Arya
-
ఆర్య హీరోగా వస్తోన్న స్పై థ్రిల్లర్.. తెలుగు టీజర్ వచ్చేసింది!
కోలీవుడ్ స్టార్ ఆర్య హీరోగా నటించిన తాజా చిత్రం 'మిస్టర్ ఎక్స్'. ఈ చిత్రానికి మను ఆనంద్ దర్శకత్వం వహించారు. గూఢచారుల నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించారు. తాజాగా ఈ మూవీ తెలుగు టీజర్ను మేకర్స్ విడుదల చేశారు. ఇప్పటికే తమిళ టీజర్ను విడుదల చేసిన సంగతి తెలిసిందే.భారతీయ గూఢచర్య వీరుల జీవితాల ఆధారంగా ఈ కథను తెరకెక్కించినట్లు టీజర్ చూస్తే అర్థమవుతోంది. దేశాన్ని కాపాడటం మన పని మాత్రమే కాదు.. అది మన బాధ్యత.. అంటూ అనే డైలాగ్తో టీజర్ ప్రారంభమైంది. శత్రువుల నుంచి మనదేశాన్ని కాపాడే నేపథ్యంలో ఈ కథను రూపొందించారు. ప్రధానంగా ఓ న్యూక్లియర్ డివైజ్ చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతుందని టీజర్లోనే తెలుస్తోంది. కాగా.. ఈ స్పై థ్రిల్లర్ సినిమాను వినీత్ జైన్, ఎస్ లక్ష్మణ్ కుమార్ నిర్మించారు. ఈ చిత్రంలో గౌతమ్ రామ్ కార్తీక్, శరత్ కుమార్, మంజు వారియర్, అనఘా, రైజా విల్సన్, అతుల్య రవి, జయప్రకాష్, కాళి వెంకట్ కీలక పాత్రల్లో నటించారు. -
1965 నందాదేవి స్పై మిషన్పై సినిమా.. టీజర్ విడుదల
కోలీవుడ్లో గతేడాదిలో విడుదలైన లబ్బర్ బంతు సినిమా భారీ విజయం అందుకుంది. ఈ చిత్రం తెలుగు వర్షన్ హాట్స్టార్లో విడుదయ అయిన తర్వాత ఇక్కడ కూడా మంచి ఆదరణ దక్కించుకుంది. అలాంటి విజయవంతమైన చిత్రం తర్వాత ప్రిన్స్ పిక్చర్స్ అధినేత ఎస్. లక్ష్మణన్ కుమార్, ఎ. వెంకటేష్తో కలిసి నిర్మిస్తున్న తాజా భారీ యాక్షన్ ఎంటర్టైనర్ కథా చిత్రం 'మిస్టర్ ఎక్స్'.. తాజాగా ఈ మూవీ నుంచి టీజర్ విడుదలైంది. కోలీవుడ్లో ఎఫ్ఐఆర్ చిత్రంతో భారీ హిట్ అందుకున్న ఫ్రేమ్ మను ఆనంద్ ఈ మూవీకి దర్శకత్వం అందిస్తున్నారు. 'మిస్టర్ ఎక్స్' చిత్రంలో ఆర్య కథానాయకుడుగానూ, గౌతమ్ కార్తీక్, శరత్ కుమార్ ,నటి మంజు వారియర్, అనకా, అతుల్య రవి, రైసా విల్సన్, ఖాళీ వెంకట్ తదితరులు ముఖ్యపాత్రుల్లోనూ నటిస్తున్నారు. టీజర్ విడుదల తర్వాత నటుడు ఆర్య మాట్లాడుతూ ఇందులో నటించడానికి తనకు సిఫార్సు చేసింది నిర్మాత ఎస్ లక్ష్మణన్ కుమార్ అని చెప్పారు. దర్శకుడు మను ఆనంద్ కథ చెప్పగానే ఇందుకు చాలా భారీ బడ్జెట్ అవుతుంది కదా అని నిర్మాతలతో చెప్పగా ప్రేక్షకులకు ఆశ్చర్యకరమైన అనుభవాన్ని ఇవ్వాలంటే రాజీ పడకుండా ఈ చిత్రాన్ని నిర్మించాల్సిందే అని చెప్పారన్నారు. నటుడు గౌతమ్ కార్తీక్ మాట్లాడుతూ ఈ చిత్రం తాను ఊహించిన దానికంటే 100 రెట్లు అధికంగా ఉంటుందన్నారు. ఈ చిత్రం కోసం కండలు పెంచి నటించారన్నారు. తనకు తెలిసి ఈయన కోలీవుడ్ హల్క్ అని పేర్కొన్నారు. నిర్మాత ఎస్. లక్ష్మణన్ కుమార్ మాట్లాడుతూ ఇది చాలా కాలం పాటు ప్రణాళికను సిద్ధం చేసి రూపొందిస్తున్న చిత్రమని చెప్పారు. దర్శకుడు మను ఆనంద్ చెప్పిన ఏ విషయం నమ్మశక్యంగా లేదని అయితే ఆయన చెప్పిన నాలుగు విషయాలు మాత్రం ఎంతో నమ్మశక్యం అనిపించాయన్నారు. చైనాను టార్గెట్ చేసేందుకు1965లో భారత సైనికులు చైనాను ఎదుర్కొనడానికి హిమాలయాల్లో ఉన్న నందాదేవి అనే కొండపైకి ఏడు బ్లుటోనియం క్యాప్షల్స్ను తీసుకెళ్తారని అయితే అవి అనుహ్యంగా కనిపించకుండా పోతాయన్నారు. వాటి గురించి ఇప్పటివరకు ఆచూకీ లేదన్నారు. అలాంటి న్యూక్లియర్ క్యాప్సిల్స్ నేపథ్యంలో సాగే కథే మిస్టర్ ఎక్స్ చిత్రం చెప్పారు. తాను దర్శకత్వం వహించిన తొలి చిత్రం ఎఫ్ఐఆర్ లేకుంటే ఈ చిత్రం అవకాశం తనకు వచ్చేది కాదని దర్శకుడు మను ఆనంద్ పేర్కొన్నారు. తెలుగులో కూడా ఈ చిత్రం విడుదల కానుంది.నందాదేవి మిస్టరీ ఇదేచైనా, భారత్ యుద్ధం ముగిసిన తర్వాత చైనా మిలటరీపై ఇండియా నిఘా పెట్టింది. ఈ క్రమంలో అమెరికాతో భారత్ చేతులు కలిపింది. 1965లో అమెరికా, భారత్ సంయుక్తంగా నందాదేవి పర్వతంపై ఒక అణుశక్తి పరికరాన్ని ఏర్పాటు చేయాలని ప్లాన్ చేశాయి. అందుకోసం ట్రాన్స్ రిసీవర్స్తో పాటు అణుశక్తి ఉత్పాదక జనరేటర్, అణు ఇంధనమైన ఫ్లుటోనియంను నందాదేవి కొండపైకి తీసుకెళ్లారు. కానీ, అక్కడి వాతావరణ పరిస్థితులు ఒక్కసారిగా ప్రమాదకరంగా మారడంతో వాటిని అక్కడే వదిలేసి కొండ నుంచి తిరిగొచ్చారు. 1966లో తిరిగి అక్కడికి వెళ్లేసరికి పరికరాలు కనిపించలేదు. అక్కడ పూర్తిగా మంచు కప్పుకొని ఉంది. దీంతో సరైన ప్రదేశం గుర్తించలేక తిరిగొచ్చేశారు. అయితే, 2005లో అనూహ్యంగా ఈ ఫ్లుటోనియం జాడలు కింద ప్రవహిస్తున్న నదుల్లో ఉన్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఫ్లుటోనియం వల్లే మంచు కరిగే ప్రమాదం ఉందని అంచనా వుంది. ఈ మూలకం జీవితకాలం వందేళ్లుగా ఉంది. వచ్చే 40 ఏళ్లలో ఎలాంటి ప్రమాదాలు ఎదురవుతాయోనని శాస్త్రవేత్తలు కూడా ఆందోళన చెందుతున్నారు. దీనిని మరో మానవ తప్పిదంగా వారు చెప్పుకొస్తున్నారు. -
గెట్... సెట్... గో
స్పోర్ట్స్ మూవీస్కి ఆడియన్స్లో స్పెషల్ క్రేజ్ ఉంటుంది. ఈ తరహా సినిమాలు ఏమాత్రం ఆడియన్స్కి కనెక్ట్ అయినా బాక్సాఫీస్ స్కోర్స్ (కలెక్షన్స్) కొత్త రికార్డులు సృష్టిస్తాయి. దీంతో వీలైనప్పుడల్లా స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్ మూవీస్ చేస్తుంటారు యాక్టర్స్. ఇలా ప్రస్తుతం సెట్స్లో ‘గెట్..సెట్..గో’ అంటూ సిల్వర్ స్క్రీన్ కోసం స్పోర్ట్స్ ఆడుతున్న కొందరు హీరోల గురించి తెలుసుకుందాం.పెద్ది... ప్లే స్టార్ట్‘రచ్చ, ఆరెంజ్’... ఇలా కొన్ని సినిమాల్లో రామ్చరణ్ క్రికెట్ ఆడిన సన్నివేశాలు చాలా తక్కువ నిడివిలో కనిపిస్తాయి. కానీ ‘పెద్ది’ సినిమాలో మాత్రం ఫుల్ మ్యాచ్ ఆడనున్నారట రామ్చరణ్. ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్చరణ్ హీరోగా ‘పెద్ది’ (ప్రచారంలో ఉన్న టైటిల్) అనే మూవీ రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ పీరియాడికల్ స్పోర్ట్స్ డ్రామాలో రామ్చరణ్ క్రికెటర్గా నటిస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. ఉత్తరాంధ్ర నేపథ్యంలో సాగే ఈ మూవీ తాజా షూటింగ్ షెడ్యూల్ హైదరాబాద్లో ముగిసింది. చివరి రోజు తన కుమార్తె క్లీంకారని సెట్స్కి తీసుకొచ్చారు రామ్చరణ్.అలాగే ఈ సినిమాలో క్రికెట్తోపాటు కబడ్డీ వంటి ఇతర స్పోర్ట్స్ల ప్రస్తావన కూడా ఉంటుందట. జాన్వీ కపూర్ హీరోయిన్గా చేస్తున్న ఈ మూవీలో దివ్యేందు, జగపతిబాబు, శివరాజ్కుమార్ ఇతర కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఏఆర్ రెహమాన్ ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్, వృద్ధి సినిమాస్ బ్యానర్స్పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ మూవీని ఈ దీపావళికి రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారని తెలిసింది.ఒక మ్యాచ్.... మూడు జీవితాలు!మాధవన్ , నయనతార, సిద్ధార్థ్ లీడ్ రోల్స్లో నటించిన స్పోర్ట్స్ డ్రామా ‘టెస్ట్’. ఈ స్పోర్ట్స్ డ్రామా థ్రిల్లర్కి శశికాంత్ దర్శకత్వం వహించారు. తాజాగా ఈ మూవీ టీజర్ విడుదలైంది. ఈ చిత్రంలో క్రికెటర్గా నటించారు సిద్ధార్థ్. చక్రవర్తి రామచంద్రన్, శశి కాంత్ నిర్మించిన ఈ మూవీ త్వరలోనే డైరెక్ట్గా నెట్ఫ్లిక్స్ ఓటీటీలో రిలీజ్ కానుంది. ఒక టెస్ట్ క్రికెట్ మ్యాచ్ ముగ్గురి జీవితాలను ఏ విధంగా ప్రభావితం చేసింది? అనే కోణంలో ఈ సినిమా కథనం ఉంటుందని కోలీవుడ్ సమాచారం. ఇక 2006లో వచ్చిన హిందీ చిత్రం ‘రంగ్ దే బసంతి’ తర్వాత మళ్లీ 18 సంవత్సరాల అనంతరం మాధవన్ , సిద్ధార్థ్ కలిసి నటించిన చిత్రం ఇదే.జల్లికట్టు నేపథ్యంలో...తమిళనాడు సంప్రదాయ క్రీడ జల్లికట్టు. ఈ క్రీడ నేపథ్యంలో చాలా సినిమాలొచ్చాయి. కాగా సూర్య హీరోగా వెట్రిమారన్ దర్శకత్వంలో ‘వాడి వాసల్’ అనే పీరియాడికల్ యాక్షన్ మూవీ రానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను నాలుగు సంవత్సరాల క్రితమే ప్రకటించారు. కానీ వివిధ కారణాల వల్ల సెట్స్పైకి వెళ్లలేదు. దీంతో ఈ ఏడాది ఈ మూవీని సెట్స్పైకి తీసుకుని వెళ్లాలని సూర్య, వెట్రిమారన్ ప్లాన్ చేశారు. జనవరిలో సూర్య, వెట్రిమారన్, ఈ చిత్రనిర్మాత కలైపులి .ఎస్ థానుల మధ్య ‘వాడి వాసల్’ గురించిన చర్చలు కూడా జరిగాయి. ఇక ఎప్పట్నుంచో ఈ మూవీ ప్రీ ప్రోడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి కాబట్టి, ఈ చిత్రం ఈ ఏడాదే సెట్స్పైకి వెళ్లనున్నట్లుగా తెలుస్తోంది. ‘వాడి వాసల్’ రెండు భాగాలుగా విడుదల కానుందని తెలిసింది.మరోసారి బాక్సింగ్ధనుష్ మెయిన్ లీడ్ రోల్లో నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్న తమిళ చిత్రం ‘ఇడ్లీ కడై’. ఈ మూవీలో అరుణ్ విజయ్ మరో లీడ్ రోల్లో నటిస్తున్నారు. ఈ చిత్రంలో అరుణ్ విజయ్ ఓ బాక్సర్ రోల్ చేస్తున్నారు. కాగా అరుణ్ విజయ్ బాక్సర్గా కనిపించడం ఇదే తొలిసారి కాదు. గతంలో ‘బాక్సర్’ అనే మూవీలో అరుణ్ విజయ్ బాక్సర్గా నటించారు. అయితే ‘బాక్సర్’ కంప్లీట్ స్పోర్ట్స్ ఫిల్మ్ కాగా, ‘ఇడ్లీ కడై’ మాత్రం స్పోర్ట్స్తోపాటు ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా ఉన్న మూవీ. ధనుష్, ఆకాష్ భాస్కరన్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 10న రిలీజ్ కా నుంది. నిత్యామీనన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ మూవీలో షాలినీపాండే, సత్యరాజ్ ఇతర లీడ్ రోల్స్లో నటిస్తున్నారు.కె–ర్యాంప్‘క’ వంటి సక్సెస్ఫుల్ మూవీ తర్వాత కిరణ్ అబ్బవరం హీరోగా నటిస్తున్న చిత్రం ‘కె–ర్యాంప్’. ఈ చిత్రం టైటిల్ లోగోలో ఓ వ్యక్తి ఫుట్బాల్ ఆడుతున్నట్లుగా కనిపిస్తోంది. దీన్ని బట్టి ఇది స్పోర్ట్స్ డ్రామా మూవీ అని ఊహించవచ్చు. జైన్స్ నాని దర్శకత్వంలో రాజేశ్ దండ నిర్మిస్తున్న ఈ మూవీ చిత్రీకరణ త్వరలోనే ప్రారంభం కానుంది. యుక్తీ తరేజా హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో వీకే నరేశ్, ‘వెన్నెల’ కిశోర్ ఇతర ప్రధానపాత్రల్లో నటిస్తున్నారు.రేస్ రాజాహీరో శర్వానంద్ బైక్ రేసింగ్తో బిజీగా ఉన్నారు. శర్వా నంద్ హీరోగా అభిలాష్ కంకర్ డైరెక్షన్లో ‘రేజ్ రాజా’ (ప్రచారంలో ఉన్న టైటిల్) అనే మూవీ రూపొందుతోంది. ఈ చిత్రంలో మోటారు బైకు రేసర్గా శర్వానంద్ నటిస్తున్నారు. 1990 నుంచి 2000ల మధ్య కాలంలో జరిగే ఈ స్పోర్ట్స్ మూవీలో మాళవికా నాయర్ హీరోయిన్గా నటిస్తున్నారు. యూవీ క్రియేషన్స్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది. త్వరలోనే ఈ మూవీని రిలీజ్ చేయాలనుకుంటున్నారు మేకర్స్. ఇదిలా ఉంటే... స్పోర్ట్స్ డ్రామా జానర్లో సినిమాలు చేసిన అనుభవం శర్వానంద్కు ఉంది. ‘మళ్ళీ మళ్లీ ఇది రాని రోజు (2015)’ మూవీలో రన్నింగ్ రేసర్గా, ‘పడి పడి లేచే మనసు (2018)’ మూవీలో ఫుట్బాల్ ప్లేయర్గా శర్వానంద్ నటించి, మెప్పించిన సంగతి తెలిసిందే.బాక్సింగ్ రౌండ్ 2హీరో ఆర్య, దర్శకుడుపా. రంజిత్ కాంబినేషన్లో వచ్చిన పీరియాడికల్ స్పోర్ట్స్ డ్రామా ‘సార్పట్టై పరంబర’. ఈ మూవీ 2021లో డైరెక్ట్గా ఓటీటీలో విడుదలై, వీక్షకుల మెప్పు పొందింది. దీంతో ఈ సినిమాకు సీక్వెల్గా 2023 మార్చిలో ‘సార్పట్టై పరంబర రౌండ్ 2’ అంటూ సీక్వెల్ను ప్రకటించారు. అయితే తొలి భాగం మాదిరి, రెండో భాగాన్ని ఓటీటీలో రిలీజ్ చేయకుండా థియేటర్స్లో రిలీజ్ చేయడానికి ప్రణాళికలు చేస్తున్నారు మేకర్స్. కబడ్డీ... కబడ్డీ..ధృవ్ విక్రమ్ హీరోగా చేస్తున్న మూవీ ‘బైసన్: కాలమాడన్’. మారి సెల్వరాజ్ ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్గా నటిస్తున్నారు. కాగా, ఈ చిత్రంలో ధృవ్ విక్రమ్ కబడ్డీ ప్లేయర్గా నటిస్తున్నారని తెలిసింది. ఆల్రెడీ విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది. అలాగే కబడ్డీ ప్లేయర్గా కెరీర్ను మొదలుపెట్టి, రాజకీయ నాయకుడిగా మారిన మనత్తి పి. గణేశన్ జీవితం ఆధారంగా ‘బైసన్’ మూవీ రూపొందుతోంని కోలీవుడ్ సమాచారం. అ΄్లాజ్ ఎంటర్టైన్మెంట్, నీలంప్రోడక్షన్స్ నిర్మిస్తున్న ఈ మూవీ ఈ ఏడాదే విడుదల కానుంది.- ముసిమి శివాంజనేయులు -
తెలుగులో తొలి సినిమా.. 16 ఏళ్ల పెద్ద హీరోతో పెళ్లి.. ఈమెని గుర్తుపట్టారా?
ఇప్పుడు హీరోయిన్లలో చాలామంది ఇంకా పెళ్లే చేసుకోవట్లేదు. అలాంటిది ఈమె తనకంటే వయసులో 16 ఏళ్లు పెద్దోడు అయిన హీరోని ప్రేమించి పెళ్లి చేసుకుంది. తెలుగులో ఈమె తొలి సినిమా చేసింది. కానీ బ్యాడ్ లక్. ఈ హీరోయిన్ ఫ్యామిలీ కూడా తరతరాలుగా ఇండస్ట్రీలోనే ఉన్నారు. మరి ఇంతలా చెప్పాం కదా ఈమె ఎవరో కనిపెట్టారా? మమ్మల్నే చెప్పేయమంటారా?(ఇదీ చదవండి: పెళ్లికి రెడీ అయిన 46 ఏళ్ల తెలుగు నటుడు)పైన ఫొటోలో కనిపిస్తున్న అమ్మాయి పేరు సాయేషా సైగల్. పాప ఈమె కూతురే. పక్కన నిలబడ్డ పెద్దావిడ పేరు సహిన్ భాను. ఈమె సాయేషా తల్లి. రీసెంట్గా కలిసినప్పుడు ఈ ఫొటోని తీసుకున్నారు. బాలీవుడ్ దిగ్గజ నటులైన దిలీప్ కుమార్, సైరా భానుల మనవరాలే సాయేషా. సినీ కుటుంబం కావడంతో సులభంగానే హీరోయిన్ అయిపోయింది. అక్కినేని అఖిల్ తొలి సినిమా 'అఖిల్'తో హీరోయిన్గా అరంగేట్రం చేసింది. కానీ మూవీ ఫ్లాప్ అయ్యేసరికి తెలుగులో మరో మూవీ చేయలేదు.అదే టైంలో తమిళంలో తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. దాదాపు అరడజనుకి పైగా చిత్రాల్లో నటించింది. అలా చేస్తున్న టైంలో హీరో ఆర్యతో పరిచయం, ఆ తర్వాత అదికాస్త ప్రేమగా మారింది. వయసు చాలా వ్యత్యాసం ఉన్నప్పటికీ పెళ్లి చేసుకున్నారు. వీళ్లకు ఓ పాప కూడా పుట్టింది. ప్రస్తుతం సాయేషా సినిమాలేం చేయట్లేదు. కుటుంబానికే పూర్తి ప్రాధాన్యం ఇస్తోంది. రీసెంట్గా అలా తల్లితో కలిసి తీసుకున్న ఫొటోలే ఇవి.(ఇదీ చదవండి: అల్లు అర్జున్కి క్యూట్ గిఫ్ట్ ఇచ్చిన రష్మిక) -
చిన్న రైతులకు అ‘ధన’పు తోడ్పాటు
చిన్న, సన్నకారు రైతులు పండించిన ధాన్యానికి అనదపు విలువను జోడిస్తూ వ్యవసాయాన్ని మరింత లాభదాయకం చేయడంలో కృషి చేస్తోంది దేశంలోనే అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ గ్రెయిన్ కామర్స్ ప్లాట్ఫామ్ అయిన ‘ఆర్య.ఏజీ’. తాజాగా రిత్ సమ్మిట్ 2.0 పేరుతో 200 రైతు ఉత్పత్తిదారుల సంస్థలను (FPO) మరింత ఆకర్షణీయమైన, లాభదాయక సంస్థలుగా మార్చేందుకు శ్రీకారం చుట్టింది. సాంకేతిక సహకారంతో సాగు సామర్థ్యాన్ని మెరుగుపరుస్తూ, లాభదాయకమైన వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహిస్తూ రైతు ఉత్పత్తిదారుల సంస్థలను బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ చొరవను ప్రారంభించింది.ఈ నేపథ్యంలో రైతులకు ఉత్పత్తుల నిల్వ, మార్కెట్తో పాటు రుణ సౌకర్యం కల్పిస్తున్న ఆర్య.ఏజీ సంస్థ ఎలా ఏర్పాటైంది.. రైతులకు ఎలాంటి సేవలు అందిస్తోంది.. టెక్నాలజీ పరంగా పెరిగిన సౌలభ్యాలు.. తదితర అంశాలపై సాక్షి బిజినెస్ వెబ్ డెస్క్ ఆర్య.ఏజీ మేనేజింగ్ డైరెక్టర్ చట్టనాథన్ దేవరాజన్తో ప్రత్యేక ఇంటర్వ్యూ చేసింది. ఈ సందర్భంగా వారు వెల్లడించిన పలు ఆసక్తికర విషయాలను ఇక్కడ మీ కోసం అందిస్తున్నాం.సాక్షి: ఆర్య.ఏజీ ఎలా ఏర్పాటైంది?నాథన్: నేను, ప్రసన్నరావు, ఆనంద్ చంద్ర అనే మరో ఇద్దరితో కలిసి ఆర్య.ఏజీని ప్రారంభించాం. మొదట నష్టాల్లో ఉన్న ఆర్య కొలేటరల్స్ అనే సంస్థను కొనుగోలు చేశాం. తర్వాత దీన్ని ఆర్య.ఏజీ పేరుతో దేశంలోనే అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ గ్రెయిన్ కామర్స్ ప్లాట్ఫామ్గా తీర్చిదిద్దాం.సాక్షి: ఆర్య.ఏజీ ఎలా పని చేస్తుంది?నాథన్: మా సంస్థ ప్రధానంగా మూడు విభాగాలుగా పనిచేస్తుంది. ఆర్య.ఏజీ కింద ఆర్య కొలేటరల్ వేర్హౌసింగ్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్, ఆర్యధన్ ఫైనాన్షియల్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఆర్యటెక్ ప్లాట్ఫారమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ విభాగాలు ఉన్నాయి. ఈ మూడింటినీ సమ్మిళితం చేసి రైతులకు సేవలు అందిస్తున్నాం.సాక్షి: రైతులకు ఎలాంటి సేవలు అందిస్తున్నారు?నాథన్: దేశంలో అత్యధికమంది చిన్న, సన్నకారు రైతులే. వీరికి ప్రధాన సమస్య దిగుబడిని నిల్వ చేయడం. ప్రధానంగా ఈ సమస్యను పరిష్కరించడం కోసం వేర్హౌస్లను నిర్వహిస్తున్నాం. దీంతో పాటు వారికి దిగుబడులకు మార్కెటింగ్ కల్పిస్తున్నాం. ఈలోపు అవసరమున్న రైతులకు దిగుబడులపై రుణ సదుపాయం కూడా కల్పిస్తున్నాం.సాక్షి: ఎలాంటి దిగుబడులకు స్టోరేజ్ కల్పిస్తున్నారు.. సామర్థ్యం ఎంత?నాథన్: మాది ప్రధానంగా గ్రెయిన్ కామర్స్ ప్లాట్ఫామ్. అంటే అన్ని రకాల ధాన్యం దిగుబడులకు స్టోరేజ్, మార్కెటింగ్, ఫైనాన్స్ సౌకర్యం కల్పిస్తున్నాం. సీజన్ను బట్టి దేశవ్యాప్తంగా 3000 వేర్హౌస్లను నిర్వహిస్తున్నాం. 30 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడులకు స్టోరేజ్ సదుపాయం కల్పిస్తున్నాం.సాక్షి: ఎక్కడెక్కడ మీ కార్యకలాపాలు ఉన్నాయి?నాథన్: కొన్ని ఈశాన్య రాష్ట్రాలు మినహా దేశంలోని అన్ని రాష్ట్రాల్లో మా కార్యకలాపాలు నిర్వహిస్తున్నాం. స్థానిక సంస్థలు, ప్రభుత్వాల సహకారంతో రైతులకు సేవలు అందిస్తున్నాం. -
హీరో సతీమణి రీఎంట్రీ.. వైరల్ అవుతున్న డ్యాన్స్ వీడియో
‘అఖిల్’ సినిమాతో వెండితెరకు పరిచయమైన సాయేషా సైగల్ బాలీవుడ్ నటదిగ్గజం దిలీప్కుమార్ ముద్దుల మనవరాలు. అజయ్దేవగణ్తో కలిసి నటించిన ‘శివాయ్’ ఆమెకు మంచి గుర్తింపు తీసుకువచ్చింది. అయితే, వివాహం తర్వాత కాస్త సినిమాలకు బ్రేక్ ఇచ్చిన ఈ బ్యూటీ మళ్లీ వెండితెరపై మెరిసేందుకు ప్లాన్ చేస్తుంది. ఈ క్రమంలో సోషల్ మీడియాలో ఆమె పంచుకుంటున్న ఫోటోలు, వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి.సాయేషా సినిమాలకు దూరంగా ఉన్నా, సోషల్మీడియా వల్ల ప్రేక్షకులకు దగ్గరగానే ఉంటుంది. తమిళంలో జయంరవికి జంటగా వనమగన్ చిత్రంతో ఎంట్రీ ఇచ్చి అక్కడ కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ చిత్రం తర్వాత ఈ బ్యూటీకి మాత్రం వరుసగా అవకాశాలు వచ్చాయి. అలా కార్తీ, విజయ్సేతుపతి, సూర్య, ఆర్యతో పలు చిత్రాల్లో నటించింది. ఈ క్రమంలో నటుడు ఆర్యతో పరిచయం ప్రేమగా మారడంతో ఇరు కుటుంబాల సమ్మతితో పెళ్లి చేసుకున్నారు. వీరికి ఒక అందమైన బేబీ కూడా పుట్టింది. దీంతో సాయేషా నటనకు దూరం అయింది. నటనకు దూరమైనా ఈమె సామాజిక మాధ్యమాల ద్వారా అభిమానులతో టచ్లోనే ఉంటుంది. తరచూ వారితో ముచ్చటించడం, తన ఫొటోలను పొందుపరచడం వంటివి చేస్తుంది. ఇకపోతే సాయేషాలో మంచి డాన్సర్ ఉన్నారనే విషయం తెలిసిందే. అదేవిధంగా మళ్లీ నటిగా రీఎంట్రీకి ఆసక్తి చూపుతుంది. దీంతో త్వరలోనే తన భర్త ఆర్యతో కలసి ఒక చిత్రంలో నటించడానికి సిద్ధం అవుతున్నట్లు తాజా సమాచారం. ఇలాంటి పరిస్థితుల్లో సాయేషా ఒక వీడియోను తన ఇన్స్ట్రాగామ్లో విడుదల చేసింది. అందులో ఆమె గురు చిత్రంలోని మైయా మైయా అనే పాటకు సూపర్గా స్టెప్స్ వేసింది. ఈ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో సాయేషా డాన్స్ను పలువురు ప్రశంసిస్తున్నారు. View this post on Instagram A post shared by Sayyeshaa (@sayyeshaa) -
ప్రెగ్నెన్సీ ప్రకటించిన టాలీవుడ్ హీరోయిన్.. పోస్ట్ వైరల్!
