మార్కెట్ అంటే నష్టాలు తెచ్చిపెట్టే ఓ జటిల పదార్ధంగా భావించకుండా సిరులు కురిపించే సాధనంగా చూడటం నేర్చుకోండి.మార్కెట్పై అవగాహన పెంచుకోండి.రియల్టైమ్లో పేపర్ట్రేడ్ చేస్తూ క్రమంగా పట్టు సాధించండి.మీ దగ్గర ఎంత డబ్బున్నా ప్రారంభంలో ట్రేడింగ్కు దూరంగా ఉండండి. ఇన్వెస్ట్మెంట్పై దృష్టి పెట్టండి.ట్రేడింగ్ వేరు.. ఇన్వెస్ట్మెంట్ వేరనే విషయాన్ని నిత్యం గుర్తుంచుకోండి.మీ పెట్టుబడును దీర్ఘకాలం కొనసాగించేలా ప్రయత్నించండి.బ్యాంకులో ఎఫ్డీ చేసినపుడు ఏడాది, రెండేళ్లు, ఐదేళ్లు ఎలా వేచిస్తున్నారో..అలాగే మార్కెట్లోనూ ఓపిగ్గా ఉండండి.స్టాక్స్లో పెట్టుబడి పెట్టాలనుకుంటే ఫండమెంటల్స్ బాగున్నా షేర్లను ఎంచుకోండి.తాత్కాలిక ఒడిదొడుకులు ఎదురైనప్పుడు ఈ షేర్లు పడినట్లు కనిపించినా, భవిష్యత్లో ఇవి మంచి రాబడులు అందిస్తాయి.మార్కెట్ పడిన ప్రతిసారీ కొంత మొత్తంలో షేర్స్ కొనేలా ప్లాన్ చేసుకోండి. దానివల్ల మీకంటూ ఒక పోర్ట్ఫోలియో క్రియేట్ అవుతుంది.డిపాజిట్లు వంటి సంప్రదాయ పెట్టుబడులతో పోలిస్తే స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు అధిక రాబడులనే ఇస్తాయి. కానీ సరైన అవగాహనతో ఇన్వెస్ట్ చేయడం ముఖ్యం.- బెహరా శ్రీనివాసరావు, మార్కెట్ విశ్లేషకులు -
ఈ వారం అనిశ్చితులు కొనసాగుతాయా..?
అంతర్జాతీయ పరిణామాలు, దేశీయ గణాంకాలు మార్కెట్లను ఈవారం ప్రభావితం చేయవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. గతవారం తీవ్ర ఒడుదొడుకులకు లోనైన మార్కెట్లు ఈ వారం కూడా అదే రీతిలో ఉన్నా కాస్తా నెమ్మదించవచ్చనే సంకేతాలు కనిపిస్తున్నాయి. మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు వెలువడి వారం గడిచినప్పటికీ ముఖ్యమంత్రి పీఠంపై కొనసాగుతున్న అనిశ్చితి ప్రతికూల సంకేతాలను పంపిస్తోంది. విదేశీ మదుపర్ల అమ్మకాలు పెరుగుతున్నందున మార్కెట్లో ఆటుపోట్లు తప్పవు. జీడీపీ మందగమనంగత వారం చివర్లో జీడీపీ గణాంకాలు వెలువడ్డాయి. ఊహించిన దానికంటే తక్కువ స్థాయిలో ఈ గణాంకాలు నమోదు కావడం మార్కెట్ను నిరుత్సాహపరుచనుంది. జులై-సెప్టెంబర్ త్రైమాసికానికి కేవలం 5.4 శాతం వృద్ధి రేటు మాత్రమే నమోదైంది. అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన 8.1 శాతం వృద్ధితో పోలిస్తే ఇది చాలా తక్కువ. అలాగే మొదటి త్రైమాసికం (ఏప్రిల్-జూన్)లో నమోదైన వృద్ధి రేటు 6.7 శాతంతో పోల్చి చూసినా తక్కువే. ముఖ్యంగా తయారీ రంగంలో వృద్ధి మందగించడం జీడీపీ గణాంకాలను ప్రభావితం చేసింది. ప్రస్తుత అంకెలు అంచనాలకు దూరంగా ఉండటం ఈవారం మార్కెట్పై ప్రభావం చూపిస్తుంది. సోమవారం ప్రారంభంలో మార్కెట్లు నష్టాల్లో ప్రారంభమయ్యే అవకాశం ఉన్నా ముగింపు వరకు కాస్తా కోలుకోవచ్చని అంచనా.ఎఫ్ఐఐల అమ్మకాలు కొనసాగే అవకాశం..అక్టోబర్ నెల ప్రారంభం నుంచి విదేశీ సంస్థాగత మదుపర్లు (ఎఫ్ఐఐ) క్రమంగా మార్కెట్ నుంచి తమ పెట్టుబడిని ఉపసంహరిస్తూనే ఉన్నారు. మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల తర్వాత నికర కొనుగోలుదార్లుగా నిలిచినప్పటికీ అది మూడు రోజులకే పరిమితమైంది. గత వారం చివరి రెండు రోజుల్లో ఏకంగా దాదాపు రూ.16000 కోట్ల షేర్లను అమ్మేశారు. ఎఫ్ఐఐలు ఇంత భారీ స్థాయిలో అమ్మకాలు జరుపుతుండగా మరోపక్క దేశీయ సంస్థాగత మదుపర్లు (డీఐఐ) మాత్రం మార్కెట్కు తమ మద్దతు కొనసాగిస్తూ వస్తున్నారు. ఎఫ్ఐఐల అమ్మకాలు డిసెంబర్లోనూ కొనసాగే అవకాశం ఉంది.అంతర్జాతీయ మార్కెట్లు ఇలా..గత వారాంతాన అమెరికా, యూరప్ మార్కెట్లు లాభాల్లోనే ముగిశాయి. ముఖ్యంగా అమెరికా విషయంలో ట్రంప్ నిర్ణయాలు మార్కెట్లకు కొత్త శక్తినిస్తూ రికార్డుల వైపు పరుగు తీయిస్తున్నాయి. డోజోన్స్, ఎస్ & పీ ఇండెక్స్లు దూసుకెళుతుండగా టెక్నాలజీ స్టాక్స్ ఒత్తిడికి గురవుతున్నాయి. దీని ప్రభావంతో నాస్డాక్ సూచీ పడిపోయేందుకు కారణమవుతుంది. ఇది మన మార్కెట్లలో ఐటీ షేర్లను ప్రభావితం చేస్తోంది. ఈవారం కూడా అమెరికా మార్కెట్లు లాభాలను కొనసాగించే అవకాశం ఉన్నందుకు ఇది కొంతవరకు మన మార్కెట్లకు సానుకూల సంకేతాలను పంపొచ్చు.ఇదీ చదవండి: ‘మీరు ముసలాడవ్వకూడదు’సాంకేతిక స్థాయులుసెన్సెక్స్, నిఫ్టీల్లో ఒడిదొడుకులు కొనసాగుతాయి. నిఫ్టీ గతవారం 24130 పాయింట్ల వద్ద ముగిసింది. ఇది ఒక రకంగా అమ్మకాల స్థాయిని సూచిస్తోంది. సోమవారం నిఫ్టీ తొలి గంటలో 24150 స్థాయికి దిగువన ట్రేడ్ అయితే అమ్మకాల ఉద్ధృతి మరింత పెరుగుతుంది. ఇదే కొనసాగితే ఈవారం నిఫ్టీ 23800 మార్కును చేరవచ్చు. దాన్ని కూడా బ్రేక్ చేస్తే తదుపరి మద్దతు స్థాయి 23300కు పడిపోయే అవకాశం ఉంది.- బెహరాశ్రీనివాసరావుమార్కెట్ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్ట్ -
భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
శుక్రవారం ఉదయం లాభాల బాటపట్టిన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి భారీ లాభాలను చవి చూశాయి. సెన్సెక్స్ 1,820.19 పాయింట్లు లేదా 2.36 శాతం పెరిగి 78,975.98 వద్ద, నిఫ్టీ 525.70 పాయింట్లు లేదా 2.25 శాతం పెరిగి 23,875.60 వద్ద నిలిచాయి.స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), టైటాన్ కంపెనీ, టాటా కన్సెల్టెన్సీ సర్వీసెస్ (TCS), జేఎస్డబ్ల్యు స్టీల్, అల్ట్రాటెక్ సిమెంట్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలోకి చేరాయి. బజాజ్ ఆటో, వోడాఫోన్ ఐడియా, ఫెడరల్ బ్యాంక్, పీఐ ఇండస్ట్రీస్ వంటి కంపెనీలు నష్టాలను చవి చూశాయి. నిన్న (నవంబర్ 21) భారీ నష్టాలను చవి చూసిన అదానీ సంస్థలు మళ్ళీ లాభాల్లో పయనించాయి.దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం ఉదయం లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:27 సమయానికి నిఫ్టీ 154 పాయింట్లు లాభపడి 23,491కు చేరింది. సెన్సెక్స్ 443 పాయింట్లు ఎగబాకి 77,596 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్ 107.07 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 74.4 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.42 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో లాభాల్లో ముగిశాయి. ఎస్ అండ్ పీ 0.5 శాతం పెరిగింది. నాస్డాక్ 0.03 శాతం పుంజుకుంది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
6:15 గంటల్లో రూ.5 లక్షల కోట్లు ఆవిరి!
దేశీయ స్టాక్మార్కెట్లు బుధవారం నష్టాలతో ముగిసాయి. మార్కెట్లు ముగిసే సమయానికి నిఫ్టీ 324 పాయింట్లు నష్టపోయి 23,559 వద్దకు చేరింది. సెన్సెక్స్ 984 పాయింట్లు దిగజారి 77,690 వద్ద ముగిసింది. దాంతో ఈక్విటీ మార్కెట్లో ఒక్కరోజే దాదాపు రూ.5 లక్షల కోట్ల మేర సంపద ఆవిరైంది.విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు(ఎఫ్పీఐ) ఇటీవల దేశీయ ఈక్విటీ మార్కెట్ల నుంచి భారీగా తమ ఇన్వెస్ట్మెంట్లను ఉపసంహరించుకుంటున్నారు. ఈ నెల ప్రారంభం నుంచి రోజూ సరాసరి రూ.4వేల కోట్ల విలువైన షేర్లను విక్రయిస్తున్నారు. దాంతో మార్కెట్లు నష్టాల్లో ముగుస్తున్నాయని కొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఫెడరల్ రిజర్వ్ మానిటరీ పాలసీ మీటింగ్లో భాగంగా 25 బేసిస్ పాయింట్లు కీలక వడ్డీరేట్లలో కోత విధించింది. అయితే శుక్రవారం ఫెడ్ ఛైర్మన్ జెరొమ్ పావెల్ యూఎస్ ఆర్థిక వ్యవస్థను ఉద్దేశించి ఫెడ్ మినట్స్ మీటింగ్లో ప్రసంగించనున్నారు.ఇదీ చదవండి: నాలుగేళ్లలో 45.7 కోట్లకు శ్రామికశక్తిసెన్సెక్స్ 30 సూచీలో టాటా మోటార్స్. ఎన్టీపీసీ, ఏషియన్ పెయింట్స్, ఇన్ఫోసిస్ కంపెనీ స్టాక్లు లాభాల్లోకి చేరుకున్నాయి. ఎం అండ్ ఎం, టాటా స్టీల్, అదానీ పోర్ట్స్ అండ్ సెజ్, జేఎస్డబ్ల్యూ స్టీల్, ఇండస్ఇండ్ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్, కోటక్ మహీంద్రా బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఎస్బీఐ, బజాజ్ ఫిన్సర్వ్ కంపెనీ షేర్లు భారీ నష్టాల్లోకి జారుకున్నాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
ఒకే రోజు రూ.4.3 లక్షల కోట్లు ఆవిరి!
దేశీయ స్టాక్మార్కెట్లు మంగళవారం నష్టాలతో ముగిసాయి. మార్కెట్ ప్రారంభంలో కాసేపు లాభాల్లో కదలాడిన సూచీలు ముగింపు సమయానికి భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి. మార్కెట్లు ముగిసే సమయానికి నిఫ్టీ 257 పాయింట్లు నష్టపోయి 23,883 వద్దకు చేరింది. సెన్సెక్స్ 820 పాయింట్లు దిగజారి 78,675 వద్ద ముగిసింది. దాంతో ఈక్విటీ మార్కెట్లో ఒక్కరోజే దాదాపు రూ.4.3 లక్షల కోట్ల మేర సంపద ఆవిరైంది.విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు ఇటీవల దేశీయ ఈక్విటీ మార్కెట్ల నుంచి భారీగా తమ ఇన్వెస్ట్మెంట్లను ఉపసంహరించుకుంటున్నారు. దాంతో మార్కెట్లు నష్టాల్లో ముగుస్తున్నాయని కొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు పెరుగుతున్నాయి. ఫెడరల్ రిజర్వ్ మానిటరీ పాలసీ మీటింగ్లో భాగంగా 25 బేసిస్ పాయింట్లు కీలక వడ్డీరేట్లలో కోత విధించింది. అయితే శుక్రవారం ఫెడ్ ఛైర్మన్ జెరొమ్ పావెల్ యూఎస్ ఆర్థిక వ్యవస్థను ఉద్దేశించి ఫెడ్ మినట్స్ మీటింగ్లో ప్రసంగించనున్నారు.సెన్సెక్స్ 30 సూచీలో ఇన్ఫోసిస్, సన్ ఫార్మా, హెచ్సీఎల్ టెక్నాలజీస్, ఐసీఐసీఐ బ్యాంక్ కంపెనీ స్టాక్లు లాభాల్లోకి చేరుకున్నాయి. ఎన్టీపీసీ, ఏషియన్ పెయింట్స్, ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, టాటా మోటార్స్, మారుతీ సుజుకీ, జేఎస్డబ్ల్యూ స్టీల్, పవర్గ్రిడ్, బజాజ్ ఫైనాన్స్, అదానీ పోర్ట్స్ అండ్ సెజ్, ఎం అండ్ ఎం, బజాజ్ ఫిన్సర్వ్ వంటి కంపెనీ షేర్లు భారీ నష్టాల్లోకి జారుకున్నాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
బేర్ ఎటాక్..!
దేశీయ స్టాక్ మార్కెట్లలో సోమవారం అమ్మకాలు వెల్లువెత్తడంతో సూచీలు భారీగా నష్టపోయాయి. బెంచ్మార్క్ ఇండెక్స్లు సెన్సెక్స్, నిఫ్టీ ఒక శాతానికి పైగా పతనమయ్యాయి. సెన్సెక్స్ 942 పాయింట్లు క్షీణించి 78,782 వద్ద స్థిరపడగా... నిఫ్టీ 309 పాయింట్లు నష్టపోయి 24 వేల దిగువన 23,995 వద్ద నిలిచింది. ముగింపు స్థాయిలు మూడు నెలల కనిష్టం కావడం గమనార్హం. ఉదయం స్తబ్ధుగా మొదలైన సూచీలు అంతర్జాతీయ మార్కెట్లోని ప్రతికూల సంకేతాలతో నష్టాల బాటపట్టాయి. ఇన్వెస్టర్లు అమ్మకాలకే మొగ్గుచూపడంతో ట్రేడింగ్ గడిచే కొద్ది నష్టాల తీవ్రత మరింత పెరిగింది. ఒక దశలో సెన్సెక్స్ 1,492 పాయింట్లు క్షీణించి 78,233 వద్ద, నిఫ్టీ 488 పాయింట్లు పతనమై 23,816 వద్ద కనిష్టాలు తాకాయి. ట్రేడింగ్ చివర్లో కనిష్ట స్థాయిల వద్ద పలు షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో సూచీలు కొంతమేర నష్టాలు భర్తీ చేసుకోగలిగాయి. కొన్ని రియల్టీ రంగ షేర్లు 5–6 శాతం వరకూ పతనం కాగా... ప్రైవేటు రంగ బ్యాంకు, ఆయిల్ అండ్ గ్యాస్ రంగాల షేర్లు 3–6 శాతం నష్టపోయాయి. అన్ని రంగాల షేర్లలోనూ అమ్మకాలేఇంట్రాడేలో అన్ని రంగాల షేర్లలోనూ విక్రయాలు వెల్లువెత్తాయి. అత్యధికంగా రియల్టీ ఇండెక్స్ 3% క్షీణించింది. ఆయిల్అండ్గ్యాస్, ఇంధన సూచీలు 2.50% పడ్డాయి. టెలికమ్యూనికేషన్, విద్యుత్, కమోడిటీ షేర్లు 1.50% నష్టపోయాయి. వాస్తవానికి చిన్న, మధ్య తరహా షేర్లు తీవ్ర అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. బీఎస్ఈ స్మాల్క్యాప్ సూచీ ఏకంగా 2% పతనమైంది. మిడ్క్యాప్ ఇండెక్స్ 1.50% నష్టపోయింది.ఆసియాలో చైనా, హాంగ్కాంగ్ సూచీలు మినహా అన్ని దేశాల ఇండెక్సులు నష్టపోయాయి. 1% నుంచి అరశాతం నుంచి పతనమయ్యాయి. యూరప్లో ఫ్రాన్స్, జర్మనీ సూచీలు పావుశాతం నష్టపోయాయి. అమెరికా సూచీలు బలహీనంగా ట్రేడవుతున్నాయి.సెన్సెక్స్ 942 పాయింట్ల పతనంతో ఇన్వెస్టర్ల సంపద గురువారం ఒక్కరోజే రూ. 5.99 లక్షల కోట్లు ఆవిరైంది. బీఎస్ఈ మార్కెట్ విలువ రూ.421 లక్షల కోట్లకు దిగివచ్చింది. రిలయన్స్ 3%, అదానీ పోర్ట్స్ 3%, సన్ఫార్మా 2.60%, ఎన్టీపీసీ 2.50%, బజాజ్ ఫిన్సర్వ్ 2.45%, యాక్సిస్ బ్యాంకు 2.40 నష్టపోయాయి. అక్టోబర్ వాహన అమ్మకాలు అంతంత మాత్రంగానే ఉండడంతో బజాజ్ ఆటో, హీరో మోటోకార్ప్ షేర్లు 3–4% చొప్పున నష్టపోయాయి. ఎదురీదిన ఆఫ్కాన్స్ ఇన్ఫ్రా షేరు ఆఫ్కాన్స్ ఇన్ఫ్రా షేరు ఎదురీదింది. బీఎస్ఈలో ఇష్యూ ధర (రూ.463)తో పోలిస్తే 7% డిస్కౌంటుతో రూ.430 వద్ద లిస్టయ్యింది. ఇంట్రాడేలో 9% క్షీణించి రూ.420 వద్ద కనిష్టాన్ని తాకింది. అయితే ట్రేడింగ్ చివర్లో రికవరీతో 2.50% లాభపడి రూ.475 వద్ద స్థిరపడింది.ఇదీ చదవండి: స్విగ్గీకి రూ.35,453 జరిమానా!నష్టాలు ఎందుకంటే..?అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నికలు, ఫెడరల్ రిజర్వ్ బ్యాంకు ద్రవ్య పరపతి సమావేశాల(6–7 తేదీల్లో) నేపథ్యంలో ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరించారు. బీజింగ్లో జరుగుతున్న నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ సందర్భంగా చైనా మరో ఆర్థిక ప్యాకేజీ ప్రకటించవచ్చనే వార్తలు వెలుగులోకి వచ్చాయి. చమురు ఉత్పత్తి పెంచాలనే నిర్ణయాన్ని ఓపెక్ వాయిదా వేసుకోవడంతో క్రూడాయిల్ ధరలు 2% పెరిగాయి. సెపె్టంబర్ త్రైమాసిక ఆర్థిక ఫలితాలు నిరాశపరిచేలా ఉండటంతో విదేశీ ఇన్వెస్టర్ల విక్రయాల పరంపర కొనసాగుతోంది. -
ఒక్కరోజులో రూ.7.5 లక్షల కోట్లు ఆవిరి.. కారణాలు..
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం భారీగా పడుతున్నాయి. ఉదయం 11:25 నిమిషాల సమయం వరకు ఏకంగా సుమారు రూ.7.5 లక్షల కోట్ల ముదుపర్ల సంపద ఆవిరైనట్లు తెలిసింది. మార్కెట్లు పడిపోతుండడంపై నిపుణులు కొన్ని అంతర్జాతీయ అంశాలు కారణమని విశ్లేషిస్తున్నారు. వాటి గురించి తెలుసుకుందాం.అమెరికా ఎన్నికలుఅమెరికా అధ్యక్ష ఎన్నికలు రేపు(మంగళవారం 5న) జరగనున్నాయి. గతంలో ప్రెసిడెంట్గా పనిచేసిన రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్, డెమొక్రటిక్ అభ్యర్ధిని కమలా హారిస్ హోరాహోరీగా తలపడుతున్నారు. అభ్యర్ధులు విభిన్న పాలసీలకు ప్రాధాన్యత ఇవ్వనున్న నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా తాజా ఎన్నికలకు ప్రాధాన్యత ఏర్పడింది.యూఎస్ ఫెడ్ సమావేశంమరోపక్క ప్రపంచ ఫైనాన్షియల్ మార్కెట్లను ప్రభావితం చేయగల యూఎస్ కేంద్ర బ్యాంకు ఫెడరల్ రిజర్వ్ పాలసీ సమీక్షను చేపట్టనుంది. వెరసి ఈ వారం దేశీ స్టాక్ మార్కెట్లలో ట్రెండ్ను ప్రధానంగా విదేశీ అంశాలే నిర్ధేశించనున్నాయి. ఫెడ్ ఛైర్మన్ జెరోమ్ పావెల్ అధ్యక్షతన ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ(ఎఫ్వోఎంసీ) బుధ, గురువారాల్లో(6–7వ తేదీన) మానిటరీ పాలసీ సమీక్షా సమావేశాన్ని నిర్వహించనున్నాయి. 7న యూఎస్ ఆర్థిక వ్యవస్థ తీరు, ద్రవ్యోల్బణ పరిస్థితుల ఆధారంగా వడ్డీ రేట్ల నిర్ణయాలు ప్రకటించనుంది. సెప్టెంబర్ ద్రవ్యోల్బణం(2.4 శాతం), అక్టోబర్ ఉపాధి గణాంకాల ఆధారంగా వడ్డీ రేట్లలో సవరణలకు తెరతీయనుంది. గత సమావేశంలో నాలుగేళ్ల తదుపరి ఎఫ్వోఎంసీ తొలిసారి 0.5 శాతం తగ్గింపును ప్రకటించింది. ఫలితంగా ప్రస్తుతం ఫెడ్ ఫండ్స్ రేట్లు 4.75–5 శాతంగా అమలవుతున్నాయి.క్యూ2 ఫలితాలుఇప్పటికే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక(జులై–సెప్టెంబర్) ఫలితాల సీజన్ వేడెక్కింది. పలు దిగ్గజాలు పనితీరును వెల్లడిస్తున్నాయి. కానీ ఆశించిన ఫలితాలు రాకపోవడంతో మార్కెట్లు కింది చూపులు చూస్తున్నాయి. ఈ వారం ఫలితాలు ప్రకటించనున్న దిగ్గజాల జాబితాలో డాక్టర్ రెడ్డీస్, టైటన్, టాటా స్టీల్, మహీంద్రా అండ్ మహీంద్రా, టాటా మోటార్స్ తదితరాలున్నాయి. దేశీయంగా తయారీ, సర్వీసుల రంగ పీఎంఐ గణాంకాలు సైతం వెలువడనున్నాయి. దేశ, విదేశీ గణాంకాలను ఈ వారం స్టాక్ ఇన్వెస్టర్లు నిశితంగా పరిశీలించనున్నాయి.ఇదీ చదవండి: కంపెనీలకు ధర దడ.. రేట్లు పెంపు?ఎఫ్పీఐల అమ్మకాల రికార్డ్దేశీ స్టాక్స్లో ఉన్నట్టుండి గత నెలలో అమ్మకాల యూటర్న్ తీసుకున్న విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐలు) కొత్త చరిత్రకు తెరతీశారు. అక్టోబర్లో నికరంగా రూ.94,000 కోట్ల(11.2 బిలియన్ డాలర్లు) పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. నెలవారీగా దేశీ స్టాక్ మార్కెట్లలో ఇవి అత్యధిక అమ్మకాలుకాగా..కొవిడ్–19 ప్రభావంతో ఇంతక్రితం 2020 మార్చిలో ఎఫ్పీఐలు రూ.61,973 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించారు. దేశీయంగా ఒక నెలలో ఇవి అత్యధిక విక్రయాలుగా నమోదయ్యాయి. ఎఫ్పీఐలు సెప్టెంబర్లో రూ.57,724 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేశారు. ఇవి గత 9 నెలల్లోనే గరిష్టంకావడం గమనార్హం. అయితే చైనాలో ఆకర్షణీయ ఈక్విటీ విలువలు, ప్రభుత్వ సహాయక ప్యాకేజీలు ఎఫ్పీఐలను అమ్మకాలవైపు ఆకర్షిస్తున్నట్లు స్టాక్ నిపుణులు తెలియజేశారు. -
ఐటీ షేర్ల దెబ్బ.. సంవత్ చివరిరోజూ నష్టాలే!
బెంచ్మార్క్ ఈక్విటీ సూచీలు బీఎస్ఈ సెన్సెక్స్, ఎన్ఎస్ఈ నిఫ్టీ 50, గురువారం వరుసగా రెండో సెషన్లోనూ ప్రతికూలంగా ముగిశాయి. ఇది సంవత్ 2080 చివరి ట్రేడింగ్ సెషన్. బీఎస్ఈ సెన్సెక్స్ 553.12 పాయింట్లు లేదా 0.69 శాతం క్షీణించి 79,389.06 వద్ద స్థిరపడింది. నిఫ్టీ కూడా అదే దారిలో 135.50 పాయింట్లు లేదా 0.56 శాతం క్షీణించి 24,205.35 వద్ద ముగిసింది. దీంతో సంవత్ 2080లో సెన్సెక్స్ 22.31 శాతం లాభపడగా, నిఫ్టీ 26.40 శాతంగా ఉంది.50 షేర్లలో 34 నష్టాల్లో ముగియడంతో ప్రస్తుత సంవత్ చివరి ట్రేడింగ్ సెషన్ 3.61 శాతం చొప్పున నష్టాలను చవిచూసింది. హెచ్సీఎల్ టెక్, టెక్ మహీంద్రా, టీసీఎస్, ఇన్ఫోసిస్, ఏషియన్ పెయింట్స్ టాప్ లూజర్స్ జాబితాలో ఉన్నాయి. దీనికి విరుద్ధంగా, సిప్లా, లార్సెన్ & టూబ్రో, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, ఓన్జీసీ, మహీంద్రా & మహీంద్రా టాప్ గెయినర్స్గా నిలిచాయి.కాగా శుక్రవారం దీపావళి సందర్భంగా బీఎస్ఈ, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE)లతోపాటు మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX) సాధారణ ట్రేడింగ్ సెషన్కు బదులుగా ముహూర్తం ట్రేడింగ్ సెషన్ను నిర్వహిస్తాయి. శుక్రవారం సాయంత్రం 6-7 గంటల వరకు గంటసేపు సెషన్ జరగనుంది. దీంతో సంవత్ 2081 ప్రారంభం కానుంది. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
పండగవేళ నష్టాల్లో స్టాక్మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం ఉదయం నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:30 సమయానికి నిఫ్టీ 66 పాయింట్లు తగ్గి 24,272కు చేరింది. సెన్సెక్స్ 251 పాయింట్లు నష్టపోయి 79,681 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్ 104.1 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 72.5 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.29 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో నష్టాల్లో ముగిశాయి. ఎస్ అండ్ పీ 0.33 శాతం నష్టపోయింది. నాస్డాక్ 0.56 శాతం దిగజారింది.ఇదీ చదవండి: ‘పర్యావరణం కోసం వాటికి నేను దూరం’యూఎస్ అధ్యక్ష ఎన్నికలకు ముందు ప్రపంచవ్యాప్తంగా ట్రేడర్లు అప్రమత్తంగా వ్యవహరించనున్నట్లు నిపుణులు చెబుతున్నారు. ఎఫ్ఐఐలు నిత్యం వేలకోట్ల రూపాయల విలువ చేసే షేర్లు విక్రయిస్తున్నారు. కొన్ని రేటింగ్ ఏజెన్సీలు సమీప భవిష్యత్తులో భారత ఆర్థిక వృద్ధి రేటు 6.5-7 శాతంగా ఉంటుందని అంచనా వేస్తున్నాయి. మ్యూచవల్ ఫండ్స్ వద్ద ఉన్న రిటైల్ ఇన్వెస్టర్ల డబ్బు క్రమంగా తగ్గిపోతుంది. ఒకవేళ రానున్న రోజుల్లో ఎఫ్ఐఐలు మరింతగా విక్రయిస్తే కొనుగోలు చేసేందుకు ఏఎంసీల వద్ద సరిపడా డబ్బు ఉండకపోవచ్చనే వాదనలున్నాయి. కానీ ఈ తాత్కాలిక పరిణామాలకు భయపడి విక్రయాలు అమ్మకాలు చేయకుండా మంచి కంపెనీ స్టాక్లను హోల్డ్ చేస్తున్న ఇన్వెస్టర్లు దీర్ఘకాలంలో మెరుగైన లాభాలు పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
ఫ్లాట్గా కదలాడుతున్న స్టాక్మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం ఉదయం ఫ్లాట్గా ట్రేడవుతున్నాయి. ఉదయం 9:48 సమయానికి నిఫ్టీ 21 పాయింట్లు పెరిగి 24,201కు చేరింది. సెన్సెక్స్ 213 పాయింట్లు నష్టపోయి 79,616 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్ 104.24 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 76 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.24 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో ఫ్లాట్గా ముగిశాయి. ఎస్ అండ్ పీ 0.03 శాతం నష్టపోయింది. నాస్డాక్ 0.6 శాతం లాభపడింది.ఇదీ చదవండి: క్విక్ కామర్స్లోకి టాటా గ్రూప్?దేశీయ ఈక్విటీ మార్కెట్లపై ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధ పరిస్థితులు, ముడిచమురు ధరలు కీలకంగా నిలవనున్నట్లు మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. వీటికితోడు ఎఫ్పీఐల తీరు, క్యూ2 ఫలితాలకూ ప్రాధాన్యత ఉన్నట్లు తెలియజేస్తున్నారు. యూఎస్ అధ్యక్ష ఎన్నికలకు ముందు ప్రపంచవ్యాప్తంగా ట్రేడర్లు అప్రమత్తంగా వ్యవహరించనున్నట్లు చెబుతున్నారు. ఈ వారం యూఎస్ క్యూ3(జులై–సెప్టెంబర్) జీడీపీ గణాంకాలు, సెప్టెంబర్ ఉపాధి రిపోర్ట్, చైనా తయారీ రంగ డేటాతోపాటు.. యూఎస్ పీసీఈ ధరలు వెల్లడికానున్నాయి. ఇవి ఫెడరల్ రిజర్వ్ ద్రవ్యోల్బణ అంచనాలపై ప్రభావం చూపుతాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
‘అలాంటివారిని ఇప్పటి వరకు చూడలేదు’
దేశీయ స్టాక్మార్కెట్లు ఇటీవల భారీగా పడిపోతున్న నేపథ్యంలో స్టాక్ బ్రోకింగ్ సంస్థ జెరోధా వ్యవస్థాపకుడు నితిన్ కామత్ మదుపర్లకు సలహా ఇచ్చారు. సరైన రిస్క్ మేనేజ్మెంట్తోనే స్టాక్ మార్కెట్లో లాభాలు పొందవచ్చన్నారు. మార్కెట్ ట్రెండ్కు తగిన వ్యూహం అనుసరించని వారు త్వరగా నష్టపోతారని చెప్పారు. ఈ సందర్భంగా ఆయన తన ట్విటర్లో కొన్ని అంశాలను పంచుకున్నారు.‘ఈక్విటీ మార్కెట్లో దాదాపు 20 ఏళ్ల అనుభవం ఉంది. సరైన రిస్క్ మేనేజ్మెంట్ లేనివారు లాభాలు ఆర్జించడం ఇప్పటివరకు చూడలేదు. మార్కెట్ ట్రేండ్కు తగిన ప్రణాళిక లేకుండా ట్రేడింగ్ చేసేవారు త్వరగా నష్టాల్లోకి వెళుతారు. మార్కెట్ రిస్క్లకు తగిన విధంగా పోర్ట్ఫోలియోను నిర్వహించాలి. లేదంటే డబ్బు సంపాదించడం కష్టం. రిస్క్ తక్కువగా తీసుకుంటే రిటర్న్లు కూడా అందుకు అనుగుణంగానే తక్కువ ఉంటాయి. అలాగని ఎక్కువ రిస్క్ తీసుకోవడం ప్రమాదం. కొన్నిసార్లు మొత్తం డబ్బు నష్టపోవాల్సి వస్తుంది. కాబట్టి రిస్క్ నిర్వహణ చాలా ముఖ్యం. పోర్ట్ఫోలియో ఆధారంగా రిస్క్ మేనేజ్మెంట్ ఉండాలి. ఇది ట్రేడర్, ఇన్వెస్టర్ క్రమశిక్షణపై ఆధారపడి ఉంటుంది’ అని కామత్ అన్నారు.In the 20+ years in this business, I haven’t seen anyone who has kept profits from trading without good risk management. I know many who've lost quickly. If you don't have a plan to manage risk and size your bets, it's impossible to keep the money you make.Here are a few…— Nithin Kamath (@Nithin0dha) October 23, 2024ఇదీ చదవండి: బీఎస్ఎన్ఎల్ కస్టమర్ల సంఖ్య పెంపు.. ఎంతంటే..అంతర్జాతీయ అనిశ్చితులు, అమెరికా ఎన్నికలు, పెరుగుతున్న ఎఫ్ఐఐ అమ్మకాలు వెరసి స్టాక్ మార్కెట్లు ఇటీవల భారీగా నష్టపోతున్నాయి. దీర్ఘకాలంలో రాబడులు ఆశించే ఇన్వెస్టర్లకు ఇలా మార్కెట్లు నష్టపోతుండడం మంచి అవకాశంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి సందర్భాల్లో మరిన్ని ఎక్కువ స్టాక్లు తక్కువ ధరకే లభించే అవకాశం ఉందని సూచిస్తున్నారు. -
ఫ్లాట్గా ట్రేడవుతున్న స్టాక్మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం ఉదయం ఫ్లాట్గా ట్రేడవుతున్నాయి. ఉదయం 9:16 సమయానికి నిఫ్టీ 22 పాయింట్లు తగ్గి 24,441కు చేరింది. సెన్సెక్స్ 63 పాయింట్లు నష్టపోయి 80,144 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్ 104.1 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 75.7 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.2 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో ఫ్లాట్గా ముగిశాయి. ఎస్ అండ్ పీ 0.05 శాతం నష్టపోయింది. నాస్డాక్ 0.18 శాతం లాభపడింది.ఇదీ చదవండి: రిలయన్స్, వాల్ట్ డిస్నీ డీల్కు ఆమోదం.. షరతులివే..కార్పొరేట్ కంపెనీల సెప్టెంబర్ త్రైమాసిక ఆర్థిక ఫలితాలు నిరాశపరచడంతో విదేశీ ఇన్వెస్టర్ల విక్రయాలు కొనసాగుతున్నాయి. తాజాగా ఇజ్రాయెల్పై హెజ్బొల్లా క్షిపణి దాడులతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తీవ్రతరమయ్యాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్..నవంబర్లో పావుశాతం మేరకే వడ్డీరేట్లను తగ్గించవచ్చనే అంచనాలున్నాయి. అమెరికా పదేళ్ల బాండ్లపై రాబడులు 3 నెలల గరిష్టానికి (4.21%), డాలర్ ఇండెక్సు 104.1 స్థాయికి చేరుకున్నాయి. ఇవన్నీ అంతర్జాతీయ మార్కెట్లలో బలహీన ధోరణులకు కారణమయ్యాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
గ్రీన్లో కదలాడుతున్న స్టాక్మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం ఉదయం లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:41 సమయానికి నిఫ్టీ 40 పాయింట్లు పెరిగి 24,821కు చేరింది. సెన్సెక్స్ 145 పాయింట్లు లాభపడి 81,314 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్ 104.01 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 74 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.19 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో ఫ్లాట్గా ముగిశాయి. ఎస్ అండ్ పీ 0.18 శాతం నష్టపోయింది. నాస్డాక్ 0.27 శాతం లాభపడింది.ఇదీ చదవండి: 2030 నాటికి రూ.32 లక్షల కోట్లు అవసరంఇరాన్-ఇజ్రాయెల్ మధ్య దాడుల కారణంగా ఇటీవల భారీగా పడిన మార్కెట్లు మంగళవారం లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఇరాన్ ఆయిల్ రిఫైనరీలపై దాడి చేయబోమని ఇజ్రాయెల్ ప్రకటించడంతో క్రూడాయిల్ ధరలు మళ్లీ తగ్గుతున్నాయి. ఇది ఒకింత సానుకూలాంశమే. కానీ అక్టోబర్ నెల ప్రారంభం నుంచి ఇప్పటివరకు ఎఫ్ఐఐలు భారీ ఇండియన్ ఈక్విటీ మార్కెట్ నుంచి షేర్లు అమ్ముతున్నారు. దాంతో మార్కెట్లు పతనమవుతున్నాయి. దానికితోడు నవంబర్ మొదటి వారంలో అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఉండడంతో మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్మార్కెట్లు సోమవారం నష్టాలతో ముగిసాయి. మార్కెట్లు ముగిసే సమయానికి నిఫ్టీ 72 పాయింట్లు తగ్గి 24,781 వద్దకు చేరింది. సెన్సెక్స్ 73 పాయింట్లు దిగజారి 81,151 వద్ద ముగిసింది.మదుపర్లు లాభాలు స్వీకరించడం, అంతర్జాతీయ మార్కెట్ల ట్రెండ్ ఈరోజు దేశీయ స్టాక్మార్కెట్ను నడిపించాయని నిపుణులు తెలియజేస్తున్నారు. విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు ఇటీవల దేశీయ ఈక్విటీ మార్కెట్ల నుంచి భారీగా తన ఇన్వెస్ట్మెంట్లను ఉపసంహరించుకుంటున్నారు. దాంతో మార్కెట్లు నష్టాల్లో ముగుస్తున్నాయి. చైనా మార్కెట్లో ప్రభుత్వ నిర్ణయాలు కొంత అంతర్జాతీయ మార్కెట్లకు ఆశాజనకంగా కనిపిస్తున్నాయి. రానున్న యూఎస్ ఎన్నికలు కూడా మార్కెట్ను ప్రభావితం చేస్తున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు.ఇదీ చదవండి: అమ్మో ఏఐ.. ఉద్యోగాలు ఊడుతున్నాయ్!సెన్సెక్స్ 30 సూచీలో హెచ్డీఎఫ్సీ బ్యాంకు, ఏషియన్ పెయింట్స్, ఎం అండ్ ఎం, రిలయన్స్ ఇండస్ట్రీస్, మారుతీ సుజుకీ, టెక్ మహీంద్రా, నెస్లే, ఎల్ అండ్ టీ కంపెనీ స్టాక్లు లాభాల్లోకి చేరుకున్నాయి. కోటక్ మహీంద్రా బ్యాంక్, బజాజ్ ఫిన్సర్వ్, ఇండస్ఇండ్ బ్యాంక్, అదానీ పోర్ట్స్ అండ్ సెజ్, బజాజ్ ఫైనాన్స్, ఆల్ట్రాటెక్ సిమెంట్, ఇన్ఫోసిస్, టీసీఎస్, భారతీ ఎయిర్టెల్, హెచ్యూఎల్, జేఎస్డబ్ల్యూ స్టీల్, ఎస్బీఐ, హెచ్సీఎల్ టెక్నాలజీస్, టాటా మోటార్స్, సన్ఫార్మా కంపెనీ షేర్లు నష్టాల్లోకి జారుకున్నాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
