Anupam Kher
-
ఎలాన్ మస్క్ను సూటిగా ప్రశ్నించిన అనుపమ్ ఖేర్.. అసలేం జరిగిందంటే?
ది కశ్మీర్ ఫైల్స్ మూవీతో క్రేజ్ తెచ్చుకున్న నటుడు అనుపమ్ ఖేర్. ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉన్నారాయన. ఇటీవలే ప్రభాస్ మూవీలోనూ ఛాన్స్ కొట్టేశాడు. హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కించబోయే చిత్రంలో కీలక పాత్ర పోషించనున్నారు. ఈ విషయాన్ని తన సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. బాహుబలి ప్రభాస్తో నా 544వ చిత్రం చేయడం ఆనందంగా ఉందని అనుపమ్ ట్వీట్ చేశారు. అయితే తాజాగా అనుపమ్ ఖేర్కు సోషల్ మీడియాలో చేదు అనుభవం ఎదురైంది. ఆయన ఎక్స్ ఖాతా కొంతసేపు లాక్ అయింది. ఈ విషయంపై ఏకంగా ట్విటర్ సీఈవో ఎలాన్ మస్క్ను ఆయన ప్రశ్నించారు. దీనిపై ట్విటర్ వేదికగా పోస్ట్ పెట్టారు. తన అకౌంట్ లాక్ అయినట్లు వచ్చిన స్క్రీన్షాట్ను కూడా షేర్ చేశారు. మీ అకౌంట్ లాకైంది. ఈ ప్లాట్ఫామ్ వేదికగా మీరు పోస్ట్ చేసిన కంటెంట్ విషయమై డిజిటల్ మిలీనియం కాపీరైట్ చట్టం కింద ఎక్స్కు ఒక ఫిర్యాదు వచ్చిందని అందులో రాసి ఉంది.దీనిపై అనుపమ్ తన ట్వీట్లో రాస్తూ.. 'నా ఖాతాను పునరుద్దరించినందుకు థ్యాంక్స్. కానీ నా అకౌంట్ లాక్ కావడం చూసి ఆశ్చర్యపోయాను. నేను 2007 సెప్టెంబర్ నుంచి ఈ సోషల్ మీడియా ఫ్లాట్ఫామ్లో ఉపయోగిస్తున్నా. నాకు ట్విటర్ నియమాలు, కాపీరైట్స్ గురించి బాగా తెలుసు. అందువల్ల నాకు అసంతృప్తిగా అనిపించింది. నేను చేసిన ఏ పోస్ట్ మీ నిబంధనలను ఉల్లంఘించిందో తెలుసుకోవచ్చా? అంటూ' పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది.Dear X! Even though my account has been restored I was surprised to see it locked. I have been on this platform since September 2007. Have always been mindful of rules of #X (formerly twitter). Or for that matter any social media copyright rules. So found it a little absurd.… pic.twitter.com/tNmhc30vtP— Anupam Kher (@AnupamPKher) February 24, 2025 -
ప్రభాస్ చిత్రంలో ది కశ్మీర్ ఫైల్స్ నటుడు.. డైరెక్టర్ ఎవరంటే?
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఈ ఏడాది ది రాజాసాబ్తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. గతేడాది కల్కి 2898తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన ప్రభాస్ మారుతి డైరెక్షన్లో లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్లో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ దాదాపు పూర్తి కావొస్తోంది. ఈ చిత్రంలో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. గతేడాది ప్రభాస్ బర్త్డే సందర్భంగా ఈ సినిమా నుంచి వీడియోతో కూడిన స్పెషల్ మోషన్ పోస్టర్ని విడుదల చేశారు.ది రాజాసాబ్లో ప్రభాస్ ఇప్పటి వరకు చేయని రొమాంటిక్ హారర్ జానర్లో ఈ సినిమాను తెరకెక్కుతోంది. ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్పై నిర్మాత టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాను ఈ ఏడాది ఏప్రిల్ 10న తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అయితే ఈ మూవీ తర్వాత రెబల్ స్టార్ ప్రభాస్ హను రాఘవపూడి దర్శకత్వంలో పని చేయనున్నారు. వీరి కాంబోలో వస్తోన్న చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. (ఇది చదవండి: ‘ది రాజాసాబ్’ అప్డేట్ .. ప్రభాస్ కొత్త లుక్ అదిరింది!)అయితే ఈ క్రేజీ ప్రాజెక్ట్లో ది కశ్మీర్ ఫైల్స్ నటుడు అనుపమ్ ఖేర్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ విషయాన్ని తన సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. బాహుబలి ప్రభాస్తో నా 544వ చిత్రం చేయడం ఆనందంగా ఉందని అనుపమ్ ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా ప్రభాస్, డైరెక్టర్తో హను రాఘవపూడితో దిగిన ఫోటోలను పంచుకున్నారు. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలోనే ప్రకటించనున్నారు. కాగా.. అనుపమ్ ఖేర్ బాలీవుడ్లో తన నటనతో గుర్తింపు తెచ్చుకున్నారు. ది కశ్మీర్ ఫైల్స్ మూవీతో మరింత ఫేమస్ అయ్యారు. ANNOUNCEMENT: Delighted to announce my 544th untitled film with the #Bahubali of #IndianCinema, the one and only #Prabhas ! The film is directed by the very talented @hanurpudi ! And produced by wonderful team of producers of @MythriOfficial ! My very dear friend and brilliant… pic.twitter.com/sBIXCS98t6— Anupam Kher (@AnupamPKher) February 13, 2025 -
స్నేహితుడు పోయిన దుఃఖంలో నటుడు.. 'ఆ వెధవ ఆత్మకు శాంతి దొరక్కూడదు'
ప్రముఖ నిర్మాత ప్రతీశ్ నంది (73) బుధవారం కన్నుమూశారు. ముంబైలోని తన నివాసంలో గుండెపోటుతో మరణించారు. సినీ ఇండస్ట్రీలో అనేక సినిమాలు నిర్మించిన ఈయన ఒకప్పుడు ప్రముఖ జర్నలిస్టు కూడా! ప్రతీశ్ మరణం పట్ల ఆయన స్నేహితుడు, ప్రముఖ నటుడు అనుపమ్ ఖేర్ తీవ్ర విచారం వ్యక్తం చేశాడు.స్నేహితుడి మరణం బాధాకరంనా ప్రియమైన మిత్రుడు ప్రితీశ్ (Pritish Nandy) మరణవార్త నన్నెంతగానో కలిచివేసింది. అద్భుతమైన కవి, రచయిత, నిర్మాత.. అలాగే ధైర్యవంతుడైన జర్నలిస్ట్ కూడా! ముంబైలో అడుగుపెట్టిన కొత్తలో నాకెంతో సపోర్ట్గా నిలబడ్డాడు. మేము ఎన్నో విషయాలను పంచుకునేవాళ్లం. దేనికీ జంకకుండా ఎంతో ధైర్యంగా ఉండేవాడు. తన దగ్గరి నుంచి నేను ఎంతో నేర్చుకున్నాను. మిస్ అవుతున్నా..ఒకప్పుడు తను, నేను వేరు కాదు అన్నట్లుగా ఉండేవాళ్లం. కానీ రానురానూ కలుసుకోవడమే తగ్గిపోయింది. మనం కలిసున్న రోజుల్ని మిస్ అవుతున్నా.. నిన్ను కూడా ఎంతో మిస్ అవుతున్నా ఫ్రెండ్.. ఎక్కడున్నా నీ ఆత్మకు శాంతి చేకూరాలి అంటూ గుండె ముక్కలైన ఎమోజీతో ఈ పోస్ట్ను షేర్ చేశాడు. అనుపమ్ ఖేర్ (Anupam Kher).. ప్రతీశ్ను అంతలా పొగడం నటి నీనా గుప్తాకు ఏమాత్రం నచ్చినట్లు లేదు. (చదవండి: నేను చేసిన పెద్ద తప్పు అదే!: కంగనా రనౌత్)బుద్ధి తక్కువ వెధవనా విషయంలో అతడేం చేశాడో తెలుసా? తను చేసిన పనికి ఆగ్రహం పట్టలేక అందరిముందే అతడిని బుద్ధి తక్కువ వెధవ అని తిట్టాను. నా బిడ్డ బర్త్ సర్టిఫికెట్ దొంగిలించి దాన్ని మీడియాలో పబ్లిష్ చేశాడు. ఇందుకు సంబంధించిన సాక్ష్యం ఇప్పటికీ నా దగ్గరుంది. అందుకే అతడి ఆత్మకు శాంతి దొరకాలని నేను కోరుకోను అని కామెంట్ చేసింది. అయితే తర్వాత ఆ కామెంట్ను నీనా (Neena Gupta) డిలీట్ చేసినట్లు తెలుస్తోంది.ఆమె అనుమతి లేకుండా దొంగిలించి మరీ..ఇకపోతే ప్రితీశ్ నంది జర్నలిస్టుగా ఉన్న సమయంలో నీనా గుప్తా కూతురు మసాబా బర్త్ సర్టిఫికెట్ దొంగిలించి సమాచారం లీక్ చేశాడు. దీని ఆధారంగా నీనా- క్రికెటర్ వివియన్ రిచర్డ్స్ సంతానమే మసాబా అని జనాలకు తెలిసిపోయింది. పెళ్లితో సంబంధం లేకుండా వీరిద్దరూ రిలేషన్లో ఉన్నప్పుడే మసాబాకు పేరెంట్స్ అయ్యారని విస్తృతమైన చర్చ జరిగింది.ప్రితీశ్ నంది విషయానికి వస్తే..కుచ్ కట్టి కుచ్ మీఠి, బాలీవుడ్ కాలింగ్, ముంబై మ్యాట్నీ, చమేలి, జస్ట్ మ్యారీడ్, ధీమె ధీమె, ప్యార్ కే సైడ్ ఎఫెక్ట్స్, అగ్లీ ఔర్ పాగ్లీ, షాదీ కే సైడ్ ఎఫెక్ట్స్ వంటి చిత్రాలను ప్రితీశ్ నిర్మించారు. జర్నలిస్టుగానూ పలు సంస్థల్లో పని చేశారు. 1977లో పద్మశ్రీ, 2008లో కర్మవీర్ పురస్కార్, 2012లో ఇంటర్నేషనల్ హ్యుమానిటేరియన్ అవార్డులు అందుకున్నారు. View this post on Instagram A post shared by Anupam Kher (@anupampkher) చదవండి: Game Changer: ‘గేమ్ ఛేంజర్’ని వదలని సినిమా కష్టాలు! -
40 ఏళ్లుగా అద్దె ఇంట్లోనే పాన్ ఇండియా స్టార్
సామాన్యుడు నుంచి సెలబ్రిటీల వరకు ఎవరైనా సరే డబ్బుంటే ఇల్లు లేదా నగలు కొనుక్కోవాలని చూస్తాడు. ఎందుకంటే భవిష్యత్తు కోసం భరోసా అని చెబుతాడు. కానీ బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ మాత్రం అసలు సొంతిల్లు ఎందుకు కొనుక్కోవాలి అని వింత లాజిక్ చెబుతున్నాడు. కావాలంటే అద్దె ఇంట్లోనే ఉంటానని ఖరాఖండీగా చెబుతున్నాడు.ఖేర్ ఏమన్నాడంటే?'సొంతంగా ఇల్లు కొనకూడదని ఫిక్సయ్యా. అందుకే ఇప్పటికీ అద్దె ఇంట్లోనే ఉంటున్నాను. అయినా ఎవరి కోసం ఇల్లు కొనాలి? ఆ ఇంటికి ఖర్చు పెట్టే డబ్బుని ప్రతినెలా బ్యాంకులో దాచుకుని, కొంత డబ్బుతో ప్రతినెలా అద్దెకడితే సరిపోతుందిగా! భవిష్యత్తులో ఆస్తుల పంపకంలో పిల్లల మధ్య గొడవలు రావొచ్చు. అందుకే ఆస్తులు కొనే డబ్బుని దాచిపెట్టి, దానినే సమంగా పంచితే సరిపోతుంది. అప్పుడు ఏం ఇబ్బంది ఉండదు'(ఇదీ చదవండి: కన్నడ బ్యాచ్ కన్నింగ్ గేమ్.. ఈ వారం నామినేషన్స్లో ఎవరెవరు?)'మంచి సినిమాలు చేస్తున్న టైంలో తనకోసం ఓ ఇల్లు కొనివ్వమని అమ్మ కోరింది. దీంతో ఓ హౌస్ కొనిచ్చాను. నాన్న ఉన్నప్పుడు మేం అక్కడే ఉండేవాళ్లం. ఆ చనిపోయిన తర్వాత సిమ్లాలో ఉన్నది తక్కువే. అందుకే ఆమె అక్కడ ఇల్లు కావాలని కోరింది. సింగిల్ బెడ్రూమ్ చాలాని చెప్పింది గానీ 8 బెడ్రూమ్స్ ఉన్న ఇంటిని బహుమతిగా ఇచ్చాను. నా భార్యకు ఇలా ఎందుకు ఇచ్చానో చాలారోజుల తర్వాత అర్థమైంది' అని అనుపమ్ ఖేర్ చెప్పుకొచ్చాడు.హిందీ సినిమాల్లో సహాయ పాత్రలు, లీడ్ రోల్స్.. ఇలా వరస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న అనుపమ్ ఖేర్.. తెలుగు నుంచి వచ్చిన కార్తికేయ 2, టైగర్ నాగేశ్వరరావు లాంటి పాన్ ఇండియా మూవీస్లోనూ కనిపించారు. అయితే అనుపమ్ చెప్పిన లాజిక్ ఆయన లాంటి స్టార్ యాక్టర్స్కి వర్కౌట్ కావొచ్చేమో గానీ సామాన్యులకు అవుతుందా అనేది పెద్ద ప్రశ్న.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 22 సినిమాలు.. అవి ఏంటంటే?) -
ఓటీటీలో మరో క్రేజీ మూవీ.. ఇది 69 ఏళ్ల వృద్ధుడి కథ
థియేటర్లలో అంటే కమర్షియల్ అంశాలు ఉండాలి, లేదంటే ప్రేక్షకులు చూడరు అంటుంటారు. ఓటీటీలకు అలాంటి ఇబ్బందులేం ఉండవు. ఏం చెప్పాలి అనిపిస్తే అది చెప్పేయొచ్చు. బౌండరీలు ఉండవు. దీంతో అప్పుడప్పుడు కొన్ని మంచి కథలు వస్తుంటాయి. తాజాగా రిలీజైన 'విజయ్ 69' అనే హిందీ మూవీ ట్రైలర్ చూస్తుంటే అదే అనిపించింది. ఇంతకీ ఈ సినిమా ఓటీటీలోకి ఎప్పుడు రానుందంటే?(ఇదీ చదవండి: తెలుగు నిర్మాత.. హైదరాబాద్లోని చెరువులో దూకేశాడు: శ్రియ)బాలీవుడ్ సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్ లీడ్ రోల్ చేసిన సినిమా 'విజయ్ 69'. పేరుకి తగ్గట్లే 69 ఏళ్ల వయసులో ట్రయథ్లాన్ పూర్తి చేసి రికార్డ్ సాధించాలనేది ఇతడి కల. ఇందులో భాగంగా 1.5 కిలోమీటర్ల స్విమ్మింగ్, 40 కి.మీ సైక్లింగ్, 10 కి.మీ రన్నింగ్ పూర్తి చేయాల్సి ఉంటుంది. కానీ విజయ్ని కుటుంబ సభ్యులు, ఫ్రెండ్, ఇలా ప్రతి ఒక్కరూ డిసప్పాయింట్ చేసేవాళ్లే. కానీ కలలకు వయసుతో సంబంధం లేదు. చెప్పాలంటే వాటికి ఎక్స్పైరీ డేట్ ఉండదని చివరకు నిరూపిస్తాడు. ఇదే కాన్సెప్ట్.నవంబరు 8 నుంచి నెట్ఫ్లిక్స్లో ఈ సినిమాని స్ట్రీమింగ్ చేయనున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇది చూస్తుంటే వర్కౌట్ అయ్యేలా ఉంది. కామెడీతో పాటు ఎమోషన్స్ కూడా బాగానే దట్టించినట్లు ఉన్నారు. ప్రస్తుతానికి హిందీ మాత్రమే అని చెప్పారు కానీ ఓటీటీలో స్ట్రీమింగ్ చేసేటప్పుడు తెలుగు వెర్షన్ కూడా అందుబాటులోకి తీసుకొస్తారు. ఎమోషనల్ డ్రామా మూవీస్ అంటే ఇష్టముంటే మాత్రం దీన్ని మిస్ కావొద్దు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 15 సినిమాలు రిలీజ్.. అవి ఏంటంటే?) -
సంతానం లేనందుకు బాధగా అనిపిస్తుంది: అనుపమ్ ఖేర్
చాలామంది పనిలో పడి వ్యక్తిగత జీవితాన్నే మర్చిపోతుంటారు. అలా ఏళ్లకు ఏళ్లే గడిచిపోతాయి. కానీ వెనక్కు తిరిగి చూసుకున్నప్పుడు ఎన్నో కోల్పోయామని బాధపడుతుంటారు. బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ పరిస్థితి కూడా ఇంతే! ప్రస్తుతం ఈయన వయసు 69 ఏళ్లు.. ఇన్నేళ్లుగా కెరీర్లోనే మునిగిపోయిన ఆయన తనకంటూ కన్నకొడుకు ఉంటే బాగుండని అంటున్నాడు.ఇద్దరికీ రెండో పెళ్లికాగా అనుపమ్.. 1979లో నటి మధుమాలతిని పెళ్లి చేసుకోగాకొన్నేళ్లకే విడిపోయారు. 1985లో కిరణ్ ఖేర్ను పెళ్లాడాడు. కిరణ్కు కూడా ఇది రెండో పెళ్లి! గతంలో ఆమె బిజినెస్మెన్ గౌతమ్ను పెళ్లాడగా వీరికి సికిందర్ అనే కుమారుడు జన్మించాడు. తర్వాత భార్యాభర్తల మధ్య పొరపచ్చాలు రావడంతో అతడికి విడాకులిచ్చేసి 1985లో అనుపమ్ను పెళ్లాడింది. అయితే వీరికి సంతానం లేదు.ఆ అనురాగం వేరే..తాజాగా అనుపమ్ మాట్లాడుతూ.. అంతకుముందు పట్టించుకునేవాడిని కాదు కానీ కొన్నిసార్లు బాధేస్తుంటుంది. నాకూ ఓ కొడుకో, కూతురో ఉంటే బాగుండేదని ఏడెనిమిదేళ్లలో ఎన్నోసార్లు అనుకున్నాను. అలా అని సికిందర్తో సంతోషంగా లేనని కాదు. కానీ ఓ కొడుకు పుట్టుంటే.. వాడు కళ్ల ముందు పెరుగుతూ ఉంటే ఆ సంతోషం, అనురాగమే వేరేలా ఉండేది. మాకు సంతానం ఉండుంటే ఎంత బాగుండో అని అనుకుంటూ ఉంటాను.(చదవండి: నాన్న ఏడుస్తుంటే ఫోటోలు తీశారు, దారుణం: కిచ్చా సుదీప్ కూతురు)50 ఏళ్లు దాటినప్పటి నుంచి..నేను పనిలో మునిగిపోయి కొన్నేండ్లపాటు దీని గురించే ఆలోచించలేదు. ఎప్పుడైతే 50-55 ఏళ్ల వయసు వచ్చిందో అప్పటినుంచే ఏదో వెలితిగా అనిపిస్తోంది. ద అనుపమ్ ఖేర్ ఫౌండేషన్లో పిల్లలతో కలిసి పని చేస్తుంటాను. అలాగే నా స్నేహితుల పిల్లలను చూసినప్పుడు కూడా నాకు పిల్లలు లేరు అని ఫీలవుతాను అని చెప్పుకొచ్చాడు.బిగ్బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
69 ఏళ్ల వయసులో సాహసం.. ఓటీటీకి రియల్ స్టోరీ!
ది కశ్మీర్ ఫైల్స్ నటుడు అనుపమ్ ఖేర్ ప్రధానపాత్రలో నటించిన చిత్రం విజయ్ 69. ఓ క్రీడాకారుని నిజ జీవితం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. యశ్రాజ్ ఫిల్మ్స్ బ్యానర్పై మనీశ్ శర్మ నిర్మించారు. ఈ చిత్రానికి అక్షయ్ రాయ్ దర్శకత్వం వహించారు.తాజాగా ఈ చిత్రం ఓటీటీకి వచ్చేందుకు సిద్ధమైంది. వచ్చేనెల 8 నుంచి ప్రముఖ ఓటీటీ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని నిర్మాణసంస్థ అధికారికంగా ప్రకటించింది. 69 ఏళ్ల వ్యక్తి ట్రయాత్లాన్ కోసం శిక్షణ పొందడం, జీవితంలోని సవాళ్లను ఎలా అధిగమించాడనేదే కథ.విజయ్ 69 కేవలం ఒక చిత్రం మాత్రమే కాదు.. అంతకంటే ఎక్కువని అనుపమ్ ఖేర్ అన్నారు. ఇది అభిరుచి, పట్టుదల, అచంచలమైన మానవ స్ఫూర్తికి నిదర్శనమని పేర్కొన్నారు. మన కలలను సాకారం చేసుకోవడానికి వయస్సు ఎప్పుడూ అడ్డంకి కాదనే నమ్మకాన్ని ఇది ప్రతిబింబిస్తుందని వెల్లడించారు. విజయ్ 69 అన్ని రకాల ప్రేక్షకులను అలరిస్తుందని ఆయన హామీ ఇచ్చారు. View this post on Instagram A post shared by Netflix India (@netflix_in) -
2.1 గోల్డ్ కొట్టేశారు!
అహ్మదాబాద్: వీళ్లు అలాంటిలాంటి మోసగాళ్లు కాదు.. దొంగనోట్ల కట్టలు. అవీ బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ బొమ్మతో ఉన్నవి అక్షరాలా రూ.1.30 కోట్లు..ఓ బడా బంగారం వ్యాపారికి అంటగట్టి ఏకంగా 2.1 కిలోల బంగారంతో ఉడాయించారు. ఇందుకోసమే ప్రత్యేకంగా వాళ్లు ఓ నకిలీ హవాలా ఆఫీసును సైతం ఏర్పాటు చేసుకున్నారు. మోసం తెలుసుకునేలోపే పత్తా లేకుండా పోయారు. బాలీవుడ్ను సైతం తలదన్నే ట్విస్టులున్న ఈ ఘటన గుజరాత్లో చోటుచేసుకుంది. బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు గుర్తు తెలియని వ్యక్తులపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. అహ్మదాబాద్కు చెందిన బంగారం వ్యాపారి మెహుల్ ఠక్కర్కు ఇటీవల ఓ వ్యక్తి ఫోన్ చేశాడు. తన పేరు ప్రశాంత్ పటేల్ అని, స్థానికంగా ఉన్న ఫలానా నగల దుకాణం మేనేజర్ను అంటూ పరిచయం చేసుకున్నాడు. ఆ దుకాణం మెహుల్కు తెలిసిందే కావడంతో ఆయన నిజమేననుకున్నాడు. పటేల్ 2.1 కిలోల బంగారాన్ని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపగా, కొంత బేరసారాల తర్వాత రూ.1.60 కోట్లకు డీల్ కుదిరింది. అతడిచి్చన సమాచారం మేరకు సెప్టెంబర్ 24వ తేదీన ఠక్కర్ తన మనుషులకు 2.1 కిలోల బంగారమిచ్చి పంపించారు. చెప్పిన ప్రకారం వాళ్లు ఓ హవాలా దుకాణానికి చేరుకున్నారు. అప్పటికే అక్కడ వీరి కోసం ముగ్గురు వ్యక్తులున్నారు. దుకాణంలోని నోట్ల లెక్కింపు మిషన్తో తీసుకువచి్చన 26 బండిళ్లలో ఉన్న నోట్లను లెక్కించడం మొదలైంది. తాము రూ.1.30 కోట్లే తెచ్చామని, మిగతా రూ.30 లక్షలు పక్కనే మరో దుకాణం నుంచి తెస్తామంటూ ముగ్గురిలో ఇద్దరు బంగారం బిస్కెట్లను తీసుకుని వెళ్లారు. అయితే, ఆ నోట్లపై మహాత్మా గాం«దీకి బదులు నటుడు అనుపమ్ ఖేర్ బొమ్మ ఉంది. రిజర్వు బ్యాంక్ ఇండియా స్థానంలో తప్పుగా ‘రెసోల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా’అని ఉంది. ఠక్కర్ సిబ్బంది ఇదంతా గమనించి, అనుమానించారు. ఇదేమని, అక్కడే ఉన్న మూడో వ్యక్తిని ప్రశ్నించారు. కౌంటింగ్ మిషన్ తెమ్మంటే తెచ్చానే తప్ప, వారెవరో, ఆ నోట్ల విషయమేంటో నాకూ తెలియదు’అంటూ అతడు చావు కబురు చల్లగా చెప్పాడు. బంగారం బిస్కెట్లతో వెళ్లిన పెద్దమనుషులు తిరిగి రాలేదు. దీంతో, సిబ్బంది ఆ విషయాన్ని ఠక్కర్ చెవిన వేశారు. ఆయన గుండె ఆగినంత పనైంది..! ఇదేమిటని ఆరా తీయగా ఆ హవాలా దుకాణాన్ని రెండు రోజుల క్రితమే ఎవరో తెరిచారని తేలింది. దీంతో, మెహుల్ ఠక్కర్ తననెవరో బకరాను చేశారని గ్రహించి, నవ్రంగ్పుర పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. -
అనుపమ్ ఖేర్ బొమ్మ కరెన్సీతో బురిడీ
అహ్మదాబాద్: వీళ్లు అలాంటిలాంటి మోసగాళ్లు కాదు.. దొంగనోట్ల కట్టలు. అవీ బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ బొమ్మతో ఉన్నవి అక్షరాలా రూ.1.30 కోట్లు..ఓ బడా బంగారం వ్యాపారికి అంటగట్టి ఏకంగా 2.1 కిలోల బంగారంతో ఉడాయించారు. ఇందుకోసమే ప్రత్యేకంగా వాళ్లు ఓ నకిలీ హవాలా ఆఫీసును సైతం ఏర్పాటు చేసుకున్నారు. మోసం తెలుసుకునేలోపే పత్తా లేకుండా పోయారు. బాలీవుడ్ను సైతం తలదన్నే ట్విస్టులున్న ఈ ఘటన గుజరాత్లో చోటుచేసుకుంది. బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు గుర్తు తెలియని వ్యక్తులపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. అహ్మదాబాద్కు చెందిన బంగారం వ్యాపారి మెహుల్ ఠక్కర్కు ఇటీవల ఓ వ్యక్తి ఫోన్ చేశాడు. తన పేరు ప్రశాంత్ పటేల్ అని, స్థానికంగా ఉన్న ఫలానా నగల దుకాణం మేనేజర్ను అంటూ పరిచయం చేసుకున్నాడు. ఆ దుకాణం మెహుల్కు తెలిసిందే కావడంతో ఆయన నిజమేననుకున్నాడు. పటేల్ 2.1 కిలోల బంగారాన్ని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపగా, కొంత బేరసారాల తర్వాత రూ.1.60 కోట్లకు డీల్ కుదిరింది. అతడిచి్చన సమాచారం మేరకు సెప్టెంబర్ 24వ తేదీన ఠక్కర్ తన మనుషులకు 2.1 కిలోల బంగారమిచ్చి పంపించారు. చెప్పిన ప్రకారం వాళ్లు ఓ హవాలా దుకాణానికి చేరుకున్నారు. అప్పటికే అక్కడ వీరి కోసం ముగ్గురు వ్యక్తులున్నారు. దుకాణంలోని నోట్ల లెక్కింపు మిషన్తో తీసుకువచి్చన 26 బండిళ్లలో ఉన్న నోట్లను లెక్కించడం మొదలైంది. తాము రూ.1.30 కోట్లే తెచ్చామని, మిగతా రూ.30 లక్షలు పక్కనే మరో దుకాణం నుంచి తెస్తామంటూ ముగ్గురిలో ఇద్దరు బంగారం బిస్కెట్లను తీసుకుని వెళ్లారు. అయితే, ఆ నోట్లపై మహాత్మా గాం«దీకి బదులు నటుడు అనుపమ్ ఖేర్ బొమ్మ ఉంది. రిజర్వు బ్యాంక్ ఇండియా స్థానంలో తప్పుగా ‘రెసోల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా’అని ఉంది. ఠక్కర్ సిబ్బంది ఇదంతా గమనించి, అనుమానించారు. ఇదేమని, అక్కడే ఉన్న మూడో వ్యక్తిని ప్రశ్నించారు. కౌంటింగ్ మిషన్ తెమ్మంటే తెచ్చానే తప్ప, వారెవరో, ఆ నోట్ల విషయమేంటో నాకూ తెలియదు’అంటూ అతడు చావు కబురు చల్లగా చెప్పాడు. బంగారం బిస్కెట్లతో వెళ్లిన పెద్దమనుషులు తిరిగి రాలేదు. దీంతో, సిబ్బంది ఆ విషయాన్ని ఠక్కర్ చెవిన వేశారు. ఆయన గుండె ఆగినంత పనైంది..! ఇదేమిటని ఆరా తీయగా ఆ హవాలా దుకాణాన్ని రెండు రోజుల క్రితమే ఎవరో తెరిచారని తేలింది. దీంతో, మెహుల్ ఠక్కర్ తననెవరో బకరాను చేశారని గ్రహించి, నవ్రంగ్పుర పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. -
20 ఏళ్ల తర్వాత మెగాఫోన్ పట్టనున్న అనుపమ్ ఖేర్
ఐదు వందలకు పైగా సినిమాల్లో నటించిన బాలీవుడ్ ప్రముఖ నటుడు అనుపమ్ ఖేర్ దర్శకత్వం వహించిన తొలి చిత్రం ‘ఓం జై జగదీష్’ (2002). ఆ సినిమా తర్వాత ఆయన డైరెక్షన్ విభాగంలో అడుగుపెట్టలేదు. అయితే, సుమారు ఇరవయ్యేళ్ల తర్వాత అనుపమ్ ఖేర్ దర్శకుడిగా మళ్లీ మెగాఫోన్ పట్టి, హిందీలో ‘తన్వి: ది గ్రేట్’ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభమైంది.కాగా ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’తో పాటు పలు హాలీవుడ్ చిత్రాలు, సిరీస్లలో నటించిన ఇయాన్ గ్లెన్ ‘తన్వి’ సినిమాలో ఓ కీలక ΄పాత్రలో నటిస్తున్నారు. ‘తన్వి’ సెట్స్లో ఇయాన్ ΄పాల్గొన్న ఫొటోలు వైరల్ అవుతున్నాయి. దీంతో ఈ విషయంపై అనుపమ్ ఖేర్ ఓ క్లారిటీ ఇచ్చారు. ‘‘హిస్టారికల్ డ్రామా ‘మిసెస్ విల్సన్’ సిరీస్లో నేను, ఇయాన్ కలిసి నటించాం. ఇప్పుడు నా దర్శకత్వంలోని ‘తన్వి’ సినిమాలో ఇయాన్ నటిస్తున్నారని చెప్పడానికి చాలా సంతోషంగా ఉంది. ఇండియన్ సినిమాలో నటిస్తున్న ఇయాన్కు స్వాగతం’’ అని తెలి అనుపమ్ ఖేర్ తెలిపారు. ఇండియన్ సినిమాలో నటించడం తనకు చాలా ఆనందంగా ఉందని ఇయాన్ అన్నారు. ఇక్కడి సినిమాలో నటించే అవకాశం దక్కడం చాలా గౌరవంగా భావిస్తున్నానని ఆయన పేర్కొన్నారు. ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందిస్తున్నారు. -
ఆఫీస్లో చోరీ.. వీడియో రిలీజ్ చేసిన నటుడు
బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ ఆఫీస్లో దొంగలు పడ్డారు. ఓ సినిమా నకలుతోపాటు విలువైన డాక్యుమెంట్లను ఎత్తుకెళ్లారు. రూ.4 లక్షల నగదు సైతం దొంగిలించారు. ఈ ఘటనపై అనుపమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అలాగే ఇన్స్టాగ్రామ్లోనూ ఓ వీడియో షేర్ చేశాడు. 'నిన్న రాత్రి ముంబైలోని వీర దేశాయ్ రోడ్లో ఉన్న నా ఆఫీసులో చోరీ జరిగింది. ఇద్దరు దొంగలు తలుపులు బద్ధలు కొట్టి లోనికి ప్రవేశించి విలువైన పత్రాలను దొంగతనం చేశారు. సీసీటీవీలో..వాటిని నాశనం చేయరని ఆశిస్తున్నాను. అలాగే మా కంపెనీ నిర్మించిన ఓ సినిమా నెగెటివ్స్ కూడా మాయం చేశారు. ఆ ఇద్దరు దొంగలు లగేజీతో ఆటోలో వెళ్లినట్లు సీసీటీవీ కెమెరాలో నమోదైంది. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయగా.. వీలైనంత త్వరగా దొంగలను పట్టుకుంటామని హామీ ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకునేముందు నా ఆఫీసులో పనిచేసేవారు తీసిన వీడియో ఇది' అని చెప్పుకొచ్చాడు.సినిమా..కాగా ది కశ్మీర్ ఫైల్స్తో సెన్సేషన్గా మారిన అనుపమ్ ఖేర్.. ఇటీవల ఐబీ71, ద వ్యాక్సిన్ వార్, కుచ్ ఖట్టా హో జాయే, కాగజ్ 2 వంటి చిత్రాలతో ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం మెట్రో.. ఇన్ డినో, తన్వి ద గ్రేట్ అనే మూవీస్లో నటిస్తున్నాడు. View this post on Instagram A post shared by Anupam Kher (@anupampkher) చదవండి: దర్శన్ కేసు.. హత్య తర్వాత అతను ఏం చేశాడంటే? -
బాలీవుడ్ లో మనోడి క్రేజ్ మామూలుగా లేదుగా
-
ఎన్టీఆర్పై బాలీవుడ్ సీనియర్ హీరో ఆసక్తికర పోస్ట్
ఎన్టీఆర్ ఇప్పుడు ముంబైలో ఉన్న సంగతి తెలిసిందే. దేవర షూటింగ్కి గ్యాప్ ఇచ్చి, ‘వార్ 2’సెట్స్లోకి ఎంట్రీ ఇచ్చాడు. హృతిక్ రోషన్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ప్రస్తుతం ఎన్టీఆర్కు సంబంధించిన కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. షూటింగ్ అంతా ముంబైలోనే జరుగుతుండడంతో.. ఖాలీ సమయంలో తన స్నేహితులను కలుస్తూ ఆ ఫోటోలను అభిమానులతో పంచుకుంటున్నాడు. తాజాగా బాలీవుడ్ సీనియర్ హీరో అనుపమ్ ఖేర్ కలిశాడు తారక్. ఎన్టీఆర్తో కలిసి దిగిన ఫోటోని అనుపమ్ ఎక్స్(ట్విటర్)లో షేర్ చేస్తూ.. ‘నా ఫేవరేట్ పర్సన్. యాక్టర్ ఎన్టీఆర్ ను కలవడం చాలా ఆనందంగా ఉంది. అతని వర్క్ నాకు చాలా ఇష్టం. అతను జీవితంలో మరింత ఎత్తుకు ఎదగాలి’ అంటూ రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. ‘‘వార్ 2’లో అనుపమ్ నటిస్తున్నారా?’, ప్రశాంత్ నీల్-ఎన్టీఆర్ కాంబినేషన్లో రాబోతున్న చిత్రంలో అనుపమ్ కీలక పాత్ర పోషిస్తున్నారా ఏంటి? అంటూ నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. It was such a pleasure to meet one of my favourite persons and actor @tarak9999 last night. Have loved his work. May he keep rising from strength to strength! Jai Ho! 😍🕉👏 #Actors pic.twitter.com/XSetC87b4Y— Anupam Kher (@AnupamPKher) May 1, 2024 -
అప్పట్నుంచి కీరవాణి ఫ్యాన్ని!
‘‘మా తరానికి చెందిన అద్భుతమైన సంగీతదర్శకుల్లో ఒకరైన కీరవాణితో సినిమా చేసే అవకాశం రావడం నాకు గర్వకారణం. నా కల నిజమైంది’’ అని బాలీవుడ్ ప్రముఖ నటుడు–దర్శకుడు అనుపమ్ ఖేర్ సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. ఇరవై రెండేళ్ల తర్వాత ఆయన మళ్లీ మెగాఫోన్ పట్టారు. గతంలో ‘ఓం జై జగదీష్’ (2002) చిత్రానికి దర్శకత్వం వహించారు అనుపమ్ ఖేర్. తాజాగా ‘తన్వీ ది గ్రేట్’ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతదర్శకత్వం వహిస్తున్నట్లు ప్రకటించి, ఆయన ట్రాక్ కంపోజ్ చేస్తున్న ఫొటోను షేర్ చేశారు. ‘‘ఆస్కార్ అవార్డు, గోల్డెన్ గ్లోబ్ అవార్డు విజేత కీరవాణి మా సినిమాకి మ్యూజిక్ ఇవ్వడం ఓ ఆశీర్వాదం. ఏడాదిగా ఈ సినిమాకి కలిసి పని చేస్తున్నాం. కీరవాణి స్వరపరచిన ‘తుమ్ మిలే దిల్ ఖిలే..’ (నాగార్జున, మనీషా కొయిరాలా, రమ్యకృష్ణ నటించిన ‘క్రిమినల్’ సినిమాలోని ΄ాట) విన్నప్పట్నుంచి ఆయనకు అభిమాని అయిపోయాను. ఇప్పుడు నా సినిమా ఒప్పుకున్నందుకు ఆయనకు «థ్యాంక్స్’’ అని పేర్కొన్నారు అనుపమ్ ఖేర్. -
నవల రాసిన ప్రముఖ డైరెక్టర్.. ఆవిష్కరించిన దిగ్గజ నటుడు
సాధారణంగా రచయితలు దర్శకులుగా మారిన తర్వాత తిరిగి వెనక్కి చూసేది చాలా తక్కువ. కానీ ఓ డైరెక్టర్ మాత్రం ఇప్పుడు తిరిగి రైటర్ అయిపోయారు. ఏకంగా ఓ నవల కూడా రాసేశారు. దీన్ని పలువురు సెలబ్రిటీల ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. ప్రస్తుతం ఈ విషయం ఇండస్ట్రీలో ఆసక్తికకరంగా మారిపోయింది. (ఇదీ చదవండి: దీనస్థితిలో 'షాపింగ్ మాల్' హీరో.. ఇప్పుడెలా ఉన్నాడో తెలుసా?) బాలీవుడ్లో 'కాల్', 'లక్', 'ఫిక్సర్' సినిమాలు తీసిన దర్శకుడు సొహమ్ షా.. ప్రస్తుతం సినిమాలే చేయట్లేదు. అయితే ఇండస్ట్రీకి దూరమైనప్పటికీ 'బ్లడ్ మూన్' అనే నవలతో సరికొత్త ప్రయాణం మొదలుపెట్టారు. కరోనా కాలంలో చూసిన కొన్ని పరిస్థితుల్ని ఆధారంగా చేసుకుని, పారానార్మల్ థ్రిల్లర్ కథతో ఈ నవలని రాసినట్లు చెప్పుకొచ్చారు. తాజాగా ముంబయిలో జరిగిన కార్యక్రమంలో ఈ నవలని ప్రముఖ నటుడు అనుపమ్ ఖేర్ ఆవిష్కరించారు. ఇదే ఈవెంట్లో అనుపమ్ ఖేర్తో పాటు జాకీ ష్రాఫ్ తదితరులు పాల్గొన్నారు. ఇక వీళ్లిద్దరూ కూడా సొహమ్ షాతో తనుకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. అలానే ఈ బుక్ లాంచ్ చేయడం తను గౌరవంగా భావిస్తున్నట్లు అనుపమ్ ఖేర్ చెప్పుకొచ్చారు. (ఇదీ చదవండి: కుమారీ ఆంటీ ఒకప్పుడు ఆ సింగర్ ఇంట్లో పని చేసింది!) -
ప్రధాని నరేంద్ర మోదీ బయోపిక్ రెడీ.. అదిరిపోయే టైటిల్ ఫిక్స్
'ముచ్చటగా మూడోసారి కూడా భారత దేశ పాలనా పగ్గాలు చేపట్టడం కేవలం లాంఛనం' అనే అంచనాల నడుమ ప్రధాని నరేంద్ర మోదీ బయోపిక్ తెరకెక్కనుంది. 'విశ్వనేత' పేరుతో అన్ని భారతీయ భాషల్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మాణం కానున్న ఈ చిత్రానికి యువ ప్రతిభాశాలి సి.హెచ్.క్రాంతి కుమార్ దర్శకత్వం వహించనున్నారు. 'వందే మీడియా ప్రయివేట్ లిమిటెడ్' పతాకంపై కాశిరెడ్డి శరత్ రెడ్డి నిర్మించనున్న ఈ చిత్రంలో అభయ్ డియోల్, నీనా గుప్తా, అనుపమ్ ఖేర్, పల్లవి జోషి ముఖ్య పాత్రలు పోషించనున్నారు. ఆస్కార్ విజేత ఎం.ఎం.కీరవాణి తనయుడు కాలభైరవ సంగీతం సమకూర్చుతున్న ఈ చిత్రం ప్రి ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకుని త్వరలో సెట్స్కు వెళ్లేందుకు సన్నాహాలు చేసుకుంటోంది. ఆర్టికల్ 370 రద్దు, డిమోనిటైజేషన్, జీ.ఎస్.టీ, అయోధ్య రామ మందిర నిర్మాణం వంటి ఎన్నో సంచలనాలతో కోట్లాది భారతీయుల గుండెల్లో కొలువుదీరి.. "యూనిఫామ్ సివిల్ కోడ్" అమలు దిశగా అడుగులు వేస్తున్న నరేంద్రుడి బయోపిక్లో చాయ్ వాలా స్థాయి నుంచి "విశ్వనేత" గా ఎదిగిన ఆయన మహాప్రస్థానానికి దృశ్యరూపం ఇవ్వనున్నామని సినిమా యూనిట్ చెబుతోంది!! -
సరదా.. దసరా..
బాలీవుడ్లో దసరా సందడి జోరు బాగా కనిపిస్తోంది. ప్రతి ఏడాదీ కొందరు స్టార్స్ ప్రముఖ ఏరియాల్లో అమ్మవారిని ప్రతిష్ఠించే చోటుకి వెళ్లి, పూజలు చేస్తుంటారు. ముఖ్యంగా కాజోల్, రాణీ ముఖర్జీ తప్పకుండా వెళుతుంటారు. ఈ ఏడాది కూడా ఈ ఇద్దరూ అమ్మవారిని దర్శించుకున్నారు. కాజోల్ తన తనయుడు యుగ్తో కలిసి వెళ్లారు. ఇంకా హేమా మాలిని, ఆమె కుమార్తె ఈషా డియోల్ తన తల్లి దులారీ ఖేర్తో కలిసి అనుపమ్ ఖేర్ తదితరులు దుర్గా మాత ఆశీస్సులు అందుకున్నారు. -
రవితేజకు సారీ చెప్పిన అనుపమ్ ఖేర్.. ఎందుకంటే?
