transco
-
ఇంధన శాఖపై ‘కూటమి’ కన్ను!
సాక్షి, అమరావతి: గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఆదుకోవడంతో అప్పులు తీర్చుకుని ఆదాయం బాట పట్టిన ఇంధన శాఖపై టీడీపీ కూటమి ప్రజాప్రతినిధుల కన్ను పడింది. డిస్కంలతో పాటు ఏపీ జెన్కో, ట్రాన్స్కోలో కీలక స్థానాల్లో తమ వారిని నియమించుకొని, కోట్లాది రూపాయలు దండుకొనేందుకు కూటమికి చెందిన కొందరు ప్రజాప్రతినిధులు పెద్ద కుతంత్రానికే తెరలేపారు. ఇందులో భాగంగా వైఎస్సార్సీపీ ప్రభుత్వం హయాంలో నియమితులైనవారిని రాజీనామాలు చేసి వెళ్లిపోవాలని హెచ్చరిస్తున్నారు. గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా ప్రభుత్వ శాఖలను జేబులు నింపుకొనేందుకు వాడుకున్నారో ఇప్పుడూ అదే తీరులో చెలరేగుతున్నారు. వారి ధన దాహానికి డైరెక్టర్ నుంచి అన్ని స్థాయిల ఉద్యోగులు అల్లాడిపోతున్నారు. కూటమి పెద్దల బలవంతంతో వరుసగా రాజీనామాలు చేస్తున్నారు. కొందరిని బలవంతంగా బయటకు పంపిస్తున్నారు. ఇప్పటికే ఏపీ ట్రాన్స్కో విజిలెన్స్ జేఎండీ, విశ్రాంత ఐపీఎస్ అధికారి మల్లారెడ్డి చేత రాజీనామా చేయించారు. ఏపీ సోలార్ పవర్ కార్పొరేషన్లో ముఖ్య ఆర్థిక సలహాదారులు హనుమంతరావు, సింహాచలం, జెన్కో ఓఎస్డీ ఆంటోని రాజు, మరికొందరిని విధుల నుంచి తప్పించారు. డైరెక్టర్లనూ రాజీనామా చేయాలని ఇటీవల హుకుం జారీ చేశారు. మంగళవారం రాత్రి మరోసారి గట్టిగా చెప్పడంతో ఏపీ ట్రాన్స్కో, జెన్కో, మూడు డిస్కంలలోని 10 మంది డైరెక్టర్లు బుధవారం రాజీనామా చేశారు. వారి బాధ్యతలను తాత్కాలికంగా సీజీఎంలకు అప్పగిస్తూ డిస్కంల సీఎండీలు ఉత్తర్వులు జారీ చేశారు. ఖాళీ అయిన పోస్టుల్లో కొన్నింటికి రూ. కోట్లలో బేరాలు మొదలు పెట్టినట్లు సమాచారం. కొన్ని పోస్టుల్లో అనుయాయులను నియమించుకొని వారి ద్వారా కోట్లు దండుకొనే ఆలోచనతో ఉన్నట్లు తెలిసింది. త్వరలోనే ట్రాన్స్కో, జెన్కో, డిస్కంల అధిపతులను కూడా మార్చాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి తమకు అనుకూలంగా ఉండే పలువురు ఐఏఎస్ అధికారుల పేర్లును పరిశీలిస్తున్నట్లు సమాచారం.10 మంది డైరెక్టర్ల రాజీనామా ఏపీ ట్రాన్స్కో సీఎండీ, జెన్కో ఎండీ, డిస్కంల సీఎండీలకు 10 మంది డైరెక్టర్లు బుధవారం రాజీనామా లేఖలను అందజేశారు. వాటిని ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్కు పంపగా, ఆయన వెంటనే ఆమోదించారు. ఈ మేరకు బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. రాజీనామా చేసిన డైరెక్టర్లు » టి.వీరభద్రరెడ్డి (ఫైనాన్స్– ఏపీ ట్రాన్స్కో) » డి.ఎస్.జి.ఎస్.ఎస్. బాబ్జి (థర్మల్ – ఏపీ జెన్కో) » సయ్యద్ రఫి (హెచ్ఆర్, ఐఆర్ – ఏపీ జెన్కో) » ఎంవీవీ సత్యనారాయణ (హైడల్ – ఏపీ జెన్కో) » సి.శ్రీనివాసమూర్తి (ఆపరేషన్స్ – ఏపీఈపీడీసీఎల్) » ఎ.వి.వి.సూర్యప్రతాప్ (ప్రాజెక్ట్స్ – ఏపీఈపీడీసీఎల్) » వి. బ్రహా్మనందరెడ్డి (ఫైనాన్స్ – ఏపీసీపీడీసీఎల్) » బి. జయభారతరావు (టెక్నికల్ – ఏపీసీపీడీసీఎల్) » టి. వనజ (ప్రాజెక్ట్స్ – ఏపీసీపీడీసీఎల్) » కె.శివప్రసాదరెడ్డి (ప్రాజెక్ట్స్ – ఏపీఎస్పీడీసీఎల్) -
ట్రాన్స్కో, జెన్కో డైరెక్టర్ పోస్టులకు నోటిఫికేషన్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర విద్యుత్ సరఫరా సంస్థ (టీఎస్ ట్రాన్స్కో), తెలంగాణ రాష్ట్ర విద్యుదుత్పాదన సంస్థ (టీఎస్ జెన్కో)లలో కొత్త డైరెక్టర్ల నియామకానికి రాష్ట్ర ప్రభుత్వం సోమవారం వేర్వేరు నోటిఫికేషన్లు జారీ చేసింది. ట్రాన్స్కో డైరెక్టర్ (గ్రిడ్, ట్రాన్స్మిషన్), డైరెక్టర్(ఫైనాన్స్), డైరెక్టర్ (ప్రాజెక్ట్స్) పోస్టులతోపాటు జెన్కో డైరెక్టర్ (జలవిద్యుత్), డైరెక్టర్ (థర్మల్, ప్రాజెక్టులు), డైరెక్టర్ (హెచ్ఆర్ అండ్ ఐఆర్), డైరెక్టర్ (కోల్–లాజిస్టిక్స్), డైరెక్టర్ (ఫైనాన్స్–కమర్షియల్) పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానించింది. దరఖా స్తుదారుల వయసు 62 ఏళ్లలోపు ఉండాలని స్పష్టం చేసింది. ట్రాన్స్కో, జెన్కో డైరెక్టర్ల పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి మార్చి 1ని చివరి తేదీగా నిర్ణయించింది. త్వరలోనే డిస్కమ్ల డైరెక్టర్ పోస్టులకు కూడా నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక.. ట్రాన్స్కో, జెన్కో, టీఎస్ఎస్పీడీసీఎల్, టీఎస్ఎన్పీడీసీఎల్ సంస్థల్లో డైరెక్టర్లుగా సంబంధిత విభాగాల్లో అనుభవం, పరిజ్ఞానం కలిగిన అర్హులైన ఇన్ సర్వీస్, రిటైర్డ్ విద్యుత్ అధికారులను ప్రభుత్వం ఎంపిక చేయనుంది. డైరెక్టర్ల నియమకానికి మార్గదర్శకాలను జారీ చేస్తూ 2012 మే 14న జారీ చేసిన జీవో 18 ప్రకారం.. ఇంధన శాఖ ముఖ్యకార్యదర్శి నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ ఇంటర్వ్యూ నిర్వహించి ఒక్కో డైరెక్టర్ పోస్టుకు ముగ్గురి పేర్లతో షార్ట్ లీస్టును రూపొందించి ప్రభుత్వానికి సిఫారసు చేయనుంది. ఈ కమిటీలో ఆయా విద్యుత్ సంస్థల సీఎండీలు కన్వీనర్లుగా, రాష్ట్ర ప్రభుత్వరంగ సంస్థల శాఖ ముఖ్యకార్యదర్శి, ప్రభుత్వం నామినేట్ చేసే విద్యుత్రంగ ఇండిపెండెంట్ ఎక్స్పర్ట్ సభ్యులుగా ఉండనున్నారు. కమిటీ సిఫారసు చేసిన షార్ట్ లిస్టు లోని ముగ్గురు వ్యక్తుల నుంచి ఒకరిని డైరెక్టర్గా నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. ఇక పదవీ కాలం రెండేళ్లు మాత్రమే.. డైరెక్టర్ పదవి కాలం రెండేళ్లు మాత్రమే. పనితీరును మదించడం ద్వారా సెలక్షన్ కమిటీ సిఫారసులతో మరో ఏడాది, ఆ తర్వాత కూడా ఇంకో ఏడాది పొడిగించడానికి వీలుంది. -
‘విద్యుత్’ డైరెక్టర్లకు ఉద్వాసన?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విద్యుత్ సంస్థల్లో సుదీర్ఘకాలం నుంచి డైరెక్టర్లుగా కొనసాగుతున్న వారికి ఉద్వాసన పలికేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. వారి స్థానంలో కొత్త డైరెక్టర్ల నియామకానికి కసరత్తు ప్రారంభించింది. రాష్ట్రంలో కొత్తగా కొలువుదీరిన కాంగ్రెస్ సర్కారు విద్యుత్ శాఖపై ప్రత్యేకంగా ఫోకస్ చేసిన విషయం తెలిసిందే. తెలంగాణ ట్రాన్స్కో, జెన్కో, టీఎస్ఎస్పీడీసీఎల్, టీఎస్ఎన్పిడీసీఎల్ తదితర సంస్థల చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్లు (సీఎండీ)గా ఐఏఎస్ అధికారులను నియమించింది. విద్యుత్ సంస్థల ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రాన్ని సైతం విడుదల చేసింది. తదుపరి చర్యగా కొత్త డైరెక్టర్ల నియామకం కోసం త్వరలో నోటిఫికేషన్ విడుదల చేయనుంది. సంబంధిత విభాగాల్లో అనుభవం, పరిజ్ఞానం కలిగిన అర్హులైన ఇన్సర్విస్, రిటైర్డ్ విద్యుత్ అధికారుల నుంచి దరఖాస్తులను ఆహ్వానించనుంది. 2012 మే 14న ఇంధన శాఖ జారీ చేసిన జీవో 18 ప్రకారం నియామకాలు చేపట్టనున్నారు. ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి, తెలంగాణ జెన్కో, ట్రాన్స్కోల ఇన్చార్జి సీఎండీ సయ్యద్ అలీ ముర్తుజా రిజ్వీ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ దరఖాస్తుదారులను ఇంటర్వ్యూ చేసి.. ఒక్కో డైరెక్టర్ పోస్టుకు ముగ్గురి పేర్లతో షార్ట్ లిస్టును రూపొందించి ప్రభుత్వానికి అందించనుంది. ఈ సెలెక్షన్ కమిటీలో ఆయా విద్యుత్ సంస్థల సీఎండీలు కన్వినర్లుగా, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల శాఖ ముఖ్య కార్యదర్శి, ప్రభుత్వం నామినేట్ చేసే విద్యుత్ రంగ స్వతంత్ర నిపుణుడు సభ్యులుగా ఉంటారు. కమిటీ సిఫార్సు చేసినవారి నుంచి డైరెక్టర్లను ప్రభుత్వం నియమించనుంది. అర్హతలు ఉంటేనే కొలువు గతంలో కనీస అర్హతలు లేనివారిని విద్యుత్ సంస్థల్లో డైరెక్టర్లుగా నియమించడంతోపాటు అడ్డగోలుగా పదవీ కాలాన్ని పొడిగించినట్టు ఆరోపణలున్నాయి. డైరెక్టర్గా ఎంపికయ్యే వారికి కనీసం చీఫ్ ఇంజనీర్గా మూడేళ్ల అనుభవం ఉండాల్సి ఉన్నా.. డీఈలుగా రిటైరైన వారిని సైతం నియమించి కీలక విభాగాలను అప్పగించినట్టు విమర్శలున్నాయి. దీంతో ఈసారి పక్కాగా నిబంధనలను అనుసరించి నియామకాలు జరపాలని నిర్ణయించి, పాత ఉత్తర్వులను వెలికితీశారు. ఆ ఉత్తర్వుల ప్రకారం డైరెక్టర్ పదవికి ఎంపిక కావాలంటే.. సంబంధిత విద్యుత్ విభాగాల కార్యకలాపాల్లో కనీసం 15 ఏళ్ల అనుభవంతోపాటు మొత్తంగా కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వాలు/ప్రభుత్వ రంగ సంస్థల్లో కనీసం 25 ఏళ్లు పనిచేసి ఉండాలి. కనీసం మూడేళ్లపాటు చీఫ్ ఇంజనీర్/చీఫ్ జనరల్ మేనేజర్/ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ లేదా తత్సమాన హోదాల్లో పనిచేసి ఉండాలి. నోటిఫికేషన్ నాటికి వయసు 65 ఏళ్లకు మించరాదు. పదవీకాలం రెండేళ్లే.. నిబంధనల ప్రకారం డైరెక్టర్ పదవీకాలం రెండేళ్లు మాత్రమే. పనితీరును మదించడం ద్వారా సెలెక్షన్ కమిటీ సిఫార్సులతో ఏడాది చొప్పున రెండుసార్లు పదవీకాలాన్ని పొడిగించడానికి వీలుంది. ప్రస్తుతం ట్రాన్స్కోలో నలుగురు, జెన్కోలో ఏడుగురు, టీఎస్ఎస్పీడీసీఎల్లో 8 మంది, ఎన్పిడీసీఎల్లో 8 మంది కలిపి మొత్తం 27 మంది డైరెక్టర్లు కొనసాగుతున్నారు. వీరిలో కొందరు ఉమ్మడి రాష్ట్రం నుంచీ, మరికొందరు తెలంగాణ ఏర్పాటైన నాటి నుంచీ కొనసాగుతున్నారు. తదుపరి ఆదేశాలు జారీచేసే వరకు వీరే డైరెక్టర్లుగా కొనసాగుతారంటూ గత ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో ఇలా సుదీర్ఘంగా కొనసాగుతున్నారు. కొందరి వయసు 85ఏళ్లకు చేరినా డైరెక్టర్లుగా ఉండటం గమనార్హం. ఇప్పుడు వీరంతా ఇంటిబాట పట్టనున్నారు. ట్రాన్స్కో కొత్త జేఎండీకి అందని బాధ్యతలు ఇటీవల ట్రాన్స్కో జేఎండీగా ఐఏఎస్ అధికారి సందీప్కుమార్ ఝాను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. అయితే సంస్థ సీఎండీ ముర్తుజా రిజ్వీ ఇంకా సందీప్కుమార్ ఝాకు అధికారికంగా ఎలాంటి బాధ్యతలు అప్పగించలేదు. ఆయన విద్యుత్ సౌధలోని రెండో అంతస్తులో ఖాళీగా కూర్చుంటున్నారు. గత ప్రభుత్వహయాంలో ట్రాన్స్కో జేఎండీగా ఆర్థిక వ్యవహారాల్లో కీలక పాత్ర పోషించిన సి.శ్రీనివాసరావునే ఆ పోస్టులో కొనసాగిస్తున్నారు. శ్రీనివాసరావు పదవీకాలం వచ్చే ఏప్రిల్లో ముగియనుంది. గత ప్రభుత్వ హయాంలో జరిగిన లావాదేవీలన్నీ శ్రీనివాసరావుకు తెలిసి ఉండటంతో.. ఆయనను పదవీకాలం ముగిసేవరకు కొనసాగించవచ్చనే అభిప్రాయం ఉంది. తర్వాత కూడా శ్రీనివాసరావును కొనసాగించాలని భావిస్తే.. కొత్త జేఎండీ సందీకుమార్ ఝాకు రెండో జేఎండీగా హెచ్ఆర్ వంటి విభాగాల బాధ్యతలు అప్పగించవచ్చని అంటున్నారు. -
జీవన్రెడ్డికి షాక్ల మీద షాక్లు
ఆర్మూర్: అధికారం చేజారగానే బీఆర్ఎస్కు చెందిన ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్రెడ్డికి ఆర్టీసీ, ట్రాన్స్కో అధికారులు ఏకకా లంలో బకాయిల వసూ లుకు చర్యలు ప్రారంభిస్తూ షాక్ ఇచ్చారు. పూర్వా పరాలిలా.. ఆర్మూర్ పట్టణంలోని టీఎస్ ఆర్టీసీ స్థలాన్ని జీవన్రెడ్డి సతీమణి రజితరెడ్డి తాను మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్న విష్ణుజిత్ ఇన్ఫ్ట్రా డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరిట లీజ్కు తీసుకుని మాల్ అండ్ మల్టిప్లెక్స్ పేరిట 5 అంతస్తుల భారీ షాపింగ్ మాల్ నిర్మించారు. గతేడాది దసరా రోజున ప్రారంభించిన ఈ మాల్లో రిలయన్స్ స్మార్ట్, ట్రెండ్స్, ఎలక్ట్రానిక్స్, కేఎఫ్సీ, పీవీఆర్ సినిమా హాళ్లకు అద్దెకు ఇచ్చారు. మొన్నటి వరకు జీవన్రెడ్డి అధికార పార్టీ ఎమ్మెల్యే కావడంతో ఈ మాల్ అద్దె బకా యిలు వసూలు చేయడంలో ఆర్టీసీ, ట్రాన్స్కో అధికారులు నిర్లక్ష్యం వహించారు. దీంతో విష్ణుజిత్ ఇన్ఫ్ట్రా డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ .. ఆర్టీసీకి చెల్లించాల్సిన అద్దె 7 కోట్ల 23 లక్షల 71 వేల 807 రూపాయలు, విద్యుత్కు సంబంధించి ట్రాన్స్కోకు 2 కోట్ల 57 లక్షల 20 వేల 2 రూపాయలు బకాయిలుగా పేరుకుపోయాయి. ఇప్పుడు రాష్ట్రంలో, నియోజకవర్గంలో అధికార మార్పు జరగగానే ఆర్టీసీ, ట్రాన్స్కో అధికారులు ఈ బకాయిల వసూళ్లకు నడుం బిగించారు. మూడు రోజుల్లో చెల్లించాలి ఆర్టీసీ నిజామాబాద్ ఆర్ఎం జానీరెడ్డి, ఆర్మూర్ డిపో ఇన్చార్జి మేనేజర్ పృథ్వీరాజ్ గౌడ్ ఆధ్వర్యంలో హైదరాబాద్కు చెందిన పోలీసు అధికారులు తోడు రాగా జీవన్ మాల్లో గురువారం హెచ్చరికలు జారీ చేసారు. మూడు రోజుల్లో లీజుదారులు అద్దె బకాయిలు చెల్లించని పక్షంలో మల్టీప్లెక్స్ను సీజ్ చేస్తామంటూ మైక్లో హెచ్చరించారు. మరో వైపు ట్రాన్స్కో ఆర్మూర్ ఏడీఈ శ్రీధర్ ఆధ్వర్యంలో ట్రాన్స్కో అధికారులు సైతం మూడు రోజుల్లో బకాయిలు చెల్లించాలంటూ విద్యుత్ సరఫరా నిలిపివేశారు. దీంతో షాపింగ్ మాల్కు జనరేటర్లతో విద్యుత్ సరఫరా చేస్తున్నారు. -
భారీగా విద్యుత్ డిమాండ్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో అనూహ్యంగా విద్యుత్ డిమాండ్ భారీగా పెరిగింది. ఆగస్టు మొదటివారం నుంచి మళ్లీ వర్షాభావ పరిస్థితులు నెలకొని ఉండడమే ఇందుకు కారణం. రాష్ట్రంలోని 31లక్షలకు పైగా వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. వర్షాలు లేక బోరుబావుల కింద ఉచిత విద్యుత్ బాగా వాడేస్తున్నారు. పంటలను రక్షించుకోవడానికి రైతులు పెద్దఎత్తున విద్యుత్ వినియోగిస్తున్నారు. దీంతో గతవారం రోజులుగా రాష్ట్రంలో రోజువారీ గరిష్ట విద్యుత్ డిమాండ్ 13వేల మెగావాట్లకు మించిపోయింది. ఈ నెల 11న అత్యధికంగా 13,829 మెగావాట్ల గరిష్ట విద్యుత్ డిమాండ్ నమోదైంది. అదేరోజు జాతీయస్థాయిలో గరిష్ట విద్యుత్ డిమాండ్ 2,28,963 మెగావాట్లకు చేరి కొత్త రికార్డు నెలకొల్పింది. సాధారణంగా వేసవిలో డిమాండ్ ఈ స్థాయిలో పెరుగుతూ ఉంటుంది. గత నెలాఖరులో ఎడతెరిపి లేకుండా భారీవర్షాలు కురవడంతో అప్ప ట్లో రోజువారీగా రాష్ట్రస్థాయిలో గరిష్ట విద్యుత్ డి మాండ్ 8వేల మెగావాట్లలోపు మాత్రమే నమోదైంది. గత నెల 27న అయితే గరిష్ట డిమాండ్ ఏకంగా 6904 మెగావాట్లకు పడిపోయింది. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో గరిష్ట విద్యుత్ డిమాండ్ త్వరలో 14వేల మెగావాట్లకు చేరే అవకాశాలున్నాయని ట్రాన్స్కో యాజమాన్యం అంచనా వేస్తోంది. జల విద్యుదుత్పత్తిపై కరువు నీడలు కృష్ణా బేసిన్లో తీవ్ర వర్షాభావం కారణంగా ఈ ఏడాది శ్రీశైలం, నాగార్జునసాగర్ జలవిద్యుత్ కేంద్రాల్లో విద్యుదుత్పత్తి ప్రశ్నార్థకంగా మారింది. కనీసం 3000 మిలియన్ యూనిట్ల(ఎంయూ) జలవిద్యుత్ ఉత్పత్తి చేయాలని ప్రతి ఏటా తెలంగాణ జెన్కో లక్ష్యంగా పెట్టుకుంటుంది. ప్రస్తుత పరిస్థితుల్లో కనీసం 1000 ఎంయూలు కూడా ఉత్పత్తి చేసే పరిస్థితి కనిపించడం లేదు. శ్రీశైలం, సాగర్ జలాశయాలు ఈ ఏడాది పూర్తిస్థాయిలో నిండే పరిస్థితి లేదు. ఇంకా శ్రీశైలం ప్రాజెక్టు నిండాలంటే 97 టీఎంసీలు, నాగార్జునసాగర్ నిండాలంటే 166 టీఎంసీల వరద ఎగవ నుంచి రావాలి. ఆదివారం నాటికి శ్రీశైలం జలాశయానికి కృష్ణానది ఎగువ నుంచి ఇన్ఫ్లో పూర్తిగా నిలిచిపోయింది. రోజూ రూ.30 కోట్ల విద్యుత్ కొనుగోళ్లు ప్రస్తుతం జలవిద్యుత్ ఉత్పత్తికి అవకాశం లేకపోవడంతో గరిష్ట డిమాండ్ నెలకొని ఉండే వేళల్లో నిరంతర విద్యుత్ కొనసాగించడానికి పవర్ ఎక్ఛ్సేంజీల నుంచి రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లు పెద్దఎత్తున విద్యుత్ కొనుగోళ్లు చేస్తున్నాయి. రోజూ రూ.30 కోట్ల వ్యయంతో 60 ఎంయూల విద్యుత్ను ఎక్ఛ్సేంజీల నుంచి కొనుగోలు చేస్తున్నాయి. ఇప్పటికే తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్న డిస్కంలకు రోజువారీ విద్యుత్ కొనుగోళ్లు తీవ్ర భారంగా మారాయి. -
ఏపీ ట్రాన్స్కోలో నకిలీ లేఖ కలకలం
సాక్షి, అమరావతి: ఏపీ ట్రాన్స్కోలో నకిలీ లేఖ కలకలం రేపింది. ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలపై సోషల్ మీడియాలో ప్రత్యక్షమైన ఆ ఆదేశాల ప్రతులు నిజం కాదని, అదంతా తప్పుడు ప్రచారమని ట్రాన్స్కో అదనపు కార్యదర్శి వి.శ్రీనివాసరావు స్పష్టం చేశారు. శుక్రవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. 17 మంది ఔట్ సోర్సింగ్ సిబ్బందిని విధుల్లోకి తీసుకోమని చీఫ్ ఎలక్ట్రికల్ ఇంజనీర్కు తాను రాసినట్లుగా చక్కర్లు కొడుతున్న లేఖ అబద్ధమని తెలిపారు. ఏపీ ట్రాన్స్కోకి సంబంధించి శాశ్వత ప్రాతిపదికన చేపట్టే నియామకాలు, ఉద్యోగ ప్రకటనలు ట్రాన్స్కో, ఇతర విద్యుత్ సంస్థల అధికారిక వెబ్సైట్లు, ప్రింట్ మీడియాలో ప్రకటన ద్వారా తెలియజేస్తామని వివరించారు. ఇలాంటి నకిలీ వార్తలను ప్రచారం చేసిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని శ్రీనివాసరావు హెచ్చరించారు. ఇది కూడా చదవండి: ఛీటింగ్ ‘మార్గం' మూత! -
తెలంగాణ ఆవిర్భావం తర్వాత.. 9 సంవత్సరాలు.. రూ.97,321 కోట్లు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రంలో విద్యుదుత్పత్తి, సరఫరా, పంపిణీ వ్యవస్థల బలోపేతానికి రూ.97,321 కోట్ల ఖర్చు చేశామని తెలంగాణ ట్రాన్స్కో, జెన్కో సీఎండీ డి.ప్రభాకర్రావు తెలిపారు. తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సోమవారం విద్యుత్ సౌధ, మింట్ కాంపౌండ్లోని టీఎస్ఎస్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ‘విద్యుత్ విజయోత్సవ దినం’కార్యక్రమాల్లో మాట్లాడారు. రాష్ట్ర తలసరి విద్యుత్ వినియోగం 2022–23లో 2140 యూనిట్లుగా, జాతీయ సగటుతో పోలి్చతే 70శాతం అధికంగా నమోదైందని తెలిపారు. విద్యుత్ పంపిణీ వ్యవస్థ అభివృద్ధికి 9 ఏళ్లలో రూ.14,063 కోట్లు ఖర్చు చేశామని టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎండీ జి.రఘుమారెడ్డి అన్నారు. వినియోగదారుల సమస్యలను సత్వరంగా పరిష్కరించి సంస్థకు మంచి పేరు తీసుకురావాలని ఉద్యోగులకు సూచించారు. కార్యక్రమాల్లో ఎమ్మెల్యే దానం నాగేందర్, ట్రాన్స్కో జేఎండీ సి.శ్రీనివాసరావు, విద్యుత్ సంస్థల డైరెక్టర్లు, ఉద్యోగులు పాల్గొన్నారు. చదవండి: ఉగ్రవాదులు టార్గెట్ చేసిన రాష్ట్రాలు ఏవి? -
సమ్మె ప్రభావం లేదు
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ సంస్థలపై ఆర్టీజన్ల సమ్మె ప్రభావం లేదని, విద్యుత్ సరఫరాలో సైతం ఎలాంటి అంతరాయాలు లేవని తెలంగాణ ట్రాన్స్కో, జెన్కో సీఎండీ డి.ప్రభాకర్ రావు తెలిపారు. విద్యుదుత్పత్తి సంస్థ (జెన్కో)లో 100 శాతం, సరఫరా (ట్రాన్స్కో), పంపిణీ సంస్థ (డిస్కం)ల్లో 80 శాతం మంది ఆర్టీజన్లు మంగళవారం విధులకు హాజరయ్యారని ఒక ప్రకటనలో తెలిపారు. మంగళవారం నుంచి ఆర్టిజన్ల (విద్యుత్ సంస్థల్లో విలీనమైన కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు) సమ్మెకి తెలంగాణ విద్యుత్ ఉద్యోగుల సంఘం (హెచ్ 82) పిలుపునిచ్చి న నేపథ్యంలో దాని ప్రభావాన్ని అంచనా వేసేందుకు విద్యుత్ సౌధలో ఆయన సమీక్ష నిర్వహించారు. అత్యవసర సేవల నిర్వహణ చట్టం (ఎస్మా) కింద విద్యుత్ సంస్థల్లో సమ్మెలపై నిషేధం అమల్లో ఉందని, దీనిని ఉల్లంఘించి సమ్మెకి దిగితే ఆర్టీజన్ల సర్వీసు నిబంధనలైన ‘స్టాండింగ్ ఆర్డర్స్’లోని నిబంధన 34(20) ప్రకారం దు్రష్పవర్తనగా పరిగణించి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. చట్టవిరుద్ధంగా సమ్మెకి దిగిన 200 మంది ఆర్టీజన్లను ట్రాన్స్కో, జెన్కో, డిస్కంల నుంచి తొలగించినట్టు తెలిపారు. రాష్ట్రంలోని వినియోగదారులకు 24 గంటల విద్యుత్ సరఫరాకు ఆటంకం కలిగించే దుశ్చర్యలను ఉపేక్షించబోమని, ఈ మేరకు సీఎం కేసీఆర్ ఆదేశాలున్నాయని స్పష్టం చేశారు. బుధవారం ఉదయంలోగా విధులకు హాజరుకాని వారందర్నీ తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేస్తామని తెలిపారు. యూనియన్ నేతలు డిస్మిస్.. సమ్మె పిలుపు నేపథ్యంలో ఉద్యోగుల సంఘం (హెచ్ 82) ప్రధాన కార్యదర్శి ఎస్.సాయిలు, నేతలు నరేష్, సత్యనారాయణ, వినోద్, సుభా‹Ùలను సోమవారం పంజాగుట్ట పోలీసులు ఎస్మా చట్టం కింద అరెస్టు చేయగా, మంగళవారం కోర్టు వారికి బెయిల్ మంజూరు చేసింది. మరో ఇద్దరు నేతలు బాల్రెడ్డి, కావలి వెంకటేశ్వర్లును సైఫాబాద్ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారని యూనియన్ నేతలు వెల్లడించారు. సమ్మెలో పాల్గొనడం, ఉద్యోగులను సమ్మెకి పురిగొల్పారనే ఆరోపణలపై ఎంప్లాయీస్ యూనియన్ (హెచ్ 82) ప్రధాన కార్యదర్శి సాయిలును ఆర్టీజన్ గ్రేడ్–2 ఉద్యోగం నుంచి తొలగిస్తూ ట్రాన్స్కో సీఎండీ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇదే అరోపణలపై యూనియన్ హెల్త్ సెక్రటరీ జె.శివశంకర్ను ఆర్టీజన్ గ్రేడ్–1 ఉద్యోగం నుంచి తొలగిస్తూ టీఎస్ఎస్పీడీసీఎల్ ఉత్తర్వులు జారీ చేసింది. మరి కొంతమంది యూనియన్ నేతలను కూడా ఉద్యోగాల నుంచి తొలగించినట్టు సమాచారం. కాగా, ట్రాన్స్కోలో 80 శాతంమంది, జెన్కో, డిస్కంలలో కలిసి 60 శాతం ఆర్టీజన్లు సమ్మెలో పాల్గొన్నారని సాయిలు ఒక ప్రకటనలో వెల్లడించారు. బుధవారం మరింత మంది సమ్మెకి దిగుతార చెప్పారు. -
15,254 మెగావాట్ల గరిష్ట డిమాండ్
సాక్షి, హైదరాబాద్: గరిష్ట విద్యుత్ డిమాండ్లో రాష్ట్రం కొత్త చరిత్ర సృష్టించింది. మంగళవారం ఉదయం 10:03 గంటలకు రాష్ట్రంలో విద్యుత్ పీక్ డిమాండ్ 15,254 మెగావాట్లుగా నమోదైంది. విద్యుత్ డిమాండ్ 15 వేల మెగావాట్లకు మించడం ఇదే తొలిసారి. ఈ నెలలోనే నమోదైన 14,750 మెగావాట్ల పీక్ డిమాండ్ను మంగళవారం రాష్ట్రం అధిగమించింది. గతేడాది మార్చిలో 14,160 మెగావాట్లుగా పీక్ డిమాండ్ నమోదైంది. వేసవి మొదలవడంతో వ్యవసాయ, గృహ అవసరాల విద్యుత్ వినియోగం భారీగా పెరిగిపోయింది. ఇళ్లు, ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, వాణిజ్య సంస్థల్లో ఏసీలు, ఇతర ఉపకరణాల వాడకం పెరిగింది. రాష్ట్రంలోని 30 లక్షల వ్యవసాయ బోరుబావుల కింద సాగు చేస్తున్న పంటలకు నీటి సరఫరా కోసం రైతులు భారీగా విద్యుత్ వినియోగిస్తున్నారు. దీనికితోడు సాగు విస్తీర్ణం పెరగడం కూడా విద్యుత్ వినియోగాన్ని పెంచింది. పారిశ్రామిక విద్యుత్ డిమాండ్ సైతం గణనీయంగా పెరిగిపోయింది. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలోని రెండు పంప్హౌస్ల ద్వారా నీటిని ఎత్తిపోయడానికి 600 మెగావాట్ల విద్యుత్ను వినియోగిస్తున్నారు. దీంతో రోజువారీ విద్యుత్ డిమాండ్ విపరీతంగా పెరిగిపోయిందని విద్యుత్ సంస్థల వర్గాలు పేర్కొంటున్నాయి. మార్చి చివరి వరకు పీక్ విద్యుత్ డిమాండ్ 16,000 మెగావాట్లకు పెరిగే అవకాశముందని అంచనా వేస్తున్నారు. ఆ మేరకు విద్యుత్ సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ట్రాన్స్కో తెలిపింది. 13 రోజుల్లో రూ.600 కోట్ల విద్యుత్ కొనుగోళ్లు వేసవిలో విద్యుత్ డిమాండ్ పెరగడంతో నిరంతర విద్యుత్ సరఫరాకు వీలుగా విద్యుత్ సంస్థలు ఎఎక్స్చేంజి ల నుంచి భారీ స్థాయిలో విద్యుత్ కొనుగోళ్లు చేస్తున్నాయి. ఈ నెలలో గత 13 రోజుల్లో రూ. 600 కోట్ల వ్యయంతో 930 మిలియన్ యూనిట్ల విద్యుత్ను కొనుగోలు చేశాయి. రోజుకు సగటున రూ. 45 కోట్ల వ్యయంతో 72 మిలియన్ యూనిట్ల విద్యుత్ను కొన్నాయి. నిరంతర విద్యుత్ సరఫరాకు అవసరమైన విద్యుత్ను కొనుగోలు చేసేందుకు రూ. 4 వేల కోట్ల రుణాలను ప్రభుత్వ పూచికత్తుతో తీసుకోవడానికి అనుమతిస్తూ గత నెలలో రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆర్ఈసీ, పీఎఫ్సీల నుంచి రూ. 3 వేల కోట్ల రుణం కోసం రాష్ట్ర విద్యుత్ సంస్థలు దరఖాస్తు చేసుకున్నాయి. త్వరలో ఈ మేరకు రుణం విడుదల కానుంది. -
31లోగా ‘వేతన’ ప్రకటన చేయాలి
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ ఉద్యోగుల వేతన సవరణపై ఈ నెల 31లోగా ప్రకటన చేయాలని, లేనిపక్షంలో వచ్చే నెల 2 నుంచి ఆందోళనలు ఉధృతం చేస్తామని తెలంగాణ స్టేట్ పవర్ ఎంప్లాయీస్ జేఏసీ ప్రకటించింది. ఫిబ్రవరి 1న నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలియజేస్తామని, 2న విద్యుత్ సౌధ ముట్టడి, మహాధర్నా నిర్వహిస్తామని వెల్లడించింది. జేఏసీ నేతలు మంగళవారం విద్యుత్ సౌధలో తెలంగాణ ట్రాన్స్కో, జెన్కో సీఎండీ డి.ప్రభాకర్ రావును కలిసి వినతిపత్రం అందజేశారు. అమల్లో ఉన్న విద్యుత్ ఉద్యోగుల వేతన సవరణ గడువు గతేడాది మార్చి 31తో ముగిసిపోగా, అదే ఏడాది ఏప్రిల్ 1 నుంచి కొత్త పీఆర్సీ అమలు చేయాల్సి ఉందని నేతలు జి.సాయి బాబు, రత్నాకర్రావు, శ్రీధర్ ఒక ప్రకటనలో తెలిపారు. కొత్త పీఆర్సీపై గతేడాది మే 30న సంప్రదింపుల కమిటీని విద్యుత్ సంస్థల యాజమాన్యాలు ఏర్పాటు చేసినా, ఇప్పటి వరకు పీఆర్సీపై ప్రకటన చేయలేదన్నారు. 1999, అక్టోబర్ 2 నుంచి 2004, ఆగస్టు 31 మధ్యకాలంలో నియమితులైన విద్యుత్ ఉద్యోగులకు ఈపీఎఫ్కి బదులు జీపీఎఫ్ను అమలు చేయాలన్నారు. -
అద్దెకివ్వండి.. ఆదాయం పొందండి!
సాక్షి, అమరావతి: విద్యుత్ రంగంలో కేంద్ర ప్రభుత్వం మొదలుపెట్టిన సంస్కరణల్లో భాగంగా మరో ప్రయత్నానికి శ్రీకారం చుట్టింది. దేశ వ్యాప్తంగా విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)ల అప్పులు రూ.1.32 లక్షల కోట్లకు చేరడంతో వాటి వసూలుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్న కేంద్రం.. తాజాగా రాష్ట్రాలకు ఓ మార్గాన్ని చూపింది. గతేడాది అమల్లోకి తెచ్చిన ఎలక్ట్రిసిటీరూల్స్–2021(ట్రాన్స్మిషన్ సిస్టమ్ ప్లానింగ్, డెవలప్మెంట్ అండ్ రికవరీ ఆఫ్ ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ చార్జెస్)కు కొనసాగింపుగా మరికొన్ని నిబంధనలను ప్రవేశపెడుతూ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. తద్వారా రాష్ట్రాలు తమ ఆధీనంలోని విద్యుత్ సరఫరా నెట్వర్క్ను అమ్ముకునేందుకు, ఇతరుల నుంచి కొనుక్కునేందుకు, లీజుకు ఇవ్వడానికి అవకాశం కల్పించింది. ఈ వెసులుబాట్లతో విద్యుత్ సంస్థలు ఆదాయాన్ని ఆర్జించి అప్పుల ఊబి నుంచి బయటపడతాయని కేంద్రం చెబుతోంది. నెట్వర్క్ సమస్యకు చెక్ ఆంధ్రప్రదేశ్ పవర్ ట్రాన్స్మిషన్ కార్పొరేషన్(ఏపీ ట్రాన్స్కో)కు ప్రస్తుతం 5,532.161 సీకేఎం(సర్క్యూట్ కిలోమీటర్ల) మేర 400 కేవీ ట్రాన్స్మిషన్ లైన్లు, 12,200.9 సీకేఎం మేర 220 కేవీ ట్రాన్స్మిషన్ లైన్లు, 13,568.18 సీకేఎం మేర 132 కేవీ ట్రాన్స్మిషన్ లైన్లు ఉన్నాయి. మొత్తంగా 400 కేవీ, 220 కేవీ,132 కేవీ ట్రాన్స్మిషన్ లైన్లు 354 ఉండగా, వాటి ద్వారా రాష్ట్రంలోని తూర్పు, మధ్య, దక్షిణ ప్రాంత విద్యుత్ సంస్థలకు ఏడాదికి సగటున 70 వేల మిలియన్ యూనిట్ల విద్యుత్ను పంపిణీ చేస్తున్నారు. ఈ కార్పొరేషన్ యాజమాన్యంలోని అంతర్రాష్ట్ర ట్రాన్స్మిషన్ లైన్లను ప్రయివేటుకు ఇచ్చేందుకు వీలు కల్పిస్తూ కేంద్రం మార్గదర్శకాలు విడుదల చేసింది. డిస్కంల ఆధీనంలోని ట్రాన్స్మిషన్ లైన్ల లీజుకు అవకాశం కల్పించింది. దీని ప్రకారం ప్రస్తుతం ఉన్న లైన్లను అద్దె ప్రాతిపదికన ఇకపై ఎవరికైనా ఇవ్వొచ్చు. భవిష్యత్లో రానున్న ప్రైవేటు డిస్కంలకు నెట్వర్క్ సమస్యలు రాకుండా చూడటం దీని ప్రధాన ఉద్దేశం. ఇదీ చదవండి: రూ.10 వేల కోట్లతో చేపట్టనున్న ప్రాజెక్టులకు మోదీ శంకుస్థాపన! -
ట్రాన్స్కో ఆస్తులు ప్రైవేటుకు!
విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)ల ప్రైవేటీకరణ కోసం కేంద్రం విద్యుత్ చట్ట సవరణ బిల్లు–2022ను ఇటీవల పార్లమెంట్లో ప్రవేశపెట్టడంతో దేశవ్యాప్తంగా అలజడి రేగింది. దానితో బిల్లును పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి పంపారు. కానీ కేంద్రం కొత్తగా విద్యుత్ ట్రాన్స్మిషన్ సంస్థ (ట్రాన్స్కో)ల ఆస్తుల ప్రైవేటీకరణకు మార్గదర్శకాలను జారీ చేసింది. విద్యుత్ రంగంలో జనరేషన్ (ఉత్పత్తి), ట్రాన్స్మిషన్ (సరఫరా), డిస్ట్రిబ్యూషన్ (పంపిణీ) అనే మూడు ఉప రంగాలుండగా.. ఇప్పటికే జనరేషన్, డిస్ట్రిబ్యూషన్లో ప్రైవేటు సంస్థలు రంగ ప్రవేశం చేశాయి. ఇప్పుడు ట్రాన్స్మిషన్ రంగం సైతం ప్రైవేటుపరం కానుంది. సాక్షి, హైదరాబాద్: విద్యుత్ ట్రాన్స్మిషన్ వ్యవస్థ (ట్రాన్స్కో)ల ఆస్తులను గంపగుత్తగా ప్రైవేటుపరం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం సూచించింది. ‘అక్వైర్, ఆపరేట్, మెయింటైన్, ట్రాన్స్ఫర్ (ఏఓఎంటీ)’ఆధారిత పబ్లిక్, ప్రైవేటు భాగస్వామ్య (పీపీపీ) విధానంలో ఈ ఆస్తులను జీవితకాలం పాటు ప్రైవేటుకు అప్పగించాలని ప్రతిపాదించింది. ఈ విధానం ద్వారా ఆదాయాన్ని ఆర్జించేందుకు (అసెట్స్ మానిటైజేషన్) అనుసరించాల్సిన విధివిధానాలను మంగళవారం కేంద్ర విద్యుత్ శాఖ విడుదల చేసింది. మౌలిక సదుపాయాల కల్పనకు ముఖ్యమైన మార్గం ఇదేనని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్టు మార్గదర్శకాల్లో తెలిపింది. ప్రైవేటుపరం చేయడం ద్వారా ట్రాన్స్మిషన్ రంగంలో నాణ్యమైన సదుపాయాల కల్పనతోపాటు ఉద్యోగ, ఉపాధి అవకాశాల పెంపు, నిస్సహాయుల సాధికారత, ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదల సాధ్యమవుతుందని పేర్కొంది. ప్రైవేటుపరం చేయడం ద్వారా వచ్చే డబ్బులను ట్రాన్స్మిషన్ రంగ మౌలిక సదుపాయాల అభివృద్ధికి వినియోగించాలని రాష్ట్రాలకు సూచించింది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ పవర్గ్రిడ్ కార్పొరేషన్కు సంబంధించిన ఐదు ట్రాన్స్మిషన్ ఆస్తులను ప్రైవేటుపరం చేయడం ద్వారా 2021 మేలో రూ.7,700 కోట్లను ఆర్జించినట్టు తాజా ప్రతిపాదనల్లో కేంద్రం తెలిపింది. రాష్ట్రాలు సైతం ట్రాన్స్మిషన్ ఆస్తులను ప్రైవేటుపరం చేసేందుకు విస్తృత అవకాశాలు ఉన్నాయని స్పష్టం చేసింది. 2020 మార్చి నాటికి దేశంలో 66 కేవీ, ఆపై సామర్థ్యం కలిగిన 7,13,400 సర్క్యుట్ కిలోమీటర్ల ట్రాన్స్మిషన్ నెట్వర్క్ ఉందని.. దానిని ప్రైవేటుపరం చేసేందుకు వీలుందని కేంద్రం ప్రతిపాదించింది. నామమాత్రపు బుక్ విలువ ఆధారంగా.. కేంద్రం ప్రతిపాదించిన విధానం ప్రకారం.. 66 కేవీ, ఆపై సరఫరా సామర్థ్యం కలిగిన విద్యుత్ ట్రాన్స్మిషన్ లైన్లు, సబ్ స్టేషన్లు, ట్రాన్స్ఫార్మర్లు వంటి ఆస్తులను తొలుత ఆయా ట్రాన్స్కోలు గుర్తించాలి. వీటిలో కొన్ని ఆస్తులను ఒక గొడుగు కింద చేర్చి ‘స్పెషల్ పర్పస్ వెహికల్ (ఎస్పీవీ)గా ఏర్పాటు చేయాలి. ఒక్కో ఎస్పీవీని ఒక సంస్థగా పరిగణిస్తూ ఈఆర్సీ నుంచి ట్రాన్స్మిషన్ లైసెన్స్ తీసుకోవాలి. అనంతరం ఒక్కో ఎస్పీవీ ఆస్తుల విక్రయాలకు అంతర్జాతీయ బిడ్లను ఆహ్వానించాలి. అత్యధిక రేటు సూచించిన సంస్థకు ఈ ఆస్తులపై హక్కులను, నిర్వహణ బాధ్యతలను నిర్దేశిత కాలం పాటు అప్పగిస్తారు. ఈ ప్రైవేటు సంస్థలు ఈఆర్సీ నుంచి ట్రాన్స్మిషన్ లైసెన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. నామమాత్రంగా ఉండే బుక్ విలువ ఆధారంగా బిడ్డింగ్ జరుగుతుంది. అయితే సదరు ఆస్తుల నిర్దేశిత జీవితకాలం ముగిసిన తర్వాత.. ప్రైవేటు సంస్థలు వాటిని తిరిగి ట్రాన్స్కోకు ఒక్క రూపాయి నామమాత్రపు ధరకు తిరిగి అప్పగించాల్సి ఉంటుంది. సాధారంగా 35 ఏళ్ల కాలానికి ట్రాన్స్మిషన్ ఆస్తులను ప్రైవేటుపరం చేసే అవకాశం ఉందని విద్యుత్ రంగ నిపుణులు చెప్తున్నారు. సదరు ట్రాన్స్మిషన్ వ్యవస్థ ద్వారా 35 ఏళ్ల పాటు వచ్చే ఆదాయాన్ని ప్రైవేటు సంస్థలు పొందనున్నాయి. -
‘చీకటి’ కథనాలు ఉత్తదే
సాక్షి, అమరావతి: ‘అప్పుల చీకట్లో డిస్కంలు’ శీర్షికతో ‘ఈనాడు’ అసంబద్ధ కథనాన్ని ప్రచురించటాన్ని ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ ఖండించారు. 2022–23 ఆర్థ్ధిక సంవత్సరానికి విద్యుత్ పంపిణీ సంస్థలు ఆగస్టు నాటికి నెలవారీ వాయిదా కింద చెల్లించాల్సిన అప్పులు రూ.24,838 కోట్లేనని చెప్పారు. డిస్కంల అప్పులు రూ.56 వేల కోట్లు దాటాయని అసత్యాలతో నిరాధార కథనాన్ని ప్రచురించటాన్ని తప్పుబడుతూ సోమవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వం చెల్లించాల్సిన సబ్సిడీ, వివిధ శాఖలు, స్థానిక సంస్థలు వినియోగించిన విద్యుత్ చార్జీలను వసూలు చేయడం ద్వారా నెలవారీ అప్పులు, జీతభత్యాలు, ఇతర ఖర్చులను సకాలంలో చెల్లిస్తున్నట్లు తెలిపారు. కేంద్రం కొత్తగా తెచ్చిన ఎలక్ట్రిసిటీ లేట్ పేమెంట్ సర్చార్జీ (ఎల్పీఎస్) పథకంలో చేరి మొదటి వాయిదాగా గత నెలలో రూ.1,422 కోట్లు చెల్లించినట్లు గుర్తు చేశారు. ఈ ఏడాది జూన్ 3 వరకు బకాయిలను పవర్ పీఎఫ్సీ, ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఆర్ఈసీ) లిమిటెడ్ ద్వారా చెల్లిస్తున్నట్లు చెప్పారు. దీనివల్ల ఆలస్య రుసుము భారం నుంచి మినహాయింపు లభించి డిస్కంలకు ఆర్థికంగా కొంత మేర వెసులుబాటుగా ఉన్నట్లు తెలిపారు. -
రాష్ట్ర కరెంటు కొనుగోళ్లపై కేంద్రం నిషేధం !
-
రాష్ట్ర కరెంటు కొనుగోళ్లపై కేంద్రం నిషేధం!
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా విద్యుత్ క్రయ విక్రయాలు జరిగే ‘ఇండియన్ ఎనర్జీ ఎక్స్చేంజీ (ఐఈఎక్స్)’నుంచి లావాదేవీలు జరపకుండా రాష్ట్రంపై కేంద్రం నిషేధం విధించింది. కరెంటు కొనుగోలు చేయడానికి, విక్రయించడానికి వీలు లేదని, గురువారం అర్ధరాత్రి నుంచే దీన్ని అమల్లోకి తెస్తున్నామని పేర్కొంది. తెలంగాణ, ఏపీలతోపాటు దేశవ్యాప్తంగా 13 రాష్ట్రాలకు చెందిన 29 విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లకు ఈ నిషేధం వర్తిస్తుందని ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర విద్యుత్ శాఖ పరిధిలోని పవర్ సిస్టమ్ ఆపరేషన్ కార్పొరేషన్ (పొసోకో) ఆయా రాష్ట్రాలకు వర్తమానం పంపింది. రూ.1,380 కోట్ల బకాయిలు రాష్ట్రంలోని ఉత్తర తెలంగాణ పంపిణీ సంస్థ (టీఎస్ఎన్పీడీసీఎల్) రూ.104.6 కోట్లు, దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ఎస్పీడీసీఎల్) రూ.197.67 కోట్లు, తెలంగాణ స్టేట్ పవర్ కోఆర్డినేషన్ కంపెనీ (టీఎస్పీసీసీ) రూ.1,078.69 కోట్లు కలిపి సుమారు రూ.1,380 కోట్ల మేర విద్యుత్ బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఇదే తరహాలో దేశవ్యాప్తంగా చాలా విద్యుత్ సరఫరా సంస్థలు గడువు తీరి నెల రోజులైనా విద్యుదుత్పత్తి కంపెనీలకు బకాయిలు చెల్లించలేదని కేంద్ర విద్యుత్ శాఖ తన ‘ప్రాప్తి వెబ్ పోర్టల్లో ప్రకటించింది. దేశవ్యాప్తంగా 13 రాష్ట్రాల్లోని 29 విద్యుత్ సంస్థల బకాయిలు రూ.5,085.30 కోట్లకు చేరాయని తెలిపింది. అవసరానికి కొనుగోళ్ల కోసం.. విద్యుత్ లభ్యతకు మించి డిమాండ్ ఉన్న రాష్ట్రాలు ఆ లోటును పూడ్చుకోవడానికి ఎనర్జీ ఎక్స్చేంజీ నుంచి విద్యుత్ కొనుగోలు చేస్తుంటాయి. అలాగే విద్యుత్ డిమాండ్ తగ్గి, మిగిలిపోయినప్పుడు దానిని ఎనర్జీ ఎక్స్చేంజీలో విక్రయిస్తుంటాయి. కేంద్రం తాజాగా నిషేధం విధించడంతో ఆయా రాష్ట్రాలు విద్యుత్ కొనుగోలు, అమ్మకాల అవకాశాన్ని కోల్పోనున్నాయి. తెలంగాణ బుధవారం ఎనర్జీ ఎక్స్చేంజీ నుంచి ఏకంగా 1980 మెగావాట్ల విద్యుత్ను కొనుగోలు చేయడం గమనార్హం. ప్రధానంగా విద్యుత్ డిమాండ్ గరిష్టంగా ఉండే సమయాల్లో రాష్ట్రం కొనుగోలు చేస్తోంది. ప్రస్తుతం కేంద్రం విధించిన నిషేధంతో రాష్ట్రంలో నిరంతర విద్యుత్ సరఫరాపై ఎలాంటి ప్రభావం ఉండబోదని తెలంగాణ ట్రాన్స్కో, జెన్కోల సీఎండీ డి.ప్రభాకర్రావు తెలిపారు. ప్రాప్తి పోర్టల్లో పేర్కొన్న బకాయిలన్నింటినీ చెల్లించామని, తమపై నిషేధాన్ని తొలగించాలని ఆయన పోసోకోకు లేఖ రాశారు. ప్రస్తుతానికి ప్రభావం తక్కువే! రాష్ట్రంలో విస్తారంగా వానలు పడుతుండటంతో ప్రస్తుతం వ్యవసాయ విద్యుత్ డిమాండ్ తక్కువగా ఉంది. ఇదే సమయంలో కృష్ణా, గోదావరి నదులకు భారీగా వరద వస్తుండటంతో శ్రీశైలం, సాగర్, జూరాల, పులిచింతల ప్రాజెక్టుల్లో గణనీయంగా విద్యుదుత్పత్తి జరుగుతోంది. అందువల్ల ఎనర్జీ ఎక్స్చేంజీ నుంచి విద్యుత్ కొనుగోళ్లపై నిషేధం ప్రభావం పెద్దగా కనబడే అవకాశం లేవు. వానలు తగ్గితే మాత్రం అక్కడక్కడా కోతలు విధించే పరిస్థితి ఎదురుకానుంది. ఇక బిల్లులు చెల్లించకుంటే రాష్ట్రాలకు కరెంట్ కట్ కేంద్ర ప్రభుత్వం గత జూన్లో అమల్లోకి తెచ్చిన లేట్ పేమెంట్ సర్చార్జీ రూల్స్–2022 ప్రకారం.. విద్యుదుత్పత్తి కంపెనీల నుంచి కొనుగోలు చేసిన కరెంటుకు సంబంధించిన బిల్లులను 45 రోజుల గడువులోగా డిస్కంలు చెల్లించాల్సి ఉంటుంది. లేకుంటే సదరు డిస్కంలకు విద్యుత్ విక్రయించకుండా ఆపేస్తారు. గత వేసవిలోనూ నిషేధం ఆదానీ పవర్ కంపెనీ నుంచి కొన్న సౌర విద్యుత్ బిల్లులను గడువులోగా చెల్లించలేదంటూ.. కేంద్రం గత వేసవిలోనూ రాష్ట్రంపై నిషేధం విధించింది. అయితే ఆ నిషేధంపై హైకోర్టు స్టే ఇవ్వడంతో రాష్ట్రానికి ఊరట లభించింది. రాష్ట్రాలపై కేంద్రం కక్ష సాధింపు కేంద్రం మరోసారి రాష్ట్రాలపై కక్ష సాధింపు చర్యలకు పూనుకుంది. రాష్ట్ర విద్యుత్ సంస్థలను ఇబ్బంది పెట్టాలని చూస్తోంది. హైకోర్టు స్టే ఉన్నా ఐఈఎక్స్ లావాదేవీలపై నిషేధం విధించడం సరికాదు. దీనిపై సోమవారం హైకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్ వేస్తాం. ప్రజలు, వినియోగదారులు విద్యుత్ సంస్థలకు సహకరించాలి. – డి.ప్రభాకర్రావు, తెలంగాణ జెన్కో, ట్రాన్స్కో సీఎండీ -
విద్యుత్ సంస్థల్లో బదిలీలు షురూ
సాక్షి, అమరావతి: విద్యుత్ సంస్థల్లో బదిలీల పర్వం మొదలైంది. ఏపీ ట్రాన్స్కో, ఏపీ జెన్కోలలో పనిచేస్తున్న ఉద్యోగుల బదిలీలకు ఎండీ బీ శ్రీధర్ శుక్రవారం మార్గదర్శకాలను విడుదల చేశారు. వీటితో ప్రమేయం లేకుండా ఆంధ్రప్రదేశ్ తూర్పు, మధ్య, దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)ల సీఎండీలు కే సంతోషరావు, జే పద్మాజనార్థనరెడ్డి, హెచ్ హరనాథరావు కూడా వేర్వేరుగా బదిలీ మార్గదర్శకాలు వెల్లడించారు. వీటి ప్రకారం నేటి (4వ తేదీ) నుంచి బదిలీ ప్రక్రియ మొదలుకానుంది. బదిలీలకు అర్హులైన వారి పేర్ల జాబితాను సంబంధిత కార్యాలయాల్లో శనివారం ప్రదర్శిస్తారు. దీంతో మొత్తం ఎంతమందికి బదిలీలు జరుగుతాయనేది స్పష్టంకానుంది. అందులో ఉన్నవారు డిస్కంల ఉద్యోగులైతే ఈ నెల 9లోగా.. జెన్కో, ట్రాన్స్కో ఉద్యోగులైతే ఈ నెల 10లోగా తమ అభ్యర్థనలను సమర్పించాలి. డిస్కంలలో బదిలీలు ఈ నెల 15కల్లా పూర్తికానుండగా, 16కల్లా జెన్కో, ట్రాన్స్కోలో చేస్తారు. అయితే, ఉద్యోగులను రిలీవ్ చేసేందుకు ఈ నెల 23 వరకు గడువిచ్చారు. ట్రాన్స్కో, జెన్కోలో మార్గదర్శకాలిలా.. ప్రస్తుత పోస్టులో ఏప్రిల్ 30 నాటికి మూడేళ్ల పనికాలం పూర్తిచేసుకున్న వారు బదిలీకి అర్హులు. అయితే.. ఇదే తేదీకి విద్యుదుత్పత్తి కేంద్రం, కార్పొరేట్ కార్యాలయంలో ఐదేళ్లు పనిచేసిన వారిని బదిలీ చేస్తారు. ఇందులోని మొత్తం ఉద్యోగుల్లో 20 శాతం మందికి మాత్రమే సీనియారిటీ ప్రకారం బదిలీ జరుగుతుంది. రెండేళ్లు పూర్తిచేసుకున్న వారు తీవ్ర అనారోగ్య సమస్యలు, వ్యక్తిగత కారణాలపై సంబంధిత ధ్రువపత్రాలు సమర్పించి బదిలీ కోరుకోవచ్చు లేదా నిలుపుకోవచ్చు. పరస్పర బదిలీ కావాలనుకునే వారు కనీసం ఏడాది పాటు ఒకేచోట పనిచేసి ఉండాలి. రెండేళ్లు పూర్తిచేసుకున్న వారు ‘రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్’ సౌకర్యాన్ని ఇప్పుడు ఉపయోగించుకుంటే మళ్లీ ఎనిమిదేళ్లకే అర్హులవుతారు. ఏసీబీ, విజిలెన్స్ కేసుల్లో ఉన్నవారు బదిలీలకు అనర్హులు డిస్కంలలో నిబంధనలు ఇలా.. ప్రస్తుత ప్రాంతంలో ఐదేళ్లు, ఒకే పోస్టులో మూడేళ్లు పనిచేసిన వారు బదిలీకి అర్హులు. మొత్తం అర్హుల్లో 100 శాతం మందికి బదిలీ జరుగుతుంది. తీవ్ర అనారోగ్య సమస్యలు, భార్యాభర్తలు బదిలీల నుంచి మినహాయింపు పొందవచ్చు. వచ్చే ఏడాది మార్చి 31 నాటికి రిటైరయ్యే వారిని బదిలీ చేయరు. రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్ పొందాలంటే రెండేళ్లు, మ్యూచువల్ ట్రాన్స్ఫర్ కోరాలంటే ఏడాదిపాటు ఒకేచోట పనిచేసి ఉండాలి. జనరల్ ట్రాన్స్ఫర్స్ పూర్తయిన తరువాత ఖాళీలను బట్టి అభ్యర్థనలను పరిగణలోకి తీసుకుంటారు. ఒకే ఊర్లో సుదీర్ఘకాలం కుదరదు.. విద్యుత్ సంస్థల్లో గతంలో ఒకే ఊరిలో సెక్షన్, డివిజన్ కార్యాలయాలకు బదిలీ అయ్యేవారు. పోస్టులోకి వచ్చి ఎన్నేళ్లు అయ్యిందనే దానిని బట్టి బదిలీ జరిగేది. కానీ, ఇప్పుడలా కుదరదు. ఒక ఊరిలో ఎన్నేళ్లు ఉన్నారనే దానినే తప్ప పోస్టులోకి వచ్చింది లెక్కలోకి తీసుకోరు. దీనివల్ల ఒకే ఊరిలో పదేళ్లు, ఇరవై ఏళ్లు సర్వీసుచేసే అవకాశం ఉండదు. ఈ నిబంధన నుంచి యూనియన్ల నాయకులతో సహా ఎవరికీ మినహాయింపులేదు. డిస్కంలలో బదిలీ పరిధిలోకి వచ్చే వారిలో 20 శాతం మందిని మాత్రమే గతంలో బదిలీ చేసేవారు. కానీ, ఇప్పుడు ఎంతమందికి అర్హత ఉంటే అంతమందినీ బదిలీ చేయనున్నారు. దీనివల్ల గిరిజన ప్రాంతాల్లోనూ, మారుమూల గ్రామాల్లోనూ మగ్గిపోతున్న వారికి ఇతర ప్రాంతాలకు వెళ్లే వెసులుబాటు కలుగుతుంది. పరస్పర ఆమోదంతో బదిలీ కోరుకోవాలంటే పట్టణం నుంచి గ్రామానికి, లేదా గ్రామం నుంచి పట్టణానికి అనుమతిస్తారు. -
పోలీసులపై కోపం.. టౌన్ మొత్తం కరెంట్కట్
సాక్షి,పలమనేరు(తిరుపతి): ఓ కేసు విచారణలో భాగంగా పోలీసులు అవమానించారని ఆగ్రహించిన ట్రాన్స్కో సిబ్బంది పట్టణం మొత్తానికి విద్యుత్ సరఫరా నిలిపేయడం శుక్రవారం పలమనేరులో చర్చనీయాంశంగా మారింది. వివరాలివీ.. ఇటీవల పట్టణంలో జరిగిన గంగజాతరలో స్థానిక ముత్తాచారిపాళ్యానికి చెందిన రజని(58) కరెంట్ షాక్తో మృతి చెందిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించి కేసు నమోదు చేసిన పోలీసులు విచారణలో భాగంగా స్థానిక లైన్మన్ ప్రకాష్, సచివాలయ పరిధిలో సిబ్బందిని శుక్రవారం స్థానిక స్టేషన్కు పిలిపించారు. వారు వెళ్లగానే వారి సెల్ఫోన్లను తీసిపెట్టుకుని అక్కడే వేచిఉండమని చెప్పారు. దీంతో వారు తమకి, కేసుకు ఏంటి సంబంధంమంటూ అడిగినట్టు తెలిసింది. దీంతో పోలీసులు కాస్త దురుసుగా మాట్లాడడంతో, వాగ్వాదం చోటుచేసుకున్నట్లు సమాచారం. పోలీసులు తమను అవమానించారని భావించిన ట్రాన్స్కో సిబ్బంది పట్టణంలో కరెంట్ సరఫరాను నిలిపేశారు. దీంతో మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు పట్టణంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఆపై ట్రాన్స్కో ఏడీ చిన్నబ్బ, డీఎస్పీ గంగయ్య చర్చించి, ఈ విషయం పెద్దది కాకుండా విద్యుత్ సరఫరాను పునరుద్ధరించినట్లు తెలిసింది. ఈవిషయమై ట్రాన్స్కో ఏడీ చిన్నబ్బను ‘సాక్షి’ వివరణ కోరగా తమ సిబ్బందిపట్ల పోలీసుల తీరు బాగోలేకనే వారు కరెంటు ఆఫ్ చేసినట్టు తెలిసిందన్నారు. ఇదే విషయమై స్థానిక సీఐ భాస్కర్ స్పందిస్తూ.. విద్యుత్ షాక్తో మహిళ మృతి నేపథ్యంలో విచారణ నిమిత్తం ట్రాన్స్కో సిబ్బందిని పిలిపించిన మాట వాస్తవమేనన్నారు. అయితే నిర్లక్ష్యంగా సమాధానమివ్వడంతో కాసేపు స్టేషన్లోనే కూర్చోబెట్టుకున్నామన్నారు. దీన్ని అవమానంగా భావించి పట్టణం మొత్తానికి విద్యుత్ సరఫరా నిలిపేయడం ఎంత వరకు సమంజసమన్నారు. చదవండి: Indian Paper Currency History: సముద్రం పాలైన ‘హైదరాబాద్’ కరెన్సీ.. నాసిక్లో నోట్ల ముద్రణ -
విద్యుత్ ఉద్యోగులూ.. ఆందోళనొద్దు
సాక్షి, అమరావతి: ట్రాన్స్కో, జెన్కో, డిస్కంలలో ఉద్యోగుల జీతాలు తగ్గనున్నాయనే ప్రచారాన్ని విద్యుత్ పంపిణీ సంస్థల సీఎండీలు కొట్టిపడేశారు. విద్యుత్ ఉద్యోగులకు పే రివిజన్ కమిటీ(పీఆర్సీ) వేశాక జీతాలు తగ్గిస్తారనేది కేవలం అపోహ మాత్రమేనని వారు స్పష్టం చేశారు. ట్రాన్స్కో సీఎండీ నాగులపల్లి శ్రీకాంత్, జెన్కో ఎండీ శ్రీథర్, ఏపీసీపీడీసీఎల్ సీఎండీ జె.పద్మాజనార్దనరెడ్డి, ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ హెచ్.హరనాథరావు, ఏపీఈపీడీసీఎల్ సీఎండీ కె.సంతోషరావులతో పాటు ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలతో ఇంధన శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి బుధవారం సచివాలయంలో సమావేశం నిర్వహించారు. ఆ సమావేశం వివరాలను సీఎండీలు, జేఏసీ నేతలు ‘సాక్షి’కి వివరించారు. పీఆర్సీ వచ్చే వరకూ ఇవే జీతాలు.. విద్యుత్ సంస్థల్లో ఉద్యోగులు అనవసర భయాలతో వీఆర్ఎస్ తీసుకోవాల్సిన అవసరం లేదని సీఎండీలు తెలిపారు. పీఆర్సీ వచ్చే వరకూ ఇవే జీతాలు కొనసాగుతాయని, ఆ కమిటీ అధ్యయనం తర్వాత తన నివేదికను ప్రభుత్వానికి ఇస్తుందని, ఆపై ప్రభుత్వ నిర్ణయం మేరకు జీతాలుంటాయని వారు వెల్లడించారు. అలాగే కొత్తగా తీసుకొస్తున్న సర్వీస్ రెగ్యులేషన్స్ వల్ల కూడా జీతాలు తగ్గుతాయనే అనుమానాలున్నాయని, అది పూర్తిగా అవాస్తవమన్నారు. రెగ్యులేషన్స్ ఎప్పుడు అమల్లోకొస్తే ఆ రోజు నుంచి నియమితులైన ఉద్యోగులకే ఆ నిబంధనలు వర్తిస్తాయని, అవి రావడానికి ముందు ఉన్న ఉద్యోగులెవరికీ వాటి వల్ల ఎలాంటి ఇబ్బందులుండవన్నారు. సెక్షన్ 79సీ ఆఫ్ ఎలక్ట్రిసిటీ సప్లయి యాక్ట్ 1948 ప్రకా>రం 1967లో రెగ్యులేషన్స్ రూపొందించారని, ఆపై దాని స్థానంలో ఎలక్ట్రిసిటీ యాక్ట్ 2003 వచ్చిందన్నారు. దీనివల్ల పాతది వాడుకునేందుకు వీల్లేదని, ఒక బోర్డు రెగ్యులేషన్లను మరో బోర్డు మార్చేందుకూ అవకాశం లేదని చెప్పారు. ఈ నేపథ్యంలో కొత్తగా రెగ్యులేషన్స్ రూపొందిస్తున్నారని వివరించారు. కేసులను ఎత్తివేస్తామన్నారు.. ఉద్యోగుల సంక్షేమమే తమకు తొలి ప్రాధాన్యమని బాలినేని, సజ్జల స్పష్టం చేసినట్టు ఏపీ స్టేట్ పవర్ ఎంప్లాయిస్ జాయింట్ యాక్షన్ కమిటీ(జేఏసీ) చైర్మన్ చంద్రశేఖర్ తెలిపారు. ఉద్యోగ సంఘాల నేతలపై ఉన్న దాదాపు 32 కేసులను తక్షణమే ఎత్తివేస్తామని వారు హామీ ఇచ్చినట్టు వెల్లడించారు. డీఏ, ఇతర అంశాలపై చర్చించేందుకు వారంలో మరోసారి సమావేశం నిర్వహిస్తామన్నారని చంద్రశేఖర్ వివరించారు. మీటర్ రీడర్లకు పీస్ రేటు(విద్యుత్ బిల్లులపై ఇచ్చే కమీషన్)ను త్వరలో పెంచేందుకు చర్యలు చేపడతామని బాలినేని, సజ్జల హామీ ఇచ్చినట్టు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ మీటర్ రీడర్ల రాష్ట్ర కార్యాచరణ కమిటీ(జేఏసీ) గౌరవాధ్యక్షుడు బాలకాశి, యూనియన్ నేతలు తెలిపారు. సచివాలయంలో వారిని కలిసి తమ సమస్యలను విన్నవించగా సానుకూలంగా స్పందించారని వెల్లడించారు. మూడు కంపెనీల సీఎండీలు చర్చించి రేటుపై నిర్ణయం తీసుకోవాలని బాలినేని, సజ్జల ఆదేశించినట్టు జేఏసీ నేతలు చెప్పారు. డిస్కంల పరిధిలో ఉన్న దాదాపు 4,600 మంది రీడర్లకు డిస్కం పరిధిలోనే ఇతర ఉపాధి అవకాశాలు కల్పించే అంశాన్ని కూడా పరిశీలించాల్సిందిగా సీఎండీలకు వారు సూచించినట్టు వివరించారు. -
భారం మోపి బురద!
సాక్షి, అమరావతి: గత సర్కారు అనాలోచిత నిర్ణయాలు, అసంబద్ధ విధానాలతో విద్యుత్ రంగం కుదేలైంది. బకాయిలు చెల్లించకపోవడంతో డిస్కంలు అప్పుల ఊబిలో కూరుకుపోయాయి. అప్పుడు చేసిన తప్పిదాలే ట్రూ అప్ చార్జీల భారానికి కారణమయ్యాయని విద్యుత్తు రంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుంచి చౌక విద్యుత్తు కొనుగోళ్లు, పొదుపు చర్యలతో విద్యుత్ రంగాన్ని బలోపేతం చేస్తూ పంపిణీ సంస్థలను ఆదుకుంటోంది. విద్యుత్తు రంగంలో ఆధునిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటూ అనవసర వ్యయాన్ని నియంత్రిస్తోంది. మరోవైపు ప్రజలపై పెనుభారం పడకుండా భారీగా రాయితీలను భరిస్తోంది. రైతులతో పాటు ఇతర వర్గాలకు ఉచిత, రాయితీ విద్యుత్ను అందిస్తూనే కొనుగోళ్లు, పంపిణీలో నష్టాలను తగ్గించుకునేందుకు చర్యలు చేపడుతోంది. అయితే టీడీపీ నేతలు వాస్తవాలను మభ్యపుచ్చి తమ కారణంగా ప్రజలపై పడిన ట్రూ అప్ చార్జీలపై వారే ఆందోళనకు దిగడం పట్ల సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. ఆ ఐదేళ్లూ అప్పుల కొండ ఆర్ధిక భారం నుంచి తప్పించుకునేందుకు గత సర్కారు తప్పుడు నివేదికలతో డిస్కంలను అప్పుల ఊబిలోకి గెంటేసింది. ఫలితంగా 2014 నుంచి 2019 వరకూ విద్యుత్ పంపిణీ సంస్థల నష్టాలు రూ.4,110 కోట్ల నుంచి ఏకంగా రూ.27,240 కోట్లకు చేరాయి. గత రెండున్నరేళ్లలో నష్టాలు రూ.311 కోట్లు మాత్రమే పెరిగాయి. ప్రస్తుతం నష్టాలు రూ.27,551 కోట్లుగా ఉన్నాయి. టీడీపీ హయాంలో వార్షిక సరఫరా ఖర్చు రూ.24,211 కోట్ల నుంచి రూ.46,404 కోట్లకు చేరుకుంది. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తరువాత పొదుపు చర్యలతో ఇది తగ్గుముఖం పట్టింది. ప్రస్తుతం రూ.39,324 కోట్లుగా ఉంది. ఇక 2014 నుంచి 2019 వరకూ విద్యుత్ రంగం అప్పులు రూ.31,648 కోట్ల నుంచి రెట్టింపై రూ.62,463 కోట్లకి ఎగబాకాయి. 2014 జూన్ 2 నాటికి విద్యుత్తు కొనుగోళ్ల బకాయిలు, నిర్వహణ ఖర్చులు రూ.12,500 కోట్లు ఉండగా 2019 ఏప్రిల్ 1 నాటికి రూ.32,000 కోట్లకు చేరాయి. భారమైనా భరిస్తున్న వైఎస్సార్సీపీ ప్రభుత్వం రాష్ట్ర చరిత్రలోనే తొలిసారిగా గృహ విద్యుత్ వినియోగానికి సంబంధించి రూ.1,707.07 కోట్ల సబ్సిడీని రాష్ట్ర ప్రభుత్వం భరిస్తోంది. రాయితీలు, ప్రోత్సాహకాలు, గృహ విద్యుత్ వినియోగదారులతో పాటు చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, రైతులు, పౌల్ట్రీ వర్గాల భారాన్ని ప్రభుత్వమే మోస్తోంది. వ్యవసాయ ఉచిత విద్యుత్కు సంబంధించి రూ.7297.08 కోట్ల ఆర్ధిక భారం ప్రభుత్వంపై పడింది. తొలిసారిగా ఉచిత విద్యుత్ వర్గాలన్నీ సెక్షన్–65 కింద ప్రత్యక్ష రాయితీ పొందేలా ఒకే గొడుగు కిందకు ఏపీఈఆర్సీ తెచ్చింది. దీనివల్ల పడిన రూ.1,657.56 భారాన్ని కూడా భరించేందుకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అంగీకరించారు. రాష్ట్రవ్యాప్తంగా మూడు పంపిణీ సంస్థల పరిధిలోనూ ఒకే విధంగా ధరలు అమలుకు ప్రభుత్వం ముందుకు వచ్చింది. దీనివల్ల ప్రభుత్వంపై రూ.136.72 కోట్ల భారం పడింది. అప్పటిలా కనీస చార్జీలు లేవు గృహ విద్యుత్ వినియోగదారుల నుంచి రూ.50 చొప్పున కనీస చార్జీలు వసూలు చేసే విధానం గత సర్కారు హయాంలో అమలైంది. దీనివల్ల నెలంతా విద్యుత్ వినియోగించకపోయినా కనీస చార్జీ రూ.50 చెల్లించాల్సి వచ్చేది. దీన్ని తొలగించి కిలోవాట్కు రూ.10 వసూలు చేసే విధానాన్ని వైఎస్సార్సీపీ ప్రభుత్వం తీసుకువచ్చింది. అంటే నెలంతా విద్యుత్ వినియోగించకపోతే కనీస చార్జీ చెల్లించనవసరం లేదు. ఇక సగటు యూనిట్ సేవా వ్యయం రూ.7.17 నుంచి రూ.6.37కి తగ్గించింది. విద్యుత్ వినియోగాన్ని బట్టి శ్లాబులను మార్చి అధికభారం మోపే విధానాన్ని టీడీపీ సర్కారు ఐదేళ్లూ అమలు చేసింది. దాని నుంచి కాపాడటానికి ఏ నెలలో ఎంత విద్యుత్ వినియోగిస్తున్నారో టారిఫ్ ప్రకారం ఆ నెలలోనే బిల్లు వేసే విధంగా కంటిన్యూ బిల్లింగ్ విధానాన్ని ఇప్పుడు ప్రభుత్వం తెచ్చింది. విద్యుత్ సంక్షేమ రంగంవైపు అడుగులు.. విద్యుత్తు రంగాన్ని ప్రగతిశీల, ప్రజా సంక్షేమ రంగంగా మార్చాలని ప్రభుత్వం భావిస్తోంది. ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులకు 200 యూనిట్లు, ఎంబీసీలు, చేనేత కార్మికులకు 100 యూనిట్లు, దోబీఘాట్లు, లాండ్రీలకు 150 యూనిట్లు, స్వర్ణకారులకు 100 యూనిట్లు, సెలూన్లు, రోల్డ్ గోల్డ్ పనివారికి 100 యూనిట్లు ఉచితంగా అందజేస్తోంది. విద్యుత్తు సరఫరాలో అంతరాయాలను తగ్గించేందుకు చర్యలు తీసుకుంటోంది. 2019–20లో 3 లక్షలుగా ఉన్న అంతరాయాలను 2020–21 నాటికి 1.77 లక్షలకు తగ్గించింది. 2019–20లో యూనిట్కు రూ.7.23 చొప్పున ఉన్న సగటు సర్వీసు వ్యయాన్ని 2020–21 నాటికి రూ.6.37కి తగ్గించగలిగింది. ఇటు డిస్కంలను ఆదుకుంటున్న ప్రభుత్వం.. విద్యుత్తు సంస్థలు 2019–21 మధ్య కొనుగోళ్ల కోసం విద్యుదుత్పత్తి సంస్థలకు రూ.64,007 కోట్లు చెల్లించాయి. దీనిని తట్టుకోవాలంటే ప్రభుత్వం నుంచి సబ్సిడీలు సకాలంలో అందాలి. ఈ నేపథ్యంలో 2019 మార్చి 31 నాటికి విద్యుత్తు సబ్సిడీ బకాయిలు రూ.13,388 కోట్లు ఉండగా ప్రభుత్వం రూ.11,442 కోట్లు ఇచ్చింది. 2019–21 సంవత్సరానికి విద్యుత్తు సబ్సిడీ, ఇతర ఛార్జీల కింద మరో రూ.16,724 కోట్లు విడుదల చేసింది. ఇలా విద్యుత్తు సంస్థలను ఆదుకునేందుకు రూ.28,166 కోట్లు విడుదల చేసింది. వాస్తవ సర్దుబాటు వ్యయం రూ.20,572 కోట్లు విద్యుత్ పంపిణీ సంస్థలు 2014–19 కాలానికి దాదాపుగా రూ.20,572 కోట్ల వాస్తవ అదనపు వ్యయం సర్దుబాటు కోసం విద్యుత్ నియంత్రణ మండలికి 2019 చివరిలో విన్నవించాయి. ఇదే కాకుండా 2014–15 నుంచి 2018–19 వరకు సంస్థల నెట్వర్క్ (పంపిణీ వ్యవస్థ) నిర్వహణ, ఆదాయ అవసరాల వాస్తవ ఖర్చుల ఆధారంగా జరిపిన అదనపు వ్యయం సర్దుబాటు రూపంలో మరో రూ.7,224 కోట్లు అనుమతించాలని విద్యుత్ నియంత్రణ మండలిని కోరాయి. ఇందులో రూ.3,555 కోట్ల వసూలును ఏపీఈఆర్సీ తిరస్కరించింది. రూ.3,669 కోట్ల ట్రూ–అప్ చార్జీల వసూలు మాత్రం అనివార్యమైంది. నిజానికి ఇది కూడా ఆమోదించకపోతే విద్యుత్ పంపిణీ సంస్థల మనుగడ కష్టంగా మారే ప్రమాదం ఉంది. అది మంచిది కాదని విద్యుత్ రంగ నిపుణులు పేర్కొంటున్నారు. గత ప్రభుత్వ హయాం నాటివే ‘ప్రస్తుతం అమలవుతున్న ట్రూ అప్–సర్దుబాటు చార్జీలు గత ప్రభుత్వ హయాం నాటి విద్యుత్ పంపిణీ నెట్వర్క్ చార్జీలకు సంబంధించినవి. విద్యుత్ పంపిణీ సంస్థల వార్షిక ఖర్చులు, ఆదాయ అవసరాలకు అనుగుణంగా గత ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోకపోవడం, విద్యుత్ నియంత్రణ మండలి నిర్దేశించిన సబ్సిడీని భరించని కారణంగా పంపిణీ సంస్థల అప్పులు పెరిగిపోయాయి. ఏపీఈఆర్సీకి సమర్పించే వార్షిక ఆదాయ అవసరాల నివేదికలలో వాస్తవాలను వెల్లడించకుండా పరోక్షంగా భారాన్ని తగ్గించుకుని తప్పుల తడకలు నివేదికలతో సమయాన్ని వెళ్లదీశారు. అప్పుడు జరిగిన నష్టమంతా సర్దుబాటు చార్జీల రూపంలో వినియోగదారులపై పడింది. 2014–15 నుంచి 2018–19 వరకు నెట్వర్క్ (పంపిణీ వ్యవస్థ) నిర్వహణకు అనుమతించిన వ్యయం కన్నా వాస్తవ ఖర్చు అధికమవడం వల్లే ఈ సవరింపు చార్జీలు విధించాల్సి వచ్చిందనే విషయాన్ని గమనించాలి’ –నాగులాపల్లి శ్రీకాంత్, ఇంధన శాఖ కార్యదర్శి -
తెలంగాణలో ‘కరెంట్’కు కష్టాలు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో విద్యుత్ రంగం ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకుంది. కొండలా పేరుకు పోయిన రుణాలకు ప్రతినెలా వడ్డీలు కట్టడం, ఉద్యోగులకు జీతాలు చెల్లించడం తమ వల్ల కావట్లేదని రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లు మొత్తుకుంటున్నాయి. ప్రతినెలా రూ.1,200 కోట్లు ఆర్థిక సాయం చేయాలని, లేకుంటే డిస్కంల నిర్వహణ సాధ్యం కాదని కోరుతున్నాయి. అయితే ఇప్పటికే పెద్ద ఎత్తున విద్యుత్ సబ్సిడీలను భరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. మరింతగా నిధులు ఇవ్వలేని పరిస్థితి ఉందని స్పష్టం చేసినట్టు సమాచారం. ప్రత్యామ్నాయంగా విద్యుత్ చార్జీల పెంపునకు అనుమతించి డిస్కంలను గట్టెక్కించాలని భావిస్తున్నట్టు తెలిసింది. ఒత్తిళ్లు తట్టుకోలేక..: గత నెల 21న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు నిర్వహించిన ఓ సమీక్షలో తెలంగాణ ట్రాన్స్కో, జెన్కో సీఎండీ ప్రభాకర్రావు డిస్కంల పరిస్థితిని వివరించినట్టు తెలిసింది. ప్రతినెలా డిస్కంల అప్పులపై వడ్డీల చెల్లింపు కోసం రూ.800 కోట్లు, జీతాల కోసం రూ.400 కోట్లు కలిపి రూ.1,200 కోట్ల చొప్పున ప్రభుత్వ సాయంగా విడుదల చేయాలని కోరారని.. విద్యుత్ చార్జీలు పెంచడానికి కూడా అనుమతించాలని విజ్ఞప్తి చేశారని సమాచారం. అయితే విద్యుత్ చార్జీల పెంపుపై మాత్రమే సీఎం సానుకూలంగా స్పందించారని.. అదనపు నిధులివ్వడం సాధ్యంకాదని తేల్చిచెప్పారని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. దీనితో చేసేదేమీ లేక ప్రభాకర్రావు దీర్ఘకాలిక సెలవులో వెళ్లారని పేర్కొంటున్నాయి. బిల్లులు, బకాయిలు చెల్లించాలంటూ విద్యుదుత్పత్తి కంపెనీలు, రుణ సంస్థలు తెస్తున్న ఒత్తిళ్లు తట్టుకోలేకపోతున్నానని.. జెన్కో, ట్రాన్స్కో సీఎండీ బాధ్యతల నుంచి తనను తప్పించాలని ప్రభాకర్రావు కొద్దినెలలుగా విజ్ఞప్తి చేస్తూ వస్తున్నారని, కానీ సీఎం అంగీకరించడం లేదని పేర్కొంటున్నాయి. రూ.20 వేల కోట్ల అప్పుల్లో.. రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థల నష్టాలు ఏటేటా పెరిగిపోయి.. ప్రస్తుతం రూ.20 వేల కోట్లను దాటినట్టు అధికారవర్గాలు చెబుతున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక.. విద్యుత్ పంపిణీ వ్యవస్థల (నెట్వర్క్) సామర్థ్యం పెంపునకు డిస్కంలు రూ.వేల కోట్ల అప్పులు చేశాయి. ప్రస్తుతం ప్రతినెలా వడ్డీల కిందనే రూ.800 కోట్ల మేర చెల్లించాల్సి వస్తోంది. ఉద్యోగుల జీతాలకూ ఇబ్బంది తలెత్తుతోంది. దీనితో కొంతకాలంగా ప్రతి నెలా బ్యాంకుల నుంచి అడ్వాన్స్ తీసుకుని ఉద్యోగులకు జీతాలు చెల్లిస్తున్నట్టు అధికారులు చెప్తున్నారు. చార్జీల పెంపుపై కసరత్తు రాష్ట్రంలో గత ఆరేళ్లుగా విద్యుత్ చార్జీలను పెంచలేదు. విద్యుత్ చట్టం ప్రకారం.. డిస్కంలు ఏటా నవంబర్ 30లోగా తర్వాతి ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన విద్యుత్ చార్జీల పెంపు (టారిఫ్ సవరణ) ప్రతిపాదనలను, ఆదాయ, వ్యయాల అంచనా (ఏఆర్ఆర్) నివేదికను రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ)కి సమర్పించాల్సి ఉంటుంది. ఈఆర్సీ వాటిని పరిశీలించి చార్జీల సవరణను ఆమోదిస్తుంది. అయితే డిస్కంలు గత మూడేళ్లుగా టారిఫ్ సవరణ, ఏఆర్ఆర్ నివేదికలను సమర్పించడమే లేదు. విద్యుత్ చార్జీల పెంపునకు ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడమే దీనికి కారణం. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో డిస్కంలను గట్టెక్కించడం కోసం చార్జీలు పెంచాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయానికి వచ్చింది. హుజూరాబాద్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరుగుతుండటంతో.. ఆ ప్రక్రియ ముగిశాక ఈఆర్సీకి టారిఫ్ పెంపు ప్రతిపాదనలను సమర్పించనున్నట్టు అధికార వర్గాలు చెప్తున్నాయి. ఆరేళ్లుగా చార్జీలు పెంచని నేపథ్యంలో ఈసారి గణనీయంగానే పెంపు ఉండవచ్చని అధికారవర్గాలు తెలిపాయి. కేటగిరీల వారీగా 10 శాతం నుంచి 20శాతం వరకు చార్జీలు పెంచాలని డిస్కంలు కోరుతున్నాయని వివరించాయి. అంతేగాకుండా గత ఆరేళ్లుగా వచ్చిన నష్టాలకు సంబంధించి ‘ట్రూఅప్’ చార్జీలు వసూలు చేసుకోవడానికి అనుమతించాలని డిస్కంలు విజ్ఞప్తి చేశాయని.. దానికి ఈఆర్సీ అనుమతిస్తే వినియోగదారులపై ఒకేసారి పెనుభారం పడే అవకాశాలు ఉంటాయని వెల్లడించాయి. ప్రభుత్వం, ఈఆర్సీ అనుమతిస్తే.. వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి విద్యుత్ చార్జీల పెంపు అమల్లోకి వస్తాయని తెలిపాయి. ఇప్పటికే సబ్సిడీల భారం రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయానికి ఉచిత విద్యుత్, ఇతర రాయితీ పథకాలు, ఎత్తిపోతల స్కీమ్లకోసం ప్రతినెలా డిస్కంలకు రూ.833.33 కోట్లు విడుదల చేస్తోంది. ఇందుకోసం బడ్జెట్లోరూ.10 వేల కోట్లు కేటాయిస్తోంది. డిస్కంలు కోరినట్టు ప్రతినెలా మరో రూ.1,200 కోట్ల చొప్పున ఇస్తే ఏడాదికి రూ.14,400 కోట్ల అదనపు భారం పడుతుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. అప్పులు, నష్టాలు పెరుగుతూ.. కొన్నేళ్లుగా రాష్ట్రంలో విద్యుత్ అవసరాలు బాగా పెరిగాయి. డిమాండ్కు తగినట్టుగా ఎక్కువ ధరతో విద్యుత్ కొని తక్కువ రేటుతో సరఫరా చేయాల్సి వచ్చింది. దానికితోడు ఆరేళ్లుగా విద్యుత్ చార్జీలు పెంచకపోవడం, ఉద్యోగులకు భారీగా జీతాల పెంపుతోనూ డిస్కంలపై ఆర్థిక భారం పడింది. వివిధ కేటగిరీల కింద సరఫరా చేస్తున్న రాయితీ విద్యుత్ కంటే.. ప్రభుత్వం నుంచి అందుతున్న సబ్సిడీ సొమ్ము తక్కువగా ఉందన్న అంచనాలు ఉన్నాయి. దీనితో ఏటేటా నష్టాలు, అప్పులు పెరుగుతూ పోయాయి. -
ఇన్చార్జ్ సీఎండీల పాలనలో ట్రాన్స్కో, జెన్కో
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ట్రాన్స్కో, జెన్కో ఇన్చార్జిల పాలనలోనే కొనసాగుతోంది. ట్రాన్స్కో సీఎండీగా ఆ సంస్థ జేఎండీ సి.శ్రీనివాస రావు, తెలంగాణ జెన్కో సీఎండీగా సింగరేణి సంస్థ సీఎండీ ఎన్.శ్రీధర్కు అదనపు బాధ్యతలను కొనసాగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తదుపరి ఆదేశాలు జారీ చేసే వరకు వీరు అదనపు బాధ్యతల్లో కొనసాగుతారని స్పష్టం చేసింది. ఈ మేరకు రాష్ట్ర ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సునీల్ శర్మ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. సీఎండీగా ప్రభాకర్రావు కొనసాగింపుపై అస్పష్టత...: ట్రాన్స్కో, జెన్కో సంస్థలకు 2014 అక్టోబర్ నుంచి డి.ప్రభాకర్రావు ఉమ్మడి సీఎండీగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వ అనుమతితో గత ఆగస్టు 19 నుంచి 31 వరకు సెలవుపై వెళ్లారు. అనంతరం సెప్టెంబర్ 22 వరకు ప్రభాకర్రావు సెలవు పొడిగించుకున్నారు. అక్టోబర్ 1న విధుల్లో చేరి... ఆరు వరకు కొనసాగారు. ఆ తర్వాత నుంచి మళ్లీ ఆయన విధులకు హాజరు కాలేదు. సెలవు మంజూరు కోసం దరఖాస్తు కూడా చేసుకోలేదు. దీంతో ట్రాన్స్కో, జెన్కో సంస్థలకు సీఎండీలుగా జె.శ్రీనివాసరావు, ఎన్.శ్రీధర్లను అదనపు బాధ్యతల్లో కొనసాగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని రాష్ట్ర ఇంధన శాఖ వర్గాలు తెలిపాయి. ఈ ఉత్తర్వుల్లో ప్రభాకర్రావు సెలవుల పొడిగింపు అంశం ప్రస్తావించకపోవడంతో ట్రాన్స్కో, జెన్కో సీఎండీ పదవుల్లో ఆయన కొనసాగుతారా? లేదా? అన్నది విద్యుత్ సౌధలో చర్చనీయాంశంగా మారింది. ప్రభాకర్రావు సీఎండీ పదవికి రాజీనామా చేసి ఉండవచ్చని చర్చ జరుగుతుండగా, ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కార్యాలయం వర్గాలు తోసిపుచ్చాయి. ఆయన కొనసాగుతారా? లేదా ? అన్న అంశంపై సీఎంఓ వర్గాలు కూడా ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. -
‘లైన్మన్ల’ నియామకం నెలలో పూర్తి చేయండి
సాక్షి, హైదరాబాద్: ట్రాన్స్కో ఆధ్వర్యంలో 2017లో జారీచేసిన నోటిఫికేషన్లో భాగంగా జూనియర్ లైన్మన్ల నియామకాలను నెలరోజుల్లో పూర్తి చేయాలని హైకోర్టు ఆదేశించింది. వీటికి సంబంధించిన మరో ఏడు పిటిషన్లను కూడా కొట్టివేసింది. ట్రాన్స్కో ఆధ్వర్యంలో చేపట్టిన సబ్ ఇంజనీర్, నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆధ్వర్యంలో చేపట్టిన సబ్ ఇంజనీర్ల నియామకాలకు సంబంధించిన వివాదం సుప్రీంకోర్టులో ఉన్న నేపథ్యంలో న్యాయస్థానం ఆదేశాల మేరకు నియామక ప్రక్రియ చేపట్టాలని స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ బి.విజయసేన్రెడ్డి ఇటీవల తీర్పునిచ్చారు. లైన్మన్ల నియామకాల్లో 20 మార్కులు వెయిటేజీ ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ పలువురు హైకోర్టును ఆశ్రయించగా ధర్మాసనం వెయిటేజీ మార్కులను సమర్థించింది. మరో ధర్మాసనం తప్పుబట్టింది. దీంతో ఈ వివాదం ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన విస్తృత ధర్మాసనం ముందుకు రాగా అది కూడా వెయిటేజీని సమర్థిస్తూ తీర్పునిచ్చింది. -
అనంతపురం: గుంతకల్లు ట్రాన్స్కో డీఈ రవిబాబు అవినీతి బాగోతం
-
పాతలైన్లతోనే రెట్టింపు కరెంట్..
