first look release
-
క్యూట్ కాంత
ప్రేమికుల దినోత్సవం సందర్భంగా గులాబీ రంగు చీరలో సింప్లీ సూపర్బ్గా కనిపించారు భాగ్యశ్రీ బోర్సే(Bhagyashri Borse). దుల్కర్ సల్మాన్ సరసన భాగ్యశ్రీ బోర్సే ‘కాంత’ అనే చిత్రంలో నటించారు. ఈ చిత్రంలోని పింక్ శారీలో క్యూట్గా ఉన్న భాగ్యశ్రీ లుక్ని విడుదల చేశారు. సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వంలో రానా దగ్గుబాటి, దుల్కర్ సల్మాన్, ప్రశాంత్ పొట్లూరి, జోమ్ వర్గీస్ ఈ చిత్రాన్ని నిర్మించారు.‘‘1950ల మద్రాస్ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం ‘కాంత’. అప్పటి మానవ సంబంధాలు, సామాజిక సంక్లిష్టతలను ఆవిష్కరించే చిత్రం ఇది. ఈ బహు భాషా చిత్రం షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: జాను. -
పల్లెటూరిలో నవ్వులు
మహేశ్ చింతల, విద్యాసాగర్ కారంపురి, మురళీధర్ గౌడ్ లీడ్ రోల్స్లో నటిస్తున్న చిత్రం ‘బద్మాషులు’. శంకర్ చేగూరి దర్శకత్వంలో బి. బాలకృష్ణ, సి. రామశంకర్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ని రిలీజ్ చేశారు. ‘‘పల్లెటూరి నేపథ్యంలో సాగే హాస్యభరిత చిత్రం ‘బద్మాషులు’. ప్రతి సన్నివేశంలో కడుపుబ్బా నవ్వుకుని, ఆ అనుభూతిని నలుగురూ పంచుకునేలా ఉంటుంది. ఈ చిత్రంలోని ప్రతి పాత్ర నిజ జీవితంలో మనకి తారసపడే వారిలాగే ఉంటూ నవ్విస్తుంటుంది. పూర్తి వినోదంతో పాటు గొప్ప సందేశం ఇచ్చే సినిమా ఇది’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: తేజ కూనూరు, కెమేరా: వినీత్ పబ్బతి. -
మీలో ఒకడు
‘మీకు సుపరిచితుడు... మీలో ఒకడు... మీ సాగర్’ అంటూ రామ్ తాజా చిత్రం లుక్ విడుదలైంది. రామ్ పోతినేని హీరోగా మహేశ్బాబు .పి దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్పై నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి ఓ సినిమా నిర్మిస్తున్న విషయం తెలిసిందే.ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైన సందర్భంగా రామ్ చేస్తున్న సాగర్ పాత్రను పరిచయం చేసి, లుక్ని విడుదల చేశారు. పాత రోజుల హెయిర్ స్టయిల్, క్లీన్ షేవ్తో రామ్ వింటేజ్ లుక్లో కనిపిస్తున్నారు. ఈ హీరోకి ఇది 22వ సినిమా. భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: మధు నీలకందన్, సంగీతం: వివేక్–మెర్విన్, సీఈవో: చెర్రీ. -
టర్నింగ్ పాయింట్లా...
త్రిగుణ్ హీరోగా నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ‘టర్నింగ్ పాయింట్’. ఈ చిత్రంలో హెబ్బా పటేల్, ఇషా చావ్లా, వర్షిణి హీరోయిన్లుగా నటించారు. కుహన్ నాయుడు దర్శకత్వంలో స్వాతి సినిమాస్ పతాకంపై సురేష్ దత్తి నిర్మించిన చిత్రం ఇది. ఈ సినిమా ఫస్ట్ లుక్ను హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, దర్శకుడు విజయ్ కనకమేడల కలిసి విడుదల చేసి, చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా దర్శకుడు కుహన్ నాయుడు మాట్లాడుతూ– ‘‘ఈ చిత్రంలో ఓ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో త్రిగుణ్ నటించారు. మర్డర్ మిస్టరీ నేపథ్యంలో మంచి సస్పెన్స్ ఎలిమెంట్స్తో ఈ సినిమా ఆడియన్స్ను ఎంగేజ్ చేసేలా ఉంటుంది. యాక్షన్ సన్నివేశాలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం నిర్మాణానంతర పనులు జరుగుతున్నాయి. త్వరలోనే టీజర్ను విడుదల చేస్తాం’’ అన్నారు.‘‘కొత్తదనం ఆశించే ప్రేక్షకులను అలరించే అన్ని అంశాలు మా చిత్రంలో ఉన్నాయి. యూనిట్లోని అందరి కెరీర్స్కి ఓ టర్నింగ్ పాయింట్లా ఈ ‘టర్నింగ్ పాయింట్’ నిలుస్తుందన్న నమ్మకం ఉంది’’ అని తెలిపారు సురేష్ దత్తి. ఈ సినిమాకు సంగీతం: ఆర్.ఆర్. ధ్రువన్, కెమెరా: గరుడవేగ అంజి, సహ–నిర్మాతలు: నందిపాటి ఉదయభాను, జీఆర్ మీనాక్షి, ఎం. ఫణిభూషణ్ కుమార్. -
అప్పుడో ఇప్పుడో ఎప్పుడో...
‘స్వామి రా రా (2013), కేశవ (2017)’ చిత్రాల తర్వాత హీరో నిఖిల్ సిద్ధార్థ్–దర్శకుడు సుధీర్ వర్మ కాంబినేషన్లో రూపొందిన చిత్రం ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో...’. కన్నడ హీరోయిన్ రుక్మిణీ వసంత్ ఈ సినిమాతో తెలుగు పరిశ్రమకు పరిచయమవుతున్నారు. బాపినీడు సమర్పణలో బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించారు. ఆదివారం సుధీర్ వర్మ బర్త్ డే సందర్భంగా ఫస్ట్ లుక్ రిలీజ్ చేసి, దీపావళికి ఈ సినిమాని రిలీజ్ చేయనున్నట్లు యూనిట్ ప్రకటించింది. హీరోయిన్ దివ్యాంశా కౌశిక్, హర్ష చెముడు కీలకపాత్రల్లో నటించిన ఈ చిత్రానికి సంగీతం: కార్తీక్, బ్యాక్గ్రౌండ్ స్కోర్: సన్నీ ఎమ్ఆర్. -
చిన్న కథ కాదు!
నివేదా థామస్, ప్రియదర్శి, విశ్వదేవ్, గౌతమి, భాగ్యరాజ్ కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘35– చిన్న కథ కాదు’. ఈ చిత్రానికి నంద కిశోర్ ఈమాని దర్శకత్వం వహించారు. సురేష్ ప్రోడక్షన్స్ ఎస్. ఒరిజినల్స్, వాల్టెయిర్ ప్రోడక్షన్స్ పై రానా దగ్గుబాటి, సృజన్ యరబోలు, సిద్ధార్థ్ రాళ్లపల్లి నిర్మించిన ఈ చిత్రానికి ‘35– చిన్న కథ కాదు’ అనే టైటిల్ని ఫిక్స్ చేసి, ఫస్ట్ లుక్ విడుదల చేశారు.ఆగస్ట్ 15న సినిమాని తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో రిలీజ్ చేయనున్నట్లు కూడా అధికారికంగా ప్రకటించారు. ‘‘క్లీన్ ఎంటర్టైనర్గా రూపొందిన న్యూ ఏజ్ ఫ్యామిలీ డ్రామా ‘35–చిన్న కథ కాదు’. స్కూల్ ఎపిసోడ్స్ స్పెషల్ ఎట్రాక్షన్గా చక్కని వినోదంతో అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించేందుకు ఈ సినిమా సిద్ధమైంది. తప్పకుండా హిట్ అవుతుందనే నమ్మకం ఉంది’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: వివేక్ సాగర్, కెమెరా నికేత్ బొమ్మి. -
వాస్తవ ఘటనల నింద
‘హ్యాపీ డేస్, కొత్త బంగారు లోకం’ చిత్రాల ఫేమ్ వరుణ్ సందేశ్ హీరోగా రూపొందిన చిత్రం ‘నింద’. ‘కాండ్రకోట మిస్టరీ’ అన్నది ఉపశీర్షిక. ఆనీ, తనికెళ్ల భరణి, భద్రం, సూర్యకుమార్, ఛత్రపతి శేఖర్ ఇతర పాత్రల్లో నటించారు. ది ఫర్వెంట్ ఇండీ ప్రోడక్షన్స్ బ్యానర్ రాజేష్ జగన్నాథం స్వీయ దర్శకత్వంలో నిర్మించారు.ఈ చిత్రం నుంచి వరుణ్ సందేశ్ పాత్ర ఫస్ట్ లుక్ని రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా దర్శక–నిర్మాత రాజేష్ జగన్నాథం మాట్లాడుతూ– ‘‘వాస్తవ ఘటనల ఆధారంగా రూపొందిన చిత్రం ‘నింద’. ఇప్పుడు ప్రేక్షకులు రెగ్యులర్ సినిమాల కంటే కంటెంట్, కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలనే ఎక్కువగా ఆదరిస్తున్నారు. ఈ కోవలోనే మా ‘నింద’ రూపొందింది. ప్రస్తుతం పోస్ట్ప్రోడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ నెల 15న మా సినిమా టీజర్ను విడుదల చేస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: సంతు ఓంకార్, కెమెరా: రమీజ్ నవీత్. -
మన తెలుగువాడి బయోపిక్
చూపు లేకపోయినా అంట్రప్రెన్యూర్గా విజయం సాధించిన మన తెలుగువాడు శ్రీకాంత్ బొల్లా బయోపిక్ ఫస్ట్లుక్ వైరల్ అయ్యింది. రాజ్ కుమార్ రావు శ్రీకాంత్ పాత్ర పోషిస్తున్నాడు. పుట్టుకతో అంధత్వం వెంటాడినా విజయాలు అందుకోవడానికి అది అడ్డుకాదని నిరూపించిన తెలుగు పారిశ్రామికవేత్త శ్రీకాంత్ బొల్లా బయోపిక్ ‘శ్రీకాంత్’ ఫస్ట్లుక్ విడుదలైంది. మంచి నటుడిగా పేరు గడించిన రాజ్కుమార్ రావు శ్రీకాంత్ పాత్రను పోషిస్తుండటం విశేషం. మచిలీపట్నంలో జన్మించిన శ్రీకాంత్ బొల్లా ఇంజినీరింగ్ చదువు విషయంలో చాలా సవాళ్లు ఎదుర్కొన్నాడు. అంధుడైన కారణాన ఐఐటీలో సీటు ΄÷ందలేకపోయాడు. అయితే పట్టుదలతో మసాచూసెట్స్ యూనివర్సిటీలో తొలి అంతర్జాతీయ అంధ విద్యార్థిగా దఖలయ్యి చదువుకున్నాడు. భారత్కు తిరిగి వచ్చి పారిశ్రామిక రంగంలో కీర్తి గడించాడు. బొల్లా జీవితం ఇప్పటికే ఎందరికో ఆదర్శం అయ్యింది. వెండితెర మీద ఆయన జీవితం చూసి మరెందరో స్ఫూర్తి ΄÷ందుతారు. తుషార్ హీరానందాని ఈ సినిమా దర్శకుడు. -
'ఫ్యామిలీ మ్యాన్' కాదు ఇకపై 'భయ్యాజీ'
బాలీవుడ్ నటుడు మనోజ్ బాజ్పేయి హీరోగా నటిస్తున్న తాజా హిందీ చిత్రానికి ‘భయ్యాజీ’ అనే టైటిల్ ఖరారైంది. ‘సిర్ఫ్ ఏక్ బందా కఫీ హై’ (2023) సినిమా తర్వాత మనోజ్ బాజ్పేయి, దర్శకుడు అపూర్వ్సింగ్ కర్కీ కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఇది. ఈ సినిమా షూటింగ్ పూర్తయిందని బాలీవుడ్ సమాచారం. కాగా ఇటీవల ఈ సినిమా ఫస్ట్లుక్ను విడుదల చేశారు మేకర్స్. అలాగే ఈ సినిమా టీజర్ను ఈ నెల 20న, సినిమాను మే 24న విడుదల చేయనున్నట్లుగా మేకర్స్ ప్రకటించారు. కాగా ‘భయ్యాజీ’ చిత్రం మనోజ్ బాజ్పేయి కెరీర్లో వందో చిత్రం కావడం విశేషం. -
టైసన్ నాయుడి యాక్షన్
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రానికి ‘టైసన్ నాయుడు’ అనే టైటిల్ని ఖరారు చేశారు. సాగర్ కె. చంద్ర దర్శకత్వంలో 14 రీల్స్ ప్లస్ బ్యానర్పై రామ్ ఆచంట, గోపీ ఆచంట ఈ సినిమా నిర్మిస్తున్నారు. బుధవారం (జనవరి 3న) సాయి శ్రీనివాస్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా టైటిల్ని ‘టైసన్ నాయుడు’గా ఫిక్స్ చేసి, ఫస్ట్ లుక్ విడుదల చేశారు మేకర్స్. సాయి శ్రీనివాస్ను బాక్సింగ్ లెజెండ్ మైక్టైసన్ అభిమానిగా ఈ చిత్రం వీడియో గ్లింప్స్ ద్వారా పరిచయం చేశారు. నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘యునిక్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతోన్న చిత్రం ‘టైసన్ నాయుడు’. సాయి శ్రీనివాస్ను మునుపెన్నడూ చూడని మాస్, యాక్షన్ అవతార్లో చూపిస్తున్నారు సాగర్ కె. చంద్ర. హై బడ్జెట్తో ఈ సినిమా రూపొందుతోంది’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: భీమ్స్ సిసిరోలియో, కెమెరా: ముఖేష్ జ్ఞానేష్, ఎగ్జిక్యూటివ్ ్ర΄÷డ్యూసర్: హరీష్ కట్టా. -
కాంతార2 ఫస్ట్ లుక్ ఎప్పుడంటే..
-
ప్రేమలో గీతాశంకరం
ముఖేష్ గౌడ, ప్రియాంకా శర్మ జంటగా కె.దేవానంద్ నిర్మిస్తున్న ప్రేమకథా చిత్రం ‘గీతా శంకరం’. దీపావళి సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్ను రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ముఖేష్ గౌడ మాట్లాడుతూ– ‘‘సీరియల్స్లో పేరు సంపాదించుకున్నట్లే ఈ సినిమాతో వెండితెరపై కూడా మంచి పేరు తెచ్చుకుంటాననే నమ్మకం ఉంది’’ అన్నారు. ‘‘నటనకు మంచి స్కోప్ ఉన్న పాత్ర లభించడం నా లక్గా భావిస్తున్నా’’ అన్నారు ప్రియాంకా శర్మ. ‘‘ఇరవై కథలు విన్నాం. కానీ రుద్ర చెప్పిన ఈ కథ నచ్చడంతో ఈ సినిమా చేస్తున్నాం. ఈ నెల 14న కొత్త షెడ్యూల్ ఆరంభిస్తాం’’ అన్నారు దేవానంద్. ‘‘ప్రేక్షకులకు నచ్చే అంశాలన్నీ ఈ సినిమాలో ఉంటాయి’’ అన్నారు రుద్ర. ఈ చిత్రానికి సంగీతం: అబు, కెమెరా: ఉదయ్ ఆకుల. -
బెస్ట్ గిఫ్ట్
‘తంగలాన్’ సినిమా కోసం పూర్తిగా మేకోవర్ అయ్యారు హీరోయిన్ మాళవికా మోహనన్. విక్రమ్ హీరోగా పా. రంజిత్ దర్శకత్వంలో రూపొందుతున్న పీరియాడికల్ ఫిల్మ్ ‘తంగలాన్’. ఈ చిత్రంలో పార్వతి, మాళవికా మోహనన్ హీరోయిన్లు. కేజీ జ్ఞానవేల్ రాజా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. శుక్రవారం (ఆగస్టు 4) మాళవికా మోహనన్ బర్త్ డే. ఈ సందర్భంగా ‘తంగలాన్’లోని ఆమె ఫస్ట్ లుక్ను రిలీజ్ చేశారు. ‘బెస్ట్ బర్త్ డే గిఫ్ట్’ అని ఈ పోస్టర్ని ఉద్దేశించి మాళవిక ట్వీట్ చేశారు. ఈ చిత్రంలో గిరిజన యువతిగా ఆమె నటిస్తున్నట్లు తెలుస్తోంది. భారతదేశంలో 19వ శతాబ్దంలో బ్రిటిష్ పాలన కొనసాగుతున్నప్పుడు కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ వద్ద ఆక్రమణలకు ఎదురు నిలిచిన ఓ గిరిజన తెగ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోందని సమాచారం. -
హాయ్ నాన్న
నాని హీరోగా నటిస్తున్న తాజా చిత్రానికి ‘హాయ్ నాన్న’ అనే టైటిల్ ఖరారు చేశారు. శౌర్యువ్ దర్శకత్వంలో మోహన్ చెరుకూరి (సీవీఎం), డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల నిర్మిస్తున్న ఈ చిత్రంలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్. ఈ చిత్రానికి తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ‘హాయ్ నాన్న’ అని, హిందీలో ‘హాయ్ పప్పా’ అనే టైటిల్ను ఖరారు చేసి, ఫస్ట్ లుక్, గ్లింప్స్ను విడుదల చేశారు. ‘‘తండ్రీ–కూతురు భావోద్వేగాలతో కూడిన ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇది. యూనిక్ స్టోరీ లైన్తో రూపొందుతున్న ఈ చిత్రం అన్ని భాషలవారికీ కనెక్ట్ అవుతుంది. ఈ ఏడాది డిసెంబర్ 21న చిత్రాన్ని రిలీజ్ చేస్తాం’’ అని యూనిట్ పేర్కొంది. -
సోషల్ టీచర్ ఇంగ్లిష్ పాఠాలు చెబితే...
