Ajith
-
కోలీవుడ్ ను టెన్షన్ పెడుతున్న అజిత్
-
టెన్త్ ఫెయిల్, బైక్ మెకానిక్.. ఇప్పుడు రూ. 350 కోట్ల స్టార్ హీరో
మీరు ఇలాంటి హీరోను అరుదుగా చూస్తారు.. బహుషా భవిష్యత్లో కనిపించకపోవచ్చు. థియేటర్ల వద్ద కటౌట్లు పెట్టొద్దని హుకూం జారీ చేస్తాడు. ఎట్టి పరిస్థితిలో పాలాభిషేకాలు చేయొద్దని వేడుకుంటాడు. సినిమా విడుదల సమయంలో ఎలాంటి హంగామా, వేడుకలు వద్దని సూచిస్తాడు. ఇంతకీ ఎవరా స్టార్ అనుకుంటున్నారా..? కోలీవుడ్ హీరో అజిత్.. చిత్ర పరిశ్రమలో ఇలాంటి ప్రవర్తన ప్రేక్షకులే కాదు సినీ ప్రముఖులూ ఫిదా అవుతుండటం విశేషం.సికింద్రాబాద్లో జన్మించిన అజిత్అజిత్ నాన్న సుబ్రమణిది తమిళకుటుంబమే అయినప్పటికీ పాకిస్థాన్లోని కరాచీలో జన్మించిన మోహినిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. దేశ విభజన తర్వాత కోల్కతాలో స్థిరపడ్డారు. పెళ్ళయ్యాక ఆయనకి సికింద్రాబాద్లోని ఓ ఫార్మా కంపెనీలో ఉద్యోగం రావడంతో ఇక్కడ ఐదారేళ్లపాటున్నారు. రెండో సంతానంగా అజిత్ జన్మించారు. తర్వాత వారు చెన్నై వెళ్లి అక్కడే స్థరపడ్డారు. దీంతో అజిత్కి ఏ ప్రాంతీయ భాషా సరిగ్గా రాలేదు. ఆపై స్కూల్లో ఎప్పుడూ అట్టడుగు ర్యాంకే. చివరకు ఆయన్ను పదో తరగతి పరీక్షలకు కూడా అనుమతించలేదు. అలా ఖాళీగా ఉన్నప్పుడే ఓసారి వాళ్ల నాన్నతో ఆఫీసుకెళ్లాడు. అక్కడి ఎండీ గదిలో ఉన్న రేసు బైకుల ఫోటోలను చూసి ఫిదా అయ్యాడు. తానూ ఆ రంగంలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. అందుకోసమే రాయల్ ఎన్ఫీల్డ్ బైకు తయారీ కంపెనీలో మెకానిక్ పనిలో చేరాడు. అలా పదహారేళ్లకే రిపేరింగ్ నేర్చుకుని డబ్బు సంపాదన మొదలుపెట్టాడు. కానీ, అతని తల్లిదండ్రులకి ఆ వర్క్ నచ్చలేదు..! మావాడు మెకానిక్ అంటే అందరూ నవ్వుతున్నారంటూ అజిత్పై వాళ్లనాన్న కోప్పడేవాడు. బలవంతంగా మెకానిక్ పనికి ఫుల్స్టాప్ పెట్టించి ఓ గార్మెంట్ ఎక్స్పోర్ట్ కంపెనీలో ఉద్యోగం ఇప్పించాడు.అక్కడ పనిచేస్తున్నా సరే, అజిత్ రేసులపైన ఆశలు వదులుకోలేదు. తన జీతం డబ్బు మొత్తం పెట్టి బైకు రేసుల్లో పాల్గొనేవాడు. కానీ , ఆ సమయంలో అజిత్కు ఎక్కువగా ఎస్పీబీ చరణ్ సాయపడ్డాడు. పదో తరగతిలో మొదలైన ఆ స్నేహమే అజిత్ సినిమాల్లోకి రావడానికి మూల కారణమైంది. గార్మెంట్ ఎక్స్పోర్టింగ్ బిజినెస్ ప్రారంభించిన అజిత్కు నష్టాలు వచ్చాయి. అన్నయ్య అమెరికాలో స్థిరపడ్డాడు. తమ్ముడు ఐఐటీ మద్రాసులో చేరాడు. వారికి డబ్బు సర్ధడమే కుటుంబానికి కష్టంగా మారింది. తొలి సినిమా ఛాన్స్ ఎలా వచ్చింది.. ఇప్పటికీ నో ఫోన్అప్పుడే గొల్లపూడి మారుతీరావు కుమారుడు సినిమా మొదలు పెట్టాడు. ఆ సినిమా నిర్మాతకు అజిత్ను పరిచయం చేసింది ఎస్పీ బాలసుబ్రమణ్యమే.. అలా అజిత్ కెరీర్లో ఫస్ట్ సినిమా 'ప్రేమ పుస్తకం' తెలుగు పరిశ్రమ నుంచే పడ్డాయి. అక్కడ మొదలైన ఆయన ప్రయాణం ఇప్పుడు స్టార్ హీరోగా కొనసాగుతున్నాడు. ఏమీ లేని స్థాయి నుంచి ప్రస్తుతం రూ. 350 కోట్ల ఆస్తితో నిలదొక్కుకున్నాడు.ఈ కాలంలో మొబైల్ ఫోన్ కూడా ఉపయోగించని సూపర్ స్టార్ ఒకరు ఉన్నారని చెబితే అది అజిత్ మాత్రమేనని చెప్పవచ్చు. సోషల్ మీడియాకు ఆయన పూర్తిగా దూరంగా ఉంటారు. తనకంటూ యాక్టివ్ ఫ్యాన్ క్లబ్లు లేవు. ఎలాంటి వేడుకల్లో పాల్గొనడు. ప్రమోషనల్ యాడ్స్లో నటించడు. సినిమా, కారు రేసింగ్లలోనే కోట్ల రూపాయలు సంపాదించాడు.అభిమాన సంఘాలు వద్దని ఎందుకు చెప్పారు..?రాజకీయాల్లో అజిత్ రాబోతున్నట్లు గతంలో వార్తలు వచ్చాయి. అందుకు అభిమాన సంఘాలిను ఉపయోగించుకుంటున్నాడు అని ప్రచారం జరిగింది. దీంతో ఆ సంఘాలన్నింటినీ రద్దు చేస్తున్నట్టు ఆయన అధికారికంగా ప్రకటించాడు. సినిమా హీరోలను అభిమానించే వారికి గొప్ప గుణపాఠం కూడా చెప్పాడు. 'డియర్ సార్,మేడమ్.. ఒక సినిమా నటుడి కోసం మీ విలువైన సమయాన్ని వృథా చేసుకోవద్దు. నేనొక మెకానిక్ని.. అక్కడి నుంచి నేను ఈరోజు ఈ స్థాయికి వచ్చానంటే కారణం కరెక్ట్ సమయాన్ని ఉపయోగించడమే. నామీద ప్రేమతో మీరు సమయాన్ని వృథా చేయకండి. అందుకే ఈ అభిమాన సంఘాలను పూర్తిగా రద్దు చేస్తున్నాను. మీ పని అంత మీ కెరీర్పైనా పెట్టిండి. భవిష్యత్లో ఉన్నత స్థాయికి చేరాలి. మీరు పట్టుదలతో కరెక్ట్గా సమయాన్ని ఉపయోగిస్తే భారీ విజయాలను అందుకుంటారు. -
మరోసారి ప్రాణాపాయం నుంచి బయటపడ్డ అజిత్
అజిత్ కథానాయకుడిగానే కాకుండా , కారు రేస్, రైఫిల్ షూటింగ్ క్రీడా రంగాల్లోనూ తన ప్రతిభను నిరూపించుకుంటున్న విషయం తెలిసిందే. కాగా తాజాగా ఈయన కథానాయకుడిగా నటించిన విడాముయర్చి (పట్టుదల) చిత్రం ఇటీవల విడుదలై థియేటర్లలో సందడి చేస్తున్న విషయం తెలిసిందే. అదే విధంగా అజిత్ కథానాయకుడిగా నటించిన మరో చిత్రం గుడ్ బాడ్ అగ్లీ. ఈ చిత్ర షూటింగ్ డబ్బింగును పూర్తి చేసిన అజిత్ ఇటీవల దుబాయ్లో జరిగిన అంతర్జాతీయ కారు రేస్ క్రీడా పోటీల్లో పాల్గొని తృతీయ పతకాన్ని గెలుచుకున్న విషయం తెలిసిందే. అయితే అంతకుముందు దుబాయ్లో జరిగిన కారు రేస్ శిక్షణలో పాల్గొని ప్రమాదానికి గురై తృటిలో ప్రాణాప్రాయం నుంచి తప్పించుకున్నారు. అదేవిధంగా మరోసారి ఈయన కార్ రేస్ శిక్షణలో ఘోర ప్రమాదానికి గురై ఎలాంటి గాయాలు లేకుండా సురక్షితంగా బయటపడ్డారు. అజిత్ ప్రస్తుతం పోర్చుగల్లో జరగనున్న కారు రేస్ పోటీలకు సిద్ధమవుతున్నారు. అందులో భాగంగా అక్కడ శనివారం కారు రేస్ శిక్షణలో పాల్గొంటున్నారు. అయితే ఆయన నడుపుతున్న కారు అదుపుతప్పి ప్రమాదానికి గురైంది. అదృష్టవశాత్తూ అజిత్కు ఎలాంటి ప్రాణాపాయం జరగలేదు. దీంతో ఆయన అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. -
నాకు ట్రీట్మెంట్ ఇప్పించి ఆపై 'సారీ' చెప్పారు.. అజిత్పై నటుడి కామెంట్
నటుడు అజిత్ ప్రవర్తన చాలా భిన్నంగా ఉంటుంది అన్నది అందరికీ తెలిసిన విషయమే. ఒకరిని కించపరచడం, విమర్శలు చేయడం, ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోవడం వివాదాస్పద విషయాలకు చాలా దూరంగా ఉండటం ఆయన నైజం. తనేంటో తన పని ఏంటో చేసుకుంటూ పోయే మనస్తత్వం ఆయనది. కాగా తాజాగా ఆయన నటించిన విడాముయర్చి (పట్టుదల) చిత్రం భారీ అంచనాల మధ్య విడుదలైంది. నటి త్రిష నాయకిగా నటించిన ఈ చిత్రాన్ని మగిళ్ తిరుమేణి దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించింది.సినిమా బాగుందంటూ రివ్యూస్ కూడా వస్తున్నాయి. భారీ యాక్షన్ ఎంటర్ టైనర్గా రూపొందిన ఈ చిత్రంలోని సీన్స్ హాలీవుడ్కు దగ్గరగా ఉన్నాయని ప్రశంసలు దక్కుతున్నాయి. అయితే, ఈ మూవీ కోసం ఒక యాక్షన్ సన్నివేశాన్ని అజర్ బైజాన్లోని రోడ్లపై చిత్రీకరించినప్పుడు అజిత్ డ్రైవ్ చేస్తున్న కారు అనూహ్యంగా ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఈ వీడియో గతంలో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. యావత్ చిత్ర పరిశ్రమని దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈ ఘటన గురించి ఈ చిత్రంలో ముఖ్యపాత్రను పోషించిన నటుడు ఆరవ్ మీడియాతో మాట్లాడారు. 'విడాముయర్చి చిత్రంలోని ఆ యాక్షన్ సన్నివేశాన్ని చాలా పకడ్బందీగా ప్లాన్ చేశాం. అయినప్పటికీ అనూహ్యంగా కారు ప్రమాదానికి గురైంది. అయితే, ఆ తర్వాత జరిగిన ఘటనలే ఆశ్చర్యానికి గురి చేశాయి. కారు ప్రమాదం జరిగిన అర్ధగంట తర్వాత అజిత్ మళ్లీ నటించడానికి సిద్ధమయ్యారు. ఆ సన్నివేశంలో అజిత్తో కలిసి నేను నటించాను. షూటింగ్ పూర్తి అయిన తర్వాత అజిత్ నన్ను వదిలేసి వెళ్లలేదు. ఆయనే స్వయంగా ఆసుపత్రికి తీసుకెళ్లి నా ఎక్సరే రిపోర్టు చూసిన తర్వాత ఏం జరగలేదని తెలుసుకుని రిలాక్స్ అయ్యారు. నా భుజం తట్టి గట్టిగా ఆలింగనం చేసుకొని సారీ కూడా చెప్పారు. ఆ సమయంలో ఎంతో భావోద్వేగానికి గురైన నాకు చెప్పడానికి మాటలు కూడా రాలేదు. అదేవిధంగా అజిత్ ఆ తర్వాత కూడా డూప్ లేకుండానే నటించాలని నిర్ణయం తీసుకున్నారు. ఆయనకు బిలియన్ల సంఖ్యలో అభిమానులు ఉండడానికి కారణం ఇదే అని నాకు అప్పుడు అర్థమైంది' అని నటుడు ఆరవ్ పేర్కొన్నారు. -
అజిత్ 'పట్టుదల' HD మూవీ స్టిల్స్
-
అజిత్ 'పట్టుదల' సినిమా ట్విటర్ రివ్యూ
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ (Ajith Kumar) నటించిన తాజా చిత్రం విదాముయార్చి(Vidaamuyarchi Movie) తెలుగులో 'పట్టుదల' టైటిల్తో ఫిబ్రవరి 6న విడుదలైంది. ఇప్పటికే పలుచోట్ల సినిమా ప్రీమియర్స్ షోలు ప్రపంచవ్యాప్తంగా ప్రదర్శించారు. సినిమా చూసిన అభిమానులు ట్విట్టర్ వేదికగా తమ అభిప్రాయాన్ని పంచుకుంటున్నారు. మగిజ్ తిరుమేని దర్శకత్వంపై మంచి ప్రశంసలే వస్తున్నాయి. ఈ చిత్రంలో త్రిష అద్భుతంగా నటించడమే కాకుండా సరైన పాత్ర పడింది అంటూ మెచ్చుకుంటున్నారు. అయితే, ఈ మూవీలో అర్జున్ సర్జా పాత్ర ప్రధాన హైలెట్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. భారీ బడ్జెట్తో లైకా ప్రొడక్షన్స్ ఈ మూవీని తెరకెక్కించింది.ఇంట్రడక్షన్ సీన్తోనే అజిత్ దుమ్మురేపాడని, ఆ స్పీడ్ తగ్గకుండా సినిమాలో వేగం ఉంటుందని ఆడియన్స్ చెబుతున్నారు. అజిత్ ఎంట్రీ సీన్ థియేటర్లో గూస్బంప్స్ను తెప్పించేలా ఉంటుందని ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు. ఈ చిత్రాన్ని దర్శకుడు మగీజ్ తిరుమేని చాలా స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కించారని కోలీవుడ్ ప్రేక్షకులు చెబుతున్నారు. ఈ మూవీకి ప్రధాన బలం యాక్షన్ సీక్వెన్స్ అంటూ.. అవన్నీ హాలీవుడ్ రేంజ్లో ఉన్నాయని తెలుపుతున్నారు. ముఖ్యంగా ఇంటర్వెల్ సమయంలో వచ్చే ఒక ఫైట్ సీన్లో అజిత్, అర్జున్ పోటీపడుతారని, ఈ ట్రైన్ యాక్షన్ సీక్వెన్స్ ప్రేక్షకులను మరింత థ్రిల్లింగ్ను పంచుతాయని చెబుతున్నారు.పట్టుదల సినిమా కథ రొటిన్లా కాకుండా చాలా డిఫరెంట్గా చెప్పారని నెజన్లు తెలుపుతున్నారు. దర్శకత్వంతో పాటు సినిమాకు స్క్రీన్ ప్లే మరింత బలాన్ని ఇచ్చిందని అంటున్నారు. సినిమా ప్రారంభం నుంచే తర్వాత ఏం జరగబోతుందనే ఆసక్తి ప్రేక్షకుల్లో కలిగేలా ఉందన్నారు. ఇప్పటికే సినిమా చూసిన వారు చాలామంది 3.5 రేంటింగ్ పైగానే ఇస్తున్నారు. అజిత్ యాక్షన్ సీన్లకు అనిరుద్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ పీక్స్లో ఉంటుందని.. భారీ ఎలివేషన్స్కు అదిరిపోయే రేంజ్లో బీజీఎమ్ ఇరగదీశాడని అంటున్నారు. చాలా సర్ప్రైజ్లతో పట్టుదల సినిమా ఉంటుందని సినీ అభిమానులు మిస్ చేసుకోవద్దని కొందరు చెబుతున్నారు. అనుకోకుండా జరిగిన ఒక సంఘటనలో తన భార్య తప్పిపోతే ఆమె కోసం భర్త చేసిన పోరాటం ఎలా ఉంటుంది..? అనే కాన్సెప్ట్తో కథ ఉంటుందట. ఆమె జాడ కోసం హీరో ప్రయాణంలో ఎన్నో ట్విస్ట్లు ఎదురవుతూ ఉంటాయట. అయితే, చివరి వరకు ఏం జరుగుతుందో అనే టెన్షన్ను ప్రేక్షకులలో ఉండేలా కరెక్ట్గా కథను చెప్పాడని డైరెక్టర్పై ప్రశంసలు వస్తున్నాయి. ఫాస్ట్ ఫేజ్డ్ సర్వైవల్ థ్రిల్లర్ మూవీ అంటూ పేర్కొంటున్నారు.విదాముయార్చి (పట్టుదల) అజిత్కు కమ్బ్యాక్ సినిమా అంటూ చాలామంది రివ్యూవర్లు అంటున్నారు. త్రిష రోల్ కూడా చాలా కాలం పాటు గుర్తు పెట్టుకునేలా ఉంటుందని తెలుపుతున్నారు. క్యారెక్టరైజేషన్ కొత్తగా ఉండటంతో సినిమా అందరికీ నచ్చుతుందని చెబుతున్నారు. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అంటూ.. అజిత్, త్రిష కాంబోలో వచ్చే సీన్స్ బాగున్నాయని తెలుపుతున్నారు.పట్టుదల సినిమాపై కొందరు నిరుత్సాహంగా కూడా ఉన్నారు. కథ చాలా సాధారణమైనదని చెబుతున్నారు. ఇలాంటి యాక్షన్ థ్రిల్లర్ సినిమాలు గతంలో చాలా వచ్చాయని అంటున్నారు. కథలో వేగం లేదని చాలా నెమ్మదిగా చెప్పారని విమర్శలు వస్తున్నాయి. ఎక్కువగా కమర్షియల్ ఎలిమెంట్స్ కోసమే దర్శకుడు ప్లాన్ చేసుకున్నాడని అంటున్నారు. సినిమాను విమర్శించే వారు ఎక్కువగా 2.5 రేటింగ్ వరకు ఇచ్చారు.#VidaaMuyarchi #VidaaMuyarchiReview This isn’t a typical mass masala movie. Very serious, intense and high quality screenplay. Very engaging and yet stylish entertainer. Camera work and action sequences are Hollywood level making #AjithKumar sir acting is top notch❤️…— Karthik (@meet_tk) February 6, 2025#VidaaMuyarchi 1st Half reviews from USA are positive.. 👍— Ramesh Bala (@rameshlaus) February 6, 2025#Vidaamuyarchi: No Mass opening scene, No Mass BGM, No Mass scene/Build-up but yet director MagizhThirumeni has pulled up the First Half so racy💥#Anirudh has underplayed his BGM, for the content driven genre perfectly🎶 pic.twitter.com/k2xXiXGImA— AmuthaBharathi (@CinemaWithAB) February 6, 2025#Vidaamuyarchi is a strictly mediocre action thriller that has an interesting storyline and some decently executed twists but is narrated in a very slow manner that gets tedious at times! The basic plot line engages with some twists and the director doesn’t deviate much by…— Venky Reviews (@venkyreviews) February 6, 2025#VidaaMuyarchi First Review {4.75/5} : A masterclass in tension-building !! The screenplay smartly weaves paranoia and desperation into a fast-paced survival thriller. Every scene raises stakes as #AjithKumar's Arjun character spirals deeper into a nightmare after his wife… pic.twitter.com/6qJ41V9Pzi— Cinemapatti (@cinemapatti) February 5, 2025#Vidaamuyarchi Is An ‘INDUSTRY HIT’ 💣DOT!! 🎯 pic.twitter.com/z1Dutmkia4— AJITHKUMAR FANS CLUB (@ThalaAjith_FC) February 6, 2025#VidaaMuyarchiReview - Except for the short car sequence, not even one interesting scene.Below par & lethargic attempt by Magzhil 👎why AK why? 🙏VERDICT - Sai 🙏Sai🙏Bye Bye 🙏#Vidaamuyarchi #VidaamuyarchiFromFeb6 pic.twitter.com/xVq3UV4nIi— Harish N S (@Harish_NS149) February 6, 2025#Vidaamuyarchi AK Gud Screen Presence. AK-Trisha Romantic portion is Dull. Arjun, Regina Near. Music ok. Songs gud. Azerbaijan landscape visuals super. Weak Story, No emotions, No twists; Unexciting, Flat & Draggy Narration. Style with no substance. Total DISAPPOINTMENT!— Christopher Kanagaraj (@Chrissuccess) February 6, 2025 -
'పులి బిడ్డ' అంటూ అజిత్ కుమారుడి విజయంపై ప్రశంసలు
కోలీవుడ్ ప్రముఖ హీరో అజిత్ కుమారుడు ఆద్విక్ రన్నింగ్ రేసులో విజయం సాధించి ప్రథమ బహుమతి అందుకున్నారు. అందుకు సంబంధించిన వీడియోను అజిత్ ((Ajith Kumar)) సతీమణి షాలిని (Shalini) సోషల్మీడియాలో పంచుకున్నారు. ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్న ఈ వీడియోపై ఆయన అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. కారు రేసింగ్లో తండ్రి సత్తా చాటితే.. కుమారుడు రన్నింగ్ రేస్లో దుమ్మురేపుతున్నాడని, అదే రక్తం అంటూ..ఆద్విక్ను ఆకాశానికి ఎత్తేస్తున్నారు.అజిత్లాగే ఆయన కుమారుడు అద్విక్కి కూడా క్రీడలంటే చాలా ఆసక్తి. తాజాగా అద్విక్ తమిళనాడు అంతర్ పాఠశాలల క్రీడా పోటీలలో సత్తా చాటాడు. రన్నింగ్ రేస్, రిలే రేసులలో మొదటి స్థానంలో నిలిచి తండ్రికి తగిన కుమారుడని పేరు గడించాడు. ఏకంగా మూడు మెడల్స్ అందుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియోను షాలిని తన ఇన్స్టాగ్రామ్ పేజీలో షేర్ చేయడంతో అభిమానులు వైరల్ చేస్తున్నారు. వీడియో చూసిన నెటిజన్లు పులికి పులినే పుడుతుందంటూ కామెంట్లు చేస్తున్నారు. తండ్రి అంతర్జాతీయ స్థాయిలో విజయాలు సాధిస్తుంటే.. కుమారుడు పాఠశాల నుంచి తన విజయాలను మొదలు పెట్టాడని చెప్పుకొస్తున్నారు. భవిష్యత్తులో భారతదేశం గర్వపడేలా మంచి రన్నింగ్ రేసర్ కావాలని ఫ్యాన్స్ ఆశిస్తూ..శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.'అజిత్ కుమార్ రేసింగ్' పేరుతో ఇటీవల ఒక రేసింగ్ టీమ్ను ప్రకటించిన అజిత్.. దుబాయ్ వేదికగా జరిగిన '24హెచ్ దుబాయ్' కారు రేసింగ్లో పాల్గొని విజయాన్ని అందుకున్నారు. పలు దేశాలకు చెందిన రేసర్లతో పోటీపడి హోరా హోరీగా సాగిన ఈ పోటీల్లో ఆయన టీమ్ మూడో స్థానాన్ని కైవసం చేసుకుంది. కొద్దిరోజుల క్రితం జరిగిన ప్రమాదంలో గాయపడినప్పటికీ దానిని లెక్కచేయకుండా బరిలోకి దిగినందుకు గాను.. స్పిరిట్ ఆఫ్ రేస్ అనే అవార్డుతో అజిత్ను గౌరవించారు. సినీ పరిశ్రమకు అజిత్ చేసిన సేవలకు దేశంలోనే మూడో అత్యున్నత పురస్కారంతో కేంద్రం గౌరవించింది. తాజాగా ఆయన్ను పద్మభూషణ్తో సత్కరించింది. తన విజయానికి, సంతోషానికి షాలినీ ప్రధాన కారణం అని అవార్డ్ వచ్చిన సందర్భంగా అజిత్ తెలిపారు. ఆయన నటించిన కొత్త సినిమా 'గుడ్ బ్యాడ్ అగ్లీ' ఏప్రిల్ 10న తెలుగు,తమిళ్లో విడుదల కానుంది. ఈ మూవీని అధిక్ రవిచంద్రన్ తెరకెక్కిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్తో View this post on Instagram A post shared by Shalini Ajith Kumar (@shaliniajithkumar2022) -
ప్రతిభా భూషణాలు
గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం శనివారం ప్రతిష్టాత్మక పద్మ అవార్డులు ప్రకటించింది. కళల విభాగంలో నటులు నందమూరి బాలకృష్ణ, అజిత్, అనంత్,నాగ్, నటి శోభన, దర్శకుడు శేఖర్ కపూర్లకు పద్మభూషణ్ పురస్కారాన్ని ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం.పట్టుదలే పద్మభూషణ్ వరకూ...అజిత్ తండ్రి సుబ్రమణి తమిళనాడులో పుట్టారు. అయితే కేరళ మూలాలు ఉన్న కుటుంబం. తల్లి మోహినిదిపాకిస్థాన్ లోని కరాచీ. కోల్కతాలో స్థిరపడ్డ సింధీ కుటుంబం. కాగా కోల్కతాలో ఉద్యోగం చేస్తున్న సమయంలో మోహినితో ప్రేమలో పడ్డారు సుబ్రమణి. ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత సికిందరాబాద్లోని ఫార్మా కంపెనీలో ఉద్యోగం రావడంతో ఇక్కడ ఐదేళ్లు ఉంది ఆ కుటుంబం. వీరికి ముగ్గురు కుమారులు. అజిత్ రెండో కొడుకు. అజిత్కి ఏడాదిన్నర వచ్చాక చెన్నైలో స్థిరపడ్డారు. చదువులో లాస్ట్... అజిత్కి పెద్దగా చదువు అబ్బలేదు. అయితే క్రికెట్లో బెస్ట్. ఎన్ సీసీలోనూ మంచి ర్యాంకు సంపాదించాడు. కానీ సరిగ్గా చదవకపోవడంతో స్కూలు యాజమాన్యం అజిత్ని పదో తరగతి పరీక్షలు రాయడానికి అనుమతించకపోవడంతోపాటు స్కూలు నుంచి పంపించేసింది. ఆ తర్వాత రాయల్ ఎన్ ఫీల్డ్ బైకు షోరూమ్లో మెకానిక్ అప్రెంటిస్గా చేరడం, తల్లిదండ్రుల ్రపోద్భలంతో గార్మెంట్ ఎక్స్పోర్ట్ బిజినెస్లో చేరడం, అవి చేస్తూనే రేసుల్లోపాల్గొనడం, ఇలా సాగింది. ఇక ఎవరో ఇచ్చిన సలహాతో సినిమాల్లో ప్రయత్నించాలనుకున్నారు అజిత్. ప్రముఖ నటుడు–రచయిత–దర్శకుడు గొల్లపూడి మారుతీరావు తనయుడు శ్రీనివాస్ దర్శకత్వంలో అజిత్ హీరోగా ‘ప్రేమ పుస్తకం’ సినిమా ఆరంభమైంది. ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చెప్పడంతో నిర్మాత పూర్ణచంద్రరావు అజిత్ని హీరోగా తీసుకున్నారు. అయితే శ్రీనివాస్ మృతి చెందడంతో షూటింగ్ ఆగింది. ఆ తర్వాత ఆ చిత్రాన్ని మారుతీరావు పూర్తి చేశారు. అయితే ఆ సినిమా ఆశించిన ఫలితం సాధించలేదు.‘ఆశై’తో హిట్ ట్రాక్: ఎస్పీబీయే తమిళ దర్శకుడు సెల్వకి చెప్పి, అజిత్కి ‘అమరావతి’లో హీరోగా నటించే చాన్స్ ఇప్పించారు. ఆ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకోవడంతోపాటు లుక్స్, నటన పరంగా అజిత్కి మంచి గుర్తింపు వచ్చింది. అయితే ఓ రేసుకి సంబంధించిన ట్రయల్కి వెళుతుండగా జరిగిన ప్రమాదంలో వెన్నెముకకి సర్జరీ జరిగింది. ఆ తర్వాత ‘ఆశై’ (1995)తో అజిత్ కెరీర్ హిట్ ట్రాక్ ఎక్కింది. ఆ తర్వాత చేసిన ‘కాదల్ కోటై్ట’ (ప్రేమ లేఖ), ‘వాలి’ వంటివి సూపర్ హిట్. సినిమాలు చేస్తూనే బైక్, కారు రేస్లకూ వెళుతుంటారు. ఇటీవల కారు రేసులో అజిత్ టీమ్ విజయం సాధించింది. ప్రస్తుతం అజిత్ నటిస్తున్న చిత్రాల్లో ‘విడాముయర్చి’ తెలుగులో ‘పట్టుదల’గా విడుదల కానుంది. జీవితంలోనూ అజిత్కి పట్టుదల ఎక్కువ. ఆ పట్టుదలే నేడు ‘పద్మభూషణ్’ వరకూ తీసుకొచ్చింది. ఇక ‘అమర్కలమ్’ (1999) సినిమాలో నటించినప్పుడు అజిత్, హీరోయిన్ షాలిని ప్రేమలో పడ్డారు. 2000లో పెళ్లి చేసుకున్నారు. వీరికి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు.యాక్టివ్గా యాక్టింగ్ప్రముఖ కన్నడ నటుడు అనంత్ నాగ్ (76) గురించి నేటి తరానికి చెప్పాలంటే ‘కేజీఎఫ్’ సినిమా చాలు. ‘ప్రేమ లేఖలు’ (1977), ఆ తర్వాత ‘శాంతి క్రాంతి’, ‘శంఖారావం’ వంటి చిత్రాలతో నాటి తరం తెలుగు ప్రేక్షకుల్లో ఆయనకు బాగా గుర్తింపు ఉంది. ఇక నేటితరం తెలుగు ప్రేక్షకులకు ‘కేజీఎఫ్’ (2018) ద్వారా దగ్గరయ్యారు అనంత్ నాగ్. ఈ సినిమాలో ఆయన రచయితపాత్ర చేసిన విషయం గుర్తుండే ఉంటుంది. ‘సంకల్ప’ (1973) చిత్రంతో కన్నడంలో నటుడిగా పరిచయం అయ్యారు అనంత్ నాగ్. ఆ చిత్రం పలు అవార్డులు సాధించడంతోపాటు నటుడిగానూ గుర్తింపు తెచ్చిపెట్టింది. 