HIV
-
కోడలికి హెచ్ఐవీ ఇంజక్షన్
హరిద్వార్: అడిగినంత కట్నం ఇవ్వలేదని కోడలికి ఏకంగా హెచ్ఐవీ సోకిన ఇంజెక్షన్ ఇచ్చిన అత్తామామల అమానుషత్వమిది. ఉత్తరాఖండ్లో హరిద్వార్లోని జస్వవాలాలో ఈ దారుణం జరిగింది. నాతిరామ్ సైనీ కుమారుడు అభిõÙక్కు రెండేళ్ల క్రితం ఉత్తరప్రదేశ్కు చెందిన సోనాల్ సైనీతో పెళ్లయింది. కట్నంగా రూ.15 లక్షల నగదు, కారు ఇచ్చారు. కొంతకాలానికే అత్తమామలు స్కారి్పయో కారు, రూ.25 లక్షలు డిమాండ్ చేయడం ప్రారంభించారు. యువతి తల్లిదండ్రులు అంగీకరించకపోవడంతో కోడలిని ఇంటి నుంచి గెంటేశారు. గ్రామంలో పంచాయతీ పెట్టి తిరిగి అత్తారింటికి పంపించారు. శారీరకంగా, మానసికంగా హింసించడంతో ఆమె ఆరోగ్యం క్షీణించింది. తల్లిదండ్రులు ఆస్పత్రికి తీసుకెళ్తే హెచ్ఐవీ పాజిటివ్ అని తేలింది. భర్తకు మాత్రం నెగిటివ్ వచ్చింది. షాక్కు గురైన యువతి తల్లిదండ్రులు అత్తామామలపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పట్టించుకోకపోవడంతో బాధితురాలు కోర్టును ఆశ్రయించింది. కోర్టు ఆదేశాల మేరకు భర్త, అత్తమామ, ఇతర కుటుంబీకులపై వరకట్న వేధింపులు, దాడి, హత్యాయత్నం కేసు నమోదు చేశారు. -
హెచ్ఐవీ-ఎయిడ్స్: టీకాకు దీటుగా సూదిమందు...
ఏదైనా వ్యాధి సోకితే మానవుల్లోని వ్యాధి నిరోధక శక్తి / వ్యవస్థ దాన్ని సమర్థంగా ఎదుర్కొంటాయి. అయితే... ఎయిడ్స్ వ్యాధి ప్రత్యేకత ఏమిటంటే... అది దేహంలోని జబ్బుల్ని ఎదుర్కొనే వ్యాధి నిరోధక శక్తినే దెబ్బతీస్తుంది. దాంతో చిన్న చిన్న సాంక్రమిక వ్యాధులకే బాధితులు తేలిగ్గా లొంగిపోతారు. హెచ్ఐవి వైరస్ క్రిమికి ఉండే కొన్ని ప్రత్యేక లక్షణాల కారణంగా సమీప భవిష్యత్తులో దీనికి వ్యాక్సిన్ రూపొందే పరిస్థితి లేదు. అయినప్పటికీ 25 రకాల ఏంటి రెట్రో వైరల్ ఔషధాల తోపాటు ఓ ఇంజెక్షన్తో ఈ వ్యాధిని నివారించడం సాధ్యమేనని తేలింది. ఇది ఇంచుమించూ టీకాలాగే పనిచేస్తూ జబ్బు బారిన పడకుండా చేస్తుంది. అదెలాగో తెలుసుకుందాం. హెచ్ఐవీకి టీకా రూపొందించడానికి అనేక సాంకేతిక ప్రతిబంధకాలు ఉన్నాయి. సాధారణ ప్రజలకు అర్థమయ్యేలా చెప్పాలంటే... ఏదైనా టీకాను అభివృద్ధి చేస్తే... అది ఆ వ్యాధి నుంచి రక్షణ కల్పించేలా ‘వ్యాధి నిరోధక వ్యవస్థ’ను ప్రేరేపితం చేస్తుంది. కానీ ఈ వైరస్ మానవ వ్యాధి నిరోధక వ్యవస్థలోని కీలక కణాలైన సీడీ4 లింఫోసైట్స్ తదితర కణాల జీన్స్లో కలిసిపోతుంది. దాంతో ఇన్ఫెక్షన్ శాశ్వతమైపోయి వ్యాధి నిరోధక వ్యవస్థే కుప్పకూలిపోయి, దీర్ఘ కాలంలో ఎయిడ్స్ వస్తుంది. అందుకే ఎయిడ్స్కు టీకా అభివృద్ధి చేయడం సాధ్యం కా(లే)దు. అయినప్పటికీ హెచ్ఐవీని నిరోధించేందుకు పరిశోధనలింకా జరుగుతూనే ఉన్నాయి. ఈ ఇంజెక్షన్తో విప్లవాత్మక మార్పు... గతేడాది అంటే... 2024 జూలైలో దక్షిణ ఆఫ్రికాకి చెందిన పరిశోధకులు డాక్టర్ లిండా గేయిల్ బెక్కర్ తదితరులు... హెచ్ఐవీని నిరోధించడానికి ప్రీఎక్స్పోజర్ ప్రొఫైలాక్సిస్గా ఓ సరికొత్త ఇంజక్షన్ ‘లెనకపావిర్’ సమర్థంగా పనిచేస్తుందని ప్రకటించారు. దక్షిణాఫ్రికా, ఉగాండాలలో నిర్వహించిన ప్రయోగంలో... తమ భర్తలకు హెచ్ఐవీ పాజిటివ్ ఉండి... తాము మాత్రం నెగెటివ్ అయిన ఓ 3204 మంది మహిళలకు (అంటే... సీరో డిస్కార్డెంట్ విమెన్కు) టెనొఫోవిర్, ఎమ్ ట్రైసిటాబైన్ అనే మందులు ఇచ్చారుగానీ వారిలో 35 మందికి హెచ్ఐవీ సోకింది. ఇక మరో ప్రయోగంలో మరో 2134 మంది సీరో డిస్కార్డెంట్ మహిళలకి సరికొత్త ఔషధం అయిన లెనకపావిర్ (927 మిల్లీగ్రాముల) ఇంజక్షన్స్ ని ఆరు నెలలకు ఒకటి చొప్పున, ఏడాదిలో రెండు ఇంజెక్షన్స్ ఇచ్చారు. వీళ్లలో ఒక్కరికి కూడా హెచ్ఐవి ఇన్ఫెక్షన్స్ సోకలేదు. దీంతో హైరిస్క్ గ్రూపుల్లో, అంటే... భర్త హెచ్ఐవి పాజిటివ్ అయి, భార్య నెగిటివ్గా ఉన్న పరిస్థితుల్లో ఈ ఇంజక్షన్స్తో ఎయిడ్స్ను సమర్థంగా నివారించవచ్చని తేలింది. ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన లెనకపావిర్ ఇంజక్షన్ తాలూకు ఒక్క మోతాదు ఆరు నెలలపాటు రక్షణ ఇస్తుండడంతో అనేక ఆఫ్రికా, ఆసియా దేశాలలో ఎయిడ్స్ వ్యాప్తి నిరోధానికి ఈ ఇంజెక్షన్ను వాక్సిన్ (టీకా) తరహాలోనే ఉపయోగంలోకి తీసుకొచ్చే అవకాశాలున్నాయి. అసలీ లెనకపావిర్ కాప్సిడ్ ఇన్హిబిటర్ ఎలా పనిచేస్తుదంటే... హెచ్ఐవీ తాలూకు జీన్స్, ప్రోటీన్స్, ఎంజైమ్స్... ఈ అన్నింటినీ కలిపి ‘కోర్’ (న్యూక్లియో కాప్సిడ్) అంటారు. ఈ ‘కోర్’ని కలిపి ఉంచే ఒక సంచి వంటి నిర్మాణమే కాప్సిడ్. ఈ క్యాప్సిడ్ మూలంగానే హెచ్ఐవి తాలూకు ‘కోర్ ’కు ఓ శంఖువు లాంటి ఆకృతి వస్తుంది. ఈ కోర్ తాలూకు ప్రోటీన్నే ‘పీ 24 ఏంటిజెన్’గా పిలుస్తారు. ఇన్ఫెక్షన సోకిన తొలివారాల్లో దీన్ని గుర్తించడానికి ప్రత్యేక టెస్ట్లు ఉన్నాయి. కొత్తగా అందుబాటులోకి వచ్చిన లెనాకపావిర్ అనేది ‘కాప్సిడ్ ఇన్హిబిటర్ ’ ఔషధం. అంటే... వైరస్ సంక్రమించే సందర్భంలో కాప్సిడ్ను విచ్ఛిన్నం చేస్తుంది. ఈ ఇంజెక్షన్ ఇచ్చినప్పుడు... న్యూక్లియస్ క్యాప్సిడ్ లోని భాగాలు ‘కోర్’గా మారి, దాని చుట్టూ సంచి వంటి కాప్సిడ్ ఏర్పడకుండా అడ్డుతుంది. అంతేకాదు... హెచ్ఐవీ జన్యువుల్లోని అణువులను అది మానవుల కణాల్లోకి విడుదల కాకుండా అడుకట్ట వేస్తుంది. ఒక్కమాటలో చెప్పాలంటే... ఈ ఇంజెక్షన్ హెచ్ఐవీ లోని జన్యువులను మనిషి జీన్స్లో కలిసే ప్రక్రియని అడ్డుకుంటుందని చెప్పవచ్చు. లెనాకపావిర్ ప్రత్యేకతలివి... ఇప్పటివరకు ఉన్న యాంటీ రెట్రోవైరల్ మందులు... హెచ్ఐవీ సోకి అది మానవుల్లో వృద్ధి చెందే దశల్లోని ఏదో ఒక దశలో మాత్రమే అడ్డుకొంటాయి. అయితే లెనాక΄ావిర్ మాత్రం హెచ్ఐవీ క్రిమి వృద్ధి చెందడాన్ని మూడు దశలలో అడ్డుకుంటుంది. అంతేకాదు... ఈ మందు ఆర్నెల్ల పాటు పనిచేస్తుంది. అంటే ఏడాదికి రెండు ఇంజెక్షన్లతోనే ఏడాదంతా హెచ్ఐవీ / ఎయిడ్స్ రాకుండా చూస్తుంది. ఒకరకంగా చెప్పాలంటే... ముందుగా ఓ టీకా, ఆర్నెల్ల తర్వాత ఓ బూస్టర్ డోస్ ఎలా పనిచేస్తాయో, ఈ ఇంజెక్షన్ తాలూకు రెండు మోతాదులు అదే పనిచేస్తాయి. పైగా హెచ్ఐవీ బాధితులకు ఇప్పుడు అనేక మందుల్ని రకరకాల కాంబినేషన్లలో వాడుతుంటారు. మందులు పెరుగుతున్న కొద్దీ హెచ్ఐవి క్రిమి వాటికి రెసిస్టెన్స్ పెంచుకుని, వాటికి లొంగకుండా తయారయ్యే అవకాశాలెక్కువ. అలాంటి వారిలో లెనకపావిర్ను ఏదో ఒక మందుతో కలిపి వాడుతున్నారు. ఈ రకంగా చూసినప్పుడు కూడా లెనకపావిర్ అనే ఈ ఇంజెక్షన్ ఎయిడ్స్ బాధితుల పాలిట ఆశారేఖగా నిలుస్తోంది.అదుపునకు కొన్ని మార్గాలివి...కండోమ్స్, డిస్పోసబుల్ సిరంజీల వాడకం తోపాటు, బ్లడ్ బ్యాంకులలో హెచ్ఐవీ పరీక్షలు తప్పనిసరి చేయడం వల్ల హెచ్ఐవీ వ్యాప్తిని కొంతమేరకు అదుపు చేయడం సాధ్యమైంది. అయితే ఈ జబ్బుకు గురయ్యేందుకు అవకాశమున్న అనేక వర్గాలకు ముందుగానే ఇచ్చేలా ‘ప్రీ ఎక్సపోజర్ ప్రొఫైలాక్సిస్’ (ప్రెప్ ) వంటి ప్రక్రియలూ, అలాగే ఈ జబ్బు ఉన్న వారికి సేవలు చేసే సందర్భాలలో ప్రమాదవశాత్తు జబ్బు వచ్చే అవకాశం ఉన్న డాక్టర్లు, నర్సుల వంటివారికి పోస్ట్ ఎక్స్పోజర్ ప్రొఫైలాక్సిస్’ (పెప్)ల వంటి ప్రక్రియలు అందుబాటులోకి వచ్చాయి. (చదవండి: సార్కోమాను ఎదుర్కోలేమా!) -
వివాహితతో సహజీవనం.. ఉపాధ్యాయుడికి హెచ్ఐవీ..?
సూర్యాపేటటౌన్: విద్యాబుద్ధులు నేర్పించే ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఓ మహిళతో సహజీవనం చేస్తూ ఆమె కుమార్తెలపై అత్యాచారం ఒడిగట్టాడు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా కేంద్రంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని చర్చి కాంపౌండ్లో నివాసముండే ప్రభుత్వ ఉపాధ్యాయుడు జాటోతు సునీల్కుమార్ జిల్లా కేంద్రంలోని మామిళ్లగడ్డ ప్రాథమిక పాఠశాలలో విధులు నిర్వహిస్తున్నాడు. కొంతకాలంగా అతడు భార్యకు దూరంగా ఉంటూ మరో మహిళతో సహజీవనం చేస్తున్నాడు. 2018 నుంచి ఆ మహిళతోనే ఉంటూ సహజీవనం చేస్తున్నాడు. సదరు మహిళకు భర్త లేడు. ఇద్దరు కుమార్తెలు ఉండడంతో వారిని చదివించుకుంటూ సునీల్కుమార్తోనే ఉంటోంది. తల్లితో సహజీవనం చేస్తూ.. ఇద్దరు కుమార్తెలపై అత్యాచారం..జాటోతు సునీల్కుమార్ కన్ను ఆ మహిళ కుమార్తెలపై పడింది. వారిని ఎలాగైనా లొంగతీసుకోవాలనే కోరికతో కొద్దిరోజులుగా ముగ్గురికి నిద్రమాత్రలు ఇస్తూ సదరు మహిళ ఇద్దరు కుమార్తెలపై అత్యాచారం చేశాడు. తల్లితో చెబితే చంపేస్తానని బెదిరింపులకు సైతం పాల్పడ్డాడు. ఓ రోజు సదరు మహిళ చూస్తుండగానే ఆమె కుమార్తెపై సునీల్కుమార్ అత్యాచారం చేస్తుండగా వెంటనే కేకలు వేసి అతడి చెర నుంచి విడిపించింది. పోక్సో కేసు నమోదు...సదరు మహిళ సూర్యాపేట పట్టణ పోలీస్ స్టేషన్లో ఈ నెల 5వ తేదీన సునీల్కుమార్పై ఫిర్యాదు చేసింది. ఈ మేరకు సునీల్కుమార్పై పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పట్టణ సీఐ వీరరాఘవులు తెలిపారు. సునీల్కుమార్ తనను తనను పెళ్లి కూడా చేసుకున్నాడని సదరు మహిళ ఫిర్యాదులో పేర్కొంది.ఉపాధ్యాయుడికి హెచ్ఐవీ..? సునీల్కుమార్కు హెచ్ఐవీతో పాటు పలు సుఖ వ్యాధులు ఉన్నట్లు సదరు మహిళ ఫిర్యాదులో పేర్కొంది. తమకు న్యాయం చేసి ఉపాధ్యాయుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది. సునీల్కుమార్ను అరెస్ట్ చేసి హెచ్ఐవీ టెస్ట్ చేయిస్తామని పట్టణ సీఐ తెలిపారు. అదేవిధంగా సదరు మహిళకు, ఆమె కుమార్తెలకు కూడా సోమవారం హెచ్ఐవీ పరీక్షలు చేయించనున్నట్లు చెప్పారు. -
కట్టడి చేస్తున్నా...కేసులు పెరుగుతున్నాయ్!
దాదర్: ప్రాణాంతక హెచ్ఐవీ వ్యాధిని నియంత్రించేందుకు ప్రభుత్వం, ఎయిడ్స్ కంట్రోల్ బోర్డు (ఏసీబీ)అనేక ప్రయత్నాలు చేస్తున్నాయి. అయినప్పటికీ ముంబైలో ఎయిడ్స్ రోగుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ముంబై జిల్లా ఎయిడ్స్ నియంత్రణ కమిటీ ఏటా నిర్వహిస్తున్న వైద్య పరీక్షల్లో రాష్ట్రవ్యాప్తంగా సుమారు మూడు వేల మంది హెచ్ఐవీ రోగులన్నుట్లు తేలింది. ప్రస్తుతం ముంబైలో 40,658 హెచ్ఐవీ రోగులున్నట్లు ముంబై జిల్లా ఎయిడ్స్ నియంత్రణ కమిటీ స్పష్టం చేసింది. దీంతో ఎయిడ్స్ కంట్రోల్ బోర్డు, వైద్య శాఖ, ప్రభుత్వ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు హెచ్ఐవీ రోగుల సంఖ్య తగ్గించేందుకు గత అనేక సంవత్సరాలుగా ప్రభుత్వం వివిధ కార్యక్రమాలు చేపడుతోంది. ఇందుకోసం పెద్ద ఎత్తున జనజాగృతి కార్యక్రమాల చేపడుతోంది. నేటి ఆధునిక యుగంలో కొత్తకొత్త మందులు మార్కెట్లోకి వచ్చాయి. రోగులు కూడా ఆయుర్వేదం జోలికి పోకుండా ఆధునిక మందులు, మాత్రలను వాడుతున్నారు. అయినా ముంబైలో ఏటా మూడు వేలమందికి వ్యాధి నిర్ధారణ జరగడం ఆందోళన కల్గిస్తోంది. ఏటా నిర్వహిస్తున్న వైద్య పరీక్షల్లో బయటపడుతున్న కొత్త రోగుల్లో 75 శాతం 15–49 ఏళ్ల మధ్య వయసున్న వారున్నారు. వీరిలో 31 శాతం మహిళలున్నారు. అనేక సందర్భాల్లో రక్షణ ప్రమాణాలు పాటించకుండా లైంగిక సంబంధాలు కొనసాగించడం, అక్రమ సంబంధాల వల్ల ఈ వ్యాధి సోకుతోందని వైద్య పరిశీలనలో తెలిసింది. హెచ్ఐవీ గురించి భారీగా అవగాహన సదస్సులు, జనజాగృతి కార్యక్రమాలు చేపట్టినప్పటికీ పెద్ద మొత్తంలో ఎయిడ్స్ కేసులు బయటపడుతుండటంతో ముంబై జిల్లా ఎయిడ్స్ నియంత్రణ కమిటీ ఆశ్చర్యం వ్యక్తం చేస్తోంది. తగ్గిన వివక్ష... హెచ్ఐవీ రోగులు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా కొద్ది సంవత్సరాల నుంచి నియంత్రణ కమిటీ కొత్త విధానాలను అమలు చేస్తోంది. రోగులు ఉన్నచోటే పరీక్షలు నిర్వహించడం, వ్యాధి ఏ దశలో ఉందో గుర్తించడం, ఒక్క ముంబైలోనే 20కి పైగా కేంద్రాల ద్వారా ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించడం, రోగులకు ఉచితంగా మందులు లభించేలా ఏర్పాటు చేసినట్లు ముంబై జిల్లా ఎయిడ్స్ నియంత్రణ కమిటీ అదనపు డైరెక్టర్ డా.విజయ్కుమార్ కారంజ్కర్ తెలిపారు. మరోవైపు ప్రభుత్వం రోగులకు ఉచితంగా మందులు పంపిణీ చేస్తుంది. గతంలో వారు చికిత్స పొందుతున్న ఆస్పత్రుల్లోనే మందులు ఇచ్చేందుకు స్వతంత్రంగా కౌంటర్లు ఏర్పాటు చేసింది. ఎలాంటి ఆహారం, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే వ్యాధి నియంత్రణలోకి వస్తుందనే విషయంలో మార్గదర్శనం చేస్తున్నారు. సమయానికి మందులు, మంచి ఆహారం తీసుకుంటే ఎప్పటిలాగే జీవనం సాగిస్తారని రోగులకు మనోధైర్యాన్ని నూరిపోస్తున్నారు. గతంలో హెచ్ఐవీ రోగులంటేనే వారి కుటుంబసభ్యులు, ప్రజలు కూడా చిన్న చూపు చూసేవారు. వారి పట్ల బేధభావం ప్రదర్శించేవారు. వారు వాడే దుస్తులు, వస్తువులను వేరుగా ఉంచడంతోపాటు పడుకునేందుకు ప్రత్యేకంగా గది కేటాయించేవారు. కానీ ప్రభుత్వం పెద్ద ఎత్తున చేపట్టిన జనజాగృతి కార్యక్రమాలవల్ల ప్రజల్లో అవగాహన వచ్చింది. దీంతో ఇలాంటి ఘటనలు కూడా గణనీయంగా తగ్గిపోయాయని వైద్యనిపుణులు చెబుతున్నారు. -
ఇక ఎయిడ్స్కు చరమగీతం!
ఒకప్పుడు మశూచి వ్యాధి బారిన పడి లక్షలమంది మరణించేవారు. అలాగే ప్లేగ్ వ్యాధితో కూడా! అలాంటి భయంకరమైన రోగాలు ఇప్పుడు కలికానికి కూడా లేవు. దీనికి కారణాలు ఆ రోగాలను మట్టుబెట్ట డంలో జరిగిన నిరంతర కృషి.1980వ దశకంలో ఎయిడ్స్ అంటే మరణం. దీని బారిన పడినవారు బతికి ఉన్నా, చచ్చినవారితో సమానం అన్నట్టుగా సమాజం పరిగణించిన రోజులు అవి. హెచ్ఐవీ పాజిటివ్ అని తెలియ గానే గుండెలో బండ పడినట్లే భావించి మానసికంగా మరణా నికి చేరువయ్యేవారు. ఎయిడ్స్ తాకిడికి అమెరికా లాంటి అగ్ర దేశాలు కూడా విలవిలలాడి పోయాయంటే అప్పట్లో ఈ వ్యాధి కలిగించిన భయోత్పాతాన్ని అర్థం చేసుకోవచ్చు. అది ఆనాటి ముఖచిత్రం. ఈనాడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. మందే లేదనుకున్న ఈ వ్యాధికి తగిన మందులు లభిస్తున్నాయి. ఇప్పుడు ఎయిడ్స్ ఒక దీర్ఘకాలిక వ్యాధి మాత్రమే! ఎయిడ్స్కు గురి కాకుండా ఎలాగూ కాపాడుకోవచ్చు. ఒకవేళ వచ్చిందని తెలిసినా, 72 గంటల లోపు పోస్ట్ ప్రొఫలాక్సిస్ మందులు వాడి దాని బారి నుంచి బయటపడవచ్చు. తొమ్మిదేళ్ల క్రితమే క్యూబాలో హెచ్ఐవీ ఎయిడ్స్, సిఫిలిస్ వ్యాధులను పూర్తిగా తుడిచి పెట్టారు. తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఎయిడ్స్ గురించి భయపడాల్సిన అవసరం ఇక ఎంత మాత్రం లేదని, గట్టిగా ప్రయత్నిస్తే, మొత్తం ప్రపంచానికి ఎయిడ్స్ నుంచి విముక్తి కలిగించవచ్చనే గట్టి సందేశాన్ని ఆ దేశం ప్రపంచ దేశాలకు పంపింది. ఎయిడ్స్ పాజిటివ్ దంపతులు నేడు చికిత్స తీసుకొని, ఆ వ్యాధి లక్షణాలు లేని, ఆరోగ్యవంతమైన పిల్లలను కనవచ్చు. హెచ్ఐవీ పాజిటివ్ వాళ్ళు... ఆ వ్యాధి సోకని వాళ్ళను నిక్షేపంగా వివాహం చేసు కొని, ఎలాంటి భయ సంకోచాలూ లేకుండా హాయిగా కాపు రాలు చేసుకోవచ్చు. అనేక శాస్త్రీయ పరిశోధనల పుణ్యమా అని అలాంటి చికిత్సా పద్ధతులు, ఈనాడు సామాన్యులకు సైతం అందుబాటులోకి వచ్చాయి. బీపీ, షుగర్ బాధితులు అతి తక్కువ ఖర్చుతో ప్రతి రోజూ క్రమం తప్పకుండా మాత్రలు వాడుతూ ఆరోగ్యంగా సాధారణ జీవితం గడుపున్న మాదిరిగానే, ఎయిడ్స్ రోగులు కూడా 30 రూపాయలు ఖరీదు చేసే ఒక్క మాత్రను క్రమం తప్పకుండా రోజూ వేసుకుంటూ, తగు విశ్రాంతి, పోషకా హారం తీసుకుంటూ క్రమశిక్షణతో జీవితం గడిపితే, 80 ఏళ్ల వయస్సు వచ్చే వరకు ఆరోగ్యంగా, ఆనందంగా, ఉల్లాసంగా జీవించవచ్చు. ఈ విషయాన్ని ప్రఖ్యాత వైద్య జర్నల్ ‘లాన్ సెట్’, ప్రపంచ ఆరోగ్య సంస్థ పరిశోధక బృందం, పలు అధ్య యన సంస్థలు అధికారికంగా ప్రకటించాయి.వైద్యపరంగా ఇంతటి భరోసా లభిస్తున్నా, ఎయిడ్స్ రోగులు మానసికమైన భయాందోళనలతో చికిత్సకు దూరంగా ఉంటూ అల్లాడిపోతున్నారు. రోజువారీ వాడాల్సిన మాత్రలు తమ దగ్గర ఉంటే పక్కవారికి తెలిస్తే, పరువు పోతుందనే భయంతో సక్రమంగా వాడకుండా కోరి ప్రమా దాన్ని తెచ్చి పెట్టుకుంటున్నారు. ఇంత ప్రగతి సాధించినా ఇప్పటికీ సామాన్యులే కాక, విద్యాధికులైన హెచ్ఐవీ రోగులు కూడా అపోహలు, మూఢ నమ్మకాలతో శాస్త్రీయంగా ఎలాంటి నిర్ధారణ కాని పొడులు, కషాయాలతో వ్యాధిని మరింత ముదరబెట్టుకొంటున్నారు. కొందరు పాము విషం తీసుకుంటే ఈ వ్యాధి తగ్గిపోతుందనే ప్రచారాలు నమ్మి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారనే వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి.ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ డిసెంబర్ ఒకటవ తేదీ ప్రపంచ ఎయిడ్స్ దినం కోసం ‘అందరం కలసి శ్రమిద్దాం– ఎయిడ్స్ను నిరోధిద్దాం‘ అన్న నినాదాన్ని ప్రకటించింది. 2030 నాటికి ఎయిడ్స్ లేని ప్రపంచాన్ని సృష్టించడానికి, ఆధునిక చికిత్సా పద్ధతులపై ప్రజల్లో అవగాహన పెంచాలని సంకల్పించింది. హెచ్ఐవీ ఎయిడ్స్ వ్యాధి నూటికి నూరుపాళ్ళు నివారించే వీలున్న వ్యాధి కనుక నిరంతరం దీనిపై ప్రజల్లో అవ గాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉండాలి. ఆత్మహత్యల నిరోధానికి కౌన్సెలింగ్ ఇస్తున్న తరహాలోనే ప్రజలకు అందుబాటులో ఎయిడ్స్ కౌన్సెలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయాలి. ఒక టోల్ ఫ్రీ నంబరుతో రోగులకు, సలహాలు, సూచనలు ఇచ్చే కార్యక్రమం చేపడితే మరిన్ని సత్ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. తామెవరు అన్నది పైకి తెలిసే అవకాశం ఉండదు కనుక రోగులు నిర్భయంగా, ఎలాంటి సంకోచమూ లేకుండా వైద్యులను సంప్రతించి సక్రమంగా చికిత్స తీసుకునే వీలుంటుంది. నిర్మూలనకు మంచి అవకాశాలు ఉన్న ఎయిడ్స్ వ్యాధి ముప్పును ప్రపంచానికి పూర్తిగా తప్పించాలంటే కలసికట్టు కృషి అవసరం. ప్రభుత్వ సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, వైద్యులు పరస్పర సహకారంతో ప్రజల్లో, ప్రత్యేకించి ఎయిడ్స్ బాధితుల్లో చక్కటి అవగాహన కల్పించే ప్రయత్నాలు నిరంతరం చేయగలిగితే... మశూచి, ప్లేగు వ్యాధుల మాదిరిగానే అతి త్వరలోనే ఎయిడ్స్ అనే భయంకర రోగాన్ని ప్రపంచం నుంచి తరిమివేయడం అసాధ్యం ఏమీ కాదు. అలాంటి శుభ దినం త్వరలోనే రాగలదని ఆశిద్దాం. డా‘‘ కూటికుప్పల సూర్యారావు వ్యాసకర్త ‘పద్మశ్రీ’ పురస్కార గ్రహీత, అంతర్జాతీయ ఎయిడ్స్ నివారణ సంస్థ సభ్యులు ‘ 93811 49295(నేడు ప్రపంచ ఎయిడ్స్ దినం) -
Karnataka: వీడియోలతో బెదిరించి మంత్రి అయ్యాడు
బనశంకరి: కాంట్రాక్టర్లపై బెదిరింపులు, అలాగే అత్యాచారం, హనీట్రాప్ కేసులు ఎదుర్కొంటూ అరెస్టయిన రాజరాజేశ్వరి నగర బీజేపీ ఎమ్మెల్యే మునిరత్న తనను వాడుకుని ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులను హనీట్రాప్ చేయించారని మహిళ ఆరోపించారు. బెంగళూరులో ఇది జరిగిందని, నా భర్త, పిల్లలను చంపేస్తానని బెదిరించి హనీట్రాప్ చేయించారని తెలిపారు. చాలా మంది మహిళలతో ఈ మహిళపై అత్యాచారం కేసులోనే మునిరత్న అరెస్టయ్యారు. ఆమె బుధవారం నగరంలో మీడియాతో మాట్లాడుతూ సంచలన ఆరోపణలు చేశారు. తనకు భద్రత కల్పిస్తే, మాజీ సీఎం హనీట్రాప్ విషయాలను సిట్కు అందజేస్తానని తెలిపారు. మునిరత్న తనలాగే చాలామంది మహిళలను హనీ ట్రాప్ కు వాడుకున్నారని, తనకు మొబైల్ ఫోన్ ఇచ్చి సదరు వ్యక్తుల వద్దకు పంపించేవారని చెప్పారు. మునిరత్న బంధువు సుధాకర్ కూడా హనీట్రాప్ దందాలో పాల్గొనేవాడని చెప్పారు. హెచ్ఐవీ కలిగిన యువతితో.. మునిరత్న బెదిరించి తనతో హనీ ట్రాప్ చేసిన సాక్ష్యాధారాలు అన్నీ ఉన్నాయని, తాను సొంతంగా ఎవరినీ ట్రాప్ చేయలేదని ఆమె చెప్పారు. ఆయన మాజీ సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలను హనీట్రాప్ చేసి వీడియో తీశారని, ఏసీపీ, సీఐ కూడా హనీట్రాప్ చేయించారని తెలిపారు. హెచ్ఐవీ జబ్బు కలిగిన యువతిని రాజకీయ నేతల వద్దకు పంపేవారని, 10 నిమిషాలు సమయం ఇస్తే బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు బీవై.విజయేంద్రను కలిసి మునిరత్న అక్రమాలను వివరిస్తానని, ఆయనను ఇంకా పారీ్టలో ఎందుకు కొనసాగిస్తున్నారని ధ్వజమెత్తారు. మునిరత్న మంత్రిగా ఉండగా ఎలాంటి దుశ్చర్యలకు పాల్పడ్డారో కొన్ని ఫోటోలను ఆమె విడుదల చేశారు. హనీ ట్రాప్ వీడియోల ద్వారా అప్పటి సీఎంలను బెదిరించి మంత్రి పదవి పొందారని అన్నారు. నాకు ఏమైనా జరిగితే మునిరత్న కారణమన్నారు. అత్యాచారం ఫిర్యాదు వెనక్కి తీసుకోవాలని బెదిరింపులకు పాల్పడ్డారని, దీనిపై పోలీస్స్టేషన్లో కేసు పెట్టానన్నారు. తనకు రక్షణ కలి్పంచాలని పదే పదే కోరారు. -
హెచ్ఐవీ ఇక పరారే, కొత్త టెక్నాలజీ..!
ఎన్నో ఏళ్లుగా ప్రపంచాన్ని వణికిస్తున్న ప్రాణాంతక వ్యాధి హ్యూమన్ ఇమ్యునో డెఫిషియెన్సీ వైరస్ (HIV). తాజాగా ఈ మహమ్మారి నివారణ విషయంలో గుడ్ న్యూస్ అందింది. ఇకపై హెచ్ఐవీని పూర్తిగా నయం చేయవచ్చని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం మందులు తప్ప నివారణ లేని హైఐవీ వ్యాధిని నయం చేయడానికి కొత్త మార్గాన్ని గుర్తించారు. డచ్ శాస్త్రవేత్తల బృందం పరిశోధన వచ్చే నెలలో యూరోపియన్ కాంగ్రెస్ ఆఫ్ క్లినికల్ మైక్రోబయాలజీ అండ్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్లో ఈ పరిశోధనను వెల్లడించే అవకాశం ఉంది. ప్రస్తుతంఉపయోగించే మందులు వైరస్ దాడిని ఆపగలవు కానీ పూర్తిగా నివారించలేవు దీనిపై ప్రపంచవ్యాప్తంగా అనేక పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా శాస్త్రవేత్తలు కీలక పురోగతిని సాధించారు. బీబీసీ నివేదిక ప్రకారం ఆమ్స్టర్డ్యామ్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకుల బృందం, నోబెల్ బహుమతి పొందిన క్రిస్పర్ (CRISPR) జీన్-ఎడిటింగ్ టెక్నాలజీ సాయంతో హెచ్ఐవీని విజయవంతంగా తొలగించినట్లు చెప్పారు. మాలిక్యులర్ కటింగ్ అని పిలిచే ఈ పద్ధతి ద్వారా శాస్త్రవేత్తలు హెచ్ఐవీ సోకిన కణాల డీఎన్ఏను తొలగింగచలిగారు. తొలుత ఈ టెక్నాలజీ సూక్ష్మ స్థాయిలో కత్తెరలా పనిచేసి "చెడు" భాగాన్ని తొలగిస్తుంది. ఆ తరువాత శరీరాన్ని పూర్తిగా వైరస్ నుండి విముక్తి చేయగలదని పరిశోధకులు ఆశిస్తున్నారు. అయితే ఈ CRISPR సాంకేతికత ఎంత సురక్షితంగా, ఎంత ప్రభావవంతంగా ఉంటుందో తెలియడానికి మరింత పరిశోధన జరగాల్సి ఉందని నాటింగ్హామ్ విశ్వ విద్యాలయంలో స్టెమ్ సెల్, జీన్ థెరపీ టెక్నాలజీ అసోసియేట్ ప్రొఫెసర్ డా. జేమ్స్ డిక్సన్ తెలిపారు. క్రిస్పర్-ఆధారిత చికిత్సలో చాలా సవాళ్లు ఉన్నాయనీ, ఇది అందుబాటులోకి రావడానికి చాలా సంవత్సరాలు పట్టవచ్చు అన్నారు లండన్లోని ఫ్రాన్సిస్ క్రిక్ ఇన్స్టిట్యూట్లోని వైరస్ నిపుణుడు డా. జోనాథన్ స్టోయ్, హెచ్ఐవికి చికిత్స చేయడం చాలా కష్టం ఎందుకంటే ఇది రెట్రోవైరస్. ఇది వ్యక్తి రోగనిరోధక శక్తిని బలహీనపరిచే ఒక తీవ్రమైన అంటు వ్యాధి. జీవితకాల యాంటీరెట్రోవైరల్ థెరపీ అవసరమవుతుంది. ఈ మందులను నిలిపి వేస్తే డీఎన్ఏలో దాక్కున్న వైరస్ తిరిగి విజృంభిస్తుంది. ప్రాణాంతకం కూడా. -
జైలులో హెచ్ఐవీ కలకలం.. 63 మందికి పాజిటివ్
లక్నో: ఉత్తరప్రదేశ్లోని లక్నో జిల్లా జైలులో ఖైదీల ఆరోగ్యానికి సంబంధించి సంచలన విషయం బయటపడింది. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా జైలులోని 63 మంది ఖైదీలకు హెచ్ఐవీ(ఎయిడ్స్) ఉన్నట్లు తేలింది. గత ఏడాది డిసెంబర్ నెలలో నిర్వహించిన పరీక్షల్లో 36 మందికి హెచ్ఐవీ సోకినట్లు తేలగా తాజా పరీక్షల్లో ఈ సంఖ్య 63కు చేరింది. వైరస్ ఇంత పెద్ద ఎత్తున వ్యాప్తి చెందడానికి గల స్పష్టమైన కారణాలు మాత్రం తెలియాల్సి ఉంది. హెచ్ఐవీ సోకిన ఖైదీల్లో చాలా మందికి డ్రగ్స్ తీసుకునే అలవాటు ఉండటంతో ఒకరు వాడిన ఇంజెక్షన్లతో మరొకరు డ్రగ్స్ ఎక్కించుకునే సమయంలో వైరస్ ఒకరి నుంచి మరొకరికి సోకినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. అయితే వీరిందరికీ ముందే హెచ్ఐవీ ఉందని, జైలులోకి వచ్చిన తర్వాత ఎవరికీ వైరస్ సోకలేదని మరో వాదన వినిపిస్తోంది. హెచ్ఐవీ సోకినట్లు తేలిన వారందరికీ లక్నోలోని ఒక ఆస్పత్రిలో చికిత్సనందిస్తున్నట్లు జైలు అధికారులు తెలిపారు. ఒక్కసారిగా భారీ సంఖ్యలో హెచ్ఐవీ కేసులు బయటపడిన నేపథ్యంలో జైలులో వైరస్ మరింత వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఇదీచదవండి.. రిసార్ట్ పాలిటిక్స్.. తొలిసారి ఎక్కడ..ఎప్పుడంటే -
హెచ్ఐవీ నియంత్రణకు కొత్త ఔషధాలు
సాక్షి, హైదరాబాద్: హెచ్ఐవీని నియంత్రించేందుకు కొత్త ఔషధాలు అందుబాటులోకి వచ్చాయని, వ్యాధి బారినపడిన వారికి వీటితో మంచి ఫలితం ఉంటుందని ప్రముఖ సంక్రమిక వ్యాధుల నిపుణులు డాక్టర్ మోనాలిసా సాహు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ‘ఇంటిగ్రేస్ స్ట్రాండ్ ట్రాన్స్ఫర్ ఇన్హిబిటర్స్ (ఐఎన్ఎస్టీఐ)’ ఔషధాలు బాధితుల శరీరంలో హెచ్ఐవీ వైరస్ స్థాయిలను గణనీయంగా తగ్గించాయని వివరించారు. ఈ ఐఎన్ఎస్టీఐ, డోలుటెగ్రావిర్ వంటివి వైరస్ను అణచివేస్తాయని తెలిపారు. మన దేశంలో 24 లక్షల మంది హెచ్ఐవీతో బాధపడుతున్నారని, బాధితుల సంఖ్యలో భారత్ ప్రపంచంలో 3వ స్థానంలో ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. గుర్తింపు, చికిత్సలో సవాళ్లు.. 2021లో విడుదలైన నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ నివేదిక ప్రకారం.. దేశంలో హెచ్ఐవీ ఏటా 62 వేల మందికి సోకుతోందని డాక్టర్ మోనాలిసా సాహు తెలిపారు. ఎయిడ్స్ సంబంధిత మరణాల సంఖ్యను 2021లో 41,000గా అంచనా వేశారన్నారు. డోలుటెగ్రావిర్ను కలిగిన కొత్త అధునాతన ఐఎన్ఎస్టీఐ ఆధారిత ఔషధాలు హెచ్ఐవీ చికిత్సలో మంచి ఫలితాలను చూపుతున్నాయని తెలిపారు. కొత్త చికిత్స అవకాశాలు రోగులకు సౌకర్యవంతంగా ఉంటాయని, ఖర్చు కూడా తగ్గుతుందని వైరాలజిస్ట్ మేకా సత్యనారాయణ తెలిపారు. -
హెచ్ఐవీ ఉన్నవాళ్లు పిల్లల్ని కనకూడదా?అలా కూడా వ్యాపిస్తుందా?
హ్యూమన్ ఇమ్యునో డెఫిషియెన్సీ వైరస్ (హెచ్ఐవి) అనేది శరీరంలోని వ్యాధులతో పోరాడే రోగనిరోధక కణాలను నాశనం చేసే వైరస్. సరైన మందులతో, హెచ్ఐవి ని ఎయిడ్స్ (అక్వైర్డ్ ఇమ్యునో డెఫిషియెన్సీ వైరస్) గా అభివృద్ధి చెందకుండా అలాగే ఆపగలిగే అవకాశం ఉంది. హెచ్ఐవి, ఎయిడ్స్ చుట్టూ చాలా అపోహలు ఉన్నాయి. అవేంటో ప్రముఖ డా. నవీన్ నడిమింటి మాటల్లోనే తెలుసుకుందాం. 1. అపోహ: హెచ్ఐవి పాజిటివ్ ఉన్న వ్యక్తుల దగ్గర ఉండటం వల్ల హెచ్ఐవి ఇతరులకి సోకుతుంది? వాస్తవం: హెచ్ఐవి గాలి ద్వారా సంక్రమించే వ్యాధి కాదు. అదే గాలిని పీల్చడం ద్వారా లేదా ఒకే చోట ఉండటం వల్ల కానీ హెచ్ఐవి సోకదు. 2. అపోహ: కౌగిలించుకోవడం లేదా ముద్దు పెట్టుకోవడం ద్వారా హెచ్ఐవి వ్యాప్తి చెందుతుంది? వాస్తవం: ఇది సుద్ద తప్పు. అలా గైతే మనం హెచ్ఐవి పాజిటివ్,హెచ్ఐవి నెగిటివ్ వ్యక్తుల కోసం రెండు ప్రత్యేక ప్రపంచాలను సృష్టించాలి. మీరు నిశ్చింతగా హెచ్ఐవి ఉన్నవారిని కౌగిలించుకోవచ్చు,ముద్దు పెట్టుకోవచ్చు. వీర్యం, రక్తం వంటి శరీర ద్రవాలను పంచుకోవడం ద్వారా మాత్రమే HIV వ్యాపిస్తుంది. 3. అపోహ: దోమకాటు ద్వారా హెచ్ఐవి వ్యాపిస్తుంది? వాస్తవం:దోమలు రక్తాన్ని పీల్చుకుంటాయి తప్పా, రక్తాన్ని ఒకరి నుంచి ఒకరికి బదిలీ చేయవు. అలా చేస్తూ పోతే అవి ఎలా బతుకుతాయి? దోమల ద్వారా హెచ్ఐవి వ్యాప్తి చెందదు. 4. అపోహ: హెచ్ఐవి సోకిన వారు కొంతకాలమే జీవిస్తారు? వాస్తవం: సరైన మందులు,సకాల చెకప్స్తో, ఒకరు హెచ్ఐవితో సుదీర్ఘ జీవితాన్ని గడపగలరని,హెచ్ఐవిని ఎయిడ్స్కు అభివృద్ధి చేయకుండా నిరోధించవచ్చని తెలుసుకోండి. 5. అపోహ: హెచ్ఐవీ ఉన్నప్పుడు పిల్లల్ని కనకూడదు? వాస్తవం: తల్లి నుంచి పుట్టబోయే బిడ్డకు, హెచ్ఐవి,ఎయిడ్స్ సోకే అవకాశం ఉన్నప్పటికీ, సరైన మందులు వాడటం వల్ల హెచ్ఐవీ నెగటివ్ బిడ్డకు జన్మనివ్వొచ్చు. - నవీన్ నడిమింటి ప్రముఖ ఆయుర్వేద వైద్యులు -
భార్యకు ఎయిడ్స్ అంటించి భర్త పరార్!
ఉత్తరప్రదేశ్లోని మీరఠ్లో కలకలం రేపే ఉదంతం చోటుచేసుకుంది. ఈ ప్రాంతానికి చెందిన ఒక మహిళ.. తన భర్త పెళ్లికి ముందు హెచ్ఐవీ ఉన్న విషయాన్ని దాచిపెట్టాడని ఆరోపించింది. పెళ్లి తరువాత తాను హెచ్ఐవీ బాధితురాలిగా మారిపోయానన్నారు. దీంతో తనను పుట్టింటిలో దిగబెట్టి, భర్త పరారయ్యాడని బాధితురాలు తెలిపింది. ఈ నేపధ్యంలో ఆమె భర్త దురాగతంపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ ఘటన మీరఠ్లోని పల్లవ్పురంలో చోటుచేసుకుంది. ఈ ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తి తన కుమార్తెకు 2021లో జానీ పోలీస్స్టషన్ పరిధిలోని ఒక యువకునితో వివాహం జరిపించాడు. ఈ సందర్భంగా బాధితురాలి తండ్రి మాట్లాడుతూ తన కుమార్తె వివాహానికి రూ. 15 లక్షలు ఖర్చుచేశానని తెలిపారు. అయినా అత్తింటి వారు సంతృప్తి చెందక ఇంకా కట్నం కావాలని అడుగుతుండేవారని తెలిపారు. అత్తవారింటిలో ఎన్ని సమస్యలు ఎదురైనా తన కుమార్తె సహనంతో వ్యవహరించిందన్నారు. బాధితురాలి కుటుంబ సభ్యులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పెళ్లికి ముందు ఆ యువకుడు హెచ్ఐవీ పాజిటివ్ అని తెలిపారు. అయితే పెళ్లి సమయంలో ఈ విషయాన్ని దాచి ఉంచారన్నారు. ఈ నేపధ్యంలో తన కుమార్తె కూడా ఎయిడ్స్ బాధితురాలిగా మారిందని వాపోయారు. కుమార్తె ఆరోగ్యం క్షీణించడంతో ఆమెను తమ దగ్గర దిగబెట్టి భర్త పరారయ్యాడని తెలిపారు. బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇది కూడా చదవండి: 40 ఖాతాల్లోకి ఉన్నట్టుండి లక్షలు.. బ్యాంకుకు పరుగులు తీసిన జనం! -
'సనాతన ధర్మంపై 'ఇండియా' ఉద్దేశం ఇదే..'
ఢిల్లీ: ప్రతిపక్ష కూటమి 'ఇండియా' అన్ని మతాలను, సిద్ధాంతాలను గౌరవిస్తుందని కాంగ్రెస్ అధికార ప్రతినిధి పవన్ ఖేరా చెప్పారు. సనాతన ధర్మాన్ని డీఎంకే ఎంపీ ఏ రాజా ఎయిడ్స్తో పోల్చుతూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన తర్వాత కాంగ్రెస్ ఈ మేరకు స్పందించింది. ఎంపీ రాజా వ్యాఖ్యలను సమ్మతించబోమని చెప్పారు. డీఎంకే ఎంపీ ఏ రాజా వివాదాస్పద వ్యాఖ్యల తర్వాత స్పందించిన కాంగ్రెస్ తన సిద్ధాంతం సర్వధర్మ సమభావం అని పేర్కొంది. ప్రతి మతానికి, సిద్ధాంతానికి సమాన ఆధరణ ఉంటుందని స్పష్టం చేసింది. తాము ఏ మతానికి, విశ్వాసాలను కించపరచబోమని వెల్లడించింది. డీఎంకే వ్యాఖ్యలపై స్పందిస్తూ.. కూటమిలో ప్రతి ఒక్కరూ అన్ని మతాలను గౌరవిస్తారని అన్నారు. డీఎంకే ఎంపీ రాజా ఈ రోజు సనాతన ధర్మంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సనాతన ధర్మాన్ని ఎయిడ్స్, కుష్టు రోగంతో పోల్చారు. దీనిపై బీజేపీ మండిపడింది. దేశవ్యాప్తంగా ఈ వ్యాఖ్యలు విమర్శలకు కారణమయ్యాయి. అనంతరం కాంగ్రెస్ తన అభిప్రాయాన్ని మరోసారి స్పష్టం చేసింది. ఇదీ చదవండి: ‘సనాతన ధర్మం అంశంపై చర్చలకు ఎవరు రమ్మన్నా వస్తా’ -
ఎయిడ్స్ ఉందని తప్పుడు రిపోర్ట్
అన్నానగర్: ఎయిడ్స్పై తప్పుడు సమాచారం ఇచ్చిన ఓ ప్రైవేటు కంటి ఆసుపత్రికి బుధవారం నామక్కల్ వినియోగదారుల కోర్టు రూ.5 లక్షలు జరిమానా విధించింది. కోయంబత్తూరులోని బీలమెట్కు చెందిన కృష్ణస్వామి (71) 2017 డిసెంబర్లో పరీక్షల నిమిత్తం కోయంబత్తూరులోని ఓ ప్రైవేటు కంటి ఆసుపత్రికి వెళ్లాడు. కళ్లను పరీక్షించిన వైద్యులు శస్త్ర చికిత్స చేయాలని చెప్పారు. అంతకు ముందు రక్త, మూత్ర పరీక్షలు చేయించుకోవాలని తెలిపారు. పరీక్షలు ముగియగా అతనికి ఎయిడ్స్ ఉందని ఆసుపత్రి అధికారులు తెలిపారు. దీంతో షాక్కు గురైన కృష్ణస్వామిని కోయంబత్తూరు ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రితో పాటు మరో ప్రైవేటు ఆసుపత్రిలో పరీక్షలు చేయగా అతనికి ఎయిడ్స్ లేదని వైద్య నివేదికలో తేలింది. దీంతో ఆగ్రహించిన కృష్ణస్వామి కోయంబత్తూరు వినియోగదారుల కోర్టులో ప్రైవేటు కంటి ఆసుపత్రిపై కేసు వేశారు. 2022 జులైలో సత్వర విచారణ కోసం కేసు నామక్కల్ జిల్లా వినియోగదారుల కోర్టుకు బదిలీ చేశారు. బుధవారం కేసును విచారించిన న్యాయమూర్తి డాక్టర్ రామరాజు మాట్లాడుతూ.. ప్రైవేటు కంటి ఆసుపత్రి నిర్లక్ష్యంగా సేవలందించినందున ఫిర్యాదుదారునికి నాలుగు వారాల్లోగా రూ.5 లక్షలు పరిహారం చెల్లించాలని ఆదేశించారు. -
హైరానా పెడుతున్న హెచ్ఐవీ
సాక్షి, బెంగళూరు: రాష్ట్రంలో హెచ్ఐవీ బాధితుల సంఖ్య క్రమంగా విస్తరిస్తున్న దాఖలాలున్నాయి. ప్రతిఏటా రెండు వేల కేసులు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. రాష్ట్ర ఎయిడ్స్ ప్రివెన్షన్ సొసైటీ హెచ్ఐవీ పరీక్షలను పెంచడం ద్వారా బాధితులను గుర్తింపునకు ప్రయత్నిస్తోంది. హెచ్ఐవీ/ ఎయిడ్స్ మహమ్మారిని అరికట్టేందుకు పలు కార్యక్రమాలు చేపట్టినప్పటికీ కేసుల సంఖ్య అదుపులోకి రావడం లేదు. హెచ్ఐవీ బాధితుల్లో దేశంలో కర్ణాటక 17వ స్థానంలో ఉండడం కొంచెం మంచి విషయమే. కాగా, గతేడాది ఏకంగా రాష్ట్రవ్యాప్తంగా 13,338 మంది హెచ్ఐవీ బారిన పడ్డారు. 2020–21లో మొత్తం 10,095 మందికి, 2021–22లో 11,178 మందికి హెచ్ఐవీ సోకింది. కాగా, అసురక్షిత శృంగారం వల్లే హెచ్ఐవీ కేసులు ఎక్కువగా ప్రబలుతున్నట్లు ప్రభుత్వ సర్వేలో తేలింది. లక్షిత వర్గాలకు టెస్టులు ఈ నేపథ్యంలో ఎయిడ్స్ ప్రివెన్షన్ సొసైటీ హెచ్ఐవీ గురించి ముందస్తు జాగ్రత్తగా కొత్త కార్యక్రమాన్ని చేపట్టింది. హెచ్ఐవీ కేసులను తగ్గించేందుకు సొసైటీ కొత్త కార్యక్రమాన్ని రూపొందించింది. ఈ కార్యక్రమంలో భాగంగా లైంగిక కార్యకర్తలు (సెక్స్ వర్కర్స్), ట్రక్ డ్రైవర్లు, డ్రగ్స్ వాడేవారు, హిజ్రాలు, రోజువారీ కూలీలు ఎక్కువగా అసురక్షిత శృంగారంలో పాల్గొంటున్నారని సమీక్షలో సొసైటీ గుర్తించింది. వీరినే లక్షిత వర్గాలు అని పిలుస్తారు. వారి జాబితాను తయారు చేసి అందరికీ హెచ్ఐవీ టెస్టులను చేస్తోంది. వీరిలో పాజిటివ్ వచ్చిన వారికి వైద్య సేవలను, ఉచిత ఔషధాలను అందిస్తోంది. ఇప్పటికే 86 శాతం మేర ఈ కార్యక్రమం కార్యరూపం దాల్చింది. ఏఆర్టీ కేంద్రాల్లో ఔషధాలు రాష్ట్రంలో మొత్తం 71 ఏఆర్టీ కేంద్రాలు ఉన్నాయి. ఇందులో హెచ్ఐవీ బాధితులకు ఉచితంగా చికిత్స అందిస్తున్నారు. అయితే ఈ కేంద్రాల్లో అపరిశుభ్రత, నర్సులు, మందుల కొరత ఎక్కువగా వేధిస్తోంది. దీంతో బాధితులు ఇక్కడికి రావాలంటే భయపడాల్సి వస్తోంది. రాజీవ్గాంధీ వసతి యోజన కింద వసతి, చికిత్స, ఉచిత ప్రయాణానికి డబ్బులు చెల్లిస్తున్నారు. హెచ్ఐవీ బాధిత విద్యార్థులకు ఉచిత కాలేజీ విద్య, ఉపకార వేతనాలు, ధనశ్రీ యోజన కింద రూ. 40 వేల రుణం, ఉచిత రైల్వే ప్రయాణం, ఉచిత రక్తసేవలు వంటి అనేక సౌకర్యాలను ప్రభుత్వాలు బాధితులకు కల్పిస్తున్నాయి. అయితే ఇందులో 40 శాతం హెచ్ఐవీ బాధితులకు ఈ సౌలభ్యాలు చేరడం లేదు. 30 శాతం మందికి ఈ పథకాల సమాచారమే తెలియకపోవడం గమనార్హం. క్షయ, క్యాన్సర్ తదితర జబ్బులు సోకితే నిర్ణీత కాలం చికిత్స తీసుకుంటే నయమై మామూలు మనిషి కావచ్చు. కానీ ఒక్కసారి హెచ్ఐవీ వైరస్ సోకితే నయం కాదు, అది ముదిరిపోకుండా చూసుకుంటూ జీవించాల్సి ఉంటుంది. ఇంత భయంకరమైన హెచ్ఐవీపై అనేక వర్గాల్లో అవగాహన కరువై ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. సులభంగా హెచ్ఐవీ/ ఎయిడ్స్కు గురై జీవితాన్ని నరకప్రాయం చేసుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది. -
హెచ్ఐవీ ఔషధం తయారీలో అరబిందో: ఇదే తొలిసారి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వీఐఐవీ హెల్త్కేర్ రూపొందించిన హెచ్ఐవీ నివారణ ఔషధం కాబొటిగ్రావిర్ ఎల్ఏ జనరిక్ ఔషధం తయారీని అరబిందో ఫార్మా, సిప్లా, వయాట్రిస్ చేపట్టనున్నాయి. యునైటెడ్ నేషన్స్కు చెందిన మెడిసిన్స్ పేటెంట్ పూల్ ఈ మేరకు మూడు కంపెనీలతో సబ్లైసెన్స్ ఒప్పందాలు చేసుకుంది. ఈ కంపెనీలు ఔషధం అభివృద్ధి, తయారీతోపాటు 90 దేశాలకు సరఫరా చేస్తాయి. (ట్విటర్లో రతన్ టాటా ఫాలో అయ్యే యాక్టర్స్ ఎవరో తెలుసా?) ఆంధ్రప్రదేశ్లోని నాయుడుపేట్, వైజాగ్ యూనిట్లలో ట్యాబ్లెట్లు, ఇంజెక్టబుల్ డోసుల రూపంలో కాబొటిగ్రావిర్ తయారు చేయనున్నట్టు అరబిందో తెలిపింది. ప్రపంచ డిమాండ్ను తీర్చే ఉత్పత్తి సామర్థ్యం కంపెనీకి ఉందని వివరించింది. హెచ్ఐవీ నివారణకు ఎక్కువ కాలం పనిచేసే ఇంజెక్టబుల్ ఉత్పాదన తక్కువ, మధ్యస్థాయి ఆదాయ దేశాల్లో అందుబాటులోకి రానుండడం ఇదే తొలిసారి అని అరబిందో వైస్ చైర్మన్, ఎండీ కె.నిత్యానంద రెడ్డి తెలిపారు. ఈ ఒప్పందం జనరిక్ హెచ్ఐవీ ఔషధ విభాగంలో కంపెనీ నాయకత్వాన్ని మరింత బలోపేతం చేస్తుందని అన్నారు. (ఇదీ చదవండి: నీతా అంబానీ డ్రీమ్ ప్రాజెక్ట్ లాంచ్: తరలి వచ్చిన తారలు, ఫోటోలు వైరల్) -
కొనసాగుతున్న హెపటైటిస్ – బీ టీకా పంపిణీ
సాక్షి, అమరావతి: హెపటైటిస్ వ్యాధి నియంత్రణ, నివారణ చర్యలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. హెపటైటిస్–బీ బారిన పడేందుకు ఎక్కువ అవకాశాలున్న హెచ్ఐవీ బాధితులకు టీకా పంపిణీని గత నెలలో రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ప్రారంభించింది. రాష్ట్రంలోని 55 యాంటి రెట్రోవైరల్ థెరపీ (ఏఆర్టీ) కేంద్రాల్లో టీకా అందుబాటులో ఉంచింది. హెచ్ఐవీ బాధితులకు స్క్రీనింగ్ నిర్వహించి హెపటైటిస్–బీ నెగెటివ్గా నిర్ధారణ అయిన వారికి టీకా వేస్తున్నారు. ఇలా ఇప్పటివరకు 54,805 మందికి తొలి డోసు వేశారు. రెండో డోసు 3,002 మందికి వేశారు. వచ్చే వారంలో హెచ్ఐవీ హైరిస్క్ వర్గాలకు టీకా పంపిణీ ప్రారంభిస్తున్నారు. ఏపీ శాక్స్ హై రిస్క్ వర్గాలుగా గుర్తించిన 3,923 మంది ట్రాన్స్జెండర్లు, 1,16,616 మంది మహిళా సెక్స్ వర్కర్లు, 23,623 మంది పురుష స్వలింగ సంపర్కులు, 1,741 ఇన్జెక్టింగ్ డ్రగ్ యూజర్స్.. మొత్తం 1,45,903 మందికి టీకా పంపిణీ లక్ష్యం. ఈ క్రమంలో దేశంలోనే హెచ్ఐవీ బాధితులు, హైరిస్క్ వర్గాలకు టీకా ఇస్తున్న తొలి రాష్ట్రంగా ఏపీ నిలుస్తోంది. తొలి డోసు వేసుకున్న నెలకు రెండో డోసు, తరువాత రెండు నెలలకు చివరి డోసు టీకా వేస్తారు. హెపటైటిస్ నియంత్రణలో భాగంగా ఇప్పటికే వైద్యులు, వైద్య సిబ్బందికి వందశాతం టీకా పంపిణీ చేశారు. కొత్తగా విధుల్లో చేరుతున్న వారికి కూడా టీకా వేస్తున్నారు. వైద్యశాఖ అంచనాల ప్రకారం రాష్ట్రంలో 2.3 శాతం జనాభా హెపటైటిస్ – బీ, 0.3 శాతం హెపటైటిస్–సీతో బాధపడుతున్నారు. శృంగారం, రక్తమార్పిడి, సిరంజిలు, టూత్బ్రెష్, రేజర్లు వంటి వివిధ రూపాల్లో హెపటైటిస్–బీ ఒకరి నుంచి ఒకరికి వ్యాపిస్తుంది. హెచ్ఐవీ బాధితులు, హైరిస్క్ వర్గాల వారు హెపటైటిస్–బీ బారిన పడటానికి ఎక్కువ అవకాశాలుంటాయని, అందువల్ల వీరు తప్పనిసరిగా టీకా వేయించుకోవాలని రాష్ట్ర హెపటైటిస్ వ్యాధి నియంత్రణ కార్యక్రమం ప్రత్యేకాధికారి డాక్టర్ నీలిమ తెలిపారు. దగ్గరలోని ఏఆర్టీ కేంద్రానికి వెళ్లి స్క్రీనింగ్ చేయించుకుని టీకా వేయించుకోవాలన్నారు. హెపటైటిస్ పాజిటివ్గా నిర్ధారణ అయిన వారు కుటుంబ సభ్యులకు కూడా పరీక్షలు చేయించి, ముందస్తు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. -
నిశ్శబ్దాన్ని ఛేదించి ఎందరికో ‘చేయూత’
హెచ్ఐవీ.. దశాబ్దం క్రితం వరకు దీనిపై నలుగురిలో మాట్లాడాలంటేనే వణుకు. ఆత్మహత్య ఒక్కటే శరణ్యమనుకునే వారు. కానీ.. మందులకు లొంగని ఈ వ్యాధి సోకినంత మాత్రాన జీవితం అక్కడితో ఆగిపోదని కోటగిరి రేణుక రుజువు చేశారు. ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలం ఈదర గ్రామానికి చెందిన రేణుక భర్త కోటగిరి శ్రీనివాసరావుకు 1999లో హెచ్ఐవీ పాజిటివ్గా తేలింది. రేణుకకు కూడా ఈ వ్యాధి సోకినట్టు వైద్యులు గుర్తించారు. 2003లో శ్రీనివాసరావు మృతి చెందారు. భర్త మరణానంతరం రేణుక విజయవాడకు మారారు. హెచ్ఐవీ బాధితుల పట్ల ఉన్న చిన్నచూపు వల్ల తనలా ఇంకెంత మంది మహిళలు వేదనకు గురవుతున్నారోననే భావన రేణుకను కలచివేసింది. హైదరాబాద్కు వెళ్లి హెచ్ఐవీ బాధితుల ‘కేర్ అండ్ సపోర్టింగ్’లో శిక్షణ పొందారు. అనంతరం ప్రజల్లో అవగాహన కల్పించేందుకు నడుం కట్టారు. ఇందులో భాగంగా 2003లోనే ‘తెలుగు నెట్వర్క్ ఆఫ్ పీపుల్ లివింగ్ విత్ హెచ్ఐవీ అండ్ ఎయిడ్స్’ పేరిట స్వచ్ఛంద సంస్థను నెలకొల్పడంలో భాగస్వామి అయ్యారు. మరోవైపు అప్పట్లోనే చేయూత అనే సంస్థను సైతం నెలకొల్పి ఉమ్మడి కృష్ణా జిల్లాలోని హెచ్ఐవీ బాధితులకు వివిధ రకాలుగా అండగా నిలిచారు. బాధిత కుటుంబాల్లోని పిల్లల చదువులకు సాయం, పౌష్టికాహారం అందిస్తున్నారు. ఇప్పటివరకు 200 మంది పిల్లల చదువులకు చేయూత ఎన్జీవో ద్వారా సాయం అందించారు. ప్రస్తుతం 400 మంది పిల్లలకు పౌష్టికాహారం అందిస్తున్నారు. ఆమె సహకారంతో బీఎస్సీ నర్సింగ్, ఫార్మసీ, ఇంజనీరింగ్ చదివిన వారు ప్రస్తుతం ఉద్యోగాలు చేస్తున్నారు. చెప్పుకోవడానికి భయపడను నేను హెచ్ఐవీ పాజిటివ్ అని చెప్పుకోవడానికి భయపడను. అలా చెప్పుకోవడానికి ఇబ్బంది పడి.. నాలుగు గోడల మధ్య కుంగిపోకుండా బాధితులకు సాయం చేయడమే నా లక్ష్యం. తమ ప్రమేయం లేకున్నా.. ఏ తప్పు చేయకున్నా చాలామంది ఈ వ్యాధి బారినపడుతుంటారు. వ్యాధి సోకినంత మాత్రాన కుంగిపోవద్దు. ఇప్పుడు మన రాష్ట్రంలోనే ప్రభుత్వ రంగంలో మంచి వైద్యం అందుతోంది. ఎవరో.. ఏదో అనుకుంటారని బాధితులు ఆస్పత్రులకు వెళ్లడం మానేయొద్దు. – కోటగిరి రేణుక, చైర్మన్, చేయూత స్వచ్ఛంద సంస్థ -
భార్యకు హెచ్ఐవీ బ్లడ్ ఎక్కించిన భర్త
గుంటూరు: ఫేస్బుక్లో ఏర్పడిన పరిచయం పలు మలుపులు తిరిగి చివరకు ఓ మహిళ జీవితంలో విషాదం మిగిల్చింది. గుంటూరు జిల్లా సీతానగరానికి చెందిన ఓ యువతికి మంగళగిరి చెందిన యువకుడితో ఫేస్బుక్లో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారి వివాహం చేసుకున్నారు. అనంతరం మరో యువతితో వివాహే తర సంబంధం పెట్టుకుని భార్యను వదిలించుకునేందుకు ప్రణాళిక రూపొందించి ఆమెకు హెచ్ఐవీ సోకే విధంగా ఓ ఆర్ఎంపీ తో వైద్యం చేయించినట్లు ఆ వివాహిత గురువారం తాడేపల్లి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకా రం.. సీతానగరానికి చెందిన యువతి ఫేస్బుక్ ద్వారా పరిచయమైన మంగళగిరి చెందిన ముప్పెర చరణ్కుమార్ను 2015లో ప్రేమ వివాహం చేసుకుంది. వీరిద్దరికి ఒక పాప. పాప పుట్టిన అనంతరం ఆమెను చరణ్కుమార్ శారీరకంగా దూరం పెట్టడమే కాకుండా ఇంటికి కూడా రావడం మానేశాడు. పిల్లలు పుట్టిన తరువాత నీకు అనారోగ్యంగా ఉంది వైద్యం చేయిస్తానంటూ మంగళగిరి చెందిన ఆర్ఎంపీతో ఆమెకి పలుసార్లు ఇంజక్షన్లు చేయించాడు. కొంత కాలం తరువాత వైద్య పరీక్షలు చేయించుకోగా హెచ్ఐవీ ఉందని తేలింది. ఆసుపత్రి నుంచి అదే విషయాన్ని తన భర్త చరణ్కుమార్కు తెలిపింది. దీంతో అతను ఇంటికి వచ్చి నాకు హెచ్ఐవీ లేదు, నీకు హెచ్ఐవీ ఉంది. నావల్లే పొరపాటు జరిగింది. నన్ను క్షమించు. జీవితాంతం నిన్ను చూసుకుంటానని చెప్పాడు. ఈ నేపథ్యంలో మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. నన్ను వదిలించుకోవడానికే హెచ్ఐవీ ప్రయోగం చేశాడని, జరిగిన ఈ సంఘటనపై తాడేపల్లి పోలీసులు ఫిర్యాదు చేసినట్లు తెలిపింది. పోలీసులు బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు విష ప్రయోగం కింద, మోసగించినందుకు, కులాన్ని ప్రస్తావించినందుకు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
కలకలం.. జైల్లో 140 మంది ఖైదీలకు హెచ్ఐవీ నిర్ధారణ
లక్నో: జైలులో 140 మంది ఖైదీలకు హెచ్ఐవీ నిర్ధారణ కావడం సంచలనం రేపుతోంది. మరో 35 మందికి టీబీ ఉన్నట్లు తేలింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లో ఘజియాబాద్లోని దాస్నా జైలులో వెలుగు చూసింది. ఈ విషయాన్ని స్వయంగా జైలు సీనియర్ అధికారులే ధ్రువీకరించారు. మొత్తం జైలులో 5500 మంది ఖైదీలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించగా.. అందులో 140 మంది ఖైదీలకు హెచ్ఐవీ పాజిటివ్గా తేలిందని వెల్లడించారు. కాగా ప్రభుత్వ ఆదేశాల ప్రకారం.. జైలు లోపలికి వచ్చే ప్రతీ ఖైదీకి హెచ్ఐవీ, టీబీ పరీక్షలు నిర్వహించడం తప్పనిసరి. ఘజియాబాద్ జైలులోని ఖైదీలకు ఎమ్ఎమ్జీ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న యాంటీరెట్రోవైరల్ థెరపీ సెంటర్ వైద్యులు పరీక్షలు చేస్తారని జైలు సూపరింటెండెంట్ అలోక్ కుమార్ సింగ్ తెలిపారు. 2016లో ఘజియాబాద్ దస్నా జిల్లా జైల్లోకి వచ్చిన ఖైదీలకు పరీక్షలు చేయగా అందులో 46 మందికి హెచ్ఐవీ నిర్ధారణ అయ్యింది. అప్పటి నుంచి వారు జైల్లోనే ఉంటున్నారు. ప్రస్తుతం హెచ్ఐవీ బారిన పడిన బాధితుల సంఖ్య 140కి చేరిందని అలోక్ కుమార్ సింగ్ తెలిపారు. అందులో 35 మందికి టీబీ కూడా సోకిందని వెల్లడించారు. రాష్ట్ర ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ద్వారా హెచ్ఐవీ రోగులకు చికిత్స అందిస్తున్నామన్నారు. పరిమితికి మించిన ఖైదీలతో దస్నా జైలు కిక్కిరిసి పోయిందని అధికారులు తెలిపారు. జైలులో 1706 మంది ఖైదీలను మాత్రమే ఉంచేందుకు సదుపాయాలు ఉండగా.. ప్రస్తుతం జైలులో మొత్తం 5,500 మంది ఖైదీలు ఉన్నట్లు పేర్కొన్నారు. 2016 నుంచి ఇప్పటి వరకు సుమారుగా 120 నుంచి 150 మంది హెచ్ఐవీ బాధితులు జైల్లో ఉన్నారని పేర్కొన్నారు. ఈ వ్యాధి స్పర్శ ద్వారా వ్యాపించదని, ప్రభుత్వ సూచనల మేరకు ఈ ఖైదీలందరినీ సాధారణ ఖైదీలతో పాటు ఉంచుతున్నామని అధికారులు చెప్పారు. ప్రస్తుతానికి భయపడాల్సిన పని లేదన్నారు. హెచ్ఐవీ బారిన పడిన ఖైదీల్లో ఎక్కువ డ్రగ్స్కు బానిసలని, డ్రగ్స్ కోసం వాడే సిరంజీలను వాడడం వల్ల ఇన్ఫెక్షన్ బారిన పడి ఉంటారని జైలు అధికారులు భావిస్తున్నారు. చదవండి: అది మసాజ్ కాదు.. ట్రీట్మెంట్.. జైలు వీడియోపై ఆప్ కౌంటర్.. -
ఆ వ్యక్తికి ఏకకాలంలో మంకీపాక్స్, కరోనా, హెచ్ఐవీ... నమోదైన తొలి కేసు
ఇటలీలోని ఒక వ్యక్తి ఒకేసారి మంకీపాక్స్, కరోనా, హెచ్ఐవి ఎటాక్ అయ్యాయని వైద్యులు వెల్లడించారు. ఆ వ్యక్తి ఐదు రోజుల స్పెయిన్ పర్యటన నుంచి తిరిగి వచ్చినప్పటి నుంచి గత తొమ్మిది రోజులుగా తీవ్ర జ్వరం, తల, గొంతు నొప్పులతో బాధపడ్డాడని చెప్పారు. అంతేగాక అతని ప్రైవేట్ భాగాలలో తీవ్ర ఇన్ఫెక్షన్లతో బాధపడ్డాడని వివరించారు. అదీగాక అతని చర్మం పై దద్దుర్లు, పెద్ద పెద్ద గాయాలు వంటివి కూడా వచ్చాయని చెప్పారు. దీంతో అతన్ని ఆస్పత్రి వర్గాలు అత్యవసర ఇన్ఫెక్షన్ విభాగానికి తరలించి చికిత్స అందించడం ప్రారంభంచారు. తొలుత అతనికి మంకీపాక్స్, కరోనా, హెచ్ఐవీ టెస్టులు చేయగా రిపోర్టుల్లో పాజిటివ్ అని తేలిందని చెప్పారు. ఇలా ఒకేసారి మూడు వ్యాధులు ఎటాక్ అయ్యిన తొలికేసు ఇదేనని వైద్యులు చెబుతున్నారు. అతనికి కరోనాకి సంబంధించి ఓమిక్రాన్ సబ్వేరియంట్ కూడా సోకిందని తేలింది. దీంతో అతనికి కోవిడ్ సంబంధించిన వ్యాక్సిన్లు ఇచ్చారు. ప్రస్తుతం ఆ వ్యక్తి కోవిడ్, మంకీపాక్స్ నుంచి బయటపడి కోలుకున్నాడని చెప్పారు. కానీ ఆ వ్యక్తి ఎయిడ్స్కి చికిత్స తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ఈ కేసు మంకీపాక్స్, కరోనా ఎలా వ్యాప్తి చెందుతున్నాయో తెలియజేసిందన్నారు. అలాగే ఒక వ్యక్తి లైంగిక అలవాట్లు వ్యాధుల నిర్ధారణ చేయడానికి ఎంత కీలకమో ధృవీకరించిందన్నారు. పైగా ఆయా రోగులకు చికిత్స అందించేటప్పుడూ వైద్యులు కూడా తగిన జాగ్రత్తల తీసుకోవాలని పరిశోధకులు సూచించారు. (చదవండి: మూకుమ్మడిగా కుక్కల దాడి... పోస్టల్ ఉద్యోగి మృతి) -
హెచ్ఐవీ కంటే హెపటైటిస్ ప్రమాదకరమా? అందులో నిజమెంత?
