-
దేవర భామ జాన్వీ కపూర్ బ్యాచిలరేట్ పార్టీ .. పెళ్లికి రెడీనా?
బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ ప్రస్తుతం దేవర చిత్రంలో జూనియర్ సరసన కనిపించనుంది. ఈ మూవీ ద్వారానే తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెడుతోంది. ఆ తర్వాత గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సరసన నటించనుంది. అయితే ఇటీవల జాన్వీ కపూర్ పెళ్లిపై నెట్టింట తెగ చర్చ నడుస్తోంది. ఎందుకంటే ఆమె మైదాన్ సినిమాకు చూసేందుకు వెళ్లిన జాన్వీ తన బాయ్ఫ్రెండ్ శిఖర్ పహారియా పేరుతో నెక్లెస్ ధరించి కనిపించారు. దీంతో త్వరలోనే పెళ్లి చేసుకోబోతోందంటూ వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. అంతే కాకుండా శిఖర్పై జాన్వీ తండ్రి బోనీ కపూర్ సైతం ప్రశంసలు కురిపించారు. ఈ నేపథ్యంలో వీరిద్దరి పెళ్లి చేసుకోవడం ఖాయమని బీ టౌన్లో టాక్ నడుస్తోంది. అయితే తాజాగా జాన్వీ కపూర్ బ్యాచిలరేట్ పార్టీని సెలబ్రేట్ చేసుకుంది. దీనికి సంబంధించిన ఫోటోలను తన ఇన్స్టాలో షేర్ చేసింది. అదేంటీ అప్పుడే పెళ్లికి సిద్ధమైపోయిందనుకుంటున్నారా? కానీ ఇక్కడే ఓ చిన్న ట్విస్ట్ ఉంది. జాన్వీ కపూర్ తన ఫ్రెండ్ రాధికా మర్చంట్ బ్యాచిలరేట్ పార్టీని నిర్వహించింది. జాన్వీతో పాటు రాధిక ఫ్రెండ్స్ కూడా ఈ విందుకు హాజరయ్యారు. జాన్వీ కపూర్ హోస్ట్ చేసిన ఈ పార్టీలో ఆమె స్నేహితులందరూ గులాబీ రంగు దుస్తులు ధరించారు. ఈ పార్టీకి హాజరైన వారిలో అంజలి మర్చంట్ కూడా ఉన్నారు. కాగా.. ఇటీవలే గుజరాత్లోని జామ్నగర్లోని అనంత్ అంబానీ- రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పలువురు బాలీవుడ్ తారలు, వ్యాపారవేత్తలు, క్రీడాకారులు హాజరయ్యారు. పారిశ్రామికవేత్త వీరేన్ మర్చంట్ కుమార్తె రాధిక మర్చంట్ 2022 డిసెంబర్లో రాజస్థాన్లో జరిగిన వేడుకలో అనంత్ అంబానీతో నిశ్చితార్థం చేసుకున్నారు. వీరి వివాహం ఈ ఏడాది జూలైలో జరగనుంది. View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) -
లగేజీ తీసుకురావడానికి రూ.25 కోట్ల కాన్వాయ్!
దేశంలోనే అత్యంత సంపన్నుడైన ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ-రాధికమర్చంట్ల ప్రీవెడ్డింగ్ వేడుక ఇటీవల జరిగిన విషయం తెలిసిందే. త్వరలో పెళ్లిపీటలు ఎక్కనున్న ఆ జంట తాజాగా దుబాయ్లో షాపింగ్ చేస్తూ కనిపించింది. అందులో ప్రత్యేకత ఏముంది అనుకుంటున్నారేమో.. సంపన్నుల షాపింగ్ అంటే భారీ బందోబస్తుతో వెళతారు. అనంత్-రాధికలు కూడా భారీ సెక్యూరిటీ మధ్య లగ్జరీ కార్లతో దుబాయ్లోని విలాసవంతమైన సిటీ వాక్ మాల్లో ప్రత్యక్షమయ్యారు. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. అనంత్-రాధికల జంట దాదాపు రూ.10 కోట్లు విలువ చేసే రోల్స్రాయిస్ కల్లినన్ బ్లాక్ బ్యాడ్జ్ మోడల్కారులో మాల్లోకి ప్రవేశించారు. వారిచుట్టూ భారీ సెక్యూరిటీ ఉన్నట్లు వీడియో ద్వారా తెలిసింది. దాంతోపాటు లగ్జరీ కార్లతో సెక్యూరిటీ కాన్వాయ్ను ఏర్పాటు చేశారు. ఆ కాన్వాయ్లో కాడిలాక్ ఎస్కలేడ్స్, జీఎంసీ యుకోన్ డెనాలిస్, చేవ్రొలెట్ సబర్బన్తోపాటు ఓ అంబులెన్స్ కూడా ఉంది. చివరకు వారు షాపింగ్ చేసిన లగేజీ తెచ్చుకోవడానికి సుమారు రూ.25 కోట్ల విలువైన ఆ కార్ల కాన్వాయ్ను వినియోగించడంతో నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. అనంత్ రిలయన్స్ న్యూ ఎనర్జీ విభాగానికి నేతృత్వం వహిస్తున్నారు. 2024 జులైలో అనంత్-రాధిక వివాహం చేసుకోనున్నారు. ఇదీ చదవండి: రికార్డులను తిరగరాస్తున్న బంగారం ధరలు The Ambani family, the richest in Asia, driving through Dubai with 20 cars in their convoy pic.twitter.com/Ge3SlyN72x — Historic Vids (@historyinmemes) April 7, 2024 -
అచ్చం అనంత్ మామలాగే..క్యూట్ కృష్ణ ఫోటో వైరల్
రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ, నీతా అంబానీల ముద్దుల తనయ ఇషా అంబానీ. రిలయన్స్ రిటైల్ వ్యాపారాన్ని నిర్వహిస్తున్నా ఇషా, 2018 డిసెంబరులో వ్యాపారవేత్త ఆనంద్ పిరమల్ను వివాహం చేసుకుంది. ఇషా, ఆనంద్ జంటకు కవలలు - కృష్ణ (కుమారుడు) ఆదియా (కుమార్తె) జన్మించారు. అటు తల్లిగా, ఇటు వ్యాపార నిర్వహణలోనూ అంబానీ వారసురాలిగా తన సత్తా చాటుకుంటోంది. ఇటీవల ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో తన ట్విన్స్తో సందడిగా కనిపించింది ఇషా. ఇషాతో ట్విన్స్ ఫోటోలో సోషల్ మీడియాలో తెగ షేర్ అయ్యాయి. ముఖ్యంగా ఇషా కుమారుడు కృష్ణ స్పెషల్ ఎట్రాక్షన్గా నిలిచాడు. ఈ ఫోటోలు అచ్చం మేనమామ అనంత్ అంబానీలా ఉండటం నెటిజనులను బాగా ఆకట్టుకుంది. బ్లాక్ సూట్లో రాయల్ లుక్లో చిరునవ్వుల చిందిస్తున్న ఇషా కుమారుడు కృష్ణ, తమ్ముడు అనంత్ కార్బన్ కాపీలా ఉన్నాడంటూ వ్యాఖ్యానించారు. " అచ్చం అనంత్ అంబానీ లాగానే ఉన్నాడు అని ఒకరు, "అనంత్ మాము జైసా లగ్తా హై" అని మరొకరు వ్యాఖ్యానించారు. అంతేకాదుఆ చిన్నారి ధీరూభాయ్ అంబానీలా ఉన్నాడని మరికొందరు కామెంట్ చేయడం విశేషం. ప్రస్తుతం ఈ మామ, అల్లుళ్ల పోలికల ఫోటో ఇంటర్నెట్లో హల్చల్ చేస్తోంది. -
