Madhuri Dixit
-
మరింత యంగ్గా మాధురీ దీక్షిత్.. 57 ఏళ్లు అంటే నమ్ముతారా..? (ఫోటోలు)
-
ఓటీటీలో భయపెడుతూ నవ్వించే సినిమా
సాధారణంగా సినిమాలలో ఓ రెండింటికి ప్రత్యేక స్థానం ఉంటుంది. ఒకటి హ్యూమర్ అయితే మరొకటి హారర్ జోనర్. కానీ ఆ రెండూ కలిపి సినిమా తీస్తే అదే ఈ సినిమా ‘భూల్ భులయ్యా 3’(Bhool Bhulaiyaa 3). ఇది ‘భూల్ భులయ్యా’ సిరీస్లో వచ్చిన మూడవ సినిమా. నిజానికి మొదటి భాగానికి, మిగతా రెండు భాగాలకి కథతో పాటు పాత్రధారులలో కూడా తేడా ఉంది. ‘భూల్ భులయ్యా’ మొదటి భాగం ‘చంద్రముఖి’ సినిమా ఆధారంగా తీసింది. కానీ మిగతా రెండు భాగాలను మాత్రం అదే థీమ్తో కాస్త విభిన్నంగా రూపొందించారు. ఇప్పుడు ‘భూల్ భులయ్యా 3’ సినిమా కథ విషయానికి వస్తే... 200 సంవత్సరాల క్రితం రక్తఘాట్ రాజ్యంలో జరిగిన కథ. అప్పటి రాజ కుటుంబం వల్ల జరిగిన సంఘటనలో మంజులిక అనే ఓ దెయ్యం కనిపిస్తుంది. ఈ దెయ్యాన్ని అదే రాజ్యంలోని అంతఃపుర గదిలో భద్రంగా బందిస్తారు ఆ రాజ్యానికి చెందిన రాజగురువు. 2024లో వారసత్వ సంపదగా ఆ అంతఃపురాన్ని ఓ హోటల్గా మార్చాలని రాజకుటుంబం వారసులు ప్రయత్నించగా బందీగా ఉన్న మంజులిక దెయ్యం బయటపడి వారిని చాలా ఇబ్బంది పెడుతుంది. ఆ విషయం చూసే ప్రేక్షకులకు గిలిగింతలు పెట్టిస్తుంది. ఈ మంజులికను కట్టడి చేయడానికి ఫేక్ మాంత్రికుడైన రూహాన్ను ఆ రాజ్యానికి తెప్పించుకుంటారు. రూహాన్ రక్తఘాట్కు వచ్చినప్పటి నుండి కథ అనేక మలుపులు తిరగుతూ ఊహించని క్లైమాక్స్ ట్విస్ట్తో ముగుస్తుంది. ఈ సినిమాలో ముఖ్యంగా ముగ్గురి గురించి చెప్పుకోవాలి. అందులో మొదటగా హీరో రోల్ వేసిన కార్తీక్ ఆర్యన్(Kartik Aaryan)... తన ఈజ్ ఆఫ్ యాక్టింగ్తో హారర్ ఎమోషన్ని కూడా హ్యూమర్ ఎమోషన్తో చక్కగా పలికించాడు. ఇక విశేష పాత్రలలో నటించిన నాటి తార మాధురీ దీక్షిత్(Madhuri Dixit), నేటి వర్ధమాన తార విద్యాబాలన్(Vidya Balan) వారి నటనతోనే కాదు అద్భుత నాట్యంతోనూ సినిమాని ప్రేక్షకులకు మరింత దగ్గర చేశారు. దర్శకుడు అనీస్ ఈ సినిమాని ఎక్కడా బోర్ కొట్టించకుండా ఓ పక్క భయపెడుతూ మరో పక్క గిలిగింతలు పెడుతూ ప్రేక్షకులను కదలనివ్వకుండా స్క్రీన్ప్లే నడిపించాాడు. నెట్ఫ్లిక్స్ ఓటీటీ వేదికగా స్ట్రీమ్ అవుతున్న ఈ ‘భూల్ భులయ్యా 3’ వీకెండ్ వాచబుల్ మూవీ. – ఇంటూరు హరికృష్ణ -
సంక్రాంతికి కొత్త కారు కొన్న బ్యూటీ.. భర్తతో జాలీగా..
బాలీవుడ్ నటి మాధురి దీక్షిత్ (Madhuri Dixit)- డాక్టర్ శ్రీరామ్ నేనే సంక్రాంతి పండక్కి కొత్త కారు కొనుగోలు చేశారు. ఫెరారి 296 జీటీఎస్ మోడల్ను తమ గ్యారేజీకి తెచ్చుకున్నారు. దీని విలువ రూ.6 కోట్ల పైనే ఉంటుందని అంచనా. మాధురి దీక్షిత్ దంపతులు ఈ ఫెరారీ కారులో షికారుకు వెళ్లారు. ఎరుపు రంగు ఫెరారీ కారును భర్త నడుపుతుంటే మాధురి పక్కన కూర్చుంది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్గా మారింది. ఇది చూసిన అభిమానులు దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.సినిమామాధురి దీక్షిత్ చివరగా భూల్ భులయ్యా 3 సినిమా (Bhool Bhulaiyaa 3 Movie)లో కనిపించింది. ఈ మూవీలో విద్యా బాలన్, తృప్తి డిమ్రి, రాజ్పాల్ యాదవ్, విజయ్ రాజ్, సంజయ్ మిశ్రా, అశ్విని కల్సేకర్, రాజేశ్ శర్మ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు. 2007లో వచ్చిన భూల్ భులయ్యా మొదటి భాగం సూపర్ హిట్ అయింది. దీంతో 2022లో దీనికి సీక్వెల్ తెరకెక్కింది. కార్తీక్ ఆర్యన్, కియరా అద్వానీ, టబు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీ కూడా సక్సెస్ అందుకుంది. దీంతో గతేడాది మూడో పార్ట్ రిలీజ్ చేశారు. ఇది కూడా బాక్సాఫీస్ హిట్గా నిలిచింది. View this post on Instagram A post shared by Manav Manglani (@manav.manglani) చదవండి: థియేటర్లలో రిలీజ్కు ముందే ఓటీటీ ఫిక్స్.. ఆ టాలీవుడ్ సినిమాలివే! -
ఇది కదా సొగసు.. బంగారం వెలుగు కొద్దిసేపే! (ఫోటోలు)
-
ఏక్..దో..తీన్..అన్స్టాపబుల్ అంటున్న స్టార్ హీరోయిన్ను గుర్తుపట్టారా? (ఫొటోలు)
-
మాధురీ నవ్వులతో పోటీ పడే ఇంటి కళ
బాలీవుడ్ నటి మాధురీ దీక్షిత్, డాక్టర్ శ్రీరామ్ మాధవ్ నేనే నివాసం ఉంటున్న ఇల్లు కళ, సాంకేతికతల మేళవింపులా ఉంటుంది. దీనిని డిజైనర్ అపూర్వ ష్రాఫ్ రూపోందించారు.ముంబై అపార్ట్మెంట్లోని 53వ అంతస్తులో మాధురీ దీక్షిత్ ఇంటి నుంచి ఒక ట్యూన్ వినిపిస్తుంటుంది. అది ఆమె నడక, హుందాతనం, అందాన్ని కూడా కళ్లకు కట్టేలా చేస్తుంది అంటారు ఆ ట్యూన్ విన్నవాళ్లు. బాలీవుడ్లో 90ల నాటి సినిమా హిట్లలో తేజాబ్ లో మోహిని, దిల్ లో మధు, అంజామ్ లో శివాని, హమ్ ఆప్కే హై కౌన్ లో నిషా, దిల్ తో పాగల్ హై లో పూజ ... వంటి. ఇంకా ఎన్నో పాత్రలతో ఆమె నటన నేటికీ ప్రశంసించబడుతూనే ఉంటుంది. మాధురి ఆమె భర్త డాక్టర్ శ్రీరామ్ మాధవ్ నేనే ముంబైలోని ఎతై ్తన భవనంలో తమ అధునాతన నివాసాన్ని రూపోందించడానికి ప్రఖ్యాత లిత్ డిజైన్ సంస్థకు చెందిన ఆర్కిటెక్ట్ అపూర్వ ష్రాఫ్ను పిలిచారు.సింప్లిసిటీఈ జంట కోరిన వాటిని సరిగ్గా అందించడంలో వారు చెప్పిన స్పష్టమైన సంక్షిప్త వివరణ ష్రాఫ్కు బాగా సహాయపడింది: ‘సమకాలీన సౌందర్యాన్ని మినిమలిస్ట్ అండర్ టోన్ తో మిళితం చేసేలా సరళ రేఖలు, అందమైన రూపాలు, హుందాతనాన్ని కళ్లకు కట్టే అభయారణ్యం...’ ఇవి ఇంటి యజమానుల శక్తివంతమైన వ్యక్తిత్వాలను చూపుతుందని వారిని ఒప్పించింది ష్రాఫ్. మాధురి, డాక్టర్ మాధవ్ ‘సింప్లిసిటీ’ని కోరుకున్నారు. ఇది ఇల్లులాగా అనిపించే టైమ్లెస్ టెంప్లేట్. మాధురి ఈ విషయాలను షేర్ చేస్తూ, ‘ప్రశాంతత, స్పష్టత, సౌకర్యాన్ని రేకెత్తించే వాతావరణాన్ని సృష్టించడం కూడా ఒక ఆర్ట్’ అంటారామె.హుస్సేన్ కళాకృతి40 సంవత్సరాల సినీ కెరీర్లో మాధురీ దీక్షిత్ లక్షలాది మంది ఆరాధకులతో పాటు, ఎంతో మంది ఊహాలోకపు రారాణి. వారిలో ఎమ్.ఎఫ్.హుస్సేన్ ఒకరు. భారతదేశపు ప్రసిద్ధ చిత్రకారుడు మక్బూల్ ఫిదా హుస్సేన్ మాధురి కోసం ప్రత్యేకంగా చిత్రించిన విసెరల్ వైబ్రెంట్ పెయింటింగ్లు ఇంటి డిజైన్ భాషకు అద్దంలా నిలిచాయి. విక్రమ్ గోయల్ వియా హోమ్ ద్వారా అలంకరించిన ప్రవేశ ద్వారం, హుస్సేన్ పవిత్రమైన గణేషులచే ఆకర్షణీయంగా ఉంటుంది. ఇది మాధురి వినయపూర్వకమైన ్రపారంభాన్ని గుర్తుచేసే స్వాగతతోరణంలా భాసిల్లుతుంది. ఇంట్లో ప్రతిచోటా హుస్సేన్ కళాకృతి సంభాషణలనుప్రోత్సహిస్తుంది. మాధురి వాటి గురించి మరింత వివరింగా చెబుతూ ‘హుస్సేన్ జీ మా ఇంటి గోడలకు రంగులతో కళ తీసుకురావాలనుకున్నాడు. కానీ నేను వద్దాన్నాను. దీంతో నాకు అత్యుత్తమ చిత్రాలను చిత్రించి, ఇచ్చాడు. అతను ఉపయోగించిన రంగులను ఇప్పటికీ ప్రేమిస్తున్నాను. ఆ కళ ఇలా బయటకు కనిపిస్తుంది’ అని వెల్లడించింది మాధురి. -
Bhool Bhulaiyaa 3 X Review: భూల్ భూలయ్యా టాక్ ఎలా ఉందంటే.. ?
బాలీవుడ్లో ఈ శుక్రవారం రెండు భారీ సినిమాలు విడుదలయ్యాయి. అందులో ఒకటి సింగమ్ ఎగైన్. మరొకటి భూల్ భూలయ్యా 3. ఈ మూవీలో కార్తీక్ ఆర్యన్, విద్యాబలన్, మాధూరీ దీక్షిత్ కీలక పాత్రలు పోషించారు. అనీస్ బాజ్మీ దర్శకత్వం వహించారు. గతంలో ఈ సీరిస్ నుంచి వచ్చిన రెండు భాగాలు సూపర్ హిట్గా నిలిచాయి. మొదటి భాగంలో అక్షయ్ కుమార్ హీరోగా నటించగా, రెండు, మూడో భాగాల్లో కార్తీక్ ఆర్యన్ హీరో పాత్రను పోషించాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన ట్రైలర్కి మంచి రెస్పాన్స్ వచ్చింది. దానికి తోడు ఇటీవల బాలీవుడ్లో భారీ చిత్రాలేవి లేకపోవడంతో ‘భూల్ భూలయ్యా 3’పైనే అంతా ఆశలు పెట్టుకున్నారు. ఇలా భారీ అంచనాలతో ఈ చిత్రం నేడు(నవంబర్ 1) ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఇప్పటికే పలు ప్రాంతాలలో ఫస్ట్డే ఫస్ట్ షో పడిపోయింది. దీంతో సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాన్ని వెల్లడిస్తున్నారు. భూల్ భూలయ్యా 3 కథేంటి? ఈ సారి ఏమేరకు భయపెట్టింది? కార్తిక్ ఆర్యన్ ఖాతాలో మరో హిట్ పడిందా లేదా? తదితర అంశాలను ఎక్స్(ట్విటర్) వేదికగా చర్చిస్తున్నారు. అవేంటో చూసేయండి.ట్విటర్లో భూల్ భూలయ్యా 3 చిత్రానికి మిశ్రమ స్పందన లభిస్తోంది. సినిమా బాగుందని కొంతమంది కామెంట్ చేస్తే.. మరికొంతమంది అంచనాలకు తగ్గట్టుగా లేదని ట్వీట్ చేస్తున్నారు. #OneWordReview...#BhoolBhulaiyaa3: OUTSTANDING.Rating: ⭐️⭐️⭐️⭐️Entertainment ka bada dhamaka... Horror + Comedy + Terrific Suspense... #KartikAaryan [excellent] - #AneesBazmee combo hits it out of the park... #MadhuriDixit + #VidyaBalan wowsome. #BhoolBhulaiyaa3Review pic.twitter.com/t2GbQIAfri— taran adarsh (@taran_adarsh) November 1, 2024ప్రముఖ సీనీ విమర్శకుడు తరణ్ ఆదర్శ్ ఈ చిత్రంపై ప్రశంసల వర్షం కురిపించాడు. సినిమా అదిరిపోయిందంటూ ఏకంగా నాలుగు స్టార్స్(రేటింగ్) ఇచ్చాడు. హారర్, కామెడీ, సస్పెన్స్తో ఫుల్ ఎంటర్టైనింగ్గా కథనం సాగుతుందని చెప్పారు. కార్తీక్ అద్భుతంగా నటించాడని, విద్యాబాలన్, మాధురీ దీక్షిత్ నటన బాగుందని ట్వీట్ చేశాడు. #BhoolBhulaiyaa3 first half... Full on cringe... Unnecessary songs and whatsapp forward jokes... @vidya_balan has the least screen presence but she stole the show... Hoping for a better second half... Pre-Interval block is interesting...— Anish Oza (@aolostsoul) November 1, 2024 ఫస్టాఫ్లో వచ్చే పాటలు కథకి అడ్డంకిగా అనిపించాయి. జోకులు కూడా అంతగా పేలలేదు. వాట్సాఫ్లలో పంపుకునే జోకుల్లా ఉన్నాయి. విద్యాబాలన్ తెరపై కనిపించేదది కాసేపే అయినా తనదైన నటనతో ఆకట్టుకుంది. క్లైమాక్స్లో వచ్చే ట్విస్టులు బలవంతంగా పెట్టినట్లు అనిపిస్తుంది. ఓవరాల్గా ఇది ఓ యావరేజ్ మూవీ అంటూ మరో నెటిజన్ కామెంట్ చేశాడు.The first one was a classic; this is just a disaster. #BhoolBhulaiyaa3 #BhoolBhulaiyaa3Review pic.twitter.com/e3VWavE9iB— Ankush Badave. (@Anku3241) November 1, 2024భూల్ భూలయ్యా మూవీ క్లాసికల్ హిట్ అయితే భూల్ భూలయ్యా 3 డిజాస్టర్ అని మరో నెటిజన్ కామెంట్ చేశాడు.#BhoolBhulaiyaa3 might've been highly anticipated, but the script feels completely off-track. It's almost as if someone unfamiliar with the franchise wrote it. Disappointing execution and weak storyline! #BhoolBhulaiyaa3Review.pic.twitter.com/yvZGfTSNp9— Utkarsh Kudale 18 (@BOss91200) November 1, 2024The third installment of Bhool Bhulaiyaa is here to give us a Diwali filled with excitement and surprises. A cinematic delight that keeps you hooked! #BhoolBhulaiyaa3 #BhoolBhulaiyaa3Review"— itz Joshi (@ItzKulkarni) November 1, 2024#BhoolBhulaiyaa3Review: ⭐⭐⭐⭐A thrilling blend of laughs, chills, and an unexpected twist! #BhoolBhulaiyaa3 is a wild horror-comedy ride. @TheAaryanKartik nails it with his flawless comic timing, while @tripti_dimri23 lights up the screen. @vidya_balan and @MadhuriDixit… pic.twitter.com/aoHA2OBVbs— Manoj Tiwari (@ManojTiwariIND) November 1, 2024There is no mosquito repellent in the hall! The theatre is empty, watching a movie is no fun #BhoolBhulaiyaa3 #BhoolBhulaiyaa3Review— Harish raj (@Harishraj162409) November 1, 2024Bhool Bhulaiyaa 3 is a spine-chilling delight!The plot twists are just mind-blowing.Kartik Aaryan owns every scene he’s in.It's a film that’ll have you laughing and screaming!#BhoolBhulaiyaa3 #BhoolBhulaiyaa3Review— Dattaraj Mamledar (@DattarajMamled) November 1, 2024 -
57 ఏళ్ల వయసులో మరింత యంగ్గా కనిపిస్తున్న మాధురీ దీక్షిత్ (ఫోటోలు)
-
పాకిస్తాన్ వ్యాపారి కోసం 'మాధురి దీక్షిత్' వివాదాస్పద నిర్ణయం
మాధురి దీక్షిత్ బాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఆమె పేరు ముందు వరుసలో ఉంటుందని చెప్పడంలో ఎలాంటి సందేహం ఉండదు. 1990ల్లో స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న మాధురి దీక్షిత్.. బాలీవుడ్లో స్టార్ హీరోలందరితో నటించిన ఆమె ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసింది. 1984లో అబోద్ అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చిన మాధురి దీక్షిత్.. శ్రీదేవి వంటి స్టార్ హీరోయిన్లకు కూడా అందనంత ఎత్తులో నిలబడింది. అయితే, తాజాగా ఆమె చిక్కుల్లో పడినట్లు తెలుస్తోంది.ఓ కంపెనీకి చెందిన యాడ్ విషయంలో మాధురి దీక్షిత్ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. పాకిస్థాన్ సంతతికి చెందిన అమెరికన్ వ్యాపారవేత్త రెహన్ సిద్ధిఖీ తన వ్యాపారా సామ్రాజ్యాన్ని పెంచుకునే క్రమంలో ఒక భారీ ఈవెంట్ను నిర్వహించబోతున్నాడు. ఆగష్టు నెలలో తనకు చెందిన కంపెనీల ప్రమోషన్ కార్యక్రమాన్ని టెక్సాస్లో నిర్వహించనున్నాడు. అయితే, ఈ కంపెనీకి ప్రచారకర్తగా వ్యవరించేందుకు మాధురి దీక్షిత్ టెక్సాస్కు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. దీనిని భారతీయులు తప్పుబడుతున్నారు. ఇలాంటి నిర్ణయం తీసుకోవద్దని నెట్టింట పెద్ద ఎత్తున్న కామెంట్లు చేస్తున్నారు. దీనంతటికి కారణం పాకిస్థాన్ గూఢచారి సంస్థ ఐఎస్ఐతో రెహన్ సిద్ధిఖీకి సంబంధాలున్నాయంటూ.. ఆయన నిర్వహించే అన్నీ కంపెనీలను భారత్ బ్లాక్లిస్ట్లో ఉంచింది. టెక్సాస్ ఈవెంట్కు సంబంధించిన ఓ పోస్టర్ నెట్టింట వైరల్ అవుతుంది. అందులో రెహన్ సిద్ధికీ, మాధురిదీక్షిత్ ఫొటోలున్నాయి. దీంతో ఆమె ఆ కార్యక్రమానికి వెళ్తున్నట్లు తేలిపోయింది. ముందుగా రెహన్ సిద్ధిఖీ ఎలాంటి వాడో తెలుసుకొని ఆ కార్యక్రమానికి మాధురి దీక్షిత్ వెళ్లాలని నెటిజన్లు సూచిస్తున్నారు. అయితే, ఈ గొడవ గురించి మాధురి దీక్షిత్ ఇంకా స్పందించలేదు. -
అదిరే..అదిరే మాధురి స్టయిలే అదిరే!
-
ఆ సినిమా షూటింగ్లో ఏడ్చిన హీరోయిన్.. చివరకు తప్పలేదు!
ఒక్కసారి ఇండస్ట్రీలో అడుగుపెట్టాక కొన్ని ఇష్టం ఉన్నా, లేకపోయినా చేయక తప్పదు. అలా హీరోయిన్ మాధురి దీక్షిత్ గతంలో ఒక అత్యాచార సన్నివేశంలో నటించాల్సి వచ్చింది. కానీ ఆ సీన్ చేయడం ఇష్టం లేక ఆమె ఎంతగానో ఏడ్చిందట! ఈ విషయాన్ని ప్రముఖ బాలీవుడ్ విలన్ రంజీత్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. రంజీత్ మాట్లాడుతూ.. 'ప్రేమ్ పరిత్యాగ్ సినిమా షూటింగ్ సమయంలో జరిగిన సంఘటన ఇది. ఆరోజు అత్యాచార సీన్ చిత్రీకరించాలి. నేను రెడీగా ఉన్నాను. ఎందుకింత ఆలస్యం? ఇంతలో మాధురి ఆ సీన్ చేయనని ఏడుస్తూ ఉందట. ఈ విషయం నాకెవరూ చెప్పలేదు. ఎందుకింత ఆలస్యం చేస్తున్నారా? అని అనుకుంటూ ఉండగా ఓ ఆర్ట్ డైరెక్టర్ తను ఏడుస్తుందని అసలు విషయం చెప్పాడు. అతడొక బెంగాలీవాసి. మా డైరెక్టర్ పేరు బాపు. తను దక్షిణాది ప్రాంతానికి చెందిన వ్యక్తి. ఇకపోతే సినిమాలో మాధురి తండ్రి చాలా పేదవాడు. తోపుడుబండి నడుపుతూ ఉంటాడు. ఆ బండిపైనే హీరోయిన్తో నా సీన్ చిత్రీకరించాల్సి ఉంది. చాలాసేపటి తర్వాత ఆమె ఆ సీన్ చేసేందుకు ఒప్పుకుంది. కట్ చెప్పకుండా.. ఫైట్ మాస్టర్ వీరు దేవ్గణ్.. ఎక్కడా సీన్కు కట్ చెప్పకుండా చూసుకోండి.. మేము కెమెరాను తిప్పుతూనే ఉంటామని చెప్పాడు. అత్యాచార సన్నివేశాల్లో నటించడమనేది మా పని. కానీ విలన్లమైన మేము మరీ అంత చెడ్డవాళ్లమైతే కాదు' అని చెప్పుకొచ్చాడు. కాగా ప్రేమ్ పరిత్యాగ్ 1989లో రిలీజైంది. మిథున్ చక్రవర్తి, మాధురి దీక్షిత్, రంజీత్ సహా దివంగత నటులు వినోద్ మెహ్రా, సతీశ్ కౌశిక్ ప్రధాన పాత్రల్లో నటించారు. రంజీత్ విషయానికి వస్తే ఈయన కెరీర్లో దాదాపు 500 చిత్రాల్లో నటించారు. చదవండి: తొలిసారి తండ్రి ఫోటోను షేర్ చేసిన స్టార్ హీరోయిన్ -
Madhuri Dixit Photos: కుర్ర హీరోయిన్లకు కుళ్ళు పుట్టిస్తున్న ఈ స్టార్ ఎవరు?
-
లాక్మే ఫ్యాషన్ వీక్ లో మెరిసిన బాలీవుడ్ తారలు (ఫొటోలు)
-
డెబ్బై మూడేళ్ల బామ్మ... మాధురితో పోటీపడి డ్యాన్స్ చేసింది!
‘డ్యాన్స్ వయసు ఎరగదు’ అనే సామెత ఉందో లేదోగాని ఈ వీడియో చూస్తే ‘నిజమే సుమీ’ అనిపిస్తుంది. ప్రముఖ డ్యాన్స్ రియాలిటీ షో ‘డ్యాన్స్ దివానే’లో 73 సంవత్సరాల బామ్మ డ్యాన్స్ వైరల్ అయింది. ఛోబీ అనే బామ్మ ‘దేవదాస్’ సినిమాలోని మాధురి దీక్షిత్ పాపులర్ పాట ‘మార్ డాలా’కు అద్భుతంగా డ్యాన్స్ చేసింది. రియాల్టీ షో జడ్జీలు మాధురి దీక్షిత్, సునీల్షెట్టీలకు ఛోబీ డ్యాన్స్ బాగా నచ్చింది. ‘మనసులో ఏది అనిపిస్తే అది చేయాలి. భయం అవసరం లేదు... అని మీరు మాకు చెబుతున్నట్లుగా ఉంది’ అని బామ్మను ప్రశంసించింది మాధురి. ఆ తరువాత బామ్మతో కలిసి మాధురి దీక్షిత్ డ్యాన్స్ చేసింది. ‘మాధురి అంటే డ్యాన్స్కు మరో పేరు. ఆమె పాపులర్ పాటకు డ్యాన్స్ చేయాలంటే సాహసం మాత్రమే కాదు. ప్రతిభ కూడా ఉండాలి. ప్రతిభ, సాహసం మూర్తీభవించిన ఛోబీజీకి అభినందనలు’. ‘మాధురితో పోటీపడి డ్యాన్స్ చేయడం మామూలు విషయం కాదు’... ఇలాంటి కామెంట్స్ ఎన్నో సోషల్ మీడియాలో కనిపించాయి. -
పట్టుచీరలో మెరిసిన మాధురి, ఆ చీర ధర ఎంతో తెలుసా?