సాక్షి, అమరావతి: ఏపీ ట్రాన్స్కో సరికొత్త హై టెన్షన్ లో సాగ్ (హెటీఎల్ఎస్) సాంకేతిక పరిజ్ఞానంపై ఆసక్తి చూపుతోంది. ఈ టెక్నాలజీ వినియోగం ద్వారా విద్యుత్ లైన్ల సామర్థ్యం పెంచబోతోంది. కొత్తగా లైన్లు వేయకుండా, ఉన్న కారిడార్తోనే ఎక్కువ విద్యుత్ సరఫరా చేయడం ఈ టెక్నాలజీ ప్రత్యేకత. ఎక్కువ కరెంట్ రావడమే కాకుండా, కొత్త లైన్లు వేసే అవసరం లేకపోవడంతో సమయం, డబ్బు ఆదా అవుతుందని అధికారులు తెలిపారు. ఇప్పటికే 2 జిల్లాల్లో చేసిన ప్రయోగం సత్ఫలితాలనివ్వడంతో మరికొన్ని జిల్లాల్లో అమలు చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిపారు. కండక్టర్ల మార్పుతో రెట్టింపు వేగం విద్యుత్ వినియోగం పెరుగుతున్న కొద్దీ విద్యుత్ పంపిణీ లైన్ల సామర్థ్యం కూడా పెంచాల్సి ఉంటుంది. ఇలా చేయాలంటే కొత్త కారిడార్లు వేయాలి. వ్యవసాయ భూముల్లోంచి విద్యుత్ లైన్లు వేయడం కష్ట సాధ్యంగా మారుతోంది. రైతులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తుండటంతో ప్రాజెక్టులు ముందుకెళ్ళడం లేదు. ఈ నేపథ్యంలో హెటీఎల్ఎస్ టెక్నాలజీపై ట్రాన్స్కో దృష్టి సారించింది. ప్రస్తుతం ఉన్న విద్యుత్ కారిడార్ను వాడుకుంటూనే కేవలం కండక్టర్ను మార్చడం ద్వారా రెట్టింపు విద్యుత్ను పంపేందుకు ఈ టెక్నాలజీ ఉపయోగపడనుంది. హెచ్టీఎల్ఎస్ సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన కండక్టర్లు అత్యధిక ఉష్ణోగ్రతను తట్టుకుంటాయి. అత్యధిక వేగంతో కరెంట్ను సరఫరా చేస్తాయి. పెరుగుతున్న విద్యుత్ డిమాండ్ను తట్టుకునేందుకు, వివిధ రకాలుగా లభిస్తున్న విద్యుత్ను గ్రిడ్పై ప్రతికూల ప్రభావం లేకుండా పంపిణీ చేయడానికి ఇది తోడ్పడుతుందని అధికారులు తెలిపారు. రూ.100 కోట్ల వ్యయం.. హెటీఎల్ఎస్ టెక్నాలజీ కోసం ఏపీ ట్రాన్స్కో రూ.100 కోట్లు వెచ్చిస్తోంది. ప్రయోగాత్మకంగా కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల్లో రూ.15 కోట్లతో 13 కిలోమీటర్ల మేర 132 కేవీ కండక్టర్లు వేశారు. ఇవి మంచి ఫలితాన్నిచ్చాయి. రెండో దశలో విశాఖ, విజయనగరం, రాజమండ్రి, నెల్లూరు విద్యుత్ జోన్లలో కొత్త కండక్టర్లు వేయనున్నారు. 27 కిలోమీటర్ల మేర 220 కిలోవాట్ల సామర్థ్యంతో, 110 కిలోమీటర్ల మేర 132 కేవీ సామర్థ్యంతో హెటీఎల్ఎస్ కండక్టర్లు వేయబోతున్నారు. కాగా, విద్యుత్ లోడ్ తగ్గించడమే లక్ష్యంగా.. కొత్త టెక్నాలజీతో చేపడుతున్న ఈ ప్రాజెక్టు పనులకు త్వరలో టెండర్లు పిలవబోతున్నట్లు ట్రాన్స్కో డైరెక్టర్ ప్రవీణ్కుమార్ తెలిపారు. -
లో వోల్టేజీకిక చెక్!
సాక్షి, అమరావతి: ఉన్నట్టుండి విద్యుత్ బల్బులు డిమ్గా మారిపోవడం, ట్యూబ్లైట్లు ఆరిపోవడం, విద్యుత్ సరఫరా ఎక్కువ, తక్కువ కావడం వంటి సమస్యలు ఇక సమసిపోనున్నాయని విద్యుత్ అధికారులు చెబుతున్నారు. పట్టణాలతో పాటు గ్రామాల్లో సైతం విద్యుత్ లోవోల్టేజీ సమస్య తలెత్తదని అంటున్నారు. ఏపీ ట్రాన్స్కో రూ.6,610.5 కోట్ల వ్యయంతో 85 ప్రాజెక్టులను చేపడుతోంది. ప్రపంచబ్యాంక్తో పాటు పలు ఆర్థిక సంస్థలు సహకారంతో చేపడుతున్న ఈ ప్రాజెక్టుల పురోగతిని ట్రాన్స్కో సీఎండీ శ్రీకాంత్ నాగులాపల్లి ‘సాక్షి’కి వివరించారు. ► సబ్స్టేషన్లు, ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాటు, లైన్లు వేయడం కొత్త ప్రాజెక్టుల్లో ప్రధానంగా ఉన్నాయి. దీనివల్ల రాష్ట్రంలో ఎప్పుడు విద్యుత్ డిమాండ్ పెరిగినా లోవోల్టేజీ అన్న సమస్యే తలెత్తదు. ► రాష్ట్రంలో ఏటా 20 శాతం మేర విద్యుత్ వినియోగం పెరుగుతోంది. దీనికి తోడు రాష్ట్రవ్యాప్తంగా 18 లక్షల పంపుసెట్లకు పీక్ అవర్స్లోనే విద్యుత్ అందిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో పెరిగే లోడ్ను తట్టుకునేందుకు విద్యుత్ వ్యవస్థల బలోపేతం తప్పనిసరి. ► ట్రాన్స్కో, తూర్పు, దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థలు (ఏపీఈపీడీసీఎల్, ఏపీఎస్పీడీసీఎల్), డిజాస్టర్ రికవరీ ప్రాజెక్టు (ప్రకృతి వైపరీత్యాలప్పుడు ఉపయోగపడేది), విశాఖ, చెన్నై ఇండ్రస్టియల్ కారిడార్ (వీసీఐసీ), గ్రీన్ ఎనర్జీ కారిడార్ (జీఈసీ) కొత్త ప్రాజెక్టుల్లో ప్రధానంగా ఉన్నాయి. ► ఈ ప్రాజెక్టులకు ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీ కన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్ ఫైనాన్షియల్ ఇనిస్టిట్యూషన్ (ఐబీఆర్డీ), ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ (ఏఐఐబీ), ప్రపంచ బ్యాంకు వంటి అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు రుణాలు ఇచ్చేందుకు ముందుకొచ్చాయి. ఇప్పటికే కొంత భాగానికి పాలనపరమైన అనుమతులు కూడా లభించాయి. -
కరెంటు స్తంభంపై మంటలు..తప్పిన ప్రమాదం
సాక్షి, కరీంనగర్ : కరెంటు స్తంభంపై మంటలు చెలరేగి స్తంభం వద్ద నిలిచిన వర్షం నీళ్లలో సైతం కరెంటు ప్రవహించింది. అయితే ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ ఘటన కరీంనగర్ జిల్లాలో చోటుచేసుకుంది. సైదాపూర్ మండలం ఘనపూర్లో రైతు వెంకట్ రెడ్డికి చెందిన పత్తి చేనులో కరెంటు స్తంభం పై మంటలు చెలరేగాయి. 11 కె.వి లైన్ కావడంతో పవర్ షాక్ కొట్టి స్తంభం పై నుంచి భూమిపై వరకు మంటలు వచ్చాయి.దీంతో స్తంభం వద్ద నిలిచిన వర్షం నీళ్లలో సైతం కరెంటు ప్రవహించింది. ఆ వేడి దాటికి వర్షపు నీళ్లు సలసల మసిలాయి. అయితే ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. వెంటనే ట్రాన్స్కో అధికారులకు సమాచారం ఇవ్వడంతో పవర్ సప్లై నిలిపివేశారు. ఇన్సోలేటర్ ఫెయిల్ కావడంతో స్తంభంపై మంటలు వచ్చి కింద వాటర్ మరిగినట్లు విద్యుత్ అధికారులు తెలిపారు. వ్యవసాయ పొలాలకు వెళ్లే రైతులు కరెంట్ పోల్స్ తో జాగ్రత్తగా ఉండాలని కోరారు. -
గట్టెక్కిన గ్రిడ్!
సాక్షి, హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు ఆదివారం రాత్రి 9 గంటలకు రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి విద్యుత్ దీపాలు ఆర్పినప్పటికీ, విద్యుత్ శాఖ పక్కా వ్యూహంతో వ్యవహరించడంతో ఎక్కడా ఎలాంటి ఇబ్బంది తలెత్తలేదు. ఒకేసారి పెద్ద మొత్తంలో విద్యుత్ వినియోగంలో మార్పులు సంభవించినా, ఉత్పత్తి – సరఫరా మధ్య సమతూకం సాధించడంలో జెన్ కో, ట్రాన్స్ కో పూర్తిస్థాయిలో విజయం సాధించాయి. ఆదివారం ఉదయం నుంచి జెన్ కో– ట్రాన్స్ కో సీఎండీ ప్రభాకర్రావు విద్యుత్ సౌధలోని లోడ్ డిస్పాచ్ సెంటర్లోనే ఉండి విద్యుత్ డిమాండ్ ఒకేసారి పడిపోయినప్పుడు అనుసరించాల్సిన వ్యూహం రచించారు. దానికి అనుగుణంగా రాత్రి 9 గంటల నుంచి 9 నిమిషాల పాటు వ్యవహరించారు. రాష్ట్రంలో ఒకేసారి లైట్లు ఆర్పేయడం వల్ల 300 నుంచి 500 మెగావాట్ల డిమాండ్ పడిపోయే అవకాశం ఉందని కేంద్ర విద్యుత్ ప్రాధికార సంస్థ అంచనా వేసింది. కానీ రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి లైట్లు ఆర్పేయడం వల్ల రాష్ట్రంలో 1,500 మెగావాట్ల డిమాండ్ పడిపోయింది. మూడు రెట్ల విద్యుత్ డిమాండ్ పతనం... ఆదివారం రాత్రి 9 గంటలకు ముందు రాష్ట్రంలో 7,380 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ ఉండగా, 9 గంటల తర్వాత 5,800 మెగావాట్లకు పడిపోయింది. రాష్ట్రమంతటా ఇళ్లల్లో విద్యుత్ దీపాలను బంద్ చేస్తే గరిష్టంగా 300–500 మెగావాట్ల డిమాండ్ మాత్రమే తగ్గనుందని కేంద్ర విద్యుత్ ప్రాధికారత సంస్థ (సీఈఏ) అంచనా వేయగా, దాని కన్నా మూడు రేట్లు అధికంగా విద్యుత్ డిమాండ్ పతనమైంది. అయినా విద్యుత్ సరఫరా వ్యవస్థ (గ్రిడ్) కుప్పకూలకుండా లోడ్ డిస్పాచ్ సెంటర్ (ఎల్డీసీ) ఇంజనీర్లు కంటికి రెప్పలా కాపాడుకున్నారు. ఒక్కసారిగా విద్యుత్ డిమాండ్ భారీగా తగ్గడం తో గ్రిడ్ను బ్యాలెన్స్ చేసేందుకు నాగార్జునసాగర్ రివర్స్ పంపింగ్ కేంద్రంలోని నాలుగు యూనిట్లను నడపడం ద్వారా 400మెగావాట్ల విద్యుత్ను, మేడారంలోని కాళేశ్వరం పంపింగ్ స్టేషన్ను నడపడం ద్వారా మరో 300 మెగావాట్ల విద్యుత్ను వినియోగించారు. ఇలా మొత్తం 700 మెగావాట్ల కృత్రిమ విద్యుత్ డిమాండ్ను సృష్టించడంతో పాటు మరో 800 మెగావాట్ల వరకు థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో ఉత్పత్తి తగ్గించడం ద్వారా గ్రిడ్ బ్యాలెన్సింగ్ను పరిరక్షించారు. దీంతో విద్యుత్ ఉత్పత్తి– సరఫరాల మధ్య సమతూకం కుదిరింది. విద్యుత్ దీపాలను మళ్లీ వెలిగించడంతో క్రమంగా రాష్ట్రవ్యాప్తంగా డిమాండ్ పుంజుకుని పూర్వస్థితికి చేరింది. లైట్లు ఆర్పేసినా విద్యుత్కు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చేసిన విద్యుత్ శాఖను ముఖ్యమంత్రి కేసీఆర్ అభినందించారు. -
పక్కచూపుల నిఘా కన్ను
ద్వారకానగర్ (విశాఖ దక్షిణ): ఆదాయానికి మించి అక్రమంగా ఆస్తులు కూడబెట్టినట్లు అందిన సమాచారంతో ఏపీ ట్రాన్స్కో విజిలెన్స్ అదనపు ఎస్పీ తంగెళ్ల హరికృష్ణ ఇంట్లో ఏసీబీ అధికారులు గురువారం సోదాలు నిర్వహించారు. ఏకకాలంలో విశాఖలోని ఆశీలుమెట్ట దరి ఫేమ్ హైట్లోని ఐదో అంతస్తులో గల హరికృష్ణ నివాసంతోపాటు, రాజమండ్రి, హైదరాబాద్, అమలాపురం, విజయవాడలోని బంధువుల ఇళ్లలో సోదాలు చేశారు. ఈ సందర్భంగా ఏసీబీ శ్రీకాకుళం డీఎస్పీ బీవీఎస్ రమణమూర్తి మాట్లాడుతూ అక్రమంగా ఆస్తులు కూడబెట్టినట్లు అందిన సమాచారంతో విజిలెన్స్ ఏఎస్పీ హరికృష్ణ ఇంటిలో సోదాలు చేశామని తెలిపారు. ప్రభుత్వ ధర ప్రకారం రూ.2.74 కోట్ల విలువ చేసే ఆస్తులను గుర్తించామని, మార్కెట్ ధర ప్రకారం రూ.10కోట్ల పైనే ఉంటాయని అంచనా వేస్తున్నామన్నారు. తూర్పు గోదావరి జిల్లా అమలాపురం ప్రాంతానికి చెందిన హరికృష్ణ 1989లో పోలీస్ శాఖలో ఎస్ఐగా చేరి ఏఎస్పీ స్థాయికి చేరుకున్నారని తెలిపారు. సీఐడీ, ఏసీబీ, విజిలెన్స్ విభాగాల్లో పనిచేశారన్నారు. విజిలెన్స్ ఎన్ఫోర్సుమెంట్లో అదనపు ఎస్పీగా శ్రీకాకుళం జిల్లాలో పనిచేసి నాలుగు నెలల కిందట విశాఖలోని ఏపీ ట్రాన్స్కోలో విజిలెన్స్ ఏఎస్పీగా చేరారని తెలిపారు. సోదాల్లో పలు కీలక డాక్యుమెంట్లు స్వా«దీనం చేసుకున్నామని తెలిపారు. విజయనగరం డీఎస్పీ డి.వి.ఎస్.నాగేశ్వరరావు, సీఐలు అప్పారావు, భాస్కర్, ఎస్ఐలు, సిబ్బంది సోదాల్లో పాల్గొన్నారు. హరికృష్ణ ఇంట్లో ఏసీబీ అధికారుల సోదాలతో పోలీస్ శాఖతోపాటు ఏపీఈపీడీసీఎల్లో చర్చనీయంగా మారింది. హరికృష్ణను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసి ఎంవీపీ జోన్ పోలీస్ స్టేషన్కు తరలించారు. శుక్రవారం ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తామని డీఎస్పీ తెలిపారు. గుర్తించిన ఆస్తులివీ ►హరికృష్ణ పేరు మీద తూర్పు గోదావరి జిల్లా, తాళ్లరేవు మండలం, చోల్లంగి గ్రామంలో 300 చదరపు గజాల ఇంటి స్థలం. ►విజయవాడలోని గుణదల జయప్రకాష్నగర్లో శ్రీలక్ష్మి అపార్టుమెంట్ సి – 4లో ఓ ప్లాట్. ►హరికృష్ణ భార్య తంగెళ్ల పద్మారాణి పేరు మీద పశ్చిమ గోదావరి జిల్లా పోడూరు మండలం, మట్టపర్రు గ్రామంలో 25 సెంట్లు స్థలం. ►శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం పొన్నాడ గ్రామంలో 3.02 ఎకరాల స్థలం. ►కృష్ణ జిల్లా, మంగళగిరి మండలం, నిడమర్రు గ్రామంలో 72 సెంట్ల స్థలం. ►పశ్చిమ గోదావరి జిల్లా, గవరవరం గ్రామంలో అక్షయ ఎన్క్లేవ్లో ఓ ప్లాట్. ►విశాఖపట్నం జిల్లా, పరదేశిపాలెంలో ఓ ప్లాట్. ►హరికృష్ణ కుమారుడు రాజహర్ష పేరు మీద విశాఖ జిల్లా పరదేశిపాలెంలో ఓ ప్లాట్. ►కుమార్తె మానవిత పేరు మీద హైదరాబాద్ సరూర్నగర్లో బిజాయ్ క్యాస్టిల్లో మూడో అంతస్తులో ఓ ప్లాట్. ►సుమారు 6.64 లక్షల విలువ చేసే 260 గ్రాముల బంగారం, 2876 గ్రాముల వెండి వస్తువులు, రూ.19లక్షల విలువ చేసే ఇతర విలువైన వస్తువులను గుర్తించారు. ►అదేవిధంగా బ్యాంకు ఖాతాలో రూ.17లక్షల నగదు గుర్తించారు. -
‘కరెంట్’ రికార్డు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ కొత్త రికార్డులు సృష్టిస్తోంది. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలోని భారీ సామర్థ్యం గల పంపుల ద్వారా నీటిని తోడుతుండటం, కొన్ని రోజులుగా వర్షాలు లేక పొలాలకు బోరుబావుల ద్వారా నీటిని తోడేందుకు విద్యుత్ను వినియోగిస్తుండడడంతో డిమాండ్ విపరీతంగా పెరిగిపోతోంది. గత 3 రోజులుగా వరుసగా విద్యుత్ డిమాండ్ రికార్డులపై రికార్డులు సృష్టించింది. 2018 సెప్టెంబర్ 11న నమోదైన 10,818 మెగావాట్ల గరిష్ట డిమాండ్ ఇప్పటివరకు రికార్డు కాగా, ఈ నెల 28న 11,064 మెగావాట్ల గరిష్ట వినియోగం నమోదై కొత్త రికార్డు సృష్టించింది. మరుసటి రోజు 29న డిమాండ్ 11,638 మెగావాట్లకు చేరి అంతకు ముందురోజు ఉన్న రికార్డును చెరిపేసింది. తాజాగా శుక్రవారం ఉదయం 7 గంటల ప్రాంతంలో విద్యుత్ డిమాండ్ 11,669 మెగావాట్లకు చేరి మరో కొత్త రికార్డు సృష్టించింది. తెలంగాణ చరిత్రలో ఇప్పటివరకిదే అత్యధిక విద్యుత్ డిమాండ్ కాగా, రానున్న 2 నెలల్లో డిమాండ్ పెరిగి 12,000 మెగావాట్లు దాటే అవకాశముందని ట్రాన్స్కో అంచనా వేసింది. -
లైన్లు లేకున్నా లైన్ క్లియర్!
సాక్షి, అమరావతి: గత ప్రభుత్వ హయాంలో ఏపీ ట్రాన్స్కోలో చోటు చేసుకున్న మరో అవినీతి వ్యవహారం తెరపైకి వచ్చింది. అనంతపురం జిల్లాలో అసలు సరిపడా లైన్లే లేకుండా పవన విద్యుత్కు అనుమతులు మంజూరు చేయడం విద్యుత్ వర్గాలనే విస్మయానికి గురి చేస్తోంది. విండ్ పవర్ లాబీ, విద్యుత్ అధికారులు, టీడీపీ పెద్దలు కలసికట్టుగా ఈ కుంభకోణానికి పాల్పడినట్లు ట్రాన్స్కో విజిలెన్స్ పరిశీలనలో వెల్లడైంది. 2017లో జరిగిన ఈ వ్యవహారంపై ట్రాన్స్కో విజిలెన్స్ విభాగం ఇటీవల ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక అందచేసింది. అవసరం లేకుండా ప్రైవేట్ పవన విద్యుత్కు గత సర్కారు ఎలా పెద్దపీట వేసిందో నిపుణుల కమిటీ ఇప్పటికే నిగ్గు తేల్చడం తెలిసిందే. లోపాయికారీ ఒప్పందంతో అనుమతులు.. దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీలో పవన విద్యుత్ను యూనిట్ రూ.4.84 చొప్పున కొనుగోలు చేసేందుకు గత ప్రభుత్వం అనుమతించింది. నిజానికి ఆ సమయంలో అన్ని రాష్ట్రాలు బిడ్డింగ్ ద్వారానే పవన విద్యుత్ కొనుగోలు చేస్తున్నాయి. అయితే విండ్ లాబీతో కుదుర్చుకున్న లోపాయికారి ఒప్పందంతో టీడీపీ పెద్దలు అడ్డగోలుగా అనుమతులిచ్చారు. అనంతపురం జిల్లా ఉరవకొండలో సరిపడా ట్రాన్స్కో లైన్లు లేకున్నా పవన విద్యుత్ కొనుగోలుకు ట్రాన్స్కో అధికారులు పచ్చజెండా ఊపడం గమనార్హం. నిబంధనలకు పూర్తి విరుద్ధంగా జరిగిన ఈ వ్యవహారంపై వ్యక్తమైన ఆరోపణలను అధికారులు తొక్కిపెట్టారు. సగానికి పైగా అదనం ఉరవకొండ పరిధిలో పవన విద్యుదుత్పత్తికి పలు బడా కంపెనీలు దరఖాస్తులు చేసుకున్నాయి. ఉత్పత్తి అయ్యే విద్యుత్ను గ్రిడ్కు అనుసంధానం చేసి రాష్ట్ర అవసరాలకు వినియోగిస్తారు. ఇందుకు విద్యుదుత్పత్తి జరిగే ప్రదేశంలో 400 కేవీ సబ్స్టేషన్లు, లైన్లు ఏర్పాటు చేయాలి. 2017 నాటికి ఏపీ ట్రాన్స్కో కేవలం 997 మెగావాట్ల విద్యుత్ తీసుకునేందుకు వీలుగా ట్రాన్స్కో లైన్లను విస్తరించింది. కానీ గత ప్రభుత్వం ఏకంగా 1,851 మెగావాట్ల మేర విద్యుత్ తీసుకునేందుకు విండ్ ఉత్పత్తిదారులకు అనుమతులు ఇవ్వడం గమనార్హం. దీన్ని ఆసరాగా చేసుకుని పవన విద్యుత్ ఉత్పత్తిదారులు విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటు చేసి వాటిని అడ్డం పెట్టుకుని బ్యాంకు లోన్లు తీసుకున్నారు. వీటిల్లో మాజీ ముఖ్యమంత్రికి బినామీగా వ్యవహరించిన వ్యక్తులకు సంబంధించిన పవన విద్యుత్ ప్లాంట్లు కూడా ఉన్నాయి. ఓ పవన విద్యుత్ సంస్థ విద్యుత్ శాఖలో కీలక బాధ్యతల్లో ఉన్న వ్యక్తికి పెద్ద ఎత్తున ముడుపులు ఇచ్చినట్టు తేలింది. టీడీపీకి చెందిన స్థానిక నేత ఒకరు మాజీ ముఖ్యమంత్రికి విండ్ లాబీ నుంచి భారీగా ముడుపులు ఇప్పించినట్టు విజిలెన్స్ అధికారుల దృష్టికి వచ్చింది. దీంతో ఎలాంటి లైన్లు లేకుండానే 854 మెగావాట్ల మేర పవన విద్యుత్ ఉత్పత్తికి అధికారులు అనుమతులు ఇచ్చినట్లు స్పష్టమవుతోంది. ఇదిలా ఉంటే అప్పటికప్పుడు కనెక్షన్లు ఇచ్చేందుకు వీలుగా వేరే ప్రదేశం నుంచి 500 ఎంవీఏ సామర్థ్యం గల ట్రాన్స్ఫార్మర్ను కూడా ఉరవకొండ ప్రాంతంలో బిగించడం విశేషం. ఓ అధికారి కీలక పాత్ర ట్రాన్స్కోలో డిప్యుటేషన్పై పనిచేసిన ఓ అధికారి పాత్రపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పవన విద్యుత్ లాబీకి, మాజీ ముఖ్యమంత్రికి మధ్య ఆయనే బేరసారాలు జరిపినట్లు తెలుస్తోంది. మరోవైపు అప్పటి ఇంధనశాఖ ముఖ్య అధికారి ప్రమేయం కూడా ఉందని విజిలెన్స్ అధికారులు అనుమానిస్తున్నారు. ఉరవకొండ ప్రాంతంలో సరిపడా లైన్లు లేవని, సామర్థ్యానికి మించి పవన విద్యుత్ ఉత్పత్తికి అనుమతులు ఇవ్వడం సరికాదని స్థానిక అధికారులు నివేదికలు పంపినా డిçప్యుటేషన్పై వచ్చి ట్రాన్స్కోలో పనిచేసిన అధికారి వినలేదని తెలిసింది. నివేదికలు ఇచ్చిన ఇంజనీర్లను పిలిచి మందలించినట్టు సమాచారం. ఈ మొత్తం వ్యవహారం అప్పటి సీఎం ఆదేశాల మేరకు జరిగిందని, ఇంధనశాఖ ముఖ్య అధికారి ఇంజనీర్లను సైతం బెదిరించినట్టు తెలిసింది. గత్యంతరం లేక క్షేత్రస్థాయి ఇంజనీర్లు ఉన్నతాధికారుల మాట వినాల్సి వచ్చిందని విజిలెన్స్ అధికారుల దృష్టికి వచ్చింది. ఈ వ్యవహారంలో ఎవరి పాత్ర ఎంత అనేది పూర్తి స్థాయి నివేదికలో తేలనుంది. -
అక్రమార్కులకు ‘షాక్’ ఇస్తారా?
సాక్షి, విజయనగరం: కొన్నేళ్లుగా ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీఈపీడీసీఎల్) అక్రమార్కులకు బంగారు బాతుగుడ్డుగా మారింది. అవినీతి, అక్రమాలకు ఆలవాలంగా తయారైంది. సంస్థలో అక్రమ నియామకాలు, అడ్డగోలు ఇంక్రిమెంట్లు, తుపాన్లలో నిధుల దుర్వినియోగం వంటి ఎన్నో అడ్డదారి వ్యవహారాలు చోటు చేసుకుంటున్నాయి. సీఎండీలుగా వ్యవహరించిన వారు, కీలకస్థానాల్లో ఉన్న మరికొందరు ఇందులో భాగస్వాములుగా ఉన్నారు. దీంతో ఈ అక్రమాలకు బాధ్యులపై చర్యలకు అడుగు ముందుకు పడడం లేదు. మూడు నెలల క్రితం ఈపీడీసీఎల్లో నిబంధనలకు విరుద్ధంగా 32 మందికి నోషనల్ ఇంక్రిమెంట్లను మంజూరు చేస్తూ రూ.కోట్లు చెల్లించారు. కానీ వీరికి ఇంక్రిమెంట్లు ఇవ్వడం ట్రాన్స్కో తేల్చి చెప్పినా ఇందుకు బాధ్యులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అంతేకాదు.. ఈ 32 మంది నుంచి రికవరీ చేయాలని ట్రాన్స్కో ఆదేశించినా ఇప్పటిదాకా కొద్దిమంది నుంచే తప్ప మిగతా వారి నుంచి వసూలు చేయలేదు. అలాగే తిత్లీ తుపానులో ఈపీడీసీఎల్కు రూ.349 కోట్ల నష్టం వాటిల్లింది. ఇందులోనూ పెద్ద ఎత్తున నిధుల స్వాహా జరిగింది. పనులు చేయకుండానే చేసినట్టు రికార్డులు సృష్టించి బిల్లులు చెల్లించడం, మెటీరియల్ కొనుగోలు చేయకుండానే కొనుగోలు చేసినట్టు చూపి కోట్లాది రూపాయల నిధులను మింగినట్టు ఆరోపణలొచ్చాయి. అప్పటి విద్యుత్ శాఖ మంత్రి కళా వెంకట్రావు బంధువుల పేరిట ఉన్న సంస్థ నుంచి కండక్టర్ల కొనుగోలు చేసినట్టు చూపించి సొమ్ము స్వాహా చేశారంటూ ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇంతటి భారీ కుంభకోణంపై కూడా ఎలాంటి చర్యలు లేవు. గతంలో నిబంధనలకు విరుద్ధంగా జిల్లాల్లోని సర్కిల్స్ నుంచి సీనియర్ అసిస్టెంట్లను కార్పొరేట్ కార్యాలయానికి బదిలీలు చేయడం వెనక భారీగా చేతులు మారాయన్న విమర్శలు సంబంధిత అధికారులపై వచ్చాయి. అంతేకాదు.. స్పాట్ బిల్లింగ్ కాంట్రాక్టర్ల రెండేళ్ల టెండరు గడువు 2019తో ముగిసింది. కానీ వారు అడగకుండానే అప్పటి సీఎండీ హెచ్వై దొర 2020 వరకు కాంట్రాక్టు పొడిగించేశారు. అలాగే షిఫ్ట్ ఆపరేటర్ పోస్టులు కూడా లక్షల్లో అమ్ముడుపోయినా సంబంధిత అధికారులపై ఎలాంటి చర్యలూ లేవు. మరోవైపు 15 ఏళ్ల క్రితం నిబంధనలకు తిలోదకాలిచ్చి ఈపీడీసీఎల్లో వివిధ పోస్టుల్లో 29 మందిని నియమించారు. వీరిలో 28 మంది నకిలీలేనని దీనిపై దర్యాప్తు జరిపిన విజిలెన్స్ అధికారులు తేల్చి నివేదికలిచ్చారు. చర్యలు తీసుకోవాలని రెండు మార్లు సిఫార్సు చేశారు. అయినా వీరు ఇప్పటికీ ఉద్యోగాల్లోనే కొనసాగుతూ లక్షల్లో జీతాలు తీసుకుంటున్నారు. ఇలా ఈపీడీసీఎల్లో చిన్నా చితకా కాదు.. భారీ అక్రమాలు, అవినీతి వ్యవహారాలు జరుగుతూనే ఉన్నాయి. 172 సబ్స్టేషన్ల ఏర్పాటులో ఎస్టిమేట్ రేట్లకంటే ఎక్కువకు మెటల్ కొనుగోలు చేయడంలోనూ నిధుల దుర్వినియోగానికి పాల్పడినట్టు ఆరోపణలున్నాయి. పదేళ్ల నుంచి కొనుగోలు ఆర్డర్ ప్రకారం సకాలంలో సప్లై చేయనందుకు పోల్స్ తయారీ సంస్థలకు విధించిన పెనాల్టీనీ మాఫీ చేసి రూ.38 కోట్లు వెనక్కి చెల్లించడం పెను దుమారం రేగింది. ఈ నేపథ్యంలో కొత్త సీఎండీగా బాధ్యతలు చేపట్టిన ఐఏఎస్ అధికారి నాగలక్ష్మి సెల్వరాజన్ వీటిన్నిటిపై దృష్టి సారిస్తారా? లేదా? ఈ సవాళ్లన్నిటీ ఆమె ఎలా ఎదుర్కొంటారన్న దానిపై సర్వత్రా చర్చ జరుగుతోంది. -
హైదరాబాద్కు ‘హై’పవర్!