లాభాల్లో ప్రారంభమైన మార్కెట్లు
భారతీయ బెంచ్మార్క్ సూచీలు బీఎస్ఈ సెన్సెక్స్, నిఫ్టీ 50 సోమవారం అధిక స్థాయిలో ప్రారంభమయ్యాయి.ప్రారంభ సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ 420 పాయింట్లు లేదా 0.52 శాతం పెరిగి 81,645 వద్ద, నిఫ్టీ 50 108 పాయింట్లు లేదా 0.44 శాతం పెరిగి 24,962 వద్ద పయనిస్తున్నాయి.హెచ్డీఎఫ్సీ బ్యాంక్, టెక్ మహీంద్రా, హెచ్డీఎఫ్సీ లైఫ్, ఏషియన్ పెయింట్స్, విప్రో టాప్ గెయినర్స్గా లాభాల్లో కొనసాగుతున్నాయి. మరోవైపు టాటా కన్య్సూమర్ ప్రొడక్ట్స్, కొటక్ మహీంద్రా, బీపీసీఎల్, భారతీ ఎయిర్టెల్, ఇండస్ఇండ్ బ్యాంక్ టాప్ లూజర్స్గా భారీ నష్టాల్లో చలిస్తున్నాయి.కాగా సోమవారం ఉదయం చైనా సెంట్రల్ బ్యాంక్ ప్రకటించిన రేటు తగ్గింపును ట్రేడర్లు అంచనా వేయడంతో ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో మార్కెట్లు స్వల్పంగా పెరిగాయి. పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా ఒక సంవత్సరం రుణ ప్రైమ్ రేటుని 25 బేసిస్ పాయింట్లు తగ్గించి 3.1 శాతానికి తగ్గిస్తున్నట్లు తెలిపింది. అయితే ఐదేళ్ల ఎల్పీఆర్ 3.6 శాతానికి తగ్గింది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
పతనమవుతున్న స్టాక్మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం ఉదయం నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:33 సమయానికి నిఫ్టీ 114 పాయింట్లు తగ్గి 24,635కు చేరింది. సెన్సెక్స్ 427 పాయింట్లు నష్టపోయి 80,573 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్ 103.5 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 74.7 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.09 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో ఫ్లాట్గా ముగిశాయి. ఎస్ అండ్ పీ 0.02 శాతం నష్టపోయింది. నాస్డాక్ 0.04 శాతం లాభపడింది.ఇదీ చదవండి: విదేశాలకు వెళ్తున్నారా? ఈ పాలసీ మీ కోసమే..ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య దాడుల కారణంగా ఇటీవల భారీగా పడిన మార్కెట్లు క్రమంగా పుంజుకున్నాయి. గడిచిన రెండు రోజుల నుంచి తిరిగి మార్కెట్లు భారీగా పతనమవుతున్నాయి. ఇరాన్ ఆయిల్ రిఫైనరీలపై దాడి చేయబోమని ఇజ్రాయెల్ ప్రకటించడంతో క్రూడాయిల్ ధరలు మళ్లీ తగ్గుతున్నాయి. ఇది ఒకింత సానుకూలాంశమే. కానీ అక్టోబర్ నెల ప్రారంభం నుంచి ఇప్పటివరకు ఎఫ్ఐఐలు భారీ ఇండియన్ ఈక్విటీ మార్కెట్ నుంచి షేర్లు అమ్ముతున్నారు. దాంతో మార్కెట్లు పతనమవుతున్నాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
మార్కెట్ల తిరోగమనం.. నష్టాల్లో ముగింపు
దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం నష్టాల్లో ముగిశాయి. బెంచ్మార్క్ ఈక్విటీ సూచీలు బీఎస్ఈ సెన్సెక్స్, ఎన్ఎస్ఈ నిఫ్టీ 50 ప్రారంభ లాభాలను కోల్పోయి ప్రతికూలంగా తిరోగమించాయి. సెన్సెక్స్ 167.71 పాయింట్లు లేదా 0.21 శాతం నష్టపోయి 81,467.10 వద్ద స్థిరపడింది. ఈ ఇండెక్స్ ఈరోజు 82,319.21 - 81,342.89 స్థాయిల శ్రేణిలో ట్రేడైంది. సెన్సెక్స్ను ప్రతిబింబిస్తూ నిఫ్టీ కూడా 31.20 పాయింట్లు లేదా 0.12 శాతం తగ్గి 24,981.95 వద్దకు పడిపోయింది. బుధవారం ఇది 25,234.05 - 24,947.70 రేంజ్లో చలించింది.నిఫ్టీ50 ఇండెక్స్లోని 50 స్టాక్స్లో సిప్లా, ట్రెంట్, టాటా మోటార్స్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా , టెక్ మహీంద్రా నేతృత్వంలోని 31 స్టాక్స్ గ్రీన్లో ముగిసి 2.58 శాతం వరకు పెరిగాయి. మరోవైపు రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐటీసీ, నెస్లే ఇండియా, ఒఎన్జీసీ, హిందుస్తాన్ యూనిలీవర్ 19 స్టాక్లలో దిగువన ముగిశాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
ఎంపీసీ సమావేశం..లాభాల్లో స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం ఉదయం లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:27 సమయానికి నిఫ్టీ 56 పాయింట్లు పెరిగి 25,068కు చేరింది. సెన్సెక్స్ 170 పాయింట్లు పుంజుకుని 81,801 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్ 102.5 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 77.5 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.01 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో లాభాల్లో ముగిశాయి. ఎస్ అండ్ పీ 0.97 శాతం లాభపడింది. నాస్డాక్ 1.44 శాతం పుంజుకుంది.ఇదీ చదవండి: కిక్కెక్కిస్తోన్న ‘క్విక్ కామర్స్’!ఈరోజు ఆర్బీఐ మానిటరీ పాలసీ సమావేశం వివరాలు వెల్లడి కానున్నాయి. మార్కెట్లు కొంత ఒడిదొడుకులకు లోనయ్యే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. దానికితోడు పశ్చిమాసియా ఉద్రిక్తతలు ఉండడంతో మదుపర్లు కొంత అప్రమత్తంగా వ్యవహరించాలని సూచిస్తున్నారు. ఇజ్రాయెల్–హమాస్ మధ్య పోరు లెబనాన్కు పాకడం.. ఇరాన్ కూడా రంగంలోకి దూకి ఇజ్రాయెల్పై మిసైళ్ల వర్షం కురిపించడంతో ఈ ప్రాంతంలో పూర్తిస్థాయి యుద్ధానికి దారితీసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. గడిచిన రెండేళ్ల కాలం నుంచి వారం రోజుల్లో మార్కెట్లు భారీగా పడిపోయాయి. అయితే, ఈ పతనాలను చూసి రిటైల్ ఇన్వెస్టర్లు మరీ అందోళన చెందాల్సిన అవసరం లేదంటున్నారు మార్కెట్ నిపుణులు. గత యుద్ధాల సమయంలో పడిపోయిన మార్కెట్లు చాలా త్వరగా కోలుకున్నాయని, అందుకే ఈ మార్కెట్ క్రాష్ను సదవకాశంగా మలచుకోవాలని సూచిస్తున్నారు.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
ఫ్లాట్గా ట్రేడవుతున్న స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం ఉదయం లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:27 సమయానికి నిఫ్టీ 6 పాయింట్లు పెరిగి 24,808కు చేరింది. సెన్సెక్స్ 84 పాయింట్లు పుంజుకుని 81,142 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్ 102.53 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 80.8 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.02 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో నష్టాల్లో ముగిశాయి. ఎస్ అండ్ పీ 0.96 శాతం నష్టపోయింది. నాస్డాక్ 1.18 శాతం దిగజారింది.ఇదీ చదవండి: హైడెల్బర్గ్ సిమెంట్పై అదానీ కన్ను!రష్యా–ఉక్రెయిన్ యుద్ధంతో అస్తవ్యస్తంగా మారిన ఆర్థిక వ్యవస్థలకు తాజాగా పశ్చిమాసియా ఉద్రిక్తతలు తీవ్ర అనిశ్చితులకు గురిచేస్తున్నాయి. ఇజ్రాయెల్–హమాస్ మధ్య పోరు లెబనాన్కు పాకడం.. ఇరాన్ కూడా రంగంలోకి దూకి ఇజ్రాయెల్పై మిసైళ్ల వర్షం కురిపించడంతో ఈ ప్రాంతంలో పూర్తిస్థాయి యుద్ధానికి దారితీసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. గడిచిన రెండేళ్ల కాలం నుంచి వారం రోజుల్లో మార్కెట్లు ఇంతలా పడిపోవడం ఇదే తొలిసారి. అయితే, ఈ పతనాలను చూసి రిటైల్ ఇన్వెస్టర్లు మరీ అందోళన చెందాల్సిన అవసరం లేదంటున్నారు మార్కెట్ నిపుణులు. గత యుద్ధాల సమయంలో పడిపోయిన మార్కెట్లు చాలా త్వరగా కోలుకున్నాయని, అందుకే ఈ మార్కెట్ క్రాష్ను సదవకాశంగా మలచుకోవాలని సూచిస్తున్నారు.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
నష్టాలకు బ్రేక్.. లాభాల్లో స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం ఉదయం లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:25 సమయానికి నిఫ్టీ 84 పాయింట్లు పెరిగి 25,095కు చేరింది. సెన్సెక్స్ 285 పాయింట్లు పుంజుకుని 81,958 వద్ద ట్రేడవుతోంది. గడిచిన సెషన్ల్లో మార్కెట్లు నష్టాలపాలయ్యాయి. సోమవారం కొంత పుంజుకుని లాభాల్లో ట్రేడవుతున్నాయి.అమెరికా డాలర్ ఇండెక్స్ 102.52 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 78.12 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 3.97 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో లాభాల్లో ముగిశాయి. ఎస్ అండ్ పీ 0.9 శాతం లాభపడింది. నాస్డాక్ 1.22 శాతం పుంజుకుంది.ఇదీ చదవండి: అక్టోబర్ నుంచి ఆరు మార్పులు ఇవే..భవిష్యత్తులో అంతర్జాతీయ అనిశ్చితులు దేశీయ మార్కెట్ను ప్రభావితం చేయొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొంతకాలం కొనసాగే అవకాశం ఉంది. అమెరికా ఎన్నికలు ముగిసే వరకు ఈ యుద్ధ భయాలు ఉండవచ్చని అంచనా. ముడిచమురు ధరలు మరింత పెరిగే ప్రమాదముందని చెబుతున్నారు. ఈ నెల 9న ఆర్బీఐ ద్రవ్యపరపతి విధాన సమీక్ష నిర్ణయాలు మార్కెట్కు కీలకంగా మారనున్నాయి. గతంలో ఆర్బీఐ గవర్నర్ తెలిపిన వివరాల ప్రకారం కీలక వడ్డీరేట్లను వెంటనే తగ్గించబోమనే సంకేతాలు వెలువరించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికానికి సంబంధించి కంపెనీలు ఆర్థిక ఫలితాలను త్వరలో ప్రకటించనున్నాయి. దాంతో రాబోయే రోజుల్లో మార్కెట్లు కొంత ఒడిదొడుకులకు లోనయ్యే అవకాం ఉందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
మార్కెట్ కల్లోలానికి కారణాలు
పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం తీవ్రరూపం దాలుస్తుండడంతో స్టాక్మార్కెట్లు భారీగా నష్టపోతున్నాయి. ఇజ్రాయిల్–ఇరాన్ పరస్పర ప్రతీకార దాడుల నేపథ్యంలో ఇన్వెస్టర్లు భారీ అమ్మకాలకు దిగారు. ఫలితంగా నిన్న దేశీయ స్టాక్మార్కెట్లో రూ.9.78 లక్షల కోట్ల సంపద హరించుకుపోయింది. ఇందుకుగల కారణాలను మార్కెట్ నిపుణులు విశ్లేషించారు.నిపుణులు అంచనా ప్రకారం..హెజ్బొల్లా, హమాస్ అగ్రనేతలను ఇజ్రాయెల్ మట్టుపెట్టడంతో పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు మరింత తీవ్ర రూపం దాల్చాయి. ఈ సంస్థలకు మద్దతుగా నిలిచిన ఇరాన్ ప్రత్యక్ష దాడులకు పాల్పడింది. ఇజ్రాయెల్పై ఏకంగా 180కి పైగా క్షిపణులతో విరుచుకుపడింది. ఇరాన్–ఇజ్రాయెల్ల మద్య పోరు భీకర యుద్ధానికి దారి తీయోచ్చనే ఆందోళనలతో ఇన్వెస్టర్లు అప్రమత్తత వహిస్తూ అమ్మకాలకు పాల్పడ్డారు.చిన్న ఇన్వెస్టర్ల ప్రయోజనాలను పరిరక్షించడంతో పాటు ఈక్విటీ మార్కెట్లో స్థిరత్వం కోసం సెబీ ఎఫ్అండ్ఓ ట్రేడింగ్ నిబంధనలను మరింత కఠినతరం చేసింది. డెరివేటివ్స్ కనీస కాంట్రాక్టు విలువను రూ.15–20 లక్షలకు పెంచింది. దీంతో విస్తృత మార్కెట్లో ట్రేడింగ్ వాల్యూమ్స్ భారీగా తగ్గే అవకాశం ఉంది. సెబీ కొత్త మార్గదర్శకాలు మార్కెట్పై ఒత్తిడి పెంచాయి.పశ్చిమాసియా దేశాల్లో యుద్ధ పరిస్థితులు నెలకొనడంతో కొన్ని వారాలుగా నిలకడగా ఉన్న క్రూడాయిల్ ధరలు ఇటీవల మళ్లీ ఎగబాకాయి. గడిచిన 3 రోజుల్లో చమురు ధరలు 5% పెరిగాయి. ప్రస్తుతం భారత్కు దిగుమతయ్యే బ్యారెల్ బ్రెంట్ క్రూడాయిల్ ధర 77 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. సరఫరా అవాంతరాల దృష్ట్యా రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉందనే ఆందోళనలు నెలకొన్నాయి. దేశీయ ముడి చమురుల దిగుమతుల బిల్లు భారీగా పెరగొచ్చనే భయాలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్ను దెబ్బతీశాయి. డాలర్ మారకంలో రూపాయి విలువ 14 పైసలు బలహీనపడి 83.96 వద్ద స్థిరపడింది. ఇంట్రాడే ట్రేడింగ్లో 23 పైసలు క్షీణించి 84.00 స్థాయిని తాకింది.ఇదీ చదవండి: కార్పొరేట్ కంపెనీలు ప్రెషర్ కుక్కర్లు!చైనా ప్రభుత్వం ఆర్థిక వృద్ధికి ఊతమిచ్చే సంస్కరణలు, ఉద్దీపన చర్యలు, వరుస వడ్డీరేట్ల కోతను ప్రకటించడంతో గతవారంలో ఆ దేశ స్టాక్ మార్కెట్ ఏకంగా 15 శాతం ర్యాలీ అయింది. ఇప్పటికీ అక్కడి షేర్లు తక్కువ ధరల వద్ద ట్రేడవుతున్నాయి. దీంతో విదేశీ ఇన్వెస్టర్లు భారత్ వంటి వర్ధమాన దేశాల మార్కెట్లో లాభాల స్వీకరణకు పాల్పడి, చైనా మార్కెట్లకు తమ పెట్టుబడులు తరలిస్తున్నారు. -
భారత్, చైనా మార్కెట్లపై జెఫ్రీస్ హెడ్ కీలక వ్యాఖ్యలు
దేశీయ ఈక్విటీ మార్కెట్లు ఇటీవల జీవితకాల గరిష్ఠాలను చేరిన నేపథ్యంలో ప్రస్తుత స్థాయి నుంచి ఒక శాతం మేర నష్టపోయే అవకాశం ఉందని జెఫ్రీస్ గ్లోబల్ హెడ్ క్రిస్టోఫర్ వుడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. చైనా మార్కెట్లు మాత్రం ప్రస్తుత స్థానం నుంచి దాదాపు రెండు శాతం పెరగనున్నాయని అంచనా వేశారు.క్రిస్టోఫర్ తెలిపిన వివరాల ప్రకారం..భారత ఈక్విటీ మార్కెట్లు ఇప్పటికే భారీగా ర్యాలీ అయ్యాయి. దాంతో చాలామంది మదుపర్లు లాభాలు స్వీకరించే అవకాశం ఉంది. అదే చైనాలో పరిస్థితి భిన్నంగా ఉంది. అక్కడి మార్కెట్లు ప్రస్తుత స్థానం నుంచి సుమారు రెండు శాతం పెరిగే అవకాశం ఉంది. ఆస్ట్రేలియా, మలేషియా మార్కెట్లు 50 బేసిస్ పాయింట్లు తగ్గుతాయని అంచనా. అంతర్జాతీయ భౌగోళిక ఉద్రిక్తతలు ఇంకా పూర్తిగా తగ్గలేదు. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య చెలరేగుతున్న యుద్ధ వాతావరణం మరింత పెరిగితే భారత్తోపాటు దాదాపు అన్ని గ్లోబల్ మార్కెట్లు తీవ్రంగా దెబ్బతింటాయి.ఇదీ చదవండి: పెట్రోల్ అప్.. డీజిల్ డౌన్!దీర్ఘకాల వ్యూహంతో ఈక్విటీలో పెట్టుబడి పెట్టేవారు ప్రతి ప్రతికూల ప్రభావాన్ని ఒక అవకాశంగా తీసుకుని మరిన్ని ఎక్కువ యూనిట్లు కొనుగోలు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. భారత్ వేగంగా వృద్ధి చెందుతోంది. మరో పదేళ్లలో అన్ని రంగాల్లో విప్లవాత్మక మార్పు రానుంది. అన్ని విభాగాలు వృద్ధి చెందనున్నాయి. కాబట్టి మదుపర్లు ట్రేడింగ్ కంటే పెట్టుబడిపై దృష్టి సారించి మంచి రాబడులు పొందాలని చెబుతున్నారు. -
ఒక్కరోజులోనే రూ.నాలుగు లక్షల కోట్లు ఆవిరి!
దేశీయ స్టాక్మార్కెట్లు సోమవారం భారీ నష్టాలతో ముగిసాయి. మార్కెట్లు ముగిసే సమయానికి నిఫ్టీ 368 పాయింట్లు తగ్గి 25,810 వద్దకు చేరింది. సెన్సెక్స్ 1272 పాయింట్లు దిగజారి 84,299 వద్ద ముగిసింది. ఈరోజు స్టాక్మార్కెట్లో ఇన్వెస్టర్ల సంపద దాదాపు రూ.నాలుగు లక్షల కోట్లు ఆవిరైనట్లు మార్కెట్ వర్గాలు అంచనావేస్తున్నాయి.మదుపర్లు లాభాలు స్వీకరించడం, అంతర్జాతీయ మార్కెట్ల ట్రెండ్ ఈరోజు దేశీయ స్టాక్మార్కెట్ను నడిపించాయని నిపుణులు తెలియజేస్తున్నారు. ఇప్పటికే జీవితకాల గరిష్ఠాలను చేరిన మార్కెట్లలో ఇన్వెస్టర్లు ఉదయ నుంచే లాభాలు స్వీకరించినట్లు తెలిసింది. రానున్న యూఎస్ ఎన్నికలు, ఎఫ్ఐఐలు చైనావైపు మొగ్గు చూపుతుండడం వంటి అంశాలు కూడా మార్కెట్ను ప్రభావితం చేసినట్లు నిపుణులు చెప్పారు.ఇదీ చదవండి: ఎట్టకేలకు రెండేళ్ల వివాదానికి పరిష్కారం!సెన్సెక్స్ 30 సూచీలో జేఎస్డబ్ల్యూ స్టీల్, ఎన్టీపీసీ, టాటా స్టీల్ కంపెనీ స్టాక్లు లాభాల్లోకి చేరుకున్నాయి. యాక్సిస్ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఎం అండ్ ఎం, ఐసీఐసీఐ బ్యాంక్, టెక్ మహీంద్రా, నెస్లే, బజాజ్ ఫిన్సర్వ్, మారుతి సుజుకీ, ఎస్బీఐ, టాటా మోటార్స్, ఇన్ఫోసిస్, భారతీ ఎయిర్టెల్, ఆల్ట్రాటెక్ సిమెంట్, సన్ఫార్మా, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, హెచ్సీఎల్ టెక్, టీసీఎస్ కంపెనీ షేర్లు నష్టాల్లోకి జారుకున్నాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
మార్కెట్ చూపు ఫెడ్ వైపు.. నిఫ్టీ@25,377
దేశీయ స్టాక్మార్కెట్లు బుధవారం నష్టాలతో ముగిసాయి. మార్కెట్లు ముగిసే సమయానికి నిఫ్టీ 41 పాయింట్లు తగ్గి 25,377 వద్దకు చేరింది. సెన్సెక్స్ 131 పాయింట్లు దిగజారి 82,948 వద్ద ముగిసింది. ఈరోజు రాత్రి ఫెడ్ సమావేశంలోని ముఖ్యాంశాలు విడుదలవ్వనున్నాయి. దాంతో గరిష్ఠాల వద్ద మదుపర్లు కొంత లాభాలు స్వీకరించినట్లు తెలుస్తుంది.సెన్సెక్స్ 30 సూచీలో బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సర్వ్, నెస్లే, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్బీఐ, ఎల్ అండ్ టీ, ఎం అండ్ ఎం, ఇండస్ ఇండ్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, అదానీ పోర్ట్స్ అండ్ సెజ్ కంపెనీ స్టాక్లు లాభాల్లోకి చేరుకున్నాయి.ఇదీ చదవండి: ఎనిమిది నెలల్లో 3.5 కోట్ల దరఖాస్తులుటీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్సీఎల్ టెక్, టెక్ మహీంద్రా, సన్ఫార్మా, టాటా మోటార్స్, టాటా స్టీల్, టైటాన్, ఏషియన్ పెయింట్స్, జేఎస్డబ్ల్యూ స్టీల్, పవర్ గ్రిడ్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఎన్టీపీసీ, భారతీ ఎయిర్టెల్, మారుతీసుజుకీ, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఆల్ట్రాటెక్ సిమెంట్ కంపెనీ షేర్లు నష్టాల్లోకి జారుకున్నాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
లాభాల్లో ట్రేడవుతున్న స్టాక్ మార్కెట్లు.. నిఫ్టీ@25,388
దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం ఉదయం లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:22 సమయానికి నిఫ్టీ 31 పాయింట్లు పెరిగి 25,388కు చేరింది. సెన్సెక్స్ 122 పాయింట్లు లాభపడి 83,002 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్ 101.11 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 72.06 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 3.66 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో లాభాలతో ముగిశాయి. ఎస్ అండ్ పీ 0.54 శాతం, నాస్డాక్ 0.65 శాతం లాభపడ్డాయి.క్రూడాయిల్ కదలికలు, డాలర్ మారకంలో రూపాయి విలువ అంశాలు ట్రేడింగ్ను ప్రభావితం చేయోచ్చని నిపుణులు చెబుతున్నారు. ఫెడ్ పాలసీ కమిటీ ద్రవ్య విధాన నిర్ణయాల వెల్లడికి ముందు సూచీలు పరిమిత శ్రేణిలో ట్రేడవ్వొచ్చని అంటున్నారు. వివిధ రంగాల షేర్లలో లాభాల స్వీకరణకు అవకాశం ఉంది. సాంకేతికంగా నిఫ్టీకి దిగువ స్థాయిలో 25,000 వద్ద తక్షణ మద్దతు ఉంది. కొనుగోళ్లు నెలకొంటే ఎగువున 25,500 వద్ద కీలక నిరోధం ఉంది. ఈ స్థాయిని చేధిస్తే 26,000 వద్ద మరో నిరోధం ఉందని మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.ఇదీ చదవండి: బీమా ప్రీమియంపై జీఎస్టీ.. మంత్రుల సంఘం ఏర్పాటు(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
25,000 మార్కు వద్ద నిఫ్టీ.. లాభాల్లో స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్మార్కెట్లు గురువారం ఉదయం లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:21 సమయానికి నిఫ్టీ 95 పాయింట్లు పెరిగి 25,022కు చేరింది. సెన్సెక్స్ 322 పాయింట్లు లాభపడి 81,857 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్ 101.72 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 70.8 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 3.65 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో లాభాలతో ముగిశాయి. ఎస్ అండ్ పీ 1.07 శాతం, నాస్డాక్ 2.2 శాతం లాభపడ్డాయి.ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ఆగస్టులోనూ తమ జోరు చూపించాయి. నికరంగా రూ.38,239 కోట్లను ఆకర్షించాయి. ఈ ఏడాది జులైలో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లోకి వచ్చిన రూ.37,113 కోట్లతో పోల్చి చూస్తే 3.3 శాతం మేర ఆగస్ట్లో వృద్ధి నమోదైంది. థీమ్యాటిక్ ఫండ్స్ (రంగాలు/ప్రత్యేక థీమ్లలో ఇన్వెస్ట్ చేసేవి) పథకాల్లోకి అత్యధికంగా రూ.18,117 కోట్లు వచ్చాయి. ఈ తరహా పథకాలు జులైలో రూ.18,336 కోట్లు, జూన్లో రూ.22,352 కోట్ల చొప్పున ఆకర్షించాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
25,000 మార్కు దాటిన నిఫ్టీ..!
దేశీయ స్టాక్మార్కెట్లు గురువారం ఉదయం లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:32 సమయానికి నిఫ్టీ 101 పాయింట్లు పెరిగి 25,053కు చేరింది. సెన్సెక్స్ 266 పాయింట్లు పుంజుకుని 82,006 వద్ద ట్రేడవుతోంది. ఫెడ్ కీలక వడ్డీ రేట్లను తగ్గిస్తుందనే సంకేతాలు స్పష్టమవడంతో స్టాక్ మార్కెట్ సూచీలు జీవితకాల గరిష్ఠాలను చేరాయి.అమెరికా డాలర్ ఇండెక్స్ 104.1 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 80.72 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.06 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో లాభాలతో ముగిశాయి. ఎస్ అండ్ పీ 1.58 శాతం, నాస్డాక్ 2.64 శాతం లాభపడ్డాయి.యూఎస్ ఫెడరల్ రిజర్వ్ ఛైర్మన్ జెరొమ్ పావెల్ సెప్టెంబర్లో జరగబోయే ఫెడ్ మీటింగ్లో వడ్డీరేట్లను తగ్గిస్తామని సంకేతాలు ఇచ్చారు. అయితే దానికి ద్రవ్యోల్బణాన్ని మరింత పరిశీలించాలని తెలిపారు. దాంతో యూఎస్ మార్కెట్లు రానున్న సెషన్లో ఎలాగైనా వడ్డీరేట్లను తగ్గిస్తుందనే ఉద్దేశంతో భారీగా పెరిగాయి. దేశీయంగా జులై నెలకు సంబంధించి ఆగస్టు 1న వెలువడే ఆటో కంపెనీల అమ్మకాల డేటా, తయారీ రంగ పీఎంఐ గణాంకాలను ఇన్వెస్టర్లు క్షుణ్ణంగా పరిశీలించవచ్చు.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
1,000 టూ 25,000 పాయింట్లు.. నిఫ్టీ ప్రస్థానం
నిఫ్టీ 50 ఇండెక్స్ సోమవారం చరిత్రాత్మక మార్కు 24,999.75ను తాకింది. నవంబర్ 1995లో 1,000 పాయింట్లతో ప్రారంభమైన నిఫ్టీ సూచీ 25,000 మార్కును చేరడానికి సుమారు 29 ఏళ్లు పట్టింది. ఈ క్రమంలో అంతర్జాతీయ అనిశ్చితులు, భౌగోళిక అస్థిరత, ఆర్థికమాంద్యం వంటి ఎన్నో ఒడిదొడుకులను అధిగమించింది. దీర్ఘకాలిక వ్యూహంతో పెట్టుబడులు కొనసాగిస్తే స్టాక్మార్కెట్లో మంచి రాబడులు సాధించవచ్చని నిపుణులు చెబుతున్నారు. నిఫ్టీ 1,000 నుంచి 25,000 మార్కు చేరడానికి పట్టిన సమయాన్ని తెలుసుకుందాం.ఇదీ చదవండి: నిఫ్టీ 25,000 పాయింట్లకు..?1000 నుంచి 2,000 మార్కు-9 ఏళ్ల, 1 నెల 10 రోజులు3000 మార్కు-1 సంవత్సరం 2 నెలలు4,000 మార్కు-1 సంవత్సరం 5,000 మార్కు-10 నెలలు6,000 మార్కు-2 నెలలు7,000 మార్కు-6.5 సంవత్సరాలు 8,000 మార్కు-4 నెలలు9,000 మార్కు-రెండున్నరేళ్లు 10,000 మార్కు-4 నెలలు10,000 నుంచి 20,000కి చేరుకోవడానికి 6 సంవత్సరాలు21,000 మార్కు-61 సెషన్లు22,000 మార్కు-ఒక నెల 23,000 మార్కు-5 నెలలు24,000 మార్కు- నెల కంటే తక్కువ సమయం24,999.75 మార్కు-రెండున్నర నెలలు -
నిఫ్టీ 25,000 పాయింట్లకు..?
ఈ వారంలో నిఫ్టీ చరిత్రాత్మక స్థాయి 25,000 పాయింట్లను పరీక్షించొచ్చని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. అయితే ఈ లక్ష్యాన్ని చేరుకునేందుకు ఎగువ స్థాయిలో 24,963 పాయింట్ల వద్ద నిరోధాన్ని చేధించాల్సి ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ ఇన్వెస్టర్లు జీవితకాల గరిష్టాల వద్ద లాభాలను స్వీకరిస్తే దిగువన 24,504 – 24,600 శ్రేణిలో తక్షణ మద్దతు ఉందని చెబుతున్నారు. అమెరికా జీడీపీ గణాంకాలు, అంతర్జాతీయంగా డిమాండ్ ఊపందుకోవచ్చనే అంచనాలు, దలాల్ స్ట్రీట్పై సంస్థాగత ఇన్వెస్టర్ల విశ్వాసం తదితర అంశాలతో బడ్జెట్ తర్వాత నష్టాల నుంచి స్టాక్ మార్కెట్ రికవరీ అయింది. వరుస అయిదు రోజుల పతనం నుంచి గట్టెక్కిన సూచీలు శుక్రవారం జీవితకాల గరిష్టం వద్ద ముగిశాయి.ఎఫ్ఐఐల కొనుగోళ్లు: రూ.53 వేల కోట్లువిదేశీ ఇన్వెస్టర్లు భారత ఈక్విటీల కొనుగోళ్లకు మొగ్గుచూపుతున్నారు. ఎన్ఎస్డీఎల్ డేటా ప్రకారం జులై నెలలో 26 నాటికి ఈక్విటీలో రూ.33,688 కోట్ల విదేశీ పెట్టుబడులు వచ్చాయి. డెట్ మార్కెట్లోకి రూ.19,222 కోట్లు వచ్చాయి. దీంతో మొత్తం ఈ నెలలో ఇప్పటి వరకు ఎఫ్పీఐలు రూ.52,910 కోట్లు పెట్టుబడులు పెట్టారు. ‘ఎఫ్అండ్ఓ ట్రేడింగ్పై సెక్యూరిటీ లావాదేవీల పన్ను పెంపుతో పాటు మూలధన లాభాలపై పన్ను పెంచాలనే బడ్జెట్ ప్రతిపాదనలు ఎఫ్పీఐలకు ప్రతికూలంగా మారింది. విదేశీ ఇన్వెస్టర్లు పెట్టుబడులు తిరిగి ఉపసంహరించుకునే అవకాశం లేకపోలేదు. అయితే ఈ ధోరణి స్వల్ప కాలికంగా మాత్రమే ఉంటుందని, రానున్న రోజుల్లో ఈక్విటీల్లోకి మరిన్ని పెట్టుబడులు వస్తాయి’ అని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు.ఇదీ చదవండి: ట్రేడింగ్ చేస్తున్నారా.. జాగ్రత్త!ఈ వారంలో వెలువడే కంపెనీల క్యూ1 ఆర్థిక ఫలితాలకు తోడు, వడ్డీరేట్లపై బుధవారం వెల్లడయ్యే అమెరికా ఫెడరల్ రిజర్వ్ నిర్ణయాలు మార్కెట్కు దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. యూరోజోన్ జీడీపీ డేటా(మంగళవారం), చైనా తయారీ రంగ గణాంకాలు బ్యాంకు ఆఫ్ ఇంగ్లాడ్ ద్రవ్య విధాన నిర్ణయాలు(గురువారం), అమెరికా ఉద్యోగాల డేటా ట్రేడింగ్కు ప్రభావితం చేయొచ్చు. దేశీయంగా జులై నెలకు సంబంధించి గురువారం(ఆగస్టు 1న) దేశీయ ఆటో కంపెనీల అమ్మకాల డేటా, తయారీ రంగ పీఎంఐ గణాంకాలను ఇన్వెస్టర్లు క్షుణ్ణంగా పరిశీలించవచ్చు. వీటితో పాటు ప్రపంచ మార్కెట్ల పనితీరు, రూపాయి విలువ, విదేశీ పెట్టుబడులను పరిగణించే అవకాశం ఉంది. -
ఎన్నికల ఫలితాల రోజు మార్కెట్ పతనంపై సుప్రీం కోర్టులో పిటిషన్
లోక్సభ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో జూన్ 4వ తేదీన స్టాక్మార్కెట్లు భారీగా పతనమవ్వడంపై కేంద్రం, సెబీ నివేదిక సమర్పించాలని విశాల్ తివారీ అనే న్యాయవాది డిమాండ్ చేశారు. ఈమేరకు సుప్రీంకోర్టులో ఆయన పిటిషన్ దాఖలు చేశారు.సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మార్కెట్లు భారీగా పతనమైన సంగతి తెలిసిందే. అందుకు సంబంధించిన పూర్తి నివేదికన సమర్పించేలా కేంద్రం, సెబీకి ఆదేశాలు జారీచేయాలని తివారీ సుప్రీంకోర్టును కోరారు. దాంతోపాటు అదానీ-హిండెన్బర్గ్ వ్యవహారంలో జస్టిస్ ఏఎం సప్రే నేతృత్వంలోని నిపుణుల కమిటీ జనవరి 3న ఇచ్చిన సూచనలపై స్టేటస్ రిపోర్టును సమర్పించేలా ప్రభుత్వం, సెబీని ఆదేశించాలని కోరారు.నిపుణుల కమిటీ సూచనలను కేంద్రం, సెబీ నిర్మాణాత్మకంగా పరిగణించాలని సుప్రీంకోర్టు తెలిపింది. నియంత్రణ ఫ్రేమ్వర్క్ను బలోపేతం చేయడానికి, పెట్టుబడిదారులను రక్షించడానికి, సెక్యూరిటీ మార్కెట్ పనితీరును నిర్ధారించడానికి అవసరమైన తదుపరి చర్యలను తీసుకోవాలని సుప్రీంకోర్టు పేర్కొంది.తివారీ దాఖలు చేసిన పిటిషన్లో..‘సార్వత్రిక ఎన్నికలు 2024 ఫలితాలకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్ ప్రకటనల సమయంలో స్టాక్మార్కెట్లు భారీగా పెరిగాయి. కానీ వాస్తవ ఫలితాలు వెలువడిన రోజు మార్కెట్లో ఇన్వెస్టర్లు తీవ్రంగా నష్టపోయారు. కొన్ని నివేదికల ప్రకారం ఏకంగా ఒక్కరోజే రూ.20లక్షల కోట్ల నష్టం వాటిల్లింది. ఈ వ్యవహారం నియంత్రణ యంత్రాంగంపై ప్రశ్నలు లేవనెత్తుతుంది. మార్కెట్ నియమాలపై స్పష్టమైన కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ ఎలాంటి ప్రభావం చూపించలేదు’ అని తెలిపారు.ఇదీ చదవండి: రూ.83 వార్షికవేతనం తీసుకున్న స్టీవ్జాబ్స్..!ఎగ్జిట్ పోల్ అంచనాల ప్రకారం సోమవారం (జూన్3న) బీఎస్ఈ బెంచ్మార్క్ సెన్సెక్స్ 2,507 పాయింట్లు లేదా 3.4 శాతం పెరిగి 76,469 వద్ద గరిష్ట స్థాయిని చేరింది. తర్వాతరోజు వాస్తవ ఫలితాలు వెలువడిన మంగళవారం సెన్సెక్స్ 4,390 పాయింట్లు లేదా 6 శాతం దిగజారి 72,079 వద్ద స్థిరపడింది. -
ఎన్నికలవేళ తీవ్ర ఒడుదొడుకుల్లో స్టాక్మార్కెట్లు.. కారణం..