అబ్బురపరిచిన ‘అనంత’ భావోద్వేగం
కళ్లు చెదిరే ఐశ్వర్యం, దేన్నయినా క్షణాల్లో సాధించగల అధికారం, కుటుంబ విలువల పట్ల అచంచల విశ్వాసం, భగవంతుడిపై అంతులేని భక్తి... ఇవన్నీ ఒకే కుటుంబంలో కలగలిసి వుండటం ఊహాతీతం. కానీ ప్రపంచ కుబేరుల జాబితాలో అగ్రస్థానంలో ఉన్న ‘అంబానీ పరివార్’ వీటన్నిటి సమ్మేళనం అని మరోసారి రుజువైంది. గుజరాత్లోని జామ్నగర్లో మూడు రోజులపాటు ఈమధ్య జరిగిన ప్రీ వెడ్డింగ్ సంబరాలు దేశంలోనే ఎప్పుడూ కనీవినీ ఎరుగనివి. కానీ వీటన్నిటి కంటే అందరికీ ఆసక్తి కలిగించింది మరొకటుంది. అది జూలైలో పెళ్లికొడుకు కాబోతున్న అనంత్ అంబానీ చేసిన ప్రసంగం! చిన్ననాటి స్నేహితురాలూ, ప్రియురాలూ అయిన రాధికా మర్చంట్తో ఆయనకు వివాహం అవుతున్న సందర్భంగా ఈ ప్రీ వెడ్డింగ్ వేడుకలు జరిగాయి. వర్తమాన ప్రపంచాన్ని ప్రభావితం చేస్తున్న వివిధ రంగాల ప్రముఖులు, కార్పొరేట్ కుబేరులు, బాలీవుడ్ అగ్రతారలు, క్రికెటర్లు సకుటుంబ సమేతంగా వచ్చారు. అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా హాజరయ్యారు. అనంత్ అంబానీ చేసిన ప్రసంగం అందరి మనసులనూ మెలిపెట్టింది. కుమారుడి ప్రసంగం వింటూ ముఖేష్ దంపతులైతే కంటతడి పెట్టారు. 2003లో కరణ్ థాపర్ ‘బీబీసీ’ కోసం ముఖేష్–నీతా దంపతులను ఇంటర్వ్యూ చేసిన సందర్భంగా నీతాను ‘మీ దృష్టిలో డబ్బంటే ఏమిటి?’ అని అడిగినప్పుడు ‘డబ్బు దానికదే అంతిమ లక్ష్యం కాదు... దాన్ని ఎలా వినియోగిస్తామన్నదే ముఖ్యం’ అని చెబుతూ ఒక మాటన్నారు. ‘డబ్బు సంపాదన, సంపద జీవితం కానే కాదు... కొన్ని అపురూప చిరస్మరణీయ జ్ఞాపకాలను నిర్మించుకోవటమే జీవితం’ అని చెప్పారు. అనంత్ హృదయాంతరాళాల్లోంచి పెల్లుబికి వచ్చిన మాటల వెనక ఆ విలువల జీవశక్తి నిండివుందనీ, ఆ దంపతుల పెంపకం అతణ్ణి తీర్చిదిద్దిందనీ అనిపిస్తుంది. ఏమన్నారూ అనంత్? తన కుటుంబసభ్యులంతా తన కోసం, తన సుఖ సంతోషాల కోసం పడుతున్న శ్రమను వివరించారు. తనకున్న ప్రత్యేక అనారోగ్య సమస్యల నేపథ్యంలో అమ్మానాన్నలిద్దరూ అనుక్షణమూ తనను అపురూపంగా చూసుకున్న వైనాన్ని కళ్లకు కట్టారు. ప్రీ వెడ్డింగ్ వేడుకలు అత్యంత విలక్షణంగా ఉండాలన్న తపనతో గత కొన్ని నెలలుగా రోజుకు కనీసం 20 గంటలు తన కుటుంబసభ్యులంతా పడిన కఠోర శ్రమను గుర్తుకు చేసుకున్నారు. అందరూ అనుకుంటున్నట్టు తన జీవితం పూలపాన్పు కాదనీ, చిన్ననాటినుంచీ భరించలేని బాధల ముళ్లు వేధిస్తూనే ఉన్నాయనీ చెప్పారు. అనారోగ్య సమస్యల నుంచి బయటపడే క్రమంలో వాడక తప్పని స్టెరాయిడ్స్ చివరకు ఊబకాయానికి కారణమైన తీరును తెలిపారు. సాధారణంగా 25–30 ఏళ్ల మధ్యనుండే సంపన్న కుటుంబాల యువతలో చాలా సందర్భాల్లో విచ్చలవిడితనం, బాధ్యతారాహిత్యం కనబడుతూ ఉంటుంది. ఇంగ్లిష్ తప్ప ఏదీ మాట్లాడలేరు. ఈ వేడుకల సందర్భంగా ‘న్యూస్18’కు ఇచ్చిన ఇంటర్వ్యూ అనంత్లోని మానవీయతను వెల్లడిస్తుంది. నిలువెల్లా వినమ్రత, పలికే ప్రతి మాటలో నిజాయితీ అతని సొంతం. ఇంగ్లిష్లో కాదు... అందరికీ అర్థమయ్యేలా స్వచ్ఛమైన హిందీలో భావ వ్యక్తీకరణ అనంత్ ప్రత్యేకత. గాయపడిన, ఆదరణ కోల్పోయిన వన్యప్రాణులను అక్కున చేర్చుకుని వాటి సంరక్షణ కోసం జామ్నగర్లో మూడువేల ఎకరాల్లో ‘స్టార్ ఆఫ్ ద ఫారెస్ట్ వన్తార’ అనే ప్రాజెక్టును నిర్వహిస్తున్నారు. చిన్ననాడు తన నాయనమ్మ కోకిలా బెన్ నేర్పిన ప్రేమ, దయ భావనలే ఈ ప్రాజెక్టుకు తనను పురిగొల్పాయని చెప్పారు. తన ఆధ్వర్యంలోనే గుజరాత్ ప్రభుత్వ సహకారంతో ఒక ‘జూ’ కూడా నిర్వహిస్తున్నారు. ‘ఇండియా టుడే’ ఛానెల్లో వచ్చిన ఇంటర్వ్యూ ఆయనలోని మరో మనిషిని ఆవిష్కరించింది. ఆ యువకుడిలో దాగున్న ఆధ్యాత్మిక భావనలూ, మాతృదేశంపై ఉన్న చెక్కుచెదరని మమకారాన్నీ ఆ ఇంటర్వ్యూ వెలికితీసింది. పెళ్లి వేడుకలు మన దేశంలోనే జరుపుకోవాలన్న ప్రధాని నరేంద్ర మోదీ పిలుపే స్ఫూర్తిగా అందుకోసం జామ్నగర్ను ఎంచుకున్నానని చెప్పారు. తన ఇంటిల్లిపాదికీ సనాతన ధర్మంపై ఉన్న భక్తి విశ్వాసాలనూ, వాటికి అనుగుణంగా ఆచరిస్తున్న విలువలనూ వివరించారు. ఆసియా ఖండంలోని సంపన్నవంతుల్లో మొట్టమొదటి స్థానంలో, ప్రపంచ కుబేరుల జాబితాలో పదో స్థానంలో ఉన్న కుటుంబంలో ఒక 28 ఏళ్ల కుర్రాడు ఇంత పరిణతితో, ఆధ్యాత్మిక విలువలతో మాట్లాడతాడని బహుశా ఎవరూ అనుకుని ఉండరు. ‘లైసెన్స్ రాజ్’గా పేరుబడిన ఆర్థిక సంస్కరణల పూర్వ దశలో అనంత్ తాత ధీరూభాయ్ అంబానీ తనదైన రీతిలో పావులు కదుపుతూ, ఒక్కొక్క మెట్టే అధిరోహిస్తూ తన విశాల కుటుంబ సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటూ వెళ్లారు. ఆయన వారసత్వాన్ని ముఖేష్ అప్రతిహతంగా కొనసాగిస్తూ దాన్ని మరింత పెంచుతున్న వైనమూ కళ్లముందే ఉంది. అందుకే ఇవాళ దేశంలో రిలయన్స్ స్పృశించని రంగమంటూ లేదు. ఆ కుటుంబ విలువలు సైతం అందరి హృదయాలనూ తాకుతాయని ప్రీ వెడ్డింగ్ వేడుకలు తెలియజెప్పాయి. బి.టి. గోవిందరెడ్డి వ్యాస రచయిత సీనియర్ జర్నలిస్టు -
ఆఖరికి అంబానీ ఇంట పార్టీ అయినా ఓరీ ఉండాల్సిందే! (ఫొటోలు)
-
అంబానీకి స్టార్ హీరో ఏం గిఫ్ట్ ఇచ్చాడో తెలుసా?