వయసు పెరుగుతున్నా వన్నె తగ్గని అందం ఆమె. వయసుతో పాటు అందాన్ని కూడా పెంచుకున్న బాలీవుడ్ నటి మాధురీ దీక్షిత్ మాధురీ దీక్షిత్ లివింగ్ లెజెండ్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. సాంప్రదాయ దుస్తులలో, ముఖ్యంగా చీరలలో మెరిసిపోతూ ఉంటుంది ఈ ఎవర్గ్రీన్ దివా. పాప్ ఆఫ్ పింక్, ఏ డ్యాష్ ఆఫ్ గ్రేస్ అంటూ తన అందాన్ని పొగడకుండానే తెగ పొగిడేసుకుంది. తన బ్యూటిఫుల్ స్మైల్తో పాటు, చక్కటి డ్యాన్స్తో అందరినీ మెస్మరైజ్ చేస్తోంది. ఆమె అందమైన ఫోటోలను తన సోషల్ మీడియాలో ఫ్యాన్స్తో పంచుకుంటూ ఉంటుంది. తాజాగా మాధు దీక్షిత్ గుజరాత్ బంధాని (బంధేజీ) పట్టుచీరలో మెరిసిపోతున్న ఫోటోలను ఇన్స్టాలో షేర్ చేసింది. బ్రైట్ కలర్ ఆరు గజాల చీరలో మాధురి లుక్ అదిరిపోయిందంటున్నారు ఫ్యాన్స్. పింక్, పర్పుల్ కాంబినేషన్లో బంగారు రంగు అంచు చీరలో అద్భుతంగా కనిపించింది. పర్పుల్ హ్యూడ్ బ్లౌజ్, చక్కటి మేకప్, సాధారణ హెయిర్ బన్, యాంటిక్ జ్యూయల్లరీతో మరింత ఫ్యాషన్ను జోడించింది. దీంతో ఈ చీర ఎంత అనే ఆసక్తి నెలకొంది. గ్రాండ్ పీస్ ధర 75వేల రూపాయలట. కాగా జవనరి 22న అయోధ్యలో జరిగిన రామమందిర ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి భర్త శ్రీరామ్ తో కలిసి హజరైంది. View this post on Instagram A post shared by Madhuri Dixit (@madhuridixitnene) -
ఎంపీగా పోటీచేయనున్న ప్రముఖ హీరోయిన్
ప్రముఖ బాలీవుడ్ నటి మాధురీ దీక్షిత్ 2024 లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయడంపై నిత్యం చర్చలు జరుగుతున్నాయి. ఆమె బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈలోగా, మహారాష్ట్రలోని ముంబై లోక్సభ నియోజకవర్గంలో మాధురీ దీక్షిత్ బ్యానర్లు వెలిశాయి. బీజేపీ ప్రస్తుత ఎంపీ పూనమ్ మహాజన్ స్థానంలో వచ్చే ఎన్నికల్లో ఆమె పోటీ చేసే సూచనలు కనిపిస్తున్నాయి. మాధురీ దీక్షిత్ రాజకీయాల్లోకి వస్తారనే వార్తలు చాలా రోజుల నుంచే వినిపిస్తున్నాయి. ఈ పుకార్లకు బలం చేకూర్చేందుకు బీజేపీ సీనియర్ నేతలతో ఆమె టచ్లో ఉంది. కొద్ది రోజుల క్రితం కేంద్ర హోంమంత్రి అమిత్ షా ముంబైలోని మాధురీ దీక్షిత్ ఇంటికి వెళ్లారు. ఈ సందర్భంగా మోదీ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులకు సంబంధించిన బుక్లెట్ను నటికి షా బహుమతిగా ఇచ్చారు. దీని తర్వాత మాధురీ దీక్షిత్ బీజేపీలో చేరుతారనే చర్చకు మరింత బలం చేకూరింది. కాబట్టి ఆమె ఎన్నికల రంగంలోకి దిగే అవకాశం దాదాపు ఖాయం అయినట్లే. ఈ విషయంపై ఇప్పటి వరకు మాధురి ఎలాంటి స్పందనా ఇవ్వలేదు. ఉత్తర మధ్య ముంబై లోక్సభ నియోజకవర్గాన్ని దివంగత బీజేపీ నేత ప్రమోద్ మహాజన్ కుమార్తె పూనమ్ మహాజన్ పాలిస్తున్నారు. ఈ నియోజకవర్గం నుంచి 2014, 2019లో వరుసగా రెండుసార్లు విజయం సాధించారు. ప్రస్తుతం సాయిబాబ వార్షిక ఉత్సవాల సందర్భంగా ఈ ప్రాంతమంతా నటి మాధురీ దీక్షిత్ బ్యానర్లు వెలిశాయి. ఇందులో విశేషమేమిటంటే.. అక్కడ మాధురీ దీక్షిత్ బ్యానర్ లేదా ఫ్లెక్స్ బహిరంగంగా పెట్టడం ఇదే తొలిసారి. ముంబైలోని మొత్తం 6 లోక్సభ నియోజకవర్గాల్లో నార్త్-ముంబై, నార్త్ సెంట్రల్ ముంబైలు బీజేపీకి అత్యంత బలమైన రెండు నియోజకవర్గాలు. వీటిలో పూనమ్ మహాజన్ నియోజకవర్గం నార్త్ సెంట్రల్ ముంబై. ఈ నియోజకవర్గంలో మొత్తం ఆరుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ మొత్తం లోక్సభ నియోజకవర్గం ఎక్కువగా బీజేపీ, షిండే గ్రూపు ఆధిపత్యంలో ఉంది. పూనమ్ మహాజన్ ఈ నియోజకవర్గం నుంచి వరుసగా రెండుసార్లు విజయం సాధించారు. కాబట్టి ఈ నియోజకవర్గం ప్రస్తుతం బీజేపీకి అనుకూలమైనదిగా చెప్పవచ్చు. లోక్సభ ఎన్నికల్లో నటి మాధురీ దీక్షిత్ బీజేపీ నుంచి ముంబైలో పోటీ చేస్తారని గత కొన్ని నెలలుగా వార్తలు వస్తున్నాయి. అయితే ఈ విషయాన్ని నటి మాత్రమే కాదు బీజేపీ పార్టీ కూడా ఇంకా అధికారికంగా ధృవీకరించలేదు. దీనిపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర బావాంకులే మాట్లాడినా ఇంతవరకు దీనిపై ఎలాంటి ప్రతిపాదన జరగలేదని ఆయన చెప్పారు. ఈ విషయంలో పార్టీ నేతల నిర్ణయమే అంతిమమని ఆయన అన్నారు. నటి మాధురీ దీక్షిత్కు సంబంధించిన ఆ బ్యానర్స్తో బీజేపీ ఎన్నికలతో ఎటువంటి సంబంధం లేదని అక్కడి నేతలు కొందరు చెప్పుకొస్తున్నారు. మోదీ ప్రభుత్వం చేస్తున్న పనులను ప్రముఖులకు, వ్యాపారులకు, సినీ పరిశ్రమకు చెందిన వారికి చేరవేసే పని కొన్ని నెలలుగా అక్కడి పార్టీలో సాగుతోంది. దీంతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. నటి మాధురీ దీక్షిత్ ఇంటికి వెళ్లారు. అయితే మాధురీ దీక్షిత్ ఎన్నికల్లో పోటీ చేస్తారా లేదా? ఈ విషయంలో ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని బీజేపీ వర్గాలు తెలిపాయి. -
IFFI Goa 2023: గోవా ఇఫి వేడుకల్లో తారాలోకం (ఫొటోలు)
-
'హీరోయిన్తో అలాంటి సీన్.. ఒక గొడవతో ఆగిపోయింది'
బాలీవుడ్లో కాలియా, షాహెన్షా వంటి చిత్రాలను రూపొందించిన నటుడు,దర్శకుడు అయిన టిన్ను ఆనంద్, 1989లో మాధురీ దీక్షిత్- అమితాబ్ బచ్చన్ల కాంబినేషన్లో 'శనఖత్' అనే చిత్రాన్ని తెరకెక్కించాలని అన్ని ఏర్పాట్లను పూర్తి చేయయడంతో పాటు ఐదురోజులు షూట్ చేసి సినిమాను మధ్యలోనే ఆపేయాల్సి వచ్చింది. ఇందుకు సంబంధించిన కారణాలను సుమారు మూడు దశాబ్ధాల తర్వాత దర్శకుడు టిన్ను ఆనంద్ ఇలా తెలిపాడు. (ఇదీ చదవండి: మొదటిరోజు 'జవాన్' కలెక్షన్స్.. ఆల్ రికార్డ్స్ క్లోజ్) 'సినిమాకు చెందిన ఒక సన్నివేశం ఇలా ఉంటుంది. ఒక గ్యారేజ్లో అమితాబ్ను విలన్లు గొలుసులతో కట్టిపడేస్తారు. ఆ సమయంలో మాధురిని రక్షించడానికి ఆమితాబ్ ప్రయత్నిస్తున్నాడు. ఈ క్రమంలో అతను ఆ గూండాలచే దెబ్బలు తిని హీరోయిన్ను రక్షిస్తాడు. అలాంటి సమయంలో హీరోకు అన్నివిదాలుగా హీరోయిన్ దగ్గర కావాలనేది సీన్. సినిమాలోని కీలకమైన ఈ సన్నివేశాల్లో హీరోయిన్ను లోదుస్తులు చూపించాలనుకున్నా. దానికి మాధురి దీక్షిత్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. (ఇదీ చదవండి: బంగ్లాదేశ్లో 'జవాన్' నిషేధం.. ఎందుకో తెలుసా?) అందుకు నచ్చిన దుస్తువులను తెచ్చుకోవచ్చని కూడా ఆమెకు చెప్పాను. దీంతో మాధురి కూడా ఓకే అన్నారు. తీరా షూటింగ్ సమయానికి ఇలా లోదుస్తులతో నటించడం ఇష్టం లేదని చెప్పింది. ఆప్పుడు ఆమెతో గొడవ జరిగింది. ఈ సీన్ చేయకుంటే ఈ సినిమా నుంచి వెళ్లిపోండని చెప్పడంతో ఆమె కూడా అక్కడి నుంచి వెళ్లిపోయింది. అలా ఆ సినిమా ప్రారంభం అయిన ఐదురోజులకే ఆగిపోయింది.' అని టిన్ను ఆనంద్ తెలిపాడు. ప్రస్తుతం ఆయన సలార్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ మధ్య విడుదలైన గ్లింప్స్ ఆయన డైలాగ్లతోనే ప్రారంభం అవుతాయి. -
బాలీవుడ్ క్వీన్.. సూపర్ హిట్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్!
మాధురి దీక్షిత్ బాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఆమె పేరు ముందు వరుసలో ఉంటుంది. 1990ల్లో బాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. 1967 మే 15న ముంబయిలో జన్మించింది. మైక్రో బయాలజిస్ట్ కావాలనుకున్న మాధురి దీక్షిత్.. మూడేళ్ల వయసులోనే డ్యాన్స్ చేయడం ప్రారంభించింది. ఎనిమిదేళ్ల వయసులోనే కథక్ నృత్యాన్ని నేర్చుకుంది. బాలీవుడ్ డ్యాన్స్ క్వీన్గా పేరు సంపాదించింది. బాలీవుడ్లో అగ్ర హీరోలందరితో నటించిన ఆమె ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసింది. ఇవాళ ఆమె 56వ బర్త్ డే సందర్బంగా ప్రత్యేక కథనం. (ఇది చదవండి: నరేశ్-పవిత్ర.. వారి బంధానికి ఇంతకన్నా ఏం కావాలి?) 1984లో అబోద్ అనే సినిమాతో మాధురి దీక్షిత్ ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత కొన్నిసినిమాల్లో సహాయ నటిగా చేసిన మాధురి..తేజాబ్ సినిమాలో ముఖ్య పాత్ర పొషించారు. ఈ సినిమా ఆమెకి మంచి గుర్తింపును తీసుకొచ్చింది. ఈ చిత్రమం మొదటి ఫిలింఫేర్ నామినేషన్కు కూడా ఎంపికైంది. ఆ తర్వాత రాం లఖాన్ (1989), పరిందా (1989), త్రిదేవ్ (1989), కిషన్ కన్హయ్యా (1990) వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు. బాలీవుడ్లో శ్రీదేవి కంటే ఎక్కువగా మాధురి పాపులారిటీ సాధించింది. (ఇది చదవండి: ఏజెంట్పై ఫలితంపై అఖిల్ రియాక్షన్..) 1990లో దీక్షిత్ ఇంద్ర కుమార్ దర్శకత్వం వహించిన దిల్ అనే ప్రేమ కథా చిత్రంలో ఆమిర్ ఖాన్ సరసన నటించారు. ఈ సినిమా ఆమె కెరీర్లోనే బ్లాక్బస్టర్గా నిలిచింది. అంతేకాకుండా మొట్ట మొదటి ఫిలింఫేర్ ఉత్తమ నటి పురస్కారాన్ని కూడా తెచ్చి పెట్టింది. ఆ తర్వాత సాజన్ (1991), బేటా(1992), ఖల్ నాయక్ (1993), హం ఆప్కే హై కౌన్ (1994), రాజా (1995) వంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించారు. బేటా చిత్రంలో చదువురాని అమాయకుడికి భార్యగా నటించిన పాత్రకి రెండో ఫిలింఫేర్ ఉత్తమ నటి పురస్కారాన్ని అందుకుంది. 1999లో డాక్టర్ శ్రీరామ్ నేనేను మాధురి వివాహం చేసుకున్నారు. పెళ్లి తర్వాత అమెరికాకు వెళ్లిపోయారు. దాదాపు ఓ దశాబ్దానికి పైగా అక్కడే నివసించారు. ఈ జంటకు అరిన్, ర్యాన్ అనే ఇద్దరు కుమారులు సంతానం. ప్రస్తుతం మాధురి దీక్షిత్ రియాలిటీ షోలకు న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తోంది. ఇటీవలే ఓటీటీలోకి కూడా ఎంట్రీ ఇచ్చేసింది. ది నేమ్ ఫేమ్తో అభిమానులను పలకరించింది. బాలీవుడ్లో దశాబ్దాల పాటు స్టార్ హీరోయిన్గా రాణించిన మాధురికి పలువురు బాలీవుడ్ ప్రముఖులు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. -
‘మాధురీ మేడం వడపావ్ అదిరింది’.. యాపిల్ సీఈవో టిమ్కుక్ వైరల్
భారత పర్యటనలో ఉన్న యాపిల్ సీఈవో టిమ్కుక్ ముంబైలో సందడి చేశారు. ఏప్రిల్ 18న యాపిల్ తన మొదటి స్టోర్ను ముంబైలో, ఏప్రిల్ 20న ఢిల్లీలో రెండో స్టోర్ ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా ముంబైలోని ప్రముఖ స్వాతీ స్నాక్స్ రెస్టారెంట్లో భారతీయులు అమితంగా ఇష్టపడే వడపావ్ను బాలీవుడ్ బ్యూటీ మాధురీ దీక్షిత్తో కలిసి యాపిల్ సీఈవో టిమ్కుక్ రుచి చూశారు. వడపావ్ చాలా బాగుంది అంటూ ఆ ఫోటోల్ని ట్వీట్ చేశారు. Thanks @madhuridixit for introducing me to my very first Vada Pav — it was delicious! https://t.co/Th40jqAEGa — Tim Cook (@tim_cook) April 17, 2023 నటి మాధురీ దీక్షిత్ టిమ్ కుక్తో కలిసి వడ పావ్ తింటున్న ఫోటోల్ని నెటిజన్లతో పంచుకున్నారు. “ముంబైకి వడ పావ్ కంటే మెరుగైన స్వాగతం గురించి ఆలోచించలేను!” అని ట్వీట్లో పేర్కొన్నారు. ప్రస్తుతం ఆఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. Can’t think of a better welcome to Mumbai than Vada Pav! pic.twitter.com/ZA7TuDfUrv — Madhuri Dixit Nene (@MadhuriDixit) April 17, 2023 -
మాధురి దీక్షిత్పై అవమానకర కామెంట్స్.. నెట్ఫ్లిక్స్కు లీగల్ నోటీసులు
అమెరికన్ సిట్ కామ్ 'ది బిగ్ బ్యాంగ్ థియరీ' సిరీస్ ప్రస్తుతం బి-టౌన్లో తీవ్ర దుమారం రేపుతోంది. ఇందులోని ఓ ఎపిసోడ్లో బాలీవుడ్ బ్యూటీ మాధురి దీక్షిత్ను కించపరిచారంటూ ఇప్పటికే ఎంపీ, బాలీవుడ్ నటి జయబచ్చన్ విరుచుకుపడ్డారు. ఈ నేపథ్యంలో మరో పొలిటిషియన్ తాజాగా నెట్ఫ్లిక్స్కు లీగల్ నోటీసులు పంపి షాకిచ్చాడు. ‘ది బిగ్ బ్యాంగ్ థియరీ’లోని ఒక ఎపిసోడ్లో మాధురీ దీక్షిత్ను సూచించేందుకు అవమానకరమైన పదాన్ని వినియోగించారని రాజకీయ విశ్లేషకుడు మిథున్ విజయ్ కుమార్ మండపడ్డారు. చదవండి: బిగ్బాస్ 7లోకి బుల్లితెర హీరో అమర్దీప్.. క్లారిటీ ఇచ్చిన నటుడు వెంటనే ఆ ఎపిసోడ్ను తొలగించాల్సిందిగా నెట్ఫ్లిక్స్పై దావా వేశారు. ‘ది బిగ్ బ్యాంగ్ థియరీ’ సీజన్ 2 నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇందులో నటించిన రాజ్ షెల్డన్ కూపర్గా నటించిన జిమ్ పార్సన్స్ ఐశ్వర్యరాయ్ని మాధురి దీక్షిత్తో పోలుస్తాడు. ఒక సన్నివేశంలో ఐశ్వర్యను పేదోడి ‘మాధురీ దీక్షిత్’ అని పేర్కొంటాడు. దీనికి మరో పాత్రధారి రాజ్ కూత్రపల్లి క్యారెక్టర్ను పోషించిన కునాల్ నయ్యర్.. కుష్టురోగి వంటి మాధురీ దీక్షిత్తో పోలిస్తే ఎలా? ఐశ్వర్య ఒక దేవత’ అని అంటాడు. దీనిపై మిథున్ కుమార్ స్పందిస్తూ.. ఈ సిరీస్లో స్త్రీ ద్వేషాన్ని ప్రోత్సహిస్తున్నారని.. వ్యక్తులను కించపరిచే భాష వాడుతున్నారని ఆయన ఫైర్ అయ్యారు. అదే విధంగా ఆయన ఓ ప్రకటన ఇచ్చారు. చదవండి: బిగ్బాస్ అలీ రేజాతో రొమాంటిక్ సీన్పై ప్రశ్న.. నటి సనా షాకింగ్ రియాక్షన్ ‘‘తాము చేసే పనులకు జవాబుదారీగా ఉండడం, స్ట్రీమింగ్లో సామాజిక, సాంస్కృతిక విలువలను కించపరచకుండా, ప్రజల మనోభావాలు దెబ్బతినకుండా చూసుకోవడం నెట్ఫ్లిక్స్ వంటి పెద్ద సంస్థలకు ఇది చాలా ముఖ్యం. స్ట్రీమింగ్ సర్వీస్ ప్రొవైడర్లు తమ ప్లాట్ఫారమ్లలో అందించే కంటెంట్ను జాగ్రత్తగా పరిశీలించి ప్రసారం చేయాల్సిన బాధ్యత ఉందని నేను గట్టిగా నమ్ముతున్నాను. అవమానకరమైన, అభ్యంతరకరమైన లేదా పరువు నష్టం కలిగించే కంటెంట్ లేదని నిర్ధారించాకే స్ట్రీమింగ్ చేయాలి. నెట్ఫ్లిక్స్ - ‘బిగ్ బ్యాంగ్ థియరీ’లోని షోలలో ఒకదానిలో అవమానకరమైన పదాన్ని ఉపయోగించడం వల్ల నేను చాలా బాధపడ్డాను. ఆ పదాన్ని ప్రజల నుంచి ఎన్నో ప్రశంసలు, భారీగా అభిమానులు ఉన్న నటి మాధురీ దీక్షిత్ను ఉద్దేశించి ఉపయోగించారు. ఇది అత్యంత అభ్యంతరకరం, తీవ్రంగా బాధించేది మాత్రమే కాకుండా ఆమె ఆత్మ గౌరవాన్ని, పరువును కించపరిచేలా ఉంది’’ అని ఆయన తన ప్రకటనలో పేర్కొన్నారు. మరి నెట్ ప్లిక్స్ ఎలా స్పందిస్తుందో చూడాలి. -
మాధురి దీక్షిత్పై అసభ్య పదజాలం.. తీవ్రస్థాయిలో మండిపడ్డ జయాబచ్చన్
అమెరికన్ సిట్ కామ్ 'ది బిగ్ బ్యాంగ్ థియరీ' షోపై బాలీవుడ్ నటి జయాబచ్చన్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ షోలోని ఎపిసోడ్లో బాలీవుడ్ నటి మాధురి దీక్షిత్పై చేసిన వ్యాఖ్యల పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. చంక్ లోరె, బిల్ ప్రాడీ రూపొందించిన అమెరికన్ టెలివిజన్ షోలో మాధురి దీక్షిత్పై చేసిన కామెంట్స్పై ఆమె జయాబచ్చన్ ఫైరయ్యారు. ది బిగ్ బ్యాంగ్ థియరీ షోలో పాల్గొన్న కునాల్ నయ్యర్ ఐశ్యర్యారాయ్తో పోలుస్తూ మాధురీ దీక్షిత్ను వేశ్య అని సంభోదించారు. కునాల్ నయ్యర్ వ్యాఖ్యల పట్ల జయా బచ్చన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వాడికేమైనా పిచ్చి పట్టిందా? అతన్ని వెంటనే మానసిక ఆస్పత్రికి తరలించాలని అన్నారు. అతని వ్యాఖ్యల పట్ల వారి కుటుంబ సభ్యులను నిలదీయాలని మండిపడ్డారు. ఈ షోలో షెల్డన్ కూపర్ పాత్రను పోషిస్తున్న జిమ్ పార్సన్స్ ఐశ్వర్య రాయ్ బచ్చన్ను పొగిడారు. అదే సమయంలో మాధురీ దీక్షిత్ను పోలుస్తూ కునాల్ నయ్యర్ అసభ్య పదజాలాన్ని ఉపయోగించారు. ఈ వ్యాఖ్యలతో ఇండియాలో జనాదరణ పొందిన అమెరికన్ సిట్కామ్ 'ది బిగ్ బ్యాంగ్ థియరీ' భారతీయుల ఆగ్రహానికి గురవుతోంది. కునాల్ నయ్యర్ వ్యాఖ్యల పట్ల నటి ఊర్మిళ మటోండ్కర్ ఇది అత్యంత దారుణమని అన్నారు. ఇది వారి చీప్ మెంటాలిటీని చూపిస్తోందని మండిపడ్డారు. ఇలా మాట్లాడటం అత్యంత అసహ్యంగా ఉందని దియా మీర్జా అన్నారు. నెట్ఫ్లిక్స్కు నోటీసులు అయితే ఈ ఎపిసోడ్ను తొలగించాలని రచయిత, రాజకీయ విశ్లేషకుడు మిథున్ విజయ్ కుమార్ స్ట్రీమింగ్ దిగ్గజాన్ని కోరుతూ నెట్ఫ్లిక్స్కి లీగల్ నోటీసులు పంపారు. సీజన్ టూ మొదటి ఎపిసోడ్లో బాలీవుడ్ నటి మాధురీ దీక్షిత్పై కునాల్ నయ్యర్ చేసిన వ్యాఖ్యలను ఆయన ప్రస్తావించారు. అతని వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయిని.. పరువు నష్టం కలిగించేలా ఉన్నాయని లీగల్ నోటీసులో విజయ్ కుమార్ పేర్కొన్నారు. ఇలాంటి కంటెంట్ సమాజంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని నోటీసులో పేర్కొన్నారు. బిగ్ బ్యాంగ్ థియరీ 'బిగ్ బ్యాంగ్ థియరీ' అనేది చక్ లోర్రే, బిల్ ప్రాడీ రూపొందించిన అమెరికన్ సిట్కామ్. ఇది 2007లో ప్రారంభం కాగా.. 12 సీజన్ల తర్వాత చివరి ఎపిసోడ్ 2019లో ప్రసారమైంది. -
స్టార్ హీరోయిన్ ఇంట తీవ్ర విషాదం
అలనాటి స్టార్ హీరోయిన్, బాలీవుడ్ నటి మాధురి దీక్షిత్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆమె తల్లి స్నేహలత (90) ఆదివారం ఉదయం కన్నుమూశారు. ఈ విషయాన్ని మాధురీ దీక్షిత్, ఆమె భర్త శ్రీరామ్ నేనే సంయుక్త ప్రకటనలో తెలియజేశారు. 'మేము ఎంతగానో ప్రేమించే ఆయి(అమ్మ) ఈ రోజు ఉదయం తనకు ఇష్టమైన వారి మధ్య ఉన్నప్పుడు స్వర్గస్తులయ్యారు' అని రాసుకొచ్చారు. మాధురి తల్లి మరణవార్తపై పలువురు సెలబ్రిటీలు, అభిమానులు నివాళులు అర్పిస్తున్నారు. గతేడాది జూన్లో తల్లి పుట్టినరోజు వేడుకలను సెలబ్రేట్ చేస్తూ ఎమోషనలైంది మాధురి. హ్యాపీ బర్త్డే ఆయి. 'ప్రతి అమ్మాయికి తన తల్లే బెస్ట్ ఫ్రెండ్ అంటుంటారు. నువ్వు నాకోసం ఎంతో చేశావు. నువ్వు చేసిన త్యాగాలు, నాకు నేర్పిన పాఠాలు.. అవే నాకు పెద్ద బహుమతులు. నువ్వు ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నా' అని రాసుకొచ్చింది. -
ఇతడిని పెళ్లి చేసుకుంటే కష్టమే అనుకున్నా: మాధురీ
బాలీవుడ్ నటి మాధురీ దీక్షిత్ సినీ ఇండస్ట్రీకి చెందిన వ్యక్తిని కాకుండా ఓ వైద్యుడిని పెళ్లాడింది. శ్రీరామ్ నేనే అనే డాక్టర్ను 1999లో పెళ్లి చేసుకుని యూఎస్లో సెటిలైపోయింది. తాజాగా శ్రీరామ్ నేనే యూట్యూబ్ ఛానల్లో వీరి కష్టసుఖాల గురించి మాట్లాడారు. ముందుగా నటి మాట్లాడుతూ.. 'ఇతడిని పెళ్లాడితే కష్టాలు ఖాయమనుకున్నా. ఎందుకంటే తనకు పగలూరాత్రి తేడా లేకుండా షెడ్యూల్స్ ఉంటాయి. అలాంటప్పుడు కొన్నిసార్లు పిల్లల్ని చూసుకోవడం కష్టంగా ఉంటుంది. వారిని స్కూల్కు తీసుకెళ్లడం, మళ్లీ ఇంటికి తీసుకురావడం వంటి చాలా పనులు ఉంటాయి. మరికొన్నిసార్లు ఏవైనా ముఖ్యమైన పనులు కూడా పడుతుంటాయి. కానీ తను అందుబాటులో ఉండడు. హాస్పిటల్లో పేషెంట్స్ను చూసుకుంటూ ఉంటాడు. కానీ నేను అనారోగ్యానికి గురైనప్పుడు ఆ పనులు ఇంకెవరు చూసుకుంటారు? ఇలా కొన్ని విషయాలు ఆలోచిస్తే ఎంతో కష్టంగా అనిపిస్తుంది. అదే సమయంలో తనను చూస్తుంటే గర్వంగానూ అనిపిస్తుంది. ఎందుకంటే పేషెంట్స్ కోసం ఎంతగానో తపిస్తాడు, వారి వైపు నిలబడతాడు. తను చాలా మంచివాడు. ఏదేమైనా పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు మన పార్ట్నర్ గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం' అని చెప్పుకొచ్చింది. మాధురి గురించి శ్రీరామ్ మాట్లాడుతూ.. 'ఇలా అర్థం చేసుకునే భార్య దొరకడం చాలా కష్టం. తను నాపై ఎంతో ప్రేమ చూపిస్తుంది' అని తెలిపాడు. చదవండి: ఫస్ట్ డే కలెక్షన్ రూ.10 లక్షలు.. నాపై విరుచుకుపడ్డవారు ఇప్పుడు మాట్లాడరే? -
అప్పట్లో సంచలనమైన మాధురీ లిప్లాక్, అత్యంత కాస్ట్లీ కిస్ ఇదేనట!
