Anant Ambani
-
అంబానీ పెళ్లి.. ఆవు కాలికి కూడా వజ్రాలు.. అది మరో ప్రపంచం: కర్దాషియన్స్
అనంత్ అంబానీ- రాధిక మర్చంట్ పెళ్లిని దేశమంతా చూసింది. ఈ వివాహ వేడుకకు దేశవిదేశాల నుంచి సెలబ్రిటీలు హాజరయ్యారు. ఖర్చుకు వెనుకాడకుండా అంగరంగ వైభవంగా ఈ పెళ్లి జరిపించారు ముఖేశ్ - నీతా అంబానీ. ఈ వెడ్డింగ్ సెలబ్రేషన్స్లో కర్దాషియన్స్ సిస్టర్స్ కూడా ఉన్న విషయం తెలిసిందే! అయితే ఎప్పుడూ పొట్టి బట్టల్లో కనిపించే వారు ఈ పెళ్లిలో మాత్రం భారతీయ సాంప్రదాయానికి తగ్గట్లుగా లంగా ఓణీలో మెరిశారు. అంబానీ ఆతిథ్యం చూసి గుడ్లు తేలేశారు. స్వయంగా వారే ఈ మాట చెప్తున్నారు.మరో ప్రపంచలోకి వెళ్లినట్లే ఉందిద కర్దాషియన్స్ లేటెస్ట్ ఎపిసోడ్లో అనంత్ అంబానీ (Anant Ambani) పెళ్లి గురించి మాట్లాడారు. వేదికను ఎంత అందంగా ముస్తాబు చేశారో అని ఖ్లోయె ఫ్లాష్బ్యాక్లోకి వెళ్లిపోగా.. లక్షలాది పువ్వులు సీలింగ్ నుంచి వేలాడుతూ ముచ్చటగొలిపాయి అని కిమ్ (Kim Kardashian) చెప్పుకొచ్చింది. మా ఎగ్జయిట్మెంట్ను చాలావరకు ఆపుకున్నాం. అదంతా ఒక డిస్నీల్యాండ్ రైడ్లా అనిపించింది. డిస్నీల్యాండ్తో పోల్చడం కూడా చిన్నమాటే అవుతుంది అని ఖ్లోయే (Khloe Kardashian) అభిప్రాయపడింది. మరో ప్రపంచంలోకి అడుగుపెట్టినట్లు అనిపించింది అని కిమ్ పేర్కొంది.రిచ్ వెడ్డింగ్వీరిద్దరూ ఇంకా మాట్లాడుతూ.. పెళ్లికూతురు రాధిక మర్చంట్ (Radhika Merchant) నెమలిలా డిజైన్ చేసిన వాహనంపై వచ్చింది. దానికన్నీ విలువైన రత్నాలు పొదిగి ఉన్నాయి. కొన్నిచోట్ల నిజమైన బంగారం పూత పూశారు. ఎక్కడచూసినా అంతా వజ్రాలమయంగానే ఉంది. ఆఖరికి ఆవు కాళ్లకు సైతం వజ్రాలే ఉన్నాయి. అవి పారిపోకుండా ఉండేందుకు సంకెళ్లలాంటివి కాలికి వేశారు. వాటికి వజ్రాలుండటం చూసి ఆశ్చర్యపోయాం. అంబానీ కుటుంబం గోవును భక్తిగా పూజించారు. ఇదొక అత్యంత ధనిక వెడ్డింగ్. అలాగే పెళ్లికి ముందు అనేక సేవా కార్యక్రమాలు చేపట్టింది అని పేర్కొన్నారు.అలా అంబానీ పెళ్లికి వచ్చాం..ఇక ఇదే ఎపిసోడ్లో కిమ్ కర్దాషియన్.. అంబానీ ఎవరో కూడా తెలీదన్న సంగతి తెలిసిందే! తన స్నేహితురాలు లోరైన్ స్కువార్ట్జ్.. అంబానీ కుటుంబానికి ఆభరణాలు తయారు చేసి పెడుతుందని.. అలా ఆమె చెప్పడం వల్లే అంబానీ గురించి తెలిసిందని పేర్కొంది. పెళ్లికి రావాల్సిందిగా 20 కిలోల బరువైన ఇన్విటేషన్ గిఫ్ట్ బాక్స్ పంపించారని, అది చూసి ఇంప్రెస్ అయిపోయి పెళ్లికి హాజరయ్యామంది. అనంత్-రాధిక 2024 జూలైలో పెళ్లి చేసుకున్నారు. View this post on Instagram A post shared by The Kardashians (@kardashianshulu) చదవండి: మద్యానికి బానిసయ్యా.. రోజుకు 9 గంటల నరకం: స్టార్ హీరో చెల్లెలు -
అంబానీ ఎవరో మాకు తెలీదు.. అయినా పెళ్లికి వచ్చాం: కిమ్ కర్దాషియన్
ప్రపంచ కుబేరుడు ముకేశ్ అంబానీ (Mukesh Ambani) చిన్న కుమారుడు అనంత్ అంబానీ పెళ్లికి రాజకీయ, సినీ, వ్యాపార ప్రముఖులు ఎందరో వచ్చారు. వారిలో హాలీవుడ్ సెన్సేషన్ కర్దాషియన్స్ సిస్టర్స్ కూడా వచ్చారు. నటి, మోడల్ కిమ్ కర్దాషియన్ (Kim Kardashian)తో పాటు సోదరి ఖ్లోయె కర్దాషియన్ (Khloé Kardashian).. అనంత్-రాధిక వెడ్డింగ్ సెలబ్రేషన్స్లో హాజరై సందడి చేశారు. తాజాగా ద కర్దాషియన్స్ ఎపిసోడ్లో కిమ్ ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది.నా ఫ్రెండ్ మాటల్లో తెలిసింది..ఆమె మాట్లాడుతూ.. ఈ అంబానీలెవరో నాకు తెలియదు. కాకపోతే మాకు కామన్ ఫ్రెండ్స్ ఉన్నారు. జ్యువెలరీ డిజైనర్ లారైన్ స్క్వార్ట్జ్ నాకు మంచి స్నేహితురాలు. తనకు అంబానీ కుటుంబంతో మంచి అనుబంధం ఉంది. ఆ కుటుంబంలోని వారికి పలురకాల ఆభరణాలు తయారు చేసిస్తూ ఉంటుంది. తను అంబానీ పెళ్లికి వెళ్తున్నట్లు నాతో చెప్పింది. అంతేకాకుండా అంబానీ కుటుంబం.. నన్ను, నా సోదరిని ఆ పెళ్లికి ఆహ్వానించాలని అనుకుంటున్నట్లు పేర్కొంది. అది వినగానే తప్పకుండా వస్తామని చెప్పాను.అదిరిపోయిన ఆహ్వానం.. రాకుండా ఊరుకుంటామా?తను చెప్పినట్లుగానే ఆహ్వానం అందింది. వారు పంపించిన ఇన్విటేషన్ గిఫ్ట్ బాక్స్ బరువు దాదాపు 20 కిలోలుంటుంది. అందులోనుంచి ఒకరకమైన సంగీతం కూడా వచ్చింది. అది మాకు విపరీతంగా నచ్చేసింది. అది చూశాక ఇలాంటివాటికి నో చెప్పే ప్రసక్తే లేదనుకున్నాం.. కచ్చితంగా పెళ్లికి వెళ్లాల్సిందే అని నిర్ణయించుకున్నాం అని చెప్పుకొచ్చింది. కాగా అనంత్- రాధిక 2024 జూలై 12న పెళ్లి చేసుకున్నారు.చదవండి: అయోధ్యలో మళ్లీ భూమి కొన్న బిగ్బీ.. ఈసారి పెద్ద మొత్తంలో..! -
జీవ్ మే శివ్ హై.. వంతారా కృషిపై ఆధ్యాత్మిక గురువు స్పందన
వన్యప్రాణుల సంరక్షణలో అనంత్ అంబానీ చేస్తున్న విశేష కృషిని బాగేశ్వర్ ధామ్ ఆధ్యాత్మిక గురువు ధీరేంద్ర కృష్ణ శాస్త్రి ప్రశంసించారు. రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ నేతృత్వంలోని ప్రపంచంలోనే అతిపెద్ద జంతు సంరక్షణ, పునరావాస కేంద్రం వంతారా ‘జీవ్ మే శివ్ హై’ అనే దృక్పథంతో పని చేస్తుందని చెప్పారు. ధీరేంద్ర శాస్త్రి వంతారా చేస్తున్న కృషిని కొనియాడుతూ వీడియో విడుదల చేశారు. అదికాస్తా వివిధ సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది.వీడియోలో ధీరేంద్ర కృష్ణ శాస్త్రి తెలిపిన వివరాల ప్రకారం..‘జీవ్ మే హి శివ్ హై.. ప్రతి జీవంలో శివుడు ఉంటాడు. ఇది అన్ని జీవుల్లో దైవిక ఉనికిని గుర్తించే తత్వం. ఎన్నో కారణాలవల్ల సంరక్షణకు నోచుకోని జంతువులకు కొత్త జీవితాన్ని అందించే కేంద్రం వంతారా ఎంతో కృషి చేస్తోంది. వంతారా అంటే ‘అటవీ నక్షత్రం’. దీని పేరుకు తగినట్లుగానే ఎన్నో వన్యప్రాణులను రక్షిస్తోంది. ఇందుకు అనంత్ అంబానీ అనుసరిస్తున్న విధానాలు ప్రశంసణీయం. వంతారా ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి వణ్యప్రాణుల సంరక్షణ చర్యలకు ప్రేరణ ఇస్తోంది. మానవాళికి సమస్త జీవరాశుల సంరక్షణ స్ఫూర్తిని పెంపొందిస్తోంది’ అని తెలిపారు. View this post on Instagram A post shared by Peepingmoon (@peepingmoonofficial)వంతారాఅనంత్ అంబానీ గుజరాత్లోని జామ్నగర్లో 3వేల ఎకరాల్లో వంతారా పేరుతో కృత్రిమ అడవిని ఏర్పాటు చేశారు. ఇందులో జంతువులు నివసించేందుకు వీలుగా సహజంగా ఉండేలా వసతులు ఏర్పాటు చేశారు. ఈ అడవిలో 25,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏనుగుల కోసం ప్రత్యేకంగా ఆసుపత్రి ఉంది. ఇది ప్రపంచంలోనే అతి పెద్దది. పూర్తిగా పోర్టబుల్ ఎక్స్రే యంత్రాలు, శస్త్ర చికిత్సల కోసం లేజర్ యంత్రాలు, పాథాలజీ ల్యాబ్లు, హైపర్బారిక్ ఆక్సిజన్ ఛాంబర్తోపాటు అధునాతన సదుపాయాలు ఉన్నాయి. ఈ ఎలిఫెంట్ కేర్ సెంటర్లో 240కి పైగా ఏనుగులను రక్షించారు. అల్లోపతి, ఆయుర్వేదం, ఆక్యుపంక్చర్(చైనాలో మాదిరి సుదులతో గుచ్చి రోగాన్ని నయం చేయడం) వైద్యాన్ని సమ్మిళితం చేసే అధునాతన పశువైద్య చికిత్సలను వంతారాలో అందిస్తున్నారు. ఆర్థరైటిస్ చికిత్స కోసం హైడ్రోథెరపీ, గాయం నయం చేయడానికి హైపర్బారిక్ ఆక్సిజన్ ఛాంబర్ వంటి ప్రత్యేక సదుపాయాలున్నాయి.ఇదీ చదవండి: హోలీ గేట్వే సేల్.. రూ.1,199కే విమాన ప్రయాణం!‘ప్రాణి మిత్ర’గా గుర్తింపుఅనంత్ అంబానీకి జంతు సంరక్షణలో చేస్తున్న కృషికి గుర్తుగా ఇటీవల భారతదేశపు అత్యున్నత గౌరవమైన ప్రతిష్టాత్మక ‘ప్రాణి మిత్ర’ జాతీయ పురస్కారం లభించింది. ప్రాణి మిత్ర జాతీయ పురస్కారం జంతు సంరక్షణ విభాగంలో అందించే అత్యున్నత పురస్కారం. జంతువుల శ్రేయస్సుకు అవార్డు గ్రహీతలు చేసిన అసాధారణ కృషిని ఇది గుర్తిస్తుంది. గత ఐదేళ్లలో జంతు సంక్షేమానికి విశేష కృషి చేసిన సంస్థలు, కార్పొరేషన్లు, ప్రభుత్వ సంస్థలు, సహకార సంఘాల కృషిని గుర్తించి భారత ప్రభుత్వం ఈ అవార్డును అందిస్తోంది. -
అంబానీ వంతారా : పులులు, సింహాలతో నరేంద్ర మోదీ (ఫోటోలు)
-
అనంత్-రాధిక అంబానీ గ్రాండ్ వెడ్డింగ్ : మికా సింగ్ వ్యాఖ్యలు వైరల్
రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ,నీతా అంబానీ దంపతుల చిన్న కుమారుడు అనంత్ అంబానీ (Anant Ambani) రాధికా మర్చంట్ (Radhika Merchant) వివాహం అంగరంగ వైభవంగా కనీవినీ ఎరుగని రీతిలో జరిగింది. ప్రపంచంలోనే అతిఖరీదైన వివాహంగా పేరు గాంచింది. దీనిపై ప్రముఖ గాయకుడు మికా సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. గత ఏడాది జరిగిన ఈ కార్పొరేట్ వెడ్డింగ్పై మికాసింగ్ (Mika Singh) చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.2024లో జరిగిన అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ వివాహ వేడుక చాలా మందికి ఒక ఆశీర్వాదకరమని వ్యాఖ్యానించారు. అనంత్, రాధికా అంబానీ గ్రాండ్ వెడ్డింగ్ పై విమర్శలను మికా సింగ్ ప్రస్తావించారు. వారిపెళ్లిపై ప్రశంసలు కురిపించాడు. అంతేకాదు తాను ఎందుకు భావిస్తున్నానో కూడా వివరించాడు. ఆ ఒక్క పెళ్లి వల్ల లక్షల మందికి ఉపాధిలభించిందని, అందుకే అది బ్లెస్సింగ్ అన్నానని చెప్పుకొచ్చాడు. అంతమాత్రాన తానేమీ చెంచిగిరీ చేయడం లేదంటూ వివరణ ఇచ్చాడు. ఇలాంటి గ్రాండ్ వెడ్డింగ్స్ అనేక ఉపాధి అవకాశాలను అందిస్తాయనేది జనం అర్థం చేసుకోలేకపోతున్నారని మికా సింగ్ వ్యాఖ్యానించాడు. క్యాటరర్లు, డెకరేటర్లు, ఫ్యాషన్ డిజైనర్లు, సంగీతకారులు, భద్రతా సిబ్బంది, మళ్లీ వీరినుంచిమరికొంతమందికి లాభం చేకూరుతుందన్నాడు. అంతేకాకుండా, అనేక మంది కళాకారులు, సెలబ్రిటీలు తమ తమ ప్రదర్శన ఇచ్చే అవకాశం పొందుతారంటూ ఉదాహరణలతో చెప్పుకొచ్చాడు. తద్వారా అంబానీ కుటుంబం ఆడంబర వివాహంతో డబ్బు వృధా చేసిందన్న వ్యక్తులకు ఆయన కౌంటర్ ఇచ్చాడు. ఇటువంటి గ్రాండ్ వెడ్డింగ్స్ వాటి నుండి సంపాదించే చాలా మందికి ఒక వరం అని పేర్కొన్నాడు.భారతదేశంలో అత్యంత ప్రియమైన గాయకులలో మికా సింగ్ ఒకరు. ఆయన తన ప్రత్యేకమైన స్వరం, ఆకట్టుకునే శైలితో అనేక మంది ఫ్యాన్స్ను సంపాదించుకున్నాడు. సుబా హోనే నా దే, ఆంఖ్ మారే, మౌజా హి మౌజా, పార్టీ తో బన్తీ హై లాంటి అత్యంత ప్రజాదరణ పొందిన పాటలతో పాపులరయ్యాడు. ఈ నేపథ్యంలోనే వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ల గ్రాండ్ వివాహ వేడుకలో ప్రదర్శనకు ఆహ్వానించారు.కాగా అనంత్ అంబానీ రాధిక మర్చంట్ల వివాహంగత ఏడాది జూలైలో ముంబై నగరంలో జియో కన్వెన్షన్ సెంటర్లో జరిగింది. 2024లో జరిగిన అతిపెద్ద ఈవెంట్లలో ఒకటి. రెండు డెస్టినేషన్ ప్రీ-వెడ్డింగ్, ముంబైలో ఆరు రోజుల గ్రాండ్ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ అత్యంత ఘనంగా జరిగాయి. ప్రపంచ దేశాల ప్రముఖులతో పాటు, దేశీయంగా అనేక మంది వ్యాపార, రాజకీయ, సినీ, క్రీడా రంగ ప్రముఖులు హాజరైన సంగతి తెలిసిందే. -
Vantara అనంత్ అంబానీ ‘వంతారా’ అరుదైన ఘనత
రిలయన్స్ వారసుడు అనంత్ అంబానీ (Anant Ambani) మరో ఘనతను సాధించారు. రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ చిన్నకుమారుడిగా జంతుప్రేమికుడిగా అనంత్ అంబానీ అందరికీ సుపరిచితమే. జంతు రక్షణ, ప్రధానంగా ఏనుగుల సంరక్షణ కోసం వంతారా (Vantara) అనే సంస్థను స్థాపించారు. అనంత్ అంబానీ ప్రాణప్రదమైన వంతారాకు ప్రతిష్టాత్మక 'ప్రాణి మిత్ర' జాతీయ అవార్డు లభించింది.'కార్పొరేట్' విభాగంలో జంతు సంక్షేమంలో భారతదేశంలోని అత్యున్నత గౌరవం పురస్కారం 'ప్రాణి మిత్ర' ( Prani Mitra Award ) జాతీయ అవార్డు వంటారా దక్కించుకుంది. వంటారా సంస్థ అయిన రాధే కృష్ణ టెంపుల్ ఎలిఫెంట్ వెల్ఫేర్ ట్రస్ట్ (RKTEWT)కు గౌరవం దక్కింది. ఈ అవార్డును భారత ప్రభుత్వ మత్స్య, పశుసంవర్ధక మరియు పాడి పరిశ్రమ సహాయ మంత్రి గురువారం న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో జరిగిన ఒక కార్యక్రమంలో ప్రదానం చేశారు. దీనికి వంతారా సీఈవో వివాన్ కరణి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన జంతు సంక్షేమం పట్ల వంతారా లోతైన నిబద్ధతను నొక్కి చెప్పారు. సంక్షేమ ప్రమాణాలను పెంచడం, భారతదేశ జీవవైవిధ్యాన్ని కాపాడటం వారి లక్ష్యమనన్నారు. "ఈ అవార్డు భారతదేశ జంతువులను రక్షించడానికి, సంరక్షించడానికి తమ జీవితాలను అంకితం చేసిన అనేక మంది వ్యక్తులకు నివాళి. వంతారాలో, జంతువులకు సేవ చేయడం అంటే కేవలం డ్యూటీ కాదు - ఇది తమ ధర్మం, సేవ, కరుణ, తమ బాధ్యతలో దృఢమైన నిబద్ధత అన్నారు. భవిష్యత్తరాలకోసం దేశ గొప్ప జీవవైవిధ్యాన్ని కాపాడటం అనే లక్ష్యంలో తాము అలుపెరగకుండా కృషి చేస్తామని పేర్కొన్నారు.చదవండి : పోలీస్ ఉద్యోగానికి రిజెక్ట్, కట్ చేస్తే ఐపీఎస్గా!కెరీర్లో పీక్లో ఉండగానే పెళ్లి, భరించలేని గృహహింస..చివరికి!ఖరీదైన కారు చెత్త కుప్పలో... అసలు సంగతి తెలిసి విస్తుపోతున్న జనంవంతారాగుజరాత్లోని జామ్నగర్లో 3వేల ఎకరాల్లో వంతారా పేరుతో కృత్రిమ అడవిని ఏర్పాటు చేశారు. వంతారాలోని ఎలిఫెంట్ కేర్ సెంటర్ ప్రపంచంలోనే అతిపెద్ద ఏనుగు ఆసుపత్రికి నిలయంగా ఉంది. 240కి పైగా ఏనుగులకు రక్షణ కల్పిస్తోంది. ఇక్కడ ఏనుగులకు ప్రపంచ స్థాయి పశువైద్య చికిత్స, కరుణా సంరక్షణ లభిస్తుంది. ఇక్కడ అల్లోపతిని ప్రత్యామ్నాయ వైద్యంతో అనుసంధానించే అధునాతన పశువైద్య సంరక్షణను అందిస్తుంది. దీర్ఘకాలిక వ్యాధుల నిర్వహణ కోసం ఆయుర్వేదం మరియు నొప్పి నివారణ కోసం అక్యుపంక్చర్ సదుపాయాలు కూడా ఉన్నాయి. దీని అత్యాధునిక వైద్య సౌకర్యాలలో ఆర్థరైటిస్ చికిత్స కోసం అధిక పీడన నీటి జెట్లతో కూడిన హైడ్రోథెరపీ చెరువు, గాయం నయం కోసం హైపర్బారిక్ ఆక్సిజన్ చాంబర్ , పెడిక్యూర్ నిపుణులతో అంకితమైన పాద సంరక్షణ సౌకర్యాలుండటం విశేషం.అలాగే వంతారా అతిపెద్ద ఏనుగు అంబులెన్స్ల సముదాయాన్ని నిర్వహిస్తోంది.హైడ్రాలిక్ లిఫ్ట్లు, రబ్బరు మ్యాట్ ఫ్లోరింగ్, వాటర్ ట్రఫ్లు, షవర్లు , కేర్టేకర్ క్యాబిన్లున్న 75 కస్టమ్-ఇంజనీరింగ్ వాహనాలున్నాయి. -
అంబానీ వారసులలో ఎవరు ఎక్కువ రిచ్?
దేశంలోనే అత్యంత సంపన్నుడైన పారిశ్రామికవేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ (Mukesh Ambani) లక్షల కోట్ల రూపాయల విలువైన వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించారు. ఫోర్బ్స్ ప్రకారం ఆయన నెట్వర్త్ 91.1 బిలియన్ డాలర్లు. ఆయన ముగ్గురు పిల్లలు ఆకాష్ అంబానీ , ఇషా అంబానీ, అనంత్ అంబానీలు చేతికొచ్చారు. కుటుంబ వ్యాపారంలో వారు కూడా ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు. కంపెనీలో గణనీయమైన వాటాలను కలిగి ఉన్నారు.అయితే ముఖేష్ అంబానీ, నీతా అంబానీల ముగ్గురు వారసుల్లో ఎవరు ఎక్కువ సంపన్నులు (Richest) అనే ఆసక్తికర సందేహం ఎప్పుడైనా కలిగిందా? దీనికి సమాధానం ఈ కథనంలో తెలుసుకుందాం. ప్రస్తుతం ఆకాశ్, అనంత్, ఇషా అంబానీల నెట్ వర్త్ ఎంత? వ్యాపారంలో ఎవరి పాత్ర ఏంటి అన్నది కూడా పరిశీలిద్దాం..ఆకాష్ అంబానీముఖేష్ అంబానీ, నీతా అంబానీల ముగ్గురు సంతానంలో పెద్దవాడు, ఇషా అంబానీకి కవల సోదరుడు అయిన ఆకాష్ (Akash Ambani) రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ ఛైర్మన్గా పనిచేస్తున్నారు. రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ బోర్డులో డైరెక్టర్గా కూడా ఉన్నారు . ఆకాష్ వార్షిక జీతం రూ . 5.6 కోట్లు, దీని ద్వారా ఆయన 40.1 బిలియన్ డాలర్ల ( సుమారు రూ . 3,32,815 కోట్లు ) నెట్వర్త్ను సంపాదించారు.ఇషా అంబానీ అంబానీ ముద్దుల తనయ ఇషా అంబానీ (Isha Ambani).. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ బోర్డులో నాన్ - ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పదవిని కలిగి ఉన్నారు . ఆమె రిలయన్స్ రిటైల్ , రిలయన్స్ జియో, రిలయన్స్ ఫౌండేషన్లలో ఎగ్జిక్యూటివ్ లీడర్షిప్ బృందంలో కీలక సభ్యురాలు కూడా. అంతే కాకుండా తీరా బ్యూటీకి ఇషా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, సహ వ్యవస్థాపకురాలు. అలాగే ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ నిర్వహణలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఆమె వార్షిక జీతం సుమారు రూ . 4.2 కోట్లు. ఆమె నెట్వర్త్ రూ . 800 కోట్లని అంచనా.అనంత్ అంబానీఅంబానీ వారసులలో ఆఖరి వాడు అనంత్ అంబానీ (Anant Ambani). రిలయన్స్ జియోలో ఎనర్జీ, టెలికమ్యూనికేషన్ రంగాలను పర్యవేక్షిస్తున్నారు. ఈయన జియో ప్లాట్ఫామ్స్ లిమిటెడ్, రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ బోర్డులలో డైరెక్టర్గా కూడా పనిచేస్తున్నారు. అనంత్ వార్షిక జీతం రూ . 4.2 కోట్లు. నెట్వర్త్ విషయానికి వస్తే 40 బిలియన్ డాలర్లు ( సుమారు రూ . 3,32,482 కోట్లు).ఆకాషే అత్యంత రిచ్ముఖేష్ అంబానీ ముగ్గురు వారసులలో ఆకాష్ అంబానీ అత్యంత ధనవంతుడు. తన తమ్ముడు అనంత్ కంటే స్వల్ప ఆధిక్యంతో 40.1 బిలియన్ డాలర్ల నికర సంపదను కలిగి ఉన్నారు. ఇక ఇషా అంబానీ విషయానికి వస్తే రూ .800 కోట్ల నెట్వర్త్తో సోదరులిద్దరి కన్నా ఆమడ దూరంలో ఉన్నారు. ఏదేమైనప్పటికీ అంబానీ వారసులందరూ కలిసి రిలయన్స్ ఇండస్ట్రీస్లో కీలక పాత్రలు పోషిస్తున్నారు. వారి కుటుంబ వారసత్వాన్ని నిలబెట్టుకుంటున్నారు. -
ఉద్యోగి బర్త్డే సెలబ్రేట్ చేసిన అనంత్, రాధికా అంబానీ (ఫోటోలు)
-
చిన్న కోడలు రాధికపై నీతా అంబానీ ప్రశంసలు
రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపక-ఛైర్పర్సన్ నీతా అంబానీ ఇటీవల ప్రతిష్టాత్మక హార్వర్డ్ ఇండియా కాన్ఫరెన్స్ 2025లో కీలకోపన్యాసం చేశారు. హార్వర్డ్ విశ్వ విద్యాలయంలో ఆమె ప్రసగించడం పలువురి ప్రశంసలందుకుంది. ఈ సందర్బంగా తన వ్యక్తిగత అనుభవాలను పంచుకున్నారు నీతా ముఖ్యంగా తాను చిన్నపుడు హార్వర్డ్ యూనివర్శిటీలో చదువు కోవాలని భావించడం, కానీ ఆర్థిక పరిస్థితుల రీత్యా ఆ కోరిక నెరవేరకపోవడం, ఇపుడు అక్కడి కీలకోపన్యాసం చేయడంతో తన తల్లి ఎంతో సంబర పడిపోయిన వైనాన్ని షేర్ చేశారు. తాజాగా తన చిన్నకోడలు రాధిక అంబానీపై ప్రశంసలు కురిపించడం విశేషంగా నిలిచింది.నీతా అంబానీ మాట్లాడుతూ తన చిన్న కొడుకు అనంత్ అంబానీ గురించి చెప్పుకొచ్చారు. అనంత్ ఆధ్యాత్మికంగా ఎలా ఉంటాడు, ఊబకాయంతో ఫైట్ చేస్తున్న తీరు ,రాధికతో ప్రేమను గుర్తు చేసుకున్నారు. అనారోగ్యంతో పోరాడుతున్న సమయంలో, అతనికి రాధిక లాంటి భార్య దొరకడం సంతోషం అన్నట్టు నీతా మాట్లాడారు. అనంత్ మతపరంగా, ఆధ్యాత్మికంగా చాలా దృఢంగా ఉంటాడు. జీవితాంతం ఊబకాయంతో పోరాడుతూ ఉన్నాడు. అయినప్పటికీ చాలా సానుకూలంగా ఉంటాడు. అలాగే తన జీవిత భాగస్వామి రాధికను కలవడం ద్వారా మరింత ఉత్సాహంగా మారాడు. వాళ్లిద్దరినీ అలా జంటగా చూడముచ్చటగా, అద్భుతంగా మ్యాజిక్లా ఉంటారంటూ చిన్న కోడల్ని కొనియాడారు.At the Harvard India Conference, Mrs. Nita Ambani speaks from the heart about her youngest son Anant - his journey through challenges, his positivity and spirituality, and finding his soulmate in Radhika! pic.twitter.com/yQNeMMFyZJ— Reliance Industries Limited (@RIL_Updates) February 18, 2025కాగా గత ఏడాది జూలై 12న అనంత్, రాధిక మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. అంబానీ నివాసం, యాంటిలియా, ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో వీరి వివాహం ఆరు రోజుల పాటు ఘనంగా జరిగింది. రాధిక మర్చంట్, అనంత్ చిన్నప్పటి నుంచి స్నేహితులు. అనంత్ రోడ్ ఐలాండ్లోని బ్రౌన్ విశ్వవిద్యాలయంలో చదువుకోగా రాధిక న్యూయార్క్లో చదువుకుంది. 2018 నుంచి డేటింగ్ చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ముఖ్యంగా ఒకరినొకరు కళ్ళలోకి చూసుకుంటున్న ఒక ఫోటో వైరల్ కావడంతో వీరి ప్రేమ వ్యవహారం బైటపడింది. ఆ తరువాత అనంత్ సోదరి ఇషా అంబానీ నిశ్చితార్థ వేడుకలో, నీతా అంబానీ, ముఖేష్ అంబానీ పెద్ద కుమారుడు ఆకాశ్ అంబానీ, శ్లోకా మెహతా వివాహ వేడుకలో కూడా రాధిక కనిపించారు.అయితే రాధిక తనకు దొరకడం అంటే 100 శాతం అదృష్టవంతుడిని అంటూ అనంత్ అంబానీ గతంలో తన ప్రేమను చాటుకున్నాడు. ఇప్పటికీ రాధికను కొత్తగా కనిసినట్టు అనిపిస్తుంది రాధికను చూసినప్పుడు తన హృదయంలో అగ్నిపర్వతాలు, భూకంపాలు, సునామీలొస్తాయంటూ చాలా భావోద్వేగంతో అనంత్ చెప్పిన సంగతి తెలిసిందే. -
కుమారుడి పెళ్లి ఖర్చుపై విమర్శలు.. నీతా అంబానీ రిప్లై
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ పెళ్లి వేడుకలు, అందుకు చేసిన ఖర్చుకు సంబంధించి విమర్శలు వస్తున్న నేపథ్యంలో అనంత్ తల్లి, రిలయన్స్ ఫౌండేషన్ ఛైర్పర్సన్ నీతా అంబానీ(Nita Ambani) స్పందించారు. ఇటీవల బ్లూమ్బర్గ్ టెలివిజన్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడారు.‘ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లల వివాహం కోసం తమ వంతు కృషి చేయాలని కోరుకుంటారు. మేం చేసింది కూడా అదే. ఇది మేడ్ ఇన్ ఇండియా బ్రాండ్ అని నేను భావిస్తున్నాను’ అని అన్నారు. వేడుకల స్థాయిని పెంచుతూ భారతీయ వారసత్వాన్ని చాటాలని నీతా నొక్కి చెప్పారు. భారతీయ సంప్రదాయాలు, వారసత్వం, సంస్కృతిని ప్రపంచానికి తెలియజేసే ప్రయత్నం చేసినందుకు సంతోషంగా ఉందని ఆమె ఇంటర్వ్యూలో అన్నారు. తన కుమారుడు అనంత్ ఆస్తమా కారణంగా చిన్నప్పటి నుంచి స్థూలకాయంతో పోరాడుతున్నాడని చెప్పారు. సమస్యలున్నా ఆత్మవిశ్వాసం కలిగిన పెళ్లికొడుకుగా వేదికపైకి వచ్చాడన్నారు.జులై 12, 2024లో ఒకటైన అనంత్ అంబానీ-రాధికమర్చెంట్ల వివాహం ప్రపంచ వ్యాప్తంగా అప్పట్లో చర్చకు దారితీసింది. వీరి వివాహం మూడు ప్రధాన ఘట్టాల్లో జరిగింది. 2024 మార్చిలో అంతర్జాతీయ ప్రముఖులు జామ్నగర్లో మూడు రోజుల ప్రీ వెడ్డింగ్ వేడుకలకు హజరయ్యారు. ఇందులో రిహానా, అకాన్, జస్టిన్ బీబర్, దిల్జిత్ దోసాంజ్ ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. బాలీవుడ్ హీరోలు షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, ఆమిర్ ఖాన్.. వంటి సినీతారలు కలిసి చిందేశారు. తర్వాత క్రూయిజ్ షిప్లో ప్రముఖులకు ఆతిథ్యం ఇచ్చారు. చివరకు ముంబయిలోని బీకేసీలో వివాహం జరిగింది.ఇదీ చదవండి: శాంతించిన కూరగాయలు, ఆహార ధరలుఅనంత్ అంబానీ-రాధిక మర్చంట్ల వివాహానికి దేశీయ ప్రముఖులతోపాటు విదేశాల్లోని దిగ్గజ సంస్థల సీఈఓలు హాజరయ్యారు. దాంతో వారికి సకల సౌకర్యాలు సమకూర్చేలా ఏర్పాట్లు జరిపారు. అందులో భాగంగా ప్రముఖుల కోసం ఏకంగా అంబానీ కుటుంబం మూడు ఫాల్కన్ 2000 జెట్లను, 100 సాధారణ విమానాలను అద్దెకు తీసుకుంది. క్లబ్ వన్ ఎయిర్ సంస్థ సీఈఓ రాజన్ మెహ్రా అంబానీ జెట్ విమానాలను అద్దెకు తీసుకున్నట్లు అప్పట్లో ధ్రువీకరించారు. పెళ్లికి వచ్చిన అతిథులను తిరిగి వారి గమ్యస్థానాలను చేర్చడానికి వీటిని వినియోగిస్తారని చెప్పారు. ఇలా పెళ్లికి భారీగా ఖర్చు చేయడంతో విమర్శలు వెల్లువెత్తాయి. దాంతో తాజాగా నీతా అంబానీ ఇంటర్వ్యూలో స్పందించారు. -
Maha Kumbh Mela : సింపుల్గా, హుందాగా రాధిక-అనంత్ అంబానీ జంట
రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ కుటుంబంతో కలిసి ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్నమహాకుంభమేళాలో పుణ్యస్నానాలు ఆచరించారు. గంగా, యమునా, సరస్వతి నదుల పవిత్ర సంగమమైన త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం చేయడానికి ప్రతిరోజూ లక్షలాది మంది భక్తులు తరలి వస్తున్నారు. ఈ భక్తజన సంద్రంలో అంబానీ కుటుంబంకూడా చేరింది. ముఖేష్ అంబానీ,కోకిలాబెన్ అంబానీ, ఆకాశ్ అంబానీ, అతని భార్య శ్లోకా మెహతాతో పాటు, అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ,చిన్న కోడలు రాధిక మర్చంట్ (ఫిబ్రవరి 11న) త్రివేణి సంగమంలో పవిత్ర ఆచారాలలో పాల్గొని పవిత్ర స్నానం చేశారు. (మున్నార్ : థ్రిల్లింగ్ డబుల్ డెక్కర్ బస్, గుండె గుభిల్లే! వైరల్ వీడియో)మహా కుంభ్లో, రాధిక తన లుక్తో ఆకట్టుకుంది. నేవీ బ్లూ సిల్క్ లగ్జరీ కుర్తాలో హుందాగా కనిపించింది. గోల్డ్ జరీ ఎంబ్రాయిడరీతో జయంతి రెడ్డి రూపొందించిన ఈ దుస్తుల విలువ ఇపుడు హాట్ టాపిక్గా నిలిచింది. V-నెక్లైన్ ,మోచేయి వరకు పొడవున్న స్లీవ్లు నెక్లైన్ బోర్డర్లను జరీ ఎంబ్రాయిడరీతో తీర్చి దిద్దారు. ఈ కుర్తాకు కాంట్రాస్టింగ్ పుదీనా గ్రీన్ ధోతీ ప్యాంటు, మ్యాచింగ్ దుపట్టాతో జత చేసింది. దీని ధర లక్ష రూపాయలని వివిధ నివేదికల ద్వారా తెలుస్తోంది. అలాగే జ్యయుల్లరీ తక్కువగా ఉంచినప్పటికీ మోడ్రన్గా ఉండటం విశేషం. సింపుల్ పోనీటైల్తో డైమండ్ స్టడ్ చెవిపోగులు, హారాన్ని ధరించి ఆధ్యాత్మిక లుక్లో అలరించింది. (Valentines Day : లవ్ బర్డ్స్కోసం ది బెస్ట్ డెస్టినేషన్ ఇదే!)ఇక రాధికకు జతగా అనంత్ అంబానీ అద్భుతమైన ఎరుపు రంగు దుస్తుల్లో కనిపించాడు. వెండి మోటిఫ్లు , చక్కటి,చిక్కటి బంగారు ఎంబ్రాయిడరీ చేసిన మెరూన్ వెయిస్ట్కోట్, షైనింగ్ రెడ్ ఎరుపు కుర్తాను ధరించాడు. అలాగే బంగారు గొలుసు, నుదుటిన తిలకంతో తన సాంప్రదాయ రూపాన్ని పూర్తి చేశాడు. View this post on Instagram A post shared by Ambani Family (@ambani_update) కాగా ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లోని త్రివేణి సంగమంలోమహా కుంభమేళా 2025 ఉత్సాహంగా సాగుతోంది. సూర్యుని చుట్టూ బృహస్పతి చుట్టే కక్ష్య పూర్తైన సూచనగా జరుపుకునే ముఖ్యమైన తీర్థయాత్ర పండుగ ఇది. 12-కుంభమేళా చక్రం ముగింపును ఇది సూచిస్తుంది. దీనిని అధికారికంగా 45 రోజుల పాటు జరిగే మహా కుంభమేళాగా పిలుస్తారు. ఈ కార్యక్రమం జనవరి 13న మొదలై, ఫిబ్రవరి 26 వరకు సాగనుంది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద సమావేశంగా గుర్తింపు పొందింది. -
మహా కుంభమేళాలో అంబానీ ఫ్యామిలీ (ఫోటోలు)
-
బెస్ట్ ఫ్రెండ్ సంగీత్ వేడుకలో రాధికా అంబానీ స్టెప్పులు
రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ చిన్న కోడలు, అనంత్ అంబానీ భార్య రాధికా అంబానీ తన డ్యాన్స్తో అందర్నీ మెస్మరైజ్ చేసింది. బెస్ట్ ఫ్రెండ్ సంగీత్ వేడుకలో రాధిక అంబానీ తనదైన శైలిలో ఆకట్టుకుంది. స్టైలిష్ లుక్తో అందర్నీ కట్టి పడేసింది. స్నేహితులు కృష్ణ పరేఖ్, యష్ సింఘాల్ సంగీత్ వేడుకలో అనంత్ అంబానీ,రాధికా అంబానీతో కలిసి తమ స్నేహితులతో కలిసి సందడి చేశారు. అంతేకాదు అనార్కలి డిస్కో చలి అంటూ ప్రెండ్స్తో కలిసి సూపర్ స్టెప్పులేసింది రాధిక. దీనికి సంబంధించిన వీడియో, ఫోటోలు నెట్టింట సందడి చేస్తున్నాయి. రాధికా అంబానీ తన స్నేహితుల బృందంతో కలిసి విలాసవంతమైన సంగీత్ వేడుకలో నృత్యం చేసింది. ఈ వీడియో ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయడంతో అది వైరల్గా మారింది. ఇటీవల ముంబైలో ట్రైడెంట్ ఒబెరాయ్ హోటల్లో జరిగిన విలాసవంతమైన సంగీత్ వేడుకలో 'అనార్కలి డిస్కో చలి'కి తన అద్భుతమైన స్టెప్పులేసింది. 2012 చిత్రం హౌస్ఫుల్ 2 మూవీలోని ఈ పాటకు అద్భుతంగా డ్యాన్స్ చేసింది. ఈ వివాహానికి రాధిక అంబానీ స్టైలిష్ లుక్ మరో ప్రత్యేక ఆకర్షణ అని చెప్పవచ్చు. సిల్వర్ కలర్ లెహెంగాలో అందంగా ముస్తాబైంది. డైమండ్ బ్యాంగిల్స్ , చెవిపోగులతో తన లుక్ మరింత గ్రాండ్గా ఉండేలా జాగ్రత్తపడింది. దిల్ ధడక్నే దో చిత్రంలోని గల్లన్ గుడియాన్ లాంటి పాటలకు కూడా ఆమె ఉత్సాహంగా స్టెప్పులు వేస్తూ కనిపించింది. మరో వీడియోలో, ఆమె భర్త అనంత్ అంబానీ, వరుడు యష్ సింఘాల్, వారి స్నేహితులతో కలిసి నృత్యం చేస్తూ కనిపించారు. ఇదీ చదవండి: సబీర్ భాటియా లవ్ స్టోరీ : స్టార్ హీరోయిన్తో లవ్? కానీ పెళ్లి మాత్రం! View this post on Instagram A post shared by Ambani Family (@ambani_update) కాగా వ్యాపారవేత్త వీరేన్ మర్చంట్ చ శైలా మర్చంట్ దంపతుల కుమార్తెరాధికా మర్చంట్. అలాగే అంబానీముఖేష్ , నీతా అంబానీల చిన్న కుమారుడు అనంత్ అంబానీని ప్రేమించి పెళ్లి చేసుకుంది.వివాహం తర్వాత తన అంబానీ ఇంటి పేరుతో కలిపి రాధికా అంబానీగా మారిపోయింది. యూరప్లో క్రూయిజ్తో సహా రెండుసార్లు ప్రీ వెడ్డింగ్ వేడుకల పాటు గత ఏడాది జూలై 12న అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్నారు. ఇది "ఇండియాస్ వెడ్డింగ్ ఆఫ్ ది ఇయర్"గా నిలిచింది. ది న్యూయార్క్ టైమ్స్ పత్రిక డిసెంబరులో రిలీజ్ చేసిన " మోస్ట్ స్టైలిష్ పీపుల్ ఆఫ్ 2024" జాబితాలో అనంత్-రాధికా అంబానీ కపుల్ని చేర్చడం విశేషం. -
అంతరించిపోయిన ఐకానిక్ పక్షులకోసం అనంత్ అంబానీ కీలక నిర్ణయం
రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీకి చెందిన వంతారా వన్య ప్రాణుల సంరక్షణలో మరో కీలక అడుగు వేసింది. ప్రపంచ వన్యప్రాణుల సంరక్షణను అభివృద్ధి చేయడంలో కృషి చేస్తున్న వంతారా బ్రెజిల్లో దాదాపు అంతరించి పోయినట్టు ప్రకటించిన ఐకానిక్ పక్షులను రక్షించేందుకు నడుంబిగించింది. బ్రెజిల్లోని కాటింగా బయోమ్ అడవిలో అంతరించిపోయిన 41 స్పిక్స్ మకావ్ (Cyanopsitta spixii) లకు పునరుజ్జీవం తెచ్చేందుకు రంగంలోకి దిగింది. ఇందుకు సంబంధించి వంతారా అనుబంధ సంస్థ గ్రీన్స్ జూలాజికల్ రెస్క్యూ అండ్ రిహాబిలిటేషన్ సెంటర్ (GZRRC), అసోసియేషన్ ఫర్ ది కన్జర్వేషన్ ఆఫ్ థ్రెటెండ్ పేరెట్స్ (ACTP)తో భాగస్వామ్యం కుదుర్చుకుంది.2000లో అంతరించిపోయినట్లు ప్రకటించినన స్పిక్స్ మాకా (సైనోప్సిట్టా స్పిక్సీ) అనే జాతిని పునరుద్ధరించే ప్రయాణంలో ఈ ఐకానిక్ పక్షులను బ్రెజిల్లోని వాటి స్థానిక ఆవాసాలకు తిరిగి పరిచయం చేయడమే ఈ చొరవ లక్ష్యం. ఇందులో GZRRC ప్రాజెక్ట్లో విజయవంతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తోంది.జర్మనీలోని బెర్లిన్లోని ఏసీటీపీ బ్రీడింగ్ సెంటర్ నుండి 41 స్పిక్స్ మకావ్లను బ్రెజిల్లోని బాహియాలోని విడుదల కేంద్రానికి విజయవంతంగా తరలించడం ద్వారా ఒక ప్రధాన మైలురాయిని సాధించిందిఅనంత్ అంబానీ నేతృత్వంలోని వన్యప్రాణుల సంరక్షణ ప్రాజెక్ట్ వంతారా. ఈ గ్లోబల్ రీఇంట్రడక్షన్ ప్రోగ్రామ్లో భాగంగా, వంతారా నిపుణులు ఏసీటీపికి మార్గదర్శకత్వం చేయడంతో పాటు కీలకమైన వనరులను అందిస్తారు. వీటిల్లో 2022లో 20 స్పిక్స్ మకావ్లను అడవిలోకి తిరిగి ప్రవేశపెట్టడం జరిగిందని, దీని ఫలితంగా 20 సంవత్సరాలలో తొలిసారి పిల్లలు పుటాయనీ, ఇది ప్రోగ్రామ్ పురోగతికి సామర్థ్యానికి నిదర్శనమని వంతారా ప్రకటించింది.బ్రెజిల్కు బదిలీకి ఎంపిక చేయబడిన 41 స్పిక్స్ మకావ్లను వాటి వంశపారంపర్యత, ఆరోగ్యం ఆధారంగా ఎంపిక చేశారు. ఇందులో 23 ఆడ, 15 మగ, 3 ఇంకా నిర్ధారించని చిన్న పిల్లలున్నాయి. ఈ సంవత్సరం విడుదలకు సిద్ధమవుతున్న బృందంలో కొన్ని చేరగా, మరికొన్ని దీర్ఘకాలిక పరిరక్షణ ప్రయత్నాలకు మద్దతుగా బ్రీడింగ్ ప్రోగ్రామ్లో చేర్చారు.. బదిలీకి ముందు, పక్షులు బెర్లిన్లోని ఒక బ్రీడింగ్ ఫెసిలిటీలో 28 రోజుల కంటే ఎక్కువ క్వారంటైన్లో ఉన్నాయి. అక్కడి అడవి పర్యావరణాన్ని ప్రభావితం చేసే ఏవైనా వ్యాధులకు లేవని నిర్దారించుకునేందుకు వీలుగా సమగ్ర పరీక్షలు నిర్వహించారు. జనవరి 28న, ఆ పక్షులు బెర్లిన్ నుండి చార్టర్డ్ విమానంలో బ్రెజిల్లోని పెట్రోలినా విమానాశ్రయానికి బయలు దేరి, అక్కడికి చేరుకున్న తర్వాత, వాటిని నేరుగా క్వారంటైన్ సౌకర్యానికి తరలించారు. ఈ బదిలీని ఇద్దరు పశువైద్యులు , ఏసీటీపిఒక కీపర్ జాగ్రత్తగా పర్యవేక్షించారు, వీరితో పాటు వంటారా GZRRC నుండి నిపుణుల బృందం కూడా ఉంది.స్పిక్స్ మకావ్స్ రీఇంట్రడక్షన్ ప్రాజెక్ట్కు వారి అద్భుతమైన కృషి చేసిన అనంత్ అంబానీ , వంతారాబృందానికి ACTP వ్యవస్థాపకుడు మార్టిన్ గుత్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. అంతరించిపోయిన జాతుల రక్షణలోఆర్థిక సహాయంతో పాటు, నైపుణ్యం ఎంతో అమూల్యమైనదని కొనియాడారు.హాలీవుడ్ చిత్రం రియోలో ప్రముఖంగా కనిపించిన స్పిక్స్ మకా, బ్రెజిలియన్ ప్రభుత్వం కృషి చేస్తోంది. ఇందులో భాగంగా 2019లో, బ్రెజిల్లో ఒక ప్రత్యేక విడుదల కేంద్రం స్థాపించారు. ఆ తర్వాత 2020లో జర్మనీ బెల్జియం నుండి 52 పక్షులను రవాణా చేశారు. 2022లో, 20 స్పిక్స్ మకావ్లను వాటి సహజ ఆవాసాలలోకి విడుదల చేయగా, ఏడు అడవి కోడిపిల్లలు జన్మించాయి. భారతదేశ వైవిధ్యమైన వన్యప్రాణుల వారసత్వాన్ని పునరుద్ధరించడానికి కూడా వంతారా గట్టి ప్రయత్నాలు చేస్తోంది. కట్టడిలో ఉన్న ఖడ్గమృగాలను సురక్షితమైన ఆవాసాలలోకి తిరిగి ప్రవేశపెట్టడం, సంతానోత్పత్తి , ఆవాస పునరుద్ధరణ ద్వారా ఆసియా సింహాల జనాభాను బలోపేతం చేయడం వాటి సంతానోత్పత్తి కార్యక్రమం తర్వాత చిరుతలను భారతీయ అడవులకు తిరిగి తీసుకురావడం వంటివి ఉన్న సంగతి తెలిసిందే. -
అంబానీ జూకు ఏనుగుల తరలింపుపై విమర్శలా?!