హర్ష చెముడు టైటిల్ రోల్లో నటిస్తున్న చిత్రం ‘సుందరం మాస్టర్’. దివ్య శ్రీ పాద హీరోయిన్. కళ్యాణ్ సంతోష్ దర్శకత్వంలో రవితేజ, కుర్రు సుధీర్కుమార్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ను హీరో రవితేజ విడుదల చేశారు. ‘‘సోషల్ స్టడీస్ బోధించే సుందరం మాస్టర్ మిర్యాలమెట్ట అనే మారుమూల పల్లెకి ఇంగ్లిష్ టీచర్గా బదిలీ అవుతాడు. అక్కడున్నవారికి ఎలా ఇంగ్లిష్ బోధిస్తాడు? అనేది ప్రధాన ఇతివృత్తం’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. -
మాస్ రత్నమాల
ఊర మాస్ రత్నమాలగా కనిపించనున్నారు అంజలి. శుక్రవారం (జూన్ 16) ఆమె పుట్టినరోజు సందర్భంగా ‘వీఎస్ 11’ (వర్కింగ్ టైటిల్) సినిమాలో ఆమె చేస్తున్న రత్నమాల పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ని విడుదల చేసింది చిత్ర యూనిట్. విశ్వక్ సేన్ హీరోగా కృష్ణ చైతన్య దర్శ కత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ‘‘యాక్షన్ డ్రామాగా రూపొందుతోన్న చిత్రమిది. ఇందులో రత్నమాలగా అంజలి కనిపించనున్నారు. ఆమె పాత్ర మాస్ ప్రేక్షకులను అలరిస్తుంది. విశ్వక్ సేన్ తొలిసారి ఈ చిత్రంలో క్రూరమైన పాత్రను పోషిస్తున్నారు’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: యువన్ శంకర్ రాజా, కెమెరా: అనిత్ మధాది, సహనిర్మాతలు: వెంకట్ ఉప్పుటూరి, గోపీచంద్ ఇన్నమూరి. -
ప్రేమ తగ్గిపోతుందా?
అర్జున్ అంబటి, చాందిని తమిళరసన్ జంటగా వెంకటరమణ మిద్దె స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం ‘వెడ్డింగ్ డైరీస్’. ఈ సినిమా ఫస్ట్ లుక్ను రిలీజ్ చేశారు. ‘‘విడిపోవాలనుకున్న భార్యాభర్తలు తమ ప్రేమను బలపర్చుకొని వైవాహిక బంధాన్ని ఎలా కొనసాగించారు? ఆ భార్యాభర్తల నడుమ ఎలాంటి సంఘర్షణ జరిగింది? అనేది ఈ సినిమాలోని మెయిన్ పాయింట్. ‘పెళ్లి తర్వాత ప్రేమ తగ్గిపోతుందా..?’ అనేది కాన్సెప్ట్’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. -
నిఖిల్ స్వయంభూ
నిఖిల్ హీరోగా నటించనున్న కొత్త సినిమాకు ‘స్వయంభూ’ అనే టైటిల్ ఖరారు చేశారు. గురువారం (జూన్ 1) నిఖిల్ బర్త్ డే సందర్భంగా ఈ చిత్రం టైటిల్ను ప్రకటించి, ఫస్ట్ లుక్ను విడుదల చేశారు. భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో ‘ఠాగూర్’ మధు సమర్పణలో భువన్, శ్రీకర్ నిర్మించనున్నారు. ‘‘నిఖిల్ కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్తో ఈ సినిమా రూపుదిద్దుకోనుంది. ఆగస్టులో షూటింగ్ ఆరంభిస్తాం’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సహనిర్మాతలు: విజయ్ కామిశెట్టి, జీటీ ఆనంద్, సంగీతం: రవి బస్రూర్, కెమెరా: మనోజ్ పరమహంస. ఇంకా.. నిఖిల్ బర్త్ డే సందర్భంగా వేరే చిత్రాల అప్డేట్స్ కూడా వచ్చాయి. నిఖిల్తో ‘స్వామి రారా’, ‘కేశవ’ చిత్రాల తర్వాత దర్శకుడు సుధీర్ వర్మ మరో సినిమా చేయనున్నారు. ఈ చిత్రాన్ని బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించనున్నారు. అలాగే ‘ది ఇండియా హౌస్’ అనే మరో సినిమా కమిటయ్యారు నిఖిల్. ఇక నిఖిల్ హీరోగా నటించిన ‘స్పై’ చిత్రం ఈ నెల 29న విడుదల కానుంది. -
పలాసకి మించి ఆపరేషన్ రావణ్
‘‘పలాస’ నచ్చకపోతే నా కాలర్ పట్టుకోండి’ అంటూ గతంలో చెప్పాను. ఇప్పుడు అంతకు మించిన నమ్మకంతో చెబుతున్నాను. ‘పలాస’కి మించి ‘ఆపరేషన్ రావణ్’ నెక్ట్స్ లెవెల్లో ఉంటుంది. మా నాన్న వెంకట సత్య వరప్రసాద్గారు బాగా డైరెక్ట్ చేశారు’’ అని హీరో రక్షిత్ అట్లూరి అన్నారు. వెంకట సత్య దర్శకత్వంలో రక్షిత్ అట్లూరి, సంగీర్తన విపిన్ జంటగా నటించిన చిత్రం ‘ఆపరేషన్ రావణ్’. ధ్యాన్ అట్లూరి నిర్మించిన ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటోంది. ఈ మూవీ ఫస్ట్ థ్రిల్ను దర్శకులు మారుతి, కల్యాణ్ కృష్ణ విడుదల చేశారు. దర్శక–నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ– ‘‘ప్రసాద్గారు డైరెక్షన్ చేస్తా అన్నప్పుడు నవ్వుకున్నా. కానీ ట్రైలర్ చూశాక చాలా బాగుంది’’ అన్నారు. ‘‘ఈ సినిమా బాగా రావడానికి కారణం రాధికగారు’’ అన్నారు వెంకట్ సత్య. ‘‘ఆపరేషన్ రావణ్’ మంచి చిత్రం’’ అన్నారు నటి రాధిక. ఈ చిత్రానికి కెమెరా: నాని చమిడిశెట్టి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: శ్రీపాల్ చొళ్లేటి. -
డబుల్ ధమాకా
మంచు మనోజ్ తన పుట్టినరోజుని (మే 20) పురస్కరించు కుని రెండు సినిమాల అప్డేట్తో డబుల్ ధమాకా ఇచ్చారు. వరుణ్ కోరుకొండ దర్శకత్వంతో మనోజ్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘వాట్ ది ఫిష్’. మనం మనం బరంపురం అనేది ట్యాగ్ లైన్. 6ఐఎక్స్ సినిమాస్పై విశాల్ బెజవాడ, సూర్య బెజవాడ నిర్మిస్తున్నారు. మనోజ్కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ, ఫస్ట్ లుక్ గ్లింప్స్ని విడుదల చేసింది చిత్రయూనిట్. ఇందులో మనోజ్ విభిన్నమైన గెటప్లలో కనిపిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: శక్తికాంత్ కార్తీక్, సహనిర్మాత: వరుణ్ కోరుకొండ. ఎల్ఎస్ ప్రొడక్షన్స్లో... మనోజ్ హీరోగా మరో కొత్త మూవీ ప్రకటన శనివారం వచ్చింది. భాస్కర్ బంటుపల్లి డైరెక్షన్లో మమత సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్పై ఎం. శ్రీనివాసులు, డి. వేణుగోపాల్, ఎం. మమత, ముల్లపూడి రాజేశ్వరి ఈ సినిమాను నిర్మించనున్నారు. -
స్పిన్ మాంత్రికుడి బయోపిక్.. ఆసక్తిగా ఫస్ట్ లుక్!
క్రికెట్ ప్రపంచంలో ఎన్నో రికార్డులు సాధించిన ప్రముఖ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ జీవితం ఆధారంగా రూపొందుతున్న చిత్రం ‘800’. సోమవారం (ఏప్రిల్ 17) ముత్తయ్య పుట్టినరోజుని పురస్కరించుకుని ఈ చిత్రం ఫస్ట్ లుక్ని విడుదల చేశారు. ఎంఎస్ శ్రీపతి రచన, దర్శకత్వం వహిస్తున్నారు. ‘స్లమ్డాగ్ మిలియనీర్’లో చేసిన సలీమ్ మాలిక్ పాత్ర ద్వారా గుర్తింపు తెచ్చుకున్న మధుర్ మిట్టల్ ఈ బయోపిక్లో ముత్తయ్య పాత్రను పోషిస్తున్నారు. ముత్తయ్య భార్య మదిమలర్ పాత్రను మహిమా నంబియార్ చేస్తున్నారు. శ్రీపతి మాట్లాడుతూ – ‘‘కెరీర్లో 800 టెస్ట్ వికెట్స్ తీసిన ఏకైక ఆఫ్ స్పిన్నర్ బౌలర్గా మురళీధరన్ అరుదైన రికార్డు సాధించారు. అందుకే ఈ చిత్రానికి ‘800’నే టైటిల్గా పెట్టాం. మురళికి తమిళనాడులో మూలాలు ఉన్నాయి. అతని తాతలు భారతీయులు. బ్రిటిష్ వారు అక్కడి టీ తోటలలో పని చేయడానికి వారిని శ్రీలంకకు తీసుకెళ్లారు. ఇలా ముత్తయ్య మురళీధరన్లోని పలు కోణాలను చూపించే చిత్రం ఇది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నాం’’ అన్నారు. వివేక్ రంగాచారి నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ ఏడాదే విడుదల కానుంది. -
'ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి' ఫస్ట్ లుక్ రిలీజ్
‘ఊహలు గుసగుసలాడే, జ్యో అచ్యుతానంద’ వంటి చిత్రాల తర్వాత హీరో నాగశౌర్య, దర్శకుడు శ్రీనివాస్ అవసరాల కాంబినేషన్లో రూపొందుతోన్న మూడో చిత్రం ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’. నాగశౌర్య, మాళవికా నాయర్ జంటగా టీజీ విశ్వప్రసాద్, పద్మజ దాసరి నిర్మిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ ఇటీవలే పూర్తయింది. ఈ సందర్భంగా ఈ చిత్రం ఫస్ట్ లుక్ను విడుదల చేశారు. శ్రీనివాస్ అవసరాల మాట్లాడుతూ– ‘‘పదేళ్ల పాటు ఓ జంట మధ్య సాగే ప్రేమ ప్రయాణమే ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’. 18 ఏళ్ల నుండి 28 సంవత్సరాల వయస్సు వరకు హెచ్చు తగ్గులతో సాగే వారి ప్రయాణం ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది’’ అన్నారు. ‘‘ఈ సినిమా విడుదల తేదీతో పాటు మరిన్ని వివరాలు త్వరలో వెల్లడిస్తాం’’ అన్నారు టీజీ విశ్వప్రసాద్, పద్మజ దాసరి. ఈ చిత్రానికి కెమెరా: సునీల్ కుమార్ నామ, సంగీతం: కళ్యాణీ మాలిక్, వివేక్ సాగర్ (కాఫీ ఫై సాంగ్), ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సుజిత్ కుమార్ కొల్లి, అసోసియేట్ ప్రొడ్యూసర్స్: సునీల్ షా, రాజా సుబ్రమణియన్, సహనిర్మాత: వివేక్ కూచిభొట్ల. -
సందీప్ రెడ్డి వంగ, రణ్బీర్ కపూర్ యానిమల్ నుంచి క్రేజీ అప్డేట్
‘అర్జున్ రెడ్డి’ డైరెక్టర్ సందీప్ వంగ దర్శకత్వంలో రణ్బీర్ కపూర్, రష్మిక మందన్నా జంటగా నటిస్తున్న చిత్రం యానిమల్. ప్రస్తుతం ఈ మూవీ శరవేగంగా షూటింగ్ను జరుపుకుంటోంది. ఇప్పటికే కబీర్ సింగ్ చిత్రంతో బాలీవుడ్ బ్లాక్బస్టర్ హిట్ కొట్టాడు. దీంతో సందీప్ తదుపరి చిత్రంపై ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో న్యూ ఇయర్ కానుకగా ఈ మూవీ ఫస్ట్లుక్ను రిలీజ్ చేసింది చిత్ర బృందం. టైటిల్ తగ్గట్టే ఫస్ట్లుక్ వైల్డ్ మలిచారు. ఈ పోస్టర్లో రణ్బీర్ ఒత్తయిన జట్టు, గుబురు గడ్డం, శరీర మొత్తం రక్తంతో తడిచి సిగరెట్ కాల్చుతూ కనిపించాడు. అర్జున్ రెడ్డి పోలిక కనిపిస్తున్నప్పటికీ చాక్లెట్ బాయ్ లాంటి రణ్బీర్ను వైల్డ్గా చూపించి అందరి దృష్టిని ఆకర్షించాడు సందీప్ వంగ. ప్రస్తుతం ఈ లుక్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కాగా టీ సిరిస్, భద్రకాళి పిక్చర్స్ సంస్థలు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ చిత్రం పాన్ ఇండియా చిత్రంగా విడుదల కానుంది. Presenting you the first look of ANIMAL. HAPPY NEW YEAR PEOPLE🙂 #RanbirKapoor #ANIMAL@AnilKapoor @thedeol @iamRashmika @tripti_dimri23 #BhushanKumar @VangaPranay @MuradKhetani #KrishanKumar @anilandbhanu @VangaPictures @Cine1Studios @TSeries @rameemusic @cowvala #ShivChanana pic.twitter.com/zrsyaXqWVx — Sandeep Reddy Vanga (@imvangasandeep) December 31, 2022 -
‘కథ వెనుక కథ’లో చాలా మంచి కథలు ఉన్నాయి
విశ్వంత్ దుద్దుంపూడి, శ్రీజిత ఘోష్, శుభశ్రీ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమాకు ‘కథ వెనుక కథ’ అనే టైటిల్ ఖరారు చేశారు. కృష్ణ చైతన్య దర్శకత్వంలో సాయి స్రవంతి మూవీస్ సమర్పణలో దండమూడి బాక్సాఫీస్, సాయి స్రవంతి మూవీస్ పతాకాలపై అవనింద్ర కుమార్ నిర్మిస్తున్న ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ లాంచ్ వేడుక హైదరాబాద్లో జరిగింది. ఈ సందర్భంగా నటుడు, ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారు అలీ మాట్లాడుతూ– ‘‘కథ వెనుక కథ మంచి కథ. దండమూడి అవనింద్ర కుమార్గారిది గోల్డెన్ హ్యాండ్. ఏ వ్యాపారం చేసినా కలిసి వస్తుంది’ అని అన్నారు. ‘‘కథ వెనుక కథ’లో చాలా కథలున్నాయి’’ అన్నారు సునీల్. ‘‘ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాం’’ అన్నారు విశ్వంత్. ‘‘ఈ సినిమాలో మంచి ట్విస్ట్లు ఉన్నాయి’’ అన్నారు అవనింద్ర కుమార్. ‘‘నిర్మాత అవనింద్ర, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ సాయిగార్ల వల్లే ఈ సినిమాను లార్జ్ స్కేల్లో చేస్తున్నాం’’ అన్నారు కృష్ణచైతన్య. -
నేను స్టూడెంట్ సార్
బెల్లంకొండ గణేష్ హీరోగా నటించిన ద్వితీయ చిత్రం ‘నేను స్టూడెంట్ సార్!’. డైరెక్టర్ తేజ శిష్యుడు రాఖీ ఉప్పలపాటి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఎస్వీ2 ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో ‘నాంది’ వంటి హిట్ సినిమా నిర్మించిన ‘నాంది’ సతీష్ వర్మ ‘నేను స్టూడెంట్ సార్!’ని నిర్మించారు. ఈ చిత్రం టైటిల్, ఫస్ట్ లుక్ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ‘నాంది’ సతీష్ మాట్లాడుతూ– ‘‘వైవిధ్యమైన యాక్షన్ థ్రిల్లర్గా రూపొందిన చిత్రమిది. దర్శకుడు కృష్ణ చైతన్య మంచి కథ అందించారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి’’ అన్నారు. సముద్ర ఖని, సునీల్, శ్రీకాంత్ అయ్యంగార్, ప్రమోదిని ఇతర పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి సంగీతం: మహతి స్వరసాగర్, కెమెరా: అనిత్ మధాడి. -
‘మాచర్ల నియోజకవర్గం’ నుంచి కృతీ లుక్
నితిన్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘మాచర్ల నియోజకవర్గం’. ఎంఎస్ రాజశేఖర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కృతీ శెట్టి, కేథరిన్ థ్రెసా కథానాయికలు. రాజ్కుమార్ ఆకెళ్ల సమర్పణలో శ్రేష్ట్ మూవీస్ బ్యానర్పై సుధాకర్ రెడ్డి, నికితారెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమా ఆగస్ట్ 12న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్లను వేగవంతం చేసిన చిత్ర బృందం తాజాగా కృతీశెట్టి లుక్ను వదిలింది. ఇందులో కృతీ స్టైలిష్గా కాఫీ కప్ పట్టుకుని కనిపించింది. ఇందులో ఆమె స్వాతి పాత్రలో అలరించనుందట. పొలిటికల్ ఎలిమెంట్స్తో మాస్, కమర్షియల్ ఎంటర్టైనర్ ఈ చిత్రం రూపొందింది. Introducing our ‘Swathi' aka @IamKrithiShetty ❤️ One of the core persons from #MacherlaNiyojakavargam 🚩 Get Ready to fall in Love with her from August 12th😍#MNVFromAug12th pic.twitter.com/vexAUuWYOV — nithiin (@actor_nithiin) July 17, 2022 -
'మేజర్ సెల్వన్'గా ప్రముఖ డైరెక్టర్..