ప్రముఖ నటి శ్రద్ధా ఆర్య అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. ప్రస్తుతం తాను గర్భంతో ఉన్నట్లు సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. 2021లో నావీ అధికారి రాహుల్ నాగల్ను ఈ బాలీవుడ్ భామ పెళ్లి చేసుకుంది. తొలిసారి గర్భం ధరించిన విషయాన్ని తెలియజేస్తూ తన ఇన్స్టాగ్రామ్లో ఓ వీడియోను షేర్ చేసింది. ఇది తెలుసుకున్న బాలీవుడ్ తారలు, అభిమానులు ఈ జంటకు అభినందనలు చెబుతున్నారు. సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ పెడుతున్నారు.కాగా.. ఢిల్లీకి చెందిన శ్రద్ధా ఆర్య 2006లో కల్వనిన్ కదాలి అనే తమిళ సినిమాలో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత బాలీవుడ్ మూవీ నిశ్శబ్ద్ చిత్రంలో నటించింది. తెలుగులో 2007లో కోదండ రామిరెడ్డి దర్శకత్వం వహించిన గొడవ అనే సినిమాతో అరంగేట్రం చేసింది. ఆ తర్వాత రోమియో, కోతిమూక లాంటి టాలీవుడ్ సినిమాల్లో కనిపించింది. తెలుగుతో పాటు కన్నడ, పంజాబీ చిత్రాల్లోనూ నటించింది. బాలీవుడ్లో చివరిసారిగా రాకీ ఔర్ రాణి కీ ప్రేమ్ కహానీ మూవీలో మెరిసింది. అంతేకాకుండా హిందీలో పలు సీరియల్స్తో శ్రద్ధా ఆర్య గుర్తింపు తెచ్చుకుంది. View this post on Instagram A post shared by Shraddha Arya (@sarya12) -
Abhinayashree Photos: 'అ అంటే అమలాపురం' పాటతో అదరగొట్టిన బ్యూటీ.. ఇప్పటికీ అలానే! (ఫోటోలు)
-
ఆ మాట అనగానే నాకు కోపం వచ్చేసింది: అల్లు అర్జున్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, అను మెహతా, శివబాలాజీ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ఆర్య. సుకుమార్ డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. మే 7, 2004లో థియేటర్లలో సందడి చేసిన ఈ చిత్రం రిలీజై ఇప్పటికీ 20 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్బంగా చిత్రయూనిట్ 20 ఏళ్ల సెలబ్రేషన్స్ నిర్వహించారు. ఈ వేడుకలో సుకుమార్, అల్లు అరవింద్, దిల్రాజు లాంటి ప్రముఖులంతా హాజరయ్యారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఆర్య రిలీజ్ తర్వాత ఆ విషయంలో తనకు కోపం వచ్చిందని తెలిపారు.అల్లు అర్జున్ మాట్లాడుతూ..'సినిమా రిలీజయ్యాక ఆ రోజుల్లో 70 డేస్ కాదు.. 100 డేస్ ఆడితేనే సక్సెస్. రిలీజ్ రోజు నేను, సుకుమార్ థియేటర్కు వెళ్లి చూస్తే అప్పటికీ 40 శాతమే ఉంది. థియేటర్స్ మెల్ల మెల్లగా ఫిల్ అవుతున్నాయి. మాకైతే ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంది. తీరా ఆ రోజు రిపోర్ట్ చూస్తే మాత్రం 10 వీక్స్ మాత్రమే అన్నారు. అప్పుడు నాకు ఏంటి ఇది 100 డేస్ సినిమా కాదా? అనిపించింది. కానీ నాకు మాత్రం ఆ ఫీలింగ్ లేదు.. సాయంత్రం కల్లా ఫుల్ అవుతుంది అన్నా. కచ్చితంగా రైజ్ అవుద్ది అని చెప్పా. ఇలాంటి సినిమాకు 70 రోజులంటేనే సక్సెస్ అయినట్లు అని చాలామంది అన్నారు. కానీ ఆ మాట అనగానే నాకు, సుకుమార్కు కోపమొచ్చేసింది. అలా ఒకరోజు అయిపోగానే నాన్న ఓ మాట అన్నారు. ఏంటి మొహం అలా పెట్టుకున్నావ్.. పదివారాలు అంటే పెద్ద సక్సెస్ తెలుసా? అని అన్నారు. ఏంటి 10 వీక్స్?..125 డేస్ షీల్డ్ తీసుకోకపోతే నా పేరు మార్చుకుంటా అని చెప్పా. ఆ తర్వాత మెగాస్టార్ చేతుల మీదుగా షీల్డ్ తీసుకున్నా. అది నా పిచ్చి అనుకోండి. ఇంకేమైనా అనుకోండి. థ్యాంక్ యూ' అని అన్నారు. #TFNReels: Icon Star @alluarjun reminisces about his confidence in the #Arya movie result!🔥Watch Full Speech here - https://t.co/MwPKCcVoVm#20YearsForArya #AlluArjun #TeluguFilmNagar pic.twitter.com/C7bOUWk3Wl— Telugu FilmNagar (@telugufilmnagar) May 8, 2024 -
20 ఏళ్లయినా అదే క్రేజ్.. స్టేజీపై అదరగొట్టేసింది!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, అను మెహతా, శివబాలాజీ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ఆర్య. సుకుమార్ డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. మే 7, 2004లో థియేటర్లలో సందడి చేసిన ఈ చిత్రం రిలీజై ఇప్పటికీ 20 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా బన్నీ ఈ సినిమాను గుర్తు చేసుకున్నారు. ఆర్య కేవలం సినిమా మాత్రమే కాదు.. నా కెరీర్ను మలుపు తిప్పిన క్షణం అంటూ అల్లు అర్జున్ ట్వీట్ చేశారు. అయితే తాజాగా ఆర్య మూవీ 20 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సెలబ్రేషన్స్ నిర్వహించారు. హైదరాబాద్లో జరిగిన ఈవెంట్కు టాలీవుడ్ ప్రమఖులు హాజరయ్యారు.అయితే ఈ సినిమాలో ఐటమ్ సాంగ్ సినీ ప్రియులను ఓ ఊపు ఊపేసిన సంగతి తెలిసిందే. 'అ అంటే అమలాపురం.. ఆ అంటే ఆహాపురం' ఓ రేంజ్లో అలరించింది. ఇప్పటికీ ఈ సాంగ్కు క్రేజ్ తగ్గలేదు. అయితే ఈ పాటకు డ్యాన్స్ చేసిన అభినయశ్రీ అందరికీ గుండెల్లో చోటు దక్కించుకుంది. తాజా ఈవెంట్కు హాజరైన ఆమె మరోసారి తన స్టెప్పులను అందరికీ పరిచయం చేసింది. అ అంటే అమలాపురం అంటూ డ్యాన్స్తో అదరగొట్టింది. 20 ఏళ్లయినా అదే స్టైల్తో డ్యాన్స్ చేసి అలరించింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరలవుతోంది. #TFNExclusive: Talented Abinaya Satish Kumar grooves to ‘Aa Ante Amalapuram’ song at #20YearsForArya celebrations event!💃🔥#AlluArjun #Arya #TeluguFilmNagar pic.twitter.com/sPuRjK4wN5— Telugu FilmNagar (@telugufilmnagar) May 8, 2024 -
Allu Arjun HD Photos: ‘ఆర్య 20 ఇయర్స్ సెలబ్రేషన్స్’లో అల్లు అర్జున్ (ఫొటోలు)
-
Arya 20 Years Celebrations: ‘ఆర్య’ సినిమా 20 ఇయర్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
ఆర్య కథ వినగానే ఇది నా ఇడియట్ అనిపించింది: అల్లు అర్జున్
‘‘హీరో తరుణ్ నాకు మంచి ఫ్రెండ్. ‘దిల్’ సినిమా ప్రీమియర్కి తను పిలవడంతో వెళ్లాను. అక్కడ నన్ను చూసిన సుకుమార్గారు మరుసటి రోజు వచ్చి ‘ఆర్య’ కథ చెప్పారు.. మైండ్ బ్లోయింగ్గా నచ్చింది. ‘ఇడియట్’ మూవీ చూసి ఇలాంటి యూత్ సినిమా నాకు పడితే ఎలా ఉంటుంది? అనే కోరిక మనసులో ఉండేది. ‘ఆర్య’ కథని సుకుమార్గారు చెబుతున్నప్పుడు ఇది నా ‘ఇడియట్’ మూవీ కథ అనిపించింది’’ అని హీరో అల్లు అర్జున్ అన్నారు. ఆయన హీరోగా, అనూ మెహతా జంటగా తెరకెక్కిన చిత్రం ‘ఆర్య’. ఈ మూవీ ద్వారా సుకుమార్ దర్శకునిగా పరిచయమయ్యారు.శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్పై ‘దిల్’ రాజు నిర్మించిన ఈ సినిమా 2004 మే 7న విడుదలైంది. ఈ చిత్రం విడుదలై 20 ఏళ్లు అయిన సందర్భంగా మంగళవారం హైదరాబాద్లో ‘ఆర్య 20 ఇయర్స్ సెలబ్రేషన్స్’ నిర్వహించారు. ఈ వేడుకలో అల్లు అర్జున్ మాట్లాడుతూ–‘‘ఆర్య’ ఒక సినిమా మాత్రమే కాదు.. మా అందరి జీవితాలను మార్చింది. ఈ మూవీ 20ఏళ్ల వేడుకని నిర్వహించిన రాజుగారికి థ్యాంక్స్. నా జీవితాన్ని పూర్తీగా మార్చిన సినిమా ‘ఆర్య’. నా తొలి మూవీ ‘గంగోత్రి’ హిట్ అయింది. అయితే చూడ్డానికి నేనంత గొప్పగా లేనని ఆ తర్వాత మంచి సినిమాలేవీ రాలేదు. ఏడాది పాటు ఖాళీగా కూర్చున్నా. కానీ, రోజుకి మూడు కథలు వినేవాణ్ణి.. కానీ నచ్చేవి కాదు. ‘ఆర్య’ కథ బాగా నచ్చింది.. కానీ, సుకుమార్గారు సరిగ్గా తీయగలరా? లేదా? అనే చిన్న అనుమానం. వీవీ వినాయక్గారు ఇంటికొచ్చి.. నాన్నగారు(అల్లు అరవింద్), నాతో మాట్లాడి.. సుకుమార్ తీయగలడు.. అతన్ని నమ్మండి అన్నారు. ఆయన మాట నాకు కొండంత ధైర్యం ఇచ్చింది. ఆ తర్వాత వారం రోజులు ట్రైల్ షూట్ చేస్తే అద్భుతంగా తీశారు సుకుమార్గారు. ఆ తర్వాత ధైర్యంగా ముందుకెళ్లాం.. సినిమా అద్భుతంగా వచ్చింది.. బ్లాక్ బస్టర్ అయింది. ఇందుకు సుకుమార్గారికి థ్యాంక్స్’’ అన్నారు. ‘దిల్’ రాజు మాట్లాడుతూ–‘‘ఆర్య’ వచ్చి 20 ఏళ్లు అయింది. ఆ సినిమా కోసం పనిచేసిన నటీనటులు, సాంకేతిక నిపుణుల కళ్లల్లో ఇప్పటికీ ఓ ఆనందం కనిపిస్తోంది. అది చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ‘ఆర్య’ కి పనిచేసిన బన్నీ, నేను, సుకుమార్, దేవిశ్రీ, రత్నవేలు.. ఇలా అందరూ ఈరోజు సక్సెస్ఫుల్గా టాప్ ΄÷జిషన్లో ఉన్నాం. ఒక సినిమాతో ఇంత మ్యాజిక్ జరగడం అనేది తెలుగు ఇండస్ట్రీనే కాదు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే ‘ఆర్య’ ప్రత్యేకమైన సినిమా. 20 ఏళ్ల తర్వాత కూడా అందరూ ఇలా సక్సెస్ఫుల్గా ఉండటం అనేది గ్రేట్ మూమెంట్.. దీనికి కారణం సుకుమార్. ‘ఆర్య’ ప్రయాణాన్ని మాత్రం ఎప్పటికీ మరచిపొలేను’’ అన్నారు. సుకుమార్ మాట్లాడుతూ–‘‘ఆర్య’ నా తొలి చిత్రం కాబట్టి ప్రతి మూమెంట్ నాకు గుర్తుంది. ప్రస్తుతం కొత్త డైరెక్టర్స్కి అవకాశాలు చాలా బాగున్నాయి. కానీ, అప్పట్లో లేవు. కొత్త డైరెక్టర్తో ఓ సినిమా చేయాలంటే ధైర్యం కావాలి. ధైర్యం చేసి నాకు అవకాశం ఇచ్చిన రాజుగారికి జీవితాంతం రుణపడి ఉంటాను. ఈరోజు నేను ఈ స్థాయిలో ఉన్నానంటే దానికి పునాది బన్నీనే.. దాన్ని ఎప్పుడూ మరచిపొలేను’’ అన్నారు. ఈ వేడుకలో నిర్మాత అల్లు అరవింద్, సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్, కెమెరామేన్ రత్నవేలు, నటీనటులు అభినయశ్రీ, మధుమిత, శివ బాలాజీ, ‘చిత్రం’ శ్రీను, సుబ్బరాజు, బబ్లు, దేవి చరణ్, ‘ఆదిత్య’ మ్యూజిక్ నిరంజన్ పాల్గొన్నారు. -
ఆ సినిమా నా జీవితాన్నే మార్చేసింది.. బన్నీ ఎమోషనల్ పోస్ట్
అల్లు అర్జున్-సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కిన తొలి సినిమా ఆర్య. 2004లో ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ చిత్రం..ఊహించని విజయం సాధించింది. అటు సుకుమార్, ఇటు బన్నీ ఇద్దరి సీనీ జీవితాన్ని మార్చేసింది. ఈ సినిమా విడుదలై నేటికి(మే 7) సరిగ్గా 20 ఏళ్లు పూర్తవుతుంది. ఈ సందర్భంగా బన్నీ ఫ్యాన్స్ ఆర్య సినిమాను గుర్తు చేసుకుంటూ.. సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అల్లు అర్జున్ కూడా ఆర్య షూటింగ్ రోజులను గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ పోస్ట్ చేశాడు. ‘ఆర్యకు 20 ఏళ్లు. ఇది సినిమా మాత్రమే కాదు.. నా జీవితాన్ని మార్చేసిన క్షణమది. ఎప్పటికీ కృతజ్ఞతతో ఉంటాను. స్వీట్ మెమొరీస్’ అంటూ ఆర్య సినిమాకు సంబంధించిన కొన్ని స్టిల్స్ని ఎక్స్ (ట్విటర్) వేదికగా షేర్ చేసుకున్నాడు.20 ఏళ్ల సెలబ్రేషన్స్ఆర్య సినిమా విడుదలై నేటికి 20 ఏళ్లు పూర్తయిన సందర్భంగా చిత్ర యూనిట్ రీ యూనియన్ ప్లాన్ చేసింది. హైదరాబాద్లోని ఓ ప్రముఖ హోటల్లో జరగనున్న ఈ వేడుకకి అల్లు అర్జున్, సుకుమార్, దిల్ రాజుతో పాటు ఆర్య టీమ్ అంతా హాజరుకానుంది. ప్రస్తుతం బన్నీ.. పుష్ప 2 షూటింగ్లో బిజీగా ఉన్నాడు. బన్నీ- సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న నాలుగో సినిమా ఇది. రష్మిక మందన్నా హీరోయిన్. ఫహద్ ఫాజిల్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఆగస్ట్ 15న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. 20 years of Arya. It’s not just a movie … it’s a moment in time that changed the course of my life . Gratitude forever . pic.twitter.com/DIYyWIP7ig— Allu Arjun (@alluarjun) May 7, 2024Sweet Memories 🖤 #20yearsofArya pic.twitter.com/wp9cXaMeTB— Allu Arjun (@alluarjun) May 7, 2024 -
వారందరి జీవితాలను మార్చేసిన 'ఆర్య'కు 20 ఏళ్లు
నేషనల్ అవార్డ్ విన్నర్ 'అల్లు అర్జున్' అంటే పేరు కాదు ఒక బ్రాండ్ అనేలా తనను తాను మలుచుకున్నాడు. 'గంగోత్రి'తో ఇండస్ట్రీలో ఆయన ఎంట్రీ సులువుగానే జరిగిపోయింది. కానీ, 'ఆర్య' నుంచి తన ప్రయాణంలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని ఐకాన్ స్టార్గా ఎదిగాడు. బాక్సాఫీసు దగ్గర వసూళ్ల పరంగానే కాకుండా... పురస్కారాల్లోనూ తగ్గేదేలే అని చాటి చెప్పాడు. 'గంగోత్రి'లో అందర్నీ నటనతో కట్టిపడేసిన బన్ని.. తర్వాత వచ్చిన 'ఆర్య'తో తన మార్క్ను చూపించాడు. ఆర్య సినిమా బన్నీకి మాత్రమే కాదో ఎందరో జీవితాలను మార్చేసింది. ఆ సినిమాతో మొదలైన సుకుమార్- బన్నీ ప్రయాణం.. పుష్ప చిత్రం ద్వారా నేషనల్ అవార్డు వరకు చేరింది. అందుకే ఆర్య సినిమా వారందరికీ చాలా ప్రత్యేకం. సరిగ్గా నేటికి ఆర్య విడుదలై 20 సంవత్సరాలు అయింది.అల్లు అర్జున్ హీరోగా నటించిన రెండవ సినిమానే ఆర్య. సుకుమార్కు ఇదే మొదటి సినిమా. ఎలాంటి అంచనాలు లేకుండా 7 మే 2004లో విడుదలైంది. ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించారు. ఇందులో బన్నీకి జోడిగా అనురాధ మెహతా నటించింది. మొదటి ఆటతోనే 'ఫీల్ మై లవ్' అంటూ 'ఆర్య'తో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు అల్లు అర్జున్. ఆర్య సినిమా తర్వాత బన్నికి కేవలం తెలుగులోనే కాదు, పొరుగు ఇండస్ట్రీల్లోనూ భారీగా క్రేజ్ వచ్చింది. ఇక్కడ అల్లు అర్జున్ను మనం ప్రేమగా బన్నీ అని పిలుచుకుంటే.. మలయాళం ప్రేక్షకులకు మల్లు అర్జున్ అయిపోయాడు. ఈ సినిమాతో అల్లు అర్జున్ కెరియరే మారిపోయింది. తనలోని డ్యాన్స్,నటన, స్టైల్ ఇలా అన్నీ తెరపై చూపించాడు. దీంతో ఒక్కసారిగా ఆయనకు చాలామంది ఫ్యాన్స్ అయిపోయారు.ఆర్యతో మారిపోయిన జీవితాలుసుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్య చిత్రం నేటితో 20 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ సినిమా ఎందరో జీవితాలని మార్చింది. నటుడిగా అల్లు అర్జున్, దర్శకుడిగా సుకుమార్, నిర్మాతగా దిల్రాజుకి, సంగీత దర్శకుడిగా దేవి శ్రీ ప్రసాద్కి, డీఓపీగా రత్నవేలుకి, డిస్ట్రిబ్యూటర్గా బన్ని వాసుకి ఇలా చాలామందికి ఆర్య మంచి గుర్తింపునిచ్చింది. వారందరి కెరీర్లో ఒక మైలురాయిగా ఆర్య నిలిచిపోయింది. ఇలా ఎందరికో బ్రేక్ ఇచ్చిన ఆర్యను గుర్తు చేసుకుంటూ ఒక ఈవెంట్ను ప్లాన్ చేయాలని దిల్ రాజు ఉన్నారట. దీని నుంచి అధికారక ప్రకటన రాలేదు.అల్లు అర్జున్ రియాక్షన్ఆర్యకు 20 సంవత్సరాలు. ఇది సినిమా మాత్రమే కాదు.. నా జీవిత గమనాన్ని మార్చిన ఒక క్షణం. ఎప్పటికీ కృతజ్ఞతతో ఉంటాను. అని తెలిపాడు 20 years of Arya. It’s not just a movie … it’s a moment in time that changed the course of my life . Gratitude forever . pic.twitter.com/DIYyWIP7ig— Allu Arjun (@alluarjun) May 7, 2024 -
ఈ హీరోను గుర్తుపట్టారా? అప్పుడలా.. ఇప్పుడిలా..!
శరీరాన్ని నచ్చినట్లు మలచడం అంత ఈజీ కాదు. కానీ సినిమాతారలు మాత్రం ఒక్కోసారి ఒక్కో గెటప్లో కనిపిస్తారు. సిక్స్ ప్యాక్, ఎయిట్ ప్యాక్.. అవసరమైతే ఫ్యామిలీ ప్యాక్లో కూడా దర్శనమిస్తారు. మళ్లీ యాక్షన్ మూవీ అనగానే వెంటనే కొవ్వును కరిగించేసుకుని.. కండలు తిరిగిన దేహం కోసం శ్రమిస్తారు. పైన కనిపిస్తున్న హీరో కూడా అదే చేశాడు. ఇంతకీ ఈ హీరో ఎవరో గుర్తుపట్టారా? రాజా రాణి, వరుడు, సైజ్ జీరో, సైంధవ్ సినిమాలతో తెలుగులో బోలెడంత ఫేమ్ సంపాదించుకున్న ఆర్య. ఏడాదిగా కసరత్తులు తమిళంలో హీరోగా రాణిస్తున్న ఆర్య గతేడాది మిస్టర్ ఎక్స్ అనే సినిమా ఒప్పుకున్నాడు. లావుగా, కాస్త పొట్ట ఉన్నట్లుగా కనిపిస్తున్న ఫోటో అప్పటిదే! సినిమాకు సంతకం చేసిన మరుసటి నెల నుంచే కసరత్తులు చేయడం ప్రారంభించాడు. కండలు తిరిగిన దేహాన్ని సొంతం చేసుకున్నాడు. 'గతేడాది మార్చిలో సినిమా ఒప్పుకున్నాను. ఏప్రిల్లో వర్కవుట్స్ స్టార్ట్ చేశా.. సెప్టెంబర్లో సినిమా షూటింగ్ ప్రారంభమైంది. ఇప్పుడు లాస్ట్ షెడ్యూల్ జరుగుతోంది. చూస్తుండగానే ఏడాది అయిపోయింది. 2023 ఏప్రిల్లో.. 2024 మార్చిలో నా లుక్ ఇలా ఉంది' అంటూ ఫోటోలు షేర్ చేశాడు. మైండ్ బ్లోయింగ్ ఇది చూసిన ఫ్యాన్స్ మైండ్ బ్లోయింగ్ ట్రాన్స్ఫర్మేషన్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇకపోతే మిస్టర్ ఎక్స్ సినిమాను పాన్ ఇండియా రేంజ్లో విడుదల చేయాలని ఆలోచిస్తున్నారు. ఇందులో మంజు వారియర్, శరత్ కుమార్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. గౌతమ్ కార్తీక్ విలన్గా నటిస్తున్నాడు. ఆనంద్ దర్శకత్వం వహిస్తున్నాడు. View this post on Instagram A post shared by Arya (@aryaoffl) చదవండి: 56 ఏళ్ల వయసులో నటుడి డేటింగ్.. విడిపోయామంటూ పోస్ట్.. -
భర్త చేతిలో మోసపోయిన బిగ్బాస్ కంటెస్టెంట్.. చివరికీ!
మలయాళంలో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటీమణుల్లో ఆర్య ఒకరు. బుల్లితెర నటిగా కెరీర్ ప్రారంభించిన ఆమె మలయాళంలో చాలా సినిమాల్లో నటించింది. అంతే కాకుండా మలయాళ బిగ్బాస్ సీజన్-2లో కంటెస్టెంట్గా పాల్గొంది. వీటితో పాటు బడాయి బంగ్లా, స్టార్ మ్యూజిక్ లాంటి రియాలిటీ షోలలో కనిపించింది. అయితే తాజాగా ఒక యూట్యూబ్ ఛానెల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన కెరీర్కు సంబంధించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. తన జీవితంలో ఎదుర్కొన్న సమస్యలు, ముఖ్యంగా తన భర్త రాహుల్ సుశీలన్తో విడిపోవడానికి గల కారణాలను వెల్లడించింది. ఐదేళ్ల తర్వాత తొలిసారి తన విడాకులపై స్పందించింది. బిగ్బాస్ కంటెస్టెంట్ ఆర్య మాట్లాడుతూ.. 'ఇప్పుడు నేను దాని గురించి ఆలోచిస్తున్నా. వదిలించుకోవడానికే అతను నన్ను బిగ్ బాస్కి పంపాడా అనే అనుమానం ఉంది. ముఖ్యంగా షోలో వెళ్లడానికి నాకు మద్దతు ఇచ్చిన వ్యక్తి. నాకు ఓ కుమార్తె ఉంది. మా నాన్న చనిపోయి చాలా కాలం కూడా కాలేదు. బిగ్బాస్ వెళ్లమని ఆయనే నాకు సపోర్టు చేసి మరీ ఎయిర్పోర్టులో దింపారు. నాకు అక్కడ బిగ్బాస్లో ఉన్నన్ని రోజులు ఎవరితోనూ పరిచయం లేదు. నేను హౌస్ నుంచి వచ్చేలోగా నాకు దూరం కావాలనేది అతని ప్లాన్ అని తెలీదు. కానీ ఇది ఒక అవకాశం అని నేను భావిస్తున్నా' అని తెలిపింది. కొవిడ్ వల్ల నేను బిగ్ బాస్ నుంచి తిరిగి వచ్చి నా భర్తకు చాలాసార్లు కాల్ చేశా. కానీ లిఫ్ట్ చేయలేదు. దీంతో ఏం చేయాలో నాకు అర్థం కాలేదు. నాకు తెలిసిన ఏకైక నంబర్ అతనిదే. అతను ఫోన్ తీయకపోవడంతో.. నేను అతని సోదరికి ఫోన్ చేశా. ఆమె జరిగిన విషయమంతా నాకు చెప్పింది. అతని మరో మహిళ వివాహేతర సంబంధంలో ఉన్నాడని నాకు అప్పుడే తెలిసింది. దీంతో అతన్ని కాల్చి చంపాలన్నా కోపం వచ్చింది. కానీ ఇప్పుడైతే అలాంటి కోపం లేదు. కానీ అతనికి ఏదైనా చెడు జరిగిందని తెలిస్తే మాత్రం సంతోషిస్తా.' అంటూ తన కోపాన్ని బయటపెట్టింది. ఆ సమయంలో అతను దుబాయ్లో ఉన్నందున.. కొవిడ్ వల్ల అతన్ని కలిసేందుకు వీలు కాలేదని ఆర్య తెలిపింది. కాగా.. ఆర్య చివరిగా మలయాళ కామెడీ చిత్రం క్వీన్ ఎలిజబెత్లో నటించారు. ఈ చిత్రాన్ని ఎం పద్మకుమార్ తెరకెక్కించారు. ఈ చిత్రంలో శ్వేతా మీనన్, నరేన్, జానీ ఆంటోనీ, మీరా జాస్మిన్, నీనా కురుప్ ప్రముఖ పాత్రలు పోషించారు. View this post on Instagram A post shared by Arya Babu (@arya.badai) -
Police Officer breastfeeds: అమ్మ ఎక్కడైనా అమ్మే
నెలల పసికందు. తల్లి ఆస్పత్రిలో..బిడ్డ పోలీసు వొడిలో. బిహార్కు చెందిన ఒక కూలి మనిషి కేరళలో హాస్పిటల్ పాలైంది. ఆలనా పాలనా చూసేవారులేక బిడ్డ పోలీస్ స్టేషన్కు చేరింది. వెక్కి వెక్కి ఏడుస్తున్న పసిగుడ్డును చూసి ఒక పోలీసు గుండె ఆగలేదు. వెంటనే పాలిచ్చింది. ఈ వీడియో చూసినవారు అమ్మ ఎక్కడైనా అమ్మే అంటున్నారు. ఖాకీ యూనిఫామ్ వేసుకున్న మాత్రాన తల్లి గుండె తల్లి గుండె కాకుండా పోతుందా? ఏ తల్లి మనసైనా తన బిడ్డను ఒకలా మరొకరి బిడ్డను ఒకలా చూస్తుందా? ప్రాణం పోసే స్వభావం కదా తల్లిది. ఎర్నాకుళానికి పట్నా నుంచి వలస వచ్చిన ఒక కుటుంబంలో తల్లికి గుండె జబ్బు రావడంతో ఐసియులో చేరింది. అప్పటికే ఆమె భర్త ఏదో కారణాన జైల్లో ఉన్నాడు. ఆమెకు నలుగురు పిల్లలు. ఆఖరుది నాలుగు నెలల పాప. హాస్పిటల్ వాళ్లు దిక్కులేని ఆమె పిల్లల గురించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు వెళ్లి స్టేషన్కు తీసుకొచ్చారు. పసిపాప ఏడ్వడం మొదలెట్టింది. ఆర్య అనే పోలీసు ఆఫీసర్ మనసు ఊరికే ఉండలేకపోయింది. ఆమెకు కూడా 9 నెలల పసిపాప ఉంది. అందుకే చటుక్కున పసిదాన్ని ఒడిలోకి తీసుకొని పాలు ఇచ్చింది. ఊరుకో బెట్టింది. పై అధికారులు ఇందుకు అనుమతించారు. కొచ్చి పోలీసులు ఈ వీడియోను ఫేస్బుక్ పేజీలో లోడ్ చేశారు. సాటి మహిళా పోలీసులే కాదు నెటిజన్లు కూడా ఆర్యను మెచ్చుకున్నారు. ఆ బిహార్ మహిళ పూర్తిగా కోలుకునే వరకు పిల్లలను స్టేట్ హోమ్కు తరలించి అక్కడ ఉంచుతామని అధికారులు తెలిపారు. పాలిచ్చిన బంధంతో ఆర్య ఆ పసిగుడ్డును హోమ్కు వెళ్లి చూడకుండా ఉంటుందా? -
స్టార్ హీరో తొలి వెబ్ సిరీస్.. ఆ ఒక్కదానికే రెండేళ్లు టైమ్!
