transco
-
ఇంధన శాఖపై ‘కూటమి’ కన్ను!
సాక్షి, అమరావతి: గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఆదుకోవడంతో అప్పులు తీర్చుకుని ఆదాయం బాట పట్టిన ఇంధన శాఖపై టీడీపీ కూటమి ప్రజాప్రతినిధుల కన్ను పడింది. డిస్కంలతో పాటు ఏపీ జెన్కో, ట్రాన్స్కోలో కీలక స్థానాల్లో తమ వారిని నియమించుకొని, కోట్లాది రూపాయలు దండుకొనేందుకు కూటమికి చెందిన కొందరు ప్రజాప్రతినిధులు పెద్ద కుతంత్రానికే తెరలేపారు. ఇందులో భాగంగా వైఎస్సార్సీపీ ప్రభుత్వం హయాంలో నియమితులైనవారిని రాజీనామాలు చేసి వెళ్లిపోవాలని హెచ్చరిస్తున్నారు. గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా ప్రభుత్వ శాఖలను జేబులు నింపుకొనేందుకు వాడుకున్నారో ఇప్పుడూ అదే తీరులో చెలరేగుతున్నారు. వారి ధన దాహానికి డైరెక్టర్ నుంచి అన్ని స్థాయిల ఉద్యోగులు అల్లాడిపోతున్నారు. కూటమి పెద్దల బలవంతంతో వరుసగా రాజీనామాలు చేస్తున్నారు. కొందరిని బలవంతంగా బయటకు పంపిస్తున్నారు. ఇప్పటికే ఏపీ ట్రాన్స్కో విజిలెన్స్ జేఎండీ, విశ్రాంత ఐపీఎస్ అధికారి మల్లారెడ్డి చేత రాజీనామా చేయించారు. ఏపీ సోలార్ పవర్ కార్పొరేషన్లో ముఖ్య ఆర్థిక సలహాదారులు హనుమంతరావు, సింహాచలం, జెన్కో ఓఎస్డీ ఆంటోని రాజు, మరికొందరిని విధుల నుంచి తప్పించారు. డైరెక్టర్లనూ రాజీనామా చేయాలని ఇటీవల హుకుం జారీ చేశారు. మంగళవారం రాత్రి మరోసారి గట్టిగా చెప్పడంతో ఏపీ ట్రాన్స్కో, జెన్కో, మూడు డిస్కంలలోని 10 మంది డైరెక్టర్లు బుధవారం రాజీనామా చేశారు. వారి బాధ్యతలను తాత్కాలికంగా సీజీఎంలకు అప్పగిస్తూ డిస్కంల సీఎండీలు ఉత్తర్వులు జారీ చేశారు. ఖాళీ అయిన పోస్టుల్లో కొన్నింటికి రూ. కోట్లలో బేరాలు మొదలు పెట్టినట్లు సమాచారం. కొన్ని పోస్టుల్లో అనుయాయులను నియమించుకొని వారి ద్వారా కోట్లు దండుకొనే ఆలోచనతో ఉన్నట్లు తెలిసింది. త్వరలోనే ట్రాన్స్కో, జెన్కో, డిస్కంల అధిపతులను కూడా మార్చాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి తమకు అనుకూలంగా ఉండే పలువురు ఐఏఎస్ అధికారుల పేర్లును పరిశీలిస్తున్నట్లు సమాచారం.10 మంది డైరెక్టర్ల రాజీనామా ఏపీ ట్రాన్స్కో సీఎండీ, జెన్కో ఎండీ, డిస్కంల సీఎండీలకు 10 మంది డైరెక్టర్లు బుధవారం రాజీనామా లేఖలను అందజేశారు. వాటిని ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్కు పంపగా, ఆయన వెంటనే ఆమోదించారు. ఈ మేరకు బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. రాజీనామా చేసిన డైరెక్టర్లు » టి.వీరభద్రరెడ్డి (ఫైనాన్స్– ఏపీ ట్రాన్స్కో) » డి.ఎస్.జి.ఎస్.ఎస్. బాబ్జి (థర్మల్ – ఏపీ జెన్కో) » సయ్యద్ రఫి (హెచ్ఆర్, ఐఆర్ – ఏపీ జెన్కో) » ఎంవీవీ సత్యనారాయణ (హైడల్ – ఏపీ జెన్కో) » సి.శ్రీనివాసమూర్తి (ఆపరేషన్స్ – ఏపీఈపీడీసీఎల్) » ఎ.వి.వి.సూర్యప్రతాప్ (ప్రాజెక్ట్స్ – ఏపీఈపీడీసీఎల్) » వి. బ్రహా్మనందరెడ్డి (ఫైనాన్స్ – ఏపీసీపీడీసీఎల్) » బి. జయభారతరావు (టెక్నికల్ – ఏపీసీపీడీసీఎల్) » టి. వనజ (ప్రాజెక్ట్స్ – ఏపీసీపీడీసీఎల్) » కె.శివప్రసాదరెడ్డి (ప్రాజెక్ట్స్ – ఏపీఎస్పీడీసీఎల్) -
ట్రాన్స్కో, జెన్కో డైరెక్టర్ పోస్టులకు నోటిఫికేషన్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర విద్యుత్ సరఫరా సంస్థ (టీఎస్ ట్రాన్స్కో), తెలంగాణ రాష్ట్ర విద్యుదుత్పాదన సంస్థ (టీఎస్ జెన్కో)లలో కొత్త డైరెక్టర్ల నియామకానికి రాష్ట్ర ప్రభుత్వం సోమవారం వేర్వేరు నోటిఫికేషన్లు జారీ చేసింది. ట్రాన్స్కో డైరెక్టర్ (గ్రిడ్, ట్రాన్స్మిషన్), డైరెక్టర్(ఫైనాన్స్), డైరెక్టర్ (ప్రాజెక్ట్స్) పోస్టులతోపాటు జెన్కో డైరెక్టర్ (జలవిద్యుత్), డైరెక్టర్ (థర్మల్, ప్రాజెక్టులు), డైరెక్టర్ (హెచ్ఆర్ అండ్ ఐఆర్), డైరెక్టర్ (కోల్–లాజిస్టిక్స్), డైరెక్టర్ (ఫైనాన్స్–కమర్షియల్) పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానించింది. దరఖా స్తుదారుల వయసు 62 ఏళ్లలోపు ఉండాలని స్పష్టం చేసింది. ట్రాన్స్కో, జెన్కో డైరెక్టర్ల పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి మార్చి 1ని చివరి తేదీగా నిర్ణయించింది. త్వరలోనే డిస్కమ్ల డైరెక్టర్ పోస్టులకు కూడా నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక.. ట్రాన్స్కో, జెన్కో, టీఎస్ఎస్పీడీసీఎల్, టీఎస్ఎన్పీడీసీఎల్ సంస్థల్లో డైరెక్టర్లుగా సంబంధిత విభాగాల్లో అనుభవం, పరిజ్ఞానం కలిగిన అర్హులైన ఇన్ సర్వీస్, రిటైర్డ్ విద్యుత్ అధికారులను ప్రభుత్వం ఎంపిక చేయనుంది. డైరెక్టర్ల నియమకానికి మార్గదర్శకాలను జారీ చేస్తూ 2012 మే 14న జారీ చేసిన జీవో 18 ప్రకారం.. ఇంధన శాఖ ముఖ్యకార్యదర్శి నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ ఇంటర్వ్యూ నిర్వహించి ఒక్కో డైరెక్టర్ పోస్టుకు ముగ్గురి పేర్లతో షార్ట్ లీస్టును రూపొందించి ప్రభుత్వానికి సిఫారసు చేయనుంది. ఈ కమిటీలో ఆయా విద్యుత్ సంస్థల సీఎండీలు కన్వీనర్లుగా, రాష్ట్ర ప్రభుత్వరంగ సంస్థల శాఖ ముఖ్యకార్యదర్శి, ప్రభుత్వం నామినేట్ చేసే విద్యుత్రంగ ఇండిపెండెంట్ ఎక్స్పర్ట్ సభ్యులుగా ఉండనున్నారు. కమిటీ సిఫారసు చేసిన షార్ట్ లిస్టు లోని ముగ్గురు వ్యక్తుల నుంచి ఒకరిని డైరెక్టర్గా నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. ఇక పదవీ కాలం రెండేళ్లు మాత్రమే.. డైరెక్టర్ పదవి కాలం రెండేళ్లు మాత్రమే. పనితీరును మదించడం ద్వారా సెలక్షన్ కమిటీ సిఫారసులతో మరో ఏడాది, ఆ తర్వాత కూడా ఇంకో ఏడాది పొడిగించడానికి వీలుంది. -
‘విద్యుత్’ డైరెక్టర్లకు ఉద్వాసన?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విద్యుత్ సంస్థల్లో సుదీర్ఘకాలం నుంచి డైరెక్టర్లుగా కొనసాగుతున్న వారికి ఉద్వాసన పలికేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. వారి స్థానంలో కొత్త డైరెక్టర్ల నియామకానికి కసరత్తు ప్రారంభించింది. రాష్ట్రంలో కొత్తగా కొలువుదీరిన కాంగ్రెస్ సర్కారు విద్యుత్ శాఖపై ప్రత్యేకంగా ఫోకస్ చేసిన విషయం తెలిసిందే. తెలంగాణ ట్రాన్స్కో, జెన్కో, టీఎస్ఎస్పీడీసీఎల్, టీఎస్ఎన్పిడీసీఎల్ తదితర సంస్థల చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్లు (సీఎండీ)గా ఐఏఎస్ అధికారులను నియమించింది. విద్యుత్ సంస్థల ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రాన్ని సైతం విడుదల చేసింది. తదుపరి చర్యగా కొత్త డైరెక్టర్ల నియామకం కోసం త్వరలో నోటిఫికేషన్ విడుదల చేయనుంది. సంబంధిత విభాగాల్లో అనుభవం, పరిజ్ఞానం కలిగిన అర్హులైన ఇన్సర్విస్, రిటైర్డ్ విద్యుత్ అధికారుల నుంచి దరఖాస్తులను ఆహ్వానించనుంది. 2012 మే 14న ఇంధన శాఖ జారీ చేసిన జీవో 18 ప్రకారం నియామకాలు చేపట్టనున్నారు. ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి, తెలంగాణ జెన్కో, ట్రాన్స్కోల ఇన్చార్జి సీఎండీ సయ్యద్ అలీ ముర్తుజా రిజ్వీ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ దరఖాస్తుదారులను ఇంటర్వ్యూ చేసి.. ఒక్కో డైరెక్టర్ పోస్టుకు ముగ్గురి పేర్లతో షార్ట్ లిస్టును రూపొందించి ప్రభుత్వానికి అందించనుంది. ఈ సెలెక్షన్ కమిటీలో ఆయా విద్యుత్ సంస్థల సీఎండీలు కన్వినర్లుగా, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల శాఖ ముఖ్య కార్యదర్శి, ప్రభుత్వం నామినేట్ చేసే విద్యుత్ రంగ స్వతంత్ర నిపుణుడు సభ్యులుగా ఉంటారు. కమిటీ సిఫార్సు చేసినవారి నుంచి డైరెక్టర్లను ప్రభుత్వం నియమించనుంది. అర్హతలు ఉంటేనే కొలువు గతంలో కనీస అర్హతలు లేనివారిని విద్యుత్ సంస్థల్లో డైరెక్టర్లుగా నియమించడంతోపాటు అడ్డగోలుగా పదవీ కాలాన్ని పొడిగించినట్టు ఆరోపణలున్నాయి. డైరెక్టర్గా ఎంపికయ్యే వారికి కనీసం చీఫ్ ఇంజనీర్గా మూడేళ్ల అనుభవం ఉండాల్సి ఉన్నా.. డీఈలుగా రిటైరైన వారిని సైతం నియమించి కీలక విభాగాలను అప్పగించినట్టు విమర్శలున్నాయి. దీంతో ఈసారి పక్కాగా నిబంధనలను అనుసరించి నియామకాలు జరపాలని నిర్ణయించి, పాత ఉత్తర్వులను వెలికితీశారు. ఆ ఉత్తర్వుల ప్రకారం డైరెక్టర్ పదవికి ఎంపిక కావాలంటే.. సంబంధిత విద్యుత్ విభాగాల కార్యకలాపాల్లో కనీసం 15 ఏళ్ల అనుభవంతోపాటు మొత్తంగా కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వాలు/ప్రభుత్వ రంగ సంస్థల్లో కనీసం 25 ఏళ్లు పనిచేసి ఉండాలి. కనీసం మూడేళ్లపాటు చీఫ్ ఇంజనీర్/చీఫ్ జనరల్ మేనేజర్/ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ లేదా తత్సమాన హోదాల్లో పనిచేసి ఉండాలి. నోటిఫికేషన్ నాటికి వయసు 65 ఏళ్లకు మించరాదు. పదవీకాలం రెండేళ్లే.. నిబంధనల ప్రకారం డైరెక్టర్ పదవీకాలం రెండేళ్లు మాత్రమే. పనితీరును మదించడం ద్వారా సెలెక్షన్ కమిటీ సిఫార్సులతో ఏడాది చొప్పున రెండుసార్లు పదవీకాలాన్ని పొడిగించడానికి వీలుంది. ప్రస్తుతం ట్రాన్స్కోలో నలుగురు, జెన్కోలో ఏడుగురు, టీఎస్ఎస్పీడీసీఎల్లో 8 మంది, ఎన్పిడీసీఎల్లో 8 మంది కలిపి మొత్తం 27 మంది డైరెక్టర్లు కొనసాగుతున్నారు. వీరిలో కొందరు ఉమ్మడి రాష్ట్రం నుంచీ, మరికొందరు తెలంగాణ ఏర్పాటైన నాటి నుంచీ కొనసాగుతున్నారు. తదుపరి ఆదేశాలు జారీచేసే వరకు వీరే డైరెక్టర్లుగా కొనసాగుతారంటూ గత ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో ఇలా సుదీర్ఘంగా కొనసాగుతున్నారు. కొందరి వయసు 85ఏళ్లకు చేరినా డైరెక్టర్లుగా ఉండటం గమనార్హం. ఇప్పుడు వీరంతా ఇంటిబాట పట్టనున్నారు. ట్రాన్స్కో కొత్త జేఎండీకి అందని బాధ్యతలు ఇటీవల ట్రాన్స్కో జేఎండీగా ఐఏఎస్ అధికారి సందీప్కుమార్ ఝాను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. అయితే సంస్థ సీఎండీ ముర్తుజా రిజ్వీ ఇంకా సందీప్కుమార్ ఝాకు అధికారికంగా ఎలాంటి బాధ్యతలు అప్పగించలేదు. ఆయన విద్యుత్ సౌధలోని రెండో అంతస్తులో ఖాళీగా కూర్చుంటున్నారు. గత ప్రభుత్వహయాంలో ట్రాన్స్కో జేఎండీగా ఆర్థిక వ్యవహారాల్లో కీలక పాత్ర పోషించిన సి.శ్రీనివాసరావునే ఆ పోస్టులో కొనసాగిస్తున్నారు. శ్రీనివాసరావు పదవీకాలం వచ్చే ఏప్రిల్లో ముగియనుంది. గత ప్రభుత్వ హయాంలో జరిగిన లావాదేవీలన్నీ శ్రీనివాసరావుకు తెలిసి ఉండటంతో.. ఆయనను పదవీకాలం ముగిసేవరకు కొనసాగించవచ్చనే అభిప్రాయం ఉంది. తర్వాత కూడా శ్రీనివాసరావును కొనసాగించాలని భావిస్తే.. కొత్త జేఎండీ సందీకుమార్ ఝాకు రెండో జేఎండీగా హెచ్ఆర్ వంటి విభాగాల బాధ్యతలు అప్పగించవచ్చని అంటున్నారు. -
జీవన్రెడ్డికి షాక్ల మీద షాక్లు
ఆర్మూర్: అధికారం చేజారగానే బీఆర్ఎస్కు చెందిన ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్రెడ్డికి ఆర్టీసీ, ట్రాన్స్కో అధికారులు ఏకకా లంలో బకాయిల వసూ లుకు చర్యలు ప్రారంభిస్తూ షాక్ ఇచ్చారు. పూర్వా పరాలిలా.. ఆర్మూర్ పట్టణంలోని టీఎస్ ఆర్టీసీ స్థలాన్ని జీవన్రెడ్డి సతీమణి రజితరెడ్డి తాను మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్న విష్ణుజిత్ ఇన్ఫ్ట్రా డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరిట లీజ్కు తీసుకుని మాల్ అండ్ మల్టిప్లెక్స్ పేరిట 5 అంతస్తుల భారీ షాపింగ్ మాల్ నిర్మించారు. గతేడాది దసరా రోజున ప్రారంభించిన ఈ మాల్లో రిలయన్స్ స్మార్ట్, ట్రెండ్స్, ఎలక్ట్రానిక్స్, కేఎఫ్సీ, పీవీఆర్ సినిమా హాళ్లకు అద్దెకు ఇచ్చారు. మొన్నటి వరకు జీవన్రెడ్డి అధికార పార్టీ ఎమ్మెల్యే కావడంతో ఈ మాల్ అద్దె బకా యిలు వసూలు చేయడంలో ఆర్టీసీ, ట్రాన్స్కో అధికారులు నిర్లక్ష్యం వహించారు. దీంతో విష్ణుజిత్ ఇన్ఫ్ట్రా డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ .. ఆర్టీసీకి చెల్లించాల్సిన అద్దె 7 కోట్ల 23 లక్షల 71 వేల 807 రూపాయలు, విద్యుత్కు సంబంధించి ట్రాన్స్కోకు 2 కోట్ల 57 లక్షల 20 వేల 2 రూపాయలు బకాయిలుగా పేరుకుపోయాయి. ఇప్పుడు రాష్ట్రంలో, నియోజకవర్గంలో అధికార మార్పు జరగగానే ఆర్టీసీ, ట్రాన్స్కో అధికారులు ఈ బకాయిల వసూళ్లకు నడుం బిగించారు. మూడు రోజుల్లో చెల్లించాలి ఆర్టీసీ నిజామాబాద్ ఆర్ఎం జానీరెడ్డి, ఆర్మూర్ డిపో ఇన్చార్జి మేనేజర్ పృథ్వీరాజ్ గౌడ్ ఆధ్వర్యంలో హైదరాబాద్కు చెందిన పోలీసు అధికారులు తోడు రాగా జీవన్ మాల్లో గురువారం హెచ్చరికలు జారీ చేసారు. మూడు రోజుల్లో లీజుదారులు అద్దె బకాయిలు చెల్లించని పక్షంలో మల్టీప్లెక్స్ను సీజ్ చేస్తామంటూ మైక్లో హెచ్చరించారు. మరో వైపు ట్రాన్స్కో ఆర్మూర్ ఏడీఈ శ్రీధర్ ఆధ్వర్యంలో ట్రాన్స్కో అధికారులు సైతం మూడు రోజుల్లో బకాయిలు చెల్లించాలంటూ విద్యుత్ సరఫరా నిలిపివేశారు. దీంతో షాపింగ్ మాల్కు జనరేటర్లతో విద్యుత్ సరఫరా చేస్తున్నారు. -
భారీగా విద్యుత్ డిమాండ్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో అనూహ్యంగా విద్యుత్ డిమాండ్ భారీగా పెరిగింది. ఆగస్టు మొదటివారం నుంచి మళ్లీ వర్షాభావ పరిస్థితులు నెలకొని ఉండడమే ఇందుకు కారణం. రాష్ట్రంలోని 31లక్షలకు పైగా వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. వర్షాలు లేక బోరుబావుల కింద ఉచిత విద్యుత్ బాగా వాడేస్తున్నారు. పంటలను రక్షించుకోవడానికి రైతులు పెద్దఎత్తున విద్యుత్ వినియోగిస్తున్నారు. దీంతో గతవారం రోజులుగా రాష్ట్రంలో రోజువారీ గరిష్ట విద్యుత్ డిమాండ్ 13వేల మెగావాట్లకు మించిపోయింది. ఈ నెల 11న అత్యధికంగా 13,829 మెగావాట్ల గరిష్ట విద్యుత్ డిమాండ్ నమోదైంది. అదేరోజు జాతీయస్థాయిలో గరిష్ట విద్యుత్ డిమాండ్ 2,28,963 మెగావాట్లకు చేరి కొత్త రికార్డు నెలకొల్పింది. సాధారణంగా వేసవిలో డిమాండ్ ఈ స్థాయిలో పెరుగుతూ ఉంటుంది. గత నెలాఖరులో ఎడతెరిపి లేకుండా భారీవర్షాలు కురవడంతో అప్ప ట్లో రోజువారీగా రాష్ట్రస్థాయిలో గరిష్ట విద్యుత్ డి మాండ్ 8వేల మెగావాట్లలోపు మాత్రమే నమోదైంది. గత నెల 27న అయితే గరిష్ట డిమాండ్ ఏకంగా 6904 మెగావాట్లకు పడిపోయింది. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో గరిష్ట విద్యుత్ డిమాండ్ త్వరలో 14వేల మెగావాట్లకు చేరే అవకాశాలున్నాయని ట్రాన్స్కో యాజమాన్యం అంచనా వేస్తోంది. జల విద్యుదుత్పత్తిపై కరువు నీడలు కృష్ణా బేసిన్లో తీవ్ర వర్షాభావం కారణంగా ఈ ఏడాది శ్రీశైలం, నాగార్జునసాగర్ జలవిద్యుత్ కేంద్రాల్లో విద్యుదుత్పత్తి ప్రశ్నార్థకంగా మారింది. కనీసం 3000 మిలియన్ యూనిట్ల(ఎంయూ) జలవిద్యుత్ ఉత్పత్తి చేయాలని ప్రతి ఏటా తెలంగాణ జెన్కో లక్ష్యంగా పెట్టుకుంటుంది. ప్రస్తుత పరిస్థితుల్లో కనీసం 1000 ఎంయూలు కూడా ఉత్పత్తి చేసే పరిస్థితి కనిపించడం లేదు. శ్రీశైలం, సాగర్ జలాశయాలు ఈ ఏడాది పూర్తిస్థాయిలో నిండే పరిస్థితి లేదు. ఇంకా శ్రీశైలం ప్రాజెక్టు నిండాలంటే 97 టీఎంసీలు, నాగార్జునసాగర్ నిండాలంటే 166 టీఎంసీల వరద ఎగవ నుంచి రావాలి. ఆదివారం నాటికి శ్రీశైలం జలాశయానికి కృష్ణానది ఎగువ నుంచి ఇన్ఫ్లో పూర్తిగా నిలిచిపోయింది. రోజూ రూ.30 కోట్ల విద్యుత్ కొనుగోళ్లు ప్రస్తుతం జలవిద్యుత్ ఉత్పత్తికి అవకాశం లేకపోవడంతో గరిష్ట డిమాండ్ నెలకొని ఉండే వేళల్లో నిరంతర విద్యుత్ కొనసాగించడానికి పవర్ ఎక్ఛ్సేంజీల నుంచి రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లు పెద్దఎత్తున విద్యుత్ కొనుగోళ్లు చేస్తున్నాయి. రోజూ రూ.30 కోట్ల వ్యయంతో 60 ఎంయూల విద్యుత్ను ఎక్ఛ్సేంజీల నుంచి కొనుగోలు చేస్తున్నాయి. ఇప్పటికే తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్న డిస్కంలకు రోజువారీ విద్యుత్ కొనుగోళ్లు తీవ్ర భారంగా మారాయి. -
ఏపీ ట్రాన్స్కోలో నకిలీ లేఖ కలకలం
సాక్షి, అమరావతి: ఏపీ ట్రాన్స్కోలో నకిలీ లేఖ కలకలం రేపింది. ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలపై సోషల్ మీడియాలో ప్రత్యక్షమైన ఆ ఆదేశాల ప్రతులు నిజం కాదని, అదంతా తప్పుడు ప్రచారమని ట్రాన్స్కో అదనపు కార్యదర్శి వి.శ్రీనివాసరావు స్పష్టం చేశారు. శుక్రవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. 17 మంది ఔట్ సోర్సింగ్ సిబ్బందిని విధుల్లోకి తీసుకోమని చీఫ్ ఎలక్ట్రికల్ ఇంజనీర్కు తాను రాసినట్లుగా చక్కర్లు కొడుతున్న లేఖ అబద్ధమని తెలిపారు. ఏపీ ట్రాన్స్కోకి సంబంధించి శాశ్వత ప్రాతిపదికన చేపట్టే నియామకాలు, ఉద్యోగ ప్రకటనలు ట్రాన్స్కో, ఇతర విద్యుత్ సంస్థల అధికారిక వెబ్సైట్లు, ప్రింట్ మీడియాలో ప్రకటన ద్వారా తెలియజేస్తామని వివరించారు. ఇలాంటి నకిలీ వార్తలను ప్రచారం చేసిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని శ్రీనివాసరావు హెచ్చరించారు. ఇది కూడా చదవండి: ఛీటింగ్ ‘మార్గం' మూత! -
తెలంగాణ ఆవిర్భావం తర్వాత.. 9 సంవత్సరాలు.. రూ.97,321 కోట్లు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రంలో విద్యుదుత్పత్తి, సరఫరా, పంపిణీ వ్యవస్థల బలోపేతానికి రూ.97,321 కోట్ల ఖర్చు చేశామని తెలంగాణ ట్రాన్స్కో, జెన్కో సీఎండీ డి.ప్రభాకర్రావు తెలిపారు. తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సోమవారం విద్యుత్ సౌధ, మింట్ కాంపౌండ్లోని టీఎస్ఎస్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ‘విద్యుత్ విజయోత్సవ దినం’కార్యక్రమాల్లో మాట్లాడారు. రాష్ట్ర తలసరి విద్యుత్ వినియోగం 2022–23లో 2140 యూనిట్లుగా, జాతీయ సగటుతో పోలి్చతే 70శాతం అధికంగా నమోదైందని తెలిపారు. విద్యుత్ పంపిణీ వ్యవస్థ అభివృద్ధికి 9 ఏళ్లలో రూ.14,063 కోట్లు ఖర్చు చేశామని టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎండీ జి.రఘుమారెడ్డి అన్నారు. వినియోగదారుల సమస్యలను సత్వరంగా పరిష్కరించి సంస్థకు మంచి పేరు తీసుకురావాలని ఉద్యోగులకు సూచించారు. కార్యక్రమాల్లో ఎమ్మెల్యే దానం నాగేందర్, ట్రాన్స్కో జేఎండీ సి.శ్రీనివాసరావు, విద్యుత్ సంస్థల డైరెక్టర్లు, ఉద్యోగులు పాల్గొన్నారు. చదవండి: ఉగ్రవాదులు టార్గెట్ చేసిన రాష్ట్రాలు ఏవి? -
సమ్మె ప్రభావం లేదు
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ సంస్థలపై ఆర్టీజన్ల సమ్మె ప్రభావం లేదని, విద్యుత్ సరఫరాలో సైతం ఎలాంటి అంతరాయాలు లేవని తెలంగాణ ట్రాన్స్కో, జెన్కో సీఎండీ డి.ప్రభాకర్ రావు తెలిపారు. విద్యుదుత్పత్తి సంస్థ (జెన్కో)లో 100 శాతం, సరఫరా (ట్రాన్స్కో), పంపిణీ సంస్థ (డిస్కం)ల్లో 80 శాతం మంది ఆర్టీజన్లు మంగళవారం విధులకు హాజరయ్యారని ఒక ప్రకటనలో తెలిపారు. మంగళవారం నుంచి ఆర్టిజన్ల (విద్యుత్ సంస్థల్లో విలీనమైన కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు) సమ్మెకి తెలంగాణ విద్యుత్ ఉద్యోగుల సంఘం (హెచ్ 82) పిలుపునిచ్చి న నేపథ్యంలో దాని ప్రభావాన్ని అంచనా వేసేందుకు విద్యుత్ సౌధలో ఆయన సమీక్ష నిర్వహించారు. అత్యవసర సేవల నిర్వహణ చట్టం (ఎస్మా) కింద విద్యుత్ సంస్థల్లో సమ్మెలపై నిషేధం అమల్లో ఉందని, దీనిని ఉల్లంఘించి సమ్మెకి దిగితే ఆర్టీజన్ల సర్వీసు నిబంధనలైన ‘స్టాండింగ్ ఆర్డర్స్’లోని నిబంధన 34(20) ప్రకారం దు్రష్పవర్తనగా పరిగణించి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. చట్టవిరుద్ధంగా సమ్మెకి దిగిన 200 మంది ఆర్టీజన్లను ట్రాన్స్కో, జెన్కో, డిస్కంల నుంచి తొలగించినట్టు తెలిపారు. రాష్ట్రంలోని వినియోగదారులకు 24 గంటల విద్యుత్ సరఫరాకు ఆటంకం కలిగించే దుశ్చర్యలను ఉపేక్షించబోమని, ఈ మేరకు సీఎం కేసీఆర్ ఆదేశాలున్నాయని స్పష్టం చేశారు. బుధవారం ఉదయంలోగా విధులకు హాజరుకాని వారందర్నీ తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేస్తామని తెలిపారు. యూనియన్ నేతలు డిస్మిస్.. సమ్మె పిలుపు నేపథ్యంలో ఉద్యోగుల సంఘం (హెచ్ 82) ప్రధాన కార్యదర్శి ఎస్.సాయిలు, నేతలు నరేష్, సత్యనారాయణ, వినోద్, సుభా‹Ùలను సోమవారం పంజాగుట్ట పోలీసులు ఎస్మా చట్టం కింద అరెస్టు చేయగా, మంగళవారం కోర్టు వారికి బెయిల్ మంజూరు చేసింది. మరో ఇద్దరు నేతలు బాల్రెడ్డి, కావలి వెంకటేశ్వర్లును సైఫాబాద్ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారని యూనియన్ నేతలు వెల్లడించారు. సమ్మెలో పాల్గొనడం, ఉద్యోగులను సమ్మెకి పురిగొల్పారనే ఆరోపణలపై ఎంప్లాయీస్ యూనియన్ (హెచ్ 82) ప్రధాన కార్యదర్శి సాయిలును ఆర్టీజన్ గ్రేడ్–2 ఉద్యోగం నుంచి తొలగిస్తూ ట్రాన్స్కో సీఎండీ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇదే అరోపణలపై యూనియన్ హెల్త్ సెక్రటరీ జె.శివశంకర్ను ఆర్టీజన్ గ్రేడ్–1 ఉద్యోగం నుంచి తొలగిస్తూ టీఎస్ఎస్పీడీసీఎల్ ఉత్తర్వులు జారీ చేసింది. మరి కొంతమంది యూనియన్ నేతలను కూడా ఉద్యోగాల నుంచి తొలగించినట్టు సమాచారం. కాగా, ట్రాన్స్కోలో 80 శాతంమంది, జెన్కో, డిస్కంలలో కలిసి 60 శాతం ఆర్టీజన్లు సమ్మెలో పాల్గొన్నారని సాయిలు ఒక ప్రకటనలో వెల్లడించారు. బుధవారం మరింత మంది సమ్మెకి దిగుతార చెప్పారు. -
15,254 మెగావాట్ల గరిష్ట డిమాండ్
సాక్షి, హైదరాబాద్: గరిష్ట విద్యుత్ డిమాండ్లో రాష్ట్రం కొత్త చరిత్ర సృష్టించింది. మంగళవారం ఉదయం 10:03 గంటలకు రాష్ట్రంలో విద్యుత్ పీక్ డిమాండ్ 15,254 మెగావాట్లుగా నమోదైంది. విద్యుత్ డిమాండ్ 15 వేల మెగావాట్లకు మించడం ఇదే తొలిసారి. ఈ నెలలోనే నమోదైన 14,750 మెగావాట్ల పీక్ డిమాండ్ను మంగళవారం రాష్ట్రం అధిగమించింది. గతేడాది మార్చిలో 14,160 మెగావాట్లుగా పీక్ డిమాండ్ నమోదైంది. వేసవి మొదలవడంతో వ్యవసాయ, గృహ అవసరాల విద్యుత్ వినియోగం భారీగా పెరిగిపోయింది. ఇళ్లు, ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, వాణిజ్య సంస్థల్లో ఏసీలు, ఇతర ఉపకరణాల వాడకం పెరిగింది. రాష్ట్రంలోని 30 లక్షల వ్యవసాయ బోరుబావుల కింద సాగు చేస్తున్న పంటలకు నీటి సరఫరా కోసం రైతులు భారీగా విద్యుత్ వినియోగిస్తున్నారు. దీనికితోడు సాగు విస్తీర్ణం పెరగడం కూడా విద్యుత్ వినియోగాన్ని పెంచింది. పారిశ్రామిక విద్యుత్ డిమాండ్ సైతం గణనీయంగా పెరిగిపోయింది. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలోని రెండు పంప్హౌస్ల ద్వారా నీటిని ఎత్తిపోయడానికి 600 మెగావాట్ల విద్యుత్ను వినియోగిస్తున్నారు. దీంతో రోజువారీ విద్యుత్ డిమాండ్ విపరీతంగా పెరిగిపోయిందని విద్యుత్ సంస్థల వర్గాలు పేర్కొంటున్నాయి. మార్చి చివరి వరకు పీక్ విద్యుత్ డిమాండ్ 16,000 మెగావాట్లకు పెరిగే అవకాశముందని అంచనా వేస్తున్నారు. ఆ మేరకు విద్యుత్ సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ట్రాన్స్కో తెలిపింది. 13 రోజుల్లో రూ.600 కోట్ల విద్యుత్ కొనుగోళ్లు వేసవిలో విద్యుత్ డిమాండ్ పెరగడంతో నిరంతర విద్యుత్ సరఫరాకు వీలుగా విద్యుత్ సంస్థలు ఎఎక్స్చేంజి ల నుంచి భారీ స్థాయిలో విద్యుత్ కొనుగోళ్లు చేస్తున్నాయి. ఈ నెలలో గత 13 రోజుల్లో రూ. 600 కోట్ల వ్యయంతో 930 మిలియన్ యూనిట్ల విద్యుత్ను కొనుగోలు చేశాయి. రోజుకు సగటున రూ. 45 కోట్ల వ్యయంతో 72 మిలియన్ యూనిట్ల విద్యుత్ను కొన్నాయి. నిరంతర విద్యుత్ సరఫరాకు అవసరమైన విద్యుత్ను కొనుగోలు చేసేందుకు రూ. 4 వేల కోట్ల రుణాలను ప్రభుత్వ పూచికత్తుతో తీసుకోవడానికి అనుమతిస్తూ గత నెలలో రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆర్ఈసీ, పీఎఫ్సీల నుంచి రూ. 3 వేల కోట్ల రుణం కోసం రాష్ట్ర విద్యుత్ సంస్థలు దరఖాస్తు చేసుకున్నాయి. త్వరలో ఈ మేరకు రుణం విడుదల కానుంది. -
31లోగా ‘వేతన’ ప్రకటన చేయాలి
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ ఉద్యోగుల వేతన సవరణపై ఈ నెల 31లోగా ప్రకటన చేయాలని, లేనిపక్షంలో వచ్చే నెల 2 నుంచి ఆందోళనలు ఉధృతం చేస్తామని తెలంగాణ స్టేట్ పవర్ ఎంప్లాయీస్ జేఏసీ ప్రకటించింది. ఫిబ్రవరి 1న నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలియజేస్తామని, 2న విద్యుత్ సౌధ ముట్టడి, మహాధర్నా నిర్వహిస్తామని వెల్లడించింది. జేఏసీ నేతలు మంగళవారం విద్యుత్ సౌధలో తెలంగాణ ట్రాన్స్కో, జెన్కో సీఎండీ డి.ప్రభాకర్ రావును కలిసి వినతిపత్రం అందజేశారు. అమల్లో ఉన్న విద్యుత్ ఉద్యోగుల వేతన సవరణ గడువు గతేడాది మార్చి 31తో ముగిసిపోగా, అదే ఏడాది ఏప్రిల్ 1 నుంచి కొత్త పీఆర్సీ అమలు చేయాల్సి ఉందని నేతలు జి.సాయి బాబు, రత్నాకర్రావు, శ్రీధర్ ఒక ప్రకటనలో తెలిపారు. కొత్త పీఆర్సీపై గతేడాది మే 30న సంప్రదింపుల కమిటీని విద్యుత్ సంస్థల యాజమాన్యాలు ఏర్పాటు చేసినా, ఇప్పటి వరకు పీఆర్సీపై ప్రకటన చేయలేదన్నారు. 1999, అక్టోబర్ 2 నుంచి 2004, ఆగస్టు 31 మధ్యకాలంలో నియమితులైన విద్యుత్ ఉద్యోగులకు ఈపీఎఫ్కి బదులు జీపీఎఫ్ను అమలు చేయాలన్నారు. -
అద్దెకివ్వండి.. ఆదాయం పొందండి!
సాక్షి, అమరావతి: విద్యుత్ రంగంలో కేంద్ర ప్రభుత్వం మొదలుపెట్టిన సంస్కరణల్లో భాగంగా మరో ప్రయత్నానికి శ్రీకారం చుట్టింది. దేశ వ్యాప్తంగా విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)ల అప్పులు రూ.1.32 లక్షల కోట్లకు చేరడంతో వాటి వసూలుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్న కేంద్రం.. తాజాగా రాష్ట్రాలకు ఓ మార్గాన్ని చూపింది. గతేడాది అమల్లోకి తెచ్చిన ఎలక్ట్రిసిటీరూల్స్–2021(ట్రాన్స్మిషన్ సిస్టమ్ ప్లానింగ్, డెవలప్మెంట్ అండ్ రికవరీ ఆఫ్ ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ చార్జెస్)కు కొనసాగింపుగా మరికొన్ని నిబంధనలను ప్రవేశపెడుతూ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. తద్వారా రాష్ట్రాలు తమ ఆధీనంలోని విద్యుత్ సరఫరా నెట్వర్క్ను అమ్ముకునేందుకు, ఇతరుల నుంచి కొనుక్కునేందుకు, లీజుకు ఇవ్వడానికి అవకాశం కల్పించింది. ఈ వెసులుబాట్లతో విద్యుత్ సంస్థలు ఆదాయాన్ని ఆర్జించి అప్పుల ఊబి నుంచి బయటపడతాయని కేంద్రం చెబుతోంది. నెట్వర్క్ సమస్యకు చెక్ ఆంధ్రప్రదేశ్ పవర్ ట్రాన్స్మిషన్ కార్పొరేషన్(ఏపీ ట్రాన్స్కో)కు ప్రస్తుతం 5,532.161 సీకేఎం(సర్క్యూట్ కిలోమీటర్ల) మేర 400 కేవీ ట్రాన్స్మిషన్ లైన్లు, 12,200.9 సీకేఎం మేర 220 కేవీ ట్రాన్స్మిషన్ లైన్లు, 13,568.18 సీకేఎం మేర 132 కేవీ ట్రాన్స్మిషన్ లైన్లు ఉన్నాయి. మొత్తంగా 400 కేవీ, 220 కేవీ,132 కేవీ ట్రాన్స్మిషన్ లైన్లు 354 ఉండగా, వాటి ద్వారా రాష్ట్రంలోని తూర్పు, మధ్య, దక్షిణ ప్రాంత విద్యుత్ సంస్థలకు ఏడాదికి సగటున 70 వేల మిలియన్ యూనిట్ల విద్యుత్ను పంపిణీ చేస్తున్నారు. ఈ కార్పొరేషన్ యాజమాన్యంలోని అంతర్రాష్ట్ర ట్రాన్స్మిషన్ లైన్లను ప్రయివేటుకు ఇచ్చేందుకు వీలు కల్పిస్తూ కేంద్రం మార్గదర్శకాలు విడుదల చేసింది. డిస్కంల ఆధీనంలోని ట్రాన్స్మిషన్ లైన్ల లీజుకు అవకాశం కల్పించింది. దీని ప్రకారం ప్రస్తుతం ఉన్న లైన్లను అద్దె ప్రాతిపదికన ఇకపై ఎవరికైనా ఇవ్వొచ్చు. భవిష్యత్లో రానున్న ప్రైవేటు డిస్కంలకు నెట్వర్క్ సమస్యలు రాకుండా చూడటం దీని ప్రధాన ఉద్దేశం. ఇదీ చదవండి: రూ.10 వేల కోట్లతో చేపట్టనున్న ప్రాజెక్టులకు మోదీ శంకుస్థాపన! -
ట్రాన్స్కో ఆస్తులు ప్రైవేటుకు!
విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)ల ప్రైవేటీకరణ కోసం కేంద్రం విద్యుత్ చట్ట సవరణ బిల్లు–2022ను ఇటీవల పార్లమెంట్లో ప్రవేశపెట్టడంతో దేశవ్యాప్తంగా అలజడి రేగింది. దానితో బిల్లును పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి పంపారు. కానీ కేంద్రం కొత్తగా విద్యుత్ ట్రాన్స్మిషన్ సంస్థ (ట్రాన్స్కో)ల ఆస్తుల ప్రైవేటీకరణకు మార్గదర్శకాలను జారీ చేసింది. విద్యుత్ రంగంలో జనరేషన్ (ఉత్పత్తి), ట్రాన్స్మిషన్ (సరఫరా), డిస్ట్రిబ్యూషన్ (పంపిణీ) అనే మూడు ఉప రంగాలుండగా.. ఇప్పటికే జనరేషన్, డిస్ట్రిబ్యూషన్లో ప్రైవేటు సంస్థలు రంగ ప్రవేశం చేశాయి. ఇప్పుడు ట్రాన్స్మిషన్ రంగం సైతం ప్రైవేటుపరం కానుంది. సాక్షి, హైదరాబాద్: విద్యుత్ ట్రాన్స్మిషన్ వ్యవస్థ (ట్రాన్స్కో)ల ఆస్తులను గంపగుత్తగా ప్రైవేటుపరం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం సూచించింది. ‘అక్వైర్, ఆపరేట్, మెయింటైన్, ట్రాన్స్ఫర్ (ఏఓఎంటీ)’ఆధారిత పబ్లిక్, ప్రైవేటు భాగస్వామ్య (పీపీపీ) విధానంలో ఈ ఆస్తులను జీవితకాలం పాటు ప్రైవేటుకు అప్పగించాలని ప్రతిపాదించింది. ఈ విధానం ద్వారా ఆదాయాన్ని ఆర్జించేందుకు (అసెట్స్ మానిటైజేషన్) అనుసరించాల్సిన విధివిధానాలను మంగళవారం కేంద్ర విద్యుత్ శాఖ విడుదల చేసింది. మౌలిక సదుపాయాల కల్పనకు ముఖ్యమైన మార్గం ఇదేనని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్టు మార్గదర్శకాల్లో తెలిపింది. ప్రైవేటుపరం చేయడం ద్వారా ట్రాన్స్మిషన్ రంగంలో నాణ్యమైన సదుపాయాల కల్పనతోపాటు ఉద్యోగ, ఉపాధి అవకాశాల పెంపు, నిస్సహాయుల సాధికారత, ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదల సాధ్యమవుతుందని పేర్కొంది. ప్రైవేటుపరం చేయడం ద్వారా వచ్చే డబ్బులను ట్రాన్స్మిషన్ రంగ మౌలిక సదుపాయాల అభివృద్ధికి వినియోగించాలని రాష్ట్రాలకు సూచించింది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ పవర్గ్రిడ్ కార్పొరేషన్కు సంబంధించిన ఐదు ట్రాన్స్మిషన్ ఆస్తులను ప్రైవేటుపరం చేయడం ద్వారా 2021 మేలో రూ.7,700 కోట్లను ఆర్జించినట్టు తాజా ప్రతిపాదనల్లో కేంద్రం తెలిపింది. రాష్ట్రాలు సైతం ట్రాన్స్మిషన్ ఆస్తులను ప్రైవేటుపరం చేసేందుకు విస్తృత అవకాశాలు ఉన్నాయని స్పష్టం చేసింది. 2020 మార్చి నాటికి దేశంలో 66 కేవీ, ఆపై సామర్థ్యం కలిగిన 7,13,400 సర్క్యుట్ కిలోమీటర్ల ట్రాన్స్మిషన్ నెట్వర్క్ ఉందని.. దానిని ప్రైవేటుపరం చేసేందుకు వీలుందని కేంద్రం ప్రతిపాదించింది. నామమాత్రపు బుక్ విలువ ఆధారంగా.. కేంద్రం ప్రతిపాదించిన విధానం ప్రకారం.. 66 కేవీ, ఆపై సరఫరా సామర్థ్యం కలిగిన విద్యుత్ ట్రాన్స్మిషన్ లైన్లు, సబ్ స్టేషన్లు, ట్రాన్స్ఫార్మర్లు వంటి ఆస్తులను తొలుత ఆయా ట్రాన్స్కోలు గుర్తించాలి. వీటిలో కొన్ని ఆస్తులను ఒక గొడుగు కింద చేర్చి ‘స్పెషల్ పర్పస్ వెహికల్ (ఎస్పీవీ)గా ఏర్పాటు చేయాలి. ఒక్కో ఎస్పీవీని ఒక సంస్థగా పరిగణిస్తూ ఈఆర్సీ నుంచి ట్రాన్స్మిషన్ లైసెన్స్ తీసుకోవాలి. అనంతరం ఒక్కో ఎస్పీవీ ఆస్తుల విక్రయాలకు అంతర్జాతీయ బిడ్లను ఆహ్వానించాలి. అత్యధిక రేటు సూచించిన సంస్థకు ఈ ఆస్తులపై హక్కులను, నిర్వహణ బాధ్యతలను నిర్దేశిత కాలం పాటు అప్పగిస్తారు. ఈ ప్రైవేటు సంస్థలు ఈఆర్సీ నుంచి ట్రాన్స్మిషన్ లైసెన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. నామమాత్రంగా ఉండే బుక్ విలువ ఆధారంగా బిడ్డింగ్ జరుగుతుంది. అయితే సదరు ఆస్తుల నిర్దేశిత జీవితకాలం ముగిసిన తర్వాత.. ప్రైవేటు సంస్థలు వాటిని తిరిగి ట్రాన్స్కోకు ఒక్క రూపాయి నామమాత్రపు ధరకు తిరిగి అప్పగించాల్సి ఉంటుంది. సాధారంగా 35 ఏళ్ల కాలానికి ట్రాన్స్మిషన్ ఆస్తులను ప్రైవేటుపరం చేసే అవకాశం ఉందని విద్యుత్ రంగ నిపుణులు చెప్తున్నారు. సదరు ట్రాన్స్మిషన్ వ్యవస్థ ద్వారా 35 ఏళ్ల పాటు వచ్చే ఆదాయాన్ని ప్రైవేటు సంస్థలు పొందనున్నాయి. -
‘చీకటి’ కథనాలు ఉత్తదే
సాక్షి, అమరావతి: ‘అప్పుల చీకట్లో డిస్కంలు’ శీర్షికతో ‘ఈనాడు’ అసంబద్ధ కథనాన్ని ప్రచురించటాన్ని ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ ఖండించారు. 2022–23 ఆర్థ్ధిక సంవత్సరానికి విద్యుత్ పంపిణీ సంస్థలు ఆగస్టు నాటికి నెలవారీ వాయిదా కింద చెల్లించాల్సిన అప్పులు రూ.24,838 కోట్లేనని చెప్పారు. డిస్కంల అప్పులు రూ.56 వేల కోట్లు దాటాయని అసత్యాలతో నిరాధార కథనాన్ని ప్రచురించటాన్ని తప్పుబడుతూ సోమవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వం చెల్లించాల్సిన సబ్సిడీ, వివిధ శాఖలు, స్థానిక సంస్థలు వినియోగించిన విద్యుత్ చార్జీలను వసూలు చేయడం ద్వారా నెలవారీ అప్పులు, జీతభత్యాలు, ఇతర ఖర్చులను సకాలంలో చెల్లిస్తున్నట్లు తెలిపారు. కేంద్రం కొత్తగా తెచ్చిన ఎలక్ట్రిసిటీ లేట్ పేమెంట్ సర్చార్జీ (ఎల్పీఎస్) పథకంలో చేరి మొదటి వాయిదాగా గత నెలలో రూ.1,422 కోట్లు చెల్లించినట్లు గుర్తు చేశారు. ఈ ఏడాది జూన్ 3 వరకు బకాయిలను పవర్ పీఎఫ్సీ, ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఆర్ఈసీ) లిమిటెడ్ ద్వారా చెల్లిస్తున్నట్లు చెప్పారు. దీనివల్ల ఆలస్య రుసుము భారం నుంచి మినహాయింపు లభించి డిస్కంలకు ఆర్థికంగా కొంత మేర వెసులుబాటుగా ఉన్నట్లు తెలిపారు. -
రాష్ట్ర కరెంటు కొనుగోళ్లపై కేంద్రం నిషేధం !
-
రాష్ట్ర కరెంటు కొనుగోళ్లపై కేంద్రం నిషేధం!