అంబానీ ఇంట సెలబ్రేషన్స్ అంటే మాటలా.. దేశమంతా ఈ ఫ్యామిలీ వేడుకలను చూసి నోరెళ్లబెడుతోంది. ప్రీవెడ్డింగ్ కోసమే వెయ్యి కోట్లపైనే ఖర్చు చేయడం చూసి జనాలు ముక్కున వేలేసుకుంటున్నారు. జాతీయ, అంతర్జాతీయ సెలబ్రిటీలంతా గుజరాత్లోని జామ్నగర్లోనే రెండు, మూడు రోజులపాటు సెటిలయ్యారు. బాలీవుడ్ సెలబ్రిటీలు కూడా పనులన్నీ పక్కనపెట్టి ఈ వేడుకలను ఎంజాయ్ చేశారు. ఆటపాటలతో అలరించారు. స్టార్ హీరో సల్మాన్ ఖాన్ అంబానీ ఫ్యామిలీకి చాలా క్లోజ్. అనంత్ అంబానీ- సల్మాన్ మధ్య ఎప్పటినుంచో మంచి అనుబంధం ఉంది. అందుకే ప్రీవెడ్డింగ్కు సైతం సల్లూభాయ్ ఓ గిఫ్ట్ పట్టుకెళ్లాడట! అనంత్ కోసం ప్రత్యేకంగా ఓ వాచ్ తయారు చేయించాడట. దాని విలువ కోట్లల్లో ఉంటుందని తెలుస్తోంది. రాధిక మర్చంట్కు డైమండ్ ఇయర్ రింగ్స్ బహుమతిగా ఇచ్చాడట. ఇది చూసిన కొందరు అంబానీకి ఆ గిఫ్ట్స్ ఏం సరిపోతాయని సెటైర్లు వేస్తున్నారు. అయినా అంబానీకి గిఫ్ట్ ఇవ్వాలంటే ఆస్తులు అమ్ముకోవాలని కామెంట్లు చేస్తున్నారు. ఏదేమైనా ఇలా బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటే వారి మధ్య స్నేహం మరింత బలంగా మారుతుందని అభిప్రాయపడుతున్నారు. చదవండి: పెళ్లికి రెడీ అయిన కిరణ్ అబ్బవరం! ఆ హీరోయిన్తో ఏడడుగులు? -
Anant-Radhika జుకర్బర్గ్ భార్య నగ మిస్..? నెటిజనుల కామెంట్స్ వైరల్
రిలయన్స్ అధినేత, బిలియనీర్ ముఖేష్ ,నీతా అంబానీ చిన్నకుమారుడు అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ బాష్లో ఒక ఆశ్యర్యకరమైన విషయం నెట్టింట చక్కర్లు కొడుతోంది. అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ ఈవెంట్లో మెటా సీఈవో మార్క్ జుకర్బర్గ్ భార్య పెండెంట్ను కోల్పోయిందట. దీంతో సోషల్ మీడియా సంస్థలు ఎఫ్బీ, ఇన్స్టాగ్రామ్ డౌన్కి ఇదే కారణమంటున్న నెటిజన్లు ఛలోక్తులు వైరల్గా మారాయి. గుజరాత్లోని జామ్ నగర్లో మూడు రోజుల పాటు ఘనంగా నిర్వహించిన వేడుకలకు బాలీవుడ్, క్రీడారంగ సెలబ్రిటీలతోపాటు, మెటా సీఈవో మార్క్ జుకర్బర్గ్ , భార్య న్, బిల్ గేట్స్ ఆయన భార్య, గ్లోబల్ పాప్ ఐకాన్, రిహన్నా సందడి చేసిన సంగతి తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం మార్క్ భార్యప్రిస్సిల్లా చాన్ లాకెట్ మిస్ అయింది. దీంతో భారీ గందరగోళం ఏర్పడి, జుకర్బర్గ్ దంపతులతో పాటు అతిథులంతా మూడున్నర గంటలపాటు లాకెట్టు కోసం వెతికినా ఫలితం లేక పోయింది. ఈ ఘటనపై రెడిట్యూజర్ వెల్లడించడంతో నెటిజన్లు ఫన్నీ కమెంట్లతో సందడి చేశారు. అందుకే ఫేస్బుక్, ఇన్స్టా పనిచేయ లేదంటూ కమెంట్ చేశారు. ఈ సంఘటన దురదృష్టకరం అంటూ మరికొందరు వ్యాఖ్యానించారు. అయితే చాన్ లాకెట్టు నిజంగానే పోయిందా? ఒక వేళ పోతే మళ్లీ దొరికిందా లేదా అనే దానిపై స్పష్టత లేదు. కాగా మెటా యాజమాన్యంలోని యాప్లు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, మెసెంజర్, థ్రెడ్లు నాలుగు రోజుల క్రితం భారతదేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా డౌన్ అయిన సంగతి తెలిసిందే. -
పెళ్లికొడుకు వాచ్పై కన్నేసిన జూకర్బర్గ్ దంపతులు.. ధర ఎంతో తెలుసా..
అంబానీ ఇంట వివాహ వేడుకలు ఇటీవలే ముగిశాయి. అనంత్ అంబానీ-రాధికమర్చంట్ ప్రివెడ్డింగ్ ఈవెంట్ ఘనంగా నిర్వహించిన విషయం తెలిసిందే. ప్రముఖులు, సినీతారలు, ప్రపంచ వ్యాపారవేత్తలు పాల్గొని అలరించిన సంగతి తెలిసిందే. అయితే ప్రివెడ్డింగ్ వేడుకలు ముగిసినా అందుకు సంబంధించిన వార్తలు రోజూ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ ఫంక్షన్కి హాజరైన వారిలో ఫేస్బుక్ అధినేత మార్క్జూకర్బర్గ్ దంపతులు కూడా ఉన్నారు. పెళ్లికొడుకు ధరించిన వాచ్ చూసి వారు దాని వివరాలు అడిగి తెలుసుకుంటున్న వీడియో ఒకటి వైరల్గా మారింది. అనంత్ అంబానీ చేతి గడియారాన్ని గమనించిన మార్క్ భార్య ప్రిస్కిల్లా.. అది చాలా బాగుంది అని అనంత్కు కితాబిచ్చినట్లు తెలిసింది. దానికి జుకర్బర్గ్ అంగీకరిస్తూ తాను ఇప్పుటికే ఆ విషయాన్ని అనంత్కు చెప్పానని జవాబిచ్చారు. దాన్ని ఎవరు తయారు చేశారని ఆమె అడగ్గా.. రిచర్డ్ మిల్లే అని అనంత్ బదులిచ్చాడు. Zuckerberg and wife going gaga over Anant Ambani’s watch (Richard Mille) worth 12-15 crores INR. FYI Anant also has a Patek Philippe Grand Complication Sky Moon Tourbiillion - ₹ 63 crores and a Grand Master Chimes - ₹66 crores 😂 😂 pic.twitter.com/65gwALBGwG — Pakchikpak Raja Babu (@HaramiParindey) March 3, 2024 ఈ వీడియో వైరల్ అయిన వెంటనే పలువురు ఆ వాచ్ ధర, కంపెనీ గురించి సోషల్ మీడియాలో ఆరా తీయడం ప్రారంభించారు. దాని ఖరీదు రూ.15 కోట్లు ఉంటుందంటూ సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఎక్స్లోని ఒక పోస్ట్ ప్రకారం.. ఆ రిచర్డ్ మిల్లే ఆర్ఎం 56-02 వాచ్ విలువ రూ.15-18 కోట్లు ఉంటుందని అంచనా. అనంత్కు పటెక్ ఫిలిప్ గ్రాండ్ కాంప్లికేషన్ స్కై మూన్ టూర్బిల్లాన్ కూడా ఉంది. దీని ధర రూ.63 కోట్లుగా ఉందని తెలిసింది. ఇదీ చదవండి: అమృత‘మూర్తి’కి అరుదైన గౌరవం -
అంబానీ ఫ్యామిలీ ఫోటో అదిరిందిగా : ఫోటోలు వైరల్
రిలయన్స్అధినేత ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ, వ్యాపారవేత్త కుమార్తె, అనంత్ ప్రేయసి రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకులు ఘనంగా ముగిసాయి. గుజరాత్లోని జామ్ నగర్లో మూడు రోజుల పాటు అంగరంగ వైభవంగా ఈ వేడుకలు జరిగాయి. అంబానీ పెద్దకోడలు, ఆకాశ్ భార్య శ్లోకా అంబానీ మన దేశం నెక్స్ట్ జనరేషన్ లీడర్లు ఒకే ఫ్రేమ్లో అంటూ ఈ ఫోటోను ఇన్స్టాలో పోస్ట్ చేసింది. జామ్నగర్లో డిన్నర్ సందర్భంగా తీసుకున్న ఫోటోకి ఆకాష్, శ్లోక ఇషా, ఆనంద్, అనంత్, రాధికల బెస్ట్ ఫోటో అనే క్యాప్షన్ ఇచ్చింది. దీంతో అద్భుతం అంటూ నెటిజన్లు కమెంట్ చేశారు. రిలయన్స్ అంబానీ కుటుంబం రేపటి తరం అంటూ సోషల్ మీడియా పోస్ట్లు వైరల్ అవుతున్నాయి. బాలీవుడ్ మూవీ ‘హమ్ సాథ్ సాథ్ హై’ పోస్టర్తో పోస్టింగ్లు వెల్లువెత్తాయి. మరోవైపు ముఖేష్ అంబానీ సతీమణి నీతా అంబానీ ఫౌండర్ చైర్మన్గా ఉన్న ఎన్ఎంఏసీసీకి చెందిన ట్విటర్ ఖాతా కూడా వేడుకలు ఘనంగా ముగిసాయి అంటూ ట్వీట్ చేసింది. దీనికి సంబంధించి రెండు ఫోటోలను కూడా షేర్ చేసింది. Ambani family and their furry family member ‘Happy’, strike a relaxed pose at the successful completion of the pre-wedding celebrations of Anant and Radhika which started with Anna Seva for nearby village communities, followed by three day festivities with friends and family. pic.twitter.com/crLugfuX2y — Nita Mukesh Ambani Cultural Centre (@nmacc_india) March 8, 2024 View this post on Instagram A post shared by Shloka Akash Ambani (@shloka_ambani) -
వజ్రాలు వైఢూర్యాలతో డిజైన్ చేసిన జాకెట్..అంబానీ కూతురుగా ఆ మాత్రం ఉండాల్సిందే (ఫొటోలు)
-
బంగారంతో లెహంగా.. అంబానీ కోడలంటే మినిమమ్ ఉంటది!