ఇప్పుడంతా ఓటీటీల ట్రెండ్ నడుస్తోంది. దీంతో సినిమా హీరోలు కూడా చాలామంది వెబ్ సిరీస్లతో డిజిటల్ ఎంట్రీ ఇస్తున్నారు. నాగచైతన్య త్వరలో 'దూత' అనే సిరీస్తో రాబోతున్నాడు. దీనికంటే ముందు తమిళ స్టార్ హీరో ఆర్య.. 'ద విలేజ్' అనే హారర్ వెబ్ సిరీస్తో ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తున్నాడు. తాజాగా ఈ సిరీస్ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ జరగ్గా.. పలు ఆసక్తికర విషయాలు బయటపడ్డాయ్. (ఇదీ చదవండి: వరల్డ్కప్ ఫైనల్.. పాత టాలెంట్ బయటకు తీసిన హీరో నాని!) 'ద విలేజ్' సిరీస్ నవంబరు 24 నుంచి అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. తాజాగా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరగ్గా.. ప్రైమ్ వీడియో ప్రెసిడెంట్ అపర్ణ పురోహిత్ హాజరయ్యారు. 'ది విలేజ్' వెబ్ సిరీస్తో ప్రేక్షకులని తాము నెక్ట్స్ లెవెల్కి తీసుకెళ్లనున్నట్లు చెప్పారు. ఈ సిరీస్ కోసం దాదాపు నాలుగేళ్లు జర్నీ చేసినట్లు పేర్కొన్నారు. ఇకపోతే ఈ స్ట్రిప్ట్ని రాసి చదవడానికే రెండేళ్లు పట్టిందన్నారు. అలానే నటుడు ఆర్య నటించడానికి అంగీకరించడంతో ఇది చాలా భారీ సిరీస్ అయిందనే అభిప్రాయాన్ని అపర్ణ పురోహిత్ వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా వేర్వేరు ప్రాంతాల్లో జరిగే పలు ఘటనలను ఒక చోటకు తీసుకురావడం ఎలా? అనే ఆసక్తికరమైన స్టోరీతో ఈ సిరీస్ తీసినట్లు నిర్మాత బీఎస్ రాధాకృష్ణ చెప్పారు. (ఇదీ చదవండి: పెళ్లి చేసుకున్న నాగచైతన్య ఫస్ట్ మూవీ హీరోయిన్) -
ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తోన్న స్టార్ హీరో.. టీజర్తోనే భయపెట్టేశాడు!
కోలీవుడ్ హీరో ఆర్య తెలుగువారికి కూడా సుపరిచితమే. తన సినిమాలతో టాలీవుడ్లోనూ అభిమానులను సంపాదించుకున్నారు. తాజాగా ఓటీటీలో ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయ్యారు. ఈ రోజుల్లో సినీ తారలు ఒకవైపు సినిమాలు చేస్తూనే.. మరోవైపు వెబ్ సిరీస్లతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. తాజాగా ఆర్య తొలి వెబ్ సిరీస్ 'ది విలేజ్' లో నటిస్తున్నారు. ఈ సిరీస్కు మిలింద్ రాజు దర్శకత్వంలో.. బి.ఎస్. రాధాకృష్ణన్ నిర్మించారు. తాజాగా దీనికి సంబంధించిన టీజర్ను మేకర్స్ రిలీజ్ చేశారు. ది విలేజ్ అనే గ్రాఫిక్ నవల ఆధారంగా హారర్, క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో ఈ వెబ్ సిరీస్ను తెరకెక్కించారు. టీజర్ రిలీజ్ చేసిన టీమ్.. రిలీజ్ డేట్ను కూడా ప్రకటించింది. ఈ నెల 24 నుంచి అమెజాన్ ప్రైమ్లో ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానున్నట్లు వెల్లడించింది. తాజాగా విడుదల చేసిన టీజర్ ఈ సిరీస్పై అభిమానుల్లో మరింత ఆసక్తి పెంచుతోంది. తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీలో స్ట్రీమింగ్ కానుంది. ఈ సిరీస్లో దివ్య పిళ్లై, ఆడుకాలం నరేన్, జార్జ్ మయన్, పూజా రామచంద్రన్ ముఖ్య పాత్రల్లో నటించారు. కాగా.. ఆర్య ప్రస్తుతం తెలుగులో సైంధవ్ చిత్రంలో ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. వెంకటేశ్ హీరోగా దర్శకుడు శైలేష్ కొలను తెరకెక్కిస్తున్నారు. ఈ మూువీ 2024 జనవరి 13న విడుదల కానుంది. dare to venture into ‘the village' where darkness holds the secrets! 🌙#TheVillageOnPrime, Nov 24#Arya @milindrau #KiranKonda @thespcinemas @DivyaPillaioffl @ActorMuthukumar @Aazhiya_ @highonkokken @Poojaram22 @theabishekkumar #NaveenGeorgeThomas @ashwin_kkumar @arjunchdmbrm… pic.twitter.com/3muX5zC29w — prime video IN (@PrimeVideoIN) November 9, 2023 -
వారివల్లే ఈ ప్రయాణం సాధ్యమైంది
‘‘నా మొదటి సినిమా(కలియుగ పాండవులు) నుంచి ఇప్పుడు 75వ సినిమా ‘సైంధవ్’ వరకూ నన్ను ఎంతగానో ప్రేమించి, ఆదరించి, అభిమానిస్తున్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు. మీ ప్రేమ, అభిమానం, ఆప్యాయత వల్లే ఈ ప్రయాణం సాధ్యపడింది. ఇందుకు ప్రేక్షకులకు, నా అభిమానులకు, చిత్ర పరిశ్రమకు ధన్యవాదాలు’’ అని హీరో వెంకటేశ్ అన్నారు. శైలేష్ కొలను దర్శకత్వంలో వెంకటేశ్ లీడ్ రోల్లో నటించిన చిత్రం ‘సైంధవ్’. నవాజుద్దీన్ సిద్ధిఖీ, ఆర్య, శ్రద్ధా శ్రీనాథ్, రుహానీ శర్మ, ఆండ్రియా జెరెమియా, సారా కీలక పాత్రల్లో నటించారు. నిహారిక ఎంటర్టైన్మెంట్స్పై వెంకట్ బోయనపల్లి నిర్మించిన ‘సైంధవ్’ తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో జనవరి 13న విడుదల కానుంది. ఈ మూవీ టీజర్ లాంచ్ వేడుకలో వెంకటేశ్ మాట్లాడుతూ– ‘‘బలమైన భావోద్వేగాలు, యాక్షన్కి అవకాశం ఉన్న కథ ‘సైంధవ్’. కుటుంబ ప్రేక్షకులందరికీ సినిమా నచ్చుతుంది. ఇందులో నన్ను కొత్తగా చూస్తారు. గతంలో నా సినిమాలు ‘చంటి, కలిసుందాం రా, లక్ష్మి’ సంక్రాంతికి వచ్చి, హిట్ అయ్యాయి. ఇప్పుడు ‘సైంధవ్’ వస్తోంది. సంక్రాంతి రోజు ప్రేక్షకులు ఒక మంచి సినిమా చూడబోతున్నారు’’ అన్నారు. ‘‘ఈ మూవీ అందరికీ నచ్చుతుంది’’ అన్నారు నవాజుద్దీన్ సిద్ధిఖీ. ‘‘వెంకటేశ్గారి ప్రతిష్టాత్మక 75వ చిత్రానికి దర్శకత్వం చేసే అవకాశం నాకు ఇచ్చినందుకు ఆయనకు కృతజ్ఞతలు’’ అన్నారు శైలేష్ కొలను. ‘‘వెంకటేశ్గారితో సినిమా చేసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను’’ అన్నారు వెంకట్ బోయనపల్లి. -
వెంకటేశ్ చిత్రంలో మరో స్టార్ హీరో.. ఎవరంటే?
వెంకటేశ్ హీరోగా తెరకెక్కుతోన్న తాజా చిత్రం సైంధవ్. ఈ చిత్రానికి శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీలో శ్రద్ధా శ్రీనాథ్, రుహానీ శర్మ, ఆండ్రియా జెర్మియా హీరోయిన్స్గా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ఓ అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. తాజాగా ఈ చిత్రంలో మరో హీరో నటిస్తున్నట్లు వెల్లడించారు. దీనికి సంబంధించిన విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇంతకీ ఆ హీరో ఎవరో ఓ లుక్కేద్దాం. (ఇది చదవండి: ఈ కాలమే.. మంచి ఫీల్ గుడ్ పాటలాగా ఉంది: మారుతి) ఆ హీరోకు సంబంధించిన ఫస్ట్ లుక్ రిలీజ్ చేసి ఫ్యాన్స్కు సర్ప్రైజ్ ఇచ్చారు మేకర్స్. ఈ చిత్రంలో తమిళ స్టార్ ఆర్య ఈ చిత్రంలో నటిస్తున్నట్లు ప్రకటించారు. పోస్టర్లో ఆర్య లుక్ ఫ్యాన్సను తెగ ఆకట్టుకుంటోంది. తుపాకీ చేతపట్టి ఆర్య నడుస్తూ కనిపిస్తోన్న లుక్ సినిమాపై భారీ అంచనాలు పెంచుతోంది. కాగా.. ఇప్పటికే ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. కాగా.. తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం, హిందీ భాషల్లో డిసెంబరు 22న సైంధవ్ విడుదల కానుంది. (ఇది చదవండి: రక్షాబంధన్ వేడుకల్లో స్టార్ హీరో పిల్లలు.. ఎంత ముద్దుగా ఉన్నారో!) Meet the talented @arya_offl as MANAS from #SAINDHAV 🔥#SaindhavOn22ndDEC @Nawazuddin_S@KolanuSailesh @ShraddhaSrinath @iRuhaniSharma @andrea_jeremiah @Music_Santhosh @NiharikaEnt @vboyanapalli @maniDop @Garrybh88 @tkishore555 @NeerajaKona @artkolla @UrsVamsiShekar #Venky75 pic.twitter.com/6TlHJGGQRy — Venkatesh Daggubati (@VenkyMama) August 30, 2023 -
పాన్ ఇండియాను టార్గెట్ చేసిన ఆర్య
కోలీవుడ్ నటుడు ఆర్య కథానాయకుడిగా నటిస్తున్న నూతన చిత్రం 'మిస్టర్ ఎక్స్'. గతేడాదిలో విడుదల అయిన 'కెప్టెన్' సినిమా అంతగా మెప్పించలేదు. ఆ సినిమా తర్వాత వస్తున్న 'మిస్టర్ ఎక్స్' సినిమాను పాన్ ఇండియా రేంజ్లో విడుదల చేసి హిట్ కొట్టాలని ప్లాన్లో ఆయన ఉన్నారు. ఇందులో నటుడు గౌతమ్ కార్తీక్ ప్రతి నాయకుడిగా నటించడం విశేషం. నటుడు శరత్ కుమార్, నటి మంజూవారియర్, తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఇంతకు ముందు ఎఫ్ఐఆర్ వంటి సక్సెస్ ఫుల్ చిత్రాన్ని డైరెక్ట్ చేసిన ఆనంద్నే ఈ సినిమాకు కూడా దర్శకత్వం వహిస్తున్నారు. (ఇదీ చదవండి: అవమానాలు భరించి వెండితెరపై సత్తా చాటిన అల్లు అర్జున్) ప్రిన్స్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ఇటీవలే ప్రారంభమైంది. దౌనోకి దీపు నీనన్ ఛాయాగ్రహణం అందిస్తున్నారు. కొంతమంది వల్ల దేశానికి ప్రమాదం ఏర్పడితే దేశాన్ని రక్షించే హీరోగా అర్య కనిపించనున్నారు.చిత్ర వివరాలను దర్శకుడు తెలుపుతూ ఇది విభిన్న యాక్షన్ థ్రిల్లర్ కథాచిత్రంగా ఉంటుందన్నారు. ముఖ్య సన్నివేశాలను ఉగాండా, సిరియా దేశాల్లో చిత్రీకరించనున్నట్లు చెప్పారు. కాగా ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ను చిత్ర వర్గాలు విడుదల చేశాయి. మిస్టర్ ఎక్స్ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలను తదుపరి వెల్లడించనున్నట్లు దర్శకుడు చెప్పారు. -
అందానికి, అశ్లీలతకు చాలా తేడా ఉంది: హీరోయిన్
తమిళనాడు రాజకీయ కుటుంబం నుంచి సినీ రంగప్రవేశం చేసిన నటి దుషారా. పా.రంజిత్ దర్శకత్వంలో రూపొందిన సార్పట్టా పరంపరై చిత్రంలో అయ్యకు జంటగా కథానాయికిగా నటించి తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ ఆ తరువాత నక్షత్రం నగర్గిరదు చిత్రంలో మరోసారి నటిగా తానేమిటో నిరూపించుకున్నారు. కాగా తాజాగా వసంత బాలన్ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన అనిత చిత్రంలో నటుడు అర్జున్దాస్తో పోటీ పడి నటించి ప్రశంసలు అందుకున్నారు. ప్రస్తుతం బాలాజి మోహన్ దర్శకత్వంలో నటిస్తున్న దుషారా ఈ చిత్రంతో పాటు ధనుష్ సరసన నటించే ఛాన్స్ కొట్టేసింది. దుషారా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నటన అంటే తనకు చాలా ఇష్టమని చెప్పారు. అందుకే ఎలాంటి పాత్రలో నటించడానికై నా సిద్ధం అన్నారు. అయితే చిత్రంలో తన పాత్ర ఐదు నిమిషాలు ఉన్నా దానికి ప్రాధాన్యత ఉండాలన్నారు. (ఇదీ చదవండి: అమల అక్కినేనితో బాలీవుడ్ హీరో, ఫోటో వైరల్) కుటుంబకథా చిత్రాల నాయకి ఇమేజ్ తెచ్చుకున్న తనను గ్లామర్ పాత్రల్లో నటిస్తారా అని చాలామంది అడుగుతున్నారని, అందానికి, అశ్లీలతకు చాలా తేడా ఉందని, అలా ప్రేక్షకులు ముఖం తిప్పుకునేది ఏది గ్లామర్ కాదని అన్నారు. అందాలారబోతలో హద్దులు తనకు తెలుసని, అలాంటి పరిమితులుతో కూడిన గ్లామర్ పాత్రల్లో నటించడానికి తాను సిద్ధమేనని అన్నారు. బాలుమహేంద్ర, మణిరత్నం దర్శకులు అంటే ఇష్టం అని చెప్పారు. -
హీరోగా మారిన 'సార్పట్టా' నటుడు
కోలీవుడ్లో ఆర్య హీరోగా పా.రంజిత్ దర్శకత్వం వహించిన సూపర్ హిట్ మూవీ 'సార్పట్టా పరంపరై'. అందులో డాన్సింగ్ రోస్ అనే ముఖ్యమైన పాత్రలో షబ్బీర్ కల్లరాక్కల్ నటించిన విషయం తెలిసిందే. ఆ చిత్రం 2021లో విడుదలై మంచి విజయాన్ని సాధించింది. తాజాగా డాన్సింగ్ రోస్ షబ్బీర్ కల్లరాక్కల్ హీరోగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రానికి 'బర్త్ మార్క్' అనే టైటిల్ను నిర్ణయించారు. ఇందులో నటి మీర్జా హీరోయిన్గా నటిస్తున్నారు. విక్రమ్ శ్రీధరన్ కథ, దర్శకత్వం వహిస్తున్నారు. (ఇదీ చదవండి: వరుణ్- లావణ్యల పెళ్లి.. ఎప్పుడో హింట్ ఇచ్చిన అల్లు అరవింద్, వీడియో వైరల్) 1990 ప్రాంతంలో జరిగిన కొన్ని యథార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కిస్తున్న చిత్రమని డైరెక్టర్ చెప్పాడు. తమిళనాడు, కేరళ సరిహద్దుల్లోని మరైయూర్ అనే గ్రామంలో షూటింగ్ నిర్వహిస్తున్నట్లు తెలిపాడు. మిస్టరీ డ్రామాగా సాగే ఈ చిత్రం కథ ముఖ్యంగా రెండు పాత్రల చుట్టూ తిరుగుతుందని పేర్కొన్నాడు. డేని అనే సిపాయి కార్గిల్ యుద్ధం అనంతరం తన భార్యను తీసుకుని సొంత గ్రామానికి వచ్చిన తర్వాత వారు ఎదుర్కొనే సమస్యలు, కష్టాలే చిత్ర ప్రధాన అంశం అని చెప్పాడు. సెంటిమెంట్, యాక్షన్తో పాటు భావోద్వేగాలతో కూడిన చిత్రం 'బర్త్ మార్క్' అని తెలిపాడు. (ఇదీ చదవండి: మళ్లీ తెరపైకి మీటూ కేసు.. మరో కొత్త ట్విస్ట్) -
హీరో ఆర్య కూతురిని చూశారా? ఎంత క్యూట్గా ఉందో! (ఫొటోలు)
-
కూతురితో ఆడుకున్న ఆర్య దంపతులు
-
ఆర్య సినిమా చేయనన్నాను, ఎందుకంటే?: శివ బాలాజీ
బిగ్బాస్ తొలి సీజన్ విన్నర్ శివ బాలాజీ ఎన్నో సినిమాల్లో తన అద్భుత నటనతో ప్రేక్షకులకు ఆకట్టుకున్నాడు. ఆయన పేరు చెప్పగానే ఆర్య, చందమామ, శంభో శివ భంభో వంటి సినిమాలు టక్కుమని కళ్లముందు మెదులుతాయి. తాజాగా అతడు ఓ షోలో తనకు పేరు తెచ్చిన సినిమాలపై ఆసక్తిక వ్యాఖ్యలు చేశాడు. 'సుకుమార్ గారు ఆర్య ఆడిషన్స్కు పిలిస్తే వెళ్లాను. వెంటనే ఓకే చేశారు. అయితే ఆ సినిమాలో నాది నెగెటివ్ పాత్ర కావడంతో చేయనని చెప్పేశాను. కానీ వాళ్లందరూ నాకు సర్ది చెప్పడంతో చివరికి ఒప్పుకున్నాను. అల్లు అర్జున్ ఆర్య సినిమా సమయంలో ఎంత ఆప్యాయంగా ఉన్నాడో ఇప్పుడు కూడా అలాగే ఉంటాడు. ఆర్య తర్వాత మల్టీస్టారర్ సినిమా అవకాశాలు ఎక్కువగా వచ్చాయి. చేసుకుంటూ పోయాను. కానీ చందమామ సినిమా చేయడానికి చాలా భయపడ్డాను. డైరెక్టర్ కృష్ణవంశీ గారు చందమామ సినిమా కోసం ఆడిషన్ చేశారు. రాఖీ సినిమాలోని క్లైమాక్స్ డైలాగ్ చెప్పమని అడిగారు. నేను చెప్పిన తీరు ఆయనకు అంతగా నచ్చలేదు. ఆ విషయం అర్థమైన నేను ఈ సినిమాలో నటించే ఛాన్స్ రాదని ఫిక్సయ్యాను. కానీ కొన్ని రోజుల తర్వాత షూటింగ్కు రావాలని ఫోన్ కాల్ వచ్చింది. అపనమ్మకంగానే సెట్స్కు వెళ్లేవాడిని. షూటింగ్ జరుగుతున్నా నాకు నమ్మకం కలగలేదు. అసలు నన్ను ఈ సినిమాలో ఉంచుతారా? మధ్యలోనే తీసేస్తారా? అనుకుంటూనే చిత్రీకరణ పూర్తి చేశాను. తీరా సినిమా రిలీజై మంచి విజయం సాధించింది. చందమామ సక్సెస్ మీట్కు వెళ్లేటప్పుడు కృష్ణవంశీ పర్సనల్గా నా దగ్గరకు వచ్చి అందరితో కలిసిపోవాలి. లేదంటే నీలో ఉన్న ప్రతిభ ఎవరికీ తెలియకుండా పోతుంది అని చెప్పారు' అంటూ ఆనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నాడు శివబాలాజీ. చదవండి: రోడ్డు ప్రమాదానికి గురైన సింగర్, 10 సెకన్లలో జీవితమంతా.. బలవంతంగా బంధంలో ఉండే కంటే ఒంటరిగా ఉండటమే నయం: సదా -
హీరోలు ఆర్య, గౌతమ్ కార్తీక్ల మల్టీస్టారర్.. పోస్టర్ రిలీజ్
నటుడు ఆర్య, గౌతమ్ కార్తీక్ హీరోలుగా నటించడానికి సిద్ధం అవుతున్నారు. వీరిద్దరి కాంబోలో తెరకెక్కుతున్న తొలి చిత్రం ఇది. దీనికి మిస్టర్ ఎక్స్ అనే టైటిల్ను ఖరారు చేశారు. ఇంతకు ముందు విష్ణు విశాల్ హీరోగా ఎఫ్ఐఆర్ అనే సక్సెస్పుల్ చిత్రాన్ని తెరకెక్కించిన మణు ఆనంద్ తాజాగా దర్శకత్వం వహిస్తున్న చిత్రం మిస్టర్ ఎక్స్. ప్రిన్స్ పిక్చర్స్ పతాకంపై ఏస్.లక్ష్మణన్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఫస్ట్లుక్ పోస్టర్ను విడుదల చేశారు. చదవండి: గొప్పమనసు చాటుకున్న నిర్మాత.. లైట్మెన్ కుటుంబానికి ఆర్థికసాయం చిత్ర వివరాలను నిర్మాత తెలుపుతూ ఇది యాక్షన్ స్పై థ్రిల్లర్ కథా చిత్రంగా ఉంటుందన్నారు. దీనికి దీపు నినన్ థామస్ సంగీతాన్ని, తన్వీర్ మిర్ ఛాయాగ్రహణం అందిస్తున్నట్లు తెలిపారు. చిత్ర షూటింగ్ను ఉగాండా, సెర్పియా రాష్ట్రా ల్లో చిత్రీకించనున్నట్లు చెప్పారు. ఇందు లో కథ, కథనాలతో పాటు యాక్షన్ సన్నివేశాలు హైలెట్గా ఉంటాయన్నారు. ఈ చిత్రంలో నటించే ఇతర నటీనటు ల వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు పేర్కొన్నారు. చిత్రాన్ని తమిళంతో పాటు తెలుగు, మలయాళం, కన్నడం, హిందీ భాషల్లో వచ్చే ఏడాది విడుదల చేయనున్నట్లు తెలిపారు. చదవండి: దక్షిణాదిలో స్టార్ క్రేజ్.. అక్కడేమో ఒక్క హిట్ కోసం తంటాలు! -
గురుకులం: వేద విద్యామణులు