హెపటైటిస్ అనేది జబ్బు కాదు.. కొన్ని ఇన్ఫెక్షన్ల సమాహారం. హెపటైటిస్లో ఏ, బీ, సీ, డీ, ఈ అనే ఐదు రకాలు ఉన్నాయి. హెపటైటిస్ చాలా మందిలో ఉన్నప్పటికీ అది తమకు ఉన్నట్టే తెలియదు. సాధారణంగా 2, 3 వారాల్లో తగ్గిపోతుంది. కొద్ది మందిలో మాత్రం దీర్ఘకాలికంగా ఉండిపోతుంది. మొత్తం జనాభాలో 3 నుంచి 5 శాతం మంది హెపటైటిస్ బారిన పడుతున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. హెపటైటిస్ ముదిరితే లివర్ గట్టి బడి లివర్ సిర్రోసిస్, మరికొందరిలో లివర్ క్యాన్సర్కు దారితీయవచ్చు. ఇంతటి ప్రమాదకరమైన హెపటైటిస్ నుంచి ముందు జాగ్రత్త చర్యలు పాటించడం, వ్యాక్సిన్ తీసుకోవడం ద్వారా రక్షణ పొందవచ్చని 40 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం ఉన్న ప్రముఖ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ ఇ.పెదవీర్రాజు సూచిస్తున్నారు. వరల్డ్ హెపటైటిస్ డే సందర్భంగా ఆయన ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. – సీతంపేట(విశాఖ ఉత్తర) సాక్షి: హెపటైటిస్ అంటే ఏమిటి, ఎన్ని రకాలు, ఏ విధంగా వస్తుంది? డాక్టర్ పెదవీర్రాజు: హెపటైటిస్ నాలుగైదు రకాల వైరస్ల వల్ల వ్యాపిస్తుంది. హెపటైటిస్ ఏ, బీ, సీ,డీ, ఈ ఇలా ఐదు రకాల వైరస్ల వల్ల వ్యాధి బారిన పడతారు. ఇందులో హెపటైటిస్ బీ, సీ రకాలు కలుషితమైన రక్తం ఎక్కించుకోవడం, స్టెరిలైజ్ చేయని ఇంజక్షన్ సూదుల వల్ల, ఎక్కువ సార్లు శస్త్ర చికిత్సలు చేయించుకోవడం వల్ల వస్తుంది. ఏ, ఈ రకాలు కలుషితమైన నీరు, పాడైపోయిన ఆహారం వల్ల వ్యాపిస్తుంది. ముందు జాగ్రత్త చర్యలు పాటించం ద్వారా హెపటైటిస్ బారిన పడకుండా ఉండవచ్చు. సాక్షి: హెపటైటిస్ లక్షణాలు ఏమిటి? డాక్టర్ : హెపటైటిస్కు గురైన వారిలో జ్వరం, ఆకలి లేకపోవడం, నీళ్ల విరేచనాలు, తెలుపు రంగులో మోషన్, కడుపులో ఇబ్బంది, దురదలు, మూత్రం పచ్చగా రావడం, చర్మం, కంటిలోని తెల్లభాగం పసుపుగా మారడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. రెండు నుంచి ఆరు వారాల లోపు వ్యాధి లక్షణాలు బయటపడతాయి. సాక్షి: హెపటైటిస్ బీ బారిన పడకుండా ఉండాలంటే ఏం చేయాలి? డాక్టర్ : హెపటైటిస్ బీని నివారించడానికి వ్యాక్సిన్ అందుబాటులో ఉంది. హెపటైటిస్ బీ వ్యాక్సిన్ మూడు డోసులు తీసుకుంటే రక్షణ ఉంటుంది. ఈ వ్యాక్సిన్ లివర్ క్యాన్సర్ బారిన పడకుండా కూడా రక్షణ కల్పిస్తుంది. భర్తకు హెపటైటిస్ బీ వస్తే భార్య.. ఇంటిలో ఒకరికి వస్తే మిగిలిన వారందరూ వ్యాక్సిన్ కచ్చితంగా తీసుకోవాలి. సాక్షి: హెపటైటిస్ సీ వైరస్ నుంచి రక్షణ పొందాలంటే..? డాక్టర్ : హెపటైటిస్ సీ కి గతంలో మందులు ఉండేవి కాదు. నాలుగేళ్ల నుంచి అద్భుతమైన మందులు అందుబాటులోకి వచ్చాయి. ఈ మందులు మూడు నెలలు వాడినట్లయితే హెపటైటిస్ సీ 95 శాతం నయం అవుతుంది. సాక్షి: హెపటైటిస్ ఏ, ఈ బారిన పడకుండా ఉండాలంటే..? డాక్టర్ : కలుషితం కాని ఆహారం, నీరు తీసుకోవడం వంటి ముందు జాగ్రత్త చర్యలు ద్వారా హెపటైటిస్ ఏ, ఈ బారిన పడుకుండా ఉండొచ్చు. హెపటైటిస్ ఏకు వ్యాక్సిన్ అందుబాటులో ఉన్నప్పటికీ అభివృద్ధి చెందిన దేశాల్లో మాత్రమే వినియోగిస్తున్నారు. మనదేశంలో వ్యాక్సిన్ వినియోగించడం లేదు. హెపటైటిస్ ‘ఈ’కి వ్యాక్సిన్ లేదు. పరిసరాల పరిశుభ్రత, ఆహార నియమాలు పాటించడం ద్వారా ఏ, ఈ వైరస్ వ్యాప్తికి గురికాకుండా ఉండొచ్చు. సాక్షి: గర్భిణికి హెపటైటిస్ వస్తే పుట్టే శిశువుకు సంక్రమిస్తుందా? డాక్టర్ : గర్భిణికి హెపటైటిస్ బి ఉంటే పుట్టే శిశువుకు వచ్చే అవకాశం ఉంది. తల్లి గర్భంతో ఉన్నపుడు చేసే రక్త పరీక్షలో వ్యాధి నిర్ధారణ అయితే, బిడ్డ పుట్టగానే వ్యాక్సిన్తో పాటు హెచ్బీఐజీ ఇంజక్షన్ చేస్తారు. దీనివల్ల తల్లి నుంచి బిడ్డకు వ్యాధి సంక్రమించకుండా కాపాడవచ్చు. ఇటీవల టెనోఫెవర్ మాత్రలు అందుబాటులోకి వచ్చాయి. గర్భిణికి హెపటైటిస్‘బి’ వ్యాధి సోకి ఉండి, వైరస్ శాతం బాగా ఎక్కువగా ఉంటే.. ఆమెకు చివరి మూడు నెలలు ఈ మాత్రలు ఇవ్వాలి. దీని వల్ల ఆమె నుంచి శిశువుకు వ్యాధి వ్యాప్తి చెందకుండా ఆపొచ్చు. సాక్షి: ప్రస్తుతం ఈ వ్యాధి తీవ్రత ఏ మేరకు ఉంది? డాక్టర్ : డాక్టర్ బ్లూమ్ బెర్గ్ తన బృందంతో విస్తృత పరిశోధనల ఫలితంగా 1967లో హెపటైటిస్ బీ వైరస్ను గుర్తించారు. ఆ తర్వాత 1969లో హెపటైటిస్ బీ వ్యాక్సిన్ కనిపెట్టారు. అప్పటి వరకు జాండిస్ ఎందుకు వస్తుందో తెలిసేది కాదు. పరిశోధనల వల్ల రక్తం ద్వారా వస్తుందని తెలిసింది. ఇప్పుడు రక్తం ఎక్కించే ముందు స్క్రీనింగ్ పరీక్షలు చేస్తున్నారు. అందువల్ల రక్తం ద్వారా హెపటైటిస్ బీ, సీ కూడా వచ్చే అవకాశాలు బాగా తగ్గిపోయాయనే చెప్పాలి. సాక్షి: ఈ వ్యాధి బారిన పడకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? డాక్టర్ : కలుషితం కాని ఆహారం, నీరు తీసుకోవడం ద్వారా హెపటైటిస్ ఏ, ఈ బారిన పడకుండా ఉండొచ్చు. వ్యాక్సిన్ తీసుకోవడం ద్వారా హెపటైటిస్ బీ రాకుండా రక్షణ పొందవచ్చు. హెపటైటిస్ బీ నివారణకు వ్యాక్సినే బెస్ట్ ప్రీవెన్షన్. రక్తం ఎక్కించే ముందు సరైన స్క్రీనింగ్ పరీక్షలు చేయడం ద్వారా హెపటైటిస్ బీ, సీ బారిన పడకుండా ఉండొచ్చు. హెపటైటిస్ డీ మన దేశంలో చాలా అరుదుగా వస్తుంది. ఇటలీలో కనిపిస్తుంది. ఒకప్పుడు హెపటైటిస్ వల్ల లివర్ సమస్యలు ఎక్కువగా వచ్చేవి. ప్రస్తుతం ఆల్కాహాల్, ఊబకాయం వల్ల ఎక్కువగా లివర్ సమస్యలు వస్తున్నాయి. ఢిల్లీ, బెనారస్ ప్రాంతాల్లో హెపటైటిస్ ఎక్కువగా ఉంది. ఆయా ప్రాంతాలకు వెళ్లి వచ్చిన వారు హెపటైటిస్ పరీక్ష చేయించు కోవడం మంచిది. సాక్షి: హెచ్ఐవీ కంటే హెపటైటిస్ ప్రమాదకరమా? డాక్టర్ : హెపటైటిస్ హెచ్ఐవీ కంటే ప్రమాదమన్న అపోహ ఉంది. అది నిజం కాదు. ఎందుకంటే చెమట ద్వారా, ముట్టుకోవడం, ముద్దు పెట్టుకోవడం వల్ల హెపటైటిస్ వ్యాపించదు. ఇంజక్షన్, శరీరంలోకి రక్తం ఎక్కించడం ద్వారా వ్యాపిస్తుంది. వ్యాధిగ్రస్తుడు వాడే రేజర్, బ్రష్, నెయిల్ కట్టర్ వేరుగా ఉంచాలి. భర్తకు హెపటైటిస్ బీ వస్తే భార్య వ్యాక్సిన్ తీసుకోవాలి. ఆ వ్యాక్సిన్ పని చేసే వరకు అంటే.. ఆరు నెలల వరకు కండోమ్ వాడాలి. సాక్షి: జాండిస్ తగ్గడానికి అల్లోపతి వైద్యం పనికిరాదనే అపోహ ఉంది. నిజమేనా? డాక్టర్ : జాండిస్ రాగానే అల్లోపతిలో మందు లేదని చాలా మందిలో అపోహ ఉంది. నాటు వైద్యానికి వెళ్లిపోతున్నారు. హైపటైటిస్ ఏ, బీ, సీ వచ్చినా సాధారణంగా రెండు మూడు వారాల్లో తగ్గిపోతుంది. అందువల్ల పసరు మందు రెండు మూడు వారాలు వాడగానే తగ్గిపోతుంది. అప్పటికీ తగ్గకపోతే వైద్యుడిని సంప్రదిస్తారు. ఈ లోగా వ్యాధి ముదిరిపోతుంది. జాండిస్ చాలా కారణాల వల్ల వస్తుంది. మలేరియా, లివర్లో స్టోన్, ట్యూమర్ వల్ల జాండిస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. హెపటైసిస్ వల్ల వచ్చే జాండిస్ 2, 3 వారాల్లో తగ్గిపోతుంది. 3 నుంచి 5 శాతం మందికి దీర్ఘకాలికంగా శరీరంలో ఉండిపోతుంది. దీని వల్ల లివర్ గట్టిపడి లివర్ సిర్రోసిస్కు దారితీస్తుంది. పొట్టలో నీరు చేరడం, కళ్లు పచ్చబడటం, కాళ్లు పొంగడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. 2030 నాటికి హెపటైటిస్ నిర్మూలనే లక్ష్యం ఢిల్లీ ఎయిమ్స్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ డాక్టర్ గౌతమ్ హెపటైటిస్కు కారణమయ్యే వైరస్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని, లేకపోతే ప్రాణాలకే ప్రమాదం వాటిల్లుతుందని ఢిల్లీ ఎయిమ్స్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ బుడిమూరి గౌతమ్ అన్నారు. హెపటైటిస్ దినోత్సవం పురస్కరించుకుని విశాఖ ప్రజల అవగాహన కోసం ఓ ప్రకటన విడుదల చేశారు. వైరల్ హెపటైటిస్ గురించి అవగాహన కల్పించాలన్న థీమ్ను ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించిన నేపథ్యంలో ఆ దిశగా తాను కృషి చేస్తున్నట్టు తెలిపారు. లివర్ హెపటైటిస్ వ్యాధి తీవ్రత గణాంకాల ప్రకారం పరిశీలిస్తే.. భారతదేశంలో 4 శాతంగా ఉందన్నారు. ఒకసారి లివర్ పూర్తిగా పాడైన తర్వాత కాలేయ మార్పిడి ద్వారా మాత్రమే శాశ్వత పరిష్కారం ఉంటుందన్నారు. తీవ్రమైన ఇన్ఫెక్షన్ ఉన్న రోగుల్లో ఫ్లూ వంటి జ్వరం, ఆకలి తగ్గడం, వికారం, పొత్తి కడుపులో నొప్పి, పచ్చ కామెర్లకు దారి తీస్తుందని, వ్యాధి అత్యంత తీవ్రమైన సందర్భాల్లో కోమాలోకి వెళ్లే ప్రమాదం ఉందన్నారు. వ్యాధి సోకిన వెంటనే వైద్యులను సంప్రదించి పరీక్షలు చేయించుకుని మందులు సక్రమంగా వాడితే.. ఆదిలోనే నివారించడంతో పాటు లివర్ వ్యాధుల నుంచి తప్పించుకోవచ్చని వివరించారు. 2030 నాటికి హెపటైటిస్ నిర్మూలనే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు పేర్కొన్నారు. -
తగ్గిన హెచ్ఐవీ తీవ్రత
విజయనగరం ఫోర్ట్: హెచ్ఐవీ తీవ్రత జిల్లాలో చాలా వరకు తగ్గిందని జిల్లా ఎయిడ్స్, కుష్టు నివారణ అధికారి రాణి సంయుక్త పేర్కొన్నారు. నగరంలోని ఓ ప్రైవేట్ హోటల్లో సోమవారం సాయంత్రం నిర్వహించిన వర్క్షాప్లో ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ జిల్లాలో హెచ్ఐవీ, ఎయిడ్స్ ప్రభావం ఏ ప్రాంతాలలో, ఏ సమూహాలలో, ఏ వయసు వారికి సోకుతున్నదో తెలుసుకోవడానికి స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో 3 రోజుల వర్క్ షాపు నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో డబ్లు్యహెచ్ఓ కన్సల్టెంట్ సుకుమార్, డీపీఎం బాలాజీ, జిల్లా సూపర్ వైజర్ సాక్షి గోపాల్రావు తదితరులు పాల్గొన్నారు. -
పదేళ్లలో 17 లక్షల మందికి ఎయిడ్స్
న్యూఢిల్లీ: దేశంలో గత పదేళ్లలో 17,08,777 మంది హెచ్ఐవీ బారిన పడ్డారని జాతీయ ఎయిడ్స్ నియంత్రణ(ఎన్ఏసీఓ) సంస్థ వెల్లడించింది. అరక్షితశృంగారమే ఇందుకు కారణమని పేర్కొంది. కొత్తగా హెచ్ఐవీ బారినపడే వారి సంఖ్య క్రమంగా తగ్గుతోందని వివరించింది. 2011–12లో 2.4 లక్షల మందికి హెచ్ఐవీ సోకగా, 2020–21 85,268కు తగ్గిందని తెలిపింది. ► ఎయిడ్స్ బాధితుల్లో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉంది. గత పదేళ్లలో ఏపీలో 3,18,814, మహారాష్ట్రలో 2,84,577, కర్ణాటకలో 2,12,982, తమిళనాడులో 1,16,536, యూపీలో 1,10,911, గుజరాత్లో 87,440 హెచ్ఐవీ కేసులు బయటపడ్డాయి. ► 2011–12 నుంచి 2020–21 మధ్య రక్తం ద్వారా 15,782 మందికి హెచ్ఐవీ సోకింది. ► తల్లి నుంచి బిడ్డకు సోకిన కేసులు గత పదేళ్లలో 4,423 బయటపడ్డాయి. ► 2020 నాటికి 23,18,737 హెచ్ఐవీ బాధితులున్నారు. వీరిలో 81,430 మంది పిల్లలు. ► హెచ్ఐవీ వైరస్ ప్రధానంగా రోగ నిరోధక వ్యవస్థపై దాడి చేసి ఎయిడ్స్కు దారితీస్తుంది. ఎయిడ్స్ను పూర్తిగా నయం చేసే ప్రామాణికమైన చికిత్స ఇప్పటిదాకా అందుబాటులో లేదు. -
హెచ్పీవీ వ్యాక్సిన్తో సర్వైకల్ క్యాన్సర్ నివారణ
మీరు తరచూ గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ టీకాల ప్రకటనలు చూసి కూడా పట్టించుకోలేదా? మీరు మరోసారి తప్పక ఆలోచించండి. భారతదేశంలో సర్వైకల్ క్యాన్సర్ బాధితుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. మనదేశంలో ఏటా 1,34,240 సర్వైకల్ క్యాన్సర్ కేసులు నమోదవుతున్నాయి. ఇది 2025 నాటికి రెండు లక్షలకు పైగా చేరవచ్చని అంచనా. సర్వైకల్ క్యాన్సర్ అంటే...? గర్భాశయ ముఖద్వారం (సర్విక్స్) వద్ద వచ్చే క్యాన్సర్ను సర్వైకల్ క్యాన్సర్ అంటారు. ఈ భాగం గర్భాశయానికి కింది భాగంలో ఉండే సన్నటి ప్రదేశం. పేరుకు తగ్గట్టు ఇది గర్భాశయ ముఖద్వారంలా పనిచేస్తుంది. ఇది గర్భాశయాన్ని యోనితో కలిపి ఉంచుతుంది. మిగతా అన్ని క్యాన్సర్లతో పోలిస్తే గర్భాశయ ముఖద్వారపు క్యాన్సర్ను చాలా సులువుగా నివారించవచ్చు. క్రమం తప్పకుండా స్క్రీనింగ్ చేయించడం దీనికి ఉత్తమ పరిష్కారం. సర్వైకల్ క్యాన్సర్కు చికిత్స కూడా చాలా సులభం. దీన్ని ఎంత ముందుగా గుర్తిస్తే అంత తేలిగ్గా చికిత్స చేయవచ్చు. కారణాలేమిటి? సర్వైకల్ క్యాన్సర్కు ముఖ్యమైన కారణాల్లో హ్యూమన్ పాపిల్లోమా వైరస్ (హెచ్పీవీ) ప్రధానమైనది. ఈ వైరస్ సెక్స్ ద్వారా ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందుతుంది. దాదాపు సగం జనాభాలో జీవితంలో ఏదో ఒక సమయంలో హెచ్పీవీ వైరస్ను కలిగి ఉంటారు. అయితే అందరిలోనూ ఇది సర్వైకల్ క్యాన్సర్కు దారితీయదు. కేవలం కొంతమందిలోనే క్యాన్సర్ను కలగజేస్తుంది. సెక్స్లో పాల్గొన్న ప్రతివారికీ హెచ్పీవీ వైరస్ సోకే అవకాశాలు ఉంటాయి. అయితే తక్కువ వయసులోనే సెక్స్లో పాల్గొనడం మొదలుపెట్టిన మహిళల్లో మొదలుకొని, ఎక్కువమంది భాగస్వాములతో సెక్స్లో పాల్గొనే సందర్భాల్లో హెచ్పీవీ సోకే అవకాశం మరీ ఎక్కువ. ఈ వైరస్లోనూ అనేక రకాలు ఉంటాయి. సాధారణంగా హెచ్పీవీ వైరస్ దానంతట అదే నశించిపోతుంది. అలా ఒకవేళ నశించకపోతే అది కొంతకాలం తర్వాత క్యాన్సర్కు దారితీయవచ్చు. హెచ్పీవీ వైరస్తో పాటు పొగతాగడం, ఎయిడ్స్, ఐదేళ్ల కంటే ఎక్కువకాలం గర్భనిరోధక మాత్రలు వాడటం, ముగ్గురు అంతకంటే ఎక్కువ మంది పిల్లలను కనడం వంటివి కూడా సర్వైకల్ క్యాన్సర్కు దారితీసే రిస్క్ఫ్యాక్టర్లలో కొన్ని. నివారణ ఎలా? సర్వైకల్ క్యాన్సర్ నిర్ధారణలో పాప్స్మియర్ అనేది క్యాన్సర్ స్క్రీనింగ్కు ఉపయుక్తమైన పరీక్ష. 21 ఏళ్లు నిండిన మహిళలు మొదలుకొని, సెక్స్లో పాల్గొనడం ప్రారంభించి మూడేళ్లు దాటిన ప్రతి మహిళా తప్పనిసరిగా క్రమం తప్పకుండా పాప్స్మియర్ పరీక్ష చేయించుకోవాలి. అంటే మహిళలందరూ క్రమం తప్పకుండా స్క్రీనింగ్ చేయించుకోవడం అవసరం. హెచ్పీవీ వ్యాక్సిన్ అంటే..? శక్తిమంతమైన వైరస్, బ్యాక్టీరియాలను తట్టుకోవడానికి మన శరీరం ‘యాంటీబాడీస్’ను తయారుచేస్తుంది. అయితే హెచ్పీవీ వైరస్ విషయంలో మాత్రం మన శరీరం ఎలాంటి యాంటీబాడీస్లను తయారు చేయదు. అందువల్ల ఒకసారి ఇన్ఫెక్షన్ వస్తే అది జీవితాంతం ఉండిపోతుంది. అది సర్వైకల్ క్యాన్సర్కు దారితీయవచ్చు. హెచ్పీవీ వ్యాక్సిన్ (టీకా) ఇప్పించడం వల్ల అది శరీరంలో యాంటీబాడీస్ను తయారుచేసి హెచ్పీవీ వైరస్ నుంచి శరీరాన్ని కాపాడుతుంది. హెచ్పీవీ వ్యాక్సిన్ యోని క్యాన్సర్, గర్భాశయం ముఖద్వారం వద్ద వచ్చే క్యాన్సర్లను నివారిస్తుంది. అమెరికన్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ వారి సిఫార్సు ప్రకారం 11 ఏళ్లు నిండిన ప్రతి ఆడపిల్లకు హెచ్పీవీ వ్యాక్సిన్ ఇప్పించాలి. అయితే తొమ్మిదేళ్లు నిండినవారి నుంచి 18 ఏళ్ల వరకు ఉండే ఆడపిల్లలకు ఈ వ్యాక్సిన్ ఇప్పించవచ్చు. ఈ వ్యాక్సిన్ను ఆరు నెలల వ్యవధిలో మూడుసార్లు ఇప్పించాలి. దీనివల్ల సర్వైకల్ క్యాన్సర్ను నివారించవచ్చు. -
హెచ్ఐవీ కారణంగానే ఒమిక్రాన్ పుట్టుకొచ్చిందా? సంచలన విషయాలు వెల్లడి
Is Omicron Variant Connection With HIV?: కరోనా వైరస్ ప్రపంచ దేశాలను అతలాకుతలం చేసింది. వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టడంతో ప్రజలకు కాస్త ఉపశమనం లభించింది అనుకునే లోపే మాయదారి మహమ్మారి రూపాంతరం చెంది ఒమిక్రాన్ వేరియంట్ రూపంలో ప్రజలను పీడించేందుకు మరో సారి దాపురించింది. ప్రస్తుతం కోవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రపంచ దేశాలను ఆందోళనకు గురిచేస్తోంది. అయితే ఈ వేరియంట్ మొదటగా సౌతాఫ్రికాలో బయటపడినప్పటికీ.. ఎలా పుట్టుకొచ్చింది, అన్నదానిపై ఎవరికీ స్పష్టత లేదు. అందుకు శాస్త్రవేత్తలు ఈ వేరియంట్ కరోనా వైరస్ నుంచి ఒమిక్రాన్గా ఎలా రూపాంతరం చెందింది, మరే ఇతర లక్షణాలు ఉన్నాయా? అని తెలుసుకునేందుకు పరిశోధనలను ముమ్మరం చేశారు. ఈ క్రమంలో కొందరు నిపుణులు వెల్లడించిన వివరాలు ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఒమిక్రాన్ మూలంలో హ్యూమన్ ఇమ్యునో డెఫిషియెన్సీ వైరస్ (హెచ్ఐవీ)తో సంబంధాలు ఉండే అవకాశాలు ఉన్నాయని కొందరు శాస్త్రవేత్తలు నిర్థారణకు వచ్చారు. అయితే దీనిపై పూర్తి స్పష్టత రావాల్సి ఉంది. ప్రస్తుతం దక్షిణాఫ్రికా పరిశోధకులు ఒమిక్రాన్, హెచ్ఐవి మూలాల మధ్య సంబంధాన్ని అధ్యయనం చేస్తున్నారు. ఈ పరిశోధనలను ఉటంకిస్తూ ఒమిక్రాన్ను హెచ్ఐవితో ముడిపెట్టే అవకాశాలు "అత్యంత ఆమోదయోగ్యమైనదిగా ఉన్నాయని బీబీసీ తన నివేదికలో పేర్కొంది. ఏది ఏమైనప్పటికీ, ఒమిక్రాన్ అనుకున్నదానికంటే ఎక్కువ కాలం చెలామణిలో ఉండే అవకాశాలు ఉన్నాయి. పరిశోధకులు ఏమంటున్నారంటే.. హెచ్ఐవీ సోకిన మహిళకు కరోనా సోకడం, ఆ తరువాత వైరస్ కారణంగా కరోనా ఉత్పరివర్తనాలకు గురై ఒమిక్రాన్గా అవతరించి ఉండే అవకాశాలు ఉండచ్చని ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. ఇటువంటి అభిప్రాయమే కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయానికి చెందిన డా.కెంప్ బృందం వ్యక్తం చేసింది. హెచ్ఐవీ వైరస్ తిష్ఠవేసిన శరీరంలో కరోనా విజృంభించడానికి చాలా అనువైన పరిస్థితులుంటాయి. దక్షిణాఫ్రికాలో హెచ్ఐవీ బాధితులు ఎక్కువగా ఉంటారు కాబట్టి, అక్కడే ఒమిక్రాన్గా అవతరించి ఉండొచ్చు’’ అని డా.కెంప్ తెలిపారు. చదవండి: Omicron Variant: అమెరికాను కమ్మేసిన ఒమిక్రాన్.. 73 శాతం అవే కేసులు -
ఆ వ్యాధితో గతేడాది కోటిన్నర మంది మృతి.. కరోనా ఎంతపని చేసింది..?
దాదాపుగా దశాబ్ధం తర్వాత మొదటిసారి క్షయ (టీబీ) మరణాల సంఖ్య గణనీయంగా పెరిగినట్లు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ గురువారం విడుదలచేసిన గ్లోబల్ టీబీ - 2021 నివేదికలో వెల్లడించింది. చదవండి: ఛీ! యాక్!! మూడేళ్లగా పచ్చిమాంసం మాత్రమే తింటున్నాడు.. ఒక్క రోజు కూడా.. 2020లో కోవిడ్ మహమ్మారి కారణంగా క్షయ వ్యాధికి చికిత్స అందించడంలో తీవ్ర అంతరాయం కలిగింది. మహమ్మారి మూలంగా అనేక మంది రోగులు కనీసం వ్యాధి నిర్ధారణకు కూడా నోచుకోలేదు. గణాంకాల ప్రకారం 2019లో 7.1 కోట్ల మందికి వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయగా, 2020లో ఆ సంఖ్య 5.8 కోట్లకు పడిపోయింది. అందుకు బారీ మూల్యమే చెల్లించవలసి వచ్చింది. గత యేడాది మనదేశంతో సహా దాదాపుగా 30 దేశాల్లో సమారు కోటిన్నర మంది (2,14,000 మంది హెచ్ఐవీ పాజిటివ్ వ్యక్తులతో కలిపి) క్షయతో మరణించారని డబ్యూహెచ్వో తన నివేదికలో తెలియజేసింది. ఐతే 2021-22లో టీబీ మరణాలు మరింత పెరిగే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రపంచ దేశాలను హెచ్చరించింది. సరైన సమయంలో వ్యాధి నిర్ధారణ చేయడం, చికిత్స అందించడంలోని సవాళ్లను అధిగమిస్తే దీనినుంచి బయటపడొచ్చని సూచించింది. ప్రపంచవ్యాప్తంగా వివిధ వ్యాధుల కారణంగా అనారోగ్యంతో బాధపడేవారికి కోవిడ్ సమయంలో చికిత్స అందించడంలో తీవ్ర అంతరాయం కలిగింది. దాని పర్యవసానమే ఈ మృత్యుఘోష!! చదవండి: అప్పుడు కన్నీళ్లు తాగి ఆకలి తీర్చుకున్నాడు.. ఇప్పుడు ఎందరికో ఆసరా..! -
85 మంది ఖైదీలకు హెచ్ఐవీ.. అదే కారణమంటున్న వైద్యులు
నౌగావ్: కేంద్ర కారాగారంలో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలలో ఏకంగా 85 మందికి హెచ్ఐవీ సోకడం స్థానికంగా కలకలం రేపింది. ఈ ఘటన అస్సాంలో నౌగావ్ జిల్లాలోని సెంట్రల్ జైలులో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. సెప్టంబర్లో జైలు అధికారులు ఖైదీలకు హెచ్ఐవీ పరీక్షలు నిర్వహించారు. కాగా ఈ పరీక్షలో సుమారు 85 మంది హెచ్ఐవీ పాజిటివ్గా నిర్థారణ అయినట్లు వైద్యులు ధృవీకరించారు. అయితే ఈ స్థాయిలో ఖైదీలకు హెచ్ఐవీ సోకడంతో అధికారులు ఆశ్చర్యపోతున్నారు. వైరస్ సోకిన వారంతా డ్రగ్స్కు అలవాటు పడ్డారని వైద్యులు తెలుపుతూ.. డ్రగ్స్ తీసుకొనేటపుడు వాడిన సిరంజ్ల మూలాన ఈ స్థాయిలో పాజిటివ్ కేసులకు ప్రధాన కారణమని పేర్కొన్నారు. చదవండి: ఆ రోజు పంజాబ్లో ఆరోనది పారింది! అసలేం జరిగిందంటే.. -
కండోమ్ కొనేందుకు సిగ్గు.. విస్తరిస్తున్న హెచ్ఐవీ
సాక్షి, హైదరాబాద్: హెచ్ఐవీ చాపకింది నీరులా విస్తరిస్తోంది. గతంతో పోలిస్తే ప్రస్తుతం కేసుల సంఖ్య కొంత తగ్గుముఖం పట్టినప్పటికీ.. అత్యధిక కేసులు నమోదవుతున్న జాబితాలో గ్రేటర్ టాప్లో ఉండటం ఆందోళన కలిగిస్తోంది. జాతీయ కుటుంబ నియంత్రణ సంస్థ తాజా లెక్కల ప్రకారం కండోమ్ల వినియోగంలో జాతీయ సగటు 5.2 శాతం ఉండగా, రాష్ట్రంలో 0.5 శాతమే ఉండటమే ఇందుకు కారణం. అక్షరాస్యతలోనే కాదు.. ఆరోగ్యపరమైన అంశాల్లోనూ దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఇక్కడి వారిలో అవగాహన కొంత ఎక్కువే. కానీ సురక్షిత శృంగారంపై మాత్రం అవగాహన తక్కువ. కండోమ్ విషయంలో తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నారు. ఫలితంగా చిన్న వయసులోనే హెచ్ఐవీనే కాదు హెపటైటీస్–బి, సి, గనేరియా, సిఫిలిస్ వంటి వ్యాధుల బారినపడుతున్నారు. అంతేకాదు చాలామందికి హెచ్ఐవీ ఉన్నా.. బయటికు చెప్పడం లేదు. బంధువులకు తెలుస్తుందనే భయంతో చికిత్సకు దూరంగా ఉంటున్నారు. ఈ విషయం తెలిసి కూడా ఇతరులతో శృంగారంలో పాల్గొంటున్నారు. వీరు చూసేందుకు అందంగా ఉన్నారు.. కదా! అని భావించి చాలా మంది ఏమీ ఆలోచించకుండా వీరితో అనైతిక సంబంధాలు కొనసాగిస్తున్నారు. రక్షణ కోసం కనీసం కండోమ్లను కూడా వాడటం లేదు. ప్రస్తుతం హెచ్ఐవీ కేసుల సంఖ్య పెరగడానికి ఇది కూడా ఓ కారణమని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అవగాహన ఉన్నా.. జాతీయ కుటుంబ నియంత్రణ సంస్థ తాజా లెక్కల ప్రకారం ఫ్యామిలీ ప్లానింగ్పై అత్యధికంగా ఆంధ్రప్రదేశ్లో 86.3 శాతం మందికి అవగాహన ఉంది. కానీ కండోమ్ల వినియోగం మాత్రం 0.2 శాతమే. ఇక పాండిచ్చేరిలో 79.9 శాతం మందికి కుటుంబ నియంత్రణపై చైతన్యం ఉండగా, 0.8 శాతం మందే కండోమ్ వాడుతున్నారు. గోవాలో 77.4 శాతం మందికి అవగాహన ఉండగా, వీరిలో 7.1 శాతం మంది కండోమ్లను వినియోగిస్తున్నారు. హర్యానాలో 71.6 శాతం మందికి అవగాహన ఉన్నప్పటికీ.. 12 శాతం మంది కండోమ్లను వినియోగిస్తున్నారు. ఉత్తరాఖండ్లో 65.3 శాతం మందికి అవగాహన ఉండగా, ఇక్కడ అత్యధికంగా 16.1 శాతం మంది కండోమ్లను వినియోగిస్తున్నారు. తమిళనాడులో 64.7 శాతం మందికి అవగాహన ఉండగా, 0.8 శాతం మంది మాత్రమే కండోమ్ వాడుతున్నారు. సిక్కింలో 62.7 శాతం మందికి చైతన్యం కలిగి ఉండగా, వీరిలో 5.2 శాతం మందే కండోమ్లను వాడుతున్నట్లు తేలింది. త్రిపురలో 57.6 శాతం మందికి అవగాహన ఉండగా, వీరిలో 1.9 శాతం మంది కండోమ్ వాడుతున్నారు. ఇక తెలంగాణలో 67 శాతం మందికి పరిజ్ఞానం కలిగి ఉండగా, వీరిలో 0.5 శాతం మందే కండోమ్ వాడుతున్నట్లు స్పష్టమైంది. నిర్లక్ష్యం వల్లే హెచ్ఐవీ.. అపరిచిత వ్యక్తులతో సెక్స్లో పాల్గొనడం వల్ల హెచ్ఐవీ సోకుతుంది. ·గర్భిణి నుంచి పుట్టబోయే బిడ్డకు సోకే అవకాశం ఐదు శాతం ఉంది. ఎయిడ్స్కు స్వలింగ సంపర్కం కూడా ఒక కారణం. కలుషిత రక్తాన్ని ఇతరులకు ఎక్కించడం వల్ల కూడా సోకుతుంది. ఒకరికి వాడిన సిరంజ్లు, బ్లేడ్స్ మరొకరికి వాడటం వల్ల వస్తుంది. నిరంతరం జ్వరం, నీళ్ల విరేచనాలు, అకారణంగా బక్కచిక్కడం వంటి లక్షణాలు కన్పిస్తాయి. జ్ఞాపకశక్తి తగ్గుతుంది. గొంతువాపు, చర్మ సంబంధిత సమస్యలు తలెత్తుతాయి. - డాక్టర్ ప్రసన్నకుమారి, ఎయిడ్స్ కంట్రోల్ విభాగం అధికారిణి -
కరోనా ఎప్పటికీ పోదు : డబ్ల్యూహెచ్ఓ తాజా హెచ్చరిక
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా వైరస్ కు సంబంధించి ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ)మరో సంచలన హెచ్చరిక చేసింది. మహమ్మారి కరోనా హెచ్ఐవీ లాంటిదని ఎప్పటికీపోదని హెచ్చరించింది. 'ప్రపంచం దానితో జీవించడం నేర్చుకోవలసి ఉంటుంది' అని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఉన్నత నిపుణుడు హెచ్చరించారు. జనవరి 21నుండి వైరస్ పై రోజువారీ నివేదికను ఇస్తున్న సంస్థ తాజాగా ఈ విషయాన్ని వెల్లడించింది. (కరోనా : ట్విటర్ సంచలన నిర్ణయం) కరోనా వైరస్ ప్రపంచ సమాజంలో హెచ్ఐవీ లాంటి మరొక స్థానిక వైరస్ కావచ్చని పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా సోకుతున్న హెచ్ఐవీ మాదిరిగానే కోవిడ్-19 కూడా ఎప్పటికీ పోదని సంస్థ హెల్త్ ఎమర్జెన్సీ ప్రోగ్రాం డైరెక్టర్ డాక్టర్ మైఖేల్ ర్యాన్ చెప్పారు. ఈ వైరస్ ఎప్పటికీ దూరంకాకపోవచ్చని ర్యాన్ వ్యాఖ్యానించారు. అలాగే కేసుల సంఖ్య ఇంకా ఎక్కువగా ఉన్నప్పుడు కరోనావైరస్, లాక్డౌన్ పరిమితులను ఎత్తివేయడం మరింత సంక్రమణను దారితీస్తుందన్నారు. ప్రాణాంతక మహమ్మారిని అంతం చేసే టీకా కోసం ఎదురు చూడకుండా జాగ్రత్త వహించాలన్నారు. (కరోనాను జయించిన స్పెయిన్ బామ్మ) బుధవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, టీకా లేకుండా ప్రపంచ జనాభా తగినంత స్థాయిలో రోగనిరోధక శక్తిని పెంపొందించడానికి సంవత్సరాలు పట్టవచ్చు. ఈ వైరస్ ఎప్పటికి అంతమవుతుందో తెలియదు, దీన్ని నిరోధించగలిగే వ్యాక్సిన్ కనుగొని, దాన్ని ప్రతీ ఒక్కరికీ అందుబాటులోకి తేగలినపుడు మాత్రమే దీన్ని అరికట్టవచ్చని ర్యాన్ స్పష్టం చేశారు. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు దేశవ్యాప్తంగా లాక్డౌన్ ఆంక్షలను తగ్గించాలని యోచిస్తున్న సమయంలో డబ్ల్యూహెచ్ఓ ఈ హెచ్చరికలు చేయడం గమనార్హం. (లాక్డౌన్ ముగిసిన వెంటనే బరిలోకి దిగుతా: సెరెనా) -
ఎయిడ్స్కు 4,250 మంది బలి
సాక్షి, హైదరాబాద్: ఎయిడ్స్కు తెలంగాణలో అనేకమంది బలవుతున్నారు. దేశవ్యాప్తంగా ఎయిడ్స్ మరణాల్లో మన రాష్ట్రం ఏకంగా నాలుగో స్థానంలో ఉందని ఇటీవల కేంద్రం వెల్లడించింది. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ లెక్కల ప్రకారం 2018–19లో దేశవ్యాప్తంగా 51,911 మంది చనిపోగా, 2019–20 ఆర్థిక ఏడాదిలో డిసెంబర్ నాటికి 43,019 మంది మరణించినట్లు కేంద్రం తెలిపింది. జాతీయస్థాయిలో మరణాల సంఖ్య తగ్గగా, తెలంగాణలో మాత్రం ఆ సంఖ్య పెరగడం ఆందోళన కలిగిస్తోంది. 2018– 19 ఆర్థిక ఏడాదిలో 2,925 మంది తెలంగాణలో ఎయిడ్స్ కారణంగా చనిపోగా, 2019–20 ఆర్థిక ఏడాదిలో గత డిసెంబర్ నాటికే 4,278 మంది చనిపోయినట్లు ఆ నివేదిక వెల్లడించింది. అంటే గత సంవత్సరం కంటే ఈ ఆర్థిక సంవత్సరం 9 నెలల కాలంలోనే ఇంతమంది చనిపోవడం గమనార్హం. మరణాల్లో పెరుగుదల 32%అధికంగా ఉంది. దేశంలో ఎయిడ్స్ కారణంగా మరణించిన వారిలో దాదాపు పదో వంతు ఉండటం గమనార్హం. ఇక 7,778 మరణాలతో మొదటి స్థానంలో మహారాష్ట్ర ఉంది. జాతీయ ఎయిడ్స్ నియంత్రణ కార్యక్రమం ప్రకారం గతేడాది డిసెంబర్ నాటికి దేశవ్యాప్తంగా 17.77 లక్షల మంది హెచ్ఐవీతో బాధపడుతున్నారని కేంద్రం తెలిపింది. అందులో తెలంగాణలో 83,861 మంది రోగులున్నారు. సెక్స్ వర్కర్లలో అధికం.. సెక్స్ వర్కర్లలో లైంగిక సంక్రమణ వ్యాధులు 25% ఎక్కువగా ఉన్నాయని తేలింది. తర్వాత వలస కార్మికులు 17%, లింగమార్పిడి 15%, మిశ్రమ సమూహాలు 12%, మిగిలిన ఇతరుల్లో లైంగిక సంక్రమణ వ్యాధులు ఎక్కువగా వస్తున్నాయని తేలింది. 25 శాతం మంది మాత్రమే కండోమ్ వాడుతున్నారని ఓ అంచనా . ఎయిడ్స్ సోకినట్లు తెలియగానే కొన్నాళ్లపాటు మందులు వాడుతున్నారని, తర్వాత మధ్యలో నిలిపేయడం వల్ల మరణాలు అధికంగా సంభవిస్తున్నాయని డాక్టర్ కమల్నాథ్ తెలిపారు. -
హెచ్ఐవీ దాచి పెళ్లి.. ఆపై భార్యతో..
ముంబై : తనకు వచ్చిన రోగాన్ని దాచి తనతో పాటు తన భార్య జీవితాన్ని నాశనం చేశాడు ఓ దుర్మార్గపు భర్త. తనకు హెచ్ఐవీ సోకిందన్న నిజాన్ని దాచి.. ఆమె నూరేళ్ల జీవితంతో ఆడుకున్నాడు. చివరకు నిజం తెలుసుకొని నిలదీసిన భార్యపై నిందలు మోపారు. కోడలు వల్లనే తమ కుమారుడికి ఈ పాడురోగం సోకిందంటూ అత్త, మామలు దొంగ ఏడుపులు ఏడ్చారు. తమ కుమారుడిని వెనుకేసుకొస్తూ నిజాన్ని కప్పిపుచ్చారు. చివరికి కోర్టు ఆదేశాల మేరకు అతనిపై కేసు నమోదు అయింది. ఈ దారుణ ఘటన మహారాష్ట్ర లోని నవీ ముంబైలో చోటు చేసుకుంది. వివరాలు.. థానే జిల్లాలోని డోంబివ్లీ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి(31) ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. కామోథేకు చెందిన ఓ యువతి(26)ని 2016లో వివాహం చేసుకున్నాడు. కాగా, అంతకు ముందే అతనికి హెచ్ఐవీ సోకింది. ఈ విషయం అతని కుటుంబీకులకు కూడా తెలుసు. ఈ దారుణ విషయాన్ని కప్పిపుచ్చి వివాహం చేసుకున్నారు. కొద్ది రోజుల తర్వాత అతని ఇంటికి వచ్చిన ఓ బంధువు.. మందులు వాడుతున్నావా అని అడగడంతో అతని భార్యకు అనుమానం కలిగింది. మందులు ఎందుకు... ? ఏమైందని అని అడుగగా.. దాటవేసే ప్రయత్నం చేశారు. అత్తమామలను నిలదీయగా క్షయ వ్యాది సోకిందని, మందులు వాడితే తగ్గిపోతుందని నచ్చజెప్పారు. ఓ రోజు భర్తతో పాటు ఆస్పత్రికి వెళ్లిన యువతి.. డాక్టర్ల ద్వారా అతనికి హెచ్ఐవీ సోకిందని తెలుసుకుంది. వెంటనే ఈ విషయాన్ని ఆమె తల్లిదండ్రులకు చెప్పి.. వారితో కలిసి మరో ఆస్పత్రికి వెళ్లి రక్త పరీక్షలు నిర్వహించగా.. హెచ్ఐవీ పాజిటీవ్గా తేలింది. ఈ విషయంపై అత్తమామలను నిలదీయగా.. తిరిగి ఆమెపైనే నిందలు వేశారు. ‘ నీ వల్లనే మా కుమారుడికి హెచ్ఐవీ సోకింది’ అంటూ తిరిగి ఆమెనే నిందించారు. దీంతో ఆమె న్యాయం కోసం కోర్టును ఆశ్రయించారు. తన జీవితాన్ని నాశనం చేసిన భర్త, అత్తమామలపై చర్యలు తీసుకోవాలని కోరారు. కోర్టు ఆదేశాల మేరకు యువతి భర్త, అత్తమామలపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. -
వేలమందిని కాపాడిన ఆ డాక్టర్ ఇక లేరు
1990లో మధ్య చైనాలో హెచ్ఐవీ, హెపటైటిస్ మహమ్మారికి సంబంధించిన సంచలన విషయాన్ని బయటపెట్టిన సాహసోపేత డాక్టర్ షుపింగ్ వాంగ్ (59) కన్నుమూశారు. దాదాపు పదివేల మందికిపైగా ప్రాణాలను కాపాడిన ఆమె ఇక సెలవంటూ ఈ ప్రపంచానికి శాశ్వత వీడ్కోలు పలికారు. ఈమె స్ఫూర్తితో రూపొందించిన నాటకం ‘ది కింగ్ ఆఫ్ హెల్స్ ప్యాలెస్’ ప్రస్తుతం లండన్లో నడుస్తోంది. నాటక రచయిత ఫ్రాన్సిస్ యో చూ.. వాంగ్ను "పబ్లిక్ హెల్త్ హీరో" అని పిలుస్తారు. ఈ సందర్భంగా డా. వాంగ్ ప్రయాణం గురించి తెలుసుకోవాలి. 1991 లో చైనా ప్రావిన్స్ హెనాన్లో డాక్టర్ వాంగ్ ప్రభుత్వ రక్త, ప్లాస్మా సేకరణ కేంద్రంలో పనిచేసేవారు. ఈ సందర్భంగా చాలా మంది హెచ్ఐవీ, హెపటైటిస్ బారిని పడిన వారు విచక్షణ రహితంగా రక్తాన్ని అమ్ముతున్నారని, తద్వారా లక్షలమంది రక్త గ్రహీతలు ఈ భయంకరమైన వ్యాధుల బారిన పడుతున్నారని గుర్తించింది. వెంటనే తన సీనియర్ అధికారులను అప్రమత్తం చేసింది. దీనికితోడు పేలవమైన సేకరణ పద్ధతుల ద్వారా పెనుప్రమాదం పొంచి వుందని హెచ్చరించింది. ఆమె చర్యలు వ్యాపారానికి ఆటంకం కలిగించాయని వాదించిన సీనియర్లు బదిలీని బహుమానంగా ఇచ్చారు. అయినా 1995లో, ఆమె మరో కుంభకోణాన్ని బయటపెట్టింది. హైచ్ఐవీ పాజిటివ్ వ్యక్తి పలు కేంద్రాల్లో రక్తాన్ని అమ్ముతున్నాడని గుర్తించింది. ఇదే విషయాన్ని ఆరోగ్య మంత్రిత్వ శాఖకు కూడా నివేదించింది. ఫలితంగా ఉద్యోగాన్నికోల్పోయింది. ఆరోగ్య మంత్రిత్వ శాఖలో పనిచేసిన ఆమె భర్తను అతని సహచరులు బహిష్కరించారు. చివరికి ఇది వారి విడాకులకు దారి తీసింది. దీంతో డాక్టర్ వాంగ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. హెనాన్ ప్రావిన్స్లో తనే స్వయంగా 400 శాంపిళ్లను సేకరించింది. ఖరీదైన పరీక్షలు నిర్వహించి, హెచ్ఐవీ రేటు 13 శాతంగా ఉన్నట్టు గుర్తించారు. ఈ ఫలితాలను రాజధాని బీజింగ్లోని అధికారుల వద్దకు తీసుకువెళ్లారు. కానీ ఈ సారి కూడా ఆమెపై దాడి జరిగింది. ఆమె క్లినిక్కు వచ్చి పరికరాలను ధ్వంసం చేశారు. ఎట్టకేలకు చైనా ప్రభుత్వం స్పందించింది. 1996లో దేశంలోని అన్ని రక్తం, ప్లాస్మా సేకరణ కేంద్రాలు మూసివేసి దర్యాప్తు చేపట్టింది. అనంతరం ఆయా కేంద్రాల్లో దాతలందరికీ హెచ్ఐవీ, హెపటైటిస్ సి స్క్రీనింగ్ చేయవలసి ఉంటుందని మంత్రిత్వ శాఖ తరువాత ప్రకటించింది. చాలా సంవత్సరాల తరువాత, డాక్టర్ వాంగ్ గ్యారీ క్రిస్టెన్సెన్ను తిరిగి వివాహం చేసుకుని 2001లో సన్షైన్ అనే పేరుతో అమెరికా వెళ్లి పోయారు. అక్కడ సాల్ట్ లేక్ సిటీలోని ఉటా విశ్వవిద్యాలయంలో వైద్య పరిశోధకురాలిగా పనిచేయడం ప్రారంభించారు. 2001 సంవత్సరంలోనే మధ్య చైనాలో తీవ్రమైన ఎయిడ్స్ సంక్షోభాన్ని ఎదుర్కొన్నట్లు చైనా ప్రభుత్వం అంగీకరించింది. స్థానిక రక్త బ్యాంకుల ద్వారా లక్షలాదిమంది వ్యాధి బారిన పడ్డారని వెల్లడించింది. ముఖ్యంగా డాక్టర్ వాంగ్ పనిచేసిన ప్రావిన్స్ హెనాన్ ఎక్కువగా ప్రభావితం మైంది. ఎయిడ్స్ సంబంధిత అనారోగ్యంతో బాధపడుతున్నవారిని చూసుకోవడానికి ప్రభుత్వం ప్రత్యేక క్లినిక్లను ఏర్పాటు చేసింది. 2019లో ఆమెను గతం వెంటాడింది. ఆమె జీవిత కథ ఆధారంగా రూపొందిన నాటక ప్రదర్శనను నిలువరించే ప్రయత్నాల్లోభాగంగా హునాన్లోని బంధువులు, స్నేహితులను కలవడానికివీల్లేదని, చైనా భద్రతా అధికారులు బెదిరించారు. వీటిని వాంగ్ ఏ మాత్రం లెక్కచేయలేదు. దీంతో "ది కింగ్ ఆఫ్ హెల్స్ ప్యాలెస్" అనే నాటకం సెప్టెంబరులో లండన్లోని హాంప్స్టెడ్ థియేటర్లో ప్రదర్శించడం విశేషం. నాటకంలోని ఒక దృశ్యం సెప్టెంబర్ 21 న సాల్ట్ లేక్ సిటీలో స్నేహితులు, ఆమె భర్తతో కలిసి హైకింగ్ చేస్తుండగా డాక్టర్ వాంగ్ గుండెపోటుతో కన్నుమూశారు. మరణానికి ఒక నెల ముందు హాంప్స్టెడ్ థియేటర్ వెబ్సైట్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన వాంగ్ అన్యాయానికి వ్యతిరేకంగా మాట్లాడటం వల్ల ఉద్యోగం, వివాహం,ఆనందం అన్నీ కోల్పోయాను. కానీ తన పోరాటం ఏంతోమంది పేదలను రక్షించడానికి సహాయపడిందని సంతోషం వ్యక్తం చేశారు. ఇంతలోనే ఆమె ఆకస్మిక మరణం ఆమె అభిమానుల్లో విషాదాన్ని నింపింది. నాటక రచయితతో డా. వాంగ్ -
వారి సంగతేంటో తేల్చండి..
సాక్షి, తూర్పుగోదావరి : రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో 27 మందికి ఎయిడ్స్ ఉందో! లేదో! జైలు అధికారులు నిర్ధారించాలని బుధవారం హై కోర్టు జైలు అధికారులను ఆదేశించింది. వైద్య పరీక్షలు చేయకుండా ఏం చేస్తున్నారు. ఇంకా ఎంత మందికి ఎయిడ్స్ ఉందో తేల్చాలని జైలు అధికారులను ఆదేశించింది. హెచ్ఐవీ వ్యాధిగ్రస్తుడైన ఏడు కొండలు అనే ఖైదీ తనకు బెయిల్ ఇస్తే ఇంటి వద్ద కొన్ని రోజులు వైద్యం చేయించుకుంటానని హై కోర్టుకు విన్నవించడంతో కోర్టు జైలు అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో ఎంత మంది హెచ్ఐవీ రోగులు ఉన్నారు? వారికి ఆరోగ్యపరంగా ఇస్తున్న వైద్యం, పౌష్టికాహారం తదితర వివరాలు ఇవ్వాలని కోరింది. ఈ మేరకు జైలు అధికారులు ఖైదీలకు ఇస్తున్న ఆహారం మందుల వివరాల నివేదికను అందజేశారు. ప్రతిరోజూ ఆహారంతో పాటు గుడ్డు, 250 మిల్లీ గ్రాముల పాలు, వారంలో వంద గ్రాముల మాంసం, ప్రోటీన్స్, ఇతర ఏఆర్టీ మందులు ఇస్తామని హై కోర్టుకు తెలిపారు. అలాగే ఇతర జైళ్ల నుంచి కూడా హెచ్ఐవీ రోగులు రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు పంపుతున్నారన్నారు. రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో 30 పడకల ఆసుపత్రి అందుబాటులో ఉండడంతో గుంటూరు, కృష్ణ, పశ్చిమ, తూర్పుగోదావరి జిల్లాల్లోని హెచ్ఐవీ రోగులు ఎక్కువ మంది ఉన్నారని, ఈ నాలుగు జిల్లాలు హైవే కు ఆనుకొని ఉండడంతో లారీ డ్రైవర్లు, కూలీలు, రోడ్డు ప్రమాదం చేసి, హత్యలు చేసి హెచ్ఐవీ రోగులుగా జైలుకు వస్తున్నారని జైలు అధికారులు హై కోర్టుకు వివరించారు. గత ఐదేళ్లలో హెచ్ఐవీ రోగులు 19 మంది బయట నుంచి వచ్చారని, అనారోగ్యంతో బాధపడే వారికి రక్తపరీక్షలు నిర్వహించినప్పుడు హెచ్ఐవీ టెస్ట్లలో బయటపడ్డాయని కోర్టుకు వివరించారు. తదుపరి విచారణ ఆగస్టు రెండో తేదీకి వాయిదా వేసింది. -
బాలుడికి హెచ్ఐవీ రక్తం ఎక్కిస్తారా?
సాక్షి, చెన్నై : శస్త్రచికిత్స సమయంలో ఓ తొమ్మిది నెలల బాలుడికి హెచ్ఐవీ రక్తాన్ని ఎక్కించిన ఘటనపై చెన్నై కోర్టు సివిల్ కోర్టు తీవ్రంగా స్పందించింది. 20 ఏళ్ల నాటి ఈ కేసులో బాధిత బాలుడికి రూ.20 లక్షల పరిహారం చెల్లించాలని చెన్నైలోని ‘ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఛైల్డ్ హెల్త్ అండ్ హాస్పిటల్ ఫర్ చిల్డ్రన్’ ను ఆదేశించింది. అలాగే ఆ యువకుడికి ఉద్యోగం కల్పించాలని తమిళనాడు ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. 1999లో జరిగిన ఈ ఘటన వివరాలు.. చెన్నై నగరంలో దినసరి కూలీలుగా జీవనం సాగిస్తున్న ఓ పేద దంపతుల కుమారునికి ఒక్కసారిగా వాంతులు, విరేచనాలు కావడంతో నగరంలోకి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఛైల్డ్ హెల్త్ అండ్ హాస్పిటల్ ఫర్ చిల్డ్రన్ ఆస్పత్రిలో చేర్పించారు. వైద్యులు శస్త్ర చికిత్స వైద్యులు శస్త్ర చికిత్స నిర్వహించి, రక్తాన్ని ఎక్కించారు. అయినప్పటికీ బాలుడి ఆరోగ్యం కుదుట పడకపోవడంతో తిరిగి ఆసుపత్రిలో చేర్పించారు. మరోచోట రక్త పరీక్ష చేయగా హెచ్ఐవీ ఉన్నట్టు తేలడంతో కోర్టును ఆశ్రయించారు. 20 ఏళ తర్వాత కోర్డు తీర్పును వెల్లడించింది. కాగా ఆ బాలుడి కుటుంబానికి ఇప్పటికే రూ.50 వేలు చెల్లించామని ఆస్పత్రి అధికారులు పేర్కొనగా.. అది అతని వైద్య ఖర్చులకే సరిపోవని కోర్టు అభిప్రాయపడింది. హెచ్ఐవీ బ్లడ్ను ఎలా ఎక్కించారని సిబ్బందిపై మండిపడింది. సిబ్బంది నిర్లక్ష్యంగానే ఆ బాలుడికి హెచ్ఐవీ సోకిందని..పరిహారంగా రూ. 20లక్షలు చెల్లించాలని కోర్టు తేల్చిచెప్పింది. యువకుడి తల్లిదండ్రులు పేదవారని, కుటుంబ పోషణ కోసం ఆ యుకుడికి ఉద్యోగం కల్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. -
హెచ్ఐవీ ఉందని ఇంటికి పంపించేశారు
తల్లిదండ్రులు చేసిన తప్పు ఆ పాపకు శాపంగా మారింది. చేరదీయాల్సిన గురువులే ఆమెను దూరం పెట్టడంతో ఆమెకు కన్నీరే మిగిలింది. వీరఘట్టం కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయంలో 7వ తరగతి చదువుతున్న విద్యార్థినికి హెచ్ఐవీ ఉన్నట్టు తెలియడంతో సిబ్బంది ఇంటికి పంపేశారు. ఊరడించి, ధైర్యం చెప్పాల్సిన వారే వివక్ష చూపడంపై నిరసన వ్యక్తమవుతోంది. సాక్షి, వీరఘట్టం(శ్రీకాకుళం) : తల్లి గర్భంలో ఉన్నప్పుడే పాపకు ఈ వ్యాధి సోకింది. కొన్నేళ్ల తర్వాత అమ్మ చనిపోయింది. ఆ తర్వాత తండ్రి ఏమయ్యాడో తెలీదు. చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయిన ఆ పాప వీరఘట్టంలో ఉన్న తన తాత వద్దే ఉంటూ చదువుకునేది. ఆమెను ఈ ఏడాదే కేజీబీవీలో చేర్చారు. వైద్యుల సూచన మేరకు ఆమె నిత్యం మందులు వాడుతుంది. ఈ అమ్మాయి ఎందుకు మందులు వాడుతుందోనని కేజీబీవీ సిబ్బంది బిటివాడ పీహెచ్సీలో వైద్య తనిఖీలు చేయిం చారు. ఈ పాపకు హెచ్ఐవీ ఉన్నట్లు నిర్ధారణ కావడంతో గుట్టుచప్పుడు కాకుండా ఆ బాలి కను వీరఘట్టంలో ఉన్న తన తాత వద్దకు పం పించేశారు. వారం రోజులవుతున్నా కేజీబీవీ సి బ్బంది నుంచి ఇంత వరకు పిలుపు రాలేదు. మందులు వాడడమే గానీ తనకు ప్రాణాంతక వ్యాధి ఉందనే విషయం కూడా ఆ బాలికకు తెలీదు. ఆ బాలిక పరిస్థితిని చూసి అందరి మనసులు తల్లడిల్లిపోతున్నాయి. ఏ పాపం చేయని బాలికపై కేజీబీవీ సిబ్బంది వివక్ష చూపడం సరికాదన్న విమర్శలు వస్తున్నాయి. బాల్యం నుంచే కష్టాలు... చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయిన ఈ బాలిక వీరఘట్టంలో ఉన్న తాత వద్ద ఉంటోం ది. 1 నుంచి 5వ తరగతి వరకు వీరఘట్టం కోమటివీధి ప్రాథమిక పాఠశాలలో చదువుకుంది. తర్వాత 6వ తరగతి వీరఘట్టం బాలికోన్నత పాఠశాలలో చదివింది. ఇంటి వద్ద పాప ఆలనా పాలనా చూసేందుకు తాతకు ఇబ్బందిగా ఉండడంతో రెసిడెన్షియల్ విద్య ఉన్న కేజీబీవీలో ఈ ఏడాది 7వ తరగతిలో చేర్పించారు. సమాజానికి ఇచ్చే సందేశమిదేనా? ప్రతి ఏటా డిసెంబర్ 1న ఎయిడ్స్ దినోత్సవం రోజున.. ఎయిడ్స్ అంటువ్యాధి కాదని ర్యాలీలు చేసి స్పీచ్లు ఇచ్చే ఉపాధ్యాయులు ఓ బాలికపై ఇటువంటి వివక్ష చూపించి సభ్య సమాజానికి ఏం సందేశం ఇద్దామనుకుంటున్నారని పలువురు ప్రశ్నిస్తున్నా రు. ఇటీవల తమిళనాడు రాష్ట్రంలోని పెరంబదూర్లో ఓ బాలుడికి హెచ్ఐవీ ఉందని ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్ ఇవ్వనందున అక్కడ ప్రధానోపాధ్యాయుడిని ఆ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఇటువంటి చర్యలకు పాల్పడిన వీరఘట్టం కేజీబీవీ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. ప్రిన్సిపాల్ వివరణ ఈ విషయంపై కేజీబీవీ ప్రిన్సిపాల్ అమరావతిని సాక్షి వివరణ కోరగా.. ఆ బాలికకు హెచ్ఐవీ ఉందని తెలిస్తే మిగిలిన బాలికలు కంగారు పడతారనే ఉద్దేశంతో ఇంటికి పంపించేశామని చెప్పా రు. బాలికను మళ్లీ ఇక్కడ చేర్చుకుని తర్వాత శ్రీకాకుళంలో వీరి కోసం ప్రత్యేకంగా ఉన్న హోంకు పంపిస్తామన్నారు. -
ఆ బాలుడిని పాఠశాలలో చేర్చుకోండి
తమిళనాడు, తిరువొత్తియూరు: హెచ్ఐవీ బాధిత బాలుడిని ప్రభుత్వ పాఠశాలలో చేర్చుకోవాలని జిల్లా ముఖ్య విద్యాధికారి గురువారం ఆదేశించారు. పెరంబలూరు జిల్లా కొలక్కానత్తంకు చెందిన ఓ బాలుడి తల్లిదండ్రులు హెచ్ఐవీ బాధితులు. వీరిలో బాలుడి తల్లి గతేడాది మృతి చెందింది. తండ్రి సంరక్షణలో బాలుడు ఉన్నాడు. ఈ క్రమంలో బాలుడికి హెచ్ఐవీ ఉన్నట్టు వైద్య పరీక్షలో తెలిసింది. ఇందుకు ఆ బాలుడు చికిత్స పొందుతున్నాడు. పెరంబలూరు సమీపంలోని ప్రభుత్వ పాఠశాలలో 8వ తరగతి వరకు చదివిన ఆ బాలుడు 9వ తరగతి పెరంబలూరు ప్రభుత్వ మహోన్నత పాఠశాలలో చదివాడు. ఈ ఏడాది ఇంతకు ముందు చదివిన ప్రభుత్వ మహోన్నత పాఠశాలలోనే 10వ తరగతి చేర్చడానికి అతని బంధువులు ప్రయత్నించారు. ఆ బాలుడికి హెచ్ఐవీ ఉండడంతో అతన్ని పాఠశాలలో చేర్చుకోవడానికి హెచ్ఎం తిరస్కరించినట్టు తెలిసింది. దీనికి సంబంధించి బుధవారం పాఠశాల ఆవరణలో బాలుడి బంధువులకు, హెచ్ఎంకు తీవ్ర వాగ్వాదం జరిగింది. దీంతో బాలుడి బంధువులు జిల్లా కలెక్టర్ శాంతను కలిసి ఫిర్యాదు చేశారు. స్పందించిన కలెక్టర్ విద్యార్థిని పాఠశాలలో చేర్పించడానికి చర్యలు తీసుకోవాలని పాఠశాల విద్యా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఆ బాలుడు ఏ పాఠశాలలో 10వ తరగతి చదువడానికి ఇష్టపడతాడో అదే పాఠశాలలో చేర్పించాలన్నారు. అలాగే హాస్టల్లో ఉంటూ చదవాలనుకుంటే పెరంబలూరు సింజేరిలో ఉన్న ప్రైవేటు స్వచ్ఛంద సంస్థ నిర్వహిస్తున్న హాస్టల్లో చేర్చించాలన్నారు. ఆ బాలుడికి అడ్మిషన్ ఇవ్వడానికి తిరస్కరించిన పెరంబలూరు ప్రభుత్వ పాఠశాల హెచ్ఎం(ప్రధానోపాధ్యాయుడి)పై చర్యలు తీసుకుంటామని జిల్లా ముఖ్య విద్యాఅధికారి (సీఈఓ) గురువారం ఆదేశాలు జారీ చేశారు. -
హెచ్ఐవీకి మందు దొరికింది!
అవసరాలకు తగ్గట్టుగా జన్యువుల్లో మార్పులు చేర్పులు చేసేందుకు వీలు కల్పించే క్రిస్పర్ క్యాస్ –9 టెక్నాలజీతో శాస్త్రవేత్తలు జంతువుల్లో హెచ్ఐవీని లేకుండా చేయగలిగారు. బతికున్న జంతువుల జన్యువుల్లోంచి హెచ్ఐవీ కారక వైరస్ను తొలగించగలగడం ఇదే తొలిసారి. వైద్యశాస్త్రం చాలా అభివృద్ధి చెందినప్పటికీ హెచ్ఐవీకి ఇప్పటివరకూ పూర్తిస్థాయి చికిత్స అన్నది లేదన్నది తెలిసిందే. యాంటీ రెట్రో వైరల్ మందులను వాడుతూ జీవితకాలాన్ని పెంచుకునేందుకు మాత్రమే అవకాశముంది. ఈ నేపథ్యంలో టెంపుల్ యూనివర్శిటీ, నెబ్రాస్కా యూనివర్శిటీ మెడికల్ సెంటర్ల శాస్త్రవేత్తలు క్రిస్పర్ సాయంతో హెచ్ఐవీ వైరస్లను తొలగించే ప్రయత్నాలు మొదలుపెట్టారు. 2014లో టెంపుల్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు పరిశోధన శాలలో మానవ కణాల జన్యువుల్లోంచి వైరస్ను తొలగించడంలో విజయం సాధించగా.. తరువాతి కాలంలో నెబ్రాస్కా యూనివర్శిటీ శాస్త్రవేత్తలతో కలిసి బతికున్న జంతువులపై ప్రయోగాలు చేసి విజయం సాధించారు. హెచ్ఐవీ వైరస్ తనదైన డీఎన్ఏ సాయంతో కణాల్లోకి చొరబడి విభజితమవుతుందన్నది తెలిసిందే. వ్యాధితో కూడిన ఎలుకలకు యాంటీ రెట్రో వైరల్ మందులను చాలా నెమ్మదిగా వారాలపాటు విడుదల చేస్తూ వైరస్ మోతాదు అతి తక్కువ స్థాయిలో ఉండేలా చేసిన తరువాత శాస్త్రవేత్తలు.. ఆ తరువాత కణాల లోపల ఉండే వైరస్ డీఎన్ఏ పోగును కత్తిరించారు. ఆ తరువాత జరిపిన పరిశీలనల్లో మూడు వంతుల ఎలుకల్లో వైరస్ లేకుండా పోయినట్లు స్పష్టమైంది. -
వైద్యుడి నిర్లక్ష్యం.. 400 మందికి హెచ్ఐవీ
ఇస్లామాబాద్ : ఆస్పత్రి ప్రాంగంణంలో ఉన్న ఆ తల్లిదండ్రుల మొహాల్లో ఆందోళన కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. తమ చిన్నారుల గురించి ఎలాంటి చెడు వార్త వినాల్సి వస్తుందో తెలీక వారంతా ప్రాణాలు అర చేతిలో పెట్టుకుని కూర్చున్నారు. రిపోర్ట్స్ నెగిటీవ్ అని వస్తే బాగుండు అని దేవుడిని వేడుకుంటున్నారు. కానీ వారు కోరుకున్నట్లు జరగడం లేదు. పరీక్షలు చేసిన ప్రతి ఒక్కరిలో మహామ్మరి లక్షణాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే దాదాపు 400 మందిలో హెచ్ఐవీ వైరస్ లక్షణాలు కనిపించగా.. వారిలో ఎక్కువ మంది చిన్నారులే కావడం ప్రతి ఒక్కరిని కలచి వేస్తుంది. కలుషిత సిరంజి వాడి.. వందలాది మంది చిన్నారులను ప్రాణాంతక హెచ్ఐవీ వ్యాధి బారిన పడేలా చేసిన ఈ సంఘటన పాకిస్తాన్లో తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. లర్కానా జిల్లాలోని రటోడెరో ప్రభుత్వ ఆస్పత్రిలో విధులు నిర్వహిస్తున్న డాక్టర్ ముజఫర్ గంగర్ ఈ దారుణానికి ఒడిగట్టాడు. స్వయంగా అతను కూడా హెచ్ఐవీ బాధితుడు కావడం గమనార్హం. ఈ వైద్యుడి వద్ద వద్ద చికిత్స తీసుకున్న వారంతా ఈ వైరస్ బారిన పడ్డట్లు అధికారులు గుర్తించారు. ఇప్పటికే దాదాపు 400 మందిలో ఈ వైరస్ లక్షణాలు బయటపడ్డాయని.. వారిలో అధికులు చిన్న పిల్లలే అని అధికారులు తెలిపారు. మరి కొంత మందికి ప్రస్తుతం వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామని.. బాధితుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. అభం శుభం తెలియని తమ చిన్నారులకు ఈ ప్రాణాంతక వ్యాధి సోకడంతో వారి తల్లిదండ్రుల ఆందోళనలు మిన్నంటుతున్నాయి. ఇక తమ పిల్లలు సాధరణ జీవితాన్ని ఎలా గడుపుతారు.. సమాజం వారిని ఎలా చూస్తుంది అని వాపోతున్నారు. తమ పిల్లలను ఆదుకోవాలని.. వారికి మెరుగైన వైద్యం అందించేందుకు దాతలు ముందుకు రావాలని కోరుతున్నారు. తమ ప్లిలలకు ఈ పరిస్థితి కల్పించిన డాక్టర్కు మరణ శిక్ష విధించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయం గురించి అధికారులు మాట్లాడుతూ.. హైచ్ఐవీ కేసుల్లో పాకిస్తాన్ ఆసియాలోనే రెండో స్థానంలో ఉంది. 2017 ఒక్క సంవత్సరంలోనే దేశ వ్యాప్తంగా దాదాపు 20 వేల కొత్త కేసులు నమోదయ్యాయి. నకిలీ వైద్యులు, పేదరికం వంటివి కూడా ఈ వైరస్ వ్యాప్తికి ప్రధాన కారణాలు అవుతున్నాయి. డబ్బు మిగులుతుందనే ఉద్దేశంతో.. వైద్యులు ఒకే సిరంజిని అనేక మందికి వినియోగిస్తున్నారు. ఇక ఇంతటి దారుణానికి కారణమైన వైద్యుడు ప్రస్తుతం రటోడెరోకు సమీపంలోని ఓ జైలులో ఉన్నాడు. ఈ విషయం గురించి అతను ‘నాకు హెచ్ఐవీ ఉన్న సంగతి తెలియదు. కావాలనే కలుషిత సిరంజి వాడానని చేస్తోన్న ఆరోపణలు కూడా అవాస్తవం’ అని కొట్టి పారేస్తున్నాడు. ఈ దారుణంపై విచారణ చేస్తున్నట్లు సింధ్ ఎయిడ్స్ కంట్రోల్ ప్రొగ్రామ్ ఇంచార్జ్ డా. సికందర్ మెమన్ తెలిపారు. -
పెరిగిన హెచ్ఐవీ పేషెంట్లు.. డాక్టర్ అరెస్ట్
కరాచీ : పాకిస్తాన్లోని సింధ్ ప్రావిన్స్లో హెచ్ఐవీ వ్యాధిని వ్యాప్తి చేస్తున్న డా. ముజఫర్ గంగర్ను పోలీసులు అరెస్ట్ చేశారు. లర్కానా జిల్లాలోని రటోడెరోలో ప్రభుత్వ ఆసుపత్రిలో ముజఫర్ గంగర్ విధులు నిర్వహిస్తున్నారు. అతడికి కూడా హెచ్ఐవీ ఉన్నట్టు గుర్తించారు. లర్కానా నగర సమీప ప్రాంతాల్లో హెచ్ఐవీ బాధితుల సంఖ్య ఒక్కసారిగా పెరగడంతో వైద్యఅధికారులు అలర్ట్ను ప్రకటించారు. వైద్య పరీక్షలకు ఆదేశించగా చిన్నపిల్లలు కూడా ఎక్కువగా హెచ్ఐవీ భారిన పడ్డట్లుగా గుర్తించారు. విచారణ సందర్భంగా ఓ వైద్యుడి వద్ద చికిత్స తీసుకున్న వారంతా ఈ వైరస్ బారిన పడ్డట్లు అధికారులు గుర్తించారు. సదరు వైద్యుడు కలుషిత సిరంజీలు వాడటం వల్లే వ్యాధి వ్యాప్తికి కారకుడయ్యాడని పేర్కొన్నారు. కలుషిత సిరంజి వాడటం వల్ల 90 మంది వ్యక్తులు హెచ్ఐవీ బారిన పడినట్టు తెలుస్తోంది. వీరిలో 65 మంది పిల్లలు ఉన్నారు. అయితే ఈ ఘటనకకు తనకు ఎలాంటి సంబంధం లేదని డా. ముజఫర్ గంగర్ తెలిపారు. తనకు హెచ్ఐవీ సోకిన విషయం కూడా తెలియదని చెప్పారు. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ చేయనున్నట్టు సింధ్లో ఎయిడ్స్ కంట్రోల్ ప్రోగ్రామ్ ఇంచార్జ్ డా. సికందర్ మెమన్ తెలిపారు. -
హెచ్ఐవీ ఉందని చెప్పినా వినని కామాంధుడు..