సార్వత్రిక ఎన్నికల ప్రారంభానికి ముందు స్టాక్మార్కెట్లు రికార్డు గరిష్ఠాలను చేరాయి. కానీ క్రమంగా సెన్సెక్స్ అస్థిరంగా మారింది. ప్రస్తుత కాలంలో సూచీలు నిత్యం తీవ్ర ఒడుదొడుకులకు లోనవుతున్నాయి. ఈసారి ఎన్నికల్లో గతంలో కంటే తక్కువ ఓటింగ్ శాతం నమోదవడంతో కేంద్రంలో అధికారపార్టీ, ప్రతిపక్షపార్టీల గెలుపుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దాంతో స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లు తమ పోర్ట్ఫోలియోలను సర్దుబాటు చేస్తున్నారని నిపుణులు చెబుతున్నారు. సమీప భవిష్యత్తులో ఏం జరుగుబోతుందో పరిశీలిస్తున్నారు.ఎన్నికల అనిశ్చితి వల్ల గత రెండు వారాలుగా స్మాల్ అండ్ మిడ్క్యాప్ స్టాక్లు తీవ్ర ఒడుదొడుకులకు గురవుతున్నాయి. ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఈక్విటీ మార్కెట్లో మరింత అనిశ్చితులు ఏర్పడతాయని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఎన్నికల ఫలితాలు వచ్చేముందు 3-4 ట్రేడింగ్ సెషన్లు, ఫలితాలు వచ్చాక 3-4 ట్రేడింగ్ సెషన్లు మార్కెట్లో జాగ్రత్తగా వ్యవహరించాలని సూచిస్తున్నాయి.ఇదీ చదవండి: 100 నుంచి 75 వేల పాయింట్ల వరకు ప్రస్థానంస్టాక్మార్కెట్లో పెట్టుబడి పెట్టాలనుకునే చాలామంది తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలనుకుంటారు. కొందరికైతే స్టాక్మార్కెట్ గ్యాంబ్లింగ్ అనే అభిప్రాయం ఉంది. స్పష్టమైన వైఖరి, భవిష్యత్తు ప్రణాళిక లేకుండా మార్కెట్లో తాత్కాలికంగా డబ్బు సంపాదించే వారికి ఇది గ్యాంబ్లింగ్గానే కనిపిస్తోంది. ఈజీ మనీకి అలవాటుపడి మార్కెట్లో కాకుండా బయట ఇతర అవకాశాలు ఉంటే వెంటనే ఆయా మార్గాల్లోకి డబ్బు మళ్లిస్తుంటారు. ఇటీవల జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో గెలుపోటములపై ఇప్పటికే బెట్టింగ్ల పర్వం మొదలైంది. దాంతో మార్కెట్లో ఉన్న చాలామంది బెట్టింగ్వైపు మొగ్గు చూపుతున్నారు. జూన్ 4న జరిగే ఓట్ల లెక్కింపునకు ముందే ఎవరుగెలుస్తారనే అంచానాలతో షాడో బెట్టింగ్ ప్లాట్ఫామ్లను పరిశీలిస్తున్నారు. -
సాక్షి మనీ మంత్ర: లాభాలతో ముగిసిన స్టాక్మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్మార్కెట్లు మంగళవారం లాభాలతో ముగిశాయి. మార్కెట్లు ముగిసే సమయానికి నిఫ్టీ 31 పాయింట్లు లాభపడి 22,368 వద్దకు చేరింది. సెన్సెక్స్ 89 పాయింట్లు ఎగబాకి 73,738 వద్దకు చేరింది. సెన్సెక్స్ 30 సూచీలో నెస్లే, మారుతీ సుజుకీ, హెచ్సీఎల్ టెక్నాలజీస్, టాటా మోటార్స్, ఎన్టీపీసీ, ఏషియన్ పెయింట్స్, ఎస్బీఐ, ఐటీసీ, హెచ్యూఎల్, టైటాన్, పవర్గ్రిండ్, ఇన్ఫోసిస్ కోటక్ మహీంద్రా బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ కంపెనీ షేర్లు లాభాల్లోకి చేరుకున్నాయి. సన్ఫార్మా, ఎం అండ్ ఎం, రిలయన్స్ ఇండస్ట్రీస్, టెక్ మహీంద్రా, టాటా స్టీల్, ఆల్ట్రాటెక్ సిమెంట్, బజాజ్ ఫిన్సర్వ్, జేఎస్డబ్ల్యూ స్టీల్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కంపెనీ షేర్లు నష్టాల్లోకి జారుకున్నాయి. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
సాక్షి మనీ మంత్ర: తీవ్ర ఒడుదొడుకులు.. గ్రీన్లో ముగిసిన స్టాక్మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్మార్కెట్లు శుక్రవారం తీవ్ర ఒడుదొడుకులకు లోనయ్యాయి. కానీ చివరికు లాభాలతో ముగిశాయి. మార్కెట్లు ముగిసే సమయానికి నిఫ్టీ 153 పాయింట్లు లాభపడి 22,149 వద్దకు చేరింది. సెన్సెక్స్ 599 పాయింట్లు ఎగబాకి 73,088 వద్దకు చేరింది. సెన్సెక్స్ 30 సూచీలో బజాజ్ ఫైనాన్స్, ఎం అండ్ ఎం, మారుతీ సుజుకీ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, జేఎస్డబ్ల్యూ స్టీల్, విప్రో, బజాజ్ ఫిన్సర్వ్, భారతీ ఎయిర్టెల్, ఐటీసీ, టాటా స్టీల్, టెక్ మహీంద్రా, టైటాన్, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్యూఎల్, ఎస్బీఐ కంపెనీ షేర్లు భారీగా లాభపడిన జాబితాలో ఉన్నాయి. హెచ్సీఎల్ టెక్నాలజీస్, టాటా మోటార్స్, నెస్లే, టీసీఎస్, ఎల్ అండ్ టీ, ఇన్ఫోసిస్, ఎన్టీపీసీ, ఆల్ట్రాటెక్ సిమెంట్, ఏషియన్ పెయింట్స్ కంపెనీ షేర్లు నష్టాల్లోకి జారుకున్నాయి. యుద్ధభయాలు విస్తరించడంతోపాటు ఫెడ్ ఛైర్మన్ కీలక వడ్డీ రేట్ల పెంపుపై వెనకడుగు వేస్తున్నట్లు తెలిసింది. దాంతో మార్కెట్ ఈ రోజు సెషన్లో తీవ్ర ఒడుదొడుకులకు లోనైంది. చివరకు మార్కెట్లు గ్రీన్లోనే ముగిశాయి. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
సాక్షి మనీ మంత్ర: నష్టాలతో ప్రారంభమైన స్టాక్మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్మార్కెట్ సూచీలు శుక్రవారం ఉదయం నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:28 సమయానికి నిఫ్టీ 155 పాయింట్లు నష్టపోయి 21,835కు చేరింది. సెన్సెక్స్ 529 పాయింట్లు దిగజారి 71,955 వద్ద ట్రేడవుతోంది. అమెరికా డాలర్ ఇండెక్స్ 106.2 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 87 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.63 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో నష్టాలతో ముగిశాయి. ఎస్ అండ్ పీ 0.2 శాతం నష్టాలపాలైంది. నాస్డాక్ 0.5 శాతం దిగజారింది. ఎన్ఎస్ఈ ఏప్రిల్ 24 నుంచి నిఫ్టీ నెక్ట్స్ 50 ఇండెక్స్కి సంబంధించిన డెరివేటివ్ కాంట్రాక్టులను ప్రారంభించనుంది. ఇందుకు సెబీ నుంచి అనుమతులు వచ్చినట్లు తెలిపింది. 10 లాట్ సైజుతో 3 నెలల ఇండెక్స్ ఫ్యూచర్స్, ఇండెక్స్ ఆప్షన్స్ కాంట్రాక్టులను ప్రవేశపెట్టనున్నట్లు, వీటి కాలవ్యవధి ఎక్స్పైరీ నెలలో చివరి శుక్రవారంతో ముగుస్తుందని పేర్కొంది. 2024 మార్చి నాటికి ఈ ఇండెక్స్లో ఆర్థిక సర్వీసుల రంగం స్టాక్స్ వాటా 23.76 శాతంగా, క్యాపిటల్ గూడ్స్ రంగం వాటా 11.91 శాతం, కన్జూమర్ సరీ్వసెస్ వాటా 11.57 శాతంగా ఉంది. 1997 జనవరి 1న ఈ ఇండెక్స్ను ప్రవేశపెట్టారు. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
సాక్షి మనీ మంత్ర: నష్టాలతో ముగిసిన స్టాక్మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్మార్కెట్లు గురువారం నష్టాలతో ముగిశాయి. మార్కెట్లు ముగిసే సమయానికి నిఫ్టీ 103 పాయింట్లు నష్టపోయి 22,044 వద్దకు చేరింది. సెన్సెక్స్ 454 పాయింట్లు దిగజారి 72,488 వద్దకు చేరింది. సెన్సెక్స్ 30 సూచీలో భారతీ ఎయిర్టెల్, పవర్గ్రిడ్, ఇన్ఫోసిస్, ఎల్ అండ్ టీ, టాటాస్టీల్, రిలయన్స్ ఇండస్ట్రీస్ కంపెనీ షేర్లు మినహా మిగతావి నష్టాల్లోకి చేరుకున్నాయి. నెస్లే, టైటాన్, యాక్సిస్ బ్యాంక్, ఎన్టీపీసీ, టాటా మోటార్స్, ఐటీసీ, సన్ఫార్మా, బజాన్ ఫిన్సర్వ్, ఇండస్ఇండ్ బ్యాంక్, టెక్ మహీంద్రా, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఎస్బీఐ, ఆల్ట్రాటెక్ సిమెంట్ కంపెనీలు భారీగా నష్టపోయిన జాబితాలో ఉన్నాయి. యుద్ధభయాలు విస్తరించడం, వడ్డీ రేట్ల దిశపై అనిశ్చితికి తోడు ముడి చమురు ధరలు పెరుగుతుండడంతో కొంత మంది మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపినట్లు తెలిసింది. మ్యూచువల్ ఫండ్లలో ద్రవ్యలభ్యత అధికంగా ఉండటం వల్ల, సూచీలను కొంతవరకు ఆదుకోవచ్చని నిపుణులు భావిస్తున్నారు. విదేశీ సంస్థాగత మదుపర్లు మంగళవారం నికరంగా రూ.4,468.09 కోట్ల విలువ చేసే షేర్లను విక్రయించారు. దేశీయ సంస్థాగత మదుపర్లు రూ.2,040.38 కోట్ల స్టాక్స్ను కొన్నారు. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
సాక్షి మనీ మంత్ర: గ్రీన్లో ప్రారంభమైన స్టాక్మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్మార్కెట్ సూచీలు గురువారం ఉదయం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:17 సమయానికి నిఫ్టీ 96 పాయింట్లు లాభపడి 22,245కు చేరింది. సెన్సెక్స్ 280 పాయింట్లు దిగజారి 73,219 వద్ద ట్రేడవుతోంది. అమెరికా డాలర్ ఇండెక్స్ 105.93 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 87.4 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.59 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో నష్టాలతో ముగిశాయి. ఎస్ అండ్ పీ 0.58 శాతం నష్టాలపాలైంది. నాస్డాక్ 1.15 శాతం దిగజారింది. భారత ఆర్థిక వ్యవస్థ ఈ ఏడాది 6.5 శాతం వృద్ధిని నమోదు చేయొచ్చని ఐక్యరాజ్యసమితి అంచనా వేసింది. దేశంలో పలు బహుళజాతి కంపెనీలు తమ తయారీని కొనసాగిస్తుండడం వల్ల, భారత ఎగుమతులపై సానుకూల ప్రభావం పడుతోందని పేర్కొంది. 2024లో 6.8%, 2025లో 6.5% మేర భారత్ వృద్ధి నమోదు చేస్తుందని ఇటీవల విడుదలైన ఐఎమ్ఎఫ్ నివేదిక అంచనా వేసింది. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
100 నుంచి 75 వేల పాయింట్ల వరకు ప్రస్థానం
స్టాక్మార్కెట్లో ఒడిదుడుకులు సహజం. స్వల్పకాలంలోనే డబ్బు సంపాదిద్దామని మార్కెట్లోకి వచ్చిన వారికి ఇటీవల ఈక్విటీ మార్కెట్లు కొంత నిరాశ కలిగించే ఉంటాయి. దీర్ఘకాలంలో మంచి రాబడులు పొందాలనుకునే వారు మాత్రం ఇలాంటి ఎత్తుపల్లాలు పట్టించుకోకుండా క్రమశిక్షణతో ఇన్వెస్ట్ చేస్తే తప్పకుండా అనుకున్న ఆర్థిక లక్ష్యాలు చేరుకుంటారని నిపుణులు చెబుతున్నారు. భవిష్యత్తులో ఎన్నో అంతర్జాతీయ అనిశ్చితులు రావొచ్చు. దేశాల మధ్య యుద్ధాలు జరగొచ్చు. కమోడిటీ, ఈక్విటీ మార్కెట్లు భారీ నష్టాల్లోకి వెళ్లొచ్చు. అయినా సరే అన్నింటినీ తట్టుకుని పెట్టుబడి విషయంలో క్రమశిక్షణ పాటిస్తే 20-30 ఏళ్లలో పెట్టుబడిదారుల కోరిక నెరవేరుతుందని నిపుణులు అంటున్నారు. మార్కెట్లు గతంలోనూ చాలా అనిశ్చితులను తట్టుకుని ఇన్వెస్టర్లకు మంచి సంపద సృష్టించాయి. ప్రస్తుతం దేశీయ మార్కెట్లు జీవితకాల గరిష్టాలను తాకుతున్నాయి. 1979లో 100 పాయింట్లు ఉన్న సెన్సెక్స్ ప్రస్తుతం 75000 మార్కును తాకింది. ఈ మధ్యలో ఎన్నో ఆటుపోట్లను తట్టుకుంది. ఆ విషయాలేంటో తెలుసుకుందాం. 100 పాయింట్లు: ఏప్రిల్ 3, 1979లో బీఎస్ఈ సెన్సెక్స్ 100 పాయింట్లను చేరింది. 1000 పాయింట్లు: జులై 23, 1990లో ఈ మార్కెను చేరుకుంది. 900 పాయింట్లు పెరగడానికి అప్పట్లో దాదాపు 11 ఏళ్లు పట్టింది. 5000 పాయింట్లు: సెన్సెక్స్ 1000 పాయింట్లు చేరుకున్నాక దేశీయంగా చాలా పరిణామాలు చోటుచేసుకున్నాయి. జనవరి 17, 1991లో గల్ఫ్యుద్ధం మొదలైంది. జులై 24న మన్మోహన్ సింగ్ ప్రవేశపెట్టిన బడ్జెట్లో కీలక మార్పులు తీసుకొచ్చారు. ఏప్రిల్ 26, 1992లో హర్షద్మెహతా కుంబకోణం సంచలనం సృష్టించింది. జనవరి 01, 1993 నుంచి భారత్లోకి ఎఫ్ఐఐల రాకమొదలైంది. అక్టోబర్ 28, 1997లో ఏషియన్ మార్కెట్లు కుప్పకూలాయి. మే 1,1998లో భారత్ న్యూక్లియర్ పరీక్షలు నిర్వహించింది. అక్టోబర్ 05, 1998లో యూఎస్లో ఆర్థిక అనిశ్చితుల కారణంగో భారత్లోని సెన్సెక్స్ ఓకేరోజు 7 శాతం కుంగింది. మే26, 1999లో పాకిస్థాన్పై భారత్ కార్గిల్ యుద్ధం ప్రకటించింది. డిసెంబర్ 30, 1999లో సెన్సెక్స్ 5000 మార్కును తాకింది. 10000 పాయింట్లు ఏప్రిల్ 13, 2000లో టెక్ కంపెనీలు భారీగా నష్టపోయయి. మార్చి 30, 2001లో కేతన్ప్రకాశ్ స్కామ్ వెలుగులోకి వచ్చింది. జులై 2, 2001లో ‘బద్లా ట్రేడింగ్’ను రద్దు చేశారు. ఫిబ్రవరి 7, 2002లో ఎఫ్ఐఐలకు డెరివేటివ్ ట్రేడింగ్లోకి అనుమతులు ఇస్తూ ప్రకటనలు జారీ చేశారు. ఫిబ్రవరి 6, 2006లో 10000 మార్కెను చేరింది. 25000 పాయింట్లు ఏప్రిల్ 26, 2007లో ఐపీఓ స్కామ్ వెలుగులోకి వచ్చింది. అక్టోబర్ 17,2007లో సెబీ ఎఫ్ఐఐల ఇన్వెస్ట్మెంట్ కంపెనీలో 50 శాతం ఉండేలా పార్టిసిపేటరీ నోట్ పద్ధతిలో మార్పులు తీసుకొచ్చింది. జనవరి 21, 2008 అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది. మే 16, 2014లో సెన్సెక్స్ 25000 మార్కును తాకింది. 50000 పాయింట్లు మే 26, 2014లో నరేంద్రమోదీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. నవంబర్ 9, 2016లో రూ.500, రూ.1000 పెద్దనోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. జులై 1, 2017లో జీఎస్టీను అమలులోకి తీసుకొచ్చారు. సెప్టెంబర్ 14, 2018లో ఎల్ అండ్ ఎఫ్ఎస్ స్కామ్ వెలుగులోకి వచ్చింది. మార్చి 24, 2020లో కొవిడ్ వైరస్ కారణంగా దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించారు. జనవర్ 21, 2021లో సెన్సెక్స్ 50000 మార్కును చేరింది. ఇదీ చదవండి: సెలబ్రిటీలు ఇన్వెస్ట్ చేసిన యూనికార్న్లు ఇవే.. 75000 పాయింట్లు జనవరి 24, 2023లో అదానీ గ్రూప్ సంస్థలపై హిండెన్బర్గ్ ఇచ్చిన నివేదికతో మార్కెట్లు కొంత రెడ్లో ముగిశాయి. నవంబర్ 29, 2023లో భారత్ కంపెనీలు 4 ట్రిలియన్ మార్కెట్ క్యాపిటలైజేషన్కు చేరాయి. ఏప్రిల్ 9, 2024లో సెన్సెక్స్ చివరకు 75000 మార్కును కూడా విజయవంతంగా చేరుకుంది. -
టి+0 సెటిల్మెంట్కు తేదీ ఖరారు చేసిన సెబీ
స్టాక్మార్కెట్లో ట్రేడింగ్ చేసేవారికి ఇప్పటి వరకు టి+1 రోజున అంటే ట్రేడ్ చేసిన మరుసటి రోజున సెటిల్మెంట్ జరుగుతోంది. అయితే తాజాగా సెబీ నిబంధనలు మారుస్తున్నట్లు ప్రకటించింది. దాంతో టి+0తో ట్రేడ్ జరిగిన రోజే షేర్ల సెటిల్మెంట్ పూర్తవుతుంది. ప్రస్తుతానికి సెబీ ఈ సెటిల్మెంట్పై నమూనా పరీక్షలను నిర్వహించనుంది. మార్చి 28, 2024 నుంచి బీటా వర్షన్ను ఆవిష్కరించనుంది. టి+0 సెటిల్మెంట్ను కేవలం 25 షేర్లు, పరిమిత బ్రోకర్లకు మాత్రమే మొదలుపెట్టనున్నారు. తద్వారా వ్యవస్థ సామర్థ్యాన్ని పరిశీలించనున్నారు. అన్ని షేర్లకు ఒకే రోజు సెటిల్మెంట్ను అమలు చేయడానికి ముందు ఈ 25 షేర్లపై జరిపే పరీక్షా ఫలితాలను బట్టి సమీక్ష నిర్వహించి నిర్ణయం తీసుకోనున్నారు. మూడు, ఆరు నెలల కాలంపాటు ఈ పరీక్షల ప్రగతిని సెబీ పరీక్షించనుంది. అన్ని సజావుగా జరిగితే విస్తృత స్థాయిలో టి+0 అమల్లోకి వస్తుంది. బీటా వర్షన్ వినియోగదార్లతో పాటు అన్ని వర్గాలతో చర్చించిన అనంతరం పూర్తిస్థాయిలో అమలు తేదీపై సెబీ ఒక నిర్ణయానికి రానుంది. ఏమిటి ప్రయోజనం.. టి+0 సెటిల్మెంట్ వల్ల బ్రోకర్ల సొంత నిధులను వాడాల్సిన అవసరం పెద్దగా ఉండకపోవచ్చు. తద్వారా మొత్తం మీద వ్యాపార వ్యయాలు తగ్గుతాయి. ప్రస్తుతం ఎవరైనా క్లయింటు షేర్లను విక్రయిస్తే తక్షణం అందుకు సంబంధించిన మొత్తం ట్రేడింగ్ ఖాతాలో పడిపోతోంది. ఆ మొత్తంతో షేర్ల కొనుగోళ్లు చేయడానికి వీలవుతుంది. తక్షణ సెటిల్మెంట్ వల్ల మార్కెట్లో ద్రవ్యలభ్యత పెరుగుతుంది. ఇదీ చదవండి: భారత్లో భారీ నిక్షేపాలు.. తేలిగ్గా, దృఢంగా మార్చే ధాతువు గతంలో 2002 వరకు టి+5 సెటిల్మెంట్ విధానం అమలులో ఉండేది. దాన్ని ఏప్రిల్ 2002లో టి+3కి సెబీ మర్చింది. ఆ తర్వాతి సంవత్సరమే టి+2కు సవరించింది. 2021లో టి+1ను దశలవారీగా అమలు చేయడం ప్రారంభించింది. తుది దశను జనవరి 2023కు పూర్తి చేసింది. -
ఏదైనా పడాల్సిందే.. నష్టాలూ మంచివే!
స్టాక్ మార్కెట్ అంటేనే ఒడిదుడుకుల సహజం. పెట్టుబడి పెట్టిన స్టాక్లకు సంబంధించి, సెబీ, ఆర్బీఐ, ప్రభుత్వం.. తీసుకునే నిర్ణయాలకు సంబంధించి చిన్న వార్త వచ్చినా దానికి ప్రతికూలంగానో, అనుకూలంగానో మార్కెట్లు స్పందిస్తుంటాయి. ఒక్క రోజులోనే మదుపరుల సంపద కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఆవిరవుతుంది.. మరోరోజు తిరిగి గరిష్ఠ స్థాయికి చేరుతుంది. మార్కెట్లో నిత్యం పెరిగే స్టాక్లు ఉండవు. ఎంత మంచి ఫండమెంటల్స్ ఉన్న కంపెనీ షేర్ అయినాసరే ఎప్పుడోఒకప్పుడు పడిపోవాల్సిందే. ఇటీవల మధ్య, చిన్న స్థాయి షేర్ల ధరలు బుడగల్లా పెరుగుతూ వస్తున్నాయని, ఇవి ఏమాత్రం సహేతుకంగా కనిపించడం లేదని మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ అభిప్రాయం వ్యక్తం చేసింది. చిన్న మదుపరులు పెట్టుబడులు పెట్టే ముందు కాస్త అప్రమత్తంగా ఉండాలని సూచిస్తోంది. ఈ నేపథ్యంలో పెట్టుబడుల విషయంలో అనుసరించాల్సిన మార్గాలేమిటో నిపుణులు తెలియజేస్తున్నారు. ఆందోళనతో నష్టాలు.. మార్కెట్ ఎప్పుడూ స్థిరంగా ఉండదు. అస్థిర మార్కెట్లో ఎన్నో భయాందోళనలు ఉంటాయి. వదంతులు వస్తుంటాయి. వీటన్నింటి ఆధారంగా పెట్టుబడి నిర్ణయం తీసుకోవడం మంచిది కాదు. ఆందోళనలకు గురిచేసే విశ్లేషణలు, సలహాలతో చాలామంది తమ పెట్టుబడులను వెనక్కి తీసుకోవడం, నష్టపోవడం చూస్తూనే ఉంటారు. మార్కెట్లు తిరిగి కోలుకున్నప్పుడు రాబడి ఆర్జించే అవకాశాలు కోల్పోతారు. పెరుగుతున్న ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్లలాంటివి మీ దగ్గరున్న నగదు నిల్వల విలువను తగ్గిస్తాయి. పెట్టుబడుల రూపంలో ఉన్నప్పుడే మంచి ఫలితాలు రాబట్టుకోగలం. పెట్టుబడుల విలువ తగ్గిపోగానే ఆందోళన చెందడం కాదు. మీరు తెలుసుకుంటున్న సమాచారం ఎంత మేరకు సరైనదో చూసుకోండి. మార్కెట్లు పడిపోతున్నప్పుడు పెట్టుబడుల విలువ తగ్గడం సహజమేననే వాస్తవాన్ని అంగీకరించాలి. అందుకు తగ్గట్టుగా ప్రణాళికలు వేసుకోవాలి. దీర్ఘకాలంలో అధిక రాబడి దీర్ఘకాల లక్ష్యాలతో మార్కెట్లో పెట్టుబడి పెడితే అధికమొత్తంలో రాబడి అందుతుంది. చాలా మంది మొదట లాంగ్టర్మ్ కోసమనే మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తారు. కానీ ఇతర కారణాల వల్ల స్వల్పకాలంలోనే ఆ మొత్తాన్ని ఉపసంహరించుకుంటారు. దాంతో నష్టమే కలుగుతుంది. పెట్టుబడులు ఎప్పుడూ ఏదో ఒక ఆర్థిక లక్ష్యానికి అనుగుణంగా ఉండాలి. వాటిని సాధించే వరకూ మదుపు సాగుతూనే ఉండాలి. మధ్యలోనే వదిలేయొద్దు. నష్టాన్ని పరిమితం చేసేలా.. మార్కెట్లో నష్టం రావడం సాధారణం. అలాఅని తీవ్ర నష్టాల్లోకి వెళ్లే వరకు పెట్టుబడులను కొనసాగించకూడదు. ఫలానా నష్టం వరకు భరించేలా స్టాప్లాస్ను ఉంచుకోవాలి. నష్టభయాన్ని పరిమితం చేసుకునేందుకు ప్రయత్నించాలి. పెట్టుబడులు ఒకే చోట కాకుండా.. పలు పథకాలకు కేటాయించాలి. నష్టభయం అధికంగా ఉంటూ, ఎక్కువ రాబడినిచ్చే పథకాల్లో కొంత, సురక్షిత పథకాల్లో కొంత మొత్తం మదుపు చేయాలి. ఈక్విటీ ఆధారిత పెట్టుబడులే కాకుండా, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ల వంటి స్థిరాదాయ పథకాలనూ ఎంచుకోవాలి. ఇదీ చదవండి: హైదరాబాద్లో ఇళ్లు అ‘ధర’హో.. మార్కెట్ పతనం మంచి అవకాశం మంచి యాజమాన్యం, పనితీరు బాగున్న సంస్థల షేర్లు పతనం సమయంలో అందుబాటు ధరలోకి వస్తాయి. ఇలాంటి వాటిని ఎంచుకొని, దీర్ఘకాలిక దృష్టితో పెట్టుబడులు పెట్టే ప్రయత్నం చేయాలి. మార్కెట్లు మళ్లీ పెరుగుతున్నప్పుడు ఇవి మంచి లాభాలను పంచే అవకాశం లేకపోలేదు. మంచి షేర్లను అవకాశాన్ని బట్టి యావరేజ్ చేసుకోవచ్చు. నష్టభయాన్ని ఎంత మేరకు భరించగలరో చూసుకోవాలి. -
భారీగా పడుతున్న స్టాక్మార్కెట్లు.. కారణాలు ఇవే..
స్టాక్మార్కెట్ అంటేనే ఒడిదొడుకులతో నిండి ఉంటుంది. దాన్ని పూర్తిగా అర్థం చేసుకోనివారు అదో గ్యాంబ్లింగ్ అనుకుంటారు. కానీ కాస్త అనుభవం ఉన్నవారు, మార్కెట్ను నిత్యం పరిశీలిస్తున్నవారికి అందులోని ఆంతర్యం అర్థం అవుతుంది. ఎలాంటి సందర్భాల్లో ఎలా స్పందిస్తుందో చెప్పేస్తారు. అలాఅని వారు అనుకుంది ప్రతిసారి జరగాలని మాత్రం లేదు. మార్కెట్లో నిత్యం నేర్చుకోవాల్సిందే. ఈరోజు మార్కెట్లో అనుకున్న స్ట్రాటజీ రేపు పనిచేయకపోవచ్చు. కాబట్టి మార్కెట్లో అన్నివేళలా ప్రతిస్ట్రాటజీ పనిచేస్తుందనుకోవద్దు. ఈ మధ్య మార్కెట్లు వరుసగా భారీగా దిద్దుబాటుకు గురవుతున్నాయి. స్టాక్ మార్కెట్లో బుధవారం స్మాల్, మిడ్క్యాప్ సూచీల పతనం కొనసాగింది. ఈ ఏడాది ఫిబ్రవరి 7న ఈ సూచీలు గరిష్ఠాలకు చేరాయి. తదుపరి నష్టపోతూ వస్తున్నాయి. ఇప్పటివరకు స్మాల్క్యాప్ సూచీ 12%, మిడ్క్యాప్ సూచీ 6% పతనమయ్యాయి. గత కొన్ని సెషన్లలో చిన్న, మధ్యస్థాయి కంపెనీల షేర్లు భారీగా పడిపోతున్నాయి. ఇందుకు కారణాలు కింది విధంగా ఉన్నాయి. సెబీ మ్యూచువల్ ఫండ్స్కు సంబంధించి స్ట్రెస్ టెస్ట్ డేటాను ఈ నెల 15న వెలువరించనుంది. దాంతో ఫండ్స్లోని నిధులు ఏమేరకు వచ్చాయి. ఎలా వచ్చాయి. ఎక్కడ ఇన్వెస్ట్ చేశారు.. వంటి అనేక అంశాలను పరిగణిస్తూ రిపోర్ట్ వెలువడనుంది. అయితే ఇప్పటికే చాలామంది ఇన్వెస్టర్లు వారి పోర్ట్ఫోలియోలోని మ్యూచువల్ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్లను అమ్మేసినట్లు తెలిసింది. కానీ ఈ ర్యాలీ 15వ తేదీ వరకు కొనసాగనుందని సమాచారం. పొజిషన్లను కొనసాగించేందుకు ఖాతాదారుల నుంచి అదనపు మార్జిన్ సొమ్మును బ్రోకర్లు అడుగుతున్నారు. దీంతో కొంత మంది పొజిషన్లను అమ్మేస్తున్నారు. దుబాయ్కు చెందిన హవాలా ఆపరేటర్ హరిశంకర్ టిబ్రేవాలాపై ఎన్ఫోర్స్మెంట్ దాడులు చేయడం ప్రతికూల ప్రభావం చూపింది. అక్కడ నుంచి నిధులు దేశీయ స్టాక్మార్కెట్లలోకి అక్రమంగా చేరుతున్నాయనే ఆరోపణలున్నాయి. కొన్ని చిన్న, మధ్య స్థాయి కంపెనీల షేర్ల ధరలు బుడగల్లా ఉన్నాయని సెబీ ఛైర్పర్సన్ మాధబి పురి పేర్కొనడమూ, మదుపర్ల సెంటిమెంట్ను దెబ్బతీసింది. మదుపర్ల ప్రయోజనాలు పరిరక్షించేలా అప్రమత్తంగా వ్యవహరించాలని స్మాల్, మిడ్క్యాప్ మ్యూచువల్ ఫండ్ పథకాలకు సెబీ గత నెలలో నియమావళి జారీ చేయడమూ ఆందోళనకు కారణమైంది. సాధారణంగానే ఆర్థిక సంవత్సరం చివరి నెల అయిన మార్చిలో విక్రయాలు జరుపుతుంటారు. గత 23 ఏళ్లలో సగానికి పైగా సార్లు, మార్చిలో ఈ షేర్లు ప్రతికూల ప్రతిఫలాలు ఇచ్చాయి. అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండిమా(ఆంఫీ) ఇటీవల పలు ఫండ్స్లో వస్తున్న రిటైల్ ఇన్వెస్టర్ల డబ్బులు ఆపేలా చర్యలు తీసుకుంది. దాంతో చాలా ఫండ్స్ మేనేజర్లు లమ్సమ్ నగదును నిలిపేశాయి. ఇదీ చదవండి: ఒకసారి ఛార్జ్ చేస్తే హైదరాబాద్ టు శ్రీకాకుళం! ప్రస్తుతం నెలకొంటున్న మార్కెట్ ఒడిదొడుకుల్లో స్వల్పకాల పెట్టుబడుల కోసం ఇన్వెస్ట్ చేసేవారు కాస్త ఆచుతూచి వ్యవహరించాలని నిపుణులు చెబుతున్నారు. దీర్ఘకాల పెట్టుబడుల కోసం ఇన్వెస్ట్ చేసేవారికి ఇదో మంచి అవకాశం అని సూచిస్తున్నారు. -
మార్కెట్కు బ్యాంకింగ్ షేర్ల దన్ను
ముంబై: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐసీఐసీఐ బ్యాంక్ వంటి బ్యాంకింగ్ షేర్లు, రిలయన్స్ ఇండస్ట్రీస్ తదితర స్టాక్స్లో కొనుగోళ్ల ఊతంతో శుక్రవారం దేశీ సూచీలు లాభాల్లో ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 167 పాయింట్లు (0.23 శాతం) లాభపడి 71,595 వద్ద, నిఫ్టీ సుమారు 65 పాయింట్లు లాభంతో (0.30 శాతం) 21,782.50 పాయింట్ల వద్ద క్లోజయ్యాయి. సెన్సెక్స్ ఇంట్రాడేలో 71,676–71,200 శ్రేణిలో తిరుగాడింది. ఆద్యంతం హెచ్చుతగ్గులకు లోనైన మార్కెట్.. బ్యాంకింగ్, ఎఫ్ఎంసీజీ షేర్లలో కొనుగోళ్లతో స్వల్పంగా లాభపడిందని విశ్లేషకులు తెలిపారు. మరోవైపు, మెటల్, టెలికం, విద్యుత్ రంగ సంస్థల షేర్లలో అమ్మకాలు జరిగాయి. వేల్యుయేషన్లు భారీగా పెరిగిపోవడంతో మిడ్, స్మాల్ క్యాప్ సూచీలు అత్యధికంగా ఒత్తిడికి గురైనట్లు జియోజిత్ ఫైనాన్షియల్ సరీ్వసెస్ రీసెర్చ్ విభాగం హెడ్ వినోద్ నాయర్ తెలిపారు. 52 వారాల గరిష్టానికి జొమాటో.. పేటీఎం మరింత డౌన్.. క్యూ3లో లాభాలు ప్రకటించిన ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో షేర్లు దాదాపు 4 శాతం పెరిగాయి. బీఎస్ఈలో ఒక దశలో 5 శాతం ఎగిసి 52 వారాల గరిష్ట స్థాయి రూ. 151ని తాకాయి. చివరికి సుమారు 4 శాతం లాభంతో రూ. 149.45 వద్ద క్లోజయ్యాయి. మరోవైపు, పేటీఎం మాతృసంస్థ వన్97 కమ్యూనికేషన్స్ షేర్ల పతనం కొనసాగుతోంది. కంపెనీ షేరు బీఎస్ఈలో మరో 6 శాతం క్షీణించి రూ. 419.85 వద్ద క్లోజయ్యింది. రెండు రోజుల్లో షేరు 15 శాతం మేర పతనమైంది. రూ. 4,871 కోట్ల మార్కెట్ వేల్యుయేషన్ కరిగిపోయింది. నిబంధనల ఉల్లంఘన కారణంగా.. ఫిబ్రవరి 29 నుంచి దాదాపుగా అన్ని కార్యకలాపాలు నిలిపివేయాలంటూ వన్97కి అసోసియేట్ సంస్థ అయిన పేటీఎం పేమెంట్స్ బ్యాంకును ఆర్బీఐ ఆదేశించిన సంగతి తెలిసిందే. మరిన్ని విశేషాలు.. ► బీఎస్ఈ స్మాల్క్యాప్ సూచీ 1.36 శాతం, మిడ్క్యాప్ ఇండెక్స్ 0.82 శాతం క్షీణించాయి. రంగాలవారీగా చూస్తే ఆయిల్ అండ్ గ్యాస్ సూచీ 1.97 శాతం, మెటల్ 1.62 శాతం, టెలికమ్యూనికేషన్ 1.45 శాతం, విద్యుత్ 1.10 శాతం మేర తగ్గాయి. బ్యాంకెక్స్, ఎఫ్ఎంసీజీ, ఫైనాన్షియల్ సరీ్వసెస్, కన్జూమర్ డ్యూరబుల్స్, హెల్త్కేర్ రంగాల షేర్లు లాభపడ్డాయి. ► విదేశీ ఇన్వెస్టర్లు (ఎఫ్ఐఐ, ఎఫ్పీఐ) నికరంగా రూ. 142 కోట్లు కొనుగోళ్లు చేయగా, దేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు రూ. 422 కోట్ల మేర విక్రయాలు జరిపారు. ► వారంవారీగా చూస్తే సెన్సెక్స్ 490 పాయింట్లు (0.67 శాతం), నిఫ్టీ 71 పాయింట్లు (0.32 శాతం) మేర తగ్గాయి. ► ఆసియా మార్కెట్లలో టోక్యో, షాంఘై లాభాల్లోనూ, హాంకాంగ్ నష్టాల్లోనూ ముగిశాయి. యూరప్ మార్కెట్లు మిశ్రమంగా ట్రేడయ్యాయి. -
ట్రేడింగ్ సమయం పెంపు.. సెబీ చీఫ్ ఏమన్నారో తెలుసా..
దేశీయ స్టాక్మార్కెట్లో ట్రేడింగ్ సమయాన్ని పెంచాలనే సూచనపై మార్కెట్ నియంత్రణ మండలి సెబీ కీలక వ్యాఖ్యలు చేసింది. సెబీ ఇప్పటి వరకు దీనిపై ఒక అభిప్రాయానికి రాలేదని సెబీ ఛైర్పర్సన్ మాధవి పురి బుచ్ అన్నారు. అయితే ఏ ఒక్కరి నుంచీ తమకు ట్రేడింగ్ సమయానికి సంబంధించి ప్రతిపాదన రాలేదన్నారు. స్టాక్ బ్రోకర్లు నిర్వహించిన ఒక సదస్సులో ఆమె ఈ విషయాన్ని స్పష్టం చేశారు. అయితే బ్రోకింగ్ కంపెనీ యజమాన్యం మాత్రం వారివారి మదుపర్ల అభిప్రాయాలకు అనుగుణంగా నిర్ణయాలను సేకరించి ఫిబ్రవరి నెలాఖరులోపు తమ అభిప్రాయం చెబుతామన్నట్లు తెలిసింది. ఇదీ చదవండి: బడ్జెట్ 2024-25 కథనాల కోసం క్లిక్ చేయండి ట్రేడింగ్ సమయాన్ని పొడిగించడం వల్ల కొన్ని నష్టాలు ఉంటాయని సెబీ చీఫ్ హెచ్చరించారు. ప్రస్తుతం సెబీ వద్ద ఉన్న మౌలిక సదుపాయాలతో ట్రేడింగ్ సమయాన్ని పెంచడం సాధ్యం కాదని తేల్చి చెప్పారు. ఒకవేళ ట్రేడింగ్ సమయం పెంచితే ఈక్విటీ మార్కెట్లకు, కమోడిటీస్ మార్కెట్కు తేడా లేకుండా పోతుందన్నారు. ప్రస్తుతం ఉదయం 9.15 గంటల నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు ఈక్విటీ మార్కెట్ ట్రేడింగ్ జరుగుతోంది. -
సాక్షి మనీ మంత్ర: నష్టాల్లో ముగిసిన మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్మార్కెట్ సూచీలు మంగళవారం నష్టాల్లో ట్రేడింగ్ ముగించాయి. నిఫ్టీ 211 పాయింట్ల నష్టంతో 21,527కు చేరింది. సెన్సెక్స్ 786 పాయింట్లు తగ్గి 71,183 వద్ద ముగిసింది. సెన్సెక్స్ 30 సూచీలో టాటా మోటార్స్, ఎస్బీఐ, హెచ్యూఎల్, టెక్ మహీంద్రా పవర్గ్రిడ్ షేర్లు లాభాల్లో ముగిశాయి. బజాజ్ ఫైనాన్స్, టైటాన్, ఆల్ట్రాటెక్ సిమెంట్, ఎన్టీపీసీ, బజాజ్ ఫిన్సర్వ్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐటీసీ, సన్ఫార్మా, ఎల్ అండ్ టీ, ఎం అండ్ ఎం, హెచ్సీఎల్ టెక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేర్లు నష్టాల్లో ట్రేడింగ్ ముగించాయి. అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ బ్రెంట్ చమురు ధర గత 24 గంటల్లో 0.15 శాతం పెరిగి 82.52 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ‘విదేశీ సంస్థాగత మదుపరులు (ఎఫ్ఐఐ)’ సోమవారం రూ.110 కోట్ల విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు. ‘దేశీయ సంస్థాగత మదుపరులు (డీఐఐ)’ సైతం రూ.3,221.34 కోట్ల విలువ చేసే షేర్లను కొన్నారు. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
సాక్షి మనీ మంత్ర: బడ్జెట్ ర్యాలీ.. భారీ లాభాల్లో ముగిసిన మార్కెట్లు
దేశీయ స్టాక్మార్కెట్లు సోమవారం భారీగా పుంజుకున్నాయి. రానున్న బడ్జెట్ నేపథ్యంలో మదుపర్లు మార్కెట్లో అధికమొత్తంలో షేర్లను కొనుగోలు చేసినట్లు తెలిసింది. మార్కెట్ ముగిసే సమయానికి నిఫ్టీ 387.45 పాయింట్లు పుంజుకుని 21,740.05కు చేరింది. సెన్సెక్స్ 1,203.29 పాయింట్లు లాభపడి 71,903.96 వద్ద ట్రేడింగ్ ముగించింది. మధ్యంతర కేంద్ర బడ్జెట్ 2024–25 ప్రభావిత అంశాలు, యూఎస్ ఫెడరల్ రిజర్వ్, బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ ద్రవ్య పాలసీ నిర్ణయాలు ఈ వారం మార్కెట్కు అత్యంత కీలకం కానున్నాయని స్టాక్ నిపుణులు భావిస్తున్నారు. వాహన విక్రయ డేటా, అదే నెలకు సంబంధించి కొన్ని స్థూల ఆర్థిక గణాంకాలు వెల్లడికానున్నాయి. దేశీయ కార్పొరేట్ డిసెంబర్ త్రైమాసిక ఆర్థిక ఫలితాలు తుది దశకు చేరుకున్నాయి. అమెరికా సెంట్రల్ బ్యాంక్ యూఎస్ ఫెడరల్ రిజర్వ్ సమావేశం మంగళవారం(జనవరి 30న) ప్రారంభమవుతుంది. ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ తీసుకున్న నిర్ణయాలను ఫెడ్ చైర్మన్ జెరోమ్ పావెల్ బుధవారం(జనవరి 31)రోజున ప్రకటిస్తారు. ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు తగ్గుముఖం పట్టినట్లయితే ఈ ఏడాదిలో మూడు దఫాలు వడ్డీరేట్ల కోత ఉంటుందని గతేడాది డిసెంబర్లో పాలసీ ప్రకటన సందర్భంగా ఫెడ్ సంకేతాలిచ్చింది. ఈ దఫా ఫెడ్ కీలకవడ్డీ రేట్లను ప్రస్తుత స్థాయి (5.25 – 5.50 వద్ద) యథాతథంగా కొనసాగవచ్చు. అయితే బాండ్ల కొనుగోలు, ఆర్థిక వ్యవస్థ పనితీరుపై పావెల్ ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారోనని ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు ఆసక్తి ఎదురుచూస్తున్నాయి. యూఎస్ జీడీపీ అంచనాలకు మించి నమోదైన నేపథ్యంలో మార్కెట్ వర్గాలు ఫెడ్ చైర్మన్ పావెల్ వ్యాఖ్యలను నిశీతంగా పరిశీలించే వీలుంది. ఫెడ్ పాలసీ తర్వాత దలాల్ స్ట్రీట్ వర్గాలు అత్యంత ఆస్తకిగా ఎదురుచూసే మరో కీలక ఘట్టం బడ్జెట్. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి ఒకటిన మధ్యంతర బడ్జెట్ 2024–25 ను ప్రవేశపెట్టనున్నారు. సార్వత్రిక ఎన్నికల వేళ ప్రజాకర్షక బడ్జెట్ ఉండొచ్చనేది అత్యధిక వర్గాల అంచనా. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
అమ్మకాలను కట్టడి చేసేందుకే చైనా కఠిన నిర్ణయాలు..