ప్రస్తుత సినిమాల్లో హీరోహీరోయిన్ల మధ్య ఇంటిమేట్, లిప్ లాక్ సీన్స్ సాధారణం అయిపోయాయి. కానీ 80, 90లో మాత్రం ఇలాంటి సన్నివేశం అంటే సంచలనం. హీరోహీరోయిన్ల మధ్య ఇలాంటి సన్నివేశాలు ఉంటే చాలు దానిపై విపరీతమైన చర్చ జరిగేది. ఎక్కడికి వెళ్లిన ఆ నటీనటులకు దీనిపై ప్రశ్నలు ఎదురవుతూనే ఉండేవి. టీవీల్లో, వార్తల్లో ఎక్కడ చూసిన దీనిపైనే రచ్చ. అలా ఇప్పటికీ తాను చేసిన లిప్లాక్ సీన్పై ప్రశ్నలకు ఎదుర్కొంటూనే ఉంటుంది అలనాటి బ్యూటీ క్వీన్, సీనియర్ హీరోయిన్ మాధురీ ధీక్షిత్. చదవండి: అదితిపై మాజీ భర్త సంచలన వ్యాఖ్యలు! రెండో పెళ్లిపై ఏమన్నాడంటే.. అప్పటికే ఆమె స్టార్ హీరోయిన్, కానీ అవసరం లేకున్నా ఓ సినిమాలో హీరోతో డీప్ లిప్లాక్ సీన్ చేసి వార్తల్లోకి ఎక్కింది. అప్పుట్లో దీనిపై పెద్ద రచ్చే జరిగిందట. అసలు మాధురీ ఆ సన్నివేశం ఎందుకు చేసింది? తనకు అంత అవసరం ఏమొచ్చిందని అంతా చర్చించుకున్నారట. అయితే ఈ సీన్ కోసం మాధురీ కోటి రూపాయల పారితోషికం తీసుకున్న అంశం అప్పట్లో బచర్చనీయాంశమైంది. అంతేకాదు అంత్యంత విలువైన ముద్దు ఏదంటే మాధురిది అనేంతగా ట్రోల్స్ కూడా ఎదుర్కొంది. డబ్బు కోసం ఇంత దిగజారాలా! అని ఫ్యాన్స్ సైతం ఆమెను విమర్శించారట. ఇక అసలు విషయానికొస్తే.. బాలీవుడ్ దర్శకుడు ఫిరోజ్ ఖాన్ డైరెక్షన్లో 1988లో విడుదలైన ‘దయావన్’ చిత్రంలో వినోద్ ఖన్నా-మాధురీ దీక్షిత్లు హీరోహీరోయిన్లుగా నటించారు. చదవండి: లవ్టుడే హీరోపై రజనీకాంత్ ఫ్యాన్స్ ఆగ్రహం! ట్వీట్కి లైక్ కొడతావా? అంటూ ఫైర్ ఇందులో అవసరం లేకున్నా హీరోహీరోయిన్ల మధ్య ఇంటిమేట్ సీన్తో పాటు లిప్కిస్ పెట్టారట. అయితే మొదట మాధురీ చేయనని చెప్పడంతో దర్శక-నిర్మాతలు ఆమెకు కోటీ రూపాయలు ఆఫర్ చేశారట. దీంతో ఆమె అయిష్టంగానే ఒకే చేప్పిందని సమాచారం. ఇక రీసెంట్గా ఓ మూవీ ఈవెంట్లో మీడియా నుంచి మాధురీకి ఈ లిప్కిస్పై ప్రశ్న ఎదురైంది. దీనికి ఆమె స్పందిస్తూ.. ‘నేను ఆ సన్నివేశంలో నటించాల్సి ఉండకూడదు. ఇంపార్టెంట్ కాకపోయినా సరే ఆ సీన్ పెట్టారనిపిస్తుంది. నేను దానికి నో చెప్పి ఉండాల్సింది’ అని వివరణ ఇచ్చింది. దీంతో 35 ఏళ్ల నాటి ఈ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. -
మాపై అలాంటి ముద్ర వేస్తారు..హీరోలను అలా అనరెందుకు: నటి
బాలీవుడ్ నటి రవీనా టాండన్ గురించి పెద్దగా చెప్పక్కర్లేదు. బాలీవుడ్ లో మోస్ట్ గ్లామరస్ హీరోయిన్స్ లో రవీనా ఒకరు. అందం, అభినయంతో రవీనా బాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.90ల్లో స్టార్ హీరోయిన్గా ఎంతో క్రేజ్ సంపాదించుకుంది. అప్పట్లో ఆమె నటించిన ప్రతి సినిమా హిట్లే. దీంతో ఆమెకు లెక్కలేనంతమంది అభిమానులు ఉండేవారు. ఇక తెలుగులోనూ సత్తా చాటిన రవీనా టాండన్ ఇటీవలె కెజిఎఫ్-2 సినిమాలో కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. తాజాగా ఓ మీడియాతో ముచ్చటించిన ఆమె హీరో, హీరోయిన్ల విషయంలో తేడాలు చూపిస్తుండటంపై మండిపడింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. హీరోలు ఒక్కో సినిమాకు రెండు, మూడేళ్ల గ్యాప్ తీసుకుంటారు. కానీ హీరోయిన్స్ కొద్ది రోజులు కనిపించకున్నా…సెకండ్ ఇన్నింగ్స్ అని ముద్ర వేస్తారు. మాధురీ దీక్షిత్ను 90ల కాలం నాటి సూపర్ స్టార్ అని మీడియాలో కథనాలు వేస్తారు. మరి అప్పటి నుంచి పని చేస్తున్న సల్మాన్ ఖాన్, సంజయ్ దత్ల గురించి అలా అనరెందుకు? హీరో, హీరోయిన్ల విషయంలో చూపిస్తున్న ఈ అసమానతను అంతం చేయాలి అంటూ వాపోయింది రవీనా. -
Beauty: వారానికి 3 సార్లు ఇలా చేస్తా! నా బ్యూటీ సీక్రెట్ అదే: మాధురీ దీక్షిత్
Madhuri Dixit- Beauty Secret: అందం, అభినయానికి తోడు తనవైన స్టెప్పులతో బాలీవుడ్ను ఉర్రూతలూగించిన అలనాటి హీరోయిన్ మాధురీ దీక్షిత్. తొంభయవ దశకంలో యువత కలల రాణిగా వెలుగొందిన ఈ ముంబై నటి.. యాభై పదుల వయసులోనూ అందంతో కట్టిపడేస్తోంది. తన చర్మ సౌందర్యం వెనుక ఉన్న రహస్యాన్ని ఇటీవల అభిమానులతో పంచుకుంది. వయసును దాచేసే మంత్రం! ‘‘వయసుని కనిపించనివ్వని చర్మ సౌందర్యానికి ఏం చేస్తున్నారేంటి అని అభిమానులే కాదు.. నా తోటి నటీమణులూ అడుగుతుంటారు. స్కిన్కేర్ విషయంలో నేను ఇంటి చిట్కాలనే నమ్ముతా.. అది మా అమ్మమ్మ నుంచి నేర్చకున్నా. శనగపిండిలో కాసిన్ని తేనె చుక్కలు.. కొంత నిమ్మరసం కలిపి మొహానికి పట్టిస్తా.. పాలల్లో ముంచిన కీరా దోసకాయ ముక్కలను కళ్ల మీద పెట్టుకుని ఓ ఇరవై నిమిషాల పాటు రిలాక్స్ అవుతా. తర్వాత చన్నీళ్లతో మొహం కడిగేసుకుంటా. ఇలా వారానికి మూడుసార్లు చేస్తానంతే!’’ అంటూ తన బ్యూటీ సీక్రెట్ వెల్లడించింది మాధురి దీక్షిత్. కాగా 70కి పైగా సినిమాల్లో నటించిన మాధురీ.. టీవీ షోల్లో జడ్జీగా అభిమానులను అలరిస్తోంది. చదవండి: ఉల్లిపాయ రసంలో బాదం నూనె కలిపి జుట్టుకు పట్టిస్తున్నారా? కొబ్బరి నూనెలో ఆవాలు వేయించి ముఖానికి రాస్తే! -
53వ అంతస్తులో.. ఖరీదైన ఇల్లు కొన్న మాధురీదీక్షిత్
బాలీవుడ్ బ్యూటీ మాధురీ దీక్షిత్ ముంబైలోని లోయర్ పరేల్ ప్రాంతంలో ఓ విలాసవంతమైన ఇంటిని కొనుగోలు చేసింది. 53వ అంతస్తులో ఉన్న ఈ ఇంటిని దాదాపు రూ. 48కోట్లు పెట్టి కొనుగోలు చేసినట్లు సమాచారం. ఇప్పటికే ఈ ఇంటికి సంబంధించి రిజిస్ట్రేషన్ పనులు కూడా పూర్తయ్యాయి. 5384 చదరపు గజాలు ఉన్న ఈ కొత్తింట్లో స్విమ్మింగ్ పూల్స్, ఫుట్బాల్ పిచ్, జిమ్, స్పా, క్లబ్ వంటి ఎన్నో సదుపాయాలు ఉన్నాయట. అంతేకాకుండా మాధురీ దీక్షిత్ ఖరీదు చేసిన అపార్ట్మెంట్ నుంచి అరేబియా సముద్రం వ్యూ చాలా అందంగా కనిపిస్తుందని ఇండియాబుల్స్ బ్లూ తన వెబ్సైట్లో తెలిపింది. 1990ల కాలంలో మోస్ట్ బిజీయెస్ట్ హీరోయిన్గా పేరు సంపాదించుకున్న మాధురీ దీక్షిత్ ప్రస్తుతం సినిమాలతో పాటు అటు బుల్లితెరపై కూడా సందడి చేస్తుంది. చివరగా ఆమె ది ఫేమ్ గేమ్ అనే వెబ్సిరీస్లో కనిపించింది. -
ఇల్లు మారనున్న మాధురీ దీక్షిత్, ఒక్క నెలకే అన్ని లక్షలా?
బాలీవుడ్ జంట మాధురీ దీక్షిత్, శ్రీరామ్ నేనే త్వరలో కొత్త ఇంట్లోకి మారబోతున్నారు. ముంబైలోని పోష్ ఏరియా అయిన వొర్లిలో ఓ అపార్ట్మెంట్లో అద్దెకు దిగబోతున్నారు. సకల హంగులతో విలాసవంతంగా ఉన్న ఈ అపార్ట్మెంట్లో నివసించేందుకు వారు నెలకు రూ.12.5 లక్షలు అద్దె కట్టనున్నట్లు సమాచారం. ఈ సెలబ్రిటీ కపుల్ ఉండబోయే ఇంటిని నిర్మించిన డిజైనర్ అపూర్వ ష్రాఫ్ మాట్లాడుతూ.. అపార్ట్మెంట్లోని 29వ అంతస్థులో మాధుదీ దంపతుల ఫ్లాట్ ఉందని పేర్కొన్నారు. వారు దీనికి ఎలాంటి మార్పులు చేయాలనుకోకుండా యధాతథంగా ఉంచాలనుకుంటున్నారని తెలిపారు. అంతేకాదు, ఆ ఫ్లాట్కు సంబంధించిన ఫోటోలను సైతం ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారు. దీంతో ఆ ఫొటోలు ప్రస్తుతం వైరల్గా మారాయి. మాధురి సినిమాల విషయానికి వస్తే ఆమె చివరి సారిగా 'ది ఫేమ్ గేమ్' వెబ్ సిరీస్లో నటించింది. ఇందులో సంజయ్ కపూర్ మానవ్ కౌల్ ముఖ్యపాత్రలు పోషించిన ఈ సిరీస్ను దర్శకులు బెజోయ్ నంబియార్, కరిష్మా హోలీ తెరకెక్కించారు. కరణ్ జోహార్ నిర్మాతగా వ్యవహరించాడు. ఈ సిరీస్ నెట్ఫ్లిక్స్లో అందుబాటులో ఉంది. View this post on Instagram A post shared by Apoorva Shroff (@lythdesign) View this post on Instagram A post shared by Apoorva Shroff (@lythdesign) View this post on Instagram A post shared by Apoorva Shroff (@lythdesign) View this post on Instagram A post shared by Apoorva Shroff (@lythdesign) -
అజయ్ జడేజా బ్రేకప్ స్టోరీ: మ్యాచ్ ఫిక్సింగ్.. మాధురీ దీక్షిత్ని దూరం చేసిందా!
అజయ్ జడేజా పేరు తెలియని క్రికెట్ అభిమానులు ఉండరు.. మాధురీ దీక్షిత్ను గుర్తుపట్టని సినీ ప్రేక్షకులు ఉండరు.. ఓ వెలుగు వెలిగిన తారలు.. వారి వారి రంగాల్లోని వాళ్ల గ్లామర్.. సంపాదించుకున్న పాపులారిటీ ఒకరితో ఒకరు ప్రేమలో పడేలా చేసింది. కానీ పెళ్లిదాకా తీసుకెళ్లలేదు. అర్ధాంతరంగా ముగిసిన ఆ లవ్ స్టోరీ ఏంటంటే... ఇది 1990ల కథ.. ఓ మ్యాగజైన్ కోసం ఫొటో షూట్ చేయడానికి అజయ్ వెళ్లాడు. అక్కడ కలిసింది మాధురీ దీక్షిత్. అప్పటిదాకా ఆమె సినిమాలు చూశాడు.. ఆమె అభినయానికి ఆరాధకుడయ్యాడు. ఆ వెండితెర వేలుపు తన కళ్ల ముందే కొలువుదీరేసరికి అప్రతిభుడయ్యాడు. ఆ అందానికి ముగ్ధుడయ్యాడు. ఆమె నవ్వుకి పడిపోయాడు. అజయ్ జడేజా గురించి మాధురీ విన్నది. కానీ చూడ్డం అదే మొదలు. ఆ పరిచయానికి తనూ కాస్త ఎగ్జయిట్ అయింది. ఇద్దరి మధ్యా స్నేహం మొదలైంది. అప్పటికే..సంజయ్ దత్తో ప్రేమ, అతను టాడా కేసులో ఇరుక్కోవడం.. ఆ నేపథ్యంలో మాధురీని మీడియా ఫోకస్ చేయడం.. వంటి చిక్కులు, చికాకుల్లో ఉంది. మాధురీ.. దిగులు, కలత, కలవరం గూడులో దాక్కునుంది. అలాంటి సమయంలో అజయ్ పరిచయం.. స్నేహం ఆమెకు కాస్త ఊరటనిచ్చాయి. అతని హాస్య చతురత ఆమెలో ఉత్సాహాన్ని, జీవనాసక్తినీ పెంచింది. తనకు తెలియకుండానే అతనితో ప్రేమలో పడింది. మాధురీకి తన మీదున్న ప్రేమను సినిమా రంగంలో తన ఎంట్రీకి పాస్గా ఉపయోగించుకోవాలనుకున్నాడు అజయ్. మైదానంలో సిక్సర్లు కొట్టినంత తేలికగా తెర మీద హీరోయిక్ స్టంట్లు చేయాలని ఉబలాటపడ్డాడు. ఆ విషయాన్ని మాధురీ చెవిలో వేశాడు. సినిమాల్లోకి రావాలనుకున్న అజయ్కు వెన్నుదన్నుగా నిలబడాలనుకుంది. తనకు బాగా పరిచయం ఉన్న నిర్మాతలందరినీ అతనికి పరిచయం చేసింది. వాళ్లకు అతణ్ణి రికమెండ్ చేసింది. ఈ ఇద్దరి మధ్య ఉన్న ఆ చనువు చూసి బాలీవుడ్లో గుసగుసలు మొదలయ్యాయి. ఆ టైమ్లోనే ఈ జంట ఓ మ్యాగజైన్ మీద కవర్ ఫొటోగా అచ్చయింది. దాంతో ఆ గుసగుసలు పెళ్లి చేసుకుంటారనే వదంతుల రూపం తీసుకున్నాయి. ఇటు సినిమా ఇండస్ట్రీ, అటు క్రికెట్ ఫీల్డ్కీ చేరాయి. ఈలోపే.. క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ సంచలనం అయింది. అందులో అజయ్ పేరూ వినిపించింది. పత్రికల నిండా అవే వార్తలు. మళ్లీ నిరాశ, నిస్పృహలు ఆవహించాయి మాధురీని. ‘అలాంటిదేమీ లేదు.. పట్టించుకోవద్దు’ అని చెప్పే ప్రయత్నం చేశాడు అజయ్. ఆ మాటను నమ్మింది ఆమె. కానీ ఈలోపే అజయ్ తల్లిదండ్రులకు వాళ్ల ప్రేమ విషయం తెలిసింది. అజయ్ వాళ్లది రాజకుటుంబం. ఆ ఇంటి కోడలు ఓ సినిమా యాక్టరా? వీల్లేదు అంటూ ఫత్వా జారీ చేశారని ఓ వార్త. అదలా ఉంచితే మ్యాచ్ ఫిక్సింగ్లో దోషిగా తేలాడు అజయ్. ఇన్ని గందరగోళాల మధ్య ఆ రిలేషన్ను ముందుకు తీసుకెళ్లాలనుకోలేదు మాధురీ. అంతకుముందు ఆమె కుటుంబం అజయ్ పట్ల సానుకూల దృక్ఫథంతోనే ఉంది. కానీ ఎప్పుడైతే మ్యాచ్ ఫిక్సింగ్లు, మాధురీ పట్ల అతనింట్లో వాళ్లకున్న అభిప్రాయం తెలిసేసరికి ఆమె ఇంటి వాళ్లూ ఆ సంబంధం పట్ల మొగ్గు చూపలేదు. ఆ ప్రేమకు చరమగీతం పాడి.. మనసులోంచి అజయ్ను చెరిపేసుకొమ్మనే సలహా ఇచ్చారు. అజయ్ జడేజా నుంచి సానుకూల స్పందన వస్తుందేమోనని చూసింది. కనీసం వివరణ కూడా ఇవ్వలేదు అతను. ఇవన్నీ గ్రహించిన మాధురీ కుటుంబం మళ్లీ ఆమె దిగులు లోకం తలుపు తట్టకముందే అమెరికా సంబంధం తెచ్చారు. అతనే డాక్టర్ శ్రీరామ్ నేనే. తర్జనభర్జనలేమీ లేకుండా మీమాంసేదీ పెట్టుకోకుండా శ్రీరామ్కు ఓకే చెప్పింది. అతని జీవితభాగస్వామై అమెరికా వెళ్లిపోయింది. ఇక్కడ అజయ్ జడేజా కూడా ఎలాంటి శషభిషలు లేకుండా జయ అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ∙ఎస్సార్ -
నా కొడుకు గుండె పగిలింది, అందుకే : హీరోయిన్
సాక్షి, ముంబై: బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ మాధురీ దీక్షిత్ కుమారుడు ర్యాన్ పెద్ద మనసుకు నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. నేషనల్ కేన్సర్ అవేర్నెస్ డే (నవంబర్ 7) సందర్భంగా కేన్సర్ బాధితుల కోసం తన జుట్టును దానం చేయడం విశేషంగా నిలిచింది. స్వయంగా మాధురీ దీనికి సంబంధించిన వీడియోను ఇన్స్టాగ్రామ్లో అభిమానులతో పంచుకున్నారు. (Kamal Haasan: తొలి భారతీయుడిగా కమల్ మరో సంచలనం) అలనాటి అందాల నటి, డ్యాన్సింగ్ క్వీన్ మాధురీ దీక్షిత్, శ్రీరామ్ నెనె దంపతుల చిన్న కుమారుడు ర్యాన్ తన పొడవైన జుట్టును కీమో థెరపీ చేయించుకున్న పేషెంట్ల కోసం డొనేట్ చేశాడు. సెలూన్లో ర్యాన్ హెయిర్కట్ చేయించుకుంటున్న వీడియోను షేర్ చేశారు మాధురి. కేన్సర్ బారిన పడి కీమో థెరపీ చేయించుకున్న వారిని చూసి ర్యాన్ చలించి పోయాడు. అందుకే కీమో ద్వారా జుట్టును కోల్పోయిన వారిలో ఆత్మవిశ్వాసం నింపేలా తన జుట్టును కేన్సర్ సొసైటీకి దానం చేయాలనుకున్నాడని మాధురి తెలిపారు. ఇది విని తాము చాలా ఆశ్చర్యపోయామని, దాదాపు రెండు సంవత్సరాలుగా పెంచు కుంటున్న తన జుట్టును డొనేట్ చేయడంపై చాలా గర్వ పడుతున్నామని మాధురి పేర్కొన్నారు. ర్యాన్ తీసుకున్న నిర్ణయంపై అభిమానులతో పాటు పలువురు నెటిజన్లు కూడా ఫిదా అవుతున్నారు. View this post on Instagram A post shared by Madhuri Dixit (@madhuridixitnene) -
వైరల్ వీడియో: టోక్యో ఒలింపిక్స్లో మాధురి దీక్షిత్ సాంగ్
-
టోక్యో ఒలింపిక్స్లో మాధురి దీక్షిత్ సాంగ్ వైరల్
జపాన్ రాజధాని టోక్యోలో జరుగుతున్న ఒలింపిక్స్లో ఇదివరకు లేని రికార్డులు నమోదవుతున్నాయి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఒలింపిక్స్ ఫీవర్ పట్టుకుంది. ఎక్కడ చూసిన ఈ అంతర్జాతీయ ఆటలకు చెందిన విషయాలే హల్చల్ చేస్తున్నాయి. టోక్యో ఒలింపిక్స్కు సంబంధించిన బోలేడు వీడియోలు సోషల్ మీడియాలో కూడా తెగ వైరల్ అవుతున్నాయి. తాజాగా టోక్యో ఒలింపిక్స్లో బాలీవుడ్కు చెందిన ఓ పాట ఇంటర్నెట్ను షేక్ చేస్తుంది. ఒలింపిక్స్లో ఇజ్రాయిల్ జట్టు స్మిమర్స్ ఈడెన్ బ్లెచర్, షెల్లీ బోబ్రిట్క్సీ.. ఆర్టిస్టిక్ స్విమ్మింగ్ డ్యూయెట్ ఫ్రీ రొటీన్ ప్రిలిమినరీలో మంగళవారం పోటీ పడ్డారు. ఆ సమయంలో బీటౌన్ బ్యూటీ మాధురి దీక్షిత్ నటించిన పాపులర్ సాంగ్ ‘ఆజా నాచ్లే’ పాటకు డ్యాన్స్ చేస్తూ స్వీమ్ చేశారు. అన్నే దానం అనే ట్విట్టర్ యూజర్ ఈ వీడియోను షేర్ చేశారు. ‘చాలా ధన్యవాదాలు ఇజ్రాయెల్ టీమ్. ఆజా నాచ్లే పాటను వినడానికి, చూడటానికి ఎంత ఉత్సాహంగా ఉందో మీకు తెలియదు’. అంటూ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు ఈ వీడియో ప్రస్తుతం నెట్టింటా వైరల్గా మారడంతో నెటిజన్లు ఇజ్రాయెల్ స్విమర్స్ బాలీవుడ్ పాటను ఎంచుకున్నందుకు ప్రశంసలు కురిపిస్తున్నారు. స్విమ్మింగ్లో వారి స్టైల్కు ఫిదా అయిపోతున్నారు. ఒలింపిక్స్లో బాలీవుడ్ సాంగ్ వినిపించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా మాధురి దీక్షిత్, కొంకణ సేన్, కునాల్ కపూర్, అక్షయ్ ఖన్నా ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ఆజా నాచ్లే . 2007లో విడుదలైన ఈ చిత్రానికి అనిల్ మెహతా దర్శకత్వం వహించారు. -
షూటింగ్ సమయంలో ధోతీ జారిపోతూ ఉండేది: షారుఖ్
దేవదాస్.. బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ కెరీర్లో గుర్తుండిపోయే చిత్రం. పారూ- దేవదాస్ల అమర ప్రేమకు దృశ్యరూపమైన ఈ హృద్యమైన ప్రేమకథా చిత్రం ప్రేక్షకుల చేత కంటతడి పెట్టించింది. విషాదాంతంతో ముగిసే ఈ సినిమా భగ్న ప్రేమికుల హృదయానికి అద్దం పట్టింది. షారుఖ్, మాధురీదీక్షిత్(వేశ్య పాత్ర), ఐశ్వర్యారాయ్ పోటీపడి మరీ నటించి తమ తమ కెరీర్ బెస్ట్ పర్ఫామెన్స్లో ఒకటిగా ఈ మూవీని పదిలం చేసుకున్నారు. ఇక సంజల్ లీలా భన్సాలీ తెరకెక్కించిన ఈ రొమాంటిక్ డ్రామా విడుదలై 19 ఏళ్లు అవుతోంది. ఈ సందర్భంగా షారుఖ్ ఖాన్ గత జ్ఞాపకాలు గుర్తుచేసుకున్నాడు. ఈ మేరకు సోమవారం ఇన్స్టా వేదికగా.. ‘దేవదాస్’ సినిమా షూటింగ్ సమయం నాటి పలు ఫొటోలను షేర్ చేశాడు. ‘‘అర్ధరాత్రి వరకు షూటింగ్లు... పొద్దుపొద్దున్నే నిద్రలేవడం.. అబ్బో ఎన్నో కష్టాలు.. అయితే అవన్నీ మంచి అవుట్పుట్ను ఇచ్చాయి... ఇందుకు కారణం.. దిగ్గజ సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో మాధురీ దీక్షిత్, ఐశ్వర్యారాయ్, జాకీ ష్రాఫ్, కిరణ్ ఖేర్... ఇంకా టీం మొత్తం కలిసికట్టుగా పనిచేయడమే... అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు’’ అని సహచర నటుల పట్ల ప్రేమను కురిపించాడు. అదే విధంగా... షూటింగ్ సమయంలో ధోతీ ఎప్పుడూ జారిపోతూ ఉండేదని, అన్నింటి కంటే తాను ఎదుర్కొన్న పెద్ద సమస్యే అదేనంటూ సరదాగా వ్యాఖ్యానించాడు. ఇక మాధురీ దీక్షిత్ సైతం.. ‘‘19 ఏళ్లు గడిచినా ఆ జ్ఞాపకాలు ఇంకా కొత్తగానే ఉన్నాయి. ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు థాంక్యూ సంజయ్’’ అని సోషల్ మీడియా వేదికగా కృతజ్ఞతలు చెప్పారు. అదే విధంగా ఇటీవల మరణించిన, ‘దేవదాస్’ దిలీప్ కుమార్(1955 నాటి సినిమా)ను ఈ సందర్భంగా మరోసారి నివాళి అర్పించారు. View this post on Instagram A post shared by Shah Rukh Khan (@iamsrk) -
ఆస్తులమ్ముకున్న నటికి మాధురీ దీక్షిత్ సాయం!