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్లో రికార్డు స్థాయిలో పెరుగుతున్న డిమాండ్కు అనుగుణంగా విద్యుత్ సరఫరా వ్యవస్థ సామర్థ్యాన్ని పెంపొందించేందుకు రాష్ట్ర విద్యుత్ సరఫరా సంస్థ(ట్రాన్స్కో) అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంది. కొత్త టవర్లు నిర్మించకుండానే, కొత్త లైన్లు వేయకుండానే ప్రస్తుత లైన్లకు ‘హై టెంపరేచర్ లాసాగ్’ (హెచ్టీఎల్ఎస్) కండక్టర్లను అమర్చి హైదరాబాద్లో 70 కిలోమీటర్ల డబుల్ సర్క్యూట్ 220 కేవీ విద్యుత్ సరఫరా లైన్ల సామర్థ్యాన్ని రెట్టింపు చేసింది. దీంతో రూ.1,100 కోట్లు ఆదా చేయడంతోపాటు మూడేళ్లు పట్టే పనిని 3నెలల్లో పూర్తిచేసింది. సామర్థ్యం పెంచేందు కు ఏర్పాటు చేసిన కండక్లర్లను విద్యుత్ సౌధలో ట్రాన్స్కో సీఎండీ ప్రభాకర్రావు బుధవారం ప్రారంభించారు. అధిక లోడ్ లైన్ల సామ ర్థ్యం పెంపుతో హైదరాబాద్లో విద్యుత్ సరఫరాలో అప్పుడప్పుడు ఎదురవుతున్న సాంకేతిక సమస్యలు పరిష్కారం కానున్నాయి. రూ.1,100 కోట్లు ఆదా..: పారిశ్రామిక, వాణిజ్య, గృహ విద్యుత్ వినియోగం రోజురోజుకూ పెరుగుతోంది. గతేడాది 2,950 మెగావాట్ల గరిష్ట డిమాండ్ రాగా, ఈ ఏడాది 3,276 మెగావాట్లకు చేరింది. ప్రస్తుతమున్న లైన్లు, ట్రాన్స్ఫార్మర్లపై ఒత్తిడి పెరిగింది. ఎక్కువ లోడ్ గల రూట్లలో సరఫరాలో అప్పుడప్పుడు అవాంతరాలు తప్పట్లేదు. 400 కేవీ లైన్ల నుంచి 220 కేవీ విద్యుత్ను తీసుకొచ్చే మామిడిపల్లి– శివరామ్పల్లి, మల్కాపురం– షాపూర్నగర్, శంకరపల్లి–గచ్చిబౌలి లైన్లపై అధిక ఒత్తిడి ఉన్నట్లు నిర్ధారించారు. ఈ లైన్లలో సామర్థ్యాన్ని రెట్టింపు చేయాల్సిన అవసరాన్ని గుర్తించారు. ఈ మూడు లైన్లు కలిపి దాదాపు 70 కిలోమీటర్ల దూరం ఉంటుంది. కొత్తగా టవర్లు నిర్మించి, 220 కేవీ లైన్లు వేయాల్సిన పరిస్థితి ఉండేది. ఇలా చేయడం వల్ల రూ.1,200 కోట్ల వ్యయం అవుతుంది. పైగా మూడేళ్ల సమయం పట్టేది. ఆధునిక పరిజ్ఞానాన్ని వినియోగించి టవర్లు, లైన్లు నిర్మించకుండానే ప్రస్తుతమున్న లైన్ల సామర్థ్యాన్ని ప్రత్యేక కండక్టర్లు అమర్చడం ద్వారా రెట్టింపు చేసింది. ఈ కండక్టర్ల సామర్థ్యాన్ని మొదట నార్కట్పల్లి ప్రాంతంలో 20 కిలోమీటర్ల 132 కేవీ లైన్లలో పరీక్షించారు. ట్రాన్స్కో సాంకేతిక బృందం పూర్తి స్థాయిలో అధ్యయనం చేసిన తర్వాత ఈ కండక్టర్లను వాడాలని సిఫారసు చేసింది. టెస్ట్ రన్ కూడా విజయవంతం చేసిన తర్వాత, బుధవారం నుంచి అధికారికంగా ఈ మూడు లైన్లలో కండక్టర్లను అనుసంధానం చేశారు. దీంతో విద్యుత్ సరఫరా పరిస్థితి మెరుగైంది. 4 వేలకు పైగా డిమాండ్ తట్టుకునే సామర్థ్యం పెరిగింది. మూడేళ్ల వరకు ఢోకా లేకుండా హైదరాబాద్కు విద్యుత్ సరఫరా చేయొచ్చు. దీనికి రూ.100 కోట్ల వ్యయమైంది. 400 కేవీ రింగ్ ఏర్పాటు ‘హైదరాబాద్ ను జాగ్రత్తగా కాపాడుకోవాలి. పరిశ్ర మలు, వ్యాపారం, వాణిజ్యం, కార్యాలయాలు అన్నీ కరెంటుపై ఆధారపడి నడుస్తున్నాయి. ఎక్కడా విద్యుత్ కోతల్లేకుండా, సరఫరాలో అంతరాయం కలగకుండా చూస్తున్నాం. డిమాండ్కు తగినట్లు విద్యుత్ సరఫరా చేయడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నాం. ఇప్పటికే హైదరాబాద్ చుట్టూ 400 కేవీ రింగ్ ఏర్పాటు చేశాం. నాలుగు 400 కేవీ సబ్స్టేషన్లు నిర్మించాం. అక్కడి నుంచి 220 సబ్స్టేషన్లకు విద్యుత్ సరఫరా చేసే లైన్ల సామర్థ్యం ఎప్పటికప్పుడు పెంచుతున్నాం’ – ట్రాన్స్కో సీఎండీ డి.ప్రభాకర్ రావు -
నిర్మాణ రంగానికి ఊతం
1. ముందే విద్యుత్, నీటి కనెక్షన్ల దరఖాస్తు.. గతంలో నిర్మాణం పూర్తయి ఓసీ వచ్చిన తర్వా తే వాటర్ వర్క్స్, ట్రాన్స్కో విభాగాల కనెక్షన్ల కోసం దరఖాస్తు చేసుకోవాల్సి వచ్చేది. కానీ, తాజా నిబంధనతో ఓసీ రాకముందే డెవలపర్లు విద్యుత్, వాటర్ కనెక్షన్ల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. కనెక్షన్లు మాత్రం ఓసీ మంజూరయ్యాకే ఇస్తారు. కొన్ని చోట్ల వాటర్ వర్క్స్ విభాగానికి పూర్తి స్థాయిలో నల్లా లైన్స్ లేవు. టెండర్లు పిలవటం, పనులు పూర్తవటం వంటి తతంగమంతా జరగడానికి 3–9 నెలల సమయం పట్టేది. ఈ లోపు నిర్మాణం పూర్తయినా సరే కస్టమర్లు గృహ ప్రవే శం చేయకపోయే వాళ్లు. ఎందుకంటే మౌలిక వసతులు లేవు కాబట్టి! కానీ, ఇప్పుడు దరఖాస్తు చేయగానే వెంటనే అధికారులు ఆయా ప్రాం తాల్లో కనెక్షన్లు ఉన్నాయా? లేవా? చెక్ చేసుకునే వీలుంటుంది. దీంతో నిర్మా ణంతో పాటూ వసతుల ఏర్పాట్లు ఒకేసారి జరుగుతాయి. 2. వెంటిలేషన్స్లో గ్రీన్.. హరిత భవనాల నిబంధనల్లో ప్రధానమైనవి.. భవ న నిర్మాణాల్లో సాధ్యమైనంత వరకూ సహజ వనరుల వినియోగం. ఉదయం సమయంలో ఇంట్లో లైట్ల వినియోగం అవసరం లేకుండా సహజ గాలి, వెలుతురు వచ్చేలా గదుల వెంటిలేషన్స్ ఉం డాలి. అందుకే తాజాగా గదుల వెంటిలేషన్స్ గ్రీన్ బిల్డింగ్స్ నిబంధనలకు అనుగుణంగా ఉండాలనే నిబంధనలను తీసుకొచ్చారు. దీంతో ఇంట్లో లైట్లు, ఏసీల వినియోగం తగ్గుతుంది. ఫలితంగా కరెంట్ ఆదా అవుతుంది. నిర్వహణ వ్యయం కూడా తగ్గుతుంది. 3. సెట్బ్యాక్స్ తగ్గింపు.. 120 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తులో నిర్మించే భవనా ల చుట్టూ 20 మీటర్ల వెడల్పు ఖాళీ స్థలం వదిలితే సరిపోతుంది. గతంలో వీటికి సెట్బ్యాక్స్ 22.5 మీటర్లుగా ఉండేది. 55 మీటర్ల వరకూ ఎత్తు భవనాలకు గరిష్టంగా చుట్టూ వదలాల్సిన స్థలం 16 మీటర్లుగా ఉండగా.. ఆపై ప్రతి 5 మీటర్లకు 0.5 మీటర్ల ఖాళీ స్థలం పెరిగేది. కానీ, తాజా నిబంధనలతో 120 మీటర్ల ఎత్తు దాటితే గరిష్టంగా 20 మీటర్ల సెట్బ్యాక్ వదిలితే సరిపోతుంది. 4. రోడ్ల విస్తరణకు స్థలం ఇస్తే.. నగరంలో రోడ్ల విస్తరణలో స్థలాల సమీకరణ పెద్ద చాలెంజ్. దీనికి పరిష్కారం చెప్పేందుకు, స్థలాలను ఇచ్చేవాళ్లను ప్రోత్సహించేందుకు నిబంధనల్లో మార్పు చేశారు. రోడ్ల విస్తరణకు ముందు ఉన్న విధంగానే భవనం నమూనా, ఒక అంతస్తు నుంచి మరొక అంతస్తుకు ఉన్న ఎత్తు సేమ్ అదేగా ఉండాల్సిన అవసరం లేదు. భవన నిర్మాణానికి అనుమతించిన విస్తీర్ణం మాత్రం గతం కంటే మించకుండా ఉంటే చాలు. 5. టెర్రస్ మీద స్విమ్మింగ్ పూల్ ఇప్పటివరకు టెర్రస్ మీద స్విమ్మింగ్ పూల్స్ అనేవి స్టార్ హోటళ్లు, ప్రీమియం అపార్ట్మెంట్లలో మాత్ర మే కనిపించేవి. కానీ, తాజా సవరణల్లో టెర్రస్ మీద స్విమ్మింగ్ పూల్ ఏర్పాటును చేర్చారు. అపార్ట్మెంట్ పైకప్పును పూర్తి స్థాయిలో వినియోగించుకోవచ్చు. పైగా టెర్రస్ మీద స్విమ్మింగ్ పూల్, దాని కింది ఫ్లోర్లోనే క్లబ్ హౌస్ వంటి వసతులుంటా యి కాబట్టి కస్టమర్లు పూర్తి స్థాయిలో వసతులను వినియోగించుకుంటారు. అపార్ట్మెం ట్ చల్లగా ఉంటుంది. ఏసీ వినియోగం తగ్గు తుంది. నిర్వహణ పటిష్టంగా ఉన్నంతకాలం బాగుంటుంది. – సాక్షి, హైదరాబాద్ ఇంపాక్ట్ ఫీజు సంగతేంటి? ఓసీ రాకముందే బీటీ, సీసీ రోడ్లు నిర్మా ణం పూర్తి చేయాలనే నిబంధనను తీసుకొ చ్చారు. ఇది ఆహ్వానించదగ్గదే. కానీ, ఎక్స్టర్నల్ డెవలప్మెంట్ కోసం వసూలు చేస్తున్న ఇంపాక్ట్ ఫీజును ఇందులో నుంచి మినహాయించాలనేది డెవలపర్ల డిమాండ్. 6 ఫ్లోర్ల తర్వాత నుంచి ఇంపాక్ట్ ఫీజుగా చ.అ.కు రూ.50 వసూలు చేస్తున్నారు. నిజానికి నిర్మాణ కార్యకలాపాలతో అభి వృద్ధి జరిగి ఆయా ప్రాంతాల్లో జనాభా పెరుగుతుంది కాబట్టి ఇంపాక్ట్ ఫీజులతో ఎక్స్టర్నల్ డెవలప్మెంట్స్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. కానీ, తాజా నిబంధనల్లో ఎక్స్టర్నల్ డెవలప్మెంట్స్ కూడా నిర్మాణదారులే చేయాలి. ఆ తర్వాతే ఓసీ మంజూరు చేస్తామనడం సరైనది కాదు. ఇంపాక్ట్ ఫీజు ఎస్క్రో ఖాతాలో ఉంటుంది ఈ సొమ్ముతో డెవలపర్లు వసతులను ఏర్పా టు చేయాలి లేదా ఆయా ఖర్చును ఇంపాక్ట్ ఫీజు నుంచి మినహాయించాలి. -
ట్రాన్స్కోలో ఇష్టారాజ్యం
సాక్షి, మద్నూర్(జుక్కల్): తెలిసీ తెలియని పనులు చేస్తే ఉద్యోగం నుంచి తీసి వేస్తారు.. మళ్లీ వేరే ఉద్యోగం వెతుక్కోవచ్చు.. అయితే విద్యుత్ శాఖలో మాత్రం నిర్లక్ష్యం పనికిరాదు. కొద్దిపాటి నిర్లక్ష్యం చేసిన ప్రాణాల హరీమనడం ఖాయం. మండలలోని ట్రాన్స్కో అధికారులు స్థానికంగా ఉండకుండా ఇతర ప్రాంతాల నుంచి నిత్యం రాకపోకలు సాగిస్తున్నారు. ట్రాన్స్కో లైన్మెన్లు, సిబ్బంది ప్రైవేట్ వ్యక్తులకు పెట్టుకుని వారితో పనులు చేపించుకుని కొంత డబ్బు ముట్టజెప్పుతున్నారు. రాత్రి సమయాల్లో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడితే ప్రైవేటు వ్యక్తులే సమస్యలను పరిష్కరిస్తున్నారు. నిబంధనల ప్రకారం ట్రాన్స్కో అధికారులు, సిబ్బంది స్థానికంగా ఉండి, ప్రైవేటు వ్యక్తులతో పనులు చేయించరాదు. జిల్లాకు సరిహద్దులో ఉన్న మద్నూర్ మండలంలో ట్రాన్స్కో ఉన్నతాధికారుల పర్యవేక్షణలు లేకపోవడంతో సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని పలువురు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. మండల కేంద్రంలో విద్యుత్ లైన్కు ప్రైవేటు వ్యక్తితో మరమ్మతులు చేయించడం చూసి గ్రామస్తులు ఆశ్యర్యం వ్యక్తం చేశారు. ట్రాన్స్కో లైన్మెన్, క్యాజువల్ లెబర్, ట్రాన్స్కో సిబ్బంది దగ్గరుండి మరి పనులు చేపించడం దారుణమని పలువురు మండిపడుతున్నారు. గతంలో ట్రాన్స్కోలో ప్రైవేటు సిబ్బంది పనిచేస్తూ ప్రమాదల బారిన పడిన సంఘటనలు ఉన్నాయి. ఉపాధి కోసం, ట్రాన్స్కోలో ఉద్యోగం కోసం పని నేర్చుకుంటుమన్నామని ప్రైవేటు వ్యక్తులు చెబుతున్నారు. ట్రాన్స్కో జిల్లా అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. -
బకాయి చెల్లించకుండా బుకాయింపు
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్కు తెలంగాణ విద్యుత్తు సంస్థలు రూ.5 వేల కోట్లకుపైగా బకాయి పడ్డాయంటూ ఆ రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు చేస్తున్న ఆరోపణలు అబద్ధమని తెలంగాణ ట్రాన్స్కో, జెన్కో సీఎండీ ప్రభాకర్రావు అన్నారు. ఏపీ విద్యుత్తు సంస్థలే తెలంగాణకు బకాయిలు చెల్లించాల్సి ఉందని, ఆ విషయాన్ని పక్కనపెట్టి ‘ఉల్టా చోర్ కొత్వాల్కో డాంటే’తరహాలో ఏపీ వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ఆయన శుక్రవారం ఇక్కడ విద్యుత్సౌధలో మీడియాతో మాట్లాడారు. రెండు వైపుల నుంచి బకాయిలు ఇచ్చిపుచ్చుకోవాల్సి ఉన్నందున చాలాకాలంగా పరిష్కారం కోసం ఆహ్వానిస్తున్నా ఏపీ అధికారులు సహకరించటం లేదన్నారు. సెటిల్మెంట్ కోసం ముందుకు రాకుండా ఇప్పుడేమో తెలంగాణ విద్యుత్తు సంస్థలే బకాయి పడ్డాయని ఆరోపించటం హాస్యాస్పదమన్నారు. ‘ఏపీ డిస్కంల నుంచి తెలంగాణ డిస్కంలకు రూ.1,659 కోట్లు, ఏపీ ట్రాన్స్కో నుంచి తెలంగాణ ట్రాన్స్కోకు రూ.101 కోట్లు, ఏపీ జెన్కో నుంచి తెలంగాణ జెన్కోకు రూ.3,096 కోట్లు, ఏపీ పవర్ యుటిలిటీస్ నుంచి తెలంగాణ పవర్ యుటిలిటీస్కు రూ.929 కోట్లు వెరసి రూ.5,785 కోట్లు రావాల్సి ఉంది. విద్యుత్తు కొనుగోలుకు సంబంధించి తెలంగాణ డిస్కంల నుంచి ఏపీ జెన్కోకు రూ.3,379 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఈ మొత్తం పోను ఏపీ సంస్థలు తెలంగాణ సంస్థలకు రూ.2,406 కోట్లు చెల్లించాల్సి ఉంది. మరో రూ.1,100 కోట్ల వరకు తెలంగాణకు ఏపీ చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. వీటిని మరుగున పడేసి తెలంగాణనే బకాయిపడ్డట్టు తప్పుడు వాదనను తెరపైకి తెచ్చారు. ఈ లెక్కలు బహుశా అక్కడి ప్రభుత్వానికి తెలియకపోవచ్చు. అధికారులకు, ప్రభుత్వానికి మధ్య సమన్వయలోపం ఉన్నట్టుంది. తెలిసి ఉంటే ప్రభుత్వ వాదన అలా ఉండదు కదా’అని ప్రభాకరరావు అన్నారు. ఎన్సీఎల్టీని ఎందుకు ఆశ్రయించినట్టో... వాస్తవాలను పక్కన పెట్టి ఏపీ జెన్కో నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ)ని ఆశ్రయించటం విడ్డూరంగా మారిందని ప్రభాకర్రావు అన్నారు. దివాలా తీసిన సమయంలో ఈ ట్రిబ్యునల్ను ఆశ్రయించి లెక్కలు సరిచేసుకునేందుకు వాటి ఆస్తులను స్వాధీనం చేసుకునే ప్రక్రియ నిర్వహిస్తారని, మరి తెలంగాణ విద్యుత్తు సంస్థలను ఏపీ స్వాధీనం చేసుకోవాలని చూస్తోందా... అంటూ ఆయన ఎద్దేవా చేశారు. ఈ బకాయిలకు సంబంధించి సెటిల్ చేసుకునేందుకు రావాలంటూ ఇప్పటికే ఏడెనిమిది లేఖలు రాశామని, తాను స్వయంగా ఏపీ అధికారులతో మాట్లాడానని, కానీ అక్కడి నుంచి స్పందన లేదని ఆరోపించారు. ఏపీ అధికారులు ముందుకొస్తే 24 గంటల్లో పరిష్కరించుకునేందుకు తాము సిద్ధమని, ఆ తర్వాత తాము చెల్లించాల్సిన బకాయిలు వెంటనే చెల్లించేందుకు కూడా సిద్ధమన్నారు. ఏపీ తెలంగాణకు చెల్లించేది డబ్బు... తెలంగాణ ఏపీకి చెల్లించాల్సింది డబ్బు కాదా... డబ్బుకు కూడా రంగు, రుచి, వాసన వేర్వేరుగా ఉంటాయని ఏపీ అధికారులు భావిస్తున్నట్టున్నారంటూ ఎద్దేవా చేశారు. -
విద్యుత్ చార్జీల పెంపు అనివార్యమే!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుపోతున్నాయి. ఓ వైపు డిస్కంల ఆర్థికలోటు ఏడాదికేడాది పెరిగిపోతుండగా, మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆశించిన మేరకు విద్యుత్ రాయితీలు కేటాయించడం లేదు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఎదురైన విద్యుత్ సంక్షోభాన్ని డిస్కంలు కేవలం 6 నెలల్లోనే అధిగమించి 24 గంటల నిరంతర విద్యుత్ సరఫరా అందిస్తున్నాయి. దీనికితోడు రాష్ట్రప్రభుత్వ నిర్ణయం మేరకు గతేడాది జనవరి 1 నుంచి వ్యవసాయానికి ఉచిత్విద్యుత్ సరఫరా పథకాన్ని 9 గంటల నుంచి 24 గంటలకు పొడిగించాయి. ఈ చర్యల వల్ల రాష్ట్ర విద్యుత్ డిమాండ్ భారీగా పెరిగిపోయింది. రాష్ట్ర అవసరాలకు తగ్గట్లు ఎప్పటికప్పుడు ప్రైవేటు విద్యుదుత్పత్తి కంపెనీల నుంచి అదనపు విద్యుత్ కొనుగోలు చేసి సరఫరా చేయాల్సి రావడంతో డిస్కంలపై ఆర్థికభారం పెరిగిపోయింది. దీంతో విద్యుదుత్పత్తి కంపెనీలకు బిల్లుల బకాయిలను సకాలంలో చెల్లించడంలో డిస్కంలు చేతులెత్తేస్తున్నాయి. విద్యుత్ కొనుగోళ్లకు సంబంధించి రూ.1,356 కోట్ల బకాయిలు చెల్లించకపోవడంతో రాష్ట్రానికి విద్యుత్ సరఫరా నిలుపుదల చేస్తామని జాతీయ థర్మల్ విద్యుదుత్పత్తి సంస్థ(ఎన్టీపీసీ) గతనెలలో హెచ్చరికలు జారీ చేసింది. మరో ప్రైవేటు కంపెనీకు సైతం రూ.1,000 కోట్ల వరకు బకాయిలను డిస్కంలు చెల్లించాల్సి ఉంది. ఈ పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ రాయితీలు పెంచి ఆదుకుంటుందని డిస్కంల యాజమాన్యాలు ఆశించాయి. తాజాగా శాసనసభలో ప్రవేశపెట్టిన రాష్ట్ర ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో అరకొరగా విద్యుత్ రాయితీ నిధులు కేటాయించడంతో విద్యుత్ సంస్థలు తీవ్ర నిరాశకు గరయ్యాయి. విద్యుత్ చార్జీల పెంపు అనివార్యంగా మారిందని అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. కొంప ముంచిన ఈఆర్సీ లెక్కలు ప్రస్తుత చార్జీలను యథాతథంగా కొనసాగిస్తే 2018–19లో రూ.9,970.98 కోట్ల ఆర్థిక లోటు ఏర్పడనుందని గతేడాది రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి(ఈఆర్సీ)కి సమర్పించిన వార్షిక ఆదాయ అవసరాల నివేదిక(ఏఆర్ఆర్)లో డిస్కంలు అంచనా వేశాయి. రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసే విద్యుత్ రాయితీ నిధులతో కొంతవరకు ఆర్థికలోటు భర్తీ కానుండగా, మిగిలినలోటును విద్యుత్ చార్జీల పెంపుతో పూడ్చుకోవాలని డిస్కంలు భావించాయి. విద్యుత్చార్జీల పెంపునకు ప్రభుత్వం నుంచి అనుమతి లభించలేదు. 2018–19 రాష్ట్ర బడ్జెట్లో సైతం డిస్కంలకు ప్రభుత్వం రూ.4,980 కోట్ల విద్యుత్ రాయితీలు మాత్రమే కేటాయించింది. ఈ క్రమంలో ప్రభుత్వం చేతిలో కీలుబొమ్మగా వ్యవహరించిన ఈఆర్సీ డిస్కంల ఆర్థికలోటు అంచనాలను రూ.5,980 కోట్లకు కుదించి పాతచార్జీలతోనే వార్షిక టారిఫ్ ఉత్తర్వులను జారీ చేసింది. వచ్చే నెలతో 2018–19 ఆర్థిక సంవత్సరం ముగిసిపోనుండగా, ఇప్పటికే డిస్కంలు రూ.5 వేల కోట్లకుపైగా ద్రవ్యలోటును ఎదుర్కొంటున్నాయని ట్రాన్స్కో అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. ప్రస్తుత చార్జీలనే వచ్చే ఏడాది కొనసాగిస్తే 2019–20లో డిస్కంలు రూ.10 వేల కోట్లకుపైగా ఆర్థికలోటును ఎదుర్కోక తప్పదని స్పష్టం చేస్తున్నాయి. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో ప్రవేశపెట్టిన రాష్ట్ర ఓటాన్ అకౌంట్ బడ్జెట్ 2019–20లో విద్యుత్శాఖకు రూ.4,002 కోట్లను మాత్రమే ప్రభుత్వం కేటాయించింది. ఎస్సీ, ఎస్టీ సబ్ నిధులు కలుపుకున్నా విద్యుత్ రాయితీలు రూ.5 వేల కోట్లకు మించవని అధికారులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో మిగిలిన రూ.5 వేల కోట్లకుపైగా ఆర్థికలోటులో కొంతభాగాన్ని అయినా పూడ్చుకోవడానికి విద్యుత్చార్జీల పెంపు తప్పదని చర్చ జరుగుతోంది. లోక్సభ ఎన్నికలు ముగిసిన అనంతరం వచ్చే జూన్లో విద్యుత్చార్జీల పెంపు ప్రతిపాదనలను డిస్కంలు ఈఆర్సీకి సమర్పించే అవకాశాలున్నాయి. -
విద్యుత్ తేజో ‘ప్రభాకరుడు’
కొందరికి పదవుల వల్ల పేరొస్తుంది. కానీ, కొందరు వ్యక్తుల కృషి వల్ల ఆ పదవులకు వన్నె వస్తుంది. అలాంటి అరుదైన వ్యక్తులలో ట్రాన్స్కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్రావు ఒకరు. ఆయన వృత్తిలో ప్రవేశిస్తున్నప్పుడే ఎ.పి.ఎస్.ఇ.బి వ్యవస్థ ఏర్పడింది. ఇపుడు ఆ సంస్థ వయస్సు 50 ఏళ్లయితే ప్రభాకర్రావు సర్వీసు కూడా 50 ఏళ్లు అయ్యింది. ఇది కూడా అరుదైన సంఘటనగానే మిగిలిపోయింది. ప్రభాకర్రావు విద్యుత్ శాఖకే వెలుగులు పంచి వన్నె తెచ్చారు. ఇది కూడా ఆయనకు చెరగని కీర్తి తెచ్చి పెట్టింది. ఆయన వృత్తిలో ఎందరెందరో ఉద్యోగులను, ఇంజనీర్లను, ఆడిటింగ్ సెక్షన్ ఆఫీసర్లను, పలురకాల ట్రేడ్ యూనియన్లు చూశారు. వాళ్లందరి తలలో నాలుకలాగా వ్యవహరించటం ఆయన వ్యక్తిత్వానికి నిదర్శనం. అవిభక్త ఆంధ్రప్రదేశ్లో నేదురుమల్లి జనార్ధన్రెడ్డి, వై.ఎస్. రాజశేఖరరెడ్డి నుంచి చివరి ఏపీ సీఎంలు కొణిజేటి రోశయ్య, కిరణ్కుమార్రెడ్డిల వరకు ఆయనకు బాగా తెలుసు. ఆ కాలంలోని సీఎంలందరూ ప్రభాకర్రావు వ్యక్తిత్వాన్ని కొనియాడారు. తెలంగాణ రాష్ట్రం అవతరించాక సీఎం కేసీఆర్ చేపట్టిన 24 గంటల కరెంట్ సరఫరా ఆలోచన అమలుకు ప్రాణంగా ప్రభాకర్రావు పనిచేశారు. విద్యుత్ కోతలు లేని రాష్ట్రంగా తెలంగాణను మలచటానికి ఎంతో శ్రమించి ప్రభుత్వానికి కుడిభుజంగా పనిచేశారు. కేసీఆర్ నమ్మి బాధ్యతనిస్తే చిత్తశుద్ధితో పనిచేసి ఆయన మన్ననలు పొందారు. ఈ 50 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానంలో ప్రభాకర్రావు వ్యక్తిత్వం, పనివిధానం ద్వారా, నిజాయతీ, నిబద్ధతల ద్వారా విద్యుత్ శాఖపై చెరగని ముద్ర వేశారు. ఒక రకంగా ఆయన తన ఇంటిని చూసుకున్నట్లే విద్యుత్ శాఖను కూడా చూసుకున్నారు. చేసే పనిలో చిత్తశుద్ధి, కృషి, ఆత్మగౌరవం, ఎవరికీ తలవంచనితనం, క్లిష్టసమయాల్లో సమస్యలను ఎదుర్కునే శక్తిని అందుకు పరిష్కార మార్గాలను వెతికి పట్టుకోవటంలో ఆయన సిద్ధహస్తుడు. విద్యుత్శాఖలో ప్రభాకర్రావు ఒక ఇన్సైడర్గా ఉన్నారు. విద్యుత్ శాఖ ఆత్మను ఆయన పట్టుకున్నారు. ఆయన ఆ శాఖలో అనేక ఉన్నత శిఖరాలను అధిరోహించారు. 22 ఏళ్ల వయస్సులో ఉద్యోగంలో చేరిన కొత్తలోనే ప్రభాకర్రావును ఒక అధికారి అపార్థం చేసుకున్నారు. ఆ సందర్భంగా ఆయనను ‘ఐ విల్ సీ యువర్ ఎండ్’ అని కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ అధికారి అంతమాట అన్నందుకు ‘మనిద్దరి అంతు చూడటానికి పైవాడున్నాడు. మీరు మంచి మూడ్లో లేరు’ అని సమయస్ఫూర్తిగా మాట్లాడారు. ప్రభాకర్రావులో ఒక డైనమిజం ఉంది. ఆయన వృత్తిరీత్యా అకౌంట్స్ విభాగంలో ఉన్నప్పటికీ ఆయనకు స్నేహితులంతా ఇంజనీర్లుగా ఉన్నారు. అది కింది స్థాయి నుంచి పై వరకు ఉన్నారు. అలాగే ఆఫీసులో పనిచేసే వాచ్మెన్ దగ్గర్నుంచి ట్రేడ్యూనియన్ల వరకు ఎవరు కన్పించినా ప్రేమగా మాట్లాడటం ఆయన నుంచి నేర్చుకోవాలి. ఇంజనీరింగ్ క్యాటగిరికీ, అకౌంట్స్ శాఖకు మధ్యలో అనేక వైరుధ్యాలుంటాయి. ఒక్కొక్కసారి అవి శత్రుత్వాలుగా మారుతాయి. ప్రభాకర్రావు ఈ రెండింటి మధ్యలో ఉన్న రైవలిజం అనే బెర్రను చెరిపివేశారు. అదే ఆయనను ఈ రెండు శాఖల మధ్య వారధిని చేశాయి. ఈ రెండు శాఖల మధ్య ఆయన వంతెనగా మారడంతో విద్యుత్ శాఖలో ‘‘లోపల మనిషి’’ అయ్యారు. ఆయన అకౌంట్స్ ఆఫీసర్గా మొదలై అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చారు. ఈ దశలోనే ఆయన అసోషియేషన్ అధ్యక్షుడూ అయ్యారు. దీంతో అన్ని శాఖల మధ్య దూరాన్ని తొలగించి మంచి వాతావరణాన్ని ఏర్పాటు చేయగలిగారు. విద్యుత్ శాఖలో ఆయన ఈ ఉన్నత దశలో ఉండటానికి కారణం ఇదేననుకుంటా! తెలంగాణ రాష్ట్ర అవతరణ తరువాత అలుముకున్న చీకట్లను తొలగించటానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో కృషి చేశారు. తెలంగాణ రాష్ట్రం వస్తే చీకట్లు కమ్ముకుంటాయని జరిగిన ప్రచారాల్ని తిప్పి కొట్టడానికి ఆయన సీఎం అయ్యాక తొలిగా 24 గంటల నిరంతర కరెంటు ఇచ్చే పనికి శ్రీకారం చుట్టారు. చీకట్లను చీల్చుకుంటూ విద్యుత్ వెలుగులను పంచటానికి ముందుకు సాగిన కేసీఆర్కు ఈ ప్రభాకర్రావు ఒక కార్యకర్తగా కృషిచేశారు. దాన్ని ముఖ్యమంత్రి కేసీఆరే స్వయంగా ప్రకటించారు. అవిభక్త ఆంధ్రప్రదేశ్లో విద్యుత్శాఖ అభివృద్ధి కోసం కృషిచేసిన ప్రభాకర్రావుకు అనుకోకుండా రాష్ట్రం రావడంతో తను పుట్టిపెరిగిన నేలకు సేవ చేసి తరించే అవకాశాన్ని కేసీఆర్ కల్పించారు. ట్రాన్స్కో సీఎండిగా ప్రభాకర్రావును ఎంపిక చేయటం ఒక రకంగా ఆయనకు జీవనసాఫల్య పురస్కారం లభించినట్లుగానే భావించాలి. కేసీఆర్ ఏ పనైనా చేపడితే ఎంత మొండితనంతో దూసుకుపోతాడో తెలిసిందే. అందుకు నికార్సైన మనుషులనే ఆయన ఎంచుకుంటారు. ఈ దారిలో విద్యుత్శాఖకు ప్రభాకర్రావును ఆయన ఎంచుకున్నారు. సరిగ్గా కేసీఆర్ ఏ ఆలోచనతో ముందుకుపోతున్నారో అందుకు మొత్తం విద్యుత్శాఖను సన్నద్ధం చేసిన కార్యకర్తగా ప్రభాకర్రావుకు గుర్తింపు ఉంది. ఇది ఆయన జీవితంలో అందుకున్న అన్ని పురస్కారాలకంటే గొప్పది. -జూలూరు గౌరీశంకర్ తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులు మొబైల్ : 94401 69896 -
తెలంగాణ ‘పవర్’ ప్రభాకర్రావు!