స్టాక్మార్కెట్లో ఒడిదొడుకులు సహజం. ఏదైనా అనిశ్చిత పరిస్థితుల్లో మార్కెట్లు మరింత ఎక్కువగా ఊగిసలాడుతాయి. అయితే మార్కెట్లో నిత్యం భారీగా అమ్మకాలపర్వం కొనసాగితే ఆ దేశ ఆర్థికవ్యవస్థకు నష్టం జరుగుతుంది. దాంతో ఎక్స్ఛేంజ్ రెగ్యులేటరీలు కొత్త నిబంధనలు తీసుకొస్తాయి. ఫలితంగా కొంత నష్టాన్ని అరికట్టేలా చర్యలు తీసుకుంటాయి. తాజాగా చైనా మార్కెట్లో అమ్మకాలు వెల్లువెత్తుతున్నాయి. దాంతో దేశ ఆర్థిక వ్యవస్థను కాపాడుకునేందుకు స్టాక్ మార్కెట్ నిబంధనలను మరింత కఠినతరం చేసింది. చైనా వరుస అమ్మకాల ఒత్తిడిని కట్టడి చేసేందుకు ఏర్పాట్లు చేసింది. కొవిడ్ అనంతరం అక్కడి మార్కెట్ వెళ్లిన జీవనకాల గరిష్ఠాల నుంచి క్రమంగా చైనా, హాంకాంగ్ మార్కెట్లలో ఆరు ట్రిలియన్ డాలర్ల సంపదను మదుపర్లు విక్రయించి దేశానికి షాక్ ఇచ్చారు. ఈ తరుణంలో దేశంలోని ఆర్థిక నిపుణులు సలహా మేరకు అక్కడి మార్కెట్ రెగ్యులేటర్లు దిద్దుబాటు చర్యలకు పూనుకున్నాయి. ఇందులో భాగంగా చైనా కొత్త నిబంధనలు అమలు చేయనుంది. షార్ట్ సెల్లింగ్కు సంబంధించి ‘చైనా సెక్యూరిటీస్ రెగ్యులేటరీ కమిషన్ (సీఎస్ఆర్సీ)’ పరిమితులు విధించింది. ఈ నిబంధనలు ఈరోజు నుంచే అమల్లోకి రానున్నట్లు తెలిపింది. ‘రెస్ట్రిక్టెడ్ స్టాక్స్’ లిస్ట్లో ఉన్న షేర్లను ఇతరులకు అప్పుగా ఇచ్చేలా గతంలో ఉన్న నిబంధనలను ఎత్తివేస్తున్నట్లు సీఎస్ఆర్సీ తెలిపింది. దీనిపై మరిన్ని షరతులను మార్చి మూడోవారంలో తెలియజేయనున్నట్లు ప్రకటించింది. ఇదీ చదవండి: అమెరికా వార్నింగ్ ఇచ్చినా ఒకేసారి మూడు ఉపగ్రహాలు ప్రయోగించిన దేశం..! చైనా వృద్ధి రేటు చాలా ఏళ్లపాటు నెమ్మదిగా ఉంటుందనే అంచనాలు వస్తున్నాయి. గత రెండు దశాబ్దాలుగా ఆ దేశ ఆర్థిక వృద్ధిలో కీలక పాత్ర పోషించిన స్థిరాస్తి రంగం ప్రస్తుతం దారుణ పరిస్థితుల్లో ఉన్నట్లు తెలిసింది. అక్కడి స్టాక్ మార్కెట్ మదుపర్లు పెద్ద ఎత్తున అమ్మకాలు చేస్తున్నట్లు సమాచారం. దాంతో దేశ ఆర్థిక వ్యవస్థను ఎలాగైనా పటిష్ట పరుచుకోవాలని భావించిన ప్రభుత్వం ఈ చర్యలకు పూనుకున్నట్లు తెలిసింది. -
సాక్షి మనీ మంత్ర: మార్కెట్లో తీవ్ర ఒడిదొడుకులు.. నష్టాల్లో ముగిసిన సూచీలు
దేశీయ స్టాక్మార్కెట్ సూచీలు గురువారం తీవ్ర ఒడిదొడుకులకు లోనయ్యాయ. మార్కెట్ ప్రారంభం నుంచి ముగిసే సమయం వరకు నష్టాల్లో ట్రేడయింది. నిఫ్టీ 75 పాయింట్లు నష్టపోయి 21,378కు చేరింది. సెన్సెక్స్ 359 పాయింట్లు దిగజారి 70.700వద్ద ట్రేడింగ్ ముగించింది. మార్కెట్ రెగ్యులేటరీ సెబీ ఎఫ్ఐఐలకు సంబంధించి కీలక ప్రకటన చేసింది. దాంతో ఎఫ్ఐఐలు ఈక్విటీ మార్కెట్నుంచి భారీ మొత్తంలో స్టాక్లు విక్రయిస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు. దాంతోపాటు చైనా రిజర్వ్ రేషియో రిక్వైర్మెంట్స్(ఆర్ఆర్ఆర్)ను 50 బేసిస్ పాయింట్లు కట్ చేసింది. దాంతో ఎఫ్ఐఐలు భారీగా చైనాకు తరలిపోతున్నట్లు అంచనా వేస్తున్నారు. ఫలితంగా దేశీయ మార్కెట్లో కొంత అనిశ్చితి నెలకొంటుందని భావిస్తున్నారు. సెన్సెక్స్ 30 సూచీలో ఎన్టీపీసీ, ఇండస్ఇండ్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, బజాజ్ఫిన్సర్వ్, రిలయన్స్ ఇండస్ట్రీస్, బజాజ్ ఫైనాన్స్, ఎం అండ్ ఎం, టైటాన్, టాటా మోటార్స్ కంపెనీ స్టాక్లు లాభాల్లో ముగిశాయి. టెక్ మహీంద్రా, భారతీఎయిర్టెల్, ఐటీసీ, విప్రో, నెస్లే, ఏషియన్ పెయింట్స్, హెచ్సీఎల్ టెక్నాలజీస్, టాటా స్టీల్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ స్టాక్ షేర్లు నష్టాల్లో ట్రేడయ్యాయి. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
సాక్షి మనీ మంత్ర: భారీగా పుంజుకున్న మార్కెట్లు
దేశీయ స్టాక్మార్కెట్లు బుధవారం భారీగా పుంజుకున్నాయి. మంగళవారం అమ్మకాలకు ఆసక్తి చూపిన మదుపర్లు బుధవారం కొనుగోలు వైపు మళ్లారు. నిఫ్టీ 227 పాయింట్లు లాభపడి 21,465కు చేరింది. సెన్సెక్స్ 689 పాయింట్లు ఎగబాకి 71,060 వద్ద ముగిసింది. సెన్సెక్స్ 30 సూచీలో టాటా స్టీల్, హెచ్సీఎల్ టెక్నాలజీస్, ఇండస్ఇండ్ బ్యాంక్, పవర్గ్రిండ్, టెక్ మహీంద్రా, బజాజ్ ఫిన్సర్వ్, భారతీ ఎయిర్టెల్, జేఎస్డబ్ల్యూ స్టీల్, ఎన్టీపీసీ షేర్లు భారీ లాభాల్లోకి చేరుకున్నాయి. ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్బ్యాంక్, ఏషియన్ పెయింట్స్, టీసీఎస్ నష్టాల్లో ట్రేడింగ్ ముగించాయి. అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ బ్రెంట్ చమురు ధర గత 24 గంటల్లో స్వల్పంగా పెరిగి 79.59 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ‘విదేశీ సంస్థాగత మదుపరులు (FIIs)’ మంగళవారం రూ.3,115.39 కోట్ల విలువ చేసే షేర్లను విక్రయించారు. ‘దేశీయ సంస్థాగత మదుపరులు (DIIs)’ రూ.214.40 కోట్ల విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు. -
సాక్షి మనీ మంత్ర: భారీ నష్టాల్లో స్టాక్మార్కెట్లు
దేశీయ స్టాక్మార్కెట్లు మంగళవారం లాభాల్లో ప్రారంభమైనప్పటికీ మార్కెట్ ముగిసే సమయానికి భారీ నష్టాల్లోకి జారుకున్నాయి. నిఫ్టీ 333 పాయింట్లు నష్టపోయి 21,238 వద్దకు చేరింది. సెన్సెక్స్ 1,053 పాయింట్లు దిగజారి 70,370 వద్దకు చేరింది. సెన్సెక్స్ 30 సూచీలో సన్ఫార్మా, భారతిఎయిర్టెల్, ఐసీఐసీఐ బ్యాంక్, టీసీఎస్, బజాజ్ ఫిన్సర్వ్ స్టాక్ షేర్లు లాభాల్లో ముగిశాయి. ఇండస్ఇండ్ బ్యాంక్, ఎస్బీఐ, హెచ్యూఎల్, యాక్సిస్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, బజాన్ ఫైనాన్స్, టాటా స్టీల్, ఎల్ అండ్ టీ, జేఎస్డబ్ల్యూ స్టీల్, ఏషియన్ పెయింట్స్ రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు నష్టాల్లో ముగించాయి. అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ బ్రెంట్ చమురు ధర గత 24 గంటల్లో 0.17 శాతం తగ్గి 79.92 డాలర్లకు చేరింది. ‘విదేశీ సంస్థాగత మదుపరులు (FIIs)’ శనివారం రూ.545.58 కోట్ల విలువ చేసే షేర్లను విక్రయించారు. ‘దేశీయ సంస్థాగత మదుపరులు (DIIs)’ సైతం రూ.719.31 కోట్ల విలువ చేసే వాటాలను అమ్మేశారు. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
సాక్షి మనీ మంత్ర: శనివారం లాభాల్లో ప్రారంభమైన మార్కెట్లు.. సోమవారం సెలవు
దేశీయ స్టాక్ ఎక్ఛేంజీలు శనివారం ఓపెన్లోనే ఉన్నాయి. ముందుగా ఈరోజు కొద్ది సమయమే మార్కెట్లు పని చేస్తాయని ప్రకటించిన ఎన్ఎస్ఈ, బీఎస్ఈలు రోజంతా మార్కెట్ ఓపెన్లోనే ఉండనున్నట్లు తెలిపాయి. అయోధ్యలోని రామ మందిర ప్రతిష్ఠాపనకు సంబంధించి మహారాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించడంతో జనవరి 22న నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్లో ట్రేడింగ్ జరగదని ఒక అధికారి తెలిపారు. దేశీయ మార్కెట్లు శనివారం లాభాల్లో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:16 సమయానికి నిఫ్టీ 68 పాయింట్లు లాభపడి 21698కు చేరింది. సెన్సెక్స్ 754 పాయింట్లు పుంజుకుని 71,941 వద్ద ట్రేడవుతోంది. ఎఫ్ఐఐలు శుక్రవారం రూ.3689.68 కోట్ల విలువైన షేర్లు విక్రయించారు. డీఐఐలు రూ.2638.46 కోట్లు షేర్లు కొనుగోలు చేశారు. అమెరికాలోని నాస్డాక్ 1.7 శాతం లాభాల్లో ముగిసింది. పదేళ్ల కాలపరిమితి ఉన్న యూఎస్ బాండ్ఈల్డ్ 2 బేసిస్పాయింట్లు తగ్గి 4.13 శాతానికి చేరాయి. డాలర్ ఇండెక్స్ 0.29 శాతం తగ్గి 103.24 వద్దకు చేరింది. క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 78.88 యూఎస్ డాలర్ల వద్ద ఉంది. మిచిగాన్ యూనివర్సిటీ చేసిన సర్వేలో ద్రవ్యోల్బణం తగ్గుతున్నట్లు వెల్లడైంది. ఇది మార్కెట్లకు కొంత ఊరట కలిగించే అంశంగా ఉంది. మార్కెట్లో ఇప్పటికే ఐటీస్టాక్ల ర్యాలీ కనబతుతోంది. దీనికితోడు బ్యాంకింగ్రంగ స్టాక్లు తోడ్పాటునందిస్తే మరింత దూసుకుపోయే అవకాశం ఉంది. కానీ ఇటీవల విడుదలైన హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఫలితాలు మదుపర్లకు కొంత నిరాశ కలిగించాయని మార్కెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. అయితే ఇవాళ రాబోయే ఐసీఐసీఐ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ ఫలితాలను అనుసరించి మార్కెట్ ర్యాలీ ఉండనుందని సమాచారం. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
ఫలితాలు ఎలా ఉన్నా ఇవి మాత్రం..
దేశీయ స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయిన కంపెనీలు ఒక్కొక్కటిగా తమ మూడో త్రైమాసిక ఫలితాలను విడుదల చేస్తున్నాయి. స్టాక్ ఫలితాలకు తగ్గట్టుగా మన పెట్టుబడి వ్యూహాన్ని మారుస్తుంటాం. అయితే కొన్ని రోజులుగా మార్కెట్ను అనుసరిస్తున్నవారు, కొత్తగా మార్కెట్లోకి వచ్చినవారు ఈ సమయంలో ఎలా స్పందించాలో నిపుణులు కొన్ని సలహాలు సూచనలు చేస్తున్నారు. మన పోర్ట్ఫోలియోలోని కంపెనీలు వాటి ఫలితాలను ఎప్పుడు విడుదల చేస్తుందో ట్రాక్ చేయాలి. ఇది సాధారణంగా ముందుగానే షెడ్యూల్ చేస్తారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను కంపెనీ ఇన్వెస్టర్ రిలేషన్స్ వెబ్సైట్లో పొందుపరుస్తారు. ఫలితాల్లో కంపెనీలు తమ ఆదాయాలు, బ్యాలెన్స్ షీట్, క్యాష్ఫ్లో సహా దాని ఆర్థిక నివేదికలను ప్రకటిస్తాయి. స్టాక్కు సంబంధించి ఏదైనా నిర్ణయం తీసుకునేముందు వాటిని క్షుణ్ణంగా చదివి అర్థం చేసుకోవాలి. ఈ నివేదికల వల్ల కంపెనీ పనితీరును సమీక్షించడానికి వీలువతుంది. కంపెనీలు ఫలితాలు విడుదల చేయడానికి ముందే ఆర్థిక నిపుణలు, విశ్లేషకులు తరచు సంస్థ పనితీరును గమనిస్తూ రిజల్ట్స్ను అంచనా వేస్తారు. ఈ అంచనాలతో వాస్తవ ఫలితాలను సరిపోల్చాలి. ఒకవేళ ఫలితాలు అంచనాలను మించి ఉంటే అది సానుకూలంగా పరిగణించవచ్చు. గతంలో కంపెనీ పనితీరు ఎలా ఉంది.. ఫలితాలు ప్రభావితం చేసే ఏవైనా ఆర్థిక అంశాలు ఉన్నాయో అర్థం చేసుకోవాలి. చాలా కంపెనీలు వాటి భవిష్యత్ పనితీరుపై మార్గదర్శకత్వం లేదా ఔట్లుక్ను విడుదల చేస్తాయి. సానుకూలంగా నివేదికలు అందించే కంపెనీల్లో స్టాక్ పెరుగుదల చూడవచ్చు. ఫలితాల వల్ల మార్కెట్ ఎలా స్పందిస్తుందో గమనించాలి. ఒక్కోసారి స్టాక్ ధర వేగంగా పడిపోవచ్చు..పెరగొచ్చు. స్టాక్ సంబంధించిన అన్ని అంశాలను గమనించాలి. దీర్ఘకాలిక పెట్టుబడిదారులైతే స్టాక్ ధరలో హెచ్చుతగ్గులు అంతగా పట్టించుకోవద్దు. స్వల్పకాలిక మార్కెట్ కదలికల ఆధారంగా హఠాత్తుగా నిర్ణయాలు తీసుకోకూడదు. ఇదీ చదవండి: ఈసారైనా సెక్షన్ 80సీకు మోక్షం లభిస్తుందా..? ఒకే కంపెనీలో కాకుండా పోర్ట్ఫోలియో డైవర్సిఫై చేయడం ఎంతో ఉపయోగపడుతుంది. ఒకవేళ ఏదైనా కంపెనీ అనుకున్న ఫలితాలు విడుదల చేయకపోయినా పోర్ట్ఫోలియో పెద్దగా నష్టాల్లోకి వెళ్లకుండా ఉంటుంది. స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టడం వల్ల నష్టాలు, లాభాలు ఉంటాయని గుర్తుంచుకోవాలి. ఫలితాల ఆధారంగా స్టాక్ అమ్మాలో, కొనాలో అనే నిర్ణయం తీసుకోవడానికి ముందు కంపెనీ భవిష్యత్తు పనితీరును పరిగణలోకి తీసుకోవాలి. -
సాక్షి మనీ మంత్ర: వరుస నష్టాలకు బ్రేక్.. లాభాల్లో ప్రారంభమైన మార్కెట్లు
దేశీయ స్టాక్మార్కెట్ సూచీలు గడిచిన మూడు రోజుల నష్టాలకు బ్రేక్ వేస్తూ శుక్రవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:16 సమయానికి నిఫ్టీ 150 పాయింట్లు లాభపడి 21,614కు చేరింది. సెన్సెక్స్ 580 పాయింట్లు పుంజుకుని 71,766 వద్ద ట్రేడవుతోంది. ఈక్విటీ మార్కెట్లో ఎఫ్ఐఐలు గడిచిన రెండురోజుల్లో భారీగా షేర్లను విక్రయించారు. గురువారం మార్కెట్ ముగిసే సమయానికి రూ.9,901.56 కోట్లు విలువైన షేర్లు విక్రయించారు. డీఐఐలు రూ.5,977.12 కోట్లు విలువ చేసే షేర్లు కొనుగోలు చేశారు. డాలర్ ఇండెక్స్ 103.38కు చేరింది. బ్యారెల్ క్రూడ్ ఆయిల్ 79.01 డాలర్లుగా ఉంది. అమెరికా మార్కెట్లోని నాస్డాక్ గురువారం 1.35 శాతం పెరిగింది. 10 కాలవ్యవధి ఉన్న యూఎస్ బాండ్ ఈల్డ్లు 3 బేసిస్ పాయింట్లు పెరిగి 4.14 శాతానికి చేరాయి. అమెరికాలోని జాబ్స్ డేటా ఆశించిన దానికంటే తక్కువగా నమోదైంది. పాకిస్థాన్ ఇరాన్ వ్యతిరేకంగా పోరాడేందుకు సిద్ధపడుతోందనే వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఎర్ర సముద్రంలో చేలరేగుతున్న అల్లర్లతో అంతర్జాతీయంగా వాణిజ్యంపరంగా కొంత అనిశ్చితులు నెలకొన్నాయి. దానికితోడు పాకిస్థాన్ అంశం తోడైతే మార్కెట్లు మరింత దిగజారే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇరుదేశాల మధ్య సయోధ్య కుదుర్చేందుకు చైనా ప్రయత్నిస్తున్నట్లు కొన్ని కథనాల ద్వారా తెలిసింది. ఇదిలా ఉండగా నార్త్ కొరియా, సౌత్ కొరియా మధ్య సంబంధాలపై కొమ్జాంగ్ఉన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరుదేశాల సంబంధాలపై కిమ్ భిన్న వైఖరి అవలంబించబోతున్నట్లు చెప్పారు. మిస్సైల్ల్ల పరీక్ష, లైఫ్ ఫైర్ ఎక్సర్సైజ్లను చేయబోతున్నట్లు తెలిపారు. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
సాక్షి మనీ మంత్ర: కొనసాగుతున్న బేర్ పంజా.. భారీ నష్టాల్లో మార్కెట్లు
దేశీయ స్టాక్మార్కెట్ సూచీలు గురువారం భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:24 సమయానికి నిఫ్టీ 122 పాయింట్లు నష్టపోయి 21,453కు చేరింది. సెన్సెక్స్ 352 పాయింట్లు దిగజారి 71,147 వద్ద ట్రేడవుతోంది. ఈక్విటీ మార్కెట్లో ఎఫ్ఐఐలు ఎప్పుడూ లేనంతగా రూ.10,578.13 కోట్లు విలువైన షేర్లు విక్రయించారు. డీఐఐలు రూ.4006.44 కోట్లు విలువ చేసే షేర్లు కొనుగోలు చేశారు. ఇలా మార్కెట్లో షేర్లు విక్రయించడం కేవలం ఇండియా మార్కెట్లోనే కాదు, ఆసియా మార్కెట్లోని తైవాన్, కొరియా, హాంగ్కాంగ్లో మొత్తం దాదాపు బుధవారం ఒకేరోజు రూ.45వేల కోట్లు ఎఫ్ఐఐలు విక్రయించారు. డాలర్ ఇండెక్స్ 103.37కు చేరింది. యూఎస్ రిటైల్ సేల్స్ డిసెంబర్ నెలలో పెరిగినట్లు కథనాలు వస్తున్నాయి. బ్యారెల్ క్రూడ్ ఆయిల్ 78.03 డాలర్లుగా ఉంది. అధిక వెయిటేజీ కలిగిన హెచ్డీఎఫ్సీ బ్యాంకు స్టాక్ (8.46%) బుధవారం నష్టపోవడంతో సూచీలు భారీగా దిగజారాయి. నిఫ్టీ కోల్పోయిన మొత్తం 460 పాయింట్లలో హెచ్డీఎఫ్సీ బ్యాంకు వాటాయే 235 పాయింట్లు కావడం గమనార్హం. యూఎస్ ఫెడ్ రిజర్వ్ వడ్డీరేట్లపై ప్రభావం చూపించే అమెరికా డిసెంబర్ ద్రవ్యోల్బణ డేటా, ఉపాధి కల్పన గణాంకాలు అంచనాలకు మించి నమోదడవడంతో ‘వడ్డీ రేట్ల తగ్గింపు వాయిదా’ అంచనాలు తెరపైకి వచ్చాయి. దీంతో అమెరికాలో పదేళ్ల కాల పరిమితి కలిగిన బాండ్లపై రాబడులు(4.04%) ఒక్కసారిగా పెరిగాయి. విదేశీ పెట్టుబడులు ఈక్విటీల నుంచి బాండ్లలోకి తరలిపోతాయనే ఆందోళనలు అధికమయ్యాయి. అలాగే క్రూడాయిల్తో పాటు ఇతర కమోడిటీల ధరల పెంపునకు కారణమయ్యే డాలర్ ఇండెక్స్ సైతం నెలరోజుల గరిష్టానికి చేరడమూ ప్రతికూల ప్రభావాన్ని చూపింది. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
సాక్షి మనీ మంత్ర: మార్కెట్పై బేర్ పంజా.. నష్టాల్లో ప్రారంభమైన సూచీలు
దేశీయ స్టాక్మార్కెట్ సూచీలు బుధవారం నష్టాల్లో ట్రేడింగ్ ప్రారంభించాయి. ఉదయం 9:20 సమయానికి నిఫ్టీ 211 పాయింట్లు దిగజారి 21,820కు చేరింది. సెన్సెక్స్ 755 పాయింట్లు నష్టపోయి 72,373 వద్ద ట్రేడవుతోంది. అమెరికా బాండ్ ఈల్డ్లు మంగళవారం 13 బేసిస్ పాయింట్లు పెరిగి 4.07 శాతానికి చేరాయి. యూరప్ సెంట్రల్ బ్యాంక్ ప్రతినిధులు ఫెడ్ కీలక వడ్డీరేట్లకు సంబంధించిన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ద్రవ్యోల్బణం తగ్గుతున్నట్లు వస్తున్న సంకేతాలు ఎన్నిరోజులు కొనసాగుతాయో తెలియదని చెప్పారు. కేవలం కొంతకాలాన్నే పరిగణించి ఫెడ్ వడ్డీరేట్లను తగ్గిస్తే ద్రవ్యోల్బణం పుంజుకోదని సూచించారు. దాంతో రానున్న రోజుల్లో వడ్డీరేట్లు తగ్గుతాయో లేదోనని మార్కెట్లు కొంత సందిగ్ధంలో ఉన్నట్లు తెలుస్తోంది. దానికితోడు పుట్కాల్ రేషియో(పీసీఆర్)లో కూడా ఎక్కువ అంతరాలు ఉండడంతో మార్కెట్లు కొంత ఒడిదుడుకులకు లోనయ్యే అవకాశం ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. డాలర్ ఇండెక్స్ 0.89 శాతం పెరిగి 103.31 కు చేరింది. క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర 77.87 డాలర్లుగా ఉంది. ఎఫ్ఐఐలు మంగళవారం ఈక్విటీ మార్కెట్లో రూ.656.57 కోట్ల విలువ చేసే షేర్లు కొనుగోలు చేశారు. డీఐఐలు రూ.369.29 కోట్లు విలువైన షేర్లు విక్రయించారు. సోమవారం ట్రేడింగ్లో నిఫ్టీ చరిత్రలో తొలిసారిగా 22,000 పాయింట్లకు చేరింది. సెన్సెక్స్ కూడా 73,000 పాయింట్ల ఎగువన ముగిసింది. తాజాగా అయిదు ట్రేడింగ్ సెషన్లలో సెన్సెక్స్ 1972.72 పాయింట్లు, నిఫ్టీ 584.45 పాయింట్లు చొప్పున పరుగులు తీశాయి. ఫలితంగా బీఎస్ఈలోని నమోదిత సంస్థల మొత్తం మార్కెట్ విలువ రూ.9.68 లక్షల కోట్లు వృద్ధి చెంది జీవనకాల తాజా గరిష్ఠమైన రూ.376.09 లక్షల కోట్లుగా నమోదైంది. గత ఏడాది నవంబరులో కార్మిక రాజ్య బీమా సంస్థ (ఈఎస్ఐసీ) సామాజిక భద్రతా పథకంలో 15.92 లక్షల మంది కొత్త సభ్యులు చేరారు. దాదాపు 20,830 కొత్త సంస్థలు ఇందులో నమోదైనట్లు కార్మిక శాఖ వెల్లడించింది. 15.92 లక్షల మందిలో 7.47 లక్షల మంది 25 ఏళ్ల వయసులోపు వారే ఉన్నారు. మహిళా సభ్యులు నికరంగా 3.17 లక్షల మంది చేరారు. ఇది భవిష్యత్తులో దేశ ఆర్థిక వ్యవస్థకు కొంత సానుకూల అంశంగా మారనుందని నిపుణులు చెబుతున్నారు. 2023 డిసెంబరులో టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం 9 నెలల గరిష్ఠమైన 0.73 శాతంగా నమోదైంది. ఆహార ధరలు పెరగడం ప్రభావం చూపింది. గత ఏడాది ఏప్రిల్ నుంచి అక్టోబరు వరకు ప్రతికూలంగా ఉన్న ద్రవ్యోల్బణం.. నవంబరులో 0.26 శాతానికి చేరింది. 2022 డిసెంబరులో టోకు ద్రవ్యోల్బణం 5.02 శాతంగా ఉంది. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
సాక్షి మనీ మంత్ర: లాభాలు స్వీకరణ.. నష్టాల్లో ముగిసిన మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం నష్టాల్లో ప్రారంభమై నష్టాల్లోనే ట్రేడింగ్ ముగించాయి. నిఫ్టీ 65.95 పాయింట్లు నష్టపోయి 22,031 వద్ద, సెన్సెక్స్ 193 పాయింట్లు దిగజారి 73,134 వద్దకు చేరింది. సెన్సెక్స్ 30 సూచీలో టాటా స్టీల్, టైటాన్, ఐటీసీ, మారుతిసుజుకీ, జేఎస్డబ్ల్యూ స్టీల్, ఎల్ అండ్ టీ, ఏషియన్ పెయింట్స్, టాటా మోటార్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఆల్ట్రాటెక్ సిమెంట్ షేర్లు లాభాల్లో ముగిశాయి. హెచ్సీఎల్ టెక్నాలజీస్, విప్రో, ఎన్టీపీసీ, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఇన్ఫోసిస్, టెక్మహీంద్రా, ఇండస్ఇండ్ బ్యాంక్, సన్ఫార్మా, టీసీఎస్, ఎం అండ్ ఎం షేర్లు నష్టాల్లోకి జారుకున్నాయి. ఇటీవల భారీగా పెరిగిన ఐటీ, రిలయన్స్ వంటి స్టాక్ల్లో మదుపరులు మంగళవారం లాభాలు స్వీకరించినట్లు నిపుణులు చెబుతున్నారు. మార్కెట్లు దాదాపు గత 11 ఏళ్ల నుంచి నెలవారీగా గమనిస్తే ప్రతి జనవరి నెలలో నష్టాల్లోకే జారుకున్నాయి. కానీ ఈసారి అది పునరావృతం కాదని అంటున్నారు. ఈక్విటీలో మదుపుచేస్తున్న ఇన్వెస్టర్లు భారత మార్కెట్లపై ఎంతో ఆశాజనకంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీర్ఘకాలంగా స్టాక్మార్కెట్లో పెట్టుబడి పెట్టాలనుకునే వారు తాజాగా విడుదల చేస్తున్న త్రైమాసిక ఫలితాలను గమనించాలి. దాంతోపాటు కంపెనీ యాజమాన్యం తమ భవిష్యత్తు కార్యాచరణపై ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుందో తెలుసుకుని ఇన్వెస్ట్ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
సాక్షి మనీ మంత్ర: నష్టాలతో ప్రారంభమైన మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్మార్కెట్ సూచీలు బుధవారం నష్టాల్లో ట్రేడింగ్ ప్రారంభించాయి. ఉదయం 9:20 సమయానికి నిఫ్టీ 26 పాయింట్ల నష్టంతో 21,519 వద్దకు చేరింది. సెన్సెక్స్ 81 పాయింట్లు దిగజారి 71,304 వద్ద ట్రేడవుతోంది. సెన్సెక్స్ 30 సూచీలో హెచ్సీఎల్ టెక్, నెస్లే, టైటాన్, ఐసీఐసీఐ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, టీసీఎల్, సన్ఫార్మా, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఏషియన్ పెయింట్స్ స్టాక్ షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఎన్టీపీసీ, పవర్గ్రిడ్, యాక్సిస్ బ్యాంక్, టాటా స్టీల్, బజాజ్ ఫిన్సర్వ్, జేఎస్డబ్ల్యూ స్టీల్, ఎల్ అండ్ టీ, భారతీఎయిర్టెల్, ఎస్బీఐ షేర్లు నష్టాల్లోకి జారుకున్నాయి. అమెరికా 10 ఏళ్ల బాండ్ఈల్డ్లు 4 శాతంకు పెరిగాయి. యూఎస్ మార్కెట్లు మంగళవారం కొంత రేంజ్బౌండ్లోనే ముగిశాయి. చమురు బ్యారెల్ 77.5 డాలర్లుగా ఉంది. మంగళవారం ఈక్విటీ మార్కెట్లో ఎఫ్ఐఐలు రూ.990 కోట్ల విలువైన షేర్లు విక్రయించారు. డీఐఐలు రూ.104.23 కోట్ల విలువ చేసే షేర్లు కొనుగోలు చేశారు. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు) -
సాక్షి మనీ మంత్ర: లాభాలతో ప్రారంభమైన స్టాక్మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్మార్కెట్ సూచీలు మంగళవారం భారీగా పుంజుకున్నాయి. సోమవారం ట్రేడింగ్పూర్తయ్యే సమయానికి దాదాపు 0.9 శాతం కుంగిన సూచీలు ఇవ్వాల్టి మార్కెట్ ఓపెన్లో నిఫ్టీ 131 పాయింట్లు లాభపడి 21,639 వద్దకు చేరింది. సెన్సెక్స్ 414 పాయింట్లు పుంజుకుని 71,769 వద్ద ట్రేడవుతోంది. సెన్సెక్స్ 30 సూచీలో విప్రో, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, ఎల్ అండ్ టీ, టీసీఎస్, టాటా మోటార్స్, ఎస్బీఐ, జేఎస్డబ్ల్యూ స్టీల్, టైటాన్, ఐటీసీ, యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, ఏషియన్ పెయింట్లు, నెస్లే.. స్టాక్ షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. యూరప్, అమెరికా స్టాక్ మార్కెట్లు సోమవారం లాభాల్లో ట్రేడింగ్ ముగించాయి. నేడు ఆసియా-పసిఫిక్ సూచీలు సానుకూలంగా ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ బ్రెంట్ చమురు ధర మంగళవారం ఉదయం 76.41 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. విదేశీ సంస్థాగత మదుపర్లు సోమవారం రూ.16.03 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు. దేశీయ సంస్థాగత పెట్టబడిదారులు రూ.155.96 కోట్లు విలువ చేసే షేర్లను కొన్నారు. -
సాక్షి మనీ మంత్ర: స్వల్పంగా పుంజుకున్న దేశీయ మార్కెట్లు
దేశీయ స్టాక్మార్కెట్ సూచీలు సోమవారం స్వల్ప లాభాలతో ట్రేడింగ్ ప్రారంభించాయి. ఉదయం 9:16కు నిఫ్టీ 36 పాయింట్లు లాభపడి 21,747 వద్దకు చేరింది. సెన్సెక్స్ 87 పాయింట్లు పుంజుకుని 72,113 వద్ద ట్రేడవుతోంది. అమెరికా మార్కెట్లు రేంజ్బౌండ్లోనే ఉన్నాయి. యూరప్మార్కెట్లు కొంత నష్టాల్లో ట్రేడయ్యాయి. ఎఫ్ఐఐలు రూ.1696 కోట్లు విలువైన షేర్లు స్టాక్మార్కెట్లో కొనుగోలు చేశారు. డీఐఐలు రూ.3497 కోట్ల విలువైన షేర్లు మార్కెట్నుంచి విక్రయించారు. ఇటీవల వెలువడిన యూఎస్ జాబ్స్ డేటా ప్రకారం మార్కెట్ ఊహించిన 1,70,000 ఉద్యోగాలకు బదులుగా 2,16,000 ఉద్యోగాలు పెరిగాయి. లేబర్ మార్కెట్ పుంజుకుంటున్న నేపథ్యంలో ఫెడ్ కీలక వడ్డీరేట్లను తగ్గించేందుకు మరింత సమయం తీసుకుంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు. సెన్సెక్స్ 30 సూచీలో టైటాన్, ఎల్ అండ్ టీ, టాటా మోటార్స్, టాటా స్టీల్, హెచ్సీఎల్ టెక్, మారుతి సుజుకీ, రిలయన్స్ ఇండస్ట్రీస్, బజాజ్ఫిన్సర్వ్, భారతీ ఎయిర్టెల్ లాభాల్లో ట్రేడవుతున్నాయి. బజాజ్ ఫైనాన్స్, ఇన్ఫోసిస్, టీసీఎస్, ఐటీసీ, ఇండస్ ఇండ్ బ్యాంక్, హెచ్యూఎల్ షేర్లు నష్టాల్లోకి జారుకున్నాయి. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు) -
సాక్షి మనీ మంత్ర: పుంజుకున్న దేశీయ స్టాక్మార్కెట్ సూచీలు
దేశీయ మార్కెట్లు గురువారం లాభాల్లో ముగిశాయి. నిఫ్టీ 141 పాయింట్లు లాభపడి 21,658 వద్దకు చేరింది. సెన్సెక్స్ 490 పాయింట్లు పుంజుకుని 71,847 వద్ద స్థిరపడింది. గడిచిన ట్రేడింగ్ సెషన్లో ఐటీస్టాక్లు భారీగా కుంగిన విషయం తెలిసిందే. అయితే గురువారం మార్కెట్లో కొంత రేంజ్బౌండ్లోనే ఐటీ స్టాక్లు కదలాడాయి. రానున్న త్రైమాసిక ఫలితాల్లో ఆశించిన మేరకు ఫలితాలు రావనే ఊహాగానాలు ఇప్పటికే మార్కెట్లో ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. కానీ ఇటీవల మార్కెట్లు భారీగా ర్యాలీ అవడంతో మదుపరులు కొంత లాభాలు స్వీకరించినట్లు తెలుస్తోంది. బ్యాకింగ్ సూచీ రేంజ్బౌండ్లో ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. గురువారం బ్యారెల్ బ్రెంట్ చమురు ధర 78.38 డాలర్ల వద్దకు చేరింది. ఎఫ్ఐఐలు బుధవారం రూ.666.34 కోట్ల విలువ చేసే షేర్లను విక్రయించారు. డీఐఐలు సైతం రూ.862.98 కోట్ల విలువ చేసే షేర్లను అమ్మేశారు. సెన్సెక్స్ 30 సూచీలో బజాజ్ ఫైనాన్స్, ఎన్టీపీసీ, ఇండస్ఇండ్ బ్యాంక్, భారతి ఎయిర్టెల్, యాక్సిస్ బ్యాంక్, టాటా మోటార్స్, నెస్లే, పవర్గ్రిడ్, ఇన్పోసిస్, బజాజ్ ఫిన్సర్వ్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ లాభాల్లోకి చేరాయి. హెచ్సీఎల్ టెక్, ఎం అండ్ ఎం, మారుతిసుజుకీ, హెచ్యూఎల్, ఆల్ట్రాటెక్ సిమెంట్, విప్రో నష్టాల్లోకి జారుకున్నాయి. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు) -
సాక్షి మనీ మంత్ర: సూచీలపై బేర్ పంజా.. నష్టాల్లో మార్కెట్లు
దేశీయ స్టాక్మార్కెట్ సూచీలు బుధవారం నష్టాల్లో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:16 వరకు నిఫ్టీ 50 పాయింట్లు దిగజారి 21,614 వద్ద కదలాడుతోంది. సెన్సెక్స్ 219 పాయింట్ల నష్టపోయి 71,673 వద్దకు చేరింది. అంతర్జాతీయంగా భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ముడి చమురు ధరల పెరుగుదల వంటి అంశాల మధ్య మార్కెట్లు నష్టాల్లోకి జారుకుంటున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. మంగళవారం మార్కెట్లో ఎఫ్ఐఐలు రూ.1602 కోట్ల విలువైన షేర్లు కొనుగోలు చేశారు. డీఐఐలు రూ.1959 కోట్లు విలువైన షేర్లు విక్రయించారు. సెన్సెక్స్ 30 సూచీలో భారతిఎయిర్టెల్, ఎం అండ్ ఎం, ఎన్టీపీసీ, ఆల్ట్రాటెక్ సిమెంట్, నెస్లే, మారుతి సుజుకీ, టాటా మోటార్స్, ఐటీసీ, ఐసీఐసీఐ బ్యాంక్, సన్ఫార్మా, ఎస్బీఐ, టైటాన్ లాభాల్లో ట్రేడవుతున్నాయి. విప్రో, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, జేఎస్డబ్ల్యూ స్టీల్, హెచ్సీఎల్ టెక్, పవర్గ్రిడ్ స్టాక్లు నష్టాల్లోకి జారుకున్నాయి. -
సాక్షి మనీ మంత్ర: నష్టాలతో ప్రారంభమైన సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:30 గంటల సమయంలో నిఫ్టీ 25 పాయింట్లు నష్టపోయి 21,716 వద్దకు చేరింది. సెన్సెక్స్ 130 పాయింట్లు దిగజారి 72,141 వద్ద ట్రేడవుతోంది. కొత్త సంవత్సరం నేపథ్యంలో యూఎస్, యూరప్ మార్కెట్లకు సోమవారం సెలవు. ఆసియా-పసిఫిక్ సూచీలు మంగళవారం మిశ్రమంగా ట్రేడవుతున్నాయి. 2023 డిసెంబరులో జీఎస్టీ వసూళ్లు 10 శాతం పెరిగి రూ.1.64 లక్షల కోట్లకు చేరాయి. మరోవైపు విదేశీ సంస్థాగత మదుపర్లు సోమవారం రూ.855 కోట్ల విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో దేశీయ సంస్థాగత మదుపర్లు రూ.410 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.83.30 వద్దకు చేరింది. సెన్సెక్స్ 30 సూచీలో నెస్లే ఇండియా, భారతీ ఎయిర్టెల్, టాటా మోటార్స్, పవర్గ్రిడ్, టైటన్, సన్ఫార్మా, జేఎస్డబ్ల్యూ స్టీల్, టాటా స్టీల్, ఎన్టీపీసీ, బజాజ్ ఫిన్సర్వ్, రిలయన్స్, ఐటీసీ షేర్లు లాభాల్లో ఉన్నాయి. అల్ట్రాటెక్ సిమెంట్, ఐసీఐసీఐ బ్యాంక్, విప్రో, హెచ్యూఎల్, ఎస్బీఐ, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఏషియన్ పెయింట్స్, ఇన్ఫోసిస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు) -
సాక్షి మనీ మంత్ర: 2024 మొదటి రోజు నష్టాల్లో ప్రారంభమైన సూచీలు
దేశీయ బెంచ్మార్క్ సూచీలు 2024 ఏడాది మొదటిరోజు నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:16 వరకు నిఫ్టీ 20 పాయింట్లు నష్టపోయి 21,710 వద్దకు, సెన్సెక్స్ 126 పాయింట్లు నష్టపోయి 72,113 వద్దకు చేరింది. ప్రపంచవ్యాప్తంగా నూతన సంవత్సర వేడుకల సందర్భంగా చాలా ఆసియా మార్కెట్లు సోమవారం సెలవు ప్రకటించాయి. దాంతో లోట్రేడింగ్ వాల్యూమ్లు మార్కెట్ సెంటిమెంట్ను దెబ్బతీస్తున్నట్లు తెలిసింది. 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు మధ్యంతర బడ్జెట్ను విడుదల చేయనున్నారు. దాంతో మార్కెట్లో కొంత అనిశ్చితులు నెలకొంటాయనే భావనతో మదుపరులు కొంత జాగ్రత్తపడుతున్నట్లు తెలుస్తుంది. దాంతోపాటు జనవరిలో అన్ని కంపెనీల మూడో త్రైమాసిక ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో షేర్లు కొంత ఒడిదుడుకులకు లోనయ్యే అవకాశం ఉందని సమాచారం. విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు గత ట్రేడింగ్ సెషన్లో రూ.1,459 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు. మరోవైపు, దేశీయ సంస్థాగత పెట్టుబడిదారులు భారతీయ ఈక్విటీల నుంచి రూ. 554.39 కోట్ల విలువైన షేర్లు విక్రయించారు. విదేశీ ఇన్వెస్టర్లు డిసెంబర్ 2023లో దేశీయ ఈక్విటీ మార్కెట్లలో దాదాపు రూ.66,135 కోట్ల పెట్టుబడి పెట్టారు. మొత్తం 2023 సంవత్సరంలో రూ.1,71,107 విలువైన ఈక్విటీ షేర్లను కొనుగోలు చేశారు. యూఎస్ డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 4 పైసలు లాభపడి 83.16 వద్దకు చేరింది. సెన్సెక్స్ 30 సూచీలో టాటా స్టీల్, మారుతి సుజుకీ, టాటా మోటార్స్, టైటాన్, ఎన్టీపీసీ, నెస్లే, ఎల్ అండ్ టీ షేర్లు లాభాల్లోకి చేరుకున్నాయి. యాక్సిస్బ్యాంక్, హెచ్సీఎల్ టెక్, ఏషియన్ పెయింట్స్, భారతి ఎయిర్టెల్, ఇండస్ఇండ్ బ్యాంక్ నష్టాల్లో ట్రేడవుతున్నాయి. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు) -
వచ్చేవారం మార్కెట్ ఎలా ఉంటుందంటే..