Shagufta Ali: 36 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగిన బుల్లితెర తార షగుఫ్త అలీ. ఎన్నో సీరియళ్లలో తన నటనతో ప్రేక్షకులను అలరించిన ఆమెకు ఇప్పుడు కనీస అవకాశాలు రాక దీన స్థితిలో బతుకు వెళ్లదీస్తోంది. దీనికితోడు రోజురోజుకూ తనను అనారోగ్యం మరింత కుంగ తీస్తుండటంతో దిక్కు తోచని స్థితిలో సాయం కోసం అర్థిస్తోంది. ఈ నేపథ్యంలో ఆమె గురించి విని చలించిపోయిన బాలీవుడ్ నటి మాధురీ దీక్షిత్ తనకు సాయం చేసేందుకు ముందుకు వచ్చింది. కష్టాల సుడిగుండంలో చిక్కుకున్న షగుఫ్త తాజాగా డ్యాన్స్ దీవానీ 3 షోకు వెళ్లగా అక్కడ తన బాధలను చెప్పుకుంటూ కన్నీటి పర్యంతమైంది. "ఇండస్ట్రీలో అడుగుపెట్టిన 36 ఏళ్లలో 32 ఏళ్లు అద్భుతంగా నడిచాయి. ఎంతో కష్టపడ్డాను, ఎంతగానో పని చేశాను, నాకు, నా కుటుంబానికి మద్దతుగా నిలిచాను. కానీ నాలుగేళ్ల క్రితం ఎన్నో ఆడిషన్స్కు వెళ్లాను, కానీ ఏదీ వర్కౌట్ కాలేదు. పైగా ఆ సమయంలో మధుమేహం వల్ల నా కాలు నొప్పి తీవ్రం కాసాగింది. అది నెమ్మదిగా నా కంటిచూపును దెబ్బ తీయడం మొదలు పెట్టింది. నాలుగేళ్లుగా ఈ బాధను భరించలేకపోతున్నాను. చిత్రపరిశ్రమ నాకు సొంతిల్లులాంటిది. 36 ఏళ్ల జీవితాన్ని దీనికి అంకితమిచ్చాను" అంటూ ఏడ్చేసింది. View this post on Instagram A post shared by ColorsTV (@colorstv) షగుఫ్త మాటలతో అక్కడున్న వారి కళ్లు కూడా చెమ్మగిల్లాయి. రియాలిటీ షో జడ్జి, నటి మాధురీ దీక్షిత్ వెంటనే షగుఫ్తను దగ్గరకు తీసుకుని ఓదార్చింది. అమ్మడానికి కూడా ఏమీ మిగల్లేని దీన స్థితికి చేరుకున్నందుకు విచారం వ్యక్తం చేసింది. డ్యాన్స్ దీవానే టీమ్ తరపు నుంచి రూ.5 లక్షల చెక్ను అందజేసింది. దీంతో చెక్ను అందుకున్న నటి భావోద్వేగానికి లోనైంది. గతంలో నీనా గుప్తా, సుమీత్ రాఘవన్, సుశాంత్ సింగ్ తనకు సాయం చేశారని గుర్తు చేసుకుంది. అలాగే తాజాగా రోహిత్ శెట్టి కూడా ఆమెకు ఆర్థిక సాయం చేశాడని ఫిల్మ్ మేకర్ అశోక్ పండిట్ మీడియాకు వివరించాడు. -
సులభమైన యోగాసనాలు మీకోసం: మాధురీ దీక్షిత్
శారీరక, మానసిక ఆరోగ్యాన్ని యోగా ఎంతో మేలు చేస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా యోగా ఎంతో ఆదరణను పొందుతోంది. ఇప్పుడు ప్రపంచ ప్రజలంతా యోగా వైపే చూస్తున్నారు. చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరూ యోగాతో ఆరోగ్యాన్నిపెంపొందించుకుంటున్నారు. ఆరోగ్యాన్ని మాత్రమే కాకుండా యోగాతో అందాన్ని కూడా పెంచుకోవచ్చు. అందుకే మన సినీ తారలంతా యోగా ఆసనాలు వేసి వారి అందాన్ని మరింత పెంచుకుంటున్నారు. ఈ క్రమంలో జూన్ 21 అంతర్జాతీయ యోగా డే సందర్భంగా బాలీవుడ్ నటి మాధురీ దీక్షిత్ తప యోగా వీడియోను షేర్ చేశారు. ‘యోగా నా రోజు వ్యాయమంలో ఒక భాగం అయ్యింది. త్వరలో అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా కొన్ని సులభమైన యోగా ఆసనాలు మీకోసం. రండి నాతో పాటు మీరు కూడా ఈ ఆసనాలు చేయండి’ అంటూ మాధురి దీక్షిత్ తన ఇన్స్టాగ్రామ్లో ఆసనాలు వేసి చూపించారు. View this post on Instagram A post shared by Madhuri Dixit (@madhuridixitnene) View this post on Instagram A post shared by Madhuri Dixit (@madhuridixitnene) -
తళుకు బెళుకు తారలు, అందాల సొగసులు..
♦ అదితి భాటియా సెల్ఫీ మోడ్ ♦ నేనిలాగే ఉంటా, కానీ ఇది యాటిట్యూడ్ మాత్రం కాదంటోన్న కౌశల్ మండా ♦ ఆకాశమే హద్దుగా సాగిపో అని చెప్తోన్న ముమైత్ ఖాన్ ♦ మంచు లక్ష్మీకి కూతురి సర్ప్రైజ్ ♦ అప్పట్లో ఎంతో సేఫ్గా ప్రయాణించేవాళ్లమంటోన్న నోయల్ సేన్ ♦ గుడ్ హెయిర్డే అంటోన్న మాధురీ దీక్షిత్ ♦ ఎందుకో తెలీదు గానీ నిన్నుచూసిన మరుక్షణం నా పెదాల మీద చిరునవ్వు ప్రత్యక్షమవుతుందంటోన్న అషూ రెడ్డి ♦ బ్లాక్ అండ్ వైట్ ఫొటోలో ఆర్ ఎక్స్ 100 భామ ♦ నన్ను నమ్మండి, నేను నిజంగానే పని చేస్తున్నాను అంటోన్న సన్నీలియోన్ View this post on Instagram A post shared by Shivathmika Rajashekar (@shivathmikar) View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by mon (@imouniroy) View this post on Instagram A post shared by mon (@imouniroy) View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by Niveditha Gowda 👑 (@niveditha__gowda) View this post on Instagram A post shared by MEHREEN 🌟🧿 (@mehreenpirzadaa) View this post on Instagram A post shared by Hebah Patel (@ihebahp) View this post on Instagram A post shared by Anveshi Jain (@anveshi25) View this post on Instagram A post shared by Shruti Haasan (@shrutzhaasan) View this post on Instagram A post shared by Shruti Haasan (@shrutzhaasan) View this post on Instagram A post shared by Shruti Haasan (@shrutzhaasan) View this post on Instagram A post shared by Mehaboob Shaik (@mehaboobdilse) View this post on Instagram A post shared by Vithika Sheru (@vithikasheru) View this post on Instagram A post shared by Vithika Sheru (@vithikasheru) View this post on Instagram A post shared by Ruhani Sharma (@ruhanisharma94) View this post on Instagram A post shared by Ruhani Sharma (@ruhanisharma94) View this post on Instagram A post shared by Aditi Bhatia 🎭 (@aditi_bhatia4) View this post on Instagram A post shared by Aditi Bhatia 🎭 (@aditi_bhatia4) View this post on Instagram A post shared by Adah Sharma (@adah_ki_adah) View this post on Instagram A post shared by Lakshmi Manchu (@lakshmimanchu) View this post on Instagram A post shared by k a u s h a l M a n d a (@kaushalmanda) View this post on Instagram A post shared by Mumait Khan (@mumait) View this post on Instagram A post shared by Tejaswi Madivada (@tejaswimadivada) View this post on Instagram A post shared by Lavanya T (@itsmelavanya) View this post on Instagram A post shared by Noel (@mr.noelsean) View this post on Instagram A post shared by Madhuri Dixit (@madhuridixitnene) View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) View this post on Instagram A post shared by Ashu Reddy❤️ (@ashu_uuu) View this post on Instagram A post shared by Payal Rajput (@rajputpaayal) View this post on Instagram A post shared by Alekhya Harika (@alekhyaharika_) View this post on Instagram A post shared by Alekhya Harika (@alekhyaharika_) View this post on Instagram A post shared by Akanksha Puri🧚♀️ (@akanksha8000) View this post on Instagram A post shared by Akanksha Puri🧚♀️ (@akanksha8000) View this post on Instagram A post shared by Archana Gupta🧿 (@archannaguptaa) View this post on Instagram A post shared by Archana Gupta🧿 (@archannaguptaa) View this post on Instagram A post shared by Daksha Nagarkar (@dakshanagarkar) View this post on Instagram A post shared by 𝐒𝐘𝐄𝐃 𝐒𝐎𝐇𝐄𝐋 𝐑𝐘𝐀𝐍 (@syedsohelryan_official) View this post on Instagram A post shared by Apsara👼 (@apsararaniofficial_) View this post on Instagram A post shared by Sunny Leone (@sunnyleone) View this post on Instagram A post shared by Sunny Leone (@sunnyleone) -
పాట పాడిన లావణ్య.. స్టెప్పులేసిన మాధురీ దీక్షిత్
మేము ఎంటర్టైనర్స్ అంతేకాని ప్యాక్ట్ చెకర్స్ కాదంటూ ఓ ఫన్నీ వీడియోని షేర్ చేసింది సమంత ఉగాది శుభాకాంక్షలు అంటూ లంగా ఓణిలో దర్శనం ఇచ్చింది బిగ్బాస్ బ్యూటీ అరియానా నల్లకోటు ధరించి ఫొటోకు పోజులచ్చింది హీరోయిన్ మాళవికశర్మ లావణ్య త్రిపాఠి గాయణి అవతారమెత్తింది. ఓ ఇంగ్లిష్ పాట పాడుతూ ఆమె ఓ వీడియోని షేర్ చేసుకుంది. View this post on Instagram A post shared by Varalaxmi Sarathkumar (@varusarathkumar) View this post on Instagram A post shared by Kalyani Priyadarshan (@kalyanipriyadarshan) View this post on Instagram A post shared by Ileana D'Cruz (@ileana_official) View this post on Instagram A post shared by Samantha Akkineni (@samantharuthprabhuoffl) View this post on Instagram A post shared by Madhuri Dixit (@madhuridixitnene) View this post on Instagram A post shared by Anu Emmanuel (@anuemmanuel) View this post on Instagram A post shared by Ariyana Glory (@ariyanaglory) View this post on Instagram A post shared by Keerthy Suresh (@keerthysureshofficial) View this post on Instagram A post shared by Sushanth A (@iamsushanth) View this post on Instagram A post shared by Alekhya Harika (@alekhyaharika_) View this post on Instagram A post shared by Vishnupriya (@vishnupriyabhimeneni) View this post on Instagram A post shared by Krithi Shetty (@krithi.shetty_official) View this post on Instagram A post shared by Adah Sharma (@adah_ki_adah) View this post on Instagram A post shared by Lavanya T (@itsmelavanya) View this post on Instagram A post shared by Malvika Sharma (@malvikasharmaofficial) View this post on Instagram A post shared by Naga Babu Konidela (@nagababuofficial) View this post on Instagram A post shared by Allu Sneha Reddy (@allusnehareddy) -
మాల్దీవుల్లో వాలిపోయిన బాలీవుడ్ డాన్సింగ్ క్వీన్!
సమ్మర్ వెకేషన్ మొదలైందో లేదో బాలీవుడ్ సెలబ్రిటీలు ‘ఛలో మాల్దీవులు’ అంటున్నారు. తాజాగా డ్యాన్సింగ్ క్వీన్ మాధురీ దీక్షిత్ తన భర్త డా.శ్రీరామ్ నానే, ఇద్దరు పిల్లలు ఆరిన్, రెయాన్లతో కలిసి మాల్దీవులకు వెళ్లారు. తమ వినోద, విహారానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు. ఇవి నెటిజనులను తెగ ఆకట్టుకుంటున్నాయి. వ్యూ ఆఫ్ ది డే...పేరుతో పడవ ప్రయాణం, చల్లటి తీయటి ఐస్క్రీమ్తో ఆనందం, క్యాండిల్ లైట్ డిన్నర్.. మొదలైన ఫొటోలు పోస్ట్ చేయడమే కాకుండా తనదైన శైలిలో వాటికి వ్యాఖ్యలు జోడించారు మాధురీ. కుటుంబ సభ్యులతో మాల్దీవులలో మాధురీ దీక్షిత్ మరి శ్రీరామ్ ఏమైనా తక్కువ తిన్నాడా! ఆమెతో దిగిన సెల్ఫీలకు ప్రేమకవిత్వంలాంటి పంక్తులు జోడించాడు. అంతే కాదు తన కాలేజీ రోజుల నాటి ఫొటోకు, కుమారుడి ఫొటో జోడించి ‘ఎవరు వీరు?’ అనే ప్రశ్న వేశాడు. జవాబు కూడా తానే సరదాగా చెప్పాడు... -
సోషల్ హల్చల్ : హీటెక్కిస్తున్న అనన్య.. చంపేస్తున్న శ్రీముఖి
♦ హాఫ్ సారీలో అదరగొడుతున్న బిగ్బాస్ ఫేం అరియానా గ్లోరీ ♦ చూపులతో చంపేస్తున్న శ్రీముఖి ♦ లేటు వయసులోనూ తన అందాలతో కుర్రకారు మతులు పోగొడుతున్న మాధురీదీక్షిత్ ♦ అందాలు ఆరబోసి కుర్రకారుకు పిచ్చెక్కిస్తుంది బాలీవుడ్ భామ అనన్య పాండే. విజయ్ దేవరకొండ, పూరీ జగన్నాథ్ కాంబోలో తెరకెక్కుతోన్న లైగర్ ద్వారా టాలీవుడ్కి ఎంట్రీ ఇస్తోంది ఈ బ్యూటీ ♦ ప్రామిస్.. ఇవన్నీ నా కోసం కాదు అంటూ రష్మిక ఓ ఫన్నీ ఫోటోని ఇన్స్ట్రాగ్రామ్లో షేర్ చేసింది. ♦ న్యూలుక్తో అదరగొడుతున్న యంగ్ హీరో కార్తికేయ ♦ డాన్స్తో అదరగొడుతున్న దీపికా పదుకొణె View this post on Instagram A post shared by Anchor Ariyana (@ariyanaglory) View this post on Instagram A post shared by Sreemukhi (@sreemukhi) View this post on Instagram A post shared by Madhuri Dixit (@madhuridixitnene) View this post on Instagram A post shared by Ananya 💛💫 (@ananyapanday) View this post on Instagram A post shared by disha patani (paatni) (@dishapatani) View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) Believe in this beautiful machine called your body and it will show you what you are capable of..@kuldepsethi (my super trainer) made this possible pic.twitter.com/hb8qinaN7E — Kartikeya (@ActorKartikeya) February 16, 2021 View this post on Instagram A post shared by Sukumar B (@aryasukku) View this post on Instagram A post shared by Deepika Padukone (@deepikapadukone) -
‘సోషల్’ హల్చల్: విష్ణుప్రియ సెగలు.. ఊరిస్తున్న శ్రీముఖి
♦హీరోయిన్ నిధి అగర్వాల్ ఇన్స్ట్రాగ్రామ్లో సెగలు కక్కిస్తోంది. వాలెంటైన్స్డే సందర్భంగా హాట్ ఫోటోని షేర్ చేసి కుర్రకారుల మతులో పొగొడుతోంది. సవ్యసాచి'తో తెలుగు ఇండస్ట్రీకి కూడా పరిచయమైన నిధి.. పూరీ జగన్నాథ్ డైరెక్షన్లో రామ్ హీరోగా వచ్చిన 'ఇస్మార్ట్ శంకర్' మూవీలో నటించి సూపర్ హిట్ అందుకుంది. ♦ ప్రేమను ప్రతి రోజు సెలెబ్రేట్ చేసుకోమని సలహాలు ఇస్తూ వాలెంటైన్స్ డే సందర్భంగా హబ్బీతో కలిసి ఉన్న ఫోటోని షేర్ చేసింది బాలీవుడ్ బ్యూటీ మాధురీదీక్షిత్ ♦ తన అందాలతో కుర్రకారులకు పిచ్చెక్కిస్తోంది బుల్లితెర యాంకర్ విష్టుప్రియ. గత కొద్ది రోజులుగా హాట్ ఫోటోలు పెట్టి హల్చల్ చేస్తున్న ఈ హాట్ యాంకర్.. ప్రేమికుల రోజు సందర్భంగా అందాలు ఆరబోస్తూ శుభాకాంక్షలు తెలియజేసింది. ♦ సరైన వ్యక్తి జీవిత భాగస్వామిగా వస్తే ప్రతి రోజు వాలెంటైన్స్డేనే అంటుంది మంజుల ఘట్టమనేని. ప్రేమికుల రోజు సందర్భంగా తన భర్త సంజయ్ స్వరూప్తో కలిసి ఉన్న ఫోటోని షేర్ చేస్తూ విషెష్ తెలియజేసింది. ♦ సింగిల్ కుర్రాళ్లకు వాలెంటైన్స్డే విషెష్ చెబుతూ హాట్ వీడియోని షేర్ చేసింది బ్యూటీ సిమ్రత్కౌర్. ప్రముఖ నిర్మాత ఎంఎస్ రాజు దర్శకత్వంలో తెరకెక్కిన ‘డర్టీహరి’ చిత్రంలో ఈ అమ్మడు ఒక హీరోయిన్గా చేసింది. ♦ అందం అంటే శరీరానికి సౌకర్యంగా ఉండడమే అంటున్న మంచు లక్ష్మీ ♦ మీకో బిగ్ న్యూస్ చెబుతానని నిన్నటి నుంచి ఊరిస్తుంది హాట్ యాంకర్ శ్రీముఖి. ఈ వాలెంటైన్స్ డే తనకు మిక్స్డ్ పీలింగ్ని మిలిల్చిందని చెబుతోంది. మరికొద్ది గంటల్లో మీకో న్యూస్ చెబుతానంటూ తన ఫోటోలను షేర్ చేసింది. View this post on Instagram A post shared by Nidhhi Agerwal 🌟 (@nidhhiagerwal) View this post on Instagram A post shared by Vishnupriya (@vishnupriyabhimeneni) View this post on Instagram A post shared by Simrat Kaur Randhawa (@simratkaur_16) View this post on Instagram A post shared by Manjula Ghattamaneni (@manjulaghattamaneni) View this post on Instagram A post shared by Madhuri Dixit (@madhuridixitnene) View this post on Instagram A post shared by Lakshmi Manchu (@lakshmimanchu) View this post on Instagram A post shared by Sreemukhi (@sreemukhi) View this post on Instagram A post shared by Anchor Ariyana (@ariyanaglory) -
నటుడితో మాధురీ దీక్షిత్ ప్రేమాయణం!
మెరా దిల్ భీ కిత్నా పాగల్ హై యే ప్యార్ తో తుమ్సే కర్తా హై.. పర్ సామ్నే జబ్ తుమ్ ఆతే హో కుచ్ భీ కహ్నే సే డర్తా హై.. ఓ మేరే సాజన్.. ఓ మేరే సాజన్... 1990ల్లో యువ హృదయాల మధురాలాపనగా మిగిలిపోయిన పాట అది. ‘సాజన్’ సినిమాలోనిది. ఆ చిత్రాన్ని కూడా ఓ ప్రేమ కావ్యంలా ఆరాధించింది నాటి యువత. ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీతో సంజయ్ దత్, మాధురీ దీక్షిత్ల నిజమైన ప్రేమా కథలుకథలుగా మీడియాలో అచ్చేసుకుంది. ‘నిజమే’ అని ఆ ఇద్దరూ స్పష్టం చేయకపోయినా అకస్మాత్తుగా వేరైన వాళ్ల దారులు ఆ కథనాలు వాస్తవమనుకునేలా చేశాయి. ఆ సినిమాతోనే మొదలు.. మాధురి, సంజయ్ దత్ సాజన్ కంటే ముందు నాలుగు సినిమాల్లో కలసి నటించారు. ఆ సాన్నిహిత్యంతో మంచి స్నేహితులుగా మారారు. సినిమాల్లో హిట్ పెయిర్గా పేరూ తెచ్చుకున్నారు. సాజన్ సినిమా షూటింగ్ సమయంలోనే ప్రేమలో పడ్డారు. ఆ టైమ్లో మాధురి.. పత్రికలకు ఇచ్చిన చాలా ఇంటర్వ్యూల్లో ఎలాంటి భేషజాలకు పోకుండా సంజయ్ దత్ గురించి ‘సినిమాల్లో నా ఫేవరేట్ పార్ట్నర్. నన్ను భలే ఎంటర్టైన్ చేస్తాడు. ఎప్పుడూ నవ్విస్తూనే ఉంటాడు. రియల్ జోకర్ అండ్ జెంటిల్మన్’ అని ఒకసారి, ‘ఎమోషన్స్తో గేమ్స్ ఆడే జిత్తులమారి కాదు సంజు. స్వచ్ఛమైన మనసు అతనిది. ప్రేమగల మనిషి. ఫెంటాస్టిక్ పర్సన్. మంచి సెన్సాఫ్ హ్యూమర్ అతని సొంతం. ఈ ప్రపంచంలో నన్ను నవ్వించే మనిషి అతనొక్కడే’ అంటూ ఇంకోసారి తన మనసులో మాటలను పంచుకుంది. సాజన్ సినిమా షూటింగ్ కబుర్ల కంటే మాధురి ఇంటర్వ్యూలే పాఠకులను ఆకట్టుకున్నాయి. ఆ ఇద్దరి మధ్యలో ఏదో ఉందన్న ఊహలనూ రేపాయి. పత్రికలూ ఆ డాట్స్ను కనెక్ట్ చేసుకుంటూ మాధురి, సంజయ్ల ఇష్క్కి స్క్రిప్ట్ రాయడం మొదలుపెట్టాయి. ఈలోపు ‘సాజన్’ విడుదలై సూపర్ హిట్ అయింది. వాళ్ల ప్రేమ కథా పత్రికలకు కవర్ స్టోరీ అయింది. మాధురి, సంజయ్లకు ఒకరంటే ఒకరికి ఉన్న పట్టింపు, శ్రద్ధ, పెరిగిన చనువును చూసి పరిశ్రమలో వాళ్లూ అనుకున్నారు ‘వాళ్లిద్దరూ కలసి ఏడు అడుగులు వేస్తారు’ అని. ఏమైంది మరి? సంజయ్ దత్కి అదివరకే పెళ్లయింది. ఒక కూతురు కూడా. కాని స్పర్థలతో విడివిడిగా ఉండడం మొదలుపెట్టారు ఆ ఆలుమగలు విడాకులు తీసుకోకుండా. ఈలోపే భార్య రీచా శర్మ క్యాన్సర్ బారిన పడింది. చికిత్స కోసం న్యూయార్క్ వెళ్లింది. సంజయ్, మాధురిల ముచ్చట అక్కడున్న రిచాకు చేరింది. చింత పడింది. ‘నాకు విడాకులివ్వాలనుకుంటున్నావా?’ అని అడిగింది భర్తను. ‘ఛ.. అలాంటి ఆలోచనేం లేదు’ అన్నాడు సంజయ్. కాస్త కుదుటపడినా.. అక్కడ ఉండలేకపోయింది. కూతురిని తీసుకొని ఇండియాకు వచ్చేసింది. కానీ వచ్చాక భర్త ప్రవర్తనలో మార్పు కనిపించింది రిచాకు. తన పట్ల అతనిలో మునుపటి ఆదరణ లేదు. పైగా నిర్లక్ష్యంగా ఉన్నాడు. తట్టుకోలేకపోయింది. అందుకే వచ్చినంత వేగంగా.. కేవలం పదిహేను రోజుల్లోనే తిరిగి న్యూయార్క్ వెళ్లిపోయింది రిచా కూతురిని తీసుకొని చెదిరిన మనసుతో. ‘విడాకులు తీసుకోలేదు. తీసుకోవాలని ఆయనకు, నాకూ లేకుండింది. మళ్లీ కలసి ఉంటామనే అనుకున్నాం. కానీ ఇక్కడ పరిస్థితి వేరుగా కనిపించింది. కలిసున్నా లేకపోయినా.. ఆయన నన్నెలా ట్రీట్ చేసినా ఐ లవ్ హిమ్. ఆయన నా ప్రాణం’ అని చెప్పింది రిచా. తర్వాత కొన్నాళ్లకు క్యాన్సర్తో కన్ను మూసింది ఆమె. ‘మాధురి, సంజయ్ మంచి ఫ్రెండ్స్ అనుకున్నాం. వాళ్లిద్దరిమధ్య ఇంకేదో ఉందని మేమేనాడూ అనుమానించలేదు. సంజయ్ స్పేస్ను రెస్పెక్ట్ చేశాం. అయినా మా అక్కతో అంత నిర్దయగా ప్రవర్తించిన మనిషిని ఎలా కావాలనుకుంటుందో మరి మాధురి?’ అని కామెంట్ చేసింది రిచా శర్మ చెల్లెలు ఇనా శర్మ. టాడా.. భార్యకు దూరమైన సంజయ్.. ప్రేమను దక్కించుకొని మాధురీకి దగ్గరయ్యాడా అంటే అదీ జరగలేదు. 1993లో చట్టవిరుద్ధంగా మారణాయుధం కలిగి ఉన్నందుకు టాడా కింద సంజయ్ మీద కేస్ నమోదైంది. జైలుకీ వెళ్లాడు. ఈ పరిణామానికి మాధురి షాక్ అయ్యింది. వెంటనే సంజయ్తో గడిపిన కాలానికి చెక్ పెట్టింది. ఆ జ్ఞాపకాలు మెదలకుండా మెదడును కట్టడి చేసుకుంది. జైల్లో ఉన్న సంజయ్ను కనీసం పలకరించడానిక్కూడా వెళ్లకుండా ఉండేంత. ఒక్క మాటలో చెప్పాలంటే అతడు ఆమెకు అపరిచితుడయ్యాడు. మాధురి ఈ నిర్ణయం సంజయ్ను బాధించింది. లోలోపలే కుమిలిపోయాడు. జైలు నుంచి అతను బయటకు వచ్చాక ఒక సినీ పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చాడు. అందులో ‘మాధురి ప్రవర్తనకు మీరెలా ఫీలయ్యారు? అనే ప్రశ్నకు సమాధానంగా ‘ఏమీ ఫీలవలేదు. నాతో నటించే ప్రతి నటితో మంచి ర్యాపోతో ఉండాల్సి వస్తుంది. మాధురీతో అలాగే ఉన్నాను. అందుకే ఆమె మాటలు కానీ, చేతలు కానీ నా మీద ఎలాంటి ప్రభావం చూపలేదు.. చూపవు కూడా’ అని చెప్పాడు సంజయ్. మరో పత్రికా విలేకరి ఇంకో సందర్భంలో మాధురితో ప్రేమ, పెళ్లి మీద వచ్చిన ప్రచారాన్ని గురించి అడిగితే.. ‘నాకూ అనిపిస్తుంది మాధురితో నా లైఫ్లో లవ్ సీన్ ఉంటే బాగుండు అని.. కానీ లేదు కదా. ఇక పెళ్లి అంటారా.. అసలు మా మధ్య ఏమీలేనప్పుడు ఆ ప్రస్తావన ఎందుకు వస్తుంది?’ అని కొట్టిపారేశాడు సంజయ్. మాధురిని దృష్టిలో పెట్టుకొని.. ఆమె ఇబ్బంది పడకుండా ఉండడానికే సంజయ్ అలా చెప్పాడు అంటారు అతని సన్నిహితులు. చాలా ముందుకెళ్లింది సంజయ్ దత్ బయోపిక్ ‘సంజు’ సినిమా విడుదలప్పుడు మళ్లీ వాళ్ల లవ్ స్టోరీ గుర్తొచ్చింది మీడియాకు. మైక్ తీసుకెళ్లి మాధురి ముందు పెట్టారు.. ‘ఇప్పుడు ఆ విషయం అనవసరం. ఇన్నేళ్లలో జీవితం చాలా ముందుకెళ్లింది’ అని జవాబు చెప్పింది మాధురి. 2019లో ‘కళంక్’ అనే సినిమా వచ్చింది. సంజయ్ దత్, మాధురీ కలసి నటించిన సినిమా! పర్సనల్ లైఫ్, ప్రొఫెనల్ లైఫ్ రెండు వేర్వేరు అన్నదానికి సూచనగా. - ఎస్సార్ -