50 ఏళ్ల నట జీవితంలో దాదాపు రెండువందల కన్నడ చిత్రాల్లోనూ, హిందీ, మరాఠీ, తెలుగు, మలయాళం, ఆంగ్లంలో దాదాపు వంద చిత్రాలు... మొత్తంగా మూడ వందల చిత్రాల్లో నటించారు అనంత్ నాగ్. కొన్ని సినిమాలు నిర్మించారు కూడా. పలు టీవీ షోల్లోనూ నటించారు. 76 ఏళ్ల వయసులోనూ యాక్టివ్గా ఉంటూ... సినిమాలు చేస్తున్నారు.కొత్త పంథాకి భూషణంశేఖర్ కపూర్ భారతీయ సినిమా రంగానికి, ముఖ్యంగా బాలీవుడ్కి మ్యాజికల్ టచ్ ఇచ్చిన నిన్నటి తరం దర్శక–నిర్మాత. చేసినవి కొన్ని సినిమాలే అయినా, సంపాదించిన కీర్తి, భారతీయ సినిమాకి తెచ్చిపెట్టిన గౌరవం గొప్పవి. ఇప్పటిపాకిస్థాన్లోని లాహోర్లో జన్మించారు. సినిమాల మీద మక్కువతో ముంబయి చేరుకున్నారు. మొదట నటుడుగా ప్రయత్నాలు చేశారు. దేవానంద్ ‘ఇష్క్ ఇష్క్ ఇష్క్’లో నటించారు. దూరదర్శన్ తొలిదశలో వచ్చిన ‘ఖాన్ దాన్’ మొదలైన టీవీ సీరియల్స్లో ప్రేక్షకులకి గుర్తుండిపోయే కొన్నిపాత్రలు చేశారు. ‘మాసూమ్’తో డైరెక్టర్గా...‘మాసూమ్’ సినిమాతో డైరెక్టర్గా తన కెరీర్ని కొత్త దారి పట్టించారు. ‘ది మేన్, విమెన్ అండ్ చైల్డ్’ అనే ఇంగ్లిష్ నవల ఆధారంగా శేఖర్ కపూర్ తీసిన సినిమా అది. భారతీయ సినిమాకి తెలియని కొత్త కథేమీ కాదు. కానీ సెన్సిబుల్గా కథని చెప్పారు. దాంతో శేఖర్ కపూర్ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.స్టయిల్ మార్చేశారుఇండియాలో అన్ని వర్గాల ఆడియన్స్కి శేఖర్ కపూర్ని ఓ బ్రాండ్గా మార్చిన సినిమా ‘మిస్టర్ ఇండియా’. ‘ది ఇన్విజిబుల్ మేన్’ అనే కామిక్స్ స్ఫూర్తితో ‘మిస్టర్ ఇండియా’ కథ రూపొందింది. హిందీలో అదృశ్య వ్యక్తి హీరోగా అంతకు మునుపు కొన్ని సినిమాలు వచ్చాయి. అయితే ఈ ఐడియానిపాపులర్ పల్ప్ ఫిక్షన్ చేసిన ఘనత శేఖర్ కపూర్దే. కమర్షియల్ కథలను కొత్తగా చెప్పే డైరెక్టర్ వచ్చాడని బాలీవుడ్ మురిసిపోయినంత సేపు పట్టలేదు – శేఖర్ కపూర్ తన స్టయిల్ మార్చేశారు.బాండిట్ క్వీన్కి అడ్డంకులు... అవార్డులుచంబల్ లోయకి చెందిన బందిపోటు పూలన్ దేవి జీవిత గాథ ఆధారంగా ‘బాండిట్ క్వీన్’ సినిమా తీశారు శేఖర్. సెన్సేషనల్ హిట్ అయిన ఆ సినిమా పలు సెన్సార్ సమస్యలు ఎదుర్కొంది. రిలీజ్ అయ్యాక చాలా అవార్డులు గెలుచుకుంది. శేఖర్ కపూర్ దృక్పథాన్ని మార్చింది. బ్రిటన్ మహారాణి జీవితం ఆధారంగా ‘ఎలిజిబెత్’ సినిమా తీశారు. అంతర్జాతీయంగా శేఖర్ కపూర్ పేరు మారుమోగిపోయింది. ఆ చిత్రం ఆస్కార్ అవార్డ్స్లో ఏడు నామినేషన్లు దక్కించుకుంది. ఆ తర్వాత ఆయన ‘ది ఫోర్ ఫెదర్స్’ (2002), ‘ఎలిజెబెత్’కి సీక్వెల్గా ‘ఎలిజెబెత్: ది గోల్డెన్ ఏజ్’ (2007)ని తెరకెక్కించారు. ఎన్నో ఏళ్ళ క్రితమే భారతీయ సినిమాని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్ళిన శేఖర్ కపూర్ పద్మ భూషణుడు కావడం చిత్రసీమకు లభించిన గిఫ్ట్.– తోట ప్రసాద్, ప్రముఖ సినీ రచయితఆమె కెరీర్ శోభాయమానంకేరళలోని త్రివేండ్రంలో (ప్రస్తుతం తిరువనంతపురం) 1970 మార్చి 21న జన్మించారు శోభన. ఆమె పూర్తి పేరు శోభనా చంద్రకుమార్ పిళ్లై. నాట్యంలోనూ, నటనలోనూ ప్రసిద్ధి చెందిన లలిత, పద్మిని, రాగిణిల మేనకోడలైన శోభనకు చిన్నప్పటి నుంచి భరతనాట్యం అంటే చాలా ఇష్టం. అక్కినేని నాగేశ్వరరావు నట వారసుడిగా అక్కినేని నాగార్జున హీరోగా పరిచయమైన ‘విక్రమ్’ (1986) సినిమాతో తెలుగు పరిశ్రమకు హీరోయిన్గా పరిచయమయ్యారు శోభన. ఆ తర్వాత కృష్ణ, చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేశ్, మోహన్బాబు, రజనీకాంత్, మోహన్ లాల్, రాజేంద్ర ప్రసాద్, శరత్ బాబు, కార్తీక్ వంటి హీరోల సరసన నటించారు.మాతృభాష మలయాళంతోపాటు తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, ఇంగ్లిష్ భాషల్లో సినిమాలు చేసిన శోభన అందం, అభినయంతో ప్రేక్షకుల్లో తనకంటూ మంచి గుర్తింపు సొంతం చేసుకున్నారు. ‘రుద్రవీణ, అభినందన, అల్లుడుగారు, అప్పుల అప్పారావ్, రౌడీగారి పెళ్లాం, రౌడీ అల్లుడు’ వంటి పలు తెలుగు హిట్ సినిమాలు ఆమె ఖాతాలో ఉన్నాయి. నటనలోనే కాకుండా నాట్యంలో కూడా అద్భుతంగా రాణించారు. చెన్నైలోని చిదంబరం నాట్య అకాడమీలో శిక్షణ పొందిన ఆమె క్లాసికల్ డ్యాన్సర్గానూ దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకున్నారు.నేటి తరానికి చెందిన ఎందరో కళాకారిణులు ఆమె దగ్గర నటనలోనూ, నాట్యంలోను శిక్షణ తీసుకుంటుండటం విశేషం. 1994లో ‘కళార్పణ’ అనే సంస్థను నెలకొల్పారు శోభన. ప్రస్తుతం ఆమె పెద్దగా సినిమాలు చేయడం లేదు. వివాహం కూడా చేసుకోకుండా తన జీవితాన్ని కళకు అంకితం చేశారు. ఓ వైపు దేశ విదేశాల్లో క్లాసికల్ డ్యాన్స్ షోలు చేస్తూ.. మరోవైపు డ్యాన్స్ స్కూల్ నడిపిస్తున్నారామె.నటసింహ కీర్తి కిరీటంలో...నందమూరి తారక రామారావు, బసవతారకం దంపతులకు 1960 జూన్ 10న చెన్నైలో జన్మించారు బాలకృష్ణ. ఎన్టీఆర్ హీరోగా నటించి, స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ‘తాతమ్మ కల’ చిత్రంతో నటుడిగా రంగప్రవేశం చేశారు బాలకృష్ణ. 1974 ఆగస్టు 30న ఆ సినిమా విడుదలైంది. ఆ సినిమాలో నటించే నాటికి బాలకృష్ణ వయస్సు 14 ఏళ్లు. ఆ తర్వాత ‘రామ్ రహీమ్, అన్నదమ్ముల అనుబంధం, దాన వీర శూర కర్ణ’ వంటి పలు చిత్రాల్లో నటించారు.‘సాహసమే జీవితం’తో హీరోగా1984 జూన్ 1న రిలీజైన ‘సాహసమే జీవితం’ సినిమా ద్వారా హీరోగా పరిచయమయ్యారు బాలకృష్ణ. ఆ తర్వాత ‘డిస్కో రాజా, జననీ జన్మభూమి’ వంటి చిత్రాల్లో నటించారు. అయితే కోడి రామకృష్ణ దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా నటించిన ‘మంగమ్మగారి మనవడు’ చిత్రం 1984 సెప్టెంబరు 7న విడుదలై, సూపర్ హిట్గా నిలిచింది. దీంతో సోలో హీరోగా స్థిరపడ్డారాయన. ఆ తర్వాత ‘కథానాయకుడు, ముద్దుల మామయ్య, లారీ డ్రైవర్, ఆదిత్య 369, రౌడీ ఇన్ స్పెక్టర్, బంగారు బుల్లోడు, భైరవద్వీపం, బొబ్బిలి సింహం, ముద్దుల మొగుడు, సమర సింహారెడ్డి, నరసింహæనాయుడు, చెన్నకేశవ రెడ్డి, లక్ష్మీ నరసింహా, సింహా, లెజెండ్, లయన్, పైసా వసూల్, అఖండ, వీర సింహారెడ్డి, భగవంత్ కేసరి’ వంటి పలు విజయవంతమైన సినిమాల్లో నటించి, ప్రేక్షకులను అలరించారాయన. 50 ఏళ్ల నట ప్రస్థానంలో...‘భైరవ ద్వీపం, శ్రీకష్ణార్జున విజయం,పాండురంగడు, శ్రీరామ రాజ్యం’ వంటి చిత్రాలతో పౌరాణిక, జానపద చిత్రాల్లో తండ్రికి తగ్గ తనయుడిగానూ నిరూపించుకున్నారు బాలకృష్ణ. నటుడిగా పవర్ఫుల్ డైలాగులు చెప్పడంలోనూ, పౌరుషాన్ని గాంభీర్యంగా ప్రదర్శించడంలోనూ తనకు తానే సాటి అని నిరూపించుకున్నారాయన. ఇప్పటివరకు 110 సినిమాల్లో నటించారు. వాటిలో చారిత్రక, జానపద, పౌరాణిక, సాంఘిక చిత్రాలు ఉన్నాయి. నటుడిగా 50 ఏళ్ల ప్రస్థానం పూర్తి చేసుకున్నారు బాలకృష్ణ. ఇక ఆంధ్రప్రదేశ్లోని హిందూపురం నియోజకవర్గం నుంచి వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు బాలకృష్ణ. అలాగే బసవ తారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్గానూ సేవలందిస్తున్నారు. ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో ‘అఖండ 2: తాండవం’ సినిమాలో నటిస్తున్నారు బాలకృష్ణ. బాలకృష్ణకి భార్య వసుంధరా దేవి, కుమార్తెలు బ్రాహ్మణి, తేజస్విని, కుమారుడు మోక్షజ్ఞ ఉన్నారు. బాలకృష్ణ నట వారసుడిగా మోక్షజ్ఞ త్వరలో హీరోగా పరిచయం కానున్నారు. -
కోలీవుడ్లో గేమ్ చేంజ్
సంక్రాంతి అంటే స్టార్ హీరోల చిత్రాలు కనీసం మూడు నాలుగైనా ఉండాలి. అప్పుడే సినీ లవర్స్కి అసలైన పండగ. కానీ ఈ పొంగల్కి తమిళ తెరపై ఒకే ఒక్క స్టార్ హీరో కనిపించనున్నారు. అది కూడా తెలుగు స్టార్ రామ్చరణ్. ‘గేమ్ చేంజర్’ తమిళంలో డబ్ అయి, విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఇక తమిళంలో అజిత్ ‘విడాముయర్చి’ పొంగల్ రేసు నుంచి తప్పుకుంది. మొత్తంగా తమిళంలో ఆరేడు స్ట్రయిట్ చిత్రాలు పొంగల్కి రానున్నాయి. అవి కూడా మీడియమ్ కంటే ఓ మెట్టు ఎక్కువ ఉన్న హీరోలు, ఓ మెట్టు తక్కువ ఉన్న హీరోలవే. హీరోల రేంజ్ పక్కన పెడితే... ఒకవేళ కథాబలం ఉండి, ప్రేక్షకులను ఆకట్టుకుంటే మీడియమ్ రేంజ్ సినిమా పెద్ద రేంజ్ అయిపోతుంది. మరి... పొంగల్పోటీలో వసూళ్లు కొల్లగొట్టే సినిమా ఏది? అనేది తర్వాత డిసైడ్ అవుతుంది. ఇక ఈ పొంగల్కి తెరపైకి రానున్న చిత్రాల గురించి తెలుసుకుందాం...తెలుగు సినిమాకి సంక్రాంతి సీజన్ ఎంత ముఖ్యమో తమిళ ఇండస్ట్రీకి పొంగల్ కూడా అంతే ముఖ్యం. వరుస సెలవులను క్యాష్ చేసుకునే వీలు ఉన్న సీజన్ కాబట్టి భారీ చిత్రాల విడుదలను ప్లాన్ చేస్తుంటారు. ఎప్పటిలానే ఈసారి తెలుగులో భారీ చిత్రాలు విడుదలకు సిద్ధం అయ్యాయి. సీనియర్ స్టార్ హీరోలు బాలకృష్ణ ‘డాకు మహారాజ్’, వెంకటేశ్ ‘సంక్రాంతికి వస్తున్నాం’ సంక్రాంతి సందడికి రెడీ అయ్యాయి. యంగ్ స్టార్ రామ్చరణ్ నటించిన ‘గేమ్ చేంజర్’ కూడా ఈ పండగకి రానుంది. అయితే అటు తమిళంలో మాత్రం మీడియమ్ రేంజ్ హీరోల చిత్రాలే విడుదల కానున్నాయి. ఆ మాట కొస్తే... గతేడాది కూడా కోలీవుడ్ పరిస్థితి ఇదే. ధనుష్ ‘కెప్టెన్ మిల్లర్’ మినహా మిగతావన్నీ ఓ మోస్తరు చిత్రాలే.ఈసారి అజిత్ ‘విడాముయర్చి’ రావాల్సింది కానీ సంక్రాంతి రేసు నుంచి ఆ సినిమా తప్పుకోవడంతో ఇక పొంగల్కి పెరియ పడమ్ ఇల్లే (సంక్రాంతికి పెద్ద సినిమా లేదు) అన్నట్లు అయింది. సో... ఉన్నదంతా ‘గేమ్ చేంజర్’ మాత్రమే. అనువాద రూపంలో తమిళ తెరపై ‘గేమ్ చేంజర్’ కనిపించనుంది. ‘ఆర్ఆర్ఆర్’తో గ్లోబల్ స్టార్ అనిపించుకున్న రామ్చరణ్ హీరోగా నటించిన చిత్రం కావడం, తమిళ దర్శకుడు శంకర్ తెరకెక్కించిన చిత్రం కావడం, సక్సెస్ఫుల్ ప్రోడ్యూసర్ ‘దిల్’ రాజు నిర్మించిన చిత్రం కావడంతో ‘గేమ్ చేంజర్’పై తమిళనాడులోనూ భారీ అంచనాలు ఉన్నాయి. సో... ఒక స్టార్ డైరెక్టర్–స్టార్ హీరో–స్టార్ ప్రోడ్యూసర్ కాంబినేషన్లో రూపొందిన చిత్రం కావడంతో కోలీవుడ్ పొంగల్ బాక్సాఫీస్ దగ్గర ఆట అంతా ‘గేమ్ చేంజర్’దే అని చె΄÷్పచ్చు. వేరే పెద్ద చిత్రాలు లేకపోవడంతో ఈ చిత్రానికే ఎక్కువ థియేటర్లు లభించాయి. ‘గేమ్ చేంజర్’కి ఇదో మంచి అవకాశం.10న 3 సినిమాలు ఈ నెల 10న తెలుగులోనూ, అనువాద రూపంలో తమిళ్, హిందీ భాషల్లోనూ ‘గేమ్ చేంజర్’ విడుదల కానుంది. అనిత సమర్పణలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, ‘దిల్’ రాజు ప్రోడక్షన్ బ్యానర్స్పై ‘దిల్’ రాజు, శిరీష్ దాదాపు రూ.450 కోట్లతో ఈ చిత్రాన్ని నిర్మించినట్లు సమాచారం. శంకర్ అంటే దాదాపు లార్జ్ స్కేల్ సినిమానే అవుతుందని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ‘గేమ్ చేంజర్’తోపాటు 10న తమిళంలో విడుదల కానున్న వాటిలో విలక్షణ నటుడు బాల దర్శకత్వంలో అరుణ్ విజయ్ నటించిన ‘వణంగాన్’, మలయాళ నటుడు షానే నిగమ్ తమిళ తెరకు హీరోగా పరిచయం అవుతున్న ‘మద్రాస్క్కారన్’ చిత్రాలు ఉన్నాయి. నిజానికి ‘వణంగాన్’ని సూర్య హీరోగా ప్లాన్ చేశారు బాల.అయితే కొన్ని కారణాల వల్ల అరుణ్ విజయ్తో ఈ చిత్రం చేశారు. ఒకవేళ సూర్యతో చేసి ఉంటే... పొంగల్ రేస్లో తమిళంలో ఓ స్టార్ ఉండి ఉండేవారు. ఇక ‘మద్రాస్ క్కారన్’ విషయానికొస్తే... గతేడాది ‘రంగోలి’ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమైన వాలీ మోహన్దాస్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. మలయాళ యంగ్ హీరో షానే నిగమ్ నటించారు. 11 ఏళ్ల తర్వాత 12న ఇక పొంగల్ రేస్లోని తమిళ చిత్రాల్లో చెప్పుకోదగ్గ మాస్ హీరో అంటే విశాల్. ‘మద గజ రాజా’ చిత్రంతో ఈ 12న రానున్నారు విశాల్. ఈ సినిమా 2013లో విడుదల కావాల్సింది. కొన్ని కారణాల వల్ల కుదరలేదు. చివరికి 11 ఏళ్ల తర్వాత ఈ 12న విడుదల కానుంది. సుందర్.సి దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది.పొంగల్ రోజున... పండగ రోజున ఆకాశ్ మురళి అనే నూతన హీరో వెండితెరకు పరిచయం కానున్నారు. ‘ఇదయం’ (హృదయం) ఫేమ్ మురళి రెండో కుమారుడే ఆకాశ్ మురళి. ఆల్రెడీ పెద్ద కుమారుడు అథర్వ హీరోగా (తెలుగులో ‘గద్దలకొండ గణేశ్’లో నటించారు) సినిమాలు చేస్తున్నారు. ఇక తమిళంలో ‘బిల్లా, ఆరంభం’ చిత్రాలతో మంచి మాస్ స్టయిలిష్ దర్శకుడు అనిపించుకున్న విష్ణువర్ధన్ నూతన హీరో ఆకాశ్ మురళితో తీసిన ‘నేసి΄్పాయా’ 14న రిలీజ్ కానుంది. ఈ చిత్రంలో ప్రముఖ దర్శకుడు శంకర్ కుమార్తె అదితీ శంకర్ హీరోయిన్గా నటించారు.ఇక పండగ రోజున సీనియర్ హీరో ‘జయం రవి’ ప్రేమించడానికి సమయం లేదంటూ ప్రేక్షకులు ముందుకొస్తున్నారు. ఆయన హీరోగా నిత్యామీనన్ హీరోయిన్గా నటించిన ‘కాదలిక్క నేరమిల్లై’ (ప్రేమించడానికి సమయం లేదు) చిత్రం ఈ 14న విడుదల కానుంది. ఈ చిత్రానికి కృతికా ఉదయనిధి స్టాలిన్ దర్శకత్వం వహించారు.ఇలా పొంగల్ రేసులో తమిళంలో ఐదు చిత్రాలు నిలవగా, వాటిలో విశాల్, ‘జయం’ రవి పేరున్న హీరోలు కాగా... వీరి తర్వాత అరుణ్ విజయ్ కొంచెం చెప్పుకోదగ్గ హీరో కాగా... మిగతా ఇద్దరిలో యువ హీరోలు ఆకాశ్ మురళి, షానే నిగమ్ ఉన్నారు. ఈ ఐదు చిత్రాలే కాకుండా మరో రెండు మూడు చిన్న సినిమాలు కూడా విడుదల కానున్నాయి. సో... ఎలా చూసుకున్నా పొంగల్కి తమిళ ప్రేక్షకుల ముందుకు రానున్న పెద్ద సినిమా ‘గేమ్ చేంజర్’ మాత్రమే. మరి... వసూళ్ల పరంగా ఈ సినిమా ప్రభావం ఇతర చిత్రాలపై ఏ మేరకు ఉంటుంది? పొంగల్పోటీలో బాక్సాఫీస్ హిట్ ఏ సినిమాకి దక్కుతుంది? అనేది మరో వారంలో తెలిసిపోతుంది. గేమ్ చేంజర్తో రీ ఎంటర్ కావడం హ్యాపీ ‘సందడే సందడి’తో నిర్మాతగా తెలుగులో ఆదిత్యా రామ్ ప్రయాణం ఆరంభమైంది. ఆ తర్వాత ‘ఖుషీ ఖుషీగా, స్వాగతం, ఏక్ నిరంజన్’ చిత్రాలు నిర్మించారాయన. ‘ఏక్ నిరంజన్’ (2009) తర్వాత మళ్లీ సినిమాలు నిర్మించలేదు. చెన్నైలో రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నారు. కాగా ‘గేమ్ చేంజర్’ని తమిళంలో విడుదల చేస్తున్నారు ఆదిత్యా రామ్. ‘‘చాలా కాలం తర్వాత ఒక గ్రాండ్ స్కేల్ సినిమాతో వస్తున్నందుకు ఆనందంగా ఉంది. తమిళనాడులో దాదాపు నాలుగువందల స్క్రీన్స్లో విడుదల చేస్తున్నాం. రామ్చరణ్ హీరోగా శంకర్ డైరెక్షన్లో వస్తున్న ‘గేమ్ చేంజర్’ ఈ వీకెండ్కి పెద్ద సినిమా అవుతుంది. ‘దిల్’ రాజుగారి సినిమాని విడుదల చేయడం ఆనందంగా ఉంది’’ అని పేర్కొన్నారు ఆదిత్యా రామ్. – డి.జి.భవాని‘విడాముయర్చి’ రాకపోవడం నిరుత్సాహమే ‘‘పొంగల్ చాలా పెద్ద పండగ. పైగా ఇది పెద్ద వీకెండ్. పెద్ద హీరోల సినిమాలు రాకపోతే అస్సలు పండగలానే అనిపించదు. తమిళనాడులోని థియేటర్ ఓనర్స్ అందరూ అజిత్ హీరోగా నటించిన ‘విడాముయర్చి’ కోసం ఎదురు చూశారు. హఠాత్తుగా ఈ సినిమా వాయిదా పడటంతో అందరూ నిరుత్సాహపడ్డారు’’ అంటూ తమిళ చిత్రపరిశ్రమకు చెందిన ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. -
వేసవిలో యాక్షన్
అజిత్ కుమార్ హీరోగా నటించిన స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’. త్రిష హీరో యిన్ . ‘మార్క్ ఆంటోని’ ఫేమ్ అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో మైత్రీమూవీమేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవి శంకర్ నిర్మించారు.ఈ మూవీని వేసవిలో ఏప్రిల్ 10న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించి, కొత్త పోస్టర్ను రిలీజ్ చేశారు మేకర్స్. ‘‘అజిత్పాత్రలో డిఫరెంట్ షేడ్స్ ఉంటాయి. ఇండియన్ మూవీ చరిత్రలోనే ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ ఓ మైలురాయిగా నిలుస్తుంది’’ అని యూనిట్ పేర్కొంది. ఈ సినిమాకు జీవీ ప్రకాష్కుమార్ సంగీతం అందించారు. కాగా ఈ చిత్రాన్ని తొలుత సంక్రాంతికి రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ, ఏప్రిల్లో రిలీజ్ అవుతోంది. -
రామ్ చరణ్ ను టార్గెట్ చేసిన అజిత్!
-
స్టార్ హీరో రెండు సినిమాలూ సంక్రాంతికే విడుదల
సంక్రాంతి లాంటి పండగని స్టార్ హీరోలు వదులుకోవాలని అనుకోరు. ఇద్దరు ముగ్గురు హీరోలైనా సరే తమ సినిమాల్ని రెడీ చేస్తారు. తెలుగులో అయితే రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్', బాలకృష్ణ 'డాకు మహారాజ్', వెంకటేశ్ 'సంక్రాంతికి వస్తున్నాం' చిత్రాలతో రాబోతున్నారు. తమిళంలో ఈసారి కొత్త మూవీస్ ఏమున్నాయా అని చూస్తే ఒకే స్టార్ హీరో రెండు సినిమాల్ని రిలీజ్ చేయబోతున్నట్లు చెప్పి అభిమానుల్ని తికమక పెడుతున్నారు.(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 28 సినిమాలు)తమిళ స్టార్ హీరోల్లో అజిత్ ఒకడు. తెలుగు నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్తో కలిసి 'గుడ్ బ్యాడ్ అగ్లీ' అనే సినిమా చేస్తున్నాడు. దీన్ని సంక్రాంతికే రిలీజ్ చేస్తామని ఈ మధ్య నిర్మాతలు ప్రకటించారు. ఇదిలా ఉండగానే.. అజిత్ మరో మూవీ 'విడాముయార్చి' కూడా సంక్రాంతికే వస్తున్నట్లు చెప్పి షాకిచ్చారు.గురువారం రాత్రి 'విడాముయార్చి' టీజర్ రిలీజ్ చేశారు. యాక్షన్ ఎంటర్టైనర్లా అనిపించింది. అనిరుధ్ మ్యూజిక్ కూడా వెరైటీగా బాగానే ఉంది. కానీ పొంగల్ రిలీజ్ అని చివర్లో చెప్పడం విచిత్రంగా అనిపించింది. ఎందుకంటే అజిత్ నుంచే రెండు సినిమాలు, అది కూడా సంక్రాంతికి రిలీజ్ అని నిర్మాతలు ప్రకటించారు. కానీ ఇద్దరిలో ఎవరో ఒకరు తగ్గుతారా? లేదా పంతానికి పోయి ఇద్దరూ తమ మూవీస్ తీసుకొస్తారా అనేది చూడాలి? ఒకవేళ ఏది రిలీజైనా సరే 'గేమ్ ఛేంజర్' తమిళ వెర్షన్కి థియేటర్ల సమస్య మాత్రం గ్యారంటీ.(ఇదీ చదవండి: చైతూ-శోభిత పెళ్లి సందడి.. హల్దీ ఫొటోలు వైరల్) -
భార్య పుట్టినరోజు.. ఖరీదైన కారు గిఫ్ట్ ఇచ్చిన స్టార్ హీరో
తమిళ స్టార్ హీరో అజిత్ ఒకడు. ప్రస్తుతం 'గుడ్ బ్యాడ్ అగ్లీ' సినిమా చేస్తున్నాడు. ఇతడి భార్య షాలిని.. తెలుగు ప్రేక్షకులకు కాస్త పరిచయమే. చిరంజీవి 'జగదేకవీరుడు అతిలోక సుందరి' మూవీలో చైల్డ్ ఆర్టిస్టుగా చేసింది. రీసెంట్గా తన 44వ పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకుంది. షూటింగ్ నిమిత్తం యూకేలో ఉన్న అజిత్.. భార్య పుట్టినరోజుకి రాలేకపోయాడు. అయితేనేం ఖరీదైన లగ్జరీ కారుని బహుమతి ఇచ్చాడు.(ఇదీ చదవండి: టాలీవుడ్ హీరోయిన్గా టీమిండియా క్రికెటర్ భార్య!)నవంబర్ 20న షాలినీ.. తన పుట్టినరోజు నాడే లెక్సెస్ LM 350h మోడల్ కొత్త కారుతో కనిపించింది. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అలా అజిత్.. షాలినికి కారు బహమతిగా ఇవ్వడం బయటకొచ్చింది. మార్కెట్లో కారు ఖరీదు రెండున్నర కోట్ల రూపాయలకు పైనే ఉందని తెలుస్తోంది. అంతకు ఈ ఏడాది మే 1న అజిత్ పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకున్నాడు. అప్పుడు తన భర్తకు ఇష్టమని చెప్పి, డుకాటీ లేటెస్ట్ మోడల్ రేస్ బైక్ని షాలినీ గిఫ్ట్ ఇచ్చింది. ఇలా భార్య, భర్తకు బహుమతి ఇవ్వగా.. ఇప్పుడు తిరిగి అతడి భార్యకు కారు గిఫ్ట్ ఇచ్చాడు.ఇదంతా పక్కనబెడితే అజిత్ 'గుడ్ బ్యాడ్ అగ్లీ' మూవీ సంక్రాంతి రేసులో ఉందని అంటున్నారు. అది కూడా 'గేమ్ ఛేంజర్'తో పాటు జనవరి 10నే థియేటర్లలోకి వస్తుందని అంటున్నారు. ఒకవేళ ఇదే జరిగితే మాత్రం తెలుగు రాష్ట్రాల వరకు ఇబ్బంది ఉండకపోవచ్చు గానీ తమిళనాడులో మాత్రం చరణ్ మూవీ కలెక్షన్స్ తగ్గే అవకాశముంది.(ఇదీ చదవండి: నిశ్చితార్థం చేసుకున్న 'బిగ్బాస్ 8' సోనియా.. పెళ్లెప్పుడంటే?) -
రేసులో అజిత్.. ఉదయనిధి స్టాలిన్ అభినందన
కోలీవుడ్ సినీ నటుడు అజిత్ కుమార్కు తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ అభినందనలు తెలియజేశారు. తమిళనాడు ఖ్యాతిని అంతర్జాతీయ వేదికపై చాటుతుండటాన్ని గుర్తు చేస్తూ కొనియాడారు. సినీ నటుడు అజిత్ కొత్త అవతారం ఎత్తారు. అజిత్కుమార్ రేసింగ్ టీం పేరిట టీమ్ లోగోను తాజాగా ఆవిష్కరించారు. సరికొత్త పాత్రలో రేసర్గా వస్తున్నట్టు అజిత్ ఆనందంగా ప్రకటించారు. రేసర్గా తన ప్రయాణంలో గెలవాలనే సంకల్పంతో ముందుకు సాగనున్నట్టు పేర్కొన్నారు. దుబాయ్లో త్వరలో జరగనున్న దుబాయ్ 24 హెచ్ 2025 పోటీలలో తొలిసారిగా అజిత్కుమార్ రేసింగ్ టీం పాల్గొనబోతున్నట్లు ప్రకటించారు. ఈ పోటీల ట్రయల్ రన్ ప్రస్తుతం దుబాయ్లో జరుగుతోంది. ఇందులో తమిళనాడు స్పోర్ట్స్ విభాగం లోగోను ధరించి ఈ ట్రయల్ రన్లో దూసుకెళ్తున్న వీడియో వైరల్గా మారింది. తమిళనాడు స్పోర్ట్స్ అండ్ డెవలప్మెంట్ విభాగం నేతృత్వంలో క్రీడాభ్యున్నతికి జరుగుతున్న తోడ్పాటుకు మరింత బలం చేకూర్చే విధంగా అజిత్ ఆ లోగో ధరించడాన్ని ఉదయనిధి స్టాలిన్ ప్రశంసించారు. అంతర్జాతీయ వేదికగా తమిళనాడు స్పోర్ట్స్ను చాటడం గర్వించ దగ్గ విషయం అని, ఇందుకు అభినందనలు తెలియజేశారు. -
సంక్రాంతి బరిలోనే...