కర్నూలు, ఆదోని: ఓ బాలికను కిడ్నాప్ చేయడంతోపాటు బలవంతంగా పెళ్లి చేసుకుని.. మూడు నెలల పాటు లైంగికంగా దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కామాంధుడి బారి నుంచి తప్పించుకున్న బాధితురాలు(15ఏళ్లు) పోలీసులను ఆశ్రయించింది. విలేకరులతో తనకు జరిగిన అన్యాయాన్ని చెప్పుకొని విలపించింది. వివరాలు బాలిక మాటల్లోనే.. ‘‘ మాది ఎమ్మిగనూరు పట్టణం గాంధీనగర్.. మా అమ్మ 2015లో హెచ్ఐవీతో మృతి చెందింది. అమ్మ నుంచి నాకు కూడా వ్యాధి సోకింది. విషయం తెలియడంతో నాన్న ఎంతో కుమిలిపోయారు. ఏం చేయాలో దిక్కుతోచలేదు. ఆదోని స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు నాన్నను సంప్రదించి.. హెచ్ఐవీకి చికిత్స అందిస్తూ చదివిస్తామన్నారు. దీంతో నేను ఆదోని పట్టణంలోని ఓ పాఠశాలలో 8వ తరగతిలో చేరాను. నాన్న ఆరోగ్యం దెబ్బతిన్న విషయం తెలిసి ఎమ్మిగనూరుకు వచ్చాను. మా వీధిలోనే ఉన్న శంకర్ అనే యువకుడు నన్ను ప్రేమిస్తున్నానంటూ వెంటపడ్డాడు. నాకు హెచ్ఐవీ ఉందని చెప్పినా వినలేదు. మూడు నెలల క్రితం రాత్రి 7.30గంటల సమయంలో నేను పాలప్యాకెట్టు కోసం బయటకు రాగానే మధు, యువరాజ్తో వచ్చిన శంకర్ నన్ను సైకిల్మోటార్పై బలవంతంగా ఆదోనికి తీసుకొచ్చాడు. ఓ ఇంట్లో బంధించి బలవంతంగా పెళ్లిచేసుకున్నాడు. నాకు హెచ్ఐవీ ఉందని చెప్పినా వినలేదు. గురువారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో పారిపోయి వచ్చి నాన్నకు కబురు పెట్టారు. నా జీవితాన్ని సర్వ నాశనం చేసిన శంకర్, మధు, యువరాజ్, బంధువు ఆంజనేయపై కఠిన చర్యలు తీసుకోవాలి’ అని బాలిక డిమాండ్ చేశారు. బాధిత బాలికను షీటీం పోలీసులు విచారించారు. ఏం జరిగిందో విచారించి కేసు నమోదు చేస్తామని ఆదోని త్రీ టౌన్ సీఐ శ్రీరాములు తెలిపారు. -
ఎయిడ్స్ బాధితులకు శుభవార్త
లండన్: 3.7 కోట్ల మంది. ప్రపంచవ్యాప్తంగా ఎయిడ్స్తో బాధపడుతున్న వారి సంఖ్య ఇది. వీరందరికీ కచ్చితంగా ఇది శుభవార్తే. బతికున్నన్నాళ్లు వ్యాధిని భరిస్తూ.. మందులు వాడుతూ ఉండాల్సిన అవసరం లేదని భారతీయ సంతతి శాస్త్రవేత్త డాక్టర్ రవీంద్ర గుప్తా నిరూపించారు. లండన్కు చెందిన ఓ వ్యక్తి హెచ్ఐవీ నుంచి బయటపడినట్లు.. పూర్తిస్థాయి చికిత్స సాధ్యమైనట్లు చెబుతున్నారు. అయితే 1980ల్లో గుర్తించిన ఈ ప్రాణాంతక వ్యాధి నుంచి మనిషి బయటపడటం ఇది రెండోసారి మాత్రమే. ఇలాంటి విజయాలు మరిన్ని సాధించిన తర్వాతే శాశ్వత పరిష్కారం లభించిందని చెప్పగలమని ఆయన అంటున్నారు. అమెరికాకు చెందిన తిమోతీ బ్రౌన్ అనే వ్యక్తి 12 ఏళ్ల కింద ఎయిడ్స్ను జయించి రికార్డు సృష్టించగా.. లండన్ రోగి రెండో వ్యక్తి అని సియాటెల్లో జరిగిన ఓ అంతర్జాతీయ సదస్సులో రవీంద్ర ప్రకటించారు. ఎయిడ్స్ వైరస్కు సహజమైన నిరోధకత కలిగిన వ్యక్తి తాలూకూ ఎముక మజ్జ నుంచి సేకరించిన మూలకణాలను చొప్పించడం ద్వారా ఇద్దరికీ చికిత్స జరిగింది. అప్పటి నుంచి ఇప్పటివరకు పన్నెండేళ్ల కింద బెర్లిన్ పేషెంట్గా ప్రపంచానికి పరిచయమైన తిమోతీ బ్రౌన్ జర్మనీలో చికిత్స తీసుకున్నాడు. అప్పటి నుంచి ఇప్పటివరకు యాంట్రీ రెట్రోవైరల్ మందులు వాడకున్నా అతడి శరీరంలో వైరస్ ఛాయలేవీ లేవు. లండన్ రోగి విషయానికొస్తే.. ఈయనకు 2003లో వ్యాధి సోకింది. 2012లో హడ్కిన్స్ లింఫోమా (ఒక రకమైన రక్త కేన్సర్) బారిన కూడా పడ్డాడు. రవీంద్ర గుప్తా అప్పట్లో యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లండన్లో పనిచేస్తుండేవారు. 2016లో తీవ్ర అనారోగ్య పరిస్థితుల మధ్య లండన్ పేషెంట్ తన వద్దకొచ్చాడని.. చివరి ప్రయత్నంగా మూలకణ చికిత్సకు ఏర్పాట్లు చేశామని రవీంద్ర తెలిపారు. జన్యుక్రమంలో సీసీఆర్ 5, డెల్టా 32 అనే రెండు మార్పుల కారణంగా హెచ్ఐవీ వైరస్ సోకని ఓ వ్యక్తి మూలకణాలను లండన్ పేషెంట్కు ఎక్కించారు. కొంతకాలం పాటు కొత్త మూలకణాలను రోగి శరీరం నిరోధించిందని.. ఆ తర్వాత పరిస్థితిలో మార్పులు మొదలయ్యాయి. మూడేళ్లపాటు మూలకణాలను ఎక్కించాక గత 18 నెలలుగా లండన్ పేషెంట్ యాంటీ రెట్రోవైరల్ మందులు తీసుకోవడం ఆపేసినా శరీరంలో వైరస్ ఛాయల్లేవని రవీంద్ర వివరిస్తున్నారు. సులువేం కాదు.. మూలకణాల ద్వారా హెచ్ఐవీకి చికిత్స కల్పించడం అంత ఆషామాషీ వ్యవహారమేమీ కాదు. ఉత్తర యూరప్ ప్రాంతంలో అతికొద్ది మందిలో మాత్రమే సీసీఆర్ 5 జన్యుమార్పు ఉండటం దీనికి కారణం. రోగి, దాతల మూలకణాలు కచ్చితంగా సరిపోయినప్పుడే చికిత్స చేయగలరు. దాత మూలకణాలను అడ్డుకునేందుకు రోగి శరీరంలోని రోగ నిరోధక వ్యవస్థ చేసే ప్రయత్నాలను తట్టుకుని నిలవగలగడం కష్టసాధ్యమైన పని. రోగి, దాత మూలకణాల పోటీ కాస్తా వైరస్ తొలగిపోయేందుకు కారణమవుతుందని రవీంద్ర అంచనా వేస్తున్నారు. దీని ఆధారంగా హెచ్ఐవీకి సమర్థమైన చికిత్స అందించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని అంటున్నారు. -
ప్రభుత్వాస్పత్రి నిర్వాకం.. చిన్నారికి హెచ్ఐవీ
చెన్నై : ఓ ప్రభుత్వాస్పత్రి నిర్వాకంతో ఓ మూడేళ్ల చిన్నారి హెచ్ఐవీ బాధితురాలైంది. రక్తమార్పిడి సమయంలో వైద్యుల నిర్లక్ష్యం ఆ పసిపాప పాలిట శాపంగా మారింది. రక్తమార్పిడి జరిగిన ఏడు నెలల అనంతరం నిర్వహించిన పరీక్షల్లో ఆ చిన్నారికి హెచ్ఐవీ ఉన్నట్లు తేలింది. అనుమానంతో ఆ పాప తల్లిదండ్రులను పరీక్షించగా వారికి ఎలాంటి వైరస్ సోకలేదని స్పష్టమైంది. ఈ ఘటన తమిళనాడులోని కొయంబత్తూరు ప్రభుత్వాస్పత్రిలో చోటుచేసుకుంది. అయితే ప్రభుత్వ ఆసుప్రతి వర్గాలు మాత్రం ఈ ఆరోపణలు ఖండిస్తున్నాయి. వివరాల్లోకి వెళ్తే.. సెంట్రల్ తమిళనాడులోని త్రిచిలో నివసించే ఓ జంట.. ఆనారోగ్యంతో బాధపడుతున్న తమ మూడేళ్ల కూతురిని ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. చికిత్స అందించిన వైద్యులు పరీక్షలు నిర్వహించగా.. హెచ్ఐవీ పాజిటీవ్ అని తేలింది. దీంతో ఆ తల్లిదండ్రులు అవాక్కయ్యారు. తమపై అనుమానంతో పరీక్షలు చేయించుకున్నారు. కానీ వారికి నెగటీవ్ వచ్చింది. దీంతో గతంలో తమ పాపకు రక్తమార్పిడి చేసే సమయంలో వైద్యుల చేసిన పొరపాటు ఫలితమేనని గ్రహించారు. గతేడాది జూలై 11న తమ కూతురికి రక్తాన్ని ఎక్కించారని, అయితే రక్తం ఎక్కించే సమయంలో వైద్యులు పొరపాటున ఓ వృద్ధుడి రక్తాన్ని ఎక్కించారని, ఇది తెలుసుకొని మధ్యలోనే ఆపేశారని ఆ చిన్నారి తండ్రి తెలిపారు. అప్పుడు పాప ఆరోగ్యం కుదటపడటంతో అంతగా పట్టించుకోలేదని, కానీ ఈ నెల 8న మరోసారి అస్వస్థతకు గురవ్వడంతో ఆసుపత్రికి తీసుకెళ్తే హెచ్ఐవీ అని తేలిందన్నారు. ఈ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స చేయించుకున్న మరో ఇద్దరు కూడా హెచ్ఐవీ వచ్చిందని ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి విచారణకు ఆదేశించలేదు. -
ఆడపిల్లకు జన్మనిచ్చిన హెచ్ఐవీ బ్లడ్ బాధితురాలు
చెన్నై : గతేడాది డిసెంబర్లో ల్యాబ్ టెక్నీషియన్ల నిర్లక్ష్యం కారణంగా తమిళనాడు వైద్యులు ఓ గర్భిణీకి హెచ్ఐవీ బ్లడ్ ఎక్కించిన సంగతి తెలిసిందే. ఫలితంగా సదరు మహిళకు కూడా హెచ్ఐవీ సోకింది. ఈ క్రమంలో ఆ గర్భిణీ మదురైలోని రాజాజీ ఆస్పత్రిలో గురువారం సాయంత్రం ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయం గురించి డాక్టర్లు మాట్లాడుతూ.. ‘సాధరణంగా అప్పుడే పుట్టిన పిల్లలు ఎవరైనా 2.5 - 3.5 కిలోగ్రాముల బరువు ఉండాలి. కానీ ఈ చిన్నారి కేవలం 1. 75 కిలోగ్రాముల బరువు మాత్రమే ఉంది. ప్రస్తుతం ఈ పాపను చిన్న పిల్లల ఐసీయూలో ఉంచామ’ని తెలిపారు. అంతేకాక తల్లి నుంచి బిడ్డకు హెచ్ఐవీ రాకుండా నిరోధించే ‘నెవిరాపిన్ సిరప్’ను కూడా ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఈ మెడిసిన్ను 6 - 12 వారాల పాటు ఇవ్వాల్సి ఉంటుంది. ఇవేకాక హెపటైటీస్ బీ వైరస్ రాకుండా నిరోధించడం కోసం హెపటైటీస్ బీ టీకాను కూడా ఇచ్చామన్నారు. దాంతో పాటు 45 రోజుల తర్వాత చిన్నారికి హెచ్ఐవీ పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. గత డిసెంబర్ 6న సదరు గర్భిణీకి ప్రభుత్వ బ్లడ్ బ్యాంక్ నుంచి తీసుకొచ్చిన రక్తాన్ని ఎక్కించారు. అయితే ఆ రక్తాన్ని దానం చేసిన వ్యక్తికి హెచ్ఐవీ ఉన్నట్లు తేలడంతో ఈ దారుణం చోటు చేసుకుంది. ఉద్యోగం కోసం విదేశాలకు వెళ్లడానికి సిద్దపడుతున్న ఆ వ్యక్తి.. ఓ ప్రైవేట్ ల్యాబ్లో రక్త పరీక్ష చేయించుకోగా హెచ్ఐవీ పాజిటీవ్గా తేలింది. వెంటనే అతను బ్లడ్ బ్యాంకు వారికి సమాచారం ఇచ్చాడు. కానీ అప్పటికే ఆ రక్తాన్ని గర్భిణీకి ఎక్కించడంతో జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అయితే రక్త దానం చేసే నాటికే సదరు యువకుడికి హెచ్ఐవీ, హెపటైటిస్ బీలు ఉన్నాయని పరీక్షల్లో తేలిందని గుర్తించారు. ఈ విషయాన్ని ల్యాబ్ టెక్నిషియన్లు సదరు యువకుడికి తెలియజేయకపోవడంతో ఈ దారుణం జరిగింది. -
హెచ్ఐవీ బ్లడ్ కలకలం.. మద్రాస్ హైకోర్టు ఆదేశాలు
తమిళనాడులోని ఓ ప్రభుత్వాసుపత్రి ల్యాబ్ టెక్నీషియన్ల నిర్లక్ష్యంతో ఓ నిండు గర్భిణి హెచ్ఐవీ బారిన పడగా.. తన కారణంగా రెండు జీవితాలు హెచ్ఐవీకి బలికావాల్సి వస్తోందని రక్తం దానం చేసిన యువకుడు ఆత్మహత్య చేసుకుని ప్రాణాలొదిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వాసుపత్రులంటే వణకు పుట్టేలా చేస్తోంది. సాక్షి, చెన్నై : గర్భిణికి హెచ్ఐవీ పాజిటివ్ రక్తం ఎక్కించిన వివాదం పెనుభూతంగా మారిపోగా ఇందుకు కారకులైన బ్లడ్ బ్యాంక్ సిబ్బంది నిర్లక్ష్యం ప్రభుత్వం మెడకు ఉచ్చులా బిగుసుకుంటోంది. ఈ వ్యవహారాన్ని మద్రాసు హైకోర్టు సుమోటోగా స్వీకరించి ప్రభుత్వానికి నోటీసులు జారీచేసిస సంగతి తెలిసిందే. కాగా, రక్తదానం చేసిన యువకుడు (19) తీవ్ర మనస్తాపంతో ఎలుకలమందు తాగి బుధవారం ఆత్మహత్యాయత్నం చేశాడు. మధురై రాజాజీ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం ప్రాణాలొదిలాడు. అయితే, మృతుడి తల్లిదండ్రులు తమ కుమారుడి మరణంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. (ప్రభుత్వాసుపత్రి నిర్వాకం.. గర్భిణీకి హెచ్ఐవీ బ్లడ్!) బుధవారం ఆత్మహత్యాయత్నం చేసిన తమ కొడుకు శుక్రవారం వరకు బాగానే ఉన్నాడని తెలిపారు. డాక్టర్లు వచ్చి ఏదో సూదిమందు ఇచ్చిన తర్వాతనే అతని ఆరోగ్యం క్షీణించిందని ఆరోపిస్తున్నారు. తమ కుమారుడి మృతి వెనుక కారణాలను వెలికితీసేవిధంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ మద్రాస్ కోర్టులో పిటిషన్ వేశారు. పిటిషన్ స్వీకరించిన హైకోర్టు మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించే విషయంలో సోమవారం పలు ఆదేశాలు జారీ చేసింది. ఇద్దరు ఫోరెన్సిక్ నిపుణుల పర్యవేక్షణలో పోస్టుమార్టం చేయాలనీ, ఆ ప్రక్రియనంతా వీడియోలో చిత్రీకరించాలని రాజాజీ ప్రభుత్వాస్పత్రికి ఆదేశాలు జారీ చేసింది. అయితే, హెచ్ఐవీ సోకిన శరీరానికి 72 గంటలలోపు పోస్టుమార్టం చేయడం కుదరదని ఆస్పత్రి డీన్ షణ్ముగసుందరం కోర్టుకు విన్నవించారు. అలా చేస్తే డాక్టర్లకు ఇన్ఫెక్షన్ సోకే ప్రమాదముందని తెలిపారు. అన్ని జాగ్రత్తలు తీసుకుని, నిబంధనల ప్రకారమే పోస్టుమార్టం చేయాలని కోర్టు వెల్లడించింది. వీడియో చిత్రీకరణ చేయాలని పునరుద్ఘాటించింది. (మరో గర్భిణికి హెచ్ఐవీ రక్తం) -
మరో గర్భిణికి హెచ్ఐవీ రక్తం
సాక్షి ప్రతినిధి, చెన్నై: విరుదునగర్ జిల్లాకు చెందిన ఒక గర్భిణికి ప్రభుత్వ సిబ్బంది హెచ్ఐవీ రక్తం ఎక్కించిన వేడి వాతావరణం ఇంకా చల్లారక ముందే ఇలాంటి మరో దారుణం తమిళనాడులో బైటపడింది. చెన్నైలోని ప్రభుత్వ కీల్పాక్ ఆస్పత్రిలో ఒక మహిళకు హెచ్ఐవీ రక్తం ఎక్కించిన వైనం ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాలు.. చెన్నై మాంగాడుకు చెందిన 27 ఏళ్ల వివాహిత రెండోసారి గర్భం దాల్చి అక్కడికి సమీపంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్యకేంద్రం (పీహెచ్సీ)లో తరచూ పరీక్షలు చేయించుకునేది. రక్తం తక్కువగా ఉన్నందున కీల్పాక్ ఆస్పత్రికి వెళ్లాల్సిందిగా పీహెచ్సీ సిబ్బంది సూచించారు. దీంతో ఏప్రిల్ 5న కీల్పాక్ ప్రభుత్వ ఆస్పత్రిలో చేరగా ఆమెకు రెండు యూనిట్ల రక్తం ఎక్కించారు. ఆ తరువాత యథాప్రకారం పీహెచ్సీలో పరీక్షలు చేయించుకునేది. ఎనిమిదో నెల గర్భంతో ఉన్నప్పుడు ఆగస్టు 18న ఆమెకు పరీక్షలు చేసినపుడు హెచ్ఐవీ బైటపడింది. అయితే ఈ విషయాన్ని గర్బిణి వద్ద దాచిపెట్టి హెచ్ఐవీ నిరోధక చికిత్సను ప్రారంభించారు. ఈ మందులు ఎందుకని గర్భిణి ప్రశ్నించగా రక్తం ఎక్కించినపుడు అంటువ్యాధి సోకి ఉండొచ్చనే అనుమానంతో వైద్యంచేస్తున్నట్లు చెప్పిపంపివేశారు. అయితే పీహెచ్సీ సిబ్బంది ఇచ్చిన వివరణను అనుమానించిన ఆమె ప్రయివేటు ఆస్పత్రిలో పరీక్షలు చేయించుకోగా హెచ్ఐవీ వ్యాధి సోకినట్లు చెప్పారు. దీంతో హతాశురాలైన ఆమె తమిళనాడు వైద్య, ఆరోగ్యశాఖా మంత్రి విజయభాస్కర్, కార్యదర్శి డాక్టర్ రాధాకృష్ణన్లకు లేఖ రాశారు. అయితే వారి నుంచి ఎలాంటి స్పందనరానట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా, సదరు గర్భిణి సెప్టెంబరు 19న మగబిడ్డను ప్రసవించింది. కుటుంబ సభ్యులు, బంధువులు ఆమెను దూరం పెట్టడంతో దిక్కుతోచక అల్లాడిపోయింది. ఈ దశలో విరుదనగర్ జిల్లా గర్భిణి ఉదంతం రచ్చకెక్కగా మాంగాడు మహిళ సైతం ఇరుగూ పొరుగుకు తనగోడు వెళ్లబోసుకోవడంతో బైటపడింది. ప్రభుత్వ సిబ్బంది నిర్లక్ష్యానికి తన జీవితం కూడా నాశనమైందని ఆమె ఆవేదన చెందగా, ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని పలువురు సామాజిక కార్యకర్తలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. -
గర్భిణికి హెచ్ఐవీ బ్లడ్.. రక్తదాత ఆత్మహత్యాయత్నం
గర్భిణికి హెచ్ఐవీ రక్తం ఎక్కించిన వివాదం పెనుభూతంగా మారిపోగా ఇందుకు కారకులైన బ్లడ్ బ్యాంక్ సిబ్బంది నిర్లక్ష్యం ప్రభుత్వం మెడకు ఉచ్చులా బిగుసుకుంటోంది. ఈ వ్యవహారాన్ని మద్రాసు హైకోర్టు సుమోటోగా స్వీకరించి ప్రభుత్వానికి నోటీసులు జారీచేసింది. సాక్షి ప్రతినిధి, చెన్నై: విరుదునగర్ జిల్లా సాత్తూరుకు చెందిన 8 నెలల గర్భిణికి శివకాశి ప్రభుత్వ ఆస్పత్రి అనుబంధ బ్లడ్ బ్యాంక్ నుంచి సేకరించిన రక్తాన్ని ఎక్కించడం, ఆ రక్తం హెచ్ఐవీ రోగికి చెందినది కావడంతో గర్భిణి కూడా హెచ్ఐవీ రోగిగా మారిన సంఘటన రాష్ట్రాన్ని కుదిపేసింది. ప్రభుత్వ ఆస్పత్రులంటేనే భయాందోళనలకు గురయ్యేలా చేసింది. బాధిత కుటుంబ సభ్యులపై ప్రభుత్వం అనేక వరాలజల్లు కురిపించినా వారు శాంతించలేదు. తమకు తీరని అన్యాయం జరిగిందంటూ భార్యాభర్త పోలీస్స్టేషన్లో ఫిర్యాదుచేశారు. ఈ సంఘటనపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. సుమోటోగా కేసు స్వీకరణ న్యాయవాదులు జార్జ్ విలియమ్స్, కృష్ణమూర్తి మద్రాసు హైకోర్టులోని సెలవు దినాల ప్రత్యేక కోర్టు న్యాయమూర్తులు ఎస్.వైద్యనాథన్, పీడీ ఆషాలతో కూడిన డివిజన్ బెంచ్ ముందుకు గురువారం హాజరయ్యారు. గర్భిణికి జరిగిన అన్యాయాన్ని విశదీకరించారు. ప్రభుత్వాస్పత్రులు ఎయిడ్స్ వ్యాధి వ్యాప్తికి పనిచేస్తున్నట్లుగా తయారయ్యాయని దుయ్యబట్టారు. గర్భిణి నిండు జీవితాన్ని కాలరాసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరారు. న్యాయవాదుల ఆవేదనను విన్న అనంతరం న్యాయమూర్తులు మాట్లాడుతూ, ఈ ఘోరం తమ దృష్టికి కూడా వచ్చిందని, తీవ్రమైన ఆవేదన కలిగించిందని తెలిపారు. అధికారుల అలక్ష్యం సహించరానిదని అన్నారు. ఈ దశలో ప్రభుత్వ అదనపు అడ్వకేట్ జనరల్ అరవింద్ పాండియన్ మాట్లాడుతూ, ప్రభుత్వం ఇప్పటికే ఈ సంఘటనపై విచారణకు ఆదేశించిందని న్యాయమూర్తుల దృష్టికి తెచ్చారు. గర్భిణి ఘటనకు కారకులైన వారిపై చర్య తీసుకున్నామని, కోర్టు సెలవులు ముగిసిన తరువాత నివేదిక అందజేస్తామని చెప్పారు. గర్భిణి కేసును సుమోటాగా స్వీకరిస్తున్నట్లు న్యాయమూర్తులు ప్రకటించారు. వైద్య, ఆరోగ్యశాఖ కార్యదర్శి, శివకావి ప్రభుత్వ వైద్యశాల నిర్వాహకులు, బ్లడ్బ్యాంక్ సిబ్బందిపై కేసులు పెట్టాల్సిందిగా ఆదేశించారు. ఈ సంఘటనపై సవిరమైన నివేదికను సమర్పించాల్సిందిగా తమిళనాడు ప్రభుత్వాన్ని కోరారు. శిశువుకు సోకకుండా.. గర్భంలోని శిశువుకు హెచ్ఐవీ సోకకుండా గర్భిణిని మదురైలోని ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రత్యేక వార్డులో పెట్టారు. ప్రత్యేక వైద్య చికిత్స కోసం ముగ్గురు వైద్యులతో కూడిన బృందాన్ని ప్రభుత్వం నియమించింది. వ్యవహారంపై ఆరుగురితో కూడిన విచారణ కమిటీ రెండు వారాల్లోగా నివేదికను సమర్పిస్తుందని వైద్య, ఆరోగ్యశాఖ కార్యదర్శి డాక్టర్ రాధాకృష్ణన్ తెలిపారు. రక్తదాత ఆత్మహత్యాయత్నం వదిన కోసం మరిది రక్తం దానం చేశాడు. అయితే అదృష్టం వదినె చెంత నిలువగా రక్తం రూపంలో దురదృష్టం గర్భిణిని వెతుక్కుంటూ వచ్చింది.. ప్రాణాల మీదకు తెచ్చింది. రామనాథపురం జిల్లా కముదికి చెందిన 19 ఏళ్ల యువకుడు శివకాశి బాణసంచా ప్రింటింగ్ పరిశ్రమలో పనిచేస్తున్నాడు. అనారోగ్యానికి గురైన ఇతని అన్నభార్య (వదిన) ప్రసవం కోసం శివకాశి ప్రభుత్వ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతోంది. వదినెకు రక్తం అవసరం కావడంతో అందుకు సరిపడా ఎవరైనా బ్లడ్బ్యాంకు రక్తం చెల్లించాల్సి ఉంటుంది. దీంతో సదరు యువకుడు నవంబరు 30వ తేదీన అదే ఆస్పత్రిలోని బ్లడ్ బ్యాంక్కు వెళ్లిరక్తం ఇచ్చాడు. యువకుడు ఇచ్చిన రక్తాన్ని బ్లడ్బ్యాంక్లో భద్రం చేసుకున్న సిబ్బంది, య«థాలాపంగా మరో ప్యాకెట్లోని రక్తాన్ని అతని వదినకు ఎక్కించారు. ఇదిలా ఉండగా, రక్త దానం చేసిన యువకుడు విదేశీ ఉద్యోగానికి వెళుతూ డిసెంబర్ 6వ తేదీన ఫిట్నెస్ సర్టిఫికెట్ పొందడంలో భాగంగా రక్తపరీక్షలు చేయించుకోగా హెచ్ఐవీ ఉన్నట్లు తేలింది. దీంతో కంగారుపడిన యువకుడు బ్లడ్ బ్యాంక్కు వెళ్లి విషయం చెప్పాడు. అయితే దురదృష్టవశాత్తు అప్పటికే అతడిచ్చిన రక్తం గర్భిణికి ఎక్కించడం జరిగిపోయింది. తన రక్తం వల్లనే గర్భిణి హెచ్ఐవీ రోగిగా మారిందని యువకుడు తీవ్రంగా కలతచెందాడు. బుధవారం రాత్రి ఇంటిలోని ఎలుకల మందు తిని ఆత్మహత్యాయత్నం చేశాడు. తల్లిదండ్రులు అతడిని వెంటనే రామనాథపురం ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించగా ప్రస్తుతం అతడిని ఐసీయూలో ఉంచి తీవ్రచికిత్స అందిస్తున్నారు. తనకు జీవించాలని లేదంటూ వైద్యచికిత్సకు అతడు సహకరించడం లేదని వైద్యులు చెబుతున్నారు. ప్రజల ప్రాణాలతో ప్రభుత్వం చెలగాటం ఆడుతోందని ఎండీఎంకే అధినేత వైగో విమర్శించారు. బాధిత మహిళకు రూ.కోటి నష్టపరిహారం చెల్లించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బాలకృష్ణన్ డిమాండ్ చేశారు. -
ప్రభుత్వాసుపత్రి నిర్వాకం.. గర్భిణీకి హెచ్ఐవీ బ్లడ్!
చెన్నై: తమిళనాడులోని ఓ ప్రభుత్వాసుపత్రిలో దారుణం చోటు చేసుకుంది. ల్యాబ్ టెక్నీషియన్ల నిర్లక్ష్యం కారణంగా వైద్యులు ఓ గర్భిణీకి హెచ్ఐవీ బ్లడ్ ఎక్కించారు. ఈ దారుణ ఘటన విరుదు నగర్ జిల్లా ప్రభుత్వాసుపత్రిలో చోటు చేసుకుంది. ఈ సంఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రభుత్వం దీనికి కారణమైన ముగ్గురు ల్యాబ్ టెక్నీషియన్లను ఉద్యోగాల్లో నుంచి తీసేసింది. బాధిత గర్భిణీకి లేదా అతని భర్తకు ప్రభుత్వ ఉద్యోగంతో పాటు నష్టపరిహారం చెల్లిస్తామని హామీ ఇచ్చింది. గత డిసెంబర్ 6న సదరు గర్భిణీకి ప్రభుత్వ బ్లడ్ బ్యాంక్ నుంచి తీసుకొచ్చిన బ్లడ్ను వైద్యులు ఎక్కించారు. అయితే ఆ రక్తాన్ని దానం చేసిన ఓ వ్యక్తికి హెచ్ఐవీ ఉన్నట్లు తేలడంతో ఈ వ్యవహారం వెలుగు చూసింది. ఉద్యోగం కోసం విదేశాలకు వెళ్లడానికి సిద్దపడుతున్న ఆ వ్యక్తి.. ఓ ప్రైవేట్ ల్యాబ్లో రక్త పరీక్ష చేయించుకోగా హెచ్ఐవీ పాజిటీవ్గా తేలింది. వెంటనే అతను బ్లడ్ బ్యాంకు వారికి సమాచారం ఇచ్చాడు. కానీ అప్పటికే ఆ రక్తాన్ని గర్భిణీకి ఎక్కించడంతో జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఈ ఘటనపై విచారణ చేపట్టిన అధికారులకు విస్తుపోయే నిజాలు వెలుగు చూశాయి. సదరు యువకుడు రెండేళ్ల క్రితమే ఓ ఎన్జీవో కార్యక్రమం ద్వారా రక్త దానం చేశాడని, అప్పటికే అతనికి హెచ్ఐవీ, హెపటైటిస్ బీలు ఉన్నాయని పరీక్షల్లో తేలిందని గుర్తించారు. ఈ విషయాన్ని ల్యాబ్ టెక్నిషియన్లు సదరు యువకుడికి తెలియజేయలేదని, అతని మెడికల్ రికార్డును కూడా పొందుపరచలేదని అధికారులు పేర్కొన్నారు. దర్యాప్తు కొనసాగుతుందని, టెక్నీషియన్ల నిర్లక్ష్యంతో ప్రమాదవశాత్తు జరిగిందని, ఉద్దేశపూర్వకంగా చేసింది కాదన్నారు. ఆ యువకుడి నుంచి రెండోసారి రక్తాన్ని సేకరించినప్పుడు టెక్నీషియన్లు హెచ్ఐవీ టెస్ట్ చేయలేదని, దీంతో ఈ తప్పిదం జరిగిందన్నారు. -
ఈ మహిళ బిల్ గేట్స్ చేత కన్నీరు పెట్టించింది..
నిశబ్దంగా ఉన్న ఆ గదిలో ఓ విదేశీ జంటకు ఎదురుగా కొందరు మహిళలు కింద కూర్చున్నారు. వారిలో ఓ మహిళ మాట్లాడటం ప్రారంభించింది. ‘ఒంటరిదాన్ని.. నాకో కూతురు. తనను పోషించాలి. తనకు మంచి జీవితం ఇవ్వాలి.. గొప్ప చదువులు చదివించాలి. వీటన్నింటిని ఎలా నెరవేర్చాలి.. నాకు చదువు లేదు.. పది ఇళ్లలో పాచి పని చేస్తే.. నాకు వచ్చే మొత్తం చాలా తక్కువ. దొంగతనాలు, దోపిడీలు నాకు చేతకావు. కానీ కళ్ల ముందు నా కూతురి ఉజ్వల భవిష్యత్ నాకు కనిపిస్తోంది. అది నిజమవ్వాలంటే నాకు డబ్బు కావాలి. అలాంటి పరిస్థితుల్లో నేనేం చేయాలి.. ఓ మార్గం కనిపించింది. తప్పని తెలుసు.. కానీ తప్పదు. నాకు బురదంటుకున్న పర్వాలేదు.. నా కూతురి జీవితం వికసించాలి. అంతే.. ఆ ముళ్ల బాటలోనే నడవడం ప్రారంభించాను. నా కూతురి కోసం నా శరీరాన్ని అమ్ముకుంటున్నాను’. ‘కానీ మనసులో ఓ భయం. ఈ విషయం నా కూతురికి తెలిసిన రోజు నా పరిస్థితి ఎలా ఉంటుంది. ఈ ఊహ కూడా నాకు చాలా భయంకరంగా తోచేది. అలా భయపడుతూనే.. నా కూతురికి తెలియకుండా జాగ్రత్త పడుతూనే.. ఈ వృత్తిలో కొనసాగాను. కానీ ఈ రహస్యాన్ని ఎక్కువ కాలం దాచలేపోయాను. నా కూతురి స్నేహితులకు నేను చేసే పని గురించి తెలిసింది. దాంతో వారు తనను సూటిపోటి మాటాలతో వేధించడం ప్రారంభించారు. హైస్కూల్ చదువులు చదువుతున్న నా చిట్టితల్లి.. ఈ పాడు తల్లి మూలంగా ఎదరవుతోన్న అవమానాల్ని తట్టుకోలేకపోయింది. చివరకూ ఓ రోజు ఇంట్లో తన శవాన్ని చూడాల్సి వచ్చింది. నా బంగారు తల్లి ఉన్నతంగా ఎదగాలని ఈ రొంపిలోకి దిగాను. కానీ నేడు నా చిట్టి తల్లి ఎవరికి అందనంత దూరం వెళ్లింది. నాకు ఈ జన్మకు తీరని శోకాన్ని మిగిల్చింది. ఇందుకు నేను ఎవరిని నిందించాలి’ అంటూ విలపిస్తుంది. ఆ మహిళ కష్టం అక్కడ ఉన్న వారితో కూడా కంటతడి పెట్టించింది. అలా ఏడ్చిన వారిలో ప్రపంచ కుబేరుడు బిల్ గేట్స కూడా ఉన్నారంటున్నారు అశోక్ అలెగ్జాండర్. సదరు మహిళల ముందు కూర్చున్న విదేశీ జంట మరేవరో కాదు ప్రపంచ కుబేరుడు బిల్ - మిలిందా గేట్స్ దంపతులు. గేట్స్ ఫౌండేషన్ ‘హెచ్ఐవీ / ఎయిడ్స్’ ప్రివెన్షన్ కోసం ప్రారంభించిన ‘అవహాన్’ ప్రోగ్రాం హెడ్గా పదేళ్లుగా పని చేస్తున్నారు అశోక్. ఈ 10 ఏళ్లలో తాను చూసిన సెక్స్ వర్కర్ల గురించి, వారి నేపథ్యాలు, జీవన విధానాల గురించి తెలుపుతూ ‘ఏ స్ట్రేంజ్ ట్రూత్ : లెసన్స్ ఇన్ లవ్.. లీడర్షిప్ అండ్ కరేజ్ ఫ్రమ్ ఇండియన్ సెక్స్ వర్కర్స్’ అనే పుస్తకాన్ని తీసుకొచ్చారు అశోక్. అంతేకాక ఈ ఎయిడ్స్ మహమ్మారి నివారణ విషయంలో భారత్ ఎలా విజయాన్ని సాధించిందో తెలపడమే కాక బాధితుల జీవితం నుంచి మనం నేర్చుకోవాల్సిన అంశాలు గురించి కూడా అశోక్ ఈ పుస్తకంలో వివరించారు. ఈ బుక్ ఆవిష్కరణ సందర్భంగా ఇందులోని పలు అంశాల గురించి ఆయన మాట్లాడారు. ఈ క్రమంలో బిల్ గేట్స్ చేత కంటతడి పెట్టించిన మహిళ దీన గాధను కూడా ఈ పుస్తకంలో పొందు పరిచినట్లు తెలిపారు అశోక్. ఆ నాటి సంఘటనను గుర్తు చేసుకుంటూ.. సదరు మహిళ చెప్పినదాన్ని విన్న తర్వాత మిలిందా గేట్ అక్కడ ఉన్న మిగతా మహిళలను ఒక ప్రశ్న అడిగింది. ‘ఇందులో ఎంత మంది జీవితాల్లో ఇలాంటి కష్టాలు ఉన్నాయ’ని ప్రశ్నించింది. దానికి వారు ‘మా అందరివి ఇలాంటి గాధలేనని’ తెలిపారు. అప్పుడు పక్కనే ఉన్న బిల్గేట్స్ తల కిందకు దించుకుని కన్నీరు పెట్టడం తాను చూశానని అశోక్ తెలిపారు. 2000 సంవత్సరంలో బిల్ - మిలిందా గేట్స్ దంపతులు ఇండియా పర్యటనకు వచ్చినప్పుడు జరిగింది ఈ సంఘటన. ఇక అశోక్ గురించి వస్తే ఉన్నత ఉద్యోగాన్ని వదులుకుని ‘అవహాన్’తో పనిచేయడానికి ముందుకు వచ్చారు. గత పదేళ్లగా దీనికి హెడ్గా పనిచేస్తున్నారు. తన పూర్తి జీవితాన్ని వీరి కోసమే కేటాయించాడు. ఈ సమస్య గురించి అశోక్ ‘ఇది జీవితాలను పిండి చేసే ప్రదేశం.. ఇక్కడ మహిళలు రూ. 50 కోసం తమను తాము అమ్ముకుంటారు.. ఇక్కడ 14 ఏళ్ల వారికి డ్రగ్స్ ఇంజక్షన్లు ఇచ్చి బలి పశువులుగా మారుస్తారు. ఇదో చీకటి ప్రపంచం. ఇక్కడ ట్రాన్స్జెండర్లుగా పుట్టడంం.. గేల మధ్య ప్రేమ మహా పాపం. మర్చిపోయిన రహదారుల వెంట ప్రయాణం చేసే ట్రక్కుల వింత ప్రపంచం ఇది. ఇవే కాక గౌరవప్రదమైన జీవితం కోసం నిత్యం యుద్దం జరిగే ప్రదేశం. వారందరికిదే జీవనం.. జీవితం. శరీరం పావుగా మారే వేళ ఇక్కడ ఆత్మ పవిత్రత కోసం పరితపిస్తింటుంది’ అంటూ సెక్స్ వర్కర్ల దయనీయ జీవితాల గురించి ఈ పుస్తకంలో చెప్పుకొచ్చారు అశోక్. -
మీ హెచ్ఐవీ స్థితి తెలుసా?
హెచ్ఐవీ.. ఎయిడ్స్ ప్రాణాంతకమైన వ్యాధి. వ్యాధి సోకినా క్రమం తప్పకుండా మందులు వాడితే ప్రాణాపాయం లేకుండా సుఖమైన జీవనం సాగించవచ్చు. వైద్యులు, కౌన్సిలర్ల సలహాలు, సూచనలు క్రమం తప్పకుండా పాటిస్తే ఆనందంగా గడపవచ్చు. ఎలాంటి అనుమానం ఉన్నా ఉచితంగా పరీక్షలు చేస్తారు. జిల్లాలోని ఐసీటీసీ కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించడంతో పాటు కౌన్సెలింగ్ ఇస్తూ వ్యాధిగ్రస్తులకు మనోస్థైర్యం కల్పిస్తున్నారు. ప్రధానంగా గర్భిణుల కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. తల్లి నుంచి బిడ్డకు రాకుండా జాగ్రత్తలు చేపట్టారు. ఈ ఏడాది‘ మీ హెచ్ఐవీ స్థితిని తెలుసుకోండి’ అనే నినాదంతో వ్యాధి నివారణకు పిలుపునిచ్చారు. కొత్తగా హెచ్ఐవీకి గురి కాకుండా చర్యలు తీసుకోవడం, వివక్ష లేకుండా చూడడం, హెచ్ఐవీ మరణాలు తగ్గించడం వంటి చర్యలు తీసుకోవాలన్నది ధ్యేయం. ఇందు కోసం జిల్లాలో డిసెంబర్ నెలలో హెచ్ఐవీపై అవగాహన సదస్సులు, హైరిస్క్ ప్రాంతాల్లో పరీక్షలు, అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించారు. ఏఆర్టీ కేంద్రాల్లో చికిత్స కోసం నమోదు చేసుకున్నవారు 20,665 మంది ఉన్నారు. మదనపల్లె సిటీ / చిత్తూరు అర్బన్ :శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని క్షీణింపజేసే వైరస్ (హ్యూమన్ ఇమ్యునో డెఫిషియన్సీ వైరస్/హెచ్ఐవీ) కారణంగా పలు వ్యాధులకు గుర య్యే పరిస్థితి ఉత్పన్నం కావడాన్ని అక్వైర్డ్ ఇమ్యునో డెఫిషియన్సీ సిండ్రోమ్ (ఎయిడ్స్) అంటారు. 25 నుంచి 44 ఏళ్ల వయసున్న పురుషుల్లో సంభవించే మరణాలకు ఎయిడ్స్ అతిపెద్ద కారణం అంటున్నారు వైద్యులు. ప్రస్తుతం సమాజాన్ని పట్టిపీడిస్తున్న ఎయిడ్స్ బారిన పడకుం డా ఉండాలంటే విశృంఖల శృంగా రానికి అడ్డుకట్ట వేయాల్సిందేనని సూచి స్తున్నారు. కణాల పాత్రే కీలకం.. వ్యాధి నిరోధక వ్యవస్థ ఏ మేరకు నాశనం చెందిందనే విషయాన్ని సీడీ–4 కణాల (టీ హెల్పర్ కణాలు–తెల్లరక్త కణాలు) సంఖ్యను బట్టి తెలుస్తుంది. మనిషిలోని వ్యాధి నిరోధక వ్యవస్థలో ఈ కణాల పాత్ర ప్రముఖమైంది. ఆరోగ్యవంతుడిలో సీడీ–4 కణాలు ప్రతిమిల్లీలీటర్ రక్తంలో 500 నుంచి 1,500 వరకు ఉంటాయి. సరైన చికిత్స తీసుకోకపోతే సీడీ–4 సంఖ్య గణనీయంగా తగ్గిపోతుంది. ఫలితంగా హెచ్ఐవీ లక్షణాలు కనిపించడం ఆరంభమవుతుంది. వ్యాధి గుర్తించడానికి ఇదేళ్లు హెచ్ఐవీ క్రిములు శరీరంలోకి ప్రవేశించిన తర్వాత వ్యాధి లక్షణాలు కనిపించడానికి సగటున 5 నుంచి 10 సంవత్సరాలు పడుతుంది. ఇలా కనిపించే లక్షణాల్లో అధికంగా హెచ్ఐవీ క్రిముల కారణంగా కాకుండా శరీరంలో వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోవడం వల్ల సోకే ఇతర ఇన్ఫెక్షన్లకు చెందినవై ఉంటాయి. హెచ్ఐవీ క్రిములు శరీరంలోకి చేరిన తర్వాత అవి విభజన చెంది వాటి సంఖ్య పెరిగి, వ్యాధి నిరోధక వ్యవస్థ చిన్నాభిన్నం కావడానికి కొన్ని వారాల నుంచి నెల వరకు పట్టవచ్చు. ఈ సమయంలో పరీక్షలు చేయించుకుంటే హెచ్ఐవీ పాజిటివ్ అని ఫలితం రాదు. అయితే బాధితులు మాత్రం ఈ వ్యాధి మరొకరికి వ్యాపింపజేయగలిగే స్థితిలో ఉంటారు. అందుబాటులో ఏటీఆర్ కేంద్రాలు జిల్లాలో హెచ్ఐవీ, ఎయిడ్స్ బాధితులకు వైద్య సేవలు అందించడం కోసం ఏఆర్టీ కేంద్రాలు ఉన్నాయి. ఇందులో 2 వేల మంది కంటే ఎక్కువగా రోగులు నమోదు ఉన్న తిరుపతి కేంద్రానికి ఏఆర్టీ ప్ల్లస్ గుర్తింపు వచ్చింది. ఇక్కడికి కడప, నెల్లూరు, అనంతపురం జిల్లాల నుంచి రోగులు వస్తున్నారు. వీటితో పాటు శ్రీకాళహస్తి, కుప్పం, వి.కోట, పలమనేరు, బంగారుపాళ్యం, సత్యవేడు, పూతలపట్టు, పీలేరు, సదుం, పుంగనూరులాంటి ప్రాంతాల్లో 11 లింక్ ఏఆర్టీలు ఉన్నాయి. 350, అంతకంటే తక్కువ తెల్ల రక్తకణాలు ఉన్నవారు, హెచ్ఐవీ ఉన్న గర్భిణులు, టీబీ, హెచ్ఐవీ ఉన్న వారు జీవితాంతం మందులు వాడాల్సి ఉంటుంది. హెచ్ఐవీ ఇన్ఫెక్షన్తో బాధపడుతున్న తల్లులకు, పిల్లలకు 28 వారాల పాటు యాంటీ రిట్రోవైరల్ మందులు ఇవ్వ డంతో ఇన్పెక్షన్లు తల్లి నుంచి బిడ్డకు సంక్రమించకుండా నివారించవచ్చు. నేడు భారీ ఎత్తున ర్యాలీలు ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం పురస్కరించుకుని చిత్తూరు జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రి నుంచి ర్యాలీ నిర్వహించనున్నట్లు జిల్లా ఎయిడ్స్ కం ట్రోల్ అధికారిణి డాక్టర్ అరుణ సులోచన తెలి పారు. అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరి«ధిలో కూడా ర్యాలీలు అవగాహన ర్యాలీలు నిర్వహిస్తారని పేర్కొన్నారు. వ్యాధి ఇలా వస్తుంది.. ♦ సురక్షితం కాని లైంగిక సంబంధాలు ♦ మాదక ద్రవ్యాల వంటి వాటిని తీసుకునేందుకు ఒకే సిరంజి, సూదిని ఉపయోగించడం. ♦ రక్త మార్పిడి, హెచ్ఐవీ సోకిన గర్భిణి నుంచి పుట్టబోయే బిడ్డకు రావచ్చు. శిశువు గర్భంలో ఉన్నప్పుడు గానీ, జనన సమయంలో గానీ వ్యాపించే అవకాశం ఉంది. సర్జికల్æ ఇన్స్ట్రుమెంట్స్ను శుభ్ర పరచకుండా వాడితే వ్యాపిస్తుంది. ఇలా రాదు.. ♦ హెచ్ ఐవీ బాధితుడికి షేక్హ్యాండ్ ఇచ్చినా, కలిసి భోజనం చేసినా వ్యాపించదు. ♦ హెచ్ఐవీ బాధితులను ముద్దు పెట్టుకుంటే వ్యాధి వ్యాప్తి చెందుతుందనడానికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలూ లేవు. దోమలు కుట్టడం వల్ల ఈ వ్యాధి వ్యాప్తి చెందదు. ♦ వివాహేతర సంబంధాలకు దూరంగా ఉండడం. ♦ నమ్మకమైన దాంపత్య జీవితాన్ని పాటిస్తూ జీవిత భాగస్వామి తోనే లైంగిక సంబంధం కలిగి ఉండడం. ♦ సరైన పద్ధతిలో కండోమ్ వాడడం. ♦ హెచ్ఐవీ బాధితులు జీవితకాలం మందులు క్రమం తప్పకుండా వాడాలి. సాంకేతిక పద్ధతిలో సరైన మందులు వాడితే దీర్ఘకాలం జీవించొచ్చు. జాగ్రత్తలు తప్పనిసరి గర్భిణికి హెచ్ఐవీ ఉందని పరీక్షల్లో తేలితే ఆమెను ఏఆర్టీ సెంటర్కు పంపిస్తాం. అక్కడ ఆమెకు సీడీ4 కౌంట ర్ పరీక్ష చేస్తారు. గతంలో సీడీ4 కౌంట్æ 350 ఉంటే గానీ మందులు ఇచ్చేవారు కాదు. ఇప్పుడు 300లోపు ఉన్నా మందులు ఇస్తున్నారు. ఈ మందులు వాడుతూనే గైనకాలజిస్టు వద్ద నెలనెలా పరీక్షలు చేయించుకోవాలి. ఏఆర్టీ మందులు వాడితే సిజేరియన్ అవసరం లేదు. –అరుణ సులోచన, అడిషనల్ డీఎంహెచ్ఓ, చిత్తూరు -
ఆ కేసుల్లో భారత్ టాప్
ఐక్యరాజ్యసమితి: దక్షిణాసియాలో హెచ్ఐవీతో బాధపడే యువతీయువకులు భారత్లోనే అత్యధికంగా ఉన్నారని యూనిసెఫ్ తెలిపింది. 2017 సంవత్సరానికి గానూ భారత్లో 19 ఏళ్లలోపు వయస్సున్నవారిలో 1,20,000 మంది హెచ్ఐవీతో బాధపడుతున్నారని వెల్లడించింది. ఈ వ్యాధి వ్యాప్తిని నిరోధించేందుకు తగిన చర్యలు తీసుకోకుంటే 2030 నాటికి ప్రపంచవ్యాప్తంగా రోజుకు 80 మంది యువతీయువకులు చనిపోతారని హెచ్చరించింది. ఈ మేరకు ‘చిల్డ్రన్–హెచ్ఐవీ అండ్ ఎయిడ్స్– ది వరల్డ్ ఇన్ 2030’ పేరుతో యూనిసెఫ్ ఓ నివేదికను విడుదల చేసింది. చిన్నారులు, యువత, గర్భిణుల్లో హెచ్ఐవీ కేసుల్ని నియంత్రించడంలో దక్షిణాసియా గణనీయమైన పురోగతి సాధించిందని యూనిసెఫ్ తెలిపింది. ఈ విషయంలో భారత్తో పోల్చుకుంటే పాకిస్తాన్(5,800 మంది), నేపాల్(1,600), బంగ్లాదేశ్(వెయ్యి కంటే తక్కువ) మరింత మెరుగైన ఫలితాలు సాధించాయంది. -
హెచ్ఐవీలో విశాఖ @ 9
తగ్గుతున్న హెచ్ఐవీ కేసులు : విశాఖ జిల్లాలో 2014 నుంంచి 2018 వరకూ హెచ్ఐవీ కేసుల తీరు తెన్నులు పరిశీలిస్తే.. ఏటేటా గణనీయంగాతగ్గుతున్నాయి. 2014లో 98,169 మందిని పరీక్షిస్తే 2464 మందికి హెచ్ఐవీ పాజిటివ్గా తేలింది. 2015–166లో 96081 మంందికి పరీక్షలు చేయగా 2,180 కేసులు నమోదయ్యాయి. హెచ్ఐవీ కేసులు 2007 నుంచి క్రమేపీ తగ్గుముఖం పడుతూ వస్తున్నాయి. గత ఏడాది 1,03,616 మందిని పరీక్షించగా 2,017 మందికి , ఈ ఏడాది ఇప్పటిదాకా 63,325 మందికి పరీక్షలు చేయగా 1,046 మందికి పాజిటివ్గా తేలింది. దీనిని బట్టి గడచిన 10 ఏళ్ల నుంచి చూస్తే హెచ్ఐవీని పరీక్షించుకునే వారి సంంఖ్య పెరుగుతుంండగా.. పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుతూ వస్తున్నట్టుస్పష్టమవుతోంది. పెదవాల్తేరు(విశాఖ తూర్పు): పులిరాజాకు ఎయిడ్స్ వస్తుందా?.. ఒకప్పుడు విస్తృతంగా జరిగిన ప్రచారం ఇది. ఉత్కంఠను రేకెత్తించడమే కాదు, ఉపద్రవంలా మారిన ఎయిడ్స్/ హెచ్ఐవీపై అవగాహన పెంపొందించడానికి దోహదపడిన ప్రచారం ఇది. కొన్నేళ్లుగా ఈ ప్రచార జోరు కనబడనంతగా తగ్గింది. ఇంతకూ జనాలను మహమ్మారిలా హడలెత్తించిన ఈ పులి విశాఖ జిల్లాలో క్రమంగా తన ఉనికి కోల్పోతోంది. గత ఏడాది ఎయిడ్స్/ హెచ్ఐవీ రోగుల సంఖ్యలో జిల్లా 4వ స్థానంలో ఉండగా..ఈ ఏడాది 9వ స్థానానికి మారింది. అధికారులు, స్వచ్ఛంద సంస్థలు కల్పించిన అవగాహన సత్ఫాలితాలను ఇచ్చింది. ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకూ... ఈ ఏడాది ఏప్రిల్ æనుంచి అక్టోబర్ వరకూ జిల్లా ఆస్ప?త్రుల్లో హైఐవీ పరీక్షలు చేయించుకోగా..వారిలో 1,046 మందికి హెచ్ఐవీఉన్నట్టు నిర్ధారణ అయింది. జిల్లాలో హెచ్ఐవీ సోకిన వారి కోసం నాలుగు యాంటీ రెట్రో వైరల్æ చికిత్సా కేంద్రాలు ఉన్నాయి. వీరిలో32,790 మంది రోగులు చికిత్స పొందుతున్నారు. ఎయిడ్ బారిన పడిన సుమారు 2,500 మంది బాధితులు పింఛన్లు పొందుతున్నారు. ఏఆర్టీ సెంటర్లలో నమోదైనవారు హెచ్ఐవీ ఉండి యాంటీ రిట్రో వైరల్æ మందుల కోసంం ఏఆర్టీ సెంటరులో మొత్తం 32,790 మంది నమోదు చేయించుకున్నారు. వారిలో 16,890 పురుషులు, 14621 స్త్రీలు. మగ పిల్లలు 661, ఆడపిల్లలు 522 మంది. హెచ్ఐవీ ఉండి యాంటీ రిట్రోవైరల్ నివారణ మందులు (ఏఆర్టీ) వాడుతున్నావారు మొత్తం 15,495 మంది ఉండగా..వారిలో 6,822 పురుషులు, 8047 మంది స్త్రీలు, మగ పిల్లలు 335, ఆడ పిల్లలు 259 మంది వున్నారు. హెచ్ఐవి స్థితిని తెలుసుకోండి పెదవాల్తేరు(విశాఖతూర్పు): ఈ ఏడాది ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా మీ హెచ్ఐవీ స్థితిని తెలుసుకోండి అనే కొత్త నినాదంతో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని జిల్లా వైద్య–ఆరోగ్యశాఖ అధికారి ఎస్.తిరుపతిరావు వెల్లడించారు. రేసపువానిపాలెంలో గల సంస్థ కార్యాలయంలో ఆయన శుక్రవారం మీడియా సమావేశంలో మాట్లాడారు. కొత్తగా ఎవరినీ హెచ్ఐవీ బారిన పడకుండా చేయడం, హెచ్ఐవీ సోకిన వారిని వివక్ష లేకుండా సామూహికంగా కలుపుకుని పోవడం అన్నవి ప్రధాన అంశాలుగా ప్రభుత్వ శాఖలు, స్వచ్ఛంద సంస్థలు, సంయుక్తంగా ఈ లక్ష్యాన్ని సాధించే దిశగా కార్యక్రమాలు జరుగుతాయన్నారు. ఈ ఏడాది జూన్ ఒకటి నుంచి జూన్ 30 వరకు తల్లిబిడ్డ రక్ష కార్యక్రమం ద్వారా ప్రత్యేక డ్రైవ్ నిర్వహించామన్నారు. జిల్లాలో సుమారుగా 3వేలమంది ఎయిడ్స్ రోగులు కేజీహెచ్, టీబీ ఆస్పత్రి, అనకాపల్లి, నర్సీపట్నం ఆస్పత్రుల ద్వారా ఏఆర్టీ మందులు పొందుతున్నారన్నారు. జిల్లా ఎయిడ్స్ కంట్రోల్సొసైటీ అధికారి డాక్టర్ ఆర్.రమేష్ మాట్లాడుతూ, డిసెంబర్ ఒకటవ తేదీన ఉదయం 9 గంటలకు జీవీఎంసీ గాంధీ విగ్రహం నుంచి ఏయూ వరకు భారీ ర్యాలీ జరుగుతుందన్నారు. జిల్లా కలెక్టర్, ప్రజాప్రతినిధులు పాల్గొంటారన్నారు. మీడియా సమావేశంలో జిల్లావైద్య–ఆరోగ్యశాఖ సిబ్బంది కూడా పాల్గొన్నారు. నేడు జీవీఎంసీ నుంచి ఏయూ వరకూ ర్యాలీ :నివారణ చర్యలు ముమ్మరం ఎయిడ్స్ నివారణ, నియంత్రణలో భాగంంగా ఈ ఏడాది వినూత్న కార్యక్రమాలు చేపడుతున్నాం. ఆరోగ్యసంస్థ మార్గదర్శకాల ప్రకారం సీడీ 4పరీక్షతో నిమిత్తంం లేకుంండా హెచ్ఐవీ/ఎయిడ్స్ పాజిటివ్ అని నిర్ధారణ అయిన వెంంటనే ఎఆర్టీ చికిత్స ప్రారంభించడంం జరుగుతుంది. రక్తసేకరణ, రవాణా వాహనం ద్వారా స్వచ్ఛంద రక్త దానశాతాన్ని పెంచి, రక్తకొరత లేకుండా చేయడం, హెచ్ఐవీ/ఎయిడ్స్తో జీవిస్తున్న వారికి ఎన్టీఆర్భరోసా ద్వారా జిల్లాలో 4వేలకు పైగా మందికి పింఛన్లు పంపిణీ చేస్తున్నాం. ఏపీ బ్లడ్ సెల్æ యాప్ ద్వారా బ్లడ్బ్యాంక్, రక్తనిల్వలు వివరాలు తెలుసుకోవచ్చు. సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ ద్వారా హెచ్ఐవీ, ఎయిడ్స్తో జీవిస్తున్న 137 మంది గిరిజనులకు పంచామృతం కార్యక్రమంం ద్వారా పౌష్టికాహారం పంపిణీ చేస్తున్నారు.– డాక్టర్ ఆర్.రమేష్, జిల్లా ఎయిడ్స్ నివారణ,నియంత్రణ విభాగం అధికారి, విశాఖపట్నం. వివిధ సంస్థల సహకారంతో.. ప్రస్తుత కాలంలో ప్రజల జీవన శైలి ఎయిడ్స్ వ్యాప్తికి దోహదం చేస్తోంది. నైతికపరమైన విలువలతో కూడిన జీవన విధానం ద్వారానే ఈ వ్యాధి నియంంత్రణ సాధ్యపడుతుంది. ముఖ్యంంగా హెచ్ఐవీపై అవగాహన కల్పించేందుకు పలు సంస్థల సహకారంతో నెలకు మూడు సమావేశాలు ఏరా ?టు చేస్తున్నాం. అసలు వ్యాధి రాకుండానే తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరిస్తున్నాం. – డాక్టర్ ఎస్.తిరుపతిరావు,జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి,విశాఖ. 9వ స్థానంలో విశాఖ ఆరోగ్యసంస్థ సర్వే ప్రకారం భారతదేశంలో ఎయిడ్స్వ్యాధిగ్రస్తులు అధికంగా ఉన్న రాష్ట్రం ఏమైనా ఉందంటే..అది ఆంధ్రప్రదేశే. ఎయిడ్స్పై అవగాహన లోపించడం రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలదే. 1981లో తొలిసారిగా ఎయిడ్స్ను కనుగొన్నప్పుడు కేవలం నలుగురికి మాత్రమే ఉంది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా 36.9 మిలియన్ల మంది ఈ వ్యాధితో బాధపడుతున్నారంటే పరిస్థితి ఏ మేరకు ఉందో అర్థం చేసుకోవచ్చు. బిల్æగేట్, క్లింటన్ ఫౌండేషన్ల నుంచి నిధులు వచ్చినంంత కాలం ఎయిడ్స్ నివారణకు విస్తత ప్రచారాలు చేసిన రెండు ప్రభుత్వాలు, ఆ నిధులు ఆగిపోవడంంతో ప్రచారాన్ని, అవగాహన కార్యక్రమాలను గాలికొదిలేశాయి.– కూటికుప్పల సూర్యారావు, ప్రముఖ వైద్యుడు -
జీవితంలో గరళం.. హృదయంలో అమృతం
అది నయం కాని వ్యాధి. మందులు వాడినన్ని రోజులూ జీవితాన్నిస్తుంది. ఆపేస్తే ప్రాణాలు తీసేసుకుంటుంది. అలాగని ‘నాకు ఈ వ్యాధి ఉంది’ అని ఎవ్వరికీ చెప్పుకోలేనిది. అది పెట్టే బాధ కన్నా సమాజం పెట్టే బాధ.. దానిని.. పంటిబిగువున తట్టుకుని నిలబడటం సాధ్యం కాదు. ఇలాంటి బాధను భరిస్తూ ఓ మహిళ ఒంటరి పోరాటం చేస్తోంది. తెలిసో తెలియకో భర్త చేసిన తప్పు ఆయనతో పాటు భార్యాబిడ్డలనూ వెంటాడింది. ఆ మహమ్మారి.. భర్తను బలి తీసుకున్నా, తనను బంధువుల్లో, సమాజంలో వివక్షకు గురిచేసినా ఆమె వెరవలేదు. భర్త చేసిన తప్పు వల్ల తనతో పాటు కుమార్తె అనుభవించిన క్షోభ మరెవ్వరికీ కలగకూడదని ఆమె భావించింది. హెచ్.ఐ.వి.పై విస్తృతంగా అవగాహన కల్పిస్తోంది. ఇప్పటికే ఆ వ్యాధి బారిన పడ్డ వారికి ప్రభుత్వం ద్వారా అందే అన్ని రకాల ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకుంటోంది. హెచ్.ఐ.వి. కారణంగా కుటుంబ సభ్యులు దూరం చేసిన వారిని అక్కున చేర్చుకుని వారిని సేవా కేంద్రాలకు పంపిస్తోంది. హెచ్ఐవి, ఎయిడ్స్తో మరణించిన వారిని అయినవారు తీసుకెళ్లకపోతే తనే అన్నీ అయి స్వయంగా అంత్యక్రియలు నిర్వహించి ఆదర్శంగా నిలుస్తోంది. ఆ ఆదర్శ మహిళే.. సుధారాణి. భర్త ద్వారా సంక్రమించింది ఆళ్లగడ్డకు చెందిన శ్రీనివాసరావు 22 ఏళ్ల క్రితం గుంటూరు సమీపంలోని ఓ గ్రామంలో టెలిఫోన్ బూత్ నిర్వహించేవారు. అందులోనే స్థానికంగా నివాసం ఉండే సుధారాణి పనిలో చేరింది. వారిద్దరి మధ్యా పరిచయం ప్రేమగా మారింది. వీరి పెళ్లికి మొదట పెద్దలు నిరాకరించినా తర్వాత ఒప్పుకున్నారు. 1997లో వీరి వివాహం జరిగింది. ఈ దంపతులకు ఒక పాప కూడా జన్మించింది. గతంలో తిరిగిన తిరుగుళ్లకు శ్రీనివాసరావుకు హెచ్.ఐ.వి. సోకింది. ఈ కారణంగా ఆయన భార్య, పిల్లలూ ఇబ్బంది బలయ్యారు. ఈ సమయంలో శ్రీనివాసరావు కుటుంబ సభ్యుల నుంచి సుధారాణి తీవ్ర వివక్షకు గురయ్యింది. తమ వాడికి ఎలాగో వ్యాధి వచ్చింది. ఆయనతో పాటు మిమ్మల్నీ చూడాలంటే సాధ్యం కాదని వెళ్లగొట్టారు. వ్యాధితో ఏడేళ్ల పాటు బాధను అనుభవించి 2005లో శ్రీనివాసరావు మరణించాడు. భర్త దహనసంస్కారాలు, పెద్దకర్మ కార్యక్రమాలు ముగిసిన వెంటనే సుధారాణిని పుట్టింటికి పంపించేశారు. ప్రేమపెళ్లిని కాదని సుధారాణిని దూరంగా ఉంచిన ఆమె తల్లిదండ్రులు భర్త చనిపోయిన తర్వాత మాత్రం అక్కున చేర్చుకున్నారు. ఆమెకూ ఆ వ్యాధి ఉందని తెలిసినా.. మేమున్నామంటూ ఓదార్చారు. దీంతో కొండంత ధైర్యంతో సుధారాణి తన జీవితాన్ని కొనసాగించారు. వైద్యుల సలహాతో ఏఆర్టి మందులు వాడుతూ పదహారేళ్లుగా ఆరోగ్యంగా జీవిస్తున్నారు. అవుట్ రీచ్ వర్కర్గా సేవలు తన జీవితం ఎలాగూ అస్తవ్యస్తమయ్యింది. తనలా మరొకరు ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కోకూడదని, అలాంటి వారిని అక్కున చేర్చుకుని ఆదరించాలని సుధారాణి నిర్ణయించుకున్నారు. భర్త మరణించిన తర్వాత పీపీటీసీటీ ప్లస్ ప్రోగ్రామ్లో భాగంగా సెయింట్ యాన్స్లో అవుట్రీచ్ వర్కర్గా చేరారు. ఇందులో భాగంగా గర్భిణిలను గుర్తించి వారిని ఆసుపత్రికి తీసుకెళ్లి హెచ్ఐవి పరీక్షలు చేయించి, ఒకవేళ వారికి హెచ్ఐవి ఉంటే బిడ్డకు ఆ వ్యాధి రాకుండా జాగ్రత్త పడేలా వైద్యులతో చికిత్స చేయిస్తున్నారు. గర్భిణిలకు బిడ్డ పుట్టిన తర్వాత కూడా 18 నెలల పాటు ఫాలో అప్ చేస్తున్నారు. బాధితుల కోసం కర్నూలుతో ‘నేస్తం’ డ్రాపింగ్ సెంటర్ ప్రాజెక్ట్ కో ఆర్డినేటర్గా పనిచేసేందుకు 2007లో సుధారాణి కర్నూలు వచ్చారు. కర్నూలులో ‘నేస్తం ఫర్ రాయలసీమ రీజియన్ పీపుల్ లివింగ్ విత్ హెచ్ఐవి అండ్ ఎయిడ్స్ వెల్ఫేర్ సొసైటీ’ని స్థాపించారు. డ్రాపింగ్ సెంటర్ ద్వారా హెచ్ఐవి ఉన్న వారికి ఏవైనా సమస్యలుంటే పరిష్కరిస్తూ, వారు ఎవరి వల్లనైనా వివక్షకు గురవుతుంటే వెళ్లి కౌన్సెలింగ్ ఇప్పిస్తున్నారు సుధారాణి. అలాగే హెచ్ఐవి/ఎయిడ్స్పై కళాశాలలు, పాఠశాలలు, మహిళా ప్రాంగణాల్లో ఇప్పటి వరకు 220లకు పైగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. హెచ్ఐవితో ఉన్న వారికి తిరిగి చెల్లించనవసరం లేని రుణాలు ఇప్పించారు. ఇటీవలే ‘విహాన్ కేర్ అండ్ సపోర్ట్ సెంటర్’ ఏర్పాటు చేశారు. హెచ్ఐవితో జీవించే వారిని గుర్తించి, వారిని ఏఆర్టి సెంటర్తో లింకప్ చేసి మందులు తీసుకునేలా చేయడం, అవసరమున్న వారికి వైద్యుల వద్దకు రెఫర్ చేయడం ఈ సెంటర్ ద్వారా నిర్వహిస్తున్నారు. హెచ్ఐవితో బాధపడుతూ చురుకుగా, కాస్త ఆరోగ్యంగా ఉన్న వారితో ఇతరులు ఆ వ్యాధికి గురిగాకుండా వారితోనే చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అలాగే హెచ్ఐవి బారిన పడిన పిల్లలను ఐసీపీఎస్కు లింకప్ చేసి, వారికి ఏఆర్టి సెంటర్ ద్వారా మందులు అందుకునేలా చేయడంతోపాటు, నెలకు రూ.1000లు పింఛన్ వచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికి పది వేల మంది హెచ్ఐవి బాధితులను గుర్తించి, వారిని ఏఆర్టి సెంటర్కు పంపించి మందులు ఇప్పించారు. అలాగే 104 మంది హెచ్ఐవి బాధిత చిన్నారులను గుర్తించి, వారి డాక్యుమెంట్లను ప్రభుత్వానికి పంపి ఒక్కొక్కరికి నెలకు రూ.500 లు ఆర్థిక సహాయం అందేలా చేశారు. శాంతి ఆశ్రమ ట్రస్ట్ వ్యవస్థాపకులు హిమాలయ గురూజీ ద్వారా ఏఆర్టి కేంద్రంలో చికిత్స పొందేందుకు వచ్చే 100 మందికి మధ్యాహ్న భోజనాన్ని ప్రతిరోజూ అందేలా చూశారు. హెచ్ఐవి కారణంగా కుటుంబసభ్యులు దూరం చేసిన వారిని కర్నూలు లోని శాంతినికేతన్, అభయగిరి సెంటర్లతో పాటు అనంతపురంలోని ఆర్డిటికి పంపిస్తున్నారు. వీరిలో ఎవరైనా చనిపోతే స్వయంగా దగ్గరుండి అంత్యక్రియలు జరిపిస్తున్నారు. – జె.కుమార్, సాక్షి, కర్నూలు నేను పడ్డ క్షోభ ఎవరూ పడకూడదనే ఆ వ్యాధి బయటపడినప్పటి నుంచి నేను, నా భర్త పడిన క్షోభ అంతా ఇంతా కాదు. ఆయన మంచాన పడ్డప్పుడు ఏ ఒక్కరూ వచ్చి చేయందించింది లేదు. సమాజంతో పాటు బంధువుల, స్నేహితులూ మమ్ములను దూరం చేశారు. ఐదేళ్ల పాటు ఆయనను కాపాడుకున్నా, చివరికి విధి గెలిచి ఆయనను మా నుంచి దూరం చేసింది. ఆ తర్వాత అమ్మ, తమ్ముడు నాకు పెద్ద దిక్కయ్యారు. సమాజం ఏమనుకున్నా ఫరవాలేదని అండగా నిలిచారు. వారి ప్రోత్సాహం వల్లే నేను ఈరోజు ఈస్థాయిలో ఉన్నాను. ఈ వ్యాధి భారిన పడిన వారు నాలాగా బాధపడకూడదని భావించి హెచ్ఐవి/ఎయిడ్స్ బాధితులకు నా వంతు సేవ చేస్తున్నాను. – బి. సుధారాణి, నేస్తం కో ఆర్డినేటర్ -
గ్రాఫీన్తో సరికొత్త ఇంధనం!
ఏటికేడాదీ పెరిగిపోతున్న కాలుష్యానికి చెక్ పెట్టేందుకు స్వీడన్లోని లింక్పింగ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఓ వినూత్న పరిష్కారాన్ని సిద్ధం చేశారు. కాలుష్యకారక కార్బన్డైయాౖMð్సడ్ను నీటితో కలిపి ఎథనాల్, మీథేన్ వంటి ఇంధనాలను తయారు చేయవచ్చునని వీరు నిరూపించారు. రేపటితరం అద్భుత పదార్థంగా చెబుతున్న గ్రాఫీన్ సాయంతో తాము ఈ అద్భుతాన్ని సాధించగలిగామని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త జియాన్వూ సన్ తెలిపారు. సిలికాన్, కార్బన్లతో తయారైన క్యూబిక్ సిలికాన్ కార్బైడ్కు గ్రాఫీన్ను పూతగా పూసినప్పుడు అది సూపర్ కండక్టర్గా వ్యవహరిస్తుందని.. ఇది కార్బన్డైయాక్సైడ్తో కూడిన నీటిని ఆక్సిజన్, హైడ్రోజన్లుగా విడగొడుతుందని, వీటి నుంచి మీథేన్, ఎథనాల్లను తయారు చేయవచ్చునని వివరించారు. ఇలాంటి సూపర్ కండక్టర్లతో ప్రసార సమయంలో జరిగే విద్యుత్తు నష్టాన్ని లేకుండా చేయవచ్చునని జియాన్వూ సన్ అంటున్నారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సూపర్ కండక్టర్లు అత్యంత తక్కువ ఉష్ణోగ్రతల్లో మాత్రమే పనిచేస్తూండగా.. కొత్తవి మాత్రం సాధారణ ఉష్ణోగ్రతల్లోనూ పనిచేస్తాయని తెలిపారు. జన్యువులకు.. దీర్ఘాయుష్షుకు సంబంధం లేదు! వినడానికి కొంత ఆశ్చర్యంగా అనిపిస్తుందిగానీ.. జన్యువులకు, దీర్ఘాయుష్షుకు ఎలాంటి సంబంధం లేదని అంటున్నారు కాలికో లైఫ్ అనే కంపెనీ శాస్త్రవేత్తలు. దాదాపు 40 కోట్ల మందితో కూడిన వంశవృక్షాలను పరిశీలించి మరీ తాము ఈ అంచనాకు వచ్చామని అంటున్నారు ఈ పరిశోధనలో పాల్గొన్న శాస్త్రవేత్త గ్రాహం రూబీ! జన్యువులతో చాలా విషయాలు తెలుస్తాయన్నది నిజమేనని.. కాకపోతే ఆయుష్షుకు మాత్రం ఇది వర్తించదని రూబీ అంటారు. జన్యుమార్పుల ఆధారంగా తండ్రుల నుంచి వారసత్వంగా వచ్చే ఆయుష్షు 15 – 30 శాతం మాత్రమేనని గతంలోనే లెక్కకట్టారు. జీవనశైలి, సామాజిక, సాంస్కృతిక కారణాలు, ప్రమాదాలు వంటి వాటిని పరిగణనలోకి తీసుకోకుండా లెక్కించడం ద్వారా ఈ అంచనా ఏర్పడింది. తాజా అధ్యయనంలో కాలికో రీసెర్చ్ శాస్త్రవేత్తలు ఆన్సిస్ట్రీ వెబ్సైట్లోని అమెరికా, యూరప్లకు చెందిన 40 కోట్ల మంది వివరాలను విశ్లేషించారు. ఒకే కుటుంబం.. ఇంటిపేరున్న వారిలో ఎవరి ఆయుష్షు ఎంత? అన్నది లెక్కకట్టింది. ఇది ఏడు శాతం కూడా లేదని స్పష్టమైంది. మొత్తమ్మీద చూస్తే ఆయుష్షుకు.. మన జన్యువులకు అస్సలు సంబంధం లేదన్నది ఈ అధ్యయనం సారాంశం. సెల్ఫోన్తో హెచ్ఐవీని గుర్తించవచ్చు! మనిషిని నిలువునా నిర్వీర్యం చేసేసే హెచ్ఐవీని ఎంత వేగంగా గుర్తిస్తే అంతమేలన్నది అందరికీ తెలిసిన విషయమే. కాకపోతే ఇప్పటివరకూ ఉన్న పద్ధతులతో ఇది అసాధ్యం. అందుకే బ్రైగమ్ అండ్ విమెన్స్ హాస్పిటల్ శాస్త్రవేత్తలు ఓ వినూత్నమైన కొత్త పద్ధతిని ఆవిష్కరించారు. అందరి చేతుల్లో ఉండే మొబైల్ఫోన్ సాయంతో పనిచేసే ఈ సరికొత్త టెక్నాలజీ.. చుక్క రక్తంతోనే హెచ్ఐవీ వ్యాధి ఉన్నదీ లేనిదీ స్పష్టం చేసేస్తుంది. ప్రస్తుతం ఖరీదైన పాలిమరేస్ చెయిన్ రియాక్షన్ సాయంతో హెచ్ఐవీ వైరస్ను గుర్తిస్తున్నారు. బ్రైగమ్ శాస్త్రవేత్తలు నానోటెక్నాలజీ సాయంతో ఓ మైక్రోప్రాసెసర్, మొబైల్ఫోన్ ద్వారా వైరస్ తాలూకూ ఆర్ఎన్ఏ న్యూక్లియిక్ యసిడ్లను గుర్తించే ఓ వ్యవస్థను సిద్ధం చేశారు. త్రీడీ ప్రింటింగ్ టెక్నాలజీతో తయారైన ఓ యంత్రాన్ని మొబైల్ఫోన్కు అనుసంధానించుకుని చుక్క రక్తం వేస్తే సరి.. 99.1 శాతం కచ్చితత్వంతో హెచ్ఐవీ వైరస్ను గుర్తించవచ్చు. భవిష్యత్తులో ఈ టెక్నాలజీని ఇతర వైరస్, బ్యాక్టీరియా గుర్తింపునకూ ఉపయోగించవచ్చునని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త షఫీ తెలిపారు. -
హెచ్ఐవీ నివారణకు సరికొత్త మందు..
ప్రమాదకరమైన హెచ్ఐవీ వ్యాధిని నిరోధించేందుకు, చికిత్స చేసేందుకూ యూనివిర్శటీ ఆఫ్ నార్త్ కారొలీనా శాస్త్రవేత్తలు సరికొత్త పద్ధతిని సిద్ధం చేశారు. ఇంజెక్షన్ల ద్వారా శరీరంలోకి ఓ గాడ్జెట్లాంటిది ప్రవేశపెట్టి దాని ద్వారా మందు నిత్యం అందుబాటులో ఉండేలా చేయడం ఇందులోని విశేషం. రోజుకో మాత్ర వేసుకోవడం ద్వారా హెచ్ఐవీ రాకుండా ఉండేందుకు ఇప్పటికే అవకాశముంది. అలాగే యాంటీ రెట్రోవైరల్ మందులను క్రమం తప్పకుండా వాడటం వ్యాధి నుంచి రక్షణ కల్పిస్తుందనీ మనకు తెలుసు. అయితే ప్రతిరోజూ మందులేసుకోవడంలో ఉన్న ఇబ్బందులను దష్టిలో ఉంచుకుని మార్టినా కొవరోవా అనే శాస్త్రవేత్త ఈ కొత్త పద్ధతి కోసం పరిశోధనలు చేసి విజయం సాధించారు. ఈ పద్ధతిలో హెచ్ఐవీ మందు, ఓ సాల్వెంట్, ప్లాస్టిక్లను కలిపి ఓ గడ్డలా తయారు చేసి. గొట్టంలాంటి గాడ్జెట్లోకి ఎక్కిస్తారు. ఈ గొట్టాన్ని చర్మం అడుగుభాగంలోకి జొప్పించినప్పుడు ప్లాస్టిక్ క్రమేపీ కరిగిపోతూ వస్తుంది. ఈ క్రమంలో సాల్వెంట్తో కూడిన మందు నెమ్మదిగా అందడం మొదలవుతుంది. జంతువులపై జరిపిన ప్రయోగాల్లో ఒక్కో గాడ్జెట్ దాదాపు ఐదు నెలలపాటు మందు అందించినట్లు తెలిసిందని, ఎలాంటి ఇతర దుష్ఫలితాలూ లేవని మార్టినా వివరించారు. -
హెచ్ఐవీ పంజా!
జిల్లాలో హెచ్ఐవీ వైరస్ పంజా విసురుతోంది. ప్రతి నెలా 250 నుంచి 300 కొత్త కేసులు నమోదవుతున్నారు. ఒక్క విజయవాడలోనే నెలకు వంద కేసులకు తక్కువకాకుండా రికార్డవుతున్నాయి. పరిస్థితి ఇలా ఉంటే నివారణ చర్యలు తీసుకోవాల్సిన అధికారులు చోద్యం చూస్తున్నారు. కాకిలెక్కలు చెబుతూ కాలక్షేపం చేస్తున్నారు. నిర్లక్ష్యం వీడకుంటే భారీమూల్యం చెల్లించుకోవాల్సివస్తుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. లబ్బీపేట (విజయవాడ తూర్పు) : పులిరాజాకు ఎయిడ్స్ వస్తుందా.. అంటూ మూడు దశాబ్దాల కిందట హెచ్ఐవీ/ఎయిడ్స్పై విస్తృత ప్రచారం చేశారు. ఎయిడ్స్ ఎలా సోకుతుంది. రాకుండా ఏమి చేయాలనే దానిపై ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు అవగాహన కార్యక్రమాలతో హోరెత్తించారు. దీంతో దశాబ్దకాలం పాటు హెచ్ఐవీ కేసులు కొంత తగ్గుముఖం పట్టాయి. అయితే రెండేళ్లుగా జిల్లాలో హెచ్ఐవీ కేసుల సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ప్రతి నెలా కొత్తగా 300 కేసులు నమోదవుతుండగా, ఏడాదిలో 3 వేల నుంచి 3,500 వరకూ నమోదవుతున్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. అనధికారికంగా మరింత మంది ఉండవచ్చనేది అంచనా. ఇదే పరిస్థితి కొనసాగితే రాష్ట్రంలోనే హెచ్ఐవీ వ్యాప్తిలో జిల్లా మొదటి స్థానానికి చేరే అవకాశం ఉంది. హెచ్ఐవీ వ్యాప్తి చెందుతుందిలా.. ఒకప్పుడు లైంగిక సంపర్కం ద్వారానే ఎక్కువగా హెచ్ఐవీ వ్యాప్తి చెందేది. ప్రస్తుతం బ్లడ్ బ్యాంక్ల్లో స్క్రీనింగ్ పరీక్షలు నాసిరకంగా చేయడంతో రక్తమార్పిడి ద్వారా కూడా వ్యాపిస్తున్నట్లు తెలుస్తోంది. జిల్లాలో యువత ఇటీవల కాలంలో మత్తు పదార్థాలు, మాదకద్రవ్యాలకు ఎక్కువగా అలవాటు పడుతున్నారు. దీంతో ఒకరు వాడిన సూదిని మరొకరు వాడటం ద్వారా కూడా ఎయిడ్స్ వ్యాపిస్తున్నట్లు సమాచారం. హైటెక్ వ్యభి చారం జోరుగా సాగుతుండటం మరోకారణం. అధికారులు కాకి లెక్కలు అధికారుల లెక్కల ప్రకారం 2015లో 33 వేలు ఉండగా, 2016లో 36 వేలకు చేరింది. 2017లో 39,500 మంది హెచ్ఐవీ బాధితులు ఉండగా, తాజాగా 20 వేల మంది మాత్రమే ఉన్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. మిగిలిన 19,500 మంది ఏమయ్యారనేది ప్రశ్నార్థకంగానే మిగిలింది. వారిలో సగం మంది మృత్యువాత పడగా, మిగిలిన వారిని ఆధార్ నంబర్ ఎన్రోల్ చేయకపోవడంతో పేర్లు తొలగించి, జిల్లాలో హెచ్ఐవీ వ్యాప్తి తగ్గుముఖం పట్టిందని కాకిలెక్కలు చెబుతున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. ఒకసారి హెచ్ఐవీ పాజిటివ్ వచ్చిన తర్వాత పూర్తిగా నివారణ సాధ్యం కాదు. అలాంటిది 39 వేల మందిని, ఇప్పుడు 20 వేలే ఉన్నట్లు చెప్పడంపై విస్మయం వ్యక్తమవుతోంది. నాసిరకంగా నిర్ధారణ పరీక్షలు.. రాజమండ్రిలో ఓ గర్భిణికి హెచ్ఐవీ లేకుండానే ఐసీటీసీ సిబ్బంది పరీక్షల నివేదికలో పాజిటివ్ అని ఇవ్వడంతో వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే. అదేరీతిలో గతంలో విజయవాడ ప్రభుత్వాస్పత్రికి వచ్చిన హెచ్ఐవీ పాజిటివ్ రోగికి ర్యాపిడ్ పరీక్షలో నెగిటివ్ వచ్చింది. అయితే వైద్యులకు సదరు రోగి గతంలో పాజిటివ్ వచ్చినట్లు చెప్పడంతో ఉలిక్కిపడ్డారు. మళ్లీ పరీక్ష చేయించగా పాజిటివ్ వచ్చింది. ఐసీటీసీల్లో సరఫరా చేసే కిట్లు నాసిరకంగా ఉండటంతో నిర్ధారణ పరీక్షల్లో సైతం ప్రామాణికం ఉండటం లేదు. నిర్లక్ష్యం వహిస్తే చర్యలు జిల్లాలో హెచ్ఐవీ కొత్త కేసులు ఏడాదిలో 2,500 నుంచి 3 వేల వరకూ వస్తున్నాయి. హెచ్ఐవీ ఎయిడ్స్పై అవగాహన కలిగించడంతో పాటు, రక్తపరీక్షలు చేసేందుకు సిబ్బంది ఉన్నారు. వారు విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకుంటాం. ఏఆర్టీల్లో సైతం సిబ్బంది సక్రమంగా పనిచేయకుంటే చర్యలు తప్పవు. అన్నింటినీ ఆకస్మికంగా తనిఖీ చేస్తాం. మా డీఎల్వో పర్యవేక్షిస్తుంటారు. – డాక్టర్ ఐ.రమేష్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి -
గర్భిణికి ఎయిడ్స్ ఉందంటూ..