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా విద్యుత్ క్రయ విక్రయాలు జరిగే ‘ఇండియన్ ఎనర్జీ ఎక్స్చేంజీ (ఐఈఎక్స్)’నుంచి లావాదేవీలు జరపకుండా రాష్ట్రంపై కేంద్రం నిషేధం విధించింది. కరెంటు కొనుగోలు చేయడానికి, విక్రయించడానికి వీలు లేదని, గురువారం అర్ధరాత్రి నుంచే దీన్ని అమల్లోకి తెస్తున్నామని పేర్కొంది. తెలంగాణ, ఏపీలతోపాటు దేశవ్యాప్తంగా 13 రాష్ట్రాలకు చెందిన 29 విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లకు ఈ నిషేధం వర్తిస్తుందని ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర విద్యుత్ శాఖ పరిధిలోని పవర్ సిస్టమ్ ఆపరేషన్ కార్పొరేషన్ (పొసోకో) ఆయా రాష్ట్రాలకు వర్తమానం పంపింది. రూ.1,380 కోట్ల బకాయిలు రాష్ట్రంలోని ఉత్తర తెలంగాణ పంపిణీ సంస్థ (టీఎస్ఎన్పీడీసీఎల్) రూ.104.6 కోట్లు, దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ఎస్పీడీసీఎల్) రూ.197.67 కోట్లు, తెలంగాణ స్టేట్ పవర్ కోఆర్డినేషన్ కంపెనీ (టీఎస్పీసీసీ) రూ.1,078.69 కోట్లు కలిపి సుమారు రూ.1,380 కోట్ల మేర విద్యుత్ బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఇదే తరహాలో దేశవ్యాప్తంగా చాలా విద్యుత్ సరఫరా సంస్థలు గడువు తీరి నెల రోజులైనా విద్యుదుత్పత్తి కంపెనీలకు బకాయిలు చెల్లించలేదని కేంద్ర విద్యుత్ శాఖ తన ‘ప్రాప్తి వెబ్ పోర్టల్లో ప్రకటించింది. దేశవ్యాప్తంగా 13 రాష్ట్రాల్లోని 29 విద్యుత్ సంస్థల బకాయిలు రూ.5,085.30 కోట్లకు చేరాయని తెలిపింది. అవసరానికి కొనుగోళ్ల కోసం.. విద్యుత్ లభ్యతకు మించి డిమాండ్ ఉన్న రాష్ట్రాలు ఆ లోటును పూడ్చుకోవడానికి ఎనర్జీ ఎక్స్చేంజీ నుంచి విద్యుత్ కొనుగోలు చేస్తుంటాయి. అలాగే విద్యుత్ డిమాండ్ తగ్గి, మిగిలిపోయినప్పుడు దానిని ఎనర్జీ ఎక్స్చేంజీలో విక్రయిస్తుంటాయి. కేంద్రం తాజాగా నిషేధం విధించడంతో ఆయా రాష్ట్రాలు విద్యుత్ కొనుగోలు, అమ్మకాల అవకాశాన్ని కోల్పోనున్నాయి. తెలంగాణ బుధవారం ఎనర్జీ ఎక్స్చేంజీ నుంచి ఏకంగా 1980 మెగావాట్ల విద్యుత్ను కొనుగోలు చేయడం గమనార్హం. ప్రధానంగా విద్యుత్ డిమాండ్ గరిష్టంగా ఉండే సమయాల్లో రాష్ట్రం కొనుగోలు చేస్తోంది. ప్రస్తుతం కేంద్రం విధించిన నిషేధంతో రాష్ట్రంలో నిరంతర విద్యుత్ సరఫరాపై ఎలాంటి ప్రభావం ఉండబోదని తెలంగాణ ట్రాన్స్కో, జెన్కోల సీఎండీ డి.ప్రభాకర్రావు తెలిపారు. ప్రాప్తి పోర్టల్లో పేర్కొన్న బకాయిలన్నింటినీ చెల్లించామని, తమపై నిషేధాన్ని తొలగించాలని ఆయన పోసోకోకు లేఖ రాశారు. ప్రస్తుతానికి ప్రభావం తక్కువే! రాష్ట్రంలో విస్తారంగా వానలు పడుతుండటంతో ప్రస్తుతం వ్యవసాయ విద్యుత్ డిమాండ్ తక్కువగా ఉంది. ఇదే సమయంలో కృష్ణా, గోదావరి నదులకు భారీగా వరద వస్తుండటంతో శ్రీశైలం, సాగర్, జూరాల, పులిచింతల ప్రాజెక్టుల్లో గణనీయంగా విద్యుదుత్పత్తి జరుగుతోంది. అందువల్ల ఎనర్జీ ఎక్స్చేంజీ నుంచి విద్యుత్ కొనుగోళ్లపై నిషేధం ప్రభావం పెద్దగా కనబడే అవకాశం లేవు. వానలు తగ్గితే మాత్రం అక్కడక్కడా కోతలు విధించే పరిస్థితి ఎదురుకానుంది. ఇక బిల్లులు చెల్లించకుంటే రాష్ట్రాలకు కరెంట్ కట్ కేంద్ర ప్రభుత్వం గత జూన్లో అమల్లోకి తెచ్చిన లేట్ పేమెంట్ సర్చార్జీ రూల్స్–2022 ప్రకారం.. విద్యుదుత్పత్తి కంపెనీల నుంచి కొనుగోలు చేసిన కరెంటుకు సంబంధించిన బిల్లులను 45 రోజుల గడువులోగా డిస్కంలు చెల్లించాల్సి ఉంటుంది. లేకుంటే సదరు డిస్కంలకు విద్యుత్ విక్రయించకుండా ఆపేస్తారు. గత వేసవిలోనూ నిషేధం ఆదానీ పవర్ కంపెనీ నుంచి కొన్న సౌర విద్యుత్ బిల్లులను గడువులోగా చెల్లించలేదంటూ.. కేంద్రం గత వేసవిలోనూ రాష్ట్రంపై నిషేధం విధించింది. అయితే ఆ నిషేధంపై హైకోర్టు స్టే ఇవ్వడంతో రాష్ట్రానికి ఊరట లభించింది. రాష్ట్రాలపై కేంద్రం కక్ష సాధింపు కేంద్రం మరోసారి రాష్ట్రాలపై కక్ష సాధింపు చర్యలకు పూనుకుంది. రాష్ట్ర విద్యుత్ సంస్థలను ఇబ్బంది పెట్టాలని చూస్తోంది. హైకోర్టు స్టే ఉన్నా ఐఈఎక్స్ లావాదేవీలపై నిషేధం విధించడం సరికాదు. దీనిపై సోమవారం హైకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్ వేస్తాం. ప్రజలు, వినియోగదారులు విద్యుత్ సంస్థలకు సహకరించాలి. – డి.ప్రభాకర్రావు, తెలంగాణ జెన్కో, ట్రాన్స్కో సీఎండీ -
విద్యుత్ సంస్థల్లో బదిలీలు షురూ
సాక్షి, అమరావతి: విద్యుత్ సంస్థల్లో బదిలీల పర్వం మొదలైంది. ఏపీ ట్రాన్స్కో, ఏపీ జెన్కోలలో పనిచేస్తున్న ఉద్యోగుల బదిలీలకు ఎండీ బీ శ్రీధర్ శుక్రవారం మార్గదర్శకాలను విడుదల చేశారు. వీటితో ప్రమేయం లేకుండా ఆంధ్రప్రదేశ్ తూర్పు, మధ్య, దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)ల సీఎండీలు కే సంతోషరావు, జే పద్మాజనార్థనరెడ్డి, హెచ్ హరనాథరావు కూడా వేర్వేరుగా బదిలీ మార్గదర్శకాలు వెల్లడించారు. వీటి ప్రకారం నేటి (4వ తేదీ) నుంచి బదిలీ ప్రక్రియ మొదలుకానుంది. బదిలీలకు అర్హులైన వారి పేర్ల జాబితాను సంబంధిత కార్యాలయాల్లో శనివారం ప్రదర్శిస్తారు. దీంతో మొత్తం ఎంతమందికి బదిలీలు జరుగుతాయనేది స్పష్టంకానుంది. అందులో ఉన్నవారు డిస్కంల ఉద్యోగులైతే ఈ నెల 9లోగా.. జెన్కో, ట్రాన్స్కో ఉద్యోగులైతే ఈ నెల 10లోగా తమ అభ్యర్థనలను సమర్పించాలి. డిస్కంలలో బదిలీలు ఈ నెల 15కల్లా పూర్తికానుండగా, 16కల్లా జెన్కో, ట్రాన్స్కోలో చేస్తారు. అయితే, ఉద్యోగులను రిలీవ్ చేసేందుకు ఈ నెల 23 వరకు గడువిచ్చారు. ట్రాన్స్కో, జెన్కోలో మార్గదర్శకాలిలా.. ప్రస్తుత పోస్టులో ఏప్రిల్ 30 నాటికి మూడేళ్ల పనికాలం పూర్తిచేసుకున్న వారు బదిలీకి అర్హులు. అయితే.. ఇదే తేదీకి విద్యుదుత్పత్తి కేంద్రం, కార్పొరేట్ కార్యాలయంలో ఐదేళ్లు పనిచేసిన వారిని బదిలీ చేస్తారు. ఇందులోని మొత్తం ఉద్యోగుల్లో 20 శాతం మందికి మాత్రమే సీనియారిటీ ప్రకారం బదిలీ జరుగుతుంది. రెండేళ్లు పూర్తిచేసుకున్న వారు తీవ్ర అనారోగ్య సమస్యలు, వ్యక్తిగత కారణాలపై సంబంధిత ధ్రువపత్రాలు సమర్పించి బదిలీ కోరుకోవచ్చు లేదా నిలుపుకోవచ్చు. పరస్పర బదిలీ కావాలనుకునే వారు కనీసం ఏడాది పాటు ఒకేచోట పనిచేసి ఉండాలి. రెండేళ్లు పూర్తిచేసుకున్న వారు ‘రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్’ సౌకర్యాన్ని ఇప్పుడు ఉపయోగించుకుంటే మళ్లీ ఎనిమిదేళ్లకే అర్హులవుతారు. ఏసీబీ, విజిలెన్స్ కేసుల్లో ఉన్నవారు బదిలీలకు అనర్హులు డిస్కంలలో నిబంధనలు ఇలా.. ప్రస్తుత ప్రాంతంలో ఐదేళ్లు, ఒకే పోస్టులో మూడేళ్లు పనిచేసిన వారు బదిలీకి అర్హులు. మొత్తం అర్హుల్లో 100 శాతం మందికి బదిలీ జరుగుతుంది. తీవ్ర అనారోగ్య సమస్యలు, భార్యాభర్తలు బదిలీల నుంచి మినహాయింపు పొందవచ్చు. వచ్చే ఏడాది మార్చి 31 నాటికి రిటైరయ్యే వారిని బదిలీ చేయరు. రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్ పొందాలంటే రెండేళ్లు, మ్యూచువల్ ట్రాన్స్ఫర్ కోరాలంటే ఏడాదిపాటు ఒకేచోట పనిచేసి ఉండాలి. జనరల్ ట్రాన్స్ఫర్స్ పూర్తయిన తరువాత ఖాళీలను బట్టి అభ్యర్థనలను పరిగణలోకి తీసుకుంటారు. ఒకే ఊర్లో సుదీర్ఘకాలం కుదరదు.. విద్యుత్ సంస్థల్లో గతంలో ఒకే ఊరిలో సెక్షన్, డివిజన్ కార్యాలయాలకు బదిలీ అయ్యేవారు. పోస్టులోకి వచ్చి ఎన్నేళ్లు అయ్యిందనే దానిని బట్టి బదిలీ జరిగేది. కానీ, ఇప్పుడలా కుదరదు. ఒక ఊరిలో ఎన్నేళ్లు ఉన్నారనే దానినే తప్ప పోస్టులోకి వచ్చింది లెక్కలోకి తీసుకోరు. దీనివల్ల ఒకే ఊరిలో పదేళ్లు, ఇరవై ఏళ్లు సర్వీసుచేసే అవకాశం ఉండదు. ఈ నిబంధన నుంచి యూనియన్ల నాయకులతో సహా ఎవరికీ మినహాయింపులేదు. డిస్కంలలో బదిలీ పరిధిలోకి వచ్చే వారిలో 20 శాతం మందిని మాత్రమే గతంలో బదిలీ చేసేవారు. కానీ, ఇప్పుడు ఎంతమందికి అర్హత ఉంటే అంతమందినీ బదిలీ చేయనున్నారు. దీనివల్ల గిరిజన ప్రాంతాల్లోనూ, మారుమూల గ్రామాల్లోనూ మగ్గిపోతున్న వారికి ఇతర ప్రాంతాలకు వెళ్లే వెసులుబాటు కలుగుతుంది. పరస్పర ఆమోదంతో బదిలీ కోరుకోవాలంటే పట్టణం నుంచి గ్రామానికి, లేదా గ్రామం నుంచి పట్టణానికి అనుమతిస్తారు. -
పోలీసులపై కోపం.. టౌన్ మొత్తం కరెంట్కట్
సాక్షి,పలమనేరు(తిరుపతి): ఓ కేసు విచారణలో భాగంగా పోలీసులు అవమానించారని ఆగ్రహించిన ట్రాన్స్కో సిబ్బంది పట్టణం మొత్తానికి విద్యుత్ సరఫరా నిలిపేయడం శుక్రవారం పలమనేరులో చర్చనీయాంశంగా మారింది. వివరాలివీ.. ఇటీవల పట్టణంలో జరిగిన గంగజాతరలో స్థానిక ముత్తాచారిపాళ్యానికి చెందిన రజని(58) కరెంట్ షాక్తో మృతి చెందిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించి కేసు నమోదు చేసిన పోలీసులు విచారణలో భాగంగా స్థానిక లైన్మన్ ప్రకాష్, సచివాలయ పరిధిలో సిబ్బందిని శుక్రవారం స్థానిక స్టేషన్కు పిలిపించారు. వారు వెళ్లగానే వారి సెల్ఫోన్లను తీసిపెట్టుకుని అక్కడే వేచిఉండమని చెప్పారు. దీంతో వారు తమకి, కేసుకు ఏంటి సంబంధంమంటూ అడిగినట్టు తెలిసింది. దీంతో పోలీసులు కాస్త దురుసుగా మాట్లాడడంతో, వాగ్వాదం చోటుచేసుకున్నట్లు సమాచారం. పోలీసులు తమను అవమానించారని భావించిన ట్రాన్స్కో సిబ్బంది పట్టణంలో కరెంట్ సరఫరాను నిలిపేశారు. దీంతో మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు పట్టణంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఆపై ట్రాన్స్కో ఏడీ చిన్నబ్బ, డీఎస్పీ గంగయ్య చర్చించి, ఈ విషయం పెద్దది కాకుండా విద్యుత్ సరఫరాను పునరుద్ధరించినట్లు తెలిసింది. ఈవిషయమై ట్రాన్స్కో ఏడీ చిన్నబ్బను ‘సాక్షి’ వివరణ కోరగా తమ సిబ్బందిపట్ల పోలీసుల తీరు బాగోలేకనే వారు కరెంటు ఆఫ్ చేసినట్టు తెలిసిందన్నారు. ఇదే విషయమై స్థానిక సీఐ భాస్కర్ స్పందిస్తూ.. విద్యుత్ షాక్తో మహిళ మృతి నేపథ్యంలో విచారణ నిమిత్తం ట్రాన్స్కో సిబ్బందిని పిలిపించిన మాట వాస్తవమేనన్నారు. అయితే నిర్లక్ష్యంగా సమాధానమివ్వడంతో కాసేపు స్టేషన్లోనే కూర్చోబెట్టుకున్నామన్నారు. దీన్ని అవమానంగా భావించి పట్టణం మొత్తానికి విద్యుత్ సరఫరా నిలిపేయడం ఎంత వరకు సమంజసమన్నారు. చదవండి: Indian Paper Currency History: సముద్రం పాలైన ‘హైదరాబాద్’ కరెన్సీ.. నాసిక్లో నోట్ల ముద్రణ -
విద్యుత్ ఉద్యోగులూ.. ఆందోళనొద్దు
సాక్షి, అమరావతి: ట్రాన్స్కో, జెన్కో, డిస్కంలలో ఉద్యోగుల జీతాలు తగ్గనున్నాయనే ప్రచారాన్ని విద్యుత్ పంపిణీ సంస్థల సీఎండీలు కొట్టిపడేశారు. విద్యుత్ ఉద్యోగులకు పే రివిజన్ కమిటీ(పీఆర్సీ) వేశాక జీతాలు తగ్గిస్తారనేది కేవలం అపోహ మాత్రమేనని వారు స్పష్టం చేశారు. ట్రాన్స్కో సీఎండీ నాగులపల్లి శ్రీకాంత్, జెన్కో ఎండీ శ్రీథర్, ఏపీసీపీడీసీఎల్ సీఎండీ జె.పద్మాజనార్దనరెడ్డి, ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ హెచ్.హరనాథరావు, ఏపీఈపీడీసీఎల్ సీఎండీ కె.సంతోషరావులతో పాటు ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలతో ఇంధన శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి బుధవారం సచివాలయంలో సమావేశం నిర్వహించారు. ఆ సమావేశం వివరాలను సీఎండీలు, జేఏసీ నేతలు ‘సాక్షి’కి వివరించారు. పీఆర్సీ వచ్చే వరకూ ఇవే జీతాలు.. విద్యుత్ సంస్థల్లో ఉద్యోగులు అనవసర భయాలతో వీఆర్ఎస్ తీసుకోవాల్సిన అవసరం లేదని సీఎండీలు తెలిపారు. పీఆర్సీ వచ్చే వరకూ ఇవే జీతాలు కొనసాగుతాయని, ఆ కమిటీ అధ్యయనం తర్వాత తన నివేదికను ప్రభుత్వానికి ఇస్తుందని, ఆపై ప్రభుత్వ నిర్ణయం మేరకు జీతాలుంటాయని వారు వెల్లడించారు. అలాగే కొత్తగా తీసుకొస్తున్న సర్వీస్ రెగ్యులేషన్స్ వల్ల కూడా జీతాలు తగ్గుతాయనే అనుమానాలున్నాయని, అది పూర్తిగా అవాస్తవమన్నారు. రెగ్యులేషన్స్ ఎప్పుడు అమల్లోకొస్తే ఆ రోజు నుంచి నియమితులైన ఉద్యోగులకే ఆ నిబంధనలు వర్తిస్తాయని, అవి రావడానికి ముందు ఉన్న ఉద్యోగులెవరికీ వాటి వల్ల ఎలాంటి ఇబ్బందులుండవన్నారు. సెక్షన్ 79సీ ఆఫ్ ఎలక్ట్రిసిటీ సప్లయి యాక్ట్ 1948 ప్రకా>రం 1967లో రెగ్యులేషన్స్ రూపొందించారని, ఆపై దాని స్థానంలో ఎలక్ట్రిసిటీ యాక్ట్ 2003 వచ్చిందన్నారు. దీనివల్ల పాతది వాడుకునేందుకు వీల్లేదని, ఒక బోర్డు రెగ్యులేషన్లను మరో బోర్డు మార్చేందుకూ అవకాశం లేదని చెప్పారు. ఈ నేపథ్యంలో కొత్తగా రెగ్యులేషన్స్ రూపొందిస్తున్నారని వివరించారు. కేసులను ఎత్తివేస్తామన్నారు.. ఉద్యోగుల సంక్షేమమే తమకు తొలి ప్రాధాన్యమని బాలినేని, సజ్జల స్పష్టం చేసినట్టు ఏపీ స్టేట్ పవర్ ఎంప్లాయిస్ జాయింట్ యాక్షన్ కమిటీ(జేఏసీ) చైర్మన్ చంద్రశేఖర్ తెలిపారు. ఉద్యోగ సంఘాల నేతలపై ఉన్న దాదాపు 32 కేసులను తక్షణమే ఎత్తివేస్తామని వారు హామీ ఇచ్చినట్టు వెల్లడించారు. డీఏ, ఇతర అంశాలపై చర్చించేందుకు వారంలో మరోసారి సమావేశం నిర్వహిస్తామన్నారని చంద్రశేఖర్ వివరించారు. మీటర్ రీడర్లకు పీస్ రేటు(విద్యుత్ బిల్లులపై ఇచ్చే కమీషన్)ను త్వరలో పెంచేందుకు చర్యలు చేపడతామని బాలినేని, సజ్జల హామీ ఇచ్చినట్టు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ మీటర్ రీడర్ల రాష్ట్ర కార్యాచరణ కమిటీ(జేఏసీ) గౌరవాధ్యక్షుడు బాలకాశి, యూనియన్ నేతలు తెలిపారు. సచివాలయంలో వారిని కలిసి తమ సమస్యలను విన్నవించగా సానుకూలంగా స్పందించారని వెల్లడించారు. మూడు కంపెనీల సీఎండీలు చర్చించి రేటుపై నిర్ణయం తీసుకోవాలని బాలినేని, సజ్జల ఆదేశించినట్టు జేఏసీ నేతలు చెప్పారు. డిస్కంల పరిధిలో ఉన్న దాదాపు 4,600 మంది రీడర్లకు డిస్కం పరిధిలోనే ఇతర ఉపాధి అవకాశాలు కల్పించే అంశాన్ని కూడా పరిశీలించాల్సిందిగా సీఎండీలకు వారు సూచించినట్టు వివరించారు. -
భారం మోపి బురద!
సాక్షి, అమరావతి: గత సర్కారు అనాలోచిత నిర్ణయాలు, అసంబద్ధ విధానాలతో విద్యుత్ రంగం కుదేలైంది. బకాయిలు చెల్లించకపోవడంతో డిస్కంలు అప్పుల ఊబిలో కూరుకుపోయాయి. అప్పుడు చేసిన తప్పిదాలే ట్రూ అప్ చార్జీల భారానికి కారణమయ్యాయని విద్యుత్తు రంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుంచి చౌక విద్యుత్తు కొనుగోళ్లు, పొదుపు చర్యలతో విద్యుత్ రంగాన్ని బలోపేతం చేస్తూ పంపిణీ సంస్థలను ఆదుకుంటోంది. విద్యుత్తు రంగంలో ఆధునిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటూ అనవసర వ్యయాన్ని నియంత్రిస్తోంది. మరోవైపు ప్రజలపై పెనుభారం పడకుండా భారీగా రాయితీలను భరిస్తోంది. రైతులతో పాటు ఇతర వర్గాలకు ఉచిత, రాయితీ విద్యుత్ను అందిస్తూనే కొనుగోళ్లు, పంపిణీలో నష్టాలను తగ్గించుకునేందుకు చర్యలు చేపడుతోంది. అయితే టీడీపీ నేతలు వాస్తవాలను మభ్యపుచ్చి తమ కారణంగా ప్రజలపై పడిన ట్రూ అప్ చార్జీలపై వారే ఆందోళనకు దిగడం పట్ల సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. ఆ ఐదేళ్లూ అప్పుల కొండ ఆర్ధిక భారం నుంచి తప్పించుకునేందుకు గత సర్కారు తప్పుడు నివేదికలతో డిస్కంలను అప్పుల ఊబిలోకి గెంటేసింది. ఫలితంగా 2014 నుంచి 2019 వరకూ విద్యుత్ పంపిణీ సంస్థల నష్టాలు రూ.4,110 కోట్ల నుంచి ఏకంగా రూ.27,240 కోట్లకు చేరాయి. గత రెండున్నరేళ్లలో నష్టాలు రూ.311 కోట్లు మాత్రమే పెరిగాయి. ప్రస్తుతం నష్టాలు రూ.27,551 కోట్లుగా ఉన్నాయి. టీడీపీ హయాంలో వార్షిక సరఫరా ఖర్చు రూ.24,211 కోట్ల నుంచి రూ.46,404 కోట్లకు చేరుకుంది. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తరువాత పొదుపు చర్యలతో ఇది తగ్గుముఖం పట్టింది. ప్రస్తుతం రూ.39,324 కోట్లుగా ఉంది. ఇక 2014 నుంచి 2019 వరకూ విద్యుత్ రంగం అప్పులు రూ.31,648 కోట్ల నుంచి రెట్టింపై రూ.62,463 కోట్లకి ఎగబాకాయి. 2014 జూన్ 2 నాటికి విద్యుత్తు కొనుగోళ్ల బకాయిలు, నిర్వహణ ఖర్చులు రూ.12,500 కోట్లు ఉండగా 2019 ఏప్రిల్ 1 నాటికి రూ.32,000 కోట్లకు చేరాయి. భారమైనా భరిస్తున్న వైఎస్సార్సీపీ ప్రభుత్వం రాష్ట్ర చరిత్రలోనే తొలిసారిగా గృహ విద్యుత్ వినియోగానికి సంబంధించి రూ.1,707.07 కోట్ల సబ్సిడీని రాష్ట్ర ప్రభుత్వం భరిస్తోంది. రాయితీలు, ప్రోత్సాహకాలు, గృహ విద్యుత్ వినియోగదారులతో పాటు చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, రైతులు, పౌల్ట్రీ వర్గాల భారాన్ని ప్రభుత్వమే మోస్తోంది. వ్యవసాయ ఉచిత విద్యుత్కు సంబంధించి రూ.7297.08 కోట్ల ఆర్ధిక భారం ప్రభుత్వంపై పడింది. తొలిసారిగా ఉచిత విద్యుత్ వర్గాలన్నీ సెక్షన్–65 కింద ప్రత్యక్ష రాయితీ పొందేలా ఒకే గొడుగు కిందకు ఏపీఈఆర్సీ తెచ్చింది. దీనివల్ల పడిన రూ.1,657.56 భారాన్ని కూడా భరించేందుకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అంగీకరించారు. రాష్ట్రవ్యాప్తంగా మూడు పంపిణీ సంస్థల పరిధిలోనూ ఒకే విధంగా ధరలు అమలుకు ప్రభుత్వం ముందుకు వచ్చింది. దీనివల్ల ప్రభుత్వంపై రూ.136.72 కోట్ల భారం పడింది. అప్పటిలా కనీస చార్జీలు లేవు గృహ విద్యుత్ వినియోగదారుల నుంచి రూ.50 చొప్పున కనీస చార్జీలు వసూలు చేసే విధానం గత సర్కారు హయాంలో అమలైంది. దీనివల్ల నెలంతా విద్యుత్ వినియోగించకపోయినా కనీస చార్జీ రూ.50 చెల్లించాల్సి వచ్చేది. దీన్ని తొలగించి కిలోవాట్కు రూ.10 వసూలు చేసే విధానాన్ని వైఎస్సార్సీపీ ప్రభుత్వం తీసుకువచ్చింది. అంటే నెలంతా విద్యుత్ వినియోగించకపోతే కనీస చార్జీ చెల్లించనవసరం లేదు. ఇక సగటు యూనిట్ సేవా వ్యయం రూ.7.17 నుంచి రూ.6.37కి తగ్గించింది. విద్యుత్ వినియోగాన్ని బట్టి శ్లాబులను మార్చి అధికభారం మోపే విధానాన్ని టీడీపీ సర్కారు ఐదేళ్లూ అమలు చేసింది. దాని నుంచి కాపాడటానికి ఏ నెలలో ఎంత విద్యుత్ వినియోగిస్తున్నారో టారిఫ్ ప్రకారం ఆ నెలలోనే బిల్లు వేసే విధంగా కంటిన్యూ బిల్లింగ్ విధానాన్ని ఇప్పుడు ప్రభుత్వం తెచ్చింది. విద్యుత్ సంక్షేమ రంగంవైపు అడుగులు.. విద్యుత్తు రంగాన్ని ప్రగతిశీల, ప్రజా సంక్షేమ రంగంగా మార్చాలని ప్రభుత్వం భావిస్తోంది. ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులకు 200 యూనిట్లు, ఎంబీసీలు, చేనేత కార్మికులకు 100 యూనిట్లు, దోబీఘాట్లు, లాండ్రీలకు 150 యూనిట్లు, స్వర్ణకారులకు 100 యూనిట్లు, సెలూన్లు, రోల్డ్ గోల్డ్ పనివారికి 100 యూనిట్లు ఉచితంగా అందజేస్తోంది. విద్యుత్తు సరఫరాలో అంతరాయాలను తగ్గించేందుకు చర్యలు తీసుకుంటోంది. 2019–20లో 3 లక్షలుగా ఉన్న అంతరాయాలను 2020–21 నాటికి 1.77 లక్షలకు తగ్గించింది. 2019–20లో యూనిట్కు రూ.7.23 చొప్పున ఉన్న సగటు సర్వీసు వ్యయాన్ని 2020–21 నాటికి రూ.6.37కి తగ్గించగలిగింది. ఇటు డిస్కంలను ఆదుకుంటున్న ప్రభుత్వం.. విద్యుత్తు సంస్థలు 2019–21 మధ్య కొనుగోళ్ల కోసం విద్యుదుత్పత్తి సంస్థలకు రూ.64,007 కోట్లు చెల్లించాయి. దీనిని తట్టుకోవాలంటే ప్రభుత్వం నుంచి సబ్సిడీలు సకాలంలో అందాలి. ఈ నేపథ్యంలో 2019 మార్చి 31 నాటికి విద్యుత్తు సబ్సిడీ బకాయిలు రూ.13,388 కోట్లు ఉండగా ప్రభుత్వం రూ.11,442 కోట్లు ఇచ్చింది. 2019–21 సంవత్సరానికి విద్యుత్తు సబ్సిడీ, ఇతర ఛార్జీల కింద మరో రూ.16,724 కోట్లు విడుదల చేసింది. ఇలా విద్యుత్తు సంస్థలను ఆదుకునేందుకు రూ.28,166 కోట్లు విడుదల చేసింది. వాస్తవ సర్దుబాటు వ్యయం రూ.20,572 కోట్లు విద్యుత్ పంపిణీ సంస్థలు 2014–19 కాలానికి దాదాపుగా రూ.20,572 కోట్ల వాస్తవ అదనపు వ్యయం సర్దుబాటు కోసం విద్యుత్ నియంత్రణ మండలికి 2019 చివరిలో విన్నవించాయి. ఇదే కాకుండా 2014–15 నుంచి 2018–19 వరకు సంస్థల నెట్వర్క్ (పంపిణీ వ్యవస్థ) నిర్వహణ, ఆదాయ అవసరాల వాస్తవ ఖర్చుల ఆధారంగా జరిపిన అదనపు వ్యయం సర్దుబాటు రూపంలో మరో రూ.7,224 కోట్లు అనుమతించాలని విద్యుత్ నియంత్రణ మండలిని కోరాయి. ఇందులో రూ.3,555 కోట్ల వసూలును ఏపీఈఆర్సీ తిరస్కరించింది. రూ.3,669 కోట్ల ట్రూ–అప్ చార్జీల వసూలు మాత్రం అనివార్యమైంది. నిజానికి ఇది కూడా ఆమోదించకపోతే విద్యుత్ పంపిణీ సంస్థల మనుగడ కష్టంగా మారే ప్రమాదం ఉంది. అది మంచిది కాదని విద్యుత్ రంగ నిపుణులు పేర్కొంటున్నారు. గత ప్రభుత్వ హయాం నాటివే ‘ప్రస్తుతం అమలవుతున్న ట్రూ అప్–సర్దుబాటు చార్జీలు గత ప్రభుత్వ హయాం నాటి విద్యుత్ పంపిణీ నెట్వర్క్ చార్జీలకు సంబంధించినవి. విద్యుత్ పంపిణీ సంస్థల వార్షిక ఖర్చులు, ఆదాయ అవసరాలకు అనుగుణంగా గత ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోకపోవడం, విద్యుత్ నియంత్రణ మండలి నిర్దేశించిన సబ్సిడీని భరించని కారణంగా పంపిణీ సంస్థల అప్పులు పెరిగిపోయాయి. ఏపీఈఆర్సీకి సమర్పించే వార్షిక ఆదాయ అవసరాల నివేదికలలో వాస్తవాలను వెల్లడించకుండా పరోక్షంగా భారాన్ని తగ్గించుకుని తప్పుల తడకలు నివేదికలతో సమయాన్ని వెళ్లదీశారు. అప్పుడు జరిగిన నష్టమంతా సర్దుబాటు చార్జీల రూపంలో వినియోగదారులపై పడింది. 2014–15 నుంచి 2018–19 వరకు నెట్వర్క్ (పంపిణీ వ్యవస్థ) నిర్వహణకు అనుమతించిన వ్యయం కన్నా వాస్తవ ఖర్చు అధికమవడం వల్లే ఈ సవరింపు చార్జీలు విధించాల్సి వచ్చిందనే విషయాన్ని గమనించాలి’ –నాగులాపల్లి శ్రీకాంత్, ఇంధన శాఖ కార్యదర్శి -
తెలంగాణలో ‘కరెంట్’కు కష్టాలు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో విద్యుత్ రంగం ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకుంది. కొండలా పేరుకు పోయిన రుణాలకు ప్రతినెలా వడ్డీలు కట్టడం, ఉద్యోగులకు జీతాలు చెల్లించడం తమ వల్ల కావట్లేదని రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లు మొత్తుకుంటున్నాయి. ప్రతినెలా రూ.1,200 కోట్లు ఆర్థిక సాయం చేయాలని, లేకుంటే డిస్కంల నిర్వహణ సాధ్యం కాదని కోరుతున్నాయి. అయితే ఇప్పటికే పెద్ద ఎత్తున విద్యుత్ సబ్సిడీలను భరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. మరింతగా నిధులు ఇవ్వలేని పరిస్థితి ఉందని స్పష్టం చేసినట్టు సమాచారం. ప్రత్యామ్నాయంగా విద్యుత్ చార్జీల పెంపునకు అనుమతించి డిస్కంలను గట్టెక్కించాలని భావిస్తున్నట్టు తెలిసింది. ఒత్తిళ్లు తట్టుకోలేక..: గత నెల 21న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు నిర్వహించిన ఓ సమీక్షలో తెలంగాణ ట్రాన్స్కో, జెన్కో సీఎండీ ప్రభాకర్రావు డిస్కంల పరిస్థితిని వివరించినట్టు తెలిసింది. ప్రతినెలా డిస్కంల అప్పులపై వడ్డీల చెల్లింపు కోసం రూ.800 కోట్లు, జీతాల కోసం రూ.400 కోట్లు కలిపి రూ.1,200 కోట్ల చొప్పున ప్రభుత్వ సాయంగా విడుదల చేయాలని కోరారని.. విద్యుత్ చార్జీలు పెంచడానికి కూడా అనుమతించాలని విజ్ఞప్తి చేశారని సమాచారం. అయితే విద్యుత్ చార్జీల పెంపుపై మాత్రమే సీఎం సానుకూలంగా స్పందించారని.. అదనపు నిధులివ్వడం సాధ్యంకాదని తేల్చిచెప్పారని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. దీనితో చేసేదేమీ లేక ప్రభాకర్రావు దీర్ఘకాలిక సెలవులో వెళ్లారని పేర్కొంటున్నాయి. బిల్లులు, బకాయిలు చెల్లించాలంటూ విద్యుదుత్పత్తి కంపెనీలు, రుణ సంస్థలు తెస్తున్న ఒత్తిళ్లు తట్టుకోలేకపోతున్నానని.. జెన్కో, ట్రాన్స్కో సీఎండీ బాధ్యతల నుంచి తనను తప్పించాలని ప్రభాకర్రావు కొద్దినెలలుగా విజ్ఞప్తి చేస్తూ వస్తున్నారని, కానీ సీఎం అంగీకరించడం లేదని పేర్కొంటున్నాయి. రూ.20 వేల కోట్ల అప్పుల్లో.. రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థల నష్టాలు ఏటేటా పెరిగిపోయి.. ప్రస్తుతం రూ.20 వేల కోట్లను దాటినట్టు అధికారవర్గాలు చెబుతున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక.. విద్యుత్ పంపిణీ వ్యవస్థల (నెట్వర్క్) సామర్థ్యం పెంపునకు డిస్కంలు రూ.వేల కోట్ల అప్పులు చేశాయి. ప్రస్తుతం ప్రతినెలా వడ్డీల కిందనే రూ.800 కోట్ల మేర చెల్లించాల్సి వస్తోంది. ఉద్యోగుల జీతాలకూ ఇబ్బంది తలెత్తుతోంది. దీనితో కొంతకాలంగా ప్రతి నెలా బ్యాంకుల నుంచి అడ్వాన్స్ తీసుకుని ఉద్యోగులకు జీతాలు చెల్లిస్తున్నట్టు అధికారులు చెప్తున్నారు. చార్జీల పెంపుపై కసరత్తు రాష్ట్రంలో గత ఆరేళ్లుగా విద్యుత్ చార్జీలను పెంచలేదు. విద్యుత్ చట్టం ప్రకారం.. డిస్కంలు ఏటా నవంబర్ 30లోగా తర్వాతి ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన విద్యుత్ చార్జీల పెంపు (టారిఫ్ సవరణ) ప్రతిపాదనలను, ఆదాయ, వ్యయాల అంచనా (ఏఆర్ఆర్) నివేదికను రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ)కి సమర్పించాల్సి ఉంటుంది. ఈఆర్సీ వాటిని పరిశీలించి చార్జీల సవరణను ఆమోదిస్తుంది. అయితే డిస్కంలు గత మూడేళ్లుగా టారిఫ్ సవరణ, ఏఆర్ఆర్ నివేదికలను సమర్పించడమే లేదు. విద్యుత్ చార్జీల పెంపునకు ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడమే దీనికి కారణం. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో డిస్కంలను గట్టెక్కించడం కోసం చార్జీలు పెంచాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయానికి వచ్చింది. హుజూరాబాద్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరుగుతుండటంతో.. ఆ ప్రక్రియ ముగిశాక ఈఆర్సీకి టారిఫ్ పెంపు ప్రతిపాదనలను సమర్పించనున్నట్టు అధికార వర్గాలు చెప్తున్నాయి. ఆరేళ్లుగా చార్జీలు పెంచని నేపథ్యంలో ఈసారి గణనీయంగానే పెంపు ఉండవచ్చని అధికారవర్గాలు తెలిపాయి. కేటగిరీల వారీగా 10 శాతం నుంచి 20శాతం వరకు చార్జీలు పెంచాలని డిస్కంలు కోరుతున్నాయని వివరించాయి. అంతేగాకుండా గత ఆరేళ్లుగా వచ్చిన నష్టాలకు సంబంధించి ‘ట్రూఅప్’ చార్జీలు వసూలు చేసుకోవడానికి అనుమతించాలని డిస్కంలు విజ్ఞప్తి చేశాయని.. దానికి ఈఆర్సీ అనుమతిస్తే వినియోగదారులపై ఒకేసారి పెనుభారం పడే అవకాశాలు ఉంటాయని వెల్లడించాయి. ప్రభుత్వం, ఈఆర్సీ అనుమతిస్తే.. వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి విద్యుత్ చార్జీల పెంపు అమల్లోకి వస్తాయని తెలిపాయి. ఇప్పటికే సబ్సిడీల భారం రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయానికి ఉచిత విద్యుత్, ఇతర రాయితీ పథకాలు, ఎత్తిపోతల స్కీమ్లకోసం ప్రతినెలా డిస్కంలకు రూ.833.33 కోట్లు విడుదల చేస్తోంది. ఇందుకోసం బడ్జెట్లోరూ.10 వేల కోట్లు కేటాయిస్తోంది. డిస్కంలు కోరినట్టు ప్రతినెలా మరో రూ.1,200 కోట్ల చొప్పున ఇస్తే ఏడాదికి రూ.14,400 కోట్ల అదనపు భారం పడుతుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. అప్పులు, నష్టాలు పెరుగుతూ.. కొన్నేళ్లుగా రాష్ట్రంలో విద్యుత్ అవసరాలు బాగా పెరిగాయి. డిమాండ్కు తగినట్టుగా ఎక్కువ ధరతో విద్యుత్ కొని తక్కువ రేటుతో సరఫరా చేయాల్సి వచ్చింది. దానికితోడు ఆరేళ్లుగా విద్యుత్ చార్జీలు పెంచకపోవడం, ఉద్యోగులకు భారీగా జీతాల పెంపుతోనూ డిస్కంలపై ఆర్థిక భారం పడింది. వివిధ కేటగిరీల కింద సరఫరా చేస్తున్న రాయితీ విద్యుత్ కంటే.. ప్రభుత్వం నుంచి అందుతున్న సబ్సిడీ సొమ్ము తక్కువగా ఉందన్న అంచనాలు ఉన్నాయి. దీనితో ఏటేటా నష్టాలు, అప్పులు పెరుగుతూ పోయాయి. -
ఇన్చార్జ్ సీఎండీల పాలనలో ట్రాన్స్కో, జెన్కో
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ట్రాన్స్కో, జెన్కో ఇన్చార్జిల పాలనలోనే కొనసాగుతోంది. ట్రాన్స్కో సీఎండీగా ఆ సంస్థ జేఎండీ సి.శ్రీనివాస రావు, తెలంగాణ జెన్కో సీఎండీగా సింగరేణి సంస్థ సీఎండీ ఎన్.శ్రీధర్కు అదనపు బాధ్యతలను కొనసాగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తదుపరి ఆదేశాలు జారీ చేసే వరకు వీరు అదనపు బాధ్యతల్లో కొనసాగుతారని స్పష్టం చేసింది. ఈ మేరకు రాష్ట్ర ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సునీల్ శర్మ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. సీఎండీగా ప్రభాకర్రావు కొనసాగింపుపై అస్పష్టత...: ట్రాన్స్కో, జెన్కో సంస్థలకు 2014 అక్టోబర్ నుంచి డి.ప్రభాకర్రావు ఉమ్మడి సీఎండీగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వ అనుమతితో గత ఆగస్టు 19 నుంచి 31 వరకు సెలవుపై వెళ్లారు. అనంతరం సెప్టెంబర్ 22 వరకు ప్రభాకర్రావు సెలవు పొడిగించుకున్నారు. అక్టోబర్ 1న విధుల్లో చేరి... ఆరు వరకు కొనసాగారు. ఆ తర్వాత నుంచి మళ్లీ ఆయన విధులకు హాజరు కాలేదు. సెలవు మంజూరు కోసం దరఖాస్తు కూడా చేసుకోలేదు. దీంతో ట్రాన్స్కో, జెన్కో సంస్థలకు సీఎండీలుగా జె.శ్రీనివాసరావు, ఎన్.శ్రీధర్లను అదనపు బాధ్యతల్లో కొనసాగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని రాష్ట్ర ఇంధన శాఖ వర్గాలు తెలిపాయి. ఈ ఉత్తర్వుల్లో ప్రభాకర్రావు సెలవుల పొడిగింపు అంశం ప్రస్తావించకపోవడంతో ట్రాన్స్కో, జెన్కో సీఎండీ పదవుల్లో ఆయన కొనసాగుతారా? లేదా? అన్నది విద్యుత్ సౌధలో చర్చనీయాంశంగా మారింది. ప్రభాకర్రావు సీఎండీ పదవికి రాజీనామా చేసి ఉండవచ్చని చర్చ జరుగుతుండగా, ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కార్యాలయం వర్గాలు తోసిపుచ్చాయి. ఆయన కొనసాగుతారా? లేదా ? అన్న అంశంపై సీఎంఓ వర్గాలు కూడా ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. -
‘లైన్మన్ల’ నియామకం నెలలో పూర్తి చేయండి
సాక్షి, హైదరాబాద్: ట్రాన్స్కో ఆధ్వర్యంలో 2017లో జారీచేసిన నోటిఫికేషన్లో భాగంగా జూనియర్ లైన్మన్ల నియామకాలను నెలరోజుల్లో పూర్తి చేయాలని హైకోర్టు ఆదేశించింది. వీటికి సంబంధించిన మరో ఏడు పిటిషన్లను కూడా కొట్టివేసింది. ట్రాన్స్కో ఆధ్వర్యంలో చేపట్టిన సబ్ ఇంజనీర్, నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆధ్వర్యంలో చేపట్టిన సబ్ ఇంజనీర్ల నియామకాలకు సంబంధించిన వివాదం సుప్రీంకోర్టులో ఉన్న నేపథ్యంలో న్యాయస్థానం ఆదేశాల మేరకు నియామక ప్రక్రియ చేపట్టాలని స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ బి.విజయసేన్రెడ్డి ఇటీవల తీర్పునిచ్చారు. లైన్మన్ల నియామకాల్లో 20 మార్కులు వెయిటేజీ ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ పలువురు హైకోర్టును ఆశ్రయించగా ధర్మాసనం వెయిటేజీ మార్కులను సమర్థించింది. మరో ధర్మాసనం తప్పుబట్టింది. దీంతో ఈ వివాదం ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన విస్తృత ధర్మాసనం ముందుకు రాగా అది కూడా వెయిటేజీని సమర్థిస్తూ తీర్పునిచ్చింది. -
అనంతపురం: గుంతకల్లు ట్రాన్స్కో డీఈ రవిబాబు అవినీతి బాగోతం
-
పాతలైన్లతోనే రెట్టింపు కరెంట్..
సాక్షి, అమరావతి: ఏపీ ట్రాన్స్కో సరికొత్త హై టెన్షన్ లో సాగ్ (హెటీఎల్ఎస్) సాంకేతిక పరిజ్ఞానంపై ఆసక్తి చూపుతోంది. ఈ టెక్నాలజీ వినియోగం ద్వారా విద్యుత్ లైన్ల సామర్థ్యం పెంచబోతోంది. కొత్తగా లైన్లు వేయకుండా, ఉన్న కారిడార్తోనే ఎక్కువ విద్యుత్ సరఫరా చేయడం ఈ టెక్నాలజీ ప్రత్యేకత. ఎక్కువ కరెంట్ రావడమే కాకుండా, కొత్త లైన్లు వేసే అవసరం లేకపోవడంతో సమయం, డబ్బు ఆదా అవుతుందని అధికారులు తెలిపారు. ఇప్పటికే 2 జిల్లాల్లో చేసిన ప్రయోగం సత్ఫలితాలనివ్వడంతో మరికొన్ని జిల్లాల్లో అమలు చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిపారు. కండక్టర్ల మార్పుతో రెట్టింపు వేగం విద్యుత్ వినియోగం పెరుగుతున్న కొద్దీ విద్యుత్ పంపిణీ లైన్ల సామర్థ్యం కూడా పెంచాల్సి ఉంటుంది. ఇలా చేయాలంటే కొత్త కారిడార్లు వేయాలి. వ్యవసాయ భూముల్లోంచి విద్యుత్ లైన్లు వేయడం కష్ట సాధ్యంగా మారుతోంది. రైతులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తుండటంతో ప్రాజెక్టులు ముందుకెళ్ళడం లేదు. ఈ నేపథ్యంలో హెటీఎల్ఎస్ టెక్నాలజీపై ట్రాన్స్కో దృష్టి సారించింది. ప్రస్తుతం ఉన్న విద్యుత్ కారిడార్ను వాడుకుంటూనే కేవలం కండక్టర్ను మార్చడం ద్వారా రెట్టింపు విద్యుత్ను పంపేందుకు ఈ టెక్నాలజీ ఉపయోగపడనుంది. హెచ్టీఎల్ఎస్ సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన కండక్టర్లు అత్యధిక ఉష్ణోగ్రతను తట్టుకుంటాయి. అత్యధిక వేగంతో కరెంట్ను సరఫరా చేస్తాయి. పెరుగుతున్న విద్యుత్ డిమాండ్ను తట్టుకునేందుకు, వివిధ రకాలుగా లభిస్తున్న విద్యుత్ను గ్రిడ్పై ప్రతికూల ప్రభావం లేకుండా పంపిణీ చేయడానికి ఇది తోడ్పడుతుందని అధికారులు తెలిపారు. రూ.100 కోట్ల వ్యయం.. హెటీఎల్ఎస్ టెక్నాలజీ కోసం ఏపీ ట్రాన్స్కో రూ.100 కోట్లు వెచ్చిస్తోంది. ప్రయోగాత్మకంగా కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల్లో రూ.15 కోట్లతో 13 కిలోమీటర్ల మేర 132 కేవీ కండక్టర్లు వేశారు. ఇవి మంచి ఫలితాన్నిచ్చాయి. రెండో దశలో విశాఖ, విజయనగరం, రాజమండ్రి, నెల్లూరు విద్యుత్ జోన్లలో కొత్త కండక్టర్లు వేయనున్నారు. 27 కిలోమీటర్ల మేర 220 కిలోవాట్ల సామర్థ్యంతో, 110 కిలోమీటర్ల మేర 132 కేవీ సామర్థ్యంతో హెటీఎల్ఎస్ కండక్టర్లు వేయబోతున్నారు. కాగా, విద్యుత్ లోడ్ తగ్గించడమే లక్ష్యంగా.. కొత్త టెక్నాలజీతో చేపడుతున్న ఈ ప్రాజెక్టు పనులకు త్వరలో టెండర్లు పిలవబోతున్నట్లు ట్రాన్స్కో డైరెక్టర్ ప్రవీణ్కుమార్ తెలిపారు. -
లో వోల్టేజీకిక చెక్!
సాక్షి, అమరావతి: ఉన్నట్టుండి విద్యుత్ బల్బులు డిమ్గా మారిపోవడం, ట్యూబ్లైట్లు ఆరిపోవడం, విద్యుత్ సరఫరా ఎక్కువ, తక్కువ కావడం వంటి సమస్యలు ఇక సమసిపోనున్నాయని విద్యుత్ అధికారులు చెబుతున్నారు. పట్టణాలతో పాటు గ్రామాల్లో సైతం విద్యుత్ లోవోల్టేజీ సమస్య తలెత్తదని అంటున్నారు. ఏపీ ట్రాన్స్కో రూ.6,610.5 కోట్ల వ్యయంతో 85 ప్రాజెక్టులను చేపడుతోంది. ప్రపంచబ్యాంక్తో పాటు పలు ఆర్థిక సంస్థలు సహకారంతో చేపడుతున్న ఈ ప్రాజెక్టుల పురోగతిని ట్రాన్స్కో సీఎండీ శ్రీకాంత్ నాగులాపల్లి ‘సాక్షి’కి వివరించారు. ► సబ్స్టేషన్లు, ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాటు, లైన్లు వేయడం కొత్త ప్రాజెక్టుల్లో ప్రధానంగా ఉన్నాయి. దీనివల్ల రాష్ట్రంలో ఎప్పుడు విద్యుత్ డిమాండ్ పెరిగినా లోవోల్టేజీ అన్న సమస్యే తలెత్తదు. ► రాష్ట్రంలో ఏటా 20 శాతం మేర విద్యుత్ వినియోగం పెరుగుతోంది. దీనికి తోడు రాష్ట్రవ్యాప్తంగా 18 లక్షల పంపుసెట్లకు పీక్ అవర్స్లోనే విద్యుత్ అందిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో పెరిగే లోడ్ను తట్టుకునేందుకు విద్యుత్ వ్యవస్థల బలోపేతం తప్పనిసరి. ► ట్రాన్స్కో, తూర్పు, దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థలు (ఏపీఈపీడీసీఎల్, ఏపీఎస్పీడీసీఎల్), డిజాస్టర్ రికవరీ ప్రాజెక్టు (ప్రకృతి వైపరీత్యాలప్పుడు ఉపయోగపడేది), విశాఖ, చెన్నై ఇండ్రస్టియల్ కారిడార్ (వీసీఐసీ), గ్రీన్ ఎనర్జీ కారిడార్ (జీఈసీ) కొత్త ప్రాజెక్టుల్లో ప్రధానంగా ఉన్నాయి. ► ఈ ప్రాజెక్టులకు ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీ కన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్ ఫైనాన్షియల్ ఇనిస్టిట్యూషన్ (ఐబీఆర్డీ), ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ (ఏఐఐబీ), ప్రపంచ బ్యాంకు వంటి అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు రుణాలు ఇచ్చేందుకు ముందుకొచ్చాయి. ఇప్పటికే కొంత భాగానికి పాలనపరమైన అనుమతులు కూడా లభించాయి. -
కరెంటు స్తంభంపై మంటలు..తప్పిన ప్రమాదం
సాక్షి, కరీంనగర్ : కరెంటు స్తంభంపై మంటలు చెలరేగి స్తంభం వద్ద నిలిచిన వర్షం నీళ్లలో సైతం కరెంటు ప్రవహించింది. అయితే ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ ఘటన కరీంనగర్ జిల్లాలో చోటుచేసుకుంది. సైదాపూర్ మండలం ఘనపూర్లో రైతు వెంకట్ రెడ్డికి చెందిన పత్తి చేనులో కరెంటు స్తంభం పై మంటలు చెలరేగాయి. 11 కె.వి లైన్ కావడంతో పవర్ షాక్ కొట్టి స్తంభం పై నుంచి భూమిపై వరకు మంటలు వచ్చాయి.దీంతో స్తంభం వద్ద నిలిచిన వర్షం నీళ్లలో సైతం కరెంటు ప్రవహించింది. ఆ వేడి దాటికి వర్షపు నీళ్లు సలసల మసిలాయి. అయితే ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. వెంటనే ట్రాన్స్కో అధికారులకు సమాచారం ఇవ్వడంతో పవర్ సప్లై నిలిపివేశారు. ఇన్సోలేటర్ ఫెయిల్ కావడంతో స్తంభంపై మంటలు వచ్చి కింద వాటర్ మరిగినట్లు విద్యుత్ అధికారులు తెలిపారు. వ్యవసాయ పొలాలకు వెళ్లే రైతులు కరెంట్ పోల్స్ తో జాగ్రత్తగా ఉండాలని కోరారు. -
గట్టెక్కిన గ్రిడ్!
సాక్షి, హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు ఆదివారం రాత్రి 9 గంటలకు రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి విద్యుత్ దీపాలు ఆర్పినప్పటికీ, విద్యుత్ శాఖ పక్కా వ్యూహంతో వ్యవహరించడంతో ఎక్కడా ఎలాంటి ఇబ్బంది తలెత్తలేదు. ఒకేసారి పెద్ద మొత్తంలో విద్యుత్ వినియోగంలో మార్పులు సంభవించినా, ఉత్పత్తి – సరఫరా మధ్య సమతూకం సాధించడంలో జెన్ కో, ట్రాన్స్ కో పూర్తిస్థాయిలో విజయం సాధించాయి. ఆదివారం ఉదయం నుంచి జెన్ కో– ట్రాన్స్ కో సీఎండీ ప్రభాకర్రావు విద్యుత్ సౌధలోని లోడ్ డిస్పాచ్ సెంటర్లోనే ఉండి విద్యుత్ డిమాండ్ ఒకేసారి పడిపోయినప్పుడు అనుసరించాల్సిన వ్యూహం రచించారు. దానికి అనుగుణంగా రాత్రి 9 గంటల నుంచి 9 నిమిషాల పాటు వ్యవహరించారు. రాష్ట్రంలో ఒకేసారి లైట్లు ఆర్పేయడం వల్ల 300 నుంచి 500 మెగావాట్ల డిమాండ్ పడిపోయే అవకాశం ఉందని కేంద్ర విద్యుత్ ప్రాధికార సంస్థ అంచనా వేసింది. కానీ రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి లైట్లు ఆర్పేయడం వల్ల రాష్ట్రంలో 1,500 మెగావాట్ల డిమాండ్ పడిపోయింది. మూడు రెట్ల విద్యుత్ డిమాండ్ పతనం... ఆదివారం రాత్రి 9 గంటలకు ముందు రాష్ట్రంలో 7,380 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ ఉండగా, 9 గంటల తర్వాత 5,800 మెగావాట్లకు పడిపోయింది. రాష్ట్రమంతటా ఇళ్లల్లో విద్యుత్ దీపాలను బంద్ చేస్తే గరిష్టంగా 300–500 మెగావాట్ల డిమాండ్ మాత్రమే తగ్గనుందని కేంద్ర విద్యుత్ ప్రాధికారత సంస్థ (సీఈఏ) అంచనా వేయగా, దాని కన్నా మూడు రేట్లు అధికంగా విద్యుత్ డిమాండ్ పతనమైంది. అయినా విద్యుత్ సరఫరా వ్యవస్థ (గ్రిడ్) కుప్పకూలకుండా లోడ్ డిస్పాచ్ సెంటర్ (ఎల్డీసీ) ఇంజనీర్లు కంటికి రెప్పలా కాపాడుకున్నారు. ఒక్కసారిగా విద్యుత్ డిమాండ్ భారీగా తగ్గడం తో గ్రిడ్ను బ్యాలెన్స్ చేసేందుకు నాగార్జునసాగర్ రివర్స్ పంపింగ్ కేంద్రంలోని నాలుగు యూనిట్లను నడపడం ద్వారా 400మెగావాట్ల విద్యుత్ను, మేడారంలోని కాళేశ్వరం పంపింగ్ స్టేషన్ను నడపడం ద్వారా మరో 300 మెగావాట్ల విద్యుత్ను వినియోగించారు. ఇలా మొత్తం 700 మెగావాట్ల కృత్రిమ విద్యుత్ డిమాండ్ను సృష్టించడంతో పాటు మరో 800 మెగావాట్ల వరకు థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో ఉత్పత్తి తగ్గించడం ద్వారా గ్రిడ్ బ్యాలెన్సింగ్ను పరిరక్షించారు. దీంతో విద్యుత్ ఉత్పత్తి– సరఫరాల మధ్య సమతూకం కుదిరింది. విద్యుత్ దీపాలను మళ్లీ వెలిగించడంతో క్రమంగా రాష్ట్రవ్యాప్తంగా డిమాండ్ పుంజుకుని పూర్వస్థితికి చేరింది. లైట్లు ఆర్పేసినా విద్యుత్కు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చేసిన విద్యుత్ శాఖను ముఖ్యమంత్రి కేసీఆర్ అభినందించారు. -
పక్కచూపుల నిఘా కన్ను
ద్వారకానగర్ (విశాఖ దక్షిణ): ఆదాయానికి మించి అక్రమంగా ఆస్తులు కూడబెట్టినట్లు అందిన సమాచారంతో ఏపీ ట్రాన్స్కో విజిలెన్స్ అదనపు ఎస్పీ తంగెళ్ల హరికృష్ణ ఇంట్లో ఏసీబీ అధికారులు గురువారం సోదాలు నిర్వహించారు. ఏకకాలంలో విశాఖలోని ఆశీలుమెట్ట దరి ఫేమ్ హైట్లోని ఐదో అంతస్తులో గల హరికృష్ణ నివాసంతోపాటు, రాజమండ్రి, హైదరాబాద్, అమలాపురం, విజయవాడలోని బంధువుల ఇళ్లలో సోదాలు చేశారు. ఈ సందర్భంగా ఏసీబీ శ్రీకాకుళం డీఎస్పీ బీవీఎస్ రమణమూర్తి మాట్లాడుతూ అక్రమంగా ఆస్తులు కూడబెట్టినట్లు అందిన సమాచారంతో విజిలెన్స్ ఏఎస్పీ హరికృష్ణ ఇంటిలో సోదాలు చేశామని తెలిపారు. ప్రభుత్వ ధర ప్రకారం రూ.2.74 కోట్ల విలువ చేసే ఆస్తులను గుర్తించామని, మార్కెట్ ధర ప్రకారం రూ.10కోట్ల పైనే ఉంటాయని అంచనా వేస్తున్నామన్నారు. తూర్పు గోదావరి జిల్లా అమలాపురం ప్రాంతానికి చెందిన హరికృష్ణ 1989లో పోలీస్ శాఖలో ఎస్ఐగా చేరి ఏఎస్పీ స్థాయికి చేరుకున్నారని తెలిపారు. సీఐడీ, ఏసీబీ, విజిలెన్స్ విభాగాల్లో పనిచేశారన్నారు. విజిలెన్స్ ఎన్ఫోర్సుమెంట్లో అదనపు ఎస్పీగా శ్రీకాకుళం జిల్లాలో పనిచేసి నాలుగు నెలల కిందట విశాఖలోని ఏపీ ట్రాన్స్కోలో విజిలెన్స్ ఏఎస్పీగా చేరారని తెలిపారు. సోదాల్లో పలు కీలక డాక్యుమెంట్లు స్వా«దీనం చేసుకున్నామని తెలిపారు. విజయనగరం డీఎస్పీ డి.వి.ఎస్.నాగేశ్వరరావు, సీఐలు అప్పారావు, భాస్కర్, ఎస్ఐలు, సిబ్బంది సోదాల్లో పాల్గొన్నారు. హరికృష్ణ ఇంట్లో ఏసీబీ అధికారుల సోదాలతో పోలీస్ శాఖతోపాటు ఏపీఈపీడీసీఎల్లో చర్చనీయంగా మారింది. హరికృష్ణను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసి ఎంవీపీ జోన్ పోలీస్ స్టేషన్కు తరలించారు. శుక్రవారం ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తామని డీఎస్పీ తెలిపారు. గుర్తించిన ఆస్తులివీ ►హరికృష్ణ పేరు మీద తూర్పు గోదావరి జిల్లా, తాళ్లరేవు మండలం, చోల్లంగి గ్రామంలో 300 చదరపు గజాల ఇంటి స్థలం. ►విజయవాడలోని గుణదల జయప్రకాష్నగర్లో శ్రీలక్ష్మి అపార్టుమెంట్ సి – 4లో ఓ ప్లాట్. ►హరికృష్ణ భార్య తంగెళ్ల పద్మారాణి పేరు మీద పశ్చిమ గోదావరి జిల్లా పోడూరు మండలం, మట్టపర్రు గ్రామంలో 25 సెంట్లు స్థలం. ►శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం పొన్నాడ గ్రామంలో 3.02 ఎకరాల స్థలం. ►కృష్ణ జిల్లా, మంగళగిరి మండలం, నిడమర్రు గ్రామంలో 72 సెంట్ల స్థలం. ►పశ్చిమ గోదావరి జిల్లా, గవరవరం గ్రామంలో అక్షయ ఎన్క్లేవ్లో ఓ ప్లాట్. ►విశాఖపట్నం జిల్లా, పరదేశిపాలెంలో ఓ ప్లాట్. ►హరికృష్ణ కుమారుడు రాజహర్ష పేరు మీద విశాఖ జిల్లా పరదేశిపాలెంలో ఓ ప్లాట్. ►కుమార్తె మానవిత పేరు మీద హైదరాబాద్ సరూర్నగర్లో బిజాయ్ క్యాస్టిల్లో మూడో అంతస్తులో ఓ ప్లాట్. ►సుమారు 6.64 లక్షల విలువ చేసే 260 గ్రాముల బంగారం, 2876 గ్రాముల వెండి వస్తువులు, రూ.19లక్షల విలువ చేసే ఇతర విలువైన వస్తువులను గుర్తించారు. ►అదేవిధంగా బ్యాంకు ఖాతాలో రూ.17లక్షల నగదు గుర్తించారు. -
‘కరెంట్’ రికార్డు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ కొత్త రికార్డులు సృష్టిస్తోంది. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలోని భారీ సామర్థ్యం గల పంపుల ద్వారా నీటిని తోడుతుండటం, కొన్ని రోజులుగా వర్షాలు లేక పొలాలకు బోరుబావుల ద్వారా నీటిని తోడేందుకు విద్యుత్ను వినియోగిస్తుండడడంతో డిమాండ్ విపరీతంగా పెరిగిపోతోంది. గత 3 రోజులుగా వరుసగా విద్యుత్ డిమాండ్ రికార్డులపై రికార్డులు సృష్టించింది. 2018 సెప్టెంబర్ 11న నమోదైన 10,818 మెగావాట్ల గరిష్ట డిమాండ్ ఇప్పటివరకు రికార్డు కాగా, ఈ నెల 28న 11,064 మెగావాట్ల గరిష్ట వినియోగం నమోదై కొత్త రికార్డు సృష్టించింది. మరుసటి రోజు 29న డిమాండ్ 11,638 మెగావాట్లకు చేరి అంతకు ముందురోజు ఉన్న రికార్డును చెరిపేసింది. తాజాగా శుక్రవారం ఉదయం 7 గంటల ప్రాంతంలో విద్యుత్ డిమాండ్ 11,669 మెగావాట్లకు చేరి మరో కొత్త రికార్డు సృష్టించింది. తెలంగాణ చరిత్రలో ఇప్పటివరకిదే అత్యధిక విద్యుత్ డిమాండ్ కాగా, రానున్న 2 నెలల్లో డిమాండ్ పెరిగి 12,000 మెగావాట్లు దాటే అవకాశముందని ట్రాన్స్కో అంచనా వేసింది. -
లైన్లు లేకున్నా లైన్ క్లియర్!