అజిత్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ స్పెయిన్లోని మ్యాడ్రిడ్లో జరుగుతోంది. ఈ లాంగ్ షెడ్యూల్లో ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలతో పాటు యాక్షన్, సాంగ్ చిత్రీకరణలను కూడా ప్లాన్ చేశారు. ఈ చిత్రంలో సునీల్, ప్రసన్న కీలక పాత్రలు పోషిస్తున్నారు. అలాగే ఈ చిత్రంలో త్రిష హీరోయిన్గా నటిస్తున్నారని, హీరోయిన్ శ్రీలీల మరో లీడ్ రోల్లో కనిపిస్తారనే ప్రచారం సాగుతోంది.మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్న ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ సంక్రాంతికి విడుదల కానుంది. అయితే ఈ సినిమాకన్నా ముందే అజిత్ హీరోగా కమిటైన ‘విడాముయర్చి’ చిత్రం సంక్రాంతికి విడుదలతుందని, ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ వచ్చే వేసవిలో రిలీజ్ కానుందనే ప్రచారం తెరపైకి వచ్చింది. కానీ తాజాగా ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ సంక్రాంతికే రిలీజ్ అవుతుందని వెల్లడించి, అజిత్ కొత్త లుక్ను యూనిట్ రిలీజ్ చేసింది. దీంతో ‘విడాముయర్చి’ చిత్రం వచ్చే వేసవిలో రిలీజ్ అవుతుందని ఊహించవచ్చు. -
మతం, కులం మనల్ని ద్వేషించేలా చేస్తాయి: అజిత్
తమిళ నటుడు అజిత్ను తెలుగు ప్రజలు కూడా ఆదరిస్తారు. సినిమాలకు ఆయన ఎంత ప్రాధాన్యత ఇస్తారో.. అంతే స్థాయిలో ట్రావెలింగ్ను కూడా ఇష్టపడుతారు. అజిత్కు ఏమాత్రం విరామం దొరికినా బైక్, కార్ సాయంతో టూర్స్ వెళ్తుంటారు. ఈ క్రమంలో తాజాగా తన ట్రావెలింగ్ విశేషాలు తెలుపుతూ ఓ వీడియో పంచుకున్నారు. సోషల్మీడియాలో ట్రెండ్ అవుతున్న అందులో పలు ఆసక్తికరమైన విషయాలను అజిత్ పంచుకున్నారు. ట్రావెలింగ్ చేయడం వల్ల చాలా విషయాలు తెలుసుకోవడంతో పాటు కొత్త వ్యక్తులతో పరిచయాలు కూడా పెరుగుతాయని పేర్కొన్నారు.ప్రపంచానికి ట్రావెలింగ్ను ప్రమోట్ను చేయడం చాలా ఇష్టమని అజిత్ తెలిపారు. జీవితంలో ఇలా ప్రయాణించడం వల్ల ఉత్తమ విద్యను అందిస్తుదని నేను నమ్ముతున్నాను. ఇంత కంటే బెస్ట్ ఎడ్యుకేషన్ ఇంకోకటి లేదనేది నా అభిప్రాయం. మతం, కులం అనేవి రెండూ కూడా మనం జీవితంలో ఎప్పుడు కలవనివారిని కూడా ద్వేషించేలా చేస్తాయని ఒక సూక్తి ఉంది. అది నిజం అని నేను నమ్ముతాను. ఎందుకంటే..? ఎదుటి వారితో మనకు పరిచయం లేనప్పటికీ వారు ఎలాంటివారో డిసైడ్ చేసేస్తాం. మనం ట్రావెల్ చేస్తున్న క్రమంలో వివిధ మతాలకు చెందిన వారిని కలుస్తూ ఉంటాం. వారితో మాట్లాడినప్పుడు వాళ్లు ఏంటో మనకు తెలుస్తుంది. మన ఆలోచన ఎంత తప్పో అర్థం అవుతుంది. వివిధ మతాల వారిని కలిసినప్పుడు వారి సంస్కృతి, సంప్రదాయాల గురించి తెలుసుకుంటాం. దీంతో ఇతరులపై సానుభూతి ఏర్పడుతుంది. అప్పుడు మీరు ఉన్నతమైన వ్యక్తిగా ఎదుగుతారు. అందుకే ట్రావెలింగ్ చేసి మనకు తెలియని వ్యక్తులను కలవండి.' అంటూ అజిత్ పేర్కొన్నారు.ప్రస్తుతం అజిత్, త్రిష జంటగా రూపొందుతున్న చిత్రం ‘విడా ముయర్చి’ (పట్టు వదలకుండా ప్రయత్నించడం) షూటింగ్ పనుల్లో బిజీగా ఉన్నారు. లైకా ప్రోడక్షన్స్పై మగిళ్ తిరుమేని దర్శకత్వంలో సుభాస్కరన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మాగిజ్ తిరుమేని దర్శకత్వం వహిస్తున్నారు. మరోవైపు 'గుడ్ బ్యాడ్ అగ్లీ' చిత్రంలోనూ ఆయన నటిస్తున్నారు. 'మార్క్ ఆంటోని' ఫేమ్ అధిక్ రవిచంద్రన్ ఈ మూవీకి డైరెక్టర్. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం 2025 సంక్రాంతికి విడుదల కానుంది. Fueling passion for adventure! 🏍️ #AjithKumar on a thrilling journey with #VenusMotortours. Experience the best of Indian bike tours, where every ride is a story of freedom and speed! 🇮🇳✨@VenusMotoTours @Donechannel1 @Dubai_Autodrome#BikeTours pic.twitter.com/YwqKK7BiNF— Suresh Chandra (@SureshChandraa) October 5, 2024 -
కేజీఎఫ్ 3 లోకి ఎన్టీఆర్, అజిత్.. ?
-
నెల వ్యవధిలో మరో లగ్జరీ కారు కొన్న స్టార్ హీరో
ఒక్కొక్కరికి ఒక్కో విషయంలో విపరీతమైన ఇష్టం ఉంటుంది. అలా తమిళ స్టార్ హీరో అజిత్కి కార్లు, బైక్స్ అంటే పిచ్చి. ఓవైపు సినిమాలు చేస్తుంటాడు. ఖాళీ దొరికితే చాలు బైక్ రైడింగ్, రేసింగ్ లాంటివి చేసేస్తుంటాడు. మొన్నీ మధ్య ఆగస్టులో రూ.9 కోట్ల విలువ చేసే ఫెర్రారీ కారు కొనుగోలు చేశాడు. ఇప్పుడు కూడా మరో కాస్ట్ లీ కారు సొంతం చేసుకున్నాడు. ఈ విషయాన్ని అజిత్ భార్య, మాజీ నటి షాలినీ బయటపెట్టింది.అజిత్ లేటెస్ట్గా ఫోర్స్ కంపెనీకి చెందిన జీటీ3 ఆర్ఎస్ (GT3 RS) కారుని కొనుగోలు చేశాడు. మార్కెట్లో దీని ధర మూడన్నర కోట్ల రూపాయలకు పైనే ఉంది. మిగతా ఖర్చులన్నీ కలిపి చూసుకుంటే దీని ధర రూ.4 కోట్లు దాటేస్తుంది. అయితే ఇలా నెలల వ్యవధిలో కోట్లు విలువ చేసే కార్లు సొంతం చేసుకున్న హీరో.. అవంటే తనకు ఎంత ఇష్టమో చెప్పకనే చెప్పేశాడు.(ఇదీ చదవండి: తమిళ స్టార్ హీరోలు.. కార్తీని చూసి కాస్త నేర్చుకోండి!)ఈ కార్లు కాకుండా అజిత్ దగ్గర బీఎండబ్ల్యూ ఎస్ 1000 ఆర్ఆర్, బీఎండబ్ల్యూ కే 1300 ఎస్, ఏప్రిలా కాపోనార్డ్ 1200, కవసాకీ నింజా జెడ్ ఎక్స్ 145 లాంటి స్పోర్ట్స్ బైక్స్ ఉన్నాయి. అలానే ఫెర్రారీ 458 ఇటాలియా, బీఎమ్ వన్ 740 లీ, హోండా ఎకార్డ్ వీ6 కార్లు కూడా ఉన్నాయి.ప్రస్తుతం 'విడా మయూర్చి' అనే సినిమా చేస్తున్న అజిత్.. 'గుడ్ బ్యాడ్ అగ్లీ' అనే మరో మూవీ చేస్తున్నాడు. ఈ రెండు కూడా సంక్రాంతి టైంలో రిలీజ్ అవుతాయని తెలుస్తోంది. (ఇదీ చదవండి: ఒకేరోజు ఓటీటీల్లోకి వచ్చేసిన 20 మూవీస్.. ఇవి డోంట్ మిస్) View this post on Instagram A post shared by Shalini Ajith Kumar (@shaliniajithkumar2022)Exclusive Pics of THALA AJITH With Porsche GT3RS 🏎️💨Man And the Machine.,🚨🚧 #VidaaMuyarchi | #Ajithkumar pic.twitter.com/sydMXebHaD— AJITHKUMAR FANS CLUB (@ThalaAjith_FC) September 13, 2024 -
సంక్రాంతి రేసులో అజిత్
నటుడు అజిత్ కథానాయకుడిగా నటిస్తున్న రెండు చిత్రాలు నిర్మాణంలో ఉన్న విషయం తెలిసిందే. అందులో ఒకటి విడాముయర్చి. నటుడు అర్జున్, త్రిష, ఆరవ్, రెజీనా తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రాన్ని మగిళ్తిరుమేణి దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్ సంస్థ నిర్మిస్తోంది. అనిరుధ్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రం దీపావళికి తెరపైకి వస్తుందని ప్రచారం జరిగింది. అయితే నిర్మాణ కార్యక్రమాలు ప్రణాళిక ప్రకారం పూర్తి కాకపోవడంతో ఇప్పుడు ఈ చిత్రాన్ని 2025 పొంగల్కు విడుదల చేయడానికి నిర్మాతల వర్గం సన్నాహాలు చేస్తున్నట్లు తాజా సమాచారం. కాగా అజిత్ నటిస్తున్న మరో చిత్రం గుడ్ బ్యాడ్ అగ్లీ. ఆధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహిస్తున్న ఇందులోనూ నటి త్రిష నాయకిగా నటిస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రాన్ని ప్రముఖ టాలీవుడ్ చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. కాగా ఈ చిత్రాన్ని 2025 పొంగల్కు విడుదల చేయనున్నట్లు ముందుగానే ప్రకటించారు. కాగా ఇప్పుడు ఆ తేదీన విడాముయర్చి తెరపైకి రానుండడంతో గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రం విడుదల తేదీ మారే అవకాశం ఉంది. దీన్ని వచ్చే ఏడాది మే 1వ తేదీన విడుదల చేసే అవకాశం ఉందని సమాచారం. కాగా విడాముయర్చి చిత్రం విడుదలనంతరం గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్ర విడుదలపై నిర్ణయం తీసుకోనున్నట్లు మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ భావిస్తున్నట్లు సమాచారం. ఈ రెండు చిత్రాల విడుదలపై పూర్తి క్లారిటీ రావాలంటే మరి కొద్ది రోజులు ఆగాల్సిందే. -
అజిత్తో కలిసి కచ్చితంగా నటిస్తా!
అవకాశాలు వచ్చినా, విజయాలు అంత సులభంగా రావు. అందుకు కృషి, శ్రమ అవసరం, అదృష్టం చాలా ముఖ్యం. అలా సినీ కుంటుంబం నుంచి వచ్చిన నటి కీర్తీసురేశ్. తల్లి నటి, తండ్రి నిర్మాత కావడంతో ఈమెకు అవకాశాలు సులభంగానే వచ్చి ఉండవచ్చు. అయితే స్టార్ నటిగా రాణించడానికి ఆమె ప్రతిభనే ముఖ్య కారణం. మలయాళం, తమిళం, తెలుగు భాషల్లో ప్రముఖ కథానాయకిగా రాణిస్తున్న కీర్తీసురేశ్ తాజాగా బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చారు. తొలి రోజుల్లో వచ్చిన అవకాశాలను సది్వనియోగం చేసుకున్నా, ఇప్పుడు కథలు నచ్చితేనే నటించడానికి సమ్మతిస్తున్నారు. తెలుగు చిత్రం మహానటిలో నటించి జాతీయ ఉత్తమ నటి అవార్డును గెలుచుకున్న ఈమెకు ఆ తరువాత పలు ఉమెన్స్ సెంట్రిక్ కథా పాత్రలు వెతుక్కుంటూ వస్తున్నాయి. అలా తాజాగా కీర్తీసురేశ్ నటించిన చిత్రం రఘుతాత. ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్త హోంబలే నిర్మించిన ఈ చిత్రంపై ఇప్పటికే చాలా ఆసక్తి నెలకొంది. కారణం ఇదిబలవంతపు హిందీ భాషను వ్యతిరేకించే కథాంశంతో తెరకెక్కడమే. చిత్రం ఈ నెల 15న తెరపైకి రానుంది. ఈ చిత్ర ప్రమోషన్లో బిజీగా ఉన్న కీర్తీసురేశ్ ఒక భేటీలో నటుడు అజిత్తో కలిసి నటించాలనే ఆసక్తిని వ్యక్తం చేశారు. ఈమె తమిళంలో నటుడు విజయ్, విశాల్, ధనుష్ శివకార్తికేయన్, చివరికి రజనీకాంత్కు చెల్లెలిగా కూడా నటించారు. కానీ అజిత్తో కలిసి నటించలేదు. ఇదే విషయాన్ని ఆమె పేర్కొంటూ ఈ మధ్య హైదరాబాద్లో షూటింగ్లో పాల్గొన్నప్పుడు అజిత్ కూడా అక్కడ జరుగుతున్న చిత్ర షూటింగ్లో పాల్గొన్నారని, ఆ సమయంలో తాను ఆయన్ని కలిసి పరిచయం చేసుకున్నానని చెప్పారు. అప్పుడు తన తల్లి, శాలిని కలిసి చాలా చిత్రాల్లో నటించారని ఆయనతో చెప్పానన్నారు. తాను కూడా కచ్చితంగా అజిత్తో కలిసి నటిస్తాననే నమ్మకాన్ని నటి కీర్తీసురేశ్ వ్యక్తం చేశారు. -
అజిత్, ప్రశాంత్ నీల్ సినిమాపై మేనేజర్ క్లారిటీ
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్తో దర్శకుడు ప్రశాంత్ నీల్ ఒక సినిమా ప్లాన్ చేసినట్లు కొద్దిరోజులుగా వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అజిత్ మేనేజర్ క్లారిటీ ఇచ్చారు. 'కె.జి.ఎఫ్' కథకు కనెక్ట్ అయ్యేలా మరో స్టోరీని ప్రశాంత్ రెడీ చేశాడాని, అందులో అజిత్ హీరోగా నటించనున్నారని కోలీవుడ్లో వార్తలు వచ్చాయి. అయితే, ఈ విషయం గురించి తాజాగా అజిత్ మేనేజర్ మాట్లాడుతూ.. అదంతా ప్రచారం మాత్రమేనని చెప్పుకొచ్చారు.అజిత్ మేనేజర్ సురేష్ చంద్ర ఈ వాదనలను ఇలా ఖండించారు.. 'ఈ పుకార్లు ఆన్లైన్లో వచ్చాయి. ఇందులో ఎలాంటి నిజం లేదు. అజిత్, ప్రశాంత్ నీల్ కలిశారనేది మాత్రం నిజమే.. కానీ, వారు ఒకరినొకరు మర్యాదపూర్వకంగా మాత్రమే కలుసుకున్నారు. ఒకరినొకరు అత్యున్నత గౌరవం కలిగి ఉంటారు. అయితే, వారు కలిసినప్పుడు ఏ సినిమా గురించి చర్చించలేదు. ప్రశాంత్ డైరెక్షన్లో అజిత్ సినిమా వస్తే చూడటానికి నేనూ ఇష్టపడతాను. కానీ, భవిష్యత్తులో అయినా వీరి కాంబినేషన్లో ఒక ప్రాజెక్ట్ వస్తుందనే నమ్మకం కూడా నాకు లేదు.' అని సురేష్ చంద్ర తెలిపారు.మగిళ్ తిరుమేని దర్శకత్వంలో అజిత్ విడాముయర్చి సినిమాలో నటించారు. కొద్దిరోజుల క్రితమే ఈ ప్రాజెక్ట్ షూటింగ్ పూర్తి అయింది. దీపావళికి ఈ సినిమా విడుదల కానుందని ప్రచారం జరుగుతుంది. అధిక్ రవిచంద్రన్ డైరెక్షన్లో అజిత్ తర్వాతి సినిమా ఉంటుంది. ఇదిలా ఉంటే, ప్రశాంత్ త్వరలో జూనియర్ ఎన్టీఆర్తో కలిసి తన కొత్త సినిమా షూటింగ్ ప్రారంభించనున్నారు. -
భారీ బడ్జెట్ సినిమా నుంచి 'త్రిష' ఫస్ట్ లుక్ రిలీజ్
నటుడు అజిత్ కథానాయకుడిగా నటి స్తున్న తాజా చిత్రం 'విడాముయర్చి'. నటి త్రిష నాయకిగా నటిస్తున్న ఈ చిత్రాన్ని మగిళ్ తిరుమేణి దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్ సంస్థ భారీ బడ్జెట్లో నిర్మి స్తోంది. తరచూ వార్తల్లో ఉంటున్న చిత్రం నుంచి తాజాగా త్రిష ఫస్ట్ లుక్ను మేకర్స్ విడుదల చేశారు.మొదట ఈ చిత్రానికి విఘ్నేశ్శివన్ దర్శకత్వం వహించనున్నట్లు ప్రచారం జరిగింది. కానీ, దర్శకుడు మగిళ్ తిరుమే ణి చెప్పిన కథ నచ్చడంతో అజిత్ ఆయన దర్శకత్వంలో నటించడానికి ఓకే చెప్పారు. ఎక్కువ భాగం విదేశాల్లో చిత్రీకరణ జరుపుకుంటున్న విడాముయర్చి చిత్రంపై అంచనాలు మాత్రం భారీ స్థాయిలోనే ఉన్నాయి. తాజాగా విడుదలైన త్రిష ఫస్ట్ లుక్లో చాలా బ్యూటీఫుల్గా ఉంది. ఓ రెస్టారెంట్లో త్రిషతో పాటు అజిత్ ఉన్న ఫోటోను మేకర్స్ పంచుకున్నారు. ఇందులో అజిత్కు సతీమణిగా ఆమె కనిపించనుంది.కాగా చిత్రాన్ని దీపావళికి విడుదల చేయనున్నారు. ఇంతకుముందు దీపావళికి విడుదలైన ఈయన చిత్రాలు ఘన విజయం సాధించాయి. ఇప్పుడు కూడా అదే సెంటిమెంట్ను వారు కొనసాగిస్తున్నారు. మరో విశేషం ఏమిటంటే అదిరిపోయే యాక్షన్ ఎంటర్టైనర్ కథా చిత్రంగా తెరకెక్కుతున్న దీని వ్యాపారం హాట్ హాట్గా జరుగుతున్నట్లు ప్రచారం. కర్ణాటకలో విడాముయర్చి చిత్రం వ్యాపారం రజనీకాంత్, విజయ్ల చిత్రాలను మించి పోయినట్లు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. #VidaaMuyarchi 🌟🧿#EffortsNeverFail pic.twitter.com/mTvEtUHuEN— Trish (@trishtrashers) July 19, 2024 -
Sreeleela: ఆమె అంటే ఎంతో ఇష్టం
పెళ్లి సందడితో టాలీవుడ్లో మహా సందడి చేసిన నటి శ్రీలీల. అలా తొలి చిత్రం తర్వాత చిన్న గ్యాప్ రావడంతో ఇంక అంతేనా అన్నారు సినీ వర్గాలు. అయితే ఢమాకా చిత్రంలో మాస్ డాన్స్తో కుమ్మేయడంతో అందరి దృష్టి శ్రీలీలపై పడింది. అంతే అవకాశాలు వరుస పట్టేశాయి. ప్రస్తుతం టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా వెలిగిపోతున్న ఈ కన్నడ బ్యూటీ ఇప్పుడు కోలీవుడ్, బాలీవుడ్లోనూ సత్తా చాటడానికి రెడీ అవుతున్నారు. ముఖ్యంగా తమిళంలో నటుడు అజిత్ సరసన గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రం ద్వారా ఎంట్రీ ఇస్తున్న ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విషయాన్ని నిర్మాతలు ఇంకా అధికారికంగా ధ్రువీకరించలేదన్నది గమనార్హం. ఇకపోతే ఈ అమ్మడు ఇటీవల చైన్నెలో సందడి చేశారు. ఓ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న శ్రీలీలపై మీడియా ప్రశ్నల వర్షం కురిపించింది. ముఖ్యంగా కోలీవుడ్లో మీకు నచ్చిన నటి ఎవరన్న ప్రశ్నకు నయనతార అంటే ఎంతో ఇష్టం అని బదులిచ్చారు. అయితే ఒకరనే కాకుండా తమిళ చిత్ర పరిశ్రమలో ప్రతిభావంతులైన నటీనటులు, సాంకేతిక నిపుణుల ఎందరో ఉన్నారని తెలివిగా బదులు ఇచ్చారు. మొత్తం మీద చాలా తక్కువ కాలంలో శ్రీలీల పాన్ ఇండియా నటి స్థాయికి ఎదిగి పోవడం విశేషం. -
శ్రీలీల కాదు ఆ ఛాన్స్ కొట్టేసిన కీర్తి సురేశ్?
తమిళ స్టార్ హీరో అజిత్ ప్రస్తుతం రెండు సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. 'విడాముయర్చి' షూటింగ్ చివరి దశలో ఉంది. త్వరలో రిలీజ్ తేదీపై ప్రకటన ఇవ్వనున్నారు. మరోవైపు తెలుగు బడా నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ తీస్తున్న 'గుడ్ బ్యాడ్ అగ్లీ' కూడా చేస్తున్నారు. ఇప్పటికే వచ్చిన ఫస్ట్ లుక్ పోస్టర్ మూవీపై అంచనాలు పెంచేసిందని చెప్పొచ్చు. అయితే హీరోయిన్ విషయంలో మాత్రం ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది.(ఇదీ చదవండి: గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీ రివ్యూ)షూటింగ్ ఇటీవలే హైదరాబాద్లో ప్రారంభమై, తొలి షెడ్యూల్ కూడా పూర్తి చేసుకుంది. ఇందులో హీరోయిన్గా తొలుత శ్రీలీల పేరు వినిపించింది. కానీ ఇప్పుడు ఆ ప్లేసులో కీర్తి సురేశ్ నటించబోతుందని అంటున్నారు. మరి ఇద్దరు హీరోయిన్లకు చోటుందా? లేదా కీర్తి సురేశ్నే తీసుకుంటారా అనేది తెలియాల్సి ఉంది. ఒకవేళ ఇదే నిజమైతే కీర్తీసురేశ్ ఖాతాలో మరో భారీ చిత్రం పడినట్లే.(ఇదీ చదవండి: 'భజే వాయువేగం' సినిమా రివ్యూ) -
అజిత్, షాలినితో ఉన్న బంధాన్ని గుర్తుచేసుకున్న చిరంజీవి
కొంత గ్యాప్ తర్వాత మళ్లీ ‘విశ్వంభర’ సెట్స్లో అడుగుపెట్టారు చిరంజీవి. ఈ క్రమంలో కొద్దిరోజుల క్రితమే ఆషికా రంగనాథ్ కూడా ఈ బిగ్ ప్రాజెక్ట్లో అడుగుపెట్టేసింది. సోషియో ఫ్యాంటసీ యాక్షన్ థ్రిల్లర్గా తెరకెక్కుతున్న ‘విశ్వంభర’ చిత్రాన్ని వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల ఈ సినిమాలోని ఇంట్రవెల్ యాక్షన్ సీక్వెన్స్ని హైదరాబాద్లో చిత్రీకరించారు. అయితే, తాజాగా విశ్వంభర సెట్స్లో కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ అడుగుపెట్టారు. ఈ విషయాన్ని మెగాస్టార్ చిరంజీవి తన ఇన్స్టాగ్రామ్లో పంచుకున్నారు.హైదరాబాద్లో జన్మించిన అజిత్సౌత్ ఇండియాలో టాప్ హీరోలలో అజిత్ కూడా ఒకరు. హైదరాబాద్లో జన్మించిన అజిత్ పదోతరగతి వరకు మాత్రమే చదివినా, అనేక భాషల్లో అనర్గళంగా మాట్లాడగలడు. తన నట జీవితాన్ని తెలుగు చిత్రమైన 'ప్రేమ పుస్తకం'తో ప్రారంభించాడు. ఈ సినిమాను కూడా ఆప్పట్లో మెగాస్టార్ చిరంజీవినే లాంచ్ చేశారు. ఒకప్పటి టాప్ హీరోయిన్ షాలినిని 2000 సంవత్సరంలో అజిత్ పెళ్లి చేసుకున్నాడు.నా చేతుల మీదుగా లాంచ్ అయ్యాడు: చిరంజీవిఅయితే, అజిత్ విశ్వంభర సెట్స్లో అడుగుపెట్టడం పట్ల చిరంజీవి ఇలా చెప్పుకొచ్చారు. 'నిన్న సాయంత్రం 'విశ్వంభర' సెట్స్కి స్టార్ గెస్ట్గా వచ్చి అజిత్ మా అందరినీ ఆశ్చర్యపరిచారు. అజిత్ సినిమా కూడా షూటింగ్ ఇక్కడే జరుగుతుండటంతో చాలా ఏళ్ల తర్వాత కలిశాం. అజిత్ తొలి సినిమా 'ప్రేమ పుస్తకం' ఆడియో లాంచ్ కార్యక్రమం నా చేతుల మీదుగానే జరిగింది. ఆ సమయాన్ని మరోసారి గుర్తుచేసుకుంటూ గడిపాం. ఇంకా చెప్పాలంటే అజిత్ జీవిత భాగస్వామి షాలిని కూడా 'జగదేకవీరుడు అతిలోక సుందరి' సినిమాలో నటిచింది. ఆ సినిమాలోని చిన్నపిల్లల పాత్రలో ఆమె ఒకరు. అలా అజిత్తో గుర్తుంచుకోవాల్సిన జ్ఞాపకాలు చాలా ఉన్నాయి. సినిమా ఇండస్ట్రీలో అజిత్ స్టార్డమ్ శిఖరాలను దాటేసింది. దానిని చూసి నేను చాలా సంతోషించాను.' అని మెగాస్టార్ అన్నారు. View this post on Instagram A post shared by Chiranjeevi Konidela (@chiranjeevikonidela) -
గుడ్ బ్యాడ్ అగ్లీ.. ఆ ఓటీటీ అన్ని కోట్లు పెట్టిందా?
అన్నం ఉడికిందో లేదో తెలియడానికి ఒక్క మెతుకు చూస్తే చాలంటారు. అలాగే కొన్ని చిత్రాల జాతకం ఒక్క పోస్టర్తోనే తెలిసిపోతుంది. ఈ విషయాన్ని అజిత్ 'గుడ్ బ్యాడ్ అగ్లీ' చిత్రం నిరూపించింది. అజిత్ ప్రస్తుతం విడాయుయర్చి చిత్రంలో నటిస్తున్నారు. మగిళ్ తిరుమేణి దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తున్న ఇందులో త్రిష హీరోయిన్గా నటిస్తున్నారు. పలు సమస్యలను అధిగమిస్తూ ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. గుడ్ బ్యాడ్ అగ్లీఇకపోతే అజిత్ తన తదుపరి చిత్రానికి సిద్ధం అవుతున్నారు. అదే గుడ్ బ్యాడ్ అగ్లీ. మార్క్ ఆంటోని వంటి సూపర్హిట్ చిత్రాన్ని తెరకెక్కించిన అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ప్రముఖ టాలీవుడ్ చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ఇందులో అజిత్ త్రిపాత్రాభినయం చేస్తున్నట్లు సమాచారం. పోస్టర్కు పాజిటివ్ రెస్పాన్స్ఆయనకు జంటగా శ్రీలీల, మీనా, సిమ్రాన్లు నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. కాగా చిత్ర షూటింగ్ వచ్చే నెలలో ప్రారంభం అవుతుందని సమాచారం. గుడ్ బ్యాడ్ అగ్లీ అనే టైటిల్కు సూపర్ రెస్పాన్స్ రాగా ఫస్ట్లుక్ పోస్టర్ కూడా అదిరిపోయింది. అజిత్ మూడు ముఖాలతో కూడిన ఆ పోస్టర్ చిత్రంపై మరింత ఆసక్తిని పెంచేసింది. ఓటీటీ రైట్స్ఇక ఈ సినిమా డిజిటల్ రైట్స్ను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ రూ.95 కోట్లు పెట్టి సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. మొత్తం మీద అజిత్ గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రం ప్రారంభానికి ముందే సంచలనం సృష్టిస్తోందన్నమాట. ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి థియేటర్లలో రానుంది.చదవండి: బిగ్ బాస్ ఓటీటీ సీజన్ 3 అప్డేట్ వచ్చేసింది.. మారనున్న హోస్ట్ -
శ్రీలీల కోలీవుడ్ ఎంట్రీ.. ఆ స్టార్ హీరోతోనే!
తమిళ నటుడు అజిత్ ఇప్పుడు ఒకేసారి రెండు చిత్రాల్లో నటిస్తోన్న సంగతి తెలిసిందే. అందు విడాముయర్చి. లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రంలో నటి త్రిష నాయకిగా నటిస్తున్నారు. మగిళ్ తిరుమేణి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకుంది. అనివార్య కారణాల వల్ల నిర్మాణ కార్యక్రమాల్లో జాప్యం జరుగుతోంది.ఇదిలా ఉండగా.. అజిత్ కథానాయకుడిగా నటిస్తున్న మరో చిత్రం గుడ్ బ్యాడ్ అగ్లీ. మార్క్ ఆంటోని చిత్రంతో సూపర్హిట్ కొట్టిన ఆదిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ భారీ చిత్రాన్ని మైత్రీ మూవీస్ సంస్థ నిర్మిస్తోంది. ఇందులో అజిత్ త్రిపాత్రాభినయం చేస్తున్నట్లు సమాచారం. దీంతో ఆయనకు జంటగా నటి శ్రీలీల, సిమ్రాన్, మీనా నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇదే నిజం అయితే నటి శ్రీలీల కోలీవుడ్ ఎంట్రీ ఖాయంగా కనిపిస్తోంది.కాగా.. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ఇటీవల సైలెంట్గా ఎలాంటి హంగామా లేకుండా హైదరాబాద్లో ప్రారంభమైంది. అంతేకాదు శుక్రవారంతో తొలి షెడ్యూల్ను పూర్తి చేసుకుంటుందని అజిత్ సన్నిహితుడు తెలిపారు. హైదరాబాద్లో కొన్ని యాక్షన్ సన్నివేశాలు, అజిత్ పాల్గొనే ఇంట్రో పాటను చిత్రీకరించినట్లు ఆయన తెలిపారు.కాగా అజిత్ తదపరి విడాముయర్చి చిత్రం షూటింగ్లో పాల్గొననున్నారని.. జూన్ రెండు లేదా మూడో వారంలో ఈ చిత్రం షూటింగ్ ఉంటుందని చెప్పారు. ఇదే ఈ చిత్రం చివరి షెడ్యూల్ అవుతుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఆ తరువాత గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రం షూటింగ్లో పాల్గొంటారని తెలిపారు. ఇకపోతే ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయడానికి నిర్మాతలు ప్లాన్ చేస్తున్నట్లు తాజా సమాచారం. దీనికి ముందు విడాముయర్చి చిత్రం విడుదలయ్యే అవకాశం ఉంది. -
అజిత్ కి షాకిచ్చిన త్రిష.. ఏకంగా చిరు, కమల్ కోసం!