బాలీవుడ్ సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్ తెలుగువారికి కూడా సుపరిచితమే. ది కశ్మీర్ ఫైల్స్ చిత్రంలో ప్రేక్షకులను మెప్పించిన ఆయన.. ప్రస్తుతం మాస్ మహారాజా రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ టైగర్ నాగేశ్వరరావులో కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే ఈ చిత్ర ట్రైలర్ రిలీజ్ కాగా.. అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రాన్ని వంశీకృష్ణనాయుడు దర్శకత్వంలో అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్నారు. రవితేజ ప్రస్తుతం మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా రేంజ్లో తెరకెక్కించారు. ఇటీవలే ముంబయిలో ఈవెంట్కు రవితేజ హాజరయ్యారు. అయితే ఈవెంట్లో అనుపమ్ ఖేర్ సైతం పాల్గొన్నారు. ఈ సందర్భంగా వీరిద్దరి మధ్య ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. అదేంటో తెలుసుకుందాం. (ఇది చదవండి: బిగ్బాస్ 7: మళ్లీ గ్రాండ్ లాంచ్.. హౌస్లోకి కొత్త కంటెస్టెంట్లు.. కానీ..) ఈవెంట్కు హాజరైన అనుపమ్.. గతంలో జరిగిన ఓ సంఘటనను గుర్తు చేసుకున్నారు. ఒకసారి చిన్న వయసులో రవితేజ తన స్టూడియోకి వచ్చి నాతో ఫోటో దిగాలని అడిగాడు. కానీ నేను కుదరదని చెప్పా.. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత ఆయన సినిమాలోనే నటిస్తున్నా.. ఆ రోజు అలా అన్నందుకు రవితేజకు నవ్వుతూ సారీ అన్నారు. దీంతో వెంటనే రవితేజ.. సార్ అంటూ దండం పెట్టారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. ఈ చిత్రంలో నుపుర్ సనన్, గా యత్రి భరద్వాజ్ హీరో, హీరోయిన్లుగా నటిస్తున్నారు. 1970లో జరిగిన యథార్థ ఘటన ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. గుంటూరు జిల్లాలోని స్టువర్టుపురానికి చెందిన ఒకనాటి గజదొంగ టైగర్ నాగేశ్వరరావు జీవితాన్నే ఈ చిత్రంలో చూపించనున్నారు. ఈ చిత్రాన్ని అక్టోబర్ 20న ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. (ఇది చదవండి: 'సీరియల్ కిల్లర్ నడిరోడ్డుపై గుడ్డిగా షూట్ చేస్తున్నాడు'.. ఆసక్తిగా లియో ట్రైలర్!) 1988 :- #AnupamKher rejected to click a photo with #RaviTeja 😢💔 2023 :- #AnupamKher is doing a key role in Mass Maharaja @RaviTeja_offl most anticipated Project #TigerNageswaraRao 🥵🔥 True definition of Success 💥💯 pic.twitter.com/z3GY4rPEc7 — Neeraj Kumar (@73forever_) October 4, 2023 -
The Vaccine War: 'ది వ్యాక్సిన్ వార్' మూవీ రివ్యూ
టైటిల్: ది వ్యాక్సిన్ వార్ నటీనటులు: నానా పటేకర్,అనుపమ్ ఖేర్,పల్లవి జోషి,రైమా సేన్,గిరిజా ఓక్,సప్తమి గౌడ తదితరులు నిర్మాణ సంస్థ: అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ నిర్మాతలు: పల్లవి జోషి, అభిషేక్ అగర్వాల్ దర్శకత్వం: వివేక్ అగ్నిహోత్రి సంగీతం: రోహిత్ శర్మ, వనరాజ్ భాటియా సినిమాటోగ్రఫీ: ఉదయసింగ్ మోహితే ఎడిటర్: శంఖ రాజాధ్యక్ష విడుదల తేది: సెప్టెంబర్ 28, 2023 'ది కాశ్మీర్ ఫైల్స్' సినిమాతో దేశ మొత్తం తన గురించి చర్చించుకునేలా చేసిన దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి బాలీవుడ్లో పలు సినిమాలు చేసినా ఆయనకు గుర్తింపు వచ్చింది మాత్రం ది కాశ్మీర్ ఫైల్స్ చిత్రంతోనే. సున్నితమైన సమస్య చుట్టూ ఈ కథని చెప్పడం వలన కొంతమంది మనోభావాలు దెబ్బతింటే, హిందుత్వ సంఘాల, పలు సమూహాలకి బాగా కనెక్ట్ అయ్యింది. అంతేకాకుండా ఆ సినిమాపై భారీ విమర్శలు కూడా వచ్చాయి. ఇలా ఆ సినిమా తర్వాత ఆయన నుంచి తాజాగా విడుదలైన చిత్రం 'ది వ్యాక్సిన్ వార్' కరోనావైరస్ వ్యాప్తి భూ గ్రహం మీద ఉన్న ప్రతి వ్యక్తి జీవితాలను ప్రభావితం చేసింది. ఆ సమయంలో విధించిన లాక్డౌన్ వల్ల వివిధ వర్గాల ప్రజల దుస్థితి ఎలా ఉంది.. వ్యాక్సిన్ తయారు చేసేందుకు చాలామంది శాస్త్రవేత్తలు ఎందుకు వెనకడుగు వేశారు..? అలాంటి సమయంలో తామున్నామని మహిళా శాస్త్రవేత్తలు ముందు అడుగు వేయడానికి గల కారణాలు ఏంటి..? వ్యాక్సిన్ తయారు చేయడం ఇండియా వల్ల కాదని ఎందరో చెబుతున్నా.. కేవలం ఏడు నెలల సమయంలో స్వంత వ్యాక్సిన్ను భారత్ ఎలా తయారు చేయగలిగింది..? వ్యాక్సిన్ తయారు చేస్తున్న సమయంలో శాస్త్రవేత్తల దుస్థితి ఎలా ఉంది..? ఇవన్నీ తెలియాలంటే వివేక్ రంజన్ అగ్నిహోత్రి 'ది వ్యాక్సిన్ వార్'లోకి వెళ్లాల్సిందే. 'ది వ్యాక్సిన్ వార్' కథేంటంటే.. ది ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) మాజీ డైరెక్టర్ జనరల్, డాక్టర్ బలరామ్ భార్గవ్ రాసిన 'గోయింగ్ వైరల్' పుస్తకం ఆధారంగా ఈ చిత్రాన్ని అగ్నిహోత్రి తెరకెక్కించారు. వాక్సిన్ వార్, వాస్తవ ప్రపంచంలో జరిగిన ఘటనలతో సినిమా ప్రారంభం అవుతుంది. ICMR డైరెక్టర్ జనరల్ డాక్టర్ భార్గవ (నానా పటేకర్) తన శాస్త్రవేత్తల బృందంతో న్యుమోనియా లాంటి వ్యాక్సిన్లను తయారు చేసే పనిలో ఉంటారు. అందుకు కావాల్సిన ఆయన ఒక టీమ్ను సమీకరించుకుంటారు. అదే సమయంలో నేషనల్ వైరాలజీ ఇన్స్టిట్యూట్ (NIV) హెడ్గా డాక్టర్ అబ్రహం (పల్లవి జోషి పోషించారు) వీరందరి నేతృత్వంలో భారత్ కోసం పలు వ్యాక్సిన్ల తయారిలో కీలక పాత్ర పోషిస్తూ ఉంటారు. ఇదిలా ఉండగా ఆ సమయంలో భారతదేశంతో పాటు.. ప్రపంచంలోని అన్ని దేశాలు కూడా కోవిడ్-19 మహమ్మారి బారిన పడుతాయి. ప్రజలందరూ తమ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బతుకుతుంటారు. ఈ కథనాలను ప్రజలకు చేరవేసేందుకు మీడియా కూడా ప్రాణలకు తెగించే పని చేస్తుంటుంది. నెగటివ్ జర్నలిస్టు పాత్రలో (రైమా సేన్) అనేక నిజ జీవితాలను వెలికితీస్తూనే కొన్ని తప్పుడు వార్తలను కూడా ప్రచురిస్తూ ఉంటుంది. ఆమె నేతృత్వంలోని మీడియాకు చెందిన ఒక విభాగం హానికరమైన తప్పుడు వార్తల ప్రచారం చేస్తూ.. శాస్త్రవేత్తలకు పెద్ద తలనొప్పిగా మారుతుంది. ఆమెతో పోరాడుతూ.. వైరస్కు వ్యతిరేకంగా వ్యాక్సిన్ను తయారు చేయడానికి శాస్త్రవేత్తల బృందం ఎలాంటి అడ్డంకులను దాటింది. అనేది కథలో కీలకంగా ఉంటుంది. వ్యాక్సిన్ తయారిలో భాగం అయ్యేందుకు చాలామంది పురుష శాస్త్రవేత్తలు వెనకడుగు వేస్తారు. అలాంటి సమయంలో మహిళా శాస్త్రవేత్తలు ముందుకు వస్తారు. ఇందులో డాక్టర్ భార్గవ పాత్ర కథలో కీలకంగా ఉంటుంది. వ్యాక్సిన్ తయారి సమయంలో ప్రభుత్వ పాత్ర ఎంతవరకు ఉంది..? ఆ సమయంలో ప్రభుత్వంపై ఎలాంటి వ్యతిరేకత వచ్చింది..? ది వ్యాక్సిన్ వార్ సినిమా మన వ్యాక్సిన్ సిస్టం.. మన మెడికల్ సిస్టం నిజస్వరూపాన్ని చూపెట్టిందా..? విపత్కర పరిస్థితుల్లో భారత్ ఎలా పోరాడింది. శాస్త్రవేత్తలను అణగదొక్కడమే తమ లక్ష్యంగా పనిచేసింది ఎవరు..? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే.. మనం చేయలేము.. అనుకునే స్థాయి నుంచి మనం చేయగలం అనే స్థాయికి చేరుకుని.. చేసి చూపించారు మన శాస్త్రవేత్తలు. ఒక్కముక్కలో చెప్పాలంటే ది వ్యాక్సిన్ వార్ సారాంశం ఇదే. సినిమా కథ విషయానికి వస్తే అద్బుతంగా ఉంది. మానవ మెదడుకి మెమోరీ తక్కువగా ఉంటుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. కరోనా టైంలో జరిగిన వాటిని మరిచిపోగలం. కానీ ఈ చిత్రం మాత్రం ఇండియా శాస్త్రవేత్తల మీద నమ్మకాన్ని పెంచుతుంది. వారి పట్ల గౌరవాన్ని తీసుకొస్తుంది. ఈ సినిమాను చూశాక మన శాస్త్రవేత్తలను చూసి గర్వపడేలా ఉంటుంది. సినిమాలో గమనించదగ్గ అంశం ఏమిటంటే, వివేక్ అగ్నిహోత్రి తన మునుపటి చిత్రం 'ది కాశ్మీర్ ఫైల్స్'పై ఎన్నో విమర్శలను అందుకున్నాడు. కానీ ఈ సినిమా విషయంలో అలా జరగకపోవచ్చు. కోవిడ్ -19 కేసులకు మైనారిటీలు ఎలా కారణం అయ్యారు.. దానిని వ్యాప్తి చేయడంలో వారు చేసిన తప్పు ఏంటి అనే కథనాన్ని స్పష్టంగా చూపించారు. అంతేకాకుండా ఈ చిత్రంలో కుంభమేళా వేడుకలు, పలు ర్యాలీలతో పాటు డెల్టా వేరియంట్ వైరస్ వ్యాప్తిని తెరపై చూపిస్తుంది. సినిమాలో రాజకీయ విషయానికి వస్తే అతను దానిని కొంతమేరకు బ్యాలెన్స్ చేశాడని చెప్పవచ్చు. ఇది ప్రభుత్వాన్ని సానుకూలంగా చూపుతుందనడంలో సందేహం లేదు. బలరామ్ భార్గవ్ (నానా పటేకర్ పోషించిన పాత్ర) తాను సైన్స్ అనుకూలుడని ప్రధానిని ప్రశంసించడం కనిపించింది. రెండవ వేవ్ సమయంలో వైరస్ వ్యాప్తికి రాజకీయ ర్యాలీలు కారణమని కూడా చిత్రంలో కనిపిస్తుంది. అటు ప్రభుత్వంపై సానుకూలతను చూపుతూనే.. కొంతమేరకు ప్రభుత్వం ఎక్కడ తప్పు చేసిందో కూడా చిత్రంలో ఉంటుంది. సినిమా ఫస్ట్ హాఫ్ చాలా నిడివిగా అనిపిస్తుంది. ఇది సాధారణ ప్రేక్షకులకు విసుగు తెప్పించవచ్చు. అయితే సెకండాఫ్ వేగం పుంజుకుని చివరి వరకు మెయింటెన్ చేస్తుంది. ‘ది వ్యాక్సిన్ వార్’ సినిమాలో చిన్నపిల్లలు ఉన్న తల్లులు కూడా వ్యాక్సిన్ తయారు చేయడం కోసం ల్యాబ్లలోనే వారి జీవితాన్ని ఎలా గడిపారని చూపించారు. ఆ సీన్స్ మెప్పిస్తాయి. ఒక సాధారణ వ్యక్తికి వ్యాక్సిన్ గురించి పూర్తిగా తెలియదు. కానీ, ఈ సినిమా చూశాక దాని గురించి పూర్తిగా అర్థం చేసుకుంటారు. వ్యాక్సిన్ తయారు చేయడం కేవలం వాళ్ల ఉద్యోగం మాత్రమే కాదు. అది సైంటిస్ట్లు చేసిన నిస్వార్థమైన సేవ. వాళ్ల సమయాన్ని దేశం కోసం ఉపయోగించారు. ఇది అన్నింటికంటే ముఖ్యమైన విషయం. ఈ సినిమా ప్రతి ఒక్కరి హృదయాలను హత్తుకుంటుంది. విదేశీ వ్యాక్సిన్లను భారత్లో ఎక్కువగా ప్రచారం చేయడం.. వారి వ్యాపార సామ్రాజ్యం కోసం జరుగుతున్న లాబీయింగ్ సీన్లు ప్రతి భారతీయుడిని ఆలోచింపచేస్తాయి. అందులో మీడియా పాత్ర ఏమేరకు ఉందనేది ప్రధాన చర్చకు దారితీస్తుంది. అంతేకాకుండా ‘భారత్కు వ్యాక్సిన్ తయారు చేయడం చేతకాదు’ అని మీడియా మొత్తం నమ్మిందా? అనేలా చిత్రీకరించిన సీన్లు కొంతమేరకు అభ్యంతరకంగా ఉన్నాయి. ఎవరెలా చేశారంటే.. సినిమాలో నానా పటేకర్ పెర్ఫార్మెన్స్ ప్రత్యేకంగా నిలుస్తుంది. తన ప్రతిభకు తాను మాత్రమే అనేలా మరోసారి ఆయన నిరూపించుకున్నాడు. అతను ఏ పాత్రనైనా పోషించగలడని శాస్త్రవేత్తగా 100 మార్కులతో మెప్పిస్తాడు. ఒక శాస్త్రవేత్త బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుంది.. కీలక సమయాల్లో వారి యెక్క భావోద్వేగాలు ఏ విధంగా ఉంటాయో నానా పటేకర్ చూపించాడు. డాక్టర్ అబ్రహం పాత్రలో పల్లవి జోషి నటించింది. ఆమె ఒక మలయాళీ పాత్రను పోషిస్తుంది. సినిమాలో ఆమె ఉచ్చారణ బాగున్నా.. నానా పటేకర్తో వచ్చే సీన్లు అంతగా హైలెట్గా కనిపించవు. కానీ NVIలోని శాస్త్రవేత్తల మధ్య ఒత్తిడితో పాటు అనేక భావోద్వేగాలు కనిపిస్తాయి. అక్కడ ఆమె ప్రదర్శనకు ఎవరైనా ఫిదా కావాల్సిందే. సినిమా ఎడిటింగ్ మరింత పటిష్టంగా ఉండి ఉంటే ఇంకా బాగుండేది. ఏది ఏమైనప్పటికీ, ఒక ప్రధాన లోపం ఏమిటంటే, మీడియాను ఏకపక్షంగా చిత్రీకరించడం అంతగా మెప్పించదు. మీడియా వల్లే నాడు కోవిడ్ సమయంలో ప్రపంచంలో ఏ మూలన ఏం జరిగినా తెలుసుకునే వారు. మీడియా కూడా ఫ్రంట్ వారియర్స్గా కరోనా విపత్తు సమయంలో పనిచేసింది. ఈ విషయాన్ని గుర్తించడంలో దర్శకుడు ఫెయిల్ అయ్యాడు. అతను ఈ చలన చిత్రాన్ని ఒక రకమైన 'మీడియా యుద్ధం'గా పేర్కొన్నట్లు ఉంది. వాస్తవానికి, వ్యాక్సిన్పై నెగిటివ్ ఇమేజ్ని సృష్టించి, నకిలీ వార్తల ద్వారా దాని గురించి తప్పుడు కథనాన్ని అల్లడంపై నరకయాతన పడుతున్న జర్నలిస్ట్గా నటించిన రైమా సేన్, ఈ చిత్రంలో బలహీనమైన లింక్గా కనిపిస్తుంది. ఆమెను సరైన రీతిలో దర్శకుడు ఉపయోగించుకోలేకపోయాడు. శాస్త్రవేత్తలు, ప్రజల్లో కలిగే ఎమోషనల్ సీన్లు మాత్రం బాగా పండుతాయి. రాజకీయ సంఘర్షణలు తెరకెక్కించడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యాడు. భారతీయ శాస్త్రవేత్తలు విపత్తు సమయంలో ప్రాణాలకు తెగించి పనిచేశారు. వారి కోసం ఈ సినిమాను ఖచ్చితంగా చూడవచ్చు. వారు తమ జీవితాల గురించి పట్టించుకోకుండా గొప్ప మంచికి ఎలా ప్రాముఖ్యతనిచ్చారనే దాని గురించి మీరు ఆలోచించేలా చేస్తుంది. ఇది వారి త్యాగాన్ని గుర్తు చేస్తూ థియేటర్ నుంచి మిమ్మల్ని ఇంటికి నడిపిస్తుంది. - బ్రహ్మ కోడూరు, సాక్షి వెబ్డెస్క్ -
టైగర్ నాగేశ్వరరావుని పట్టుకునేందకు ఎంట్రీ ఇచ్చిన అనుపమ్ ఖేర్
ఐబీ ఆఫీసర్ (ఇంటెలిజెన్స్ బ్యూరో) రాఘవేంద్ర రాజ్పుత్గా చార్జ్ తీసుకున్నారు అనుపమ్ ఖేర్. టైగర్ నాగేశ్వరరావుని పట్టుకునే మిషన్ విషయంలో రాఘవేంద్ర ఎలాంటి ప్లాన్స్ వేశారు? అనేది ‘టైగర్ నాగేశ్వరరావు’ చిత్రంలో చూడాల్సిందే. రవితేజ టైటిల్ రోల్లో వంశీ దర్శకత్వంలో తేజ్ నారాయణ్ అగర్వాల్ సమర్పణలో అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్న చిత్రం ‘టైగర్ నాగేశ్వరరావు’. ఈ చిత్రంలో అనుపమ్ ఖేర్ చేస్తున్న కీలక పాత్ర అయిన ఐబీ ఆఫీసర్ రాఘవేంద్ర రాజ్పుత్ లుక్ని విడుదల చేశారు. ‘‘టైగర్ నాగేశ్వరరావు’టీజర్ను ఈ నెల 17న విడుదల చేయనున్నాం. అలాగే ఈ మూవీని అక్టోబర్ 20న రిలీజ్ చేస్తాం’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ చిత్రంలో నూపుర్ సనన్, గాయత్రీ భరద్వాజ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. -
The India House: స్వాతంత్య్రానికి పూర్వం..
‘ది ఇండియా హౌస్’ లోకి నిఖిల్ ఎంట్రీ ఇస్తున్నారు. నిఖిల్ హీరోగా అనుపమ్ ఖేర్ ఓ లీడ్ రోల్లో నటించనున్న తాజా చిత్రం ‘ది ఇండియా హౌస్’. ‘జై మాతా ది’ అనేది ఉపశీర్షిక. వి మెగా పిక్చర్స్, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పతాకాలపై రామ్చరణ్, విక్రమ్ రెడ్డి, అభిషేక్ అగర్వాల్ ఈ సినిమాను నిర్మించనున్నారు. స్వాతంత్య్ర సమరయోధుడు వీర్ సావర్కర్ 140వ జయంతి సందర్భంగా ‘ది ఇండియా హౌస్’ సినిమా ప్రకటన వీడియోను సోషల్ మీడియా వేదికగా రిలీజ్ చేశారు రామ్చరణ్, అభిషేక్ అగర్వాల్. ఈ సినిమాలో శివ పాత్రలో నిఖిల్, సయామీ కృష్ణ వర్మగా అనుపమ్ ఖేర్ కనిపిస్తారు. ‘‘లండన్ లో స్వాతంత్య్రానికి పూర్వం జరిగిన ఘటనల నేపథ్యంలో ఈ సినిమా ఉంటుంది’’ అని యూనిట్ పేర్కొంది. On the occasion of the 140th birth anniversary of our great freedom fighter Veer Savarkar Garu we are proud to announce our pan India film - THE INDIA HOUSEheadlined by Nikhil Siddhartha, Anupam Kher ji & director Ram Vamsi Krishna! Jai Hind!@actor_Nikhil @AnupamPKher… pic.twitter.com/YYOTOjmgkV— Ram Charan (@AlwaysRamCharan) May 28, 2023 -
నా సినిమాల్లో దేశభక్తి అలా కుదురుతోంది!
‘‘ఇండియన్ ఇంటెలిజెన్సీ బ్యూరో ప్రతినిధులు పాకిస్తాన్ వెళ్లి అక్కడ ఓ స్పై ఆపరేషన్ను సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ చేశారు. ఈ మిషన్ సక్సెస్ఫుల్ కావడం వల్ల వేలాదిమంది భారతీయుల ప్రాణాలు రక్షించబడ్డాయి. ఈ మిషన్ తాలూకు విషయాలను తెలుసుకోవాలంటే ‘ఐబీ 71’ సినిమా చూడాలి. ఓ చారిత్రాత్మక ఘటనతో తీసిన ఈ చిత్రంలో దేశభక్తి తాలూకు మూమెంట్ప్ ఉంటాయి’’ అన్నారు దర్శకుడు సంకల్ప్రెడ్డి. విద్యుత్ జమాల్ హీరోగా నటించి, నిర్మించిన హిందీ థ్రిల్లర్ ‘ఐబీ 71’. అనుపమ్ ఖేర్ కీలక పాత్రలో నటించిన ఈ సినిమాకు సంకల్ప్రెడ్డి దర్శకత్వం వహించారు. ఈ చిత్రం ఈ శుక్రవారం విడుదలైంది. ఈ సందర్భంగా సంకల్ప్మాట్లాడుతూ– ‘‘ఘాజీ’ ఇన్సిడెంట్కు ముందు కశ్మీర్లో జరిగిన ఓ ఘటన ఆధారంగా తీసిన చిత్రమే ‘ఐబీ 71’. ‘ఘాజీ’, ‘రాజీ’, ఇప్పుడు ఈ ‘ఐబీ 71’.. ఇవన్నీ ఇండియా–పాకిస్తాన్ (1971) యుద్ధానికి ముందు జరిగిన ఘటనల నేపథ్యంలో వచ్చిన సినిమాలు. ఈ ఘటల తాలుకూ విషయాలు అప్పట్లో న్యూస్పేపర్స్లో ప్రచురితమయ్యాయి. ఆ సమాచారం ఆధారంగా, కొత్తమంది వ్యక్తుల ద్వారా కొన్ని కొత్త విషయాలు తెలిశాయి. ‘ఘాజీ’, ‘అంతరిక్షం’, ఇప్పుడు ‘ఐబీ 71’ కథల్లో భాగంగానే దేశభక్తి అంశం మిళితమై ఉంది. అంతేకానీ ప్రత్యేకంగా దేశభక్తి నేపథ్యాల్లో చేయాలని నేనీ సినిమాలు చేయలేదు. అలా కుదురుతోంది.. అంతే. బహుశా అంతర్లీనంగా నాలో ఉన్న దేశభక్తి ఓ కారణమేమో! హిందీలో నాకు ‘ఐబీ 71’ తొలి సినిమా. తెలుగులో నా తొలి సినిమా ‘ఘాజీ’ అండర్వాటర్ బ్యాక్డ్రాప్, రెండో సినిమా ‘అంతరిక్షం’ స్పేస్ బ్యాక్డ్రాప్లో ఉంటాయి. ‘ఐబీ 71’ బ్యాక్డ్రాప్ ఆకాశం. అలాగే భూమి, నిప్పుల బ్యాక్డ్రాప్లో కూడా సినిమాలు చేయాలని ఉంది’’ అని అన్నారు. -
సీక్రెట్ మిషన్
తెలుగులో ‘ఘాజీ’, ‘అంతరిక్షం 9000కేఎమ్పీహెచ్’ వంటి చిత్రాలను తీసిన సంకల్ప్ రెడ్డి హిందీలో దర్శకత్వం వహించిన తొలి చిత్రం ‘ఐబీ 71’. విద్యుత్ జమాల్ హీరోగా నటించి, నిర్మించిన ఈ చిత్రంలో అనుపమ్ ఖేర్ ఓ లీడ్ రోల్ చేశారు. స్పైజానర్లో రూపొందిన ఈ సినిమా టీజర్ను విడుదల చేసి, చిత్రాన్ని మే 12న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు మేకర్స్. ‘‘1971లో ఇండియా–పాకిస్తాన్ మధ్య యుద్ధం జరిగింది. ఈ వార్లో భారతదేశం గెలవడానికి దేశ ఇంటెలిజెన్స్ బ్యూరో చేసిన ఓ సీక్రెట్ మిషన్ ఏ విధంగా దోహదపడింది? అనే అంశాల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కించాం’’ అని యూనిట్ పేర్కొంది. -
స్నేహితుడి మరణం.. బోరున ఏడ్చేసిన బాలీవుడ్ నటుడు
బాలీవుడ్లో దర్శకనటుడు సతీష్ కౌశిక్(67) హఠాన్మరణం చెందిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని ఆయన మిత్రుడు, మరో సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్ ట్వీటర్ ద్వారా వెల్లడించారు. సతీశ్ మరణాన్ని తట్టుకోలేక పోతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. తాజాగా ఓ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఆ వీడియోలో సతీశ్ పార్థివదేహం వద్ద అనుపమ్ ఖేర్ బోరున విలపించారు. స్నేహితుని మరణాన్ని తట్టుకోలేక కన్నీటి పర్యంతమయ్యారు. సతీశ్ మృతిపట్ల అనుపమ్ ఖేర్ మాట్లాడుతూ..' మేమిద్దరం మధ్యతరగతి కుటుంబాలకు చెందినవాళ్లం. సొంతంగా పేరు తెచ్చుకున్నందుకు గర్వపడుతున్నాం. ముంబై నగరం మాకు అవకాశం ఇచ్చింది. దాన్ని సాధించాం. కానీ ఇది జీర్ణించుకోవటం చాలా కష్టం. అతను చాలా చమత్కారి. ప్రతి విషయాన్ని తేలికగా అర్థం చేసుకునేవాడు. ఎలా జీవించాలనేది ప్రజలు అతని నుంచి నేర్చుకుంటారు. మమ్మల్ని అకాలంగా విడిచి వెళ్లాడనే పశ్చాత్తాపం నాకు ఎప్పటికీ ఉంటుంది.' అంటూ ఎమోషనలయ్యారు. అదేవిధంగా సతీశ్ కౌశిక్తో తనకు 45 నుంచి అనుబంధమని అనుపమ్ ఖేర్ తెలిపారు. కాగా.. 13 ఏప్రిల్ 1956లో హర్యానాలో పుట్టి, పెరిగిన సతీష్ కౌశిక్.. నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాలో థియేటర్ ఆర్టిస్ట్గా కెరీర్ను ప్రారంభించారు. ఇక్కడి నుంచే అనుపమ్ ఖేర్తో ఆయనకు అనుబంధం ఏర్పడింది. 1983లో వచ్చిన జానే భీ దో యారోన్ చిత్రానికి ఆయన సంభాషణలు అందించారు.. కమెడియన్గా, స్క్రీన్ రైటర్గా, దర్శకనిర్మాతగానూ ఆయన బాలీవుడ్లో రాణించారు. Anupam Kher Looses A True Friend 💔#AnupamKher #RipLegend #ShatishKaushik #ripshatishkaushik pic.twitter.com/wzbnQ0dR3Z — Yogeshnegi45 (@Yogeshnegi451) March 9, 2023 -
కొందరి జీవితాలు అంతే.. ప్రకాశ్ రాజ్కు అనుపమ్ ఖేర్ గట్టి కౌంటర్..!
ది కాశ్మీర్ ఫైల్స్ సినిమాపై వివాదం ఇంకా ముగిసిపోలేదు. సీనియర్ నటుడు ప్రకాశ్ రాజ్ వ్యాఖ్యలపై దుమారం మరింత రాజుకుంటోంది. ఇప్పటికే ప్రకాశ్ రాజ్కు దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి కౌంటర్ ఇచ్చారు. ది కశ్మీర్ ఫైల్స్ ఓ నాన్సెన్స్ ఫిల్మ్ అన్న వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కేరళలో జరిగిన ఓ ఈవెంట్లో ది కాశ్మీర్ ఫైల్స్ ఓ నాన్సెన్స్ ఫిల్మ్ అంటూ ప్రకాశ్ రాజ్ ఘాటుగా వ్యాఖ్యనించిన సంగతి తెలిసిందే. అంతర్జాతీయ జ్యూరీనే వారి సినిమాపై ఉమ్మివేసిందని తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. అయితే తాజాగా ప్రకాష్ రాజ్ చేసిన వ్యాఖ్యలపై ది కశ్మీర్ ఫైల్స్ నటుడు అనుపమ్ ఖేర్ స్పందించారు. తన జీవితమంతా ఎల్లప్పుడూ నిజమే మాట్లాడాతానని ఆయన చెప్పారు. కొంతమంది అబద్ధాలతో తమ జీవితాన్ని వెల్లదీస్తున్నారని ప్రకాశ్ రాజ్ను ఉద్దేశించి మాట్లాడారు. అనుపమ్ ఖేర్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ' కొందరు మనుషులు తమ స్థాయిని తగ్గట్లు మాట్లాడతారు. కొంతమంది మాత్రం తమ జీవితమంతా అబద్ధం చెబుతారు. మరికొందరు నిజాలే మాట్లాడతారు. నా జీవితమంతా నిజం మాట్లాడిన వారిలో నేనూ ఒకడిని. అబద్ధాలు చెబుతూ జీవించాలనుకోవడం అది వారి కోరిక.' అంటూ ప్రకాశ్ రాజ్కు గట్టిగా కౌంటరిచ్చారు. కాగా.. గతేడాది విడుదలైన ది కాశ్మీర్ ఫైల్స్ 1990లలో కశ్మీరీ హిందువుల వలసలను ఈ చిత్రంలో చూపించారు.వివేక్ అగ్నిహౌత్రి దర్శకత్వంలో జీ స్టూడియోస్ నిర్మించారు. ఈ చిత్రంలో అనుపమ్ ప్రధాన పాత్రలో పల్లవి జోషి, మిథున్ చక్రవర్తి, దర్శన్ కుమార్ తదితరులు నటించారు. -
వార్లో సప్తమి
‘ది కశ్మీరీ ఫైల్స్’ వంటి సూపర్హిట్ ఫిల్మ్ తర్వాత దర్శకుడు వివేక్ రంజన్ అగ్నిహోత్రి తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ‘ది వ్యాక్సిన్ వార్’. కోవిడ్ 19 పరిస్థితులు, దేశంలోని వ్యాక్సిన్ డ్రిల్స్ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో అనుపమ్ ఖేర్, నానా పటేకర్, దివ్య సేథ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. కాగా ఈ సినిమాలో కన్నడ హిట్ ‘కాంతార’ ఫేమ్ హీరోయిన్ సప్తమి గౌడ జాయిన్ అయ్యారు. ప్రస్తుతం హైదరాబాద్లో జరుగుతున్న ఈ సినిమా ఫైనల్ షెడ్యూల్ చిత్రీకరణలో సప్తమి పాల్గొంటున్నారు. ఐయామ్ బుద్ధ ప్రొడక్షన్స్ పతాకంపై ‘వ్యాక్సిన్ వార్’ సినిమాను నిర్మిస్తుండటంతో పాటు ఇందులో నటిస్తున్నారు పల్లవీ జోషి. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పతాకంపై ఈ సినిమా ఈ ఏడాది ఆగస్టు 15న రిలీజ్ కానుంది. తెలుగు, తమిళ, కన్నడ, ఉర్దూ, హిందీ, ఇంగ్లిష్, గుజరాతీ, పంజాబీ, భోజ్పురి, మరాఠీ, అస్సామీ భాషలతో సహా ఈ సినిమాను మరికొన్ని భాషల్లో విడుదల చేయనున్నారు. -
అంతా ఓకే.. అతని ఆటను మళ్లీ చూస్తాం: బాలీవుడ్ నటులు
టీమిండియా యంగ్ క్రికెటర్ రిషబ్ పంత్ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. ఈ ఘటనతో ప్రతి ఒక్కరూ షాక్కు గురయ్యారు. క్రీడాకారులు, సినీ ప్రముఖులు సైతం రిషబ్ త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియాలో పెద్దెఎత్తున ట్వీట్స్ చేశారు. ప్రధాని మోదీతో పలువురు రాజకీయ ప్రముఖులు ఈ ఘటన పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కాగా స్వస్థలం ఉత్తరాఖండ్కు ఢిల్లీ నుంచి వస్తుండగా.. రూర్కీ సమీపంలోని నర్సన్ సరిహద్దు వద్ద ఈ ప్రమాదం జరిగింది. (ఇది చదవండి: Rishabh Pant: క్రికెటర్ రిషభ్ పంత్కు ఘోర ప్రమాదం.. తీవ్ర గాయాలు) తాజాగా రిషబ్ పంత్ను బాలీవుడ్ నటులు పరామర్శించారు. డెహ్రడూన్లో ఆస్పత్రికి వెళ్లిన అనిల్ కపూర్, అనుపమ్ ఖేర్ క్రికెటర్ ఆరోగ్యంపై ఆరా తీశారు. అయితే అతని పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది. బాలీవుడ్ నటులు అనిల్ కపూర్, అనుపమ్ ఖేర్ రిషబ్ను పరామర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. అనిల్ కపూర్ మాట్లాడుతూ.. 'ప్రస్తుతం పంత్ బాగానే ఉన్నాడు. అభిమానులుగా మేము అతనిని కలిశాం. రిషబ్ త్వరగా కోలుకోవాలని మనందరం ప్రార్థిద్దాం. అతని ఆటను మళ్లీ గ్రౌండ్లో చూస్తాం.' అని అన్నారు. అనుపమ్ ఖేర్ మాట్లాడుతూ.. 'పంత్ కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పేందుకు వచ్చాం. ప్రస్తుతం అంతా బాగానే ఉంది. పంత్, అతని తల్లి, బంధువులను కలిసి మాట్లాడాం. అందరికీ ధైర్యంగా ఉండాలని చెప్పాం. మేము వారందరినీ నవ్వించాం.' అని అన్నారు. -
కశ్మీర్ ఫైల్స్పై... మాటలు.. మంటలు
ముంబై: విడుదలైనప్పుడే పలు వివాదాలకు కేంద్ర బిందువుగా నిలిచిన కశ్మీర్ ఫైల్స్ సినిమా ఇఫీ ఉదంతం పుణ్యమా అని మరోసారి దేశవ్యాప్తంగా మంటలు రేపుతోంది. అదో చెత్త సినిమా అంటూ సోమవారం ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (ఐఎఫ్ఎఫ్ఐ) ముగింపు వేడుకల్లో ఇజ్రాయెల్కు చెందిన జ్యూరీ హెడ్ నదవ్ లపిడ్ చేసిన వ్యాఖ్యలపై ఇంటా బయటా విమర్శలు రేగుతున్నాయి. సోషల్ మీడియాలో కూడా ఇది పెద్ద చర్చకు తెర తీసింది. నదవ్ వ్యాఖ్యలను భారత్లో ఇజ్రాయెల్ రాయబారి నవోర్ గిలాన్ తీవ్రంగా ఖండించారు. ‘‘అతిథిని దైవంగా భావించే దేశానికి వచ్చి అలాంటి వ్యాఖ్యలు చేసినందుకు సిగ్గుపడాలి. ఇఫీ జడ్జీల ప్యానల్కు సారథ్య స్థానంలో కూచోబెట్టిన ఆతిథ్య దేశాన్ని నదవ్ తన వ్యాఖ్యలతో దారుణంగా అవమానించారు’’ అంటూ మంగళవారం బహిరంగ లేఖలో దుయ్యబట్టారు. ‘‘హిట్లర్ సారథ్యంలోని నాజీల చేతుల్లో లక్షలాది మంది యూదులు హోలోకాస్ట్ కాన్సంట్రేషన్ క్యాంపుల్లో నిస్సహాయంగా ఊచకోతకు గురయ్యారు. అదృష్టం కొద్దీ ఆ మారణహోమం నుంచి తప్పించుకున్న వారి వారసున్ని నేను. నీ వ్యాఖ్యలనే గీటురాయిగా తీసుకునే పక్షంలో హోలోకాస్ట్ దారుణాలపై హాలీవుడ్ దర్శక దిగ్గజం స్పీల్బర్గ్ తీసిన షిండ్లర్స్ లిస్ట్ కూడా చెత్త సినిమాయేనా అని భారతీయులు ప్రశ్నిస్తుంటే నా మనసెంతో గాయపడుతోంది. కశ్మీర్ ఫైల్స్పై నీ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నా. వాటిని నువ్వు ఏ విధంగానూ సమర్థించుకోలేవు’’ అంటూ తూర్పారబట్టారు. నదవ్ తక్షణం క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. కశ్మీరీ పండిట్ల మండిపాటు బీజేపీతో పాటు కశ్మీర్ ఫైల్స్ సినిమా రచయిత, దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి, అందులో ప్రధాన పాత్ర పోషించిన సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్ తదితరులు కూడా నదవ్ విమర్శలను తీవ్రంగా ఖండించారు. ‘‘భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన అంతర్జాతీయ స్థాయి కార్యక్రమాన్ని ఉగ్రవాదుల వాదనకు మద్దతిచ్చేందుకు వాడుకున్న తీరు ఆశ్చర్యకరం. కశ్మీర్ ఫైల్స్ ప్రచారం కోసం తీసిందని, అందులో ఒక్క సీన్ గానీ, డైలాగ్ గానీ అవాస్తవమని నిరూపించినా ఇకపై సినిమాలే తీయను. నదవ్తో పాటు ప్రపంచ మేధావులకు, అర్బన్ నక్సల్స్కు ఇది నా సవాలు’’ అని అగ్నిహోత్రి అన్నారు. నవద్ను తక్షణం భారత్ నుంచి పంపించేయాలని కశ్మీరీ పండిట్లు డిమాండ్ చేశారు. ఇజ్రాయెల్ కాన్సులర్ జనరల్ కొబ్బీ షొషానీ కూడా నదవ్ వ్యాఖ్యలను తప్పుబట్టారు. -
సీనియర్ నటితో మెగాస్టార్ స్టెప్పులు.. సోషల్ మీడియాలో వైరల్
ఫిల్మ్ ఇండస్ట్రీలో 80వ దశకంలోని నటీనటులు ఇటీవలే ముంబైలో కలిసిన విషయం తెలిసిందే. టాలీవుడ్తో పాటు బాలీవుడ్, ఇతర ఇండస్ట్రీల్లోని సీనియర్ స్టార్స్ అందరూ ఒకేచోట కనిపించి సందడి చేశారు. అలనాటి రోజులను గుర్తు చేసుకుంటూ హ్యాపీగా ఎంజాయ్ చేశారు. ఈ రీయూనియన్ వేడుకలో మెగాస్టార్ తన డ్యాన్స్తో ఊపేశారు. ఓ సీనియర్ నటితో కలిసి స్టెప్పులేశారు. ఆ వీడియోను ప్రముఖ బాలీవుడ్ సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్ తన ఇన్స్టాలో పోస్ట్ చేశారు. అది కాస్తా సోషల్ మీడియాలో తెగ వైరవుతోంది. (చదవండి: ముంబైలో సీనియర్ స్టార్స్ సందడి.. ఫోటోలు వైరల్) మెగాస్టార్తో పాటు సీనియర్ నటి సుహాసిని కూడా కాలు కదిపారు. మరో బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ సైతం స్టెప్పులేశారు. ముంబైలో జరిగిన ఈ వేడుకకు బాలీవుడ్ నటుడు జాకీ ష్రాఫ్ ఆతిథ్యమిచ్చారు. ఈ వేడుకలో టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, వెంకటేశ్, నరేశ్, భానుచందర్, నదియా, రమ్యకృష్ణ, విద్యాబాలన్, సుహాసిని, జయప్రద, రాధ, శోభన, భానుచందర్, అనుపమ్ ఖేర్, శరత్ కుమార్, అర్జున్, అనిల్ కపూర్ తదితరులు పాల్గొన్నారు. 2020లో జరిగిన రీయూనియన్ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి ఆతిథ్యం ఇచ్చిన సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Anupam Kher (@anupampkher) -
నన్ను చితక్కొట్టి ఇంట్లో నుంచి గెంటేశారు: అనుపమ్
కశ్మీర్ ఫైల్స్ నటుడు అనుపమ ఖేర్ 'మంజిలే ఔర్ బీ హై' షోకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నాడు. ఇందులో పలువురు సెలబ్రిటీలను ఆయన ఇంటర్వ్యూ చేస్తుంటాడు. తాజాగా ఈ షోకి అనుపమ్ తల్లి దులరి ఖేర్ వచ్చింది. ఈ సందర్భంగా ఆమె తన పిల్లలు తప్పు చేస్తే ఎలా శిక్షించేదో చెప్పుకొచ్చింది. ఓసారి అనుపమ్ స్కూలుకు వెళ్లేటప్పుడు అతడికి కొంత పాకెట్మనీ ఇచ్చిందిట దులరి. కానీ అతడి బ్యాగులో తానిచ్చిన చిల్లరతో పాటు మరో మూడు పైసలు, రెండు పైసలు ఎక్స్ట్రా కనిపించాయట. చిన్నపిల్లాడు పోనీలే అని అతడి తండ్రి ఊరుకుంటే ఆమె మాత్రం ఎందుకు వదిలేయాలి, డబ్బు దొంగిలించినందుకు దండించాల్సిందేనని చెప్పిందట. అలా తనను బట్టలు ఊడగొట్టి మరి ఇంట్లో నుంచి బయటకు వెళ్లగొట్టారని గుర్తు చేసుకున్నాడు అనుపమ్. కానీ ఒకరకంగా తన తల్లి మంచి పనే చేసిందని చెప్పుకొచ్చాడు. అనుపమ్తో పాటు అతడి తమ్ముడు రాజు ఖేర్ను కూడా బాగా కొట్టేదాన్నంది దులరి. ఓ చెట్టు కట్టెతో కొడితే శరీరమంతా దద్దులు వచ్చేవని తెలిపింది. ఓసారి ఆ కట్టెతో బాగా కొట్టడంతో అనుపమ్ అనారోగ్యానికి గురయ్యాడని, ఆస్పత్రికి తీసుకెళ్లగా డాక్టర్ ఆ చెట్టు విషపూరితమైనదని, ఆ కట్టెతో దండించొద్దని, కావాలంటే చేత్తో కొట్టమని సూచించినట్లు పేర్కొంది. ఇకపోతే అనుపమ్ ఖేర్ నటించిన ఊంచాయ్ మూవీ నవంబర్ 11న విడుదల కానుంది. చదవండి: ఊహించని కంటెస్టెంట్ ఎలిమినేట్! పెళ్లి కాకుండా తల్లయినా ఓకే: జయా బచ్చన్ -
సత్యరాజ్, అనుపమ్ ఖేర్ ప్రధాన పాత్రలో నయన్ ‘కనెక్ట్’, ఫస్ట్లుక్ అవుట్
లేడీ సూపర్ స్టార్ నయనతార చిత్రాలకు అందరూ కనెక్ట్ అవుతారు. అలాంటిది ఇప్పుడు ఆమె కనెక్ట్గా మారింది. ఒక పక్క స్టార్ హీరోలతో నటిస్తున్న ఈమె, మరో పక్క హీరోయిన్ ఓరియంటెడ్ కథల్లో నటిస్తూ విజయాలను అందుకుంటోంది. ఇలాంటి కథా చిత్రం విడుదలయ్యేలా చూసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఆ మధ్య ఈమె నటించిన ఓ2 చిత్రం ఓటీటీలో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. కాగా నయనతార కథానాయకిగా ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రానికి కనెక్ట్ అనే పేరును ఖరారు చేశారు. ఈ చిత్రాన్ని ఆమె భర్త, దర్శకుడు విఘ్నేశ్ శివన్ తమ రౌడీ పిక్చర్స్ పతాకంపై నిర్మించారు. ఈ చిత్రానికి అశ్విన్ శరవణన్ దర్శకత్వం వహించారు. కాగా కనెక్ట్ చిత్రంలో నయనతారకు జంటగా నటుడు వినయ్ నటించగా సత్యరాజ్, బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. దీనిని అశ్విన్ శరవణన్ తన గత చిత్రాల తరహాలోనే తెరకెక్కించినట్లు తెలిసింది. షూటింగ్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్ర ప్రత్యేక పోస్టర్ను చిత్ర వర్గాలు విడుదల చేశాయి. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలను జరపుకుంటున్న ఈ మూవీ త్వరలో విడుదల తేదీని ప్రకటిస్తామని చిత్ర బృందం పేర్కొంది. అయితే నయనతార గత చిత్రాల మాదిరిగా ఇది ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందా? లేక థియేటర్లలో విడుదలవుతుందా ? అన్నది తెలియాల్సి ఉంది. కనెక్ట్ చిత్ర విడుదలకు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉంది. -
ఓ మై గాడ్.. ఇంట్లో అసలు ఖాళీ లేదుగా
-
పీవీ సింధు ఇంటికి బాలీవుడ్ దిగ్గజం
బాలీవుడ్ దిగ్గజ నటుడు అనుపమ్ ఖేర్ బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు ఇంటికి వెళ్లాడు. ఇటీవలే ఒక కార్యక్రమం కోసం హైదరాబాద్ వచ్చిన అనుపమ్ సింధు ఇంటికి వెళ్లి సందడి చేశారు. ఈ సందర్భంగా సింధూ సాధించిన ట్రోఫీలు చూసి షాక్ తిన్నాడు. దీనికి సంబంధించిన వీడియోనూ అనుపమ్ ఖేర్ స్వయంగా షేర్ చేసుకున్నాడు. "వన్ అండ్ ఓన్లీ ఛాంపియన్. ఈ గోడ చూడండి. నా ఇంట్లో నా దగ్గర ఉన్న అవార్డులు చూసి నా గోడపై చాలా ఎక్కువ ఉన్నాయని అనుకునే వాడిని. కానీ ఇక్కడ చూడండి. అద్భుతం. ఇక్కడ అసలు స్థలమే లేదు" అని అనుపమ్ అన్నాడు. అనంతరం ఆమె తండ్రితోనూ అనుపమ్ మాట్లాడాడు. సింధు గెలుస్తున్న ట్రోఫీలు పెట్టడానికి స్థలం సరిపోవడం లేదని, అందుకే ఇంకో అంతస్తు కట్టాలని అనుకుంటున్నట్లు సింధు తండ్రి చెప్పడం విశేషం. ఆమె ఇంటికి వెళ్లడం చాలా సంతోషంగా ఉందన్న అనుపమ్.. ఈ వీడియోను పోస్ట్ చేస్తూ తాను ఎలాంటి అనుభూతి చెందాడో వివరించాడు. "ఇది అద్భుతం. ఈ మధ్యే నేను ఛాంపియన్ పీవీ సింధు ఇంటికి వెళ్లాను. ఆమె తాను సాధించిన ట్రోఫీలను చూపించింది. 8 ఏళ్ల వయసు ఉన్నప్పటి నుంచీ అందులో ఉన్నాయి. ఆమె అవార్డులు, ట్రోఫీలు, ఆమె వినయం చూసి బౌల్డయ్యాను. ఆమె మన ఇండియా కూతురు. ఆమె మనను మోటివేట్ చేసే హీరో. జై హో.. జై హింద్" అని పేర్కొన్నాడు. అటు సింధు కూడా అనుపమ్ ఖేర్తో దిగిన ఫొటోను షేర్ చేసింది. అతన్ని కలవడం గొప్ప గౌరవంగా భావిస్తున్నట్లు చెప్పింది. AMAZING: I had the privilege of visiting CHAMP @Pvsindhu1’s home.She very humbly gave me a tour of her achievements, awards and trophies! Right from the age of 8!😳ये है हमारे भारत की बेटी।ये है हमारे देश की शान।ये है हमारी प्रेरणात्मक HERO! जय हो! जय हिंद! 👏🌈🇮🇳🇮🇳 #YouthIcon pic.twitter.com/gk1ooybScE — Anupam Kher (@AnupamPKher) September 29, 2022 చదవండి: ఇమిటేట్ చేయబోయి.. ఆస్పత్రి బెడ్ మీద పేషెంట్గా -
బాలీవుడ్లో ఆ బడా సెలబ్రిటీలు నాకు ఆఫర్స్ ఇవ్వట్లేదు: అనుపమ్
కశ్మీర్ ఫైల్స్ సినిమాతో బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ పేరు మార్మోగిపోయింది. 500కు పైగా సినిమాల్లో నటించిన ఈయన ఈమధ్య హిందీ చిత్రాల్లో పెద్దగా కనిపించడం లేదు. కశ్మీర్ ఫైల్స్, కార్తికేయ 2 సినిమాలతో హిట్స్ అందుకున్న ఆయన బాలీవుడ్ మూవీస్లో కనిపించకుండా పోవడానికి గల కారణాన్ని తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. 'మెయిన్ స్ట్రీమ్ సినిమాలో నేను లేకుండా పోయాను. కరణ్ జోహార్, సాజిద్ నదియావాలా, ఆదిత్య చోప్రా సినిమాలు ఒక్కటి కూడా చేయడం లేదు. కారణం.. వాళ్లు నాకు ఒక్క ఆఫర్ కూడా ఇవ్వట్లేదు. ఒకప్పుడు వీళ్లందరికీ నేను డార్లింగ్.. వీళ్లు తీసిన సినిమాల్లో నేనూ ఉన్నాను. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. పోనీలే.. నన్ను వారి మూవీస్లోకి తీసుకోనందుకు నేను వాళ్లను తప్పుపట్టడం లేదు. కానీ వాళ్లు నాకు ఛాన్స్ ఇవ్వకపోవడం వల్లే నేను వేరే దారి వెతుక్కున్నాను.. అలా తమిళ సినిమా కనెక్ట్ చేశాను. తెలుగులో టైగర్ నాగేశ్వరరావు చేశాను. హిందీలో సూరజ్ బర్జాత్యా ఊంచై చేశాను. కానీ నా స్నేహితులు నన్ను పక్కన పెట్టేసినందుకు బాధేసింది. ఒక ద్వారం మూసుకున్నా మరోవైపు ఎన్నో ద్వారాలు తెరుచుకుంటాయి అని చెప్పుకొచ్చాడు. చదవండి: బ్రహ్మాస్త్ర గ్రాండ్ ఈవెంట్: ముఖ్య అతిథిగా యంగ్ టైగర్ అనసూయ వివాదం.. నన్నెందుకు తిడుతున్నారు? -
ఈ ఫొటోలో ఉన్న నటుడిని గుర్తుపట్టారా?