అనంత్ అంబానీ రాధిక ప్రీ వెడ్డింగ్ వేడుకలు గుజరాత్లోని జామ్నగర్లో అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. ఆ వేడుక ఏర్పాట్లు ప్రపంచ దేశాలనే ఆకర్షించాయి. ఎక్కడ చూసినా.. అంబానీల కుటుంబ సభ్యలు ధరించిన నగలు, ఫ్యాషన్ బ్రాండ్ డ్రస్లపైన తెగ చర్చ నడుస్తోంది. ముఖ్యంగా ఈ మేడుకలు బాలీవుడ్ అగ్ర తారలు, ప్రముఖ పాప్ సింగర్లు తరలి వచ్చి మరీ ఆడి పాడి సందడి చేశారు. దేశ విదేశాలకు చెందిన అతిరథ మహారథులంతా ఈ వేడుకకు పెద్ద ఎత్తున హాజరవ్వడమే గాక భారతీయ సంస్కృతిని ఆకళింపు చేసుకునేలా వస్త్రధారణతో అలరించారు. అయితే ఈ వేడుకలో నీతా అంబానీ, కోడలు శ్లోకా మెహతా, కూతురు ఈషా అంబానీ ధరించిన లగ్జరీయస్ నగలు, చీరలు గురించి కథకథలుగా విన్నాం. అవన్నీ ఒక ఎత్తైతే నీతా అంబానీ కాబోయే కోడలు రాధికా మర్చంట్ ధరించిన డ్రస్లు మరింత చర్చనీయాంశంగా మారాయి. కాబోయే పెళ్లి కూతురు, అందులోనూ ముఖేశ్ అంబానీ రేంజ్కి తగ్గట్టు ఆమె డ్రస్లు నగలు చాలా గ్రాండ్గా ఉంటాయి. అది కామనే. కానీ ఇలా ప్రీ వెడ్డింగ్ వేడుకల కోసమే రాధిక మరీ ఈ రేంజ్లో డ్రస్లు డిజైన్ చేయించుకోవడమే నెట్టింట కాస్త చర్చనీయాంశమయ్యింది. ఈ ప్రీ వెడ్డింగ్ వేడుకల్లోనూ చివరి రోజున రాదిక ధరించే లెహంగాని ఏకంగా బంగారపు దారాలతో రూపొందించారట. అలాగే డ్రస్పై ధరించే దుప్పటను తయారు చేసేందుకు ఏకంగా ఆరు నెలల సమయం పట్టిందట. దీన్ని ప్రముఖ డిజైన్ర్ మనీష్ మల్హోత్రా రూపొందించారట. అంతేగాదు ఈ కార్యక్రమానికి హాజరైన 1500 మంది సమక్షంలో వారి వివాహ బంధాన్ని చట్టబద్ధం చేసుకునేలా కాబోయే వధువరులు అనంత్ రాధికాలు తమ వివాహపత్రాలపై సంతాకాలు చేసినట్లు వోగ్ మీడియా పేర్కొంది. View this post on Instagram A post shared by Manish Malhotra (@manishmalhotra05) (చదవండి: వజ్రాలు వైఢ్యూర్యాల డిజైన్ చేసిన జాకెట్..ధర ఏకంగా..!) -
అంబానీ ప్రీవెడ్డింగ్.. త్రీ ఖాన్స్కు భారీగా పారితోషికం?!
బాలీవుడ్ సెలబ్రిటీలందరినీ ఒక్కచోటకు చేర్చడం.. అది కూడా బస్సెక్కించి మరీ ఈవెంట్కు తీసుకురావడం ఒక్క అంబానీకే సాధ్యమైంది. తారలు సైతం తమ ఇంటి పెళ్లిలాగే భావించి అనంత్ అంబానీ ప్రీవెడ్డింగ్ సెలబ్రేషన్స్లో తెగ సందడి చేశారు. ఆటపాటలతో అలరించారు. అయితే అందరినీ కట్టిపడేసిన అంశం ఏదైనా ఉందా? అంటే త్రీఖాన్స్ డ్యాన్స్ చేయడమే! స్టేజీపై డ్యాన్స్.. ఎప్పుడూ బిజీగా ఉండే షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్, ఆమిర్ ఖాన్.. అన్నదమ్ముల్లాగా కలిసి డ్యాన్స్ చేయడంతో అభిమానులంతా ఫుల్ ఖుషీ అయ్యారు. ఇందుకోసం డబ్బులు కూడా బాగానే తీసుకుని ఉండొచ్చంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. వీరితో కలిసి స్టెప్పేసిన రామ్చరణ్కు కూడా ఎంతో కొంత ఇచ్చే ఉంటారని ఎవరికి వారు అభిప్రాయపడుతున్నారు. కానీ బీటౌన్లో మాత్రం ప్రచారం మరోలా ఉంది. చరణ్తో పాటు ఈ ఖాన్స్ త్రయానికి డబ్బులే ఇవ్వలేదట! సంతోషంతోనే.. 'వారిని ఒకే స్టేజీపైకి తీసుకురావాలని అప్పటికప్పుడు అనుకున్నారు. ఎవరూ ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు. అంబానీ అంత గ్రాండ్గా ఆతిథ్యం ఇచ్చినప్పుడు అతిథులు డబ్బులు అడగ్గలరా? ఆ హీరోలు సంతోషంతో అలా డ్యాన్స్ చేశారంతే.. కానీ డబ్బులు మాత్రం తీసుకోలేదు' అని జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. అంబానీ ఇచ్చిన ఆతిథ్యాన్ని మెచ్చిన హీరోలు ఫ్రీగా డ్యాన్స్ చేశారన్నమాట! అయినా ఇది ప్రీవెడ్డింగ్ కాబట్టి డిమాండ్ చేయలేదేమో.. పెళ్లికి అసలు, వడ్డీ.. అంతా కలిపి అడుగుతారని.. అప్పటిదాకా ఓపిక పట్టండని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. #RamCharan kaha hai tu.. They are treating him like his own. How beautiful 😍. pic.twitter.com/s7hXwrBP6N — अपना Bollywood🎥 (@Apna_Bollywood) March 3, 2024 చదవండి: సడన్గా ఓటీటీలోకి వచ్చేస్తున్న థ్రిల్లర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే? -
అనంత్-రాధిక ప్రీ-వెడ్డింగ్ : పాక్ జీడీపీ, నీతా నగలపై సెటైర్లు