స్టార్ హీరోయిన్ త్రిష.. కెరీర్లో ఎన్నడూ లేనంత బిజీగా ఉన్నారు. 40 ఏళ్ల వయసులోనూ ఈమె నటిస్తున్న సినిమాలన్నీ సూపర్ స్టార్స్తోనే కావడం శేషం. అన్ని భాషల్లోనూ ఏక కాలంలో నటించేస్తున్నారు. ప్రస్తుతం అజిత్ 'విడామయూర్చి', కమల్ హాసన్ 'థగ్ లైఫ్', చిరంజీవి 'విశ్వంభర', మోహన్ లాల్ 'రామ్' చిత్రాల్లో త్రిషనే హీరోయిన్.(ఇదీ చదవండి: నేనెవర్నీ విడగొట్టలేదు.. ఆ హీరోయిన్కు, నా భర్తకు ఆల్రెడీ బ్రేకప్!)కాగా అజిత్ 'విడా మయూర్చి' షూటింగ్ లేట్ అవుతూ వస్తోంది. దీంతో ఈ సినిమాకు కేటాయించిన డేట్స్ని విశ్వంభర, థగ్ లైఫ్ చిత్రాలకు ఉపయోగించేస్తోంది. దీంతో 'విడామయర్చి' చిత్రానికి షాక్ తగిలినట్లయింది. అయితే ఇదంతా దర్శకుడు మణిరత్నం చేసిన పని అనుకోవచ్చు.. ఎందుకంటే 'పొన్నియన్ సెల్వన్'లో కుందవై పాత్ర ఇచ్చి త్రిషకి మళ్లీ లైఫ్ ఇచ్చాడు. దీంతో ఇప్పుడు ఈమె ఊపిరిసలపనంత బిజీగా మారిపోయింది. టైమ్ అంటే ఇదే మరి.(ఇదీ చదవండి: నా మాజీ భర్త గే.. అతడి గదిలో రాత్రి ధనుష్కు ఏం పని? సుచిత్ర సంచలన వ్యాఖ్యలు) -
స్టార్ హీరో అజిత్ బర్త్ డే.. అద్భుతమైన గిఫ్ట్తో భార్య సర్ప్రైజ్
డై హార్డ్ ఫ్యాన్స్ ఉండే హీరోల్లో తలా అజిత్ ఒకడు. తమిళనాడులో ఇతడికి కోట్లాదిమంది అభిమానులున్నారు. తెలుగులోనూ ఇతడికి ఓ మాదిరి గుర్తింపు ఉంది. అడపాదడపా యాక్షన్ సినిమాలతో ఆకట్టుకునే ఇతడు ప్రస్తుతం ఓ రెండు చిత్రాల్లో హీరోగా నటిస్తూ బిజీగా ఉన్నాడు. బుధవారం ఇతడి 53వ పుట్టినరోజు. ఈ క్రమంలోనే అందరూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇతడి భార్య మాత్రం అదిరిపోయే గిఫ్ట్తో సర్ప్రైజ్ చేసింది.(ఇదీ చదవండి: మొటిమలకు సర్జరీ చేయించుకున్నారా? సాయిపల్లవి ఆన్సర్ ఇదే)1990లోనే నటుడిగా కెరీర్ ప్రారంభించిన అజిత్.. 'ప్రేమ పుస్తకం' అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యాడు. ఆ తర్వాత పూర్తిగా తమిళంకే పరిమితమయ్యాడు. ప్రస్తుతం 'విడామయూర్చి' అనే మూవీ చేస్తున్నాడు. దీని తర్వాత 'గుడ్ బ్యాడ్ అగ్లీ' అనే ద్విభాషా చిత్రం చేయబోతున్నాడు. తాజాగా బుధవారం అజిత్ 53వ పుట్టినరోజు వేడుకల్ని నిర్వహించారు.ఈ క్రమంలోనే అజిత్ భార్య షాలిని.. భర్తకు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చింది. బైక్స్ అంటే అజిత్ ఎంత ఇష్టమో బాగా తెలిసిన షాలిని.. ఈ బర్త్ డే కానుకగా డుకాటీ బైక్ బహుమతిగా ఇచ్చింది. మార్కెట్లో దీని ధర రూ.10 లక్షలు పైమాటే. ఏదేమైనా ఇలా బైక్ ఇచ్చి పుట్టినరోజు సర్ప్రైజ్ చేయడం అజిత్ అభిమానులకు తెగ నచ్చేసింది. (ఇదీ చదవండి: పెళ్లెప్పుడు అని ప్రశ్న.. హీరోయిన్ మాళవిక ఇంట్రెస్టింగ్ కామెంట్స్) Shalini Ajith gifted Ducati bike for Thala #Ajith 🥰#HBDAjithKumar 🎉🎂#VidaaMuyarchi .. #AjithKumar#GoodBadUgly #Ajithkumar𓃵 pic.twitter.com/aWYnXAI5CU— 𒆜Harry Billa𒆜 (@Billa2Harry) May 1, 2024 -
అజిత్కి జోడీగా...
కోలీవుడ్లో ప్రస్తుతం హాట్ టాపిక్గా నిలిచిన వార్తల్లో అజిత్ ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ చిత్రానికి సంబంధించిన వార్త ఒకటి. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో తెలుగు నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్గా నటించనున్నారనే వార్త ప్రచారంలో ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా సిమ్రాన్, మీనా పేర్లు వినిపిస్తున్నాయి.ఈ ఇద్దరూ అతిథి పాత్రల్లో కాదు.. అజిత్ సరసన హీరోయిన్లుగా నటిస్తారని టాక్. ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’లో అజిత్ మూడు పాత్రల్లో కనిపిస్తారట. మూడు పాత్రలకు ముగ్గురు హీరోయిన్లు ఉంటారని, శ్రీలీల, సిమ్రాన్, మీనాతో అజిత్ జతకడతారని చెన్నై కోడంబాక్కమ్ అంటోంది. ఈ వార్త నిజమైతే దాదాపు రెండు దశాబ్దాల తర్వాత సిమ్రాన్, మీనా అజిత్తో మళ్లీ స్క్రీన్ షేర్ చేసుకున్నట్లు అవుతుంది. ‘అవళ్ వరువాళా (1998), వాలి’ (1999) వంటి విజయవంతమైన చిత్రాల్లో అజిత్ సరసన నటించారు సిమ్రాన్.అలాగే అజిత్కి జోడీగా ‘సిటిజెన్ (2001), విలన్’ (2002) వంటి చిత్రాల్లో నటించారు మీనా. ఇప్పుడు మళ్లీ ఈ హీరో సరసన సిమ్రాన్, మీనా నటిస్తే దాదాపు రెండు దశాబ్దాలకు ఈ కాంబినేషన్ కుదిరినట్లు అవుతుంది. మేలో ఈ చిత్రం షూటింగ్ని ఆరంభించాలనుకుంటున్నారని సమాచారం. సో... అజిత్ సరసన శ్రీలీల, సిమ్రాన్, మీనా నటించనున్నారా? అనేది త్వరలో తెలిసి΄ోతుంది. మహేశ్బాబు సినిమాలో...మహేశ్బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందనున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో ఓ కీలక పాత్రకు సిమ్రాన్ని ఎంపిక చేశారని సమాచారం. గతంలో ‘యువరాజు’ (2000) చిత్రంలో మహేశ్బాబు–సిమ్రాన్ జంటగా నటించిన సంగతి తెలిసిందే. ఇన్నేళ్ల తర్వాత ఈ ఇద్దరూ స్క్రీన్ షేర్ చేసుకోనున్నారనే వార్త ప్రచారంలో ఉంది. అయితే హీరో–హీరోయిన్గా కాదని, సిమ్రాన్ది అతిథి పాత్ర అని భోగట్టా. త్వరలో ఈ చిత్రానికి సంబంధించిన విశేషాలను రాజమౌళి ప్రకటించనున్నారట. మరి.. సిమ్రాన్ ఈప్రాజెక్ట్లో ఉన్నారా? లేదా అనే ప్రశ్నకు అప్పుడు సమాధానం దొరుకుతుంది. -
లక్కీ చాన్స్ కొట్టేసిన శ్రీలీల!
తమిళసినిమా: నటుడు అజిత్తో కలిసి టాలీవుడ్ క్రేజీ నటి నటించనున్నారా? ఈ ప్రశ్నకు కోలీవుడ్ వర్గాల నుంచి అలాంటి అవకాశం ఉందని సమాధానం వస్తోంది. కోలీవుడ్లో స్టార్ హీరోల్లో అజిత్ ఒకరు. ఈయన ఇటీవల నటించిన చిత్రం తుణివు. మంచి యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. తాజాగా విడాముయర్చి చిత్రంలో నటిస్తున్నారు. మగిళ్ తిరుమేణి దర్శకత్వంలో లైకా ఫిలింస్ సంస్థ ని ర్మిస్తున్న ఈ చిత్రంలో నటి త్రిష నాయకిగా నటిస్తున్నారు. నటుడు అర్జున్, ఆరవ్, రెజీనా తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. అనిరుధ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం ఇప్పటికే చాలా వరకూ షూటింగ్ను పూర్తి చేసుకుంది. తాజాగా అజర్బైజాన్లో షూటింగ్ను నిర్వహించారు. తదుపరి సెడ్యూల్ ఎప్పుడు? ఎక్కడ నిర్వహించేది చిత్ర వర్గాలు ఇంకా వెల్లడించలేదు. ఇకపోతే మే నెల 1వ తేదీన నటుడు అజిత్ పుట్టిన రోజు. ఆ సందర్భంగా విడాముయర్చి చిత్రానికి సంబంధించిన ఏదైనా అప్డేట్ వస్తుందనే ఆశాభావంతో అజిత్ అభిమానులు ఎదురు చూస్తున్నారు. అయితే వారిని ఖుషీపరచడానికి అజిత్ నటించిన బిల్లా చిత్రం రీరిలీజ్ కానుంది. ప్రస్తుతం అజిత్ బైక్లో విదేశాలు చుట్టొస్తున్న పని లో ఉన్నారు. కాగా విడాముయర్చి చిత్రం అజిత్ నటిస్తున్న 62వ చిత్రం అవుతుంది. దీంతో తన 63వ చిత్రానికీ గ్రీన్సిగ్నల్ ఇచ్చారు. దీంతో తెలు గు ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీస్ నిర్మించనుంది. ఈ చిత్రానికి ఆధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వచ్చనున్నారు. దీనికి గుడ్ బ్యాడ్ అగ్లీ అనే టైటిల్ను నిర్ణయించారు. ఇందులో అజిత్ మూడు గెటప్లలో నటిస్తారట. కాగా టాలీవుడ్ క్రేజీ నాయకి శ్రీలీల ఈ చిత్రంలో అజిత్కు జంటగా నటించనున్నట్లు తాజాగా సామాజిక మాధ్యమా ల్లో ప్రచారం వైరల్ అవుతోంది. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు. శ్రీలీల తెలుగులో రవితేజ, మహేశ్బాబు వంటి స్టార్ నటుల సరసన నటించారు. తాజాగా అజిత్ సరసన నటించడం నిజమైతే ఇదే ఈమె తొలి తమిళ చిత్రం అవుతుంది. ఇక పోతే ఈ చిత్రాన్ని త్వరలో ప్రారంభించి 2025 పొంగల్కు విడుదల చేయడానికి నిర్మాతలు ప్రణాళికను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. -
నటరాజన్ బర్త్డే వేడుకలో సడెన్గా ఎంట్రీ ఇచ్చిన స్టార్ హీరో
టి నటరాజన్.. భారత క్రికెట్ టీమ్లో యార్కర్ కింగ్గా గుర్తింపు ఉంది. నేడు (ఏప్రిల్ 4) ఆయన 33వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ప్రస్తుతం ఐపీఎల్ సీజన్ నడుస్తుండటంతో తనతో పాటు ఉన్న ఆటగాళ్లతో తన పుట్టినరోజును సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ వేడుకల్లో స్టార్ హీరో అజిత్ సడన్ ఎంట్రీ ఇచ్చి షాకిచ్చాడు. నటరాజన్ పుట్టినరోజు వేడుకలకు అజిత్ ఎంట్రీ ఎలా జరిగిందంటే.. ఏప్రిల్ 5న సన్రైజర్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ హైదరాబాద్ వేదికగా జరగనుంది. ఈ క్రమంలో టీమ్ అంతా ఒక స్టార్ హోటల్లో బస చేసింది. నేడు నటరాజన్ పుట్టినరోజు కావడంతో టీమ్ సభ్యులు కలిసి సెలబ్రేట్ చేసుకున్నారు. ఇకపోతే సన్రైజర్స్ బస చేసిన హోటల్లోనే హీరో అజిత్ కూడా ఉన్నారు. నటరాజన్ పుట్టినరోజు విషయాన్ని తెలుసుకున్న ఆయన ఆ వేడుకల్లో హఠాత్తుగా ఎంట్రీ ఇచ్చారు. ఆ సమయంలో అజిత్ను చూసిన వారందరూ షాక్ అయ్యారు. ఇంతలో అజిత్ కేక్ కట్ చేసి నటరాజన్కు తినిపించాడు. తన అభిమాన హీరో అజిత్తో ఈ పుట్టినరోజు జరుపుకోవడం తన జీవితంలో మరిచిపోలేనదని నటరాజన్ పేర్కొన్నాడు. అదే సమయంలో క్రికెట్ మాజీ దిగ్గజం ముత్తయ్య మురళీధరన్ కూడా ఉన్నారు. వారందరూ అజిత్తో కలిసి ఫోటోలు దిగి ఎంజాయ్ చేశారు. అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. గత కొన్నాళ్లుగా గాయాలతో బాధపడుతున్న నటరాజన్ ఈ ఏడాది ఐపీఎల్లో రీఎంట్రీ ఇచ్చి బాగా ఆడుతున్నాడు. ఐపీఎల్ 2020 సీజన్లో మెరిసిన యువ కిషోరం నటరాజన్. సన్రైజర్స్ హైదరాబాద్ తరుపన రాణిస్టూ నట్టూగా పేరు పొందాడు, ఐపీఎల్లో యార్కర్లతో అదరగొట్టి, టీమిండియాలో ఊహించని విధంగా ఎంట్రీ ఇచ్చాడు. నెట్బౌలర్ నుంచి టీమ్ఇండియా పేసర్ స్థాయికి ఆయన ఎదిగాడు. నటరాజన్ సేలం సమీపంలోని చిన్నపంబట్టి అనే గ్రామానికి చెందినవాడు. నటరాజన్ కెరియర్ ప్రారంభంలో తన అమ్మగారు అదే గ్రామంలో కూరగాయలు అమ్ముతుండగా.. తండ్రి ఓ కూలీ. బస్సు ఎక్కేందుకు రూ.5 లేని పరిస్థితి నుంచి నేడు తమ కుటుంబాన్ని ఈ స్థాయికి తీసుకొచ్చాడని ఓ సందర్భంలో తన అమ్మగారు సగర్వంగా చెప్పుకొచ్చారు. -
ప్రమాదకరమైన స్టంట్స్.. అజిత్ కారు బోల్తా.. వీడియో వైరల్
కోలీవుడ్ స్టార్ అజిత్కు భయమనేదే లేదు. ఎంతటి డేంజరస్ స్టంటయినా సరే డూప్ లేకుండా చేసేస్తాడు. ఈ క్రమంలో పలుమార్లు గాయపడ్డాడు కూడా! ప్రస్తుతం అతడు విడాముయర్చి అనే సినిమా చేస్తున్నాడు. గతేడాది చివర్లో ఈ మూవీ చిత్రీకరణ ప్రారంభమైంది. అక్టోబర్లో.. అజర్బైజాన్లో తొలి షెడ్యూల్ నిర్వహించారు. ఈ షూటింగ్లో జరిగిన ప్రమాదానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కారు ప్రమాదం ఇందులో అజిత్ కుమార్ కారును వేగంగా నడుపుకుంటూ వెళ్తున్నాడు. కాసేపటికి ఆ కారును పక్కకు ఆపేందుకు ప్రయత్నించాడు, కానీ అప్పటికే అది అదుపుతప్పి బోర్లా పడింది. అజిత్ పక్కన నటుడు అరవ్ కూడా ఉన్నాడు. అతడి చేతికి బేడీలు వేసి ఉండటంతో పాటు తనను సీటుకు కట్టేసి ఉండటం వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. కారు బోర్లా పడ్డాక అరవ్ను నువ్వు బాగానే ఉన్నావ్ కదా, ఏం కాలేదు కదా.. అని అజిత్ అతడి గురించి ఆరా తీశాడు. ఇంతలో సెట్లో ఉన్నవాళ్లు పరుగున వెళ్లి ఆ ఇద్దరిని బయటకు తీశారు. డేరింగ్ స్టంట్స్ ఏమాత్రం బెదురు లేకుండా ఇలాంటి డేరింగ్ స్టంట్స్ చేసిన అజిత్, అరవ్ను అభిమానులు కొనియాడుతున్నారు. సినిమా కోసం ప్రాణాలు పణంగా పెట్టే నీకు సెల్యూట్ అని కామెంట్లు చేస్తున్నారు. విడాముయర్చి సినిమాకు మగిళ్ తిరమేని దర్శకత్వం వహిస్తున్నాడు. లైకా ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్తో నిర్మిస్తోంది. ఇందులో త్రిష హీరోయిన్గా నటిస్తుండగా ప్రియ భవానీ శంకర్, సంజయ్ దత్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. Bravery knows no bounds! 💪 Witness Ajith Kumar's fearless dedication as he takes on a daring stunt sequence in #VidaaMuyarchi without any stunt double. 🫡 🔥#AjithKumar pic.twitter.com/62NyEG4cvG — Lyca Productions (@LycaProductions) April 4, 2024 చదవండి: ఆ సీన్ చేయనని ఏడ్చేసిన హీరోయిన్.. విలన్గా అది తప్పదన్న నటుడు -
ఫ్రెండ్స్కు కమ్మని బిర్యానీ వండిన స్టార్ హీరో
ఒక్కొక్కరికీ ఒక్కో పిచ్చి.. అలా తమిళ స్టార్ హీరో అజిత్కు బైక్స్ అన్నా.. బైక్ మీద విహరించడం అన్నా ఎంతో ఇష్టం. సినిమాల నుంచి కాస్త బ్రేక్ దొరికినా చాలు.. బైక్ మీద తనకు నచ్చిన ప్రాంతాలు చుట్టేస్తుంటాడు. అంతేకాదు.. చాలాసార్లు ప్రొఫెషనల్ రేసింగ్లో పాల్గొని అంతర్జాతీయ స్థాయిలోనూ గుర్తింపు తెచ్చుకున్నాడు. తన సినిమాల్లో కూడా బైక్పై చేజింగ్ సీన్లు, యాక్షన్ సీన్లు కనిపిస్తూ ఉంటాయి. ప్రస్తుతం అజిత్ విడాముయర్చి అనే సినిమాలో నటిస్తున్నాడు. ఇటీవల ఈ సినిమా షూటింగ్కు బ్రేక్ వచ్చింది. ఇంకేముంది తన ఫ్రెండ్స్తో కలిసి బైక్ రైడ్కు వెళ్లాడు. అక్కడ వారికోసం ప్రత్యేకంగా బిర్యానీ కూడా చేశాడు. స్నేహితులతో కలిసి ట్రిప్ను ఎంజాయ్ చేస్తున్న ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. సినిమాల విషయానికి వస్తే.. అజిత్ చేతిలో గుడ్ బ్యాడ్ అగ్లీ అని మరో సినిమా కూడా ఉంది. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. ఇది వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ కానుంది. Multitalented SOUL. 😘😘😘 #Ajith sir #VidaaMuyarchi #GoodBadUgly pic.twitter.com/mLyqLM0Vjv — Ashok Surya (@AshokSuryaOff03) March 21, 2024 Ride with Venus. It is #Ajith sir’s GAME #VidaaMuyarchi 🔥🔥🔥 pic.twitter.com/1vved9bWVp — Ashok Surya (@AshokSuryaOff03) March 20, 2024 చదవండి: శృంగార చిత్రంతో ఆస్కార్ వరకు.. ఎవరో గుర్తుపట్టారా..? -
ఆస్పత్రి నుంచి అజిత్ డిశ్చార్జ్
ప్రముఖ నటుడు అజిత్ గురువారం ఆస్పత్రిలో చేరడంతో ఆయన గురించి రకరకాల ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. అజిత్కు ఏమైంది అంటూ ఆయన అభిమానులు ఆందోళన చెందారు. త్వరలో మిడాముయర్చి చిత్రం షూటింగ్ కోసం విదేశాలకు పయనం కానున్న నేపథ్యంలో ఇదంతా రెగ్యులర్ చెకప్లో భాగం అంటూ అజిత్ కార్యనిర్వాహకుడు పేర్కొనడంతో అభిమానుల మనసులు కుదుటపడ్డాయి. అసలు విషయం ఏమిటంటే అజిత్ చెవి కింద భాగంలో పల్జ్ అనే చిన్న బుడుపు ఏర్పడింది. దానివల్ల ఎలాంటి బాధ లేకపోయినా వైద్యులు చిన్న శస్త్ర చికిత్స చేసి, దాన్ని తొలగించినట్లు తెలిసింది. దీంతో అజిత్ శుక్రవారం సాయంత్రం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. త్వరలోనే మిడాముయర్చి చిత్రం షూటింగ్ కోసం అజర్బైజాన్కు బయలు దేరనున్నట్లు సమాచారం. కాగా అజిత్ ఆస్పత్రిలో చేరారన్న వార్త వినగానే అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడపాడి పళనిస్వామి తన ఎక్స్ మీడియాలో ఒక ట్వీట్ చేశారు. అందులో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సహోదరుడు, నటుడు అజిత్ త్వరలో సంపూర్ణ ఆరోగ్యంతో ఇంటికి తిరిగి రావాలని ఆయన పేర్కొన్నారు. -
గఘనయానులు...
భారత్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గగన్యాన్ మిషన్లో పాల్గొనబోతున్న వ్యోమగాములంతా నేషనల్ డిఫెన్స్ అకాడమీ పూర్వ విద్యార్థులే. ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్, అజిత్ కృష్ణన్, అంగద్ ప్రతాప్, శుభాన్షు శుక్లా వృత్తిరీత్యా యుద్ధపైలెట్లు. వీరంతా గగన్యాన్ కోసం ఇప్పటికే రష్యాలో వ్యోమగాములుగా శిక్షణ పూర్తి చేసుకున్నారు. భారత్లోనూ ఇస్రో వీరికి కొంతకాలంగా ప్రత్యేక శిక్షణ ఇస్తోంది. తమ నలుగురు యుద్ధవిమాన పైలెట్లు గగన్యాన్లో భాగస్వాములు కావడం తమకెంతో గర్వకారణమని భారత వాయుసేన పేర్కొంది. ఈ నేపథ్యంలో ఈ ‘సూపర్ ఫోర్’ గురించి... ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్ భారత వాయుసేనలో యుద్ధవిమానాన్ని సుదీర్ఘకాలంపాటు నడిపిన అనుభవం ఉన్న పైలెట్ ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్ ఈ నలుగురిలో ఒక్కడిగా ఎంపికయ్యారు. కేరళలోని తిరువజియాడ్లో 1976 ఆగస్ట్ 26న జన్మించారు. నేషనల్ డిఫెన్స్ అకాడమీ(ఎన్డీఏ)లో శిక్షణ పూర్తిచేసుకుని అక్కడే ‘స్క్వాడ్ ఆఫ్ హానర్’ను సాధించారు. తమిళనాడులోని వెల్లింగ్టన్లోని డిఫెన్స్ సర్విసెస్ స్టాఫ్ కాలేజీలో, తాంబరం ఎఫ్ఐఎస్లో చదువుకున్నారు. తర్వాత ఈయన 1998 డిసెంబర్19న ఇండియన్ ఎయిర్ఫోర్స్లో యుద్ధవిమాన పైలెట్గా విధుల్లో చేరారు. సుఖోయ్30ఎంకేఐ, మిగ్–21, మిగ్–29 ఇలా పలు రకాల యుద్ధవిమానాలు నడపడంలో ఈయన దిట్ట. మొత్తంగా 3,000 గంటలకుపైగా యుద్ధవిమానాలను నడిపారు. కీలకమైన సుఖోయ్–30 స్క్వాడ్రాన్కు కమాండింగ్ బాధ్యతలు నిర్వర్తించారు. ‘ఎ’ కేటగిరీ ఫ్లయింగ్ ఇన్స్ట్రక్టర్గా, టెస్ట్ పైలెట్గా అనుభవం గడించారు. గగన్యాన్లో ఈయన గ్రూప్ కెప్టెన్ గా బాధ్యతలు తీసుకోనున్నారు. నాయర్ భార్య లీనా మలయాళ సినీపరిశ్రమలో నటిగా పేరొందారు. వీళ్లది పెద్దలు కుదిర్చిన పెళ్లి. గత నెల 17వ తేదీన వీరి వివాహం జరిగింది. ‘ మా ఆయనకు తొలి ఇండియన్ ఆస్ట్రోనాట్ వింగ్స్ దక్కడం కేరళ రాష్ట్రానికే గర్వకారణం’ అని ఆమె ఆనందం వ్యక్తంచేశారు. వీళ్ల కుటుంబం కేరళలోని పాలక్కడ్ జిల్లా నెన్మరలో నివసిస్తోంది. నాయర్ను ఆస్ట్రోనాట్గా ప్రధాని ప్రకటించగానే నెన్మరలో పండగ వాతావరణం నెలకొంది. అజిత్ కృష్ణన్ అజిత్ కృష్ణన్ 1982లో చెన్నైలో జన్మించారు. ఈయన సైతం ఎన్డీఏలో శిక్షణ విజయవంతంగా పూర్తిచేసుకుని స్వోర్డ్ ఆఫ్ ఆనర్ పొందారు. రాష్ట్రపతి బంగారు పతకాన్ని సాధించారు. ఈయన తమిళనాడులోని వెల్లింగ్టన్లోని డీఎస్ఎస్సీలోనూ చదువుకున్నారు. 2003 జూన్లో భారత వాయుసేనలో పైలెట్గా చేరారు. ఫ్లయింగ్ ఇన్స్టక్టర్గా, టెస్ట్ పైలెట్గా ఉంటూ 2,900 గంటలపాటు యుద్ధ విమానాలను నడిపారు. సుఖోయ్, మిగ్, జాగ్వర్, డోర్నియర్, ఏఎన్–32 రకం విమానాలను నడిపారు. ఈ మిషన్లో అవసరం మేరకు గ్రూప్ కెప్టెన్ గా ఉంటారు. అంగద్ ప్రతాప్ అంగద్ ప్రతాప్ 1982లో ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జన్మించారు. ఈయన సైతం ఎన్డీఏ పూర్వ విద్యార్ధే. 2004 డిసెంబర్లో భారత వాయుసేన దళాల్లో చేరారు. టెస్ట్ పైలెట్గా, ఫ్లయింగ్ ఇన్స్ట్రక్టర్గా సేవలందించారు. దాదాపు 2,000 గంటలపాటు విమానాలు నడిపిన అనుభవం ఉంది. సుఖోయ్ 30 ఎంకేఐ, మిగ్–21, మిగ్–29, హాక్, డోర్నియర్, ఏఎన్–32సహా ఎన్నో రకాల విమానాలను సమర్థవంతంగా నడిపారు. గగన్యాన్ మిషన్లో ఈయన గ్రూప్ కెప్టెన్ గా ఎంపికయ్యారు. శుభాన్షు శుక్లా వింగ్ కమాండర్ శుభాన్షు శుక్లా ఉత్తరప్రదేశ్లోని లక్నోలో 1985లో జన్మించారు. ఎన్డీఏలో శిక్షణ పూర్తిచేసుకుని 2006 జూన్లో ఇండియన్ ఎయిర్ఫోర్స్లో పైలెట్గా చేరారు. ఫైటర్ కంబాట్ లీడర్గా, టెస్ట్ పైలెట్గా 2,000 గంటలపాటు యుద్ధవిమనాలు నడిపారు. భారత వాయుసేనలోని దాదాపు అన్నిరకాల యుద్ధవిమానాలు నడపడంలో ఈయన నైపుణ్యం సాధించారు. ఈ నలుగురికి రష్యాలోని యూరీ గగారిన్ కాస్మోనాట్ శిక్షణ సంస్థలో సమగ్రమైన శిక్షణ ఇచ్చారు. గగన్యాన్లో ఈయన వింగ్ కమాండర్గా వ్యవహరిస్తారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
మృణాల్ ఠాకూర్ ఏ హీరోకు ఎస్ అంటుందో?