పూలదండల చాటున ఉన్న ఈ వధూవరులెవరో గుర్తుపట్టారా? ఈ నటుడు ఈ మధ్య వరుస విజయాలు అందుకోవడంతో ఇండియా అంతటా అతడి పేరు మార్మోగిపోతోంది. అతడు మరెవరో కాదు అనుపమ్ ఖేర్. ఈరోజు ఆయన పెళ్లిరోజు! బాలీవుడ్ ప్రముఖ నటుడు అనుపమ్ ఖేర్ ఫుల్ జోష్ మీదున్నాడు. తాను నటించిన రెండు సినిమాలు కశ్మీర్ ఫైల్స్, కార్తికేయ 2 ఘన విజయం సాధించడంతో సంతోషంలో మునిగి తేలుతున్నాడు. శుక్రవారం(ఆగస్టు 26) అనుపమ్- కిరణ్ ఖేర్ల పెళ్లిరోజు. ఈ సందర్భంగా అతడు సోషల్ మీడియాలో తన పెళ్లి ఫొటో షేర్ చేశాడు. 'హ్యాపీ యానివర్సరీ కిరణ్. ఇటీవల నేను సిమ్లా వెళ్లినప్పుడు మా నాన్నగారి ట్రంకు పెట్టెలో నుంచి 37 ఏళ్ల క్రితం దిగిన ఈ ఫొటోను బయటకు తీశాను. ఆ భగవంతుడు నీకు ఆయురారోగ్యాలను, సుఖసంతోషాలను అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను' అని రాసుకొచ్చాడు. ఇక ఈ ఫొటోలో బంగారు రంగు చీరను ధరించిన కిరణ్ ఒంటి నిండా నగలతో ధగధగా మెరిసిపోతుంది. అనుపమ్ సింపుల్గా ఓ ధోతీ ధరించాడు. వీరిద్దరి మెడలోనూ పూలమాలలు ఉన్నాయి. కాగా అనుపమ్, కిరణ్లు 1985లో పెళ్లి చేసుకున్నారు. ఇది కిరణ్ ఖేర్కు రెండో వివాహం. ఇదిలా ఉంటే అనుపమ్ ప్రస్తుతం కంగనా రనౌత్ ఎమర్జెన్సీ మూవీలో నటిస్తున్నాడు. రాజకీయ నాయకుడు జయప్రకాశ్ నారాయణ్ పాత్ర పోషిస్తున్నాడు. అలాగే అతడు ఐబీ 71, ఊంచై సినిమాలు చేస్తున్నాడు. Happy anniversary dearest #Kirron. Dug out this pic of our wedding 37years ago from the Treasure Trunk of my father during my recent visit to Shimla!😍! May God give you all the happiness, long and healthy life. सालगिरह मुबारक! 😍🌺😍 #MarriageAnniversary @KirronKherBJP #37Years pic.twitter.com/EEiSDcZrfB — Anupam Kher (@AnupamPKher) August 26, 2022 చదవండి: కేజీఎఫ్ నటుడికి క్యాన్సర్, మూడేళ్లుగా దాచిపెట్టాడు! బాలీవుడ్ స్టార్లను అమ్ముకుంటుంది: అనుపమ్ ఖేర్ సంచలన వ్యాఖ్యలు -
బాలీవుడ్ స్టార్లను అమ్ముకుంటుంది: అనుపమ్ ఖేర్ సంచలన వ్యాఖ్యలు
ఈ మధ్యకాలంలో హిందీ సినిమాలకు ఆదరణ తగ్గిపోతుంది. అక్కడ వరుసగా సినిమాలు పరాజయం కావడం, దక్షిణాది చిత్రాలు అక్కడ బ్లాక్బస్టర్గా నిలుస్తున్నాయి. ఈ క్రమంలో బాలీవుడ్ సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమవుతున్నాయి. బాలీవుడ్ చిత్రాలు ఫ్లాప్ అవ్వడంపై ఆయన తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ఇటీవల ఓ జాతీయ మీడియాతో ముచ్చటించిన ఆయన ఈ సందర్భంగా బాలీవుడ్పై సంచలన కామెంట్స్ చేశారు. దక్షిణాది పరిశ్రమ మంచి కథల చూట్టూ తిరుగుతుంటే బాలీవుడ్ మాత్రం హీరోలను అమ్ముకునే ఆలోచనలో ఉందన్నారు. చదవండి: ఆ ఉసురు ఊరికే పోదు.. అనసూయ సంచలన ట్వీట్ అందుకే హిందీ చిత్రాలకు ఆదరణ తగ్గిపోతుందన్నారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. సౌత్ ఇండస్ట్రీ కథలపై దృష్టి పెడుతుంది బాలీవుడ్ పరిశ్రమ మాత్రం హీరోలపై దృష్టి పెడుతుంది. అందుకే సౌత్ సినిమాలు దూసుకెళ్తుంటే బాలీవుడ్ డీలా పడిపోతుంది’ అన్నారు. ‘‘మనం వినియోగదారుల కోసం వస్తువులను తయారు చేస్తున్నాం అనుకుందాం. ఎప్పుడైతే వినియోగదారులను చిన్నచూపు చూడటం ప్రారంభిస్తామో అప్పటి నుంచే సమస్య మొదలవుతుంది. ‘మేం ఒక గొప్ప సినిమా చేయడం వల్ల మీరు లాభం పొందుతున్నారని, మీరు ఒక గొప్ప సినిమా చూస్తారు’ అనుకోవడం తప్పు. ఎందుకంటే గొప్పతనం అనేది సమిష్టి కృషితో సాధ్యం అవుతుంది. చదవండి: ఆ డైరెక్టర్కి అలా హగ్ ఇచ్చా.. అందరు వింతగా చూశారు: కియారా ఈ విషయాన్ని తెలుగులో పనిచేయడం వల్ల నేను నేర్చుకున్నా. ఈ మధ్యే తెలుగులో కార్తీకేయ 2లో నటించా. తమిళంలో కూడా ఒక సినిమా చేశాను. ఇప్పుడు మలయాళ చిత్రంలో కూడా నటించబోతున్నాను. అయితే దక్షిణాదిలో నేను ఏ రెండింటి మధ్య తేడా చూడటం లేదు. అక్కడి వాళ్లు కథను నమ్ముకుంటారు తప్పా హాలీవుడ్ను ఇష్టపడరు. కానీ ఇక్కడ(బాలీవుడ్) మేం స్టార్లను అమ్ముతున్నాం’’ అని అన్నారు. కాగా అనుపమ్ ఖేర్ కీలక పాత్రలో నటించిన ‘ది కశ్మీర్ ఫైల్స్’ ఈ సంవత్సరం అత్యధిక వసూళ్లు సాధించిన హిందీ చిత్రంగా నిలిచిన సంగతి తెలిసిందే. ఇక ‘కార్తికేయ 2’లో ఆయన అతిధి పాత్రలో కనిపించారు. చందూ మొండేటి దర్శకత్వం వహించిన ఈ తెలుగు చిత్రం.. హిందీతో పాటు పలు భాషల్లో భారీ వసూళ్లు సాధించి బ్లాక్బస్టర్గా నిలిచింది. -
టైగర్ నాగేశ్వరరావు బయోపిక్: రవితేజ సినిమాలో అనుపమ్
ప్రముఖ హిందీ నటుడు అనుపమ్ ఖేర్ ‘టైగర్ నాగేశ్వర రావు’ చిత్రంలో కీలక పాత్ర అంగీకరించారు. రవితేజ టైటిల్ రోల్లో తేజ్ నారాయణ్ అగర్వాల్ సమర్పణలో అభిషేక్ అగర్వాల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కాగా అభిషేక్ అగర్వాల్ నిర్మించిన ‘ది కశ్మీరీ ఫైల్స్’లో అనుపమ్ చేసిన పుష్కర్ నాథ్ పండిట్ పాత్ర సినిమాకి హైలైట్గా నిలిచింది. మళ్లీ అభిషేక్ నిర్మాణంలో మరో సినిమా చేయనుండటం పట్ల అనుపమ్ ఆనందం వ్యక్తం చేశారు. స్టువర్ట్పురం దొంగగా పేరు గాంచిన టైగర్ నాగేశ్వరరావు బయోపిక్గా 1970 నేపథ్యంలో రూపొందుతోన్న ‘టైగర్ నాగేశ్వరరావు’లో రవితేజ సరసన నూపుర్ సనన్, గాయత్రీ భరద్వాజ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. వంశీ దర్శకత్వంలో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ చిత్రం రూపొందుతోంది. ఇదే కాదు.. నిఖిల్ ‘కార్తికేయ 2’లోనూ అనుపమ్ కీలక పాత్ర చేస్తున్నారు. -
కార్తికేయ 2: ముఖ్య పాత్రల పోస్టర్స్ రిలీజ్
యంగ్ హీరో నిఖిల్; చందు మొండేటి దర్శకత్వంలో కార్తికేయకి సీక్వెల్గా వస్తున్న చిత్రం కార్తికేయ 2. ఈ మధ్యే విడుదలైన మోషన్ పోస్టర్కు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. సముద్రం దాచుకున్న అతిపెద్ద ప్రపంచ రహస్యం.. ఈ ద్వారకా నగరం అంటూ హీరో నిఖిల్ వాయిస్తో వచ్చిన ఈ మోషన్ పోస్టర్ ఆసక్తి రేపుతోంది. దీనిపై ఇస్కాన్ (అంతర్జాతీయ శ్రీకృష్ణ భక్తుల సమితి) వైస్ ప్రెసిడెంట్ రామ్రధన్ దాస్ కార్తికేయ 2పై ప్రశంసల వర్షం కురిపించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమాలోని పాత్రలను పరిచయం చేశారు మేకర్స్. ఇందులో కార్తికేయగా నిఖిల్ సిద్ధార్థ్ నటిస్తుంటే.. ముగ్ధ పాత్రలో అనుపమ పరమేశ్వరన్ నటిస్తున్నారు. అతి ముఖ్యమైన ధన్వంతరి పాత్రలో ప్రముఖ బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ కనిపిస్తుండగా.. శాంతనుగా ఆదిత్య మీనన్.. సదానందగా శ్రీనివాస్ రెడ్డి.. సులేమాన్ పాత్రలో వైవా హర్ష నటిస్తున్నారు. ఈ మేరకు ఫస్ట్ లుక్స్ కూడా విడుదల చేశారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరి, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బేనర్స్పై టి.జి. విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీ జూలై 22న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. The World of #karthikeya2 is opening up… Teaser Coming soon ☺️ India's epic mystical adventure🌟🔥releasing on July 22nd @actor_Nikhil @anupamahere @AnupamPKher @harshachemudu @AdityaMenon22 @chandoomondeti @vishwaprasadtg @AbhishekOfficl @vivekkuchibotla @kaalabhairava7 pic.twitter.com/wHgMj4l72B— Nikhil Siddhartha (@actor_Nikhil) June 10, 2022 చదవండి: సీక్రెట్గా సింగర్ పెళ్లి, ఆపేందుకు ప్రయత్నించిన మాజీ భర్త మాడవీధుల్లో చెప్పులేసుకుని తిరిగిన కొత్త పెళ్లికూతురు -
సినిమా ఛాన్స్.. అప్పుడు ఆస్పత్రి బెడ్పై ఉన్నాను: నటి
ప్రముఖ నటి మహిమ చౌదరి క్యాన్సర్ బారిన పడ్డారు. ఆమె బ్రెస్ట్ క్యాన్సర్కు చికిత్స తీసుకుందని నటుడు అనుపమ్ ఖేర్ వెల్లడించాడు. '‘నా 525వ చిత్రం ‘ద సిగ్నేచ’ర్లో ఓ కీ రోల్ కోసం నెల రోజుల క్రితం అమెరికా నుంచి మహిమకు కాల్ చేశాను. అప్పుడే తను బ్రెస్ట్ క్యాన్సర్తో బాధపడుతున్నట్టు తెలిసింది. ఈ విషయాన్ని బయటకు వెల్లడించడంలో నేను కూడా భాగం కావాలని ఆమె కోరుకుంది’’ అంటూ తన ఇన్స్టాగ్రామ్లో ఓ వీడియో షేర్ చేశాడు. ఇందులో మహిమ.. క్యాన్సర్ వ్యాధితో తాను చేసిన పోరాటం గురించి వివరిస్తూ భావోద్వేగానికి లోనయింది. ‘మీ 525 సినిమాలో నటించాలని మీరు కాల్ చేసినప్పుడు నేను హాస్పిటల్ బెడ్పై ఉన్నాను. నా చుట్టూ డాక్టర్లు, నర్సులు ఉన్నారు. నా జుట్టు పూర్తి పోయింది. మీరు ఇప్పుడు కాల్ చేశారేంటి అనుకున్నాను. ఇంకా వెబ్ సిరీస్లు, సినిమాల్లో నటించాలని ఇంకా నాకు ఎన్నో కాల్స్ వచ్చాయి. నేను నటిస్తానని చెప్పలేను. ఎందుకంటే నా హెయిర్ మొత్తం లాస్ అయ్యింది’ అని చెప్పుకొచ్చింది. ‘సాధారణ చెకప్ కోసం వెళ్లగా క్యాన్సర్ బయటపడింది. నాకు ఎలాంటి క్యాన్సర్ లక్షణాలు కూడా కనిపించలేదు. కానీ క్లారిటీ కోసం చెకప్కు వెళ్లాను. టెస్ట్ చేసిన డాక్టర్లు ఇది క్యాన్సర్ కణతి అయ్యుండొచ్చు అన్నారు. మీరు దీన్ని తీసేయాలనుకుంటున్నారా? అని అడిగారు. వద్దు వద్దు నేను జస్ట్ చెకప్ కోసం వచ్చాను అన్నాను. చివరకు బయాప్సీ చేసి కణతి తీసి టెస్ట్ చేయగా క్యాన్సర్గా తేలింది. ఆ తర్వాత కీమోలు ఇస్తున్న సమయంలో చాలా నీరసించి పోయాను. ఎనర్జీ లాస్ అయ్యాను. నా హెయిర్ పోయింది. కానీ ధైర్యంతో ఈ వ్యాధిని ఎదుర్కొన్నాను. ప్రస్తుతం నేను పూర్తి ఆరోగ్యంగా ఉన్నాను’ అని వివరించింది. కాగా క్యాన్సర్పై ఎంతో మంది మహిళలకు అవగాహన కల్పించేందుకు మహిమ తనని కూడా భాగం చేశారని అనుపమ్ ఖేర్ చెప్పుకొచ్చాడు. View this post on Instagram A post shared by Anupam Kher (@anupampkher) -
ఇట్స్ అఫీషియల్: కశ్మీర్ ఫైల్స్ ఓటీటీ రిలీజ్ డేట్ ప్రకటించిన మేకర్స్
చిన్న సినిమాగా వచ్చి బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల సునామీ సృష్టించిన చిత్రం ది కశ్మీర్ ఫైల్స్. ఎలాంటి అంచనాలు లేకుండా మార్చి 11న విడుదలైన ఈ మూవీ రూ.250 కోట్లకుపైగా కలెక్షన్లు రాబట్టి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. బాలీవుడ్ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అనుపమ్ ఖేర్, మిథున్ చక్రవర్తి, దర్శన్ కుమార్, పల్లవి జోషి ముఖ్య పాత్రల్లో నటించారు. థియేటర్లలో రికార్డులు బద్దలు కొట్టిన ఈ చిత్రం ప్రస్తుతం ఓటీటీని షేక్ చేసేందుకు రెడీ అయింది. తాజాగా కశ్మీర్ ఫైల్స్ ఓటీటీ రిలీజ్ డేట్ను ప్రకటించింది చిత్రయూనిట్. జీ 5లో మే 13 నుంచి ప్రసారం చేస్తున్నట్లు వెల్లడించింది. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ భాషల్లో కశ్మీర్ ఫైల్స్ అందుబాటులోకి రానున్నట్లు తెలిపిం. మొత్తానికి ఈ సినిమాను మరోసారి చూసే ఛాన్స్ దొరికిందంటూ సంబరపడిపోతున్నారు సినీప్రియులు. Bringing the story of the Kashmiri Pandits straight to you. If you missed it, this is your chance to watch the truth unfold.#TheKashmirFiles premiering 13th May on #ZEE5#TheKashmirFilesOnZEE5 pic.twitter.com/uAFFEp3O0u — ZEE5 (@ZEE5India) April 25, 2022 చదవండి: పోలీసులు ఘోరంగా అవమానించారు, కాలర్ పట్టుకుని.. Shahid Kapoor: నాకెప్పటికీ ఆ స్కూల్ డేస్ అంటే ఆసహ్యం -
The Kashmir Files: అందుకే పబ్లిసిటీ చేయలేదు.. నిర్మాత అభిషేక్ అగర్వాల్
‘సినిమా అనేది కమర్షియల్. కానీ ఐదు లక్షల మంది కశ్మీర్ పండిట్ల బాధలు, సమస్యలను 32 ఏళ్ల తర్వాత ‘ది కశ్మీర్ ఫైల్స్’మూవీతో బయటకు తెచ్చాం. ఈ చిత్రం యూత్ కు బాగా కనెక్ట్ అయింది. ఇలాంటి సంఘటనలు జరిగాయా! అంటూ ఇవి చూస్తుంటే మాకే సిగ్గేస్తుందంటూ సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇంత మంచి సినిమాను నిర్మించినందుకు గర్వంగా ఉంది. కశ్మీర్ ఫైల్స్ చిత్రాన్ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు పాదాభివందనాలు చేస్తున్నాను’అన్నారు నిర్మాత అభిషేక్ అగర్వాల్. వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వంలో ఆయన నిర్మించిన తాజా చిత్రం ‘ది కశ్మీర్ ఫైల్స్’. 1980-90లలో కశ్మీర్లో ఓ వర్గంపై మరో వర్గం చేసిన మారణకాండ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి. అనుపమ్ ఖేర్, పల్లవి జోషి, దర్శన్ కుమార్ మరియు మిథున్ చక్రవర్తి కీలక పాత్రలు పోషించారు. చిన్న సినిమాగా వచ్చిన ఈ మూవీ.. పెను సంచలనంగా మారింది. విడుదలైన అన్నిచోట్ల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. ఈ సందర్భంగా అభిషేక్ అగర్వాల్ హైదరాబాద్ లో తన సంస్థ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు విషయాలను తెలియజేశారు. ఆ విశేషాలు. ► ముందుగా ఈ సినిమాను ఆదరిస్తున్న యావత్ ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పటికే ఈ సినిమా 100 కోట్ల క్లబ్ లో చేరింది. ఇంత ఆదరణ చూపిస్తున్న ప్రతి హిందూ పండిట్ లకు, ప్రేక్షకులకు పాదాభివందనాలు తెలియజేస్తున్నా. ► సినిమా విడుదలకు ఐదురోజుల ముందు ఒక మహిళ ఢిల్లీ నుంచి 20 వేల రూపాయలతో టికెట్ పెట్టుకుని నన్ను వెతుక్కుంటూ మరీ హైదరాబాద్కు వచ్చింది. వచ్చీ రాగానే తెగ ఏడ్చేసింది. నాకు ఈ సినిమా గురించి చెప్పడానికి మాటలు రావడంలేదు. 32 ఏళ్ళ నుంచి మా పండిట్ ల గురించి ఎవ్వరూ మాట్లాడలేదు. నా కుటుంబం ఆ టైంలో ఎంతో సఫర్ అయింది అంటూ ఆమె జ్ఞాపకాలు తెలియజేసింది. అదే రోజు రాత్రి కశ్మీర్ పండిట్ ల తో జూమ్ మీటింగ్ ఏర్పాటు చేశాం. రెండు వేల మంది పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ థ్యాంక్ యూ సార్ అని చెప్పారు. ►ఈ సినిమా చేసేటప్పుడు ఆర్టికల్ 370 గురించి రీసెర్ఛ్ చేశాం.. మూడు నెలలపాటు అమెరికా, కెనడ, దక్షిణాఫ్రికా మొదలైన ప్రదేశాలు తిరిగి అక్కడున్నవారి నుంచీ ఫీడ్ బ్యాక్ తీసుకున్నాం. ► ఇది ప్రజల సినిమా. ఇతర సినిమాలు అదే టైంలో విడుదలైనా వారి ఇష్టం మేరకు ఆయా సినిమాలు చూస్తారు. మాది చిన్న సినిమా. అందుకే పెద్దగా పబ్లిసిటీ కూడా ఇవ్వలేదు. చిన్న సినిమా కాబట్టి ఎవరూ సపోర్ట్ చేయరని తెలుసు. కానీ సినిమా విడుదలయ్యాక అన్ని చోట్లనుంచి, ముఖ్యంగా తెలుగు చలన చిత్రరంగంలో ఎంతోమంది అభినందలు కురిపించారు. కశ్మీర్ పండితులకు ఈ సినిమా అంకితం చేస్తున్నాం. ► ప్రధాని నరేంద్రమోదీని కలవడం అనేది యాదృశ్చికంగా జరిగింది. ఒకరోజు ఆయన ఆఫీసునుంచి ఫోన్ వచ్చింది. వెళ్ళి కలిశాం. ఆయనతో గడిపిన క్షణాలు మర్చిపోలేను. ► ఈ సినిమా తర్వాత పర్యావసనాలు ఏమైనా వుంటే ఛాలెంజ్ గా తీసుకున్నాం. సినిమా తీసేటప్పుడు కొంత ఫేస్ చేశాను. విడుదలకుముందు కొంత ఫేస్ చేశాను. ఇలాంటి సమస్యలు వస్తాయనే ముందుగాను ప్రిపేర్ అయ్యాను. ► నిజాయితీగా ఈ సినిమాను తెరకెక్కించాం. అందుకే ఎవరికీ భయపడాల్సిన అవసరంలేదు. నేను ఏదైనా తప్పుగా చూపిస్తే ప్రజలే సపోర్ట్ చేయరు. ► త్వరలో దేశంలో అన్ని భాషల్లో డబ్ చేసే ఆలోచన వుంది. తెలుగులోకూడా డబ్ చేయబోతున్నాం. ► మా సినిమాకు అస్సాం, ఉత్తరప్రదేశ్, గుజరాత్, మధ్యప్రదేశ్, హర్యానా, కర్నాటకతోసహా మొత్తం 9 రాష్ట్రాలలో టాక్స్ మినహాయింపు వచ్చింది. ►ఈ సినిమాలో అనుపమ్ ఖేర్ కశ్మీర్ పండిట్ గా నటించారు. ఆయన పాత్రలో లీనమై పోయారు. ఆయనేకాదు చాలమంది నటీనటులు ఫీల్ అయి చేశారు. రాత్రి పూటా ఆ పాత్రలో మమేకం అయి నిద్ర సరిగ్గా పట్టేదికాదు. ► షూటింగ్ జరుగుతుండగా అనుపమ్ ఖేర్ ను అక్కడి హిందువులు డిన్నర్కు ఆహ్వానించేవారు. 90 ఏళ్ళ వృద్ధురాలు కూడా తను ఇంటిదగ్గర వండి భోజనం తీసుకువచ్చేది. ఇలా ఎంతోమంది హిందువులును కలిసి వారితో షేర్ చేసుకున్న సంగతులు నిర్మాతగా నాకు సంతృప్తినిచ్చాయి. ►ఈ సినిమాను అందరూ పర్సనల్ గా తీసుకుని నటించారు. దర్శకుడు పూర్తి క్లారిటీతో సినిమా తీశాడు. ►కొత్త సినిమాలు: రవితేజ తో నా డ్రీమ్ ప్రాజెక్ట్.. టైగర్ నాగేశ్వర రావు చేస్తున్నా. ఆ తర్వాత అబ్దుల్ కలాం బయోపిక్ చేయబోతున్నాం. అదేవిధంగా దర్శకుడు వివేక్తో ఢిల్లీ ఫైల్స్ అనే సినిమా ఆలోచనలో వుంది. -
రాధేశ్యామ్కు పోటీ ఇవ్వనున్న చిత్రం ఇదేనా !
Radhe Shyam Vs The Kashmir Files Box Office Collection: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, బుట్టబొమ్మ పూజా హెగ్డే నటించిన రొమాంటిక్ ప్రేమకథా చిత్రం 'రాధేశ్యామ్'. రోమన్ కాలం నాటి రొమాంటిక్ లవ్ స్టోరీతో తెరకెక్కిన ఈ మూవీలో ప్రేమించిన అమ్మాయి జాతకమేమిటో తెలిసిన హీరో.. ఆమెను దక్కించుకోవడం కోసం చేసే సాహసమే రాధేశ్యామ్ కథ. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం మార్చి 11న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. యూవీ క్రియేషన్స్, టీ సిరీస్ బ్యానర్లపై భూషణ్ కుమార్, వంశీ, ప్రమోద్, ప్రసీద సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా ఇప్పటివరకూ బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లే రాబట్టింది. 'రాధేశ్యామ్' ఇండియాలో మొదటి వారంలో సుమారు రూ. 94.50 కోట్లు కొల్లగొట్టింది. అందులో ఒక్క తెలుగు రాష్టాల (తెలంగాణ/ఏపీ) నుంచి రూ. 78.64 కోట్లు సాధించింది. అయితే ప్రపంచవ్యాప్తంగా రూ. 151 కోట్ల గ్రాస్ వసూలు చేసింది 'రాధేశ్యామ్'. చదవండి: అప్పుడే ఓటీటీకి రాధేశ్యామ్, స్ట్రీమింగ్ ఎక్కడంటే.. కాకపోతే ప్రభాస్ పాపులారిటీ, సినిమా ప్రమోషన్స్తో విడుదలైన తొలిరోజు రూ. 46 కోట్లు కొల్లగొట్టింది 'రాధేశ్యామ్'. తర్వాత మిక్స్డ్ పబ్లిక్ టాక్తో రోజురోజూకీ బాక్సాఫీస్ వద్ద వసూళ్లు తగ్గుతున్నాయి. శనివారం (మార్చి 12) రూ. 24. 50 కోట్లు వసూలు చేయగా ఆదివారం (మార్చి 13) రూ. 24 కోట్లు రాబట్టింది. ఈ కలెక్షన్లలో ప్రధానంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచే వచ్చాయి. తెలుగు రాష్ట్రాల్లో రూ. 37.85 కోట్లతో విడుదలైన రోజు ప్రారంభం కాగా శనివారం రూ. 21.48 కోట్లు, ఆదివారం 19.31 కోట్లు వసూళ్లు సాధించింది. నిజానికి పెద్ద హీరోలంటే విడుదలైన రోజు కంటే తర్వాత రోజుల్లో కలెక్షన్లు ఎక్కువగా ఉంటాయి. కానీ రాధేశ్యామ్ మాత్రం మిక్స్డ్ టాక్తో బాక్సాఫీస్ వద్ద వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. #RadheShyam AP/TS Box Office Biz stays STRONG despite mixed response. Day 1 - ₹ 37.85 cr Day 2 - ₹ 21.48 cr Day 3 - ₹ 19.31 cr Total - ₹ 78.64 cr#Prabhas — Manobala Vijayabalan (@ManobalaV) March 14, 2022 చదవండి: ప్రధాని మోదీ మెచ్చిన చిత్రం 'ది కశ్మీర్ ఫైల్స్'.. సినిమాలో ఏముంది ? ఇక అనేక వివాదాలు, బెదిరింపులు ఎదుర్కొని విడుదలైన హిందీ చిత్రం 'ది కశ్మీర్ ఫైల్స్'. ఈ చిత్రానికి సామాజిక అంశాలను ఉన్నది ఉన్నట్లుగా తెరకెక్కించే డైరెక్టర్ వివేక్ రంజన్ అగ్నిహోత్రి దర్శకత్వం వహించారు. అనుపమ్ ఖేర్, మిథున్ చక్రవర్తి వంటి పాపులర్ యాక్టర్స్ నటించిన ఈ చిత్రం 1990లో కశ్మీర్ పండిట్లపై జరిగిన మారణకాండకు అద్దం పడుతుంది. అదే మార్చి 11న విడుదలైన ఈ మూవీ సాధారణ కలెక్షన్లతో ప్రారంభమైంది. తర్వాత ప్రేక్షకులు, విమర్శకులు, ప్రధాని నరేంద్ర మోదీ సైతం ప్రశంసలు కురుపించడంతో మంచి మౌత్ టాక్ సంపాదించుకుంది. దీంతో రోజు రోజుకీ ఈ సినిమా వసూళ్లు పెరిగిపోతున్నాయి. శుక్రవారం విడుదలైన 'ది కశ్మీర్ ఫైల్స్' మొదటి రోజు రూ. 3.55 కోట్లు రాబట్టగా, శనివారం రూ. 8.50 కోట్లు కలెక్ట్ చేసింది. తర్వాత ఆదివారం ఒకేసారి భారీగా రూ. 15.10 కోట్లు వసూళ్లు చేసింది. మొత్తంగా మొదటి వారంలో ఈ మూవీ వసూళ్లు రూ. 27.15 కోట్లకు చేరుకున్నాయి. #TheKashmirFiles shows PHENOMENAL GROWTH… Grows 325.35% on Day 3 [vis-à-vis Day 1], NEW RECORD… Metros + mass belt, multiplexes + single screens, the *opening weekend biz* is TERRIFIC across the board... Fri 3.55 cr, Sat 8.50 cr, Sun 15.10 cr. Total: ₹ 27.15 cr. #India biz. pic.twitter.com/FsKN36sDCp — taran adarsh (@taran_adarsh) March 14, 2022 కలెక్షన్లతో పోల్చుకుంటే 'రాధేశ్యామ్'కు చాలా వెనకంజలో 'ది కశ్మీర్ ఫైల్స్' ఉంది. కానీ రెండు సినిమాలపై ఆడియెన్స్ రెస్పాన్స్ చూస్తుంటే మాత్రం 'రాధేశ్యామ్'ను 'ది కశ్మీర్ ఫైల్స్' కొద్దివరకైనా చేరుకునే అవకాశాలు లేకపోలేదని మూవీ క్రిటిక్స్ అంచనా వేస్తున్నారు. ఏది ఏమైనా రెండు సినిమా కథలను మాత్రం పోల్చి చూడలేం. ఒకటి రొమాంటిక్ లవ్స్టోరీ అయితే మరొకటి నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కింది. అయితే ప్రభాస్ స్టార్డమ్, వరల్డ్వైడ్గా డార్లింగ్ ఉన్న పాపులారిటీని 'ది కశ్మీర్ ఫైల్స్' రీచ్ అవుతుందా ?.. లేదా బీట్ చేస్తుందా ? చూడాలి. చదవండి: డైరెక్టర్ కాళ్లు పట్టుకుని ఏడ్చేసిన మహిళ.. కంటతడి పెట్టిస్తున్న వీడియో -
ప్రధాని మోదీ మెచ్చిన చిత్రం 'ది కశ్మీర్ ఫైల్స్'.. సినిమాలో ఏముంది ?
PM Narendra Modi Appreciates The Kashmir Files Movie Special Story: బాలీవుడ్ దిగ్గజ నటులు మిథున్ చక్రవర్తి, అనుపమ్ ఖేర్, దర్శన్ కుమార్, పల్లవి జోషిలు కీలక పాత్రల్లో నటించిన చిత్రం 'ది కశ్మీర్ ఫైల్స్'. ఈ సినిమాకు ప్రముఖ బీటౌన్ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వం వహించారు. ఆయన ఇదివరకూ 'ది తాష్కెంట్ ఫైల్స్' అనే సినిమాతో బాలీవుడ్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. సామాజిక అంశాలను వెండితెరపై ఆవిష్కరించడంలో వివేక్ అగ్నిహోత్రి అస్సలు వెనుకాడరు. అలా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా తెరకెక్కించిందే 'ది కశ్మీర్ ఫైల్స్'. మార్చి 11న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. విమర్శకులు సైతం ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. అంతేకాకుండా ఈ సినిమాకు హరియానా, మధ్యప్రదేశ్ ప్రభుత్వాలు కూడా తమవంతు సాయంగా పన్ను రాయితీని ప్రకటించాయి. ప్రధాని నరేంద్ర మోదీ సైతం ఈ సినిమాపై ప్రశంసలు కురిపించారు. మరీ ఇంతలా ఆకట్టుకుంటున్నా 'ది కశ్మీర్ ఫైల్స్' సినిమాలో ఏముంది ? ఈ మూవీ కథేంటీ ? అనే సందేహం రాకుండా ఉండదు. ఆ సందేహం వచ్చిన ప్రేక్షకుల కోసమే 'సాక్షి' స్పెషల్ స్టోరీ. కశ్మీర్ పండిట్లపై సాముహిక హత్యాకాండ.. 'ది కశ్మీర్ ఫైల్స్' సినిమా కథ 1990లో కశ్మీర్ పండిట్లపై సాగిన సాముహిక హత్యాకాండకు అద్దం పడుతుంది. కశ్మీర్ లోయలోని ఓ వర్గంపై పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు దారుణ మారణ కాండకు పాల్పడ్డారు. కశ్మీరీ మహిళలను వివస్త్రలుగా చేసి, సాముహిక మానభంగానికి ఒడిగట్టారు. ఆ లోయలో ఉండాలంటే మతం మారాలని, లేదంటే చంపేస్తామని బెదిరించారు. అడ్డుకున్న వారిని అడ్డుతొలగించుకుంటారు. వారి ఆస్తులను దోచుకున్నారు. ఎదురు తిరిగినవారిపై బుల్లెట్ల వర్షం కురిపించారు. తుపాకులు, కత్తులతో దారుణంగా దాడి చేశారు. పాకిస్తాన్ జిహాదీ మూకతో చేతులు కలిపి ఆకృత్యాలకు పాల్పడటం వారిని కలచివేసింది. ఈ దారుణమైన ఉదంతానికి పర్యవసానంగా సుమారు 5 లక్షల మంది కశ్మీరీ పండిట్లు స్వదేశంలోనే శరణార్థులుగా మారారు. దీంతో వివిధ రాష్ట్రాలకు వలస వెళ్లిపోయారు. ఢిల్లీ పురవీధుల ఫుట్పాత్స్పై ఏళ్ల తరబడి జీవితాన్ని గడిపారు. వేలాది కుటుంబాలు చెల్లాచెదురైపోయాయి. బాధ్యతాయుత పౌరుడిగా తీశాను.. నిజాన్ని నిక్కచ్చిగా చెప్పేందుకు, సినిమా రూపంలో తెరకెక్కిచ్చేందుకు ఎంతో గుండె ధైర్యం ఉండాలి. వాస్తవ గాథలను చిత్రీకరిస్తున్నామని చెప్పి అనేకమంది దర్శకనిర్మాతలు వసూళ్ల కోసం కక్కుర్తితో రాజీ పడి రూపొందిస్తుంటారు. కానీ ఎలాంటి రాజీ లేకుండా తెరకెక్కించారు డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి. ‘‘కశ్మీర్లో 1990వ దశకంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి? అనే విషయాలను ‘కశ్మీర్ ఫైల్స్’లో చూపించాం. కశ్మీర్లో జరిగిన అసలు సిసలైన వాస్తవాలు బయటకు రాలేదు. అందుకే బాధ్యతాయుత పౌరుడిగా నేను ఈ సినిమా తీశాను.. నాలుగేళ్లపాటు చాలా కష్టనష్టాలు అనుభవించాను. మా చిత్రం చూసి నిజాలు తెలుసుకోండి.’’ అని హైదరాబాద్లో నిర్వహించిన ఓ సమావేశంలో డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి తెలిపారు. ‘‘గడిచిన 30 ఏళ్లల్లో ‘కశ్మీర్ ఫైల్స్’ లాంటి కథను ఎవరూ తీయలేదు’’ అని నిర్మాత అభిషేక్ అగర్వాల్ పేర్కొన్నారు. సినిమా చూసి కంటతడి పెట్టిన మహిళ.. అయితే మన దేశంలోని కశ్మీర్ ప్రాంతంలో జరిగిన ఈ అత్యంత భయానకమైన ఘటనను వెండితెరపై ఆవిష్కరించడం అంత సులువుకాదు. దర్శకనిర్మాతలకు ఈ సినిమా రూపొందించడం నల్లేరుపై నడకల జరగలేదు. 'ది కశ్మీర్ ఫైల్స్' మూవీ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రికి ఈ చిత్రాన్ని ఆపేయమని బెదిరింపు కాల్స్ కూడా వచ్చాయని పలు ఇంటర్వ్యూల్లో ప్రస్తావించారు. ఈ మూవీని అడ్డుకోవడానికి కోర్టులో వ్యాజ్యాలు సైతం వేశారు. ఇలా ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి 'ది కశ్మీర్ ఫైల్స్'ను ఉన్నది ఉన్నట్లుగా నటీనటుల సహకారంతో వెండితెరపై ఆవిష్కరించారు. ఇందులో ప్రతీ సన్నివేశం, నటీనటుల భావోద్వేగపు యాక్టింగ్ ప్రేక్షకులను కదిలించేలా ఉన్నాయని చెబుతున్నారు. ఈ సినిమా చూసిన అనేక మంది ప్రేక్షకులు భావోద్వేగానికి లోనయి కంటతడి పెట్టుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోను క్రికెటర్ సురేష్ రైనా తన ట్విటర్ హ్యాండిల్లో షేర్ చేశారు. ఈ వీడియోలో ఒక మహిళ వివేక్ పాదాలు తాకడం, సినిమా గురించి తన భావాన్ని వ్యక్తపరుస్తూ బిగ్గరగా ఏడవడం మనం చూడొచ్చు. అనంతరం డైరెక్టర్ వివేక్, నటుడు దర్శన్ కుమార్ ఆ మహిళను ఓదార్చారు. ఆమె కన్నీళ్లు పెట్టుకోవడం చూసి డైరెక్టర్, దర్శన్ కుమార్ సైతం కంటతడి పెట్టుకున్నారు. ప్రేక్షకుల నీరాజానలు అందుకుంటున్న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా మార్చి 11న విడుదలు కాగా మన దేశంలో 561 థియేటర్లలో, ఓవర్సీస్లో 113 స్క్రీన్స్లలో ప్రదర్శించబడుతోంది. Presenting #TheKashmirFiles It’s your film now. If the film touches your heart, I’d request you to raise your voice for the #RightToJustice and heal the victims of Kashmir Genocide.@vivekagnihotri @AnupamPKher @AdityaRajKaul pic.twitter.com/Gnwg0wlPKU — Suresh Raina🇮🇳 (@ImRaina) March 11, 2022 -
నిజ సంఘటనల ఆధారంగా ‘కశ్మీర్ ఫైల్స్’
‘‘కశ్మీర్లో 1990వ దశకంలో హిందూ పండితులను టార్గెట్ చేసి టెర్రరిస్టులు ఊచకోత కోశారు. అనంతరం ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి? అనే విషయాలను ‘కశ్మీర్ ఫైల్స్’లో చూపించాం. మా చిత్రం చూసి నిజాలు తెలుసుకోండి’’ అని డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి అన్నారు. దర్శన్ కుమార్, మిథున్ చక్రవర్తి, అనుపమ్ ఖేర్, పల్లవి జోషి, చిన్మయ్ మాండ్లేకర్, ప్రకాష్ బెలవాడి, పునీత్ ఇస్సార్ నటించిన చిత్రం ‘కశ్మీర్ ఫైల్స్’. వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వంలో అభిషేక్ అగర్వాల్, పల్లవి జోషి నిర్మించిన ఈ హిందీ చిత్రం శుక్రవారం విడుదలవుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్లో నిర్వహించిన సమావేశంలో వివేక్ అగ్నిహోత్రి మాట్లాడుతూ..‘‘కశ్మీర్లో జరిగిన అసలు సిసలైన వాస్తవాలు బయటకు రాలేదు. అందుకే బాధ్యతాయుత పౌరుడిగా నేను ఈ సినిమా తీశాను.. నాలుగేళ్లపాటు చాలా కష్టనష్టాలు అనుభవించాను’’ అన్నారు. ‘‘గడచిన 30 ఏళ్లల్లో ‘కశ్మీర్ ఫైల్స్’ లాంటి కథను ఎవరూ తీయలేదు’’ అన్నారు అభిషేక్ అగర్వాల్. ‘‘మాపై నమ్మకంతో సినిమా విడుదలకు సహకరిస్తున్న తేజ్ నారాయణ్, అభిషేక్లకు థ్యాంక్స్’’ అన్నారు పల్లవి జోషి. నటుడు దర్శన్ కుమార్, బీజేపీ నాయకుడు రామచంద్రరావు, పరిపూర్ణానంద స్వామి తదితరులు మాట్లాడారు. -
భావోద్వేగంగా 'ది కశ్మీర్ ఫైల్స్' ట్రైలర్.. కంగనా ప్రశంసలు
The Kashmir Files Movie Trailer Out And Released In March: అనుపమ్ ఖేర్, మిథున్ చక్రవర్తి, దర్శన్ కుమార్, పల్లవి జోషి కీలకపాత్రల్లో నటించిన హిందీ చిత్రం 'ది కశ్మీర్ ఫైల్స్'. 90వ దశకంలో కశ్మీర్ పండిట్లపై సాగిన సాముహిక హత్యాకాండ నేపథ్యంలో తెరకెక్కింది ఈ సినిమా. 'ది తాష్కెంట్ ఫైల్స్' సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వం వహించారు. ఈ సినిమా ట్రైలర్ సోమవారం (ఫిబ్రవరి 21) విడుదలైంది. ఆద్యంతం ఉత్కంఠభరితంగా, భావోద్వేగంగా ఉంది మూవీ ట్రైలర్. 1990 సంవత్సరంలో కశ్మీర్లోని ఒక సామాజిక వర్గంపై జరిగిన హత్యలను డైరెక్టర్ వివేక్ భావోద్వేగంగా చూపించనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రం ట్రైలర్పై బాలీవుడ్ డేరింగ్ హీరోయిన్ కంగనా రనౌత్ ప్రశంసలు కురిపించింది. సినిమాను చాలా బాగా తీశారని ట్రైలర్ చూస్తే అర్థమవుతోందని, ఈ సినిమా విడుదల కోసం ఎదురు చూస్తున్నట్లు పేర్కొంది. 'ది కశ్మీర్ ఫైల్స్' సినిమా మార్చి 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
‘ఛీ నువ్వు ఏం బాగాలేవు.... ఎండు చేపలా ఉన్నావు’
ముంబై: మనకు మనం బాగానే ఉన్నట్లు కనిపిస్తాం. కానీ మన అమ్మలకు మనం ఎప్పుడూ చిన్నపిల్లలే అన్నట్లుగా మనల్ని ఎప్పడూ చూసిన సన్నగా ఉన్నారంటూ తిడుతుంటారు. మనకేమో మనం బాగానే ఉన్నాం అనిపిస్తుంది. కానీ ఇక్కడ బాలీవుడ్ నటుడు అనుపమ ఖేర్ని సన్నగా ఉన్నావు, నువ్వేం బాగోలేదు అంటూ వాళ్లమ్మ దులారీ ఖేర్ తిడుతుంటుంది. (చదవండి: వీటి స్నేహం బంధం చాలా గొప్పది) పైగా నువ్వు ఎండు చేపలా ఉన్నావు అంటూ పోల్చి మరీ తిడుతుంది. ఆఖరికి అనుపమ్ తాను తింటున్న పరాటాను చూపించనప్పడూ కూడా అతని తల్లి ఆగకుండా రకరకాల హావాభావాలు పెట్టి మరీ తిడుతూనే ఉంటుంది. ఈ మేరకు అనుపమ్ మాట్లాడుతూ.."ఒక నెల తర్వాత అమ్మ నన్ను చూడటంతో ఇలా తిడుతుందని చెబుతున్నారు. తిడితే తిట్టింది గారీ నాకు రెండు మంచి షర్ట్లు తీసుకు వచ్చింది. పైగా మా అమ్మకు నేను చేసిన పరాట కూడా ఆమెకు బాగా నచ్చింది. ఆమె ఉన్నప్పుడూ నిస్తేజంగా ఉండటం అస్సలు కుదరదు. ఆమె లాగానే అందరూ సందడిగా ఉండాల్సిందే. " అన్నారు. (చదవండి: బంపరాఫర్.. ఆ షాపులో ఒక డ్రెస్ ఖరీదు రూ.1 మాత్రమే..!) -
Apple: ఏంది యాపిల్ ఇది.. భారత్ అంటే లెక్కేలేదా?
Anupam Kher On Apple: యాపిల్ ఉత్పత్తుల పట్ల భారతీయులకు యమ క్రేజు ఉంటుంది. పైగా ఆ ప్రొడక్టుల కొనుగోళ్లలో భారత్ అతిపెద్ద మార్కెట్ అని తెలిసిన విషయమే కదా. అందుకే తాజాగా జరిగిన అతిపెద్ద ఈవెంట్ను భారత్ నుంచే ఎక్కువ మంది లైవ్లో వీక్షించారు. అయితే యాపిల్ మాత్రం భారత్ విషయంలో లెక్కలేని తనం ప్రదర్శిస్తోందా? అని ప్రశ్నిస్తున్నారు సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్. నటుడు అనుపమ్ ఖేర్ ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్నారు. న్యూయార్క్ ఫిఫ్త్ ఎవెన్యూలోని యాపిల్ స్టోర్ను మొన్న మంగళవారం ఆయన సందర్శించారట. అక్కడ ఒలింపిక్స్ కలెక్షన్ పేరుతో కొన్ని వాచీలను డిస్ప్లే ఉంచారు. ఆ వాచీలపై దాదాపు అన్ని జెండాలు ఆయనకు కనిపించాయి. అయితే భారత్ జెండా కనిపించకపోయే సరికి ఆయన చిన్నబుచ్చుకున్నారు. ట్విటర్లో ఓ వీడియో పోస్ట్ పెట్టారు. స్మార్ట్ వాచీ కలెక్షన్ బాగుంది. కెనెడా, ఆసీస్, ఫ్రాన్స్.. జమైకా లాంటి చిన్న దేశాల జెండాలతో కలెక్షన్స్ ఉంచారు. కానీ, అందులో భారత్ జెండా మాత్రం లేదు. ఈ విషయంలో నిరాశ చెందాను.. కారణం ఏమై ఉంటుంది? యాపిల్ ఉత్పత్తులను ఉపయోగించేవాళ్లు భారత్లోనే ఎక్కువగా ఉన్నారు కదా! మరి మా జెండా కనిపించలేదా? అని అసంతృప్తి వ్యక్తం చేశారాయన. ఇదిలా ఉంటే యాపిల్ ఈ వ్యవహారంపై ఎలా స్పందిస్తుందో చూడాలి మరి! Dear @Apple! Visited your store on 5th ave in NY! Impressive! There were watches of International Olympic collection representing flags of various countries! Was disappointed not to see INDIA’s watch there? I wonder why? We are one of the largest consumers of #Apple products!😳🇮🇳 pic.twitter.com/IVvB8TmkGU — Anupam Kher (@AnupamPKher) September 14, 2021 చదవండి: ఐఫోన్ 13 లాంఛ్.. ఊహించని ట్విస్ట్ -
ముగ్గురు మిత్రుల కథ
బాలీవుడ్ సీనియర్ నటులు అమితాబ్ బచ్చన్, అనుపమ్ ఖేర్, బొమన్ ఇరానీ కలిసి ఓ సినిమాలో నటించనున్నారు. ‘మైనే ప్యార్ కియా’, ‘హమ్ ఆప్కే ౖహె∙కౌన్’, ‘ప్రేమ రతన్ ధన్ పాయో’ వంటి చిత్రాలను తెరకెక్కించిన సూరజ్ బర్జాత్యా ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు. ఈ సినిమాకు ‘ఊంచాయీ’ అనే టైటిల్ అనుకుంటున్నారని బాలీవుడ్ టాక్. ముగ్గురి వ్యక్తుల జీవితాల్లోని స్నేహం ఆధారంగా ఈ సినిమా రూపుదిద్దుకోనుందని సమాచారం. ‘‘మే డే’ (అజయ్ దేవగన్ దర్శకత్వం వహిస్తూ, నటిస్తున్న చిత్రం) షూటింగ్లో అమితాబ్ బచ్చన్ను కలిశాను. సూరజ్ డైరెక్షన్లోని సినిమా గురించి మాట్లాడుకున్నాం. ఆ తర్వాత ఓ రోజు అనుపమ్ ఖేర్ ఫోన్ చేసి.. ‘ఇంకా ఏంటి ఆలస్యం.. టీమ్లోకి వచ్చెయ్’ అన్నారు. అంతే.. నేను కూడా ఈ సినిమా చేయడానికి సిద్ధమైపోయాను’’ అని పేర్కొన్నారు బొమన్ ఇరానీ. ఈ సినిమా షూటింగ్ను ఈ ఏడాది సెప్టెంబరులో ప్రారంభించాలనుకుంటున్నారు. -
ప్రముఖ సీనియర్ నటికి బ్లడ్ క్యాన్సర్..