నలుగురు అక్కచెల్లెళ్లు. లక్ష్మి ఆర్య, కవిత ఆర్య, రజిత ఆర్య, సరిత ఆర్య. వీరిది తెలంగాణలోని ఓ వ్యవసాయ కుటుంబం. ఈ నలుగురూ వేదాలను అభ్యసించారు. కంప్యూటర్ యుగంలో అందులోనూ ఆడపిల్లలకు వేదాలెందుకు అనేవారి నోళ్లను మూయిస్తూ యజ్ఞయాగాది క్రతువులు చేస్తూ, అపార పాండిత్యంతో ఔరా అనిపిస్తూ సంస్కృతంలో విద్యార్థులను నిష్ణాతులు చేస్తూ తమ ప్రతిభను చాటుతున్నారు. రంగారెడ్డి జిల్లా ఎదిర గ్రామమైన ఈ అక్కాచెల్లెళ్లను కలిస్తే వేదాధ్యయనం గురించి ఎన్నో విషయాలు ఇలా మన ముందుంచారు. ‘‘మా అమ్మానాన్నలు ఆంచ సుమిత్ర, జంగారెడ్డి. నాల్గవ తరగతి వరకు ఊళ్లోనే చదువుకున్నాం. మా మామయ్య విద్వాంసుడవడంతో అతని సూచన మేరకు మా నలుగురు అక్కచెల్లెళ్ల ను కాశీలోని పాణిని కన్యా మహావిద్యాలయంలో చేర్చారు. కాశీ అంటేనే విద్యానగరి. విద్యలన్నీ అక్కడ సులభంగా లభిస్తాయని ప్రతీతి. అక్కడే పదేళ్లపాటు వేదాదేవి సాన్నిధ్య శిష్యరికాలలో విద్యాభ్యాసం చేశాం. ఆత్మరక్షణ కోసం శస్త్ర, శాస్త్రాలు సాధన చేశాం. ► ఆడపిల్లలకు వేదాలా..? వేదాలు బ్రాహ్మణులు కదా చదివేది అనేవారున్నారు. ఆడపిల్లలకు వేదం ఎందుకు అన్నారు. ఎక్కడ రాసుంది స్త్రీ వేదాలు చదవకూడదని, వేద మంత్రమే చెబుతుంది ప్రతి ఒక్కరూ వేదాన్ని పఠించవచ్చు అని. మేం చదివిన గురుకులాన్ని కూడా ప్రజ్ఞాదేవి, భేదాదేవి అనే అక్కచెల్లెళ్లు ఎంతో కృషితో నడిపిస్తున్నారు. రిషిదయానంద్ అనే విద్వాంసుడు స్త్రీని బ్రహ్మ పదవిపై కూర్చోబెట్టారు. వారి వద్ద విద్యను నేర్చుకున్న ఆ అక్కచెల్లెళ్లు వాళ్లు. ఆడపిల్లలు వేదాలు వినడమే నిషేధం అనే రోజుల్లోనే వారిద్దరూ వేదాధ్యయనం చేసి, గురుకులాన్ని స్థాపించారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో వారి శిష్యులు గురుకులాలు స్థాపించి, వేదాన్ని భావితరాలకు అందిస్తున్నారు. ► అన్ని కర్మలు ఉపనిషత్తులు, పురాణాలు, ఇతిహాసాలను ఔపోసన పట్టడమే కాదు పౌరోహిత్యం, పుట్టినప్పటి నుంచి మరణించేవరకు మధ్య ఉన్న అన్ని కర్మలూ విధి విధానాలతో చేస్తున్నాం. కొంతమంది ‘ఇదేం విచిత్రం’ అన్నవారూ లేకపోలేదు. అనేవారు చాలా మందే అంటారు. కానీ, మేం వాటికి మా విద్య ద్వారానే సమాధానం చెబుతున్నాం. పురాణ, ఇతిహాసాల్లో గార్గి, మైత్రి, ఘోశ, అపాల .. వంటి స్త్రీలు వేదాభ్యాసం చేసి, తమ సమర్థత చూపారు. అయితే, చాలా మందికి వారి గురించి తెలియదు. ► ఉచిత తరగతులు మా నలుగురిలో లక్ష్మి ఆర్య, సరిత ఆర్య చిన్నజీయర్ స్వామి ఆశ్రమంలో విద్యార్థులకు వేదవిద్యను బోధిస్తున్నారు. పౌరహిత్యంతో పాటు ఆన్లైన్లోనూ, ఆఫ్లైన్లోనూ భగవద్గీత, సంస్కృత పాఠాలను ఉచితంగా చెబుతున్నాం. మా నలుగురి ఆలోచన ఒక్కటే సంస్కృతం విస్తృతంగా ప్రచారం కావాలి. ఆడపిల్లలూ వేద విద్యలో ముందంజలో ఉండాలి. మా వద్ద పిల్లలతోపాటు పెద్దవాళ్లు కూడా సంస్కృతం అభ్యసిస్తున్నారు’’ అని వివరించారు ఈ నలుగురు అక్కచెల్లెళ్లు. నేటి కాలంలో వేద విద్యపై ఎవరూ ఆసక్తి చూపడం లేదని, అందుకోసమే తాము వేద విద్యలో పట్టు సాధించాలనుకున్నాం అని తెలిపారు ఈ సోదరీమణులు. తిరుపతిలోని సంస్కృత విశ్వవిద్యాలయం నుంచి సంస్కృత వ్యాకరణంలో రజిత ఆర్య, సరిత ఆర్య పీహెచ్డీ పట్టా అందుకుని ప్రముఖుల ప్రశంసలు అందుకున్నారు. – నిర్మలారెడ్డి – బాలయ్య, కొందుర్గు, రంగారెడ్డి జిల్లా, సాక్షి -
సింపుల్గా..శుభంగా
ఎంత ఎక్కువ ఖర్చు చేస్తే పెళ్లి అంత ఘనంగా జరిగినట్లు. అనే ఆలోచనధోరణి నుంచి బయటికి వచ్చి నిరాడంబరంగా పెళ్లి చేసుకున్నారు ఇండియన్ రెవెన్యూ సర్వీస్ ఆఫీసర్ ఆర్య, ఇండియన్పోస్టల్ సర్వీస్ ఆఫీసర్ శివమ్ త్యాగి. ‘ఆనందం అనేది ఆడంబరపు ఖర్చుల్లో కాదు... మనం చేసే మంచి పనుల్లో దొరుకుతుంది’ అని నమ్మిన ఈ నవదంపతులు 20 మంది అనాథ పిల్లల చదువుకు అయ్యే ఖర్చును భరించాలని వివాహ శుభసమయాన శుభనిర్ణయం తీసుకున్నారు... కేరళ, కొట్టాయంలోని కూరోప్పడకు చెందిన ఆర్య ఎన్ నాయర్ తండ్రి రాధాకృష్ణన్నాయర్ జాయింట్ లేబర్ కమిషనర్గా రిటైరయ్యారు. కూతురికి చిన్నవయసు నుంచే దినపత్రికలు చదవడం అలవాటు చేశారు. ఈ అలవాటు తనకు ఎంతో మేలు చేసింది. ఎప్పటికప్పుడు సామాజిక సందర్భాలను అర్థం చేసుకోవడానికి మాత్రమే కాదు, రకరకాల సమస్యల విశ్లేషణ గురించి తెలుసుకోవడానికి కూడా ఆర్యకు ఉపకరించింది. బంధువులకు సంబంధించిన ఎన్నో పెళ్లిళ్లకు హాజరయ్యేది ఆర్య. ఆ ఆడంబరపు ఖర్చును చూసి తన మనసు చివుక్కుమనేది. ‘ఈ పెళ్లికి చేసిన ఖర్చుతో ఎన్నో మంచి పనులు చేయవచ్చు’ అనుకునేది. ఇదే విషయాన్ని ఇతరులతో పంచుకుంటే... ‘ఇప్పుడు ఇలాగే అంటావ్. తీరా పెళ్లి టైమ్ వచ్చేసరికి మారిపోతావు. నా పెళ్లి ఎంత ఘనంగా జరిగిందో తెలుసా అని చెప్పుకోవడానికేప్రా ధాన్యత ఇస్తావు. నీ వయసులో నీలాగే ఆలోచించాను. కాని నా పెళ్లి ఘనంగా జరగక తప్పలేదు. చివరికి అప్పు కూడా చేయాల్సి వచ్చింది’ అన్నవాళ్లే ఎక్కువ. ఈ మాటలు ఆర్య మనసులో గట్టిగా నిలిచిపోయాయి.‘పెళ్లంటూ చేసుకుంటే నిరాడంబరంగానే చేసుకోవాలి’ అని నిర్ణయం తీసుకుంది. దిల్లీకి చెందిన శివమ్ త్యాగి కూడా ఆర్యలాగే ఆలోచిస్తాడు. ఇద్దరూ ప్రస్తుతం అహ్మదాబాద్లో ఉద్యోగం చేస్తున్నారు. వారి పరిచయం స్నేహం అయ్యే క్రమంలో, ఆ స్నేహం ప్రేమకు దారి తీసే క్రమంలో ఎన్నో సామాజిక సంబంధిత విషయాలు మాట్లాడుకునేవారు. అందులో ఆడంబర వివాహాల ప్రస్తావన కూడా తప్పనిసరిగా ఉండేది. ‘నిరాడంబరంగా పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం’ అని ఆర్య చెప్పినప్పుడు తల్లిదండ్రులు ఇష్టపడలేదు. వారిని ఒప్పించడానికి కాస్త సమయం పట్టింది. మరోవైపు శివమ్ త్యాగి పరిస్థితి కూడా అంతే. అతడి తల్లిదండ్రులు కూడా నిరాడంబర వివాహానికి మొదట సుముఖంగా లేరు. ‘మా నిరాడంబర వివాహం కొందరికైనా స్ఫూర్తిని ఇస్తే అంతకంటే గొప్ప ఆనందం ఏం ఉంటుంది!’ అంటున్నాడు శివమ్ త్యాగి. ఆనందాలు ఆడంబరపు ఖర్చులతో ముడిపడిన చోట ఆనందం మాటేమిటోగానీ అప్పులు మాత్రమే మిగులుతాయి. దీనికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. ఈ ధోరణిలో మార్పు రావాలంటే నిరాడంబర వివాహాల సంఖ్య పెరగాల్సిన అవసరం ఉంది. ఆర్య– శివమ్ త్యాగిలాంటి వారు ఇందుకు స్ఫూర్తిగా నిలుస్తారు. ‘కేరళలో వివాహాలు మూడు రోజులపాటు అట్టహాసంగా జరుగుతాయి. నా పెళ్లి వార్త తెలియగానే బంధువులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూశారు. పెళ్లి ఆడంబరంగా జరుగుతుందని ఊహించారు. కాని కొట్టాయంలోని సబ్– రిజిస్ట్రార్ ఆఫీసులో దండలు మార్చుకోవడం ద్వారా నిరాడంబరంగా జరిగిన మా పెళ్లి వారిని కాస్త నిరాశకు గురిచేసింది. అయితే ఆ తరువాత వారు మమ్మల్ని అర్థం చేసుకొని అభినందించారు’ అంటుంది ఆర్య. -
కొత్త సినిమా మొదలుపెట్టిన హీరో ఆర్య
కొత్త సినిమాకు కొబ్బరికాయ కొట్టారు హీరో ఆర్య. ముత్తయ్య దర్శకత్వంలో ఆర్య, సిద్ధి ఇద్నానీ జంటగా ఈ సినిమా చెన్నైలో ప్రారంభమైంది. జీ స్టూడియోస్, డ్రమ్స్టిక్స్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్నాయి. ఆర్య విలక్షణ నటుడు. ప్రేక్షకుల పల్స్ తెలిసిన దర్శకుడు ముత్తయ్య. వీరి కాంబినేషన్లో రూపొందుతున్న ఈ సినిమా వినోదాత్మకంగా ఉంటుంది అని అన్నారు జీ స్టూడియోస్ సౌత్ మూవీస్ హెడ్ అక్షయ్ కేజ్రివాల్. -
3 వారాలకే ఓటీటీకి కెప్టెన్ చిత్రం.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే..
తమిళ హీరో ఆర్య హీరోగా ఇటీవల తెరకెక్కిన చిత్రం ‘కెప్టెన్’. శక్తి సౌందన్ రాజన్ దర్శకత్వంలో సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం సెప్టెంబర్ 8న తమిళ్, తెలుగు భాషల్లో విడుదలైంది. దాదాపు 30 కోట్ల బడ్జెట్తో నిర్మాత టి. కిషోర్ తో కలిసి ఆర్య కూడా నిర్మించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద యావరేజ్ టాక్ తెచ్చుకుంది. ఇక కలెక్షన్స్ పరంగా నిర్మాతలకు ఈ మూవీ భారీ నష్టాలను మిగిల్చిందని సినీ విశ్లేషకులు అంటున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీకి రిలీజ్కు సిద్ధమైంది. చదవంండి: కొడుకు చంద్రహాస్పై ట్రోల్స్.. నటుడు ప్రభాకర్ షాకింగ్ రియాక్షన్ విడుదలైన మూడు వారాలకే కెప్టెన్ ఓటీటీకి రావడం గమనార్హం. ప్రముఖ ఓటీటీ సంస్థ జీ స్టూడియోస్ ఈ మూవీ ఓటీటీ రైట్స్ను సొంతం చేసుకుంది. సెప్టెంబర్ 30 నుంచి ‘జీ5’లో కెప్టెన్ మూవీ తెలుగు, తమిళ భాషల్లో అందుబాటులోకి రానుంది. తాజా ఇదే విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. కాగా తెలుగులో శ్రేష్ట్ మూవీస్ సమర్పించిన ఈ చిత్రానికి ఇమ్మాన్ సంగీతం అందిస్తున్నాడు. ఇందులో ఆర్యకు జోడిగా ఐశ్వర్య లక్ష్మి నటించగా... సీనియర్ నటి సిమ్రాన్ మహిళా ఆర్మీ అధికారినిగా స్పెషల్ రోల్ పోషించింది. చదవండి: ‘సీతారామం’ చూసిన ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్.. హీరోయిన్ గురించి ఏమన్నదంటే.. #Captain OTT RELEASE September 30 @ZEE5India pic.twitter.com/lnHBo9cSQZ — OTTGURU (@OTTGURU1) September 21, 2022 -
‘కెప్టెన్’ మూవీ రివ్యూ
టైటిల్ : కెప్టెన్ నటీనటులు : ఆర్య, ఐశ్యర్య లక్ష్మీ, సిమ్రాన్, హరీశ్ ఉత్తమన్, కావ్యశెట్టి తదితరులు నిర్మాణ సంస్థ: ది షో పీపుల్, థింక్ స్టూడియోస్, ఎస్ఎన్ఎస్ ప్రొడక్షన్స్ తెలుగులో విడుదల: శ్రేష్ఠ్ మూవీస్ దర్శకత్వం: శక్తి సౌందర్ రాజన్ సంగీతం : డి ఇమాన్ సినిమాటోగ్రఫీ: ఎస్ యువ విడుదల తేది: సెప్టెంబర్8,2022 కథేంటంటే.. భారత్లోని ఈశాన్య అటవీ ప్రాంంతంలో, సెక్టార్ 42కి చెందిన అటవీ ప్రాంతంలో కొన్నేళ్లుగా పౌర, సైనిక కార్యకలాపాలు లేవు. ఆ ప్రదేశానికి వెళ్లిన వారు ప్రాణాలతో తిరిగి రావడం లేదు. వారికి వారే షూట్ చేసుకొని చనిపోతున్నారు. దీంతో ఈ మిస్టరీని తెలుసుకోవడానికి భారత ఆర్మీకి చెందిన కెప్టెన్ విజయ్ కుమార్(ఆర్య) బ్యాచ్ని రంగంతోకి దించుతుంది. కెప్టెన్ విజయ్కి ఏ ఆపరేషన్ అయినా విజయవంతంగా పూర్తి చేస్తాడనే పేరుంది. తన టీమ్తో కలిసి స్పెషల్ ఆపరేషన్స్ చేపడుతుంటాడు. అందుకే ఈ డేంజరస్ ఆపరేషన్ని కెప్టెన్ విజయ్కి అప్పగిస్తుంది ప్రభుత్వం. విజయ్ తన బృందంతో కలిసి సెక్టార్ 42 ప్రదేశానికి వెళ్తాడు. అక్కడ మినటార్స్(వింత జీవులు) ఉన్నాయని, వాటివల్లే అక్కడికి వెళ్లిన వాళ్లు ప్రాణాలతో తిగిరి రావడంలేదని విజయ్ గుర్తిస్తాడు. మరి విజయ్ తన ప్రాణాలను పణంగా పెట్టి వాటిని ఎలా ఎదుర్కొన్నాడు? అసలు ఆ వింత జీవులు ఏంటి? సైనికులు తమకు తాము షూట్ చేసుకునేలా మినటార్స్ ఏం చేస్తున్నాయి? సైంటిస్ట్ కీర్తి(సిమ్రాన్) చేసే పరిశోధన ఏంటి? చివరకు కెప్టెన్ విజయ్ మినటార్స్ని అంతం చేశాడా? లేదా? అనేదే మిగతా కథ. ఎలా ఉందంటే.. ‘కెప్టెన్’ ట్రైలర్ విడుదలైనప్పటి నుంచి సినిమాపై అసక్తి పెరిగింది. వింత జీవులతో ఇండియన్ ఆర్మీ ఫైట్ చేయడం అనే కొత్త పాయింట్తో సినిమా తెరకెక్కడంతో అందరికి దృష్టి ‘కెప్టెన్’పై పడింది. అయితే కాన్సెప్ట్ కొత్తగా ఉన్నా.. దానికి తగ్గ కథ, కథనం లేకపోవడం సినిమాకు పెద్ద మైనస్. దర్శకుడు శక్తి సౌందర్ రాజన్ హాలీవుడ్ చిత్రాలను చూసి కథను రాసుకున్నట్లు తెలుస్తోంది. మ్యాన్ వర్సస్ క్రియేచర్ జానర్లో ఈ సినిమా సాగుతుంది. అందులో అయినా ఏదైనా కొత్తదనం ఉందా అంటే అదీ లేదు. సెక్టార్ 42లో వింత జీవులు ఉంటాయి వాటితో కెప్టెన్ విజయ్ యుద్దం చేయాలి అనేది ఫస్టాఫ్ పాయింట్ అయితే.. ఎలా చేశాడనేది సెకండాఫ్. దీనికి కథను అల్లడానికి ఫస్టాఫ్లో అసవరమైన సీన్స్ అన్ని బలవంతంగా చొప్పించాడు దర్శకుడు. ఆ సీన్స్ కూడా ఆకట్టుకున్నట్లు ఉంటుందా అంటే అదీ లేదు. ఇక సినిమాలో లాజిక్ లేని సన్నివేశాలు చాలా ఉంటాయి. సెక్టార్ 42కి వెళ్లిన సైనికులు మరణిస్తారని చూపించిన దర్శకుడు.. వారిని తీసుకురావడానికి వెళ్లిన సైనికులకు ఏమి కాలేదన్నట్టు సన్నివేశాలు రూపొందించడం.. గన్తో షూట్ చేసే మినటార్స్ మరణించడం లేదని తెలిసినా.. మళ్లీ మళ్లీ సైనికులు గన్స్ పట్టుకొనే ఆ ప్రదేశానికి వెళ్లడం.. సైంటిస్ట్ కీర్తికి కెప్టెన్ జవాన్ సైన్స్ గురించి చెప్పడం.. ఆమె ఆశ్యర్యంగా చూడడం..ఇలా చాలా సన్నివేశాల్లో లాజిక్ మిస్సవుతుంది. అదే సమయంలో హీరో మాత్రం ఎందుకు స్పృహ కోల్పోవడం లేదనడానికి మాత్రం సరైన కారణం చెప్పాడు. వీఎఫ్ఎక్స్ అంతగా ఆకట్టుకోలేదు. కథకు కీలకమైన క్రీచర్ని కూడా సరిగా చూపించలేకపోయారు. మినటార్స్తో వచ్చే ఫైట్ సీన్స్ కూడా అంతగా ఆకట్టుకోలేకపోతాయి. హాలీవుడ్ లో ఈ తరహా సినిమాలు చాలానే వచ్చాయి. ఆ చిత్రాలను చూడని ప్రేక్షకులకు ‘కెప్టెన్’ కాస్త కొత్తగా కనిపిస్తాడు. ఎవరెలా చేశారంటే.. కెప్టెన్ విజయ్ కుమార్ పాత్రకు ఆర్య న్యాయం చేశాడు. ఉన్నంతలో యాక్షన్స్ సీన్స్ని కూడా అదరగొట్టేశాడు. అతని టీమ్లోని సభ్యులు కూడా చక్కటి నటనను కనబరిచారు. ఐశ్వర్య లక్ష్మి రెండు సీన్స్, ఓ పాటలో కనిపిస్తుంది అంతే. ఆమె పాత్రకు పెద్దగా ప్రాధాన్యత ఉండదు. సైంటిస్ట్ కీర్తిగా సిమ్రాన్ పర్వాలేదనిపించింది. అయితే ఆమె పాత్రను మరింత బలంగా తీర్చిదిద్దాల్సింది. మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఇక టెక్నికల్ విషయానికొస్తే.. ఎస్ యువ సినిమాటోగ్రఫీ బాగుంది. ఇమాన్ నేపథ్య సంగీతం ఆట్టుకునేలా ఉంటుంది. విజువల్ ఎఫెక్ట్స్ అంతగా ఆకట్టుకోలేకపోతాయి. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి. -
హీరో ఆర్య 'కెప్టెన్' మూవీ స్టిల్స్
-
కొత్త అపార్ట్మెంట్స్ కొన్న విజయ్, ఆర్య.. ఎన్ని కోట్లంటే?
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ప్రస్తుతం వారసుడు చిత్రంతో పాటు లోకేశ్ కనకరాజు డైరెక్షన్లో ఓ మూవీ చేస్తున్నాడు. సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న ఈ హీరో తాజాగా చెన్నైలోని ఓ పోష్ ఏరియాలో అపార్ట్మెంట్ను కొనుగోలు చేశాడట. దీని ఖరీదు అక్షరాలా 35 కోట్ల రూపాయలని తెలుస్తోంది. ప్రస్తుతం విజయ్, తన భార్య సంగీత, పిల్లలు దివ్య సాష, జాసన్ సంజయ్తో కలిసి ఈసీఆర్ ప్రాంతంలో నివాసముంటున్నారు. అడయార్లోని తన పాత ఇంట్లో ఆఫీస్ను నిర్వహిస్తున్నాడు. కాగా విజయ్ ప్రస్తుతం తన ఆఫీస్ను కొత్తగా కొనుగోలు చేసిన అపార్ట్మెంట్కు షిఫ్ట్ చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఇదే అపార్ట్మెంట్లో ఓ ఫ్లాట్ను హీరో ఆర్య సొంతం చేసుకున్నాడట. దీంతో హీరోలు ఆర్య, విజయ్ ఇద్దరూ ఇరుగుపొరుగువారయ్యారు అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. చదవండి: హీరోతో సహజీవనం వార్తలపై ఇస్మార్ట్ బ్యూటీ గప్చుప్! మాజీ ప్రియుడితో నటి చక్కర్లు, వీడియో వైరల్ -
ఏలియన్తో హీరో ఆర్య పోరాటం.. ఆసక్తిగా ‘కెప్టెన్’ ట్రైలర్
తమిళ హీరో ఆర్య హీరోగా తాజాగా తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ చిత్రం కెప్టెన్. శక్తి సౌందన్ రాజన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా సెప్టెంబర్ 8న ప్రేక్షకులు ముందుకు రాబోతోంది, ప్రస్తుతం పోస్ట్ ప్రోడక్షన్ పనులతో పాటు ప్రమోషన్స్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఇక మూవీ ప్రమోషన్స్ జోరు పెంచిన మూవీ టీం తాజాగా మూవీ ట్రైలర్ను సోషల్ మీడియా వేదికగా రిలీజ్ చేశారు. ఇండియన్ ఆర్మీ, ఏలియన్లతో చేసే పోరాటం నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్ను ఆసక్తిగా మలిచారు. చదవండి: నెపోటిజంపై నోరు విప్పిన నాగ చైతన్య.. ఏమన్నాడంటే ఆర్మీ అధికారులు ఓ గ్రహాంతరవాసితో తలపడే యాక్షన్ సీన్స్ ఉత్కంఠ రేపుతున్నాయి. ఇక ట్రైలర్లోని యాక్షన్ సీన్స్, ఆర్మీ ఆఫీసర్ల అధికారిగా నటి సిమ్రాన్ ఇచ్చే సూచనలు, గ్రహాంతవాసులను ఎదుర్కొనేందుకు ఆర్య వేసే ఎత్తుగడలను వివరిస్తూ సాగిన ఈ ట్రైలర్ సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేస్తోంది. కాగా తెలుగులో శ్రేష్ట్ మూవీస్ సమర్ఫిస్తున్న ఈ చిత్రానికి ఇమ్మాన్ సంగీతం అందిస్తున్నాడు. ఇందులో ఆర్యకు జోడిగా ఐశ్వర్య లక్ష్మి నటించింది. -
‘ఆర్య’, ‘గిల్టీ మైండ్స్’ ఫేం సుగంధా గర్గ్ గురించి ఈ విషయాలు తెలుసా?
జీవితాన్ని ఉన్నదున్నట్టుగా యాక్సెప్ట్ చేసేవాళ్లలో సుగంధా గర్గ్ ఒకరు. ఆమె ఎవరు? హాట్ స్టార్లో ‘ఆర్య’, అమెజాన్ ప్రైమ్లో ‘గిల్టీ మైండ్స్’ చూసిన వాళ్లకు బాగా తెలుసు సుగంధా ఎవరో! అయితే ఆమె గాయని కూడా! ఎమ్టీవీ ‘కోక్ స్టూడియో సీజన్ 2’ లో సుగంధా తన గాన మాధుర్యాన్ని వినిపించింది. ఆమె గురించి కొన్ని వివరాలు.. ►పుట్టింది ఉత్తరప్రదేశ్లోని మీరట్లో. పెరిగింది హైదరాబాద్లో. తల్లిదండ్రులు.. మీనా గర్గ్, శేఖర్ గర్గ్. సుగంధా.. ఢిల్లీలోని మైత్రేయి కాలేజ్లో డిగ్రీ చదువుకుంది. ►పద్దెనిమిదేళ్ల వయసులోనే బీబీసీ చానెల్లో ఉద్యోగం వచ్చింది.. హోస్ట్గా. ఆమె నిర్వహించిన షో పేరు ‘హాథ్ సే హాథ్ మిలా’. ఫొటోగ్రఫీలోనూ శిక్షణ పొందింది. నటి కావాలని కలలు కన్నది. ►డిగ్రీ అయిపోగానే ముంబై చేరింది. సినిమా అవకాశాల కోసం దరఖాస్తుల పర్వం మొదలుపెట్టింది. అలా తెచ్చుకున్న మొదటి చాన్స్ ‘జానే తూ యా జానే నా’ సినిమా. తర్వాత లాస్ట్ డాన్స్, మై నేమ్ ఈజ్ ఖాన్ వంటి సినిమాలూ చేసింది. ►‘తెరే బిన్ లాడెన్’తో సుగంధాకు మంచి గుర్తింపు వచ్చింది. ఆ గుర్తింపు అదే సినిమా సీక్వెల్లోనూ అవకాశాన్నిచ్చింది. ఆమె నటనా ప్రతిభ అంతర్జాతీయ ప్రేక్షకులకూ పరిచయం అయింది.. ది కైట్ – పతంగ్, కాఫీ బ్లూమ్ వంటి చిత్రాలతో. ► థియేటర్ ఆర్టిస్ట్గానూ రాణిస్తోంది. ‘ఐ హావ్ గాన్ మార్కింగ్ అండ్ సమ్టైమ్స్’ అనే నాటకంలోని సుగంధా అభినయానికి అభినందనల వర్షం కురిసింది. ► ఈ తరానికీ దగ్గరవడానికి ఓటీటీని ప్లాట్ఫామ్గా చేసుకుంది. ఆర్య, గిల్టీ మైండ్స్తో యూత్కూ ఫేవరెట్గా మారింది. ►ఇంకో విషయం.. సుగంధా దక్షిణాది చిత్రసీమలోనూ ఎంట్రీ ఇచ్చింది. సంతోష్ శివన్ దర్శకత్వం వహించిన ‘సిలోన్’ అనే తమిళ (నిజానికిది ద్విభాషా చిత్రం. ఇంగ్లిష్లోనూ విడుదలైంది) చిత్రంతో. ‘సిలోన్ సినిమాలోని రజిని పాత్రలో సుగంధా ఒదిగిపోయింది. ఆ రోల్ ఇంకెవరు చేసినా న్యాయం చేయగలిగేవాళ్లు కాదు. అది ఆమెకు మాత్రమే సాధ్యమైంది’ అంటూ సుగంధా నటనకు ముగ్ధుడయ్యాడు సంతోష్ శివన్. నాకు వచ్చిన ప్రతి పనినీ అమితంగా ప్రేమిస్తా. రాని పనినీ అంతే ఇష్టంగా నేర్చుకుంటా. అందిన జీవితాన్ని అందినట్టుగా ఆస్వాదించడంలో ఉన్న ఆనందమే వేరు - సుగంధా గర్గ్ -
ఫస్ట్లుక్ పోస్టర్ కోసం ఏడాదిన్నర సమయం పట్టిందట!