నటుడు అజిత్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం విడాముయర్చి. లైకా పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి మగిల్ తిరుమేణి దర్శకత్వం వహిస్తున్నారు. నటి త్రిష నాయకిగా నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకుంది. దీంతో అజిత్ తన తర్వాత చిత్రానికి సిద్ధం అవుతున్నారు. ఇటీవల విడుదలైన మార్క్ ఆంటోని చిత్రం ఫేమ్ ఆదిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించనున్నారు. దీన్ని ప్రముఖ తెలుగు చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీస్ నిర్మించనున్నట్లు సమాచారం. ఇందులో అజిత్ సరసన నటి మృణాల్ ఠాకూర్ నటించబోతున్నారనే ప్రచారం జరుగుతోంది. తెలుగులో వరుస హిట్లతో క్రేజీ కథానాయకిగా ఈమెకు ఇప్పుడు అవకాశాలు వరుస కడుతున్నాయి. ఇటీవల నటుడు శివకార్తికేయన్ హీరోగా ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా నటించనుందని ప్రచారం జోరుగా సాగింది. ఆమె కాల్షీట్స్ కోసం ఆ చిత్ర యూనిట్ గట్టిగానే ప్రయత్నించారు. అయినప్పటికీ ఆ ప్రయత్నం ఫలించలేదు. అదేవిధంగా శింబు కథానాయకుడిగా కమలహాసన్ నిర్మిస్తున్న చిత్రంలోనూ కథానాయకిగా మృణాల్ ఠాకూర్ పేరు వినిపిస్తోంది. దీంతో ఈ అమ్మడు అజిత్కు జై కొడుతుందో, శింబుకు సై అంటుందోనన్న ఆసక్తి కోలీవుడ్లో నెలకొంది. అజిత్ చిత్రం యూనిట్ వేరే ఆప్షన్ కూడా ఆలోచిస్తున్నట్లు సమాచారం. మృణాల్ ఠాకూర్ కాల్షీట్స్ కుదరకపోతే బాలీవుడ్ బ్యూటీ దిశా పటాని నటింపజేయడానికి చర్చలు జరుపుతున్నట్లు టాక్ వైరల్ అవుతోంది .ఈ భామ ఇప్పటికే కంగువ చిత్రంలో సూర్యకు జంటగా నటిస్తున్న విషయం తెలిసిందే. -
ఎన్సీపీ నాదే.. సుప్రీంకోర్టుకు శరద్పవార్
న్యూఢిల్లీ: మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్దే అసలైన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) అని ఎన్నికల సంఘం(ఈసీ)వెల్లడించిన నిర్ణయంపై ఆ పార్టీ పూర్వ అధినేత శరద్పవార్ సుప్రీంకోర్టు తలుపు తట్టారు. ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దేశ అత్యున్నత కోర్టులో సోమవారం ఆయన పిటిషన్ దాఖలు చేశారు. అజిత్ పవార్దే అసలైన ఎన్సీపీ అని ఈ నెల 6వ తేదీన తేల్చిన ఈసీ ఆ మరుసటి రోజే శరద్పవార్ వర్గానికి ఎన్సీపీ-శరద్పవార్ అనే పేరు కేటాయించింది. 1999లో స్థాపించి నిర్మించిన ఎన్సీపీని ఈసీ లాక్కుని వేరే వాళ్లకు ఇచ్చేసిందని, గతంలో ఇలాంటి ఘటన దేశంలో ఎప్పుడూ జరగలేదని శరద్పవార్ మండిపడ్డారు. కాగా, గతంలో ఎన్సీపీ నుంచి వేరుపడిన శరద్పవార్ మేనల్లుడు అజిత్ పవార్ మహారాష్ట్ర బీజేపీ, శివసేన సంకీర్ణంలో చేరి ఉపముఖ్యమంత్రి అయ్యారు. తన వద్దే మెజారిటీ ఎమ్మెల్యేలున్నందున అసలైన ఎన్సీపీ తనదేనని అజిత్ పవార్లో ఈసీ తలుపు తట్టారు. దీంతో ఈసీ అసలైన ఎన్సీపీ అజిత్దేనని తేల్చింది. ఇదీ చదవండి.. ఎంఐఎం నేతను కాల్చి చంపిన దుండగులు -
వారిపై కన్నేసిన మృణాల్ ఠాకూర్.. ప్లాన్ అదుర్స్
ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిన నటి మృణాల్ ఠాకూర్. చాలా మంది నటీమణులాగానే బుల్లితెర నుంచి వెండితెరకు ఎంట్రీ ఇచ్చింది ఈ బ్యూటీ. మొదట్లో మరాఠీ చిత్రాల్లో నటించిన మృణాల్ ఠాగూర్ ఆ తరువాత హిందీ చిత్రాల్లో నటించింది. అక్కడ పెద్దగా ఆకట్టుకోలేకపోయినా ఈ భామకు టాలీవుడ్ నుంచి లక్కీచాన్స్ వరించింది. అదే సీతారామం చిత్రం. ఆ చిత్రం సక్సెస్ మృణాల్ ఠాగూర్ను ఒక్కసారిగా మార్చేసింది. ఇటీవల నాని సరసన నటించిన 'హాయ్ నాన్న' చిత్రం హిట్ కూడా ఈమె ఖాతాలో పడింది. (ఇదీ చదవండి: సినిమా ఛాన్సులు లేవు.. కానీ భారీగా సంపాదిస్తున్న హీరోయిన్) మంచి జోష్ మీదు ఉన్న మృణాల్ ఠాకూర్కు విజయ్ దేవరకొండతో 'ఫ్యామిలీ స్టార్' చిత్రంలో ఛాన్స్ దక్కింది. త్వరలో విడుదల కానున్న ఈ చిత్రంపై కూడా మంచి అంచనాలు ఉన్నాయి. ఇదిలాఉంటే మృణాల్ ఠాకూర్పై ఇప్పుడు కోలీవుడ్ కన్ను పడింది. అక్కడ ఈ అమ్మడి కోసం మూడు భారీ ఆఫర్లు ఎదురుచూస్తున్నాయనేది తాజా సమాచారం. అందులో భాగంగా ఏఆర్ మురుగదాస్ శివకార్తికేయన్ హీరోగా నటించనున్న ఈ చిత్రంలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా నటించనున్నట్లు చాలా రోజులుగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. తాజాగా కమల్ హాసన్ తన రాజ్కుమార్ ఫిలిం ఇంటర్నేషనల్ పతాకంపై శింబు కథానాయకుడిగా నిర్మించనున్న భారీ యాక్షన్ ఎంటర్ కథా చిత్రంలో మృణాల్ ఠాగూర్ను ఒక హీరోయిన్గా ఎంపిక చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది. ఇందులో మరో హీరోయిన్గా కీర్తీ సురేష్ నటించబోతున్నట్లు సమాచారం. కాగా మృణాల్ ఠాగూర్ మరో లక్కీచాన్స్ కూడా తలుపు తట్టినట్లు తెలుస్తోంది. నటుడు అజిత్ ప్రస్తుతం విడాముయర్చి చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం పూర్తి కాగానే అజిత్ మరో సినిమా తీస్తున్న విషయం తెలిసిందే. మార్క్ ఆంటోని చిత్రంతో ఫేమ్ సంపాదించుకున్న ఆదిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో నటించడానికి ఆయన సిద్ధం అవుతున్నారు. ప్రముఖ టాలీవుడ్ చిత్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీస్ నిర్మించనున్న చిత్రంలో కూడా మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా నటించే విషయంపై చర్చలు జరుగుతున్నట్లు తెలిసింది. ఇలా కోలీవుడ్లో మృణాల్ ఠాకూర్ కరెక్ట్ ప్లాన్తో అడుగులేస్తూ.. వరుసగా దండెత్తడానికి సిద్ధమవుతున్నారన్నమాట. View this post on Instagram A post shared by Mrunal Thakur (@mrunalthakur) -
అజిత్తో ఇబ్బంది పడుతున్న త్రిష
అతివృష్టి, అనావృష్టి అన్నచందంగా ఉంది నటి త్రిష పరిస్థితి. దక్షిణాది చిత్ర పరిశ్రమను ఏలుతున్న ఈ చైన్నె బ్యూటీ. మొదట సహాయనటిగా సినీ రంగప్రవేశం చేసి ఆ తర్వాత తమిళం, తెలుగు భాషల్లో క్రేజీ కథానాయకిగా సత్తా చాటుకుంటున్నారు. ఒకానొక సమయంలో లేడీ ఓరియెంట్ కథా చిత్రాల్లో నటించిన ఈమెకు ఆ తరహా చిత్రాలు అచ్చి రాలేదు. అంతేకాదు అలాంటి చిత్రాలు అపజయాలను చవిచూడడంతో త్రిష కెరీర్ డౌన్ అయిపోయింది. అలా అవకాశాలే లేక ఇంట్లో కూర్చున్న ఈ బ్యూటీకి నాలుగు పదుల వయసు మీద పడ్డ తర్వాత ఇటీవల పొన్నియిన్ సెల్వన్ చిత్రంతో దర్శకుడు మణిరత్నం నటిగా పునర్ జన్మను ఇచ్చారనే చెప్పాలి. అలా త్రిష మళ్లీ పీక్లోకి వచ్చారు. ఆ తర్వాత విజయ్తో జతకట్టిన లియో చిత్రం మంచి వసూళ్లు సాధించింది. ప్రస్తుతం అజిత్ సరసన విడాముయర్చి, కమలహాసన్కు జంటగా థక్స్లైఫ్ చిత్రాల్లో నటిస్తున్నారు. అదేవిధంగా చాలా గ్యాప్ తర్వాత తెలుగులో చిరంజీవి సరసన విశ్వంభర చిత్రంలో నటించే అవకాశం వచ్చినదన్నది తాజా సమాచారం. ఈమె ఇంతకుముందు స్టాలిన్ చిత్రంలో చిరంజీవితో జత కట్టారన్నది గమనార్హం. ఇలా వరుసగా అవకాశాలు వెల్లువెత్తడంతో త్రిష పరిస్థితి అతివృష్టిగా మారింది. ఎందుకు ప్రధాన కారణం అజిత్ సరసన నటిస్తున్న విడాముయర్చి చిత్రం అని సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఈ చిత్ర షూటింగ్ అనుకున్న ప్రకారం జరగకపోవడంతో త్రిషకు తలనొప్పిగా మారిందట. ఇతర చిత్రాలకు కేటాయించిన కాల్షీట్స్కు ఆటంకం కలుగుతోందని త్రిష వాపోతున్నారట. ఏమిట్రా బాబు ఇలాంటి పరిస్థితి బాగున్న సమస్యే, బాగా లేకపోయినా సమస్యేనా అంటూ త్రిష టెన్షన్ అవుతున్నట్లు టాక్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. -
హిట్ కాంబో రిపీట్.. స్టార్ హీరోతో ఆ దర్శకుడు ఐదో సినిమా
దళపతి విజయ్, తలా అజిత్ అభిమానుల వైరం గురించి చాలామందికి తెలుసు. ఎందుకంటే తమ హీరో గొప్ప, తమ హీరో గొప్ప అని ఎప్పుడూ గొడవపడుతూనే ఉంటారు. అయితే తాజాగా విజయ్, రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించడంతో అజిత్ ఫ్యాన్స్ హ్యాపీగా ఫీలవుతున్నారు. అదే టైంలో అజిత్ వరస చిత్రాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుండటం హాట్ టాపిక్గా మారిపోయింది. అలా ఇప్పుడు తనకు నాలుగు హిట్స్ ఇచ్చిన దర్శకుడితో మరోసారి కలిసి పనిచేయబోతున్నట్లు న్యూస్ బయటకొచ్చింది. (ఇదీ చదవండి: మేనల్లుడిని హీరోగా పరిచయం చేస్తున్న ధనుష్) అజిత్ ప్రస్తుతం తన 62వ సినిమా చేస్తున్నాడు. లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి 'విడామయూర్చి' అనే టైటిల్ నిర్ణయించారు. మగిళ్ తిరుమేణి దర్శకుడు. షూటింగ్ చివరి దశకు చేరుకోగా.. మేలో విడుదల చేయాలని చూస్తున్నారు. కాగా అజిత్ తన 63వ మూవీ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో చేయబోతున్నారు. దీని తర్వాత వెట్రిమారన్తో మూవీ ఉంటుందని అంటున్నారు. కానీ అది జరిగేలా కనిపించట్లేదు. ఈ క్రమంలోనే దర్శకుడు శివ పేరు తెరపైకి వచ్చింది. అజిత్ తన 64వ సినిమాని శివకి అప్పగించాలని అనుకుంటున్నారట. గతంలో వీళ్ల కాంబోలో వీరం, వేదాళం, వివేకం, విశ్వాసం లాంటి నాలుగు సూపర్ హిట్ చిత్రాలు వచ్చాయి. ఇప్పుడు చేయబోయేది ఐదో చిత్రం కాబోతుంది. అయితే ఈ మూవీస్ అన్నీ కూడా తమిళంలో హిట్ అయ్యాయి కానీ తెలుగులో పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. (ఇదీ చదవండి: గుంటూరు కారం ఓటీటీ రిలీజ్ డేట్.. నెలరోజుల్లోనే ఓటీటీలోకి) -
మనసు మార్చుకున్న హీరోయిన్ టబు.. 24 ఏళ్ల తర్వాత ఇప్పుడు!
టబు గురించి ఇప్పటి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా తెలియకపోవచ్చు. కానీ కాస్త ముందు జనరేషన్ని అడిగితే ఆమె యాక్టింగ్ గురించి చెబుతారు. గత కొన్నేళ్ల నుంచి పూర్తిగా బాలీవుడ్కే పరిమితమైపోయిన ఈ బ్యూటీ.. మధ్యలో 'అల వైకుంఠపురములో' అనే తెలుగు సినిమాలో మాత్రమే నటించింది. తర్వాత మళ్లీ హిందీపైనే ఫోకస్ చేసింది. అలాంటిది ఇప్పుడు మరోసారి దక్షిణాదిలో నటించనుంది. (ఇదీ చదవండి: జ్యోతిక విడాకుల రూమర్స్.. ముంబైకి షిఫ్ట్.. అసలు కారణం ఇదేనా?) తమిళంలో అజిత్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వయసుకు తగ్గ పాత్రలు చేస్తూ అందరినీ ఎంటర్టైన్ చేస్తున్నాడు. ప్రస్తుతం 'విడాముయర్చి' సినిమాతో బిజీగా ఉన్నాడు. ఇందులో త్రిష హీరోయిన్ కాగా నటిస్తుండగా అర్జున్, రెజీనా ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. దీని తర్వాత అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో ఓ మూవీ చేయబోతున్నాడు. ఇందులో అజిత్ సరసన బాలీవుడ్ భామ టబు నటిస్తున్నట్లు తాజా సమాచారం. 2000లో టబు-అజిత్ జంటగా తమిళంలో 'కండు కొండేన్' అనే సినిమా వచ్చింది. 'ప్రియురాలు పిలిచింది' పేరుతో ఇది తెలుగులోనూ డబ్ అయింది. రాజీవ్ మేనన్ దర్శకుడు. అదే ఏడాది మరో తమిళ సినిమా చేసిన టబు.. 2013లో మరో తమిళ మూవీ చేసింది అంతే. మళ్లీ ఇన్నాళ్లకు మరో చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇకపోతే అజిత్తో అయితే ఏకంగా 24 ఏళ్ల తర్వాత కలిసి పనిచేయబోతుందనమాట. (ఇదీ చదవండి: అత్తారింట్లో కండీషన్స్? మెగా కోడలు లావణ్య త్రిపాఠి ఇంట్రెస్టింగ్ కామెంట్స్) -
కార్తీ, కమల్ ప్రాజెక్ట్లను కాదని కమెడియన్తో సినిమా తీస్తున్న స్టార్ డైరెక్టర్
హిట్ చిత్రాలకు కేరాఫ్గా మారిన దర్శకుడు హెచ్.వినోద్. అజిత్తో వలిమై,తెగింపు చిత్రాలతో పాటు బాలీవుడ్ హిట్ సినిమా అయిన పింక్ చిత్రాన్ని కూడా తమిళ్లో వినోద్ డైరెక్ట్ చేశాడు. కార్తీతో ఖాకీ చిత్రాన్ని తీసి టాలీవుడ్లో కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈయన తదుపరి ప్రాజెక్ట్ కమలహాసన్ కథానాయకుడిగా రాజ్ కమల్ ఫిలిం ఇంటర్నేషనల్ పతాకంపై ఓ చిత్రం చేయడానికి సిద్ధం అయ్యారు. దీనికి సంబంధించిన కథా చర్చలు జరిగాయి. ఇది వ్యవసాయ నేపథ్యంలో రూపొందనుందనే ప్రచారం జరిగింది. అలాంటిది ఇప్పుడు ఈ చిత్రం తెరకెక్కించడానికి మరింత సమయం పట్టనుందనే టాక్ వినిపిస్తోంది. కాగా ఇంతకు ముందు నటుడు కార్తీతో ఖాకీ చిత్రానికి సీక్వెల్ చేస్తానని కూడా ఆయన ప్రకటించారు. కానీ ఆ ప్రాజెక్ట్ గురించి ఎలాంటి సమాచారం లేదు. దీంతో నటుడు కార్తీ ప్రస్తుతం వరుస చిత్రాలతో బిజీగా ఉన్నారు. కమలహాసన్ హీరోగా చేసే చిత్రం కూడా వాయిదా పడడంతో హెచ్.వినోద్ మధ్యలో ఓ చిత్రాన్ని చేయడానికి సిద్ధమవుతున్నట్లు తాజా సమాచారం. ఇందులో నటుడు యోగిబాబు హీరోగా నటించనున్నట్లు తెలుస్తోంది. ఇది రాజకీయ వ్యంగ్యాస్త్రాలతో వినోద భరిత కథా చిత్రంగా ఉంటుందని సమాచారం. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉందని భావిస్తున్నారు. -
ఆ ఓటీటీలో భారీ చిత్రాల హంగామా.. 2024లో వస్తున్న టాప్ సినిమాలు ఇవే
ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ సంస్ధ అయిన నెట్ఫ్లిక్స్ కోలీవుడ్లో కూడా ట్రెండింగ్లో ఉంది. 2024లో పాన్ ఇండియా రేంజ్లో భారీ చిత్రాలతో ప్రేక్షకులకు మరింత వినోదాన్ని అందించనుంది. దీని గురించి ఆ సంస్థ నిర్వాహకురాలు మోనికా పెర్కన్ తన ఇన్స్టాగ్రామ్లో పేర్కొంటూ.. నెట్ఫ్లిక్స్ ఓటీటీ సంస్థ మంచి కంటెంట్ తక్కువ అయినా జనరంజిత చిత్రాలను అందిస్తూ అలరించే విషయంలో ఎప్పుడూ ముందుంటుందన్నారు. గత ఏడాది విజయ్ కథానాయకుడిగా నటించిన లియో, అజిత్ హీరోగా నటించిన తుణివు, ఉదయనిధి స్టాలిన్ కథానాయకుడిగా నటించిన మామన్నన్ వంటి సూపర్ హిట్ చిత్రాలను స్ట్రీమింగ్ చేసినట్లు తెలిపారు. అలాగే 2024లో 9 తమిళ భారీ చిత్రాలు నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కానున్నాయని చెప్పారు. వీటిలో కమలహాసన్ కథానాయకుడిగా శంకర్ దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఇండియన్–2, అజిత్ కథానాయకుడిగా నటిస్తున్న విడాముయర్చి, ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మించిన కంజూరింగ్ కన్నప్పన్, కీర్తి సురేష్ ప్రధానపాత్రలో డ్రీమ్ వారియర్ ఫిలిమ్స్ నిర్మిస్తున్న కన్నివెడి, విజయ్సేతుపతి కథానాయకుడిగా ఫ్యాషన్ స్టూడియో సంస్థ నిర్మిస్తున్న మహరాజా చిత్రం ఉంది. సోనీ పిక్చర్స్ ఫిలిమ్స్ శివకార్తికేయన్ 21వ చిత్రం ఫ్యాషన్ ఫిలిం ఫ్యాక్టరీ, దిరూట్ సంస్థలు నిర్మిస్తున్న రివాల్వర్ రీటా, ఎస్ఎన్ఎస్ ప్రొడక్షన్స్ ఎల్ఎల్పీ సంస్థ నిర్మిస్తున్న స్వర్గ వాసల్, స్టూడియో గ్రీన్ పతాకంపై విక్రమ్ కథానాయకుడిగా జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్న తంగలాన్ చిత్రం ఉంటాయన్నారు. ఇక ఈ తొమ్మిది చిత్రాలను తెలుగు, కన్నడం, హిందీ, మలయాళం భాషల్లో విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. -
ఆ ఇద్దరు హీరోలు ఎవరో నాకు తెలియదు.. RRR నటుడు వైరల్ కామెంట్
ఎడ్వర్డ్ సోన్నెన్బ్లిక్.. దక్షిణ కాలిఫోర్నియాలో జన్మించి నటుడిగా తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ముంబై షిఫ్ట్ అయ్యాడు. ప్రస్తుతం ఆయనకు హీందీ కూడా వచ్చు. ఆర్ఆర్ఆర్ చిత్రంతో పాన్ ఇండియా రేంజ్లో గుర్తింపు రావడంతో ధనుష్ కెప్టెన్ మిల్లర్ చిత్రంలో ఆయనకు ఛాన్స్ దక్కింది. కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ ప్రధాన పాత్రలో నటించిన 'కెప్టెన్ మిల్లర్' సంక్రాంతి కానుకగా పాన్ ఇండియా రేంజ్లో జనవరి 12న వడుదల కానుంది. కానీ తెలుగులో మాత్రం సంక్రాంతి తర్వాత విడుదల అవుతుందని మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో ఈ సినిమాకు సంబంధించిన నటులు సినిమా ప్రమోషన్స్లలో భాగంగా పలు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. అమెరికన్ నటుడు 'ఎడ్వర్డ్ సోన్నెన్ బ్లిక్' కూడా ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కుతున్న కెప్టెన్ మిల్లర్లో ఆయన బ్రిటిష్ అధికారిగా నటించాడు. గతంలో కూడా RRR చిత్రంలో ఎడ్వర్డ్ పాత్రలో మెప్పించిన విషయం తెలిసిందే. రాజన్న, షిర్డీ సాయి, కేసరి, సామ్ బహదూర్, మణికర్ణిక వంటి పాపులర్ చిత్రాల్లో ఆయన నటించాడు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న 'ఎడ్వర్డ్ సోన్నెన్ బ్లిక్' కోలీవుడ్ హీరోల గురించి పలు విషయాలు షేర్ చేశాడు. ధనుష్ కాకుండా ఈ హీరోలు తెలుసా.. ? అని ఆయనకు ఒక ప్రశ్న ఎదురైంది. అజిత్, సూర్య, విజయ్ ఫోటోలను అతని ముందు ఉంచగా... విజయ్ను మాత్రమే సరిగ్గా ఆయన గుర్తించాడు. 2005లోనే విజయ్ నటించిన చిత్రాన్ని చూశానని ఎడ్వర్డ్ చెప్పాడు. అతనిలో మంచి టాలెంట్ ఉందని అప్పుడే అనుకున్నానని ఆయన పేర్కొన్నాడు. దీంతో కోలీవుడ్లో విజయ్ ఫ్యాన్స్ ఈ అంశాన్ని తెగ వైరల్ చేస్తున్నారు. తమ హీరో రేంజ్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలకు తెలుసు అంటూ కామెంట్లు చేస్తున్నారు. I have seen #ThalapathyVijay film in 2005 and liked him. - RRR and Captain Miller fame Edward Sonnenblick#TheGreatestOfAllTime @actorvijaypic.twitter.com/Hy8TdBTSw9 — Actor Vijay FC (@ActorVijayFC) January 7, 2024 -
చివరకు అలాంటి పాత్రలు కూడా చేస్తున్న స్టార్ హీరోయిన్!
రెజీనా పేరు చెప్పగానే తెలుగు యంగ్ హీరోయిన్ గుర్తొస్తుంది. దాదాపు కెరీర్ అంతా మిడ్ రేంజ్ హీరోలతో సినిమాలు చేసిన ఈ బ్యూటీ.. ఇప్పుడు వెబ్ సిరీసులు, లేడీ ఓరియెంటెడ్ మూవీస్ చేస్తూ బిజీగా ఉంది. ఈ మధ్య కాలంలో ఈమె నటించిన ఏ మూవీ కూడా హిట్ కావడం లేదు. దీంతో ఎలాంటి పాత్రకు అయినా సరే రెడీ అంటోంది. (ఇదీ చదవండి: సడన్గా ఓటీటీలోకి వచ్చేసిన సుడిగాలి సుధీర్ లేటెస్ట్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?) ప్రస్తుతం తమిళంలో అజిత్ హీరోగా 'విడమయూర్చి' సినిమా తీస్తున్నారు. ఇందులో అర్జున్ విలన్గా నటిస్తున్నాడు. రెజీనా.. విలన్ పాత్రధారి అర్జున్కి జోడీగా నటిస్తోంది. ఒకప్పుడు హీరోల సరసన నటించిన రెజీనా ఇప్పుడు విలన్ సరసన నటించే పాత్రలు చేస్తోంది. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అజిత్ 'విడమయూర్చి' మూవీ షూటింగ్ చివరి దశలో ఉంది. ఇతర కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకుని అజిత్ పుట్టినరోజు కానుకగా మే 1న ఈ చిత్రాన్ని థియేటర్లలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. దీని తర్వాత అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో అజిత్ కొత్త మూవీ చేస్తాడు. (ఇదీ చదవండి: అక్కడ 'సలార్'ని మించి కలెక్షన్స్ సాధిస్తున్న చిన్న సినిమా!) -
ప్రశాంత్ నీల్తో బిగ్ ప్లాన్ వేస్తున్న మైత్రి మూవీ మేకర్స్
దక్షిణాది చిత్ర పరిశ్రమలో మాస్ ఫాలోయింగ్ ఉన్న హీరోల్లో అజిత్ ఒకరు. ఈయన ఇటీవల నటించిన చిత్రాలన్నీ మంచి విజయాన్ని సాధిస్తున్నాయి. ప్రస్తుతం అజిత్ తన 62వ చిత్రంలో నటిస్తున్నారు. దీనికి విడాముయర్చి అన్న టైటిల్ను కూడా ఖరారు చేసిన విషయం తెలిసిందే. మగిళ్ తిరుమేణి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని లైకా సంస్థ భారీ ఎత్తున నిర్మిస్తోంది ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతాన్ని అందిస్తున్నారు. చిత్ర షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. కాగా అజిత్ తన తదుపరి చిత్రాలను వరుసగా కమిట్ అవుతున్నట్లు తాజా సమాచారం. విడాముయర్చి చిత్రాన్ని పూర్తి చేసిన తర్వాత అజిత్ ఆధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో నటించడానికి సిద్ధమవుతున్నారు. ఇది ఆయన 63వ చిత్రం అవుతుంది. కాగా అజిత్ తన 64వ చిత్రాన్ని ప్రముఖ తెలుగు చిత్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్లో చేయబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అదేవిధంగా తన 65వ చిత్రం కూడా దర్శకుడిని ఫిక్స్ చేసుకున్నట్లు తాజా సమాచారం. ఆయన ఎవరో కాదు తాజా క్రేజీ దర్శకుల్లో ఒకరైన ప్రశాంత్ నీల్. కేజీఎఫ్తో తన సత్తాను చాటుకుని పాన్ ఇండియా దర్శకుడుగా మారి తాజాగా సలార్ చిత్రంతో మరోసారి సంచలన విజయాన్ని అందుకున్నారు. దీంతో ప్రశాంత్ నీల్కు అవకాశాలు వెంటాడుతున్నాయి అనే చెప్పాలి. ఇప్పటికే టాలీవుడ్లో సక్సెస్ఫుల్ బ్యానర్గా మైత్రి మూవీ మేకర్స్ మంచి పేరు ఉంది. అజిత్ సినిమాతో కోలీవుడ్లో కూడా ఎంట్రీ ఇచ్చి.. అక్కడ కూడా పాగా వేసేందుకు మైత్రి మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తుందట. ప్రస్తుతం ఈయన కేజీఎఫ్ 3, సలార్ 2 చిత్రాలను చేయాల్సి ఉంది. అదేవిధంగా టాలీవుడ్ స్టార్ కథానాయకుడు జూనియర్ ఎన్టీఆర్తో చిత్రం చేయనున్నట్లు ఇంతకుముందే ప్రకటించారు. తాజాగా ఈ దర్శకుడిపై అజిత్ కన్నేసినట్లు సమాచారం. తనతో చిత్రం చేయమని ఈయనే స్వయంగా దర్శకుడు ప్రశాంత్ నీల్ను కోరినట్లు ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. అజిత్ 65వ చిత్రానికి ఈయనే దర్శకత్వం వహించే అవకాశం ఉందనే సమాచారం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడానికి మాత్రం ఇంకా చాలా సమయం ఉంది. -
నాడు అజిత్ కూతురిగా మెప్పించి.. నేడు గ్లామర్ ఫోటోలతో ఛాన్స్లు
కోలీవుడ్లో నటి అనికా సురేందర్ గురించి తెలియని సినీ ప్రియులు ఉండరు. టాలీవుడ్లో కూడా ఆమెకు గుర్తింపు ఉంది. ఆమె ఎక్కువ చిత్రాల్లోనూ నటించలేదు. కథానాయకిగా సక్సెస్లు అందుకోలేదు. మరి ఈ అమ్మడి పాపులారిటీకి కారణం ఏమిటంటారా? ఓన్లీ గ్లామర్. అవును తన గ్లామరస్ ఫొటోలను తరచూ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తూ కుర్రకారుకు కిర్రెక్కిస్తుంటారు నటి అనికా సురేందర్. బాల నటిగా పరిచయమైన ఈ మలయాళీ కుట్టి కోలీవుడ్లో గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన అజిత్ సినిమా 'ఎన్నై అరిందాల్' తెలుగులో (ఎంత వాడు కానీ) చిత్రంలో త్రిషకు కూతురిగా నటించి గుర్తింపు పొందింది. ఆ తరువాత విశ్వాసం చిత్రంలో అజిత్, నయనతారల కూతురిగా నటించి ఇంకా ప్రాచుర్యం పొందింది. అలా మొదటిసారిగా తెలుగులో బుట్టబొమ్మ చిత్రం ద్వారా కథానాయకిగా పరిచయమైంది. ఆ చిత్రం నిరాశ పరిచింది. అయినా మాతృభాషలో ఓ మై డార్లింగ్ చిత్రంతో కథానాయకిగా ఎంట్రీ ఇచ్చింది. ఈ చిత్రం ట్రైలర్ విడుదలై చాలా ఇంట్రెస్టింగ్ను క్రియేట్ చేసింది. దానికి కారణం గ్లామర్నే. ఇటీవల తెరపైకి వచ్చిన ఈ చిత్రం పూర్తిగా నిరాశ పరిచింది. ఇప్పుడు తమిళంలో కథానాయకిగా నటించే అవకాశం వచ్చినట్టు సమాచారం. ప్రస్తుతం నటి అనికా సురేందర్ తమిళంలో ధనుష్ హీరోగా నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్న తన 50వ చిత్రంలో ముఖ్య భూమికను పోషిస్తోంది. ధనుష్ మరో చిత్రానికి కూడా దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో ఆయన అక్క కొడుకును కథానాయకుడిగా పరిచయం చేస్తున్నారు. ఈ చితంలో నటి అనికా సురేందర్ను హీరోయిన్గా నటింపజేయడానికి చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. ఈ చిత్రంతోనైనా నటి అనికా సురేందర్ సక్సెస్ను అందుకుంటుందా అన్న ఆసక్తి నెలకొంది. -
ప్రమాదం వల్ల అప్పుడు ఆపేశారు.. ఇప్పుడు మళ్లీ షురూ!
తమిళ స్టార్ హీరో అజిత్ కొత్త సినిమా 'విడాముయర్చి'. మగిళ్ తిరమేని దర్శకత్వం వహిస్తున్నాడు. లైకా ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్తో నిర్మిస్తోంది. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా సాగుతోంది. చాలాకాలం తరువాత త్రిష, అజిత్ మూవీలో నటిస్తుండటం విశేషం. ప్రియా భవానీ శంకర్, సంజయ్ దత్ తదితరులు ముఖ్య పాత్రలను పోషిస్తున్నారు. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 32 మూవీస్) తొలి షెడ్యూల్ అజర్ బైజాన్ దేశంలో చేశారు. అప్పుడు అసిస్టెంట్ కెమెరామెన్ ప్రమాదవశాత్తూ మృతి చెందడంతో మధ్యలో నిలిపేశారు. చిన్న గ్యాప్ తీసుకుని ఇప్పుడు మళ్లీ ఆ దేశానికి చెక్కేశారు. తాజాగా హీరో అజిత్.. చైన్నె విమానాశ్రయంలో అభిమానితో దిగిన ఫొటో ఇప్పుడు వైరల్ అవుతోంది. అజర్ బైజాన్లో మిగతా షెడ్యూల్కి సంబంధించిన సన్నివేశాలన్నీ పూర్తి చేసుకుని.. కొన్ని రోజుల తర్వాత మూవీ యూనిట్ చెన్నైకి తిరిగొస్తారు. వచ్చే ఏడాది వేసవి కానుకగా ఈ చిత్రాన్ని థియేటర్లలోకి తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. (ఇదీ చదవండి: Bigg Boss 7: శోభాశెట్టి ఎలిమినేట్.. మొత్తం రెమ్యునేషన్ ఎంతో తెలుసా?) -
'సహస్రనామం' సమ్మోహన విజయం!