సాక్షి, అమరావతి: గత ప్రభుత్వ హయాంలో ఏపీ ట్రాన్స్కోలో చోటు చేసుకున్న మరో అవినీతి వ్యవహారం తెరపైకి వచ్చింది. అనంతపురం జిల్లాలో అసలు సరిపడా లైన్లే లేకుండా పవన విద్యుత్కు అనుమతులు మంజూరు చేయడం విద్యుత్ వర్గాలనే విస్మయానికి గురి చేస్తోంది. విండ్ పవర్ లాబీ, విద్యుత్ అధికారులు, టీడీపీ పెద్దలు కలసికట్టుగా ఈ కుంభకోణానికి పాల్పడినట్లు ట్రాన్స్కో విజిలెన్స్ పరిశీలనలో వెల్లడైంది. 2017లో జరిగిన ఈ వ్యవహారంపై ట్రాన్స్కో విజిలెన్స్ విభాగం ఇటీవల ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక అందచేసింది. అవసరం లేకుండా ప్రైవేట్ పవన విద్యుత్కు గత సర్కారు ఎలా పెద్దపీట వేసిందో నిపుణుల కమిటీ ఇప్పటికే నిగ్గు తేల్చడం తెలిసిందే. లోపాయికారీ ఒప్పందంతో అనుమతులు.. దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీలో పవన విద్యుత్ను యూనిట్ రూ.4.84 చొప్పున కొనుగోలు చేసేందుకు గత ప్రభుత్వం అనుమతించింది. నిజానికి ఆ సమయంలో అన్ని రాష్ట్రాలు బిడ్డింగ్ ద్వారానే పవన విద్యుత్ కొనుగోలు చేస్తున్నాయి. అయితే విండ్ లాబీతో కుదుర్చుకున్న లోపాయికారి ఒప్పందంతో టీడీపీ పెద్దలు అడ్డగోలుగా అనుమతులిచ్చారు. అనంతపురం జిల్లా ఉరవకొండలో సరిపడా ట్రాన్స్కో లైన్లు లేకున్నా పవన విద్యుత్ కొనుగోలుకు ట్రాన్స్కో అధికారులు పచ్చజెండా ఊపడం గమనార్హం. నిబంధనలకు పూర్తి విరుద్ధంగా జరిగిన ఈ వ్యవహారంపై వ్యక్తమైన ఆరోపణలను అధికారులు తొక్కిపెట్టారు. సగానికి పైగా అదనం ఉరవకొండ పరిధిలో పవన విద్యుదుత్పత్తికి పలు బడా కంపెనీలు దరఖాస్తులు చేసుకున్నాయి. ఉత్పత్తి అయ్యే విద్యుత్ను గ్రిడ్కు అనుసంధానం చేసి రాష్ట్ర అవసరాలకు వినియోగిస్తారు. ఇందుకు విద్యుదుత్పత్తి జరిగే ప్రదేశంలో 400 కేవీ సబ్స్టేషన్లు, లైన్లు ఏర్పాటు చేయాలి. 2017 నాటికి ఏపీ ట్రాన్స్కో కేవలం 997 మెగావాట్ల విద్యుత్ తీసుకునేందుకు వీలుగా ట్రాన్స్కో లైన్లను విస్తరించింది. కానీ గత ప్రభుత్వం ఏకంగా 1,851 మెగావాట్ల మేర విద్యుత్ తీసుకునేందుకు విండ్ ఉత్పత్తిదారులకు అనుమతులు ఇవ్వడం గమనార్హం. దీన్ని ఆసరాగా చేసుకుని పవన విద్యుత్ ఉత్పత్తిదారులు విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటు చేసి వాటిని అడ్డం పెట్టుకుని బ్యాంకు లోన్లు తీసుకున్నారు. వీటిల్లో మాజీ ముఖ్యమంత్రికి బినామీగా వ్యవహరించిన వ్యక్తులకు సంబంధించిన పవన విద్యుత్ ప్లాంట్లు కూడా ఉన్నాయి. ఓ పవన విద్యుత్ సంస్థ విద్యుత్ శాఖలో కీలక బాధ్యతల్లో ఉన్న వ్యక్తికి పెద్ద ఎత్తున ముడుపులు ఇచ్చినట్టు తేలింది. టీడీపీకి చెందిన స్థానిక నేత ఒకరు మాజీ ముఖ్యమంత్రికి విండ్ లాబీ నుంచి భారీగా ముడుపులు ఇప్పించినట్టు విజిలెన్స్ అధికారుల దృష్టికి వచ్చింది. దీంతో ఎలాంటి లైన్లు లేకుండానే 854 మెగావాట్ల మేర పవన విద్యుత్ ఉత్పత్తికి అధికారులు అనుమతులు ఇచ్చినట్లు స్పష్టమవుతోంది. ఇదిలా ఉంటే అప్పటికప్పుడు కనెక్షన్లు ఇచ్చేందుకు వీలుగా వేరే ప్రదేశం నుంచి 500 ఎంవీఏ సామర్థ్యం గల ట్రాన్స్ఫార్మర్ను కూడా ఉరవకొండ ప్రాంతంలో బిగించడం విశేషం. ఓ అధికారి కీలక పాత్ర ట్రాన్స్కోలో డిప్యుటేషన్పై పనిచేసిన ఓ అధికారి పాత్రపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పవన విద్యుత్ లాబీకి, మాజీ ముఖ్యమంత్రికి మధ్య ఆయనే బేరసారాలు జరిపినట్లు తెలుస్తోంది. మరోవైపు అప్పటి ఇంధనశాఖ ముఖ్య అధికారి ప్రమేయం కూడా ఉందని విజిలెన్స్ అధికారులు అనుమానిస్తున్నారు. ఉరవకొండ ప్రాంతంలో సరిపడా లైన్లు లేవని, సామర్థ్యానికి మించి పవన విద్యుత్ ఉత్పత్తికి అనుమతులు ఇవ్వడం సరికాదని స్థానిక అధికారులు నివేదికలు పంపినా డిçప్యుటేషన్పై వచ్చి ట్రాన్స్కోలో పనిచేసిన అధికారి వినలేదని తెలిసింది. నివేదికలు ఇచ్చిన ఇంజనీర్లను పిలిచి మందలించినట్టు సమాచారం. ఈ మొత్తం వ్యవహారం అప్పటి సీఎం ఆదేశాల మేరకు జరిగిందని, ఇంధనశాఖ ముఖ్య అధికారి ఇంజనీర్లను సైతం బెదిరించినట్టు తెలిసింది. గత్యంతరం లేక క్షేత్రస్థాయి ఇంజనీర్లు ఉన్నతాధికారుల మాట వినాల్సి వచ్చిందని విజిలెన్స్ అధికారుల దృష్టికి వచ్చింది. ఈ వ్యవహారంలో ఎవరి పాత్ర ఎంత అనేది పూర్తి స్థాయి నివేదికలో తేలనుంది. -
అక్రమార్కులకు ‘షాక్’ ఇస్తారా?
సాక్షి, విజయనగరం: కొన్నేళ్లుగా ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీఈపీడీసీఎల్) అక్రమార్కులకు బంగారు బాతుగుడ్డుగా మారింది. అవినీతి, అక్రమాలకు ఆలవాలంగా తయారైంది. సంస్థలో అక్రమ నియామకాలు, అడ్డగోలు ఇంక్రిమెంట్లు, తుపాన్లలో నిధుల దుర్వినియోగం వంటి ఎన్నో అడ్డదారి వ్యవహారాలు చోటు చేసుకుంటున్నాయి. సీఎండీలుగా వ్యవహరించిన వారు, కీలకస్థానాల్లో ఉన్న మరికొందరు ఇందులో భాగస్వాములుగా ఉన్నారు. దీంతో ఈ అక్రమాలకు బాధ్యులపై చర్యలకు అడుగు ముందుకు పడడం లేదు. మూడు నెలల క్రితం ఈపీడీసీఎల్లో నిబంధనలకు విరుద్ధంగా 32 మందికి నోషనల్ ఇంక్రిమెంట్లను మంజూరు చేస్తూ రూ.కోట్లు చెల్లించారు. కానీ వీరికి ఇంక్రిమెంట్లు ఇవ్వడం ట్రాన్స్కో తేల్చి చెప్పినా ఇందుకు బాధ్యులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అంతేకాదు.. ఈ 32 మంది నుంచి రికవరీ చేయాలని ట్రాన్స్కో ఆదేశించినా ఇప్పటిదాకా కొద్దిమంది నుంచే తప్ప మిగతా వారి నుంచి వసూలు చేయలేదు. అలాగే తిత్లీ తుపానులో ఈపీడీసీఎల్కు రూ.349 కోట్ల నష్టం వాటిల్లింది. ఇందులోనూ పెద్ద ఎత్తున నిధుల స్వాహా జరిగింది. పనులు చేయకుండానే చేసినట్టు రికార్డులు సృష్టించి బిల్లులు చెల్లించడం, మెటీరియల్ కొనుగోలు చేయకుండానే కొనుగోలు చేసినట్టు చూపి కోట్లాది రూపాయల నిధులను మింగినట్టు ఆరోపణలొచ్చాయి. అప్పటి విద్యుత్ శాఖ మంత్రి కళా వెంకట్రావు బంధువుల పేరిట ఉన్న సంస్థ నుంచి కండక్టర్ల కొనుగోలు చేసినట్టు చూపించి సొమ్ము స్వాహా చేశారంటూ ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇంతటి భారీ కుంభకోణంపై కూడా ఎలాంటి చర్యలు లేవు. గతంలో నిబంధనలకు విరుద్ధంగా జిల్లాల్లోని సర్కిల్స్ నుంచి సీనియర్ అసిస్టెంట్లను కార్పొరేట్ కార్యాలయానికి బదిలీలు చేయడం వెనక భారీగా చేతులు మారాయన్న విమర్శలు సంబంధిత అధికారులపై వచ్చాయి. అంతేకాదు.. స్పాట్ బిల్లింగ్ కాంట్రాక్టర్ల రెండేళ్ల టెండరు గడువు 2019తో ముగిసింది. కానీ వారు అడగకుండానే అప్పటి సీఎండీ హెచ్వై దొర 2020 వరకు కాంట్రాక్టు పొడిగించేశారు. అలాగే షిఫ్ట్ ఆపరేటర్ పోస్టులు కూడా లక్షల్లో అమ్ముడుపోయినా సంబంధిత అధికారులపై ఎలాంటి చర్యలూ లేవు. మరోవైపు 15 ఏళ్ల క్రితం నిబంధనలకు తిలోదకాలిచ్చి ఈపీడీసీఎల్లో వివిధ పోస్టుల్లో 29 మందిని నియమించారు. వీరిలో 28 మంది నకిలీలేనని దీనిపై దర్యాప్తు జరిపిన విజిలెన్స్ అధికారులు తేల్చి నివేదికలిచ్చారు. చర్యలు తీసుకోవాలని రెండు మార్లు సిఫార్సు చేశారు. అయినా వీరు ఇప్పటికీ ఉద్యోగాల్లోనే కొనసాగుతూ లక్షల్లో జీతాలు తీసుకుంటున్నారు. ఇలా ఈపీడీసీఎల్లో చిన్నా చితకా కాదు.. భారీ అక్రమాలు, అవినీతి వ్యవహారాలు జరుగుతూనే ఉన్నాయి. 172 సబ్స్టేషన్ల ఏర్పాటులో ఎస్టిమేట్ రేట్లకంటే ఎక్కువకు మెటల్ కొనుగోలు చేయడంలోనూ నిధుల దుర్వినియోగానికి పాల్పడినట్టు ఆరోపణలున్నాయి. పదేళ్ల నుంచి కొనుగోలు ఆర్డర్ ప్రకారం సకాలంలో సప్లై చేయనందుకు పోల్స్ తయారీ సంస్థలకు విధించిన పెనాల్టీనీ మాఫీ చేసి రూ.38 కోట్లు వెనక్కి చెల్లించడం పెను దుమారం రేగింది. ఈ నేపథ్యంలో కొత్త సీఎండీగా బాధ్యతలు చేపట్టిన ఐఏఎస్ అధికారి నాగలక్ష్మి సెల్వరాజన్ వీటిన్నిటిపై దృష్టి సారిస్తారా? లేదా? ఈ సవాళ్లన్నిటీ ఆమె ఎలా ఎదుర్కొంటారన్న దానిపై సర్వత్రా చర్చ జరుగుతోంది. -
హైదరాబాద్కు ‘హై’పవర్!
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్లో రికార్డు స్థాయిలో పెరుగుతున్న డిమాండ్కు అనుగుణంగా విద్యుత్ సరఫరా వ్యవస్థ సామర్థ్యాన్ని పెంపొందించేందుకు రాష్ట్ర విద్యుత్ సరఫరా సంస్థ(ట్రాన్స్కో) అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంది. కొత్త టవర్లు నిర్మించకుండానే, కొత్త లైన్లు వేయకుండానే ప్రస్తుత లైన్లకు ‘హై టెంపరేచర్ లాసాగ్’ (హెచ్టీఎల్ఎస్) కండక్టర్లను అమర్చి హైదరాబాద్లో 70 కిలోమీటర్ల డబుల్ సర్క్యూట్ 220 కేవీ విద్యుత్ సరఫరా లైన్ల సామర్థ్యాన్ని రెట్టింపు చేసింది. దీంతో రూ.1,100 కోట్లు ఆదా చేయడంతోపాటు మూడేళ్లు పట్టే పనిని 3నెలల్లో పూర్తిచేసింది. సామర్థ్యం పెంచేందు కు ఏర్పాటు చేసిన కండక్లర్లను విద్యుత్ సౌధలో ట్రాన్స్కో సీఎండీ ప్రభాకర్రావు బుధవారం ప్రారంభించారు. అధిక లోడ్ లైన్ల సామ ర్థ్యం పెంపుతో హైదరాబాద్లో విద్యుత్ సరఫరాలో అప్పుడప్పుడు ఎదురవుతున్న సాంకేతిక సమస్యలు పరిష్కారం కానున్నాయి. రూ.1,100 కోట్లు ఆదా..: పారిశ్రామిక, వాణిజ్య, గృహ విద్యుత్ వినియోగం రోజురోజుకూ పెరుగుతోంది. గతేడాది 2,950 మెగావాట్ల గరిష్ట డిమాండ్ రాగా, ఈ ఏడాది 3,276 మెగావాట్లకు చేరింది. ప్రస్తుతమున్న లైన్లు, ట్రాన్స్ఫార్మర్లపై ఒత్తిడి పెరిగింది. ఎక్కువ లోడ్ గల రూట్లలో సరఫరాలో అప్పుడప్పుడు అవాంతరాలు తప్పట్లేదు. 400 కేవీ లైన్ల నుంచి 220 కేవీ విద్యుత్ను తీసుకొచ్చే మామిడిపల్లి– శివరామ్పల్లి, మల్కాపురం– షాపూర్నగర్, శంకరపల్లి–గచ్చిబౌలి లైన్లపై అధిక ఒత్తిడి ఉన్నట్లు నిర్ధారించారు. ఈ లైన్లలో సామర్థ్యాన్ని రెట్టింపు చేయాల్సిన అవసరాన్ని గుర్తించారు. ఈ మూడు లైన్లు కలిపి దాదాపు 70 కిలోమీటర్ల దూరం ఉంటుంది. కొత్తగా టవర్లు నిర్మించి, 220 కేవీ లైన్లు వేయాల్సిన పరిస్థితి ఉండేది. ఇలా చేయడం వల్ల రూ.1,200 కోట్ల వ్యయం అవుతుంది. పైగా మూడేళ్ల సమయం పట్టేది. ఆధునిక పరిజ్ఞానాన్ని వినియోగించి టవర్లు, లైన్లు నిర్మించకుండానే ప్రస్తుతమున్న లైన్ల సామర్థ్యాన్ని ప్రత్యేక కండక్టర్లు అమర్చడం ద్వారా రెట్టింపు చేసింది. ఈ కండక్టర్ల సామర్థ్యాన్ని మొదట నార్కట్పల్లి ప్రాంతంలో 20 కిలోమీటర్ల 132 కేవీ లైన్లలో పరీక్షించారు. ట్రాన్స్కో సాంకేతిక బృందం పూర్తి స్థాయిలో అధ్యయనం చేసిన తర్వాత ఈ కండక్టర్లను వాడాలని సిఫారసు చేసింది. టెస్ట్ రన్ కూడా విజయవంతం చేసిన తర్వాత, బుధవారం నుంచి అధికారికంగా ఈ మూడు లైన్లలో కండక్టర్లను అనుసంధానం చేశారు. దీంతో విద్యుత్ సరఫరా పరిస్థితి మెరుగైంది. 4 వేలకు పైగా డిమాండ్ తట్టుకునే సామర్థ్యం పెరిగింది. మూడేళ్ల వరకు ఢోకా లేకుండా హైదరాబాద్కు విద్యుత్ సరఫరా చేయొచ్చు. దీనికి రూ.100 కోట్ల వ్యయమైంది. 400 కేవీ రింగ్ ఏర్పాటు ‘హైదరాబాద్ ను జాగ్రత్తగా కాపాడుకోవాలి. పరిశ్ర మలు, వ్యాపారం, వాణిజ్యం, కార్యాలయాలు అన్నీ కరెంటుపై ఆధారపడి నడుస్తున్నాయి. ఎక్కడా విద్యుత్ కోతల్లేకుండా, సరఫరాలో అంతరాయం కలగకుండా చూస్తున్నాం. డిమాండ్కు తగినట్లు విద్యుత్ సరఫరా చేయడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నాం. ఇప్పటికే హైదరాబాద్ చుట్టూ 400 కేవీ రింగ్ ఏర్పాటు చేశాం. నాలుగు 400 కేవీ సబ్స్టేషన్లు నిర్మించాం. అక్కడి నుంచి 220 సబ్స్టేషన్లకు విద్యుత్ సరఫరా చేసే లైన్ల సామర్థ్యం ఎప్పటికప్పుడు పెంచుతున్నాం’ – ట్రాన్స్కో సీఎండీ డి.ప్రభాకర్ రావు -
నిర్మాణ రంగానికి ఊతం
1. ముందే విద్యుత్, నీటి కనెక్షన్ల దరఖాస్తు.. గతంలో నిర్మాణం పూర్తయి ఓసీ వచ్చిన తర్వా తే వాటర్ వర్క్స్, ట్రాన్స్కో విభాగాల కనెక్షన్ల కోసం దరఖాస్తు చేసుకోవాల్సి వచ్చేది. కానీ, తాజా నిబంధనతో ఓసీ రాకముందే డెవలపర్లు విద్యుత్, వాటర్ కనెక్షన్ల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. కనెక్షన్లు మాత్రం ఓసీ మంజూరయ్యాకే ఇస్తారు. కొన్ని చోట్ల వాటర్ వర్క్స్ విభాగానికి పూర్తి స్థాయిలో నల్లా లైన్స్ లేవు. టెండర్లు పిలవటం, పనులు పూర్తవటం వంటి తతంగమంతా జరగడానికి 3–9 నెలల సమయం పట్టేది. ఈ లోపు నిర్మాణం పూర్తయినా సరే కస్టమర్లు గృహ ప్రవే శం చేయకపోయే వాళ్లు. ఎందుకంటే మౌలిక వసతులు లేవు కాబట్టి! కానీ, ఇప్పుడు దరఖాస్తు చేయగానే వెంటనే అధికారులు ఆయా ప్రాం తాల్లో కనెక్షన్లు ఉన్నాయా? లేవా? చెక్ చేసుకునే వీలుంటుంది. దీంతో నిర్మా ణంతో పాటూ వసతుల ఏర్పాట్లు ఒకేసారి జరుగుతాయి. 2. వెంటిలేషన్స్లో గ్రీన్.. హరిత భవనాల నిబంధనల్లో ప్రధానమైనవి.. భవ న నిర్మాణాల్లో సాధ్యమైనంత వరకూ సహజ వనరుల వినియోగం. ఉదయం సమయంలో ఇంట్లో లైట్ల వినియోగం అవసరం లేకుండా సహజ గాలి, వెలుతురు వచ్చేలా గదుల వెంటిలేషన్స్ ఉం డాలి. అందుకే తాజాగా గదుల వెంటిలేషన్స్ గ్రీన్ బిల్డింగ్స్ నిబంధనలకు అనుగుణంగా ఉండాలనే నిబంధనలను తీసుకొచ్చారు. దీంతో ఇంట్లో లైట్లు, ఏసీల వినియోగం తగ్గుతుంది. ఫలితంగా కరెంట్ ఆదా అవుతుంది. నిర్వహణ వ్యయం కూడా తగ్గుతుంది. 3. సెట్బ్యాక్స్ తగ్గింపు.. 120 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తులో నిర్మించే భవనా ల చుట్టూ 20 మీటర్ల వెడల్పు ఖాళీ స్థలం వదిలితే సరిపోతుంది. గతంలో వీటికి సెట్బ్యాక్స్ 22.5 మీటర్లుగా ఉండేది. 55 మీటర్ల వరకూ ఎత్తు భవనాలకు గరిష్టంగా చుట్టూ వదలాల్సిన స్థలం 16 మీటర్లుగా ఉండగా.. ఆపై ప్రతి 5 మీటర్లకు 0.5 మీటర్ల ఖాళీ స్థలం పెరిగేది. కానీ, తాజా నిబంధనలతో 120 మీటర్ల ఎత్తు దాటితే గరిష్టంగా 20 మీటర్ల సెట్బ్యాక్ వదిలితే సరిపోతుంది. 4. రోడ్ల విస్తరణకు స్థలం ఇస్తే.. నగరంలో రోడ్ల విస్తరణలో స్థలాల సమీకరణ పెద్ద చాలెంజ్. దీనికి పరిష్కారం చెప్పేందుకు, స్థలాలను ఇచ్చేవాళ్లను ప్రోత్సహించేందుకు నిబంధనల్లో మార్పు చేశారు. రోడ్ల విస్తరణకు ముందు ఉన్న విధంగానే భవనం నమూనా, ఒక అంతస్తు నుంచి మరొక అంతస్తుకు ఉన్న ఎత్తు సేమ్ అదేగా ఉండాల్సిన అవసరం లేదు. భవన నిర్మాణానికి అనుమతించిన విస్తీర్ణం మాత్రం గతం కంటే మించకుండా ఉంటే చాలు. 5. టెర్రస్ మీద స్విమ్మింగ్ పూల్ ఇప్పటివరకు టెర్రస్ మీద స్విమ్మింగ్ పూల్స్ అనేవి స్టార్ హోటళ్లు, ప్రీమియం అపార్ట్మెంట్లలో మాత్ర మే కనిపించేవి. కానీ, తాజా సవరణల్లో టెర్రస్ మీద స్విమ్మింగ్ పూల్ ఏర్పాటును చేర్చారు. అపార్ట్మెంట్ పైకప్పును పూర్తి స్థాయిలో వినియోగించుకోవచ్చు. పైగా టెర్రస్ మీద స్విమ్మింగ్ పూల్, దాని కింది ఫ్లోర్లోనే క్లబ్ హౌస్ వంటి వసతులుంటా యి కాబట్టి కస్టమర్లు పూర్తి స్థాయిలో వసతులను వినియోగించుకుంటారు. అపార్ట్మెం ట్ చల్లగా ఉంటుంది. ఏసీ వినియోగం తగ్గు తుంది. నిర్వహణ పటిష్టంగా ఉన్నంతకాలం బాగుంటుంది. – సాక్షి, హైదరాబాద్ ఇంపాక్ట్ ఫీజు సంగతేంటి? ఓసీ రాకముందే బీటీ, సీసీ రోడ్లు నిర్మా ణం పూర్తి చేయాలనే నిబంధనను తీసుకొ చ్చారు. ఇది ఆహ్వానించదగ్గదే. కానీ, ఎక్స్టర్నల్ డెవలప్మెంట్ కోసం వసూలు చేస్తున్న ఇంపాక్ట్ ఫీజును ఇందులో నుంచి మినహాయించాలనేది డెవలపర్ల డిమాండ్. 6 ఫ్లోర్ల తర్వాత నుంచి ఇంపాక్ట్ ఫీజుగా చ.అ.కు రూ.50 వసూలు చేస్తున్నారు. నిజానికి నిర్మాణ కార్యకలాపాలతో అభి వృద్ధి జరిగి ఆయా ప్రాంతాల్లో జనాభా పెరుగుతుంది కాబట్టి ఇంపాక్ట్ ఫీజులతో ఎక్స్టర్నల్ డెవలప్మెంట్స్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. కానీ, తాజా నిబంధనల్లో ఎక్స్టర్నల్ డెవలప్మెంట్స్ కూడా నిర్మాణదారులే చేయాలి. ఆ తర్వాతే ఓసీ మంజూరు చేస్తామనడం సరైనది కాదు. ఇంపాక్ట్ ఫీజు ఎస్క్రో ఖాతాలో ఉంటుంది ఈ సొమ్ముతో డెవలపర్లు వసతులను ఏర్పా టు చేయాలి లేదా ఆయా ఖర్చును ఇంపాక్ట్ ఫీజు నుంచి మినహాయించాలి. -
ట్రాన్స్కోలో ఇష్టారాజ్యం
సాక్షి, మద్నూర్(జుక్కల్): తెలిసీ తెలియని పనులు చేస్తే ఉద్యోగం నుంచి తీసి వేస్తారు.. మళ్లీ వేరే ఉద్యోగం వెతుక్కోవచ్చు.. అయితే విద్యుత్ శాఖలో మాత్రం నిర్లక్ష్యం పనికిరాదు. కొద్దిపాటి నిర్లక్ష్యం చేసిన ప్రాణాల హరీమనడం ఖాయం. మండలలోని ట్రాన్స్కో అధికారులు స్థానికంగా ఉండకుండా ఇతర ప్రాంతాల నుంచి నిత్యం రాకపోకలు సాగిస్తున్నారు. ట్రాన్స్కో లైన్మెన్లు, సిబ్బంది ప్రైవేట్ వ్యక్తులకు పెట్టుకుని వారితో పనులు చేపించుకుని కొంత డబ్బు ముట్టజెప్పుతున్నారు. రాత్రి సమయాల్లో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడితే ప్రైవేటు వ్యక్తులే సమస్యలను పరిష్కరిస్తున్నారు. నిబంధనల ప్రకారం ట్రాన్స్కో అధికారులు, సిబ్బంది స్థానికంగా ఉండి, ప్రైవేటు వ్యక్తులతో పనులు చేయించరాదు. జిల్లాకు సరిహద్దులో ఉన్న మద్నూర్ మండలంలో ట్రాన్స్కో ఉన్నతాధికారుల పర్యవేక్షణలు లేకపోవడంతో సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని పలువురు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. మండల కేంద్రంలో విద్యుత్ లైన్కు ప్రైవేటు వ్యక్తితో మరమ్మతులు చేయించడం చూసి గ్రామస్తులు ఆశ్యర్యం వ్యక్తం చేశారు. ట్రాన్స్కో లైన్మెన్, క్యాజువల్ లెబర్, ట్రాన్స్కో సిబ్బంది దగ్గరుండి మరి పనులు చేపించడం దారుణమని పలువురు మండిపడుతున్నారు. గతంలో ట్రాన్స్కోలో ప్రైవేటు సిబ్బంది పనిచేస్తూ ప్రమాదల బారిన పడిన సంఘటనలు ఉన్నాయి. ఉపాధి కోసం, ట్రాన్స్కోలో ఉద్యోగం కోసం పని నేర్చుకుంటుమన్నామని ప్రైవేటు వ్యక్తులు చెబుతున్నారు. ట్రాన్స్కో జిల్లా అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. -
బకాయి చెల్లించకుండా బుకాయింపు
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్కు తెలంగాణ విద్యుత్తు సంస్థలు రూ.5 వేల కోట్లకుపైగా బకాయి పడ్డాయంటూ ఆ రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు చేస్తున్న ఆరోపణలు అబద్ధమని తెలంగాణ ట్రాన్స్కో, జెన్కో సీఎండీ ప్రభాకర్రావు అన్నారు. ఏపీ విద్యుత్తు సంస్థలే తెలంగాణకు బకాయిలు చెల్లించాల్సి ఉందని, ఆ విషయాన్ని పక్కనపెట్టి ‘ఉల్టా చోర్ కొత్వాల్కో డాంటే’తరహాలో ఏపీ వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ఆయన శుక్రవారం ఇక్కడ విద్యుత్సౌధలో మీడియాతో మాట్లాడారు. రెండు వైపుల నుంచి బకాయిలు ఇచ్చిపుచ్చుకోవాల్సి ఉన్నందున చాలాకాలంగా పరిష్కారం కోసం ఆహ్వానిస్తున్నా ఏపీ అధికారులు సహకరించటం లేదన్నారు. సెటిల్మెంట్ కోసం ముందుకు రాకుండా ఇప్పుడేమో తెలంగాణ విద్యుత్తు సంస్థలే బకాయి పడ్డాయని ఆరోపించటం హాస్యాస్పదమన్నారు. ‘ఏపీ డిస్కంల నుంచి తెలంగాణ డిస్కంలకు రూ.1,659 కోట్లు, ఏపీ ట్రాన్స్కో నుంచి తెలంగాణ ట్రాన్స్కోకు రూ.101 కోట్లు, ఏపీ జెన్కో నుంచి తెలంగాణ జెన్కోకు రూ.3,096 కోట్లు, ఏపీ పవర్ యుటిలిటీస్ నుంచి తెలంగాణ పవర్ యుటిలిటీస్కు రూ.929 కోట్లు వెరసి రూ.5,785 కోట్లు రావాల్సి ఉంది. విద్యుత్తు కొనుగోలుకు సంబంధించి తెలంగాణ డిస్కంల నుంచి ఏపీ జెన్కోకు రూ.3,379 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఈ మొత్తం పోను ఏపీ సంస్థలు తెలంగాణ సంస్థలకు రూ.2,406 కోట్లు చెల్లించాల్సి ఉంది. మరో రూ.1,100 కోట్ల వరకు తెలంగాణకు ఏపీ చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. వీటిని మరుగున పడేసి తెలంగాణనే బకాయిపడ్డట్టు తప్పుడు వాదనను తెరపైకి తెచ్చారు. ఈ లెక్కలు బహుశా అక్కడి ప్రభుత్వానికి తెలియకపోవచ్చు. అధికారులకు, ప్రభుత్వానికి మధ్య సమన్వయలోపం ఉన్నట్టుంది. తెలిసి ఉంటే ప్రభుత్వ వాదన అలా ఉండదు కదా’అని ప్రభాకరరావు అన్నారు. ఎన్సీఎల్టీని ఎందుకు ఆశ్రయించినట్టో... వాస్తవాలను పక్కన పెట్టి ఏపీ జెన్కో నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ)ని ఆశ్రయించటం విడ్డూరంగా మారిందని ప్రభాకర్రావు అన్నారు. దివాలా తీసిన సమయంలో ఈ ట్రిబ్యునల్ను ఆశ్రయించి లెక్కలు సరిచేసుకునేందుకు వాటి ఆస్తులను స్వాధీనం చేసుకునే ప్రక్రియ నిర్వహిస్తారని, మరి తెలంగాణ విద్యుత్తు సంస్థలను ఏపీ స్వాధీనం చేసుకోవాలని చూస్తోందా... అంటూ ఆయన ఎద్దేవా చేశారు. ఈ బకాయిలకు సంబంధించి సెటిల్ చేసుకునేందుకు రావాలంటూ ఇప్పటికే ఏడెనిమిది లేఖలు రాశామని, తాను స్వయంగా ఏపీ అధికారులతో మాట్లాడానని, కానీ అక్కడి నుంచి స్పందన లేదని ఆరోపించారు. ఏపీ అధికారులు ముందుకొస్తే 24 గంటల్లో పరిష్కరించుకునేందుకు తాము సిద్ధమని, ఆ తర్వాత తాము చెల్లించాల్సిన బకాయిలు వెంటనే చెల్లించేందుకు కూడా సిద్ధమన్నారు. ఏపీ తెలంగాణకు చెల్లించేది డబ్బు... తెలంగాణ ఏపీకి చెల్లించాల్సింది డబ్బు కాదా... డబ్బుకు కూడా రంగు, రుచి, వాసన వేర్వేరుగా ఉంటాయని ఏపీ అధికారులు భావిస్తున్నట్టున్నారంటూ ఎద్దేవా చేశారు. -
విద్యుత్ చార్జీల పెంపు అనివార్యమే!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుపోతున్నాయి. ఓ వైపు డిస్కంల ఆర్థికలోటు ఏడాదికేడాది పెరిగిపోతుండగా, మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆశించిన మేరకు విద్యుత్ రాయితీలు కేటాయించడం లేదు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఎదురైన విద్యుత్ సంక్షోభాన్ని డిస్కంలు కేవలం 6 నెలల్లోనే అధిగమించి 24 గంటల నిరంతర విద్యుత్ సరఫరా అందిస్తున్నాయి. దీనికితోడు రాష్ట్రప్రభుత్వ నిర్ణయం మేరకు గతేడాది జనవరి 1 నుంచి వ్యవసాయానికి ఉచిత్విద్యుత్ సరఫరా పథకాన్ని 9 గంటల నుంచి 24 గంటలకు పొడిగించాయి. ఈ చర్యల వల్ల రాష్ట్ర విద్యుత్ డిమాండ్ భారీగా పెరిగిపోయింది. రాష్ట్ర అవసరాలకు తగ్గట్లు ఎప్పటికప్పుడు ప్రైవేటు విద్యుదుత్పత్తి కంపెనీల నుంచి అదనపు విద్యుత్ కొనుగోలు చేసి సరఫరా చేయాల్సి రావడంతో డిస్కంలపై ఆర్థికభారం పెరిగిపోయింది. దీంతో విద్యుదుత్పత్తి కంపెనీలకు బిల్లుల బకాయిలను సకాలంలో చెల్లించడంలో డిస్కంలు చేతులెత్తేస్తున్నాయి. విద్యుత్ కొనుగోళ్లకు సంబంధించి రూ.1,356 కోట్ల బకాయిలు చెల్లించకపోవడంతో రాష్ట్రానికి విద్యుత్ సరఫరా నిలుపుదల చేస్తామని జాతీయ థర్మల్ విద్యుదుత్పత్తి సంస్థ(ఎన్టీపీసీ) గతనెలలో హెచ్చరికలు జారీ చేసింది. మరో ప్రైవేటు కంపెనీకు సైతం రూ.1,000 కోట్ల వరకు బకాయిలను డిస్కంలు చెల్లించాల్సి ఉంది. ఈ పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ రాయితీలు పెంచి ఆదుకుంటుందని డిస్కంల యాజమాన్యాలు ఆశించాయి. తాజాగా శాసనసభలో ప్రవేశపెట్టిన రాష్ట్ర ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో అరకొరగా విద్యుత్ రాయితీ నిధులు కేటాయించడంతో విద్యుత్ సంస్థలు తీవ్ర నిరాశకు గరయ్యాయి. విద్యుత్ చార్జీల పెంపు అనివార్యంగా మారిందని అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. కొంప ముంచిన ఈఆర్సీ లెక్కలు ప్రస్తుత చార్జీలను యథాతథంగా కొనసాగిస్తే 2018–19లో రూ.9,970.98 కోట్ల ఆర్థిక లోటు ఏర్పడనుందని గతేడాది రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి(ఈఆర్సీ)కి సమర్పించిన వార్షిక ఆదాయ అవసరాల నివేదిక(ఏఆర్ఆర్)లో డిస్కంలు అంచనా వేశాయి. రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసే విద్యుత్ రాయితీ నిధులతో కొంతవరకు ఆర్థికలోటు భర్తీ కానుండగా, మిగిలినలోటును విద్యుత్ చార్జీల పెంపుతో పూడ్చుకోవాలని డిస్కంలు భావించాయి. విద్యుత్చార్జీల పెంపునకు ప్రభుత్వం నుంచి అనుమతి లభించలేదు. 2018–19 రాష్ట్ర బడ్జెట్లో సైతం డిస్కంలకు ప్రభుత్వం రూ.4,980 కోట్ల విద్యుత్ రాయితీలు మాత్రమే కేటాయించింది. ఈ క్రమంలో ప్రభుత్వం చేతిలో కీలుబొమ్మగా వ్యవహరించిన ఈఆర్సీ డిస్కంల ఆర్థికలోటు అంచనాలను రూ.5,980 కోట్లకు కుదించి పాతచార్జీలతోనే వార్షిక టారిఫ్ ఉత్తర్వులను జారీ చేసింది. వచ్చే నెలతో 2018–19 ఆర్థిక సంవత్సరం ముగిసిపోనుండగా, ఇప్పటికే డిస్కంలు రూ.5 వేల కోట్లకుపైగా ద్రవ్యలోటును ఎదుర్కొంటున్నాయని ట్రాన్స్కో అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. ప్రస్తుత చార్జీలనే వచ్చే ఏడాది కొనసాగిస్తే 2019–20లో డిస్కంలు రూ.10 వేల కోట్లకుపైగా ఆర్థికలోటును ఎదుర్కోక తప్పదని స్పష్టం చేస్తున్నాయి. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో ప్రవేశపెట్టిన రాష్ట్ర ఓటాన్ అకౌంట్ బడ్జెట్ 2019–20లో విద్యుత్శాఖకు రూ.4,002 కోట్లను మాత్రమే ప్రభుత్వం కేటాయించింది. ఎస్సీ, ఎస్టీ సబ్ నిధులు కలుపుకున్నా విద్యుత్ రాయితీలు రూ.5 వేల కోట్లకు మించవని అధికారులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో మిగిలిన రూ.5 వేల కోట్లకుపైగా ఆర్థికలోటులో కొంతభాగాన్ని అయినా పూడ్చుకోవడానికి విద్యుత్చార్జీల పెంపు తప్పదని చర్చ జరుగుతోంది. లోక్సభ ఎన్నికలు ముగిసిన అనంతరం వచ్చే జూన్లో విద్యుత్చార్జీల పెంపు ప్రతిపాదనలను డిస్కంలు ఈఆర్సీకి సమర్పించే అవకాశాలున్నాయి. -
విద్యుత్ తేజో ‘ప్రభాకరుడు’
కొందరికి పదవుల వల్ల పేరొస్తుంది. కానీ, కొందరు వ్యక్తుల కృషి వల్ల ఆ పదవులకు వన్నె వస్తుంది. అలాంటి అరుదైన వ్యక్తులలో ట్రాన్స్కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్రావు ఒకరు. ఆయన వృత్తిలో ప్రవేశిస్తున్నప్పుడే ఎ.పి.ఎస్.ఇ.బి వ్యవస్థ ఏర్పడింది. ఇపుడు ఆ సంస్థ వయస్సు 50 ఏళ్లయితే ప్రభాకర్రావు సర్వీసు కూడా 50 ఏళ్లు అయ్యింది. ఇది కూడా అరుదైన సంఘటనగానే మిగిలిపోయింది. ప్రభాకర్రావు విద్యుత్ శాఖకే వెలుగులు పంచి వన్నె తెచ్చారు. ఇది కూడా ఆయనకు చెరగని కీర్తి తెచ్చి పెట్టింది. ఆయన వృత్తిలో ఎందరెందరో ఉద్యోగులను, ఇంజనీర్లను, ఆడిటింగ్ సెక్షన్ ఆఫీసర్లను, పలురకాల ట్రేడ్ యూనియన్లు చూశారు. వాళ్లందరి తలలో నాలుకలాగా వ్యవహరించటం ఆయన వ్యక్తిత్వానికి నిదర్శనం. అవిభక్త ఆంధ్రప్రదేశ్లో నేదురుమల్లి జనార్ధన్రెడ్డి, వై.ఎస్. రాజశేఖరరెడ్డి నుంచి చివరి ఏపీ సీఎంలు కొణిజేటి రోశయ్య, కిరణ్కుమార్రెడ్డిల వరకు ఆయనకు బాగా తెలుసు. ఆ కాలంలోని సీఎంలందరూ ప్రభాకర్రావు వ్యక్తిత్వాన్ని కొనియాడారు. తెలంగాణ రాష్ట్రం అవతరించాక సీఎం కేసీఆర్ చేపట్టిన 24 గంటల కరెంట్ సరఫరా ఆలోచన అమలుకు ప్రాణంగా ప్రభాకర్రావు పనిచేశారు. విద్యుత్ కోతలు లేని రాష్ట్రంగా తెలంగాణను మలచటానికి ఎంతో శ్రమించి ప్రభుత్వానికి కుడిభుజంగా పనిచేశారు. కేసీఆర్ నమ్మి బాధ్యతనిస్తే చిత్తశుద్ధితో పనిచేసి ఆయన మన్ననలు పొందారు. ఈ 50 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానంలో ప్రభాకర్రావు వ్యక్తిత్వం, పనివిధానం ద్వారా, నిజాయతీ, నిబద్ధతల ద్వారా విద్యుత్ శాఖపై చెరగని ముద్ర వేశారు. ఒక రకంగా ఆయన తన ఇంటిని చూసుకున్నట్లే విద్యుత్ శాఖను కూడా చూసుకున్నారు. చేసే పనిలో చిత్తశుద్ధి, కృషి, ఆత్మగౌరవం, ఎవరికీ తలవంచనితనం, క్లిష్టసమయాల్లో సమస్యలను ఎదుర్కునే శక్తిని అందుకు పరిష్కార మార్గాలను వెతికి పట్టుకోవటంలో ఆయన సిద్ధహస్తుడు. విద్యుత్శాఖలో ప్రభాకర్రావు ఒక ఇన్సైడర్గా ఉన్నారు. విద్యుత్ శాఖ ఆత్మను ఆయన పట్టుకున్నారు. ఆయన ఆ శాఖలో అనేక ఉన్నత శిఖరాలను అధిరోహించారు. 22 ఏళ్ల వయస్సులో ఉద్యోగంలో చేరిన కొత్తలోనే ప్రభాకర్రావును ఒక అధికారి అపార్థం చేసుకున్నారు. ఆ సందర్భంగా ఆయనను ‘ఐ విల్ సీ యువర్ ఎండ్’ అని కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ అధికారి అంతమాట అన్నందుకు ‘మనిద్దరి అంతు చూడటానికి పైవాడున్నాడు. మీరు మంచి మూడ్లో లేరు’ అని సమయస్ఫూర్తిగా మాట్లాడారు. ప్రభాకర్రావులో ఒక డైనమిజం ఉంది. ఆయన వృత్తిరీత్యా అకౌంట్స్ విభాగంలో ఉన్నప్పటికీ ఆయనకు స్నేహితులంతా ఇంజనీర్లుగా ఉన్నారు. అది కింది స్థాయి నుంచి పై వరకు ఉన్నారు. అలాగే ఆఫీసులో పనిచేసే వాచ్మెన్ దగ్గర్నుంచి ట్రేడ్యూనియన్ల వరకు ఎవరు కన్పించినా ప్రేమగా మాట్లాడటం ఆయన నుంచి నేర్చుకోవాలి. ఇంజనీరింగ్ క్యాటగిరికీ, అకౌంట్స్ శాఖకు మధ్యలో అనేక వైరుధ్యాలుంటాయి. ఒక్కొక్కసారి అవి శత్రుత్వాలుగా మారుతాయి. ప్రభాకర్రావు ఈ రెండింటి మధ్యలో ఉన్న రైవలిజం అనే బెర్రను చెరిపివేశారు. అదే ఆయనను ఈ రెండు శాఖల మధ్య వారధిని చేశాయి. ఈ రెండు శాఖల మధ్య ఆయన వంతెనగా మారడంతో విద్యుత్ శాఖలో ‘‘లోపల మనిషి’’ అయ్యారు. ఆయన అకౌంట్స్ ఆఫీసర్గా మొదలై అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చారు. ఈ దశలోనే ఆయన అసోషియేషన్ అధ్యక్షుడూ అయ్యారు. దీంతో అన్ని శాఖల మధ్య దూరాన్ని తొలగించి మంచి వాతావరణాన్ని ఏర్పాటు చేయగలిగారు. విద్యుత్ శాఖలో ఆయన ఈ ఉన్నత దశలో ఉండటానికి కారణం ఇదేననుకుంటా! తెలంగాణ రాష్ట్ర అవతరణ తరువాత అలుముకున్న చీకట్లను తొలగించటానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో కృషి చేశారు. తెలంగాణ రాష్ట్రం వస్తే చీకట్లు కమ్ముకుంటాయని జరిగిన ప్రచారాల్ని తిప్పి కొట్టడానికి ఆయన సీఎం అయ్యాక తొలిగా 24 గంటల నిరంతర కరెంటు ఇచ్చే పనికి శ్రీకారం చుట్టారు. చీకట్లను చీల్చుకుంటూ విద్యుత్ వెలుగులను పంచటానికి ముందుకు సాగిన కేసీఆర్కు ఈ ప్రభాకర్రావు ఒక కార్యకర్తగా కృషిచేశారు. దాన్ని ముఖ్యమంత్రి కేసీఆరే స్వయంగా ప్రకటించారు. అవిభక్త ఆంధ్రప్రదేశ్లో విద్యుత్శాఖ అభివృద్ధి కోసం కృషిచేసిన ప్రభాకర్రావుకు అనుకోకుండా రాష్ట్రం రావడంతో తను పుట్టిపెరిగిన నేలకు సేవ చేసి తరించే అవకాశాన్ని కేసీఆర్ కల్పించారు. ట్రాన్స్కో సీఎండిగా ప్రభాకర్రావును ఎంపిక చేయటం ఒక రకంగా ఆయనకు జీవనసాఫల్య పురస్కారం లభించినట్లుగానే భావించాలి. కేసీఆర్ ఏ పనైనా చేపడితే ఎంత మొండితనంతో దూసుకుపోతాడో తెలిసిందే. అందుకు నికార్సైన మనుషులనే ఆయన ఎంచుకుంటారు. ఈ దారిలో విద్యుత్శాఖకు ప్రభాకర్రావును ఆయన ఎంచుకున్నారు. సరిగ్గా కేసీఆర్ ఏ ఆలోచనతో ముందుకుపోతున్నారో అందుకు మొత్తం విద్యుత్శాఖను సన్నద్ధం చేసిన కార్యకర్తగా ప్రభాకర్రావుకు గుర్తింపు ఉంది. ఇది ఆయన జీవితంలో అందుకున్న అన్ని పురస్కారాలకంటే గొప్పది. -జూలూరు గౌరీశంకర్ తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులు మొబైల్ : 94401 69896 -
తెలంగాణ ‘పవర్’ ప్రభాకర్రావు!