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వశాఖలో పదవీ విరమణ వయసు 58 ఏళ్లు. సేవలను గుర్తించి కొంత కాలం పొడిగించినా మరో ఐదేళ్లు మించి కొనసాగే అవకాశం అరుదుగా వస్తుంది. దీంతో ఒక వ్యక్తి ప్రభుత్వశాఖలో పనిచేసే సగటుకాలం 40 ఏళ్లు. కానీ ఒకే శాఖలో ఉద్యోగం సాధించి అంచెలంచెలుగా వివిధ హోదాల్లో పనిచేస్తూ ఏకంగా 50 ఏళ్ల పాటు కొనసాగుతూ రికార్డు సృష్టించారు జెన్కో–ట్రాన్స్కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్రావు. రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభాన్ని విజయవంతంగా పరిష్కరించి, నిరంతర విద్యుత్ సరఫరా చేయడంలో ముఖ్య భూమిక పోషించిన ప్రభాకర్రావు విద్యుత్ సంస్థలో చేరి ఈ నెల 10 నాటికి 50 ఏళ్లవుతోంది. అకౌంట్స్ ఆఫీసర్ నుంచి.. ఏపీ రాష్ట్ర ఎలక్ట్రిసిటీ బోర్డులో (ఏపీఎస్ఈబీ)లో అసిస్టెంటు అకౌంట్స్ ఆఫీసర్గా 1969 ఫిబ్రవరి 10న ప్రభాకర్రావు విధుల్లో చేరారు. 1992లో ఏపీఎస్ఈబీ ఫైనాన్షియల్ అడ్వైజర్, చీఫ్ కంట్రోలర్ ఆఫ్ అకౌంట్స్గా నియామకమయ్యారు. 1998లో బోర్డు మెంబర్ (అకౌంట్స్)గా నియమితులయ్యారు. ఐఏఎస్ అధికారులు, ఇంజనీర్లు కాని వారిని బోర్డు మెంబర్గా నియమించడం అదే ప్రథమం. 1999లో ఏపీఎస్ఈబీ జెన్కో, ట్రాన్స్కో, డిస్కంలుగా విడిపోయింది. అప్పుడు ప్రభాకర్రావు ఏపీ ట్రాన్స్కో డైరెక్టర్ (ఫైనాన్స్)గా నియమితులయ్యారు. ప్రభుత్వంతో విభేదాలు రావడంతో 2002లో డైరెక్టర్ పదవికి రాజీనామా చేశారు. మరో ఏడేళ్ల సర్వీసు ఉండగానే ఉద్యోగాన్ని వదిలేశారు. 2004లో వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎం అయ్యాక ప్రభాకర్రావును మళ్లీ జెన్కో డైరెక్టర్ (ఫైనాన్స్)గా నియమించారు. 2009లో రోశయ్య సీఎం అయ్యాక ప్రభాకర్రావును జెన్కో జేఎండీగా నియమించారు. కిరణ్కుమార్రెడ్డి సీఎం అయ్యాక కూడా అదే పదవిలో కొనసాగారు. 2014లో తెలంగాణ ఏర్పాటు తర్వాత తెలంగాణ జెన్కో సీఎండీగా నియామకమయ్యారు. తర్వాత ట్రాన్స్కో సీఎండీగా కూడా అదనపు బాధ్యతలు అప్పగించారు. ప్రస్తుతం ఈ రెండింటి బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. లోటును పూడ్చిన ఘనత... మాములుగా ట్రాన్స్కో, జెన్కో సీఎండీ పోస్టులను ఐఏఎస్లకు ఇస్తారు. సంస్థ ఉద్యోగి అయితేనే సాధక బాధకాలు తెలుస్తాయనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ నాన్ ఐఏఎస్ అయిన ప్రభాకర్రావుకు జెన్కో సీఎండీగా బాధ్యతలు అప్పగిస్తూ మొదటి నిర్ణయం తీసుకున్నారు. ఆయన బాధ్యతలు తీసుకున్న నాడు తెలంగాణ విద్యుత్ రంగం సంక్షోభంలో ఉంది. పరిశ్రమలకు పవర్ హాలిడేలు, గృహ విద్యుత్కు గంటల తరబడి కోతలు, వ్యవసాయానికి 4 గంటల వరకు కరెంటే అందేది. ఆ కరెంటూ తక్కువ సామర్థ్యం కూడినది కావడంతో మోటార్లు కాలిపోయేవి. ట్రాన్స్ ఫార్మర్లు పేలిపోయేవి. రాష్ట్రం ఏర్పడే నాటికి విద్యుత్ కొరత 2,700 మెగావాట్లు. ఆ లోటు ఎలా పూడుతుందో తెలియని పరిస్థితి. సీఎం తనపై ఉంచిన నమ్మకాన్ని ప్రభాకర్రావు నూటికి నూరుపాళ్లు నిలబెట్టారు. తెలంగాణ ఏర్పడిన ఆరో నెల నుంచే (2014, నవంబర్ 20) కోతలు ఎత్తివేశారు. 24 గంటల విద్యుత్సరఫరా ప్రారంభించారు. అప్ప ట్నుంచే రైతులకు 9 గంటల విద్యుత్ అందింది. 2018 జనవరి 1 నుంచి దేశంలో మరెక్కడా లేని విధంగా రాష్ట్రంలోని 23 లక్షల పంపుసెట్లకు 24 గంటల పాటు నాణ్యమైన విద్యుత్ను ఉచితంగా అందిస్తున్నారు. ఇటు నిదానంగా నడుస్తున్న విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల పనులను ప్రభుత్వం వేగం చేసింది. కొత్త విద్యుత్ ప్లాంట్లు నిర్మించింది. దక్కించుకున్న అవార్డులు విద్యుత్ రంగంలో అద్వితీయమైన కృషికి పలు అవార్డులు ప్రభాకర్రావు అందుకున్నారు. ‘ఎకనామిక్ టైమ్స్ అవార్డు–2018’, ‘సీబీఐపీ ప్రత్యేక గుర్తింపు అవార్డు–2018’ పొందారు. తెలంగాణ విద్యుత్ రంగం–పంపిణీలో మార్పులు, నిర్వహణపై ‘స్కోచ్ గోల్డ్ అవార్డు–2018’, తెలంగాణ ప్రభుత్వం మేడే సందర్భంగా ప్రదానం చేసిన ‘టీఎస్ జెన్కో, టీఎస్ ట్రాన్స్కో బెస్ట్ మేనేజ్మెంట్ అవార్డు’, విద్యుత్ రంగంలో విశేష కృషికి గాను ‘డాక్టర్ బూర్గుల రామకృష్ణారావు అవా ర్డు–2016’ను ఆయన అందుకున్నారు. విద్యుత్ రంగంలో ప్రతిభ కనబరచినందుకుగాను ‘నేషనల్ కౌన్సిల్ ఆఫ్ పవర్ యుటిలిటీస్’ నుంచి ‘ఇండియా పవర్ అవార్డు–2013’, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రాక్టికల్ అకౌంటెన్సీ, హైదరాబాద్ నుంచి ‘ఎక్స్లెన్సీ ఇన్ అకౌంటెన్సీ అండ్ ఫైనాన్స్’ అవార్డులు అందుకున్నారు. -
అక్రమాల అడ్డా.. ట్రాన్స్కో కార్యాలయం
ప్రకాశం, కొండపి: కొండపి ట్రాన్స్కో కార్యాలయం అక్రమాల అడ్డాగా మారింది. ఇక్కడి అధికారులు ప్రతి పనికి ఓ రేటు నిర్ణయించారు. ఇక్కడి ఇంజినీరింగ్ అధికారి తన కార్యాలయాన్ని అక్రమ దందాకు అడ్డాగా మార్చుకున్నారు. అక్రమార్జనే ధ్యేయంగా పని చేస్తున్న ఏఈ ప్రజలు, రైతుల విద్యుత్ అవసరాలను తనకు అనుకూలంగా మల్చుకున్నాడు. అడ్డగోలుగా తన కార్యాలయం సెక్షన్ పరిధిలో ట్రాన్స్ఫార్మర్లు, విద్యుత్ స్తంభాలు, కరెంటు తీగలను అడ్డగోలుగా అమ్మాకానికి పెట్టాడు. ట్రాన్స్ఫార్మర్ కావాల్సిన రైతులు ప్రభుత్వానికి రుసుం చెల్లించాల్సిన పనిలేదు. ఒక్కో ట్రాన్స్ఫార్మర్కు ఆయనకు రూ.30 వేలు అందిస్తే ఆ రైతుకు ట్రాన్స్ఫార్మర్ ఇచ్చేలా బహిరంగంగా ఒప్పందం కుదుర్చుకుంటున్నాడు. విద్యుత్ స్తంభాలను సైతం ఒక్కో స్తంభానికి వెయ్యి రూపాయలు చొప్పున తీసుకుని అవసరమైన వారికి యథేచ్ఛగా అమ్మకాలు సాగిస్తున్నారు. ఐదేళ్లుగా కొండపి విద్యుత్ సెక్షన్లో ఏఈగా తిష్టవేసిన ఈ అధికారి వందల సంఖ్యలో ట్రాన్స్ఫార్మర్లు, విద్యుత్ స్తంభాలు, తీగలు అమ్మటం ద్వారా రెండు కోట్ల రూపాయలకు పైగా అక్రమార్జన చేసినట్లు ప్రజల నుంచి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మండలంలోని పెట్లూరు, కోయవారిపాలెం, గుర్రప్పడియ, నెన్నూరుపాడు, అనకర్లపూడి తదితర గ్రామాలకు వెళ్లి చూస్తే అక్రమంగా ఏర్పాటు చేసిన అగ్రికల్చర్ ట్రాన్స్ఫార్మర్లు కనిపిస్తాయి. నెన్నూరుపాడులోని కొంతమంది రైతుల ట్రాన్స్ఫార్మర్ను అక్రమంగా ఒకచోట నుంచి మరోచోటకు మార్పించి డబ్బులు వసూలు చేసిన సంఘటనలు ఉన్నాయి. కట్టావారిపాలెంలోని ఒక రైతుకు కావాల్సిన విద్యుత్ స్తంభాలను సైతం అక్రమంగా కొండపిలోని విద్యుత్ సబ్స్టేషన్ ఎదురుగా పొలాల్లో ఉన్న వాటిని ఎత్తించాడు. చేష్టలుడిగి చూస్తున్న ఉన్నతాధికారులు ట్రాన్స్కో అధికారి తన కార్యాలయాన్ని అక్రమాలకు అడ్డాగా మార్చి దందాలు కొనసాగిస్తున్నా చర్యలు తీసుకోవాల్సిన ఉన్నతాధికారులు చేష్టలుడిగి చూస్తున్నారే తప్ప చర్యలు తీసుకున్న దాఖలాలు లేవని ప్రజలంటున్నారు. ఈ అధికారి సంపాదించిన అక్రమార్జనలో ఉన్నతాధికారులకు సైతం ముడుపులు అందుతున్నాయన్న అనుమానాలు ఈ ప్రాంత రైతులు వ్యక్తం చేస్తున్నారు. రైతుల అవసరాలను తనకు అవకాశంగా మలుచుకుని ముడుపులు మింగుతున్న ఈ అధికారి లీలలు అన్నీఇన్ని కావు. ఈయన అక్రమాలపై ఇటీవల సింగరాయకొండ ఏడీఈ సైతం వచ్చి విచారణ చేపట్టారు. కొండపి ట్రాన్స్కో అధికారి జిల్లా స్థాయి అధికారులు ద్వారా విచారణని నీరుగార్చే ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. కొండపి ట్రాన్స్కో ఏఈపై వచ్చిన ఆరోపణల గురించి సింగరాయకొండ ఏడీఈ శ్రీనివాసరావును వివరణ కోరగా ఎస్టిమేట్లు వేయకుండా వ్యవసాయ ట్రాన్స్ఫార్మర్లు రైతులకు ఏఈ ఇస్తున్న మాట వాస్తవమేనని చెప్పారు. అదే విధంగా కొండపి సబ్స్టేషన్లో ట్రాన్స్ఫార్మర్ సైతం మాయమైందని, ఈ విషయమై కొండపి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. ఇద్దరు సిబ్బందితో పాటు సెలవులో ఉన్న ఏఈకి సైతం మెమో ఇచ్చినట్లు తెలిపారు. ఈ విషయమై ఆరోపణలు ఎదుర్కొంటున్న కొండపి ట్రాన్స్కో ఏఈ చంద్రశేఖర్ను వివరణ కోరగా తనపై వస్తున్న అవినీతి, ఆరోపణలు అవాస్తవమని చెప్పకొచ్చారు. ఇదంతా ఏడీఈ కావాలని చేస్తున్నాడని ఆరోపించారు. -
50 ఏళ్లుగా వెలుగులు పంచుతూ..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ట్రాన్స్కో, జెన్కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్ రావు గురువారంతో విద్యుత్ శాఖలో 50 ఏళ్ల సర్వీసును పూర్తి చేసుకున్నారు. 1969 జనవరి 10న ఆయన అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్గా ఏపీ స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డు (ఏపీఎస్ఈబీ)లో ఉద్యోగప్రస్థానం ప్రారంభించారు. ఉమ్మడి ఏపీ, తెలంగాణ విద్యుత్ సంస్థల్లో కీలక హోదాల్లో సేవలందించారు. విద్యుత్ రంగంలో ఆయన సేవలు, విశేషానుభవాన్ని గుర్తించిన సీఎం కేసీఆర్.. తెలంగాణ రాష్ట్రంలో.. రాష్ట్ర ట్రాన్స్కో, జెన్కో సీఎండీగా బాధ్యతలు అప్పగించారు. ఐఏఎస్ అధికారులు కాదని ఈ పదవిని ఏరికోరి ప్రభాకర్ రావుకు కట్టబెట్టారు. రాష్ట్రం ఆవిర్భావం తర్వాత రాష్ట్రంలో నెలకొన్న విద్యుత్ కొరతను అధిగమించి 24 గంటల విద్యుత్ సరఫరా అందించడంలో కీలకపాత్ర పోషించారు. వ్యవసాయానికి తొలుత 9 గంటల నిరంతర విద్యుత్, ఆ తర్వాత 24 గంటల విద్యుత్ సరఫరా వంటి కేసీఆర్ నిర్ణయాలను విజయవంతంగా అమలు చేయడంలో సఫలమయ్యారు. రాష్ట్రంలో కొత్త విద్యుదుత్పత్తి కేంద్రాల నిర్మాణం, విద్యుత్ సరఫరా, పంపిణీ సంస్థల సామర్థ్యం పెంపు పనులను శరవేగంగా పూర్తి చేసేందుకు మొత్తం విద్యుత్ శాఖను పరుగులు పెట్టించారు. రికార్డు సమయంలో విద్యుదుత్పత్తి కేంద్రాలు, సబ్–స్టేషన్లు, లైన్ల నిర్మాణాన్ని పూర్తి చేసి పీజీసీఎల్ వంటి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల ప్రశంసలు అందుకున్నారు. విద్యుత్ రంగంలో చేసిన విశేష కృషికి గానూ.. గతేడాది ఎకనమిక్ టైమ్స్, సీబీఐపీ, స్కోచ్ పురస్కారాలను అందుకున్నారు. 2017లో బెస్ట్ మేనేజ్మెంట్ అవార్డు ఫర్ ట్రాన్స్కో, జెన్కో, విద్యుత్ రంగంలో విశేష కృషికి గానూ 2016లో బూర్గుల రామకృష్ణారావు పురస్కారాన్ని అందుకున్నారు. నేషనల్ కౌన్సిల్ ఫర్ పవర్ యుటిలిటీస్ 2013లో ఆయనకు ఇండియా పవర్ అవార్డును అందజేసింది. ఈ సందర్భంగా విద్యుత్ ఇంజనీర్లు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో స్వర్ణోత్సవ కేక్ను ఆయనతో కట్ చేయించారు. కార్యక్రమంలో ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్ సీఎండీలు రఘుమారెడ్డి, గోపాలరావు, ట్రాన్స్కో జేఎండీ శ్రీనివాసరావు పాల్గొని ఆయన్ను అభినందించారు. -
ఉద్యోగుల కృషి వల్లే విజయాలు
సాక్షి, హైదరాబాద్: సగటు విద్యుత్ వినియోగంలో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో నిలవడం విద్యుత్ ఉద్యోగుల సమష్టి కృషి వల్లే సాధ్యమైందని ట్రాన్స్కో, జెన్కో చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ డి.ప్రభాకర్రావు అన్నారు. తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ (టీఈఈ) 1104 రూపొందించిన పవర్మెన్–2019 డైరీ ఆవిష్కరణ కార్యక్రమం గురువారం మింట్కాంపౌండ్లో జరిగింది. దీనికి టీఈఈ 1104 రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.పద్మారెడ్డి, ప్రధాన కార్యదర్శి సాయిబాబు అధ్యక్షత వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ట్రాన్స్కో, జెన్కో సీఎండీ డైరీని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 24 గంటల విద్యుత్ను రాష్ట్ర ప్రజలందరికీ అందించడం చాలా సంతోషంగా ఉందన్నారు. విద్యుత్ ఉద్యోగుల సమస్యలను యూనియన్ల వారీగా పరిశీలించి బోర్డులో చర్చించి సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తామని హామీనిచ్చారు. అలాగే రైతులు, వినియోగదారులు కష్టాలు పడకుండా నాణ్యమైన విద్యుత్ను అందించడం శుభపరిణామమని చెప్పారు. ఏ విభాగంలో లేని జీతాలు: శ్రీనివాస్గౌడ్ సీఎం కేసీఆర్, ప్రభాకర్రావుల సలహాలు, సూచనలతో తెలంగాణ మొత్తం గర్వపడేలా విద్యుత్ సమస్యను అధిగమించామని ఎమ్మెల్యే శ్రీనివాస్గౌడ్ అన్నారు. ఏ డిపార్టుమెంటులో లేని జీతాలు సీఎం చొరవతో విద్యుత్ ఉద్యోగులు అందుకుంటున్నారని చెప్పారు. అనంతరం టీఈఈ యూనియన్, ఇతర యూనియన్లు రూపొందించిన క్యాలెండర్లను ఆవిష్కరించారు. కార్యక్రమంలో టీఎస్ఎస్పీడీసీల్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ రఘుమారెడ్డి, టీఎస్ఎన్పీడీసీఎల్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గోపాల్రావు, ఢిల్లీలోని రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి వేణుగోపాలాచారి పాల్గొన్నారు. -
నెలాఖరులోగా విద్యుత్ పీఆర్సీ!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విద్యుత్ ఉద్యోగులకు తీపికబురు. విద్యుత్ ఉద్యోగుల వేతన సవరణపై ఈ నెలాఖరులోగా ప్రకటన చేసేందుకు తెలంగాణ విద్యుత్ సంస్థల యాజమాన్యాలు కసరత్తు చేస్తున్నాయి. ట్రాన్స్కో జేఎండీ సి.శ్రీనివాసరావు నేతృత్వంలో నియమించిన విద్యుత్ ఉద్యోగుల వేతన సవరణ సంప్రదింపుల కమిటీ (పీఆర్సీ) గురువారం ట్రాన్స్కో, జెన్కో సీఎండీ డి. ప్రభాకర్రావుకు నివేదిక సమ ర్పించింది. వేతన సవరణ ఫిట్ మెంట్ శాతం, వెయిటేజీ ఇంక్రి మెంట్ల సంఖ్య, వైద్య సదుపాయం తదితర అంశాలపై విద్యుత్ ఉద్యోగుల సంఘాల ప్రతినిధులతో త్వరలో విద్యుత్ సంస్థల యాజ మాన్యాలు చర్చలు జరపను న్నాయి. అనంతరం ఈ నెల 26లోగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావుకు పీఆర్సీ నివేదికను పంపిస్తామని, సీఎం ఆమోదిస్తే ఈ నెలాఖరులోగా పీఆర్సీపై ప్రకటన విడుదల చేస్తామని డి.ప్రభాకర్రావు ‘సాక్షి’కి తెలిపారు. గత ఫిట్మెంట్కన్నాఎక్కువ ఇవ్వాలంటున్న ఉద్యోగులు ట్రాన్స్కో, జెన్కో, టీఎస్ఎస్పీడీసీఎల్, టీఎస్ఎన్పీడీసీఎల్లలో పని చేస్తున్న 25 వేల మంది విద్యుత్ ఉద్యోగులు కొత్త పీఆర్సీపై యాజమాన్యాల ప్రకటన కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. చివరిసారిగా నాలుగేళ్ల కింద విద్యుత్ ఉద్యోగులకు 30 శాతం ఫిట్మెంట్, 3 వెయిటేజీ ఇంక్రిమెంట్లతో కలిపి పీఅర్సీ ప్రకటించారు. అయితే ఇటీవల ఏపీలో విద్యుత్ ఉద్యోగులకు 25 శాతం ఫిట్మెంట్తోపాటు 3 వెయిటేజీ ఇంక్రిమెంట్లతో వేతన సవరణపై ప్రకటన చేశారు. ఈ నేపథ్యంలో ఫిట్మెంట్ శాతంపై విద్యుత్ సంస్థలు తీసుకునే నిర్ణయంపై విద్యుత్ ఉద్యోగులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి. చివరిసారిగా ప్రకటించిన 30 శాతం ఫిట్మెంట్కన్నా ఎక్కువ మొత్తంలో ఫిట్మెంట్ ప్రకటించాలని విద్యుత్ ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఏపీలో 25 శాతం ఫిట్మెంట్ ప్రకటించిన నేపథ్యంలో అంతకంటే కొద్దిగా ఎక్కువ శాతం ఫిట్మెంట్ను తెలంగాణ విద్యుత్ ఉద్యోగులకు ప్రకటించే అవకాశముందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ఫిట్మెంట్ శాతంపై సీఎం నిర్ణయం కీలకంగా మారనుంది. తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రంలో విద్యుత్ సరఫరా వ్యవస్థను గాడినపెట్టి నిరంతర విద్యుత్ సరఫరాను అమలు చేసేందుకు విద్యుత్ ఉద్యోగులు బాగా పని చేశారని కేసీఆర్ పలుమార్లు ప్రశంసించారు. ఈ నేపథ్యంలో ఫిట్మెంట్ శాతంపై ముఖ్యమంత్రి నుంచి సానుకూల నిర్ణయం వస్తుందని ఉద్యోగ సంఘాలు ఆశిస్తున్నాయి. ఈ ఏడాది మార్చి 31తో గత పీఆర్సీ కాలపరిమితి ముగిసిపోగా ఏప్రిల్ 1 నుంచి కొత్త పీఆర్సీని వర్తింపజేయాల్సి ఉంది. ప్రస్తుత వైద్య సదుపాయానికి మెరుగులు... విద్యుత్ ఉద్యోగులకు అమలు చేస్తున్న ప్రస్తుత వైద్య పథకాన్ని మెరుగుపరిచి కొనసాగించాలని పీఆర్సీ కమిటీ సిఫారసు చేసినట్లు తెలిసింది. ఎన్టీపీసీ తరహాలో అపరమిత నగదురహిత వైద్య సదుపాయం అందించాలని విద్యుత్ ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అయితే ప్రస్తుతం అమలు చేస్తున్న పథకాన్ని మరింత సరళీకృతం చేయాలని కమిటీ సూచించినట్లు సమాచారం. ఈఎన్టీ, దంత, కంటి వైద్యానికి ప్రస్తుత పథకంలో ఉన్న పరిమితులను తొలగించాలని కమిటీ కోరినట్లు చర్చ జరుగుతోంది. తక్షణమే సంప్రదింపులు: ఉద్యోగుల జేఏసీ డిమాండ్ కొత్త పీఆర్సీ అమలులో భాగంగా విద్యుత్ ఉద్యోగుల వేతన స్కేలు, అలవెన్సులు, ఈపీఎఫ్, జీపీఎఫ్, సమగ్ర వైద్య సదుపాయ పథకంపై తుది నిర్ణయం తీసుకునేందుకు తక్షణమే విద్యుత్ ఉద్యోగుల సంఘాలతో యాజమాన్యాలు సంప్రదింపులు ప్రారంభించాలని తెలంగాణ విద్యుత్ ఉద్యోగుల జేఏసీ డిమాండ్ చేసింది. ఈ నెల 26లోగా పీఆర్సీపై ప్రకటన చేయాలని లేకుంటే 27న విద్యుత్ సౌధలో మహాధర్నా నిర్వహిస్తామని జేఏసీ ప్రతినిధుల బృందం గురువారం ట్రాన్స్కో సీఎండీ డి.ప్రభాకర్రావుకు వినతిపత్రం అందజేసింది. -
ట్రాన్స్కోలో 106 పోస్టులు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ విద్యుత్ సరఫరా సంస్థ (ట్రాన్స్కో) 106 పోస్టుల భర్తీకి గురువారం నియామక ప్రకటన విడుదల చేసింది. 62 జూనియర్ పర్సనల్ ఆఫీసర్, 44 జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనుంది. ప్రథమ శ్రేణిలో బీకాం/ప్రథమ శ్రేణిలో ఎంకాం/సీఏ–ఐసీడబ్ల్యూఏ–ఇంటర్ పాసైన అభ్యర్థులు జేఏవో పోస్టుల కోసం అర్హులు. జేఏవో పోస్టులకు ఈ నెల 28 నుంచి వచ్చే నెల 11లోగా దరఖాస్తు చేసుకోవాలని తెలిపింది. ప్రథమ శ్రేణిలో బీఏ/బీకాం/బీఎస్సీ లేదా తత్సమాన డిగ్రీ పాసైన అభ్యర్థులు జూనియర్ పర్సనల్ ఆఫీసర్ పోస్టు కోసం వచ్చే నెల 11 నుంచి 25లోగా దరఖాస్తు చేసుకోవాలని కోరింది. పూర్తి వివరాలకు http://tstransco.cgg.gov.in వెబ్సైట్ను సందర్శించాలని అభ్యర్థులకు సూచించింది. -
పనీ మాదే.. పైసా మాదే!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విద్యుత్ సంస్థల్లో కొందరు అధికారులు బినామీ కాంట్రాక్టర్ల అవతారమెత్తారు! కుటుంబ సభ్యులు, సమీప బంధువులు, స్నేహితుల పేర్లతో కాంట్రాక్టర్ లైసెన్సులు పొంది లక్షలు కొల్లగొడుతున్నారు. నామినేషన్ పద్ధతిలో పనులను చేజిక్కించుకొని సర్కారు సొమ్మును జేబులో వేసుకుంటున్నారు. కొందరు అధికారులైతే తమ బినామీల కోసమే అడ్డగోలుగా పనులకు అంచనాలు రూపొందించి తూతూమంత్రంగా పనులు చేసి బిల్లులు స్వాహా చేస్తున్నారు. పనుల అంచనాల తయారీ, ఓపెన్ టెండర్ల నిర్వహణ, నామినేషన్ల కింద పనుల కేటాయింపు, పనుల నిర్వహణ, పర్యవేక్షణ, బిల్లుల జారీ అధికారం.. ఇలా అంతా తమ చేతుల్లోనే ఉండటంతో ఈ అధికారుల అవినీతి, అక్రమాలకు అడ్డూఅదుపూ లేకుండా పోయింది. తల్లి, భార్య, బావమరిది, సోదరుడు, కుమారుడు, కోడలు, కుమార్తె, అల్లుడు, మనవడు, అమ్మమ్మ, నాయనమ్మ, తాత, మేనకోడలు, ఇతర సమీప బంధువుల పేర్లతో కాంట్రాక్టర్ లైసెన్స్లు పొంది అడ్డదారిలో రూ.లక్షల విలువైన పనులను దక్కించుకుంటున్నారు. బినామీ కాంట్రాక్టర్లను అడ్డం పెట్టుకుని కొందరు పనుల అంచనాలను అడ్డగోలుగా పెంచేస్తున్నారని, మరికొందరు పనులు చేయకుండానే బిల్లులు కాజేస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇలా అధికారులే బినామీ కాంట్రాక్టర్లుగా వ్యవహరిస్తున్నా సంస్థ యాజమాన్యాలు పట్టించుకోవడం లేదు. ఉన్నతాధికారులు సైతం.. తెలంగాణ ట్రాన్స్కో, దక్షిణ/ఉత్తర విద్యుత్ పంపిణీ సంస్థ(టీఎస్ఎస్పీడీసీఎల్/ఎన్పీడీసీఎల్)లో పని చేస్తున్న ఓ డైరెక్టర్ స్థాయి అధికారితోపాటు పలువురు సూపరింటెండెంట్ ఇంజనీర్లు(ఎస్ఈ), అదనపు డివిజినల్ ఇంజనీర్లు(ఏడీఈ), డివిజినల్ ఇంజనీర్లు(డీఈ), అసిస్టెంట్ ఇంజనీర్(ఏఈ)లు, ఇతర స్థాయిల ఉద్యోగులు సొంత కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితుల పేర్లతో బినామీ కాంట్రాక్టర్లుగా చక్రం తిప్పుతున్నారు. కొందరు అధికారులు స్వయంగా కాంట్రాక్టు పనులు చేస్తుండగా, మరికొందరు అమ్యామ్యాలు తీసుకుని బంధువులకు పనులు అప్పగిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. తమ కుటుంబ సభ్యులు, బంధువులెవరూ విద్యుత్ సంస్థల్లో ఉద్యోగులుగా లేరని ప్రతి పనికి సంబంధించిన టెండరు దాఖలు సందర్భంగా కాంట్రాక్టర్లు రాత పూర్వకంగా తెలియజేయాల్సి ఉంటుంది. ఒకవేళ కాంట్రాక్టర్ల కుటుంబ సభ్యులెవరైనా విద్యుత్ సంస్థల్లో ఉద్యోగులుగా తేలితే కాంట్రాక్టును రద్దు చేయడంతో పాటు సంస్థకు జరిగిన నష్టాన్ని తిరిగి వసూలు చేయాలని నిబంధనలు పేర్కొంటున్నాయి. ఎస్ఈ, డీఈ స్థాయి అధికారులకు రూ.5 లక్షలలోపు పనులకు పరిపాలన అనుమతులు జారీ చేసే అధికారం ఉంది. దీంతో వారే కాంట్రాక్టులు దక్కించుకుంటూ, పనులు మంజూరు చేసుకుంటున్నారు. అలాగే కింది స్థాయి అధికారుల బినామీలకు సైతం పనులు అప్పగిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. బహిరంగ ప్రకటన లేకుండానే నామినేషన్లు రూ.5 లక్షల లోపు అంచనా వ్యయం కలిగిన పనులకు ఆన్లైన్ టెండర్ల నిర్వహణ నుంచి ప్రభుత్వం మినహాయింపు కల్పించింది. రూ.5 లక్షలలోపు అంచనా వ్యయం కలిగిన పనులను ఓపెన్ టెండర్ల విధానంలో నామినేషన్ ప్రాతిపదికన కాంట్రాక్టర్లకు అప్పగించేందుకు అనుమతిచ్చింది. అత్యవసరంగా నిర్వహించాల్సిన పనులకు ఆన్లైన్ ద్వారా టెండర్లు నిర్వహిస్తే తీవ్ర జాప్యం జరుగుతుందనే ఆలోచనతో ప్రభుత్వం ఈ వెసులుబాటు కల్పించింది. ఈ నిబంధనను ఆసరాగా చేసుకునే కొందరు విద్యుత్ అధికారులు బినామీ కాంట్రాక్టర్ల దందాకు తెరలేపారు. నామినేషన్ల విధానంలో చేపట్టే పనులకు తొలుత ఓపెన్ టెండరు ప్రకటనను విడుదల చేయాలి. ఆ తర్వాత కనీసం ముగ్గురు కాంట్రాక్టర్ల నుంచి కొటేషన్లను స్వీకరించాలి. అందులో తక్కువ రేటు సూచించిన వ్యక్తికి అర్హతల ప్రకారం పనులు అప్పగించాలి. అయితే నామినేషన్ల కింద చేపట్టే పనులకు చాలాచోట్ల బహిరంగ టెండరు ప్రకటన జారీ చేయడం లేదు. గుట్టు చప్పుడు కాకుండా పనులను బినామీలకు కేటాయించుకుంటున్నారు. తెలిసిన ముగ్గురు కాంట్రాక్టర్ల నుంచి కొటేషన్లు తెప్పించుకుని, వాటిలో తమ బినామీ కాంట్రాక్టర్కు వర్క్ ఆర్డర్ దక్కేలా కొందరు అధికారులు చక్రం తిప్పుతున్నారు. మిగిలిన ఇద్దరు కాంట్రాక్టర్లతో పోలిస్తే బినామీ కాంట్రాక్టర్కు సంబంధించిన కొటేషన్లో రేటును క్తాస తగ్గించి పనులను చేజిక్కించుకుంటున్నారు. చాలా కార్యాలయాల నోటీసు బోర్డుల్లో నామినేషన్ల కింద పనుల కేటాయింపు ప్రక్రియ పూర్తయిన 15 రోజుల తర్వాత ఓపెన్ టెండరు ప్రకటనలు దర్శనమిస్తున్నాయి. దీన్ దయాల్ ఉపాధ్యాయ గ్రామ్ జ్యోతి యోజన(డీడీయూజీజేవై), ఇంటిగ్రేటెడ్ పవర్ డెవలప్మెంట్ స్కీం(ఐపీడీఎస్) పథకాల కింద గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా, పంపిణీకి సంబంధించిన మౌలిక సదుపాయాల అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వేల కోట్ల నిధులు కేటాయించాయి. వీటితోపాటు ఇతర పథకాల కింద రూ.5 లక్షల లోపు అంచనా వ్యయంతో నామినేషన్పై కేటాయిస్తున్న పనుల్లో ఎక్కువ శాతం అధికారుల బినామీ కాంట్రాక్టర్లే చేజిక్కించుకుంటున్నారని తెలుస్తోంది. దీంతో తమకు పనులు దక్కడం లేదని ఇతర కాంట్రాక్టర్లు వాపోతున్నారు. -
రెండేళ్లలో 3,480 మెగావాట్ల ఉత్పత్తి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఏర్పడిన అనంతరం నిర్మిస్తున్న విద్యుత్ కేంద్రాల్లో వచ్చే నెల నుండే ఉత్పత్తి ప్రారంభమవుతుందని, రెండేళ్లలో అదనంగా 3,480 మెగావాట్లు, ఆ తరువాత రెండేళ్లలో మరో 4,000 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యం అందుబాటులోకి వస్తుందని ట్రాన్స్కో, జెన్కో సీఎండీ డి. ప్రభాకర్ రావు వెల్లడించారు. జెన్కో ఆధ్వర్యంలో చేపట్టిన 800 మెగావాట్ల కేటీపీఎస్ ఏడోదశ విద్యుదుత్పత్తి కేంద్ర నిర్మాణం పూర్తయిందని, వచ్చే నెల నుండి ఉత్పత్తి ప్రారంభిస్తామని చెప్పారు. 1080 (4గీ270) మెగావాట్ల భద్రాద్రి ప్లాంట్కు సంబంధించి తొలి రెండు యూనిట్లు వచ్చే ఏడాది మార్చి, మరో రెండు యూనిట్లు డిసెంబర్ నుండి ఉత్పత్తిని ప్రారంభిస్తాయన్నారు. ఎన్టీపీసీ, యాదాద్రి, భద్రాద్రి, కేటీపీఎస్ ఏడో దశ విద్యుదుత్పత్తి కేంద్రాల నిర్మాణ పురోగతిని శుక్రవారం ఆయన విద్యుత్ సౌధలో సమీక్షించారు. ఎన్టీపీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ దూబె, జనరల్ మేనేజర్ సుదర్శన్, ట్రాన్స్ కో జేఎండీ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. 2020 నాటికి 20 వేల మెగావాట్లు ఎన్టీపీసీ, భద్రాద్రి, కేటీపీఎస్ ద్వారా 2020 మార్చి నాటికి అదనంగా 3,480 మెగావాట్ల విద్యుదుత్పత్తి అందుబాటులోకి వస్తుందని ప్రభాకర్రావు తెలిపారు. దీంతో రాష్ట్రంలో విద్యుదుత్పత్తి 20,000 మెగావాట్లు దాటుతుందన్నారు. 4000 మెగావాట్ల యాదాద్రి ప్లాంటును కూడా నిర్మిస్తామన్నారు. సోలార్, హైడల్, సీజీఎస్ తదితర మార్గాల ద్వారా కూడా 28,000 మెగావాట్ల విద్యుదుత్పత్తిని సాధించడానికి కార్యాచరణ సిద్ధం చేశామన్నారు. శరవేగంగా రామగుండం ప్లాంట్ పనులు రామగుండంలో 4000 మెగావాట్ల ఎన్టీపీసీ విద్యుదుత్పత్తి ప్లాంట్ నిర్మాణం జరగాల్సి వుండగా మొదటి దశలో 1600 (2గీ800) మెగావాట్ల సామర్థ్యం కలిగిన రెండు యూనిట్ల నిర్మాణం పనులు శరవేగంగా జరుగుతున్నాయని ఎన్టీపీసీ ఏఈ దూబె తెలిపారు. తొలి యూనిట్ ద్వారా వచ్చే ఏడాది నవంబర్ నుండి 800 మెగావాట్ల విద్యుదుత్పత్తి ప్రారంభిస్తామన్నారు. ఆ తరువాత మూడు నెలలకు మరో 800 మెగావాట్ల ఉత్పత్తి ప్రారంభమవుతుందని వెల్లడించారు. -
విద్యుత్ ఉద్యోగులకు పీఆర్సీ
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ ఉద్యోగుల వేతన సవరణ సంఘాన్ని ఏర్పాటు చేస్తూ తెలంగాణ ట్రాన్స్మిషన్ కార్పొరేషన్ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలోని అన్ని విద్యుత్ సంస్థల్లో పని చేస్తున్న ఉద్యోగుల జీతాలు, అలవెన్సులను సవరించేందుకు ఈ పీఆర్సీని ఏర్పాటు చేసింది. తెలంగాణ ట్రాన్స్కో జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ సి.శ్రీనివాసరావును పీఆర్సీ చైర్మన్గా నియమించింది. ఆయనతో పాటు ఎన్పీడీసీఎల్ డైరెక్టర్ (ప్రాజెక్ట్స్), ఎస్పీడీసీఎల్ డైరెక్టర్ (హెచ్ఆర్) టీఎస్ జెన్కో డైరెక్టర్ (హెచ్ఆర్), డైరెక్టర్ (ఫైనాన్స్) పీఆర్సీ కమిటీలో సభ్యులుగా ఉంటారు. ట్రాన్స్కో చీఫ్ కంట్రోలర్ ఆఫ్ అకౌంట్స్ కమిటీకి కన్వీనర్గా ఉంటారు. ఈ మేరకు తెలంగాణ ట్రాన్స్కో, జెన్కో చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ డి.ప్రభాకర్రావు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణ ట్రాన్స్కో, జెన్కో, ఎన్పీడీసీఎల్, ఎస్పీడీసీఎల్ సంస్థల్లో పని చేస్తున్న అన్ని కేటగిరీల ఉద్యోగులకు సంబంధించిన జీతాలపై అధ్యయనం చేయాలని, అన్ని యూనియన్లు, అసోసియేషన్లతో సంప్రదింపులు జరపాలని పీఆర్సీకి మార్గదర్శకాలను ఈ ఉత్తర్వుల్లో సూచించింది. విద్యుత్తు సంస్థల ఆర్థిక స్థితిగతులను పరిగణనలోకి తీసుకోవాలని నిర్దేశించింది. జీతాల పెంపు భారం రాష్ట్రంలోని విద్యుత్తు వినియోగదారులపై భారం పడకుండా ఉండాలని స్పష్టం చేసింది. ఇప్పటికే ఉన్న నిబంధనల ప్రకారం విద్యుత్తు సంస్థల్లో నాలుగేళ్లకోసారి వేతన సవరణ అమలవుతోంది. ప్రస్తుత వేతన సవరణ సంఘం గడువు మార్చి 31వ తేదీతో ముగిసింది. ఈ నేపథ్యంలో కొత్త పీఆర్సీ ఏర్పాటుకు ఉత్తర్వులు వెలువడ్డాయి. విద్యుత్తు ఉద్యోగుల యూనియన్లు, అసోసియేషన్లతో సంప్రదింపుల మేరకు వేతన సవరణ ఒప్పందం జరుగుతుంది. పీఆర్సీ కమిటీ ఇచ్చే సిఫారసుల మేరకే ఉద్యోగుల వేతనాలను ఎంత మేరకు పెంచాలనేది ఖరారవుతుంది. ఈ సిఫారసులకు ఎప్పుడు ఆమోదించినా.. సవరించిన వేతనాలు 2018 ఏప్రిల్ ఒకటి నుంచి అమల్లోకి వస్తాయి. -
విభజన పంచాయతీ..!
ట్రాన్స్కో ఉద్యోగుల విభజన వివాదాలకు దారితీస్తోంది. ఉద్యోగుల విభజన శాస్త్రీయంగా, పారదర్శకంగా చేపట్టలేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉద్యోగుల కేటాయింపుల్లో జిల్లాకు అన్యాయం చేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. సిద్దిపేటకు ఎక్కువ పోస్టులు కేటాయించటంపై జిల్లా అధికారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగుల కేటాయింపులో సమన్యాయం పాటించకపోవడంపై ఉన్నతాధికారుల తీరుపై గుర్రుగా ఉన్నట్లు సమాచారం. అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఎస్ఈ ఉన్నతాధికారులకు లేఖ రాసినట్లు తెలుస్తోంది. ఈ లేఖ ద్వారా ఉద్యోగుల కేటాయింపును మరోసారి పరిశీలించి జిల్లాకు న్యాయం చేయాలని కోరినట్లు సమాచారం. సాక్షి, మెదక్: జిల్లాల పునర్విభజనలో భాగంగా 2016 అక్టోబర్లో మెదక్ నూతన జిల్లా ఏర్పాటైన విషయం తెలిసిందే. జిల్లా ఏర్పడిన వెంటనే జిల్లాకు ట్రాన్స్కో ఎస్ఈ కార్యాలయం ఏర్పాటు కావాల్సి ఉండగా దాన్ని ఏర్పాటు చేయకుండా 2017 ఆగస్టులో కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. ఎస్ఈ, డీఈ, అకౌంట్స్ ఆఫీసర్ పోస్టులను మంజూరు చేసినా మిగితా సిబ్బంది నియమించలేదు. వారం రోజుల క్రితం ట్రాన్స్కో ఉద్యోగుల విభజనను పూర్తి చేశారు. ఉద్యోగుల విభజన కోసం సీజీఎం ఆధ్వర్యంలో మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి ఎస్ఈలతో ప్రత్యేకంగా కమిటీ వేశారు. ఈ కమిటీ అన్ని స్థాయిల్లో ఖాళీల వివరాలు, పనిచేస్తున్న సిబ్బంది వివరాలను సేకరించి ఉద్యోగుల విభజనపై నిర్ణయం తీసుకున్నారని సమాచారం. సంగారెడ్డి జిల్లాకు 48 శాతం, మెదక్ జిల్లాకు 26 శాతం, సిద్దిపేట జిల్లాకు 26 శాతం చొప్పున ఉద్యోగులను కేటాయించాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ నిర్ణయం మేరకు ఉద్యోగులు కేటాయింపులు జరగకపోవటం ఇప్పుడు వివాదానికి దారితీస్తోంది. దీనికితోడు పోస్టుల కేటాయింపుపైనా ఉద్యోగులు తీవ్ర స్థాయిలో అసంతృప్తితో ఉన్నారు. కొంత మంది ఉద్యోగులు తమకు ఇచ్చిన కొత్త పోస్టుల్లో చేరేందుకు ఆసక్తిచూపడం లేదు. ట్రాన్స్కో ఉద్యోగుల విభజనలో భాగంగా సబ్ ఇంజినీర్, జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్, సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, టైపిస్టు, రికార్డు అసిస్టెంట్, ఆఫీస్ సబార్డినేట్, ఫోర్మెన్(గ్రేడ్ 1), సీనియర్ లైన్ ఇన్స్పెక్టర్, ఫోర్మెన్(ఎంఆర్టీ గ్రేడ్1), ఫోర్మెన్(ఎంఆర్టీ గ్రేడ్ 2) విభజించి మూడు జిల్లాలకు కేటాయించారు. విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.. ఉమ్మడి జిల్లాలో మొత్తం 642 పోస్టులు ఉండగా 398 పోస్టులు భర్తీ కాగా 244 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సంగారెడ్డి జిల్లాకు సబ్ ఇంజినీర్ మొదలు ఫోర్మెన్ వరకు 317 పోస్టులు కేటాయించారు. అందులో 48 శాతం చొప్పున 190 పోస్టులకు ఉద్యోగులను కేటాయించారు. 127 పోస్టులు ఖాళీగా చూపించారు. మెదక్ జిల్లాలోని మెదక్, తూప్రాన్ డివిజన్లకు 157 పోస్టులను కేటాయించారు. ఇందులో 70 పోస్టులను ఖాళీలు చూపి, 87 మంది ఉద్యోగులను భర్తీ చేశారు. సిద్దిపేటకు జిల్లాకు 168 పోస్టులను కేటాయించి కేవలం 47 పోస్టులను మాత్రమే ఖాళీలుగా చూపి, 121 పోస్టులను భర్తీ చేశారు. సిద్దిపేట, మెదక్ జిల్లాలకు 26 శాతం చొప్పున సమానంగా ఉద్యోగులు పోస్టులను భర్తీ చేయాల్సి ఉండగా సిద్దిపేటకు అదనంగా కేటాయించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. సిద్దిపేటలో హుస్నాబాద్ డివిజన్లు ఇంకా విలీనం కాకున్నా విలీనం అయినట్లు చూపి ఉద్యోగులను ఎక్కువ సంఖ్యలో కేటాయించారన్న ఆరోపణలున్నాయి. దీంతో ట్రాన్స్కోలో ఉద్యోగుల విభజన సక్రమంగా చేపట్టాలన్న డిమాండ్ ఊపందుకుంటోంది. మరోమారు పరిశీలించాలి.. పోస్టుల విభజన, ఉద్యోగుల కేటాయింపు తీరుపై మెదక్ జిల్లా ట్రాన్స్కో ఎస్ఈతో పాటు ఇతర అధికారులు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. విభజన, ఉద్యోగుల కేటాయింపు మరోమారు పారదర్శకంగా చేపట్టాలని ఎస్ఈ శ్రీనాథ్ ఉన్నతాధికారులకు కోరినట్లు సమాచారం. ఈ మేరకు ట్రాన్స్కో సీజీఎం, సంగారెడ్డి ఎస్ఈకి లేఖ రాసినట్లు తెలిసింది. ఈ విషయమై ఎస్ఈ శ్రీనాథ్ వివరణ కోరగా ఉద్యోగుల కేటాయింపు అంశాన్ని మరోమారు పరిశీలించి జిల్లాకు 26 శాతం మేరకు కేటాయింపులు జరిగేలా చూడాలని లేఖ రాసినట్లు తెలిపారు. -
విద్యుత్ కార్మికులపై ఉక్కుపాదం!