Gautham Menon As Major Selvan First Look Out: మలయాళ యంగ్ హీరో దుల్కర్ సల్మాన్, మృణాళినీ ఠాకూర్ హీరో హీరోయిన్లుగా, రష్మికా మందన్నా, సుమంత్ కీలక పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘సీతారామం’. ఈ చిత్రానికి హను రాఘవపూడి దర్శకత్వం వహించారు. వైజయంతి మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా పతాకంపై అశ్వనీదత్ నిర్మించిన చిత్రం ఇది. ఈ చిత్రంలో లెఫ్టినెంట్ రామ్ పాత్రలో దుల్కర్ సల్మాన్, సీతగా మృణాళినీ ఠాకూర్, అఫ్రిన్ పాత్రలో రష్మికా మందన్నా కనిపించనున్నారు. ఈ సినిమా నుంచి ఇదివరకు విడుదలైన టీజర్, ఫస్ట్ లుక్ పోస్టర్లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇటీవల 'బ్రిగేడియర్ విష్ణు శర్మ' పాత్రలో నటిస్తున్న సుమంత్ లుక్ ఆకట్టుకుంది. తాజాగా ప్రముఖ డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ పాత్రను రివీల్ చేసింది చిత్రబృందం. ఈ సినిమాలో గౌతమ్ 'మేజర్ సెల్వన్'గా నటిస్తున్నారు. దీనికి సంబంధించిన లుక్ విడుదల కాగా, సోషల్ మీడియాలో మంచి స్పందన లభిస్తోంది. చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో ఆగస్టు 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. చదవండి: అన్నదమ్ములతో డేటింగ్ చేసిన హీరోయిన్లు.. ఫొటోలు వైరల్ మొన్న ఆర్జీవీ.. ఇప్పుడు సుశాంత్.. యాంకర్పై ఆగ్రహం Attention Everyone! 𝐌𝐚𝐣𝐨𝐫 𝐒𝐞𝐥𝐯𝐚𝐧 is here! Here's the first look of @menongautham from #SitaRamam.https://t.co/HNfYz5h9Yy@dulQuer @mrunal0801 @hanurpudi @iamRashmika @iSumanth @Composer_Vishal @VyjayanthiFilms @SwapnaCinema @SonyMusicSouth#SitaRamamOnAug5 pic.twitter.com/oUkrUIf6EE — Vyjayanthi Movies (@VyjayanthiFilms) July 15, 2022 -
షారుక్ ఖాన్ 30 ఏళ్ల సినీ ప్రస్థానం.. ఫ్యాన్స్కు గుడ్ న్యూస్
Sharuk Khan Drops First Look Of Pathaan Celebrating 30 Years Film Industry: బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ యావత్ దేశవ్యాప్తంగా గుర్తింపు పొందాడు. అనేక విజయాలు, గ్లామర్ పాత్రలు, రొమాంటిక్ హీరోగా పేరు గడించిన షారుక్ ఖాన్ 'కింగ్ ఖాన్'గా మన్ననలు పొందాడు. ఈ బాలీవుడ్ బాద్షా సినీ ప్రయాణం ప్రారంభమై నేటితో (జూన్ 25) 30 ఏళ్లు పూర్తయింది. 1992 జూన్ 25న విడుదలైన 'దీవానా' సినిమాతో షారుక్ ఖాన్ హీరోగా బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చాడు. తర్వాత ఒక్కో సినిమాతో తన స్టార్డమ్ పెంచుకున్నాడు. ఇక షారుక్, కాజల్ రొమాంటిక్ లవ్ ట్రాక్ 'దిల్ వాలే దుల్హానియా లే జాయేంగే'తో ప్రపంచంలోనే అత్యధిక సంవత్సరాలు ప్రదర్శితమైన మూవీగా రికార్డు సాధించింది. ఇదిలా ఉంటే షారుక్ ఖాన్ తన 30 ఏళ్ల సినీ ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా అభిమానులకు సర్ప్రైజ్ ఇచ్చాడు. షారుక్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమా 'పఠాన్' నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. ఈ వీడియోలో చేతిలో గన్తో, చేతికి బేడీలతో ఇంటెన్సివ్ లుక్లో ఆకట్టుకుంటున్న షారుక్ను చూడొచ్చు. ఈ పోస్టర్ రిలీజైన అతి తక్కువ సమయంలోనే నెట్టింట షేక్ చేస్తోంది. కాగా పఠాన్ మూవీలో దీపికా పదుకొణె, జాన్ అబ్రహం కూడా కీలక పాత్రలు పోషిస్తున్న విషయం తెలిసిందే. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం జనవరి 25, 2023న గ్రాండ్గా విడుదల కానుంది. (చదవండి: నెట్టింట రకుల్ డ్యాన్స్ వీడియో వైరల్.. బాయ్ఫ్రెండ్ కామెంట్ ఏంటంటే ?) 'పఠాన్'తోపాటు షారుక్ ఖాన్ అట్లీ దర్శకత్వంలో 'జవాన్' సినిమా కూడా చేస్తున్నాడు. ఇందులో లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్గా నటించనుంది. రాజ్ కుమార్ హిరాణీ తెరకెక్కించే 'డంకీ'లోనూ నటించనున్నాడు. ఇవేకాకుండా మాధవన్ 'రాకెట్రీ: ద నంబీ ఎఫెక్ట్', అమీర్ ఖాన్ 'లాల్ సింగ్ చద్ధా', రణ్బీర్ కపూర్ 'బ్రహ్మాస్త్ర', సల్మాన్ ఖాన్ 'టైగర్-3' చిత్రాల్లో కింగ్ ఖాన్ కెమియో ఇవ్వనున్నట్లు సమాచారం. (చదవండి: ప్రముఖ నటుడి ఆత్మహత్య.. చిత్ర పరిశ్రమలో విషాదం నడిరోడ్డుపై యంగ్ హీరోయిన్ డ్యాన్స్.. వీడియో వైరల్) View this post on Instagram A post shared by Shah Rukh Khan (@iamsrk) -
'ఏజెంట్' బ్యూటీ లుక్ విడుదల.. వైరల్
అక్కినేని అఖిల్ హీరోగా నటిస్తున్న ఐదో చిత్రం 'ఏజెంట్'. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో మాలీవుడ్ మెగాస్టార్ మమ్ముట్టి విలన్గా నటిస్తున్నారు. ఏకే ఎంటర్టైన్మెంట్స్, సురేందర్ 2 సినిమా పతాకాలపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా షూటింగ్ విదేశాల్లో జరుపుకున్న విషయం తెలిసిందే. కాగా ఈ సినిమా ప్రకటించినప్పటి నుంచి విడుదలైన పోస్టర్స్కు, అఖిల్ లుక్స్కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ మూవీలో హీరోయిన్గా నటిస్తోన్న సాక్షి వైద్య లుక్ను విడుదల చేశారు మేకర్స్. జూన్ 19న ఆమె పుట్టినరోజు సందర్భంగా ఈ పోస్టర్ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్లో సాక్షి వైద్య జీన్స్ ప్యాంట్, బ్రౌన్ కలర్ టాప్తో ఆకట్టుకునేలా ఉంది. ప్రస్తుతం సాక్షి లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఏజెంట్ సినిమా వరల్డ్వైడ్గా ఆగస్టు 12న విడుదల చేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. ఇదిలా ఉంటే ఈ మూవీ హాలీవుడ్ సూపర్ హిట్ మూవీ సిరీస్ 'బోర్న్' ఆధారంగా తెరకెక్కనుంది. వక్కంతం వంశీ కథ అందిస్తుండగా, హిప్ హాప్ తమిళ సంగీత దర్శకుడిగా పనిచేస్తున్నారు. చదవండి: చెత్త ఏరిన స్టార్ హీరోయిన్.. వీడియో వైరల్ సాయి పల్లవి వివరణపై ప్రకాశ్ రాజ్ ఆసక్తికర వ్యాఖ్యలు.. ఆ హీరోలా ఎఫైర్స్ లేవు.. కానీ ప్రేమలో దెబ్బతిన్నా: అడవి శేష్ Team #AGENT⚡️ Introducing & Wishes the beauty with Immense Talent @sakshivaidya99 a very Happy Birthday💖 Welcome to TFI 🤗 @AkhilAkkineni8 @mammukka @DirSurender @hiphoptamizha @AnilSunkara1 @VamsiVakkantham @S2C_Offl #AgentLoading pic.twitter.com/Wao5A7M8Qi — AK Entertainments (@AKentsOfficial) June 19, 2022 -
ఒక్క ట్వీట్తో పుకార్లకు ఫుల్ స్టాప్ పెట్టిన సూర్య
తమిళసినిమా: బాలా దర్శకత్వంలో నటిస్తున్న చిత్రంపై వస్తున్న పుకార్లకు నటుడు సూర్య ఫుల్స్టాప్ పెట్టారు. వరుసగా చిత్రాలు చేస్తూ బిజీగా ఉన్న నటుడు సూర్య ప్రస్తుతం ఈయన వెట్రీమారన్ దర్శకత్వంలో వాడి వాసల్, బాలా దర్శకత్వం వహిస్తున్న ఓ చిత్రంలో నటిస్తున్నారు. తదుపరి జై భీమ్ చిత్రం ఫేమ్ జ్ఞానవేల్ దర్శకత్వంలో నటించడానికి సిద్ధమవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. కాగా బాలా దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం ఆగిపోయిందనే వదంతులు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. దీనికి క్లారిటీ ఇస్తూ బాలా దర్శకత్వంలో నటిస్తున్న చిత్ర షూటింగ్ తొలి షెడ్యూల్ కన్యాకుమారి పరిసర ప్రాంతాల్లో పూర్తి చేసినట్లు రెండవ షెడ్యూల్ను త్వరలో ప్రారంభించనున్నట్లు సూర్య తన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. దీంతో ఈ క్రేజీ చిత్రంపై ఉన్న అపోహలు తొలగిపోయాయి. పితామగన్, నందా వంటి విజయవంతమైన చిత్రాల తరువాత సూర్య, బాలా కలిసి 17 ఏళ్ల తరువాత చేస్తున్న చిత్రం ఇది. 2డీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై జ్యోతిక, సూర్య నిర్మిస్తున్న ఈ చిత్రానికి జీవీ ప్రకాష్కుమార్ సంగీతం అందిస్తున్నారు. Waiting to be back on sets…!! #Suriya41 pic.twitter.com/enuJ5MNbZJ — Suriya Sivakumar (@Suriya_offl) May 26, 2022 -
'పోలీసోడు' హీరో మరో కొత్త చిత్రం.. ఫస్ట్ లుక్ రిలీజ్
చెన్నై సినిమా: తమిళ యాక్టర్ విక్రమ్ ప్రభు కథా నాయకుడిగా నటించనున్న తాజా చిత్రానికి 'రత్తముమ్ సదైయుమ్' అనే టైటిల్ను నిర్ణయించారు. కార్తీక్ మూవీ హౌస్ పతాకంపై కార్తీక్ అడ్విత్ నిర్మిస్తున్న ఈ చిత్రం ద్వారా హరేందర్ బాలచందర్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఇటీవల 'టానాక్కారస్' చిత్రంలో నటనకు గాను సినీ ప్రముఖుల ప్రశంసలను అందుకున్న విక్రమ్ ప్రభు నటిస్తున్న తాజా చిత్రం ఇది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్స్ కార్యక్రమాలను శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రం షూటింగ్ వచ్చే నెలలో ప్రారంభం కానుందని, ఇందులో నటించే ఇతర నటీనటులు, సాంకేతిక వర్గం వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని యూనిట్ వర్గాలు తెలిపారు. కాగా చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ను మంగళవారం (మే 24) విడుదల చేశారు. టానాక్కారస్ చిత్రాన్ని తెలుగు వెర్షన్లో పోలీసోడు పేరుతో ఏప్రిల్ 8న విడుదల చేశారు. ఓటీటీ డిస్నీ ప్లస్ హాట్స్టార్లో రిలీజైన ఈ మూవీ అశేష ప్రేక్షకాదరణ పొందింది. చదవండి: 👇 బలవంతంగా నాతో ఆ క్యారెక్టర్ చేయించారు: డైరెక్టర్ రజనీ కాంత్తో ఇళయరాజా భేటీ.. కారణం ? Need all of your encouragement for this one! Let’s go team! 💪👍😊 இரத்தமும் சதையும் - Blood and Flesh. Written and Directed by: @harendhar_b Produced by: @KarthikFilmaker@ctcmediaboy @teamaimpr#bloodandflesh #rathamumsadhaiyum. pic.twitter.com/HdWIvDHkvP — Vikram Prabhu (@iamVikramPrabhu) May 24, 2022 -
'మనీ హెయిస్ట్' ఫ్యాన్స్కు గుడ్ న్యూస్.. అక్కడ రీమేక్
Yoo Ji-tae As The Professor In Money Heist: Korea Joint Economic Area: ప్రస్తుతం ఓటీటీల హవా నడుస్తోంది. దేశాలు, భాషలు దాటేసి మరీ సినిమాలు, సిరీస్లకు మోస్ట్ పాపులారిటీ వస్తోంది. అలా మోస్ట్ పాపులర్ అయిన వెబ్ సీరీస్లలో 'మనీ హెయిస్ట్' ఒకటి. ముందుగా ఈ సిరీస్ స్పానిష్లో 'లా కాసా డె పాపెల్ (ది హౌజ్ ఆఫ్ పేపర్)' అనే టైటిల్తో వచ్చింది. తర్వాత యూఎస్లో ఇదే సిరీస్ను 'మనీ హెయిస్ట్' టైటిల్తో ఓటీటీ దిగ్గజం నెట్ఫ్లిక్స్లో విడుదల చేశారు. బ్యాంకుల దోపిడీ నేపథ్యంలో సాగే ఈ సిరీస్ సూపర్ హిట్ అయింది. ఇప్పటివరకు ఈ సిరీస్ నుంచి వచ్చిన 5 సీజన్లు మంచి టాక్ తెచ్చుకున్నాయి. అయితే తాజాగా ఈ సిరీస్కు రీమేక్ రాబోతుంది. మనీ హెయిస్ట్ వెబ్ సిరీస్ కొరియన్ భాషలో రీమేక్ కానుంది. 'మనీ హెయిస్ట్: కొరియా- జాయింట్ ఎకనామిక్ ఏరియా పార్ట్ 1' టైటిల్తో కొరియాలో రిలీజ్కు సిద్ధంగా ఉంది. దీనికి సంబంధించిన విషయాన్ని ప్రకటిస్తూ ఇందులోని ప్రొఫెసర్ పోస్టర్ను విడుదల చేసింది నెట్ఫ్లిక్స్. కొరియన్ 'మనీ హెయిస్ట్లో ప్రొఫెసర్గా 'యూ జి-టే' నటించనున్నాడు. ఈ పోస్టర్లో జాకెట్తో పాటు ఫార్మల్ దుస్తులు ధరించి, స్పెక్ట్స్ పెట్టుకుని ప్రొఫెసర్ ఏదో ఆలోచిస్తున్నట్లు మనం చూడొచ్చు. ఈ సిరీస్ను జూన్ 24 నుంచి ప్రదర్శించనున్నట్లు నెట్ఫ్లిక్స్ పేర్కొంది. చదవండి: స్పానిష్ టీవీ సిరీస్కు ఫుల్ క్రేజ్ ఎందుకంటే.. Get ready to go back to class, The Professor arrives in just 6 weeks 🥳 MONEY HEIST: KOREA - JOINT ECONOMIC AREA ARRIVES ON JUNE 24th 🕺🏻💃 pic.twitter.com/fBtWRU4FQJ — Netflix India (@NetflixIndia) May 13, 2022 ఇదివరకు వచ్చిన 'మనీ హెయిస్ట్'లో ప్రొఫెసర్ పాత్రకు ఎంత పేరు వచ్చిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆ సిరీస్లోనే కేవలం ప్రొఫెసర్ పాత్రకే ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది. ఇందులో ప్రొఫెసర్గా అల్వారో మోర్టే నటించి ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. అందుకే ప్రస్తుతం వస్తున్న 'మనీ హెయిస్ట్: కొరియా- జాయింట్ ఎకనామిక్ ఏరియా పార్ట్ 1'పై అందులోని ప్రొఫెసర్ పాత్రపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మరీ ఇందులో ప్రొఫెసర్గా నటిస్తున్న 'యూ జి-టే' ఎంతవరకు ఆకట్టుకుంటాడో చూడాలి. కాగా వెన్ మై లవ్ బ్లూమ్స్, హీలర్, మ్యాడ్ డాగ్ చిత్రాల్లో అలరించాడు 'యూ జి-టే'. అలాగే దక్షిణ కొరియా సిరీస్ స్క్విడ్ గేమ్ కూడా పాపులర్ అయిన విషయం తెలిసిందే. చదవండి: 'మనీ హెయిస్ట్ సీజన్ 5' ఎమోజీలొస్తున్నాయ్ var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4331451957.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
ఇట్లు... ప్రజానీకం
అడవిలో నివాసం ఉండే ఓ తెగకు సంబంధించిన సమస్య పరిష్కారం కోసం వెండితెరపై పోరాడుతున్నారు ‘అల్లరి’ నరేశ్. అది ఏ సమస్య? ఆ సమస్యకు ఎలా పరిష్కారం లభించింది? అనే విషయాలను సిల్వర్ స్క్రీన్పై చూడాల్సిందే. ‘నాంది’ తర్వాత ‘అల్లరి’ నరేశ్ హీరోగా చేస్తోన్న మరో చిత్రం ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’. ఈ చిత్రంలో ఆనంది హీరోయిన్. రాజేష్ దండు నిర్మిస్తున్న ఈ సినిమాకు ఏఆర్ మోహన్ దర్శకుడు. మంగళవారం (మే 10) ‘అల్లరి’ నరేశ్ బర్త్ డే. ఈ సందర్భంగా ఈ చిత్రంలోని ఫస్ట్ లుక్ను రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. ‘వెన్నెల’ కిశోర్, ప్రవీణ్ నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: శ్రీచరణ్ పాకాల. -
'మధుమతి'గా శ్రియా కొత్త లుక్.. నెట్టింట వైరల్