ఎక్కడ అరుణాచల్ ప్రదేశ్.. ఎక్కడ గుజరాత్..? మూడు వేలకు పైగా కిలోమీటర్ల దూరం. అంత దూరం నుంచి.. అదీ ట్రక్కులలో ఏనుగులను తరలించడం ఏంటి?. స్పెషల్ ట్రక్కులలో అంబానీ కుటుంబానికి చెందిన జూకు ఏనుగులను తరలించడంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. మూగజీవుల కోసం పోరాడే ఉద్యమకారులైతే తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఆ దృశ్యాలు చూసి.. ‘‘పాపం ఏనుగులు.. డబ్బుంటే ఏమైనా చేయొచ్చా?’’ అని తిట్టుకునేవారు లేకపోలేదు. అయితే..అరుణాచల్ ప్రదేశ్(Arunachal Pradesh) నుంచి మాత్రమే కాదు.. అసోం(Assam) నుంచి కూడా జామ్ నగర్లోని అనంత్ అంబానీకి చెందిన వంతార జూనకు ఏనుగులను తరలించారట. ఈ తరలింపునకు ప్రభుత్వాల నుంచి ఎలాంటి అనుమతులు లేవని.. పైగా వన్యప్రాణులను అలా బంధించడమూ నేరమేనని కొందరు వాదిస్తున్నారు. ఈ క్రమంలోనే కొందరు నిజనిర్ధారణలు చేసుకోకుండా పోస్టులు పెట్టేస్తున్నారు. అయితే ఇలాంటి తరలింపునకు అసలు అనుమతులు ఉన్నాయా?. వన్యప్రాణులను ఇలా జంతు ప్రదర్శన శాలలో ఉంచొచ్చా?. దారిలో వాటికి ఏదైనా జరగరానిది జరిగితే ఎలా?... ఎవరిది బాధ్యత? సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ప్రచారంలో వాస్తవమెంత?. అయితే ఇవేం అడవుల నుంచి బలవంతంగా తరలిస్తున్న ఏనుగులు కాదని అధికారులు వివరణ ఇస్తున్నారు. జంతు సంరక్షణ చర్యల్లో భాగంగానే వాటిని తరలిస్తున్నట్లు స్పష్టత ఇచ్చారు. ఏనుగులను బంధించి.. వాటితో సొమ్ము చేసుకుంటున్న ముఠాల నుంచి వాటికి విముక్తి కలిగిస్తున్నారు. రిలయన్స్ వంతార జూ ‘చైన్ ఫ్రీ’ ఉద్యమం పేరిట నిర్వహిస్తున్న కార్యక్రమం భాగంగా ఇది ఎప్పటి నుంచో జరుగుతున్నదే. అయితే తాజా వీడియోలపై విమర్శల నేపథ్యంలో.. ఇటు వంతారా నిర్వాహకులు కూడా స్పందించారు.ఆరోగ్యకరమైన వాతావరణంలో అవి జీవిస్తాయని మాది గ్యారెంటీ. వాటికి గౌరవప్రదమైన జీవితం అందించడమే మా ఉద్దేశం’’ అని స్పష్టం చేసింది. అంతేకాదు.. ఇందుకు అవసరమైన ప్రక్రియ అంతా అధికారికంగానే నిర్వహించినట్లు స్పష్టత ఇచ్చింది. వన్యప్రాణుల సంరక్షణ చట్టం 1972 ప్రకారమే నడుచుకున్నట్లు, అలాగే.. గుజరాత్ , అరుణాచల్ ప్రదేశ్ అటవీ శాఖల నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్లు, ఏనుగుల తరలింపు కోసం రవాణా శాఖల నుంచీ ప్రత్యేక అనుమతులు పొందినట్లు పేర్కొంది.అరుణాచల్ ప్రదేశ్ ప్రభుత్వం ఏం చెప్పిందంటే.. అవి అటవీ ఏనుగులు కాదని, ప్రైవేట్ ఓనర్ల నుంచి వాటిని వంతారా కొనుగోలు చేసినట్లు తెలిపింది. త్రిపుర హైకోర్టు వేసిన హైపవర్ కమిటీతో పాటు సుప్రీం కోర్టు పర్యవేక్షణలోనే ఇదంతా జరుగుతోందని స్పష్టం చేసింది. వాటిని తరలించిన ఆంబులెన్స్లు కూడా ప్రత్యేకమైన సదుపాయాలతోనే తరలించినట్లు పేర్కొంది.అసోం ప్రభుత్వం మాత్రం.. తమ భూభాగం నుంచి ఏనుగుల తరలింపేదీ జరగలేదని స్పష్టం చేసింది. అసోం నుంచి గుజరాత్ ప్రైవేట్ జూకు జంతువుల తరలింపు పేరిట అసత్య ప్రచారాలు, కథనాలు ఇస్తున్నారని ఆ రాష్ట్ర సీఎం కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. అయితే ఈ వివరణలలేవీ వైల్డ్లైఫ్(Wild Life) యాక్టవిస్టులను సంతృప్తి పర్చడం లేదు. పైగా వాతావరణ మార్పు వాటి ఆరోగ్యాన్ని దెబ్బ తీస్తుందని, యానిమల్ ఆంబులెన్స్ పేరిట తరలిస్తున్న వాహనాల్లో ఎలాంటి సదుపాయాలు లేవని అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. అవసరమైతే ఈ అంశంపై కోర్టును ఆశ్రయిస్తామని అంటున్నారు. మరోవైపు.. ఈ వ్యవహారం ఇటు సోషల్ మీడియాలో, అటు రాజకీయంగా విమర్శలకు దారి తీసింది. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రైవేట్ వ్యక్తుల కోసం పని చేస్తున్నాయంటూ ప్రతిపక్షాలు తిట్టిపోస్తున్నాయి.వంతార.. రిలయన్స్ సౌజన్యంతో నడిచే అతిపెద్ద జంతు సంరక్షణశాల. దేశంలోనే అతిపెద్దది. ముకేష్ అంబానీ(Mukesh Ambani) తనయుడు అనంత్ చిన్నప్పటి నుంచి యానిమల్ లవర్ అట. అలా.. మూగ జీవుల సంరక్షణ ప్రధాన ఉద్దేశంగా రిలయన్స్ ఇండస్ట్రీస్, రిలయన్స్ ఫౌండేషన్ దేశంలో ఎక్కడా లేనన్ని సేవలతో ఈ జూను నడిపిస్తున్నాయి. వేటగాళ్ల చేతిలో బందీ అయిన, గాయపడిన ప్రాణులను రక్షించి చికిత్స చేయడం, కాపాడాటం, వాటికి పునరావాసం కల్పించడంపై దృష్టిపెట్టింది ఫౌండేషన్. ఈ ప్రాజెక్టు కింద భారతదేశంలోనే కాకుండా విదేశాల్లోని ప్రాణులను కూడా కాపాడుతున్నారు. ఇది గుజరాత్ లోని జామ్ నగర్ రిఫైనరీ కాంప్లెక్స్లోని రిలయన్స్ గ్రీన్ బెల్ట్లో సుమారు 600 ఎకరాల్లో విస్తరించి ఉంది.ఏమేం ఉన్నాయంటే..వంతార జూ(Vantara Zoo)లోనే లక్ష చదరపు అడుగుల్లో హాస్పిటల్, పరిశోధనా కేంద్రం నిర్మించారు. జంతువుల ట్రీట్మెంట్ కోసం అత్యాధునిక సౌకర్యాలు అందుబాటులోకి తీసుకొచ్చారు.. లేటెస్ట్ టెక్నాలజీతో ICU, MRI, CT స్కాన్, X-రే, అల్ట్రాసౌండ్, ఎండోస్కోపీ, డెంటల్ స్కాలార్, లిథోట్రిప్సీ, డయాలసిస్ సౌకర్యాలు ఏర్పాటు చేశారు. ఇక్కడ సర్జరీలకు లైవ్ వీడియో కాన్ఫరెన్సులు ఉన్నాయి. బ్లడ్ ప్లాస్మాను వేరు చేసే టెక్నాలజీ కూడా ఉంది. ఈ కేంద్రంలో 2 వేలకు పైగా ప్రాణులు, 43 జాతుల వాటిని కాపాడే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. అంతరించే జాతులకు సంబంధించిన 7 రకాల వన్యప్రాణులు కూడా ఇక్కడ ఉన్నాయి.. అలాగే విదేశాల్లో అంతరించే దశలో ఉన్న ప్రాణులనూ రక్షిస్తున్నారిక్కడ. రెస్క్యూలో భాగంగా ఇప్పటికే 2వందలకు పైగా ఏనుగులను సేవ్ చేసి.. వంతారలోని ఏనుగుల రక్షణ కేంద్రంలో వదిలేశారు. జూను చూసేందుకు 3వేల-4వేల మంది పనిచేస్తున్నారు. భారత్ తో సహా ప్రపంచంలోని పేరొందిన జంతుశాస్త్ర నిపుణులు.. వైద్య నిపుణులు కొందరు వంతార మిషన్ లో భాగమైయ్యారు. ప్రభుత్వ రంగ సంస్థలు.. ప్రభుత్వ పరిశోధనా సంస్థలు కూడా వంతార జూకు సహకరిస్తున్నాయి. -
వంతారాకు కొత్త అతిథులు
ఇస్కాన్ మాయాపూర్కు చెందిన రెండు ఏనుగులు బిష్ణుప్రియ, లక్ష్మీప్రియల సంరక్షణ బాధ్యతలను జంతు పునరావాస కేంద్రం వంతారా తీసుకోనుంది. గత ఏప్రిల్లో బిష్ణుప్రియ మావటిపై దాడి చేసిన విషాద సంఘటన తరువాత ఈ మేరకు ఇస్కాన్, వంతారా మధ్య ఒప్పందం జరిగింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేశ్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ ఆధ్వర్యంలోని జామ్నగర్లో ఉన్న వంతారా జంతు సంరక్షణ కేంద్రం ప్రసిద్ధి చెందింది.అనంత్ అంబానీ స్థాపించిన వంతారా ఈ రెండు ఏనుగులకు శాశ్వత నివాసం కల్పించనుంది. ఈ ఏనుగుల బదిలీకి సంబంధించి త్రిపుర హైకోర్టు ఏర్పాటు చేసిన హైపవర్ కమిటీ నుంచి పూర్తి ఆమోదం లభించింది. ఆపదలో ఉన్న అడవి జంతువులను రక్షించడం, ఒత్తిడి లేని వాతావరణాన్ని కల్పించడానికి అనువైన ప్రాంతాలను అన్వేషించడం ఈ కమిటీ బాధ్యత.బిష్ణుప్రియ, లక్ష్మీప్రియ ఏనుగుల కోసం సహజ ఆవాసాన్ని ప్రతిబింబించేలా వంతారాలో ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. ఇస్కాన్ మాయాపూర్ 2007 నుంచి లక్ష్మీప్రియను, 2010 నుంచి బిష్ణుప్రియను ఆలయ ఆచారాలకు, వివిధ పండుగ సందర్భాలకు ఉపయోగిస్తోంది. కొన్ని కారణాల వల్ల గత ఏప్రిల్లో బిష్ణుప్రియ మావటిపై దాడి చేసింది. ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. పీపుల్ ఫర్ ది ఎథికల్ ట్రీట్మెంట్ ఆఫ్ యానిమల్స్ (పెటా) ఇండియా, వరల్డ్ యానిమల్ ప్రొటెక్షన్తో సహా జంతు సంరక్షణ సంస్థలు ఇస్కాన్ ఏనుగులను సంరక్షణ కేంద్రానికి తరలించాలని తెలిపాయి.ఇదీ చదవండి: ట్రంప్ ప్రమాణ స్వీకారోత్సవానికి అంబానీ హాజరువంతారాఅనంత్ అంబానీ గుజరాత్లోని జామ్నగర్లో 3వేల ఎకరాల్లో వంతారా పేరుతో కృత్రిమ అడవిని ఏర్పాటు చేశారు. ఇందులో జంతువులు నివసించేందుకు వీలుగా సహజంగా ఉండేలా వసతులు ఏర్పాటు చేశారు. ఈ అడవిలో 25,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏనుగుల కోసం ప్రత్యేకంగా ఆసుపత్రి ఉంది. ఇది ప్రపంచంలోనే అతి పెద్దది. పూర్తిగా పోర్టబుల్ ఎక్స్రే యంత్రాలు, శస్త్ర చికిత్సల కోసం లేజర్ యంత్రాలు, పాథాలజీ ల్యాబ్లు, హైపర్బారిక్ ఆక్సిజన్ ఛాంబర్తోపాటు అధునాతన సదుపాయాలు ఉన్నాయి. -
అనంత్ చేతికి అరుదైన వాచ్: ప్రత్యేకతలివే..
కొంతమందికి కార్లంటే ఇష్టం, మరికొందరికి బైకులు, ఇంకొందరికి వాచీలు. ఇలా ఎవరి అభిరుచి వారిది. అయితే వాచీలను ఎక్కువగా ఇష్టపడే వారిలో భారతీయ కుబేరుడు ముకేశ్ అంబానీ చిన్న కుమారుడు 'అనంత్ అంబానీ' (Anant Ambani) కూడా ఒకరు. గతేడాది 'రాధికా మర్చెంట్'ను (Radhika Merchant) పెళ్లి చేసుకుని ఓ ఇంటివాడైన అనంత్.. ఇటీవల ఓ ఖరీదైన వాచ్ ధరించి కనిపించారు.అనంత్ అంబానీ ధరించిన వాచ్ ధర ఏకంగా రూ. 22 కోట్లు అని తెలుస్తోంది. ఇది ది రిచర్డ్ మిల్లే RM 52-04 స్కల్ బ్లూ సఫైర్. ప్రపంచంలోనే అత్యంత అరుదైన వాచీలలో ఇది ఒకటి. ఇలాంటివి ప్రపంచంలో కేవలం మూడు మాత్రమే ఉన్నాయని సమాచారం. ఈ వాచ్ రష్యా అధ్యక్షుడు 'వ్లాదిమిర్ పుతిన్' ప్రెస్ సెక్రటరీ 'డిమిత్రి పెస్కోవ్' (Dmitry Peskov) వద్ద కూడా ఉన్నట్లు తెలుస్తోంది.రిచర్డ్ మిల్లే RM 52-04 బ్లూ సఫైర్ ఒకే పీస్తో తయారు చేశారు. ఇది చూడటానికి చాలా ప్రత్యేకంగా కనిపిస్తుంది. ఈ వాచ్ మాత్రమే కాకుండా అనంత్ అంబానీ వద్ద పటెక్ ఫిలిప్పె, అడెమార్స్ పిగ్యుట్ వంటి ఇతర బ్రాండెడ్ వాచీలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.రిచర్డ్ మిల్లే RM 52-04 స్కల్ బ్లూ సఫైర్ ప్రత్యేకతలుఒకే పీస్తో తయారైన ఈ వాచ్ మధ్య భాగంలో ఒక పుర్రె ఆకారం.. క్రాస్బోన్ ఉండటం చూడవచ్చు. దీని కింద వంతెనల లాంటి నిర్మాణాలను చూడవచ్చు. ఇవన్నీ ఖరీదైన మెటల్తో రూపొందించడం వల్ల చాలా ప్రత్యేకంగా కనిపిస్తుంది. పేరుకు తగ్గట్టుగానే ఇది నీలం రంగులో ఉండటం కూడా గమనించవచ్చు, ఇది ఐస్ క్యూబ్ మాదిరిగా ఉంటుంది.అనంత్ అంబానీఅనంత్ అంబానీ రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ, నీతా అంబానీల చిన్న కుమారుడు. అనంత్ జూలై 12, 2024న రాధిక మర్చంట్ను పెళ్లి చేసుకున్నారు. ఈయన వద్ద ఖరీదైన వాచీలు మాత్రమే కాకుండా.. రోల్స్ రాయిస్ కల్లినన్ వంటి కార్లు కూడా ఉన్నాయి. ఇషా అంబానీ, ఆకాష్ అంబానీలు.. అనంత్ అంబానీ తోబుట్టువులు. View this post on Instagram A post shared by THEINDIANHOROLOGY (@theindianhorology) -
డిసెంబర్ 30 వరకు.. వంతారా కార్నివాల్ అడ్వెంచర్
వన్యప్రాణులను రక్షించడానికి, వాటికి పునరావాసం కల్పించడానికి ఏర్పాటైన 'వంతారా' తాజాగా 'వాంతారియన్ రెస్క్యూ రేంజర్స్' పేరుతో ఓ ఈవెంట్ నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమం 2024 డిసెంబర్ 30 వరకు జరగనుంది. ఈ ఈవెంట్ ప్రత్యేకించి జంతు ప్రేమికుల కోసం ఏర్పాటు చేసింది.వాంతారియన్ రెస్క్యూ రేంజర్స్ కార్యక్రమంలో చిక్కుకున్న పక్షులను విడిపించడం, రక్షించిన జంతువులకు ఆహారం ఇవ్వడం, ఆవాసాలను రక్షించడం నేర్చుకోవడం వంటి సవాళ్లను అనుకరించడంలో ఇంటరాక్టివ్ ప్రయాణాన్ని ప్రారంభిస్తారు. వన్యప్రాణుల అక్రమ రవాణాపై క్లిష్టమైన పోరాటాన్ని నొక్కిచెబుతూ.. తప్పిపోయిన జంతువులలో ఒకదాన్ని రక్షించడంలో సాహసం ముగుస్తుంది.కార్యకలాపాలను పూర్తి చేసిన పిల్లలు.. రక్షించిన జంతు బొమ్మను అందుకుంటారు. ఈ కార్యక్రమం కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఒక ప్రదేశంలో జంతువులు, పక్షుల బొమ్మలు చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. వీటితో పాటు ఎక్కడ చూసినా శాంటా బొమ్మలను కూడా చూడవచ్చు.వంతారాఅనంత్ అంబానీ గుజరాత్లోని జామ్నగర్లో 3వేల ఎకరాల్లో వంతారా పేరుతో కృత్రిమ అడవిని ఏర్పాటు చేశారు. ఇందులో జంతువులు నివసించేందుకు వీలుగా సహజంగా ఉండేలా వసతులు ఏర్పాటు చేశారు. ఈ అడవిలో 25,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏనుగుల కోసం ప్రత్యేకంగా ఆసుపత్రి ఉంది. ఇది ప్రపంచంలోనే అతి పెద్దది. పూర్తిగా పోర్టబుల్ ఎక్స్రే యంత్రాలు, శస్త్ర చికిత్సల కోసం లేజర్ యంత్రాలు, పాథాలజీ ల్యాబ్లు, హైపర్బారిక్ ఆక్సిజన్ ఛాంబర్తోపాటు అధునాతన సదుపాయాలు ఉన్నాయి. -
అనంత్-రాధిక హల్దీ.. వెలుగులోకి మరో వీడియో! వైరల్
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ నీతా అంబానీ చిన్న కుమారుడు అనంత్ రాధికల పెళ్లి ఎంతలా అంగరంగ వైభవంగా జరిగిందో తెలిసిందే. ఆ వేడుకకు సంబంధించిన ప్రతి ఫోటో, వీడియోలు నెట్టింట సందడి చేస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా అంబానీలు ధరించే కాస్ట్యూమ్స్, నగలు, తదితరాలు చాలా హాట్టాపిక్గా నిలిచాయి కూడా. అయితే ఆ వేడుకకు సంబంధించి ఓ వీడియోని మాత్రం అందరూ మిస్ అయ్యాం. సరదసరదాగా సాగే హల్దీ వేడుకకు సంబంధిచిన మరో వీడియో తాజగానెట్టింట తెగ వైరల్ అవుతోంది. అంబానీలకు సన్నిహితుడైన అకా ఓర్హాన్ అవత్రమణి షేర్ చేసిన ఈ లేటెస్ట్ వీడియోలో అంబానీలంతా ఖుషీగా గడిపినట్లు కనిపించింది. అతిధులంతా పసుపునీళ్లు ఒకరిపై ఒకరూ వేసుకుంటూ సందడి చేశారు. ఆ వీడియోలో నీతా అంబానీ పసుపు నీళ్లు పడకుండా తప్పించుకోవడంలో విఫల ప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ వేడుకకు హోస్ట్గా ఉన్న నీతా అంబానీ సైతం అంరిలానే హల్దీ దాడిని ఎదుర్కోవడం ఫన్నీగా ఉంటుంది. ఇక అనంత్ అంబానీ బావమరిది ఆనంద్ పిరమల్ ఒకరిపై ఒకరు పసుపు నీళ్లు, పూలతో దాడి చేయడం, మరోపక్క అతిథులంతా నవ్వుతూ ఉన్నట్లు వీడియోలో కనిపించింది. ఈ హల్దీ ఫంక్షన్ ముంబైలోని అంబానీ కుటుంబానికి చెందిన ఆంటిలియాలో జరిగింది. ఈ వేడుకలో జాన్వీ కపూర్, అర్జున్ కపూర్, రణ్వీర్ సింగ్ తదితర తారలు పాల్గొన్నారు. అంతేగాదు ఈ లెటెస్ట్ ఓర్రీ వీడియోలో ధోల్ బీట్లు, డ్యాన్స్లతో ఇతర అతిథులు ఎంత సరదాగా గడిపారో కూడా కనిపిస్తోంది. కాగా, అనంత్ రాధిక మర్చంట్ల వివాహం ఈ ఏడాది జూలై 12న అత్యంత లగ్జరియస్గా జరిగింది. (చదవండి: అందమైన శరీరాకృతికి బీబీఎల్ సర్జరీ: అంటే ఏంటీ..? ఎదురయ్యే దుష్ర్పభావాలు..) -
ట్రెండింగ్లో నిలిచిన కొత్త పెళ్లి కూతురు.. ఇంకొందరు..
రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేశ్అంబానీ చిన్న కోడలు రాధిక మర్చెంట్ 2024 ఏడాదికిగాను గూగుల్ సెర్చ్లో ట్రెండింగ్లో నిలిచారు. ముఖేశ్అంబానీ-నీతా అంబానీల చిన్న కుమారుడు అనంత్ అంబానీ వివాహం జులైలో రాధిక మర్చెంట్తో జరిగిన విషయం తెలిసిందే. వీరి వివాహానికి అంతర్జాతీయ ప్రముఖులు, సెలబ్రిటీలు, సినీతారలు హాజరై సందడి చేశారు. దాంతో అంబానీ కోడలు గురించి చాలామంది గూగుల్లో సెర్చ్ చేసినట్లు తెలిసింది.2024లో రాధిక మర్చెంట్తోపాటు మరికొందరు ట్రెండింగ్లో నిలిచారు.1. వినేష్ ఫొగాట్: భారతదేశపు రెజ్లింగ్ స్టార్రెజ్లర్ వినేష్ ఫొగాట్ 2024లో అత్యధికంగా గూగుల్లో సెర్చ్ చేసిన భారతీయ వ్యక్తుల జాబితాలో అగ్రస్థానంలో నిలిచారు. పారిస్ ఒలింపిక్లో మహిళల 50 కేజీల రెజ్లింగ్ పోటీలో 100 గ్రాముల అధిక బరువుండి దానికి అర్హత సాధించలేకపోయారు.2. నితీష్ కుమార్: బిహార్ రాజకీయ వ్యూహకర్తబిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ 2024 లోక్సభ ఎన్నికల సమయంలో విపరీతమైన ప్రజాదరణ పొందారు. తన రాజకీయ ఎత్తుగడలు, పొత్తులపై దేశవ్యాప్తంగా చర్చ జరిగింది.3. చిరాగ్ పాశ్వాన్: రాజకీయ నాయకుడుదివంగత కేంద్ర మంత్రి రామ్విలాస్ పాశ్వాన్ కుమారుడు చిరాగ్ పాశ్వాన్ నటనకు స్వస్తి చెప్పి రాజకీయాల్లోకి ప్రవేశించారు. మోడీ 3.0 కేబినెట్లో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.4. హార్దిక్ పాండ్యా: క్రికెటర్క్రికెట్లో ఆల్ రౌండర్గా పేరున్న హార్దిక్ పాండ్యా మోడల్ నటాసా స్టాంకోవిక్తో విడాకులు తీసుకున్నారు. దాదాపు నాలుగేళ్ల వైవాహిక జీవితానికి ముగింపు పలికారు.5. పవన్ కళ్యాణ్: రాజకీయ నాయకుడుప్రముఖ నటుడు, రాజకీయ నాయకుడు పవన్ కళ్యాణ్ 2024 జూన్లో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు.6. శశాంక్ సింగ్: కొత్త క్రికెట్ స్టార్శశాంక్ సింగ్ ఐపీఎల్ క్రికెట్లో తన అద్భుతమైన ఆటతో అందరి దృష్టిని ఆకర్షించారు.7. పూనమ్ పాండే: మోడల్, నటిగర్భాశయ క్యాన్సర్తో పూనమ్ పాండే మృతి చెందినట్లు ఆమె అనుచరులు తెలిపారు. తర్వాత అది ఫేక్ అని, తాను బతికే ఉన్నానని చెప్పింది.8. రాధిక మర్చెంట్: అంబానీ కోడలుజులైలో అనంత్ అంబానీతో గ్రాండ్ వెడ్డింగ్ నేపథ్యంలో రాధికా మర్చంట్ పేరు వైరల్గా మారింది.9. అభిషేక్ శర్మ: క్రికెటర్క్రికెటర్ అభిషేక్ శర్మ ఐపీఎల్లో అసాధారణ ప్రదర్శనతో అభిమానులను ఆకట్టుకున్నారు.10. లక్ష్య సేన్: బ్యాడ్మింటన్ క్రీడాకారుడు2024 పారిస్ ఒలింపిక్స్లో లక్ష్య సేన్ అద్భుతమైన ప్రతిభ కనబరిచారు. -
‘మోస్ట్ స్టైలిష్ పీపుల్ ఆఫ్ 2024’ జాబితాలో యువజంట (ఫొటోలు)
-
అనంత్-రాధిక అంబానీ ‘ప్రేమమందిరం’ దుబాయ్ లగ్జరీ విల్లా, ఫోటోలు
-
అనంత్-రాధికా అంబానీ అదిరిపోయే దుబాయ్ విల్లా, ఫోటోలు వైరల్
రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ, నీతా అంబానీ తమ చిన్న కొడుకు అనంత్ అంబానీకి అద్భుతమైన పెళ్లి కానుక ఇచ్చారు. అత్యంత వైభవంగా అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ వివాహాన్ని ఇటలీలో జరిపించిన అంబానీ దంపతులు అలాగే కనీవినీ ఎరుగని రీతిలో రెండు ప్రీ-వెడ్డింగ్ బాష్లు నిర్వహించారు. ఈ సందర్భంగా ఇటలీలోని ఓ క్రూజ్ షిప్లో భారీ పార్టీని ఏర్పాటు చేసారు. ఇందంతా ఒక ఎత్తయితే అంబానీలు తమ చిన్న కోడలు రాధికా మర్చెంట్కు దుబాయ్లో 640 కోట్ల విలువైన బంగ్లాను కానుకగా ఇచ్చారు. ఈ లగ్జరీ బంగ్లాకు సంబంధించిన ఫోటోలు ఇపుడు నెట్టింట సందడి చేస్తున్నాయి.దుబాయ్లోని ఫేమస్ పామ్ జుమైరాలో ఈ విలాసవంతమైన విల్లా ఉంది. దుబాయ్లో అత్యంత ఖరీదైన విల్లాలో ఇదొకటి. దాదాపు 3000 చదరపు అడుగుల్లో ఈ విల్లాను నిర్మించారు. ఈ విల్లా మొత్తంలో 10 బెడ్రూంలు, 70 మీటర్ల ప్రైవేట్ బీచ్ కూడా ఉంది. సొగసైన లివింగ్ రూమ్లు, బెడ్రూమ్లు విలాసవంతమైన బాత్రూమ్ల ఇలా ప్రతీది చాలా అందంగా, ఆకర్షణీయంగా ఉండేలా జాగ్రత్తపడ్డారట. ఇటాలియన్ మార్బుల్, అద్భుతమైన ఆర్ట్వర్క్తో అలంకరించిన 10 ఖరీదైన బెడ్రూమ్లు, ఆకట్టుకునే ఇంటీరియర్స్తో విల్లా ఒక అద్భుత కళాఖండంగా ఉంటుందని సమాచారం. ఇండోర్, అవుట్డోర్ పూల్స్ ఉన్నాయి. పాంపరింగ్ సెషన్ల కోసం ప్రైవేట్ స్పా, ప్రైవేట్ సెలూన్ కూడా ఉన్నాయి. పెద్ద కోడలు శ్లోకా మెహతాకి 450 కోట్ల ఖరీదైన బంగ్లాతో పాటు రూ. 200 కోట్ల ఖరీదైన నెక్లెస్ ఇచ్చారు. ఈ ఏడాది జులై 12న రాధిక, అనంత్ అంబానీ వివాహ వేడుక చాలా గ్రాండ్గా నిర్వహించిన సంగతి తెలిసిందే.👉 ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి ఇదీ చదవండి: పేరు మార్చుకున్న అంబానీ కోడలు : ఇకపై అధికారికంగా...! -
పేరు మార్చుకున్న అంబానీ కోడలు : ఇకపై అధికారికంగా...!
పెళ్లి తరువాత అమ్మాయిలకు అత్తింటి పేరు వచ్చి చేరడం సాధారణం. అయితే ఇది వారి వ్యక్తిగత ఇష్లాలు, ఆచారాలను బట్టి కూడా ఉంటుంది. తాజాగా రిలయన్స్ సామ్రాజ్యాన్ని సృష్టించిన అంబానీ ఇంటి కోడలు రాధికా మర్చంట్ పేరు మార్చుకుంది. పెళ్లి తర్వాత, రాధిక మర్చంట్ తన పేరులో 'అంబానీ'ని అధికారికంగా చేర్చుకుంది. రాధికా మర్చంట్ తన భర్త అనంత్ అంబానీ ఇంటిపేరును తన పేరులో చేర్చుకోవడంతో ‘రాధిక అంబానీ’గా అవతరించింది. వ్యాపారవేత్త విరేన్ మర్చంట్ కుమార్తె అయిన రాధికా మర్చంట్ తన చిరకాల బాయ్ఫ్రెండ్ అనంత్ అంబానీని ఈ ఏడాది జూలైలో పెళ్లాడింది. రాధిక తన తండ్రి వ్యాపారమైన ఎన్కోర్ హెల్త్కేర్కు డొమెస్టిక్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఉంది. ఇటీవల ఎంటర్ప్రెన్యూర్ ఇండియాతో మాట్లాడిన ఆమె తన భవిష్యత్ కెరీర్ ప్లాన్లను కూడా వివరించింది. ముఖ్యంగా దక్షిణాది మార్కెట్లలో తమ వ్యాపారాన్ని విస్తరించడంపై దృష్టి సారించినట్లు రాధిక వెల్లడించింది. దేశంలోని అన్ని ప్రాంతాలకు నాణ్యమైన ఆరోగ్య సంరక్షణ ఉత్పత్తులను తీసుకురావాలని ఆమె భావిస్తున్నట్టు తెలిపింది.ఇదీ చదవండి : Kartika Purnima 2024: 365 వత్తులు వెలిగిస్తే పాపాలు పోతాయా? -
అనంత్ అంబానీ వంతారాకు కొత్త అతిధులు
అనంత్ అంబానీ స్థాపించిన 'వంతారా' (Vantara) గురించి అందరికి తెలుసు. జామ్నగర్లో ఉన్న ఈ వన్యప్రాణుల రెస్క్యూ కేంద్రానికి మూడు ఆఫ్రికన్ ఏనుగులు విచ్చేసాయి. ఇందులో రెండు ఆడ ఏనుగులు, మరొకటి మగ ఏనుగు. వీటి వయసు 28 నుంచి 29 సంవత్సరాల మధ్య ఉన్నట్లు సమాచారం.వంతారాను ట్యునీషియాలోని ఒక ప్రైవేట్ జంతుప్రదర్శనశాల అధికారులు సంప్రదించి, ఆర్ధిక పరిస్థితుల కారణంగా ఏనుగుల పోషణ కష్టమైందని వెల్లడించింది. సుమారు 20ఏళ్ల క్రితం నాలుగు సంవత్సరాల వయసున్న 'అచ్తామ్, కనీ, మినా' అనే ఏనుగులు బుర్కినా ఫాసో నుంచి ట్యునీషియాలోని ఫ్రిగ్యుయా పార్కుకు వచ్చాయి. అప్పటి నుంచి అవి సుమారు 23 సంవత్సరాలు అక్కడి సందర్శకులను కనువిందు చేశాయి.ప్రస్తుతం ట్యునీషియాలో వాటి పోషణ భారమైంది. దీంతో భారతదేశంలోని వంతారాకు తరలించాలని నిశ్చయించారు. జాతీయ, అంతర్జాతీయ చట్టాలకు లోబడి ఏనుగులను ప్రత్యేకమైన చార్టర్డ్ కార్గో ఎయిర్క్రాఫ్ట్ ద్వారా భారత్కు తీసుకువచ్చారు. దీనికి సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.వంతారాకు విచ్చేసిన ఆఫ్రికా ఏనుగులు వివిధ ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వెటర్నరీ అధికారులు వెల్లడించారు. ఏనుగులకు జుట్టు రాలడం, చర్మం సంబంధిత సమస్యలు ఉన్నట్లు పేర్కొన్నారు. అచ్తామ్కు స్ప్లిట్ టస్క్ & మోలార్ టూత్ ఇన్ఫెక్షన్ ఉంది. కని ఏనుగు గోళ్లు పగిలినట్లు చెబుతున్నారు. కాబట్టి వీటికి సరైన వైద్య చికిత్స అవసరమని వైద్యులు పేర్కొన్నారు. ఈ ఏనుగులకు ప్రత్యేకమైన వసతిని కూడా వంతారాలో ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం.వంతారాఅనంత్ అంబానీ గుజరాత్లోని జామ్నగర్లో 3వేల ఎకరాల్లో వంతారా పేరుతో కృత్రిమ అడవిని ఏర్పాటు చేశారు. ఇందులో జంతువులు నివసించేందుకు వీలుగా సహజంగా ఉండేలా వసతులు ఏర్పాటు చేశారు. ఈ అడవిలో 25,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏనుగుల కోసం ప్రత్యేకంగా ఆసుపత్రి ఉంది. ఇది ప్రపంచంలోనే అతి పెద్దది. పూర్తిగా పోర్టబుల్ ఎక్స్రే యంత్రాలు, శస్త్ర చికిత్సల కోసం లేజర్ యంత్రాలు, పాథాలజీ ల్యాబ్లు, హైపర్బారిక్ ఆక్సిజన్ ఛాంబర్తోపాటు అధునాతన సదుపాయాలు ఉన్నాయి. -
లాల్బాగ్చాకు అనంత్ అంబానీ స్వర్ణకిరీటం
ముంబై: మహారాష్ట్ర రాజధాని ముంబైలో ప్రఖ్యాతి గాంచిన లాల్బాగ్చా రాజా వినాయకుడికి రిలయన్స్ సంస్థ చైర్మన్ ముకేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ రిలయన్స్ ఫౌండేషన్తో కలిసి భారీ విరాళం అందజేశారు. రూ.15 కోట్ల విలువైన 20 కిలోల స్వర్ణ కిరీటాన్ని తన ఆరాధ్య దైవానికి సమరి్పంచారు. లాల్బాగ్చా రాజా భారీ విగ్రహాన్ని గురువారం సాయంత్రం ఆవిష్కరించారు. అనంత్ అంబానీ వివాహం రాధికా మర్చంట్తో ఇటీవలే జరిగిన సంగతి తెలిసిందే. ఈ వివాహం తర్వాత వస్తున్న తొలి వినాయక చవితి కావడంతో స్వర్ణ కిరీటాన్ని తన ఇష్ట దైవానికి అందించినట్లు తెలుస్తోంది. -
ఐకానిక్ లాల్బాగ్చా రాజా వినాయకుడికి, అనంత్ అంబానీ బంగారు కానుక
గణేష్ ఉత్సవాలకు మహారాష్ట్రలోని ముంబై నగరం పెట్టింది పేరు. అందులోనూ ముంబైలోని ఐకానిక్ లాల్బాగ్చా రాజా వినాయక ఉత్సవం మరింత స్పెషల్గా ఉంటుంది. ఇప్పటికే లాల్బాగ్చా రాజా వినాయకుడి ఫస్ట్లుక్ను విడుదల చేశారు. తాజాగా పారిశ్రామిక వేత్త ముఖేష్ అంబానీ, గణనాథునిపై తమ భక్తిని, గౌరవాన్ని మరోసారి ఘనంగా చాటుకున్నారు. ముఖ్యంగా అనంత అంబానీ, రాధిక వివాహం తర్వాత తొలి వినాయక చవితి కావడంతో మరింత ప్రాధాన్యత సంతరించుకుంది.నవ వరుడు అనంత్ అంబానీ ముంబైలోని వినాయకుడికి ఘనమైన కానుకను బహూకరించారు. 20 కేజీల బంగారు కిరీటాన్ని గణేషుడికి బహుమతిగా ఇచ్చారు. దీని విలువ రూ.15 కోట్లు. ఈ కిరీటాన్ని దాదాపు 2 నెలల కష్టపడి తయారు చేసినట్లు కమిటీ వెల్లడించింది. సంప్రదాయ మెరూన్ కలర్ దుస్తుల్లో విలువైన ఆభరణాలకు తోడు ఈ ఏడాది బంగారు కిరీటంతో భక్తుల పూజలందుకోనున్నాడు గణేశుడు.కాగా 'కింగ్ ఆఫ్ లాల్బాగ్' అని పిలిచే లాల్బాగ్చా రాజా ముంబైలో అత్యధికంగా సందర్శించే గణేష్ మంటపం. ప్రతీ సంవత్సరం వేలాది మంది భక్తులు తరలివస్తారు. గత పదిహేనేళ్లుగా అనంత్ అంబానీ లాల్బాగ్చా రాజా కమిటీకి మద్దతుగా నిలుస్తున్నారు అనంత్ అంబానీ.लालबागचा राजाचे, प्रसिद्धी माध्यमांसाठी फोटो सेशन गुरुवार दिनांक 5 सप्टेंबर 2024 रोजी संध्याकाळी ठिक 7 वाजता करण्यात आले आहे. त्या वेळेची क्षणचित्रे.#lalbaugcharaja Exclusive live on YouTube :https://t.co/XAHhCLjBM6 pic.twitter.com/fg07hI096z— Lalbaugcha Raja (@LalbaugchaRaja) September 5, 2024 -
పారిస్లో కొత్తజంట..అథ్లెట్ల గురించి ఏం చెబుతున్నారంటే..
రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేశ్ అంబానీ చిన్న కుమారుడు, కోడలు అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ పారిస్ ఒలింపిక్స్లో సందడి చేశారు. భారత క్రీడాకారుల మ్యాచ్లు వీక్షించిన అనంతరం ఈ నవ దంపతులు మీడియాతో మాట్లాడారు. ఒలింపిక్స్లో పాల్గొనే భారత అథ్లెట్లు మరిన్ని పథకాలు సాధిస్తారని విశ్వసిస్తున్నట్లు చెప్పారు.ఈ సందర్భంగా అనంత్ అంబానీ మాట్లాడుతూ..‘దేవుడి దయతో భారత క్రీడాకారులు చాలా అద్భుతంగా రాణిస్తున్నారు. ఇండియా చాలా పతకాలు సాధిస్తుందని అనుకుంటున్నాను. భారత అథ్లెట్లు ప్రతి ఇండియన్ గర్వపడేలా చేస్తారని విశ్వసిస్తున్నాను’ అన్నారు. అనంత్ భార్య రాధిక మర్చంట్ మాట్లాడుతూ..‘పారిస్ ఒలింపిక్స్లో మొదటి ఇండియా మ్యాచ్ని వీక్షించినందుకు చాలా సంతోషంగా ఉంది. భారత్ ఆటగాళ్ల తీరు అద్భుతంగా ఉంది. మరింత ఉత్సాహంతో పోటీల్లో పాల్గొని మరిన్ని విజయాలు సాధిస్తారని నమ్ముతున్నాను. ఈ క్రీడల వల్ల చాలామంది యువకులు స్ఫూర్తి పొందుతున్నారు’ అని చెప్పారు.ఇదీ చదవండి: బ్యాంకు సర్వీస్ ప్రొవైడర్పై ర్యాన్సమ్వేర్ దాడి!పారిస్ ఒలింపిక్స్లో పాల్గొనే భారత క్రీడాకారులను ప్రోత్సహించేందుకు అక్కడ రిలయన్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ‘ఇండియా హౌజ్’ పేరుతో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భారత సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా దాన్ని రూపొందించారు. రిలయన్స్ ఫౌండేషన్ అధ్యక్షురాలు, ఐవోఏ సభ్యురాలు నీతా అంబానీ ఇటీవల ఇండియా హౌజ్లో భారతీయ క్రీడాకారుల విజయాలను సెలబ్రేట్ చేశారు. వారిని ప్రత్యేకంగా అభినందించారు. ఇప్పటికే రెండు పతకాలతో స్టార్ షూటర్ సరబ్జోత్ సింగ్, మనుభాకర్ పారిస్లో విజయఢంకా మోగించారు.#WATCH | #ParisOlympics2024 | Reliance Industries Chairman Mukesh Ambani's son Anant Ambani says, "I am sure that with god's grace, the Indian team will perform very well and we will win many medals. I am sure the Indian team will make every Indian like me proud."Anant Ambani's… pic.twitter.com/HzDwTwNsKn— ANI (@ANI) July 31, 2024 -
ప్యారిస్ ఒలింపిక్స్ : లవ్బర్డ్స్ సందడి, వీడియో వైరల్
రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ, నీతా అంబానీ దంపతుల చిన్నకుమారుడు, కోడలు అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ ప్యారిస్ ఒలింపిక్స్లో సందడి చేశారు. గతనెలలో(జూలై 12)న వివాహ బంధంతో ఒక్కటైన లవ్బర్డ్స్ వివాహ వేడుకలతరువాత విశ్వక్రీడా సంరంభం ఒలింపిక్స్ గ్యాలరీలో జంటగా మెరిసారు. అనంత్-రాధిక ఫోటోలు ఇంటర్నెట్లో వైరల్ అవుతున్నాయి. ప్యారిస్ ఒలింపిక్స్ వేడుకల్లో ఆసియా కుబేరుడుముఖేష్ అంబానీ, ఈషా అంబానీ, ఆమె భర్త ఆనంద్ పిరామిల్ పాల్గొంటున్నవీడియో కూడా సందడిగామారింది. రిలయన్స్ ఫౌండేషన్ ఛైర్ పర్సన్ అయిన నీతా ఒలింపిక్స్ గేమ్స్ జరుగుతున్న ప్రాంగణంలో ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ భాగస్వామ్యంతో ఏర్పాటు చేసిన తొలి ఇండియా హౌజ్ లాంచ్ చేశారు. భారతీయ టెక్స్టైల్స్, హ్యాండీక్రాఫ్ట్స్కు చెందిన వస్తువులు, ఇతక కళాఖండాలను ఇక్కడ ప్రదర్శనకు ఉంటాయి. అలాగే భారత స్టార్ షూటర్ సరబ్జోత్ సింగ్, మనుభాకర్ను నీతా అంబానీ ప్రత్యేకంగా అభినందించి, వారితో సెల్పీలు దిగి శుభాకాంక్షలు తెలిపిన సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Ambani Family (@ambani_update) -
నాలుక అబద్ధం చెప్పదు..
నీర్ దోసె అంటే నూనె వేయకుండా పెనం మీద నీటిని చల్లి వేసే దోసె. మైసూర్ మసాలా దోసె, రసం ఇడ్లీ, టొమాటో ఉప్మా, ఆనియన్ ఊతప్పం... ఇవన్నీ మనకు తెలిసినవే, ఖోట్టో... ఇది ఇడ్లీ పిండిని పనస ఆకులతో అల్లిన బుట్టలో వేసి ఆవిరి మీద ఉడికించే వంటకం. ఈ దక్షిణాది రుచుల పేరు చెబితే ముంబయి వాసుల నోట్లో నీళ్లూరతాయి. క్రికెట్ ప్లేయర్లు సునీల్ గవాస్కర్, సచిన్ టెండుల్కర్లు ఈ రుచుల కోసం ముంబయి నగరం, మాతుంగలో ఉన్న మైసూర్ కేఫ్ను విజిట్ చేసేవాళ్లు.స్వాతంత్య్రానికి ముందు 1936 నుంచి ముంబయిలో స్టవ్ వెలిగించిన ఈ కేఫ్కి గవాస్కర్, సచిన్ల కంటే ముందు ఏ ప్రముఖులు క్యూ కట్టారో తెలియదు. కొత్త పెళ్లికొడుకు అనంత్ అంబానీ ఆదివారాలు ఇక్కడే గడిచేవని ఇటీవల తెలిసింది. తన పెళ్లి వేడుకలో ఈ కేఫ్ స్టాల్ కూడా పెట్టించారు. వధువు రాధికా మర్చంట్కు ఈ కేఫ్ నిర్వహకురాలు శాంతెరీ నాయక్ను చూపిస్తూ ‘మీట్ మైసూర్ కేఫ్ ఓనర్’ అని పరిచయం చేశాడు. వధువు ఆ పెద్దావిడపాదాలను తాకి నమస్కరించింది. ఈ వీడియోతో శాంతెరీ ఒక్కసారిగా దేశం దృష్టిని ఆకర్షించింది.టూర్లో ‘టేస్ట్’ చూస్తాను..ముంబయి నగరం, మాతుంగ ఏరియాలో కింగ్స్ సర్కిల్ రైల్వేస్టేషన్ దగ్గర ఉంది మైసూర్ కేఫ్. శాంతెరీ నాయక్ మామగారు నాగేశ్ రామ నాయక్ ఈ కేఫ్ను స్థాపించాడు. కర్నాటక నుంచి ముంబయిలో అడుగు పెట్టి ఆహారమే తన కుటుంబానికి అన్నం పెడుతుందని నమ్మారాయన. ఆ నమ్మకాన్ని నిలబెట్టారు శాంతెరీ నాయక్. ఇప్పుడామె కుమారుడు నరేశ్ నాయక్ సహాయంతో కేఫ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ‘బెస్ట్ సౌత్ ఇండియన్ రెస్టారెంట్’ అనే ప్రజల ప్రశంసలే ఆమె అందుకున్న పురస్కారాలు. వివిధ ప్రదేశాలను పర్యటించడం ఆమె హాబీ. పర్యటనలో భాగంగా ఆయా ప్రదేశాల్లో ఏయే ఆహారాలు అందుబాటులో ఉంటున్నాయి, పర్యాటకులు ఏ రుచులను ఎక్కువ గా ఇష్టపడుతున్నారో గమనిస్తూ, వాటిని రుచి చూస్తానని చె΄్తారామె.కస్టమర్ అభిప్రాయమే తుదితీర్పు..‘‘వంటలను ఇష్టపడడమే నా సక్సెస్ ఫార్ములా. అమ్మకు సహాయం చేసే క్రమంలోనే రుచిగా వండడంలో మెళకువలు తెలిశాయి. అమ్మ వండిన పదార్థాలను ఇంటికి వచ్చిన అతిథులకు వడ్డించే బాధ్యత కూడా నాదే. వాళ్లకు ఏది నచ్చిందో అర్థమయ్యేది. అదే ఫార్ములాను కేఫ్ నిర్వహణలోనూ అనుసరించాను. మన ఉద్యోగులను నమ్మాలి, అంతకంటే ఎక్కువగా కస్టమర్లను నమ్మాలి. రుచి, అభిరుచుల విషయంలో కస్టమర్ల నోటి నుంచి వచ్చిన మాటే వేదవాక్కు. పదార్థాల రుచిని ఆస్వాదించిన నాలుక ఫీడ్ బ్యాక్ విషయంలో అబద్ధం చెప్పదు’’ అంటారు శాంతెరీ నాయక్. డెబ్బైఏళ్ల వయసులో కూడా చురుగ్గా, కేఫ్ నిర్వహణ పట్ల శ్రద్ధగా ఉన్నారామె. వార్థక్యం దేహానికి మాత్రమే, మనసుకు కాదు, పనిచేసే మనస్తత్వానికి కాదని నిరూపిస్తున్నారు శాంతెరీ నాయక్. -
అది ఫేక్ న్యూస్.. అంబానీ బుక్ చేసుకోలేదు
జులై 12న అనంత్ అంబానీ, రాధిక మర్చెంట్ వివాహం ముంబైలో ఎంతో వైభవంగా జరిగింది. అంబానీ ఇంట జరిగిన ఈ వేడుకలకు ప్రముఖ సెలబ్రిటీలు, పారిశ్రామిక దిగ్గజాలు, ఇతర దేశాల ప్రముఖులు హాజరయ్యారు. వీరి పెళ్ళికి సుమారు ఐదు వేలకోట్ల రూపాయలు ఖర్చు అయినట్లు సమాచారం.అనంత్, రాధికల వివాహానంతరం లండన్కు వెళ్లనున్నట్లు పలు మీడియా సంస్థలు ఇటీవల నివేదించాయి. అయితే వారు అక్కడ ఉండటానికి ప్రముఖ 7 స్టార్ లగ్జరీ హోటల్ & గోల్ఫింగ్ ఎస్టేట్ స్టోక్ పార్క్ను రెండు నెలలకు బుక్ చేసుకున్నట్లు పుకార్లు వచ్చాయి. కానీ ఇందులో ఎటువంటి నిజం లేదని స్టోక్ పార్క్ తన సోషల్ మీడియా ఖాతాలో అధికారికంగా వెల్లడించింది.సాధారణంగా మేము ప్రైవేట్ విషయాలపై స్పందించము. కానీ ఇటీవల వస్తున్న పుకార్లలో ఎటువంటి నిజం లేదని మీడియాలలో వస్తున్న పుకార్లలో నైజం లేదని స్టోక్ పార్క్ వెల్లడించింది. మొత్తానికి అంబానీ లండన్లో స్టోక్ పార్క్ బుక్ చేయలేదని స్పష్టమైపోయింది. View this post on Instagram A post shared by Stoke Park (@stokepark) -
అనంత్ పెళ్లిలో హైలెట్గా ఏనుగు ఆకారపు డైమండ్ బ్రూచ్..ఆ డిజైన్లోనే ఎందుకంటే..!
ఇటీవలే రిలయన్స్ ఇండస్ట్రీస్ దిగ్గజం ముఖేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ రాధికల వివాహం అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ వివాహ వేడుకలో వాళ్లు ధరించే దుస్తలు దగ్గర నుంచి డ్రస్లు, కార్లు అన్ని హైలెట్గా నిలిచాయి. అవన్నీ ఒక ఎత్తు అయితే..ఆ వివాహ వేడుకలో అంబానీలంతా పైజామకు ధరించిన ఏనుగు ఆకారపు డైమండ్ పతకం అత్యంత హైలెట్గా నిలిచింది. ముఖేశ్తో సహా అనంత్, ఆకాశ్ అందరూ ఈ ఆకారపు ఆభరణాన్నే ధరించారు. దీని వెనుక దాగున్న ఆసక్తికర స్టోరీ ఏంటని అక్కడున్న వాళ్లందరూ చర్చించుకున్నారు. ఎందుకిలా వారంతా ఆ జంతువు ఆకృతిలో డిజైన్ చేసిన ఆభరణం ధరించారంటే..ఈ ఆభరణాన్ని కాంతిలాల్ ఛోటాలాల రూపొందించారు. అనంత్ అమిత జంతు ప్రేమికుడు. అతని వెంచర్ వంతారాలో వన్యప్రాణులు సంరక్షణ కోసం అనంత్ ఎంతగానో కేర్ తీసుకుంటాడు. అందుకు నిదర్శనంగా ఇలా ఏనుగు ఆకారపు డైమండ్ బ్రోచ్లను సదరు ఆభరణాల వ్యాపారులు తయారు చేశారు. నీతా అంబానీ సూచన మేరకు ఇలా అంబానీ కుటుంబంలోని మగవాళ్లంతా ధరించేలా ఏనుగు ఆకారపు ఆభరణాలను రూపొందించారట. ఈ పతకం జామ్నగర్లోని వంటరా వద్ద వన్య ప్రాణుల సంరక్షణ కోసం అనంత్ చేస్తున్న కృషికి గుర్తుగా ఇలాంటి వజ్రాలతో రూపొందించిన ఏనుగు ఆకారపు బ్రోచెస్ తయారు చేసినట్లు ఆభరణ వ్యాపారులు చెప్పుకొచ్చారు. అలాగే ఈ ఆభరణాన్ని రూపొందించడంతో నీతా కూడా తమకు సహకారం అందించినట్లు తెలిపారు. అనంత్కి మాత్రమే గాక ఆమె మనవడికి ఏనుగులంటే మహా ఇష్టమని చెబుతున్నారు. ఇక్కడ అంబానీలు ధరించే బ్రూచ్ గంభీరమైన అరణ్యాన్ని ప్రదర్శించేలా పచ్చలు, వజ్రాలతో ఏనుగు ఆకృతిలో ఈ ఆభరణాన్ని అందంగా తీర్చిదిద్దారు. View this post on Instagram A post shared by Kantilal Chhotalal (@kantilalchhotalal)(చదవండి: స్టైల్ ఐకాన్ నటాషా పూనావాలా గ్లాస్ మాదిరి పర్సు ధర ఎంతంటే..?) -
అయిందా.. బాగయిందా.. అంబానీని కూడా వదిలిపెట్టవా? (ఫోటోలు)
-
అనంత్ అంబానీ బూండీ జాకెట్..రియల్ గోల్డ్తో ఏకంగా 110 గంటలు..!
అనంత్ రాధికల వివాహ వేడుకలు అత్యంత ఘనంగా ముగిశాయి. అయితే ఆ వేడుకులో అంబానీ కుటుంబ సభ్యలు ధరించిన నగలు, డిజైనర్ వేర్లు గురించి నెట్టింట హాట్టాపిక్గా నిలిచాయి. ఇంతవరకు నీతా, ఇషా, రాధికల డిజైనర్ వేర్లు, నగలు గురించి విన్నాం. కానీ అనంత్ ధరించిన డ్రస్ కూడా అత్యంత ఖరీదైనదే గాక స్పెషల్ అట్రాక్షన్గా నిలిచింది. భారతీయ హస్తకళను అంబానీలు గౌరవిస్తారు అనేలా వారి ధరించే ప్రతి డిజైనర్వేర్లో కచ్చితంగా ఎంబ్రాయిడరీ ఉంటుంది. అదీ కూడా భారత పురాత సంప్రదాయ ఎంబ్రాయిడరీ మెళుకువలే ఎక్కుగా ఉండటం విశేషం. అనంత్ తన వివాహ వేడుకలో మనీష్ మల్హోత్రా డిజైనర్ వేర్ బూండీ జాకెట్ని ధరించాడు. దీనిపై చేతితో ఎంబ్రాయిడరీ చేసిన డిజైన్ ఉంటుంది. దీన్ని నిమైన బంగారంతో అలంకరించారు. రాజస్థాన్లోని నాథద్వారా ఆలయానికి సంబంధించిన పిచ్వాయ్ పేయింటింగ్ ఆధారంగా రూపొందించారు. ఇది కృష్ణుడి జీవితంలోని ఇతివృత్తాలను వర్ణిస్తుంది. ఇందులో తామరలు, చెట్లు, ఆవులు, నెమళ్లు తదితరాలు ఉంటాయి. ముగ్గురు భిల్వారా కళాకారులచే 600 గంటలకు పైగా కష్టపడి రూపొందించారు. దీనిపై సుమారు 100 రియల్ బంగారు ఆకులను వినియోగించారు. View this post on Instagram A post shared by Manish Malhotra (@manishmalhotra05) ఇంతకీ పిచ్వై ఆర్ట్వర్క్ అంటే..పిచ్వాయ్ పెయింటింగ్ అనేది రాజస్థాన్లోని నాథద్వారా నుంచి ఉద్భవించిన సాంప్రదాయ భారతీయ కళారూపం. ఇది ప్రధానంగా శ్రీకృష్ణుని ఆరాధనతో ముడిపడి ఉంది. ముఖ్యంగా శ్రీనాథ్జీగా అతని అభివ్యక్తిలో. ఈ క్లిష్టమైన పెయింటింగ్లు సాధారణంగా వస్త్రంపై వేస్తారు. వాటిని ఆలయ హాంగింగ్లుగా ఉపయోగిస్తారు అని ప్రొఫెసర్ ఫులారి పంచుకున్నారు.పిచ్వాయ్ పెయింటింగ్స్ చరిత్ర 17వ శతాబ్దానికి చెందినది. ఈ సంప్రదాయం నాథద్వారాలో ప్రారంభమయ్యింది. ఇది హిందూమతంలోని పుష్టిమార్గ్ శాఖ అనుచరులకు ప్రముఖ పుణ్యక్షేత్రం. భక్తుల కోసం కృష్ణుడి కథలను దృశ్యమానంగా వివరించే లక్ష్యంతో, కృష్ణుడి జీవితంలోని ముఖ్యమైన ఘట్టాలను చిత్రీకరించేలా ఆలయ కళాకారులు చిత్రలేఖనాలు సృష్టించారు. కాలక్రమేణా ఈ సంప్రదాయం పరిణామం చెందింది. కళాకారులు తమ నైపుణ్యాలను తమ తరాలకు అందించి ఈ కళను నిలిచిపోయేలా చేశారు. ఈ ఆర్ట్లో ఉండే ప్రత్యేకత క్లిష్టమైన వివరాలు, శక్తిమంతమైన రంగులు. ముఖ్యంగా కళారూపంలో కృష్ణుడితో కూడిన విస్తృతమైన దృశ్యాలను రూపొందించే అద్భుతమైన కుంచె పని ఉంటుంది. దీనిలో తరచుగా గోపికలు, ఆవులు, తామరలు, అతని దివ్య నాటకం (లీలలు) తదితర చిహ్నాలు ఉంటాయి. అందుకోసం ఖనిజాలు, కూరగాయల నుంచి తయారు చేసిన సహజ రంగులను ఉపయోగించడంతో ఆ ఆర్ట్ మరింత ప్రత్యేకతను సంతరించుకుంటుందని ప్రొఫెసర్ ఫులారి వివరించారు. అయితే ఈ పెయింటింగ్ మరింత హైలెట్ అయ్యేలా ఒక్కోసారి 24 క్యారెట్ల బంగారాన్ని వినియోగిస్తుంటారని కూడా చెప్పారు. ఈ కళ దృశ్యమాన ఆనందాన్నే కాకుండా ఆధ్యాత్మిక అనుభవాన్ని కూడా అందిస్తుంది. (చదవండి: ఇదేం వింత చట్టం! భార్య పుట్టినరోజు మర్చిపోవడమే నేరమా..!) -
అంబానీ పెళ్లి సందడి : జెఫ్ బెజోస్, ఇతర దిగ్గజాల కళ్లు చెదిరే కానుకలు
రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ పెళ్లి వేడుక ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఆకాశమంతపందిరి, భూదేవి అంత పీట అనే మాట వినడమే గానీ ఎపుడూ చూడని చాలామందికి ఇలా ఉంటుందా అనేట్టుగా కనీవినీ ఎరుగని రీతిలో మూడు రోజుల పాటు వేడుక జరిగింది. జూలై 12, 2024న గ్రాండ్ వెడ్డింగ్ సెలబ్రేషన్స్కు ప్రపంచ వ్యాప్తంగా పద్నాలుగు వేల మంది హాజరయ్యారు. సుమారు రూ. 5వేల కోట్లు ఖర్చు చేసినట్టు పలు మీడియా నివేదికల ద్వారా తెలుస్తోంది. అలాగే దేశ, విదేశాలనుంచి విచ్చేసిన అతిథులకు బహుమతులను అంతే ఘనంగా అందించారు. అయితే ఇపుడు తాజాగా అనంత్-రాధిక గ్రాండ్ వెడ్డింగ్కు విచ్చేసిన గ్గోబల్ దిగ్గజాలు నూతన వధూవరులకు ఇచ్చిన కానుకలపై తాజా చర్చ నడుస్తోంది.కొత్త జంట అనంత్ అంబానీ-రాధిక మర్చంట్లకు కొందరు హై-ప్రొఫైల్ అతిథులు ఖరీదైన విగ్రహాలు , పెయింటింగ్లను అందించారు. ఇంటర్నేషన్ గెస్ట్లు మాత్రం వీటన్నింటికీ మించిన కోట్ల విలువ చేసే కార్లను గిప్ట్లుగా అందించారట. ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసిన వీడియో ప్రకారం, అమెజాన్ సీఈవో జెఫ్ బెజోస్ వారికి బుగాట్టి కారును బహుమతిగా ఇచ్చారు. దీని రూ. 11.50 కోట్లు.అమెరికన్ నటుడు , ప్రొఫెషనల్ రెజ్లర్, జాన్ సెనా వారికి రూ. 3 కోట్ల విలువైన లంబోర్ఘిని బహుమతిగా ఇచ్చాడు. ఫేస్బుక్ సీఈవో మార్క్ జుకర్బర్గ్ వారికి రూ. రూ. 300 కోట్లు విలువైన కానుక ఇచ్చారట. ఇక బిల్ గేట్స్ రూ. 9 కోట్ల విలువైన డైమండ్ రింగ్ ఇచ్చారని తెలుస్తోంది. 9 కోట్లు. అంతేకాదు బిల్ గేట్స్ రూ. రూ. 180 కోట్ల విలువైన లగ్జరీ యాచ్ను ఇచ్చినట్టు మరో వీడియో ద్వారా తెలుస్తోంది. గూగుల్ , అల్ఫాబెట్ సీఈవో సుందర్ పిచాయ్ 100 కోట్ల రూపాయల విలువైన హెలికాప్టర్ను బహుమతిగా ఇచ్చారు. అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్ కొత్తగా పెళ్లయిన జంటకు అమెరికాలోని రూ. 80 కోట్ల విలువ జేసే లగ్జరీ భవనాన్ని కానుకగా ఇచ్చినట్టు తెలుస్తోంది. -
అనంత్ అంబానీ - రాధిక వెడ్డింగ్ : అందమైన ఫోటోలు
-
అనంత్ ప్రేమంతా : అందమైన రాధిక వెడ్డింగ్ లెహెంగా పైనే
ఫ్యాషన్, ఫైన్ ఆర్ట్ అద్భుతమైన కలయికతో రూపుదిద్దుకున్న వెడ్డింగ్ లెహంగా డ్రెస్ ఇది. అనంత్ అంబానీతో రాధికా మర్చంట్ వివాహం కోసం ఆర్టిస్ట్ జయశ్రీ బర్మన్ డిజైనర్ ద్వయం అబు జానీ సందీప్ ఖోస్లాతో కలిసి ఈ చిత్రకళ లెహంగాను రూపొందించారు.రోజుకు 16 గంటలు, నెలరోజుల పాటు జయశ్రీ బర్మన్ ఢిల్లీలోని తన స్టూడియోలో ఒక నెల మొత్తం ఈ లెహంగా ఫ్యాబ్రిక్పై పెయింటింగ్ చేయడానికి వెచ్చించింది.‘అనంత్–రాధికల కలయికకు ప్రతీకగా ఖగోళ మానవ బొమ్మలు, జంతుజాలం, ముఖ్యంగా ఏనుగులపై అనంత్కు ఉన్న ప్రేమను చూపేలా ఈ సృజనాత్మక కళ రూపుదిద్దుకుంది’ అని వివరించే బర్మన్ రోజుకు 15–16 గంటల సమయాన్ని ఈ ఆర్ట్వర్క్కు కేటాయించినట్టుగా వివరించింది. కోల్కతాలో జన్మించిన జయశ్రీ బర్మన్ ఇండియన్ ఆర్టిస్ట్గా గుర్తింపు పొందారు. పెయింటింగ్లో మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ డిగ్రీ,ప్యారిస్ లో ప్రింట్ మేకింగ్ కోర్సు చేసిన బర్మన్ తన పెయింటింగ్ ద్వారా పౌరాణిక కథలను కళ్లకు కడతారు. ఆర్టిస్ట్గానే కాదు, రచయిత్రిగానూ జాతీయ అవార్డులు అందుకున్న ఘనత బర్మన్ది. -
అనంత్-రాధిక పెళ్లిపై నటుడి సెటైర్స్.. బంధాలు నిలబడట్లేదంటూ..
అప్పు చేసైనా సరే పెళ్లి గ్రాండ్గా చేస్తామంటున్నాయి మధ్యతరగతి కుటుంబాలు. వివాహం కోసం స్థోమతకు మించి మరీ ఖర్చు చేస్తున్నారు. పెళ్లి వేడుకలు అందరికీ గుర్తుండిపోయేలా చేయాలని ఆరాటపడుతున్నారు. వీళ్ల పరిస్థితే ఇలా ఉంటే దిగ్గజ పారిశ్రామికవేత్త, వేలకోట్ల సంపన్నుడు ముఖేశ్ అంబానీ ఇంట పెళ్లంటే ఇంకెలా ఉండాలి? దేశమంతా మార్మోగిపోదు!సెలబ్రేషన్స్ చేసినన్ని రోజులు కలిసుండట్లేదుఈ ఏడాది మార్చిలో అనంత్ అంబానీ- రాధిక మర్చంట్ ప్రీవెడ్డింగ్ వేడుకలు షురూ అయ్యాయి. అప్పటినుంచి ఇప్పటివరకు సెలబ్రేషన్స్ జరుగుతూనే ఉన్నాయి. జూలై 12న వీరి పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. త్వరలోనే వీరు లండన్కు వెళ్లి అక్కడ కూడా పోస్ట్ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ మొదలుపెట్టనున్నారట! ఈ వేడుకలపై పాకిస్తాన్ నటుడు అర్సలన్ నజీర్ సోషల్ మీడియాలో సెటైర్స్ వేశాడు. ఈ రోజుల్లో పెళ్లి వేడుకలు ఎన్నాళ్లు జరుపుకుంటున్నారో.. కనీసం అంతకాలం కూడా బంధాలు నిలబడటం లేదు అని ఇన్స్టాగ్రామ్ స్టోరీలో రాసుకొచ్చాడు.నీకేంటి సమస్య?ఇది చూసిన జనాలు నటుడిని తిట్టిపోస్తున్నారు. 'వాళ్లు సంతోషంగానే ఉన్నారు.. మధ్యలో నీకేంటి సమస్య?', 'వాళ్లను చూసి కుళ్లుకుంటున్నావ్ కదూ..', 'అనంత్-రాధిక చిన్ననాటి స్నేహితులు.. వారి ప్రేమలో నిజాయితీ ఉంది. వారి బంధం తెగిపోయేంత బలహీనమైంది కాదు', 'నీ డబ్బుతో సెలబ్రేట్ చేసుకోవడం లేదుగా.. మరి నువ్వెందుకు అంత బాధపడుతున్నావ్..' అంటూ రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు.చదవండి: ఐశ్వర్య- అభిషేక్ దాగుడుమూతలు.. కలిసున్నారా? విడిపోయారా? -
కొత్త కోడలి అదృష్టం!! పెళ్లి తర్వాత రూ.25వేల కోట్ల సంపద!
అపర కుబేరుడు, ఆసియాలోనే అత్యంత సంపన్నుడు ముఖేష్ అంబానీ కొడుకు అనంత్ అంబానీ వివాహం రాధిక మర్చంట్తో జూలై 12న అత్యంత ఘనంగా, విలాసవంతంగా జరిగింది. ఈ వివాహం తర్వాత రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ సంపద గణనీయంగా పెరిగింది.పెళ్లికి విపరీతంగా ఖర్చు చేసినా ముఖేష్ అంబానీ సంపద మాత్రం తగ్గలేదు. అంతకు ఐదింతలు పెరిగింది. జాతీయ వార్తాసంస్థ ఆజ్తక్ ప్రకారం, పెళ్లి తర్వాత అంబానీ నెట్వర్త్ రూ.25,000 కోట్లు (3 బిలియన్ డాలర్లు) పెరిగింది. బ్లూమ్బెర్గ్ బిలియనీర్ ఇండెక్స్ జూలై 5న అంబానీ నెట్వర్త్ 118 బిలియన్ డాలర్లుగా పేర్కొంది. జూలై 12 నాటికి ఇది 121 బిలియన్ డాలర్లకు పెరిగింది.ఈ అసాధారణ పెరుగుదల ప్రపంచ సంపద ర్యాంకింగ్స్లో ముఖేష్ అంబానీ స్థానాన్ని పెంచింది. ప్రపంచంలోని అత్యంత సంపన్న వ్యక్తులలో అంబానీ స్థానం 12 నుంచి 11వ స్థానానికి ఎగిసింది. ఆసియాలోనే అత్యంత సంపన్నుడిగా ముఖేష్ అంబానీ కొనసాగుతున్నారు. అంబానీ నెట్వర్త్ పెరగడానికి రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ల పటిష్ట పనితీరు కారణమని చెప్పవచ్చు. పెళ్లి రోజున, రిలయన్స్ షేర్లు 1% పెరిగాయి. గత నెలలో షేర్లు 6.65% పెరిగాయి. గత ఆరు నెలల్లో 14.90% రాబడిని అందుకున్నారు. -
అంబానీ గ్రాండ్ వెడ్డింగ్ : సింగర్ శ్రేయా మునుపెన్నడూ చూడని లుక్స్
-
అనంత్ రాధికల పెళ్లిలో లలితా డిసిల్వా..!ఇన్నేళ్ల తర్వాత కూడా..