నెట్టింట్లో సినీతారలు: స్టైల్గా ల్యాండైన లైగర్
♦ ధైర్యంగా ఉంటే అద్భుతమైన శక్తులు వస్తాయని అంటున్నారు మంచు లక్ష్మీ. వీకెండ్ మూడ్ అంటూ ఓ ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేశారు ♦ వీకెండ్ మూడ్ అంటూ నవ్వుతూ కళ్ల జోడు పెట్టుకొని నవ్వుతూ ఉన్న ఫోటోని అభిమానులతో పంచుకుంది బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనె ♦ నీతో ఉంటే జీవితం చాలా సంతోషంగా, ఆనందంగా ఉంటుందంటూ హబ్బీకి బర్త్డే విషెష్ చెప్పింది మాధురీదీక్షిత్. ♦ వీకెండ్ని ఎంజాయ్ చేయండంటూ బ్యూటిఫుల్ పిక్ షేర్ చేసిన బిగ్బాస్ ఫేం సావిత్రి ♦ నవ్వుతూ ఉండండి.. సంతోషంగా ఉండంటూ పప్పీ హ్యాపీ మూడ్ పిక్ని ఇన్స్ట్రాగ్రామ్లో పోస్ట్ చేసిన గాయని మధుప్రియ ♦ లైగర్ ముంబైలో ల్యాండ్ అయిందంటూ విజయ్దేవరకొండ ఫోటోలను చార్మి ఇన్స్ట్రాగ్రామ్లో పోస్ట్ చేసింది. ♦ అల్లు శిరీష్ జిమ్ చేస్తున్న వీడియోని అభిమానులతో పంచుకున్నాడు. ♦ View this post on Instagram A post shared by Lakshmi Manchu (@lakshmimanchu) View this post on Instagram A post shared by Samantha Akkineni (@samantharuthprabhuoffl) View this post on Instagram A post shared by Madhupriya (@madhupriya_peddinti) View this post on Instagram A post shared by Madhuri Dixit (@madhuridixitnene) View this post on Instagram A post shared by Deepika Padukone (@deepikapadukone) View this post on Instagram A post shared by Himaja💫 (@itshimaja) I'm back... To discipline, clean diet and strength training. pic.twitter.com/9FS6sSZnHU — Allu Sirish (@AlluSirish) February 13, 2021 View this post on Instagram A post shared by Charmmekaur (@charmmekaur) View this post on Instagram A post shared by Vishnupriya (@vishnupriyabhimeneni) -
మాధురీ దీక్షిత్ను ఫిదా చేసిన యువతి
మట్టిలో మాణిక్యాలు ఎంతోమంది ఉన్నారు. తమలో ప్రతిభ ఉన్నప్పటికీ దానిని గుర్తించి సరైన ప్రోత్సాహం అందించేవారు లేకపోవడంతో వెలుగులోకి రావడం లేదు. అలాంటి వారికి సోషల్ మీడియాలో వేదికగా మారుతోంది. దేశం నలుమూలలా జరిగే చిన్న చిన్న సంఘటనలను సైతం ప్రపంచానికి పరిచయం చేస్తోంది. అలాంటి ఓ దృశ్యం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఓ పల్లెటూరి యువతి డ్యాన్స్ చేస్తున్న వీడియోను నటి మాధురీ దీక్షిత్ ట్విటర్లో షేర్ చేశారు. రాగిరీ అనే ఓ ట్విటర్ యూజర్ ఈ వీడియోను మొదట షేర్ చేస్తూ అలనాటి తారలు మాధురీ దీక్షిత్, హేమ మాలినిని ట్యాగ్ చేశారు. యువతి నృత్యంపై వారి అభిప్రాయాలు తెలపాలని కోరారు. రెండున్నర నిమిషాల నిడివి గల ఈ వీడియోలో ఓ విలేజ్ గర్ల్ పొలాల మధ్య అద్భుతంగా స్టెప్పులు వేస్తూ కనిపిస్తోంది. 1957లో వచ్చిన హిట్ చిత్రం ‘మదర్ ఇండియా’లోని రాజేంద్ర కుమార్, కుమ్కుమ్ నటించిన గోగత్ నహీన్..అనే పాటకు ఆ యువతి ఎక్కడా తడబడకుండా సూపర్ ఎక్స్ప్రెషన్స్తో అలరించింది. ఈ డ్యాన్స్ వీడియోపై స్పందించిన ఈ బాలీవుడ్ భామ.. యువతిపై ప్రశంసలు కురిపించారు. ఆ పోస్టుకు ‘వావ్! అమ్మాయి అద్భుతంగా డ్యాన్స్ చేస్తోంది. ప్రపంచానికి పరిచయం చేయాల్సిన టాలెంట్ ఎంతో ఉంది’. అంటూ కొనియాడారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా. ఆ యువతి వివరాలు తెలియరాలేదు కానీ, వీడియోను షేర్ చేసిన ‘రాగిరీ’ సంస్థవారు సంప్రదాయ సంగీతాన్ని, నృత్యాన్ని ప్రమోట్ చేస్తూ ఉంటారు. మరి అంతలా ఆకట్టుకుంటున్న ఆ యువతి డ్యాన్స్ను మీరు కూడా చూసేయండి. చదవండి: ఆమె విషయంలో చిరంజీవి చెప్పిందే నిజమవుతోంది! మూడోసారి తల్లి కాబోతున్న నటి लाजवाब, वाह! She is dancing so beautifully. There is so much talent waiting to be discovered. https://t.co/HZYFwVbj88 — Madhuri Dixit Nene (@MadhuriDixit) February 8, 2021 -
మా ఆయన బాగా వండుతాడు: మాధురీ
బాలీవుడ్ నటి, డ్యాన్సింగ్ క్వీన్ మాధురీ దీక్షిత్ కిచెన్లో దూరారు. ఆమె వెంట భర్త శ్రీరామ్ నేనే కూడా ఉన్నారు. ఆయన భార్య చేసే వంటకాన్ని దగ్గరుండి చూస్తూ మరాఠీ పదాలను నేర్చుకుంటున్నారు. ఈ సందర్భంగా తనకు గరిటె తిప్పడం ఎంత బాగా వచ్చనే విషయాన్ని ఆమె బయటపెట్టారు. "చిన్నప్పటి నుంచే నాకు కాస్తో కూస్తో వండటం నేర్చుకున్నా. ఆమ్లెట్ వేయడం, పులిహోర చేయడం లాంటివి వచ్చు. కానీ వర్క్ బిజీలో పడి వంట చేసే అవకాశం రాలేదు. అయితే పెళ్లయ్యాక మాత్రం ఈ వంటల గురించి బాగా నేర్చుకున్నాను. ఇక నా భర్త రామ్కు అమెరికాలో ఫ్రెంచ్ వంటగాడు ఉన్నాడు. అలా అతడు అక్కడి డిషెస్ నేర్చుకున్నాడు. (చదవండి: అనుకోని అతిథి.. షాక్ అయిన సూపర్ స్టార్) ఇక నా విషయానికొస్తే.. భారతీయ వంటకాలను నేను అమ్మ దగ్గర నుంచే నేర్చుకున్నాను. ఇప్పుడు నేను చేసేవన్నీ కూడా అమ్మ వంటకాలే! నావల్ల రామ్ కూడా ఇక్కడి రెసిపీలను ఎంతో కొంత నేర్చుకుంటున్నాడు. కానీ ఒక్కటి మాత్రం చెప్పగలను, రామ్ నాకంటే బాగా వండుతాడు, అలా అని నేనేమీ చెత్తగా వండనులెండి" అని మాధురీ నవ్వుతూ చెప్పుకొచ్చారు. తాజాగా ఆమె ‘యాక్ట్రెస్’ (నటి)అనే వెబ్ సిరీస్లో నటిస్తున్నారు. ఇందులో టైటిల్ రోల్లో కనిపిస్తారు. ఒకప్పుడు బాగా వెలిగి అకస్మాత్తుగా మాయమైపోయే సినిమా స్టార్స్ జీవితం ఎలా ఉంటుంది? అనే కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కుతోంది. విశేషమేంటంటే.. 23 ఏళ్ల గ్యాప్ తర్వాత సంజయ్ కపూర్, మాధురీ దీక్షిత్ ఈ సిరీస్లో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. (చదవండి: కథ రొమాంటిక్గా ఉందని ఒప్పుకున్నా: మాధురీ) -
23 ఏళ్ల తర్వాత మళ్లీ అతనితో
మాధురీ దీక్షిత్ నటి. ఇది అందరికీ తెలిసిన విషయమే. మరి.. ‘నటి’ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనేంటీ అంటే... ఆమె నటించనున్న తాజా వెబ్ సిరీస్ టైటిల్ ‘యాక్ట్రెస్’ (నటి). ఈ సిరీస్లో మాధురి టైటిల్ రోల్లో కనిపిస్తారు. ఒకప్పుడు బాగా వెలిగి అకస్మాత్తుగా మాయమైపోయే సినిమా స్టార్స్ జీవితం ఎలా ఉంటుంది? అనే కథాంశంతో తెరకెక్కుతోంది. విశేషం ఏంటంటే.. 23 ఏళ్ల గ్యాప్ తర్వాత సంజయ్ కపూర్, మాధురీ దీక్షిత్ ఈ సిరీస్లో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. ఈ ఇద్దరి కాంబినేషన్ అనగానే గుర్తొచ్చే సినిమా ‘రాజా’. 1995లో విడుదలైన ఈ సినిమా పెద్ద సక్సెస్. ఆ తర్వాత ‘మొహబ్బత్’ (1997) సినిమాలో మళ్లీ కలసి నటించారు. ఇన్నేళ్లకు మళ్లీ కలసి నటిస్తున్నారు. కరణ్ జోహార్ నిర్మిస్తున్న ఈ సిరీస్ చిత్రీకరణ జరుగుతోంది. -
అందమైన ప్రయాణం
‘‘మా జీవితంలో మరో అద్భుతమైన ఏడాది ప్రారంభమైన రోజు ఇది (అక్టోబర్ 17). నా కలల రాకుమారుడితో ప్రతిరోజూ నా జీవితం కొత్తగా, సాహసోపేతంగా ఉంటోంది. మా ఇద్దరి మనస్తత్వాలు వేరు. అయినప్పటికీ నా జీవితంలో నువ్వు (భర్త శ్రీరామ్ నేనేని ఉద్దేశించి) ఉండటాన్ని గొప్పగా అనుకుంటాను. నాకూ నీకూ హ్యాపీ యానివర్సరీ.. రామ్’’ అని పెళ్లిరోజు సందర్భంగా మాధురీ దీక్షిత్ తన ఫీలింగ్స్ని పంచుకున్నారు. ‘‘21 ఏళ్ల క్రితం నా సోల్మెట్ను కనుగొన్నాను. అప్పటినుండి మా ప్రయాణాన్ని ప్రారంభించాం. ప్రతిరోజూ మాకు కొత్తగా, అందంగా ఉంటుంది. ఇలాగే మా ప్రయాణాన్ని మేమిద్దరం కలిసి ఎంతో ఎడ్వంచరస్గా కొనసాగిస్తాం. హ్యాపీ ట్వంటీఫస్ట్ యానివర్సరీ’’ అన్నారు శ్రీరామ్ నేనే. కెరీర్ మంచి ఫామ్లో ఉన్నప్పుడే అమెరికాలో డాక్టర్గా చేస్తున్న శ్రీరామ్ నేనేను 21 ఏళ్ల క్రితం అక్టోబర్ 17న వివాహం చేసుకున్నారు మాధురి. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. -
కథ రొమాంటిక్గా ఉందని ఒప్పుకున్నా: మాధురీ
ముంబై: బాలీవుడ్ నటి మాధురీ దీక్షిత్ తన అద్భుతమైన డాన్స్, నటనతో ‘డ్యాన్సింగ్ క్వీన్’ గా గుర్తింపు పొందిన విషయం తెలిసిందే. మాధురీ ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ ఉంటూ తన వృత్తిగత, వ్యక్తిగత విషయాలను అభిమానులతో పంచుకుంటారు. 1991లో తాను నటించిన ‘సాజన్’ చిత్రానికి సంబంధించిన ఓ అసక్తికరమైన విషయాన్ని తెలియజేశారు. ఆదివారం ఆ సినిమా విడుదలై 29 ఏళ్లు పూర్తైంది. ఈ సందర్భంగా మాధురీ ఆ సినిమాకి షూటింగ్ సమయంలో దిగిన ఓ త్రోబ్యాక్(పాత)ఫొటోను తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశారు. అదే విధంగా ఈ సినిమాలో నటించడానికి గల కారణాలను వెల్లడించారు. ‘‘సాజన్’ సినిమా ప్రాజెక్టును స్క్రిప్ట్ చదివిన తర్వాత వెంటనే అందులో భాగం కావాలని నిర్ణయించుకున్నాను. సినిమా కథ చాలా రొమాంటిక్గా ఉంది. సినిమాలో ఉన్న డైలాగ్లు కవితాత్మకంగా ఉన్నాయి. సంగీతం చాలా అద్భుతంగా ఉంది’ అని ఆమె కాప్షన్ జత చేశారు. (బిగ్బాస్ ఎంట్రీ: కొట్టిపారేసిన నటి) ఈ సినిమాలో సంజయ్ దత్ ఓ అనాథ పాత్రలో నటించారు. హీరో సల్మాన్ ఇందులో గొప్పింటికి చెందిన వ్యక్తి పాత్రలో నటించారు. వీరిద్దరూ చిన్ననాటి స్నేహితులుగా కనిపిస్తారు. సంజయ్ దత్ సాగర్ అనే పేరుతో గొప్ప కవిగా ఎదుగుతారు. కవి సాగర్కి మాధురీ అభిమాని పాత్రలో నటిస్తారు. మాధురీ సాగర్ కవిత్వాన్ని అమితంగా ఇష్టపడతారు. ఈ నేపథ్యంలో సల్మాన్ ఎంట్రీతో ట్రైయాంగిల్ ప్రేమ మొదలవుతుంది. ఈ సినిమాకి లారెన్స్ డిసౌజా దర్శకత్వం వహించారు. సాజన్ 1991లో అత్యధిక వసూళ్లు సాధించిన బాలీవుడ్ చిత్రాల్లో ఒకటి. ఇందులోని పాటలు.. దేఖా హై పెహ్లి బార్, తుమ్ సే మిల్నే కి తమన్నా హై, బహుత్ ప్యార్ కార్తే హై, తు షాయర్ హై, జియే టు జియే కైస్ ప్రేక్షకులను చాలా ఆకట్టుకున్నాయి. ఈ పాటలు నేటికి అభిమానుల గుండెల్లో మారుమోగుతున్నాయి. ఇక కరణ్ జోహార్ నిర్మించబోయే నెట్ఫ్లిక్స్ సిరీస్తో మాధురి దీక్షిత్ త్వరలో డిజిటల్ ప్లాట్ ఫామ్లోకి అడుగుపెట్టనున్నారు. మాధురీ గతంలో నెట్ఫ్లిక్స్తో కలిసి ఓ మరాఠీ డ్రామాను నిర్మించిన విషయం తెలిసిందే. View this post on Instagram #29YearsOfSaajan After reading the script of this film, I instantly decided to be a part of it. The story was romantic, the dialogues were poetic and the music was brilliant! 🎬 A post shared by Madhuri Dixit (@madhuridixitnene) on Aug 29, 2020 at 11:02pm PDT -
‘ఇతరుల ఆనందం మా సొంతం’
బాలీవుడ్ నటి మాధురీ దీక్షిత్ తన అద్భుతమైన డాన్స్, నటనతో ‘డ్యాన్సింగ్ క్వీన్’గా గుర్తింపు పొందిన విషయం తెలిసిందే. మాధురీ ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ ఉంటూ తన వృత్తిగత, వ్యక్తిగత విషయాలను అభిమానులతో పంచుకుంటూ అలరిస్తారు. తాజాగా మాధురీ ఓ అద్భుతమైన త్రోబ్యాక్(పాత) ఫొటోను తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశారు. ‘మన ముఖం మీద కొద్దిగా ఆనందాన్ని తీసుకురావడం ద్వారా ఇతరులకు కంటే భిన్నంగా కనిపిస్తాము. అభిమానులు, ప్రజలు చిరునవ్వులు చిందించడానికి కారణాలను వెతుకుతూ ఉంటారు. ఇతరుల ఆనందాన్ని మా సొంతం చేసుకున్నాము’ అని మాధురీ కామెంట్ జత చేశారు. (నటి మూడో పెళ్లిపై విమర్శలు; పోలీసులకు ఫిర్యాదు) View this post on Instagram लाकर थोड़ी सी खुशी अपने चेहरे पर, हमने खुद को दूसरों से अलग बना लिया, लोग ढूंढते रहे मुस्कुराने का कारण, हमने दूसरों की खुशी को अपना बना लिया। ✨ #QuarantineThoughts A post shared by Madhuri Dixit (@madhuridixitnene) on Jul 14, 2020 at 6:29am PDT మాధురీ 90ల్లో దిగిన స్టన్నింగ్ ఫొటో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీంతో నెటిజన్లు ఫిదా అవుతూ ఆమె అందాన్ని పొగుడుతూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ‘మీరు చాలా అందంగా ఉంటారు’ అని నెటిజన్ కామెంట్ చేశాడు. ‘మీరు ఎప్పటికీ ఎవర్ గ్రీన్’ అని మరో నెటిజన్ కామెంట్ చేశాడు. కరోనా వైరస్ కారణంగా ప్రస్తుతం మాధురీ ముంబైలోని తన నివాసంలో హోం క్వారంటైన్కి పరిమితమయ్యారు. సినిమాల విషయానికి వస్తే.. మాధురీ చివరగా ‘కలంక్’ చిత్రంలో కనిపించారు. ఇటీవల మాధురీ గాయనిగా అవతారమెత్తి ‘క్యాండిల్’ పేరుతో ఓ పాట పాడిన విషయం తెలిసిందే. ఆమె ఈ పాటను కరోనా వైరస్ నివారణకు పోరాడుతున్న ‘కరోనా వారియర్స్’కు అంకితం చేశారు.(రజని, విజయ్లపై మీరామిథున్ ఫైర్) -
నా భర్త కేశాలంకరణపై ప్రయోగాలు చేశా
కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం లాక్డౌన్ విధించి నేటి(మంగళవారం)లో వంద రోజులు పూర్తైంది. లాక్డౌన్వేళ సినీ ప్రముఖులు ఇంటికే పరిమితమైన విషయం తెలిసిందే. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే బాలీవుడ్ నటి మాధురీ దీక్షిత్ లాన్డౌన్లో తన వ్యక్తిగత, వృత్తిగత విషయాలను అభిమానులతో పంచుకున్నారు. తాజాగా మాధురీ తన భర్త శ్రీరాం మాధవ్ నేనేతో దిగిన ఓ ఫొటోను తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశారు. (ప్రేయసిని పెళ్లాడిన నటుడు..) ‘నేటి(జూన్30)కి సెల్ఫ్ క్వారంటైన్కి పరిమితమై వంద రోజులు పూర్తైంది. ఈ వంద రోజుల్లో నా భర్త శ్రీరాం మాధవ్ నేనే కేశాలంకరణపై అనేక ప్రయోగాలు చేశాను. అదే విధంగా లాక్డౌన్ నుంచి ఒక ముఖ్యమైన పాఠం నేర్చుకున్నాను. ఇతరులపై ఆధారపడకుండా నాకు కావల్సిన చిన్న చిన్న ఉత్పత్తులను సొంతంగా తయారు చేయటం ఎలానో తెలుసుకున్నాను’ అని మాధురీ కామెంట్ జతచేశారు. (బిహార్ బాలికపై 'ఆత్మనిర్భర్' చిత్రం) View this post on Instagram Self quarantine - Day 100 🗓️ Had fun experimenting with Ram's hairstyle 💇♂️ One important lesson that this lockdown has taught us is, how to be self-reliant! #100DaysInQuarantine #QuarantineThoughts A post shared by Madhuri Dixit (@madhuridixitnene) on Jun 29, 2020 at 11:03pm PDT దీని కంటే ముందు మాధురీ భర్త శ్రీరాం తన కొత్త హెయిర్ స్టైల్తో ఉన్న ఓ ఫొటోను తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు.‘హాట్సాఫ్ నా కొత్త హెయిర్ స్టైలిస్ట్. కృతజ్ఞతలు హనీ!’అని కామెంట్ జతచేశారు. లాక్డౌన్ రోజుల్లో మాధురీ తన పాత ఫొటోలను, ఇటివల తన తల్లి పుట్టిన రోజుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ అభిమానులతో పంచుకున్న విషయం తెలిసిందే. View this post on Instagram Hats off to my new hair Stylist. Thanks honey!! ❤️ A post shared by Dr Shriram Nene (@drneneofficial) on Jun 26, 2020 at 8:46am PDT -
క్యాండిల్... ఓ ఎనర్జీ
మాధురీ దీక్షిత్లోని నటికి, డ్యాన్సర్కి ఇండియా మొత్తం ఫిదా అయింది. ఇప్పుడు తనలోని మరో ట్యాలెంట్ను ప్రేక్షకులకు పరిచయం చేయడానికి సిద్ధమయ్యారు మాధురి. గాయనిగా తన ప్రతిభను చూపించబోతున్నారు. ‘క్యాండిల్’ పేరుతో ఓ పాట పాడారు మాధురి. ఈ పాటను శనివారం విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ పాట టీజర్ను విడుదల చేశారు. ‘‘ఇన్నేళ్లుగా ప్రేక్షకులు చూపిస్తున్న ప్రేమకు నా నుంచి ఓ చిన్న బహుమానం ఇది. అలాగే ప్రస్తుత పరిస్థితుల్లో అందరికీ ఓ చిన్న ఆశలాగా, పాజిటివ్ ఎనర్జీలాగా ఈ పాట ఉంటుంది. మనందరం ఈ కష్టాన్ని (కరోనా) కలసి దాటేద్దాం’’ అని ట్వీట్ చేశారు మాధురీ దీక్షిత్. -
మాధురీకి.. భర్త ప్రత్యేక బర్త్డే విషేష్
బాలీవుడ్ నటి మాధురీ దీక్షిత్ తన అద్భుతమైన డాన్స్, నటనతో ‘డ్యాన్సింగ్ క్వీన్’ గా గుర్తింపు పొందిన విషయం తెలిసిందే. మాధురీ ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ ఉంటూ తను చేసిన డాన్స్ వీడియోను పోస్టు చేస్తూ అభిమానులను అలరిస్తారు. ఆమె మే15 (శుక్రవారం) 53వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా పలువురు బాలీవుడ్ ప్రముఖులు మాధురీకి బర్త్డే విషెష్ తెలిపారు. ఆమె భర్త శ్రీరాం మాధవ్ నేనే.. మధురీకి బర్త్డే విషెష్ తెలుపుతూ వారిద్దరు కలిసి ఉన్న ఓ ఫొటోను తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ’ మనం చాలా అద్భుతమైన జీవన ప్రయాణాన్ని సాగిస్తున్నాం. చాలా తెలివైన నా అర్ధాంగి, నా అత్మబంధువు. నీకు పుట్టిన రోజు శుభాకాంక్షలు’ అంటూ ఆయన కామెంట్ జత చేశారు. View this post on Instagram Here’s wishing my soul mate and very talented better half a very Happy Bday! It’s been the most amazing ride so far. Here is to many happy returns of the day, sweetheart! A post shared by Dr Shriram Nene (@drneneofficial) on May 15, 2020 at 8:03am PDT ఇక బర్త్డే సందర్భంగా మాధురీ దీక్షిత్ తన ‘క్యాండిల్’ సాంగ్ ప్రివ్యూను ట్వీటర్లో పోస్టు చేశారు. ‘బర్త్ డే విషెష్ తెలిపిన అందరికి కృతజ్ఞతలు. మీ ప్రేమకు ధన్యవాదాలు. క్యాడిల్ పాట ప్రివ్యూ చూడండి. క్యాండిల్ అంటే నమ్మకానికి సంకేతం. ప్రస్తుతం మనందిరికీ అది ఎంతో అవసరం’ అంటూ కామెంట్ జతచేశారు. మాధురీ దీక్షిత్, శ్రీరాం మాధవ్ నేనే 1999లో వివాహం చేసుకొని ఒకటయ్యారు. వీరికి అరిన్, రాయన్ అనే ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు. లాక్డౌన్లో నేపథ్యంలో ప్రస్తుతం మాధురీ దీక్షిత్ ముంబైలోని తన ఇంటికే పరిమితమై కుంబుంబంతో గడుపుతున్నారు. సినిమాల విషయానికి వస్తే.. మాధురీ చివరగా ‘కలంక్’ చిత్రంలో కనిపించారు. View this post on Instagram Thanks for all the good wishes and birthday love! Wanted to give some love back to you. Sharing an exclusive preview of my first ever single. Will share the song soon. It's called Candle and it's about hope, something we need in large supply right now. A post shared by Madhuri Dixit (@madhuridixitnene) on May 15, 2020 at 2:40am PDT -
ఫ్యాన్స్కు మాధురీదీక్షిత్ సవాల్.. కనిపెట్టగలరా?