రిలయన్స్ అధినేత బిలియనీర్ ముఖేష్ అంబానీ, రిలయన్స్ ఫౌండేషన్ చైర్ పర్సన్ నీతా అంబానీ దంపతుల చిన్న కుమారుడు అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకలు ఇంటర్నెట్లో పెద్ద సంచలనంగా మారాయి. అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ పెళ్లి ఈ ఏడాది జూలై నిర్వహించేందుకు ఇరు కుటుంబాలు నిర్ణయించాయి. ఈ నేపథ్యంలో ఈ నెల 1, 2, 3 తేదీల్లో ప్రీ వెడ్డింగ్ బాష్ అంగరంగ వైభంగా జరిగింది. పలువురు సెలబ్రిటీలు ఈ వేడుకల్లో సందడి చేశారు. అయితే ఈ సందర్బంగా అంబానీ కుటుంబం ఈ వేడుకులకు ఖర్చు పెట్టిన కోట్లాది రూపాయలపై పెద్ద చర్చ నడిచింది. ప్రీ వెడ్డింగ్ వేడుకలకే ఇంత హంగామా అని కొందరు, లక్షల కోట్లకు అధిపతి అయిన ముఖేష్ అంబానీ 12 వందల కోట్లు వెచ్చించడం పెద్ద ఖర్చే కాదని మరికొందరు వాదించారు. దీంతోపాటు వందల కోట్ల విలువ చేసే అంబానీ భార్య నీతా అంబానీ, పెద్ద కొడలు శ్లోకామెహతా, కుమార్తె ఇషా అంబానీ ధరించి డైమండ్ నగలు, కాబోయే వరుడు అనంత్ అంబానీ డైమండ్ వాచ్ గురించి ఇంటర్నెట్ తీవ్ర చర్చ నడిచింది. ఇదంతా ఒక ఎత్తయితే నీతా అంబానీ ధరించి రూ. 500-600 కోట్ల విలువైన డైమండ్ నెక్లెస్ వైరల్గా మారింది. పాకిస్తాన్ జీడీపీ కంటే నీతా అంబానీ డైమండ్ నెక్లెస్ ధరే ఎక్కువ అంటూ నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. ఇప్పటికే ఇన్స్టాలో పలు పోస్ట్లు వైరల్గా, తాజాగా ఏఎన్ఐ షేర్ చేసిన వీడియోపై ఇదే కమెంట్లు కనిపించడం గమనార్హం. కాగా ఐఎంఎఫ్ అంచనాల ప్రకారం పాకిస్తాన్ జీడీపీ దాదాపు 341 కోట్ల డాలర్లు (రూ. 28.23 లక్షల కోట్లు)గా ఉన్న సంగతి తెలిసిందే. Etched with the initials Anant Ambani and Radhika Merchant, Nita Ambani dons the world-famous handloom Kanchipuram saree designed by Swadesh and handcrafted by artisans. She was seen thanking the Jamnagar Reliance Parivar for their love and support during Anant and Radhika's… pic.twitter.com/YEOYdVOmjp — ANI (@ANI) March 7, 2024 -
అనంత్ అంబానీ బరువుపై అసభ్యకరమైన కామెంట్లు చేసిన హీరోయిన్
భారత సంపన్నుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధిపతి ముకేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ , రాధికా మర్చంట్ల ప్రీ-వెడ్డింగ్ వేడుకలు గుజరాత్లోని జామ్నగర్ వేదికగా మార్చి 1-3 వరకు ఘనంగా జరిగాయి. మూడు రోజుల పాటు జరిగిన ఈ వేడుకలను ‘హస్తాక్షర్ ’ కార్యక్రమంతో ముగించారు. దేశ, విదేశాల్లో పలు రంగాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు. ఈ క్రమంలో అంబానీ ఫంక్షన్పై బాలీవుడ్ నటి రాఖీ సావంత్ స్పందించింది. ఎంతో ఘనంగా జరిగిన ఈ వేడుకకు తనను ఎందుకు పిలవలేదని ఆమె ప్రశ్నించింది. ఒకవేళ తనను పిలిచి ఉంటే ఫ్లోర్ క్లీన్ చేయడం నుంచి వంట పాత్రలు కడగడం వరకు తానే స్వయంగా చేసేదానినంటూ ఆమె ఇలా పేర్కొంది. 'అంబానీ జీ నమస్తే. నన్ను పెళ్లికి ఎందుకు పిలవలేదు? మీరు ఇంకా నా డ్యాన్స్ చూడలేదనుకుంటా.. మీరు సింగర్ రిహానాతో పాటుగా ఖాన్, ఐఖాన్ అంటూ ఎందరినో పిలిచారు. మీ వేడకలో వారు చేసిన డ్యాన్స్ నా ముందు జుజూబీ.. మీరు నా డాన్స్ చూశారా? మున్నీ బద్నామ్ హుయ్ డార్లింగ్ తేరే లియే, తుక్ తుక్ దేఖే, పరదేశియా ఇలా చాలా పాటలు చేశాను. అవన్నీ మీరు చూడలేదు అనుకుంటా. మీరు కోట్లకు కోట్లు డబ్బు ఇచ్చినా రిహానా చిరిగిన బట్టలతో వచ్చింది. నాకు రూ. 10 కోట్లు ఇచ్చి వుంటే మీకు ఎన్నో ప్రయోజనాలు కలిగేవి. మీ అతిథులందరి గదులు శుభ్రం చేయడం నుంచి వంట పాత్రలు కడిగే వరకు అన్నీ నేనే చేసేదాన్ని. అంటూ కామెంట్ చేసింది. అనంత్ బరువుపై కామెంట్లు అనంత్ అంబానీ బరువుపై రాఖీ సావంత్ అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసింది. ' డియర్ అంబానీ జీ.. అనంత్ అంబానీ బాగా బరువు పెరిగారు.. ఆయన్ను నా వద్దకు 5రోజుల పాటు పంపించండి. కట్టెపుల్లలా సన్నగా చేసి పంపుతాను. దీని కోసమైన కొంత డబ్బు ఇచ్చి నన్ను కొనుక్కోండి. ఆయనతో కసరత్తులు చేయించడమే కాకుండా.. తృప్తి చేసి పంపిస్తాను. అనంత అంబానీని జీరో సైజ్కు చేర్చి మీ వద్ద ఉంచే బాధ్యత నాది. ఆయన బరువు తగ్గితే మీతో పాటుగా మీ కోడలు కూడా చాలా సంతోషిస్తుంది. అసలే మీ కోడలు దానిమ్మ పండులా ఉంది. ఆయన సన్నగా అయితే ఆమెకే మంచిది.' అని అనంత్ అంబానీ బరువుపై రాఖీ సావంత్ సోషల్ మీడియాలో వివాదాస్పదంగా అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసింది. దీంతో రాఖీ సావంత్ తీరుపై నెటిజన్లు దుమ్మెత్తి పోస్తున్నారు. అనారోగ్య సమస్యలతో బరువు పెరిగినట్లు స్వయంగా ఆయన చెబుతూ ప్రీవెడ్డింగ్ వేడుకలోనే ఎమోషనల్ అయ్యాడు. అలాంటి వ్యక్తి గురించి ఇలా వల్గర్గా మాట్లాడడానికి సిగ్గులేదా అని ఆమెను ప్రశ్నిస్తున్నారు. ఆయన అమ్మగారు అయిన నీతా అంబానీ కూడా అనంత్ ఆరోగ్య సమస్యల గురించి గతంలో వివరించారు. అనారోగ్య కారణాలతో కొన్ని రకాల స్టెరాయిడ్స్ వాడటం వల్ల అనంత్ బరువు పెరిగాడని ఆమె చెప్పుకొచ్చారు. View this post on Instagram A post shared by TellyMasala (@tellymasala) -
అనామకుడిలా అనిల్ అంబానీ
-
కొడుకు పెళ్లి కోసం అంబానీ ఎన్ని కోట్లు ఖర్చు చేసాడో తెలుసా...?
-
ముఖేష్ అంబానీ ‘లడ్డూ రివర్స్’ వీడియో వైరల్, అసలు నిజం ఇది!