Shriya Saran First Look Released From Kabzaa Movie: తెలుగు ప్రేక్షకుల మదిలో హీరోయిన్గా ప్రత్యేక స్థానం సంపాదించుకుంది శ్రియా సరన్. సుమారు రెండు దశాబ్దాలుగా సౌత్ ఇండస్ట్రీలో హీరోయిన్గా గుర్తింపు పొందుతూనే ఉంది. అయితే వివాహం అనంతరం మాత్రం అరకొర సినిమాలతో సరిపెడుతూ వచ్చింది. ప్రస్తుతం బడా హీరోలా సరసన నటించికపోయిన పెద్ద చిత్రాల్లో మాత్రం కనిపించి అలరిస్తోంది. దర్శక ధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మక చిత్రం 'ఆర్ఆర్ఆర్'లో కీలక పాత్రలో నటిస్తోంది. అలాగే హిందీ 'దృశ్యం 2'లోనూ అజయ్ దేవగణ్కు జంటగా యాక్ట్ చేస్తోంది. ఇదిలా ఉంటే తాజాగా శ్రియా మరో భారీ బడ్జెట్ చిత్రంలో నటించనున్నట్లు తెలుస్తోంది. కన్నడ స్టార్ హీరోలు ఉపేంద్ర, కిచ్చా సుదీప్ కథానాయకులుగా నటిస్తున్న చిత్రం 'కబ్జా'. ఆర్. చంద్రు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలే నెలకొన్నాయి. ఈ సినిమాలో శ్రియా లీడ్ రోల్లో అలరించనుంది. తాజాగా ఈ సినిమా నుంచి శ్రియా ఫస్ట్ లుక్ను విడుదల చేశారు మేకర్స్. 'కబ్జా' సినిమాలో శ్రియా మధుమతి అనే పాత్రలో దర్శనమివ్వనుంది. ప్రస్తుతం ఈ లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సాంప్రదాయ దుస్తుల్ని ధరించి మహరాణిలా సింహాసనంలో కూర్చున్న శ్రియా మేకోవర్ ఆకట్టుకుంటోంది. ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, జగపతిబాబు, కబీర్ సింగ్ దుహా, బోమన్ ఇరానీ వంటి స్టార్ క్యాస్టింగ్ ఉంది. ఈ మూవీ తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ, ఒరియా, మరాఠి భాషల్లో పాన్ ఇండియాగా త్వరలో విడుదల కానుంది. Unveiling the first look of our 1’st queen..Welcoming Shirya Saran aboard.. happy to have you on set @shriya1109 💐✨#Kabzaa#Indianrealstarupendra#KichchaSudeepa#Rchandru#ShriyaSaran#Panindiamoviekabzaa pic.twitter.com/vP2z6eW81i — R.Chandru (@rchandru_movies) March 7, 2022 -
క్రీడాకారిణిగా పవర్ఫుల్గా వరలక్ష్మీ శరత్ కుమార్.. పోస్టర్ వైరల్
Varalaxmi Sharath Kumar First Look From Aadya Movie Revealed: తెలుగు ప్రేక్షకులకు వరలక్ష్మీ శరత్ కుమార్ సపరిచితమే. తమిళంతోపాటు తెలుగులోనూ మంచి క్రేజ్ సంపాదించుకుంది. క్రాక్, నాంది సినిమాలతో సూపర్ హిట్ అందుకోవడంతో ఈ క్రేజ్ మరింత పెరిగింది. అలాగే ఆమె కూడా వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరించనుంది. ఇటీవలే స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో నటిస్తున్న 'యశోద' మూవీలో వరలక్ష్మీ శరత్ కుమార్ స్పెషల్ పోస్టర్ను రిలీజ్ చేశారు. అలాగే 'హనుమాన్' సినిమాలోని ఫస్ట్ లుక్ను విడుదల చేశారు. ఇవే కాకుండా వరలక్ష్మీ శరత్ కుమార్ నటిస్తోన్న మరో తాజా చిత్రం 'ఆద్య'. ఆమెతో పాటు హెబ్బా పటేల్, ఆశిష్ గాంధీ తదితరులు ప్రధాన పాత్రలో తెరకెక్కనున్న ఈ సినిమాకు ఎం. ఆర్ కృష్ణ మామిడాల దర్శకత్వం వహిస్తున్నారు. శనివారం (మార్చి 5) ఆమె పుట్టిన రోజు సందర్భంగా వరలక్ష్మీ లుక్ను రివీల్ చేశారు మేకర్స్. ఈ పోస్టర్లో ఆమె క్రీడాకారిణిగా పవర్ఫుల్గా కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. జనవరి 11న రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టిన ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుపుకుంటోంది. ఈ మూవీకి మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందిచడం విశేషం. -
రొమాంటిక్ చిత్రంగా 'ఈ కథలో నేను'.. ఫస్ట్లుక్ విడుదల
Ee Kathalo Nenu Movie First Look Released: హోమానంద్, రేవంత్ సిమ్రాన్ పరింజా (తెలుగు కిర్రాక్ పార్టీ సినిమా ఫేం) హీరోహీరోయిన్లుగా రొమాంటిక్ లవ్స్టోరీగా తెరెకెక్కుతున్న సినిమా 'ఈ కథలో నేను'. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్, గోవా పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. సాయిమాధవ్ బుర్రా ఈ సినిమాకు ప్రముఖ మాటల రచయితగా వ్యవహరించడమే కాకుండా స్క్రీన్ప్లే కూడా అందించారు. ఈ సినిమా ఫస్ట్లుక్ను చిత్రబృందం శనివారం (ఫిబ్రవరి 26) విడుదల చేసింది. త్వరలో ఫస్ట్ లుక్ను రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు. ఈ సినిమాకు యంయస్. ఫణిరాజ్ దర్శకత్వం వహించగా టీవీ కేశవతీర్థ అవతార్ ఫిలింస్ బ్యానర్పై ప్రొడక్షన్ నెం 1గా నిర్మించారు. ఈ చిత్రానికి దివంగత పద్మశ్రీ సిరివెన్నెల సీతారామ శాస్త్రి, సాయికిరణ్, రెహమాన్, సాగర్ సాహిత్యం అందించారు. మధు రెడ్డి ఎడిటర్గా వ్యవహరిస్తున్న ఈ సినిమాకి శ్రీయోగి సంగీతం సమకూర్చారు. మల్హర్ బట్ జోషి డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీగా పనిచేయగా ఎం. అచ్చిబాబు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా బాధ్యతలు నిర్వర్తించారు. -
సస్పెన్స్ థ్రిల్లర్గా 'ఇట్లు'.. ఫస్ట్ లుక్ విడుదల చేసిన హరీశ్ రావు
Itlu Movie First Look Released By Minister Harish Rao: ‘‘ఇట్లు’ టీమ్ని చూస్తుంటే అందరూ కొత్తవారిలా కనిపిస్తున్నారు. ధైర్యంగా సినిమాని పూర్తి చేసి, రిలీజ్ చేస్తుండటం అభినందనీయం’’ అన్నారు మంత్రి హరీష్ రావు. అమీర్, ప్రణీత, దీపిక హీరో హీరోయిన్లుగా పందిళ్లపల్లి రోషిరెడ్డి దర్శకత్వంలో పూదరి రాజాగౌడ్, పూదరి రాజశేఖర్ గౌడ్ నిర్మించిన చిత్రం ‘ఇట్లు’. ఈ చిత్రం ఫస్ట్ లుక్ని హరీష్ రావు రిలీజ్ చేశారు. ‘‘సస్పెన్స్ థ్రిల్లర్గా తెరకెక్కిన చిత్రమిది. త్వరలో సినిమాని రిలీజ్ చేస్తాం’’ అన్నారు రోషి రెడ్డి. ‘‘పోస్టర్ని లాంచ్ చేసిన హరీష్ రావుగారికి థ్యాంక్స్’’ అన్నారు నిర్మాతలు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా బాచిన నాగేశ్వరరావు బాధ్యతలు నిర్వర్తించారు. -
ఒక ఫైటర్గా తప్ప లూజర్గా చనిపోకూడదనుకున్నా: హీరో
'చనిపోతే ఒక ఫైటర్గా తప్ప లూజర్గా చనిపోకూడదని అనుకున్నా' అని హీరో, నిర్మాత రిత్విక్ చిల్లికేశల తెలిపారు. రిత్విక్ చిల్లికేశల, చిత్రా శుక్లా హీరోయిన్లుగా నటించిన చిత్రం 'కళింగపట్నం జీవా'. డీఎల్ ప్రొడక్షన్స్ బ్యానర్పై పి. నానిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ను ఆదివారం హైదరాబాద్లో విడుదల చేశారు. 'ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ', 'మళ్లీ రావా' చిత్రాల నిర్మాత రాహుల్ యాదవ్ నక్కా చేతులమీదుగా ఈ కార్యక్రమం జరిగింది. అలాగే ఈ కార్యక్రమంలో లక్ష్య సినిమా దర్శకుడు సంతోష్ జాగర్లపూడి పాల్గొన్నారు. సినిమా ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ చాలా ఆసక్తికరంగా ఉందని రాహుల్ యాదవ్ తెలిపారు. తనే కథ రాసుకుని, హీరోగా, ప్రొడ్యూసర్గా కూడా వ్యవహరించడం గొప్ప విషయమన్నారు. సినిమా హీరో, నిర్మాత రిత్విక్ మాట్లాడుతూ 'మాములుగా నేను డ్యాన్సర్ని. కానీ ఈ చిత్రంలో ఒక్క పాట కూడా లేదు. ఒక కమర్షియల్ చిత్రంగా కాకుండా వైవిధ్యమైన సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావాలని భావించాను. ఈ చిత్రానికి కథ, నిర్మాత, రీరికార్డింగ్ వర్క్ కూడా నేనే చేశాను. సినిమా చాలా బాగా వచ్చింది. నాకు సహకరించిన అందరికీ ధన్యవాదాలు. ఇంకో 20 రోజుల్లో ఫస్ట్ కాపీ రెడీ అవుతుంది. ఈ సినిమా నిర్మాణంలో చాలా సమస్యలు ఎదుర్కొన్నా. అప్పుడు ఒక్కటే అనుకున్నా. ఒకవేళ చనిపోయినా ఒక ఫైటర్గా చనిపోవాలి తప్ప లూజర్గా కాదని. అందుకే పట్టుదలగా ఈ చిత్రాన్ని పూర్తి చేశాను. ఇందులో హీరోకి ఒక కన్ను మాత్రమే ఉండి చాలా వైవిధ్యంగా సినిమా ఉంటుంది.' అని పేర్కొన్నారు. -
రక్తంతో తడిసిన హృతిక్ రోషన్.. బర్త్డే స్పెషల్ ట్రీట్
Hrithik Roshan First Look As Vedha Out From Vikram Vedha: తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి, మాధవన్ కలిసి నటించిన చిత్రం సూపర్ హిట్ చిత్రం 'విక్రమ్ వేద'. ఈ సినిమాకు అశేష ప్రేక్షధారణ లభించిన సంగతి తెలిసిందే. అంతటి ఘన విజయాన్ని సాధించిన ఈచిత్రాన్ని హిందీలో రీమెక్ చేస్తున్నారు. ఇందులో విజయ్ సేతుపతి నటించిన వేద పాత్రలో బాలీవుడ్ స్టార్ హీరో, గ్రీక్ గాడ్గా పేరొందిన హృతిక్ రోషన్ అలరించనున్నాడని సమాచారం. జనవరి 10న హృతిక్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన పాత్రను ప్రేక్షకులకు పరిచయం చేశారు మేకర్స్. 'విక్రమ్ వేద' హీందీ రీమెక్ నుంచి హృతిక్ రోషన్ ఫస్ట్ లుక్ను విడుదల చేశారు దర్శక నిర్మాతలు. ఈ ఫస్ట్ లుక్లో హృతిక్ రఫ్ లుక్లో అట్రాక్టీవ్గా కనిపిస్తున్నాడు. నల్లని కళ్లద్దాలు, గడ్డం, నల్లటి కుర్తాలో రక్తంతో తడిసిన 'వేద' పాత్రను పరిచయం చేసింది చిత్ర బృందం. ఈ సినిమాను తమిళలో రూపొందించిన దర్శకుడు పుష్కర్ గాయత్రి ఈ హిందీ రీమెక్కు డైరెక్షన్ చేయనున్నాడు. ఈ సినిమాలో మాధవన్ నటించిన విక్రమ్ రోల్లో సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నాడు. ఇప్పటివరకు సైఫ్ ఫస్ట్ లుక్ ఇంకా రాలేదు. అయితే ఇవాళ హృతిక్ బర్త్డే స్పెషల్ ట్రీట్గా వెద ఫస్ట్ లుక్ను రివీల్ చేశారు మేకర్స్. ఇందులో రాధికా ఆప్టే కూడా కీలక పాత్రలో మెరవనుంది. वेधा . VEDHA#vikramvedha pic.twitter.com/4GDkb7BXpl — Hrithik Roshan (@iHrithik) January 10, 2022 ఇదీ చదవండి: నోట్లో థర్మామీటర్తో జాన్వీ.. కరోనాగా అనుమానం -
మోహన్ లాల్ కొత్త అవతారం.. గుండు, గుబురు గడ్డంతో అదిరిపోయిందిగా ఫస్ట్ లుక్
Mohan Lal Barroz Movie First Look Poster Released: ప్రముఖ నటుడు మోహన్ లాల్ తన విలక్షణ నటనతో ఎందరినో ఆకట్టుకున్నారు. తాజాగా ఆయన మెగాఫోన్ పట్టుకొని దర్శకుడిగా మారారు. మోహన్లాల్ తొలిసారిగా డైరెక్ట్ చేస్తున్న సినిమా 'బరోజ్'. ఈ చిత్రంలో ఆయనే ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. నూతన సంవత్సరం సందర్భంగా సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ను సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు మోహన్ లాల్. ఈ పోస్టర్లో మోహన్ లాల్ గుండు, గుబురు గడ్డం, మీసంతో బంగారు సింహాసనంపై దర్జాగా కూర్చున్నారు. మోహన్ లాల్ సరికొత్త లుక్ ఎంతో ఆకట్టుకునేలా ఉంది. ఈ చిత్రంలో మోహన్ లాల్ 'బరోజ్' అనే జీనీ పాత్రను పోషిస్తున్నట్లు సమాచారం. మోహన్ లాల్ ఈ పోస్టర్ను ప్రకటిస్తూ 'మనముందు మరో సంవత్సరం ప్రకాశించనుంది. ఈ సంవత్సరం ప్రతి ఒక్కరికి శుభప్రదంగా ఉండాలని కోరుకుంటున్నా. ఈ ఏడాది మీకు అత్యంత విలువైన కాలంగా మారాలని ఆశిస్తున్నా. హ్యాపీ న్యూ ఇయర్. బరోజ్ ఫస్ట్ లుక్.' అని పోస్ట్ చేశాడు. ఈ బరోజ్ చిత్రం మైథలాజికల్ థ్రిల్లర్గా తెరకెక్కుతోంది. అలాగే ఈ సినిమాను త్రీడీ విధానంలో చిత్రీకరిస్తున్నారు. ఇండియాలోనే మొదటి త్రీడీ చిత్రం మై డియర్ కుట్టిచాతన్కు దర్శకత్వం వహించిన జిజో పున్నూస్ కథను అందించారు. సినిమాటోగ్రాఫర్గా సంతోష్ శివన్ చేయనున్నారు. వాస్కోడిగామా నిధిని కాపాడే జినీగా మోహన్ లాల్ నటిస్తున్నాడు. Here's a toast to another year that rises before us. Wishing all good fortunes and prosperity upon each one of you! May this year turn out to be one of the most treasured time frames of your life! #HappyNewYear #BarrozFirstLook pic.twitter.com/x3ZaawlMZ6 — Mohanlal (@Mohanlal) December 31, 2021 -
మాంచి కిక్కిచ్చే క్రైమ్ థ్రిల్లర్ "రెక్కీ" ఫస్ట్లుక్ రిలీజ్
Rekki Movie First Look Released At Film Chamber: స్నోబాల్ పిక్చర్స్ పతాకంపై ప్రొడక్షన్ నంబర్-1గా తెరకెక్కుతున్న సూపర్ క్రైమ్ థ్రిల్లర్ "రెక్కీ". కొన్ని క్రైమ్ కథలు ఊహకు అందవు అన్నది ట్యాగ్లైన్. ఎన్.ఎస్.ఆర్.ప్రసాద్ దర్శకత్వంలో కమలకృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమాతో అభిరామ్ హీరోగా పరిచయం అవుతుండగా క్రేజీ కమెడియన్ భద్రమ్ సెకండ్ హీరోగా నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ఫస్ట్లుక్ పోస్టర్ను హైదరాబాద్లోని ఫిల్మ్ ఛాంబర్లో విడుదల చేశారు. క్రైమ్ థ్రిల్లర్స్ జోనర్ లో తెలుగు తెరపై ఇప్పటివరకు రాని కథాంశంతో, ఎవరూ ఊహించని ట్విస్టులతో అత్యంత ఆసక్తికరంగా రూపొందుతున్న "రెక్కీ" టాలీవుడ్ లో సరికొత్త ట్రెండ్ సెట్టర్ అవుతుందని యూనిట్ సభ్యులు పేర్కొన్నారు. పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలోనే విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. -
నాగ చైతన్య బర్త్డే: ‘బంగార్రాజు’ ఫస్ట్లుక్ వచ్చేసింది
Naga Chaitanya First Look Release From Bangarraju Movie: ‘సోగ్గాడే చిన్నినాయనా’ వంటి హిట్ చిత్రం తర్వాత హీరో నాగార్జున-దర్శకుడు కల్యాణ్ కృష్ణ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న చిత్రం ‘బంగార్రాజు’. ‘సోగ్గాడు మళ్లీ వచ్చాడు’ అనేది ఉప శిర్షీక. ఈ సినిమాలో మరో అక్కినేని వారసుడు నాగచైతన్య కూడా హీరోగా నటిస్తున్నాడు. ఇప్పటికే సెట్స్పైకి వచ్చిన ఈ సినిమా శరవేగంగా షూటింగ్ను జరుపుకుంటోంది. అంతేగాక ప్రమోషన్లో భాగంగా ఈ మూవీ నుంచి ఒక్కొక్కటిగ అప్డేట్స్ బయటకు వస్తున్నాయి. ఇప్పటికే ఈ మూవీలో ఓ ఫస్ట్సాంగ్ విడుదల కాగా.. కృతి శెట్టి లుక్ను విడుదల చేశారు మేకర్స్. చదవండి: విడాకుల తర్వాత సమంత తొలి ఇంటర్వ్యూ, ఆసక్తికర విషయాలు వెల్లడి వీటికి మంచి స్పందన వస్తోంది. ఇక రేపు నాగ చైతన్య బర్త్డే సందర్భంగా ‘బంగార్రాజు’ నుంచి చై లుక్ను విడుదల చేసింది చిత్ర బృందంగా. బంగార్రాజు ఫస్ట్లుక్ అవుట్ అంటూ ఈ సందర్భంగా చై పాత్రను వెల్లడించారు. ఇక రేపు(నవంబర్ 23) చై పుట్టిన రోజు సందర్భంగా టీజర్ రిలీజ్ చేయనున్నట్లు మూవీ యూనిట్ ప్రకటించింది. ఇదిలా ఉంటే నాగచైతన్య ‘బంగార్రాజు’ అయితే మరీ నాగార్జున పాత్ర ఏంటనేది ఆసక్తిగా మారింది. చదవండి: కృతిశెట్టి లుక్ షేర్ చేసిన చై, కొడుకును ఇలా ప్రశ్నించిన నాగ్ Here is the First Look of 🔥బంగార్రాజు🔥@chay_akkineni @IamKrithiShetty @kalyankrishna_k @AnnapurnaStdios @anuprubens @ZeeStudios_ @lemonsprasad#Bangarraju #BangarrajuComing#HBDChay pic.twitter.com/iYDDy1qzUp — Nagarjuna Akkineni (@iamnagarjuna) November 22, 2021 -
విఠలాచార్యపై పుస్తకం తీసుకురావడం సంతోషంగా ఉంది
‘‘నేను స్టూడెంట్గా ఉన్న రోజుల్లో విఠలాచార్యగారి సినిమాలు చాలా చూశాను. ఆయన దర్శకత్వంలో నేను చేసిన ఒకే ఒక సినిమా ‘ఇద్దరు మొనగాళ్లు’ హిట్ అయ్యింది. గొప్ప దర్శకుడు, సక్సెస్ఫుల్ నిర్మాత అయిన ఆయనపై పుస్తకం తీసుకురావడం సంతోషంగా ఉంది’’ అని సూపర్స్టార్ కృష్ణ అన్నారు. ప్రముఖ దర్శకుడు విఠలాచార్య సినిమా స్టైల్ ఆఫ్ మేకింగ్, ఆయన సినీ ప్రయాణం నేపథ్యంలో సీనియర్ జర్నలిస్ట్, రచయిత పులగం చిన్నారాయణ రాసిన ‘జై విఠలాచార్య’ పుస్తకం ఫస్ట్ లుక్ని కృష్ణ విడుదల చేశారు. ‘‘సినిమా నిర్మాణంలో విఠలాచార్యగారు పెద్ద బాలశిక్ష లాంటివారు. కరోనా సమయంలో విఠలాచార్య శత జయంతి సందర్భంగా ఈ పుస్తకానికి అంకురార్పణ చేసి, త్వరగా రాశాను. రచయితగా నా తొమ్మిదవ పుస్తకమిది’’ అని పులగం చిన్నారాయణ అన్నారు. ‘‘జై విఠలాచార్య’ను మా తొలి పుస్తకంగా పబ్లిష్ చేయడం చాలా ఆనందంగా ఉంది’’ అని ‘మూవీ వాల్యూమ్’ షేక్ జిలాన్ బాషా అన్నారు. -