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వశాఖలో పదవీ విరమణ వయసు 58 ఏళ్లు. సేవలను గుర్తించి కొంత కాలం పొడిగించినా మరో ఐదేళ్లు మించి కొనసాగే అవకాశం అరుదుగా వస్తుంది. దీంతో ఒక వ్యక్తి ప్రభుత్వశాఖలో పనిచేసే సగటుకాలం 40 ఏళ్లు. కానీ ఒకే శాఖలో ఉద్యోగం సాధించి అంచెలంచెలుగా వివిధ హోదాల్లో పనిచేస్తూ ఏకంగా 50 ఏళ్ల పాటు కొనసాగుతూ రికార్డు సృష్టించారు జెన్కో–ట్రాన్స్కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్రావు. రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభాన్ని విజయవంతంగా పరిష్కరించి, నిరంతర విద్యుత్ సరఫరా చేయడంలో ముఖ్య భూమిక పోషించిన ప్రభాకర్రావు విద్యుత్ సంస్థలో చేరి ఈ నెల 10 నాటికి 50 ఏళ్లవుతోంది. అకౌంట్స్ ఆఫీసర్ నుంచి.. ఏపీ రాష్ట్ర ఎలక్ట్రిసిటీ బోర్డులో (ఏపీఎస్ఈబీ)లో అసిస్టెంటు అకౌంట్స్ ఆఫీసర్గా 1969 ఫిబ్రవరి 10న ప్రభాకర్రావు విధుల్లో చేరారు. 1992లో ఏపీఎస్ఈబీ ఫైనాన్షియల్ అడ్వైజర్, చీఫ్ కంట్రోలర్ ఆఫ్ అకౌంట్స్గా నియామకమయ్యారు. 1998లో బోర్డు మెంబర్ (అకౌంట్స్)గా నియమితులయ్యారు. ఐఏఎస్ అధికారులు, ఇంజనీర్లు కాని వారిని బోర్డు మెంబర్గా నియమించడం అదే ప్రథమం. 1999లో ఏపీఎస్ఈబీ జెన్కో, ట్రాన్స్కో, డిస్కంలుగా విడిపోయింది. అప్పుడు ప్రభాకర్రావు ఏపీ ట్రాన్స్కో డైరెక్టర్ (ఫైనాన్స్)గా నియమితులయ్యారు. ప్రభుత్వంతో విభేదాలు రావడంతో 2002లో డైరెక్టర్ పదవికి రాజీనామా చేశారు. మరో ఏడేళ్ల సర్వీసు ఉండగానే ఉద్యోగాన్ని వదిలేశారు. 2004లో వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎం అయ్యాక ప్రభాకర్రావును మళ్లీ జెన్కో డైరెక్టర్ (ఫైనాన్స్)గా నియమించారు. 2009లో రోశయ్య సీఎం అయ్యాక ప్రభాకర్రావును జెన్కో జేఎండీగా నియమించారు. కిరణ్కుమార్రెడ్డి సీఎం అయ్యాక కూడా అదే పదవిలో కొనసాగారు. 2014లో తెలంగాణ ఏర్పాటు తర్వాత తెలంగాణ జెన్కో సీఎండీగా నియామకమయ్యారు. తర్వాత ట్రాన్స్కో సీఎండీగా కూడా అదనపు బాధ్యతలు అప్పగించారు. ప్రస్తుతం ఈ రెండింటి బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. లోటును పూడ్చిన ఘనత... మాములుగా ట్రాన్స్కో, జెన్కో సీఎండీ పోస్టులను ఐఏఎస్లకు ఇస్తారు. సంస్థ ఉద్యోగి అయితేనే సాధక బాధకాలు తెలుస్తాయనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ నాన్ ఐఏఎస్ అయిన ప్రభాకర్రావుకు జెన్కో సీఎండీగా బాధ్యతలు అప్పగిస్తూ మొదటి నిర్ణయం తీసుకున్నారు. ఆయన బాధ్యతలు తీసుకున్న నాడు తెలంగాణ విద్యుత్ రంగం సంక్షోభంలో ఉంది. పరిశ్రమలకు పవర్ హాలిడేలు, గృహ విద్యుత్కు గంటల తరబడి కోతలు, వ్యవసాయానికి 4 గంటల వరకు కరెంటే అందేది. ఆ కరెంటూ తక్కువ సామర్థ్యం కూడినది కావడంతో మోటార్లు కాలిపోయేవి. ట్రాన్స్ ఫార్మర్లు పేలిపోయేవి. రాష్ట్రం ఏర్పడే నాటికి విద్యుత్ కొరత 2,700 మెగావాట్లు. ఆ లోటు ఎలా పూడుతుందో తెలియని పరిస్థితి. సీఎం తనపై ఉంచిన నమ్మకాన్ని ప్రభాకర్రావు నూటికి నూరుపాళ్లు నిలబెట్టారు. తెలంగాణ ఏర్పడిన ఆరో నెల నుంచే (2014, నవంబర్ 20) కోతలు ఎత్తివేశారు. 24 గంటల విద్యుత్సరఫరా ప్రారంభించారు. అప్ప ట్నుంచే రైతులకు 9 గంటల విద్యుత్ అందింది. 2018 జనవరి 1 నుంచి దేశంలో మరెక్కడా లేని విధంగా రాష్ట్రంలోని 23 లక్షల పంపుసెట్లకు 24 గంటల పాటు నాణ్యమైన విద్యుత్ను ఉచితంగా అందిస్తున్నారు. ఇటు నిదానంగా నడుస్తున్న విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల పనులను ప్రభుత్వం వేగం చేసింది. కొత్త విద్యుత్ ప్లాంట్లు నిర్మించింది. దక్కించుకున్న అవార్డులు విద్యుత్ రంగంలో అద్వితీయమైన కృషికి పలు అవార్డులు ప్రభాకర్రావు అందుకున్నారు. ‘ఎకనామిక్ టైమ్స్ అవార్డు–2018’, ‘సీబీఐపీ ప్రత్యేక గుర్తింపు అవార్డు–2018’ పొందారు. తెలంగాణ విద్యుత్ రంగం–పంపిణీలో మార్పులు, నిర్వహణపై ‘స్కోచ్ గోల్డ్ అవార్డు–2018’, తెలంగాణ ప్రభుత్వం మేడే సందర్భంగా ప్రదానం చేసిన ‘టీఎస్ జెన్కో, టీఎస్ ట్రాన్స్కో బెస్ట్ మేనేజ్మెంట్ అవార్డు’, విద్యుత్ రంగంలో విశేష కృషికి గాను ‘డాక్టర్ బూర్గుల రామకృష్ణారావు అవా ర్డు–2016’ను ఆయన అందుకున్నారు. విద్యుత్ రంగంలో ప్రతిభ కనబరచినందుకుగాను ‘నేషనల్ కౌన్సిల్ ఆఫ్ పవర్ యుటిలిటీస్’ నుంచి ‘ఇండియా పవర్ అవార్డు–2013’, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రాక్టికల్ అకౌంటెన్సీ, హైదరాబాద్ నుంచి ‘ఎక్స్లెన్సీ ఇన్ అకౌంటెన్సీ అండ్ ఫైనాన్స్’ అవార్డులు అందుకున్నారు. -
అక్రమాల అడ్డా.. ట్రాన్స్కో కార్యాలయం
ప్రకాశం, కొండపి: కొండపి ట్రాన్స్కో కార్యాలయం అక్రమాల అడ్డాగా మారింది. ఇక్కడి అధికారులు ప్రతి పనికి ఓ రేటు నిర్ణయించారు. ఇక్కడి ఇంజినీరింగ్ అధికారి తన కార్యాలయాన్ని అక్రమ దందాకు అడ్డాగా మార్చుకున్నారు. అక్రమార్జనే ధ్యేయంగా పని చేస్తున్న ఏఈ ప్రజలు, రైతుల విద్యుత్ అవసరాలను తనకు అనుకూలంగా మల్చుకున్నాడు. అడ్డగోలుగా తన కార్యాలయం సెక్షన్ పరిధిలో ట్రాన్స్ఫార్మర్లు, విద్యుత్ స్తంభాలు, కరెంటు తీగలను అడ్డగోలుగా అమ్మాకానికి పెట్టాడు. ట్రాన్స్ఫార్మర్ కావాల్సిన రైతులు ప్రభుత్వానికి రుసుం చెల్లించాల్సిన పనిలేదు. ఒక్కో ట్రాన్స్ఫార్మర్కు ఆయనకు రూ.30 వేలు అందిస్తే ఆ రైతుకు ట్రాన్స్ఫార్మర్ ఇచ్చేలా బహిరంగంగా ఒప్పందం కుదుర్చుకుంటున్నాడు. విద్యుత్ స్తంభాలను సైతం ఒక్కో స్తంభానికి వెయ్యి రూపాయలు చొప్పున తీసుకుని అవసరమైన వారికి యథేచ్ఛగా అమ్మకాలు సాగిస్తున్నారు. ఐదేళ్లుగా కొండపి విద్యుత్ సెక్షన్లో ఏఈగా తిష్టవేసిన ఈ అధికారి వందల సంఖ్యలో ట్రాన్స్ఫార్మర్లు, విద్యుత్ స్తంభాలు, తీగలు అమ్మటం ద్వారా రెండు కోట్ల రూపాయలకు పైగా అక్రమార్జన చేసినట్లు ప్రజల నుంచి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మండలంలోని పెట్లూరు, కోయవారిపాలెం, గుర్రప్పడియ, నెన్నూరుపాడు, అనకర్లపూడి తదితర గ్రామాలకు వెళ్లి చూస్తే అక్రమంగా ఏర్పాటు చేసిన అగ్రికల్చర్ ట్రాన్స్ఫార్మర్లు కనిపిస్తాయి. నెన్నూరుపాడులోని కొంతమంది రైతుల ట్రాన్స్ఫార్మర్ను అక్రమంగా ఒకచోట నుంచి మరోచోటకు మార్పించి డబ్బులు వసూలు చేసిన సంఘటనలు ఉన్నాయి. కట్టావారిపాలెంలోని ఒక రైతుకు కావాల్సిన విద్యుత్ స్తంభాలను సైతం అక్రమంగా కొండపిలోని విద్యుత్ సబ్స్టేషన్ ఎదురుగా పొలాల్లో ఉన్న వాటిని ఎత్తించాడు. చేష్టలుడిగి చూస్తున్న ఉన్నతాధికారులు ట్రాన్స్కో అధికారి తన కార్యాలయాన్ని అక్రమాలకు అడ్డాగా మార్చి దందాలు కొనసాగిస్తున్నా చర్యలు తీసుకోవాల్సిన ఉన్నతాధికారులు చేష్టలుడిగి చూస్తున్నారే తప్ప చర్యలు తీసుకున్న దాఖలాలు లేవని ప్రజలంటున్నారు. ఈ అధికారి సంపాదించిన అక్రమార్జనలో ఉన్నతాధికారులకు సైతం ముడుపులు అందుతున్నాయన్న అనుమానాలు ఈ ప్రాంత రైతులు వ్యక్తం చేస్తున్నారు. రైతుల అవసరాలను తనకు అవకాశంగా మలుచుకుని ముడుపులు మింగుతున్న ఈ అధికారి లీలలు అన్నీఇన్ని కావు. ఈయన అక్రమాలపై ఇటీవల సింగరాయకొండ ఏడీఈ సైతం వచ్చి విచారణ చేపట్టారు. కొండపి ట్రాన్స్కో అధికారి జిల్లా స్థాయి అధికారులు ద్వారా విచారణని నీరుగార్చే ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. కొండపి ట్రాన్స్కో ఏఈపై వచ్చిన ఆరోపణల గురించి సింగరాయకొండ ఏడీఈ శ్రీనివాసరావును వివరణ కోరగా ఎస్టిమేట్లు వేయకుండా వ్యవసాయ ట్రాన్స్ఫార్మర్లు రైతులకు ఏఈ ఇస్తున్న మాట వాస్తవమేనని చెప్పారు. అదే విధంగా కొండపి సబ్స్టేషన్లో ట్రాన్స్ఫార్మర్ సైతం మాయమైందని, ఈ విషయమై కొండపి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. ఇద్దరు సిబ్బందితో పాటు సెలవులో ఉన్న ఏఈకి సైతం మెమో ఇచ్చినట్లు తెలిపారు. ఈ విషయమై ఆరోపణలు ఎదుర్కొంటున్న కొండపి ట్రాన్స్కో ఏఈ చంద్రశేఖర్ను వివరణ కోరగా తనపై వస్తున్న అవినీతి, ఆరోపణలు అవాస్తవమని చెప్పకొచ్చారు. ఇదంతా ఏడీఈ కావాలని చేస్తున్నాడని ఆరోపించారు. -
50 ఏళ్లుగా వెలుగులు పంచుతూ..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ట్రాన్స్కో, జెన్కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్ రావు గురువారంతో విద్యుత్ శాఖలో 50 ఏళ్ల సర్వీసును పూర్తి చేసుకున్నారు. 1969 జనవరి 10న ఆయన అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్గా ఏపీ స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డు (ఏపీఎస్ఈబీ)లో ఉద్యోగప్రస్థానం ప్రారంభించారు. ఉమ్మడి ఏపీ, తెలంగాణ విద్యుత్ సంస్థల్లో కీలక హోదాల్లో సేవలందించారు. విద్యుత్ రంగంలో ఆయన సేవలు, విశేషానుభవాన్ని గుర్తించిన సీఎం కేసీఆర్.. తెలంగాణ రాష్ట్రంలో.. రాష్ట్ర ట్రాన్స్కో, జెన్కో సీఎండీగా బాధ్యతలు అప్పగించారు. ఐఏఎస్ అధికారులు కాదని ఈ పదవిని ఏరికోరి ప్రభాకర్ రావుకు కట్టబెట్టారు. రాష్ట్రం ఆవిర్భావం తర్వాత రాష్ట్రంలో నెలకొన్న విద్యుత్ కొరతను అధిగమించి 24 గంటల విద్యుత్ సరఫరా అందించడంలో కీలకపాత్ర పోషించారు. వ్యవసాయానికి తొలుత 9 గంటల నిరంతర విద్యుత్, ఆ తర్వాత 24 గంటల విద్యుత్ సరఫరా వంటి కేసీఆర్ నిర్ణయాలను విజయవంతంగా అమలు చేయడంలో సఫలమయ్యారు. రాష్ట్రంలో కొత్త విద్యుదుత్పత్తి కేంద్రాల నిర్మాణం, విద్యుత్ సరఫరా, పంపిణీ సంస్థల సామర్థ్యం పెంపు పనులను శరవేగంగా పూర్తి చేసేందుకు మొత్తం విద్యుత్ శాఖను పరుగులు పెట్టించారు. రికార్డు సమయంలో విద్యుదుత్పత్తి కేంద్రాలు, సబ్–స్టేషన్లు, లైన్ల నిర్మాణాన్ని పూర్తి చేసి పీజీసీఎల్ వంటి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల ప్రశంసలు అందుకున్నారు. విద్యుత్ రంగంలో చేసిన విశేష కృషికి గానూ.. గతేడాది ఎకనమిక్ టైమ్స్, సీబీఐపీ, స్కోచ్ పురస్కారాలను అందుకున్నారు. 2017లో బెస్ట్ మేనేజ్మెంట్ అవార్డు ఫర్ ట్రాన్స్కో, జెన్కో, విద్యుత్ రంగంలో విశేష కృషికి గానూ 2016లో బూర్గుల రామకృష్ణారావు పురస్కారాన్ని అందుకున్నారు. నేషనల్ కౌన్సిల్ ఫర్ పవర్ యుటిలిటీస్ 2013లో ఆయనకు ఇండియా పవర్ అవార్డును అందజేసింది. ఈ సందర్భంగా విద్యుత్ ఇంజనీర్లు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో స్వర్ణోత్సవ కేక్ను ఆయనతో కట్ చేయించారు. కార్యక్రమంలో ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్ సీఎండీలు రఘుమారెడ్డి, గోపాలరావు, ట్రాన్స్కో జేఎండీ శ్రీనివాసరావు పాల్గొని ఆయన్ను అభినందించారు. -
ఉద్యోగుల కృషి వల్లే విజయాలు
సాక్షి, హైదరాబాద్: సగటు విద్యుత్ వినియోగంలో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో నిలవడం విద్యుత్ ఉద్యోగుల సమష్టి కృషి వల్లే సాధ్యమైందని ట్రాన్స్కో, జెన్కో చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ డి.ప్రభాకర్రావు అన్నారు. తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ (టీఈఈ) 1104 రూపొందించిన పవర్మెన్–2019 డైరీ ఆవిష్కరణ కార్యక్రమం గురువారం మింట్కాంపౌండ్లో జరిగింది. దీనికి టీఈఈ 1104 రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.పద్మారెడ్డి, ప్రధాన కార్యదర్శి సాయిబాబు అధ్యక్షత వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ట్రాన్స్కో, జెన్కో సీఎండీ డైరీని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 24 గంటల విద్యుత్ను రాష్ట్ర ప్రజలందరికీ అందించడం చాలా సంతోషంగా ఉందన్నారు. విద్యుత్ ఉద్యోగుల సమస్యలను యూనియన్ల వారీగా పరిశీలించి బోర్డులో చర్చించి సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తామని హామీనిచ్చారు. అలాగే రైతులు, వినియోగదారులు కష్టాలు పడకుండా నాణ్యమైన విద్యుత్ను అందించడం శుభపరిణామమని చెప్పారు. ఏ విభాగంలో లేని జీతాలు: శ్రీనివాస్గౌడ్ సీఎం కేసీఆర్, ప్రభాకర్రావుల సలహాలు, సూచనలతో తెలంగాణ మొత్తం గర్వపడేలా విద్యుత్ సమస్యను అధిగమించామని ఎమ్మెల్యే శ్రీనివాస్గౌడ్ అన్నారు. ఏ డిపార్టుమెంటులో లేని జీతాలు సీఎం చొరవతో విద్యుత్ ఉద్యోగులు అందుకుంటున్నారని చెప్పారు. అనంతరం టీఈఈ యూనియన్, ఇతర యూనియన్లు రూపొందించిన క్యాలెండర్లను ఆవిష్కరించారు. కార్యక్రమంలో టీఎస్ఎస్పీడీసీల్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ రఘుమారెడ్డి, టీఎస్ఎన్పీడీసీఎల్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గోపాల్రావు, ఢిల్లీలోని రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి వేణుగోపాలాచారి పాల్గొన్నారు. -
నెలాఖరులోగా విద్యుత్ పీఆర్సీ!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విద్యుత్ ఉద్యోగులకు తీపికబురు. విద్యుత్ ఉద్యోగుల వేతన సవరణపై ఈ నెలాఖరులోగా ప్రకటన చేసేందుకు తెలంగాణ విద్యుత్ సంస్థల యాజమాన్యాలు కసరత్తు చేస్తున్నాయి. ట్రాన్స్కో జేఎండీ సి.శ్రీనివాసరావు నేతృత్వంలో నియమించిన విద్యుత్ ఉద్యోగుల వేతన సవరణ సంప్రదింపుల కమిటీ (పీఆర్సీ) గురువారం ట్రాన్స్కో, జెన్కో సీఎండీ డి. ప్రభాకర్రావుకు నివేదిక సమ ర్పించింది. వేతన సవరణ ఫిట్ మెంట్ శాతం, వెయిటేజీ ఇంక్రి మెంట్ల సంఖ్య, వైద్య సదుపాయం తదితర అంశాలపై విద్యుత్ ఉద్యోగుల సంఘాల ప్రతినిధులతో త్వరలో విద్యుత్ సంస్థల యాజ మాన్యాలు చర్చలు జరపను న్నాయి. అనంతరం ఈ నెల 26లోగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావుకు పీఆర్సీ నివేదికను పంపిస్తామని, సీఎం ఆమోదిస్తే ఈ నెలాఖరులోగా పీఆర్సీపై ప్రకటన విడుదల చేస్తామని డి.ప్రభాకర్రావు ‘సాక్షి’కి తెలిపారు. గత ఫిట్మెంట్కన్నాఎక్కువ ఇవ్వాలంటున్న ఉద్యోగులు ట్రాన్స్కో, జెన్కో, టీఎస్ఎస్పీడీసీఎల్, టీఎస్ఎన్పీడీసీఎల్లలో పని చేస్తున్న 25 వేల మంది విద్యుత్ ఉద్యోగులు కొత్త పీఆర్సీపై యాజమాన్యాల ప్రకటన కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. చివరిసారిగా నాలుగేళ్ల కింద విద్యుత్ ఉద్యోగులకు 30 శాతం ఫిట్మెంట్, 3 వెయిటేజీ ఇంక్రిమెంట్లతో కలిపి పీఅర్సీ ప్రకటించారు. అయితే ఇటీవల ఏపీలో విద్యుత్ ఉద్యోగులకు 25 శాతం ఫిట్మెంట్తోపాటు 3 వెయిటేజీ ఇంక్రిమెంట్లతో వేతన సవరణపై ప్రకటన చేశారు. ఈ నేపథ్యంలో ఫిట్మెంట్ శాతంపై విద్యుత్ సంస్థలు తీసుకునే నిర్ణయంపై విద్యుత్ ఉద్యోగులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి. చివరిసారిగా ప్రకటించిన 30 శాతం ఫిట్మెంట్కన్నా ఎక్కువ మొత్తంలో ఫిట్మెంట్ ప్రకటించాలని విద్యుత్ ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఏపీలో 25 శాతం ఫిట్మెంట్ ప్రకటించిన నేపథ్యంలో అంతకంటే కొద్దిగా ఎక్కువ శాతం ఫిట్మెంట్ను తెలంగాణ విద్యుత్ ఉద్యోగులకు ప్రకటించే అవకాశముందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ఫిట్మెంట్ శాతంపై సీఎం నిర్ణయం కీలకంగా మారనుంది. తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రంలో విద్యుత్ సరఫరా వ్యవస్థను గాడినపెట్టి నిరంతర విద్యుత్ సరఫరాను అమలు చేసేందుకు విద్యుత్ ఉద్యోగులు బాగా పని చేశారని కేసీఆర్ పలుమార్లు ప్రశంసించారు. ఈ నేపథ్యంలో ఫిట్మెంట్ శాతంపై ముఖ్యమంత్రి నుంచి సానుకూల నిర్ణయం వస్తుందని ఉద్యోగ సంఘాలు ఆశిస్తున్నాయి. ఈ ఏడాది మార్చి 31తో గత పీఆర్సీ కాలపరిమితి ముగిసిపోగా ఏప్రిల్ 1 నుంచి కొత్త పీఆర్సీని వర్తింపజేయాల్సి ఉంది. ప్రస్తుత వైద్య సదుపాయానికి మెరుగులు... విద్యుత్ ఉద్యోగులకు అమలు చేస్తున్న ప్రస్తుత వైద్య పథకాన్ని మెరుగుపరిచి కొనసాగించాలని పీఆర్సీ కమిటీ సిఫారసు చేసినట్లు తెలిసింది. ఎన్టీపీసీ తరహాలో అపరమిత నగదురహిత వైద్య సదుపాయం అందించాలని విద్యుత్ ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అయితే ప్రస్తుతం అమలు చేస్తున్న పథకాన్ని మరింత సరళీకృతం చేయాలని కమిటీ సూచించినట్లు సమాచారం. ఈఎన్టీ, దంత, కంటి వైద్యానికి ప్రస్తుత పథకంలో ఉన్న పరిమితులను తొలగించాలని కమిటీ కోరినట్లు చర్చ జరుగుతోంది. తక్షణమే సంప్రదింపులు: ఉద్యోగుల జేఏసీ డిమాండ్ కొత్త పీఆర్సీ అమలులో భాగంగా విద్యుత్ ఉద్యోగుల వేతన స్కేలు, అలవెన్సులు, ఈపీఎఫ్, జీపీఎఫ్, సమగ్ర వైద్య సదుపాయ పథకంపై తుది నిర్ణయం తీసుకునేందుకు తక్షణమే విద్యుత్ ఉద్యోగుల సంఘాలతో యాజమాన్యాలు సంప్రదింపులు ప్రారంభించాలని తెలంగాణ విద్యుత్ ఉద్యోగుల జేఏసీ డిమాండ్ చేసింది. ఈ నెల 26లోగా పీఆర్సీపై ప్రకటన చేయాలని లేకుంటే 27న విద్యుత్ సౌధలో మహాధర్నా నిర్వహిస్తామని జేఏసీ ప్రతినిధుల బృందం గురువారం ట్రాన్స్కో సీఎండీ డి.ప్రభాకర్రావుకు వినతిపత్రం అందజేసింది. -
ట్రాన్స్కోలో 106 పోస్టులు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ విద్యుత్ సరఫరా సంస్థ (ట్రాన్స్కో) 106 పోస్టుల భర్తీకి గురువారం నియామక ప్రకటన విడుదల చేసింది. 62 జూనియర్ పర్సనల్ ఆఫీసర్, 44 జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనుంది. ప్రథమ శ్రేణిలో బీకాం/ప్రథమ శ్రేణిలో ఎంకాం/సీఏ–ఐసీడబ్ల్యూఏ–ఇంటర్ పాసైన అభ్యర్థులు జేఏవో పోస్టుల కోసం అర్హులు. జేఏవో పోస్టులకు ఈ నెల 28 నుంచి వచ్చే నెల 11లోగా దరఖాస్తు చేసుకోవాలని తెలిపింది. ప్రథమ శ్రేణిలో బీఏ/బీకాం/బీఎస్సీ లేదా తత్సమాన డిగ్రీ పాసైన అభ్యర్థులు జూనియర్ పర్సనల్ ఆఫీసర్ పోస్టు కోసం వచ్చే నెల 11 నుంచి 25లోగా దరఖాస్తు చేసుకోవాలని కోరింది. పూర్తి వివరాలకు http://tstransco.cgg.gov.in వెబ్సైట్ను సందర్శించాలని అభ్యర్థులకు సూచించింది. -
పనీ మాదే.. పైసా మాదే!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విద్యుత్ సంస్థల్లో కొందరు అధికారులు బినామీ కాంట్రాక్టర్ల అవతారమెత్తారు! కుటుంబ సభ్యులు, సమీప బంధువులు, స్నేహితుల పేర్లతో కాంట్రాక్టర్ లైసెన్సులు పొంది లక్షలు కొల్లగొడుతున్నారు. నామినేషన్ పద్ధతిలో పనులను చేజిక్కించుకొని సర్కారు సొమ్మును జేబులో వేసుకుంటున్నారు. కొందరు అధికారులైతే తమ బినామీల కోసమే అడ్డగోలుగా పనులకు అంచనాలు రూపొందించి తూతూమంత్రంగా పనులు చేసి బిల్లులు స్వాహా చేస్తున్నారు. పనుల అంచనాల తయారీ, ఓపెన్ టెండర్ల నిర్వహణ, నామినేషన్ల కింద పనుల కేటాయింపు, పనుల నిర్వహణ, పర్యవేక్షణ, బిల్లుల జారీ అధికారం.. ఇలా అంతా తమ చేతుల్లోనే ఉండటంతో ఈ అధికారుల అవినీతి, అక్రమాలకు అడ్డూఅదుపూ లేకుండా పోయింది. తల్లి, భార్య, బావమరిది, సోదరుడు, కుమారుడు, కోడలు, కుమార్తె, అల్లుడు, మనవడు, అమ్మమ్మ, నాయనమ్మ, తాత, మేనకోడలు, ఇతర సమీప బంధువుల పేర్లతో కాంట్రాక్టర్ లైసెన్స్లు పొంది అడ్డదారిలో రూ.లక్షల విలువైన పనులను దక్కించుకుంటున్నారు. బినామీ కాంట్రాక్టర్లను అడ్డం పెట్టుకుని కొందరు పనుల అంచనాలను అడ్డగోలుగా పెంచేస్తున్నారని, మరికొందరు పనులు చేయకుండానే బిల్లులు కాజేస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇలా అధికారులే బినామీ కాంట్రాక్టర్లుగా వ్యవహరిస్తున్నా సంస్థ యాజమాన్యాలు పట్టించుకోవడం లేదు. ఉన్నతాధికారులు సైతం.. తెలంగాణ ట్రాన్స్కో, దక్షిణ/ఉత్తర విద్యుత్ పంపిణీ సంస్థ(టీఎస్ఎస్పీడీసీఎల్/ఎన్పీడీసీఎల్)లో పని చేస్తున్న ఓ డైరెక్టర్ స్థాయి అధికారితోపాటు పలువురు సూపరింటెండెంట్ ఇంజనీర్లు(ఎస్ఈ), అదనపు డివిజినల్ ఇంజనీర్లు(ఏడీఈ), డివిజినల్ ఇంజనీర్లు(డీఈ), అసిస్టెంట్ ఇంజనీర్(ఏఈ)లు, ఇతర స్థాయిల ఉద్యోగులు సొంత కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితుల పేర్లతో బినామీ కాంట్రాక్టర్లుగా చక్రం తిప్పుతున్నారు. కొందరు అధికారులు స్వయంగా కాంట్రాక్టు పనులు చేస్తుండగా, మరికొందరు అమ్యామ్యాలు తీసుకుని బంధువులకు పనులు అప్పగిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. తమ కుటుంబ సభ్యులు, బంధువులెవరూ విద్యుత్ సంస్థల్లో ఉద్యోగులుగా లేరని ప్రతి పనికి సంబంధించిన టెండరు దాఖలు సందర్భంగా కాంట్రాక్టర్లు రాత పూర్వకంగా తెలియజేయాల్సి ఉంటుంది. ఒకవేళ కాంట్రాక్టర్ల కుటుంబ సభ్యులెవరైనా విద్యుత్ సంస్థల్లో ఉద్యోగులుగా తేలితే కాంట్రాక్టును రద్దు చేయడంతో పాటు సంస్థకు జరిగిన నష్టాన్ని తిరిగి వసూలు చేయాలని నిబంధనలు పేర్కొంటున్నాయి. ఎస్ఈ, డీఈ స్థాయి అధికారులకు రూ.5 లక్షలలోపు పనులకు పరిపాలన అనుమతులు జారీ చేసే అధికారం ఉంది. దీంతో వారే కాంట్రాక్టులు దక్కించుకుంటూ, పనులు మంజూరు చేసుకుంటున్నారు. అలాగే కింది స్థాయి అధికారుల బినామీలకు సైతం పనులు అప్పగిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. బహిరంగ ప్రకటన లేకుండానే నామినేషన్లు రూ.5 లక్షల లోపు అంచనా వ్యయం కలిగిన పనులకు ఆన్లైన్ టెండర్ల నిర్వహణ నుంచి ప్రభుత్వం మినహాయింపు కల్పించింది. రూ.5 లక్షలలోపు అంచనా వ్యయం కలిగిన పనులను ఓపెన్ టెండర్ల విధానంలో నామినేషన్ ప్రాతిపదికన కాంట్రాక్టర్లకు అప్పగించేందుకు అనుమతిచ్చింది. అత్యవసరంగా నిర్వహించాల్సిన పనులకు ఆన్లైన్ ద్వారా టెండర్లు నిర్వహిస్తే తీవ్ర జాప్యం జరుగుతుందనే ఆలోచనతో ప్రభుత్వం ఈ వెసులుబాటు కల్పించింది. ఈ నిబంధనను ఆసరాగా చేసుకునే కొందరు విద్యుత్ అధికారులు బినామీ కాంట్రాక్టర్ల దందాకు తెరలేపారు. నామినేషన్ల విధానంలో చేపట్టే పనులకు తొలుత ఓపెన్ టెండరు ప్రకటనను విడుదల చేయాలి. ఆ తర్వాత కనీసం ముగ్గురు కాంట్రాక్టర్ల నుంచి కొటేషన్లను స్వీకరించాలి. అందులో తక్కువ రేటు సూచించిన వ్యక్తికి అర్హతల ప్రకారం పనులు అప్పగించాలి. అయితే నామినేషన్ల కింద చేపట్టే పనులకు చాలాచోట్ల బహిరంగ టెండరు ప్రకటన జారీ చేయడం లేదు. గుట్టు చప్పుడు కాకుండా పనులను బినామీలకు కేటాయించుకుంటున్నారు. తెలిసిన ముగ్గురు కాంట్రాక్టర్ల నుంచి కొటేషన్లు తెప్పించుకుని, వాటిలో తమ బినామీ కాంట్రాక్టర్కు వర్క్ ఆర్డర్ దక్కేలా కొందరు అధికారులు చక్రం తిప్పుతున్నారు. మిగిలిన ఇద్దరు కాంట్రాక్టర్లతో పోలిస్తే బినామీ కాంట్రాక్టర్కు సంబంధించిన కొటేషన్లో రేటును క్తాస తగ్గించి పనులను చేజిక్కించుకుంటున్నారు. చాలా కార్యాలయాల నోటీసు బోర్డుల్లో నామినేషన్ల కింద పనుల కేటాయింపు ప్రక్రియ పూర్తయిన 15 రోజుల తర్వాత ఓపెన్ టెండరు ప్రకటనలు దర్శనమిస్తున్నాయి. దీన్ దయాల్ ఉపాధ్యాయ గ్రామ్ జ్యోతి యోజన(డీడీయూజీజేవై), ఇంటిగ్రేటెడ్ పవర్ డెవలప్మెంట్ స్కీం(ఐపీడీఎస్) పథకాల కింద గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా, పంపిణీకి సంబంధించిన మౌలిక సదుపాయాల అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వేల కోట్ల నిధులు కేటాయించాయి. వీటితోపాటు ఇతర పథకాల కింద రూ.5 లక్షల లోపు అంచనా వ్యయంతో నామినేషన్పై కేటాయిస్తున్న పనుల్లో ఎక్కువ శాతం అధికారుల బినామీ కాంట్రాక్టర్లే చేజిక్కించుకుంటున్నారని తెలుస్తోంది. దీంతో తమకు పనులు దక్కడం లేదని ఇతర కాంట్రాక్టర్లు వాపోతున్నారు. -
రెండేళ్లలో 3,480 మెగావాట్ల ఉత్పత్తి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఏర్పడిన అనంతరం నిర్మిస్తున్న విద్యుత్ కేంద్రాల్లో వచ్చే నెల నుండే ఉత్పత్తి ప్రారంభమవుతుందని, రెండేళ్లలో అదనంగా 3,480 మెగావాట్లు, ఆ తరువాత రెండేళ్లలో మరో 4,000 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యం అందుబాటులోకి వస్తుందని ట్రాన్స్కో, జెన్కో సీఎండీ డి. ప్రభాకర్ రావు వెల్లడించారు. జెన్కో ఆధ్వర్యంలో చేపట్టిన 800 మెగావాట్ల కేటీపీఎస్ ఏడోదశ విద్యుదుత్పత్తి కేంద్ర నిర్మాణం పూర్తయిందని, వచ్చే నెల నుండి ఉత్పత్తి ప్రారంభిస్తామని చెప్పారు. 1080 (4గీ270) మెగావాట్ల భద్రాద్రి ప్లాంట్కు సంబంధించి తొలి రెండు యూనిట్లు వచ్చే ఏడాది మార్చి, మరో రెండు యూనిట్లు డిసెంబర్ నుండి ఉత్పత్తిని ప్రారంభిస్తాయన్నారు. ఎన్టీపీసీ, యాదాద్రి, భద్రాద్రి, కేటీపీఎస్ ఏడో దశ విద్యుదుత్పత్తి కేంద్రాల నిర్మాణ పురోగతిని శుక్రవారం ఆయన విద్యుత్ సౌధలో సమీక్షించారు. ఎన్టీపీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ దూబె, జనరల్ మేనేజర్ సుదర్శన్, ట్రాన్స్ కో జేఎండీ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. 2020 నాటికి 20 వేల మెగావాట్లు ఎన్టీపీసీ, భద్రాద్రి, కేటీపీఎస్ ద్వారా 2020 మార్చి నాటికి అదనంగా 3,480 మెగావాట్ల విద్యుదుత్పత్తి అందుబాటులోకి వస్తుందని ప్రభాకర్రావు తెలిపారు. దీంతో రాష్ట్రంలో విద్యుదుత్పత్తి 20,000 మెగావాట్లు దాటుతుందన్నారు. 4000 మెగావాట్ల యాదాద్రి ప్లాంటును కూడా నిర్మిస్తామన్నారు. సోలార్, హైడల్, సీజీఎస్ తదితర మార్గాల ద్వారా కూడా 28,000 మెగావాట్ల విద్యుదుత్పత్తిని సాధించడానికి కార్యాచరణ సిద్ధం చేశామన్నారు. శరవేగంగా రామగుండం ప్లాంట్ పనులు రామగుండంలో 4000 మెగావాట్ల ఎన్టీపీసీ విద్యుదుత్పత్తి ప్లాంట్ నిర్మాణం జరగాల్సి వుండగా మొదటి దశలో 1600 (2గీ800) మెగావాట్ల సామర్థ్యం కలిగిన రెండు యూనిట్ల నిర్మాణం పనులు శరవేగంగా జరుగుతున్నాయని ఎన్టీపీసీ ఏఈ దూబె తెలిపారు. తొలి యూనిట్ ద్వారా వచ్చే ఏడాది నవంబర్ నుండి 800 మెగావాట్ల విద్యుదుత్పత్తి ప్రారంభిస్తామన్నారు. ఆ తరువాత మూడు నెలలకు మరో 800 మెగావాట్ల ఉత్పత్తి ప్రారంభమవుతుందని వెల్లడించారు. -
విద్యుత్ ఉద్యోగులకు పీఆర్సీ
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ ఉద్యోగుల వేతన సవరణ సంఘాన్ని ఏర్పాటు చేస్తూ తెలంగాణ ట్రాన్స్మిషన్ కార్పొరేషన్ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలోని అన్ని విద్యుత్ సంస్థల్లో పని చేస్తున్న ఉద్యోగుల జీతాలు, అలవెన్సులను సవరించేందుకు ఈ పీఆర్సీని ఏర్పాటు చేసింది. తెలంగాణ ట్రాన్స్కో జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ సి.శ్రీనివాసరావును పీఆర్సీ చైర్మన్గా నియమించింది. ఆయనతో పాటు ఎన్పీడీసీఎల్ డైరెక్టర్ (ప్రాజెక్ట్స్), ఎస్పీడీసీఎల్ డైరెక్టర్ (హెచ్ఆర్) టీఎస్ జెన్కో డైరెక్టర్ (హెచ్ఆర్), డైరెక్టర్ (ఫైనాన్స్) పీఆర్సీ కమిటీలో సభ్యులుగా ఉంటారు. ట్రాన్స్కో చీఫ్ కంట్రోలర్ ఆఫ్ అకౌంట్స్ కమిటీకి కన్వీనర్గా ఉంటారు. ఈ మేరకు తెలంగాణ ట్రాన్స్కో, జెన్కో చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ డి.ప్రభాకర్రావు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణ ట్రాన్స్కో, జెన్కో, ఎన్పీడీసీఎల్, ఎస్పీడీసీఎల్ సంస్థల్లో పని చేస్తున్న అన్ని కేటగిరీల ఉద్యోగులకు సంబంధించిన జీతాలపై అధ్యయనం చేయాలని, అన్ని యూనియన్లు, అసోసియేషన్లతో సంప్రదింపులు జరపాలని పీఆర్సీకి మార్గదర్శకాలను ఈ ఉత్తర్వుల్లో సూచించింది. విద్యుత్తు సంస్థల ఆర్థిక స్థితిగతులను పరిగణనలోకి తీసుకోవాలని నిర్దేశించింది. జీతాల పెంపు భారం రాష్ట్రంలోని విద్యుత్తు వినియోగదారులపై భారం పడకుండా ఉండాలని స్పష్టం చేసింది. ఇప్పటికే ఉన్న నిబంధనల ప్రకారం విద్యుత్తు సంస్థల్లో నాలుగేళ్లకోసారి వేతన సవరణ అమలవుతోంది. ప్రస్తుత వేతన సవరణ సంఘం గడువు మార్చి 31వ తేదీతో ముగిసింది. ఈ నేపథ్యంలో కొత్త పీఆర్సీ ఏర్పాటుకు ఉత్తర్వులు వెలువడ్డాయి. విద్యుత్తు ఉద్యోగుల యూనియన్లు, అసోసియేషన్లతో సంప్రదింపుల మేరకు వేతన సవరణ ఒప్పందం జరుగుతుంది. పీఆర్సీ కమిటీ ఇచ్చే సిఫారసుల మేరకే ఉద్యోగుల వేతనాలను ఎంత మేరకు పెంచాలనేది ఖరారవుతుంది. ఈ సిఫారసులకు ఎప్పుడు ఆమోదించినా.. సవరించిన వేతనాలు 2018 ఏప్రిల్ ఒకటి నుంచి అమల్లోకి వస్తాయి. -
విభజన పంచాయతీ..!
ట్రాన్స్కో ఉద్యోగుల విభజన వివాదాలకు దారితీస్తోంది. ఉద్యోగుల విభజన శాస్త్రీయంగా, పారదర్శకంగా చేపట్టలేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉద్యోగుల కేటాయింపుల్లో జిల్లాకు అన్యాయం చేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. సిద్దిపేటకు ఎక్కువ పోస్టులు కేటాయించటంపై జిల్లా అధికారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగుల కేటాయింపులో సమన్యాయం పాటించకపోవడంపై ఉన్నతాధికారుల తీరుపై గుర్రుగా ఉన్నట్లు సమాచారం. అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఎస్ఈ ఉన్నతాధికారులకు లేఖ రాసినట్లు తెలుస్తోంది. ఈ లేఖ ద్వారా ఉద్యోగుల కేటాయింపును మరోసారి పరిశీలించి జిల్లాకు న్యాయం చేయాలని కోరినట్లు సమాచారం. సాక్షి, మెదక్: జిల్లాల పునర్విభజనలో భాగంగా 2016 అక్టోబర్లో మెదక్ నూతన జిల్లా ఏర్పాటైన విషయం తెలిసిందే. జిల్లా ఏర్పడిన వెంటనే జిల్లాకు ట్రాన్స్కో ఎస్ఈ కార్యాలయం ఏర్పాటు కావాల్సి ఉండగా దాన్ని ఏర్పాటు చేయకుండా 2017 ఆగస్టులో కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. ఎస్ఈ, డీఈ, అకౌంట్స్ ఆఫీసర్ పోస్టులను మంజూరు చేసినా మిగితా సిబ్బంది నియమించలేదు. వారం రోజుల క్రితం ట్రాన్స్కో ఉద్యోగుల విభజనను పూర్తి చేశారు. ఉద్యోగుల విభజన కోసం సీజీఎం ఆధ్వర్యంలో మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి ఎస్ఈలతో ప్రత్యేకంగా కమిటీ వేశారు. ఈ కమిటీ అన్ని స్థాయిల్లో ఖాళీల వివరాలు, పనిచేస్తున్న సిబ్బంది వివరాలను సేకరించి ఉద్యోగుల విభజనపై నిర్ణయం తీసుకున్నారని సమాచారం. సంగారెడ్డి జిల్లాకు 48 శాతం, మెదక్ జిల్లాకు 26 శాతం, సిద్దిపేట జిల్లాకు 26 శాతం చొప్పున ఉద్యోగులను కేటాయించాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ నిర్ణయం మేరకు ఉద్యోగులు కేటాయింపులు జరగకపోవటం ఇప్పుడు వివాదానికి దారితీస్తోంది. దీనికితోడు పోస్టుల కేటాయింపుపైనా ఉద్యోగులు తీవ్ర స్థాయిలో అసంతృప్తితో ఉన్నారు. కొంత మంది ఉద్యోగులు తమకు ఇచ్చిన కొత్త పోస్టుల్లో చేరేందుకు ఆసక్తిచూపడం లేదు. ట్రాన్స్కో ఉద్యోగుల విభజనలో భాగంగా సబ్ ఇంజినీర్, జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్, సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, టైపిస్టు, రికార్డు అసిస్టెంట్, ఆఫీస్ సబార్డినేట్, ఫోర్మెన్(గ్రేడ్ 1), సీనియర్ లైన్ ఇన్స్పెక్టర్, ఫోర్మెన్(ఎంఆర్టీ గ్రేడ్1), ఫోర్మెన్(ఎంఆర్టీ గ్రేడ్ 2) విభజించి మూడు జిల్లాలకు కేటాయించారు. విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.. ఉమ్మడి జిల్లాలో మొత్తం 642 పోస్టులు ఉండగా 398 పోస్టులు భర్తీ కాగా 244 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సంగారెడ్డి జిల్లాకు సబ్ ఇంజినీర్ మొదలు ఫోర్మెన్ వరకు 317 పోస్టులు కేటాయించారు. అందులో 48 శాతం చొప్పున 190 పోస్టులకు ఉద్యోగులను కేటాయించారు. 127 పోస్టులు ఖాళీగా చూపించారు. మెదక్ జిల్లాలోని మెదక్, తూప్రాన్ డివిజన్లకు 157 పోస్టులను కేటాయించారు. ఇందులో 70 పోస్టులను ఖాళీలు చూపి, 87 మంది ఉద్యోగులను భర్తీ చేశారు. సిద్దిపేటకు జిల్లాకు 168 పోస్టులను కేటాయించి కేవలం 47 పోస్టులను మాత్రమే ఖాళీలుగా చూపి, 121 పోస్టులను భర్తీ చేశారు. సిద్దిపేట, మెదక్ జిల్లాలకు 26 శాతం చొప్పున సమానంగా ఉద్యోగులు పోస్టులను భర్తీ చేయాల్సి ఉండగా సిద్దిపేటకు అదనంగా కేటాయించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. సిద్దిపేటలో హుస్నాబాద్ డివిజన్లు ఇంకా విలీనం కాకున్నా విలీనం అయినట్లు చూపి ఉద్యోగులను ఎక్కువ సంఖ్యలో కేటాయించారన్న ఆరోపణలున్నాయి. దీంతో ట్రాన్స్కోలో ఉద్యోగుల విభజన సక్రమంగా చేపట్టాలన్న డిమాండ్ ఊపందుకుంటోంది. మరోమారు పరిశీలించాలి.. పోస్టుల విభజన, ఉద్యోగుల కేటాయింపు తీరుపై మెదక్ జిల్లా ట్రాన్స్కో ఎస్ఈతో పాటు ఇతర అధికారులు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. విభజన, ఉద్యోగుల కేటాయింపు మరోమారు పారదర్శకంగా చేపట్టాలని ఎస్ఈ శ్రీనాథ్ ఉన్నతాధికారులకు కోరినట్లు సమాచారం. ఈ మేరకు ట్రాన్స్కో సీజీఎం, సంగారెడ్డి ఎస్ఈకి లేఖ రాసినట్లు తెలిసింది. ఈ విషయమై ఎస్ఈ శ్రీనాథ్ వివరణ కోరగా ఉద్యోగుల కేటాయింపు అంశాన్ని మరోమారు పరిశీలించి జిల్లాకు 26 శాతం మేరకు కేటాయింపులు జరిగేలా చూడాలని లేఖ రాసినట్లు తెలిపారు. -
విద్యుత్ కార్మికులపై ఉక్కుపాదం!
కర్నూలు, ఆదోని: తమ డిమాండ్ల సాధన కోసం నిరవధిక సమ్మెకు దిగిన విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులపై ఉక్కుపాదం మోపేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. సమ్మె చేసిన వారి స్థానంలో కొత్త వారిని నియమించేందుకు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలని ట్రాన్స్కో ఉన్నత స్థాయి అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఇందులో ఏజెన్సీ నిర్వాహకులు అలక్ష్యం ప్రదర్శిస్తే వారిపై చర్యలకు కూడా వెనుకాడొద్దని అందులో పేర్కొన్నారు. ఈ నెల 20 సాయంత్రం 6 గంటల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అవుట్ సోర్సింగ్ విద్యుత్తు కార్మికులు నిరవధిక సమ్మెకు దిగారు. తానిచ్చిన హామీలను నెరవేర్చమంటే.. ఎన్నికల ముందు సీఎం చంద్రబాబు అర్హత కలిగిన కాంట్రాక్ట్ కార్మికులందరినీ శాశ్వత ఉద్యోగులుగా నియమిస్తామని, మిగిలిన వారికి శాశ్వత ఉద్యోగులకు సమానంగా సమాన పనికి సమాన వేతనం ప్రాతిపదికన వేతనం చెల్లిస్తామని హామీ ఇచ్చారు. హామీలు అమలు కోసం నాలుగేళ్లలో కార్మికులు ఆందోళనలు నిర్వహించారు. ఈక్రమంలోనే అనివార్య పరిస్థితుల్లో నిరవధిక సమ్మెకు దిగారు. డిమాండ్లను పరిష్కరించక పోగా సమ్మెలో వెళ్లిన వారి స్థానంలో తాత్కాలిక ప్రాతిపదికన కొత్త వారిని నియమించాలని ఆదేశాల జారీ చేయడం పట్ల కార్మికులు మండిపడుతున్నారు. వ్యథా భరితం.. జిల్లాలో మొత్తం 200 వరకు సబ్స్టేషన్లు ఉన్నాయి. ఇందులో ఒక్కో సబ్ స్టేషన్లో నలుగురు ఆపరేటర్లు, ఒక వాచ్మెన్ చొప్పున మొత్తం వెయ్యి మంది వరకు పని చేస్తున్నారు. ఆదోని, కర్నూలు, నంద్యాల డివిజన్ కార్యాలయాల పరిధిలో ఫోల్ టు ఫోల్ వర్కర్లు, బిల్లింగ్, స్పాట్ బిల్లింగ్, ఎస్పీఎం కార్మికులు మరో వెయ్యి మంది దాకా ఉంటారు. ఏజెన్సీల ద్వారా ప్రస్తుతం నెలకు రూ.6500 నుంచి రూ.12000 వరకు వేతనం చెల్లిస్తున్నారు. వేతనాల నుంచి మినహాయించుకుంటున్న ఈపీఎఫ్, ఈఎస్ఐ కంతులను కొంత మంది ఏజెన్సీ నిర్వాహకులు స్వాహా చేసిన సందర్భాలూ ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాలలో పని చేస్తున్న కార్మికులకు ఈఎస్ఐ సదుపాయం కల్పించడంలేదు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయినా ఎలాంటి పరిహారం అందకపోవడంతో వారిపై ఆధారపడిన కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. మరోవైపు అధికారులు, ఏజెన్సీ నిర్వాహకులు, రాజకీయ నాయకులకు నచ్చకపోయినా నిర్దాక్షిణ్యంగా విధుల నుంచి తొలగిస్తున్నారు. కార్మికుల్లోచీలికకు కుట్ర? కాగా తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ నిరవధిక సమ్మెకు దిగిన కార్మికుల్లో చీలిక తెచ్చేందుకు కుట్ర జరుగుతోందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికార పార్టీకి అనుబంధంగా ఉన్న తెలుగునాడు ట్రేడ్ యూనియన్తో పాటు 1104 యూనియన్లు సమ్మెకు దూరంగా ఉన్నాయి. సమ్మెలో వెళ్లొద్దని కూడా తమ యూనియన్లలో సభ్యత్వం ఉన్న కార్మికులకు సూచించినట్లు సమాచారం. ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాం కాంట్రాక్ట్ కార్మికులు సమ్మెలో వెళ్లడంతో విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయం తలెత్తకుండా శాశ్వత ఉద్యోగులకు అదనపు బాధ్యతలు అప్పగించాం. కొంతమంది కాంట్రాక్ట్ కార్మికులు కూడా విధులకు హాజరవుతున్నారు. దీంతో కొత్త వారిని నియమించే అవసరం రాలేదు. – చెంచెన్న,ట్రాన్స్కో డీఈఈ -
ఇది మాదే... అదీ మాదే!
కాంట్రాక్టు మాకే దక్కాలి. లేకపోతే వాటా అయినా ఇవ్వాలి. అంతవరకు టెండర్లు పెండింగే.. ఇదీ సబ్స్టేషన్ల కాంట్రాక్టులపై ఓ అధికార పార్టీ ప్రజాప్రతినిధి అల్టిమేటం. రాజధాని అమరావతి పరిధిలోని తుళ్లూరు మండలం, లింగాయపాలెం సబ్స్టేషన్ టెండర్లు ఖరారు కాకుండా ఆ ప్రజాప్రతినిధి సైంధవపాత్ర పోషిస్తున్నారు. ప్రస్తుతం రూ.40 కోట్ల టెండరుతోపాటు మొత్తం రూ.640 కోట్ల సబ్స్టేషన్ల కాంట్రాక్టుపై కన్నేసిన ఆయన ఒత్తిడికి ట్రాన్స్కో తలొగ్గుతోంది. సాక్షి, అమరావతిబ్యూరో: రాజధాని అమరావతిలో 16 సబ్స్టేషన్లను దశలవారీగా నిర్మించాలని ట్రాన్స్కో నిర్ణయిం చింది. ఈ మేరకు సీఆర్డీఏ కేటాయిం చిన రూ.640కోట్ల బడ్జెట్తో ప్రణాళికలు రూపొందించింది. మొదటగా లింగాయపాలెంలో రూ.40 కోట్లతో 220 కేవీ సబ్స్టేషన్ నిర్మాణానికి టెండర్లు పిలిచింది. విజయవాడకు చెందిన అధికార పార్టీ ప్రజాప్రతినిధి ఒకరు బినామీ సంస్థ పేరిట టెండరు వేశారు. ముంబాయి, హైదరాబాద్కు చెందిన ప్రముఖ కంపె నీలు కూడా టెండర్లు దాఖలు చేశాయి. టెక్నికల్ బిడ్ను ఆరు నెలల క్రితం తెరి చారు. అయితే ప్రైస్బిడ్ను ఇంకా తెరవడం లేదు. టెండర్లు ఖరారు చేయడం లేదు. జాప్యం ఎందుకు జరుగుతోందా అని ఆరా తీయగా ఆ ప్రజాప్రతినిధి వ్యవహారం వెలుగులోకి వచ్చింది. చక్రం తిప్పిన ప్రజాప్రతినిధి లింగాయపాలెం సబ్స్టేషన్ కాంట్రాక్టును తాను సూచించిన సంస్థకే ఏకపక్షంగా కేటాయించాలని విజయవాడకు చెందిన అధికార పార్టీ ప్రజాప్రతినిధి పట్టుబడుతున్నారని విశ్వసనీయ సమాచారం. ముంబాయి, హైదరాబాద్కు చెందిన ప్రముఖ సంస్థలు కూడా టెండర్లు దాఖలు చేయడంతో పోటీ తీవ్రంగా ఉంది. దీంతో ప్రజాప్రతినిధి సూచించిన సంస్థకు టెండరు వచ్చే అవకాశాలు తక్కువుగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆ ప్రజాప్రతినిధి ట్రాన్స్కో ఉన్నతాధికారులపై ఒత్తిడి తెచ్చి ఏకంగా టెండర్ల ప్రక్రియనే పెండింగులో పెట్టేలా చక్రం తిప్పారని సమాచారం. సాంకేతిక కారణాల పేరుతో టెండర్ల ప్రక్రియను రద్దు చేసి మళ్లీ పిలవాలని ఆయన ఒత్తిడి తెస్తున్నట్లు తెలిసింది. వాటా ఇస్తామంటే సరే..లేకుంటే అంతే.. ఒక్క లింగాయపాలెం సబ్ స్టేషన్ కాంట్రాక్టే కాదు, ఆ తరువాతి దశల్లో నిర్మించే 15 సబ్స్టేషన్ల కాంట్రాక్టుపైనా ఆ ప్రజాప్రతినిధి కన్నేశారు. అంటే రూ.640 కోట్ల కాంట్రాక్టును దక్కించుకోవడమే లక్ష్యంగా చేసుకున్నారు. తాను సూచించిన సంస్థకు టెండరు దక్కాలి, లేకుంటే తనకు వాటా ఇచ్చే సంస్థకు కేటాయించాలని ఆయన ప్రతిపాదించినట్లు సమాచారం. ఈ మేరకు ట్రాన్స్కో సంస్థలో ప్రస్తుతం కీలకంగా ఉన్న ఉన్నతాధికారి ద్వారా కథ నడిపిస్తున్నారు. ఆ ఉన్నతాధికారి హైదరాబాద్, ముంబాయిలకు చెందిన సంస్థలతో మంతనాలు సాగిస్తున్నారని సమచారం. లింగాయపాలెం సబ్స్టేషన్తోపాటు భవిష్యత్తో నిర్మించనున్న సబ్స్టేషన్ల కాంట్రాక్టుల్లో ఆ ప్రజాప్రతినిధి సంస్థకు వాటా ఇవ్వాలని ప్రతిపాదించారు. అందుకు సమ్మతిస్తేనే కాంట్రాక్టులు దక్కేలా చేస్తామని ఆఫర్ ఇచ్చారని సమాచారం. ఆ విషయంపై స్పష్టత వచ్చేవరకు లింగాయపాలెం సబ్స్టేషన్ కాంట్రాక్టును పెండింగులోనే ఉంచాలని ఆ ప్రజాప్రతినిధి తేల్చిచెప్పారు. దీంతో ట్రాన్స్కో వర్గాలు మల్లగుల్లాలు పడుతున్నాయి. ఆ ప్రజాప్రతినిధి ఒత్తిడికి లొంగి ఆ టెండరు ప్రక్రియను ప్రస్తుతానికి పక్కనపెట్టేశాయి. అమరావతిలో సబ్స్టేషన్ల కాంట్రాక్టు వ్యవహారం మునుముందు ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాల్సిందే. -
చైనా కంపెనీ ముసుగులో ఎంపీ కుటుంబం
సాక్షి, అమరావతి : అర్హతలేని చైనా కంపెనీకి రూ.240 కోట్ల విలువైన అప్టికల్ ఫైబర్ కేబుళ్ల ప్రాజెక్టును కట్టబెట్టడానికి టీడీపీ ఎంపీ ఒకరు రంగంలోకి దిగారు. అందుకు ట్రాన్స్కో ఉన్నతాధికారి వత్తాసు పలుకుతున్నారు. ఇదే కాదు.. అమరావతిలో విద్యుత్తు ప్రాజెక్టులను కూడా అదే చైనా కంపెనీ పేరుతో దక్కించుకోవాలని పావులు కదుపుతున్నారు. చైనా కంపెనీ ముసుగులో ప్రాజెక్టులు దక్కించుకుని కోట్లు కొల్లగొట్టాలన్నది ఆ ఎంపీ వ్యూహం. ఇదీ ప్రాజెక్టు అదనపు ఆదాయ వనరులను సమకూర్చుకోడానికి రాష్ట్రంలో ఆప్టికల్ ఫైబర్ కేబుళ్లు వేయాలని ట్రాన్స్కో నిర్ణయించింది. ఇందుకు 24 లేయర్లు కలిగిన ఆప్టికల్ ఫైబర్గ్రౌండ్(ఓపీజీ) వైర్లు వేయాలనేది ప్రణాళిక. ఈ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం రూ.240 కోట్లు కేటాయించింది. 18 నెలల్లో పనులు పూర్తి చేయాలని షరతు విధించటంతో ట్రాన్స్కో టెండర్ల ప్రక్రియకు సిద్ధపడింది. చైనా కంపెనీ ముసుగులో ఎంపీ కుటుంబం చైనాకు చెందిన ఎస్బీజీ అనే కంపెనీ వీటికి టెండర్ దాఖలు చేసింది. తాము చైనాలో ఉత్పత్తి చేస్తున్న ఆప్టికల్ ఫైబర్ కేబుళ్లతో ఈ ప్రాజెక్టు చేపడతామని పేర్కొంది. అయితే తెరవెనుక వేరే కథ ఉంది. వివాదాస్పద వ్యాఖ్యలతో తరచూ వార్తల్లో ఉండే రాయలసీమకు చెందిన ఓ టీడీపీ ఎంపీ ఆ కంపెనీ పేరుతో అసలు వ్యవహారం నడుపుతున్నారు. రెండు అర్హతలు తప్పనిసరి... అమరావతిలో భారీస్థాయిలో చేపట్టే విద్యుత్తు లైన్ల ప్రాజెక్టులను చైనా కంపెనీ పేరుతో టెండర్లు దక్కించుకోవాలన్నది ఆ ఎంపీ కుటుంబం ఉద్దేశం. అందుకు తొలి అడుగుగా ఆప్టికల్ ఫైబర్ కేబుల్ ప్రాజెక్టుపై కన్నేశారు. విదేశీ కంపెనీలు టెండర్లలో పాల్గొనేందుకు కొన్ని విధివిధానాలున్నాయి. ఆ కంపెనీకి కచ్చితంగా భారత దేశంలో బ్యాంకు ఖాతా ఉండాలి. భారత్లో ఇన్కార్పోరేట్ కంపెనీ అయ్యుండాలి. కానీ ఈ చైనా కంపెనీకి ఆ రెండు అర్హతలు లేవు. దీంతో సదరు చైనా కంపెనీ దాఖలు చేసిన టెండరును ట్రాన్స్కో ఉన్నతాధికారులు పరిశీలించకుండా పక్కనపెట్టేశారు. అనుమతించాల్సిందే... టెండర్ కట్టబెట్టాల్సిందే ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన రాయలసీమ టీడీపీ ఎంపీ.. చైనా కంపెనీని టెండర్లలో పాల్గొనేందుకు అనుమతించాలని ట్రాన్స్కోపై తీవ్ర ఒత్తిడి చేస్తున్నారు. ఆయన ఇటీవల విద్యుత్తు సౌధ కార్యాలయానికి వచ్చి చైనా కంపెనీని అనుమతించాల్సిందేనని పట్టుబట్టారు. ట్రాన్స్కోలో చక్రం తిప్పుతున్న ఓ ఉన్నతాధికారి అందుకు వత్తాసు పలుకుతున్నారు. ఈ ప్రయత్నాలకు ట్రాన్స్కో ఉన్నతాధికారులు ససేమిరా అంటున్నారు. అర్హతలు లేని కంపెనీని అనుమతిస్తే న్యాయవివాదాలు తలెత్తి మొత్తం టెండర్ల ప్రక్రియే నిలిచిపోతుందని హెచ్చరిస్తున్నారు. ఏడాదిన్నరలోగా ప్రాజెక్టు పూర్తి కాకపోతే కేంద్రం రూ.240 కోట్ల నిధులను వెనక్కి తీసుకుంటుందని చెబుతున్నా ఆ ఎంపీ వెనక్కి తగ్గకపోవటంతో ఆప్టికల్ ఫైబర్ కేబుళ్ల టెండరు వ్యవహారం ట్రాన్స్కోలో ఆసక్తికరంగా మారింది. -
‘విద్యుత్’లో మరో 1,800 పోస్టులు
సాక్షి, హైదరాబాద్ వరంగల్ కేంద్రంగా పనిచేస్తున్న ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ఎన్పీడీసీఎల్)లో 1,800 జూనియర్ లైన్మెన్ (జేఎల్ఎం) పోస్టుల భర్తీకి త్వరలో ప్రకటన జారీ కానుంది. సంస్థ పాలక మండలి సమావేశం అనంతరం మరో వారం పదిరోజుల్లో ఈ నియామక ప్రకటన జారీ చేయనున్నామని అధికారవర్గాలు తెలిపాయి. తెలంగాణ ట్రాన్స్కోలో 330 అసిస్టెంట్ ఇంజనీర్ (ఏఈ), 174 సబ్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్), 1,100 జూనియర్ లైన్మెన్ (జేఎల్ఎం) పోస్టులు కలిపి మొత్తం 1,604 పోస్టుల భర్తీకి ఇప్పటికే ప్రకటన జారీ కాగా, దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ఎస్పీడీసీఎల్)లో 150 ఏఈ, 500 జూనియర్ అసిస్టెంట్, 100 జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ (జేఏఓ) పోస్టులతో పాటు 2,000 జూనియర్ లైన్మెన్ (జేఎల్ఎం) పోస్టుల భర్తీకి మరో వారంలో ప్రకటన రానున్న విçషయం తెలిసిందే. అయితే టీఎస్ఎన్పీడీసీఎల్లో జేఎల్ఎం పోస్టులు తప్ప మిగతా ఏఈ, సబ్ ఇంజనీర్, ఇతర కేటగిరీల పోస్టులను ప్రస్తుతానికి భర్తీ చేయడం లేదని అధికారవర్గాలు తెలిపాయి. -
వ్యవసాయానికి విద్యుత్తేజం
సాక్షి, హైదరాబాద్ రైతులకు రాష్ట్ర ప్రభుత్వం నూతన సంవత్సర కానుక అందించింది. రాష్ట్రంలోని 23 లక్షల పంపుసెట్లకు ఆదివారం అర్ధరాత్రి నుంచి నిరంతర విద్యుత్ సరఫరాను ప్రారంభించింది. దీంతో దేశంలో వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంట్ అందిస్తున్న తొలి రాష్ట్రంగా తెలంగాణ రికార్డు సృష్టించింది. దేశంలోని కొన్ని రాష్ట్రాలు వ్యవసాయానికి నిర్ణీత గంటల పాటు ఉచిత విద్యుత్ ఇస్తుండగా, మరికొన్ని రాష్ట్రాలు 24 గంటల పాటు సరఫరా చేస్తున్నా చార్జీలు వసూలు చేస్తున్నాయి. 2016 జూలై నుంచి ఉమ్మడి మెదక్, నల్లగొండ, కరీంనగర్ జిల్లాల్లో ప్రయోగాత్మకంగా సాగుకు 24 గంటల విద్యుత్ అందించారు. ఆ తర్వాత నవంబర్ 6 నుంచి 20 వరకు 15 రోజులపాటు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో అమలు చేశారు. సీఎం కేసీఆర్ ఆదేశాలతో రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థలు(డిస్కం) ఆదివారం అర్ధరాత్రి నుంచి అధికారికంగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాయి. ట్రాన్స్కో, జెన్కో సీఎండీ డి.ప్రభాకర్ రావు, టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎండీ జి.రఘుమారెడ్డి మేడ్చల్ జిల్లా శామీర్పేట మండలం మూసాయపల్లిలో రైతు చింతల వెంకట్రెడ్డి పొలంలో పంప్సెట్ను ఆన్చేసి 24 గంటల కరెంట్ను లాంఛనంగా ప్రారంభించారు. తెల్లవారుజాము వరకు పలు గ్రామాల్లో పర్యటించి విద్యుత్ సరఫరా తీరును పరిశీలించారు. సీఎం కేసీఆర్ కరెంట్ సరఫరా విశేషాలను అధికారుల నుంచి ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ సమీక్షించారు. వచ్చే మార్చి కీలకం వాస్తవానికి గత మూడ్రోజుల నుంచే అనధికారికంగా సాగుకు 24 గంటల విద్యుత్ సరఫరా చేస్తున్నారు. దీంతో రాష్ట్రంలో గరిష్ట విద్యుత్ డిమాండ్ 8,200 మెగావాట్ల నుంచి 9,400 మెగావాట్లకు ఎగబాకింది. వచ్చే మార్చిలో రబీ పంటలు చివరి దశకు రానున్నాయి. అప్పుడు నీటి అవసరాలు పెరగనున్నాయి. దానికి వేసకి కూడా తోడు కానుండటంతో ఆ నెలలో డిమాండ్ భారీగా పెరగనుంది. ఆ నెలలో రికార్డు స్థాయిలో 11 వేల మెగావాట్లకు డిమాండ్ పెరగవచ్చని ప్రభుత్వం అంచనా వేసింది. అయినా ఆ మేరకు సరఫరా చేస్తామని విద్యుత్ సంస్థలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఆటో స్టార్టర్లపై త్వరలో ప్రత్యేక డ్రైవ్ సాగుకు 24 గంటల కరెంట్ నేపథ్యంలో విద్యుత్తోపాటు భూగర్భ జలాలు వృథా కాకుండా పంపుసెట్లకు బిగించిన ఆటో స్టార్టర్లను తొలగించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు రైతులకు పిలుపునిచ్చారు. ఆటో స్టార్టర్ల తొలగింపుపై రైతుల్లో అవగాహన, చైతన్యం కల్పించేందుకు జనవరి తొలి వారంలో ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక డ్రైవ్ నిర్వహించనుంది. మంత్రులు, ఎమ్మెల్యేల ద్వారా గ్రామ సభలు నిర్వహించి రైతుల్లో అవగాహన కల్పించనుంది. -
నిరుద్యోగులకు మరో శుభవార్త...