మార్కెట్ ఇప్పటికే ఆల్టైమ్హైలో ఉంది. ప్రస్తుతం ఉన్న స్థానం నుంచి పెరుగుతుందా.. ఫెడ్ కీలక వడ్డీరేట్లు తగ్గించనుందనే సంకేతాలతో రానున్న రోజుల్లో మార్కెట్ ఎలా స్పందిస్తుంది.. వచ్చేవారం మార్కెట్ వైఖరి ఎలా ఉండబోతుంది.. వంటి అంశాలపై ప్రముఖ స్టాక్మార్కెట్ అనలిస్ట్ కారుణ్యరావు మాట్లాడారు. మార్కెట్ ఆల్టైమ్హైను చేరింది. దాంతో కొత్తగా మార్కెట్లోకి వచ్చిన ఇన్వెస్టర్లు కొంత ఆందోళన చెందుతారు. కానీ చాలా కాలంగా మార్కెట్లో ఉంటున్నవారు అంతగా కంగారుపడి ఇక్కడి నుంచి మార్కెట్ తగ్గుతుందేమోనని స్టాక్లను విక్రయించే ప్రయత్నం చేయరు. అయితే నిజంగా మార్కెట్ ఇంతలా పెరిగినపుడు కొంత కరెక్షన్ రావొచ్చు. కానీ గతంలోలాగా చాలా తగ్గిపోతుందనే సంకేతాలు మాత్రం ప్రస్తుతానికి లేవు. నిజంగా మార్కెట్లు తగ్గుతాయనే లాజిక్ ఉంటే కొనుగోలు, విక్రయంపై నిర్ణయం తీసుకోవాలి. కానీ ఎలాంటి అవగాహన లేకుండా, సరైన కారణం లేకుండా మార్కెట్లో పొజిషన్ తీసుకోవడంతో నష్టపోవాల్సి ఉంటుంది. ఈ ఏడాది మార్కెట్లు భారీగా పెరిగాయి. నిఫ్టీ దాదాపు 18 శాతం పుంజుకుందని నిపుణులు చెబుతున్నారు. కానీ 2024లో మార్కెట్లు కొంత కన్సాలిడేషన్లో ఉండే అవకాశం ఉందని సమాచారం. అయితే గత కొన్నేళ్లుగా జనవరిలో మార్కెట్లు నష్టాల్లోనే ఉన్నాయి. ఈసారి నష్టాల్లో కాకుండా లాభాల్లోకి మారుతాయానే అభిప్రాయాలు వెలువడుతున్నాయి. అంతర్జాతీయంగా మార్కెట్లో తీవ్ర అనిశ్చితులు లేకపోవడం, దేశీయ మార్కెట్లో సానుకూలత వంటి అంశాలు ఇందుకు దోహదం చేస్తాయని తెలుస్తుంది. ఫెడరల్ రిజర్వ్బ్యాంక్ కీలక వడ్డీరేట్లు తగ్గుస్తుందనే సంకేతాలు ప్రధానంగా ఐటీ కంపెనీలకు బలం చేకూర్చాయి. దాంతో ఐటీ స్టాక్ల్లో భారీగా ర్యాలీ కనిపిస్తోంది. ఇది మరిన్ని రోజులు కొనసాగే అవకాశం ఉంది. అయితే క్రితం త్రైమాసికంతో పోలిస్తే ఈసారి కూడా కొన్ని దిగ్గజ ఐటీ కంపెనీలు ఊహించిన ఫలితాలు ప్రకటించకపోవచ్చు. దాంతో కంగారుపడి మంచి కంపెనీ స్టాక్లు అమ్మేయకుండా పడిన ప్రతిసారి ఎస్ఐపీ విధానంలో కొంతమేర కొనుగోలు చేయాలి. కంపెనీలు ఐపీఓల ద్వారా నిధుల సమీకరణకు సిద్ధమవుతున్న తరుణంలో మార్కెట్ వర్గాలు పబ్లిక్ ఇష్యూలపై కన్నేయోచ్చు. ఆర్థిక అగ్రరాజ్యాలు అమెరికా, చైనాలు వెల్లడించే స్థూల ఆర్థిక గణాంకాలు ఈక్విటీ మార్కెట్ల దిశను ప్రభావితం చేసే వీలుంది. వీటితో పాటు సాధారణ అంశాలైన క్రూడాయిల్ ధరలు, రూపాయి కదలికలపై మార్కెట్ వర్గాలు దృష్టి సారించవచ్చు. అధిక వాల్యుయేషన్లు, ఎల్నినో ఆందోళనలు, ప్రపంచ ఆర్థిక మందగమనం పరిణామాల నేపథ్యంలో స్వల్ప కాలం పాటు స్టాక్ సూచీలు రికార్డు స్థాయిల వద్ద స్థిరీకరణకు లోనవచ్చు. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు) -
ఏడాదిలో రూ.81.90 లక్షల కోట్ల సంపద.. ఎక్కడంటే..
స్టాక్మార్కెట్లో మదుపుదారులకు ఈ ఏడాది చాలా గుర్తుండిపోతుంది. వరుసగా ఎనిమిదో సంవత్సరమూ సూచీలు లాభాల బాటపట్టాయి. ఈ ఏడాదిలో నిఫ్టీ 50లోని 27 షేర్లు ఆల్టైమ్హైను చేరాయి. 40కి పైగా కంపెనీలు 10-100 శాతం పెరిగాయి. స్మాల్, మిడ్క్యాప్ షేర్లు భారీగా పుంజుకున్నాయి. లిస్టింగ్ గెయిన్స్ కోసం ఇన్వెస్ట్ చేసినవారికి, ఇతర పెట్టుబడిదారులకు ఐపీఓలు లిస్ట్ అయిన తొలిరోజే మంచి లాభాలను తీసుకొచ్చాయి. 2023 ప్రారంభంలో మార్కెట్లు కాస్త నష్టాల్లోకి వెళ్లినా తరువాత భారీగా రాణించాయి. అంతర్జాతీయ మాంద్యం భయాలు, కేంద్ర బ్యాంకుల వడ్డీ రేట్ల పెంపుపై ఆందోళనలతో గతంలో నిఫ్టీ, సెన్సెక్స్ వరుసగా 4, 3 శాతమే రాణించాయి. విదేశీ సంస్థాగత మదుపర్ల పెట్టుబడులతో ఏప్రిల్ నుంచి సూచీలు పుంజుకున్నాయి. ర్యాలీకి కారణాలు.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కీలక వడ్డీరేట్ల పెంపునకు విరామం ఇవ్వడం, ముడి చమురు ధరలు వేగంగా తగ్గడంతో, రెండు నెలల పాటు బాగా రాణించిన సూచీలు ప్రథమార్ధాన్ని 6 శాతం పైగా లాభాలతో ముగించాయి. సెప్టెంబరు త్రైమాసికంలో 7.6% వృద్ధి నమోదైంది. తర్వాత కేంద్రంలో అధికారంలో ఉన్న భాజపా ఇటీవల జరిగిన రాష్ట్రాల ఎన్నికల్లోనూ విజయం సాధించడం, విదేశీ మదుపర్ల పెట్టుబడులు బలంగా కొనసాగడం, 2024లో రేట్ల కోతకు అవకాశం ఉందని అమెరికా ఫెడ్ సంకేతాలివ్వడం ఇందుకు దోహదం చేసింది. ఎన్ఎస్ఈ నమోదిత కంపెనీల మార్కెట్ విలువ.. చరిత్రలోనే తొలిసారిగా డిసెంబరు 6వ తేదీన 4 లక్షల కోట్ల డాలర్ల మార్కెట్ విలువను దాటేసింది. బీఎస్ఈ నమోదిత కంపెనీల మార్కెట్ విలువ ఈ ఏడాదిలో ఇప్పటిదాకా రూ.81.90 లక్షల కోట్లు పెరిగి రూ.364 లక్షల కోట్ల ఆల్టైం గరిష్ఠానికి చేరింది. జూన్లో నిఫ్టీ సూచీ 19,000 పాయింట్లు, సెప్టెంబరులో 20,000, ఈనెల 8న 21,000 పాయింట్లకు చేరింది. డిసెంబరు 28న ఆల్టైం గరిష్ఠస్థాయి అయిన 21,801.45ను చేరింది. సెన్సెక్స్ జూన్లో 64,000 పాయింట్లను అధిగమించింది. జులైలో 67,000ను తాకింది. నవంబరు, ఈనెల 28నలో ఏకంగా 8000 పాయింట్లకుపైగా ర్యాలీ అయి 72,484.34 వద్ద జీవనకాల రికార్డు గరిష్ఠాన్ని చేరింది. ఏడాది మొత్తం మీద నిఫ్టీ 18%, సెన్సెక్స్ 19% మేర లాభాలను అందించాయి. 2024లో ఎలా ఉండబోతుందంటే.. వచ్చే ఏడాది స్టాక్మార్కెట్లు భారీగా లాభపడడానికి పెద్దగా అవకాశాలను ఈ ఏడాది మిగల్చలేదని బ్రోకరేజీ సంస్థలు అభిప్రాయపడుతున్నాయి. ప్రస్తుత స్థాయి నుంచి మహా అయితే 8-10% రాణించొచ్చని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ నివేదించింది. ఎన్నికల ముందు ర్యాలీ కారణంగా వచ్చే ఏడాది ప్రథమార్ధం వరకు సానుకూలంగా ఉండొచ్చు. ఇదీ చదవండి: ఆందోళనలో దేశీయ కంపెనీలు.. ముప్పు తప్పదా..? ఎన్నికల ఫలితాలు, పూర్తి స్థాయి బడ్జెట్ ప్రకటనలు వచ్చాకే స్టాక్ మార్కెట్ దిశపై ఒక అంచనాకు రాగలమని బ్రోకరేజీలు అంటున్నాయి. అదే సమయంలో వడ్డీ రేట్లు, ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ పరిణామాలు కూడా ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు. -
గుజరాత్ను వెనక్కి నెట్టిన యూపీ.. కానీ టాప్లో మాత్రం..
భారత్ అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ప్రధాన స్థానంలో ఉంది. దేశ ఆర్థికాభివృద్ధి ఏటా పెరుగుతోంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సంస్థలు ఇండియా ఎకానమి గ్రోత్కు సంబంధించి పాజిటివ్ రేటింగ్ ఇస్తున్నారు. అందుకు అనువుగా స్టాక్మార్కెట్లు మరింత పుంజుకుంటున్నాయి. కరోనా సమయంలో నిఫ్టీ సూచీ 8000 మార్కు వద్ద ఉండేది. ప్రస్తుతం 21,700 పాయింట్లతో జీవితకాల గరిష్ఠాన్ని చేరుతుంది. భారత్ వృద్ధిపై ఎలాంటి అనుమానం లేకుండా సమీప భవిష్యత్తులో మరింత పుంజుకుంటుందనే భావన బలంగా ఉంది. అందుకు తగ్గట్టుగానే దేశవ్యాప్తంగా చాలా మంది స్టాక్మార్కెట్లో మదుపు చేస్తున్నారు. తాజాగా నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్(ఎన్ఎస్ఈ) మదుపరుల డేటా విడుదల చేసింది. అందులోని వివరాలు ఈ కింది విధంగా ఉన్నాయి. దేశీయ స్టాక్మార్కెట్లో నమోదిత పెట్టుబడిదారుల సంఖ్య 2023లో భారీగా పెరిగింది. ఈ ఏడాదితో మదుపుదారుల సంఖ్య తొలిసారి 8 కోట్లకు చేరింది. గతేడాది డిసెంబర్ 31తో పోలిస్తే ఇన్వెస్టర్ల సంఖ్య 22.4 శాతం పెరిగింది. అత్యధిక స్టాక్ మార్కెట్ మదుపరులు కలిగిన రాష్ట్రంగా మహారాష్ట్ర అగ్రస్థానంలో నిలిచింది. అలాగే ఉత్తర్ప్రదేశ్ గుజరాత్ను అధిగమించింది. 89.47 లక్షల మదుపర్లతో యూపీ రెండో స్థానంలో నిలిచింది. ఇదీ చదవండి: న్యూ బ్రాండ్ అంబాసిడర్గా దీపికా పదుకొనె.. ఏ కంపెనీకంటే.. 2022 డిసెంబరు 31 నాటికి దేశీయ స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టే సంఖ్య 6.94 కోట్లుగా ఉండేది. ఈ ఏడాది డిసెంబరు 25 నాటికి ఆ సంఖ్య 8.49 కోట్లకు చేరింది. కేవలం ఎనిమిది నెలల్లోనే దాదాపు కోటిమందికి పైగా పెరిగారు. రాష్ట్రాల వారీగా చూస్తే 1.48 కోట్లతో మహారాష్ట్ర అగ్రస్థానంలో నిలిచింది. 89.47 లక్షలతో యూపీ రెండో స్థానంలో నిలవగా 76.68 లక్షల మదుపరులతో గుజరాత్ మూడో స్థానంలో ఉంది. -
సాక్షి మనీ మంత్ర: 2023లో చివరి రోజు.. నష్టాలతో ముగిసిన స్టాక్మార్కెట్లు
దేశీయ స్టాక్మార్కెట్లు ఈ ఏడాది చివరిరోజు ట్రేడింగ్ను నష్టాలతో ముగించాయి. నిఫ్టీ 47 పాయింట్లు నష్టపోయి 21,731 వద్దకు చేరింది. సెన్సెక్స్ 170 పాయింట్లు దిగజారి 72,240 వద్ద స్థిరపడింది. బీఎస్ఈ 30 సూచీలో టాటా మోటార్స్, నెస్లే ఇండియా, హిందుస్థాన్ యూనిలివర్, టాటా స్టీల్, బజాజ్ ఫైనాన్స్, అల్ట్రాటెక్ సిమెంట్, బజాజ్ ఫిన్ సర్వ్, విప్రో, మారుతీ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఎల్అండ్టీ లాభాల్లో ముగిశాయి. ఏషియన్ పెయింట్స్, టీసీఎస్, హెచ్సీఎల్ టెక్, ఎంఅండ్ఎం, ఐటీసీ, యాక్సిస్ బ్యాంక్, జేఎస్డబ్ల్యూ స్టీల్, భారతీ ఎయిర్టెల్, ఐసీఐసీఐ బ్యాంక్, టైటాన్, కోటక్ మహీంద్రా బ్యాంక్, రిలయన్స్, పవర్ గ్రిడ్, ఇండస్ ఇండ్ బ్యాంక్, ఎన్టీపీసీ, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, నష్టాల్లో ముగిశాయి. భారీ బ్లాక్ డీల్ తర్వాత ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ షేర్లు 3 శాతం పెరిగాయి. సింగిల్ బ్లాక్ డీల్లో దాదాపు 1.65 మిలియన్ షేర్లు చేతులు మారాయని బ్లూమ్బెర్గ్ నివేదించింది. అయితే కొనుగోలుదారులు, విక్రయదారుల వివరాలు తెలియరాలేదు. 2030 నాటికి 8,00,000 డీజిల్ బస్సులను ఎలక్ట్రిక్ బస్సులతో భర్తీ చేయాలనే లక్ష్యంతో ఉన్నట్లు ఇటీవల ప్రభుత్వ అధికారులు తెలిపినట్లు వార్తా కథనాలు వెలువడ్డాయి. దాంతో ఎలక్ట్రిక్ బస్సు తయారీదారుల్లో ముందు వరుసలో ఉన్న టాటా మోటార్స్ స్టాక్ శుక్రవారం 6.5% పెరిగి రికార్డు స్థాయికి చేరుకుంది. ఒలెక్ట్రా గ్రీన్టెక్ (11%), జేబీఎం ఆటో (5.1%), అశోక్ లేలాండ్ (4.4%), సంవర్ధన మదర్సన్ (5.4%), ఎక్సైడ్ ఇండస్ట్రీస్ (5.4%) పెరిగాయి. -
బుల్ జోరు.. గరిష్ఠాల్లో స్టాక్మార్కెట్లు
దేశీయ స్టాక్మార్కెట్లు జీవితకాల గరిష్ఠాల్లోకి దూసుకెళుతోంది. నిఫ్టీ 123 పాయింట్లు పుంజుకుని 21,778 వద్దకు చేరింది. సెన్సెక్స్ 371 పాయింట్లు లాభపడి 72,410 వద్ద స్థిరపడింది. సెన్సెక్స్ 30 సూచీలో ఎన్టీపీసీ, ఎం అండ్ ఎం, పవర్గ్రిడ్, టాటా మోటార్స్, ఐటీసీ, భారతీ ఎయిర్టెల్, కోటక్ మహీంద్రా బ్యాంక్, హెచ్యూఎల్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఇండస్ఇండ్ బ్యాంక్, టాటా స్టీల్ కంపెనీ షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఎల్ అండ్ టీ, ఇన్ఫోసిస్, విప్రో, టీసీఎస్, బజాజ్ ఫైనాన్స్, జేఎస్డబ్ల్యూ స్టీల్ కంపెనీ షేర్లు నష్టాల్లోకి జారుకున్నాయి. ఆసియా-పసిఫిక్ మార్కెట్లు గురువారం సానుకూలంగా కదలాడాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు స్వల్పంగా దిగొచ్చాయి. విదేశీ సంస్థాగత మదుపర్లు బుధవారం రూ.2,926.05 కోట్ల విలువ చేసే భారత ఈక్విటీలను కొనుగోలు చేశారు. దేశీయ సంస్థాగత మదుపర్లు రూ.192.01 కోట్ల విలువ చేసే షేర్లను విక్రయించారు. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు) -
సాక్షి మనీ మంత్ర: ఒడుదొడుకుల మధ్య లాభాల్లో ముగిసిన మార్కెట్లు
దేశీయ స్టాక్మార్కెట్లు శుక్రవారం తీవ్ర ఒడుదొడుకులతో కదలాడాయి. మార్కెట్ ముగిసే సమయానికి నిఫ్టీ 94 పాయింట్లు లాభపడి 21,349 వద్దకు చేరింది. సెన్సెక్స్ 241 పాయింట్లు పుంజుకుని 71,106 వద్ద స్థిరపడింది. సెన్సెక్స్ 30 సూచీలో విప్రో, హెచ్సీఎల్ టెక్నాలజీస్, టాటా మోటార్స్, మారుతీ సుజుకి, టాటా స్టీల్, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, ఎల్ అండ్ టీ, జేఎస్డబ్ల్యూ స్టీల్, ఏషియన్ పేయింట్స్, టైటాన్, సన్ఫార్మా, భారతీ ఎయిర్టెల్ కంపెనీ షేర్లు లాభాల్లో ట్రేడయ్యాయి. బజాన్ ఫైనాన్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఎస్బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, పవర్గ్రిడ్, ఇండస్ ఇండ్ బ్యాంక్ షేర్లు నష్టాల్లోకి జారుకున్నాయి. బ్యాంకులు మినహా, ఇతర రంగాల సూచీలు ఆటో, క్యాపిటల్ గూడ్స్, హెల్త్కేర్, ఆయిల్ & గ్యాస్ 1 శాతం చొప్పున లాభపడగా, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మెటల్, రియల్టీ 2 శాతం చొప్పున పెరిగాయి. బీఎస్ఈ మిడ్క్యాప్ ఇండెక్స్ 0.7 శాతం, స్మాల్క్యాప్ ఇండెక్స్ 1 శాతం చొప్పున పెరిగాయి. సానుకూల దేశీయ మార్కెట్లు, బలహీనమైన యుఎస్ డాలర్తో భారత రూపాయి శుక్రవారం పెరిగింది. అయితే, క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడం, ఎఫ్ఐఐ అవుట్ఫ్లోలు కొంత లాభాలను తగ్గించాయి. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు). -
మరింత ప్రమాదకరంగా 2024..?
స్టాక్మార్కెట్లో చాలా మంది ఇన్వెస్టర్ల పోర్ట్ఫోలియోలు లాభాల్లోకి వెళ్లక దాదాపు సంవత్సరం దాటింది. ఇటీవల మార్కెట్ కాస్త పుంజుకుని ఆల్టైమ్హైని చేరింది. దాంతో రానున్న ఏడాదిలో లాభాలు వస్తాయేమోననే ఆశలు చిగురించాయి. దానికితోడు అమెరికా ఫెడరల్ రిజర్వ్బ్యాంక్ కీలక వడ్డీరేట్లను తగ్గిస్తున్నట్లు సంకేతాలు ఇవ్వడంతో 2024 కొంత ఆశాజనకంగా ఉంటుందనే వాదనలు వచ్చాయి. కానీ అందుకు భిన్నంగా రానున్న ఏడాదిసైతం నష్టాల తిప్పలు తప్పవని, గతంలో కంటే మరింత తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొత్త సంవత్సరంలో అత్యంత ప్రమాదకరమైన మార్కెట్ క్రాష్ రాబోతోందని ఆర్థికవేత్త హ్యారీ డెంట్ ఇటీవల హెచ్చరించారు. ఈ క్రమంలో పెట్టుబడిదారులు తమ ఆర్థిక సలహాదారులను నమ్మకూడదని కోరారు. 2008 ఆర్థిక సంక్షోభం తర్వాత పెరిగిన మార్కెట్లు ప్రస్తుతం ఓవర్ వ్యాల్యుయేషన్లకు చేరుకున్నందున కుప్పకూలుతాయని జోష్యం చెప్పారు. అయితే ఈసారి వచ్చే మార్కెట్ క్రాష్ 1929-1932లో వచ్చిన మాంధ్యం తీవ్రతతో సమానంగా ఉంటుందని ఆయన అంచనా వేశారు. ఈ క్రమంలో ఎస్ అండ్ పీ500లో 86%, నాస్డాక్లో 92%, క్రిప్టో మార్కెట్ 96% కుప్పకూలే ప్రమాదం ఉందని డెంట్ సూచిస్తున్నారు. ఇలాంటి క్రమంలో పెట్టుబడిదారులు తమ ఇన్వెస్ట్మెంట్లను లాభాల్లో ఉన్నప్పుడే విక్రయించటం వల్ల గణనీయమైన నష్టాలను నివారించవచ్చని తెలిపారు. అలాగే భవిష్యత్తులో షేర్ల ధరలు క్షీణించినప్పుడు పెట్టుబడి పెట్టి లాభాలను పొందేందుకు మంచి అవకాశమని సలహా ఇచ్చారు. ఇదీ చదవండి: ‘బ్యాడ్ బ్యాంక్’లు మంచివే..? అమెరికా సెంట్రల్ బ్యాంక్ ఫెడ్ వచ్చే ఏడాది కీలక వడ్డీరేట్లను తగ్గించాలని యోచిస్తున్నట్లు ఇటీవల జరిగిన సమావేశాల ఆధారంగా తెలుస్తోంది. అయితే ఇలా రేట్ల తగ్గిస్తూ ద్రవ్యోల్బణాన్ని నియంత్రించాలనే చర్యలను మానుకోవాలని డెంట్ అన్నారు. దీని కారణంగా తేలికపాటి మాంధ్యం అంచనాలకు విరుద్ధంగా.. తీవ్ర ద్రవ్యోల్బణంతో ఆర్థికమాంధ్యానికి దారితీస్తుందన్నారు. ఈ ఆర్థికవేత్త 1989లో జపాన్లో జరిగిన ‘బబుల్ బర్స్ట్’, అమెరికా డాట్-కామ్ బబుల్, డోనాల్డ్ ట్రంప్ విజయం వంటి కీలక అంచనాలు నిజమయ్యాయి. అయితే ఇదే క్రమంలో కొందరు ఆర్థిక వ్యూహకర్తలు, గోల్డ్మన్ సాక్స్ వంటి పెట్టుబడి సంస్థలు అమెరికా ఆర్థిక వ్యవస్థ, స్టాక్ మార్కెట్లపై బుల్లిష్గానే ఉన్నాయి. -
సాక్షి మనీ మంత్ర: వరుస లాభాలకు బ్రేక్.. నష్టాల్లో ముగిసిన సూచీలు
దేశీయ స్టాక్మార్కెట్లు మంగళవారం నష్టాల్లో ముగిశాయి. దాంతో వరుస లాభాలకు బ్రేక్ పడినట్లయింది. సెన్సెక్స్ 377.50 పాయింట్లు లేదా 0.54% క్షీణించి 69,551.03 వద్ద ముగిసింది. నిఫ్టీ 90.70 పాయింట్లు లేదా 0.43% నష్టంతో 20,906.40 వద్దకు చేరింది. మార్కెట్ ఇటీవల భారీగా ర్యాలీ అయింది. దాంతో రిటైల్ ఇన్వెస్టర్లు లాభాలు స్వీకరించినట్లు తెలిసింది. నవంబర్ నెలలో నమోదైన ద్రవ్యోల్బణం కారణంగా నిఫ్టీ కొంత నష్టాల బాటపట్టినట్లు తెలుస్తోంది. రేపు రానున్న ఫెట్ మినట్స్ మీటింగ్ వివరాలు ఎలా ఉండబోతాయోననే ఆందోళనతో ఇన్ని రోజులు లాభాల్లో ఉన్న స్టాక్లను రిటైల్ ఇన్వెస్టర్లు విక్రయించినట్లు నిపుణులు చెబుతున్నారు. అమెరికాలో వడ్డీరేట్లలో పెంపు ఉండకపోవచ్చుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి. అలాగే ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో రేట్ల కోతపై ఫెడ్ నిర్ణయం వెలువరించే అవకాశం ఉందని ఆశిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అక్కడి సూచీలు రాణించాయి. అక్కడి నుంచి సంకేతాలు అందుకున్న ఆసియా పసిఫిక్ మార్కెట్లు నేడు లాభాల్లో ట్రేడవుతున్నాయి. సెన్సెక్స్ 30 సూచీలో ఆల్ట్రాటెక్ సిమెంట్, జేఎస్డబ్ల్యూ స్టీల్, యాక్సిస్ బ్యాంక్, టీసీఎస్, విప్రో, పవర్గ్రిడ్, బజాజ్ ఫిన్సర్వ్ లాభాల్లో ముగిశాయి. సన్ఫార్మా, ఇండస్ఇండ్ బ్యాంక్, మారుతీ సుజుకీ, టైటాన్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఎన్టీపీసీ, ఎం అండ్ ఎం స్టాక్లు నష్టాల్లోకి జారుకున్నాయి. విదేశీ సంస్థాగత మదుపర్లు సోమవారం రూ.1,261 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు. దేశీయ సంస్థాగత మదుపర్లు రూ.1,032 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. -
సాక్షి మనీ మంత్ర: నష్టాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్మార్కెట్లు
దేశీయ స్టాక్మార్కెట్లు సోమవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:30 గంటలకు బీఎస్ఈ సెన్సెక్స్ 82 పాయింట్లు లేదా 0.11% క్షీణించి 65,719 వద్ద, నిఫ్టీ 10 పాయింట్లు లేదా 0.05% క్షీణించి 19,721 వద్ద స్థిరపడ్డాయి. బ్యాంక్ నిఫ్టీ 58 పాయింట్లు నష్టంతో 43,525 వద్ద, నిఫ్టీ మిడ్క్యాప్ సూచీ 168 పాయింట్లు లాభపడి 41,979 వద్దకు చేరాయి. సెన్సెక్స్లో హెచ్సీఎల్ టెక్, ఎన్టీపీసీ, టాటా మోటార్స్, మారుతీ సుజుకీ, ఇన్ఫోసిస్ స్టాక్లు లాభాల్లో ఉన్నాయి. యాక్సిస్ బ్యాంక్, ఎల్ అండ్ టీ, ఎం అండ్ ఎం, అల్ట్రాటెక్ సిమెంట్ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. యూఎస్ మార్కెట్లు గతవారం లాభాల్లో ట్రేడయ్యాయి. యూరప్ మార్కెట్లు కూడా ర్యాలీ అయ్యాయి. ఆసియా- పసిఫిక్ సూచీలు సోమవారం లాభాలతో ట్రేడవుతున్నాయి. ఈవారం అమెరికా ఫెడరల్ రిజర్వ్ సమావేశ సారాంశం వెలువడుతుంది. దేశీయ మార్కెట్లో టాటా టెక్నాలజీస్, ఇండియన్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ ఏజెన్సీ, ఫెడ్బ్యాంక్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ కంపెనీలు ఐపీఓకి రానున్నాయి. మరోవైపు విదేశీ సంస్థాగత మదుపర్లు శుక్రవారం రూ.477 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. దేశీయ మదుపర్లు రూ.565 కోట్లు విలువ చేసే స్టాక్స్ కొనుగోలు చేశారు. -
సాక్షి మనీ మంత్ర: లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్మార్కెట్ సూచీలు బుధవారం భారీ లాభాల్లో ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 742 పాయింట్లు పెరిగి 65,675 పాయింట్ల వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 231 పాయింట్లు ఎగబాకి 19,675 వద్ద స్థిర పడింది. టాటా మోటర్స్, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, విప్రో, టాటా స్టీల్, టీసీఎస్, రిలయన్స్, యాక్సిస్ బ్యాంక్, భారతి ఎయిర్ టెల్, హెచ్సీఎల్ టెక్, ఐటీసీ, జేఎస్ డబ్ల్యూ స్టీల్, కోటక్ మహీంద్రా బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, టైటాన్, అల్ట్రాటెక్ సిమ్ంట్, ఏషియన్ పేయింట్స్, మారుతి, ఐసీఐసీఐ బ్యాంక్, ఎన్టీపీసీ, ఎల్ అండ్ టీ, సన్ ఫార్మా, హిందుస్థాన్ యూనిలివర్, నెస్లే ఇండియా, ఎంఅండ్ఎం, బజాజ్ ఫిన్సర్వ్ లాభాల్లో ముగిశాయి. యూఎస్ మార్కెట్లు మంగళవారం లాభాలతో ముగిశాయి. రిటైల్ ద్రవ్యోల్బణం తక్కువ స్థాయిలో అంచనాలకు అనుగుణంగా నమోదు కావడం అక్కడి మార్కెట్ల సెంటిమెంట్ను పెంచింది. ఆసియా- పసిఫిక్ సూచీలు నేడు సానుకూలంగా కదలాడాయి. అక్టోబరులో టోకు ధరల ద్రవ్యోల్బణ సూచీ (డబ్ల్యూపీఐ) 0.52 శాతంగా నమోదైంది. ఆహార పదార్థాల ధరలు దిగిరావడం ఇందుకు కారణంగా నిపుణులు చెబుతున్నారు. ఏప్రిల్ నుంచి డబ్ల్యూపీఐ తక్కువగానే నమోదవుతోంది. విదేశీ సంస్థాగత మదుపర్లు సోమవారం రూ.1,244 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. దేశీయ మదుపర్లు రూ.830 కోట్లు విలువ చేసే స్టాక్స్ను కొనుగోలు చేశారు. -
సాక్షి మనీ మంత్ర: నష్టాల్లో ముగిసిన భారత స్టాక్మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్మార్కెట్ సూచీలు సోమవారం నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 325 పాయింట్లు క్షీణించి 0.50% తగ్గి 64,933.87 వద్ద ముగిసింది. నిఫ్టీ 82 పాయింట్లు నష్టపోయి 0.42% కుంగి 19,443.50 వద్ద ముగిసింది. అమెరికా ఫ్యూచర్ మార్కెట్లు సోమవారం నష్టాల్లో ట్రేడయ్యాయి. యూఎస్ క్రెడిట్ రేటింగ్ ఔట్లుక్ను మూడీస్ స్టేబుల్ నుంచి నెగెటివ్కు మార్చింది. ఈ నేపథ్యంలో అక్కడి మార్కెట్లలో ప్రతికూల వాతావరణం నెలకొంది. ఐరోపా సూచీలు శుక్రవారం నష్టాలతో ముగిశాయి. సోమవారం ఆసియా- పసిఫిక్ మార్కెట్లు నష్టాల్లో ట్రేడయ్యాయి. దేశీయంగా ఆదివారం జరిగిన ప్రత్యేక మూరత్ ట్రేడింగ్లో సూచీలు లాభాల్లో ముగిశాయి. విదేశీ సంస్థాగత మదుపర్లు శుక్రవారం రూ.261 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. దేశీయ మదుపర్లు రూ.822 కోట్లు విలువ చేసే స్టాక్స్ను కొనుగోలు చేశారు. సెన్సెక్స్ 30లో ఎం అండ్ ఎం, జేఎస్డబ్ల్యూ స్టీల్, ఎన్టీపీసీ, పవర్గ్రిడ్, ఇండస్ఇండ్ బ్యాంక్, టాటాస్టీల్, టాటా మోటార్స్ మినహా అన్ని స్టాక్లు నష్టాల్లో ట్రేడయ్యాయి. దీపావళి బలిప్రతిపద సందర్భంగా మంగళవారం(నవంబర్ 14) రోజున దేశీయ స్టాక్మార్కెట్లకు సెలవు. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు) -
సాక్షి మనీ మంత్ర: ఫ్లాట్గా ముగిసిన భారత స్టాక్మార్కెట్లు
భారత స్టాక్మార్కెట్లు బుధవారం ఫ్లాట్గా ముగిశాయి. మంగళవారం ముగింపుతో పోలిస్తే 36 పాయింట్లు లాభపడి 19443కు చేరింది. అదే సెన్సెక్స్ 33 పాయింట్లు పుంజుకుని 64975 వద్ద స్థిరపడింది. అమెరికాలో వడ్డీరేట్లు గరిష్ఠ స్థాయిలకు చేరిన నేపథ్యంలో రానున్న ఏడాదిలో కీలక రేట్లను తగ్గిస్తారని మార్కెట్ భావించింది. కానీ ఫెడ్ నుంచి వెలువడిన సంకేతాల ప్రకారం అలాంటిదేమీ ఉండకపోవచ్చునని సమాచారం. ఈ తరుణంలో యూఎస్ సూచీలు మంగళవారం నష్టాల్లో ట్రేడయ్యాయి. ఐరోపా మార్కెట్లు సైతం అదే బాటలో పయనించాయి. నేడు ఆసియా- పసిఫిక్ సూచీలు స్వల్ప లాభాలతోనే ప్రారంభమై చివరివరకు అదే దిశలో పయనించాయి. విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు మంగళవారం రూ.497 కోట్లు విలువ చేసే భారత ఈక్విటీలను విక్రయించారు. దేశీయ సంస్థాగత మదుపర్లు రూ.700 కోట్లు విలువ చేసే షేర్లను కొన్నారు. మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్30 సూచీలో ఏషియన్ పెయింట్స్, జేఎస్డబ్ల్యూ, టైటాన్, ఎల్ అండ్ టీ, ఐటీసీ, హెచ్యూఎల్, మారుతి సుజుకీ లాభాల్లో ట్రేడయ్యాయి. ఐసీఐసీఐ బ్యాంక్, ఎన్టీపీసీ, ఇన్ఫోసిన్, టెక్ మహీంద్రా, టాటా స్టీల్ షేర్లు నష్టాల్లో ముగిశాయి. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు) -
సాక్షి మనీ మంత్ర: స్వల్ప నష్టాలతో ముగిసిన స్టాక్మార్కెట్లు
దేశీయ స్టాక్మార్కెట్లు మంగళవారం స్వల్ప నష్టాలతో ముగించాయి. ఉదయం ఊగిసలాటతో మొదలైన బెంచ్ మార్క్ సూచీలు చివరికి ఫ్లాట్ ముగింపును నమోదు చేశాయి. ఫార్మా, ఆయిల్ అండ్ గ్యాస్ రంగాలకు చెందిన షేర్లు లాభపడ్డాయి. బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 16 పాయింట్ల నష్టపోగా.. నిఫ్టీ కేవలం 5 పాయింట్ల మేర నష్టాన్ని నమోదు చేసింది. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 119 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 113 పాయింట్ల మేర నష్టపోయాయి. అలాగే బీఎస్ఈ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు 0.4 శాతం మేర లాభపడ్డాయి. ఎన్ఎస్ఈలో సన్ ఫార్మా, బీపీసీఎల్, ఎన్టీపీసీ, డాక్టర్ రెడ్డీస్, ఇండస్ఇండ్ బ్యాంక్, సిప్లా, ఎస్బీఐ, యాక్సిస్ బ్యాంక్, బ్రిటానియా, ఎస్బీఐ లైఫ్, కోటక్ బ్యాంక్, ఎల్ టిఐఎమ్, టెక్ మహీంద్రా, టాటా కన్జూమర్, అల్ట్రాటెక్ సిమెంట్స్, హెచ్సీఎల్ టెక్నాలజీస్, హిందాల్కొ, బజాజ్ ఫిన్ సర్వ్, ఐసీఐసీఐ బ్యాంక్, ఏషియన్ పెయింట్స్, టాటా స్టీల్, హిందుస్థాన్ యూనీలివర్, బజాజ్ ఆటో, నెస్లే, ఐషర్ మోటార్స్, టైటాన్, ఓఎన్జీసీ, ఇన్ఫోసిస్, గ్రాసిమ్ కంపెనీల షేర్లు లాభాలతో తమ ప్రయాణాన్ని ముగించాయి. ఇదే క్రమంలో హీరో మోటార్స్, బజాజ్ ఫైనాన్స్, జేఎస్డబ్ల్యూ స్టీల్, దివీస్ ల్యాబ్, రిలయన్స్, అపోలో హాస్పిటల్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, కోల్ ఇండియా, ఐటీసీ, అదానీ పోర్ట్స్, అదానీ ఎంటర్ ప్రైజెస్, ఎల్ టి, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, మారుతీ, ఎయిర్ టెల్, టీసీఎస్, యూపీఎల్, టాటా మోటార్స్, పవర్ గ్రిడ్, విప్రో కంపెనీల షేర్లు నష్టాల బాటపట్టాయి. -
మార్కెట్ పడిపోవడం మంచి అవకాశం
వచ్చే వారంలో మార్కెట్ ఎలా ర్యాలీ అవ్వబోతుంది.. గతవారంలో కుప్పకూలిన మార్కెట్లు పుంజుకుంటాయా లేదా ఇంకా పడుతాయా..యూఎస్ డాలర్తో పోలిస్తే రూపాయి మారక విలువ తగ్గిపోతుంది. ప్రపంచవ్యాప్తంగా క్రూడ్ ధర పెరుగుతుంది. దాని పర్యవసనాలు దేశీయ మార్కెట్పై ఎలా ఉండబోతాయని వివరాలపై సాక్షి బిజినెస్ కన్సల్టెంట్ కారుణ్య రావు మాట్లాడారు. దీపావళి పర్యదినాన్ని పురస్కరించుకుని బంగారం, వెండి ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధ భయాలు ఉన్నా.. ఇతర మిడిల్ ఈస్ట్ దేశాల జోక్యం చేసుకోనంత వరకు మార్కెట్లపై పెద్దగా ప్రభావం ఉండదు. యుద్ధానికి సంబంధించి వేరే దేశాలు నిర్ణయాలు తీసుకున్నా, వాటి విధానాలు మార్చుకున్నా మరింత నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. ఇప్పటికే చమురు ధరలు పెరిగాయి. రూపాయితో పోలిస్తే డాలర్ ఇంకా బలపడుతుంది. దాంతో ఆర్బీఐ ఫారెక్స్ రిజర్వ్లను విక్రయించి రూపాయి ఇంకా పడిపోకుండా చేసే వీలుంది. కానీ పరిస్థితులు ఇలాగే కొనసాగితే మరింత ప్రమాదం పొంచిఉంటుంది. యూఎస్ ట్రెజరీలు అనిశ్చితిలో ఉన్నాయి. భవిష్యత్తులో మార్కెట్ సంక్షోభానికి సంబంధించి పెట్టుబడిదారులు ఎలా స్పందిస్తారనే అంశాన్ని గమనించాలి. ఇటీవల ఫెడ్ ఛైర్మన్ జెరోమ్ పావెల్ చేసిన వ్యాఖ్యల ద్వారా అమెరికాలో రానున్న రోజుల్లో వడ్డీ రేట్లు పెంచే అవకాశం ఉందని స్పష్టం అవుతుంది. అమెరికా వడ్డీ రేట్లు పెంచడంతో మదుపర్లు తమ సొమ్మును భద్రంగా ఉంచేందుకు ప్రయత్నిస్తున్నారు. దాంతో దేశీయ మార్కెట్ నుంచి విదేశీ సంస్థాగత పెట్టుబడులు తరలిపోయే అవకాశం ఉంది. అయితే కేంద్రం అందిస్తున్న ప్రయోజనాల మూలంగా దేశీయ స్టాక్మార్కెట్లు బలంగా ఉన్నాయి. ఇతర దేశాలతో పోలిస్తే భారత్ వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ కావడంతో తాత్కాలికంగా కొంత ఒడుదుడుకులు నెలకున్నా దీర్ఘకాలికంగా ఎంతో ప్రయోజనం ఉంటుంది. గతవారం మార్కెట్లు పతనం తర్వాత ఓవర్సోల్డ్ జోన్లోకి వెళ్తున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఉన్న జోన్లో కొనుగోలు చేసేందుకు అవకాశం ఉంది. కానీ అంతర్జాతీయ అనిశ్చితులను దృష్టిలో ఉంచుకుని మార్కెట్లో నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. అది నిత్యం మారుతూ ఉంటుంది. ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న యుద్ధ వాతావరణం గ్లోబల్గా ఆర్థిక వ్యవస్థను మరింత తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. దాంతో మార్కెట్లు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. పెట్టుబడిదారులు తమ నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఫండమెంటల్స్పై దృష్టి పెట్టాలి. మార్కెట్ కదలికలను అంచనా వేయడానికి బదులుగా ప్రాథమికంగా బలమైన కంపెనీలను విశ్లేషించాలి. మంచి ఫండమెంటల్ కంపెనీలను ప్రతి మార్కెట్ డిప్లో కొనుగోలు చేసేందుకు అవకాశం ఉంటుంది. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు) -