శేఖర్ కమ్ముల చేతుల మీదుగా ‘వస్తున్నా.. వచ్చేస్తున్నా’ ఫస్ట్లుక్
‘కౌసల్య కృష్ణమూర్తి, పడేసావే, ఆపరేషన్గోల్డ్ ఫిష్’ చిత్రాలతో కథానాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్న కార్తీక్రాజు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘వస్తున్నా.. వచ్చేస్తున్నా’. మిస్తి చక్రవర్తి హీరోయిన్గా సందడి చేయనుంది. తేజస్వీ క్రియేటివ్ వర్క్స్ పతాకంపై సందీప్ గోపిశెట్టి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ఫస్ట్లుక్ పోస్టర్ సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల చేతుల మీదుగా విడుదలైంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘కార్తీక్రాజు నటించిన ఈ చిత్రం ఫస్ట్లుక్ ఇంప్రెసివ్గా ఉంది అన్నారు. చిత్రం కూడా ప్రేక్షకులు అలరించేలా ఉంటుందని అనుకుంటున్నా. ఈ మూవీ విజయం సాధించి అందరికి మంచిపేరును తీసుకురావాలని ఆశిస్తున్నా’ అన్నారు శేఖర్ కమ్ముల. అలాగే దర్శక నిర్మాత సందీప్ గోపిశె ట్టి మాట్లాడుతూ ‘ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల గారితో మా చిత్రం ఫస్ట్లుక్ విడుదల కావడం ఆనందంగా ఉంది. ఇది మా విజయానికి శ్రీకారంలా భావిస్తున్నాం. పూర్తి కమర్షియల్ అంశాలతో రూపొందిన ఫ్యామిలీ ఎమోషనల్ థ్రిల్లర్ ఇది. ఆడియన్స్ సర్ఫ్రైజ్గా ఫీలయ్యే ఎన్నోఅంశాలు ఈ చిత్రంలో ఉన్నాయి. పూర్తి కొత్తదనంతో, నిజాయితీగా తెరకెక్కించిన ఈ చిత్రం తప్పకుండా అన్ని వర్గాల ఆదరణ పొందుతుందనే నమ్మకం ఉంది. ప్రస్తుతం నిర్మాణానంతర పనులు జరుగుతున్నాయి. త్వరలోనే టీజర్ను విడుదల చేస్తాం’ అన్నారు. ప్రశాంత్, భీమనేని శ్రీనివాస్, దేవి ప్రసాద్, పోసాని కృష్ణమురళి, ఆమని, గణపతి, అన్వి, డా. శేషసాయి తదితరులు ఈ చిత్రంలో నటిస్తున్నారు. -
రజనీకాంత్ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్.. ఒకే రోజు డబుల్ ట్రీట్
సూపర్ స్టార్ రజనీకాంత్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన సినిమా విడుదల అవుతుందంటే అభిమానులకు పండుగనే చెప్పాలి. అయితే ఇటీవల రజనీ సినిమాలు పెద్దగా సక్సెస్ కావడం లేదు. దీంతో ప్రస్తుతం రజనీ నటిస్తున్న ‘అన్నాత్తే’ చిత్రంపైనే ఫ్యాన్స్ ఆశలన్నీ పెట్టుకున్నారు. ఈ చిత్రాన్ని శివ దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా చిత్ర యూనిట్ రేపు వినాయక చవితి సందర్భంగా ఆయన అభిమానుల కోసం రెండు అప్డేట్స్ ఇస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు. సెప్టెంబర్ 10న ఫస్ట్ లుక్ పోస్టర్ని మేకర్స్ విడుదల చేస్తున్నట్లు ట్వీట్ చేశారు. అందులో.. సినిమాలోని రజినీ ఫస్ట్ లుక్ని ఉదయం 11 గంటలకి రిలీజ్ చేస్తున్నట్లు, అలానే మోషన్ పోస్టర్ టీజర్ని సాయంత్రం 6 గంటలకి విడుదల చేస్తున్నట్లు తెలిపారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ చిత్ర యూనిట్ ఒక పోస్టర్ కూడా విడుదల చేసింది. అందులో రజనీకాంత్ వెనక్కి తిరిగి నిల్చుని ఉండగా, ఆ పక్కనే శూలాలు, భవనాలు కనిపిస్తున్నాయి. తమ అభిమాన హీరో ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఈ చిత్రంలో కీర్తి సురేష్, ఖుష్బూ, నయనతార ,మీనా, ప్రకాష్రాజ్ ముఖ్య పాత్రలలో కనిపించనున్నారు. ‘అన్నాత్తే’ సినిమాను దీపావళికి విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారు. #Annaatthe thiruvizha aarambam!#AnnaattheFirstLook Tomorrow @ 11 AM | #AnnaattheMotionPoster Tomorrow @ 6 PM@rajinikanth @directorsiva #Nayanthara @KeerthyOfficial @immancomposer @khushsundar #Meena @sooriofficial @AntonyLRuben @dhilipaction @vetrivisuals #AnnaattheFLTomorrow pic.twitter.com/RTOr8SFqWE — Sun Pictures (@sunpictures) September 9, 2021 చదవండి:Saba Qama: మసీదులో నటి డ్యాన్స్ వీడియో.. షాకిచ్చిన కోర్టు, అరెస్టు వారెంట్ జారీ -
విలన్గా జయసుధ తనయుడి ఎంట్రీ
వైవిధ్యమైన కథా చిత్రాలను, విభిన్నమైన పాత్రలను ఎంపిక చేసుకుంటూ యంగ్ టాలెంట్ను ఎంకరేజ్ చేసే కథానాయకుడు లక్ష్య్. ‘వలయం’ వంటి గ్రిప్పింగ్ సస్పెన్స్ థ్రిల్లర్తో ప్రేక్షకులను మెప్పించిన ఈ హీరో ఇప్పుడు తనదైన పంథాలో ‘గ్యాంగ్స్టర్ గంగరాజు’ అనే డిఫరెంట్ మూవీతో ఆకట్టుకోవడానికి సిద్ధమయ్యాడు. ఇటీవల విడుదలైన లక్ష్య్ ఫస్ట్లుక్కు మంచి స్పందన వచ్చింది. ఈ నేపథ్యంలో తాజాగా మేకర్స్ నటి జయసుధ తనయుడు నిహార్ కపూర్ లుక్ను విడుదల చేశారు. ఈ సినిమాతో నిహార్ కపూర్ విలన్గా వెండితె ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. చదవండి: Bigg Boss 5 Telugu: అలా ఏడిస్తే హౌజ్ నుంచి ముందుగా వచ్చేది నువ్వే మంగళవారం నిహార్ కపూర్ పుట్టినరోజు సందర్భంగా ‘గ్యాంగ్స్టర్ గంగరాజు’ మూవీ యూనిట్ అతడి ఫస్ట్లుక్ పోస్టర్ను విడుదల చేసింది. చేతిలో కత్తి పట్టుకుని, గడ్డంతో ఉన్న నిహార్ లుక్ చూస్తుంటే భయం గొలిపేలా ఉంది. కచ్చితంగా తనకు ‘గ్యాంగ్స్టర్ గంగరాజు’ నటుడిగా మంచి గుర్తింపు తెస్తుందని భావిస్తున్నాడు నిహార్. ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలిమ్స్ పతాకంపై చదలవాడ బ్రదర్స్ సమర్పణలో పద్మావతి చదలవాడ నిర్మిస్తున్న ఈ చిత్రానికి యంగ్ టాలెంటెడ్ ఇషాన్ సూర్య దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ను జరుపుకుంటోంది. చదవండి: ‘తలైవి’ ప్రమోషన్స్: మరోసారి బాలీవుడ్పై నిప్పులు చెరిగిన కంగనా Intense & Fierce Look Of #NiharKapoor From #GangasterGangaraju #HBDNiharKapoor@itsactorlaksh @iam_vedieka #EeshaanSuryaah @sttvfilms #ChadalavadaBrothers @ImSaiKartheek #KannaPC #ARenukaBabu @TheSaiSatish @ParvathaneniRam @MangoMusicLabel #Laksh06 pic.twitter.com/nxx1QZER4h — BA Raju's Team (@baraju_SuperHit) September 7, 2021 -
ఆది సాయి కుమార్ ‘అతిథి దేవోభవ’ ఫస్ట్లుక్ విడుదల
యంగ్ హీరో ఆది సాయికుమార్ నటిస్తున్న తాజా చిత్రం ‘అతిథి దేవోభవ’. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ను తాజాగా మేకర్స్ విడుదల చేశారు. యాక్షన్ థ్రిల్లర్ బ్యాక్డ్రాప్లో పొలిమేర నాగేశ్వర్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీనివాస సినీ క్రియేషన్స్ బ్యానర్పై రామ సత్యన్నారాయణ రెడ్డి సమర్పిస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్గా నువేక్ష నటిస్తుంది. శేఖర్ చంద్ర సంగీతం అందిస్తున్నారు. ఈ మధ్య విభిన్నమైన కథాంశాలతో వస్తున్న ఆది గతంతో ‘శశి’ మూవీతో ఆకట్టుకున్నాడు. Here comes the Promising First look of #SrinivasaCineCreations #AtithiDevobhava 🌟ing #AadiSaiKumar & #Nuveksha Directed by #PolimeraNageshwar 🎬 🎶 #SekharChandra ✂ #KarthikSrinivas 🎥 @AMARNATH_DOP 💵 #RajababuMiryala,#AshokReddyMiryala#RamaSatyaNarayanaReddy pic.twitter.com/qwaDEowk9w — BA Raju's Team (@baraju_SuperHit) September 1, 2021 -
విజయ్ సేతుపతి ‘లాభం’ మూవీ ఫస్ట్లుక్ విడుదల
విజయ్ సేతుపతి, శ్రుతిహాసన్లు హీరోహీరోయిన్గా నటించిన తాజా చిత్రం ‘లాభం’. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిన ఈ చిత్రం ఫస్ట్ లుక్ను ప్రముఖ హిట్ చిత్రాల దర్శకుడు బాబీ చేతుల మీదుగా విడుదల చేశారు. ఆయనతో పాటు ప్రముఖ సినీ రచయిత కోన వెంకట్, మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు నవీన్ ఎర్నేని, వై రవి, బత్తులలు ఈ ఫస్ట్ లుక్ విడుదల కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ చిత్రం సెప్టెంబరు 9న వినాయక చవితి సందర్భంగా తమిళంతో పాటు తెలుగులోనూ ఏక కాలంలో థియేటర్లలో విడుదలవుతోంది. ఈ నేపథ్యంలో లాభం ఫస్ట్లుక్ను మేకర్స్ విడుదల చేశారు. చదవండి: ఆకట్టుకుంటున్న ‘అనబెల్..సేతుపతి’ ట్రైలర్ విజయ్ సేతుపతి హీరోగా నటించిన ఈ మూవీ రెండు భాషల్లో విడుదల కావడం విశేషం. ఇందులో జగపతిబాబు విలన్ పాత్రలో నటిస్తుండగా, సాయి ధన్సిక ఓ కీలకమైన కీలక పాత్ర పోషించింది. ఎస్పీ జననాథన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని శ్రీ గాయత్రీ దేవి ఫిలిమ్స్ పతాకంపై నిర్మాత బత్తుల సత్యనారాయణ(వైజాగ్ సతీష్) నిర్మించారు. ఇందులో విజయ్ సేతుపతి రైతు సమస్యలపై పోరాడే యువకునిగా కనిపించనున్నాడు.ఈ సందర్భంగా దర్శకుడు బాబీ మాట్లాడుతూ.. ‘విజయ్ సేతుపతి ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. ఆయన నటించిన చిత్రాలు ఇప్పుడు తెలుగులోనూ మంచి క్రేజ్ సంపాధించుకుంటున్నాయి. ఇటీవల తెలుగులో నేరుగా నటించిన సైరా, ఉప్పెన చిత్రాలలో ఆయన పాత్రలకు మంచి అప్లాజ్ వచ్చింది. చదవండి: Varudu Kaavalenu : ‘వరుడు కావలెను’ టీజర్ వచ్చేసింది లాభం చిత్రంతోనూ ఆయన తెలుగు ప్రేక్షకుల్ని అలరిస్తారనే నమ్మకం ఉంది. ఇందులో అతని పాత్ర తన గత చిత్రాల్లానే చాలా వైవిధ్యంగా వుంటుందని అనుకుంటున్నా. ఫస్ట్ లుక్ చూస్తుంటే.. విజయ్ సేతుపతి లుక్ చాలా యూనిక్గా కనిపిస్తోంది. ఇందులో రైతుల సమస్యలపై పోరాడే యువకుని పాత్రలో విజయ్ సేతుపతి ప్రేక్షకుల్ని అలరిస్తారని నమ్మకం ఉంది. ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తున్న నిర్మాతలకు అభినందనలు. ఈ చిత్రం విజయం సాధించి మంచి లాభాలు తెచ్చిపెట్టాలని ఆశిస్తున్నా. ఈ చిత్రం వినాయక చవితి సందర్భంగా విడుదలవుతోంది కాబట్టి దేవుడి ఆశీస్సులు కూడా ఈ చిత్రానికి, నిర్మాతలకు పుష్కలంగా ఉండాలని కోరుకుంటున్న’ అని అన్నారు. -
ఎంపీ మార్గాని భరత్ చేతుల మీదుగా ‘భానుమతిరెడ్డి’ ఫస్ట్లుక్
బాలు, అప్సర హీరో, హీరోయిన్లుగా సత్య దర్శకత్వంలో డైమండ్ హౌస్ బ్యానర్పై రామ్ప్రసాద్ రెడ్డి వట్రపు నిర్మిస్తోన్న చిత్రం ‘భానుమతిరెడ్డి’. గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ప్రేమకథా చిత్రమిది. ప్రస్తుతం సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. తాజాగా ఈ సినిమా ఫస్ట్లుక్ను రాజమండ్రి పార్లమెంట్ సభ్యుడు మార్గాని భరత్ రామ్ విడుదల చేసి చిత్ర యూనిట్కు అభినందించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. సినిమా పెద్ద సక్సెస్ కావాలని, నటీనటులు, టెక్నీషియన్స్కు మంచి పేరు రావాలన్నారు. నిర్మాత రామ్ ప్రసాద్ రెడ్డికి ఈ సినిమా అన్ని రకాలుగా పెద్ద సక్సెస్ కావాలని పేర్కొన్నారు. దర్శకుడు సత్య మాట్లాడుతూ.. ‘‘భానుమతి రెడ్డి’గ్రామీణ నేపథ్యంలో రూపొందుతోన్న లవ్స్టోరి. ఫైనల్ స్టేజ్ షూటింగ్కు చేరుకున్నాం. సినిమా అనుకున్నట్లు బాగా వస్తోంది. రాజమండ్రి ఎంపీ భరత్ రామ్గారు మా సినిమా ఫస్ట్లుక్ను విడుదల చేసి అభినందనలు తెలిపారు. ఆయనకు స్పెషల్ థాంక్స్. ఈ సినిమా విషయానికి వస్తే...ప్రేమకథలో ఉండాల్సిన సెన్సిబుల్ అంశాలతో పాటు రా ఎలిమెంట్స్ కూడా ప్రేక్షకులను మెప్పించేలా రూపొందిస్తున్నాం. నిర్మాత రామ్ ప్రసాద్ రెడ్డిగారు సినిమా విషయంలో పూర్తి స్వేచ్ఛ నిచ్చారు. సినిమా బాగా వస్తోంది’’ అన్నారు. నిర్మాత రామ్ ప్రసాద్ రెడ్డి వట్రపు మాట్లాడుతూ ‘భరత్ రామ్ గారికి థాంక్స్. మా సినిమా ఫస్ట్ లుక్ను విడుదల చేసి టీమ్ను ఆయన అభినందించడం మాకు ఓ బూస్టప్ ఇచ్చింది. అందుకు ఆయనకు ప్రత్యేక కృతజ్ఞతలు. దర్శకుడు సత్య విలేజ్ బ్యాక్డ్రాప్లో వైవిధ్యమైన ప్రేమకథా చిత్రంగా ‘భానుమతి రెడ్డి’ని తెరకెక్కిస్తున్నారు. నటీనటులు, సాంకేతిక నిపుణుల సపోర్టుతో సినిమా షూటింగ్ ఫైనల్ స్టేజ్కు చేరుకుంది. త్వరలోనే సినిమాకు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం’’ అని పేర్కొన్నారు. -
ఆసక్తికరంగా ‘ఏవమ్ జగత్’ మూవీ ఫస్ట్ లుక్
‘వ్యవసాయం భవిష్యత్తు ఏంటి..? రాబోయే తరానికి కావలసిన ఆహార అవసరాలు తీర్చేటంత సాగు భూమి కానీ, పండించగల అనుభవం కానీ మన దేశ యువతకి ఉందా..? అనే అంశాలను ప్రధానంగా తీసుకొని 'ఏవమ్ జగత్' మూవీని తెరకెక్కించామని అన్నారు దర్శకుడు దినేష్ నర్రా.ఆయన దర్శకత్వంలో కిరణ్ గేయ, ప్రకృతివనం ప్రసాద్, రిటైర్డ్ బ్రిగేడియర్ గణేషమ్, ఇనయ సుల్తానా ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ఏవం జగత్’. మార్స్ మూవీ ప్రొడక్షన్స్ పతాకంపై ముణిరత్నం నాయుడు ఎన్, రాజేశ్వరి ఎన్ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ కంప్లీట్ చేసుకొనిపోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. త్వరలో సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సినిమా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు దినేష్ మాట్లాడుతూ.. ఒక పల్లెటూరిలో సాగే ఈ కథలో, దేశ పరిస్థితులను, పురోగతికి అద్దం పట్టేలా కథా కథనాలు సాగుతాయన్నారు. ఎన్ని కష్టాలు ఎదురైనా అనుకున్నది సాధించడంలో హీరో ఎలాంటి ప్రయత్నం చేశాడు అనేది ఆసక్తికరంగా ఉంటుందని చెప్పారు. త్వరలోనే ఈ సినిమా విడుదల తేదిని ప్రకటిస్తామని తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం శివకుమార్, కెమెరా వెంకీ అల్ల. -
అశ్విన్బాబు కొత్త సినిమాకి ఇంట్రెస్టింగ్ టైటిల్
యాంకర్ ఓంకార్ తమ్ముడు, ‘జీనియస్’ఫేమ్ అశ్విన్బాబు హీరోగా, అనిల్ కృష్ణ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. అశ్విన్ పుట్టిన రోజు పురస్కరించుకొని ఆదివారం ఆ సినిమా టైటిల్తో పాటు, ఫస్ట్లుక్ని చిత్రబృందం విడుదల చేసింది. ఈ చిత్రానికి ‘హిడింబ’ అనే విభిన్న పేరుని ఖరారు చేశారు. తలపై రక్తపు చుక్కలు.. చేతిలో ఇనుప చువ్వను పట్టుకుని సీరియస్లో లుక్లో దర్శనమిచ్చి ఆకట్టుకున్నాడు అశ్విన్. బట్టి చూస్తుంటే ఈ సినిమా యాక్షన్ ప్రధానంగా తెరకెక్కుతున్నట్టు అనిపిస్తుంది. ఈ చిత్రంలో అశ్విన్ సరసన నందితా శ్వేత నటిస్తోంది. రఘుకుంచె, రాజీవ్ కనకాల, శ్రీనివాస్ రెడ్డి కీలక పాత్రల్లో కనిపించనున్నారు. శ్రీ విఘ్నేశ్ కార్తీక్ సినిమాస్ పతాకంపై గంగాపట్నం శ్రీధర్ నిర్మిస్తోన్న ఈ చిత్రానికి వికాస్ సంగీతం అందిస్తున్నాడు. -
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం స్పీడ్ మాములుగా లేదుగా..