సాక్షి, హైదరాబాద్ : నిరుద్యోగులకు మరో శుభవార్త. తెలంగాణ విద్యుత్ సరఫరా సంస్థ (ట్రాన్స్కో)లో 1604 పోస్టుల భర్తీకి ఇప్పటికే నోటిఫికేషన్లు జారీ కాగా, దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ(టీఎస్ఎస్పీడీసీఎల్)లో మరో 3 వేలకు పైగా పోస్టుల భర్తీకి వారం పది రోజుల్లో నియామక ప్రకటనలు జారీ కానున్నాయి. 150 అసిస్టెంట్ ఇంజనీర్, 500 జూనియర్ అసిస్టెంట్, 100 జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్(జేఏఓ) పోస్టులతో పాటు 2000 జూనియర్ లైన్మెన్(జేఎల్ఎం) పోస్టులు ఇందులో ఉండనున్నాయి. 150 అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టుల్లో 130 ఎలక్ట్రికల్, 20 సివిల్ విభాగాలకు చెందిన పోస్టులుండనున్నాయి. ఈ పోస్టుల సంఖ్య స్వల్పంగా మారవచ్చని, మొత్తానికి 3 వేలకు పైగా పోస్టుల భర్తీకి ప్రకటన జారీ చేస్తామని టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి తెలిపారు. త్వరలో సంస్థ పాలక మండలి సమావేశం నిర్వహించి ఈ పోస్టుల నియామకాలకు ఆమోదం తెలుపుతామన్నారు. అనంతరం ఈ పోస్టులకు వేర్వేరుగా ప్రకటనలు జారీ చేస్తామన్నారు. మరో 10 రోజుల్లో ఈ ప్రకటనలు జారీ కావచ్చు అన్నారు. -
ట్రాన్స్కోలో 1,604 కొలువులు
సాక్షి, హైదరాబాద్: నిరుద్యోగులకు శుభవార్త. తెలంగాణ రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ (ట్రాన్స్కో)లో 1,604 పోస్టుల భర్తీకి శుక్రవారం ప్రకటన వెలువడనుంది. 330 అసిస్టెంట్ ఇంజనీర్ (ఏఈ), 174 సబ్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్), 1,100 జూనియర్ లైన్మెన్ (జేఎల్ఎం) పోస్టుల భర్తీకి ట్రాన్స్కో ప్రకటన జారీ చేయనుంది. గురువారం విద్యుత్ సౌధలో ట్రాన్స్కో, జెన్కో సంస్థల సీఎండీ ప్రభాకర్రావు నేతృత్వంలో సమావేశమైన సంస్థ పాలక మండలి ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. 330 అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టుల్లో 250 ఎలక్ట్రికల్, 49 సివిల్, 31 టెలికాం విభాగాల పోస్టులు ఉండనున్నాయి. ఆయా విభాగాల్లో ఇంజనీరింగ్ పూర్తి చేసిన అభ్యర్థులు ఏఈ పోస్టులకు, ఎలక్ట్రికల్ విభాగంలో డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు సబ్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్) పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. నిరుద్యోగ అభ్యర్థులకు రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న ప్రత్యేక వయోపరిమితి సడలింపు నిబంధనలను విద్యుత్ ఉద్యోగాల భర్తీలోనూ అమలు చేయనున్నట్లు ప్రభాకర్రావు తెలిపారు. తెలంగాణ విద్యుదుత్పత్తి సంస్థ (జెన్కో)లో ప్రస్తుతం ఖాళీలు లేవని, కాబట్టి జెన్కో నుంచి నియామక ప్రకటన ఉండదని పేర్కొన్నారు. కాగా, దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ఎస్పీడీసీఎల్), ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ఎన్పీడీసీఎల్)ల నుంచి కూడా జేఎల్ఎం, ఏఈ, సబ్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి వారం పది రోజుల్లో వేర్వేరు ప్రకటనలు జారీ కానున్నాయి. -
త్వరలో 4,000 ‘విద్యుత్’ కొలువులు
సాక్షి, హైదరాబాద్ రాష్ట్ర విద్యుత్ సంస్థల్లో ఖాళీ పోస్టుల భర్తీకి యాజమాన్యాలు కసరత్తు చేస్తున్నాయి. ట్రాన్స్కో, జెన్కో, టీఎస్ఎస్పీడీసీఎల్, టీఎస్ఎన్పీడీసీఎల్ సంస్థల్లో అసిస్టెంట్ ఇంజనీర్, సబ్ ఇంజనీర్, జూనియర్ లైన్మెన్ తదితర పోస్టుల భర్తీకి వారం, పది రోజుల్లో సంస్థలు నోటిఫికేషన్లు విడుదల చేయనున్నాయి. మొత్తంగా 4 వేల పోస్టుల భర్తీకి ప్రకటనలు రానున్నాయని అధికారవర్గాలు తెలిపాయి. నాలుగు సంస్థల్లో కలిపి 1,000 వరకు అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టులు భర్తీ చేయనున్నట్లు పేర్కొన్నాయి. అలాగే ట్రాన్స్కోలో 330 అసిస్టెంట్ ఇంజనీర్, 174 సబ్ ఇంజనీర్.. 1,100 జూనియర్ లైన్మెన్ పోస్టులు భర్తీ చేయాలని సంస్థ యాజమాన్యం నిర్ణయించింది. మిగిలిన 3 విద్యుత్ సంస్థల్లో భర్తీ చేయనున్న పోస్టుల వివరాలు తెలియాల్సి ఉంది. గురువారం హైదరాబాద్లోని విద్యుత్ సౌధలో జరగనున్న విద్యుత్ సంస్థల బోర్డు సమావేశంలో నియామక ప్రకటనల జారీపై నిర్ణయం తీసుకోనున్నారు. సుప్రీం తీర్పు నేపథ్యంలో.. గతంలో వేర్వేరు ప్రకటనలతో ఏఈ పోస్టుల భర్తీ చేపట్టగా వందల సంఖ్యలో అభ్యర్థులు రెండు కన్నా ఎక్కువ సంస్థల్లో ఉద్యోగాలకు ఎంపికయ్యారు. దీంతో నియామక ప్రక్రియలో గందరగోళం ఏర్పడింది. తొలి మెరిట్ జాబితాతో పోస్టుల భర్తీ ముగిసిన తర్వాత మిగిలిన పోస్టులకు రెండో మెరిట్ జాబితా ప్రకటించడంతో నిరుద్యోగులు అభ్యంతరం తెలుపుతూ న్యాయస్థానాలను ఆశ్రయించారు. చివరకు సుప్రీంకోర్టు నుంచి ప్రత్యేక అనుమతి పొంది రెండో జాబితాతో మిగిలిన పోస్టులను విద్యుత్ సంస్థలు భర్తీ చేశాయి. రెండో జాబితా తర్వాత కూడా పోస్టులు మిగలడంతో మూడు, నాలుగో జాబితానూ ప్రకటించాల్సి వచ్చింది. దీంతో పోస్టుల భర్తీకి ఉమ్మడిగానే ప్రకటన జారీ చేయాలని అప్పట్లో యాజమాన్యాలు నిర్ణయించాయి. కానీ రెండో జాబితాతో మిగిలిన పోస్టుల భర్తీకి సుప్రీం అనుమతించిన నేపథ్యంలో మళ్లీ పాత పద్ధతిలోనే వేర్వేరుగా ప్రకటనలు జారీ చేయాలని తాజాగా నిర్ణయానికొచ్చాయి. ఒకే కేటగిరీ పోస్టులు, విద్యార్హతలున్నా రాత పరీక్షలు వేర్వేరుగా ఉండనున్నాయి. -
‘విద్యుత్’ అధికారుల పదవీకాలం పొడిగింపు
సాక్షి, హైదరాబాద్: దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ఎస్పీడీసీఎల్) చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ (సీఎండీ) జి.రఘుమారెడ్డితో సహా రాష్ట్ర విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న మరో ఆరుగురు డైరెక్టర్ల పదవీకాలాన్ని మరో ఏడాదిపాటు పొడిగిస్తూ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. దీంతో టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డితో పాటు ఆ సంస్థ డైరెక్టర్ (ఆపరేషన్స్) శ్రీనివాస్రెడ్డి, ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ఎన్పీడీసీఎల్) డైరెక్టర్(ఆపరేషన్స్) నర్సింగ్రావు, ట్రాన్స్కో డైరెక్టర్లు జగత్రెడ్డి (ట్రాన్స్మిషన్), నర్సింగ్రావు (గ్రిడ్ ఆపరేషన్స్), జెన్కో డైరెక్టర్లు వెంకటరాజం (హైడల్ విభాగం), సచ్చిదానందం (థర్మల్ విభాగం)ల పదవీకాలం మరో ఏడాదికి పెరిగింది. సీఎం కేసీఆర్ శనివారం ప్రగతిభవన్లో జెన్కో, ట్రాన్స్కో సీఎండీ డి.ప్రభాకర్రావు, సీఎంఓ ముఖ్య కార్యదర్శి ఎస్.నర్సింగ్రావుతో సమావేశమై డైరెక్టర్ల పదవీకాలం పొడిగింపు, నియామకాలపై చర్చించారు. ప్రస్తుతం పదవీకాలం ముగుస్తున్న వారికి ఏడాదిపాటు పొడిగింపు ఇవ్వాలని, ఖాళీగా ఉన్న పోస్టులను త్వరలోనే భర్తీ చేయాలని నిర్ణయించారు. కాగా, రఘుమారెడ్డి పదవీకాలం 2016లో ముగియగా, అప్పుడు ఏడాదిపాటు పొడిగించారు. జెన్కో డైరెక్టర్లు వెంకట్రాజం, సచ్చిదానందంల పదవీకాలాన్ని వచ్చే ఏడాది నవంబర్ 30 గా నిర్ణయించారు. రాష్ట్ర ఇంధన శాఖ త్వరలో ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేయనుంది. -
మళ్లీ 9 గంటల విద్యుత్!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వ్యవసాయానికి ప్రయోగాత్మకంగా చేపట్టిన 24 గంటల విద్యుత్ సరఫరా కార్యక్రమం విజయవంతమైంది. ఈనెల 6వ తేదీ అర్ధరాత్రి నుంచి రాష్ట్రంలోని 23 లక్షల వ్యవసాయ పంపు సెట్లకు నిరాటంకంగా విద్యుత్ అందించారు. వారం రోజులపాటు సరఫరా చేసి పరిస్థితిని అంచనా వేయాలని విద్యుత్ శాఖ అధికారులు తొలుత భావించారు. కానీ ట్రాన్స్ఫార్మర్ల నుంచి 400 కెవి సబ్ స్టేషన్ల వరకు పడే భారాన్ని, ఒత్తిడిని మరింత లోతుగా అధ్యయనం చేసేందుకు ట్రయల్ రన్ను 2వారాలకు పొడిగించారు. సోమవారం (నేటి) అర్ధరాత్రి వరకు సరఫరా కొనసాగించనున్నారు. మంగళవారం నుంచి యథావిధిగా మళ్లీ 9 గంటల విద్యుత్ సరఫరా చేస్తారు. ప్రయోగాత్మకంగా చేపట్టిన సరఫరా విజయవంతమైందని, 2018 జనవరి ఒకటో తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా 24 గంటల విద్యుత్ సరఫరా చేయాలని సీఎం కేసీఆర్ విద్యుత్ సంస్థలను ఆదేశించారు. వ్యవసాయ విద్యుత్ ప్రయోగం, ఫలితాలపై ఆదివారం జెన్ కో, ట్రాన్స్ కో సీఎండీ ప్రభాకర్రావుతో సీఎం సమీక్షించారు. పాత మెదక్, కరీంనగర్, నల్లగొండ జిల్లాల్లో గత జూలై నుంచే ఈ కార్యక్రమం అమలు చేస్తున్నామని, 2 వారాలుగా రాష్ట్రంలోని అన్ని వ్యవసాయ పంపుసెట్లకు విస్తరించామని ప్రభాకర్ రావు వివరించారు. దీంతో రాష్ట్రంలో ఎంత డిమాండ్ ఏర్పడుతుంది, సబ్ స్టేషన్లు, ట్రాన్స్ఫార్మర్ల వారీగా పడే అదనపు లోడ్ ఎంత తదితర విషయాలపై స్పష్టత వచ్చిందని తెలిపారు. ‘ఎక్కువ మంది రైతులు ఉదయం పూటనే పంపుసెట్లు వాడుతున్నారు. దీంతో ఆ సమయంలోనే లోడ్ ఎక్కువగా పడుతోంది. 24 గంటల్లో ఏ గంటకు ఎంత లోడ్ పడుతుందనే విషయంలో అవగాహన వచ్చింది. పంపుసెట్లు ఎక్కువున్న ప్రాంతాల్లో ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటాం’అని చెప్పారు. కొందరు రోజంతా పంపుసెట్లు నడుపుతున్నారని, దీంతో భూగర్భ జలాలు తగ్గి ఇబ్బంది కలుగుతుందని రైతులు అధికారుల దృష్టికి తెచ్చినట్లు పేర్కొన్నారు. ఆటో స్టార్టర్లు తొలగిస్తే ఈ సమస్య పరిష్కారమవుతుందని, రైతులు స్వచ్ఛందంగా సహకరిస్తేనే ఆటో స్టార్టర్ల సమస్య తొలగిపోతుందని తెలిపారు. ఆటోస్టార్టర్ల తొలగింపునకు స్పెషల్ డ్రైవ్ ఆటో స్టార్టర్ల తొలగింపునకు డిసెంబర్ 5 నుంచి స్పెషల్ డ్రైవ్ నిర్వహించనున్నట్లు ప్రభాకర్ రావు వెల్లడించారు. అధికారులు, ప్రజాప్రతినిధులు రైతులకు ఈ విషయంలో అవగాహన కల్పించాలని కోరారు. విద్యుత్ అధికారులు గ్రామాల్లో పర్యటించి ఆటోస్టార్టర్ల వల్ల భూగర్భ జలాలు అంతరించడం, ఇతర అనర్థాలను వివరించాలని కోరారు. -
హైటెన్షన్.. ఒంటి స్తంభంపై
హైదరాబాద్ మహా నగరంలో ఏటేటా విద్యుత్ డిమాండ్ పెరిగిపోతోంది. గతేడాది వేసవిలో గరిష్ట డిమాండ్ 2,800 మెగావాట్లకు చేరింది. ఏటా 250–300 మెగావాట్ల మేర డిమాండ్ పెరుగుతోంది. మరోవైపు నగరానికి 4,500 మెగావాట్ల విద్యుత్ను సరఫరా చేసే సామర్థ్యం మాత్రమే ఉంది. దీంతో భవిష్యత్తు అవసరాల కోసం హైటెన్షన్ విద్యుత్ టవర్లు ఏర్పాటు చేయాలి. కానీ వీటికి స్థలం ఎక్కువగా అవసరం. భూగర్భ విద్యుత్ కేబుల్స్ను ఏర్పాటు చేసేందుకు అవకాశమున్నా.. వ్యయం చాలా ఎక్కువ. భూగర్భంలో 400 కేవీ విద్యుత్ లైన్ వేసేందుకు ఒక్కో కిలోమీటర్కు రూ.45 కోట్ల మేర ఖర్చవుతుంది. ఈ నేపథ్యంలో ఒంటి స్తంభాల (మోనో పోల్స్)పై ఈహెచ్టీ (ఎక్స్ట్రా హైటెన్షన్) లైన్లు ఏర్పాటు చేయాలని రాష్ట్ర విద్యుత్ సరఫరా సంస్థ(ట్రాన్స్కో) నిర్ణయించింది. అయితే నాలుగు స్తంభాల టవర్లతో పోల్చితే మోనో పోల్స్తో వేసే లైన్ల నిర్మాణానికి 2.5 రెట్ల వరకు అధిక వ్యయం అవుతుంది. కానీ భూసేకరణ ఖర్చు బాగా తగ్గిపోయే నేపథ్యంలో మొత్తం ఖర్చు తగ్గుతుంది. – సాక్షి, హైదరాబాద్ ఐటీ కారిడార్లో స్థలం లభించక.. కేతిరెడ్డిపల్లి–రాయదుర్గ్ 400 కేవీ లైన్ ఏర్పాటు కోసం నార్సింగ్ చౌరస్తా వరకు సాంప్రదాయ పద్ధతిలో లాటిస్ టవర్ల ఏర్పాటుకు స్థలాల లభ్యత ఉంది. అక్కడి నుంచి రాయదుర్గ్ వరకు స్థలం సేకరించడం అత్యంత ఖర్చుతో కూడుకున్న పని. ఐటీ కారిడార్ పరిధిలో ఉన్న ఈ ప్రాంతంలో భూముల ధరలు చాలా ఎక్కువ. దీంతో నార్సింగ్ చౌరస్తా నుంచి రాయదుర్గ్ వరకు 15 కిలోమీటర్ల మేర భూగర్భంలో 400 కేవీ లైన్ వేయాలని ట్రాన్స్కో తొలుత భావించింది. కానీ భూగర్భ లైన్కు కిలోమీటర్కు రూ.45 కోట్ల మేర ఖర్చవుతుందని తేలడంతో పునరాలోచనలో పడింది. దీనికి తోడు భూగర్భంలో విద్యుత్ లైన్లు వేసేందుకు ఏకంగా 8 మీటర్ల వెడల్పున రహదారులను తవ్వి.. అనంతరం వాటిని పునర్నిర్మించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే మోనో పోల్స్తో లైన్ను ఏర్పాటు చేయాలని నిర్ణయానికి వచ్చింది. నాలుగు స్తంభాల టవర్లకు 10 నుంచి 13 చదరపు మీటర్ల స్థలం అవసరంకాగా.. మోనోపోల్కు కేవలం 1.5 నుంచి 3 చదరపు మీటర్ల స్థలం సరిపోతుంది. వ్యయం కూడా కిలోమీటర్ నిడివికి కేవలం రూ.3.5 కోట్ల వరకు మాత్రమే అవుతుందని తేల్చారు. కేతిరెడ్డిపల్లి–రాయదుర్గ్ వరకు 400 కేవీ లైన్ ఏర్పాటుకు మొత్తం రూ.1,600 కోట్ల వ్యయం కానుండగా.. అందులో నార్సింగ్ చౌరస్తా నుంచి రాయదుర్గ్ వరకు మోనోపోల్స్తో లైన్కు రూ.600 కోట్ల వరకు ఖర్చవుతుందని ట్రాన్స్కో అంచనా వేసింది. భూగర్భలైన్లకు బదులుగా మోనోపోల్స్తో 400 కేవీ లైన్ నిర్మిస్తే.. రూ.500 కోట్లు ఆదా అవుతున్నాయని ట్రాన్స్కో డైరెక్టర్ (ట్రాన్స్మిషన్) టి.జగత్రెడ్డి తెలిపారు. ఒకే భారీ స్తంభం ఆధారంగా.. రాష్ట్రంలో ఇప్పటివరకు నిర్మించిన 132 కేవీ, 220 కేవీ, 400 కేవీ, 765 కేవీ ఈహెచ్టీ విద్యుత్ లైన్లన్నింటినీ.. లాటిస్ (చతురస్త్రాకారంలో ఉండే నాలుగు స్తంభాల అల్లిక) టవర్లపై ఏర్పాటు చేశారు. కానీ తొలిసారిగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మోనో పోల్స్తో రెండు ఈహెచ్టీ లైన్లు ఏర్పాటు కాబోతున్నాయి. కేతిరెడ్డిపల్లి నుంచి రాయదుర్గ్ వరకు 45 కిలోమీటర్ల పొడవున 400 కేవీ సామర్థ్యంతో.. నర్సాపూర్ నుంచి భౌరంపేట్ వరకు 220 కేవీ సామర్థ్యంతో లైన్ల ఏర్పాటుకు ట్రాన్స్కో చర్యలు తీసుకుంటోంది. ఈ రెండు లైన్లలో స్థల సేకరణ సమస్యలున్న చోట మోనో పోల్స్తో నిర్మించాలని నిర్ణయించింది. భౌరంపేట లైన్లోనూ.. మెదక్ జిల్లా నర్సాపూర్ నుంచి మేడ్చల్ జిల్లా భౌరంపేట వరకు 220 కేవీ లైన్ను ట్రాన్స్కో నిర్మించనుంది. అయితే ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలో ఆరు కిలోమీటర్ల మేర భూసేకరణ సమస్యగా మారింది. తొలుత భూగర్భంలో లైన్లు వేయాలని భావించగా.. ఈ 6 కిలోమీటర్లకు రూ.85 కోట్ల మేర వ్యయమవుతుందని తేలింది. దీంతో పునరాలోచన చేసిన ట్రాన్స్కో.. కిలోమీటర్ వరకు భూగర్భంలో లైన్ వేసి, మిగతా 5 కిలోమీటర్ల మేర మోనోపోల్స్తో ఏర్పాటుకు అవకాశమున్నట్లు గుర్తించింది. మొత్తంగా రూ.38 కోట్లు వ్యయమవుతుందని అంచనా వేసింది. గ్రామీణ ప్రాంతాల్లో వేస్తే..? గ్రామీణ ప్రాంతాల్లోని పంట పొలాల మీదుగా నాలుగు స్తంభాల టవర్లతో కూడిన లైన్లు వేస్తుండడంపై రైతుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఒక్కో టవర్ నిర్మాణానికి 10–15 చదరపు మీటర్ల స్థలం పోతుండగా.. రైతులకు తగిన పరిహారం అందడం లేదన్న ఆరోపణలున్నాయి. దాంతో గ్రామీణ ప్రాంతాల్లోనూ మోనో పోల్స్తో లైన్లు వేయాలన్న అభిప్రాయం వ్యక్తమైంది. కానీ నాలుగు స్తంభాల టవర్లతో పోల్చితే మోనోపోల్స్తో లైన్ల నిర్మాణానికి 2.5 రెట్ల వరకు అధిక వ్యయం కావడం, గ్రామీణ ప్రాంతాల్లో స్థలానికి పెద్దగా ఖర్చు ఉండకపోవడం నేపథ్యంలో.. ఈ అంశాన్ని పరిశీలించడం లేదని ట్రాన్స్కో వర్గాలు తెలిపాయి. -
విజి‘లెన్స్’కు అవినీతి మరకలు
సాక్షి, హైదరాబాద్ : అక్రమాలపై నిఘా పెట్టి ప్రభుత్వ ఆస్తులు కాపాడాల్సిన విజిలెన్స్ వ్యవస్థే చేను మేస్తోంది! జీహెచ్ఎంసీ, వాటర్ బోర్డు, ట్రాన్స్కో, హెచ్ఎండీఏ, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్లోని విజిలెన్స్ అధికా రులు, వారి పనితీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏకంగా ‘బాబోయ్.. మాకొద్దు ఈ అధికారులు’ అంటూ పోలీస్ పెద్దలకు ఫిర్యాదులపై ఫిర్యాదులు అందుతున్నాయి. ఈ విభా గాల్లోని విజిలెన్స్ వ్యవస్థలో కేవలం పోలీస్ అధికారులే విధులు నిర్వర్తిస్తున్నారు. వీటి ల్లో పనిచేసేందుకు చాలా పోటీ, డిమాండ్ ఉండటంతో అదనపు ఎస్పీలు, డీఎస్పీలు, ఇన్స్పెక్టర్లు, ఎస్సైలు, కానిస్టేబుళ్లు డిప్యూ టేషన్పై బదిలీ చేయించుకొని మరీ వెళ్తుంటారు. ఇటీవలే హెచ్ఎండీఏలోని ఎన్ఫోర్స్మెంట్లో ఉన్న ఓ పోలీస్ అధికారి చేసిన అవినీతి వెలుగులోకి రావడంతో అన్ని విభాగాల్లో ఉన్న విజిలెన్స్ అధికారులపై నిఘా వర్గాలు దృష్టి సారించినట్టు తెలుస్తోంది. కరెంట్ విజిలెన్స్ మస్తు ట్రాన్స్కో విభాగంలోనూ విజిలెన్స్ వింగ్ ఉంది. ఈ విభాగానికి డిప్యుటేషన్పై వెళ్లడం అంత సులభం కాదు. కొందరికే ఈ అవకాశం వస్తుంది. పోలీస్ ఉద్యోగం వదిలి ట్రాన్స్కోలో విజిలెన్స్ అధికారులు, సిబ్బంది వెళ్లడంపై ఎప్పటినుంచో చర్చ జరుగుతోంది. ఏఈలు, డీఈలు, కింది స్థాయి సిబ్బందిపై వచ్చే అక్రమాల ఫిర్యాదుపై విచారణ జరిపి నివేదిక తయారు చేయా ల్సిన విజిలెన్స్ అధికారులు వారితోనే కుమ్మౖMð్క నివేదికలు మార్చిన ఘటనలు న్నాయని ట్రాన్స్కో ఉన్నతాధికారులు చెబుతున్నారు. విద్యుత్ చౌర్యానికి సంబంధించి వచ్చే ఫిర్యాదులనూ విజిలెన్స్ అధికారులు క్యాష్ చేసుకుంటున్నట్టు ఆరోపణలున్నాయి. జీహెచ్ఎంసీలోని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్లోనూ ఇలాంటి వ్యవహారాలే బయటపడటంతో అక్కడ ఉన్నతాధికారులు ఇటీవలే పలువురిని పోలీస్ శాఖకు సరెండర్ చేశారు. వ్యాపారులు గగ్గోలు జీఎస్టీ వచ్చాక విజిలెన్స్ అధికారుల నుంచి తమకు వేధింపులు ఎక్కువ య్యాయని వ్యాపారులు కూడా ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ముఖ్యంగా రైస్మిల్లర్లు, ఇతరత్రా మధ్య తరహా వ్యాపారులు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారు లపై మంత్రులకు ఫిర్యాదు చేశారు. అక్రమ రవాణా, జీరో దందా, ట్యాక్స్ చెల్లించకుండా జరిగే వ్యాపారాలు తదితర వ్యవహారాలపై దృష్టి సారించాల్సిన అధికారులు ఇష్టారాజ్యంగా కమీషన్లు దండుకుంటున్నట్టు సమాచారం. విజిలెన్స్ ఎత్తేయండి రాష్ట్రంలోని ప్రధాన విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్తోపాటు వివిధ విభాగాల్లోని విజిలెన్స్ వ్యవస్థను ఎత్తివేయాలని హోంశాఖ గతంలోనే రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదన పెట్టింది. అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) కిందే ప్రధాన విజిలెన్స్ వ్యవస్థ పనిచేసేలా రూపకల్పన చేయాలని సూచించింది. విజిలెన్స్ వ్యవస్థకు బదులు సంబంధిత శాఖల్లోనే అంతర్గత విభాగాలు రూపొందించుకొని అక్కడి అధికారులనే నియమించుకుంటే బాగుంటుందన్న ఆలోచనను కూడా ఉన్నతాధికారులు ప్రభుత్వానికి సూచించినట్టు తెలుస్తోంది. కాసులు కురిపించే అక్రమ కట్టడాలు హెచ్ఎండీఏలోని విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్లో పనిచేసిన ఓ పోలీస్ అధికారిపై అక్కడి ఉన్నతాధికారులు పోలీస్ అధికారులకు ఓ లేఖ రాశారు. ఎన్ఫోర్స్మెంట్ను అడ్డంపెట్టుకొని అతడు భారీ స్థాయిలో అక్రమాలకు పాల్పడ్డట్టు అందులో పేర్కొన్నారు. ఇలాంటి అధికారితో తమ అధికారులు, సిబ్బంది కూడా అక్రమార్జనలో ఆరితేరిపోతున్నారని, అతడిని వెంటనే సరెండర్ చేస్తున్నామని లేఖలో స్పష్టంచేశారు. ఈ అధికారికి ముందు పనిచేసిన మరో డీఎస్పీ ఏకంగా సస్పెన్షన్కు గురికావడం చూస్తే ఏ స్థాయిలో వసూళ్లకు పాల్పడ్డారో అర్థమవుతోంది. ఈ ఎన్ఫోర్స్మెంట్ విభాగం అధికారులు.. అక్రమ కట్టడాలు నిర్మించిన వారి నుంచి భారీ స్థాయిలో వసూళ్లు చేసి ప్లానింగ్ విభాగాల్లోని అధికారులతో కుమ్మక్కయ్యారని లేఖలో వివరించారు. హెచ్ఎండీఏ పరిధిలోని ప్రభుత్వ భూములు, చెరువులు, కుంటలు వాటి రక్షణకు తీసుకోవాల్సిన చర్యల కన్నా సొంత ఆదాయం పెంచుకోవడంపైనే వీరు దృష్టి పెట్టినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాసులు కురిపించే నీళ్లు వాటర్బోర్డులో విజిలెన్స్ విభాగం పోస్టింగ్ అంటే చాలు.. లకరాలు పలికినట్టే అన్న మాట పోలీస్ శాఖలో వినిపిస్తోంది. అక్రమ నీటి కనెక్షన్లు, వాటర్ ట్యాంకర్ల అక్రమాలు, నల్లా కనెక్షన్లకు మోటార్ల బిగింపు.. తదితర వ్యవహారాలు పర్యవేక్షించాల్సిన విజి లెన్స్ అధికారులు వీటిని అడ్డం పెట్టుకొని భారీగానే దండుకుంటున్నట్టు ఆరోప ణలు వినిపిస్తున్నాయి. ఇంతటితో ఆగని కొంత మంది పోలీస్ అధికారులు ఏకంగా వాటర్బోర్డు ఆధ్వర్యంలో ఓ పోలీస్స్టేషన్ పెట్టి దందా నడిపించేందుకు సిద్ధమవడం ఉన్నతాధికారులనే కంగు తినిపించింది. ఇలాంటివేవీ ఇక్కడ చేయాల్సిన అవసరం లేదని ఉన్నతా ధికారులు పోలీస్ శాఖకు రాసిన లేఖలు తెగేసి చెప్పినట్టు సమాచారం. -
రూ.1,000 కోట్ల భారీ విద్యుత్తు కుంభకోణం
-
ఇల్లే జెన్కో.. ఇల్లే ట్రాన్స్కో
ఎక్కడో కరెంటు ఉత్పత్తి అవుతుంది. అక్కడినుండి తీగల వెంబడి కిలోమీటర్ల దూరం ప్రయాణించి వస్తే మనం వాడుకుంటాం. ఇలా విద్యుత్ సరఫరా అవుతుంది. కానీ ఫొటోల్లో కనిపిస్తున్న ఇళ్లున్నాయి చూశారా.. ఇవి చాలా స్పెషల్. ఎందుకంటే వీటిల్లో ఒకొక్కటీ ఓ విద్యుత్తు జనరేటర్! అర్థం కాలేదా? బ్రిటన్లోని వేల్స్ ప్రాంతంలో పదహారు ఇళ్లతో కూడిన ఓ కాంప్లెక్స్ను కడుతున్నారు. సింగిల్బెడ్ రూమ్లతోపాటు టూ, త్రీ బెడ్రూమ్ ఇళ్లు కూడా ఉన్నాయి దీంట్లో. ప్రతి ఇంట్లో సోలార్ ప్యానల్స్ ఏర్పాటు చేయడం మాత్రమే ఈ కాంప్లెక్స్ తాలూకూ విశేషం కాదు. విద్యుత్ అవసరాలన్నింటినీ అక్కడికక్కడే తీర్చేసేలా అన్ని రకాల టెక్నాలజీలనూ వాడారు. దాంతోపాటే విద్యుత్తును వీలైనంత ఆదా చేసే సాంకేతిక పరిజ్ఞానమూ ఉందిక్కడ. పైగా అంతా ఉచితం. ‘బిల్డింగ్స్ యాస్ పవర్స్టేషన్స్’ పేరుతో స్వాన్సీ విశ్వవిద్యాలయ విభాగం స్పెసిఫిక్ చేపట్టిన ప్రాజెక్టు ఇది. ఇందులోని పైకప్పులు, గోడలపైన సోలార్ ప్యానల్స్ ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్తును బ్యాటరీల్లో నిక్షిప్తం చేయడం.. దీపాలు, ఇంట్లోని ఎలక్ట్రిక్ పరికరాల కోసం వాటిని వాడటం మామూలే. మిగిలిపోయిన విద్యుత్తును కామన్ బ్యాటరీల్లోకి చేర్చి విద్యుత్తు వాహనాలను చార్జ్ చేసేందుకు వాడతారు. దీంతోపాటు ఇంటి భాగాలు కొన్నింటిని ఉక్కు పలకలతో కప్పేస్తారు. సూర్యుడి తీక్షణ కాంతికి వేడెక్కే పలకల వెనుకభాగంలోని గాలిని ఇంటిని వెచ్చబెట్టుకునేందుకు వాడతారు. ఈ ఏర్పాట్లు అన్నింటి వల్ల దాదాపు 15 శాతం వరకూ ఉన్న విద్యుత్తు పంపిణీ నష్టాలను గణనీయంగా తగ్గించవచ్చునని, పెద్దస్థాయిలో అమలు చేస్తే కొత్తగా విద్యుత్తు ప్లాంట్లు కట్టాల్సిన అవసరమూ ఉండదని అంటున్నారు స్పెసిఫిక్ సీఈవో కెవిన్ బైగేట్. వేల్స్ ప్రాంతంలోని ఈ పైలట్ ప్రాజెక్టు తరువాత 1,200 ఇళ్లతో ఇంకో పెద్ద ప్రాజెక్టు చేపడతామని బైగేట్ అంటున్నారు. ప్రస్తుతానికి ఈ ఇళ్ల నిర్మాణనికయ్యే ఖర్చు పది నుంచి 20 శాతం ఎక్కువగా ఉన్నప్పటికీ విద్యుత్తు బిల్లుల ఆదా ద్వారా అదనపు వ్యయాన్ని తొందరగానే భర్తీ చేసుకోవచ్చునట. బ్రిటన్లోని సంప్రదాయ విద్యుత్తు వ్యవస్థపై ఉన్న డిమాండ్ను మూడు గిగావాట్ల వరకూ తగ్గిస్తే ఏడాదికి 1,100 కోట్ల పౌండ్లు ఆదా చేయవచ్చునని ఆయన అంచనా. – సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
సబ్స్టేషన్ నిర్మాణాల వేగం పెంచండి
ట్రాన్స్కో, జెన్కో అధికారులకు హరీశ్ రావు ఆదేశం సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులో సబ్స్టేషన్ల నిర్మాణాల పనులను వేగవంతం చేయాలని నీటి పారుదల శాఖా మంత్రి టి.హరీశ్రావు విద్యుత్ శాఖ అధికారులను కోరారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం షెడ్యూల్ కన్నా ముందే పూర్తి చేసేందుకు విద్యుత్ సంస్థల సహకారం, తోడ్పాటు అవసరమన్నారు. ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ బ్యారేజీల పరిధిలోని సబ్స్టేషన్లు, విద్యుత్ టవర్లు, హెచ్టీ విద్యుత్ లైన్ల నిర్మాణానికి సంబంధించి తొలిసారి మంత్రి హరీశ్రావు ట్రాన్స్ కో, జెన్ కో, నీటి పారుదల శాఖ అధికారులతో సమన్వయ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ ప్రాజెక్టులో భాగంగా చేపట్టిన విద్యుత్ సంబంధిత పనులను ప్యాకేజీల వారీగా సమీక్షించారు. 2018 మార్చి లోగా 10 సబ్ స్టేషన్లు పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. ఇకపై ప్రతి నెలా మొదటి మంగళవారం ఆయా పనుల పురోగతిపై సమీక్షా సమావేశం ఉంటుందన్నారు. ఈ సమీక్షకు ఈఎన్సీ మురళీధర్, ట్రాన్స్కో డైరెక్టర్ సూర్యప్రకాశ్, జెన్కో డైరెక్టర్ వెంకటరాజం, ఎత్తిపోతల పథకాల ప్రభుత్వ సలహాదారు పెంటారెడ్డి, సీఈలు నల్లా వెంకటేశ్వర్లు, హరిరామ్, ఓఎస్డీ దేశ్పాండేలు పాల్గొన్నారు. -
‘విద్యుత్’ బదిలీలపై సందిగ్థం
మూడు జాబితాలు సిద్ధం చేసిన ఏపీఈపీడీసీఎల్ ఏ జాబితా ప్రకారం బదిలీ చేస్తారో తెలియక ఉద్యోగుల్లో అయోమయం రెండు పంపిణీ సంస్థలకు ఒకేలా మార్గదర్శకాలు ఒకే జాబితా తయారు చేసిన ఏపీఎస్పీడీసీఎల్ బదిలీలకు నేటితో ముగియనున్న గడువు సాక్షి, రాజమహేంద్రవరం: ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీఈపీడీసీఎల్) బదిలీలపై ఉద్యోగులు, క్షేత్రస్థాయి సిబ్బందికి సందిగ్థత నెలకొంది. శనివారంతో బదిలీల గడువు ముగుస్తున్నా ఏ ప్రాతిపదికన బదిలీలు చేస్తారన్న దానిపై ఇప్పటికీ ఉద్యోగులు ఓ అవగాహనకు రాలేకపోతున్నారు. రాష్ట్రంలో దక్షిణ, తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థల ద్వారా గృహ, వాణిజ్య, పారిశ్రామిక అవసరాలకు విద్యుత్ సరఫరా జరుగుతోంది. విశాఖ కేంద్రంగా ఉత్తరాంధ్ర, ఉభయగోదారి జిల్లాకు ఏపీఈపీడీసీఎల్, తిరుపతి కేంద్రంగా ఏపీఎస్పీడీసీఎల్ కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరుతోపాటు రాయలసీమ జిల్లాకు విద్యుత్ సరఫరా చేస్తున్నాయి. గత నెల 17వ తేదీన విద్యుత్ పంపిణీ సంస్థల్లోని ఉద్యోగుల బదిలీ ప్రక్రియ చేపట్టి ఈ నెల 15వ తేదీకి పూర్తి చేయాలని ట్రాన్స్కో ఆఫీస్ ఆర్డర్(టి.ఓ.ఓ) జారీ అయింది. అప్పుడే మార్గదర్శకాలు కూడా జారీ చేశారు. వీటి ప్రకారం ఒక స్టేషన్లో ఐదేళ్లపాటు ఉన్న వారు, ఒక పోస్టులో మూడేళ్లపాటు కొనసాగిన కార్యాలయ ఉద్యోగులు, క్షేత్రస్థాయి సిబ్బందిని బదిలీ చేయాలి. అదే సమయంలో మొత్తం ఉద్యోగుల్లో 20 శాతం ఉద్యోగులను మాత్రమే బదిలీ చేయాలి. అందులోనూ ఉద్యోగ, కార్మిక సంఘాల నేతలకు బదిలీల నుంచి మినహాయింపు ఉంటుంది. ఫలితంగా దాదాపు 16 శాతం ఉద్యోగులు మాత్రమే బదిలీ అయ్యే అవకాశం ఉంటుంది. . మూడు జాబితాలు సిద్ధ చేసిన ఏపీఈపీడీసీఎల్... రెండు పంపిణీ సంస్థల మధ్య మార్గదర్శకాల్లో వ్యత్యాసం, ఇతర కారణాల వల్ల సకాలంలో బదిలీ ప్రక్రియ పూర్తి కాలేదు. దీంతో ఈ నెల 19వ తేదీన మరోసారి టీఓఓ జారీ చేశారు. ఈనెల 24వ తేదీకి బదిలీలు పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు. అప్పటికే అర్హులైన ఉద్యోగులు సంస్థ వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకున్నారు. మూడు ఆప్షన్లు ఇచ్చారు. ఉద్యోగుల ఆప్షన్లను పరిగణనలోకి తీసుకుంటూ సాధ్యాసాధ్యాలు, అవసరాలను దృష్టిలో ఉంచుకుంటూ డివిజన్లు, సర్కిల్ పరిధిలో డీఈలు, ఎస్ఈలు ఉద్యోగులను బదిలీ చేయనున్నారు. అయితే రెండు సంస్థలకు ఒకే మార్గదర్శకాలు జారీ అయినా ఏపీఎస్పీడీసీఎల్, ఏపీఈపీడీసీఎల్లు ఉద్యోగుల బదిలీలకు సంబంధించిన సీనియారిటీ లిస్టులు సిద్ధం చేసిన వైనం భిన్నంగా ఉంది. ఏపీఈపీడీసీఎల్ స్టేషన్, పోస్టు సర్వీసు ఆధారంగా ఒకే లిస్టు తయారులు చేయగా ఏపీఈపీడీసీఎల్ స్టేషన్ పరిధి మేరకు ఒకటి, పోస్టులో సర్వీసు ఆధారంగా ఒకటి, స్టేషన్ పరిధి, పోస్టు సర్వీసు ఆధారంగా మరొకటి వెరసి మొత్తం మూడు లిస్టులు తయారు చేసింది. దీంతో ఏ లిస్టు ప్రాతిపాదికగా బదిలీలు చేస్తారన్న సందిగ్థం ఉద్యోగుల్లో నెలకొని ఉంది. . ఒక లిస్టులో ఉన్న ఉద్యోగి మరో లిస్టులో మాయం... రాజమహేంద్రవరం సర్కిల్లో దాదాపు 2 వేల పోస్టులున్నాయి. ఇందులో దాదాపు 1600 మంది ఉద్యోగులు, సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారు. మరో 400 పోస్టులు భర్తీ చేయాల్సి ఉంది. ఒక స్టేషన్లో అన్ని క్యాడర్లలో ఐదేళ్లకు మించి, ఒకే పోస్టులో మూడేళ్లకు మించి ఉన్న ఉద్యోగులందరూ ఒకటో లిస్టు, ఒకే పోస్టులో మూడేళ్లకు మించి పని చేస్తున్న వారు రెండో లిస్టు, ఒకే స్టేషన్లో అన్ని క్యాడర్లలో ఐదేళ్లకు మించి ఉన్న వారందరూ మూడో లిస్టు ఏపీఈపీడీసీఎల్ తయారు చేసింది. అయితే ఒక లిస్టులో ఉన్న ఉద్యోగి మరో రెండు లిస్టుల్లో లేకపోవడంతో బదిలీ ఏ జాబితా ప్రకారం చేస్తారన్నదానిపై ప్రస్తుతం ఉత్కంఠ నెలకొంది. ఉదహరణకు ఏపీఈపీడీసీఎల్ పరిధిలోని రాజమహేంద్రవరం సర్కిల్ (తూర్పు గోదావరి జిల్లా మొత్తం)లోని ఓ విభాగంలో పని చేసే ఓ సీనియర్ ఉద్యోగి అన్ని క్యాడర్లలో కలిపి ఒకే స్టేషన్ (రాజమహేంద్రవరం)లో 20 ఏళ్లుగా పని చేస్తున్నారు. అయితే ఈ ఉద్యోగి పేరు స్టేషన్లో ఐదేళ్లు, పోస్టులో మూడేళ్ల సీనియారిటీ ప్రాతిపదికన తయారు చేసిన ఒకటో లిస్టులో లేదు. అదేవిధంగా ఒకే పోస్టులో మూడేళ్లకు మించి ఉన్న ఉద్యోగులను ప్రాతిపదికగా తయారు చేసిన రెండో లిస్టులోనూ ఆ ఉద్యోగి పేరు లేదు. కానీ ఆ విభాగంలో మిగతావారి కన్నా ఆ ఉద్యోగి ఒకే స్టేషన్లో వివిధ క్యాడర్లలలో 20 ఏళ్లుగా పని చేస్తున్నారు. కానీ ఒకటి, రెండు జాబితాల్లో ఆ ఉద్యోగి పేరులేదు. మూడో జాబితాలో ఉంది. ఇప్పుడు ఏ జాబితా ప్రాతిపదికగా ఉద్యోగుల బదిలీ చేస్తారన్నది తెలియాల్సి ఉంది. ఒకటో జాబితా ప్రాతిపదికగా చేస్తే ఒకే స్టేషన్లో 20 ఏళ్లు నుంచి ఉంటున్న ఆ ఉద్యోగి అక్కడే ఉంటారు. ఫలితంగా అతని కన్నా జూనియర్ బదిలీ అవుతారు. మూడు లిస్టులు రూపాందించిన ఏపీఈపీడీసీఎల్ దేని ప్రకారం ఉద్యోగులను బదిలీలు చేస్తారోనన్న ఆందోళనతో ఉన్నారు. సాధ్యాసాధ్యాల ఆధారంగా బదిలీ చేస్తాం... ఉద్యోగులు ఇచ్చిన మూడు ఆప్షన్లను పరిగణలోకి తీసుకున్నా సాధ్యాసాధ్యాలు, అవసరాల ప్రకారం బదిలీలు చేస్తాం. సాంకేతిక పరిజ్ఞానం, క్షేత్రస్థాయి పనులతో కూడిన విధులు కాబట్టి పెట్టిన ఆప్షన్లు రాకపోవచ్చు. సీనియారిటీని పరిగణనలోకి తీసుకుంటాం. శనివారంతో బదిలీల ప్రక్రియ పూర్తి చేస్తాం. – వైఎస్ఎన్ ప్రసాద్, సూపరింటెండెంట్ ఇంజినీరు, ఏపీఈపీడీసీఎల్, రాజమహేంద్రవరం సర్కిల్ -
ఈపీఎఫ్ లేకుంటే అనర్హులే!