ముంబై : బీజేపీ చండీగఢ్ ఎంపీ, సీనియర్ నటి కిరణ్ ఖేర్ అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఓ రకమైన బ్లడ్ క్యాన్సర్కు గురైన కిరణ్ ప్రస్తుతం ముంబైలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయాన్ని చండీఘడ్ బీజేపీ అధ్యక్షుడు అరుణ్ సూద్ బుధవారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ. .కిరణ్ ఖేర్ గత సంవత్సరం నవంబర్ 11న చండీగఢ్లోని తన ఇంట్లో పడిపోవడం వల్ల ఎడమ చేయి విరిగిందని, దీంతో చండీగఢ్లోని పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (పీజీఐఎంఆర్)లో వైద్య పరీక్షలు నిర్వహించారన్నారు. ఇందులో ఆమెకు మల్టిపుల్ మైలోమా ఉన్నట్లు నిర్ధారణ అయ్యిందన్నారు. అనంతరం ఈ వ్యాధి ఆమె ఎడమ చేతి నుంచి కుడి భుజానికి వ్యాపించిందని, వైద్యం కోసం డిసెంబర్ 4న ముంబైలోని ఆసుపత్రిలో చేరిందని పేర్కొన్నారు. నాలుగు నెలల చికిత్స పొందుతున్న కిరణ్ ప్రస్తుతం కోలుకుంటున్నారని ఆమెను ఇకపై ముంబైలోని కోకిలాబెన్ ఆసుపత్రిలో చేరనవసరం లేదన్నారు. కేవలం సాధారణ చికిత్స కోసం ఆసుపత్రిని సందర్శించాల్సి ఉంటుందని అరుణ్ సూద్ తెలిపారు. కాగా కిరణ్ బాలీవుడ్ విలక్షణ నటుడు అనుపమ్ ఖేర్ భార్య అన్న విషయం తెలిసిందే. అనుపమ్ కూడా తన ఆరోగ్యంపై స్పందిచారు. కిరణ్ ఆరోగ్యంపై వస్తున్న పుకార్లకు స్వస్తి పలుకుతూ ఆమెకు రక్త క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయినట్లు తెలిపారు. ఈ మేరకు ట్విటర్లో ఓ పోస్టు పెట్టారు. ‘కిరణ్ మల్టిపుల్ మైలోమాతో బాధపడుతున్నారని మీ అందరికీ తెలియజేయాలనుకుంటున్నాను. ప్రస్తుతం ఆమె చికిత్స పొందుతోంది. త్వరలోనే సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి వస్తుందని మేము ఆశిస్తున్నాం. ఆమె ఎంతో అదృష్టవంతురాలు. అందుకే ఆమెను మీరు ఇంతలా ప్రేమిస్తున్నారు. మీ హృదయంలో ఆమె కోలుకోవాలని ప్రార్థించండి. మీ అందరి ప్రేమకు కృతజ్ఞతలు- అనుపమ్, సికందర్’.. అని ట్వీట్ చేశారు. కాగా కిరణ్ ఖేర్ 2014లో బీజేపీ పార్టీ తరపున చండీగఢ్ ఎంపీగా ఎన్నికయ్యారు. అనంతరం 2019లోనూ గెలిచి తన స్థానాన్ని నిలుపుకున్నారు. చదవండి: రైల్వే ప్లాట్ఫామ్పై పడుకున్న రోజులూ ఉన్నాయి: నటుడు ‘పెళ్లైన ఆ స్టార్ హీరోతో నయనతార సహజీవనం’ 🙏 pic.twitter.com/3C0dcWwch4 — Anupam Kher (@AnupamPKher) April 1, 2021 -
బాహుబలి లండన్ లో చూసాను : అనుపమ్ ఖేర్
-
‘ది పవర్ ఆఫ్ పాజిటివిటీ’ ముఖ్య అతిథిగా అనుపమ్ఖేర్
-
రైల్వే ప్లాట్ఫామ్పై పడుకున్న రోజులూ ఉన్నాయి: నటుడు
సాక్షి, హైదరాబాద్: నగరంలోని ఫిక్కీ ఫ్లో ఆర్గనైజేషన్ ‘ది పవర్ ఆఫ్ పాజిటివిటీ’ పేరుతో హోటల్ ఐటీసీ కాకతీయలో 2020–21 వార్షిక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో ఇండియన్ లెజండరీ యాక్టర్, మోటివేషనల్ స్పీకర్, రచయిత, అనుపమ్ఖేర్ ముఖ్య అతిథిగా పాల్గొని మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన ఏమన్నారంటే.. కేరాఫ్ రైల్వే ప్లాట్ఫామ్.. నగరంలో మంచి అనుభవాలు ఉన్నాయి. గతంలో తెలుగు సినిమా ‘త్రిమూర్తులు’లో నటించడానికి ఇక్కడికి వచ్చాను. నేను నటిస్తున్న మరో తెలుగు సినిమా కార్తికేయ– 2 త్వరలో షూటింగ్ ప్రారంభం కానుంది. 27 ఏళ్ల వయసులో సినిమాల కోసం వచ్చిన నేను మొదట్లో ముంబైలో చిన్న చిన్న పనులు చేసుకుంటూ రైల్వే ప్లాట్ఫామ్పై పడుకున్న రోజులూ ఉన్నాయి. మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన నాకు మహేష్భట్ సినిమాలో అవకాశం వచ్చేంత వరకు ఎన్నో కష్టాలు పడ్డాను. ఇండియన్ సినిమా.. లార్జర్ దెన్ లైఫ్.. నాకు తెలిసినంత వరకు భారతీయులు సినిమాని లార్జర్ దెన్ లైఫ్గా భావిస్తారు. అందుకే ఇండియాకి సినిమా అనేది లార్జర్ దెన్ లైఫ్గా మారింది. ఇక్కడి ఆర్టిస్టులు అన్ని కోణాల్లో నటించినట్టు విదేశీ నటులు నటించలేరు. మన దగ్గరా గొప్ప సినిమాలు వస్తున్నాయి. నేను లండన్లో బాహుబ లి సినిమాను చూశాను. ఇది ఒక తెలుగు సినిమాగా చూడను. భారతీయ సినిమాగానే చూస్తా ను. నా జీవితంలో బోర్, మూడ్ అనే పదాలకు దూరంగా ఉన్నాను. ఎప్పుడూ జీవితాన్ని ఆస్వాదిస్తూ, విభిన్న రకాల మనుçషులని కలవడాన్ని ఇష్టపడతాను. ఇప్పటి వరకు మూడు పుస్తకాలు రాశాను. ముఖ్యంగా కోవిడ్ సమయంలో ‘యువర్ బెస్ట్ డే ఈస్ టుడే’ అనే బుక్ని రాశాను. ఈ సమయంలో అంతా విషాదం నిండి ఉంది. రిషి కపూర్, ఇర్పాన్ఖాన్ లాంటి వ్యక్తులనే కాకుండా చుట్టూ ఎంతో మందిని కోల్పోయాం. ఆ సమయంలో పాజిటివిటీని, ఆశావాదాన్ని నింపడానికి నా ఆలోచనలతో దీనిని రాశాను’ అన్నారు. కార్యక్రమంలో ఫిక్కీ ఫ్లో చైర్పర్సన్ ఉషారాణి మన్నె, పింకీ రెడ్డి, అపూర్వ జైన్, రేఖారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
సల్మాన్ఖాన్ కాదండీ.. ఇంతకీ ఎవరండీ?
తిండి కలిగినంత మాత్రాన ‘కండ’ కలదు... అనే విషయంలో గ్యారెంటీ ఏమీలేదు. తిండికి తగినట్లు తగిన వ్యాయామాలు చేయాలి. అప్పుడే కండ. లేనిచో ‘బొజ్జ కలదోయ్’ అనుకోవాల్సి వస్తుంది. ఫిన్నెస్పై శ్రద్ధ పెట్టడం అనేది శారీరక, మానసిక ఆరోగ్యానికి మస్తు మంచిది అనే విషయం తెలిసినా చాలామంది ‘ఆ..ఈ వయసులో ఏంచేస్తాం లెండి’ అని తప్పించుకుంటుంటారు. కొందరేమో ‘బిజీ’ అంటూ సాకులు వెదుక్కుంటారు. ప్రముఖ బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ను చూడండి. అతని వయసు 65 సంవత్సరాలు. ‘ఈ వయసులో ఏమిటీ’ అని ఎప్పుడూ అనుకోలేదు. క్రమం తప్పకుండా వ్యాయామాలు చేస్తూనే ఉంటారు. రకరకాల కసరత్తులతో చూడముచ్చటగా తీర్చిదిద్దుకున్న తన బాడీకి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు ఖేర్. ‘ఎన్నడూ ఒప్పుకోవద్దు ఓటమి’ అని కామెంట్ కూడా పెట్టారు. అంతే కదా మరి! చదవండి: పవన్ కల్యాణ్ అడిగితే.. ఆయనకు 4వ భార్యగా ఉంటా.. -
నిన్ను ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటా: హీరో
ఫిబ్రవరి 3 తన తల్లి మోనా కపూర్ పుట్టిన రోజు సందర్భంగా బాలీవుడ్ హీరో అర్జున్ కపూర్ ఒక మనసును తాకే వీడియోను విడుదల చేశాడు. ‘అమ్మ పుట్టినరోజు నేడు. తను ఉంటే ఎంత హడావిడి ఉండేదో. నేను నా అభిమానులకు చెప్పేది ఒక్కటే. జీవితంలో ఎప్పుడు ఏమి జరుగుతుందో చెప్పలేము. కనుక మన కుటుంబ సభ్యులతో వీలైనంత ఎక్కువ సమయం గడపండి’ అని ఆ వీడియోలో పేర్కొన్నాడు. నిజానికి అర్జున్ కపూర్ బాల్యం అంత సుఖంగా సాగలేదు. అతడు ప్రఖ్యాత నిర్మాత బోనీ కపూర్ కుమారుడు. ఇద్దరు పిల్లలు పుట్టాక బోనీ కపూర్ నటి శ్రీదేవిని వివాహం చేసుకున్నారు. ఈ వివాహం బోనీ కపూర్ కుటుంబంలో సహజంగానే తుఫాన్ రేపింది. బోనీ కపూర్ భార్య మోనా కపూర్ బోనీ కపూర్ నుంచి దూరంగా వచ్చేసింది. బోనీ కపూర్ మీద కొంచెం కూడా ఆధారపడకుండా జీవించ దలుచుకుంది. కొడుకు అర్జున్ కపూర్, కుమార్తె అన్షులా కపూర్ ఆ కారణం వల్ల తల్లితో విపరీతంగా అటాచ్మెంట్ పెంచుకున్నారు. అర్జున్ కపూర్కు తండ్రి రెండో పెళ్లి సమయానికి 12 ఏళ్లు. 1996లో బోనీకపూర్కు శ్రీదేవితో పెళ్లి జరిగాక ఆ వంటరితనం వల్ల మోనా కపూర్ చాలా బాధలే పడింది. 2012లో మరణించింది. ఆమె మరణించిన 6 సంవత్సరాలకు శ్రీదేవి మరణించింది. తండ్రి ప్రేమకు దూరమైన అర్జున్ కపూర్ తల్లిని కూడా దూరం చేసుకుని ఆ బాధ తనలో ఎప్పటికీ చెరిగిపోదని చెప్పాడు. ‘అమ్మా... నిన్ను నేను ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాను’ అన్నాడు ఆ వీడియోలో. (చదవండి: అవి ఉంటేనే మజా!: జాన్వీ కపూర్) అమ్మను ఆటపట్టించే కొడుకు నటుడు అనుపమ్ ఖేర్కు తల్లి దులారి అంటే ఎంతో ప్రేమ. ఆమెకు చిన్న కష్టం వచ్చినా తట్టుకోలేడు. నటుడుగా ఎంత పేరున్నా తల్లి ముందు కొడుకులా ఆమెతో కబుర్లలో మునిగిపోతాడు. అంతే కాదు... ఆమెతో టైమ్పాస్ సంభాషణలు రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటాడు. ఇటీవల అతను విడుదల చేసిన వీడియో జనానికి నచ్చింది. అందులో అతడు తన తల్లిని ‘అమ్మా... నీకు ఇంగ్లిష్ వచ్చా’ అని అడిగితే ఆమె ‘రాదు... నాకు ఇంగ్లిష్ రాదు... నేను చిన్నప్పుడు నీలాంటి అబ్బాయిలతో ఆడుకోవడానికి వెళ్లిపోయేదాన్ని స్కూల్ ఎగ్గొట్టి. ఒకణ్ణి కొడితే వేలు విరిగిపోయింది... చూడు ఇప్పటికీ ఉంది ఆ వంకర’ అని ఆమె ఆ వీడియోలో చూపించింది. అప్పుడు అక్కడే ఉన్న తన తమ్ముడు రాజు ఖేర్ గురించి అనుపమ్ ఖేర్ తల్లికి ఫిర్యాదు చేస్తూ ‘చూడమ్మా.. వాడు రాత్రి ఎనిమిదిన్నరకు టీ తాగుతున్నాడు’ అనంటే ఆమె ‘ఆకలిగా ఉందేమోరా.. నిజమే.. ఈ టైమ్లో టీ తాగితే అడ్జస్ట్ కాదు’ అంది. ‘అడ్జస్ట్ కాదమ్మా... డైజెస్ట్’ అని అనుపమ్ ఖేర్ ఆటపట్టించాడు. ‘పెద్ద చెప్పొచ్చావులేరా గాడిదా’ అందామె. కొడుకు ఎంత పెద్దవాడైనా ఆ కొడుకును తిట్టగలిగే శక్తి ఒక్క అమ్మకే కదా ఉంది. View this post on Instagram A post shared by Arjun Kapoor (@arjunkapoor) View this post on Instagram A post shared by Anupam Kher (@anupampkher) -
భయం ఎందుకు?
వివేక్ రంజన్ అగ్నిహోత్రీ దర్శకత్వంలో తెలుగు నిర్మాత అభిషేక్ అగర్వాల్ తీస్తున్న హిందీ చిత్రం ‘ది కశ్మీరీ ఫైల్స్’. ‘‘కశ్మీరీ హిందువులపై సాగిన మారణహోమం గురించి ఇంతవరకూ ఎవ్వరూ సినిమా తీయలేదు. ఆ కథ అందరికీ తెలియజేయాలనుకున్నా’’ అని సినిమాకి శ్రీకారం చుట్టినప్పుడే వివేక్ పేర్కొన్నారు. కశ్మీర్లో ఈ చిత్రం షూటింగ్ జరిపారు. కాగా, ఈ చిత్రాన్ని తీసినవాళ్లను, చూసే ప్రేక్షకులను వదిలేదు లేదంటూ కశ్మీరీ మిలిటెంట్ గ్రూప్ బెదిరించినట్లుగా తాజాగా వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో సోమవారం చిత్ర నిర్మాత అభిషేక్ అగర్వాల్ హైదరాబాద్లోని జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ‘‘ఇంకా ఈ సినిమా ఎడిటింగ్ కూడా మొదలుపెట్టలేదు. వాళ్లెందుకు భయపడుతున్నారు? నిజానికా? నిజాన్ని నిర్భయంగా చెప్పాలనుకుంటున్న మమ్మల్ని ఆశీర్వదించండి’’ అని ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు అభిషేక్ అగర్వాల్. మిథున్ చక్రవర్తి, అనుపమ్ ఖేర్ కీలక పాత్రలు చేసిన ఈ చిత్రాన్ని ఏప్రిల్లో విడుదల చేయాలనుకుంటున్నారు. -
ఓటమి అనేది సంఘటన మాత్రమే
‘‘36 ఏళ్ల క్రితం సిమ్లా నుండి ఎన్నో ఆశలతో ముంౖబైలో అడుగుపెట్టాను. నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాలో శిక్షణ తీసుకుని, ప్రపంచ సాహిత్యాన్ని చదువుకుని ఎంతో ఆత్మవిశ్వాసంతో సినిమా ప్రపంచంలోకి వచ్చాను. నా మొదటి సినిమా ‘సారాన్ష్’ (1984)లో నటించినప్పుడు నా వయసు 29. ఆ చిత్రంలో నేను చేసిన తండ్రి పాత్ర వయసు 65’’ అని అప్పటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు ప్రముఖ హిందీ నటుడు అనుపమ్ ఖేర్. ఆయన వయసు ప్రస్తుతం 65. కెరీర్ ప్రారంభించినప్పటి విశేషాలను అనుపమ్ ఖేర్ చెబుతూ – ‘‘36 ఏళ్ల క్రితం బాలీవుడ్కు ఎన్నో కలలను మోసుకొని వచ్చాను. నా మొదటి సినిమా చేసినప్పుడు చాలామంది నాతో ‘అంత పెద్ద వయసున్న పాత్ర చేయటం వల్ల నీ జీవితం సర్వనాశనం కావడం ఖాయం’ అన్నారు. వాళ్లు అన్నట్లుగానే ఆ సినిమా అంతగా ఆడలేదు. వాళ్లు అన్న మాటలను పట్టించుకుని నేను నిరాశపడి ఉంటే ఈ రోజు అనుపమ్ ఖేర్ ఉండేవాడు కాదు. నా చిన్నప్పుడు మా నాన్న ఎప్పుడూ ఓ మాట చెప్పేవారు. అదేంటంటే.. ఓటమి అనేది జీవితంలో ఓ సంఘటన మాత్రమే. జీవితమే ఓటమి కాదు అని. ఆ మాటను నేనెప్పుడూ గుర్తు పెట్టుకుంటాను. ‘సారాన్ష్’ తర్వాత రెండున్నరేళ్లకు తొలి విజయం వచ్చింది. కష్టాలు వచ్చినా నవ్వుతూ దిగమింగేవాడిని కానీ నిరాశకు లోనయ్యేవాడిని కాదు. రాజ్కపూర్ సాబ్, అమితాబ్గారు, రాబర్ట్ డి నిరో లాంటి నటులతో పని చే సినందుకు ఎంతో గర్వంగా ఉంటుంది. ఓ 515 చిత్రాలు చేసిన తర్వాత కొత్తగా నిరూపించుకోవటానికి ఏముంటుంది? కానీ కెమెరా ముందుకు వెళ్లిన ప్రతిసారీ ‘మనం న్యూకమర్’ అనుకుని పనిచేస్తాను. అది వృత్తిపరంగా నాకెంతో తృప్తినిస్తుంది’’ అన్నారు. -
నటుడి కుటుంబంలో నలుగురికి కరోనా
-
నటుడి కుటుంబంలో నలుగురికి కరోనా
ముంబై: కరోనా మహమ్మారి ఎవ్వరినీ వదలట్లేదు... నెమ్మదిగా బాలీవుడ్లో పాగా వేసిన ఈ వైరస్ ప్రముఖుల ఇంట్లోకి చొరబడుతోంది. ఇప్పటికే బిగ్బీ అమితాబ్ బచ్చన్, ఆయన కుమారుడు అభిషేక్ బచ్చన్కు కోవిడ్ సోకినట్లు నిర్ధారణ అయింది. ఈ విషయం చిత్ర పరిశ్రమను షాక్కు గురి చేసింది. వారు త్వరగా కోలుకోవాలని ఆంక్షిస్తూ అనేకమంది సెలబ్రిటీలు, అభిమానులు చేస్తున్న పోస్టులతో సోషల్ మీడియా తడిసి ముద్దవుతోంది. ఈ క్రమంలో మరో బాలీవుడ్ నటుడి ఇంట కరోనా కేసులు వెలుగు చూడటం ఆందోళన కలిగిస్తోంది. అనుపమ్ ఖేర్ కుటుంబంలో ఒకేసారి నాలుగు కేసులు బయటపడ్డాయి. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడిస్తూ ఆదివారం ట్విటర్లో వీడియో రిలీజ్ చేశారు. (అమితాబ్, అభిషేక్లకు కరోనా) "అమ్మ దులారి కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతోంది. ఆస్పత్రికి తీసుకెళ్లగా కోవిడ్ ఉన్నట్లు తేలింది. అయితే ఆమెలో కరోనా లక్షణాలు తక్కువగా ఉన్నాయి. ప్రస్తుతం ఆమెను ముంబైలోని కోకిలాబెన్ ఆస్పత్రిలో చేర్పించాం. ఆమెతో పాటు తమ్ముడు(రాజు ఖేర్), మరదలు, మేనకోడలు కూడా కరోనా బారిన పడినట్లు నిర్ధారణ అయింది. వీరి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. బీఎంసీ అధికారులు, వైద్యులు మాకు ఎంతగానో సహకరించారు. నేను కూడా పరీక్ష చేయించుకోగా నెగెటివ్ అని వచ్చింది. ప్రస్తుతం మేము హోమ్ క్వారంటైన్లో ఉన్నాం. సోదరుడి ఇంటిని శానిటైజ్ చేస్తున్నారు" అని అనుపమ్ పేర్కొన్నారు. (నటి కుటుంబం మొత్తానికి సోకిన కరోనా) -
‘మైఖేల్ జాక్సన్ బాడీగార్డులు నన్ను తోసేశారు’
బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ ఇన్స్టాగ్రామ్ వేదికగా ఓ ప్రత్యేక ఫోటోని షేర్ చేశారు. 1996లో మైఖేల్ జాక్సన్ భారతదేశం వచ్చినప్పుడు తీసిన ఫోటో ఇది. పాప్ మహారాజు మైఖేల్ జాక్సన్తో కలిసి ఉన్న ఫోటోను షేర్ చేసిన అనుపమ్ ఖేర్.. ఆనాడు జరిగిన ఓ సంఘటనను అభిమానులతో పంచుకున్నారు. మైఖేల్ జాక్సన్ను చూడటం కోసం తాను బారికేడ్లను తొలగించి ముందుకు వెళ్లానని.. ఆ సమయంలో జాక్సన్ బాడీగార్డులు తనను తోసేశారని తెలిపారు. (‘మన పెళ్లి నిన్ననే జరిగినట్లు అనిపిస్తోంది’) అనుపమ్ ఖేర్ మాట్లాడుతూ.. ‘1996లో మైఖేల్ జాక్సన్ ఇండియా వచ్చారు. హోటల్ ఒబెరాయ్లో బస చేశారు. ఆయనను కలవడానికి భారత ప్రభుత్వం కొందరిని మాత్రమే ఎంపిక చేసింది. అదృష్టవశాత్తు వారిలో నేను కూడా ఉన్నాను. ఆ రోజు సాయంత్రం ఒబెరాయ్ హోటల్లో జాక్సన్ను కలిసే కార్యక్రమం ఏర్పాటు చేశారు. అక్కడ పాప్ మహారాజు కోసం ఓ ప్రత్యేక వేదికని ఏర్పాటు చేశారు. దాని మీద మైఖేల్ జాక్సన్ నిల్చుని ఉన్నాడు. చుట్టూ బాడీగార్డులున్నారు. నాతో పాటు ఎంపిక చేసిన మరికొందరు జాక్సన్ను కలవడానికి లైన్లో నిల్చుని ఉన్నాం. మరి కొద్ది క్షణాల్లో నేను జాక్సన్ని కలుస్తాను. కానీ సంతోషం తట్టుకోలేక బారికేడ్లను తొలగించి ముందుకు వెళ్లాను. ఆయనను హత్తుకునే ప్రయత్నం చేశాను’ అన్నారు. (వైరల్: నువ్వు మామూలు తల్లివి కాదమ్మా!..) అనుపమ్ ఖేర్ మాట్లాడుతూ.. ‘కానీ పక్కనే ఉన్న జాక్సన్ బాడీ గార్డులు నన్ను తోసేసే ప్రయత్నం చేశారు. ఇంతలో భరత్ భాయి షా అక్కడకు పరిగెత్తుకు వచ్చి నన్ను జాక్సన్కు పరిచయం చేశాడు. ‘ఇతడు అనుపమ్ ఖేర్. భారతీయ ప్రముఖ నటులలో ఒకరు’ అన్నాడు. అప్పుడు వెంటనే జాక్సన్ మర్యాదపూర్వకంగా వంగి.. నాకు షేక్ హ్యాండ్ ఇచ్చాడు. ఆ సమయంలో తీసిన ఫోటో ఇది’ అని చెప్పుకొచ్చారు అనుపమ్ ఖేర్. (ఆ విషయం మైకేల్ జాక్సన్ ముందే చెప్పారు) View this post on Instagram Story of this picture!! When Michael Jackson visited India in 1996 a group of selected people were invited to meet him exclusively at Oberoi hotel gardens. I was also the lucky one. Thanks to Bharat Bhai Shah. There was a small stage set up in the garden with a barricade for the special guests. MJ walked down from his suite and stood on the improvised stage with his bodyguards. There was silence and sense of awe among the selected guests. I was looking at this magician who had enthralled and hypnotised the entire universe with his electrifying performances. He was just few feet away from me. I wanted to capture this moment. So I broke the barricade jumped on the stage and almost hugged MJ. The bodyguards rushed towards me and before they could pick me up bodily Bharat Bhai Shah in panic introduced me to Michael Jackson as the biggest actor in India. He immediately and politely bent down and shook a jubilant me’s hands. And my history was captured in this picture. Sometimes you have to make an effort to create Kucch Bhi Ho Sakta Hai moments. Jai Ho!! 😍😍😎🤓 Pic courtesy my friend @timmins.andre. #MichaelJackson #Overwhelming A post shared by Anupam Kher (@anupampkher) on Jun 29, 2020 at 6:24pm PDT -
ఇంతకన్నా ఏం కావాలి?
న్యూఢిల్లీ: విలక్షణ నటుడు నసీరుద్దీన్ షాపై సుష్మా స్వరాజ్ భర్త, మిజోరం మాజీ గవర్నర్ స్వరాజ్ కౌశల్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. నసీరుద్దీన్కు దేశం ఎంతో పేరుప్రతిష్టలు ఇచ్చినా దేశం పట్ల ఆయనకు కృతజ్ఞత లేదని విమర్శించారు. పౌరసత్వ సవరణ చట్టానికి మద్దతుగా మాట్లాడిన సీనియర్ నటుడు, బీజేపీ నేత అనుమప్ ఖేర్ను నసీరుద్దీన్ విమర్శించిన నేపథ్యంలో స్వరాజ్ కౌశల్ ట్విటర్లో స్పందించారు. ‘మిస్టర్ నసీరుద్దీన్ షా మీరు కృతజ్ఞత లేని వ్యక్తి. ఈ దేశం మీకు పేరు, ప్రతిష్టలతో పాటు ఐశ్వర్యాన్ని ఇచ్చింది. ఇప్పటికీ అజ్ఞానంలోనే ఉన్నారు. మీ మతం కాని మహిళను మీరు పెళ్లి చేసుకున్నా ఎవరూ మిమ్మల్ని ఒక్క మాట కూడా అనలేదు. మీ సోదరుడు భారత సైన్యంలో లెఫ్టినెంట్ జనరల్ అయ్యారు. సమాన అవకాశాలకు ఇంతకన్నా ఏం కావాలి. అయినప్పటీకి మీకు సంతృప్తి లేదు. పక్షపాతం, వివక్షపూరితంగా మాట్లాడుతున్నారు. మనస్సాక్షి ఉంటే ఆత్మ పరిశీలన చేసుకోండి. స్వదేశంలో నిరాశ్రయులుగా మారి పడ్డ కష్టాల గురించి అనుపమ్ మాట్లాడారు. దేశం ఎన్ని ఇచ్చినా మీరు మాత్రం దేశానికి కనీసం కృతజ్ఞత కూడా చెప్పలేదు. హుందా కలిగిన వ్యక్తిగా అనుపమ్ స్పందించారు. మీ మాటలను బట్టి చూస్తే మీరు అల్పంగా కనిపిస్తున్నారు. నిరాశ నుంచి మీ కోపం వ్యక్తమవుతున్నట్టు కనబడుతోంద’ని స్వరాజ్ కౌశల్ వరుస ట్వీట్లలో పేర్కొన్నారు. కాగా, ఏబీవీపీ దాడిలో గాయపడిన జేఎన్యూ విద్యార్థులను పరామర్శించిన హీరోయిన్ దీపికా పదుకొనేను ప్రశంసించిన నసీరుద్దీన్ బుధవారం అనుపమ్ ఖేర్పై విమర్శలు చేశారు. నరేంద్ర మోదీ సర్కారుకు బాకా ఊదుతున్నారని, ఆయనను పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు. (చదవండి: ఆమె ధైర్యాన్ని ప్రశంసించిన నటుడు) -
వైరల్: నువ్వు మామూలు తల్లివి కాదమ్మా!..
కష్టం వచ్చినపుడు బాధపడుతూ కూర్చోవటం కంటే దానికి పరిష్కారం అన్వేషించటమే తెలివైన పని! అది ఎంత చిన్న కష్టమైనా. ఆ కష్టాన్ని ఎలా గట్టెక్కుతామన్న దాని మీదే మన తెలివి ఆధారపడి ఉంటుంది. మనం చేసే పనికి సృజనాత్మకత తోడైతే? అది కచ్చితంగా వైరల్ న్యూస్ అవుతుంది. ఈ కోణంలోనుంచి ఆలోచిస్తే భారతీయుల కంటే తెలివైన వాళ్లు, సృజనాత్మకంగా ఆలోచించేవాళ్లు లేరని చెప్పొచ్చు. ప్రముఖ బాలీవుడ్ సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్ తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసిన కొన్ని ఫొటోలు ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. పోస్ట్ అయిన గంటలోపే దాదాపు 26వేల లైకులతో పాటు వందల కామెంట్లు సొంతం చేసుకున్నాయి. ‘‘అత్యవసరాలను అధిగమించటానికి ఆవిష్కరణలు చేయటంలో భారతీయులే అత్యంత సృజనాత్మకమైన వాళ్లు. ఈ ఫొటోలు ఇందుకు నిదర్శనం’’ అని ఆయన పేర్కొన్నారు. అయితే ఫొటోలోని వ్యక్తుల చేష్టలు మనకు నవ్వు తెప్పించినా సమస్యను పరిష్కరించటానికి వారు చూపిన ప్రతిభను తప్పక గుర్తించి తీరాలి. లావాటి మనిషి కిందపడిపోకుండా పొట్టకు అడ్డంగా చెక్కపలక పెట్టుకుని నిద్రపోవటం, ఓ తల్లి తన బిడ్డను కిచెన్ కప్బోర్డు డ్రాయర్లో ఉంచి వంట చేసుకోవటం లాంటివి నెటిజన్లను ప్రత్యేకంగా ఆకర్షిస్తున్నాయి. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ.. నువ్వు మామూలు తల్లివి కాదమ్మా!.. మన భవిష్యత్తు చూస్కోండి.. భారతీయులు ఎంతైనా తెలివైన వాళ్లు.’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇలాంటి లైఫ్ హ్యాకింగులు కొత్త కాకపోయినా వెలుగులోకి వచ్చిన ప్రతిసారి నెటిజన్లను ఆశ్చర్యంలో ముంచెత్తుతున్నాయి. -
‘మన పెళ్లి నిన్ననే జరిగినట్లు అనిపిస్తోంది’
‘ప్రియమైన కిరణ్!!! 34వ వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు!! జీవితంలోని అత్యధిక సమయం ఇద్దరం కలిసి గడిపాము. అప్పుడే 34 ఏళ్లు గడిచాయా. నాకైతే నిన్ననే మన పెళ్లి అయినట్లు అనిపిస్తోంది. నీతో కలిసి జీవించిన, జీవిస్తున్న ప్రతీ క్షణాన్ని నేను ఎంతగానో ప్రేమిస్తా’ అంటూ బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ తన భార్య, బీజేపీ ఎంపీ కిరణ్ ఖేర్కు విషెస్ చెప్పారు. ఈ సందర్భంగా అనుమప్ ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసిన తమ పెళ్లినాటి ఫొటో అభిమానులను విపరీతంగా ఆకర్షిస్తోంది. ఈ క్రమంలో ఖేర్ దంపతులకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. కాగా చండీగఢ్లో థియేటర్స్ కోర్సు చదువుతున్న సమయంలో ప్రేమలో పడిన అనుమప్- కిరణ్ 1985లో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. అయితే అంతకుముందే గౌతం బెర్రీ అనే వ్యాపారవేత్తను పెళ్లి చేసుకున్న కిరణ్కు సిఖిందర్ అనే కుమారుడు ఉన్నాడు. సిఖిందర్ ప్రస్తుతం అనుమప్-కిరణ్ ఖేర్లతోనే జీవిస్తున్నాడు. ఇక థియేటర్స్లో అనుభవం గడించిన అనంతరం బాలీవుడ్లో అడుగుపెట్టిన కిరణ్ ఖేర్ 1996లో ‘సర్దారీ బేగమ్’ అనే సినిమాతో తొలి విజయాన్ని ఆస్వాదించారు. ఆ తర్వాత బరీవాలీ, దేవ్దాస్, వీర్జరా, హమ్తుమ్, దోస్తానా చిత్రాల్లో సహాయక పాత్రల్లో నటించి గుర్తింపు పొందారు. సంప్రదాయ పంజాబీ కుటుంబానికి చెందిన కిరణ్ ఖేర్ రాజకీయాల్లో ప్రవేశించి బీజేపీలో చేరారు. గత రెండు పర్యాయాలుగా పంజాబ్ రాజధాని చండీగఢ్ ఎంపీ(లోక్సభ)గా ఆమె ఎన్నికయ్యారు. కాగా 1984లోనే సినిమాల్లో ఎంట్రీ ఇచ్చిన అనుమప్ ఇటీవల ‘ది యాక్సిడెంటల్ ప్రైమ్మినిస్టర్’ సినిమాలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పాత్రలో ప్రేక్షకులను పలకరించాడు. View this post on Instagram Dearest Kirron!!! Happy 34th wedding anniversary!! Bahut lamba waqt zindagi ka saath mei tay kiya hai humne. 34 saal guzar gaye lekin lagta hai Jaise kal ki he baat hai. I have loved the lived quality of our lives together. सालगिरह मुबारक।😍 @kirronkhermp #Pushkar #Dulari #Raju A post shared by Anupam Kher (@anupampkher) on Aug 25, 2019 at 7:58pm PDT -
‘కశ్మీర్ సమస్యకు పరిష్కారం షురూ’
శ్రీనగర్: ఏళ్ల నాటి కశ్మీర్ సమస్యను పరిష్కారించేందుకు ఎట్టకేలకు చర్యలు ప్రారంభం అయ్యాయని ప్రముఖ నటుడు అనుపమ్ ఖేర్ అన్నారు. ఈ మేరకు ఆయన ట్విటర్లో అభిప్రాయపడ్డారు. కాగా గడిచిన వారం రోజులుగా కశ్మీర్లో భారత భద్రతాదళాలు మోహరిస్తోన్న విషయం తెలిసిందే. కశ్మీర్ సమస్యకు శాస్వత పరిష్కారం దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగుటు వేస్తోన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అనుపమ్ ఖేర్ ట్విటర్ వేదికగా స్పందించారు. ‘కశ్మీర్ సమస్యకు పరిష్కారం ప్రారంభమైంది’ అంటూ పోస్ట్ చేశారు. కాగా భారీ ఎత్తున బలగాల తరలింపుతో కశ్మీర్ను కేంద్రం పూర్తిగా తన గుప్పిట్లోకి తీసుకున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఆదివారం అర్థరాత్రి అనంతరం 144 సెక్షన్ అమలుతో పరిస్థితులు పూర్తిగా వేడెక్కాయి. ఇంటర్ నెట్ సేవలను నిలిపివేయడంతో పాటు.. పలు జిల్లాల్లో పూర్తి ఆంక్షాలను అమలుచేశారు. మాజీ ముఖ్యమంత్రులు మెహబూబా ముఫ్తీ, ఒమర్ అబ్దుల్లాను గృహ నిర్బంధం చేయడంతో పాటు స్థానిక నేతలను కూడా అదుపులోకి తీసుకున్నారు. దీంతో కశ్మీర్లో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. ఈ నేపథ్యంలో నేడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరగబోయే కేంద్ర మంత్రిమండలి సమావేశం ఆసక్తికరంగా మారింది. Kashmir Solution has begun.🇮🇳 — Anupam Kher (@AnupamPKher) August 4, 2019 -
తిడతావేంటమ్మా.. నువ్వేం మారలేదు!
సాక్షి, ముంబై: బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ తన తల్లి దులరీ ఖేర్తో చేసిన చాట్ వీడియోను ట్విటర్లో పంచుకున్నారు. మా అమ్మ దులరీ ఖేర్ చాలా కాలం తర్వాత సోషల్ మీడియాలోకి వచ్చింది అంటూ ఆనందం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ తల్లీకొడుకుల సరదా సంభాషణ నెటిజన్లను విపరీతంగా ఆకర్షిస్తోంది. ఆ సంభాషణలో.. దులరీ ఖేర్ తన ఫోన్ ఎందుకు ఎత్తలేదని అనుపమ్ ఖేర్ను ప్రశ్నిస్తుంది. దానికి అనుపమ్ బదులిస్తూ.. ‘నువ్వు కాల్ చేసే సమయానికి విమానంలో ఉన్నాను. అందుకే ఎత్తలేదు. అయినప్పటికీ అల్లంత దూరంలో ఉన్నా కూడా నేను నిన్ను పిలుస్తున్నా.. అయినా కూడా తిడతావేంటమ్మా..’ అంటూనే ‘నా దగ్గర ఉన్న పుస్తకం పేరుని ఇంగ్లీష్లో చెప్పు చూద్దాం’ అని తల్లిని అడుగుతాడు. ‘ఏమో నాకు తెలీదు’ అని దులరీ సమాధానం చెపుతుంది. ‘పర్వాలేదు చెప్పమ్మా.. ప్రయత్నించు’ అని అనుపమ్ తల్లిని విసిగిస్తాడు. ‘అదంతా కాదు గంజు పటేల్.. ముందు నాకు కాల్ చెయ్’ అని అతన్ని తిడుతుంది దులరీ. ఒక్కసారిగా అవాక్కయిన అనుపమ్ ‘నన్ను గంజు పటేల్ అని పిలుస్తావా..’ అంటూ అలక పూనుతాడు. ఈ దెబ్బకు అనుపమ్ తిక్క కుదిరింది అనుకుంటూ దులరీ హాయిగా నవ్వుకుంటుంది. ఈ వీడియోపై ఆర్టికల్ 15 నటుడు ఆయుష్మాన్ ఖురాన స్పందిస్తూ.. ‘మీ ప్రేమ ఎంత ముద్దుగా ఉందో..’ అంటూ వారి అనురాగాన్ని చూసి అబ్బురపడ్డారు. తల్లీ కొడుకుల బంధం చూడముచ్చటగా ఉందంటూ నెటిజన్లు సంతోషం వ్యక్తం చేశారు. అనుపమ్ ఖేర్ తల్లి దులరీ గతంలోనూ సోషల్ మీడియాలో ప్రధాని మోదీ గురించి మాట్లాడి వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. సార్వత్రిక ఎన్నికల ఫలితాలకు ముందు మళ్లీ ప్రధానిగా మోదీనే గెలుస్తారని ఆమె జోస్యం చెప్పగా ఆమె అభిమానానికి మోదీ కృతజ్ఞతలు తెలిపారని అనుపమ్ గతంలో ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు. She is BACK!! She has not Changed!! 😬🙄. Video called Mom in Shimla from NY. She scolded me without provocation. She called me ‘गंजु पटेल’ (Bald Dude). Efforts to make her say the title of my #Autobiography #LessonsLifeTaughtMeUnKnowingly# were a disaster.🤦🏻♂️🤦🏻♂️🤣😂 #DulariRocks pic.twitter.com/7xsktTdZRV — Anupam Kher (@AnupamPKher) July 17, 2019 -
ట్రాప్లో పడకు గంభీర్; సిగ్గుండాలి!
ముంబై : మీడియాలో పాపులారిటీ సంపాదించుకోవడం కోసం కొంత మంది పన్నిన ఉచ్చులో పడవద్దని బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్.. బీజేపీ ఎంపీ, మాజీ క్రికెటర్ గౌతం గంభీర్కు సూచించాడు. ఎంపీగా మీరు చేసే పనులు మాత్రమే మాట్లాడేలా నడుచుకుంటే బాగుంటుందంటూ సలహా ఇచ్చాడు. జై శ్రీరాం అనాలంటూ ఓ ముస్లిం యువకుడిపై గురుగ్రామ్లో అల్లరిమూకలు దాడి చేసిన సంగతి తెలిసిందే. కాగా తూర్పు ఢిల్లీ ఎంపీ గంభీర్ ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు. నరేంద్ర మోదీ సబ్కా సాత్ , సబ్కా వికాస్, సబ్ కా విశ్వాస్తో తనకు లౌకికవాదంపై ఆలోచనలు పుట్టుకొచ్చాయని పేర్కొన్నారు. ఇకపై కులం, మతం పేరిట జరిగే దాడులన్నింటిపై గళమెత్తుతానని ట్విటర్ వేదికగా స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో గంభీర్ తీరుపై అనుపమ్ ఖేర్ స్పందించాడు. ‘ఎన్నికల్లో విజయం సాధించినందుకు శుభాకాంక్షలు గౌతం గంభీర్. ఓ భారతీయుడిగా మీ విజయం పట్ల నేనెంతో సంతోషంగా ఉన్నాను. మీరు అడగకున్నా సరే ఓ చిన్న సలహా ఇవ్వాలనుకుంటున్నా..ఓ వర్గంలో పాపులర్ అయ్యేందుకు కొంతమంది పన్నిన కుట్రలో చిక్కుకోకండి. మీరు ప్రకటనలు చేయాల్సిన పనిలేదు. మీరు చేసే పనులే మాట్లాడతాయి’ అంటూ ట్వీట్ చేశాడు. ఈ క్రమంలో.. అమానుష ఘటనపై వెంటనే స్పందించిన గంభీర్ను ట్రాప్లో పడేయాలని మీరే చూస్తున్నారు. ఆయనకు ఇంకా బీజేపీ నీళ్లు ఒంటబట్టలేదు. అయినా ఇటువంటి ఘటనపై ధైర్యంగా స్పందించిన గంభీర్ను మెచ్చుకోవాల్సింది పోయి.. ఇలాంటి ఉచిత సలహాలు ఇస్తారా. సిగ్గు పడాలి’ అంటూ నెటిజన్లు అనుపమ్ ఖేర్పై ఘాటు విమర్శలు చేస్తున్నారు. కాగా అనుపమ్ భార్య కిరణ్ ఖేర్ కూడా బీజేపీ ఎంపీ అన్న సంగతి తెలిసిందే. చండీగఢ్ నుంచి బీజేపీ తరఫున పోటీ చేసిన ఆమె.. ఘన విజయం సాధించారు. Dear @GautamGambhir !! Congratulations on your win. As a passionate Indian it made me very happy. Not that you have asked for my advise but still- Don’t get into a trap of getting popular with a section of media. It is your work that will speak. Not necessarily your statements.🙏 — Anupam Kher (@AnupamPKher) May 28, 2019 -
‘అక్షయ్ దేశభక్తిని శంకించాల్సిన పని లేదు’
గత కొద్ది కాలంగా దేశవ్యాప్తంగా బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ పౌరసత్వం గురించి చర్చ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో అక్షయ్ ఓటు వేయకపోవడంతో ఈ వివాదం తెరమీదకు వచ్చింది. దీనిపై స్పందించిన అక్షయ్.. తన పౌరసత్వం గురించి ఎలాంటి చర్చ అవసరం లేదన్నారు. దేశం పట్ల తనకు ఉన్న ప్రేమను ఇప్పుడు నిరూపించుకోవాల్సిన అవసరం లేదని కూడా స్పష్టం చేశారు. తాజాగా ఈ వివాదంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిరెన్ రిజ్జూ అక్షయ్కు మద్దతుగా నిలిచారు. అక్షయ్ దేశభక్తిని శంకించాల్సిన అవసరం లేదన్నారు కిరెన్. ఈ మేరకు ‘అక్షయ్.. మీ దేశ భక్తిని ఎవరూ శంకించలేరు. సాయుధ దళాల సిబ్బంది చనిపోయినప్పుడు మీరు స్పందించిన తీరు.. వారిని ఆదుకోవడం కోసం ‘భారత్కేవీర్’ కార్యక్రమం ద్వారా మీరు విరాళాలు సేకరించిన విధానం దేశభక్తి కలిగిన ఓ భారతీయుడికి అసలైన ఉదాహరణగా నిలుస్తుందం’టూ కిరెన్ రిజ్జూ ట్వీట్ చేశారు. దాంతో అక్షయ్ ట్విటర్ ద్వారా కిరెన్ రిజ్జూకు ధన్యవాదాలు తెలిపారు. ‘మీకు ధన్యవాదాలు తెలపడంలో ఆలస్యం చేసినందుకు నన్ను క్షమించండి కిరెన్ రిజ్జూ సర్. నా పట్ల మీరు చూపిన అభిమానానికి ధన్యవాదాలు. భారత ఆర్మీ పట్ల, ‘భారత్కేవీర్’ కార్యక్రమం పట్ల నా బాధ్యత ఎప్పటికి స్థిరంగా నిలిచి ఉంటుందం’టూ అక్షయ్ రీట్వీట్ చేశారు. Thank you so much @KirenRijiju Sir, and I apologise for the delayed response. I am grateful for your kind words. Please be assured, my commitment to #BharatKeVeer and to the Indian armed forces would remain steady, no matter what 🙏🏻 https://t.co/W1298prsEQ — Akshay Kumar (@akshaykumar) May 7, 2019 బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ కూడా పౌరసత్వం విషయంలో అక్షయ్కు మద్దతుగా నిలిచారు. తన పౌరసత్వం వివాదం గుర్చి స్పందిస్తూ అక్షయ్ తన దగ్గర కెనడా పాస్పోర్ట్ ఉందన్నారు. కానీ గత ఏడేళ్లగా ఒక్కసారి కూడా కెనడా వెళ్లలేదని తెలిపారు. ఇండియా ప్రగతి పథంలో ముందుకు వెళ్లడానికి తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు అక్షయ్. -
అమెరికాలో అతను డాక్టర్ కపూర్
అనుపమ్ ఖేర్ను మన దేశంలో అందరూ గుర్తించడంలో గౌరవించడంలో వింత లేదు.కాని అమెరికాలో అతను ఇప్పుడు సామాన్యుల గౌరవాన్ని పొందుతున్నాడు. ఇటీవల అతడు అమెరికాలోని ఒక ఎయిర్పోర్ట్లో లగేజ్ క్లియరెన్స్ దగ్గర నిలబడ్డాడు. ఏదో ఈవెంట్కు హాజరవ్వాల్సి ఉండగా అతని దగ్గర అనుమతించిన లగేజీకి మించిన బరువుతో కొన్ని సూట్స్ ఉన్నాయి. వాటి బరువుకు తగ్గ చార్జ్ చెల్లించాల్సి వస్తుందేమోనని అనుపమ్ఖేర్ సందేహించాడు. కాని కౌంటర్లో ఉన్న ఒక ఆఫ్రికన్–అమెరికన్ అతణ్ణి చూసి చిన్న చిర్నవ్వుతో ‘మిస్టర్ కపూర్.. నాకు మీ యాక్టింగ్ అంటే ఇష్టం. పర్లేదు. మీరు వెళ్లొచ్చు’ అంది. అనుపమ్ ఖేర్ అమెరికాలో ‘మిస్టర్ కపూర్’గా మారడానికి అక్కడ గత సంవత్సరం ప్రసారమైన టెలివిజన్ షో ‘న్యూ ఆమ్స్టర్డామ్’ కారణం. అమెరికాలో పాఠకాదరణ పొందిన ‘ట్వల్వ్ పేషెంట్స్: లైఫ్ అండ్ డెత్ ఎట్ బెల్వ్యూ హాస్పిటల్’ అనే పుస్తకం ఆధారంగా ఈ టెలివిజన్ షో గత సంవత్సరం 16 ఎపిసోడ్లుగా ప్రసారం అయ్యింది. ఇది ఒక సీజన్కు మాత్రమే పరిమితమైన షో అనుకున్నారు. కాని ఇది ప్రసారం కావడమే పెద్ద హిట్ అయ్యింది. ఇండియన్ డాక్టర్గా నటించిన అనుపమ్ఖేర్ను అమెరికన్లు బాగా ఇష్టపడ్డారు. దాంతో ఇప్పుడు రెండో సీజన్ కోసం ఈ షో షూటింగ్ ప్రస్తుతం అమెరికాలో జరుగుతోంది. అనుపమ్ ఖేర్ అక్కడే ఉదయం ఆరు గంటల కాల్షీట్ నుంచి పని చేస్తున్నారు. ‘నేను హిందీ నటుణ్ణి. నా బుర్ర హిందీలోనే ఆలోచిస్తుంది. ఇంగ్లిష్లో డైలాగులు చెప్పాలంటే ఎక్కువసార్లు వాటిని మననం చేసుకోవాల్సి వస్తోంది’ అన్నారు అనుపమ్ ఖేర్. దాదాపు అమెరికన్లు తెర మీద తెర వెనుక పని చేస్తున్న ఆ సెట్లో అనుపమ్తో హిందీలో మాట్లాడేది అతడి మేనేజర్ మాత్రమే. మిగిలినవారితో ఇంగ్లిష్లోనే సంభాషణలు సాగుతున్నారు. ‘ఇక్కడ బాగా పేరొచ్చింది. న్యూయార్క్లో నడుస్తుంటే దారిన పోతున్నవాళ్లు విష్ చేస్తున్నారు. అందుకే ఉత్సాహంగా షూటింగ్ కోసమని వచ్చాను. కాని నా ముంబై స్టుడియోల్లోని సందడి, అరుపులు, కేకలు మాత్రం మిస్సవుతున్నాను’ అన్నాడాయన. భారతదేశంలో ఇప్పుడు ఎలక్షన్ల హడావిడి నడుస్తోందని మనందరికీ తెలుసు. అనుపమ్ ఖేర్ బిజెపి మద్దతుదారు అని కూడా తెలుసు. అయితే ప్రత్యక్షంగా ఆయన ప్రచారంలో కనిపించే అవకాశాలు ఈ షూటింగ్ వల్ల ఉండవని అర్థమవుతోంది. అదీగాక తాను నేరుగా రాజకీయాల్లోకి రాదలచుకోలేదని ఆయన ఇదివరకే ప్రకటించాడు. ఆయన భార్య కిరణ్ ఖేర్ మాత్రం చండీగఢ్ నుంచి బిజెపి ఎం.పిగా ఐదేళ్లు పూర్తిచేసి మరోసారి పోటీ చేయడానికి ఏర్పాట్లు చేసుకుంటోంది. ‘హోటల్ ముంబై’కి చిక్కులు 2008లో ముంబై తాజ్ హోటల్ మీద జరిగిన ముష్కర దాడి అందరికీ తెలుసు. ఆ ఉదంతం పై రామ్గోపాల్ వర్మ ‘ది అటాక్స్ ఆఫ్ 24/11’ అనే సినిమా తీశాడు. అయితే ఆ ఉదంతం జరిగినప్పుడు తాజ్ హోటల్లోని సిబ్బంది అందులో బస చేసిన వారి ప్రాణాలను ఎలా కాపాడారో వివరిస్తూ ఇంగ్లిష్లో ‘హోటల్ ముంబై’ సినిమా సిద్ధమైంది. ఇందులో అనుపమ్ ఖేర్ తాజ్ హోటల్ చీఫ్ చెఫ్గా నటించారు. సినిమాలో అది కీలకపాత్ర. కాని ఆ పాత్రను అందరూ చూసే వీలు కనిపించడం లేదు. ఇప్పటికే ఈ సినిమా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాలలో విడుదల కాగా తాజా న్యూజిలాండ్లో జరిగిన కాల్పుల ఘటన నేపథ్యంలో ఉగ్రవాదాన్ని చూపి భావోద్వేగాలను ప్రభావితం చేసే ఇటువంటి సినిమా అక్కర్లేదని భావించి అక్కడి ప్రభుత్వం దాని ప్రదర్శనను రద్దు చేసింది. మరోవైపు భారత్లో విడుదలకు నిర్మాతలకు, దుబాయ్లో ఉన్న ఒక డిస్ట్రిబ్యూషన్ సంస్థకు పేచీ వచ్చింది. నెట్ఫ్లిక్స్ కూడా ఈ సినిమా ప్రదర్శనను విరమించుకుంది. కనుక అనుపమ్ ఖేర్ ఎంతో బాగా నటించానని అనుకుంటున్న ఆ సినిమా ఇప్పుడిప్పుడే మనం చూసే అవకాశానికి వీలు కల్పించకుండా ఉంది. -
‘కంగనా ఓ రాక్స్టార్’
ప్రస్తుతం బాలీవుడ్లో మణికర్ణిక వివాదంతో పాటు.. తన సహ నటులపై కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలు కూడా తీవ్ర దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. నెపోటిజమ్ గురించి మాట్లాడినందునే ఇండస్ట్రీ అంతా తనకు వ్యతిరేకంగా ఉందని కంగనా ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ కంగనా నటనను మెచ్చుకుంటూ ట్వీట్ చేశారు. ట్విటర్ వేదికగా అనుపమ్ ఖేర్ నిర్వహించిన ‘ఆస్క్ మీ ఎనిథింగ్’ సెషన్లో ఒక నెటిజన్ ‘బాలీవుడ్లో కంగనా మణికర్ణిక సినిమాకు ఎవరు మద్దతు తెలపడం లేదు.. మీరు ఆమెకు మద్దతు తెలుపుతూ ట్వీట్ చేయండం’టూ అనుపమ్ను కోరాడు. #KanganaRanaut is a ROCKSTAR. She is brilliant. I applaud her courage and performances. She is also the real example of #WomenEmpowerment.:) https://t.co/WeFgWsdiSW — Anupam Kher (@AnupamPKher) February 9, 2019 దాంతో అనుపమ్ ‘కంగనా ఓ రాక్ స్టార్. తనకు చాలా ప్రతిభ ఉంది. నేను తన ధైర్యాన్ని, నటనను ప్రశంసిస్తున్నాను. మహిళా సాధికారితకు తను నిలువెత్తు నిదర్శనం’ అంటూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం అనుపమ్ చేసిన ట్వీట్ వైరలవుతోంది. ఇదిలా ఉండగా బంధుప్రీతి గురించి మాట్లాడినందునే బాలీవుడ్ మొత్తం గ్యాంగ్లా మారి తనను వ్యతిరేకిస్తున్నారంటూ కంగనా ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో అలియా భట్, ఆమిర్ ఖాన్ చిత్రాలు ‘దంగల్’, ‘రాజీ’ మూవీ ప్రమోషన్లకు తాను హాజరయ్యానని.. కానీ నేడు ధీర వనిత లక్ష్మీబాయి కథతో ముందుకు వస్తే తనకు ఎవరూ సహకరించడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో కంగనా వ్యాఖ్యలపై ఆలియా స్పందించడం.. క్షమాపణ చెప్పేందుకు కూడా సిద్ధపడటం వంటి సంఘటనలు తెలిసిందే. -
‘సంతోషం.. ఎవరూ తిట్టలేదు’
ఎవరూ విమర్శించలేదు.. అదే సంతోషం అంటున్నారు నటుడు మనోజ్ బాజ్పేయ్. సినీ రంగంలో ఆయన చేసిన కృషికి గాను ప్రభుత్వం మనోజ్కు పద్మశ్రీ అవార్డు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా మనోజ్ మాట్లాడుతూ.. ‘నాకు ఈ అవార్డును ప్రకటించిన తర్వాత సోషల్ మీడియాలో కానీ.. బయట కానీ ఎలాంటి ట్రోలింగ్ జరగలేదు. దాంతో చాలా సంతోషంగా ఫీలయ్యాను’ అన్నారు. అంతేకాక ‘గతంలో ప్రభుత్వం అవార్డులు ప్రకటించినప్పుడు ఏ అర్హత ఉందని ఇచ్చారు అని సోషల్ మీడియాలో తెగ ట్రోల్ చేసేవారు. సదరు నటుడు నటించిన సినిమాల గురించి ప్రస్తావిస్తూ దారుణంగా విమర్శించేవారు. ఈసారి నాకు అలాంటి సంఘటనలు ఎదురుకాలేదు. అందుకు సంతోషంగా ఉంది. నాతో పాటు నా కుటుంబ సభ్యులు, స్నేహితులు కూడా చాలా సంతోషంగా ఉన్నార’ని తెలిపారు. పద్మ అవార్డు వచ్చిందని తెలిసినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు అని అడగ్గా.. ‘ఆ రోజు రాత్రి పడుకునే ముందు అనుపమ్ ఖేర్ నాకు ఫోన్ చేసి అవార్డు వచ్చిందని చెప్పారు. ఇది విన్న వెంటనే నేను ఫ్రీజ్ అయిపోయాను. ఎలా స్పందించాలో నాకు తెలియలేదు. నాకు ఈ గౌరవం దక్కుతుందని అనుకోలేదు’ అని వెల్లడించారు మనోజ్. ప్రస్తుతం మనోజ్, సుశాంత్ సింగ్ రాజ్పుత్ హీరోగా తెరకెక్కుతున్న ‘సోన్ చిడియా’ అనే చిత్రంలో నటిస్తున్నారు. అభిషేక్ చౌబే దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఫిబ్రవరి 8న విడుదల కానుంది. -
బాలీవుడ్ వివాదాస్పద చిత్రం తెలుగులో కూడా..!