‘రాజావారు రాణిగారు’ ఫేమ్ కిరణ్ అబ్బవరం పుట్టినరోజు (గురువారం) సందర్భంగా ఆయన నటిస్తున్న ‘సెబాస్టియన్ పీసీ 524’, సమ్మతమే’ చిత్రాల నుంచి కొత్త లుక్స్ విడుదల చేశారు. అదే విధంగా మరో కొత్త సినిమాని ప్రకటించారు. కిరణ్ హీరోగా బాలాజీ సయ్యపురెడ్డి దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో ప్రమోద్, రాజు నిర్మించిన ‘సెబాస్టియన్ పీసీ 524’ త్వరలో విడుదల కానుంది. ఈ చిత్రానికి సహ నిర్మాత: సిద్ధారెడ్డి .బి. కాగా కిరణ్, చాందినీ చౌదరి జంటగా గోపీనాథ్ రెడ్డి దర్శకత్వంలో కనకాల ప్రవీణ నిర్మిస్తున్న ‘సమ్మతమే’ షూటింగ్ 80 శాతం పూర్తయింది. నిర్మాతగా కోడి దివ్య: లెజెండరీ దర్శకుడు, దివంగత కోడి రామకృష్ణ పెద్ద కూతురు కోడి దివ్య దీప్తి నిర్మాతగా మారారు. కోడి దివ్య ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై కిరణ్ అబ్బవరం హీరోగా ఓ సినిమాను ప్రకటించారు దివ్య. కార్తీక్ శంకర్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ చిత్రానికి సంగీతం: మణిశర్మ. -
ఇంట్రస్టింగ్గా శర్వానంద్ ‘ఒకే ఒక జీవితం’ మోషన్ పోస్టర్
యంగ్ హీరో శర్వానంద్ 30వ చిత్రం ‘ఒకే ఒక జీవితం’. ఈ చిత్రం ద్వారా శ్రీకార్తిక్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్పై ఎస్ ఆర్ ప్రకాశ్ బాబు, ఎస్ ఆర్ ప్రభు ఈ మూవీని నిర్మిస్తున్నారు. సైన్స్ఫిక్షన్ ఎలిమెంట్స్తో ఫ్యామిలీ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రానికి తరుణ్ భాస్కర్ డైలాగ్స్ అందిస్తున్నారు. ఇటీవల విడుదలైన ఫస్ట్లుక్ పోస్టర్కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ మూవీలో శర్వానంద్ పాత్ర పేరు ఆది. దీనికి సంబంధించిన ఫస్ట్లుక్ స్నీక్ ప్రోమోను మూవీ యూనిట్ తాజాగా విడుదల చేసింది. ఈ వీడియోలో పాట పాడమని కొందరు ఆదీని కోరడం అలాగే మ్యూజిక్ ఇన్స్ట్రూమెంట్స్ చూపిస్తూ తరువాత కొన్ని సైన్స్ ఫిక్షన్ అంశాలతో ఈ ప్రోమో ముగుస్తుంది. చివరలో శర్వానంద్ గిటార్ వాయిస్తూ కనిపిస్తాడు. ఇందులో శర్వానంద్ సరసన రీతూ వర్మహీరోయిన్గా నటిస్తుండగా, వెన్నెల కిషోర్, ప్రియదర్శి ప్రధాన పాత్రలు కనిపించనున్నారు. ఈ సినిమాలో అక్కినేని అమల కూడా కీలక పాత్రలో నటిస్తుండటం విశేషం. ఈ మూవీ జేక్స్ బీజోయ్ సంగీతం అందిస్తున్నాడు. సైన్స్ఫిక్షన్ ఎలిమెంట్స్తో ఫ్యామిలీ డ్రామాగా రూపొందుతోన్న ఈ చిత్రం అటూ ఫ్యామిలీ ఆడియన్స్తో పాటు ఇటూ యూత్ను ఆకట్టుకుంటుందని మేకర్స్ పేర్కొన్నారు. కాగా ఇప్పటికే ఈ మూవీ.. షూటింగ్ను పూర్తి చేసుకుని విడుదలకు సిద్దమవుతుంది. -
'రామారావు'గా రవితేజ..ఫోటోలు వైరల్
మాస్ మహారాజా రవితేజ జోరుమీదున్నాడు. ఈ ఏడాది క్రాక్ చిత్రంతో హిట్ కొట్టిన రవితేజ ఆ తర్వాత ఖిలాడి అనే సినిమాలో నటించారు. కరోనా కారణంగా ఈ మూవీ రిలీజ్కు బ్రేక్ పడింది. ఇటీవలె మరో సినిమాకు సైన్ చేసిన రవితేజ ఇటీవలె షూటింగ్ను మొదలు పెట్టారు. రవితేజ కెరీర్లో 68వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్తో పాటు రామారావు అనే టైటిల్ను ఖరారు చేశారు. ‘ఆన్ డ్యూటీ’ అనే క్యాప్షన్తో ఫస్ట్లుక్ పోస్టర్ను రిలీజ్ చేశారు. ఇందులో రవితేజ స్టైలిష్ లుక్ ఆకట్టుకుంటుంది. ఈ సినిమాతో శరత్ మండవ డైరెక్టర్గా పరిచయం కానున్నాడు. రియల్ ఇన్స్డెంట్స్ ఆధారంగా ఒక యూనిక్ థ్రిల్లర్గా ఈ మూవీ రూపొందబోతుంది.ఈ సినిమాలో రవితేజ ఎమ్మార్వో ఆఫీసర్గా ఈ చిత్రంలో కనిపించబోతోన్నట్లు తెలుస్తోంది. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్పై రూపొందుతున్న ఈ సినిమాను చెరుకూరి సుధాకర్ నిర్మిస్తున్నారు. రవితేజ సరసన మజిలి ఫేమ్ దివ్యాంశ కౌశిక్ హీరోయిన్గా నటించనుంది. ఈ చిత్రానికి స్యామ్ సీఎస్ సంగీతం అందిస్తుండగా సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రాఫర్గా వర్క్ చేస్తున్నారు. -
1979 లోభూమి నాశనం అవుతుందన్నారు..అసలేం జరిగిందంటే..
సత్యదేవ్, నిత్యామీనన్, రాహుల్ రామకృష్ణ ముఖ్య పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘స్కైలాబ్’. విశ్వక్ కందెరావ్ దర్శకత్వంలో డా. రవి కిరణ్ సమర్పణలో బైట్ ఫ్యూచర్స్, నిత్యామీనన్ కంపెనీ పతాకాలపై పృథ్వీ పిన్నమరాజు నిర్మిస్తున్నారు. ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ను హీరోయిన్ తమన్నా విడుదల చేశారు. ‘‘1979లో సాగే పీరియాడికల్ మూవీ ఇది. అమెరికా స్పేస్ స్టేషన్ నాసా ప్రయోగించిన స్పేస్ స్టేషన్ స్కైలాబ్ భూమిపై పడుతుందని, భూమి నాశనమైపోతుందని అప్పట్లో వార్తలు రావడంతో అసలేం జరగబోతుందోనని అందరూ ఎదురుచూశారు. ఆ సమయంలో కరీంనగర్ జిల్లా బండ లింగపల్లిలో ఉండే గౌరి, ఆనంద్, రామారావుల జీవితాల్లో స్కైలాబ్ వల్ల ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయనే విషయాలను వినోదాత్మకంగా చూపిస్తున్నాం’’ అని చిత్రవర్గాలు పేర్కొన్నాయి. ఈ చిత్రానికి సహనిర్మాత: నిత్యామీనన్, కెమెరా: ఆదిత్య జవ్వాది, సంగీతం: ప్రశాంత్ ఆర్. విహారి. -
శౌర్యానిదే కిరీటం!
‘కోడ్: రెడ్’ అంటూ ఫస్ట్ లుక్ని రిలీజ్ చేసింది ‘విక్రమ్’ చిత్రబృందం. కమల్హాసన్ హీరోగా ‘ఖైదీ’, ‘మాస్టర్’ చిత్రాల ఫేమ్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘విక్రమ్’. ఈ చిత్రంలో ఫాహద్ ఫాజిల్, విజయ్ సేతుపతి కీలక పాత్రధారులు. మరి.. కమల్.. విజయ్.. ఫాహద్... ఈ ముగ్గురిలో ‘రెడ్’ కోడ్ను ఎవరు? ఎలా? డీ కోడ్ చేశారన్నది వెండితెరపై చూడాల్సిందే. ‘‘శౌర్యానికి మాత్రమే కిరీటాన్ని ధరించే అర్హత ఉంది. నేను మళ్లీ ధైర్యంగా వస్తున్నాను. మాలో ఉత్తమమైనవారిని మీరే నిర్ణయించండి’’ అంటూ శనివారం ‘విక్రమ్’ ఫస్ట్ లుక్ను షేర్ చేశారు కమల్. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్లో కమల్హాసన్, విజయ్ సేతుపతి, ఫాహద్ ఫాజిల్ ఉండటం విశేషం. అలాగే పోస్టర్పై ఉన్న కోడ్: రెడ్ ఏమై ఉంటుందా? అనే ఊహగానాలు మొదలయ్యాయి. త్వరలో ‘విక్రమ్’ షూటింగ్ ప్రారంభం కానుంది. -
ప్రీ లుక్తోనే షాకిస్తున్న అల్లు శిరీష్.. అస్సలు తగ్గట్లేదుగా
ఇటీవల సిక్స్ ప్యాక్తో దర్శనమిచ్చి అందరిని ఆశ్చర్య పరిచిన అల్లు శిరీష్.. ఇప్పుడు తన కొత్త సినిమాకి సంబంధించి ప్రీలుక్లలో షాకిస్తున్నాడు. ఇప్పటికే అద్దం చాటున అను ఇమ్మాన్యుల్కి ముద్దులు ఇస్తున్న పోస్టర్ని విడుదల చేసి రచ్చ చేసిన ఈ యంగ్ హీరో.. తాజాగా మరో రొమాంటిక్ లుక్ని వదిలాడు. ఇందులో మరింత రెచ్చిపోయాడు శిరీష్. ఈ లేటెస్ట్ నయా ప్రీ లుక్ వైరల్ అయింది. మే 30న(శిరీష్ బర్త్డే)న ఉదయం 11 గంటలకు ఫస్ట్ లుక్ విడుదల చేయబోతున్నట్లు ప్రీలుక్ ద్వారా తెలియజేసింది. ఇప్పటి వరకు రొమాన్స్ జోలికి పెద్దగా వెళ్లని శిరీష్.. ఈ సినిమాలో రెచ్చిపోయినట్లు ప్రీ లుక్ పోస్టర్లు చూస్తే అర్థమవుతంది. అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 మూవీస్ బ్యానర్ క్రింద బన్నీ వాస్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. 'విజేత', 'జతకలిసే' ఫేమ్ రాకేష్ శశి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో శిరీష్ సిక్స్ ప్యాక్తో కనిపించబోతున్నట్లు సమాచారం. Here's our second prelook. Excited to share the title & first look our film tomorrow at 11am. #sirish6 @GA2Official @ItsAnuEmmanuel #rakeshsashii pic.twitter.com/7nKTuiyJNJ — Allu Sirish (@AlluSirish) May 29, 2021 చదవండి: సిగరెట్ కాలుస్తూ హీరో నిఖిల్.. మహానటి జ్ఞాపకాలు.. ఆ తర్వాతే ఊపిరి పీల్చుకున్న: కీర్తి -
యువత 'గుట్టు చప్పుడు'
నటుడు బ్రహ్మాజీ తనయుడు, ‘ఓ పిట్ట కథ’ ఫేమ్ సంజయ్ రావ్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘గుట్టు చప్పుడు’. మణీంద్రన్ని దర్శకునిగా పరిచయం చేస్తూ ఈ చిత్రాన్ని లివింగ్ స్టన్ నిర్మిస్తున్నారు. నేడు సంజయ్ రావ్ పుట్టిన రోజు సందర్భంగా ఫస్ట్ లుక్ పోస్టర్తో పాటు మోషన్ పోస్టర్ని సంతోషం స్టూడియోలో ఆవిష్కరించారు. సంజయ్ రావ్ మాట్లాడుతూ– ‘‘పక్కా మాస్ అండ్ లవ్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ‘గుట్టు చప్పుడు’ సినిమా నాకు చాలా మంచి ఇమేజ్ తెస్తుంది’’ అన్నారు. లివింగ్ స్టన్ మాట్లాడుతూ– ‘‘నేను, మణీంద్రన్ చాలా కాలంగా ఫ్రెండ్స్. మా కాంబినేషన్లో సినిమా చేయాలను కున్నప్పుడు ‘గుట్టు చప్పుడు’ కథ బాగా నచ్చింది. రెండు షెడ్యూల్స్ చిత్రీకరించాల్సి ఉంది’’ అన్నారు. మణీంద్రన్ మాట్లాడుతూ– ‘‘వైజాగ్ నేపథ్యంలో ఈ చిత్రకథ సాగుతుంది. నేటి పరిస్థితులకు అద్దం పట్టేలా, ముఖ్యంగా యూత్ని బేస్ చేసుకుని చేస్తున్న సినిమా ఇది’’ అన్నారు. కెమెరామ్యాన్ రాము, మ్యూజిక్ డైరెక్టర్ గౌర హరి, మాటల రచయిత సురేష్ కుమార్ తదితరులు మాట్లాడారు. ఈ చిత్రానికి కెమెరా: రాము సీఎం, సంగీతం: గౌర హరి. -
అద్దం చాటున శిరీష్ ముద్దులు.. రొమాంటిక్ లుక్ రిలీజ్
అల్లు శిరీష్, అను ఇమ్మాన్యుల్ జంటగా ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమా నుంచి రొమాంటిక్ లుక్ని విడుదల చేసింది చిత్రబృందం. మే 30న(శిరీష్ బర్త్డే)న ఉదయం 11 గంటలకు ఫస్ట్ లుక్ విడుదల చేయబోతున్నట్లు ప్రీలుక్ ద్వారా తెలియజేసింది. ఇందులో శిరీష్ హీరోయిన్ అను ఇమ్మాన్యుయేల్ను అద్దం చాటున ముద్దు పెడుతున్నట్లు ఉంది. ఇప్పటి వరకు రొమాన్స్ జోలికి పెద్దగా వెళ్లని శిరీష్.. తాజా చిత్రంలో లిప్ లాక్ ఇచ్చినట్లు పోస్టర్ చూస్తే అర్థమవుతుంది. అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 మూవీస్ బ్యానర్ క్రింద బన్నీ వాస్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. 'విజేత', 'జతకలిసే' ఫేమ్ రాకేష్ శశి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో శిరీష్ సిక్స్ ప్యాక్తో కనిపించబోతున్నట్లు సమాచారం. Here’s a movie that gives a refreshing perspective to love and relationship. Presenting the Pre Look of @AlluSirish & @ItsAnuEmmanuel's #Sirish6 💞#Sirish6FirstLook 👉🏻 May 30th at 11 am! ✅ Advance Birthday Wishes to #AlluSirish 🥳#AlluAravind @GA2Official pic.twitter.com/18CIGvgeW6 — Geetha Arts (@GeethaArts) May 27, 2021 -
‘ఫైటర్ శివ' ఫస్ట్ లుక్ విడుదల
కౌండిన్య ప్రొడక్షన్ బ్యానర్ పై జి.నరసింహ గౌడ్ ప్రొడ్యూసర్ గా ప్రభాస్ నిమ్మల దర్శకత్వంలో వస్తున్న యాక్షన్ చిత్రం 'ఫైటర్ శివ'. మణికాంత్, శీతల్ భట్ హీరో హీరోయిన్ లు గా నటిస్తున్న ఈ చిత్రం లో హీరో సునీల్ సిబీఐ ఆఫీసర్ గా కీలక పాత్రలో నటిస్తున్నారు.. కాగా ఈ చిత్రం యొక్క ఫస్ట్ లుక్ పోస్టర్ లాంచ్ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా కరోనా కారణం గా ఇబ్బందులు పడుతున్న కళాకారులకి నిత్యావసర వస్తువులను సరఫరా చేసింది చిత్ర బృందం. ఈ సందర్భంగా దర్శకుడు ప్రభాస్ నిమ్మల మాట్లాడుతూ.. ‘రెండు షెడ్యూల్స్ కంప్లీట్ చేసుకున్నాం.. చివరి షెడ్యూల్ ప్లాన్ చేశాం. సినిమా ఇప్పటివరకు బాగా వచ్చింది. ఫస్ట్ లుక్ పోస్టర్ ను భారీగా రిలీజ్ చేయాలని ప్లాన్ చేశాం. కానీ లాక్ డౌన్ వల్ల అది కుదరలేదు. కరోనా వల్ల ఇబ్బంది పడుతున్న సినీ కార్మికులకు పది రోజులకు సరిపడా రేషన్ని డిస్ట్రిబ్యూట్ చేయాలని చిత్ర యూనిట్ సంకల్పించింది. వెంటనే కో ఆర్డినేటర్ కృష్ణ ను సంప్రదించి, కళాకారులను పిలిపించి, వారి సమక్షంలోనే ఈ సినిమా పోస్టర్ లాంచ్ జరిపించి 200 మంది కళాకారులకు రేషన్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఇలాంటి మహత్తర కార్యక్రమానికి ముందుకు వచ్చిన ప్రొడ్యూసర్&ఫైనాన్సర్ చింతపల్లి రామారావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు అన్నారు. నిర్మాత జి.నరసింహ గౌడ్ మాట్లాడుతూ.. లాక్డౌన్ తర్వాత సినిమా మూడో షెడ్యూల్ చేస్తాం. బడ్జెట్ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ అవకుండా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాం.. హీరో హీరోయిన్ లు చక్కగా నటించారు.. దర్శకుడు ఎంతో బాగా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.. అన్నారు. -
అగస్త్య బర్త్డే: పంచతంత్రం ఫస్ట్లుక్ రిలీజ్
బ్రహ్మానందం, సముద్రఖని, స్వాతి రెడ్డి, శివాత్మిక రాజశేఖర్, రాహుల్ విజయ్, ‘మత్తు వదలరా’ ఫేమ్ నరేష్ అగస్త్య ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘పంచతంత్రం’. హర్ష పులిపాక దర్శకత్వంలో సృజన్ ఎరబోలు, అఖిలేష్ వర్ధన్ నిర్మిస్తున్నారు. సోమవారం (మే 10) నరేష్ అగస్త్య పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ‘‘ఇందులో నరేష్ అగస్త్య హైదరాబాద్లో పుట్టి, పెరిగిన అబ్బాయిగా నటిస్తున్నాడు. ‘మత్తు వదలరా’తో అందరి దృష్టిని తనవైపు తిప్పుకున్న అతను, ‘విహారి’ పాత్రలో తన నటనతో మరోసారి మెస్మరైజ్ చేస్తాడు’’ అన్నారు సృజన్ ఎరబోలు, అఖిలేష్. ‘‘సాఫ్ట్వేర్ ఉద్యోగి అయిన విహారి వ్యక్తిగత జీవితం, వృత్తి జీవితం మధ్య సమతుల్యం పాటించలేక కష్టాలు పడుతుంటాడు. ఈతరం యువతను ప్రతిబింబించేలా విహారి పాత్ర ఉంటుంది’’ అన్నారు హర్ష పులిపాక. చదవండి: ఆ రిస్క్ చేయను: హీరోయిన్ ప్రణీత -
సంపూ బర్త్డే: క్యాలీఫ్లవర్ ఫస్ట్లుక్ రిలీజ్
సంపూర్ణేష్ బాబు హీరోగా నటిస్తున్న చిత్రం ‘క్యాలీఫ్లవర్’. ‘శీలో రక్షతి రక్షితః’ అనేది ఉపశీర్షిక. ఆర్కే మలినేని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో వాసంతి హీరోయిన్ . గుడూరు శ్రీధర్ సమర్పణలో మధుసూదన క్రియేషన్స్, రాధాకృష్ణా టాకీస్పై ఆశా జ్యోతి గోగినేని నిర్మిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ ఇటీవలే మొదలైంది. మే 9 సంపూర్ణేష్ బర్త్ డేకి ఫస్ట్ లుక్ను రిలీజ్ చేశారు. ‘‘ఇంగ్లాండ్ నుంచి ఇండియాకు వచ్చిన వ్యక్తిగా సంపూ లుక్ అదిరిపోయింది. సంపూ స్టైల్ కామెడీతో సినిమా ఉంటుంది’’ అన్నారు దర్శక–నిర్మాతలు. ఈ చిత్రానికి సంగీతం: దీప్ ప్రజ్వల్ క్రిష్, కెమెరా: ముజీర్ మాలిక్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్: కోల నాగేశ్వరరావు, హరిబాబు జెట్టి. -
సర్దార్ షురూ..