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ నీతాల చిన్న కుమారుడు అనంత్-రాధికల వివాహ వేడుకులు అంగరంగ వైభవంగా ముగిశాయి. ఎందరో ప్రుముఖులు, బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ సినీ తారలు, సెలబ్రెటీలు పెద్ద ఎత్తున ఈ వేడుకకు విచ్చేశారు. ఈ వేడుకలో కేవలం సెలబ్రెటీలు, సినీ ప్రముఖులకు మాత్రమే గాదు తమ కుటుంబానికి సేవ చేసిన వారిని గుర్తుపెట్టుకుని మరీ పిలచింది అంబానీ కుటుంబం. అనంత్ రాధికల వివాహంలో బాగా హైలెట్గా నిలిచింది లలితా డిసిల్వా. అనంత్ పెళ్లికి వచ్చిన వారంలా ఈ లలితా డిసిల్వా గురించి మాట్లాడుకున్నారు. చెప్పాలంటే ఆ వివాహంలో ఆమెనే హాట్టాపిక్గా మారింది. ఇంతకీ ఆమె ఎవరంటే.. View this post on Instagram A post shared by Lalita Dsilva (@lalitadsilva2965)లలితా డిసిల్వా కరీనా కపూర్ సైఫ్ అలీ ఖాన్ల కుమారులు తైమూర్, జెహ్ల సంరక్షణ చూచుకునే నానీ. ఆమె అనంత్ పెళ్లిలో సందడి చేయడం ఏంటని అనుకోకండి. ఎందుకంటే..? ఆమె ఒకప్పుడూ అనంత్ బాల్యంలో అతడి సంరక్షణ బాధ్యతలు చూసుకున్న నానీనే లలితా డిసిల్వా. ఇన్నేళ్లు గడిచిపోయినా..అంబానీ కుటుంబం తనను గుర్తించుకుని మరీ ఇలా అనంత్ రాధికల పెళ్లికి పిలవడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తూ నాడు అనంత్ బాధ్యతలను చూసుకున్న ఫోటోలను కూడా షేర్ చేశారు. View this post on Instagram A post shared by Lalita Dsilva (@lalitadsilva2965) అనంత్ బాబు, అంబానీ కుటుంబం తన జీవితంలోకి తెచ్చిన ఆనందం, ప్రేమలను ఎన్నటికీ మర్చిపోలేను. అతను చాలామంచి అబ్బాయి అని అన్నారు. అతను ఈ గొప్ప వేడుకతో సంతోషకరమైన వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతున్న అనంత్కి శుభాకాంక్షలు అని పోస్ట్లో పేర్కొన్నారు. దేవుడు ఈ జంటను తప్పక ఆశీర్వదిస్తారు అని అన్నారు. ఆమె ఇప్పుడూ టాలీవుడ్ హీరో రామ్ చరణ్ ఉపాసనల కుమార్తె క్లిన్ కారాకు నానీ కూడా. ఆమె ఈ నేపథ్యంలో తాను పనిచేసిన సెలబ్రెటీ కుటుంబాలతో కలిసి దిగిన ఫోటోలను సైతం షేర్ చేసింది.(చదవండి: 'లావెండర్ వివాహం' అంటే..? చాలామంది దీన్నే ఎంచుకోవడానికి రీజన్..?) -
నీతా అంబానీ ప్రసంగం: తండ్రీ కూతుళ్ల భావోద్వేగం
బిలియనీర్ ముఖేష్ అంబానీ, నీతా దంపతుల చిన్న కుమారుడు అనంత్ అంబానీ , రాధికా మర్చంట్ వివాహవేడుకలు ఘనంగా ముగిసాయి. ప్రతీ వేడుకను ఘనంగా నిర్వహించడం మాత్రమే కాదు, దేశ విదేశాలనుంచి వచ్చిన అతిథులెవ్వరికీ ఏలోటూ లేకుండా చాలా శ్రద్ధ వహించి, శభాష్ అనిపించుకున్నారు నీతా అంబానీ. పెళ్లిలో అత్యంత కీలకమైందీ, ప్రతీ గుండెను ఆర్ద్రం చేసే సన్నివేశంలో కూడా నీతా తన పెద్దరికాన్ని చాటుకున్నారు. రాధిక కన్యాదానం సమయంలో నీతా ఉద్వేగ ప్రసంగం నెట్టింట వైరల్గా మారింది.Nita Ambani explains the broader significance of Kanyadaan as a union where two families come together, one gaining a son and the other a daughter. Speaking just before the Kanyadaan ceremony during Anant and Radhika's wedding, Mrs. Ambani underscores the importance of daughters… pic.twitter.com/URjchATLTf— Filmfare (@filmfare) July 16, 2024కొత్తకోడలు రాధిక మర్చంట్ను తన కోడలిగా ఆనందంతో కుటుంబంలోకి స్వాగతించడమే కాకుండా, రాధిక తల్లిదండ్రులు వీరేన్ మర్చంట్ , శైలా మర్చంట్లకు ఆమె భరోసా ఇచ్చిన తీరు విశేషంగా నిలిచింది. ‘‘కూతుర్ని ఇవ్వడం అంత తేలిక కాదు. తమ గుండెల్లో దాచుకుని పెంచుకున్న కూతుర్ని మెట్టింటికి పంపడం, ఆ భారాన్ని భరించడం కష్టం. నేనూ ఒక కూతురిని, ఒక కూతురికి తల్లిని , అత్తగారిని. రాధికను మా కూతురిలా చూసుకుంటాం. ఆడపిల్లలే పెద్ద వరం. మన ఆడపిల్లలు మన ఇంటిని స్వర్గంగా మారుస్తారు. మీరు మీ కుమార్తెను మాకు ఇవ్వడం కాదు, మరో కొడుకును, కొత్త కుటుంబాన్ని పొందారంటూ వారికి ధైర్యం చెప్పారు. అలాగే మీకు అనంత్ ఏంతో, మాకు రాధిక కూడా అంతే’’ అంటూ రాధిక పేరెంట్స్ను ఊరడించారు. ఈ సందర్భంగా హిందూ వివాహ ఆచారాల్లో కన్యాదానం అంటే ఏమిటో, అమ్మాయిని లక్ష్మితో సమానంగా భావిస్తారంటూ కుమార్తె ప్రాముఖ్యత ఏంటో ప్రపంచ అతిథుల ముందు నీతా అంబానీ వివరించారు. దీంతో నూతన వధువు రాధిక, ఆమె తల్లితండ్రులతోపాటు అక్కడున్న వారంతా భావోద్వేగానికి లోనయ్యారు. నీతా అంబానీ వాగ్దానం‘‘ముఖేష్, నేను మా కుమార్తెగా, అనంత్ సహచరిగా, ఇషా, ఆనంద్,, శ్లోక, ఆకాష్ మాదిరిగానే రాధికను కూడా గుండెల్లో పెట్టుకుని ప్రేమిస్తాం, రక్షిస్తామని వాగ్దానం చేస్తున్నాం. పృథ్వీ, ఆదియా, కృష్ణ, వేదాలకు మంచి అత్త, పిన్ని దొరికింది. నా ప్రియమైన రాధికను హృదయపూర్వకంగా మా ఇంట్లో అతి పిన్న వయస్కురాలిగా శ్రీమతి రాధిక అనంత్ అంబానీగా స్వాగతిస్తున్నాం’’ అంటూ చోటీ బహూను అందరి కరతాళ ధ్వనుల మధ్య అంబానీ కుటుంబంలోకి ఆమెను ఆహ్వానించారు. జామ్ నగర్లో అనంత్ అంబానీ-రాధికకు ఘనంగా ఆహ్వానం పలుకుతున్న వీడియో నెట్టింట్ సందడి చేస్తోంది. View this post on Instagram A post shared by Instant Bollywood (@instantbollywood) కాగా జూలై 12న అనంత్ అంబానీ తన చిరకాల ప్రేయసి రాధికా మర్చంట్తో కలిసి వివాహ బంధంలోకి అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో 3 రోజుల పాటు వివాహ వేడుకలన్నీ అట్టహాసంగా జరిగాయి. అనంతరం అనంత్, రాధిక దంపతులకు శుభప్రదమైన ఆశీర్వాద కార్యక్రమం మంగళ్ ఉత్సవ్ లేదా గ్రాండ్ రిసెప్షన్ నిర్వహించారు ఈ గ్రాండ్ వెడ్డింగ్కు హాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ సెలబ్రిటీలు, దేశ విదేశాలకు చెందిన క్రీడా, రాజకీయ, వ్యాపార దిగ్గజాలు హాజరయ్యారు. -
అంబానీ ఇంట అందగాడు
అందమైన కాలర్తో పింక్, గోల్డెన్ జాకెట్ ధరించి అనంత్ అంబానీ కుటుంబ వస్త్రధారణతో పోటీ పడుతూ వివాహ కార్యక్రమాల్లో తనూ విశేషంగా ఆహూతులను ఆకట్టుకుంది ‘హ్యాపీ’ అనే డాగ్. అహ్మదాబాద్కు చెందిన ఖ్యాతి అండ్ కరణ్ షా పంఖ్ డిజైనర్ పెట్ వేర్ దుస్తులను డిజైన్ చేసింది. స్వచ్ఛమైన సిల్క్ జాక్వర్డ్ ఫ్యాబ్రిక్తో ఆమె అంబానీల కోసం తయారు చేసిన పెంపుడు జంతువుల దుస్తుల్లో ఇది ఇరవై తొమ్మిదవది. వివాహ వేడుకలు జరుగుతున్నంతసేపూ హ్యాపీ హాయిగా మండపంపై తన స్థానాన్ని ఆక్రమించుకుని, చుట్టూ పరిశీలిస్తూ, చిత్ర విచిత్ర విన్యాసాలతో వీడియోల్లో సందడి చేసింది. ఇషా అంబానీ కూతురు బేబీ ఆదియుశక్తి ప్రేమతో హ్యాపీని ఆలింగనం చేసుకుంటుండగా, ఆమె తండ్రి ఆనంద్ పిరమల్ కూతురును అనుసరిస్తూ కనిపిస్తాడు. ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన ఈ వీడియోని ‘అత్యంత అందగాడు’ అంటూ అభివర్ణించారు వ్యూవర్స్. అంబానీ కుటుంబం పెంపుడు జంతువు హ్యాపీ ఈ యేడాది జనవరిలో అనం –రాధికల నిశ్చితార్థంలో ఉంగరం మోసే పాత్రను పోషించింది. అప్పుడే అంబానీ కుటుంబ ఫొటోలో ఇది ప్రధాన స్థానం పోందింది. -
అనంత్-రాధిక రిసెప్షన్ : అంబానీ మనవడి రియాక్షన్, వైరల్ వీడియో
బిలియనీర్,రిలయన్స్ అధినేత ముఖేష్, నీతా అంబానీ చిన్న కుమారుడు రాధిక మర్చంట్ పెళ్లి వేడుకలు అంగరంగ వైభవంగా ముగిసాయి. పెళ్లి తరువాత శుభ్ ఆశీర్వాద్ , మంగళ్ ఉత్సవ్లను నిర్వహించారు గత కొన్ని రోజులుగా గ్రాండ్ వెడ్డింగ్కు సంబంధించిన ఏదో ఒక ముచ్చట సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి. తాజాగా అనంత్-రాధిక వెడ్డింగ్ రిసెప్షన్లో అంబానీ వారసుడు పృథ్వీ ఆకాశ్ అంబానీకి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది.అంబానీ పెద్దకుమారుడు ఆకాష్ అంబానీ, శ్లోకాకుమారుడు పృథ్వీ అంబానీ సందడి ప్రత్యేకంగా నిలుస్తోంది. అనంత్, రాధిక పెళ్లి తరువాత అంబానీ ఫ్యామిలీ అంతా ఫోటోకు ఫోజులిస్తుండగా అకస్మాత్తుగా పరిగెత్తుకుంటూ వచ్చిన పృథ్వీ రాధిక కాళ్ల దగ్గర జారి పడి పోయాడు. కానీ వెంటనే లేచి సర్దుకున్నాడు. దీంతో తల్లి శ్లోకా కంగారుపడుతూ ముందుకొచ్చింది. ఇంతలో నానమ్మ అతడికి మైక్ అందివ్వగా జై శ్రీకృష్ణ అంటూ ముద్దుగా చెప్పాడు. దీంతో ఆశ్చర్యపోవడం అందరి వంతైంది.Wow what a landing...Chalo koi to nikla humhre jesa inki family me 😂😃😃 pic.twitter.com/pRMBdKaC1Z— Piku (@RisingPiku) July 15, 2024 -
ఏంటి బాబోయ్ ఈ అందం..చూపులతోనే కట్టిపడేస్తున్న తమన్నా (ఫొటోలు)
-
అంబానీ గ్రాండ్ వెడ్డింగ్ వేడుకలో తెలుగు వీణ సందడి
పరాంకుశం వీణాశ్రీవాణి... ఆమె పేరులోనే సరిగమల శ్రుతి వినిపిస్తోంది. అమలాపురంలో ఓ చిన్న అగ్రహారం అమ్మాయి శ్రుతి చేసిన వీణ ఇప్పుడు అంబానీ ఇంటి వేడుకలో సరిగమలతో అలరించింది. ఆ ఆనంద క్షణాలను ఆమె సాక్షి ఫ్యామిలీతో పంచుకున్నారు. ‘‘మాది అమలాపురం జిల్లా ఇందుపల్లి అగ్రహారం. బండారులంకలోని పిచ్చుక సీతామహాలక్ష్మి గారి దగ్గర సంగీతం నేర్చు కున్నాను. ఈ రోజు ఇన్ని ప్రశంస లందుకుంటున్నానంటే ఆమె నేర్పిన సంగీత జ్ఞానమే కారణం. అంబానీ కుటుంబంలో పెళ్లి వేడుకకు వీణావాదన చేయడానికి ఆహ్వానం రావడంతో ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే నా పేరు వాళ్లకు తెలిసే అవకాశమే లేదు. నేను సోషల్ మీడియాలో చురుగ్గా ఉండడం వల్లనే నా కళను వారు గుర్తించడానికి కారణం అనుకుంటున్నాను. నీతా అంబానీ గారు చె΄్పారు అంటూ వాళ్ల మేనేజరో ఎవరో కాంటాక్ట్ చేశారు. ఏ దుస్తులు ధరించాలనే విషయం నుంచి వేడుకలో ఏ ΄ాటలు కావాలో కూడా ఆమే ఎంపిక చేశారు. నేనిచ్చిన జాబితా నుంచి ఆమె ఎంపిక చేసిన పది ΄ాటలను వీణ మీద వినిపించాను. నా చెలి రోజావే, ఉరికే చిలకా... వంటి పలు భాషల్లోకి అనువాదమై ఉన్న ΄ాటలనే ఎంచుకున్నాను. ఇదంతా పదిహేను రోజులపాటు నడిచింది. రెండు కళ్లు చాలవు!ఆడిటోరియానికి వెళ్లే దారిలో ఒక వరుస అత్తరులు, ఇత్తడి బిందెలతో గుజరాత్ సంప్రదాయ నమూనా అలంకరణ ఉంది. ఆ తర్వాత ధొలారి ధని థీమ్, ఫారెస్ట్ థీమ్, కలంకారీ థీమ్ ఓ వరుస ఉన్నాయి. శంకర్ మహదేవన్, శ్రేయాఘోషాల్, శివమణి వంటి సంగీతకారులు, గాయకుల ప్రోగ్రామ్లను టీవీ లైవ్ లో చూశాను. వందమంది రాజమౌళిలు, వంద మంది సంజయ్ లీలా భన్సాలీలు కలిసి సెట్టింగు వేయించారా అనిపించింది. చూడడానికి రెండు కళ్లు చాలవు. తలను 360 డిగ్రీల్లో తిప్పి చూడాల్సిందే. బారాత్ తర్వాత పెళ్లికి ముందు హై టీ టైమ్లో రాత్రి ఏడు నుంచి ఏడు ముప్పావు వరకు నా కచేరీ సాగింది. రాధిక మర్చంట్ కుటుంబం, అంబానీ కుటుంబ సభ్యులకు మాత్రమే అనుమతి. వాళ్లు కదలకుండా కూర్చుని, ఓ పాటను మళ్లీ అడిగి మరీ చక్కగా ఆస్వాదించడం, కళల పట్ల వారికున్న గౌరవం నాకు సంతృప్తినిచ్చింది. నాలుగు వేల అడుగులు పన్నెండవ తేదీ ఉదయం ముంబయికి వెళ్లాం. హోటల్లో రిఫ్రెష్ అయిన తర్వాత నేరుగా జియో కన్వెన్షన్ సెంటర్కెళ్లాం. ఆ సెంటర్ ఎంట్రన్స్ నుంచి నా ప్రదర్శన ఉన్న ఆడిటోరియంలో వేదిక వద్దకు చేరడానికి నాలుగు వేల అడుగులు పడ్డాయి. ఫోన్లో చెక్ చేసుకున్నాను కూడా. నిర్వహకులు వెంట ఉండి తీసుకెళ్లకపోతే నా వేదిక ఏదో తెలుసుకోవడంతోనే రోజు పూర్తయ్యేదేమో. నీతా అంబానీ స్వయంగా కళాకారిణి కావడంతో ఈ వేడుకలో కళాప్రదర్శనకు ఎక్కువ ప్రాముఖ్యతనిచ్చారనుకున్నాను. భోజనాల దగ్గర కూడా ఆర్టిస్టుల కోసమే ఒక పెద్ద హాలును కేటాయించారు. వేల రకాల వంటలు వడ్డించారని విన్నాను. కానీ నేను సలాడ్లు, కాఫీ మాత్రమే తీసుకున్నాను. పెళ్లి వేడుకలో నీతా అంబానీ ఎంత శ్రద్ధగా ప్రతి చిన్న విషయాన్నీ పట్టించుకున్నారంటే డెకరేషన్లో ఉన్న పూలను కూడా పరిశీలించి థీమ్కి అనుగుణంగా మార్పించారు. కొన్ని రోజులపాటు ఆమె మధ్యాహ్నం మూడు నుంచి తెల్లవారి ఆరుగంటల వరకు పని చేశారట. అయినా సరే ఆమె ముఖంలో అలసట కనిపించలేదు. గొప్ప ఆర్గనైజర్ ఆమె. వీణావాణి ఇచ్చిన వరం జనసందోహంలో నేను ఎక్కువ సేపు ఇమడలేను. నా కచేరీ పూర్తి కాగానే నన్ను బయటకు తీసుకెళ్లమని నిర్వహకులను అడిగాను. గేటు వరకు తీసుకొచ్చి వెహికల్ ఎక్కించేశారు. పదమూడవ తేదీ ఉదయం ఫ్లైట్ ఎక్కి హైదరాబాద్కి వచ్చేసి హమ్మయ్య అనుకున్నాను. నాకిప్పుడు తలుచుకున్నా సరే అంతా కలలా అనిపిస్తోంది. ఆంధ్రుల ఆడపడుచుని, తెలంగాణ కోడలిని. నాకు తెలిసినంత వరకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఈ వేడుకలో కళను ప్రదర్శించిన ఏకైక వ్యక్తిని నేనే... అనుకున్నప్పుడు గర్వంగా అనిపిస్తోంది. సరస్వతీ మాత వీణతోపాటు నాకిచ్చిన వరం ఈ అవకాశం అనుకుంటున్నాను’’ అని రెండు చేతులూ జోడించారు వీణాశ్రీవాణి తన వీణను మురిపెంగా చూసుకుంటూ.– వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి ఫొటోలు : నోముల రాజేశ్ రెడ్డి -
సతీమణితో బుమ్రా.. రాజహంసలా సంజనా.. ఫొటోలు వైరల్
-
హాట్ టాపిక్గా అనంత్ అంబానీ పెళ్లి : అతి విలాసవంతమైన పెళ్లిళ్లు ఇవిగో!
అపర కుబేరుడు రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ, నీతా అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ వివాహం కనీవినీ ఎరుగుని రీతిలో అత్యంత ఘనంగా జరిగింది. ఇంట్లో జరిగిన చివరి వివాహం కావడంతో దేశ విదేశీలకు ప్రముఖులతో అంత్యంత ఆడంబరంగా నిర్వహించింది అంబానీ ఫ్యామిలీ. దీంతో ఈ వివాహ వేడుక ప్రపంచంలో ఖరీదైన వివాహాల్లో ఒకటిగా నిలిచింది.నిశ్చితార్థం మొదలు, రెండు ప్రీవెడ్డింగ్వేడుకలు, ముంబైలో మూడు రోజుల పాటు నిర్వహించిన గ్రాండ్ వెడ్డింగ్ సెలబ్రేషన్స్సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారాయి. అట్టహాసంగా నిర్వహించిన ఈ వేడుకల్లో అతిథుల ఆహ్వానం దగ్గర్నించీ, ఆతిథ్యం, వారికి అందించిన బహుమతులు ప్రత్యేక ప్రదర్శనలు, విందు ఇలా ప్రతీదీ ఆకర్షణగా నిలిచాయి. ఇక ఈ పెళ్లి వేడుకల్లో కొత్తదంపతులతో సహా అంబానీ కుటుంబ మహిళలు ధరించిన కోట్లాది రూపాయల విలువ చేసే దుస్తులు, వజ్రాభరణాలు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనేలేదు. లైవ్మింట్, ది ఎకనామిక్ టైమ్స్ , ఔట్లుక్ అంచనా ప్రకారం ఈ వివాహ వేడుకల మొత్తం ఖర్చు 5వేల కోట్ల రూపాయల వరకు ఖర్చు అయి ఉంటుందని అంచనా.ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఖరీదైన వివాహాలలో చోటు దక్కించుకున్న బ్రిటీష్ యువరాణి డయానా ప్రిన్స్ చార్లెస్ల వంటి దిగ్గజ వివాహాల ఖర్చు రూ. 1,361 కోట్లను, షేక్ హింద్ బింత్ బిన్ మక్తూమ్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ల ఖర్చులను రూ. 1,144 కోట్లుగా అధిగమించినట్టే. 1981, జూలై 29న అప్పటి ప్రిన్స్ చార్లెస్ , లేడీ డయానా వివాహం లండన్లోని సెయింట్ పాల్స్ కేథడ్రల్లో రాయల్ వెడ్డింగ్ అత్యంత ఘనంగా జరిగింది. 3,500 మంది వ్యక్తులు ప్రత్యక్షంగా చూసారు, అయితే ప్రపంచవ్యాప్తంగా సుమారు 750 మిలియన్ల మంది ప్రజలు దీనిని టీవీలో వీక్షించారు. 10వేల, 25 అడుగుల పొడవుతో తయారు చేసిన అప్పటి యువరాణి డయానా వెడ్డింగ్ గౌన్ స్పెషల్ ఎట్రాక్షన్. 1979లో దుబాయ్ రాయల్ వెడ్డింగ్లో షేక్ మహ్మద్ తన కజిన్ షేఖా హింద్ను వివాహం చేసుకున్నాడు. వారం రోజుల పాటు అత్యంగ ఘనంగా ఈ వేడుకలు జరిగాయి.2004లో సహారా గ్రూప్కు చెందిన సుబ్రతో రాయ్ తన కుమారుల కోసం డబుల్ వెడ్డింగ్ సందర్భంగా లక్నోను విలాసవంతమైన ఏర్పాట్లతో ముంచెత్తారు. ఆరు రోజుల పాటు జరిగిన ఈ ఈవెంట్లో 11వేల మంది అతిథుల హాజరయ్యారు. వీరి పెళ్లి ఖర్చు రూ. 550 కోట్ల రూపాయలట.2023, నవంబర్లో మేడ్లైన్ బ్రాక్వే , జాకబ్ లాగ్రోన్ల వెడ్డింగ్ "శతాబ్దపు వివాహం"గా పేరొందింది. ఈ వివాహానికి దాదాపు 59 మిలియన్ల డాలర్లు అంటే రూ. 489 కోట్లు ఖర్చయ్యాయి. పారిస్లోని వెర్సైల్లెస్ ప్యాలెస్లో విలాసవంతంగా ఈ వివాహం జరిగింది.2011లో కేట్ మిడిల్టన్ , ప్రిన్స్ విలియం రాజ వివాహం ప్రపంచంలోని అత్యంత ఖరీదైన వివాహాలలో ఒకటిగా పేరుగాంచింది. ఈ పెళ్లికి 43 మిలియన్ డాలర్లు ఖర్చయ్యాయి. 1,900 మంది అతిథులతో వెస్ట్మిన్స్టర్ అబ్బేలో జరిగిన ఈ ఈవెంట్ను ప్రపంచవ్యాప్తంగా 160 మిలియన్ల మంది వీక్షకులు వీక్షించారు, కామన్వెల్త్ దేశాల్లో వేడుకలు జరిగాయి.2018లో, అమెరికన్ నటి మేఘన్ మార్క్లేతో ప్రిన్స్ హ్యారీ వివాహం బ్రిటీష్ రాయల్ వివాహం విండ్సర్లోని సెయింట్ జార్జ్ చాపెల్లో జరిగిన వేడుకకు అనేక మంది ప్రముఖులు మరియు రాయల్టీతో సహా 600 మంది అతిథులు హాజరయ్యారు. ఇండియాకు చెందిన ప్రపంచంలోని అత్యంత సంపన్నులలో ఒకరైన లక్ష్మీ మిట్టల్ కుమార్తె వనీషా మిట్టల్ వివాహం ఆ జాబితాలో మరొకటి. 2004లో వనీషా మిట్టల్- అమిత్ భాటియా నిశ్చితార్థ వేడుక పారిస్లోని వెర్సైల్లెస్ ప్యాలెస్లో జరగగా, వివాహం చాటౌ వెక్స్లో జరిగింది. ఈ వివాహానికి సుమారు 66 మిలియన్ డాలర్లు రూ. 547 కోట్లు ఖర్చయిందట.2018, డిసెంబరు 12న ముఖేష్ అంబానీ కుమార్తె ఇషా అంబానీ -ఆనంద్ పిరమల్ వివాహ జరిగింది.ఈ వివాహానికి సుమారు 15 మిలియన్లు డాలర్లు అంటే రూ. 110 కోట్లు ఖర్చయ్యాయి. అంగరంగ వైభవంగా జరిగిన ఈ వివాహానికి బాలీవుడ్, భారతీయ రాజకీయ వర్గాల ప్రముఖులు హాజరయ్యారు.2006, ఫిబ్రవరి 18 ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్, మోడల్ ప్రియా సచ్దేవ్ వివాహం హోటల్ వ్యాపారి విక్రమ్ చత్వాల్తో మూడు నగరాల్లో 10 రోజుల పాటు వైభవంగా జరిగింది.26 దేశాల నుండి 600 మంది అతిథులు ఆహ్వానం, ప్రైవేట్గా చార్టర్డ్ విమానాలలో తరలించారు. అతిథి జాబితాలో బిల్ క్లింటన్, మోడల్ నవోమి క్యాంప్బెల్, అప్పటి భారత-పీఎం మన్మోహన్ సింగ్, లక్ష్మీ మిట్టల్ తదితరులు హాజరైనారు. 50,000 కిలోల పువ్వులు, 3వేల కొవ్వొత్తులు , ఇతర వస్తువులతో అలంకరించిన మొఘల్-కోర్ట్ శైలిలో ఈ వివాహం జరిగింది. పెళ్లికి 20 మిలియన్ల డాలర్లు ఖర్చయ్యాయి. అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్, హిల్లరీ క్లింటన్ కుమార్తె చెల్సియా క్లింటన్ పెట్టుబడి బ్యాంకర్ మార్క్ మెజ్విన్స్కీని ల గ్రాండ్ వెడ్డింగ్ 2010లో ఆస్టర్ కోర్ట్స్లో జరిగింది. ఖర్చు 5 మిలియన్లు డాలర్లు. (దాదాపు రూ. 40 కోట్లు).ఇంకా బాలీవుడ్ నుంచి హాలీవుడ్ దాకా తన ప్రతిభను చాటుకుంటున్న ప్రియాంక చోప్రా ,నిక్ జోనాస్ 2018,డిసెంబర్ 1 న వివాహం చేసుకున్నారు ఐదు రోజుల పాటు వీరి వివాహం రాజస్థాన్లోని ఉమైద్ భవన్ ప్యాలెస్లో జరిగింది. ఈ జంట కేవలం హోటల్స్కోసం రూ.3 కోట్లు ఖర్చు చేశారు. పెళ్లి తర్వాత ఢిల్లీలో గ్రాండ్ రిసెప్షన్ కూడా జరిగింది. -
అంబానీ గ్రాండ్ వెడ్డింగ్ : అక్క అలా, చెల్లి ఇలా, కపూర్ సిస్టర్స్ సందడే సందడి
-
అంబానీ పెళ్లిలో సెక్యూరిటీ సిబ్బందితో వాగ్వాదం.. వీడియో వైరల్
అనంత్ అంబానీ - రాధిక మర్చంట్ల పెళ్లి వేడుకలు చూస్తే కళ్లు జిగేల్మంటున్నాయి. నెలల తరబడి ప్రీవెడ్డింగ్ సెలబ్రేషన్స్ జరపగా ఇప్పుడు పెళ్లి- ఆశీర్వాద్- రిసెప్షన్ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ వేడుకలకు సెలబ్రిటీలందరూ హాజరై కొత్త జంటను ఆశీర్వదించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరలవుతున్నాయి.అయితే బాలీవుడ్ నటుడు సంజయ్ కపూర్ కూతురు షనాయా కపూర్ సెక్యూరిటీ గార్డుతో గొడవపడిన వీడియో సైతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అందులో ఓ సెక్యూరిటీ సిబ్బంది షనాయా బ్యాగ్ చెక్ చేసేందుకు ప్రయత్నించగా ఆమె అసహనం వ్యక్తం చేసింది. అతడిపై ఫైర్ అయింది. ఇది చూసిన జనాలు ఆమెపై మండిపడుతున్నారు.'ఇంకా సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వకముందే ఇంత యాటిట్యూడ్ చూపిస్తుందేంటి?', 'చేసిన సినిమాలు జీరో.. యాటిట్యూడ్ మాత్రం 100%', 'సెక్యూరిటీ సిబ్బంది వాళ్ల పని చేస్తున్నారు.. అందులో ఇబ్బందిపడాల్సిందేముందో..' అని కామెంట్లు చేస్తున్నారు.కాగా అంబానీ పెళ్లి వేడుకలకు హాజరైనవారిలో షనాయా కపూర్ కూడా ఉంది. జామ్ నగర్లోని ప్రీవెడ్డింగ్ వేడుకల నుంచి పెళ్లి-రిసెప్షన్ వరకు అన్నింటికీ హాజరైంది. కాగా ఈ బ్యూటీ 'బెదడక్' సినిమాలో నటిస్తున్నట్లు ప్రకటించి చాలాకాలమైంది. కానీ ఇంతవరకు ఆ మూవీ నుంచి మళ్లీ ఎటువంటి అప్డేట్ రాలేదు. Shanaya going offbyu/Jealous_Summer_4867 inBollyBlindsNGossipచదవండి: ఈ సినిమా సక్సెస్ కాకపోతే ఇండస్ట్రీ వదిలేసి పోదామనుకున్నా! -
అనంత్ - రాధిక రిసెప్షన్: జిగేలుమన్న సెలబ్రిటీలు (ఫోటోలు)
-
ధోనిని ఆత్మీయంగా హత్తుకున్న రాధిక.. తలా ఎమోషనల్ నోట్
టీమిండియా దిగ్గజ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని సోషల్ మీడియాకు కాస్త దూరంగానే ఉంటాడు. ప్రత్యేక సందర్భాల్లో తప్ప మహీ ఫొటోలు పోస్ట్ చేయడు.ఇన్స్టాగ్రామ్లో ఈ మిస్టర్ కూల్కు 49.3 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. కానీ, ఇప్పటి వరకు అతడు పెట్టిన పోస్టులు కేవలం 111. అయితే, తాజాగా ధోని ఓ అద్భుతమైన ఫొటోను షేర్ చేస్తూ అందమైన క్యాప్షన్ జతచేశాడు.గ్రాండ్ వెడ్డింగ్ప్రస్తుతం అతడి పోస్టు నెట్టింట వైరల్గా మారింది. ఇంతకీ అదేంటంటే.. భారత కుబేరుడు ముఖేశ్ అంబానీ- నీతా అంబానీ దంపతుల చిన్న కుమారుడు అనంత్ అంబానీ వివాహం అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే.వ్యాపారవేత్త వీరేన్ మర్చంట్- శైలా మర్చంట్ల కుమార్తె రాధికా మర్చంట్తో అనంత్ పెళ్లి జరిగింది. ముంబైలో జూలై 12న జరిగిన ఈ గ్రాండ్ వెడ్డింగ్కు ప్రపంచ నలుమూలల నుంచి క్రీడా, సినీ, వ్యాపార ప్రముఖులు హాజరయ్యారు.మహేంద్ర సింగ్ ధోని సైతం తన సతీమణి సాక్షి, కుమార్తె జివా ధోనితో కలిసి అనంత్- రాధికల పెళ్లికి వెళ్లాడు. బారాత్లో డాన్స్ చేస్తూ సందడి చేశాడు కూడా!ఇక వివాహ తంతు ముగిసిన అనంతరం ధోని దంపతులు ప్రత్యేకంగా కొత్త జంటను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా నవ వధువు రాధికా మర్చంట్ నవ్వులు చిందిస్తూ ధోనిని ఆత్మీయంగా ఆలింగనం చేసుకోగా.. అనంత్ చిరునవ్వుతో మహీ చేతిని పట్టుకున్నాడు.రాధికా.. అనంత్ అంటూ ధోని ఎమోషనల్ నోట్ఇందుకు సంబంధించిన ఫొటోను మహేంద్ర సింగ్ ధోని ఇన్స్టాలో షేర్ చేశాడు. అంబానీల నూతన జంటను ఉద్దేశించి.. ‘‘రాధికా.. నీ ప్రకాశవంతమైన చిరునవ్వు ఎప్పటికీ ఇలాగే వెలిగిపోతూ ఉండాలి.అనంత్.. మేమందరం చుట్టూ ఉన్నపుడు ఎలాగైతే నువ్వు రాధిక పట్ల ప్రేమను కురిపించావో.. ఎల్లప్పుడూ అలాగే ఉండు ప్లీజ్.మీ వైవాహిక జీవితం సంతోషాలతో నిండిపోవాలి. త్వరలోనే మిమ్మల్ని మళ్లీ కలుస్తాను. వీరేన్ అంకుల్ కోసం ఓ పాట’’ అంటూ ధోని ఉద్వేగపూరిత నోట్ పంచుకున్నాడు. ఈ ఫొటోకు ఇప్పటికే 8 మిలియన్లకు పైగా లైకులు రావడం విశేషం.కాగా భారత్కు టీ20 ప్రపంచకప్-2007, వన్డే వరల్డ్కప్-2011, చాంపియన్స్ ట్రోఫీ-2013 అందించిన జార్ఖండ్ ‘డైనమైట్’ ధోని.. ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ను ఐదుసార్లు విజేతగా నిలిపాడు.ఇక ఈ ఏడాది చెన్నై కెప్టెన్సీ నుంచి తప్పుకొని రుతురాజ్ గైక్వాడ్కు సారథ్య బాధ్యతలు అప్పగించిన 43 ఏళ్ల ధోని.. ఆటగాడిగా కొనసాగుతున్నాడు.చదవండి: Copa America 2024: కోపా అమెరికా కప్ విజేతగా అర్జెంటీనా.. మెస్సీకి గిఫ్ట్ View this post on Instagram A post shared by M S Dhoni (@mahi7781) -
దటీజ్ నీతా అంబానీ : పింక్ గాగ్రా, వెరీ, వెరీ స్పెషల్గా బ్లౌజ్
సందర్భం ఏదైనా రిలయన్స్ ఫౌండేషన్ ఛైర్మన్ నీతా అంబానీ తన ప్రత్యేకతను చాటుకుంటారు. తాజాగా తన చిన్న కుమారుడు అనంత్ అంబానీ గ్రాండ్ వెడ్డింగ్లో వరుడి తల్లిగా నీతా అద్భుతంగా కనిపించారు. నిశ్చితార్థం, ప్రీ వెడ్డింగ్ వేడుకలు, పెళ్లి, రిసెప్షన్, ఇలా ప్రతీ వేడుకను దగ్గరుండి మరీ ఘరంగా నిర్వహించడంతో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ వివాహ తొలి పత్రికను తనకెంతో ఇష్టమైన పవిత్ర వారణాసిలోని కాశీ విశ్వనాథుడి పాదల వద్ద ఉంచి ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు.తాజాగా 'శుభ్ ఆశీర్వాద్' వేడుకలో తన స్పెషల్ ఫ్యాషన్తో అలరించారు నీతా . డిజైనర్లు అబు జానీ సందీప్ ఖోస్లా ప్రత్యేకంగా రూపించిందిన పింక్ గాగ్రాలో హుందాగా కనిపించారు. కాశీలోని క్లిష్టమైన వాస్తుశిల్పం, దేవాలయాల ప్రేరణతో చేతితో ఎంబ్రాయిడరీ చేసిన జర్దోజీ గాగ్రాను ఎంచుకున్నారు. ముఖ్యంగా దీనికి మ్యాచింగ్గా ఆమె ధరించిన బ్లౌజ్ విశేషంగా నిలిచింది.ఇందులో హ్యాండ్ మేడ్ ఎంబ్రాయిడరీ ఝుమ్కా మోటిఫ్లు, బ్లౌజ్ వెనక వీపుపై శుభప్రదమైన ఏనుగు డిజైన్లు ఉన్నాయి. ఆకాష్, ఇషా అనంత్, తోపాటు మనవళ్ల పేర్లు-కృష్ణ, ఆదియా, పృథ్వీ , వేద చోళీపై హిందీలో చేతితో ఎంబ్రాయిడరీ చేయించారు. ఇంకా సంస్కృత శ్లోకాలతో, స్పెషల్ జరీ వర్క్ , ఎంబ్రాయిడరీ చేసిన దుపట్టా మరింత ఆకర్షణీయంగా నిలిచింది. విరేన్ భగత్ సెట్ చేసిన పచ్చలు, వజ్రాలఆభరణాలతో తన లుక్ మరింత ఎలివేట్ అయ్యేలా జాగ్రత్త పడ్డారు. -
సినీ ప్రముఖులతో మహేశ్ బాబు కుమార్తె సితార పోజులు.. ఫోటోలు చూశారా?
-
అంబానీ మిడిల్ క్లాస్ అయితే.. కొడుకు పెళ్లి ఇలా జరిగేదా? (ఫోటోలు)
భారతీయ కుబేరుడు ముకేశ్ అంబానీ తన చిన్న కుమారుడు అనంత్ అంబానీ పెళ్లి ఎంతో వైభవంగా చేశారు. ఈ పెళ్లికి సుమారు ఐదువేల కోట్ల రూపాయలు ఖర్చు అయినట్లు సమాచారం.జులై 12న జరిగిన వివాహానికి దేశాధినేతలు, దిగ్గజ పారిశ్రామిక వేత్తలు, సినీ తారలు, రాజకీయ, క్రీడా రంగాలకు చెందిన ప్రముఖులు దాదాపు అందరూ హాజరయ్యారు. కొంతమంది అతిధులకు అంబానీ ఏకంగా రూ. 2 కోట్ల ఖరీదైన వాచ్లను కూడా గిఫ్ట్గా ఇచ్చారు. అనంత్, రాధికల ఒక్కో పెళ్లి కార్డు కోసమే అంబానీ రూ. 6.5 లక్షలు ఖర్చు చేసినట్లు సమాచారం.అంబానీ ధనవంతుడు.. కొడుకు పెళ్లి కోసం ఎంతైనా ఖర్చు చేస్తారు. అయితే అంబానీది ఓ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అయితే?.. రాధిక మర్చంట్తో.. అనంత్ అంబానీ పెళ్లి ఎలా జరిగేది? అనే ప్రశ్న బహుశా కొంతమంది మదిలో మెదిలే ఉంటుంది. ప్రశ్న పుట్టగానే.. సమాధానం అందించడానికి మన ఏఐ ఉంది కదా. ఇట్టే ఫోటోలను విడుదల చేసేసింది. ఈ ఫోటోలు నెట్టింట్లో తెగ వైరల్ అయిపోతున్నాయి. మీరు కూడా ఓ లుక్కేసేయండి.. View this post on Instagram A post shared by Sahid SK (@sahixd) -
అంబానీ కుటుంబంతో నాకు పరిచయం లేదు: స్టార్ హీరోయిన్
ప్రముఖ వ్యాపారవేత్త ముకేశ్ అంబానీ తనయుడి పెళ్లి ముంబయిలో గ్రాండ్గా జరిగింది. గతంలోనే నిశ్చితార్థం చేసుకున్న అనంత్ అంబానీ- రాధిక మర్చంట్ జూలై 12న వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఈ పెళ్లిలో టాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు సినీతారలు హాజరై సందడి చేశారు. నగరంలోని జియో వరల్డ్ కన్వెన్ష్న్ సెంటర్లో అత్యంత వైభవంగా వీరి పెళ్లి వేడుక జరిగింది. టాలీవుడ్ నుంచి రామ్ చరణ్, మహేశ్ బాబు కుటుంబ సమేతంగా హాజరయ్యారు. ఈ గ్రాండ్ వెడ్డింగ్లో బాలీవుడ్తో పాటు దక్షిణాది సినీ ప్రముఖులు కూడా సందడి చేశారు.అయితే కొందరు సినీతారలు ఈ పెళ్లి దూరంగా ఉన్నారు. వారిలో స్టార్ హీరోయిన్ తాప్సీ పన్ను ఒకరు. తాజా ఇంటర్వ్యూలో అనంత్ అంబానీ పెళ్లికి ఎందుకు వెళ్లలేదు? అన్న ప్రశ్నకు ఆమె స్పందించారు. వివాహానికి ఎందుకు హాజరు కాలేదో కారణాలను వెల్లడించింది. తనకు అంబానీ కుటుంబంతో ఎలాంటి రిలేషన్ లేదని తాప్సీ తెలిపింది. ఎవరి పెళ్లికైనా అతిథులతో కమ్యూనికేషన్ ఉంటేనే వెళ్లేందుకు ఇష్టపడతానని ఆమె పేర్కొంది. నాకు వ్యక్తిగతంగా వారితో ఎలాంటి పరిచయం లేదన్నారు. పెళ్లి అనేది పూర్తిగా వారి వ్యక్తిగతమని తాప్సీ వెల్లడించింది. కాగా.. తాప్సీతో పాటు కరీనా కపూర్ ఖాన్, కరిష్మా కపూర్, సైఫ్ అలీ ఖాన్, కార్తీక్ ఆర్యన్, అక్షయ్ కుమార్, కంగనా రనౌత్ లాంటి సెలబ్రిటీలు అంబానీ పెళ్లికి హాజరు కాలేదు. -
అనంత్ - రాధిక పెళ్లి.. స్పెషల్ అట్రాక్షన్గా మహేశ్బాబు ఫ్యామిలీ (ఫోటోలు)
-
బిగ్బీ కాళ్లకు నమస్కరించబోయిన రజనీకాంత్.. వీడియో వైరల్
దిగ్గజ వ్యాపారవేత్త ముఖేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ వివాహం చిన్ననాటి స్నేహితురాలు రాధిక మర్చంట్తో ఎంతో ఘనంగా జరిగింది. ఈ పెళ్లి వేడుకలకు హాజరైన సినీ, క్రీడా, రాజకీయ ప్రముఖులు కొత్త జంటను మనసారా ఆశీర్వదించారు. జూలై 12న పెళ్లి జరగ్గా.. ఆ తర్వాత రోజు శుభ్ ఆశీర్వాద్ కార్యక్రమం నిర్వహించారు. ఈ వేడుకకు అమితాబ్ బచ్చన్, రజనీకాంత్ సహా తదితరులు హాజరయ్యారు.అయితే బిగ్బీ, తలైవా ఒకరికొకరు ఎదురుపడగానే ఆత్మీయంగా పలకరించుకున్నారు. బిగ్బీ షేక్ హ్యాండ్ ఇవ్వబోతే రజనీ.. ఆయన పాదాలకు నమస్కరించేందుకు ప్రయత్నించాడు. దీంతో వెంటనే అమితాబ్ వద్దని వారించి ఆయన్ను హత్తుకున్నాడు. ఇద్దరూ కాసేపు నవ్వుతూ మాట్లాడుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది.ఇది చూసిన అభిమానులు ఒకరంటే మరొకరికి ఎంత ప్రేమ, గౌరవం అని కొనియాడుతున్నారు. శనివారం జరిగిన శుభ్ ఆశీర్వాద్ కార్యక్రమంలో అమితాబ్ కలర్ఫుల్ షేర్వాణీ ధరించగా రజనీకాంత్ వైట్ డ్రెస్లో కనిపించాడు. View this post on Instagram A post shared by Pallav Paliwal (@pallav_paliwal) చదవండి: సినీ దర్శకుడు ఆత్మహత్య -
ఆషాడ మాసంలో అనంత్ అంబానీ పెళ్లి..కారణం ఇదే..!
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ -రాధికల వివాహం శుక్రవారం జియో కన్వెన్షన్ సెంటర్లో అత్యంత వైభవోపేతంగా జరిగింది. ఈ పెళ్లి సందడికి సంబంధించిన ప్రతి విషయం నెట్టింట తెగ వైరల్ అయ్యింది. అత్యంత లగ్జరీయస్గా జరిగిన ఈ వివాహానికి సినీ ప్రముఖులు, సెలబ్రెటీలు, రాజకీయనాయకులు హాజరయ్యారు. అయితే ప్రస్తుతం నెట్టింట ముఖేశ్ అంబానీ ఇంట జరిగిన ఈ పెళ్లి గురించే మాట్లాడుకుంటున్నారు. అసలు ఆషాడంలో పెళ్లిళ్లు చెయ్యరు. అందులోనూ కొత్త కోడలు అత్తారింట ఉండనే ఉండకూదు. అసలు ఈ మాసం మూఢంతో సమానమని. ఎలాంటి వివాహ తంతు లేదా అందుకు సంబంధించిన ఏ పనులు చెయ్యరు. మరీ అలాంటిది ముఖేశ్ ఉండి ఉండి మరీ ఇలా ఆషాడంలో పెళ్లి చేయడం ఏంటనీ సర్వత్రా చర్చించుకుంటున్నారు. కారణం ఏంటంటే..ఇక్కడ అనంత్ రాధికల పెళ్లి ముహుర్తం ధృక్ గణితం ఆధారంగా ముహర్తం నిర్ణయించారు పండితులు. దీన్ని సూర్యమానం ప్రకారం నిర్ణయిస్తారు. వాస్తవానికి దక్షిణాది వారు చాంద్రమానం ప్రకారం ముహుర్తాలు నిర్ణయించగా..ఉత్తరాది వారు సూర్యమానం ఆధారంగా పంచాంగం నిర్ణయిస్తారు. అలాగే చాంద్రమాన పంచాగంలో ఉన్నట్లు అధిక మాసాలు అంటూ..ఈ సూర్యమాన పంచాంగంలో ఉండనే ఉండవు. పైగా ఆయా ప్రాంతాల వారీగా అది ఆషాడ మాసం కాదు. ఇక అనంత్ రాధికల పెళ్లి జూలై 12 శుక్రవారం మేషరాశిలో చంద్రుడు సంచారం, సూర్యుడు ఉత్తరదిశగా ప్రయాణిస్తుంటాడు చంద్రుడు రాత్రి వృషభరాశిలో సంచారం. పైగా ఇది పమరమిత్ర తార కలిగిన శుభఘడియలు కూడా. కావున పండితులు ఈ ముహర్తం వివాహానికి అత్యంత శుభప్రదమని చెబుతున్నారు. అందువల్లే ఆషాడంలో కూడా అంబానీ ఇంట పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. ఇక అనంత రాధికల వివాహం జూలై 12 శుభ్ వివాహ్తో మొదలయ్యి..జూలై 13 శుభ్ ఆశీర్వాద్, జూలై 14న మంగళ మహోత్సవంతో ముగుస్తాయి. (చదవండి: వందేళ్లక్రితమే భారత్లో సెల్ఫీ ఉందని తెలుసా..!) -
దుబాయ్లో కొత్త పెళ్లికొడుకు ఇల్లు ఎలా ఉందో చూశారా?