తూర్పుగోదావరి, తాడితోట (రాజమహేంద్రవరం): గర్భిణికి ఎయిడ్స్ ఉందంటూ తప్పుడు నివేదిక ఇచ్చిన ఘటనపై వైద్య అధికారులు ఆదివారం విచారణ నిర్వహించారు. రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రిలోని మాతా శిశు విభాగం ల్యాబ్లో గర్భిణికి రక్తపరీక్షలు చేసి ఎయిడ్స్ ఉందంటూ తప్పుడు నివేదిక ఇచ్చిన విషయం తెలిసిందే. దీనిపై డిప్యూటీ డీ అండ్ ఎంహెచ్ఓ డాక్టర్ ఎం.పవన్కుమార్, జిల్లా అసుపత్రుల సమన్వయకర్త, రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ టి.రమేష్కిషోర్, ఆర్ఎంఓ డాక్టర్ పద్మశ్రీ , విచారణాధికారి డాక్టర్ సునీత విచారణ జరిపారు. బాధితురాలు నల్లమాటి మనీషాను, ల్యాబ్ టెక్నీషియన్ రవి, కౌన్సెలర్ లలితను వేరు వేరుగా విచారణ జరిపారు. బాధితురాలు మనీషా జరిగిన క్రమాన్ని వివరించారు. తన పట్ల కౌన్సెలర్ లలిత దురుసుగా ప్రవర్తించడాన్ని అధికారులకు వివరించారు. ఎయిడ్స్ లేకుండానే ఉందంటూ బలవంతంగా తనతో మందులు వాడించేందుకు ప్రయత్నించారన్నారు. తనకు ఎయిడ్స్ లేదని చెప్పినా వినకుండా లలిత దుర్భాషలాడారన్నారు. దాంతో తాను, తన భర్త, తల్లి ఆత్మహత్యాయత్నానికి పాల్పడేందుకు యత్నించామన్నారు. తనకు ఎయిడ్స్ లేదని చెప్పినప్పుడైనా రెండోసారి టెస్ట్లు చేసేందుకు ప్రయత్నించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. శాఖాపరమైన చర్యలు తీసుకుంటాం ఈ ఘటనపై డిప్యూటీ డీ అండ్ ఎంహెచ్ఓ ఎం.పవన్కుమార్ను ప్రశ్నించగా గర్భిణికి ఇచ్చిన టెస్ట్ నివేదికలు పరిశీలించి చర్యలు తీసుకుంటామన్నారు. అయితే ఈ ఘటనపై ఇంతవరకూ ఎవరిపైనా ఏవిధమైన చర్యలూ తీసుకోలేదని బాధిత కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ల్యాబ్ టెక్నీషియన్లు ఎమైనా తప్పులు చేస్తే ప్రసూతి ఆసుపత్రిలో ఉన్న ల్యాబ్ నుంచి ప్రధాన ఆసుపత్రిలో ఉన్న ల్యాబ్కు, అక్కడ నుంచి ఇక్కడకు బదిలీ చేస్తున్నారు తప్ప వారిపై ఏ విధమైన చర్యలు తీసుకోవడం లేదని వారు ఆరోపించారు. విచారణ తూతూమంత్రంగా జరిగిందని వారు తెలిపారు. -
హెచ్ఐవీ ఉందంటూ తప్పుడు నివేదిక
తాడితోట (రాజమహేంద్రవరం): వివాహమై ఆరు నెలలైంది. గర్భిణి అని తెలియడంతో రక్త పరీక్షల కోసం రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రికి వెళ్లిన ఆ యువతికి పిడుగులాంటి వార్త అందింది. తనకు హెచ్ఐవీ ఉందంటూ ఆస్పత్రి సిబ్బంది నివేదిక ఇచ్చారు. తనకు వచ్చే అవకాశమే లేదని బాధితురాలు వాపోయినా వినిపించుకోలేదు. దీంతో ఆ యువతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. పరువు పోయిందని భావించిన ఆమె భర్త, ఆ కుటుంబమంతా ఆత్మహత్యాయత్నానికి పాల్పడుతుండగా, సన్నిహితుల సలహా మేరకు ప్రైవేట్ ల్యాబ్లో ఆ యువతి పరీక్షలు చేయించగా హెచ్ఐవీ లేదని రిపోర్టు వచ్చింది. ఒకటి కాదు రెండు కాదు నాలుగు ల్యాబ్లలో పరీక్షలు చేయించగా, హెచ్ఐవీ లేదనే తేలింది. దీంతో బాధిత కుటుంబ సభ్యులు నేరుగా ప్రభుత్వ ఆస్పత్రికి చేరుకుని నిరసనకు దిగారు. తప్పుడు నివేదిక ఇచ్చిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాజమహేంద్రవరం సంతోష్నగర్కు చెందిన నల్లామట్టి నాని ఆటో డ్రైవర్. అతని భార్య మనీషా గర్భిణి. ఈ నెల 4న రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆస్పత్రిలోని మాతా శిశు విభాగానికి వైద్య పరీక్షలకు వెళ్లింది. రక్త పరీక్షలు నిర్వహించేందుకు రక్తం శాంపిల్ తీసుకొని ఇంటికి పంపించేశారు. మరుసటి రోజున ‘మీ భర్తను తీసుకొని ఆస్పత్రికి రండి’ అంటూ ఆస్పత్రి సిబ్బంది నుంచి ఫోన్ వచ్చింది. తన భర్తను వెంటబెట్టుకొని ఆమె హడావుడిగా వెళ్లింది. ‘నీకు హెచ్ఐవీ ఉందని’ ల్యాబ్ టెక్నీషియన్ చెప్పడంతో ఆ దంపతులు హడలిపోయారు. ‘నేను బయట తిరిగేదాన్ని కాదు. పెళ్లయి ఆరు నెలలైంది. నాకు హెచ్ఐవీ ఎలా వస్తుంది’ అంటూ ఆ యువతి విలపించినా పట్టించుకోకుండా ఆస్పత్రిలో ఉన్న హెచ్ఐవీ కౌన్సిలర్ లలిత బలవంతంగా హెచ్ఐవీ విభాగం (ఏఆర్టీ సెంటర్)కు తీసుకెళ్లేందుకు ప్రయత్నించగా, భీతిల్లిన ఆమె కళ్లు తిరిగి కిందపడిపోయింది. బాధితురాలి కుటుంబం ఆత్మహత్యాయత్నం ఆ రిపోర్టుతో తీవ్ర మనోవేదనకు గురైన మనీషా 5న ఆత్మహత్య చేసుకునేందుకు బయటకు వెళ్లిపోతుండగా స్థానికులు రక్షించారు. ఆమె తల్లి, భర్త కూడా ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆ రిపోర్టు మీద నమ్మకం లేక మరో ల్యాబ్లో రక్త పరీక్షలు నిర్వహించగా హెచ్ఐవీ లేదని తేలింది. మరో మూడు చోట్ల రక్త పరీక్షలు చేయించినా హెచ్ఐవీ లేదని రిపోర్టు వచ్చింది. దీంతో ప్రభుత్వ ఆస్పత్రిలోని ల్యాబ్ టెక్నీషియన్ల నిర్లక్ష్యం వల్లే తప్పుడు రిపోర్టులు వచ్చాయని నిర్ధారణకు వచ్చిన బాధితురాలి కుటుంబ సభ్యులు ఆస్పత్రికి చేరుకుని ఆందోళనకు దిగారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆస్పత్రి ఆర్ఎంవో డాక్టర్ పద్మశ్రీకి ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై దర్యాప్తు చేయించి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఆమె హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు. తప్పుడు రిపోర్టు ఇచ్చిన సిబ్బందిపై చర్యలు తప్పుడు రిపోర్టు ఇచ్చిన ల్యాబ్ టెక్నీషియన్ రవిపైనా, గర్భిణి పట్ల దురుసుగా ప్రవర్తించిన ఎయిడ్స్ కంట్రోల్ కౌన్సిలర్ లలితపైనా శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా ప్రభుత్వ ఆస్పత్రుల సమన్వయకర్త, రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్ టి.రమేష్ కిశోర్ తెలిపారు. ఇప్పటికే ఈ సంఘటనపై ఎంక్వెరీ వేశామని చెప్పారు. బాధితుల నుంచి ఫిర్యాదు స్వీకరించామన్నారు. -
మరణమా?.. హెచ్ఐవీతోనా?
జోహన్నెస్బర్గ్: ఓ వైపు ప్రాణాలు నిలబెట్టాలి.. మరో వైపు హెచ్ఐవీ సోకే ముప్పు. ఇంతటి విపత్కర పరిస్థితుల్లో హెచ్ఐవీ సోకిన తల్లి కాలేయాన్ని.. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె బిడ్డకి మార్పిడిచేసి దక్షిణాఫ్రికా వైద్యులు విజయం సాధించారు. ‘చావా? హెచ్ఐవీతోనే ఎల్లకాలం జీవించడమా? అన్న సందిగ్ధంలో వారు తెలివైన నిర్ణయం తీసుకున్నారని వైద్య రంగ నిపుణులు కొనియాడుతున్నారు. ఈ శస్త్రచికిత్స నుంచి తల్లీబిడ్డలు కోలుకున్నారు. ప్రస్తుతానికి అంతా సవ్యంగానే కనిపిస్తున్నా.. తల్లి నుంచి హెచ్ఐవీ ఆమె బిడ్డకు సోకిందా? లేదా? అన్నది ఇంకా స్పష్టం కాలేదు. హెచ్ఐవీ సోకిన వ్యక్తి నుంచి ఆ వైరస్ లేని మరో వ్యక్తికి కాలేయాన్ని మార్పిడి చేయడం ఇదే తొలిసారి. ఈ ప్రయోగం విజయవంతం కావడంతో ప్రాణాలు కాపాడేందుకు అందుబాటులో ఉండే దాతల సంఖ్య పెరుగుతుందని వైద్యులు పేర్కొన్నారు. జోహన్నెస్బర్గ్లోని విట్స్ డొనాల్డ్ గోర్డాన్ మెడికల్ సెంటర్ వైద్యులు ‘ఎయిడ్స్’ అనే జర్నల్లో గురువారం రాసిన వ్యాసంలో ఈ వివరాలున్నాయి. కాలేయ మార్పిడికి ముందు చిన్నారికి అందించిన ఔషధాలు.. ఆమెకు ఎయిడ్స్ సోకే ముప్పును నివారించి ఉండొచ్చని, అయినా కొంత కాలం గడిస్తే కానీ ఏం చెప్పలేమని వైద్యులు తెలిపారు. బిడ్డకు తల్లి నుంచి హెచ్ఐవీ సోకే ముప్పు ఉందని భావించడంతో, కాలేయాన్ని మార్పిడి చేయడంపై ఎంతో మథనపడ్డామని పేర్కొన్నారు. సంక్రమిక వ్యాధుల నివారణ నిపుణులతో వరుస పరీక్షలు చేయించగా బిడ్డకు వైరస్ సోకినట్లు తేలలేదని తెలిపారు. ఒకవేళ ఆ చిన్నారి హెచ్ఐవీ బారిన పడినా కూడా..విస్తృ్తతంగా అందుబాటులోకి వచ్చిన అధునాతన ఔషధాల సాయంతో సాధారణ జీవితం గడిపే అవకాశాలున్నాయని పేర్కొన్నారు. -
హెచ్ఐవీకి కొత్త చికిత్స...
యాంటీ రెట్రోవైరల్ మందుల పుణ్యమా అని ఇప్పుడు హెచ్ఐవీతో జీవితాన్ని పొడిగించుకోవడం సాధ్యమవుతోంది. అయితే ఈ మందులు వైరస్ను పూర్తిగా చంపలేవు. మందులు వేసుకోవడం మానేస్తే.. లేదా మరచిపోయినా చాలు.. మళ్లీ విజంభిస్తుంది. ఈ నేపథ్యంలో రాక్ఫెల్లర్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు హెచ్ఐవీపై చేసిన కొన్ని ప్రయోగాలు విజయవంతం కావడం ప్రాముఖ్యతను సంతరించుకుంటోంది. హెచ్ఐవీ యాంటీబాడీలు రెండింటిని ఒక్కసారి వాడటం ద్వారా వైరస్ను కొన్ని నెలలపాటు నిద్రాణంగా ఉంచవచ్చునని వీరు అంటున్నారు. బ్రాడ్లీ న్యూట్రలైజింగ్ యాంటీబాడీస్ (బీనాబ్స్) అని పిలుస్తున్న ఈ సరికొత్త మందులు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే హెచ్ఐవీ వ్యాధిగ్రస్తులు కొన్ని నెలలకు ఒకసారి మాత్రలేసుకుంటే సరిపోతుందని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త మైకేల్ సి. నాసెన్వీగ్ అంటున్నారు. పరిశోధన వివరాలు నేచర్, నేచర్ మెడిసిన్ జర్నల్స్ తాజా సంచికల్లో ప్రచురితమయ్యాయి. ఈ కొత్త యాంటీబాడీలు సహజసిద్ధమైనవని.. హెచ్ఐవీ వైరస్ పైభాగంలో ఉండే ప్రొటీన్లపై దాడి చేయడం ద్వారా పనిచేస్తాయని వివరించారు. అంతేకాకుండా ఈ క్రమంలో ఈ రెండు యాంటీబాడీలు శరీరపు సహజ రోగ నిరోధక వ్యవస్థలు ఉపయోగించుకోవడం విశేషమన్నారు. తొలిదశ ప్రయోగాల్లో రెండు యాంటీబాడీల మందును ఆరువారాల వ్యవధిలో మూడుసార్లు ఇస్తే.. 21 నుంచి 30 వారాలపాటు వైరస్ను అదుపులో ఉంచగలిగిందని చెప్పారు. -
క్షణకాల కాంక్ష.. పిల్లలకు జీవితశిక్ష
తంబళ్లపల్లెకు చెందిన ఓ మహిళ తిరుపతిలో కూలి పనులు చేసుకొంటున్న సమయంలో అదే ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తిని వివాహం చేసుకుంది. కొన్ని రోజులకే భార్యాభర్తలిద్దరూ స్వగ్రామం వచ్చేశారు. ఈ క్రమంలోనే ఉపాధి కోసం భర్త కోరిక మేరకు ఆమె కువైట్ వెళ్లి వచ్చింది. తిరిగొచ్చిన అనంతరం మళ్లీ కేరళకు భర్తతో కలిసి కూలి పనులకు వెళ్లింది. నాలుగు నెలల కిత్రం నయంకాని వ్యాధితో మంచానికే పరిమితమైంది. భర్త ఆమెను వదిలేసి తిరుపతి వెళ్లిపోయాడు. ఎముకల గూడుగా మారిన ఆ మహిళను రెండు నెలల క్రితం రాత్రిపూట ఆటోలో తీసుకొచ్చి బంధువులు స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో వదిలేసి వెళ్లిపోయారు. ఇరవై రోజులు మృత్యువుతో పోరాడి మహిళ కన్నుమూసింది. ఈమెకు ఒక కుమార్తె. మదనపల్లె కొత్త ఇండ్లకు చెందిన ఓ మహిళ ఉపాధి కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లింది. కొన్ని సంవత్సరాల అనంతరం స్వగ్రామానికి తిరిగి వ చ్చింది. ఈ నేపథ్యంలో నెల్లూరు నుంచి గ్రామానికి వచ్చి మేస్త్రి పని చేసుకొంటున్న ఓ వ్యక్తితో స్థానికులు ఆదర్శ వివాహం జరిపించారు. వీరికి ఇద్దరు పిల్లలు. ప్రభుత్వం మంజూరు చేసిన పక్కాగృహాన్ని నిర్మించుకొన్నారు. ఇంతలో నయం కాని వ్యాధి ఇద్దరినీ కబళించింది. తల్లిదండ్రులు చనిపోవడంతో ఆ పిల్లలు అనాథలయ్యారు. ప్రస్తుతం వారు ఏమయ్యారో కూడా చెప్పేవారు లేరు. వాల్మీకిపురంలోని ఓ గ్రామానికి చెందిన మహిళ భర్త వదిలేయడంతో ఉపాధి కోసం పూణే వెళ్లింది. ఆమెకు ఓ కుమారుడు. పూణె నుంచి స్వగ్రామానికి తరచూ వస్తూ బిడ్డను చూసుకునేది. ఈ క్రమంలోనే నయంకాని వ్యాధిబారిన పడడంతో మహిళ కన్నుమూసింది. కుమారునికీ వ్యాధి సోకడంతో తండ్రి పట్టించుకోలేదు. నానమ్మ సహకారంతో ప్రస్తుతం ఆ బాలుడు ఇంటర్ చదువుతున్నాడు. ఆమె కూడా ప్రస్తుతం నడవలేని స్థితికి చేరింది. దీంతో చదువు అర్ధంతరంగా ఆగిపోతుందని, దాతలు ఆదుకుని ఆర్థిక సాయం అందించాలని ఆ విద్యార్థి వేడుకుంటున్నాడు. ఇలా ఒకరు కాదు ఇద్దరు కాదు వందల సంఖ్యలో తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలు దుర్భర జీవితాలను వెళ్లదీస్తున్నారు. తల్లిదండ్రులు తెలిసో తెలియకో చేసిన తప్పులకు జీవితాంతం శిక్షకు గురవుతున్నారు. చిత్తూరు ,మదనపల్లె టౌన్: కరువు కోరల్లో చిక్కుకుని కొందరు, విలాసవంతమైన జీవితాన్ని గడిపేందుకు ఇంకొందరు, ఉపాధి లేక మరికొందరు. ఉన్నత చదువులు చదివినా ఉద్యోగాలు రాని నిరుద్యోగ యువతులు, మహిళలు అధికంగా వేశ్య వృత్తిని ఎంచుకుని వ్యభిచార ఊబిలో కూరుకుపోతున్నారు. డబ్బుమీద వ్యామోహంతో రెడ్లైట్ ఏరియాలైన ముంబయి, పూణె, ఢిల్లీ, కలకత్తా, బెంగళూర్, సింగపూర్ తదితర ప్రాంతాలకు వెళ్లి హెచ్ఐవీ బారిన పడి జీవితాలను నరకప్రాయం చేసుకుని రక్త సంబంధీకులకు దూరమవుతున్నారు. పబ్బులు, వేశ్య గృహాలకు వెళ్లి నయంకాని వ్యాధిబారిన పడుతున్నారని కొన్ని సంస్థల సర్వేలు చెబుతున్నాయి. అలా వ్యాధుల బారిన పడుతున్న వారు అధికంగా మదనపల్లెతో పాటు, పడమట మండలాలైన పీటీఎం, బి. కొత్తకోట, ములకలచెరువు, తంబళ్లపల్లె, పెద్దమండ్యంలలో గత ఐదేళ్లలో 23 వేల మందికి పైగా బాధితులు ఉన్నారు. వారిలో ఇప్పటి వరకు చనిపోయిన వారి సంఖ్య ఏడు వేలకుపైనే ఉన్నట్లు రికార్డులు చెబుతున్నాయి. అనాథలవుతున్న పిల్లలు.. అలా చనిపోయిన వారి అయినవారి ఆదరణకు దూరమై అనాథలుగా మారుతున్నారు. తల్లిదండ్రులు తెలిసో తెలియకో చేసిన తప్పులకు వీరికి జీవిత కాల శిక్ష పడుతోంది. రక్తసంబంధీకులు కూడా అక్కున చేర్చుకోవడానికి నిరాకరిస్తున్నారు. కానరాని ప్రభుత్వ చర్యలు.. గతంలో ప్రభుత్వాలు డీఆర్డీఏ ఆధ్వర్యంలో ఉపాధికోసం ఇతర ప్రాంతాలకు వెళ్లే మహిళలు, యువతులను గుర్తించి పునరావాసం కల్పించేందుకు చర్యలు తీసుకుంది. అప్పట్లో ఒక్కొక్కరికీ రూ. 1000 కూడా అందించేవారు. దీంతో ఎంతో కొంత వారికి భరోసా లభించేది. ప్రస్తుత ప్రభుత్వం ఇలాంటి చర్యలేవీ చేపట్టడం లేదు. పునరావాస చర్యలు తీసుకుంటే కొంతైనా తగ్గించ వచ్చని పలువురు చెబుతున్నారు. ఆదరించని కుటుంబసభ్యులు.. వ్యాధి నిరోధక శక్తిని కోల్పోయి బాధపడుతున్న మహిళలు, పురుషులు కుటుంబసభ్యుల నిరాదరణకు గురవుతున్నారు. వ్యాధి తీవ్రత ఎక్కువై మంచం పట్టిన బాధితులను పట్టిం చుకోవడం లేదు. పైగా వారే అర్ధరాత్రి సమయాల్లో తీసుకొచ్చి మదనపల్లె ప్రభుత్వ ఆస్పత్రిలో వదలి వెళుతున్నారు. వారిని సిబ్బంది క్రానిక్ వార్డులో చేర్చి చికిత్సలు అందిం చినా ఫలితం లేక చేరిన నెల రోజుల్లోపే చనిపోతున్నారు. చనిపోయిన మృతదేహాన్ని కూడా కుటుంబసభ్యులు తీసుకెళ్లని పరిస్థితి. దీంతో కుళ్లి దుర్వాసన వస్తున్న మృతదేహాలను ఆస్పత్రి సిబ్బంది పోలీసుల సహకారంతో మున్సిపల్ పారిశుధ్య కార్మికులకు అప్పగిస్తున్నారు. వారు ఆ మృతదేహాలను పట్టణానికి దూరంగా తీసుకెళ్లి వాగుల్లో పాతిపెట్టి వస్తున్నారు. -
రిపోర్టులో హెచ్ఐవీ.. యువకుడి ఆత్మహత్యాయత్నం
కోనేరుసెంటర్(మచిలీపట్నం): ప్రమాణాలు పాటించని రక్త పరీక్ష కేంద్రాలు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి. లేనివి ఉన్నట్లు ఉన్నవి లేనట్లు రిపోర్టులు ఇస్తూ రోగులను మానసిక ఒత్తిడికి గురిచేస్తున్నాయి. ఈ రిపోర్టులను గుడ్డిగా నమ్ముతున్న కొంత మంది వైద్యులు టెస్ట్లకు సంబంధించిన వివరాలను పూర్తి అవగతం చేసుకోకుండానే రోగాలను నిర్థారించేస్తున్నారు. ఇలాంటి ఓ సంఘటనే మచిలీపట్నంలో గురువారం వెలుగుచూసింది. బిహార్కు చెందిన ఒక యువకుడు కొంత మంది స్నేహితులతో కలిసి జీవనోపాధి కోసం రెండేళ్ల క్రితం మచిలీపట్నం వచ్చాడు. స్థానికంగా మగ్గం పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ నెల 5వ తేదీ నుంచి నలతగా ఉండటంతో 8న మచిలీపట్నం హైనీ హైస్కూలుకు సమీపంలో ఉన్న ఓ ఆర్ఎంపీ దగ్గరకు వెళ్లాడు. దీంతో అతడు సద్దాంకు పలురకాల టెస్టులు చేయించుకోవాలని సూచించాడు. డాక్టర్ చెప్పిన విధంగానే ఆ యువకుడు ఆర్ఎంపీ వైద్యశాలలో ఉన్న ల్యాబ్లో రక్త నమూనాలను ఇచ్చాడు. మరుసటి రోజు ల్యాబ్ టెక్నీషియన్ ఇచ్చిన రిపోర్టును వైద్యుడికి చూపించాడు. రిపోర్టు చూసిన వైద్యుడు హెచ్ఐవీ ఉన్నట్లు నిర్థారించి ప్రభుత్వాస్పత్రిలో వైద్యం చేయించుకోవాలని పంపేశాడు. మానసిక ఒత్తిడితో కెమికల్స్ తాగే యత్నం తనకు హెచ్ఐవీ ఉన్నట్లు వైద్యుడు నిర్థారించటంతో ఆ యువకుడు తీవ్ర మానసిక ఒత్తిడికి లోనయ్యాడు. స్నేహితులకు దూరంగా ఉంటూ మదనపడుతూ ఉంటున్నాడు. ఈ నెల 11వ తేదీ అర్ధరాత్రి మగ్గం పనులకు సంబంధించిన కెమికల్స్ కలుపుకుని తాగే ప్రయత్నం చేశాడు. విషయం గమనించిన స్నేహితులు అతడిని నిలదీయడంతో అసలు విషయం చెప్పాడు. స్నేహితులు జిల్లా ప్రభుత్వాస్పత్రికి తీసుకువెళ్లి హెచ్ఐవీకి సంబంధించిన పరీక్షలు చేయించారు. అన్ని రిపోర్టులు నెగిటివ్గానే వచ్చాయి. దీంతో స్నేహితులు గురువారం ఆర్ఎంపీ వైద్యుడిని నిలదీశారు. ఆ యువకుడు ఆత్మహత్య చేసుకుంటే ఎవరు బాధ్యులని ప్రశ్నించారు. దీంతో సదరు వైద్యుడు ల్యాబ్ టెక్నీషియన్ రిపోర్ట్ వల్లే తప్పిదం జరిగిందని బుకాయించాడు. ఇలాంటి తప్పు మరోసారి చేయనంటూ ల్యాబ్ టెక్నీషయన్ బతిమిలాడడంతో స్నేహితులు శాంతించారు. -
హెచ్ఐవీ వ్యాక్సిన్ వచ్చేస్తోంది...
హెచ్ఐవీ వ్యాధి నిరోధానికి శాస్త్రవేత్తలు అభివృద్ధి చేస్తున్న సరికొత్త వ్యాక్సిన్ సత్ఫలితాలనిస్తోంది. మానవులతోపాటు కోతులపై జరిగిన ప్రయోగాల్లో ఈ వ్యాక్సిన్ రోగనిరోధక వ్యవస్థను చైతన్యవంతం చేయడం ద్వారా వ్యాధిని అడ్డుకుందని నేషనల్ కేన్సర్ సెంటర్ శాస్త్రవేత్తలు అంటున్నారు. దాదాపు 400 మంది పాల్గొన్న ఈ పరీక్షలు మంచి ఫలితాలిచ్చిన నేపథ్యంలో రెండో దశ పరీక్షలు దక్షిణాఫ్రికాలో నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని, ఇందులో 2600 మంది మహిళలకు ఈ వ్యాక్సిన్ను అందించనున్నామని ప్రొఫెసర్ డాన్ బరూచ్ తెలిపారు. హెచ్ఐవీని అడ్డుకునేందుకు గత 35 ఏళ్లలో ఐదు వరకు వ్యాక్సిన్లను అభివృద్ధి చేయగా, ఈ స్థాయికి చేరుకున్న వ్యాక్సిన్ ఇదొక్కటే కావడం గమనార్హం. రకరకాల హెచ్ఐవి వైరస్ల ముక్కలు సేకరించి వాటిని కలపడం ద్వారా రోగనిరోధక శక్తిని ప్రేరేపించడం ఈ కొత్త వ్యాక్సిన్ ప్రత్యేకత. దీన్ని వాడినప్పుడు కోతులు హెచ్ఐవి లాంటి వైరస్ను 67 శాతం వరకు అడ్డుకోగలిగాయని బరూచ్ తెలిపారు. ప్రపంచం మొత్తం మీద దాదాపు 3.7 కోట్ల మంది హెచ్ఐవి బాధితులు ఉండగా.. ఏటా 18 లక్షల కొత్త కేసులు నమోదు అవుతున్నాయి. ప్రాణాంతకమైన ఈ వ్యాధిని నిరోధించే వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే ఎన్నో విలువైన ప్రాణాలు నిలబడతాయి. -
హెచ్ఐవీ వ్యాధిగ్రస్తులకు శుభవార్త
తూర్పుగోదావరి, రామచంద్రపురం: హెచ్ఐవీ వ్యాధితో జీవిస్తున్న వారికిది నిజంగా శుభవార్తే. ఇప్పటివరకు ప్రతినెలా లింక్ ఏఆర్టీ కేంద్రానికి వచ్చి మందులు తీసుకోవాల్సి వచ్చేది. అయితే ప్రభుత్వం ఈ విషయంలో వీరికి కొంత వెసులుబాటు కల్పించింది. ఇక నుంచి వీరు ప్రతి మూడు నెలలకు ఒకసారి మూడు నెలలకు సరిపడా మందులు అందించనున్నారు. ఈ మేరకు గురువారం పట్టణంలోని ఏరియా ఆసుపత్రిలో ఈ కార్యక్రమాన్ని జిల్లా అదనపు వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఎం.పవన్కుమార్, రామచంద్రపురం ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ప్రవీణ్ ఆధ్వర్యంలో ప్రారంభించారు. కార్యక్రమంలో ఏపీ సాక్స్ అసిస్టెంట్ డైరెక్టర్ జావేద్ లాల్బండ్, ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ పి.సత్యనారాయణ, జిల్లా ప్రోగ్రాం మేనేజర్ జి. ఆదిలింగం, జిల్లా ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఐసీటీసీ సూపర్వైజర్ ఎ.బుజ్జిబాబు పాల్గొన్నారు. -
బాధితుడికి ఓ అన్నం ముద్ద
హెచ్ఐవి లేదా ఎయిడ్స్ వచ్చినవారిని సమాజం దూరం పెడుతుంది. వారికి అన్నం పెట్టడానికి కూడా ముందుకు రావడానికి సాహసించరు. ఇందుకు విరుద్ధంగా ‘మీల్స్ ఆన్ వీల్స్’ పేరుతో ఎయిడ్స్ వ్యాధితో బాధపడేవారికి అమెరికాలోని ‘ఇండియానా’ రాష్ట్రంలోని ఓ సంస్థ కడుపు నిండా అన్నం పెడుతోంది. దేశవ్యాప్తంగా జరుగుతున్న ఈ మంచి ప్రయత్నానికి ‘ర్యాన్స్ మీల్ ఫర్ లైఫ్’ గా గుర్తింపు వచ్చింది. ఈ కార్యక్రమానికి ‘ర్యాన్స్ మీల్’ అనే పేరు పెట్టడానికి వెనుక ఒక చిన్న కారణం ఉంది. కొన్నేళ్ల కిందట కొకొమోకు చెందిన ‘ర్యాన్ వైట్’ అనే 18 సంవత్సరాల యువకుడు హెచ్ఐవి కారణంగా మరణించాడు. తన 13 సంవత్సరాల వయసులో కలుషిత రక్తం ద్వారా ఆ బాలుడిలోకి ఈ వైరస్ ప్రవేశించింది. ఐదు సంవత్సరాలు వ్యాధితో పోరాడి కన్నుమూశాడు. అందువల్ల ఈ సత్కార్యానికి అతడి పేరు పెట్టారు. అదే సంవత్సరం అక్టోబరు మాసంలో ఈ పథకానికి శ్రీకారం చుట్టారు. ‘రాష్ట్ర రాజధాని ఇండియానాపొలిస్లో రోజుకి 250 మందికి భోజనం అందిస్తూ, వారానికి 2500 మందికి అందించే స్థాయికి ఎదిగాం’ అని చెబుతారు ‘మీల్స్ ఆన్ వీల్స్’ ప్రాజెక్టు మేనేజర్ నిక్ ఫెన్నింగ్. ‘ఇండియానాలో సుమారు 12,000 మంది హెచ్ఐవితో బాధపడుతున్నారు. అందులో సగం కంటె ఎక్కువ మంది పేదరికంతో బాధపడుతున్నారు’ అని చెబుతారు నిక్. ఈ వ్యాధితో బాధపడుతున్నవారికి ఆహారం ఇవ్వడమే కాకుండా, వారికి కావలసిన ఆరోగ్య సదుపాయాలు చూస్తారు. ‘ఒంటరితనంతో బాధపడుతున్న వారు, వయసు పైబడినవారు ఎంతోమందికి మేం అన్నం పెట్టగలుగుతున్నాం’ అంటూ సంబరంగా చెబుతారు నిక్. ‘‘ఈ ప్రాంతంలో విస్తృతంగా ప్రబలిన ఎయిడ్స్ కారణంగా కొందరు వారి జీవితభాగస్వాములను కోల్పోయి, ఒంటరివారయ్యారు. వారంతా నలుగురితో కలవాలని, వారి బాధను నలుగురితో పంచుకోవాలని ఆశిస్తున్నారు’’ అంటున్నారు నిక్. ‘మీల్స్ ఆన్ వీల్స్’ కేవలం హెచ్ఐవి బాధితులకు మాత్రమే కాకుండా, దివ్యాంగులకు, పేదరికంతో బాధపడుతున్న అభాగ్యులకు కూడా కడుపు నింపుతున్నారు. చాలా దేశాల్లో నిర్లక్ష్యానికి గురవుతున్న హెచ్ఐవీ బాధితుల కోసం ఇలాంటి కార్యక్రమం జరిగితే చాలా బాగుంటుందని సామాజిక సేవకులు అభిప్రాయపడుతున్నారు. -
మళ్లీ విజృంభించనున్న ‘ఎయిడ్స్’
సాక్షి, న్యూఢిల్లీ : ‘ఎయిడ్స్ రహిత తరాన్ని అందించడానికి అవసరమైన సాధనాలు ఇప్పుడు మన వద్ద ఉన్నాయి’ అంటూ 2011, డిసెంబర్ 1వ తేదీన అప్పటి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా చేసిన వ్యాఖ్య ఓ కొత్త చొరవకు దారితీసింది. ఎయిడ్స్ను కనుగొన్న 30 సంవత్సరాల అనంతరం ఆయన చేసిన ఈ వ్యాఖ్య వైద్య రంగానికే స్ఫూర్తినిచ్చింది. అప్పటికే దాదాపు మూడు కోట్ల మంది మరణానికి కారణమైన ఎయిడ్స్కు వ్యతిరేకంగా పోరాడేందుకు ప్రపంచం కలసికట్టుగా ముందుకు కదిలింది. ఆ కృషి ఫలితంగానే ఇప్పుడు ఎయిడ్స్ రోగులను ‘పీపుల్ లివింగ్ విత్ హెచ్ఐవీ’ అని పిలుస్తున్నారు. ఎయిడ్స్కు వ్యతిరేకంగా ప్రపంచవ్యాప్తంగా జరిగిన కృషి ఫలితంగా 2000 సంవత్సరం నుంచి హెచ్ఐవీ కేసుల సంఖ్య 30 శాతం తగ్గింది. 2003 నుంచి మృతుల సంఖ్య 40 శాతం తగ్గింది. ఒక్క సబ్ సహారా ఆఫ్రికాలో గత దశాబ్దం కాలంలో 25 నుంచి 50 శాతం కేసులు తగ్గాయి. ఈ క్రమంలోనే ఆమ్స్టర్డామ్లో జూలై 23 నుంచి 27 వరకు ఎయిడ్స్పై ప్రపంచ సదస్సు జరుగుతోంది. ఇదే సమయంలో ఓ విషాద వార్త వెలుగులోకి వచ్చింది. రెండో రకం చికిత్సను కూడా తట్టుకొని బతకకలిగే శక్తిని హెచ్ఐవీ సాధించిందనేదే ఆ వార్త. ఎయిడ్స్ నివారణలో ప్రస్తుతం రెండు రకాల చికిత్స విధానాన్ని అమలు చేస్తున్నారు. మొదటి రకం విధానానికి రోగి స్పందించకపోతే రెండోరకం విధానాన్ని అమలు చేస్తారు. దాంతో 90 శాతం మంది రోగులకు హెచ్ఐవీ నుంచి విముక్తి లభిస్తుంది. ఇప్పుడు ఈ విధానం కూడా సత్ఫలితాలు ఇవ్వడం లేదని, రోగుల్లో వ్యాధి ముదిరి మరణిస్తున్నారని తాజా అధ్యయనాలు తెలియజేస్తున్నాయి. ఇతర బ్యాక్టీరియాలకన్నా పరావర్తనం చెందే శక్తి హెచ్ఐవీ వైరస్లో పది లక్షల కన్నా ఎక్కువ ఉండడం వల్ల అది మందులకు లొంగకపోతే విపరిమాణాలు ఎక్కువగా ఉంటాయి. ఎయిడ్స్ నివారణకు అమెరికాలో 28 రకాల మందులు ఉండగా, ప్రపంచవ్యాప్తంగా ఆరు రకాల మందులు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. రెండు రకాల కాంబినేషన్లలో మాత్రమే ఈ మందులను వాడుతారు. ఒకటో రకం కాంబినేషన్ రోగిపై పనిచేయడం ఇది వరకే నిలిచిపోగా, ఇప్పుడు రెండో రకం కాంబినేషన్ కూడా పనిచేయక పోవడం పట్ల వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
క్రిస్పర్ క్యాస్9తో హెచ్ఐవీకి చెక్!
జన్యుమార్పులను కచ్చితంగా చేయగల క్రిస్పర్ క్యాస్9 టెక్నాలజీ ద్వారా హెచ్ఐవీకి చెక్ పెట్టడం సాధ్యమేనని అంటున్నారు జపాన్ శాస్త్రవేత్తలు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 4 కోట్ల మందిని పట్టి పీడిస్తున్న ఈ వ్యాధికి ప్రస్తుతం సరైన చికిత్ప లేదు. యాంటీ రెట్రోవైరల్ మందులు వాడుతూంటే జీవితకాలం కొంత మెరుగయ్యే అవకాశం మాత్రమే ఉంది. హెచ్ఐవీ వైరస్ శరీర కణాల్లో తన జన్యుభాగాలను జొప్పించడం వల్ల.. మందులు వాడుతున్నంత సేపు అవి నిద్రాణంగా ఉంటాయి. ఆ తరువాత విజంభిస్తాయి. క్రిస్పర్ క్యాస్9 జన్యువుల్లో మార్పులు చేసేందుకు సమర్థంగా ఉపయోగపడుతుందన్నది తెలిసిందే. ఈ నేపథ్యంలో జపనీస్ శాస్త్రవేత్తలు ఆరు రకాల హెచ్ఐవీ వైరస్లలోని డీఎన్ఏ భాగాలను క్రిస్పర్ క్యాస్9లో ఉపయోగించారు. ఫలితంగా హెచ్ఐవీ వైరస్ను నియంత్రించే జన్యువులు పని చేయకుండా పోయాయి. ప్రస్తుతం తాము ప్రయోగశాలలో హెచ్ఐవీతో కూడిన కణాలపై ప్రయోగాలు చేశామని, క్రిస్పర్ క్యాస్9ను మానవుల్లో ప్రవేశపెట్టడం ఎలా? తద్వారా ఎలాంటి దుష్ప్రభావాలు లేకుండా చూడటం ఎలా అన్న అంశాలపై మరిన్ని ప్రయోగాలు చేస్తున్నామని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త కామెఓకా తెలిపారు. హెచ్ఐవీకి పూర్తిస్థాయి చికిత్స అందించేందుకు తమ పరిశోధన ఉపయోగపడుతుందని చెప్పారు. -
ఛీత్కారాల మధ్య..
గుంతకల్లు రూరల్: వ్యాపారరీత్యా ఊళ్లు తిరుగుతున్న నా భర్త హెచ్ఐవీకి గురయ్యారు. ఆయన ద్వారా ఆ జబ్బు నాకూ సోకింది. విషయం బయటపడిన తర్వాత తప్పంతా నాదేనన్నట్లు మాట్లాడారు. నన్ను ఇంటి నుంచి గెంటేశారు. అప్పటికే మాకు ఇద్దరు ఆడపిల్లలు, ఒక కుమారుడు. ఏడాది పాటు పుట్టింటిలో తలదాచుకున్నా. తన చివరి క్షణాల్లో జరిగిన వాస్తవాన్ని కుటుంబసభ్యులకు చెప్పి ఇందులో భార్య తప్పేమీ లేదని నా భర్త నోరు విప్పాడు. దీంతో మళ్లీ నన్ను అత్తింటివారు ఆదరించారు. ఆ తర్వాత నెలలోనే నా భర్త కన్నుమూశాడు. వృద్ధులైన అత్తామామలతో పాటు పిల్లల పోషణ భారం నాపై పడింది. ఇంట్లో నుంచి బయటకు వస్తే ఇరుగుపొరుగు వారు అంటున్న మాటలు ఎంతో బాధించాయి. చివరకు నా కూతుళ్ల పెళ్లిళ్లనూ చెడగొట్టారు. ఆత్మహత్య చేసుకోవాలని అనిపించింది. అయితే సమస్యకు ఇది పరిష్కారం కాదని భావించాను. ఎవరు ఎన్ని మాటలు అన్నా పట్టించుకోకుండా బతకడం నేర్చుకున్నా. గ్రామైక్య సంఘం ద్వారా పొందిన రుణాలతో చిన్నపాటి వ్యాపారం మొదలు పెట్టాను. అప్పులు తీర్చేశాను. నా ఇద్దరు ఆడపిల్లలకు పెళ్లి చేశాను. కొడుకును ఎంబీఏ వరకు చదివించాను. - కామాక్షమ్మ (పేరుమార్పు) -
రోగం.. వేగం..
ఖమ్మంవైద్యవిభాగం: సరైన సమయంలో వైద్యం చేయించుకోకపోవడం.. మందులు సక్రమంగా వేసుకోకపోవడం.. మధ్యలోనే నిలిపివేయడం.. జబ్బును నిర్లక్ష్యం చేయడంతో టీబీ వ్యాధి జిల్లాలో చాపకింద నీరులా విస్తరిస్తోంది. వయసుతో నిమిత్తం లేకుండా ఒకరి నుంచి మరొకరికి సంక్రమించే వ్యాధి ఆందోళన కలిగిస్తోంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉన్నప్పటికీ విభజన తర్వాత నివారణ చర్యలు చేపట్టినా తీవ్రత తగ్గడం లేదు. క్షయ బారినపడే వారి సంఖ్య పెరుగుతూ వస్తోంది. జిల్లాలో ప్రతి నెల క్షయ కేసులు వందకు మించుతున్నాయి. ప్రభుత్వ లెక్కల ప్రకారం 2018, జనవరిలో 126 కేసులు, 2017లో 1,563 కేసులు నమోదు కావడంతో వ్యాధి వ్యాప్తి జిల్లాలో ఎలా ఉందో అర్థమవుతోంది. ప్రైవేటు ఆస్పత్రుల్లో కూడా క్షయ కేసులు ఎక్కువగానే నమోదవుతున్నాయి. 2017లో ప్రైవేటు ఆస్పత్రుల్లో 1,774 కేసులు నమోదయ్యాయి. 2012లో టీబీని ప్రభుత్వం నోటిఫైబుల్ వ్యాధిగా ప్రకటించింది. ఈ మేరకు ప్రైవేటు ఆస్పత్రులు విధిగా తమ ఆస్పత్రిలో నమోదైన కేసుల వివరాలను టీబీ కంట్రోల్ అధికారులకు తెలియజేయాలి. ఇందుకోసం ఇద్దరు హెల్త్ విజిటర్స్ ఎప్పటికప్పుడు ఆస్పత్రుల నుంచి సమాచారం సేకరిస్తారు. ప్రస్తుతం 56 శాతం మాత్రమే ప్రైవేటులో కేసులు నమోదైన వివరాలు అందుతున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. జిల్లాలో మాత్రం 2017లో 56 టీబీ మరణాలు చోటు చేసుకోవడం ఆందోళన కలిగిస్తున్నాయి. ఒక్క రోగి నుంచి 20 మంది వరకు.. టీబీ వ్యాధికి ప్రత్యేక వైద్యం ఉన్నప్పటికీ అవగాహన లేమితో వ్యాధి బారిన పడుతున్నారు. మందులు సరిగా వేసుకోకుండా వ్యాధిగ్రస్తులు మధ్యలోనే మానేస్తుండటంతో మళ్లీ తిరగబెడుతోంది. ఒక వ్యాధిగ్రస్తుడి ద్వారా 15 నుంచి 20 మందికి వ్యాధి వ్యాప్తి చెందే అవకాశం ఉంటుందని టీబీ డాక్టర్లు చెబుతున్నారు. రోగి దగ్గితే సుమారు 40 వేల వరకు వ్యాధి కారక క్రిములు గాలిలో కలుస్తాయి. వ్యాధి ఊపిరితిత్తులకే కాకుండా గుండె, కాలేయం, పేగులు, మెదడు, ఎముకలు వంటి శరీర అవయవాలకు సోకే అవకాశం ఉంటుందని డాక్టర్లు చెబుతున్నారు. హెచ్ఐవీ వ్యాధిగ్రస్తులకు కూడా టీబీ సోకే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దగ్గుతున్నప్పుడు నోటి నుంచి రక్తం రావటం, ఆకలి మందగించటం, బరువు తగ్గటం వంటివి క్షయ లక్షణాలుగా చొప్పొచ్చు. ఎండీఆర్ కేసులూ అధికమే.. జిల్లాలో మల్టీ డ్రగ్ రెసిస్టెంట్(ఎండీఆర్) కేసులు కూడా ఆందోళన కలిగిస్తున్నాయి. మందులు వాడుతూ మధ్య ఆపివేయటం, విచ్చలవిడిగా మందులు వాడటం వంటి వ్యాధిగ్రస్తులను ఎండీఆర్ కేసులుగా పిలుస్తారు. సాధారణంగా టీబీ సోకిన వారు 6 నెలలు మందులు వాడాల్సి ఉండగా, ఎండీఆర్ కేసులకు చెందిన వ్యాధిగ్రస్తులు 18 నెలలు మందులు వాడాల్సి ఉంటుంది. జిల్లాలో 2017లో 31 ఎండీఆర్ కేసులు నమోదయ్యాయి. ఉమ్మడి జిల్లాలో 2015లో 66 కేసులు, 2016లో 82 కేసులు నమోదయ్యాయి. జిల్లాలో 22 పీహెచ్సీలు ఉండగా.. 18 డిజిగ్నేటెడ్ మైక్రోస్కోపిక్ సెంటర్(డీఎంసీ)ల ద్వారా టీబీ పరీక్షలు నిర్వహిస్తున్నారు. సబ్ సెంటర్లు, పీహెచ్సీల పరిధిలో రెండు వారాలకు మించి దగ్గు ఉండే రోగులను డీఎంసీకి పంపిస్తారు. ఇక్కడ వారికి పరీక్షలు నిర్వహిస్తారు. అలాగే ఖమ్మం, సత్తుపల్లి, మధిర, తల్లాడ, నేలకొండపల్లి, మంచుకొండ, వైరాలో ట్యూబరో క్లోసిస్ యూనిట్లు ఉన్నాయి. అందులోని సీనియర్ ట్రీట్మెంట్ సూపర్వైజర్లు రోగులు క్రమం తప్పకుండా మందులు వేసుకుంటున్నారా? లేదా? అనే విషయంపై పర్యవేక్షిస్తుంటారు. ఖమ్మంలోని జిల్లా టీబీ కంట్రోల్ కార్యాలయంలో డ్రగ్ రెసిస్టెంట్ టీబీ వార్డులో రోగులకు మందులు పంపిణీ చేస్తారు. రోజువారీ కోర్సు ఇస్తున్నాం.. గతంలో రోజు విడిచి రోజు మందులు ఇచ్చేవారు. ఫలితంగా కొందరు రోగులకు మాత్రలు పడేవి కావు. ప్రస్తుతం ఫిక్స్డ్ డైలీ కోర్సు ప్రవేశపెట్టి రోజూ మాత్రలు వేసుకునే విధానం వచ్చింది. నాలుగు రకాలకు చెందిన మందు ఒకే మాత్రలో ఉంటుంది. బరువునుబట్టి డోస్ ఇస్తున్నాం. జిల్లాలో టీబీని తగ్గించేందుకు శ్రమిస్తున్నాం. దగ్గు రెండు వారాలకు మించి ఉంటే వైద్యుడిని సంప్రదించాలి. అలాగే రోగులు కోర్సు పూర్తయ్యే వరకు మందులు వాడితే మళ్లీ టీబీ వచ్చే అవకాశం ఉండదు. వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి. టీబీపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం. – వి.సుబ్బారావు, జిల్లా టీబీ కంట్రోల్ ఆఫీసర్ -
నకిలీ వైద్యుడి నిర్వాకం.. 46 మందికి హెచ్ఐవీ
ఉన్నావో (యూపీ): ఓ నకిలీ వైద్యుడి చేసిన పనికి 10 నెలల్లో దాదాపు 46 మంది హెచ్ఐవీ బాధితులుగా మారారు. కలుషిత సిరంజీతో రోగులకు ఇంజెక్షన్ చేయడంతో ఈ దారుణం జరిగింది. యూపీలోని ఉన్నావో జిల్లా బంగర్మౌలో గతేడాది ఏప్రిల్–జూలైలో అధికారులు ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేసి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఇందులో 12 మందికి హెచ్ఐవీ ఉన్నట్లుగా తేలింది. అలాగే గత నవంబర్లో వైద్య పరీక్షలు నిర్వహించగా మరో 13 హెచ్ఐవీ కేసులు నమోదయ్యాయి. ఇంతకింతకు పెరుగుతున్న హెచ్ఐవీ కేసులను సీరియస్గా పరిగణించిన వైద్యాధికారులు ఇద్దరు సభ్యులతో కూడిన ఓ కమిటీని ఏర్పాటు చేసి దర్యాప్తు చేయించారు. కమిటీ సభ్యులు ప్రేమ్గంజ్, చక్మిర్ పూర్ ప్రాంతాల్లో ఈ ఏడాది జనవరి 24, 25, 27 తేదీల్లో ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేసి 566 మందిని పరీక్షించారు. ఇందులో మరో 21 మందికి హెచ్ఐవీ సోకినట్లు తేలింది. మొత్తం 46 మంది హెచ్ఐవీ బారిన పడినట్లు వెల్లడైంది. రాజేంద్ర కుమార్ అనే నకిలీ వైద్యుడు దీనికి కారణమని అధికారులు గుర్తించారు. చౌకవైద్యం పేరుతో తన దగ్గరకు వచ్చిన రోగులకు ఒకే కలుషిత సిరంజీతో ఇంజక్షన్ చేయడం ద్వారానే హెచ్ఐవీ సోకిందని వెల్లడించారు. -
వారం రోజుల మందులు ఒక్క క్యాప్సూల్లో
హెచ్ఐవీతో బాధపడుతన్న వారికో శుభవార్త. రోజూ బోలెడన్ని మాత్రలు తీసుకోవాల్సిన శ్రమ త్వరలోనే తప్పనుంది. వారం రోజులకు సరిపడా మందులన్నింటినీ ఒకే ఒక్క క్యాప్సూల్లోకి చేర్చడంలో మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ) శాస్త్రవేత్తలు విజయం సాధించడం దీనికి కారణం. క్యాప్సూల్లోని మందులు నెమ్మదిగా విడుదల అవడం ద్వారా హెచ్ఐవీ వైరస్ నుంచి వారం పాటు రక్షణ కల్పిస్తాయని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త గియోవానీ ట్రావెర్సో తెలిపారు. లైండ్రా అనే ఫార్మా కంపెనీ ఇప్పుడు ఈ సరికొత్త క్యాప్సూల్ క్లినికల్ ట్రయల్స్ నిర్వహించే ప్రయత్నాల్లో ఉంది. వేర్వేరు మందులను ఒక్కచోటికి తీసుకు రాగల టెక్నాలజీ ఒక్క హెచ్ఐవీకి మాత్రమే కాకుండా అనేక ఇతర వ్యాధులకూ ఉపయోగపడుతుందని ట్రావెర్సో అంటున్నారు. యాంటీ రెట్రోవైరల్ మందులు అందుబాటులోకి వచ్చిన తరువాత హెచ్ఐవీ మరణాల రేటు గణనీయంగా తగ్గినప్పటికీ, వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడంలో జరుగుతున్న నిర్లక్ష్యం వల్ల ఇప్పటికీ కొంతమంది చనిపోతున్నారు. ఈ నేపథ్యంలో లైండ్రా ఈ సరికొత్త క్యాప్సూల్ను అభివృద్ధి చేయడం విశేషం. ఆరు మూలలతో నక్షత్రం ఆకారంలో ఉండే ఈ క్యాప్సూల్ ఒక్కసారి కడుపులోకి చేరితే దాదాపు రెండు వారాలపాటు మనగలదు. ఈ కాలంలో ఒక్కో మూలలో ఉండే మందు క్రమేపీ విడుదలవుతూ వ్యాధి నుంచి రక్షణ కల్పిస్తుందన్నమాట. ఎప్పుడు ఏ మందు విడుదల కావాలో తయారీ సమయంలోనే నిర్ణయించుకోగలగడం ఇంకో విశేషం. -
వారానికో మాత్రతో హెచ్ఐవీని జయించొచ్చు!
బోస్టన్: హెచ్ఐవీ... పవర్ఫుల్ మందులకు కూడా లొంగని మొండి వైరస్. దీనిబారిన పడినవారి ఎయిడ్స్ సోకడం, క్రమక్రమంగా వారు మరణానికి దగ్గర కావడం వంటి ఎన్నో కేసులను మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఇకపై హెచ్ఐవీ బాధితులు ధైర్యంగా బతకొచ్చు. వేల రూపాయలు ఖర్చుచేసే మందులను వేసుకొని కాదు... కేవలం వారానికో మాత్ర చాలట. అమెరికాలోని మాసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ శాస్త్రవేత్తలు ఈ మాత్రను తయారుచేశారు. హెచ్ఐవీని సమర్థవంతంగా ఎదుర్కొనే శక్తినంతా ఓ మాత్రలో నింపారట. వారానికో మాత్ర వేసుకుంటే చాలు... హెచ్ఐవీ కారణంగా ఎదురయ్యే సమస్యలన్నింటినీ అధిగమించవచ్చని చెబుతున్నారు. ఒక్కసారి మాత్ర వేసుకున్నా.. అది వారం రోజులపాటు మెల్లమెల్లగా మందును శరీరంలోకి విడుదల చేస్తుందని చెబుతున్నారు. ఇది రోగి శారీరక ఆరోగ్యాన్నేకాదు.. మానసిక ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుందని చెబుతున్నారు. తరచూ మందులు వేసుకోవడం వల్ల వైరస్ వాటిని తట్టుకునే శక్తిని సమకూర్చుకుంటుందని, ఇలా వారానికోసారి వేసుకునే మందు వల్ల వైరస్పై అది సమర్థవంతంగా పనిచేస్తుందని చెప్పారు. -
హెచ్ఐవీ ఉంటే ఉద్యోగం ఇవ్వరా?
సాక్షి, హైదరాబాద్: డిపెండెంట్ ఎంప్లాయిమెంట్ కోటా కింద హెచ్ఐవీ బాధితుడికి ఉద్యోగం ఇచ్చేందుకు నిరాకరించిన సింగరేణి యాజమాన్యం తీరును ఉమ్మడి హైకోర్టు తప్పుపట్టింది. ఆ వ్యక్తి భూ గర్భంలో పనిచేయలేకపోతే, ఉపరితలంపై చేసే పనిని అప్పగించాలని ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఎ.రామలింగేశ్వరరావు ఇటీవల తీర్పు వెలువరించారు. పిటిషనర్ తండ్రి అనారోగ్య కారణాలతో ఉద్యోగం చేయలేన్నందున, పిటిషనర్కు డిపెండెంట్ కోటా కింద ఉద్యోగమిచ్చి మూడు నెలల్లో ఉత్తర్వులివ్వాలని న్యాయమూర్తి ఆదేశించారు. తన తండ్రి అనారోగ్యం నేపథ్యంలో డిపెండెంట్ కోటా కింద తనకు ఉద్యోగమివ్వాలన్న అభ్యర్థనను.. హెచ్ఐవీ ఉందన్న కారణంతో తిరస్కరించిందని కరీంనగర్కు చెందిన ఓ వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సింగరేణి కాలరీస్ కౌంటర్ దాఖలు చేస్తూ, హెచ్ఐవీ, హెపటైటీస్–బి ఉన్న వారు భూగర్భంలో పని చేయడానికి అనర్హులని, వీరికి ఉపరితలంపై బాధ్యతలు అప్పగిస్తామని తెలిపింది. దీనిని ప్రత్యేక కేసుగా పరిగణించాలని హైకోర్టు పేర్కొంది. -
భార్యకు వ్యాధి వస్తే భర్త, భర్తకు వస్తే..
సందర్భం ఎయిడ్స్ రోగి అంటేనే భయంతో పారిపోయే పరిస్థితి నుంచి, సరైన అవగాహన ఉంటే రోజుకు కేవలం రూ. 30ల మందులతో ఎయిడ్స్ రోగులు 75 ఏళ్లు బతికే స్థితి వచ్చింది. కానీ అవగాహనా లోపమే అసలు సమస్యగా ఉంటోంది. ప్రపంచ ఎయిడ్స్ దినం సందర్భంగా గత రెండు దశాబ్దాలుగా ఎయిడ్స్ వ్యాధిపై పరిశీలన జరుపుతున్న పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ కూటికుప్పల సూర్యారావుతో ఇంటర్వ్యూ... ఎయిడ్స్ వస్తే ఇక చావే గతి అనే అపోహ ఉంది కదా? ప్రజలలో అవగాహనా రాహిత్యం వల్లనే ఇలా జరుగుతోంది. అమెరికాలో మొట్టమొదటిసారిగా 35 ఏళ్ల క్రితం స్వలింగ సంపర్కం వల్ల ఈ వ్యాధి వచ్చింది. హాలీవుడ్ ప్రముఖ నటుడు రాక్ హడ్సన్ హెచ్ఐవీ బారిన పడ్డాక అమెరికన్ విమానంలో వెళుతుంటే చాలామంది విమానం దిగిపోయారు. అప్పట్లో ఈ వ్యాధి అంటే విపరీతంగా భయపడేవారు. అయితే ఇప్పుడు పరిస్థితి మారింది. హెచ్ఐవీ కూడా అన్ని వ్యాధుల లాంటిదేనని జనం నమ్మే పరిస్థితి వచ్చింది. సేఫ్ సెక్స్, సేఫ్ పేరెంట్, సేఫ్ నీడిల్, సేఫ్ బెడ్ లాంటి నాలుగు జాగ్రత్తలు తీసుకుంటే నూటికి నూరుశాతం ఈ వ్యాధిని నిర్మూలించవచ్చు. 1987లో మొదటి మందును కనుగొన్నారు. ఆ తరువాత 40 రకాల మందులు అందుబాటులోకి వచ్చాయి. మందులొచ్చినా ఈ వ్యాధిపై అవగాహనతో ఉండాల్సిన అవసరం ఉంది. గతంలో వ్యాధి ఉన్నవారు పెళ్లి చేసుకునే వారు కాదు, కానీ నేడు పాజి టివ్ పేరెంట్స్ కూడా సరైన మందులు వాడి, డాక్టర్ల పర్యవేక్షణలో ఉంటే నూటికి నూరుశాతం ఇప్పుడు నెగెటివ్ బిడ్డను కనవచ్చు. నాకో (నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్) వారి సర్వే ప్రకారం 49 శాతం మంది గర్భిణీలకు తాము హెచ్ఐవీ పాజిటివ్ అని కూడా తెలవదు. ఎయిడ్స్పై అవగాహన అవసరం ఏమిటి? ప్రపంచంలో ఎన్నో వ్యాధులకు సంబంధించి అవగాహన కలిగించడానికి.. ఐక్యరాజ్యసమితి, ప్రపంచ ఆరోగ్యసంస్థ సంయుక్తంగా కొన్నికొన్ని దినాలను గుర్తించాయి. ప్రజల్లో ఆయా వ్యాధులకు సం బంధించిన అవగాహన బలపడాలన్నదే వీటి ముఖ్య ఉద్దేశం. 1988లో మొట్టమొదటి ప్రపంచ ఎయిడ్స్ దినాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. అప్పటినుంచి ఇప్పటిదాకా ఒక్కో ఏడాది ఒక్కో నినాదంతో ఎయిడ్స్ దినాన్ని జరుపుకుంటున్నారు. ఈ ఏడాది ‘జవాబుదారీతనాన్ని, భాగస్వామ్యాన్ని పెంచండి’ అనేది నినాదం. ముప్పైఏళ్లుగా ఎయిడ్స్పై పోరాటం జరుగుతున్నా దానిని మనం నివారించలేకపోయాం కాబట్టి ‘రెయిజ్ ఇంపాక్ట్’ అనే ఈ అవగాహనను జనాల్లోకి తీసుకెళ్లాలని ప్రకటించారు. దీనిలో ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వాలు, సెలబ్రిటీలు పెద్దఎత్తున పాల్గొనాల్సి ఉంది. హెచ్ఐవీ పాజిటివ్ కేసుల్లో తగ్గుదల కనిపిస్తోంది కానీ అసలు హెచ్ఐవీ అనేదే లేకుండా పోవాలి. ఎయిడ్స్ వైరస్ ఒక్కటి మిగిలినా అది మళ్లీ వ్యాధిని వ్యాప్తి చేస్తుంది. ఆంధ్ర ప్రాంతంలో హెచ్ఐవీ గత రెండు మూడేళ్లలో ఐదుశాతం నుంచి 1.5 శాతానికి పడి పోయింది. దీన్ని జీరో శాతానికి తీసుకువెళ్లాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వాలు ఎయిడ్స్పై అవగాహన చేపడుతున్నాయా? గత మూడేళ్లుగా ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు హెచ్ఐవీపై ప్రచారం విషయంలో మొద్దునిద్ర పోతున్నాయి. దీని ఫలితంగానే భారతదేశంలోనే ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల సంఖ్యలో ఏపీ ప్రథమ స్థానం సాధిం చింది. పైగా అంతర్జాతీయ ఎన్జీవోల నుంచి డబ్బులు రాకుండా పోవడంతో ఎయిడ్స్ వ్యాధిపై ప్రచారం తగ్గిపోయింది. ఆరోగ్యంపై ఒక్కశాతం కూడా బడ్జెట్లో కేటాయింపు లేదు. పేదరికమే అనా రోగ్యానికి మూలకారణం. పేదరికం పోవాలంటే, ఆరోగ్యంపట్ల జాగరూకత ఉండాలి. కానీ ఆరోగ్యంపై మన ప్రభుత్వాలు మారుతల్లి ప్రేమ చూపిస్తున్నాయి. మన దేశంలో వ్యాధులు రాకుండా నిరోధించకపోవడంతో ప్రజలు తమ డబ్బును పూర్తిగా ఆరోగ్యంకోసమే ఖర్చు పెట్టాల్సి వస్తోంది. ప్రజలు తమ సంపాదనలో 75 శాతం వెచ్చించి మందులు కొనాల్సిన పరిస్థితి ఉంటే ఎలా? హెచ్ఐవీపై ప్రభుత్వమే చర్యలు తీసుకోవాలా? గతంలో మశూచికం వస్తే అరటి ఆకుమీదపెట్టి అడవిలో పడేసేవారు. అలాంటిది వ్యాక్సిన్ వల్ల అంత పెద్దవ్యాధిని నామరూపాలు లేకుండాచేశారు. 1978 తరువాత మశూచికంలో ఒక్క కేసు కూడా నమోదు కాకపోవడం శాస్త్ర అద్భుతంగానే చెప్పాలి. ఎయిడ్స్ వ్యాధి వచ్చినవారు స్వయంనియంత్రణ పాటించాలి. కలుషిత సిరంజీల వాడకంపై జాగరూకతతో ఉండాలి. సమర్థవంతంగా వ్యాధి వ్యాపించకుండా చేసుకునే మార్గాలున్నాయి. దీనిపై అవగాహన పెంచుకోవడం ద్వారా ఎయిడ్స్ రాకుండా చూసుకోవచ్చు. సమర్థవంతమైన వ్యవస్థ, మందులు వచ్చాయి. చాలామంది సిగ్గుతో, భయంతో ఈ వ్యాధికి సంబంధించిన విషయాలను బహిర్గతం చేయడం లేదు. భార్యకు వ్యాధి వస్తే భర్త, భర్తకు వ్యాధి వస్తే భార్య సపోర్ట్ చేసే పరిస్థితులు ఇప్పటికీ లేవు. ఏపీలో ట్రాన్స్జెండర్లలో 7.5 శాతం మందికి పాజిటివ్ ఉండటం మంచిది కాదు. రోజుకు 30 రూపాయల మందులతో 75 ఏండ్లు బతకవచ్చు. 20 ఏళ్లక్రితమే మందులువచ్చినా కూడా ఇంకా అవగాహన రాలేదు. దీనిపై డిసెంబర్ ఒకటిన మాత్రమే కాదు నిరంతరం చర్చ జరగాలి. ఈ భూమిమీద ఎయిడ్స్ ఉన్నంత కాలం ఇది జరగాలి, అప్పుడే ఎయిడ్స్ దూరం అవుతుంది. రిపోర్ట్ వ చ్చిన తర్వాత కూడా మందులు వాడటానికి ఆలస్యం చేయడంవల్లే ఎక్కువమంది చనిపోతున్నారు. (నేడు ప్రపంచ ఎయిడ్స్ దినం సందర్భంగా) డాక్టర్ కూటికుప్పల సూర్యారావు వ్యాసకర్త నేషనల్ ప్రొఫెసర్, ఐఎమ్ఐ కాలేజి మొబైల్: 97031 00938 -
హెచ్ఐవీ ఉందంటూ తప్పుడు రిపోర్టు
కరీంనగర్ రూరల్: ఓ గర్భిణికి ప్రభుత్వాసుపత్రిలో హెచ్ఐవీ ఉందని రిపోర్టు ఇవ్వడంతో వైద్యులు ప్రసవానికి నిరాకరించారు. దీంతో అదే గర్భిణికి ప్రైవేటు ఆస్పత్రిలో పరీక్షలు చేయించగా, హెచ్ఐవీ లేనట్లు రిపోర్టు వచ్చిన ఉదంతమిది. కరీంనగర్ మండలం చామన్పల్లికి చెందిన ఓ యువకుడు తన భార్య గర్భవతి కావ టంతో ఈ నెల 22న ప్రసవం కోసం ఆస్పత్రికి తీసుకొచ్చారు. రక్త పరీక్షలు నిర్వహించిన ల్యాబ్ సిబ్బంది ఆమెకు హెచ్ఐవీ ఉందంటూ రిపోర్టు ఇచ్చారు. ప్రసవం చేసేందుకు వైద్యురాలు నిరాకరించారు. ఆందోళనకు గురైన భర్త సమీపంలోని మరో రెండు ప్రైవేట్ ఆస్పత్రుల్లో రక్తపరీక్ష చేయించాడు. రెండు రిపోర్టుల్లోనూ హెచ్ఐవీ లేదని నిర్ధారించుకుని తిరిగి ప్రభుత్వ వైద్యురాలికి చూపించగా తాము చేసిన పరీక్షలే ముఖ్యమన్నారు. ప్రసవం చేసేందుకు రూ.40 వేలు ఖర్చవుతుందని వైద్యులు చెప్పడంతో ప్రతిమ ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు రక్తపరీక్షలు నిర్వహించగా హెచ్ఐవీ లేదని రిపోర్టు వచ్చింది. మరుసటిరోజు ఉదయం ఆమె పాపకు జన్మనిచ్చింది. డ్యూటీ సిబ్బందికి మెమో గర్భిణికి హెచ్ఐవీ ఉందని రిపోర్టు ఇచ్చిన విషయంపై అందిన ఫిర్యాదు మేరకు సం బంధిత వైద్య సిబ్బందికి మెమో జారీ చేశాను. డాక్టర్ అజయ్కుమార్ నేతృత్వంలో విచారణ కమిటీని నియమించాం. నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటాం. –సూపరింటెండెంట్ డాక్టర్ సుహాసిని -
పుట్టే బిడ్డకు వస్తుందా?
నా వయసు 23. సంవత్సరం క్రితం పెళ్లయ్యింది. అంతకు రెండేళ్ల ముందే నాకు హెచ్ఐవీ ఉందని తెలిసింది. దిగులు పడ్డాను. కానీ అదే సమస్య ఉన్న నా స్నేహితుడొకరు నన్ను పెళ్లి చేసుకుంటానని ముందుకొచ్చారు. ఇద్దరం పెళ్లి చేసుకుని ఆనందంగా ఉన్నాం. మందులు వాడుతున్నాం. నాకో బిడ్డను కనాలని ఉంది. కానీ పుట్టే బిడ్డకు కూడా హెచ్ఐవీ వస్తుందేమోనని భయం. అలా రాకుండా ఏమైనా జాగ్రత్తలు తీసుకోవచ్చా? – ఓ సోదరి హెచ్ఐవీ అనేది ఓ వైరస్. ఇది శరీరంలోని రోగ నిరోధక కణాలలో చేరి, అక్కడ వృద్ధి చెందుతూ, ఆ కణాలను నశింపజేస్తాయి. దానివల్ల రోగనిరోధక శక్తి తగ్గిపోయి అనేక రకాల ఇన్ఫెక్షన్లు శరీరాన్ని చుట్టుముడతాయి. మనిషిని మెల్లమెల్లగా కృశింపజేస్తాయి. ఈ పరిస్థితినే ఎయిడ్స్ అంటారు. ఈ వ్యాధి అసురక్షిత రక్తమార్పిడి వల్ల, లైంగిక కలయికల వల్ల ఒకరి నుంచి ఒకరికి సంక్రమిస్తుంది. హెచ్ఐవీ ఉన్న మహిళ గర్భం దాలిస్తే... మాయ ద్వారా, రక్తం ద్వారా బిడ్డకి వైరస్ సంక్రమించే అవకాశం ఉంటుంది. తల్లి పాల ద్వారా కూడా బిడ్డకు సంక్ర మిస్తుంది. అయితే ఇప్పుడు మిగతా జబ్బుల లాగానే దీనికి కూడా యాంటి వైరల్ మందుల్ని కనుగొన్నారు. ఇవి దీర్ఘకాలం వాడటం వల్ల హెచ్ఐవీ వైరస్ చాలావరకు నశించిపోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరిద్దరూ ఓసారి వైరల్ లోడ్ ఎంత ఉందో పరీక్ష చేయించుకోండి. ఎక్కువగా ఉంటే, ఇంకొన్ని రోజులు మందులు వాడి, తర్వాత గర్భం కోసం ప్రయత్నించండి. అప్పుడు కడుపులో బిడ్డకి హెచ్ఐవీ వైరస్ సంక్రమించే అవకాశాలు తగ్గుతాయి. గర్భం దాల్చిన తర్వాత కూడా డాక్టర్ పర్యవేక్షణలో సక్రమంగా మందులు వాడాలి. దానివల్ల బిడ్డకి వైరస్ తక్కువగా సంక్రమిస్తుంది. కాన్పు సమయంలో తల్లి నుంచి బిడ్డకి యోని ద్వారా వైరస్ ఎక్కువగా సంక్ర మించే అవకాశాలుంటాయి. కాబట్టి వైరల్ లోడ్ తక్కువగా ఉంటే సాధారణ కాన్పుకి ప్రయత్నం చేయవచ్చు. మరీ ఎక్కువగా ఉంటే సిజేరియన్ ఆపరేషన్ ద్వారా కాన్పు చేయించేసుకోవాలి. దానివల్ల బిడ్డకి హెచ్ఐవీ సోకే అవకాశాలు తక్కువ. బిడ్డ పుట్టిన తర్వాత బిడ్డకు కూడా పరీక్ష చేయించి, ఆరు వారాల వరకు హెచ్ఐవీ మందులు వాడటం వల్ల... వైరస్ బిడ్డకు సోకి ఉంటే, అది కాస్తా నాశనమవుతుంది. తల్లిలో వైరల్ లోడ్ ఎక్కువ ఉంటే మాత్రం తల్లిపాలు ఇవ్వకుండా బయటి పాలే ఇవ్వాలి. లేదంటే వైరస్ బిడ్డకు సోకేస్తుంది. నా వయసు 23. నాకిప్పుడు అయిదు నెలల బాబు ఉన్నాడు. ఆపరేషన్ అయింది. కుట్లన్నీ త్వరగా మానిపోయాయి. డెలివరీ అయిన మూడు నెలలకు నేను, మావారు శారీరకంగా కలిశాం. ఆ మరుసటి నెల పీరియడ్ వచ్చింది. కానీ తర్వాత నెల అంటే.. ఇప్పుడు (అయిదో నెల) పీరియడ్ రాలేదు. ఇంట్లో ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకుంటే నెగెటివ్ అని వచ్చింది. పీరియడ్ ఎందుకు రాలేదో తెలియడం లేదు. మళ్లీ ప్రెగ్నెంట్ అయ్యానేమోనని భయంగా ఉంది. నా సమస్యకు పరిష్కారం చెప్పండి?– పేరు రాయలేదు కొందరిలో కాన్పు తర్వాత బిడ్డకు పాలు పట్టేటప్పుడు, హార్మోన్లలో మార్పు ఉండటం వల్ల కొన్ని నెలలపాటు పీరియడ్స్ సక్రమంగా రాకపోవచ్చు. పీరియడ్ సరైన సమయానికి రాకపోతే తప్పనిసరిగా ప్రెగ్నెన్సీ ఉండాలని ఏమీ లేదు. కొందరిలో అండాశయాలలో నీటిగడ్డలు (ఒవేరియన్ సిస్ట్) ఏర్పడటం వల్ల కూడా పీరియడ్ ఆలస్యంగా రావచ్చు. కాకపోతే కొందరిలో కాన్పు తర్వాత హార్మోన్ల అసమతుల్యత వల్ల అండం విడుదల ఆలస్యమై కూడా గర్భం లేట్గా నిర్ధారణ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మీకు కాన్పు జరిగి అయిదు నెలలే కాబట్టి పీరియడ్స్ కోసం కొన్నిరోజులు ఆగి చూడొచ్చు. అలాగే 15 రోజులకొకసారి యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకుంటూ ఉండటం మంచిది. ఒకవేళ మధ్యలో ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయితే... గర్భం వద్దనుకుంటే, మొదట్లోనే మందులతో అబార్షన్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాకపోతే అబార్షన్ మందులు డాక్టర్ పర్యవేక్షణలోనే వాడాల్సి ఉంటుంది. మళ్లీ ప్రెగ్నెన్సీ రాకుండా... ఇప్పటి నుంచే డాక్టర్ సలహా తీసుకుని లూప్, పిల్స్, హార్మోన్ ఇంజక్షన్స్ వంటి పద్ధతులను పాటించడం మంచిది. అలా కాదనుకుంటే, మీవారు కండోమ్స్ వాడొచ్చు. డా‘‘ వేనాటి శోభ రెయిన్బో హాస్పిటల్స్ కూకట్పల్లి హైదరాబాద్ -
నెలకో టీకాతో హెచ్ఐవీకి చెక్!
హెచ్ఐవీ వ్యాధిగ్రస్తులకు కొంత ఉపశమనం కలిగించే వార్త ఇది. వారికి రోజువారీ మాత్రలేసుకునే అవసరం నుంచి త్వరలోనే విముక్తి లభించనుంది. అమెరికాకు చెందిన వివ్ హెల్త్కేర్ సంస్థ ఒక ఇంజెక్షన్తో నెలరోజుల పాటు యాంటీ రెట్రోవైరల్ చికిత్స అందించే కొత్త పద్ధతిని ఆవిష్కరించింది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 3.7 కోట్ల మంది హెచ్ఐవీ వ్యాధిగ్రస్తులు ఉండగా రోజువారీ మందుల పుణ్యమా అని వీరికి ప్రాణాపాయం గణనీయంగా తగ్గింది. అయితే రోగులు మందులు తీసుకోవడంలో ఏ మాత్రం అశ్రద్ధ వహించినా వ్యాధి మళ్లీ తిరగబెట్టే అవకాశముంటుంది. ఈ నేపథ్యంలో వివ్ హెల్త్కేర్ సంస్థ యాంటీ రెట్రో వైరల్ మందులను ఇంజెక్షన్ల ద్వారా అందించేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. ఇందులో భాగంగా నిర్వహించిన ఒక అధ్యయనంలో కాబోటెగ్రావిర్, రిల్పీవిరైన్ మందులతో తయారైన ఇంజెక్షన్లు 4 నుంచి 8 వారాల పాటు మాత్రలు మింగాల్సిన అవసరం లేకుండా చేస్తుందని గుర్తించారు. అవసరాన్ని బట్టి ఈ ఇంజెక్షన్లోని మందుల మోతాదులను మార్చుకోవచ్చు అని వివ్ హెల్త్కేర్ శాస్త్రవేత్త డాక్టర్ డేవిడ్ మార్గోలిస్ తెలిపారు. తాము దాదాపు 300 మందిపై జరిపిన అధ్యయనంలో రెండు నెలలకు ఒకసారి ఇంజెక్షన్లు అందుకున్న 95 శాతం మందిలో వైరస్ నియంత్రణలో ఉందని, రోజూ మాత్రలు తీసుకున్న వారిలో ఇది 91 శాతం మాత్రమే ఉందని డేవిడ్ తెలిపారు. నెలకోసారి ఇంజెక్షన్లు తీసుకున్న వారిలో 94 శాతం నియంత్రణలో ఉన్నట్లు చెప్పారు. దాదాపు 96 వారాల తర్వాత కూడా రెండు నెలలకోసారి ఇంజెక్షన్లు తీసుకున్న వారిలో 94 శాతం మందిలో వైరస్ నియంత్రణలోనే ఉన్నట్లు తెలిసిందని వివరించారు. అన్నీ సవ్యంగా సాగితే 2019 నాటికల్లా ఈ ఇంజెక్షన్లు అందరికీ అందుబాటులోకి వస్తాయని అంచనా. -
మొలకెత్తిన ఆశలు.. ఆవుతో హెచ్ఐవీ నయం!
హెచ్ఐవీ(హ్యుమన్ ఇమ్యూనోడెఫిషియెన్సీ వైరస్) సోకితే మరణం తప్పదనే మాటకు కాలం చెల్లబోతోందా?. హిందూవులు పవిత్రంగా పూజించే గోవు జన్యువులతో మనుషులకు సోకే హెచ్ఐవీని నయం చేయోచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అవును. హెచ్ఐవీ వైరస్కు గోవు శరీరంలో అత్యతం వేగంగా ప్రతిరక్షకాలు తయారవుతున్నట్లు పరిశోధకులు గుర్తించారు. దీంతో ప్రపంచాన్ని వేధిస్తున్న హెచ్ఐవీ చికిత్సలో కొత్త ఆశాలు రేగుతున్నాయి. హెచ్ఐవీపై పరిశోధనల్లో భాగంగా శాస్త్రవేత్తలు.. నాలుగు ఆవు దూడలకు హెచ్ఐవీ ఇమ్యునోజన్స్ను ఇంజక్షన్ ద్వారా ఎక్కించారు. అనంతరం ఆ దూడల రక్తంలో హెచ్ఐవీ ప్రభావాన్ని నిరోధించే ప్రతిరక్షకం వెంటనే అభివృద్ధి కావడం వారిని విస్మయపరిచింది. వాటిలో ‘ఎన్సీ-సీఓడబ్ల్యూ 1’ అనే ప్రతిరక్షకం హెచ్ఐవీని ఎదుర్కోవడంలో ప్రభావవంతంగా పనిచేసినట్లు గుర్తించారు. దీంతో ఆవులోని రోగ నిరోధక శక్తి ఇలాంటి ప్రతిరక్షకాలను వెంటనే ఎలా తయారు చేయగలుగుతుందో అర్థం చేసుకోవాలని వ్యుహం రచించారు. ప్రతిరక్షకాల ప్రక్రియను కనుగొంటే హెచ్ఐవీ సోకకుండా టీకాను అభివృద్ధి చేయడం సాధ్యమవుతుందని భావిస్తున్నారు. అమెరికాకు చెందిన స్క్రిప్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, ది ఇంటర్నేషనల్ ఎయిడ్స్ వ్యాక్సిన్ ఇనిషియేటివ్ (ఐఏవీఐ), టెక్సాస్ ఏ అండ్ ఎం యూనివర్సిటీ పరిశోధకులు జరిపిన ఈ పరిశోధన వివరాలు ‘నేచర్’ జర్నల్లో ప్రచురితమయ్యాయి. -
పదిదేశాల్లో అంటు వ్యాధిలా హెచ్ఐవీ
హైదరాబాద్: భారత్, చైనాతో పాటు పది దేశాల్లో హెచ్ఐవీ అంటువ్యాధిలా వ్యాప్తి చెందుతుందని ఐకరాజ్య సమితి(యూఎన్) తమ నివేదికలో పేర్కొంది. ప్రపంచ వ్యాప్తంగా ఐక్యరాజ్య సమితి హెచ్ఐవీ ఎయిడ్స్ నిర్మూలనుకు చెపట్టిన కార్యక్రమాలపై జరిపిన విశ్లేషణ రిపోర్టులో ఈ విషయాలు వెల్లడించింది. భారత్, చైనాతోపాటు, ఇండోనేషియా, పాకిస్థాన్, వియాత్నం, మయన్మార్, పాపువా న్యూ గినియా, ఫిలిప్పిన్స్, తైలాండ్, మలేసియాలో హెచ్ఐవీ అంటువ్యాధిలా ప్రబలుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. ప్రపంచ వ్యాప్తంగా కొత్తగా హెచ్ఐవీ సోకిన బాధితుల్లో 95 శాతం ఈ పదిదేశాలకు చెందిన వారేనని పేర్కొంది. దీనికి సెక్సు వర్కర్లు, ట్రాన్స్జెండర్స్లతో లైంగిక చర్యలకు పాల్పడటం, ఇంజక్షన్స్ తో డ్రగ్స్ తీసుకోవడమే ప్రధాన కారణంగా తెలిపింది. అయితే గత ఆరు సంవత్సరాల నుంచి హెచ్ఐవీ భారిన పడే వారి సంఖ్య ప్రపంచ వ్యాప్తంగా 13 శాతం తగ్గిందని పేర్కొంది. భారత్లోని 26 నగరాల్లో జరిపిన సర్వేలో 46 శాతం మంది డ్రగ్స్ ఇంజెక్ట్ చెసుకోవడం వల్లే హెచ్ఐవీ బాధితులుగా మారారని పేర్కొంది. గతంతో పోలిస్తే ఎయిడ్స్ బాధితుల మరణాలు తగ్గినట్లు తమ సర్వేలో వెల్లైడందని యూఎన్ రిపోర్టులో పేర్కొంది. -
హెచ్ఐవీ చిన్నారుల కోసం నోటిఫికేషన్
న్యూఢిల్లీ: ప్రాణాంతకర హెచ్ఐవీ సోకిన చిన్నారులను సైతం బలహీనవర్గాల జాబితా (డిస్అడ్వాంటేజ్ గ్రూప్)లో చేరుస్తూ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు కొత్త నోటిఫికేషన్ జారీచేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. చిన్నారులకు ఉచిత, నిర్భంద విద్యా హక్కు కల్పిస్తూ 2009లో తెచ్చిన చట్టం ప్రకారం హెచ్ఐవీ బాధిత చిన్నారులను డిస్అడ్వాంటేజ్ గ్రూప్లో చేర్చాల్సి ఉంది. అందుకనుగుణంగా ఇప్పటికే 11 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతం కొత్త నోటిఫికేషన్ తెచ్చాయని, మిగతా రాష్ట్రాలు, కేంద్రపాలితప్రాంతాలు అదేబాటలో నడవాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేఎస్ ఖేహర్, జస్టిస్ డీవై చంద్రచూడ్ల ధర్మాసనం ఆదేశించింది. జమ్మూకశ్మీర్మినహా మిగతావన్నీ వచ్చే ఎనిమిది వారాల్లో నోటిఫికేషన్ జారీచేయాలని కోర్టు పేర్కొంది. -
హెచ్ఐవీ బాధితులకు త్వరగా క్షయ
కర్నూలు(హాస్పిటల్): ఇతర రోగుల కంటే హెచ్ఐవీతో బాధపడే వ్యక్తులకు క్షయ(టీబీ) త్వరగా వచ్చే అవకాశం ఉందని ఏఆర్టీ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ మధులిక చెప్పారు. శనివారం కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని ఏఆర్టీ సెంటర్లో నేస్తం పాజిటివ్ నెట్వర్క్ విహాన్ సీఎస్సీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న హెచ్ఐవీ–టీబీ వారోత్సవాల్లో ఆమె మాట్లాడారు. క్షయ వ్యాధి గాలి ద్వారా వ్యాపించే అంటు వ్యాధి అని తెలిపారు. హెచ్ఐవీతో జీవిస్తున్న వారికి ఈ వ్యాధి త్వరగా సోకుతుందన్నారు. క్షయ శరీరంలోని ఏ భాగానికైనా సోకుతుందన్నారు. వ్యాధి లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యులను కలిసి చికిత్స తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో విహాన్ సీఎస్సీ ప్రాజెక్టు కో ఆర్డినేటర్ బి. నాగరాజు, ఏఆర్టీ సిబ్బంది పాల్గొన్నారు. -
మూడేళ్లలో హెచ్ఐవీ వ్యాక్సిన్?