కార్తీ హీరోగా నటించనున్న తాజా చిత్రానికి ‘సర్దార్’ టైటిల్ ఖరారైంది. ‘ఇరుంబు తిరై’ (తెలుగులో ‘అభిమన్యుడు’) ఫేమ్ పీఎస్ మిత్రన్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కనుంది. నేటి నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించారు. ‘‘పీఎస్ మిత్రన్ తన సినిమాల్లో చెప్పే విషయాలు, చెప్పే విధానం నాకు ఆసక్తికరంగా ఉంటుంది. మిత్రన్తో కలిసి ‘సర్దార్’ చేస్తున్నందుకు సంతోషంగా ఉంది’’ అన్నారు కార్తీ. ఈ చిత్రంలో హిందీ నటుడు చంకీ పాండే ఓ కీలక పాత్ర చేయనున్నారు. -
పంచేద్రియాల చుట్టూ అల్లుకున్న కథే 'పంచతంత్రం'
‘దొరసాని’ చిత్రం ద్వారా హీరోయిన్గా పరిచయమైన జీవితా రాజశేఖర్ల చిన్న కుమార్తె శివాత్మిక నటిస్తున్న తాజా చిత్రం ‘పంచతంత్రం’. గురువారం శివాత్మిక పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రంలోని ఆమె ఫస్ట్ లుక్ను విడుదల చేశారు. హీరో అడివి శేష్ టైటిల్ పోస్టర్ విడుదల చేసి, నటీనటుల వివరాలు వెల్లడించారు. బ్రహ్మానందం, సముద్రఖని, స్వాతి రెడ్డి, రాహుల్ విజయ్, ‘మత్తు వదలరా’ ఫేమ్ నరేష్ అగస్త్య ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘పంచతంత్రం’. కొంత గ్యాప్ తర్వాత స్వాతి నటిస్తున్న చిత్రం ఇది. నటిగా ఆమెకిది కమ్బ్యాక్ అనొచ్చు. హర్ష పులిపాక రచన, దర్శకత్వంలో తెరకెక్కుతోంది. అఖిలేష్ వర్ధన్ , సృజన్ ఎరబోలు నిర్మిస్తున్నారు. సృజన్ మాట్లాడుతూ– ‘‘దొరసాని’లో తన నటనతో ఆకట్టుకున్న శివాత్మిక మా సినిమాలో లేఖ పాత్రలో మరోసారి ప్రేక్షకుల మనసు దోచుకుంటారు. ‘కలర్ ఫొటో’ ఫేమ్ దర్శకుడు సందీప్ రాజ్ మాటలు రాశారు. ప్రశాంత్ ఆర్. విహారి సంగీతం అందిస్తున్నారు’’ అన్నారు. ‘‘ఈ సినిమాలో భాగం కావడం గర్వంగా, హ్యాపీగా ఉంది’’ అన్నారు శివాత్మిక. ‘‘ప్రతి జీవికి అవసరమైన పంచేంద్రియాల చుట్టూ (చూపు, వినికిడి, రుచి, స్పర్శ, వాసన) అల్లుకున్న కథతో ఈ సినిమా ఉంటుంది. యువతరం ఆలోచనలు, వాళ్ల దృక్పథాలకు అద్దం పట్టేలా కథ, కథనాలు ఉంటాయి’’ అన్నారు హర్ష. ఈ చిత్రానికి కెమెరా: రాజ్ కె. నల్లి, లైన్ ప్రొడ్యూసర్: సునీత్ పడోల్కర్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: భువన్ సాలూరు, క్రియేటివ్ ప్రొడ్యూసర్: ఉషారెడ్డి వవ్వేటి, సహ నిర్మాతలు: రమేష్ వీరగంధం, రవళి కలంగి. -
పోటీకి సిద్ధమవుతున్న సిద్ధార్థ్, జీవీ ప్రకాష్లు
సిద్ధార్థ్, జీవీ ప్రకాష్లు హీరోలుగా తెరకెక్కుతున్న చిత్రం ‘ఒరేయ్ బామ్మర్ది’ ఫస్ట్లుక్ పోస్టర్ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. బిచ్చగాడు లాంటి సూపర్ హిట్ చిత్రాన్ని తెరకెక్కించిన శశి ఈ మూవీకి దర్శకత్వం వహించగా కశ్మీర పరదేశి, లిజోమోల్ జోస్లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. అభిషేక్ ఫిలిమ్స్ పతాకంపై ఈ చిత్రాన్ని రమేష్ పి పిళ్లై నిర్మించారు. యాక్షన్ ఓరియెంటెడ్ తెరకెక్కుతున్న ఈ సినిమాలో సిద్ధార్థ్, జీవీ ప్రకాష్ కుమార్లు పోటాపోటీగా నటించారు. వీరి కాంబినేషన్లో వచ్చే యాక్షన్ సన్నివేశాలు ఈ చిత్రానికి హైలెట్గా నిలవనున్నాయి. ఇటీవల షూటింగ్ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకుంటోంది. ఈ సినిమాని శ్రీ లక్ష్మి జ్యోతి క్రియేషన్స్ పై ఏ.ఎన్ బాలాజీ ఈ నెలలో విడుదల చేయనున్నారు. సిద్ధూ కుమార్ సంగీతం అందించగా ప్రసన్న కుమార్ సినిమాటోగ్రఫీ అందించారు. ఈ చిత్రం గురించి పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామన్నారు. -
తేజ సజ్జతో జతకట్టిన ప్రియా ప్రకాశ్ వారియర్
మలయాళీ కుట్టి, కన్ను గీటు భామ్మ ప్రియా ప్రకాశ్ వారియర్ తెలుగులో తొలిసారిగా నటించిన చిత్రం ‘చెక్’. హీరో నితిన్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా ప్రకాశ్లు లీడ్ రోల్లో నటించిన ఈ మూవీ ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. అయితే ఈ మూవీ బాక్సాఫీసు వద్ద ప్లాప్ టాక్ తెచ్చుకుంది. అయినప్పటికి ప్రియా క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. వెంటనే మెగా సూపర్ గుడ్ ఫిల్మ్స్ నిర్మాణ సంస్థలో నటించే చాన్స్ కోట్టేసింది ప్రియా. దర్శకుడు ఎస్ఎస్ రాజు తెరకెక్కిస్తున్న ఈ మూవీకి ‘ఇష్క్’ అనే టైటిల్ను ఖారారు చేశారు. తాజాగా ఈ మూవీకి ఫస్ట్లుక్ పోస్టర్ను ప్రియా తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది. ‘మీరు లవ్స్టోరీ సినిమాలు చూసి విసిగిపోయారా.. అయితే మీ కోసం ఇష్క్ మూవీని తీసుకురాబోతున్నాం. అయితే ఇది లవ్స్టోరీ కాదు’ అటూ ఫస్ట్లుక్ను విడుదల చేసింది ప్రియా. ఇందులో ఆమె ‘జాంబీ రెడ్డి’ సినిమాతో హీరోగా పరిచయం అయిన తేజ సజ్జ సరసన హీరోయిన్గా నటిస్తోంది. ‘ఇష్క్.. నాట్ ఏ లవ్ స్టోరీ’ అనే టైటిట్తో ఉన్న ఈ పోస్టర్లో తేజ సీరియస్ లుక్లో కనిపిస్తుంటే, ప్రియా ప్రకాశ్ నవ్వుతూ కనిపిస్తుంది. వారి ముందు పగిలిన అద్దాల ముక్కలు గాల్లో ఎగురుతున్నట్లు ఉన్నాయి. ఎన్వీ ప్రసాద్, పరాస్ జైన్, వకాడ అంజన్ కుమార్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి మహతి స్వరా సాగర్ సంగీతం అందిస్తున్నాడు. View this post on Instagram A post shared by Priya Prakash Varrier💫 (@priya.p.varrier) -
నిహారిక కొత్త సినిమా.. కీలక పాత్రలో విజయ్ సేతుపతి
మెగా డాటర్ నిహారిక కొణిదెల నటిస్తోన్న ఓ మూవీ త్వరలో విడుదలకు సిద్దమైంది. ‘ఓ మంచి రోజు చూసి చెప్తా’ అనే టైటిట్ను ఖారారు చేసి మార్చి 19వ తేదీన విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ తాజాగా ప్రకటిచింది. ఈ సందర్భంగా ఈ మూవీ ఫస్ట్లుక్ పోస్టర్ను విడుదల చేసింది. అపోలో సంస్థ బ్యానర్లో నిర్మిస్తున్న ఈ మూవీలో ఇందులో తమిళ స్టార్ నటుడు విజయ్ సేతుపతి కీలక పాత్రలో నటిస్తున్నారు. శుక్రవారం ట్విటర్లో షేర్ చేసిన ఈ పోస్టర్లో నిహారిక యువరాణిగా .. విజయ్ సేతుపతి యమధర్మరాజుగా కనిపించారు. ఈ పోస్టర్లో విజయ్ కొత్తలుక్ ఆసక్తికరంగా ఉంది. గతేడాది నిహారిక చైతన్య జోన్నలగడ్డను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక పెళ్లి తర్వాత విడుదల అవుతున్న ఆమె మొదటి చిత్రం ఇది. కాగా ఇటీవల విడుదలైన ‘ఉప్పెన’ చిత్రంలో హరోయిన్ తండ్రి పాత్రలో కనిపించి తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైన విజయ్ సేతుపతి ఈ చిత్రంలో యమధర్మ రాజుగా తెలుగు ప్రేక్షకుల అలరించడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. Here is the first look poster of #OManchiRojuChusiChepta starring @VijaySethuOffl @IamNiharikaK in lead roles. #ApolloProductions banner is producing it. Releasing on 19th March @ravuribalu @apolloproducti8 @CineDigital_ pic.twitter.com/YCK0TGxa7p — BARaju (@baraju_SuperHit) February 26, 2021 -
సినిమాలు తెలుగోడి దమ్ము చూపిస్తున్నాయి
‘‘రామానాయుడు, శ్యామ్ ప్రసాద్ రెడ్డి, ఎమ్మెస్ రాజు, ‘దిల్’ రాజుగార్లు, మైత్రీ మూవీ మేకర్స్.. ఇలా వీరందరూ బాలీవుడ్, హాలీవుడ్ వారు సైతం తెలుగు ఇండస్ట్రీ వైపు చూసేలా తెలుగు సినిమాను ఒక స్థాయికి తీసుకెళ్లారు. ఈ మధ్య మన సినిమాలు తెలుగోడి దమ్ము ఏంటో చూపిస్తున్నాయి’’ అన్నారు లగడపాటి శ్రీధర్. విక్రమ్ సహిదేవ్, సౌమిక పాండియన్, రిషికా ఖన్నా, వినీత్ భవిశెట్టి, స్నేహల్ కమల్, అభిజిత్ దేశ్ పాండే, జయశ్రీ రాచకొండ ముఖ్య పాత్రల్లో నటించిన చిత్రం ‘కొత్తగా రెక్కలొచ్చెనా’. ఈ సినిమా ద్వారా నిర్మాత–నటుడు అట్లూరి పుండరీకాక్షయ్య పెద్దబ్బాయి ప్రదీప్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. లగడపాటి శిరీష, లగడపాటి శ్రీధర్ నిర్మించిన ఈ సినిమా త్వరలో విడుదలకానుంది. ఇటీవల విడుదలైన ‘ఉప్పెన’ యూనిట్కి లగడపాటి శ్రీధర్ అభినందన సభ ఏర్పాటు చేశారు. ఇదే వేదికపై ‘కొత్తగా రెక్కలొచ్చెనా’ లోగోను ‘ఉప్పెన’ దర్శకుడు బుచ్చిబాబు, నిర్మాత నవీన్ యర్నేని విడుదల చేయగా, ఫస్ట్ లుక్ను హీరోహీరోయిన్ వైష్ణవ్ తేజ్, కృతీ శెట్టి రిలీజ్ చేశారు. నవీన్ మాట్లాడుతూ– ‘‘ఉప్పెన’ కలెక్షన్స్ రోజురోజుకూ పెరుగుతున్నాయి. మాకు ఇంత విజయం అందించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు’’ అన్నారు. ‘‘కొత్తగా రెక్కలొచ్చెనా’ మంచి విజయం సాధించాలి’’ అన్నారు బుచ్చిబాబు, వైష్ణవ్ తేజ్, కృతీ శెట్టి. ‘కొత్తగా రెక్కలొచ్చెనా’ చిత్రానికి క్రియేటివ్ ప్రొడ్యూసర్: గోపీచంద్ లగడపాటి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: రాఘవేంద్ర అన్న. -
క్షణక్షణం కాన్సెప్ట్ నాకు బాగా నచ్చింది
‘‘సస్పెన్స్, డార్క్ కామెడీ జానర్తో పాటు కొత్త తరహా సినిమాలను ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు. ‘క్షణక్షణం’ సినిమా కాన్సెప్ట్ నాకు బాగా నచ్చింది. టైటిల్కు తగ్గట్టుగానే సినిమా కూడా ఉత్కంఠగా సాగుతుందని తెలిసింది. ఈ సినిమా మంచి విజయం సాధించాలి’’ అని దర్శకుడు మారుతి అన్నారు. ‘ఆటగదరా శివ’ ఫేమ్ ఉదయ్ శంకర్ హీరోగా, జియా శర్మ హీరోయిన్గా కార్తీక్ మేడికొండ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘క్షణక్షణం’. డాక్టర్ వర్లు, మన్నం చంద్రమౌళి నిర్మించిన ఈ సినిమా త్వరలో విడుదలకానుంది. ఈ సినిమా ఫస్ట్ లుక్ని మారుతి విడుదల చేశారు. ఉదయ్ శంకర్ మాట్లాడుతూ– ‘‘క్షణక్షణం’లో డార్క్ కామెడీ బాగా కుదిరింది. మా సినిమా ప్రేక్షకులకు కొత్త అనుభూతి ఇవ్వడంతో పాటు, మా టీమ్కి పెద్ద సక్సెస్ అందిస్తుందనే నమ్మకం ఉంది’’ అన్నారు. ‘‘ఈ చిత్రాన్ని చాలా రియలిస్టిక్గా తీశాం. ప్రతి పాత్ర చాలా సహజంగా ఉంటుంది.. దీంతో ప్రేక్షకులు త్వరగా కనెక్ట్ అవుతారు. మా సినిమా ప్రేక్షకుల్ని ఎక్కడా రిలాక్స్ కానివ్వదు. సందర్భానికి తగ్గట్టు వచ్చే పాటలు సినిమా మూడ్ని మరింత ఎలివేట్ చేస్తాయి’’ అన్నారు కార్తీక్ మేడికొండ. శ్రుతీసింగ్, సంగీత దర్శకులు కోటి, రఘుకుంచె, రవి ప్రకాశ్, గిఫ్టన్ ఇతర ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రానికి కెమెరా: కె. సిద్ధార్థ్ రెడ్డి, సంగీతం: రోషన్ సాలూరి. -
మేఘా ఆకాశ్.. ‘డియర్ మేఘ’
మేఘ ఏదో బాధలో ఉంది. ఈ బాధకు కారణం ఎవరు? మేఘ కళ్లు ఎందుకు చెమర్చాయి? అనేది ‘డియర్ మేఘ’ సినిమా చూస్తే తెలుస్తుంది. మేఘా ఆకాశ్ టైటిల్ రోల్లో రూపొందుతున్న చిత్రం ‘డియర్ మేఘ’. అరుణ్ ఆదిత్, అర్జున్ సోమయాజుల ప్రధాన పాత్రల్లో అర్జున్ దాస్యన్ నిర్మిస్తున్నారు. సుశాంత్ రెడ్డి దర్శకుడు. ఈ చిత్రం ఫస్ట్ లుక్ను రానా, గౌతమ్ వాసుదేవమీనన్, ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ను విజయ్ సేతుపతి విడుదల చేసి, శుభాకాంక్షలు తెలియజేశారు. మోషన్ పోస్టర్లో మేఘ కన్నీరు పెట్టుకుంటూ, బాధలో ఉన్నట్లు కనబడుతుంది. ‘‘మా సినిమా చిత్రీకరణ తుది దశలో ఉంది. త్వరలోనే విడుదల చేయాలనుకుంటున్నాం’’ అన్నారు దర్శక–నిర్మాతలు. ఈ చిత్రానికి సంగీతం: హరి గౌర, కెమెరా: ఐ ఆండ్రూ, ఎడిటర్: ప్రవీణ్ పూడి. -
‘పాగల్’ ఫస్ట్లుక్ విడుదల
‘హిట్’ సినిమా విజయంతో మంచి స్పీడు మీదున్న విష్వక్ సేన్ హీరోగా రాబోతున్న చిత్రం ‘పాగల్’. పాగల్ అంటే పిచ్చి. మ్యూజికల్ రొమాంటిక్ చిత్రంగా తెరకెక్కుతోంది. అంటే.. హీరోకి ప్రేమ పిచ్చి అని ఊహించవచ్చు. ఈ చిత్రానికి నరేశ్ కుప్పిలి దర్శకత్వం వహిస్తున్నారు. ‘దిల్’ రాజు సమర్పణలో బెక్కం వేణుగోపాల్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం ఫస్ట్లుక్ పోస్టర్ను విడుదల చేసింది చిత్రబృందం. ఏప్రిల్ 30న సినిమాను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ చిత్రానికి సంగీతం: రధన్. -
కోలా బాలకృష్ణ హీరోగా 'నేనెవరు?'