ఇటీవల బాలీవుడ్లో అత్యంత వివాదాస్పదంగా మారిన చిత్రం ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమా నిషేదించాలన్న వాదన కూడా వినిపిస్తోంది. బాలీవుడ్లో ట్రైలర్ను నిషేదించాలంటూ వేసిన పిటీషన్ను ఢిల్లీ హైకోర్ట్ కొట్టివేసింది. తాజాగా ఈ సినిమాను తెలుగులో కూడా రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు చిత్రయూనిట్. అంతేకాదు తెలుగు వర్షన్ ట్రైలర్ను కూడా రిలీజ్ చేశారు. హిందీ వర్షన్తో పాటు తెలుగు వర్షన్ను కూడా జవనరి 18న రిలీజ్ చేయనున్నారు. గతంలో మన్మోహన్ సింగ్కు మీడియా సలహాదారుగా వ్యవహరించిన సంజయ్ బారు రాసిన ది యాక్సిడెంట్ ప్రైమ్ మినిస్టర్ పుస్తకాన్ని అదే పేరుతో సినిమాగా తెరకెక్కించారు. మన్మోహన్ పాత్రలో బాలీవుడ్ అగ్రనటుడు అనుపమ్ ఖేర్ నటించగా, మరో కీలక పాత్రో అక్షయ్ ఖన్నా నటించారు. అయితే ఈ సినిమా నిర్మాణం విషయంలో కాంగ్రెస్ పార్టీ నుంచిగాని. మన్మోహస్ సింగ్ నుంచి గాని ఎలాంటి అనుమతి తీసుకోకపోవటం వివాదాస్పదమైంది. ఇటీవల సెన్సార్ విషయంలోనూ ఈ సినిమాకు ఇబ్బందులు ఎదురయ్యాయి. -
‘మోదీ మీ పాత్రలో సల్మాన్ ఐతే బాగుండేది’
ప్రస్తుతం ఇండస్ట్రీలో బయోపిక్ల హవా నడుస్తోంది. ఇప్పటికే బాలీవుడ్లో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ‘ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్’ విడుదలకు సిద్ధంగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే ట్రైలర్తోనే ఈ సినిమా వివాదాలను రేపుతోంది. ఇదిలా ఉండగా ప్రధాని నరేంద్ర మోదీ జీవితం ఆధారంగా మరో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. వివేక్ ఒబేరాయ్ మోదీ పాత్రలో నటిస్తున్నారు. మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్ని రిలీజ్ చేశారు. అయితే ఈ పోస్టర్ పట్ల ఇప్పటికే పలు రకాల కామెంట్లు వినిపిస్తున్నాయి. వివేక్ ఒబేరాయ్ మోదీ పాత్రను దారుణంగా ఖూనీ చేశారంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. ఇప్పుడు వీరి వరుసలో జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా కూడా చేరారు. ది యాక్సిడెంటల్ ప్రైమ్ పినిస్టర్ సినిమాను, మోదీ బయోపిక్ను కంపేర్ చేస్తూ అబ్దుల్లా కామెంట్ చేశారు. ‘మన్మోహన్ సింగ్ పాత్రలో అనుపమ్ ఖేర్ బాగానే సూట్ అయ్యారు.. కానీ మోదీ మీ పాత్ర కోసం వివేక్ అంతగా సెట్ అవ్వలేదు. వివేక్ బదులు మీరు సల్మాన్ ఖాన్ తీసుకుంటే మజా వచ్చేది’ అంటూ ట్వీట్ చేశారు. Life is unfair Dr Manmohan Singh got someone of the calibre of Anupam Kher. Poor Modi ji has to settle for Vivek Oberoi. Salman Khan hota toh kya maza aata. — Omar Abdullah (@OmarAbdullah) January 8, 2019 -
‘ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్’కు ఊరట
న్యూఢిల్లీ : భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ‘ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్’ చిత్రానికి ఢిల్లీ హైకోర్టులో ఊరట లభించింది. ఈ చిత్ర ట్రైలర్ను నిషేధించాలంటూ వేసిన పిటిషన్ను కోర్టు తిరస్కరించింది. ఢిల్లీకి చెందిన పూజా మహాజన్ అనే ఫ్యాషన్ డిజైనర్ ‘ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్’ ట్రైలర్ను నిషేధించాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా చిత్రబృందం సెక్షన్ 416ను ఉల్లంఘించిందని పూజ పిటిషన్లో పేర్కొంది. సెక్షన్ 416 ప్రకారం ఒక వ్యక్తి జీవితాధారంగా సినిమా తీస్తున్నప్పుడు సంబంధిత వ్యక్తుల నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకురావాలని పిటిషన్లో తెలిపింది. ఢిల్లీ హై కోర్టు సోమవారం ఈ పిటిషన్ని విచారించింది. ఈ సందర్భంగా పూజ తరఫు న్యాయవాది మైత్రి మాట్లాడుతూ.. ‘నిర్మాతలు.. మన్మోహన్ సింగ్ నుంచి కానీ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నుంచి కానీ ఎలాంటి అనుమతి తీసుకోలేదు. కాబట్టి ట్రైలర్ను, సినిమాను నిషేధించండి’ అన్నారు. ఇరువురి వాదనలు విన్న న్యాయమూర్తి విభు భాక్రు పిటిషనర్ పూజాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సినిమాకు, ఫ్యాషన్ డిజైనర్కు ఎలాంటి సంబంధంలేదని తేల్చారు. అసలు పిటిషన్ వేయడానికి సినిమాతో ఆమెకున్న సంబంధం ఏంటని ప్రశ్నించారు. ట్రైలర్ను నిషేధించడానికి వీల్లేందంటూ తీర్పునిచ్చారు. యూపీఏ - 1 హయాంలో మన్మోహన్ సింగ్కు మీడియా సలహాదారుగా వ్యవహరించిన సంజయ్ బారు రాసిన వివాదాస్పద పుస్తకం.. 'ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ : ది మేకింగ్ అండ్ అన్మేకింగ్ ఆఫ్ మన్మోహన్సింగ్' ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కిన సంగతి తెలిసిందే. జనవరి 11న ఈ సినిమా విడుదల కానుంది. -
పీవీ తర్వాత మన్మోహనే గొప్ప ప్రధాని : శివసేన
ముంబై : మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ‘ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్’ సినిమా ట్రైలర్తోనే వివాదాస్పదంగా మారింది. ఈ సినిమాను విడుదల కానివ్వమంటూ కాంగ్రెస్ నేతలు బెదిరింపులకు దిగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శివసేన నాయకులు మన్మోహన్ సింగ్ని పొగడ్తలతో ఆకాశనికెత్తుతున్నారు. పీవీ తర్వాత మన దేశానికి సేవ చేసిన ప్రధానుల్లో మన్మోహనే గొప్పవాడంటూ ప్రశంసిస్తున్నారు. ఈ సందర్భంగా శివసేన పార్టీ నాయకుడు సంజయ్ రౌతులా మాట్లాడతూ.. ‘పదేళ్లు దేశానికి సేవ చేసిన వ్యక్తిని గౌరవించడం మన బాధ్యత. మన్మోహన్ యాక్సిడెంటల్ ప్రధాని కారు. పీవీ నరసింహ రావు తర్వాత దేశానికి సేవ చేసిన ప్రధానుల్లో మన్మోహన్ చాలా గొప్పవారు. ఆయన తన విధులను చాలా విజయవంతంగా నిర్వర్తించారు’ అంటూ ప్రశంసలు కురిపించారు. అనుపమ్ ఖేర్ ప్రధాన పాత్రలో నటించిన ‘ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్’ సినిమా పట్ల ఇప్పటికే కాంగ్రెస్ నాయకులు కోపంగా ఉన్నారు. ఈ సినిమాలో సోనియా గాంధీని, రాహుల్ గాంధీని తప్పుగా చూపించారని ఆరోపిస్తున్నారు. మహారాష్ట్ర యూత్ కాంగ్రెస్ నాయకులైతే ఏకంగా తమకు స్పెషల్ షో వేసి.. ముందుగా ప్రదర్శించకుంటే మధ్యప్రదేశ్లో మూవీ విడుదల కానివ్వబోమని హెచ్చరించారు. ఇక యూపీఏ-1 హయాంలో మన్మోహన్ సింగ్కు మీడియా సలహాదారుగా వ్యవహరించిన సంజయ్ బారు రాసిన వివాదాస్పద పుస్తకం.. 'ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ : ది మేకింగ్ అండ్ అన్మేకింగ్ ఆఫ్ మన్మోహన్సింగ్' ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కిన సంగతి తెలిసిందే. జనవరి 11న ఈ సినిమా విడుదల కానుంది. -
మన్మోహన్ సినిమాపై దుమారం
మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్’ రాజకీయంగా దుమారం రేపుతోంది. బుధవారం విడుదలైన ఈ సినిమా ట్రైలర్ను బీజేపీ తన అధికార ట్విట్టర్ హ్యాండిల్లో పెట్టి ‘ ఒక కుటుంబం పదేళ్ల పాటు దేశాన్ని తన గుప్పిట్లో ఎలా ఉంచుకుందో ఈ సినిమా చూస్తే తెలుస్తుంది’ అని వ్యాఖ్యానించడంతో వివాదం రాజు కుంది. 2004–08 మధ్య మన్మోహన్కు మీడియా సలహాదారుగా పనిచేసిన సంజయ్ బారు రాసిన పుస్తకం ఆధారంగా ఈ సినిమా తీశారు. ప్రముఖ బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ మన్మోహన్ పాత్రలో నటించారు. ఈ చిత్రం జనవరి 11న విడుదల కానుంది. మన్మోహన్ రాజప్రతినిధా?: బీజేపీ సోనియా గాంధీ, రాహుల్ గాంధీల నుంచి మన్మోహన్ ఒత్తిడి ఎదుర్కొంటున్న దృశ్యాలను ప్రచార చిత్రంలో చూపడం కాంగ్రెస్కు ఆగ్రహం తెప్పించింది. ట్విట్టర్ వేదికగా ఈ సినిమాపై విమర్శలు, వ్యాఖ్యలు, ప్రతి వ్యాఖ్యలు విస్తృతంగా వ్యాపించాయి. ‘ఒక కుటుంబం ఏకంగా పదేళ్ల పాటు దేశాన్ని ఎలా గుప్పిట్లో పెట్టుకుందో చెప్పే సినిమా ఇది. వారసుడు సిద్ధమయ్యే వరకు ఆ కుటుంబం డా.సింగ్ను రాజ ప్రతినిధిగా పీఎం కుర్చీపై కూర్చోపెట్టిందా? యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ ట్రైలర్ చూడండి’ అని బీజేపీ తన అధికార ట్విట్టర్లో పేర్కొంది. కశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా స్పందిస్తూ ‘ ఇప్పటి మొద్దు ప్రధాని(మోదీ)పై వాళ్లు(కాంగ్రెస్) సినిమా తీసేదాకా వేచి ఉండలేకపోతున్నా. యాక్సిడెంటల్ ప్రధాని కన్నా ఇన్సెసిటివ్ ప్రధాని ప్రమాదకరం’ అని ట్వీట్ చేశారు. ‘బీజేపీని చూస్తే జాలేస్తోంది. నాలుగన్నరేళ్లుగా మోదీ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి సమున్నతుడైన మన్మోహన్ సింగ్పై సినిమాను స్పాన్సర్ చేశారు. మీరు ఆ మేధావికి సరితూగలేరు. కనీసం ఆయన విలువల్ని పాటించడానికైనా ప్రయత్నించండి‘ అని రాహుల్ సోదరి ప్రియాంక ట్వీట్ చేశారు. సృజన ప్రయత్నాన్నే చూడండి: ఖేర్ ఈ సినిమాను సృజనాత్మక కోణంలో చేసిన ప్రయత్నంగా చూడాలి తప్ప, ఓ రాజకీయ పార్టీకి మద్దతు తెలుపుతున్నట్లుగా భావించొద్దని అనుపమ్ ఖేర్ అన్నారు. ఈ చిత్రం తన కెరీర్లోనే ఉత్తమ ప్రదర్శనగా నిలిచిపోతుందని తెలిపారు. మన్మోహన్ పాత్ర పోషణ తనకు పెద్ద సవాలుగా మారిందని, దీనికోసం ఆరు నెలలు శ్రమించానని అన్నారు. మన్మోహన్ హావభావాలు, ముఖ్యంగా ఆయన గొంతు అనుకరించడానికి చాలా కష్టపడ్డానని, అందుకోసం ఆయనకు సంబంధించిన వీడియోల్ని గంటల కొద్దీ చూశానని తెలిపారు. -
అమ్మే గుర్తుపట్టలేదు.. ఆస్కార్ బరిలో ఉంటా!
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న బాలీవుడ్ సినిమా ‘ ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్’ . ఈ సినిమాలో బాలీవుడ్ సీనియర్ నటుడు అనుమప్ ఖేర్ మన్మోహన్ సింగ్ పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. నిన్న (గురువారం) విడుదలైన పొలిటికల్ డ్రామా ట్రైలర్కు అన్ని వర్గాల నుంచి విశేష స్పందన వస్తుందని మేకర్స్ సంబరపడుతుంటే... తమ పార్టీ అధ్యక్షుడి కుటుంబ ప్రతిష్టకు భంగం కలిగించేలా ఉన్న ఈ మూవీని విడుదల కానివ్వమని కొంతమంది కాంగ్రెస్ నేతలు బెదిరింపులకు దిగుతున్నారు. ఈ నేపథ్యంలో విమర్శలు- ప్రతి విమర్శలతో బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. కాగా ఈ విషయంపై స్పందించిన అనుపమ్ ఖేర్ జాతీయ మీడియాతో మాట్లాడుతూ.... ‘ మన దేశంలో నటన కంటే కూడా నిరసనలకే ఎక్కువ ప్రాధాన్యత ఉన్నట్టుగా కన్పిస్తోంది. నేను దాదాపు 500 సినిమాలు చేశాను. కానీ మన్మోహన్ జీ క్యారెక్టర్ చేయడం నిజంగా ఓ సవాలుగా అన్పించింది. అయినప్పటికీ అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చాను. కానీ ఇలాంటి నిరసనలు, బెదిరింపులు నన్ను నిరాశకు గురిచేస్తున్నాయి. అయితే అద్భుతంగా తెరకెక్కిన ఈ సినిమా భారత్ తరపున ఆస్కార్ బరిలో నిలుస్తుందని చెప్పగలను. అంతేకాదు మన్మోహన్గా జీవించాను. మా అమ్మ కూడా నన్ను గుర్తుపట్టలేనంతగా పాత్రలో ఒదిగిపోయాను. కాబట్టి నేను కచ్చితంగా ఆస్కార్కు నామినేట్ అవ్వాల్సిందే’ అని వ్యాఖ్యానించారు. ఇక యూపీఏ-1 హయాంలో మన్మోహన్ సింగ్కు మీడియా సలహాదారుగా వ్యవహరించిన సంజయ్ బారు రాసిన వివాదాస్పద పుస్తకం.. 'ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ : ది మేకింగ్ అండ్ అన్మేకింగ్ ఆఫ్ మన్మోహన్సింగ్' ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కిన సంగతి తెలిసిందే. జనవరి 11న ఈ సినిమా విడుదల కానుంది. -
‘పదవి కన్నా.. దేశ శ్రేయస్సే నాకు ముఖ్యం’
భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ జీవితచరిత్ర ఆధారంగా బాలీవుడ్లో ‘ ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్’ అనే చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో ప్రముఖ బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ మన్మోహన్ సింగ్ పాత్ర పోషిస్తుండగా.... సోనియా గాంధీగా జర్మన్ యాక్టర్ సుజానే బెర్నెర్ట్ కనిపించనున్నారు. విజయ్ రత్నాకర్ గట్టీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ట్రైలర్ను చిత్ర బృందం గురువారం విడుదల చేసింది. మన్మోహన్ను ప్రధానిగా ఎంపిక చేసిన నాటి నుంచి రెండు పర్యాయాల పాటు ఆయన పదవిలో కొనసాగేందుకు దోహదం చేసిన అంశాలు, కీలక నిర్ణయాలు తీసుకోవడంలో ఆయన ఎదుర్కొన్న మానసిక సంఘర్షణకు సంబంధించిన సన్నివేశాలతో ట్రైలర్ ఆకట్టుకుంటోంది. పదవి కంటే కూడా దేశ శ్రేయస్సే ముఖ్యమంటూ అనుపమ్ చెప్పే డైలాగ్స్ మన్మోహన్ సింగ్ మనస్తత్వానికి అద్దం పట్టేలా ఉన్నాయి. అంతేకాకుండా మన్మోహన్ను మహాభారతంలోని భీష్మునిగా అభివర్ణించిన డైరెక్టర్.... కశ్మీర్ వివాదం, అణు ఒప్పందం ప్రక్రియలో భాగంగా పార్టీతో ఆయన విభేదించడం వంటి సున్నితమైన అంశాలను కూడా స్పృశించారు. కాగా యూపీఏ-1 హయాంలో మన్మోహన్ సింగ్కు మీడియా సలహాదారుగా వ్యవహరించిన సంజయ్ బారు రాసిన వివాదాస్పద పుస్తకం.. 'ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ : ది మేకింగ్ అండ్ అన్మేకింగ్ ఆఫ్ మన్మోహన్సింగ్' ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని జనవరి 11న విడుదల చేయనున్నారు. ఇక సార్వత్రిక ఎన్నికల సన్నాహకాలు మొదలవుతున్న వేళ ఈ చిత్రం విడుదల కానుండటం రాజకీయ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లోనూ ఆసక్తి పెంచుతోంది. -
ఎఫ్టీఐఐ అధ్యక్షుడిగా బీపీ సింగ్
పాపులర్ టెలివిజన్ సిరీస్ ‘సీఐడీ’ దర్శక, నిర్మాత బీపీ సింగ్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎఫ్టీఐఐ) అధ్యక్షుడిగా నియమితులయ్యారు. ఇప్పటి వరకు ఈ పదవిలో ప్రముఖ నటుడు అనుపమ్ ఖేర్ ఈ ఉన్నారు. గత ఏడాది అక్టోబరులో అనుపమ్ ఖేర్ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. దాదాపు ఏడాది పాటు సేవలు అందించిన తర్వాత 2018 అక్టోబరు 31న అనుపమ్ ఖేర్ ఈ పదవి నుంచి బయటకొచ్చారు. ఈ సందర్భంగా సింగ్కు ఎఫ్టీఐఐ పుణె డైరెక్టర్ భూపేంద్ర కైన్థోలా స్వాగతం పలికారు. ‘ఇన్స్టిట్యూట్లో జరిగే అన్ని విషయాలపై సింగ్కు అవగాహన ఉంది. మే 2017లో ఎఫ్టీఐఐ తరఫున దేశవ్యాప్తంగా ఏర్పాటు చేసిన ఫిల్మ్ ఎడ్యుకేషన్ ‘స్కిల్ ఇండియా ఇన్ ఫిల్మ్ అండ్ టెలివిజన్’ ఆలోచన సింగ్దే. దీని ద్వారా దేశంలోని దాదాపు 24 నగరాల్లో 120 షార్ట్ కోర్సులను నిర్వహించాం’ అని ఆయన అన్నారు. బీపీ సింగ్ దర్శకత్వం వహిస్తూ నిర్మిస్తోన్న ‘సీఐడీ’కు అంతర్జాతీయ స్థాయి గుర్తింపు లభించింది. ఈ సిరీస్ 21 ఏళ్లుగా బ్రేక్ లేకుండా సోనీ టీవీలో టెలికాస్ట్ అవుతోంది. 2004లో సింగ్ పేరు లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్లో కూడా నమోదైంది. ‘సీఐడీ’లోని 111 నిమిషాల షాట్ను సింగిల్ టేక్లో రికార్డు చేసిన ఘనత కూడా సింగ్కే దక్కింది. -
ఎఫ్టీటీఐ చీఫ్గా తప్పుకున్న అనుపమ్ ఖేర్
సాక్షి, న్యూఢిల్లీ : భారత ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇనిస్టిట్యూట్ (ఎఫ్టీటీఐ) ఛైర్మన్ పదవికి జాతీయ అవార్డు గ్రహీత, సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్ బుధవారం రాజీనామా చేశారు. బిజీ షెడ్యూల్ కారణంగానే తాను ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పారు. ఎఫ్టీఐఐ ఛైర్మన్గా ఉండటం తనకు అత్యంత అరుదైన గౌరవంగా భావిస్తానని తనకున్న అంతర్జాతీయ అసైన్మెంట్ల కారణంగా సంస్థకు ఎక్కువ సమయం కేటాయించలేకపోతున్నానన్నారు. తనకు ఈ పదవిని చేపట్టేందుకు ఇప్పటివరకూ సహకరించిన అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నానంటూ అనుపమ్ ఖేర్ ట్వీట్ చేశారు. సమాచార, ప్రసార మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాధోర్ను ఉద్దేశిస్తూ రాజీనామా లేఖను సైతం ట్విటర్లో ఆయన పోస్ట్ చేశారు.గత ఏడాది అక్టోబర్ 11న గజేంద్ర చౌహాన్ స్ధానంలో అనుపమ్ ఖేర్ ఎఫ్టీఐఐ ఛైర్మన్గా నియమతులైన సంగతి తెలిసిందే. -
చరిత్ర తప్పుగా అంచనావేయదు
న్యూఢిల్లీ: మాజీ ప్రధాని మన్మోహన్ను చరిత్ర తప్పుగా అంచనావేయదని ప్రముఖ నటుడు అనుపమ్ ఖేర్ అన్నారు. మన్మోహన్ జీవితచరిత్ర ఆధారంగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్’ చిత్రీకరణ పూర్తయిన సందర్భంగా శనివారం ఆయన ట్విట్టర్లో పలు విషయాలు పంచుకున్నారు. ఈ చిత్రంలో మన్మోహన్ పాత్రను అనుపమ్ ఖేరే పోషించారు. తొలుత మన్మోహన్ను తానూ తప్పుగా అంచనావేశానని, కానీ ఏడాదిపాటు ఆయన రీలు లైఫ్లో జీవించాక తన దృక్పథం పూర్తిగా మారిందన్నారు. మన్మోహన్ ఈ చిత్రాన్ని తిలకించిన తరువాత ఆయనతో కలసి టీ తాగేందుకు ఎదురుచూస్తూ ఉంటానని చెప్పారు. ‘ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ చిత్రీకరణ ముగిసింది. ఆయన్ని చరిత్ర తప్పుగా అంచనావేయదు’ అని ఖేర్ అన్నారు. యూపీఏ–1లో మన్మోహన్కు మీడియా సలహాదారుగా పనిచేసిన సంజయ్ బారు రాసిన ‘ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్’ పుస్తకం ఆధారంగా అదే పేరుతో ఈ చిత్రాన్ని తీశారు. సోనియా పాత్రను జర్మనీ నటి సుజానె బెర్నర్ట్ పోషించారు. ఈ సినిమాకు విజయ్ రత్నాకర్ గుట్టె దర్శకుడు. -
‘మన్మోహన్ జీ చరిత్ర మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకోదు’
టాలీవుడ్, బాలీవుడ్ అనే తేడా లేకుండా ప్రస్తుతం అన్ని ఇండస్ట్రీల్లో బయోపిక్ల హవా నడుస్తోంది. వీటిలో రాయకీయ నాయకుల జీవితాల ఆధారంగా వస్తోన్న చిత్రాలు కూడా ఉన్నాయి. ఈ క్రమంలో తెలుగులో బాలకృష్ణ ‘ఎన్టీఆర్’, మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ జీవితం ఆధారంగా బాలీవుడ్లో ‘ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్’ సినిమాలు తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ బయోపిక్ ఇంకా సెట్స్ మీద ఉండగా.. మన్మోహన్ బయోపిక్ షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. ఈ చిత్రంలో మన్మోహన్ సింగ్ పాత్రలో ప్రముఖ నటుడు అనుపమ్ ఖేర్ నటిస్తుండగా.. సోనియా గాంధీగా సజ్జన్ బెర్నర్ట్ కనిపించనున్నారు. సంజయ్ బారు రచించిన పుస్తకం ఆధారంగా అదే పేరుతో ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ పూర్తయిందని అనుపమ్ ఖేర్ పేర్కొన్నారు. ఈ మేరకు సెట్లో తీసిన ఓ వీడియోను అనుపమ్ ఖేర్ తన ట్విట్టర్లో షేర్ చేశారు. It is a WRAP for one of my most cherished films #TheAccidentalPrimeMinister. Thank you d cast and d crew for the most enriching times. Thank you #DrManmohanSinghJi for your journey. It has been a great learning experience. One thing is sure “History will not Misjudge you.” 🙏 pic.twitter.com/xnJM9XC78j — Anupam Kher (@AnupamPKher) October 26, 2018 ‘‘ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్’ షూటింగ్ పూర్తయింది. మొత్తం చిత్ర బృందానికి ధన్యవాదాలు. ఈ ప్రయాణం నాకు ఎన్నో నేర్పింది. ఈ సినిమా చేయడానికి ముందు మన్మోహన్ జీ గురించి నాలో కొన్ని అభిప్రాయాలండేవి. మిమ్మల్ని అపార్థం చేసుకున్నా. కానీ ఈ రోజు షూటింగ్ పూర్తయిన తర్వాత, దాదాపు ఏడాది పాటు ఈ పాత్రలో జీవించిన తర్వాత నిజాయతీగా చెబుతున్నా.. చరిత్ర మిమ్మల్ని ఎప్పటికీ తప్పుగా అర్థం చేసుకోదు. మీరు మా సినిమా చూసిన తర్వాత మీతో కలిసి కప్పు టీ తాగాలని ఉంది’ అని అనుపమ్ పేర్కొన్నారు. On the last day shoot of #TheAccidentalPrimeMinister someone shoots a off camera moment between @suzannebernert playing #MrsSoniaGandhi & I having tea & biscuits. Shares it on social media. It is already on tv now. Best option is to share it myself. So here it is. Enjoy.😊🤓👇 pic.twitter.com/HVs0YR0yxQ — Anupam Kher (@AnupamPKher) October 26, 2018 ఈ సందర్భంగా సెట్లో నటి సజ్జన్ బెర్నర్ట్తో మాట్లాడుతున్న వీడియోను అనుపమ్ షేర్ చేశారు. దీన్ని వీక్షించిన నెటిజన్స్ మీరిద్దరూ అచ్చం మన్మోహన్సింగ్, సోనియాగాంధీ లాగానే ఉన్నారని కామెంట్లు పెట్టారు. -
నేనే ముందు ఇంటికెళ్తా
ప్రస్తుతం కేన్సర్ చికిత్స పొందుతూ సోనాలీ బింద్రే లండన్లో ఉన్నారు. అప్పుడుడప్పుడు ఆమె ఫ్రెండ్స్ ఆమెను చూడటానికి వెళ్తూనే ఉన్నారు. రీసెంట్గా సోనాలీకి అనుపమ్ ఖేర్ వీకెండ్స్లో కంపెనీ ఇస్తున్నారట. అమెరికన్ టీవీ సిరీస్లో యాక్ట్ చేస్తున్నారు అనుపమ్. ఆ షూటింగ్ నిమిత్తం అక్కడున్నారాయన. ఈ విషయాన్ని తెలియజేస్తూ – ‘‘ఈ షో వల్ల ఇక్కడ నాకో స్నేహితుడు దొరికాడు. మనలో ఎవ్వరు ఫస్ట్ ఇంటికి వెళ్లిపోతామో అని మాట్లాడుకుంటూ ఉంటాం. అతని కంటే నేనే ముందు వెళ్లిపోవాలని కోరుకుంటున్నాను. అనుపమ్ షోకి ఎక్కువ సీజన్స్ ఉండి తను ఇక్కడే ఉండిపోవాలి’’ అని పేర్కొన్నారు సోనాలి. -
‘హిందువులందరినీ ఏకం చేయడం చాలా కష్టం’
న్యూయార్క్ : ‘ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులు ఏకం కావాల్సిన సమయం ఆసన్నమైంది. మనం మన మూలాలని, ఆధ్యాత్మికతని మర్చిపోవడం వల్లే ఇంత వెనకబడి ఉన్నాం’ అంటూ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భగవత్ ఉద్ఘాటించారు. శుక్రవారం చికాగోలో నిర్వహించిన రెండో ప్రపంచ హిందూ కాంగ్రెస్కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘మనకు తెలివి ఉంది.. జ్ఞానం ఉంది.. కానీ ఐకమత్యం లేదు. అందువల్లే మనం ఇంత వెనకబడి ఉన్నాం. మన హిందూ సమాజంలో ఎందరో ప్రముఖులు ఉన్నారు. కానీ వారందరికి సరైన గుర్తింపు లేదు. సింహాలు కలిసి సంచరించవు.. కానీ అడవి కుక్కలు కలిసి దాడి చేస్తాయి.. నాశనం చేస్తాయి’ అని తెలిపారు. అంతేకాక హిందువుల్లో ఐకమత్యం లోపించిందని ఆయన వాపోయారు. హిందూవులందరిని ఒక్క తాటిపైకి తీసుకురావడం కూడా చాలా కష్టమన్నారు. ఈ కార్యక్రమానికి దాదాపు 2500 మంది హాజరయ్యారు. వీరిలో బాలీవుడ్ ప్రముఖులు అనుపమ్ ఖేర్ కూడా ఉన్నారు. -
‘తనే నా హీరో’
సోనాలీ బింద్రే ప్రస్తుతం క్యాన్సర్ చికిత్స కోసం న్యూయార్క్లో ఉన్న సంగతి తెలిసిందే. ఇదే సమయంలో ప్రముఖ బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ కూడా ఒక షో షూటంగ్ నిమిత్తం న్యూయార్క్లో ఉన్నారు. ఈ సందర్భంగా ఆయన సోనాలీని కలిశారు. ఈ విషయం గురించి ప్రస్తావిస్తూ ‘నేను సోనాలీతో కలిసి కొన్ని చిత్రాల్లో నటించాను. బయట కూడా చాలాసార్లు తనని కలిశాను. తనేప్పుడు నవ్వుతూ.. ప్రశాంతంగా ఉండేది. కానీ నేను ఇన్ని రోజుల చూసిన సోనాలీకి.. ఓ 15 రోజులుగా చూస్తోన్న సోనాలీకి చాలా తేడా ఉంది. ఇప్పుడు నేను ఖచ్చితంగా చెప్పగలను ‘తనే నా హీరో’ అని’ అంటూ ట్వీట్ చేశారు. I have done few films with @iamsonalibendre. We’ve met socially many times in Mumbai. She always has been bright & a very warm person. But it is only in the last 15days that I got the opportunity to spend some quality time with her in NY. And I can easily say,”She is my HERO.”😍 pic.twitter.com/z6iBe2s7fy — Anupam Kher (@AnupamPKher) August 12, 2018 ట్వీట్తో పాటు చికిత్సకు ముందు సోనాలీ జుట్టు కత్తిరించుకుని ఉన్నప్పుడు తీసిన ఫోటోను కూడా అనుపమ్ ఖేర్ షేర్ చేశారు. గతంలో వీరిద్దరు కలిసి ‘హమరా దిల్ ఆప్నే పాస్ హై’, ‘దిల్ హై దిల్ మైనే’,‘ధాయ్ అక్షర్ ప్రేమ్ కే’ వంటి చిత్రాల్లో కలిసి నటించారు. ప్రస్తుతం అనుపమ్ ఖేర్ వైద్య నేపధ్యంలో సాగే డ్రామా ‘న్యూ ఆమస్టర్డ్యామ్’ చిత్రకరణ నిమిత్తం న్యూయార్క్లో ఉన్నారు. ప్రస్తుతం అనుపమ్ ఖేర్, బాలీవుడ్లో ‘ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్’ చిత్రంలో నటిస్తున్నారు. విజయ్ రత్నాకర్ గట్టీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను బొహ్రా బ్రదర్స్ నిర్మిస్తున్నారు. సలీమ్-సలైమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను 2019 ఎన్నికల నేపథ్యంలో డిసెంబర్ 21న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. -
అదిగో రాహుల్.. ఇదిగో ప్రియాంక..
న్యూఢిల్లీ : మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ జీవితం ఆధారంగా బాలీవుడ్లో ‘ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్’ అనే చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో మన్మోహన్ సింగ్ పాత్రలో ప్రముఖ నటుడు అనుపమ్ ఖేర్, సోనియా గాంధీగా జర్మన్ నటి సుజేన్ బెర్నెర్ట్, మన్మోహన్ భార్య గుర్షరన్ కౌర్ పాత్రలో దివ్య సేథ్ నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమాలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ పాత్రల్లో ఎవరో కూడా తెలిసిపోయింది. కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీగా అర్జున్ మాథూర్, ప్రియాంక గాంధీగా ఆహానా కుమ్రా నటిస్తున్నారు. మన్మోహన్ సింగ్తో రాహుల్ గాంధీ, అతని సోదరి ప్రియాంక గాంధీ మాట్లాడుతున్నా ఫోటోను అనుపమ్ ఖేర్ తన ట్విట్టర్ ద్వారా షేర్ చేశారు. ఈ ఫోటోలో అర్జున్, ఆహానా కుమ్రా అచ్చం రాహుల్, ప్రియాంకలానే ఉన్నారు. ఆహానా కుమ్రా మాట్లాడుతూ.. ‘ఈ చిత్రంలో ప్రియాంక గాంధీగా నటించడం సంతోషంగా ఉంది. అది చాలా ప్రాధాన్యత ఉన్న పాత్ర. ఈ సినిమాలో అన్ని పాత్రలో నిజజీవితంలో ఉన్నవారే కాబట్టి వారిలా మారడం, నటించడం చాలా అవసరం’ అని అన్నారు. మన్మోహన్ సింగ్ కు మీడియా సలహాదారుగా వ్యవహరించిన సంజయ్ బారు రాసిన పుస్తకం 'ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ : ది మేకింగ్ అండ్ అన్మేకింగ్ ఆఫ్ మన్మోహన్సింగ్' ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. విజయ్ రత్నాకర్ గట్టీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను బొహ్రా బ్రదర్స్ నిర్మిస్తున్నారు. సలీమ్-సలైమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను 2019 ఎన్నికల నేపథ్యంలో డిసెంబర్ 21న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. -
మన్మోహన్ భార్య పాత్ర పోషించేది ఆమెనే..
న్యూఢిల్లీ : మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ జీవితాధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్’.. సంజయబారు రాసిన పుస్తక ఆధారంగా విడుదల కాబోతున్న ఈ సినిమాలో మన్మోహన్ సింగ్ పాత్రలో అనుపమ్ ఖేర్, సోనియా గాంధీగా జర్మన్ నటి సుజేన్ బెర్నెర్ట్ నటిస్తున్న సంగతి తెలిసిందే. సుజేన్, అనుపమ్ ఖేర్లు తమ పాత్రలను ధృవీకరిస్తూ, ఈ చిత్రానికి సంబంధించి కొన్ని స్టిల్స్ను కూడా సోషల్ మీడియాలో పోస్టు చేశారు. తాజాగా మన్మోహన్ సింగ్ భార్య పాత్రలో నటించేది ఎవరో కూడా తెలిసిపోయింది. మన్మోహన్ భార్య గుర్షరన్ కౌర్ పాత్రలో దివ్య సేథ్ నటిస్తున్నట్టు తెలిసింది. గుర్షరన్ కౌర్ పాత్రలో దివ్య సేథ్ నటిస్తున్నట్టు ధృవీకరిస్తూ.. ఒక ఫోటోను అనుపమ్ ఖేర్ తన ఇన్స్ట్రాగ్రామ్లో పోస్టు చేశారు. ఈ ఇద్దరు తమ తమ పాత్రకు తగ్గట్టు వస్త్రాలు ధరించి ఉన్నారు. అచ్చం మన్మోహన్, గుర్షరన్లా మాదిరిగానే కనిపిస్తున్నారు. ‘చాలా ప్రతిభావంతురాలైన దివ్యా సేథ్ షాను పరిచయం చేస్తున్నాం. ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ సినిమాలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ భార్య గుర్షరన్లా దివ్య నటించనుంది’’ అని అనుపమ్ ఖేర్ తన ఇన్స్టాగ్రామ్లో పేర్కొన్నారు. ఇప్పటికే ఈ సినిమాలో మన్మోహన్ పాత్రకు సంబంధించిన పలు స్టిల్స్ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. విజయ్ రత్నాకర్ గట్టే ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా.. బోహ్ర బ్రదర్స్ నిర్మిస్తున్నారు. డిసెంబర్ 21న ఈ సినిమా విడుదల అవ్వనున్నట్టు తెలుస్తోంది. ఒక దేశానికి నేతృత్వం వహించాలన్న కల సాకారం కావాలంటే అందుకు ఏళ్ల తరబడి రాజకీయ కృషి.. ప్రజాజీవితం.. ఇలా చాలానే కావాలి. కానీ.. అవేవీ లేకుండానే ప్రధాని అయిన మన్మోహన్ సింగ్ జీవితాధారంగా తెరకెక్కుతున్న కథే ఇది. -
సినిమా అంటే ఎంటర్టైన్మెంటే కాదు
‘‘సినిమా అనేది కేవలం ఎంటర్టైన్మెంట్ కోసమే కాదు.. సమాజంలో మార్పు తీసుకువచ్చేలా కూడా ఉండాలి’’ అని పేర్కొన్నారు బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్. ప్రస్తుత సమాజంలో సినిమా మాద్యమానికి ఉన్న ఆవశ్యకతను గురించి అనుపమ్ ఖేర్ మాట్లాడుతూ– ‘‘సినిమా అనేది కేవలం ఎంటర్టైన్మెంట్ మీడియమ్గా మిగిలిపోకూడదు. సమాజంలో మార్పు తీసుకొచ్చే మాద్యమంలా కూడా ఉండాలి. యంగ్ ఫిల్మ్ మేకర్స్, ఇండిపెండెంట్ ఫిల్మ్మేకర్స్ అందరూ లిమిటెడ్ బడ్జెట్తో మంచి సినిమాలు రూపొందిస్తున్నారు. వాళ్ల ముఖ్య ఉద్దేశం కేవలం మంచి సినిమా తీయడమే. సమాజాన్ని ఏదో విధంగా ఇన్ఫ్లూయన్స్ చేసే సినిమాలు ఎక్కువగా వస్తున్నాయి. అలాంటి దర్శకుల్ని కచ్చితంగా ఎంకరేజ్ చేయాలి’’ అని పేర్కొన్నారాయన. అనుపమ్ ఖేర్ ప్రస్తుతం మన్మోహన్ సింగ్ బయోపిక్ ‘ది యాక్సిడెంటల్ ప్రైమ్మినిస్టర్’ మూవీలో యాక్ట్ చేస్తున్నారు. -
అచ్చం మన్మోహన్ సింగ్లా..వీడియో వైరల్
-
అచ్చం మన్మోహన్ సింగ్లా..
మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ జీవితం ఆధారంగా బాలీవుడ్లో ‘ ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్’ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో ప్రముఖ నటుడు అనుపమ్ ఖేర్ మన్మోహన్ సింగ్ పాత్ర పోషిస్తున్నారు. ఇటీవల మన్మోహన్ లుక్లో అనుపమ్ ఖేర్కి సంబంధించిన కొన్ని ఫోటోలు కూడా విడుదల చేశారు. తాజాగా అనుపమ్ ఖేర్ ఈ చిత్రానికి సంబంధించి విడుదల చేసిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అనుపమ్ తన ట్విట్టర్ ద్వారా రిహార్సల్ వీడియో విడుదల చేశారు. నేవి బ్లూ కోట్ ధరించి మెట్లపై దిగుతున్న అనుపమ్ అచ్చం మన్మోహన్ లా నడుస్తుండటంతో ఈ వీడియో వైరల్ అయింది. ఈ చిత్రం ప్రస్తుతం లండన్లో షూటింగ్ జరుపుకుంటుంది. మన్మోహన్ సింగ్ కు మీడియా సలహాదారుగా వ్యవహరించిన సంజయ్ బారు రాసిన పుస్తకం 'ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ : ది మేకింగ్ అండ్ అన్మేకింగ్ ఆఫ్ మన్మోహన్సింగ్' ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. విజయ్ రత్నాకర్ గట్టీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను బొహ్రా బ్రదర్స్ నిర్మిస్తున్నారు. సినిమాలో సంజయ్బారుగా అక్షయ్ ఖన్నా, సోనియా గాంధీగా జర్మన్ యాక్టర్ సుజానే బెర్నెర్ట్ నటించనున్నారు. సలీమ్-సలైమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను 2019 ఎన్నికల నేపథ్యంలో డిసెంబర్ 21న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. -
సోనియా గాంధీగా ఈమెనే!
న్యూఢిల్లీ : దేశ మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ జీవిత ఆధారంగా ‘ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్’ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. సంజయ్బారు రాసిన పుసక్తం ‘ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్’ ఆధారంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఈ సినిమా కు సంబంధించిన స్టిల్స్ను చిత్ర బృందం విడుదల చేసింది. అనుపమ్ కేర్ ఈ సినిమాలో డా.మన్మోహన్ సింగ్గా కీలక పాత్ర పోషిస్తున్నారు. మరో కీలక పాత్ర అయిన కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీగా ఎవరు నటిస్తున్నారని సర్వత్రా చర్చనీయాంశమైంది. ఈ ఉత్కంఠకు తెరదించుతూ.. సోనియా గాంధీగా తాను బిగ్ స్క్రీన్పై నటిస్తున్నట్టు జర్మన్ నటి సుజానే బెర్నెర్ట్ ట్విటర్లో ధృవీకరించారు. పలు భారతీయ సినిమాల్లో, పలు భాషల టీవీ షోల్లో నటించిన బెర్నెర్ట్, నటుడు అఖిల్ మిశ్రాను పెళ్లి చేసుకున్నారు. ఆమె బెంగాలీ, మరాఠి, హిందీ భాషలను అనర్గళంగా మాట్లాడగలరని తెలుస్తోంది. అంతకముందు ‘ప్రధానమంత్రి’ టెలివిజన్ సిరీస్లో కూడా కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలిగా ఆమె నటించారు. తన తర్వాత ప్రాజెక్ట్ సోనియా గాంధీ అని సుజానే బెర్నెర్ట్ ట్విటర్లో పేర్కొన్నారు. విజయ్ గుట్టే దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అనుపమ్ ఖేర్తో పాటు అక్షయ్ ఖన్నా కూడా నటిస్తున్నారు. డిసెంబర్ 21న ఈ సినిమా విడుదల కాబోతోంది. -
మన్మోహన్ వస్తున్నారు
దేశ ప్రధానమంత్రిగా 2004 నుంచి 2014 వరకు బాధ్యతలు నిర్వర్తించారు డా. మన్మోహన్సింగ్. ఈ పదేళ్లలో ఆయనను కొందరు ప్రశంసించారు. మరికొందరు విమర్శించారు. పదవీకాలం ముగిసిపోయే సమయంలో ఆయన జీవితంపై ‘ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్’ అనే పుస్తకం విడుదల అయ్యింది. 2004 మే నుంచి 2008 ఆగస్టు వరకు మన్మోహన్సింగ్కు మీడియా అడ్వైజర్గా వర్క్ చేసిన సంజయ్బారు ఈ పుస్తకం రాయడం విశేషం. ఈ పుస్తకం ఆధారంగా బాలీవుడ్లో రూపొందుతున్న సినిమా‘ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్’. విజయ్ గుట్టే దర్శకత్వం వహిస్తున్నారు. మాజీ ప్రధానమంత్రి మన్మోహన్సింగ్ పాత్రలో అనుపమ్ ఖేర్ నటిస్తున్నారు. బోహ్రా బోస్ నిర్మాత. ఈ సినిమా ఫస్ట్ లుక్స్ను రిలీజ్ చేశారు. ‘‘సినిమాలో డా. మన్మోహన్ సింగ్ లుక్ని షేర్ చేయడం హ్యాపీగా ఉంది’’ అని అనుపమ్ పేర్కొన్నారు. ఈ ఏడాది డిసెంబర్ 21న చిత్రాన్ని రిలీజ్ చేయనున్నట్లు చిత్రబృందం పేర్కొంది. మరోవైపు ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వంలో షారుక్ ఖాన్, కత్రినా కైఫ్, అనుష్కాశర్మ ముఖ్య తారలుగా నటిస్తున్న ‘జీరో’ చిత్రాన్ని ఇదే రోజున రిలీజ్ చేయాలనుకుంటున్నారు. సో.. బాక్సాఫీస్ వద్ద క్లాష్ తప్పదన్న మాట. -
ప్రధానిగా అనుపమ్ ఖేర్ని చూశారా..?
మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ పై తెరకెక్కుతున్న చిత్రం ‘ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిష్టర్’. అనుపమ్ ఖేర్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రం ఫస్ట్లుక్ని ఆయన తన సోషల్ మీడియా ఖాతాలో విడుదల చేశారు. ప్రధాని పాత్రలో ఖేర్ తెల్లని గడ్డంతో, తలపాగ ధరించి దీర్ఘ ఆలోచనలో ఉన్నట్లు కనిపిస్తున్నారు. సంజయ్ బారు పుస్తకం ‘ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిష్టర్’ ఆధారంగా ఇదే పేరుతో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి విజయ్ రత్నాకర్ గుట్లే దర్శకత్వం వహిస్తున్నారు. లండన్లో చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్రం ఈ ఏడాది డిసెంబర్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. -
యాక్టింగ్ దేవుడు
రాబర్ట్ డెనీరోను యాక్టింగ్కు దేవుడిగా చెప్పుకుంటారు ఆయనను అభిమానించే వాళ్లు. ఐదు దశాబ్దాల కాలంలో లెక్కలేనంత మంది అభిమానులను సంపాదించుకొని, తాను తప్ప ఇంకెవరూ చెయ్యలేరన్న పాత్రలు చేసి మెప్పించిన డెనీరోకు ఇండియాలోనూ ఫ్యాన్స్ తక్కువేమీ లేరు. ముఖ్యంగా ఇండియన్ సినిమా సెలెబ్రిటీలు తమకు బాగా ఇష్టమైన నటుల పేర్లు చెప్పమంటే వినిపించే పేర్లలో రాబర్ట్ డెనీరో పేరు ఎక్కువగా ఉంటుంది. ఇండియన్ సినిమాలో నటుడిగా తనకంటూ ఒక బ్రాండ్ సృష్టించుకున్న అనుపమ్ ఖేర్ కూడా డెనీరోకు వీరాభిమాని. వీరిద్దరూ కలిసి గతంలో ‘సిల్వర్ లైనింగ్స్ ప్లేబుక్’ అనే హాలీవుడ్ సినిమాలో నటించారు. అప్పట్నుంచే ఇద్దరి మధ్యా మంచి ఫ్రెండ్షిప్ కూడా కుది రింది. తాజాగా అనుపమ్ ఖేర్ పుట్టినరోజు (మార్చి 7) సందర్భంగా డెనీరో తన భార్యతో కలిసి, అనుపమ్కు ఒక డిన్నర్ పార్టీ ఇచ్చాడు. హ్యాపీ బర్త్డే అంటూ డెనీరో పాట కూడా పాడాడు. ‘‘నా జీవితంలో ఇది మర్చిపోలేని రోజు. నాకు యాక్టింగ్ దేవుడు ఇచ్చిన బర్త్డే పార్టీ గొప్ప సంతోషాన్నిచ్చింది.’’ అంటూ అనుపమ్ ఖేర్ తన ఆనందాన్ని పంచుకున్నాడు. ∙రాబర్ట్ డెనీరో -
భ్రాంతి కాదు నిజం అయారి
‘‘దేశ్ బేచ్ దేంగే తో బచేగా క్యా?’’ (దేశాన్నే అమ్మేస్తే ఇంకేం మిగిలి ఉంటుంది?) అంటూ దేశమంతా అలుముకున్న అవినీతి మీద ఆలోచనను రేకెత్తించేదే ‘అయారి’ సినిమా! ‘ఎ వెడ్నెస్ డే’, ‘స్పెషల్ చబ్బీస్’, ‘బేబీ’ తీరులో ఈ సినిమా ఉత్కంఠను రేకెత్తించలేకపోయినా.. దర్శకుడు నీరజ్ పాండే మార్క్నైతే చూపిస్తుంది. అయారి.. అంటే భ్రాంతి.. తాంత్రికత.. మాంత్రికత! అన్నీ బాగున్నట్టు అనిపించే, ఫీల్ గుడ్ ఫీల్ భ్రాంతిని కలిగించే పరిస్థితుల వెనక ఉన్న అసలు కథను చూపించే సినిమా. ఇది కేవలం కల్పితం. ఎవరినీ, దేనినీ ఉద్దేశించి కాదు అంటూ ప్రారంభంలో డిస్క్లేమర్ వేసినా.. రక్షణ శాఖలో జరుగుతున్న అవినీతిని సెల్యూలాయిడ్ మీద చూపించిన చిత్రం ఇది. అందుకే పైన చెప్పిన మాట అంటాడు ఆర్మీ చీఫ్ ‘‘దేశ్ బేచ్ దేంగే తో బచేగా క్యా?’’ అని! ఆహారధాన్యాల దగ్గర నుంచి ఆయుధాల దాకా అన్ని శాఖల్లో అంతటా అవినీతే. ఎక్కడికక్కడ దేశాన్ని అమ్ముకుంటూ పోతే ఇంకేం మిగులుతుంది? మనకన్నా ముందు తరం.. తర్వాత తరాలకు ఏం స్ఫూర్తిని పంచుతారు? సంపాదన ఆశలో పడి ఈ తరం ఈ దేశాన్ని ఎటు తీసుకెళ్తుంది? అంటూ తరాల ఆలోచనల అంతరాలనూ ప్రశ్నిస్తుంది? చర్చకు చోటిస్తుంది. దేశ భక్తి అనే పెద్ద మాటలు వద్దు కాని.. ఆరోగ్యకరమైన వాతావరణమైతే దేశంలో ఉండాలికదా! మన దేశంలో మనం భద్రంగా ఉన్నామనే భావనైతే కలగాలి కదా! దేశానికి కంచెలా ఉన్న రక్షణ శాఖ ఆ నమ్మకాన్నివ్వాలి కదా! అదే అమ్మకానికి తయారైపోతే? విశ్వాసాన్ని కోల్పోతాడు ఓ యంగ్ సోల్జర్, మేజర్ జయ్ బక్షి (సిద్ధార్థ్ మల్హోత్రా). రక్షణ శాఖలోని పెద్ద తలకాయలైతే ఆయుధాలు అమ్మే డీలర్స్తో డీల్ కుదుర్చుకొని నిజాయితీగా పనిచేస్తున్న టీమ్ను పణంగా పెట్టాలనుకున్నప్పుడే మొత్తం మిలటరీ వ్యవస్థ మీదే గౌరవాన్ని తుడిచేసుకుంటాడు. ఆ డీల్లో తానూ వాటా పంచుకోవాలనుకుంటాడు. డ్యూటీని ప్రాణం కన్నా మిన్నగా ప్రేమించిన కల్నల్ అభయ్ సింగ్ (మనోజ్ బాజ్పాయ్)ను స్ఫూర్తిగా తీసుకుని.. విధి నిర్వహణలో అతనంతటివాడిని కావాలని కలలు కని ఆర్మీలోకి వస్తాడు. కల్నల్ అభయ్సింగ్ నేతృత్వంలోని కోవర్ట్ ఆపరేషన్స్ (స్పెషల్)లో సభ్యుడిగా ఉంటుంటాడు జయ్ భక్షి. ఒకరకంగా కల్నల్కు ఏకలవ్య శిష్యుడు జయ్. ఆపరేషన్స్ నిర్వహణలో ఆలోచన దగ్గర్నుంచి, వ్యూహప్రతివ్యూహాలు, ఆచరణ అన్నీ తన గురువులాగే చేస్తుంటాడు. ట్యాపింగ్.. రేటింగ్ ఈ స్పెషల్ టీమ్ అసైన్మెంట్లో ఉన్నప్పుడే తెలుస్తుంది ఓ మిలిటరీ ఆఫీసర్ ఆర్మీ చీఫ్ దగ్గరకు ఓ డీల్ తీసుకుని రావడం గురించి. ఓ ఆర్మ్స్ డీలర్ తరపున ఓ ఆఫర్ తీసుకొని వస్తాడు ఆ ఆఫీసర్ ఆర్మీ చీఫ్ దగ్గరకు. ఆ డీల్ను మన్నించి వాళ్ల దగ్గర ఆయుధాలు కొంటే అమరవీరుల వితంతువులకు సంక్షేమ ఫండ్నూ ఇస్తారనే తాయిలాన్నీ చూపిస్తాడు. ఆ ఆఫర్కు తల వంచని చీఫ్ ‘‘చివరకు దేశాన్నీ అమ్మేస్తున్నామన్న మాట’’ అంటూ చురకా అంటిస్తాడు. ‘‘అనధికారికంగా.. 20 కోట్ల ఫండ్తో మీరు నిర్వహిస్తున్న స్పెషల్ టీమ్ కోవర్ట్ ఆపరేషన్స్ మాటేంటి?’’ అని అప్పటిదాకా రహస్యంగా ఉన్న విషయాన్ని బయటపెట్టి బ్లాక్మెయిలింగ్కు తలపడ్తాడు ఆ ఆఫీసర్. ఆ స్పెషల్ టీమ్ ఓ కాజ్ కోసం.. ఎవరికీ తెలియకుండా నియమించింది. అది బయటపడేసరికి ఖంగు తింటాడు ఆర్మీ చీఫ్. వాళ్ల సంభాషణను ట్యాప్ చేస్తున్న జయ్ కూడా విస్మయం చెందుతాడు. అయినా తలవంచడు ఆర్మీ చీఫ్. దేశానికి రక్షణగా నిలవాల్సిన ఆ శాఖలోని అవినీతి మొత్తం మిలటరీ మీదే విశ్వాసాన్ని పోగొడ్తుంది జయ్కు. ఆ టీమ్లోంచి ఈ ఆఫీసర్ టీమ్లోకి మారుతాడు జయ్.. డబ్బు సంపాదించుకోవడానికి. అప్పటికే ఈ కోవర్ట్ ఆపరేషన్స్ కోసం ఓ ఎథికల్ హ్యాకర్ సోనియా (రకుల్ప్రీత్ సింగ్)తో పరిచయం పెంచుకొని ప్రేమలో పడ్తాడు జయ్. ఇప్పుడు ఈ ఆఫీసర్ టీమ్లో చేరి తన కోవర్ట్ టీమ్ రహస్యాలను చెప్పేందుకు పదికోట్లకు డీల్ కుదుర్చుకుని తన ప్రియురాలితో దేశాన్ని వదిలిపోవాలనుకుంటాడు. ఆ ప్రయత్నాల్లో ఉంటాడు కూడా. ఈ విషయం కల్నల్ అభయ్సింగ్కు తెలుస్తుంది. జయ్ కోసం వేట మొదలుపెడ్తాడు. ఇందులో భాగంగానే లండన్ చేరతారు ఇద్దరూ. అప్పటికే సోనియా లండన్ చేరుకుని ఉంటుంది జయ్ ప్లాన్లో భాగంగా. గురువు దగ్గర నేర్చుకున్న విద్యతో అతనికి దొరక్కుండా జాగ్రత్త పడ్తుంటాడు జయ్. ఇంకా పై ఎత్తులు వేసి దగ్గరకు రప్పిస్తాడు కల్నల్. ఇందులో ఇంటర్నేషనల్ ఆర్మ్స్ డీలర్ ముఖేష్ కపూర్ (అదిల్ హుస్సేన్)ను పావులా వాడుకుంటాడు అభయ్. ఆర్మ్స్ డీలర్ ముఖేష్ కపూర్ కూడా ఒకప్పుడు ఇండియన్ ఆర్మీలో ఆఫీసరే. ఇండియన్ ఆర్మీలో ఉన్న లొసుగులు, విధివిధానాలన్నిటినీ ఔపోసన పట్టిన అతను ఆయుధాల వ్యాపారంతో కోట్లకు పడగలెత్తొచ్చని ఉద్యోగానికి రాజీనామా చేసి ఆ వ్యాపారం మొదలుపెడ్తాడు. విదేశీ కంపెనీల ఆయుధాలకు డీలర్గా మారి మన దేశంలోని మిలటరీ అధికారులకు లంచాలిస్తూ అసలు ధరకన్నా నాలుగు రెట్ల ధరతో ఆయుధాలను కొనిపిస్తుంటాడు. అలా రిటైరయ్యి, మళ్లీ ఉద్యోగంలో చేరిన ఓ ఆర్మీ ఆఫీసర్నూ పట్టి.. ఆయన ద్వారా చీఫ్కు తన వర్తమానం పంపిస్తాడు అలా. ఆర్మీ చీఫ్ వద్దనేసరికి జయ్ భక్షి సహాయంతో ఆ చీఫ్ నియమించిన కోవర్ట్ ఆపరేషన్స్ గుట్టు రట్టు చేసి టీఆర్పీలో నంబర్ మూడులో ఉన్న ఓ చానల్ రిపోర్టర్కు ఇస్తాడు టెలికాస్ట్ చేయమని. దాంతో చానల్ రేటింగ్ను పెంచుకొని నంబర్వన్ చానల్గా అయిపోమ్మని. మోసం.. దగా అయితే కల్నల్ అభయ్ సింగ్ ఆ పాచిక పారనివ్వడు. జయ్ను పట్టుకునే క్రమంలో జయ్ ద్వారా తెలుసుకున్న, అందుకున్న సమాచారంతో ఆ చానల్ రిపోర్టర్ను కలుసుకొని ఇంకో రికార్డర్ ఇస్తాడు టెలికాస్ట్ చేసుకొమ్మని. ఆఫీసర్ ఇచ్చినది వేసుకోవాలో.. ఇప్పుడు తాను ఇచ్చింది వేసుకోవాలో విచక్షణ నీదే అంటాడు. అది అమరవీరుల వితంతువుల కోసం ముంబైలో కట్టిన నివాస సముదాయంలో జరిగిన అవినీతికి సంబంధించిన వార్తాకథనం. ఆ రిపోర్టర్ అభయ్సింగ్ ఇచ్చిన కథనాన్నే టెలికాస్ట్ చేయిస్తుంది. ఆ ఆఫీసర్ తుపాకితో పేల్చుకొని ఆత్మహత్య చేసుకుంటాడు. ఎందుకంటే ఆ నిర్మాణం అవినీతిలో ప్రధాన హస్తం ఆ ఆఫీసర్దే. ఈ మొత్తం వ్యవహారం... రక్షణ శాఖ పట్ల అభయ్సింగ్, జయ్ల మ«ధ్య ఉన్న అభిప్రాయ భేదాలను తొలగించి ఆ ఇద్దరినీ ఒక్కటిచేసే దిశగా సాగి సినిమాను ఎండ్ చేస్తుంది. కశ్మీర్ ఓ ప్రదేశం కాదు.. రక్షణ శాఖ, అంతర్జాతీయ ఆయుధ వ్యాపారులు, డీలర్లు, దేశీ మీడియా.. ఇవన్నీ కలిసి ఎలాంటి గిమ్మిక్కులు చేస్తున్నాయి? ఆ లాబీ ముసుగులో ఎవరి ప్రయోజనాలను వాళ్లు ఎంతెంత నెరవేర్చుకుంటున్నారు? ఈ నేపథ్యంలో దేశ రక్షణ, దానిపట్ల ప్రజలకున్న నమ్మకాన్ని ఎలా పణంగా పెడ్తున్నారు? అనేదాన్ని కళ్లకు కట్టినట్టు చూపెడుతుందీ సినిమా. ‘‘ఇండియా, పాకిస్తాన్ ఈ రెండు దేశాల వైపు ఎందరో మేధావులు, విద్యావేత్తలు ఉన్నారు. అయినా కశ్మీర్ సమస్యకు ఎందుకు పరిష్కారం చూపట్లేదు?’’ అని ప్రశ్నిస్తాడు జయ్.. కల్నల్ అభయ్సింగ్ను. ‘‘కశ్మీర్ ఓ ప్రదేశంకాదు.. ఓ ఇండస్ట్రీ. దానివల్ల వ్యాపారుల దగ్గర్నుంచి రాజకీయనాయకుల దాకా అందరికీ లాభాలున్నాయి. ఓ సమస్య లాభాలను పంచుతున్నంత కాలం దాన్ని కాలం చెల్లనివ్వకుండా చూసుకుంటారు ’’ అంటాడు కల్నల్. ఎంత నిజం? అదే నిజం దేశంలోని అన్ని సమస్యలకు వర్తిస్తుంది. అదే చెప్తుంది.. చూపిస్తుంది ‘అయారి’ సినిమా. పాలకులు, కార్పోరేట్ శక్తులు కలిసి సమస్యలతో ప్రయోజనాలను పిండుకుంటే ప్రజలకు అంతా బాగుందనే భ్రాంతి కలగజేస్తూ జోకొడ్తుంటారు. చైతన్యం కాకపోతే అయారి (భ్రాంతే) మిగుల్తుంది. మనోజ్భాజ్పాయ్ ఈ సినిమాకు ఊపిరి. ఆదిల్ హెస్సేన్, నసీరుద్దీన్ షా, అనుపమ్ఖేర్ల నటన గురించి ప్రతేక్యంగా చెప్పేదేముంటుంది? పాత్రలను పండిస్తారు. వీళ్లకు సమ ఉజ్జీగా సిద్ధార్థ్ మల్హోత్రా శక్తియుక్తులను కూడదీసుకున్నాడు. రకుల్ప్రీత్.. డాన్సింగ్ డాల్గా మిగల్లేదు. దర్శకుడు నీరజ్పాండే ఇంతకుముందు తీసిన సినిమాలను దృష్టిలో పెట్టుకొని వెళితే నిరాశపడ్తారు. కాబట్టి ఎలాంటి అంచనాలు లేకుండా చూస్తే ‘అయారి’ అలరిస్తుంది. – శరాది -
పేరు కోసం పోరు
‘‘నా పేరును వాడుకుంటున్నావు.. రాయల్టీ కట్టు లేదా లీగల్ నోటీస్ కోసం సిద్ధంగా ఉండు’’ అని నటుడు–దర్శకుడు అనుపమ్ ఖేర్పై హెచ్చరిక జారీ చేశారు అనిల్ కపూర్. విషయం ఏంటంటే.. ‘‘బెల్లెవ్యూ’’ అనే ఓ కెనెడా పాపులర్ టీవీ సిరీస్లో ముఖ్య పాత్ర పోషించనున్నారు అనుపమ్ ఖేర్. ఆ సిరీస్లో అనుపమ్ క్యారెక్టర్ పేరు డా. అనిల్ కపూర్. ఆ క్యారెక్టర్కు తన పేరును వాడుకుంటున్నారు అనే కారణంతో ట్విట్టర్లో ఈ కామెంట్స్ చేశారు అనిల్. దాంతో అనిల్, అనుపమ్ మధ్య గొడవ మొదలైందనే వార్తలు స్టార్ట్ అయ్యాయి. ఈ విషయం పై అనుపమ్ ఖేర్ స్పందిస్తూ – ‘‘అనిల్కపూర్ సరదాగా జోక్ చేశాడు. ఈ విషయంపై అనవసరమైన చర్చ జరుగుతోంది. అయినా అనవసరమైన విషయాల్ని ఫోకస్ చేయడం మనకు అలవాటే కదా. అనిల్ అన్నాడని కాదు కానీ, అతని పేరుతో నేను ఆ క్యారెక్టర్ను చేస్తే కొంచెం అయోమయంగా ఉండొచ్చు. అందుకని నా పాత్ర పేరును మార్చమని ప్రొడక్షన్ టీమ్ను కోరాను. ప్రాజెక్ట్ విషయానికి వస్తే ఈ సిరీస్లో పార్ట్ అయినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఇంటర్నేషనల్ టెలివిజన్లోనే ‘బెల్లవ్యూ’ మోస్ట్ అవెయిటెడ్ సిరీస్. నటుడిగా నా పరిధుల్ని పెంచుకుని, వరల్డ్ క్లాస్ టాలెంట్తో పని చేసే అవకాశం కల్పించనుంది ఈ సిరీస్’’ అని పేర్కొన్నారు. డేవిడ్ స్కల్నర్ రాసిన ఈ టీవీ సిరీస్ను ఎరిక్ మాన్హైమర్ నిర్మిస్తున్నారు. ఒక హాస్పిటల్లో పన్నెండు మంది పేషంట్స్ లైఫ్ అండ్ డెత్ సిచ్యువేషన్స్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని ఈ సిరీస్ను రూపొందిస్తున్నారు. ఈ సిరీస్ షూటింగ్లో అనుపమ్ ఖేర్ మార్చి నుంచి పాల్గొననున్నారు. -
బేడి, ఖేర్ల ట్వీటర్ ఖాతాలు హ్యాకింగ్
న్యూఢిల్లీ: పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడి, ప్రముఖ నటుడు అనుపమ్ ఖేర్, బీజేపీ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్, రాజ్యసభ సభ్యుడు స్వపన్ దాస్గుప్తాల ట్వీటర్ అకౌంట్లు హ్యాకింగ్కు గురయ్యాయి. ఈ పని వెనక టర్కీ కేంద్రంగా పనిచేస్తున్న, పాక్ అనుకూల అయిల్దిజ్ టిమ్ బృందం ఉన్నట్లు తెలిసింది. బేడి ఖాతాలో టర్కిష్, ఆంగ్ల భాషల్లో ట్వీట్లతో పాటు టర్కీ జెండా ఎమోజి కనిపించింది. ‘మా సోషల్ మీడియా అకౌంట్లను మూసివేస్తున్నందుకు నిరసన తెలుపుతున్నాం. మాపై నిషేధాన్ని తొలగించే వరకూ ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఖాతాలకు ముప్పు తప్పదు’ అని టర్కిష్ భాషలో ట్వీట్ వచ్చింది. సమస్యను పరిష్కరించడానికి తమ బృందాలు కృషి చేస్తున్నాయని ట్వీటర్ వెల్లడించింది. -
అనుపమ్ ఖేర్ మంచి నటుడే కానీ.. !
సాక్షి, న్యూఢిల్లీ: జాతీయ టెలివిజన్, ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ (ఎఫ్టీఐఐ) చైర్మన్గా ప్రముఖ నటుడు అనుపమ్ ఖేర్ను నియమించడంపై కాంగ్రెస్ పార్టీ స్పందించింది. అనుపమ్ ఖేర్ మంచి నటుడే కానీ.. ఆయన చేసే వ్యాఖ్యలు రాజకీయపరంగా ఉంటాయని అభ్యంతరం వ్యక్తం చేసింది. ఎఫ్టీఐఐ చైర్మన్గా అనుపమ్ను నియమించడంపై కాంగ్రెస్ అధికార ప్రతినిధి ఆర్పీఎన్ సింగ్ను మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. నటుడిగా అనుపమ్ చాలా గొప్ప పాత్రలు పోషించారని, ఎఫ్టీఐఐ పురోగతి కోసం ఆయన పనిచేసే అవకాశముందని పేర్కొన్నారు. 'ఆయన టీవీలోనూ, వెండితెరపై మంచి అభినయాన్ని కనబర్చారనే విషయంలో సందేహం లేదు. కానీ ఆయనను ఎఫ్టీఐఐ చైర్మన్గా ఎందుకు నియమించారో మీకు, నాకు దేశం మొత్తానికి తెలుసు. కేవలం ఆయన నటన నైపుణ్యం మీద ఆధారపడి ఈ నియామకం జరగలేదు. ఆయన ఇటీవల సినిమాల కన్నా రాజకీయాల గురించే ఎక్కువగా వ్యాఖ్యలు చేస్తున్న విషయం తెలిసిందే' అని ఆర్పీఎన్ సింగ్ అన్నారు. ఐదు వేలకుపైగా సినిమాల్లో నటించి విలక్షణ నటుడిగా పేరొందిన అనుపమ్ ఖేర్ ప్రధాని నరేంద్రమోదీకి గట్టి మద్దతుదారు. మోదీకి, బీజేపీకి అనుకూలంగా వ్యవహరించినందుకే ఆయన ఎఫ్టీఐఐ చైర్మన్గా పదవి లభించినట్టు విమర్శలు వినిపిస్తున్నాయి. -
ఎఫ్టీఐఐ చైర్మన్గా అనుపమ్ ఖేర్
న్యూఢిల్లీ: ప్రముఖ బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్(62)కు కీలక పదవి లభించింది. పుణేలోని ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా(ఎఫ్టీఐఐ) చైర్మన్గా ఖేర్ను నియమించినట్లు కేంద్ర సమాచార, ప్రసార శాఖ అధికారులు తెలిపారు. ఎఫ్టీఐఐ చైర్మన్గా తనను ఎంపిక చేయడంపై ఖేర్ స్పందిస్తూ ‘ప్రతిష్టాత్మకమైన ఎఫ్టీఐఐకి చైర్మన్గా ఎంపిక కావడాన్ని గౌరవంగా భావిస్తున్నా. నాకు అప్పగించిన విధుల్ని శక్తివంచన లేకుండా నిర్వర్తిస్తాను’ అని ట్వీటర్లో అన్నారు. ఎఫ్టీఐఐ చైర్మన్గా పనిచేసిన గజేంద్ర చౌహాన్ పదవీకాలం ముగిసిన 7 నెలల అనంతరం కేంద్రం అనుపమ్ ఖేర్ను చైర్మన్గా కేంద్రం నియమించింది. ఖేర్ ఢిల్లీలోని నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా(ఎన్ఎస్డీ)లో డిగ్రీ పొందారు. 500 పైచిలుకు చిత్రాల్లో నటించిన ఖేర్ సినిమా,కళల రంగానికి అందించిన సేవలకు గానూ 2004లో పద్మశ్రీ, 2016లో పద్మవిభూషణ్ పురస్కారాలను అందుకున్నారు. -
గజేంద్ర చౌహాన్ స్థానంలో అనుపమ్ ఖేర్
బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ కు కీలక బాధ్యతలు అప్పగించారు. బాలీవుడ్ లో విభిన్న పాత్రలతో అలరించిన ఆయనను ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాకు (ఎఫ్ టీ ఐ ఐ) చైర్మన్గా నియమించారు. పుణెలో ఉన్న ఈ ఇన్సిస్టిట్యూట్ కు ఇన్నాళ్లు బుల్లితెర నటుడు గజేంద్ర చౌహాన్ చైర్మన్ గా ఉన్నారు. ఇప్పుడు ఆయన స్థానంలో అనుపమ్ ఖేర్ కు బాధ్యతలు అప్పగించారు. అనుపమ్ గతంలో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్, నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాలకు చైర్మన్ గా వ్యవహరించారు. దాదాపు 500లకు పైగా సినిమాల్లో నటించిన అనుపమ్ ఎన్నో అవార్డులు రివార్డులు అందుకున్నారు. కళారంగానికి ఆయన అందించిన సేవలకు గానూ భారత ప్రభుత్వం పద్మ శ్రీ, పద్మ భూషణ్ అవార్డులతో సత్కరించింది. చైర్మన్ గా గజేంద్ర చౌహాన్ నియామకం రాజకీయ వత్తిడి కారణంగా జరిగిందంటూ ఇన్సిస్టిట్యూట్ విద్యార్ధులు ఆందోళన చేయటంలో మార్చిలో ఆయన పదవి నుంచి తప్పుకన్నారు. -
వర్షాల్లో చిక్కుకుపోయిన హీరో!
సాక్షి, ముంబై: భారీ వర్షాలు ముంబై మహానగరాన్ని ఉక్కిరిబిక్కిరి చేసిన సంగతి తెలిసిందే. ఎడతెరపిలేకుండా కురిసిన వర్షాలకు సామాన్య ముంబైకర్లే కాదు.. నగరంలో నివసించే బాలీవుడ్ సెలబ్రిటీలు కూడా అష్టకష్టాలు పడ్డారు. రోడ్ల మీద, వీధుల్లో నడుములోతు నీళ్లు నిలిచిపోవడంతో తమ వాహనాలు నిలిచిపోయి ఇబ్బందులు ఎదుర్కొన్నారు. భారీ వర్షం వల్ల ముంబై శాంటా క్రూజ్ ప్రాంతంలో వరదనీటిలో తన కారు చిక్కుకుపోయిందని, దీంతో గత్యంతరం లేక బాంద్రాలోని తన స్నేహితునికి ఫోన్ చేస్తే.. అతను, అతని కూతురు తనను రక్షించడానికి ముందుకొచ్చారని, అతని ఇంట్లో అత్యవసరంగా ఆశ్రయం పొందానని బాలీవుడ్ సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్ సోమవారం రాత్రి ట్వీట్ చేశారు. ఆపత్కాలంలో ఆదుకోవడం, మానవ సంబంధాలను చాటడంలో ముంబై లాంటి నగరం ప్రపంచంలో ఎక్కడా ఉండదని ఆయన పేర్కొన్నారు. వర్షం కారణంగా తాను గమ్యస్థానం చేరలేకపోయానని ఆయన తెలిపారు. ఇక, మరో బాలీవుడ్ హీరో మాధవన్ సైతం ఇదేవిధంగా వర్షాల్లో కష్టాలు ఎదుర్కొన్నారు. కారులో ఆయన ఇంటికి వెళుతుండగా.. ఇంటికి సమీపంలో కారు చెడిపోయింది. దీంతో మోకాళ్ల లోతు నీళ్లలో నడుచుకుంటూ ఇంటికి వెళ్లాల్సి వచ్చిందని, ఈ ఘటన ఉత్సుకతతోపాటు చిరాకు కలిగించిందని మాధవన్ ట్వీట్ చేశారు. కారు చుట్టూ భారీగా నిలిచిన వరదనీటి వీడియోను ఆయన షేర్ చేసుకున్నారు. హీరోయిన్ హ్యుమా ఖురేషీ కూడా వర్షాల వల్ల రోడ్డు మీద మూడుగంటలపాటు ట్రాఫిక్లో చిక్కుపోయినట్టు ట్వీట్ చేశారు. సోమవారం ముంబై మహానగరాన్ని మహాకుంభవృష్టి ముంచెత్తిన సంగతి తెలిసిందే. ఈ వర్షాలకు ఐదుగురు మరణించారు. ఎంతోమంది ముంబైవాసులు అష్టకష్టాలు పడ్డారు. ఈ రోజు వర్షాలు కాస్తా తగ్గే అవకాశముందని వాతావరణశాఖ సూచించడంతో పరిస్థితి మెరుగుపడొచ్చునని ముంబై వాసులు ఆశిస్తున్నారు. My car got stuck in heavy rains. Called a friend. He & his daughter came to my rescue. Now I am in his house. -
అప్పుడూ.. ఇప్పుడూ.. నా మాట ఒకటే!
‘‘స్టార్ కిడ్స్ ప్రభావంతో బాలీవుడ్లో కొత్తవారికి అవకాశాలు రావడం లేదు’’ అంటూ బంధుప్రీతిపై (నెపోటిజమ్) కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలు సంచలనమైన విషయం తెలిసిందే. ప్రముఖ హిందీ దర్శక–నిర్మాత కరణ్ జోహార్ హోస్ట్గా వ్యవహరిస్తోన్న ‘కాఫీ విత్ కరణ్’ టాక్ షోలో కంగనా ఈ వ్యాఖ్యలు చేశారు. ఫలితంగా ఆమెను కొంతమంది నిందించారు. స్టార్ కిడ్స్ అయితే కంగనా మీద విరుచుకుపడ్డారు. ఓ నాలుగైదు రోజులు ఈ వివాదం సాగింది. ఆ తర్వాత అంతా సద్దుమణిగింది. అయితే, మళ్లీ కంగనా అలాంటి వ్యాఖ్యలే చేశారు. ఇటీవల అనుపమ్ ఖేర్ ఇంటర్వ్యూలో పాల్గొన్న కంగనా ‘‘బంధుప్రీతిపై నా మాటలకు ఇప్పటికీ కట్టుబడి ఉంటా. ఎప్పటికీ నా అభిప్రాయం మారదు’’ అన్నారు. బాలీవుడ్ ఇండస్ట్రీ స్టార్ కిడ్స్పై పెట్టిన శ్రద్ధ బయట వాళ్లపై చూపించడంలేదని కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు. ఈ వ్యాఖ్యలు ఎలాంటి దుమారం రేపుతాయో చూడాలి. -
మోదీగా అక్షయ్?
ఇతర చిత్ర పరిశ్రమలతో పోలిస్తే బాలీవుడ్లో బయోపిక్ల జోరు కొనసాగుతోంది. మామూలు కథల కంటే జీవిత కథలను తెరకెక్కించి, బాక్సాఫీస్ వద్ద కోట్ల రూపాయల వసూళ్లు కొల్లగొడుతున్నారు. ‘భాగ్ మిల్కా భాగ్, మేరీ కోమ్, ఎం.ఎస్. ధోనీ, దంగల్, సచిన్’ వంటి పలు బయోపిక్ చిత్రాలు ఇప్పటికే విడుదలయ్యాయి. పీవీ సింధు, మన్మోహన్సింగ్, సానియా మీర్జా బయోపిక్లు తెరకెక్కనుండగా, తాజాగా ప్రధాని నరేంద్ర మోదీ జీవిత కథ తెరకెక్కించడానికి సన్నాహాలు జరుగుతున్నాయట. ఇందులో అక్షయ్ కుమార్ నటించనున్నారని బీటౌన్ టాక్. పరేశ్ రావల్, అనుపమ్ ఖేర్ వంటి వారు మోదీ పాత్రలో నటించనున్నట్లు్ల వార్తలొచ్చాయి. తాజాగా అక్షయ్ పేరు తెరపైకి వచ్చింది. మోదీపై బయోపిక్ తీస్తే అక్షయ్ కరెక్ట్ పర్సన్ అని బాలీవుడ్ వర్గాలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారని సమాచారం. నటుడు, బీజేపీ ఎంపీ శత్రుఘ్న సిన్హా, సెన్సార్ బోర్డు చీఫ్ పహ్లజ్ నిహ్లానీ కూడా అక్షయ్కే ఓటేయడం విశేషం. -
నో అబ్జెక్షన్ అంటారా?
సెన్సార్ సర్టిఫికెట్ కోసం సెన్సార్ బోర్డ్కి సినిమా చూపించినప్పుడు కొన్ని సినిమాలకు చిక్కులు వస్తుంటాయి. మాజీ ప్రధాని మనోహ్మన్సింగ్ జీవిత కథ ఆధారంగా అనుపమ్ ఖేర్ లీడ్ రోల్ చేస్తున్న ‘ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్’ చిత్రానికి షూటింగ్ పూర్తవక ముందే సెన్సార్ సమస్యలు ఎదురయ్యాయి. ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ అయిన వెంటనే సెంట్రల్ సెన్సార్ బోర్డ్ చైర్మన్ పహ్లాజ్ నిహ్లానీ స్పందించారు. ‘‘మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ బయోపిక్లో అనుపమ్ ఖేర్ నటించడం ఆనందించదగ్గ విషయమే. అయితే కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షురాలు సోనియా గాంధీ, మన్మోహన్సింగ్ల నుంచి ‘నో అబ్జెక్షన్’ సర్టిఫికెట్స్ను ఈ సినిమా మేకర్స్ సెన్సార్ బోర్డుకు సమర్పించవలసి ఉంటుంది. 2018 జనవరిలో నా పదవీ విరమణ ఉంటుంది. ఈ చిత్రం అప్పటికి సెన్సార్కు రాకపోవచ్చు. అయితే ఇప్పటి ఈ రూల్స్లో మాత్రం ఎలాంటి మార్పు ఉండదని అనుకుంటున్నాను’’ అన్నారు పహ్లాజ్. మన్మోహన్సింగ్ ప్రధానిగా ఉన్న టైమ్లో మీడియా సలహాదారులు సంజయ్ బారు రచించిన ‘ది యాక్సిడెంటల్ ప్రెమ్మినిస్టర్: ది మేకింగ్ అండ్ అన్మేకింగ్ ఆఫ్ మన్మోహన్సింగ్’ పుస్తకం ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి దర్శకుడు హన్సల్ మెహతా రచయిత కాగా, విజయ్ రత్నాకర్ గుట్టే దర్శకత్వం వహిస్తున్నారు. అయితే సెన్సార్ బోర్డ్ సభ్యులు అశోక్ పండిట్ ఈ చిత్రానికి కో–ప్రొడ్యూసర్గా వ్యవహరిస్తుండటం విశేషం. ఆ సంగతలా ఉంచితే, సోనియా, మన్మోహన్ ‘నో అబ్జెక్షన్’ సర్టిఫికెట్స్ ఇస్తారా? లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. ఈ సినిమాను 2019 ఎన్నికల సమయానికి రిలీజ్ చేయాలని చిత్రబృందం ప్లాన్ చేస్తుందని బాలీవుడ్ టాక్. -
మన్మోహన్ సింగ్ పాత్రలో అనుపమ్ ఖేర్
బాలీవుడ్ లో బయోపిక్ ల ట్రెండ్ కొనసాగుతోంది. ఇప్పటికే క్రీడాకారుల జీవిత కథల ఆధారంగా తెరకెక్కిన బయోపిక్ లు ఘనవిజయాలు సాధింస్తుండగా ఇప్పుడు రాజకీయ నాయకుల జీవితాలను కూడా వెండితెర మీద ఆవిష్కరించేందుకు రెడీ అవుతున్నారు. తాజాగా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ జీవితం ఆధారంగా ఓ బయోపిక్ రూపొందనుంది. గతంలో మన్మోహన్ సింగ్ కు మీడియా సలహాదారుగా వ్యవహరించిన సంజయ్ బారు రాసిన పుస్తకం 'ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ : ది మేకింగ్ అండ్ అన్మేకింగ్ ఆఫ్ మన్మోహన్సింగ్' ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో మన్మోహన్ సింగ్ పాత్రలో బాలీవుడ్ సీనియర్ యాక్టర్ అనుపమ్ ఖేర్ నటించనున్నాడు. అంతేకాదు ప్రపంచ వ్యాప్తంగా 12 భాషల్లో ఈ బయోపిక్ని విడుదల చేసేందుకు కూడా ప్లాన్ చేశారని తెలుస్తోంది. కీలకమైన సోనియాగాంధీ, రాహుల్గాంధీ సహా పలు ప్రధాన పాత్రల కోసం నటీనటుల ఎంపిక జరుగుతోంది. ఈ సినిమా ఫస్ట్ లుక్ ను బుధవారం (07-06-2017)నాడు రిలీజ్ చేయనున్నారు. ఆగస్ట్ 30వ తేదీన టీజర్ను విడుదల చేసేందుకు నిర్మాత సునీల్ బోహ్రా సన్నాహాలు చేస్తున్నారు. కనీసం తాను ప్రధాని అవుతానని కలలో కూడా ఊహించని ఓ వ్యక్తి కథ ఇది. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజా స్వామ్య దేశానికి తాను ప్రధానిగా ఎన్నిక కాబోతున్నాడని ఒక రోజు ముందు వరకు తనకూ తెలియదు' అనే వాయిస్ ఓవర్తో సినిమా ప్రారంభం అవుతుందని చిత్రయూనిట్ తెలిపింది. 2014 ఎన్నికలకు ముందు ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ పుస్తకం రిలీజ్ కాగా.. 2019 ఎన్నికలకు ముందుకు ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. -
శ్రీదేవి క్వీన్ ఆఫ్ యాక్టింగ్: ఖేర్
ముంబయి: బాలీవుడ్ సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్... అతిలోక సుందరి శ్రీదేవిపై ప్రశంసల జల్లు కురిపించారు. క్వీన్ ఆఫ్ యాక్టింగ్ మళ్లీ తెరపై కనిపించడం సంతోషంగా ఉందని ఆయన ట్విట్ చేశారు. ఈ సందర్భంగా శ్రీదేవి నటిస్తున్న 'మమ్' టీజర్ లింక్ను కూడా అనుపమ్ ఖేర్ షేర్ చేశారు. అనుపమ్ ఖేర్ పలు చిత్రాల్లో శ్రీదేవితో కలిసి నటించారు. వీరిద్దరూ 'కర్మా', చాల్బాజ్, లడ్లా, లమ్హే, రూప్కీ రాణీ చోరోంకా రాజా చిత్రాల్లో శ్రీదేవితో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. సుదీర్ఘ విరామం తర్వాత శ్రీదేవి 2012లో 'ఇంగ్లీష్ వింగ్లీష్' చిత్రం ద్వారా రీ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ తర్వాత విజయ్ హీరోగా నటించిన తమిళ చిత్రం పులిలో ఓ ముఖ్యపాత్ర పోషించారు. తాజాగా రవి ఉడయార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'మమ్' చిత్రంలో శ్రీదేవి మళ్లీ ప్రేక్షకుల ముందుకు వస్తోంది. బోనీకపూర్ నిర్మాణ సారధ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం హిందీతో పాటు తమిళ, తెలుగు భాషల్లోనూ రూపుదిద్దుకుంటోంది. జూన్ 14న మామ్ చిత్రం విడుదల కానుంది. ఈ సినిమాలో పాకిస్తానీ నటులు సజల్ అలీ, అద్నాన్ సిద్ధిఖీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాలో సవతి కూతురికి జరిగిన అన్యాయంపై పోరాడే ఓ ధీరోదాత్తమైన తల్లిగా శ్రీదేవి కనిపించనున్నట్టు తెలుస్తోంది. మరో విశేషం ఏంటంటే బాలనటిగా కెరీర్ ప్రారంభించిన శ్రీదేవి ఇప్పటివరకూ 299 చిత్రాల్లో నటించారు. ‘మామ్’తో ఆమె 300వ చిత్రం మైలురాయిని చేరుకున్నారు. The Queen of acting and my favourite actress is BACK. Watch & share this #MomTeaser of @SrideviBKapoor. Jai Ho. -
అమ్మకు సీనియర్ నటుడు అరుదైన కానుక
ముంబయి: తల్లిదండ్రులు పిల్లల సంతోషం కోసం, వారికి ఎన్నో సమకూర్చుతారు. అదే విధంగా పిల్లలు ప్రయోజకులయ్యాక తిరిగి తమకే ఏదైనా బహుమతి ఇస్తే వారి ఆనందం ఎలా ఉంటుందో మాటల్లో చెప్పలేం కూడా. ఇలాంటి సంతోషకర సంఘటన బాలీవుడ్ సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్ ఇంట్లో జరిగింది. అనుపమ్ హిమాచల్ప్రదేశ్లోని సిమ్లాలో పుట్టి పెరిగారు. తన సొంత ప్రాంతం సిమ్లాలో ఓ ఇల్లు కొనాలన్నది కొన్నేళ్ల అనుపమ్ కలను తాజాగా నెరవేర్చుకున్నారు. సిమ్లాలో కొనుకోలు చేసిని ఇంటిని తన తల్లి దులరీ ఖేర్కి బహుమతిగా ఇచ్చారు. ఈ సంతోషాన్ని వెటరన్ నటుడు ట్విట్టర్ ద్వారా ఫాలోయర్లతో షేర్ చేసుకున్నారు. 'సొంత గ్రామంలో సొంత ఇల్లు ఉండాలని భారతీయులు భావిస్తుంటారు. నేను పుట్టి, పెరిగిన సిమ్లాలో ఇప్పుడు మాకంటూ ఓ సొంత ఇల్లు ఉంది. మా నాన్న ఇక్కడి అటవీశాఖలో క్లర్క్గా చేశారు. దీంతో ఎక్కువగా డిపార్ట్మెంట్ క్వార్టర్లలో, అద్దె ఇళ్లలో ఉండేవాళ్లం. సొంతింటి కలకు ఇన్నేళ్లు పట్టింది. ఇప్పుడు సిమ్లాకు వచ్చి ఇల్లు కొనుగోలు చేశాను. ఆ ఇంటిని అమ్మకు కానుకగా అందించాను. అమ్మ చాలా సంతోషపడ్డారు' అని ఓ వీడియోను అనుపమ్ ఖేర్ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. తల్లి సంతోషం కోసం చాలా మంచి పని చేశారని నెటిజన్లు ట్వీట్లు చేస్తున్నారు. -
‘ఆమెను కలవడం కుదరడం లేదు’
న్యూఢిల్లీ: తన భార్య కిరణ్ ఖేర్ రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత తామిద్దరం తరచుగా కలుసుకోవడం కుదరడం లేదని సీనియర్ నటుడు అనుమప్ ఖేర్ వెల్లడించారు. ఏకాంతంగా గడిపే సమయం చిక్కడం లేదని అన్నారు. ‘నా భార్య ఎంపీగా గెలిచినప్పటి నుంచి మేమిద్దరం కలిసి గడిపేందుకు టైమ్ దొరకడం లేదు. తన నియోజకవర్గ పనుల్లో కిరణ్ తీరిక లేకుండా గడుపుతోంది. చండీగఢ్ నియోజకవర్గానికి ఆమె ఎక్కువ సమయం కేటాయించి, ప్రజల కోసం పనిచేస్తోంద’ని అనుమప్ ఖేర్ అన్నారు. వీరిద్దరి వివాహ బంధానికి మూడు దశాబ్దాలు దాటింది. 1985లో వీరు పెళ్లి చేసుకున్నారు. భార్యాభర్తలిద్దరూ తమ తమ రంగాల్లో బిజీగా ఉన్నారు. అనుమప్ ఖేర్ సినిమాల్లో నటిస్తుండగా, కిరణ్ ఖేర్ చండీగఢ్ ఎంపీగా సేవలందిస్తున్నారు. జాతీయ అవార్డు గ్రహీత అయిన 62 ఏళ్ల అనుమప్ 500పైగా సినిమాల్లో నటించారు. చండీగఢ్, ఢిల్లీలో ఉన్నప్పుడు మాత్రమే తామిద్దరం కలుసుకునేందుకు వీలవుతుందని అనుమప్ తెలిపారు. ‘ఈ రోజు ఢిల్లీలో ఉన్నాను. నా భార్యతో కలిసి కాఫీ తాగేందుకు అవకాశం చిక్కింది. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలకు హాజరవుతున్న కిరణ్ ఢిల్లీలో ఉంది. ఈ రోజు రాత్రే నేను ఢిల్లీ నుంచి వెళ్లాల్సివుంది. కాబట్టి కాఫీకి మాత్రమే అవకాశముంది. పరస్పరం అర్థం చేసుకుంటూ ముందుకు సాగుతున్నామ’ని అనుపమ్ ఖేర్ వివరించారు. -
‘రాహుల్ ఆలపిస్తే చూడాలనివుంది’
న్యూఢిల్లీ: బాలీవుడ్ సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్... కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపై వాగ్బాణాలు ఎక్కుపెట్టారు. రాహుల్ గాంధీకి ఉన్న దేశాభిమానంపై తనకు అనుమానం లేదంటూనే మెలిక పెట్టారు. రాహుల్ జాతీయగీతం ఆలపిస్తే చూడాలని ఉందని అన్నాయి. అయితే జాతీయ గీతంలోని పదాలకు అర్థాలు రాహుల్ గాంధీకి తెలుసో, లేదోనన్న అనుమానాన్ని వ్యక్తం చేశారు. ఓ బహిరంగ కార్యక్రమంలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ మద్దతుదారుడైన అనుపమ్ ఖేర్ పలు చాలా సందర్భాల్లో స్వామిభక్తి చాటుకున్నారు. మోదీ వ్యతిరేకులపై తనదైన శైలిలో విమర్శలు గుప్పించేవారు. సినిమా ధియేటర్లతో జాతీయ గీతం వినిపించాలని ఇటీవల సుప్రీంకోర్టు ఆదేశించిన సంగతి తెలిసింది. సుప్రీంకోర్టు తీర్పుపై భిన్న స్పందనలు వ్యక్తమవుతున్నాయి. -
సీనియర్ నటుడిపై కేసు నమోదు
ముంబై: భారత సైన్యంపై ఓ టీవీ చర్చ సందర్భంగా తీవ్ర వ్యాఖ్యలు చేసిన బాలీవుడ్ సీనియర్ నటుడు ఓంపురిపై ముంబైలో కేసు నమోదైంది. భారత సైన్యాన్ని ఆయన అవమానించారంటూ అంధేరి పోలీసు స్టేషన్లో ఆయనపై కేసు నమోదు చేశారు. భారత్లో పాకిస్థాన్ కళాకారులు పనిచేయడాన్ని బలంగా సమర్థించిన ఓంపురి ఓ టీవీ చానెల్ చర్చలో తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘సైన్యంలో చేరమని వాళ్లని ఎవరు బలవంతపెట్టారు. మా నాన్న సైన్యంలో ఉన్నారు. మేం సైనికులను చూసి గర్వపడతాం. కానీ భారత్-పాకిస్థాన్.. ఇజ్రాయెల్, పాలస్తీనాలాగా కావాలని మీరు కోరుకుంటున్నారా?’ అని ఆయన పేర్కొన్నారు. ‘సల్మాన్ ఖానా? ఇంకో ఖానా అన్నది కాదు. నేరుగా ప్రధాని మోదీజీ వద్దకే వెళ్లి.. పాకిస్థానీ నటుల వీసాలను రద్దు చేయించండి. 15, 20మంది ఆత్మాహుతి బాంబర్లుగా తయారుచేసి పాక్ మీదకు పంపండి’ అని ఓంపురి అన్నారు. ఓంపురి వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతున్నది. బాలీవుడ్ సినీ ప్రముఖులు అనుపమ్ ఖేర్, అశోక్ పండిట్ సహా పలువురు ఆయన వ్యాఖ్యలను తప్పుబట్టారు. భారత సైన్యాన్ని కించపరిచేలా మాట్లాడటం తగదని అన్నారు. -
అనుపమ్ ఖేర్... ది బిగ్ సిక్!