జాన్సన్ అండ్ జాన్సన్ శాస్త్రవేత్త పాల్ స్టౌఫెల్స్ వెల్లడి జీవశాస్త్ర రంగంలో భారత్కు ఉజ్వల భవిష్యత్తు సమన్వయంతో పనిచేయడం కీలకమని వ్యాఖ్య బయో ఆసియా సదస్సులో పాల్గొన్న శాస్త్రవేత్త సాక్షి నాలెడ్జ్ సెంటర్ హెచ్ఐవీ సోకితే రోజులు లెక్కబెట్టుకో వాల్సిందే అన్నది కొన్నేళ్ల కిందటి మాట.. క్రమం తప్పకుండా మందులు వాడితే జీవితాన్ని దశా బ్దాల పాటు పొడిగించుకోవచ్చన్నది నేటి పరి స్థితి. మరి భవిష్యత్తు మాటేమిటి? హెచ్ఐవీయే కాదు కేన్సర్ వంటి అనేక ప్రాణాంతక వ్యాధు లకూ మెరుగైన చికిత్సలు అందుబాటులోకి వస్తా యని డాక్టర్ పాల్ స్టౌఫెల్స్ చెబుతున్నారు. హెచ్ఐవీకి మూడేళ్లలో వ్యాక్సిన్ సిద్ధం కానుందని అంటున్నారు. బహుళజాతి కంపెనీ జాన్సన్ అండ్ జాన్సన్ ప్రధాన శాస్త్రవేత్త అయిన ఆయన హైదరాబాద్లో జరుగుతున్న బయో ఆసియా సదస్సుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ‘సాక్షి’ ఆయనను పలకరించగా... ఫార్మా రంగం లో వినూత్న పోకడలు, పరిశోధన అంశాలను వెల్లడించారు. జీవశాస్త్ర రంగంలో అపార నైపుణ్య మున్న భారత్ త్వరలోనే ప్రపంచంలోనే అగ్రగామిగా మారగలదని పేర్కొన్నారు. హెచ్ఐవీ వ్యాక్సిన్ ఎప్పటిలోగా సాధ్యం? సుమారు 30 ఏళ్ల క్రితం ఆఫ్రికాలో హెచ్ఐవీ సోకిన వారు 3 నుంచి 6 నెలలకు మించి బతికేవారు కాదు. అప్పుడే ఈ వ్యాధికి వినూత్న రీతిలో పరిష్కారాన్ని కనుక్కోవాలని తీర్మానం చేసుకున్నాం. ఇప్పటివరకు దాదాపు ఆరువేల హెచ్ఐవీ వైరస్లను నిశితంగా పరిశీలించి దాని బలహీనతలను గుర్తించాం. యాంటీ రిట్రోవైరల్ మందుల ద్వారా ఆయుః ప్రమాణాలను గణ నీయంగా పెంచగలిగాం. ఈ విషయంలో భారత దేశంలోని జెనరిక్ మందుల రంగాన్ని కచ్చితంగా ప్రశంసించాలి. మేం టెక్నాలజీని అభివృద్ధి చేసి ఇస్తే జెనరిక్ ఫార్మా కంపెనీలు వాటికి మందుల రూపమిచ్చి.. అతి చౌక ధరలతో ప్రపంచానికి అందించగలిగాయి. ఫలితంగా కొన్ని లక్షల ప్రాణాలు నిలబెట్టగలిగాం. ఇదే స్ఫూర్తితో జాన్సన్ అండ్ జాన్సన్ సంస్థ ఇప్పుడు హెచ్ఐవీకి వ్యాక్సిన్ను కనుగొనే ప్రయత్నాలు మొదలెట్టింది. 2020కి వ్యాక్సిన్ తయారీపై స్పష్టత వస్తుంది. మందులుండగా వ్యాక్సిన్ ప్రత్యేకత ఏమిటి? ఒకసారి హెచ్ఐవీ బారిన పడితే జీవితాంతం మందులు వాడాలి. ఒక్కమాత్ర కూడా తప్ప కుండా దాదాపు 30 – 40 ఏళ్లు మందులు వాడట మన్నది అందరికీ సాధ్యమయ్యే విషయం కాదు. మాత్రలకు బదులుగా వ్యాక్సిన్ అందుబాటు లోకి వస్తే వ్యాధి ఇతరులకు సోకకుండా నివా రించే అవకాశాలు ఎక్కువవుతాయి. కేన్సర్కు కొత్త చికిత్సలు అందుబాటులోకి వస్తున్నాయి. వాటిల్లో ఏది మెరుగైంది? శరీర రోగ నిరోధక వ్యవస్థను చైతన్యవంతం చేయడం ద్వారా అది కేన్సర్ కణాలను నాశనం చేసే ఇమ్యునోథెరపీ మొదలుకొని ఎన్నో కొత్త విధానాలు సిద్ధమవుతున్నది వాస్తవమే. సాంక్ర మిక వ్యాధులపై విజయం సాధించిన విధంగానే కొన్ని మందులను కలపడం, వ్యక్తులకు తగి నట్టుగా చికిత్స పద్ధతులను అభివృద్ధి చేయడం ద్వారా కేన్సర్ను జయించడం కష్టమేమీ కాదు. మొండి క్షయకు సరికొత్త మందు తయారీపై..! ప్రస్తుతం క్షయ చికిత్సకు ఉపయోగిస్తున్న మందులకు నిరోధకత ఏర్పడింది. దాంతో ‘బెడాక్విలిన్’కు ప్రాధాన్యమేర్పడింది. దాదాపు 4 దశాబ్దాల తరువాత మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ క్షయ వ్యాధికి ఈ కొత్త మందు అందుబాటులోకి వచ్చింది. దీన్ని సామాన్య ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వాలతో కలిసి పనిచేస్తున్నాం. జీవశాస్త్రంలో భారత్ అవకాశాలేంటి? భారత్ జీవశాస్త్ర రంగంలో అంతర్జాతీయ ఖ్యాతి గడిస్తుందన్నది నా బలమైన నమ్మకం. -
ఎయిడ్స్ రోగికి వైద్యం నిరాకరణ!
► ఆశ్రయం ఇవ్వడానికి బంధువుల నిరాకరణ ► స్థానికుల చొరవతో ఆస్పత్రికి.. మహబూబాబాద్: జిల్లా కేంద్రంలోని ఏరియా ఆస్పత్రి వైద్యులు ఓ రోగికి వైద్యం చేసేందుకు నిరాకరించారు. ఇటు బంధువులూ.. అద్దె ఇంటి వారు దగ్గరకు రానివ్వలేదు. తొర్రూ రు మండలంలోని కంఠాయపాలెం కు చెందిన మహ్మద్ పాషా, రజి యాలకు ఇద్దరు కుమారులు ఉన్నారు. పాషా సుతారీ మేస్త్రీ. ఈ కుటుంబం జిల్లా కేంద్రంలో ఇల్లు అద్దెకు తీసుకొని ఉంటోంది. రజియాకు హెచ్ఐవీ ఉన్నట్లు వరంగల్ ఎంజీ ఎం వైద్యులు నిర్ధారించారు. 15 రోజుల క్రితం మహబూబాబాద్ ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లగా, హెచ్ఐవీతోపాటు టీబీ కూడా ఉందని చెప్పారు.. దీంతో ఆమెను హన్మకొండ భీమారంలో టీబీ ఆస్పత్రికి తీసుకెళ్లగా.. అక్కడి వారు పట్టించుకోలేదు. దీంతో ఆ కుటుంబం అద్దె ఇంటికి తిరిగి వచ్చింది. అయితే, అద్దె ఇంటి యజమాని రజియా వ్యాధిగురించి తెలిసి ఇంటికి రానివ్వలేదు. ఈ క్రమంలో మంగళవారం మళ్లీ మహబూబాబాద్ ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లగా.. వైద్యులు అడ్మిట్ చేసుకోమని చెప్పారు. స్వగ్రామంలోని సోదరుడి ఇంటికి వెళ్లినా.. ఆశ్రయం లభించలేదు. తిరిగి మహబూబాబాద్కు వచ్చిన పాషా పట్టణ శివారులో రోడ్డు పక్కన రజియాను పడుకోబెట్టాడు. రాత్రంతా తన పిల్లలతో జాగరణ చేశాడు. దీంతో స్థానికులు 108 సమాచారం అందించి ఏరియా ఆస్పత్రికి తరలించారు. వైద్యులు రజి యాను అడ్మిట్ చేసుకున్నారు. జిల్లా సంక్షేమ అధికారి స్వర్ణలత లెనిని వచ్చి వివరాలు సేకరించారు. -
హెచ్ఐవీ చిన్నారుల ప్రవేశాలు నిరాకరిస్తే చర్యలు
సాక్షి, హైదరాబాద్: హెచ్ఐవీ బాధిత చిన్నారులకు పాఠశాలల్లో ప్రవేశాలను నిరాకరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పాఠశాల విద్యా డైరెక్టర్ కిషన్ పేర్కొన్నారు. ఎక్కడైనా ప్రవేశాలు నిరాకరించినట్లు తమ దృష్టికి వస్తే వెంటనే చర్యలు చేపట్టాలని డీఈవోలను ఆదేశించారు. ఈ మేరకు డీఈవోలకు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. -
‘హెచ్ఐవీ’చికిత్సతో సిఫిలిస్ ముప్పు!
టొరంటో: హెచ్ఐవీకి యాంటీరెట్రోవైరల్ మందులు వాడుతున్న పురుషులకు సిఫిలిస్ అవకాశాలు ఎక్కువగా ఉంటాయని కొత్త అధ్యయనం హెచ్చరిస్తోంది. ప్రస్తుతం హెచ్ఐవీకి ‘హార్ట్’(హైలీ యాక్టివ్ యాంటీరెట్రోవైరల్ థెరపీ) మంచి చికిత్సగా ఉంది. కెనడాలోని బ్రిటిష్ కొలంబియా విశ్వవిద్యాలయం, దక్షిణాఫ్రికాలోని ఆఫ్రికన్ ఇన్ స్టిట్యూట్ ఫర్ మేథమెటికల్ సైన్సెస్ పరిశోధకులు ఈ అధ్యయనం చేశారు. హార్ట్ చికిత్స రోగ నిరోధక శక్తిని పెంచుతుందనీ, కానీ చికిత్స తీసుకుంటున్న వారిలో గనేరియా, క్లామైడియాలకన్నా, సిఫిలిస్ ఎక్కువగా రావడానికి కారణం ఏంటో అంతుపట్టడం లేదని పరిశోధకులు అంటున్నారు. -
50 కోట్ల ఏళ్ల క్రితమే హెచ్ఐవీ!
లండన్: హెచ్ఐవీ (హ్యూమన్ ఇమ్యునోడిఫిసియెన్సీ వైరస్) సహా రెట్రోవైరస్లన్నీ 50 కోట్ల ఏళ్ల క్రితం నుంచే ఉన్నాయని ఆక్స్ఫర్డ్ శాస్త్రవేత్తలు చేసిన తాజా అధ్యయనంలో తేలింది. జంతుజాతుల శరీరాలను ఆవాసాలుగా మార్చుకుని ఇవి మనుగడ సాగించాయని వారు పేర్కొంటున్నారు. ఈ వైరస్లకు విరుగుడు మందులను కనిపెట్టడంలో తాజా అధ్యయనం కీలకపాత్ర పోషిస్తుందని పరిశోధకులు భావిస్తున్నారు. ‘రెట్రోవైరస్లు సకశేరుకాల్లో బాగా విస్తరించి ఉన్నాయి. ఒక శరీరం నుంచి మరో శరీరానికి వ్యాప్తి చెంది కొత్త వ్యాధులను తీసుకురాగలవు’అని పరిశోధకుల్లో ఒకరైన కట్జౌరకిస్ తెలిపారు. రెట్రోవైరస్లు 10 కోట్ల ఏళ్ల క్రితం నుంచి ఉండేవని ఇప్పటిదాకా భావిస్తుండేవారు. -
హెచ్ఐవీ, మధుమేహం ఔషధాల రేట్లు 44% దాకా తగ్గింపు
న్యూఢిల్లీ: హెచ్ఐవీ, మధుమేహం మొదలైన వాటి చికిత్సలో ఉపయోగించే 50 పైగా ఔషధాల ధరలపై కేంద్ర ప్రభుత్వం పరిమితులు విధించింది. దీంతో వీటి ధరలు 5 నుంచి 44 శాతం దాకా తగ్గనున్నాయి. 29 ఫార్ములేషన్ల రిటైల్ ధరలపై కూడా జాతీయ ఔషధ ధరల నియంత్రణ సంస్థ (ఎన్పీపీఏ) పరిమితులు విధించింది. జాబితాలోని నిర్దిష్ట ఔషధాల ధరలు 5–44 శ్రేణిలో తగ్గుతాయని, తగ్గుదల సగటున 25 శాతం మేర ఉండగలదని ఎన్పీపీఏ చైర్మన్ భూపేంద్ర సింగ్ తెలిపారు. తాజాగా నిర్దేశించిన పరిమితుల ప్రకారం హెచ్ఐవీ చికిత్సలో ఉపయోగించే నెవిరాపైన్ కాంబినేషన్ ఔషధ ట్యాబ్లెట్పై సీలింగ్ ధర రూ. 14.47గా ఉంటుంది. క్యాన్సర్ సంబంధ కీమోథెరపీలో ఉపయోగించే సైటోసిన్ అరాబినోసైడ్ ఒక్కో ప్యాక్ ధర (500 మి.గ్రా) రూ. 455.72గా ఉండనుంది. -
మేమూ మనుషులమే...
హిమాయత్నగర్: ‘మేమూ మనుషులమే. మాకు అందరిలా స్వేచ్ఛగా సమాజంలో తిరిగే హక్కుంది. బస్, ఆటో, బస్టాండ్.. ఇలా ఎక్కడైనా మమ్మల్ని చులకనగా చూస్తున్నారు. జంతువుల్లా భావిస్తూ మమ్మల్ని చూస్తేనే అందరూ పరార్ అవుతున్నార’ హిజ్రాలు ఆవేదన వ్యక్తం చేశారు. తమ పట్ల ఈ విధంగా ప్రవర్తిస్తూ గుండెలు పగిలేలా చేయొద్దంటూ కన్నీరు పెట్టుకున్నారు. హైదరగూడలోని సెంట్రల్ పార్క్ హోటల్లో ‘ఇండియా హెచ్ఐవీ ఎయిడ్స్ అలియాన్స్’ సంస్థ ఆధ్వర్యంలో బుధవారం ‘హ్యాండ్సప్ ఫర్ హెచ్ఐవీ ప్రివెన్షన్’ సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు నగరవ్యాప్తంగా ఉన్న హిజ్రాలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. తొలుత జరిగిన కార్యక్రమంలో వీరంతా మోడల్స్ తరహాలో క్యాట్వాక్ చేసి అందర్నీ ఆకట్టుకున్నారు. అనంతరం హిజ్రాల ప్రతినిధి, సోషలిస్టు చంద్రముఖి.. ఐహెచ్ఏ క్లినిక్ మేనేజర్ కె.బాలకృష్ణ, దర్శన్ ఫౌండేషన్ చైర్మన్ కుమార్లతో కలిసి విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. హెచ్ఐవీ ఎయిడ్స్ బిల్లును రాజ్యసభలో ఆమోదించినప్పటికీ అమలు కావడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. హిజ్రాలను కూడా సాధారణ మనుషుల్లాగే గుర్తించి ప్రభుత్వం నుంచి వారికి అన్ని సంక్షేమ కార్యక్రమాలను అందించాలని జాతీయ లీగల్ సర్వీస్ అథారిటీ 2014లో ఆదేశాలు ఇచ్చినప్పటికీ.. అవి ఎక్కడా అమలు కావడం లేదన్నారు. జంతువుల్లా చూస్తున్నారు... అందరిలా మేము ఆటోల్లో వెళ్లాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. మేము ఆటో ఎక్కేందుకు ప్రయత్నిస్తుండగానే ఏదో జంతువు వచ్చిందనే విధంగా మమ్మల్ని చూసి పారిపోతున్నారు. దీంతో మేం మానసికంగా ఎంతో కుంగిపోతున్నాం. – అంజలి మేమూ సాధించగలం.. అందరూ అబ్బాయిలు, అమ్మాయిల్లా మేమూ సమాజంలో పేరు ప్రఖ్యాతులు సాధించగలం. మేమూ గొప్ప గొప్ప చదువులు చదివాం... కానీ సమాజాన్ని చదవలేకపోతున్నాం. మమ్మల్ని మనుషులుగా గుర్తించండి. – మధుశ్రీ -
హెచ్ఐవీ బాధితులకు టీబీ పరీక్ష తప్పనిసరి
కర్నూలు(హాస్పిటల్): హెచ్ఐవీ/ఎయిడ్స్ బాధితులకు తప్పనిసరిగా టీబీ పరీక్ష చేయించాలని డీఎంహెచ్వో డాక్టర్ యు.స్వరాజ్యలక్ష్మి చెప్పారు. హెచ్ఐవీ, టీబీ మందులపై శుక్రవారం డీఎంహెచ్వో కార్యాలయంలో ఏఆర్టీ, టీబీ యూనిట్ల వైద్యసిబ్బందికి అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ స్వరాజ్యలక్ష్మి మాట్లాడుతూ.. హెచ్ఐవీ, టీబీ రోగులకు ఏఆర్టీ థెరపి మందులు ఏఆర్టీ సెంటర్లోనే ఇస్తారన్నారు. గతంలో టీబీ రోగులకు ఆరు నెలలకు సరిపడా మందులు ఒకేసారి ఇచ్చేవారమని, ఇప్పుడు నెలకు ఒక బాక్స్ మాత్రమే ఇస్తున్నామన్నారు. ఇకపై ప్రతి నెలా పరీక్ష చేయించుకోవాల్సి ఉంటుందన్నారు. జిల్లా క్షయ నియంత్రణాధికారి డాక్టర్ మోక్షేశ్వరుడు మాట్లాడుతూ.. టీబీ లేకుండా హెచ్ఐవీ ఉన్న వారు.. గతంలో ఏడు మాత్రలు మింగేవారని, ఇప్పుడు ఏడు మందులు కలిపి రెండు మాత్రలుగా చేశారన్నారు. రెండు మాత్రలను చించిన తర్వాత ఫోన్ నెంబర్ ఉంటుందని, ఆ ఫోన్ నెంబర్కు మిస్డ్కాల్ ఇస్తేనే వారు మింగినట్లు ఆన్లైన్లో నమోదవుతుందన్నారు. ఎవరైనా ఫోన్ చేయకపోతే వారి ఇంటికి సిబ్బంది వెళ్లి మందులు మింగేలా చర్యలు తీసుకుంటారని తెలిపారు. సమావేశంలో అడిషనల్ డీఎంహెచ్వో(ఎయిడ్స్ అండ్ లెప్రసి) డాక్టర్ రూపశ్రీ, డీఐవో డాక్టర్ వెంకటరమణ, డబ్యూహెచ్వో ప్రతినిధి డాక్టర్ జోసఫ్, కర్నూలు, నంద్యాల ఏఆర్టీ మెడికల్ ఆఫీసర్లు, స్టాఫ్నర్సులు, ఫార్మాసిస్టులు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, 18 టీబీ యూనిట్లు మెడికల్ ఆఫీసర్లు, సూపర్వైజర్లు, ల్యాబ్ సూపర్వైజర్లు, ఏఎన్ఎంలు పాల్గొన్నారు. -
క్షణికావేశానికి లోనుకావద్దు
► హెచ్ఐవీకి మందులు లేవు.. నివారణ ఒక్కటే మార్గం ►ప్రపంచ ఎయిడ్స్ దినం సభలోడీఎంహెచ్ఓ ►విద్యార్థులతో ర్యాలీ ఒంగోలు సెంట్రల్ : హెచ్ఐవీ వ్యాధికి చికిత్స లేదని నివారణ ఒక్కటే మార్గమని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ జె. యాస్మిన్ అన్నారు. ప్రపంచ ఎరుుడ్స దినం సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధ్వర్యంలో గురువారం స్థానిక అంబేడ్కర్ భవన్లో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. హెచ్ఐవీకి గురైన అనేక కుటుంబాలు వీధిన పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. యువతీ యువకులు క్షణికావేశానికి లోను కాకూడదని హెచ్చరించారు. 15 నుంచి 49 ఏళ్ల వయసు గల వారు ఎక్కువగా ఈ వ్యాధికి గురి అవుతున్నారని చెప్పారు. దీని నివారణకు పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలను చేపడుతున్నట్లు తెలిపారు. పౌష్టికాహారం తీసుకోవాలి నయంకాని వ్యాధి బారిన పడినవారు పౌష్టికాహారం తీసుకుంటూ ఏఆర్టీ మందులు వాడితే తమ జీవిత కాలాన్ని పొడిగించుకోవచ్చని డీఎంహెచ్ఓ తెలిపారు. ఈ వాధివల్ల మరణించిన వారి పిల్లలు అనాథలుగా మారుతున్నారని తెలిపారు. జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి టి. రాజా వెంకటాద్రి మాట్లాడతూ ప్రభుత్వ శాఖలన్నీ సమన్వయంగా పని చేస్తే ఈ మహమ్మారిని నిర్మూలించవచ్చన్నారు. దీని వ్యాప్తిలో భారత దేశం ప్రపంచంలో మూడో స్థానంలో ఉందన్నారు. వ్యాధిగ్రస్తులకు స్వచ్ఛంద సంస్థలు సహకరించాలని కోరారు. ముందుగా కలెక్టర్ కార్యాలయం వద్ద ఎరుుడ్స ర్యాలీని ప్రారంభించారు. ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. ఇక్కడ సంయుక్త కలెక్టర్ డాక్టర్ హరిజవహర్లాల్ మాట్లాడుతూ ఎరుుడ్స వ్యాధికి నివారణే మార్గమని తెలిపారు. అవగాహనతోనే అరికట్టాలన్నారు. ఎరుుడ్స, లెప్రసీ విభాగం అదనపు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కె. పద్మావతి, రిమ్స్ డెరైక్టర్ డాక్టర్ వల్లీశ్వరి, జిల్లా క్షయ నివారణ అధికారి టి. రమేష్, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి సరళాదేవి, అదనపు డీఎంహెచ్ఓ శకుంతల, ఏపీవీవీ ఇన్చార్జి కో ఆర్డినేటర్ ఉష, రిమ్స్ వైద్యులు డాక్టర్ జోసఫ్ శామ్యూల్, డాక్టర్ బాలాజీ నాయక్, కిరణ్మరుు, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, నర్సింగ్, ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు. ఎన్సీసీ..ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో.. ఒంగోలు కల్చరల్ : వరల్డ్ ఎరుుడ్స డే పురస్కరించుకుని గురువారం స్థానిక సీఎస్ఆర్ శర్మ కళాశాల విద్యార్థులు, ఎన్సీసీ క్యాడెట్లు, జాతీయ సేవా పథకం వలంటీర్లు ర్యాలీ నిర్వహించారు. కళాశాల నుంచి ప్రకాశం భవనం వరకు వెళ్లారు. ప్రిన్సిపాల్ మొలకలపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రజలను చైతన్యవంతులను చేసేందుకు ఎన్సీసీ క్యాడెట్లు, ఎన్ఎస్ఎస్ వలంటీర్లు కృషి చేయాలని కోరారు. ఎసీసీసీ ఆఫీసర్ కె. మనోజ్ఞకుమార్, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ శాస్త్రి, అధ్యాపకులు పాల్గొన్నారు. -
8 నెలల్లో 7,300 ఎయిడ్స్ కేసులు
నేడు ప్రపంచ ఎయిడ్స్ దినం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఎయిడ్స్ రోజురోజుకూ విస్తరిస్తోంది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు కొత్తగా 7,308 మంది హెచ్ఐవీ బారిన పడ్డారు. డిసెంబర్ 1న ప్రపంచ ఎయిడ్స్ దినం సందర్భంగా బుధవారం వైద్య, ఆరోగ్యశాఖ విడుదల చేసిన పూర్వ జిల్లాల లెక్కల ప్రకారం అత్యధికంగా హైదరాబాద్లో 1,348 మంది, రంగారెడ్డి జిల్లాలో 778 మంది హెచ్ఐవీతో బాధపడుతున్నారు. పాత ఆదిలాబాద్ జిల్లాలో 285 హెచ్ఐవీ కేసులు, నిజామాబాద్ జిల్లాలో 632, కరీంనగర్లో 594, మెదక్లో 784, మహబూబ్నగర్లో 766, నల్లగొండలో 768, వరంగల్లో 630, ఖమ్మం జిల్లాలో 723 కేసులు కొత్తగా నమోదయ్యాయి. ఎయిడ్స్ పై ప్రచారం కొన్నాళ్లుగా నిలిచిపోవడంతో ఈ పరిస్థితి తలెత్తిందని వైద్య ఆరోగ్యశాఖ అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వం కూడా కొన్నాళ్లు హెచ్ఐవీ, సీడీ4 వంటి నిర్ధారణ పరీక్ష కిట్లను పూర్తి స్థాయిలో సరఫరా చేయలేదన్న ఆరోపణలున్నాయి. రాష్ట్రంలో ప్రస్తుతం 1.7 లక్షల మంది హెచ్ఐవీ బాధితులుండగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లోనే లక్ష మంది వరకు ఉన్నట్లు అంచనా. -
నిశ్శబ్దాన్ని ఛేదించారు!
వ్యాధి విషయమై మాట్లాడుతున్నారు జిల్లాలో ఏటా తగ్గుతున్న హెచ్ఐవీ కేసులు {పభుత్వం నుంచి సాకారం అవసరం రేపు ప్రపంచ ఎయిడ్స్ నివారణ దినోత్సవం చిత్తూరు (అర్బన్) : హెచ్ఐవీ.. దశాబ్దం క్రితం వరకు కూడా దీనిపై నలుగురిలో మాట్లాడాలంటే వణుకు. వ్యాధి లక్షణాలు కనిపిస్తే గుండె జారిపోరుునంత పని. వ్యాధి సోకిందని తెలిస్తే ఆత్మహత్య ఒక్కటే దారనుకునే రోజులు. అందుకే దీనిపై నిశ్శబ్దంగా ఉండిపోయేవాళ్లు. కానీ ఇప్పుడు.. మాట్లాడుతున్నారు.. ధైర్యంగా మాట్లాడుతున్నారు. హెచ్ఐవీ పట్ల తెలిసిన విషయాలను నలుగురితో పంచుకుంటున్నారు. గురువారం ప్రపంచ ఎరుుడ్స నివారణ దినోత్సవం సందర్భంగా జిల్లాలో పరిస్థితిపై ప్రత్యేక కథనమిదీ. ఐదేళ్ల క్రితం జిల్లాలో హెచ్ఐవీ బాధితుల సంఖ్య 2,462 ఉంటే ప్రస్తుతం ఈ సంఖ్య వెరుు్యకి చేరింది. సుఖ వ్యాధులు, రోగాల పట్ల ప్రజలు అవగాహనతో ఉండటం వల్లే హెచ్ఐవీ బాధితుల సంఖ్య తగ్గుతూ వస్తోంది. వ్యాధి బారినపడ్డ వాళ్లకు ఆ ప్రాంతాల్లో సుఖ వ్యాధి చికిత్స కేంద్రాలు (డీఎస్ఆర్సీలు), వైరస్ వ్యాప్తిని నిరోధించడానికి యాంటీ రిట్రో వైరల్ థెరపి (ఏఆర్టీ) కేంద్రాలు 18 పనిచేస్తున్నారుు. వీటిల్లోని సిబ్బంది హెచ్ఐవీ బాధితులకు వైద్య సేవలు అందించడంతో పాటు వాళ్లలో మనోధైర్యాన్ని పెంచేలా కౌన్సెలింగ్ చేస్తున్నారు. ప్రభుత్వ ఆదరణ ఏదీ..? జిల్లాలో ఎరుుడ్స నియంత్రణ కోసం పనిచేస్తున్న ఐసీటీసీ కేంద్రాలకు రెండేళ్లుగా నిధులు విడుదల కాలేదు. ఫలితంగా ఈ కేంద్రాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు. నిధుల్లేక పనులు ఎలా చేయగలమని ప్రశ్నిస్తున్నారు. జిల్లాలో ఉన్న హెచ్ఐవీ బాధితులకు పింఛన్లు పంపిణీ చేస్తున్నా, వాటిని తీసుకోవడానికి చాలా మంది ముందుకు రావడంలేదు. సాటివారు చులకనగా చూస్తారనే భావం హెచ్ఐవీ బాధితుల్ని వెంటాడుతోంది. ఇలాంటివారికి ఇళ్ల వద్దకు కాకుండా బ్యాంకు ఖాతాల్లో పింఛన్లు జమచేస్తే ఉపయోగకరంగా ఉంటుంది. చైతన్యం తెస్తున్నాం ఏటా అంతర్జాతీయ ఎరుుడ్స నివారణ దినోత్సవం నేపథ్యంలో ఒక కొత్త స్లోగన్తో ప్రజల్ని చైతన్యం చేస్తున్నాం. ఈ సారి హెచ్ఐవీ వ్యాప్తిలేని సమాజాన్ని సాధిద్దామనే నినాదంతో ప్రజల్లోకి వెళుతున్నాం. ఇందులో స్వచ్ఛంద సేవా సంస్థల భాగస్వామ్యం కీలకం. ప్రజలు సైతం చైతన్యంతో వైద్యుల వద్దకు వస్తున్నారు. ఎలాంటి ఇబ్బందులున్నా నిర్మొహమాటంగా చెబుతున్నారు. పాజిటివ్ వచ్చినా మనోధైర్యంతో చికిత్స చేరుుంచుకుంటున్నారు. - డాక్టర్ వెంకటప్రసాద్, జిల్లా ఎరుుడ్స నియంత్రణాధికారిణి -
పులిరాజాకు ఇప్పుడు ఏమైంది ?
డిసెంబర్ 1 వరల్డ్ ఎయిడ్స్ డే సందర్భంగా... ‘పులిరాజాకు ఎయిడ్స్ వస్తుందా?’... ఒకప్పుడు విస్తృతంగా జరిగిన ప్రచారం ఇది. ఉత్కంఠను రేకెత్తించడమే కాదు, ఉపద్రవంలా మారిన ఎయిడ్స్ / హెచ్ఐవీపై అవగాహన పెంపొందించడానికి దోహదపడిన ప్రచారం ఇది. కొన్నేళ్లుగా ఈ ప్రచార జోరు కనబడనంతగా తగ్గింది. ఇంతకూ పులిరాజా ఇప్పుడేమయ్యాడు? బర్డ్ ఫ్లూ, స్వైన్ ఫ్లూ, ఎబోలా, జికా వంటి వాటి తాకిడితో మరుగునపడ్డాడా? ‘పులిరాజాకు ఎయిడ్స్ వస్తుందా?’ అనే ప్రచారం ఒకప్పుడు ఊరూ వాడా హోరెత్తించింది. ఎయిడ్స్ లేదా హెచ్ఐవీ అంటేనే జనం భయంతో వణికిపోయే రోజులవి. ‘పులిరాజా’ ప్రచారం జనంలో ఎయిడ్స్పై కొంత మేరకు అవగాహన కల్పించడంలో సఫలమైంది. బర్డ్ ఫ్లూ, స్వైన్ ఫ్లూ, ఎబోలా, జికా వైరస్ వంటి ఉపద్రవాలు ముంచుకు రావడంతో ఎయిడ్స్ నుంచి జనం దృష్టి మళ్లింది. కొన్నేళ్లుగా ఎయిడ్స్/హెచ్ఐవీ వ్యాప్తిలో కొంత తగ్గుదల నమోదవుతున్నట్లుగా గణాంకాలు చెబుతున్నాయి. అయితే, ఎయిడ్స్/హెచ్ఐవీ పూర్తిగా కనుమరుగు కాలేదు. ఇప్పటికీ కొత్త కేసులు నమోదవుతూనే ఉన్నాయి. మరణాలు సంభవిస్తూనే ఉన్నాయి. అయితే, గడచిన రెండు మూడు దశాబ్దాలతో పోలిస్తే కొత్తగా నమోదవుతున్న హెచ్ఐవీ కేసుల సంఖ్య కొంతవరకు తగ్గుముఖం పట్టింది. యాంటీ రిట్రోవైరల్ చికిత్స పొందుతున్న వారి సంఖ్య పెరిగింది. ఇది కొంత ఆశాజనకమైన పరిణామమే అయినా, ఎయిడ్స్/హెచ్ఐవీ మన దేశం నుంచి ఇంకా పూర్తిగా కనుమరుగవలేదు. కనీసం అంతరించే దశకు కూడా చేరుకోలేదు. హెచ్ఐవీ కేసుల్లో మన దేశం ప్రపంచంలోనే మూడో స్థానంలో ఉంది. తెలుగు రాష్ట్రాలను ఉమ్మడిగా కలిపి చూసుకుంటే, దేశంలోనే మొదటి స్థానంలో నిలుస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఎయిడ్స్/హెచ్ఐవీ పరిస్థితిపై ఒక విహంగ వీక్షణం. ఇదీ చరిత్ర మూడు దశాబ్దాల కిందటి వరకు ఎయిడ్స్/హెచ్ఐవీ అంటే జనానికి ఏమీ తెలియదు. ఫ్రెంచి సంతతికి చెందిన కెనడియన్ ఫ్లైట్ అటండెంట్ గేటన్ డుగాస్ అంతుచిక్కని లక్షణాలతో అమెరికాలో చికిత్స పొందుతూ 1984లో మరణించాడు. అమెరికన్ వైద్య నిపుణులు ఇతడినే తొలి ఎయిడ్స్ రోగిగా గుర్తించారు. విచ్చలవిడి శృంగారానికి అలవాటు పడ్డ డుగాస్కు ఉత్తర అమెరికా అంతటా దాదాపు 2500 మంది లైంగిక భాగస్వాములు ఉండేవారు. వాళ్లలో దాదాపు సగానికి సగం మంది స్వలింగ భాగస్వాములూ ఉండేవారు. డుగాస్ పుణ్యాన ఎంతమందికి ఈ వ్యాధి సంక్రమించిందో కచ్చితమైన లెక్కలేవీ దొరకలేదు గానీ, అతడు మరణించిన కొద్ది కాలంలోనే ఇబ్బడి ముబ్బడిగా ఎయిడ్స్ కేసులు వెలుగులోకి వచ్చాయి. నిజానికి అంతకు ముందు 1969లోనే రాబర్ట్ రేఫోర్డ్ అనే ఆఫ్రికన్ సంతతికి చెందిన అమెరికన్ టీనేజర్ ఈ వ్యాధితో మరణించాడు. అతడు మరణించే నాటికి ప్రాణాంతకమైన ఈ వ్యాధికి ఎయిడ్స్ అనే పేరు పెట్టలేదు. దీనికి కారణమయ్యే హ్యూమన్ ఇమ్యూనో డెఫిషియెన్సీ వైరస్నూ (హెచ్ఐవీ) గుర్తించలేదు. రాబర్ట్ మరణించిన చాలాకాలానికి అతడి నమూనాలపై పరిశోధనలు సాగించిన వైద్యులు అతడు ఎయిడ్స్ వల్లే మరణించినట్లు నిర్ధారించారు. అయితే, ఎయిడ్స్కు కారణమయ్యే హెచ్ఐవీ వైరస్ మొదట పశ్చిమాఫ్రికా, మధ్య ఆఫ్రికా ప్రాంతాల్లోని చింపాంజీలు, గొరిల్లాలు వంటి వానరాలకు సోకిందని, వాటి నుంచి మనుషులకు వ్యాపించిందని గుర్తించారు. ఆఫ్రికాలో ఈ వ్యాధి మనుషులకు సోకిన పదేళ్లలోనే ఇది ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. తొలినాళ్లలో ఈ వ్యాధి అవగాహన రాహిత్యం, సిరంజీలను తగిన రీతిలో స్టెరిలైజ్ చేయకపోవడం వంటి నిర్లక్ష్యపూరిత చికిత్సా పద్ధతులు, వ్యాధి నిర్ధారణ సౌకర్యాలు అందుబాటులో లేకపోవడం వంటి కారణాల వల్ల విపరీతంగా వ్యాపించింది. దీని పర్యవసానాలను గురించిన తర్వాత ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) సహా పలు అంతర్జాతీయ సంస్థలు చొరవ తీసుకోవడంతో కొంత కాలానికి వ్యాప్తి తీవ్రత కాస్త తగ్గుముఖం పట్టింది. శాస్త్ర పరిశోధనలతో చికిత్సా పద్ధతుల్లోనూ మార్పులు వచ్చాయి. యాంటీ రిట్రోవైరల్ ఔషధాలు అందుబాటులోకి వచ్చాయి. ఫలితంగా హెచ్ఐవీ సోకిన వారి జీవన ప్రమాణాలు, ఆయుఃప్రమాణం మెరుగుపడ్డాయి. అయితే, ఇప్పటికీ చికిత్సకు నోచుకోని రోగుల సంఖ్య ఎక్కువగానే ఉంది. ప్రపంచంలో ఇదీ పరిస్థితి ఎయిడ్స్ బారిన పడ్డ ప్రముఖులు ప్రపంచవ్యాప్తంగా పలువురు ప్రముఖులు సైతం ఎయిడ్స్ భూతానికి బలైపోయారు. రక్తమార్పిడి వల్ల ఎయిడ్స్ బారిన పడి మరణించిన తొలి సెలిబ్రిటీగా అమెరికన్ టెన్నిస్ ప్లేయర్ అర్థర్ యాష్ వార్తల్లో నిలిచాడు. గుండె ఆపరేషన్ సమయంలో రక్తమార్పిడి చేసిన వైద్యుల నిర్లక్ష్యం వల్ల హెచ్ఐవీ బారిన పడ్డాడు. అప్పటికి ఇంకా మెరుగైన చికిత్సలు అందుబాటులోకి రాకపోవడంతో ఎయిడ్స్ కోరల్లో చిక్కి 1993 ఫిబ్రవరి 6న నిస్సహాయంగా కన్నుమూశాడు. విచ్చలవిడి లైంగిక సంబంధాల కారణంగా ఎయిడ్స్ బారిన పడి మరణించిన ప్రముఖుల్లో బ్రిటిష్ రాక్స్టార్ ఫ్రెడ్డీ మెర్క్యురీ, ప్రపంచంలోనే తొలి సూపర్మోడల్ గియా కరాంగీ, అమెరికన్ నటి అమండా బ్లాక్, దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు నెల్సన్ మండేలా కొడుకు మగతో మండేలా వంటి వారు చాలామందే ఉన్నారు. తనకు ఎయిడ్స్ సోకినట్లు బహిరంగంగా ప్రకటించిన తొలి సెలిబ్రిటీ మాత్రం హాలీవుడ్ నటుడు రాక్ హడ్సన్. ఈ విషయాన్ని అతడు 1985 జూలైలో మీడియాకు వెల్లడించాడు. ఆ తర్వాత మూడు నెలలు గడిచేలోగానే మరణించాడు. హెచ్ఐవీ గుర్తింపుతో మలుపు ఎయిడ్స్ వ్యాధికి కారణమవుతున్నది హ్యూమన్ ఇమ్యూనో డెఫిషియెన్సీ వైరస్ (హెచ్ఐవీ) అనే విషయాన్ని తొలిసారిగా 1982లో ఫ్రెంచి వైరాలజిస్ట్ డాక్టర్ లూక్ మాంటేనియర్ నేతృత్వంలోని వైద్యుల బృందం గుర్తించింది. ఈ పరిశోధనకు గుర్తింపుగా మాంటేనియర్, ఫ్రాంకోయిస్ బారెసినౌసి, హెరాల్డ్ జుర్ హాసెన్లకు 2008లో నోబెల్ బహుమతి లభించింది. మహమ్మారిలాంటి ఎయిడ్స్ వ్యాధికి కారణమయ్యే వైరస్ ఏమిటో కనుగొన్న తర్వాత హెచ్ఐవీ/ ఎయిడ్స్ చికిత్స పద్ధతులు చాలా మెరుగుపడ్డాయి. హెచ్ఐవీ వైరస్ను పూర్తిగా నిర్మూలించలేకపోయినా, చాలావరకు సమర్థంగా నియంత్రించగల ఔషధాలు తయారయ్యాయి. హెచ్ఐవీ వైరస్ను కట్టడి చేయగల యాంటీ రిట్రోవైరల్ ఔషధాలు మొట్టమొదటిసారిగా 1987లో అందుబాటులోకి వచ్చాయి. అంతకు ముందు హెచ్ఐవీ సోకిన వారికి ఇతరేతర ఔషధాలతో చికిత్సలు చేస్తూ వచ్చినా, అవేవీ వారి జీవితకాలాన్ని పొడిగించలేకపోయేవి. యాంటీ రిట్రోవైరల్ చికిత్స (ఏఆర్టీ) అందుబాటులోకి వచ్చాక పరిస్థితి కొంతవరకు మెరుగుపడింది. అయితే, ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) విడుదల చేసిన తాజా లెక్కల ప్రకారం హెచ్ఐవీ సోకిన వారిలో 46 శాతం మంది మాత్రమే ఈ చికిత్సను పొందుతున్నారు. అంటే, దాదాపు సగానికి పైగా హెచ్ఐవీ రోగులు నేటికీ తగిన చికిత్సకు నోచుకోలేకపోతున్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవాల్సిందే. ప్రపంచవ్యాప్తంగా ఏఆర్టీ చికిత్స కోసం గత ఏడాది కొత్తగా 20 లక్షల మంది నమోదయ్యారు. ప్రపంచవ్యాప్తంగా ఏఆర్టీ చికిత్స పొందుతున్న వారి సంఖ్య 2010 నాటికి 75 లక్షలుగా ఉంటే, 2015 నాటికి ఈ సంఖ్య 1.70 కోట్లకు చేరుకుంది. ఇంకా చికిత్సకు నోచుకోని హెచ్ఐవీ రోగుల సంఖ్య దాదాపు 2 కోట్లకు పైగానే ఉంటుందని అంచనా. 2020 నాటికి హెచ్ఐవీ సోకిన వారిలో 90 శాతం మందిని ఏఆర్టీ చికిత్స పరిధిలోకి తీసుకురావాలని యూఎన్ఎయిడ్స్ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ లక్ష్యం నెరవేరితే భవిష్యత్తు మరింత ఆశాజనకంగా ఉంటుంది. మన దేశంలో ఇలా... ముప్పయ్యేళ్ల కిందటి వరకు భారత్లో హెచ్ఐవీ/ఎయిడ్స్ పేరు సైతం ఎవరికీ తెలియదు. తొలిసారిగా 1986లో డాక్టర్ సునీతి సాల్మన్ అనే వైద్యురాలు చైన్నయ్లోని ఒక సెక్స్ వర్కర్కు ఈ వ్యాధి ఉన్నట్లు గుర్తించారు. అదే దేశంలోని తొలి కేసు. ఏడాది గడిచే సరికి కొత్తగా మరో 135 హెచ్ఐవీ పాజిటివ్ కేసులు వెలుగులోకి వచ్చాయి. వాళ్లలో పద్నాలుగు మందికి అప్పటికే ఎయిడ్స్ ముదిరిపోయిన దశలో ఉంది. తర్వాతి కాలంలో శరవేగంగా హెచ్ఐవీ వ్యాప్తి పెరగడంతో ప్రభుత్వం 1992లో జాతీయ ఎయిడ్స్ నియంత్రణ సంస్థను (నాకో) ఏర్పాటు చేసింది. ‘నాకో’ ద్వారా ఎయిడ్స్పై అవగాహన కల్పించేందుకు దేశవ్యాప్తంగా స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యంతో విస్తృత ప్రచారం సాగించింది. హెచ్ఐవీ వ్యాప్తిని నిరోధించేందుకు వివిధ దశల్లో రకరకాల కార్యక్రమాలను చేపట్టింది. ఒకవైపు ప్రభుత్వం తన వంతుగా ఇలాంటి చర్యలు తీసుకుంటున్నా, 2010 నాటికి మన దేశంలో హెచ్ఐవీ పాజిటివ్ కేసుల సంఖ్య 23.95 లక్షలకు చేరుకుంది. అయితే, 2000 సంవత్సరానికి ముందు పరిస్థితితో పోలిస్తే, 2000 నుంచి 2010 మధ్య కాలంలో కొత్త కేసుల సంఖ్య దాదాపు సగానికి సగం తగ్గినట్లు యూఎన్ ఎయిడ్స్-2012 నివేదిక వెల్లడించింది. హెచ్ఐవీ/ఎయిడ్స్ను గుర్తించినప్పటి నుంచి మన దేశంలో ఈ వ్యాధితో దాదాపు 1.70 లక్షల మంది మరణించారు. ఇదిలా ఉంటే, గత ఏడాది మన దేశంలో కొత్తగా 1.96 లక్షల హెచ్ఐవీ పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. గత ఏడాది లెక్కల ప్రకారం మన దేశంలో మొత్తం దాదాపు 28.81 లక్షల మంది హెచ్ఐవీతో ఉన్నట్లు అంచనా. కండోమ్స్ వంటి రక్షణ సాధనాలేవీ లేకుండా అపరిచితులతో లేదా సెక్స్ వర్కర్స్తో సెక్స్లో పాల్గొనడం ద్వారా హెచ్ఐవీ సోకే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. లైంగిక అవయవాల ద్వారా హెచ్ఐవీ వ్యాప్తికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నా, నోటి ద్వారా కూడా ఇది వ్యాపించే అవకాశాలు లేకపోలేదు. స్త్రీ పురుష లైంగిక సంబంధాలు లేదా పురుషుల స్వలింగ సంపర్కం ద్వారా హెచ్ఐవీ వ్యాపించే అవకాశాలు ఎక్కువ. వారితో పోల్చుకుంటే స్త్రీ స్వలింగ సంపర్కుల మధ్య హెచ్ఐవీ వ్యాపించే అవకాశాలు చాలా తక్కువ. స్టెరిలైజ్ చేయని సూదుల వల్ల, ఎలాంటి పరీక్షలు జరపకుండా హెచ్ఐవీ సోకిన రోగుల నుంచి సేకరించిన రక్తాన్ని ఇతరులకు ఎక్కించడం వల్ల అన్నెం పున్నెం ఎరుగని అమాయకులకు సైతం హెచ్ఐవీ సోకిన సందర్భాలు లేకపోలేదు. సిఫిలిస్, గనేరియా వంటి ఇతర లైంగిక వ్యాధులు ఉన్నవారికి హెచ్ఐవీ త్వరగా వ్యాపించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. హెచ్ఐవీ సోకిన గర్భిణులకు పుట్టే బిడ్డలకు తల్లుల ద్వారానే ఈ వ్యాధి సంక్రమించే అవకాశాలు ఉంటాయి. పుట్టిన తర్వాత తల్లిపాల ద్వారా కూడా హెచ్ఐవీ సోకే అవకాశాలు ఉంటాయి. అభం శుభం తెలియని చాలామంది చిన్నారులు తల్లుల ద్వారానే ఈ వ్యాధి బారినపడుతున్నారు. అయితే, తల్లుల నుంచి బిడ్డలకు ఈ వ్యాధి సంక్రమించకుండా నిరోధించే చికిత్సా పద్ధతులు ఇప్పుడు అందుబాటులోకి రావడం కొంత ఉపశమనం. వ్యాధి లక్షణాలు హెచ్ఐవీ సోకిన వెనువెంటనే ఎలాంటి లక్షణాలు కనిపించవు. శరీరంలో హెచ్ఐవీ వైరస్ బలం పుంజుకున్న తర్వాతే వ్యాధి లక్షణాలు కనిపించడం మొదలవుతాయి. తొలి దశలో మామూలు ఫ్లూ లాంటి లక్షణాలే కనిపిస్తాయి. జ్వరం, తలనొప్పి, నోట్లో పుండ్లు ఏర్పడటం, బరువు తగ్గడం, రాత్రివేళ చెమటలు పట్టడం, అలసట, ఆకలి తగ్గుదల, చర్మంపై ర్యాష్, గొంతు బొంగురుపోవడం, లింఫ్ గ్రంథుల్లో వాపులు వంటి లక్షణాలు కనిపిస్తాయి. అయితే, కొద్ది వారాల్లోనే ఈ లక్షణాలు వాటంతట అవే మాయమవుతాయి. రెండో దశలో హెచ్ఐవీ వైరస్ నిద్రాణ స్థితికి చేరుకుంటుంది. వైరస్ సోకిన మనిషిలో ఎలాంటి అనారోగ్య లక్షణాలూ ప్రస్ఫుటంగా కనిపించవు. దాదాపు ఎనిమిది నుంచి పదేళ్ల వరకు ఈ పరిస్థితి కొనసాగుతుంది. నిద్రాణ స్థితిలో సైతం ఈ వైరస్ పునరుత్పత్తి కొనసాగిస్తూ శరీరంలో తామర తంపరగా పెరుగుతుంది. కీలకమైన రోగ నిరోధక కణాలను నాశనం చేస్తుంది. ముఖ్యంగా తెల్ల రక్తకణాల్లోని సీడీ4 లేదా టీ హెల్పర్ కణాలను దెబ్బతీస్తుంది. ఈ పరిస్థితిలో ఉన్నవారిలో ఎలాంటి వ్యాధి లక్షణాలూ కనిపించకపోయినా, వారి ద్వారా ఇతరులకు వ్యాధి సంక్రమించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మూడో దశలో హెచ్ఐవీ ఇన్ఫెక్షన్ ఎయిడ్స్గా (ఎక్వైర్డ్ ఇమ్యూనో డెఫిషియెన్సీ సిండ్రోమ్) మారుతుంది. రక్తంలో సీడీ4 కణాల సంఖ్య మిల్లీలీటరుకు 500 లేదా అంతకంటే తక్కువకు పడిపోతోంది. ఈ పరిస్థితిలో రోగ నిరోధక వ్యవస్థ పూర్తిగా దెబ్బతింటుంది. ఈ స్థితికి చేరుకున్న వారిలో న్యుమోనియా, మెదడుకు ఇన్ఫెక్షన్, నోరు, జీర్ణకోశంలో ఇన్ఫెక్షన్లు, జ్వరం, డయేరియా, విపరీతంగా బరువు తగ్గుదల వంటి లక్షణాలు కనిపిస్తాయి. వ్యాప్తికి కారణాలు హెచ్ఐవీ వ్యాప్తికి ముఖ్యంగా రక్షణ లేని శృంగార సంబంధాలే కారణంగా ఉన్నా, ఇతరేతర కారణాలు కూడా ఈ వ్యాధి వ్యాప్తికి దోహదపడుతున్నాయి. హెచ్ఐవీ వ్యాప్తికి దారితీస్తున్న ముఖ్యమైన కారణాలు ఇవే... పరిశోధనలు ఆశాజనకం ఎయిడ్స్/హెచ్ఐవీ నిరోధానికి, చికిత్సకు సమర్థంగా ఉపయోగపడగల 44 కొత్త ఔషధాలు, వ్యాక్సిన్ల తయారీ కోసం అమెరికన్ బయోఫార్మా కంపెనీలు ప్రయోగాలు నిర్వహిస్తున్నాయి. వీటిలో 25 యాంటీ వైరల్ ఔషధాలు, 16 వ్యాక్సిన్లు కాగా మరో మూడు జన్యువుల స్థాయిలో మార్పు తెచ్చి హెచ్ఐవీని రూపుమాపగల ఔషధాలని, ఇవి అందుబాటులోకి వస్తే హెచ్ఐవీపై విజయం సాధించినట్లేనని ఔషధ తయారీ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతానికి అందుబాటులో ఉన్న ఔషధాల వల్ల హెచ్ఐవీ రోగుల జీవితకాలాన్ని మరో పదిహేనేళ్ల వరకు పొడిగించడానికి వీలవుతోందని, సమర్థమైన కొత్త ఔషధాలు అందుబాటులోకి వచ్చినట్లయితే పరిస్థితి మరింత మెరుగుపడగలదని చెబుతున్నారు. -
హెచ్ఐవీ బాధితులు నిరాశ చెందొద్దు
-డీఎంహెచ్వో డాక్టర్ యు.స్వరాజ్యలక్ష్మి కర్నూలు(హాస్పిటల్): హెచ్ఐవీ భారిన పడిన వారు జీవితమైపోయిందని భయపడవద్దని డీఎంహెచ్వో డాక్టర్ యు.స్వరాజ్యలక్ష్మి చెప్పారు. వ్యాధి నివారణకు మంచి మందులున్నాయన్నారు. జిల్లాలోని ఎయిడ్స్ నివారణ ఒప్పంద ఉద్యోగులు, లెప్రసీ ప్రోగ్రామ్ ప్రభుత్వ ఉద్యోగులు, ఎయిడ్స్ నివారణ స్వచ్చంధ సంస్థల సిబ్బంది ఒకరోజు వేతనాన్ని రూ.లక్ష విరాళంగా ఇస్తూ జిల్లాలోని అన్ని డివిజన్లలోని హెచ్ఐవీ బాధిత చిన్నారులకు పౌష్టికాహార పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రాంతీయ శిక్షణా కేంద్రం(ఫిమేల్)లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి డీఎంహెచ్వో డాక్టర్ స్వరాజ్యలక్ష్మి హాజరై మాట్లాడారు. ప్రతి గర్భిణి తప్పకుండా హెచ్ఐవీ పరీక్షలు చేయించుకుని ఆరోగ్యవంతమైన కాన్పు కావాలన్నారు. అప్పుడే మనం జీరో పాజిటివ్ను సాధించడానికి వీలవుతుందన్నారు. అడిషనల్ డీఎంహెచ్వో(ఎయిడ్స్ అండ్ లెప్రసీ) డాక్టర్ రూపశ్రీ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ పౌష్టికాహారంతో పాటు క్రమం తప్పకుండా ఏఆర్టీ మందులు వాడటం వల్ల జీవిత కాలం పెంచుకోవచ్చన్నారు. కార్యక్రమంలో జేబార్ కో ఆర్డినేటర్ హేమలత, మెడికల్ ఆఫీసర్ అంకిరెడ్డి, జిల్లా ఎయిడ్స్ నివారణ ప్రోగ్రామ్ మేనేజర్ అలీ హైదర్, ఆరోగ్య విద్య అధికారి ఎస్ఎస్ రావు, లెప్రసీ డీపీఎంలు, నేస్తం పాజిటివ్ నెట్వర్క్ అధ్యక్షురాలు సుధారాణి, ఎయిడ్స్ నివారణ కౌన్సిలర్లు దస్తగిరి, రసూల్ పాల్గొన్నారు. -
ఎయిడ్స్ వ్యాప్తికి అతనొక్కడే కారణం కాదు
లండన్: ఉత్తర అమెరికా ఖండంలో ఎయిడ్స్ వ్యాప్తికి కారకుడంటూ ‘పేషెంట్ జీరో’గా ఒక వ్యక్తి ఇంతవరకు నిందలు పడ్డాడు. అయితే ఈ వ్యాధి వ్యాప్తికి అతనొక్కడే కారణం కాదని, ఎయిడ్స్ను గుర్తించేనాటికి ఆ వ్యాధి బారిన పడిన వేలాది మందిలో అతడూ ఒకడని తేలింది. చారిత్రక, జన్యుఅంశాలను విశ్లేషించిన శాస్త్రవేత్తలు ఈమేరకు అభిప్రాయపడ్డారు. ఫ్లైట్ అటెండెంట్గా పనిచేస్తున్న గాయిటన్ దుగాస్ అనే ఫ్రెంచ్ కెనడియన్ గే 1980లో అమెరికాలో ఎయిడ్స్ సంక్షోభానికి కారకుడంటూ ఆరోపణలు ఎదుర్కొన్నాడు. హెచ్ఐవీ గుర్తించడానికి ముందు ఈ వ్యక్తి మూలంగానే వేలాది మందికి ఈ వైరస్ సోకిందని భావిస్తారు. అయితే మరణానికి ముందు దుగాస్ పరిశోధకులకు అవసరమైన వ్యక్తిగత సమాచారాన్ని అందజేశాడు. యూకేలోని కేంబ్రిడ్జ్ వర్సిటీ చరిత్రకారుడి పరిశోధన, రక్త నమూనాల జన్యుపరమైన విశ్లేషణల ఆధారంగా కేవలం దుగాస్ మాత్రమే అమెరికాలో ఎయిడ్స్ విస్తృతికి కారణం కాదని శాస్త్రవేత్తలు నిర్ధారణకు వచ్చారు. -
హృదయం లేని వైద్యులు
రక్తమోడుతున్నా హెచ్ఐవీ బాధితుడికి వైద్యం నిరాకరణ ఆదివారం అర్ధరాత్రి నుంచి సోమవారం సాయంత్రం వరకు పడిగాపులు గత్యంతరం లేక ఇంటికి తీసుకెళ్లిన రోగి బంధువులు గుంటూరు మెడికల్: జిల్లాలోని కొల్లిపర ‡మండలం సిరిపురం గ్రామానికి వ్యక్తి కొంతకాలంగా హెచ్ఐవీతో బాధపడుతూ తెనాలి ప్రభుత్వ ఆసుపత్రిలో ఆగస్టు నుంచి చికిత్స పొందుతున్నాడు. రెండు రోజుల క్రితం శరీరంలో రక్తం తక్కువగా ఉండటంతో రెండు బాటిళ రక్తం ఎక్కించారు. అయినప్పటికీ ఆరోగ్యం కుదటపడకపోవడంతో తెనాలి ఆసుపత్రి వైద్యులు గుంటూరు జీజీహెచ్కు రిఫర్ చేశారు. ఆదివారం అర్ధరాత్రి 2 గంటల సమయంలో కుటుంబ సభ్యులు రోగిని జీజీహెచ్కు తీసుకొచ్చారు. అత్యవసర సేవల విభాగంలో వీల్చైర్లోనే రాత్రంతా ఉంచారు. కొన్నిరకాల రక్త పరీక్షలు రాసిన వైద్యులు ఆ రిపోర్టులు వచ్చేసరికి తెల్లవారుజామున 6 గంటలు అవడంతో క్యాజువాలిటీలో వైద్యం చేయకుండా ఓపీకి వెళ్లి చూపించుకోవాలని చెప్పారు. దీంతో వీల్చైర్లోనే కుటుంబ సభ్యులు ఓపీలో తీసుకెళ్లగా జనరల్ సర్జరీ, జనరల్ మెడిసిన్, చర్మవ్యాధుల వైద్య విభాగాలకు వెళ్లాలని సూచించారు. ఆయా విభాగాలకు వీల్చైర్లోనే తిప్పారు. అక్కడ వైద్యులు వైద్య చేసేది తాము కాదంటే తాము కాదంటూ వెనక్కి పంపారు. దీంతో రోగి బాగా నీరసంగా తల్లిదండ్రులు ఓపీ విభాగం వద్దే ఉంచారు. అక్కడ పని చేస్తున్న కాంట్రాక్ట్ శానిటేషన్ సిబ్బంది ఓపీ గదికి తాళాలు వేయాలని బయటకు వెళ్లాలని చెప్పడంతో అక్కడ చెత్తను ఎత్తే బండిలోనే రోగిని ఓపీ భవనం బయటకు తీసుకొచ్చి మందుల షాపు వద్ద చెత్తను నిల్వ చేసే డబ్బాల వద్ద నేలపై పండుకోబెట్టారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు అక్కడ వేచి ఉన్నప్పటికీ వైద్యులుగానీ, వైద్య అధికారులుగానీ రోగిని పట్టించుకున్న దిక్కు లేదు. ఈలోగా కాలికి తీవ్రంగా గాయమై రక్తం కారుతుండటంతో కన్నతల్లి విజయకుమారి అది చూసి తట్టుకోలేక కాలికి మందు పూసి ఈగలు వాలకుండా ప్లాస్టిక్ సంచులను తలిగించింది. ఈ తంతు కళ్లారా చూస్తున్న పలువురు రోగుల సహాయకులు, అధికారులు, వైద్యుల తీరుపై తీవ్రంగా విమర్శలు గుప్పించారు. సాయంత్రం వరకు వేచి ఉన్నా వైద్యులు ఎవరూ తమ వైపు రాకపోవడం, వైద్యం అందించకపోవడంతో కుటుంబ సభ్యులు రోగిని ఇంటికి తీసుకెళ్లిపోయారు. పెద్ద ఆసుపత్రిలో వైద్యం చేస్తారని తెనాలి వైద్యులు చెబితే ఎంతో ఆశతో వస్తే కనీసం ఒక్కరు కూడా తమ కుమారుడు ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీయలేదని కుటుంబ సభ్యులు తల్లడిల్లిపోయారు. -
‘ఎయిడ్స్’ వివక్షకు రెండేళ్ల జైలు
♦ రూ. లక్ష జరిమానా కూడా ♦ హెచ్ఐవీ, ఎయిడ్స్ బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం న్యూఢిల్లీ: హెచ్ఐవీ, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులపై వివక్ష చూపితే 3 నెలల నుంచి గరిష్టంగా రెండేళ్ల జైలుశిక్షతోపాటు రూ. లక్ష జరిమానా విధించాలని కేంద్రం నిర్ణయించింది. హెచ్ఐవీ, ఎయిడ్స్ బిల్లు 2014 (సవరణలు)కు ప్రధాని మోదీ నాయకత్వంలో సమావేశమైన కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ ముసాయిదా బిల్లు ద్వారా వ్యాధిగ్రస్తుల హక్కులను కాపాడటంతోపాటు.. వారి ఫిర్యాదులపై విచారణ జరిపేందుకు ఓ వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు వీలుంటుంది. ఈ బిల్లు అమల్లోకి వస్తే యాంటీరిట్రోవైరల్ థెరపీ (ఏఆర్టీ)ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తప్పనిసరిగా ఏర్పాటుచేయాల్సిందేనని కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా తెలిపారు. ఆసుపత్రులు, విద్యాలయాలతోపాటు పలుచోట్ల హెచ్ఐవీ వ్యాధిగ్రస్తుల పట్ల వివక్ష కనబరిస్తే శిక్ష అనుభవించక తప్పదని ఈ ముసాయిదాలో పేర్కొన్నారు. తొలి మెడికల్ పార్కుకు ఓకే.. దేశంలో అత్యుత్తమ ప్రమాణాలతో కూడిన వైద్య పరికరాలను ఉత్పత్తి చేసే మెడికల్ పార్కు ఏర్పాటుకు కేబినెట్ పచ్చజెండా ఊపింది. చెన్నై దగ్గర్లోని చెంగల్పట్టు ప్రాంతంలో 300 ఎకరాలను హెచ్ఎల్ఎల్ కంపెనీకి ఇచ్చేందుకు అంగీకారం తెలిపింది. ఈ కంపెనీ ఏర్పాటు ద్వారా భారతదేశంలో తక్కువ ధరకే ముఖ్యమైన వైద్య పరికరాలు అందుబాటులోకి రానున్నాయి. ‘మేకిన్ ఇండియా’ ద్వారా నిర్వహిస్తున్న ఈ ప్రాజెక్టు ద్వారా పెద్ద సంఖ్యలో ఉద్యోగావకాశాలు ఏర్పడనున్నాయి. -
హెచ్ఐవీ సోకుతుందనే భయంతోనే..
పీజీ వైద్యురాలి ఆత్మహత్య గుంటూరు మెడికల్: హెచ్ఐవీ పాజిటివ్ రోగికి ఆపరేషన్ చేస్తున్న సమయంలో సూది గుచ్చుకోవటంతో తనకు కూడా హెచ్ఐవీ సోకుందనే భయంతోనే డాక్టర్ రాచమళ్ల విజయలక్ష్మి(24) ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. గుంటూరు వైద్య కళాశాల జనరల్ సర్జరీ పీజీ ద్వితీయ సంవత్సరం విద్యార్థిని విజయలక్ష్మి గురువారం సాయంత్రం కన్నావారితోట ఐదోలైన్లోని నివాసంలో అనుమానస్పద స్థితిలో మృతి చెందిన విషయం తెలిసిందే. శుక్రవారం పోస్టుమార్టం చేసిన అనంతరం మతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆస్పత్రిలో మూడు వారాల క్రితం హెచ్ఐవీ సోకిన రోగికి ఆపరేషన్ చేస్తున్న సమయంలో సూది గుచ్చుకోవటంతో తనకు కూడా హెచ్ఐవీ సోకుతుందనే భయంతో విజయలక్ష్మి మానసిక ఒత్తిడికి గురైనట్లు తోటి వైద్యులు తెలిపారు. తక్షణమే హెచ్ఐవీ నిరోధక మందులు వాడటం ప్రారంభించినా రెండు రోజులుగా విరోచనాలు అవుతుండటంతో ఆమె ఆత్మహత్య చేసుకుని ఉంటుందని భావిస్తున్నారు. -
ఎయిడ్స్ నివారణకు 'మ్యాజిక్' డ్రగ్!
న్యూయార్క్: ఎయిడ్స్ వ్యాధి నివారణకు అమెరికా పరిశోధకులు 'మ్యాజిక్' డ్రగ్ను అభివృద్ధి చేశారు. వ్యాధి కారక హ్యూమన్ ఇమ్యునో వైరస్(హెచ్ఐవీ).. నోరు, యోని ద్వారా వ్యాపించకుండా ఈ కొత్త మందు సమర్థవంతంగా పనిచేస్తుందని శాస్త్రవేత్తలు జంతువులపై జరిపిన ప్రీ క్లినికల్ పరిశోధనల్లో గుర్తించారు. ప్రపంచవ్యాప్తంగా ఏటా సుమారు 1.5 మిలియన్ల మంది హెచ్ఐవీ కలిగిన మహిళలు ప్రెగ్నెంట్ అవుతున్నారు. సరైన చికిత్స లేని కారణంగా వీరిలో 45 శాతం మంది తమ పిల్లలకు తల్లిపాల ద్వారా వైరస్ను సంక్రమింపజేస్తున్నారు. కొత్త ఔషధం.. 4-ఇథినిల్-2-ఫ్లోరో-2'డిఆక్సియాడినోసైన్(ఈఎఫ్డీఏ) ద్వారా ఈ రకమైన సంక్రమణను సమర్థవంతంగా అరికట్టొచ్చని భావిస్తున్నారు. ఇక మహిళల్లో లైంగిక చర్య ద్వారా జరిగే సంక్రమణను కూడా ఇది అరికడుతుందని పరిశోధకులు చెబుతున్నారు. ముందుగా ఎలుకల్లో నిర్వహించిన పరిశోధనల్లో ఈ ఔషధం మంచి ఫలితాలు ఇచ్చిందని పరిశోధకులు వెల్లడించారు. పరిశోధన ఫలితాలను 'యాంటీమైక్రోబయల్ కీమోథెరపి' జర్నల్లో ప్రచురించారు. హెచ్ఐవీ వ్యాప్తి నివారణలో ఈఎఫ్డీఏ కీలకంగా పనిచేస్తుందని నార్త్ కరోలినా యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎంజిలా వహెల్ తెలిపారు. -
'ఎయిడ్స్' లో 'కండోమ్' సందడి
డర్బన్: మానవాళిని పట్టి పీడిస్తున్న మహమ్మారిని తరిమేసే దిశగా దక్షిణాఫ్రికాలోని డర్బన్ వేదికగా జరిగిన 21వ ఇంటర్నేషనల్ ఎయిడ్స్ కాన్ఫరెన్స్ (ఐఏసీ) పలు వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకుంది. ఐక్యరాజ్యసమితికి అనుబంధంగా ఏర్పాటైన ఇంటర్నేషనల్ ఎయిడ్స్ సొసైటీ(ఐఏఎస్) ఆధ్వర్యంలో జులై 17 నుంచి 22 వరకు సాగిన సదస్సుకు ప్రపంచం నలుమూలల నుంచి ఐఏఎస్ కార్యకర్తలు హాజరయ్యారు. రెండేళ్లకు ఓ సారి ఈ సదస్సును నిర్వహిస్తారు. ఈ ఏడాది 'Access Equity Rights Now' (సమానత్వపు దారిలో) థీమ్ తో నిర్వహించిన సదస్సులో హెచ్ఐవీ బాధితులు, వ్యాధిపై పోరాడుతోన్న డాక్టర్లు, నర్సులు, ఎన్ జీవోలు, ఫార్మా కంపెనీల ప్రతినిధులు, ప్రభుత్వాధికారులు సెషన్ల వారీగా తాము చేస్తున్న పనులను వివరించారు. ప్రస్తుత ఐఏఎస్ అధ్యక్షుడు క్రిస్ బేయర్ సదస్సు ముగింపు సందర్భంగా చేసిన ప్రసంగం ఉద్వేగభరితంగా సాగింది. మారుమూల ప్రాంతాలకు హెచ్ఐవీ నిపుణులను పంపడం, రోగ సంబంధిత ఔషధాల తయారీని ప్రోత్సహించడం, ఆ మేరకు ఫార్మా కంపెనీల్లో పెట్టుబడులపై ఉన్న ఆంక్షలు తొలిగేలా ప్రభుత్వాలపై ఒత్తిడితేవడం లాంటి తీర్మానాలు చేశారీ సదస్సులో. కాగా, గత సదస్సుల్లో లాగే ఈ ఏడాది కూడా బ్రెజిలియన్ డిజైనర్ ఆండ్రియానా బెర్టిని రూపొందించిన కండోమ్ దుస్తుల ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సదస్సుకు హాజరైనవారిలో చాలామంది గులాబి రంగు కండోమ్ లు ధరించిన మెనిక్వీన్ ల వద్ద చేరి సందడి చేశారు. వాటితోపాటు కొన్ని పాత ఫొటోలు కూడా మీకోసం.. -
చట్టానికి మహిళలంటే పక్షపాతమేమీ లేదు!