తమిళసినిమా: కెప్టెన్ చిత్ర ఫస్ట్లుక్ పోస్టర్ను సోమవారం చిత్ర వర్గాలు విడుదల చేశారు. ఆర్య కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ఇది. టెడీ వంటి విజయవంతమైన చిత్రం తరువాత ఆర్య దర్శకుడు శక్తి సౌందర్ రాజన్ల కాంబినేషన్లో రూపొందుతోంది. దీంతో చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. థింక్ స్టూడియోస్, ది షో పీపుల్ సంస్థలు కలిసి నిర్మిస్తున్న ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ ఇప్పుడు ట్రెండీగా మారింది. విశేషం ఏమిటంటే ఈ ఫస్ట్లుక్ పోస్టర్ కోసం చిత్ర యూనిట్ ఏడాదిన్నరగా శ్రమించారట. కారణం ప్రేక్షకులకు ఇంతకు ముందెప్పుడూ చూడనటువంటి వినూత్న అనుభూతిని కల్పించాలన్నదే అని దర్శకుడు తెలిపారు. చిత్రం ఒక థ్రిల్లర్ పయనంగా ఉంటుందన్నారు. చిత్రం కోసం ఆర్య చూపించిన అంకితభావం, శ్రమ మాటల్లో చెప్పలేదని నిర్మాతలు పేర్కొన్నారు. షూటింగ్ పూర్తి చేసుకుని నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రంలో నటి సిమ్రాన్, ఐశ్వర్య లక్ష్మి, హరీష్ ఉత్తమన్, కావ్యశెట్టి తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. యువ ఛాయాగ్రహణం, డి.ఇమాన్ సంగీతాన్ని అందిస్తున్నారు. చదవండి: Palasa 1978 Movie: 'పలాస'కు అరుదైన గౌరవం.. ఆ ఫెస్టివల్కు ఎంపిక -
ఎనిమి మూవీ ట్విటర్ రివ్యూ
యాక్షన్ హీరోగా తమిళ్ తోపాటు తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ సొంతం చేసుకున్నాడు విశాల్. ఫలితాలతో సంబంధం లేకుండా వైవిధ్యమైన చిత్రాలను ఎంచుకుంటూ దూసుకెళ్తున్నాడు. తాజాగా విశాల్ నటించిన మరో యాక్షన్ చిత్రం ‘ఎనిమి’.ఈ సినిమాలో విశాల్ తోపాటు మరో హీరో ఆర్య కూడా నటిస్తున్నారు. ఈ సినిమాలో విశాల్ పోలీస్ ఆఫీసర్ గ నటిస్తున్నాడు. అలాగే ఆర్య నెగిటివ్ రోల్ లో కనిపించనున్నాడు. నోటా చిత్ర దర్శకుడు ఆనంద్ శంకర్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. మతా మోహన్దాస్, మృణాళిని కథానాయికలు. ఈ సినిమా దీపావళి సందర్భంగా ఈనెల 4న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈ సినిమా ప్రీవ్యూస్ పడడంతో ఈ సినిమాను చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను తెలుపుతున్నారు.. అసలు కథేంటీ.. కథనం ఎలా ఉంది.. ఏ మేరకు తెలుగు వారిని ఈ సినిమా ఆకట్టుకుంటోంది.. మొదలగు అంశాలను ట్విటర్లో చర్చిస్తున్నారు.. అవేంటో చూద్దాం. సింగపూర్లో లిటిల్ ఇండియా అనే ప్రాంతం ఉంటుంది. అక్కడ జరిగే కథ ఇది. స్నేహితులుగా ఉన్న ఇద్దరు వ్యక్తులు శత్రువులుగా ఎలా మారారు? ఆఖరికి వాళ్లు ఎలా కలుస్తారు? అన్నది చిత్ర కథాంశం. సినిమాలో యాక్షన్తో పాటు డైగాగ్స్ బాగాను ఉన్నట్లు తెలుస్తోంది. #Enemy first half 🔥🔥🔥🔥🔥 Anand Shankar 💥 Aarya 🥵🧨🧨🧨🧨 pic.twitter.com/MvviWtx1Fj — MSR (@itz_chillax) November 4, 2021 #EnemyFDFS fans celebration @RohiniSilverScr 💥💥#Enemy Massive entry thalaivaa @VishalKOfficial One of the finest score points @SamCSmusic bgm is just lit 💥@arya_offl @mirnaliniravi @vinod_offl @anandshank @VffVishal pic.twitter.com/CT0IKPyE5F — Esh Vishal (@Eshvishaloff) November 4, 2021 #Annaatthe Review சரியில்லை நம்ம #ENEMY பார்க்க கிளம்புவோம்... — திண்டிவனத்தான் (@itsmetdm) November 4, 2021 #Enemy Epdi Iruku Frands — Thala Ragav™👑 (@Ragav_Tweetz) November 4, 2021 Million Thanks to my brother @VishalKOfficial for making me a part of this film 🤗🤗Had the best time working with @anandshank 😍🤗 💪 Thank you @vinod_offl darling for believing us and making #Enemy special 😍🤗 @RDRajasekar sir u r 😍😍 Happy Diwali everyone 😘💥💥 pic.twitter.com/ruKT2CYFZk — Arya (@arya_offl) November 4, 2021 #Enemy will be flop. Investment recovery is not guaranteed. #Annaatthe getting rave reviews. Industry Hit record will be sure. Watch it soon in theaters only. — AnnaattheTheFilm (@AnnaattheMovie) November 4, 2021 #Enemy review எப்டீ இருக்குன்னு போய் பார்த்தா அவனுங்க நமக்கு முன்னாடி எனிமி ரிவியூவ் எப்டீ இருக்குன்னு கேக்குறானுங்க😍🙌 — ѕ ι я α н🕊️ᴠᴋ (@Prabhaharish7) November 4, 2021 #Enemy Deepawali Than Pola 🙄🔥🔥🔥🔥 — Salva Reviews😷 (@SalvaReviews) November 4, 2021 தீபாவளி னாலே தளபதி தான் போல... புரட்ச்சி தளபதி மாஸ் #Enemy 🔥 — кαι ρυℓℓα (@KPM_Offi) November 4, 2021 #EnemyDeepavali BlockBuster #Enemy — Ansari (@Ansari0401) November 4, 2021 -
ఈ వారం ఓటీటీ, థియేటర్లో అలరించే చిత్రాలివే..
Diwali 2021 Movie Release List: కరోనా తగ్గుముఖం పట్టిన అనంతరం ప్రతి వారం కొత్త సినిమలు థియేటర్లో సందడి చేస్తున్నాయి. ఇక దసరా, దీపావళి సందర్భంగా భారీ బడ్జెట్ చిత్రాలు థియేటర్లోకి క్యూ కడుతున్నాయి. దసరా సందర్భాంగ ఇప్పటికే ‘పెళ్లి సందD, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్, వరుడు కావలెను వంటి తదితర చిత్రాలు వెండితెరపై మెరిసి ప్రేక్షకులకు బాగా అలరించాయి. ఇక దీపావళి సందర్భంగా అగ్ర హీరోల సినిమా థియేటర్లోకి వచ్చేందు రెడీ అయ్యాయి. అలాగే ఈ పండుగ సంబరాలను మరింత రెట్టింపు చేసేందుకు ఓటీటీలోకి సైతం పలు సినిమాలు రాబోతున్నాయి. మరి ఆ చిత్రాలు ఏంటో తెలుసుకోవాలంటే ఇక్కడోలుక్కేయండి. ‘ఎనిమి’లుగా విశాల్, ఆర్యలు యాక్షన్ హీరో విశాల్, మ్యాన్లీ స్టార్ ఆర్యల క్రేజీ కాంబినేషన్లో యాక్షన్ ఎంటర్టైనర్ రాబోతున్న చిత్రం ‘ఎనిమి. ఇది విశాల్ 30వ చిత్రం కాగా, ఆర్య 32వ సినిమా. ‘గద్దల కొండ గణేష్’ ఫేమ్ మృణాళిని రవి, మమతా మోహన్దాస్లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. విలక్షణ నటుడు ప్రకాశ్రాజ్ ఇందులో కీలక పాత్రలో నటించాడు. ఆనంద్ శంకర్ దర్శకత్వంలో మినీ స్టూడియోస్ పతాకంపై వినోద్ కుమార్ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మించాడు. దీపావళి సందర్భంగా ఈ సినిమా కూడా నవంబరు 4న తమిళ/తెలుగు భాషల్లో థియేటర్లలో విడుదల కానుంది. దీపావళికి వస్తున్న ‘పెద్దన్న’ సూపర్ స్టార్ రజనీకాంత్ తాజా చిత్రం ‘అన్నాత్తే’. ఈ మూవీని తెలుగులో సైతం ‘పెద్దన్న’గా దీపావళి సందర్భంగా తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్న సంగతి తెలిసిందే. యాక్షన్ డైరెక్టర్గా పేరు తెచ్చుకున్న శివ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్గా అలరించబోతోంది. ఇక కీర్తి సురేశ్ రజనీకి సోదరిగా కనిపించనుండగా.. సీనియర్ నటీమణులు మీనా, ఖుష్బులు కీలక పాత్రలో కనిపించబోతున్నారు. నవంబర్ 4న తమిళ/తెలుగులో భాషల్లో థియేటర్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. కరోనా తర్వాత థియేటర్లో విడుదల అవుతున్న తొలి అగ్ర హీరో మూవీగా రజనీది కావడం విశేషం. మెహ్రీన్, సంతోష్ శోభన్ల్లా ‘మంచి రోజులు వచ్చాయి’ సంతోష్ శోభన్, మెహ్రీన్ జంటగా మారుతి తెరకెక్కించిన చిత్రం ‘మంచి రోజులు వచ్చాయి’. యువీ కాన్సెప్ట్స్, మాస్ మూవీ మేకర్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. అనూప్ రూబెన్స్ స్వరాలందించారు. దీపావళి పండగను పురస్కరించుకుని ఈనెల 4న ఈ చిత్రం థియేటర్లలో విడుదల కానుంది. మారుతి శైలిలో సాగే విభిన్నమైన కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కినట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. అక్షయ్ కుమార్ ‘సూర్యవంశీ’ అక్షయ్కుమార్, కత్రినాకైఫ్ ప్రధాన పాత్రల్లో నటించిన యాక్షన్ చిత్రం ‘సూర్యవంశీ’. రణ్వీర్సింగ్, అజయ్దేవ్గణ్ కీలక పాత్రలు పోషించారు. రోహిత్శెట్టి దర్శకత్వం రూపొందిన ఈ చిత్రం గతేడాది విడుదల కావాల్సింది. కానీ కరోనా కారణంగా వాయిదా పడుతూ వస్తోంది. ఈ ఏడాది వేసవిలో విడుదల చేయాలని భావించినా సెకండ్వేవ్ కారణంగా మరోసారి ఈ మూవీ విడుదల వాయిదా పడింది. చివరకు ఈ దీపావళి కానుకగా థియేటర్లో సందడి చేసేందుకు నవంబరు 5న ప్రేక్షకుల ముందుకు ఈ మూవీ రాబోతోంది. రిలయన్స్ ఎంటర్టైన్మెంట్, రోహిత్శెట్టి పిక్చర్స్, ధర్మ ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ట్రైలర్కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన వచ్చింది. సూపర్ హీరోస్ ‘ఇటర్నల్స్’ సూపర్ హీరోస్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ హాలీవుడ్. మార్వెల్ కామిక్స్ నుంచి ఎందరో సూపర్హీరోలు ప్రేక్షకులను అలరించారు. అలా మరోసారి అలరించేందుకు ‘ఇటర్నల్స్’ వస్తున్నారు. థానోస్ తర్వాత భూమిని నాశనం చేసేందుకు వస్తున్న అతీంద్రియ శక్తులైన ఏలియన్స్ను కొందరు సూపర్ హీరోలు ఎలా ఎదుర్కొన్నారు? ఈ క్రమంలో వాళ్లకు ఎదురైన సవాళ్లు ఏంటి? ఇంతకాలం వాళ్లు ఎక్కడ ఉన్నారు? తెలియాలంటే సినిమా చూడాల్సిందే. క్లోవీజావ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఇటర్నల్స్’ నవంబరు 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఓటీటీలోకి వచ్చే చిత్రాలివే! సూర్య జై భీమ్ మాస్ హీరోగా ఎంతో క్రేజ్ సంపాదించుకున్న హీరో సూర్య అప్పుడప్పుడు వైవిధ్యమైన పాత్రల్లో ప్రేక్షకులను అలరిస్తుంటారు. అలాంటి పాత్రలో ఆయన నటిస్తూ.. స్వీయ నిర్మాణంలో రూపొందించిన తాజా చిత్రం ‘జై భీమ్’. తాసే జ్ఞానవేల్ దర్శకుడు. వాస్తవ సంఘటనల ఆధారంగా కోర్టు నేపథ్యంలో ఈ మూవీ రూపొందించారు. ‘లా అనేది ఓ శక్తిమంతమైన ఆయుధం. ఎవరిని కాపాడటం కోసం మనం దాన్ని ఉపయోగిస్తున్నామన్నదే ముఖ్యం’ అంటూ ట్రైలర్లో సూర్య చెప్పిన డైలాగ్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. దీంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. తమిళం, తెలుగు, హిందీ భాషల్లో నవంబరు 2న అమెజాన్ ప్రైమ్లో ఈ మూవీ విడుదల కానుంది. సందీప్ కిషన్ ‘గల్లీ రౌడీ’ సందీప్ కిషన్ హీరోగా తెరకెక్కిన వినోదభరిత చిత్రం ‘గల్లీ రౌడీ’. కొవిడ్ సెకండ్ వేవ్ తర్వాత థియేటర్లలో విడుదలై ప్రేక్షకుల్ని అలరించిన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలో సందడి చేసేందుకు రాబోతోంది. ప్రముఖ ఓటీటీ డిస్నీ+ హాట్స్టార్లో నవంబరు 4 నుంచి స్ట్రీమింగ్ కానుంది. జి. నాగేశ్వరరెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని కోన ఫిల్మ్ కార్పొరేషన్, ఎంవీవీ సినిమాస్ సంస్థలు నిర్మించాయి. నేహాశెట్టి, బాబీ సింహా, హర్ష, వెన్నెల కిశోర్, పోసాని కృష్ణమురళి తదితరులు కీలక పాత్రలు పోషించారు. సుధీర్ బాబు ‘శ్రీదేవీ సోడా సెంటర్’ కొవిడ్ సెకండ్ వేవ్ తర్వాత థియేటర్లలో విడుదలై ప్రేక్షకుల్ని అలరించిన చిత్రాల్లో ‘శ్రీదేవి సోడా సెంటర్’ ఒకటి. వెండితెరపై అలరించిన ఈ చిత్రం ఇప్పుడు బుల్లితెరపై సందడి చేసేందుకు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ ‘జీ 5’లో నవంబరు 4 నుంచి స్ట్రీమింగ్ కానుంది. సుధీర్ బాబు, ఆనంది జంటగా నటించిన చిత్రమిది. ‘పలాస 1978’ ఫేమ్ కరుణ కుమార్ దర్శకత్వం వహించారు. -
ఆర్య కొత్త చిత్రం ప్రారంభం
తమిళంతో పాటు తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఉన్న నటుడు ఆర్య.ఆయన కథానాయకుడిగా నటిస్తున్న 33వ చిత్రం సోమవారం చెన్నైలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ది షో పీపుల్, థింగ్స్ స్టూడియోస్ సంస్థలు నిర్మిస్తున్న చిత్రం ఇది. నాయిగళ్ జాగ్రత్తై, మిరుదన్, టిక్ టిక్ టిక్, రెడీ వంటి సక్సెస్ ఫుల్ చిత్రాల దర్శకుడు శక్తి సౌందర్ రాజన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో నటి సిమ్రాన్, ఐశ్వర్య లక్ష్మి, త్యాగరాజన్, కావ్య శెట్టి, హరీష్ ఉత్తమన్, గోకుల్, భరత్ రాజ్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. దీనికి డి.ఇమాన్ సంగీతాన్ని, యువ ఛాయాగ్రహణాన్ని అందిస్తున్నారు. చదవండి: ‘లైగర్’ పాటలో విజయ్ డ్యాన్స్ ఇరగదీస్తున్నాడు: చార్మీ -
శ్రీలంక యువతి కేసులో కీలక మలుపు: హీరో ఆర్యకు బిగ్ రిలీఫ్
చెన్నె: తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని శ్రీలంక యువతి పెట్టిన కేసులో ప్రముఖ నటుడు ఆర్యకు భారీ ఊరట లభించింది. అసలు ఆ కేసుతో ఆర్యకు సంబంధం లేదని తేలింది. ఉద్దేశపూర్వకంగానే ఆర్యను ఇరికించారని పోలీసులు గుర్తించారు. అయితే ఆర్యపై ఆరోపణలు చేసిన వారిని పోలీసులు అరెస్ట్ చేయడంతో ఇంతటితో ఆవివాదం సద్దుమణిగింది. ఈ పరిణామంపై ఆర్య హర్షం వ్యక్తం చేస్తూ పెద్ద ఉపశమనం లభించింది అని పేర్కొన్నాడు. ఆ ఆరోపణలు తన మనసును గాయపరిచాయని తెలిపాడు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. శ్రీలంకకు చెందిన యువతి విద్జా జర్మనీలో ఉంటోంది. ఆర్య తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి రూ.70 లక్షలు తీసుకుని మోసం చేశాడని ఆమె జర్మనీలో ఉండే ఆన్లైన్లో పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతోపాటు ఆర్యతో చేసిన చాటింగ్ అంటూ కొన్ని స్క్రీన్షాట్ ఫొటోలు కూడా విడుదల చేసింది. చెన్నెలో ఆర్యను మూడు గంటల పాటు విచారించారు. ప్రస్తుతం ఈ కేసు కోర్టులో విచారణ జరుగుతోంది. ఆగస్టు 17వ తేదీకి విచారణ చేసింది. ఈ కేసుపై మరిన్ని విషయాలు తెలుసుకోవాలని పోలీసులకు ఆదేశించడంతో ఆర్యను విచారించారు. ఈ క్రమంలోనే తమిళనాడులోని చెన్నెలో కమిషనర్ ఎదుట ఆర్య ఆగస్టు 10వ తేదీన విచారణకు హాజరయ్యాడు. ఈ సందర్భంగా పలు విషయాలు పోలీసులు ఆరా తీశారు. నేరం ఏమీ చేయకపోవడంతో ఆర్య సానుకూలంగా పోలీసులు అడిగిన వాటికి సమాధానం ఇచ్చాడు. విచారణలో ఆర్య నేరం చేయలేదని తేలడంతో పోలీసులు మరో కోణంలో విచారణ చేపట్టారు. ఈ సమయంలో పలు సంచలన విషయాలు వెల్లడయ్యాయి. చెన్నెలోని పులియంతోపకు చెందిన మహమ్మద్ ఆర్మాన్, మహ్మద్ హుస్సేనీ ఇద్దరూ కలిసి ఆర్య పేరుతో నకిలీ వాట్సప్ క్రియేట్ చేశారు. ఆ వాట్సప్ ద్వారా శ్రీలంక యువతి విద్జాతో చాటింగ్ చేసి డబ్బులు దండుకున్నారు. పోలీసులు వారిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. (చదవండి: ఎంతటి దుస్థితి! అఫ్గాన్ మంత్రి నేడు డెలివరీ బాయ్గా) ఈ పరిణామంపై ఆర్య హర్షం వ్యక్తం చేశారు. నిజమైన నేరస్తులను పట్టుకున్నందుకు సైబర్ పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. తనపై వచ్చిన ఆరోపణలు మనసుని గాయపరిచిందని తెలిపారు. ఇప్పుడు ఎంతో ఉపశమనంగా ఉందని ట్వీట్ చేశాడు. తన మీద నమ్మకం ఉంచిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. తమిళ సినీ పరిశ్రమలో అగ్ర నటుడిగా ఉన్న ఆర్య తెలుగు సినీ ప్రేక్షకులకు సుపరిచితమే. వరుడు, రాజారాణి, వాడువీడు, ఇటీవల సారపట్టతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం విశాల్తో కలిసి ‘ఎనిమి’ సినిమా చేస్తున్నాడు. అయితే ఆర్యకు సయేషాసైగల్తో వివాహమైంది. వీరిది ప్రేమ వివాహం. ‘అఖిల్' సినిమాతో హీరోయిన్గా పరిచయమైన సాయేషా ఆర్యతో కలిసి ‘గజినీకాంత్' సినిమా చేసింది. ఆ సమయంలోనే ప్రేమాయణం సాగింది. 2019లో మార్చ్ 10వ తేదీన పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు. సయేషా వివాహం తరువాత సినిమాలు చేయలేదు. ఇటీవల సయేషా ఆడబిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. I would like to thank Commissioner of Police @chennaipolice_ Additional Commissioner of Police-Central Crime Branch and Cyber Crime Team of Chennai city for arresting the Real culprit. It was a real mental trauma which I never expressed. Love to everyone who believed in me 🤗 — Arya (@arya_offl) August 24, 2021 -
ఆకట్టుకున్న విశాల్, ఆర్యల ‘ఎనిమి’ ఫస్ట్ సింగిల్
యాక్షన్ హీరో విశాల్, మ్యాన్లీ స్టార్ ఆర్యల క్రేజీ కాంబినేషన్లో యాక్షన్ ఎంటర్టైనర్ రాబోతున్న చిత్రం ‘ఎనిమి. ఇది విశాల్ 30వ చిత్రం కాగా, ఆర్య 32వ సినిమా. ‘గద్దల కొండ గణేష్’ ఫేమ్ మృణాళిని రవి, మమతా మోహన్దాస్లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. విలక్షణ నటుడు ప్రకాశ్రాజ్ ఇందులో కీలక పాత్రలో నటించాడు. ఆనంద్ శంకర్ దర్శకత్వంలో మినీ స్టూడియోస్ పతాకంపై వినోద్ కుమార్ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మించాడు. ఇప్పటికే విడుదలైన టీజర్ అన్ని భాషలలో కలిపి 20 మిలియన్లకి పైగా వ్యూస్ సాధించింది. దీంతో ఈ సినిమాపై అంఛనాలను భారీగా పెరిగాయి. చదవండి: శ్రీవారిని దర్శించుకున్న మంచు మనోజ్, లక్ష్మి ప్రసన్న ఈ నేపథ్యంలో తాజాగా ఎనిమి చిత్రం నుండి బ్లాక్బస్టర్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ స్వరపరిచిన ‘పడదే.. పడదే’ ఫస్ట్ సింగిల్ను విడుదల చేశారు మేకర్స్. ‘అదిరే నిను చూసే కనులే నీ స్నేహం కోసం కదిలే..అదిగో నిను చూస్తేనే...’ అంటూ సాగే ఈ పాటకు అనంత్ శ్రీ రామ్ సాహిత్యం అందించగా పృథ్విచంద్ర ఫుల్ ఎనర్జీతో ఆలపించాడు. తమన్ క్యాచీ ట్యూన్ మరోసారి సంగీత ప్రియుల్ని ఆకట్టుకుంటోంది. విశాల్, మృణాలిని రవి మధ్య కెమిస్ట్రీ ఈ పాటకి హైలెట్గా నిలిచింది. ఈ పాటకు సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వస్తోంది. తెలుగు, తమిళం, హిందీ సహా మరికొన్ని భాషలలో ఈ చిత్రం సెప్టెంబర్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. చదవండి: బర్త్డే పార్టీలో అమ్మాయితో ఆర్జీవీ రచ్చ, వీడియో వైరల్ -
పెళ్లి చేసుకుంటానని మోసం: పోలీసుల ఎదుటకు హీరో ఆర్య
చెన్నె: తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని శ్రీలంక యువతి ప్రముఖ నటుడు ఆర్యపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో తమిళనాడులోని చెన్నెలో కమిషనర్ ఎదుట ఆర్య మంగళవారం ఉదయం 7 గంటల సమయంలో విచారణకు హాజరయ్యాడు. ఈ సందర్భంగా పలు విషయాలు పోలీసులు ఆరా తీశారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. శ్రీలంకకు చెందిన యువతి విద్జా జర్మనీలో ఉంటోంది. ఆర్య తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి రూ.70 లక్షలు తీసుకుని మోసం చేశాడని ఆమె జర్మనీలో ఉండే ఆన్లైన్లో పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతోపాటు ఆర్యతో చేసిన చాటింగ్ అంటూ కొన్ని స్క్రీన్షాట్ ఫొటోలు కూడా విడుదల చేసింది. చెన్నెలో ఆర్యను మూడు గంటల పాటు విచారించారు. ప్రస్తుతం ఈ కేసు కోర్టులో విచారణ జరుగుతోంది. ఆగస్టు 17వ తేదీకి విచారణ వాయిదా వేస్తూనే ఈ కేసుపై మరిన్ని విషయాలు తెలుసుకోవాలని పోలీసులకు ఆదేశించడంతో ఆర్యను విచారించారు. ఆర్య తెలుగు సినీ ప్రేక్షకులకు సుపరిచితమే. వరుడు, రాజారాణి, వాడువీడు, ఇటీవల సారపట్టతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం విశాల్తో కలిసి ‘ఎనిమి’ సినిమా చేస్తున్నాడు. అయితే ఆర్యకు సయేషా సైగల్తో వివాహమైంది. వీరిది ప్రేమ వివాహం. ‘అఖిల్' సినిమాతో హీరోయిన్గా పరిచయమైన సాయేషా ఆర్యతో కలిసి ‘గజినీకాంత్' సినిమా చేసింది. ఆ సమయంలోనే ప్రేమాయణం సాగింది. 2019లో మార్చ్ 10వ తేదీన పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు. సయేషా వివాహం తరువాత సినిమాలు చేయలేదు. ఇటీవల సయేషా ఆడబిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. -
హీరో ఆర్యను ప్రశంసించిన కమల్హాసన్
చెన్నై: సార్పట్ట పరంపరై చిత్ర యూనిట్ను నటుడు, మక్కల్ నీది మయ్యం పార్టీ అధ్యక్షుడు కమలహాసన్ అభినందించారు. నటుడు ఆర్య కథానాయకుడిగా పా.రంజిత్ తెరకెక్కించిన చిత్రం సార్పట్ట పరంపరై. ఇటీవల అమెజాన్ ప్రైమ్లో విడుదలైన ఈ చిత్రం అన్ని వర్గాల ఆదరణ పొందుతోంది. విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంటోంది. కాగా ఈ చిత్ర యూని ట్ను శనివారం కమలహాసన్ కలిసి ప్రత్యేకంగా అభినందించారు. ఈ చిత్రాన్ని తాను చూశానన్నారు. ఈ చిత్రం చూస్తున్నప్పుడు గత కాలాన్ని ప్రత్యక్షంగా చూస్తున్న భావన జరిగిందన్నారు. దర్శకుడు పా.రంజిత్ పనితీరును ప్రశంసించారు. -
ఏమ్మా నీకు అంత పొగరా? అడగడంతో ఖంగుతిన్నా..