కర్నూలు, ఆదోని: తమ డిమాండ్ల సాధన కోసం నిరవధిక సమ్మెకు దిగిన విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులపై ఉక్కుపాదం మోపేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. సమ్మె చేసిన వారి స్థానంలో కొత్త వారిని నియమించేందుకు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలని ట్రాన్స్కో ఉన్నత స్థాయి అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఇందులో ఏజెన్సీ నిర్వాహకులు అలక్ష్యం ప్రదర్శిస్తే వారిపై చర్యలకు కూడా వెనుకాడొద్దని అందులో పేర్కొన్నారు. ఈ నెల 20 సాయంత్రం 6 గంటల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అవుట్ సోర్సింగ్ విద్యుత్తు కార్మికులు నిరవధిక సమ్మెకు దిగారు. తానిచ్చిన హామీలను నెరవేర్చమంటే.. ఎన్నికల ముందు సీఎం చంద్రబాబు అర్హత కలిగిన కాంట్రాక్ట్ కార్మికులందరినీ శాశ్వత ఉద్యోగులుగా నియమిస్తామని, మిగిలిన వారికి శాశ్వత ఉద్యోగులకు సమానంగా సమాన పనికి సమాన వేతనం ప్రాతిపదికన వేతనం చెల్లిస్తామని హామీ ఇచ్చారు. హామీలు అమలు కోసం నాలుగేళ్లలో కార్మికులు ఆందోళనలు నిర్వహించారు. ఈక్రమంలోనే అనివార్య పరిస్థితుల్లో నిరవధిక సమ్మెకు దిగారు. డిమాండ్లను పరిష్కరించక పోగా సమ్మెలో వెళ్లిన వారి స్థానంలో తాత్కాలిక ప్రాతిపదికన కొత్త వారిని నియమించాలని ఆదేశాల జారీ చేయడం పట్ల కార్మికులు మండిపడుతున్నారు. వ్యథా భరితం.. జిల్లాలో మొత్తం 200 వరకు సబ్స్టేషన్లు ఉన్నాయి. ఇందులో ఒక్కో సబ్ స్టేషన్లో నలుగురు ఆపరేటర్లు, ఒక వాచ్మెన్ చొప్పున మొత్తం వెయ్యి మంది వరకు పని చేస్తున్నారు. ఆదోని, కర్నూలు, నంద్యాల డివిజన్ కార్యాలయాల పరిధిలో ఫోల్ టు ఫోల్ వర్కర్లు, బిల్లింగ్, స్పాట్ బిల్లింగ్, ఎస్పీఎం కార్మికులు మరో వెయ్యి మంది దాకా ఉంటారు. ఏజెన్సీల ద్వారా ప్రస్తుతం నెలకు రూ.6500 నుంచి రూ.12000 వరకు వేతనం చెల్లిస్తున్నారు. వేతనాల నుంచి మినహాయించుకుంటున్న ఈపీఎఫ్, ఈఎస్ఐ కంతులను కొంత మంది ఏజెన్సీ నిర్వాహకులు స్వాహా చేసిన సందర్భాలూ ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాలలో పని చేస్తున్న కార్మికులకు ఈఎస్ఐ సదుపాయం కల్పించడంలేదు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయినా ఎలాంటి పరిహారం అందకపోవడంతో వారిపై ఆధారపడిన కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. మరోవైపు అధికారులు, ఏజెన్సీ నిర్వాహకులు, రాజకీయ నాయకులకు నచ్చకపోయినా నిర్దాక్షిణ్యంగా విధుల నుంచి తొలగిస్తున్నారు. కార్మికుల్లోచీలికకు కుట్ర? కాగా తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ నిరవధిక సమ్మెకు దిగిన కార్మికుల్లో చీలిక తెచ్చేందుకు కుట్ర జరుగుతోందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికార పార్టీకి అనుబంధంగా ఉన్న తెలుగునాడు ట్రేడ్ యూనియన్తో పాటు 1104 యూనియన్లు సమ్మెకు దూరంగా ఉన్నాయి. సమ్మెలో వెళ్లొద్దని కూడా తమ యూనియన్లలో సభ్యత్వం ఉన్న కార్మికులకు సూచించినట్లు సమాచారం. ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాం కాంట్రాక్ట్ కార్మికులు సమ్మెలో వెళ్లడంతో విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయం తలెత్తకుండా శాశ్వత ఉద్యోగులకు అదనపు బాధ్యతలు అప్పగించాం. కొంతమంది కాంట్రాక్ట్ కార్మికులు కూడా విధులకు హాజరవుతున్నారు. దీంతో కొత్త వారిని నియమించే అవసరం రాలేదు. – చెంచెన్న,ట్రాన్స్కో డీఈఈ -
ఇది మాదే... అదీ మాదే!
కాంట్రాక్టు మాకే దక్కాలి. లేకపోతే వాటా అయినా ఇవ్వాలి. అంతవరకు టెండర్లు పెండింగే.. ఇదీ సబ్స్టేషన్ల కాంట్రాక్టులపై ఓ అధికార పార్టీ ప్రజాప్రతినిధి అల్టిమేటం. రాజధాని అమరావతి పరిధిలోని తుళ్లూరు మండలం, లింగాయపాలెం సబ్స్టేషన్ టెండర్లు ఖరారు కాకుండా ఆ ప్రజాప్రతినిధి సైంధవపాత్ర పోషిస్తున్నారు. ప్రస్తుతం రూ.40 కోట్ల టెండరుతోపాటు మొత్తం రూ.640 కోట్ల సబ్స్టేషన్ల కాంట్రాక్టుపై కన్నేసిన ఆయన ఒత్తిడికి ట్రాన్స్కో తలొగ్గుతోంది. సాక్షి, అమరావతిబ్యూరో: రాజధాని అమరావతిలో 16 సబ్స్టేషన్లను దశలవారీగా నిర్మించాలని ట్రాన్స్కో నిర్ణయిం చింది. ఈ మేరకు సీఆర్డీఏ కేటాయిం చిన రూ.640కోట్ల బడ్జెట్తో ప్రణాళికలు రూపొందించింది. మొదటగా లింగాయపాలెంలో రూ.40 కోట్లతో 220 కేవీ సబ్స్టేషన్ నిర్మాణానికి టెండర్లు పిలిచింది. విజయవాడకు చెందిన అధికార పార్టీ ప్రజాప్రతినిధి ఒకరు బినామీ సంస్థ పేరిట టెండరు వేశారు. ముంబాయి, హైదరాబాద్కు చెందిన ప్రముఖ కంపె నీలు కూడా టెండర్లు దాఖలు చేశాయి. టెక్నికల్ బిడ్ను ఆరు నెలల క్రితం తెరి చారు. అయితే ప్రైస్బిడ్ను ఇంకా తెరవడం లేదు. టెండర్లు ఖరారు చేయడం లేదు. జాప్యం ఎందుకు జరుగుతోందా అని ఆరా తీయగా ఆ ప్రజాప్రతినిధి వ్యవహారం వెలుగులోకి వచ్చింది. చక్రం తిప్పిన ప్రజాప్రతినిధి లింగాయపాలెం సబ్స్టేషన్ కాంట్రాక్టును తాను సూచించిన సంస్థకే ఏకపక్షంగా కేటాయించాలని విజయవాడకు చెందిన అధికార పార్టీ ప్రజాప్రతినిధి పట్టుబడుతున్నారని విశ్వసనీయ సమాచారం. ముంబాయి, హైదరాబాద్కు చెందిన ప్రముఖ సంస్థలు కూడా టెండర్లు దాఖలు చేయడంతో పోటీ తీవ్రంగా ఉంది. దీంతో ప్రజాప్రతినిధి సూచించిన సంస్థకు టెండరు వచ్చే అవకాశాలు తక్కువుగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆ ప్రజాప్రతినిధి ట్రాన్స్కో ఉన్నతాధికారులపై ఒత్తిడి తెచ్చి ఏకంగా టెండర్ల ప్రక్రియనే పెండింగులో పెట్టేలా చక్రం తిప్పారని సమాచారం. సాంకేతిక కారణాల పేరుతో టెండర్ల ప్రక్రియను రద్దు చేసి మళ్లీ పిలవాలని ఆయన ఒత్తిడి తెస్తున్నట్లు తెలిసింది. వాటా ఇస్తామంటే సరే..లేకుంటే అంతే.. ఒక్క లింగాయపాలెం సబ్ స్టేషన్ కాంట్రాక్టే కాదు, ఆ తరువాతి దశల్లో నిర్మించే 15 సబ్స్టేషన్ల కాంట్రాక్టుపైనా ఆ ప్రజాప్రతినిధి కన్నేశారు. అంటే రూ.640 కోట్ల కాంట్రాక్టును దక్కించుకోవడమే లక్ష్యంగా చేసుకున్నారు. తాను సూచించిన సంస్థకు టెండరు దక్కాలి, లేకుంటే తనకు వాటా ఇచ్చే సంస్థకు కేటాయించాలని ఆయన ప్రతిపాదించినట్లు సమాచారం. ఈ మేరకు ట్రాన్స్కో సంస్థలో ప్రస్తుతం కీలకంగా ఉన్న ఉన్నతాధికారి ద్వారా కథ నడిపిస్తున్నారు. ఆ ఉన్నతాధికారి హైదరాబాద్, ముంబాయిలకు చెందిన సంస్థలతో మంతనాలు సాగిస్తున్నారని సమచారం. లింగాయపాలెం సబ్స్టేషన్తోపాటు భవిష్యత్తో నిర్మించనున్న సబ్స్టేషన్ల కాంట్రాక్టుల్లో ఆ ప్రజాప్రతినిధి సంస్థకు వాటా ఇవ్వాలని ప్రతిపాదించారు. అందుకు సమ్మతిస్తేనే కాంట్రాక్టులు దక్కేలా చేస్తామని ఆఫర్ ఇచ్చారని సమాచారం. ఆ విషయంపై స్పష్టత వచ్చేవరకు లింగాయపాలెం సబ్స్టేషన్ కాంట్రాక్టును పెండింగులోనే ఉంచాలని ఆ ప్రజాప్రతినిధి తేల్చిచెప్పారు. దీంతో ట్రాన్స్కో వర్గాలు మల్లగుల్లాలు పడుతున్నాయి. ఆ ప్రజాప్రతినిధి ఒత్తిడికి లొంగి ఆ టెండరు ప్రక్రియను ప్రస్తుతానికి పక్కనపెట్టేశాయి. అమరావతిలో సబ్స్టేషన్ల కాంట్రాక్టు వ్యవహారం మునుముందు ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాల్సిందే. -
చైనా కంపెనీ ముసుగులో ఎంపీ కుటుంబం
సాక్షి, అమరావతి : అర్హతలేని చైనా కంపెనీకి రూ.240 కోట్ల విలువైన అప్టికల్ ఫైబర్ కేబుళ్ల ప్రాజెక్టును కట్టబెట్టడానికి టీడీపీ ఎంపీ ఒకరు రంగంలోకి దిగారు. అందుకు ట్రాన్స్కో ఉన్నతాధికారి వత్తాసు పలుకుతున్నారు. ఇదే కాదు.. అమరావతిలో విద్యుత్తు ప్రాజెక్టులను కూడా అదే చైనా కంపెనీ పేరుతో దక్కించుకోవాలని పావులు కదుపుతున్నారు. చైనా కంపెనీ ముసుగులో ప్రాజెక్టులు దక్కించుకుని కోట్లు కొల్లగొట్టాలన్నది ఆ ఎంపీ వ్యూహం. ఇదీ ప్రాజెక్టు అదనపు ఆదాయ వనరులను సమకూర్చుకోడానికి రాష్ట్రంలో ఆప్టికల్ ఫైబర్ కేబుళ్లు వేయాలని ట్రాన్స్కో నిర్ణయించింది. ఇందుకు 24 లేయర్లు కలిగిన ఆప్టికల్ ఫైబర్గ్రౌండ్(ఓపీజీ) వైర్లు వేయాలనేది ప్రణాళిక. ఈ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం రూ.240 కోట్లు కేటాయించింది. 18 నెలల్లో పనులు పూర్తి చేయాలని షరతు విధించటంతో ట్రాన్స్కో టెండర్ల ప్రక్రియకు సిద్ధపడింది. చైనా కంపెనీ ముసుగులో ఎంపీ కుటుంబం చైనాకు చెందిన ఎస్బీజీ అనే కంపెనీ వీటికి టెండర్ దాఖలు చేసింది. తాము చైనాలో ఉత్పత్తి చేస్తున్న ఆప్టికల్ ఫైబర్ కేబుళ్లతో ఈ ప్రాజెక్టు చేపడతామని పేర్కొంది. అయితే తెరవెనుక వేరే కథ ఉంది. వివాదాస్పద వ్యాఖ్యలతో తరచూ వార్తల్లో ఉండే రాయలసీమకు చెందిన ఓ టీడీపీ ఎంపీ ఆ కంపెనీ పేరుతో అసలు వ్యవహారం నడుపుతున్నారు. రెండు అర్హతలు తప్పనిసరి... అమరావతిలో భారీస్థాయిలో చేపట్టే విద్యుత్తు లైన్ల ప్రాజెక్టులను చైనా కంపెనీ పేరుతో టెండర్లు దక్కించుకోవాలన్నది ఆ ఎంపీ కుటుంబం ఉద్దేశం. అందుకు తొలి అడుగుగా ఆప్టికల్ ఫైబర్ కేబుల్ ప్రాజెక్టుపై కన్నేశారు. విదేశీ కంపెనీలు టెండర్లలో పాల్గొనేందుకు కొన్ని విధివిధానాలున్నాయి. ఆ కంపెనీకి కచ్చితంగా భారత దేశంలో బ్యాంకు ఖాతా ఉండాలి. భారత్లో ఇన్కార్పోరేట్ కంపెనీ అయ్యుండాలి. కానీ ఈ చైనా కంపెనీకి ఆ రెండు అర్హతలు లేవు. దీంతో సదరు చైనా కంపెనీ దాఖలు చేసిన టెండరును ట్రాన్స్కో ఉన్నతాధికారులు పరిశీలించకుండా పక్కనపెట్టేశారు. అనుమతించాల్సిందే... టెండర్ కట్టబెట్టాల్సిందే ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన రాయలసీమ టీడీపీ ఎంపీ.. చైనా కంపెనీని టెండర్లలో పాల్గొనేందుకు అనుమతించాలని ట్రాన్స్కోపై తీవ్ర ఒత్తిడి చేస్తున్నారు. ఆయన ఇటీవల విద్యుత్తు సౌధ కార్యాలయానికి వచ్చి చైనా కంపెనీని అనుమతించాల్సిందేనని పట్టుబట్టారు. ట్రాన్స్కోలో చక్రం తిప్పుతున్న ఓ ఉన్నతాధికారి అందుకు వత్తాసు పలుకుతున్నారు. ఈ ప్రయత్నాలకు ట్రాన్స్కో ఉన్నతాధికారులు ససేమిరా అంటున్నారు. అర్హతలు లేని కంపెనీని అనుమతిస్తే న్యాయవివాదాలు తలెత్తి మొత్తం టెండర్ల ప్రక్రియే నిలిచిపోతుందని హెచ్చరిస్తున్నారు. ఏడాదిన్నరలోగా ప్రాజెక్టు పూర్తి కాకపోతే కేంద్రం రూ.240 కోట్ల నిధులను వెనక్కి తీసుకుంటుందని చెబుతున్నా ఆ ఎంపీ వెనక్కి తగ్గకపోవటంతో ఆప్టికల్ ఫైబర్ కేబుళ్ల టెండరు వ్యవహారం ట్రాన్స్కోలో ఆసక్తికరంగా మారింది. -
‘విద్యుత్’లో మరో 1,800 పోస్టులు
సాక్షి, హైదరాబాద్ వరంగల్ కేంద్రంగా పనిచేస్తున్న ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ఎన్పీడీసీఎల్)లో 1,800 జూనియర్ లైన్మెన్ (జేఎల్ఎం) పోస్టుల భర్తీకి త్వరలో ప్రకటన జారీ కానుంది. సంస్థ పాలక మండలి సమావేశం అనంతరం మరో వారం పదిరోజుల్లో ఈ నియామక ప్రకటన జారీ చేయనున్నామని అధికారవర్గాలు తెలిపాయి. తెలంగాణ ట్రాన్స్కోలో 330 అసిస్టెంట్ ఇంజనీర్ (ఏఈ), 174 సబ్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్), 1,100 జూనియర్ లైన్మెన్ (జేఎల్ఎం) పోస్టులు కలిపి మొత్తం 1,604 పోస్టుల భర్తీకి ఇప్పటికే ప్రకటన జారీ కాగా, దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ఎస్పీడీసీఎల్)లో 150 ఏఈ, 500 జూనియర్ అసిస్టెంట్, 100 జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ (జేఏఓ) పోస్టులతో పాటు 2,000 జూనియర్ లైన్మెన్ (జేఎల్ఎం) పోస్టుల భర్తీకి మరో వారంలో ప్రకటన రానున్న విçషయం తెలిసిందే. అయితే టీఎస్ఎన్పీడీసీఎల్లో జేఎల్ఎం పోస్టులు తప్ప మిగతా ఏఈ, సబ్ ఇంజనీర్, ఇతర కేటగిరీల పోస్టులను ప్రస్తుతానికి భర్తీ చేయడం లేదని అధికారవర్గాలు తెలిపాయి. -
వ్యవసాయానికి విద్యుత్తేజం
సాక్షి, హైదరాబాద్ రైతులకు రాష్ట్ర ప్రభుత్వం నూతన సంవత్సర కానుక అందించింది. రాష్ట్రంలోని 23 లక్షల పంపుసెట్లకు ఆదివారం అర్ధరాత్రి నుంచి నిరంతర విద్యుత్ సరఫరాను ప్రారంభించింది. దీంతో దేశంలో వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంట్ అందిస్తున్న తొలి రాష్ట్రంగా తెలంగాణ రికార్డు సృష్టించింది. దేశంలోని కొన్ని రాష్ట్రాలు వ్యవసాయానికి నిర్ణీత గంటల పాటు ఉచిత విద్యుత్ ఇస్తుండగా, మరికొన్ని రాష్ట్రాలు 24 గంటల పాటు సరఫరా చేస్తున్నా చార్జీలు వసూలు చేస్తున్నాయి. 2016 జూలై నుంచి ఉమ్మడి మెదక్, నల్లగొండ, కరీంనగర్ జిల్లాల్లో ప్రయోగాత్మకంగా సాగుకు 24 గంటల విద్యుత్ అందించారు. ఆ తర్వాత నవంబర్ 6 నుంచి 20 వరకు 15 రోజులపాటు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో అమలు చేశారు. సీఎం కేసీఆర్ ఆదేశాలతో రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థలు(డిస్కం) ఆదివారం అర్ధరాత్రి నుంచి అధికారికంగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాయి. ట్రాన్స్కో, జెన్కో సీఎండీ డి.ప్రభాకర్ రావు, టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎండీ జి.రఘుమారెడ్డి మేడ్చల్ జిల్లా శామీర్పేట మండలం మూసాయపల్లిలో రైతు చింతల వెంకట్రెడ్డి పొలంలో పంప్సెట్ను ఆన్చేసి 24 గంటల కరెంట్ను లాంఛనంగా ప్రారంభించారు. తెల్లవారుజాము వరకు పలు గ్రామాల్లో పర్యటించి విద్యుత్ సరఫరా తీరును పరిశీలించారు. సీఎం కేసీఆర్ కరెంట్ సరఫరా విశేషాలను అధికారుల నుంచి ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ సమీక్షించారు. వచ్చే మార్చి కీలకం వాస్తవానికి గత మూడ్రోజుల నుంచే అనధికారికంగా సాగుకు 24 గంటల విద్యుత్ సరఫరా చేస్తున్నారు. దీంతో రాష్ట్రంలో గరిష్ట విద్యుత్ డిమాండ్ 8,200 మెగావాట్ల నుంచి 9,400 మెగావాట్లకు ఎగబాకింది. వచ్చే మార్చిలో రబీ పంటలు చివరి దశకు రానున్నాయి. అప్పుడు నీటి అవసరాలు పెరగనున్నాయి. దానికి వేసకి కూడా తోడు కానుండటంతో ఆ నెలలో డిమాండ్ భారీగా పెరగనుంది. ఆ నెలలో రికార్డు స్థాయిలో 11 వేల మెగావాట్లకు డిమాండ్ పెరగవచ్చని ప్రభుత్వం అంచనా వేసింది. అయినా ఆ మేరకు సరఫరా చేస్తామని విద్యుత్ సంస్థలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఆటో స్టార్టర్లపై త్వరలో ప్రత్యేక డ్రైవ్ సాగుకు 24 గంటల కరెంట్ నేపథ్యంలో విద్యుత్తోపాటు భూగర్భ జలాలు వృథా కాకుండా పంపుసెట్లకు బిగించిన ఆటో స్టార్టర్లను తొలగించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు రైతులకు పిలుపునిచ్చారు. ఆటో స్టార్టర్ల తొలగింపుపై రైతుల్లో అవగాహన, చైతన్యం కల్పించేందుకు జనవరి తొలి వారంలో ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక డ్రైవ్ నిర్వహించనుంది. మంత్రులు, ఎమ్మెల్యేల ద్వారా గ్రామ సభలు నిర్వహించి రైతుల్లో అవగాహన కల్పించనుంది. -
నిరుద్యోగులకు మరో శుభవార్త...
సాక్షి, హైదరాబాద్ : నిరుద్యోగులకు మరో శుభవార్త. తెలంగాణ విద్యుత్ సరఫరా సంస్థ (ట్రాన్స్కో)లో 1604 పోస్టుల భర్తీకి ఇప్పటికే నోటిఫికేషన్లు జారీ కాగా, దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ(టీఎస్ఎస్పీడీసీఎల్)లో మరో 3 వేలకు పైగా పోస్టుల భర్తీకి వారం పది రోజుల్లో నియామక ప్రకటనలు జారీ కానున్నాయి. 150 అసిస్టెంట్ ఇంజనీర్, 500 జూనియర్ అసిస్టెంట్, 100 జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్(జేఏఓ) పోస్టులతో పాటు 2000 జూనియర్ లైన్మెన్(జేఎల్ఎం) పోస్టులు ఇందులో ఉండనున్నాయి. 150 అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టుల్లో 130 ఎలక్ట్రికల్, 20 సివిల్ విభాగాలకు చెందిన పోస్టులుండనున్నాయి. ఈ పోస్టుల సంఖ్య స్వల్పంగా మారవచ్చని, మొత్తానికి 3 వేలకు పైగా పోస్టుల భర్తీకి ప్రకటన జారీ చేస్తామని టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి తెలిపారు. త్వరలో సంస్థ పాలక మండలి సమావేశం నిర్వహించి ఈ పోస్టుల నియామకాలకు ఆమోదం తెలుపుతామన్నారు. అనంతరం ఈ పోస్టులకు వేర్వేరుగా ప్రకటనలు జారీ చేస్తామన్నారు. మరో 10 రోజుల్లో ఈ ప్రకటనలు జారీ కావచ్చు అన్నారు. -
ట్రాన్స్కోలో 1,604 కొలువులు
సాక్షి, హైదరాబాద్: నిరుద్యోగులకు శుభవార్త. తెలంగాణ రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ (ట్రాన్స్కో)లో 1,604 పోస్టుల భర్తీకి శుక్రవారం ప్రకటన వెలువడనుంది. 330 అసిస్టెంట్ ఇంజనీర్ (ఏఈ), 174 సబ్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్), 1,100 జూనియర్ లైన్మెన్ (జేఎల్ఎం) పోస్టుల భర్తీకి ట్రాన్స్కో ప్రకటన జారీ చేయనుంది. గురువారం విద్యుత్ సౌధలో ట్రాన్స్కో, జెన్కో సంస్థల సీఎండీ ప్రభాకర్రావు నేతృత్వంలో సమావేశమైన సంస్థ పాలక మండలి ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. 330 అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టుల్లో 250 ఎలక్ట్రికల్, 49 సివిల్, 31 టెలికాం విభాగాల పోస్టులు ఉండనున్నాయి. ఆయా విభాగాల్లో ఇంజనీరింగ్ పూర్తి చేసిన అభ్యర్థులు ఏఈ పోస్టులకు, ఎలక్ట్రికల్ విభాగంలో డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు సబ్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్) పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. నిరుద్యోగ అభ్యర్థులకు రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న ప్రత్యేక వయోపరిమితి సడలింపు నిబంధనలను విద్యుత్ ఉద్యోగాల భర్తీలోనూ అమలు చేయనున్నట్లు ప్రభాకర్రావు తెలిపారు. తెలంగాణ విద్యుదుత్పత్తి సంస్థ (జెన్కో)లో ప్రస్తుతం ఖాళీలు లేవని, కాబట్టి జెన్కో నుంచి నియామక ప్రకటన ఉండదని పేర్కొన్నారు. కాగా, దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ఎస్పీడీసీఎల్), ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ఎన్పీడీసీఎల్)ల నుంచి కూడా జేఎల్ఎం, ఏఈ, సబ్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి వారం పది రోజుల్లో వేర్వేరు ప్రకటనలు జారీ కానున్నాయి. -
త్వరలో 4,000 ‘విద్యుత్’ కొలువులు
సాక్షి, హైదరాబాద్ రాష్ట్ర విద్యుత్ సంస్థల్లో ఖాళీ పోస్టుల భర్తీకి యాజమాన్యాలు కసరత్తు చేస్తున్నాయి. ట్రాన్స్కో, జెన్కో, టీఎస్ఎస్పీడీసీఎల్, టీఎస్ఎన్పీడీసీఎల్ సంస్థల్లో అసిస్టెంట్ ఇంజనీర్, సబ్ ఇంజనీర్, జూనియర్ లైన్మెన్ తదితర పోస్టుల భర్తీకి వారం, పది రోజుల్లో సంస్థలు నోటిఫికేషన్లు విడుదల చేయనున్నాయి. మొత్తంగా 4 వేల పోస్టుల భర్తీకి ప్రకటనలు రానున్నాయని అధికారవర్గాలు తెలిపాయి. నాలుగు సంస్థల్లో కలిపి 1,000 వరకు అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టులు భర్తీ చేయనున్నట్లు పేర్కొన్నాయి. అలాగే ట్రాన్స్కోలో 330 అసిస్టెంట్ ఇంజనీర్, 174 సబ్ ఇంజనీర్.. 1,100 జూనియర్ లైన్మెన్ పోస్టులు భర్తీ చేయాలని సంస్థ యాజమాన్యం నిర్ణయించింది. మిగిలిన 3 విద్యుత్ సంస్థల్లో భర్తీ చేయనున్న పోస్టుల వివరాలు తెలియాల్సి ఉంది. గురువారం హైదరాబాద్లోని విద్యుత్ సౌధలో జరగనున్న విద్యుత్ సంస్థల బోర్డు సమావేశంలో నియామక ప్రకటనల జారీపై నిర్ణయం తీసుకోనున్నారు. సుప్రీం తీర్పు నేపథ్యంలో.. గతంలో వేర్వేరు ప్రకటనలతో ఏఈ పోస్టుల భర్తీ చేపట్టగా వందల సంఖ్యలో అభ్యర్థులు రెండు కన్నా ఎక్కువ సంస్థల్లో ఉద్యోగాలకు ఎంపికయ్యారు. దీంతో నియామక ప్రక్రియలో గందరగోళం ఏర్పడింది. తొలి మెరిట్ జాబితాతో పోస్టుల భర్తీ ముగిసిన తర్వాత మిగిలిన పోస్టులకు రెండో మెరిట్ జాబితా ప్రకటించడంతో నిరుద్యోగులు అభ్యంతరం తెలుపుతూ న్యాయస్థానాలను ఆశ్రయించారు. చివరకు సుప్రీంకోర్టు నుంచి ప్రత్యేక అనుమతి పొంది రెండో జాబితాతో మిగిలిన పోస్టులను విద్యుత్ సంస్థలు భర్తీ చేశాయి. రెండో జాబితా తర్వాత కూడా పోస్టులు మిగలడంతో మూడు, నాలుగో జాబితానూ ప్రకటించాల్సి వచ్చింది. దీంతో పోస్టుల భర్తీకి ఉమ్మడిగానే ప్రకటన జారీ చేయాలని అప్పట్లో యాజమాన్యాలు నిర్ణయించాయి. కానీ రెండో జాబితాతో మిగిలిన పోస్టుల భర్తీకి సుప్రీం అనుమతించిన నేపథ్యంలో మళ్లీ పాత పద్ధతిలోనే వేర్వేరుగా ప్రకటనలు జారీ చేయాలని తాజాగా నిర్ణయానికొచ్చాయి. ఒకే కేటగిరీ పోస్టులు, విద్యార్హతలున్నా రాత పరీక్షలు వేర్వేరుగా ఉండనున్నాయి. -
‘విద్యుత్’ అధికారుల పదవీకాలం పొడిగింపు
సాక్షి, హైదరాబాద్: దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ఎస్పీడీసీఎల్) చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ (సీఎండీ) జి.రఘుమారెడ్డితో సహా రాష్ట్ర విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న మరో ఆరుగురు డైరెక్టర్ల పదవీకాలాన్ని మరో ఏడాదిపాటు పొడిగిస్తూ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. దీంతో టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డితో పాటు ఆ సంస్థ డైరెక్టర్ (ఆపరేషన్స్) శ్రీనివాస్రెడ్డి, ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ఎన్పీడీసీఎల్) డైరెక్టర్(ఆపరేషన్స్) నర్సింగ్రావు, ట్రాన్స్కో డైరెక్టర్లు జగత్రెడ్డి (ట్రాన్స్మిషన్), నర్సింగ్రావు (గ్రిడ్ ఆపరేషన్స్), జెన్కో డైరెక్టర్లు వెంకటరాజం (హైడల్ విభాగం), సచ్చిదానందం (థర్మల్ విభాగం)ల పదవీకాలం మరో ఏడాదికి పెరిగింది. సీఎం కేసీఆర్ శనివారం ప్రగతిభవన్లో జెన్కో, ట్రాన్స్కో సీఎండీ డి.ప్రభాకర్రావు, సీఎంఓ ముఖ్య కార్యదర్శి ఎస్.నర్సింగ్రావుతో సమావేశమై డైరెక్టర్ల పదవీకాలం పొడిగింపు, నియామకాలపై చర్చించారు. ప్రస్తుతం పదవీకాలం ముగుస్తున్న వారికి ఏడాదిపాటు పొడిగింపు ఇవ్వాలని, ఖాళీగా ఉన్న పోస్టులను త్వరలోనే భర్తీ చేయాలని నిర్ణయించారు. కాగా, రఘుమారెడ్డి పదవీకాలం 2016లో ముగియగా, అప్పుడు ఏడాదిపాటు పొడిగించారు. జెన్కో డైరెక్టర్లు వెంకట్రాజం, సచ్చిదానందంల పదవీకాలాన్ని వచ్చే ఏడాది నవంబర్ 30 గా నిర్ణయించారు. రాష్ట్ర ఇంధన శాఖ త్వరలో ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేయనుంది. -
మళ్లీ 9 గంటల విద్యుత్!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వ్యవసాయానికి ప్రయోగాత్మకంగా చేపట్టిన 24 గంటల విద్యుత్ సరఫరా కార్యక్రమం విజయవంతమైంది. ఈనెల 6వ తేదీ అర్ధరాత్రి నుంచి రాష్ట్రంలోని 23 లక్షల వ్యవసాయ పంపు సెట్లకు నిరాటంకంగా విద్యుత్ అందించారు. వారం రోజులపాటు సరఫరా చేసి పరిస్థితిని అంచనా వేయాలని విద్యుత్ శాఖ అధికారులు తొలుత భావించారు. కానీ ట్రాన్స్ఫార్మర్ల నుంచి 400 కెవి సబ్ స్టేషన్ల వరకు పడే భారాన్ని, ఒత్తిడిని మరింత లోతుగా అధ్యయనం చేసేందుకు ట్రయల్ రన్ను 2వారాలకు పొడిగించారు. సోమవారం (నేటి) అర్ధరాత్రి వరకు సరఫరా కొనసాగించనున్నారు. మంగళవారం నుంచి యథావిధిగా మళ్లీ 9 గంటల విద్యుత్ సరఫరా చేస్తారు. ప్రయోగాత్మకంగా చేపట్టిన సరఫరా విజయవంతమైందని, 2018 జనవరి ఒకటో తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా 24 గంటల విద్యుత్ సరఫరా చేయాలని సీఎం కేసీఆర్ విద్యుత్ సంస్థలను ఆదేశించారు. వ్యవసాయ విద్యుత్ ప్రయోగం, ఫలితాలపై ఆదివారం జెన్ కో, ట్రాన్స్ కో సీఎండీ ప్రభాకర్రావుతో సీఎం సమీక్షించారు. పాత మెదక్, కరీంనగర్, నల్లగొండ జిల్లాల్లో గత జూలై నుంచే ఈ కార్యక్రమం అమలు చేస్తున్నామని, 2 వారాలుగా రాష్ట్రంలోని అన్ని వ్యవసాయ పంపుసెట్లకు విస్తరించామని ప్రభాకర్ రావు వివరించారు. దీంతో రాష్ట్రంలో ఎంత డిమాండ్ ఏర్పడుతుంది, సబ్ స్టేషన్లు, ట్రాన్స్ఫార్మర్ల వారీగా పడే అదనపు లోడ్ ఎంత తదితర విషయాలపై స్పష్టత వచ్చిందని తెలిపారు. ‘ఎక్కువ మంది రైతులు ఉదయం పూటనే పంపుసెట్లు వాడుతున్నారు. దీంతో ఆ సమయంలోనే లోడ్ ఎక్కువగా పడుతోంది. 24 గంటల్లో ఏ గంటకు ఎంత లోడ్ పడుతుందనే విషయంలో అవగాహన వచ్చింది. పంపుసెట్లు ఎక్కువున్న ప్రాంతాల్లో ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటాం’అని చెప్పారు. కొందరు రోజంతా పంపుసెట్లు నడుపుతున్నారని, దీంతో భూగర్భ జలాలు తగ్గి ఇబ్బంది కలుగుతుందని రైతులు అధికారుల దృష్టికి తెచ్చినట్లు పేర్కొన్నారు. ఆటో స్టార్టర్లు తొలగిస్తే ఈ సమస్య పరిష్కారమవుతుందని, రైతులు స్వచ్ఛందంగా సహకరిస్తేనే ఆటో స్టార్టర్ల సమస్య తొలగిపోతుందని తెలిపారు. ఆటోస్టార్టర్ల తొలగింపునకు స్పెషల్ డ్రైవ్ ఆటో స్టార్టర్ల తొలగింపునకు డిసెంబర్ 5 నుంచి స్పెషల్ డ్రైవ్ నిర్వహించనున్నట్లు ప్రభాకర్ రావు వెల్లడించారు. అధికారులు, ప్రజాప్రతినిధులు రైతులకు ఈ విషయంలో అవగాహన కల్పించాలని కోరారు. విద్యుత్ అధికారులు గ్రామాల్లో పర్యటించి ఆటోస్టార్టర్ల వల్ల భూగర్భ జలాలు అంతరించడం, ఇతర అనర్థాలను వివరించాలని కోరారు. -
హైటెన్షన్.. ఒంటి స్తంభంపై
హైదరాబాద్ మహా నగరంలో ఏటేటా విద్యుత్ డిమాండ్ పెరిగిపోతోంది. గతేడాది వేసవిలో గరిష్ట డిమాండ్ 2,800 మెగావాట్లకు చేరింది. ఏటా 250–300 మెగావాట్ల మేర డిమాండ్ పెరుగుతోంది. మరోవైపు నగరానికి 4,500 మెగావాట్ల విద్యుత్ను సరఫరా చేసే సామర్థ్యం మాత్రమే ఉంది. దీంతో భవిష్యత్తు అవసరాల కోసం హైటెన్షన్ విద్యుత్ టవర్లు ఏర్పాటు చేయాలి. కానీ వీటికి స్థలం ఎక్కువగా అవసరం. భూగర్భ విద్యుత్ కేబుల్స్ను ఏర్పాటు చేసేందుకు అవకాశమున్నా.. వ్యయం చాలా ఎక్కువ. భూగర్భంలో 400 కేవీ విద్యుత్ లైన్ వేసేందుకు ఒక్కో కిలోమీటర్కు రూ.45 కోట్ల మేర ఖర్చవుతుంది. ఈ నేపథ్యంలో ఒంటి స్తంభాల (మోనో పోల్స్)పై ఈహెచ్టీ (ఎక్స్ట్రా హైటెన్షన్) లైన్లు ఏర్పాటు చేయాలని రాష్ట్ర విద్యుత్ సరఫరా సంస్థ(ట్రాన్స్కో) నిర్ణయించింది. అయితే నాలుగు స్తంభాల టవర్లతో పోల్చితే మోనో పోల్స్తో వేసే లైన్ల నిర్మాణానికి 2.5 రెట్ల వరకు అధిక వ్యయం అవుతుంది. కానీ భూసేకరణ ఖర్చు బాగా తగ్గిపోయే నేపథ్యంలో మొత్తం ఖర్చు తగ్గుతుంది. – సాక్షి, హైదరాబాద్ ఐటీ కారిడార్లో స్థలం లభించక.. కేతిరెడ్డిపల్లి–రాయదుర్గ్ 400 కేవీ లైన్ ఏర్పాటు కోసం నార్సింగ్ చౌరస్తా వరకు సాంప్రదాయ పద్ధతిలో లాటిస్ టవర్ల ఏర్పాటుకు స్థలాల లభ్యత ఉంది. అక్కడి నుంచి రాయదుర్గ్ వరకు స్థలం సేకరించడం అత్యంత ఖర్చుతో కూడుకున్న పని. ఐటీ కారిడార్ పరిధిలో ఉన్న ఈ ప్రాంతంలో భూముల ధరలు చాలా ఎక్కువ. దీంతో నార్సింగ్ చౌరస్తా నుంచి రాయదుర్గ్ వరకు 15 కిలోమీటర్ల మేర భూగర్భంలో 400 కేవీ లైన్ వేయాలని ట్రాన్స్కో తొలుత భావించింది. కానీ భూగర్భ లైన్కు కిలోమీటర్కు రూ.45 కోట్ల మేర ఖర్చవుతుందని తేలడంతో పునరాలోచనలో పడింది. దీనికి తోడు భూగర్భంలో విద్యుత్ లైన్లు వేసేందుకు ఏకంగా 8 మీటర్ల వెడల్పున రహదారులను తవ్వి.. అనంతరం వాటిని పునర్నిర్మించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే మోనో పోల్స్తో లైన్ను ఏర్పాటు చేయాలని నిర్ణయానికి వచ్చింది. నాలుగు స్తంభాల టవర్లకు 10 నుంచి 13 చదరపు మీటర్ల స్థలం అవసరంకాగా.. మోనోపోల్కు కేవలం 1.5 నుంచి 3 చదరపు మీటర్ల స్థలం సరిపోతుంది. వ్యయం కూడా కిలోమీటర్ నిడివికి కేవలం రూ.3.5 కోట్ల వరకు మాత్రమే అవుతుందని తేల్చారు. కేతిరెడ్డిపల్లి–రాయదుర్గ్ వరకు 400 కేవీ లైన్ ఏర్పాటుకు మొత్తం రూ.1,600 కోట్ల వ్యయం కానుండగా.. అందులో నార్సింగ్ చౌరస్తా నుంచి రాయదుర్గ్ వరకు మోనోపోల్స్తో లైన్కు రూ.600 కోట్ల వరకు ఖర్చవుతుందని ట్రాన్స్కో అంచనా వేసింది. భూగర్భలైన్లకు బదులుగా మోనోపోల్స్తో 400 కేవీ లైన్ నిర్మిస్తే.. రూ.500 కోట్లు ఆదా అవుతున్నాయని ట్రాన్స్కో డైరెక్టర్ (ట్రాన్స్మిషన్) టి.జగత్రెడ్డి తెలిపారు. ఒకే భారీ స్తంభం ఆధారంగా.. రాష్ట్రంలో ఇప్పటివరకు నిర్మించిన 132 కేవీ, 220 కేవీ, 400 కేవీ, 765 కేవీ ఈహెచ్టీ విద్యుత్ లైన్లన్నింటినీ.. లాటిస్ (చతురస్త్రాకారంలో ఉండే నాలుగు స్తంభాల అల్లిక) టవర్లపై ఏర్పాటు చేశారు. కానీ తొలిసారిగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మోనో పోల్స్తో రెండు ఈహెచ్టీ లైన్లు ఏర్పాటు కాబోతున్నాయి. కేతిరెడ్డిపల్లి నుంచి రాయదుర్గ్ వరకు 45 కిలోమీటర్ల పొడవున 400 కేవీ సామర్థ్యంతో.. నర్సాపూర్ నుంచి భౌరంపేట్ వరకు 220 కేవీ సామర్థ్యంతో లైన్ల ఏర్పాటుకు ట్రాన్స్కో చర్యలు తీసుకుంటోంది. ఈ రెండు లైన్లలో స్థల సేకరణ సమస్యలున్న చోట మోనో పోల్స్తో నిర్మించాలని నిర్ణయించింది. భౌరంపేట లైన్లోనూ.. మెదక్ జిల్లా నర్సాపూర్ నుంచి మేడ్చల్ జిల్లా భౌరంపేట వరకు 220 కేవీ లైన్ను ట్రాన్స్కో నిర్మించనుంది. అయితే ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలో ఆరు కిలోమీటర్ల మేర భూసేకరణ సమస్యగా మారింది. తొలుత భూగర్భంలో లైన్లు వేయాలని భావించగా.. ఈ 6 కిలోమీటర్లకు రూ.85 కోట్ల మేర వ్యయమవుతుందని తేలింది. దీంతో పునరాలోచన చేసిన ట్రాన్స్కో.. కిలోమీటర్ వరకు భూగర్భంలో లైన్ వేసి, మిగతా 5 కిలోమీటర్ల మేర మోనోపోల్స్తో ఏర్పాటుకు అవకాశమున్నట్లు గుర్తించింది. మొత్తంగా రూ.38 కోట్లు వ్యయమవుతుందని అంచనా వేసింది. గ్రామీణ ప్రాంతాల్లో వేస్తే..? గ్రామీణ ప్రాంతాల్లోని పంట పొలాల మీదుగా నాలుగు స్తంభాల టవర్లతో కూడిన లైన్లు వేస్తుండడంపై రైతుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఒక్కో టవర్ నిర్మాణానికి 10–15 చదరపు మీటర్ల స్థలం పోతుండగా.. రైతులకు తగిన పరిహారం అందడం లేదన్న ఆరోపణలున్నాయి. దాంతో గ్రామీణ ప్రాంతాల్లోనూ మోనో పోల్స్తో లైన్లు వేయాలన్న అభిప్రాయం వ్యక్తమైంది. కానీ నాలుగు స్తంభాల టవర్లతో పోల్చితే మోనోపోల్స్తో లైన్ల నిర్మాణానికి 2.5 రెట్ల వరకు అధిక వ్యయం కావడం, గ్రామీణ ప్రాంతాల్లో స్థలానికి పెద్దగా ఖర్చు ఉండకపోవడం నేపథ్యంలో.. ఈ అంశాన్ని పరిశీలించడం లేదని ట్రాన్స్కో వర్గాలు తెలిపాయి. -