- విద్యుత్ ఔట్సోర్సింగ్ ఉద్యోగుల క్రమబద్ధీకరణకు నిబంధనలు - మార్గదర్శకాలను ఆమోదించిన విద్యుత్ సంస్థల బోర్డులు - ఈపీఎఫ్ నిబంధనతో అన్యాయం జరుగుతుందంటున్న కార్మిక సంఘాలు సాక్షి, హైదరాబాద్: విద్యుత్ శాఖ ఔట్సోర్సిం గ్ కార్మికులకు ఈపీఎఫ్ లేకుంటే క్రమబద్ధీకరణకు అనర్హులు కానున్నారు. అంతేగాకుండా జీవిత భాగస్వామి ఆంధ్రప్రదేశ్ లేదా ఇతర ప్రాంతాలకు చెందినవారైతే కూడా క్రమబద్ధీకరణ అవకాశం కోల్పోనున్నారు. ఈ మేరకు విద్యుత్ సంస్థలు ఔట్సోర్సింగ్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ విధివిధానాలు, మార్గదర్శకా లను ఆమోదించాయి. ఈ దరఖాస్తుల పరిశీ లన కోసం కమిటీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించాయి. రాష్ట్ర అవతరణ దినోత్సవ మైన జూన్ 2న ఔట్సోర్సింగ్ ఉద్యోగులను విలీనం చేసుకుంటూ ఉత్తర్వులు జారీ చేయా లని భావించినా.. దరఖాస్తుల పరిశీలనతో మరింత జాప్యం జరగనుంది. ఒక్కో సంస్థలో రెండు కమిటీలు తెలంగాణ రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ (ట్రాన్స్కో), విద్యుదుత్పత్తి సంస్థ (జెన్కో), దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ఎస్పీడీసీఎల్), ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ఎన్పీడీ సీఎల్)లు మంగళవారం బోర్డు సమావేశాలు నిర్వహించి క్రమబద్ధీకరణ ఉమ్మడి మార్గద ర్శకాలను ఆమోదించాయి. క్రమబద్ధీకరణ కోసం రాష్ట్రవ్యాప్తంగా 23,667 మంది విద్యుత్ ఔట్సోర్సింగ్ ఉద్యోగుల నుంచి దరఖాస్తులు వచ్చాయని... వారిలో అర్హులను గుర్తించేం దుకు ప్రతి విద్యుత్ సంస్థలో రెండు కమిటీల ను వేయాలని నిర్ణయించారు. ఒక్కో కమిటీ లో ఐదుగురేసి అధికారులు ఉంటారు. వారికి మినహాయింపు.. మార్గదర్శకాల ప్రకారం.. ఉద్యోగుల భవిష్య నిధి (ఈపీఎఫ్) ఖాతా ఉన్న విద్యుత్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులే రెగ్యులర్ ఉద్యోగులుగా విలీనానికి (అబ్జార్ప్షన్) అర్హులు కానున్నారు. అయితే 2016 డిసెంబర్ 4వ తేదీ నాటికి విద్యుత్ సంస్థల యాజమాన్యాల ప్రత్యేక ఉత్తర్వుల ద్వారా నియమితులైన ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు మాత్రం దీని నుంచి మినహాయింపు ఉంటుంది. గతంలో విద్యుత్ సంస్థలు ప్రముఖుల సిఫారసుల ఆధారంగా చాలా మందిని నేరుగా కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులుగా నియమిస్తూ ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేశాయి. అలాంటివారు ఈపీఎఫ్ లేకున్నా క్రమబద్ధీకరణకు అర్హులవుతారు. ఇక ఈపీఎఫ్ ఉన్నా ప్రస్తుతం పనిచేయనివారు క్రమబద్ధీకరణకు అనర్హులు. కాగా.. విద్యుత్ సంస్థల యజమాన్యాలు ఈపీఎఫ్ సదుపాయం కల్పించకపోవడంతో మీటర్ రీడర్లు, బిల్ కలెక్టర్లు, రెవెన్యూ క్యాషియర్లు, ట్రాన్స్ఫార్మర్ రిపేర్ వర్కర్లు తదితర కేటగిరీల ఉద్యోగులు క్రమబద్ధీకరణకు అనర్హులవుతారని విద్యుత్ కార్మిక సంఘాలు పేర్కొంటున్నాయి. మూడు కేటగిరీలుగా విభజన విద్యార్హతల ఆధారంగా ఔట్సోర్సింగ్ ఉద్యోగులను మూడు కేటగిరీలుగా విభజించారు. ఇంజనీరింగ్, డిప్లొమా ఇంజనీరింగ్, డిగ్రీ + కంప్యూటర్ అప్లికేషన్స్ అర్హతలున్న వారిని అత్యున్నత నైపుణ్యం గల ఉద్యోగులుగా పరిగణిస్తారు. పదో తరగతితో పాటు ఐటీఐ చేసినవారు, డ్రైవింగ్ లైసెన్స్ కలిగి తెలుగు/ఉర్దూలో రాయడం, చదవడం తెలిసిన వారిని నైపుణ్యం గల ఉద్యోగులుగా... ఎలాంటి విద్యార్హతలు లేనివారిని నైపుణ్యం లేని ఉద్యోగులుగా పరిగణిస్తారు. ప్రస్తుతం ఎలాంటి విద్యార్హతలు లేని 2,172 మంది ఔట్సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నట్లు గుర్తించారు. మరిన్ని మార్గదర్శకాలివీ.. ► 18 ఏళ్ల నుంచి 58 ఏళ్లలోపు వయసున్న వారిని క్రమబద్ధీకరిస్తారు. ►తెలంగాణ స్థానికత కలిగి ఇతర రాష్ట్రాల్లో చదవినా అర్హులే. తహసీల్దార్ జారీ చేసిన స్థానికత ధ్రువీకరణ పత్రం ఉంటే స్థానికులుగా పరిగణించనున్నారు. ► జీవిత భాగస్వామి ఏపీ లేదా ఇతర ప్రాంతాలకు చెందిన వారైతే సదరు ఔట్సోర్సింగ్ ఉద్యోగులు క్రమబద్ధీకరణకు అనర్హులవుతారు. ► భూములు కోల్పోయి సబ్స్టేషన్లలో ఔట్సోర్సింగ్ ఉద్యోగులుగా పనిచేస్తున్న వారికి అవకాశం ఉండదు. విద్యార్హతలు లేని వారికీ అవకాశం ఎలాంటి విద్యార్హతలు లేని వారిని వాచ్మన్ లాంటి కాంటింజెన్సీ పోస్టుల్లో భర్తీ చేస్తాం. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ కానుకగా జూన్ 2న ఉద్యోగులను విలీనం చేసుకుంటూ ఉత్తర్వులు జారీ చేయాలని ముందు భావించాం. కానీ ఆలస్యమవు తోంది. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులర్ ఉద్యోగులుగా విలీనం చేసుకు న్నా.. వారికి వెంటనే జీతభత్యాలు పెరగవు. అప్పటినుంచి వారికి లభించా ల్సిన ఇంక్రిమెంట్లు, ఇతర సదుపాయాలు లభిస్తాయి. – ట్రాన్స్కో సీఎండీ డి.ప్రభాకర్రావు -
23,667 మంది విలీనం
► విద్యుత్ ఔట్ సోర్సింగ్ సిబ్బంది విలీనానికి మార్గదర్శకాలు సిద్ధం ► నేడు జరగనున్న ట్రాన్స్కో, జెన్కో, డిస్కంల బోర్డు సమావేశాల్లో ఆమోదం ► రాష్ట్రావిర్భావ దినోత్సవ కానుకగా జూన్ 2న ఉత్తర్వులు ► కటాఫ్ తేదీ 2016 డిసెంబర్ 4.. 23,667 మంది అర్హులు సాక్షి, హైదరాబాద్: విద్యుత్ ఔట్ సోర్సింగ్ కార్మికులకు శుభవార్త! రాష్ట్రంలోని విద్యుత్ ఔట్ సోర్సింగ్ కార్మికులను రెగ్యులర్ ఉద్యోగులుగా విలీనం (అబ్జార‡్ష్పన్) చేసుకోవడానికి విద్యుత్ సంస్థల యాజమాన్యాలు సిద్ధమయ్యాయి. జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం కానుకగా 23,667 మంది ఔట్ సోర్సింగ్ కార్మికులను ఒకేసారి విలీనం చేసుకోవడానికి ఉత్తర్వుల జారీ కోసం ఏర్పాట్లు చేస్తున్నాయి. విలీన ప్రక్రియ విధివిధానాలు, మార్గదర్శకాలకు తెలంగాణ ట్రాన్స్కో యాజమాన్యాలు సోమవారం తుది మెరుగులు దిద్దాయి. రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ (ట్రాన్స్కో), రాష్ట్ర విద్యుదుత్పత్తి సంస్థ (జెన్కో), దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ఎస్పీడీసీఎల్), ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ఎన్పీడీసీఎల్) యాజమాన్యాలు మంగళవారం బోర్డు సమావేశాలు నిర్వహించి మార్గదర్శకాలను ఆమోదించనున్నాయి. విద్యుత్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించిన 2016 డిసెంబర్ 4ను విలీనానికి కటాఫ్ తేదీగా నిర్ణయించిన విద్యుత్ సంస్థలు.. ఆ తేదీనాటికి విద్యుత్ సంస్థల్లో వివిధ హోదాల్లో పని చేస్తున్న 23,667 మందిని విలీనం చేసుకోనున్నాయి. మంగళవారం జరిగే బోర్డు సమావేశంలో ఈ అంశాలపై నిర్ణయం తీసుకుంటామని తెలంగాణ ట్రాన్స్కో అధికారులు తెలిపారు. విలీనం తర్వాత రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా జీతభత్యాలు, పదోన్నతులు, ఇతర ప్రయోజనాలు లభిస్తాయని పేర్కొన్నారు. ట్రాన్స్కోలో 4,577 మంది.. జెన్కోలో 4,394 మంది.. సీఎం కేసీఆర్ ప్రకటన తర్వాత రాష్ట్రంలోని విద్యుత్ ఔట్సోర్సింగ్ ఉద్యోగుల బయోడేటాలను విద్యుత్ సంస్థలు స్వీకరించాయి. ట్రాన్స్కోలో 4,577 మంది, జెన్కోలో 4,394 మంది, టీఎస్ఎస్పీడీసీఎల్లో 10,268 మంది, టీఎస్ఎన్పీడీసీఎల్లో 4,428 మంది సహా మొత్తం 23,667 మంది ఔట్సోర్సింగ్ విద్యుత్ కార్మికులు పనిచేస్తున్నారని సంస్థలు తేల్చాయి. విద్యార్హతల ఆధారంగా ఒకేసారి వీరిని విలీనం చేసుకునే అంశంపై మంగళవారం జరిగే బోర్డు సమావేశాల్లో నిర్ణయం తీసుకోనున్నారు. ఎలాంటి విద్యార్హతలు లేని 2,172 మంది విషయంలోనూ సానుకూలంగా స్పందించాలని సంస్థలు భావిస్తున్నాయని అధికారులు తెలిపారు. న్యాయ చిక్కులను అధిగమించేందుకే.. విద్యుత్ ఔట్సోర్సింగ్ ఉద్యోగుల క్రమబద్ధీకరణలో న్యాయపర చిక్కులను అధిగమించేందుకు ‘క్రమబద్ధీకరణ’పదం స్థానంలో వ్యూహాత్మకంగా ‘విలీనం’అనే పదాన్ని విద్యుత్ సంస్థలు చేర్చాయి. తాజా మార్గదర్శకాల్లోనూ క్రమబద్ధీకరణ కాకుండా విలీనం ప్రక్రియగా పేర్కొన్నట్లు సమాచారం. 1996 ఏప్రిల్ 10 తర్వాత తాత్కాలిక/కాంట్రాక్ట్ ఉద్యోగుల సర్వీసులను ఇక క్రమబద్ధీకరించరాదని రమాదేవి కేసులో సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఆ ఆదేశాల ప్రకారం రాష్ట్రంలో కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ చేయొద్దని గత ఏప్రిల్ 26న హైకోర్టు మరో ఉత్తర్వు జారీ చేసింది. దీంతో తీర్పు ప్రభావం క్రమబద్ధీకరణపై పడకుండా విద్యుత్ సంస్థల యాజమాన్యాలు క్రమబద్ధీకరణకు బదులు విలీన ప్రక్రియను చేపట్టాయి. గతంలో కేటీపీఎస్ విద్యుత్ కేంద్రం తాత్కాలిక ఉద్యోగలను విలీనం చేశారని, ఇప్పుడూ అదే వ్యూహాన్ని అమలు చేయాలని నిర్ణయించినట్లు అధికారులు పేర్కొంటున్నారు. విద్యార్హతల వారీగా రాష్ట్ర విద్యుత్సంస్థల్లోని ఔట్సోర్సింగ్ ఉద్యోగుల వివరాలు.. సంస్థ మొత్తం ఉద్యోగులు పీజీ ఇంజనీరింగ్ డిగ్రీ ఇంజనీరింగ్ డిప్లొమా ఐటీఐ పదో తరగతి విద్యార్హత లేనివారు ట్రాన్స్కో 4,577 84 169 266 680 986 1,811 581 జెన్కో 4,394 72 57 205 85 1,404 2,312 259 టీఎస్ఎస్పీడీసీఎల్ 10,268 228 134 1,221 100 5,306 2,579 700 టీఎస్ఎన్పీడీసీఎల్ 4,428 164 11 513 76 2,784 248 632 మొత్తం 23,667 548 371 2,205 941 10,480 6,950 2,172 -
‘బయట’ కొంటే బాదుడే
- బహిరంగ మార్కెట్లో విద్యుత్ కొనుగోళ్లపై సర్చార్జీ - యూనిట్కు రూ.3 చొప్పున వడ్డించే యోచన - ముఖ్యమంత్రి కేసీఆర్కు ట్రాన్స్కో ప్రతిపాదనలు సాక్షి, హైదరాబాద్: బహిరంగ మార్కెట్లో విద్యుత్తు కొనుగోలు చేసే వినియోగదారులకు అదనపు సర్చార్జీ విధించాలని తెలంగాణ రాష్ట్ర విద్యుత్తు సరఫరా సంస్థ(ట్రాన్స్కో) నిర్ణయించింది. ఈ మేరకు తమ ప్రతిపాదనలను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావుకు సమర్పించింది. ఈ అంశంపై తుది నిర్ణయం ప్రభుత్వ పరిశీలనలో ఉన్నట్లు ట్రాన్స్కో వర్గాలు వెల్లడించాయి. ప్రధానంగా పారిశ్రామిక వినియోగదారులు, కొందరు బడా వినియోగదారులు ఒకవైపు డిస్కమ్లతో విద్యుత్ కొనుగోలు ఒప్పందం చేసుకుని, మరోవైపు బహిరంగ మార్కెట్లో కూడా విద్యుత్ కొనుగోలు చేస్తున్నారు. దీంతో డిస్కంలు ఆర్థికంగా నష్టాల పాలవుతున్నాయి. ఏటా రూ.400 కోట్ల నష్టం: రాష్ట్రంలో దాదాపు 70కిపైగా పరిశ్రమలు, బడా సంస్థలు ఏటా రెండు వేల మిలియన్ యూనిట్లను బహిరంగ మార్కెట్లో కొనుగోలు చేస్తున్నాయి. దీంతో డిస్కంలకు ఏటా దాదాపు రూ.400 కోట్ల నష్టం వస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. ప్రధానంగా బహిరంగ మార్కెట్లో తక్కువ రేటు ఉన్నప్పుడల్లా పారిశ్రామిక వినియోగదారులు అక్కడి నుంచి విద్యుత్ కొనుగోలు చేస్తుండటంతో డిస్కంలు నష్టపోతున్నాయి. రాష్ట్రంలోని విద్యుత్ వినియోగ డిమాండ్ను అనుసరించే డిస్కంలు విద్యుత్తు కొనుగోలుకు జెన్కోతో ఒప్పందాలు చేసుకుంటాయి. ఈ ఒప్పందాలు 25 ఏళ్ల పాటు అమల్లో ఉంటాయి. ఎంత మేరకు విద్యుత్ కొనుగోలు చేసేందుకు ఒప్పందం చేసుకున్నాయో.. అంత మొత్తం యూనిట్ల విద్యుత్తుకు డిస్కంలు జెన్కోకు డబ్బులు చెల్లించటం తప్పనిసరి. కానీ వినియోగదారులు బయటి మార్కెట్ను ఆశ్రయిస్తే అంత మేరకు డిస్కంల ఆదాయానికి గండి పడుతుంది. నిరంతరాయంగా విద్యుత్: తెలంగాణ ఏర్పడిన తర్వాత డిస్కంలు నాణ్యమైన, నిరంతరాయంగా విద్యుత్ అందిస్తున్నాయి. గతంలో ఉన్న పవర్ హాలిడేలను రద్దు చేసి, పరిశ్రమలకు 24 గంటల విద్యుత్ అందిస్తున్నాయి. అందుకు భిన్నంగా పారిశ్రామిక వినియోగదారులు బయట నుంచి విద్యుత్ కొనుగోలు చేయడం డిస్కంలను షాక్కు గురి చేస్తోంది. రోజురోజుకూ ఈ నష్టం పెరిగిపోవటంతో డిస్కంలు ప్రత్యామ్నాయాలు ఆలోచించాయి. సమస్య నుంచి గట్టెక్కేందుకు బహి రంగ మార్కెట్లో విద్యుత్ కొనుగోలు చేసే వారికి అదనపు సర్చార్జీ విధించాలని ట్రాన్స్కో ప్రతిపాదించింది. ప్రస్తుతం గుజరాత్, రాజస్థాన్, హిమాచల్ప్రదేశ్, ఢిల్లీ, మహారాష్ట్ర తదితర ప్రభుత్వాలు అదనపు సర్చార్జీలను అమలు చేస్తున్నాయి. బయట నుంచి కొనుగోలు చేసే విద్యుత్పై ఒక్కో యూనిట్కు గరిష్టంగా రూ.3 చొప్పున సర్చార్జీ విధిస్తున్నాయి. ఇదే విధానాన్ని రాష్ట్రంలోనూ అమలు చేయాలని ట్రాన్స్కో అధికారులు సీఎం కేసీఆర్ను కోరారు. -
తెలంగాణ విద్యుత్ శాఖలో కొలువుల జాతర
హైదరాబాద్ : తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త. విద్యుత్ శాఖలో భారీగా నియామకాలు జరగనున్నాయి. విద్యుత్ శాఖలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. జెన్ కో పరిధిలోని 13,357 పోస్టులు భర్తీ కానున్నాయి. జెన్ కో, ట్రాన్స్కో, డిస్కమ్లలో జూనియర్ లైన్ మెన్ నుంచి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వరకు మొత్తం 13,357 ఉద్యోగాలను భర్తీకి కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. అలాగే విద్యుత్ శాఖలోని దాదాపు 10 వేల మందికి వెంటనే పదోన్నతులు కల్పించాలని కూడా కేసీఆర్ ఆదేశించారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ఏపీ వాటా తెలంగాణ పరం
సాక్షి, అమరావతి : హైదరాబాద్ విద్యుత్ సౌధాలో వాటాను వదులుకునేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది. ఆస్తులు, అప్పులపై రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదం పరిష్కారం కాకుండానే ఆస్తులన్నీ అప్పగించాలనే నిర్ణయం విద్యుత్ సిబ్బందికి విస్మయం కలిగిస్తోంది. తెలంగాణకు భయపడి విలువైన ఆస్తులు వదులుకోవడం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఆరు అంతస్తుల్లో విద్యుత్ సౌధా నిర్మించారు. రాష్ట్ర విభజన తర్వాత దీన్ని ఏపీ, తెలంగాణ పంచుకోవాల్సి ఉంది. భౌగోళికంగా తెలంగాణలో ఉండటం వల్ల ఇది ఆ రాష్ట్రానికే చెందే వీలుంది. అయితే, ఏపీ వాటా కింద తెలంగాణ కొంత మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. ఆస్తుల విలువ కట్టకపోవడం వల్ల ఎంతమొత్తం ఇవ్వాలనేది ఇంకా నిర్థారణ కాలేదు. ప్రస్తుతం విద్యుత్ సౌధాలో రెండు రాష్ట్రాల జెన్కో, ట్రాన్స్కో కార్యాలయాలు తమ కార్యకలాపాలను కొనసాగిస్తున్నాయి. పదేళ్ళ పాటు ఏపీ ఇక్కడ తమ ఆఫీసులను నిర్వహించుకునే హక్కు కూడా ఉంది. ఈ నేపథ్యంలో విద్యుత్ సంస్థలను విజయవాడకు తరలించాలని ప్రభుత్వం ఆదేశించింది. మే నెలాఖరుకు అన్ని శాఖలను గుణదలకు తీసుకెళ్ళేందుకు ఏపీ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. కార్యాలయాలు ఖాళీ చేసినప్పటికీ ఆస్తుల పంపకం జరిగే వరకూ ఏపీ ఆఫీసులకు తాళాలు వేసి, తమ ఆధీనంలో ఉంచుకోవాలని ఏపీ విద్యుత్ సంస్థలు భావించాయి. దీనిపై తెలంగాణ అధికారులు తీవ్ర అభ్యంతరం లేవనెత్తినట్టు తెలిసింది. తాళాలు వేసుకుని పోతే ఆ గదుల్లో ఎలుకలు చనిపోతాయని, దీంతో పక్కన ఉన్న తమ గదుల్లోనూ భరించలేని వాసన వస్తుందని ఏపీకి తెలిపారు. తాళాలు వేసుకుని వెళ్ళే పరిస్థితే వస్తే ఒక్క ఫైల్ కూడా బయటకు వెళ్ళనీయమని హెచ్చరించినట్టు తెలిసింది. దీంతో తెలంగాణ అధికారులతో ఏపీ అధికారులు చర్చలు జరిపారు. మొత్తం బిల్డింగ్ తమకు ఇవ్వాలని, ఆస్తుల పంపకం తేలే వరకూ నెలకు రూ.2 లక్షలు అద్దె చెల్లిస్తామని తెలంగాణ ప్రతిపాదించింది. దీనికి ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకారం తెలిపింది. అయితే ఇప్పటికే తెలంగాణ రూ.4,800 కోట్ల విద్యుత్ బకాయిలు చెల్లించలేదని, అద్దె మాత్రం చెల్లిస్తుందా? అని ఏపీ విద్యుత్ సిబ్బంది పెదవి విరుస్తున్నారు. అయినా ఆరు అంతస్తుల భవనాన్ని కేవలం రూ.2 లక్షల అద్దెకే ఎలా ఇస్తారని ప్రశ్నిస్తున్నారు. ఖైరతాబాద్ ప్రాంతంలో ఒక్కో ఫ్లోర్ కనీసం రూ.25 లక్షల అద్దె పలుకుతుందని, ఆరు అంతస్తులకు దాదాపు రూ.1.50 కోట్ల వరకూ అద్దె వచ్చే వీలుందని చెబుతున్నారు. ప్రభుత్వ తీరుపై వారు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. -
ట్రాన్స్కో భూమిని రక్షించండి
ట్రాన్స్కో సీఎండీకి వినతిపత్రం ఇచ్చిన ఇంజనీర్స్ అసోసియేషన్ సాక్షి, అమరావతి బ్యూరో: విజయవాడలో తమ సంస్థకు చెందిన రూ.200 కోట్ల విలువైన ఐదు ఎకరాల భూమి అన్యాక్రాంతం కాకుండా కాపాడుకునేందుకు ట్రాన్స్కో ఇంజనీర్స్ అసోసియేషన్ ప్రతినిధులు సన్నద్ధమయ్యారు. విజయవాడ గుణదలలోని విద్యుత్ సౌధ భూమిని స్టార్ హోటల్కు 99 ఏళ్ల పాటు లీజుకు కట్టబెట్టాలని ప్రభుత్వ ముఖ్యనేత నిర్ణయించడంతో శుక్రవారం పర్యాటక శాఖ అధికారులు ఇక్కడ సర్వే చేపట్టిన సంగతి తెలిసిందే. లీజు ముసుగులో ట్రాన్స్కో భూమికి చినబాబు ఎసరు పెట్టడంపై ‘స్టార్.. స్టార్.. దగా స్టార్’ శీర్షికతో ‘సాక్షి’లో కథనం ప్రచురితమైంది. ఈ నేపథ్యంలో ట్రాన్స్కో ఇంజనీర్స్ అసోసియేషన్ ప్రతినిధులు శనివారం సమావేశమై, భవిష్యత్తు కార్యాచరణపై చర్చించారు. విలువైన భూమిని స్టార్ హోటల్కు అప్పనంగా కట్టబెట్టాలన్న నిర్ణయాన్ని ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం ట్రాన్స్కో సీఎండీ విజయానంద్ను కలిశారు. ట్రాన్స్కో భూమి బినామీల పరం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే జేఏసీ ఆధ్వర్యంలో ప్రత్యక్ష కార్యాచరణకు దిగుతామన్నారు. -
స్టార్.. స్టార్... దగా స్టార్
విజయవాడ నడిబొడ్డున ముఖ్యనేత భూదందా ⇒ రూ.200 కోట్ల విలువైన ట్రాన్స్కో భూమికి ఎసరు ⇒ 99 ఏళ్లపాటు లీజుకు ఇచ్చేందుకు టెండర్లు పిలవాలని ఆదేశం ⇒ సర్వే ప్రారంభించిన పర్యాటక శాఖ అధికారులు ⇒ ట్రాన్స్కో, ఎస్పీడీసీఎల్ అభ్యంతరాలు బేఖాతరు ⇒ స్టార్ హోటల్ నిర్మాణం పేరిట బినామీ సంస్థకు ధారాదత్తం! ⇒ కొంతకాలం తర్వాత చినబాబుకు అప్పగించేలా ఒప్పందం విజయవాడ నగరం నడిబొడ్డున అత్యంత ఖరీదైన ఐదెకరాల ప్రభుత్వ భూమి. అందులో ఒక బ్రహ్మాండమైన ఐదు నక్షత్రాల హోటల్ నిర్మించే బాధ్యత ఓ ప్రముఖ హోటల్ నిర్వహణ సంస్థది. వాళ్లు ఆ హోటల్ నిర్మించి, కొంతకాలం పాటు లాభాల బాటలో నడిపించిన తర్వాత చినబాబుకు కట్టబెడతారు. ఇదీ చినబాబు వేసిన అదిరిపోయే స్కెచ్. అంటే కాణీ ఖర్చు లేకుండా రాజధాని నగరంలో చినబాబు ఖాతాలో ఖరీదైన హోటల్ పడబోతోందన్నమాట. ఈ భూమి ప్రస్తుతం విద్యుత్ శాఖ అధీనంలో ఉంది. చినబాబు స్కెచ్ వేయగానే భూమిని స్వాధీనం చేసుకుని, ప్రైవేట్ సంస్థకు అప్పగించేందుకు పర్యాటక శాఖ అధికారులు సర్వే ప్రారంభించారు. సాక్షి, అమరావతి బ్యూరో: విజయవాడలో చినబాబు, ప్రభుత్వ పెద్దలు ఏపీ ట్రాన్స్కో– ఏపీఎస్పీడీసీఎల్కు చెందిన రూ.200 కోట్ల విలువైన 4.80 ఎకరాల భూమిని బినామీల ముసుగులో హస్తగతం చేసుకునేందుకు పథకం వేశారు. లీజు పేరిట 99 ఏళ్లకు దక్కిం చుకునేందుకు పన్నాగం పన్నారు. అందు కోసం అన్ని నిబంధనలను బేఖాతరు చేస్తూ పర్యాటక శాఖ ద్వారా రంగంలోకి దిగారు. ట్రాన్స్కో, సదరన్ డిస్కం ఉద్యోగుల అభ్యం తరాలను కూడా వారు లెక్కచేయడం లేదు. మరోవైపు తాము ఈ భూదందాలో కేవలం పావులమేనని, అసలు బాగోతం అంతా ప్రభుత్వ ముఖ్యనేతదేనని పర్యాటక శాఖ వర్గాలు చెబుతుండడం గమనార్హం. లోపాయికారీ ఒప్పందం రాజధానిలో పర్యాటక రంగాన్ని ప్రోత్సహిం చేందుకు స్టార్ హోటళ్లు నిర్మించే ముసుగులో ఆ 4.80 ఎకరాలను దక్కించుకోవాలని ముఖ్యనేత వ్యూహం పన్నారు. ఇప్పటికే స్టార్ హోటళ్లు నిర్వహిస్తున్న ఓ కార్పొరేట్ సంస్థతో లోపాయికారీ ఒప్పందం కుదుర్చుకున్నారు. దాని ప్రకారం... సదరు సంస్థకు 99 ఏళ్ల లీజు పేరిట ఆ 4.80 ఎకరాలను కట్టబెడతారు. ఆ సంస్థ చినబాబుకు బినామీగా ఉంటూ స్టార్ హోటల్ను నిర్మించాలి. దాన్ని కొంతకాలం నిర్వహించిన అనంతరం పూర్తిగా చినబాబుకే అప్పగించాలి. ట్రాన్స్కోకు సమాచారం లేదు స్టార్ హోటల్ నిర్మాణానికి వీలుగా 4.80 ఎకరాలను లీజుకు ఇచ్చేందుకు వెంటనే టెండర్లు పిలవాలని పర్యాటక శాఖను ముఖ్యనేత కార్యాలయం ఆదేశించింది. ట్రాన్స్కో, ఏపీ ఎస్పీడీసీఎల్కు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. భూమి అప్పగించకుండా తాము టెండర్లు ఎలా పిలుస్తామని పర్యాటక శాఖ అధికారి ఒకరు సందేహం వ్యక్తం చేశారు. అదంతా తాము చూసుకుంటామని, టెండర్ల ప్రక్రియకు సన్నాహాలు మొదలుపెట్టాలని ముఖ్యనేత స్పష్టం చేసినట్లు సమాచారం. ఏదైనా ఉంటే పెద్దలతో మాట్లాడుకోండి ముఖ్యనేత ఆదేశాలతో పర్యాటక శాఖ రంగంలోకి దిగింది. విద్యుత్తు సౌధ ప్రాంగణంలోని భూమిని శుక్రవారం సర్వే చేసింది. విషయం తెలుసుకున్న ట్రాన్స్కో ఇంజనీర్ల సంఘం ప్రతినిధులు అక్కడికి చేరుకున్నారు. తమ సంస్థకు చెందిన భూమిని పర్యాటక శాఖ సర్వే చేయడమేమిటని ప్రశ్నించారు. ఆ భూమిని పర్యాటక శాఖకు కేటాయిస్తూ ఉత్తర్వులు ఉంటే చూపించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకే తాము సర్వే చేస్తున్నామని పర్యాటక శాఖ అధికారులు తెలిపారు ఏదైనా ఉంటే సచివాలయంలో పెద్దలతో మాట్లాడుకోవా లని, తమ సర్వేను అడ్డగించవద్దని తేల్చిచెప్పారు. స్టార్ హోటల్పై చినబాబు మక్కువ విజయవాడ ఏలూరు రోడ్డులోని గుణదలలో విద్యుత్తు సౌధ భవన ప్రాంగణం ఉంది. ఆ ప్రాంగణంలో దాదాపు 4.80 ఎకరాల భూమి ఖాళీగా ఉంది. 1952 నుంచి అప్పటి రాష్ట్ర ఎలక్ట్రికల్ బోర్డు అధీనంలో ఈ భూమి ఉంటూ వచ్చింది. ఏపీఎస్ఈబీని విభజించిన తరువాత ఈ భూమిని ఏపీ ట్రాన్స్కో, సదరన్ డిస్కంలకు ఉమ్మడిగా కేటాయించారు. ప్రస్తుతం ఇక్కడ ఎకరా మార్కెట్ ధర రూ.40 కోట్లకు పైమాటే. ఆ లెక్కన మొత్తం భూమి మార్కెట్ విలువ దాదాపు రూ.200 కోట్లు. ఖాళీగా ఉన్న ఈ విలువైన భూమిపై ప్రభుత్వ పెద్దల కన్ను పడింది. ప్రధానంగా ప్రభుత్వ నిర్ణయాలను ప్రభావితం చేస్తున్న చినబాబు ఆ భూమిలో ఓ స్టార్ హోటల్ నిర్మించాలని భావిస్తున్నట్లు సమాచారం. దీంతో ప్రభుత్వ ముఖ్యనేత ఓ కార్పొరేట్ సంస్థ ముసుగులో చినబాబు స్టార్ హోటల్కు అడ్డంకుల్లేకుండా ఎత్తుగడ వేశారు. ప్రైవేట్కు అప్పగిస్తే ట్రాన్స్కోకు తీవ్ర నష్టం రాష్ట్ర విభజన అనంతరం మౌలిక వసతులు లేక ట్రాన్స్కో, ఏపీఎస్సీడీసీఎల్ సతమతమవుతున్నాయి. రాష్ట్రంలో ఉద్యోగుల శిక్షణ కేంద్రం, ఆర్అండ్డీ కేంద్రం కూడా లేవు. విజయవాడలో నీటిపారుదల శాఖకు చెందిన స్థలంలో ఎస్పీడీసీఎల్ భవనం ఉంది. ఆ భవనాన్ని ఖాళీ చేయాలని నీటిపారుదల శాఖ ఇప్పటికే నోటీసులు ఇచ్చింది. విద్యుత్తు సౌధ ప్రాంగణంలోనే ట్రాన్స్కో, ఎస్పీడీసీఎల్లకు భవనాలను నిర్మించాలని యోచిస్తున్నారు. కానీ, తమ సంస్థలకు చెందిన భూమిని ప్రైవేట్కు కట్టబెట్టడం ఏమిటని ట్రాన్స్కో, ఎస్పీ డీసీఎల్ అధికారులు, ఉద్యోగులు నిలదీస్తున్నారు. ట్రాన్స్కోకు నష్టాన్ని కలిగించే ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని ట్రాన్స్కో ఇంజనీర్ల అసోషియేషన్ ఉపాధ్యక్షుడు శ్రీనివాసరావు, సంఘ ప్రతినిధి కోటేశ్వరరావు డిమాండ్ చేస్తున్నారు. సర్కారు నిర్ణయానికి వ్యతిరేకంగా ఉద్యమిస్తాం ‘‘ఈ భూమి ట్రాన్స్కో, ఎస్పీడీసీఎల్ ఉమ్మడి ఆస్తి. ఎస్పీడీసీఎల్కు సొంత భవనం లేదు. భవిష్యత్తులో ట్రాన్స్కో అవసరాలు పెరుగుతాయి. అప్పుడు మేము ఎక్కడో మారుమూల ప్రాంతానికి వెళ్లాలా? ట్రాన్స్కో చెందిన విలువైన ఆస్తిని ప్రైవేటుకు కట్టబెడతారా? ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా ఉద్యమిస్తాం’’ – ఉదయ్కుమార్, ట్రాన్స్కో ఇంజనీర్ల సంఘం అదనపు కార్యదర్శి -
లైన్మన్పై దాడి , బైక్ను ధ్వంసం
విద్యుత్ బకాయి చెల్లించాలని అడిగిందుకు మహిళ వీరంగం కావలి : ఇంటి విద్యుత్ బకాయి కట్టలేదని సర్వీస్ కనెక్షన్ తొలగించేందుకు వచ్చిన సంబంధిత శాఖ లైన్మన్పై ఓ మహిళ దాడికి పాల్పడింది. అతని ద్విచక్రవాహనాన్ని సైతం ధ్వంసం చేసి వీరంగం సృష్టించింది. ఈ సంఘటన పట్టణంలోని వెంగళరావునగర్లో మంగళవారం జరిగింది. స్థానికులు, లైన్మన్ యు.రాజశేఖర్ కథనం మేరకు... వెంగళరావు నగర్ బైరాగుల కాలనీ ఐస్ ఫ్యాక్టరీ సమీపంలో షేక్ హసీనా అనే మహిళ నివాసం ఉంటుంది. ఆమె గత ఏడాది జూలై నుంచి సర్వీస్ కనెక్షన్కు సంబంధించి విద్యుత్ బిల్లు బకాయి ఉంది. గత నెలలో సంబంధిత సిబ్బంది వచ్చి ఫ్యూజ్ లింక్లు తీసుకెళ్లారు. అయితే ఆమె మరో ఫ్యూజ్లు తెచ్చి విద్యుత్ను వినియోగించుకుంటుంది. ఈ నేపథ్యంలో మంగళవారం లైన్మన్ ఆమె ఇంటికి వెళ్లి విద్యుత్ బకాయిలు చెల్లించాలని అడిగారు. ఆమె దురుసుగా సమాధానం చెప్పడంతో స్తంభం ఇంటికి ఉన్న విద్యుత్ సర్వీస్ కనెక్షన్ను తొలింగించే ప్రయత్నంలో చేశాడు. దీంతో ఆమె నిచ్చెన లాగేయడంతో లైన్మన్ కింద పడిపోయాడు. ఆమె ఇనుప రాడ్డుతో లైన్మన్పై దాడికి పాల్పడింది. అతని ద్విచక్ర వాహనాన్ని పడేసి అదే రాడ్తో ధ్వంసం చేసింది. ఈ ఘటనతో బిత్తరపోయిన లైన్మన్ తమ ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. వెంటనే ట్రాన్స్కో ఇంజినీరింగ్ అధికారులు, లైన్మన్తో కలసి టూటౌన్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదును అందజేశారు. విద్యుత్ బకాయిలు కోసం వినియోగదారుల ఇళ్లకు వెళితే తమపై ఇలా దాడులు చేయడం ఏమిటని విద్యుత్ శాఖ అధికారులు, లైన్మన్లు ఖండించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ట్రాన్స్కో విజిలెన్స్ అధికారుల దాడులు
- 70 కేసులు నమోదు - రూ.3.55 లక్షల జరిమానా ఉయ్యాలవాడ: అక్రమంగా విద్యుత్ వినియోగిస్తున్న గృహ వినియోగదారులపై బుధవారం ట్రాన్స్కో విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. 70 కేసులు నమోదు చేసి, రూ. 3.55 లక్షలు జరిమానా విధించినట్లు స్థానిక ఏఈ ప్రభాకర్రావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కర్నూలు విజిలెన్స్ డీఈ ఉమాపతి ఆధ్వర్యంలో ఏడీఈ శ్రీనివాసరెడ్డి, ముగ్గురు ఏఈలు, సిబ్బందితో కలిసి మండలంలోని అల్లూరు, మాయలూరు, ఉయ్యాలవాడ, సుద్దమల్ల, రూపనగుడి, కోవెలకుంట్ల మండలంలోని గుళ్లదుర్తి గ్రామాల్లో దాడులు నిర్వహించి అక్రమంగా విద్యుత్ కనెక్షన్లు కలిగి వున్న వారిపై కేసులు నమోదు చేసి జరిమానా విధించినట్లు ఏఈ స్పష్టం చేశారు. -
వామ్మో...! పెద్ద స్కెచ్
సాక్షి, అమరావతి బ్యూరో : ట్రాన్స్కో నిబంధనలను మార్చి కాంట్రాక్టు దక్కించుకునేందుకు టీడీపీ ప్రజాప్రతినిధి చేస్తున్న నానా యాగీ వెనుక పెద్ద కథే ఉంది. దాదాపు రూ.640 కోట్ల కాంట్రాక్టులను ఏక పక్షంగా దక్కించుకునే ‘దూరా’లోచన బట్టబయలవుతోంది. ఆ కథాకమామిషు ఇది.... ట్రాన్స్కో సబ్స్టేషన్ కాంట్రాక్టుల కోసం విజయవాడకు చెందిన ప్రజాప్రతినిధి పెద్ద గూడుపుఠాణీ సాగిస్తున్నారు. మొగల్రాజపురంలో రూ.10కోట్లతో నిర్మించదలచిన గ్యాస్ ఇన్సులేటెడ్ సబ్స్టేషన్ కోసం ఆయన ఒత్తిడి చేస్తున్న వైనాన్ని ‘సాక్షి’ మంగళవారం ‘పార్టీ మాదే... టెండర్ మాకే’ శీర్షికన బట్టబయలు చేసింది. అర్హత నిబంధనలు మార్చి తమకు కాంట్రాక్టు కట్టబెట్టాలని ఆయన పట్టుబట్టడం వెనుక అసలు ఉద్దేశం వేరే ఉంది. అదేమిటంటే... రాజధాని అమరావతి ప్రాంతంలో కూడా గ్యాస్ ఇన్సులేటెడ్ సబ్స్టేషన్లు నిర్మించాలని ట్రాన్స్కో నిర్ణయించింది. మొగల్రాజపురంలోని సబ్స్టేషన్ కంటే అధిక సామర్థ్యమైనవి నిర్మాణానికి ప్రతిపాదనను సిద్ధం చేసింది. రాజధాని ప్రాంతంలో 220 కేవీ సబ్స్టేషన్లు 16 నిర్మించాలని నిర్ణయించారు. ఒక్కో సబ్స్టేషన్ అంచనా వ్యయం రూ.40 కోట్లు చొప్పున మొత్తం రూ.640కోట్లుతో నిర్మిస్తారు. అమరావతిలో మొదటి సబ్స్టేషన్ నిర్మాణం కోసం ఈ నెలలో టెండర్లు పిలవాలని ట్రాన్స్కో భావిస్తోంది. అనంతరం మిగిలిన 15 సబ్స్టేషన్ల కోసం కూడా రానున్న రెండేళ్లలో దశలవారీగా టెండర్ల ప్రక్రియ చేపడతారు. రూ.640 కోట్ల భారీ కాంట్రాక్టు కావడంతో టీడీపీ ప్రజాప్రతినిధి కన్ను వాటిపై పడింది. అందుకే ప్రజాప్రతినిధి వీరంగం... గ్యాస్ ఇన్సులేటెడ్ సబ్స్టేషన్ కోసం ట్రాన్స్కో రూపొందించిన నిబంధనలు టీడీపీ ప్రజాప్రతినిధికి ప్రతికూలంగా ఉన్నాయి. ప్రస్తుతం మొగల్రాజపురం టెండర్ నోటిఫికేషన్లో అర్హత నిబంధనలు స్పష్టంగా పేర్కొన్నారు. గతంలో గ్యాస్ ఇన్సులేటెడ్ సబ్స్టేషన్ నిర్మించిన అనుభవం ఉన్న సంస్థలే బిడ్లు దాఖలు చేయాలని స్పష్టం చేశారు. టీడీపీ ప్రజాప్రతినిధి ఓ సంస్థ పేరున టెండరు దక్కించుకోవాలని భావిస్తున్నారు. కానీ ఆ సంస్థకు కూడా గతంలో గ్యాస్ ఇన్సులేటెడ్ సబ్స్టేషన్ నిర్మించిన అనుభవం లేదు. ప్రస్తుత నిబంధనల ప్రకారం రూ.10కోట్ల మొగల్రాజపురం సబ్స్టేషన్ నిర్మాణం కోసం ఆ సంస్థ పోటీపడ లేదు. ఈ వ్యవహారం అంతటితో ముగిసిపోదు. అమరావతిలో నిర్మించనున్న 16 సబ్స్టేషన్లకూ అవే టెండర్ నిబంధనలు వర్తింపజేస్తారు. అలా అయితే ఆ రూ.640కోట్ల భారీ కాంట్రాక్టు కూడా టీడీపీ ప్రజాప్రతినిధికి దక్కకుండాపోతుంది. అందుకే ప్రస్తుతం మొగల్రాజపురం సబ్స్టేషన్ టెండర్ నిబంధనలు మార్చాలని ప్రజాప్రతినిధి తీవ్ర ఒత్తిడి తెస్తున్నారు. గతంలో గ్యాస్ ఇన్సులేటెడ్ సబ్స్టేషన్ నిర్మించిన అనుభవం లేని సంస్థలు కూడా టెండర్లు దాఖలు చేసేందుకు అవకాశం ఇవ్వాలని ఒత్తిడి తెస్తున్నారు. ఈ వ్యవహారంతో ట్రాన్స్కో ఉన్నతాధికారులు తలలు పట్టుకుంటున్నారు. గ్యాస్ ఇన్సులేటెడ్ సబ్స్టేషన్ నిర్మించిన అనుభవం లేని సంస్థలకు అవకాశం కల్పించడం సరైన విధానం కాదని వారు స్పష్టం చేస్తున్నారు. ఓ వైపు రాజధానిని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తామని చెబుతున్న ప్రభుత్వం... మరోవైపు సబ్స్టేషన్ల వంటి కీలకమైన మౌలిక వ్యవస్థల నిర్మాణంలో రాజకీయాలకు తలొగ్గుతోందని విమర్శిస్తున్నారు. -
ఒకే కార్మిక సంఘానికి గుర్తింపు
ఇకపై ఆర్టీసీ తరహాలో విద్యుత్ సంస్థల్లో ఎన్నికలు విద్యుత్ సంస్థల యాజమాన్యాల నిర్ణయం.. కసరత్తు ప్రారంభం ప్రస్తుతం టీఆర్ఎస్కేవీ, 1104, 327 సంఘాలకు ప్రభుత్వ గుర్తింపు ట్రాన్స్కో, జెన్కో, డిస్కం సంస్థల్లో ఎన్నికల నిర్వహణ సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర విద్యుత్ సంస్థల్లో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. రాష్ట్ర విద్యుత్ సంస్థల్లో టీఆర్ఎస్కేవీ, 1104, 327 అనే మూడు ప్రధాన కార్మిక సంఘాలు గుర్తింపు సంఘాలుగా కొనసాగుతుండగా, ఇకపై ఆర్టీసీ తరహాలో ఒకే సంఘానికి గుర్తింపు కేటాయించాలని విద్యుత్ సంస్థల యాజమాన్యాలు నిర్ణయించాయి. విద్యుత్ కార్మికులు, ఉద్యోగులకు సంబంధించి ఏవైనా సమస్యలు తలెత్తినప్పుడు యాజమాన్యాలు మూడు గుర్తింపు సంఘాలతో చర్చలు జరపాల్సి వస్తోంది. అయితే సంఘాలమధ్య సమన్వయం లేక పలు సందర్భాల్లో చర్చల్లో ఏకాభిప్రాయం కుదరడం లేదు. డిసెంబర్లో కార్మిక సంఘాలన్నీ ఏకమై తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ ట్రేడ్ యూనియన్స్ ఫ్రంట్ (టఫ్)గా ఏర్పడి డిమాండ్ల పరిష్కారం కోసం సమ్మెకు పిలుపునివ్వడం యాజమాన్యాలకు ఇబ్బంది కలిగించింది. ప్రభుత్వంతో చర్చల అనంతరం కొన్ని సంఘాలు సమ్మె పిలుపును విరమించుకోగా, కొన్ని సంఘాలు నిరాకరించడంతో టఫ్లో చీలిక వచ్చింది. దీంతో ఒక్కో కార్మిక సంఘాన్ని బుజ్జగించి సమ్మె పిలుపును విరమింపజేయడానికి యాజమాన్యాలు తంటాలు పడాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వంతో చర్చల కోసం ఒకే సంఘానికి గుర్తింపు కల్పించాలని విద్యుత్ సంస్థల యాజమాన్యాలు నిర్ణయించాయి. రాష్ట్ర విద్యుదుత్పత్తి సంస్థ(జెన్కో), విద్యుత్ సరఫరా సంస్థ(ట్రాన్స్కో), దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ(టీఎస్ఎస్పీడీసీఎల్), ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ(టీఎస్ఎన్పీడీసీఎల్)లలో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర కార్మిక శాఖ ను ఇటీవల ట్రాన్స్కో యాజమాన్యం కోరిం ది. తాజా నిర్ణయం ప్రకారం ట్రాన్స్కో, జెన్కో, డిస్కంలలో వేర్వేరుగా ఎన్నికలు నిర్వహించి, ఒకే కార్మిక సంఘానికి గుర్తింపునిస్తారు. కసరత్తు ప్రారంభించిన కార్మిక శాఖ... ట్రాన్స్కో విజ్ఞప్తి మేరకు విద్యుత్ సంస్థల్లో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల నిర్వహణ కోసం రాష్ట్ర కార్మిక శాఖ కసరత్తు ప్రారంభించింది. కార్మికుల వివరాలు (మస్టర్ రోల్స్)ను అందించాలని తాజాగా విద్యుత్ సంస్థల యాజమాన్యాలను కోరింది. అదే విధంగా విద్యుత్ కార్మిక సంఘాల్లో సభ్యుల వివరాలను అందించాలని ఆయా కార్మిక సంఘాలకు తాజాగా లేఖలు రాసింది. ట్రాన్స్కో, జెన్కో, టీఎస్ఎస్పీడీసీఎల్, టీఎస్ఎన్పీడీసీఎల్ సంస్థల వారీగా కేంద్ర స్థాయిలో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలను రహస్య బ్యాలెట్ ద్వారా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది. విద్యుత్ సంస్థల్లో పని చేస్తున్న ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ సిబ్బందితో పాటు అకౌంట్స్, ఇతర విభాగాల్లోని ఎల్డీసీ, యూడీసీ, జేఏఓ, రికార్డ్ అసిస్టెంట్, డ్రైవర్, ఆఫీస్ సబార్డినేట్ స్థాయి వరకు ఉద్యోగులు ఈ ఎన్నికల్లో ఓటేయడానికి అర్హులు కానున్నారు. ట్రాన్స్కో అధికారవర్గాల లెక్కల ప్రకారం రాష్ట్రంలోని నాలుగు విద్యుత్ సంస్థల్లో పని చేస్తున్న 20 వేల మందికి పైగా కార్మికులు ఈ ఎన్నికల్లో ఓటేయనున్నారు. దీంతో ఆర్టీసీ, సింగరేణి సంస్థల తరహాలోనే ఇకపై విద్యుత్ సంస్థల్లో కూడా ప్రతి రెండేళ్లకోసారి ఎన్నికల సందడి నెలకొననుంది. సర్కిల్/డివిజన్ స్థాయిలో ఎలా..? విద్యుత్ సంస్థల్లో కేంద్ర/రాష్ట్ర స్థాయిలో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు నిర్వహించాలని ఇప్పటికే యాజమాన్యాలు నిర్ణయం తీసుకున్నప్పటికీ, సర్కిల్, డివిజన్ స్థాయిలో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల నిర్వహణపై స్పష్టత రాలేదు. జెన్కోలో విద్యుత్ కేంద్రాల పరిధిలో, ట్రాన్స్కో, జెన్కోలలో సర్కిల్, డివిజన్ స్థాయిలో ఎన్నికల నిర్వహణపై కార్మిక శాఖ నుంచి స్పష్టత రావాల్సి ఉందని ట్రాన్స్కోవర్గాలు పేర్కొన్నాయి. -
మాస్లీవ్పై ట్రాన్స్కో ఏఈలు
ఆదోని రూరల్ : ఆదోని డివిజన్ పరిధిలోని 17మండలాల ట్రాన్స్కో ఏఈలు, ఏఏఈలు 18మంది శుక్రవారం మాస్ లీవ్ ప్రకటించారు. డీఈ అంజన్ కుమార్ డివిజన్ పరిధిలోని ఏడీఈలు, ఏఈలు, ఏఏఈలకు సమావేశం నిర్వహించేందుకు పిలిపించారు. తమకు పనిభారం పెరిగిందని, అందువల్ల తమ సమస్యను విన్నవిస్తామని అందుకు సమయం కేటాయించాలని డీఈని కోరగా అందుకు ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన చేతనైతే పనిచేయండి..లేకపోతే సెలవులో వెళ్లండని ఏఈలపై విరుచుకుపడుతూ చులకనగా వ్యవహరించడంతో డివిజన్లోని 18మంది ఏఈలు మనస్థాపం చెందినట్లు తెలిపారు. దీంతో మూకుమ్మడిగా మాస్ లీవ్ తీసుకొని వెళ్తున్నామని ఏఈలు, ఏఏఈలు సమావేశాన్ని బాయ్కట్ చేశారు. డీఈ కార్యాలయ ఆవరణలో సమావేశమై ఆందోళన చేపట్టారు. అనంతరం వారు సమావేశం నిర్వహించి మాస్ లీవ్లో వెళ్లాలని తీర్మానించారు. ప్రభుత్వం ఇచ్చిన సిమ్లతో పాటు డీఈకి వినతి పత్రాన్ని సమర్పించారు. ఆయా మండలాల్లో సిబ్బంది ఏఎల్ఎంలు, జేఎల్ఎంలు, లైన్మెన్లు లేకపోవడం వల్ల చిన్న పని నుంచి పెద్ద పని వరకు ఏఈలే చూడాల్సి వస్తోందని, దీంతో పనిభారం పెరిగి డ్యూటీ చేయలేని పరిస్థితుల్లో ఉన్నామని తెలిపారు. డీఈకి విన్నవించుకున్నామంటే ముందుగానే డీఈ కించపరుస్తూ మాట్లాడారని ఏఈలు ఆరోపించారు. కార్యక్రమంలో ఏఈలు మద్దిలేటి, నాగభూషణం, నాగరాజు, చెన్నయ్య, సంతోష్, సురేష్ రెడ్డి, నర్సన్న, మోహన్ రావు, రామాంజినేయులు, నారాయణ స్వామినాయక్, రేఖ, శేఖర్ బాబు, మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు. -
‘కాళేశ్వరం’ విద్యుత్ నిర్మాణాలకు 267 కోట్లు
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టుకు అవసరమయ్యే విద్యుత్ను సమకూర్చనున్న ట్రాన్స్కోకు తొలి విడతగా రూ. 267 కోట్లు మంజూరు చేస్తూ నీటి పారుదల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎస్కే జోషి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నిధులతో కాళేశ్వరం పంప్హౌజ్లకు అవసరమైన విద్యుత్ సరఫరా కోసం ప్యాకేజీ 10, 11, 12లల్లో విద్యుత్ నిర్మాణాలను చేపడతారు. -
అంధకారంలో సున్నిపెంట
విద్యుత్ బకాయి చెల్లించకపోవడంత సరఫరా నిలిపివేత శ్రీశైలం ప్రాజెక్టు : ఏపీ ట్రాన్స్కోకు శ్రీశైలం ప్రాజెక్టు ఇరిగేషన్ శాఖ విద్యుత్ బకాయి చెల్లించపోవడంతో గురువారం ఉదయం నుంచి రాత్రి వరకు విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. కాలనీ మొత్తం అంధకార మయమైంది. ఇరిగేషన్ శాఖ రూ.14 కోట్లు బకాయి ఉంది. ఇదిలా ఉండగా సున్నిపెంట కాలనీలో ఏపీ ›ట్రాన్స్కో మీటర్లు బిగించి కనెక్షన్లను స్వాధీనం చేసుకోవాల్సిందిగా గతంలో జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. ట్రాన్స్కో మీటర్లు బిగిస్తున్నా కనెక్షన్లను తమ కంట్రోల్లోకి తీసుకోకపోవడంతో బిల్లుల వసూలు బాధ్యత ఎవరి తీసుకోవాలనే సందిగ్ధం నెలకొంది. విద్యుత్ సరఫరాను వెంటనే పునరుద్ధరించాలని ఇరిగేషన్ ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు ట్రాన్స్కో అధికారులను కోరారు. -
ట్రాన్స్కో అధికారుల దాడులు
పీక్లానాయక్తండా(మేళ్లచెర్వు): మండలంలోని పీక్లానాయక్తండాలో సోమవారం విద్యుత్ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. అక్రమంగా విద్యుత్ వాడుతున్న 78 మందిపై కేసు నమోదు చేసినట్లు ట్రాన్స్కో ఏఈ నాగరాజు తెలిపారు. మీటర్లు లేకుండా బకాయిలు చెల్లించకుండ విద్యుత్ వాడుతున్న వారిపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. ఎస్సీ,ఎస్టీలకు 50 యూనిట్ల మేరకు ఉచితంగా వాడుకోవచ్చు అని తెలిపారు. ఇట్టి అవకాశాన్ని గిరిజనులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఇక మీదట ఎటువంటి అనుమతులు లేకుండా విద్యుత్ వాడుకుంటే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. దాడుల్లో కోదాడ,చిలుకూరు ఏఈలు ,విద్యుత్ సిబ్బంది పాల్గొన్నారు. -
ముంపు మండలాల్లో కొత్త విద్యుత్ లైన్లు
ట్రాన్స్కో సీఎండీ ఎంఎం నాయక్ కుక్కునూరు: ముంపు మండలాల్లో విద్యుత్ సమస్యలను సాధ్యమైనంత త్వరగా పరిష్కరిస్తామని ట్రాన్స్కో సీఎండీ మురావత్ ఎం.నాయక్ అన్నారు. బుధవారం కుక్కునూరు వచ్చిన ఆయన్ను స్థానికులు గుట్ట సెంటర్ వద్ద అడ్డుకున్నారు. మండలంలో విద్యుత్ సమస్య తీవ్రంగా ఉందని ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. త్వరలోనే ముంపు మండలాల్లో విద్యుత్ సమస్యలను అధిగమిస్తామని, ఇందుకు ప్రణాళికబద్ధంగా ముందుకు సాగుతున్నామని సీఎండీ చెప్పారు. ఎటపాక నుంచి భువనగిరికి, కూనవరం నుంచి వేలేరుపాడుకు కొత్త విద్యుత్ ౖలైన్లు ఏర్పాటుచేయనున్నామన్నారు. త్వరలో రాజీవ్నగర్ సబ్స్టేçÙన్ పనులు ప్రారంభించి అన్ని లైన్లను ఆధునికీకరిస్తామని చెప్పారు. ఐటీడీఏ పీవో షణ్మోహన్ ఆయన వెంట ఉన్నారు. -
విద్యుత్ శాఖకు అపార నష్టం
గుంటూరు (నగరంపాలెం): భారీ వర్షాలకు చెరువులకు గండ్లుపడి వరదనీరు ముంచెత్తడంతో నర్సరావుపేట, సత్తెనపల్లి, పిడుగురాళ్ళ, రాజుపాలెం, క్రోసురు, అచ్చంపేట, చిలకలూరిపేట పరిధిలోని చాలా గ్రామాల్లో విద్యుత్శాఖకు తీవ్ర నష్టం వాటిల్లింది. వీటి పరిధిలోని సుమారు ఆరు మండలాల్లోని 82 గ్రామాల్లో విద్యుత్ వ్యవస్థలో అంతరాయం ఏర్పడింది. నివాస ప్రాంతాలకు చెందిన 11,780 సర్వీసులు, వ్యవసాయానికి సంబంధించి 2180 సర్వీసులకు ఇబ్బంది కలిగింది. శనివారం సాయంత్రం వరకు బ్రాహ్మణపల్లి, రాజుపాలెం ప్రాంతాల్లో వరదనీరు భారీగా నిల్వ ఉంది. పీసపాడు వద్ద 33 కేవీ లైనుకు సంబంధించి 20 విద్యుత్ స్తంభాలు, 11 కేవీకి చెందిన 876, ఎల్టీ లైను పోల్స్ 847 కూలిపోయాయి. సుమారు 82 కిలోమీటర్ల మేర ఎల్టీ, 11 కేవీ లైన్లు దెబ్బతిన్నాయి. 387 వరకు ట్రాన్స్ఫార్మర్లు నీటిలో మునిగి మరమ్మతులకు గురయ్యాయి. విద్యుత్శాఖకు రూ.2.5 కోట్లు నష్టం వచ్చినట్లు ప్రాథమికంగా అంచనావేశారు. శనివారం ఎనర్జీ సెక్రటరీ అజయ్ జైన్ విద్యుత్శాఖ జిల్లా అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్సులో జిల్లాలో వరద ప్రబావిత ప్రాంతాల్లో జరిగిన విద్యుత్శాఖ నష్టంపై సమీక్షించారు. సాధ్యమైనంత వరకు మరమ్మతులు వేగవంతం చేయాలని సూచించారు. 18 సబ్ స్టేషన్లకు అంతరాయం... వరద ప్రభావిత ప్రాంతాల్లో 35 బృందాలతో విద్యుత్ పునరుద్ధరణ పనులు వేగవంతంగా నిర్వహిస్తున్నాం. వరదనీరు తగ్గినప్పటి నుంచే 60 శాతం గ్రామాలకు గురువారం రాత్రే విద్యుత్ సరఫరా చేశాం. వరదల వల్ల 18 సబ్స్టేçÙన్లకు అంతరాయం కలిగింది. కొన్ని సబ్స్టేçÙన్లలో నీరు నిల్వ ఉండటంతో శనివారం సాయంత్రం నాటికి ఆరు గ్రామల మినహా అన్ని సర్వీసులకు సరఫరాను పునరుద్ధరించాం. పొలాల్లో నీరు భారీగా నిల్వ ఉండటంతో వ్యవసాయ కనెక్షన్లు, పడిపోయిన విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు మరమ్మతులు పెండింగులో ఉన్నాయి. – ఎస్ఈ బి.జయభారతరావు -
ట్రాన్స్కోకు పంగ‘నామా’లు
⇒ నామా నాగేశ్వరరావు విద్యుత్ కంపెనీలకు అడ్డగోలు ప్రయోజనం ⇒ క్విడ్ ప్రో కో కోసం ఏపీ సీఎం నుంచి ఒత్తిడి సాక్షి, హైదరాబాద్: ఓటుకు కోట్లు వ్యవహారంలో ఎమ్మెల్యేను కొనుగోలు చేసేందుకు డబ్బిచ్చిన వారికి అయాచితంగా ప్రయోజనం చేకూర్చేందుకు చంద్రబాబు సర్కారు రంగం సిద్ధం చేసింది. తెలంగాణకు చెందిన టీడీపీ నేత, ఏపీ సీఎం బినామీగా చెప్పుకొనే నామా నాగేశ్వరరావుకు చెందిన రెండు విద్యుత్ ప్రాజెక్టులకు రూ. వేల కోట్లు దోచిపెడుతున్నారు. నెల్లూరులో ఉన్న సింహపురి, మీనాక్షి సంస్థల నుంచి విద్యుత్ కొనుగోళ్లకు ఒప్పందాలు జరిగాయి. ఈ రెండు ప్రాజెక్టుల నుంచి 12 ఏళ్ల పా టు 600 మెగావాట్లు విద్యుత్ కొనేందుకు పీపీఏ (విద్యుత్ కొనుగోలు ఒప్పందం) చేసుకున్నారు. వాస్తవానికి ఈ తతంగం గత నెల రోజులుగా నడుస్తోంది. అయితే, సదరన్ లోడ్ డిస్పాచ్ సెంటర్ (ఎస్ఎల్డీసీ) దీనిపై తీవ్ర అభ్యంతరాలు చెప్పింది. ఏపీలో ఇప్పటికే మిగులు విద్యుత్ ఉందని, కొత్తగా ప్రైవేటు విద్యుత్ను కొనుగోలు చేయాల్సిన అవసరం లేదని పేర్కొంది. ఇదే విషయాన్ని ఏపీ ట్రా న్స్కో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లింది. కానీ నామా సంస్థల నుంచి విద్యుత్ను కొనాల్సిందేన ని సాక్షాత్తూ ఏపీ ముఖ్యమంత్రే ట్రాన్్థకో అధికారులపై తీవ్ర ఒత్తిడి తెచ్చినట్టు తెలిసింది. దీనివల్ల డిస్కమ్లపై రూ. వేల కోట్ల భారం పడనుంది. ఎక్కువ ధర... దీర్ఘకాలం ఇప్పుడు జరిగిన పీపీఏలు రూ. వేల కోట్లు ఖరీదైనవి. 600 మెగావాట్ల విద్యుత్ను 85 శాతం పీఎల్ఎఫ్తో తీసుకోవాలనేది ఒప్పందం. అంటే రోజుకు 12 మిలియన్ యూనిట్లు విద్యుత్ కొనుగోలు చేస్తారు. దీనికి యూనిట్కు రూ. 4.43 చొప్పున చెల్లిస్తారు. ఈ లెక్కన రోజుకు దాదాపు రూ. 5.31కోట్లు. ఏడాదికి రూ. 1,940 కోట్లు. 12 ఏళ్ల పాటు తీసుకునే ఈ విద్యుత్కు రూ. 23,280 కోట్లు ప్రజల సొమ్ము నామా సంస్థలకు దోచిపెడుతున్నారు. ఈ రెండు విద్యుత్ ప్లాంట్లు కూడా విదేశీ బొగ్గుతో నడిచేవి కావడం మరో విశేషం. అంటే, విదేశీ బొగ్గు దిగుమతిలో తేడాలు వస్తే చర వ్యయం పెరిగే వీలు కూడా ఉంది. ఇప్పటికే ఏపీ డిస్కమ్లు రూ. 4 వేల కోట్ల నష్టాల్లో ఉన్నాయి. వీటిని పూడ్చుకోవడానికి కొత్తగా ప్రైవేటు విద్యుత్ కొనుగోలు నిలిపివేయాలని కేంద్ర ఇంధనశాఖ స్పష్టం చేసింది. క్విడ్ ప్రో కో కోసం నామాకు దొడ్డిదారిన ప్రయోజనం చేకూర్చేందుకే ఈ ఒప్పందాలు జరిగినట్టు తీవ్రంగా విమర్శలు వినిపిస్తున్నాయి. జెన్కో ఉత్పత్తి నిలిపేసి... డిమాండ్ లేదంటూ ఒక పక్క జెన్కో ఉత్పత్తిని నిలిపివేస్తున్నారు. 1600 మెగావాట్ల సామర్థ్యంగల కృష్ణపట్నం థర్మల్ ప్లాంట్లో గత రెండు నెలలుగా ఒక యూనిట్లో తరచూ ఉత్పత్తిని నిలిపివేస్తున్నారు. కడపలోని ఆర్టీపీపీలో ప్రతీ రోజు మూడు యూనిట్లను బ్యాకిం గ్ డౌన్ చేస్తున్నారు. డిమాండే లేని పరిస్థితి ఒకపక్క, మిగులు విద్యుత్ను అమ్మలేని పరిస్థితి మరోపక్క ఉంటే... నామా సంస్థల నుంచి విద్యుత్ కొనుగోలు చేయడం వెనుక దోచిపెట్టడం తప్ప మరోటి లేదని అధికారులు విమర్శిస్తున్నారు. వాస్తవానికి బహిరంగ మార్కెట్లో యూనిట్ రూ. 2లకే లభిస్తోంది. అవసరమైతే జెన్కో థర్మల్ ప్లాంట్లను కూడా తగ్గించి ఈ విద్యుత్ను తీసుకోవాలని అధికారులు సర్కారుకు ప్రతిపాదించారు. అయితే ఏపీ ప్రభుత్వం మాత్రం తన వారి ప్రయోజనం కోసం విద్యుత్ సంస్థలను నిండా ముంచేస్తోంది. -
ముగిసిన విద్యుత్ ఉద్యోగుల క్రీడలు
కబడ్డీ విజేత నల్లగొండ జట్టు ద్వితీయ స్థానంలో వరంగల్ వరంగల్ స్పోర్ట్స్ : హన్మకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో తెలంగాణ ట్రాన్స్కో, డిస్కంల ఇంటర్ సర్కిల్ కబడ్డీ, క్యారమ్ టోర్నమెంట్ స్పోర్ట్స్ అండ్ కల్చరల్ కౌన్సిల్ ఆపరేషన్స్ సర్కిల్ ఆధ్వర్యంలో మూడు రోజులుగా నిర్వహిస్తున్న క్రీడా పోటీలు ఆదివారం ముగిశా యి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎన్పీడీసీఎల్ డైరెక్టర్ ఆపరేషన్స్ వి.వెంకటేశ్వర్రావు ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. క్రీడలు మానసికోల్లాసానికి దోహదపడుతాయని చెప్పారు. విధుల్లో బిజీగా ఉండే ఉద్యోగులకు మానసిక ప్రశాంతత కల్పించేందుకే క్రీడలు నిర్వహించామన్నారు. వరంగల్ వేదికగా పది జిల్లాల విద్యుత్ ఉద్యోగులు ఒకే చోట క్రీడలకు హాజరుకావడం సంతోషంగా ఉందని తెలిపారు. 300 మంది క్రీడాకారులు హాజరు హన్మకొండ జేఎన్ఎస్లో జరిగిన పోటీలకు తెలంగాణ వ్యాప్తంగా విద్యుత్ ఉద్యోగులు సుమారు మూడు వందల మంది హాజరయ్యారు. కబడ్డీ పోటీల్లో నల్లగొండ జట్టు ప్రథమ బహుమతి సాధించగా.. వరంగల్ జట్టు ద్వితీయస్థానంలో నిలిచింది. ఖమ్మం జట్టు తృతీయ బహుమతి పొందింది. క్యారమ్స్లో విద్యుత్ సౌధ (హైదరాబాద్) ప్రథమ బహుమతి సాధించగా, ద్వితీయ స్థానంలో కరీంనగర్, తృతీయ స్థానంలో వరంగల్ క్రీడాకారులు బహుమతులను అందుకున్నారు. అనంతరం విజేతలకు ఎన్పీడీసీఎల్ డైరెక్టర్ ఆపరేషన్స్ వి.వెంకటేశ్వర్రావు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో వరంగల్ ఎస్ఈ శివరాం, డీఈ శ్రీకాంత్, ఏడీఈ కుమారస్వామి, స్పోర్ట్స్ కౌన్సిల్ సెక్రటరీ కేవీ.జాన్సన్, స్పోర్ట్స్ ఆఫీసర్ జగన్నాథ్, పబ్లిసిటీ ఇన్చార్జి రౌతు రమేష్, గులాం రబ్బానీ, రాజిరెడ్డి, కుమారస్వామితో పాటు వివిధ జిల్లాల డీఈలు, ఏఈలు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. -
ఆరు గ్రామాల్లో ట్రాన్స్కో విజిలెన్స్ దాడులు
47 మందిపై కేసులు చిగురుమామిడి : మండలంలోని ఇందుర్తి, బొమ్మనపల్లి, ఉల్లంపల్లి, నవాబుపేట, ఒగులాపూర్, సుందరగిరి గ్రామాల్లో విద్యుత్ విజిలెన్స్ అధికారులు దాడులు చేశారు. విద్యుత్ చౌర్యానికి పాల్పడిన 47 మందిపై విజిలెన్స్ డీఈఈ గంగాధర్ ఆధ్వర్యంలో కేసులు నమోదు చేశారు. విజిలెన్స్ అధికారులు, పదిమంది ఏఈలు టీమ్లుగా ఏర్పడి దాడులు నిర్వహించినట్లు ట్రాన్స్కో ఇందుర్తి సెక్టార్ ఏఈ వంశీకృష్ణ తెలిపారు. గృహావసరాలకు అక్రమంగా విద్యుత్ వినియోగిస్తున్న వారిపై చర్యలు తీసుకోనున్నట్లు వెల్లడించారు. -
‘పవర్’ ఫుల్.. నీళ్లు నిల్..