లాక్డౌన్ కారణంగా ఇళ్లకే పరిమితమైన సెలబ్రటీలు నిత్యం సోషల్ మీడియాలో టచ్లో ఉంటున్నారు. షూటింగ్లతో ఎప్పడూ బిజీబిజీగా గడిపే స్టార్స్ కు బోలెడంత సమయం మిగలింది. దీంతో తమ కొత్త టాలెంట్లను బయటపెడుతూ సరదాగా గడుపుతున్నారు. అంతేకాకుండా ఈ మధ్య త్రోబ్యాక్ చాలెంజ్ కూడా తెగ ట్రెండ్ అవుతోంది. పాత ఙ్ఞాపకాలను నెమరువేసుకుంటూ ఒక్కసారిగా ఫ్లాష్బ్యాక్లోకి వెళుతున్నారు. అప్పటి అనుభవాలు, విశేషాలను ఫ్యాన్స్తో షేర్ చేసుకుంటున్నారు. (1000 మంది ప్రేక్షకుల మధ్య ఆ పాటను చిత్రీకరించాం ) తాజాగా బాలీవుడ్ డ్యాన్సింగ్ క్వీన్ మాధురీ దీక్షిత్ చిన్ననాటి ఫోటోను షేర్ చేశారు. తన సోదరితో కలిసి డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తున్న ఫోటోను అభిమానులతో పంచుకున్నారు. నా సోదరితో ఉన్న అత్యంత మధుర జ్ఞాపకాలలో ఇది కూడా ఒకటి అంటూ క్యాప్షన్ జోడించారు. అంతేనా.. ఇద్దరిలో ఎవరు మాధురీ దీక్షితో కనిపెట్టాలంటూ ఫ్యాన్స్కు ఓ సవాల్ కూడా విసిరారు. నిజానికి ఇద్దరికీ చాలా దగ్గరి పోలికలుండటంతో ఎవరు మాధురీ దీక్షిత్ అన్నది కనిపెట్టడం చాలా కష్టంగానే ఉంది. చిన్నప్పడు తన సోదరితో కలిసి అనేక డ్యాన్స్ కాంపిటీషన్లలో పాలు పంచుకునేవాళ్లమని పేర్కొన్నారు. ఇక 52 ఏళ్ల మాధురీ.. ఇప్పటికీ తన డ్యాన్స్ తో అభిమానులను అలరిస్తున్నారు. View this post on Instagram This is one of my favourite memories that I have with my sister. We used to always take part in school competitions. Here's sharing a #MajorThrowback childhood memory with my favourite dance buddy❤️ Let me know what is your favourite childhood memory! P.s. Can you tell us apart? A post shared by Madhuri Dixit (@madhuridixitnene) on May 7, 2020 at 10:27pm PDT -
అది తెలిసి షాకయ్యాను: మాధురీ దీక్షిత్
బాలీవుడ్ నటి మాధురీ దీక్షిత్ తన హిట్ సాంగ్ ‘ఏక్ ధో తీన్’ గురించిన సరదా విషయాలను, జ్ఞాపకాలను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నారు. అంతేగాక ఈ పాటకు సంబంధించిన సందేహాలను, జ్ఞాపలకాలను తనతో పంచుకోవాలని అభిమానులను కోరారు. అయితే ఈ పాటను దాదాపు 1000 అర్టిస్టులతో కాకుండా నిజమైన ప్రేక్షకులతో చిత్రీకరించినట్లు ఆమె ట్విటర్లో తెలిపారు. ఈ పాటను షూట్ చేయడానికి 10, 15 రోజుల ముందు నుంచే ప్రేక్షకుల మధ్య రిహార్సల్స్ చేశామని వెల్లడించారు. (కరోనాతో హాలీవుడ్ నటి మృతి) Let's start our #SunoSunaoWithMD Listening Party with #EkDoTeen! Right from starting the rehearsals 10-15 days before the shoot to shooting with a real crowd of 1,000 people, the song has been so special. Send me your questions & share your memories of the song with me. — Madhuri Dixit Nene (@MadhuriDixit) April 10, 2020 ‘ఈ పాటలోని హుక్ స్టేప్ బాగా పాపులర్ అయ్యింది. ఇక సినిమా విడుదలయ్యాక ధియోటర్లలో సినిమా కొనసాగుతున్నంతసేపు మళ్లీ మళ్లీ ఈ పాటను రీప్లే చేయాలని అభిమానులు డిమాండ్ చేసిన విషయం తెలిసి షాకయ్యాను. ఇక ఆ సమయంలో అందరూ నన్ను మోహినీ అని పిలవడం ప్రారంభించారు. వావ్.. ఈ సందర్భంగా అప్పటీ ఎన్నో జ్ఞాపకాలను మళ్లీ గుర్తు తెచ్చేల చేసింది’ అంటూ ట్విట్ చేశారు. ఇక ఈ పాట అంతగా ఫేమస్ అవుతుందని మీరు ఊహించారా? అని ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు.. ‘ఈ పాట అంతగా ప్రజాదరణ పొందుతుందని నేను ఊహించలేదు. కానీ కచ్చితంగా మంచి పేరు మాత్రం సంపాదింస్తుందని నమ్మాను’ అని మాధురీ సమాధానం ఇచ్చారు. ఇక మాధురీ ‘ఏక్ ధో తీన్’ పాట ఇప్పటికీ ఎంత ప్రాచుర్యం పొందిందో తెలిసిన విషయమే. కాగా 1988లో విడుదలైన ‘తేజాబ్’ సినిమాలో హీరోగా అనిల్ కపూర్ నటించగా... దర్శకుడు ఎన్ చంద్ర తెరకెక్కించారు. (అదే ఏకైక డిమాండ్ కావాలి - చిదంబరం) -
ఫస్ట్ క్రష్ ఎవరో చెప్పేసిన విక్కీ
బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్, అందాల భామ కత్రినా కైఫ్ మధ్య కుచ్ కుచ్ హోతా హై అంటూ ఎప్పటి నుంచో గుసగుసలు వినిపిస్తున్నాయి. తాజాగా ఈ ఊహాగానాలపై స్పందించిన విక్కీ తన ఫస్ట్ లవ్ కత్రినా కాదని బాంబు పేల్చాడు. వివరాల్లోకి వెళితే.. ఈ హీరో ఇన్స్టాగ్రామ్లో అభిమానులతో ముచ్చటించాడు. ఈ సందర్భంగా వాళ్లు అడిగే అన్ని ప్రశ్నలకు ఎలాంటి విసుగు ప్రదర్శించకుడా తీరికగా సమాధానమిచ్చాడు. దొరికిందే చాన్సు అనుకున్న అభిమానులు హీరో నుంచి వీలైనన్ని సీక్రెట్స్ రాబట్టే ప్రయత్నం చేశారు. అందులో భాగంగా బాలీవుడ్లో మీరు తొలుత ప్రేమించిన వ్యక్తి ఎవరు అని అభిమాని ప్రశ్నించగా విక్కీ.. ఎలాంటి తత్తరపాటు లేకుండా ఫొటోతో సహా సమాధానమిచ్చాడు. అలనాటి అందాల నటి మాధురీ దీక్షిత్ అంటే ఇష్టమంటూ మనసులోని మాటను బయటపెట్టాడు. ఇక మీరు ఈ లాక్డౌన్ సమయాన్ని ఎలా ఉపయోగించుకుంటున్నారన్న ప్రశ్నకు కుటుంబంతో గడుపుతూ, సినిమాలు చూస్తూ, అప్పుడప్పుడు అమ్మతో యోగా, ఫ్రెండ్స్తో వీడియో కాల్ ద్వారా కాలాన్ని నెట్టుకొస్తున్నానన్నాడు. ఈ "ఉరి: ద సర్జికల్ స్ట్రైక్" హీరో కరోనాపై పోరుకు రూ.1 కోటి విరాళం ఇస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా ఆయన తాజాగా స్వాతంత్ర్య సమర యోధుడు "సర్దార్ ఉద్ధమ్ సింగ్ "బయోపిక్లో నటించగా ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది. (నటుడు కావాలని నిర్ణయం తీసుకున్నాక విక్కీ చేసిన మొదటి పని) -
మాధురి దీక్షిత్ పాటకు గ్రీక్ యువతి డ్యాన్స్
-
‘కరోనా ఒత్తిడి తగ్గాలంటే ఇలా చేయండి’
గ్రీక్ దేశానికి చెందిన ఓ యువతి బాలీవుడ్ నటి మాధురీ దీక్షిత్ పాటకు డ్యాన్స్ చేస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఈ యువతి పేరు క్యాథరినా కొరోసిడో. ప్రస్తుతం ఆమె జర్మనీలో నివసిస్తుంది. కాగా కరోనా వైరస్ (కోవిడ్-19) విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రపంచ దేశ ప్రజలు వణికిపోతున్నారు. ఎక్కడా ఈ వైరస్ బారిన పడతామోనని ప్రజలంతా ఆందోళన పడుతున్నారు. (కరోనా కథలు ; మా ఇంటికి రాకండి) ఇక ఈ ఒత్తిడి నుంచి బయటపడటానికి ఈ యువతి తన అభిమాన నటి మాధురీ దీక్షిత్ పాపులర్ సాంగ్ ఏక్, దో, తీన్ పాటకు ఆనందంగా డ్యాన్స్ చేస్తున్న వీడియోను ఆమె సహోద్యోగి బెలుట్చ్ అనే వ్యక్తి తన ట్విటర్లో బుధవారం షేర్ చేశాడు. ‘ప్రపంచ దేశాల ప్రజలు కరోనా వైరస్(కోవిడ్-19) కారణంగా ఆందోళ చెందుతుంటే నా కోలిగ్ చూడండి ఏం చేస్తుందో. కరోనా ఒత్తిడి నుంచి బయటపడటానికి తనకు ఇష్టమైన హిందీ నటి మాధురి దీక్షిత్ పాటలు వింటూ డ్యాన్స్ చేస్తోంది’ అంటూ షేర్ చేశాడు. ఈ వీడియోకు ఇప్పటి వరకూ 73 వేలకు పైగా వ్యూస్ రాగా.. 5వేల లైక్లు వచ్చాయి. (‘ఇలాగైతే అమెరికాలో 22 లక్షల మరణాలు’) అంతేగాక వీడియోకు మాధురీ కూడా స్పందించారు. ‘ఈ వీడియో నాకు బాగా నచ్చింది. కరోనావైరస్ నేపథ్యంలో అందరూ ఇంటికే పరిమితమయ్యారు. ఎప్పుడూ బిజిగా ఉండే మీరు ఈ విరామ సమయాన్ని సద్వినియోగం చేసుకొండి. అంతేగాక కొత్త కొత్త విషయాలు నేర్చుకోండి. కుటుంబ సభ్యులతో సరదగా గడపండి. వ్యాయమ చేయండి. పాటలు పాడుతూ డ్యాన్స్ చేస్తూ ఒత్తిడిని తగ్గించుకోండి’ అంటూ చెప్పుకొచ్చారు. -
‘హ్యాపీ బర్త్డే మమ్మీ.. లవ్ యూ ఎవర్’
ముంబై : బాలీవుడ్ దర్శకురాలు, కొరియోగ్రాఫర్, ప్రొడ్యూసర్ ఫరా ఖాన్ గురువారం తన పుట్టిన రోజును జరుపుకున్నారు. ఈ రోజుతో ఆమె 55వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నారు. దీంతో బాలీవుడ్ ప్రముఖుల నుంచి ఫరాఖాన్కు పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. బాలీవుడ్ స్టార్ మాధురి దీక్షిత్.. ఫరాతో కలిసి ఉన్న ఫోటోను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేస్తూ ‘మనం కలిసినప్పుడల్లా నవ్వుతూనే ఉంటాం. ఎల్లప్పుడూ నాకు తోడుగా ఉన్నందుకు నీకు ధన్యవాదాలు’ అంటూ రాసుకొచ్చారు. యే జవానీ హై దివానీ సినిమాలో వీరిద్దరూ కలిసి పనిచేసిన విషయం తెలిసిందే. ఫరా కొరియాగ్రాఫిలో మాధురీ, రణ్బీర్ కపూర్ కలిసి ఘాగ్రాకు పాటకు స్టెప్పులేశారు. మరోవైపు ఫరాఖాన్ను ప్రేమగా అమ్మ అని పిలుస్తూ.. ‘హ్యాపీ బర్త్డే మమ్మీ.. లవ్ యూ ఎవర్’ అంటూ కత్రినా కైఫ్ విష్ చేశారు. బాలీవుడ్ నడుటు అనిల్ కపూర్ సైతం ఫరాకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ‘ఈ ఏడాది మీరు అనుకున్నవన్నీ సాధించాలని కోరుకుంటున్నా, పుట్టినరోజు శుభాకాంక్షలు’ అని తెలిపారు. వీరితోపాటు రవీనా టండన్, అనన్య పాండే, కార్తిక్ ఆర్యన్ తదితరులు ఫరాకు బర్తడ్ విషేస్ తెలిపారు. ఇక దాదాపు వంద పాటలకు పైగా కొరియోగ్రఫి చేసిన ఫరా.. ఉత్తమ కొరియోగ్రాఫర్గా ఆరు ఫిల్మ్ఫేర్ అవార్డులు అందుకున్నారు. View this post on Instagram Love you faru @farahkhankunder to the moon and back! Happpyyyy Birthdayyy ! The karmic connection continues.. 😜😜andar bahar, bahar andar 😂😂😂😂😂😂😘😘😍 A post shared by Raveena Tandon (@officialraveenatandon) on Jan 9, 2020 at 2:04am PST -
వెబ్లోకి ఎంట్రీ
వెబ్ వరల్డ్లోకి అడుగుపెడుతున్న స్టార్స్ జాబితాలోకి మాధురీ దీక్షిత్ కూడా జాయిన్ అయిపోయారు. ఇటీవలే సమంత, కియారా అద్వానీ, రాధికా ఆప్టే, జాన్వీ కపూర్ వెబ్లో అడుగుపెట్టారు. త్వరలోనే నెట్ఫ్లిక్స్ రూపొందించబోయే ఓ వెబ్ సిరీస్లో మాధురీ లీడ్ రోల్లో నటించనున్నారు. ఈ సిరీస్ను నెట్ఫ్లిక్స్తో కలసి కరణ్ జోహార్ నిర్మిస్తారు. ‘‘నెట్ఫ్లిక్స్కి నేను పెద్ద ఫ్యాన్ని. గతంలో నెట్ఫ్లిక్స్ కోసం ‘ఆగస్ట్ 15’ అనే మరాఠీ చిత్రాన్ని నిర్మించాను. మేం చేయబోయే సిరీస్ వినోదాత్మకంగా, హృదయాన్ని హత్తుకునేలా ఉంటుంది’’ అని పేర్కొన్నారు మాధురీ దీక్షిత్. శ్రీ రావ్ దర్శకత్వం వహించనున్న ఈ వెబ్సిరీస్ చిత్రీకరణ త్వరలోనే ప్రారంభం కానుంది. -
ఆడేందుకు ఎవరూ దొరక్కపోతే కొడుకుతోనే..
చట్టాన్ని చేతుల్లోకి తీసుకోకూడదు. చెవుల్ని చేతుల్లోకి తీసుకోవచ్చు. చెప్పిన మాట వినకుంటే పిల్లల చెవుల్ని మెలేసినట్లే.. భార్యని వేధించవద్దని, వ్యసనాల జోలికి వెళ్లొద్దని,తాగుడు మానేయమనీ ఎంత చెప్పినా వినని మగాళ్ల చెవి పిండి, చెడు వదిలించేందుకు యూపీలో గ్రామాల్లో కొత్తగా ‘గ్రీన్ గ్యాంగ్’ అనే మహిళా దళం ఊపిరి పోసుకుంది. పదమూడేళ్ల క్రితం అదే రాష్ట్రంలో ఆవిర్భవించిన ‘గులాబీ గ్యాంగ్’కు సిస్టర్ గ్యాంగ్..ఈ గ్రీన్ గ్యాంగ్. ఇంటి పని పూరై్తంది. ఆశాదేవి బట్టలు మార్చుకుని బయటికి వచ్చింది. ఆమె ఇప్పుడు ఆకుపచ్చ రంగు చీరలో ఉంది. ఆ చీర ఆమె ఆయుధం. ఆమెను మాత్రమే కాపాడే ఆయుధం కాదు, ఊళ్లోని ఆడవాళ్లందరికీ రక్షణ! ఆశాదేవి వేరే ఏ బట్టల్లో ఉన్నా ఊళ్లోని మగాళ్లు ఉలిక్కిపడరు. ఆకుపచ్చ చీరలో కనిపించిందంటే ఒళ్లు దగ్గర పెట్టుకుంటారు. గ్రీన్ గ్యాంగ్ లీడర్ బయటికి వచ్చిందని ఒకరికొకరు సమాచారం ఇచ్చుకుంటారు. గ్యాంగ్ లీడర్ బయటికి వచ్చిందంటే నూటాయాభై మంది వరకు ఉన్న ఆ గ్యాంగ్ ఊళ్లో ఎక్కడో మగవాళ్లను ‘చక్కబెడుతోందనే’! ధైర్యం.. ధీమా.. భరోసా! పవిత్ర పుణ్యభూమి అయిన వారణాసికి దగ్గరలో ఉంది గ్రీన్గ్యాంగ్ ఉన్న ఊరు. పేరు ఖుషియారీ. ఆడపిల్లలకు, ఆడవాళ్లకు అనువైన ఊరు కాదది! అసలు ఆడపిల్ల తల్లి గర్భంలోంచి భూమ్మీద పడడమే ఆ ఊళ్లో కనాకష్టం. పుట్టాక పెరగడం ఇంకా కష్టం. పెరుగుతుంది కానీ.. ఆమెకో జీవితం ఉండదు. పెళ్లీ అవుతుంది. తన మాటకు విలువ ఉండదు. ఆమె తరఫున అత్తమామలే మాట్లాడతారు. ఆమె ఇష్టాలను, అయిష్టాలను వదిన మరదళ్లే నిర్ణయిస్తారు. అలాంటి ఊళ్లో.. ఇంటి పనయ్యాక పచ్చచీర కట్టుకుని బయటికి వచ్చింది ఆశాదేవి. పొలం పనులు ముగించుకుని అప్పుడే ఇంటికి చేరుకున్న మరో ఇరవై మంది మహిళలు ఆ వెంటనే ఆమెను అనుసరించారు. వాళ్లంతా కూడా ఆకుపచ్చ చీరలో ఉన్నారు. అది వాళ్ల యూనిఫారం. ఊళ్లోని మహిళలకు, పిల్లలకు ధైర్యాన్ని, భరోసాను, నమ్మకాన్ని ఇచ్చే రంగు. తాగొచ్చి భార్యను కొట్టే భర్తకు ఆ రంగును చూస్తే భయం. జూదం ఆడే మగాళ్లకు వణుకు. పేకముక్కలు అక్కడే పడేసి వెనక్కైనా చూడకుండా పారిపోతారు. తల్లి మొత్తుకుంటున్నా పిల్లల్ని స్కూలుకు పంపకుండా పనికి తరిమేసే తండ్రుల భరతం కూడా పడుతుంది గ్రీన్ గ్యాంగ్. గ్యాంగ్ సభ్యులతో గులాబీ గ్యాంగ్ లీడర్ సంపత్పాల్ దేవి మార్పు కోసం ఒకటయ్యారు ఖుషియారీ గ్రామంలోని మగాళ్ల ప్రధాన కాలక్షేపం ‘మూడు ముక్కలాట’. దేశంలో జూదం ఆడటం నిషేధం. కానీ ఖుషియారీలో మగాళ్లు చెట్ల కింద, గట్ల మీద కండువాపై ముక్కలు వేసుకుని కూర్చుంటారు! ఆడేందుకు ఎవరూ దొరక్కపోతే కొడుకుతోనే ‘కాయ్ రాజా కాయ్’ అంటాడు తండ్రి. ఆ గ్రామంలోని షీలాదేవి ఆవేదన కూడా ఇదే. తండ్రి చెడిపోయాడు. కొడుకునూ చెడగొడుతున్నాడు. ఏం చేస్తుంది మరి? గ్రీన్ గ్యాంగ్లో చేరింది! ఇంట్లో అంతా పని చేస్తే కానీ రోజు గడవదు. షీలాదేవి భర్త çపనికి వెళ్లడు. ఆమె నాలుగు రూపాయలు సంపాదించుకొస్తేనే ఆ రోజుకి ఇంట్లో పొయ్యి వెలిగేది. షీలాదేవికి ఆడపిల్లలూ ఉన్నారు. ఖుషియారీలో ఆడపిల్లలను అచ్చంగా గుండెలపై కుంపటిలానే చూస్తారు. దేశం మారుతున్నా ఖుషియారీ మారడం లేదు. అందుకే ఆ ఊరి ఆడవాళ్లు మారదలచుకున్నారు. అడ్డదిడ్డంగా ఉండి కుటుంబాల్లో కల్లోలం రేపుతున్న మగాళ్లకు ముందుగా చెప్పి చూస్తారు. వినకుంటే ‘గుర్తుండిపోయేలా’ చెప్తారు. ఏ ఇంట్లోనైనా ఒక పురుషుడు అశాంతి సృష్టిస్తుంటే ఆ సమాచారాన్ని గ్రీన్ గ్యాంగ్ ఇచ్చి పుచ్చుకుంటుంది. అతడిని పంచాయితీకి రమ్మని పిలుస్తారు. ‘మీరు పిలిస్తే వచ్చేదేంటి?’ అని అతడు భీష్మించుకుని కూర్చుంటే వీళ్లే వెళ్తారు. ఊరికే వెళ్లరు. చేతుల్లో కర్రలతో వెళ్తారు. మరీ కర్రలు అవసరం లేని కేస్ అయితే బెదిరించి బుద్ధి చెబుతారు. జూదశాలలపై దాడులు చేయడం, గుడుంబా కుండల్ని బద్దలు కొట్టడం.. వీటి కన్నా కూడా.. మారని మగాళ్లను దారిలోకి తెచ్చేందుకే వీళ్లు ఎక్కువ సమయం కేటాయించవలసి వస్తోంది. చదువుకున్నవారి సహకారం గ్రీన్ గ్యాంగ్లో కొందరు కరాటే తెలిసిన మహిళలు కూడా ఉన్నారు! పరిస్థితి చెయ్యి దాటినప్పుడు వట్టి చేతులతో టాస్క్ని ఫినిష్ చేసేస్తారు. ఇదేమీ పెద్ద విషయంగా కనిపించకపోవచ్చు. కానీ ఖుషియారీలో మహిళలు ఇలా సంఘటితం అవడం కష్టమైన సంగతే. కట్టుబాట్లపరంగా స్త్రీల పట్ల వివక్షకు మారు పేరు ఖుషియారీ. గత ఏడాది కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఒక నివేదిక విడుదల చేసింది. ఆ నివేదిక ప్రకారం దేశంలో మూడింట ఒక వంతు మంది మహిళలు గృహహింసకు, గృహ లైంగికహింసకు గురవుతున్నారు. వివాహిత మహిళల్లో మూడింట ఒక వంతు మంది భర్తల చేతుల్లో భౌతిక, లైంగిక హింసను అనుభవిస్తున్నారు. పట్టణాలతో పోల్చి చూస్తే గ్రామాల్లోని మహిళలపైనే ఈ హింస ఎక్కువగా ఉంటోంది. అలాంటి గ్రామాలకు ఒక ముఖచిత్రం ఖుషియారీ. అయితే ఈ నివేదికల్లో చూపించేదాని కన్నా ఎక్కువగానే మహిళలపై హింస జరగుతోందని గ్రీన్ గ్యాంగ్కు తెలియందేమీ కాదు. ప్రభుత్వం వైపు నుంచి మహిళల రక్షణ, భద్రతలకు జరిగేది జరుగుతున్నా, ఏ గ్రామానికి ఆ గ్రామంలో బాధితుల తరఫున మహిళలూ పూనుకుంటే తప్ప మగాళ్లలో మార్పు రాదని గ్రీన్ గ్యాంగ్ నిశ్చయించుకుని స్త్రీలను, పిల్లలను కాపాడే ఉద్యమానికి నడుం కట్టింది. గ్రీన్ గ్యాంగ్ సభ్యులకు మార్షల్ ఆర్ట్స్ నేర్పిస్తున్న వలంటీర్లు స్వయంగా ఆశాదేవి కూడా ఒక బాధితురాలే. రోజూ తాగొచ్చి భార్యను అదొక అలవాటుగా బాదేవాడు! ఆమె తలను గోడకేసి కొట్టేవాడు. రక్తం కారేది. నొప్పిని ఆలాగే భరిస్తుండేది కానీ ఏనాడూ ఎదురు తిరగలేదు. కానీ ఒకరోజు పిల్లల ముందు ఆమెపై చెయ్యి చేసుకున్నాడు. ఆ చెయ్యిని అక్కడే ఆపేసింది ఆశాదేవి. నిర్ఘాంతపోయాడు. పిల్లల కళ్లల్లో సంతోషం. అమ్మ కూడా ఎదిరించగలదు. అమ్మకూడా ఎదురు తిరగగలదు. అంతే. నాన్నంటే భయం పోయింది. అమ్మంటే గౌరవం పెరిగింది. ఈ విషయం ఆశాదేవి గ్రహించింది. ఊళ్లో తన దొక్కటే కుటుంబం కాదు. తనొక్కతే బాధితురాలు కాదు. పిల్లల్ని తండ్రి ప్రేమగా చూసుకోవచ్చు. కానీ వాళ్ల కళ్లముందే తల్లిని అవమానిస్తే, అగౌరవపరిస్తే వాళ్లూ బాధితులే అవుతారు. ఈ దుస్థితిని తన పిల్లలకు తొలగించిన ఆశాదేవి, తనలాంటి వారే మరికొందరితో కలిసి ఊళ్లోని బాధిత మహిళల కోసం, వారి పిల్లల కోసం ‘గ్రీన్ గ్యాంగ్’ ఆవిర్భావానికి తోడ్పడింది. ఒక గ్యాంగ్ గా ఏర్పడడానికి వీళ్లకు స్ఫూర్తిని ఇచ్చింది మాత్రం కొంతమంది యూనివర్సిటీ విద్యార్థులు. వాళ్లలోని వలంటీర్లు ఊళ్లోకి వచ్చి, స్త్రీల హక్కుల గురించి చెప్పి వెళ్లిపోయారు. అరె.. హక్కులుండీ హక్కులు లేనట్లు పడివుండటం ఏంటని అనుకున్నారు ఖుషియారీ మహిళలు. విద్యార్థులలోనే కొందరికి కొన్ని స్వచ్ఛంద సేవా సంఘాలతో పరిచయాలున్నాయి. అలా దివ్వాంశు ఉపాధ్యాయ్ అనే సేవా సంఘం నిర్వాహకుడు కొంతమంది యువ వలంటీర్ల చేత స్థానిక మహిళలకు చట్టాలపై, సెక్షన్లపై అవగాహన కల్పించాడు. ముఖ్యంగా పోలిస్ కంప్లయింట్ ఎలా ఇవ్వాలో చెప్పించాడు. ఆ తర్వాతి నుంచి ఊళ్లో మగాళ్లపై కేసులు నమోదవడం మొదలైంది. భర్తపై భార్య పెట్టిన కేసులే వాటిల్లో ఎక్కువ! తర్వాతి స్థానం జూదం ఆడేవారిది, తాగొచ్చి కొట్టేవాళ్లది, గుడుంబా కాసేవాళ్లదీ. ఊళ్లో ఇప్పుడీ పచ్చరంగు చీరల్లోని ఆడవాళ్లు స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్గా మహిళల్ని, బాలికల్ని కాపుకాస్తున్నారు. రక్షణ వలయంగా నిలుస్తున్నారు. వీళ్లకు మార్షల్ ఆర్ట్స్ నేర్పిస్తున్నది కూడా యవ వలంటీర్లే. శాంతి సౌభాగ్యాలు గ్రీన్ గ్యాంగ్ గుడుంబా కుండల్ని బద్దలు కొడుతున్న వీడియో ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ గ్యాంగ్ గురించి బయటి ప్రపంచానికి తెలిసింది. గ్రీన్ గ్యాంగ్లో ప్రస్తుతం 150 మంది వరకు మహిళలు ఉన్నారు. ప్రతి సాయంత్రం వీళ్లంతా కలుస్తారు. అయితే అందరూ ఒకే చోట కలవరు. బృందాలుగా విడిపోయి, వేర్వేరు చోట్ల సమావేశం అవుతారు. ఫిర్యాదులు ఏమైనా ఉన్నాయా అని చర్చించుకుంటారు. ఉంటే ఆ బాధిత మహిళను ఎలా గట్టెక్కించాలో ఆలోచిస్తారు. కార్యాచరణ సిద్ధం చేసుకున్నాక బాధితురాలి ఇంటికి వెళ్లి భర్త వైఖరిని మార్చుకొమ్మని సలహాయిస్తారు. సాధారణంగా చెయ్యి చేసుకోరు. చేతిలో కర్రలు మాత్రం ఉంచుకుంటారు. ఏ ఫిర్యాదులూ లేనప్పుడు గ్రామం మంచిచెడ్డల కోసం అధికారులను కలిసే విషయమై మాట్లాడుకుంటారు. ఏబీసీ న్యూస్ దక్షిణాసియా కరస్పాండెంట్ సియోభన్ హెన్యూ ఈ గ్రీన్ గ్యాంగ్ను.. ‘ఆకుపచ్చ రంగునే మీ యూనిఫారమ్కు ఎందుకు ఎంచుకున్నారు అని ప్రశ్నించినప్పుడు.. ‘‘ఆకుపచ్చ సౌభాగ్యానికి, శాంతికి చిహ్నంగా మేము భావిస్తాం. అయితే ఈ మగవాళ్లు మాకు అవి రెండూ లేకుండా చేస్తున్నారు. వాటిని సాధించుకోవడం కోసమే మా పోరాటం’’ అని చెప్పారు. గులాబీ గ్యాంగ్ పన్నెండేళ్ల వయసుకే సంపత్ పాల్ దేవి ఒక గొర్రెపిల్లలా భర్త వెనకే నడిచి, మెట్టినింట అడుగుపెట్టింది. ఇరవై ఏళ్లకే ఐదుగురు పిల్లల తల్లి అయింది. గొర్రెల కాపరి అయిన ఆమె తండ్రి తన కూతురుని ఎంత త్వరగా ఇంకొకరి కాపలాకి ఇస్తే అంత త్వరగా తన భారం వదులుతుందని భావించాడే తప్ప, తర్వాత పిల్ల భవిష్యత్తు ఏమిటని ఆలోచించలేదు. బడిపిల్లలకు ఐస్క్రీమ్ అమ్ముతుండే దేవి భర్త కూడా తన భార్యాపిల్లలకు చల్లని జీవితాన్ని ఇవ్వలేకపోయాడు. ఉత్తరప్రదేశ్లోని అనేక నిరుపేద గ్రామాల్లో మహిళల పరిస్థితి చాలావరకు ఇలాగే ఉంటుంది. బాల్యంలోనే వివాహం అయిపోతుంది. అక్కడితో చదువు ఆగిపోతుంది. అక్కడి నుంచి భర్త వేధింపులు సాధింపులు మొదలవుతాయి. దేవి కూడా అలాంటి సగటు గృహిణే. తను, తన కుటుంబం, తన కష్టాలు... అంతే. గుట్టుగా నెట్టుకొస్తోంది. అయితే ఆమె జీవితంలోని ఓ క్షణం ఆమెను పూర్తిగా మార్చేసింది. ఆమెలోని దృఢత్వాన్ని, నాయకత్వ లక్షణాలను బయటికి తెచ్చింది. ఆమెపై 2014లో ‘గులాబ్ గ్యాంగ్’ అనే సినిమా కూడా వచ్చింది! ఆ చిత్రంలో సంపత్ పాల్ దేవి పాత్రను మాధురీ దీక్షిత్ పోషించారు. గ్రీన్ గ్యాంగ్ లీడర్ ఆశాదేవి 2006లో ఓరోజు సంపత్ పాల్ దేవి తన ఇంటి బయట, అత్యంత బాధాకరమైన దృశ్యం చూసింది. ఓ భర్త తన భార్యను గొడ్డును కూడా బాదని విధంగా బాదుతున్నాడు. ‘చచ్చిపోతాను, నన్ను కొట్టొద్దు’ అని ఆ భార్య అతడి కాళ్ల మీద పడి ప్రాధేయపడుతోంది. అయినా ఆమె భర్త కరుణించలేదు. అడ్డుపడిన వాళ్లను సైతం కొట్టబోయాడు. ‘నా భార్య. నా ఇష్టం’ అన్నాడు. ఆ రాత్రి సంపత్ పాల్ దేవి నిద్రపోలేదు. తెల్లవారుజామునే లేచి కొంతమంది మహిళలను సమీకరించుకుంది. అందరి చేతుల్లో కర్రలు! అంతా కలిసి ఆ భర్త ఇంటి మీదికి వెళ్లారు. అతణ్ని బయటికి రప్పించి, దేహశుద్ధి చేశారు. అదీ ఆరంభం. బుందేల్ఖండ్ గ్రామంలో గులాబీ రంగుల చీరలు ధరించిన ‘గులాబీ గ్యాంగ్’ ఆవిర్భవించింది. 2010 నాటికి రాష్ట్రవ్యాప్తం, దేశవ్యాప్తం అయింది. ఎక్కడైనా, ఏ ఇంట్లోనైనా స్త్రీపై దౌర్జన్యం, గృహహింస జరుగుతోందని తెలిస్తే గులాబీ గ్యాంగ్ అక్కడ ప్రత్యక్షమౌతోంది. ప్రలోభాలకు లోను కాకూడదన్న కారణంతో ప్రభుత్వ యంత్రాంగం నుంచీ, స్వచ్ఛంద సేవాసంస్థల నుంచి ఎలాంటి ఆసరా కోరకుండా సంపత్ పాల్ దేవీ తన సైన్యాన్ని తనే నిర్మించుకుంది. ‘ప్రతి ఆడపిల్లా చదువుకోవాలి. ప్రతి మహిళా స్వేచ్ఛగా జీవించాలి’. ఇదే సంపత్ పాల్ దేవి ధ్యేయం. గ్రీన్ గ్యాంగ్ కూడా సరిగ్గా గులాబీ గ్యాంగ్ బాటలోనే పయనిస్తోంది. -
అది మా అందరి వైఫల్యం
సంజయ్ దత్, మాధురీ దీక్షిత్, వరుణ్ ధావన్, ఆలియా భట్, సోనాక్షీ సిన్హా ముఖ్య పాత్రల్లో అభిషేక్ వర్మన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కళంక్’. ఎన్నో అంచనాలతో ఈ ఏడాది ఏప్రిల్లో విడుదలయిన ఈ చిత్రం నిరాశపరచించి. ఈ చిత్ర వైఫల్యం గురించి వరుణ్ ధావన్ స్పందించారు. ‘‘కళంక్’ సినిమాను ప్రేక్షకులు ఆదరించలేదంటే అది బ్యాడ్ ఫిల్మ్ అని అర్థం. ఎక్కడో మా టీమ్ అందరూ ఫెయిల్ అయ్యాం. సినిమా అనేది టీమ్ అందరి కష్టం. కేవలం దర్శకుడినో, నిర్మాతనో తప్పుబట్టడం సరికాదు. టీమ్లో భాగమైనందుకు నేను కూడా నిందని తీసుకుంటున్నాను. ఫెయిల్యూర్ని మన కచ్చితంగా ప్రభావం చూపాలి. లేదంటే మనం చేస్తున్న పనిని ప్రేమతో చేస్తున్నట్టు కాదని నా ఉద్దేశం’’ అన్నారు. -
ఆ కోరిక ఇంకా తీరనేలేదు!