‘ఎడారిలో రెయిన్ కోట్లు అమ్మకూడదు’ అనేది వ్యాపారానికి సంబంధించి అప్రకటిత ప్రాథమిక సూత్రం! ఎక్కడ ఏది అవసరమో అది అందుబాటులోకి తీసుకువచ్చినప్పుడే ఎంటర్ప్రెన్యూర్ గెలుపు జెండా ఎగరేయగలడు. సంప్రదాయ విధానాలకు భిన్నంగా సంస్థలకు సంబంధించిన డేటా–ఎనాలటిక్స్ ప్రాసెస్ను సులభతరం చేయడానికి, కాలాన్ని, ఖర్చును తగ్గించడానికి ఏఐ సాంకేతికత ఉపయోగపడుతుంది. ఈ నేపథ్యంలో ఏఐ స్టార్టప్లకు ప్రాధాన్యత పెరిగింది. చెన్నైకి చెందిన అజిత్ సహస్రనామం ఏఐ స్టార్టప్ ‘ఆన్గిల్’తో విజయం సాధించాడు. ‘రైట్ మోడల్ అనేది ముఖ్యం’ అంటున్న అజిత్ స్టార్టప్ కలల యువతరం రోల్మోడల్స్లో ఒకరిగా నిలిచాడు. 'ప్రాసెసింగ్ ఆఫ్ డేటా’కు సంబంధించి వివిధ సంస్థలకు రకరకాల సవాళ్లు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఐఏ) సాంకేతికత డేటా–డ్రైవెన్ మెథడాలజీలతో ఖర్చును తగ్గిస్తుంది. టైమ్ సేవ్ చేస్తోంది. రిపోర్ట్స్ తయారీని సులభతరం చేస్తోంది. అందుకే ఇప్పుడు ఏఐ స్టార్టప్లకు ప్రాధాన్యత పెరిగింది. ‘ఒకప్పుడు రోజుల్లో మాత్రమే పూర్తయ్యే పని ఇప్పుడు నిమిషాల వ్యవధిలో పూర్తవుతుంది’ అంటున్నాడు ఏఐ స్టార్టప్ ‘ఆన్గిల్’ ఫౌండర్, సీయీవో అజిత్. ఒక్క మాటలో చెప్పాలంటే డేటా ఆధారిత నిర్ణయాలకు సంబంధించి ఏఐ–డ్రైవెన్ సొల్యూషన్లు నిర్ణయాత్మక పాత్ర పోషిస్తున్నాయి. బిజినెస్ ప్రాసెస్కు డైనమిక్ లుక్ ఇస్తున్నాయి. కొన్ని నెలల క్రితం బెంగళూరులో జరిగిన ఎర్లీ–స్టేజ్ స్టారప్ ఫౌండర్స్ సమావేశంలో స్టారప్ ప్రయాణ ప్రారంభంలో ఎలాంటి సవాళ్లు ఎదురవుతాయో వివరంగా చెప్పాడు అజిత్ సహస్రనామం. ‘రైట్ మోడల్ లేకుండా ఎలా ముందుకు వెళ్లగలం?’ అంటాడు అజిత్. రైట్ మోడల్ మాట ఎలా ఉన్నా స్టార్టప్ కలల యువతరం ‘రోల్ మోడల్స్’లో అజిత్ సహస్రనామం ఒకరు. ఏఐ స్టార్టప్ ‘ఆన్గిల్’ ఫౌండర్, సీయివోగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు అజిత్. ఇన్స్టంట్ మెసేజింగ్ ΄ప్లాట్ఫామ్ ‘ఆన్గిల్’ పరిశ్రమలకు సంబంధించి డేటా కలెక్షన్ నుంచి ఇన్సైట్స్ వరకు ఎనాలటిక్స్ టాస్క్లను వేగవంతం చేస్తుంది. ‘ప్రారంభ దశలో ఉన్న స్టార్టప్లు అందుబాటులో ఉన్న మోడల్స్పై ఆధారపడడం అనేది ఒక విధానం. రెండోది పబ్లిక్ సోర్స్ శాంపిల్స్ ద్వారా సొంత డేటా తయారుచేసుకోవడం. అన్నిటికంటే పెద్ద సవాలు యూజర్స్ ఓకే అనేలా ప్రొడక్ట్ను బిల్డ్ చేయడం’ అంటాడు అజిత్. ‘ఆన్గిల్’ సాధించిన విజయం ఏమిటి? 2017లో ప్రారంభమైన ‘ఆన్గిల్’ రియల్–టైమ్ విజువలైజేషన్, ప్రిడెక్టివ్ ఎనాలటిక్స్ ఫీచర్ల ద్వారా పరిశ్రమలకు సంబంధించి ఎనాలటిక్స్ టాస్క్లను వేగవంతం చేస్తోంది. 2025 నాటికి మన దేశంలో ఏఐ మార్కెట్ మరింతగా విస్తరించనుంది అని నిపుణులు చెబుతున్నారు. డొమెస్టిక్ ఏఐ మార్కెట్లోకి యువతరం సారథ్యంలో మరెన్నో స్టార్టప్లు అడుగు పెట్టనున్నాయి. ఔత్సాహికులకు సక్సెస్ఫుల్ ఎంటర్ప్రెన్యూర్ల మాటలే పాఠాలు అవుతాయి. ‘ఆన్గిల్’తో విజయం సాధించిన అజిత్ సహస్రనామం నోటి మాటల నుంచి ఎన్నో పాఠాలు నేర్చుకోవచ్చు. -
కాంబినేషన్ కుదిరిందా?
హీరో అజిత్ ప్రస్తుతం ‘విడాముయార్చి’ సినిమాతో బిజీగా ఉన్నారు. మగిళ్ తిరుమేని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా తాజా షెడ్యూల్ అజర్బైజాన్లో పూర్తయిందని కోలీవుడ్ టాక్. అయితే అజిత్ తెలుగులో ఓ సినిమా కోసం రెడీ అవుతున్నారని, మైత్రీ మూవీమేకర్స్ సంస్థ ఈ సినిమాను నిర్మించనుందనే టాక్ తెరపైకి వచ్చింది. అంతే కాదు.. ఈ సినిమాకు దర్శకుడిగా గోపీచంద్ మలినేని పేరు అనుకుంటున్నారట. మరి.. అజిత్, గోపీచంద్ మలినేని కాంబినేషన్ కుదిరిందా? లేదా? అన్నది తెలియాలంటే మరికొంత సమయం వేచి చూడాలి. -
స్టార్ హీరో ఇంటి గోడని కూల్చేసిన అధికారులు.. అదే కారణమా?
సినిమా హీరోలు అనగానే వాళ్లు దైవంశ సంభూతులు అని ఫ్యాన్స్ అనుకుంటూ ఉంటారు. కానీ వాళ్లు కూడా మనలాంటి మనుషులే. సదరు హీరోలకు అన్నీ రూల్స్ వర్తిస్తాయి. ఇప్పుడు అలాంటి ఓ నిబంధన వల్ల స్టార్ హీరో ఇంటిని మున్సిపల్ అధికారులు కూల్చేశారు. ఇంతకీ ఏం జరిగింది? ఎవరా హీరో? (ఇదీ చదవండి: వాళ్లకు క్షమాపణలు చెప్పిన మెగాహీరో రామ్చరణ్) తమిళంలో మీకు తెలిసిన హీరో పేర్లు చెప్పండంటే.. ఇప్పటి జనరేషన్ తెలుగు ప్రేక్షకులు రజనీకాంత్, విజయ్, కమల్ హాసన్ పేర్లు చెబుతారు. వీళ్లకుఏ మాత్రం తగ్గని క్రేజ్ సొంతం చేసుకున్న వాళ్లలో అజిత్ ఒకడు. కానీ తెలుగులో ఈ హీరోకి చెప్పుకోదగ్గ ఫేమ్ లేదు. ప్రస్తుతం ఇతడు చెన్నైలోని ఇంజంబక్కమ్లోని ఓ ఇంట్లో ఉంటున్నాడు. ఇప్పుడు ఆ ఇంటి గోడనే అధికారులు కూల్చేశారు. అజిత్ ఇల్లు ఉన్న ప్రాంతంలో ప్రస్తుతం రోడ్డు విస్తరణ పనులు, వర్షం నీరు వెళ్లడానికి డ్రైనేజీ ఏర్పాటు జరుగుతోంది. ఇందులో భాగంగానే ఆ ఏరియాలో ఉంటున్న దాదాపు 50 ఇళ్లని అధికారులు కూల్చేస్తున్నారు. కోర్టు ఆదేశాల మేరకు ఈ పనులన్నీ జరుగుతున్నాయి. అయితే అజిత్ ఇంటి మొత్తాన్ని ఏం కూల్చేయలేదు. ప్రహరీ గోడని తొలగించారు. ఇప్పుడీ న్యూస్ అభిమానులని ఒక్కసారిగా కలవరపాటుకి గురిచేసింది. ఇదిలా ఉండగా ఈ ఏడాది సంక్రాంతికి 'తెగింపు' సినిమాతో వచ్చిన అజిత్.. ప్రస్తుతం 'విడా మయూర్చి' చిత్ర షూటింగ్లో బిజీగా ఉన్నారు. (ఇదీ చదవండి: సీక్రెట్గా పెళ్లి చేసుకున్న ఆ స్టార్ సింగర్.. అమ్మాయి ఎవరంటే?) -
'లియో' మూవీ హైనా వల్ల స్టార్ హీరో ఫ్యాన్స్ మధ్య గొడవ?
'లియో' సినిమా కొందరికి నచ్చింది. మరికొందరికి నచ్చలేదు. కానీ ఇందులో హైనా క్యారెక్టర్ మాత్రం చూసిన ప్రతిఒక్కరికీ పిచ్చపిచ్చగా నచ్చేసింది. మూవీ సక్సెస్లో మేజర్ రోల్ ప్లే చేసిన ఈ జంతువు పాత్ర వల్ల ఇద్దరు స్టార్ హీరో ఫ్యాన్స్ తిట్టుకుంటున్నారు. ఈ వ్యవహారంలో విజయ్ ఫ్యాన్స్ కూడా ఉన్నారండోయ్. ఇంతకీ హైనా వల్ల హర్ట్ అయిన స్టార్ హీరో అభిమానులు ఎవరు? అసలెందుకీ గొడవ? (ఇదీ చదవండి: చిన్నప్పటి ఫ్రెండ్ కోసం కదిలొచ్చిన చిరంజీవి.. స్వయంగా ఆస్పత్రికి వెళ్లి!) అసలేం జరిగింది? LCU అదేనండి లోకేశ్ సినిమాటిక్ యూనివర్స్లో భాగంగా డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ తీసిన సినిమా 'లియో'. దళపతి విజయ్ హీరోగా నటించిన ఈ మూవీలో ఓ హైనా క్యారెక్టర్ కూడా ఉంది. సినిమా ఎంట్రీ సీన్లో హీరో దీనితో పోరాడుతాడు. తర్వాత దాన్ని అటవీశాఖ అధికారులకు అప్పగిస్తాడు. కొన్నాళ్లకు దాన్ని మచ్చిక చేసుకుని సుబ్రహ్మణ్యం అని పేరు కూడా పెడతాడు. క్లైమాక్స్లో ఇదే హైనా హీరో ఫ్యామిలీని కాపాడే సీన్ ఒకటి ఉంటుంది. థియేటర్లలో అరుపులే అసలు. సమస్య ఏంటి? అయితే లియో సినిమాలో హైనాకి సుబ్రహ్మణ్యం అని పేరు పెట్టడం అజిత్ ఫ్యాన్స్కి నచ్చలేదు. ఎందుకంటే తమ అభిమాన హీరో పూర్తి పేరు అజిత్ కుమార్ సుబ్రమణియన్. దీంతో కావాలనే హైనాకి ఈ పేరు పెట్టారని కామెంట్స్ చేస్తున్నారు. అయితే దర్శకుడు లోకేశ్ కనగరాజ్ ఉద్దేశం మాత్రం అది అయ్యిండదు. ఎందుకంటే గతంలో ఓసారి మాట్లాడుతూ.. హీరో అజిత్ తోనూ సినిమా చేస్తానని అన్నాడు. ఇలా సినిమా చేస్తానని అన్నవాడు.. సదరు హీరో పేరు వచ్చేలా చేయడు కదా! సో అదన్నమాట విషయం. కానీ ఇదంతా వినే మూడ్లో ఫ్యాన్స్ లేరు. విజయ్ vs అజిత్ అభిమానులు ఈ విషయమై సోషల్ మీడియాలో గొడవపడుతున్నారు. (ఇదీ చదవండి: 'అల వైకుంఠపురములో' నటుడికి నిశ్చితార్థం.. అమ్మాయి ఎవరంటే?) -
స్టార్ హీరో సినిమాలో హీరోయిన్గా సీరియల్ బ్యూటీ
'తెగింపు' సినిమాతో ఈ ఏడాది హిట్ కొట్టిన అజిత్.. ప్రస్తుతం 'విడాముయర్చి' చిత్రంలో నటిస్తున్నారు. ఇది ఆయన 62వ మూవీ. పలు ఇబ్బందులు క్లియర్ చేసుకుని, సెట్స్ పైకి వచ్చింది. లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రానికి మగిళ్ తిరుమేణి దర్శకుడు. అనిరుధ్ సంగీతమందిస్తున్నాడు. (ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లో 29 సినిమాలు రిలీజ్) ప్రస్తుతం అజర్ బైజాన్ దేశంలో షూటింగ్ జరుగుతోంది. త్రిష, హ్యూమా ఖురేషి హీరోయిన్లుగా నటిస్తున్నారని ప్రచారం జరిగింది. అయితే హ్యూమా ఈ సినిమా నుంచి తప్పుకొందని ఆమె బదులు రెజీనాని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఈ మూవీలో మరో హీరోయిన్ కూడా ఉంటుందని ఆ పాత్రకు ప్రియా భవానిశంకర్ను ఎంపిక చేసినట్లు తాజా సమాచారం. ఇదే కనుక నిజమైతే అజిత్ సరసన ప్రియాభవానికి ఇది తొలి సినిమా అవుతుంది. ఇప్పుటివరకు యంగ్ హీరోల సరసన చేసిన ప్రియా భవానిశంకర్.. ప్రస్తుతం శంకర్-కమలహాసన్ కాంబోలో తీస్తున్న 'ఇండియన్ 2'లో నటిస్తోంది. ఈ బుల్లితెర నటి ఇప్పుడు స్టార్ హీరోయిన్ రేంజుకి చేరిపోయిందనమాట. (ఇదీ చదవండి: రెండోసారి తండ్రి అయిన 'బలగం' డైరెక్టర్ వేణు) -
స్టార్ హీరో షూటింగ్లో ప్రమాదం.. ఆయన మృతి!
కరోనా మన జీవితాల్లోకి వచ్చిన తర్వాత చావు ఎప్పుడు ఎలా వస్తుందనేది అర్థం కావడం లేదు. ఎందుకంటే చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దోళ్ల వరకు చిన్న చిన్న రోగాలకు కూడా కన్నుమూస్తున్నారు. ఇప్పుడు అలానే స్టార్ హీరో సినిమా షూటింగ్ కోసం టీమ్ అంతా విదేశానికి వెళ్లింది. అక్కడ అనుకోకుండా అస్వస్థతకు గురైన ఆర్ట్ డైరెక్టర్ మృతి చెందాడు. (ఇదీ చదవండి: హీరోయిన్తో లిప్లాక్.. నాని ఇంట్లో గొడవలు!) తమిళ సినిమా ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. స్టార్ హీరో అజిత్ 'విడా ముయూర్చి' షూటింగ్ ప్రస్తుతం అజరాబైజన్లో జరుగుతోంది. మూవీ టీమ్ అంతా షూటింగ్ బిజీలో ఉన్నారు. అయితే ఆర్ట్ డైరెక్టర్ మిలాన్ కాస్త అస్వస్వత్థకు గురి కావడంతో ఆస్పత్రిలో చేర్చారు. కానీ అప్పటికే ఆయన గుండెపోటుతో చనిపోయినట్లు డాక్టర్స్ చెప్పారు. ఇక తమిళంలో ఆర్ట్ డైరెక్టర్గా మంచి పేరు తెచ్చుకున్న మిలాన్... గతంలో అజిత్ బిల్లా, వేదాళం సినిమాలకు కూడా పనిచేశారు. తెలుగులో గోపీచంద్ 'ఆక్సిజన్' చిత్రానికి ఆర్ట్ డైరెక్టర్గా వర్క్ చేశారు. అలాంటి ఈయన ఇప్పుడు అకస్మాత్తుగా ప్రాణాలు వదిలేయడం అందరినీ షాక్కి గురిచేసింది. (ఇదీ చదవండి: IND Vs Pak మ్యాచ్: గోల్డ్ ఐఫోన్ పోగొట్టుకున్న బాలీవుడ్ బ్యూటీ) -
అజిత్ కొత్త సినిమా.. మార్క్ ఆంటోని డైరెక్టర్తో..
హీరో అజిత్ తన 63వ చిత్రానికి పచ్చజెండా ఊపారా? అంటే కోలీవుడ్ వర్గాల నుంచి అవుననే సమాధానమే వస్తోంది. ఈయన తునివు చిత్రం తరువాత కొత్త చిత్రం చేయడానికి దాదాపు ఏడాది పట్టింది. ప్రస్తుతం నటిస్తున్న విడాముయర్చి చిత్రాన్ని ప్రకటించిన ఆరు నెలల తరువాత ఇటీవలే సెట్స్ పైకి వెళ్లింది. అజిత్ 62వ చిత్రం అయిన దీన్ని మగిళ్ తిరుమేణి దర్శకత్వంలో లైకా ప్రొడక్షనన్స్ పతాకంపై సుభాస్కరన్ నిర్మిస్తున్నారు. నటి త్రిష, రెజీనా నాయికలుగా నటిస్తున్న ఇందులో అజిత్ ద్విపాత్రాభినయం చేస్తున్నట్టు సమాచారం. కాగా ఈ చిత్ర షూటింగ్ను మూడు నెలల్లో పూర్తి చేయడానికి యూనిట్ సభ్యులు ప్రణాళికను రచించినట్లు తెలుస్తోంది. కాగా అజిత్ తన 63వ చిత్రానికి కూడా కమిట్ అయినట్లు తాజా సమాచారం. విడుదలై వంటి విజయవంతమైన చిత్రాన్ని నిర్మించిన, ప్రస్తుతం విడుదలై –2 చిత్రాన్ని నిర్మిస్తున్న ఆర్ఎస్ ఇన్ఫోటెంట్ సంస్థ అధినేత ఎల్ రెడ్ కుమార్ దీన్ని నిర్మించనున్నట్లు తెలిసింది. ఇటీవల విశాల్, ఎస్జే సూర్య కలిసి నటించిన మార్క్ ఆంటోనీ చిత్రంతో హిట్ కొట్టిన అధిక్ రవిచంద్రన్ అజిత్ 63వ చిత్రానికి దర్శకత్వం వహించనున్నట్లు ప్రచారం వైరల్ అవుతోంది. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలి యాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే. చదవండి: కూతురి వయసున్న వాళ్లతో రొమాన్స్? వాళ్లకే సిగ్గు లేనప్పుడు ఇంక నేను మాత్రం.. -
లక్కీచాన్స్
దక్షిణాది ప్రేక్షకులకు హీరోయిన్ రెజీనా సుపరిచితురాలే. కానీ ఇటీవల కాలంలో ఈ బ్యూటీకి చెప్పుకోదగ్గ హిట్ దక్కలేదు. ఇలాంటి సమయంలో రెజీనాకు ఓ లక్కీచాన్స్ లభించిందని కోలీవుడ్ టాక్. అజిత్ హీరోగా మగిళ తిరుమేణి దర్శకత్వంలో ‘విడాముయార్చి’ అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో హీరోయిన్ గా త్రిష నటిస్తున్నారని సమాచారం. అలాగే కథ రీత్యా ఈ సినిమాలో మరో హీరోయిన్ కు చాన్స్ ఉందని, ఈ అవకాశం రెజీనా తలుపు తట్టిందనే టాక్ కోలీవుడ్లో వినిపిస్తోంది. మరి.. ఈ మూవీలో రెజీనా నటి స్తారా? లేదా? వేచి చూడాలి. లైకా ప్రోడక్షన్స్ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ విదేశాల్లో జరుగుతోంది. వచ్చే ఏడాది ఈ సినిమాని విడుదల చేయాలనుకుంటున్నారు. -
చాలా కాలం తర్వాత రెజీనాకు గోల్డెన్ ఛాన్స్
అజిత్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రంలో నటి రెజీనాకు అవకాశం వరించినట్లు తాజా సమాచారం. చాలా కాలంగా పలు రకాల ఊహాగానాలు వినిపిస్తున్న అజిత్ 62వ చిత్రం ఎట్టకేలకు ఇటీవలే సెట్స్ పైకి వచ్చింది. విడాముయర్చి పేరుతో రూపొందుతున్న ఈ చిత్రం ఆది నుంచి పలు మార్పులు చేర్పులకు గురవుతూ వస్తోంది. ఈ చిత్రానికి ముందుగా విగ్నేష్ శివన్ దర్శకత్వం వహించడానికి సిద్ధమయ్యారు. కొన్ని కారణాల వల్ల ఆయన ఈ చిత్రం నుంచి వైదొలగడంతో ఆ తర్వాత దర్శకుడు మగిళ్ తిరుమేణి పేరు తెరపైకి వచ్చింది. (ఇదీ చదవండి: నాకు ఇండస్ట్రీలో లైఫ్ ఇచ్చింది అతనే.. టాలీవుడ్పై షాయాజీ షిండే ఆసక్తికర కామెంట్స్!) చిత్ర కథలోని చేర్పులు మార్పులు జరిగాయి. నటి త్రిష, బాలీవుడ్ భామ హ్యుమా ఖురేషీ హీరోయిన్లుగా, విలన్గా అర్జున్ దాస్ నటించనున్నట్లు ప్రచారం జరిగింది. కాగా ఆ తర్వాత చిత్ర షూటింగ్ ఆలస్యం కావడంతో అర్జున్ దాస్ చిత్రం నుంచి వైదొలగాల్సిన పరిస్థితి. దీంతో ఇప్పుడు ఆ పాత్రను నటుడు ఆరవ్ పోషిస్తున్నారు. కాగా చిత్ర షూటింగ్ ప్రారంభం అవుతున్న సమయంలో నటి హ్యుమా ఖురేషీ చిత్రం నుంచి తప్పుకున్నారు. ఈమె ఇంతకుముందు అజిత్ జంటగా వలిమై చిత్రంలో నటించారు. కాగా ఇప్పుడు విడాముయర్చి చిత్రంలో ఆమెకు బదులు నటి రెజీనాను ఎంపిక చేసినట్లు తెలిసింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఇది ఈమెకు లక్కీ చాన్స్ అనే చెప్పాలి. ఇటీవల సరైన అవకాశాలు లేక వెబ్ సిరీస్ లో నటిస్తున్న రెజీనాకు ఈ చిత్రం నుంచి బ్రేక్ ఇస్తుందో లేదో చూడాలి. కాగా ఇన్ని మార్పులు చేర్పులు తర్వాత విడాముయర్చి చిత్రం షూటింగ్ అజర్బైజాన్ దేశంలో ప్రారంభమైంది. తదుపరి దుబాయ్ అబుదాబి ప్రాంతాల్లో చిత్రీకరణ జరుపుకొని చివరిగా చైన్నెలో షూటింగ్ను ముగించనున్నట్లు చిత్ర వర్గాల సమాచారం. కాగా దీనికి అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. -
అజిత్ కొత్త సినిమా.. త్రిష అవుట్.. రంగంలోకి సీరియల్ బ్యూటీ!
మనిషి జీవితం చాలామటుకు అదృష్టం చుట్టే తిరుగుతుందని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎంతటి వారైనా ఆ అదృష్ట దేవత కోసం ఎదురు చూడాల్సిందే. అది ఒక్కసారి వరిస్తే జీవితం సెటిల్ అయిపోతుంది. హీరోయిన్ ప్రియ భవానీ శంకర్ పరిస్థితి ఇలాంటిదే. ఒక టీవీ న్యూస్ రీడర్గా పనిచేసిన ఈమె ఆ తర్వాత నటిగా అవతారం ఎత్తి టీవీ సీరియల్లో నటించింది. అది క్లిక్ అవడంతో సినీ రంగప్రవేశానికి ద్వారాలు తెరుచుకున్నాయి. అలా మేయాదమాన్ చిత్రంతో హీరోయిన్గా తెరంగేట్రం చేసింది. తొలి చిత్రంతోనే సక్సెస్ తన ఖాతాలో వేసుకున్న ప్రియ భవానీ శంకర్కు వరుసగా అవకాశాలు తలుపు తడుతున్నాయి. అయితే ఇప్పటివరకు పలు చిత్రాల్లో ఈమె నటించినా స్టార్ హీరోలతో జతకట్టే అవకాశం మాత్రం రాలేదు. అలాంటిది తాజాగా ఈ బ్యూటీకి అజిత్ సరసన నటించే అవకాశం వరించిందన్నది తాజా సమాచారం. అజిత్ నటిస్తున్న తాజా చిత్రం విడాముయిర్చి. నిజానికి లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఇప్పటికే పూర్తి కావాల్సింది. అయితే అనేక కారణాల వల్ల ఇప్పటికీ షూటింగ్ ప్రారంభం కాలేదు. ఈ సినిమాకు మొదట నయనతార భర్త, దర్శకుడు విగ్నేష్ శివన్ దర్శకత్వం వహించాల్సింది. అనివార్య కారణాల వల్ల ఆయన ఈ చిత్రం నుంచి వైదొలగాల్సిన పరిస్థితి. ఆ తరువాత దర్శకుడు మగిళ్ తిరుమేణి లైన్లోకి వచ్చారు. దీంతో అజిత్ చిత్రం త్వరగా సెట్పైకి వచ్చేస్తుంది అని భావించిన వారికి నిరాశ ఎదురైంది. అజిత్ బైక్ టూర్ కారణంగా విడాముయిర్చి చిత్రం షూటింగ్ మరింత ఆలస్యమైంది. ఇదంతా నటి ప్రియా భవాని శంకర్ కోసమే అయ్యిందా అనిపిస్తోందిప్పుడు. ఎందుకంటే ఇందులో ఇప్పటివరకు హీరోయిన్ త్రిష కథానాయకిగా నటించనున్నట్లు ప్రచారం జరిగింది. ఇప్పుడు ప్రియా భవానీ పేరు వినిపిస్తోంది. దీని గురించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. చదవండి: నిర్మాతను మోసం చేసిన డైరెక్టర్.. చివరి రోజుల్లో వైద్యానికి డబ్బుల్లేక.. -
పెళ్లి చేసుకుంటానని అప్పట్లో ఆ హీరోయిన్ ఇంటికి వెళ్లిన అజిత్..
తమిళ చిత్రసీమలో జెంటిల్మన్ గుర్తింపు ఉన్న అతికొద్ది మంది నటుల్లో హీరో అజిత్ కుమార్ ఒకరు. అజిత్ తన కెరీర్తో పాటు కుటుంబ జీవితంలో కూడా ఎలాంటి వివాదాలు లేకుండా ముందుకు వెళ్తున్నాడు. అజిత్ లాంటి భర్త కావాలని కోలివుడ్లో కలలు కనే యువతులు ఎందరో ఉన్నారు.పెళ్లయి 23 ఏళ్లు గడిచినా అజిత్కు భార్య షాలినిపై ప్రేమ తగ్గలేదు. ఆదర్శ జంటల జాబితాలో అజిత్- షాలిని పేరు మొదటగా వినిపిస్తుంది. కానీ అజిత్ వ్యక్తిగత జీవితం గురించి అభిమానులకు పెద్దగా తెలియదు. ఆయనకు వచ్చిన స్టార్డమ్ని తలకు ఎక్కుంచుకునే వ్యక్తి కాదు. అజిత్ ఒక సినిమాని పూర్తి చేసిన తర్వాత, దాని గురించి అన్ని ఆలోచనలను విడిచిపెట్టి, తనకు ఇష్టమైన బైక్పై రైడ్కు వెళతాడు. అజిత్ కూడా తన సినిమా ప్రమోషన్ కోసం ఎప్పుడూ వేదికపైకి కూడా రాడు. అజిత్ తన అభిరుచిని కొనసాగించడంలో భార్య షాలిని నుంచి ఎక్కువ మద్దతు ఉంది. అజిత్ షాలినిని సినిమా ద్వారా సంపాదించిన నిధిగా చూస్తాడు. అజిత్ 2000లో షాలినిని పెళ్లాడాడు. అమర్కలం సినిమాలో షాలినితో కలిసి నటించిన తర్వాతే అజిత్ ప్రేమలో పడ్డాడని, ఆ విషయాన్ని షాలినితో చెప్పాడు. తరువాత, రెండు కుటుంబాలు ఈ సంబంధానికి మద్దతు ఇచ్చాయి. తర్వాత పెళ్లితో అజిత్- షాలిని కలిసి జీవితాన్ని ప్రారంభించారు. (నటి హీరా రాజగోపాల్తో అజిత్) అజిత్కు సినిమా ఛాన్స్లు ఇప్పించిన హీరోయిన్ షాలిని కంటే ముందు అజిత్ మరొక హీరోయిన్తో రొమాన్స్ చేశాడని కోలీవుడ్లో ప్రచారంలో ఉంది. తమిళ నటి హీరా రాజగోపాల్తో అజిత్ ప్రేమలో ఉన్నాడని అప్పట్లో భారీగానే వార్తలు వచ్చాయి. ఆమె తెలుగు మూలాలు ఉన్నా కోలీవుడ్లో టాప్ హీరోయిన్గా గుర్తింపు పొందింది. అజిత్ కెరియర్ ప్రారంభంలో ఆమె పలు సినిమా అవకాశాలు ఇప్పించినట్లు ప్రచారం ఉంది. అయితే వారిద్దరి మధ్య విబేదాలు రావడంతో హీరాతో అజిత్ బ్రేకప్ చెప్పేశాడట. ప్రేమ బ్రేకప్ అయిన తర్వాత అజిత్ జీవితంలోకి షాలిని వచ్చిందని టాక్. ఇదే విషయాన్ని కోలీవుడ్ నటుడు, సినీ విమర్శకుడు బైల్వాన్ రంగనాథన్ ఇలా వెల్లడించారు. (ఇదీ చదవండి: సౌత్లో ఈ హీరోయిన్ల రెమ్యునరేషన్ ఎంతంటే.. టాప్లో ఎవరో తెలుసా?) '1996లో తమిళ్లో వచ్చిన 'వాన్మతి' సినిమాలో హీరోయిన్గా నటించిన స్వాతిని కూడా అజిత్ ప్రేమించాడు. ఒకానొక సమయంలో స్వాతిని పెళ్లి చేసుకోవాలనే కోరికతో అజిత్ ఆమె కుటుంబాన్ని సంప్రదించాడు. అయితే దీనికి నటి కుటుంబం అంగీకరించకపోవడంతో అజిత్ ఆ సంబంధాన్ని విడిచిపెట్టాడు' అని బెయిల్వాన్ రంగనాథన్ చెప్పారు. కానీ అజిత్ జీవితంలో తొలిప్రేమ మాత్రం హీరా రాజగోపాల్ అనే ఆయన చెప్పాడు. అప్పట్లో మోహన్లాల్ నిర్వాణం చిత్రంలో కథానాయికగా నటించి మలయాళీ హృదయాలను కొల్లగొట్టిన నటి ఆమె. హీరాకు అప్పట్లో భారీగా ఫ్యాన్స్ ఉండేవారు. (వాన్మతి నటి స్వాతితో అజిత్) హీరాతో అజిత్ గాఢమైన ప్రేమలో ఉన్నాడని. ఆమెను అజిత్ పెళ్లి చేసుకోనున్నాడని ఇండస్ట్రీలో ప్రచారం జరిగింది. అంతేకాకుండా వీరిద్దరూ కూడా చాలా చనువుగా ఉండేవారని పలు ఫోటోలు కూడా వైరల్ అయ్యాయి. వీరిద్దరూ తొలిసారి కలిసి నటించిన 'కథల్ కొట్టాయ్' సినిమా షూటింగ్ సమయంలో ప్రేమలో పడ్డారని తెలుస్తోంది. సెట్లో హీరాకు అజిత్ ప్రేమలేఖలు కూడా రాసినట్లు పుకార్లు వచ్చాయి. తర్వాత వారిద్దరితో బ్రేకప్ అవడంతో.. 2000 సంవత్సరంలో అజిత్-షాలినిని పెళ్లి చేసుకోవడం జరిగినట్లు వార్తలు వచ్చాయి. (షాలినితో అజిత్ పెళ్లి ఫోటోలు) అజిత్ ఎవరితో జోడీ కట్టినా షాలినీకి ఎవరూ సాటిరారని, అజిత్కి షాలినీ పర్ఫెక్ట్ పెయిర్ అని ఫ్యాన్స్ చెప్పుకొచ్చారు. ఈ జంటకు ఇద్దరు పిల్లలు. అజిత్తో వివాహం అయిన తర్వాత శాలిని నటనకు దూరమైంది. ఇప్పుడు షాలిని మంచి కుటుంబ మహిళగా తన పాత్ర పోషిస్తుంది. తాజాగా షాలిని సోషల్ మీడియాలో అకౌంట్ ఓపెన్ చేసింది. షాలిని సోషల్ మీడియాలో కూడా యాక్టివ్గా ఉండటంతో అభిమానులు అజిత్కు సంబంధించిన విషయాలను సులభంగా తెలుసుకోవచ్చు. తునివ్ (తెగింపు) అజిత్ నటించిన చివరి సినిమా.. తన తర్వాతి ప్రాజెక్ట్ విధముయిర్చి ఈ సినిమా కూడా పాన్ ఇండియా రేంజ్లో విడుదల అవుతుంది. -
తగ్గేదే లే అంటున్న సన్ పిక్చర్స్.. అజిత్కు ఎన్ని వందల కోట్లంటే?