బిలియనీర్, రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీకి చెందిన వీడియో ఒకటి ఇంటర్నెట్లో సంచలనంగా మారింది. ముఖేష్ అంబానీ, నీతాల చిన్న కుమారుడు అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకలు ఈ నెల( మార్చి) 1, 2,3 తేదీల్లో ఘనంగా జరిగాయి. గుజరాత్లోని జామ్ నగర్లో అంగరంగ వైభవంగా జరిగిన ఈ వేడుకల ప్రారంభంలో వేల మందికి అన్న దానం చేశారు. "ఖానా కమ్ పడ్ గయా హై.తూ థోడా అడ్జస్ట్ కర్ లేనా (ఫుడ్ తక్కువైంది.. కొంచెం సర్దుకు పోండి) అనే పేరుతో పోస్ట్ అయిన వీడియో తెగ చక్కర్లు కొడుతోంది. అంబానీ ఎందుకు అలా చేస్తారు. అని ఆశ్చర్యపోతున్నారా? అసలు నిజం ఇది..! దీనికి సంబంధించి అసలు వీడియోను రివర్స్గా రూపొందించిన ఫేక్ వీడియో ఇది. JIO, after some years of free internet pic.twitter.com/VlFPKrsq6g — Tweeting Quarantino (@rohitadhikari92) March 5, 2024 కమ్యూనిటీ విందులో విస్తర్లలో వడ్డించిన తరువాత, భోజనాలకు కూర్చున్న వారి నుంచి లడ్డూలను వెనక్కి తీసుకుంటున్నట్టుగా వీడియో ట్విటర్లో తెగ షేర్ అవుతోంది. ముఖేష్ అంబానీ కొడుకు అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్లో ఇదీ సంగతి అంటూ కొంతమంది ఈ వీడియోపై కమెంట్ చేశారు. అయితే ఇది రివర్స్ వీడియో అంటూ అసలు సంగతి చెప్పారు కొంతమంది. మరి కొంతమంది యూజర్స్ జియో..ఉచితంగా డేటా అలవాటు చేసిన కొన్నాళ్ల తరువాత పరిస్థితి ఇదీ అంటూ వ్యంగ్యోక్తులు విసురుతున్నారు. ఇదీ అసలు వీడియో.. In run up to marriage ceremony of Anant Ambani, community feast are being organized in villages around the Jamnagar refinery. Today, in Jogvad village, Billionaire #MukeshAmbani himself seen offering food to the guests in a community feast. pic.twitter.com/0Nb7dWMdVM — Kumar Manish (@kumarmanish9) February 28, 2024 కాగా అనంత్ అంబానీ తన లేడీ లవ్ రాధికా మర్చంట్తో ఈ ఏడాదిలో ఏడడుగులు వేసుందుకు రడీ అవుతున్నాడు. గత ఏడాది ఎంగేజ్మెంట్ చేసుకున్న ఈ లవ్బర్డ్స్ ఈ నెలలో అంగరంగ వైభవంగా ప్రీ- వెడ్డింగ్ బాష్ నిర్వహించారు. బాలీవుడ్సెలబ్రిటీలు, క్రీడారంగ ప్రముఖులతోపాటు బిల్గేట్స్, మార్క్ జుకర్ బర్గ్ సహా పలువురు ప్రపంచ బిజినెస్ దిగ్గజాలు ఈ వేడుకల్లో విశేషంగా నిలిచిన సంగతి తెలిసిందే. -
LBW అంటూ సచిన్ విషెస్.. ముద్ద మందారంలా సారా
కాబోయే వధూవరులు అనంత్ అంబానీ- రాధికా మర్చంట్లకు టీమిండియా దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండుల్కర్ తనదైన శైలిలో శుభాకాంక్షలు తెలిపాడు. అందమైన జంట విషయంలో 'LBW' అంటే వేరే అర్థం ఉందంటూ సరికొత్త నిర్వచనం ఇచ్చాడు. కాగా భారత కుబేరుడు ముకేశ్ అంబానీ- నీతా అంబానీల చిన్న కుమారుడు అనంత్ అంబానీ, ఎన్కోర్ హెల్త్కేర్ సీఈఓ వీరేన్ మర్చంట్ కుమార్తె రాధికను పెళ్లాడనున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో అంబానీల స్వస్థలం గుజరాత్లోని జామ్నగర్లో ముందుస్తు పెళ్లి వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. మార్చి 1-3 వరకు మూడు రోజుల పాటు జరిగిన ప్రీ వెడ్డింగ్ వేడుకలకు వ్యాపార దిగ్గజాలు సహా సినీ, క్రీడా ప్రముఖులంతా విచ్చేశారు. సచిన్ టెండుల్కర్ సైతం సతీమణి అంజలి, కుమార్తె సారాతో కలిసి ఈ సెలబ్రేషన్స్లో పాలు పంచుకున్నాడు. ఈ నేపథ్యంలో.. ‘‘అనంత్, రాధిక విషయంలో ‘LBW’ అంటే ప్రేమ(Love), ఆశీర్వాదాలు(Blessings), అభినందనలు(Wishes). అందమైన జంటకు శుభాకాంక్షలు’’ అని సచిన్ టెండుల్కర్ కాబోయే జంట ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసి విషెస్ తెలిపాడు. అన్నట్లు క్రికెట్ పరిభాషలో.. LBW అంటే లెగ్ బిఫోర్ వికెట్. బ్యాటర్ ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా బౌలర్ సంధించే బంతిని సరిగ్గా అంచనా వేయలేక వికెట్ల ముందే అతడికి దొరికి పోయి పెవిలియన్ చేరాల్సిందే! స్పెషల్ అట్రాక్షన్గా సారా అనంత్- రాధిక ప్రీ వెడ్డింగ్ వేడుకలో సచిన్ టెండుల్కర్ కుమార్తె సారా టెండుల్కర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తల్లిదండ్రులతో కలిసి సంప్రదాయ దుస్తుల్లో మెరిసిపోయింది. ముఖ్యంగా ఎరుపు వర్ణం లెహంగాలో ముద్ద మందారంలా చక్కగా కనిపించింది. ఆ ఫొటోలను సారా ఇన్స్టాలో షేర్ చేయగా వైరల్ అవుతున్నాయి. చదవండి: Anant- Radhika: రోహిత్ తిరుగు పయనం.. భయ్యాకు కోపం వచ్చిందంటే! The 'LBW' here stands for Love, Blessings, and Wishes for Anant and Radhika! Best wishes to the beautiful couple. pic.twitter.com/L14RvNefXH — Sachin Tendulkar (@sachin_rt) March 4, 2024 -
పెళ్లికి రావాలంటే కోట్లు ఇవ్వాల్సిందే! స్టార్ హీరోయిన్ షాకింగ్ నిజాలు
గత మూడు రోజుల నుంచి సోషల్ మీడియా తెరిస్తే చాలు అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్కి సంబంధించిన ఫొటోలు, వీడియోలే కనిపించాయి. బాలీవుడ్ సెలబ్రిటీలు అందరికీ ఇంకేం పనిలేనట్లు జామ్ నగర్లోనే కనిపించారు. పాటలు పాడుతూ డ్యాన్సులేస్తూ ఊహించన పనులెన్నో చేశారు. అయితే ఇదేదో అంబానీ అంటే గౌరవంతో చేసింది కాదు. తెర వెనక కోట్ల రూపాయల డీలింగ్స్ జరిగాయట. తాజాగా హీరోయిన్ కంగన పోస్ట్తో ఇదంతా బయటపడింది. (ఇదీ చదవండి: అనంత్-రాధిక ప్రీ వెడ్డింగ్ : భారీ ఏర్పాట్లు, మొత్తం ఖర్చు ఎంతంటే..!) స్టార్ సెలబ్రిటీల్లో చాలామంది ప్రతి విషయాన్ని డబ్బుతోనే లెక్కేస్తారు. సినిమాలు, యాడ్స్లో నటిస్తూ కోట్లాది రూపాయలు సంపాదిస్తారు. ఇది కాదన్నట్లు పలు వ్యాపారాలు చేస్తూ ఆస్తులు బాగానే కూడబెట్టుకుంటున్నారు. ఈ విషయం చాలామందికి తెలుసు. కానీ అంబానీ లాంటి బిజినెస్మేన్ పెళ్లికి.. జస్ట్ అలా హాజరయ్యేందుకు కూడా కోట్లాది రూపాయలు డబ్బులు తీసుకుంటారట. అవును మీరు సరిగానే విన్నారు. గతంలో తనకు కూడా ఇలా ఆఫర్స్ వచ్చాయని, కానీ తాను ఆత్మగౌరవం చంపుకోలేదని కంగన రాసుకొచ్చింది. 'ఆర్థికంగా దారుణమైన పరిస్థితుల్ని చాలాసార్లు నేను ఫేస్ చేశారు. కానీ ఎవరెన్ని రకాలుగా ప్రలోభ పెట్టాలని చూసినా సరే పెళ్లిళ్లలో డ్యాన్స్ లాంటివి చేయలేదు. ఐటమ్ సాంగ్స్లో కూడా నాకు ఛాన్సులు వచ్చాయి. కానీ నేను చేయలేదు. కొన్నాళ్ల తర్వాత అవార్డ్ షోలకి కూడా వెళ్లడం మానేశాను. ఇలా డబ్బు, ఫేమ్ వద్దని చెప్పడానికి ఆత్మగౌరవం చాలా కావాల్సి ఉంటుంది' అని కంగన తన ఇన్ స్టా స్టోరీలో రాసుకొచ్చింది. (ఇదీ చదవండి: అంబానీ ప్రీ వెడ్డింగ్లో చరణ్ని అవమానించిన షారుక్.. షాకింగ్ పోస్ట్) కంగన తన ఇన్ స్టా స్టోరీలో పెట్టిన ఆర్టికల్ చూస్తే.. గతంలో దిగ్గజ సింగర్స్ ఆశా భోంస్లే, లతా మంగేష్కర్ లాంటి వాళ్లకు కూడా తమ పెళ్లిలో పాటలు పాడితే రూ.50 కోట్లకు అంతకు మించిన మొత్తం ఇస్తామని ఆశ చూపారట. కానీ వాళ్లు వెళ్లలేదు. కానీ అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్లో మాత్రం బాలీవుడ్ హేమాహేమీలు అందరూ కనిపించారు. వీళ్లు.. పెళ్లికి హాజరవడంతో పాటు డ్యాన్సులు చేసినందుకు గానూ ఒక్కో సినిమాకు అయ్యేంత రెమ్యునరేషన్ ఇచ్చారని టాక్. బహుశా అందుకేనేమో ప్రీ వెడ్డింగ్కే రూ.1000 కోట్లకు పైగా ఖర్చు అయనట్లు ఉంది. అంబానీ ఇంట్లో జరిగిన ప్రీ వెడ్డింగ్లో బాలీవుడ్ స్టార్స్ షారుక్, సల్మాన్, ఆమిర్ ఖాన్లతో పాటు చిన్న పెద్ద స్టార్స్ అందరూ వచ్చారు. దక్షిణాది నుంచి మాత్రం రామ్ చరణ్, రజినీకాంత్ దంపతులు మాత్రమే హాజరయ్యారు. ఇప్పుడు కంగన పోస్ట్ చూస్తుంటే.. చరణ్, రజినీకాంత్లకు కూడా పెద్ద మొత్తం డబ్బులు ఇచ్చారేమో అనే సందేహం వస్తోంది. (ఇదీ చదవండి: అనంత్-రాధిక : నీతా అంబానీ లాంగ్ నెక్లెస్ ధర ఎంతో తెలుసా?) -
Anant- Radhika: తిరుగు పయనం.. భయ్యాకు కోపం వస్తే అంతే!