ఆసియా అపర కుబేరుడు ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ-రాధిక మర్చెంట్ల వివాహం ముంబైలో అంత్యంత వైభవంగా జరిగింది. ప్రపంచంలోని నలుమూలల నుంచి వ్యాపార దిగ్గజాలు, రాజకీయ సినీ ప్రముఖులు తరలిరాగా ప్రపంచం అబ్బురపడేలా అంగరంగ వైభవంగా వేడుకలు సాగాయి.విస్తారమైన వ్యాపార సామ్రాజ్యానికి పేరుగాంచిన అంబానీ కుటుంబానికి చెందిన చిన్న వారసుడు అనంత్ అంబానీ వివాహం నేపథ్యంలో వారి వద్ద ఉన్న అత్యంత ఖరీదైన వస్తువులు, విలాసవంతమైన కార్లు, ఆస్తుల గురించి చర్చ జరుగుతోంది. అయితే పెళ్లికి ముందే అనంత్ అంబానీకి ముఖేష్ అంబానీ దుబాయ్లో ఓ లగ్జరీ విల్లాను కొనుగోలు చేసి గిఫ్ట్ ఇచ్చిన సంగతి తెలుసా..? ఆ విలాసవంతమైన ఇంటి గురించి ఈ కథనంలో తెలుసుకుందాం..అనంత్ అంబానీకి దుబాయ్లోని పామ్ జుమేరాలో సముద్రతీరంలో అత్యంత ఖరీదైన, విశాలమైన విల్లా ఉంది. ముఖేష్ అంబానీ 2022లో దీన్ని సుమారు రూ.640 కోట్లు పెట్టి కొనుగోలు చేసి అనంత్ అంబానీకి బహుమతిగా ఇచ్చారు. ఇందులో పది బెడ్రూమ్లు, ప్రైవేట్ స్పా, 70 మీటర్ల పొడవైన ప్రైవేట్ బీచ్ ఉన్నాయి. ఇది దుబాయ్లోని అత్యంత విలాసవంతమైన నివాసాలలో ఒకటిగా ఉంది. -
అనంత్- రాధిక వెడ్డింగ్: అందానికే అర్థంలా సానియా మీర్జా (ఫొటోలు)
-
అంతా ప్రేమ మయం అంటున్న హార్దిక్ పాండ్యా.. ఆ లాకెట్ స్పెషల్ (ఫొటోలు)
-
అనంత్ అంబానీ పెళ్లి.. ఆ హీరోలకు గిఫ్ట్గా కోట్ల విలువైన వాచీలు
అంబానీల ఇంట్లో పెళ్లి గురించి ఎంత మాట్లాడుకున్నా తరగదు అన్నట్లు ఉంది. ఎందుకంటే గత కొన్నాళ్లుగా ఏదో ఓ పేరుతో ఫంక్షన్ నిర్వహిస్తూనే ఉన్నారు. తాజాగా ముఖ్యమైన పెళ్లి వేడుక కూడా జరిపించారు. దీనికి బాలీవుడ్, టాలీవుడ్, టీమిండియా క్రికెటర్లతో పాటు ప్రధానమంత్రి స్థాయి నుంచి ముఖ్యమంత్రులు వరకు చాలామంది హాజరై, హాట్ టాపిక్ అయిపోయారు. ఇదంతా పక్కనబెడితే అనంత్.. తన స్నేహితులకు ఖరీదైన బహుమతులు ఇవ్వడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.(ఇదీ చదవండి: అంబానీ పెళ్లిలో ఐశ్వర్య రాయ్.. డిస్కషన్ మాత్రం విడాకుల గురించి!)ముకేశ్ అంబానీ చిన్న కొడుకు అనంత్ పెళ్లి వేడుక కనివినీ ఎరుగని రీతిలో జరిగింది. దాదాపు రూ.5000 కోట్ల మేరకు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. ఇకపోతే అనంత్కి బాలీవుడ్లో బోలెడంత మంది ఫ్రెండ్స్ ఉన్నారు. వీళ్లలో సల్మాన్ ఖాన్, షారుక్ ఖాన్, రణ్వీర్ సింగ్ తదితరులు ఉన్నారు. ఇప్పుడు వీళ్లకే తన పెళ్లి సందర్భంగా అనంత్ అంబానీ ఖరీదైన వాచీలు ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.లగ్జరీ వాచీలకు పెట్టింది పేరైన 'అడెమార్స్ పిగ్యుట్ రాయల్ ఓక్ పెర్పుట్యల్ కాలండెర్' అనే వాచీనీ అనంత్ బహుమతులుగా ఇచ్చాడు. మార్కెట్లో ఒక్క వాచీ ధర రూ.2 కోట్ల పైమాటే అని తెలుస్తోంది. వీటితో షారుక్, రణ్వీర్ పోజులిచ్చిన పిక్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.(ఇదీ చదవండి: అంబానీ పెళ్లిలో స్పెషల్ ఎట్రాక్షన్ వీళ్లదే.. పిక్ అదిరిపోయింది!) View this post on Instagram A post shared by THEINDIANHOROLOGY (@theindianhorology) -
అనంత్ దంపతులను ఆశీర్వదించిన మోదీ
ముంబై: అంబానీల ఇంట పెళ్లి వేడుకలకు ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యారు. రిలయన్స్ సంస్థల అధిపతి ముకేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ–రాధికా మర్చంట్ దంపతులను ఆశీర్వదించారు. శుక్రవారం రాత్రి జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో జరిగిన పెళ్లి వేడుకలకు ప్రపంచ ప్రముఖులంతా తరలి రావడం తెలిసిందే. శనివారం జరిగిన వివాహ విందులో పాల్గొన్న మోదీకి ముకేశ్–నీతా అంబానీ దంపతులు స్వాగతం పలికారు. ‘శుభ్ ఆశీర్వాద్’ పేరిట జరిగిన విందు వేడుకకు కూడా తారాలోకంతో పాటు ప్రపంచం నలుమూలల నుంచి వ్యాపార, రాజకీయ తదితర రంగాల దిగ్గజాలు హాజరై సందడి చేశారు. -
అనంత్- రాధిక పెళ్లి: నిండు మనసుతో ఆశీర్వదించిన సినీతారలు (ఫోటోలు)
-
అంబానీ పెళ్లిలో స్పెషల్ ఎట్రాక్షన్ వీళ్లదే.. పిక్ అదిరిపోయింది!
అంబానీ ఇంట్లోని పెళ్లి గురించే ప్రస్తుతం సోషల్ మీడియాలో డిస్కషన్ నడుస్తోంది. ఎందుకంటే టాలీవుడ్, బాలీవుడ్, టీమిండియా.. ఇలా దాదాపు అన్ని రంగాలకు చెందిన ప్రముఖులు.. అనంత్ అంబానీ పెళ్లిలో కనిపించారు. జస్ట్ కనిపించడమే కాకుండా డ్యాన్సులతో రచ్చ రచ్చ చేశారు. ఇక తెలుగు ఇండస్ట్రీ నుంచి మహేశ్, వెంకటేశ్, రామ్ చరణ్ తదితరులు సతీసమేతంగా పెళ్లికి హాజరయ్యారు. మిగతా వాళ్ల సంగతేమో గానీ మహేశ్, టీమిండియా లెజెండ్ ధోనీతో పిక్ తీసుకోవడం మాత్రం హైలైట్ అని చెప్పొచ్చు.(ఇదీ చదవండి: వీడియో కాల్లో ప్రముఖ నటుడి కొడుకు నిశ్చితార్థం.. ఎందుకిలా?)టీమిండియా దిగ్గజం ధోనీకి అభిమానులు కాని వాళ్లు ఎవరుంటారు చెప్పండి. అలా మహేశ్ కూడా ఆయనకు ఫ్యాన్స్ అనుకుంట. అందుకే అంబానీల పెళ్లిలో ఓ వైపు ఎంజాయ్ చేస్తూనే అవకాశం దొరకడంతో ధోనీతో ఓ ఫొటో దిగాడు. తాజాగా ఆ పిక్ని ఇన్ స్టాలో షేర్ చేసుకున్నాడు. 'లెజెండ్తో..' అని క్యాప్షన్ పెట్టాడు. దీనిబట్టి ధోనీకి మహేశ్ ఎంత పెద్ద అభిమానో అర్థమైపోతోంది.మహేశ్ బాబు తెలుగు హీరో కావడం వల్ల ఈ పెళ్లిలో ఆయన్ని గుర్తుపట్టి పలకరించిన వాళ్లు తక్కువమందే. ప్రస్తుతం రాజమౌళితో సినిమా చేస్తున్నాడు కదా. దీని రిలీజ్ తర్వాత కచ్చితంగా పాన్ ఇండియా సూపర్ స్టార్ అయిపోతాడు. అప్పుడు మహేశ్తో ఫొటోలు దిగేందుకు బాలీవుడ్ సెలబ్రిటీలు ఎగబడటం గ్యారంటీ. ఏదేమైనా మహేశ్-ధోనీ పిక్ మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిపోతోంది.(ఇదీ చదవండి: అంబానీ పెళ్లిలో ఐశ్వర్య రాయ్.. డిస్కషన్ మాత్రం విడాకుల గురించి!) View this post on Instagram A post shared by Mahesh Babu (@urstrulymahesh) -
అంబానీ పెళ్లిలో ఐశ్వర్య రాయ్.. డిస్కషన్ మాత్రం విడాకుల గురించి!
శుభమా అని అంబానీ కొడుకు పెళ్లి జరుగుతుంటే విడాకుల గురించి మాట్లాడుతున్నాం ఏంటా అని మీరు అనుకోవచ్చు. కానీ సోషల్ మీడియాలో చర్చంతా దీని గురించే నడుస్తోంది. గత కొన్నాళ్లుగా విశ్వ సుందరి ఐశ్వర్యా రాయ్ విడాకుల గురించి అప్పుడప్పుడు పుకార్లు వినిపించాయి. కానీ అలాంటిదేం ఉండకపోవచ్చని ఫ్యాన్స్ అనుకున్నారు. కానీ అంబానీ పెళ్లి వల్ల ఇదే నిజమేనా అనే సందేహం వస్తోంది.(ఇదీ చదవండి: అనంత్- రాధిక వెడ్డింగ్.. ఒక్క పాటకు రూ.25 కోట్లా!)ముఖేశ్ అంబానీ చిన్న కొడుకు అనంత్ అంబానీ పెళ్లి కనివినీ ఎరుగని రీతిలో జరుగుతోంది. దేశవ్యాప్తంగా ఉన్న సినీ, రాజకీయ, క్రీడ ప్రముఖులు పెళ్లిలో సందడి చేస్తున్నారు. టాలీవుడ్ నుంచి కూడా మహేశ్ బాబు, రామ్ చరణ్, వెంకటేశ్ తదితరులు హాజరయ్యారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఫుల్ వైరల్ అవుతున్నాయి. ఇదే వేడుకకు ఐశ్వర్యా రాయ్ మాత్రం భర్తతో కాకుండా విడిగా వచ్చింది.అంబానీల పెళ్లిక కూతురు ఆరాధ్యతో కలిసి ఐశ్వర్య రాయ్ రాగా.. ఈమె భర్త అభిషేక్ బచ్చన్ మాత్రం తన కుటుంబంతో కలిసి విచ్చేశాడు. ఇది చూస్తే ఐశ్వర్యా రాయ్ విడాకుల వార్త నిజమే అనిపిస్తుంది. ప్రస్తుతం భార్యభర్తలు విడివిడిగా ఉంటున్నారు కాబట్టి ఇలా విడిగా వచ్చారా అని సందేహాలు వస్తున్నాయి. మరి ఈ విషయంలో ఓ క్లారిటీ వస్తే గానీ నెటిజన్లు ఊరుకోరేమో?(ఇదీ చదవండి: 'భారతీయుడు 2'.. ఆయనకు తప్ప అందరికీ నష్టమే!) View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
అనంత్ అంబానీ & రాధిక మర్చంట్ వివాహ వేడుకలో ప్రముఖుల డాన్స్
-
కుమారుడి పెళ్లిలో నీతా అంబానీ చేతిలో మంగళ దీపం: విశేషం ఇదీ!
గత కొన్ని రోజులుగా వార్తల్లో నిలుస్తూ ఉన్న ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వెడ్డింగ్ అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ పెళ్లి వేడుకలో జయమాల ఇతర ఘట్టాలు విజయవంతంగా ముగిసాయి. దీంతో అధికారంగా రాధిక మర్చంట్ అనంత్ భార్య, అంబానీ ఇంట చిన్న కోడలిగా అవతరించింది. అయితే ఈ వివాహ వేడుకలో వరుడి తల్లి, రిలయన్స్ ఫౌండేషన్ ఛైర్మన్ నీతా అంబానీ పట్టుకున్నదీపం హాట్ టాపిక్గా నిలిచింది.నీతా అంబానీ తన కుమారుడు అనంత్ అంబానీ వివాహానికి ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్కు వచ్చినప్పుడు, సంప్రదాయ రామన్ డివో దీపంతో కనిపించారు. గుజరాతీ వివాహాలలో రామన్ డివో ఒక ముఖ్యమైన భాగం. గుజరాతీ ప్రజలు ప్రతి శుభ కార్యంలో దీనిని ఉపయోగిస్తారు. ఆచారాన్ని సంప్రదాయాలను కచ్చితంగా పాటించే నీతా కూడా వివాహ వేదిక వద్దకు వరుడు తరలి వెళ్లే సమయంలో గణేశ విగ్రహంతో ఉన్న రామన్ దీపాన్ని తీసుకెళ్లాడు. ఇది చీకటిని పారదోలి, సకల శుభాలు కలుగ జేస్తుందని, కొత్త దంపతులకు ఆశీర్వాదాలు అందించే మంగళదీపంగా నమ్ముతారు. ఈ సందర్భంగా తల్లిగా నీతా అంబానీ ఉద్వేగానికి లోనయ్యారు. ఈ వివాహానికి వచ్చిన ప్రతిఒక్కరికీ కృతజ్ఞతలు. అనంత్ రాధిక శాశ్వత బంధంలోకి అడుగు పెడుతున్న తరుణంలో తన మనసు ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అవుతోందనీ, భక్తిభావంతో ఉప్పొంగుతోంది అంటూ ఉద్వేగంగా చెప్పారు. హిందూ సంప్రదాయంలో వివాహం అంటే ఏడేడు జన్మల వాగ్దానం అని వివరించారు. గతంలో కూడా నీతా ఈ దీప ఆచారాన్ని పాటించారు. అలాగే పెళ్లికి తరలివెళ్లేముందు తన తాతగారు ధీరు భాయి అంబానీకి ప్రత్యేక నివాళులర్పించాడు వరుడు అనంత్. ఈ సందర్భంగా ఫ్యాషన్ ఐకాన్ నీతా అంబానీ ధరించిన జానీ సందీప్ ఖోస్లా రూపొందించిన అందమైన పీచ్ కలర్ సిల్క్ గాగ్రా మరింత ఆకర్షణీయంగా నిలిచింది. అనంత్ పెళ్లి వేడుకల్లో నీతా ఆనందంతో నృత్యం చేయడం విశేషం. #WATCH | Mumbai: Chairperson of Reliance Foundation Nita Ambani, Industrialist Mukesh Ambani along with family and guests shake a leg at the wedding ceremony of Anant Ambani and Radhika Merchant. pic.twitter.com/bD1pZH2vmw— ANI (@ANI) July 13, 2024 -
బరాత్లో దుమ్ము లేపిన బ్యూటీలు.. అతడిని నెట్టేసి మరీ..!
అంబానీ ఇంట పెళ్లి ధూంధాంగా జరిగింది. ఇండియన్ సెలబ్రిటీలతో పాటు హాలీవుడ్ స్టార్స్ సైతం విచ్చేసి అనంత్ అంబానీ- రాధిక మర్చంట్లను దీవించారు. నిండు నూరేళ్లు కలిసుండమని ఆశీర్వదించారు. సినిమా తారలే కాకుండా వ్యాపార, రాజకీయ ప్రముఖులు సైతం పెళ్లికి విచ్చేశారు. ఇకపోతే శుక్రవారం జరిగిన బరాత్లో సినిమా స్టార్స్ డ్యాన్స్తో హోరెత్తించారు.గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా స్టెప్పులేస్తుంటే ఆమె భర్త నిక్ జోనస్ తనతో పాటు కాలు కదిపాడు. కానీ అంతలోనే నిక్ను వెనక్కు నెట్టిందో హీరోయిన్. లైగర్ బ్యూటీ అనన్య పాండే నిక్ను వెనక్కి నెట్టి ముందుకు వచ్చి ప్రియాంకతో డ్యాన్స్ చేసింది. దీంతో నిక్ బిత్తరపోయాడు. విషయం అర్థం చేసుకున్న హీరో రణ్వీర్ సింగ్.. అతడిని దగ్గరకు తీసుకుని హత్తుకున్నాడు.ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇది చూసిన నెటిజన్లు అయ్యో.. నిక్ ఎక్స్ప్రెషన్స్ చూశారా?, బరాత్ అంటే అంతే మరి.. నలుగురిని తోసి అయినా సరే.. ముందుకొచ్చి మరీ డ్యాన్స్ చేయాల్సిందే అంటూ సరదా కామెంట్లు చేస్తున్నారు. కాగా మాధురి దీక్షిత్, రాశీ ఖన్నా, రణ్వీర్ సింగ్, అనిల్ కపూర్.. ఇలా తారలంందరూ బరాత్లో సరదాగా చిందేశారు. Ananya is literally representing Nick jiju hatiye 😭#PriyankaChopra #AnanyaPandey pic.twitter.com/ADWSMkEIr7— 𝒫𝓇𝒾𝓎𝒶🌸🤍 (@DewaniMastanii) July 13, 2024 View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) View this post on Instagram A post shared by Instant Bollywood (@instantbollywood) View this post on Instagram A post shared by Instant Bollywood (@instantbollywood) View this post on Instagram A post shared by Instant Bollywood (@instantbollywood) -
హుందాగా గాగ్రా, అందంగా లెహెంగా... కళ్లు తిప్పుకోలేరు! (ఫోటోలు)
-
అదే ప్రార్థిస్తున్నా.. వేడుకలో ముఖేష్ అంబానీ స్పీచ్
బిలియనీర్ ముఖేష్ అంబానీ తన చిన్న కుమారుడు అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ వివాహ వేడుకలో ప్రసంగించారు. అనంత్, రాధికలకు స్వర్గంలోని వారి తాత ముత్తాతల ఆశీర్వాదం ఉంటుందని, వారి శ్రేయస్సు కోసం భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నానని భావోద్వేగంతో పేర్కొన్నారు.వేడుకలకు విచ్చేసిన అతిథులను ఉద్దేశించి ముఖేష్ అంబానీ మాట్లాడుతూ.. "అనంత్, రాధికలకు స్వర్గంలో ఉన్న వారి తాత ముత్తాతల ఆశీర్వాదం ఉంటుంది. అనంత్, రాధికల జీవితం సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలతో నిండాలని నేను భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను” అన్నారు.ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ (BKC)లోని జియో వరల్డ్ సెంటర్ వేదిక వద్ద అనంత్ అంబానీ, తన చిరకాల స్నేహితురాలు రాధిక మర్చంట్ను పెళ్లాడారు. గ్లోబల్ సెలబ్రిటీలు, బిజినెస్ టైకూన్లు, ఇతర ప్రముఖుల సమక్షంలో వివాహ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతన్నాయి. -
అనంత్ అంబానీ పెళ్లి వేడుకలో వీణ శ్రీవాణి సందడి
వీణ శ్రీవాణి.. ఈ పేరు సోషల్ మీడియాలో సెన్సేషన్.. వీణపై స్వరాలు పలికిస్తూ ఎప్పుడూ నవ్వుతూ కనిపించే ఆమె టాలెంట్కు దేశవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు సినిమా పాటలతో పాటు భక్తి గీతాలను తన వీణతో వాయించటం శ్రీవాణి ప్రత్యేకత. తాజాగా ఆమె రిలయన్స్ గ్రూపు అధినేత, ప్రముఖ పారిశ్రామికవేత్త ముకేశ్ అంబానీ ఇంట పెళ్లి వేడుకలో పాల్గొన్నారు. అక్కడ తన వీణ ద్వారా పెళ్లికి వచ్చిన అతిథిలను మెప్పించారు.అనంత్ అంబానీ- రాధికా మర్చంట్ పెళ్లి వేడుకలో దేశవిదేశాలకు చెందిన వ్యాపార, రాజకీయ, సినీ, క్రీడారంగాల ప్రముఖులు పాల్గొన్నారు. ముంబయిలోని బాంద్రా కుర్లా కాంప్లెక్సు (బీకేసీ)లో ఉన్న జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్ వారి కల్యాణానికి వేదికగా నిలిచింది. అందులో వీణ శ్రీవాణి తన వీణా నైపుణ్యంతో అద్భుతంగా వాయించి మెప్పించారు.ఈ క్రమంలో అంబానీ పెళ్లి వేడుక గురించి వీణ శ్రీవాణి ఇలా చెప్పారు. 'ప్రపంచవ్యాప్తంగా ఎందరో ప్రముఖులు హాజరుకానున్న ఈ వేడుకులో నాకు వీణ వాయించే అవకాశం దక్కడం ఆనందంగా ఉంది. తెలుగు వారి తరుపన వెళ్లడం మరింత సంతోషాన్ని ఇచ్చింది. వారు మా కోసం ప్రేత్యేకంగా ఏర్పాటు చేసిన స్టేజీ చాలా అద్భుతంగా ఉంది. మన తెలుగు వారి సంప్రదాయాన్ని రిప్రెజెంట్ చేయాలని నేను ఎలా అయితే అనుకున్నానో అలాగే నీతా అంబానీ గారు కూడా నా డ్రస్ను సెలక్ట్ చేశారు. అంబానీ కుటుంబం చాలా గౌరవంగా పలకరించారు. ఎక్కడే కానీ చిన్న ఇబ్బంది కలగకుండా నన్ను చూసుకున్నారు.' అని ఆమె తెలిపింది. View this post on Instagram A post shared by Veena Srivani (satyavani Parankusham ) (@veenasrivani_official) -
అంబానీ చిన్న కోడలిగా రాధిక మర్చంట్, తొలి ఫోటో వైరల్
బిలియనీర్ ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ, తన ప్రేయసితో వివాహ బంధంలోకి అడుగుపెట్టాడు. అత్యంత ఘనంగా నిర్వహించిన పెళ్లి వేడుకలో, సన్నిహితులు, అతిథుల ఆశీర్వాదాల మధ్య అనంత్, రాధిక మర్చంట్ దండలు మార్చుకున్నారు. ఈ గ్రాండ్ వెడ్డింగ్కు సంబంధించిన ఫోటో, వీడియోలు నెట్టింట సందడి చేస్తున్నాయి. View this post on Instagram A post shared by Shloka Akash Ambani (@shloka_ambani) వరుడు తల్లిదండ్రులు,వధువు తల్లిదండ్రులు అనంత్ సోదరి ఇషా అంబానీ పిరమల్, అంబానీ పెద్ద కోడలు శ్లోకా మెహతో పాటు, వధువు సోదరి అంజలి మర్చంట్ మజిథియా,తదితరు సన్నిహిత కుటుంబ సభ్యులు ఆనందంలో మునిగి తేలారు. బాలీవుడ్, టాలీవుడ్, క్రీడా రంగ ప్రముఖులు, దేశ విదేశాలకు అతిథులు ఈ వేడుకకు మరింత ఆనందోత్సాహాలను జోడించారు. రియాలిటీ టీవీ స్టార్లు కిమ్ కర్దాషియాన్, ఖోలే కర్దాషియాన్ సందడి చేశారు. ఇంకా శాంసంగ్ చైర్మన్ లీ జే-యోంగ్, బాలీవుడ్ స్టార్లు, షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, దీపికా పదుకొనే, జాన్వీకపూర్, కత్రినా, టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు కుటుంబం, రాంచరణ్, సూర్య జ్యోతిక, రాణా అతని భార్య, మాజీ అందాల సుందరి మానుషి చిల్లర్, ఇవాంకా ట్రంప్ తదితరులు ఈ లిస్ట్లో ఉన్నారు. -
లెహెంగాలో వధువు రాధిక మనోహరంగా, మహరాణిలా (ఫోటోలు)
-
Anant-Radhika Wedding:ఆకాశ పందిరి.. తారలు తలంబ్రాలు
కుబేరులు వియ్యంకులైతే ఒక కల్యాణం ఎంత ఘనంగా జరగాలో అంత ఘనంగా జరుగుతుంది. దేవతల వంటి అతిథులు, పుష్పక విమానాలు, పారిజాతాలు, శతభక్ష్య పరమాణ్ణాలు, సువర్ణ తోరణాలు, వెండి ద్వారాలు, స్త్రీల మెడల్లో పచ్చలు, కెంపులు, వజ్రవైఢూర్యాలు, కళ్లు చెదిరే పట్టుపీతాంబరాలు...ముఖేష్ అంబానీ– నీతా అంబానీ తమ కుమారుడు అనంత్ అంబానీ వివాహాన్ని విరెన్ మర్చంట్–శైలా మర్చంట్ల కుమార్తె రాధికా మర్చంట్తో జూలై 12 రాత్రి జరప నిశ్చయించడంతో ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ అందుకు భారీ వేదికైంది. దేశ, విదేశాల అతిథులను విమానాలు మోసుకొచ్చాయి. శనివారం ‘శుభ్ ఆశీర్వాద్’ పేరుతో వేడుక, ఆదివారం రోజు ‘మంగళ్ ఉత్సవ్’ పేరున భారీ రిసెప్షన్ జరుగనున్నాయి.తరలి వచ్చిన అతిథులుఒకవైపు తేలికపాటి చినుకులు పడుతూ ఉంటే అనంత్–రాధికల పెళ్లి కోసం అంబానీ గృహధామం ఎంటిలియాతో పాటు వివాహవేదిక జియో వరల్డ్ కన్వెçన్షన్లో అతిథుల తాకిడి మొదలైంది. ‘దుల్హేరాజా’ అనంత్ బారాత్ను సర్వాంగ సుందరంగా తయారు చేసిన కారులో కొనసాగింది. సాయంత్రం నుంచే అతిథుల రాక మొదలైంది. బ్రిటన్ మాజీ ప్రధాని టోని బ్లెయర్ మొదలు అమెరికా మీడియా పర్సనాలిటీ కిమ్ కర్దాషియన్ వరకు హాలీవుడ్ నటుడు జాన్ సీనా నుంచి తమిళ సూపర్స్టార్ రజనీకాంత్ వరకూ ఎందరో అరుదెంచారు. బాలీవుడ్ నుంచి షారూక్ ఖాన్, సల్మాన్ ఖాన్, రణబీర్ కపూర్, ఆలియా భట్, ప్రియాంకా చో్ప్రా– నిక్ జోన్స్, అనిల్ కపూర్, జాకీ ష్రాఫ్ తదితరులు హాజరయ్యారు. క్రికెటర్లలో మహేంద్ర సింగ్ ధోని, నాటి మేటి ఆటగాడు శ్రీకాంత్, బుమ్రా, కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్ హాజరయ్యారు. దక్షిణాది తారాతోరణంఅనంత్– రాధికల వివాహంలో దక్షిణాది తారలు తళుకులీనారు, మహేష్బాబు తన భార్య నమ్రత, కుమార్తె సితారతో హాజరవగా, రామ్చరణ్–ఉపాసన జోడీగా వచ్చారు. వెంకటేష్, రాణ స్పెషల్ అట్రాక్షన్గా నిలిచారు. సంగీత దిగ్గజం ఏ.ఆర్. రెహమాన్ సతీసమేతంగా హాజరయ్యారు. సూపర్స్టార్ రజనీకాంత్ కుటుంబ సమేతంగా వచ్చారు. నయనతార–విగ్నేష్ శివన్, సూర్య–జ్యోతిక వేడుకకు తళుకులు అద్దారు. -
అనంత్-రాధిక పెళ్లిలో.. సందడి చేసిన ప్రముఖులు (ఫోటోలు)
-
అంగరంగ వైభవం.. తరలివచ్చిన బిజినెస్ టైకూన్స్
Ambani wedding: ఎంతగానో ఎదురుచూస్తున్న అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ల వివాహ వేడుకలు శుక్రవారం (జూలై 12) సాయంత్రం ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. ఈ గ్రాండ్ వెడ్డింగ్కు పలువురు అగ్రశ్రేణి వ్యాపార దిగ్గజాలు హాజరవుతున్నారు. అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ నుంచి మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో బిల్ గేట్స్ వరకు అనేక మంది దేశీయ, అంతర్జాతీయ వ్యాపార ప్రముఖలులు ఈ వేడుకకు హాజరవుతారని భావిస్తున్నారు.అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ వివాహానికి హాజరవుతున్న వ్యాపార దిగ్గజాలలో మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్, గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్, థాయ్ వ్యాపారవేత్త, అంతర్జాతీయ ఒలింపిక్ సభ్యురాలు ఖున్ యింగ్ పటామా లీస్వాడ్ట్రాకుల్, సౌదీ అరామ్కో సీఈవో అమీన్ నాసర్, బీపీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ముర్రే ఔచిన్క్లోస్ ఉన్నారు. అలాగే డ్రగ్ దిగ్గజం జీఎస్కే సీఈవో ఎమ్మా వామ్స్లీ, లాక్హీడ్ మార్టిన్ సీఈవో జిమ్ టైక్లెట్, ఫిఫా అధ్యక్షుడు జియాని ఇన్ఫాంటినో కూడా వేడుకలకు హాజరవుతున్నట్లు ఎకానమిక్ టైమ్స్ నివేదించింది.వీరితో పాటు ఎరిక్సన్ సీఈవో బోర్జే ఎఖోల్మ్ , టెమాసెక్ సీఈవో దిల్హాన్ పిళ్లే, హెచ్పీ ప్రెసిడెంట్ ఎన్రిక్ లోరెస్, ఏడీఐఏ బోర్డు సభ్యుడు ఖలీల్ మహ్మద్ షరీఫ్ ఫౌలతీ, ముబాదలాకు చెందిన ఖల్దూన్ అల్ ముబారక్, కువైట్ ఇన్వెస్ట్మెంట్ అథారిటీ ఎండీ బాదర్ మహ్మద్ అల్-సాద్ తదితరులు వేడుకలకు తరలివస్తున్నట్లుగా తెలుస్తోంది. -
అనంత్-రాధిక పెళ్లికి హాజరయ్యే హాలీవుడ్ స్టార్స్ వీళ్లే! (ఫోటోలు)
-
అనంత్- రాధిక వెడ్డింగ్.. ఒక్క పాటకు రూ.25 కోట్లా!
ప్రముఖ వ్యాపారవేత్త ముకేశ్ అంబానీ ఇంట్లో పెళ్లిసందడి నెలకొంది. ఆయన కుమారుడు అనంత్ అంబానీ.. రాధిక మర్చంట్తో మూడుముళ్ల బంధంలోకి అడుగుపెట్టనున్నారు. ముంబయిలో జరుగుతున్న ఈ గ్రాండ్ వెడ్డింగ్కు హాజరయ్యేందుకు సినీతారలు, విదేశాల నుంచి ప్రముఖులు హాజరవుతున్నారు. ఇప్పటికే అతిథులు దాదాపు ముంబయికి చేరుకున్నారు. వీరి పెళ్లి వేడుకల్లో విదేశీ ప్రతినిధులతో పాటు హాలీవుడ్ సినీతారలు సైతం పాల్గొంటున్నారు. ఈ గ్రాండ్ వెడ్డింగ్ జియో వరల్డ్ సెంటర్లో జరగనుంది.ఒక్క పాటకే రూ.25 కోట్లు...అయితే పెళ్లి వేడుకల్లో స్పెషల్ అట్రాక్షన్గా ఉండేందుకు పలువురు అగ్రతారలతో కచేరీలు ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగానే ప్రముఖ నైజీరియన్ సింగర్ రేమాను ప్రదర్శనకు ఆహ్వానించారు. ఈ పెళ్లి వేడుకల్లో అతను ఓ పాటను పాడేందుకు ఏకంగా రూ.25 కోట్ల రూపాయలు వసూలు చేస్తున్నట్లు సమాచారం. అంతే కాకుండా సంగీత్ వేడుకలో ప్రదర్శనకు పాప్ సింగర్ జస్టిన్ బీబర్కు రూ.84 కోట్లు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆయనతో పాటు పంజాబీ గాయకులు బాద్షా, కరణ్ ఔజ్లాకు రూ.4 కోట్ల వరకు ముట్టజెప్పారని టాక్ వినిపిస్తోంది. -
అనంత్ రాధిక వెడ్డింగ్: మెనూలో ఏకంగా పది లక్షలకు పైగా వెరైటీలు..!
రిలయన్స్ ఇండస్ట్రీస్ దిగ్గజం ముఖేశ్ అంబానీ-నీతాల చిన్న కుమారుడు అనంత్ రాధికాల వివాహం ఇవాళే(జూలై 12న) అంగరంగ వైభవోపేతంగా జరుగుతోంది. ఓ పక్క పెళ్లి కోలాహాలంతో వేడుకులు అంబరాన్ని అంటేలా సాగుతున్నాయి. ఈ వేడుకలో సినీ సెలబ్రెటీలు, ప్రముఖులు, రాజకీయనాయకులు వేలాదిగా తరలి వస్తున్నారు. ఆ ఆతిధులకు అందించే ఆతిథ్య మెనూలో ఎన్ని రకాల వంటకాలు ఉన్నాయంటే..ఈ విలాసవంతమైన పెళ్లి మెనూలో అతిథుల కోసం దాదాపు 10 లక్షలకు పైగా వంటకాలు సిద్ధమవుతున్నాయి. టిక్కీ, వడపావో, టోమాటో చాట్, పాలక్ చాట్, పూరీ, గట్టేకి సబ్జీ, పనీర్ కి సబ్జీ, రైతా, వెజ్ పులావ్, ధోక్లా వంటి వివిధ రాష్ట్రాల వంటకాలు కూడా ఉన్నాయి. ఈ వంటకాల్లో ఇండోర్ ఫేమస్ గరడు చాట్ కూడా మెనూలో భాగం కావడం విశేషం. గరడు చాట్ అంటే..?కర్ర పెండలంతో చేసే ఒక విధమైన చాట్. ఇది ఇండోర్లో బాగా ఫేమస్. అక్కడ ఈ గరడు చాట్ తోపాటు షకర్జంద్ చాట్కు కూడా మంచి డిమాండ్ ఉంది. ఇంతకమునుపు ఇటలీలో క్రూయిజ్లో జరిగిన రెండో ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో 1200 మంది అతిథులు హాజరు కాగా, అప్పటి మెనూలో వివిధ దేశాల రెసీపీలతో సహా మొత్తం 40 వెరైటీలు ఉన్నాయి. ఇక ఇవాళ జరుగుతున్న వివాహ ఈవెంట్లో మరింత గ్రాండ్గా వివాహ మెనూ ఉండొచ్చు.(చదవండి: రిచ్ బ్లూ గ్రీన్ లెహంగాలో ఎవర్ గ్రీన్గా ఉన్న నీతా లుక్..!) -
అంబానీ పెళ్లికి టాలీవుడ్ ప్రిన్స్.. న్యూ లుక్లో సందడి!
టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు ముంబయికి బయలుదేరారు. అనంత అంబానీ- రాధిక మర్చంట్ పెళ్లికి హాజరయ్యేందుకు కుటుంబంతో కలిసి వెళ్లారు. తన భార్య నమ్రతా శిరోద్కర్, సితారతో కలిసి ఎయిర్పోర్ట్లో కనిపించారు. సరికొత్త హెయిర్ స్టైల్తో మహేశ్ బాబు లుక్ అదిరిపోయింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.కాగా.. మహేశ్ బాబు గుంటూరు కారం తర్వాత రాజమౌళితో జతకట్టనున్నారు. వీరిద్దరి కాంబోలో వస్తోన్న ఈ మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన స్క్రిప్ట్ కూడా పూర్తయింది. త్వరలోనే ఈ చిత్రం సెట్స్పైకి వెళ్లే అవకాశమున్నట్లు తెలుస్తోంది. #TFNExclusive: Super 🌟 @urstrulymahesh and his family are off to Mumbai to attend #AnantRadhikaWedding ceremony!! ✈️❤️#MaheshBabu #NamrataShirodkar #SitaraGhattamaneni #SSMB29 #TeluguFilmNagar pic.twitter.com/7ych9Ww7Xr— Telugu FilmNagar (@telugufilmnagar) July 12, 2024 -
అనంత్ అంబానీ గ్రాండ్ వెడ్డింగ్ : ఆలిమ్ హకీం స్టయిల్స్ మామూలుగా లేవుగా!
హెయిర్ డ్రెస్సర్ అనగానే సెలబ్రిటీలకు గుర్తొచ్చే పేరు ఆలిమ్ హకీమ్. ఆలీం చెయ్యేస్తే మాస్.. క్లాస్ ..అదిరే లుక్స్.. గుర్తు పట్టలేనంత అందంగా తీర్చిదిద్దేంత ప్రతిభ అతని సొంతం. అందుకే సెలబ్రిటీలు, స్టార్లు, గొప్ప గొప్ప బిజినెస్ మేన్లు సెలబ్రిటీ హెయిర్ స్టయిలిష్ట్ ఆలిమ్ హకీమ్. తాజాగా అంబానీ పెళ్లి ఇంట సందడిలో మేజిక్ చేస్తున్నాడు.బాలీవుడ్ ,టాలీవుడ్ , క్రికెట్, బిజినెస్ ఇలా రంగం ఏదైనా టాప్ సెలబ్రిటీలు ఆలిమ్ హకీమ్ కస్టమర్లు. తన హెయిర్ స్టైల్తో స్టైలిష్ లుక్స్ ఇచ్చి అందర్నీ ఆకట్టుకుంటాడు. మహేష్ బాబు,రణవీర్ సింగ్, ధోని, కోహ్లీ లాంటి స్టార్ల లుక్ను అదుర్స్ అనిపించేలా తీర్చిదిద్దిన ఘన ఆయ సొంతం. తాజాగా రిలయన్స్ కుచెందిన కాబోయే వరుడు అనంత్ అంబానీకి రూపును అందంగా తీర్చిదిద్ది మరోసారి వార్తల్లోకి వచ్చాడు.రిలయన్స్ ఫ్యామిలీ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న అనంత్-రాధిక మర్చంట్ వివాహ వేడుకల్లో ఆలిమ్ హకీమ్ హెయిర్ స్టయిలిస్ట్గా తన సత్తా చాటాడు. వరుడు అనంత్ అంబానీ, అలాగే ముఖేష్ అంబానీ పెద్దకుమారుడు ఆకాష్ లుక్ను అద్భుతంగా మార్చేశాడు. ఈ సందర్భంగా ఇన్స్టాలో ఆలిమ్ హకీమ్ అంబానీకి ఫేడ్ కట్తో ఎలా సరికొత్త రూపాన్ని ఇచ్చాడో షేర్ చేశాడు.అంతేనా కాబోయే వరుడు అనంత్ అంబానీకి కూడా అలీమ్ అద్భుతమైన మేకోవర్ ఇచ్చాడు. అనంత్ పొడవాటి గిరజాల జుట్టును కత్తిరించకుండా మేకోవర్ చేయడం హైలైట్గా నిలిచింది. అలాగే పెళ్లికి వచ్చిన అతిథుల కేశాలను అందంగా తీర్చిదిద్దుతున్నాడు. View this post on Instagram A post shared by Eka (@ekalakhani) -
అటు దాండియా.. ఇటు మెహందీ.. కలర్ఫుల్గా అంబానీ ఫ్యామిలీ (ఫోటోలు)
-
గ్రాండ్ వెడ్డింగ్ : పవిత్ర కాశీ నగరంపై నీతా అంబానీ ప్రత్యేక వీడియో, వైరల్
లవ్బర్డ్స్ అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ వివాహం సందర్భంగా అనంత్ తల్లి, రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు, చైర్పర్సన్ నీతా అంబానీ పవిత్ర వారణాసి నగర గొప్పదనాన్ని తన అభిమానులతో పంచుకున్నారు. దేశీయ గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని ప్రపంచంతో పంచుకోవాలనే ఉద్దేశంతో ఎన్ఎంఏసీసీని స్థాపించిన తమ దార్శనికతకు అనుగుణంగా, తమ కుటుంబంలోని వివాహ వేడుకలకు ముందు పవిత్ర నగరమైన వారణాసికి నివాళులర్పిస్తున్నట్టు ప్రకటించారు. ఈ సందర్భంగా అద్భుతమైన వీడియోను షేర్ చేశారు. నీతా అంబానీ మనీష్ మల్హోత్రా డిజైన్ చేసిన అరుదైన రంగత్ స్వదేశీ బనారసీ చీరలో హుందాగా కనిపించారు.~ Auspicious Beginnings: An Ode to Kashi ~ pic.twitter.com/GXVcIXIeBh— Nita Mukesh Ambani Cultural Centre (@nmacc_india) July 12, 2024కాగా అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ వివాహం శుక్రవారం రాత్రి అంగరంగ వైభవంగా జరగనుంది. ఈ వివాహ వేడుకల్లో భాగంగా వరుడి తల్లి, నీతా అంబానీ వారణాసిని సందర్శించి వివాహ తొలి ఆహ్వానాన్ని కాశీ విశ్వేశ్వరుడి పాదాల వద్ద ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించిన సంగతి తెలిసిందే.. -
అనంత్-రాధిక గ్రాండ్ వెడ్డింగ్: భావోద్వేగ క్షణాలు, వైరల్ వీడియో
పెళ్లి చేసి ఆడబిడ్డను అత్తారింటికి సాగనంపడం అనేది భావోద్వేగంతో కూడిన సందర్భం. పెళ్లికి నిశ్చితార్థం మొదలు, ఆ మూడు ముళ్లూ పడివరకు, ఇక అమ్మాయి అప్పగింతల సమయంలో ఆ ఉద్విగ్న క్షణాలు కన్నీటి పర్వంత మవుతాయి. నిరుపేదైనా, కుబేరుడైనా ఈ అనుభవం తప్పదు. పారిశ్రామికవేత్త విరేన్ మర్చంట్ ముద్దుల తనయ రాధికమర్చంట్ మధ్య ఇలాంటి భావోద్వేగ క్షణాలు నమోదైనాయి. మర్చంట్, అంబానీ కుటుంబాలు నిర్వహించిన గ్రహ శాంతి పూజ సందర్భంగా వీరేన్, కాబోయే వధువు రాధికను ఆలింగనం చేసుకుని ఎమోషనల్ అయ్యారు. గ్రాండ్ వెడ్డింగ్కు ముందు అనంత్ అంబానీకూడా తన కాబోయే భార్యను ఆత్మీయంగా గుండెలకు హత్తుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది.కాగా ఇద్దరు పారిశ్రామికవేత్తలువియ్యమందుకునే ముహూర్తం మరికొద్ది గంటల్లో రానుంది. ప్రపంచంలోని అత్యంత సంపన్న కుటుంబాలలో ఒకటి, రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ, నీతా చిన్న కుమారుడు అనంత్, పారిశ్రామికవేత్త వీరేన్ మర్చంట్, వ్యాపారవేత్త శైలా మర్చంట్ కుమార్తె రాధిక మర్చంట్తో ఈ రోజు (జూలై 12) వివాహం జరగనుంది. ఈ వివాహానికి పలువురు సినీ, క్రీడా రంగ సెలబ్రిటీలు, రాజకీయ ప్రముఖులు దేశ విదేశాలకు చెందిన అతిరథ మహారథులు ఇప్పటికే ముంబై చేరుకుంటున్నారు. View this post on Instagram A post shared by WeddingSutra.com (@weddingsutra) -
అంబానీ చెల్లి.. భర్త చనిపోయినా కోట్ల కంపెనీకి ఛైర్పర్సన్గా..