సాక్షి, చెన్నై: ఏమ్మా నీకు అంత పొగరా? అని అడగడంతో ఖంగుతిన్నానని చెప్పారు సార్పట్ట కథానాయిక దుషారా విజయన్. ఇటీవల ఓటీటీలో విడుదలైన ఈ చిత్రం విశేష ప్రేక్షకాదరణ అందుకుంటోంది. ఈ సందర్భంగా ఆమె తన సంతోషాన్ని మీడియాతో పంచుకున్నారు. ‘దిండుగల్ జిల్లా కన్యాపురం గ్రామానికి చెందిన నేను ప్యాషన్ డిజైనింగ్ చేసే సమయంలో బోదై ఏరి బుద్ధిమారి చిత్రంలో ఓ చిన్న పాత్రలో నటించాను. ఐదేళ్ల కష్టానికి ఫలితంగా పా.రంజిత్ దర్శకత్వంలో సార్పట్ట చిత్రం అవకాశం వచ్చింది. ఓ రోజు రంజిత్ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది. మరుసటిరోజు ఆఫీసుకు రావాల్సిందిగా చెప్పారు. అయితే నేను ఆ ఫోన్కాల్ను నమ్మలేదు. రెండో రోజు మళ్లీ పోన్ చేసి నీకు అంత పొగరా? పా.రంజిత్ ఆఫీస్ నుంచి ఫోన్ చేస్తే రాలేదే అని ప్రశ్నించారు. దీంతో వెంటనే అక్కడికి వెళ్లాను. అడిషన్లో సెలెక్ట్ కావడంతో నటించే అవకాశం లభించింద’ని చెప్పుకొచ్చారు. -
పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చిన హీరోయిన్
కోలీవుడ్ హీరో ఆర్య భార్య, హీరోయిన సయేషా సైగల్ శుక్రవారం పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని హీరో విశాల్ ట్విటర్ ద్వారా తెలియజేశాడు. తాను మావయ్య అయ్యానని, చాలా ఎమోషనల్గా ఉందని చెబుతూ విశాల్ ఆర్య, సయేషాలకు అభినందనలు తెలిపారు. ‘ఈ వార్తను రివీల్ చేస్తున్నందుకు సంతోషంగా ఉంది. నా సోదరుడు ఆర్య, సాయేషా ఆడబిడ్డకు జన్మనిచ్చారు. అంకుల్ను అయినందుకు హ్యాపీ. షూటింగ్ మధ్యలో చెప్పలేని అనుభూతి కలిగింది. ఆర్య తండ్రిగా కొత్త బాధ్యతలు తీసుకున్నాడు. బిడ్డకు దేవుడి ఆశీర్వాదం ఉండాలి' అంటూ విశాల్ ట్వీట్ చేశాడు. కాగా, ఆర్య, విశాల్ కలిసి ప్రస్తుతం ‘ఎనిమీ’ సినిమాలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ హైదరబాద్లో జరుగుతుంది. ఆర్య, సయేషా సైగల్లది ప్రేమ వివాహం. ‘అఖిల్' అనే సినిమాతో హీరోయిన్గా పరిచయమైన సాయేషా.. ఆ తర్వాత ‘గజినీకాంత్' అనే మూవీలో ఆర్యతో కలిసి నటించింది. ఆ సమయంలోనే ఆర్యతో ప్రేమాయణం సాగించింది. 2019లో మార్చ్ 10న పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు. సయేషా వివాహం తరువాత సినిమాలు చేయలేదు. ఆమె ప్రెగ్నెన్సీ విషయం చాలా రహస్యంగా ఉంచారు. -
‘సార్పట్ట’ మూవీ రివ్యూ
టైటిల్ : సార్పట్ట జానర్ : పీరియాడికల్ స్పోర్ట్స్ డ్రామా నటీనటులు : ఆర్య, దుషారా విజయన్, పశుపతి, అనుపమ కుమార్, జాన్ కొక్కెన్ తదితరులు నిర్మాణ సంస్థలు : నీలం ప్రొడక్షన్స్, కె9 స్టూడియో నిర్మాతలు : షణ్ముగం దక్షన్ రాజ్ దర్శకత్వం : పా.రంజిత్ సంగీతం : సంతోష్ నారాయణ్ సినిమాటోగ్రఫీ : మురళి.జి ఎడిటర్ : సెల్వ ఆర్.కె విడుదల తేది : జూలై(22), 2021(అమెజాన్ ప్రైమ్ వీడియో) సూపర్ స్టార్ రజనీకాంత్తో ‘కబాలి’, ‘కాలా’లాంటి చిత్రాలతో క్రేజ్ తెచ్చుకున్న యంగ్ డైరెక్టర్ పా.రంజిత్. వైవిధ్యమైన చిత్రాలలో నటిస్తూ టాలీవుడ్, కోలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో ఆర్య. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన చిత్రం ‘సార్పట్ట’. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ఎలా ఉంది? బాక్సర్గా ఆర్య ఎలా నటించాడు? ఈ చిత్రంతోనైనా పా.రంజిత్ కమర్షియల్ సక్సెస్ అందుకున్నాడా? లేదా? రివ్యూలో చూద్దాం. కథ ఈ సినిమా కథ అంతా ఎమర్జెన్సీ కాలం(70వ దశకం)లో నడుస్తుంది. ఉత్తర చెన్నైలోని ఓ హార్బర్లో హమాలి కూలీగా పనిచేసే సమర అలియాస్ సామ్రాజ్యం(ఆర్య)కి చిన్నప్పటి నుంచి బాక్సింగ్ అంటే చాలా ఇష్టం. స్కూల్కి డుమ్మా కొట్టి మరీ బాక్సింగ్ పోటీలు చూడడానికి వెళ్లేవాడు. కొడుకు బాక్సింగ్ పోటీలకు వెళ్లడం మాత్రం తల్లి భాగ్యం(అనుపమ కుమార్)కు అస్సలు నచ్చదు. కానీ సమర మాత్రం తల్లి కళ్లు కప్పి బాక్సింగ్ పోటీలను చూసేందుకు వెళ్లేవాడు. కట్ చేస్తే.. ఒకరోజు బాక్సింగ్ క్రీడకు మారుపేరైన సర్పట్టా, ఇడియప్ప మధ్య జరిగిన బాక్సింగ్ పోటీలో సార్పట్ట ఓడిపోతుంది. దీంతో సార్పట్ట తరపున బాక్సింగ్ చేసి గెలుస్తానని సమర ప్రత్యర్థులకు సవాల్ విసురుతాడు. తన తల్లి మాటను పక్కన పెట్టి ఇడియప్ప పోటీదారైన వేటపులి(జాన్ కొక్కెన్)తో పోటీ పడేందుకు సిద్దమవుతాడు. అసలు సమర బాక్సర్ అవడానికి అతని తల్లికి ఎందుకు ఇష్టం లేదు? బాక్సింగ్ బరిలోకి దిగిన సమరకు ఎలాంటి ప్రతికూల పరిస్థితులు ఎదురయ్యాయి? తన ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమింగే గురువు రంగా కోసం సమర ఎలాంటి సహసం చేశాడు? బాక్సింగ్ పోటీల్లో రారాజుగా వెలుగొందుతున్న వేటపులిని సమరా ఓడించాడా? లేదా? అనేదే మిగతా కథ. నటీనటులు బాక్సర్గా ఆర్య అద్భుతంగా నటించాడు. సమర పాత్ర కోసం ఆర్య పడిన కష్టమంతా తెరపై కనిపిస్తుంది. బాక్సింగ్పై ఇష్టం ఉన్న యువకుడిగా, తల్లిమాటని జవదాటని కొడుకుగా తనదైన యాక్టింగ్తో అదరగొట్టేశాడు. అలాగే చెడు వ్యసనాలకు బానిసైన వ్యక్తిగాను ఆకట్టుకునే నటనను కనబరిచాడు. ఇక ఆర్య తర్వాత ఈ సినిమాలో బాగా పండిన పాత్ర పశుపతిది. గురువు రంగా అలియాస్ రంగయ్య పాత్రలో ఆయన ఒదిగిపోయాడు. ఈ సినిమాకు ఆయన స్పెషల్ ఎట్రాక్షన్ అని చెప్పొచ్చు. సమర భార్య పాత్రలో దుషారా విజయన్ సహజసిద్ధమైన నటనతో ఆకట్టుకుంది. వేటపులిగా జాన్ కొక్కెయ్ అదరగొట్టేశాడు. డాడీ పాత్రలో జాన్ విజయ్ అలరించాడు. అనుపమ కుమార్, షబ్బీర్ తదితురలు తమ పాత్రల పరిధిమేర నటించారు. విశ్లేషణ క్రీడా నేపథ్య చిత్రాలు ఇండియాలో ఇప్పటికే చాలా వచ్చాయి. ఆ కథలన్నింటిని ఒక్కసారి పరిశీలిసే.. ముందుగా హీరో సాధారణ వ్యక్తిగా ఉంటాడు. అతనిపై ఎవరికి ఎలాంటి అంచానాలు ఉండవు. కానీ ఏదో ఒక సంఘటన వల్ల హీరో ఆ క్రీడా రంగంలోకి సడెన్గా ఎంట్రీ ఇస్తాడు. అప్పుడు అతనిలోని మరో కోణం బయటపడుతుంది. ఒక ప్లాష్బ్యాక్... లక్ష్యం వెళ్తున్న హీరోకి అడ్డంకులు, చివరకు హీరో విజయం. ఇదే ప్రతి సినిమా నేపథ్యం. ‘సార్పట్ట’కూడా కొంచెం అటు,ఇటుగా అలాంటి కథే. బాక్సింగ్కి 70వ దశకం నాటి ఎమర్జెన్సీ పరిస్థితులను జోడించి చెప్పడం ఈ సినిమా స్పెషల్. అప్పటి బాక్సింగ్ సంస్కృతి ఎలా ఉండేదో తెరపై కళ్లకు కట్టినట్లు చూపించాడు దర్శకుడు పా.రంజిత్. ఇతర విషయాల జోలికి వెళ్లకుండా నేరుగా అసలు కథలోకి తీసుకెళ్లిపోయాడు. బాక్సింగ్ అంటే ఇష్టపడే ఒక యువకుడు తల్లి కోసం ఆ ఆటకు దూరంగా ఉండటం, అనుకోని సంఘటన వల్ల బాక్సర్గా మారి, ప్రత్యర్థులు చేసే కుట్రలను తిప్పికొడుతూ గురువుగారి మాట నిలబెట్టటం తదితర సన్నివేశాలను ఆసక్తిగా తీర్చిదిద్దాడు. అయితే క్రీడా నేపథ్యంలో తెరకెక్కే చిత్రాలకు ‘భావోద్వేగం’అతి ముఖ్యమైనది. అదే సినిమా జయాపజయాలను నిర్ణయిస్తాయి. సార్పట్టలో ఆ ‘ఎమోషన్’మిస్సయింది. ప్రేక్షకులకు ఉత్కంఠ కలిగించే సన్నివేశాలు కూడా పెద్దగా లేవు. సినిమా ఆరంభంలో కాస్త ఆసక్తికరంగానే అనిపించినా... కథలో, పాత్రల్లో ఒక నిలకడ లేకపోవడం ప్రతికూల అంశమే.సెకండాఫ్లో సాగదీత సీన్స్ సినిమాపై అభిప్రాయాన్ని మారుస్తాయి. అలాగే ఒక్కసారి కూడా బాక్సింగ్ కోచింగే తీసుకొని హీరో.. ఉన్నట్లుండి గ్లవ్స్ వేసుకొని అత్యుత్తమ బాక్సర్ని చితక్కొట్టడం కొంచెం అతిగా అనిపిస్తుంది. అన్నింటికీ మించి తెలుగు ప్రేక్షకులు ఇది మన సినిమా అని ఫీలయ్యే అవకాశం ఎక్కడా లేదు. కానీ ‘కబాలి’,‘కాలా’లాంటి విభిన్న చిత్రాలను అందించిన పా.రంజిత్.. ఈ సారి భిన్నంగా స్పోర్ట్స్ డ్రామాను ఎంచుకొని, దానికి పీరియాడికల్ టచ్ ఇచ్చి తీర్చిదిద్దిన విధానం బాగుంది. ఇక సాంకెతిక విషయానివస్తే.. స్పోర్ట్స్ డ్రామా చిత్రంలో ప్రేక్షకుడిని లీనం చేయడంలో నేపథ్య సంగీతాన్ని కీలక పాత్ర. ఆ విషయంలో సంతోష్ నారాయణ్ సక్సెస్ అయ్యాడు. తనదైన బీజీఎంతో కొన్ని సన్నివేశాలకు ప్రాణం పోశాడు. కానీ పాటలు మాత్రం ఆకట్టుకోలేకపోయాయనే చెప్పాలి. మురళి.జి సినిమాటోగ్రఫి చాలా బాగుంది. ఇక ఈ సినిమాకు ప్రధాన లోపం సెల్వ ఆర్.కె ఎడిటింగ్. సెకండాఫ్లో చాలా సన్నివేశాలకు కత్తెర వేయాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. ఫస్టాఫ్లో ఉన్న జోష్.. సెకండాఫ్లో ఉంటే ‘సార్పట్ట’ మరోస్థాయిలో ఉండేది. మొత్తంగా స్పోర్ట్స్ డ్రామా సినిమాలను ఇష్టపడే వారికి ‘సార్పట్ట’నచ్చుతుంది. ప్లస్ పాయింట్స్ ఆర్య, పశుపతి నటన నేపథ్య సంగీతం దర్శకత్వం ఫస్టాప్ మైనస్ పాయింట్స్ సెకండాఫ్లోని సాగదీత సీన్స్ సినిమా నిడివి ఊహకందే క్లైమాక్స్ - అంజి శెట్టె, సాక్షి వెబ్డెస్క్ -
నా కల నిజమైంది..అలా మారడం చాలెంజింగ్: హీరో ఆర్య
అది పెద్ద సవాల్ఆర్య హీరోగా ‘కబాలి’ ఫేమ్ పా. రంజిత్ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం ‘సారపట్ట పరంబరై’. ఈ నెల 22 నుంచి ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ కానున్న సందర్భంగా ఆర్య మాట్లాడుతూ– ‘‘ఒక స్పోర్ట్స్ ఫిల్మ్ చేయాలనుకుంటున్న నాకు రంజిత్ చెప్పిన ‘సారపట్ట పరంబరై’ కథ బాగా నచ్చింది. ఈ కథలో ఎమోషన్స్, ఫ్యామిలీ రిలేషన్స్ను బ్యాలెన్స్ చేస్తూ బాక్సింగ్ ఉంటుంది. జీవితాలను ప్రతిబింబిస్తుంది. 1975లో మద్రాస్లో ఉండే బాక్సింగ్ కల్చర్ని చూపించాం. బాక్సర్గా మారడం ఫిజికల్గా పెద్ద చాలెంజింగ్గా అనిపించింది. జాతీయ స్థాయి బాక్సర్ల దగ్గర శిక్షణ తీసుకున్నాను’’ అన్నారు. ఇంకా మాట్లాడుతూ – ‘‘నా మ్యారీడ్ లైఫ్ బాగుంది. ‘గజినీకాంత్, కాప్పాన్, టెడ్డీ’ చిత్రాల్లో సాయేషా (హీరోయిన్, ఆర్య భార్య), నేను కలిసి నటించాం. మంచి కథ దొరికితే మళ్లీ నటిస్తాం. తెలుగులో ‘వరుడు’, ‘సైజ్ జీరో’ చిత్రాల తర్వాత మరో సినిమా చేయాలని నాకూ ఉంది. మంచి స్క్రిప్ట్ కోసం ఎదురు చూస్తున్నాను’’ అన్నారు. -
ఓటీటీలోకి ఆర్య సర్పట్టా, ఆకట్టుకుంటున్న ట్రైలర్
తమిళ హీరో ఆర్య తాజా చిత్రం సర్పట్టా. స్పోర్ట్స్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం బ్రిటిష్ పాలనలోని ఇండియా కాలం నాటి సినిమాగా రూపొందింది. ఈ మూవీ నుంచి వచ్చిన ఫస్ట్లుక్, టీజర్లు సినిమాపై మరింత హైప్ను క్రియేట్ చేశాయి. ఇక ఆర్య లుక్కు అయితే విశేష స్పందన వచ్చింది. ఈ మూవీ వచ్చే వారం ఓటీటీలో విడుదల కానున్న సందర్భంగా ఈ రోజు ట్రైలర్ను విడుదల చేశారు. మూడు నిమిషాల నిడివిగల ఈ ట్రైలర్.. బాక్సింగ్లో గెలిచిన వాళ్లే తమ నాయకుడు అని ఊరి ప్రజలు మాట్లాడుకోవడంతో ప్రారంభం అవుతుంది. మొదట్లో ఊరంతా ఒకే వర్గంగా ఉండి బ్రిటిష్ వారితో బాక్సింగ్లో పోటీ చేసి గెలిచిన నాయకుడిని ఎన్నుకునేవాళ్ళు. ఆ తర్వాత మన భారతీయులు వాళ్లలోనే వర్గాలుగా ఏర్పడి మనవాళ్లతోనే కొట్లాడి నాయకుడిని ఎన్నుకోవడం మొదలవుతుంది. అలాంటి సమయంలో ఆ ఊరిలో వెనకబడిన జాతిగా పిలువబడి, అసలు పోటీకే అర్హత లేని వర్గం నుంచి ఆర్య పోటీలో ఎలా నిలబడి గెలిచాడన్నదే ఈ సినిమా కథగా ట్రైలర్ చూస్తుంటే తెలుస్తోంది. ఈ క్రమంలో ఆర్య ఎదుర్కొన్న పరిస్థితులు ఏంటి? జాతి వివక్ష ఎలా ఉంటుందనేది సినిమాలో చూడాల్సిందే. కాగా పా రంజిత్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని కే9(K9) స్టూడియోస్, నీలం ప్రొడక్షన్స్ బ్యానర్పై షణ్ముగం దక్షన్ రాజ్ నిర్మించారు. జులై 22న ఈ మూవీ అమెజాన్ ప్రైమ్లో విడుదల కానుంది. -
విశాల్, ఆర్యల భారీ మల్టిస్టారర్ ‘ఎనిమీ’ షూటింగ్ పూర్తి
యాక్షన్ హీరో విశాల్, మ్యాన్లీ స్టార్ ఆర్య కలిసి నటించిన లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘ఎనిమీ’. పది సంవత్సరాల క్రితం దర్శకులు బాలా తెరకెక్కించిన ‘వాడు–వీడు’ సినిమా తర్వాత మరోసారి వీరిద్దరు కలిసి నటిస్తోన్న చిత్రమిది. ఇది హీరో విశాల్కు 30వ చిత్రం కాగా, ఆర్యకు 32వ మూవీ. ‘గద్దల కొండ గణేష్’ ఫేమ్ మృణాళిని రవి హీరోయిన్గా నటిస్తోన్న ఈ చిత్రంలో విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ కీలక పాత్రలో నటించాడు. ఆనంద్ శంకర్ దర్శకత్వంలో మినీ స్టూడియోస్ పతాకంపై వినోద్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మించాడు. కాగా తాజాగా ‘ఎనిమీ’ మూవీ షూటింగ్ పూర్తయినట్లు హీరో విశాల్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. It’s a wrap for #Enemy shoot,all set 4 Teaser soon,so damn happy & elated 2 hv worked wit a lovely team Tnx to @anandshank,@RDRajasekar,@MusicThaman,cast,crew,Tnx 2 producer @vinod_offl 4 making this lovely project Love U @arya_offl so happy we are again in a fab film together pic.twitter.com/yXTqCWzIcS — Vishal (@VishalKOfficial) July 12, 2021 ఈ సందర్భంగా...‘ఎనిమీ చిత్రీకరణను విజయవంతగా పూర్తి చేశాం. టీజర్ విడుదలకు అంతా సిద్ధమైంది. ఇటువంటి లవ్లీ టీమ్తో వర్క్ చేసినందుకు సంతోషంగా ఉంది. ఆర్యతో కలిసి మళ్లీ వర్క్ చేసినందుకు ఆనందంగా ఉంది. ఇంత మంచి ప్రాజెక్ట్లో భాగమైన దర్శకుడు ఆనంద్శంకర్, మ్యూజిక్ డైరెక్టర్ తమన్, కెమెరామ్యాన్ ఆర్డి రాజశేఖర్, నిర్మాత వినోద్ కుమార్లతో పాటు చిత్రయూనిట్ సభ్యులందరికి ధన్యవాదలు’ అంటూ విశాల్ రాసుకొచ్చాడు. కాగా ఈ చిత్రానికి మ్యూజిక్ సెన్సేషన్ ఎస్ఎస్ తమన్ స్వరాలు సమకూరుస్తున్నాడు. తెలుగు, తమిళంతో పాటు మరిన్ని భాషల్లో ఈ మూవీ విడుదల కానుంది. వీలైనంత త్వరగా పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా పూర్తి చేసి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ప్లాన్ చేస్తున్నట్లు చిత్ర బృందం పేర్కొంది. -
బాక్సర్ అవతారంలో కిక్ ఇవ్వనున్న హీరోలు
తెరపై విలన్ ముఖం మీద హీరో ఒక్క కిక్ ఇస్తే.. చూసే ఆడియన్స్కి ఓ కిక్. హీరో వరుసగా కిక్ల మీద కిక్లు కొడుతుంటే.. ప్రేక్షకులకు దక్కే కిక్కే వేరు. కొందరు హీరోలు ఆ కిక్ ఇవ్వనున్నారు. బాక్సర్ అవతారంలో కిక్ ఇవ్వనున్న ఆ హీరోల గురించి తెలుసుకుందాం. యూత్ స్టార్ విజయ్ దేవరకొండ తన తొలి ప్యాన్ ఇండియన్ మూవీ ‘లైగర్’ కోసం బాక్సర్ అవతారం ఎత్తారు. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం కోసం బాక్సింగ్లో శిక్షణ తీసుకున్నారు విజయ్. దీంతో ‘లైగర్’ సినిమాలో బాక్సింగ్ ఎపిసోడ్స్తో పాటు యాక్షన్ సీక్వెన్స్ కూడా అదిరిపోతాయని ఊహించవచ్చు. ఈ చిత్రాన్ని సెప్టెంబరు 9న రిలీజ్ చేయనున్నట్లు గతంలో చిత్ర బృందం ప్రకటించిన విషయం తెలిసిందే. కోవిడ్ సెకండ్ వేవ్ కారణంగా ‘లైగర్’ షూటింగ్కు కాస్త అంతరాయం కలిగింది. త్వరలో మళ్లీ చిత్రీకరణ ఆరంభించనున్నారు. ఇక తొలి స్పోర్ట్స్ ఫిల్మ్ ‘గని’ చేస్తున్నారు వరుణ్ తేజ్. ఇందులో బాక్సర్ గని పాత్రలో కనిపిస్తారు వరుణ్. లాక్డౌన్ సమయాల్లో తన సమయం అంతా బాక్సింగ్ ప్రాక్టీస్తోనే గడిచిపోయిందని వరుణ్ పలు సందర్భాల్లో సోషల్ మీడియా ద్వారా తెలిపారు. దీన్నిబట్టి ‘గని’లో వరుణ్ నుంచి సాలిడ్ బాక్సింగ్ సీన్స్ను ఆశించవచ్చు. కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ సగానికి పైగా పూర్తయింది. ఈ చిత్రాన్ని ఈ ఏడాదే విడుదల చేయాలనుకుంటున్నారు. 2013లో హీరో ఫర్హాన్ అక్తర్, దర్శకుడు ఓం ప్రకాష్ మెహ్రా కాంబినేషన్లో వచ్చిన ‘భాగ్ మిల్కా భాగ్’ చిత్రం ఎంత గొప్ప విజయాన్ని సాధించిందో తెలిసిందే. ఈ చిత్రంలో అథ్లెట్గా కనిపించారు ఫర్హాన్. ఇప్పుడు ‘తుఫాన్’ కోసం వీరి కాంబినేషన్ రిపీటైంది. అయితే ‘తుఫాన్’లో ఫర్హాన్ బాక్సర్గా కనిపించనున్నారు. ఈ చిత్రం జూలై 16 నుంచి ఓటీటీ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్ కానుంది. అటు తమిళ హీరో ఆర్యను బాక్సింగ్ రింగులో దింపారు ‘కబాలి’ ఫేమ్ పా. రంజిత్. వీరి కాంబినేషన్లో వస్తున్న ‘సారపటై్ట పరంపర’లో ఆర్య బాక్సర్గా నటిస్తున్నారు. ఈ సినిమా కోసం ఆర్య శిక్షణ కూడా తీసుకున్నారు. 1980 కాలంలోని బాక్సింగ్ కల్చర్ను ఈ సినిమాలో చూపించనున్నారు రంజిత్. ‘బ్రూస్లీ, సాహో’ వంటి చిత్రాల్లో నటించిన అరుణ్ విజయ్ హీరోగా తమిళంలో ‘బాక్సర్’ తెరకెక్కింది. ఇందులో రితికా సింగ్ ఓ హీరోయిన్. ‘గురు’లో బాక్సర్గా కనిపించిన రితికా ఈ సినిమాలోనూ ఆ పాత్ర చేశారు. ఆమె నిజంగా కూడా బాక్సర్ అనే విషయం తెలిసిందే. ఇటు సౌత్ అటు నార్త్లో ఈ బాక్సర్లు కొట్టే కిక్లకు వసూళ్ల కిక్ ఖాయం అనే అంచనాలున్నాయి. -
చిరు-అక్కీ-ఫిక్కీ.. ఓ మంచిపని
కరోనా టైంలో సినీ సెలబ్రిటీల సాయంపై కొందరు విమర్శలు గుప్పిస్తున్నా.. వాళ్లు మాత్రం తమ పని తాము చేసుకుంటూ పోతున్నారు. టాలీవుడ్లో మెగాస్టార్ చిరంజీవి, బాలీవుడ్లో అక్షయ్కుమార్ సెకండ్ వేవ్లో భారీగా సాయం అందిస్తున్న లిస్ట్లో ఉన్నారు కూడా. అయితే ఈ అగ్ర హీరోలు ఇప్పుడు మరో మంచి పనిలో భాగం కాబోతున్నారు. ‘ద ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ’ (ఫిక్కీ) మీడియా నిర్వహించే ఓ అవేర్నెస్ క్యాంపెయిన్లో వీళ్లు భాగం కాబోతున్నారు. బాలీవుడ్ సీనియర్ హీరో అక్షయ్ కుమార్ ఈ కార్యక్రమానికి నేతృత్వం వహించబోతున్నాడు. ఈ క్యాంపెయిన్ పేరు ‘కరోనా కో హరానా హై’(కరోనాను ఓడిద్దాం). ఇక మిగతా భాషల నుంచి కూడా అగ్రహీరోలను ఇందుకోసం ఎంపిక చేశారు. టాలీవుడ్ నుంచి మెగాస్టార్ చిరంజీవి రిప్రజెంట్ చేస్తుండగా, కోలీవుడ్ నుంచి ఆర్య, కన్నడ నుంచి పవర్ స్టార్ పునీత్ రాజ్కుమార్లు ఇందులో పాల్గొనబోతున్నారు. ‘హర్ ఘర్ నే థానా హై, కరోనా కో హరానా హై’ను తమ తమ భాషల్లో చెప్పబోతున్నారు ఈ అగ్రహీరోలు. ఈ మహమ్మారి టైంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో, మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి లాంటి నిపుణుల సలహాలను వీళ్లు ప్రచారం చేయనున్నారు. మరాఠీ, పంజాబీ, భాషల్లోనూ ఆయా స్టార్లతో ప్రచారం చేయించబోతున్నారు. జూన్ 5 నుంచీ టీవీ, పేపర్, ఇంటర్నెట్ లాంటి మాస్ మీడియా ప్లాట్ ఫామ్స్ పైన వీళ్లు క్యాంపెయిన్లో పాల్గొనే స్పెషల్ కరోనా అవేర్ నెస్ యాడ్స్ ప్రసారం అవుతాయి. ఈ కరోనా టైంలో అందరం హెల్త్వర్కర్స్కి కృతజ్ఞతలు చెప్పుకోవాలి. అలాగే కరోనాపై పోరాటం కొనసాగించాలి. అగ్రహీరోల ద్వారా నడిపించే ఈ క్యాంపెయిన్.. మరింత ప్రభావితంగా ఉంటుందని భావిస్తున్నాం అని ఫిక్కీ చైర్పర్సన్ సంజయ్ గుప్తా ఒక ప్రకటనలో తెలిపారు. చదవండి: సత్యదేవ్కి జాక్పాట్ -
Arya@17: అల్లు అర్జున్ ఎమోషనల్ ట్వీట్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటీవ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన తొలి చిత్రం ఆర్య. 2004లో వచ్చిన ఈ చిత్రం ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికి తెలిసిందే.ఈ సూపర్ హిట్ మూవీ విడుదలై నేటికి(మే 7) 17 ఏళ్లు అవుతుంది. ఈ సందర్భంగా అల్లు అర్జున్ ఓ ఎమోషనల్ ట్వీట్ చేశాడు. ఆర్య సినిమా తనతో పాటు చాలా మంది జీవితాన్ని మలుపు తిప్పిదంటూ బావోధ్వేగ లేఖను ట్వీట్ చేశాడు. 17 years of ARYA today pic.twitter.com/YnOs5jDRDL — Allu Arjun (@alluarjun) May 7, 2021 ‘ఆర్య చిత్రం విడుదలై నేటికి 17 ఏళ్లు అవుతుంది. నా లైఫ్ చేంజింగ్ చిత్రాలలో ఇది కూడా ఒకటి. జీవితంలో జరిగిన గొప్ప అద్భుతం. ఫీల్ మై లవ్ అనే బంగారు పదాలను నేను పలికిన తర్వాత ప్రేక్షకులు నాపై ప్రేమను కురిపించడం మొదలు పెట్టారు.ఈ సినిమా కొందరి జీవితాలనే మార్చేసింది. నటుడిగా నాకు, డైరెక్టర్గా సుకుమార్కి, నిర్మాతగా దిల్రాజుకి, సంగీత దర్శకుడిగా దేవీశ్రీప్రసాద్(డీఎస్పీ), డీఓపీగా రత్నవేలు, డిస్ట్రీబ్యూటర్గా బన్నీవాసు.. ఇలా చాలా మంది జీవితాలను మార్చేసింది. ఇలాంటి మంచి హిట్ మాకిచ్చిన ప్రేక్షకులందరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అని అల్లు అర్జున్ అన్నారు. Thank you & Gratitude Forever 💙 pic.twitter.com/9tVshZNQAU — Allu Arjun (@alluarjun) May 7, 2021 -
నేడు ఆర్య అప్కమింగ్ మూవీ ఫస్ట్లుక్
అరణ్మణై–3 చిత్ర ఫస్ట్లుక్ పోస్టర్ను గురువారం విడుదల చేయనున్నట్లు చిత్ర వర్గాలు వెల్లడించారు. దర్శకుడు సుందర్ సి తెరకెక్కిస్తున్న చిత్రం అరణ్మణై –3. ఈయన ఇంతకుముందు రూపొందించిన అరణ్మణై–, 1, 2 చిత్రాలు మంచి ప్రేక్షకాదరణ పొందాయి. దీంతో తాజాగా అరణ్మణై–3 చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇది కూడా రెండు చిత్రాల తరహాలోనే హర్రర్, కామెడీ, థ్రిల్లర్ ఇతి వృత్తంతో రూపొందుంతున్న చిత్రమే అని దర్శకుడు సుందర్ సి తెలిపారు. ఇందులో ఆర్య కథానాయకుడిగా నటించగా, రాశిఖన్నా, ఆండ్రియా, సాక్షి అగర్వాల్ ముగ్గురు కథానాయికలుగా నటించారు. నటుడు వివేక్, యోగిబాబు ముఖ్య పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి సత్య సంగీతం అందించారు. చిత్ర ఫస్ట్లుక్ మోషన్ పోస్టర్లను గురువారం విడుదల చేయనున్నట్లు చిత్ర వర్గాలు వెల్లడించారు. -
Vishal: దుబాయ్ టు చెన్నై
దాదాపు 30 రోజులు ‘ఎనిమీ’ షూటింగ్ కోసం దుబాయ్లో ఉన్నారు హీరో విశాల్. దుబాయ్ షెడ్యూల్ పూర్తి కావడంతో ఈ చిత్రబృందం చెన్నైకి బయలుదేరింది. ఈ షెడ్యూల్లో మేజర్గా యాక్షన్ సీక్వెన్సెస్ను షూట్ చేశారు. ఆనంద్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఎనిమీ’ చిత్రంలో హీరో ఆర్య మరో లీడ్ క్యారెక్టర్ చేస్తున్నారు. ఈ సినిమా నెక్ట్స్ షెడ్యూల్ చెన్నైలో ప్రారంభం కానుంది. ఇందులో మృణాళినీ రవి, మమతా మోహన్దాస్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా ఈ ఏడాదే థియేటర్స్లో విడుదల కానుంది. ఈ సంగతి ఇలా ఉంచితే.. బాలా దర్శకత్వంలో వచ్చిన ‘అవన్ ఇవన్ ’(2011) (తెలుగులో ‘వాడు–వీడు’) తర్వాత విశాల్, ఆర్య కలిసి నటిస్తున్న చిత్రం ఇదే కావడం విశేషం. -
నటుడు ఆర్యకు ముందస్తు బెయిల్ ఇవ్వొద్దు!