సాక్షి మనీ మంత్ర: స్వల్ప నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు
Today Stock Market Closing: దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ రోజు స్వల్ప లాభాలతో ప్రారంభమై.. నష్టాల్లో జారుకున్నాయి. మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 64.66 పాయింట్ల నష్టంతో 66408 పాయింట్ల వద్ద స్థిరపడింది. నిఫ్టీ 17.35 పాయింట్ల నష్టంతో 19794.80 పాయింట్లకు చేరింది. బీపీసీఎల్, కోల్ ఇండియా, మారుతి సుజుకీ, ఎన్టీపీసీ, పవర్గ్రిడ్ కార్పొరేషన్, గ్రాసిమ్, బజాజ్ఆటో, జేఎస్డబ్ల్యూ స్టీల్, టాటా స్టీల్, అదానీ ఎంటర్ప్రైజెస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఎం అండ్ ఎం కంపెనీలు లాభాల్లో ట్రేడయ్యాయి. నష్టాల జాబితాలో టెక్ మహింద్రా, అపోలో హాస్పటల్స్, ఇన్ఫోసిస్, టీసీఎస్, హెచ్సీఎల్ టెక్, ఎల్టీ మైండ్ట్రీ, సిప్లా, యూపీఎల్, బజాజ్ ఫైనాన్స్, విప్రో కంపెనీలు ఉన్నాయి. రూపాయి: నేడు రూపాయి డాలర్తో పోలిస్తే స్వల్ప నష్టంలో 83.24 వద్ద ముగిసింది. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
ఫెడ్ నిర్ణయాలు.. క్యూ1 ఫలితాలు కీలకం
ముంబై: కంపెనీల తొలి త్రైమాసిక ఫలితాలు, అమెరికా ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ(ఫెడ్ రిజర్వ్) పాలసీ నిర్ణయాలు ఈ వారం స్టాక్ మార్కెట్కు కీలకమని నిపుణులు భావిస్తున్నారు. అలాగే ప్రపంచ పరిమాణాలు, స్థూల ఆర్థిక గణాంకాలు, విదేశీ ఇన్వెస్టర్ల వైఖరి అంశాలు ట్రేడింగ్పై ప్రభావాన్ని చూపొచ్చు. వీటితో పాటు రూపాయి విలువ, క్రూడాయిల్ కదలికలపైనా ఇన్వెస్టర్లు దృష్టి సారించవచ్చని స్టాక్ నిపుణులు చెబుతున్నారు. బ్యాంకింగ్, ఫైనాన్స్, ఇంధన, మౌలిక, ఆయిల్ అండ్ గ్యాస్, ఫార్మా షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో గత వారం మొత్తంగా సెన్సెక్స్ 846 పాయింట్లు లాభపడింది. నిఫ్టీ 180 పాయింట్లు ర్యాలీ చేసింది. అయితే ఐటీ షేర్లు ముఖ్యంగా ఇన్ఫోసిస్ భారీ క్షీణతతో శుక్రవారం సూచీలు 18 వారాల్లో అతిపెద్ద నష్టాన్ని చవిచూశాయి. ఫలితంగా ఆరురోజుల రికార్డు ర్యాలీకి బ్రేక్ పడింది. ‘‘బ్యాంకింగ్ షేర్లకు డిమాండ్, విదేశీ పెట్టుబడుల వెల్లువ పరిణామాల దృష్ట్యా మార్కెట్లో ఇంకా సానుకులత మిగిలే ఉంది. ఇదే సమయంలో ఫెడ్ రిజర్వ్ పాలసీ నిర్ణయాలు వెల్లడి, జూన్ క్వార్టర్ ఫలితాల ప్రకటన నేపథ్యంలో కొంత స్థిరీకరణకు లోనవచ్చు. వచ్చే వారం జూలై డెరివేటివ్స్ కాంట్రాక్టుల గడువు ముగియనున్నందున కొంత ఆటుపోట్లకు గురికావచ్చు. సాంకేతికంగా నిఫ్టీ స్వల్ప కాలం పాటు 19,524 – 19,854 స్థాయిలో కదలాడొచ్చు. మూమెంటమ్ కొనసాగి ఈ శ్రేణిని చేధిస్తే ఎగువున 19,992 వద్ద మరో నిరోధం ఎదురుకావచ్చు’’ అని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్సియల్ సరీ్వసెస్ రిటైల్ రీసెర్చ్ హెడ్ సిద్ధార్థ ఖేమా తెలిపారు. కీలక దశలో క్యూ1 ఫలితాలు స్టాక్ మార్కెట్ ముందుగా రిలయన్స్, కోటక్ మహీంద్రా, ఐసీఐసీఐ బ్యాంక్, యస్ బ్యాంక్ల క్యూ1 ఆర్థిక ఫలితాలకు స్పందించాల్సి ఉంటుంది. ఈ మూడు ప్రధాన కంపెనీలు గతవారాంతంలో ఆర్థిక ఫలితాలను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక ఈ వారంలో బ్యాంకింగ్, ఆటో, ఐటీ, రియల్టీ రంగాలకు చెందిన 380 కంపెనీలు తమ తొలి త్రైమాసిక ఫలితాలను వెల్లడించనున్నాయి. టాటా స్టీల్, బజాజ్ ఆటో, ఏషియన్ పేయింట్స్, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ, టాటా మోటర్స్, ఎల్అండ్టీ, టాటా కన్జూమర్ ప్రాడెక్ట్స్, బజాజ్ ఫైనాన్స్, టెక్ మహీంద్రా, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, సిప్లా, యాక్సిస్ బ్యాంక్, నెస్లే ఇండియా, బజాజ్ ఫిన్సర్వ్లు ఫలితాలు వెల్లడించే జాబితాలో ఉన్నాయి. అలాగే కొకొ–కోలా, బోయింగ్, మైక్రోసాఫ్ట్, ఆల్ఫాబెట్, విసా, మెటా, మాస్టర్కార్డ్, ప్రాక్టర్–గ్యాంబెల్, హార్మేస్, ఆ్రస్టాజెనికా తదితర అంతర్జాతీ కంపెనీలు సైతం ఇదే కంపెనీలో తమ క్వార్టర్ ఫలితాలను వెల్లడించనున్నాయి. కార్పొరేట్ ఆర్థిక ఫలితాలు కీలక దశకు చేరుకున్న తరుణంలో స్టాక్ ఆధారిత ట్రేడింగ్ అధికంగా ఉండొచ్చు. ఈ అంశమూ మార్కెట్కు దిశానిర్ధేశం చేసే వీలుందని స్టాక్ నిపుణులు చెబుతున్నారు. ఫెడ్ వడ్డీ రేట్ల నిర్ణయ ప్రభావం అగ్ర రాజ్యం అమెరికా సెంట్రల్ బ్యాంక్ యూఎస్ ఫెడరల్ రిజర్వ్ సమావేశం మంగళవారం(జూలై 25న) ప్రారంభమవుతుంది. ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ తీసుకున్న నిర్ణయాలను ఫెడ్ చైర్మన్ జెరోమ్ పావెల్ బుధవారం(28న)రోజున ప్రకటిస్తారు. ఫెడ్ రిజర్వ్ లక్ష్య ద్రవ్యోల్బణం రెండు శాతం కంటే అధికంగా ఉండటం, లేబర్ మార్కెట్ పటిష్టత కారణంగా కీలక వడ్డీరేట్లు 25 బేసిస్ పాయింట్లు(పావు శాతం) పెంపు ఉంటుందని ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. అయితే బాండ్ల కొనుగోలు, ఆర్థిక వ్యవస్థ పనితీరుపై పావెల్ ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారోనని ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు ఆసక్తి ఎదురుచూస్తున్నాయి. వడ్డీరేట్ల పెంపుతో కొంత అమ్మకాల ఒత్తిడి నెలకొనే వీలుంది. ఫెడ్ రిజర్వ్ ద్రవ్య విధాన వైఖరికి ముందు కొందరు ట్రేడర్లు తమ పొజిషన్లను వెనక్కి తీసుకోవచ్చు. స్థూల ఆర్థిక గణాంకాలు జపాన్, యూరోజోన్, అమెరికా దేశాల జూన్ తయారీ, సేవారంగ పీఎంఐ డేటా సోమవారం విడుదల అవుతుంది. అమెరికా ఫెడ్ ద్రవ్య పరపతి నిర్ణయాలు, కొత్త ఇళ్ల అమ్మకాల గణాంకాలు బుధవారం వెల్లడి కానున్నాయి. యూరో సెంట్రల్ బ్యాంక్ ఈసీబీ వడ్డీరేట్లను గురువారం, బ్యాంక్ ఆఫ్ జపాన్ పాలసీ నిర్ణయాలను ప్రకటించనున్నాయి. ఇక దేశీయంగా శుక్రవారం జూన్ చివరి వారంతో ముగిసిన ఫారెక్స్ నిల్వల డేటా, జూన్ 18న ముగిసిన డిపాజిట్– బ్యాంక్ రుణ వృద్ధి డేటాను వెల్లడించనుంది. ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థ స్థితిగతులను ప్రతిబింబించేసే ఈ స్థూల గణాంకాలను మార్కెట్ ట్రేడింగ్పై ప్రభావం చూపగలవు. కొనసాగిన ఎఫ్ఐఐల కొనుగోళ్లు భారత స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేందుకు విదేశీ ఇన్వెస్టర్లు ఆసక్తి చూపుతున్నారు. దేశీయ ఆర్థిక వృద్ధి మెరుగ్గా ఉండట, చైనాలో నెలకొన్న ప్రతికూలత కారణంగా ఎఫ్ఐఐలు జూలైలో ఇప్పటివరకు రూ.45,800 కోట్ల పెట్టుబడులు పెట్టారు. ఇందులో ఈక్విటీ మార్కెట్ నుంచి రూ.43,804 షేర్ల విలువైన షేర్లను కొన్నారు. డెట్ మార్కెట్లో రూ.2,623 కోట్లు పెట్టుబడులు పెట్టినట్లు ఎక్సే్చంజీ గణాంకాలు చెబుతున్నాయి. దీంతో వరుసగా మూడో నెలా ఎఫ్ఐఐ నిధులు రూ.40 వేల కోట్లను అధిగమించాయి. ముఖ్యంగా ఫైనాన్స్, ఆటోమొబైల్స్, కేపిటల్ గూడ్స్, రియలీ్ట, ఎఫ్ఎంసీజీ రంగాల్లో ఎఫ్ఐఐల ఎక్కువగా పెట్టుబడులు పెట్టారు. ‘‘భారత ఈక్విటీ మార్కెట్ల రికార్డు ర్యాలీకి ప్రధాన మద్దతిస్తున్నది విదేశీ పెట్టుబడిదారులే. సూచీల రికార్డు ర్యాలీతో ఇప్పటికే ఈక్విటీ మార్కెట్ విలువ అధిక వాల్యూయేషన్కు చేరుకుంది. దీనివల్ల మార్కెట్లపై ఒత్తిడి ఉంటుంది. ఈ దశలో పెద్ద ఎత్తున లాభాల స్వీకరణకు అవకాశం ఉండొచ్చు’’ అని మారి్నంగ్ స్టార్ ఇండియా అసోసియేట్ డైరెక్టర్ హిమాన్షు శ్రీవాస్తవ పేర్కొన్నారు. ఇక డిపాజిటీ గణాంకాల ప్రకారం ఎఫ్ఐఐలు మేలో రూ. 43,838 కోట్లు, జూన్లో రూ. 47,148 కోట్లను భారత ఈక్విటీల్లో ఉంచారు. ఈ ఏడాదిలో ఇప్పటివరకు ఈక్విటీ మార్కెట్లలో ఎఫ్ఐఐల పెట్టుబడులు రూ.1.2 లక్షల కోట్లకు చేరుకున్నాయి. -
స్వల్ప శ్రేణిలోనే ట్రేడింగ్
ముంబై: స్టాక్ మార్కెట్ కొత్త ఏడాది తొలి వారంలోనూ ఒడిదుడుకులకు లోనవుతూ పరిమిత శ్రేణిలో కదలాడొచ్చని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. స్థూల ఆర్థిక గణాంకాలు, చైనాలో కోవిడ్ పరిస్థితులు, ప్రపంచ పరిణామాలు ట్రేడింగ్ను ప్రభావితం చేయోచ్చంటున్నారు. వీటితో పాటు డాలర్ మారకంలో రూపాయి విలువ, క్రూడాయిల్ ధరలు, విదేశీ ఇన్వెస్టర్లు పెట్టుబడులపై దృష్టి సారించే వీలుంది. గతవారం ప్రారంభమైన షా పాలీమర్స్ పబ్లిక్ ఇష్యూ బుధవారం ముగుస్తుంది. అదే రోజున రేడియంట్ క్యాష్ మేనేజ్మెంట్ సర్వీసెస్ ఐపీఓ లిస్టింగ్ ఉంది. ఇటీవల దిద్దుబాటులో దిగివచ్చిన షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో గతవారంలో స్టాక్ సూచీలు రికవరీ అయ్యాయి. ఎఫ్ఎంసీజీ, ఫార్మా షేర్ల మినహా అన్ని రంగాల షేర్లలో బుల్ ర్యాలీ కొనసాగడంతో సెన్సెక్స్ దాదాపు వెయ్యి పాయింట్లు, నిఫ్టీ 300 పాయింట్లు చొప్పున లాభపడ్డాయి. ‘‘ఆర్థిక మాంద్య భయాలు, చైనా కోవిడ్ పరిస్థితులు సూచీల అప్సైడ్ ర్యాలీని అడ్డుకుంటున్నాయి. ఇదే సమయంలో కనిష్ట స్థాయిల వద్ద కొనుగోళ్ల మద్దతు లభిస్తుంది. కావున సూచీలు కొంతకాలం పాటు తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతూ పరిమిత శ్రేణిలో ట్రేడవచ్చు. నిఫ్టీ 17800–18400 పాయింట్ల పరిధిలో స్వల్పకాలం పాటు స్థిరీకరణ కొనసాగొచ్చు. కన్సాలిడేషన్ దశను పూర్తి చేసుకున్నట్లయితే నిఫ్టీ జీవితకాల గరిష్టం 18,887 స్థాయిని చేరుకునేందుకు ప్రయత్నం చేయోచ్చు’’ అని ఎంకే వెల్త్ మేనేజ్మెంట్ రీసెర్చ్ హెడ్ జోసెఫ్ థామస్ తెలిపారు. మార్కెట్ను నడిపించే అంశాలు ఇవీ.. ఫెడ్ రిజర్వ్ మినిట్స్ గతేడాది డిసెంబర్ 14న జరిగిన అమెరికా ఫెడ్ రిజర్వ్ ఎఫ్ఓఎంసీ మినిట్స్ వివరాలు గురువారం వెల్లడి కానున్నాయి. గత నాలుగుసార్లు 75 బేసిస్ పాయింట్లు పెంచిన ఫెడ్.. గత నెలలో 50 పాయింట్లు పెంచింది. దీంతో 4.25 – 4.50 శాతానికి ఫెడ్ బెంచ్ మార్క్ వడ్డీ రేటు చేరింది. గత 15 సంవత్సరాల్లో ఇదే అత్యధికం. భవిష్యత్తు(2023)లోనూ వడ్డీ రేట్ల పెంపు ఉంటుందని ఫెడ్ అధికారిక వర్గాలు సంకేతాలిచ్చాయి. ఈ పరిణామాల నేపథ్యంలో ద్రవ్య విధాన వైఖరిపై ఫెడ్ మినిట్స్లో మరింత స్పష్టత వచ్చే వీలుంది. ఎఫ్పీఐలు ఓకే డిసెంబర్లో ఈక్విటీల్లోకి రూ. 11,119 కోట్ల పెట్టుబడులు గత నెలలో విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐలు) దేశీ ఈక్విటీలలో పెట్టుబడులకు ఆసక్తి చూపారు. డిపాజిటరీల గణాంకాల ప్రకారం 2022 డిసెంబర్లో నికరంగా రూ. 11,119 కోట్లు ఇన్వెస్ట్ చేశారు. దీంతో వరుసగా రెండో నెలలోనూ నికర పెట్టుబడిదారులుగా నిలిచారు. కొన్ని ప్రపంచ దేశాలలో తిరిగి కోవిడ్–19 కేసులపై ఆందోళనలు తలెత్తుతున్న నేపథ్యంలోనూ దేశీ స్టాక్స్పట్ల ఎఫ్పీఐలు ఆసక్తి ప్రదర్శిస్తున్నారు. అయితే ఇటీవల కొంత అప్రమత్తంగా వ్యవహరిస్తుండటం గమనార్హం! ఫలితంగా 2022 నవంబర్లో నమోదైన రూ. 36,239 కోట్లతో పోలిస్తే తాజా పెట్టుబడులు భారీగా తగ్గాయి. యూఎస్లో మాంద్య భయాలు వంటి అంశాలు ఎఫ్పీఐ పెట్టుబడులను ప్రభావితం చేస్తున్నట్లు మార్నింగ్స్టార్ ఇండియా రీసెర్చ్ నిపుణులు హిమాన్షు శ్రీవాస్తవ పేర్కొన్నారు. ప్రస్తుత అనిశ్చిత వాతావరణంలోనూ చరిత్రాత్మక గరిష్టాలకు చేరిన దేశీ స్టాక్ మార్కెట్లలో లాభాల స్వీకరణకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలియజేశారు. భారీ అమ్మకాలు దేశీ ఈక్విటీ మార్కెట్ల నుంచి ఎఫ్పీఐలు 2022లో భారీగా రూ. 1.21 లక్షల కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. యూఎస్ ఫెడ్సహా ప్రపంచవ్యాప్తంగా పలు కేంద్ర బ్యాంకులు వడ్డీ రేట్లను పెంచుతూపోవడం, చమురు ధరల పెరుగుదల, రష్యా– ఉక్రెయిన్ యుద్ధం తదితర అంశాలు సెంటిమెంటును దెబ్బతీశాయి. వెరసి గత మూడేళ్లలో నికర పెట్టుబడిదారులుగా నిలిచిన ఎఫ్పీఐలు 2022లో నికర అమ్మకందారులుగా నిలిచారు. ఎఫ్పీఐలు ఇంతక్రితం అంటే 2021లో రూ. 25,752 కోట్లు, 2020లో రూ. 1.7 లక్షల కోట్లు, 2019లో రూ. 1.01 లక్షల కోట్లు విలువైన స్టాక్స్ కొనుగోలు చేసిన విషయం విదితమే. ఇక 2022 డిసెంబర్లో రూ. 1,673 కోట్ల విలువైన రుణ సెక్యూరిటీలను విక్రయించగా.. ఏడాది మొత్తం రూ. 15,911 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. 2021లోనూ డెట్ విభాగంలో రూ. 10,359 కోట్లు, 2020లో రూ. 1.05 లక్షల కోట్ల విలువైన రుణ సెక్యూరిటీలు విక్రయించారు. స్థూల ఆర్థిక గణాంకాలు ముందుగా నేడు మార్కెట్ ఆదివారం వెలువడిన డిసెంబర్ ఆటో విక్రయాలకు స్పందించాల్సి ఉంటుంది. ప్రపంచ దేశాలు ఈ వారంలో డిసెంబర్ తయారీ రంగ పీఎంఐ గణాంకాలను వెల్లడించనున్నాయి. కోవిడ్ కేసులు తెరపైకి వచ్చిన నేపథ్యంలో కరోనా ప్రభావం ఈ రంగంపై ఎంతమేర పడిందనే అంశాన్ని మార్కెట్ వర్గాలు క్షుణ్ణంగా పరిశీలించనున్నాయి. భారత్, అమెరికా డిసెంబర్ తయారీ రంగ పీఎంఐ డేటా(నేడు), బ్రిటన్ తయారీ రంగ పీఎంఐ గణాంకాలు మంగళవారం వెల్లడి కానున్నాయి. సేవారంగ పీఎంఐ డేటా బుధవారం విడుదల అవుతుంది. కొత్త ఏడాది కలిసొచ్చే కాలమే గతేడాది తీవ్ర ఒడిదుడుకులకు లోనైన భారత స్టాక్ మార్కెట్కు కొత్త ఏడాది కలిసొస్తుందని నిపుణులు భావిస్తున్నారు. ఈ 2023లో ఫెడ్ రిజర్వ్ వడ్డీరేట్ల పెంపు తెరపడనుంది. రష్యా–ఉక్రెయిన్ మధ్య యుద్ధ పరిస్థితులు కొలిక్కి రావచ్చు. దేశీయ పరిస్థితులను గమనిస్తే.., ధరలు కొండెక్కి ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. వినియోగం పుంజుకుంటుంది. ప్రభుత్వ వృద్ధి దోహద చర్యలు, ప్రోత్సాహక విధానాలు, కార్పొరేట్ కంపెనీల ఆదాయాల్లో మెరుగైన వృద్ధి మన మార్కెట్ను ముందుకు నడపొచ్చని మార్కెట్ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. -
ఫెడ్ రిజర్వ్, ఆర్బీఐ నిర్ణయాలు కీలకం
ముంబై: అమెరికా ఫెడ్ రిజర్వ్ ద్రవ్య పాలసీ, ఆర్బీఐ ద్రవ్య విధాన కమిటీ అత్యవసర సమావేశపు నిర్ణయాలు ఈ వారం మార్కెట్ను నడిపిస్తాయని స్టాక్ నిపుణులు భావిస్తున్నారు. కార్పొరేట్ క్యూ2 ఆర్థిక ఫలితాలు, స్థూల ఆర్థిక గణాంకాలు ట్రేడింగ్ను ప్రభావితం చేయోచ్చంటున్నారు. వీటితో పాటు విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల ధోరణి, డాలర్ మారకంలో రూపాయి విలువ, క్రూడాయిల్ కదిలికలు ప్రభావం చూపొచ్చంటున్నారు. హిందూ నూతన సంవత్సరం ‘2079 సంవత్’ తొలివారంలో సెన్సెక్స్ 650 పాయింట్లు, నిఫ్టీ 200 పాయింట్లు లాభపడ్డాయి. ‘‘జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లు స్థిరీకరణ దిశగా సాగొచ్చు. కార్పొరేట్ల రెండో క్వార్టర్ ఆర్థిక ఫలితాల విడుదల నేపథ్యంలో స్టాక్ ఆధారిత ట్రేడింగ్పై దృష్టి సారించడం శ్రేయస్కరం. కన్సాలిడేషన్లో భాగంగా దిగివచ్చిన నాణ్యమైన షేర్లను గుర్తించి ఎంపిక చేసుకోవాలి. సాంకేతికంగా నిఫ్టీకి 18,100 పాయింట్ల వద్ద నిరోధం ఎదురుకావచ్చు. దిగువ స్థాయిలో 17,400 స్థాయి వద్ద తక్షణ మద్దతు లభించవచ్చు’’ అని మోతీలాల్ ఓస్వాల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ సిద్ధార్థ ఖేమా తెలిపారు. ఫెడ్ రిజర్వ్ సమావేశం అగ్రరాజ్యం అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడ్ రిజర్వ్ పాలసీ సమావేశం మంగళవారం(నవంబర్ ఒకటిన) ప్రారంభం కానుంది. మరుసటి రోజు(బుధవారం) చైర్మన్ జెరోమ్ పావెల్ ద్రవ్య కమిటి నిర్ణయాలను వెల్లడించనున్నారు. వరుసగా నాలుగోసారి వడ్డీరేట్లను 75 బేసిస్ పాయింట్లు పెంచవచ్చని మార్కెట్ వర్గాలు అంచనావేస్తున్నాయి. పాలసీ ప్రకటన సందర్భంగా ఫెడ్ చైర్మన్ వ్యాఖ్యలను విదేశీ ఇన్వెస్టర్లు క్షుణ్ణంగా పరిశీలించే అవకాశం ఉంది. ఆర్బీఐ ఎంపీసీ అత్యవసర భేటీ రిజర్వ్ బ్యాంక్ తన తదుపరి పరపతి ద్రవ్య సమీక్ష(ఎంపీసీ) సమావేశాన్ని గురువారం (నవంబర్ 3న) అత్యవసరంగా నిర్వహించనుంది. వరుసగా మూ డు త్రైమాసికాలుగా ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయడంలో విఫలంకావడంతో ఆర్బీఐ మరోదఫా వడ్డీరేట్లను పెంచడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది. కార్పొరేట్ ఆర్థిక ఫలితాలు ఈ వారంలో సుమారు 100కి పైగా కంపెనీలు తమ క్యూ2తో గణాంకాలను ప్రకటించనున్నాయి. ఎస్బీఐ, భారతీ ఎయిర్టెల్, ఎల్అండ్టీ, హెచ్డీఎఫ్సీ, టాటా స్టీల్, అదానీ పోర్ట్స్, సన్ ఫార్మా, టెక్ మహీంద్రా, యూపీఎల్, హీరో మోటోకార్ప్, హెచ్పీసీఎల్, బ్రిటానియా ఇండస్ట్రీస్, సిప్లా, గెయిల్ ఇండియా, టైటాన్, పవర్ గ్రిడ్ తదితర దిగ్గజ కంపెనీలు ఫలితాలు వెల్లడించే జాబితాలో ఉన్నాయి. ఫలితాల ప్రకటన సందర్భంగా కంపెనీల యాజమాన్యం చేసే అవుట్లుక్ వ్యాఖ్యలను మార్కెట్ వర్గాలు నిశీతంగా పరిశీలించే వీలుంది. స్థూల ఆర్థిక గణాంకాలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్ త్రైమాసిక జీడీపీ డేటాతో పాటు జూలై ద్రవ్యోల్బణ లోటు, మౌలిక రంగ గణాంకాలు బుధవారం(ఆగస్టు 31న) వెల్లడి కానున్నాయి. సెప్టెంబర్ ద్రవ్యలోటు, మౌలిక రంగ గణాంకాలు సోమవారం విడుదల కానున్నాయి. మరసటి రోజు అక్టోబర్ నెల వాహన విక్రయ గణాంకాలతో పాటు అదే నెల తయారీ రంగ డేటా కూడా విడుదల అవుతుంది. సేవారంగ డేటా గురువారం వెల్లడి కానుంది. అలాగే శుక్రవారం ఆర్బీఐ అక్టోబర్ 21 తేదీతో ముగిసిన ఫారెక్స్ నిల్వల డేటా, ఇదే నెల 28వ తేదీతో ముగిసిన డిపాజిట్– బ్యాంక్ రుణ వృద్ధి డేటాను వెల్లడించనుంది. దేశీయ ఆర్థిక వ్యవస్థ స్థితిగతులను ప్రతిబింబించేసే ఈ స్థూల గణాంకాలను మార్కెట్ వర్గాలు క్షుణ్ణంగా పరిశీలిస్తాయి. దేశీయ ఆర్థిక వ్యవస్థ స్థితిగతులను ప్రతిబింబించేసే ఈ స్థూల గణాంకాలను మార్కెట్ వర్గాలు క్షుణ్ణంగా పరిశీలిస్తాయి. తగ్గిన ఎఫ్ఐఐల అమ్మకాల ఉధృతి దేశీయ మార్కెట్లో విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాల ఉధృతి తగ్గుముఖం పట్టింది. సెప్టెంబర్లో రూ.7,600 కోట్ల ఈక్విటీలను విక్రయించిన ఎఫ్ఐఐలు ఈ నెలలో ఇప్పటి వరకు(29 తేదీ నాటికి) రూ.1,586 కోట్ల షేర్లను మాత్రమే అమ్మారు. ఆగస్ట్లో రూ. 51,200 కోట్లు ఇన్వెస్ట్ చేశారు. ఈ ఏడాదిలో నికరంగా 1.70 లక్షల కోట్లు పెట్టుబడులను ఉపసంహరించుకున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ‘‘ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు, రూపాయి పతనం, ఆర్థిక మాంద్యం భయాలు, ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు, ఉక్రెయిన్పై రష్యా యుద్ధం కొనసాగడం, బ్రిటన్లో రాజకీయ అస్థిరత తదితర అంశాల నేపథ్యంలో భవిష్యత్లోనూ ఎఫ్పీఐల పెట్టుబడుల్లో ఆటుపోట్లు కనిపించవచ్చు’’ అని మార్నింగ్స్టార్ ఇండియా అసిసోయేట్ డైరెక్టర్ హిమాన్షు శ్రీవాస్తవ తెలిపారు. -
కొనుగోళ్లకు ఎగబడుతున్న ఇన్వెస్టర్లు, లాభాల్లో దేశీ స్టాక్ మార్కెట్లు
ముంబై: వరుసగా రెండో రోజు దేశీ స్టాక్ మార్కెట్లు బలపడ్డాయి. ఇన్వెస్టర్లు ప్రారంభంలోనే కొనుగోళ్లకు ఎగబడటంతో సెన్సెక్స్ 513 పాయింట్లు ఎగసి 58,579కు చేరింది. చివరికి 157 పాయింట్ల లాభంతో 58,222 వద్ద ముగిసింది. తొలుత 17,428ను దాటిన నిఫ్టీ సైతం 58 పాయింట్లు జమ చేసుకుని 17,332 వద్ద స్థిరపడింది. ప్రపంచ మార్కెట్లు అటూఇటుగా ఉన్నప్పటికీ విదేశీ ఇన్వెస్టర్లు కొనుగోళ్ల యూటర్న్ తీసుకోవడంతో సెంటిమెంటు బలపడినట్లు నిపుణులు పేర్కొన్నారు. ఈ ఉత్సాహం రెండో రోజూ కొనసాగడంతో మార్కెట్లు రోజంతా లాభాల్లోనే కదిలినట్లు విశ్లేషించారు. మెటల్స్ జోరు..: ఎన్ఎస్ఈలో ప్రధానంగా మెటల్, మీడియా, రియల్టీ, ఐటీ 3.2–1.6 శాతం మధ్య ఎగశాయి. ఎఫ్ఎంసీజీ, ఫార్మా 0.4 శాతం డీలాపడ్డాయి. బ్లూచిప్స్లో జేఎస్డబ్ల్యూ, సీఐఎల్, హిందాల్కో, టాటా స్టీల్, ఎల్అండ్టీ, ఐసీఐసీఐ, హెచ్సీఎల్ టెక్, ఇన్ఫీ, యాక్సిస్, 5–1.5 శాతం మధ్య లాభపడ్డాయి. అయితే ఎయిర్టెల్, హెచ్యూఎల్, హెచ్డీఎఫ్సీ ద్వయం, ఇండస్ఇండ్, దివీస్, ఎస్బీఐ లైఫ్, బజాజ్ ఫైనాన్స్, బ్రిటానియా 2.6–1 శాతం మధ్య క్షీణించాయి. స్టాక్ హైలైట్స్ ►రూ. 1,000 కోట్ల అదనపు అత్యవసర రుణ సహాయం అందనున్న వార్తలతో చౌక ధరల విమానయాన సంస్థ స్పైస్జెట్ షేరు 8 శాతం జంప్చేసి రూ. 42 వద్ద ముగిసింది. ►కొన్ని షరతులకులోబడి సోనీ పిక్చర్స్తో విలీనానికి సీసీఐ అనుమతించడంతో జీ ఎంటర్టైన్మెంట్ 4.6% ఎగసి రూ. 281 వద్ద ముగిసింది. ►ఉత్తర అమెరికా నుంచి క్లాస్8 ట్రక్కుల ఆర్డర్లు పెరగడంతో భారత్ ఫోర్జ్ షేరు 8 శాతం దూసుకెళ్లి రూ. 763 వద్ద ముగిసింది. రూ‘పాయే’: 82.17 రూపాయి రికార్డుల పతనం ఆగట్లేదు. ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో డాలర్ మారకంలో రూపాయి విలువ గురువారం మొదటిసారి భారీగా 55 పైసలు నష్టపోయి 82 దిగువన 82.17 వద్ద ముగిసింది. అంతర్జాతీయంగా డాలర్ పటిష్టత, క్రూడ్ ధరలు స్థిరంగా ఉండడం దీనికి కారణం. రూపాయి మంగళవారం ట్రేడింగ్లో 20 పైసలు లాభపడి 81.62 వద్ద ముగిసింది. దసరా సందర్బంగా బుధవారం మార్కెట్కు సెలవు. గురువారం కొంత సానుకూలంగా 81.52 వద్ద ప్రారంభమైంది. ఇంట్రాడేలో 81.51ని చూసినా ఆ స్థాయిలో నిలదొక్కుకోలేకపోయింది. -
ఆర్ధిక మాంద్యం భయాలు, స్టాక్ మార్కెట్ లాభాలకు బ్రేకులు!
ముంబై: ఆర్థిక మాంద్యం భయాలు మరోసారి తెరపైకి రావడంతో స్టాక్ సూచీల నాలుగు రోజుల లాభాలకు బుధవారం బ్రేక్ పడింది. జూన్ నెలవారీ ఎఫ్అండ్ఓ ఎక్స్పైరీ(నేడు)కి ముందుట్రేడర్లు అప్రమత్తత వహిస్తూ బ్యాంకింగ్, ఐటీ ఎఫ్ఎంసీజీ షేర్లలో లాభాల స్వీకరణకు మొగ్గు చూపారు. విదేశీ ఇన్వెస్టర్ల వరుస విక్రయాలు, బలహీన అంతర్జాతీయ సంకేతాలు సెంటిమెంట్పై మరింత ఒత్తిడి పెంచాయి. ఫలితంగా సెన్సెక్స్ 150 పాయింట్లు నష్టపోయి 53,027 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 51 పాయింట్ల పతనంతో 15,799 వద్ద నిలిచింది. మరోవైపు ఇంధన, రియల్టీ, మెటల్, ఆటో షేర్లకు స్వల్పంగా కొనుగోళ్ల మద్దతు లభించింది. బీఎస్ఈ మిడ్క్యాప్, స్మాల్క్యాప్ ఇండెక్సులు వరసగా 0.70%, 0.20 శాతం చొప్పున నష్టపోయాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.851 కోట్ల షేర్లను అమ్మేయగా, దేశీయ ఇన్వెస్టర్లు రూ.847 కోట్ల షేర్లను కొన్నారు. యూఎస్ తొలి త్రైమాసిక జీడీపీ గణాంకాలు విడుదల(రాత్రికి) ముందు ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు స్వల్ప నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ‘‘ప్రపంచ మార్కెట్లలో నెలకొన్న మిశ్రమ సంకేతాల కారణంగా ఇటీలవ దేశీయ స్టాక్ మార్కెట్ సరైన దిశా, నిర్దేశం లేకుండా ట్రేడ్ అవుతోంది. ఇప్పటికే క్రూడాయిల్ ధరలు గరిష్టాలకు చేరుకున్నాయి. డాలర్ మారకంలో రూపాయి విలువ జీవితకాల కనిష్టాన్ని చవిచూసింది. ఈ నేపథ్యంలో జూన్ ఎఫ్అండ్ఓ డెరివేటివ్స్ ఎక్స్పైరీ(నేడు)తో పాటు ఆటో విక్రయ, పీఎంఐ గణాంకాల విడుదల(రేపు)కు ముందు ట్రేడర్లు అప్రమత్తత వహిస్తూ లాభాల స్వీకరణకు మొగ్గుచూపారు. రానున్న రోజుల్లో సూచీలు ఒడిదుడుకులకు లోనవుతూ పరిమిత శ్రేణిలో కదలాడొచ్చు’’ అని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్స్ సర్వీసెస్ రిటైల్ రీసెర్చ్ హెడ్ సిద్ధార్థ ఖేమా తెలిపారు. మిడ్ సెషన్ నుంచి కొనుగోళ్లు ప్రపంచ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు అందుకున్న దేశీయ మార్కెట్ భారీ నష్టంతో మొదలైంది. సెన్సెక్స్ 554 పాయింట్ల నష్టంతో 52,623 వద్ద, నిఫ్టీ 148 పాయింట్లు పతనంతో 15,702 వద్ద ట్రేడింగ్ను ప్రారంభించాయి. కొనుగోళ్లకు తోడ్పడే అంశాలేవీలేకపోవడంతో సూచీలు తొలిసెషన్లో పరిమితి శ్రేణిలో నష్టాలతో కదలాడాయి. అయితే మిడ్సెషన్ నుంచి ఇంధన, ఆటో ప్రభుత్వ కంపెనీ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో సూచీలు నష్టాలను పరిమితం చేసుకోగలిగాయి. మార్కెట్లో మరిన్ని సంగతులు ► దేశీయంగా ఉత్పత్తి చేసిన క్రూడాయిల్ విక్రయం ధరలను నియంత్రణ పరిధి నుంచి తొలిగించాలనే కేంద్ర కేబినేట్ నిర్ణయంతో ఆయిల్ ఇండియా, ఓఎన్జీసీ, రిలయన్స్, గెయిల్ షేర్లు ఐదుశాతం నుంచి ఒకటిన్నర శాతం ర్యాలీ చేశాయి. ► ఓపెన్ మార్కెట్ పద్దతిలో షేర్ల బైబ్యాక్ ప్రకటన నిరాశపరచడంతో రూట్ మొబైల్ షేరు ఏడు శాతం క్షీణించి రూ.1,237 వద్ద నిలిచింది. ►ఆర్బీఎల్ బ్యాంక్, బంధన్ బ్యాంక్, కోటక్ బ్యాంక్, ఐసీఐసీఐ తదితర ప్రైవేట్ రంగ బ్యాంకు షేర్లు 4శాతం నుంచి ఒకశాతం క్షీణించాయి. కారణాలు...కఠినం క్రూడ్ ఆయిల్ ధరల తీవ్రత, వడ్డీరేట్ల పెంపు ధోరణి, డాలర్ పటిష్టత, దేశీయ ఈక్విటీ మార్కెట్ల నష్టాలు, విదేశీ ఇన్వెస్టర్ల నికర అమ్మకాలు, మరో మాంద్యం ముందు ప్రపంచం నిలబడిందన్న విశ్లేషణలు, కోవిడ్–19పై అనిశ్చితి వంటి పలు అంశాలు రూపాయి పతనానికి కారణంగా ఉన్నాయి. మరోవైపు రూపాయి కట్టడిచేసే స్థితిలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) లేదన్న వార్తలు రూపాయి జారుడుకు మరింత ఊతం ఇస్తోంది. ఇటీవల ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ మైఖేల్ డీ పాత్ర ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ, రూపాయి విలువ ఏ స్థాయిలో స్థిరపరచాలన్న అంశంపై ఎటువంటి లక్ష్యాన్ని ఆర్బీఐ నిర్ధేశించుకోలేదని చెప్పారు. ‘‘రూపాయి ఎక్కడ ఉంటుందో మాకు తెలియదు. డాలర్ ఎక్కడ ఉంటుందో అమెరికా ఫెడ్కి కూడా తెలియదు. కానీ ఒక్క విషయం మాత్రం కచ్చితంగా చెప్పాలి. మేము రూపాయి స్థిరత్వం కోసం నిరంతరం గట్టి ప్రయత్నం చేస్తాము. ఈ విషయంలో పురోగతి ఉంటుందని ఆర్బీఐ విశ్వసిస్తోంది. రూపాయి విలువ స్థిరీకరణపై లక్ష్యం ఏదీ లేదుకానీ, తీవ్ర ఒడిదుడుకులను నివారించడానికి మాత్రం సెంట్రల్ బ్యాంక్ అధిక ప్రాధాన్యత ఇస్తుంది’’ అని ఆయన పేర్కొన్నారు. అమెరికా వడ్డీరేట్ల పెంపు, దీనితో ఆ దేశానికి తిరిగి డాలర్ల రాక డాలర్ ఇండెక్స్ బలోపేతానికి కారణమవుతోంది. ఈ వార్త రాస్తున్న రాత్రి 11 గంటల సమయంలో అంతర్జాతీయ ఫ్యూచర్స్ మార్కెట్లో డాలర్ మారకంలో రూపాయి విలువ అరశాతంపైగా నష్టంతో 79 వద్ద ట్రేడవుతోంది. ఆరు కరెన్సీ విలువల (యూరో, స్విస్ ఫ్రాంక్, జపనీస్ యన్, కెనడియన్ డాలర్, బ్రిటన్ పౌండ్, స్వీడిష్ క్రోనా) ప్రాతిపదకన లెక్కించే డాలర్ ఇండెక్స్ పటిష్టంగా 104.50 డాలర్లపైన ట్రేడవుతోంది. ముంబై: క్షీణబాటలో రూపాయి వేగం ఆగట్లేదు. ఏరోజుకారోజు కొత్త పతన రికార్డులు కొనసాగుతున్నాయి. బుధవారం ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో డాలర్ మారకంలో రూపాయి విలువ క్రితం ముగింపుతో పోల్చితే 18 పైసలు నష్టంతో 79.03 వద్ద ముగిసింది. ఫారెక్స్ మార్కెట్లో రూపాయి మంగళవారం ముగింపు 78.85. బుధవారం ట్రేడింగ్లో మరింత బలహీనంగా 78.86 వద్ద ప్రారంభమైంది. ఇంట్రాడేలో ఒక దశలో 79.05 స్థాయినీ చూసింది. చివరకు క్రితం ముగింపుతో పోల్చితే 18పైసలు నష్టపోయింది. వెరసి ముగింపు, ఇంట్రాడేల్లో రూపాయిది బుధవారం విలువలే కనిష్ట స్థాయిలు కావడం గమనార్హం. ఉక్రెయిన్పై రష్యా యుద్ధం ప్రారంభమైన తర్వాత రూపాయి దాదాపు 6 శాతం నష్టపోయింది. ఏడాది ప్రారంభం నుంచి 6.39 శాతం నష్టపోతే, ఒక్క జూన్ నెల్లో 2 శాతం పతనమైంది. ఫిలిప్పీన్ పెసో, థాయ్ భాట్ తర్వాత ఆసియా కరెన్సీల్లో రూపాయి ఇటీవలి నెలల్లో మూడవ అత్యంత క్షీణతను నమోదుచేసుకుంది. శుక్రవారం వరుసగా ఎనిమిది వారాల్లో నష్టాల్లో నడిచిన రూపాయి, తాజా వారంలో వరుసగా మూడు ట్రేడింగ్ సెషన్లలోనూ నష్టపోవడం గమనార్హం. ఐపీవోకు ఇన్నోవా క్యాప్ట్యాబ్ ఫార్మాస్యూటికల్ కంపెనీ ఇన్నోవా క్యాప్ట్యాబ్ పబ్లిక్ ఇష్యూ బాట పట్టింది. ఇందుకు అనుమతించమంటూ క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్ను దాఖలు చేసింది. తద్వారా రూ. 900 కోట్లవరకూ సమకూర్చుకునే యోచనలో ఉంది. ఐపీవోలో భాగంగా రూ. 400 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి అదనంగా రూ. 96 లక్షల షేర్లను ప్రమోటర్లు, కంపెనీలో ఇప్పటికే ఇన్వెస్ట్చేసిన వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. -
ఎలన్ మస్క్ ఆగమాగం, మంచు పర్వతంలా కరిగిపోతున్న ఆస్తులు!