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తిరిగి తన విధుల్లో చేరనున్నాడు. నాలుగు- ఐదో టెస్టు మధ్య లభించిన విరామానికి స్వస్తి పలికి.. ఆటపై దృష్టి సారించనున్నాడు. కాగా స్వదేశంలో ఇంగ్లండ్తో జరుగుతున్న ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్ను భారత్ ఇప్పటికే కైవసం చేసుకుంది. హైదరాబాద్లో జరిగిన తొలి మ్యాచ్లో ఓడినా.. ఆ తర్వాత విశాఖపట్నం, రాజ్కోట్, రాంచిలలో హ్యాట్రిక్ విజయాలతో 3-1తో సత్తా చాటింది. తదుపరి ధర్మశాల వేదికగా నామమాత్రపు ఐదో టెస్టుకు భారత జట్టు సిద్ధం కానుంది. ఇదిలా ఉంటే.. ఫిబ్రవరి 26న రాంచి మ్యాచ్ ముగియగా.. మార్చి 7న ధర్మశాల మ్యాచ్ ఆరంభం కానుంది. ఈ మధ్యలో దొరికిన విరామ సమయంలో కెప్టెన్ రోహిత్ శర్మ అనంత్ అంబానీ- రాధికా మర్చంట్ ముందస్తు పెళ్లి వేడుకలకు హాజరయ్యాడు. బిలియనీర్ ముకేశ్ అంబానీ- నీతా తమ చిన్న కుమారుడి కోసం నిర్వహించిన మూడు రోజుల కార్యక్రమంలో భార్య రితికాతో కలిసి పాల్గొన్నాడు. గుజరాత్లోని జామ్నగర్ వేదికగా అత్యంత వైభవోపేతంగా జరిగిన ప్రీ వెడ్డింగ్ వేడుకలు ఆదివారమే ముగిసిన నేపథ్యంలో రోహిత్ తిరుగుపయనమయ్యాడు. ఈ క్రమంలో జామ్నగర్ ఎయిర్పోర్టుకు చేరుకోగానే అభిమానులు, పాపరాజీలు హిట్మ్యాన్ను చుట్టుముట్టారు. View this post on Instagram A post shared by Instant Bollywood (@instantbollywood) అయితే, అప్పటికే అలసిపోయినట్లు కనిపిస్తున్నా రోహిత్ శర్మ ఫ్యాన్స్తో కలిసి ఫొటోలకు ఫోజులిచ్చాడు. అయినా మరికొందరు క్యూ కట్టడంతో అక్కడున్నవాళ్లలో ఒకరు.. ‘‘ఇప్పుడు రోహిత్ భయ్యాకు కోపం వస్తుంది జాగ్రత్త’’ అంటూ హెచ్చరించడం ఆసక్తికరంగా మారింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) కాగా అంబానీల యాజమాన్యంలోని ముంబై ఇండియన్స్ ఐపీఎల్ ఫ్రాంఛైజీకి కెప్టెన్గా వ్యవహరించిన రోహిత్ శర్మ ఐదుసార్లు టైటిల్ అందించాడు. అయితే, ఐపీఎల్-2024కు ముందు అతడి స్థానంలో భారత ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యాకు పగ్గాలు అప్పగించింది మేనేజ్మెంట్. ఫలితంగా రోహిత్ ఫ్యాన్స్ బాగా హర్టయ్యారు. దీంతో ఇప్పటికీ ముంబై ఇండియన్స్ వ్యవహారశైలిపై విమర్శలు వస్తున్నాయి. చదవండి: Shreyas Iyer: ‘సాహో’ హీరోయిన్తో ప్రేమలో పడ్డ శ్రేయస్ అయ్యర్?! ‘రోహిత్ సహచర ఆటగాళ్లను అందుకే తిడతాడు’ -
అత్తకు తగ్గ కోడలు.. నాట్యంలో దిట్ట.. రాధిక గురించి ఆసక్తికర విషయాలు..
అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ పెళ్లి వేడుకల గురించి ప్రస్తుతం దేశంఅంతా చర్చ జరుగుతోంది. విదేశాల నుంచి ప్రముఖ వ్యాపారవేత్తలు, బాలీవుడ్ తారలు ప్రివెడ్డింగ్ ఈవెంట్లో సందడి చేశారు. ఆటపాటలతో మూడు రోజుల పాటు నిర్వహించిన ఈ వేడుక అందిరికీ గుర్తుండిపోయేలే జరిగింది. ముందస్తు పెళ్లి వేడుకలే ఈ రేంజ్లో ఉంటే ఇక పెళ్లి ఏరేంజ్లో ఉంటుందోనని పలువురు అభిప్రాయపడుతున్నారు. అయితే ముఖేశ్ అంబానీ చిన్న కుమారుడిగా అనంత్ అంబానీ గురించి దాదాపు చాలామందికే తెలుసు. పనిలోపనిగా అంబానీల ఇంటికొస్తున్న చిన్న కోడలెవరోనని చాలామంది ఆరాతీస్తున్నారు. ఇషా అంబానీ-ఆనంద్ పిరమల్ల వివాహం 2018లోనే జరిగింది. ఆ సమయంలోనే రాధిక మర్చంట్ పేరు వినిపించింది. 2019లో ఆకాశ్-శ్లోకల పెళ్లి సమయంలో రాధిక అంబానీ కుటుంబంతో సన్నిహితంగా మెలగడం, ప్రతీ వేడుకలోనూ ప్రత్యేక ఆకర్షణగా నిలవడం, సంగీత్ వేడుకలో అనంత్కు జంటగా డ్యాన్స్ చేయడంతో నీతా అంబానీకి కాబోయే చిన్న కోడలంటూ ప్రచారం ఊపందుకుంది. Emotional moment of Radhikaa merchant 😍❤️#RadhikaMerchant #AnantAmbani #MukeshAmbani #AnantRadhikaWedding #NitaAmbani #AmbaniWedding #AmbaniFamily pic.twitter.com/3IB5Gxmmeg — jayaa (@Jayaa2012) March 4, 2024 ఎన్కోర్ హెల్త్కేర్ సంస్థ సీఈఓ వీరెన్ మర్చంట్-శైలజా మర్చంట్ల కుమార్తె రాధిక. తండ్రి వీరెన్ మర్చంట్ హెల్త్కేర్ సీఈఓగా, వైస్ ఛైర్మన్గా వ్యవహరిస్తున్నారు. రాధిక న్యూయార్క్ యూనివర్సిటీలో పాలిటిక్స్, ఎకనామిక్స్ విభాగాల్లో డిగ్రీ పూర్తి చేశాక ఓ రియల్ ఎస్టేట్ కంపెనీలో సేల్స్ ఎగ్జిక్యూటివ్గా కొన్నాళ్లు పనిచేశారు. ఎన్కోర్ హెల్త్కేర్ సంస్థలో డైరెక్టర్గానూ వ్యవహరిస్తున్నారు. #RadhikaMerchant dance like Afsara 😍#MukeshAmbani family truly culture centric pic.twitter.com/bNbLSwWiya — SATYA (@Vindhyaputra) February 29, 2024 రాధికకు శాస్త్రీయ నృత్యం అంటే చిన్నప్పటి నుంచీ ఇష్టం. ఆ మక్కువతోనే ప్రముఖ డ్యాన్సర్ భావనా థాకర్ వద్ద భరతనాట్యంలో శిక్షణ తీసుకున్నారు. ముంబయిలోని జియో వరల్డ్ సెంటర్లో 2022లో ముకేశ్-నీతా అంబానీలు రాధికకు అరంగేట్రం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ముకేశ్ భార్య నీతా అంబానీ కూడా క్లాసికల్ డ్యాన్సర్. దీంతో అత్తకు తగ్గ కోడలు అని అందరూ ప్రశంసించారు. #AmbaniPreWedding Sangeet dance of bride and groom #AmbaniWedding pic.twitter.com/iQHtyi1U9p — ✨ HeroesDontExist! (@humaneGPT) March 3, 2024 -
అనంత్-రాధిక ప్రీ వెడ్డింగ్ : భారీ ఏర్పాట్లు, మొత్తం ఖర్చు ఎంతంటే..!