ఆ మధ్య వరుసగా చిత్రాలు నిర్మించి చేతులు కాలడంతో కొంతకాలం చిత్ర నిర్మాణానికి దూరంగా ఉన్న సన్ పిక్చర్స్ సంస్థ ఇప్పుడు సత్తా చాటుతోంది. గతంలో రజనీకాంత్ కథానాయకుడిగా నిర్మించిన అన్నాత్తే చిత్రం ఆశించిన విజయాన్ని సాధించకపోయినా మంచి లాభాలను తెచ్చిపెట్టింది. ఆ తర్వాత విజయ్ కథానాయకుడిగా బీస్ట్ చిత్రాన్ని నిర్మించింది. ఈ చిత్రం సేమ్ టు సేమ్ మంచి లాభాలను తెచ్చిపెట్టింది. అయితే ఘన విజయాన్ని మాత్రం సాధించలేదు. ఇటీవల రజనీకాంత్ కథానాయకుడిగా నెల్సన్ దర్శకత్వంలో నిర్మించిన జైలర్ చిత్రం సంచలన విజయం సాధించింది. దీంతో ఇప్పుడు తగ్గేదే లే అన్నట్లుగా వరుసగా చిత్రాలను నిర్మిస్తోంది. ప్రస్తుతం ధనుష్ కథానాయకుడిగా ఆయన 50వ చిత్రాన్ని భారీ ఎత్తున నిర్మిస్తోంది. ఈ చిత్రం నిర్మాణంలో ఉండగానే రజినీకాంత్, దర్శకుడు లోకేష్ కనకరాజ్ క్రేజీ కాంబినేషన్లో ఓ చిత్రం ఉండబోతుందని అధికారికంగా ప్రకటించింది. తాజా సమాచారం ప్రకారం అజిత్తోనూ ఓ సినిమా నిర్మించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. ఈ చిత్రంలో నటించడానికిగానూ ఆయనకు ఏకంగా రూ.150 కోట్లు పారితోషికం ఇవ్వడానికి ఆఫర్ ఇచ్చినట్లు టాక్. ఇప్పటివరకు అంతపెద్ద మొత్తంలో పారితోషికాన్ని నటుడు రజనీకాంత్, విజయ్, కమల్ హాసన్ మాత్రమే తీసుకుంటున్నారు. దీంతో సన్ పిక్చర్స్ ఆఫర్కు అజిత్ ఓకే చెప్పినట్లు సమాచారం. ప్రస్తుతం ఈయన విడాముయిర్చి చిత్రంలో నటించడానికి సిద్ధమవుతున్నారు. లైకా ప్రొడక్షనన్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం త్వరలో సెట్ పైకి వెళ్లనుంది. దీని తర్వాత ఆయన తన 63వ చిత్రాన్ని సన్ పిక్చర్స్ సంస్థకు చేసే అవకాశం ఉంది. చదవండి: పూజలు, మొక్కులు పెళ్లి కోసమేనా..? .. అనుష్క ఆన్సర్ ఇదే! -
రాజ రాజ చోళుడిగా అజిత్?
తమిళసినిమా: నటుడు అజిత్ చారిత్రక కథా చిత్రంలో నటించబోతున్నారా? రాజరాజ చోళుడు పాత్రను పోషించనున్నారా? ఇలాంటి ప్రశ్నలకు ఇప్పుడు కోలీవుడ్ వర్గాల్లో అవుననే సమాధానమే రావడం విశేషం. ఇటీవల చారిత్రక కథాచిత్రాలు నడుస్తుందని చెప్పవచ్చు. తెలుగులో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి 1,2 చిత్రాలు సంచలన విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. అదేవిధంగా ప్రఖ్యాత దర్శకుడు మణిరత్నం ఇటీవల పొన్నియిన్ సెల్వన్ 1, 2 చిత్రాలను రూపొందించి సక్సెస్ అయిన విషయాన్ని చూశాం. ఇందులో నటుడు జయం రవి రాజ రాజ చోళుడుగా నటించి మెప్పించారు. చాలా కాలం క్రితమే దివంగత నడిగర్ తిలకం శివాజీ గణేషన్ రాజ రాజ చోళన్ చిత్రంలో తన గంభీరమైన నటనా కౌశలంతో ఆ పాత్రకు వన్నె తీసుకొచ్చారు. కాగా తాజాగా బ్రహ్మాండ చిత్రాల దర్శకుడు శంకర్ కూడా అదే బాటలో పయనించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈయన వెళ్పారి అనే చారిత్రాత్మక కథా చిత్రాన్ని తెరకెక్కించనున్నారనే ప్రచారం సాగుతోంది. రచయిత బాలకుమార్తో కలిసి కథా చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఇలాంటి సమయంలో నటుడు అజిత్ కూడా చారిత్రక కథా చిత్రంలో నటించడానికి సిద్ధమవుతున్నట్లు తాజా సమాచారం. ఈయన ప్రస్తుతం విడాముయిర్చి చిత్రంలో నటించడానికి సిద్ధమవుతున్నారు. దీని తర్వాత రాజరాజ చోళన్ కథా చిత్రంలో నటించిన ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రానికి విష్ణువర్ధన్ దర్శకత్వం వహించనున్నట్లు సమాచారం. అజిత్, విష్ణువర్దన్ కాంబినేషన్లో ఇంతకుముందు బిల్లా, ఆరంభం వంటి విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. కాగా ప్రస్తుతం దర్శకుడు విష్ణువర్దన్ హిందీలో సల్మాన్ ఖాన్ బంధువు ఒకరికి చిత్రం చేయడానికి కమిట్ అయ్యారని సమాచారం. అదే విధంగా అజిత్ తన 62వ చిత్రం విడాముయిర్చి చిత్రాన్ని పూర్తి చేయాల్సి ఉంది. ఆ తరువాత రాజ రాజ చోళుడుగా నటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. -
విజయ్ కి, అజిత్ కి చుక్కలు చూపిస్తున్న రజినీకాంత్
-
పదిసార్లు ఫోన్ చేసినా సాయం లేదు.. డబ్బులేక ప్రాణాలు వదిలేసిన సింధు
కోలీవుడ్లో కొద్దిరోజుల క్రితం అనారోగ్యంతో నటి సింధు మరణించింది. ఈ ఘటన అక్కడి పరిశ్రమలో పెద్ద చర్చనీయాంశమైంది. గత కొన్నేళ్లుగా బ్రెస్ట్ క్యాన్సర్తో చికిత్స పొందుతూ.. వైద్య ఖర్చులకు డబ్బులేక, అంత పెద్ద ఇండస్ట్రీ నుంచి సాయం అందక ధీన స్థితిలో ప్రాణాలు వదిలిసేంది. ఈ వార్త తమిళనాట చాలా మందిని కలిచివేసింది. గతంలో సాయం కోసం ఆమె బహిరంగంగానే చేయి చాచింది. అందుకు సంబంధించిన వీడియోలను పలువురు నెటిజన్లు ఇప్పుడు షేర్ చేస్తున్నారు. 2020లోనే మీడియా ముందు సింధు కన్నీరు పెట్టుకుంటూ ఇలా మాట్లాడింది. ' నా ఆరోగ్యం పూర్తిగా దెబ్బతింది. చికిత్స చేస్తే జబ్బు నుంచి కోలుకుంటానని వైద్యులు తెలిపారు. కానీ అందుకు అవసరమైన డబ్బు లేదు. ఇప్పటికే నా భర్త మరణంతో కుటుంబం కష్టాల్లో ఉంది. అనారోగ్యంతో నేను కూడా చనిపోతే నా కుమార్తె అనాథ అవుతుంది. ఇండస్ట్రీలోని పెద్దలు ఎవరైన సాయం చేయాలి' అని ఆమె కోరింది. (ఇదీ చదవండి: గూగుల్ మ్యాప్స్కెక్కిన చిరంజీవి.. సినీచరిత్రలోనే తొలిసారి!) గతంలో ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు సింధు మరణం తర్వాత వైరల్ అవుతున్నాయి. సింధు లాంటి మంచి మనసున్న మహిళ ఇన్ని కష్టాలు పడాల్సి వచ్చిందంటూ నటి షకీలా కూడా తెలిపింది. కోవిడ్ వ్యాప్తి సమయంలో చాలామంది జీవితాలు అస్తవ్యస్తమై తినేందుకు అన్నం కూడా లేకుండా పలువురు రోడ్డున పడ్డారు. అలాంటి వారికి ఆహారం అందించడానికి సింధు చొరవ తీసుకుందని షకీలా గుర్తుచేసింది. కోవిడ్ సమయంలో ధాతల నుంచి సేకరించిన వాటితో ఎంతోమందికి సాయం చేసింది. ఇలా ఎన్నో మంచి కార్యక్రమాలు చేసిన సింధు చాలా కష్టాలు పడాల్సి వచ్చిందని, దేవుడు ఉన్నాడా..? అనే అనుమానం కూడా కలుగుతోందని షకీలా చెప్పింది. వాళ్లెవరూ సాయం చేయలేదు: సింధు స్నేహితులు సింధు మరణం తర్వాత తన స్నేహితులు మీడియా ముందు చేసిన వ్యాఖ్యలు అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాయి. తమిళ పరిశ్రమలో ఉన్న సూపర్ స్టార్స్ ఎవరూ సింధుకు సహాయం చేయలేదని ఆమె స్నేహితులు అంటున్నారు. దీనిపై సినీ ఉలకం అనే తమిళ మీడియాలో వార్తలు వచ్చాయి. తనకు సహాయం చేయమని బహిరంగంగానే సింధు అభ్యర్థించింది. కానీ ఆమెకు చాలా తక్కువ మంది స్టార్స్ సాయం చేశారు. (ఇదీ చదవండి: జైలర్ రికార్డు స్థాయి వసూళ్లు, తొలిరోజు ఎన్ని కోట్లు వచ్చాయంటే?) రజనీకాంత్, విజయ్, అజిత్ లాంటి సూపర్ స్టార్లు ఎవరూ సహాయం చేయలేదు. బహుశా వారిలో ఏ ఒక్కరు సాయం చేసినా సింధును కాపాడి ఉండేవాళ్లమని స్నేహితులు ముక్తకంఠంతో చెప్పారు. చాలా రోజుల ముందే తమిళ మీడియాలో సింధు తన బాధలను బయటపెట్టింది. ఏడుస్తూనే సాయం కోసం అందరినీ వేడుకుంది. అయినా ఆమెకు ఎవరూ సాయం చేయకపోవడం బాధాకరమని వారు తెలిపారు. అజిత్ సాయం కోరితే... తనకు కేన్సర్ ఉన్నట్లు నిర్ధారణ కాగానే చికిత్స కోసం డబ్బు సాయం చేయమని చాలా మందిని సింధు వేడుకుంది. అందులో భాగంగానే హీరో అజిత్ మేనేజర్కి పదిసార్లు ఫోన్ చేసినప్పటికీ, అతను సింధుతో మాట్లాడలేదని గతంలో ఓ ఇంటర్వ్యూలో ఆమె తెలిపింది. దీంతో డైరెక్ట్గానే అజిత్ మేనేజర్ వద్దకు వెళ్లి తన ఆరోగ్య సమస్య గురించి చెప్పి సాయం చేయాలని కోరానని ఆమె చెప్పింది. అప్పుడు అజిత్ వద్ద సాధారణ ఫోన్ మాత్రమే ఉంటుందని మెడికల్ రిపోర్ట్స్ పంపించేందుకు వీలు కాదని ఆయన చెప్పడంతో అక్కడి నుంచి వెనుతిరిగానని సింధు పేర్కొంది. కనీసం ఫోన్లో అయినా తమ గురించి అజిత్కు చెప్పమని కోరానని, తన సమస్యను అజిత్ వద్దకు మేనేజర్ తీసుకుపోయాడో లేదో తెలియదు కానీ ఆయన నుంచి ఎలాంటి సాయం అందలేదని కొద్దిరోజుల క్రితమే సింధు ఈ వ్యాఖ్యలు చేసింది. ఆ సమయంలో ఎక్కడ పొరపాటు జరిగిందో తెలియదు కానీ అజిత్ సాయం చేసి ఉంటే సింధు ఖచ్చితంగా బతికి ఉండేదని తన స్నేహితులు తెలుపుతున్నారు. కోలీవుడ్లో ఒక చిన్న నటుడు కార్తీక్ మాత్రం సింధుకు రూ.20000 ఇచ్చాడని స్నేహితులు తెలిపారు. పరిశ్రమలో ఉండే గొప్ప కళాకారులకు సామాన్యుల మనస్సాక్షి ఎందుకు ఉండదని గతంలోనే కన్నీటితో సింధు ప్రశ్నించింది. కోలీవుడ్లో కూడా బిగ్ హీరోలందరూ కోట్ల పారితోషికం తీసుకుంటాన్నారు. అజిత్, విజయ్ ఒక సినిమాకు దాదాపు 100 కోట్ల పారితోషికం తీసుకుంటారు. వారి నుంచి సహాయం అందితే సింధు బతికి ఉండేదని పలువురు సోషల్ మీడియాలో వ్యాఖ్యానించారు. (ఇదీ చదవండి: Actress Sindhu: దీనస్థితిలో కన్నుమూసిన నటి.. ఆ వ్యాధితో) -
అజిత్ దక్ష టీమ్తో ఇండియన్ ఆర్మీ డీల్.. రూ.165 కోట్లకు ఒప్పందం
కోలీవుడ్ స్టార్ అజిత్ నటనతో పాటు ఇతర రంగాల్లోనూ ఆసక్తి చూపుతున్న విషయం తెలిసిందే. ఈయన గతంలో రైఫిల్ షూట్ విన్ అయ్యారు. బైక్ రైడింగ్లో పాల్గొంటూ ప్రపంచ యాత్ర చేస్తున్నారు. అదే విధంగా ఏరోనాటికల్ రంగంలోనూ ఆసక్తి కలిగి ఉన్నారు. చైన్నె ఎంఐటీ విశ్వవిద్యాలయం విద్యార్థులకు ఆయన సలహదారుడిగా ఉన్నారు. ఈయన నేతృత్వంలో ఏరోనాటికల్ విద్యార్థుల బృందం డ్రోన్లను తయారు చేస్తోంది. గత కరోనా కాలంలో వీరు తయారు చేసిన డ్రోన్లు ప్రభుత్వ సేవలకు ఉపయోగపడ్డాయి. వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించడానికి ఎంతగానో ఉపయోగపడ్డాయి. అజిత్ సలహదారుడిగా వ్యవహరించిన దక్ష టీమ్ 2018లో ఆస్ట్రేలియాలో జరిగిన అంతర్జాతీయ డ్రోన్ల పోటీల్లో పాల్గొని అవార్డులను గెలుచుకుంది. తాజాగా ఈ టీమ్తో ఇండియన్ ఆర్మీ డీల్ కుదుర్చుకుంది. 200 డ్రోన్లు తయారు చేసివ్వమంటూ రూ.165 కోట్లకు ఒప్పందం కుదుర్చుకుంది. అజిత్ సినిమాల విషయానికి వస్తే ఆయన చివరగా తునివు(తెలుగులో తెగింపు) చిత్రంలో నటించారు. విడాముయర్చి సినిమాకు సంతకం చేసిన ఆయన తన బైక్ టూర్ ముగియగానే షూటింగ్లో పాల్గొననున్నారు. అనిరుధ్ రవించందర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తుండగా త్రిష హీరోయిన్గా నటించనున్నట్లు సమాచారం. అర్జున్, అర్జున్ దాస్ కూడా ఈ చిత్రంలో భాగమవుతున్నట్లు తెలుస్తోంది. #AK's passion once again benefits the nation - The #AjithKumar mentored #Daksha team has got the order to supply 200 drones worth 165 crore rupees to the Indian Army in the next 12 months 👏#Ajithkumar #VidaaMuyarchi pic.twitter.com/fZVIQR5bwj — KERALA AJITH FANS CLUB (@KeralaAjithFc) August 8, 2023 చదవండి: జైలర్ సినిమా రివ్యూ -
కోలీవుడ్ స్టార్స్తో దర్శకుడి ఫ్రెండ్షిప్.. ఫోటో వైరల్
స్నేహమేరా జీవితం.. స్నేహమేరా శాశ్వతం.. ఇది పాట మాత్రమే కాదు. జీవనామృతం. ఈ కాలంలో ప్రేమాభిమానాలను పంచుకోవాల్సిన కుటుంబ సభ్యులే ద్వేషాలను పెంచుకుంటున్నారు. అందరూ కాకపోయినా ఎక్కువ మంది కుటుంబాల్లో జరుగుతోంది ఇదే. అయితే ఒక్కోసారి గొడవలు పడ్డా, కొట్టుకున్నా కష్టకాలంలో అండగా నిలుస్తుంది స్నేహితులు మాత్రమే. కాగా సోమవారం స్నేహితుల దినోత్సవాన్ని ప్రపంచమంతా జరుపుకుంది. సినీ పరిశ్రమలోనూ హీరోల అభిమానులు తమ హీరో గొప్ప అంటే తమ హీరో తోపు అని సామాజిక మాధ్యమాల్లో విమర్శించుకోవడం పరిపాటే. తమిళ సినిమాలో ఒకప్పుడు రజినీకాంత్, కమల్ హాసన్ అభిమానులు ఈ విషయంలో తీవ్రంగా గొడవపడేవారు. అయితే రాను రానూ ఆ పరిస్థితి తగ్గుతూ వచ్చింది. ఆ తర్వాత విజయ్, అజిత్ అభిమానుల మధ్య ఇలాంటి పోటీ తీవ్ర రూపు దాల్చింది. ఇప్పుడు అది కూడా సన్నగిల్లింది. తాజాగా రజనీకాంత్, విజయ్ అభిమానుల మధ్య ఎవరు సూపర్ స్టార్? అన్న వివాదం నడుస్తోంది. అయితే హీరోలు మాత్రం తామంతా ఒకటేనని వివాదాలు వద్దని తమ అభిమానులకు హితవాఖ్యలు చేస్తూనే ఉన్నారు. అయినప్పటికీ అభిమానులకు అది తలకెక్కడం లేదు. కాగా దర్శకుడు వెంకట్ ప్రభు చుట్టూ ఎప్పుడు చూసినా మిత్ర బృందమే ఉంటుంది. స్నేహానికి అంత విలువనిచ్చే ఆయన స్నేహితుల దినోత్సవం సందర్భంగా ఆయన ట్విటర్లో 'ఇది చాలా సంతోషకరమైన స్నేహితుల దినోత్సవం. ప్రేమను వ్యాపింపజేయండి' అని పేర్కొన్నారు. అందులో నటుడు రజనీకాంత్, కమల్ హాసన్, గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్పీ చరణ్, ఆయన తండ్రి గంగై అమరన్ తో కలిసి ఉన్న ఫొటోలను పోస్ట్ చేశారు. అదేవిధంగా విజయ్, అజిత్తో కలిసి ఉన్న మరో ఫొటోను పోస్ట్ చేశారు. Happy friendship day🙏🏽❤️ spread love pic.twitter.com/TJ8Ab1HTEx — venkat prabhu (@vp_offl) August 6, 2023 చదవండి: మిగతా హీరోయిన్లకు సమంత కథ వేరే! -
విశాల్పై పగ ఎప్పటికీ తగ్గదు.. సూర్య వెనకున్న శక్తి ఎవరంటే: అబ్బాస్
ప్రేమదేశం సినిమా సూపర్ హిట్ కాగానే అబ్బాస్పై సినీ ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అప్పట్లో అబ్బాస్ కటింగ్ చేయండని సెలూన్ షాపుల్లో యూత్ క్యూ కట్టేవారు. అబ్బాస్ రొమాంటిక్ హీరోగా మారతాడని అంతా అనుకున్నారు. కానీ అబ్బాస్ కెరీర్ మాత్రం ఆశించిన స్థాయిలో లేకుండా కొన్ని సినిమాలతోనే ఫుల్స్టాప్ పడిపోయింది. ప్రేమదేశం తర్వాత ఆయన నుంచి వచ్చిన సినిమాలన్నీ ప్రేక్షకులను మెప్పించలేదు. చేసేదేమి లేక కుటుంబం కోసం చివరికి సహాయక పాత్రలలో నటించడం ఆయన కొనసాగించాడు. అలా అబ్బాస్ ఎక్కువ కాలం సినిమాల్లో కొనసాగలేదు. (ఇదీ చదవండి: బిగ్ హీరోతో సినిమా ఛాన్స్.. ఈ ఒక్క కారణంతో నన్ను తొలగించారు: యంగ్ హీరోయిన్) తర్వాత తన కుటుంబంతో కలిసి న్యూజిలాండ్కు వెళ్లి అక్కడ కొత్త జీవితాన్ని గడిపాడు. అబ్బాస్ ఎలాంటి సెలబ్రిటీ గుర్తింపు లేకుండా పూర్తిగా సాధారణ వ్యక్తిగా ఇక్కడ జీవించాడు. విదేశాల్లో పెట్రోల్ పంప్ వర్క్, ట్యాక్సీ డ్రైవింగ్, నిర్మాణం వంటి ఉద్యోగాలు చేశానని అబ్బాస్ బాహాటంగానే చెప్పాడు. తాజాగ ఇండియాకు తిరిగొచ్చిన అబ్బాస్ ఇన్నాళ్ల తర్వాత మళ్లీ వార్తల్లో నిలిచాడు. ఒక ఇంటర్వ్యూలో తమిళ స్టార్ హీరోల గురించి అబ్బాస్ చెప్పిన మాటలు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. అజిత్, విజయ్, సూర్య, విశాల్ తదితరుల గురించి అబ్బాస్ ఇలా మాట్లాడారు. అజిత్ను వైద్యలు కూడా హెచ్చరించారు కానీ అజిత్కు మంచి వ్యక్తిత్వం ఉందని అబ్బాస్ చెప్పారు. ఒకరకంగా అజిత్ తనలాంటి వాడేనని ఆయన అన్నారు. అజిత్ ఏదైన ఒక విషయంపై మాట్లాడితే అవి కత్తిపై చెక్కర పూసిన మాదిరి ఉండవు. ఎలాంటి టాపిక్పైనా కానివ్వండి సూటిగా ప్రతిస్పందిస్తాడని అబ్బాస్ ఇలా పంచుకున్నారు. 'అతను మూర్ఖత్వాన్ని సహించడు. అతనిలో ఏ హీరోలో కనిపించని ఉత్సాహం ఉంది. అతనికి ఇప్పటికే అనేక శస్త్రచికిత్సలు జరిగాయి. వైద్యులు పక్షవాతం వచ్చే అవకాశం ఉందని కూడా హెచ్చరించినప్పటికీ అభిమానుల కోసం సినిమాలు చేస్తున్నాడు. అతనిలో అభిమానుల పట్ల అచంచలమైన అంకితభావం ఉంది. అందుకే అజిత్ను ఫ్యాన్స్ అంతగా ఇష్టపడుతారు. వారి ప్రేమే అయన్ను ముందుకు నడిపిస్తుంది.' అని అజిత్ గురించి అబ్బాస్ అన్నారు. విజయ్ సినిమాలంటే ఇష్టం లేదు: అబ్బాస్ విజయ్ మృదుస్వభావి... డౌన్టు ఎర్త్గా ఇప్పటికీ ఆలాగే ఉన్నాడు. అతను ఏదైనా అతిగా చేయడు. అయితే మంచి హాస్యం కలవాడని అబ్బాస్ పేర్కొన్నాడు. మొదట్లో విజయ్ సినిమాలంటే ఇష్టం ఉండేది కాదు. కానీ ఇప్పుడు అతని సినిమాలంటే చాలా ఇష్టమని ఆయన చెప్పాడు. తన సినిమాలు సమాజానికి మంచి సందేశాలు ఇస్తాయని అబ్బాస్ అభిప్రాయపడ్డారు. సూర్యను నడిపించే శక్తి ఎవరంటే: అబ్బాస్ సూర్య గురించి, అబ్బాస్ ఇలా అన్నాడు 'సూర్య తన తొలి చిత్రం 'నెరుక్కు నెర్' నుంచి నాకు తెలుసు. సినిమా కెరీయర్ ప్రారంభంలో అతనిలో చాలా సిగ్గు కనిపించేది. కెమెరా ముందుకు అంత ఈజీగా వచ్చేవాడు కాదు. కానీ రానురాను అతని జీవితంలో అద్భుతమైన పరివర్తనను చూడటం నిజంగా ఆకర్షణీయంగా ఉంది. సినిమాలను ఎంపిక చేసుకోవడంలో సూర్య అద్భుతం, పని పట్ల ఆయనకున్న చిత్తశుద్ధి గురించి ఎంత చెప్పినా తక్కువే. సూర్య విజయానికి జ్యోతిక సపోర్ట్ పెద్ద కారణం. సూర్య నిస్సందేహంగా చెప్పుకోదగ్గ వ్యక్తి అయినప్పటికీ, అతని విజయం వెనుక జ్యోతిక అనే శక్తి ఉందని స్పష్టంగా తెలుస్తుంది. నటీనటులందరికీ ఆయన బెంచ్మార్క్.' అని సూర్య గురించి అబ్బాస్ అన్నారు. విశాల్పై అబ్బాస్ పగ చాలా ఏళ్ల క్రితం సెలబ్రిటీ క్రికెట్ లీగ్ విషయంలో విశాల్తో గొడవ జరిగిందని అబ్బాస్ మొదటిసారి రివీల్ చేశాడు. 'నా పట్ల విశాల్ వ్యవహరించిన తీరుతో చాలా కోపం వచ్చింది. అతను చేసిన పనికి నేను ఎప్పుడో క్షమించాను కూడా. ఇప్పుడు ఎక్కడైనా ఎదురుపడితే హాయ్ అని కూడా చెబుతాను. కానీ విశాల్తో మాత్రం ఎప్పటికీ సన్నిహితంగా ఉండను. సినిమా పరిశ్రమలో బలమైన బంధాన్ని పెంపొందించుకోవడం నా నిరంతర లక్ష్యం. కానీ విశాల్ విషయంలో అది జరగదు. సినీ పరిశ్రమలోని నటులందరూ ఒకేతాటిపైకి తెచ్చేందుకే సెలబ్రిటీ క్రికెట్ లీగ్ ప్రారంభానికి దారితీసింది. (ఇదీ చదవండి: గుండెపోటుతో ప్రముఖ హీరో భార్య మృతి.. దిగ్భ్రాంతి చెందిన సీఎం) నటీనటులందరి మధ్య సోదర భావాన్ని పెంపొందించాలనేది దీని వెనుక ఉన్న ఆలోచన. అయితే సీసీఎల్ రెండో సీజన్లో అతనితో ఒక గొడవ జరిగింది. అతను (నా గురించి) అసత్యాలు చెప్పడం ప్రారంభించాడు. అంతేకాకుండా ఇతరులను కూడా తన మాటలతో పాడు చేశాడు. నేను ఇష్టపడని వాతావరణంలో ఉండటం నాకు ఇష్టం లేదు, కాబట్టి నేను వెనక్కి తగ్గాలని నిర్ణయించుకున్నాను. ఆ సమయంలో నేను తీవ్రంగా బాధపడ్డాను. బహుశా, ఒకరోజు అతను ఈ విషయంపై గ్రహించాడని అనుకుంటున్న. అంతిమంగా, అతను ఇప్పటికీ (సినిమా) కుటుంబంలో ఒక భాగం. ఒక కుటుంబంలో విభేదాల రావడం సహజం.' అని అబ్బాస్ పేర్కొన్నారు. -
తమన్నా కోసం ఆ టాప్ హీరోయిన్ను టార్గెట్ చేసిన అజిత్
ఎవరైనా సక్సెస్ వెనుక పరిగెత్తం సాధారణ విషయమే. ఇక చిత్రాల విషయాని కొస్తే క్రేజ్ చాలా అవసరం. నటుడు అజిత్ కూడా ఈ పాలసీనే ఫాలో అవుతున్నారా..? అంటే అయ్యుండొచ్చు అనే కోలీవుడ్ వర్గాల నుంచి వినిపిస్తోంది. ఈయన నటించిన తాజా చిత్రం తుణివు (తెగింపు) విడుదలై దాదాపు ఏడాది కావస్తోంది. ఇంతవరకు ఆయన తదుపరి చిత్రం ప్రారంభం కాలేదు. విడాముయిర్చి అనే చిత్రంలో నటిస్తున్నట్లు ప్రకటించి చాలా కాలమే అయ్యింది. దీనికి ఆది నుంచి ఆటంకాలే ఎదురవుతున్నాయి. (ఇదీ చదవండి: జైలర్కు 'తెలుగు' సెంటిమెంట్.. రజనీకాంత్కు అసూయ ఎందుకు?) మొదట నయనతార భర్త విగ్నేష్ శివన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించడానికి సిద్ధమయ్యారు. అందుకు సన్నహాలు కూడా చేసుకున్నారు. అలాంటి దశలో అనుహ్యంగా ఆయన్ని చిత్రం నుంచి తొలగించడం జరిగింది. ఈ విషయంలో అజిత్ ప్రమేయం ఉందనే ప్రచారం జరిగింది. వాస్తవం ఏమిటి అన్నది తెలియకపోయినా ఆ తరువాత విడాముయిర్చి చిత్ర యూనిట్ లోకి దర్శకుడు మగిళ్ తిరుమేణి వచ్చారు. దీంతో ఈ చిత్ర షూటింగ్ ప్రారంభ పనులు వేగవంతం అవుతాయని అందరూ భావించారు. అయితే ఈ చిత్ర షూటింగ్ ఇప్పటికే రెండుసార్లు వాయిదా పడింది. ఇంతకుముందే ఆగస్టు తొలి వారంలో విడాముయిర్చి సెట్స్ పైకి వెళుతుందని చెప్పారు. అయితే ఇది మరోసారి వాయిదా పడినట్టు, సెప్టెంబర్ నెలలో ప్రారంభం కానున్నట్లు తాజా సమాచారం. అసలు ఈ చిత్రం విషయంలో ఏం జరుగుతుందనే గందరగోళ వాతావరణం అజిత్ అభిమానుల్లో నెలకొంది. ఇకపోతే ఈ చిత్రం షూటింగ్ పలుమార్లు వాయిదా పడటంతో ఇందులో నాయకిగా నటించాల్సిన త్రిష ఇతర చిత్రాలతో బిజీ అవ్వడం జరిగిపోయింది. (ఇదీ చదవండి: వాళ్లను చూస్తే నాకు ఎప్పుడూ గర్వంగానే ఉంటుంది: చిరంజీవి) ఆమె అజిత్ చిత్రానికి కాల్ షీట్స్ సర్దుబాటు చేయలేని పరిస్థితి అనీ అయినప్పటికీ కాస్త ఆలస్యం అయినా ఎలాగో అలా విడాముయిర్చి చిత్రంలో నటిస్తానని త్రిష చెప్పినట్లు సమాచారం. అయితే నటుడు అజిత్ ఆమెకు అడ్డుపడుతున్నట్లు తాజాగా సామాజిక మాధ్యమాలలో వైరలవుతోంది. ఆయన దృష్టి ఇప్పుడు నటి తమన్నపై పడిందట. కారణం జైలర్ చిత్రంలోని కావాలా పాటతో ఫుల్ క్రేజ్ తెచ్చుకోవడమే అని టాక్. అజిత్ అంటేనే తమిళ పరిశ్రమలో పవర్ హౌస్ లాంటోడు. అలాంటిది మరోక హీరోయిన్కు వచ్చిన క్రేజ్ను సొంతం చేసుకోవాలనే మోజులో ఉండటం మంచిది కాదని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. త్రిష కూడా తమన్నా క్రేజ్కు ఏ మాత్రం తక్కువ కాదని వారు తెలుపుతున్నారు. కాగా అజిత్ చిత్రంలో నటించే నాయకి ఎవరన్నది చిత్రవర్గాలు ఇప్పటివరకు అధికారికంగా ప్రకటించకపోవడం గమనార్హం. -
తమన్నాకు గోల్డెన్ ఛాన్స్.. మరోసారి ఆయనతో రొమాన్స్కు రెడీ
మిల్కీబ్యూటీ తమన్న తాజాగా మరోసారి 'అజిత్'తో రొమాన్స్ చేసే అవకాశం ఉందనే ప్రచారం సామాజకమాధ్యమాల్లో వైరల్ అవుతోంది. గతంలో వీరి కాంబోలో వచ్చిన 'వీరం' చిత్రం అప్పట్లో మంచి విజయాన్ని సాధించింది. కాగా అజిత్ నటించిన 'తుణివు' తెలుగులో తెగింపు చిత్రం విడుదలై చాలా కాలం అవుతోంది. ఈ చిత్రంతో పాటు తెరపైకి వచ్చిన విజయ్ చిత్రం వారిసు తరువాత ఆయన నటిస్తున్న 'లియో' చిత్రం షూటింగ్ కూడా పూర్తి చేసుకుంది. అలాంటిది అజిత్ తాజా చిత్రం మాత్రం ఇంకా సెట్స్ పైకి వెళ్లలేదు. దీనికి 'విడాముయిర్చి' అనే టైటిల్ను ఖరారు చేశారు. లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ముందుగా నయనతార భర్త 'విఘ్నేశ్ శివన్' దర్శకత్వం వహించడానికి సన్నాహాలు జరిగాయి. అయితే ఈ చిత్రం నుంచి ఆయనను తొలగించి దర్శకుడు మగిళ్ తిరుమేణిని ఎంపిక చేశారు. దీంతో చిత్రం మే నెలలో ప్రారంభం అవుతుందనే ప్రచారం జరిగింది. కానీ అలా జరగలేదు. తాజాగా ఆగస్ట్లో విడాముయిర్చి సెట్స్పైకి వెళ్లడం ఖాయం అనే టాక్ వినిసిస్తోంది. కాగా ఇందులో నటి త్రిష నాయకిగా నటించనున్నట్లు ప్రచారం జరిగింది. (ఇదీ చదవండి: ఆ సీన్లు లేకుండా చేస్తారా.. నాకు మీరే న్యాయం చేయండి: విజయ్ ఆంటోని) అయితే చిత్ర షూటింగ్ పలుమార్లు వాయిదా పడుతుండటంతో ప్రస్తుతం విజయ్కు జంటగా లియో చిత్రాన్ని పూర్తి చేసిన త్రిషకు తెలుగు, మలయాళం భాషల్లో అవకాశాలు వచ్చాయి. అలా ఆమె మలయాళంలో నటుడు 'టోవినో థామస్'కు జంటగా ఐడెంటీ చిత్రంలో నటించడానికి ఒప్పుకున్నారు. దీంతో అజిత్ సరనస నటించే అవకాశం లేదనే టాక్ వినిపిస్తోంది. ఇకపోతే నటి తమన్న ప్రస్తుతం రజనీకాంత్ సరసన 'జైలర్' చిత్రంలో నటించి పూర్తి చేశారు.కాగా ఇందులోని 'కావాలయా అనే పాట'ను ఇటీవల చిత్ర వర్గాలు విడుదల చేశారు. ఆ పాటలో తమన్న కవ్వింపు డాన్స్ ఇప్పుడు ట్రెండింగ్గా మారింది. అంతే కాదు ఈ పాట ఈ మిల్కీబ్యూటీకి మరిన్ని అవకాశాలను తెచ్చిపెడుతుందనేది తాజా సమాచారం. అందులో ఒకటి అజిత్ సరసన నటించే విడాముయిర్చి అని టాక్. లైకా సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రంలో తమన్నను నటింపజేయడానికి చర్చలు జరుగుతున్నట్లు ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. -
అజిత్ 'మోసగాడు' అంటూ సీరియస్ అయిన నిర్మాత
తమిళ చిత్ర పరిశ్రమలోని బిగ్గెస్ట్ సూపర్ స్టార్లలో అజిత్ కుమార్ ఒకరు. సూపర్హిట్ చిత్రాలతో బాక్సాఫీస్ కింగ్ అయినప్పటికీ, చిత్రపరిశ్రమలో అతను ఎంతో వినయపూర్వకంగా ఉంటూ డౌన్ టు ఎర్త్గా పేరు పొందాడు. అయితే, అజిత్ అలాంటివాడేమి కాదంటూ.. నిర్మాత మాణికం నారాయణన్ ఆరోపిస్తున్నాడు. తన వద్ద డబ్బు తీసుకుని ఇప్పటికి కూడా తిరిగి ఇవ్వలేదని, అతనో మోసగాడని ఆరోపించాడు. (ఇదీ చదవండి: రెండోపెళ్లి చేసుకోనున్న ఐశ్వర్య రజనీకాంత్..?) నారాయణన్ మీడియాతో మాట్లాడుతూ అజిత్ కుమార్ తనను మోసం చేశారని మండిపడ్డారు. 'అజిత్ తన తల్లిదండ్రులను సెలవుపై మలేషియాకు పంపాలని చాలా సంవత్సరాల క్రితం నా నుంచి డబ్బు తీసుకున్నాడు. అప్పట్లో అతను నా కోసం ఒక సినిమా చేస్తానని మాట ఇచ్చాడు. రెమ్యునరేషన్లో ఆ డబ్బును సర్దుబాటు చేస్తానని మాట ఇచ్చాడు. అయితే, ఈ రోజు వరకు కూడా అతను డబ్బు తిరిగి ఇవ్వలేదు. అంతే కాకుండా నాకు సినిమా చేయలేదు. ఇన్నేళ్లలో అతను దీని గురించే మాట్లాడటం మానేశాడు. అతను తనను తాను పెద్దమనిషిగా అనకుంటాడు కానీ అది నిజం కాదు.' అని చెప్పుకొచ్చాడు. ఇప్పుడు అతనొక టాప్ హీరో ప్రతి చిత్రానికి రూ. 50కోట్లకు పైగానే సంపాదిస్తున్నాడు. కాబట్టి తనకు రావాల్సిన డబ్బు చెల్లించవచ్చు కదా అని నిర్మాత మాణికం ఫైర్ అవుతున్నాడు. తనతో పాటు ఏఎమ్ రత్నం వంటి నిర్మాతలు కూడా అజిత్ చిత్రాలను నిర్మించడంతో భారీగా నష్టాలను చవిచూశామని. ఇప్పటి వరకు నష్టపోయిన నిర్మాతలకు సహాయం కూడా చేయలేదని ఆయన పంచుకున్నారు. గతంలోనే ఆరోపణ హీరో అజిత్కు 1996లో మొదట రూ.6లక్షలు, 1998లో మరోసారి రూ.12 లక్షలు ఇచ్చానని నిర్మాత మాణికం నారాయణన్ గతంలోనే ఆరోపించారు. తాజాగా ఇదే అంశాన్ని మళ్లీ తెరపైకి తెచ్చాడు. గతంలో వీరిద్దరి మధ్య మంచి స్నేహం ఉండేది. నిర్మాత మాణికం కుతురు పెళ్లికి కొన్ని కారణాల వల్ల అజిత్ రాలేదని అందుకే ఇలాంటి పిచ్చి ఆరోపణలు చేస్తున్నాడని ఆయన ఫ్యాన్స్ తెలుపుతున్నారు. ప్రస్తుతం అజిత్ తన 60వ ప్రాజెక్ట్ 'వలిమాయి'తో బిజీగా ఉన్నాడు. (ఇదీ చదవండి: యువతికి కేక్ తినిపించిన బాలకృష్ణ.. ఆమె ఎవరంటూ..) -
ఆ డైరెక్టర్తో వన్స్మోర్ అంటున్న అజిత్, ఆ బ్యానర్లో మాత్రం..