ఆసియాలోనే అత్యంత ధనవంతుడిగా పేరున్న ముఖేశ్ అంబానీ కుంటుంబం గురించి తెలుసా అంటే.. ఆయన గురించి తెలియని వారుంటారా..? ముఖేశ్ భార్య నీతా, పిల్లలు ఆకాశ్, అనంత్, ఇషా అని చెబుతారు కదూ. కానీ ముఖేశ్ చెల్లెళ్ల గురించి ఎంతమందికి తెలుసు.. అందులో ఒకరి భర్త మరణించినా తన కంపెనీలను సమర్థంగా నిర్వహిస్తూ కోట్ల రూపాయల వ్యాపార సామ్రాజ్యాన్ని స్థాపించారు. ఇంతకీ ఆమె ఎవరు..తాను చేస్తున్న వ్యాపారం ఏంటో ఈ కథనంలో తెలుసుకుందాం.ధీరూభాయ్ అంబానీకి ముఖేష్, అనిల్లతోపాటు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వీరి పేర్లు నీనా కొఠారి, దీప్తి సల్గోకర్. నీనా కొఠారి 1986లో కొఠారి షుగర్స్ అండ్ కెమికల్స్ ఛైర్మన్ భద్రశ్యామ్ కొఠారిని వివాహం చేసుకున్నారు. వీరికి కుమారుడు అర్జున్ కొఠారి, కుమార్తె నయనతార కొఠారి ఉన్నారు. నీనా భర్త శ్యామ్ కొఠారి 2015లో క్యాన్సర్తో మరణించారు. ఆ తర్వాత నీనా వారి కుటుంబ వ్యాపారమైన కొఠారి షుగర్స్ అండ్ కెమికల్స్ బాధ్యతలను చేపట్టారు. ఏప్రిల్ 8, 2015లో ఆమె కంపెనీ ఛైర్పర్సన్గా నియమితులయ్యారు.ఆమె భర్త మరణానంతరం కంపెనీ లాభాలను పెంచేందుకు చాలా కృషి చేశారు. ప్రస్తుతం కొఠారీ షుగర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.450 కోట్లుగా ఉంది. కార్పొరేట్ షేర్హోల్డింగ్స్ ప్రకారం.. నీనా భద్రశ్యామ్ కొఠారి రెండు స్టాక్లను కలిగి ఉన్నారు. వాటి నికర విలువ రూ.54 కోట్లకు పైగానే ఉంది. కార్పొరేట్ పరిశ్రమలో నీనా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్నారు. ఆమె 2003లో జావగ్రీన్ అనే కాఫీ అండ్ ఫుడ్ చైన్ని ప్రారంభించారు.ఆమె పెద్ద కుమారుడు అర్జున్ కొఠారి..కొఠారి షుగర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్కు మేనేజింగ్ డైరెక్టర్గా వ్యవహరిస్తున్నారు. కుటుంబ వ్యాపారాన్ని విస్తరించేందుకు తల్లి నీనాతో కలిసి పని చేస్తున్నారు. కాగా, నీనా కుమార్తె నయనతార కెకె బిర్లా మనవడు షమిత్ భారతియాను వివాహం చేసుకున్నారు.ఇదీ చదవండి: అతిథుల కోసం 3 ఫాల్కన్ జెట్లు, 100 విమానాలుముఖేశ్ అంబానీ రెండో చెల్లి దీప్తి సల్గోకర్. ఈమె వీ.ఎం.సల్గోకర్ అండ్ బ్రో ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఎండీ దత్తరాజ్ సల్గోకర్ భార్య. ఈ దంపతులు గోవాలో ‘సునపరంతా గోవా సెంటర్’లో ప్రదర్శనశాలను నిర్వహిస్తున్నారు. దీప్తి సల్గ్కోకర్ వీ.ఎం.సగోన్కర్ అండ్ బ్రో ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో కార్పొరేట్ కమ్యునికేషన్ వైస్ ప్రెసిడెంట్ బాధ్యతలు కూడా నిర్వర్తిస్తున్నారు.ముఖేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ల వివాహా వేడుకకు సర్వం సిద్ధమైంది. ముంబయిలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ (బీకేసీ)లోని జియో వరల్డ్ సెంటర్లో జులై 12న ఈ జంట పెళ్లి బంధంతో ఒక్కటవ్వనుంది. వీరి వివాహానికి దేశీయ ప్రముఖులతోపాటు విదేశాల్లోని దిగ్గజ సంస్థల సీఈఓలు హాజరవుతున్నారు. -
ఉద్యోగులకు అంబానీ ఫ్యామిలీ అదిరిపోయే గిఫ్ట్ - వీడియో
అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ల వివాహం ఈ రోజు (జులై 12) జరగనుంది. అంబానీ ఇంట జరుగుతున్న ఈ పెళ్ళి సందర్భంగా రిలయన్స్ ఉద్యోగులకు గిఫ్ట్ బాక్స్ పంపించారు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది.సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో గమనిస్తే.. రెడ్ కలర్ బాక్స్, దాని మీద దేవీ, దేవతల దివ్య దయతో 12 జులై 2024న ఆనంద్ మరియు రాధికల వివాహాన్ని జరుపుకుంటున్నాము. నీతా, ముఖేష్ అంబానీల శుభాకాంక్షలు అని ఉండటం చూడవచ్చు.అంబానీ ఫ్యామిలీ పంపించిన గిఫ్ట్ బాక్స్లో హల్దీరామ్ ఆలూ భుజియా సేవ్, లైట్ చివాడాతో సహా పలు రకాల స్వీట్లు ఉన్నాయి. వీటితో పాటు ఓ వెండి కాయిన్ కూడా ఉంది. ఈ గిఫ్ట్ అందుకున్న ఉద్యోగులు అనంత్ & రాధిక జంటను అభినందిస్తూ ఇన్స్టాగ్రామ్లో కామెంట్స్ చేస్తున్నారు.అనంత్ అంబానీ, రాధిక మర్చెంట్ వివాహ వేడుకలు సాంప్రదాయ హిందూ వైదిక ఆచారాలతో జరిగే అవకాశం ఉంది. ప్రధాన వేడుకలు శుక్రవారం, జూలై 12 వివాహ కార్యక్రమంతో ప్రారంభమవుతాయి. ఆ తరువాత జూలై 13, శనివారం శుభ్ ఆశీర్వాద్తో వేడుకలు.. జులై 14 ఆదివారం మంగళ్ ఉత్సవ్ లేదా వివాహ రిసెప్షన్ జరగనుంది. ఈ వివాహ వేడుకలకు ప్రపంచం నలుమూలల నుంచి ఎంతోమంది ప్రముఖులు హాజరయ్యే అవకాశం ఉంది. View this post on Instagram A post shared by Tanya Raj (@vibewithtanyaa) -
అంబానీ ఇంట పెళ్లికి హాజరుకానున్న ప్రముఖ సీఈఓలు (ఫొటోలు)
-
అంబానీల పెళ్లి సందడి
-
అంబానీ ఇంట పెళ్లి.. ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్
అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ వివాహం ఈ రోజు (జులై 12)న ముంబైలో జరగనుంది. ఈ నేపథ్యంలో ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్(BKC)లోని పలు కార్యాలయాలు తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ అవకాశం కల్పించాయి. జూలై 15 వరకు ఎవరూ ఆఫిసులకు రావాల్సిన అవసరం లేదని, ఆ తరువాత కార్యాలయాలకు యధావిధిగా హాజరు కావాలని పేర్కొన్నాయి.అనంత్, రాధికల పెళ్లి కారణంగా ట్రాఫిక్ మళ్లింపులు ముంబైలోని పలు కంపెనీలు ఈ నిర్ణయం తీసుకున్నాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ చైర్మన్ ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ, వీరేన్ మర్చంట్ కుమార్తె రాధిక మర్చంట్ వివాహం జూలై 12న జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో జరగనుంది. ఈ పెళ్లి వేడుకలు జూలై 14 వరకు.. మూడు రోజులు కొనసాగుతాయి.అంబానీ ఇంట జరగనున్న ఈ వేడుకలకు ప్రపంచ నలుమూలల నుంచి ఎంతో మంది సెలబ్రిటీలు, పారిశ్రామికవేత్తలు హాజరుకానున్నారు. వీరందరికి భద్రత కల్పించడంలో సెక్యూరిటీ చాలా పటిష్టంగా ఉంటుంది. కాబట్టి ఉద్యోగులు ఇంటి నుంచి పనిచేయాలని ఆఫీసులు తెలిపాయి.అనంత్, రాధికల వివాహం కారణంగా ఇప్పటికే ముంబై అంతటా హోటల్ బుకింగ్ ధరలు గణనీయమైన పెరిగాయి. ట్రైడెంట్, ఒబెరాయ్ వంటి వేదికలు జూలై 10 నుంచి 14 వరకు పూర్తిగా బుక్ అయినట్లు సమాచారం. ఇక్కడ ఒక రాత్రి బస చేయడానికి ఏకంగా లక్ష రూపాయలు చెల్లించాల్సి ఉందని పలు నివేదికలు వెల్లడించాయి.అంబానీ ఇంట జరగనున్న పెళ్ళికి హెచ్ఎస్బీసీ హోల్డింగ్స్ పీఎల్సీ ఛైర్మన్ మార్క్ టక్కర్, శామ్సంగ్ ఎలక్ట్రానిక్స్ కో. లిమిటెడ్ ఛైర్మన్ జేలీ, యూకే మాజీ నేతలు బోరిస్ జాన్సన్, టోనీ బ్లెయిర్ వంటి వాటితో పాటు సౌదీ అరామ్కో అమిన్ నాసర్, బీపీ పీఐసీ ముర్రే ఆచిన్క్లోస్, జీఎస్కే పీఐసీ ఎమ్మా వాల్మ్స్లే, లాక్హీడ్ మార్టిన్ జిమ్ టైక్లెట్, ఫిఫా అధ్యక్షుడు జియాని ఇన్ఫాంటినో వంటి టాప్ ఎగ్జిక్యూటివ్లు హాజరయ్యే అవకాశం ఉంది. -
అంబానీ ఇంట పెళ్లి ఖర్చు 0.5 శాతమే!!
ఆసియా అపర కుబేరుడు ముఖేష్ అంబానీ చిన్న కొడుకు అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ల వివాహం జూలై 12న జరగనుంది. రెండు విడతల ప్రీ-వెడ్డింగ్ వేడుకలు ఇదివరకే అత్యంత ఘనంగా జరిగాయి. ఇక అసలైన పెళ్లి వేడుకలు ఇంకెంత ఘనంగా జరుగుతాయోనని ప్రపంచమంతా ఆసక్తిగా చూస్తోంది.ప్రపంచమే అబ్బురపడేలా వీరి వివాహ వేడుకలు నిర్వహిస్తున్నారు. గ్లోబల్ సింగింగ్ ఐకాన్లు జస్టిన్ బీబర్, రిహన్న, దిల్జిత్ దోసాంజ్, ఇతర బాలీవుడ్ ప్రముఖులు ఈ వేడుకలలో ప్రదర్శనలు ఇస్తున్నారు. దీంతో ఎక్కడ చూసినా ఈ పెళ్లి గురించే చర్చ జరుగుతోంది. అంబానీ వివాహానికి సంబంధించిన విజువల్స్, ఫొటోలు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి.రూ.5000 కోట్ల ఖర్చుఅనంత్ అంబానీ, రాధిక మర్చంట్ల పెళ్లి ఖర్చు రూ. 4,000-5,000 కోట్లు ఉంటుందని ఫైనాన్స్ డీకోడర్లు అంచనా వేస్తున్నారు. పెళ్లి కోసం ఇంత మొత్తంలో ఖర్చు చేయడం అనూహ్యమైనప్పటికీ, అంబానీ కుటుంబం సగటు భారతీయ కుటుంబాలు ఖర్చు చేసే దాని కంటే తక్కువ శాతాన్నే ఖర్చు చేస్తోంది.రూ. 50 లక్షల నుంచి రూ. కోటి వరకు ఆస్తి కలిగిన కుటుంబం తమ పిల్లల పెళ్లికి రూ. 10-15 లక్షలు ఖర్చు చేస్తున్నారు. అదే విధంగా రూ. 10 కోట్ల సంపద కలిగిన కుటుంబం రూ. 50 లక్షల నుంచి రూ. 1.5 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నారు. అంటే తమ సంపదలో 5 శాతం నుంచి 15 శాతం వరకు ఖర్చు చేస్తున్నారన్న మాట. అయితే అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ల వివాహానికి చేస్తున్న దాదాపు రూ.5,000 కోట్లు అంబానీ సంపదలో 0.5 శాతం మాత్రమే. ఫోర్బ్స్ ప్రకారం.. ప్రస్తుతం ముఖేష్ అంబానీ నికర విలువ 123.2 బిలియన్ డాలర్లు (రూ. 10,28,544 కోట్లు). -
రామ్ చరణ్ కొత్త కారు.. దేశంలోనే రెండోది
గ్లోబల్స్టార్ రామ్ చరణ్ దంపతులు అనంత్ అంబానీ- రాధికా మర్చెంట్ల వివాహానికి హైదరాబాద్ నుంచి బయల్దేరారు. ఇప్పటికే సినీ, రాజకీయ ప్రముఖులు వివాహానికి భారీగా వెళ్తున్నారు. అయితే ఇప్పుడు రామ్ చరణ్ తన సతీమణి ఉపాసన, కూతురు క్లీంకారతో కలిసి లగ్జరీ కారులో ఎయిర్పోర్ట్కు వెళ్లారు. ఇప్పుడా వీడియో నెట్టింట భారీగా వైరల్ అవుతుంది.టాలీవుడ్ టాప్ హీరోల వద్ద లగ్జరీ కార్లు ఉన్నాయి. ఈ క్రమంలో రామ్ చరణ్ గ్యారేజీలో మెర్సిడేజ్, రోల్స్ రాయిస్ ఫాంథమ్, ఫెరారీ, ఆస్టో మార్టిన్ వంటి లగ్జరీ కార్లు ఉన్నాయి. తాజాగా చరణ్ దంపతులు అనంత్ అంబానీ-రాధికా మర్చెంట్ వివాహానికి వెళ్లేందుకు బేగంపేట ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. అయితే, రామ్ చరణ్ కొత్త రోల్స్ రాయిస్ స్పెక్టార్ను డ్రైవ్ చేసుకుంటూ ఎయిర్పోర్ట్కు వచ్చారు. దీని ధర దాదాపు రూ.7.5 కోట్లు ఉంటుందని సమాచారం. ప్రస్తుతం ఈ కారు ఇండియాలో రెండోది కావడం విశేషం. సౌత్ ఇండియాలో మొదటి కారు కావడం గమనార్హం.రోల్స్ రాయిస్ కారుకు ప్రత్యేకమైన స్థానం ఉంది. చాలా తక్కువ మంది వద్దే ఈ కెంపెనీకి చెందిన కార్లు ఉంటాయి. మెగాస్టార్ చిరంజీవికి వైట్ కలర్ రోల్స్ రాయిస్ కారు ఉన్న విషయం తెలిసిందే. ఇప్పుడు తాజాగా రామ్ చరణ్ లేటెస్ట్ వర్షన్ రోల్స్ రాయిస్ కారును కొన్నారు. జనవరి 2024లో ఈ మోడల్ లాంఛ్ అయింది. ఈ కారు అందుకున్న రెండో వ్యక్తిగా రామ్ చరణ్ రికార్డ్ క్రియేట్ చేశారు.Charan Babu Off to Mumbai 👍👍👍New Rolls Royce Spectre Car (Second Car in India its cost around 7.5 Cr)#RamCharan pic.twitter.com/eqkjiAJUEa— Praveen (@AlwaysPraveen7) July 11, 2024Screen presence &Royality @AlwaysRamCharan 🦁Present Generation lo #RamCharan offline styling 👌🔥Eh dress ayna easy ga set ayipodi aha body ki pic.twitter.com/m4AikXYzDj— vijay (@vijay_mbfan) July 11, 2024 -
అనంత్ అంబానీ పెళ్లిలో ధగధగ మెరిసిపోతున్న దేవర భామ.. పోటోలు
-
ముంబయికి గ్లోబల్ స్టార్ దంపతులు.. ఎందుకంటే?
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ముంబయికి బయలుదేరి వెళ్లారు. ప్రముఖ వ్యాపారవేత్త ముకేశ్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ- రాధిక మర్చంట్ పెళ్లికి సతీసమేతంగా హాజరు కానున్నారు. తాజాగా ఆయన భార్య ఉపాసన, ముద్దుల కూతురు క్లీంకారతో కలిసి హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో కనిపించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.కాగా.. రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ డైరెక్షన్లో తెరకెక్కుతోన్న గేమ్ ఛేంజర్లో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తి కావొస్తోంది. ఈ చిత్రంలో చెర్రీ సరసన బాలీవుడ్ భామ కియారా అద్వానీ హీరోయిన్గా కనిపించనుంది. ఇప్పటికే పలుసార్లు వాయిదా పడుతూ వచ్చిన గేమ్ ఛేంజర్ ఈ ఏడాది చివర్లో థియేటర్లలో రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. గేమ్ ఛేంజర్ తర్వాత బుచ్చిబాబు దర్శకత్వంలో చెర్రీ నటించనున్నారు. ఈ మూవీలో రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తోంది. #RamCharan brings his A Swag to the airport as he departs for Mumbai with #KlinKaara & @upasanakonidela for Anant Ambani & Radhika Merchant's Wedding !The Debonair @AlwaysRamCharan 🦁 pic.twitter.com/SVlrMZVbE4— Trends RamCharan ™ (@TweetRamCharan) July 11, 2024 -
అతిథుల కోసం 3 ఫాల్కన్ జెట్లు, 100 విమానాలు
రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ల వివాహా వేడుకకు సర్వం సిద్ధమైంది. ముంబయిలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ (బీకేసీ)లోని జియో వరల్డ్ సెంటర్లో జులై 12న ఈ జంట పెళ్లి బంధంతో ఒక్కటవ్వనుంది. వీరి వివాహానికి దేశీయ ప్రముఖులతోపాటు విదేశాల్లోని దిగ్గజ సంస్థల సీఈఓలు హాజరవుతున్నారు. దాంతో వారికి సకల సౌకర్యాలు సమకూర్చేలా ఇప్పటికే ఏర్పాట్లు జరిగిపోయాయి. అందులో భాగంగా ప్రముఖుల కోసం ఏకంగా అంబానీ కుటుంబం మూడు ఫాల్కన్ 2000 జెట్లను, 100 సాధారణ విమానాలను అద్దెకు తీసుకుంది.క్లబ్ వన్ ఎయిర్ సంస్థ సీఈఓ రాజన్ మెహ్రా అంబానీ జెట్ విమానాలను అద్దెకు తీసుకున్నట్లు ధ్రువీకరించారు. పెళ్లికి వచ్చిన అతిథులను తిరిగి వారి గమ్యస్థానాలను చేర్చడానికి వీటిని వినియోగిస్తారని చెప్పారు. అనంత్-రాధిక పెళ్లి సందర్భంగా జులై 12-15 వరకు ముంబయిలో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు ఇప్పటికే పోలీసులు ప్రకటించారు.కొన్ని మీడియా కథనాల ప్రకారం అనంత్-రాధికల పెళ్లికి రాబోయే విదేశీ ప్రముఖుల లిస్ట్ ఈ కింది విధంగా ఉంది.సౌదీ అరామ్కో సీఈవో అమిన్ నాసర్హెచ్ఎస్బీసీ గ్రూప్ ఛైర్మన్ మార్క్ టక్కర్భారతీయ సంతతికి చెందిన అడోబ్ సీఈవో శంతను నారాయణ్మోర్గాన్ స్టాన్లీ ఎండీ మైఖేల్ గ్రిమ్స్శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ ఛైర్మన్ జే లీముబాదలా ఎండీ ఖల్దున్ అల్ ముబారక్ బీపీ సీఈఓ ముర్రేఅనంత్-రాధికల పెళ్లి నేపథ్యంలో ముంబైలోని హోటల్స్ గదుల రేట్లు భారీగా పెరిగాయి. ఇప్పటికే మొత్తం రూమ్స్ బుక్ అయిపోయినట్లు కూడా కొన్ని ప్రముఖ ఫైవ్ స్టార్ హోటల్స్ పేర్కొన్నాయి. సాధారణ రోజులలో ముంబైలోని కొన్ని ఫైవ్ స్టార్ హోటల్స్లోని గదుల ఛార్జీ ఒక రాత్రికి సుమారు రూ.13,000గా ఉండేది. అంబానీ ఇంట పెళ్లి వేడుకల సందర్భంగా ఈ ధరలను సుమారు రూ.1 లక్షకు పెంచినట్లు తెలిసింది.ఇదీ చదవండి: వచ్చే 2-3 ఏళ్లలో 10 లక్షల ఉద్యోగాలు!జులై 12న ‘శుభ్ వివాహ్’, జులై 13న ‘శుభ్ ఆశీర్వాద్’, జులై 14న ‘మంగళ్ ఉత్సవ్’ కార్యక్రమంతో పెళ్లి వేడుకలు ముగియనున్నాయి. త్వరలో పెళ్లి పీటలెక్కే జంట ఇప్పటికే రెండుసార్లు అంగరంగ వైభవంగా ప్రీవెడ్డింగ్ వేడుకలు నిర్వహించుకుంది. ఇటీవల ఇటలీ నుంచి ఫ్రాన్స్ వరకు దాదాపు 4500 కిలోమీటర్లు క్రూయిజ్లో ప్రయాణిస్తూ రెండో ప్రీవెడ్డింగ్ సెలబ్రేషన్స్ జరుపుకున్నారు. గతంలో ఈ జంట జామ్నగర్లో తమ మొదటి ప్రీవెడ్డింగ్ వేడుకలను జరుపుకున్నారు. ఇటీవల అంబానీ కుంటుంబం 50 పేద జంటలకు సామూహిక వివాహాలను కూడా జరిపించింది. అందుకు అవసరమైన పూర్తి ఖర్చులను భరించింది. వివాహాల అనంతరం కొత్త జంటలకు అవసరమయ్యే ఇంటి సామగ్రిని అందించింది. ఇటీవల జరిగిన సంగీత్ వేడుకల్లో పాప్ సింగర్ జస్టిన్బీబర్ సందడి చేశారు. -
అనంత్ అంబానీ పెళ్లిపై ఆలియా సంచలన వ్యాఖ్యలు
ప్రముఖ వ్యాపారవేత్త, అపర కుభేరుడు ముకేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ పెళ్లి శుక్రవారం(జులై 12) ముంబైలో జరగనుంది. ఇప్పటికే ఏర్పట్లు అన్ని పూర్తి చేశారు. ఈ వివాహ వేడుకకి ప్రపంచ నలుమూలల నుంచి పలువురు వ్యాపార, సీనీ, రాజకీయ ప్రముఖులు హాజరకానునున్నారు. ఇప్పటికే రెండు సార్లు ప్రీవెడ్డింగ్ ఈవెంట్స్ జరిగాయి. ఈ ఈవెంట్స్కి బాలీవుడ్ స్టార్స్ అంతా హాజరై సందడి చేశారు. (చదవండి: క్లీంకారతో ముంబయికి రామ్ చరణ్.. ఎందుకో తెలుసా?)రేపు జరిగే వివాహ వేడుకకి కూడా బాలీవుడ్ ప్రముఖులంతా హాజరుకానున్నారు. ఇప్పటికే సంబంధిత పీఆర్వోలు ఆహ్వానాలు అందించారు. పలువురు స్టార్స్ కూడా పెళ్లికి కోసం తమ షెడ్యూల్ని మార్చుకున్నారు. అయితే తనకు ఎన్నిసార్లు ఆహ్వానం పంపినా.. పెళ్లికి మాత్రం వెళ్లనని చెబుతోంది ప్రముఖ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ కూతురు ఆలియా కశ్యప్. అంతేకాదు అనంత్ అంబానీ పెళ్లి.. పెళ్లిలా కాకుండా ఒక సర్కస్లా మారిందని సంచలన వ్యాఖ్యలు చేసింది.(చదవండి: పెళ్లి వేడుకల్లో మెరిసిన దేవర భామ.. పక్కనే బాయ్ఫ్రెండ్ కూడా!)‘నన్ను ఓ ఈవెంట్కి ఆహ్వానించారు. కానీ నేను రానని చెప్పాను. ఎందుకంటే నాకు కొంచెం ఆత్మగౌరవం ఉంది. ఒకరి పెళ్లిలో నన్ను నేను అమ్ముకోవడం కంటే నాకు గౌరవమే ముఖ్యం’ అని అలియా తన ఇన్స్టాలో రాసుకొచ్చింది. ప్రస్తుతం ఆలియా వ్యాఖ్యలపై నెట్టింట వైరల్ అవుతున్నాయి.అంబానీ ఇంట పెళ్లి అంటే.. బాలీవుడ్ మొత్తం పండగ చేసుకుంటుంది. స్టార్ హీరోహీరోయిన్లు పెళ్లిలో డ్యాన్స్ చేసి సందడి చేస్తారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పాప్ స్టార్లంతా ఈ పెళ్లి వేడుకలో ప్రదర్శన ఇచ్చేందుకు తహతహలాడతారు. అంబానీ ప్యామిలీ కూడా ఇలాంటి ఈవెంట్స్కి కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తుంది. Aliyah Kashyap (Anurag Kashyap's daughter) talks about the PR involved in the Ambani wedding on her Instagram channel. Influencers are being invited to promote wedding.Although this is hard to digest. They don’t need the PR thing to promote the wedding + it also takes away the… pic.twitter.com/kezmfnsk0b— Vineet Sharma (@Vineet_Sir_) July 8, 2024 -
రిచ్ బ్లూ గ్రీన్ లెహంగాలో ఎవర్ గ్రీన్గా ఉన్న నీతా లుక్..!
ముఖేశ్ అంబానీ ఇంట పెళ్లి కోలాహలంతో సందడిగా ఉంది. రోజుకో ఈవెంట్లో కుటుబసభ్యులంతా కళ్లు చెదిరే ష్యాషన్ డిజైనర్ వేర్లతో అలరిస్తున్నారు. ప్రతి ఒక్క కార్యక్రమం చాలా వేడుకగా జరుగుతోంది. అందులో భాగంగా అనంత్ రాధికల శివశక్తి వేడుక జరిగింది. ఈ వేడుకలో నీతా ధరించిన లెహంగా మిస్మరైజ్ చేస్తోంది. చక్కటి రిచ్ బ్లూ గ్రీన్ లెహంగాలో నీతా దివి నుంచి భువికి వచ్చిన దేవతలా మెరిసిపోతోంది. ఆ గ్రాండ్ లెహంగాకి తగ్గట్టుగా ఆమె ధరించిన పెద్ద కుందన్ నెక్లెస్ సెట్ మిరుమిట్లు గొలిపే కాంతితో ఆమె ముఖ వర్చస్సు మరింత అందంగా కనిపిస్తోంది. అబు జానీ సందీప్ ఖోస్టో డిజైన్ చేసిన స్పెషల్ లెహంగాలో నీతా చాలా అందంగా కనిపించింది. ఆ లెహంగా..చిలుక ఆకుపచ్చ స్కర్ట్, పైన రిచ్ బ్లూ దుప్పట దానిపై చేతితో చేసిన ఎంబ్రాయిడరీ వర్క్, మిర్రర్లతో కూడిన జరీ వర్క్తో అందంగా తీర్చిదిద్దారు. నీతా ధరించిన లెహంగా మంచి రిచ్ లుక్లో ఉండగా, ముఖ్యంగా ఆమె నెక్కి ధరించిన కుందనపు నగ అందరి దృష్టిని ఆకర్షించింది. ఆమె చెవులకు సైతం పెద్ద కుందనాలతో ఉన్న చెవిపోగులనే ధరించారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. కాగా, అనంత్ రాధికల పెళ్లి జూలై 12న అంగరంగ వైభవంగా జరగనున్న సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) (చదవండి: అనంత్ -రాధిక పెళ్లి వేడుక: తమిళియన్ హెయిర్ స్టైల్లో ఇషా..!) -
పెళ్లి వేడుకల్లో ప్రియుడితో కలిసి సందడి చేసిన హీరోయిన్..!
బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ ప్రస్తుతం దేవర సినిమాలో నటిస్తోంది. జూనియర్ ఎన్టీఆర్- కొరటాల శివ కాంబోలో వస్తోన్న ఈ చిత్రం ద్వారా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. ఆ తర్వాత బుచ్చిబాబు డైరెక్షన్లో వస్తోన్న మూవీలో రామ్ చరణ్ సరసన కనిపించనుంది. వీటితో పాటు బాలీవుడ్లోనూ బిజీగా ఉంది ముద్దుగుమ్మ.తాజాగా ముంబయిలో జరుగుతున్న అనంత్ అంబానీ- రాధిక మర్చంట్ వెడ్డింగ్ వేడుకల్లో మెరిసింది. బుధవారం జరిగిన శివశక్తి పూజకు హాజరైంది. జాన్వీ భాయ్ఫ్రెండ్గా భావిస్తున్న శిఖర్ పహారియాతో కలిసి పెళ్లి వేడుకల్లో పాల్గొంది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. వీరితో పాటు కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ దంపతులు కూడా సంప్రదాయ దుస్తులు ధరించి సందడి చేశారు. View this post on Instagram A post shared by Manav Manglani (@manav.manglani) -
అంబానీ పెళ్లి వేడుక : టిక్ టాకర్ లగేజీ గాయబ్..చివరికి!
View this post on Instagram A post shared by jewelswithjules • julia hackman chafé (@juliachafe)అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ల వివాహ వేడుకలు సోషల్ మీడియాలో ట్రెండిగ్లో నిలుస్తున్నాయి. ఈ వేడుకలకు హాజరయ్యేందుకు దేశ విదేశాలకు చెందిన సెలబ్రిటీలు, కంటెంట్ క్రియేటర్లు, ఇన్ఫ్లూయెన్సర్లు ఉవ్విళ్లూరుతున్నారు. ఈ క్రమంలో అనంత్, రాధిక ప్రీవెడ్డింగ్ వేడులకు ఉత్సాహంగా పయనమైన యుఎస్ టిక్టాకర్, కంటెంట్ క్రియేటర్ జూలియా చాఫ్కు వింత అనుభవం ఎదురైంది. బిలియనీర్ అంబానీ కుటుంబంపై నెలల తరబడి వీడియోలు చేసిన ఆమెకు అంబానీ ఇంట పెళ్లి సందడికి హాజరవ్వాలనేది డ్రీమ్. కానీ ఊహించని పరిస్థితి ఎదురైంది.. స్టోరీ ఏంటంటే..అంబానీ ఫ్యామిలీనుంచి అందిన ఆహ్వానం నేపథ్యంలో జూలియా చాఫ్ ఉత్సాహంగా సోమవారం ఇండియాకు బయలుదేరింది. దీనికి సంబంధించిన వీడియోను కూడా ఇన్స్టాలో షేర్ చేసింది. ఇంతలో ఏజియన్ ఎయిర్లైన్స్ లో నాలుగు బ్యాగుల లగేజీ మొత్తాన్ని పోగొట్టుకుంది. ఏథెన్స్లో చిక్కుకుపోయింది. దీంతో సంబంధిత ఎయిర్లైన్ ట్యాగ్ చేస్తూ మరో పోస్ట్ పెట్టింది. మొత్తానికి లగేజీ తిరిగి దొరకడంతో తన కలను సాకారం చేసుకుంది. అంబానీ ఇంట జరిగిన వేడుకలకు హాజరైంది. ఈ వీడియోపై ఇంటర్నెట్ సంచలనం ఓరీ స్పందించాడు. View this post on Instagram A post shared by jewelswithjules • julia hackman chafé (@juliachafe) కాగా జూలియా చాఫ్తో జెమ్ డీలర్ కూడా. అంబానీ కుటుంబానికి చెందిన డైమండ్, లగ్జరీ ఆభరణాల గురించి ఈమెకు తెలిసినంతగా ఇండియన్ మీడియాకు కూడా తెలియదట. దీనికి సంబంధించిన కంటెంట్తోనే జూలియా బాగా పాపులర్ అయింది. -
అనంత్ అంబానీ - రాధిక హల్దీ : హాట్ టాపిక్గా సల్మాన్ ఖాన్ వాచ్
రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ చిన్నకుమారుడు అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో సినీ, రాజకీయ, క్రీడా రంగ ప్రముఖులు సందడి చేస్తున్నారు. ఒక్కొక్కరు ఒక్కో స్టయిల్తో ప్రత్యేకంగా నిలుస్తున్నారు. తాజాగా అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ ప్ రీవెడ్డింగ్ బాష్లో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ధరించిన వాచ్ హాట్ టాపిక్గానిలిచింది.అనంత్ అంబానీకి ఎంగేజ్మెంట్మొదలు, తొలి, రెండో క్రూయిజ్ ప్రీ-వెడ్డింగ్ ఈవెంట్, ఇలా ప్రతీవేడుకలోనూ సల్మాన్ హాజరు తప్పకుండా ఉండాల్సిందే. ఇటీవల అనంత్-రాధిక సంగీత్లో కూడా అనంత్తో కలిసి స్టెప్పులేశారు. ఇక హల్దీ వేడుకలో సల్మాన్ ఖాన్ ఖరీదైన వాచ్తో పాటు ఆల్-బ్లాక్ లుక్తో అలరించాడు. ప్రత్యేకంగా డిజైన్ చేసిన డైమండ్స్ పొదిగిన వాచ్ అందర్నీ ఆకర్షించింది. అయితే సల్మాన్ ఖాన్ ఖరీదైన వాచెస్ ధరించడం కొత్తేం కాదు. కోట్ల విలువ చేసే లగ్జరీ వాచెస్ కలెక్షన్ విలవ కోట్ల రూపాయకుపైమాటే. తాజాగా లగ్జరీ బ్రాండ్ పాటెక్ ఫిలిప్ రెయిన్ బో (Patek Philippe Rainbow Watch) కి చెందిన వాచ్ ధరించాడు. ఆక్వానాట్ లూస్ రెయిన్బో మినిట్ రిపీటర్ హాట్ జ్యూయిలరీ వాచ్ సుమారు 130 వజ్రాలతో పొదిగి ఉందట. దీని ధర దాదాపు రూ. 23.54 కోట్లు ఉంటుందని అంచనా.కాగాజూలై 12న అనంత్, రాధిక వివాహ వేడుక మూడు రోజుల పాటు ఘనంగా జరగ బోతోంది. View this post on Instagram A post shared by THEINDIANHOROLOGY (@theindianhorology) -
హల్దీ ఫంక్షన్లో ముఖేశ్ అంబానీ చెల్లెలు సందడి (ఫొటోలు)
-
అనంత్ అంబానీ హల్దీ వేడుక: 150 ఏళ్ల నాటి హైదరాబాదీ వస్త్రధారణలో నీతా..!
ముఖేశ్ అంబానీ నీతాల చిన్న కుమారుడు అనంత్ రాధికల వివాహ వేడుకలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. సంగీత్ కార్యక్రమంలో అంబానీ కుటుంబ సభ్యుల వస్త్రధారణ, నగలు నెట్టింట ట్రెండ్ అయ్యాయి. సోమవారం జరిగిన హల్దీ వేడుకలో నీతా, శ్లోకామెహతా, ఇషా తమదైన డిజైనర్వేర్ దుస్తులతో మెరిశారు. ఇషా,శ్లోకా రంగురంగుల లెహంగాలతో అలరించగా..నీతా వారిద్దర్ని తలదన్నేలా సరికొత్త లుక్లో కనిపించారు. అదికూడా మన హైదరాబాద్కు చెందిన 150 ఏళ్ల చౌగోషియ సంప్రదాయ దుస్తులతో తళుక్కుమన్నారు. ఇది అత్యంత అరుదైన హైదరాబాద్ కుర్తా. దీనికి ఖాదా దుప్పటా చీర మాదిరిగా అతిపెద్దగా వస్తుంది. చెప్పాలంటే 150 ఏళ్ల నాటి దుస్తుల శైలి. హైదరాబాదీ ముస్లీం మహిళలు తమ నికాహ్ లేదా వివాహ వేడుకల సమయంలో ఈవిధమైన దుస్తులను ధరిస్తారు. దీని మూలాలు 17వ శతాబ్దంలో మొఘల్ శకంలో ఉద్భవించాయి. ఈ చారిత్రాత్మక సంప్రదాయాన్ని హైదరాబాద్లో రాజవంశస్థులైన రాణి, బేగంలు అనుసరించేవారు. అలనాటి సంప్రదాయ వస్త్రధారణ శైలి ఫ్యాషన్ నుంచి బయటపడదని మరోసారి తేటతెల్లమయ్యింది. ఏళ్ల నాటి ముస్లిం రాణుల సంప్రదాయ వస్త్రధారణతో సరికొత్త ట్రెండ్ని సెట్ చేసింది నీతా. అందుకు తగ్గట్టు అద్భుతమైన ఆభరణాలను ఎంచుకున్నారు. ముఖ్యంగా ఆమె చెవులకు ధరించిన కమ్మలు మంత్రముగ్దుల్ని చేసేలా ఉండగా, ఆ డిజైనర్ వేర్కి మ్యాచింగ్గా ధరించిన బ్రాస్లెట్, బిందీ తదితరాలన్ని ఆమె రూపాన్ని మరింత అద్భుతంగా కనిపించేలా చేశాయి. చివరిగా స్టైలిష్ స్ట్రాపీ హీల్స్తో తన రాణి మాదిరి లుక్ని తెప్పించింది. పైగా ముఖానికి లైట్ మేకప్ని ఎంచుకున్నారు. మొత్తం ఈ హల్దీ వేడుకలో ఆమె ఏళ్ల నాటి సంప్రదాయాన్ని సరికొత్తగా గుర్తు చేశారు ఆమె. ముఖ్యంగా మన హైదరాబాదీ సంప్రదాయన్ని అంబానీలు అనుసరించడం విశేషం. View this post on Instagram A post shared by Manish Malhotra (@manishmalhotra05) (చదవండి: అనంత్ రాధికల హల్దీ వేడుక: కలర్ఫుల్ లెహంగాలో శ్లోకా, ఇషా..!) -
ఫ్యాషన్ ఐకాన్ లేడీస్ : నీతా అంబానీ, ఇషా, శ్లోకా మెహతా (ఫోటోలు)
-
అంబానీ హల్ది ఫంక్షన్.. అందరికంటే ఈ బ్యూటీయే హైలైట్ (ఫోటోలు)
-
అనంత్ రాధికల హల్దీ వేడుక: కలర్ఫుల్ లెహంగాలో శ్లోకా, ఇషా..!
రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ నీతాల చిన్న కుమారుడు పెళ్లి వేడుకలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ వేడుకల్లో మొదటగా జరిగిన సంగీత్ కార్యక్రమం నీతా ధరించిన ఆభరణాలు, వస్త్రాధారణ హైలెట్గా నిలిచింది. ఇక తర్వాత జరుగుతున్న హల్దీ వేడుక చాల కలర్ఫుల్గా సాగింది. ఈ హల్దీ వేడుకలో ఇషా పిరమల్, శ్లోకా మెహతా రంగరంగుల లెహంగాలతో స్టన్నింగ్ లుక్తో ఆకట్టుకున్నారు. ఈ వేడుకలో కాబోయే పెళ్లి కూతరు రాధిక ఆమె సోదరి సాంప్రదాయ వస్త్రధారణతో కళ్యాణ శోభను తీసుకొచ్చారు. ఈ గ్రాండ్ వేడుకలో శ్లోకా, అనామికా ఖన్నా డిజైనర్ వేర్ లెహంగాను ధరించింది. ఆమె ఎరుపు, నీలం, ఆకుపచ్చ, బంగారు రంగు వంటి మరెన్నో రంగులతో కూడిన శక్తివంతమైన లెహంగా సెట్ను ధరించింది. దానికి తగినట్టుగా చిలుక ఆకుపచ్చ స్కర్ట్ దానిపై పూల ఎంబ్రాయిడరీని అందంగా తీర్చిదిద్దారు. ఇక ఇషా మల్టీకలర్ కలర్ లెహంగాను ధరించింది. ప్రముఖ లగ్జరీ బ్రాండ్ టోరాని దిల్ రంగ్ జీవా లెహంగా సెట్తో అలరించింది. ఇది ఇండో వెస్టట్రన్ టచ్తో కూడిన సరికొత్త డిజైనర్ వేర్ లెహంగా. దీనికి రా సిల్క్తో రూపొందించిన టాసెల్ అలంకారాలు హైలెట్గా ఉండగా, అందమైన నెక్లైన్తో కూడిన ప్రత్యేకమైన బ్లౌజ్ మరింత అకర్షణీయంగా ఉంది. ఈ లెహంగా ధర ఏకంగా రూ. 135,500/-.(చదవండి: అనంత్ రాధిక సంగీత్ కార్యక్రమంలో నీతా లుక్ అదుర్స్..చేతికి హృదయాకారంలో..!) -
అనంత్-రాధిక హల్దీ.. సుందరంగా ముస్తాబైన సెలబ్రిటీలు (ఫోటోలు)
-
అనంత్ - రాధిక పెళ్లి వేడుకలు.. మెరిసిపోయిన అంబానీ కుటుంబం (ఫోటోలు)
-
ఒక రాత్రికి రూ.1 లక్ష.. పెరిగిన హోటల్స్ ధరలు - కారణం ఇదే!
అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ల పెళ్లి ఈ నెల 12న (జులై) ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో జరగనుంది. వీరి వివాహానికి ముందే ముంబైలోని హోటల్స్ గదుల రేట్లు భారీగా పెరిగాయి. ఇప్పటికే మొత్తం రూమ్స్ బుక్ అయిపోయినట్లు కూడా కొన్ని ప్రముఖ ఫైవ్ స్టార్ హోటల్స్ పేర్కొన్నారు.సాధారణ రోజులలో ముంబైలోని కొన్ని ఫైవ్ స్టార్ హోటల్స్లోని గదుల ఛార్జ్ ఒక రాత్రికి రూ.13000 ఉంటుంది. అంబానీ ఇంట పెళ్లి వేడుకల సందర్భంగా ఈ ధరలను సుమారు రూ.1 లక్షకు పెంచారు. దీన్ని బట్టి చూస్తే అంబానీ పెళ్లి వేడుకలను హోటల్స్ ఎలా క్యాష్ చేసుకుంటున్నాయో అర్థం చేసుకోవచ్చు.హోటల్స్ ధరలు పెంచడం ఇదే మొదటిసారి కాదుసీజన్ను దృష్టిలో పెట్టుకుని ప్రముఖ హోటల్స్.. గదుల చార్జెస్ భారీగా పెంచడం ఇదే మొదటిసారి కాదు. గతంలో బెంగళూరులో ఏరో షో జరిగినప్పుడు కూడా అక్కడున్న హోటల్స్ గదుల రేట్లకు భారీగా పెంచాయి. ఇది మాత్రమే కాకుండా ఆటో ఎక్స్పో సమయంలో ఢిల్లీ, గురుగ్రావ్ ప్రాంతాల్లోని హోటల్స్ కూడా భారీ చార్జీలను వసూల్ చేశాయి.పెళ్ళికి హాజరుకానున్న ప్రముఖులుఇప్పటికే అనంత్, రాధికల వివాహ వేడుకలు ప్రారంభమైపోయాయి. ఇటీవలే సంగీత్ ఫంక్షన్ కూడా జరిగింది. ఈ వేడుకలకు సెలబ్రిటీలు, క్రికెటర్లు, ఇతర ప్రముఖులు హాజరయ్యారు. కాగా వీరి వివాహం త్వరలోనే జరుగుతుంది. ఈ వేడుకలకు కూడా దిగ్గజ పారిశ్రామికవేత్తలు, సినీ తారలు మొదలైనవారు పాల్గొనే అవకాశం ఉందని సమాచారం. -
అనంత్ - రాధిక పెళ్లి సందడి : మరోసారి మెస్మరైజ్ చేసిన రాధిక
రిలయన్స్ వారసుడు, ముఖేష్, నీతా అంబానీ చిన్నకుమారుడు అనంత్ అంబానీ- రాధిక మర్చంట్ వివాహ వేడుకల్లో భాగంగా గృహ శాంతి పూజలో అనంత్ కాబోయే భార్య రాధిక పాల్గొంది. ఈ సందర్భంగా ముగ్ధ మనోహర రూపంలో మరోసారి ఆకట్టుకుంది. మరాఠీ ముల్గిగా అద్భుతంగా కనిపించింది రాధిక.జూలై 12, 2024న ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ వివాహ బంధంలోకి అడుగు పెట్టబోతున్నారు. ఈ సందర్బంగా ప్రీ వెడ్డింగ్ వేడుకలు జోరందుకున్నాయి. ఇటీవల అంబానీ ఫ్యామిలీ మామేరా వేడుకను ఘనంగా నిర్వహించగా, ఇపుడు రాధిక కుటుంబం గృహ శాంతి పూజను నిర్వహించింది. ఈ పూజలో రాధిక తన తల్లి, సోదరి అంజలి మర్చంట్తో కలిసి కార్యక్రమాలు నిర్వహించింది. ఈ సందర్బంగా రాధిక ఫ్యాషన్ దుస్తులు, ఆభరణాలు విశేషంగా నిలిచాయి. View this post on Instagram A post shared by Nikitaa🌻 (@nikitaawaghela_) జరీ వర్క్తో తొమ్మిది గజాల కాంచీపురం సంప్రదాయపట్టు వైట్ శారీని దక్షిణ భారత శైలిలో చుట్టుకుంది. ఎరుపు రంగు బ్లౌజ్తో పెళ్లి కూతురిలా అందంగా కనిపించింది. దీనికి తగ్గట్టుగా, డైమండ్ నెక్లెస్, సరిపోలే జత చెవిపోగులతో కళకళలాడింది.కాగా ఇప్పటికే రెండు సార్లు ప్రీవెడ్డింగ్ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించిన సంగతి తెలిసిందే. కనీవినీ ఎరుగని రీతిలో అనంత్-రాధిక వివాహ వేడుక మూడు రోజుల పాటు జరగబోతోంది. -
అనంత్-రాధికలు ఏం చదువుకున్నారంటే..
ఆసియా కుబేరుడిగా పేరున్న ముఖేశ్ అంబానీ ఇంట్లో పెళ్లి సంబరాలు వైభవంగా జరుగుతున్నాయి. ఆయన రెండో కుమారుడు అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ల వివాహం జులై 12న జరుగనుంది. అయితే పెళ్లి పీటలెక్కనున్న జంట ఏం చదువుకుందనే ఆలోచన ఎప్పుడైనా వచ్చిందా? రిలయన్స్ ఇండస్ట్రీస్లో అనంత్ ఏ పాత్ర పోషిస్తున్నారు? వీరెన్ మర్చెంట్ కూతురిగా ఎన్కోర్ హెల్త్కేర్లో కొత్త పెళ్లి కూతురు ఏ పొజిషన్లో ఉన్నారు..? అనే విషయాలను తెలుసుకుందాం.అనంత్ అంబానీరిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ-నీతా అంబానీల రెండో కుమారుడు అనంత్ అంబానీ. ఆయన తన పాఠశాల విద్యను ముంబయిలోని ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్లో పూర్తి చేశారు. యూఎస్ఏలోని రోడ్ ఐలాండ్లో ఉన్న బ్రౌన్ విశ్వవిద్యాలయం నుంచి బిజినెస్ మేనేజ్మెంట్లో బ్యాచిలర్స్ డిగ్రీ పట్టా పొందారు. అనంత్ అన్నయ్య ఆకాష్ అంబానీ కూడా బ్రౌన్ యూనివర్శిటీ పూర్వ విద్యార్ధి. ఆకాష్ ఆర్థిక శాస్త్రంలో బ్యాచిలర్ డిగ్రీని పొందారు. ముఖేశ్ కూతురు, కుమారులు ఇషా అంబానీ, ఆకాష్ అంబానీ, అనంత్ అంబానీలు ఆగస్టు 2023లో రిలయన్స్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్గా చేరారు. ప్రస్తుతం అనంత్ అంబానీ రిలయన్స్ న్యూ ఎనర్జీకి సారథ్యం వహిస్తున్నారు.రాధిక మర్చంట్ఎన్కోర్ హెల్త్కేర్ గ్రూప్ వ్యవస్థాపకుడు వీరెన్ మర్చంట్-శైలా మర్చంట్ల కూతురు రాధిక మర్చంట్. ఆమె తన పాఠశాల విద్యను 1999 నుంచి 2006 వరకు కేథడ్రల్ అండ్ జాన్ కానన్ స్కూల్లో, 2006 నుంచి 2009 వరకు ఎకోల్ మొండియేల్ వరల్డ్ స్కూల్లో, 2009 నుంచి 2013 వరకు ముంబయిలోని బీడీ సోమాని ఇంటర్నేషనల్ స్కూల్లో పూర్తి చేశారు. ఆమె లింక్డ్ఇన్ ప్రొఫైల్ ప్రకారం..యూఎస్ఏలోని న్యూయార్క్లో ఉన్న న్యూయార్క్ యూనివర్సిటీ నుంచి పొలిటికల్ సైన్స్లో బ్యాచిలర్స్ డిగ్రీ పట్టా పొందారు. రాధిక మర్చంట్, ఆమె సోదరి అంజలి మర్చంట్ ఎన్కోర్ హెల్త్కేర్ డైరెక్టర్ల బోర్డులో ఉన్నారు. ఆమె తండ్రి వీరెన్ మర్చంట్ కంపెనీ సీఈఓగా వ్యవహరిస్తున్నారు. తల్లి శైలా మర్చంట్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.ఇదీ చదవండి: ‘అనంత్-రాధికల పెళ్లికి ప్రభుత్వం సెలవు ప్రకటించాలి’అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ వివాహ వేడుకలు శుక్రవారం(జులై 12)న శుభ వివాహ్తో ప్రారంభమవుతాయి. జులై 13 శనివారం శుభ్ ఆశీర్వాద్, జులై 14న మంగళ్ ఉత్సవ్ కార్యక్రమాలతో ముగుస్తాయి. -
‘అనంత్-రాధికల పెళ్లికి ప్రభుత్వం సెలవు ప్రకటించాలి’
అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ల పెళ్లి వేడుకను పురస్కరించుకుని ముంబయిలో ట్రాఫిక్ సమస్యలు ఎదురవకుండా స్థానిక పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. అందులో భాగంగా ముందస్తు ప్రకటన విడుదల చేశారు. జులై 12 నుంచి 15 వరకు అనంత్-రాధికల వివాహ వేడుక జరిగే బాందాకుర్లా కాంప్లెక్స్(బీకేసీ)లోని జియో కన్వెన్షన్ సెంటర్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని ‘ఎక్స్’ వేదికగా తెలిపారు. ఈ ట్వీట్పై స్పందించిన ఓ నెటిజన్ ‘అంబానీ పెళ్లికి ప్రభుత్వం సెలవు ప్రకటించాలి’ అని కామెంట్ చేశారు. అదికాస్తా వైరల్గా మారుతుంది.ఆసియాలోనే అత్యంత ధనవంతుడు ముఖేశ్ అంబానీ ఇంట్లో పెళ్లంటే మామూలుగా ఉంటుందా..! ఇప్పటికే అంగరంగ వైభవంగా రెండుసార్లు ప్రీ వెడ్డింగ్ ఈవెంట్ను జరుపుకున్నారు. అందుకోసం రూ.కోట్లు ఖర్చు చేశారు. ఈ సెలబ్రేషన్స్కు ప్రపంచ వ్యాప్తంగా ప్రముఖులు వందల సంఖ్యలో హాజరయ్యారు. మరి పెళ్లికి ఇంకెందరు వస్తారోననే చర్చ జరుగుతోంది. అయితే అలా వస్తున్న వారికి ట్రాఫిక్ సమస్యలు ఎదురవకుండా ముంబయి ట్రాఫిక్ పోలీసులు చర్యలు చేపట్టారు.ముంబయి ట్రాఫిక్ పోలీసులు ‘ఎక్స్’ ప్లాట్ఫామ్లో విడుదల చేసిన ప్రకటన ప్రకారం..2024 జులై 12-15 వరకు ముంబయిలోని బాందాకుర్లా కాంప్లెక్స్(బీకేసీ)లోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో సామాజిక కార్యక్రమం నిర్వహిస్తున్నారు. దీనికి పెద్ద సంఖ్యలో అతిథులు, వీఐపీలు వస్తున్నారు. దాంతో భద్రతా కారణాల వల్ల జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్ వైపునకు వెళ్లే వాహనాలను వేరే మార్గానికి మళ్లిస్తున్నామని తెలిపారు.పోలీసుల ప్రకటనపై నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు. ‘అనంత్ అంబానీ పెళ్లి ఈవెంట్ పబ్లిక్ ఈవెంట్ ఎలా అవుతుంది?’ అని ఒక యూజర్ కామెంట్ చేశారు. ‘హత్రాస్ భోలేబాబా వ్యవహారం కంటే అంబానీ పెళ్లికి ప్రభుత్వం ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటోంది.. కారణం ఏంటో..’ అని ఒకరు, ‘అంబానీ పెళ్లి సందర్భంగా ప్రభుత్వం సెలవు ప్రకటించాలి’ అని మరొకరు కామెంట్లు చేస్తున్నారు.Due to a public event at the Jio World Convention Centre in Bandra Kurla Complex on July 5th & from July 12th to 15th, 2024, the following traffic arrangements will be in place for the smooth flow of traffic.#MTPTrafficUpdates pic.twitter.com/KeERCC3ikw— Mumbai Traffic Police (@MTPHereToHelp) July 5, 2024ఇదీ చదవండి: సంగీత్లో అదిరిపోయే స్టెప్పులేసిన అంబానీ కుటుంబంఅనంత్ అంబానీ-రాధిక మర్చంట్ వివాహ వేడుకలు శుక్రవారం(జులై 12)న శుభ వివాహ్తో ప్రారంభమవుతాయి. జులై 13 శనివారం శుభ్ ఆశీర్వాద్, జులై 14న మంగళ్ ఉత్సవ్ కార్యక్రమాలతో ముగుస్తాయి. -
Radhika Merchant: కాబోయే పెళ్లి కూతురు.. దిష్టి తగిలేను (ఫోటోలు)
-
Justin Bieber: అనంత్-రాధికలతో స్టార్ సింగర్ హ్యాపీ మూమెంట్స్ (ఫోటోలు)
-
అంబానీ ఇంట సంగీత్.. బాద్షా ఎన్ని కోట్లు తీసుకున్నాడంటే?
అనంత్ అంబానీ- రాధిక మర్చంట్ సంగీత్ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ముఖేశ్ అంబానీ ఫ్యామిలీ అంతా డ్యాన్స్ చేయడం ఈ వేడుకలో అన్నింటికన్నా హైలైట్గా నిలిచింది. అనంత్ బాలీవుడ్ స్టార్స్తో స్టెప్పులేయడం కొసమెరుపు. ఇకపోతే ఈ వేడుక కోసం హాలీవుడ్ స్టార్ సింగర్ జస్టిన్ బీబర్ విచ్చేశాడు. ఈవెంట్లో ఆల్టైమ్ హిట్ సాంగ్స్ను ఆలపించి అదరగొట్టేశాడు. ఇందుకోసం దాదాపు రూ.83 కోట్ల మేర తీసుకున్నాడని ప్రచారం జరుగుతోంది.అలాగే బాలీవుడ్ సింగర్ బాద్షా తన పాటలతో అతిథుల్లో జోష్ నింపాడు. వారితో మమేకమై పాటలు ఆలపించాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్గా మారిన సంగతి తెలిసిందే! బాద్షా కూడా ఈ సంగీత్ కోసం కోట్లు పుచ్చుకున్నాడట! ఒక్కరోజు పర్ఫామెన్స్ కోసం రూ.4 కోట్లు అందుకున్నాడంటూ ఓ వార్త చక్కర్లు కొడుతోంది. మరి ఇదెంతవరకు నిజమన్నది తెలియాల్సి ఉంది. View this post on Instagram A post shared by Manav Manglani (@manav.manglani) చదవండి: క్యాన్సర్తో పోరాటం.. మీకు ఈ కాలిన మచ్చలే కనిపిస్తున్నాయా?: నటి -
అనంత్ అంబానీ సంగీత్ వేడుకలో జాన్వీ కపూర్ (ఫొటోలు)
-
అనంత్ అంబానీ వేసుకుంది మామూలు డ్రెస్ కాదు! తెలిస్తే..
త్వరలో పెళ్లి చేసుకోబోతున్న అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ సంగీత్ వేడుక చాలా గ్రాండ్గా జరిగింది. ఈ కార్యక్రమానికి అంబానీ స్నేహితులు, బంధువులతో పాటు, సినీ తారలు, క్రికెటర్లు, ఇతర ప్రముఖులు హాజరయ్యారు.సంగీత్ వేడుకలో కనిపించిన అనంత్ అంబానీ, రాధిక మర్చెంట్ ఇద్దరూ కూడా ప్రత్యేకమైన దుస్తులతో కనిపించారు. ఇవి మాస్టర్ కౌచర్స్ అబూ జానీ సందీప్ ఖోస్లా డిజైన్ చేసిన దుస్తులని తెలుస్తోంది. అనంత్ అంబానీ ధరించిన జాకెట్ బంగారంతో తయారైనట్లు తెలుస్తోంది. రాధిక మర్చెంట్ ధరించిన ఆఫ్ షోల్డర్ బ్లౌజ్, లెహంగా స్వరోవ్స్కి స్ఫటికాలతో అలంకరించారు.#WATCH | Anant Ambani and Radhika Merchant arrive at Jio World Centre in Mumbai for their 'Sangeet ceremony' pic.twitter.com/yzODKut59g— ANI (@ANI) July 5, 2024జూలై 12న ముకేశ్, నీతా అంబానీల చిన్న కుమారుడు అనంత్ అంబానీ, పారిశ్రామికవేత్త వీరేన్ మర్చంట్ కుమార్తె రాధిక వివాహం జరగనుంది. జూలై 14 వరకు వీరిద్దరి వివాహ వేడుకలు జరగనున్నాయి. వీరి పెళ్ళికి పలువురు పారిశ్రామిక వేత్తలు, ఇతర సెలబ్రిటీలు హాజరయ్యే అవకాశం ఉందని సమాచారం. -
ఏడ్చేసిన నీతా అంబానీ.. రోహిత్ ముంబైని వీడటం పక్కా! వీడియో
ఐపీఎల్-2024కు ముందే రోహిత్ శర్మను కెప్టెన్గా తప్పిస్తూ నిర్ణయం తీసుకుంది ముంబై ఇండియన్స్. ఐదుసార్లు చాంపియన్గా నిలిపిన హిట్మ్యాన్ను కాదని.. హార్దిక్ పాండ్యాకు పగ్గాలు అప్పగించి తగిన మూల్యం చెల్లించింది.పాండ్యా సారథ్యంలో ఘోరంగా విఫలమైన ముంబై ఇండియన్స్ పాయింట్ల పట్టికలో అడుగున నిలిచింది. రోహిత్- పాండ్యా సైతం ఎడమొహం- పెడమొహంగానే మెదిలారు. ఫలితంగా ఇరువురిపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి.అయితే, టీ20 ప్రపంచకప్-2024తో సీన్ రివర్స్ అయింది. ఈ ఇద్దరూ టీమిండియా ట్రోఫీ గెలవడంలో కీలక పాత్ర పోషించి నీరాజనాలు అందుకుంటున్నారు. కెప్టెన్గా రోహిత్, ఆల్రౌండర్గా హార్దిక్ పాండ్యా తమ బాధ్యతను చక్కగా పూర్తి చేసి ప్రశంసలు దక్కించుకుంటున్నారు.ఈ నేపథ్యంలో ముంబై ఇండియన్స్ యాజమాన్యం.. ట్రోఫీ గెలిచిన టీమిండియాలో సభ్యులైన తమ ఆటగాళ్లను ఘనంగా సత్కరించింది. ముఖేశ్ అంబానీ- నీతా అంబానీ దంపతులు ఈ సందర్భంగా భారత జట్టుపై ప్రశంసల వర్షం కురిపించారు.కాగా అంబానీ చిన్న కుమారుడు అనంత్- రాధికా మర్చంట్ల ముందస్తు పెళ్లి వేడుకలు ఆర్భాటంగా జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో సంగీత్ నిర్వహించిన సమయంలోనే రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యాలను ఉద్దేశించి నీతా అంబానీ మాట్లాడారు.వారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానించి ఆత్మీయంగా హత్తుకుని భావోద్వేగంతో కన్నీళ్లు పెట్టుకున్నారు. టీమిండియా కెప్టెన్ రోహిత్ అద్భుతం చేశాడంటూ అతడిని హగ్ చేసుకున్న నీతా.. ఆ తర్వాత సూర్య, హార్దిక్లను కూడా ఆత్మీయంగా హత్తుకున్నారు.ఈ సందర్భంగా హార్దిక్ను ఉద్దేశించి.. ‘‘కష్ట సమయం ఎప్పుడూ ఉండదు.. అయితే, పట్టుదల కలిగిన మనుషులు మాత్రం ఎప్పుడూ ఒకేలా ఉంటారు’’ అని ప్రశంసించారు. ముఖ్యంగా వరల్డ్కప్ ఫైనల్లో ఆఖరి ఓవర్ అద్భుతంగా వేసి జట్టును గెలిపించిన తీరు అమోఘమంటూ కొనియాడారు.మరోవైపు.. 2011 నాటి సంబరాన్ని మళ్లీ తీసుకువచ్చారంటూ ముఖేశ్ అంబానీ ఆటగాళ్లను కితాబులిచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. అయితే, ఇందులో రోహిత్ శర్మ మాత్రం పైకి నవ్వుతూ కనిపించినా కాస్త మనస్ఫూర్తిగా ఆ వేడుకలో భాగం కాలేకపోయాడంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.ఇప్పటికే తన మనసు విరిగిపోయిందని.. వచ్చే సీజన్లో అతడు ముంబై ఇండియన్స్ జట్టును వీడటం పక్కా అని ఫిక్సయిపోయారు. కాగా వెస్టిండీస్ వేదికగా సౌతాఫ్రికాతో ఫైనల్లో ఆఖరి వరకు ఉత్కంఠగా సాగిన పోరులో టీమిండియా ఏడు పరుగుల స్వల్ప తేడాతో గెలిచిన విషయం తెలిసిందే.చివరి ఓవర్లో మూడు వికెట్లు తీసి హార్దిక్ పాండ్యా జట్టును విజయతీరాలకు చేర్చాడు. తద్వారా భారత్ ఖాతాలో నాలుగో వరల్డ్కప్ టైటిల్ చేరింది.AMBANI FAMILY celebrating the World Cup heroes - Captain Rohit, Hardik & Surya. 🇮🇳- VIDEO OF THE DAY...!!!! ❤️ pic.twitter.com/8XbPo9kkLE— Johns. (@CricCrazyJohns) July 6, 2024 -
అనంత్ అంబానీతో స్టెప్పులేసిన బాలీవుడ్ స్టార్.. వీడియో వైరల్
అనంత్ అంబానీ- రాధిక మర్చంట్ల పెళ్లి వేడుకలు ఎంతో వేడుకగా జరుగుతున్నాయి. శుక్రవారం జరిగిన సంగీత్ ఫంక్షన్కు బాలీవుడ్ సెలబ్రిటీలు హాజరై సందడి చేశారు. ఈ సంగీత్లో అంబానీ ఫ్యామిలీ డ్యాన్స్ చేయడం అన్నింటికన్నా హైలైట్గా నిలిచింది. సినిమా తారలు తగ్గేదేలే అంటూ స్టేజీని రఫ్ఫాడించారు.బాలీవుడ్ జంట ఆలియా భట్-రణ్బీర్ కపూర్ డ్యాన్స్తో అదరగొట్టారు. ముకేశ్ అంబానీ పెద్ద కుమారుడు ఆకాశ్ అంబానీ కూడా వారితో కలిసి స్టెప్పులేశాడు. అటు సల్మాన్ ఖాన్, అనంత్తో కలిసి హిందీ పాటకు చిందేశాడు. లవ్ బర్డ్స్ జాన్వీ కపూర్-శిఖర్ పహారియా, మానుషి చిల్లర్, వీర్ పహారియా కలిసి డ్యాన్స్ చేశారు. పాప్ సింగర్ జస్టిన్ బీబర్ తన గాత్రంతో అదరగొట్టాడు. బేబీ, పీచెస్, లవ్ యువర్సెల్ఫ్ వంటి సాంగ్స్ ఆలపించాడు.ఈ ఫంక్షన్కు విక్కీ కౌశల్, మాధురి దీక్షిత్, అనన్య పాండే, సల్మాన్ ఖాన్, జెనీలియా దేశ్ముఖ్, రితేశ్ దేశ్ముఖ్, రణ్వీర్ సింగ్, దీపికా పదుకొణె, ఆదిత్య రాయ్ కపూర్ తదితరులు హాజరయ్యారు. ఇకపోతే అనంత్ అంబానీ పెళ్లి జూలై 12న ముంబైలో ఘనంగా జరగనుంది. జూలై 14న రిసెప్షన్ జరగనుంది. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) Ranbir and Alia dancing along with Akash and shloka Ambani on “Show me the thumka” 🔥#RanbirKapoor #AliaBhatt pic.twitter.com/MiJsXO5cxI— ritika ❤️🔥 | L&W ERA (@ritikatweetssx) July 6, 2024 చదవండి: డైరెక్టర్ రాజమౌళి జీవితంపై మూవీ.. ఓటీటీలో నేరుగా రిలీజ్ -
విడాకులు నిజమే అనేలా హార్దిక్ పాండ్యా.. వీడియో వైరల్
టీ20 ప్రపంచకప్-2024 ట్రోఫీ గెలిచిన జోష్లో ఉన్న భారత క్రికెటర్లు ప్రస్తుతం వ్యక్తిగత జీవితానికి సమయం కేటాయించారు. కుటుంబాలతో సరదాగా సమయం గడుపుతున్నారు.ఈ క్రమంలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా, మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోని సహా పలువురు క్రికెటర్లు అపర కుబేరుడు ముఖేశ్ అంబానీ ఇంట నెలకొన్న పెళ్లి సందడిలో భాగమయ్యారు.VIDEO | Anant Ambani-Radhika Merchant's sangeet ceremony: Former India cricketer Zaheer Khan and his wife Sagarika Ghatge arrive at Nita Mukesh Ambani Cultural Centre in BKC, Mumbai for the sangeet ceremony. (Full video available on PTI Videos - https://t.co/n147TvqRQz) pic.twitter.com/W8h0FDcBDB— Press Trust of India (@PTI_News) July 5, 2024 భార్యలతో ఆ క్రికెటర్లునీతా- ముఖేశ్ అంబానీల చిన్న కుమారుడు అనంత్ అంబానీ- రాధిక మర్చంట్ సంగీత్లో తళుక్కుమన్నారు. రోహిత్, ధోని, హార్దిక్, కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, శ్రేయస్ అయ్యర్, కృనాల్ పాండ్యా, జహీర్ ఖాన్, ఇషాన్ కిషన్ తదితరులు ఈ వేడుకకు హాజరయ్యారు.ధోని, సూర్య, జహీర్, కేఎల్ రాహుల్, కృనాల్ పాండ్యా తమ భార్యలతో కలిసి ఈ ఈవెంట్లో సందడి చేయగా.. హార్దిక్ పాండ్యా మాత్రం ఒంటరిగా వచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.#WATCH | Cricketers Hardik Pandya, Krunal Pandya and Ishan Kishan arrive at Jio World Centre in Mumbai to attend Anant Ambani and Radhika Merchant's 'Sangeet ceremony' pic.twitter.com/bLy33tmZB8— ANI (@ANI) July 5, 2024 కాగా హార్దిక్- నటాషా మధ్య విభేదాలు తలెత్తి విడాకులకు దారితీశాంటూ గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో హార్దిక్ ఇలా ఒంటరిగా అంబానీ ఇంట సంగీత్కు హాజరుకావడం వీటికి మరింత బలాన్నిచ్చింది.అదే సమయంలో అతడి సతీమణి నటాషా స్టాంకోవిక్ తమ కుమారుడు అగస్త్యతో కలిసి ఎంజాయ్ చేస్తున్న దృశ్యాలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. జీవితం ఎంతో సంతోషంగా సాగిపోతుందని.. ఇందుకు ఎల్లప్పుడూ తాను అన్నింటికి కృతజ్ఞురాలిగా ఉంటానంటూ వేదాంత ధోరణిలో క్యాప్షన్ జతచేసింది.విడాకులు నిజమేనన్న వార్తలు ఈ నేపథ్యంలో హార్దిక్- నటాషా విడాకులు నిజమేనన్న వార్తలు మరోసారి నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. కాగా ఐపీఎల్-2024లో ముంబై ఇండియన్స్ కెప్టెన్గా వ్యవహరించిన హార్దిక్ పాండ్యాకు చేదు అనుభవం ఎదురైంది.అంబానీల యాజమాన్యంలోని ఈ జట్టు వరుస పరాజయాలతో పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది. దీంతో హార్దిక్పై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. అయితే, టీ20 ప్రపంచకప్-2024లో మాత్రం అద్భుతంగా రాణించిన హార్దిక్.. టీమిండియా ట్రోఫీ గెలవడంలో కీలక పాత్ర పోషించి ప్రశంసలు అందుకున్నాడు.ఈ నేపథ్యంలో.. విమర్శలు- ప్రశంసల సమయంలో హార్దిక్ పాండ్యాను ఉద్దేశించి నటాషా ఒక్క పోస్ట్ కూడా పెట్టకపోవడం గమనార్హం. ఇప్పుడిలా హార్దిక్ అంబానీ ఇంట వేడుకలకు ఒక్కడే హాజరుకావడంతో విభేదాలు నిజమేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.VIDEO | Anant Ambani-Radhika Merchant's sangeet ceremony: Indian cricketer KL Rahul arrives at Nita Mukesh Ambani Cultural Centre in BKC, Mumbai for the sangeet ceremony. (Full video available on PTI Videos - https://t.co/n147TvqRQz) pic.twitter.com/es5B8zIfNJ— Press Trust of India (@PTI_News) July 5, 2024 -
సంగీత్లో అదిరిపోయే స్టెప్పులేసిన అంబానీ కుటుంబం
అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ల వివాహ వేడుకల్లో భాగంగా ఇటీవల అంబానీ కుటుంబం ఘనంగా సంగీత్ జరుపుకుంది. ఈ సందర్భంగా ఇంటిల్లిపాది సభ్యులు డ్యాన్స్తో సందడి చేశారు. ఈ మేరకు విడుదలైన ఒక వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది.అనంత్-రాధికల వివాహం జులై 12న ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ (బీకేసీ) జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో జరగనుంది. జులై 13న ‘శుభ్ ఆశీర్వాద్’, జులై 14న ‘మంగళ్ ఉత్సవ్’ కార్యక్రమంతో వేడుకలు ముగియనున్నాయి. త్వరలో పెళ్లి పీటలెక్కే జంట ఇప్పటికే రెండుసార్లు అంగరంగ వైభవంగా ప్రీవెడ్డింగ్ వేడుకలు నిర్వహించుకుంది. ఇటీవల ఇటలీ నుంచి ఫ్రాన్స్ వరకు దాదాపు 4500 కిలోమీటర్లు క్రూయిజ్లో ప్రయాణిస్తూ రెండో ప్రీవెడ్డింగ్ సెలబ్రేషన్స్ జరుపుకున్నారు. గతంలో ఈ జంట జామ్నగర్లో తమ మొదటి ప్రీవెడ్డింగ్ వేడుకలను జరుపుకున్నారు. ఇటీవల అంబానీ కుంటుంబం 50 పేద జంటలకు సామూహిక వివాహాలను కూడా జరిపించింది. అందుకు అవసరమైన పూర్తి ఖర్చులను భరించింది. వివాహాల అనంతరం కొత్త జంటలకు అవసరమయ్యే ఇంటి సామగ్రిని అందించింది.ఇదీ చదవండి: దేశంలోనే అతిపెద్ద ఐపీఓకు రిలయన్స్ సిద్ధం..? -
అనంత్ అంబానీ -రాధిక సంగీత్ : వారసులతో ముఖేష్, నీతా మురిపెం!
రిలయన్స్ వారసుడు అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ల వివాహ వేడుకలు మరింత జోరందుకున్నాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ-రాధికా మర్కెంట్ ప్రీవెడ్డింగ్ వేడుకల్లో భాగంగా శుక్రవారం రాత్రి సంగీత్ వేడుకును ఘనంగా జరిగింది. ఈ వేడుకలో అంబానీ కుటుంబం ఆనందోత్సాహాలు అంబరాన్నంటాయి.ఈ వేడుకలో ముఖేష్, నీతా అంబానీ దంపతులు మనవళ్లు, మనవరాళ్లతో వింటేజ్ ఓపెన్-టాప్ కారులో షికారు చేయడం హైలైట్గా నిలిచింది. ఈ సందర్బంగా ముఖేష్ను చూసి నీతా అంబానీ ముద్దు, ముద్దుగా మురిసిన దృశ్యం వైరలవుతోంది. 1968 నాటి బాలీవుడ్ బ్రహ్మచారి మూవీలోని "చక్కే మే చక్క" అనే క్లాసిక్ ట్యూన్కి, అంబానీ కారు నడుపుతూ కన్పించారు. View this post on Instagram A post shared by Pallav Paliwal (@pallav_paliwal)పృథ్వి, కృష్ణ, మనవరాళ్లు ఆద్యశక్తి, వేద తమ గ్రాండ్ పేరెంట్స్తో ఉత్సాహంగా కనిపించిన వీడియోను సంగీత్లో ప్రదర్శించారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్గా మారింది.రణబీర్ కపూర్ అలియా భట్, సల్మాన్ ఖాన్, విక్కీ కౌశల్, రణ్వీర్ సింగ్,దీపికా పదుకొణె, కియారా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్రా, తదితర బాలీవుడ్ ప్రముఖుల ఈ వేడుకలకు మరింత ఉత్సాహాన్ని జోడించారు. ఇంకా క్రికెటర్లు ధోనీ, హార్దిక్ పాండ్య ప్రత్యేకంగా నిలిచారు. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్తో కలిసి కాబోయే వరుడు అనంత్ అంబానీ డ్యాన్స్ చేశారు. బాలీవుడ్ హీరో షారుక్ ఖాన్ నటించిన ‘ఓం శాంతి ఓం’ సినిమాలోని ‘దీవాంగీ.. దీవాంగీ’ పాటకు అంబానీ కుటుంబం అంతా ఉత్సాహంగా స్టెప్పులేశారు. ఎప్పటిలాగానే నీతా అంబానీ సంప్రదాయ భరతనాట్యంతో తన ప్రత్యేకతను చాటుకున్నారు.కాగా మూడు రోజుల పాటు జులై 12-14 తేదీల్లో ముంబైలోని జియో సెంటర్ వేదికగాఅనంత్-రాధిక వివాహం అంగరంగవైభవంగా జరగనున్న సంగతి తెలిసిందే. -
అనంత్- రాధిక సంగీత్: జంటగా మెరిసిన క్రికెటర్లు.. హార్దిక్ మాత్రం ఒంటరిగా! (ఫోటోలు)
-
హాట్స్టార్లో అనంత్-రాధికల వివాహ వేడుక స్ట్రీమింగ్
రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేశ్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ల వివాహ వేడుకను ప్రసారం చేసేందుకు డిస్నీ హాట్స్టార్ స్ట్రీమింగ్ హక్కులను దక్కించుకుంది.అనంత్-రాధికల పెళ్లి జులై 12న జరగనుంది. దేశవ్యాప్తంగా అంబానీ అభిమానులు ఈ వేడుకను వీక్షించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. అందులో భాగంగా డిస్నీ హాట్స్టార్ ఈ వేడుక లైవ్ స్ట్రీమింగ్ హక్కులను దక్కించుకుంది. జులై 12న ‘శుభ్ వివాహ్’తో వేడుక ప్రారంభం కానుంది. జులై 13న 'శుభ్ ఆశీర్వాద్', జులై 14న ‘మంగళ్ ఉత్సవ్’ కార్యక్రమాలతో ముగియనున్నాయి. ఈ సంబరాలను హాట్స్టార్లో వీక్షించవచ్చిన కంపెనీ తెలిపింది.అనంత్ అంబానీ-రాధికల జంట ఇప్పటికే రెండుసార్లు అంగరంగ వైభవంగా ప్రీవెడ్డింగ్ వేడుకలు నిర్వహించుకుంది. ఇటీవల ఇటలీ నుంచి ఫ్రాన్స్ వరకు దాదాపు 4500 కిలోమీటర్లు క్రూయిజ్లో ప్రయాణిస్తూ రెండో ప్రీవెడ్డింగ్ సెలబ్రేషన్స్ జరుపుకున్నారు. గతంలో ఈ జంట జామ్నగర్లో తమ మొదటి ప్రీవెడ్డింగ్ వేడుకలను జరుపుకున్నారు. ఇటీవల అంబానీ కుంటుంబం 50 పేద జంటలకు సామూహిక వివాహాలను కూడా జరిపించింది. అందుకు అవసరమైన పూర్తి ఖర్చులను భరించింది. వివాహాల అనంతరం కొత్త జంటలకు అవసరమయ్యే ఇంటి సామగ్రిని అందించింది. -
'అనంత్, రాధిక' సంగీత్ ఫంక్షన్.. సందడి చేసిన ప్రముఖులు (ఫోటోలు)
-
అనంత్ అంబానీ-రాధిక వెడ్డింగ్ : అదిరిపోయిన దాండియా నైట్ (ఫోటోలు)
-
అనంత్-రాధిక సంగీత్.. అదరగొట్టేందుకు స్టార్ సింగర్ రెడీ
అనంత్ అంబానీ, రాధి మర్చెంట్ వివాహ వేడుకలు ఇప్పటికే మొదలైపోయాయి. ఇటీవలే మామేరు సెలబ్రేషన్స్ పూర్తయ్యాయి. ఈ రోజు (శుక్రవారం) సాయంత్రం సంగీత్ ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమంలో యుఎస్ సింగర్ జస్టిన్ బీబర్ ప్రదర్శన ఉంటుంది. సంగీత్లో పాటలు పాడేందుకు బీబర్ రూ.83 కోట్లు తీసుకుంటున్నట్లు సమాచారం.ఈ రోజు సాయంత్రం జరగనున్న సంగీత్ కార్యక్రమంలో పాటలు పాడటానికి బీబర్ ముంబై చేరుకున్నారు. దీనికి సంబందించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో బీబర్ గులాబీ రంగు స్వెట్షర్ట్, ఎరుపు రంగు బకెట్ టోపీని ధరించి ఉండటం చూడవచ్చు.అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ పెళ్లిఅనంత్ అంబానీ, రాధిక మర్చంట్ పెళ్లి ఈ నెల 12న పెళ్లి చేసుకోబోతున్నారు. అయితే శుక్రవారం సాయంత్రం ముంబైలోని బీకేసీలోని నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్లో సంగీత్ నిర్వహించనున్నారు. దీనికి కుటుంబం, బాలీవుడ్ ప్రముఖులతో పాటు ఇతర సెలబ్రిటీలు కూడా హాజరయ్యే అవకాశం ఉంది. View this post on Instagram A post shared by Manav Manglani (@manav.manglani) -
అంబానీ పెళ్లి కోసం స్టార్ సింగర్.. ఎన్ని కోట్లు ఆఫర్ చేశారంటే?
పెళ్లి అంటే నెల రోజుల ముందు నుంచే హడావుడి ఉంటుంది. అసలైన వేడుకలు మాత్రం వారం ముందు నుంచి మొదలవుతాయి. కానీ ప్రముఖ వ్యాపారవేత్త ముఖేశ్ అంబానీ తనయుడు అనంత్ అంబానీ పెళ్లికి మాత్రం ఐదు నెలల ముందు నుంచే హంగామా మొదలైంది. మార్చి నెలలోనే ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్సే కళ్లు చెదిరే రేంజులో నిర్వహించారు. వేలాది కోట్లు ఖర్చు పెట్టారు. మరి పెళ్లి ఇంకెంత ఘనంగా నిర్వహిస్తారో ఎవరి ఊహకూ అందడం లేదు.ముంబైకి చేరుకున్న బీబర్ఇకపోతే తాజాగా పెళ్లి పనులు షురూ అయ్యాయి. గుజరాతీ సాంప్రదాయాల్లో ఒకటైన మామేరు వేడుక నిర్వహించారు. మరోవైపు ఆహ్వానాలు అందుకున్న అతిథులు టంచనుగా వచ్చేస్తున్నారు. అమెరికన్ పాప్ సింగర్ జస్టిన్ బీబర్ అంబానీ పెళ్లి కోసం ఇండియా వచ్చేశాడు. గురువారం నాడు ఆయన ముంబైకు చేరుకున్న ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. సంగీత్లో పాటలు పాడేందుకు బీబర్ను రప్పించిన అంబానీ ఫ్యామిలీ.. అతడికి రూ.83 కోట్ల మేర డబ్బు ఆఫర్ చేసిందని తెలుస్తోంది. మరికొద్ది రోజుల్లో పెళ్లిఅందులో భాగంగానే బీబర్.. శుక్రవారం నాడు తన గాత్రంతో అతిథులందరినీ ఆకట్టుకోనున్నాడు. అడెల్, డ్రేక్, లానా డెల్ రే వంటి సింగర్స్ సైతం పెళ్లిలో పాటలు పాడనున్నట్లు తెలుస్తోంది. కాగా జూలై 12న ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో అనంత్ అంబానీ- రాధికా మర్చంట్ల వివాహం జరగనుంది. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani)చదవండి: ఓటీటీలోకి టాప్ రేటింగ్ సినిమా.. అధికారిక ప్రకటన -
అంబానీ ఇంట పెళ్లి వేడుకల్లో మెరిసిన బాలీవుడ్ ప్రేమ జంట (ఫోటోలు)
-
‘మామేరు’ వేడుకలో మెరిసిన రాధిక : అమ్మనగలతో అందంగా, అద్భుతంగా!