లీగల్ కౌన్సెలింగ్ మేడం, మహిళల గురించి ఏమైనా కంప్లైంట్ చేస్తే మహిళా న్యాయవాదులు కస్సుమంటుంటారు. మరి వారు చేసే మోసాలకూ, అన్యాయాలకూ అడ్డుకట్టవేయలేమా? ప్రతి విషయంలో మగవారే నిందితులా? నా ప్రశ్న ఏమిటంటే.. మా ఏరియాలో గత ఐదేళ్ల నుంచి జరుగుతున్న ఒక విషయం గురించి.... మేడం, మా ఏరియాలో ఒక గొప్ప కంపెనీలో పనిచేసే అందమైన మహిళ ఒకామె నివసిస్తున్నారు. ఆమె నైట్షిఫ్ట్లో పని చేస్తున్నారు. పగలు అప్పుడప్పుడు కొందరు మగవాళ్లు వస్తూ పోతూ ఉండేవాళ్లు. ఆమెది స్వంత ఇల్లు కనుక ఎవరూ ఏమీ ప్రశ్నించలేదు. వారు ఆమెకు స్నేహితులు, బంధువులు అనుకున్నాము. ఆ మధ్యనే నా ఫ్రెండ్ కూడా ఆమె ఇంటికి వెళ్లి రావడం జరిగిందట. వాడు నాకు ఒక భయంకరమైన విషయం చెప్పాడు. తనకు ఇటీవలే హెచ్ఐవీ పాజిటివ్ సోకిందని! అంతకంటే భయంకరమైన విషయం ఆమె వద్దకు వెళ్లిన ప్రతి ఒక్కరికీ ఆ జబ్బు సోకిందని చెప్పాడు. చివరకు వారంతా ఆమె గురించి వాకబు చేస్తే, ఆమె ఆ వ్యాధిగ్రస్థురాలనీ, ఆమెకు ఆ వ్యాధి ఎలా వచ్చిందో ఎవరికీ తెలియదనీ. కానీ ఆమె సమాజం పట్ల ముఖ్యంగా మగవారి పట్ల క్రోధం, ద్వేషం పెంచుకుని సాధ్యమైనంతమందికి ఆ వ్యాధి సోకేలా చేయడమే లక్ష్యంగా పెట్టుకుందని తెలిసింది. ఆ విషయం ఆమె కూడా కొందరిముందు ఒప్పుకుందని చెప్పాడు. ఇప్పుడు మీరు పురుషులకు ఏమి సమాధానం ఇస్తారో చెప్పండి. -సత్యకృష్ణ, సికిందరాబాద్ సార్, మీరు చాలా అపోహల్లో ఉన్నారు. చట్టాలు ఇరువురికీ సమానంగానే వర్తిస్తాయి. కొన్ని మాత్రమే స్త్రీలకు నిర్దేశించినవి ఉన్నాయి. అలా ఉన్నా కూడా నిర్దోషిత్వాన్ని నిరూపించుకునే అవకాశాలు పురుషులకు మెండుగా ఉన్నాయి. ఇక మీ ప్రశ్నకు సమాధానం... సెక్షన్ 269, 279 ఐపీసీ ప్రకారం నిర్లక్ష్యంగా రోగాలను వ్యాపింపజేయడం, విచక్షణారహిత చర్యల వల్ల అంటువ్యాధులు సోకేలాగా వ్యవహరించడం నేరం. వీటికి ఆరునెలల నుంచి 2 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడుతుంది. సెక్షన్ 269, 279 ప్రకారం నేరపూరితంగా, హెచ్.ఐ.వి. వైరస్ని సంక్రమింపజేస్తే వారిని ప్రాసిక్యూట్ చేయవచ్చు. కలరా, ప్లేగు, సిఫిలిస్, గనేరియా లాంటి వ్యాధులను ఇతరులకు సంక్రమింపచేసే వ్యక్తులకు ఈ సెక్షన్లు వర్తిస్తాయి. కాకపోతే ముద్దాయి ఉద్దేశ్యపూర్వకంగా, ప్రాణాంతకమైన చర్యలను చేశాడని రుజువు చేయాల్సి ఉంటుంది. ఈ నేరాలు స్త్రీలకూ, పురుషులకూ ఇరువురికీ వర్తిస్తాయి. పరస్త్రీ సాంగత్యం కోసం వెంపర్లాడినందుకు మీ స్నేహితులను ఏమనాలో మీరే ఆలోచించుకోండి. మీరు చెప్పిన ఆ మహిళపై కేసు పెట్టే అవకాశం ఉంది. అమ్మా! నేనూ, నా భర్తా కూలీనాలి చేసుకుని పొట్టపోసుకుని జీవించేవాళ్లం. మాకు ఇద్దరు చిన్నపిల్లలు. ఇటీవల నా భర్త రైలుప్రమాదంలో చనిపోయాడు. నాకు కుటుంబం గడవడం కష్టమైపోతోంది. మాకు ఏదైనా నష్టపరిహారం వ స్తుందా? - రంగమ్మ, ఓ అభాగ్యురాలు తప్పకుండా మీకు నష్టపరిహారం వస్తుంది. మీలాంటి బాధితులకు న్యాయం చేసేందుకే రైల్వేచట్టం ఉంది. వీటికి సంబంధించిన విషయాలను పరిష్కరించేందుకు రైల్వే క్లెయిమ్స్ ట్రిబ్యునల్ సికిందరాబాద్లో ఉంది. రైలు ప్రమాదాలలో చనిపోయినా, గాయాలపాలైనా, వికలాంగులైనా, అటువంటి ప్రయాణీకులు లేదంటే చనిపోయిన వారి కుటుంబ సభ్యులు తమకు జరిగిన నష్టానికి తగిన పరిహారం చెల్లించమని కోరుతూ దరఖాస్తు పెట్టుకోవచ్చు. చనిపోయిన వ్యక్తి వివరాలు, వారి టికెట్, ఎఫ్.ఐ.ఆర్, మెడికల్ రిపోర్ట్, పోస్ట్మార్టమ్ రిపోర్ట్ వంటి సంబంధిత డాక్యుమెంట్లు అన్నీ జతపరచాలి. అలాగే చనిపోయి వ్యక్తి కుటుంబ సభ్యుల వివరాలు, వాటికి తగిన ఆధారాలు కూడా ట్రిబ్యునల్లో ఫైల్ చేయాలి. ఆత్మహత్య చేసుకున్న వారికి, కావాలని గాయాలు చేసుకున్నవారికి, కావాలని గాయాలు చేసుకున్నవారికి నష్టపరిహారం రాదు. మీ భర్త రైలు ప్రమాదంలో మరణించారు కనక మీ భర్త రైలు ప్రమాదంలో మరణించారు కనుక మీకు నష్టపరిహారం వస్తుంది. వెంటనే న్యాయవాదిని సంప్రదించండి. లేదంటే ఉచిత న్యాయసహాయం కోసం లీగల్ సర్వీసెస్ వారిని సంప్రదించండి. ఇ.పార్వతి అడ్వొకేట్ అండ్ ఫ్యామిలీ కౌన్సెలర్ parvathiadvocate2015@gmail.com కేస్ స్టడీ కమ్లీబాయ్... మంగ్లీబాయ్ కటకటాల పాలయ్యారు! సోని, రేణులు అక్కాచెల్లెళ్లు. ఇద్దరూ టెన్ట్ పాసై, ఇక చదివే అవకాశాలు లేక, చెప్పించే వాళ్లు లేక, వ్యవసాయకూలీలుగా మారారు. పగలంతా పొలంలో పని చేయడం, సాయంత్రం కూలి డబ్బులు తీసుకెళ్లి మారుటితల్లికి ఇవ్వడం, ఆమె తిట్టుకుంటూ పోసే గంజినీళ్లు తాగడం వారి దినచర్య. ఇద్దరూ టీనేజ్ అమ్మాయిలే. పైగా కాయకష్టం చేస్తున్నవాళ్లు కనక తగిన పోషణ లేకపోయినా, కంటికి నదురుగా కనిపిస్తున్నారు. చదువుకున్న వాళ్లు కనక ఉన్నంతలో శుభ్రంగా తయారై, పనికి వెళుతున్నారు. వారి తల్లి వారు చిన్నవయసులో ఉండగానే చనిపోయింది. తండ్రి రెండోపెళ్లి చేసుకున్నాడు. సవతి తల్లి మంగ్లీబాయి ఆరళ్లతోనే పెరిగి పెద్దవాళ్లయ్యారు వారు. ఇరుగూపొరుగూ, చుట్టాలకు భయపడి పదో తరగతి వరకూ ఓపిక పట్టింది వారి సవతి తల్లి. కాలేజీకైతే డబ్బులు ఖర్చవుతాయని, అంతటితో ఆపేసింది. తండ్రి ఒక ప్రైవేట్ కాలేజీలో ఉద్యోగి. మంచి జీతమైనా సగం తాగుడుకే ఖర్చు చేసేవాడు. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో పనికి వెళ్లసాగారు సోని, రేణు. విషయం తెలిసిన తండ్రి, భార్య నోటికి దడిచి, కిక్కురు మనలేదు. ఇంతలో మంగ్లీబాయ్కి దూరపుచుట్టమైన కమ్లీబాయ్ బొంబాయి నుంచి వచ్చింది. ఆమె గురించి రేణూ, సోనిల సవతి తల్లి ఎప్పుడూ గొప్పగా చెబుతుండేది. ఆమె బొంబాయిలో అనాథలైన ఆడపిల్లలకోసం ఆశ్రమం నడుపుతోందని, వారికి మంచి ఉద్యోగాలు వచ్చేలా చేస్తుందని, ఆమెకు పెద్దపెద్ద వాళ్లతో పరిచయాలున్నాయని, బాగా ధనవంతురాలని చెబుతుండేది. వచ్చీ రావడంతోనే సోనీ, రేణూలపై కన్నేసింది కమ్లీబాయ్. మంగ్లీతో ఒకటే మంతనాలు జరుపుకుంది. చివరికి సోనీ, రేణూలకు బేరం కట్టి మంగ్లీబాయికి లక్షరూపాయలిచ్చింది. వారిని బలవంతంగానైనా బొంబాయికి తీసుకుని పోవడానికి సిద్ధమైంది. కమ్లీబాయితో బొంబాయికి వె ళ్లమని, అక్కడ మంచి ఉద్యోగంలో పెడుతుందని, వచ్చేవారమే ప్రయాణమని డిక్లేర్ చేసింది మంగ్లీబాయి. సోనీ, రేణూల్లో ఏదో అనుమానం. సవతి తల్లి ఏదో దాస్తోందని, తమకు బాగా పరిచయం ఉన్న అంగన్ వాడీ వర్కర్గా పని చేస్తున్న సుమిత్రక్కకు విషయం చెప్పారు. ఆమె వెంటనే అసలు విషయం పసిగట్టింది. కమ్లీబాయి అమ్మాయిల తో వ్యాపారం చేసే మనిషని తెలుసుకుని మహిళా న్యాయవాదిని సంప్రదించింది. అనుభవజ్ఞురాలైన ఆమె ఇది అమ్మాయిలను వ్యభిచారంలోకి దింపే వ్యవహారమని, కమ్లీబాయ్, మంగ్లీబాయ్లు ఐపీసీ సెక్షన్ 372, 373ల ప్రకారం నేరస్థులవుతారని, వ్యభిచారం కోసం మైనర్ పిల్లలను అమ్మితే సెక్షన్ 372 ఐపీసీ ప్రకారం నేరమని, పది సంవత్సరాలకు తగ్గకుండా జైలు శిక్ష పడుతుందని, అలాగే వ్యభిచారం నిమిత్తం కానీ, ఎవరితోనైనా అక్రమ సంభోగం జరిపే నిమిత్తం కానీ, చట్టవ్యతిరేక నీతిబాహ్య చర్యలు జరిపే నిమిత్తం కానీ 18 సంవత్సరాలలోపు మైనరు బాలికలను కొన్నా, కిరాయికి తెచ్చినా అది సెక్షన్ పది సంవత్సరాలు జైలుశిక్ష పడుతుందని తెలియజెప్పి, అంగన్వాడీ వర్కర్తో, పిల్లలతో కలసి నేరుగా పోలీస్ స్టేషన్కి వెళ్లింది. భయంకరమైన కూపంలోకి నెట్టివేయకుండా సోనీ, రేణూలు కాపాడబడ్డారు. కమ్లీబాయ్, మంగ్లీబాయ్లు కటకటాల పాలయ్యారు. -
'నేను కేబినెట్ మంత్రి కూతురితో రాత్రంతా గడిపా'
లండన్: తాను బ్రిటన్ కేబినెట్ మంత్రి కూతురుతో కూడా ఒక రాత్రి గడిపినట్లు ప్రముఖ హాలీవుడ్ నటుడు చార్లీ షీన్ చెప్పాడు. ఆదివారం రాత్రి జరిగిన ఓ టీవీ షో కార్యక్రమంలో పీర్స్ మోర్గాన్ అడిగిన ప్రశ్నలకు ఈ సమాధానం చెప్పాడు. ఆ సమయంలో తన ఎదురుగా వందలమంది కూర్చుని ఉన్నారు. ప్రముఖ నటుడిగా పేరు తెచ్చుకున్న షీన్ తనకు హెచ్ఐవీ ఉందని గత ఏడాది బహిరంగంగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ మధ్య తరుచు ఇంటర్వ్యూలు ఇస్తూ వివాదాలు రాజేస్తున్న ఈ నటుడు ఈసారి ఏకంగా ఓ కేబినెట్ మంత్రి నెత్తిన బాంబు పేల్చాడు. మీరు గడిపిన అమ్మాయిల్లో అత్యంత ఫేమస్ అయి ఉండి బయటకు చెప్పని వారు ఎవరైనా ఉన్నారా అంటూ మోర్గాన్ వేసిన ప్రశ్నకు వెంటనే అతడు బదులిస్తూ 'ఉన్నారు.. అది సరిగ్గా 20 ఏళ్ల కిందట. ఆమె ఫేమస్ అని చెప్పనుగానీ ఆమె తండ్రి మాత్రం ఫేమస్.. ఓ బ్రిటన్ కేబినెట్ మంత్రి కూతురుతో ఒక రాత్రంతా గడిపాను' అని చెప్పాడు. దీంతో అక్కడ కూర్చున్న వాళ్లంతా షాక్ అయ్యారు. వెంటనే మోర్గాన్ ఆ మంత్రి ఎవరనే విషయం తెలుసుకునేందుకు పలు ప్రశ్నలు సందించాడు. ఇప్పుడు కూడా ఆ మంత్రి అధికారంలో ఉన్నాడా? ఏ శాఖలో ఉన్నారు? పోని ఇప్పుడు లేకుండా ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఏ శాఖలో బాధ్యతలు నిర్వర్తించారు? అంటూ గుచ్చిగుచ్చి ప్రశ్నించారు. దీనికి ఆయన స్పందిస్తూ తాను అలా పేరు చెప్పి సమస్యలు కొని తెచ్చుకోలేనని, ఇంటర్ పోల్ అధికారులు నా వెంటపడతారని చెప్పాడు. అయితే, పదే పదే ప్రశ్నించగా ఆమె పేరు చెప్పేందుకు నిరాకరించిన ఆయన ఆ మంత్రి గతంలో హోంశాఖ కార్యదర్శిగా కూడా పనిచేశారంటూ తన సమాధానం ముగించాడు. -
మా ఆయన సెక్స్ వర్కర్ల దగ్గరకి వెళ్లి...
విడిగా ఉంటారు కానీ... వివాహ బంధం రద్దు కాదు! లీగల్ కౌన్సెలింగ్ మేడమ్, రెండున్నర సంవత్సరాల క్రితం మేము ప్రేమించి పెళ్లి చేసుకున్నాము. పెద్దలను ఎదిరించి, పోలీస్స్టేషన్ల చుట్టూ తిరిగి, మా పెళ్లికి ఆటంకాలను కల్పించిన వారు పెట్టిన కేసుల నుండి బయటపడి, రిజిస్టర్ వివాహం చేసుకున్నాం. ఇద్దరం ఉద్యోగస్తుల కావడంతో ఆర్థిక సమస్యలు రాలేదు. నేను హైదరాబాద్లో ఉద్యోగం చేస్తున్నాను. నా భర్త కూడా ఇక్కడే ఉద్యోగం చేస్తుండేవారు. ప్రమోషన్ మీద ఆయనకు ముంబాయికి ట్రాన్స్ఫర్ అయింది. నేను కూడా కంపెనీ వారు పంపిస్తే, ఒక సంవత్సరం పాటు విదేశాల్లో ఉద్యోగం చేశాను. దాదాపు ఒకటిన్నర సంవత్సరాలపాటు మేము దూరంగా ఉన్నాము. మొన్ననే నేను ఇండియా వచ్చాను. ఆయన కూడా బాంబే నుండి హైదరాబాద్ వచ్చారు. ఎయిర్పోర్టులోనే నేను సిక్ అయితే అటునుండి అటే హాస్పిటల్కు వెళ్లాము. నేను మాస్టర్ హెల్త్ చెకప్ చేయించుకున్నాను. ఎందుకయినా మంచిదని నా భర్తకు కూడా హెల్త్ చెకప్ చేయించాను. నా గుండె పగిలే విషయం తెలిసింది. నా భర్తకు హెచ్.ఐ.వి సోకినట్లు తెలిసింది. నేను దూరంగా ఉన్న సమయంలో ఆయన సెక్స్ వర్కర్ల దగ్గరకి వెళ్లి, విచ్చలవిడిగా అనైతిక కార్యాలు జరిపినట్టు తెలిసింది, నా మనసు ఇది జీర్ణించుకోలేకపోతోంది. నేను తీవ్రమైన ఆవేదనలో ఉన్నాను. నా నమ్మకం, విశ్వాసాలపై ఆయన దెబ్బకొట్టారు. నాకు అతని ముఖం చూడాలన్నా మనస్కరించడం లేదు. కొంతకాలం అతనికి దూరంగా ఉండాలనుకున్నాను. అదీ కూడా కోర్టు ద్వారా. దయచేసి ఎలాగో తెలియజేయండి. - గీత, హైదరాబాద్ మీ మనోవేదన అర్థం చేసుకున్నాను. మీ భర్త మీ నమ్మకంపై దెబ్బ తీశారు. మీ నిర్ణయం సరైనదే. హిందూ వివాహ చట్టం 1955 సెక్షన్ 10 ప్రకారం మీరు జుడీషియల్ సెపరేషన్ తీసుకోవచ్చు. అంటే మీ వివాహబంధం రద్దు కాకుండా విడిగా జీవించే అవకాశం అన్నమాట. సెక్షన్ 13 (1) గ ప్రకారం సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ వెనీరల్ డిసీజెస్ విడాకులకు ఒక కారణం అవుతుంది. హెచ్.ఐ.వి. కూడా ఆ కోవలోకి వస్తుంది. ఒకరినుంచి మరొకరికి సంక్రమించే సుఖవ్యాధులతో భార్యాభర్తల్లో ఎవరైనా బాధపడుతుంటే ఆ కారణం వల్ల రెండవవారు జుడీషియల్ సెపరేషన్ కేసు వేసి ఆర్డర్లు పొందవచ్చు. ఈ సెపరేషన్ కాలంలో మీరు అన్ని విషయాలూ క్షుణ్ణంగా ఆలోచించుకుని ఒక నిర్ణయం తీసుకోవచ్చు. అతన్ని క్షమించి కలిసి ఉండాలని అనుకుంటే నిరభ్యంతరంగా వెళ్లవచ్చు. లేకుంటే విడాకులు తీసుకోవచ్చు. మేడమ్, మా గల్లీలో ఒక రీహాబిలిటేషన్ సెంటర్ ఇటీవలే వెలిసింది. దానిలో దాదాపు 20 మంది దాకా మానసిక అస్వస్థులు ఉన్నట్లు సమాచారం. ఆ సెంటర్ నుంచి రోజూ అరుపులు, ఏడుపులు వినిపిస్తున్నాయి. మేము నిశితంగా గమనిస్తే, అక్కడ పనిచేసే వాళ్లు రోగులను బంధించి బాగా కొడుతున్నారని, వారికి సరిగా ఆహారం ఇవ్వక మాడుస్తున్నారని తెలిసింది. మాకు వారి పరిస్థితి చూస్తే గుండె ద్రవించిపోతోంది. ఈ పరిస్థితుల్లో మేము ఏం చేయమంటారు? - సంకా కోటేశ్వరరావు, తెనాలి ముందుగా సునిశిత పరిశీలనా దృష్టికి, మీ సోషల్ రెస్పాన్సిబిలిటీకి అభినందనలు. మీరు చెబుతున్న వివరాల ప్రకారం బహుశ అది కొందరు ప్రైవేటు వ్యక్తులు కేవలం ధనార్జన కోసం పెట్టుకున్న మానసిక రోగుల చికిత్సాలయమో లేదా డ్రగ్స్, డ్రింక్స్కు బానిసలైన వారికోసం స్థాపించిన డీ అడిక్షన్ సెంటరో అయి ఉంటుంది. ఇలాంటివారిని హింసిస్తే అది మానవ హక్కుల ఉల్లంఘనే అవుతుంది. చికిత్స జరిగే సమయంలో మానసిక రోగులను కాని, మత్తుపదార్థాలకు అలవాటుపడి చికిత్సకు వచ్చిన వారిని కానీ శారీరకంగా లేదా మానసికంగా హింసించ కూడదు. అవమానించ కూడదు. ముందు ఆ సెంటర్కు లెసైన్స్ ఉందో లేదో కనుక్కోండి. ఆ రోదనలు, ఆక్రందనలను రికార్డు చేయండి. తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేయండి. లేదంటే మానవ హక్కుల కమిషన్ను ఆశ్రయించండి. మా పెళ్లయి పన్నెండేళ్లయింది. మా ఇద్దరి మధ్య అన్యోన్యత ఏమాత్రం లేదు. దాంతో చట్టప్రకారం విడాకులు తీసుకోలేదు కానీ నేను, నా భర్త చాలా ఏళ్లనుంచి విడివిడిగా జీవిస్తున్నాం. నా ఇద్దరు ఆడపిల్లలూ నా దగ్గరే ఉంటున్నారు. ఈ మధ్యే నా భర్త, పిల్లల కష్టడీ కోసం కోర్టులో కేసు వేశారు. నాకేమో పిల్లల కష్టడీ ఆయనకు ఇవ్వడం ఇష్టం లేదు. నేను ఏం చేయాలి? - రమ, జహీరాబాద్ పిల్లలు మీ ఇద్దరికీ పుట్టిన వారు. మీరింకా లీగల్గా డైవోర్స్ తీసుకోలేదు. చట్టప్రకారం మైనర్ పిల్లల సంరక్షణ బాధ్యత తండ్రికే ఉంటుంది. అయితే మైనర్లయిన మీ పిల్లలు ఎన్నో ఏళ్లుగా మీతోనే కలిసి ఉంటున్నారు, అదీగాక మైనర్ పిల్లలకు తల్లి అవసరం ఎంతైనా ఉంటుంది. అందువల్ల జడ్జిగారు పిల్లల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని, దాని ప్రకారం నిర్ణయం తీసుకుని, తీర్పు ఇస్తారు. మీ పిల్లలిద్దరూ ఆడపిల్లలంటున్నారు కాబట్టి తండ్రికి కష్టడీ ఇచ్చే అవకాశం తక్కువ. ఎందుకంటే ఎదిగే ఆడపిల్లలకు తల్లి అవసరం ఎంతో ఉంటుంది కాబట్టి కష్టడీ మీకే ఇస్తారు. అయితే తండ్రికి వారానికో పదిహేను రోజులకో ఒకసారి పిల్లలను చూసేందుకు విజిటేషన్ రైట్స్ ఇస్తారు. మీరు అందుకు అంగీకరించక తప్పదు. ఇ.పార్వతి అడ్వకేట్ అండ్ ఫ్యామిలీ కౌన్సెలర్ parvathiadvocate2015@gmail.com కేస్ స్టడీ తగిన మూల్యం చెల్లించక తప్పదు! లక్ష్మి, వెంకట్రావులు భార్యాభర్తలు. పెళ్లయిన నెలరోజులనుండే భర్త వేధింపులు ప్రారంభమయ్యాయి లక్ష్మికి. వెంకట్రావుది విపరీత మనస్తత్త్వం. లక్ష్మి మంచి చీరకట్టుకున్నా, పువ్వులు పెట్టుకున్నా అనుమానంతో వేధించేవాడు. రోజూ ఆఫీస్కు వెళుతుంది కాబట్టి అక్కడివారిని ఆకర్షించడానికే ఆ ముస్తాబులని చీటికిమాటికీ గొడవ పెట్టుకుని ఇష్టమొచ్చినట్లు కొట్టేవాడు. ప్రతి రోజూ ఆఫీస్ నుంచి రాగానే ఆమె సెల్ఫోన్ చెక్ చేసేవాడు. తన సంపాదన అంతా తాగుడుకి, జల్సాలకి ఖర్చు చేసి లక్ష్మి జీతం మొత్తం లాక్కునేవాడు. ఈ హింసకు తోడు అతని తమ్ముడి పెళ్లయింది మొదలుకొని లక్ష్మిపై వరకట్న వేధింపులు మొదలుపెట్టాడు. తమ్ముడు పాతిక లక్షల కట్నం తెచ్చుకున్నాడని, తనకేమో దరిద్రపుగొట్టు సంబంధం దొరికింది అడ్డూ అదుపు లేకుండా తిడుతూ కట్నం తెమ్మని గొడ్డును బాదినట్లు బాదసాగాడు. తన పెళ్లికి చేసిన అప్పులకే చితికిపోయిన పుట్టిల్లు గుర్తొచ్చి వారికి ఈ వేధింపుల గురించి ఎప్పుడూ చెప్పలేదు లక్ష్మి. ఒకరోజు విపరీతంగా తాగి వచ్చి లక్ష్మిపైకి కర్ర విసిరాడు వెంకట్రావు. అది తగిలి తలపగిలింది లక్ష్మికి. వెంటనే ఇన్పేషెంట్గా చేర్చుకుని చికిత్స చేసి నాలుగు రోజుల్లో పంపించి వేశారు. మెడికల్ బిల్లు తడిసి మోపెడైంది. డిశ్చార్జ్ అయి వచ్చినప్పటినుంచి రకరకాల ఆరోగ్య సమస్యలు వచ్చి నెలరోజులు రెస్ట్ తీసుకోవలసి వచ్చింది. ప్రైవేటు ఉద్యోగం కావడం వల్ల ఉద్యోగం నుంచి తీసివేశారు యాజమాన్యం. వెంకట్రావ్ నిమ్మకు నీరెత్తినట్లున్నాడు. పైగా తనకు మనశ్శాంతి లేదని, కావాలనే మంచం దిగకుండా వేధిస్తోందనీ కొత్తవేధింపులు. ఒకవైపు ఉద్యోగం పోయింది. మరోవైపు మోయలేని మందుల ఖర్చులు. ఇంకోవైపు గాయాల నొప్పులు, అనారోగ్యం. ఇక లాభం లేదనుకుని 478 ఎ కేసు వేసింది లక్ష్మి. తను ఆర్థికంగా, శారీరకంగా, మానసికంగా ఎంతో బాధలు అనుభవిస్తున్నాననీ, ఇందుకు కారణమైన భర్తనుంచి నష్టపరిహారం ఇప్పించాలంటే ఏం చేయాలో సలహా ఇమ్మంటూ న్యాయవాదిని సంప్రదించింది లక్ష్మి. గృహ హింస చట్టం సెక్షన్ 22 ప్రకారం బాధితురాలు తాను అనుభవించిన పెయిన్, ట్రామా, ఆర్థిక నష్టం, శారీరక గాయాలు, సంపాదన నష్టం, మనోవ్యధలకు సరిపడా నష్టపరిహారం భర్త నుంచి పొందవచ్చునని న్యాయవాది తెలిపారు. వెంటనే ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ ఆఫీస్కు వెళ్లింది లక్ష్మి. గృహ హింస చట్టం కింద వారు కేసు నమోదు చేసుకున్నారు. విషయం తెలిసిన వెంకట్రావు, పరిహారం చెల్లించకపోతే తనకు శిక్ష తప్పదని తెలుసుకుని హతాశుడయ్యాడు. వెంటనే లక్ష్మితో కాళ్లబేరానికి దిగాడు. డి.వి. కేసు -
తాగేసి కండోమ్ మర్చిపోయా
లాస్ ఏంజెలిస్: తనకు హెచ్ఐవీ వ్యాధి ఉందని హాలీవుడ్ ప్రముఖ నటుడు చార్లీ షీన్ గతేడాది డిసెంబర్ లో అంగీకరించాడు. ఓ ప్రైవేట్ చానల్ ప్రత్యక్ష ప్రసారంలో ఆయన ఈ నిజాన్ని వెల్లడించి అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తిన విషయం తెలిసిందే. నిజానికి తాను కేవలం రెండుసార్లు మాత్రమే రక్షణ(కండోమ్) లేకుండా శృంగారంలో పాల్గొన్నట్లు తాజాగా తెలిపాడు. తరచుగా కండోమ్స్ యాడ్స్, వాటిపై ప్రచారం చేయడంతో కనిపించే చార్లీ.. తాను దురదృష్టవంతుడినని ఆవేదన వ్యక్తం చేశాడు. దాదాపు నాలుగున్నర ఏళ్ల కిందట తనకు హెచ్ఐవీ సోకిందని తెలిసిందని, అప్పటినుంచి చికిత్స పొందుతున్నానని ఆయన వివరించారు. కేవలం రెండుసార్లు మాత్రమే అసురక్షిత లైంగిక చర్యలో పాల్గొన్నాను, అందుకే ఇప్పుడు శిక్ష అనుభవిస్తున్నానని చెప్పాడు. ఫుల్లుగా తాగి కండోమ్ వాడటం మరిచిపోయానని దీంతో వైరస్ సంక్రమించి ఉండొచ్చని అభిప్రాయపడ్డాడు. హెచ్ఐవీ సోకిన విషయం తెలిసిన తర్వాత కూడా కొన్ని నెలల పాటు శృంగారంలో పాల్గొనడం మానలేదని చార్లీ వెల్లడించాడు. తనకు సోకిన వ్యాధిని ఇతరులకు అంటించలేదని వ్యాఖ్యానించాడు. తనకు హెచ్ఐవీ ఉందన్న విషయం ఏడాది కిందటే తెలిసినా.. ఆ విషయాన్ని చార్లీ షీన్ దాచిపెట్టారని, ఆయనతో లైంగిక సంబంధం ఉన్న ఓ పోర్న్ స్టార్ కూడా వెల్లడించడంతో ఈ వార్త అప్పట్లో సంచలనం అయింది. -
తప్పుడు హెచ్ఐవీ రిపోర్టు ఎంత పని చేసింది..
చండూరు (నల్లగొండ): ఆ దంపతులకు హెచ్ఐవీ లేదు. కానీ ఉన్నట్టు తప్పుడు రిపోర్ట్ ఇవ్వడంతో వారి జీవితంలో ఎన్నో మలుపులకు దారి తీసింది. నల్లగొండ జిల్లా చండూరు మండల కేంద్రంలో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించి బాధితులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పశ్చిమ బెంగాల్కు చెందిన దంపతులు చండూరు మండల కేంద్రానికి కొంతకాలం క్రితం వలస వచ్చారు. స్థానికంగా ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఇటీవల ఫాస్ట్ఫుడ్ సెంటర్ నిర్వాహకుడి భార్య గర్భం దాల్చింది. ఈ నెల 1న స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పరీక్షలు నిర్వహించుకుంది. హెచ్ఐవీ సోకిందని వెంటనే జిల్లా కేంద్ర ఆస్పత్రిలో చూపించుకోవాలని అక్కడికి రెఫర్ చేశారు. దీంతో ఆ దంపతులు ఆత్మహత్య చేసుకునేందుకు నిర్ణయించుకున్నారు. అదే రోజు జిల్లా కేంద్రంలోని రైల్వేస్టేషన్కు వెళ్లారు. వీరి ప్రవర్తనపై అనుమానం వచ్చిన వారి బంధువు పలుమార్లు ఫోన్ చేసి అది తప్పుడు రిపోర్ట్ అంటూ కౌన్సెలింగ్ ఇచ్చాడు. దీంతో వారు నిర్ణయాన్ని మార్చుకుని జిల్లా కేంద్ర ఆస్పత్రితో పాటు ప్రైవేట్ ఆస్పత్రిలో మళ్లీ పరీక్షలు చేయించుకున్నారు. హెచ్ఐవీ లేదని వెల్లడి కావడంతో ఊపిరి పీల్చుకున్నారు. వైద్యురాలితో వాగ్వాదం కాగా, జరిగిన విషయాన్ని బాధితులు వివిధ పార్టీల నాయకులకు వివరించారు. బుధవారం వారితో వెళ్లి సదరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యురాలిని నిలదీశారు. బాధితురాలికి హెచ్ఐవీ పరీక్ష నిర్వహించగా అనుమానం కలిగిందని, అందుకే జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రికి సిఫారసు చేసినట్టు చెప్పారు. సిబ్బంది తప్పుడు రిపోర్ట్ ఇచ్చారని, తన తప్పేమీ లేదని పీహెచ్సీ వైద్యురాలు స్వర్ణలత వివరణ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. -
రక్తమార్పిడితో 2234 మందికి హెచ్ఐవీ!
అత్యవసర పరిస్థితిలో రక్తమార్పిడి చేయించుకోవడం తప్పనిసరి అవుతుంది. బ్లడ్బ్యాంకులలో రక్తాన్ని క్షుణ్ణంగా, అన్నిరకాల పరీక్షలు చేసిన తర్వాత మాత్రమే దాన్ని రోగులకు ఇస్తారు. కానీ.. రక్తమార్పిడి కారణంగానే మన దేశంలో 2234 మందికి హెచ్ఐవీ సోకింది. 2014 అక్టోబర్ నుంచి 2016 మార్చి మధ్యలో రక్తం తీసుకుని, హెచ్ఐవీ బారిన పడినవాళ్ల సంఖ్య ఇది. ఈ విషయం సమాచార హక్కు కింద అడిగిన ప్రశ్నకు సమాధానంగా తెలిసింది. చేతన్ కొఠారీ అనే వ్యక్తి అడిగిన ప్రశ్నకు సమాధానంగా జాతీయ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఈ వివరాలు వెల్లడించింది. చాలావరకు బ్లడ్బ్యాంకులు నిబంధనలను ఉల్లంఘిస్తున్నాయని, దానివల్లే ప్రజలు ప్రమాదకరమైన వ్యాధుల బారిన పడుతున్నారని ఇటీవల వెల్లడైన ఓ నివేదికలో కూడా తెలిపారు. 2014 జనవరి నుంచి సెప్టెంబర్ వరకు సుమారు 30 లక్షల యూనిట్ల రక్తాన్ని బ్లడ్బ్యాంకులు సేకరించాయి. వాటిలో 84 శాతం మంది స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. అయితే, ఈ రక్తాన్ని సరిగా పరీక్షించకపోవడం వల్లే 2వేల మందికి పైగా హెచ్ఐవీ బారిన పడ్డారు. అత్యధికంగా యూపీలో 361 మంది, తర్వాత గుజరాత్లో 292 మందికి ఈ వ్యాధి సోకింది. సేకరించిన రక్తాన్ని ఎవరికైనా ఇచ్చే ముందు తప్పనిసరిగా హెచ్ఐవీ, హెచ్బీవీ, హెపటైటిస్ సి, మలేరియా, సిఫిలిస్ లాంటి వ్యాధులు ఉన్నాయేమో పరీక్షించాలి. అయితే, హెచ్ఐవీ సోకిన 3 నెలల వరకు అది రక్తపరీక్షలో కూడా బయటపడదు. దీన్ని విండో పీరియడ్ అంటారు. అలాంటి సందర్భాల్లోనే చాలావరకు రక్తగ్రహీతలకు హెచ్ఐవీ సోకుతుందని నిపుణులు అంటున్నారు. -
ఎయిడ్స్ వచ్చిందని చెప్పని భర్తను..
బరేలీ: హెచ్ఐవీ ఉందనే కారణంతో అత్తమామలు అతడి భార్యతో కుట్ర చేసి హత్య చేశారు. పోలీసులు వారిని అరెస్టు చేశారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్లోని ఖమారియా అనే గ్రామనికి చెందిన వ్యక్తికి అట్టాపట్టి అనే గ్రామానికి అమ్మాయితో 2013లో వివాహం అయింది. ట్రక్కు డ్రైవర్ గా పనిచేస్తున్న అతడు ఏడాదిన్నర కిందట తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. అప్పటి నుంచి తన అత్తమామల ఇంట్లో ఉండటం మొదలుపెట్టాడు. వాస్తవానికి అతడికి ఆ సమయంలో ఎయిడ్స్ సోకింది. అయితే, ఆ విషయం ఎవరికీ చెప్పకుండా రహస్యంగా ఉంచాడు. ఎవరికీ తెలియకుండా భోజిపురాలోని యాంటీ రిట్రో వైరల్ థెరపీ కేంద్రానికి వెళ్లి అక్కడే ఉండి థెరపీ పూర్తి చేసుకున్నాడు. థెరపీ సెషన్ పూర్తయ్యాక తిరిగి అత్తగారింటికి వెళ్లాడు. ఈ లోగా ఇంట్లో వాళ్లకు అతడికి ఎయిడ్స్ సోకిందని తెలిసింది. దీంతో అతడిని ఎవరికీ తెలియకుండా చంపేశారు. ఎలా చనిపోయాడని చెబితే సరైన కారణాలను గ్రామస్తులకు చెప్పలేకపోయారు. పైగా శరవేగంగా అంత్యక్రియలు పూర్తి చేసేందుకు పూనుకోగా వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అక్కడి వచ్చిన పోలీసులు విచారణ ప్రారంభించగా అసలు విషయం తెలిసింది. -
'నీకు ఎయిడ్స్ ఉందని ఎందుకు చెప్పలేదు?'
బ్రిటన్: ఆమె తన మాజీ ప్రేయసి.. ఒకప్పుడు ఎంతో గాఢమైన అనుబంధం ఉంది. కొద్దికాలం విడిపోయారు. ఆ తర్వాత మళ్లీ మాటలు కలిశాయి. గతంలో ఉన్న చనువు మేరకు వారిద్దరు తిరిగి శృంగారంలో పాల్గొన్నారు. కాకపోతే, ఆ ప్రియుడు ఆమె ముందు నిజం దాచాడు. ఆ నిజమేమిటంటే అతడికి అప్పటికే హెచ్ఐవీ సోకింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూ కార్యక్రమంలో మాట్లాడుతూ అతడు తాఫీగా తనకు ఎయిడ్స్ ఉందంటూ బహిర్గతం చేశాడు. ఈ విషయం తెలుసుకున్న ఆ మాజీ ప్రేయసి గుండె ఒక్కసారిగా జారిపోయింది. ఎందుకు ఇంతపనిచేశావ్ అని నిలదీస్తే ఎంతో నిర్లక్ష్యంగా సమాధానం చెప్పాడు. అతడే.. చార్లీ షీన్. తొలుత రంగస్థల నటుడిగా ఉన్న ఇతడు అనంతరం పలు అమెరికన్ చిత్రాల్లో నటించి కొద్ది కాలంలోనే పేరు ప్రఖ్యాతులు సంపాధించుకున్నాడు. కానీ, అతడి విచ్చల విడితనం కారణంగా హెచ్ఐవీ సోకింది. ఆ విషయాన్ని తన మాజీ ప్రేయసికి చెప్పకుండా దాచేశాడు. ఇదే విషయాన్ని అతడిని ఆమె ప్రశ్నిస్తే ఏం చెప్పాడో ఒకసారి చూస్తే.. మాజీ ప్రేయసి: నీకు ఎయిడ్స్ లేదని ఎందుకు చెప్పావ్? షీన్: అది నీకు చెప్పాల్సిన అవసరం లేదు మాజీ ప్రేయసి: కండోమ్ లేకుండా శృంగారంలో పాల్గొంటున్నప్పుడు ఆ విషయం తెలుసుకోవడం నా హక్కు షీన్: నువ్వు ఇలాంటివి కోరుకోకూడదు.. అంటూ ఇంకా ఎన్నో కొన్ని చెప్పకూడని మాటలు వారిద్దరు ఫోన్లో మాట్లాడుకున్నారు. -
ఎయిడ్స్ పై విజయం సాధించారు!
వాషింగ్టన్: ప్రపంచ దేశాలను రెండు దశాబ్దాలుగా పట్టి పీడిస్తున్న వ్యాధి ఎయిడ్స్. ఈ వ్యాధిని కలిగించే హెచ్ఐవీ వైరస్ నిర్మూలనలో అమెరికా శాస్త్రవేత్తలు ఓ అడుగు ముందుకేశారు. ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల డీఎన్ఏ నుంచి హెచ్ఐవీ వైరస్ ను తొలగించవచ్చునని టెంపుల్ యూనివర్సిటీకి చెందిన ఓ శాస్త్రవేత్త కామెల్ ఖాలిలి తెలిపారు. హెచ్ఐవీ-1 వైరస్ పై చేసిన పరిశోధనలు సత్ఫలితాలు ఇస్తున్నట్లు ఆయన వెల్లడించారు. అయితే యాంటీరిట్రోవైరల్ థెరపీ చేయించుకుంటున్న పేషెంట్లు తమ ట్రీట్ మెంట్ కొనసాగించాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపవద్దని సూచిస్తున్నారు. జెనీ ఎడిటింగ్ సిస్టమ్ అనే విధానం ద్వారా హెచ్ఐవీ వైరస్ ను అరికట్టవచ్చని వివరించారు. డీఎన్ఏ లోని సీడీ4 టీ కణాల నుంచి హెచ్ఐవీ వైరస్ క్రమక్రమంగా తొలగిపోతుందని తమ పరిశోధనలు కనుగొన్నట్లు పేర్కొన్నారు. జెనీ ఎడిటింగ్ విధానం ప్రారంభించిన తర్వాత ఎయిడ్స్ పేషెంట్లు ఈ ప్రమాదకర వైరస్ నుంచి రక్షణ పొందుతారు. ఈ విధానం ఏదో నామమాత్రం కాదని పూర్తిగా ప్రభావాన్ని చూపుతుందని పేషెంట్లు మళ్లీ ఈ వ్యాధి భారిన పడకుండా ఉండేందుకు అవకాశాలు అధికంగా ఉన్నాయని శాస్త్రవేత్త కమెల్ ఖలిలి తెలిపారు. -
భూ..భూ.. భూతం
► చాప కింద నీరులా హెచ్ఐవీ వ్యాప్తి ► రాష్ట్రంలో గుంటూరు జిల్లాలో అధికం ► మూడో స్థానంలో కృష్ణాజిల్లాతాజా సర్వేలో వెల్లడి ► వ్యాధి నిర్ధారణకు కిట్లు కూడా లేవు ► పట్టించుకోని ప్రభుత్వం హెచ్ఐవీ భూతం మళ్లీ కోరలు చాస్తోంది. పాలకులు పట్టించుకోక.. నిధులు విడుదల కాకపోవడంతో వ్యాధి నిర్ధారణ కిట్లు కూడా అందుబాటులో ఉండటం లేదు. మందుల కొరత వల్ల అనేకమంది మృత్యువాత పడుతున్నారు. అవగాహన కార్యక్రమాలు కూడా స్తంభించిపోవటంతో మరోసారి గుంటూరు, కృష్ణా జిల్లాల్లో కొత్త కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. విజయవాడ (లబ్బీపేట) : ఐదేళ్ల కిందట ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హెచ్ఐవీ/ఎయిడ్స్ వ్యాప్తిలో గుంటూరు, కృష్ణాజిల్లాలు రాష్ట్రంలోనే అగ్రస్థానంలో ఉండేవి. రాష్ట్రంలో నమోదవుతున్న కేసుల్లో 20 శాతం ఈ జిల్లాల్లోనే ఉండడంతో అప్పటి ప్రభుత్వం అప్రమత్తమై విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టింది. వ్యాధి నిర్ధారణకు ఐసీటీసీ సెంటర్లు ఏర్పాటు చేయడంతో పాటు, వ్యాధి సోకిన వారికి మందులు ఇచ్చేందుకు ఏఆర్టీ కేంద్రాలను కూడా ఏర్పాటు చేసింది. దీంతో ఈ రెండు జిల్లాల్లో రెండేళ్ల కిందట హెచ్ఐవీ/ఎయిడ్స్ వ్యాప్తి గణనీయంగా తగ్గింది. ప్రస్తుత ప్రభుత్వ తీరుతో పాత రోజులు పునరావృతమయ్యాయి. ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ (ఏపీ సాక్స్)కి సరైన నిధులు విడుదల చేయకపోవడంతో హెచ్ఐవీ నియంత్రణ గురించి పట్టించుకునేవారే కరువయ్యారు. ఆంధ్రప్రదేశ్లో హెచ్ఐవీ వ్యాప్తిలో గుంటూరు జిల్లా అగ్రస్థానంలో, కృష్ణాజిల్లా మూడో స్థానంలో ఉన్నాయంటూ ప్రభుత్వం వెల్లడించిన తాజా సర్వేలో తేటతెల్లమైంది. ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరే దీనికి నిదర్శనమని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రెండు జిల్లాల్లో లక్షన్నరకు పైగానే... హెచ్ఐవీ వ్యాధి నిర్ధారణ చేసేందుకు కృష్ణాజిల్లాలో 14 ఐసీటీసీ కేంద్రాలు, 4 పీపీటీసీటీలు, 87 ఎఫ్ఐసీటీసీలు ఉన్నాయి. వాటిలో ఇప్పటివరకు ఏడు లక్షల మందికి పైగా పరీక్షలు చేయగా, 66,276 మందికి పాజిటివ్ వచ్చినట్లు అధికారిక లెక్కలు చెపుతున్నాయి. కొందరు మృతి చెందగా, ఏఆర్టీ సెంటర్లలో 37,739 మంది పేర్లు నమోదు చేయించుకున్నారు. వారిలో వ్యాధి నిరోధకశక్తి తగ్గిన వారు 14,660 మంది మందులు వాడుతున్నారు. గుంటూరు జిల్లాలో 19 ఐసీటీసీలు, 6 ఏఆర్టీ సెంటర్లు ఉండగా, వంద వరకు ఎఫ్ఐసీటీసీలు ఉన్నాయి. ఇప్పటివరకు వాటిలో పరీక్షలు చేసిన వారిలో 66 వేల మందికి హెచ్ఐవీ పాజిటివ్ రాగా, 47 వేల మంది ఏఆర్టీల్లో పేర్లు నమోదు చేయించుకున్నారు. వారిలో 18 వేల మంది మందులు వాడుతున్నట్లు అధికారిక లెక్కలు చెపుతున్నాయి. వీరు కాక అనధికారికంగా మరో 20 వేల మంది ఉంటారనేది అంచనా. ఇలా రెండు జిల్లాల్లో కలిపి మొత్తం లక్షా 50 వేల మంది ఉంటారని అధికారులే చెపుతున్నారు. నిర్ధారణ కిట్లు లేవు వ్యాధి లక్షణాలతో స్వచ్ఛందంగా పరీక్షల కోసం వచ్చిన వారికి ఆయా కేంద్రాల్లో ఉచితంగా పరీక్షలు చేయాల్సి ఉంది. పీవీటీసీటీలో గర్భిణులకు వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేస్తారు. ఏడాదిగా వ్యాధి నిర్ధారణకు అవసరమైన కిట్లు లేక ఈ పరీక్షలు నిలిచిపోయాయి. దీంతో హెచ్ఐవీ లక్షణాలు ఉన్నా.. ప్రైవేటు ఆస్పత్రుల్లో పరీక్షలు చేయించుకునే ఆర్థిక స్థోమత లేనివారు అలాగే ఉండిపోవాల్సిన దుస్థితి నెలకొంది. మరోవైపు హెచ్ఐవీ బాధిత గర్భిణి నుంచి బిడ్డకు హెచ్ ఐవీ సోకకుండా పుట్టిన వెంటనే ‘నెవిరిఫిన్’ అనే సిరప్ వేస్తారు. ప్రస్తుతం సిరప్లు లేకపోవడంతో తల్లి నుంచి బిడ్డకు వచ్చే హెచ్ఐవీని నిరోధించలేకపోతున్నారు. దీంతో పది నెలల కాలంలో గుంటూరులో 3,495 కొత్త కేసులు నమోదు కాగా, కృష్ణాజిల్లాలో 2,376 కేసులు నమోదయ్యాయి. మందుల కొరత కృష్ణాజిల్లాలో మూడు, గుంటూరు జిల్లాలో ఆరు ఏఆర్టీ సెంటర్లు ఉండగా, వాటిలో 32,660 మంది మందులు వాడుతున్నారు. ఒక్కసారి మందుల వాడకం ప్రారంభిస్తే జీవితాంతం వాడాల్సిందే. ఒక్కో సమయంలో ఏఆర్టీ మందుల కొరత నెలకొనడంతో, రోగులకు ఏంచేయాలో దిక్కుతోచని దుస్థితి నెలకొంటోంది. దీంతో వ్యాధి ముదిరి కొందరు రోగులు మృత్యువాత పడుతున్నట్లు చెపుతున్నారు. దీనంతటికీ ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అవగాహన కార్యక్రమాలెక్కడ? ప్రభుత్వం నుంచి సరైన ప్రోత్సాహం లేకపోవడంతో జిల్లాల్లో హెచ్ఐవీపై అవగాహన కార్యక్రమాలు కూడా పూర్తిగా స్తంభించిపోయాయి. ఒకప్పుడు ప్రభుత్వాలు ప్రకటనలు, ప్రచారంతో విస్తృత స్థాయిలో ఈ వ్యాధిపై అవగాహన కలిగించాయి. ప్రస్తుతం హెచ్ఐవీ అంశాన్ని పక్కన పెట్టేశారు. కనీస నిధులు మంజూరు చేయకపోవడమే గాక సిబ్బంది జీతాలు కూడా చెల్లించని దుస్థితి నెలకొంది. దీంతో కృష్ణా, గుంటూరు జిల్లాల్లో పనిచేస్తున్న 500 మంది సిబ్బంది జీతాలు అందక ఇబ్బందులు పడుతున్నారు. పింఛను విషయంలో మొండిచేయి... ఏఆర్టీ కేంద్రాల్లో ముందులు వాడుతున్న వారందరికీ ప్రతినెలా పింఛను మంజూరు చేయాల్సి ఉంది. ఇలా రెండు జిల్లాల్లో 32,660 మందికి ఫించన్లు అందాల్సి ఉండగా, మూడువేల మందికి మాత్రమే అందుతున్నాయి. మిగిలినవారు దరఖాస్తులు చేసుకున్నప్పటికీ వేర్వేరు కారణాలు చూపుతూ వారికి మొండిచేయి చూపుతున్నారు. దీంతో వారంతా పింఛను కోసం ఎదురుచూస్తూ కాలం వెళ్లదీస్తున్నారు. -
మళ్లీ కోరలు చాస్తున్న... హెచ్ఐవీ భూతం
► చాప కింద నీరులా వ్యాధి వ్యాప్తి ► రాష్ట్రంలో గుంటూరు జిల్లా టాప్ ► మూడో స్థానంలో కృష్ణాజిల్లా ► తాజా సర్వేలో వెల్లడి ► వ్యాధి నిర్ధారణకు కిట్లు కూడా లేవు ► పట్టించుకోని ప్రభుత్వం హెచ్ఐవీ భూతం మళ్లీ కోరలు చాస్తోంది. పాలకులు పట్టించుకోక.. నిధులు విడుదల కాకపోవడంతో వ్యాధి నిర్ధారణ కిట్లు కూడా అందుబాటులో ఉండటం లేదు. మందుల కొరత వల్ల అనేకమంది మృత్యువాత పడుతున్నారు. అవగాహన కార్యక్రమాలు కూడా స్తంభించిపోవటంతో మరోసారి గుంటూరు, కృష్ణా జిల్లాల్లో కొత్త కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. విజయవాడ (లబ్బీపేట) : ఐదేళ్ల కిందట ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హెచ్ఐవీ/ఎయిడ్స్ వ్యాప్తిలో గుంటూరు, కృష్ణాజిల్లాలు రాష్ట్రంలోనే అగ్రస్థానంలో ఉండేవి. రాష్ట్రంలో నమోదవుతున్న కేసుల్లో 20 శాతం ఈ జిల్లాల్లోనే నమోదవడంతో అప్పటి ప్రభుత్వం అప్రమత్తమై విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టింది. వ్యాధి నిర్ధారణకు ఐసీటీసీ సెంటర్లు ఏర్పాటు చేయడంతో పాటు, వ్యాధి సోకిన వారికి మందులు ఇచ్చేందుకు ఏఆర్టీ కేంద్రాలను కూడా ఏర్పాటు చేసింది. దీంతో ఈ రెండు జిల్లాల్లో రెండేళ్ల కిందట హెచ్ఐవీ/ఎయిడ్స్ వ్యాప్తి గణనీయంగా తగ్గింది. ప్రస్తుత ప్రభుత్వ తీరుతో పాత రోజులు పునరావృతమయ్యాయి. ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ (ఏపీ సాక్స్)కి సరైన నిధులు విడుదల చేయకపోవడంతో హెచ్ఐవీ నియంత్రణ గురించి పట్టించుకునేవారే కరువయ్యారు. ఆంధ్రప్రదేశ్లో హెచ్ఐవీ వ్యాప్తిలో గుంటూరు జిల్లా అగ్రస్థానంలో, కృష్ణాజిల్లా మూడో స్థానంలో ఉన్నాయంటూ ప్రభుత్వం వెల్లడించిన తాజా సర్వేలో తేటతెల్లమైంది. ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరే దీనికి నిదర్శనమని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిర్ధారణ కిట్లు లేవు వ్యాధి లక్షణాలతో స్వచ్ఛందంగా పరీక్షల కోసం వచ్చిన వారికి ఆయా కేంద్రాల్లో ఉచితంగా పరీక్షలు చేయాల్సి ఉంది. పీవీటీసీటీలో గర్భిణులకు వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేస్తారు. ఏడాదిగా వ్యాధి నిర్ధారణకు అవసరమైన కిట్లు లేక ఈ పరీక్షలు నిలిచిపోయాయి. దీంతో హెచ్ఐవీ లక్షణాలు ఉన్నా.. ప్రైవేటు ఆస్పత్రుల్లో పరీక్షలు చేయించుకునే ఆర్థిక స్థోమత లేనివారు అలాగే ఉండిపోవాల్సిన దుస్థితి నెలకొంది. మరోవైపు హెచ్ఐవీ బాధిత గర్భిణి నుంచి బిడ్డకు హెచ్ ఐవీ సోకకుండా పుట్టిన వెంటనే ‘నెవిరిఫిన్’ అనే సిరప్ వేస్తారు. ప్రస్తుతం సిరప్లు లేకపోవడంతో తల్లి నుంచి బిడ్డకు వచ్చే హెచ్ఐవీని నిరోధించలేకపోతున్నారు. దీంతో పది నెలల కాలంలో గుంటూరులో 3,495 కొత్త కేసులు నమోదు కాగా, కృష్ణాజిల్లాలో 2,376 కేసులు నమోదయ్యాయి. మందుల కొరత కృష్ణాజిల్లాలో మూడు, గుంటూరు జిల్లాలో ఆరు ఏఆర్టీ సెంటర్లు ఉం డగా, వాటిలో 32,660 మంది మందులు వాడుతున్నారు. ఒక్కసారి మందుల వాడకం ప్రారంభిస్తే జీవితాంతం వాడాల్సిందే. ఒక్కో సమయంలో ఏఆర్టీ మందుల కొరత నెలకొనడంతో, రోగులకు ఏంచేయాలో దిక్కుతోచని దుస్థితి నెలకొంటోంది. దీంతో వ్యాధి ముదిరి కొందరు రోగులు మృత్యువాత పడుతున్నట్లు చెపుతున్నారు. దీనంతటికీ ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అవగాహన కార్యక్రమాలెక్కడ? ప్రభుత్వం నుంచి సరైన ప్రోత్సాహం లేకపోవడంతో జిల్లాల్లో హెచ్ఐవీ వైరస్పై నిర్వహించాల్సిన అవగాహన కార్యక్రమాలు కూడా పూర్తిగా స్తంభించిపోయాయి. ఒకప్పుడు ప్రభుత్వాలు ప్రకటనలు, ప్రచారంతో విస్తృత స్థాయిలో ఈ వ్యాధిపై అవగాహన కలిగించాయి. ప్రస్తుతం హెచ్ఐవీ అంశాన్ని పక్కన పెట్టేశారు. కనీస నిధులు మంజూరు చేయకపోవడమే గాక సిబ్బంది జీతాలు కూడా చెల్లించని దుస్థితి నెలకొంది. దీంతో కృష్ణా, గుంటూరు జిల్లాల్లో పనిచేస్తున్న 500 మంది సిబ్బంది జీతాలు అందక ఇబ్బందులు పడుతున్నారు. పింఛను విషయంలో మొండిచేయి... ఏఆర్టీ కేంద్రాల్లో ముందులు వాడుతున్న వారందరికీ ప్రతినెలా పింఛను మంజూరు చేయాల్సి ఉంది. ఇలా రెండు జిల్లాల్లో 32,660 మందికి ఫించన్లు అందాల్సి ఉండగా, మూడువేల మందికి మాత్రమే అందుతున్నాయి. మిగిలినవారు దరఖాస్తులు చేసుకున్నప్పటికీ వేర్వేరు కారణాలు చూపుతూ వారికి మొండిచేయి చూపుతున్నారు. దీంతో వారంతా పింఛను కోసం ఎదురుచూస్తూ కాలం వెళ్లదీస్తున్నారు. రెండు జిల్లాల్లో లక్షన్నరకు పైగానే... హెచ్ఐవీ వ్యాధి నిర్ధారణ చేసేందుకు కృష్ణాజిల్లాలో 14 ఐసీటీసీ కేంద్రాలు, 4 పీపీటీసీటీలు, 87 ఎఫ్ఐసీటీసీలు ఉన్నాయి. వాటిలో ఇప్పటివరకు ఏడు లక్షల మందికి పైగా పరీక్షలు చేయగా, 66,276 మందికి పాజిటివ్ వచ్చినట్లు అధికారిక లెక్కలు చెపుతున్నాయి. కొందరు మృతి చెందగా, ఏఆర్టీ సెంటర్లలో 37,739 మంది పేర్లు నమోదు చేయించుకున్నారు. వారిలో వ్యాధి నిరోధకశక్తి తగ్గిన వారు 14,660 మంది మందులు వాడుతున్నారు. గుంటూరు జిల్లాలో 19 ఐసీటీసీలు, 6 ఏఆర్టీ సెంటర్లు ఉండగా, వంద వరకు ఎఫ్ఐసీటీసీలు ఉన్నాయి. ఇప్పటివరకు వాటిలో పరీక్షలు చేసిన వారిలో 66 వేల మందికి హెచ్ఐవీ పాజిటివ్ రాగా, 47 వేల మంది ఏఆర్టీల్లో పేర్లు నమోదు చేయించుకున్నారు. వారిలో 18 వేల మంది మందులు వాడుతున్నట్లు అధికారిక లెక్కలు చెపుతున్నాయి. వీరు కాక అనధికారికంగా మరో 20 వేల మంది ఉంటారనేది అంచనా. ఇలా రెండు జిల్లాల్లో కలిపి మొత్తం లక్షా 50 వేల మంది ఉంటారని అధికారులే చెపుతున్నారు. -
భారత్లో 21.17 లక్షల హెచ్ఐవీ రోగులు
న్యూఢిల్లీ : భారత్లో హెచ్ఐవీ రోగుల సంఖ్య నానాటికి పెరుగుతుంది. ప్రస్తుతం 21.17 లక్షల మంది హెచ్ఐవీ రోగులతో భారత్ ప్రస్తుతం ప్రపంచంలో మూడో స్థానంలో ఉందని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జె.పి.నడ్డా వెల్లడించారు. శుక్రవారం లోక్సభలో మంత్రి నడ్డా మాట్లాడుతూ... 68 లక్షల మంది హెచ్ఐవీ రోగులతో దక్షిణాఫ్రికా మొదటి స్థానం ఆక్రమించగా... 34 లక్షలతో నైజీరియా రెండో స్థానంలో నిలిచిందన్నారు. అయితే దేశంలో కొత్త హెచ్ఐవీ కేసుల నమోదు సంఖ్య తగ్గిందన్నారు. ఈ కేసుల సంఖ్య తగ్గించడం ఈ ప్రభుత్వానికి ఓ చాలెంజ్ అని జె.పి.నడ్డా అభిప్రాయపడ్డారు. -
రోజులు గడిచి.. విచారణ మరిచి!
► నీరుగారుతున్న ఎయిడ్స్ కిట్ల కేసు ► సూత్రధారులను తప్పించే ప్రయత్నం ► అక్రమాలపై నోరు మెదపని అధికారులు ► రెండు వారాలుగా ఇదే తంతు ► ఇప్పటికీ మొదలు కాని విచారణ అధికారులు తప్పు చేస్తే తప్పించుకోవడం చాలా తేలిక. అదీ సొంత శాఖ వారయితే.. ఇక అడ్డేముంది. విచారణకు ఆదేశిస్తున్నట్లు ప్రకటిస్తే సరి.. ఆ తర్వాత షరా మామూలే. చేస్తున్నాం.. చూస్తున్నాం.. అనే మాటలతో నెట్టుకురావడం అధికారులకు కొత్తేమీ కాదనేది ఎయిడ్స్ కిట్ల వ్యవ హారంలో మరోసారి రుజువవుతోంది. ప్రభుత్వం సరఫరా చేసిన ఉచిత హెచ్ఐవీ కిట్లను తిరిగి ప్రభుత్వాసుపత్రికే విక్రయించిన ఉదంతాన్ని ‘సాక్షి’ రెండు వారాల క్రితం వెలుగులోకి తీసుకొచ్చింది. అయితే ఇప్పటికీ విచారణ మొదలు కాకపోవడం తోటి అధికారుల సహకారానికి నిదర్శనం. కర్నూలు(జిల్లా పరిషత్): జిల్లాలో రెండు వారాల క్రితం హెచ్ఐవీ కిట్ల వ్యవహారం తీవ్ర దుమారం రేపిన విషయం విదితమే. జాతీయ ఎయిడ్స్ నియంత్రణ మండలి(నాకో) ద్వారా రాష్ట్రీయ ఎయిడ్స్ నియంత్రణ మండలికి, అక్కడి నుంచి జిల్లా ఎయిడ్స్ నియంత్రణ మండలి కార్యాలయానికి ఉచితంగా హెచ్ఐవీ కిట్లను సరఫరా చేస్తారు. ఇందుకు సంబంధించి వాకిన్ కూలర్ను సైతం నాకో సరఫరా చేసింది. అయితే ఈ కూలర్ను ఏర్పాటు చేసేందుకు తమ వద్ద స్థలం లేదని చెప్పి, దానిని కర్నూలు మెడికల్ కాలేజీలోని మైక్రోబయాలజి విభాగానికి చేర్చారు. అక్కడి నుంచే జిల్లాలోని ఐసీటీసీ, పీపీటీసీ, ఏఆర్టీ సెంటర్లకు, పీహెచ్సీలకు హెచ్ఐవీ కిట్లు వెళ్తాయి. ఇలా వచ్చిన కిట్లను వైద్యులు, సిబ్బంది, అధికారులతో కొందరు వ్యాపారస్తులు కుమ్మక్కై పక్కదారి పట్టించారు. ఈ విషయాన్ని ‘సాక్షి’ వెలుగులోకి తేవడంతో ఔషధ నియంత్రణ మండలి అధికారులు జిల్లా వ్యాప్తంగా ల్యాబొరేటరీలు, మెడికల్ ఏజెన్సీలు, మెడికల్ దుకాణాలపై దాడులు నిర్వహించారు. కర్నూలులోని రెండు మెడికల్ ఏజెన్సీలలో నాకో సరఫరా చేసిన హెచ్ఐవీ కిట్లను గుర్తించారు. వీటి ఆధారంగా కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని 24 గంటలు పనిచేసే ల్యాబ్లో, కర్నూలు మెడికల్ కాలేజీలోని మైక్రోబయాలజి ల్యాబ్లో 2వేల దాకా నాకో హెచ్ఐవీ కిట్లు లభించాయి. ఇందుకు సంబంధించి ఔషధ నియంత్రణ అధికారులు పంచనామా చేసి, నివేదికను కోర్టుకు సమర్పించారు. సూత్రధారులు తప్పించుకునేలా విచారణ నాకో సరఫరా చేసిన ఉచిత హెచ్ఐవీ కిట్లు మెడికల్ ఏజెన్సీలతో పాటు ప్రభుత్వ ఆసుపత్రిలో లభించి రెండు వారాలవుతున్నా విచారణ ప్రారంభం కాకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఆసుపత్రిలో ఆరోగ్యశ్రీ నిధుల నుంచి హెచ్ఐవీ కిట్లను కొనుగోలు చేస్తారు. ఇలా వచ్చిన రీకాన్ కంపెనీ హెచ్ఐవీ కిట్లను కాదని.. ఎస్డీ కంపెనీ కిట్లు కావాలని తెప్పించుకున్నారు. ఈ కిట్లు నాకో సరఫరా చేసినవని ఔషధ నియంత్రణ మండలి అధికారుల తనిఖీలో బయటపడింది. ఈ కిట్లను గత డిసెంబర్లో తెప్పించుకున్నా వాడకుండా మైక్రోబయాలజీ డిపార్ట్మెంట్లో ఓ మూలన భద్రపరిచారు. మైక్రోబయాలజి ల్యాబ్లో గత మూడు నెలలుగా హెచ్ఐవీ పరీక్షలు చేయడం లేదని సమాచారం. ఒకవైపు ఉన్న కిట్లను మూలనపడేసి, మరోవైపు కిట్ల కొరత ఉందని పేర్కొంటూ 2వేల కిట్లకు ఆర్డర్ పెట్టారు. ఈ మేరకు గత జనవరి 21న టెండర్ దారుడైన స్వాతి ఏజెన్సీ నుంచి కాకుండా స్టార్ ఏజెన్సీ నుంచి వెయ్యి కిట్లు తెప్పించారు. వీటిని కూడా ఇప్పటి వరకు వినియోగించకుండా ఆరోగ్యశ్రీ కార్యాలయానికి పరిమితం చేశారు. హెచ్ఐవీ పరీక్షలు నిర్వహించకుండా కేవలం కమీషన్ల కోసమే కిట్లను కొనుగోలు చేస్తున్నారనే ఆరోపణలకు ఈ పరిణామం బలాన్ని చేకూరుస్తోంది. పని ఒత్తిడి సాకు.. హెచ్ఐవీ కిట్లకు సంబంధించి విచారణ అధికారిగా సీఎస్ఆర్ఎంఓ డాక్టర్ వై.శ్రీనివాసులును నియమించారు. రెండు రోజుల అనంతరం రేడియాలజిస్ట్ డాక్టర్ జోజిరెడ్డిని సైతం విచారణాధికారిగా నియమించారు. అయితే వీరిని నియమించి పది రోజులైనా ఇప్పటిదాకా విచారణ ప్రారంభించకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయమై ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ జె.వీరాస్వామిని ‘సాక్షి’ వివరణ కోరగా పని ఒత్తిడి కారణంగా విచారణ ప్రారంభం కాలేదన్నారు. త్వరగా పూర్తి చేసి, బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు. -
అక్కడ పెళ్ళికి ముందే హెచ్ఐవీ పరీక్షలు!
ఆ గ్రామస్థులు... గ్రామ పెద్దల నిర్ణయాన్ని శిరసా వహిస్తున్నారు. హర్యానా భివానీ జిల్లాలోని చందేని గ్రామంలో పంచాయితీ సభ్యులు చేసిన ప్రత్యేక తీర్మానానికి ప్రజలంతా ఆమోదం తెలిపారు. వివాహానికి ముందే వధూవరులు హెచ్ఐవీ పరీక్షలను చేయించుకోవాలన్న ఆలోచనను ప్రోత్సహిస్తున్నారు. సర్పంచ్ మమతా సంగ్వాన్ తో సహా పదిమంది పంచాయితీ సభ్యులను గ్రామ ప్రజలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. వారంతా ఇప్పుడు గ్రామాన్ని అభివృద్ధి బాటలో నడపడంతోపాటు... స్థానిక ప్రజలను చైతన్యపరుస్తున్నారు. ఇందులో భాగంగానే వివాహానికి ముందు వధూవరులు హెచ్ఐవీ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. గ్రామ పెద్దల ఆలోచనతో ఏకీభవించిన ధరమ్ జిత్ గ్రేవాల్, ముఖేష్ రాణిలు తమ హెచ్ఐవీ రిపోర్టులను సర్పంచ్ కు అందజేశారు. గ్రామస్తుల్లో ఎక్కువశాతం విద్యావంతులేనని, వారందరికీ వ్యాధివల్ల వచ్చే సమస్యలు, ఇబ్బందులు తెలుసునని అందుకే పంచాయితీ తీర్మానాన్ని ఆమోదించి తాము పరీక్షలు చేయించుకున్నామని ధరమ్ జిత్ గ్రేవాల్ అన్నారు. ముందుగానే పరీక్షలు చేయించుకొని పంచాయితీ పెద్దలను రిసెప్షన్ కు ఆహ్వానించి అందరి సమక్షంలో వారికి రిపోర్టులు సమర్పించామని తెలిపారు. తనకు ఈ ఆలోచనను గ్రామ కార్యకర్త, రంగస్థల నటుడు అయిన సంజయ్ రాంఫాల్ సూచించారని, అయితే తమ ఆలోచన తప్పనిసరిగా అమలవుతుందన్న నమ్మకం గట్టిగా ఉందని సర్పంచ్ మమత చెప్తున్నారు. అంతేకాక వివాహం చేసుకున్న నూతన దంపతులకు ఓ తులసి మొక్కను బహూకరించి, వారితో ప్రతిజ్ఞ కూడ చేయించేందుకు పంచాయితీ సభ్యులు నిర్ణయించారు. హెచ్ఐవీ ఎన్నో జీవితాలను బలి చేస్తోందని, ఆ వ్యాధితో తమ గ్రామంలో ఎవరూ మరణించకూడదన్నదే తమ లక్ష్యమని పంచాయితీ సభ్యులు అంటున్నారు. తమ గ్రామంలోనే కాక పరిసర గ్రామాల ప్రజలకు కూడ హెచ్ఐవీపై అవగాహన కల్పించేందుకు ప్రయత్సిస్తున్నామని వారు చెప్తున్నారు. మొదటి మహిళా గ్రామ సర్పంచ్ గా ఎన్నికైన మమత పట్టభద్రు రాలు. ఆమె భర్త హితేష్ ఆర్మీలో హెడ్ కానిస్టేబుల్ గా పని చేస్తున్నారు. అయితే గ్రామస్థుల ఆరోగ్యమే ధ్యేయంగా తీసుకున్న ఈ నిర్ణయం... వధూవరులకు అంగీకారమైతేనే పాటించవచ్చని, టెస్టులు చేయించుకోడానికి ఎటువంటి బలవంతం లేదని ఆమె చెప్తున్నారు. -
200మందికి ఎయిడ్స్ ఎక్కించిన దొంగ వైద్యుడు
పినోమ్ పెన్: వైద్యో నారయణో హరి అని అంటుంటారు.. అంటే వైద్యుడు ప్రత్యక్ష దైవం అని చెప్తారు. సృష్టిలో ఈ వృత్తిలో ఉన్నవారిని మాత్రమే ప్రత్యక్ష దైవసమానంగా చూడటం పరిపాటి. ఇంతటి గొప్ప వృత్తిలో ఉన్న ఓ నకిలీ వైద్యుడు చేయకూడని తప్పిదానికి పాల్పడ్డాడు. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 200మందికి పైగా ఎయిడ్స్ వ్యాపించేందుకు కారణమయ్యారు. ఈ వృత్తిని చేపట్టిన ఆ వైద్యుడికి లైసెన్సు కూడా లేదు. ఈ తప్పిదానికి పాల్పడినందుకు గురువారం కాంబోడియా కోర్టు అతడికి 25 ఏళ్ల కారాగార శిక్షను విధించింది. యెమ్ చరిన్ (57) అనే వ్యక్తి లైసెన్సు లేకుండానే వైద్య వృత్తి చేపట్టాడు. బట్టామాబాంగ్ ప్రావిన్స్ లోని రోఖా అనే గ్రామీణ తెగకు తనకు వచ్చి రాని వైద్యంతో డబ్బుసంపాధించడం మరిగాడు. ఈ క్రమంలో అతడు దాదాపు 200మందికి పైగా ఎయిడ్స్ రావడానికి కారణమయ్యాడు. వారిలో పదిమందికి పైగా ఇప్పటికే చనిపోయారు కూడా. ఈ క్రమంలో అతడిని గత ఏడాది 2014లో అరెస్టు చేశారు. ఇతడు ఒకరికి ఉపయోగించిన నీడిల్ ను మరొకరికి ఉపయోగించిన కారణంగా 200మందికి పైగా ఎయిడ్స్ సోకింది. వీరంతా కూడా 15 నుంచి 49ఏళ్ల మధ్య వయసు ఉన్నవారే. ఇతడికి 25 ఏళ్ల జైలు శిక్షను విధించడంతోపాటు భారీ మొత్తంలో ఫైన్ కూడా వేశారు. -
హెచ్ఐవీ ఉందని ఆయన నాకు చెప్పలేదు!
'నేను ఆయన గర్ల్ఫ్రెండ్ను. ఆయనతో కలిసి జీవించాను. అయినా ఆయన నాకేమీ చెప్పలేదు' అంటూ మాజీ పోర్న్ స్టార్, చార్లీ షీన్ మాజీ ప్రియురాలు బ్రీ ఓల్సన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. తనకు హెచ్ఐవీ ఉందని హాలీవుడ్ నటుడు చార్లీషీన్ ఎన్బీసీ 'టుడే షో' కార్యక్రమంలో ప్రకటించిన గంటసేపటికే ఆమె మీడియా ముందుకొచ్చి.. తన ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. ఆయన ఏనాడూ తనకు హెచ్ఐవీ ఉందని, చికిత్స పొందుతున్నానని చెప్పలేదని ఆమె తెలిపింది. 2011లో చార్లీ కెరీర్ ఒడిదుడుకుల్లో ఉన్నప్పుడు ఆయనతో దాదాపు ఏడాదిపాటు బ్రీ ఓల్సన్ కలిసి జీవించింది. చార్లీ షీన్కు హెచ్ఐవీ పాజిటివ్ ఉందని గాసిప్ వెబ్సైట్ల ద్వారా తెలియడంతో తాను భయాందోళనకు గురయ్యానని, వెంటనే ఆస్పత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకోగా.. హెచ్ఐవీ నెగిటివ్ వచ్చిందని, దీంతో కాస్తా ఊపిరి పీల్చుకున్నానని ఆమె చెప్పారు. చార్లీ వ్యాధి గురించి యావత్ ప్రపంచంతోపాటే తానూ తెలుసుకోవాల్సిరావడం ఆగ్రహం కలిగిస్తున్నదని, ఆయనకు తానే హెచ్ఐవీ అంటించానని పేర్కొంటూ చార్లీ మద్దతుదారులు చంపేస్తామని హెచ్చరికలు చేయడంతో తాను వెంటనే ఇండియానా నుంచి న్యూయార్క్ పరిగెత్తుకొని వచ్చి ఈ రేడియో కార్యక్రమంలో మాట్టాడుతున్నాని తెలిపింది. ' ఆయన నాకు ఎప్పుడూ చెప్పలేదు. నేను ఆయన గర్ల్ ఫ్రెండ్ ను. మేం కలిసి జీవించాం. దాదాపు ఏడాదిపాటు ప్రతిరోజూ మేం లైంగిక అనుభవం పొందాం' అని వివరించింది. అయితే, గర్భం రాకుండా ఉండేందుకు మాత్రమే లెదర్ కండోమ్ లను వాడినట్టు తెలిపింది. అత్యంత ప్రజాదరణ పొందిన 'టు అండ్ హాఫ్ మెన్' కార్యక్రమం నుంచి తొలగించిన కొన్ని రోజులకే 2011లో తనకు హెచ్ఐవీ ఉన్నట్టు తెలిసిందని చార్లీ ఇంటర్వ్యూలో చెప్పారని, ఆ సమయంలో దాదాపు ఏడాదికాలం పాటు అతనితో కలిసి ఉన్నా అతను ఆ విషయాన్ని తనకు చెప్పలేదని చార్లీ తీరుపై బ్రీ ఒల్సన్ మండిపడుతున్నది. వార్నర్ బ్రదర్స్ తో గొడవపడి.. అత్యంత వివాదాస్పదంగా టీవీ షో నుంచి వైదొలిగిన చార్లీ ఆ సమయంలో ఇద్దరు భామలతో ప్రణయాన్ని నెరిపారు. అందులో ఒల్సన్ ఒకరు. 2011లో తను ఒడిదుడుకుల్లో ఉన్నప్పుడే హెచ్ఐవీ ఉందని మీకు తెలిసిందా? అని ఇంటర్వ్యూలో విలేకరి ప్రశ్నించగా.. అప్పటికీ ఇంకా కచ్చితంగా తెలియలేదని చార్లీ చెప్పారు. అయితే అప్పటికే చార్లీ తనకు హెచ్ఐవీ ఉందనే విషయం చార్లీకి తెలుసని ఒల్సన్ వాదిస్తున్నది. -
తొలి వెలుగు!
గ్రేట్ లవ్ స్టోరీస్ ప్రేమలో విషాదం ఉంటుంది. కానీ, అసలైన విషాదం... మనలో ప్రేమే లేకపోవడం! మైత్రి ప్రేమరాహిత్యంతో ఎందుకు కనిపిస్తుంది? ప్రేమ అనే మాట వినగానే ఎందుకు ఉలిక్కిపడుతుంది? ఆమె ఎప్పుడూ ఏదీ చెప్పదు. కానీ ఆమె కళ్లలో కనిపించీ కనిపించని నల్లటి విషాదపు నీడ మాత్రం... ఏదో చెప్పకనే చెబుతుంది. దాన్ని నాజరస్ గుర్తించాడు. అందుకే ఆమె మౌనాన్ని తన మాటలతో చెరిపేయాలని, తన పెదవులపై నవ్వుల పూలు పూయించాలని కలలు కన్నాడు. అమావాస్య చీకట్లో నుంచి ఆమెను బయటికి తీసుకువచ్చి... వెన్నెల వర్షంలో తడిపెయ్యాలని తహతహలాడాడు. ‘‘ఎందుకిలా నా చుట్టూ తిరుగు తున్నావు... వేరే పనేమీ లేదా?’’ ఒకరోజు కోపంగా నాజరస్ను నిలదీసింది మైత్రి. ‘‘లేదు. నిన్ను ప్రేమించడమే నాకు ఉన్న ఏకైక పని’’... అప్పటి వరకు లేని గాంభీర్యాన్ని కొని తెచ్చుకుని అన్నాడు నాజరస్. ‘‘పిచ్చివాడిలా ఉన్నావే... అసలు నా గురించి నీకేం తెలుసు?’’ అడిగింది మైత్రి. ‘‘ఏమీ తెలియనక్కర్లేదు. అన్నీ తెలుసు కుని ప్రేమించడం ప్రేమ కాదు. నిన్ను నిన్నుగా ప్రేమించడమే ప్రేమ. నేను నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను.’’ ఆ తర్వాత వారి మధ్య కొన్ని నిమిషాల మౌనం. క్షణం తీరిక లేకుండా ఎప్పుడూ ఏదో ఒకటి మాట్లాడే నాజరస్... అప్పుడు మాత్రం మౌనాంకితుడైపోయాడు. న్యాయమూర్తి తీర్పు కోసం ఎదురు చూస్తున్న ఖైదీలా ఉన్నాడు. అతడి ఎదురు చూపులు ఫలించాయి. ‘సరే’ అంది మైత్రి. ఆనందంతో నోట మాట రాలేదు నాజరస్కి. కళ్ల నుంచి కన్నీళ్లు మౌనంగా జారుతున్నాయి! కానీ మైత్రికి ఆనందంతో కూడా కన్నీళ్లు రావడం లేదు. ఎందుకంటే ఆమె మనసులోని చెమ్మను విధి పూర్తిగా పీల్చేసింది. ఆమె గతం అలాంటిది! బాగా చదువుకుని మంచి ఉద్యోగం చేయాలని కలలు కనేది మైత్రి. ‘‘ఆడపిల్ల పదవ తరగతి వరకు చదివితే చాలు’’ అంటూ చదువు మానిపించి ఆమెకి పెళ్లి చేసేశాడు తండ్రి. అయిపోయిందేదో అయిపోయింది, సర్దుకుపోదాం అనుకుంది మైత్రి. కానీ ఆ అవకాశం లేకపోయింది. ఎందుకంటే, భర్తకి లేని చెడు అలవాటు లేదు. బాగా తాగి వచ్చి మైత్రిని చావబాదే వాడు. ఇద్దరు పిల్లలు పుట్టాక కూడా అతడిలో మార్పు రాలేదు. అంతా తన ఖర్మ అనుకుంది. అయితే అంతలోనే ఒకరోజు అతడు వచ్చి భోరుమన్నాడు. ‘‘ఏమైంది?’’ అని ఆందోళనగా అడిగింది మైత్రి. ‘‘నాకు హెచ్ఐవీ సోకింది. ఇక ఎంతో కాలం బతకను’’ అంటూ కన్నీరు మున్నీరయ్యాడు. బెంగాల్లోని ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కొద్ది రోజుల్లోనే మరణించాడు. భర్త నుంచి తనకు హెచ్ఐవీ సోకిందేమోనని పరీక్షలు చేయించుకుంది మైత్రి. బతుకు మరోసారి చీకటయినట్లు అనిపించింది. తనకు కూడా హెచ్ఐవీ సోకింది! కాస్తయినా కనికరం లేకుండా అత్తింటివాళ్లు మైత్రిని ఇంటి నుంచి తరిమేశారు. పిల్లలను ఆమె దగ్గరికి వెళ్లనివ్వలేదు. చివరకు ఆమెను కన్న తల్లి కూడా కూతుర్ని చేరదీయలేదు. ఎటు చూసినా చీకటి. భవిష్యత్తు అన్నది కన్ను పొడుచుకు చూసినా కాన రాలేదు. సరిగ్గా అదే సమయంలో ‘బీఎన్పీఎల్’(బెంగాల్ నెట్వర్క్ ఆఫ్ పీపుల్ లివింగ్ విత్ హెచ్ఐవీ, ఎయిడ్స్) సభ్యులు కొందరు పరిచయమయ్యారు. వాళ్లంతా తనలాగే భర్తను పోగొట్టుకున్న వారు. హెచ్ఐవీ బాధితులు. వారితో చెలిమి మైత్రిలో ధైర్యాన్ని నింపింది. ఆ సంస్థలో రిసెప్షనిస్ట్గా ఉద్యోగమూ దొరి కింది. ఆ పని చేస్తూనే సంస్థ ప్రచార కార్య క్రమాల్లో చురుగ్గా పాల్గొనడంతో విషాదం నుంచి ఉపశమనం లభించినట్లు అనిపిం చింది మైత్రికి. సరిగ్గా ఆ సమయంలోనే ఢిల్లీలోని ఒక స్వచ్ఛంద సంస్థలో పని చేస్తున్న నాజరస్ పరిచయమయ్యాడు. ఆమె జీవితానికి ఒక కొత్త అర్థం ఇచ్చాడు. మైత్రిని పెళ్లాడిన నాజరస్ను ‘పిచ్చోడు’ అన్నారు చాలామంది. అతని తల్లిదండ్రులు మండిపడ్డారు. ఏ ఒక్కరూ వారి వెంట నిలవలేదు సరికదా సూటి పోటి మాటలు, వెటకారాలతో వాళ్ల మనసులకు తూట్లు పొడవాలని ప్రయత్నించారు. కానీ నాజరస్ పట్టించుకోలేదు. ఆ నిరసనల సెగ మైత్రిని తాకనివ్వలేదు. ఆమెను సంతోషంగా ఉంచడమే తన జీవిత లక్ష్యం అన్నట్టుగా సాగిపోతున్నాడు. ఆ ప్రేమ ముందు వెక్కిరింపులు, అవహేళనలు చిన్నబోయాయి. అవి వారి ప్రేమబంధానికి దిష్టిచుక్కలుగా మిగిలిపోయాయి. -
హెచ్ఐవీ సోకిన ఆ సూపర్ స్టార్ ఎవరు?