అజిత 63వ చిత్రం ఫిక్స్ అయిందా? ఈ ప్రశ్నకు అవుననే సమాధానమే కోలీవుడ్ వర్గాల నుంచి వస్తోంది. అయితే ఆయన నటిస్తున్న 62వ చిత్రమే ఇంకా సెట్ పైకి వెళ్లలేదు అంటారా? నిజమే, లైకా ప్రొడక్షన్స్ సంస్థ మగిల్ తిరుమేణి దర్శకత్వంలో నిర్మించనున్న విడా ముయర్చి చిత్రం జూలై మొదటి వారంలో సెట్పైకి వెళ్లనున్నట్లు సమాచారం. ఇప్పుడు అజిత్ 63వ చిత్రం గురించి ఓ వార్త సామాజిక మాధ్యమాల్లో వైరలవుతోంది. రేర్ కాంబినేషన్లో ఈ చిత్రం తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది. సన్ పిక్చర్స్ సంస్థ రజనీకాంత్, విజయ్, ధనుష్ వంటి పలువురు ప్రముఖులు హీరోలతో చిత్రాలు నిర్మించింది. కానీ ఇప్పటి వరకు అజిత్తో చిత్రం తీయలేదు. కారణం ఆయన చిత్ర ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొనరనేదే కారణం అని టాక్ ఉంది. అలాంటిది ఇన్నాళ్లకు ఈ సంస్థ అజిత్ హీరోగా చిత్రం చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఇందుకు కారణం దర్శకుడు శివ అని తెలిసింది. దర్శకుడు శివ ఇంతకుముందు అజిత్ హీరోగా వీరం, వేదాళం, వివేకం, విశ్వాసం వంటి నాలుగు హిట్ చిత్రాలను రూపొందించారన్నది తెలిసిందే. అదేవిధంగా రజనీకాంత్ కథానాయకుడిగా సన్ పిక్చర్స్ సంస్థ నిర్మించిన అన్నాత్తే చిత్రానికి శివ దర్శకత్వం వహించారు. దీంతో ఈ సంస్థలో నిర్మితం కానున్న సినిమాలో అజిత్ హీరోగా నటించడానికి ఈయనే కారణం అని తెలుస్తోంది. కాగా అజిత్ కథానాయకుడిగా సన్ పిక్చర్స్ నిర్మించే చిత్రానికి శివనే దర్శకత్వం వహించనున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. చదవండి: చరణ్-ఉపాసనల బిడ్డ కోసం ఊయల -
విజయ్ స్పీడ్కు నో బ్రేక్స్.. అజిత్కు అన్నీ అడ్డంకులే
హీరో అజిత్ కథానాయకుడిగా నటించిన తుణివు (తెగింపు) చిత్రం విడుదలై ఏడాదిన్నర కాబోతోంది. ఈ చిత్రంతో పాటు హీరో విజయ్ నటించిన వారీసు (వారసుడు) చిత్రం విడుదలైంది. కాగా విజయ్ తదుపరి చిత్రం ప్రారంభం కావడడంతో పాటు షూటింగ్కూడా పూర్తి చేసుకోబోతోంది. అయితే అజిత్ తాజా చిత్రం ఇప్పటి వరకు ప్రారంభం కాలేదు. (ఇదీ చదవండి: బన్నీ విషయంలో లెక్క తప్పిన అల్లు రామలింగయ్య) ఆయన 62వ చిత్రాన్ని ఏ ముహుర్తాన ప్రకటించారో గానీ పలు సమస్యలను ఎదుర్కొంటోంది. ఈ చిత్రానికి నయనతార భర్త దర్శకుడు విఘ్నేష్ శివన్ దర్శకత్వం వహించాల్సి ఉంది. కథ సిద్ధమైంది. ఇక సెట్పైకి వెళ్లటమే తరువాయి అనుకుంటున్న తరుణంలో అనూహ్యంగా ఈ చిత్రం నుంచి విఘ్నేష్ శివన్ వైదొలిగారు. ఆయన స్క్రీన్ప్లే లైకా ప్రొడక్షన్స్ అధినేతకు, అజిత్కు సంతృప్తిని కలిగించకపోవడం కారణమని తెలిసింది. ఆ తరువాత చిత్ర కథ మారింది. దర్శకుడు మారారు. అనూహ్యంగా దర్శకుడు మగిళ్ తిరుమేణి తెరపైకి వచ్చారు. ఈయన చెప్పిన కథ నచ్చడంతో లైకా ప్రొడక్షన్స్ చిత్రాన్ని నిర్మించడానికి సిద్ధమైంది. (ఇదీ చదవండి: శర్వానంద్ పెళ్లికి హాజరైన లవ్ బర్డ్స్.. సోషల్ మీడియాలో వైరల్!) అజిత్ పుట్టినరోజు సందర్భంగా మే 1వ తేదీన 'విడామయర్చి' అని చిత్ర టైటిల్ వెల్లడించారు. దీంతో షూటింగ్ ప్రారంభం అవుతుందని అందరూ భావించారు. అలాంటి సమయంలో విదేశీ బైక్ ప్రయాణానికి వెళ్లిపోయారు. ఇటీవలే ఆయన తిరిగి రావడంతో జూన్ తొలి వారంలో విరామం వీడి చిత్ర షూటింగ్ మొదలవుతుందని ప్రచారం జరిగింది. ఇందులో నటి త్రిష నాయకిగా నటించబోతున్నట్లు ప్రచారం జరిగింది. అయితే అలా జరగలేదు. తాజా సమాచారం ప్రకారం అజిత్, దర్శకుడు మగిళ్ తిరుమేణి ప్రస్తుతం లండన్లో మకాం పెట్టినట్లు తెలిసింది. విడామయర్చి చిత్ర షూటింగ్ గురించి చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఈ చిత్ర షూటింగ్ను పలు దేశాల్లో నిర్వహించనున్నట్లు, ఈ నెల చివరిలో షూటింగ్ను ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. ఇందులో నటుడు అజిత్ రెండు విభిన్న గెటప్లలో కనిపిస్తున్నట్లు సమాచారం. -
కొత్త బిజినెస్ ప్రారంభించిన స్టార్ హీరో అజిత్
తాను, తన ప్రపంచం అన్నట్టుగా జీవన విధానాన్ని మలుచుకున్న నటుడు అజిత్. ఈయన నటనతో పాటు ఫొటోగ్రఫీ, బైక్, కార్ రేసింగ్, చిన్న చిన్న డ్రోన్లు రూపొందించడం వంటి విషయాలపై ఆసక్తి కనబరుస్తుంటారన్న విషయం తెలిసిందే. ఆ మధ్య బైక్ పయనంతో దేశంలోని ప్రధాన నగరాలను చుట్టొచ్చారు. తాజాగా భూటాన్, నేపాల్ నగరాల్లో బైక్ విహార యాత్ర ముగించుకుని చైన్నెకి తిరిగొచ్చారు. కాగా అనుహ్యంగా ఆయన సోమవారం మీడియాకు ఒక ప్రకటనను విడుదల చేశారు. అందులో తాను చాలాకాలం తనకు నచ్చిన జీవితాన్ని అనుభవిస్తున్నానన్నారు. జీవితం ఒక అందమైన ప్రయాణమని.. అందులోని మలుపులు, తెరిచిన మార్గాలను అనుభవించండి అని పేర్కొన్నారు. తన స్వదేశీ, విదేశీ బైక్ రైడింగ్ విహార యాత్రను ఇప్పుడు ఒక వృత్తిగా మార్చే ప్రయత్నం చేశానన్నారు. ఏకే మోటో రైడ్ పేరుతో మోటార్ సైకిల్ విహార యాత్ర సంస్థను ప్రారంభించినట్లు తెలిపారు. దీని ద్వారా భారత దేశంలోని ప్రకృతి అందాలను, అంతర్జాతీయ రోడ్లపై ప్రయాణం చేయాలన్న ఆసక్తిని కనబరచేవారికి ఏకే మోటో రైడ్ సంస్థ విహార పయనం నేర్చుకోవడానికి సహకరిస్తుందన్నారు. అలాంటి వారికి తగిన భద్రతతో పాటు సౌకర్యవంతమైన మోటార్ బైక్లను సమకూర్చడం జరుగుతుందన్నారు. అదే విధంగా అనుభవం కలిగిన మోటార్ బైక్ రైడర్స్ను సమకూర్చడం జరుగుతుందని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. -
అజిత్ డబుల్ రోల్.. ఇందులో నటించే ఇద్దరు హీరోయిన్లు ఎవరంటే?
హీరో అజిత్ తాజా చిత్రంపై చాలాకాలంగా రకరకాల చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. మొదట్లో ఈ చిత్రానికి నయనతార భర్త విఘ్నేష్ శివన్ దర్శకత్వం వహించడానికి సన్నాహాలు చేసుకున్నారు. ఆ తరువాత ఆయన్ని తొలగించారు. అందుకు కారణం అజిత్ అని, కాదు నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్న్స్ అని రకరకాల ప్రచారం జరిగింది. ఏది ఏమైనా ప్రస్తుతం మగిళ్ తిరుమేణి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. అనిరుధ్ సంగీతాన్ని అందిస్తున్నారు. జూన్ నుంచి షూటింగ్ కూడా మొదలు కాబోతోందని తాజా సమాచారం. దీనికి విడా మయర్చి టైటిల్ను కూడా అధికారికంగా యూనిట్ వర్గాలు ప్రకటించాయి. అంతా బాగానే ఉంది. కానీ, ఈ క్రేజీ చిత్రంలో నటించే హీరోయిన్ ఎవరనేది ప్రకటించలేదు. మొదట్లో హీరోయిన్ త్రిష అని ప్రచారం జరిగింది. కానీ అది నిజం కాలేదు. విడా మయర్చి చిత్రం గురించి తాజాగా మరో స్టన్నింగ్ అప్ డేట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఇందులో అజిత్ ద్విపాత్రాభినయం చేయబోతున్నారన్నదే ఆ ప్రచారం. అయితే ఆయనతో రొమాన్స్ చేసే ఆ ఇద్దరు భామలెవరన్నదే ఆసక్తితో కూడిన ప్రశ్న. ఈ విషయంలో ఒక ఆసక్తికరమైన ప్రచారం ఇప్పుడు తెరపైకి వచ్చింది. ఇందులో ఇద్దరు హీరోయిన్లు ఉన్నారట. ఈ పాత్రల కోసం ఐశ్వర్య రాయ్, త్రిష, కంగనా రనౌత్లలో ఇద్దరిని ఎంపిక చేసే ప్రయత్నంలో చిత్ర వర్గాలు ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా త్రిష మరోసారి ఇందులో అజిత్తో జత కట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం. మరి కొద్ది రోజుల్లోనే హీరోయిన్ల వ్యవహారం ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. చదవండి: రూమ్కు రమ్మని రెండుసార్లు పిలిచాడు.. నిర్మాతపై నటి ఆరోపణలు -
బైక్పై ప్రపంచాన్ని చుట్టిరానున్న స్టార్ హీరో!
హీరో అజిత్లో రైఫిల్ షూటర్, బైక్ రైడర్ ఉన్నారన్నది తెలిసిందే. రైఫిల్ షూటింగ్లో ఇప్పటికే రాష్ట్ర స్థాయి పోటీల్లో బహుమతులు గెలుచుకున్నారు. బైక్ రైడర్గా ఇప్పటికే ఐరోపా దేశాలు తిరిగొచ్చారు. ప్రస్తుతం నేపాల్, భూటాన్ దేశాలను చుట్టేస్తున్నారు. ఈ ప్రయాణం త్వరలో పూర్తి చేసుకుని చైన్నెకి తిరిగి రానున్నారు. తదుపరి మరోసారి ప్రపంచ పయనానికి సిద్ధం అవుతున్నారు. ఈ విషయాన్ని ఆయన మేనేజర్ మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. అజిత్కుమార్కు బైక్ రైడింగ్ అంటే ప్యాషన్ అన్న విషయం తెలిసిందేనని, ప్రస్తుతం ఆయన భూటాన్, నేపాల్ దేశాల్లో బైక్ రైడింగ్ చేస్తున్నారని తెలిపారు. ఈ బైక్ రైడింగ్ చాలా ఛాలెంజింగ్తో కూడిందని, ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొని అజిత్కుమార్ స్వదేశీ పర్యటన చేశారన్నారు. నేపాల్, భూటాన్ దేశాల పర్యటనను ముగించుకుని తదుపరి ప్రపంచ యాత్ర చేయడానికి సిద్ధం అవుతున్నారని, నవంబర్ నుంచి ఈ టూర్ ఉంటుందని చెప్పారు. కాగా అజిత్ తన తాజా చిత్ర షూటింగ్కు సిద్ధం అవుతున్నారు. లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి మగిళ్ తిరుమేణి దర్శకత్వం వహిస్తున్నారు. దీనికి విడా ముయర్చి అనే టైటిల్ను ఖరారు చేశారు. అనిరుద్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్ర షూటింగ్ను జూన్ నెల నుంచి ప్రారంభించనున్నట్లు తాజా సమాచారం. అయితే ఇందులో హీరోయిన్ ఎవరన్నది ఇంకా ప్రకటించలేదు. మొదట్లో త్రిష పేరు వినిపించింది. ఆ తరువాత ఆమె నటించడం లేదనే ప్రచారం జరిగింది. ఈ చిత్రం కోసం అజిత్ 70 రోజులు కాల్షీట్స్ కేటాయించినట్లు, ఆలోగా ఆయనకు సంబంధించిన సన్నివేశాలను పూర్తి చేయాలంటూ కండిషన్ పెట్టినట్లు ప్రచారంలో ఉంది. మొత్తం మీద నవంబర్ నెలలోగా విడా ముయర్చి చిత్ర షూటింగ్ను పూర్తి చేయడానికి లైకా సంస్థ ప్రణాళికను సిద్ధం చేసినట్లు సమాచారం. అజిత్ నటించిన తునివు(తెగింపు) గత పొంగల్కు తెరపైకి వచ్చిన విషయం తెలిసిందే. తాజా చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. చదవండి: బెడ్పై ఒకరు, మైండ్లో మరొకరు.. నిహారిక డైలాగ్పై ట్రోలింగ్ -
తమిళ త్రివిక్రమ్ గా పాపులర్ అవుతున్న తల
-
అందుకే అజిత్ సినిమా నుంచి తొలిగించారు: విఘ్నేశ్ శివన్
లేడీ సూపర్ స్టార్ నయనతార భర్త విఘ్నేశ్ శివన్ అజిత్ సినిమా నుంచి తొలగించిన సంగతి తెలిసిందే. అజిత్ 62వ సినిమా రాబోయే ప్రాజెక్ట్కు ఎన్నికైన విఘ్నేశ్ శివన్ కొన్ని కారణాల వల్ల ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. అయితే దీనిపై ఇంతవరకు అజిత్ కానీ విఘ్నేశ్ శివన్ నుంచి క్లారిటీ లేదు. నయన్ కూడా దీనిపై ఎక్కడ ప్రస్తావించలేదు. కానీ తన భర్తను అవమానించినందుకు నయన్ హర్ట్ అయ్యిందని, ఇకపై అజిత్తో నటించనని ఆమె నిర్ణయించుకుందంటూ రకరకాలుగా వార్తలు వినిపించాయి. చదవండి: పుష్ప 2 టీజర్ వచ్చేసింది.. ఇక ఫ్యాన్స్కి పూనకాలే దీంతో ఈ విషయంలో అంతా అజిత్ని తప్పుబట్టారు. అజిత్కు స్క్రిప్ట్ నచ్చలేదని.. అందుకే, ఇది ఆగిపోయిందంటూ కోలీవుడ్ వర్గాలు చర్చించుకున్నాయి. ఈ నేపథ్యంలో అజిత్ సినిమా నుంచి తప్పుకోవడంపై మొదటిసారి విఘ్నేశ్ శివన్ పెదవి విప్పాడు. రీసెంట్గా ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన AK62 ప్రాజెక్ట్ నిలిచిపోవడంపై క్లారిటీ ఇచ్చాడు. తన స్కిప్ట్ నచ్చకపోవడం వల్లే ఈ సినిమా నుంచి తనని తప్పించారన్నాడు. చదవండి: ‘బలగం’ దూకుడు.. ఉత్తమ దర్శకుడిగా వేణుకి అంతర్జాతీయ అవార్డు ఇందులో అజిత్ తప్పులేదని, తాను రాసిన స్క్రిప్ట్ ఆ మూవీ నిర్మాణ సంస్థకు నచ్చలేదని క్లారిటీ ఇచ్చాడు. సెకండాఫ్ విషయంలో వాళ్లు అసంతృప్తి వ్యక్తం చేశారని, ఈ ప్రాజెక్ట్కు మగిళ్ తిరుమేని దర్శకత్వం వహిస్తున్నందుకు ఆనందిస్తున్న అన్నాడు. అంతేకాదు ఒక అభిమానిగా అజిత్ చిత్రాన్ని ఎంజాయ్ చేస్తానంటూ విఘ్నేశ్ చెప్పుకొచ్చాడు. కాగా అజిత్ - విఘ్నేశ్ శివన్ కాంబోలో ఓ సినిమా చేయనున్నట్లు ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడెక్షన్స్ గతేడాది ప్రకటించింది. అజిత్ 62వ చిత్రంగా ఇది ప్రచారం పొందింది. -
నయన్ భర్త అవుట్.. ఏకే 62 మూవీకి ముహుర్తం ఫిక్స్
తమిళసినిమా: నటుడు అజిత్ చివరిగా నటించిన తుణివు చిత్రం గత ఏడాది దీపావళికి తెరపైకి వచ్చింది. ఆ తరువాత ఆయన నటించనున్న చిత్రం ఎప్పుడు ప్రారంభం అవుతుందన్నది ప్రశ్నార్థకంగా మారింది. కారణం దర్శకుడు, నటి నయనతార భర్త విగ్నశ్ శివన్ దర్శకత్వంలో లైకా సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించనున్నట్లు ప్రచారం జరిగింది. చిత్రంలో నటి కాజల్ అగర్వాల్ హీరోయిన్గా కూడా ఫిక్స్ అయ్యారు. చిత్ర ప్రీ పొడక్షన్ కార్యక్రమాలు కూడా ప్రారంభం అయ్యాయి. అయితే చివరి సమయంలో దర్శకుడు విఘ్నేశ్ శివన్ చిత్రం నుంచి వైదొలిగారు. కారణం ఆయన కథను పూర్తిగా రెడీ చేయకపోవడమేనని సమాచారం. దీంతో ఆ తరువాత దర్శకుడు మగిళ్ తిరుమేణిని ఎంపిక చేశారు. అయితే చిత్రం ఎప్పుడు సెట్ పైకి వెళ్తుందనే విషయంలో ఇప్పటి వరకూ స్పష్టత రాలేదు. ఈ మధ్యలో నటుడు అజిత్ బైక్పై విదేశీ ప్రయాణం చేయడానికి సిద్ధం అవుతున్నట్లు ప్రచారం జరిగింది. అదే విధంగా ఇటీవల అజిత్ తండ్రి కన్నుమూశారు. ఇలాంటి పరిస్థితుల్లో అజిత్ షూటింగ్లో పాల్గొడానికి మరింత సమయం పడుతుందనే ప్రచారం జరుగుతోంది. అయితే ఇప్పుడు అజిత్ నటించనున్న 62వ చిత్రం ప్రారంభానికి ముహూర్తం కరారైనట్లు తెలిసింది. ఏప్రిల్ నెలలో ప్రీ ప్రొడక్షన్స్ కార్యక్రమాలను పూర్తి చేసి మే నుంచి షూటింగ్ను ప్రారంభించడానికి సన్నాహాలు జరుగుతున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వేలువడే అవకాశం ఉంది. -
స్టార్ హీరో అజిత్ ఇంట తీవ్ర విషాదం
తమిళ స్టార్ హీరో అజిత్ ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆయన తండ్రి సుబ్రమణ్యం అనారోగ్యంతో శుక్రవారం కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని నివాసంలో తుదిశ్వాస విడిచారు. తండ్రి మృతితో అజిత్ ఇంట విషాద చాయలు నెలకొన్నాయి. చదవండి: సీక్రెట్గా పెళ్లి పీటలు ఎక్కిన నటీనటులు.. ఫొటోలు వైరల్ ఇక ఆయన మృతి పట్ల సినీ ప్రముఖులు దిగ్భ్రంతి వ్వక్తం చేస్తూ అజిత్కు, ఆయన కుటుంబ సభ్యులకు సంతాపం తెలుపుతున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలంటూ నివాళులు అర్పిస్తున్నారు. ఈ రోజు సాయంత్రం చెన్నైలో బీసెంట్ నగర్లోని శ్మశాన వాటికలో ఆయన అంత్యక్రియలు జరగనున్నట్లు తెలుస్తోంది. చదవండి: Sakshi 15th Anniversary: సినీ ప్రముఖుల శుభాకాంక్షలు -
దుబాయ్లో ఎంజాయ్ చేస్తున్న అజిత్ దంపతులు, ఫొటోలు వైరల్
తమ చిత్రాలతో నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్ల గల్లాపెట్టెలను నింపే నటుల్లో అజిత్ ఒకరు. అయితే ఈయన ఇతర నటులకు పూర్తిగా భిన్నం. చిత్ర పరిశ్రమకు చెందిన ఏ విషయంలోనూ జోక్యం చేసుకోరు. ఏ చిత్ర వేడుకల్లోనూ పాల్గొనరు. అసలు తన చిత్ర ప్రమోషన్ కార్యక్రమాలకు కూడా దూరంగా ఉండే నటుడు ఎవరైనా ఉన్నారంటే అది అజితే. తనూ, తన వృత్తి, ప్రవృత్తి, తన కుటుంబం అదే ఈయన లోకం. అందుకే విమర్శలు, వదంతులు అజిత్ దరిచేరవు. ఇక ఆయన జీవిత భాగస్వామి శాలిని గురించి చెప్పాలంటే ఈమె బాల్యంలో లిటిల్ సూపర్ స్టార్. తమిళం, తెలుగు, మలయాళం, కన్నడం ఇలా పలు భాషల్లో నటించి తన నటనతో వావ్ అనిపించుకున్నారు. కథానాయకిగా కొన్ని చిత్రాల్లో నటించారు. అలా అద్భుతం అనే చిత్రంలో అజిత్తో జతకట్టారు. అప్పుడు వీరి పరిచయం ప్రేమగా మారి పెళ్లికి దారి తీసింది. ఆ తర్వాత శాలిని నటనకు స్వస్తి పలికి కుటుంబ బాధ్యతలకే పరిమితం అయ్యారు. కాగా అందరిలాగా అజిత్ శాలిని దంపతులు తరచూ బయట ప్రపంచంలోకి రారు. అది నటుడు అజిత్కు ఇష్టం ఉండదు. తనకంటూ ఓ ప్రపంచాన్ని ఏర్పరచుకొని అందులోనే తన సంతోషాన్ని వెతుక్కుంటారాయన. ఈయన నటన తర్వాత ఇష్టపడేది బైక్ రేస్. అలా స్టేట్ లెవెల్ బైక్ రేస్ పోటీల్లో పాల్గొని పథకాలను గెలుచుకున్నారు. ఇక విషయానికి వస్తే.. చాన్నళ్ల తర్వాత అజిత్, శాలిని దంపతులు విహారయాత్రలో ఉన్న ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. అవును అజిత్ తన భార్య శాలినితో కలిసి ఇటీవల విహారయాత్ర కోసం దుబాయ్ వెళ్లారు. అక్కడ సముద్రంలో బోట్లో విహరిస్తున్న ఫోటోలు నెటిజన్లను చేతినిండా పని చెబుతున్నాయి. కాగా తుణివు చిత్రంతో భారీ హిట్ కొట్టిన అజిత్ త్వరలో తన 62వ చిత్రంలో నటించడానికి సిద్దమవుతున్నారు.