తెలుగు–తమిళ భాషల్లో సుప్రసిద్ధులైన ఎడిటర్ కోలా భాస్కర్ తనయుడు కోలా బాలకృష్ణ హీరోగా నటించిన చిత్రం ‘నేనెవరు’. సాక్షీ చౌదరి కథానాయికగా నటించారు. నిర్ణయ్ పల్నాటి దర్శకత్వంలో కౌశల్ క్రియేషన్స్ పతాకంపై భీమినేని శివప్రసాద్–తన్నీరు రాంబాబు నిర్మించిన ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్ణయ్ పల్నాటి, భీమినేని శివప్రసాద్ – తన్నీరు రాంబాబు మాట్లాడుతూ– ‘‘విభిన్న కథతో రూపొందిన చిత్రమిది. లవ్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్గా తెరకెక్కింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. కోలా భాస్కర్ ఎడిటింగ్ చేసిన చివరి (గత ఏడాది నవంబర్లో ఆయన మరణించారు) చిత్రమిది. త్వరలో టీజర్ విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి సహనిర్మాతలు: పూనమ్ చంద్, కుమావత్, కిరణ్ కుమార్ మోటూరి, కెమెరా: సామల భాస్కర్, సంగీతం: ఆర్.జి.సారథి. -
సీరియస్ లుక్లో.. ‘సన్నాఫ్ ఇండియా’
కలెక్షన్ కింగ్ మోహన్బాబు మంచు తన సినిమా ఎంపికలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఆయన హీరోగా గతంలో వచ్చిన ‘గాయత్రి’ మూవీ తర్వాత కేవలం అతిథి పాత్రల్లోనే కనిపించారు. కనిపించేది కొద్ది సమయమే కథను మలుపు తిప్పే కీలక పాత్రలు పోషిస్తూ ప్రత్యేకతను చాటుకుంటున్నారు. ఇక చాలా రోజుల తర్వాత ఆయన ఫుల్లెంగ్త్ మూవీతో ప్రేక్షకులను అలరించేందుకు ‘సన్నాఫ్ ఇండియా’గా వస్తున్నారు. దేశభక్తి నేపథ్యంలో తెరకెక్కతున్న ఈ సినిమాలో ఆయన టైటిల్ రోల్ పోషిస్తున్నారు. ఈ క్రమంలో సన్నాఫ్ ఇండియా సినిమా ఫస్ట్ లుక్ను మోహన్బాబు సోషల్ మీడియా వేదికగా శుక్రవారం విడుదల చేశారు. ‘దేశభక్తి అతడి రక్తంలోనే ఉంది.. ‘సన్నాఫ్ ఇండియా’ను కలుసుకోండి’ అంటూ ఫస్ట్లుక్ను విడుదల చేశారు. ఇందులో ఆయన సీరియస్ లుక్లో.. మెడలో రుద్రాక్ష మాలతో దేశ రక్షణ కోసం పోరాడే వ్యక్తిగా కనిపించారు. ఈ పోస్టర్కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. శ్రీలక్ష్మీ ప్రసన్న పిక్చర్స్, 24 ఫ్రేమ్స్ పతాకం సంస్థలు సంయుక్తంగా రూపొందిస్తున్న ఈ చిత్రానికి డైమండ్ రత్నబాబు దర్శకత్వం వహిస్తున్నారు. మాస్ట్రో ఇళయారాజా సంగీతం అందిస్తున్నారు. కాగా ఇటీవల పూజ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటోంది. Patriotism is in his blood, Meet #SonOfIndia🇮🇳. Here's #SonOfIndiaFirstlook Directed by @ratnababuwriter 🎶 Maestro #Ilaiyaraaja Musical@iVishnuManchu @LakshmiManchu @HeroManoj1 @vinimanchu @itsmepragya @24framesfactory#SOI #SreeLakshmiPrasannaPictures pic.twitter.com/5fgFrPBpAb — Mohan Babu M (@themohanbabu) January 29, 2021 -
రేపే ‘సన్నాఫ్ ఇండియా’ ఫస్ట్లుక్..
సమాజంలో జరిగే అన్యాయాలను, అక్రమాలను ఎదుర్కోవడానికి సన్నాఫ్ ఇండియా రెడీ అయ్యారు. సన్నాఫ్ ఇండియా ఎలా ఉంటారో చిన్న లుక్ ద్వారా పరిచయం చేస్తారట. మోహన్బాబు హీరోగా తెరకెక్కుతున్న సోషల్ డ్రామా ‘సన్నాఫ్ ఇండియా’. డైమండ్ రత్నబాబు దర్శకుడు. మంచు విష్ణు, లక్ష్మీ మంచు నిర్మించారు. ఈ సినిమా ఫస్ట్లుక్ను రేపు రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. సమాజాన్ని సరిదిద్దాలని ప్రయత్నించే పవర్ఫుల్ వ్యక్తిగా మోహన్బాబు కనిపిస్తారని టాక్. ఈ సినిమాకు మోహన్బాబు స్క్రీన్ప్లే సమకూర్చడం విశేషం. -
ప్రభుదేవా తమ్ముడి డాన్స్ రాజా
నటుడు–దర్శకుడు ప్రభుదేవా సోదరుడు నాగేంద్ర ప్రసాద్, రాజ్ కుమార్, శ్రీజిత్ ఘోష్, రాంకీ, మనోబాల, ఊర్వశి, జూనియర్ బాలయ్య ముఖ్యపాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘డాన్స్ రాజా డాన్స్’. ఏ.ఎల్ విజయ్ దర్శకత్వం వహించారు. తమిళంలో రూపొందిన ఈ చిత్రాన్ని తెలుగులో అనువదించి భీమవరం టాకీస్ పతాకంపై తుమ్మలపల్లి రామసత్యనారాయణ ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఈ చిత్రం ఫస్ట్ లుక్ని తమిళనాడు మాజీ గవర్నర్ – ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ కొణిజేటి రోశయ్య ఆవిష్కరించి, ‘డాన్స్ ప్రధానంగా రూపొందిన ఈ సినిమా మంచి విజయం సాధించాలి’’ అన్నారు. తుమ్మలపల్లి రామసత్యనారాయణ మాట్లాడుతూ– ‘‘రోశయ్యగారి చేతుల మీదుగా మా చిత్రం ఫస్ట్ లుక్ విడుదలవడం గర్వకారణం మాత్రమే కాకుండా విజయసూచకం. ఎం.ఎం. శ్రీలేఖ ఆలపించిన నాలుగు పాటలూ ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. తమిళంలో విజయం సాధించిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను అలరిస్తుందనే నమ్మక ఉంది’’ అన్నారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ రవి కనగాల పాల్గొన్నారు. -
ఎక్కడికో ఈ అడుగు
‘ఎఫెక్ట్స్ రాజు’ గా చిత్ర పరిశ్రమ వర్గాలకు సుపరిచితుడైన రాజు బొనగాని దర్శకత్వం వహించిన తొలి చిత్రం ‘ఎక్కడికో ఈ అడుగు’. గోపీకృష్ణ, ప్రియాంకా చౌదరి జంటగా నటించారు. స్కై లైన్ ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై అట్లూరి శ్రీనివాస్ నిర్మించిన ఈ సినిమా ఫస్ట్ లుక్ని సంక్రాంతి కానుకగా విడుదల చేశారు. ఈ సందర్భంగా రాజు, శ్రీనివాస్ మాట్లాడుతూ–‘‘విభిన్న ప్రేమకథా చిత్రం ‘ఎక్కడికో ఈ అడుగు’. 1990లో జరిగిన వాస్తవ ఘటన ఆధారంగా గ్రామీణ నేపథ్యంలో రూపొందింది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు దాదాపుగా పూర్తయ్యాయి. మార్చిలో సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం. మా సినిమా కోసం 55 రోజులు రేయింబవళ్లు పని చేసిన యూనిట్కి ధన్యవాదాలు’’ అన్నారు. ఆర్తి రాజ్, జయప్రకాష్ (తమిళ్), తోటపల్లి మధు, పిల్లా ప్రసాద్ ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రానికి సంగీతం: దిలీప్ బండారి, కెమెరా: ఈశ్వర్ ఎల్లుమహంతి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: తాతినేని సుజన్ బాబు. -
విజువల్స్ బాగున్నాయి– రానా
‘‘గుహన్గారు ఒక యూనిక్ సినిమాటోగ్రాఫర్. ఆయనతో కలిసి పనిచేశాను. ‘డబ్లు్యడబ్లు్యడబ్లు్య’ పోస్టర్ చూస్తుంటే హై కాన్సెప్ట్ ఫిలిం అనిపిస్తోంది. ఈ సినిమాలో విజువల్స్ సరికొత్తగా ఉంటాయి. గుహన్గారు ఇలాంటి సినిమాలు మరెన్నో తీయాలి. ఈ సినిమా మంచి హిట్ అవ్వాలి’’ అన్నారు రానా. ‘118’ వంటి హిట్ చిత్రాన్ని తెరకెక్కించిన సినిమాటోగ్రాఫర్ కేవీ గుహన్ దర్శకత్వం వహించిన రెండో చిత్రం ‘డబ్లు్యడబ్లు్యడబ్లు్య’ (ఎవరు, ఎక్కడ, ఎందుకు). అదిత్ అరుణ్, శివానీ రాజశేఖర్ హీరోహీరోయిన్లుగా రామంత్ర క్రియేషన్స్ పతాకంపై డా. రవి పి.రాజు ధాట్ల తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ని రానా విడుదల చేశారు. కేవీ గుహన్ మాట్లాడుతూ– ‘‘లాక్డౌన్లో ఒక కొత్త కాన్సెప్ట్ అనుకుని ఈ సినిమా చేశాను. ఇది ఒక కాన్సెప్ట్ బేస్డ్ ఫిలిం. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోన్న మా చిత్రాన్ని త్వరలోనే రిలీజ్కి ప్లాన్ చేస్తున్నాం’’ అన్నారు. ‘‘మిస్టరీ థ్రిల్లర్గా గుహన్గారు ఈ సినిమాని బాగా తీశారు’’ అన్నారు డా. రవి పి.రాజు ధాట్ల. ‘‘కొత్త కాన్సెప్ట్తో ఈ మూవీని తెరకెక్కించారు గుహన్గారు’’ అన్నారు అదిత్ అరుణ్. ‘‘కేవీ గుహన్గారి సినిమాలో నటించడం అదృష్టంగా భావిస్తున్నాను. నా తొలి సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ను లాంచ్ చేసిన రానాగారికి థ్యాంక్స్’’ అన్నారు శివానీ రాజశేఖర్. ‘‘ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం’’ అన్నారు సహ నిర్మాత విజయ్ధరన్ ధాట్ల. ఈ చిత్రానికి సంగీతం: సైమన్ కె. కింగ్, కథ, స్క్రీన్ప్లే, సినిమాటోగ్రఫీ, దర్శకత్వం: కేవీ గుహన్. -
హాకీ ఎక్స్ప్రెస్
సందీప్ కిషన్, లావణ్యా త్రిపాఠి జంటగా నటించిన న్యూఏజ్ స్పోర్ట్స్ ఎంటర్టైనర్ ‘ఏ1 ఎక్స్ప్రెస్’. డెన్నిస్ జీవన్ కనుకొలను దర్శకత్వంలో ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, వెంకటాద్రి టాకీస్ పతాకాలపై టి.జి. విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్, సందీప్ కిషన్, దయా వన్నెం నిర్మించారు. ‘ఏ1 ఎక్స్ప్రెస్’ ఫస్ట్ లుక్ను శనివారం విడుదల చేసింది చిత్రబృందం. పోస్టర్లో ఎయిట్ప్యాక్ బాడీతో ఒక చేతిలో హాకీ స్టిక్ పట్టుకుని మరో చేతిలో చొక్కా ఊపుతూ కనిపించారు సందీప్. త్వరలో థియేటర్లలో విడుదలయ్యేందుకు సిద్దమవుతుందీ సినిమా. తెలుగు సినిమా పరిశ్రమలో హాకీ నేపథ్యంలో వస్తున్న ఈ తొలి చిత్రానికి హిప్హాప్ తమిళ సంగీత దర్శకుడు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. -
జాతీయ రహదారికి అవార్డులు రావాలి
‘‘నరసింహనంది మా దగ్గర చాలా సినిమాలకు పనిచేశాడు. అతని డెడికేషన్ నాకు చాలా ఇష్టం. తన దర్శకత్వంలో రూపొందిన సినిమాలు పలు అవార్డులు గెలుచుకున్నాయి.. ‘జాతీయ రహదారి’ సినిమాకి కూడా అవార్డులతో పాటు రివార్డులు రావాలి’’ అని రచయిత, దర్శకుడు విజయేంద్ర ప్రసాద్ అన్నారు. మధుచిట్టి, సైగల్ పాటిల్, మమత, ఉమాభారతి, మాస్టర్ దక్షిత్ రెడ్డి, అభి, శ్రీనివాస్ పసునూరి ముఖ్యపాత్రల్లో నరసింహ నంది దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘జాతీయ రహదారి’. తుమ్మలపల్లి రామ సత్యనారాయణ నిర్మిస్తున్న ఈ సినిమా టీజర్, ఫస్ట్ లుక్ని విజయేంద్ర ప్రసాద్ విడుదల చేశారు. తుమ్మలపల్లి రామసత్యనారాయణ మాట్లాడుతూ– ‘‘శతాధిక చిత్రనిర్మాతగా నాకు పేరున్నా తృప్తి కలగలేదు. నర సింహ నంది దర్శకత్వంలో నిర్మిస్తున్న ఈ ‘జాతీయ రహదారి’ సినిమాతో నంది (ఆంధ్రప్రదేశ్), సింహ (తెలంగాణ ప్రభుత్వ పురస్కారం) అవార్డులు గెలుచుకోవడం ఖాయం’’ అన్నారు. నరసింహ నంది మాట్లాడుతూ– ‘‘ఇప్పటి వరకు నేను 6 సినిమాలకు దర్శకత్వం వహించాను.. వాటిలో 4 సినిమాలకు జాతీయ అవార్డులు, రాష్ట్రీయ అవార్డులు అందుకున్నాను. రామసత్యనారాయణగారికి ఈ కథ నచ్చి, నిర్మాణ బాధ్యతలు కూడా నా భుజంపై వేశారు. ఆయనతో మరో సినిమా చేయడానికి కథ రెడీ చేసుకొంటున్నాను’’ అన్నారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సంధ్య స్టూడియోస్, సంగీతం: సుక్కు, కెమెరా: మురళి మోహన్ రెడ్డి. -
మేడమ్ చీఫ్ మినిస్టర్
ఇటీవల విడుదలైన ‘షకీలా’ బయోపిక్లో గ్లామరస్గా కనిపించిన రిచా చద్దా ఇప్పుడు అందుకు భిన్నంగా కనిపించనున్నారు. ఆమె ముఖ్య పాత్రలో తెరకెక్కిన లేడీ ఓరియంటడ్ చిత్రం ‘మేడమ్ చీఫ్ మినిస్టర్’. ఇందులో టైటిల్ రోల్లో రిచా కనిపిస్తారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ను సోమవారం విడుదల చేశారు. సుభాష్ కపూర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా రిచా నటించారు. ఇదో సీరియస్ పొలిటికల్ డ్రామా. జనవరి 22న సినిమా రిలీజ్ కానుంది.