మిల్కీ బ్యూటీ తమన్నాకు సినిమారంగంలో దాదాపు 15 ఏళ్ల అనుభవం ఉంది. చాలా పిన్న వయసులోనే నటిగా రంగప్రవేశం చేసిన తమన్నా హిందీ, తెలుగు, తమిళం భాషల్లో నటించేశారు. బాలీవుడ్లో పెద్దగా ఆదరణకు నోచుకోకపోయినా దక్షిణాది ప్రజలు బాగానే ఆదరిస్తున్నారు. ఇప్పటికీ తెలుగు, తమిళ భాషల్లో హీరోయిన్గా తన మార్కెట్ను కాపాడుకుంటున్న తమన్నా ఇటీవల ఒక భేటీలో పేర్కొంటూ తాను చిన్న తనం నుంచి నటి మాధురీదీక్షిత్ డాన్స్ చూసి ఆమెలా ఆడాలని ఆశ పడ్డానని చెప్పారు. మాధురీకి చాలా మంది అభిమానులుండేవారని, అలా తనకూ ఉండాలని కోరుకునేదాన్నని అన్నారు. ఆ కోరికే తనను సినిమా రంగంలోకి తీసుకొచ్చిందని అంది. దీంతో పట్టుదలతో డాన్స్ను నేర్చుకున్నానని చెప్పారు. ఇప్పుడు కూడా డాన్స్కు ప్రాధాన్యత కలిగిన చిత్రంలో నటించాలన్న కోరిక ఉందని, అలాంటి చిత్రంలో తన పూర్తి డాన్స్ ప్రతిభను నిరూపించుకోవాలని ఆశ పడుతున్నట్లు వెల్లడించారు. అయితే ఇప్పటి వరకూ ఆ కోరిక నెరవేరలేదు. అయితే 12 ఏళ్లుకు పైగా నటిస్తున్నా ఇప్పుడే నటిగా జీవితాన్ని ప్రారంభించినట్లు ఉందని, ఇలా భావించడమే తన విజయరహస్యం అన్నారు. చిన్న వయసులోనే సినిమాలోకి వచ్చానని, ఆ రోజులను తలచుకుంటే ఆశ్చర్యం అనిపిస్తుందని చెప్పారు. నటిగా అనుభవం పెరగడంతో ఎలాంటి పాత్రల్లో నటిస్తే బాగుంటుందన్న గ్రహించగలుగుతున్నానన్నారు. ఇప్పుడు తన ఆలోచనలు మారుతున్నాయని, తొలి రోజుల్లో వచ్చిన అవకాశాలన్నీ ఒప్పేసుకుని నటించానని, అలాంటిది ఇప్పుడు ఎంపిక చేసుకుని నటిస్తున్న విధానం మారిందని తెలిపారు. ఇది తనకు తాను కొత్తగా తెలుసుకున్నానని తమన్నా చెప్పుకొచ్చారు. -
స్టార్ స్టార్ సూపర్ స్టార్ మధురీ దీక్షిత్
-
దీదీని ఎదుర్కోవడానికి..
రాజకీయాలకు, సినీరంగానికి ఉన్న అనుబంధం విడదీయలేనిది.. సినీ గ్లామరే పెట్టుబడిగా పెట్టి రాజకీయాల్లో నాలుగు ఓట్లు రాబట్టుకోవడం అన్ని పార్టీల్లోనూ మామూలే. ఎన్నికల ప్రచారానికి ఒక ఊపు రావాలన్నా, ఊరూవాడా ఈస్ట్మన్ కలర్లో ప్రచారం హోరెత్తిపోవాలన్నా సినీ తారల వల్లే సాధ్యమవుతుందని అన్ని పార్టీలు భావిస్తున్నాయి. బీజేపీ ఈ విషయంలో అందరికంటే ముందుంది. లోక్సభ ఎన్నికల షెడ్యూల్ కూడా విడుదల కావడంతో కమలనాథులు పార్టీకి సినీ సొగసులు అద్దే పనిలో పడ్డారు. బీజేపీ అధిష్టానం ఎందరో తారల్ని పార్టీలోకి లాగడానికి ప్రయత్నాలు ముమ్మరంగా చేస్తోంది. కేవలం సినీ గ్లామర్ మాత్రమే కాదు, క్రీడాకారులు, మేధావులు, కళాకారులు ఇలా జనాన్ని ఆకర్షించే సత్తా ఉన్నవాళ్లని తీసుకువచ్చి పార్టీకి కొత్త హంగుల్ని అద్దడానికి వ్యూహరచన చేస్తోంది. దీదీని ఎదుర్కోవడానికి పశ్చిమ బెంగాల్లో పార్టీని బలోపేతం చేసి వీలైనన్ని ఎక్కువ లోక్సభ స్థానాలను దక్కించుకోవడానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా చాలా కాలంగా వ్యూహాలు రచిస్తున్నారు. బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని దీటుగా ఎదుర్కోవడానికి ఏ చిన్న అవకాశాన్నీ వదలడం లేదు. మొత్తం 42 లోక్సభ స్థానాలున్న పశ్చిమబెంగాల్లో 22 స్థానాల్లోనైనా నెగ్గాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అందుకోసం బెంగాల్లో బాగా పేరున్న వారు, పార్టీకి వెన్నుదన్నుగా ఉంటారని భావిస్తున్న ఎవరినైనా లాగేయడానికి సిద్ధంగా ఉన్నారు. మహాభారతంలో ద్రౌపది వేషంతో పాపులర్ అయిన రూపాగంగూలీని 2015లోనే పార్టీలో చేర్చుకున్నారు. ప్రముఖ బెంగాలీ గాయకుడు బాబూల్ సుప్రియో ఇప్పటికే అసనోల్ నియోజకవర్గం నుంచి బీజేపీ ఎంపీగా ఉన్నారు. కాంగ్రెస్లో తగిన ప్రాధాన్యం దక్కక అసంతృప్తితో ఉన్న హిందీ తార మౌసమీ ఛటర్జీ బెంగాల్ బీజేపీకి కొత్త హంగులు తెచ్చారు. సినీ తారలు, క్రికెటర్లపై గురి భారతీయ జనతా పార్టీ తన గూటిలోకి లాగాలనుకునే తారల జాబితా చాలా పెద్దదే. గత ఏడాది జూన్లో అమిత్ షా బాలీవుడ్ నటి మాధురీ దీక్షిత్ను ముంబైలో స్వయంగా కలుసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం సాధించిన విజయాల గురించి ఆమెకు వివరించారు. మాధురిని మహారాష్ట్రలోని పుణే నుంచి ఎన్నికల బరిలోకి దింపుతారనే వార్తలు అప్పట్లోనే హల్ చల్ చేశాయి. అయితే మాధురి నుంచి ఇప్పటివరకు ఎలాంటి స్పందన లేదు. మాధురీయే కాదు కంగనా రనౌత్, ప్రీతి జింటా, పల్లవి జోషీ, రవీనా టాండన్, అక్షయ్ కుమార్లను కూడా ఎన్నికల వేళ పార్టీ తీర్థం పుచ్చుకునేలా బీజేపీ వ్యూహాలకు పదును పెడుతోంది. క్రికెటర్లు కపిల్దేవ్, రాహుల్ ద్రావిడ్, అనిల్ కుంబ్లే, వీరేంద్ర సెహ్వాగ్, గౌతమ్ గంభీర్లు పొలిటికల్ పిచ్లో తమ సత్తా చాటుతారన్న నమ్మకంతో ఉన్న బీజేపీ వారికి కూడా గాలం వేస్తోంది. ఇక కేరళ బీజేపీ ట్రంప్కార్డుగా మలయాళం సూపర్ స్టార్ మోహన్లాల్ను తిరువనంతపురం బరి నుంచి దింపుతారని వార్తలు వచ్చాయి. గతంలో మోహన్లాల్ స్వయంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీని కలుసుకోవడంతో ఊహాగానాలు చెలరేగాయి. మోహన్లాల్కి పద్మభూషణ్ అవార్డు ఇవ్వడం కూడా ఈ ఊహాగానాలకు ఊతమిచ్చింది. అయితే మోహన్లాల్ అభిమానులే ఆయన బీజేపీలోకి వెళతారన్న వార్తలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో మోహన్లాల్ వెనకడుగు వేశారు. రాజకీయాల్లో చేరాలనే ఉద్దేశం తనకు లేదని, నటుడిగా తన జీవితం సంతృప్తినిస్తోందని మోహన్లాల్ తేల్చి చెప్పేశారు.అయినా రాజకీయాల్లో ఏ నిమిషం ఏదైనా జరగవచ్చునన్న విశ్లేషణలైతేవినిపిస్తున్నాయి. సుమలత రూటు ఎటు ? సుమలత.. ఈ పేరు చెబితే చాలు.. తెరపై సంప్రదాయమైన చీరకట్టుతో హుందా పాత్రలే మన కళ్ల ముందు కదులుతాయి. తెలుగు ఆడపడుచు, కన్నడ కోడలు అయిన సుమలత భర్త, నటుడు, కాంగ్రెస్ ఎంపీ అంబరీష్ ఇటీవల ఆకస్మికంగా మరణించడంతో ఆయన అభిమానులు సుమలతను పోటీ చేయాలంటూ డిమాండ్లు చేస్తున్నారు. కర్ణాటకలో మండ్యా నియోజకవర్గానికి ఇన్నాళ్లూ ఆయన ప్రాతినిధ్యం వహించారు. భర్త పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్నప్పటికీ సుమలత అభిమానుల కోరిక మేరకు రాజకీయ అరంగేట్రం చేయాలని భావించారు. కాంగ్రెస్ పార్టీ మండ్యా టికెట్ ఇస్తే పోటీకి దిగుతానని మీడియా ముందే ప్రకటించారు. కానీ ఇక్కడే రాజకీయం రసవత్తరంగా మారింది. కర్ణాటకలో కాంగ్రెస్, జేడీ(ఎస్) మధ్య పొత్తు ఉంది. ఈ పొత్తులో భాగంగా పాండ్యా సీటు జేడీ(ఎస్)కే ఇవ్వాలన్న నిర్ణయం కూడా జరిగిపోయింది. అందుకే అంబరీష్ను అప్పట్లోనే మంత్రి పదవి నుంచి తప్పించారన్న ప్రచారం కూడా జరిగింది. సుమలత మండ్యా నుంచి తప్ప మరో చోట నుంచి బరిలోకి దిగనని పట్టు పట్టడంతో కాంగ్రెస్ అధిష్టానం ఏమీ చేయలేని స్థితిలో పడిపోయింది.. మరోవైపు కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి తన కుమారుడు నిఖిల్ గౌడను మండ్యా బరిలోకి దింపాలని యోచిస్తున్నారు. మండ్యాలో వక్కళిగ ఓట్లు ఎక్కువగా ఉన్నాయి. ఆ నియోజవవర్గంలో అరంగేట్రం చేస్తే వక్కళిగ సామాజిక వర్గానికి చెందిన తన కుమారుడు నిఖిల్ గెలుపు నల్లేరు మీద బండి నడకని కుమారస్వామి భావిస్తున్నారు. పిట్ట పోరు పిట్ట పోరు పిల్లి తీర్చినట్టుగా కాంగ్రెస్, జేడీ(ఎస్)మధ్య అంతర్గత పోరుని తమకు అనుకూలంగా మార్చుకునే పనిలో బీజేపీ పడింది. సుమలతను పార్టీలోకి తీసుకురావాలని వ్యూహాలు కూడా పన్నుతోంది. కానీ సుమలత కాంగ్రెస్ టికెట్ దక్కకపోతే స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగాలని భావిస్తున్నట్టుగా తెలిసింది. అయినా సుమలతకున్న సినీ గ్లామర్ను వినియోగించుకోవడానికి కమలనాథులు ఆ నియోజకవర్గంలో తమ పార్టీ అభ్యర్థిని నిలబెట్టకుండా, పరోక్షంగా సుమలతకు మద్దతు ఇవ్వాలని నిర్ణయానికి వచ్చారు. దీంతో జేడీ(ఎస్)సుమలతపై రాజకీయ దాడి మొదలు పెట్టింది. ‘‘భర్త పోయి నెల తిరక్కుండానే రాజకీయాలు కావాల్సి వచ్చాయా‘‘అంటూ కుమారస్వామి సోదరుడు, కర్ణాటక మంత్రి హెచ్డీ రేవణ్ణ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అంబరీష్కు కన్నడనాట మంచి ఫాలోయింగ్ ఉంది. రెబెల్ స్టార్ అన్న ఇమేజ్ కూడా ఉంది. దీంతో రేవణ్ణ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో రచ్చ రచ్చ జరిగింది. భర్తను కోల్పోయిన ఒక మహిళపై ఇలాంటి నీచ వ్యాఖ్యలు చేస్తారా అంటూ సుమలత, అంబరీష్ అభిమానులు సోషల్ మీడియాలో విరుచుకుపడ్డారు. ఎన్నికల వేళ తమ ఇమేజ్ ఎక్కడ డ్యామేజ్ అవుతుందోనని భావించిన కుమారస్వామి, నిఖిల్లు రేవణ్ణ తరఫున క్షమాపణలు కోరారు. ఇన్ని మలుపుల మధ్య సుమలత రాజకీయ భవితవ్యం ఎటు తిరుగుతుందో చూడాలి. 2014లో బీజేపీ సినీ ఫార్ములా సక్సెస్ 2014లోనూ బీజేపీ పెద్ద ఎత్తున సినీ తారల్ని ఆకర్షించి పొలిటికల్ బాక్సాఫీస్ వద్ద వారి గ్లామర్ని క్యాష్ చేసుకోవడంలో సక్సెస్ కొట్టింది. గత లోక్సభ ఎన్నికల్లో రాహుల్గాంధీపై టెలివిజన్ స్టార్, ఇంటింటి కోడలుగా అందరి మన్ననలు పొందిన స్మృతి ఇరానీని పోటీకి నిలిపింది. స్మృతి ఓడిపోయినప్పటికీ బీజేపీకి ఒక ఊపు తీసుకురావడంలో విజయం సాధించారు. ఇక చాలా మంది తారలు విజయం సాధించి పార్లమెంటుకి గ్లామర్ తళుకులు అద్దారు.హేమమాలిని (మథుర నియోజకవర్గం), మనోజ్తివారీ (ఈశాన్య ఢిల్లీ), పరేష్ రావల్ (తూర్పు అహ్మదాబాద్), కిరణ్ఖేర్ (చండీగఢ్), శత్రుఘ్నసిన్హా (పట్నా సాహిబ్) బాబూల్ సుప్రియో (అసనోల్)లు గత ఎన్నికల్లో విజయం సాధించారు. అయితే శత్రుఘ్నసిన్హా ఇప్పుడు అధిష్టానంపై తిరుగుబాటు బావుటాఎగురవేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీని వీలైనప్పుడల్లా విమర్శిస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. మరి ఈ ఎన్నికల్లో కమల వికాసానికి తారల తళుకుబెళుకులు ఎంతవరకు కలిసొస్తాయో మరి. పక్కాగా సర్వే చేసి మరీ.. సినీ గ్లామర్ అన్నివేళలా ఓట్లను రాలుస్తుందని చెప్పలేం. అందుకే సినీతారలు, క్రికెటర్లపై గాలం వేయడానికి ముందే బీజేపీ ఓ పక్కా సర్వే నిర్వహించినట్టు సమాచారం. ఏ నియోజకవర్గంలో ఏ తారని దింపితే ఫలితం ఉంటుందాఅన్న సర్వే చేయించినట్టు తెలుస్తోంది. ఈ సర్వేలో మాధురీ దీక్షిత్, క్రికెటర్లు వీరేంద్ర సెహ్వాగ్, గౌతమ్ గంభీర్లు విజయం సాధించడానికి ఎక్కువగాఅవకాశాలు ఉన్నట్టు తేలింది. మహారాష్ట్రలో ముంబై లేదా పుణె నుంచిమాధురీ దీక్షిత్, హరియాణాలోని రోహ్తక్ నుంచి వీరేంద్ర సెహ్వాగ్, న్యూఢిల్లీ నుంచి గౌతమ్ గంభీర్ గెలుపు గుర్రాలేనని ఆ సర్వేలో వెల్లడైంది. గౌతమ్ గంభీర్ ఎప్పుడూ జాతివ్యతిరేక శక్తుల్ని ఎండగడుతూ ఉంటారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్తో ట్విట్టర్ వేదికగా ఢీ అంటే ఢీ అంటూ గంభీర్ ఎందరో ఫాలోయర్లను పెంచుకున్నారు.ఇక పంజాబ్లో గురుదాస్పూర్ నియోజకవర్గం నుంచి చాలా ఏళ్లు బీజేపీ తరఫున గెలిచిన నటుడువినోద్ఖన్నా మృతితో ఆ నియోజకవర్గం నుంచి ఎవరిని నిలపాలా అన్నదికమలనాథులు ముందు సవాల్గానే ఉంది. ఇప్పటికే ప్రధానమంత్రినరేంద్రమోదీతో అత్యంత సన్నిహితంగా ఉన్న అక్షయ్కుమార్నుగురుదాస్పూర్ నుంచి పోటీకి నిలిపితే బాగుంటుందని బీజేపీ అధిష్టానం భావించింది కానీ ఆయనకు పౌరసత్వమే పెద్ద అడ్డంకిగా ఉంది.కెనడా పౌరుడు అయిన అక్షయ్కుమార్ భారత్లో ఎన్నికల్లో పోటీచేయడానికి వీలులేదు. -
స్త్రీ శక్తి
అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి బహార్ బేగం, రూప్, సత్యలు వచ్చేశారు. ‘2 స్టేట్స్’ ఫేమ్ అభిషేక్ వర్మన్ దర్శకత్వంలో సంజయ్దత్, వరుణ్ ధావన్, ఆదిత్యా కపూర్, మాధురీ దీక్షిత్, సోనాక్షీ సిన్హా, ఆలియా భట్ ముఖ్య తారలుగా రూపొందిన మల్టీస్టారర్ పీరియాడికల్ మూవీ ‘కళంక్’. 1921 నేపథ్యంలో ఈ సినిమా సాగనుందని తెలిసింది. గురువారం ఈ సినిమాలోని మేల్ యాక్టర్స్ లుక్స్, రోల్స్ వివరాలను వెల్లడించింది. చిత్రబృందం. బల్రాజ్ చౌదరిగా సంజయ్దత్, జాఫర్గా వరుణ్ ధావన్, దేవ్గా ఆదిత్యాకపూర్లు కనిపిస్తారు. శుక్రవారం ఫిమేల్ ఆర్టిస్టుల వివరాలను తెలిపారు. బహార్ బేగం, సత్య, రూప్ పాత్రల్లో మాధురీ దీక్షిత్, సోనాక్షి సిన్హా, ఆలియా భట్ నటించారు. ఈ ముగ్గురివీ శక్తిమంతమైన పాత్రలని సమాచారం. ఇక్కడున్న ఈ ముగ్గురి ఫొటోలు సినిమాలోని లుక్స్కి సంబంధించినవే. హీరోయిన్లు కృతీ సనన్, కియారా అద్వానీలు ఈ సినిమాలో ప్రత్యేకపాత్రలు చేశారు. దాదాపు 21ఏళ్ల తర్వాత సంజయ్దత్, మాధురీ దీక్షిత్ కలిసి నటించిన చిత్రమిది. ఇంతకుముందు మాధురి, సంజయ్ 1997లో ‘మహానతా’ అనే సినిమాలో నటించారు. ఇక తాజా చిత్రం ‘కళంక్’ ఏప్రిల్లో విడుదల కానుంది. -
బ్రేక్ తీసుకుంటే కమ్బ్యాక్ అంటారా?
‘‘ఒక హీరో చాలా కాలం సినిమాలకు దూరంగా ఉంటే... మీ కమ్బ్యాక్ ఎప్పుడు? అని ఆ హీరోని ఎవరూ అడగరు. కానీ అదే ఒక హీరోయిన్ కాస్త బ్రేక్ తీసుకుంటే చాలు.. మీ కమ్బ్యాక్ ఎప్పుడు? అనే ప్రశ్నను పదే పదే అడుగుతారు. ఒక వర్కింగ్ ఉమెన్ను అలా అడగటం మానేయండి’’ అన్నారు నటి మాధురీ దీక్షిత్. 1999లో శ్రీరామ్ నేనేను వివాహం చేసుకున్న మాధురి సినిమాలను తగ్గించారు. 2007లో ‘ఆజా నాచ్లే’ సినిమా తర్వాత మాధురి తిరిగి సినిమాలకు బ్రేక్ ఇచ్చారు. ఆ తర్వాత అడపాదడపా అతిథి పాత్రలు మాత్రమే చేశారు. గత నెల విడుదలైన ‘టోటల్ ధమాల్’ సినిమాలో ఆమె ఫుల్ లెంగ్త్ లీడ్ రోల్ చేశారు. ఈ సినిమాతో మంచి కమ్బ్యాక్ ఇచ్చారని మాధురితో ఎవరో అన్నారట. అంతే.. ఆమె అసహనం వ్యక్తం చేశారు. ‘‘నా వ్యక్తిగత కారణాల వల్ల కొన్నేళ్లు నేను సినిమాలు చేయలేదు. ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ నేను ఇండస్ట్రీకి దూరం కాలేదు. సినిమాలకు దూరం కానప్పుడు ఇక కమ్బ్యాక్ అనే ప్రసక్తి ఎందుకు? నా వైవాహిక బంధాన్ని ఆస్వాదించాలనుకున్నాను. నా కుటుంబసభ్యులతో, నా పిల్లలతో సరదాగా కొంత కాలం గడపాలనుకున్నాను. అందుకే సినిమాలు ఒప్పుకోలేదు. ప్రొఫెషనల్ లైఫ్కి కొంత గ్యాప్ ఇస్తే ‘మీ కమ్బ్యాక్ ఎప్పుడు?’ అని అడగడమేనా?’’ అని అసహనం వ్యక్తం చేశారు మాధురీ దీక్షిత్. -
శ్రీదేవి గర్వపడేలా చేయాలనుకున్నా
‘‘శ్రీదేవి చనిపోయి ఏడాది పూర్తయింది. కానీ శ్రీదేవి మన మధ్య లేరు అనే వాస్తవాన్ని అంగీకరించడానికి నా మనసు ఒప్పుకోవడం లేదు. ప్రస్తుతం శ్రీదేవి చేయాల్సిన ఓ పాత్రను నేను చేయడం చాలా ఎమోషనల్గా అనిపిస్తోంది. శ్రీదేవి గర్వపడేలా చేస్తాననే అనుకుంటున్నాను’’ అని మాధురీ దీక్షిత్ అన్నారు. కరణ్ జోహార్ నిర్మాణంలో సంజయ్ దత్, మాధురీ దీక్షిత్, ఆలియా భట్, వరుణ్ ధావన్, సోనాక్షి సిన్హా ముఖ్య పాత్రల్లో అభిషేక్ వర్మన్ తెరకెక్కిస్తున్న పీరియాడికల్ చిత్రం ‘కళంక్’. ఇందులో మాధురి పోషిస్తున్న పాత్రను మొదట శ్రీదేవి చేయాలి. కానీ శ్రీదేవి అకాల మరణంతో ఆ పాత్ర మాధురికి వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ విషయం గురించి మాధురి మాట్లాడుతూ – ‘‘ఈ పాత్ర కోసం కరణ్ నన్ను సంప్రదించగానే చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యాను. శ్రీ, నేను చివరిసారిగా డిజైనర్ మనీష్ మల్హోత్రా బర్త్డే పార్టీలో కలుసు కున్నాం. ఆ పార్టీలో పిల్లలిద్దరితో (జాన్వీ, ఖుషీ) సంతోషంగా కనిపించింది. సడన్గా శ్రీదేవి చనిపోవడం బాధగా అనిపించింది. తన మరణంతో జీవితం చాలా చిన్నది అనే విషయాన్ని తెలుసుకున్నాను. ప్రతిరోజుని ఆస్వాదించాలి, ఆనందించాలి అని తెలుసుకున్నాను. ఎందుకంటే రేపు ఏమవుతుందో మనం ఎవ్వరం ఊహించలేం’’ అని అన్నారు. ‘కళంక్’ ఈ ఏడాది రిలీజ్ కానుంది. -
శ్రీదేవిగా మాధురి?