విజి‘లెన్స్’కు అవినీతి మరకలు
సాక్షి, హైదరాబాద్ : అక్రమాలపై నిఘా పెట్టి ప్రభుత్వ ఆస్తులు కాపాడాల్సిన విజిలెన్స్ వ్యవస్థే చేను మేస్తోంది! జీహెచ్ఎంసీ, వాటర్ బోర్డు, ట్రాన్స్కో, హెచ్ఎండీఏ, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్లోని విజిలెన్స్ అధికా రులు, వారి పనితీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏకంగా ‘బాబోయ్.. మాకొద్దు ఈ అధికారులు’ అంటూ పోలీస్ పెద్దలకు ఫిర్యాదులపై ఫిర్యాదులు అందుతున్నాయి. ఈ విభా గాల్లోని విజిలెన్స్ వ్యవస్థలో కేవలం పోలీస్ అధికారులే విధులు నిర్వర్తిస్తున్నారు. వీటి ల్లో పనిచేసేందుకు చాలా పోటీ, డిమాండ్ ఉండటంతో అదనపు ఎస్పీలు, డీఎస్పీలు, ఇన్స్పెక్టర్లు, ఎస్సైలు, కానిస్టేబుళ్లు డిప్యూ టేషన్పై బదిలీ చేయించుకొని మరీ వెళ్తుంటారు. ఇటీవలే హెచ్ఎండీఏలోని ఎన్ఫోర్స్మెంట్లో ఉన్న ఓ పోలీస్ అధికారి చేసిన అవినీతి వెలుగులోకి రావడంతో అన్ని విభాగాల్లో ఉన్న విజిలెన్స్ అధికారులపై నిఘా వర్గాలు దృష్టి సారించినట్టు తెలుస్తోంది. కరెంట్ విజిలెన్స్ మస్తు ట్రాన్స్కో విభాగంలోనూ విజిలెన్స్ వింగ్ ఉంది. ఈ విభాగానికి డిప్యుటేషన్పై వెళ్లడం అంత సులభం కాదు. కొందరికే ఈ అవకాశం వస్తుంది. పోలీస్ ఉద్యోగం వదిలి ట్రాన్స్కోలో విజిలెన్స్ అధికారులు, సిబ్బంది వెళ్లడంపై ఎప్పటినుంచో చర్చ జరుగుతోంది. ఏఈలు, డీఈలు, కింది స్థాయి సిబ్బందిపై వచ్చే అక్రమాల ఫిర్యాదుపై విచారణ జరిపి నివేదిక తయారు చేయా ల్సిన విజిలెన్స్ అధికారులు వారితోనే కుమ్మౖMð్క నివేదికలు మార్చిన ఘటనలు న్నాయని ట్రాన్స్కో ఉన్నతాధికారులు చెబుతున్నారు. విద్యుత్ చౌర్యానికి సంబంధించి వచ్చే ఫిర్యాదులనూ విజిలెన్స్ అధికారులు క్యాష్ చేసుకుంటున్నట్టు ఆరోపణలున్నాయి. జీహెచ్ఎంసీలోని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్లోనూ ఇలాంటి వ్యవహారాలే బయటపడటంతో అక్కడ ఉన్నతాధికారులు ఇటీవలే పలువురిని పోలీస్ శాఖకు సరెండర్ చేశారు. వ్యాపారులు గగ్గోలు జీఎస్టీ వచ్చాక విజిలెన్స్ అధికారుల నుంచి తమకు వేధింపులు ఎక్కువ య్యాయని వ్యాపారులు కూడా ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ముఖ్యంగా రైస్మిల్లర్లు, ఇతరత్రా మధ్య తరహా వ్యాపారులు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారు లపై మంత్రులకు ఫిర్యాదు చేశారు. అక్రమ రవాణా, జీరో దందా, ట్యాక్స్ చెల్లించకుండా జరిగే వ్యాపారాలు తదితర వ్యవహారాలపై దృష్టి సారించాల్సిన అధికారులు ఇష్టారాజ్యంగా కమీషన్లు దండుకుంటున్నట్టు సమాచారం. విజిలెన్స్ ఎత్తేయండి రాష్ట్రంలోని ప్రధాన విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్తోపాటు వివిధ విభాగాల్లోని విజిలెన్స్ వ్యవస్థను ఎత్తివేయాలని హోంశాఖ గతంలోనే రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదన పెట్టింది. అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) కిందే ప్రధాన విజిలెన్స్ వ్యవస్థ పనిచేసేలా రూపకల్పన చేయాలని సూచించింది. విజిలెన్స్ వ్యవస్థకు బదులు సంబంధిత శాఖల్లోనే అంతర్గత విభాగాలు రూపొందించుకొని అక్కడి అధికారులనే నియమించుకుంటే బాగుంటుందన్న ఆలోచనను కూడా ఉన్నతాధికారులు ప్రభుత్వానికి సూచించినట్టు తెలుస్తోంది. కాసులు కురిపించే అక్రమ కట్టడాలు హెచ్ఎండీఏలోని విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్లో పనిచేసిన ఓ పోలీస్ అధికారిపై అక్కడి ఉన్నతాధికారులు పోలీస్ అధికారులకు ఓ లేఖ రాశారు. ఎన్ఫోర్స్మెంట్ను అడ్డంపెట్టుకొని అతడు భారీ స్థాయిలో అక్రమాలకు పాల్పడ్డట్టు అందులో పేర్కొన్నారు. ఇలాంటి అధికారితో తమ అధికారులు, సిబ్బంది కూడా అక్రమార్జనలో ఆరితేరిపోతున్నారని, అతడిని వెంటనే సరెండర్ చేస్తున్నామని లేఖలో స్పష్టంచేశారు. ఈ అధికారికి ముందు పనిచేసిన మరో డీఎస్పీ ఏకంగా సస్పెన్షన్కు గురికావడం చూస్తే ఏ స్థాయిలో వసూళ్లకు పాల్పడ్డారో అర్థమవుతోంది. ఈ ఎన్ఫోర్స్మెంట్ విభాగం అధికారులు.. అక్రమ కట్టడాలు నిర్మించిన వారి నుంచి భారీ స్థాయిలో వసూళ్లు చేసి ప్లానింగ్ విభాగాల్లోని అధికారులతో కుమ్మక్కయ్యారని లేఖలో వివరించారు. హెచ్ఎండీఏ పరిధిలోని ప్రభుత్వ భూములు, చెరువులు, కుంటలు వాటి రక్షణకు తీసుకోవాల్సిన చర్యల కన్నా సొంత ఆదాయం పెంచుకోవడంపైనే వీరు దృష్టి పెట్టినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాసులు కురిపించే నీళ్లు వాటర్బోర్డులో విజిలెన్స్ విభాగం పోస్టింగ్ అంటే చాలు.. లకరాలు పలికినట్టే అన్న మాట పోలీస్ శాఖలో వినిపిస్తోంది. అక్రమ నీటి కనెక్షన్లు, వాటర్ ట్యాంకర్ల అక్రమాలు, నల్లా కనెక్షన్లకు మోటార్ల బిగింపు.. తదితర వ్యవహారాలు పర్యవేక్షించాల్సిన విజి లెన్స్ అధికారులు వీటిని అడ్డం పెట్టుకొని భారీగానే దండుకుంటున్నట్టు ఆరోప ణలు వినిపిస్తున్నాయి. ఇంతటితో ఆగని కొంత మంది పోలీస్ అధికారులు ఏకంగా వాటర్బోర్డు ఆధ్వర్యంలో ఓ పోలీస్స్టేషన్ పెట్టి దందా నడిపించేందుకు సిద్ధమవడం ఉన్నతాధికారులనే కంగు తినిపించింది. ఇలాంటివేవీ ఇక్కడ చేయాల్సిన అవసరం లేదని ఉన్నతా ధికారులు పోలీస్ శాఖకు రాసిన లేఖలు తెగేసి చెప్పినట్టు సమాచారం. -
రూ.1,000 కోట్ల భారీ విద్యుత్తు కుంభకోణం
-
ఇల్లే జెన్కో.. ఇల్లే ట్రాన్స్కో
ఎక్కడో కరెంటు ఉత్పత్తి అవుతుంది. అక్కడినుండి తీగల వెంబడి కిలోమీటర్ల దూరం ప్రయాణించి వస్తే మనం వాడుకుంటాం. ఇలా విద్యుత్ సరఫరా అవుతుంది. కానీ ఫొటోల్లో కనిపిస్తున్న ఇళ్లున్నాయి చూశారా.. ఇవి చాలా స్పెషల్. ఎందుకంటే వీటిల్లో ఒకొక్కటీ ఓ విద్యుత్తు జనరేటర్! అర్థం కాలేదా? బ్రిటన్లోని వేల్స్ ప్రాంతంలో పదహారు ఇళ్లతో కూడిన ఓ కాంప్లెక్స్ను కడుతున్నారు. సింగిల్బెడ్ రూమ్లతోపాటు టూ, త్రీ బెడ్రూమ్ ఇళ్లు కూడా ఉన్నాయి దీంట్లో. ప్రతి ఇంట్లో సోలార్ ప్యానల్స్ ఏర్పాటు చేయడం మాత్రమే ఈ కాంప్లెక్స్ తాలూకూ విశేషం కాదు. విద్యుత్ అవసరాలన్నింటినీ అక్కడికక్కడే తీర్చేసేలా అన్ని రకాల టెక్నాలజీలనూ వాడారు. దాంతోపాటే విద్యుత్తును వీలైనంత ఆదా చేసే సాంకేతిక పరిజ్ఞానమూ ఉందిక్కడ. పైగా అంతా ఉచితం. ‘బిల్డింగ్స్ యాస్ పవర్స్టేషన్స్’ పేరుతో స్వాన్సీ విశ్వవిద్యాలయ విభాగం స్పెసిఫిక్ చేపట్టిన ప్రాజెక్టు ఇది. ఇందులోని పైకప్పులు, గోడలపైన సోలార్ ప్యానల్స్ ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్తును బ్యాటరీల్లో నిక్షిప్తం చేయడం.. దీపాలు, ఇంట్లోని ఎలక్ట్రిక్ పరికరాల కోసం వాటిని వాడటం మామూలే. మిగిలిపోయిన విద్యుత్తును కామన్ బ్యాటరీల్లోకి చేర్చి విద్యుత్తు వాహనాలను చార్జ్ చేసేందుకు వాడతారు. దీంతోపాటు ఇంటి భాగాలు కొన్నింటిని ఉక్కు పలకలతో కప్పేస్తారు. సూర్యుడి తీక్షణ కాంతికి వేడెక్కే పలకల వెనుకభాగంలోని గాలిని ఇంటిని వెచ్చబెట్టుకునేందుకు వాడతారు. ఈ ఏర్పాట్లు అన్నింటి వల్ల దాదాపు 15 శాతం వరకూ ఉన్న విద్యుత్తు పంపిణీ నష్టాలను గణనీయంగా తగ్గించవచ్చునని, పెద్దస్థాయిలో అమలు చేస్తే కొత్తగా విద్యుత్తు ప్లాంట్లు కట్టాల్సిన అవసరమూ ఉండదని అంటున్నారు స్పెసిఫిక్ సీఈవో కెవిన్ బైగేట్. వేల్స్ ప్రాంతంలోని ఈ పైలట్ ప్రాజెక్టు తరువాత 1,200 ఇళ్లతో ఇంకో పెద్ద ప్రాజెక్టు చేపడతామని బైగేట్ అంటున్నారు. ప్రస్తుతానికి ఈ ఇళ్ల నిర్మాణనికయ్యే ఖర్చు పది నుంచి 20 శాతం ఎక్కువగా ఉన్నప్పటికీ విద్యుత్తు బిల్లుల ఆదా ద్వారా అదనపు వ్యయాన్ని తొందరగానే భర్తీ చేసుకోవచ్చునట. బ్రిటన్లోని సంప్రదాయ విద్యుత్తు వ్యవస్థపై ఉన్న డిమాండ్ను మూడు గిగావాట్ల వరకూ తగ్గిస్తే ఏడాదికి 1,100 కోట్ల పౌండ్లు ఆదా చేయవచ్చునని ఆయన అంచనా. – సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
సబ్స్టేషన్ నిర్మాణాల వేగం పెంచండి
ట్రాన్స్కో, జెన్కో అధికారులకు హరీశ్ రావు ఆదేశం సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులో సబ్స్టేషన్ల నిర్మాణాల పనులను వేగవంతం చేయాలని నీటి పారుదల శాఖా మంత్రి టి.హరీశ్రావు విద్యుత్ శాఖ అధికారులను కోరారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం షెడ్యూల్ కన్నా ముందే పూర్తి చేసేందుకు విద్యుత్ సంస్థల సహకారం, తోడ్పాటు అవసరమన్నారు. ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ బ్యారేజీల పరిధిలోని సబ్స్టేషన్లు, విద్యుత్ టవర్లు, హెచ్టీ విద్యుత్ లైన్ల నిర్మాణానికి సంబంధించి తొలిసారి మంత్రి హరీశ్రావు ట్రాన్స్ కో, జెన్ కో, నీటి పారుదల శాఖ అధికారులతో సమన్వయ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ ప్రాజెక్టులో భాగంగా చేపట్టిన విద్యుత్ సంబంధిత పనులను ప్యాకేజీల వారీగా సమీక్షించారు. 2018 మార్చి లోగా 10 సబ్ స్టేషన్లు పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. ఇకపై ప్రతి నెలా మొదటి మంగళవారం ఆయా పనుల పురోగతిపై సమీక్షా సమావేశం ఉంటుందన్నారు. ఈ సమీక్షకు ఈఎన్సీ మురళీధర్, ట్రాన్స్కో డైరెక్టర్ సూర్యప్రకాశ్, జెన్కో డైరెక్టర్ వెంకటరాజం, ఎత్తిపోతల పథకాల ప్రభుత్వ సలహాదారు పెంటారెడ్డి, సీఈలు నల్లా వెంకటేశ్వర్లు, హరిరామ్, ఓఎస్డీ దేశ్పాండేలు పాల్గొన్నారు. -
‘విద్యుత్’ బదిలీలపై సందిగ్థం
మూడు జాబితాలు సిద్ధం చేసిన ఏపీఈపీడీసీఎల్ ఏ జాబితా ప్రకారం బదిలీ చేస్తారో తెలియక ఉద్యోగుల్లో అయోమయం రెండు పంపిణీ సంస్థలకు ఒకేలా మార్గదర్శకాలు ఒకే జాబితా తయారు చేసిన ఏపీఎస్పీడీసీఎల్ బదిలీలకు నేటితో ముగియనున్న గడువు సాక్షి, రాజమహేంద్రవరం: ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీఈపీడీసీఎల్) బదిలీలపై ఉద్యోగులు, క్షేత్రస్థాయి సిబ్బందికి సందిగ్థత నెలకొంది. శనివారంతో బదిలీల గడువు ముగుస్తున్నా ఏ ప్రాతిపదికన బదిలీలు చేస్తారన్న దానిపై ఇప్పటికీ ఉద్యోగులు ఓ అవగాహనకు రాలేకపోతున్నారు. రాష్ట్రంలో దక్షిణ, తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థల ద్వారా గృహ, వాణిజ్య, పారిశ్రామిక అవసరాలకు విద్యుత్ సరఫరా జరుగుతోంది. విశాఖ కేంద్రంగా ఉత్తరాంధ్ర, ఉభయగోదారి జిల్లాకు ఏపీఈపీడీసీఎల్, తిరుపతి కేంద్రంగా ఏపీఎస్పీడీసీఎల్ కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరుతోపాటు రాయలసీమ జిల్లాకు విద్యుత్ సరఫరా చేస్తున్నాయి. గత నెల 17వ తేదీన విద్యుత్ పంపిణీ సంస్థల్లోని ఉద్యోగుల బదిలీ ప్రక్రియ చేపట్టి ఈ నెల 15వ తేదీకి పూర్తి చేయాలని ట్రాన్స్కో ఆఫీస్ ఆర్డర్(టి.ఓ.ఓ) జారీ అయింది. అప్పుడే మార్గదర్శకాలు కూడా జారీ చేశారు. వీటి ప్రకారం ఒక స్టేషన్లో ఐదేళ్లపాటు ఉన్న వారు, ఒక పోస్టులో మూడేళ్లపాటు కొనసాగిన కార్యాలయ ఉద్యోగులు, క్షేత్రస్థాయి సిబ్బందిని బదిలీ చేయాలి. అదే సమయంలో మొత్తం ఉద్యోగుల్లో 20 శాతం ఉద్యోగులను మాత్రమే బదిలీ చేయాలి. అందులోనూ ఉద్యోగ, కార్మిక సంఘాల నేతలకు బదిలీల నుంచి మినహాయింపు ఉంటుంది. ఫలితంగా దాదాపు 16 శాతం ఉద్యోగులు మాత్రమే బదిలీ అయ్యే అవకాశం ఉంటుంది. . మూడు జాబితాలు సిద్ధ చేసిన ఏపీఈపీడీసీఎల్... రెండు పంపిణీ సంస్థల మధ్య మార్గదర్శకాల్లో వ్యత్యాసం, ఇతర కారణాల వల్ల సకాలంలో బదిలీ ప్రక్రియ పూర్తి కాలేదు. దీంతో ఈ నెల 19వ తేదీన మరోసారి టీఓఓ జారీ చేశారు. ఈనెల 24వ తేదీకి బదిలీలు పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు. అప్పటికే అర్హులైన ఉద్యోగులు సంస్థ వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకున్నారు. మూడు ఆప్షన్లు ఇచ్చారు. ఉద్యోగుల ఆప్షన్లను పరిగణనలోకి తీసుకుంటూ సాధ్యాసాధ్యాలు, అవసరాలను దృష్టిలో ఉంచుకుంటూ డివిజన్లు, సర్కిల్ పరిధిలో డీఈలు, ఎస్ఈలు ఉద్యోగులను బదిలీ చేయనున్నారు. అయితే రెండు సంస్థలకు ఒకే మార్గదర్శకాలు జారీ అయినా ఏపీఎస్పీడీసీఎల్, ఏపీఈపీడీసీఎల్లు ఉద్యోగుల బదిలీలకు సంబంధించిన సీనియారిటీ లిస్టులు సిద్ధం చేసిన వైనం భిన్నంగా ఉంది. ఏపీఈపీడీసీఎల్ స్టేషన్, పోస్టు సర్వీసు ఆధారంగా ఒకే లిస్టు తయారులు చేయగా ఏపీఈపీడీసీఎల్ స్టేషన్ పరిధి మేరకు ఒకటి, పోస్టులో సర్వీసు ఆధారంగా ఒకటి, స్టేషన్ పరిధి, పోస్టు సర్వీసు ఆధారంగా మరొకటి వెరసి మొత్తం మూడు లిస్టులు తయారు చేసింది. దీంతో ఏ లిస్టు ప్రాతిపాదికగా బదిలీలు చేస్తారన్న సందిగ్థం ఉద్యోగుల్లో నెలకొని ఉంది. . ఒక లిస్టులో ఉన్న ఉద్యోగి మరో లిస్టులో మాయం... రాజమహేంద్రవరం సర్కిల్లో దాదాపు 2 వేల పోస్టులున్నాయి. ఇందులో దాదాపు 1600 మంది ఉద్యోగులు, సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారు. మరో 400 పోస్టులు భర్తీ చేయాల్సి ఉంది. ఒక స్టేషన్లో అన్ని క్యాడర్లలో ఐదేళ్లకు మించి, ఒకే పోస్టులో మూడేళ్లకు మించి ఉన్న ఉద్యోగులందరూ ఒకటో లిస్టు, ఒకే పోస్టులో మూడేళ్లకు మించి పని చేస్తున్న వారు రెండో లిస్టు, ఒకే స్టేషన్లో అన్ని క్యాడర్లలో ఐదేళ్లకు మించి ఉన్న వారందరూ మూడో లిస్టు ఏపీఈపీడీసీఎల్ తయారు చేసింది. అయితే ఒక లిస్టులో ఉన్న ఉద్యోగి మరో రెండు లిస్టుల్లో లేకపోవడంతో బదిలీ ఏ జాబితా ప్రకారం చేస్తారన్నదానిపై ప్రస్తుతం ఉత్కంఠ నెలకొంది. ఉదహరణకు ఏపీఈపీడీసీఎల్ పరిధిలోని రాజమహేంద్రవరం సర్కిల్ (తూర్పు గోదావరి జిల్లా మొత్తం)లోని ఓ విభాగంలో పని చేసే ఓ సీనియర్ ఉద్యోగి అన్ని క్యాడర్లలో కలిపి ఒకే స్టేషన్ (రాజమహేంద్రవరం)లో 20 ఏళ్లుగా పని చేస్తున్నారు. అయితే ఈ ఉద్యోగి పేరు స్టేషన్లో ఐదేళ్లు, పోస్టులో మూడేళ్ల సీనియారిటీ ప్రాతిపదికన తయారు చేసిన ఒకటో లిస్టులో లేదు. అదేవిధంగా ఒకే పోస్టులో మూడేళ్లకు మించి ఉన్న ఉద్యోగులను ప్రాతిపదికగా తయారు చేసిన రెండో లిస్టులోనూ ఆ ఉద్యోగి పేరు లేదు. కానీ ఆ విభాగంలో మిగతావారి కన్నా ఆ ఉద్యోగి ఒకే స్టేషన్లో వివిధ క్యాడర్లలలో 20 ఏళ్లుగా పని చేస్తున్నారు. కానీ ఒకటి, రెండు జాబితాల్లో ఆ ఉద్యోగి పేరులేదు. మూడో జాబితాలో ఉంది. ఇప్పుడు ఏ జాబితా ప్రాతిపదికగా ఉద్యోగుల బదిలీ చేస్తారన్నది తెలియాల్సి ఉంది. ఒకటో జాబితా ప్రాతిపదికగా చేస్తే ఒకే స్టేషన్లో 20 ఏళ్లు నుంచి ఉంటున్న ఆ ఉద్యోగి అక్కడే ఉంటారు. ఫలితంగా అతని కన్నా జూనియర్ బదిలీ అవుతారు. మూడు లిస్టులు రూపాందించిన ఏపీఈపీడీసీఎల్ దేని ప్రకారం ఉద్యోగులను బదిలీలు చేస్తారోనన్న ఆందోళనతో ఉన్నారు. సాధ్యాసాధ్యాల ఆధారంగా బదిలీ చేస్తాం... ఉద్యోగులు ఇచ్చిన మూడు ఆప్షన్లను పరిగణలోకి తీసుకున్నా సాధ్యాసాధ్యాలు, అవసరాల ప్రకారం బదిలీలు చేస్తాం. సాంకేతిక పరిజ్ఞానం, క్షేత్రస్థాయి పనులతో కూడిన విధులు కాబట్టి పెట్టిన ఆప్షన్లు రాకపోవచ్చు. సీనియారిటీని పరిగణనలోకి తీసుకుంటాం. శనివారంతో బదిలీల ప్రక్రియ పూర్తి చేస్తాం. – వైఎస్ఎన్ ప్రసాద్, సూపరింటెండెంట్ ఇంజినీరు, ఏపీఈపీడీసీఎల్, రాజమహేంద్రవరం సర్కిల్ -
ఈపీఎఫ్ లేకుంటే అనర్హులే!
- విద్యుత్ ఔట్సోర్సింగ్ ఉద్యోగుల క్రమబద్ధీకరణకు నిబంధనలు - మార్గదర్శకాలను ఆమోదించిన విద్యుత్ సంస్థల బోర్డులు - ఈపీఎఫ్ నిబంధనతో అన్యాయం జరుగుతుందంటున్న కార్మిక సంఘాలు సాక్షి, హైదరాబాద్: విద్యుత్ శాఖ ఔట్సోర్సిం గ్ కార్మికులకు ఈపీఎఫ్ లేకుంటే క్రమబద్ధీకరణకు అనర్హులు కానున్నారు. అంతేగాకుండా జీవిత భాగస్వామి ఆంధ్రప్రదేశ్ లేదా ఇతర ప్రాంతాలకు చెందినవారైతే కూడా క్రమబద్ధీకరణ అవకాశం కోల్పోనున్నారు. ఈ మేరకు విద్యుత్ సంస్థలు ఔట్సోర్సింగ్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ విధివిధానాలు, మార్గదర్శకా లను ఆమోదించాయి. ఈ దరఖాస్తుల పరిశీ లన కోసం కమిటీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించాయి. రాష్ట్ర అవతరణ దినోత్సవ మైన జూన్ 2న ఔట్సోర్సింగ్ ఉద్యోగులను విలీనం చేసుకుంటూ ఉత్తర్వులు జారీ చేయా లని భావించినా.. దరఖాస్తుల పరిశీలనతో మరింత జాప్యం జరగనుంది. ఒక్కో సంస్థలో రెండు కమిటీలు తెలంగాణ రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ (ట్రాన్స్కో), విద్యుదుత్పత్తి సంస్థ (జెన్కో), దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ఎస్పీడీసీఎల్), ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ఎన్పీడీ సీఎల్)లు మంగళవారం బోర్డు సమావేశాలు నిర్వహించి క్రమబద్ధీకరణ ఉమ్మడి మార్గద ర్శకాలను ఆమోదించాయి. క్రమబద్ధీకరణ కోసం రాష్ట్రవ్యాప్తంగా 23,667 మంది విద్యుత్ ఔట్సోర్సింగ్ ఉద్యోగుల నుంచి దరఖాస్తులు వచ్చాయని... వారిలో అర్హులను గుర్తించేం దుకు ప్రతి విద్యుత్ సంస్థలో రెండు కమిటీల ను వేయాలని నిర్ణయించారు. ఒక్కో కమిటీ లో ఐదుగురేసి అధికారులు ఉంటారు. వారికి మినహాయింపు.. మార్గదర్శకాల ప్రకారం.. ఉద్యోగుల భవిష్య నిధి (ఈపీఎఫ్) ఖాతా ఉన్న విద్యుత్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులే రెగ్యులర్ ఉద్యోగులుగా విలీనానికి (అబ్జార్ప్షన్) అర్హులు కానున్నారు. అయితే 2016 డిసెంబర్ 4వ తేదీ నాటికి విద్యుత్ సంస్థల యాజమాన్యాల ప్రత్యేక ఉత్తర్వుల ద్వారా నియమితులైన ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు మాత్రం దీని నుంచి మినహాయింపు ఉంటుంది. గతంలో విద్యుత్ సంస్థలు ప్రముఖుల సిఫారసుల ఆధారంగా చాలా మందిని నేరుగా కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులుగా నియమిస్తూ ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేశాయి. అలాంటివారు ఈపీఎఫ్ లేకున్నా క్రమబద్ధీకరణకు అర్హులవుతారు. ఇక ఈపీఎఫ్ ఉన్నా ప్రస్తుతం పనిచేయనివారు క్రమబద్ధీకరణకు అనర్హులు. కాగా.. విద్యుత్ సంస్థల యజమాన్యాలు ఈపీఎఫ్ సదుపాయం కల్పించకపోవడంతో మీటర్ రీడర్లు, బిల్ కలెక్టర్లు, రెవెన్యూ క్యాషియర్లు, ట్రాన్స్ఫార్మర్ రిపేర్ వర్కర్లు తదితర కేటగిరీల ఉద్యోగులు క్రమబద్ధీకరణకు అనర్హులవుతారని విద్యుత్ కార్మిక సంఘాలు పేర్కొంటున్నాయి. మూడు కేటగిరీలుగా విభజన విద్యార్హతల ఆధారంగా ఔట్సోర్సింగ్ ఉద్యోగులను మూడు కేటగిరీలుగా విభజించారు. ఇంజనీరింగ్, డిప్లొమా ఇంజనీరింగ్, డిగ్రీ + కంప్యూటర్ అప్లికేషన్స్ అర్హతలున్న వారిని అత్యున్నత నైపుణ్యం గల ఉద్యోగులుగా పరిగణిస్తారు. పదో తరగతితో పాటు ఐటీఐ చేసినవారు, డ్రైవింగ్ లైసెన్స్ కలిగి తెలుగు/ఉర్దూలో రాయడం, చదవడం తెలిసిన వారిని నైపుణ్యం గల ఉద్యోగులుగా... ఎలాంటి విద్యార్హతలు లేనివారిని నైపుణ్యం లేని ఉద్యోగులుగా పరిగణిస్తారు. ప్రస్తుతం ఎలాంటి విద్యార్హతలు లేని 2,172 మంది ఔట్సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నట్లు గుర్తించారు. మరిన్ని మార్గదర్శకాలివీ.. ► 18 ఏళ్ల నుంచి 58 ఏళ్లలోపు వయసున్న వారిని క్రమబద్ధీకరిస్తారు. ►తెలంగాణ స్థానికత కలిగి ఇతర రాష్ట్రాల్లో చదవినా అర్హులే. తహసీల్దార్ జారీ చేసిన స్థానికత ధ్రువీకరణ పత్రం ఉంటే స్థానికులుగా పరిగణించనున్నారు. ► జీవిత భాగస్వామి ఏపీ లేదా ఇతర ప్రాంతాలకు చెందిన వారైతే సదరు ఔట్సోర్సింగ్ ఉద్యోగులు క్రమబద్ధీకరణకు అనర్హులవుతారు. ► భూములు కోల్పోయి సబ్స్టేషన్లలో ఔట్సోర్సింగ్ ఉద్యోగులుగా పనిచేస్తున్న వారికి అవకాశం ఉండదు. విద్యార్హతలు లేని వారికీ అవకాశం ఎలాంటి విద్యార్హతలు లేని వారిని వాచ్మన్ లాంటి కాంటింజెన్సీ పోస్టుల్లో భర్తీ చేస్తాం. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ కానుకగా జూన్ 2న ఉద్యోగులను విలీనం చేసుకుంటూ ఉత్తర్వులు జారీ చేయాలని ముందు భావించాం. కానీ ఆలస్యమవు తోంది. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులర్ ఉద్యోగులుగా విలీనం చేసుకు న్నా.. వారికి వెంటనే జీతభత్యాలు పెరగవు. అప్పటినుంచి వారికి లభించా ల్సిన ఇంక్రిమెంట్లు, ఇతర సదుపాయాలు లభిస్తాయి. – ట్రాన్స్కో సీఎండీ డి.ప్రభాకర్రావు -
23,667 మంది విలీనం
► విద్యుత్ ఔట్ సోర్సింగ్ సిబ్బంది విలీనానికి మార్గదర్శకాలు సిద్ధం ► నేడు జరగనున్న ట్రాన్స్కో, జెన్కో, డిస్కంల బోర్డు సమావేశాల్లో ఆమోదం ► రాష్ట్రావిర్భావ దినోత్సవ కానుకగా జూన్ 2న ఉత్తర్వులు ► కటాఫ్ తేదీ 2016 డిసెంబర్ 4.. 23,667 మంది అర్హులు సాక్షి, హైదరాబాద్: విద్యుత్ ఔట్ సోర్సింగ్ కార్మికులకు శుభవార్త! రాష్ట్రంలోని విద్యుత్ ఔట్ సోర్సింగ్ కార్మికులను రెగ్యులర్ ఉద్యోగులుగా విలీనం (అబ్జార‡్ష్పన్) చేసుకోవడానికి విద్యుత్ సంస్థల యాజమాన్యాలు సిద్ధమయ్యాయి. జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం కానుకగా 23,667 మంది ఔట్ సోర్సింగ్ కార్మికులను ఒకేసారి విలీనం చేసుకోవడానికి ఉత్తర్వుల జారీ కోసం ఏర్పాట్లు చేస్తున్నాయి. విలీన ప్రక్రియ విధివిధానాలు, మార్గదర్శకాలకు తెలంగాణ ట్రాన్స్కో యాజమాన్యాలు సోమవారం తుది మెరుగులు దిద్దాయి. రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ (ట్రాన్స్కో), రాష్ట్ర విద్యుదుత్పత్తి సంస్థ (జెన్కో), దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ఎస్పీడీసీఎల్), ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ఎన్పీడీసీఎల్) యాజమాన్యాలు మంగళవారం బోర్డు సమావేశాలు నిర్వహించి మార్గదర్శకాలను ఆమోదించనున్నాయి. విద్యుత్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించిన 2016 డిసెంబర్ 4ను విలీనానికి కటాఫ్ తేదీగా నిర్ణయించిన విద్యుత్ సంస్థలు.. ఆ తేదీనాటికి విద్యుత్ సంస్థల్లో వివిధ హోదాల్లో పని చేస్తున్న 23,667 మందిని విలీనం చేసుకోనున్నాయి. మంగళవారం జరిగే బోర్డు సమావేశంలో ఈ అంశాలపై నిర్ణయం తీసుకుంటామని తెలంగాణ ట్రాన్స్కో అధికారులు తెలిపారు. విలీనం తర్వాత రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా జీతభత్యాలు, పదోన్నతులు, ఇతర ప్రయోజనాలు లభిస్తాయని పేర్కొన్నారు. ట్రాన్స్కోలో 4,577 మంది.. జెన్కోలో 4,394 మంది.. సీఎం కేసీఆర్ ప్రకటన తర్వాత రాష్ట్రంలోని విద్యుత్ ఔట్సోర్సింగ్ ఉద్యోగుల బయోడేటాలను విద్యుత్ సంస్థలు స్వీకరించాయి. ట్రాన్స్కోలో 4,577 మంది, జెన్కోలో 4,394 మంది, టీఎస్ఎస్పీడీసీఎల్లో 10,268 మంది, టీఎస్ఎన్పీడీసీఎల్లో 4,428 మంది సహా మొత్తం 23,667 మంది ఔట్సోర్సింగ్ విద్యుత్ కార్మికులు పనిచేస్తున్నారని సంస్థలు తేల్చాయి. విద్యార్హతల ఆధారంగా ఒకేసారి వీరిని విలీనం చేసుకునే అంశంపై మంగళవారం జరిగే బోర్డు సమావేశాల్లో నిర్ణయం తీసుకోనున్నారు. ఎలాంటి విద్యార్హతలు లేని 2,172 మంది విషయంలోనూ సానుకూలంగా స్పందించాలని సంస్థలు భావిస్తున్నాయని అధికారులు తెలిపారు. న్యాయ చిక్కులను అధిగమించేందుకే.. విద్యుత్ ఔట్సోర్సింగ్ ఉద్యోగుల క్రమబద్ధీకరణలో న్యాయపర చిక్కులను అధిగమించేందుకు ‘క్రమబద్ధీకరణ’పదం స్థానంలో వ్యూహాత్మకంగా ‘విలీనం’అనే పదాన్ని విద్యుత్ సంస్థలు చేర్చాయి. తాజా మార్గదర్శకాల్లోనూ క్రమబద్ధీకరణ కాకుండా విలీనం ప్రక్రియగా పేర్కొన్నట్లు సమాచారం. 1996 ఏప్రిల్ 10 తర్వాత తాత్కాలిక/కాంట్రాక్ట్ ఉద్యోగుల సర్వీసులను ఇక క్రమబద్ధీకరించరాదని రమాదేవి కేసులో సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఆ ఆదేశాల ప్రకారం రాష్ట్రంలో కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ చేయొద్దని గత ఏప్రిల్ 26న హైకోర్టు మరో ఉత్తర్వు జారీ చేసింది. దీంతో తీర్పు ప్రభావం క్రమబద్ధీకరణపై పడకుండా విద్యుత్ సంస్థల యాజమాన్యాలు క్రమబద్ధీకరణకు బదులు విలీన ప్రక్రియను చేపట్టాయి. గతంలో కేటీపీఎస్ విద్యుత్ కేంద్రం తాత్కాలిక ఉద్యోగలను విలీనం చేశారని, ఇప్పుడూ అదే వ్యూహాన్ని అమలు చేయాలని నిర్ణయించినట్లు అధికారులు పేర్కొంటున్నారు. విద్యార్హతల వారీగా రాష్ట్ర విద్యుత్సంస్థల్లోని ఔట్సోర్సింగ్ ఉద్యోగుల వివరాలు.. సంస్థ మొత్తం ఉద్యోగులు పీజీ ఇంజనీరింగ్ డిగ్రీ ఇంజనీరింగ్ డిప్లొమా ఐటీఐ పదో తరగతి విద్యార్హత లేనివారు ట్రాన్స్కో 4,577 84 169 266 680 986 1,811 581 జెన్కో 4,394 72 57 205 85 1,404 2,312 259 టీఎస్ఎస్పీడీసీఎల్ 10,268 228 134 1,221 100 5,306 2,579 700 టీఎస్ఎన్పీడీసీఎల్ 4,428 164 11 513 76 2,784 248 632 మొత్తం 23,667 548 371 2,205 941 10,480 6,950 2,172 -
‘బయట’ కొంటే బాదుడే
- బహిరంగ మార్కెట్లో విద్యుత్ కొనుగోళ్లపై సర్చార్జీ - యూనిట్కు రూ.3 చొప్పున వడ్డించే యోచన - ముఖ్యమంత్రి కేసీఆర్కు ట్రాన్స్కో ప్రతిపాదనలు సాక్షి, హైదరాబాద్: బహిరంగ మార్కెట్లో విద్యుత్తు కొనుగోలు చేసే వినియోగదారులకు అదనపు సర్చార్జీ విధించాలని తెలంగాణ రాష్ట్ర విద్యుత్తు సరఫరా సంస్థ(ట్రాన్స్కో) నిర్ణయించింది. ఈ మేరకు తమ ప్రతిపాదనలను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావుకు సమర్పించింది. ఈ అంశంపై తుది నిర్ణయం ప్రభుత్వ పరిశీలనలో ఉన్నట్లు ట్రాన్స్కో వర్గాలు వెల్లడించాయి. ప్రధానంగా పారిశ్రామిక వినియోగదారులు, కొందరు బడా వినియోగదారులు ఒకవైపు డిస్కమ్లతో విద్యుత్ కొనుగోలు ఒప్పందం చేసుకుని, మరోవైపు బహిరంగ మార్కెట్లో కూడా విద్యుత్ కొనుగోలు చేస్తున్నారు. దీంతో డిస్కంలు ఆర్థికంగా నష్టాల పాలవుతున్నాయి. ఏటా రూ.400 కోట్ల నష్టం: రాష్ట్రంలో దాదాపు 70కిపైగా పరిశ్రమలు, బడా సంస్థలు ఏటా రెండు వేల మిలియన్ యూనిట్లను బహిరంగ మార్కెట్లో కొనుగోలు చేస్తున్నాయి. దీంతో డిస్కంలకు ఏటా దాదాపు రూ.400 కోట్ల నష్టం వస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. ప్రధానంగా బహిరంగ మార్కెట్లో తక్కువ రేటు ఉన్నప్పుడల్లా పారిశ్రామిక వినియోగదారులు అక్కడి నుంచి విద్యుత్ కొనుగోలు చేస్తుండటంతో డిస్కంలు నష్టపోతున్నాయి. రాష్ట్రంలోని విద్యుత్ వినియోగ డిమాండ్ను అనుసరించే డిస్కంలు విద్యుత్తు కొనుగోలుకు జెన్కోతో ఒప్పందాలు చేసుకుంటాయి. ఈ ఒప్పందాలు 25 ఏళ్ల పాటు అమల్లో ఉంటాయి. ఎంత మేరకు విద్యుత్ కొనుగోలు చేసేందుకు ఒప్పందం చేసుకున్నాయో.. అంత మొత్తం యూనిట్ల విద్యుత్తుకు డిస్కంలు జెన్కోకు డబ్బులు చెల్లించటం తప్పనిసరి. కానీ వినియోగదారులు బయటి మార్కెట్ను ఆశ్రయిస్తే అంత మేరకు డిస్కంల ఆదాయానికి గండి పడుతుంది. నిరంతరాయంగా విద్యుత్: తెలంగాణ ఏర్పడిన తర్వాత డిస్కంలు నాణ్యమైన, నిరంతరాయంగా విద్యుత్ అందిస్తున్నాయి. గతంలో ఉన్న పవర్ హాలిడేలను రద్దు చేసి, పరిశ్రమలకు 24 గంటల విద్యుత్ అందిస్తున్నాయి. అందుకు భిన్నంగా పారిశ్రామిక వినియోగదారులు బయట నుంచి విద్యుత్ కొనుగోలు చేయడం డిస్కంలను షాక్కు గురి చేస్తోంది. రోజురోజుకూ ఈ నష్టం పెరిగిపోవటంతో డిస్కంలు ప్రత్యామ్నాయాలు ఆలోచించాయి. సమస్య నుంచి గట్టెక్కేందుకు బహి రంగ మార్కెట్లో విద్యుత్ కొనుగోలు చేసే వారికి అదనపు సర్చార్జీ విధించాలని ట్రాన్స్కో ప్రతిపాదించింది. ప్రస్తుతం గుజరాత్, రాజస్థాన్, హిమాచల్ప్రదేశ్, ఢిల్లీ, మహారాష్ట్ర తదితర ప్రభుత్వాలు అదనపు సర్చార్జీలను అమలు చేస్తున్నాయి. బయట నుంచి కొనుగోలు చేసే విద్యుత్పై ఒక్కో యూనిట్కు గరిష్టంగా రూ.3 చొప్పున సర్చార్జీ విధిస్తున్నాయి. ఇదే విధానాన్ని రాష్ట్రంలోనూ అమలు చేయాలని ట్రాన్స్కో అధికారులు సీఎం కేసీఆర్ను కోరారు. -
తెలంగాణ విద్యుత్ శాఖలో కొలువుల జాతర