నటుడిగా 32 ఏళ్లు... 499 సినిమాలు. హిందీ నటుడు అనుపమ్ ఖేర్ కెరీర్ రికార్డ్ ఇది. 99వ సినిమా చేసి, నూరో చిత్రంలో నటించినప్పుడు అనుపమ్కు దక్కిన ఆనందం అంతా ఇంతా కాదు. తొలి సెంచరీ పూర్తి చేశాక ఆనందంగా మలి సెంచరీని టార్గెట్ చేశారు. 200, 300, 400.. ఇలా సెంచరీల మీద సెంచరీలు సాధించారు. ఇప్పుడు అందరి దృష్టీ అనుపమ్ నటించనున్న 500వ సినిమాపై ఉంది. అయిదు వందలు సినిమాలకు చేరుకోవడం అంటే మాటలు కాదు. అందుకే అనుపమ్ని బంపర్ ఆఫర్ వరిస్తే బాగుంటుందని ఆయన శ్రేయోభిలాషులు ఆశించారు. వారి ఆశ ఫలించింది. ‘ది బిగ్ సిక్’ అనే హాలీవుడ్ చిత్రంలో నటించే అవకాశం వచ్చింది. ‘‘నా 500వ సినిమాగా ‘ది బిగ్ సిక్’ చేయబోతున్నా. ఈ సినిమాలో హాలీవుడ్ నటులు హాలీ హంటర్, రే రొమానొ, జో కజాన్ తదితరులతో కలిసి నటించబోతున్నా’’ అని అనుపమ్ పేర్కొన్నారు. ‘‘బెండ్ ఇట్ లైక్ బెకమ్’, ‘సిల్వర్ లైనింగ్స్ ప్లేబుక్’, ‘ది మిస్ట్రెస్ ఆఫ్ స్పైసెస్’ తదితర అంతర్జాతీయ చిత్రాల్లో నటించారాయన. ఇప్పుడు పూర్తి స్థాయి హాలీవుడ్ మూవీలో చేయనున్నారు. ఈ విషయం గురించి అనుపమ్ చెబుతూ - ‘‘నా 500వ సినిమా హాలీవుడ్కి చెందినది కావడం ఆనందంగా ఉంది. హిందీ సినిమా అయితే ఆనందపడి ఉండేవాణ్ణి కాదనడంలేదు. హిందీలో చాలా చేసేశాను. ఇంకా కొత్తగా ఏదైనా చేయాలనుకుంటున్న సమయంలో ‘ది బిగ్ సిక్’కి అవకాశం వచ్చింది’’ అని ఆనందం వ్యక్తం చేశారు. అనుపమ్ ఐదు సెంచరీలు సాధించడం పట్ల పలువురు హిందీ తారలు, హాలీవుడ్ తారలు ఆయన్ను అభినందించారు. 72 ఏళ్ల హాలీవుడ్ నటుడు రాబర్ట్ డి నీరో అయితే ‘‘అమెరికాలో నేనిప్పటికి 95 సినిమాలు మాత్రమే చేయగలిగాను. మీరు అయిదు వందల చిత్రాల్లో నటించగలిగారు. ఇది నిజంగా అద్భుతం’’ అని 61 ఏళ్ల అనుపమ్ని ప్రశంసించారు. -
32 ఏళ్లలో 500 సినిమాలు!
ముంబై: బాలీవుడ్ సీనియర్ నటుడు అనుమప్ ఖేర్ మరో మైలు రాయిని అందుకున్నారు. 500వ సినిమాలో నటిస్తున్నారు. హాలీవుడ్ సినిమా 'ది బిగ్ సిక్' తనకు 500వ సినిమా అని ట్విటర్ లో అనుమప్ ఖేర్ తెలిపారు. హోలి హంటర్, రే రొమానొ, జియ్ కజాన్, కుమైల్ నాన్జియాని వంటి నటులతో తెర పంచుకోవడం గొప్పగా ఉందని ట్వీట్ చేశారు. ఆయనకు ప్రముఖ హాలీవుడ్ నటుడు రాబర్ట్ డినీరో అభినందనలు తెలిపారు. 1984లో 'సారాంశ్'తో సినిమా జీవితం మొదలు పెట్టిన అనుమప్ ఖేర్ అంచెలంచెలుగా ఎదిగారు. 61 ఏళ్ల ఖేర్ బాలీవుడ్ లో తనదైన ముద్ర వేశారు. హాలీవుడ్ సినిమాతో 500 మైలురాయిని అందుకోవడం ఆనందంగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు. 32 ఏళ్ల పాటు హిందీ సినిమాల్లో నటించానని ఇప్పుడు కొత్త వేదికల కోసం చూస్తున్నానని చెప్పారు. 500 సినిమాలు చేస్తానని కెరీర్ ఆరంభంలో ఊహించలేదన్నారు. 29 ఏళ్ల వయసులో తెరగ్రేటం చేసిన తాను 'సారాంశ్'లో 65 ఏళ్ల వృద్ధుడి పాత్రలో నటించానని గుర్తు చేశారు. కొత్తతరంతో అనుసంధానం కావడానికి సోషల్ మీడియా తనకెంతో ఉపయోగపడుతోందని , దీని నుంచి ఎంతో నేర్చుకున్నానని చెప్పారు. ఎవరేమన్నా దేశం గురించి తన అభిప్రాయాలను నిర్మోహమాటంగా వ్యక్తం చేస్తుంటానని అనుపమ్ ఖేర్ స్పష్టం చేశారు. Happy to announce my 500th film 'The Big Sick'. And who else but to have Robert De Niro congratulate me. Jai Ho.:) pic.twitter.com/9fcYvnuLL7 — Anupam Kher (@AnupamPkher) 14 June 2016 -
స్థానికేతర ప్రాతినిధ్యం?
విశ్లేషణ బాలీవుడ్ నటుడు అనుపమ్ఖేర్ గురించి తాను చేసినట్లు చెబుతున్న వ్యాఖ్యలను ‘తప్పుగా నివేదించార’ని నటుడు నసీరుద్దీన్ షా పేర్కొన్నట్లు ప్రముఖ ఇంగ్లిష్ పత్రిక పేర్కొంది. కశ్మీర్ పండిట్ల సమస్యను ఖేర్ ఎత్తిపడుతున్నట్లు నసీరుద్దీన్ చెప్పి ఉండవచ్చు. ‘కశ్మీర్లో ఎన్నడూ నివసించని వ్యక్తి కశ్మీర్ పండిట్ల కోసం పోరాటం ప్రారంభించారు. ఉన్నట్లుండి ఆయన నిర్వాసితుడిలాగా మారి పోయారు.’ నసీరుద్దీన్ ఈ విధంగానే చెప్పి ఉన్నట్లయితే, నాకు తీవ్ర అభ్యం తరం ఉంది. కశ్మీర్ను మనం భారత్లో ఒక భాగంగా చూస్తున్నప్పుడు, ఆ సమస్యను ఏవరయినా చేపట్టినప్పుడు దాంట్లో తప్పేముంది? గుజరాత్లో, తర్వాత ఉత్తరప్రదేశ్లో ముస్లింల గురించి మనం పట్టించుకుంటున్నందున, కశ్మీర్ పండిట్ల విధి గురించి మీరూ నేను కూడా అదేవిధంగా పట్టించుకోవలసి ఉంటుంది. ‘కశ్మీర్ పండిట్ల సమస్యలపై పోరాడటానికి మీరు కశ్మీరీ అయివుండనవసరం లేదని’ దాంట్లో ఏ ప్రమాదాన్నీ తాను చూడటం లేదని మధుర్ భండార్కర్ వ్యాఖ్యా నించినట్లు ఆ ఇంగ్లిష్ పత్రికే పేర్కొంది. ఆయన మాట ఎంత చక్కగా ఉందో! బయటివారు, స్థానికులకు సంబంధించిన వ్యవహారం చేతులు దాటిపోతోంది. నాగాలాండ్ వంటి చోట్ల ప్రజలు మనల్ని భారతీయులమని, తాము మాత్రం భిన్నమైన వారిమని పరిగణిస్తుండటం ఒక వాస్తవికతగానే ఉంది. మహారాష్ట్రలో మరాఠీ వర్సెస్ మరాఠీయేతరుల సమస్య ఉండనే ఉంది. ఒక సమయంలో ఇది హిందీ మాట్లాడే ప్రజలను భయాందోళనలకు గురిచేసి నాసిక్ నుంచి పారిపోయేలా చేసింది. దీంతో పారిశ్రామిక కార్యకలాపాలు దాదాపుగా స్తంభించిపోయినంత పనయింది. స్థానికుల ప్రయోజనాల కోసం స్థానికేతరులు లేదా బయటి వారు పడుతున్న దుస్థితిని ఇది వాస్తవంగానే వివరించాల్సి ఉంది. కానీ మాటల యుద్ధం జరుగుతున్నప్పుడు, చిత్రసీమకు చెందిన అశోక్ పండిట్ అనే మరో కశ్మీరీ పండిట్, తన వంతుగా అగ్నికి ఆజ్యం పోశారు. ‘మీరట్కు చెందిన నసీరుద్దీన్ షా.. గుజరాత్ అల్లర్లపై తన గొంతు పెంచుతున్నారే’. ఇదంతా మీడియా దృష్టికి రావడమే కాదు.. సోషల్ మీడియాలో దుమారం లేచింది కూడా. కానీ అసలు సమస్యలు మాత్రం నిర్లక్ష్యానికి గురవుతున్నాయి. చాలా కాలం క్రితమే అన్యాక్రాంతమైన లేదా దాదాపుగా విధ్వంసానికి గురైన తమ సొంత ఇళ్లకు తిరిగి రావడంపై కశ్మీర్ పండిట్లు చెందుతున్న ఆందోళనను ఎవరూ పట్టించుకున్న పాపాన పోలేదు. నసీరుద్దీన్ షా ప్రకటనను కానీ, అశోక్ పండిట్ చేసిన అసంబధ్ద వ్యాఖ్యను కానీ పరిశీలించి నట్లయితే, దేశం ఉప జాతీయవాదం కోసం లెక్కలు తేల్చుకోవలసి ఉంటుంది. రాష్ట్రాల ఆవిర్భావానికి విస్తృతమైన భాషా కారణాల్లో ఇది వేళ్లూనుకుని ఉంది. ఇక భాష విషయానికి వస్తే అది ఒక ప్రజాబృందం సంస్కృతితో ముడిపడి ఉంది. తన అభిప్రాయాన్ని వివరించడంలో లేదా కశ్మీర్ పండిట్ల గురించి ఆందోళన వ్యక్తపర్చటంలో ఖేర్ ఏ తప్పూ చేయలేదు. భారత సంతతి ప్రజలు మరొక దేశంలో మూడో స్థాయి పౌరులుగా పనిచేస్తుండటాన్ని మన గర్వకారణంగా భావిస్తున్నట్లయితే, తమ సొంత దేశంలోనే శరణార్థులుగా ఉంటున్న ప్రజలకోసం నెత్తురు కార్చడం సరైందే. రెండు దశాబ్దాలకు ముందు మిలిటెంట్లు దాదాపు 3 లక్షల మందిని తరిమేశారు. వారి హృదయం నేటికీ లోయలోనే ఉంది కానీ మళ్లీ అక్కడకి వెళ్లి స్థిరపడటానికి వారికి ఇచ్ఛ కలగటం లేదు. కశ్మీర్లో మిలిటెంట్లు తమదైన ప్రభావం కలిగి ఉన్నారు కాబట్టి అక్కడ జీవితం కష్టభూయిష్టంగానే దాదాపు బహిష్కార స్థితిలోనే ఉంటుంది. సిమ్లాలో పుట్టి ముంబైలో నివసిస్తున్న కశ్మీర్ ప్రాంతానికి చెందిన వ్యక్తి తన కమ్యూనిటీ వేదనపై గొంతు విప్పలేని నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు, తమిళనాడుకు చెందిన పి.చిదంబరం, రాజ్యసభలో మహారాష్ట్రకు ప్రాతినిధ్యం వహించగలగడం (చట్టాలు దానికి వీలు కల్పించి నప్పటికీ) ఎలా సబబు అవుతుంది? అలాగే ఢిల్లీకి ప్రాతినిధ్యం వహించిన కపిల్ సిబల్ ఇప్పుడు ఉత్తరప్రదేశ్కు, మునుపటి ఆంధ్రప్రదేశ్కు ప్రాతినిధ్యం వహించిన జైరాం రమేష్ ప్రస్తుతం కర్ణాటకకు ప్రాతినిధ్యం వహించడం ఎలా సబబు? హైదరాబాద్ నివాసి అయిన నిర్మలా సీతారామన్ కర్ణాటక నుంచి, నెల్లూరుకు చెందిన వెంకయ్యనాయుడు గుజరాత్ నుంచి రాజ్యసభకు ఎలా ప్రాతినిధ్యం వహించగలరు? దేశానికి రెండుసార్లు ప్రధానిగా వ్యవహరించిన వ్యక్తి స్థానిక చిరునామాను పొందడానికి ఒక ఇంటిని అద్దెకు తీసుకోవలసి వచ్చింది. పండిట్ల సమస్య నుంచి అనుపమ్ ఖేర్ను దూరం జరగాలని కోరుతున్నవారు తమ ప్రశాంతతను కూడా నిలుపుకోవలసి రావచ్చు. తన వ్యాఖ్యలకుగాను అనుపమ్ఖేర్ను ఎవరూ మందలించాల్సిన అవసరం లేదు. వ్యాసకర్త: మహేష్ విజాపుర్కార్, సీనియర్ పాత్రికేయులు ఈమెయిల్: mvijapurkar@gmail.com -
సీనియర్ నటుల మాటల వార్!
బాలీవుడ్లో సీనియర్ నటులైన నసీరుద్దీన్ షా, అనుపమ్ ఖేర్ మధ్య మాటల యుద్ధం మొదలైంది. కశ్మీర్ పండిట్ల విషయంలో ఈ ఇద్దరు నటులు పరస్పరం విమర్శలు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో నసీరుద్దీన్ షా వివరణ ఇవ్వడంతో ఈ వివాదం సమసిపోయే అవకాశం కనిపిస్తోంది. వివాదం ఏమిటి? తన తాజా చిత్రం 'వెయిటింగ్' ప్రమోషన్లో భాగంగా ఇటీవల ఢిల్లీలో నసీరుద్దీన్ షా అనుపమ్ ఖేర్పై విమర్శనాస్త్రాలు సంధించాడు. 'ఎన్నడూ కశ్మీర్లో నివసించని వ్యక్తి కశ్మీర్ పండిట్ల కోసం పోరాటం ప్రారంభించాడు. నిజానికి ఆయనే ఓ నిర్వాసితుడైనట్టు వ్యవహరిస్తున్నాడు' అని షా పేర్కొన్నాడు. షా విమర్శలపై ఖేర్ ట్విట్టర్లో బదులిచ్చాడు. 'జయహో షాగారు. మీ లాజిక్ ప్రకారం ఎన్నారైలు ఇండియా గురించి మాట్లాడవద్దన్న మాట' అని వ్యంగ్యంగా పేర్కొన్నాడు. ఖేర్కు బాలీవుడ్ ప్రముఖులు అశోక్ పండిట్, మధుర్ బండార్కర్ మద్దతు పలికారు. ఖేర్కు షా క్షమాపణ చెప్పాలని దర్శకుడు అశోక్ పండిట్ డిమాండ్ చేశారు. దీంతో నసీరుద్దీన్ షా స్పందిస్తూ ఖేర్ను ఉద్దేశించి తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని, తన వ్యాఖ్యలను వక్రీకరించారని వివరణ ఇచ్చాడు. -
‘యోగా’లో ఓంపై రగడ
♦ ప్రభుత్వ ప్రకటనపై మండిపడ్డ ముస్లిం సంఘాలు, విపక్షాలు ♦ మంత్రోచ్ఛారణ తప్పనిసరి కాదన్న ఆయుష్ శాఖ న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ హిందుత్వాన్ని ప్రోత్సహిస్తున్నారని.. ఇందులో భాగంగానే అంతర్జాతీయ యోగా దినోత్సవం (జూన్ 21) నాడు యోగా చేసే వారంతా ‘ఓం’తోపాటు పలు వేదమంత్రాలు ఉచ్ఛరించాలని చెప్పారంటూ ముస్లిం మతపెద్దలు మండిపడుతున్నారు. యోగా చేసే ముందు దీని ఫలితాలు వచ్చేందుకు ప్రార్థన (వేద మంత్రాలతో)చేయాలంటూ ఇటీవల ఆయుష్ మంత్రిత్వ శాఖ సూచన చేసింది. జూన్ 21న యోగా సందర్భంగా ఈ నియమాలు పాటించాలంటూ.. విద్యాసంస్థలు, వర్సిటీలు దీనిపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని యూజీసీ సర్క్యులర్ జారీ చేసింది. దీనిపై ముస్లిం మత పెద్దలు, విపక్ష పార్టీలు ఆందోళన చేస్తున్నాయి. కేంద్రం దేశానికున్న సెక్యులర్ ముద్రను చెరిపేసేందుకు ప్రయత్నిస్తోందని విమర్శించాయి. ‘ఓం, ఇతర వేదమంత్రాలను పఠించటం ఒక మతానికి సంబంధించినవి. వీటిని అందరికీ ఆపాదించటం సరికాదు. ఇది సెక్యులరిజానికి వ్యతిరేకం. ఇది మా విశ్వాసానికి పూర్తి వ్యతిరేకం. దేశం మొత్తాన్ని ఒక గొడుగు కిందికి తెచ్చే ప్రయత్నాన్ని సహించం’ అని ముస్లిం మతపెద్ద షఫీక్ ఖ్వాజ్మీ అన్నారు. జేడీయూ నేత కేసీ త్యాగి కూడా ఆయుష్ ప్రకటనను విమర్శించారు. ‘ఓం’ తప్పనిసరేం కాదు: ఆయుష్ విపక్షాలు, ముస్లిం మత పెద్దలనుంచి వస్తున్న విమర్శలతో ఆయుష్ శాఖ వెనక్కు తగ్గింది. జూన్ 21న యోగా ప్రదర్శనలో భాగంగా ‘ఓం’ మంత్రాన్ని ఉచ్ఛరించటం తప్పనిసరేం కాదని.. స్వచ్ఛందమేనని ప్రకటించింది. నచ్చనివారు మంత్ర ఉచ్ఛారణ బదులు మౌనంగా ఉన్నా ఎవరూ అభ్యంతరం వ్యక్తం చేయరని తెలిపింది. విపక్షాల ఆందోళనపై బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ స్పందించారు. ‘మంత్రోచ్ఛారణ యోగాలో భాగం. దీన్ని వివాదం చేయటం సరికాదు. అయితే నచ్చనివారూ ఈ మంత్రాన్ని పలకాల్సిందే అని ఒత్తిడి లేదే’ అని ఖేర్ అన్నారు. -
సినిమా వివాదం.. యువతులపై లైంగిక వేధింపులు!
కోల్ కతా: సినిమా షూటింగ్ వివాదానికి తెరతీసింది. ఆపై యువతులపై లైంగిక వేధింపుల వరకు ఘటన వెళ్లింది. పశ్చిమబెంగాల్ లోని జాదవపూర్ యూనివర్సిటీకి చెందిన ఏబీవీపీ, లెఫ్ట్ వింగ్ మద్ధతుదారుల మధ్య గొడవ జరిగింది. ఈ ఘటనలో నలుగురు ఏబీవీపీ సభ్యులను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం... వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వం వహిస్తున్న పొలిటికల్ మూవీ 'బుద్ధా ఇన్ ఏ ట్రాఫిక్ జామ్' వివాదాస్పదమైంది. జాదవపూర్ వర్సిటీలో శుక్రవారం రాత్రి ఈ డైరెక్టర్ కు నల్లజెండాలతో నిరసన తెలిపడంతో పాటు అక్కడి నుంచి వెళ్లిపోవాలని వామపక్ష వర్గానికి చెందినవారు నినాదాలు చేశారు. దీంతో ఆగ్రహించిన ఏబీవీపీ మూవీ యూనిట్ కు మద్ధతు తెలిపింది. ఈ నేపథ్యంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. తనపై కూడా దాడి జరిగిందని, తనపై కొందరు చెయ్యి చేసుకున్నారని డైరెక్టర్ అగ్నిహోత్రి ఆరోపించారు. ఇరువర్గాల మద్ధతుదారుల గొడవ మహిళలపై అసభ్యప్రవర్తను దారితీసింది. ప్రత్యర్థివర్గానికి చెందిన యువతులపై దురుసుగా ప్రవర్తించారని పోలీసులు చెబుతున్నారు. బీజేపీకి సపోర్ట్ చేసే అనుపమ్ ఖేర్ ఈ సినిమాలో నటించడం కూడా వివాదానికి ఓ కారణమని పోలీసులు భావిస్తున్నారు. జేఎన్యూ వివాదంలో ఖేర్ వ్యాఖ్యలను దృష్టిలో పెట్టుకుని ఈ విధంగా ఆందోళనకు దిగారని వామపక్షాలపై ఏబీవీపీ సంఘాలు ఆరోపించాయి. అయితే దర్శకుడు, ఆ చిత్ర యూనిట్ పై తమకు ఎలాంటి కోపంలేదని.. అయితే మూవీ కథాంశంపైనే తమకు అభ్యంతరాలున్నాయని వామపక్ష సంఘాలు పేర్కొన్నాయి. నలుగురు విద్యార్థినులపై అసభ్యంగా ప్రవర్తించడంతో పాటు లైంగిక వేధింపులు జరిగినట్లు వర్సిటీలో ప్రచారం జరుగుతోందని, తన వద్దకు ఎలాంటి ఫిర్యాదులు రాలేదని వైస్ చాన్సలర్ సురంజన్ దాస్ తెలిపారు. -
లవ్ సోనియా: లాస్ ఏంజిల్స్ చీకటి కోణం
అమెరికాలో రెండో అతిపెద్ద నగరమైన లాస్ ఏంజిల్స్.. షిప్పులో నుంచి అప్పుడే దించిన కంటెయినర్ నిండా అమ్మాయిలు. చైనా నుంచి కిడ్నాప్ చేసి తీసుకొచ్చిన ఆ యువతుల బృందంలో ఓ ఇండియన్ కూడా ఉంది. దూరంగా నిల్చున్న తబ్రేజ్ నూరానీ.. ఆ అమ్మాయిలను ఎక్కడికి తీసుకెళ్తారా అని ఆరాతీశాడు. రకరకాలుగా వేధించి కిడ్నాపర్లు ఆ అమ్మాయిలను బలవంతంగా వ్యభిచారం రొంపిలోకి దింపుతారని తెలుసుకున్నాడు. పరిశీలించేకొద్దీ నూరానీకి ఇలాంటి ఉదంతాలా ఎన్నో కనిపించాయి. పోలీసులతో కలిసి వెళ్లి వ్యభిచార గృహాలపై దాడులను దగ్గర్నుంచి చూశాడు నూరానీ. నిజానికి అతను జర్నలిస్ట్ కాదు. సినిమా పర్సనాలిటీ. లాస్ ఏంజిల్స్ లోనే అతనికి డేవిడ్ వోమార్క్ తో పరిచయం అయింది. అప్పటికి డేవిడ్ 'లైఫ్ ఆఫ్ పై' అనే సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. నూరానీ చెప్పిన లైన్ నచ్చడంతో సినిమా చేద్దామని మాటిచ్చాడు. మూడేళ్ల ప్రాజెక్ట్ సెట్స్ మీదికి వచ్చింది. సినిమా పేరు లవ్ సోనియా. లాస్ ఏంజిల్స్ లో తాను చూసిన భాతీయ యువతి నిజజీవిత గాథ ఆధారంగా తబ్రేజ్ నూరానీ తీస్తున్న ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ టైటిల్ రోల్ చేస్తోంది. ఫ్రిదా పింటో, రిచా చడ్డా, అనుపమ్ ఖేర్, మనోజ్ వాజపేయి ఇతర నటీనటులు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ రాజస్థాన్ లో జరుగుతోంది. టెడ్ కప్లాన్, అల్కేశ్ విజాలు సంయుక్తంగా కథను అందించారు. రాజస్థాన్ లోని అద్భుతమైన లొకేషన్లలో 'లవ్ సోనియా'ను షూట్ చేస్తున్నాం అంటూ నటుడు అనుపమ్ ఖేర్ సోమవారం ట్వీట్ చేశారు. ఇండియాతోపాటు హాంకాంగ్, లాస్ ఏంజిల్స్ లో షూటింగ్ జరుపుకోబోయే ఈ సినిమా హిందీ, ఇంగ్లీష్ భాషల్లో తెరకెక్కుతోంది. 'ది హల్క్', 'లైఫ్ ఆఫ్ పై', 'జీఐ జో రైస్ ఆఫ్ కోబ్రా' వంటి హిట్ చిత్రాల నిర్మాత కావటంతో డేవిడ్ రూపొందిస్తున్న 'లవ్ సోనియా' పట్ల హాలీవుడ్ లోనూ విపరీతమైన ఆసక్తి నెలకొంది. నిర్మాత డేవిడ్ వోమార్క్, దర్శకుడు తబ్రేజ్ నూరానీతో నటుడు అనుపమ్ ఖేర్. -
‘ఇది ఎయిర్పోర్ట్ అరెస్ట్’
అనుపమ్ ఖేర్ను అడ్డుకున్న పోలీసులు శ్రీనగర్ నిట్ క్యాంపస్కు వెళ్లకుండా ఆపివేత న్యూడిల్లీ: నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్)లో వివాదం నేపథ్యంలో అక్కడి విద్యార్థులను కలిసేందుకు వెళ్లిన బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ను జమ్మూకశ్మీర్ పోలీసులు శ్రీనగర్ విమానాశ్రయంలో అడ్డుకున్నారు. క్యాంపస్లో శాంతి భద్రతల సమస్యలు తలెత్తుతాయని, తిరిగి ఢిల్లీ వెళ్లాలని ఆయనకు చెప్పామని ఓ పోలీసు అధికారి తెలిపారు. తనను అడ్డుకోవడంపై ఖేర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘పోలీసులు కోరినట్లే శ్రీనగర్లోకి వెళ్లనన్నాను. కానీ, నేను శ్రీనగర్లోకి ప్రవేశించకూడదని జారీ చేసిన ఆదేశాలను చూపించాలని అడిగాను’ అని ట్వీట్ చేశారు. తాను సమస్యలు సృష్టించేందుకు నిట్కు రాలేదని, విద్యార్థులను కలిసేందుకే వచ్చానన్నారు. ‘విద్యార్థులకు నైతిక స్థైర్యం ఇవ్వడానికి ఒక పౌరుడిగా వెళ్తున్నాను. వర్సిటీకి వెళ్లమని లక్షల మందికి చెప్తాను’ అని పేర్కొన్నారు. ‘కనీసం మా పూర్వీకుల ఇంటికి, లేకపోతే ఖీర్ భవానీ గుడికి వెళ్లేందుకు కూడా అనుమతించలేదు. ఇది ఎయిర్పోర్ట్ అరెస్ట్’ అని అన్నారు. ఢిల్లీకి తిరిగిరావడానికి ముందు ఎయిర్పోర్టులో త్రివర్ణ పతాకాన్ని ప్రదర్శించారు. -
'వారేమీ ఒలింపిక్ హీరోలు కాదు'
న్యూ ఢిల్లీ: జవహార్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో ఉగ్రవాది అప్జల్ గురుకు మద్దతుగా నిర్వహించిన ర్యాలీలో దేశద్రోహ చర్యలకు పాల్పడ్డారన్న ఆరోపణలపై అరెస్టైన ఉమర్ ఖలీద్, అనిర్భన్ బట్టాచార్యలకు కోర్టు శుక్రవారం మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. యూనిటీ మార్చ్ పేరుతో బెయిల్పై విడుదలౌతున్న వీరికి స్వాగతం పలకాలని కన్నయ్య కుమార్తో సహా పలువురు మద్దతుదారులు జేఎన్యూలో సన్నాహకాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు, నటుడు అనుపమ్ ఖేర్ మాట్లాడుతూ.. బెయిల్ పొందిన విద్యార్ధులను సాదరంగా స్వాగతించడానికి వారేమీ ఒలింపిక్ హీరోలు కాదు అని వ్యాఖ్యానించారు. జేఎన్యూలో శుక్రవారం అనుపమ్ ఖేర్ చిత్రం 'బుద్ద స్టక్ ఇన్ ఏ ట్రాఫిక్'ను ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి ముందుగా విద్యార్థులను ఉద్దేశించి అనుపమ్ ప్రసంగించారు. తన చిత్రాన్ని ప్రదర్శించడానికి యూనివర్సిటీ అధికారులు మొదట అభ్యంతరం చెప్పారని ఆయన ఈ సందర్భంగా విమర్శించారు. -
నన్ను 'చెంచా' అన్నా ఏం బాధలేదు...
న్యూఢిల్లీ: దేశం కోసం పగలు, రాత్రి తేడా లేకుండా పనిచేస్తున్న ప్రధాని నరేంద్ర మోదీకి తనను 'చెంచా' అని పిలిచినా ఏమాత్రం పట్టించుకోనని బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ వ్యాఖ్యానించారు. ఓ ఛానల్ కి ఇంటర్వ్యూలో ఆయన ఈ విధంగా మాట్లాడారు. స్కూళ్లలో లాల్ బహదుర్ శాస్త్రి, ఇతర నేతలకు జై కొడుతూ నినాదాలు చేస్తుంటారు కదా... మరి ఎందుకు ప్రధాని మోదీకి ఆ విధంగా జై కొట్టడం లేదని ప్రశ్నించారు. అసలు సమస్య ఏంటో తనకు అర్థం కావడం లేదన్నాడు. దేశ ప్రతిష్టను ప్రపంచ వ్యాప్తంగా తెలిసేలా చేస్తున్న వ్యక్తిని గౌరవించుకోవడం మన పని అని పేర్కొన్నారు. మహిళల టాయిలెట్లు, వారి సమస్యలపై ఇప్పటివరకు ఏ ప్రధాని నోరువిప్పలేదన్న విషయాన్ని ప్రస్తావించారు. కొందరు తనను ప్రధాని మోదీకి 'చెంచా' అని విమర్శిస్తున్నారని చెప్పారు. అయితే తాను మోదీకి మాత్రమే కాదు, బిగ్ బి అమితాబ్ బచన్, దిలీప్ కుమార్ లకు కూడా చెంచా అంటూ తనపై విమర్శల్ని తిప్పికొట్టారు. దేశం కోసం తనను ఆలోచించేలా చేసిన వ్యక్తి మోదీ అని చెప్పుకొచ్చారు. తాను రాజకీయాల్లోకి వస్తే ఏ పార్టీలోనైనా చేరేందుకు తగిన నిర్ణయం తీసుకుంటానన్నారు. ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని తీవ్రంగా విమర్శించారు. రాజకీయాలపై అనాసక్తి ఉన్న నేత అంటూ అనుపమ్ ఖేర్ వ్యాఖ్యలు చేశారు. -
రీల్ లైఫ్లోనే కాదు.. రియల్ లైఫ్లోనూ విలనే
గోరఖ్పూర్: బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్పై బీజేపీ ఎంపీ మహంత్ యోగి ఆదిత్యానాథ్ విరుకుపడ్డారు. సినిమాల్లోనే కాదు నిజజీవితంలో కూడా ఖేర్ విలన్ అని యోగి విమర్శించారు. 'విలన్ క్యారక్టర్ ఏంటో ప్రతి ఒక్కరికీ తెలుసు. రీల్ లైఫ్లో కాదు రియల్ లైఫ్లోనూ ఖేర్ విలనే. కోల్కతాలో ఖేర్ చేసిన వ్యాఖ్యలపై ఎక్కువ మాట్లాడదలచుకోలేదు' అని యోగి అన్నారు. కోల్కతాలో ఇటీవల జరిగిన అసహనంపై చర్చలో ఖేర్ మాట్లాడుతూ.. 'బీజేపీ ఎంపీలు యోగి, సాధ్వి ప్రాచి అనుచితంగా మాట్లాడుతున్నారు. వారిద్దరినీ బీజేపీ నుంచి బహిష్కరించి జైల్లో వేయాలి' అని అన్నారు. ఈ నేపథ్యంలో యోగి ఆదిత్యానాథ్ ఘాటుగా స్పందించారు. -
'వారిని గెంటేసి జైల్లో పెట్టాలి'
కోల్కతా: బీజేపీలో కొందరిని బయటకు గెంటేసి వారిని జైలులో పెట్టాలని ప్రముఖ బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ అన్నారు. ముఖ్యంగా యోగి ఆధిత్యానాథ్, సాద్వి ప్రాచి నాన్సెన్స్గా తయారయ్యారని వారిని వెంటనే పార్టీ నుంచి బయటకు పంపించాలని, కటకటాల్లో పెట్టాలన్నారు. 'బీజేపీలో కొందరు అడ్డగోలుగా మాట్లాడుతున్నారు. వారికి జాఢ్య మనస్తత్వం ఉంది. సాధ్వి, యోగిలాంటి వారిని పార్టీ నుంచి తొలగించి జైలులో పెట్టాలి' అని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీలో కూడా చాలామంది చెత్త విషయాలు మాట్లాడుతున్నారని అది నీచమైన పని అన్నారు. తాను ఎవరూ నీచంగా మాట్లాడినా వెనుకేసుకొచ్చేది లేదని, అలాంటివారిని విమర్శిస్తూనే ఉంటానని అన్నారు. ఈ దేశంలో సంపన్నులు, ప్రఖ్యాతి చెందిన వారే అసహనం గురించి మాట్లాడుతున్నారని, వీధిలో వెళ్లే సామాన్యుడు ఈ విషయాన్ని ఎప్పుడూ మాట్లాడడని అన్నారు. వారు రెండు పూటల తమకు భోజనం సరిపోతే చాలని అనుకుంటారని గుర్తు చేశారు. -
అక్కడ మనోళ్ల సంగతేంటో చూడండి!
ఎవరైనా పాకిస్థాన్కు అనుకూలంగా వ్యాఖ్యలు చేస్తే వాళ్లను వెంటనే కొట్టేస్తారా.. అసలు చట్టం పనిచేస్తోందా అంటూ ప్రశ్నించిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు బాలీవుడ్ నటుడు, బీజేపీ నేత అనుపమ్ ఖేర్ గట్టిగా సమాధానం ఇచ్చారు. భారతీయ క్రికెటర్ విరాట్ కోహ్లీకి వీరాభిమాని అయిన ఓ పాకిస్థానీ.. కోహ్లీకి మద్దతుగా భారత పతాకం ఊపినందుకు అతడిని అరెస్టుచేసి జైల్లో పెట్టారని గుర్తు చేశారు. అక్కడ మనోళ్ల పరిస్థితి ఇలా ఉందంటూ చెప్పారు. మొత్తమ్మీద జేఎన్యూ వ్యవహారం తర్వాత నాయకుల మధ్య వాద ప్రతిపాదనలు ట్విట్టర్ వేదికగా శరవేగంగా సాగుతున్నాయి. Sir! A Pak national who raised an Indian Flag for our Virat Kohli is behind bars there. https://t.co/ZOL9OPDQDk — Anupam Kher (@AnupamPkher) February 18, 2016 -
అనుపమ్ఖేర్కు పాక్ వీసా నిరాకరణ
కరాచీ సాహిత్య ఉత్సవాలకు 18 మందికి ఆహ్వానం * ఖేర్ దరఖాస్తు చేయలేదని వెల్లడి * వీసా తిరస్కరణకు నా దేశభక్తి కారణమా?: అనుపమ్ ప్రశ్నలు న్యూఢిల్లీ/కరాచీ: బాలీవుడ్ నటుడు, బీజేపీ సానుభూతిపరుడు అనుపమ్ ఖేర్కు పాకిస్తాన్ వీసా నిరాకరించింది. పాక్లోని కరాచీలో శుక్రవారం నుంచి జరిగే కరాచీ సాహిత్య ఉత్సవం(కేఎల్ఎఫ్)లో పాల్గొనాల్సిందిగా నిర్వాహకులు భారత్కు చెందిన అనుపమ్ఖేర్తో పాటు ప్రముఖ నటి నందితాదాస్, కాంగ్రెస్ నేత సల్మాన్ఖుర్షీద్ తదితర 18 మంది ప్రముఖులను ఆహ్వానించారు. ఖేర్ మినహా మిగతా అందరికీ పాక్ వెళ్లడానికి గాను ఢిల్లీలోని పాక్ హైకమిషన్ వీసా మంజూరు చేసింది. అయితే.. ఖేర్ ఎలాంటి వీసా కోసం ఏ దరఖాస్తూ చేసుకోలేదని పాక్ ఎంబసీ పేర్కొంది. ఖేర్కు ఇటీవలే కేంద్రం పద్మభూషణ్ అవార్డు ప్రకటించడం తెలిసిందే. అందరికీ వీసా ఇచ్చి తనకు వీసా నిరాకరించటం చాలా విచారం, నిరుత్సాహం కలిగిస్తోందని ఆయన మంగళవారం అన్నారు. కశ్మీరీ పండిట్ అంశాన్ని లేవనెత్తటం, ప్రధాని మోదీకి మద్దతివ్వటం, దేశభక్తిపరుణ్ని కావటం వల్లే తనకు వీసా నిరాకరించారా? అన్నారు. ‘వారి ప్రదర్శనలకు భారత్లో ఒక చోట అభ్యంతరాలంటే.. మరొక చోటకు ఆహ్వానిస్తాం. కానీ అటువైపు నుంచి ఆ ప్రతిస్పందన లేదు’ అని అన్నారు. వీసా కోసం దరఖాస్తు చేయవద్దన్నారు: కేఎల్ఎఫ్ ఈ విషయమై ఢిల్లీలోని పాక్ హైకమిషన్ను సంప్రదించగా.. ఖేర్ వీసా కోసం తమకు దరఖాస్తు సమర్పించలేదని.. కాబట్టి ఆయనకు వీసా మంజూరు చేయటం లేదా నిరాకరించటం అనే దానికే ఆస్కారం లేదని హైకమిషన్ పేర్కొంది. కరాచీ సాహిత్య ఉత్సవ నిర్వాహకులు మాత్రం.. ఖేర్కు వీసా మంజూరు చేయబోమని, కాబట్టి ఆయనకు వీసా కోసం దరఖాస్తు చేయవద్దని సలహా ఇవ్వాలని ఢిల్లీలోని పాక్ హైకమిషన్ తమకు సూచించిందని చెప్పటం గమనార్హం. మతం, ఇండో-పాక్ సంబంధాలపై సామాజిక మాధ్యమాల్లో అనుపమ్ క్రియాశీలంగా స్పందిస్తుండటం వల్ల వీసా కోసం దరఖాస్తు చేయవద్దని సూచించినట్లు పాక్వర్గాలు తెలిపాయి. తాను వీసా కోసం దరఖాస్తు చేయలేదని పాక్ హైకమిషన్ చెప్పటం పెద్ద జోక్ అని, అబద్ధమని ఆయన తప్పుపట్టారు. వీసా దరఖాస్తు లాంఛనాలను కరాచీలోని నిర్వాహకులే పూర్తిచేశారని చెప్పారు. ‘నాకు ఎందుకు వీసా నిరాకరించారో తెలియదు. నా దేశభక్తి వల్లా? నేను నా దేశం గురించి మాట్లాడతాను కనుకనా? నేను ఆ దేశానికి వెళ్లి నా దేశాన్ని విమర్శించననా? నేను ఉగ్రవాదుల భాషను మాట్లాడను’ అని అన్నారు. దీనిపై పాక్తో మాట్లాడాలని కేంద్రాన్ని కోరతానన్నారు. గత ఏడాది పాక్లో ఓ కార్యక్రమానికి హాజరవ్వాల్సిన ఖేర్కు అప్పడు కూడా పాక్ హైకమిషన్ వీసా నిరాకరించింది. -
బాలీవుడ్ నటుడికి వీసా నిరాకరించిన పాక్
న్యూఢిల్లీ: దాయాది దేశం పాకిస్థాన్లోనూ అసహనం ఉందా? 18 మంది ఆహూతుల్లో 17 మందికి వీసాలు ఇచ్చి ఒక్కరికే ఇవ్వకపోవడం దేనికి సంకేతం? బాలీవుడ్ ప్రముఖ నటుడు అనుపమ్ ఖేర్కు వీసా మంజూరు చేసేందుకు పాక్ ప్రభుత్వం నిరాకరించింది. భారత్లో అసహనం పెరిగిపోతోందని సాహితీవేత్తలు, కళాకారులు, రాజకీయ నాయకులు విమర్శిస్తున్న సంగతి తెలిసిందే. వీరికి వ్యతిరేకంగా ఖేర్ గళం విప్పారు. ఈ నేపథ్యంలో ఆయనకు పాక్ వీసా ఇవ్వకపోవడం చర్చనీయాంశమైంది. ఈ నెల 5న కరాచీ సాహిత్య సమ్మేళనంలో ఖేర్ పాల్గొనాల్సి ఉంది. ఈ కార్యక్రమానికి 18 మంది విదేశీ ప్రముఖులను ఆహ్వానించారు. ఖర్కు మినహా మిగిలిన ప్రముఖులకు పాక్ వీసాలు మంజూరు చేసింది. దీనిపై ఖేర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తనకు పాక్ వీసా నిరాకరించడం బాధ కలిగించిందని చెప్పారు. అనుపమ్ ఖేర్కు ఇటీవల కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డును ప్రకటించిన సంగతి తెలిసిందే. -
నువ్వో కాంగ్రెస్ చెంచావి!
న్యూఢిల్లీ: బాలీవుడ్ నటుడు అనుపమ్ కేర్, కాంగ్రెస్ నేత శశి థరూర్ ట్విట్టర్లో కత్తులు దూసుకున్నారు. నువ్వో సంఘ్ భావజాలమున్న హిందూవి అని ఖేర్ను థరూర్ విమర్శిస్తే.. 'నువ్వో కాంగ్రెస్ చెంచావి' అంటూ థరూర్ పై ఆయన విరుచుకుపడ్డారు. శశి థరూర్ శనివారం ఖేర్ ఇంటర్వ్యూకు సంబంధించిన ఓ వీడియో లింకును ట్విట్టర్లో పోస్టు చేసి.. 'అనుపమ్, నేను హిందువునని గర్వంగా అన్ని సమయాల్లో చెప్పుకొంటాను. కానీ సంఘ్ భావజాలమున్న హిందుని కాదు' అని ట్వీట్ చేశారు. దీనిపై అనుపమ్ ఖేర్ తీవ్రంగా మండిపడ్డారు. 'శశీ.. నువ్వు కూడా మిగతావారిలాగా నా వ్యాఖ్యలను వక్రీకరించి.. కాంగ్రెస్ చెంచాలాగా వ్యవహరిస్తావని అనుకోలేదు' రీట్వీట్ చేశారు. దీనికి స్పందించిన థరూర్ వాదనలో ఓడిపోయినప్పుడే దుర్భాషలకు దిగుతారని, తాను కాంగ్రెస్ ఎంపీగా గర్వపడతానని, తాను ఎవరినీ అవమానించనని పేర్కొన్నారు. ఖేర్ మళ్లీ స్పందిస్తూ థరూర్ మొదట హిందూ, సంఘీ పేరిట ఈ వివాదానికి తెరతీశారని వివరణ ఇచ్చారు. అనుపమ్ ఖేర్కు పద్మభూషణ్ అవార్డు రావడంపై ట్విట్టర్లో నెటిజన్లు తీవ్రంగా స్పందించారు. 2010లో పద్మ అవార్డుల ప్రామాణికతను ప్రశ్నించిన ఆయన ఎలా ఈ పురస్కారాన్ని తీసుకుంటారంటూ పెద్ద ఎత్తున ట్వీట్లతో విరుచుకుపడ్డారు. ఈ నేపథ్యంలో శశి థరూర్ చేసిన వ్యాఖ్యలపై ఖేర్ తీవ్రంగా స్పందించారు. -
అనుపమ్కి ఈ అవార్డు ఎలా వచ్చింది?!