9 గంటల సరఫరా కోసం 9,500 మెగావాట్ల విద్యుత్ సమీకరణ ఖరీఫ్లో అరకొరగానే పంటల సాగు భూగర్భ జలాల్లేక విద్యుత్ వినియోగించుకోలేని రైతులు డిమాండ్ లేక మిగిలిపోతున్న విద్యుత్ 12 నుంచి 19 గంటలు సరఫరా వ్యవసాయానికి పగటిపూట విద్యుత్తో రాత్రిళ్లు భారీగా తగ్గుతున్న వినియోగం విద్యుత్ వినియోగంలో హెచ్చుతగ్గులతో ట్రాన్స్కో సతమతం రాష్ట్రంలో వ్యవసాయానికి నిరంతరాయంగా విద్యుత్ సరఫరా అవుతోంది. కరెంటు ఎప్పుడు వస్తుందా అని అన్నదాత ఎదురుచూడాల్సిన పరిస్థితి నుంచి..రోజుకు 12 నుంచి 19 గంటల విద్యుత్ సరఫరా అవుతోంది. గత రబీ వరకు కూడా రాత్రీ పగలు కలిపి 6 గంటల పాటు కరెంటు ఉంటేనే గొప్ప విషయం. అలాంటిది ప్రస్తుత ఖరీఫ్లో వ్యవసాయానికి కావాల్సినంత విద్యుత్ను సర్కారు సరఫరా చేస్తోంది. ఇందుకోసం ప్రైవేటు సంస్థల నుంచి భారీగా విద్యుత్ను కొనుగోలు చేస్తోంది. కానీ రైతాంగం మాత్రం ఐదారు గంటలకు మించి విద్యుత్ను వినియోగించుకోలేకపోతోంది. రాష్ట్రంలో పంటల సాగు ఇప్పటికీ ఊపందుకోకపోవడం, మూడేళ్లుగా నెలకొన్న వర్షాభావంతో భూగర్భ జలాలు అడుగంటడమే దీనికి కారణం. – సాక్షి, హైదరాబాద్ రైతుల ఇబ్బందులు తొలగించేందుకు గతంలో వ్యవసాయానికి పగలు రాత్రి కలిపి రెండు మూడు విడతల్లో 4 నుంచి 6 గంటల వరకు విద్యుత్ సరఫరా చేసేవారు. అది కూడా కచ్చితమైన సమయాలేమీ ఉండేవి కావు. అలా వేళాపాళా లేని విద్యుత్ సరఫరా వల్ల అర్ధరాత్రి పొలాలకు నీరు పెట్టేందుకు వెళ్లిన చాలా మంది రైతులు విద్యుత్ షాక్, పాముకాటు వంటి దుర్ఘటనల బారినపడి మృతి చెందారు. ఈ సమస్యకు పరిష్కారంగా సాగుకు పగటిపూటే 9 గంటల నిరంతర విద్యుత్ ఇస్తామని టీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించింది. ఆ హామీని ఈ ఏడాది ఖరీఫ్ నుంచి అమలు చేసేందుకు భారీ ఎత్తున ఏర్పాట్లు చేసింది. సాగు లేక పెరగని వినియోగం రాష్ట్రంలో మొత్తంగా 21 లక్షల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. రాత్రి పగలు రెండు విడతల్లో కలిపి 6 గంటల విద్యుత్ సరఫరా చేసినప్పుడు రాష్ట్రంలో మొత్తం విద్యుత్ వినియోగం 6,000 మెగావాట్లలోపే నమోదైంది. ప్రస్తుత ఖరీఫ్ నుంచి 9 గంటల సరఫరా విద్యుత్ సరఫరా చేస్తే.. వ్యవసాయ విద్యుత్ డిమాండ్ గరిష్టంగా 9,500 మెగావాట్లకు పెరుగుతుందని సర్కారు అంచనా వేసింది. ఈ మేరకు ప్రైవేటు విద్యుదుత్పత్తి కంపెనీలతో కొనుగోలు ఒప్పందాలు (పీపీఏ) కుదుర్చుకుని అదనపు విద్యుత్ ను సమీకరించింది. ఖరీఫ్ సాగు ప్రారంభమైన జూన్ నెల నుంచి పగటిపూటే 9 గంటల విద్యుత్ సరఫరా చేసినా... వ్యవసాయ విద్యుత్ డిమాండ్ అంచనా వేసిన స్థాయిలో పెరగలేదు. ఖరీఫ్లో ఇప్పటి వరకు 40 శాతమే వరి నాట్లు పడడం, ఇతర పంటల సాగు కూడా ఆశించిన స్థాయిలో లేకపోవడంతోపాటు కొన్నేళ్లుగా నెలకొన్న వర్షాభావం కారణంగా బోర్లలో నీళ్లు లేకపోవడమే వ్యవసాయ విద్యుత్ వినియోగం పెరగకపోవడానికి కారణం. 19 గంటలు సరఫరా చేసినా.. రాష్ట్రంలో జూన్లో సగటున 6,000 మెగావాట్ల వరకు, జూలైలో సగటున 7,000 మెగావాట్ల వరకు విద్యుత్ డిమాండ్ నమోదైంది. అంటే ప్రభుత్వం సమీకరించిన 9,500 మెగావాట్ల విద్యుత్లో 2,000 నుంచి 4,000 మెగావాట్ల వరకు మిగిలిపోతోంది. దీంతో రాష్ట్ర విద్యుదుత్పత్తి సంస్థ (జెన్కో) థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో ఉత్పత్తిని బలవంతంగా తగ్గించి బ్యాక్డౌన్ చేశారు. ఇది సంస్థ ఉత్పత్తి సామర్థ్యం (పీఎల్ఎఫ్) 69 శాతానికి పడిపోవడానికి కారణమైంది. ఒకవేళ ప్రైవేటు విద్యుత్ను వదులుకుందామనుకున్నా.. ఒప్పందాల ప్రకారం జరిమానాలను చెల్లించాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో విద్యుత్ డిమాండ్ను పెంచేందుకు ఆగస్టు నెలారంభంలో కొన్ని ప్రాంతాల్లో వ్యవసాయానికి విద్యుత్ సరఫరాను 9 గంటల నుంచి ఏకంగా 19 గంటలకు పెంచారు. ఆగస్టులో గరిష్ట విద్యుత్ డిమాండ్ 6,300–8,000 మెగావాట్ల మధ్య నమోదు కావడానికి ఇది దోహదపడింది. ఈ నెల 12న గరిష్టంగా 7,945 మెగావాట్ల డిమాండ్ నమోదయింది. అయితే అందులో హైదరాబాద్ నగర విద్యుత్ వినియోగమే 2,480 మెగావాట్లు కావడం గమనార్హం. వచ్చే నెల నుంచి పెరగనున్న డిమాండ్ భూగర్భ జలాలు అడుగంటిపోవడం, పంటల సాగు తక్కువగా నమోదవడంతో 19 గంటలు విద్యుత్ సరఫరా చేసినా.. రైతులు ఐదారు గంటలకు మించి వినియోగించుకోలేకపోతున్నారు. గత వారం రోజులుగా మెదక్ తదితర జిల్లాల్లో వ్యవసాయానికి 12 గంటల నుంచి 15 గంటల పాటు విద్యుత్ సరఫరా చేస్తున్నారు. సాధారణంగా సెప్టెంబర్, అక్టోబర్లలో వ్యవసాయ విద్యుత్ వినియోగం పెరుగుతుంది. ఈ నేపథ్యంలో వచ్చే నెల నుంచి డిమాండ్ 9,500 మెగావాట్లకు చేరుతుందని విద్యుత్ శాఖ అంచనా వేస్తోంది. పంటలకు పగలే 9 గంటల విద్యుత్ సరఫరా పథకంపై అధ్యయనం కోసమే 19 గంటల పాటు సరఫరా చేస్తున్నామని ట్రాన్స్కో సీఎండీ డి.ప్రభాకర్రావు ఇటీవల పేర్కొన్నారు. వణుకుతున్న గ్రిడ్ పగటి పూటే వ్యవసాయ విద్యుత్ వినియోగం జరుగుతుండడంతో ట్రాన్స్కోకు గ్రిడ్ పరిరక్షణ కత్తి మీద సాముగా మారింది. పగటి పూట ఉన్న డిమాండ్లో రాత్రి పూట సగం కూడా ఉండడం లేదు. దీంతో విద్యుత్ వినియోగానికి సంబంధించి తీవ్ర హెచ్చుతగ్గులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో ట్రాన్స్కో అధికారులు నిరంతరం అప్రమత్తంగా ఉంటూ డిమాండ్లో హెచ్చుతగ్గులకు తగ్గట్లు విద్యుత్ సరఫరాను నియంత్రిస్తున్నారు. -
కాంట్రాక్టు ‘విద్యుత్’ కార్మికులకు ఊరట
- సమ్మె విరమణ ఒప్పందంలోని నాలుగు హామీలు నెరవేర్చిన ప్రభుత్వం - విధి నిర్వహణలో మరణిస్తే రూ.10 లక్షల పరిహారం -1,100 మంది కాంట్రాక్ట్ జూనియర్ లైన్మెన్ల క్రమబద్ధీకరణ సాక్షి, హైదరాబాద్ : విద్యుత్ కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి విద్యుత్ సంస్థలు చర్యలు ప్రారంభించాయి. జూన్ 15 నుంచి విద్యుత్ ఉద్యోగుల రాష్ట్రవ్యాప్త సమ్మెకు తెలంగాణ విద్యుత్ ట్రేడ్ యూనియన్ల ఫ్రంట్ పిలుపునివ్వగా.. రాష్ట్ర విద్యుత్ మంత్రి జి.జగదీశ్రెడ్డి జూన్ 14న ఫ్రంట్ ప్రతినిధులతో చర్చలు జరిపి సమ్మె విరమణకు ఒప్పించారు. 34 డిమాం డ్ల పరిష్కారం కోసం సమ్మెకు పిలుపునివ్వ గా, 14 డిమాండ్లను 3 నెలల వ్యవధిలో పరిష్కరిస్తామని అప్పట్లో విద్యుత్ సంస్థల యాజమాన్యాలు హామీ ఇచ్చాయి. వచ్చే నెల 14తో ఈ గడువు పూర్తికానుండగా, 4 హామీలను విద్యుత్ సంస్థలు నెరవేర్చాయి. అందులో 1,100 మంది కాంట్రాక్టు జూనియర్ లైన్మెన్ల క్రమబద్ధీకరణ ఒకటి. అలాగే విధి నిర్వహణలో ప్రమాదానికి గురై మృతి చెందిన కాంట్రాక్టు ఉద్యోగులకు చెల్లించే ఎక్స్గ్రేషియాను రూ.10లక్షలకు పెంచుతున్నట్లు తాజాగా ట్రాన్స్కో, డిస్కం లు ఉత్తర్వులు జారీ చేశాయి. క్రెడిట్ కార్డు వైద్య సేవలను వర్తింపజేస్తూ ఉత్తర్వులిచ్చా యి. కాంట్రాక్టు కార్మికుల బీమాను రూ.10 లక్షకు పెంచుతూ ఆదేశాలు జారీ చేశాయి. మరోవైపు కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు నేరుగా జీతాలు చెల్లించాలని ట్రేడ్లు యూనియన్లు డిమాండ్ చేస్తున్నాయి. 3.26 శాతం డీఏ పెంపు రాష్ట్రంలోని విద్యుత్ ఉద్యోగులు, పెన్షనర్ల కరువు భత్యాన్ని (డీఏ) 3.26% పెంచుతూ ట్రాన్స్కో, డిస్కంలు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశాయి. ప్రస్తు తం 12.585% డీఏ అమలు చేస్తుండగా, గత జూలై 1 నుంచి 15.845 శాతానికి పెంచుతున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నాయి. జూలై నెలకు సంబంధించి పెరిగిన డీఏ బకాయిలను ఆగస్టు నెల జీతంతో కలిపి సెప్టెంబర్లో చెల్లించనున్నారు. అలాగే విద్యుత్ ప్రమాదాల్లో క్షతగాత్రులుగా మారే శాఖేతర వ్యక్తులకు రూ.4 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించాలని ఆదేశిస్తూ ట్రాన్స్కో, డిస్కంలు ఉత్తర్వులు జారీ చేశాయి. విద్యుత్ ప్రమాదాల్లో 100% అంగవైకల్యం పొందిన బాధితులకే ఈ పరిహారం వర్తించనుందని పేర్కొన్నాయి. -
విద్యుత్ సంస్థలో వసూల్రాజాలు
కడప అగ్రికల్చర్: విద్యుత్ సంస్థలో వినియోగదారులకు సేవలు అందించేందుకు కాల్ సెంటర్లు ఉంటున్నాయి. వీటిల్లో కొన్ని సెంటర్లు అక్రమాలకు, అవినీతికి కేరాఫ్ అడ్రస్గా మారాయి. సేవలు పొందవచ్చని ఆశతో వెళ్లే వినియోగదారులను కాల్ సెంటర్ల నిర్వాహకులు దోచుకుంటున్నారు. కాల్ సెంటర్లలో జరిగే విషయాలను ఆలోచిస్తే ఇది చిల్లర వ్యవహారం అనిపించినా అది పెద్ద మొత్తంగా ఉంటోంది. జిల్లాలో వినియోగదారులకు సేవలు అందించడానికి ప్రతి ఏడీఈ పరిధిలో ఒక కాల్సెంటర్ ఉంటుంది. ఈ లెక్కన జిల్లాలో మొత్తం 18 కాల్ సెంటర్లు ఉన్నాయి. ఇవి ఏమేం సేవ చేస్తాయంటే.. ఈ కాల్సెంటర్లు విద్యుత్తో పని ఉండే ప్రతి ఒక్కరికి సేవలు అందించాలి. కొత్త సర్వీసు కావాలన్నా, మీటర్లు మార్చుకోవాలన్నా, విద్యుత్ సర్వీసు కావాలన్నా, ఇతర విద్యుత్ సమస్యలను పరిష్కరించాలన్నా ఈ కాల్సెంటర్లు పరిష్కరించాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకునే వారి పేరు మీద రిజిస్ట్రేషన్ చేయడం, వారి సమస్యలను నిర్ణయించిన సమయంలోపు పరిష్కరించడం తదితర పనులు చేయడం ఈ కాల్సెంటర్ల విధి. కాగా నిర్వాహకులు ఆయా సమస్యల పరిష్కారం కోసం కాల్ సెంటర్లను ఆశ్రయించే వినియోగదారుల జేబులకు చిల్లులు పెడుతున్నారు. దరఖాస్తు చేసుకునే సమయంలో దరఖాస్తులు ఇచ్చి ఆయా దరఖాస్తులకు, ఆయా పనులకు కేటాయించిన ఫీజును చెల్లించే సమయంలో తమ చేతి వాటం ప్రదర్శిస్తున్నారు. ఎలాగంటే.. ఒక వినియోగదారుడు ఒక సర్వీసు కోసం దరఖాస్తుతో పాటు నిర్ణీత ఫీజు రూ. 200 చెల్లించాల్సి ఉంది. అయితే ఆ వినియోగదారుడు రూ. 500 నోటు ఇచ్చి మిగతా చిల్లర ఇమ్మని అడిగితే, కొందరు కాల్ సెంటర్ల నిర్వహకులు రూ. 200 తీసుకుంటూ అదే సందర్భంలో ‘అయ్యా...! మిగిలిన చిల్లర రాదు, ఎందుకంటే ఖర్చులు ఉంటాయి, పై అధికారులకు ఇవ్వాలి, మీ పని తొందరగా కావాలంటే ఈ మొత్తం మరచిపోవాల్సిం§ó’lనని చెబుతున్నారని వినియోగదారులు వాపోతున్నారు. ఇలాంటి తతంగం జిల్లాలోని ఒంటిమిట్ట, రాంజపేట, ప్రొద్దుటూరు, రాయచోటి పట్టణాల్లోని కాల్సెంటర్లలో అధికంగా ఉందని వినియోగదారులు చెబుతున్నారు. సర్వీసును బట్టి రూ. 100 నుంచి 1000ల వరకు లాగుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ కాల్సెంటర్లలలోని కాంట్రాక్టు కార్మికులు చేతివాటం ప్రదర్శిస్తున్నట్లు ఆ శాఖ అధికారులు, ఉద్యోగులే పెదవి విరుస్తున్నారు. ఇది ప్రతి రోజూ జరుగుతున్న వ్యవహారమేనని విద్యుత్ సంస్థలోని ఓ అ«ధికారి ఆధారాలతో సహా ‘సాక్షి’కి అందించారు. బద్వేలు నియోజకవర్గంలోని ఓ సెంటర్లో ఓ రెగ్యులర్ ఉద్యోగి ప్రతి సర్వీసుకు రూ. 100 నుంచి రూ. 500లు ఇవ్వనిదే పని చేయడం లేదని వినియోగదారులు ఆరోపిస్తున్నారు. ఇంటి సర్వీసు కోసం దరఖాస్తు చేసుకున్న బద్వేలు నియోజక వర్గానికి చెందిన రామసుబ్బయ్య అనే వ్యక్తి నుంచి రూ.1000లు తీసుకుని మిగతా చిల్లర అడిగిౖతే పై విధంగా సమాధానం చెప్పారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇందులో ఓ అధికారికి బాగస్వామ్యం కూడా ఉంటోందని తెలిపారు. మెజార్టీ కాల్సెంటర్ల నుంచి నెలనెలా మామూళ్ల రూపంలో ఉన్నతాధికారులకు రూ. లక్షల్లోనే అందుతోందని ఆ శాఖ ఉద్యోగులే చర్చించుకుంటున్నారు. ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం.... కాల్ సెంటర్లలో అక్రమాలు, చిల్లర వ్యవహారాలు నా దృష్టికి రాలేదు. గతంలో ఇలాంటి సమస్యలు దృష్టికి వచ్చినప్పుడు నిర్వహకులను తొలగించాం. ఇప్పుడు కూడా ఎవరైనా సరే వినియోగదారులు ఇలా ఫలానా కాల్ సెంటర్లో డబ్బులు అదనంగా తీసుకుంటున్నారని పిర్యాదు చేస్తే తప్పకుండా ఉద్యోగులపైన చర్యలు తీసుకుంటాం. –ఎన్విఎస్ సుబ్బరాజు, ఎస్ఈ, జిల్లా విద్యుత్శాఖ. -
జాతీయ రహదారిపై రాస్తారోకో
ట్రాన్స్కో అధికారులపై తీరుపై ఆగ్రహం ట్రాన్స్కో ఏఈని నీలదీసిన మద్నూర్ గ్రామస్తులు మద్నూర్ : విద్యుత్ సరఫరాలో తలెత్తే ఇబ్బందులపై ట్రాన్స్కో అధికారులు స్పందించడం లేదని మద్నూర్ గ్రామస్తులు మంగళవారం సాయంత్రం రాస్తారోకో నిర్వహించారు. మండల కేంద్రంలోని సబ్స్టేషన్ వద్ద జాతీయ రహదారిపై రథ్గల్లీ, ఎస్సీ కాలనీవాసులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మంగళవారం మధ్యాహ్నం రెండు కాలనీల్లో విద్యుత్ హై వోల్టోజీ రావడంతో టీవీలు, ఫ్రిజ్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు చెడిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాత్రి అయినా కరెంటు సరఫరా పునరుద్ధరించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే అదే కాలనీలో విద్యుత్ వైర్లు తెగిపోయి ఇళ్లపై పడ్డాయని ఏఈకి తెలిపినా పట్టించుకోలేదని వారు మండిపడ్డారు. మధ్యాహ్నం నుంచి ట్రాన్స్కో అధికారులు కనీసం కాలనీకి రాలేదని ఆరోపించారు. ఈ విషయమై పలుమార్లు ఏఈకి ఫోన్ చేసినా తాను లోకల్లో లేనని వేరే గ్రామంలో ఉన్నానని నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారని వారు తెలిపారు. సాయంత్రం వరకు విద్యుత్ సరఫరా ప్రారంభం కాకపోవడంతో ఆందోళనకు దిగారు. అక్కడే ఉన్న ఏఈ శ్రీధర్ను నిలదీశారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని గ్రామస్తులకు నచ్చజెప్పి రాస్తారోకోను విరమింపజేశారు. -
క్రీడలతో స్నేహభావం పెంపొందుతుంది
భీమారం(మేడిపెల్లి) : క్రీడలతో స్నేహభావం పెంపొందుతుందని ఎస్సై రవి, మన్నెగూడెం ట్రాన్స్కో ఏఈ రాజశేఖర్ అన్నారు. భీమారంలో స్థానిక యువకులు ఏర్పాటు చేసిన మండలస్థాయి కబడ్డీ పోటీలను శనివారం ప్రారంభించారు. పోటీల్లో 20జట్లు హాజరయ్యాయి. దేహదారుఢ్యానికి ్రMీ డలు తప్పనిసరన్నారు. ఆదరణ కోల్పోతున్న కబడ్డీని యవకులు మరిచిపోకుండా మండలస్థాయిలో పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. పీఈటీలు మోహన్, కిశోర్ పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భీమారం యువకులు చెక్కపెల్లి సంజీవ్, స్వామిరెడ్డి, రంజిత్, అవినాష్, శేఖర్, శ్రీధర్, నాయకులు ప్రశాంత్, ఉత్కం శంకర్, పల్లి నర్సయ్య తదితరులు పాల్గొన్నారు. -
అంతా ఆన్లైన్
ఓడీ చెరువు: ఆంధ్రప్రదేశ్ దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ వినియోగదారుల కోసం బిల్ పే, పేమెంట్ రిమైండర్, గత చెల్లింపుల వివరాలు, కస్టమర్ కేర్ సేవలు, సరఫరా, కార్యాలయం సంప్రదింపు వివరాలు తదితర సేవల కోసం మొబైల్ అప్లికేషన్ను ప్రారంభించింది. విద్యుత్ బిల్లును క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, నెట్బ్యాంకింగ్ , నగదు కార్డు, వాలెట్ ద్వారా నగదు చెల్లించే విధానాన్ని తీసుకువచ్చింది. నెట్ బ్యాంకింగ్ లావాదేవీలకు ఎటువంటి రుసుము వసూలు చేయడం లేదని అధికారులు చెబుతున్నారు. ఏపీఎస్పీడీసీఎల్ యాప్ను ఉపయోగించే విధానాన్ని అధికారులు వివరించారు. ూ గూగుల్ ప్లేస్టోర్ నుంచి ఏపీఎస్పీడీసీఎల్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఆండ్రాయిడ్ మొబైల్లో స్టోర్ చేసుకోవాలి. ూ యాప్ను ఓపెన్ చేసిన తర్వాత స్క్రీన్ దిగువన ‘సైన్ అప్’ బటన్పై క్లిక్ చేయాలి. ూ పేరు, మొబైల్ నంబర్, ఈమైల్ ఐడీ, పాస్వర్డ్ను నమోదు చేసి సైన్అప్ ప్రక్రియను పూర్తి చేయాలి. ూ తర్వాత హోమ్ స్క్రీన్పైన రిజిస్ట్రేషన్ క్లిక్ చేయాలి. 13 అంకెల సర్వీస్ నంబర్ను అందులో నమోదు చేయాలి. తర్వాత రిజిస్ట్రేషన్ బటన్పై క్లిక్ చేస్తే సర్వీసు నంబర్ ప్రక్రియ పూర్తీ అవుతుంది. ఒక యూజర్ ఐడీతో ఐదు సర్వీసుల వరకు నమోదు చేసుకోవచ్చు. ూ విద్యుత్ బిల్లు చెల్లించేందుకు హోమ్ స్క్రీన్పై ‘బిల్పే’ ఐకాన్ మీద క్లిక్ చేయాలి. ూ బిల్లు మొత్తం తెలుసుకోవడానికి నమోదు చేసిన సర్వీస్ నమోదుపై క్లిక్ చేస్తే అవసరాన్ని బట్టి బిల్పే రిమైండర్ను సెట్ చేసుకోవచ్చు. ూ బిల్లు చెల్లించేందుకు ‘పేమెంట్’ ఐకాన్పై క్లిక్ చేయాలి. ఇక్కడ ‘ఓకే’ బటన్ క్లిక్ చేయడం ద్వారా నిబంధనలను అంగీకరించాలి. తర్వాత యూజర్ చెల్లింపు పద్ధతి ఎంపిక స్క్రీన్ కనిపిస్తుంది. వినియోగదారుడు, క్రెడిట్ కార్డు, డెబిట్కార్డు, నెట్ బ్యాంకింగ్, నగదు కార్డు, వాలెట్ ఏదో ఒకదాన్ని ఎంచుకుని చెల్లింపు ప్రక్రియను పూర్తి చేయవచ్చు. తర్వాత రసీదు కనిపిస్తుంది. దాన్ని వినియోగదారుడు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే విద్యుత్ వినియోగదారులు తమ విద్యుత్ సమస్యల పరిష్కారానికి టోల్ఫ్రీ నెంబర్ – 1800425155333 సంప్రదించవచ్చు -
మాతో పెట్టుకోకు!
♦ టోల్ప్లాజాకు ట్రాన్స్కో షాక్ ♦ టోల్ ఫీజు అడిగారని ఎస్ఈ సీరియస్ ♦ రుసుము కట్టి.. బకాయిలపై ఆరా ♦ అప్పటికప్పుడు కరెంట్ కట్ ♦ అంధకారంలో తూప్రాన్ టోల్గేట్ తూప్రాన్: ట్రాన్స్కో టోల్ప్లాజాపై కన్నెర్ర చేసింది. ఆ విభాగం ఉన్నతాధికారికి కోపం వచ్చిన దరిమిలా ప్లాజా అంధకారంలో మునిగిపోయింది. వాహనదారుల ముక్కుపిండి వసూళ్లకు పాల్పడే టోల్గేట్ నిర్వాహకులు తమ కట్టాల్సిన బకాయిల విషయం మర్చిపోవడంతో ఈ పరిస్థితి ఉత్పన్నమైంది. వివరాల్లోకి వెళ్తే.. మంగళవారం రాత్రి జిల్లా టీఎస్ సీపీడీసీఎల్ (విద్యుత్) ఎస్ఈ సదాశివరెడ్డి తూప్రాన్ మండలం అల్లాపూర్ శివారులోని 44వ జాతీయ రహదారిపై ఉన్న టోల్ప్లాజా మీదుగా హైదరాబాద్ వెళుతున్నారు. ఆయన ప్రయాణిస్తున్న కారును టోల్ప్లాజా సిబ్బంది ఆపేశారు. తన గుర్తింపును స్పష్టం చేసినప్పటికి వారు పట్టించుకోకుండా రుసుం కట్టాల్సిందేనన్నారు. వారితో వాదనలకు వెళ్లకుండా సదాశివరెడ్డి రుసుం చెల్లించాడు. ఆ వెంటనే తమ సిబ్బందితో మాట్లాడి టోల్ప్లాజా బకాయిలపై ఆరా తీశారు. నెల రోజుల విద్యుత్ బిల్లు బకాయిలు కట్టలేదని గుర్తించారు. వాహనాదారుల ముక్కుపిండి వసూళ్లకు పాల్పడుతున్న టోల్ప్లాజా నిర్వాహకులపై ఉపేక్ష అనవసరమని వెంటనే విద్యుత్ సరఫరా నిలిపివేయాలని అప్పటికప్పుడు ఆయన సిబ్బందికి పురమయించారు. వెంటనే వారు టోల్ప్లాజాకు విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. దీంతో టోల్ప్లాజా వద్ద అంధకారం నెలకొంది. ఈ ఉహించని సంఘటనతో టోల్ప్లాజా మీదుగా వెళ్లే వాహనచోదకులకు అసౌకర్యానికి గురయ్యారు. -
విద్యుత్ చౌర్యంపై కొరడా
నివారణ కోసం కొన్ని విభాగాల దృష్టి ఈ ఏడాది 352 కేసుల నమోదు రూ.3.60 కోట్ల అపరాధ రుసుము వసూలు సీతానగరం :జిల్లాలో విద్యుత్ చౌర్యం నానాటికీ పెరుగుతోంది. విద్యుత్ చౌర్యానికి పాల్పడేది కూడా ఎక్కువగా బ డాబాబులే. దీనిపై ట్రాన్స్కో అధికారులు సీరియస్గా దృష్టి సారించి, కేసులు కూడా నమోదు చేస్తున్నారు. ఏడాది కాలంలోనే జిల్లాలో నాలుగు అంకెలకు ఈ కేసులు చేరుతున్నాయి. విద్యుత్ చోరులపై విధించిన అపరాధ రుసుం రూపేణా జిల్లాలో రూ.50 లక్షలకు పైగా ట్రాన్స్కోకు రావలసి ఉంది. అయితే కేసుదారులు కోర్టులను ఆశ్రయించడంతో అవి పెండింగ్లో ఉన్నాయి. విద్యుత్ చౌర్యం ఇలా జిల్లాలో విద్యుత్ చౌర్యం పలు విధాలుగా జరుగుతోంది. మీటరు నుంచి, మీటరు లేకుండా నేరుగా కూడా చోరీ జరుగుతోంది. తక్కువ లోడ్కు కనెక్షన్ తీసుకుని ఎక్కువ లోడు విద్యుత్ వాడకం, కేటగిరి ఒన్ సర్వీసులు కేటగిరి టుకు వాడడం ద్వారా వినియోగదారులు విద్యుత్ను చోరీ చేస్తున్నారు. దీనికితోడు బ్యాక్ బిల్లింగ్ వంటి విధానాలతో విద్యుత్ చౌర్యం జరుగుతోంది. మిల్లులు, చిన్న తరహా పరిశ్రమలు, బ డా వ్యాపారులు విద్యుత్ చోరీకి పాల్పడుతున్నారు. సామాన్యులు తమ కరెంట్ బిల్లులను సక్రమంగా చెల్లిస్తున్నా, బిల్లులు అధికంగా రావడం వంటి పలు తప్పిదాలు జరుగుతున్నాయి.చౌర్యం నివారణకు చర్యలు విద్యుత్ చౌర్యాన్ని నిరోధించడానికి ఏపీ ఈపీడీసీఎల్ ఆధ్వర్యంలో కొన్ని విభాగాలు పనిచేస్తున్నాయి. విజిలెన్స్ , ఆపరేషన్ వంటి విభాగాలు ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహిస్తూ విద్యుత్ చౌర్యానికి పాల్పడే వారిపై కొరడా ఝళిపిస్తున్నాయి. దాడులు చేసి, దొరికిని వారిపై యాంటీ పవర్ థెఫ్ట్ కేసులు నమోదు చేస్తున్నాయి. -
ముగిసిన ట్రాన్స్కో ఏఈ, టీఎస్పిఎస్సీ రాతపరీక్ష
-
నేడు ట్రాన్స్కో ఏఈ రాతపరీక్ష
పోస్టులు 206.. అభ్యర్థులు 47,246 నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విద్యుత్ సరఫరా సంస్థ (ట్రాన్స్కో)లో అసిస్టెంట్ ఇంజనీర్(ఏఈ) పోస్టుల భర్తీకి ఆదివారం రాత పరీక్ష జరుగనుంది. ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు నిర్వహిస్తారు. మొత్తం 206 పోస్టుల కోసం 47,246 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. ఎలక్ట్రికల్ కేటగిరీలో 184 పోస్టులకు 39,092 మంది (ఒక్కో పోస్టుకు 213 మంది), సివిల్ కేటగిరీలో 22 పోస్టులకు 8,154 మంది (ఒక్కో పోస్టుకు 371 మంది) అభ్యర్థులు పరీక్ష రాయనున్నారు. హైదరాబాద్ జేఎన్టీయూ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ పరీక్ష కోసం... హైదరాబాద్, సికింద్రాబాద్లలో 53 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. నిమిషం ఆలస్యమైనా పరీక్షా కేంద్రంలో అనుమతించబోమని ట్రాన్స్కో మానవ వనరుల విభాగం డెరైక్టర్ నర్సింగ్రావు తెలిపారు. పూర్తి పారదర్శకంగా పరీక్షను నిర్వహిస్తున్నామని, ఎలాంటి వదంతులను నమ్మవద్దని అభ్యర్థులకు సూచించారు. పరీక్ష అనంతరం అభ్యర్థులు జవాబు పత్రం (ఓఎంఆర్ షీట్) కార్బన్ కాపీతో పాటు ప్రశ్నపత్రాన్ని తీసుకుని వెళ్లాలని చెప్పారు. -
పల్లెల్లో చీ‘కట్’లు
బిల్లులు చెల్లించలేదనే సాకుతో కరెంటు కోత వైఎస్ హయాంలో చిన్న పంచాయతీలకు మినహాయింపు బిల్లులు చెల్లించాల్సిందేనంటూ చంద్రబాబు సర్కారు హుకుం గ్రామాల్లో అంధకారంతో జనం అవస్థలు గుడ్లవల్లేరు : జిల్లాలో పచ్చని పల్లెలు అంధకారంలో మగ్గుతున్నాయి. పంచాయతీ, ట్రాన్స్కో అధికారుల సమన్వయ లోపం పల్లె ప్రజలకు శాపంగా మారింది. బకాయిలు చెల్లించలేదనే పేరుతో విద్యుత్ సరఫరా నిలిపివేయటంతో గ్రామీణులు చిమ్మచీకట్లో బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. పంట చేలలో పైరు ఎదిగే సమయం కావటంతో చేలల్లో నుంచి పాములు, విష పురుగులు ఇళ్లలోకి చొరబడతాయేమోనని జనం భయం గుప్పెట్లో కాలం గడుపుతున్నారు. 30 రోజులుగా పల్లెల్లో ఇదే పరిస్థితి నెలకొంది. జిల్లాలోని 970 గ్రామ పంచాయతీల్లో 820 మైనర్, 150 మేజర్ పంచాయతీలున్నాయి. పాత బకాయిలు చెల్లించలేదంటూ 690 చిన్న పంచాయతీలకు ట్రాన్స్కో సిబ్బంది విద్యుత్ సరఫరా నిలిపివేశారు. ప్రస్తుత సర్పంచులకు పూర్వం వాడిన బిల్లుల్ని కూడా ప్రభుత్వం అంటగడుతోంది. అసలే మైనర్ పంచాయతీలు.. ఆదాయం అంతంతమాత్రం.. అయినా పాత బకాయిలు సహా లక్షలాది బిల్లులు చెల్లించాలని ఆదేశిస్తుండటంతో ఈ బిల్లుల్ని ఎలా చెల్లించాలని సర్పంచులు, కార్యదర్శులు ఆందోళనకు గురవుతున్నారు. టాన్స్కో అధికారులు మాత్రం ససేమిరా అంటున్నారు. 13వ ఆర్థిక సంఘ నిధుల నుంచి నెలవారీ 10 శాతం చొప్పున బకాయిలు చెల్లించాలని చెబుతున్నారు. పాత పాలకవర్గాలు పెండింగ్లో ఉంచిన బిల్లుల్ని తాము ఎందుకు చెల్లిస్తామని సర్పంచులు ప్రశ్నిస్తున్నారు. వైఎస్సార్ హయాంలో... మైనర్ పంచాయతీలకు ఆదాయం తక్కువగా ఉండటంతో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో మంచినీటి సరఫరా, వీధిలైట్లకు వినియోగిస్తున్న విద్యుత్కు ఎలాంటి బిల్లులూ లేకుండా ఉచితంగా అందించేవారు. చంద్రబాబు ప్రభుత్వం బిల్లులు చెల్లించవలసిందేనని హుకుం జారీ చేయడంతో పల్లెలు చీకట్లో మగ్గాల్సి వస్తోంది. జిల్లాలో రూ.30 కోట్ల బకాయిలు జిల్లాలో పంచాయతీల నుంచి రూ.30 కోట్ల బకాయిలు రావలసి ఉందని ట్రాన్స్కో జిల్లా ఎస్ఈ విజయకుమార్ తెలిపారు. గత నెలాఖరున రూ.50 లక్షల వరకు కొన్ని పంచాయతీలు 13, 14వ ఆర్థిక సంఘాల నిధుల నుంచి కొంతమేరకు చెల్లించటంతో వాటికి విద్యుత్ సరఫరా చేస్తున్నామన్నారు. వెంటనే చర్యలు తీసుకుంటాం 13, 14వ ఆర్థిక సంఘ నిధుల్లో 20 శాతం చొప్పున కరెంట్ బిల్లుల చెల్లింపునకు వినియోగించాలని సూచించినట్లు డీపీవో డి.కృష్ణకుమారి చెప్పారు. ఇంకా చెల్లించని పంచాయతీలు ఉన్నట్టు తన దృష్టికి రాలేదన్నారు. చర్యలు తీసుకుంటామన్నారు. -
ఏసీబీకి చిక్కిన ట్రాన్స్కో ఏఈ
ములుగు: వరంగల్ జిల్లా ములుగు ట్రాన్స్కో ఏఈ శ్రీనివాస్ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. అబ్బాపూర్ గ్రామంలో ట్రాన్స్ఫారం ఏర్పాటుకు రైతులు డీడీ తీసి నాలుగు నెలలుగా ఏఈ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. అయితే, లంచం ఇస్తేనే పని అవుతుందని ఏఈ శ్రీనివాస్ చెప్పినట్టు తెలిసింది. దీంతో అబ్బాపూర్కు చెందిన రైతులు ఏసీబీ అధికారులకు సమాచారం అందించారు. సోమవారం ఓ రైతు ఏఈ శ్రీనివాస్కు ములుగులోని ఆయన కార్యాలయంలో రూ.15 వేలు లంచం ఇస్తుండగా ఏసీబీ అధికారులు ఏఈని అదుపులోకి తీసుకున్నారు. రూ.15 వేలను స్వాధీనం చేసుకుని విచారిస్తున్నారు. -
కొలిక్కి వస్తున్న విద్యుత్ రిలీవ్ ఉద్యోగుల వివాదం
సాక్షి, హైదరాబాద్: ఏపీ స్థానికత ఆధారంగా తెలంగాణ విద్యుత్ సంస్థలు రిలీవ్ చేసిన ఉద్యోగుల వివాదం కొలిక్కి వస్తోంది. వేతనాలు, వేతన బకాయిలు ఇస్తామన్న ఏపీ ట్రాన్స్కో సీఎండీ హామీపై తెలంగాణ సంస్థలు సానుకూలంగా స్పందించాయి. ఆ రాష్ట్ర ట్రాన్స్కో సీఎండీ ప్రభాకర్రావు ప్రభుత్వంతో చర్చలు జరిపి ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. ఈ పరిణామాలు తమకు అనుకూలంగా ఉన్నాయని రిలీవ్ ఉద్యోగులు తెలిపారు. ఈ నెల 19 వరకూ వేతన బకాయిలు చెల్లిస్తామని టీఎస్ ట్రాన్స్కో సీఎండీ భరోసా ఇచ్చారని, హైకోర్టు ఆదేశాలను అమలు చేస్తామని చెప్పినట్టు తెలిపారు. దీన్నిబట్టి త్వరలోనే తమను విధుల్లోకి తీసుకుంటారన్న ఆశాభావం వ్యక్తం చేశారు. స్థానికత ఆధారంగా 1,252 మంది ఉద్యోగులను జూన్లో తెలంగాణ విద్యుత్ సంస్థలు రిలీవ్ చేశాయి. దీనిపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. వారిని తిరిగి తీసుకోవాలని, వేతన, బకాయిలను రెండు రాష్ట్రాలూ దామాషా పద్ధతిలో చెల్లించాలని కోర్టు సూచించిన విషయం తెలిసిందే. -
విద్యుత్ ఏఈ నోటిఫికేషన్లు విడుదల
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ విద్యుదుత్పత్తి సంస్థ(జెన్కో), విద్యుత్ సరఫరా సంస్థ(ట్రాన్స్కో), ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ఎన్పీడీసీఎల్)లలో అసిస్టెంట్ ఇంజనీర్(ఏఈ) పోస్టుల భర్తీకి గురువారం వేర్వేరుగా నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. ట్రాన్స్కో, జెన్కోతో పాటు డిస్కంల నుంచి 1,427 ఏఈ పోస్టుల భర్తీకి నియామక ప్రకటనలు రావాల్సి ఉండగా.. గురవారం ట్రాన్స్కోలో 206, జెన్కోలో 856, ఎన్పీడీసీఎల్లో 164 ఏఈ పోస్టుల భర్తీకి ఆయా సంస్థల సీఎండీలు డి.ప్రభాకర్రావు, వెంకట నారాయణ నోటిఫికేషన్లు జారీ చేశారు. ఎలక్ట్రికల్, మెకానికల్, సివిల్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్ విభాగాల్లో ఇంజనీరింగ్ డిగ్రీ చేసిన అభ్యర్థులు ఆయా కేటగిరీల్లోని పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు అభ్యర్థుల వయో పరిమితిని పదేళ్ల వరకు సడలించారు. జెన్కో పోస్టులకు అభ్యర్థులు అక్టోబర్ 8 నుంచి 28 వరకు దరఖాస్తు చేసుకోవాలి. రాత పరీక్ష నవంబర్ 14న జరగనుంది. ట్రాన్స్కో ఏఈ పోస్టుల కోసం అక్టోబర్ 6 నుంచి 26వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. నవంబర్ 29న ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు రాత పరీక్ష నిర్వహించనున్నారు. మరోవైపు దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ(టీఎస్ఎస్పీడీసీఎల్)లో 201 ఏఈ(ఎలక్ట్రికల్) పోస్టుల భర్తీకి ఒకటి రెండు రోజుల్లో నియామక ప్రకటనలు విడుదల చేసే అవకాశం ఉంది. ఓపెన్ కేటగిరీ పోస్టులూ తెలంగాణ అభ్యర్థులకే.. ఓపెన్ కేటగిరీ పోస్టులను తెలంగాణ అభ్యర్థులతో భర్తీ చేయనున్నారు. లోకల్ కేటగిరీ పోస్టులకు సంబంధిత జోన్ పరిధిలోని జిల్లాల అభ్యర్థులే అర్హులు కాగా.. ఓపెన్ కేటగిరీ పోస్టులకు జోన్లతో సంబంధం లేకుండా రాష్ట్రంలో ఏ ప్రాంత అభ్యర్థులైనా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకోవాల్సిన వెబ్సైట్లు జెన్కో: www.genco.telangana.gov.in, http://tsgenco.cgg.gov.in ట్రాన్స్కో: ww.transco.telangana.gov.in, http://tstransco.cgg.gov.in ఎన్పీడీసీఎల్: www.tsnpdcl.in -
‘విద్యుత్’ భర్తీ వేర్వేరుగానే!