బిలియనీర్ ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకలు ఘనంగా జరిగాయి. గుజరాత్లోని జామ్నగర్లో అనంత్-రాధికా మర్చంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకలకు పలువురు రాజకీయ, క్రీడా, సినీ రంగ ప్రముఖులతోపాటు, గ్లోబల్ టెక్ సీఈఓలు, పాప్ ఐకాన్లు హాజరు కావడం విశేషంగా నిలిచింది. మూడు రోజుల పాటు అత్యంత వైభవంగా జరిగిన ఈ ఈవెంట్ యావత్ ప్రపంచం దృష్టిని ఆకర్షించడం విశేషం. ప్రీ వెడ్డింగ్ సందడే ఇంత ఘనంగా జరుగుతోంటే, అదీ ముఖేష్ అంబానీ సంతానంలో జరుగుతున్న చివరి పెళ్లి వేడుక కావడంతో అనంత్ అంబానీ పెళ్లి తంతు ఇంకెంత ఘనంగా ఉంటుందో అనే చర్చ మొదలైంది. అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ బాష్కు రూ.1260 కోట్లు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. తద్వారా ప్రపంచంలో అత్యంత విలాసవంతమైన వేడుకగా ఇది నిలిచింది. మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్, మెటా హెడ్ మార్క్ జుకర్బర్గ్, ఇవాంకా ట్రంప్, ఇలా డజన్ల కొద్దీ ఇతర ప్రముఖులు బసకోసమే ఏకంగా సుమారు రూ. 52 కోట్లు ఖర్చు పెట్టారట. పాప్ ఐకాన్ రిహన్నా సహా, వీరందరికోసం విలాసవంతమైన వసతి గృహాన్ని ఏర్పాటు చేశారు. అంతేకాదు, దేశ, విదేశీ భారతీయ అతిథుల కోసం ముఖేష్ అంబానీ ప్రైవేట్ విమానాలను కూడా ఏర్పాటు చేశారు. కేటరింగ్ కాంట్రాక్టుకే రూ.200 కోట్లకు పైగా ఖర్చు చేసినట్లు సమాచారం. మూడు రోజుల పాటు అద్భుతమైన పూలకోసం కూడా భారీగానే వెచ్చించారట. ఫ్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్రా ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ ప్రకారం అమెరికన్ పూల డిజైనర్ జెఫ్ లీథమ్ అదిరిపోయే కలర్ఫుల్ ఫ్లవర్ సెట్టింగ్స్ తీర్చిదిద్దాడు. కాగా 2023, జనవరిలో నిశ్చితార్థం చేసుకున్న అనంత్ -రాధికా మర్చంట్ఈ ఏడాది జూలైలో పెళ్లి పీటలెక్కేందుకు సిద్ధమవుతున్నారు. -
అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
మీ కుటుంబానికి మనస్ఫూర్తిగా అభినందనలు: ఉపాసన ట్వీట్
టాలీవుడ్ మోస్ట్ బ్యూటీఫుల్ కపుల్ ఉపాసన- రామ్ చరణ్ ఇటీవల జరిగిన అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో సందడి చేశారు. గుజరాత్లోని జామ్నగర్లో జరిగిన ఈ వేడుకలకు టాలీవుడ్ నుంచి కేవలం రామ్ చరణ్ దంపతులు మాత్రమే హాజరయ్యారు. ఈ ఫంక్షన్లో పలువురు బాలీవుడ్, హాలీవుడ్, కోలీవుడ్తో పాటు ప్రముఖ క్రీడాకారులు కూడా పాల్గొన్నారు. మూడు రోజుల పాటు కొనసాగిన ప్రీ వెడ్డింగ్ వేడుకలు.. ఆదివారంతో ముగిశాయి. తాజాగా ఈ వేడుకలకు హాజరైన ఉపాసన- రామ్ చరణ్ దంపతులు సోషల్ మీడియా వేదికగా ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు ఉపాసన ట్విటర్లో పోస్ట్ చేశారు. 'అనంత్ అంబానీ- రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో నీతా జీ- ముఖేశ్ జీ అతిథ్యం సాటిలేనిది.. మనస్ఫూర్తిగా మీ కుటుంబానికి మా అభినందనలు' అంటూ ట్వీట్ చేశారు. అద్భుతమైన వ్యక్తులతో.. అద్భుతమైన సమయం వెచ్చించినందుకు సంతోషంగా ఉందంటూ ఫోటోలను షేర్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కాగా.. రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ డైరెక్షన్లో గేమ్ ఛేంజర్ చిత్రంలో నటిస్తున్నారు. ఈ మూవీలో చెర్రీ సరసన బాలీవుడ్ భామ కియారా అద్వానీ హీరోయిన్గా కనిపించనుంది. Congratulations Anant & Radhika & the whole Ambani Family. Nita Ji & Mukesh Ji your hospitality is unmatched. Thank you. Wonderful times with wonderful people pic.twitter.com/IzcrOxHN5X — Upasana Konidela (@upasanakonidela) March 4, 2024 -
ప్రీ వెడ్డింగ్లో రజినీకాంత్.. మరి ఇంత చీపా?
కోలీవుడ్ సూపర్ స్టార్ తలైవా ఇటీవలే లాల్ సలామ్ చిత్రంతో ప్రేక్షకులను అలరించారు. ఆయన కూతురు ఐశ్వర్య రజినీకాంత్ తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ప్రస్తుతం తలైనా వెట్టైయాన్ అనే చిత్రంలో నటించనున్నారు. ఈ సినిమాకు టీజీ జ్ఞానవేల్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇదిలా ఉండగా.. ఇటీవల గుజరాత్లోని జామ్నగర్లో ముకేశ్ అంబానీ- నీతా అంబానీల తనయుడు అనంత్ అంబానీ- రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో తన ఫ్యామిలీతో కలిసి రజినీకాంత్ సందడి చేశారు. తన భార్య లతా, కూతురు ఐశ్వర్యతో కలిసి తలైవా హాజరయ్యారు. మూడు రోజుల పాటు కొనసాగిన ఈ వేడుకలు ఆదివారంతో ముగిశాయి. కాగా.. వేడుకలకు వెళ్తున్న రజినీకాంత్ తన ఫ్యామిలీతో కలిసి ఫోటోలకు పోజులిచ్చారు. అయితే అదే సమయంలో ఓ మహిళ వారి వెనకాలే నడుస్తూ వచ్చింది. అయితే ఆమెను రజినీకాంత్ పక్కకు వెళ్లు అనేలా తన చేతులతో సంజ్ఞ చేస్తూ కనిపించారు. ఈ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఆ మహిళ పట్ల రజినీకాంత్ వ్యవహించిన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓ నెటిజన్ రాస్తూ.. 'కండక్టర్ స్థాయి నుంచి వచ్చారు.. కానీ పేద ప్రజలకు, అల్లుడికి కూడా మర్యాద ఇవ్వరంటూ రాసుకొచ్చారు. మరో నెటిజన్స్ రాస్తూ..' స్టార్ హీరో ఒక మహిళతో ఎలా వ్యవహరిస్తున్నాడో చూడండి.. ఆయన అభిమానిగా ఉన్నందుకు సిగ్గుపడుతున్నా' అంటూ కామెంట్ చేశారు. 'అదే ఆయన అసలు రంగు' అని ఒకరు రాయగా.. రజినీకాంత్ చీప్ బిహేవియర్' అంటూ మరొక నెటిజన్ రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలవుతోంది. Cheapest behaviour from #Rajinikanth!pic.twitter.com/uw0opzNdsZ — Kolly Censor (@KollyCensor) March 3, 2024
Pagination
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- బర్త్ డే స్పెషల్.. విజయ్ దేవరకొండ ఎక్కడ తప్పు చేస్తున్నాడు?
- ఒక్క క్లిక్తో ‘ఏపీ పాలిసెట్’ ఫలితాలు
- సుప్రీత మైండ్ బ్లోయింగ్ గ్లామర్.. ఫారెన్ వీధుల్లో కేతిక!
- ఐసీఎంఆర్ విడుదల చేసిన ఆహార మార్గదర్శకాలు ఇవే..
- పిట్రోడా వ్యాఖ్యల దుమారం.. నిర్మలా సీతారామన్ ఆగ్రహం
- పవన్ మూవీ రిలీజ్ డేట్కి టెండర్ వేసిన 'దేవర'?
- టీ20 వరల్డ్కప్ 2024 కోసం భారత బి టీమ్.. కెప్టెన్గా కేఎల్ రాహుల్..!
- ‘నోరు మెదపరేం రాహుల్జీ?’..ప్రధాని మోదీ విమర్శలు
- ల్యాండ్ టైట్లింగ్ చట్టం నిజాలివిగో..
- బాబోస్తే ఆరోగ్యశ్రీ గో..వింద
Advertisement