అవార్డొస్తే ఆనందం. రాకపోతే నిరాశ. వస్తుందనుకునీ రాకపోతే కోపం. క్వయిట్ నేచురల్. ఆనందంలో ఎగిరి గంతేస్తాం. నిరాశలో డీలా పడిపోతాం. కోపంలో కయ్యిమని లేస్తాం. ఇదీ నేచురలే. ఆనందంలో, నిరాశలో, కోపంలో ఒకేలా ముక్కూ మూతి బిగించుకుని ఎలా కూర్చుంటాం? కానీ ఈ మనుషులకి ఎప్పుడూ ఒకే ఎక్స్ప్రెషన్ కావాలి. ‘ఆరోజు నువ్వు అవార్డుల్ని తీసి పారేశావు కదా, ఇప్పుడెలా వాటిని తలకెత్తుకుంటావు’ అని వీళ్ల పాయింట్! సోషల్ మీడియా కోడిని కోసి, ఎవరికైనా ఒక సండే రోజు వండి పెట్టాలన్నంత కోపం వస్తోంది. ఎప్పుడో ఏదో అన్నానని, ఇప్పుడూ అదే అనాలా?! పని చేసేవాళ్ల కన్నా, పనికిమాలిన ప్రశ్నలేసేవాళ్లు ఎక్కువయ్యారు దేశంలో! అవును. అన్నాను. పద్మ అవార్డులకి ఇక్కడేం విలువ లేదు అన్నాను. అది పాస్ట్. ఇప్పుడు హ్యాపీ అండ్ హంబుల్డ్ అంటున్నాను. ఇది ప్రెజెంట్. ‘నీ పాస్టు, నీ ప్రెజెంటు ఒకేలా ఉండాలి’ అనే వాళ్లకి సమాధానం చెప్పేంత తీరిక నాకు లేదు. ఎప్పుడూ ఏదో ఒక పనిలో బిజీగా ఉంటాను. ఇప్పుడూ ఉన్నాను. ఐదున కరాచీలో లిటరేచర్ ఫెస్టివల్. దానికి వెళ్లాలి. దాని కోసం నోట్స్ రాసుకోవాలి. పెద్ద పని! ఇంకా పెద్ద పని.. ఫెస్టివల్లో నా పుస్తకం ‘ది బెస్ట్ థింగ్ ఎబౌట్ యు ఈజ్ యు’ రీడింగ్కి నన్ను నేను రెడీ చేసుకోవడం. నా లైఫ్ స్ట్రగుల్ అంతా ఆ పుస్తకంలో ఉంది. నేను ఇల్లొదిలి వెళ్లడం, వేషాల కోసం వెతుక్కోవడం, రైల్వే ప్లాట్ఫారాల మీద పడుకోవడం.. ఊరికే పద్దెనిమిది ముద్రణలు అవుతాయా? ఊరికే నాకు అవార్డులు వచ్చేస్తాయా? నన్ను నేను రెస్పెక్ట్ చేసుకోదగిన జీవితం నాకు ఉన్నందువల్లనే కదా ఈ గుర్తింపు అంతా. గుర్తింపు రాని రోజుల్లో నిరాశతో, కోపంతో నేను అన్నమాటలకు కూడా రెస్పెక్ట్ ఉంటుందనే జ్ఞానం ఈ క్రిటిక్స్కి లేకపోతే.. ఆ జ్ఞానమేదో కలిగించడానికి నేనెందుకు టైమ్ వేస్ట్ చేసుకోవాలి? ‘అసలు అనుపమ్కి ఈ అవార్డు ఎలా వచ్చింది?!’ అని.. వీళ్లదే ఇంకో క్వొశ్చన్ మార్క్! ఏం? ఎందుకు రాకూడదు? నాకేం పెయింటింగ్కీ, డాన్సింగ్కీ పద్మభూషణ్ ఇవ్వలేదే? అలా ఇచ్చి ఉంటే ముఖం దాచుకోడానికి ముంబైలో ఎక్కడైనా మంచి ప్లేస్ ఉందేమో వెతుక్కునేవాడిని. లేదా నేను పుట్టిన సిమ్లాకు వెళ్లిపోయేవాడిని. ‘నేను ఏమిటో అందుకు మాత్రమే’ వచ్చిన అవార్డు ఇది. కాబట్టి నేనెవ్వరికీ సమాధానం చెప్పక్కర్లేదు. నాకైతే ఒకటి బాగా అర్థమైంది. మనమంటే నచ్చనివాళ్లకు మనమేం సాధించినా లెక్కకాదు. మనమంటే ఇష్టపడేవాళ్లకు మనం ఏం సాధించామన్నది లెక్కకాదు. -
దర్శకుడికి 'అవార్డు' నటుడి గురుదక్షిణ
ముంబై: పద్మభూషణ్ అవార్డుకు ఎంపికైన బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్.. దర్శకుడు మహేష్ భట్కు గురుదక్షిణ చెల్లించుకున్నాడు. మహేష్ భట్కు వెయ్యి రూపాయల నోటు ఇచ్చి, తనకు కెరీర్ ప్రసాదించినందుకు ధన్యవాదాలు తెలిపాడు. భట్ దర్శకత్వం వహించిన 'సారాంశ్' చిత్రం ద్వారా ఖేర్ బాలీవుడ్లో తెరంగేట్రం చేశాడు. అప్పటి నుంచి భట్, ఖేర్ల మధ్య గురుశిష్యుల బంధం కొనసాగుతోంది. భట్ను కలసినపుడు తీసిన ఫొటోను అనుపమ్ ఖేర్ ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. ఖేర్ వెయ్యి రూపాయల కాగితాన్ని అందించి, ధన్యవాదాలు తెలపగా, భట్ ఆయన్ని ఆప్యాయంగా దగ్గరకు తీసుకుని నుదుటిపై ముద్దుపెట్టాడు. పద్మభూషణ్ అవార్డుకు ఎంపికైన ఖేర్కు భట్ అభినందనలు తెలిపాడు. ఈ అవార్డు రావడం గర్వంగా ఉందని చెప్పాడు. -
'ఆయనకు అదో అలవాటుగా మారింది'
'సూపర్ స్టార్ అయిన ఆమిర్ ఖాన్.. ప్రతీ అంశం మీద అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం అలవాటుగా మార్చుకున్నాడు. అయితే అది ప్రజలందరిని దృష్టిలో ఉంచుకొని చేయాలి' అని బాలీవుడ్ సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్ సూచించాడు. అమీర్ ఖాన్ తనకు మంచి మిత్రునిగా పేర్కొన్న ఆయన.. గతంలో ఆయనతో ఎన్నో చిత్రాలకు కలిసి పనిచేసిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. గతంలో 'దిల్', 'దిల్ హై కీ మంతా నహీ' చిత్రాలకు తనతో కలిసి పనిచేసినప్పుడు ఉన్న ఆమిర్ ఖాన్ ఇప్పటిలా లేడని, సంవత్సరాల పాటు ప్రయత్నించి ఆయన ఈ స్థాయికి చేరుకున్నాడన్నారు. ఇప్పుడు ఆయన ఏ విషయం మీద అయినా తన అభిప్రాయాలను తెలపాలనే క్రమంలో వివాదాస్పదంగా మాట్లాడుతున్నారన్నారు. స్టార్ డమ్ తోపాటు బాధ్యత కూడా వస్తుందని ప్రజలను భయబ్రాంతులకు గురిచేసేలా కాకుండా వారిలో ఆశ నింపేలా మాట్లాడాలని సూచించాడు. 'గతంలో నేను చిత్రీకరించిన ఓ పాత్ర శుద్ద దండగ అని మహేశ్ బట్తో ఆమిర్ తెలిపినట్లు విన్నాను. అయితే కొంత మంది వ్యక్తులు మేము చెప్పేదే సరైనది, మిగతా ప్రపంచం మొత్తం తప్పు అని భావిస్తుంటారు' అని అనుపమ్ ఖేర్ తెలిపాడు -
రాజకీయాల్లోకి వచ్చే ప్రసక్తి లేదు
ముంబై: వివాదాస్పద ట్వీట్లతో తరచు వార్తలో నిలిచే బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్, రాజకీయాల్లోకి రానని తేల్చిచెప్పారు. తాను కోట్లాది మంది భారతీయులకు ప్రతినిధిగా ఉంటానని చెప్పారు. ఈస్ట్ ఆర్ వెస్ట్.. ఇండియా ఈజ్ బెస్ట్ అని నమ్మే భారతీయుల తరఫున తన వాదనను వినిపిస్తాను తప్ప రాజకీయాల్లోకి రానన్నారు. సోషల్ మీడియాలో అభిమానులతో, స్నేహితులతో ఆయన సరదాగా చాట్ చేసినపుడు.. మీ భార్య కిరణ్లా భవిష్యత్తులో రాజకీయాల్లోకి వస్తారా అన్న ప్రశ్నలకు ఆయన ఇలా స్పందించారు. మీ భార్య అడుగు జాడల్లో నడుస్తారా అన్న నెటిజన్ల ప్రశ్నలకు ఎట్టి పరిస్థితుల్లోనూ రాజకీయాల్లో చేరనని, నటుడిగా, స్ఫూర్తిమంతమైన ఉపన్యాసకుడిగా ఉండటమే తనకు సంతోషాన్నిస్తుందని పేర్కొన్నారు. పరమత సహనం కోరుతూ ఢిల్లీలో నిర్వహించిన ర్యాలీ సందర్భంగా తనకు సినిమాల కంటే దేశమే ముఖ్యమని ప్రకటించిన ఖేర్ తాజా వ్యాఖ్యలు ఆసక్తిని రేపాయి. అయితే ఇప్పటికే రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటున్న అనుపమ్ భార్య కిరణ్ ఖేర్.. ఇటీవలి ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీచేసి ఎంపీగా ఎన్నికయ్యారు. కాగా సల్మాన్ సెన్సేనషనల్ మూవీ 'ప్రేమ రతన్ ధన్ పాయో'లో నటించిన అనుపమ్.. క్రికెటర్ ధోనీపై రూపొందుతున్న చిత్రం 'ఎమ్ఎస్ ధోనీ' లో ధోనీ తండ్రి పాన్ సింగ్ పాత్రను పోషిస్తున్న సంగతి తెలిసిందే. -
నమ్మకాన్ని పెంచండి..భయాన్ని కాదు
ముంబై: భారత్ వదిలిపెట్టి పోదామని నా భార్య అడుగుతోందన్న బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ సంచలన వ్యాఖ్యలపై ట్విట్టర్ లో దుమారం కొనసాగుతోంది. బాలీవుడ్ నటుడు, బీజేపీ ఎంపీ అనుపమ్ ఖేర్ అమీర్ వ్యాఖ్యలపై ట్విట్టర్ లో ఘాటుగా స్పందించారు. పవిత్ర భారతదేశం అసహన భారతదేశంగా ఎపుడు మారిపోయిందని ప్రశ్నించారు. ఏ దేశం వెళదామో మీ భార్య కిరణ్ చెప్పలేదా అంటూ ట్విట్ చేశారు. మరి ఏ దేశం మీకు అమీర్ ఖాన్ గా పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టిందో ఆమెకు తెలిపారా వ్యంగ్య బాణాలు విసిరారు. చాలా కష్టాల్లో ఉన్నపుడు ఈ దేశమే మిమ్మల్ని ఆదుకుందనే విషయాన్ని ఆమెకు చెప్పారా.. మరి దేశం విడిచి పోయే ఆలోచన అప్పుడెందుకు చేయలేదన్నారు. దేశంలో అసహనం పెరుగుతోందన్న అమీర్ వ్యాఖ్యలను తప్పు బట్టిన ఆయన . దేశంలో అసహనం పెరుగుతోంటే, ప్రజలకు ఇలాంటి సలహానే ఇస్తారా అంటూ మండిపడ్డారు. పవిత్రమైన దేశంలో అల్లర్లు చెలరేగితే పరిస్థితులు చక్కబడేదాకా సంయమనం పాటించమని ప్రజలకు పిలుపునిస్తారా లేక దేశం విడిచి పారిపొమ్మంటారా అని ప్రశ్నించారు. దేశంలో పెరుగుతున్న అశాంతి గత ఏడెనిమిది నెలలునుంచే మీకు కనిపిస్తోందా అంటూ అమీర్ పై విరుచుకుపడ్డారు. సత్యమేవ జయతి ప్రజల్లో. నమ్మకాన్న ఆశావహదృక్పథాన్ని పెంపొందించాలి తప్ప భయాన్ని కాదని అనుపమ్ ఖేర్ హితవు చెప్పారు. కాగా దేశంలో రామ్నాథ్ గోయెంగా ఎక్సెలెన్స్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న అమీర్ దేశంలో అభద్రతా పరిస్థితులు నెలకొన్నాయంటూ ఆందోళన వ్యక్తం చేశారు. తన చిన్నారుల విషయంలో తన భార్య కిరణ్ ఆందోళన చెందుతోందన్నారు. దేశం వదిలిపెట్టి వేరేదేశానికి వెళ్లాలని కూడా ఆలోచించిందని చెప్పిన సంగతి తెలిసిందే. -
మీ భార్యను ఈ ప్రశ్నలు అడిగారా?
న్యూఢిల్లీ: మత అసహనంపై ఆందోళన వ్యక్తం చేసిన బాలీవుడ్ హీరో ఆమిర్ ఖాన్ పై సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్ పశ్నల వర్షం కురిపించారు. 'ఇండియా వదిలి వేరే దేశానికి వెళ్దామా?' అని తన భార్య కిరణ్ రావ్ అడిగిందని ఆమిర్ ఖాన్ వెల్లడించిన నేపథ్యంలో ట్విటర్ ద్వారా అనుపమ్ ఖేర్ పలు ప్రశ్నలు సంధించారు. * 'నన్ను స్టార్ హీరోను చేసిన ఇండియాను వదిలి వెళ్లాలనుకుంటున్నావా' అని మీ భార్యను అడిగారా? * గతంలో ఇంతకంటే గడ్డు పరిస్థితులు ఎదుర్కొన్నప్పుడు ఇండియా వదిలి వెళ్లాలనిపించలేదా అని కిరణ్ ను ప్రశ్నించారా? * 'ఇంక్రెడిబుల్ ఇండియా' కాస్తా 7-8 నెలల కాలంలో మీకు 'ఇన్ టోలరెంట్ ఇండియా'గా ఎలా మారిందో చెప్పగలరా? * దేశంలో మత అసహనం పెరిగిందని అంటున్నారు. దీని ద్వారా ప్రజలకు మీరు చెప్పదలుచుకున్నదేమిటి. ఇండియా వదిలి వెళ్లమంటారా? లేదా పరిస్థితులు చక్కబడేవరకు ఆగమంటారా? * 'సత్యమేయ జయతే' కార్యక్రమం ద్వారా దేశంలోని సమస్యలను వెలుగులోకి తెచ్చారు. నేడు మత అసహనం పెరిగిందని చెబుతున్న మీరు ప్రజలకు భరోసా ఇచ్చేందుకు ప్రయత్నించాలి కానీ భయపెట్టకూడదు. Dear @aamir_khan. Did you ask Kiran which country would she like to move out to? Did you tell her that this country has made you AAMIR KHAN. — Anupam Kher (@AnupamPkher) November 23, 2015 -
'సహనం పుష్కలంగా ఉంది'
ఢిల్లీ: దేశంలో అసహనం పెరిగిపోతుందంటూ పలువురు రచయితలు, మేధావులు తమ అవార్డులను వెనక్కిస్తున్న నేపథ్యంలో ప్రముఖ బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ శనివారం రాష్ట్రపతి భవన్కు పలువురు బాలీవుడ్ నటులతో ర్యాలీని నిర్వహించారు. దేశంలో సహనానికి వచ్చిన నష్టం ఏమీ లేదనీ, సహనం పుష్కలంగా ఉందని ఆయన పేర్కొన్నారు. కొంతమంది ఉద్దేశపూర్వకంగా దేశంలో అసహనం పెరిగిపోతుందంటూ దేశ ప్రతిష్టను దిగజారుస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రపతితో భేటీ వివరాలను అనుపమ్ తెలియజేశారు. అవార్డులు ప్రభుత్వం ఇవ్వడం లేదని, దేశ ప్రజలే ఇస్తున్నారని ప్రణబ్ ఈ సందర్భంగా అన్నట్లు తెలిపారు. అంతే కాకుడా మతాలకతీతంగా తయారుచేయబడ్డ భారత రాజ్యాంగం పట్ల అందరూ గౌరవాన్ని కలిగి ఉండాలని ప్రణబ్ సూచించినట్లు చెప్పారు. అసహనం పేరిట అవార్డులను తిరిగి ఇచ్చే ఘటనలను సహనానికి ప్రతీక అయిన ఇండియా పట్ల కొందరు చేస్తున్న దుష్ప్రచారంగా చూడాలన్నారు. అయితే కొంతమంది చేస్తున్న ఈ నిరసనల పట్ల భారతీయులు ఏకీభవించడం లేదని ఆయన అన్నారు. మోదీకి వ్యతిరేకంగా ఎన్నికల్లో ప్రచారం నిర్వహించిన కొందరు అవార్డుల రిటర్న్ ద్వారా తమ నిరసనలు తెలుపుతున్నారని అన్నారు. తమ ర్యాలీకి ఎటువంటి రాజకీయ పార్టీలతో సంబంధం లేదని తెలిపిన అనుపమ్ ఖేర్ ఇది కేవలం భారతీయుల కోసం నిర్వహించిన ర్యాలీ అని అన్నారు. -
'అసహనం'పై అనుపమ్ పోరాటం
న్యూఢిల్లీ: ప్రముఖ నటుడు అనుపమ్ ఖేర్ 'అసహనం'పై పోరాటానికి సంసిద్ధులయ్యారు. 'మార్చ్ ఫర్ ఇండియా' పేరుతో శనివారం ఉదయం ఢిల్లీలోని జనపథ్ రోడ్డు నుంచి రాష్ట్రపతి భవన్ వరకు ర్యాలీ నిర్వహించనున్నారు. ఈ మేరకు సామాజిక మాధ్యమాల ద్వారా మేధావులు, సినీ దిగ్గజాలు, సాధారణ ప్రజలకు ఆహ్వానం పలికారు. దేశంలో అసహన పరిస్థితులు నెలకొన్నాయంటూ రచయితలు, సినీ దర్శకులు, శాస్త్రవేత్తలు తమకు లభించిన విశిష్ట అవార్డులను వెనక్కి ఇస్తుండటాన్ని అనుపమ్ ఖేర్ మొదటి నుంచీ తప్పుపడుతున్న సంగతి తెలిసిందే. కేవలం ప్రధాని నరేంద్ర మోదీని లక్ష్యంగా చేసుకునే కొందరు అవార్డులు తిరిగిచ్చే కార్యక్రమాన్ని ప్రారంభించారని, ఇలా చేయడం జాతిని అవమానించినట్లేనని అనుపమ్ ఆరోపిస్తున్నారు. అనుపమ్ భార్య కిరణ్ ఖేర్ బీజేపీలో సుప్రసిద్ధ నాయకురాలన్న సంగతి తెలిసిందే. రాష్ట్రపతిని కలుసుకుని ఒక వినతిపత్రం ఇస్తామని ఖేర్ చెప్పారు. కాగా,ఖేర్ ర్యాలీకి పలువురు సినీ దిగ్గజాలు మద్దతు పలికారు. దర్శకులు మథుర్ భండార్కర్, అశోక్ పండిట్ లు తాము కూడా 'మార్చ్ ఫర్ ఇండియా'లో పాల్గొనబోతున్నట్లు ప్రకటించారు. మూడు రోజుల కిందటే కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ రాష్ట్రపతి ప్రణబ్ ను కలిసి అసహన పరస్థితులపై ఫిర్యాదుచేసిన సంగతి విదితమే. -
'సినిమాల కంటే.. నాకు దేశమే ముఖ్యం'
న్యూఢిల్లీ: తనకు సినిమాల కంటే దేశమే ముఖ్యమని ప్రముఖ బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ అన్నారు. పరమత సహనం కోరుతూ శనివారం ఢిల్లీలో ప్రముఖులు నిర్వహిస్తున్న ర్యాలీలో అనుపమ్ ఖేర్ పాల్గొననున్నారు. ఈ యాత్రలో సినీ నటులు, మేధావులు, కవులు, కళాకారులు పాల్గొంటారు. ఇందులో పాల్గొనడం వల్ల తనకు సినిమాల్లో నటించే అవకాశాలు ఇవ్వకపోవచ్చని, వృత్తి కంటే తనకు దేశమే ముఖ్యమని అనుపమ్ ఖేర్ చెప్పారు. దేశంలో అసహనం పెరిగిపోతుందంటూ రచయితలు, మేధావులు తమకు లభించిన జాతీయ అవార్డులను వెనక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రజాస్వామ్యానికి వచ్చిన ప్రమాదమేమీ లేదనీ, అవార్డులు వెనక్కి ఇవ్వాల్సిన అవసరం లేదంటూ అనుపమ్ ఖేర్ రాష్ట్రపతి భవన్కు ర్యాలీ నిర్వహించనున్నారు. నరేంద్రమోదీ ప్రభుత్వానికి, పెరుగుతున్న అసహనానికి సంబంధం లేదంటూ ఈ ర్యాలీని నిర్వహించనున్నారు. -
మోదీకి మద్దతుగా అనుపమ్ ఖేర్ ర్యాలీ
ఢిల్లీ: దేశంలో అసహనం పెరిగిపోతుందంటూ రచయితలు, మేధావులు తమకు లభించిన జాతీయ అవార్డులను వెనక్కిస్తున్నారు. పలువురు సినీ దర్శకులు కూడా వీరికి మద్దతు తెలుపుతున్నారు. కాంగ్రేస్ అధినేత్రి సోనియా గాంధీ ఆంధ్వర్యంలో రాష్ట్రపతి భవన్కు ర్యాలీని నిర్వహించి, పెరుగుతున్న అసహనంపై చర్యలు తీసుకోవాలని ప్రణబ్ను కోరారు.ఈ నేపథ్యంలో ప్రజాస్వామ్యానికి వచ్చిన ప్రమాదమేమీ లేదనీ, అవార్డులు వెనక్కి ఇవ్వాల్సిన అవసరం లేదంటూ ప్రముఖ బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ రాష్ట్రపతి భవన్కు ర్యాలీ నిర్వహించనున్నారు. శనివారం నిర్వహించనున్న ర్యాలీలో పలువురు బాలీవుడ్ ప్రముఖులు, ప్రజలు పాల్గొననున్నట్లు అనుపమ్ ఖేర్ సతీమణి కిరణ్ ఖేర్ తెలిపారు. నరేంద్రమోదీ ప్రభుత్వానికి, పెరుగుతున్న అసహనానికి సంబంధం లేదంటూ ఈ ర్యాలీని నిర్వహించనున్నారు. ఇది సత్యానికి సంబంధించిన ర్యాలీగా ఆమె తెలిపారు. -
అనుపంతో కౌంటర్ ప్లాన్ చేస్తున్న బీజేపీ
'అసహనం'పై దేశ వ్యాప్తంగా రచయితలు, కళాకారులు, సినిమా స్టార్లు నిరసన వ్యక్తం చేస్తుండటంతో.. ఇప్పటి వరకూ కేంద్ర మంత్రుల ద్వారా సమాధానం చెబతూ వస్తున్నబీజేపీ తాజాగా.. కౌంటర్ ఎటాక్ పదును పెంచాలని భావిస్తోంది. విపక్షాలకు గట్టిగా సమాధానం చెప్పాలని నిర్ణయించింది. మంగళవారం కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ నుంచి రాష్ట్ర పతి భవన్ వరకూ నిర్వహించిన ర్యాలీకి కౌంటర్ గా.. ప్రముఖ నటుడు అనుపం ఖేర్ ఆధ్వర్యంలో ఒక ర్యాలీ నిర్వహించేందుకు నిర్ణయించింది. ఈనెల 7న కళాకారులు, నటులతో ఈ ర్యాలీ ఏర్పాటు చేయనున్నారు. కాగా.. మోదీ సర్కారు తీరు దేశంలో సామాజిక, మత ఉద్రిక్తతలను రెచ్చగొట్టేలా వ్యవహరిస్తోందని విమర్శించిన కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ.. ర్యాలీ అనంతరం రాష్ట్ర పతి ప్రణబ్ ముఖర్జీకి వినతి పత్రం సమర్పించిన సంగతి తెలిసిందే. -
ధోని.. సనాఫ్ అనుపమ్ ఖేర్
ప్రస్తుతం బాలీవుడ్లో బయోపిక్ల సీజన్ నడుస్తోంది. సినీనటుల జీవితగాథలతో పాటు, అంతర్జాతీయ స్థాయిలో భారత కీర్తి పతాకాన్ని ఎగరవేసిన క్రీడాకారుల జీవితాలను కూడా వెండితెర మీద ఆవిష్కరిస్తున్నారు మన దర్శక నిర్మాతలు. అదే బాటలో ఇండియన్ క్రికెట్ను విజయపథంలో నడిపించిన భారత క్రికెట్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని జీవితకథను సినిమాగా తెరకెక్కిస్తున్నారు. వెడ్నెస్ డే, స్పెషల్ 26, బేబీ లాంటి సస్పెన్స్ థ్రిల్లర్లను తెరకెక్కించిన బాలీవుడ్ దర్శకుడు నీరజ్ పాండే తొలిసారిగా బయోపిక్ను డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమాలో ధోని తండ్రి పాన్ సింగ్గా బాలీవుడ్ సీనియర్ యాక్టర్ అనుపమ్ ఖేర్ నటిస్తున్నాడు. గతంలో నీరజ్ దర్శకత్వంలో తెరకెక్కిన అన్ని సినిమాల్లో ప్రధానపాత్రల్లో నటించిన అనుపమ్ ఈ సినిమాలో కూడా కీరోల్ ప్లే చేస్తున్నాడు. సుశాంత్ సింగ్ రాజ్పుత్ ధోనిగా నటిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. పగ్లీ సినిమాతో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న కైరా అద్వానీ ధోని భార్య సాక్షి సింగ్ ధోని పాత్రలో కనిపించనుంది. 'ఎమ్ఎస్ ధోని : ద అన్ టోల్డ్ స్టోరీ' పేరుతో ఈ సినిమా రిలీజ్ కు రెడీ అవుతోంది. -
'ధోనీకి తండ్రిగా నటిస్తున్నాను'
ముంబై: భారత క్రికెట్ వన్డే కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి తండ్రిగా నటించనున్నట్లు బాలీవుడ్ సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్ తెలిపాడు. ఈ విషయాన్ని ఆయన తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశాడు. దేశానికి రెండు ప్రపంచ కప్లు అందించిన ధోనీ జీవిత అంశాలపై దర్శకుడు నీరజ్ పాండే ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ కోసం ప్రస్తుతం అనుపమ్ ఖేర్ ఖరగ్పూర్లో ఉన్నాడు. అభిమానులతో జరిపిన ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో భాగంగా ఖేర్ మరిన్ని విషయాలను వెల్లడించాడు. 'ఎమ్ఎస్ ధోనీ: ద అన్టోల్డ్ స్టోరీ' మూవీలో ధోనీ తండ్రి పాన్ సింగ్ పాత్రలో తాను, ధోనీ క్యారెక్టర్లో సుశాంత్ సింగ్ రాజ్పుత్ నటిస్తున్నట్లు వివరించాడు. ధోనీ భార్య సాక్షి సింగ్ పాత్రలో కిరణ్ అద్వానీ కనిపించనుంది. గతంలో వచ్చిన 'ఏ వెన్స్డే', స్పెషల్ 26, 'బేబి' మూవీలలో వీరిద్దరూ కలిసి పనిచేశారు. ఆ కారణంతోనే తాను ఈ మూవీకి సంతకం చేసినట్లు అనుపమ్ ఖేర్ వెల్లడించాడు. On my way to Karaghpur via Kolkata for d shoot of MSDhoni-The Untold Story with my favorite director Neeraj Pandey. I play Dhoni's Father.:) — Anupam Kher (@AnupamPkher) October 26, 2015 -
'ఆమె కోసం అతను' కి ప్రతినిధిగా బాలీవుడ్ నటుడు
న్యూయార్క్: లోక్సభ ఎంపీ కిరణ్ ఖేర్ భర్త, బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ ఐక్యరాజ్య సమితికి చెందిన విమెన్ మిషన్కు అంబాసిడర్గా నియమితులయ్యారు. 'హి ఫర్ షి' (ఆమె కోసం అతను) అనే కార్యక్రమానికి ప్రచారకర్తగా ఆయనను నియమించారు. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే ట్విట్టర్లో షేర్ చేశారు. తనపై ఇంతటి గౌరవాన్ని ఉంచినందుకు యూఎన్ విమెన్ విభాగానికి ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. స్త్రీ పురుష సమానత్వానికి తాను కట్టుబడి ఉన్నానని పేర్కొన్నారు. తనకప్పగించిన బాధ్యతను పరిపూర్ణం చేయడానికి తన శాయశక్తులా ప్రయత్నిస్తానని ట్వీట్ చేశారు. సమాజంలో మహిళలు, బాలికలు ఎదుర్కొంటున్న అసమానత్వాన్ని అధిగమించేందుకు పురుషులను, మగపిల్లలను భాగస్వాములుగా చేయాలనే లక్ష్యంలో భాగమే 'హి ఫర్ షి' అనే కార్యక్రమం. యూఎన్ విమెన్ ఆధ్వర్యంలో ఈ పథకానికి రూపకల్పన జరిగింది. స్త్రీ పురుష సమానత్వ సాధన, మహిళా హక్కుల సాధన ప్రచారం కల్పించే ఉద్దేశంతోనే అనుపమ్ ఖేర్ను ఎంపికచేసినట్టు తెలుస్తోంది. కాగా 2014 జూలైలో హాలీవుడ్ నటి ఎమ్మా వాట్సన్ యూఎన్ విమెన్ గుడ్ విల్ అంబాసిడర్గా నియమితులయ్యారు. ఆమె ఆధ్వర్యంలోనే ఐక్యరాజ్యసమితి 'హి ఫర్ షి' ప్రచార కార్యక్రమానికి ఐక్యరాజ్యసమితి శ్రీకారం చుట్టింది. Two honors in 24hrs. To be invited for an exclusive birthday Party by my hero Robert De Niro & Champion Gender Equality by @UN_Women.:) — Anupam Kher (@AnupamPkher) August 19, 2015 Thank you @UN_Women again 4 honoring me at @UN headquarters NY. Will work tirelessly for Gender Equality.:)@HeforShe pic.twitter.com/WwgNi31B5L — Anupam Kher (@AnupamPkher) August 19, 2015 -
'కిరణ్ బేడీ ఢిల్లీ సీఎం అవుతారు'
జైపూర్: కిరణ్ బేడీ ముఖ్యమంత్రి అవుతారని బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ విశ్వాసం వ్యక్తం చేశారు. ఈనెల 7న జరగనున్న ఢిల్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత కిరణ్ బేడీ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడే అవకాశముందని అన్నారు. గోచ్చాలో జైపూర్ ఇంటర్నేషనల్ ఫిలిమ్ ఫెస్టివల్ ను ఆదివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... కేంద్రంలో నరేంద్ర మోదీ పాలన చాలా బాగుందని కితాబిచ్చారు. మోదీ లాంటి ప్రధాని ఉండడం మన అదృష్టమన్నారు. గుర్మీత్ రామ్ రహీం సింగ్ వివాదస్పద సినిమా 'మెసేంజర్ ఆఫ్ గాడ్' గురించి మాట్లాడేందుకు అనుపమ్ ఖేర్ నిరాకరించారు. -
ఎంతో బాగా ఆడాలి
తాజా చిత్రం ‘ఎక్కీస్ తోపో కీ సలాం’పై అప్పుడే ప్రశంసల జల్లులు కురుస్తుండడంతో బాలీవుడ్ నటుడు అనుపమ్ఖేర్ ఆనందానికి అంతేలేకుండాపోయింది. ఈ సినిమా ఎంతో బాగా ఆడాలని అనుపమ్ అభిలషిస్తున్నాడు. ఈ సినిమా విజయవంతమైతే ఇటువంటి సినిమాలు మున్ముందు మరిన్ని వస్తాయన్నాడు. ‘ఈ సినిమా బాగా ఆడితే మున్ముందు ఇటువంటి సినిమాలు తీసేందుకు నిర్మాతలు ముందుకొస్తారు. వారికి మరింత ధైర్యం వస్తుంది’అని అన్నాడు. ఈ సినిమాపై విమర్శకులు సైతం సదభిప్రాయాన్ని వెలిబుచ్చారు. రివ్యూలు ఎంతో బాగుంటున్నాయి. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా హిట్గా నిలవాలి. ఈ సినిమాని అంతా థియేటర్లలోనే చూడాలి’అని అన్నాడు. ఈ సినిమాలో అనుపమ్ తండ్రి పాత్ర పోషించాడు. ఇద్దరు కొడుకులు ఉంటారు. అయితే వివిధ అంశాలపై వారి మధ్య ఏకాభిప్రాయం ఉండదు. ఈ సినిమాకు వర్ధమాన దర్శకుడు రవీంద్ర దర్శకత్వం వహించాడు. రవీంద్ర దర్శకత్వం వహించిన తొలి సినిమా ఇదే. ఈ సినిమాలో అనుపమ్తోపాటు నేహా ధూపియా, సుప్రియాకుమారి, మను రిషి, దివ్యేందు శర్మ, అతిథి శర్మ, ఉత్తర బావ్కర్ తదితరులు నటించారు. సామాన్యుడిని పణంగాపెట్టి రాజకీయనాయకులు అవినీతికి పాల్పడడం ఈ సినిమాలో కనిపిస్తుంది. అవినీతి అందరి నరనరాల్లో పాతుకుపోయిందనేది ఈ సినిమా సారాంశం. ఈ సినిమాలో జాతిపిత మహాత్మాగాంధీ బోధనలు కొంతమేర కనిపిస్తాయి. ‘సారాంశ్’ సినిమా మాదిరిగానే ఈ సినిమాలో అనుపమ్ ఖేర్ పాత్ర అత్యంత విలక్షణమైనది. తన తండ్రి చివరికోరికను కొడుకు తీర్చడం ఈ సినిమాలో కనిపిస్తుంది. నేహా ధూపియా పాత్ర ప్రేక్షకులను ఆకట్టుకునే రీతిలో తీర్చిదిద్దారు. -
150 దేశాల్లో 600 థియేటర్లలో 'జన గణ మన'!
కోల్ కతా: పాప్ సాంగ్స్, హిప్పీ, వెస్ట్రన్ సంగీతం మోజులో పడిన పిల్లలకు, యువతకు జాతీయ గీతంపై అవగాహన కల్పించేందుకు సుమారు 70 మంది ప్రముఖ వ్యక్తులతో జాతీయ గీతం 'జన గణ మన'ను కొత్త వీడియోగా చిత్రీకరించారు. రాజీవ్ వాలియా దర్శకత్వం వహించిన కొత్త వీడియోను 150 దేశాలల్లో 600 థియేటర్లలో ప్రదర్శించారు. జాతీయ గీతాన్ని రూపొందించడానికి ఎనిమిది నెలలు పట్టిందని రాజీవ్ వాలియా తెలిపారు. ఈ వీడియోకు స్వరూప్ భల్వంకర్ సంగీతాన్ని సమకూర్చగా, బాల గాయని సంచితి సాకత్ పాడారని వాలియా మీడియాకు వివరాలందించారు. ఈ వీడియోలో బాలీవుడ్ తారలు శిల్పాశెట్టి, వివేక్ ఓబెరాయ్, తుషార్ కపూర్, అనుపమ్ ఖేర్, ఇషా కొప్పికర్, మల్లికా షరావత్, జానీ లీవర్ లు, మెజీషియన్ పీసీ సర్కార్, నృత్యాకారిణీలు సుజాతా మహాపాత్ర, క్రికెటర్లు ఇర్ఫాన్, యూసఫ్ పఠాన్, కుస్తీ ఆటగాడు సంగ్రామ్ సింగ్, బాలీవుడ్ గాయకులు అల్కా యాగ్నినిక్, అను మాలిక్, జావెద్ ఆలీ, మోహిత్ చౌహాన్, ఉదిత్ నారాయణ్ లు, ఇంకా పూనమ్ థిల్లాన్, పద్మిని కొల్హాపూరి లు కూడా ఉన్నారు. తాజ్ మహల్, కోణార్క్ టెంపుల్, బాంద్రా, ఇండియా గేట్, ఎర్రకోట, తదితర ప్రాంతాల్లో 1500 మంది పిల్లలపై చిత్రీకరించారు. -
మేమంతా వెళ్తున్నాం.. మీరో!
దేశ 15వ ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరయ్యేందుకు బాలీవుడ్ తారలు ఉత్సుకతతో తరలి వెళ్తున్నారు. ఈ సందర్భంగా తమ తమ భావాలను వాళ్లు ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. హేమమాలిని, అనుపమ్ ఖేర్, మధుర్ భండార్కర్, వివేక్ ఒబెరాయ్.. ఇలా అనేకమంది ఢిల్లీ బయల్దేరి వెళ్లారు. దారిలోనే వాళ్లు ట్విట్టర్ ద్వారా తమ భావాలు పంచుకున్నారు. ఎవరేమన్నారో ఓసారి చూస్తారా.. Good afternoon! Going to Delhi now to participate in the celebrations! May not be able to talk to u thro the day! Its going to be a busy day — Hema Malini (@dreamgirlhema) May 26, 2014 On my way to Delhi. Looking forward to the beginning of a new era. Jai Ho.:) #SwearingInceremony — Anupam Kher (@AnupamPkher) May 26, 2014 Delhi beckons! Feel privileged, honoured & proud that I'll be able to witness in person the historic moment of swearing-in of Modiji today. — Madhur Bhandarkar (@mbhandarkar268) May 26, 2014 On my way to delhi! Atmosphere even in the aircraft is electric! Everyone is buzzing about the swearing in! #NaMoPm — Vivek Oberoi (@vivek_oberoi) May 26, 2014 -
మోడీని ప్రశంసలతో ముంచెత్తిన అనుపమ్ ఖేర్!
న్యూఢిల్లీ: లోకసభ లో బీజేపీ నాయకుడు నరేంద్రమోడీపై బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ ప్రశంసలతో ముంచెత్తారు. మోడీ గొప్ప దేశభక్తుడు, గొప్ప నాయకుడు అని అనుపమ్ ఖేర్ కితాబిచ్చారు. గుజరాత్ భవన్ లో మోడిని కలుసుకున్నట్టు ఖేర్ ట్విటర్ లో ఫోటోను, వివరాలను పోస్ట్ చేశారు. కాబోయే ప్రధాని నరేంద్రమోడీని కలుసుకోవడం గొప్ప అనుభూతినిచ్చింది. మోడీ దేశభక్తి, పోరాట పటిమ జైహో అంటూ ట్వీట్ చేశారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో చంఢీఘడ్ లోకసభ స్థానం నుంచి అనుపమ్ ఖేర్ సతీమణి కిరణ్ ఖేర్ బీజేపీ తరపున ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. -
రాజకీయాల్లోనే ఉంటా
ముంబై: ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) తరఫున చండీగఢ్ నియోజకవర్గం నుంచి లోక్సభ ఎన్నికల బరిలోకి దిగి పరాజయం పాలైనప్పటికీ బాలీవుడ్ నటి గుల్పనాగ్ ఎంతమాత్రం డీలాపడిపోలేదు. ఆప్ నేత అర్వింద్తో మున్ముందు కూడా కలసి పనిచేస్తానంది. దాదాపుగా రాజకీయాల్లోనే కొనసాగుతానంటూ అనుపమ్ ఖేర్ సతీమణి కిరణ్ఖేర్తో తలపడి పరాజయం పాలైన గుల్పనాగ్ తన మదిలో మాట బయటపెట్టింది. కేవలం ఈ ఎన్నికల కోసమే ఇక్కడికి రాలేదని, సుదీర్ఘ కాలం కొనసాగుతానని అంది. ప్రజలు ఇచ్చిన తీర్పును శిరసావహిస్తానంది. ‘చండీగఢ్వాసులు తమ ఓటుహక్కును ప్రశాంతంగా వినియోగించుకున్నారు. బీజేపీకి స్పష్టమైన మెజారిటీ ఇచ్చారు. ఈ తీర్పుతో నేను ఎంతో ప్రశాంతంగా ఉన్నా. నా పట్ల చూపిన అభిమానానికి, నాకు మద్దతుగా నిలిచినందుకు చండీగఢ్వాసులందరికీ ధన్యవాదాలు’ అని అంది. తొలిసారిగా బరిలోకి దిగిన తనకు ఎంతో బాగా సహకరించిందంటూ ఈ మాజీ బ్యూటీ ఆప్ను అభినందించింది. ‘కేంద్ర పాలిత ప్రాంతంలో బరిలోకి దిగడం ఇదే తొలిసారి. నాలుగో వంతు ఓట్లు మాకు వచ్చాయి. అందువల్ల తమ గొంతుకను ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేయడానికి ఎంతమాత్రం వీల్లేదు’ అని చెప్పింది. ‘భవిష్యత్తుపై ఎంతో ఆశతో ఉన్నా. ప్రజలు ఎంతో నమ్మకంతో తీర్పు ఇచ్చినందువల్ల ఎన్డీయే బాధ్యతాయుతంగా వ్యవహరిస్తుందని భావిస్తున్నా’ అని అంది. జాతి నిర్మాణంలో మీతోపాటు మీ పార్టీ పాత్ర ఏమిటని ప్రశ్నించగా ‘చండీగఢ్వాసులకు నిరంతరం సేవలందిస్తా. అవినీతికి వ్యతిరేకంగా పోరాటం విషయంలో కట్టుబడి ఉంటాను’ అని వివరించింది. -
భార్య కోసం షూటింగులన్నీ రద్దు
లోక్సభ ఎన్నికల్లో పోటీచేస్తున్న తన భార్య కిరణ్ ఖేర్ తరఫున ప్రచారం చేయడానికి ప్రముఖ నటుడు అనుపమ్ ఖేర్ మొత్తం షూటింగులన్నింటికీ తాత్కాలికంగా విరామం పలికారు. చండీగఢ్ నుంచి కిరణ్ పోటీచేస్తున్నారు. ఆమెకోసం ఏప్రిల్ నెలలో తనకున్న షూటింగులన్నింటినీ అనుపమ్ ఖేర్ రద్దుచేసుకున్నారు. ఈనెల ఆరంభంలో కిరణ్ తన నామినేషన్ పత్రాలు దాఖలు చేసినప్పుడు ఆమె వెంట అనుపమ్ ఖేర్ కూడా ఉన్నారు. కిరణ్ ఖేర్కు చండీగఢ్లో పరిస్థితి చాలా బాగుందని, ఆమెకు సాయం చేయడానికి అద్భుతమైన మౌలిక సదుపాయాలు ఉన్నాయని అనుపమ్ చెప్పారు. ఆమెకు కొంతకాలం పాటు సాయం ఉంటానని, ఇదంతా తన సంతృప్తి కోసమే తప్ప ఆమెకు నిజానికి తన అవసరం ప్రస్తుతానికి లేదని తెలిపారు. కిరణ్ వయస్సు గురించి ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థిని గుల్ పనగ్ చేసిన వ్యాఖ్యలపై అనుపమ్ మండిపడ్డారు. రాజకీయాల్లో ఒత్తిడి తట్టుకోడానికి కిరణ్ వయసు సహకరించదని చెప్పేవాళ్లు ఆమె ప్రచార ఉధృతిని చూడాలని అన్నారు. ''మా తాతగారు ఒకటే చెప్పేవారు. అప్పటికే తడిసి ఉన్నప్పుడు మళ్లీ వర్షం గురించి భయపడటం అనవసరమన్నారు. కిరణ్, నేను ఇద్దరమూ యోధులమే. దేనికీ భయపడేది లేదు" అని ఆయన చెప్పారు. -
భార్య గెలుపు కోసం శ్రమిస్తున్న బాలీవుడ్ నటుడు!
చండీఘడ్ లోకసభ స్థానంలో బాలీవుడ్ తార కిరణ్ ఖేర్ కు గెలుపు సులభం కాదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. బీజేపీ అభ్యర్థిగా కిరణ్ ఖేర్ కు చండీఘడ్ టికెట్ కేటాయించడాన్ని స్థానిక నేతల తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అయితే మాజీ ఎంపీ హర్ మోహన్ ధావన్ మొదటి నుంచి టికెట్ రేసులో ముందంజలో ఉన్నారు. అయితే పార్టీ అధిష్టాన్ని ప్రభావం చేసుకుని టికెట్ సాధించడంలో కిరణ్ ఖేర్ బలమైన పావుల్ని కదిపి సఫలమయ్యారు. అయితే లోకసభ ఎన్నికల్లో ఇతర పార్టీల కంటే స్థానికంగా బీజేపీ నేతలే ఖేర్ కు ప్రమాదకరంగా మారినట్టు పలు పార్టీల నేతలు గుసగుసలాడుతున్నారు. కాని బీజేపీ పార్టీ శ్రేణుల్లో విశ్వాసం నింపడానికి ఖేర్ దంపతులు శ్రమిస్తున్నారు. పార్టీలో ఎలాంటి విభేదాలు లేవు. ప్రతి పార్టీలో, కుటుంబంలో విభేదాలు సహజమే. ఎలాంటి విభేదాలున్నా సులభంగా పరిష్కరించుకుంటాం అని కిరణ్ భర్త, బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ అన్నారు. అయితే శుక్రవారం జరిగిన కిరణ్ ఖేర్ నామినేషన్ కార్యక్రమానికి ధావన్ గైర్హాజరు కావడం అనేక సందేహాల్ని రేకెత్తిస్తోంది. ఏది ఏమైనా కిరణ్ ఖేర్ కు స్వంత పార్టీ నేతలు ధావన్, సత్యపాల్ జైన్ ల నుంచి సహాయ నిరాకరణ ఎదురువుతోంది. చంఢీఘడ్ బరిలో కిరణ్ ఖేర్ కు ఆమ్ ఆద్మీ పార్టీ తరపు నుంచి మరో బాలీవుడ్ నటి గుల్ పనాగ్, మాజీ కేంద్రమంత్రి పవన్ కుమార్ భన్సాల్ గట్టి పోటి ఇవ్వనున్నారు. -
నటించడం కంటే బోధించడమే ఇష్టం: అనుపమ్ ఖేర్
ముంబై: అనుపమ్ ఖేర్.. బాలీవుడ్ అభిమానులకు సుపరిచితమైన విలక్షణ నటుడు. ప్రతిభావంతుడైన నటుడిగా తనదైన ముద్ర వేశారు ఖేర్. అయితే నటించడం కంటే పాఠాలు చెప్పడాన్ని ఎక్కువగా ఆస్వాదిస్తానని ఆయన చెబుతున్నారు. శుక్రవారం 60వ అడుగుపెట్టిన అనుపమ్ ఖేర్ తను అనుభవాలను వెల్లడించారు. 'నటించడం కంటే పాఠాలు చెప్పడాన్నే అమితంగా ప్రేమిస్తాను. ఇతరుల నుంచి తీసుకోవడం కంటే ఇవ్వడం గొప్పది. నటన చేర్చుకోవడానికి ప్రత్యేకించి పాఠ్యప్రణాళిక అంటూ ఉండదు. యువతరం నుంచి నేను ఎన్నో విషయాలు నేర్చుకున్నా' అని అనుపమ్ ఖేర్ అన్నారు. మూడు దశాబ్దాలుగా బాలీవుడ్లో విభిన్న పాత్రలు పోషిస్తున్నారు. -
ఆప్ తరఫున పోటీ చేయను
న్యూఢిల్లీ: తాను రాజకీయాల్లోకి చేరుతున్నానంటూ వచ్చిన వార్తలను బాలీవుడ్ నటుడు అనుపమ్ఖేర్ కొట్టిపారేశారు. సినిమా రంగంలో తాను సంతృప్తిగానే ఉన్నానని, అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) తరఫున బరిలోకి దిగబోనని ఆయన గురువారం ట్విటర్లో స్పష్టం చేశారు. ఆప్ తరఫున బరిలోకి దిగుతారా అంటూ ఓ నిర్మాత తన ను అడిగాడని, అలా చేస్తే ఆయన సినిమా షూటిం గ్ మాటేమిటని అనుపమ్ ప్రశ్నించారు. సినిమా ప్రపంచంలో ఉండడం తనకు ఎంతో ఆనందం కలి గిస్తోందన్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గళం విప్పడం అవసరమే అయినప్పటికీ దాని కోసం రాజకీయ వేదిక అవసరమేమీ లేదన్నారు. -
'రాజకీయాల్లో చేరను.. ఎన్నికల్లో పోటీ చేయను'
రాజకీయాల్లో చేరబోతున్నారంటూ మీడియాలో వస్తున్న వార్తల్లో వాస్తవం లేదు అని బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ అన్నారు. అరవింద్ కేజ్రివాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ తరపున ఎన్నికల్లో పోటి చేయనున్నట్టు వచ్చిన వార్తలను ఆయన ఖండించారు. ఎన్నికల్లో పోటీ చేయబొతున్నారంటూ వచ్చిన వార్తలతో తన నిర్మాత ఆందోళన చెందారని అనుపమ్ ఖేర్ తెలిపారు. దాంతో తాను రాజకీయాల్లోకి వెళ్లడం లేదని నిర్మాతకు సర్ధిచెప్పాల్సి వచ్చిందన్నారు. తాను రాజకీయాల్లో చేరడం లేదని సోషల్ మీడియా వెబ్ సైట్ ట్విటర్ లో ఓ సందేశాన్ని పోస్ట్ చేశారు. ఇలాంటి వార్తలన్ని ఎవరు ప్రచారం చేస్తున్నారో అర్ధం కావడం లేదు అని ఆయన అన్నారు. ప్రజ సమస్యలపై అవసరమైతే స్పందిస్తాను కాని.. రాజకీయాల్లో చేరే ఆసక్తి తనకు లేదని.. చిత్ర పరిశ్రమలో తాను సంతోషంగా ఉన్నాను అని ఆయన తెలిపారు. -
ఢిల్లీ ప్రజలారా ఓటు వేయండి: బాలీవుడ్ ప్రముఖుల విజ్క్షప్తి
రాజ్యాంగపరంగా సక్రమించిన ఓటు హక్కును వినియోగించుకోవాలని ఢిల్లీ ఓటర్లకు బాలీవుడ్ తారలు నేహా దూపియా, అదితిరావు, దియా మిర్జాలు సోషల్ మీడియా వెబ్ సైట్ ట్విటర్ లో దియా మిర్జాలు విజ్క్షప్తి చేశారు. ఢిల్లీ ఎన్నికల్లో మధ్యాహ్నం మూడు గంటల వరకు 48 శాతం పోలింగ్ నమోదైంది. అనుపమ్ ఖేర్ ఓటు అనేది ఓ భద్రత. ఎవరికైనా ఓటు వేయండి. కాని ఓటు వేయకుండా ఉండకండి. మీ భవిష్యత్తును నిర్ణయించుకోవడానికి ఓ చక్కటి అవకాశం. వెళ్లి ఓటేయండి. Vote for any person/party that gives you a sense of security. It is your one chance to make a difference to your own future. Go & Vote.:) — Anupam Kher (@AnupamPkher) December 4, 2013 Exercise your right to vote today Delhi! It's the only way to have your concerns represented in government and for your voice to be heard. — soha ali khan (@sakpataudi) December 3, 2013 సోహా ఆలీ ఖాన్ ఢిల్లీ ప్రజల్లారా ఓటు వినియోగించుకోండి. ఓ వాయిస్ ను వినిపించడానికి, మీకు కావాల్సిన ప్రభుత్వాన్ని ఎన్నుకోవడానికి ఓటేయ్యడమే సరియైన మార్గం. నేహ దూపియా మంచైనా.. చెడైనా.. మీ నేతకు మీరే బాధ్యత వహించాలి. ఓటు వేసిన తర్వాత ఇంక్ తో కూడిన వేలిని గుర్తును ట్విటర్ లో పెట్టండి. ఆమ్ ఆద్మీ పార్టీకి ఓటు వేయండి అంటూ ట్వీట్ చేశారు. అదితిరావు ఈ రోజు మీ రోజు. ఢిల్లీ ప్రజల్లారా ఓటు వేయడానికి వెళ్లండి. మీ దేశం. మీ నగరం కోసం ఓటు వేయండి చేతన్ భగత్ మీ బాస్ ఎవరో చూపండి. హ్యపీగా ఓటు వేసిరండి దియా మీర్జా అతి ముఖ్యమైన హక్కును సక్రమంగా వినియోగించండి. ఓటు వేయండి. కోయిల్ పూరీ మీరు ఓటు వేశారా? నేను నా ఓటును సీక్రెట్ గా వేశాను. 15 సంవత్సరాలుగా పాలిస్తున్న షీలా నానీ(నానమ్మ) రిటైర్ కావాల్సిందే. ఆమ్ ఆద్మీ పార్టీకి ఓటు వేయండి అని ట్వీట్ చేశారు. కునాల్ కోహ్లీ ప్రతి ఒక్కరు తప్పక ఓటు వేయాలి. వెళ్లండి.. త్వరపడండి. గుల్ పనాగ్ ఢిల్లీ ప్రజల్లారా ఓటు వేయడానికి కదలండి. రాష్ట్ర జరిగే సంఘటనలు తర్వాత నిందించకుండా సరియైన వ్యక్తికి ఓటు వేయండి