ప్రపంచ దేశాల్లో నెలకొన్న పరిణామాలతో జాతీయ, అంతర్జాతీయ స్టాక్ మార్కెట్లు భారీగా నష్టపోతున్నాయి. ఊహించని విధంగా సెకన్ల వ్యవధిలో ఈక్వేషన్లు మారిపోతున్నాయి. లక్షల కోట్ల మదపర్ల పెట్టుబడులు ఆవిరై పోతున్నాయి. మునుపెన్నడూ లేని విధంగా స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టే మధ్య తరగతి ఉద్యోగి నుంచి క్యాపిటల్ మార్కెట్లో వేల కోట్ల కంపెనీ అధినేతగా పేరొందిన ఎలన్ మస్క్కు సైతం నష్టాలు తప్పడం లేదు. ఉక్రెయిన్పై రష్యా యుద్ధం, లాక్ డౌన్, స్తంభించిన రవాణా సప్లయ్ చైన్, చిప్ కొరత, ఊహాతీతమైన నిర్ణయాలతో ఎలన్ మస్క్ నష్టాల్ని కొని తెచ్చుకుంటున్నారు.దీంతో మస్క్ కోల్పోతున్న సంపద ముఖేష్ అంబానీ ఆస్తుల కంటే ఎక్కువగా ఉందని బ్లూమ్ బర్గ్ నివేదిక తెలిపింది. జూన్ 14వరకు (నిన్న) కేవలం రెండు నెలల వ్యవధిలో 100బిలియన్ డాలర్లు నష్టపోయినట్లు పేర్కొంది. అదే సమయంలో ఆసియా రిచెస్ట్ పర్సన్ ముఖేష్ అంబానీ తన మొత్తం సంపదలో 96 బిలియన్ డాలర్లు ఉండగా..రిలయన్స్ ఇండస్ట్రీ కంపెనీ షేర్లు బెటర్ ఫర్మామెన్స్తో 9 శాతం వృద్ధిని నమోదు చేశాయి. ముఖేష్ అంబానీ ఆస్తి రోజురోజుకీ పెరిగిపోతున్నట్లు బ్లూమ్ బర్గ్ తన కథనంలో హైలెట్ చేసింది. దురదృష్టం అడ్రస్ వెతుక్కొని వెళ్లి మరీ దురదృష్టం అడ్రస్ వెతుక్కొని వెళ్లి మరీ వెళ్లినట్లుగా..ఎలన్ మస్క్కు నష్టాలు చుట్టం చూపుగా వచ్చి నెలల తరబడి తిష్ట వేస్తున్నాయి. వెరసీ ఈ ఏడాది జనవరి నెలలో 300 బిలియన్ డాలర్లతో ప్రపంచంలో నెంబర్ వన్ బిలియనీర్గా అవతరించిన మస్క్ ఆదాయం మంచు పర్వతంలా కరిగిపోతుంది. కరెక్షన్ కారణంగా స్టాక్ మార్కెట్ ప్రతి రోజు నష్టాల్ని చవిచూస్తున్నారు. కాబట్టే రెండు నెలల వ్యవధిలో మస్క్ 100బిలియన్ సంపద తరిగిపోయింది. ఫోర్బ్స్ లెక్కల ప్రకారం.. మస్క్ 203 బిలియన్ డాలర్లతో ధనవంతుల జాబితాలో నెంబర్ వన్ స్థానంలో ఉన్నారు. కానీ ఈ ఏడాది జనవరి నుంచి ప్రతి రోజు 0.6 బిలియన్ డాలర్లు నష్టపోతుండడం గమనార్హం. చదవండి👉యూట్యూబ్లో ‘ఎలన్ మస్క్ స్కామ్’, వందల కోట్లలో నష్టం! -
ఉక్రెయిన్- రష్యా యుద్ధం: ఈ వారం స్టాక్ మార్కెట్ల దారెటు?
ముంబై: స్టాక్ మార్కెట్లో ఈ వారమూ దిద్దుబాటు (కరెక్షన్) కొనసాగే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. ఎఫ్అండ్ఓ ఎక్స్పైరీ ముగింపు తేదీ, మార్చి వాహన విక్రయాలు గణాంకాలు, కీలక ఆర్థిక గణాంకాల వెల్లడి నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తత వహించవచ్చు. ఇక అంతర్జాతీయంగా ఉక్రెయిన్–రష్యాల మధ్య కొనసాగుతున్న యుద్ధం, నిరంతర పెరుగుతున్న ముడిచమురు ధరలు సెంటిమెంట్పై ప్రభావాన్ని చూపొచ్చు. వీటితో పాటు డాలర్ మారకంలో రూపాయి విలువ ట్రేడింగ్పైనా మార్కెట్ వర్గాలు దృష్టి సారించనున్నాయి. ‘‘గత కొన్ని ట్రేడింగ్ సెషన్ల నిఫ్టీ 17,000–17,450 పాయింట్ల రేంజ్లో కదలాడుతోంది. ఈ శ్రేణిని చేధిస్తేనే తదుపరి స్థాయిలను అంచనా వేయవచ్చు’’ అని నిపుణులు చెబుతున్నారు. ఆటో, బ్యాంకింగ్, ఆర్థిక, ఎఫ్ఎంసీజీ షేర్లలో లాభాల స్వీకరణ చోటు చేసుకోవడంతో గతవారంలో సెన్సెక్స్ 502 పాయింట్లు, నిఫ్టీ 134 పాయింట్లను నష్టాలను చవిచూశాయి. దీంతో సూచీల రెండువారాల వరుస లాభాలకు బ్రేక్ పడింది. ఈ వారం మార్కెట్ను ప్రభావితం చేసే అంశాలు.... రష్యా ఉక్రెయిన్ యుద్ధ పరిస్థితులు నెలరోజులుగా కొనసాగుతున్న ఉక్రెయిన్, రష్యాల యుద్ధం ఈక్విటీ మార్కెట్లపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. శాంతి చర్చలు క్లిష్టం గా సాగుతున్నాయని ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి దిమిత్రి కులేబా చేసిన వ్యాఖ్యలు మరింత ఆందోళనలను రేకెత్తిస్తున్నాయి. రష్యా దూకుడుకు కళ్లెం వేసేందుకు అమెరికా పావులు కదుపుతోంది. జీ–20 కూటమి నుండి రష్యాను బహిష్కరించేందుకు ఆయా దేశాలతో చర్చలు జరుపుతామని యూఎస్ అధ్యక్షుడు జో బైడెన్ తెలిపారు. కాల్పుల విరమణ చర్చల సఫలవంతం కోసం మార్కెట్ వర్గాలు ఎదురుచూస్తున్నాయి. కీలకంగా ఆర్థిక, ఆటో అమ్మక గణాంకాలు కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ ఫిబ్రవరి ద్రవ్యలోటు(ప్రభుత్వ ఆదాయాలు, వ్యయాల మధ్య బేధం) గణాంకాలను గురువారం విడుదల చేయనుంది. అదేరోజున మౌలిక రంగాల వృద్ధిగా పిలిచే ఎనిమిది రంగాల ఉత్పత్తి(ఫిబ్రవరి)డేటా వెల్లడి అవుతుంది. దేశీయ ఆటో కంపెనీలు శుక్రవారం మార్చి నెలతో గతేడాది పాటు 2021 ఆర్థిక సంవత్సరపు వాహన అమ్మక గణాంకాల వివరాలను వెల్లడించనున్నాయి. ఈ కీలకమైన ఈ గణాంకాల విడుదలకు ముందు ఇన్వెస్టర్లు అప్రమత్తత వహించే అవకాశం ఉంది. గురువారం ఎఫ్అండ్ఓ ముగింపు ఈ గురువారం(మార్చి 31న) నిఫ్టీ సూచీకి చెందిన మార్చి సిరీస్ డెరివేటివ్స్ కాంట్రాక్టులు ముగియనున్నాయి. అదేరోజున బ్యాంక్ నిఫ్టీ వీక్లీ ఎక్స్పైరీ తేదీ కూడా ఉంది. ట్రేడర్లు తమ పొజిషన్లపై తీసుకొనే స్క్వేయర్ ఆఫ్ లేదా రోలోవర్ నిర్ణయానికి అనుగుణంగా మార్కెట్ స్పందించవచ్చని నిపుణులు చెబుతున్నారు. ప్రపంచ పరిణామాలు ప్రపంచ పరిణామాలు ట్రేడింగ్పై ప్రభావాన్ని చూపవచ్చు. అంతర్జాతీయంగా కోవిడ్ కేసులు తిరిగి పెరుగుతున్నాయి. భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతలతో సప్లై అవాంతరాలు ఆటంకం కలుగవచ్చనే అంచనాల నడుమ ఇప్పటికే క్రూడాయిల్ ధర భారీ పెరిగాయి. చమురు ధరల పెరుగుదల ద్రవ్యోల్బణానికి దారితీయవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అమెరికా వినియోగ విశ్వాస, నిరుద్యోగ, చమురు నిల్వల డేటాతో పాటు కీలకమైన క్యూ4 జీడీపీ గణాంకాలు ఈ వారంలో విడుదల అవుతాయి. జపాన్ నిరుద్యోగ గణాంకాలు మంగవారం, యూరోజోన్ పారిశ్రామిక డేటా బుధవారం వెల్లడికానున్నాయి. వీటితో పాటు ఆయా దేశాలు విడుదల చేసే కీలక ఆర్థిక గణాంకాల ఆధారంగా ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు కదలాడవచ్చు. మూడు నెలల్లో రూ.లక్ష కోట్ల విదేశీ పెట్టుబడులు వెనక్కి.. భౌగోళిక ఉద్రిక్తతలు, ద్రవ్యోల్బణ భయాలతో భారత మూలధన మార్కెట్ నుంచి విదేశీ ఇన్వెస్టర్లు గడిచిన మూడునెలల్లో రూ.1.14 లక్షల కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. ఎఫ్ఐఐలు ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల్లో వరుసగా రూ.28,526 కోట్లు, రూ.38,068 కోట్లు, రూ.48,261 కోట్లను ఉపసంహరించుకున్నట్లు డిపాజిటరీ గణాం కాలు వెల్లడించాయి. ‘‘ఉక్రెయిన్, రష్యాల నుంచి దిగుమతులు తక్కువగా ఉంటడంతో యుద్ధ ప్రభావం భారత ఆర్థిక వ్యవస్థపై పరిమితంగానే ఉంది. అయితే అంతర్జాతీయంగా పెరిగిపోతున్న ఇంధన, మెటల్స్, వ్యవసాయ తదితర కమోడిటీ ఉత్పత్తుల ధరలు దేశీయ కార్పొరేట్ ఆదాయాలను దెబ్బతీస్తాయి’’ కోటక్ మహీంద్రా అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ ఈక్విటీ రీసెర్చ్ హెడ్ సుబానీ కురియన్ తెలిపారు. అంతర్జాతీయంగా క్రూడ్ ధరలు పదిశాతం పెరిగితే దేశీయ కరెంట్ అకౌంట్ ద్రవ్యలోటు 30 బేసిస్ పాయింట్ల, సీపీఐ ద్రవ్యోల్బణం 40 బేసిస్ పాయింట్లు మేర పెరగవచ్చని కురియన్ పేర్కొన్నారు. -
దేశీయ స్టాక్ మార్కెట్లపై బేర్ పంజా...నష్టాల్లో స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లపై గురువారం బేర్ పంజా విసిరింది. దీంతో సూచీలు కుప్ప కూలి గురువారం ఉదయం ప్రారంభం నుంచి స్టాక్ మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. మన దేశంలో పెట్రోల్ ధరలు పెరగడం, రష్యా–ఉక్రెయిన్ల మధ్య ఉద్రిక్త పరిస్థితుల వల్ల గోధుమలు, పామాయిల్ వంటి కమోడిటీలతో పాటు ప్యాకేజింగ్ మెటీరియల్స్ మొదలైన వాటి రేట్లు పెరగడంతో ఆ భారాన్ని వినియోగదారులకు బదలాయించేందుకు ఎఫ్ఎంసీజీ (ఫాస్ట్ మూవింగ్ కన్జూమర్ గూడ్స్) సంస్థలు సిద్ధమవ్వడం, అంతర్జాతీయంగా అమెరికా బాండ్లపై వడ్డీరేట్లు పెరగుతుండడం,యూరప్లో యుద్ధం పరిస్థితులు, పశ్చిమ దేశాల కేంద్ర బ్యాంకుల వడ్డీరేట్ల పెంపు నిర్ణయాలు సెంటిమెంట్ను బలహీనపరిచాయి దీంతో దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం ఉదయం 9.20గంటలకు సెన్సెక్స్ పాయింట్లు నష్టపోయి 57370 వద్ద ట్రేడ్ అవుతుండగా..నిఫ్టీ 489 పాయింట్లు నష్టపోయి 35659 పాయింట్ల వద్ద ట్రేడింగ్ ను కొనసాగుతుంది. కోల్ఇండియా, హిందాల్కో, ఓఎన్జీసీ, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్, జేఎస్డబ్ల్యూస్టీల్, టాటా స్టీల్, అదానీ పోర్ట్ స్టాక్స్ లాభాలతో కంటిన్యూ అవుతుండగా..కొటాక్, ఐసీఐసీఐ,హెచ్డీఎఫ్సీ, ఇండస్ ఇండ్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ, ఎస్బీఐ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. -
ఐపీవోకు ఉవ్విళ్లూరుతున్న ఎల్ఐసీ! అంతలోనే భారీ షాక్!!
న్యూఢిల్లీ: జీవిత బీమా కంపెనీల కొత్త బిజినెస్ ప్రీమియం ఆదాయం 2022 జనవరిలో 2.65 శాతం పెరిగి, రూ.21,957 కోట్లకు చేరింది. రెగ్యులేటర్– ఐఆర్డీఏఐ (ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా) తాజా గణాంకాలను పరిశీలిస్తే.. ► దేశంలోకి మొత్తం 24 జీవిత బీమా కంపెనీలు 2022 జనవరిలో రూ.21,390 కోట్ల కొత్త బిజినెస్ ప్రీమియంను వసూలు చేశాయి. ► ఈ రంగంలో దిగ్గజ ప్రభుత్వ రంగ సంస్థ– లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) కొత్త ప్రీమియం ఆదాయం 2 శాతం. 5పడిపోయి రూ.12,936.28 కోట్లకు చేరింది. 2021 ఇదే నెల్లో ఎల్ఐసీ కొత్త ప్రీమియం ఆదాయం రూ.13,144 కోట్లు. ► ఇక 23 ప్రైవేటు రంగ కంపెనీల కొత్త ప్రీమియం 9.39 శాతం ఎగసి, రూ.8,246.06 కోట్ల నుంచి రూ. 9,020.75 కోట్లకు చేరింది. ► మొత్తం మార్కెట్లో ఎల్ఐసీ వాటా 61.15 శాతంగా ఉంది. వివిధ కారణాలతో రద్దయిన (ల్యాప్స్డ్) పాలసీలను పునరుద్ధరించుకోవడానికి ఎల్ఐసీ ప్రకటించిన ప్రత్యేక ఆఫర్ ఈ నెల 7వ తేదీ నుంచి మార్చి 27వ తేదీ వరకూ అమలవుతుంది. హెల్త్, మైక్రో ఇన్సూరెన్స్ పాలసీలపైనా లేట్ ఫీజులో రాయితీ ఈ ఆఫర్లో ప్రత్యేకత. ఇక పబ్లిక్ ఇష్యూకు రావడానికి కూడా ఎల్ఐసీ సంసిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. -
స్టాక్ మార్కెట్: వరుసగా మూడో రోజూ నష్టాలతోనే ముగింపు
Stock Market Closed Update: దేశీ స్టాక్ సూచీలు వరుసగా మూడో రోజూ నష్టాలతోనే ముగిశాయి. సెన్సెక్స్ 634 పాయింట్లు పతనం కాగా, నిఫ్టీ 181 పాయింట్ల నష్టంతో ట్రేడ్ పూర్తి చేసుకుంది. ఇదిలా ఉంటే దలాల్ స్ట్రీట్లో గత మూడు రోజుల్లో సెన్సెక్స్ 2 వేల పాయింట్లకు పైగా పతనం కావడం గమనార్హం. గురువారం 60, 045 పాయింట్ల వద్ద మొదలైన సెన్సెక్స్.. 59, 068 పాయింట్ల కనిష్టానికి టచ్ అయ్యి.. చివరికి 59, 464 పాయింట్ల వద్ద క్లోజ్ అయ్యింది. నిన్నటి ముగింపుతో పోలిస్తే.. 1.06 శాతం నష్టంతో సెన్సెక్స్ క్లోజ్ అయ్యింది. మంగళ, బుధ వారాల్లో వరుసగా 656, 554 పాయింట్లు నష్టపోయింది సెన్సెక్స్. ఇక నిఫ్టీ 17, 921 పాయింట్ల వద్ద గురువారం మొదలై.. ఒకానొక టైంలో 17, 648 పాయింట్లకు చేరి.. చివరికి 17, 757 పాయింట్ల వద్ద ముగిసింది. కిందటి రోజుతో పోలిస్తే.. ఈ పతనం 1.01 శాతం దిగజారింది. భారత ఈక్విటీ మార్కెట్ కీలక సూచీలు పతనం కావడంతో ప్రత్యేకించి ఐటీ, ఫార్మా, ఎఫ్ఎంసీజీ దారుణంగా నష్టపోయాయి. ఐటీ స్టాక్స్ వరుసగా మూడో రోజూ భారీ అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. బజాజ్ ఫిన్సర్వ్, హిందుస్థాన్ యునిలివర్, డాక్టర్ రెడ్డీ ల్యాబోరేటరీస్, సన్ ఫార్మా నష్టాల సెన్సెక్స్లో నష్టాలు చవిచూశాయి. -
Stock Market: ఊగిసలాటలో స్టాక్ సూచీలు
శుక్రవారం ఉదయం(డిసెంబర్ 24, 2021) గ్లోబల్ మార్కెట్లో ఫలితాలు సానుకూలంగా కదలాడుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత స్టాక్ మార్కెట్ సూచీలు లాభాలతో మొదలయ్యాయి. అయితే కాసేపటికే స్వల్ఫ నష్టాలు, ఆపై లాభంతో ఊగిసలాట కనిపిస్తోంది. డిసెంబర్ 24 ఉదయం గ్లోబల్ క్యూస్ సానుకూల సంకేతాలతో భారత స్టాక్ మార్కెట్ మొదలైంది. లాభాలతో మొదలైన స్వల్ఫ నష్టాలు, ఆ వెంటనే స్వల్ఫ లాభాలతో స్టాక్ సూచీలు కదలాడుతున్నాయి. ఉదయం 9గం.23ని. వద్ద సెన్సెక్స్ 48 పాయింట్ల లాభంతో 57, 364 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతోంది. నిఫ్టీ 27 పాయింట్ల స్వల్ప లాభంతో 17, 100 వద్ద ట్రేడ్ అవుతోంది. అంతర్జాతీయ మార్కెట్ సానుకూల ప్రభావం చూపెట్టినప్పటికీ.. ఒమిక్రాన్ భయాల నేపథ్యంలో మార్కెట్ ఊగిసలాటలో ట్రేడ్ అవుతోంది. హెచ్సీఎల్ టెక్నాలజీస్, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, టీసీఎస్, విప్రో, ఐవోసీ లాభాల్లో, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, ఇండస్లాండ్ బ్యాంక్, సన్ ఫార్మా, టాటా క్జూమర్ ప్రొడక్ట్స్, ఐసీఐసీఐ బ్యాంకులు నష్టాల బాట పట్టాయి. -
స్టాక్ మార్కెట్కి ఊరట.. లాభాల్లో ట్రేడ్
ఒమిక్రాన్ వేరియెంట్ భయాందోళనల నడుమ గ్లోబల్ మార్కెట్ నిన్నంతా (సోమవారం) భారీ నష్టాల్ని చవిచూసిన విషయం తెలిసిందే. ఈ ప్రభావంతో దేశీయ స్టాక్ సూచీలు సైతం భారీ పతనాల్ని ఎదుర్కొన్నాయి. అయితే మంగళవారం కాస్త ఊరటనిచ్చే ఫలితాలు మార్కెట్లో కనిపిస్తున్నాయి. దేశీయ స్టాక్ మార్కెట్ మంగళవారం ఉదయం(21-12-2021) లాభాలతో మొదలైంది. ఉదయం 9.40గం. సమయంలో నిఫ్టీ 137 పాయింట్లు లాభపడి(1.09%) 16, 751 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతోంది. మరోవైపు బీఎస్ఈ సెన్సెక్స్ 478 పాయింట్లు లాభంతో (1.09%) 56,300 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతోంది. మార్కెట్లో నిఫ్టీ-సెన్సెక్స్ టాప్ గెయినర్స్గా టైటాన్ కంపెనీ, హెచ్సీఎల్ టెక్, టాటా స్టీల్, టెక్ మహీంద్రా, విప్రోలు.. నిఫ్టీలో టాప్ లాసర్స్గా సిప్లా, హీరో మోటర్కాప్, ఎయిచర్ మోటర్స్, ఉన్నాయి. ఐసీఐసీఐ, రిలయన్స్, బజాజ్ఫైనాన్స్, టాటామోటార్స్, విప్రో లాభాల బాటలో ట్రేడ్ అవుతున్నాయి. ఆసియా మార్కెట్లో సానుకూల ప్రభావం, దేశీయ కంపెనీల భారీ ఒప్పందాల నడుమ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల పట్టినట్లు నిపుణులు చెప్తున్నారు. -
నష్టాలతో స్టాక్ మార్కెట్ ప్రారంభం
స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం నష్టాల్లో ప్రారంభమయ్యాయి. ఉదయం 9గం.50ని. సమయంలో సెన్సెక్స్ 390 పాయింట్ల నష్టంతో 57,510 వద్ద.. నిఫ్టీ 132 పాయింట్లు నష్టపోయి 17,116 వద్ద ట్రేడవుతున్నాయి. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.76.19 వద్ద కొనసాగుతోంది. సెన్సెక్స్ 30 సూచీలో ఇన్ఫోసిస్, హెచ్సీఎల్ టెక్, టీసీఎస్, టెక్ మహీంద్రా, డాక్టర్ రెడ్డీస్ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. టైటన్, కొటాక్ మహీంద్రా బ్యాంక్, మారుతీ, ఏషియన్ పెయింట్స్, యాక్సిస్ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, బజాజ్ ఫిన్సర్వ్, హెచ్యూఎల్ షేర్లు నష్టాలు చవిచూస్తున్నాయి. కారణాలు ఏంటంటే.. ►అమెరికా మార్కెట్లు గురువారం నష్టాలతో ముగిశాయి. ఈ ప్రభావం గ్లోబల్ మార్కెట్ల మీద కనిపిస్తోంది. ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ట్రేడవుతున్నాయి. ► దేశీయ మార్కెట్ల నుంచి విదేశీ సంస్థాగత మదుపర్ల పెట్టుబడుల ఉపసంహరణ కొనసాగుతోంది. ► అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు స్వల్పంగా తగ్గాయి. ► అమెరికా ఫెడ్ వచ్చే ఏడాది వడ్డీరేట్లను పెంచుతామని ప్రకటించడం, అలాగే బాండ్ల విక్రయాల ద్వారా 30 బిలియన్ డాలర్లు సేకరిస్తామని చెప్పడంతో బంగారానికి డిమాండ్ పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 1800 డాలర్లు దాటింది. ► ఇక ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణం పెరగడం ఇప్పుడు మదుపర్లను కలవరపెడుతోంది. ఈ పరిణామాల నేపథ్యంలోనే సూచీలు నేడు అప్రమత్తంగా కదలాడుతున్నాయి. -
Stock Market Today: స్టాక్ మార్కెట్ లాభాల బాట
అంతర్జాతీయ మార్కెట్లో సానుకూల సంకేతాల నడుమ స్టాక్ మార్కెట్ ఇవాళ లాభాలతో మొదలైంది. గురువారం ఉదయం మొదలైన స్టాక్ మార్కెట్లో లాభాల బాట పట్టాయి. సెన్సెక్స్ 325 పాయింట్లు (0.56 శాతం) లాభంతో 58, 113 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతోంది. నిఫ్టీ 94 పాయింట్లు(0.55 శాతం) లాభంతో 17, 315 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతోంది. రిలయన్స్, ఐసీఐసీఐ బ్యాంక్లు ఫోకస్లో ఉన్నాయి. ఐటీ, పీఎస్యూ బ్యాంక్ 1 శాతం పెరుగుదల కనిపిస్తోంది. బ్యాంక్, మెటల్, ఆయిల్ గ్యాస్, పవర్, రియల్టీ సెక్టార్స్లో కొనుగోలు చోటు చేసుకుంటున్నాయి. ఇన్ఫోసిస్ బిగ్గెస్ట్ గెయినర్గా, మారుతీ సుజుకీ బిగ్గెస్ట్ లాసర్గా నిలిచాయి. చదవండి: చరిత్రాత్మక కనిష్ట పతన దిశగా రూపాయి విలువ! కారణాలివే.. -
నష్టాలతో మొదలైన స్టాక్ మార్కెట్
Stock Market Live Updates: అంతర్జాతీయ మార్కెట్ల బలహీన ఆరంభం.. భారత మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపెడుతోంది. ఈ కారణంతో.. నిన్న(సోమవారం) నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్ ఇవాళ నష్టాలతోనే మొదలైంది. మంగళవారం ఉదయం 9.23గంటలకు 363 పాయింట్లు నష్టపోయి.. 57,919 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతోంది. ఇక నిఫ్టీ 101 పాయింట్ల నష్టంతో 17, 266 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతోంది. ►సిప్లా బిగ్గెస్ట్ గెయినర్గా ఉండగా, బజాజ్ ఫైనాన్స్ బిగ్గెస్ట్ లాజర్గా ఉంది. నిఫ్టీ ఫార్మా బెస్ట్సెక్టార్గా, నిఫ్టీ ఐటీ వరస్ట్సెక్టార్ కేటగిరీలో కొనసాగుతున్నాయి. ►ఎర్లీ ట్రేడ్లో పవర్గ్రిడ్, ఐటీసీ, ఎన్టీపీసీ, డాక్టర్ రెడ్డీస్, సన్ ఫార్మా, హిందూలివర్, టైటాలన్లు లాభపడ్డాయి. మారుతి, యాక్సిస్, భారతీఎయిర్టెల్, నెస్లే ఇండియా నష్టపోయాయి. చదవండి: టెన్షన్.. టెన్షన్.. భారీ నష్టాల్లో సెన్సెక్స్ -
స్టాక్ మార్కెట్ ఊరట.. లాభాలతో మొదలు
ఒమిక్రాన్ తీవ్రత భారత ఎకానమీపై అంతగా ఉండదన్న ఆర్థిక శాఖ ప్రకటన, అంతర్జాతీయ మార్కెట్లు పుంజుకోవడం తదితర పరిణామాలు స్టాక్ మార్కెట్ను లాభాల ట్రాక్ ఎక్కించాయి. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం(13, డిసెంబర్ 2021) లాభాలతో ప్రారంభమయ్యాయి. ఆసియా మార్కెట్లు లాభాల్లో ట్రేడవుతుండడంతో.. దేశీ స్టాక్ మార్కెట్లో సెన్సెక్స్, నిఫ్టీ లాభాల బాటలో నడుస్తున్నాయి. పైగా గత కొన్ని రోజుల దిద్దుబాటు నేపథ్యంలో కనిష్ఠాల వద్ద మదుపర్లు కొనుగోళ్లకు మొగ్గుచూపుతున్నారు. ఈ నేపథ్యంలోనే సూచీలు సానుకూలంగా కదలాడుతున్నాయి. ఉదయం 10:09 గంటల సమయంలో సెన్సెక్స్ 371 పాయింట్ల లాభంతో 59,158 వద్ద.. నిఫ్టీ 114 పాయింట్ల లాభంతో 17,625 వద్ద ట్రేడవుతున్నాయి. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.75.59 వద్ద కొనసాగుతోంది. సెన్సెక్స్ 30 సూచీలో నెస్లే ఇండియా, బజాజ్ ఫినాన్స్, టెక్ మహీంద్రా మినహా అన్ని షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. పవర్గ్రిడ్, యాక్సిస్ బ్యాంక్, టాటా స్టీల్, ఐసీఐసీఐ బ్యాంక్, ఎల్అండ్టీ, ఏషియన్ పెయింట్స్, సన్ఫార్మా, డాక్టర్ రెడ్డీస్, టైటన్, ఇండస్ఇండ్ బ్యాంక్ షేర్లు అత్యధికంగా లాభపడుతున్న వాటిలో ఉన్నాయి. చదవండి: ఎకామనీపై ఒమిక్రాన్ ఎఫెక్ట్ అంతంతే!- ఆర్థిక శాఖ -
స్టాక్ మార్కెట్ అప్డేట్: నష్టాలతో మొదలు..
మూడు రోజుల దేశీయ స్టాక్ మార్కెట్ల లాభాలకు బ్రేక్ పడింది. అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల సంకేతాలతో పాటు, దేశీయ మదుపర్ల అప్రమత్తతతో నేటి ట్రేడింగ్ను సూచీలు నష్టాలతో ప్రారంభించాయి. ఆపై నష్టాలతోనే ట్రేడ్ నడుస్తోంది కూడా. నిన్నటి ముగింపులో, సెన్సెక్స్ 157.45 పాయింట్లు (0.27%) పెరిగి 58,807.13 వద్ద ఉంటే, నిఫ్టీ 47 పాయింట్లు (0.27%) లాభపడి 17,516.80 వద్ద నిలిచింది. అయితే శుక్రవారం ఉదయం 10.00 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 143 పాయింట్ల నష్టంతో 58,663 వద్ద, నిఫ్టీ 31 పాయింట్ల నష్టంతో 17,485 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. ఇండస్ ఇండ్ బ్యాంక్, ఐటీసీ, సిప్లా, పవర్గ్రిడ్ కార్పొరేషన్ షేర్లు స్వల్ప లాభాల్లో ఉండగా.. యాక్సిస్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ, టాటామెటార్స్, కొటక్ మహీంద్రా, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. చదవండి: Stock Market.. మూడో రోజూ ముందుకే! -
స్టాక్ మార్కెట్: లాభాలతో మొదలై స్వల్ప నష్టాలతో..
ఆర్బీఐ పాలసీ , అంతర్జాతీయ స్థాయిలో సానుకూల పరిస్థితుల నేపథ్యంలో స్టాక్ మార్కెట్ గురువారం(డిసెంబర్ 12, 2021) ఉదయం లాభాలతో మొదలైంది. అయితే కాసేపటికే స్వల్ప నష్టాల్లోకి ట్రేడ్ అవుతూ.. కొనసాగుతోంది. బుధవారం మార్కెట్ ముగిసే సమయానికి 1016 పాయింట్ల లాభంతో 58,649 పాయింట్ల దగ్గర ముగిసింది. మరోవైపు నిఫ్టీ 17,469 దగ్గర క్లోజయ్యింది. కానీ, గురువారం ఉదయం లాభాలతో మొదలై.. ఆ వెంటనే స్వల్ప నష్టాల్లోకి జారుకుంది. ఉదయం 9గం. 45ని. సమయానికి సెన్సెక్స్ 21 పాయింట్లు నష్టపోయి 58,628 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతుండగా, నిఫ్టీ 6 పాయింట్లు కోల్పోయి 17,462 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతోంది. -
Stock Market Today: లాభాలతో మొదలైన స్టాక్మార్కెట్
Stock Market Updates Live: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. గత మూడు రోజులుగా సూచీలు నష్టాల్లో ట్రేడవుతున్న నేపథ్యంలో కనిష్ఠాల వద్ద మదుపర్లు కొనుగోళ్లకు మొగ్గుచూపుతున్నట్లు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఉదయం 10:10 గంటల సమయంలో సెన్సెక్స్ 295 పాయింట్ల లాభంతో 60,215 వద్ద.. నిఫ్టీ 96 పాయింట్ల లాభంతో 17,970 వద్ద ట్రేడవుతోంది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.73.37 వద్ద కొనసాగుతోంది. సెన్సెక్స్ 30 సూచీలో బజాజ్ ఆటో తప్ప మిగిలిన షేర్లన్నీ లాభాల్లో ట్రేడవుతుండడం విశేషం. నెస్లే ఇండియా, సన్ఫార్మా, టాటా స్టీల్, మారుతీ, ఇన్ఫోసిస్, బజాజ్ ఫిన్సర్వ్, హెచ్డీఎఫ్సీ, కొటాక్ మహీంద్రా బ్యాంక్ షేర్ల విలువ పెరిగింది. ఇక అంతర్జాతీయంగా ఉన్న ప్రతికూల సంకేతాలు దేశీయ సూచీలను కొంతమేర కలవరపరుస్తున్నాయి. ద్రవ్యోల్బణ భయాలతో గురువారం అమెరికా మార్కెట్ సూచీలు మిశ్రమంగా ముగిశాయి. అక్కడి ద్రవ్యోల్బణం 30 ఏళ్ల గరిష్ఠానికి చేరినట్లు గణాంకాలు చెబుతున్నాయి. మరోవైపు బంగారం ధరలు సైతం 5 నెలల గరిష్ఠానికి చేరాయి. డాలర్ ఇండెక్స్ కూడా 16 నెలల గరిష్ఠం వద్ద ట్రేడవుతోంది. ఇక ఆసియా పసిఫిక్ సూచీలు నేడు మిశ్రమంగా కదలాడుతున్నాయి. -
Stock Market: లాభాలతో మొదలైన స్టాక్ మార్కెట్
స్టాక్ మార్కెట్.. గురువారం ఉదయం లాభాలతో మొదలై.. స్వల్ఫ నష్టాలు, ఆపై స్వల్ఫ లాభల దిశగా ట్రేడ్ అవుతోంది. వరుస రికార్డులను నమోదుచేసిన దేశీ సూచీలకు మంగళవారం రోజున బ్రేక్ పడిన విషయం తెలిసిందే. బుధవారం కూడా ఇదే ట్రెండ్ మార్కెట్లో కొనసాగింది. అయితే గురువారం ఉదయం బీఎస్ఈ సెన్సెక్స్, ఎన్ఎస్ఈ నిఫ్టీలు మరోసారి సరికొత్త గరిష్టాలను టచ్ చేశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 69 పాయింట్లు లాభపడి 61,329 పాయింట్ల వద్ద ట్రేడయ్యింది. నిఫ్టీ 31 పాయింట్లు లాభపడి 18,297 వద్దకు చేరుకుంది. కానీ, కాసేపటికే సెన్సెక్స్, నిఫ్టీలు స్వల్ఫ నష్టాలను చవిచూశాయి. ఆ వెంటనే స్వల్ఫంగా లాభపడ్డాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 61,271.07 , నిఫ్టీ 18,282.00 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతున్నాయి. నిఫ్టీ ఎనర్జీ బెస్ట్ సెక్టార్గా, నిఫ్టీ సెక్టార్ వరస్ట్ సెక్టార్లో కొనసాగుతున్నాయి. ఏషియన్ పెయింట్స్ మీద మార్కెట్ ఫోకస్ నడుస్తోంది. ఓఎన్జీసీ భారీగా లాభపడగా, ఐవోసీ, టాటా మోటర్స్, బీపీసీఎల్, టాటా కన్జూమర్ ఉత్పత్తులు లాభపడ్డాయి. హెచ్సీఎల్ టెక్ భారీగా నష్టపోయింది. బీఎస్ఈ సెన్సెక్స్ తరపున సన్ఫార్మా, పవర్గ్రిడ్, హెచ్డీఎఫ్సీ, కొటాక్ బ్యాంక్, రిలయన్స్, మారుతీ, ఐటీసీ, బజాజ్ ఫైనాన్స్ లాభపడగా.. ఏషియన్ పెయింట్, టైటాన్, బజాజ్ ఆటో, టీసీఎస్, టెక్ఎం, భారతీఎయిర్టెల్ నష్టాల బాటలో పయనిస్తున్నాయి. చదవండి: మార్కెట్లో చెన్నై సూపర్ కింగ్స్ హవా -
Stock market: నష్టాలు.. ఆ వెంటనే కోలుకున్న మార్కెట్!