న్యూయార్క్: హెచ్ఐవీ కలిగిన ఆ హాలీవుడ్ సూపర్ స్టార్ ఎవరనే విషయం ఇప్పుడు హాలీవుడ్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఆయనతో లైంగిక సంబంధాలు కలిగిన సెలబ్రిటీల్లో కలవరం రేపుతోంది. కనీసం ఆయనతో 50 మంది సెలబ్రిటీలు లైంగిక సంబంధాలు కలిగి ఉన్నారని, వారిలో ఐదుగురు పోర్న్ స్టార్లే కాకుండా ఓ అవార్డు విన్నింగ్ హాలివుడ్ నటి, ప్రముఖ టీవీ షో ప్రెజెంటర్, ఓ ప్రముఖ మీడియా జర్నలిస్ట్ ఉన్నారని పేరు బహిర్గతం చేయడానికి ఇష్టపడని ఓ పోర్న్ స్టార్ మీడియాకు తెలిపారు. ఆ హాలివుడ్ సూపర్ స్టార్తో తనకు లైంగిక సంబంధాలు ఉన్నాయని, సేఫ్ సెక్స్ విధానం విఫలమవడం వల్ల తాను ఓ సారి గర్భవతిని కూడా అయ్యాయని, తప్పనిసరై అబార్షన్ చేయించుకున్నానని ఆ పోర్న్ స్టార్ తెలిపారు. ఆ హాలివుడ్ స్టార్కు హెచ్ఐవీ సోకినట్టు డాక్టర్లు ధ్రువీకరించిన నేపథ్యంలో తానూ అన్ని ఆరోగ్య పరీక్షలు చేయించుకున్నానని, అదృష్టవశాత్తు ఆ జబ్బు తనకు సోకలేదని ఆమె వివరించారు. తన పేరు వెల్లడించేందుకు తానేమి సిగ్గు పడడం లేదని, తన పేరు తెలిస్తే ఆ హాలివుడ్ స్టార్ పేరు కూడా వెల్లడవుతుందని, అప్పుడు ఆయన బాధితులంతా ఆయనపై కోర్టు కేసులువేసే అవకాశం ఉందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ఆ స్టారే స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఆయనకు హెచ్ఐవీ ఉన్న విషయాన్ని బహిరంగంగా ఒప్పుకోవాలని తాను ఆశిస్తున్నానని, అది ఆయన సామాజిక బాధ్యత కూడా అని పోర్న్ స్టార్ వ్యాఖ్యానించారు. అలా ఒప్పుకోవడం వల్ల తోటివారకి మంచి చేసినట్టు అవుతుందని, ఆయన పేరు తెలిస్తే ఆయనతో శారీరక సంబంధాలు కలిగి ఉన్న వారంతా ఆరోగ్య పరీక్షలు చేయించుకునే అవకాశం, మున్ముందు జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉంటుందని ఆమె అభిప్రాయపడ్డారు. హెచ్ఐవీ సోకిన ఆ హాలివుడ్ స్టార్ ఎవరనే విషయమై సామాజిక వెబ్సైట్లు ముఖ్యంగా, ఫేస్బుక్, ట్విట్టర్లో పలు ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఎవరి ఊహకు అందిన పేర్లను వారు ప్రచారంలో పెడుతున్నారు. ఎక్కువ మంది ఉమనైజర్ల పేర్లనే పేర్కొంటున్నారు. వారిలో ‘టిన్సెల్ టౌన్’ ప్రొడక్షన్ యూనిట్కు చెందిన వారు కూడా ఉన్నారు. రెండేళ్ల క్రితమే హాలివుడ్ స్టార్కు హెచ్ఐవీ ఉన్నట్టు తనకు తెల్సిందని మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చిన పోర్న్ స్టార్ తెలిపారు. ఆయనతో లైంగిక సంబంధాలు కలిగిన ఐదుగురు పోర్న్ స్టార్లు అప్పుడే పరిశ్రమను వదిలేసి వెళ్లిపోయారని, ఇది పరిశ్రమపై తీవ్ర ప్రభావం చూపుతోందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ఆయనకు స్వలింగ సంపర్కులతోని (బెసైక్సువల్) కూడా సంభంధాలు ఉన్నాయని, ఆ విషయం ఇప్పుడు తనను కూడా భయపెడుతోందని, ఎందుకంటే ఈ వారంతంలో తన షూటింగ్ ప్రారంభమవుతోందని చెప్పారు. ఆ షూటింగ్లో తనతో భాగస్వామిగా పాల్గొనే వారికి, ఆయనతో కూడా లైంగిన సంబంధాలు ఉండే ఉంటాయన్నది తన ఆందోళన అని ఆ పోర్న్ స్టార్ వివరించారు. -
నెలకు రెండు ఇంజెక్షన్లతో హెచ్ఐవీకి చెక్!
హెచ్ఐవీ వ్యాధి నియంత్రణ దిశగా కీలక అడుగు పడింది. సుదీర్ఘకాలం క్రియాశీలంగా ఉండే రెండు ఇంజెక్ట్బుల్ ఔషధాలను నెలకోసారి లేదా రెండు నెలలకోసారి రోగికి ఇవ్వడం వల్ల హెచ్ఐవీకి నిరవధికంగా చెక్ పెట్టవచ్చునని ప్రాథమిక పరిశోధనల్లో వెల్లడైంది. హెచ్ఐవీ నిరోధానికి జాన్సన్ అండ్ జాన్సన్, దాని భాగస్వామ్య సంస్థ వీఐఐవీ కలిసి చేపడుతున్న ప్రాథమిక పరీక్షా ఫలితాల్లో ఈ విషయం వెల్లడైంది. ఆ కంపెనీలు చేపడుతున్న మొత్తం 96 వారాల అధ్యయనంలో భాగంగా మొదటి 32 వారాల అధ్యయన ఫలితాలను మంగళవారం ప్రకటించాయి. ఈ రెండు కంపెనీలు చేరో ఔషధంతో హెచ్ఐవీ నిరోధానికి ఈ పరిశోధన నిర్వహిస్తున్నాయి. హెచ్ఐవీ వ్యాధి నిరోధక ఔషధాలు అందించడంలో వీఐఐవీ పేరెన్నికగన్న సంస్థ. ఈ ప్రయోగానికి సంబంధించి కీలకమైన అదనపు పరీక్షలు ఇంకా జరుగాల్సింది. అయితే, ఈ ఔషధ కలయిక చికిత్సకు ఆమోదం లభిస్తే.. ప్రపంచవ్యాప్తంగా గడగడలాడిస్తున్న ఎయిడ్స్ వ్యాధి నిరోధంలో గణనీయమైన ముందడుగు పడినట్టే. పరిశోధనలో భాగంగా 309 హెచ్ఐవీ మంది రోగులపై పరీక్షలు నిర్వహించారు. రక్తంలో హెఐవీ వైరస్ను నిరోధించేందుకు రోజువారీ ఔషధ మాత్రలను వీరు గతంలో తీసుకునేవారు. వీరికి ప్రయోగదశలో ఉన్న ఇంజెక్షన్లు ఇవ్వగా.. దాదాపు 95శాతం మంది రక్తంలోని హెచ్ఐవీ వైరస్ను 32 వారాలపాటు నియంత్రించింది. ఔషధమాత్రలు తీసుకునేవారు 91శాతం మందిలో మాత్రమే హెచ్ఐవీ నియంత్రణ సాధ్యపడింది. మాత్రలు, ఇంజెక్షన్లు తీసుకునే రెండు గ్రూపుల రోగులకు చికిత్స కొనసాగిస్తూ.. కాలనుగుణంగా వారి రక్తాన్ని పరీక్షిస్తున్నారు. ఈ అధ్యయన నివేదికలను పరిశీలిస్తే.. రానున్నకాలంలో కొత్త విధానమే ఆచరణసాధ్యంగా కనిపిస్తున్నదని హార్వర్డ్ మెడికల్ స్కూలుకు చెందిన ఎయిడ్స్ చికిత్స నిపుణుడు డాక్టర్ డానియెల్ కురిట్జ్కెస్ తెలిపారు. -
రోగ నిరోధకత చికిత్సతో హెచ్ఐవీ నుంచి రక్షణ
ముంబై: అత్యాచార బాధితులకు ఘటన జరిగిన ఎనిమిది గంటల్లోపు రోగనిరోధకత చికిత్స అందిస్తే హెచ్ఐవీ ఇన్ఫెక్షన్ నుంచి రక్షించవచ్చని ఎయిడ్స్ సొసైటీ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు డాక్టర్ ఈశ్వర్ గిలాడ ప్రకటించారు. సరైన అవగాహన లేకపోవడం, సంబంధిత నిబంధనలు లేకపోవడంతో భారత్లాంటి దేశాల్లో బాధితులకు ఇలాంటి చికిత్స అందడంలేదని ఆయన అన్నారు. బాధితులకు చట్టబద్ధంగా అందిస్తున్న చికిత్సలకు తోడుగా పోస్ట్-ఎక్స్పోజర్ ప్రొఫిలాక్సిస్(పెప్) చేస్తే వారికి ప్రాణాపాయం నుంచి కాపాడవచ్చని ఆయన ఆదివారం ఆయన ముంబైలో పీటీఐతో చెప్పారు. పెప్పై అవగాహన కల్పించేందుకు శనివారం నుంచి ముంబైలో కార్యక్రమాన్ని చేపట్టారు. జాతీయ నేర గణాంకాల విభాగం వెల్లడించిన లెక్కల ప్రకారం గత ఏడాది దేశవ్యాప్తంగా 36,735 రేప్ కేసులు నమోదయ్యాయి. -
నాకు హెచ్ఐవి నేను పాజిటివ్
జ్యోతి జీవితంలో ఎన్నో శాపాలు ఒక శాపం తనకు వరంగా మారింది తన ఏడుపు తనే వినలేదు.. మరో శాపం సమాజానికి వరంగా మారింది.. తన హెచ్ఐవి ఇతరులకు పాజిటివ్ సపోర్ట్గా మారింది.. మూడు అబార్షన్లు... ఆరు గాయాలు... డజన్ల వైవాహిక రేప్లు... ఒక డైవర్స్ ఇచ్చిపుచ్చుకోవడాల్లో కూడా.. జీవితం అన్యాయం చేసింది హాస్పిటల్ హెచ్ఐవీ ఇచ్చింది... కోర్ట్ కొడుకును తీసుకుంది తను ఒక్కతే మిగిలింది.. కొత్త జీవితం మొదలుపెట్టింది పదిమందికి జ్యోతి వెలుగునిస్తుంది.. పాజిటివ్ వెలుగునిస్తుంది... సమాజం నుంచి దోసిట్లో దాక్కోవాలా? ధైర్యంగా అదే సమాజానికి చేయూత నివ్వాలా? ముంబైలో ఓ మురికివాడ... ఇరుకు సందు... మట్టిగోడలు... నిలబడితే తలకు తగిలే ఎత్తులో రేకుల పైకప్పుతో ఓ పాక. ఆ పాకలో ఓ మహిళను ఇంటర్వ్యూ చేస్తోంది జ్యోతి ధావలే. రేకుల సందుల్లోంచి పడుతున్న వెలుతురును బ్యాలెన్స్ చేసుకుంటూ కెమెరా లైటింగ్ని సెట్ చేసుకోవడానికి కుస్తీ పడుతోంది కెమెరా బృందం. అదేమీ పట్టించుకోకుండా ఆ ఇంటి ఆడమనిషి చెప్తున్న కథలో లీనమై పోయింది జ్యోతి. ‘మేడం... ఆమె కెమెరాకి ఫేస్ చేయట్లేదు... ఆమెను కొంచెం తలపెకైత్తమని చెప్పండి’ కెమెరామన్ అన్నాడు. అతని మాటలు పూర్తి కాకముందే చేయి పెకైత్తి ఆపమన్నట్టుగా సైగ చేసింది. అవతలి స్త్రీ చాలా ఉద్వేగంగా చెప్పుకుపోతోంది. దాదాపు అరగంట ఇంటర్వ్యూ తర్వాత ఆమెకు థ్యాంక్స్ చెప్పి బయటకు వచ్చేసింది జ్యోతి. అప్పుడంది కెమెరామన్తో.. ‘గోవింద్.. ఆమెను ఇంకెంతోమందికి ఓ స్ఫూర్తిగా చూపడమే ఈ ఇంటర్వ్యూ లక్ష్యం కానీ ఆమె ముఖాన్ని కెమెరా క్లోజప్లో చూపించి ఆమెపై ఆమెకే జాలి క్రియేట్ చేయడానికి కాదు’ అంది. ‘సారీ మేడం’ అన్నాడతను. ‘ఇట్స్ ఓకే...’ అంటూ గోవింద్ భుజాన్ని తట్టబోతుంటే ఆ స్పర్శ నుంచి తప్పించుకునే యత్నం చేశాడతను. అర్థమైన ఆమె చిన్నగా నవ్వుకొని ముందుకు నడిచింది. ఎవరీ జ్యోతి? ‘బ్లాక్ స్వాన్ ఎంటర్టైన్మెంట్’ అనే ప్రొడక్షన్ దూరదర్శన్లో ప్రసారమయ్యే ‘స్త్రీ శక్తి’ అనే కార్యక్రమం కోసం దేశంలోని పలుప్రాంతాల్లోని సామాన్య మహిళల విజయగాథలను చిత్రీకరిస్తోంది. ఆ సంస్థకు క్రియేటివ్ మేనేజర్, సోషల్మీడియా అండ్ పబ్లిక్ రిలేషన్స్ హెడ్. ఇలాంటి సంస్థలు చాలా ఉంటాయి.. ఎన్నో కథలు తెరకెక్కుతాయి. కాని జ్యోతి ఒక్కటే ఉంటుంది. ఆమె సాధారణ స్త్రీ కాదు. ప్రతికూలతలకు ఎదురీదుతూ నిలబడిన అసాధారణ స్త్రీ. ఆమె హెచ్ఐవీ పాజిటివ్. తనలాంటి ఇంకెందరో పాజిటివ్స్ హక్కుల కోసం నిలబడుతోంది. ఎలా వచ్చింది? రక్తమార్పిడి ద్వారా జ్యోతికి హెచ్ఐవీ సోకింది. అదో భయంకరమైన గతం. ఢిల్లీలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ నుంచి ట్వెల్త్క్లాస్ పూర్తిచేసిన జ్యోతి.. ఆ టైమ్లోనే ఓ వ్యక్తితో ప్రేమలో పడి పెళ్లీ చేసుకుంది. పెళ్లయిన ఐదు నెలలకు భర్త అసలు రూపం బయటపడింది. ‘ఆ క్షణాలు నా కళ్లముందు ఇప్పటికీ కదులుతూనే ఉంటాయి. నేను ప్రెగ్నెంట్నని తెలియగానే సంతోషం పట్టలేకపోయాను. ఎప్పుడెప్పుడు ఆయనతో షేర్ చేసుకుంటానా అన్న ఆరాటం. కానీ ఆరాటపడ్డంత సేపైనా ఆ సంతోషం నిలువలేదు. ప్రెగ్నెంట్నని చెప్పగానే ఆయన మొహంలో రంగులు మారాయి. ‘నాకిష్టంలేదు అబార్షన్ చేయించుకో’ అన్నాడు కర్కశంగా. ఎందుకని అడిగేలోపే అక్కణ్ణించి వెళ్లిపోయాడు. మరుసటిరోజు అతనే హాస్పిటల్కి తీసుకెళ్లి అబార్షన్ చేయించాడు. తర్వాత ఐదు నెలలకు మళ్లీ నెల తప్పాను. ఈసారీ అదే తీరు. ఉండబట్టలేక ఎదిరించాను. ‘ఇష్టంలేకపోతే జాగ్రత్తలు పాటించొచ్చుకదా’ అని అరిచాను. ఈ దేశంలోని స్త్రీకి భరించే బాధ్యత తప్ప ఎదిరించే హక్కులేదని నిరూపించాడు నా భర్త నా మీద చేయిచేసుకొని. నన్ను కొట్టడమనేది ఆయన దినచర్యలో భాగమైంది.. దాంపత్య జీవితానికి సంబంధించి నేనే జాగ్రత్తపడడం మొదలుపెట్టాను. అయినా ఎక్కడో ఏదో పొరపాటు జరిగి రెండోసారీ పీరియడ్స్ మిస్ అయ్యాయి. ఆనందం వెయ్యకపోగా వెన్నులోంచి వణుకుపుట్టుకొచ్చింది. పోరాడీ లాభంలేదనుకొని ఆయన తీసుకెళ్లిన హాస్పిటల్లోని గైనకాలజిస్ట్కి నా ఒళ్లు అప్పగించాను. అబార్షన్ జరిగిపోయింది. ఈసారి ఆయనను దగ్గరకు రానివ్వకుండా పోరాడాను. కొట్టి రేప్చేసేవాడు. డొమెస్టిక్ వయొలెన్స్కి వ్యతిరేకంగా ఓ చట్టం ఉందన్న విషయం కూడా తెలీదు నాకప్పుడు. నాలుగోసారీ ప్రెగ్నెన్సీ వచ్చింది. ఎప్పట్లాగే అబార్షన్ కోసం హాస్పిటల్ వెళ్లాను. అబార్షన్ కంటే ముందు చేసిన బ్లడ్ టెస్ట్లో హెచ్ఐవీ పాజిటివ్ అని రిపోర్ట్ వచ్చింది. నా కాళ్ల కిందున్న భూమి కంపించినట్టే అయింది. మూడోసారి అబార్షనప్పుడు రక్తం ఎక్కించడంలో హెచ్ఐవీ సోకిందని తేలింది. హెచ్ఐవీ పేషంట్కి అబార్షన్ చేయడానికి డాక్టర్ ఒప్పుకోలేదు. దాంతో ఆ క్షణమే నన్ను వదిలేసి వెళ్లిపోయాడు నా భర్త. తల్లిని అవుతున్నందుకు సంతోషపడాలో, హెచ్ఐవీ సోకినందుకు జీవితం చాలించుకోవాలో తెలీని పరిస్థితి... బిడ్డ ఈ రోగంతో పుడితే.. ఆ ఆలోచనకే తట్టుకోలేకపోయేదాన్ని. తొమ్మిదోనెల అప్పుడు అనుకుంటా.. ఓరోజు వచ్చి చెప్పాడు మా ఆయన.. ‘నాకు ఇంకో అమ్మాయితో సంబంధం ఉంది. ఆమెనే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. విడాకులు కావాలి’ అంటూ! నాకు అదేమంత షాకింగ్గా అనిపించలేదు. ఎప్పటిలా మౌనంగానే ఉన్నా. తొమ్మిది నెలలు పూర్తికాకుండానే కొడుకు పుట్టాడు. ఒక్క విషయంలో అదృష్టం నాకు తోడైంది... వాడికి హెచ్ఐవీ రాలేదు. నా బిడ్డను చేతుల్లోకి తీసుకొని తనివితీరా ముద్దాడనైనా లేదు, నా భర్త వచ్చి బిడ్డను తీసుకెళ్లిపోయాడు. రెండు వైపులా వాదనలు లేకుండానే, మెజిస్ట్రేట్ ముందు హాజరయ్యే అవకాశాన్ని నాకు ఇవ్వకుండానే విడాకులు మంజూరయ్యాయి. ‘హెచ్ఐవీతో బిడ్డను ఎలా పోషించుకుంటావ్ అని బిడ్డ పెంపకాన్నీ ఆయనకే అప్పజెప్పింది కోర్టు’ అంటూ రెండు చేతుల్లో మొహం దాచుకొని వెక్కివెక్కి ఏడ్చింది జ్యోతి. ఆ తర్వాత.. అనుకున్నవి అందనప్పుడు జీవితం ఆగిపోదని... పోరాడి వాటిని పొందడానికి చచ్చే వరకు బతికుండాలని నేర్చుకుంది జ్యోతి. ఓ పక్క ఒంట్లోని హెచ్ఐవీతో పోరాడుతూనే, ఆకలిని జయించే ప్రయత్నమూ చేయసాగింది. చాలా ప్రైవేట్ కంపెనీల్లో ఉద్యోగాల వేట కొనసాగించింది. కొన్ని మాత్రమే అవకాశం ఇచ్చాయి. అవీ కొన్నాళ్లే. మరోపక్క హెచ్ఐవీ పాజిటివ్స్ కోసం పనిచేసే సంస్థలతోనూ పరిచయం పెంచుకుంది. ఆ క్రమంలోనే తారసపడ్డాడు వివేక్. ఆయన హెచ్ఐవీలేని మనిషి. జ్యోతిలోని ఆత్మవిశ్వాసం వివేక్ని అబ్బురపరచింది. పరిచయం ప్రేమగా మారింది. పెళ్లి చేసుకుంటానని అడిగాడు. నమ్మకంలేని ఆమె నవ్వి ఊరుకుంది. ఏడాది తర్వాత మళ్లీ అడిగాడు... ఈసారి ఒప్పుకుంది. వివేక్ ఆమెకు మంచి తోడయ్యాడు. నాలుగేళ్లుగా వాళ్ల కాపురంలో ఎలాంటి కలతలూ లేవు. వివేక్ సహకారంతోనే ‘బ్లాక్స్వాన్ ఎంటర్టైన్మెంట్’ సంస్థను స్థాపించింది. అతడి అండతోనే తన కొడుకు విజిటింగ్ రైట్స్ కోసమూ కోర్టులో పిటిషన్ వేసింది. ‘ఇప్పుడు నాకెలాంటి రిగ్రెట్స్ లేవు. కానీ నా కొడుకు విషయంలోనే.. నాకు పట్టిన గతే వాడికి పడుతుందేమోనని భయం. నేనూ సొంతతల్లి ఉండీ సవతితల్లి పెంపకంలో చేదు బాల్యాన్ని గడిపాను. ఇప్పుడు నా కొడుకూ అలాంటి పరిస్థితుల్లోనే ఉన్నాడేమో అనిపిస్తుంటుంది. వాడిని నా దగ్గరకి తెచ్చేసుకోవాలి. వాడి ఆలనాపాలనా చూడాలి. తల్లిగా నాకిప్పుడు ఈ ప్రయారిటీ తప్ప ఇంకేదీ లేదు’ అంటుంది జ్యోతి స్థిరంగా. అనుక్షణం తనను ఓడించాలని చూస్తున్న విధికి ఆత్మవిశ్వాసంతో సమాధానం చెబుతున్న జ్యోతిని మించిన విజేతలెవరుంటారు! స్ఫూర్తికి ఆమెను మించిన ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ ఏముంటుంది! బాల్యం ఆమెకో చేదు జ్ఞాపకం జ్యోతి చెప్పినట్టుగా బాల్యం ఆమెకో చేదు జ్ఞాపకం. తండ్రి ఎయిర్ఫోర్స్ ఆఫీసర్. ఆమెకు ఎనిమిదేళ్లున్నప్పుడే తల్లిదండ్రులు విడిపోయారు. మూడేళ్ల వయసులో తండ్రితో కలిసి మోటార్బైక్ మీద వెళ్తుంటే టైర్ బరస్ట్ అయి కిందపడిపోయింది. అప్పుడే ‘బైలేటరల్ సెన్సారి న్యూరల్ హియరింగ్ లాస్ (bilateral sensorineural hearing loss)’ అనే డిజార్డర్కి గురైంది. మామూలుగా మాట్లాడినా ఆమెకు రైలింజన్ మోతలా వినపడుతుంది. ఈ లోపం వల్లనే తండ్రిలాగా ఫైటర్ పైలట్ కావాలన్న తన కలను నెరవేర్చుకోలేకపోయింది. సవతితల్లి వేధింపులు, తండ్రి నుంచి కరువైన ప్రేమ.. జ్యోతికి భయంకరమైన బాల్యాన్ని మిగిల్చాయి. అయినా ఆమె స్థైర్యం చెక్కు చెదరలేదు. -
గిరిజనం.. చేదు నిజం
కర్నూలు(అర్బన్) : కర్నూలు డివిజన్లో 48, ఆదోనిలో 18, నంద్యాల డివిజన్లో 117 మంది గిరిజనులు హెచ్ఐవీ బారిన పడ్డారు. ఈ వ్యాధి బారిన పడిన వారిలో స్త్రీ, పురుషులు సమాన నిష్పత్తిలో ఉన్నారు. ఆయుష్షు పెంచుకునేందుకు మందులు వాడుతున్నా ఫలితం లేకుండా పోతోంది. ఈ నేపథ్యంలో ఐటీడీఏ ఏపీవో మురళీధర్ ఆధ్వర్యంలో హెచ్ఐవీ బాధితులను కలుసుకొని వారి ఆర్థిక అవసరాలు తీర్చేందుకు అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. అసలు దోషి పేదరికమే... వాస్తవానికి గిరిజనుల ఆర్థిక పరిస్థితే ఈ మొత్తం సమస్యకు కారణమనే వాదన వినిపిస్తోంది. ఉన్న చోటనే ఆహారం దొరకని దుస్థితిని గిరి జనులు ఎదుర్కొంటున్నారు. దీంతో వేరే చోటికి వలసలు వెళ్లి పొట్ట నింపుకోవాల్సి వస్తోంది. దీంతో పనికి వెళ్లిన చోట బలవంతపు లైంగిక వేధింపులకు గురికావాల్సి వస్తోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీనికితోడు గిరిజన కుటుంబాల్లో పురుషులు ప్రధానంగా మద్యానికి బానిసలుగా ఉంటున్నారు. దీంతో చిన్న వయసులోనే వీరు మృత్యువాత పడుతున్నారు. తద్వారా వీరిని నమ్ముకున్న మహిళలు వితంతువులుగా మారుతున్నారని నల్లమల సొసైటీ అధ్యక్షుడు పురుష్తోతం పేర్కొన్నారు. ‘చిన్న వయసులోనే మహిళలు వితంతువులుగా మారుతుండటంతో వారు మైదాన ప్రాంతాలకు వ్యక్తిగత పనులకు వచ్చిన సందర్భాల్లో ఇతరులను నమ్మి మోసపోవడం వల్ల కూడా వారు అనార్యోలకు గురవుతున్నారని తమ అధ్యయనంలో వెల్లడైనట్లు పురుషోత్తం చెబుతున్నారు. ఆర్థిక చేయూత... జీవో 31 ప్రకారం గిరిజనుల ఆర్థికాభివృద్ధి పథకం అమ లు చేస్తున్నారు. గిరిజనుల్లో బాగా వెనుకబడిన వికలాంగులు, హెచ్ఐవీ బాధితులకు ఈ పథకం కింద ఆర్థిక చేయూతను అందించనున్నారు. వీరికి కనీసం ఒక్కో కుటుంబానికి రూ.లక్షకు తగ్గకుండా ఆర్థిక సహాయం అందించనున్నారు. ఇందులో 90 శాతం సబ్సిడీ కాగా, మిగిలిన 10 శాతాన్ని ఐటీడీఏ అధికారులే స్త్రీ నిధి బ్యాంకు నుంచి రుణంగా ఇప్పించేందుకు చర్యలు చేపడుతున్నారు. అవగాహన సదస్సులు: హెచ్ఐవీ బారిన పడి దుర్భరమైన జీవితాలను గడుపుతున్న గిరిజనులకు ప్రభుత్వం ద్వారా కనీస ఆర్థిక చేయూతను అందించేందుకు చర్యలు చేపట్టాం. అడిషనల్ డీఎంఅండ్హెచ్ఓ ద్వారా జిల్లాలోని మూడు డివిజన్లలోని గ్రామాలను పర్యటించి అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నాం. -పీ మురళీధర్, ఐటీడీఏ ఏపీఓ -
ఎయిడ్స్పై పోరులో ముందడుగు ఆమెదే
చెన్నై: మానవ చరిత్రలో అత్యంత భయంకరమైన వ్యాధిగా భావించే హెచ్ఐవీ ఎయిండ్స్ భారత్ లోకి ప్రవేశించిన తొలి రోజులవి. తమకు సోకింది ఎయిడ్స్ అని, అది ప్రాణాంతకమైనదని, తమ ద్వారా ఇతరులకూ సోకే అవకాశం ఉందని చాలా మందికి తెలియదు. ఆ దశలో ప్రారంభమైంది సునితి సాల్మన్ ప్రస్థానం.. ఎయిడ్స్ తో పోరాటం. భారతదేశంలో తొలిసారిగా ఎయిడ్స్ ను గుర్తించడంతో పాటు దాని నిర్మూలకు విశేష కృషి చేసిన డాక్టర్ సునితి మంగళవారం ఉదయం చెన్నైలోని తన నివాసంలో మృతిచెందారు. 1980లలో వైజీఆర్ కేర్ అనే స్వచ్ఛంద సంస్థ ద్వారా హెచ్ఐవీ వ్యాప్తిపై ప్రజలకు అవగాహన కల్పించడంతోపాటు రోగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించేవారు. తమిళనాడు వ్యాప్తంగా అనేక సేవా కేంద్రాలు స్థాపించిన ఆమె మద్రాస్ యూనివర్సిటీలో మైక్రోబయాలజీ ప్రొఫెసర్ గానూ సేవలందించారు. భారత్లో తొలి ఎయిడ్స్ కేసు.. 1940 కంటే ముందే కొన్ని జంతువుల్లో హెచ్ఐవీ ఉనికిని కనిపెట్టినా.. 1980 తర్వాత గానీ అది మనుషులకు వస్తుందని తెలియలేదు. ఆ తర్వాత ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు అప్రమత్తత ప్రకటించాయి. రోగసంబంధిత విషయాలను విపులీకరిస్తూ అనేక జర్నల్స్ ప్రచురితమయ్యాయి. వాటిని క్షుణ్ణంగా చదివిన డాక్టర్ సునితి సాల్మన్.. ప్రభుత్వ సాయం ఆశించకుండా స్వచ్ఛందంగా ప్రయోగాలకు సిద్ధపడ్డారు. చెన్నైలోని ఓ రెడ్ లైట్ ఏరియాలో సెక్స్ వర్కర్లుగా పనిచేసి అనారోగ్యం పాలై మైలాపూర్ లోని స్టేట్ హోంలో చికిత్స పొందుతున్న మహిళలను ఒప్పించి వారి రక్తాన్ని సేకరించి హెచ్ఐవీ టెస్టులు నిర్వహించారు. అనూహ్యంగా వారికి ఎయిడ్స్ ఉన్నట్లు తేలింది. సెకండ్ ఒపీనియన్ కోసం శాంపిల్స్ ను వేలూరు లోని క్రిస్టియన్ మెడికల్ కాలేజీకి పంపారు. అప్పట్లో ఎలిసా టెస్టులు అక్కడ మాత్రమే అదుబాటులో ఉండేవి. తుది నిర్ధారణ కోసం అవే శాంపిళ్లను అమెరికాలోని జాన్ హోప్కిన్స్ యూనివర్సిటీ ల్యాబ్ కు పంపారు. అలా ఇండియా కూడా ఎయిడ్స్ బాధిత దేశమేనని వెలుగులోకి తెచ్చిన సుమితి.. ఆ తరువాతి కాలంలో ఎయిడ్స్ మహమ్మారిని నిర్మూలించడమే జీవితాశయంగా పనిచేశారు. డాక్టర్ సుమితి వెలుగులోకి తెచ్చిన అంశాలను గుర్తిస్తున్నట్లు తమిళనాడు శాసనసభ ఒక తీర్మానం కూడా చేసింది. 1992లో ఓ హెచ్ఐవీ పాజిటివ్ గర్భిణికి చికిత్స చేయడాన్ని డాక్టర్ సునితి తరచూ గుర్తుచేసేవారు. ఆ మహిళకు పుట్టిన ఆడపిల్ల కూడా 17 ఏళ్ల వయసులో చనిపోవడం తనను వేదనకు గురిచేసిందని చెప్పేవారు. -
‘ప్రసవ’ వేదన!
హెచ్ఐవీ బాధిత గర్భిణులకు కడగండ్లు ప్రభుత్వ ఆస్పత్రుల్లో లేని సర్జికల్ కిట్లు నిధుల్లేవని చేతులెత్తేసిన కలెక్టర్లు హైదరాబాద్: ‘‘మా పరిస్థితి పగవారికి కూడా రాకూడదు. ప్రాణాంతక జబ్బు సోకి క్షణమొక యుగంలా బతుకుతున్నాం. జబ్బు ఉందని తెలిస్తే ప్రతి ఒక్కరూ వివక్ష చూపేవారే. అయినా సరే అమ్మ కావాలన్న ఆశ. మాతృత్వ మధురిమను ఆస్వాదించాలన్న ఆరాటం. పుట్టెడు కష్టాల్లో కాన్పు కోసమని ప్రభుత్వ ఆస్పత్రులకు వెళితే.. అక్కున చేర్చుకోవాల్సిన వారే కాదు పొమ్మంటున్నారు’’.... ఇదీ ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో హెచ్ఐవీ సోకిన గర్భిణుల దీనగాథ.. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని 23 జిల్లాల్లో హెచ్ఐవీ సర్జికల్ కిట్స్ 4 నెలలుగా అందుబాటులో ఉండడం లేదు. ఈ కిట్లు లేకుండా హెచ్ఐవీ బాధిత గర్భిణులకు కాన్పు చేయలేమని డాక్టర్లు చెబుతున్నారు.ప్రైవేటు ఆస్పత్రుల్లో కాన్పునకు రూ.30 వేలకు పైగానే ఖర్చవుతోంది. ఈ పరిస్థితుల్లో రెండు రాష్ట్రాల్లో సు మారు 3 వేల మంది గర్భిణులు తమ బాధ ఎవరికీ చెప్పుకోలేక కన్నీటి పర్యంతమవుతున్నారు. నిధులు లేవట: హెచ్ఐవీ పాజిటివ్ గర్భిణులకు కాన్పు చేయాల్సి వస్తే ప్రత్యేక సర్జికల్ కిట్లు వాడాలి. లేదంటే వైద్యులతో పాటు పక్కవారికి కూడా ఈ వ్యాధి సోకే ప్రమాదం ఉంటుంది. ప్రసవం పూర్తయ్యాక ఈ కిట్లను ప్రత్యేక పరిస్థితుల్లో నిర్వీర్యం చేస్తారు. ఒక్కో కిట్ ఖరీదు రూ.వెయ్యికి పైగా ఉంటుంది. హైదరాబాద్లోని గాంధీ, నయాపూల్ మెటర్నిటీ, పేట్లబుర్జు మెటర్నిటీ, కర్నూలు ప్రభుత్వాసుపత్రి, విశాఖపట్నంలోని కింగ్జార్జి వంటి ప్రధాన ప్రభుత్వాసుపత్రుల్లో కిట్లు లేవు. దీంతో హెచ్ఐవీ పాజిటివ్ మహిళలు ప్రైవేటు ఆస్పత్రుల్లో చేరాల్సి వస్తోంది. కాన్పు కోసం వేలాది రూపాయలు ఖర్చు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. జిల్లా కలెక్టర్లు అత్యవసర నిధి నుంచి హెచ్ఐవీ బాధితుల కోసం పరికరాలు కొనుగోలు చేసే అవకాశమున్నా నిధులు లేవనే సాకుతో చేతులెత్తేస్తున్నారు. ఈ పరికరాల కొనుగోలుకు ప్రతిఏటా కనీసం రూ.6 కోట్లు అవసరం. ఈ ఏడాది జాతీయ ఎయిడ్స్ నియంత్రణా మండలి నుంచి 2 రాష్ట్రాలకు కలిపి రూ.26 కోట్ల నిధులు మాత్రమే వచ్చాయి. గతేడాది రూ.114 కోట్ల వచ్చాయి. ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు హెచ్ఐవీ బాధిత గర్భిణుల కోసం పైసా కూడా కేటాయించలేదు. ప్రకాశం జిల్లాలో ప్రమాద ఘంటికలు ప్రకాశం జిల్లాలో హెచ్ఐవీ ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. హెచ్ఐవీ పాజిటివ్ కేసుల విషయంలో ప్రకాశం జిల్లా మొదటి స్థానంలో నిలుస్తోంది. ఈ జిల్లాలో నెలకు 200 నుంచి 250 హెచ్ఐవీ పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఏటా 90 మంది హెచ్ఐవీ పాజిటివ్ గర్భిణులు కాన్పు కోసం వస్తున్నారు. తెలంగాణ విషయానికొస్తే.. హైదరాబాద్, మహబూబ్నగర్, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల్లో హెచ్ఐవీ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. హెచ్ఐవీ బాధితులకు సేవలందించాల్సిన జిల్లా ప్రాజెక్టు మేనేజర్లు ఎన్జీవోలతో కుమ్మక్కై జలగల్లా పీడిస్తున్నారు. ముఖ్యంగా ప్రకాశం, ఉభయ గోదావరి జిల్లాల ప్రాజెక్ట్ మేనేజర్లపై ఫిర్యాదులొచ్చినా కలెక్టర్లు చర్యలు తీసుకోవడం లేదు. ఏపీ, తెలంగాణలో హెచ్ఐవీ పాజిటివ్ గర్భిణులు: 3 వేల మంది ఒక్కో సర్జికల్ కిట్ ఖరీదు: రూ.1000కి పైగా పరికరాల కొనుగోలుకు ప్రతిఏటా కావాల్సిన నిధులు: కనీసం రూ.6 కోట్లు {పైవేటు ఆస్పత్రుల్లో కాన్పు ఖర్చు: రూ.30 వేలు -
పులిరాజా పరీక్షల్లేవు!
⇒ హెచ్ఐవీ రోగుల నెత్తిన పిడుగు ⇒ ఆరు నెలలుగా టెస్టింగ్ కిట్లు లేక ఆగిన వైద్యపరీక్షలు ⇒ హెచ్ఐవీ పాజిటివ్ తల్లుల బిడ్డలకు లభించని సిరప్లు ⇒ నెలకు రెండు లక్షలమంది కిట్లు లేక తిరుగుముఖం ⇒ చిన్నాభిన్నమైన ఎన్జీవో వ్యవస్థ.. జిల్లా ప్రాజెక్టు మేనేజర్ల దోపిడీ సాక్షి, హైదరాబాద్: జబ్బును బయటకు చెప్పలేరు.. అలాగని లోపలా దాచుకోలేరు.. అలాంటి బాధ అనుభవించే హెచ్ఐవీ రోగుల నెత్తిన పిడుగుపడింది. జాతీయ ఎయిడ్స్ నియంత్రణా మండలి (నాకో) నిధులివ్వలేదన్న కారణంగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో హెచ్ఐవీ ఉందో లేదో నిర్ధారించేందుకు వాడాల్సిన టెస్ట్కిట్లు అందుబాటులో లేకుండా చేశారు. దీంతో హెచ్ఐవీ పరీక్షలకు వచ్చేవారి పరిస్థితి దారుణంగా ఉంది. ప్రస్తుతం ఏపీశాక్స్ను 10వ షెడ్యూల్లో చేర్చడంతో ఉభయ తెలుగు రాష్ట్రాలూ దీన్ని గాలికొదిలేశాయి. దీంతో భారతదేశంలో ఈశాన్య రాష్ట్రాల తర్వాత అత్యధిక హెచ్ఐవీ రోగులున్న తెలుగు రాష్ట్రాల్లో నియంత్రణ పూర్తిగా అదుపు తప్పింది. ఈఏడాది నాకోనుంచి రూ.100 కోట్లు రావాల్సి ఉండగా ఇప్పటివరకూ కేవలం రూ.26 కోట్లు మాత్రమే వచ్చాయి. ఐసీటీసీల్లో కిట్లు ఎక్కడ? ఇంటిగ్రేటెడ్ కౌన్సిలింగ్ అండ్ టెస్టింగ్ సెంటర్స్ (ఐసీటీసీ)కు నెలకు రెండు లక్షలమంది సెక్స్ వర్కర్లు, డ్రై వర్లు ఇలా పలు వర్గాలకు చెందినవారు పరీక్షలకోసం వస్తారు. ఇందులో నెలకు కనీసం నాలుగువేల మందికి పాజిటివ్ కేసులు వస్తున్నాయి. ఏపీ, తెలంగాణలో 463 ఐసీటీసీ కేంద్రాలున్నాయి. ఈ కేంద్రాల్లో గత ఫిబ్రవరి నుంచి కిట్లు లేకపోవడంతో వైద్య పరీక్షలు ఆపేశారు. దీంతో గడిచిన నాలుగు నెలల్లో ఎనిమిది లక్షల మంది బాధితులు వైద్య పరీక్షలు చేయించుకోకుండా వెనక్కు వెళ్లిపోయారు. గర్భిణుల బిడ్డలకు సిరప్లు ఏవీ? ఎయిడ్స్ నియంత్రణా మండలి లెక్కల ప్రకారం ఈ ఏడాది హెచ్ఐవీ పాజిటివ్ గర్భిణులు నాలుగువేల మందిపైనే ఉన్నట్టు అంచనా. వీళ్లు ప్రసవం అయిన తక్షణమే బిడ్డకు 72 గంటల్లోగా నెవాప్రిన్ సిరప్ వేయాలి. ఆ తర్వాత 3 నుంచి 13 వారాల వరకూ సెప్ట్రాన్ సిరప్ వేయాలి. ఈ రెండు సిరప్లు వేస్తేనే తల్లినుంచి బిడ్డకు హెచ్ఐవీ సోకకుండా ఉంటుంది. గడిచిన ఆరు మాసాల్లో రెండువేల మందికి పైగా హెచ్ఐవీ సోకిన గర్భిణులు ప్రసవం అయ్యారు. కానీ ఆ బిడ్డలకు సిరప్లు వేసే పరిస్థితి లేదు. ఆ బిడ్డల పరిస్థితి దారుణం. సీడీ4 కిట్లూ లేవు హెచ్ఐవీ రోగులకు వ్యాధినిరోధకత శక్తిని సీడీ4 టెస్ట్ద్వారా చూస్తారు. అంటే తెల్లరక్త కణాల కొలమానం అన్నమాట. సీడీ4 కౌంట్ 350 కంటే తగ్గితే ఆ వ్యాధిగ్రస్థుడు ఖచ్చితంగా ఏఆర్టీ (యాంటీ రిట్రోవెల్ ట్రీట్మెంట్) మందులు వాడాలి. హెచ్ఐవీ సోకిన టీబీ రోగులైతే విధిగా ఏఆర్టీ మందులు వాడాల్సిందే. ఈ టెస్టును ప్రతి ఆరు మాసాలకు ఒకసారి చేయించుకోవాలి. కానీ ఏడాదిగా రెండు రాష్ట్రాల్లో సీడీ4 కిట్లు లేవు. దీంతో హెచ్ఐవీ రోగులు ప్రై వేటుకు వెళ్లలేక, ఇక్కడ కిట్లు లేక యాతన పడుతున్నారు. డీపీఎంల దోపిడీ రాజ్యం ఏడాదిగా హెచ్ఐవీ నియంత్రణకు సంబంధించిన ఒక్క ప్రచార కార్యక్రమమూ లేదు. జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్లుగా నియమితులైనవారు ఎన్జీవోలనుంచి భారీగా వసూళ్లు చేస్తున్నారు. దీంతో ఎన్జీవోలు పనిచేయడం మానేశారు. కొందరు నాలుగైదేళ్లుగా ఒకే జిల్లాలో పనిచేస్తూ హెచ్ఐవీ నియంత్రణకు సంబంధించిన ఒక్క కార్యక్రమమూ చేపట్టలేదు. హైదరాబాద్లోని రక్తనిధి కేంద్రాలను పర్యవేక్షించే ఓ జాయింట్ డెరైక్టర్ అండతో ప్రాజెక్టు మేనేజర్లు అక్రమాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలున్నాయి. కేంద్రం నుంచి రావడం లేదు హెచ్ఐవీ కిట్లు లేని మాట వాస్తవమే. అయితే ఇవి కేంద్రం నుంచి రావాల్సి ఉంది. కానీ ఇప్పటివరకూ రాలేదు. ఈ ఏడాది నిధులు కూడా రూ.100 కోట్లు రావాల్సి ఉండగా రూ.26 కోట్లు మాత్రమే వచ్చాయి. - డాక్టర్ రామ్మోహన్, జేడీ, ఏపీశాక్స్ నా ఆవేదన ఎవరికీ చెప్పుకోలేక పోతున్నా ఐదారేళ్లుగా హెచ్ఐవీతో బాధపడుతున్నా. ఇక్కడ హెచ్ఐవీ రోగులకు వైద్యసేవలు అందడం లేదంటే జిల్లా ప్రాజెక్టు మేనేజర్లే కారకులు. ఏ ఒక్క కార్యక్రమాన్ని అమలు చేయకుండా వచ్చిన నిధులను తినేస్తున్నారు. దీంతో వేలాదిమంది హెచ్ఐవీ రోగులు మానసిక క్షోభ అనుభవిస్తున్నారు.-కె.రవి, హెచ్ఐవీ బాధితుడు (సమాచార హక్కుచట్టం కార్యకర్త) రెండు రాష్ట్రాల్లో హెచ్ఐవీ బాధితులు 5 లక్షలు తెలంగాణలో హెచ్ఐవీ బాధితులు 2.5 లక్షలు ఆంధ్రప్రదేశ్లో హెచ్ఐవీ బాధితులు 2.7 లక్షలు ఏటా కొత్తగా నమోదయ్యే బాధితులు 25 వేలు ఏటా ప్రసవానికి వస్తున్న హెచ్ఐవీ బాధితులు 5 వేలు ఏటా రెండు రాష్ట్రాల్లో హెచ్ఐవీ మృతులు 31 వేలు -
తల్లి నుంచి బిడ్డకు హెచ్ఐవీ వ్యాప్తిని నిర్మూలించారు
హవానా: తల్లి నుంచి బిడ్డకు హెచ్ఐవీ వ్యాప్తి (మదర్ టు ఛైల్డ్ ట్రాన్స్మిషన్) ని సంపూర్ణంగా నిర్మూలించిన మొట్టమొదటి దేశంగా క్యూబా చరిత్రకెక్కింది. ప్రస్తుతం ఆదేశంలో హెచ్ఐవీ బాధిత తల్లులకు పుట్టే పిల్లలెవ్వరికీ ఆ మహమ్మారి సొకడంలేదని, ఇది అరుదైన ఘనత అని ప్రపంచ ఆరోగ్య సంస్థ బుధవారం ప్రకటించింది. తల్లికి హెచ్ఐవీ ఉన్న ప్పుడు ప్రసవం ముందర కొద్దికాలంపాటు యాంటీ రిట్రోవైరల్ డ్రగ్స్ ఇవ్వడంతోపాటు ప్రసవం తర్వాత పుట్టిన పాపకు కూడా తగిన మోతాదులో మెడిసిన్ వాడాల్సి ఉంటుందని తద్వారా క్యూబా వైద్యులు హెచ్ఐవీ మహమ్మారి వ్యాప్తిని అడ్డుకున్నారని డబ్ల్యూహెచ్వో డైరెక్టర్ జనరల్ మార్గరేట్ చాన్ చెప్పారు. తల్లి నుంచి బిడ్డకు హెచ్ఐవీ వ్యాపించకుండా ఉండేందుకు వాడే మందుల్లో నెవిరపిన్, జిడోవుడిన్ (దీన్ని ఏజడ్టీ అని కూడా అంటారు) అనే ఔషధాలు ప్రభావవంతగా పనిచేశాయని తెలిపారు. అమెరికా ఒత్తిళ్లతో పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న తమను డబ్ల్యూహెచ్ వో వంటి అంతర్జాతీయ సంస్థలు ఇప్పటికైనా గుర్తించినందుకు సంతోషంగా ఉందని, ప్రపంచంలో ఏ బిడ్డకూ తల్లి నుంచి హెచ్ఐవీ సోకకుండా నిరోధించేందుకు తమ వంతు సహకారం అందిస్తామని క్యూబా వైద్యులు పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఏటా 1.4 లక్షలమంది హెచ్ఐవీ బాధిత మహిళలు గర్భం దాల్చుతుండగా వారిలో 15 నుంచి 45 శాతం మందికి పుట్టే బిడ్డలు కూడా వైరస్ తోనే పురుడుపోసుకుంటున్నారు. అయితే వైద్యశాస్త్రంలో నూతన పరిశోధనల ఫలితంగా 2009 నుంచి తల్లి నుంచి బిడ్డకు వైరస్ వ్యాప్తి తగ్గుతూ వస్తోంది. -
యాండ్రాలజీ కౌన్సెలింగ్
నా వయస్సు 29 ఏళ్లు. నేను మూడేళ్ల క్రితం ఓ మహిళతో శారీరకంగా కలిశాను. ఆమెకు హెచ్ఐవీ ఉందేమోననే అనుమానంతో ఆమెకు హెచ్ఐవీ పరీక్ష చేయించాను. వెస్ట్రన్బ్లాట్ పరీక్ష కూడా చేయించాను. అన్ని రిపోర్టులూ నెగెటివ్ వచ్చాయి. ఆ మహిళకూ, నా భార్యకు కూడా పరీక్షలు చేయించాను. ఇద్దరికీ నెగెటివ్ వచ్చింది. అయితే విండో పిరియడ్ అని ఒకటి ఉంటుందని, ఆ సమయంలో వ్యాధి ఉన్నా బయటపడదని స్నేహితులు అంటున్నారు. ఈ విండో పిరియడ్ అంటే ఏమిటి? ఎన్నాళ్లుంటుంది? వివరించండి. - పి.వి.ఆర్., రాజమండ్రి వివాహేతర సంబంధాలు ఉన్నప్పుడు హెచ్ఐవీ వస్తుం దేమో అని భయం ఉంటుంది. దానికి ప్రధాన కారణం... కండోమ్ లేకుండా సెక్స్లో పాల్గొనడం. కండోమ్ వాడితే ఈ సమస్యను చాలా సులువుగా ఎదుర్కోవచ్చు. కండోమ్ వాడకుండా సెక్స్లో పాల్గొంటే హెచ్ఐవీ, హెపటైటిస్ లాంటి ఇన్ఫెక్షన్స్ సోకే ప్రమాదం ఉంది. ఆ వైరస్ల విండో పిరియడ్ కొన్ని వారాల నుంచి ఆరు నెలల వరకు ఉంటుంది. ఇక విండో పీరియడ్ అంటే ఏమిటనే విషయానికి వస్తే - ఏదైనా వైరస్ను వాటి యాంటీబాడీస్ ద్వారా గుర్తిస్తాం. ఓ వైరస్ శరీరంలోకి ప్రవేశించినప్పుడు వాటి యాంటీబాడీస్ ఉత్పత్తి కావడానికి కొంత సమయం పడుతుంది. ఆ వ్యవధినే విండో పీరియడ్ అంటాం. ఈ విండో పీరియడ్లో యాంటీబాడీస్ ఉండవు. అయితే శరీరంలో వైరస్ మాత్రం ఉంటుంది. అలాంటప్పుడు ఆ వైరస్ ఉన్నవాళ్లతో సెక్స్లో పాల్గొంటే (యాంటీబాడీస్ పరీక్షలో హెచ్ఐవీ టెస్ట్ నెగెటివ్ అని వచ్చినా) ఆ వైరస్ సోకే ప్రమాదం ఉంది. అందువల్ల ఆర్నెల్ల తర్వాత ఇద్దరికీ హెచ్ఐవీ పరీక్షలో నెగెటివ్ వస్తే దాదాపు వ్యాధి లేనట్లే అనుకోవచ్చు. ఇక కండోమ్ కంటే కూడా ఎలాంటి వివాహేతర సంబంధాలు లేకపోవడమే ముఖ్యం. అదే అన్నిటికంటే సురక్షితం. డాక్టర్ వి. చంద్రమోహన్ యూరో సర్జన్ అండ్ యాండ్రాలజిస్ట్, ప్రీతి యూరాలజీ అండ్ కిడ్నీ హాస్పిటల్, కె.పి.హెచ్.బి, హైదరాబాద్ -
హెచ్ఐవి కౌన్సెలింగ్
ఇటీవలే తరచూ జ్వరం వస్తూ, తగ్గుతూ ఉంటే డాక్టర్కు చూపించుకున్నాను. ఆయన నాకు హెచ్ఐవీ ఉన్నట్లు చెప్పారు. నాకు ఎయిడ్స్ వచ్చినట్టే కదా? చావు తప్పదా? - సుదీప్ (పేరు మార్చాం), బాపట్ల మనలో రోగనిరోధక శక్తిని కలిగించే కణాలు చాలా ఉంటాయి. అందులో ‘టీ’ సెల్స్ ముఖ్యమైనవి. వీటినే సీడీ4 కణాలు అని కూడా పిలుస్తారు. హెచ్ఐవీ వైరస్ సీడీ4 కణాలను తగ్గించి వ్యాధినిరోధకతను తగ్గిస్తుంది. హెచ్ఐవీ అనే వైరస్ సోకినవారు, అది హెచ్ఐవీ దశలోనే ఉన్నప్పుడు మాత్రం మామూలు వ్యక్తుల్లాగే సాధారణ జీవితం గడుపుతారు. అసలు వాళ్లకు ఆ వ్యాధి ఉన్నట్లే తెలియదు. అయితే హెచ్ఐవీ వైరస్ ఈ రోగనిరోధక కణాలను క్రమంగా దెబ్బతీస్తూ పోయి వాటి సంఖ్యను గణనీయంగా తగ్గిస్తుంది. ఈ ‘టీ’సెల్స్ సంఖ్య (సీడీ4 కౌంట్) ప్రతి మైక్రోలీటర్కూ 200 కంటే తగ్గితే.... అప్పుడు ఆ రోగికి ‘ఎయిడ్స్’ సోకినట్లుగా నిర్ధారణ చేస్తారు. ఈ స్థితిలో రోగికి ఆపర్చునిస్టిక్ ఇన్ఫెక్షన్లు తేలిగ్గా సంక్రమిస్తాయి. అయితే ఆ దశలోనూ కొన్ని రకాల యాంటీబయాటిక్స్, యాంటీఫంగల్ మందులతో చికిత్స చేస్తూ రోగిని మామూలు వ్యక్తిలాగే పూర్తి జీవిత కాలం బతికేలా చేయవచ్చు. నాకు హెచ్ఐవీ సోకింది. ఇక నేను దీన్ని నా పిల్లలకు అంటించేస్తానేమో, నా నుంచి వారికి సోకుతుందేమో అనే ఆందోళన ఎక్కువగా ఉంది. నాకు తగిన సలహా ఇవ్వండి. - సుధాకర్ (పేరు మార్చాం), గుంటూరు సాధారణంగా హెచ్ఐవీ వచ్చిన తల్లిదండ్రులు పడే ఆందోళనలో ఇదే ప్రధానం. అలాంటి భయాలు వద్దు. ఇది కేవలం రక్తం, శరీర స్రావాలలు, అసురక్షితమైన సెక్స్ ద్వారానే సంక్రమిస్తుంది. కానీ ఒకేచోట నివసించడం, అందరూ అవే పాత్రలను వాడటం, పిల్లలను దగ్గరికి తీసుకోవడం, వారికి ముద్దు పెట్టడం వల్ల సోకదు. కాబట్టి నిరభ్యంతరంగా అలాంటి వారికి ఎవరైనా సేవలందించవచ్చు. కాకపోతే... మన చేతులపై గాయాలుంటే వాళ్ల రక్తం, శరీర స్రావాలు దానికి అంటుకోకుండా చూడాలి. వారి రక్తం, శరీర స్రావాలు, రక్తం అంటిన దూది, సూది లాంటి వాటిని జాగ్రత్తగా తొలగించాలి/డిస్పోజ్ చేయాలి. మీరు మీ భార్యతో సెక్స్ విషయంలోనే జాగ్రత్తగా ఉండాలి. మీ పార్ట్నర్తో సెక్స్ సమయంలో కండోమ్ వాడటం తప్పనిసరి. డాక్టర్ టి.జి. కిరణ్బాబు సీనియర్ కన్సల్టెంట్ ఫిజీషియన్ సన్షైన్ హాస్పిటల్స్, హైదరాబాద్ -
హెచ్ఐవీ ఉందని.. భార్యాపిల్లల్ని చంపేశాడు
తనను కబళించిన ఎయిడ్స్.. కుటుంబ సభ్యులకు కూడా సోకిందని.. విషయం నలుగురికీ తెలిస్తే పరువుపోతుందని భావించి భార్యాపిల్లల్ని సజీవదహనం చేశాడో ఐఐటీ గ్రాడ్యుయేట్. అనంతరం తాను ఆత్మహత్య చేసుకోవాలనుకొని ఆస్పత్రి పాలయ్యాడు. అయితే చివరికి వైద్యుల పరీక్షల్లో అతనికి హెచ్ఐవీ లేదని తేలింది! ప్రస్తుతం చికిత్స పొందుతున్న అతను.. తాను చేసింది ఘోర తప్పిదమని విలపిస్తూ అసలేం జరిగిందో చెప్పాడు.. 'నా పేరు ప్రవీణ్ మన్వర్. ఐఐటీ గ్రాడ్యూయేట్ను. మధ్యప్రదేశ్లోని బెతుల్ సిటీలో ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం. నా భార్యపేరు శిల్ప. ఇద్దరు పిల్లలు.. శర్వాణి (9), ప్రణీతి (2) . ఆనందంగా సాగుతోన్న మా జీవితంలో అల్లకల్లోలం చెలరేగడానికి కారణం గతంలో నేను చేసిన ఓ భారీ పొరపాటు..! ఉద్యోగ నిమిత్తం అప్పుడప్పుడూ ఢిల్లీ టూర్కు పోయేవాణ్ణి. అలా అక్కడి రెడ్ లైట్ ఏరియాకు వెళ్లడం అలవాటైంది. ఎంత వద్దనుకున్నా ఆ అలవాటును మానుకోలేకపోయా. రెండు నెలల కిందట నా నోటిలో చిన్న పుండైంది. రోజులు గడిచేలోగా అది పెద్ద కురుపుగా మారింది. సడన్గా బరువు కోల్పోయాను కూడా. గూగుల్లో సెర్చ్ చేస్తే ఈ లక్షణాలన్నీ హెచ్ఐవీ పాజిటివ్వేనని అర్థమైంది. రహస్యంగా ఓ ప్రైవేటు డయాగ్నస్టిక్స్ సెంటర్కు వెళ్లి రక్తపరీక్ష చేయించుకున్నా. రిజల్ట్స్ 'పాజిటివ్' అని తేలింది. షాక్కు గురైన నేను చాలా రోజులపాటు నాలో నేనే కుమిలిపోతూ ఆత్మహత్యకు ప్రయత్నించా. కానీ వీలుకాలేదు. మరోవైపు తన అనుమానం నిజం కావద్దని భగవంతుడికి చేసిన ప్రార్థనలు ఫలించలేదు. భయపడిందే జరిగింది.. ఓ రోజు నా భార్యా పిల్లలు అనారోగ్యం పాలయ్యారు. వాళ్లకు కూడా హెచ్ఐవీ పాజిటివ్ లక్షణాలే కనిపించాయి. దీంతో ధైర్యం చేసి నా భార్య శిల్పకు విషయం మొత్తం చెప్పా. మొదట ఏడ్చి, గగ్గోలు పెట్టిన ఆమె.. రెండో రోజుకు నన్ను ఓదార్చింది. 'చస్తే అందరం కలిసే చద్దాం' అంది. నొప్పిలేకుండా ఆత్మహత్య చేసుకోవడం ఎలాగో గూగుల్లో సెర్చ్ చేశాం. వివరాలు దొరకలేదు. ఫిబ్రవరి 28న పిల్లల్ని వెంటబెట్టుకొని అమరావతి వెళ్లాం. అక్కడే అందరం ఉరి వేసుకొని చావాలనేది మా పథకం. అయితే పసి పిల్లలకు ఉరివేయడానికి మా ఇద్దరి చేతులూ ముందుకు రాలేదు. దాంతో ఆ ప్లాన్ ను తాత్కాలికంగా విరమించుకున్నా ఆత్మహత్యా ప్రయత్నాల్ని మాత్రం ఆపలేదు. మార్చి 4న అమరావతి నుంచి మా సొంతూరు బెతుల్ కు బయలుదేరాం. కారులో పెట్రోల్ ఫుల్ ట్యాంక్ చేయించా. స్పీడ్గా డ్రైవ్ చేస్తూ కావాలనే ఓ చెట్టును ఢీకొట్టా. పిల్లలు, శిల్పా, నేను సృహతప్పి పడిపోయాం. కొద్ది నిమిషాలకు నాకు మెలకువొచ్చింది. పగిలిన కిటికీ అద్దంలోంచి బయటికొచ్చిన నేను.. అగ్గి పుల్ల వెలిగించి కారును తగలబెట్టాను. అప్పుడే కళ్లు తెరిచిన పిల్లలు 'అమ్మా.. మంటలు..' అంటూ ఆర్తనాదాలు చేయడం నాకు వినిపిస్తూనే ఉంది. కానీ వాళ్లను కాపాడే ప్రయత్నం చేయలేదు. కాసేపట్లో నేనూ చనిపోవాలనుకున్నా.. కానీ ఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని నన్ను ఆస్పత్రికి చేర్చారు. బయటికి వెళ్లిన తర్వాతైనా నేను చావాల్సిన వాడినే. కచ్చితంగా చనిపోతా' అంటూ తన గాథను వివరించాడు ప్రవీణ్ మన్వర్. అయితే గురువారం వైద్యులు నిర్వహించిన పరీక్షల్లో ప్రవీణ్ కు ఎయిడ్స్ లేదని తేలింది. ఈ విషయం చెప్పినప్పుడు అతని ముఖంలో ఎలాంటి భావం కనిపించలేదని పోలీసులు చెప్పారు. ప్రవీణ్పై హత్యకేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. ఓ 'తప్పిదం' మూడు నిండు అమాయక ప్రాణాలు బలికావటం విషాదకరం. -
మందూలేదు.. నివారణా లేదు!
నివారణే తప్ప మందుల్లేని మహమ్మారి హెచ్ఐవీ. అలాంటి ఈ వ్యాధికి.. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ మందులూ అందుబాటులో లేవు... నివారణకు తోడ్పడే చర్యలకూ దిక్కులేదు. విస్తృతంగా ప్రచారం చేస్తున్నామని చెప్పుకొంటున్నా... కోట్ల కొలదీ నిధులు వెచ్చిస్తున్నా... ఫలితం మాత్రం శూన్యం. దీంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో హెచ్ఐవీ చాపకింద నీరులా వ్యాపిస్తూ లక్షలాది మందిని పీల్చిపిప్పి చేస్తోంది. ప్రభుత్వాల నిర్లక్ష్యం, ఆంధ్రప్రదేశ్ ఎయిడ్స్ నియంత్రణ మండలి దారుణ పనితీరే దీనికి కారణమనే విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికే దేశంలో అత్యధిక మంది హెచ్ఐవీ రోగులున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ 3వ స్థానంలో, తెలంగాణ 4వ స్థానంలో ఉండడం గమనార్హం. - హైదరాబాద్, సాక్షి తెలుగు రాష్ట్రాల్లోనే ఎక్కువ ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో హెచ్ఐవీ కేసులు భారీగా పెరుగుతున్నట్టు ఇటీవల వివిధ సంస్థల పరిశోధనల్లో వెల్లడైంది. ఇరు రాష్ట్రాల్లో కలిపి ఏటా 25 వేల కొత్త హెచ్ఐవీ పాజిటివ్ కేసులు నమోదవుతున్నట్లు తేలింది. వాస్తవానికి ఇది చాలా పెద్ద సంఖ్య. ఇప్పటికే ఇరు రాష్ట్రాల్లో కలిపి ఐదు లక్షల మందికిపైనే హెచ్ఐవీ బాధితులు ఉన్నారు. వీళ్లలో 4.26 లక్షల మంది మాత్రమే ఏఆర్టీ కేంద్రాల్లో పేర్లు నమోదుచేసుకున్నారు. ఇక దేశంలోని మొత్తం ఎయిడ్స్ (హెచ్ఐవీ ముదిరి ఎయిడ్స్ వ్యాధిగా మారుతుంది) బాధితుల్లో దాదాపు 20 శాతం మంది ఏపీ, తెలంగాణల్లోనే ఉన్నారు. మరోవైపు హెచ్ఐవీతో బాధపడుతున్న గర్భిణులు దేశం మొత్తమ్మీద తెలుగు రాష్ట్రాల్లోనే ఎక్కువగా ఉండడం ఆందోళనకరం. ముఖ్యంగా హెచ్ఐవీ సోకిన గర్భిణులు ఏపీలోని కడప జిల్లాలో, తెలంగాణలోని కరీంనగర్ జిల్లాలో ఎక్కువగా ఉన్నట్టు తేలింది. ఇక హెచ్ఐవీ బాధితుల్లో దాదాపు 80 శాతం మందికి టీబీ కూడా సోకుతున్నట్లు వైద్య నిపుణులు చెబుతున్నారు. ఉభయ రాష్ట్రాల్లో ఏటా 600 మంది పైనే హెచ్ఐవీతో మృతి చెందుతున్నట్లు తెలుస్తోంది. ఎన్జీవోల అక్రమాలు.. హెచ్ఐవీ, ఎయిడ్స్ నియంత్రణ కార్యక్రమాలకు ఓవైపు నిధులు సరిగా అందకపోతుండగా... మరోవైపు కోట్లాది రూపాయల ఏపీ శాక్స్ నిధులను ఎన్జీవోల నిర్వాహకులు కాజేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఆ నిధులకు లెక్కల్లేవు. పనులకు వివరాల్లేవు. నకిలీ హెచ్ఐవీ రోగుల పేర్లతో రికార్డులను నింపేసి నిధులను కాజేసినట్లు ఆడిట్ అధికారులు తేల్చారు. ఉమ్మడి రాష్ట్రంలో 2013-14 సంవత్సరానికి సుమారు 173 ఎన్జీవోలకు రూ. 33 కోట్లు ఇచ్చారు. ఆ సొమ్మంతా ఖర్చయినట్లు ఎన్జీవోలు చెబుతుండగా... కనీసం రూ. 10 కోట్ల పనులైనా కాలేదని ఆడిట్లో బయటపడింది. ఈ లెక్కన గత నాలుగేళ్లలో సుమారు రూ. 80 కోట్లకు పైనే దుర్వినియోగం జరిగి ఉంటుందని అంచనా. ప్రకాశం, చిత్తూరు, నిజామాబాద్, తూర్పుగోదావరి తదితర జిల్లాల్లో హెచ్ఐవీ పరీక్షలు చేసినట్టు రికార్డుల్లో ఉండగా... వారి చిరునామాలకు వెళ్లి చూస్తే అసలు అలాంటి పేరున్న వ్యక్తులే లేరని తేల డం గమనార్హం. కానీ ఈ నివేదికలను పైస్థాయి అధికారులు తొక్కిపెట్టినట్లు ఆరోపణలున్నాయి. నిర్లక్ష్యం.. నిధుల లేమి.. రెండు రాష్ట్రాల్లోనూ హెచ్ఐవీ, ఎయిడ్స్ నియంత్రణ, ప్రజలకు అవగాహన కలిగించడం, మందుల పంపిణీ తదితర పనులు చేస్తున్న స్వచ్ఛంద సంస్థలు కొంతకాలంగా చాపచుట్టేశాయి. హెచ్ఐవీ విభాగంలో పనిచేస్తున్న కమ్యూనిటీ హెల్త్ ఆర్గనైజర్లకు నెలల తరబడి జీతాలు సరిగా అందడం లేదు. నాకో (జాతీయ ఎయిడ్స్ నియంత్రణ మండలి) నుంచి అందాల్సిన నిధులు సరిగా రాకపోవడం, వచ్చిన నిధులు దుర్వినియోగం కావడం కూడా హెచ్ఐవీ కేసులు పెరగడానికి కారణమవుతోంది. నాకో నుంచి రాష్ట్రానికి ఏటా సుమారు రూ. 80 కోట్లకు పైగా నిధులు వచ్చేవి. కానీ ఈ ఏడాది రూ. 30 కోట్లు కూడా రాలేదని సమాచారం. ఇక ఎయిడ్స్పై అవగాహనకు పనిచేస్తున్న రెడ్రిబ్బన్ క్లబ్లు, సురక్ష క్లినిక్స్, మొబైల్ ఐసీటీసీలు సరిగా పనిచేయకపోవడంతో పరిస్థితి దారుణంగా మారుతోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇదీ పరిస్థితి.. మొత్తం హెచ్ఐవీ బాధితులు 5,00,000+ ఏఆర్టీలో నమోదుచేసుకున్నవారు 4,26,000 (వీరిలో కొందరు ఇప్పటికే మరణించారు) పురుష బాధితులు 1,09,598 మహిళా బాధితులు 1,93,134 చిన్నారులు 31,591 హిజ్రాలు 599 జిల్లాల జనాభాలో బాధితుల శాతం మహబూబ్నగర్ 1.38 ప్రకాశం 1.34 కరీంనగర్ 1.25 తూ. గోదావరి 0.83 గుంటూరు 0.83 వైఎస్సార్ జిల్లా 0.75 వరంగల్ 0.75 శ్రీకాకుళం 0.63 విశాఖపట్నం 0.63 కర్నూలు 0.58 చిత్తూరు 0.53 ఖమ్మం 0.50 నిజామాబాద్ 0.50 రంగారెడ్డి 0.50 -
పెళ్లికి ముందు 'హెచ్ఐవీ' వరుడు అరెస్టు
హసన్పర్తి (వరంగల్): ఓ ప్రబుద్ధుడు తనకు హెచ్ఐవీ (పాజిటివ్) ఉన్నప్పటికీ దాన్ని కప్పి పుచ్చి వివాహానికి సిద్ధమయ్యాడు. భాజా భజంత్రీలతో వధువు గ్రామానికి వచ్చాడు. వరుడిని తీసుకెళ్లడానికి వధువు తరఫున ఎదురుకోళ్లకు వచ్చారు. మరో ఇరవై నిమిషాల్లో వధూవరులు పెళ్లిపీటల మీద కూర్చునేవారు. అంతలోనే పోలీసులు రంగప్రవేశం చేయడంతో వాతావరణం మారిపోయింది. వరంగల్ జిల్లా హసన్పర్తి మండలంలో గురువారం ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాలు.. వరంగల్ జిల్లాకు చెందిన ఓ యువకుడికి హసన్పర్తి మండలానికి ఓ యువతితో 20 రోజుల క్రితం వివాహం నిశ్చితార్థమైంది. వివాహానికి వధువు తల్లిదండ్రులు రూ.4.50 లక్షల వరకట్నం ఇచ్చేందుకు అంగీకరించారు. నిశ్చితార్థం రోజున రూ.50 వేలు ఇచ్చారు. గురువారం (ఫిబ్రవరి 5న) పెళ్లికి సిద్ధమయ్యూరు. కాగా హెచ్ఐవీ వ్యాధిగ్రస్తుడైన వరుడు మెడిసిన్ వాడడం లేదని, అసలు కారణాలు తెలుసుకునేందుకు వరంగల్లోని స్నేహ స్వచ్ఛంద సంస్థ, కరుణ మైత్రి సంస్థల ప్రతినిధులు ఆయన ఇంటికి వెళ్లారు. అక్కడ అసలు విషయం తెలుసుకుని అవాక్కయ్యారు. వెంటనే ఈ విషయాన్ని ఫోన్ ద్వారా హసన్పర్తి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వెంటనే వివాహ వేదిక వద్దకు వెళ్్లి పెళ్లి తతంగాన్ని నిలిపివేశారు. కాగా, వరుడికి హెచ్ఐవీ సోకినట్లు కుటుంబ సభ్యులకు తెలియదు. తమను చీటింగ్ చేసిన వరుడిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని పెళ్లి కూతురి కుటుంబ సభ్యులు హసన్పర్తి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. -
ఎయిడ్స్ రోగులు 'ఆ రెండు చోట్లే' టాప్
హైదరాబాద్ : రాష్ట్రంలో ఏయిడ్స్ రోగులు అత్యధికంగా గల జిల్లాల జాబితాలో గుంటూరు జిల్లా మొదటి స్థానంలో ఉందని ఎయిడ్స్ కంట్రోల్ సొసైటి వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలోని ఎయిడ్స్ రోగుల అత్యధికంగా గల జిల్లాల జాబితా వివరాలను విడుదల చేసింది. 2013 -14 ఏడాదిలో ఒక్క గుంటూరు జిల్లాలోనే 5,195 ఎయిడ్స్ కేసులు నమోదు కాగా వారిలో 2,498 మహిళలు ఉన్నారని పేర్కొంది. అంతకు ముందు ఏడాది 6,027 కేసులు నమోదు అయ్యాయని తెలిపింది. ఆ తర్వాత స్థానాలు వరుసగా తూర్పు గోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా, కృష్ణా జిల్లా, హైదరాబాద్, విశాఖపట్నం జిల్లా, చిత్తూరు జిల్లా, నల్గొండ జిల్లా, నెల్లూరు జిల్లా, కడప జిల్లా, మహబూబ్నగర్ జిల్లా, అనంతపురం జిల్లా, ప్రకాశం జిల్లా, ఖమ్మం జిల్లా, కర్నూలు జిల్లా, మెదక్ జిల్లా, కరీంనగర్ జిల్లా, రంగారెడ్డి జిల్లా, వరంగల్ జిల్లా, శ్రీకాకుళం జిల్లా , విజయనగరం జిల్లా, ఆదిలాబాద్ జిల్లా అక్రమించాయని తెలిపింది. అయితే తూర్పు, పశ్చిమ, కృష్ణా జిల్లాలు జాతీయ రహదారికి అనుకుని ఉన్నాయని... ఈ నేపథ్యంలో ఆయా జిల్లాలలో హెచ్ఐవీ కేసులు మరింత పెరిగే అవకాశం ఉందని ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ఆందోళన వ్యక్తం చేసింది. విభజనకు ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత రెండేళ్లు వరుసగా గుంటూరు జిల్లా ఎయిడ్స్ రోగులతో మొదటి స్థానంలో ఉందన్న సంగతిని ఈ సందర్బంగా సొసైటీ గుర్తు చేసింది. అలాగే తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ నగరం ఎయిడ్స్ రోగుల్లో జాబితాలో మొదటి స్థానంలో ఉందని పేర్కొంది. నగరంలో మొత్తం 3952 మంది హెచ్ఐవీ రోగులు ఉండగా వారిలో 2,525 మంది మహిళలు ఉన్నారని వెల్లడించింది. కాగా అత్యధికంగా గర్బిణీల ఎయిడ్స్ వ్యాధీ సోకిన జిల్లాగా మహబూబ్నగర్ నమోదు అయినట్లు ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ తెలిపింది. -
అవగాహనతోనే నివారణ
నల్లగొండ టౌన్ :హెచ్ఐవీ, ఎయిడ్స్ నియంత్రణ కోసం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ, జిల్లా ఎయిడ్స్ నియంత్రణ సంస్థ చేపడుతున్న కార్యక్రమాలు మంచి ఫలితాలను అందిస్తున్నాయి. దీంతో జిల్లాలో హెచ్ఐవీ బాధితుల సంఖ్య గణనీయంగా తగ్గుముఖం పట్టింది. గత సంవత్సరం(2013-14)లో జిల్లాలో 1832 హెచ్ఐవీ కేసులు నమోదు కాగా, ఈ ఏడాది(2014-15) ఇప్పటి వరకు 1029 కేసులు మాత్రమే నమోదయ్యాయి. 2004-05లో హెచ్ఐవీ బాధితుల సంఖ్య 2074గా ఉంది. జిల్లాలో 105 పరీక్షల కేంద్రాలు.. జిల్లా వ్యాప్తంగా పీపీటీసీటీలు 5, ఐసీటీసీలు 14, ఎఫ్ఐఐసీటీసీలు 72, పీపీపీలు 11, ఒక మొబైల్ ఐసీటీసీ సెంటర్లతో పాటు మొత్తం 105 సెంటర్లలో హెచ్ఐవీ పరీక్షలు నిర్వహిస్తున్నారు. జిల్లా కేంద్రంలోని హెడ్క్వార్టర్ హాస్పిటల్లో ఏఆర్టీ సెంటర్, అదే విధంగా భువనగిరి, మిర్యాలగూడ, సూర్యాపేట ఏరియా ఆస్పత్రులలో మూడు లింకెడ్ ఏఆర్టీ సెంటర్లు పనిచేస్తున్నాయి. వీటి ద్వారా ఎయిడ్స్ పాజి టీవ్ బాధితులకు ఉచిత వైద్య పరీక్షలతో, ఉచిత మందులు, గ్రూప్ కౌన్సిలింగ్, వ్యక్తిగత కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నారు. దాంతో పాటు ఏఆర్టీ సెంటర్లో సీడీ-4 పరీక్షలను ఉచి తంగా నిర్వహిస్తున్నారు. జిల్లాలోని 72 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ఫిసిలీటీ ఇంటిగ్రేటెడ్ కౌన్సిలింగ్ అండ్ టెస్టింగ్ సెంటర్(ఎఫ్ఐసీటీసీ)లు, 13 ప్రైవేటు ఆస్పత్రులలో పబ్లిక్ ప్రైవేటు పార్టనర్షిప్ సెంటర్(పీపీపీ)లు ఉన్నాయి. ఈ పరీ క్షా కేంద్రాల ద్వారా హెచ్ఐవీ, ఎయిడ్స్ పరీక్షలు నిర్వహించడంతో పాటు గర్బిణులకు, సామాన్య ప్రజ లు, ప్రమాదకర ప్రవర్తన కలిగిన వ్యక్తులు ఉచితంగా పరీక్షలు నిర్వహించి హెచ్ఐవీ పాజిటీవ్ కలిగిన వ్యక్తులకు కౌన్సిలింగ్ను నిర్వహిస్తున్నారు. అవగాహన కోసం వివిధ కార్యక్రమాలు చేపడుతూ హెచ్ఐవీ, ఎయిడ్స్ నియంత్రణ కోసం కృషి చేస్తుండడంతో గతంలో కంటే ప్రస్తు తం హెచ్ఐవీ పాజిటీవ్ కేసుల నమోదు గణనీయంగా తగ్గింది. నేడు జిల్లా కేంద్రంలో ర్యాలీ ప్రపంచ ఎయిడ్స్ నివారణ దినం సందర్భంగా సోమవారం జిల్లా కేంద్రంలో అవగాహన ర్యాలీ నిర్వహిస్తున్నారు. స్థానిక జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రి వద్ద జిల్లా కలెక్టర్ టి.చిరంజీవులు ర్యాలీని ప్రారంభిస్తారు. ఎన్జీ కళాశాల వరకు కొనసాగుతుంది. నివారణ ఒక్కటే మార్గం : డాక్టర్ విజయ్కుమార్ అడిషనల్ డీఎంహెచ్ఓ(ఎయిడ్స్అండ్ లెప్రసీ) ఎయిడ్స్ను అవగాహనతో నివారించవచ్చు. ముఖ్యంగా యువతీయువకులు సురక్షిత శృంగార పద్ధతులు పాటిం చాలి. సురక్షితమైన రక్తాన్ని మాత్రమే ఎక్కించుకోవాలి. పాజిటీవ్ వ్యక్తులు ఏఆర్టీ సెంటర్లో అందజేసే మందులు క్రమం తప్పకుండా వాడడం ద్వారా తమ జీవితకాలాన్ని పెంచుకోవచ్చు. బోగస్ ప్రకటనలను నమ్మి మొసపోవద్దు. ప్రపంచ ఎయిడ్స్ నివారణ దినోత్సవాన్ని పురస్కరిం చుకుని కోదాడలోని తేజ టాలెంట్ స్కూల్కు చెందిన విద్యార్థులు వ్యాధిపై అవగాహన కల్పించడానికి వినూత్నంగా ప్రయత్నించారు. నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్(నాకో) రూపంలో ఇలా కూర్చున్నారు. బాధితుల సంరక్షణ ఇలా.. హెచ్ఐవీ పాజిటీవ్ బాధితులను జిల్లా కేంద్రంలోని ఏఆర్టీ సెంటర్ లేదా సూర్యాపేటలోని ఏఆర్టీ సెంటర్లకు పంపిస్తారు. అక్కడ వైద్యాధికారులు వారికి ఉచితంగా సీడీ-4 పరీక్షలు చేసి కౌన్సెలింగ్ ఇస్తారు. అలాగే అవసరమైన మందులు ఉచితంగా అందజేస్తారు. 250 కంటే సీడీ-4 కణాలు తక్కువ ఉన్నవారికి ఎన్ఎన్ఆర్టీఐ, ఎన్ఆర్టీఐ మందులను అందజేస్తూ వారిని పరిశీలన, సంరక్షణ, కౌన్సిలింగ్ కోసం జిల్లాలోని మూడు ఆధరణ సంరక్షణ కేంద్రాలకు పంపిస్తున్నారు. ఏఆర్టీఐ మందులను క్రమం తప్పకుండా ఆరు నెలలపాటు వాడిన బాధితులను వారికి దగ్గరలోని లింక్డ్ ఏఆర్టీ సెంటర్లకు పంపించి ఆ సెంటర్ల ద్వారా మందులను ఉచితంగా అందజేస్తున్నారు. ఏఆర్టీ సెంటర్లలో క్రమం తప్పకుండా వాడిన వేలాది మంది హెచ్ఐవీ పాజిటీవ్ బాధితులలో సీడీ-4, బరువులో పెరుగుదల లేని వారిని వైద్యులు, కౌన్సిలర్లు పరీక్షించి సెకండ్లైన్ మందుల కోసం హైదరాబాద్లోని గాంధీ ఆస్పత్రికి పంపిస్తున్నారు. దీంతో పాటు జిల్లా వ్యాప్తంగా శుభం కార్యక్రమాలు, నల్లగొండ యూత్ పాజిటీవ్ సొసైటీ, ఇతర స్వచ్ఛంద సంస్థలు, జిల్లా ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఆధ్వర్యంలో విరివిగా అవగాహన కల్పించడంతో జిల్లాలో హెచ్ఐవీ పాజిటీవ్ కేసుల నమోదు గణనీయంగా తగ్గడం శుభ సూచికంగా పేర్కొనవచ్చు. -
ఎయిడ్స్తో అతలాకుతలమైన సిక్కోలు జిల్లా
రాజాం : కొద్ది సంవత్సరాల క్రితం హెచ్ఐవీ, ఎయిడ్స్తో అతలాకుతలమైన సిక్కోలు జిల్లా ప్రస్తుతం నియంత్రణ దిశలో సాగుతోంది. జిల్లా ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ యంత్రాంగం చైతన్య కార్యక్రమాలు, ప్రజల్లో కూడా వ్యాధి తీవ్రతపై అవగాహన పెంపొందించడం వంటి వాటి వల్ల క్రమేపీ హెచ్ఐవీ రోగుల సంఖ్య తగ్గుముఖం పట్టడం మం చి పరిణామంగా వైద్య యంత్రాంగం పరిగణి స్తోంది. అయితే ఈ వ్యాధి తమకు సోకిందని తెలియని వారు, తెలిసీ బయటకు చెప్పుకోలేని వారు, మానసికంగా కుంగిపోతున్నవారి లెక్కలు లేకపోవడం సర్వత్రా ఆందోళనకు గురిచేస్తోంది. జిల్లాలో తాజా స్థితిగతులు ఇలా... జిల్లాలో 2014-15 సంవత్సరానికి సంబంధించి ఇప్పటివరకూ ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ, ఇతర సంస్థలు నిర్వహించిన రక్తదాన శిబిరాలు ద్వారా సేకరించిన రక్తం యూనిట్లు 6480 కాగా వీరిలో 25 మందికి హెచ్ఐవీ పాజి టివ్గా నిర్ధారించారు. ఇది 0.39 శాతం. అలాగే గ ర్భిణులను 20,268 మందిని పరీక్షించగా వీరిలో 29 మంది హెచ్ఐవీ(0.14 శాతం)తో బాధపడుతున్నట్టు గుర్తించారు. ఇక సాధారణ పరీక్షలు 29,628 మందికి జరపగా 667 మంది (2.25 శాతం)కి హెచ్ఐవీ ఉన్నట్టు నిర్ధారణ అయ్యింది. అయితే గతేడాది(2013-14)తో పోల్చుకుంటే తగ్గుముఖం పడుతున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. గడిచిన ఏడాది రక్తదాతలకు 0.71 శాతం, గర్భిణులకు 0.16 శాతం, సాధారణ పరీక్షల్లో 2.52 శాతం కాగా ఈ ఏడాది కాస్త తగ్గుముఖం పట్టింది. రోగ నిర్ధారణ...రోగులకు చికిత్స ఇలా... జిల్లా వ్యాప్తంగా ఇంటిగ్రేటెడ్ కౌన్సెలింగ్ అండ్ టెస్టింగ్ కేంద్రాలు(ఐసీటీసీలు) 15 చోట్ల ఉన్నాయి. అలాగే గ ర్భిణులను ప్రత్యేకంగా పరీక్షించేందుకు శ్రీకాకుళం రిమ్స్తో పాటు పాలకొండ, టెక్కలి ఏపీ వైద్య విధాన పరిషత్ ఆస్పత్రుల్లో పీపీటీసీ కేంద్రాలు సేవలందిస్తున్నాయి. హెచ్ఐవీ సోకిన వారికి సేవలందించేందుకు శ్రీకాకుళం రిమ్స్లో యాంటీ రిట్రో వైరల్(ఏఆర్టీ) కేంద్రం ఏర్పాటు కాగా దీనికి అనుబంధంగా ఏఆర్టీలను రాజాం, టెక్కలి, పాలకొండ వైద్య విధాన పరిషత్ ఆస్పత్రుల్లో ఏర్పాటు చేసి ఆయా ప్రాంతాల్లో ఉచితంగా మందుల పంపిణీ, కౌన్సిలింగ్ తదితర కార్యకలాపాలు చేపడుతున్నారు. అలాగే వ్యాధి సోకిన గర్భిణులకు చికిత్స ప్రారంభించేప్పుడు సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా రాగోలులో కేర్ అండ్ సపోర్టు సెంట ర్ను ఏర్పా టు చేశారు. జిల్లా వ్యాప్తం గా శ్రీకాకుళం, పలాసలలో రెండేసి, సోంపేట, పాతపట్నం, పూండిలలో ఒక్కొక్కటి చొప్పున ప్రైవేటు ఆస్పత్రుల్లోనూ ప్రభుత్వ అనుమతితో ప్రైవేటు పార్టనర్ల పేరిట పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇటీవలే జిల్లాలోని మొత్తం 76 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు టెస్టింగ్ కిట్లను పంపిణీ చేయడంతో పీహెచ్సీ స్థాయిలోనూ పరీక్షలు ఆరంభం కానున్నాయి. అవగాహన పెంపొందించుకుంటే నియంత్రణ... ఇదే విషయమై జిల్లా ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ నోడల్ అధికారి, జిల్లా అదనపు డీఎంఅండ్హెచ్ఓ డాక్టర్ డి.రత్నకుమారి, జిల్లా ప్రాజెక్టు మేనేజర్ ఉమా మహేశ్వరరావు ఆదివారం రాత్రి ‘సాక్షి’తో మాట్లాడుతూ అవగాహన పెంచుకుంటే హెచ్ఐవీని అదుపులో ఉంచవచ్చునన్నారు. సందేహం ఉంటే పరీక్ష చేయించుకోవాలని, సరైన చికిత్స పొందితే దాదాపు 20 ఏళ్లు ఆరోగ్యంగా జీవించే అవకాశం ఉందని అన్నారు. కాగా హెచ్ఐవీ సోకిన రోగులకు రూ.వెయ్యి పింఛను, ఆర్టీసీలో ప్రయాణానికి 50 శాతం రాయితీ, ఎస్సీ, బీసీ కార్పొరేషన్ల ద్వారా 50 శాతం రాయితీతో రుణాలు అందజేస్తున్నారు. కొద్ది నిమిషాలు చర్చిస్తే చాలు... హెచ్ఐవీ, ఎయిడ్స్ తీవ్రతను ప్రజలకు తెలియజేందుకు ప్రభుత్వ యంత్రాంగం బహుముఖ ప్రయత్నం చేస్తోంది. స్వచ్ఛంద సంస్థల సేవలను వినియోగించుకుంటోంది. అలాగే జిల్లాలో ఏ స్థాయి అధికారిక సమావేశం జరిగినా ప్రారంభంలో కొద్ది నిముషాలు ఎయిడ్స్పై చర్చించాలని నిర్దిష్టమైన ప్రభుత్వ ఆదేశాలున్నాయి. ఆరంభంలో అధికారులు ఈ నిబంధన పాటించి తర్వాత వదిలేశారు. మరో పక్క హెచ్ఐవీ, ఎయిడ్స్ జిల్లాలో చాపకింద నీరులా ప్రవేశిస్తోంది. రాజాం ప్రాంతంలో అత్యధిక సంఖ్యలో హెచ్ఐవీ, ఎయిడ్స్ రోగులున్నట్టు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. సమావేశాల ముందు ఎయిడ్స్పై చర్చించే ప్రక్రియ దాదాపు నిలిచిపోవడంతో గ్రామస్థాయి ప్రజలకు వ్యాధి తీవ్రతపై అవగాహన కలగడం లేదు. దీనిపై జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ శ్యామల వివరణ ఇస్తూ ఇకపై అన్ని అధికారిక సమావేశాల్లో హెచ్ఐవీపై రెండు నిమిషాలైనా చర్చించేలా చర్యలు తీసుకుంటామన్నారు. వ్యర్థ్దాలతో ఎయిడ్స చిహ్నం సీతంపేట : స్థానిక మం డల సహిత ఉపాధ్యాయుడు కందికప్ప చక్రధర్ నేడు ఎయిడ్స్ దినోత్స వం సందర్భంగా వ్యర్థపదార్థాలతో ఎయిడ్స్ చిహ్నమైన రెడ్రిబ్బన్ను వ్యర్థ పదార్థాలతో తయారు చేశారు. దీనికి మధ్యలో గ్లోబు ఉంచారు. దీన్ని తయారు చేయడానికి స్పైరల్ బైండింగ్ ఎరుపు పేపరు, ఎలక్ట్రానిక్ ప్లాస్టిక్ పైపు, పాత బంతి, రక్త పరీక్షల బీడలు, ఫెవికిక్ ఉపయోగించారు. రెండు గంటల సమయంలో దీన్ని తయారు చేసినట్టు చక్రధర్ తెలిపారు. -
హెచ్ఐవీ నివారణకు కొత్త జెల్
వాషింగ్టన్: ప్రాణాంతక ఎయిడ్స్ వైరస్ హెచ్ఐవీని సమర్థంగా అడ్డుకునేందుకు సరికొత్త జెల్ వంటి ఓ మెత్తని పదార్థాన్ని భారత సంతతి శాస్త్రవేత్త నేతృత్వంలోని బృందం ఆవిష్కరించింది. సముద్రమొక్కల నుంచి సేకరించిన కారాగీనన్ అనే పాలీశాకరైడ్తో వైరస్ నిరోధక ఔషధం టీనోఫోవిర్ను కలిపి ఉపయోగించేందుకు వీలుగా ఈ జెల్ను తయారు చేశారు. దీనిలో టీనోఫోవిర్ను నింపి స్త్రీ యోనిలోకి ప్రవేశపెట్టడం ద్వారా అరక్షిత శృంగారం జరిపినా కూడా హెచ్ఐవీ వ్యాప్తి చెందదని అమెరికాలోని పెన్సిల్వేనియా స్టేట్ యూనివర్సిటీకి చెందిన పరిశోధన బృందం సారథి టోరల్ ఝవేరీ తెలిపారు. హెచ్ఐవీ, ఇతర వైరస్లను నివారించే మందులను జెల్తో మాత్రమే కాకుండా నురగ, క్రీము, స్పాంజ్, ఫిల్మ్ల ద్వారా కూడా ఉపయోగించవచ్చన్నారు. ఇంతవరకూ హెచ్ఐవీ నిరోధక జెల్లు జంతు ఉత్పత్తుల నుంచి సేకరించే జెలాటిన్ పదార్థంతో తయారు చేశారని, తాము మాత్రం పూర్తి శాకాహార పదార్థాలతోనే ఈ జెల్ను సృష్టించామని పేర్కొన్నారు. -
హెచ్ఐవీ సోకిన 12 మంది చిన్నారులు దత్తత!