హైదరాబాద్ : తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త. విద్యుత్ శాఖలో భారీగా నియామకాలు జరగనున్నాయి. విద్యుత్ శాఖలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. జెన్ కో పరిధిలోని 13,357 పోస్టులు భర్తీ కానున్నాయి. జెన్ కో, ట్రాన్స్కో, డిస్కమ్లలో జూనియర్ లైన్ మెన్ నుంచి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వరకు మొత్తం 13,357 ఉద్యోగాలను భర్తీకి కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. అలాగే విద్యుత్ శాఖలోని దాదాపు 10 వేల మందికి వెంటనే పదోన్నతులు కల్పించాలని కూడా కేసీఆర్ ఆదేశించారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ఏపీ వాటా తెలంగాణ పరం
సాక్షి, అమరావతి : హైదరాబాద్ విద్యుత్ సౌధాలో వాటాను వదులుకునేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది. ఆస్తులు, అప్పులపై రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదం పరిష్కారం కాకుండానే ఆస్తులన్నీ అప్పగించాలనే నిర్ణయం విద్యుత్ సిబ్బందికి విస్మయం కలిగిస్తోంది. తెలంగాణకు భయపడి విలువైన ఆస్తులు వదులుకోవడం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఆరు అంతస్తుల్లో విద్యుత్ సౌధా నిర్మించారు. రాష్ట్ర విభజన తర్వాత దీన్ని ఏపీ, తెలంగాణ పంచుకోవాల్సి ఉంది. భౌగోళికంగా తెలంగాణలో ఉండటం వల్ల ఇది ఆ రాష్ట్రానికే చెందే వీలుంది. అయితే, ఏపీ వాటా కింద తెలంగాణ కొంత మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. ఆస్తుల విలువ కట్టకపోవడం వల్ల ఎంతమొత్తం ఇవ్వాలనేది ఇంకా నిర్థారణ కాలేదు. ప్రస్తుతం విద్యుత్ సౌధాలో రెండు రాష్ట్రాల జెన్కో, ట్రాన్స్కో కార్యాలయాలు తమ కార్యకలాపాలను కొనసాగిస్తున్నాయి. పదేళ్ళ పాటు ఏపీ ఇక్కడ తమ ఆఫీసులను నిర్వహించుకునే హక్కు కూడా ఉంది. ఈ నేపథ్యంలో విద్యుత్ సంస్థలను విజయవాడకు తరలించాలని ప్రభుత్వం ఆదేశించింది. మే నెలాఖరుకు అన్ని శాఖలను గుణదలకు తీసుకెళ్ళేందుకు ఏపీ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. కార్యాలయాలు ఖాళీ చేసినప్పటికీ ఆస్తుల పంపకం జరిగే వరకూ ఏపీ ఆఫీసులకు తాళాలు వేసి, తమ ఆధీనంలో ఉంచుకోవాలని ఏపీ విద్యుత్ సంస్థలు భావించాయి. దీనిపై తెలంగాణ అధికారులు తీవ్ర అభ్యంతరం లేవనెత్తినట్టు తెలిసింది. తాళాలు వేసుకుని పోతే ఆ గదుల్లో ఎలుకలు చనిపోతాయని, దీంతో పక్కన ఉన్న తమ గదుల్లోనూ భరించలేని వాసన వస్తుందని ఏపీకి తెలిపారు. తాళాలు వేసుకుని వెళ్ళే పరిస్థితే వస్తే ఒక్క ఫైల్ కూడా బయటకు వెళ్ళనీయమని హెచ్చరించినట్టు తెలిసింది. దీంతో తెలంగాణ అధికారులతో ఏపీ అధికారులు చర్చలు జరిపారు. మొత్తం బిల్డింగ్ తమకు ఇవ్వాలని, ఆస్తుల పంపకం తేలే వరకూ నెలకు రూ.2 లక్షలు అద్దె చెల్లిస్తామని తెలంగాణ ప్రతిపాదించింది. దీనికి ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకారం తెలిపింది. అయితే ఇప్పటికే తెలంగాణ రూ.4,800 కోట్ల విద్యుత్ బకాయిలు చెల్లించలేదని, అద్దె మాత్రం చెల్లిస్తుందా? అని ఏపీ విద్యుత్ సిబ్బంది పెదవి విరుస్తున్నారు. అయినా ఆరు అంతస్తుల భవనాన్ని కేవలం రూ.2 లక్షల అద్దెకే ఎలా ఇస్తారని ప్రశ్నిస్తున్నారు. ఖైరతాబాద్ ప్రాంతంలో ఒక్కో ఫ్లోర్ కనీసం రూ.25 లక్షల అద్దె పలుకుతుందని, ఆరు అంతస్తులకు దాదాపు రూ.1.50 కోట్ల వరకూ అద్దె వచ్చే వీలుందని చెబుతున్నారు. ప్రభుత్వ తీరుపై వారు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. -
ట్రాన్స్కో భూమిని రక్షించండి
ట్రాన్స్కో సీఎండీకి వినతిపత్రం ఇచ్చిన ఇంజనీర్స్ అసోసియేషన్ సాక్షి, అమరావతి బ్యూరో: విజయవాడలో తమ సంస్థకు చెందిన రూ.200 కోట్ల విలువైన ఐదు ఎకరాల భూమి అన్యాక్రాంతం కాకుండా కాపాడుకునేందుకు ట్రాన్స్కో ఇంజనీర్స్ అసోసియేషన్ ప్రతినిధులు సన్నద్ధమయ్యారు. విజయవాడ గుణదలలోని విద్యుత్ సౌధ భూమిని స్టార్ హోటల్కు 99 ఏళ్ల పాటు లీజుకు కట్టబెట్టాలని ప్రభుత్వ ముఖ్యనేత నిర్ణయించడంతో శుక్రవారం పర్యాటక శాఖ అధికారులు ఇక్కడ సర్వే చేపట్టిన సంగతి తెలిసిందే. లీజు ముసుగులో ట్రాన్స్కో భూమికి చినబాబు ఎసరు పెట్టడంపై ‘స్టార్.. స్టార్.. దగా స్టార్’ శీర్షికతో ‘సాక్షి’లో కథనం ప్రచురితమైంది. ఈ నేపథ్యంలో ట్రాన్స్కో ఇంజనీర్స్ అసోసియేషన్ ప్రతినిధులు శనివారం సమావేశమై, భవిష్యత్తు కార్యాచరణపై చర్చించారు. విలువైన భూమిని స్టార్ హోటల్కు అప్పనంగా కట్టబెట్టాలన్న నిర్ణయాన్ని ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం ట్రాన్స్కో సీఎండీ విజయానంద్ను కలిశారు. ట్రాన్స్కో భూమి బినామీల పరం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే జేఏసీ ఆధ్వర్యంలో ప్రత్యక్ష కార్యాచరణకు దిగుతామన్నారు. -
స్టార్.. స్టార్... దగా స్టార్
విజయవాడ నడిబొడ్డున ముఖ్యనేత భూదందా ⇒ రూ.200 కోట్ల విలువైన ట్రాన్స్కో భూమికి ఎసరు ⇒ 99 ఏళ్లపాటు లీజుకు ఇచ్చేందుకు టెండర్లు పిలవాలని ఆదేశం ⇒ సర్వే ప్రారంభించిన పర్యాటక శాఖ అధికారులు ⇒ ట్రాన్స్కో, ఎస్పీడీసీఎల్ అభ్యంతరాలు బేఖాతరు ⇒ స్టార్ హోటల్ నిర్మాణం పేరిట బినామీ సంస్థకు ధారాదత్తం! ⇒ కొంతకాలం తర్వాత చినబాబుకు అప్పగించేలా ఒప్పందం విజయవాడ నగరం నడిబొడ్డున అత్యంత ఖరీదైన ఐదెకరాల ప్రభుత్వ భూమి. అందులో ఒక బ్రహ్మాండమైన ఐదు నక్షత్రాల హోటల్ నిర్మించే బాధ్యత ఓ ప్రముఖ హోటల్ నిర్వహణ సంస్థది. వాళ్లు ఆ హోటల్ నిర్మించి, కొంతకాలం పాటు లాభాల బాటలో నడిపించిన తర్వాత చినబాబుకు కట్టబెడతారు. ఇదీ చినబాబు వేసిన అదిరిపోయే స్కెచ్. అంటే కాణీ ఖర్చు లేకుండా రాజధాని నగరంలో చినబాబు ఖాతాలో ఖరీదైన హోటల్ పడబోతోందన్నమాట. ఈ భూమి ప్రస్తుతం విద్యుత్ శాఖ అధీనంలో ఉంది. చినబాబు స్కెచ్ వేయగానే భూమిని స్వాధీనం చేసుకుని, ప్రైవేట్ సంస్థకు అప్పగించేందుకు పర్యాటక శాఖ అధికారులు సర్వే ప్రారంభించారు. సాక్షి, అమరావతి బ్యూరో: విజయవాడలో చినబాబు, ప్రభుత్వ పెద్దలు ఏపీ ట్రాన్స్కో– ఏపీఎస్పీడీసీఎల్కు చెందిన రూ.200 కోట్ల విలువైన 4.80 ఎకరాల భూమిని బినామీల ముసుగులో హస్తగతం చేసుకునేందుకు పథకం వేశారు. లీజు పేరిట 99 ఏళ్లకు దక్కిం చుకునేందుకు పన్నాగం పన్నారు. అందు కోసం అన్ని నిబంధనలను బేఖాతరు చేస్తూ పర్యాటక శాఖ ద్వారా రంగంలోకి దిగారు. ట్రాన్స్కో, సదరన్ డిస్కం ఉద్యోగుల అభ్యం తరాలను కూడా వారు లెక్కచేయడం లేదు. మరోవైపు తాము ఈ భూదందాలో కేవలం పావులమేనని, అసలు బాగోతం అంతా ప్రభుత్వ ముఖ్యనేతదేనని పర్యాటక శాఖ వర్గాలు చెబుతుండడం గమనార్హం. లోపాయికారీ ఒప్పందం రాజధానిలో పర్యాటక రంగాన్ని ప్రోత్సహిం చేందుకు స్టార్ హోటళ్లు నిర్మించే ముసుగులో ఆ 4.80 ఎకరాలను దక్కించుకోవాలని ముఖ్యనేత వ్యూహం పన్నారు. ఇప్పటికే స్టార్ హోటళ్లు నిర్వహిస్తున్న ఓ కార్పొరేట్ సంస్థతో లోపాయికారీ ఒప్పందం కుదుర్చుకున్నారు. దాని ప్రకారం... సదరు సంస్థకు 99 ఏళ్ల లీజు పేరిట ఆ 4.80 ఎకరాలను కట్టబెడతారు. ఆ సంస్థ చినబాబుకు బినామీగా ఉంటూ స్టార్ హోటల్ను నిర్మించాలి. దాన్ని కొంతకాలం నిర్వహించిన అనంతరం పూర్తిగా చినబాబుకే అప్పగించాలి. ట్రాన్స్కోకు సమాచారం లేదు స్టార్ హోటల్ నిర్మాణానికి వీలుగా 4.80 ఎకరాలను లీజుకు ఇచ్చేందుకు వెంటనే టెండర్లు పిలవాలని పర్యాటక శాఖను ముఖ్యనేత కార్యాలయం ఆదేశించింది. ట్రాన్స్కో, ఏపీ ఎస్పీడీసీఎల్కు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. భూమి అప్పగించకుండా తాము టెండర్లు ఎలా పిలుస్తామని పర్యాటక శాఖ అధికారి ఒకరు సందేహం వ్యక్తం చేశారు. అదంతా తాము చూసుకుంటామని, టెండర్ల ప్రక్రియకు సన్నాహాలు మొదలుపెట్టాలని ముఖ్యనేత స్పష్టం చేసినట్లు సమాచారం. ఏదైనా ఉంటే పెద్దలతో మాట్లాడుకోండి ముఖ్యనేత ఆదేశాలతో పర్యాటక శాఖ రంగంలోకి దిగింది. విద్యుత్తు సౌధ ప్రాంగణంలోని భూమిని శుక్రవారం సర్వే చేసింది. విషయం తెలుసుకున్న ట్రాన్స్కో ఇంజనీర్ల సంఘం ప్రతినిధులు అక్కడికి చేరుకున్నారు. తమ సంస్థకు చెందిన భూమిని పర్యాటక శాఖ సర్వే చేయడమేమిటని ప్రశ్నించారు. ఆ భూమిని పర్యాటక శాఖకు కేటాయిస్తూ ఉత్తర్వులు ఉంటే చూపించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకే తాము సర్వే చేస్తున్నామని పర్యాటక శాఖ అధికారులు తెలిపారు ఏదైనా ఉంటే సచివాలయంలో పెద్దలతో మాట్లాడుకోవా లని, తమ సర్వేను అడ్డగించవద్దని తేల్చిచెప్పారు. స్టార్ హోటల్పై చినబాబు మక్కువ విజయవాడ ఏలూరు రోడ్డులోని గుణదలలో విద్యుత్తు సౌధ భవన ప్రాంగణం ఉంది. ఆ ప్రాంగణంలో దాదాపు 4.80 ఎకరాల భూమి ఖాళీగా ఉంది. 1952 నుంచి అప్పటి రాష్ట్ర ఎలక్ట్రికల్ బోర్డు అధీనంలో ఈ భూమి ఉంటూ వచ్చింది. ఏపీఎస్ఈబీని విభజించిన తరువాత ఈ భూమిని ఏపీ ట్రాన్స్కో, సదరన్ డిస్కంలకు ఉమ్మడిగా కేటాయించారు. ప్రస్తుతం ఇక్కడ ఎకరా మార్కెట్ ధర రూ.40 కోట్లకు పైమాటే. ఆ లెక్కన మొత్తం భూమి మార్కెట్ విలువ దాదాపు రూ.200 కోట్లు. ఖాళీగా ఉన్న ఈ విలువైన భూమిపై ప్రభుత్వ పెద్దల కన్ను పడింది. ప్రధానంగా ప్రభుత్వ నిర్ణయాలను ప్రభావితం చేస్తున్న చినబాబు ఆ భూమిలో ఓ స్టార్ హోటల్ నిర్మించాలని భావిస్తున్నట్లు సమాచారం. దీంతో ప్రభుత్వ ముఖ్యనేత ఓ కార్పొరేట్ సంస్థ ముసుగులో చినబాబు స్టార్ హోటల్కు అడ్డంకుల్లేకుండా ఎత్తుగడ వేశారు. ప్రైవేట్కు అప్పగిస్తే ట్రాన్స్కోకు తీవ్ర నష్టం రాష్ట్ర విభజన అనంతరం మౌలిక వసతులు లేక ట్రాన్స్కో, ఏపీఎస్సీడీసీఎల్ సతమతమవుతున్నాయి. రాష్ట్రంలో ఉద్యోగుల శిక్షణ కేంద్రం, ఆర్అండ్డీ కేంద్రం కూడా లేవు. విజయవాడలో నీటిపారుదల శాఖకు చెందిన స్థలంలో ఎస్పీడీసీఎల్ భవనం ఉంది. ఆ భవనాన్ని ఖాళీ చేయాలని నీటిపారుదల శాఖ ఇప్పటికే నోటీసులు ఇచ్చింది. విద్యుత్తు సౌధ ప్రాంగణంలోనే ట్రాన్స్కో, ఎస్పీడీసీఎల్లకు భవనాలను నిర్మించాలని యోచిస్తున్నారు. కానీ, తమ సంస్థలకు చెందిన భూమిని ప్రైవేట్కు కట్టబెట్టడం ఏమిటని ట్రాన్స్కో, ఎస్పీ డీసీఎల్ అధికారులు, ఉద్యోగులు నిలదీస్తున్నారు. ట్రాన్స్కోకు నష్టాన్ని కలిగించే ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని ట్రాన్స్కో ఇంజనీర్ల అసోషియేషన్ ఉపాధ్యక్షుడు శ్రీనివాసరావు, సంఘ ప్రతినిధి కోటేశ్వరరావు డిమాండ్ చేస్తున్నారు. సర్కారు నిర్ణయానికి వ్యతిరేకంగా ఉద్యమిస్తాం ‘‘ఈ భూమి ట్రాన్స్కో, ఎస్పీడీసీఎల్ ఉమ్మడి ఆస్తి. ఎస్పీడీసీఎల్కు సొంత భవనం లేదు. భవిష్యత్తులో ట్రాన్స్కో అవసరాలు పెరుగుతాయి. అప్పుడు మేము ఎక్కడో మారుమూల ప్రాంతానికి వెళ్లాలా? ట్రాన్స్కో చెందిన విలువైన ఆస్తిని ప్రైవేటుకు కట్టబెడతారా? ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా ఉద్యమిస్తాం’’ – ఉదయ్కుమార్, ట్రాన్స్కో ఇంజనీర్ల సంఘం అదనపు కార్యదర్శి -
లైన్మన్పై దాడి , బైక్ను ధ్వంసం
విద్యుత్ బకాయి చెల్లించాలని అడిగిందుకు మహిళ వీరంగం కావలి : ఇంటి విద్యుత్ బకాయి కట్టలేదని సర్వీస్ కనెక్షన్ తొలగించేందుకు వచ్చిన సంబంధిత శాఖ లైన్మన్పై ఓ మహిళ దాడికి పాల్పడింది. అతని ద్విచక్రవాహనాన్ని సైతం ధ్వంసం చేసి వీరంగం సృష్టించింది. ఈ సంఘటన పట్టణంలోని వెంగళరావునగర్లో మంగళవారం జరిగింది. స్థానికులు, లైన్మన్ యు.రాజశేఖర్ కథనం మేరకు... వెంగళరావు నగర్ బైరాగుల కాలనీ ఐస్ ఫ్యాక్టరీ సమీపంలో షేక్ హసీనా అనే మహిళ నివాసం ఉంటుంది. ఆమె గత ఏడాది జూలై నుంచి సర్వీస్ కనెక్షన్కు సంబంధించి విద్యుత్ బిల్లు బకాయి ఉంది. గత నెలలో సంబంధిత సిబ్బంది వచ్చి ఫ్యూజ్ లింక్లు తీసుకెళ్లారు. అయితే ఆమె మరో ఫ్యూజ్లు తెచ్చి విద్యుత్ను వినియోగించుకుంటుంది. ఈ నేపథ్యంలో మంగళవారం లైన్మన్ ఆమె ఇంటికి వెళ్లి విద్యుత్ బకాయిలు చెల్లించాలని అడిగారు. ఆమె దురుసుగా సమాధానం చెప్పడంతో స్తంభం ఇంటికి ఉన్న విద్యుత్ సర్వీస్ కనెక్షన్ను తొలింగించే ప్రయత్నంలో చేశాడు. దీంతో ఆమె నిచ్చెన లాగేయడంతో లైన్మన్ కింద పడిపోయాడు. ఆమె ఇనుప రాడ్డుతో లైన్మన్పై దాడికి పాల్పడింది. అతని ద్విచక్ర వాహనాన్ని పడేసి అదే రాడ్తో ధ్వంసం చేసింది. ఈ ఘటనతో బిత్తరపోయిన లైన్మన్ తమ ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. వెంటనే ట్రాన్స్కో ఇంజినీరింగ్ అధికారులు, లైన్మన్తో కలసి టూటౌన్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదును అందజేశారు. విద్యుత్ బకాయిలు కోసం వినియోగదారుల ఇళ్లకు వెళితే తమపై ఇలా దాడులు చేయడం ఏమిటని విద్యుత్ శాఖ అధికారులు, లైన్మన్లు ఖండించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ట్రాన్స్కో విజిలెన్స్ అధికారుల దాడులు
- 70 కేసులు నమోదు - రూ.3.55 లక్షల జరిమానా ఉయ్యాలవాడ: అక్రమంగా విద్యుత్ వినియోగిస్తున్న గృహ వినియోగదారులపై బుధవారం ట్రాన్స్కో విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. 70 కేసులు నమోదు చేసి, రూ. 3.55 లక్షలు జరిమానా విధించినట్లు స్థానిక ఏఈ ప్రభాకర్రావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కర్నూలు విజిలెన్స్ డీఈ ఉమాపతి ఆధ్వర్యంలో ఏడీఈ శ్రీనివాసరెడ్డి, ముగ్గురు ఏఈలు, సిబ్బందితో కలిసి మండలంలోని అల్లూరు, మాయలూరు, ఉయ్యాలవాడ, సుద్దమల్ల, రూపనగుడి, కోవెలకుంట్ల మండలంలోని గుళ్లదుర్తి గ్రామాల్లో దాడులు నిర్వహించి అక్రమంగా విద్యుత్ కనెక్షన్లు కలిగి వున్న వారిపై కేసులు నమోదు చేసి జరిమానా విధించినట్లు ఏఈ స్పష్టం చేశారు. -
వామ్మో...! పెద్ద స్కెచ్
సాక్షి, అమరావతి బ్యూరో : ట్రాన్స్కో నిబంధనలను మార్చి కాంట్రాక్టు దక్కించుకునేందుకు టీడీపీ ప్రజాప్రతినిధి చేస్తున్న నానా యాగీ వెనుక పెద్ద కథే ఉంది. దాదాపు రూ.640 కోట్ల కాంట్రాక్టులను ఏక పక్షంగా దక్కించుకునే ‘దూరా’లోచన బట్టబయలవుతోంది. ఆ కథాకమామిషు ఇది.... ట్రాన్స్కో సబ్స్టేషన్ కాంట్రాక్టుల కోసం విజయవాడకు చెందిన ప్రజాప్రతినిధి పెద్ద గూడుపుఠాణీ సాగిస్తున్నారు. మొగల్రాజపురంలో రూ.10కోట్లతో నిర్మించదలచిన గ్యాస్ ఇన్సులేటెడ్ సబ్స్టేషన్ కోసం ఆయన ఒత్తిడి చేస్తున్న వైనాన్ని ‘సాక్షి’ మంగళవారం ‘పార్టీ మాదే... టెండర్ మాకే’ శీర్షికన బట్టబయలు చేసింది. అర్హత నిబంధనలు మార్చి తమకు కాంట్రాక్టు కట్టబెట్టాలని ఆయన పట్టుబట్టడం వెనుక అసలు ఉద్దేశం వేరే ఉంది. అదేమిటంటే... రాజధాని అమరావతి ప్రాంతంలో కూడా గ్యాస్ ఇన్సులేటెడ్ సబ్స్టేషన్లు నిర్మించాలని ట్రాన్స్కో నిర్ణయించింది. మొగల్రాజపురంలోని సబ్స్టేషన్ కంటే అధిక సామర్థ్యమైనవి నిర్మాణానికి ప్రతిపాదనను సిద్ధం చేసింది. రాజధాని ప్రాంతంలో 220 కేవీ సబ్స్టేషన్లు 16 నిర్మించాలని నిర్ణయించారు. ఒక్కో సబ్స్టేషన్ అంచనా వ్యయం రూ.40 కోట్లు చొప్పున మొత్తం రూ.640కోట్లుతో నిర్మిస్తారు. అమరావతిలో మొదటి సబ్స్టేషన్ నిర్మాణం కోసం ఈ నెలలో టెండర్లు పిలవాలని ట్రాన్స్కో భావిస్తోంది. అనంతరం మిగిలిన 15 సబ్స్టేషన్ల కోసం కూడా రానున్న రెండేళ్లలో దశలవారీగా టెండర్ల ప్రక్రియ చేపడతారు. రూ.640 కోట్ల భారీ కాంట్రాక్టు కావడంతో టీడీపీ ప్రజాప్రతినిధి కన్ను వాటిపై పడింది. అందుకే ప్రజాప్రతినిధి వీరంగం... గ్యాస్ ఇన్సులేటెడ్ సబ్స్టేషన్ కోసం ట్రాన్స్కో రూపొందించిన నిబంధనలు టీడీపీ ప్రజాప్రతినిధికి ప్రతికూలంగా ఉన్నాయి. ప్రస్తుతం మొగల్రాజపురం టెండర్ నోటిఫికేషన్లో అర్హత నిబంధనలు స్పష్టంగా పేర్కొన్నారు. గతంలో గ్యాస్ ఇన్సులేటెడ్ సబ్స్టేషన్ నిర్మించిన అనుభవం ఉన్న సంస్థలే బిడ్లు దాఖలు చేయాలని స్పష్టం చేశారు. టీడీపీ ప్రజాప్రతినిధి ఓ సంస్థ పేరున టెండరు దక్కించుకోవాలని భావిస్తున్నారు. కానీ ఆ సంస్థకు కూడా గతంలో గ్యాస్ ఇన్సులేటెడ్ సబ్స్టేషన్ నిర్మించిన అనుభవం లేదు. ప్రస్తుత నిబంధనల ప్రకారం రూ.10కోట్ల మొగల్రాజపురం సబ్స్టేషన్ నిర్మాణం కోసం ఆ సంస్థ పోటీపడ లేదు. ఈ వ్యవహారం అంతటితో ముగిసిపోదు. అమరావతిలో నిర్మించనున్న 16 సబ్స్టేషన్లకూ అవే టెండర్ నిబంధనలు వర్తింపజేస్తారు. అలా అయితే ఆ రూ.640కోట్ల భారీ కాంట్రాక్టు కూడా టీడీపీ ప్రజాప్రతినిధికి దక్కకుండాపోతుంది. అందుకే ప్రస్తుతం మొగల్రాజపురం సబ్స్టేషన్ టెండర్ నిబంధనలు మార్చాలని ప్రజాప్రతినిధి తీవ్ర ఒత్తిడి తెస్తున్నారు. గతంలో గ్యాస్ ఇన్సులేటెడ్ సబ్స్టేషన్ నిర్మించిన అనుభవం లేని సంస్థలు కూడా టెండర్లు దాఖలు చేసేందుకు అవకాశం ఇవ్వాలని ఒత్తిడి తెస్తున్నారు. ఈ వ్యవహారంతో ట్రాన్స్కో ఉన్నతాధికారులు తలలు పట్టుకుంటున్నారు. గ్యాస్ ఇన్సులేటెడ్ సబ్స్టేషన్ నిర్మించిన అనుభవం లేని సంస్థలకు అవకాశం కల్పించడం సరైన విధానం కాదని వారు స్పష్టం చేస్తున్నారు. ఓ వైపు రాజధానిని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తామని చెబుతున్న ప్రభుత్వం... మరోవైపు సబ్స్టేషన్ల వంటి కీలకమైన మౌలిక వ్యవస్థల నిర్మాణంలో రాజకీయాలకు తలొగ్గుతోందని విమర్శిస్తున్నారు. -
ఒకే కార్మిక సంఘానికి గుర్తింపు
ఇకపై ఆర్టీసీ తరహాలో విద్యుత్ సంస్థల్లో ఎన్నికలు విద్యుత్ సంస్థల యాజమాన్యాల నిర్ణయం.. కసరత్తు ప్రారంభం ప్రస్తుతం టీఆర్ఎస్కేవీ, 1104, 327 సంఘాలకు ప్రభుత్వ గుర్తింపు ట్రాన్స్కో, జెన్కో, డిస్కం సంస్థల్లో ఎన్నికల నిర్వహణ సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర విద్యుత్ సంస్థల్లో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. రాష్ట్ర విద్యుత్ సంస్థల్లో టీఆర్ఎస్కేవీ, 1104, 327 అనే మూడు ప్రధాన కార్మిక సంఘాలు గుర్తింపు సంఘాలుగా కొనసాగుతుండగా, ఇకపై ఆర్టీసీ తరహాలో ఒకే సంఘానికి గుర్తింపు కేటాయించాలని విద్యుత్ సంస్థల యాజమాన్యాలు నిర్ణయించాయి. విద్యుత్ కార్మికులు, ఉద్యోగులకు సంబంధించి ఏవైనా సమస్యలు తలెత్తినప్పుడు యాజమాన్యాలు మూడు గుర్తింపు సంఘాలతో చర్చలు జరపాల్సి వస్తోంది. అయితే సంఘాలమధ్య సమన్వయం లేక పలు సందర్భాల్లో చర్చల్లో ఏకాభిప్రాయం కుదరడం లేదు. డిసెంబర్లో కార్మిక సంఘాలన్నీ ఏకమై తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ ట్రేడ్ యూనియన్స్ ఫ్రంట్ (టఫ్)గా ఏర్పడి డిమాండ్ల పరిష్కారం కోసం సమ్మెకు పిలుపునివ్వడం యాజమాన్యాలకు ఇబ్బంది కలిగించింది. ప్రభుత్వంతో చర్చల అనంతరం కొన్ని సంఘాలు సమ్మె పిలుపును విరమించుకోగా, కొన్ని సంఘాలు నిరాకరించడంతో టఫ్లో చీలిక వచ్చింది. దీంతో ఒక్కో కార్మిక సంఘాన్ని బుజ్జగించి సమ్మె పిలుపును విరమింపజేయడానికి యాజమాన్యాలు తంటాలు పడాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వంతో చర్చల కోసం ఒకే సంఘానికి గుర్తింపు కల్పించాలని విద్యుత్ సంస్థల యాజమాన్యాలు నిర్ణయించాయి. రాష్ట్ర విద్యుదుత్పత్తి సంస్థ(జెన్కో), విద్యుత్ సరఫరా సంస్థ(ట్రాన్స్కో), దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ(టీఎస్ఎస్పీడీసీఎల్), ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ(టీఎస్ఎన్పీడీసీఎల్)లలో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర కార్మిక శాఖ ను ఇటీవల ట్రాన్స్కో యాజమాన్యం కోరిం ది. తాజా నిర్ణయం ప్రకారం ట్రాన్స్కో, జెన్కో, డిస్కంలలో వేర్వేరుగా ఎన్నికలు నిర్వహించి, ఒకే కార్మిక సంఘానికి గుర్తింపునిస్తారు. కసరత్తు ప్రారంభించిన కార్మిక శాఖ... ట్రాన్స్కో విజ్ఞప్తి మేరకు విద్యుత్ సంస్థల్లో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల నిర్వహణ కోసం రాష్ట్ర కార్మిక శాఖ కసరత్తు ప్రారంభించింది. కార్మికుల వివరాలు (మస్టర్ రోల్స్)ను అందించాలని తాజాగా విద్యుత్ సంస్థల యాజమాన్యాలను కోరింది. అదే విధంగా విద్యుత్ కార్మిక సంఘాల్లో సభ్యుల వివరాలను అందించాలని ఆయా కార్మిక సంఘాలకు తాజాగా లేఖలు రాసింది. ట్రాన్స్కో, జెన్కో, టీఎస్ఎస్పీడీసీఎల్, టీఎస్ఎన్పీడీసీఎల్ సంస్థల వారీగా కేంద్ర స్థాయిలో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలను రహస్య బ్యాలెట్ ద్వారా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది. విద్యుత్ సంస్థల్లో పని చేస్తున్న ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ సిబ్బందితో పాటు అకౌంట్స్, ఇతర విభాగాల్లోని ఎల్డీసీ, యూడీసీ, జేఏఓ, రికార్డ్ అసిస్టెంట్, డ్రైవర్, ఆఫీస్ సబార్డినేట్ స్థాయి వరకు ఉద్యోగులు ఈ ఎన్నికల్లో ఓటేయడానికి అర్హులు కానున్నారు. ట్రాన్స్కో అధికారవర్గాల లెక్కల ప్రకారం రాష్ట్రంలోని నాలుగు విద్యుత్ సంస్థల్లో పని చేస్తున్న 20 వేల మందికి పైగా కార్మికులు ఈ ఎన్నికల్లో ఓటేయనున్నారు. దీంతో ఆర్టీసీ, సింగరేణి సంస్థల తరహాలోనే ఇకపై విద్యుత్ సంస్థల్లో కూడా ప్రతి రెండేళ్లకోసారి ఎన్నికల సందడి నెలకొననుంది. సర్కిల్/డివిజన్ స్థాయిలో ఎలా..? విద్యుత్ సంస్థల్లో కేంద్ర/రాష్ట్ర స్థాయిలో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు నిర్వహించాలని ఇప్పటికే యాజమాన్యాలు నిర్ణయం తీసుకున్నప్పటికీ, సర్కిల్, డివిజన్ స్థాయిలో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల నిర్వహణపై స్పష్టత రాలేదు. జెన్కోలో విద్యుత్ కేంద్రాల పరిధిలో, ట్రాన్స్కో, జెన్కోలలో సర్కిల్, డివిజన్ స్థాయిలో ఎన్నికల నిర్వహణపై కార్మిక శాఖ నుంచి స్పష్టత రావాల్సి ఉందని ట్రాన్స్కోవర్గాలు పేర్కొన్నాయి. -
మాస్లీవ్పై ట్రాన్స్కో ఏఈలు
ఆదోని రూరల్ : ఆదోని డివిజన్ పరిధిలోని 17మండలాల ట్రాన్స్కో ఏఈలు, ఏఏఈలు 18మంది శుక్రవారం మాస్ లీవ్ ప్రకటించారు. డీఈ అంజన్ కుమార్ డివిజన్ పరిధిలోని ఏడీఈలు, ఏఈలు, ఏఏఈలకు సమావేశం నిర్వహించేందుకు పిలిపించారు. తమకు పనిభారం పెరిగిందని, అందువల్ల తమ సమస్యను విన్నవిస్తామని అందుకు సమయం కేటాయించాలని డీఈని కోరగా అందుకు ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన చేతనైతే పనిచేయండి..లేకపోతే సెలవులో వెళ్లండని ఏఈలపై విరుచుకుపడుతూ చులకనగా వ్యవహరించడంతో డివిజన్లోని 18మంది ఏఈలు మనస్థాపం చెందినట్లు తెలిపారు. దీంతో మూకుమ్మడిగా మాస్ లీవ్ తీసుకొని వెళ్తున్నామని ఏఈలు, ఏఏఈలు సమావేశాన్ని బాయ్కట్ చేశారు. డీఈ కార్యాలయ ఆవరణలో సమావేశమై ఆందోళన చేపట్టారు. అనంతరం వారు సమావేశం నిర్వహించి మాస్ లీవ్లో వెళ్లాలని తీర్మానించారు. ప్రభుత్వం ఇచ్చిన సిమ్లతో పాటు డీఈకి వినతి పత్రాన్ని సమర్పించారు. ఆయా మండలాల్లో సిబ్బంది ఏఎల్ఎంలు, జేఎల్ఎంలు, లైన్మెన్లు లేకపోవడం వల్ల చిన్న పని నుంచి పెద్ద పని వరకు ఏఈలే చూడాల్సి వస్తోందని, దీంతో పనిభారం పెరిగి డ్యూటీ చేయలేని పరిస్థితుల్లో ఉన్నామని తెలిపారు. డీఈకి విన్నవించుకున్నామంటే ముందుగానే డీఈ కించపరుస్తూ మాట్లాడారని ఏఈలు ఆరోపించారు. కార్యక్రమంలో ఏఈలు మద్దిలేటి, నాగభూషణం, నాగరాజు, చెన్నయ్య, సంతోష్, సురేష్ రెడ్డి, నర్సన్న, మోహన్ రావు, రామాంజినేయులు, నారాయణ స్వామినాయక్, రేఖ, శేఖర్ బాబు, మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు. -
‘కాళేశ్వరం’ విద్యుత్ నిర్మాణాలకు 267 కోట్లు
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టుకు అవసరమయ్యే విద్యుత్ను సమకూర్చనున్న ట్రాన్స్కోకు తొలి విడతగా రూ. 267 కోట్లు మంజూరు చేస్తూ నీటి పారుదల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎస్కే జోషి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నిధులతో కాళేశ్వరం పంప్హౌజ్లకు అవసరమైన విద్యుత్ సరఫరా కోసం ప్యాకేజీ 10, 11, 12లల్లో విద్యుత్ నిర్మాణాలను చేపడతారు. -
అంధకారంలో సున్నిపెంట
విద్యుత్ బకాయి చెల్లించకపోవడంత సరఫరా నిలిపివేత శ్రీశైలం ప్రాజెక్టు : ఏపీ ట్రాన్స్కోకు శ్రీశైలం ప్రాజెక్టు ఇరిగేషన్ శాఖ విద్యుత్ బకాయి చెల్లించపోవడంతో గురువారం ఉదయం నుంచి రాత్రి వరకు విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. కాలనీ మొత్తం అంధకార మయమైంది. ఇరిగేషన్ శాఖ రూ.14 కోట్లు బకాయి ఉంది. ఇదిలా ఉండగా సున్నిపెంట కాలనీలో ఏపీ ›ట్రాన్స్కో మీటర్లు బిగించి కనెక్షన్లను స్వాధీనం చేసుకోవాల్సిందిగా గతంలో జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. ట్రాన్స్కో మీటర్లు బిగిస్తున్నా కనెక్షన్లను తమ కంట్రోల్లోకి తీసుకోకపోవడంతో బిల్లుల వసూలు బాధ్యత ఎవరి తీసుకోవాలనే సందిగ్ధం నెలకొంది. విద్యుత్ సరఫరాను వెంటనే పునరుద్ధరించాలని ఇరిగేషన్ ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు ట్రాన్స్కో అధికారులను కోరారు. -
ట్రాన్స్కో అధికారుల దాడులు
పీక్లానాయక్తండా(మేళ్లచెర్వు): మండలంలోని పీక్లానాయక్తండాలో సోమవారం విద్యుత్ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. అక్రమంగా విద్యుత్ వాడుతున్న 78 మందిపై కేసు నమోదు చేసినట్లు ట్రాన్స్కో ఏఈ నాగరాజు తెలిపారు. మీటర్లు లేకుండా బకాయిలు చెల్లించకుండ విద్యుత్ వాడుతున్న వారిపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. ఎస్సీ,ఎస్టీలకు 50 యూనిట్ల మేరకు ఉచితంగా వాడుకోవచ్చు అని తెలిపారు. ఇట్టి అవకాశాన్ని గిరిజనులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఇక మీదట ఎటువంటి అనుమతులు లేకుండా విద్యుత్ వాడుకుంటే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. దాడుల్లో కోదాడ,చిలుకూరు ఏఈలు ,విద్యుత్ సిబ్బంది పాల్గొన్నారు. -
ముంపు మండలాల్లో కొత్త విద్యుత్ లైన్లు
ట్రాన్స్కో సీఎండీ ఎంఎం నాయక్ కుక్కునూరు: ముంపు మండలాల్లో విద్యుత్ సమస్యలను సాధ్యమైనంత త్వరగా పరిష్కరిస్తామని ట్రాన్స్కో సీఎండీ మురావత్ ఎం.నాయక్ అన్నారు. బుధవారం కుక్కునూరు వచ్చిన ఆయన్ను స్థానికులు గుట్ట సెంటర్ వద్ద అడ్డుకున్నారు. మండలంలో విద్యుత్ సమస్య తీవ్రంగా ఉందని ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. త్వరలోనే ముంపు మండలాల్లో విద్యుత్ సమస్యలను అధిగమిస్తామని, ఇందుకు ప్రణాళికబద్ధంగా ముందుకు సాగుతున్నామని సీఎండీ చెప్పారు. ఎటపాక నుంచి భువనగిరికి, కూనవరం నుంచి వేలేరుపాడుకు కొత్త విద్యుత్ ౖలైన్లు ఏర్పాటుచేయనున్నామన్నారు. త్వరలో రాజీవ్నగర్ సబ్స్టేçÙన్ పనులు ప్రారంభించి అన్ని లైన్లను ఆధునికీకరిస్తామని చెప్పారు. ఐటీడీఏ పీవో షణ్మోహన్ ఆయన వెంట ఉన్నారు. -
విద్యుత్ శాఖకు అపార నష్టం
గుంటూరు (నగరంపాలెం): భారీ వర్షాలకు చెరువులకు గండ్లుపడి వరదనీరు ముంచెత్తడంతో నర్సరావుపేట, సత్తెనపల్లి, పిడుగురాళ్ళ, రాజుపాలెం, క్రోసురు, అచ్చంపేట, చిలకలూరిపేట పరిధిలోని చాలా గ్రామాల్లో విద్యుత్శాఖకు తీవ్ర నష్టం వాటిల్లింది. వీటి పరిధిలోని సుమారు ఆరు మండలాల్లోని 82 గ్రామాల్లో విద్యుత్ వ్యవస్థలో అంతరాయం ఏర్పడింది. నివాస ప్రాంతాలకు చెందిన 11,780 సర్వీసులు, వ్యవసాయానికి సంబంధించి 2180 సర్వీసులకు ఇబ్బంది కలిగింది. శనివారం సాయంత్రం వరకు బ్రాహ్మణపల్లి, రాజుపాలెం ప్రాంతాల్లో వరదనీరు భారీగా నిల్వ ఉంది. పీసపాడు వద్ద 33 కేవీ లైనుకు సంబంధించి 20 విద్యుత్ స్తంభాలు, 11 కేవీకి చెందిన 876, ఎల్టీ లైను పోల్స్ 847 కూలిపోయాయి. సుమారు 82 కిలోమీటర్ల మేర ఎల్టీ, 11 కేవీ లైన్లు దెబ్బతిన్నాయి. 387 వరకు ట్రాన్స్ఫార్మర్లు నీటిలో మునిగి మరమ్మతులకు గురయ్యాయి. విద్యుత్శాఖకు రూ.2.5 కోట్లు నష్టం వచ్చినట్లు ప్రాథమికంగా అంచనావేశారు. శనివారం ఎనర్జీ సెక్రటరీ అజయ్ జైన్ విద్యుత్శాఖ జిల్లా అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్సులో జిల్లాలో వరద ప్రబావిత ప్రాంతాల్లో జరిగిన విద్యుత్శాఖ నష్టంపై సమీక్షించారు. సాధ్యమైనంత వరకు మరమ్మతులు వేగవంతం చేయాలని సూచించారు. 18 సబ్ స్టేషన్లకు అంతరాయం... వరద ప్రభావిత ప్రాంతాల్లో 35 బృందాలతో విద్యుత్ పునరుద్ధరణ పనులు వేగవంతంగా నిర్వహిస్తున్నాం. వరదనీరు తగ్గినప్పటి నుంచే 60 శాతం గ్రామాలకు గురువారం రాత్రే విద్యుత్ సరఫరా చేశాం. వరదల వల్ల 18 సబ్స్టేçÙన్లకు అంతరాయం కలిగింది. కొన్ని సబ్స్టేçÙన్లలో నీరు నిల్వ ఉండటంతో శనివారం సాయంత్రం నాటికి ఆరు గ్రామల మినహా అన్ని సర్వీసులకు సరఫరాను పునరుద్ధరించాం. పొలాల్లో నీరు భారీగా నిల్వ ఉండటంతో వ్యవసాయ కనెక్షన్లు, పడిపోయిన విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు మరమ్మతులు పెండింగులో ఉన్నాయి. – ఎస్ఈ బి.జయభారతరావు