అపర కుబేరుడు రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ, నీతా అంబానీ దంపతుల చిన్న కుమారుడు అనంత్ అంబానీ తన చిరకాల ప్రేయసితో వివాహ బంధంలోకి అడుగుపెట్టే ముహూర్తం సమీపిస్తోంది. దీంతో పెళ్లి వేడుకలోని కీలక ఘట్టాలు ఒక్కొక్కటీ వైభవంగా మొదలయ్యాయి.ప్రధానంగా గుజరాతీ వివాహాల్లో తొలుతగా నిర్వహించే ఆచారాలను ఇరు కుటుంబాలు పాటిస్తున్నాయి. ఇందులో భాగంగానే ముంబైలోని యాంటిలియాలో అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ల మామేరు వేడుక ఘనంగా జరిగింది. ఈ సందర్బంగా కాబోయే వధువు రాధిక తన స్టయిలిష్ లుక్తో అందర్నీ ఆకట్టుకుంది.అమ్మ నగలతో అందంగారాధికా మర్చంట్ ఆరెంజ్ అండ్ పింక్ షేడ్స్లో మనీష్ మల్హోత్రా డిజైన్ చేసిన లెహంగాలో అందంగా ముస్తాబైంది. బంగారు నెక్లెస్ , మ్యాచింగ్ జుంకాలు, బ్యాంగిల్స్ ఇంకా స్పెషల్ హెయిర్ స్టయిల్తో ఆమె ఫ్యాషన్ లుక్ అదిరిపోయింది. ముఖ్యంగా ఇదే వేడుకలో తన తల్లి ధరించిన ఆభరణాలను ఎంచుకోవడం ప్రత్యేకతగా నిలుస్తోంది.బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్, ప్రియుడు శిఖర్ పహారియాతో స్టైలిష్గా కనిపించింది. ఇంకా మాజీ ప్రపంచ సుందరి మానుషి చిల్లర్, ఓరీ తదితర బాలీవుడ్ ప్రముఖులు ఈ ఈవెంట్కు మరింత గ్లామర్ జోడించారు. View this post on Instagram A post shared by Varinder Chawla (@varindertchawla) గుజరాతీ వివాహాలలో కుటుంబ ప్రాముఖ్యతను, వరుడు తల్లి పుట్టింటివారి ప్రేమలను చాటేలా 'మోసలు' లేదా 'మామెరు' వేడుకులను నిర్వహిస్తారు. ఈ 'మామేరు' వేడుకలో వధూవరులు మేనమామలు, ఇతర కుటుంబ సభ్యుల ఆశీర్వాదాన్ని తీసుకుంటారు. అమ్మతరపు వారు అందించే బహుమతులను స్వీకరిస్తారు.కాగా జూలై 12నుంచి ముంబైలోని జియో వరల్డ్ సెంటర్లో అనంత్ అంబానీ- రాధిక మర్చంట్ వివాహ వేడుకలు జరగ బోతున్నాయి. జూలై 13న శుభ్ ఆశీర్వాద్, జూలై 14న మంగళ్ ఉత్సవ్ (వివాహ రిసెప్షన్)దాకా ఈ వివాహ వేడుకలు అంగరంగ వైభవంగా కొనసాగనున్నాయి. -
అంబానీ ఇంట మొదలైన పెళ్లి సందడి (ఫోటోలు)
-
అంబానీ ఇంట పెళ్లి సందడి : 50 జంటలకు సామూహిక వివాహాలు (ఫొటోలు)
-
అనంత్ అంబానీ - రాధిక ప్రీ వెడ్డింగ్ : మరో విశేష కార్యక్రమం, వైరల్ వీడియో
రిలయన్స్ అధినేత, కుబేరుడు ముఖేష్ అంబానీ, నీతా అంబానీ దంపతులు తమ చిన్న కుమారుడు అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో భాగంగా మరో విశిష్ట కార్యక్రమాన్ని నిర్వహించారు. నిరుపేద కుటుంబాలకు చెందిన జంటల సామూహిక వివాహ కార్యక్రమాన్ని నిర్వహించారు అంబానీ దంపతులు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట విశేషంగా నిలిచింది. ముఖేష్ అంబానీ, నీతా అంబానీ దగ్గరుండి మరీ ఈ కార్యక్రమాన్నినిర్వహించారు. ముంబైకి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాల్ఘర్కు చెందిన 50 మంది నిరుపేద జంటకు సామూహిక వివాహాలను నిర్వహించారు. అలాగే అంబానీ పెద్దకుమారుడు ఆకాశ్ అంబానీ, ఆయన భార్య శ్లోకా, ఇషా అంబానీ, భర్త ఆనంద్ పిరామిల్ కూడా పాల్గొన్నారు. శ్లోకా అంబానీ నూతన వధూవరులకు ఖరీదైన బహుమతులను అందించారు. కాగా జూలై 12న ముంబైలోని బాంద్రాలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో అనంత్, రాధిక మర్చంట్ వివాహం వీరి పెళ్లి అంగరంగ వైభవంగా జరగబోతోంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ ఇప్పటికే పూర్తయ్యినట్టు తెలుస్తోంది. వీరి పెళ్లికి సంబంధించిన తొలి వివాహ ఆహ్వాన పత్రికను ఇటీవలే నీతా అంబానీ వారణాసిలోని కాశీ విశ్వనాథుడి పాదాల వద్ద ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పెళ్లికి దేశవిదేశాల నుంచి ప్రముఖులు హాజరయ్యే అవకాశముందని అంచనా.#WATCH | Navi Mumbai: Reliance Industries Chairman Mukesh Ambani and Nita Ambani present at the mass wedding of the underprivileged being organised as part of the pre-wedding celebrations of Anant Ambani and Radhika Merchant. pic.twitter.com/IoMvMsPq7s— ANI (@ANI) July 2, 2024 -
అనంత్ అంబానీ ఇష్టపడే ఆంధ్ర పెసరట్టు..ఎమ్మెల్యే పెసరట్టు అని ఎందుకంటారంటే..?
రిలయన్స్ దిగ్గజం ముఖేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్-రాధికల ప్రీ వెడ్డింగ్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఆ సందర్భంగా అంబానీ కుటుంబ సభ్యులు ఇష్టంగా తినే వాటి గురించి నెట్టింట తెగ వైరల్ అయ్యాయి కూడా. వాళ్లు గుజరాతీ ప్రధాన వంటకాలు, ప్రపంచ స్థాయిలో ఫ్రెంచ్ వంటకాలను ఇష్టంగా ఆస్వాదిస్తారని ఆయా ఈవెంట్ల కారణంగా తెలుస్తోంది. ఇక ఆ ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో కాబోయే వరుడు అనంత్ ఇష్టంగా తినే ఆంధ్రప్రదేశ్ ఫేమస్ పెసరట్ ప్రస్తుతం హాట్టాపిక్గా మారింది.జామ్నగర్లో జరిగిన తొలి ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో ఆయన ప్రముఖ అరుసువై అరుసు క్యాటరింగ్ సర్వీస్ అనే ఫుడ్ స్టాల్ వద్ద అనంత్ పెసరట్టు ఆర్డర్ చేశారు. ఆయన దీన్ని అల్లం చట్నీతో ఆస్వాదించారు. ఈ స్టాల్కి ముఖేష్ అంబానీ, రజనీకాంత్, బిల్గేట్స్, ఐశ్వర్యరాయ్ బచ్చన్ వంటి ప్రముఖులు తరుచుగా వస్తారట కూడా. అంత ఫేమస్ ఈ స్టాల్. ఆంధ్ర ఫేమస్ బ్రేక్ఫాస్ట్ అయిన పెసరట్టు అత్యంత సంపన్నుడైన అనంత్ అంబానీ మనసునే దోచింది. అయితే ఈ పెసరట్టుతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి.పెసరట్టు స్టోరీ..మినపప్పు, బియ్యంల మిశ్రమాన్ని పులియబెట్టి దోసెలు తయారు చేస్తే..ఈ పెసరట్టు మాత్రం అందుకు విరుద్ధం. దీన్ని మెలకెత్తిన పెసలు లేదా మూడు గంటలు నానబెట్టిన పెసలుతో తయారు చేస్తారు. మనం వేసే సాధారణ దోసె కంటే కాస్త దళసరిగా వేస్తారు. దీనిలో ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. హైదరాబాద్ రాష్ట్ర శాసన సభ క్యాంటిన్లో ఏకంగా దీన్ని ఉప్మాతో కలిపి సర్వ్ చేస్తారు. సాధారణ దోసెల్లో బంగాళ దుంప వంటి వాటిని ఉపయోగిస్తే..పెసరట్టులో మాత్రం ఉప్మాను ఉపయోగిస్తారు. అందుకే దీన్ని ఉప్మా పెసరట్టు లేదా ఎమ్మెల్యే పెసరట్టు అని పిలుస్తారు. చక్కగా ఇంట్లోనే ఎలా తయరు చేసుకోవాలంటే..కావాల్సినవి:పెసలు: 1 కప్పుబియ్యం:1/4 కప్పుఒక చిన్న అల్లం ముక్కకొత్తిమీర ఆకుల చిన్న కట్టవెల్లుల్లి 2 లవంగాలు (ఇష్టాన్ని బట్టి వేసుకోవచ్చు లేదా స్కిప్ చెయ్యొచ్చు)పచ్చి మిరపకాయలు-1 లేదా రెండునూనె తగినంతఉల్లి: చక్కగా సన్నగా తరిగినవితయారీ విధానం: కనీసం మూడు గంటలు నానిన పెసలు మిక్సీలో వేసుకోవాలి. అందులోనే అల్లం ముక్క, పచ్చిమిర్చి, వెల్లుల్లి/దాల్చిన చెక్క వేసి మెత్తగా అయ్యే వరకు మిక్సీ పట్టాలి. ఆ తర్వాత స్టవ్ మీత పెనం పెట్టుకుని చక్కగా దోసె మాదిరిగా కొంచెం దలసరిగా వేసుకుని మద్యలో ఉల్లి ముక్కలు, కొద్దిగా నూనె వేసుకుని దోరగా వేయించుకోవాలి. దీన్ని మూత పెట్టి ఉడికించుకోవాలి. అదే దోసెతో ఫిల్ చేయాలనుకుంటే రెండు వైపులా కాల్చుకుని దోసెతో ఫిల్ చేసి సర్వ్ చేయాలి. -
అనంత్ అంబానీ వాచ్..వామ్మో..! అంత ఖరీదా?
రిలయన్స్ ఇండస్ట్రీస్ దిగ్గజం ముఖేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ వివాహం ఈ నెల 12న జరగనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే వారి ఇంట జరిగే చివరి వివాహం కావడంతో అత్యంత విలాసవంతంగా ప్రీ వెడ్డింగ్ వేడుకలు జరిగాయి. ఆ ఈవెంట్లో ఆ కుటుంబ సభ్యులు ధరించిన ఆభరణాలు, కాస్ట్యూమ్స్ నెట్టింట తెగ వైరల్ అయ్యాయి కూడా. తాజాగా అలానే అనంత్ ధరించిన లగ్జరియస్ వాచ్ నెట్టింట హాట్టాపిక్గా మారింది. రాధిక మర్చంతో వివాహ నేపథ్యంలో అనంత్ ప్రముఖ దేవాలయాలను దర్శిస్తున్నారు. ఆ క్రమంలోనే మహారాష్ట్రలోని నేరల్లోని కృష్ణ కాళీ దేవాలయాన్ని దర్శించారు కాబోయే వరుడు అనంత్ అంబానీ. అమ్మవారి ఆశీర్వాదాన్ని కోరుతూ ఆలయంలో హవన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అనంత్ ధరించిన గడియారం అందరి దృష్టిని తెగ ఆకర్షించింది. దాని ధర తెలిస్తే కంగుతింటారు.అత్యంత అరుదైన వాచ్..అనంత్ అంబానీకి అద్భుతమైన వాచీలను సేకరించే అలవాటు ఉంది. వాటిలో ఖరీదైన పాటెక్ ఫిలిప్, రిచర్డ్ మిల్లే నుండి అరుదైన వాచీలు ఉన్నాయి. కృష్ణ కాళీ ఆలయ సందర్శన సమయంలో, అనంత్ రిచర్డ్ మిల్లే వాచీని పెట్టుకున్నారు. ఎరుపు రంగు కార్బన్ రిచర్డ్ మిల్లే వాచ్ (ఆర్ఎం 12-01 టూర్బిల్లాన్)ను ఆయన పెట్టుకున్నారు. దీని ధర ఏకంగా రూ. 6.91 కోట్లు. ఈ బ్రాండ్కి సంబంధించిన వాచ్లు చాలా పరిమితి పరిధిలోనే అందుబాటులో ఉంటాయి. ఇప్పటి వరకు ఈ బ్రాండ్కు సంబంధించినవి 18 వాచ్లు మాత్రమే రూపొందించారు. మన దేశంలో కొన్ని కుటుంబాలు కేవలం నెలకు ఆరు వేల రూపాయలతో జీవిస్తున్నారు. అనంత్ అంబానీ వాచీ ఖరీదు ఆరుకోట్ల 91 లక్షల రూపాయలు. అంటే మనదేశంలోని దారిద్య్రరేఖకు దిగువున ఉన్న రెండు గ్రామాలను అభివృద్ధి చెయ్యొచ్చు. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) (చదవండి: పారిస్ ఒలింపిక్స్లో పాల్గొననున్న టీమ్ ఇండియా దుస్తులను డిజైన్ చేసేదేవరంటే..!) -
కాళ్లు మొక్కి ఆశీర్వాదాలు కోరిన అనంత్ అంబానీ
రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్ పాదాలకు నమస్కరించి ఆయన ఆశీర్వాదాలు తీసుకున్నారు. ఆదివారం ముంబయిలోని ముఖేష్ అంబానీ నివాసం యాంటిలియాలో ఏర్పాటు చేసిన విందుకు మోహన్ భగవత్ హాజరయ్యారు. కార్యక్రమానికి పాల్గొన్న ఆయన్ను ముఖేశ్ అంబానీ, అనంత్ అంబానీ కలిసి లోపలికి ఆహ్వానించారు. ఈ క్రమంలో కారులో నుంచి దిగిన మోహన్ భగవత్ కాళ్లకు నమస్కరించి అనంత్ ఆశీర్వాదాలు కోరారు. తన పెళ్లికి తప్పకుండా హాజరుకావాలని తెలిపారు.అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ల వివాహాం జూలై 12న జరుగుతున్న నేపథ్యంలో ముఖేష్-నీతా అంబానీ దంపతులు కొందరు ప్రముఖులకు ఆదివారం ముంబయిలోని తమ నివాసం యాంటిలియాలో విందు ఏర్పాటు చేశారు. ఈ ఆతిధ్యానికి హాజరైన ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ పాదాలకు అనంత్ సమస్కరిస్తున్నపుడు తీసిన వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో ప్రస్తుతం వైరల్గా మారింది.జులై 12న అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ల వివాహ వేడుక ‘శుభ్ వివాహ్’తో ప్రారంభం కానుంది. జులై 13న 'శుభ్ ఆశీర్వాద్', జులై 14న ‘మంగళ్ ఉత్సవ్’ కార్యక్రమాలతో వేడుకలు ముగియనున్నాయి. ఇటీవల ఈ జంట ఇటలీ నుంచి ఫ్రాన్స్ వరకు దాదాపు 4500 కిలోమీటర్లు క్రూయిజ్లో ప్రయాణిస్తూ రెండో ప్రీవెడ్డింగ్ సెలబ్రేషన్స్ జరుపుకున్నారు. గతంలో ఈ జంట జామ్నగర్లో తమ మొదటి ప్రీవెడ్డింగ్ వేడుకలను అంగరంగవైభవంగా జరుపుకున్నారు. -
పెళ్లికి ముందు అంబానీ ఫ్యామిలీ మరో గ్రాండ్ ఈవెంట్
ముఖేష్ అంబానీ, నీతా అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ.. వీరేన్ మర్చంట్, శైలా మర్చంట్ కుమార్తె రాధికా మర్చంట్ అతి త్వరలో మూడు ముళ్లతో ఒక్కటవుతున్నారు. వీరి వివాహం జూలై 12న ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ (బీకేసీ)లోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో అత్యంత ఘనంగా జరగనుంది. ఇప్పటికే రెండు ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ జరిగాయి. ఇప్పుడు పెళ్లికి ముందు మరో భారీ వేడుకను అంబానీ ఫ్యామిలీ నిర్వహించబోతోంది.మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో నిరుపేద యువతీయువకులకు సామూహిక వివాహాలను జరిపించబోతోంది. దీనికి సంబంధించిన ఆహ్వాన పత్రికను వార్తా సంస్థ ఏఎన్ఐ ప్రచురించింది. దీని ప్రకారం.. అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ లో భాగంగా జూలై 2న సాయంత్రం 4.30 గంటలకు పాల్ఘర్ లోని స్వామి వివేకానంద విద్యామందిర్ లో నిరుపేదల సామూహిక వివాహాన్ని ఏర్పాటు చేశారు.అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ల ప్రీ వెడ్డింగ్ సెలెబ్రేషన్స్ అత్యంత ఆడంబరంగా జరిగాయి. జామ్ నగర్ లో జరిగిన తొలి కార్యక్రమానికి ప్రపంచం నలుమూలల నుంచి ప్రముఖులు హాజరుకాగా, రిహన్నా వంటి గ్లోబల్ ఐకాన్ల ప్రదర్శనలు ఇచ్చారు. మధ్యధరా సముద్రంపై క్రూయిజ్లో విశిష్టంగా జరిగిన రెండో వేడుక అయితే ప్రపంచ దృష్టిని ఆకర్షించింది.As part of the pre-wedding celebrations of Anant Ambani and Radhika Merchant, a mass wedding of the underprivileged has been organised at 4:30 pm on 2nd July, at Swami Vivekanand Vidyamandir in Palghar. pic.twitter.com/tRu1h5Em6g— ANI (@ANI) June 29, 2024 -
ఒక వెడ్డింగ్ కార్డు ధర అన్ని లక్షలా!.. అంబానీ అంటే ఆ మాత్రం ఉంటది
'అనంత్ అంబానీ, రాధికా మర్చెంట్'ల వివాహం జులై 12న జరగనుంది. ఇప్పటికే వివాహ వేడుకలు మొదలైపోయాయి. నీతా అంబానీ మొదటి శుభలేఖను కాశీ విశ్వనాధునికి సమర్పించారు. అనంత్ అంబానీ పలువురు సినీ తారలను, ఇతర ప్రముఖులను స్వయంగా వెళ్లి ఆహ్వానిస్తున్నారు. ఈ తరుణంలో అనంత్ & రాధికల వెడ్డింగ్ కార్డు వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.అద్భుతంగా ఉన్న అనంత్ & రాధికల వెడ్డింగ్ కార్డు ధర ఎంత ఉంటుందని సర్వత్రా ఉత్కంఠగా మారింది. అంబానీల ఒక్క వెడ్డింగ్ కార్డు ధర రూ. 6.50 లక్షల వరకు ఉంటుందని అంచనా. ఎందుకంటే ఇది మూడు కేజీల వెండి దేవాలయంలో 24 క్యారెట్ల బంగారు విగ్రహాలతో కూడిన వెడ్డింగ్ కార్డు.గతంలో ముకేశ్ అంబానీ తన కూతురు ఇషా అంబానీ పెళ్లి కార్డును కూడా రూ. 3 లక్షల ఖర్చు పోయేట్టు తయారు చేయించినట్లు సమాచారం. కాగా ఇప్పుడు కొడుకు వెడ్డింగ్ (ఒక్కొక్క వెడ్డింగ్ కార్డు) కార్డు కోసం ఏకంగా రూ. 6.50 లక్షలు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. అంబానీ ఇంట జరగబోయే ఈ వివాహ వేడుకలకు ప్రపంచ నలుమూలల నుంచి పారిశ్రామిక వేత్తలు, సినీతారలు హాజరు కానున్నారు. కాగా వీరి పెళ్లి ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో జరగనుంది.ఇదీ చదవండి: అనంత్ అంబానీ - రాధిక పెళ్లి : అపురూపంగా ఆహ్వాన పత్రికUnboxing the wedding card for Anant Ambani and Radhika Merchant's world's costliest wedding! pic.twitter.com/p3GnYSjkp2— DealzTrendz (@dealztrendz) June 26, 2024 -
వైరల్ వీడియో: అంబానీ ఇంట్లో పెళ్లి అంటే మజాకా?
-
అనంత్ అంబానీ - రాధిక పెళ్లి : అపురూపంగా ఆహ్వాన పత్రిక
బిలియనీర్ పారిశ్రామికవేత్త ముఖేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ ఏడడుగుల వేడుకకు ముహూర్తం సమీపిస్తోంది. అపరకుబేరుడు, రిలయన్స్ అధినేత అంబానీ ఇంట పెళ్లి అంటే ఆ సందడే వేరుగా ఉంటుంది. అంబానీ కుటుంబం పెళ్లి పనుల్లో ఇప్పటికే బిజీగా ఉంది. వివాహ పత్రికను కాశీ విశ్వేశ్వరుడి పాదాల వద్ద ఉంచి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు అనంత్ తల్లి నీతాఅంబానీ. ఆ తరువాత హితులు, సన్నిహితులు, సెలబ్రిటీలకు పెళ్లి ఆహ్వానాలను అందిస్తున్నారు కూడా. ఈ క్రమంలో అనంత్ -రాధిక వెడ్డింగ్ కార్డ్ నెట్టింట చక్కర్లు కొడుతోంది.Unboxing the wedding card for Anant Ambani and Radhika Merchant's world's costliest wedding! pic.twitter.com/p3GnYSjkp2— DealzTrendz (@dealztrendz) June 26, 2024ప్రపంచంలోనే అతి ఖరీదైన వ్యవహారంగా మారిపోయింది అనంత్-రాధిక పెళ్లి ముచ్చట. ఇక వివాహ ఆహ్వానం ప్రత్యేకంగా ఒక పెట్టెలో ఒక కళాఖండంగా తీర్చిదిద్దిన వైనం విశేషంగా నిలుస్తోంది. అనంత్-రాధిక పేర్లలోని తొలి అక్షరాలు, లైట్లు, ఎర్రని రంగుతో ఇన్విటేషన్ కార్డును అలంకరించారు. బాక్స్ ఓపెన్ చేయగానే ఓం అంటూ మంత్రం వినిపిస్తుంది. దీన్ని ఓపెన్ చేయగానే వెండితో చేసిన ఆలయం, ఈ ఆలయం లోపల వెండితోనే చేసిన వినాయకుడు, దుర్గామాత, రాధాకృష్ణ విగ్రహాలు ముచ్చటగా ఉన్నాయి. అంతేకాదు వివాహ ఆహ్వాన అతిథులకు ఈ వెండి కార్డుతో పాటు పలు బహుమతులు కూడా ఇస్తున్నారని తెలుస్తోంది.అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ వివాహం ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో జూలై 12న అంగరంగ వైభవంగా జరగనుంది. దేశ, విదేశాలకు చెందిన పలువురు సెలబ్రిటీలు ఈ వివాహానికి హాజరుకానున్నారు. -
ఇది కదా అంబానీ రేంజ్.. అనంత్ అంబానీ వెడ్డింగ్ కార్డ్ వైరల్
-
నా పెళ్లికి తప్పకుండా రావాలి.. హీరోల ఇంటికి వెళ్లిన అనంత్ అంబానీ
దిగ్గజ వ్యాపారవేత్త ముఖేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ ప్రీవెడ్డింగ్ సెలబ్రేషన్స్ కళ్లు చెదిరేలా జరిగాయి. మరికొద్ది రోజుల్లోనే పెళ్లి జరగబోతుండగా ఈ శుభాకార్యానికి రావాలంటూ పెళ్లి పత్రికలు పంచుతున్నారు. ఈ వెడ్డింగ్ కార్డ్స్ కూడా ఎంతో వెరైటీగా డిజైన్ చేశారు. చిన్నపాటి దేవుడి మందిరాన్నే కానుకగా ఇచ్చారు. అందులోనే పెళ్లి పత్రికను పొందుపరిచారు.తాజాగా అనంత్ అంబానీ.. తమ పెళ్లికి రావాలంటూ ఇద్దరు హీరోల ఇంటికి వెళ్లి మరీ పిలిచాడు. బుధవారం రాత్రి తన రోల్స్ రాయిస్ కారులో బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ ఇంటికి వెళ్లాడు. అక్షయ్కు స్వయంగా కార్డు ఇచ్చి కుటుంబసమేతంగా తన పెళ్లికి రావాలని ఆహ్వానించాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్గా మారింది. అలాగే అక్షయ్ దేవ్గణ్ను సైతం కలిసి వెడ్డింగ్ కార్డ్ ఇచ్చాడు. అనంత్ అంబానీ- రాధిక మర్చంట్ల పెళ్లి సెలబ్రేషన్స్ మూడు రోజుల పాటు ఘనంగా జరగనున్నట్లు తెలుస్తోంది. జూలై 12, 13, 14 తేదీల్లో జరగనున్న ఈ వివాహ వేడుకకు ముంబైలోని జియో వరల్డ్ సెంటర్ వేదికగా మారనుంది. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) చదవండి: ‘కల్కి 2898 ఏడీ’ టాక్ ఎలా ఉందంటే..? -
నీతా అంబానీ మనసు దోచుకున్న చాట్...వైరల్వీడియో
రిలయన్స్ ఫౌండేషన్ చైర్పర్సన్ , బిలియనీర్ ముఖేష్ అంబానీ భార్య నీతా అంబానీ తన చిన్న కుమారుడు అనంత్ అంబానీ పెళ్లి పురస్కరించుకొని ఉత్తర ప్రదేశ్లోని వారణాసిలో ఉన్న ప్రసిద్ధ కాశీ విశ్వనాథ్ ఆలయంలో ప్రార్థనలు చేశారు. అనంత్ అంబానీ - రాధిక మర్చంట్ వివాహ తొలి ఆహ్వానాన్ని శివుని పాదాల వద్ద ఉంచి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా కాశీ లేదా బనారస్ నగరంలో చాట్ను ఆస్వాదించిన వీడియో వైరల్ అయింది. అంతేకాదు భర్త ముఖేష్ అంబానీకి చాట్లు అంటే చాలా ఇష్టమని ప్రస్తావించారు. ఇపుడు ముఖేష్ ఉండి ఉంటే దీన్ని ఇష్టపడి ఉండేవారని వ్యాఖ్యానించారు. అంబానీ ముంబైలోని స్వాతి స్నాక్స్ ఫుడ్ అంటే చాలా ఇష్టమట ఒకసారి ఆహారాన్ని ఆర్డర్ చేసేవాడని చెబుతారు.After temple visit and the sacred Ganga Aarti, Smt. Nita Ambani savored a variety of dishes at the famous Kashi Chat Bhandaar in Varanasi today#KasiViswanathan #Varanasi #RelianceFoundation #AnantRadhikaWedding #KashiVishwanathTemple #HarHarMahadev #NitaAmbani pic.twitter.com/RzZ8uHWNV1— AkashMAmbani (@AkashMAmbani) June 25, 2024 కాశీలో నీతా అంబానీ మనసు దోచుకున్న స్నాక్ బనారస్ టమాటా చాట్. పాపులర్ కాశీ చాట్ భండార్లో చాట్ను ఆస్వాదించారు. అలాగే స్థానిక సంస్కృతి , సంప్రదాయాల గురించి ముచ్చటించడం విశేషంగా నిలిచింది. పనిలో పనిగా చాట్ రెసిపీని కూడా దుకాణదారుడిని కూడా అడిగి తెలుసుకున్నారు. బనారస్లో ఇది పాపులర్. దేశ విదేశాలనుంచి వచ్చేవారు కచ్చితంగా దీన్ని టేస్ట్ చేస్తారట. దాదాపు పదేళ్ల తర్వాత కాశీ విశ్వేశ్వరుడిని దర్శించుకున్నానంటూ నీతా ఉద్వేగానికి లోనయ్యారు. "గంగా హారతి సందర్భంగా ఇక్కడికి రావడం నా అదృష్టం. చాలా బాగుంది.. ఇక్కడ గొప్ప శక్తి ఉంది’’ అన్నారామె.కాగా అనంత్- రాధిక పెళ్లి బాజాలు జూలై 12న మోగనున్నాయి. ముంబైలో బాంద్రా కుర్లా కాంప్లెక్స్ (BKC)లోని జియో వరల్డ్ సెంటర్లో మూడు రోజుల పాటు వీరి వివాహ వేడుకలు జరగనున్నాయి -
భర్తతో హీరోయిన్ ఆలియా భట్ క్యూట్ (ఫొటోలు)
-
అజయ్ దేవగన్ నివాసంలో అనంత్ అంబానీ - వీడియో
అనంత్ అంబానీ వచ్చే నెలలో రాధికా మర్చంట్ను వివాహం చేసుకోనున్నారు. వివాహ సన్నాహాలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. తమ పెళ్ళికి ఆహ్వానించడానికి అనంత్ అంబానీ స్వయంగా అజయ్ దేవగన్, కాజోల్ నివాసానికి వెళ్లారు. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో అనంత్ అంబానీ.. అజయ్ దేవగన్ ఇంటి నుంచి బయటకు వచ్చి తన రోల్స్ రాయిస్ కారులోకి వెళ్లడం చూడవచ్చు. ఆ తరువాత తన సెక్యూరిటీ సిబ్బందితో కలిసి అక్కడ నుంచి వెళ్లిపోయారు.ఇదిలా ఉండగా అనంత్ అంబానీ తల్లి నీతా అంబానీ కాశీ విశ్వనాథ్ ఆలయాన్ని సందర్శించారు. అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ల పెళ్లి కార్డును దేవుని చెంత ఉంచడానికి, దేవుని ఆశీర్వాదం పొందటానికి అక్కడకు వెళ్లినట్లు నీతా అంబానీ పేర్కొన్నారు. దీనికి సంబంధించిన చాలా వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.జూలై 12న పెళ్లి2024 జులై 12న వీరి పెళ్లి జరుగుతుందని ఇప్పటికే వారిరువురి కుటుంబాలు పేర్కొన్నాయి. అనంత్ & రాధికల పెళ్లి ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో మూడు రోజులు జరగనుంది. జులై 12న వివాహం, 13న శుభ్ ఆశీర్వాద్, 14న మంగళ ఉత్సవ్ లేదా రిసెప్షన్ ఉండనున్నట్లు తెలుస్తోంది. వీరి పెళ్ళికి ప్రపంచం నలుమూలల నుంచి ప్రముఖులు హాజరుకానున్నారు.ముకేశ్ & నీతా అంబానీల చిన్న కుమారుడు అనంత్ అంబానీ.. రిలయన్స్ ఇండస్ట్రీస్, జియో ప్లాట్ఫారమ్లు, రిలయన్స్ రిటైల్ వెంచర్స్, రిలయన్స్ న్యూ ఎనర్జీ, రిలయన్స్ న్యూ సోలార్ ఎనర్జీతో సహా పలు రిలయన్స్ గ్రూప్ కంపెనీల బోర్డులలో డైరెక్టర్గా పనిచేస్తున్నారు. View this post on Instagram A post shared by Voompla (@voompla) -
కాశీ విశ్వనాథుడిని దర్శించుకున్న నీతా అంబానీ
రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు, చైర్పర్సన్ నీతా అంబానీ సోమవారం వారణాసిలోని కాశీ విశ్వనాథ ఆలయాన్ని సందర్శించారు. జులై 12న జరగబోయే తన చిన్న కుమారుడు అనంత్ అంబానీ వివాహ ఆహ్వాన పత్రికను స్వామివారి ముందుంచి ఆశీర్వాదాలు తీసుకున్నారు. అనంతరం దేవాలయం ముందున్న దుకాణంలో చాట్ తింటూ స్థానికులతో కాసేపు ముచ్చటించారు.రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ-నీతా అంబానీల చిన్న కుమారుడు అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ల ప్రివెడ్డింగ్ వేడుకలను ఇప్పటికే ఘనంగా నిర్వహించారు. మొదటిసారి వేడుకలను జామ్నగర్లో జరిపారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రముఖులు ఈ వేడుకలో అలరించారు. ఇటీవల రెండోసారి ఏకంగా సముద్రంలో దాదాపు 4000 కిలోమీటర్లు క్రూయిజ్లో ప్రయాణిస్తూ అంగరంగ వైభవంగా వేడుకలు జరుపుకున్నారు. జులై 12న వివాహ ముహుర్తం నిర్ణయించడంతో ప్రముఖులను ఆహ్వానించాల్సి ఉంటుంది. దానికంటే ముందు నీతా అంబానీ తన ఇష్టదైవమైన కాశీ విశ్వనాథున్ని దర్శించుకుని కుమారుడి వివాహ ఆహ్వాన పత్రికను స్వామివారి చెంత ఉంచేందుకు సోమవారం వారణాసి చేరుకున్నారు.స్వామివారికి మొక్కులు చెల్లించిన అనంతరం దేవాలయం ముందు ఉన్న చాట్ దుకాణంలో చాట్ తింటూ ఆడంబరాలు లేకుండా స్థానికులతో కాసేపు ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..‘కాశీ విశ్వనాథుడి ఆశీర్వాదాలు ఎప్పుడూ నావెంట ఉంటాయి. అనంత్-రాధికల వివాహ ఆహ్వాన పత్రికను పరమశివుడికి సమర్పించి స్వామివారి దీవెనలు కోరేందుకు వచ్చాను. పదేళ్ల తర్వాత స్వామివారిని దర్శించుకోవడం సంతోషంగా ఉంది. ఈ ప్రాంతం చాలా అభివృద్ధి చెందింది’ అన్నారు. ఈ మేరకు తీసిన వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది.#WATCH | Varanasi, Uttar Pradesh: Founder and Chairperson of Reliance Foundation Nita Ambani visits a chaat shop and interacts with locals pic.twitter.com/1QIY4Ha0xs— ANI (@ANI) June 24, 2024ఇదీ చదవండి: యాపిల్ ఉత్పత్తుల్లో మెటా ఏఐ.. క్లారిటీ ఇచ్చిన దిగ్గజ సంస్థ ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ (బీకేసీ)లో ఉన్న జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో జులై 12న అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ల వివాహం జరగనుంది. ఎన్కోర్ హెల్త్కేర్ సీఈఓ వీరేన్-శైలా మర్చంట్ కుమార్తె రాధిక మర్చంట్. -
పదేళ్ల తరువాత కాశీ వెళ్లిన 'నీతా అంబానీ'.. ఎందుకో తెలుసా?
అనంత్ అంబానీ & రాధిక మర్చంట్ 2024 జులై 12న పెళ్లిచేసుకోనున్నారు. ఇప్పటికే రెండు సార్లు ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ చేసుకున్న ఈ జంట వివాహం ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో జరుగుతుంది. అంతకంటే ముందు రిలయన్స్ ఫౌండేషన్ ఫౌండర్ & చైర్పర్సన్ నీతా అంబానీ ఈ రోజు (జూన్ 24) వారణాసికి వెళ్లారు.రాధికా మర్చంట్తో తన కుమారుడు అనంత్ అంబానీ వివాహానికి ముందు నీతా అంబానీ.. కాశీ విశ్వనాథ ఆలయం చేరుకొని అక్కడ ప్రార్థనలు చేశారు. "ఈ రోజు నేను అనంత్ & రాధికల వివాహ ఆహ్వానాన్ని సర్వేశ్వరునికి సమర్పించడానికి పదేళ్ల తరువాత ఇక్కడకు వచ్చాను" అని మీడియాతో చెప్పారు. అంతే కాకుండా ఇక్కడ జరుగుతున్న అభివృద్ధిని చూసి సంతోషిస్తున్నానని అన్నారు.రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ, పారిశ్రామికవేత్త వీరేన్ మర్చంట్ కుమార్తె రాధికా మర్చంట్ వివాహ వేడుకలు జూన్ 29 నుంచి ప్రారంభం కానున్నాయి. వీరి పెళ్లి జూలై 12 నుంచి 14 వరకు మూడురోజులు జరుగుతుంది. భారతదేశంలో సంపన్నుడైన అంబానీ కొడుకు వివాహనికి సినీ, రాజకీయ, పారిశ్రామిక దిగ్గాలు హాజరయ్యే అవకాశం ఉంది.#WATCH | Uttar Pradesh: Reliance Foundation Founder and Chairperson, Nita Ambani says, "I offered prayers to lord Shiva. I am feeling very blessed. Today I came here with the invitation for the wedding of Anant and Radhika to offer it to the almighty. I came here after 10 years.… https://t.co/KpZGiAWzvq pic.twitter.com/JY6aqFi7bn— ANI (@ANI) June 24, 2024 -
అనంత్ అంబానీ ప్రీవెడ్డింగ్.. బంగారం వడ్డించారు!
పెళ్లి అంటే వారం రోజుల ముందు నుంచే హడావుడి ఉంటుంది. కానీ అంబానీ పెళ్లికి నెలల ముందు నుంచే సందడి మొదలైంది. జూలైలో జరగబోయే పెళ్లికి మార్చి నుంచే ప్రీవెడ్డింగ్ సెలబ్రేషన్స్ మొదలుపెట్టారు. మార్చిలో గుజరాత్లోని జామ్ నగర్లో జరిగిన ప్రీవెడ్డింగ్ కార్యక్రమాలకు సినీ సెలబ్రిటీలు సైతం హాజరయ్యారు. తమ ఇంట్లో శుభకార్యం అన్నట్లుగా ఆనందంగా గడిపారు. ఆ వేడుకల్లో బాలీవుడ్ హీరోయిన్ సారా అలీ ఖాన్ కూడా ఉంది.బంగారం వడ్డింపుతాజాగా ఆ సెలబ్రేషన్స్ సంగతులను సారా అలీ ఖాన్ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. ఆమె మాట్లాడుతూ.. 'అక్కడ ఏకంగా బంగారమే వడ్డించినట్లుగా అనిపించింది. అందరూ చపాతీతో పాటు పసిడి తిన్నట్లుగా ఫీలయ్యాను. ఎక్కడ చూసినా అంతా వజ్రాలమయంగానే ఉంది. అంత అద్భుతంగా వేడుక నిర్వహించారు. ఎంతో బాగా వెల్కమ్ చెప్పారు. అనంత్తో కలిసి నేను స్కూలుకు వెళ్లేదాన్ని. రాధికా మర్చంట్ కూడా తెలుసు. అది మాత్రం మర్చిపోలేనుఏదేమైనా.. అంబానీ కుటుంబసభ్యులంతా ఎంతో మంచి మనసుతో సాదరంగా వెల్కమ్ చెప్పారు. నిజంగా వీళ్లు బంగారంలాంటివాళ్లు! నీతా అంబానీ మేడమ్ స్టేజీపై డ్యాన్స్ చేయడం మాత్రం మర్చిపోలేని జ్ఞాపకం' అని చెప్పుకొచ్చింది. ఇటీవల క్రూయిజ్ షిప్లో జరిగిన ప్రీ వెడ్డింగ్ వేడుకల్లోనూ సారా పాల్గొంది. ప్రస్తుతం ఈ హీరోయిన్ నటించిన మెట్రో ఇన్ డినో మూవీ విడుదలకు రెడీ అవుతోంది.చదవండి: సుత్తి లేకుండా సాగే థ్రిల్లర్ సినిమా.. లూ మూవీ రివ్యూ -
అంబానీ ప్రేయసి: ఈ ఒక్క లుక్ విలువ రూ. 1002కోట్లు! నమ్ముతారా?
అనంత్ అంబానీకి కాబోయే భార్య, రాధికా మర్చంట్ ఫ్యాషన్ ఔట్ఫిట్స్ ఫ్యాన్స్ని మంత్రముగ్దుల్ని చేస్తోంది. రిలయన్స్ వ్యాపార వారసుడు అనంత్ అంబానీ ప్రేయసిగా తన ఫ్యాషన్ స్టయిల్తో కాబోయే అత్తగారు నీతా అంబానీని మించి అభిమానులను ఆకట్టుకుంటోంది. తాజాగా అనంత్- రాధిక ఇటలీ - ఫ్రాన్స్ లగ్జరీ క్రూయిజ్ ప్రీ వెడ్డింగ్ వేడుక అట్టహాసంగా జరిగింది. ఈ వేడుకలో అంబానీ కోడలిగా కాబోయే వదువు రాధిక మెస్మరైజ్ చేసింది. వేలకోట్ల రూపాయలతో నిశ్చితార్థ వేడుక, మొదటి ప్రీ వెడ్డింగ్ వేడుక ఘనంగా జరిగాయి. తాజాగా రెండో ప్రీ-వెడ్డింగ్ బాష్ థీమ్ 'లా వీటా ఇ అన్ వియాజియో' (జీవితం ఒక ప్రయాణం), ఫ్యాషన్ స్టేట్మెంట్లతో ప్రతీ ఈవెంట్, దుస్తులు స్పెషల్ ఎట్రాక్షన్గా నిలిచాయి. అంబానీ ఫ్యాన్ పేజీ అందించిన డ్రెస్ ధలు హాట్ టాపిక్గా నిలుస్తున్నాయి.వైట్ డ్రెస్ మహారాణిలా, ధర రూ.1002 కోట్లురాధికా మర్చంట్ తెల్లటి తమరా రాల్ఫ్ డ్రెస్, డైమండ్ ఆభరణాలతోరాయల్లుక్లో అందంగా మెరిసి పోయింది. స్ప్రింగ్-సమ్మర్ 2024 కలెక్షన్కు చెందిన శాటిన్ గౌనులో రాణిలా కనిపించింది. పట్టు , క్రిస్టల్తో చేసిన గులాబీలు మెడ, నడుముపైనా, తలకు కిరీటంగా అమిరాయి. ఈ మొత్తం లుక్ ధర రూ. 1002కోట్లుక్రూయిజ్ బాష్లో స్టార్రి నైట్ పార్టీ కోసం రాధిక ధరించిన డైమండ్ ఇయర్కఫ్లు, లావెండర్ డ్రెస్, మొత్తం లుక్ ఖర్చు రూ. 896 కోట్లు.రెండో రోజు, టోగా పార్టీకోసం ఏరోస్పేస్ టెక్నాలజీతో తయారు చేసిన డ్రెస్, బంగారు ఆభరణాలతో డైమండ్ నగలు, బ్యాంగిల్స్ , వాచ్తో సహా మొత్తం లుక్ రూ. 697 కోట్లు.అనంత్ ప్రేమను చుట్టుకున్న ఈ లుక్ ధరఅనంత్ తన ప్రేమంతా కురిపించిన లవ్లెటర్తో రాబర్ట్ వున్ డిజైన్ చేసిన గౌను ధరించింది. లేయర్డ్ డైమండ్ నెక్లెస్, మ్యాచింగ్ చెవిపోగులు ధరించింది. ఈమొత్తం లుక్ ఖర్చు రూ. 478 కోట్లు.పాతకాలపు డియోర్ డ్రెస్లో ఖరీదైన యాక్సెసరీస్తో రాధిక అందంగా కనిపించిన మరో డ్రెస్ విలువ రూ. 26 లక్షలు రాధిక మర్చంట్ చిక్ బాల్మైన్ గౌను రూ. 5.43 లక్షలు. ఇంకా చెప్పాలంటే ఈ లిస్ట్ చాలా పెద్దదే. -
ధగధగ మెరిసే మెరుపుల రాణిలా రాధికా మర్చంట్ (ఫోటోలు)