బాలీవుడ్ వెండితెరపై బయోపిక్ ఫార్ములా నడుస్తోంది. ఆల్రెడీ కొన్ని బయోపిక్స్ వెండితెరపైకి వచ్చాయి. మరికొన్ని సెట్స్లో ఉన్నాయి. ఇంకొన్ని చర్చల దశలో ఉన్నాయి. ఈ చర్చించుకునే బయోపిక్ జాబితాలో అతిలోక సుందరి శ్రీదేవి బయోపిక్ కూడా ఉంది. ఆదివారం శ్రీదేవి వర్థంతి సందర్భంగా ఆమె బయోపిక్ మరోసారి తెరపైకి వచ్చింది. శ్రీదేవి బయోపిక్ను నిర్మించేందుకు ఆయన భర్త బోనీ కపూర్ కూడా సుముఖంగానే ఉన్నారట. కానీ శ్రీదేవిలా నటించగల నటి ఎవరు? అన్నదే పెద్ద ప్రశ్న. అయితే శ్రీదేవిపాత్రలో మాధురీ దీక్షిత్ అయితే సరిపోతారని బోనీ భావిస్తున్నారని బాలీవుడ్ తాజా ఖబర్. -
అడ్వంచరస్ ఫన్ రైడ్ : టోటల్ ధమాల్
2011లో ఘనవిజయం సాధించిన డబుల్ ధమాల్కు సీక్వల్గా తెరకెక్కుతున్న సినిమా టోటల్ ధమాల్. అజయ్ దేవగణ్, అనిల్ కపూర్, మాధురీ దీక్షిత్, జానీ లివర్, రితేశ్ దేశ్ముఖ్ లు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈసినిమా 22న రిలీజ్ రెడీ అవుతోంది. ఈ చిత్రాన్ని ఫాక్స్ స్టార్ స్టూడియోస్, మారుతి మల్టీనేషనల్ సంస్థలతో కలిసి అజయ్ దేవగన్ స్వయంగా నిర్మిస్తున్నారు. విజువల్ వండర్ గా తెరకెక్కిన ఈ కామెడీ ఎంటర్టైనర్ సినిమా ట్రైలర్ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. వైల్డెస్ట్ అడ్వెంచర్ కామెడీతో రూపొందించిన ఈ ట్రైలర్కు సూపర్బ్ రెస్సాన్స్ వస్తోంది. ఇంద్ర కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా హిమేష్ రేషమియా సంగీతమందించాడు. -
టాటా.. బై బై
‘కళంక్’ టీమ్కు టాటా చెప్పేశారు వరుణ్ ధావన్. ‘2 స్టేట్స్’ ఫేమ్ అభిషేక్ వర్మన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. మాధురీ దీక్షిత్, సంజయ్ దత్, వరుణ్ ధావన్, ఆదిత్యారాయ్ కపూర్, ఆలియా భట్, సోనాక్షీ సిన్హా ముఖ్య తారలుగా నటిస్తున్నారు. ఈ సినిమాలో తన షూటింగ్ పూర్తి చేసినట్లు వరుణ్ ధావన్ పేర్కొన్నారు. ‘‘ఇప్పటి వరకు నేను నటించిన వాటిలో పెద్ద సినిమా ఇది. నిజంగా చాలా కష్టపడ్డాను. సోనా, మాధురీ మేడమ్, సంజు సార్, ఆలియా మేడమ్లతో నేను బిగ్ స్క్రీన్ని షేర్ చేసుకోవడం హ్యాపీగా ఉంది. ఆలియా భట్తో నాలుగోసారి నటించడం సూపర్ ఎగై్జటింగ్గా అనిపించింది’’ అని పేర్కొన్నారు వరుణ్. ‘‘హార్డ్వర్క్తో వరుణ్ ఎప్పటికప్పుడు సర్ప్రైజ్ చేస్తుంటాడు. ‘కళంక్’ సెట్లోనూ అదే చేశాడు. ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నా’’ అని ఆలియా పేర్కొన్నారు. ‘కళంక్’ సినిమా ఈ ఏడాదే రిలీజ్ కానుంది. ఈ సంగతి ఇలా ఉంచితే... 1994లో వచ్చిన ‘అందాజ్ అప్నా అప్పా’ సినిమా రీమేక్ లేదా సీక్వెల్లో వరుణ్ ధావన్, రణ్వీర్ సింగ్ నటించనున్నారనే ప్రచారం బాలీవుడ్లో జరుగుతోంది. -
పుణే నుంచి మాధురీ దీక్షిత్ పోటీ!
ముంబై: బాలీవుడ్ నటి మాధురీ దీక్షిత్ను 2019 లోక్సభ ఎన్నికలలో పుణే నుంచి పోటీ చేయించాలని బీజేపీ భావిస్తోంది. జూన్లో పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్షా మాధురీని ఆమె నివాసంలో కలిసి ఈ మేరకు చర్చలు జరిపినట్లు, ప్రధాని మోదీ సాధించిన విజయాలను ఆమెకు వివరించినట్లు పార్టీ రాష్ట్ర సీనియర్ నేత ఒకరు తెలిపారు. పుణే స్థానానికి ఆమె పేరు పరిశీలిస్తున్నామని, ఆ స్థానం నుంచి పోటీచేయడానికి ఆమే సరైన వ్యక్తి అని గురువారం ఆయన తెలిపారు. 2014 లోక్సభ ఎన్నికలలో పుణే స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిపై బీజేపీ అభ్యర్థి అనిల్ షిరోలే మూడు లక్షల పైచిలుకు ఓట్లతో విజయం సాధించారు. పార్టీ సీనియర్ నేత ఒకరు మాట్లాడుతూ, ‘గుజరాత్లో నరేంద్ర మోదీ ఈ ప్రణాళికతో విజయవంతమయ్యారు. అక్కడి స్థానిక సంస్థల ఎన్నికలలో కొత్తవారిని పోటీ చేయించడం ద్వారా ఆయన మంచి ఫలితాలు సాధించారు. కొత్తగా పోటీచేసే వారిని విమర్శించడానికి ఎలాంటి ఆస్కారం ఉండదు. దీనివల్ల ప్రతిపక్షం తికమక పడడంతో బీజేపీ అధిక స్థానాలు గెలుచుకోగలిగింది’అని ఆయన వివరించారు. -
2019 ఎన్నికల బరిలో ప్రముఖ నటి
ముంబై : ఐదు రాష్ట్రాల ఎన్నికల ముగిసిన నేపథ్యంలో.. బీజేపీ వచ్చే ఏడాది జరగనున్న సాధరణ ఎన్నికలపై దృష్టి సారించింది. ఈ క్రమంలో 2019 ఎన్నికల్లో పూణె నియోజక వర్గం నుంచి ప్రముఖ బాలీవుడ్ నటి మాధురి దీక్షిత్ను బరిలోకి దించుతున్నట్లు సమాచారం. 2019 ఎన్నికల కోసం ఎవరెవరిని బరిలోకి దించాలనే అంశంపై బీజేపీ ఇప్పటికే జాబితాను పూర్తి చేసినట్లు పార్టీ సీనియర్ నాయకుడు ఒకరు తెలిపారు. ఈ జాబితాలో మాధురికి, పూణె నుంచి టికెట్ కన్ఫామ్ చేసినట్లు తెలిపారు. ఈ ఏడాది జూన్లో బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్షా ముంబయిలోని మాధురి ఇంటికి వెళ్లిన విషయం తెలిసిందే. ‘సంపర్క్ సమర్థాన్’(భాజపాకు మద్దతివ్వండి) కార్యక్రమంలో భాగంగా అమిత్ షా ఆమెతో సమావేశమయ్యారు. ప్రధాని మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాల గురించి, సాధించిన అభివృద్ధి గురించి అమిత్ షా మాధురికి వివరించారు. ఈ విషయం గురించి సీనియర్ నాయుకుడు ఒకరు.. ‘మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఇలాంటి వ్యూహాలనే పాటించారు. ఆ సమయంలో పాత అభ్యర్థుల స్థానంలో కొత్త వారిని నిలబెట్టి భారీ మెజారిటీ సాధించి ప్రతిపక్షాలకు షాక్ ఇచ్చారు. ఇప్పుడు కూడా అదే జరగబోతుంది’ అంటూ చెప్పుకొచ్చారు. 2014 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి అయిన అనిల్ శిరోల్ మీద దాదాపు 3 లక్షల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. -
ఆరంభం.. అట్టహాసం
భువనేశ్వర్: అగ్ర తారల తళుకులు... బాణా సంచా మెరుపులు... రంగురంగుల విద్యుద్దీపాల వెలుగులు... హుషారెత్తించే పాటలు... మైమరపించే నృత్య ప్రదర్శనల మధ్య... మనుషులంతా ఒక్కటే అని చాటుతూ... 14వ పురుషుల హాకీ ప్రపంచ కప్ ప్రారంభ వేడుకలు అట్టహాసంగా సాగాయి. ఆతిథ్య రాష్ట్రం ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ సమక్షంలో, 16 ప్రాతినిధ్య దేశాల కెప్టెన్ల హాజరీలో జరిగిన ఈ కార్యక్రమాలు ఆద్యంతం ఆకట్టుకున్నాయి. బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్, అందాల తార మాధురీ దీక్షిత్, ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ ప్రదర్శనలు కట్టిపడేశాయి. మాధురీ భూ దేవీగా అవతరిస్తూ, ప్రపంచ ప్రజలందరినీ తన పిల్లలుగా సంబోధిస్తూ చేసిన ప్రసంగంతో షో ప్రారంభమైంది. ఆమెపై చిత్రీకరించిన ‘ఎర్త్ సాంగ్’ అలరించింది. 1100 మంది కళాకారులతో, షిమాక్ దావర్ కొరియోగ్రఫీలో రూపొందిన ‘ఫ్యూజన్ డ్యాన్స్’ అబ్బురపర్చింది. గుల్జార్ రచించిన ప్రపంచ కప్ అధికార పాట ‘జై హింద్, జై ఇండియా’కు రెహమాన్ లైవ్ ఫెర్ఫార్మెన్స్ మరింత వన్నె తెచ్చింది. ‘డ్రమ్స్’ శివమణి తన వాయిద్యాలతో హోరెత్తించారు. మరోవైపు ప్రపంచకప్లో పాల్గొంటున్న జట్లకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. క్రీడాభిమానులను ఈ కప్ అలరిస్తుందని, భారత దేశ, ప్రత్యేకించి ఒడిశా సంస్కృతిని ప్రపంచానికి చాటుతుందున్న ఆశాభావం వ్యక్తం చేశారు. -
జై బోలో గణేశ్ మహారాజ్కి...జై!
పండగ రోజు షూటింగ్లకు కాస్త గ్యాప్ ఇచ్చి వినాయక చవితి సెలబ్రేషన్స్ను గ్రాండ్గా జరుపుకున్నారు బాలీవుడ్ సినీ తారలు. ఇంట్లో పండగ చేసుకుని ఇరుగింటికి పొరుగింటికి కూడా వెళ్లారు. ఈ తొమ్మిది రోజులూ బాలీవుడ్లో ఇలా సందడి సందడిగా ఉంటుంది. సల్మాన్ ఖాన్ సోదరి అర్పితా ఖాన్ అయితే ఘనంగా పూజా కార్యకమాలు ఏర్పాటు చేసి, ఇండస్ట్రీ ప్రముఖులను ఆహ్వానించారు. కత్రినా కైఫ్, ఆమె చెల్లి ఇసబెల్లా కైఫ్, సంజయ్దత్, ఆయన సతీమణి మాన్యతా దత్, సోహా అలీఖాన్, సల్మాన్ ప్రేయసి లూలియా వంటూర్, షారుక్ ఖాన్, ఆయన సతీమణి గౌరీ ఖాన్.. ఇలా చాలా మంది స్టార్స్ అర్పితాఖాన్ అండ్ ఆయుష్ శర్మల ఇంటి వినాయకుడ్ని సందర్శించారు. ఈ ప్రముఖులు కొన్ని కెమెరా కళ్లకు చిక్కారు. ఇక ఇక్కడే ఉన్న ఫొటోలో చూశారుగా గణేశ్ మహరాజ్ని మాధురీ దీక్షిత్ ఎంత భక్తిగా ప్రార్థిస్తున్నారో. ప్రతి ఏడాదిలానే శిల్పా శెట్టి తన భర్త రాజ్ కుంద్రాతో కలసి స్వయంగా మార్కెట్కి వెళ్లి వినాయకుడ్ని కొని తెచ్చారు. నిమజ్జనం రోజున ఆమె చేసే సందడి మామూలుగా ఉండదు. క్రేజీ స్టార్స్ తమన్నా, శ్రద్ధాకపూర్లను చూస్తున్నారా? నవ్వులు చిందిస్తూ పూజ చేస్తున్నారు. మరో బ్యూటీ సోనమ్ కపూర్కి పెళ్లయ్యాక వచ్చిన తొలి వినాయక చవితి ఇది. ఆమె కూడా ఘనంగా జరుపుకున్నారు. డేరింగ్ అండ్ డాషింగ్ గాళ్ కంగనా రనౌత్ సెలబ్రేషన్స్లో మాత్రం వెనక్కు తగ్గుతారా? తన సోదరి రంగోలి రనౌత్ కొడుకుతో కలిసి హ్యాపీ వినాయక చవితి చెప్పారు. అలాగే సెన్సేషనల్ స్టార్ సన్నీ లియోన్ ఇంట్లో కూడా పండగ వాతావరణం వచ్చింది. ఇక్కడున్న ఫొటోలో ఆమె భర్త డానియల్, సన్నీల దత్త పుత్రిక నిషాలను చూడొచ్చు. ఇదే రేంజ్లో షారుక్ఖాన్, అనుష్కా శర్మ.. ఇలా మరెందరో బాలీవుడ్ తారలు పండగని ఘనంగా జరుపుకున్నారు. బచ్చన్ ఫ్యామిలీని మరచిపోతే ఎలా? ఆ ఇంటి పండగ సందడి కూడా బ్రహ్మాండంగా వినిపించిందని బాలీవుడ్ టాక్. సోదరి తనయుడితో కంగనా రనౌత్; భర్త రాజ్ కుంద్రా, తనయుడు వియాన్తో శిల్పా శ్రద్ధాకపూర్ దత్త పుత్రిక, భర్తతో సన్నీ కత్రినా, ఇసబెల్లా, ; చెల్లి ఇంటి దారిలో సల్మాన్... -
మాధురీతో పోటీ
ప్రస్తుతం ‘బ్రహ్మాస్త్ర’ సినిమా కోసం బల్గేరియాలో ఉన్నారు కథానాయిక ఆలియా భట్. ఈ షెడ్యూల్ కంప్లీట్ అవ్వగానే ఆమె ఏం చేస్తారంటే ‘కళంక్’ సినిమా సెట్లో జాయిన్ అవుతారు. ‘2 స్టేట్స్’ ఫేమ్ అభిషేక్ వర్మన్ దర్శకత్వంలో రూపొందుతున్న మల్టీస్టారర్ మూవీ ‘కళంక్’. సంజయ్దత్, మాధురీ దీక్షిత్, వరుణ్ ధావన్, ఆదిత్యారాయ్ కపూర్, సోనాక్షీ సిన్హా ముఖ్య పాత్రలు చేస్తున్నారు. ఈ పీరియాడికల్ మూవీలో మాధురీ దీక్షిత్, ఆలియా భట్ కాంబినేషన్లో కథక్ డ్యాన్స్ బ్యాక్డ్రాప్లో ఓ సాంగ్ ఉందట. ఆల్రెడీ పండిట్ బిర్జు మహారాజ్ వద్ద మాధురి కథక్ నేర్చుకున్నారు. ఇక ఆలియా భట్ కూడా ఈ సాంగ్ కోసం ఎప్పటి నుంచో కథక్ నేర్చుకుంటున్నారట. అంతేకాదు సాంగ్ షూట్ టైమ్ దగ్గర పడుతుండటంతో రెండు నెలలుగా కఠోర సాధన చేస్తున్నారట ఆలియా. ఏమైనా డౌట్స్ వస్తే మాధురి దగ్గర క్లారిఫై చేసుకోవాలనుకుంటున్నారట. సీనియర్తో ఈ పోటీలో ధీటుగా నిలవాలనుకుంటున్నారట. మరి.. ఈ సాంగ్ ఏ రేంజ్లో ఉంటుందనేది వెండితెరపై చూడాల్సిందే. ‘కళంక్’ సినిమా వచ్చే ఏడాది రిలీజ్ కానుంది. అలాగే అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో అమితాబ్ బచ్చన్, రణ్బీర్ కపూర్, ఆలియా భట్, నాగార్జున, డింపుల్ కపాడియా ముఖ్య తారలుగా నటిస్తున్న ‘బ్రహ్మాస్త్ర’ ఫస్ట్ పార్ట్ వచ్చే ఏడాది ఆగస్టులో రిలీజ్ కానుంది. -
తొమిదేళ్ల తర్వాత తొలిసారి!
తొలిసారి డ్యాన్స్ చేయడానికి రెడీ అవుతున్నారట బాలీవుడ్ బ్యూటీ సోనాక్షీ సిన్హా. అదేంటీ.. ఒకటా రెండా సోనాక్షి డ్యాన్స్తో అదరగొట్టిన పాటలు బోలెడు ఉన్నాయి కదా అనుకుంటు న్నారా? అది నిజమే. అయితే కెరీర్లో ఆమె తొలిసారి ఐటమ్ సాంగ్ చేయడానికి రెడీ అవుతున్నారని బాలీవుడ్ టాక్. ఇంద్రకుమార్ దర్శకత్వంలో అజయ్ దేవగన్, అనిల్ కపూర్, మాధురీ దీక్షిత్, రితేష్ దేశ్ముఖ్, అర్షద్ వార్షి ముఖ్య తారలుగా నటిస్తున్న సినిమా ‘టోటల్ ధమాల్’. ఇంద్రకుమార్ దర్శకత్వంలో ధమాల్ సిరీస్లో వస్తోన్న థర్డ్ పార్ట్ ఇది. ఈ సినిమాలోనే స్పెషల్ సాంగ్ చేయడానికి ఒప్పుకున్నారట సోనాక్షీ సిన్హా. ఇండస్ట్రీలోకి వచ్చి దాదాపు తొమిదేళ్ల తర్వాత ఆమె ఐటమ్ సాంగ్ చేయడానికి ఒప్పుకోవడం విశేషమే మరి. -
ప్రముఖ సింగర్తో అమిత్ షా భేటి
సాక్షి, ముంబై : ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా ప్రముఖులను పార్టీలోకి ఆహ్వానించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. దీనిలో భాగంగానే భారతదేశ దిగ్గజ గాయని లతా మంగేష్కర్ను అమిత్షా మర్యాదపూర్వకంగా కలిశారు. మంగేష్కర్ నివాసంలో సుదీర్ఘంగా భేటీ అయిన అమిత్ షా రానున్న ఎన్నికల్లో బీజేపీ తరుఫున ప్రచారం చేయాలని అమెను కోరారు. షెడ్యూల్ ప్రకారం జూన్ ఆరునే అమిత్ షా లతాను కలవాల్సింది ఉంది. ఆ సమయంలో మంగేష్కర్ పుడ్ పాయిజన్తో బాధపడుతుండడం వల్ల అమిత్షాతో భేటికి నిరాకరించారు. ముంబైలో ఆదివారం బీజేపీ కార్యకర్తలు నిర్వహించిన ర్యాలీలో పాల్గొనేందుకుగాను అమిత్షా ఒక్క రోజు పర్యటనకు మహారాష్ట్ర వచ్చారు. ఈ సందర్భంగా మంగేష్కర్తో భేటి అయ్యారు. నాలుగేళ్ల కాలంలో బీజేపీ ప్రభుత్వం సాధించిన విజయాల గురించి ఓ పుస్తకాన్ని ఆమెకు బహుకరించారు. అమిత్షాతో పాటు మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్, బీజేపీ ఛీప్ రాసాసాహెబ్, బీజేపీ నేత అశీష్ షెల్లర్ ఈ భేటిలో పాల్గొన్నారు. కాగా ఇటీవల ముంబై పర్యటనకు వచ్చిన అమిత్షా ప్రముఖ బాలీవుడ్ నటి మాధురీ దీక్షిత్, వ్యాపారవేత్త రతన్ టాటాను బీజేపీకి మద్దతుగా ప్రచారంలో పాల్గొనాలని కోరిన విషయం తెలిసిందే. -
రాజ్యసభకు కపిల్దేవ్, మాధురీ!
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: రాజ్యసభలో నామినేటెడ్ సభ్యుల ఖాళీలను భర్తీ చేసే దిశగా కేంద్రం ప్రయత్నాలు ప్రారంభించింది. క్రికెటర్ సచిన్ టెండూల్కర్, సినీ నటి రేఖ, పారిశ్రామికవేత్త అను ఆఘా ఇటీవలే రిటైర్ అయ్యారు. సీనియర్ లాయర్ కే పరాశరన్ నేడు(శుక్రవారం) రాజ్యసభ నుంచి రిటైర్ కానున్నారు. దీంతో ప్రస్తుతం రాజ్యసభలో నామినేటెడ్ సభ్యుల ఖాళీల సంఖ్య నాలుగుకి చేరనుంది. ఈ నేపథ్యంలో బీజేపీ ఎవరిని రాజ్యసభకు నామినేట్ చేయనుందనే విషయంలో పలు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యే జూలై 18 నాటికి కొత్త సభ్యుల నియామకంపై ఒక స్పష్టత వస్తుందని భావిస్తున్నారు. రాజ్యసభలో మొత్తం 12 మంది నామినేటెడ్ సభ్యులుంటారు. మాజీ సీజేఐ, ఆర్మీ మాజీ చీఫ్ పేర్లు! రాజ్యసభకు నామినేట్ అయ్యే అవకాశమున్న వారిలో మాజీ క్రికెటర్ కపిల్ దేవ్, సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఆర్సీ లహోటియా, ఆర్మీ మాజీ చీఫ్ దల్బీర్ సింగ్, రాజ్యాంగ వ్యవహారాల నిపుణుడు సుభాష్ కాశ్యప్, బాలీవుడ్ నటి మాధురీ దీక్షిత్.. తదితరుల పేర్లు బీజేపీ వర్గాల్లో ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తున్నాయి. దాదాపు వీరందరినీ ఇటీవల బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా కలిశారు. ‘సంపర్క్ సే సమర్థన్’ కార్యక్రమంలో భాగంగా ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా, క్రీడాకారుడు మిల్ఖా సింగ్, జర్నలిస్ట్ కుల్దీప్ నయ్యర్, యోగా గురు బాబా రామ్దేవ్, జస్టిస్ ఆర్సీ లహోటియా, మాజీ ఆర్మీ చీఫ్ దల్బీర్ సింగ్ సహా పలువురు ప్రముఖులను అమిత్ షా కలిసిన విషయం తెలిసిందే. హరియాణాకు చెందిన మాజీ క్రికెటర్ కపిల్ దేవ్కు, అలాగే, ఇటీవలి కాలం వరకు హీరోయిన్గా వెండితెరపై మెరిసిన మాధురీ దీక్షిత్కు దేశవ్యాప్తంగా అభిమానులున్న విషయాన్ని బీజేపీ పరిగణనలోకి తీసుకుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. -
కపిల్దేవ్కు ఎంపీ పదవి?
న్యూఢిల్లీ : మరో లెజండరీ క్రికెటర్ రాజ్యసభలో అడుగుపెట్టబోతున్నారు. ఈ ఏడాది వర్షాకాలపు పార్లమెంటు సమావేశాల్లో(జులై 18 నుంచి ఆగష్టు 10) కపిల్ దేవ్ను రాజ్యసభ సభ్యుడిగా నామినేట్ చేసేందుకు భారతీయ జనతా పార్టీ(బీజేపీ) ఇప్పటికే సంప్రదింపులు ప్రారంభించినట్లు ఓ ఆంగ్ల దినపత్రిక కథనాన్ని ప్రచురించింది. రాష్ట్రపతి ఎంపిక చేసే రాజ్యసభ సభ్యులు కేంద్ర ప్రభుత్వం, కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ అభిప్రాయానికి అనుగుణంగా ఉండటం సంప్రదాయం. ఈ నేపథ్యంలో కపిల్ దేవ్ను పెద్దల సభకు పంపాలని బీజేపీ భావిస్తున్నట్టుగా ఆ పత్రిక కథనంలో పేర్కొంది. కపిల్తో పాటు బాలీవుడ్ నటి మాధురి దీక్షిత్ను సైతం రాజ్యసభకు నామినేట్ చేయాలనే యోచనలో మోదీ సర్కారు ఉన్నట్లు తెలిపింది. ఇటీవలే బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా కపిల్ దేవ్ ఇంటికి వెళ్లిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ నటి మాధురీ దీక్షిత్ ఇంటికి కూడా వెళ్లిన అమిత్ షా సమావేశం అయ్యారు. కాగా, ఇటీవలే సచిన్ టెండూల్కర్ రాజ్యసభ సభ్యత్వం కాలం ముగిసిన విషయం తెలిసిందే. అయితే, పదవీ కాలంలో సచిన్ పనితీరుపై తీవ్రంగా విమర్శలు రావడంతో ఆయన తనకు వచ్చిన వేతనాన్ని అంతటిని తిరిగి ఇచ్చేశారు. -
అభిమాన నటున్ని కలిసిన డాన్సింగ్ అంకుల్
డాన్సింగ్ వీడియోతో ఇంటర్నెట్లో సంచలనం సృష్టించి, ఏకంగా ప్రభుత్వ బ్రాండ్ అంబాసిడర్ అయ్యాడు ‘డాన్సింగ్ అంకుల్’ సంజీవ్ శ్రీవాస్తవ. ఇతనికి హీరో గోవిందా అంటే ఎంత అభిమానమో తెలిసిందే. శ్రీవాస్తవ తన అభిమాన హీరో గోవిందాను అనుకరిస్తూ చేసిన వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేసిన విషయము తెలిసిందే. శ్రీవాస్తవ చేసిన డాన్స్కు గోవిందా కూడా ఫిదా అయ్యాడు. ఫోన్ చేసి మరి శ్రీవాస్తవను అభినందించడమే కాక కలుస్తానని కూడా మాటిచ్చాడు. ఆ ప్రామిస్ను నెరవేర్చడానికి మాధురి దీక్షిత్ డాన్స్ రియాలిటీ షో ‘డాన్స్ దివానే’ కార్యక్రమం అందుకు వేదికయ్యింది. ఈ షోలో గోవిందా ‘డాన్సింగ్ అంకుల్’ కలవడమే కాక అతనితో పాటు కాలు కదిపి ప్రేక్షకులను అలరించాడు. ‘డాన్స్ దివానే షో’ ద్వారా మాధురి దీక్షిత్తో కూడా డాన్స్ చేసే అవకాశం లభించింది ‘డాన్సింగ్ అంకుల్’కు. ఈ షోలో మాధురి కూడా శ్రీవాస్తవ, గోవిందాలతో పాటు డాన్స్ చేసింది. ‘డాన్సింగ్ అంకుల్’గా పేరు తెచుకున్న ఈ విదిషా ప్రొఫెసర్ సంజీవ్ శ్రీవాస్తవను మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మెచ్చుకోవడమే కాక విదిషా మున్సిపల్ కార్పొరేషన్కు బ్రాండ్ అంబాసిడర్గా నియమించారు.