మీరట్: మంచి పనులు చేయడానికి కావాల్సింది మాటలు కాదు.. చేతలు కావాలి. అందుకే ప్రార్ధించే పెదవుల కన్నా.. సాయం చేసే చేతులే మిన్నా అన్నారు. హెచ్ఐవీ సోకిన 12 మంది పిల్లల్ని దత్తత తీసుకుని మనకు చేతనైన సాయంలో భాగం కావాలని సాటి చెప్పాడు అజయ్ శర్మ. మీరట్ లోని గంగానగర్ లో ఉంటున్నఅజయ్ శర్మ హెచ్ఐవీ బారిన పడ్డ చిన్నారులకు అన్నీ తానై ఆసరాగా నిలిచాడు. ఆ చిన్నారులు తల్లి దండ్రులను ఎయిడ్స్ మహమ్మారి కాటేయడంతో వారు అజయ్ వద్దకు చేరారు. కొంతమంది పిల్లలు తల్లిదండ్రులు బ్రతికున్నాన్నాళ్లు వారి వద్దే ఉన్నా తరువాత ఆదరణ కరవైంది. బంధువులు కూడా ఛీదరించుకున్న సమయంలో అజయ్ వారిని అక్కున చేర్చుకుని ఆశ్రయమిచ్చాడు. కొంతమంది సందర్శకులు ఆ పిల్లల ఉన్న గృహాన్ని సందర్శించినప్పుడు ఈ విషయాలు వెలుగుచూశాయి. ఆ సందర్శకులను వివేక్ అనే 12 ఏళ్ల చిన్నారి చెమర్చిన కళ్లతో స్వాగతం పలకడం వారిని కలిచివేసింది. వీరిలో ఉన్న చిన్నారులంతా ఏడు సంవత్సరాల నుంచి 17 ఏళ్ల లోపు వారే కావడం గమనార్హం. 'నాకు 12 మంది పిల్లలు ఉన్నారు. ప్రతీ ఒక్కరూ నాకు అమూల్యమైన వారే. అత్యంత ప్రాణాంతక వ్యాధి బారిన పడ్డ ఆ తల్లిదండ్రులకు వారిని పెంచడం నిజంగా కష్టంతో కూడుకున్న పని. ఆ క్రమంలో ఈ 12 మంది నాచెంతకు చేరడం నా అదృష్టం' అంటూ అజయ్ నవ్వుతూ ఆ సందర్శకులకు తెలిపాడు. -
హెచ్ఐవీని చంపే కండోమ్ వచ్చేస్తోంది...
ప్రాణాంతక ఎయిడ్స్ వైరస్ హెచ్ఐవీని అడ్డుకోవడమే కాదు.. దానిని పూర్తిగా హతమార్చగలిగే రక్షణ కవచం త్వరలోనే అందుబాటులోకి రానుంది. హెచ్ఐవీని చంపగల సమర్థమైన కండోమ్ను అభివృద్ధిపర్చినట్లు ఆస్ట్రేలియాలోని ‘స్టార్ఫార్మా’ కంపెనీ ప్రకటించింది. ‘వైవాజెల్ కండోమ్’గా పేరుపెట్టిన ఈ నిరోధ్కు ఆస్ట్రేలియా థెరప్యూటిక్ గూడ్స్ అడ్మినిస్ట్రేషన్(టీజీఏ) అనుమతి కూడా లభించిందని, కొద్ది నెలల్లోనే ఈ కండోమ్లను మార్కెట్లోకి విడుదల చేస్తామని ఆ కంపెనీ వెల్లడించింది. ఆస్టోడ్రైమర్ సోడియమ్ అనే రసాయనంతో తయారు చేసిన జెల్ను వైవాజెల్ నిరోధ్ తయారీలో ఉపయోగించారట. ప్రయోగాత్మక పరీక్షల్లో ఈ జెల్ హెచ్ఐవీ వైరస్లను 99.9 శాతం కచ్చితత్వంతో చంపేసిందట. హెర్పిస్ (పొక్కులు), హ్యూమన్ పాపిలోమా వైరస్లను కూడా ఈ నిరోధ్ హతమారుస్తుందట. హెచ్ఐవీని చంపే కండోమ్ తయారీ ప్రపంచంలో ఇదే తొలిసారని, దీనిని ఉపయోగిస్తే హెచ్ఐవీ, సుఖవ్యాధుల నుంచి వంద శాతం రక్షణ లభించినట్లేనని కంపెనీవారు ధీమాగా చెబుతున్నారు. -
హెచ్ఐవీ బాధిత బాలికకు అండగా...
మండపేట : తాను చేయని తప్పుకు బలై కానిరోగం బారిన పడి అయినవారికి బారమైన ఓ బాలికకు మండపేట పోలీసులు అండగా నిలిచారు. ఆమెకు ఓ గూడు, ఆసరా చూపారు. మండపేట మండలం మారేడుబాకకు చెందిన ఒకబాలిక తల్లిదండ్రులను ఆమె చిన్నతనంలోనే హెచ్ఐవీ భూతం కబళించింది. అదే వ్యాధితో ఆమె తన సోదరిని కూడా కోల్పోయింది. తల్లిదండ్రుల ద్వారా సంక్రమించిన ఆప్రాణాంతక వ్యాధితో ఆమె కూడా బాధపడుతోంది. ఆమె బంధువులందరూ నిరుపేదలే కావడంతో ఆమెకు ఆశ్రయం కరవైంది. స్థానికుల చొరవతో ఆమె ఏడేళ్లుగా పట్టణంలోని ఒక హాస్టల్లో ఉంటూ ఇంటర్మీడియట్ ఒకేషనల్ కోర్సు పూర్తిచేసింది. ఇప్పుడు ఆమె వయస్సు 17 సంవత్సరాలు. ఆమెను హాస్టల్లో కొనసాగించేందుకు నిబంధనలు ఒప్పుకోవంటూ ఇటీవల హాస్టల్ అధికారులు ఆమెను బయటకు పంపేశారు. దాంతో ఆమె తన పెదనాన్న, మేనత్తల పంచకు చేరింది. వారి ఆర్థిక పరిస్థితి కూడా అంతంతమాత్రమే కావడంతో ఎవరు ఆమెను సంరక్షించాలనే విషయమై వివాదం తలెత్తింది. దాంతో ఇరు కుటుంబాల వారు సోమవారం పోలీస్స్టేషన్కు వెళ్లారు. బంధువులు ఆమెను స్టేషన్ బయటే వదలిపెట్టి వెళ్లిపోయారు. విషయం ఆరా తీసిన మండపేట ఎస్సై క్రాంతికుమార్ ఆమె దీనావస్థను చూసి చలించిపోయారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ సరిగా మాట్లాడలేకపోతున్న ఆమె సంరక్షణ బాధ్యతలను ఏదైనా సంస్థకు అప్పగించాలని భావించారు. విషయాన్ని మండపేట సీఐ విజయారావు దృష్టికి తీసుకువెళ్లారు. స్త్రీ, శిశుసంక్షేమశాఖ అధికారులతో పాటు పలుశాఖల అధికారులతో ఏస్సై, సీఐ మాట్లాడారు. చివరకు రావులపాలెంలోని ఫారా స్వచ్ఛంద సంస్థ గురించి తెలియడంతో వారితో మాట్లాడారు. వారు ఆమెను సంరక్షించేందుకు అంగీకరించడంతో మంగళవారం మధ్యాహ్నం సీఐ విజయారావు, ఎస్సై క్రాంతికుమార్లు ఖర్చుల కోసం రూ. 1500 నగదు ఇచ్చి, ఏఎస్సై దేవరను తోడుగా ఇచ్చి ఆమెను రావులపాలెం పంపించారు. మండపేట పోలీసులు చూపిన చొరవను పలువురు పట్టణవాసులు అభినందించారు. పౌష్టికాహారం రావులపాలెం పంపిస్తాం మండపేటకు చెందిన ‘మేమున్నాం’ స్వచ్ఛంద సంస్థ ప్రతీ నెలా సుమారు 60 మంది హెచ్ఐవీ బాధిత చిన్నారులకు ఒక్కొక్కరికి రూ.500 విలువ చేసే పౌష్టికాహార కిట్లు పంపిణీ చేస్తోంది. అందులో భాగంగా మారేడుబాకకు చెందిన బాలికకు కూడా ప్రతీనెలా పౌష్టికాహారం అందజేస్తున్నారు. ప్రస్తుతం ఆమెను రావులపాలెం తరలించడంతో ఇకపై ప్రతీనెలా పౌష్టికాహారాన్ని అక్కడకు తీసుకువెళ్లి అందజేస్తామని సంస్థ వ్యవస్థాపకుడు బుంగా సంజయ్ తెలిపారు. -
హెచ్ఐవీకి సోయా సాస్తో విరుగుడు
సోయా సాస్లో రుచిని పెంచేందుకు ఉపయోగించే ఈఎఫ్డీఏ అనే మాలిక్యూల్తో హెచ్ఐవీ, ఇతర వైరస్ల నివారణకు మందు తయారు చేయొచ్చట. ఎయిడ్స్ నివారణకు కొత్త మందులపై పరిశోధిస్తున్న యూనివర్సిటీ ఆఫ్ మిస్సోరీ శాస్త్రవేత్తలు ఈ దిశగా ముందడుగు వేశారు. ప్రస్తుతం ఎయిడ్స్కు టీనోఫోవిర్ను ఔషధంగా వాడుతున్నారు. ఈ మందుకు హెచ్ఐవీ నిరోధకత ఏర్పర్చుకుంటుండటం వల్ల మరింత శక్తిమంతమైన మందులను వాడాల్సిన వస్తోంది. అయితే సోయా సాస్కు రుచిని పెంచే ఈఎఫ్డీఏ మాలిక్యూల్ను పరీక్షిస్తుండగా.. దీనికి వైరస్ల వ్యాప్తిని అడ్డుకునే లక్షణం ఉన్నట్లు జపాన్ కంపెనీ 2001లో గుర్తించింది. తర్వాత దీనిపై కొనసాగుతూ వచ్చిన పరిశోధనలు ఓ కొలిక్కి వచ్చాయి. హెచ్ఐవీ కణాల మూలాలపై దెబ్బకొడుతూ ఆ కణాలు విభజన చెందకుండా ఈఎఫ్డీఏ అడ్డుకుంటుందట. టీనోఫోవిర్ కన్నా ఈ మాలిక్యూల్ 70 రెట్లు శక్తిమంతమైనది కావడం విశేషం. -
టీబీ పరీక్షలకు జంకుతున్న హెచ్ఐవీ రోగులు
న్యూఢిల్లీ: టీబీగా పిలిచే ట్యూబర్క్యులోసిస్ (క్షయ) నివారణకు దేశవ్యాప్తంగా ఉచితంగానే చికిత్స పొందే పరిస్థితి ఉన్నప్పటికీ కొందరు ఈ కేంద్రాలకు వెళ్లేందుకు జంకుతున్నారు. ముఖ్యంగా హెచ్ఐవీ సోకిన రోగులకు టీబీ సంక్రమించే అవకాశం ఎక్కువగా ఉన్నా టీబీ పరీక్షలు చేసుకునేందుకు టీబీ కేంద్రాలకు వెళ్లకుండా ప్రాణాలమీదకు కొనితెచ్చుకుంటున్నారు. వరల్డ్ టీబీ డేను పురస్కరించుకొని నగరంలో సోమవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో టీబీ విభాగం డెరైక్టర్ జనరల్ ఆర్ఎస్ గుప్తా మాట్లాడుతూ... ‘హెచ్ఐవీ సోకినవారికి టీబీ సంక్రమించే అవకాశం చాలా ఎక్కువ. అయితే హెచ్ఐవీ సోకినవారు, టీబీ సోకినవారు వైద్య కేంద్రాలకు వెళ్లేందుకు భయపడుతున్నారు. ఎక్కడ తమ వ్యాధి గురించి ఇతరులకు తెలిసిపోతుందోనన్న భయంతో నివారణ కేంద్రాలకు వెళ్లకుండా ప్రాణాలమీదకు తెచ్చుకుంటున్నారు. హెచ్ఐవీ సోకినవారికి సరైన చికిత్స అందకపోతే మరణించే అవకాశం కాస్త ఆలస్యంగా ఉన్నా అదే వ్యక్తికి టీబీ ఉంటే చాలా త్వరగా మృత్యువు ఒడిలోకి చేరుతారు. టీబీ వ్యాధి ఉండి, హెచ్ఐవీ సోకినవారికి సరైన మందులు అందకపోతే 50-60 శాతం మరణించే అవకాశం ఉంద’న్నారు. హెచ్ఐవీ సోకినవారికి రోగనిరోధక శక్తి తగ్గే అవకాశం ఉన్నందున టీబీ పరీక్షను కూడా జరిపించుకోవాలని, సోకినట్లు తేలితే వెంటనే చికిత్స చేయించుకోవాలన్నారు. మృత్యువాత పడుతున్న హెచ్ఐవీ రోగుల్లో 25 శాతం మంది టీబీ కారణంగానే మరణిస్తున్నట్లు చెప్పారు. దేశంలో దాదాపు 21 లక్షల మంది హెచ్ఐవీ రోగులు ఉన్నారని చెప్పారు. బరువు తగ్గినట్లు అనిపించినా, రాత్రి సమయంలో చెమటలు పడుతున్నా, మూడు వారాలకు మించి దగ్గు ఉన్నా హెచ్ఐవీ రోగులు వెంటనే టీబీ పరీక్ష చేయించుకోవాలని సూచించారు. అయితే చాలా తక్కువ సంఖ్యలో ఉన్న టీబీ కేంద్రాలు కూడా రోగుల పట్ల సమస్యగా మారాయన్నారు. ‘పాలసీ అండ్ ప్రోగ్రామ్ ఇన్ ఇండియా హెచ్ఐవీ/ఎయిడ్స్ అలయెన్స్’ డెరైక్టర్ సోనాల్ మెహతా మాట్లాడుతూ... ప్రజలకు హెచ్ఐవీతోపాటు టీబీపై కూడా అవగాహన కల్పించాల్సిన అవసరముందన్నారు. ముఖ్యంగా హెచ్ఐవీ రోగులకు టీబీపై సరైన అవగాహన కల్పించి, చికిత్సా కేంద్రాలకు వెళ్లేలా చే యాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. హెచ్ఐవీ రోగులు నెలలో కనీసం ఒక్కసారైనా టీబీ పరీక్ష చేయించుకుంటే మంచిదని ఆమె అభిప్రాయపడ్డారు. ఎయిమ్స్ వద్ద విద్యార్థుల మానవహారం క్షయ(టీబీ)పై అవగాహన కల్పించేందుకు వందలాదిమంది విద్యార్థులు మానవహారంగా ఏర్పడ్డారు. వరల్డ్ టీబీ డేను పురస్కరించుకొని ఎయిమ్స్ వద్ద ఏర్పాటు చేసిన మానవహారంలో నగరంలోని పలు పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు. ఎయిమ్స్ డెరైక్టర్ మిశ్రా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. -
హెచ్ఐవీ, హెపటైటిస్లు హోమియోతో హద్దుల్లో...
రక్తమార్పిడి. ఇంజక్షన్లు, సంభోగం, ముద్దుల ద్వారా లైంగిక వ్యాధులు వ్యాపిస్తాయి. ఒక్కోసారి ఇవి ప్రాణాంతకమూ కావచ్చు. హెర్పిస్, గనేరియా, సిఫిలిస్, హెచ్పీవీ లాంటి వ్యాధులను ముందే గుర్తించి హోమియో చికిత్స తీసుకుంటే పూర్తిగా నయమవుతాయనీ, హెచ్ఐవి లాంటివి నియంత్రణలో ఉండి, రోగనిరోధకశక్తి పెరుగుతుందని అంటున్నారు ప్రముఖ హోమియో వైద్యనిపుణులు డాక్టర్ రవికిరణ్. ఎయిడ్స్ లేదా హెచ్ఐవి: హ్యూమన్ ఇమ్యునో డెఫిషియన్సీ వైరస్ వ్యాధి నిరోధకశక్తిని నాశనం చేసి, టీబీ, ఫంగల్ ఇన్ఫెక్షన్స్, నిమోనియా, విరేచనాలు, చర్మరోగాలకు తేలిగ్గా గురయ్యేలా చేస్తుంది. లక్షణాలు: అరక్షిత సంభోగం అనంతరం రెండు నుంచి నాలుగు వారాల తర్వాత జ్వరం, గొంతునొప్పి, కురుపులు, ఒళ్ళు నొప్పులు, నీరసం, నోటిపూత, తలనొప్పి, వికారం, వాంతులు, బరువు తగ్గడం, నోటిలో అల్సర్లు, రాత్రిపూట చెమటలు, కీళ్ళ నొప్పులు, గవద బిళ్ళల వాపు, కాలేయం, ప్లీహం వాపు. హెచ్ఐవీని గుర్తుపట్టేదెలా? ప్రాథమికంగా ట్రైడాట్ టెస్ట్; ఎలీసా; కచ్చితత్వానికి వెస్ట్రన్బ్లాట్ టెక్నిక్. హోమియో చికిత్స... హెచ్ఐవీ వ్యాధి బాధపడేవారిలో ముఖ్యమైన సమస్య రోగనిరోధకశక్తి తగ్గడం. రోగనిరోధకశక్తిని తగ్గకుండా ఆపగలిగితే రోగికి హెచ్ఐవీ కాంప్లికేషన్స్ రాకుండా మరికొంత సమయం ఆపవచ్చు. రోగికి హోమియో వైద్యం ద్వారా ఆరోగ్యవంతమైన జీవనాన్ని అందించవచ్చు. హెపటైటిస్ బి, సి వ్యాధులు : కొన్ని వైరస్లు శరీరంలో ప్రవేశించి నిద్రాణంగా ఉండిపోతాయి. ఆ సమయంలో ఎలాంటి లక్షణాలూ కనిపించవు. లక్షణాలేమీ లేవు కదా అని నిర్లక్ష్యంగా ఉండిపోతే ఒక్కోసారి ప్రాణాపాయం ఏర్పడవచ్చు. అలాంటి వాటిలో ముఖ్యమైనవి హెపటైటిస్ బి, సి, హెర్పిస్ సింప్లెక్స్ వైరస్లు. హెపటైటిస్ బి, సి కూడా లైంగిక కారణాల వల్ల సంక్రమిస్తాయి. ఇందుకు హెపటైటిస్ బి, సి వైరస్లే కారణం. ఈ వైరస్ తన ప్రత్యుత్పత్తికి కాలేయాన్ని ఎంచుకోవడంతో కాలేయానికి సంబంధించిన సమస్యలు ఉత్పన్నమవుతుంటాయి. లక్షణాలు: అలసట, ఆకలి లేకపోవటం, వాంతులు, ఒళ్ళు నొప్పులు, జ్వరం ఉంటుంది. జ్వరం ఉన్నా బయటకు కనిపించదు. కళ్లు, శరీరం పచ్చగా మారటం, చర్మం మీద పొక్కులు, కీళ్లనొప్పులు, వాంతి వచ్చినట్టుగా అనిపించడం (వికారం), మూత్రం పచ్చగా రావడం; తరువాత నెమ్మదిగా కామెర్లు మొదలవుతాయి. చర్మంపై దద్దుర్లు కనిపిస్తాయి. చివరన కాలేయం పనితీరు తగ్గి మరణం సంభవిస్తుంది. హెచ్బీఎస్ ఏజీ అనే పరీక్ష ద్వారా హెపటైటిస్ బి వ్యాధిని గుర్తించవచ్చు. పీసీఆర్, డీఎన్ఏ క్వాలిటేటివ్ టెస్ట్ ద్వారా ఈ వ్యాధిని నిర్ధారించవచ్చు. హోమియో చికిత్స: హెపటైటిస్ బి, సి వైరస్లు కాలేయంలో పెరుగుతాయి. హోమియోలో క్లాసికల్ విధానం ద్వారానే ఈ వ్యాధిని ఎదుర్కోగలం. లైకోపోడియం, హెపర్ సల్ఫ్, మెర్క్సాల్, బ్రయోనియా, ఫాస్ఫరస్ వంటి మందులు వ్యాధిని తగ్గించడంలో బాగా ఉపయోగపడతాయి. హెర్పిస్ సింప్లెక్స్: ఒక గుండుసూది గుండు మీద కోటి వైరస్ల దాకా ఇమిడిపోయేంత సూక్ష్మమైన ఈ వైరస్ జీవితాంతం బాధిస్తుంది. హెర్పిస్ సింప్లెక్స్-2: ఈ వ్యాధి కూడా లైంగిక చర్యలతోనే వ్యాపిస్తుంది. తొలిదశలో జననాంగాల్లో మంట, నొప్పి, మూత్రంలో దురద, జ్వరం, ఒళ్ళు నొప్పులు, గజ్జలు, చంకల్లో గడ్డలు ఏర్పడటం దీని లక్షణాలు. వ్యాధి ముదిరాక జననాంగాలపై పొక్కులు ఏర్పడి, పగిలి పుండ్లలా మారతాయి. పరీక్షలు: హెచ్ఎస్వీ 1, 2 పరీక్షలు, ఐజీఏ, ఐజీఎం పరీక్షల ద్వారా. నిర్ధారణ: ఈ వ్యాధిలో వైరస్ నిర్ధారణ చాలా ముఖ్యం. లైంగిక సంపర్కం తరువాత వారం రోజులలో నీటి పొక్కులలాగా వచ్చి పుండ్లు కనిపిస్తాయి. హోమియో చికిత్స: హెర్పిస్ సింప్లెక్స్ వంటి లైంగిక వ్యాధుల నివారణకు హోమియో చికిత్స అద్భుతంగా పనిచేస్తుంది. ఈ చికిత్స మూలకారణాన్ని గుర్తించి దాన్ని తొలగిస్తుంది. దీనివల్ల సత్ఫలితాలు పొందవచ్చు. డాక్టర్ రవికిరణ్, గోల్డ్ మెడల్ ఫర్ ఎక్సలెన్సీ ఇన్ మెడిసిన్, ప్రముఖ హోమియో వైద్యనిపుణులు, మాస్టర్స్ హోమియోపతి, అమీర్పేట్, కూకట్పల్లి, దిల్సుఖ్నగర్, హైదరాబాద్, కరీంనగర్,విజయవాడ, ఫోన్: 7842 108 108 / 7569 108 108 -
హెచ్ఐవీపై విద్యార్థి వినూత్న ప్రచారం
చేగుంట, న్యూస్లైన్: హెచ్ఐవీ/ఎయిడ్స్ నివారణపై ఓ బాలుడు వినూత్న ప్రచారాన్ని నిర్వహిస్తున్నాడు. ఎయిడ్స్ నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈనెల ఒకటిన అన్ని ప్రాంతాల్లో విద్యార్థులు ర్యాలీలు నిర్వహించారు. ఒక్క రోజు కార్యక్రమాలతో మార్పు రాదని గమనించిన చేగుంటలోని కృష్ణవేణి టాలెంట్ స్కూల్కు చెందిన ఎనిమిదో తరగతి విద్యార్థి సాయి సాకేత్ తన ప్రచారాన్ని కొనసాగిస్తున్నాడు. తనకు సమయం చిక్కినప్పుడల్లా ప్లకార్డుతో చేగుంట, వడియారం గ్రామాల్లో తిరుగుతున్నాడు. ఇందులో భాగంగా శనివారం వడియారం గ్రామంలో హెచ్ఐవీ నివారణ కోసం ప్లకార్డు ప్రదర్శిస్తూ కనిపించాడు. ఎయిడ్స్/హెచ్ఐవీ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఒక వేళ వస్తే ఎలాంటి చికిత్స పొందాలో స్థానికులకు వివరిస్తున్నాడు. ఎయిడ్స్ నివారణ ప్రచారం కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేసే అధికారుల కన్నా ఈ విద్యార్థి ప్రచారమే బాగుందని అతడి ప్రయత్నాన్ని స్థానికులు అభినందించారు. -
హెచ్ఐవీ రోగులకు అధిక బీమా ప్రీమియం: ఐఆర్డీఏ
న్యూఢిల్లీ: హెచ్ఐవీ/ఎయిడ్స్ రోగులు అధిక జీవిత బీమా ప్రీమియం చెల్లించాల్సి ఉంటుందని నియంత్రణ సంస్థ ఐఆర్డీఏ స్పష్టం చేసింది. బీమా పథకం తీసుకొనేటప్పుడు ఇతర వ్యాధులు ఏవైనా ఉన్నా అధిక ప్రీమియం చెల్లింపు వర్తిస్తుందని ఐఆర్డీఐ చైర్మన్ టీఎస్ విజయన్ శుక్రవారం స్పష్టంచేశారు. బీమా ప్రొడక్ట్లు కొనేటప్పటికే వ్యాధులు ఏమైనా ఉన్నా, బీమా కంపెనీలు లైఫ్ కవర్ సదుపాయాన్ని అందిస్తాయని అయితే వాణిజ్యపరమైన గిట్టుబాటుకు వీలుగా తగిన ప్రీమియంను చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. ఇక్కడ జరిగిన ఫిక్కీ కార్యక్రమంలో పాల్గొన్న విజయన్ ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. హెచ్ఐవీ/ఎయిడ్స్ రోగులకు కొన్ని బీమా కంపెనీలు ఇప్పటికే బీమా కవరేజ్లు కల్పిస్తున్నాయని, మరిన్ని కంపెనీలు సైతం ఈ దశలో ముందుకు వస్తాయని తాను భావిస్తున్నానని అన్నారు. హెచ్ఐవీ/ఎయిడ్స్ రోగులను జీవిత బీమా కవర్లోకి తీసుకురావడంసహా పలు అంశాలపై అక్టోబర్లో ఐఆర్డీఏ ముసాయిదా మార్గదర్శకాలను ఆవిష్కరించింది. వీటిపై డిసెంబర్లోపు సంబంధిత వర్గాలు సూచనలు, సలహాలూ ఇవ్వాల్సి ఉంటుంది. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచీ ఈ తాజా మార్గదర్శకాలు అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. -
పోయిందనుకున్న హెచ్ఐవీ మళ్లీ వచ్చింది!!
రక్తంలోని మూలుగ మార్పిడి చికిత్స చేసిన తర్వాత ఇద్దరు రోగులకు పూర్తిగా నయం అయ్యిందనుకున్న హెచ్ఐవీ మళ్లీ వచ్చిందని అమెరికా వైద్యులు చెబుతున్నారు. శాస్త్రవేత్తలు అంచనా వేసినదానికంటే వైరస్ను కలిగి ఉన్న హెచ్ఐవీ రిజర్వాయర్లు, లేటెంట్ కణాలు చాలా లోతుగా ఉన్నాయని దీనివల్ల తేలినట్లు అమెరికాలోని బోస్టన్ బ్రిగామ్ అండ్ వుమెన్స్ హాస్పిటల్ వైద్యుడు, పరిశోధకుడు టిమోతీ హెన్రిచ్ తెలిపారు. తాము చికిత్స చేసిన రోగులకు మళ్లీ హెచ్ఐవీ రావడం చాలా నిరుత్సాహంగానే ఉన్నా, శాస్త్రీయంగా మాత్రం ఇది చాలా కీలకమని హెన్రిచ్ చెప్పారు. దీన్ని బట్టి చూస్తే హెచ్ఐవీని అంచనా వేయడంలో మనం ప్రస్తుతం అనుసరిస్తున్న ప్రమాణాలు ఏమాత్రం సరిపోవన్న విషయం అర్థమవుతోందన్నారు. 2008, 2010 సంవత్సరాల్లో ఇద్దరు హెచ్ఐవీ రోగులకు మూలుగ మార్పిడి చికిత్సలు చేశారు. ఆ తర్వాత దాదాపు 8 నెలల పాటు వారిద్దరిలోనూ హెచ్ఐవీ లక్షణాలు కనిపించలేదు. దాంతో ఈ సంవత్సరం యాంటీ రిట్రోవైరల్ చికిత్స ఆపేద్దామని భావించి వాళ్లు మరోసారి పరీక్ష చేయించుకోగా, వాళ్ల శరీరంలో అప్పటికి వైరస్ కనిపించలేదు. సరిగ్గా నెల రోజుల తర్వాత మళ్లీ పరీక్షిస్తే హెచ్ఐవీ కనిపించింది! దాంతో మళ్లీ చికిత్స మొదలుపెట్టాల్సి వచ్చింది. -
హెచ్ఐవీ రోగులకు పెళ్లి
చంద్రపూర్: ముంబై ఉగ్రవాద దాడుల్లో మృతి చెందిన రాష్ట్ర ఏటీఎస్ ప్రధానాధికారి హేమంత్ కర్కరేను స్ఫూర్తిగా తీసుకున్న చంద్రపూర్ ట్రాఫిక్ పోలీసులు ఓ హెచ్ఐవీ జంటకు వివాహం చేశారు. వరల్డ్ ఎయిడ్స్ డే సందర్భంగా న్ఠరానికి చెందిన నెట్వర్క్ ఆఫ్ మహారాష్ట్ర బై పీపుల్ లివింగ్ వీత్ హెచ్ఐవీ పాసిటివ్ అనే స్వచ్ఛంద సేవా సంస్థ సహకారంతో ఈ జంటకి పెళ్లి చేశారు. 1990 సంవత్సరంలో చంద్రపూర్లో పోలీసు సూపరింటెండెంట్గా ఉన్న సమయంలో కర్కరే ప్రారంభించిన హెచ్ఐవీ అవగాహన కార్యక్రమాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఇప్పటికీ వివిధ సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నామని నగర ట్రాఫిక్ విభాగ ఇన్స్పెక్టర్ పండలిక్ సప్కలే సోమవారం మీడియాకు తెలిపారు. ఇప్పటివరకు హెచ్ఐవీ కలిగిన ఎనిమిది జంటలను ఒకటీ చేశామని సంస్థ కన్వీనర్ విజయ్ బెండే తెలిపారు. హెచ్ఐవీ వచ్చిందంటే సమాజం వేలివేసి చూసే ఈ రోజుల్లో తమ భాగస్వామి కోసం వెతికే సమయంలో తమ పరిస్థితిని రోగులు వెల్లడించడం లేదన్నారు. కొన్నిసార్లు ఇది ఆరోగ్యంగా ఉన్న వ్యక్తితో హెచ్ఐవీ రోగి వివాహం చేసుకునేందుకు దారి తీస్తుందని తెలిపారు. దీనిని పరిగణనలోకి తీసుకొని హెచ్ఐవీ పాజిటివ్ ఉన్న వారికి అదే కమ్యూనిటీ నుంచి జీవిత భాగస్వామిని ఎంచుకునేలా ప్రోత్సహిస్తున్నామన్నారు. వీరి వివరాలు రహస్యంగా ఉంచుతున్నామని వెల్లడించారు -
వివరం: మాట్లాడుకోవాల్సిన మహమ్మారి
డిసెంబర్ 1 ఎయిడ్స్ డే డిసెంబర్ 1 ‘ఎయిడ్స్ దినోత్సవం’ కాదు; అది ఎయిడ్స్ దినం మాత్రమే! అందులో ఉత్సవం ఎక్కడ? ప్రపంచాన్ని భయపెట్టే యుద్ధ బీభత్సాలు, ప్రకృతి ఉత్పాతాలు, కరువు కాటకాల లాంటి జాబితాలో ‘ఎయిడ్స్’ కూడా చేరిపోయింది. అధికంగా వినడం వల్ల కొంత పలుచబారిపోయినట్టనిపించినా, అదింకా మెడికల్ ఛాలెంజే! మధ్యయుగాల్లో మశూచి, ప్లేగులాగా ఈ ఆధునిక కాలంలో ఎయిడ్స్ అటు చికిత్సలేని వ్యాధి; కొంత ‘నైతికత’తో ముడిపడివుండటం వల్ల ఇటు వివక్షను ఎదుర్కునేది కూడా! అందుకే దానిగురించి ఇంతగా ప్రచారం! మనమూ హెచ్ఐవి/ఎయిడ్స్ గురించి మాట్లాడుకుందాం; మాట్లాడకుండా దాచుకోవడమే కదా ప్రమాదం! ఐక్యరాజ్యసమితి అంచనా మేరకు, ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు ‘ఎయిడ్స్’తో సుమారు 3.6 కోట్ల మంది చనిపోయారు. ఈ సంఖ్య దాదాపుగా కేరళ లాంటి ఒక రాష్ట్ర జనాభా మొత్తం! అదే ఐక్యరాజ్యసమితి ప్రకారం, ఒక్క 2012 సంవత్సరంలోనే ఎయిడ్స్ సోకినవాళ్లు 16 లక్షల మంది మృత్యువాత పడ్డారు. ఈ సంఖ్య ప్రకాశం లాంటి జిల్లా జనాభాలో దాదాపుగా సగం! ఇంత ప్రచారంలో కూడా, ప్రతిరోజూ 900 మంది పిల్లలు పుడుతూనే కొత్తగా హెచ్ఐవి బారిన పడుతున్నారని ఐక్యరాజ్యసమితి ఆందోళన చెందుతోంది. ఈ సంఖ్య ఒక పెద్ద పాఠశాలలోని విద్యార్థుల మొత్తానికి సమానం! మరణించేవారంతా ఎక్కువగా పేద, వెనకబడిన దేశాల్లోనివారే! హెచ్.ఐ.వి. అంటే ఏమిటో, ఎయిడ్స్ అనే పదాన్ని ఎలా విస్తరించాలో తెలియనివాళ్లు కూడా వీటివల్ల అర్ధాంతరంగా తనువు చాలిస్తున్నారు. హెచ్ఐవి ఏమిటి? ఎయిడ్స్ ఏమిటి? హెచ్ఐవి (హ్యూమన్ ఇమ్యునోడెఫిషియెన్సీ వైరస్) మనిషిలో రోగనిరోధకశక్తిని హరింపజేసే ఒక వైరస్. ఇది ప్రధానంగా శరీరంలోని ద్రవాల్లో ఉంటుంది. రక్తం, వీర్యం, మహిళల్లోనైతే యోనిద్రవాలు, చనుబాలు దీని స్థావరాలు. ఇది ఎవరికైనా ఉందని నిర్ధారణ కావడమేహెచ్ఐవి పాజిటివ్. అయితే, దీనికిదే జబ్బు కాదు. వైరస్ సోకిన ఒకటి నుంచి నాలుగు వారాల్లో అది మనిషి శరీరంలో పూర్తిగా వ్యాపిస్తుంది. తన సంఖ్యను తాను పెంచుకుంటూ పోతుంది. పెంచుకోవడమే కాకుండా, మనిషికి రోగనిరోధక శక్తినిచ్చే సీడీ-4 కణాలను చంపుతూ ఉంటుంది. దీనివల్ల, మరేదైనా వ్యాధికారక వైరస్ శరీరంలోకి ప్రవేశించినప్పుడు, దాన్ని సహజంగా ఎదుర్కోగలిగే రక్షణ వ్యవస్థ మనిషికి ఉండదు. దాంతో అతడికి ఏ స్వల్ప రుగ్మత సోకినా ప్రాణాలమీదికి వస్తుంది. ఇదీ ఎయిడ్స్! (ఎ.ఐ.డి.ఎస్.- ఎక్వైర్డ్ ఇమ్యూనో డెఫిషియెన్సీ సిండ్రోమ్). తొలుత ‘4హెచ్’ వ్యాధి హెచ్ఐవి సోకిన తర్వాత, మనిషిలో సీడీ కౌంట్ 200/ఎంఎం క్యూబ్ దాకా పడిపోయినప్పుడు ఎయిడ్స్కు దాదాపుగా చేరువైనట్టు! ఈ స్థితి కొందరికి ఒకట్రెండేళ్లకే రావొచ్చు; కొందరికి 10-12 ఏళ్లదాకా ఏ ఇబ్బందీ ఉండకపోవచ్చు. 1981లో అమెరికాకు చెందిన ‘సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్’ తొలిసారిగా ఎయిడ్స్ వ్యాధిని గుర్తించింది. తర్వాత, దీనికి కారణం హెచ్ఐవి వైరస్ అని తేల్చింది. 1970ల ప్రాంతంలో కొందరు అమెరికా యువకుల్లో- ముఖ్యంగా మాదక ద్రవ్యాలు వాడేవారు, హోమోసెక్సువల్సులో రోగనిరోధక శక్తి పోయి, అరుదుగా సంభవించే చర్మవ్యాధులు వారికి సోకాయి. అంతుబట్టని, పేరులేని రుగ్మతలుగానే ఇవి కొన్నాళ్లు కొనసాగాయి. కొంతకాలం దీన్ని ‘4హెచ్ వ్యాధి’ అని పిలిచేవారు. ఎందుకంటే-హైతియన్స్(అమెరికాలోని హైతీమూలాలున్న ప్రజలు), హోమోసెక్సువల్స్(స్వలింగ సంపర్కులు), హీమోఫీలియాక్స్(రక్తం ఆగనివాళ్లు), హెరాయిన్ యూజర్స్(మాదకద్రవ్యం హెరాయిన్ వాడేవాళ్లు)లో మాత్రమే ఈ వ్యాధిని తొలుత ఎక్కువగా గుర్తించడంవల్ల! మరికొన్నాళ్లు ‘గ్రిడ్’ (జి.ఆర్.ఐ.డి.- గే రిలేటెడ్ ఇమ్యూనో డెఫిషియెన్సీ)గా కూడా పిలిచారు. ఇది స్వలింగ సంపర్కులకు మాత్రమే పరిమితమైన జబ్బు కాకపోవడం వల్ల దీనికి మించిన పేరు అవసరమైంది. అలా ‘ఎయిడ్స్’ అనే మాట ఉనికిలోకి వచ్చింది. ఆఫ్రికా కోతుల్లో మొదలు... ఇరవయ్యో శతాబ్దపు తొలినాళ్లలో పశ్చిమ మధ్య ఆఫ్రికాలో హెచ్ఐవి వైరస్ ప్రాణం పోసుకుందని అంచనా వేస్తున్నారు. కామెరూన్ దేశంలో కొన్ని రకాల పెద్ద కోతులకు ఎస్.ఐ.వి. (సిమియన్ ఇమ్యునో డెఫిషియెన్సీ వైరస్) సోకింది. ఇందులో వైల్డ్ చింపాంజీల్లాంటివాటి శరీరంలో ‘ఎస్ఐవి’ నిరోధకత లేదు; అదే, గుడ్లగూబకోతుల్లాంటివి మాత్రం తట్టుకోగలవు. వేటగాళ్లకుగానీ, వన్యమృగాల మాంస విక్రేతలకుగానీ ఈ వైరస్ పాకివుంటుంది. అయితే మనిషి శరీరంలోని రోగనిరోధకత ఈపాటి వైరస్ను సులభంగా అణచివేయగలదు! బ్రిటన్ వలస దేశాలుగా ఉన్న ఆఫ్రికా దేశాల్లో సమాజ మార్పులు జరిగి, వ్యభిచారం తీవ్రంగా పెరిగింది. 1928 ప్రాంతంలో కాంగో రాజధాని కిన్షాసాలో 45 శాతం మంది స్త్రీలు వ్యభిచార వృత్తిలో ఉన్నారు. మామూలు శృంగారంలో ఈ వైరస్ వ్యాప్తి తక్కువే అయినా, భాగస్వాముల్లో ఒకరికి సుఖవ్యాధులు ఉన్నప్పుడు, మర్మాంగాల్లో పొక్కులు ఉన్నప్పుడు వైరస్ బలం ఎక్కువ. అలాగే, రెండో ప్రపంచ యుద్ధం తర్వాత మలేరియా నిర్మూలన కార్యక్రమాల్లో భాగంగా శుభ్రం చేయని సిరంజీలతో టీకాలు గంపగుత్తగా వేయడం వల్ల ఈ వైరస్ అతి త్వరగా వ్యాప్తిచెందిందనీ, అక్కణ్నుంచి ప్రపంచాన్ని చుట్టుకుపోయిందనీ చెబుతారు. హెచ్ఐవి వైరస్లో రెండు రకాలున్నాయి. హెచ్ఐవి -1. ఇది చింపాంజీ, గొరిల్లాలాంటివాటిల్లో కనబడింది. హెచ్ఐవి-2 మరికొన్ని రకాల కోతులకు సోకుతుంది. అయితే, వాటికి దాన్ని తట్టుకునే నిరోధకశక్తి ఉంది. హెచ్ఐవి-1ను తిరిగి ‘ఎం’, ‘ఎన్’, ‘ఒ’ , ‘పి’ అని నాలుగు రకాలుగా వర్గీకరిస్తారు. మిగతావి కూడా ఎయిడ్స్ను కలగజేసినప్పటికీ ‘ఎం’ మనకు ఎక్కువ ప్రమాదకారి. 90 శాతం ఎయిడ్స్ రోగుల్లో ఉండేది ఇదే! హెచ్ఐవి అని మనం సాధారణంగా వ్యవహరిస్తున్నది నిజానికి ‘హెచ్ఐవి-1 ఎం’. మూడు ముఖ్యమైన మార్గాలు ‘‘హోమోసెక్సువల్స్కు దేవుడు విధించిన శిక్ష మాత్రమే కాదు ఎయిడ్స్; హోమోసెక్సువల్స్ను సహిస్తున్నందుకు దేవుడు సమాజానికి విధించిన శిక్ష కూడా’’ అన్నారు మతగురువు జెర్రీ ఫాల్వెల్. టాన్స్జెండర్స్, హోమోసెక్సువల్స్, బై సెక్సువల్స్... భాగస్వాముల్ని మార్చుతారు కాబట్టి, హై రిస్కు గ్రూపుగా ఉన్నప్పటికీ, అది వాళ్లకు మాత్రమే పరిమితం చేయడం వివక్ష మాత్రమే! సురక్షిత శృంగారంలో పాల్గొనని ఎవరికైనా రిస్కులో తేడాలేదు. అత్యాధునిక సమాజమనుకునే అమెరికాలో కూడా ఇంత ప్రచారం జరిగినా, యువకుల్లో యాభై శాతం మంది కండోమ్ను ఉపయోగించట్లేదు. వైరస్ శరీరంలో ఉన్నవారితో లైంగిక సంబంధాలవల్ల, రక్తమార్పిడి వల్ల, బిడ్డ నుంచి తల్లికి ఇది ముఖ్యంగా సోకుతుంది. వెంటనే లక్షణాలు కనిపించవు. హెచ్ఐవి సోకినట్టు కూడా తెలియదు. కొంత కాలం గడిచాక జ్వరం రావడం, ముఖం, మెడ, ఛాతీ మీద రాష్ రావడం, లింఫ్నోడ్స్ వాచడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. గొంతునొప్పి, తలనొప్పి, కండరాల నొప్పి, కీళ్లనొప్పులు వస్తాయి. బరువు తగ్గుతుంది. వికారం, వాంతులు ఇతర లక్షణాలు. వ్యాధి ముదురుతున్నకొద్దీ జ్వరం అధికమవడం, నీళ్ల విరేచనాలు, మర్మావయల్లో మంట, కంటిచూపు మందగించడం, శ్వాస పీల్చడం కష్టంకావడం, రాత్రుళ్లు చెమటపట్టడం, డయేరియా కనబడతాయి. హెచ్ఐవి రోగుల్లో అనుబంధ రోగాలు కూడా ఉండే అవకాశముంది. మూత్రపిండాల వ్యాధి (హెచ్ఐవి అసోసియేటెడ్ నెఫ్రోపతి), మెదడు పనితీరులో మార్పులు, హెపటైటిస్ బి/సి, క్షయ. సాధారణంగా అత్యధిక ప్రజానీకానికి (85శాతం) క్షయను కలిగించే ట్యూబర్క్యులోసిస్ బ్యాసిల్లస్ అనే టీబీ వ్యాప్తికారక బ్యాక్టీరియా శరీరాల్లో ఉంటుంది. సహజంగా ఉండే వ్యాధి రోగనిరోధక శక్తి వల్ల బ్యాక్టీరియా నిద్రాణంగా ఉంటుంది. దీనికిదే టీబీ అవదు. హెచ్ఐవి సోకి రోగనిరోధక శక్తి తగ్గిపోవడం మొదలుపెట్టగానే బ్యాక్టీరియా విజృంభిస్తుంది. అప్పుడు లక్షణాలు కనబడతాయి. అందుకే టీబీ ఉన్నవాళ్లకు హెచ్ఐవి నిర్ధారణ పరీక్షలు చేస్తారు. చికిత్స వైరస్ సోకివుంటుందని అనుమానం వ్యక్తం చేసినవాళ్లకు ముందుగా 72 గంటల్లోపు(మూడు రోజుల్లోపు) ఎమర్జెన్సీ హెచ్ఐవి పిల్స్ ఇస్తారు (పోస్ట్ ఎక్స్పోజర్ ప్రొఫిలాక్సిస్). ఈ చికిత్స నాలుగు వారాల పాటు సాగుతుంది. హెచ్ఐవి నిర్ధారణ పరీక్ష వైరస్ సోకిన నాలుగు నుంచి ఆరు వారాల్లో చేస్తారు. ‘పాజిటివ్’ అయితే గనక దానికి రోగి శరీరంలో రోగనిరోధకశక్తిని బయటినుంచి పెంచడమే మార్గం. దానికోసం ‘యాంటీ రెట్రోవైరల్’(ఎ.ఆర్.టి.) మందులు ఇస్తారు. హెచ్ఐవి తనను తాను కాపీ చేసుకుంటూ సంఖ్య పెంచుకోవడమేగాక, మందులనుంచి నిరోధకతను కూడా పెంపొందించుకుంటుంది. అందుకని ఆ వైరస్ను తప్పుదారి పట్టించేందుకు రకరకాల ఎ.ఆర్.టి. మందులను భిన్న కాంబినేషన్లుగా ఇస్తారు. ఈ మందులు ఇవ్వడం కూడా మూడు దశల్లో జరుగుతుంది. ఫస్ట్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్, సెకండ్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్, కాక్టెయిల్ ఆఫ్ మెడిసిన్స్! వీటిని దీర్ఘకాలం పాటు ఉపయోగిస్తే సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశముంది. శరీరంలో కొవ్వు పేరుకుపోయి శరీరాకృతి మారిపోవచ్చు. కానీ జీవితకాలాన్ని పెంచుకోవడానికి వాటిని భరించాల్సిందే! ఇక, గర్భధారణ, ప్రసవం, పాలిచ్చే సమయంలో తల్లి నుంచి బిడ్డకు ఈ వైరస్ సంక్రమించవచ్చు. ఇది 20-45 శాతం రిస్కు. నిర్ధారణ అవగానే తల్లి చికిత్స తీసుకోవడం, ముందే సిజేరియన్ ద్వారా బిడ్డను బయటికి తీయడం, పాలివ్వకపోవడం, బిడ్డకూ ప్రొఫిలాక్సిస్ మందులు ఇప్పించడం ద్వారా హెచ్ఐవి సంక్రమణ రిస్కును 2 శాతానికి తగ్గించవచ్చు. మెడికల్లీ మేనేజబుల్ డిసీజ్! హెచ్ఐవి ఉన్నప్పటికీ, అది ఎయిడ్స్లాగా మారినప్పటికీ అలాంటివారితో కరచాలనం చేసినా, కౌగిలించుకున్నా, ఒకే చోట నివసించినా, ఒకే పాత్రలు పంచుకున్నా వైరస్ సోకదు. ఆ రోగికి సేవలు చేసినా ప్రమాదం లేదు. వారితో కలిసి టాయ్లెట్ వాడుకోవచ్చు, టవల్స్ వాడుకోవచ్చు. రోగిని కుట్టిన దోమ మరొకరిని కుట్టినా ఏమీకాదు. ఉమ్మి, కన్నీళ్లు హెచ్ఐవిని సంక్రమింపజేయవు. శాశ్వత చికిత్స, వ్యాక్సిన్ ఇప్పటికి అందుబాటులో లేకపోయినా... బలవర్ధకమైన ఆహారం తీసుకుంటూ, వ్యాయామం చేసుకుంటూ, వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత పాటిస్తూ , క్రమంగా మందులు వాడుకుంటూ, నియమబద్ధమైన జీవితాన్ని గడిపేవాళ్లకు హెచ్ఐవి అంత భయపెట్టేదేమీ కాదు! ఐక్యరాజ్యసమితి అంచనా ప్రకారం 2012 నాటికి జనాభాలో శాతాల ప్రకారం అత్యధికంగాహెచ్ఐవి బారినపడ్డ పదిదేశాలు: దేశం శాతం స్వాజిలాండ్ 26.5 లెసోతో 23.1 బోట్స్వానా 23.0 దక్షిణాఫ్రికా 17.9 జింబాబ్వే 14.7 నమీబియా 13.3 జాంబియా 12.7 మొజాంబిక్ 11.1 మాలవి 10.8 ఉగాండా 7.2 నాలుగు కోట్ల బాధితులు! ఐక్యరాజ్యసమితి అంచనా ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 2012 నాటికి హెచ్ఐవీ బాధితులు సుమారు 3.53 కోట్ల మంది. అత్యధికంగా హెచ్ఐవి బారినపడ్డ పదిదేశాలు: దేశం సంఖ్య- లక్షల్లో దక్షిణాఫ్రికా 61 నైజీరియా 34 ఇండియా 21 కెన్యా 16 మొజాంబిక్ 16 ఉగాండా 15 టాంజానియా 15 జింబాబ్వే 14 మాలవి 11 జాంబియా 11 -
ఏజెన్సీకి ‘ఎయిడ్స్’ వణుకు
భద్రాచలం, న్యూస్లైన్: ఎయిడ్స్ నివారణకు ప్రభుత్వం అడ్డుకట్ట వేయలేకపోతుంది. వ్యాధి పీడుతుల ఆయుష్షు పెంచే అధునాతన మందులు అందుబాటులోకి వచ్చినా వాటిని సకాలంలో వారి దరికి చేర్చలేకపోతుంది. భద్రాచలం ఏజెన్సీ ఆస్పత్రుల్లో రక్త పరీక్షలు చేయించుకున్న ప్రతి వందమందిలో ఐదుగురు హెచ్ఐవీ పీడితులు ఉండటం ఆందోళన కలిగిస్తోంది. డిసెంబర్ 1న ప్రపంచ ఎయిడ్స్ దినం సందర్భంగా ‘న్యూస్లైన్’ ప్రత్యేక కథనం. జిల్లాలో ఎయిడ్స్ వ్యాధిని నియంత్రించేందుకు 2009లో ఎయిడ్స్ నియంత్రణ విభాగాన్ని ఏర్పాటు చేశారు. జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో హెచ్ఐవీ నిర్దారణ పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. సాధారణ వ్యాధి గ్రస్తులతో పాటు ఆస్పత్రులకు వైద్య సేవలు నిమిత్తం వచ్చే రోగులకు ఐసీటీసీ కేంద్రాలలో హెచ్ఐవీ పరీక్ష నిర్వహిస్తున్నారు. పీపీటీసీటీ కేంద్రాల్లో గర్భిణులకు పరీక్షలు నిర్వహిస్తున్నారు. వ్యాధి నివారణ, అవగాహన కల్పించే నిమిత్తం ప్రత్యేకంగా ఏఆర్టీ కేంద్రాలను ఏర్పాటు చేసి తగినంత మంది సిబ్బందిని కూడా నియమించారు. కానీ పరీక్షల్లో నిర్ధారణ అయిన వ్యాధి గ్రస్తులనే తప్ప పల్లెలపై అధికారులు దృష్టి సారించడం లేదు. హెచ్ఐవీ పరీక్షల నిమిత్తం 2002లో స్థానిక ఏరియా ఆస్పత్రిలో ఐసీటీసీ కేంద్రాన్ని ప్రారంభించారు. 2013 నవంబర్ 30 వరకు 42,416 మందికి రక్త పరీక్షలు నిర్వహించారు. వీరిలో 3,306 మందికి హెచ్ఐవీ సోకినట్లుగా నిర్దారణ అయింది. రెండేళ్లుగా వ్యాధిగ్రస్తుల సంఖ్య పరిశీలించినట్లైతే 2011లో 5,216 మందికి పరీక్షలు నిర్వహించగా 219 మందికి, 2012లో 4,925 మందికి రక్తపరీక్షలు నిర్వహించగా 279 మందికి హెచ్ఐవీ సోకినట్లుగా తేలింది. 2013 నవంబర్ 30 వరకు 7,917 మందికి పరీక్షలు నిర్వహించగా 240 మంది వ్యాధిగ్రస్తులు ఉన్నారు. ఈ ఏడాది 8 మంది గర్భిణులకు కూడా హెచ్ఐవీ సోకింది. పరీక్షలకే పరిమితమవుతున్న కేంద్రాలు ఎయిడ్స్ నిర్ధారణకు జిల్లా మొత్తంమీద 67 సమగ్ర హెచ్ఐవీ కౌన్సెలింగ్, పరీక్ష కేంద్రాలు ఉన్నాయి. వీటిలో 8 ఐసీటీసీలు, మూడు తల్లి నుంచి బిడ్డకు హెచ్ఐవీ సోకకుండా నివారణ కేంద్రాలు, 49 ఫెసిలిలేటెడ్ సమగ్ర హెచ్ఐవీ కౌన్సెలింగ్ పరీక్షా కేంద్రాలున్నాయి. ఖమ్మం, కొత్తగూడెం, భద్రాచలం, మధిర, సత్తుపల్లి, అశ్వారావుపేట, ఇల్లెందు వంటి చోట్ల ప్రత్యేక సిబ్బది పనిచేసే 11 కేంద్రాలు సైతం ఉన్నాయి. ఇంత పెద్ద యంత్రాంగం ఉన్నా వ్యాధి నిర్ధారణ తర్వాత హెచ్ఐవీ పీడితులకు సరైన కౌన్సెలింగ్ ఇవ్వకపోవడంతో వారు సకాలంలో వైద్యసేవలు పొందలేక మృత్యువుకు చేరువవుతున్నారు. పింఛన్ కోసం సవాలక్ష ఆంక్షలు ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు ప్రభుత్వం నెలకు రూ.200 చొప్పున పింఛన్ అందజేస్తుంది. కానీ నాలుగు నెలలుగా పింఛన్ బకాయిలు పెంఢింగ్లోనే ఉన్నాయి. జిల్లాలోని 29 మండలాల పరిధిలో ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు చికిత్సలు అందించే భద్రాచలం ఏఆర్టీ సెంటర్ పరిధిలో 210 మంది పింఛన్దారులు ఉన్నారు. మూడు నెలల పాటు క్రమం తప్పకుండా ఏఆర్టీ కేంద్రాల్లో చికిత్సలు పొందినట్లుగా నమోదైతేనే పింఛన్ సక్రమంగా వస్తుంది. అనివార్యకారణాలతో చికిత్సలకు రానివారికి తిరిగి పింఛన్ పునరుద్ధరణకు తీవ్ర ఆటంకాలు ఏర్పడుతున్నాయి. ఏడాది కాలపరిమితితో ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణించేందుకు పాసులు ఇస్తున్నారు. ఏజెన్సీ పరిధి వరకు ఇలా 273 పాసు లు ఇవ్వగా రెండో ఏడాది 16 మందికే రెన్యువల్ చేశారు. మిగిలిన వారికి అందించటంలో సదరు అధికారులు శ్రద్ధ చూపటం లేదు. పౌష్టికాహార కేంద్రాలు ఎత్తివేత వ్యాధిగ్రస్తుల ఆయుష్షు పెంచేందుకు జాతీయ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (నాకో)ఆధ్వర్యంలో జిల్లాలోని ఖమ్మం, భద్రాచలంలో పోషకాహార కేంద్రాలను ఏర్పాటు చేశారు. బూర్గంపాడు మండలం మోరంపల్లి బంజర, సత్తుపల్లిలో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇటువంటి కేంద్రాలను నెలకొల్పారు. నిధులు లేక నాకో ఆధ్వర్యంలో ఉన్న కేంద్రాలు మూతపడ్డాయి. ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులను వేరుగా ఉంచి పౌష్టికాహారం అందించటంలో వివక్ష చూపుతున్నారనే విమర్శలు వస్తున్నందునే వాటిని ఎత్తివేసినట్లుగా ప్రభుత్వం కుంటిసాకులు చెబుతోంది. ఈ కారణంగానే ఏజెన్సీ పరిధిలో 243 మంది మృత్యువాత పడ్డారు. వీరికి టీబీ వ్యాధి ముదరటం కారణంగానే మృతి చెందారని వైద్యులు చెబుతున్నారు. -
హెచ్ఐవీని నిరోధించే రింగ్...
మహిళల్లో హెచ్ఐవీ నిరోధానికి ఉపయోగపడే సరికొత్త ఇంట్రా-వెజైనల్ రింగ్ ఇది. రిట్రోవైరస్(హెచ్ఐవీ)ని నివారించే శక్తిమంతమైన ‘టీనోఫోవిర్’ ఔషధంతో నింపిన ఈ రింగ్ను ఇటీవల ఆడ కోతుల్లో పరీక్షించగా.. వంద శాతం ఎస్హెచ్ఐవీని అడ్డుకోగలిగింది. ఒకసారి యోనిలోకి ప్రవేశపెడితే 30 రోజుల వరకూ ఇది పనిచేస్తుందని, దీనిని వచ్చే నవంబరులో 60 మంది స్త్రీలలోనూ పరీక్షించనున్నట్లు న్యూయార్క్లోని అల్బర్ట్ ఐన్స్టీన్ కాలేజ్ ఆఫ్ మెడిసిన్ శాస్త్రవేత్తలు వెల్లడించారు. -
తేనెటీగ విషంతో హెచ్ఐవీ ఖతం!
వాషింగ్టన్: ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది జీవితాలను కబళిస్తున్న హెచ్ఐవీ మహమ్మారి నిర్మూలనకు ఉపయోగపడే శక్తిమంతమైన అస్త్రాలు మరో రెండేళ్లలో సిద్ధం కానున్నాయి. అపార ఔషధగుణాలు గల ‘సమోవన్ మమాలా’ చెట్టు బెరడు, బ్రయోజోవా అనే సముద్రజీవుల నుంచి సేకరించిన రసాయనాలతో స్టాన్ఫర్డ్ వర్సిటీ శాస్త్రవేత్తలు సమర్థమైన కొత్త మందులను తయారుచేశారు. సమోవన్ బెరడు నుంచి తయారుచేసిన ‘ప్రొస్ట్రాటిన్’ అనే ఔషధం.. మనిషి శరీర కణాల్లో దాక్కునే హ్యూమన్ ఇమ్యూనోడెఫిషియెన్సీ వైరస్ (హెచ్ఐవీ)ని బయటికి తరిమేస్తుందని వర్సిటీ శాస్త్రవేత్త పాల్ వెండర్ వెల్లడించారు. మంగళవారం ఇండియానాపొలిస్లో అమెరికన్ కెమికల్ సౌసైటీ 246వ సమావేశాల సందర్భంగా వెండర్ ఈ మేరకు ‘హెల్త్లైన్’తో మాట్లాడారు. ప్రొస్ట్రాటిన్తో ఇప్పటిదాకా జంతువులు, ఎయిడ్స్ రోగుల రక్తంపై పరీక్షలు చేయగా, పూర్తి సత్ఫలితాలు వచ్చాయన్నారు. మనుషుల్లో దీన్ని ఉపయోగించడం కోసం అమెరికా ‘ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ(ఎఫ్డీఏ)’ అనుమతి కూడా లభించిందని, రెండేళ్లలోనే అందుబాటులోకి తేనున్నామన్నారు. కణాల లోపలి నుంచి గెంటేస్తుంది..! సమోవన్ బెరడు నుంచి ప్రొస్ట్రాటిన్, బ్రయోజోవన్ల నుంచి ‘బ్రయోస్టాటిన్’ రసాయనాలను సేకరించి వైద్యపరమైన ఉపయోగం కోసం ప్రయోగశాలలో పునరుత్పత్తి చేశారు. ఎయిడ్స్ చికిత్సకు ఇప్పటిదాకా తయారుచేసిన ఔషధాలు హెచ్ఐవీ వైరస్లు కణాల బయట ఉన్నప్పుడే వాటిని నాశనం చేయగలుగుతున్నాయి. ఈ ఔషధాల వినియోగం ఆపేయగానే కణాల్లో దాక్కున్న హెచ్ఐవీ వైరస్లు బయటికి వచ్చి మళ్లీ విజృంభిస్తున్నాయి. అయితే కణాలలోపల దాగున్న వైరస్లను సైతం ప్రొస్ట్రాటిన్ బయటికి గెంటేయగలుగుతుందని వెండర్ వివరించారు. పాతికేళ్ల క్రితమే గుర్తించినా... ఎయిడ్స్ కారక హెచ్ఐవీ వంటి వైరస్లను నిర్మూలించే గుణం సమోవన్ చెట్టు బెరడుకు ఉందని 1987లోనే కాక్స్ అనే శాస్త్రవేత్త గుర్తించారు. దీనిపై పరిశోధన చేపట్టిన పాల్ వెండర్ బృందం ఎట్టకేలకు ఔషధాన్ని తయారుచేయగలిగింది. అయితే ప్రకృతిసిద్ధమైన ప్రొస్ట్రాటిన్ను ప్రయోగశాలలో రకరకాల మార్పులకు గురిచేసిన తర్వాతే దానిని తాము వంద రెట్లు శక్తిమంతంగా మార్చగలిగామని వెండర్ పేర్కొన్నారు. బ్రయోజోవా నుంచి తీసిన బ్రయోస్టాటిన్ను కూడా వెయ్యిరెట్లు శక్తిమంతంగా తయారుచేశామని, హెచ్ఐవీని తరిమేయడంలో అది ప్రొస్ట్రాటిన్ కన్నా మేలైనదన్నారు. కేన్సర్, అల్జీమర్స్ వ్యాధులకూ చికిత్స... మనిషి వేళ్ల మాదిరిగా ఉండే ‘బ్రయోజోవా’ నుంచి సేకరించిన బ్రయోస్టాటిన్ రసాయనం కేన్సర్, అల్జీమర్స్ వ్యాధుల చికిత్సకూ ఉపయోగపడనుందని వెండర్ చెబుతున్నారు. బ్రయోస్టాటిన్తో కొన్ని జంతువులకు చికిత్స చేయగా.. అవి విషయాలను ఎక్కువకాలం గుర్తుంచుకోగలిగాయట. దీంతో మతిమరుపు, ఇతర లక్షణాలుండే అల్జీమర్స్ చికిత్సకూ దీనిని ఉపయోగించవచ్చని భావిస్తున్నారు. తేనెటీగ విషంతో హెచ్ఐవీ ఖతం! తేనెటీగ విషంలోని మెలిటిన్ పదార్థంతో హెచ్ఐవీ నిర్మూలనకు ఔషధాన్ని తయారుచేస్తున్నట్లు ‘వాషింగ్టన్ యూనివర్సిటీ’ శాస్త్రవేత్తలు ఇటీవల వెల్లడించారు. హెచ్ఐవీ సోకకుండా నివారించే జెల్తోపాటు మందును కూడా మెలిటిన్తో తయారుచేయవచ్చట. ఎక్కువ మొత్తంలో ఉంటే శరీర కణాలకు హాని చేసే మెలిటిన్ను అత్యంత సూక్ష్మ పరిమాణంలోని నానోపార్టికల్స్ ద్వారా శరీరంలోకి ప్రవేశపెడితే.. హెచ్ఐవీ కణాలకు అతుక్కుని వాటి చుట్టూ ఉండే రక్షణ కవచాలకు తూట్లు పొడుస్తుందట. ఇంకేం.. రక్షణ కవచాన్ని తిరిగి ఉత్పత్తి చేసుకోలేక హెచ్ఐవీ అంతమైపోతుందన్నమాట. -
హెచ్ఐవీ బాధితుల రక్షణకు బిల్లు
HIV/AIDS Bill in next Parliament session: Oscar Fernandes బెంగళూరు, న్యూస్లైన్: హెచ్ఐవీ బాధితుల రక్షణకు త్వరలో పార్లమెంటులో బిల్లును ప్రవేశ పెడతామని కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి ఆస్కార్ ఫెర్నాండెజ్ తెలిపారు. కర్ణాటకలో హెచ్ఐవీ నియంత్రణకు కృషి చేస్తున్న స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో నగరంలోని వికాససౌధలో మంగళవారం ఏర్పాటు చేసిన చర్చాగోష్టిలో ఫెర్నాండెజ్ ప్రసంగించారు. పార్లమెంటులో బిల్లును ప్రవేశపెట్టడానికి ముందు దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, స్పీకర్లు, ఆరోగ్య శాఖల మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమావేశాన్ని నిర్వహిస్తామని మంత్రి తెలిపారు. దీనిపై సెక్స్ వర్కర్లు, స్వచ్ఛంద సంస్థలతో హైదరాబాద్లో సమావేశాన్ని కూడా నిర్వహించాలనుకున్నామని, అయితే సమైక్యాంధ్ర ఉద్యమం కారణంగా దానిని కర్ణాటకలో నిర్వహించాలని నిర్ణయించామన్నారు. అక్టోబరు లేదా నవంబరులో సమావేశాన్ని నిర్వహిస్తామన్నారు. -
హెచ్ఐవీని పూర్తిగా నిరోధించే టీకా!
కోతుల్లో పరీక్షలు విజయవంతం వాషింగ్టన్: ప్రాణాంతక ఎయిడ్స్ వైరస్ ‘హెచ్ఐవీ’ని శరీరం నుంచి పూర్తిగా నిరోధించగల ఓ సమర్థమైన టీకాను ఒరెగాన్ హెల్త్ అండ్ సైన్స్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు తయారు చేశారు. కోతుల్లో హెచ్ఐవీని ఈ టీకాతో పూర్తిగా నిర్మూలించగలిగామని, మనుషుల్లో కూడా ఇది సత్ఫలితాలనిస్తుందని పరిశోధకులు భావిస్తున్నారు. ప్రస్తుతం హెచ్ఐవీ సంక్రమించినవారికి యాంటీవైరల్ మందులు ఉపయోగిస్తూ చికిత్సలు చేస్తున్నా.. చాలా తక్కువ మందిలో మాత్రమే ఫలితం కనిపిస్తోంది. అయితే తాము రూపొందించిన ఈ టీకా కోతుల్లో ఎయిడ్స్కు కారణమయ్యే ‘సిమియన్ ఇమ్యూనోడెఫీషియెన్సీ వైరస్ (ఎస్ఐవీ)’ని పూర్తిగా నిర్మూలించగలిగిందని వర్సిటీ పరిశోధకులు లూయిస్ పికర్ వెల్లడించారు. సైటోమెగాలో వైరస్(సీఎంవీ) అనే సాధారణ వైరస్ను జన్యుమార్పిడి చేసి ఈ టీకాను తయారుచేశామని, కోతుల్లో ఎస్ఐవీ కణాలను తెల్లరక్త కణాలు (టీ-సెల్స్) గుర్తించి హతమార్చేందుకు తోడ్పడుతోందన్నారు. కోతులకు ముందుగా ఈ టీకా ఇచ్చి.. తర్వాత ఎస్ఐవీని ఎక్కించగా కొంతకాలానికి వాటి శరీరాల్లోంచి ఎస్ఐవీ పూర్తిగా తొలగిపోయిందని తెలిపారు. సీఎంవీని జన్యుమార్పిడి చేసి మనుషుల్లో హెచ్ఐవీ నిర్మూలనకు ఉపయోగపడే టీకాను కూడా తయారుచేయవచ్చన్నారు.