సాక్షి, చెన్నై: తమిళ నటుడు ఆర్యకు ముందస్తు బెయిల్ మంజూరు చేయకూడదని శ్రీలంకకు చెందిన మహిళ మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జెమినిలో నివసిస్తున్న శ్రీలంకకు చెందిన ఓ యువతి ఆర్య తనను వివాహం చేసుకుంటానని చెప్పి రూ.70 లక్షలు తీసుకుని మోసం చేశారని ఆరోపిస్తూ పీఎం, సీఎం, హోం మినిస్టర్ కార్యాలయాలకు లేఖ రాశారు. దీంతో ఆర్య అనుచరుడు మహమ్మద్ అర్మన్ ముందస్తు బెయిల్ కోరుతూ మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే వారికి బెయిల్ ఇవ్వకూడదని కోరుతూ యువతి మరో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ శుక్రవారం న్యాయమూర్తి సెల్వ కుమార్ సమక్షంలో విచారణకు వచ్చింది. విచారణను ఏప్రిల్ 4వ తేదీకి వాయిదా వేశారు. చదవండి: షారుఖ్తో సినిమా.. ముంబైలో ఆఫీస్ వెతుకుతున్న డైరెక్టర్ -
ఆర్య 2 ఆరంభం
‘ఆర్య’ వెబ్సిరీస్ సెకండ్ సీజన్ స్టార్ట్ అయ్యింది. సుష్మితా సేన్ ప్రధాన పాత్రలో రామ్ మద్వానీ, సందీప్ మోడీ, వినోద్ రావత్ సంయుక్త దర్శకత్వంలో రూపొందిన ‘ఆర్య’ వెబ్సిరీస్ గత ఏడాది జూలైలో ఓటీటీ ప్లాట్ఫామ్లో విడుదలైంది. ఈ వెబ్ సిరీస్కు మంచి వ్యూయర్షిప్ లభించింది. దీంతో వెంటనే ‘ఆర్య’ వెబ్సిరీస్కు సెకండ్ సీజన్ ను అనౌ¯Œ ్స చేశారు. తొలి సీజన్ లో సుష్మితా సేన్ తో పాటు చంద్రాచూడ్ సింగ్, నమిత్ దాస్, వికాస్ కుమార్ ప్రధాన పాత్రలు పోషించారు. మరి.. సెకండ్ సీజన్ లో కూడా వీరు కనిపిస్తారా? లెట్స్ వెయిట్ అండ్ సీ. -
విశాల్ వర్సెస్ ఆర్య
దర్శకుడు బాల తెరకెక్కించిన ‘వాడు వీడు’ చిత్రంలో అన్నదమ్ములుగా నటించారు విశాల్, ఆర్య. ఇప్పుడు ఒకరితో ఒకరు తలపడనున్నారు. ఆనంద్ శంకర్ దర్శకత్వంలో విశాల్, ఆర్య హీరోలుగా ఓ మల్టీస్టారర్ చిత్రం తెరకెక్కనుంది. ఇది యాక్షన్ ఎంటర్టైనర్ అని సమాచారం. ఈ సినిమాలో విశాల్, ఆర్య ఒకరి మీద మరొకరు ఎత్తులు, పైఎత్తులు వేసుకోనున్నారట. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఈ సినిమా చిత్రీకరణను ప్రారంభించారు. చిత్రీకరణలో పాల్గొంటున్న వీడియోను షేర్ చేసి, ‘‘మళ్లీ సెట్స్లోకి అడుగుపెట్టడం సంతోషంగా ఉంది. కొత్త టీమ్. కొత్త లుక్. కొత్త సినిమా’’ అన్నారు విశాల్. ఇందులో ‘గద్దలకొండ గణేష్’ ఫేమ్ మృణాళినీ రవి హీరోయిన్గా కనిపించనున్నారని టాక్. ఈ చిత్రానికి తమన్ సంగీత దర్శకత్వం వహిస్తున్నారు. -
ప్రముఖ నటుడికి కోర్టు నోటీసులు
తమిళ సినిమా: నటుడు ఆర్యకు అంబా సముద్రం కోర్టు నోటీసులు జారీ చేసింది. ఏమిటి ఎలాంటి వివాదాల్లో చిక్కుకోని ఆర్యకు కోర్టు నోటీసులు ఇవ్వడం ఏమిటని ఆశ్చర్యంగా ఉందా? నటీనటులు వివాదాలు చిక్కుకుపోయినా వారు నటించిన చిత్రాలు వివాదాంశం కావచ్చు కదా! అదేవిధంగా 9 ఏళ్ల క్రితం ఆర్య నటించిన అవన్ ఇవన్ చిత్రం ఆయన్ని ఇప్పుడు కోర్టుకు లాగుతోంది. బాల దర్శకత్వంలో విశాల్, ఆర్య కలిసి నటించిన చిత్రం అవన్ ఇవన్. ఈ చిత్రంలో సింగంపట్టి జమీన్ను అవమానపరిచే సన్నివేశాలు చోటుచేసుకున్నాయంటూ నెల్లై జిల్లా, అంబాసముద్రం కోర్టులో అప్పట్లో పిటిషన్ దాఖలైంది. ఆ పిటిషన్ శుక్రవారం కోర్టులో విచారణకు వచ్చింది. ఆర్య ఈ నెల 28న హాజరు కావాల్సిందిగా అంబాసముద్రం కోర్టు ఆయనకు నోటీసులు జారీ చేసింది. -
ముచ్చటైన జంట ఆర్య, సాయేషా ఫోటోలు
-
క్లాసికల్ డ్యాన్స్తో అదరగొట్టిన సాయేషా
కరోనా లాక్డౌన్తో ఇళ్లకే పరిమితమైన సినీ ప్రముఖుల్లో చాలా మంది సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటున్నారు. ప్రముఖ తమిళ హీరో ఆర్య సతీమణి, హీరోయిన్ సాయేషా సైగల్ కూడా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారనే సంగతి తెలిసిందే. తాజాగా ఓ సాంగ్కు క్లాసికల్ డ్యాన్స్ చేస్తున్న వీడియోను ఆమె ట్విటర్లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్గా మారింది. ఇది చూసిన అభిమానులు సాయేషా డ్యాన్స్ అద్భుతంగా ఉందంటూ ఆమెపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. సాయేషా గతంలో కూడా తన డ్యాన్స్ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. (చదవండి : యువ దర్శకుడు మృతి.. విషాదంలో శంకర్) కాగా, బాలీవుడ్ దిగ్గజ నటుడు దిలీప్కుమార్ మనవరాలైన సాయేషా.. తెలుగు చిత్రం అఖిల్తో వెండితెరకు పరిచమయ్యారు. అయితే ఆ చిత్రం ఆశించిన స్థాయిలో విజయవంతం కాకపోవడంతో.. తెలుగులో ఆమెకు అవకాశాలు అంతగా రాలేదు. అఖిల్ అనంతరం బాలీవుడ్లో అజయ్ దేవగణ్.. శివాయ్ చిత్రంలో నటించారు. ఆ తర్వాత ఆమె తమిళంలో పలు చిత్రాల్లో నటించారు. గతేడాది హీరో ఆర్యను వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం ఆమె రెండు చిత్రాల్లో నటిస్తున్నారు. ఇందులో ఒకటి తమిళ చిత్రం కాగా, మరోకటి కన్నడ చిత్రం. -
బన్నీ, ఆర్యలకు శ్రియ చాలెంజ్..
కరోనా కట్టడిలో భాగంగా కొనసాగుతున్న లాక్డౌన్తో సామాన్యుల నుంచి మొదలుకుని సెలబ్రిటీల వరకు అందరు ఇళ్లకే పరిమితమైన సంగతి తెలిసిందే. అయితే ఈ సమయంలో ఇళ్లకే పరిమితమైన పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా కరోనాపై జనాల్లో అవగాహన పెంచడమే కాక, అభిమానులకు వినోదాన్ని అందించేలా పలు పోస్ట్లు చేస్తున్నారు. ఈ క్రమంలోనే హీరోయిన్ శ్రియ సరికొత్త చాలెంజ్కు శ్రీకారం చుట్టారు. తన భర్త అండ్రీ కొచ్చిన్ కిచెన్లో వంట పాత్రలను శుభ్రం చేస్తున్న ఓ వీడియోను శ్రియ ఇన్స్ట్రాగ్రామ్లో షేర్ చేశారు. ఈ చాలెంజ్ను(బార్తన్ సాఫ్ కరో) స్వీకరించాల్సిందిగా హీరోలు అల్లు అర్జున్, ఆర్యలతో పాటు పలువురిని నామినేట్ చేశారు. వారి అందమైన భార్యల కోసం పాత్రలు శుభ్రం చేసిపెట్టాలని ఈ సందర్భంగా శ్రియ చాలెంజ్ విసిరారు. ‘నేను నా భర్తను ఎందుకు పెళ్లి చేసుకున్నానో తెలుసా?. ఎందుకంటే.. నాకు వంట పాత్రలను కడగటం ఇష్టం ఉండదు. పెళ్లైనా మగవాళ్లు అందరూ.. వారి అందమైన భార్యలకు సాయం చేయాలని నేను చాలెంజ్ విసురుతున్నాను. నేను నా స్నేహితులు కొందరని ఈ చాలెంజ్కు నామినేట్ చేస్తున్నాను’ అని శ్రియా తెలిపారు. కాగా, తెలుగు, తమిళ భాషల్లో హీరోయిన్గా తనదైన ముద్ర వేసిన శ్రియ.. 2018లో ఆండ్రీ కొచ్చివ్ అనే బార్సిలోనా టెన్నిస్ ప్లేయర్ను ఆమె వివాహం చేసుకున్నా సంగతి తెలిసిందే. View this post on Instagram Bartan saaf karo.... So I nominate @therahulaggarwal @rahullings @atulkasbekar @ashishchowdhryofficial @anishchanana @satyasees @aarti.ravi @alluarjunonline @najafkhan1 @neerjasaran @sshauryaa23 @aryaoffl A post shared by Shriya Saran (@shriya_saran1109) on Apr 2, 2020 at 3:52am PDT -
నువ్వు లేని జీవితాన్ని ఊహించలేను!
చెన్నై : నువ్వు లేని జీవితాన్ని కలలో కూడా ఊహించుకోలేను అని నటి సాయేషా సైగల్ పేర్కొంది. ఈ అమ్మడు ఎవరి గురించి ఇలా చెప్పిందో ఊహించవచ్చు. ఎస్ తన భర్త ఆర్య గురించే అలా తన భావాన్ని వెల్లడించింది. ఈ ఉత్తరాది బ్యూటీ తొలుత తెలుగులో అఖిల్ చిత్రంతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి ఆ తరువాత, తమిళంలోకి దిగుమతి అయిన విషయం తెలిసిందే. కోలీవుడ్లో తొలి చిత్రంతోనే మంచి గుర్తింపును తెచ్చుకున్న నటి సాయేషా. ఆ తరువాత నటుడు ఆర్యతో కలిసి గజనీకాంత్ చిత్రంలో జత కట్టింది. ఆ చిత్రమే వారిద్దరిని నిజ జీవితంలో ఆలుమగలను చేసింది. అవును గజనీకాంత్ చిత్రంతో పరిచయం ఆర్య, సాయేషాసైగల్ల మధ్య ప్రేమకు దారి తీయడం,ఆ వెంటనే ఇరుకుటుంబాల సమ్మతంతో పెళ్లి చేసుకోవడం చాలా సైలెంట్గా జరిగిపోయాయి. 2019, మార్చి 10 తేదీ ఈ జంట నిజజీవితంలో ఒకటైన రోజు అంటే మంగళవారానికి సరిగ్గా వివాహ తొలి వార్షికోత్సవాన్ని జరుపుకున్నారు. కాగా ఈ సందర్భంగా ఆర్య, సాయేషా తాజాగా కలిసి నటిస్తున్న టెడీ చిత్ర టీజర్ను విడుదల చేశారు.ఇదో విశేషం అయితే తొలి వివాహ వార్షికోత్సవాన్ని పూర్తి చేసుకున్న ఈ జంటకు పలువురు సినీ ప్రముఖులు, స్నేహితులు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆర్య గురించి సాయేషా తన ట్విట్టర్లో ఒక ట్వీట్ చేసింది. అందులో నన్ను అన్ని విధాలుగా సంపూర్ణం చేసిన మనిషికి పెళ్లి రోజు శుభాకాంక్షలు. నువ్వు లేని జీవితాన్ని ఊహించలేను. ప్రేమ,ఉత్సాహం, స్థిరత్వం, స్నేహం అన్నీ ఒకేసారి లభించాయి. నేను నిన్ను ఇప్పటికీ, ఎప్పటికీ ఇష్టపడతాను అని పేర్కొంది.అందుకు నటుడు ఆర్య బదులిస్తూ ఎప్పటికీ అన్నది భవిష్యత్ కాలం. అయితే దాన్ని నీతో గడపడానికి ఎలాంటి సంకోచంలేదు. నేను నేనుగా ఉండడానికి కారణం నువ్వే. నేను నిన్ను ఎంతగానే ప్రేమిస్తున్నాను. నువ్వు నువ్వుగా ఉండడానికి ధన్యవాదాలు. పెళ్లి రోజు శుభాకాంక్షలు అని ఆర్య పేర్కొన్నారు. వీరు ఒకరికొకరుఇలా ప్రేమ నిండిన మనసుతో శుభాకాంక్షలు తెలుపుకున్న విషయాలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. -
‘నువ్వు లేకుండా జీవితాన్ని ఊహించలేను’
తమిళ నటుడు ఆర్య, నటి సయేషా సైగల్ ప్రేమ వివాహం చేసుకొని ఈ రోజుతో ఏడాది పూర్తి అవుతోంది. కొంతకాలం ప్రేమించుకున్న ఈ జంట గతేడాది మార్చి 10న వివాహ బంధంతో ఒకటయ్యారు. మొదటి వార్షికోత్సవం సందర్భంగా ఈ క్యూట్ కపూల్కి సెలబ్రిటీలు, అభిమానులు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ శుభ సందర్భంగా సాయేషా, ఆర్య ఇద్దరూ ఒకరిమీద ఒకరికి ఉన్న ప్రేమను చాటుకున్నారు. ఇద్దరు కలిసి ప్రేమగా దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ('ఆయన బాడీని చూస్తుంటే ఇండియన్ టైసన్లా') ఈ మేరకు.. ‘నా జీవితాన్ని పరిపూర్ణం చేసిన వ్యక్తికి పెళ్లి రోజు శుభాకాంక్షలు. నువ్వు లేకుండా నా జీవితాన్ని అస్సలు ఊహించలేను జాన్. అన్ని వేళలా నువ్వు చూపే ప్రేమ అమూల్యమైనది. ఇప్పుడు.. ఎప్పటికీ నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను. బెస్ట్ హస్బెండ్’ అంటూ ఆర్య మీద ఉన్న ప్రేమను సయేషా సైగల్ తెలియ జేశారు. అలాగే ఆర్య ‘ఎల్లకాలం అనే పదం చాలా పెద్దది. కానీ నేను నీతో ఉన్నప్పుడు సమయమే గుర్తురాదు. నీవల్ల నేను ఇంకా ఎక్కువ ఆనందంగా ఉన్నాను. నా జీవితంలోకి వచ్చినందుకు ధన్యవాదాలు. లవ్ యూ సోమచ్ మై జాన్. హ్యాపీ యానివర్సరీ’ అంటూ భార్యకు వివాహ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపాడు. తమిళ్, హిందీ చిత్రాల్లో నటించిన సాయేషా.. ‘అఖిల్’ సినిమాతో టాలీవుడ్లోనూ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆమె బాలీవుడ్ దిగ్గజ నటుడు దిలీప్ కుమార్ మనువరాలు. గజినీకాంత్ చిత్రంలో కలిసి నటించిన ఆర్య, సయేషా.. ఈ సినిమా షూటింగ్ సమయంలోనూ ప్రేమలో పడ్డారు. అనంతరం ఇరు కుటుంబాలను ఒప్పించి గతేడాది పెళ్లి పీటలెక్కారు. ఆర్య ప్రస్తుతం ‘టెడీ’ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో ఆయన భార్య సాయేషా సైగల్నే హీరోయిన్గా నటించడం విశేషం. ఈ రోజే సినిమా టీజర్ విడుదలవ్వడం మరో విశేషం. Happy Anniversary to the man who completes me in every way possible! Life without you is unimaginable jaan. Love, excitement, stability and companionship all at the same time! I love you now and forever! ❤️😘😍#besthusband @arya_offl pic.twitter.com/MPUx5HJ3JU — Sayyeshaa (@sayyeshaa) March 10, 2020 Forever is a long time but I don’t mind spending it with you 😉😉🤗🤗😍😘😘🤩🤩 I am more of me because of you .. love u so much my jaan 🤗🤗😘 thanks for being you .. Happy Anniversary 🤗🤗😘😘 https://t.co/Je0LkI5f4k — Arya (@arya_offl) March 10, 2020 -
'ఆయన బాడీని చూస్తుంటే ఇండియన్ టైసన్లా'
పాత్రలకు తగ్గట్టుగా మారడానికి హీరోలు చాలా శ్రమపడుతున్నారు. ఆరు పలకలు, ఎనిమిది పలకలు అంటూ కఠిన కసరత్తులతో బాడీని మార్చుకుంటున్నారు. అలాంటి వారిలో నటుడు ఆర్య చేరారు. ఈయన ఇప్పటి గెటప్ చూస్తే ఆర్యనేనా అని ఆశ్చర్యపడతారు. ఇటీవల కాప్పాన్ చిత్రంలో కనిపించిన ఆర్య ప్రస్తుతం టెడీ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో ఆయన భార్య సాయేషాసైగల్నే హీరోయిన్గా నటించడం విశేషం. ఈ చిత్రం త్వరలో తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. కాగా తాజాగా పా.రంజిత్ దర్శకత్వంలో నటించడానికి ఆర్య రెడీ అవుతున్నారు. ఈ చిత్రం కోసమే ఆయన బాడీ బిల్డర్గా మారారు.దర్శకుడు పా.రంజిత్ రజనీకాంత్ హీరోగా తెరకెక్కించిన కాలా తరువాత పిర్చా ముండా అనే చిత్రాన్ని తెరకెక్కించడానికి సన్నాహాలు చేశారు. చదవండి: ఈ హీరోను గుర్తుపట్టారా? అయితే కొన్ని కారణాల వల్ల ఆ చిత్రం వాయిదా పడింది. దీంతో ఇప్పుడు నటుడు ఆర్య హీరోగా చిత్రం చేయడానికి సిద్ధం అయ్యారు. ఇప్పటికే ప్రారంభమైన ఈ చిత్ర షూటింగ్ చెన్నై పరిసరాల్లో చిత్రీకరణను జరుపుకుంటోంది. అయితే దీని గురించి చిత్ర వర్గాలు అధికారికంగా గురువారం వెల్లడించారు. ఇందులో ఆర్య బాక్సింగ్ క్రీడాకారుడిగా నటిస్తున్నారు. అందుకోసం ఆయన తన బాడీని పూర్తిగా మార్చుకున్నారు. కఠినంగా కసరత్తులు చేసి సిక్స్ప్యాక్కు తయారయ్యారు. ఆయన బాడీని చూస్తుంటే ఇండియన్ టైసన్లా ఉన్నారు. ఆ ఫొటోలను ఆయన ట్విట్టర్లో విడుదల చేశారు. అవి ఇప్పుడు సామాజిక మాద్యమాల్లో వైరల్ అవుతున్నాయి. వాటిని చూసిన ఆయన మిత్ర వర్గం వావ్ అదుర్స్ అంటూ అభినందనల వర్షం కురిపిస్తున్నారు. చదవండి: అతడితోనే తాళి కట్టించుకుంటా: అనుష్క ఇక అభిమానులైతే సూపర్ అంటూ లైకులు కొడుతున్నారు. దీంతో ఆర్య నటించే చిత్రంపై అంచనాలు పెరిగిపోతున్నాయి. కాగా ఆర్య తాజా చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలను చిత్ర యూనిట్ ఇంకా వెల్లడించలేదు. అయితే నటుడు కలైయరసన్, దినేశ్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నట్లు ఇంతకు ముందే ప్రచారం జరిగింది. నటుడు ఆర్యకు అర్జెంట్గా ఇప్పుడు ఒక హిట్ కావాలి. దీంతో ఆయన తన చిత్రాలపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. అందులో భాగమే ఈ సిక్స్ప్యాక్కు రెడీ అవడం అని భావించవచ్చు. -
ఈ హీరో ఎవరో చెప్పగలరా?
కండలు తిరిగిన దృఢకాయంతో మతి పోగొడుతున్న ఈ హీరో ఎవరో చెప్పగలరా? అటు తిరిగి నిలుచోవడంతో గుర్తు పట్టలేకపోతున్నారా? దక్షిణాది ప్రేక్షకులకు చిరపరిచితమైన విలక్షణ నటుడు ఇతడు. తమిళ సినిమాల్లో హీరోగా సత్తా చాటిన ఈ నటుడు విలన్గా తెలుగు తెరకు పరిచయమయ్యాడు. అతనెవరో కాదు తమిళ హీరో ఆర్య. తన 30వ సినిమా కోసం తీవ్రంగా శ్రమించి కండలు పెంచి కొత్త అవతారంలోకి మారిపోయాడు. ఈ సినిమాకు సంబంధించిన వివరాలు గురువారం వెల్లడిస్తానని చెబుతూ ఈ ఫొటోను ఆర్య ట్వీట్ చేశాడు. ‘మీరంతట మీరు బలవంతులుగా మారేంత వరకు తెలియదు మీరెంత బలవంతులో’ అంటూ క్యాప్షన్ కూడా పెట్టాడు. ఆర్య లేటెస్ట్ ఫొటోపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఊహించని హార్డ్వర్క్, అంకితభావంతో స్ఫూర్తిగా నిలిచారని ఆయన భార్య సాయేషా సైగల్ పేర్కొన్నారు. దర్శకుడు శక్తిసౌందర్రాజన్, మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎన్ ప్రసాద్, నటి శ్రియారెడ్డి, టీవీ యాంకర్ డీడీ నీలకందన్ తదితరులు ఆర్యను మెచ్చుకుంటూ ట్వీట్లు పెట్టారు. కాగా, ఆర్య నటించిన తాజా చిత్రం ‘టెడ్డీ’ విడుదలకు సిద్ధమవుతోంది. దర్శకుడు శక్తిసౌందర్రాజన్ తెరకెక్కించిన ఈ సినిమాలో ఆర్యకు జంటగా ఆయన భార్య సాయేషా సైగల్ నటించడం విశేషం. జ్ఞానవేల్రాజా నిర్మించిన ఈ చిత్రంలో గ్రాఫిక్స్కు పెద్దపీట వేశారు. (చదవండి: టెడ్డీ చిత్రం కథేంటి?) -
హాయ్ హారర్
‘ఇలాంటి సినిమాలో నటించాలి’ అని ప్రతి ఆర్టిస్ట్ కి ఒక ‘విష్ లిస్ట్’ ఉంటుంది. అది నెరవేరే టైమ్ వచ్చినపుడు ఆనందపడిపోతారు. ఇప్పుడు రాశీ ఖన్నా ఆ ఆనందంలోనే ఉన్నారు. ఈ బ్యూటీ విష్ లిస్ట్లో హారర్ సినిమా చేయాలని ఉంది. ‘అరణ్మణై 3’తో హారర్ జానర్కి హాయ్ చెప్పే అవకాశం ఆమెకు వచ్చింది. సుందర్. సి కీలక పాత్ర పోషించి, దర్శకత్వం వహించిన ‘అరణ్మౖణె’, ‘అరణ్మణై 2’ పెద్ద హిట్. ఇప్పుడు మూడో భాగం తీయడానికి సుందర్ సిద్ధమయ్యారు. ఇందులో రాశీ ఖన్నా కథానాయికగా నటించబోతున్నారు. ఆండ్రియా మరో కథానాయిక. ఆర్య హీరో. తొలి, మలి భాగాల్లో నటించిన సుందర్ ఇందులోనూ కీలక పాత్ర చేయబోతున్నారు. ‘‘హారర్ జానర్ మూవీ చేయాలని ఎప్పటినుంచో అనుకుంటున్నాను. ‘అరణ్మణై’ సిరీస్తో ఆ కోరిక నెరవేరబోతోంది. ఫస్ట్, సెకండ్ పార్ట్స్ చూశాను. చాలా బాగుంటాయి. మూడో భాగం షూటింగ్లో పాల్గొనడానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్నా’’ అని తన ఆనందాన్ని వ్యక్తపరిచారు రాశీ ఖన్నా. ఫిబ్రవరి నెలాఖరున లేక మార్చిలో ఈ చిత్రం ప్రారంభమవుతుంది. -
టెడ్డీ ఫస్ట్లుక్ ఆసక్తిని రేకెత్తిస్తోంది..