Stock Market LIVE Updates: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం లాభనష్టాల మధ్య కదలాడుతున్నాయి. లాభాలతో ట్రేడింగ్ ప్రారంభించిన సూచీలు కాసేపటికే నష్టాల్లోకి జారుకున్నాయి. అయితే ఆ వెంటనే స్వల్ఫంగా లాభపడింది. గరిష్ఠాల వద్ద మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపడంతో ఏడు రోజుల వరుస లాభాలకు మంగళవారం బ్రేక్ పడిన విషయం తెలిసిందే. బుధవారం ఉదయం అదే ట్రెండ్ కనిపించింది. కీలక కంపెనీల షేర్లు నష్టాల్లో జారుకున్నాయి. అంతర్జాతీయంగా సానుకూల సంకేతాలు ఉన్నప్పటికీ.. దేశీయ సూచీలు మాత్రం నష్టాలు చవిచూస్తున్నాయి. ఉదయం 9:25 గంటల సమయంలో సెన్సెక్స్ 212 పాయింట్లు నష్టపోయి 61,504 వద్ద.. నిఫ్టీ 88 పాయింట్ల నష్టంతో 18,330 వద్ద కొనసాగాయి. అయితే కాసేపటికే స్వల్ఫంగా పుంజుకుని ప్రస్తుతం(10గం.27ని. వద్ద) సెన్సెక్స్ 61, 725 వద్ద, నిఫ్టీ 18, 410 వద్ద కొనసాగుతున్నాయి. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.75.34 వద్ద ట్రేడవుతోంది. సెన్సెక్స్ 30 సూచీలో మెజారిటీ షేర్లు లాభనష్టాల నడుమ ఊగిసలాడుతున్నాయి. భారతీఎయిర్టెల్ 32.25 పాయింట్లతో లాభపడింది. నెస్లే ఇండియా, హెచ్యూఎల్, ఇన్ఫోసిస్, హెచ్సీఎల్ టెక్, హెచ్డీఎఫ్సీ, ఎల్అండ్టీ, హెచ్సీఎల్ టెక్ షేర్లు రాణిస్తున్నాయి. టాటా స్టీల్, ఇండస్ఇండ్ బ్యాంక్, బజాజ్ ఆటో, బజాజ్ ఫిన్సర్వ్, మారుతీ, యాక్సిస్ బ్యాంక్, ఎంఅండ్ఎం, టీసీఎస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేర్లు నష్టాలు చవిచూస్తున్నాయి. హిండాల్కో భారీగా నష్టపోయింది. చదవండి: లాభాలు సరే? మరి నష్టపోయినోళ్ల సంగతేంటి? -
ఫలితాలు, ప్రపంచ సంకేతాలే దిక్సూచి
న్యూఢిల్లీ: ఈ వారం(18–22) దేశీ స్టాక్ మార్కెట్లు ప్రధానంగా కార్పొరేట్ల త్రైమాసిక ఫలితాలు, ప్రపంచ సంకేతాలపై ఆధారపడి కదలనున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. ఇప్పటికే జులై–సెప్టెంబర్(క్యూ2) ఫలితాల విడుదల ప్రారంభమైన నేపథ్యంలో ఇకపై మరిన్ని కంపెనీలు ఆర్థిక పనితీరును వెల్లడించనున్నట్లు తెలియజేశారు. క్యూ2లో ఇన్ఫోసిస్, విప్రో, టీసీఎస్, హెచ్సీఎల్ టెక్ తదితర ఐటీ బ్లూచిప్ కంపెనీలతోపాటు ప్రయివేట్ రంగ దిగ్గజం హెచ్డీఎఫ్సీ బ్యాంక్ సైతం ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. ఈ బాటలో ఫలితాల సీజన్ మరింత వేడెక్కనున్నట్లు నిపుణులు తెలియజేశారు. క్యూ2 జాబితా ఇలా ఈ వారం రెండో త్రైమాసిక ఫలితాలు విడుదల చేయనున్న దిగ్గజాల జాబితాలో అల్ట్రాటెక్ సిమెంట్, ఏసీసీతోపాటు ఎఫ్ఎంసీజీ దిగ్గజం హిందుస్తాన్ యూనిలీవర్, నెస్లే, ఏషియన్ పెయింట్స్, డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ తదితరాలున్నాయి. ఇవేకాకుండా జేఎస్డబ్ల్యూ స్టీల్, హెచ్డీఎఫ్సీ లైఫ్, హిందుస్తాన్ జింక్, ఐడీబీఐ, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, సౌత్ ఇండియన్ బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్ సైతం క్యూ2 ఫలితాలు వెల్లడించనున్నాయి. ఇక మరోవైపు చైనా క్యూ3(జులై–సెప్టెంబర్) జీడీపీ గణాంకాలు, సెపె్టంబర్ నెలకు యూఎస్పారిశ్రామికోత్పత్తి వివరాలు వెల్లడికానున్నాయి. సెంటిమెంటుపై ఎఫెక్ట్ ఈ వారం దలాల్ స్ట్రీట్లో త్రైమాసిక ఫలితాలు సెంటిమెంటును ప్రభావితం చేయనున్నట్లు పలువురు స్టాక్ మార్కెట్ నిపుణులు అభిప్రాయపడ్డారు. తదుపరి కాలానికి కంపెనీలు ప్రకటించే ఆదాయ అంచనాలు(గైడెన్స్) తదితరాలను ఇన్వెస్టర్లు నిశితంగా గమనించనున్నట్లు తెలియజేశారు. దీంతో ఆయా కంపెనీలు విడుదల చేసే ప్రోత్సాహకర లేదా నిరుత్సాహకర ఫలితాల ఆధారంగా మార్కెట్లలో ఆటుపోట్లు కనిపించవచ్చని శామ్కో సెక్యూరిటీస్ ఈక్విటీ రీసెర్చ్ హెడ్ యెషా షా పేర్కొన్నారు. వారాంతాన ఫలితాలు వెలువడిన హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఎవెన్యూ సూపర్మార్ట్స్ కౌంటర్లలో నేడు(సోమవారం) అధిక యాక్టివిటీ నమోదుకావచ్చని స్వస్తికా ఇన్వెస్ట్మార్ట్ లిమిటెడ్ రీసెర్చ్ హెడ్ సంతోష్ మీనా పేర్కొన్నారు. వీటితోపాటు ఈ వారం ఎఫ్ఎంసీజీ, సిమెంట్ దిగ్గజాలుసహా ఆర్ఐఎల్, హెచ్డీఎఫ్సీ లైఫ్, జేఎస్డబ్ల్యూ స్టీల్ తదితర ఫలితాలు మార్కెట్లను నడిపించే వీలున్నట్లు అంచనా వేశారు. కరెక్షన్ తదుపరి కొద్ది రోజుల దిద్దుబాటు తదుపరి ఈ వారం గ్లోబల్ మార్కెట్లు జోరందుకునే వీలున్నట్లు సంతోష్ అభిప్రాయపడ్డారు. కార్పొరేట్ ఫలితాలకు ఇవి జత కలిసే అవకాశమున్నట్లు తెలియజేశారు. రానున్న రోజుల్లో బ్యాంకింగ్ రంగం కీలకంగా నిలవనున్నట్లు జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయిర్ పేర్కొన్నారు. ఫైనాన్షియల్ రంగంలోని సంస్థలు క్యూ2 పనితీరు వెల్లడించవలసి ఉన్నట్లు తెలియజేశారు. కార్పొరేట్ ఆర్జనల్లో పటిష్ట రికవరీపట్ల పెరుగుతున్న అంచనాలు మార్కెట్లలో బుల్ రన్ కొనసాగేందుకు దోహదపడవచ్చని అభిప్రాయపడ్డారు. అయితే మార్కెట్ అంచనాలు విఫలమైతే ఆయా రంగాలలో స్వల్పకాలానికి దిద్దుబాటు జరగవచ్చని అంచనా వేశారు. మరోవైపు డాలరుతో మారకంలో రూపాయి కదలికలు, ఇటీవల జోరు చూపుతున్న ముడిచమురు ధరలు, విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్ల(ఎఫ్పీఐలు) పెట్టుబడుల తీరు తదితర అంశాలు సైతం సెంటిమెంటుకు కీలకంగా నిలవనున్నట్లు వివరించారు. కాగా.. గత గురువారం ప్రామాణిక ఇండెక్స్ సెన్సెక్స్ 1,247 పాయింట్లు(2 శాతం) పుంజుకోవడం ద్వారా మార్కెట్ చరిత్రలోనే తొలిసారి 61,000 పాయింట్ల మైలురాయిని అధిగమించిన సంగతి తెలిసిందే. ఈ బాటలో నిఫ్టీ 18,000 పాయింట్ల మార్క్ ఎగువన నిలిచింది. విజయదశమి పర్వదినం సందర్భంగా గత శుక్రవారం మార్కెట్లకు సెలవుకావడంతో ట్రేడింగ్ నాలుగు రోజులకే పరిమితమైంది. రుణ మార్కెట్లో ఎఫ్పీఐల అమ్మకాలు అక్టోబర్లో నికరంగా వెనకడుగు అక్టోబర్లో ఇప్పటివరకూ విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐలు) దేశీ క్యాపిటల్ మార్కెట్లలో నికర అమ్మకందారులుగా నిలిచారు. గత రెండు నెలల్లో కనిపించిన పెట్టుబడుల ట్రెండ్కు విరుద్ధంగా ఎఫ్పీఐలు అమ్మకాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇందుకు రూపాయి మారకపు విలువ పతనం, ప్రపంచ పరిణామాలు కారణమైనట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. డిపాజిటరీల గణాంకాల ప్రకారం నికరంగా అక్టోబర్ నెలలో ఇప్పటివరకూ ఎఫ్పీఐలు రూ. 1,472 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. ప్రధానంగా రుణ(డెట్) మార్కెట్లో అమ్మకాల ట్రెండ్ నమోదైంది. ఫలితంగా రూ. 1,698 కోట్లు విలువైన సెక్యూరిటీలను విక్రయించారు. ఇదేసమయంలో మరోపక్క రూ. 226 కోట్ల విలువైన ఈక్విటీలను నికరంగా కొనుగోలు చేశారు. -
భారీ లాభాలతో కొనసాగుతున్న స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్మార్కెట్ సూచీలు నేడు భారీ లాభాల్లో కొనసాగుతున్నాయి. ఉదయం 9.55 గంటల సమయంలో నిఫ్టీ 149 పాయింట్ల లాభంతో 17,695వద్ద, సెన్సెక్స్ 489.99 పాయింట్ల లాభంతో 59,417.32 వద్ద ట్రేడింగ్ను కొనసాగిస్తున్నాయి. డీఎల్ ఎఫ్, గోద్రెజ్, పిరమల్ పిరమల్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్, ఇండియన్ హోటల్, టాటాపవర్ షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా.. ఐసీఐసీఐ లాంబార్డ్, స్ట్రిడ్స్ ఫార్మా, బాలకృష్ణ ఇండస్ట్రీస్ లిమిటెడ్, పేజ్ ఇండస్ట్రీస్, ఏసీసీ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. -
లాభాల్లో కొనసాగుతున్న స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం లాభాలతో ప్రారంభమయ్యాయి.ప్రపంచ దేశాలను కరోనా మహమ్మారి విడిచిపెట్టనప్పటికీ పెట్టుబడులు పెట్టేందుకు ఇంటస్ట్ర్ చూపిస్తున్నారు. దీంతో ఎన్నడూ లేని విధంగా మార్కెట్లు సరికొత్త రికార్డ్ లను కొనసాగిస్తున్నాయి. ఆ రికార్డ్ల పరంపర కొనసాగిస్తూ గురువారం ఉదయం మార్కెట్లు 9.38 గంటల సమాయానికి నిఫ్టీ 54.05 పాయింట్ల లాభంతో 17,125.10 వద్ద ట్రేడ్ అవుతుండగా సెన్సెక్స్ 144.77 పాయింట్ల లాభంతో 57,482.98 వద్ద ట్రేడింగ్ను కొనసాగిస్తున్నాయి. కాగా, మారుతి సుజికి,డీఆర్ఎల్,బజాజ్ ఆటో, జేఎస్డబ్ల్యూ స్టీల్ మార్కెట్లు లాభాల్ని గడిస్తుండగా.. వోల్టాస్,బాటా ఇండియా, గోద్రెజ్,ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు నష్టాల్ని మూటగట్టుకుంటున్నాయి. -
అదే జోరు, లాభాల్లో కొనసాగుతున్న స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా భారీ లాభాల్ని మూటగట్టుకుంటున్నాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ చైర్మన్ జెరోమ్ పావెల్ వ్యాఖ్యలు, క్యూ1లో జీడీపీ ఫలితాల ప్రభావంతో బుధవారం స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. బుధవారం ఉదయం 9.30గంటల సమయానికి నిఫ్టీ 47.65 పాయింట్లు లాభపడి 17,179 వద్ద ట్రేడింగ్ను కొనసాగిస్తున్నాయి. ఇక సెన్సెక్స్ 159.67 పాయింట్లు లాభపడి 57,712.06 వద్ద అదే జోరును కంటిన్యూ చేస్తున్నాయి. అదానీ ట్రాన్స్మిషన్, అదానీ గ్యాస్, అదానీ పవర్, యాక్సెస్ బ్యాంక్, భారతీ ఎయిర్టెల్, బజాస్ ఫైనాన్స్, జేకే సిమెంట్ షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా.. టాటా స్టీల్, మారుతి సుజికి, టెక్ మహీంద్రా, హెచ్డీఎఫ్సీ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. -
బుల్ పరుగులు..3 రోజుల్లో రూ.5.76 లక్షల కోట్ల సంపద సృష్టి
లాభాల జడివానతో ఇన్వెస్టర్ల సంపద జీవితకాల గరిష్టానికి చేరుకుంది. సూచీల వరుస ర్యాలీతో గడిచిన మూడురోజుల్లో స్టాక్ మార్కెట్లో రూ.5.76 లక్షల కోట్ల సంపద సృష్టి జరిగింది. సోమవారం ఒక్కరోజే ఇన్వెస్టర్లు రూ.3.58 లక్షల కోట్లను ఆర్జించారు. దీంతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈ కంపెనీల మొత్తం మార్కెట్ విలువ జీవితకాల రికార్డు స్థాయి రూ.247 లక్షల కోట్లకు చేరింది. ముంబై: దలాల్ స్ట్రీట్ సోమవారం బుల్ రంకెలతో దద్దరిల్లిపోయింది. కొంతకాలంగా పరిమిత శ్రేణిలో కదలాడుతున్న పావెల్ వ్యాఖ్యలతో స్టాక్ సూచీలు దూసుకెళ్లాయి. ఒక్క ఐటీ షేర్లు తప్ప అన్ని రంగాల షేర్లలో కొనుగోళ్లు వెల్లువెత్తడంతో సూచీలు ఇంట్రాడే, ముగింపులోనూ సరికొత్త రికార్డులను లిఖించాయి. ఇంట్రాడేలో 833 పాయింట్లు పెరిగి 56,958 వద్ద జీవితకాల గరిష్టాన్ని నమోదు చేసిన సెన్సెక్స్ చివరికి 765 పాయింట్ల లాభంతో 56,890 వద్ద ముగిసింది. సెన్సెక్స్ సూచీకిది వరుసగా మూడోరోజూ లాభాల ముగింపు. ఈ సూచీలోని మొత్తం 30 షేర్లలో నాలుగు షేర్లు మాత్రమే నష్టపోయాయి. నిఫ్టీ ఇండెక్స్ సూచీ 247 పాయింట్లు ఎగసి 16,952 వద్ద కొత్త ఆల్టైం హైని అందుకుంది. మార్కెట్ ముగిసేసరికి 226 పాయింట్ల లాభంతో 16,931 వద్ద స్థిరపడింది. గడిచిన ఆరు ట్రేడింగ్ సెషన్లలో నిఫ్టీ సూచీ ఐదు కొత్త రికార్డు ముగింపులను నమోదుచేసింది. ధరల నియంత్రణకు చైనా నిల్వల విక్రయానికి సిద్ధమవడంతో మెటల్ షేర్ల ర్యాలీ కొనసాగింది. ఎన్ఎస్ఈలోని సెక్టార్ ఇండెక్స్ల్లోకెల్లా నిఫ్టీ మెటల్ సూచీ అత్యధికంగా రెండున్నర శాతం లాభపడింది. కొంతకాలంగా స్తబ్ధుగా ట్రేడవుతున్న ఆర్థిక, బ్యాంకింగ్ కౌంటర్లు కొనుగోళ్లతో కళకళలాడాయి. ఆగస్ట్లో వాహన విక్రయాలు ఊపందుకొని ఉండొచ్చనే అంచనాలతో ఆటో షేర్లు రాణించాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.1,208 కోట్ల షేర్లను, దేశీయ ఇన్వెస్టర్లు రూ.689 కోట్ల షేర్లను కొన్నారు. సూచీల దూకుడుకు కారణాలివే... అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ చైర్మన్ జెరోమ్ పావెల్ శుక్రవారం జాక్సన్ హోల్ సదస్సులో మాట్లాడుతూ.., వడ్డీ రేట్ల పెంపు 2023 ఏడాది నుంచి ఉండొచ్చన్నారు. బాండ్ల కొనుగోళ్ల కోత ఈ సంవత్సరాంతం ప్రారంభం అవుతుందని స్పష్టతనిచ్చారు. ఫెడ్ చైర్మన్ వ్యాఖ్యలతో అమెరికాతో పాటు ఆసియా, యూరప్ మార్కెట్లు లాభాల బాటపట్టా యి. అలాగే పావెల్ ప్రకటనతో యూఎస్ డాలర్ బలహీనపడడంతో, ట్రెజరీ ఈల్డ్స్ కూడా తగ్గాయి. యూఎస్ పదేళ్ల బాండ్ ఈల్డ్స్ 1.312 శాతం నుంచి 1.305 శాతానికి దిగింది. డాలర్ ఇండెక్స్ కూడా రెండు వారాల కనిష్టానికి పడిపోయింది. ఫారెక్స్ మార్కెట్లో రూపాయి 40 పైసలు బలపడటం కలిసొచ్చింది. ఈ వారంలో వెలువడనున్న దేశీయ స్థూల ఆర్థిక గణాంకాలు ప్రోత్సాహకరంగా నమోదుకావచ్చనే అంచనాలతో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు మొగ్గుచూపారు. ఆర్థిక వ్యవస్థ రికవరీకి కేంద్రం చేపట్టిన సంస్కరణలతో క్యూ1లో రికార్డు స్థాయిలో 17.57 బిలియన్ డాలర్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు భారత్లోకి వచ్చాయి. నాలుగు నెలల వరుస అమ్మకాల తర్వాత ఈ ఆగస్టులో ఎఫ్ఐఐ నికర కొనుగోలుదారులుగా నిలిచారు. చదవండి : అద్భుతమైన ఫీచర్లతో మరో స్మార్ట్ ఫోన్ మార్కెట్లో మరిన్ని విశేషాలు... భారతీ ఎయిర్టెల్ బీఎస్ఈలో నాలుగున్నర శాతం లాభపడి రూ.620 వద్ద ముగిసింది. కంపెనీ బోర్డు రూ.21వేల కోట్ల నిధుల సమీకరణకు ఆమోదం తెలపడం షేరు ర్యాలీకి కారణం. పలు కార్ల రేట్లు ఈ సెప్టెంబర్ నుంచి పెంచనున్నట్లు మారుతీ సుజుకీ ఇండియా ప్రకటించడంతో బీఎస్ఈలో ఈ కంపెనీ షేరు మూడు శాతం పెరిగి రూ.6,797 వద్ద ముగిసింది. భారత్లో టెస్లా కంపెనీకి విడిభాగాలను సరఫరా ఒప్పందంపై చర్చలు జరుగుతున్నాయనే వార్తలతో సోనా కామ్స్టార్, సంధార్ టెక్, భారత్ ఫోర్జ్ షేర్లు తొమ్మిదిశాతం ర్యాలీ చేశాయి. -
స్టాక్ మార్కెట్: ప్రపంచంలోనే భారత్ టాప్!
న్యూఢిల్లీ: ప్రపంచంలో మరే ఇతర ఈక్విటీ మార్కెట్ చూడని లాభాన్ని గడచిన ఏడాది కాలంలో భారత స్టాక్ మార్కెట్ చూసింది. ఈ మేరకు వెలువడిన ఒక అధ్యయనం ప్రకారం, నేషనల్ స్టాక్ ఎక్ఛేంజ్– నిఫ్టీ గడచిన 12 నెలల కాలంలో ఏకంగా 45 శాతం పురోగమించింది. ఈ ఏడాది ఇప్పటి వరకూ చూసినా 19 శాతం పురోగమించింది. ఆర్థిక రికవరీ, ఎకానమీ మూలాల పటిష్టత, కార్పొరేట్ ఆదాయాలు బాగుండడం వంటి అంశాల దన్నుతో రిటైల్, వ్యవస్థాగత పెట్టుబడులు మార్కెట్లోకి భారీగా రావడం దీనికి కారణం. ఒక నివేదిక వెలువరించిన అంశాల్లో ముఖ్యమైనవి... ►అభివృద్ధి చెందిన దేశాల మార్కెట్లను పరిగణనలోకి తీసుకునే ఎంఎస్సీఓ వరల్డ్ ఇండెక్స్ గత 12 నెలల్లో 15 శాతం పురోగమిస్తే, వర్థమాన దేశాల మార్కెట్లను ప్రతిబింబించే ఎంఎస్సీఐ ఎమర్జింగ్ సూచీ 29 శాతం లాభపడింది. వీటికన్నా నేషనల్ స్టాక్ ఎక్ఛేంజ్– నిఫ్టీ వేగం అధికంగా ఉంది. ► భారత్ మార్కెట్ల రిటర్న్స్ పరిస్థితి కూడా గ్లోబల్ మార్కెట్లతో సరిపోల్చితే గణనీయంగా మెరుగుపడింది. ఇందుకు సంబంధించి నిష్పత్తి గతంలో 80 శాతం ఉంటే, తాజాగా 61 శాతానికి మెరుగుపడింది. ► ఇక గడచిన ఏడాది కాలంలో భారత్ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఒక ట్రిలియన్ డాలర్లమేర పెరిగి, 3.17 ట్రిలియన్ డాలర్లకు చేరింది. తద్వారా మార్కెట్ క్యాపిటలైజేషన్ విషయంలో ప్రపంచంలో భారత్ ఎనిమిదవ స్థానానికి చేరింది. భారత్ ముందు ఈ విషయంలో అమెరికా (51.39 ట్రిలియన్ డాలర్లు), చైనా (12.16 ట్రిలియన్ డాలర్లు), జపాన్ (6.77 ట్రిలియన్ డాలర్లు), హాంకాంగ్ (6.38 ట్రిలియన్ డాలర్లు), బ్రిటన్ (3.68 ట్రిలియన్ డాలర్లు), ఫ్రాన్స్ (3.35 ట్రిలియన్ డాలర్లు) ఉండగా, 9, 10 స్థానాల్లో కెనడా (3.15 ట్రిలియన్ డాలర్లు), జర్మనీ (2.88 ట్రిలియన్ డాలర్లు) ఉన్నాయి. ► గడచిన ఏడాది కాలంలో ఫారిన్ పోర్టిఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్పీఐ) భారత్లో రూ.2.2 లక్షల కోట్ల (31 బిలియన్ డాలర్లు) పెట్టుబడులు వస్తే, క్రమానుగత పెట్టుబడుల ప్రణాళిక (సిప) ద్వారా వచ్చిన రిటైల్ పెట్టుబడుల విలువ లక్ష కోట్లుగా ఉంది. ► ఎకానమీ వృద్ధి వాతావరణం, మెరుగుపడుతున్న కార్పొరేట్ మార్జిన్లు, తక్కువ పన్ను రేట్లు, సరళతరమైన రీతిలో తక్కువ స్థాయిలో వడ్డీరేట్ల వ్యవస్థ వంటి అంశాలు భారత్ ఆర్థిక వ్యవస్థ రీ–రేటింగ్కు దోహదపడే అవకాశం ఉందని ఇటీవల ఆర్థిక సేవల దిగ్గజం మోర్గాన్ స్టాన్లీ ఇటీవలే ఒక నివేదికలో పేర్కొంది. చదవండి : రూపాయి.. అధరహో -
బంగారంలోనూ భారీగా తగ్గిన లావాదేవీలు
ముంబై: కొద్ది నెలలుగా బుల్ ధోరణిలో సాగుతున్న దేశీ స్టాక్ మార్కెట్ల కారణంగా కమోడిటీలలో ట్రేడింగ్ క్షీణిస్తూ వస్తోంది. దీంతో మల్టీ కమోడిటీ ఎక్ఛేంజీ(ఎంసీఎక్స్)లో లావాదేవీల పరిమాణం నీరసిస్తోంది. ఎంసీఎక్స్లో ప్రధానమైన పసిడిలో లావాదేవీలు కొన్నేళ్ల కనిష్టానికి చేరాయి. వెరసి కమోడిటీ ఎక్ఛేంజీలో నిరుత్సాహకర పరిస్థితులు తలెత్తినట్లు నిపుణులు పేర్కొన్నారు. దీంతో ఇతర విభాగాలలోనూ ట్రేడింగ్ తగ్గుతూ వచ్చినట్లు తెలియజేశారు. 2011 గరిష్టంతో పోలిస్తే పరిమాణం తగినంతగా పుంజుకోలేదని వివరించారు. ఇదీ తీరు 2011లో రోజువారీగా ఎంసీఎక్స్లో సగటున రూ. 48,326 కోట్ల టర్నోవర్ నమోదైంది. ప్రస్తుతం రూ. 28,972 కోట్లకు పరిమితమవుతోంది. ఇది 40 శాతం క్షీణతకాగా.. పసిడి ఫ్యూచర్స్లో లావాదేవీలు మరింత అధికంగా 54 శాతం పతనమయ్యాయి. రోజువారీ సగటు టర్నోవర్ రూ. 5,723 కోట్లకు చేరింది. 2011లో రూ. 12,436 కోట్లు చొప్పున రోజువారీ సగటు టర్నోవర్ నమోదైంది. చమురు డీలా ఎంసీఎక్స్లో మరో ప్రధాన విభాగమైన చమురులో ట్రేడింగ్ సైతం ఇటీవల వెనుకంజ వేస్తోంది. చమురు ఫ్యూచర్స్లో రోజువారీ సగటు టర్నోవర్ 2012లో రూ. 9,421 కోట్లను తాకింది. మొత్తం ఎఫ్అండ్వోను పరిగణిస్తే రూ. 9,963 కోట్లుగా నమోదైంది. అయితే 2021లో రూ. 5,280 కోట్లకు ఈ పరిమాణం పడిపోయింది. 2014 నుంచీ ఎంసీఎక్స్లో ట్రేడింగ్కు బ్యాంకులు, మ్యూచువల్ ఫండ్స్(ఎంఎఫ్లు), ఈటీఎఫ్లు, విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు(ఎఫ్ఐఐలు)ను అనుమతించినప్పటికీ లావాదేవీలు పుంజుకోకపోవడం గమనార్హం! చదవండి : పసిడి మరింత పైపైకి.. రానున్న రోజుల్లో ఇంకా పెరిగే అవకాశం!! స్టాక్ ఎక్ఛేంజీల స్పీడ్ దిగ్గజ స్టాక్ ఎక్సే్ఛంజీలు ఎన్ఎస్ఈ, బీఎస్ఈ ట్రేడర్లను భారీగా ఆకట్టుకోవడంతో ఎంసీఎక్స్ వెనుకబడుతూ వచ్చింది. ప్రస్తుతం బీఎస్ఈలో 7.8 కోట్ల మంది, ఎన్ఎస్ఈలో 4.5 కోట్లమంది ప్రత్యేకతరహా రిజస్టర్డ్ క్లయింట్లు(యూసీలు) నమోదై ఉన్నారు. 2003 నుంచి బులియన్, చమురు ట్రేడింగ్ ప్లాట్ఫామ్స్లో పోటీయేలేని ఎంసీఎక్స్ 2021 జులైకల్లా 69.86 లక్షల మంది యూసీలను మాత్రమే కలిగి ఉంది. అయితే ఇదే కాలంలో ఎంసీఎక్స్ షేరు మాత్రం 2013 ఆగస్ట్లో నమోదైన రూ. 290 నుంచి 2020 అక్టోబర్కల్లా రూ. 1,875కు చేరింది. ప్రస్తుతం మార్కెట్ విలువ రూ. 7,482 కోట్లను తాకింది. ప్రధానంగా సుప్రసిద్ధ స్టాక్ ఇన్వెస్టర్ రాకేష్ జున్జున్వాలా ఎంసీఎక్స్లో 5 శాతం వాటా కొనుగోలు చేసిన నేపథ్యంలో షేరు ర్యాలీ చేసినట్లు నిపుణులు పేర్కొంటున్నారు. కోటక్ వాటా 15శాతం.. ఎంసీఎక్స్లో ప్రస్తుతం కోటక్ గ్రూప్ 15 శాతం వాటాను కలిగి ఉంది. 2021 మార్చికల్లా రూ. 685 కోట్ల నగదు నిల్వలను కలిగి ఉంది. ఇటీవల సాంకేతిక సేవల కోసం టీసీఎస్ను ఎంపిక చేసుకున్న నేపథ్యంలో ఎంసీఎక్స్ ట్రేడింగ్ టెక్నాలజీని పూర్తిస్థాయిలో ఆధునీకరిస్తోంది. కొంతకాలంగా పసిడిలో స్పాట్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్కు వీలైన టెక్నాలజీని సొంతం చేసుకోవడంలో ఎంసీఎక్స్ సమస్యలు ఎదుర్కొంటోంది. కాగా.. ఎక్సే్ఛంజీలలో 100 శాతం యాజమాన్యవాటాకు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ అనుమతించనుందన్న వార్తలతో ఎంసీఎక్స్ షేరుకి మరింత బూస్ట్ లభించే అవకాశమున్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. -
రికార్డ్ల వేట, భారీ లాభాల్లో కొనసాగుతున్న స్టాక్ మార్కెట్లు
స్టాక్ మార్కెట్లో బుల్ జోరు కొనసాగుతుంది. ప్రధాన సూచీలు గరిష్టస్థాయిలో సరికొత్త రికార్డ్ లను క్రియేట్ చేస్తున్నాయి. బుధవారం ఉదయం 9.36 గంటల సమయానికి సెన్సెక్స్ సరికొత్త రికార్డ్ లను నమోదు చేసింది. సెన్సెక్స్ 97 పాయింట్ల లాభంతో 56119 వద్ద ట్రేడ్ అవుతుండగా.. నిఫ్టీ 128 పాయింట్ల లాభంతో 16683 వద్ద ట్రేడింగ్ను కొనసాగిస్తుంది. టాటా మోటార్స్, టాటా స్టీల్, ఐసీఐసీఐ బ్యాంక్,హిందాల్కో షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. కాగా,మౌలిక రంగ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఆవిష్కరించిన రూ.6 లక్షల కోట్ల జాతీయ మానిటైజేషన్ పైప్లైన్(ఎన్ఎంపీ) కార్యక్రమం మార్కెట్ సెంటిమెంట్ను బలపరచడంతో స్టాక్ మార్కెట్ లాభాల్లో కొనసాగుతుందని మార్కెట్ పండితులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. -
ప్రపంచ ప్రతికూలతలు పడేశాయ్
ముంబై: ప్రపంచ ఈక్విటీ మార్కెట్లో నెలకొన్న ప్రతికూలతలతో దేశీయ మార్కెట్ రెండో రోజూ వెనకడుగు వేసింది. ఫారెక్స్ మార్కెట్లో రూపాయి పతనం సెంటిమెంట్ను దెబ్బతీసింది. అమెరికా కేంద్ర బ్యాంకు ఫెడరల్ రిజర్వ్ సమావేశపు మినిట్స్ బుధవారం వెల్లడయ్యాయి. కరోనా సంక్షోభ సమయంలో ప్రకటించిన ఆర్థిక ఉద్దీపనలను ఉపసంహరించుకునే(ట్యాపరింగ్) అంశంపై ఫెడ్ అధికారులు చర్చించినట్లు మినిట్స్లో వెల్లడైంది. దీంతో ఈక్విటీ మార్కెట్లలో విదేశీ ఇన్వెస్టర్లు అమ్మకాలు జరుపుతారన్న భయాలు తెరపైకి వచ్చాయి. చదవండి : 5g Smartphone : దూసుకెళ్తున్న అమ్మకాలు వ్యాక్సినేషన్ తక్కువగా నమోదైన ప్రాంతాల్లో డెల్టా వేరియంట్ కరోనా వైరస్ శరవేగంగా విస్తరిస్తోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ఆందోళన వ్యక్తం చేసింది. సరైన సమాచారం ఇవ్వకుండా నిబంధనలను ఉల్లంఘిస్తున్నాయంటూ తమ దేశానికే చెందిన దిగ్గజ ఐటీ సంస్థలపై చైనా రెగ్యులేటరీ కఠిన ఆంక్షలను విధించింది. ఈ పరిణామాలతో అంతర్జాతీయ మార్కెట్లు పతనబాట పట్టాయి. అంతర్జాతీయ మార్కెట్ల ట్రెండ్కు అనుగుణంగా దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు రెండో రోజూ క్షీణించాయి. ఒక్క ఎఫ్ఎంసీజీ షేర్లు మినహా అన్ని రంగాల షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తడంతో సూచీలు శుక్రవారం నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 300 పాయింట్లు పతనమై 55,329 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 118 పాయింట్లను కోల్పోయి 16,500 దిగువను 16,450 వద్ద నిలిచింది. మార్కెట్ పతనంలో భాగంగా మెటల్ షేర్లు భారీ నష్టాలను చవిచూశాయి. చిన్న, మధ్య తరహా షేర్లలో అమ్మకాలు ఆగలేదు. బీఎస్ఈ మిడ్, స్మాల్క్యాప్ ఇండెక్స్లు రెండుశాతం క్షీణించాయి. సెన్సెక్స్ సూచీలోని మొత్తం 30 షేర్లలో ఆరు షేర్లు మాత్రమే లాభపడ్డాయి. ఆరు ప్రధాన కరెన్సీ విలువల్లో డాలర్ ఇండెక్స్ బలపడటంతో ఫారెక్స్ మార్కెట్లో రూపాయి విలువ 15 పైసలు పతనమై 74.39 వద్ద స్థిరపడింది. విదేశీ ఇన్వెస్టర్లు రూ.2,287 కోట్ల షేర్లను అమ్మారు. సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.119 కోట్ల షేర్లను కొన్నారు. మెటల్ షేర్లలో మంటలు... ఈ ఏడాదిలో చైనా స్టీల్ ఉత్పత్తి భారీగా తగ్గిపోవచ్చని ప్రముఖ మైనింగ్ కంపెనీ బీహెచ్పీ గ్రూప్ తన కమోడిటీ అవుట్లుక్లో తెలపడంతో అంతర్జాతీయ మార్కెట్లలో ఐరన్ ఓర్ ఫ్యూచర్లు నెలరోజుల కనిష్టానికి కుప్పకూలిపోయాయి. ఈ ప్రతికూల ప్రభావం దేశీయ మెటల్ షేర్లపైనా పడటంతో నిఫ్టీ మెటల్ ఇండెక్స్ ఆరున్నర పతనాన్ని చవిచూసింది. ఎన్ఎండీసీ, వేదాంత, టాటా స్టీల్, సెయిల్, జిందాల్ స్టీల్ షేర్లు పదిశాతం నుంచి ఎనిమిదిశాతం క్షీణించాయి. కార్ట్రేడ్ టెక్ ... లిస్టింగ్లో డీలా ఆటో క్లాసిఫైడ్ సంస్థ కార్ట్రేడ్ టెక్ షేర్లు లిస్టింగ్ తొలిరోజే డీలాపడ్డాయి. ఇష్యూ ధర రూ.1,618తో పోలిస్తే బీఎస్ఈలో ఒకశాతం డిస్కౌంట్తో రూ.1,600 వద్ద లిస్ట్ అయ్యాయి. ఇంట్రాడేలో మరింత అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ఒకదశలో 9% క్షీణించి రూ.1475 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకాయి. చివరికి 7% నష్టంతో రూ.1501 వద్ద ముగిశాయి. -
రంకెలేసిన బుల్, లాభాల్లో స్టాక్ మార్కెట్లు
శుక్రవారం స్టాక్ మార్కెట్లో బుల్ రంకెలేసింది. కొనుగోళ్ల అండతో ఉత్సాహంగా ఉరకలేసింది. దీంతో ఉదయం ప్రారంభం నుంచి దేశీయ మార్కెట్లు లాభాలతో కళకళలాడాయి. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ సెన్సెక్స్ ఏకంగా 55,060 పాయింట్లను టచ్ చేసింది. దీంతో సెన్సెక్స్ 216.44 పాయింట్లు లాభపడి 55,060వద్ద కొనసాగుతుంది. అదే సమయంలో నిఫ్టీ సైతం ఫ్రెష్ హై రికార్డ్ లను క్రియేట్ చేస్తూ 67 పాయింట్ల లాభంతో 16,441.25తో పరుగులు పెడుతోంది. అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాలతో పాటు దేశీయంగా పెట్రోస్టాక్స్తో పాటు ఆటోమోబైల్, మెటల్ కంపెనీ షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా.. ఫార్మాషేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. -
రికార్డుల ర్యాలీ కొనసాగవచ్చు
ముంబై: స్టాక్మార్కెట్లో సూచీల ర్యాలీ ఈ వారంలోనూ కొనసాగవచ్చని నిపుణులు భావిస్తున్నారు. ఆర్థిక వృద్ధి ఊపందుకునేందుకు కీలక వడ్డీరేట్లను యథాతథంగా ఉంచుతామని ఆర్బీఐ పరపతి విధాన కమిటీ ప్రకటించింది. దేశీయ ఈక్విటీల పట్ల విదేశీ ఇన్వెస్టర్లు తిరిగి బుల్లిష్ వైఖరిని ప్రదర్శిస్తున్నారు. కార్పొరేట్ సంస్థలు అంచనాలకు తగ్గట్లు క్యూ1 ఆర్థిక ఫలితాలను వెల్లడిస్తున్నాయి. అగ్ర రాజ్యం అమెరికా మార్కెట్లు ఆల్టైం హై స్థాయిల వద్ద కదలాడుతున్నాయి. ఈ సానుకూల పరిణామాల దృష్ట్యా రానున్న రోజుల్లో సూచీలు పరిమిత శ్రేణిలో ట్రేడవుతూ సరికొత్త రికార్డులను నమోదు చేయవచ్చని నిపుణులు చెబుతున్నారు. జాతీయ, అంతర్జాతీయ సంకేతాలు కలిసిరావడంతో గతవారంలో సూచీలు సరికొత్త రికార్డులను నెలకొల్పాయి. వారం మొత్తంగా సెన్సెక్స్ 1691 పాయింట్లు, నిఫ్టీ 16,238 పాయింట్లను ఆర్జించాయి. ఇక వారంలో క్యూ1 ఆర్థిక ఫలితాలు, జూన్ పారిశ్రామికోత్పత్తి, జూలై ద్రవ్యోల్బణ గణాంకాల(ఆగస్ట్ 12న విడుదల)తో పాటు ప్రపంచ పరిణామాలు ట్రేడింగ్పై ప్రభావాన్ని చూపవచ్చు. వర్షపాత నమోదు, కరోనా కేసులు, వ్యాక్సినేషన్ వార్తలపై ఇన్వెస్టర్లు దృష్టి సారించవచ్చు. వీటితో పాటు డాలర్ మారకంలో రూపాయి విలువ, క్రూడాయిల్ ధరల కదలికలు మార్కెట్లకు కీలకంగా మారనున్నాయి. ‘‘మార్కెట్లో పాజిటివ్ ట్రెండ్ మరింతకాలం కొనసాగవచ్చు. పతనాన్ని కొనుగోళ్లకు అవకాశంగా భావించాలి. సాంకేతికంగా నిఫ్టీ 16,300 వద్ద కీలకమైన నిరోధాన్ని కలిగి ఉంది. ఈ స్థాయిని అధిగమిస్తే 16,500 – 16,600 స్థాయి వద్ద మరో ప్రధాన అవరోధాన్ని పరీక్షిస్తుంది’’ అని దీన్ దయాళ్ ఇన్వెస్ట్మెంట్స్ సాంకేతిక నిపుణుడు మనీష్ హతిరామణి తెలిపారు. చివరి దశకు క్యూ1 ఫలితాలు... దేశీయ కార్పొరేట్ తొలి త్రైమాసిక ఆర్థిక ఫలితాల ప్రకటన చివరి దశకు చేరుకుంది. ఈ వారంలో మొత్తం 1900 కంపెనీలు తమ క్యూ1 గణాంకాలను వెల్లడించున్నాయి. టాటా స్టీల్, హీరో మోటోకార్ప్, భారత్ పెట్రోలియం, ఐషర్ మోటార్స్, శ్రీ సిమెంట్స్, ఎమ్ఆర్ఎఫ్, పవర్ గ్రిడ్, కోల్ ఇండియా, మదర్సన్ సుమీ, పిడిలైట్, క్యాడిల్లా హెల్త్కేర్, ఎన్ఎండీసీ, ఓఎన్జీసీ, గ్రాసీం, ఇంద్రప్రస్థ, తదితర కంపెనీలు ఉన్నాయి. ఇటీవల ఐపీఓను పూర్తి చేసుకొని ఎక్సే్చంజీల్లో షేర్లను లిస్ట్ చేసిన జొమాటో, క్లీన్ సైన్స్ టెక్నాలజీ కంపెనీలు సైతం ఇదే వారంలో తమ క్వార్టర్ ఫలితాలను వెల్లడించనున్నాయి. మారిన విదేశీ ఇన్వెస్టర్ల వైఖరి గత కొంతకాలంగా భారత ఈక్విటీలను అమ్మేసిన విదేశీ ఇన్వెస్టర్లు తాజాగా కొనుగోళ్లు చేపట్టారు. ఈ ఆగస్ట్ నెల తొలి ఐదు ట్రేడింగ్ సెషన్లలో రూ.1,210 కోట్ల షేర్లను కొన్నారు. ఈ జూలైలో రూ.7,273 కోట్ల షేర్లను విక్రయించారు. ‘‘దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగం పుంజుకుంది. పలు రాష్ట్రాలు లాక్డౌన్ ఆంక్షలను సడలించాయి. కార్పొరేట్ క్యూ1 ఫలితాలు మెప్పిస్తున్నాయి. ఈ అంశాలన్నీ విదేశీ ఇన్వెస్టర్లను ఆకర్షిస్తున్నాయి’’ అని కోటక్ సెక్యూరిటీస్ సాంకేతిక నిపుణుడు శ్రీకాంత్ చౌహాన్ తెలిపారు. రోలెక్స్ రింగ్స్ లిస్టింగ్ నేడు... ఆటో ఉపకరణాల తయారీ సంస్థ రోలెక్స్ రింగ్స్ షేర్లు సోమవారం(ఆగస్ట్ 9న) ఎక్సే్చంజీల్లో లిస్ట్ కానున్నాయి. ఈ ఐపీఓ ఈ జూలై 28న మొదలై.., 30వ తేదీన ముగిసింది. షేరుకి రూ.900 గరిష్ట ధరతో చేపట్టిన ఇష్యూ ద్వారా కంపెనీ రూ. 731 కోట్లు సమకూర్చుకుంది. ఐపీఓకు ఇన్వెస్టర్ల నుంచి భారీ స్పందన లభించింది. చివరి రోజు నాటికి 130.43 రెట్లు సబ్స్క్రైబ్ అయ్యింది. ఇష్యూలో భాగంగా కంపెనీ 56.85 లక్షల షేర్లను జారీ చేయగా.., ఏకంగా 74.15 కోట్ల షేర్లకు బిడ్లు దాఖలయ్యాయి. ఇష్యూ ధర రూ.900 తో పోలిస్తే గ్రే మార్కెట్లో రూ.450ల ప్రీమియం పలుకుతోంది. దీనిబట్టి ఇష్యూ లిస్టింగ్ రోజు లాభాల్ని పంచవచ్చని తెలుస్తోంది.