నటుడు ఆర్య కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం టెడ్డీ. ఇది పలు విశేషాలతో కూడి ఉంటుందంటున్నారు దర్శకుడు శక్తిసౌందర్రాజన్. ఈయన ఇంతకు ముందు టిక్ టిక్ టిక్ అనే స్పై చిత్రాన్ని తెరకెక్కించారన్నది గమనార్హం. గ్రాఫిక్స్తో కూడిన చిత్రాలను రూపొందించడంలో సిద్ధహస్తుడైన ఈయన తాజా చిత్రం టెడ్డీలోనూ గ్రాఫిక్స్కు అధిక ప్రాధాన్యత ఉంటుందట. ఆర్యకు జంటగా ఆయన భార్య సాయేషాసైగల్ నటిస్తున్న చిత్రం ఇది. దీన్ని స్టూడియోగ్రీన్ పతాకంపై జ్ఞానవేల్రాజా నిర్మిస్తున్నారు. కాగా ఈ చిత్ర ఫస్ట్లుక్ పోస్టర్ను మంగళవారం విడుదల చేశారు. ఆర్య వెనుక టెడ్డీబేర్ నిలబడి తొంగి చూస్తున్న ఫస్ట్లుక్ ఆసక్తిని రేకెత్తిస్తోంది. టెడ్డీ చిత్రం కథేంటి? టెడ్డీబేర్ పాత్ర విశేషాలు ఏమిటి? గ్రాఫిక్స్ ప్రాధాన్యత ఎంత? వంటి పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి కదూ! ఆ సందేహాలను చిత్ర దర్శకుడిని అడిగి తెలుసుకుందాం! ప్ర: ఈ చిత్రానికి టెడ్డీ అని పేరు నిర్ణయించడానికి కారణం? జ: చిత్రంలో ఆర్యకు టెడ్డీబేర్కు చాలా సంబంధం ఉంటుంది. అయితే ఈ చిత్రానికి చాలా పేర్లను పరిశీలించాం. చివరికి అందరికీ పరిచయం అయిన టెడ్డీ పేరునే చిత్రానికి ఖరారు చేశాం. టెడ్డీ చిత్ర ఫస్ట్లుక్ పోస్టర్ చూస్తేనే టైటిల్ ప్రాముఖ్యత మీకు అర్థం అయ్యి ఉంటుంది. పెద్దల నుంచి పిల్లల వరకూ ఎలా టెడ్డీబేర్ను ముద్దులాడతారో అలా ఈ టెడ్డీ చిత్రాన్ని చూసి అలరిస్తారు. అలా చిత్రాన్ని తయారు చేయడానికి శ్రమిస్తున్నాం. ప్ర: ఇంతకు ముందు బ్యాంకు దోపిడీ. జోంబి, అంతరిక్షం నేపథ్యాల్లో చిత్రాలను తెరకెక్కించారు. మరి ఈ టెడ్డీ ఏ జానర్లో ఉంటుంది? జ: దీన్ని ఒక్క మాటలో పలానా జానర్ చిత్రం అని చెప్పడం కుదరదు. చిత్రంలో హీరోతో పాటు కంప్యూటర్కు సంబంధించిన పాత్ర ఉంటుంది. దాన్ని రూపాన్ని గ్రాఫిక్స్లో మాత్రమే ఆవిష్కరించాల్సి ఉంటుంది. అదే టెడ్డీబేర్ పాత్ర. ఇదే చిత్రంలో ప్రత్యేకం. చిత్రంలో సెకెండ్ పాత్ర ఇదే. టెడ్డీబేర్ను పూర్తిగా సాంకేతిక పరిజ్ఞానంతో సహజత్వానికి అద్దం పట్టేలా రూపొందిస్తున్నాం. ఈ టెడ్డీబేర్ ఫైట్స్ కూడా చేస్తుంది. అదే ప్రేక్షకులకు కొత్త అనుభూతిని కలిగిస్తుంది. ప్ర: వివాహానంతరం ఆర్య, సాయేషాలను హీరోహీరోయిన్లుగా నటింపజేయాలన్న ఆలోచన గురించి? జ: నిజం చెప్పాలంటే వారిద్దరినీ హీరోహీరోయిన్లుగా నటింపజేయడానికి భయపడ్డాను. అయితే కథ విన్న వారం రోజుల్లోనే పాత్రకు ప్రాముఖ్యత ఉండడంతో నటి సాయేషా నటించడానికి అంగీకరించారు. ప్ర: అజర్బైజాన్ దేశంలో షూటింగ్ చేయడానికి కారణం? జ:అది చాలా పురాతన దేశం. ఇప్పుడు అదే రష్యా. అప్పట్లో భారతీయ చిత్రాలను అక్కడి ప్రజలు ఎక్కువగా చూసేవారు. నటి సాయేషా ప్రఖ్యాత నటుడు దిలీప్కుమార్ మనవరాలు అని తెలవగానే అక్కడి ప్రజలు సంతోషంగా దిలీప్కుమార్ అంటూ పెద్దగా కేకలు పెట్టారు. ఒక బామ్మ నటుడు ఆర్యను పట్టుకుని అటూ ఇటూ ఊపేసింది. ఎందుకమ్మా? అని అంటే మదరాసు పట్టణం చిత్ర సీడీ చూపించి ఇందులో నటించింది నువ్వేగా అని అడిగింది. అంతగా ఇండియన్ చిత్రాలను ఇప్పటికీ య్యూట్యూబుల్లో అక్కడి ప్రజలు చూస్తూనే ఉన్నారు. ప్ర: చిత్ర నిర్మాత జ్ఞానవేల్రాజా గురించి? జ: టిక్ టిక్ టిక్ చిత్రాన్ని పూర్తి చేసిన తరువాత జ్ఞానవేల్రాజాను కలిశాను. బడ్జెట్, ఎన్ని రోజులు షూటింగ్ వంటివి ఏమీ అడగకుండా చిత్రం చేద్దాం అని చెప్పారు. ఇప్పటికీ ఇంత బడ్జెట్ అని నిర్ణయించలేదు. చిత్రానికి అవసరం అయిన వన్నీ సమకూర్చుతున్నారు. నిర్మాత జ్ఞానవేల్రాజా నాకు పూర్తి స్వేచ్ఛనిచ్చారు. ఆయన నిర్మాణ సంస్థలో చాలా మైలురాయి చిత్రాలు ఉన్నాయి. వాటిలో ఈ టెడ్డీ చిత్రం కూడా చేరుతుందని చెప్పగలను -
‘ఆర్యా అజింక్యా రహానే’
పిల్లలకు పేరు పెట్టడానికి చాలామంది పెద్ద కసరత్తే చేస్తుంటారు. రకరకాల అక్షరాలను ఒకచోట చేర్చి కొత్త పేర్లకు శ్రీకారం చుడతారు. వాళ్లలాగే మన టీమ్ ఇండియా టెస్ట్ వైస్ కెప్టెన్ అజింక్య రహానే ఎన్ని పుస్తకాలు తిరగేశారో కానీ.. మొత్తానికి తన కూతురుకి ‘ఆర్య’ అనే పేరును ఫిక్స్ చేశారు. రహానే, రాధిక దంపతులకు అక్టోబరు 5 న ఆర్య పుట్టింది. ఇన్నాళ్లకు ఆ పాప ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ, ఫొటో కింద ‘ఆర్యా అజింక్యా రహానే’ అని కాప్షన్ ఇచ్చాడు రహానే. అలా తన కుమార్తె పేరు ఆర్య అని పరోక్షంగా ప్రకటించాడు. ఆర్య అనగానే మగపిల్లాడు అనిపిస్తుంది. నిజానికి అది అమ్మాయి పేరు. ఆర్య అనే మాటకు పదహారేళ్ల యువతి, పార్వతి, దుర్గ, ధాన్యం, తల్లి, అత్తగారు.. ఇలా చాలా అర్థాలు ఉన్నాయి. శంకరాచార్యుల వారి తల్లి పేరు ఆర్యాంబ. శ్రీరాముడిని సంబోధించే సమయంలో కూడా ‘ఆర్యపుత్రా’ అనటం తెలిసిందే! ఏమైనా ఇంత అందమైన అర్థవంతమైన పేరును తల్లిదండ్రుల చేత పెట్టించుకున్న ఆర్యకు శతాయుష్మాన్భవ!! -
భాషతో పనేంటి?
చెన్నై : భాషతో పనేంటి? అని ప్రశ్నిస్తోంది నటి సాయేషా సైగల్. ఈ బాలీవుడ్ బ్యూటీ తొలుత టాలీవుడ్కు దిగుమతి అయినా, ఆ తరువాత కోలీవుడ్లో సెటిల్ అయింది. ఇప్పుడు నటిగానే కాదు చెన్నైని తన అత్తిల్లుగా మార్చేసుకుంది. కోలీవుడ్లో ‘వనమగన్’ చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన సాయేషాసైగల్ తొలి చిత్రంతోనే ప్రశంసలు అందుకుంది. ఆ తరువాత వరుసగా అవకాశాలు రాబట్టుకుంది. కడైకుట్టిసింగం, జూంగా, గజనీకాంత్ తదితర చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు పొందింది. ఈ అమ్మడు రెండు చిత్రాలకు కృతజ్ఞతలు చెప్పుకునే తీరాలి. అందులో ఒకటి వనమగన్. నటిగా మలుపు తిప్పిన చిత్రం ఇదే. ఇక రెండోది గజనీకాంత్. ఇది ఇంకా సాయేషాకు మరిచిపోలేని చిత్రం. కారణం నటుడు ఆర్యతో పరిచయాన్ని, సాన్నిహిత్యాన్ని పెంచిన చిత్రమే కాకుండా వారి ప్రేమను పండించిన చిత్రం గజనీకాంత్. ఇక కాప్పాన్ చిత్రం కూడా సాయేషా సైగల్ చిత్రంలో గుర్తిండిపోయే చిత్రమే అవుతుంది. ఈ చిత్ర షూటింగ్ సమయంలోనే ఆర్యతో ఏడడుగులు వేసి అర్ధాంగిగా మారిపోయింది. కాగా చివరిగా ఈ బ్యూటీ నటించిన చిత్రం కాప్పాన్. సూర్య కథానాయకుడిగా నటించిన ఈ చిత్రంలో ఆర్య కూడా కీలక పాత్రను పోషించారు. ప్రస్తుతం తన భర్త ఆర్యకు జంటగా టెడ్డీ అనే చిత్రంలో నటిస్తోంది. ఈ సందర్భంగా సాయోషా ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో.. హిందీలో అజయ్దేవగన్ సరసన నటించిన శివాయ్ చిత్రం విజయం సాధించడం కారణంగానే నటిగా తనకు పలు అవకాశాలు వచ్చాయని తెలిపింది. ఇప్పుడు సూర్యకు జంటగా కాప్పాన్ చిత్రంలో నటించే స్థాయికి ఎదిగానని అంది. నటననూ నేర్చుకున్నానని చెప్పింది. ఇంకో విషయం ఏమిటంటే నటనకు కళ్లు చాలని పేర్కొంది. ఆ రెండు కళ్లు ఎన్ని భావాలనైనా పలికిస్తాయంది. అందుకు భాషతో పనే లేదని పేర్కొంది. తాను సినిమా కుటుంబం నుంచి వచ్చినా ఇంట్లో సినిమా గురించి మాట్లాడటం తక్కువేనని చెప్పింది. తమ కుటుంబానికంతా ప్రయాణం చేయడం ఇష్టం అని తెలిపింది. దక్షిణభారత సినిమా సాంకేతిక పరంగా చాలా అభివృద్ధి చెందిందని చెప్పారు. అది కాప్పాన్ చిత్రంలో చూశానని చెప్పింది. సూర్యకు జంటగా నటిస్తానని కలలో కూడా ఊహించలేదని పేర్కొంది. ఆయన నుంచి నేర్చుకున్న విషయాలను భవిష్యత్లో తనకు ఉపకరిస్తాయని అంది. ఇప్పుడు పాత చిత్రాలను రీమేక్ చేసే ట్రెండ్ నడుస్తోందని, అలా హిందీ చిత్రం రామ్ లక్కన్ను ఎవరైనా రీమేక్ చేస్తే అందులో మాధురీదీక్షిత్ పాత్రలో నటించాలని ఆశపడుతున్నట్లు చెప్పింది. అందులో డాన్స్కు ఎక్కువ అవకాశం ఉందని, తాను డాన్స్లో శిక్షణ పొందిన నటినని తెలిపింది. తనలోని నాట్యకళాకారిణిని ఆవిష్కరించేలా పూర్తి నాట్యభరిత కథా చిత్రంలో నటించాలని కోరుకుంటున్నానని నటి సాయేషా సైగల్ పేర్కొంది. -
కసితో బాలా.. భారీ మల్టిస్టారర్కు ప్లాన్!
సాక్షి, తమిళసినిమా: దర్శకుడు బాలా గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సేతు చిత్రంతో విక్రమ్కు, నందా చిత్రంతో సూర్యకు, నాన్ కడవుల్ చిత్రంతో ఆర్యకు లైఫ్ ఇచ్చిన దర్శకుడీయన. దర్శకుడిగా వైవిధ్యానికి మారుపేరుగా పేరొందిన ఆయన.. తొలిసారిగా ఒక రీమేక్ చిత్రాన్ని తెరకెక్కించడానికి అంగీకరించడం గతంలో చాలామందిని ఆశ్చర్యపరిచింది. అదే తెలుగులో సంచలన విజయాన్ని సాధించిన అర్జున్రెడ్డి చిత్రం. ఈ చిత్ర తమిళ రీమేక్లో విక్రమ్ కొడుకు ధ్రువ్ను హీరోగా పరిచయం చేయాలని ఆయన భావించారు. వర్మ చిత్రాన్ని ఆయన రీమేక్ చేసినప్పటికీ.. చిత్రీకరణ అంతా పూర్తయిన తరువాత నిర్మాతలు ఇది అసలు అర్జున్రెడ్డి చిత్రానికి రీమేక్లా లేదు, బాలా సరిగా తీయలేదంటూ పక్కన పడేశారు. నూతన దర్శకుడితో ఆదిత్యవర్మ పేరుతో మళ్లీ ఆ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఇంతకంటే బాలాకు జరిగిన అవమానం వేరే ఉండదు. దీంతో ఆయన చాలా కసిగా ఒక కథను తయారు చేశారని సమాచారం. విశేషం ఏమిటంటే ఇది మల్టీస్టారర్ సినిమా. ఇందులో నటించడానికి సూర్య సమ్మతించినట్లు సమాచారం. అంతేకాదు మరో హీరోగా నటుడు ఆర్య, అధర్వ కూడా నటించడానికి గ్రీన్సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది. విశేషం ఏమిటంటే ఈ ముగ్గురు ఇంతకుముందు బాలా దర్శకత్వంలో నటించినవారే. వారిప్పుడు ఆయనకు అండగా నిలవడానికి సిద్ధమవుతున్నారు. ఇందులో ప్రతినాయకుడిగా బాహుబలి ఫేమ్ రానాను నటింపజేసే ఆలోచనలో ఉన్నట్లు తాజా సమాచారం. ఇక కథానాయికలుగా మహిమ, బిందుమాధవి నటించే అవకాశమున్నట్లు తెలిసింది. ఈ క్రేజీ చిత్రానికి సంబంధించిన అధికార ప్రకటన త్వరలోనే వెలువడే అవకాశముంది. ఈ సినిమా సూపర్హిట్ అవ్వాలన్న కసి, పట్టుదలతో బాలా ఉన్నట్టు తెలిసింది. దీంతో ఈ మల్టీస్టారర్ చిత్రంపై ఇప్పటికే హైప్ క్రియేట్ అయింది. -
‘బందోబస్త్’ ప్రీ రిలీజ్ ఈవెంట్
-
ఎవడబ్బ సొత్తు కాదురా టాలెంటూ!
చెన్నై : ఎవడబ్బ సొత్తు కాదురా టాలెంటూ.. ఏంటీ సడన్గా పాటందుకున్నారు అని అనుకుంటున్నారా? వాస్తవాన్ని చెప్పడంలో తప్పులేదుగా. ఎవరిలో ఎలాంటి టాలెంట్ ఉందన్నది బయట పడితేనే గానీ తెలియదు. నటుడు ఆర్య మంచి నటుడన్న విషయం తెలిసిందే. అయితే ఆయనలో నలభీముడున్న విషయం హీరోయిన్లకు బిరియానీ విందునివ్వడంతోనే వెలుగు చూసింది. ఇది ఆర్యలోని ఇంకో టాలెంట్ అని చెప్పవచ్చు. ఇక ఆయన హీరోయిన్లను మచ్చిక చేసుకోవడంలో సిద్ధహస్తుడంటారు. అదీ టాలెంటే. కాగా తాజాగా ఆయన అర్ధాంగి సాయేషాసైగల్లోనూ మరో టాలెంట్ ఉన్న విషయం బహిర్గతమైంది. వనమగన్ చిత్రం ద్వారా కోలీవుడ్కు హీరోయిన్గా పరిచయమైన ఈ అమ్మడు బాలీవుడ్ బ్యూటీ అన్న విషయం తెలిసిందే. నటిగా పరిచయం అయిన కొద్ది కాలంలోనే ఆర్యతో ప్రేమలో పడి, వెనువెంటనే ఆయన్ని పెళ్లి చేసుకున్న సంగతి విధితమే. ఆర్య ఆమెకు నటించరాదని ఆక్షలు విధించకపోయినా, సెలెక్టెడ్ చిత్రాలనే చేయాలని ఈ బ్యూటీ నిర్ణయించుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం సూర్యకు జంటగా కాప్పాన్ చిత్రంలో నటిస్తోంది. ఇందులో నటుడు ఆర్య ఒక ముఖ్య పాత్రలో నటించడం విశేషం. ఈ చిత్రం షూటింగ్ను పూర్తి చేసుకుని నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది. తాజాగా తన భర్త ఆర్యకు జంటగా టెడీ అనే చిత్రంలో నటిస్తోంది. కాగా ప్రస్తుతం ఈ అమ్మడికి కొంచెం తీరిక దొరుకుతుండడంతో తనలోని మరో టాలెంట్ను బాహ్య ప్రపంచానికి తెలిపే ప్రయత్నం చేస్తోంది. అందులో భాగంగా ఒండ్రా ఇరండా అనే పాటను పాడి దాన్ని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసింది. అది ఇప్పుడు సోషల్ మీడియాల్లో వైరల్ అవుతోంది. నటుడు సూర్య, జ్యోతిక జంటగా నటించిన కాక్క కాక్క చిత్రంలోని ఆ పాటను బాంబే జయశ్రీ పాడారు. ఈ పాటను నటి సాయేషా గొంతు నుంచి వచ్చి మరింత మధురంగా ఉండడంతో సంగీత ప్రియుల లైక్లు పెరిగిపోతున్నాయి. దీని గురించి స్పందించిన నటి సాయేషా తనకు పాడడం అంటే చాలా ఇష్టం అని చెప్పుకొచ్చింది. అలా తనకు నచ్చిన పాటను షూటింగ్ విరామ సమయంలో పాడినట్లు తెలిపింది. అయితే ఇందుకోసం ఎలాంటి శిక్షణ తీసుకోలేదని, తప్పులుంటే మన్నించండి అని అంది. నటనే తెలుసనుకుంటే పాడడం కూడా తెలుసా ఈ అమ్మడికి అని ఆశ్చర్యపడుతున్న అభిమానులు మొత్తం మీద చేతిలో మరో వృత్తిలో కూడా టాలెంట్ ఉందన్నమాట అని ప్రశంసిస్తున్నారు. మరి నటి సాయేషాను త్వరలో గాయనిగా కూడా చూసే అవకాశం లేకపోలేదని అంటున్నారు నెటిజన్లు. అయినా సినీ కుటుంబం నుంచి వచ్చిన ఈ బ్యూటీకి ఆ మాత్రం టాలెంట్ ఉండదా ఏమిటి? కాకపోతే ఈ ఉత్తరాది భామ తమిళ పాటను అంత చక్కగా పాడడం అభినందనీయమే. -
కొండల్లో థ్రిల్
ఆర్య, కేథరిన్ థెరిస్సా జంటగా రాఘవ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘కదంబన్’. భారీ బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా తమిళంలో ఘన విజయం సాధించి, ఆర్య కెరీర్లోనే అత్యధిక కలెక్షన్స్ సాధించిన చిత్రంగా నిలిచింది. ఈ చిత్రాన్ని లక్ష్మీ వెంకటేశ్వర ఫ్రేమ్స్ పతాకంపై ఉదయ్ హర్ష వడ్డెల్ల ‘గజేంద్రుడు’ పేరుతో తెలుగులోకి అనువదించారు. ఈ నెల 21న సినిమా విడుదల కానుంది. ఉదయ్ హర్ష వడ్డెల్ల మాట్లాడుతూ– ‘‘ఓ కొండ ప్రాంతాల్లో ఉండే గిరిజన పుత్రులుగా హీరో, హీరోయిన్ నటించారు. సినిమా అంతా కూడా కొండ ప్రాంతంలో ఉంటూ ఆద్యంతం థ్రిల్కి గురి చేసేలా ఉంటుంది. ఈ సినిమా కోసం ఆర్య బాగా బరువు పెరిగారు. కేథరిన్, ఆర్య జంట తెరపై కనువిందు చేస్తుంది’’ అన్నారు. ఈ చిత్రానికి సమర్పణ: భారతి వరప్రసాద్ వడ్డెల్ల. -
భర్తపై హీరోయిన్ ప్రశంసల జల్లు..!
సాక్షి, తమిళ సినిమా: పెళ్లి తరువాత భార్య నుంచి ప్రశంసలు లభిస్తే.. ఆ ఆనందమే వేరు. ఇప్పుడు నటుడు ఆర్య అలాంటి ఆనందాన్నే ఆస్వాదిస్తున్నాడు. ఈ సంచలన నటుడు ఇటీవల అనూహ్యంగా నటి సాయేషా సైగల్ను ప్రేమించి పెళ్లి కూడా చేసుకున్న సంగతి తెలిసిందే. ‘నాన్ కడవుల్’ చిత్రంతో నటుడిగా తానేమిటో నిరూపించుకున్న ఆర్య.. ఆ తరువాత బాస్ ఎన్గిర భాస్కరన్, రాజారాణి వంటి విజయవంతమైన చిత్రాలతో కోలీవుడ్లో మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇటీవల ఆయన నటించిన కంబన్, గజనీకాంత్ వంటి చిత్రాలు కొంత నిరాశపరిచాయి. దీంతో ఆర్యకు ఇప్పుడు అర్జెంట్గా ఒక హిట్ కావాలి. ఈ క్రమంలో సూర్య హీరోగా నటిస్తున్న ‘కాప్పాన్’ చిత్రంలో ఆర్య కీలక పాత్ర పోషిస్తున్నారు. కేవీ ఆనంద్ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంలో ఆర్య హీరో కాకపోయినా, ఆయన పాత్ర కీలకంగా ఉంటుందని సమాచారం. ఇకపోతే ఆర్య హీరోగా నటిస్తున్న తాజా చిత్రం మహాగురు. ఇంతకుముందు మౌనగురు చిత్రంతో సంచలన విజయాన్ని అందుకున్న దర్శకుడు శాంతకుమార్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో ఆర్యకు జంటగా ఇందుజా, మహిమా నంబియార్ నటిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకుని, నిర్మాణాంతర కార్యక్రమాల్లో ఉన్న ఈ సినిమా టీజర్ను గురువారం విడుదల చేశారు. ఈ టీజర్ భార్య సాయేషా సైగల్తోపాటు ఆమె అమ్మను కూడా ఫిదా చేసిందట. ఈ చిత్ర టీజర్ గురించి నటి సాయేషా సైగల్ ట్విట్టర్లో స్పందిస్తూ.. ఎంతో శ్రమించి.. ఆర్య ఈ సినిమాలో కొత్త గెటప్తో సరికొత్తగా కనిపించబోతున్నారని, ఈ చిత్రాన్ని ఎప్పుడెప్పుడు చూద్దామా అన్న ఆసక్తి కలుగుతోందని పేర్కొన్నారు. ఆమె తల్లి కూడా టీజర్పై ప్రశంసల జల్లు కురిపించారు. -
కవిత కుమారుడిని పరామర్శించిన కేసీఆర్
సాక్షి, హైదరాబాద్ : తీవ్ర జ్వరంతో బాధపడుతున్న మనవడు ఆర్యను (నిజామాబాద్ టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కవిత) తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం పరామర్శించారు. ఎంపీ కవిత రెండో కుమారుడు ఆర్య తీవ్ర జ్వరంతో ఈ నెల 15వ తేదీ నుంచి రెయిన్ బో హాస్పటల్లో చికిత్స పొందుతున్నాడు. నిన్న మధ్యాహ్నం కేసీఆర్ స్వయంగా హాస్పటల్కి వెళ్లి మనవడిని పరామర్శించి, ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. మెరుగైన చికిత్స అందించాల్సిందిగా వైద్యులను ఆయన కోరారు. కాగా ఆర్యను ఇవాళ హాస్పటల్ నుంచి డిశ్చార్జ్ చేయనున్నట్లు వైద్యులు తెలిపారు. -
నా జీవితాన్ని మార్చేసింది
ప్రేమలో కొత్త యాంగిల్ని చూపించిన చిత్రం ‘ఆర్య’ (2004). అల్లు అర్జున్ హీరోగా ‘దిల్’ రాజు నిర్మించిన ఈ చిత్రంతో సుకుమార్ దర్శకునిగా పరిచయం అయ్యారు. ఈ సినిమా పాటలతో కెరీర్లో మంచి మైలేజ్ పొందారు దేవిశ్రీ ప్రసాద్. ఈ సినిమా విడుదలై 15ఏళ్లు ముగిసింది. ఈ విషయంపై అల్లు అర్జున్ స్పందిస్తూ– ‘‘ఆర్య’ సినిమా ఫీల్ని ఇంకా ఆస్వాదిస్తున్నాను. నా లైఫ్లో మోస్ట్ మ్యాజికల్ ఫిల్మ్ ఇది. నా జీవితాన్ని మార్చేసిన ‘ఆర్య’ సినిమా రిలీజై 15ఏళ్లు పూర్తయిందంటే నమ్మలేకున్నాను. సుకుమార్, దేవిశ్రీ ప్రసాద్, రత్నవేలు, ‘దిల్’ రాజుగారు.. ఇలా టీమ్ అందరికీ థ్యాంక్స్. ఈ సినిమాను మెచ్చిన ప్రేక్షకులను మరచిపోలేను’’ అని అల్లు అర్జున్ అన్నారు. ‘‘15ఏళ్ల క్రితం ఇదే రోజున (మే 7) ‘ఆర్య’ సినిమా విడుదలై నాకు, బన్నీ (అల్లు అర్జున్), సుకుమార్కి మంచి విజయాన్ని అందించింది. అల్లు అర్జున్తో నాలుగో సినిమా చేయబోతున్నాను’’ అని ‘దిల్’ రాజు పేర్కొన్నారు. బన్నీ–‘దిల్’ రాజు కాంబినేషన్లో ఆర్య, పరుగు, డీజే చిత్రాలు వచ్చిన విషయం తెలిసిందే. నాలుగో సినిమా టైటిల్ ‘ఐకాన్’. వేణు శ్రీరామ్ దర్శకుడు. -
బిందుమాధవికి భలేచాన్స్
నటి బిందుమాధవికి భలే చాన్స్ తలుపు తట్టనుందని సమాచారం. తెలుగింటి ఆడపడుచు అయిననీ అమ్మడు, తమిళంలో పలు చిత్రాల్లో నటించింది. కళుగు వంటి చిత్రాల్లో నటిగా చక్కని ప్రతిభను చాటుకుని ప్రశంసలు అందుకుంది. అయినా ఎందుకనో నటిగా రావలసినంత పేరు రాలేదు. ఈ మధ్య చేతిలో అకాశాలు లేక సొంత ఊరికి వెళ్లిపోయింది కూడా. అలాంటి బిందుమాధవికి అనుకోకుండా ఒక లక్కీచాన్స్ తలుపుతట్టిందన్నది తాజా సమాచారం. దర్శకుడు బాలా విషయానికి వస్తే ఈయన చిత్రాల్లో నటులెంత వాళ్లైనా పాత్రలే కనిపిస్తాయి. బాలా ప్రస్తుతం యువ హీరోలతో మల్టీస్టారర్ చిత్రాన్ని తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇటీవల సూర్య హీరోగా చిత్రం చేయబోతున్నారనే ప్రచారం జరిగింది. బాలా కథను వినిపించారని, అది సూర్యకు బాగా నచ్చిందని టాక్ స్ప్రెడ్ అయింది. అయితే ప్రస్తుతం సూర్య వరుసగా చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఆయన నటించిన ఎన్జీకే చిత్రం మేడే సందర్భంగా తెరపైకి రానుంది. కేవీ.ఆనంద్ దర్శకత్వంలో నటించిన కాప్పాన్ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని సెప్టెంబరులో తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. ప్రస్తుతం సుధ కొంగర దర్శకత్వంలో సూరరై పోట్రు చిత్రంలో నటిస్తున్నారు. ఆ తరువాత శివ దర్శకత్వంలో ఒక చిత్రం, హరి దర్శకత్వంలో మరో చిత్రం చేయనున్నారు. దీంతో బాలా దర్శకత్వంలో ప్రస్తుతం నటించలేనని చెప్పడంతో ఆయన మరో కథను తయారు చేసుకున్నారు. ఇందులో యువ నటులు ఆర్య, అధర్వ హీరోలుగా నటించడానికి సై అన్నారు. ఇందులో బిందుమాధవికి నటించే అవకాశం వచ్చిందని సమాచారం. దీనికి జీవీ.ప్రకాశ్కుమార్ సంగీతం అందించడం మరో విశేషం. పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడయ్యే అవకాశం ఉంది.