ఇంజనీర్ పోస్టుల భర్తీకి ట్రాన్స్కో, జెన్కో, డిస్కంల నుంచి ప్రత్యేక నోటిఫికేషన్లు హైదరాబాద్: రాష్ట్రంలోని ట్రాన్స్కో, జెన్కో, డిస్కంల పరిధిలోని విద్యుత్ ఇంజనీర్ల పోస్టులను.. ఎవరికి వారే భర్తీ చేసుకోవాలని నిర్ణయించాయి. రాష్ట్ర ఇంధన శాఖ పరిధిలో ఖాళీగా ఉన్న 2,681 ఇంజనీర్ పోస్టుల భర్తీకి గత నెల 27న ప్రభుత్వం అనుమతించింది. ఈ పోస్టుల భర్తీ చేపట్టడంపై రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) ఆసక్తి కనబరిచినా... విద్యుత్ సంస్థల యాజమాన్యాలు దానికి అంగీకరించలేదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం పాత విధానాన్నే అనుసరిస్తూ... ఈ పోస్టుల భర్తీని ఆయా విద్యుత్ సంస్థలకే కట్టబెట్టింది. విధివిధానాలపై తర్జనభర్జన: ‘విద్యుత్’ ఇంజనీర్ పోస్టుల భర్తీ విధివిధానాలపై స్పష్టత లేకపోవడంతో నోటిఫికేషన్ల జారీకి మరికొంత సమయం పట్టనుందని అధికారులు పేర్కొంటున్నారు. ప్రధానంగా జోనల్ విధానం కొనసాగింపుపై తర్జన భర్జన జరుగుతోంది. జోనల్ విధానం కొనసాగింపు వైపే విద్యుత్ సంస్థల యాజమాన్యాలు మొగ్గు చూపుతున్నాయి. ఇక ఆర్టికల్ 371డీ ఆధారంగా విద్యుత్ సంస్థల్లో లోకల్, నాన్లోకల్ రిజర్వేషన్లను అమలు చేస్తున్నారు. ఇప్పుడు దీనిని కొనసాగించడంపైనా సందిగ్ధత నెలకొంది. మరోవైపు 10 శాతం ఏఈ పోస్టులను ప్రస్తుతం సర్వీసులో ఉన్న సబ్ ఇంజనీర్లలో అర్హులైన వారికి పదోన్నతులు ఇవ్వాల్సి ఉంటుంది. కొత్త ఏఈల నియామకాలు, సబ్ ఇంజనీర్లకు ఏఈలుగా పదోన్నతులు ఒకేసారి ఇస్తే భవిష్యత్తులో సీనియారిటీ సమస్యలు ఉండవు. కానీ దీనిపైనా ఇంకా నిర్ణయం తీసుకోలేదని తెలిసింది. జెన్కో, ట్రాన్స్కో, డిస్కంల పనితీరుకు అనుగుణంగా వేర్వేరు సిలబస్ల ఆధారంగా నియామక పరీక్షలు నిర్వహించాలనే ప్రతిపాదన కూడా ఉంది. అయితే దీనిపై విద్యుత్ ఇంజనీర్ల సంఘాలు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నాయి. నిర్వహణ బయటి సంస్థలకు.. ఇంజనీర్ పోస్టుల భర్తీ విధివిధానం ఖరారు, నోటిఫికేషన్ల జారీ వరకే విద్యుత్ సంస్థలు పరిమితం కానున్నాయి. నియామక పరీక్షల నిర్వహణ బాధ్యతలను ఎప్పటిలాగే మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రాని(ఎంసీహెచ్ఆర్డీ)కి అప్పగించనున్నారు. పరీక్షా పత్రాలను జేఎన్టీయూహెచ్ తయారు చేయనుంది. ఎంపికైన అభ్యర్థుల జాబితాను ఎంసీహెచ్ఆర్డీ... విద్యుత్ సంస్థలకు అందజేస్తే, వారికి నియామక పత్రాలు జారీ చేస్తామని అధికారవర్గాలు తెలిపాయి. -
విద్యుత్ ఉద్యోగుల ఆందోళన
నల్లగొండ: నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో విద్యుత్ డీఈ కార్యాలయం ఎదుట ఉద్యోగులు బైఠాయించారు. ఉద్యోగుల బదిలీల విషయంలో జరిగిన అవకతవకలకు నిరసనగా దాదాపు 200 మంది విద్యుత్ ఉద్యోగులు ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఏడీఈ నరేశ్ కుమార్ రెడ్డి ఉద్యోగులతో దురుసుగా వ్యవహరిస్తున్నారని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైన ఉన్నతాధికారులు స్పందించి ఉద్యోగుల బదిలీలో జరిగిన అవకతవకలపై విచారణ చేపట్టాలని ఉద్యోగుల డిమాండ్ చేస్తున్నారు. -
ఏపీ ఉద్యోగులు ఏపీకే!
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ ఉద్యోగుల విభజన కసరత్తు ఊపందుకుంది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య విద్యుత్ ఉద్యోగుల తుది కేటాయింపుల్లో స్థానికతను ప్రామాణికంగా తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర ఇంధన శాఖ ఈ నెల 6న జారీ చేసిన మార్గదర్శకాలను అనుసరించి తెలంగాణ విద్యుత్ సంస్థలు కసరత్తును ప్రారంభించాయి. ట్రాన్స్కో, జెన్కోల సీఎండీ డి.ప్రభాకర్రావు నేతృత్వంలో మంగళవారం విద్యుత్సౌధలో ఉద్యోగుల కేటాయింపుల కమిటీ సమావేశమై చర్చింది. సమావేశంలో తెలంగాణ ట్రాన్స్కో, జెన్కో, డిస్కంల యాజమాన్యాలు, ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ‘ఆంధ్రప్రదేశ్ స్థానికత’ గల ఉద్యోగులను ఆ రాష్ట్రానికి పంపేందుకు చర్యలు ప్రారంభించాలని సమావేశంలో నిర్ణయించారు. తెలంగాణ ట్రాన్స్కో, జెన్కో, డిస్కంలలో పనిచేస్తున్న ఉద్యోగుల్లో ‘ఏపీ స్థానికత’ గల ఉద్యోగుల తుది జాబితాలను విద్యుత్ సంస్థలు సిద్ధం చేశాయి. ఈ జాబితాలను మంగళవారం రాత్రి నుంచి సంబంధిత సంస్థల వెబ్సైట్లలో ఉంచనున్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు.. తుది జాబితాల ప్రకారం తెలంగాణ ట్రాన్స్కోలో 262 మంది, టీ జెన్కోలో 600 మంది, తెలంగాణ దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ(ఎస్పీడీసీఎల్)లో 539 మంది ఏపీ స్థానికత గల ఉద్యోగులు పనిచేస్తున్నారు. తెలంగాణ స్థానికత కలిగి ఏపీలో పనిచేస్తున్న ఉద్యోగులను సైతం తెలంగాణకు కేటాయించాలని ఏపీ ప్రభుత్వానికి లేఖ రాసినట్లు సమాచారం. ఉద్యోగుల తుది కేటాయింపులపై చర్చించి నిర్ణయం తీసుకుందాని ఏపీ విద్యుత్ శాఖ అధికారులను పలుమార్లు సమావేశానికి పిలిపించినా స్పందన రాలేదని తెలంగాణ విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు. కనీసం తెలంగాణ స్థానికత కలిగి ఏపీలో పనిచేస్తున్న ఉద్యోగులను తెలంగాణకు పంపాలని లేఖ రాసినా ఏపీ ప్రభుత్వం ఒప్పుకోలేదని ఓ ఉన్నతాధికారి ‘సాక్షి’కి తెలిపారు. -
గుంటూరు జిల్లాలో అంధకారంలో 20 గ్రామాలు
మాచర్ల(గుంటూరు): ట్రాన్స్కో అధికారుల కారణంగా దాదాపు 20 గ్రామాల్లో బుధవారం సాయంత్రం నుంచి విద్యుత్ సరఫరా బంద్ అయింది. ఇటీవలి ఈదురుగాలులకు దుర్గి మండలంలో చెట్లు కూలి, స్తంభాలు విరిగిపడటంతో విద్యుత్ వ్యవస్థ ఛిన్నాభిన్నమైంది. విద్యుత్ అధికారులు రోజంతా కష్టపడి వాటన్నిటినీ సరిచేసి, ట్రాన్స్కోకు క్లియరెన్స్ ఇచ్చారు. అయితే, ట్రాన్స్కో యంత్రాంగం స్పందించకపోవటంతో మండలంలోని నాలుగు సబ్స్టేషన్ల పరిధిలోని దాదాపు 20 గ్రామాల్లో బుధవారం సాయంత్రం నుంచి కరెంట్ లేదు. దీంతో వారు ఇబ్బందులు పడుతున్నారు. -
విద్యుత్ శాఖలో 1,919 పోస్టులు
అదనంగా ఏఈ, ఎస్ఈ పోస్టులు జెన్కో ఫైలుకు సర్కారు ఆమోదం హైదరాబాద్: రాష్ట్ర విద్యుత్ విభాగంలో కొత్తగా 1,919 ఇంజనీర్ పోస్టులకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. తెలంగాణ జెన్కో, ట్రాన్స్కో, ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్ విభాగాల్లో 1,492 అసిస్టెంట్ ఇంజనీర్, 427 సబ్ ఇంజనీర్ పోస్టులను మంజూరు చేసింది. ఈ మేరకు సోమవారం ఆర్థికశాఖ కార్యదర్శి ఎన్.శివశంకర్ ఉత్తర్వులు జారీ చేశారు. విద్యుత్ కొరతను అధిగమించేందుకు ప్రభుత్వం జెన్కో ఆధ్వర్యంలో అదనంగా 6,280 మెగావాట్ల విద్యుదుత్పత్తి చేపట్టే కార్యాచరణకు నడుం బిగించింది. ఇందుకు అవసరమయ్యే ఇంజనీర్లు, సిబ్బంది కోసం ఖాళీగా ఉన్న 456 అసిస్టెంట్ ఇంజనీర్, 306 సబ్ ఇంజనీర్ పోస్టులను భర్తీ చేయాలని, కొత్తగా 1,919 పోస్టులు మంజూరు చేయాలని జెన్కో సీఎండీ ప్రభాకరరావు సర్కారుకు ప్రతిపాదనలు పంపారు. వాటిని పరిశీలించిన ప్రభుత్వం కొత్త పోస్టులను మంజూరు చేసింది. ఈ పోస్టులను దశలవారీగా భర్తీ చేయాలని, భర్తీ చేసే ముందు ఆర్థిక శాఖ అనుమతి తీసుకోవాలని సూచించింది. విభాగాల వారీగా కొత్త పోస్టులు, పేస్కేళ్ల వివరాలను ఈ ఉత్తర్వుల్లో పొందుపరిచింది. అసిస్టెంట్ ఇంజనీర్లకు రూ.41,155-రూ.63,600, సబ్ ఇంజనీర్లకు రూ.20,535- రూ.41,155 స్కేల్ ఆఫ్ పేగా ప్రకటించింది. ప్రభుత్వ ఆమోదం లభించిన పోస్టులు.. విభాగం ఏఈలు ఎస్ఈలు టీఎస్ జెన్కో 788 16 టీఎస్ ట్రాన్స్కో 62 42 టీఎస్ ఎస్పీడీసీఎల్ 376 139 టీఎస్ ఎన్పీడీసీఎల్ 266 230 మొత్తం 1492 427 -
ట్రాన్స్కో..కాస్కో
ఖమ్మం/ సత్తుపల్లి: జిల్లాలోని ఎన్పీడీసీఎల్లో పనిచేస్తున్న అవినీతి అధికారులకు ఏసీబీ దడ పట్టుకుంది. ఎప్పుడు ఏసీబీ దాడులు జరుగుతాయో..ఎవరు ట్రాప్ అవుతారోనని బిక్కుబిక్కుమంటున్నారు. వేలాది రూపాయల వేతనాలు వస్తున్నా అవినీతి సొమ్ముకు ఎన్పీడీసీఎల్ అధికారులు ఆశపడుతుండటంపై విమర్శలు సైతం వస్తున్నాయి.జిల్లాతో పాటు ఎన్పీడీసీఎల్ విస్తరించి ఉన్న అన్ని జిల్లాల్లో రోజు ఏదో ఒకచోట అవినీతి అధికారులు పట్టుపడుతుండటం గమనార్హం. అవినీతికి పాల్పడితే చర్యలు తీసుకుంటామని ఇటీవల ఆశాఖ ఉన్నతాధికారి ముందస్తు హెచ్చరికలు జారీ చేసినా.. విద్యుత్ వినియోగదారుల వద్దనే కాకుండా సొంతశాఖ సిబ్బంది నుంచి కూడా డబ్బులు వసూలు చేస్తూ ఏసీబీకి పట్టుబడుతుండటం గమనార్హం. వరుస దాడులు గడిచిన రెండు నెలల్లో ఎన్పీడీసీఎల్ పరిధిలోని నిజామాబాద్, కరీంనగర్, నల్లగొండ జిల్లాలతో పాటు ఖమ్మం జిల్లాలో ఇటీవలి కాలంలో తల్లాడ, సత్తుపల్లి ప్రాంతాల్లో అధికారులు ఏసీబీకి చిక్కారు. గతంలో కూడా ఇదే సత్తుపల్లి సబ్డివిజన్ పరిధిలోని బోనకల్లు, వేంసూరు, పెనుబల్లి ప్రాంతాల్లో పనిచేస్తున్న పలువురు అధికారులు ఏసీబీ పట్టుబడ్డారు. విద్యుత్శాఖలో మరికొన్ని అవినీతి చేపలున్నాయని వారిని కూడా పట్టుకొని తీరుతామని ఏసీబీ హెచ్చరిస్తుండటంతో అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. సత్తుపల్లి డివిజన్లో మరీ అధికం.. విద్యుత్శాఖ అధికారులు ప్రతి పనికి అనధికారికంగా ఒక రేటు ఫిక్స్చేసి డబ్బులు దండుకుంటున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. వ్యవసాయానికి త్రీఫేస్ కరెంట్ నుంచి సామాన్యుల ఇంటి కనెక్షన్ వరకు ఒక్కో రేటు నిర్ణయించి వసూళ్లు చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. రెండేళ్ల కాలంలో సత్తుపల్లి డివిజన్లోని నలుగురు విద్యుత్శాఖ ఉద్యోగులే ఏసీబీకి పట్టుబడ్డారు. బోనకల్, పెనుబల్లి, తల్లాడ, ఏఈలు మునీర్పాషా, ప్రవీణ్కుమార్, రాంరెడ్డిలు ఏసీబీ వలలో చిక్కారు. ఈ నెల మొదటివారంలో తల్లాడ ఏఈ శీలం రాంరెడ్డిని ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. చివరికి సొంత శాఖ ఉద్యోగులను కూడా వదలకపోవడంతో సత్తుపల్లి లైన్మన్ పూర్ణచంద్రరావు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. డీఈఈ సుదర్శనాన్ని పట్టించటం సంచలనం సృష్టించింది. గతేడాది రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్ల చెల్లింపుల్లో జరిగిన అవకతవకలపై డీఈఈ కార్యాలయంలో ముగ్గురు సిబ్బందిపై వేటుపడింది. ఏసీబీకి పట్టుబడినా ఆరు నెలలకే మళ్లీ విధుల్లోకి చేరుతుండటంతో సస్పెన్షన్లు అంతగా పట్టించుకోవాల్సిన పనిలేదని ఆశాఖ ఉద్యోగులే వ్యాఖ్యానిస్తుండటం గమనార్హం. హెచ్చరించినా అదే తీరు.. ఎన్పీడీసీఎల్ పరిధిలోని పలువురు అధికారులు, ఉద్యోగులు అక్రమాలకు పాల్పడుతున్నారనే ఫిర్యాదుల మేరకు ఆశాఖ సీఎండీ వెంకటనారాయణ ఇటీవల జరిగిన సమావేశంలో పలుమార్లు హెచ్చరికలు జారీ చేసినట్లు తెలిసింది. ఇటీవల వరంగల్ సమావేశంలో జిల్లాకు చెందిన పలువురు రైతులు, వినియోగదారులు అధికారులు తమ వద్దనుండి లంచం అడుగుతున్నారని, డబ్బులు ఇవ్వనిదే పనిచేయడంలేదని ఫిర్యాదు చేశారు. దీనిపై సీఎండీ జిల్లా ఉన్నతాధికారులను తీవ్రస్థాయిలో హెచ్చరించినట్లు తెలిసింది. జిల్లాలో గత నెలలో జరిగిన సమావేశంలోనూ సీఎండీ అవినీతిపై మాట్లాడారు. అక్రమాలకు పాల్పడితే సహించేది లేదని హెచ్చరించారు. ఇంత జరిగినా అధికారుల తీరు మారకపోవడం, అక్రమాలకు పాల్పడుతూ ఏసీబీకి చిక్కడం గమనార్హం. ఇటీవల కరీంనగర్లో జరిగిన సమావేశంలోనూ ‘తెలంగాణ పునర్నిర్మాణంలో మీ భాగస్వామ్యం కీలకం, మీకు కావాల్సినంత వేతనాలు ఇస్తున్నాం. అక్రమాలకు పాల్పడకండి..’ అంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని శాఖల అధికారులకు సూచించారు. లంచం అడిగితే ఫోన్ చేయండి..అంటూ టోల్ ఫ్రీ నంబర్ ప్రకటించడంతో అవినీతి అధికారులకు చెక్ పడుతోంది. -
ట్రాన్సకో అధికారుల నిర్లక్ష్యం
విద్యుత్షాక్తో బాలుడి మృతి మక్తల్ : ట్రాన్స్కో అధికారుల నిర్లక్ష్యంతో ఓ బాలుడు మృత్యువాత పడ్డాడు. ఈ సంఘటన శుక్రవారం మక్తల్ పట్టణంలో చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. పట్టణంలోని యాదవనగర్లోని కుర్వ కుమరయ్య, శంకరమ్మల కుమారుడు గ ణేష్(13) శుక్రవారం సాయంత్రం ఆడుకుంటూ ఇంటిపైకి వెళ్లాడు. ఇంటిని ఆనుకొని వెళ్లిన ఎల్టీలైన్ తీగలు తగిలి అక్క డే మృతిచెందాడు. పెద్ద శబ్ధం రావడం తో తేరుకున్న స్థానికులు అధికారులతో మాట్లాడి పక్కనే ఉన్న ట్రాన్స్ఫార్మర్ను బంద్ చేశారు. అయితే ఇంటికి తగిలేవి ధంగా ఉన్న ఎల్టీలైన్ను తొలగించాల ని, ఇళ్ల మధ్యనున్న ట్రాన్స్ఫార్మర్ను వేరే ప్రాంతానికి తరలించాలని విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదు. బాలుడి మృతికి ట్రాన్స్ కో అధికారులే బాధ్యత వహించాలని కాలనీవాసులు డిమాండ్ చేశారు. గతం లో కూడా ఇదే మిద్దెపై సంఘటన జరిగి న వ్యక్తి మృతిచెందాడు. అప్పట్లోనే తీగ లు తొలగించి ఉంటే మరో ప్రాణం బలయ్యేది కాదని బాలుడి తల్లిదండ్రులు వాపోయారు. విషయం తెలుసుకున్న హెడ్కానిస్టేబుల్ బాలయ్య ఘటనాస్థలానికి వచ్చి వివరాలు సేకరించారు. మృతి చెందిన బాలుడు పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువుతున్నాడు. పరిహారం కోసం రాస్తారోకో బాధిత కుటుంబాన్ని ట్రాన్సకోశాఖ ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్ష నా యకుల ఆధ్వర్యంలో ప్రధాన రహదారి పై రాస్తారోకో నిర్వహించారు. అధికారు ల నిర్లక్ష్యం వల్లే గణేష్ మృతి చెందాడని, ఈ సంఘటనపై బాధ్యత వహిస్తూ ఎక్స్గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చే శారు. స్పందించిన ఏడీ శ్రీనివాస్, ఏఈ రాజ్ప్రకాష్లు సంఘటన స్థలానికి చేరుకొని తక్షణసాయంగా రూ.50వేల నగ దు అందించారు. అలాగే ప్రభుత్వం నుం చి వచ్చే ఆర్థిక సహాయాన్ని త్వరగా ఇ ప్పించేందుకు కృషి చేస్తామన్నారు. మక్త ల్ జెడ్పీటీసీ శ్రీహరి, మాజీ ఎంపీటీసీ కోళ్ల వెంకటేష్, లక్ష్మణ్, శివశంకర్, నర్సిములు, కల్లూరినాగప్ప, వివిధ పార్టీల నాయకులు బాధితులకు అండగా నిలిచారు. -
ఏసీబీకి చిక్కిన ‘పెద్దచేప’
ఏసీబీ వలలో ఓ అవినీతి పెద్ద చేప చిక్కింది.. ఓ రైతు నుంచి ట్రాన్స్ఫార్మర్ మంజూరు కోసం ట్రాన్స్కో ఏడీ పెద్దమొత్తంలో డబ్బును లంచంగా డిమాండ్ చేశాడు.. మొదటి విడతలో కొంత చెల్లించుకున్న బాధితుడు రెండోసారీ ఇచ్చే ముందు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేయడంతో ఎట్టకేలకు పట్టుకున్నారు.. వివరాలిలా ఉన్నాయి. - పెద్దమందడి / కొత్తకోట పెద్దమందడి మండలం దొడగుంటపల్లికి చెందిన ఆవుల శ్రీశైలం వృత్తిరీత్యా రైతు. కొన్నేళ్లుగా లోఓల్టేజీ విద్యుత్ సరఫరాతో పంటలను రక్షించుకునేందుకు ఇబ్బందులు పడుతున్నాడు. తనకున్న మూడు వ్యవసాయ బోర్లకు సంబంధించి ట్రాన్స్ఫార్మర్ మంజూరు కోసం 2012లో *5400 డీడీ చెల్లించినా ఏడీఈ కామేశ్వర్రావు నిర్లక్ష్యం చేశారు. దీంతో ఏడాది క్రితం వనపర్తి డీఈ కార్యాలయం ఎదుట శ్రీశైలం ఒంటిపై పెట్రోలు పోసుకుని ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టగా అక్కడ ఉన్న సిబ్బంది, అధికారులు అడ్డుకున్నారు. అయినా ట్రాన్స్ఫార్మర్ మంజూరు కావడంలో తీవ్ర జాప్యం జరిగింది. ఇంతలోనే అప్పుడు తీసిన డీడీ తాలూకు రసీదు పొగొట్టుకుపోయింది. దీంతో కొన్నాళ్ల క్రితం ట్రాన్స్ఫార్మర్ కోసం రైతు శ్రీశైలం కొత్తకోటలో ఏడీ కామేశ్వర్రావును కలిశాడు. అయితే *30వేలు లంచం డిమాండ్ చేశాడు. ఇటీవల *పదివేలను రైతు శ్రీశైలం నుంచి ఏడీ తీసుకున్నాడు. మిగతా డబ్బుల కోసం ఒత్తిడితేగా మంగళవారం మహబూబ్నగర్ వెళ్లి కలిశాడు. చివరికి *ఆరు వేలు ఇచ్చేందుకు ఒప్పుకొని విసిగివేసారిన బాధితుడు మహబూబ్నగర్లో ఏసీబీ డీఎస్పీ రాందాస్తేజకు ఫిర్యాదు చేశాడు. చివరకు బుధవారం *మూడువేలు కొత్తకోటలోని విద్యుత్తు కార్యాలయంలో ఏడీ తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. గురువారం హైదరాబాద్లోని ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరుపర్చనున్నారు. ఈ దాడిలో సీఐ గోవింద్రెడ్డి, మరో ఇద్దరు సిబ్బంది పాల్గొన్నారు. -
ఏఈ, సబ్ ఇంజనీర్ ఉద్యోగాలకు ప్రిపరేషన్ వ్యూహాలు
తెలంగాణ రాష్ట్రంలో జెన్కో, ట్రాన్స్కో, డిస్కమ్లలో అసిస్టెంట్ ఇంజనీర్ (ఏఈ), సబ్ ఇంజనీర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ను విడుదల చేయనున్నారు. దీని ద్వారా 1948 ఏఈ ఉద్యోగాలు, 733 సబ్ ఇంజనీర్ ఉద్యోగాలను భర్తీ చేసే అవకాశముంది. ఉద్యోగ ప్రకటనల కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఇంజనీరింగ్ అభ్యర్థులకు ఇది శుభవార్త. ఇప్పటి నుంచి సరైన ప్రణాళికతో సిద్ధమైతే ఉద్యోగ సాధన తేలికే! ఎలక్ట్రికల్, కమ్యూనికేషన్, ఇన్స్ట్రుమెంటేషన్, మెకానికల్ బ్రాంచ్ల్లో బీటెక్ పూర్తిచేసిన వారు ఏఈ ఉద్యోగాలకు అర్హులు. ఎలక్ట్రికల్ బ్రాంచ్ వారికి 70 శాతం ఉద్యోగాలు, మిగిలిన బ్రాంచ్ల కూడా వారికి 30 శాతం ఉద్యోగాలు అందుబాటులో ఉండొచ్చు. ఇంజనీరింగ్ డిప్లొమా అభ్యర్ధులు సబ్ ఇంజనీర్ ఉద్యోగాలకు అర్హులు. రాత పరీక్ష: 100 మార్కులకు రాత పరీక్ష ఉంటుంది. రెండు గంటల వ్యవధిలో సమాధానాలు గుర్తించాలి. ఆబ్జెక్టివ్ మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలుంటాయి. నెగిటివ్ మార్కులు ఉండవు. కాన్సెప్టులు, విశ్లేషణ ఆధారిత ప్రశ్నలు: ఇంజనీరింగ్ సిలబస్లోని కాన్సెప్టులపై పూర్తిస్థాయిలో పట్టు సాధిస్తేనే ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు గుర్తించవచ్చు. ఉదా: Ferranti effect in power system is due to? 1) Inductance 2) Capacitance 3) both Induction and Capacitance 4) Resistance, Inductance and Capacitance Ans: 3 అప్లికేషన్ ఆధారిత ప్రశ్నలు: ఇంజనీరింగ్ కాన్సెప్టులను.. ఎక్కడ, ఎందుకు అనువర్తిస్తారు (అఞఞడ) అనే విషయాలపై అవగాహన ఏర్పరుచుకుంటే ఈ తరహా ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వొచ్చు. ఉదా: Which of the following motor is used in Com-puter printers? 1) DC series motor 2) Universal motor 3) Stepper motor 4) Compound motor Ans: 3 Trouble shooting, error corrections ప్రశ్నలు.. అప్లికేషన్స్లో.. ఏ ట్రబుల్స్ వస్తాయి? వాటిని ఎలా రికవరీ చేయాలి? లోపాలను ఎలా సరిచేయాలి? తదితర అంశాలపై ప్రశ్నలుంటాయి. ఉదా: If DC Shunt generator is failure to build up voltage then the reason is..... 1) Presence of Residual Magnetism 2) Reversily the field terminals 3) Speed is less than critical speed 4) either 2 or 3 Ans: 4 ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో: ఎలక్ట్రికల్ సర్క్యూట్లు, ఎలక్ట్రికల్ మెషీన్లు, పవర్ సిస్టమ్స్, అనలాగ్ సర్క్యూట్లు, కంట్రోల్ సిస్టమ్ వంటి అంశాలు ముఖ్యమైనవి. వీటిపై ఎక్కువ ప్రశ్నలు వచ్చేందుకు అవకాశముంది. జనరల్ ఆప్టిట్యూడ్పైనా ప్రశ్నలుంటాయి కాబట్టి న్యూ మరికల్ ఎబిలిటీ,రీజనింగ్ అంశాలపై పట్టు సాధించాలి. ప్రతి సబ్జెక్టుకు సంబంధించి ప్రిపరేషన్కు ప్రామాణిక పాఠ్యపుస్తకాలు, ఆబ్జెక్టివ్ స్టడీ మెటీరియల్, పాత ప్రశ్నపత్రాలను ఉపయోగించుకోవాలి. సిలబస్ ఆధారంగా రోజువారీ ప్రణాళికను సిద్ధం చేసుకొని, దానికి అనుగుణంగా అధ్యయనం చేయాలి. సబ్జెక్టుపై ఎంత పట్టు సాధించినా ఆబ్జెక్టివ్ ప్రశ్నల సాధనను ప్రాక్టీస్ చేయకపోతే ఫలితం ఉండదు. ఒక సబ్జెక్టును చదివిన తర్వాత, దానికి సంబంధించిన సూత్రాలను విడిగా రాసుకోవాలి. ఒక్కో సబ్జెక్టులో కనీసం 500 ఆబ్జెక్టివ్ ప్రశ్నలను ప్రాక్టీస్ చేయాలి. ఎలక్ట్రికల్ పవర్ సిస్టమ్స్ నుంచి 25 శాతం, ఎలక్ట్రికల్ మెషీన్స్ నుంచి 25 శాతం, బేసిక్ ఎలక్ట్రికల్ సర్క్యూట్ల నుంచి 15 శాతం, మిగిలిన సిలబస్ నుంచి 35 శాతం మార్కులు రావొచ్చు.గత ఐఈఎస్, గేట్ ప్రశ్నపత్రాల్లోని ప్రశ్నలను అధ్యయనం చేయాలి. నాలుగైదు సబ్జెక్టులను చదివితే సరిపోతుందని అనుకోకుండా అన్ని సబ్జెక్టులపైనా అవగాహన పెంపొందించుకోవాలి. రిఫరెన్స్: Network Theory: Van valkenburg, Hyte Kimberly. Power Systems: Stevenson, C.L.Wadhwa. Electrical Machine: P.S.Bimbra, Nagrath and Kotari. Control Systems: I.J.Nagrath, Gopal Power Electronics: Rashid Electrical measurements: A.K.Sawhney. -జి.రమణ, డెరైక్టర్, సాయిమేధ, హైదరాబాద్. -
సబ్సిడీపైనా మౌనమే
కేబినెట్ భేటీలో విద్యుత్తు చార్జీల పైనా వ్యూహాత్మక ధోరణే సాక్షి, హైదరాబాద్: విద్యుత్ చార్జీల పెంపుపై ప్రభుత్వం తర్జనభర్జనలు పడుతోంది. పంపిణీ సంస్థల ప్రతిపాదనపై ఎలాంటి స్పష్టమైన వైఖరినీ వెల్లడించలేదు. ఆర్థిక లోటును పూడ్చుకునేందుకు ఎలాంటి దిశా నిర్దేశం చేయలేదు. పైగా చార్జీల పెంపు అనివార్యమన్న డిస్కమ్లనే ప్రజల ముందు విలన్గా చూపించే ప్రయత్నం చేసింది. డిస్కమ్లకు ప్రభుత్వంతో సంబంధం లేదన్నట్టుగా.. పేదలపై అవి విద్యుత్ భారం మోపుతుంటే మంత్రులు వ్యతిరేకించినట్టుగా వ్యూహాత్మకంగా వ్యహరించింది. ఏతావాతా చార్జీల మోత తప్పదని తెలుస్తుండటంతో, తద్వారా వె ల్లువెత్తే ప్రజా వ్యతిరేకత నుంచి తప్పించుకోవడంపై దృష్టి పెడుతోంది. ఈ నేపథ్యంలో డిస్కమ్లు రూ.7,716 కోట్ల లోటును పూడ్చుకునేలా ప్రతిపాదనలు ఈఆర్సీకి సమర్పించేందుకు సిద్ధమవుతున్నాయి. సోమవారం జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో విద్యుత్ చార్జీల పెంపు ప్రతిపాదనలపై కీలక చర్చ జరిగింది. ఇంధన శాఖ కార్యదర్శి అజయ్ జైన్, ట్రాన్స్కో సీఎండీ విజయానంద్ పరిస్థితిని ప్రభుత్వానికి వివరించారు.విశ్వసనీయ సమాచారం మేరకు డిస్కమ్ల ప్రతిపాదనలపై పలువురు మంత్రులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజా వ్యతిరేకత రాకుండా ఏం చేయాలనే దానిపై చర్చించారు. ఈ నేపథ్యంలో ఇప్పటికిప్పుడు నిర్ణయం తీసుకునే బదులు ప్రస్తుతానికి వేచి చూడటమే సరైన విధానమని మంత్రివర్గం భావించినట్టు తెలుస్తోంది. -
రామగుండం బల్దియాకు పవర్కట్
రూ.2.20 కోట్ల విద్యుత్ బకాయిలు కోల్సిటీ: విద్యుత్ బిల్లులు చెల్లించలేదని రామగుండం నగరపాలక సంస్థ కార్యాలయానికి ట్రాన్స్కో విభాగం అధికారులు శనివారం సాయంత్రం విద్యుత్ సరఫరా నిలిపివేశారు. దీంతో ఇన్చార్జి కమిషనర్ సీఆర్.బాబు, ఇతర అధికారులు సెల్ఫోన్ వెలుతురులో విధులు నిర్వహించారు. రూ.2.20 కోట్ల విద్యుత్ వినియోగ బకాయిలు చెల్లించకపోడంతోనే ట్రాన్స్కో ఎస్ఈ ఆదేశాల మేరకు కరెంట్ కట్ చేసినట్టు ఏఈ వెంకటేశ్వర్లు తెలిపారు. బకాయిలు చెల్లించాలని గతంలోనే అనేకసార్లు నోటీసులు జారీ చేసినా కార్పొరేషన్ అధికారులు స్పందించలేదని ఆయన వెల్లడించారు. సుమారు రూ.2.20 కోట్ల బకాయిల్లో హెచ్టీ బిల్లులు రూ.1.80 కోట్లు ఉండగా, మిగితా బిల్లులు ఎల్టీ కనెక్షన్లవి ఉన్నాయ ని ఏఈ వివరించారు. ఎల్టీ బిల్లులు రెగ్యులర్గా చెల్లింపులు జరుపుతున్నప్పటికీ హెచ్టీ బకాయిలు చెల్లించడం లేదని, ప్రతీ నెలా నోటీసులు జారీ చేస్తున్నా స్పందించడం లేదని అన్నారు. గతేడాది కూడా విద్యుత్ బకాయిలు చెల్లించలేదని ట్రాన్స్కో అధికారులు రెండుసార్లు కార్పొరేషన్ కార్యాలయాని కి కరెంటు సరఫరాను నిలిపివేశారు. వెంటనే విద్యుత్ను పునరుద్ధరించడానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్లు మేయర్ కొంకటి లక్ష్మీనారాయణ తెలిపారు. ఎల్టీ బిల్లులు రూ.16 లక్షల వరకు చెల్లించడానికి డబ్బులు సిద్ధంగా ఉన్నప్పటికీ, ఆడిట్ ఎగ్జామినర్ అందుబాటులో లేకపోడంతో సమస్య వచ్చిందని ఇన్చార్జి కమిషనర్ తెలిపారు. -
కరెంట్ కట్
రామగుండం (కరీంనగర్): విద్యుత్ బిల్లులు చెల్లించలేదని కరీంనగర్ జిల్లా రామగుండం మున్సిపల్ కార్యాలయానికి టాన్స్కో అధికారులు శనివారం విద్యుత్ను నిలిపివేశారు. బకాయిలు పడ్డ రూ.33 లక్షల బిల్లులు వెంటనే చెల్లించాలని మున్సిపల్ అధికారులకు తెలియజేశారు. బకాయిలు చెల్లించే వరకు విద్యుత్ సరఫరా చేయలేమని స్పష్టం చేశారు. కరెంటు లేకపోవడంతో మున్సిపల్ అధికారులు చాలా ఇబ్బందిని ఎదుర్కొన్నారు. కరెంటు బిల్లులు చెల్లించని ప్రతీ కార్యాలయానికి కరెంటు సరఫరా నిలిపేస్తామని ట్రాన్స్కో అధికారులు ముందస్తుగా హెచ్చరికలు జారీ చేశారు. -
హిందూజాకు తలొగ్గిన సర్కారు!
ట్రాన్స్కో అభ్యంతరాలు బుట్టదాఖలు ప్రజలపై విద్యుత్ భారం ఖాయం సాక్షి, హైదరాబాద్: పవర్ రేసులో పరుగెత్తడమే లక్ష్యంగా ప్రభుత్వం హిందూజా సంస్థ గొంతెమ్మ కోర్కెలకు సర్కారు తలూపినట్లు తెలుస్తోంది. ప్రభుత్వమే హుకుం జారీ చేయడంతో ఏపీ ట్రాన్స్కో ఈ నెల 30వ తేదీకల్లా ఆ సంస్థతో విద్యుత్ కొనుగోలు ఒప్పందానికి సిద్ధమైంది. దీనివల్ల రాష్ట్ర ప్రజలపై మోయలేని విద్యుత్ భారం తప్పనిసరి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. హిందూజా డిమాండ్లను ఏపీ ట్రాన్స్కో మొదటినుంచి వ్యతిరేకిస్తోంది. దీంతో యాజమాన్యం నేరుగా ప్రభుత్వం పెద్దలను ఆశ్రయించి వారిని సంతృప్తి పరచడంతో హిందూజా కోరినట్టు పీపీఏలు చేసుకోవాలని ట్రాన్స్కోపై ఒత్తిడి తెచ్చినట్టు తెలిసింది.1040 మెగావాట్ల హిందూజా తాజాగా ఒక యూనిట్ను ప్రారంభించేందుకు రంగం సిద్ధం చేసింది. పాత పీపీఏలను పక్కనబెట్టి, కొత్త డిమాండ్లను తెరమీదకు తెచ్చింది. స్థిర వ్యయం రూ. 1.75 వరకూ ఇవ్వాలని ప్రతిపాదించింది. 75 శాతం విద్యుత్ను బయట అమ్ముకోవడానికి అనుమతి కోరింది.దీనికి అధికారులు ససేమిరా అనడంతో 100 శాతం విద్యుత్ రాష్ట్రానికే ఇవ్వడానికి ఒప్పుకుంది. సంస్థ కోరిన యూనిట్ కాస్ట్ ఇవ్వాలనే డిమాండ్ పెట్టింది. దీనివల్ల రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలు భారీగా పెరుగుతాయని ట్రాన్స్కో అడ్డుపడింది. దీంతె ప్రభుత్వాన్ని ఆశ్రయించి ట్రాన్స్కోపై ఒత్తిడి తెచ్చినట్టు తెలిసింది. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం యూనిట్ రూ. 1.50లకు విద్యుత్ కొనుగోలుకు స్థిర ఛార్జీ నిర్ణయించే వీలుంది. స్థిర, చర వ్యయాన్ని లెక్కిస్తే యూనిట్ రూ. 15 రూపాయలకు వెళ్ళినా ఆశ్చర్యం లేదని విద్యుత్ అధికారులు అభ్యంతరం చెబుతున్నారు. దీనిపై న్యాయ నిపుణుల సలహా తీసుకుంటున్నామని ట్రాన్స్కో సీఎండీ విజయానంద్ తెలిపారు. -
టాన్స్కో జులుం..
విద్యుత్ బోరుమోటర్ సర్చార్జీ కట్టలేదని మండలంలోని పెద్దలింగారెడ్డిపల్లిలో మంగళ, బుధవారాల్లో పొలాల వద్ద ఉన్న సుమారు 40 మంది రైతుల స్టార్టర్లను ట్రాన్స్కో సిబ్బంది ఎత్తుకెళ్లారు. మక్కలు, వరి ధాన్యాన్ని మార్కెట్లో విక్రయించామని, ఆ డబ్బు రాగానే బకాయిగా ఉన్న సర్చార్జీ చెల్లిస్తామని, రెండు రోజులు గడువు ఇవ్వాలని రైతులు కోరినా కరెంటోళ్లు కనికరం చూపలేదు. దీంతో ఆగ్రహించిన పెద్దలింగారెడ్డిపల్లి గ్రామానికి చెందిన రైతులు పలువురు రాఘవాపూర్ బస్స్టేజీ వద్ద రాస్తారోకోకు దిగారు. వీరికి బీజేపీ, ఇతర రాజకీయ పార్టీల నాయకులు సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా రైతులు పలువురు మాట్లాడుతూ, బోరుమోటార్లపైనే ఆధారపడి సాగుచేసుకుంటున్న తమపై కక్ష కట్టడం దారుణంగా ఉందన్నారు. ముఖ్యమంత్రి సారు రైతుకు ఏ ఇబ్బందీ రానివ్వనని చెప్తుంటే, కరెంటోళ్లు మాత్రం కనికరం లేకుండా కనెక్షన్లు కట్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ధాన్యం అమ్మిన 72 గంటల్లో డబ్బులు ఖాతాలో జమ చేస్తామని చెప్పిన అధికారులు, 15 రోజులైనా ఆ పని చేయడం లేదని, మేము మాత్రం సమయానికి కరెంటు బిల్లు కట్టలేదని స్టార్టర్లు తీసుకెళ్లడం ఎంత వరకు న్యాయమన్నారు. వారికో న్యాయం, మాకో న్యాయమా అని ప్రశ్నించారు. ధాన్యం అమ్మినా డబ్బు చేతికందలేదని, రెండు రోజులు గడువు ఇస్తే బకాయి చెల్లిస్తామని చెప్పినా వినకుండా స్టార్టర్లను ఎత్తుకెళ్లారని కన్నీటి పర్యంతమయ్యారు. ఈ పరిస్థితుల్లో బోరుబావుల కింద సాగు చేసిన పంటలు ఎండిపోతాయని వేడుకున్నా.. ట్రాన్స్కో అధికారులు పట్టించుకోలేదన్నారు. సమాచారం అందుకున్న రూరల్ ఎస్ఐ రాజేంద్రప్రసాద్, ఏఎస్ఐ వెంకటయ్యలతో పాటు సిబ్బందితో అక్కడికి చేరుకుని రైతులతో మాట్లాడారు. బిల్లులు చెల్లించేందుకు గడువు అడిగినా స్టార్టర్లను లాక్కెళ్లిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రూరల్ ఎస్ఐ రాజేంద్రప్రసాద్ రైతులను నచ్చజెప్పి ఆందోళన విరమింపజేశారు. -
సాయం కోసం ఎదురుచూపులు
హుద్హుద్ బాధితులు సాయం కోసం ఎదురు చూస్తున్నారు. పునర్ నిర్మాణం పేరిట సంబరాలకు కోట్లు కుమ్మరించిన ప్రభుత్వం కూడా నిధుల కోసం కేంద్రం వైపే చూస్తోంది. తుపాను మర్నాడే కేంద్రం తక్షణ సాయం వెయ్యికోట్లు ప్రకటించినా రూపాయి కూడా విడుదల చేయలేదు. దీంతో పరిహారం పంపిణీ ప్రశ్నార్ధకంగా మారింది. ఈ నేపథ్యంలో కేంద్ర బృందం మంగళవారం నుంచి పర్యటించనుంది. దీనిపైనే జిల్లా వాసులు కోటి ఆశలు పెట్టుకున్నారు. మరోపక్క నిలదీసేందుకూ సిద్ధమవుతున్నారు. సాక్షి, విశాఖపట్నం: హుద్హుద్ తుపాను ఫలితంగా విభాగాల వారీగా ట్రాన్స్కోకు అత్యధికంగా రూ.1020.88 కోట్ల నష్టం వాటిల్లింది. పాక్షికంగా, తీవ్రంగా, పూర్తిగా దెబ్బ తి న్న ఇళ్లు లక్షా 43 వేల 761 ఉన్నాయి. వీటికి రూ.75.99కోట్లు అవసరమవు తుందని అంచనా. 34,180.22హెక్టార్లలో రూ.49.18కోట్ల విలువైన పంటలు దెబ్బతిన్నాయి. 55,334.608 హెక్టార్లలో హార్టికల్చర్ పంటలు దెబ్బతిన్నాయి. ఫిషరీస్ డిపార్టుమెంట్కు రూ.38.06కోట్లు, పశుసంవర్ధకశాఖకు రూ.124.78కోట్లు నష్టం వాటిల్లగా, వివిధ డిపార్టుమెంట్లకు రూ.7,986.20కోట్ల నష్టంవాటిల్లినట్టుగా లెక్క తేల్చారు. ఇదంతా ప్రభుత్వపరంగా జరిగిన నష్టమైతే పారిశ్రామిక రంగానికి 50వేల కోట్లకు పైగా నష్టం వాటిల్లినట్టు భావిస్తున్నారు. ఇలా దాదాపు రూ.65వేల కోట్ల నష్టం వాటిల్లిందని అంచనా వేసిన రాష్ర్ట ప్రభుత్వం రూ.21.640.63 కోట్ల సాయం చేయాల్సిందిగా కేంద్రానికి నివేదిక సమర్పించింది. తుపాను వచ్చిన మూడో రోజునే విశాఖ వచ్చిన ప్రధాన మంత్రి రూ.1000 కోట్ల తక్షణ సాయాన్ని ప్రకటించారు. రూ.450 కోట్లు రాష్ర్ట ప్రభుత్వానికి విడుదల చేసిందని చెబుతున్నప్పటికీ ఒక్క రూపాయి కూడా జిల్లాకు కేటాయించలేదు. దీంతో పరిహారంఅందక ఆదుకునే వారు లేక బాధితులు అల్లాడిపోతున్నారు. నెలన్నర తర్వాత వస్తున్న కేంద్రం బృందం క్షేత్ర స్థాయిలో చూసేది ఏమీ లేకున్నా ఇక్కడ జరిగిన నష్టాన్ని అంచనా వేసేందుకు అవకాశం ఉంటుంది. దీంతో వీరు ఇచ్చే నివేదికను బట్టే కేంద్రం సాయం ప్రకటించే అవకాశాలుండడంతో జిల్లా ప్రజలతో పాటు రాష్ర్ట ప్రభుత్వం కూడా ఈ బృందం పర్యటనపైనే ఆశలు పెట్టుకుంది. కేంద్ర బృందం పర్యటన సాగిదిలా: కేంద్ర హోంమంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ పాఠక్ నేతృత్వంలోని ఎనిమిది సభ్యుల బృందం మంగళవారం సాయంత్రం విశాఖకు చేరుకోంది. తొలుత ఎయిర్ పోర్టుకు వాటిల్లిన నష్టాన్ని పరిశీలించి నేరుగా కలెక్టరేట్కు చేరుకుని తుఫాన్ నష్టం ఫోటోఎగ్జిబిషన్ను తిలకిస్తుంది. మర్నాడు ఉదయం నగరంలో నష్టాన్ని చూసి మధ్యాహ్నం అనంతగిరి వెళ్తుంది. 27న పరిశ్రమలులు..గ్రామీణ జిల్లాను పరిశీలిస్తుంది. బృందం పర్యటనకు ఏర్పాట్లు సాక్షి,విశాఖపట్నం: కేంద్ర బృందం పర్యటనకు ఏర్పాట్లు చేసినట్టు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్.యువరాజ్ తెలిపారు. నష్టాలపై బృందానికి సమగ్ర నివేదిక అందజేయనున్నట్టు సోమవారం ఒక ప్రకటనలో వివరించారు. ప్రభుత్వం తరపున నష్టాలను నివేదించేందుకు రాష్ర్టమంత్రిఒకరు రానున్నారని, రాష్ర్టవిపత్తుల నిర్వహణ కమిషనర్ కూడా పాల్గొంటారన్నారు. నాలుగు జిల్లాల్లో జరిగిన తుఫాన్ నష్టాలపై జిల్లాకలెక్టర్ కార్యాలయంలో 28వ తేదీమధ్యాహ్నం వివరించి ఒక నివేదిక అందజేయనున్నట్టుకలెక్టర్ తెలిపారు. నాలుగు జిల్లాల్లో వివిధశాఖలకు తుఫాన్ కారణంగా రూ.21,908 కోట్ల నష్టం వాటిల్లిందని చెప్పారు. -
విద్యుత్ ఉద్యోగుల సమ్మె సైరన్!
విద్యుత్ జేఏసీ నోటీసు అందజేత.. 3న ‘చలో విద్యుత్ సౌధ’ సాక్షి, హైదరాబాద్: తెలంగాణ విద్యుత్ ఉద్యోగ సంఘాల జేఏసీ సమ్మెకు సన్నద్ధమవుతోంది. ఈ మేరకు టీఎస్ జెన్కో, ట్రాన్స్కోలకు నోటీసు ఇచ్చింది. 2014 పీఆర్సీని వెంటనే వర్తింపజేయాలని, కాంట్రాక్టు ఉద్యోగులకు మధ్యంతర భృతి మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. విద్యుత్ ఉద్యోగ సంఘాల జేఏసీ కన్వీనర్ ఏ.సుధాకర్రావు సారధ్యంలో వివిధ సంఘాల ప్రతినిధులు గురువారం సాయంత్రం టీఎస్ జెన్కో, ట్రాన్స్కో చైర్మన్, మేనేజింగ్ డెరైక్టర్ డి.ప్రభాకరరావును కలిసి సమ్మె నోటీసు అందించారు. సమ్మెలో భాగంగా డిసెంబరు 3 న ‘చలో విద్యుత్ సౌధ’ కార్యక్రమం చేపట్టనున్నట్లు తెలిపారు. అప్పటికీ ప్రభుత్వం స్పందించకపోతే ఆందోళనను ఉధృతం చేస్తామని, అదేరోజున భవిష్యత్తు కార్యాచరణను వెల్లడిస్తామని తెలిపారు. -
ట్రాన్స్కో ఏఈకి ఏసీబీ షాక్
కాగజ్నగర్టౌన్ : అవినీతి నిరోధక శాఖ అధికారులు శనివారం కాగజ్నగర్ విద్యుత్ శాఖ (ట్రాన్స్కో) కార్యాలయంలో దాడులు నిర్వహించారు. విద్యుత్ కనెక్షన్ షిఫ్టింగ్ కోసం డిమాండ్ నోటిస్ ఇవ్వడానికి 20 వేల రూపాయలు లంచం తీసుకున్న రూరల్ ఇన్చార్జి ఏఈ వేణుగోపాల్ను రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఈ సందర్భంగా ఏసీబీ డీఎస్పీ సుదర్శన్గౌడ్ విలేకరులతో మాట్లాడారు. కాగజ్నగర్ మండలం రాస్పెల్లి గ్రామానికి చెందిన పెకర శ్రీకాంత్ తన మినీ రైస్ మిల్లును గ్రామ శివారులోకి మార్చే క్రమంలో విద్యుత్ కనెక్షన్ షిఫ్టింగ్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. రాస్పెల్లి మెయిన్ రోడ్డు వద్ద మినీ రైస్ మిల్లును ఏర్పాటు చేసి, త్రీఫేజ్ కరెంట్ షిఫ్టింగ్ కోసం ట్రాన్స్కో కార్యాలయం చుట్టూ తిరుగుతున్నాడు. ఈ క్రమంలో రూరల్ ఇన్చార్జి ఏఈ వేణుగోపాల్ షిఫ్టింగ్ కోసం ఇచ్చే డిమాండ్ నోటీస్ ఇవ్వడానికి మొదట 35 వేల రూపాయలు లంచం డిమాండ్ చేశాడు. ఈ విషయాన్ని బాధితుడు ఏసీబీ అధికారుల దృష్టికి తీసుకువచ్చాడు. పథకం ప్రకారం శనివారం కార్యాలయంలో రూ. 20 వేలు లంచం తీసుకుంటుండగా రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నామని డీఎస్పీ సుదర్శన్ గౌడ్ పేర్కొన్నారు. నగదు స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ వివరించారు. ఈ సందర్భంగా ఇన్చార్జి ఏఈ వేణుగోపాల్ డీఈఈ ఒత్తిడి మేరకే తాను రూ.20 వేలు అడిగినట్లు ఆవేదన వ్యక్తం చేశారు. షిఫ్టింగ్ చేయడానికి డీఈఈ డబ్బులు అడిగినందుకే తాను పెరక శ్రీకాంత్ను తీసుకుని కార్యాలయానికి రావాలని సూచించినట్లు వివరించాడు. ఇదిలా ఉండగా.. ఈ అంశంలో డీఈఈ పాత్రపైనా విచారణ చేపడుతామని డీఎస్పీ సుదర్శన్ గౌడ్ వెల్లడించారు. ఇన్చార్జి ఏఈ వేణుగోపాల్ను ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరుపర్చనున్నట్లు డీఎస్పీ చెప్పారు. దాడిలో ఆదిలాబాద్ సీఐ సీహెచ్ వేణుగోపాల్, కరీంనగర్ సీఐ వీవీ రమణామూర్తితో పాటు సిబ్బంది వెంకటస్వామి, షేక్ జమీర్, వేణు తదితరులు పాల్గొన్నారు. లంచం అడిగితే నిర్భయంగా ఫిర్యాదు చేయండి.. - అవినీతి నిరోధక శాఖ డీఎస్పీ సుదర్శన్ గౌడ్ కాగజ్నగర్ టౌన్ : జిల్లాలోని పలు ప్రభుత్వ శాఖల్లో అవినితి పేరుకుపోయిందని, లంచం అడిగే అధికారులపై ప్రజలు నిర్భయంగా అవినీతి నిరోధక శాఖ అధికారులకు ఫిర్యాదు చేయాలని ఏసీబీ కరీంనగర్ రేంజి డీఎస్పీ సుదర్శన్ గౌడ్ సూచించారు. శనివారం కాగజ్నగర్ ట్రాన్స్కో కార్యాలయంలో దాడులు నిర్వహించిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. దశలవారీగా ఆయా శాఖల అధికారులపై నిఘా ఏర్పాటు చేసి వారి అక్రమాలకు చెక్ పెడుతామన్నారు. అనేక మండలాల్లో పహాని, పాస్ బుక్కులు, టైటిల్ బుక్కుల కోసం ఆయా తహశీల్దార్లు వీఆర్వోలపై డబ్బుల కోసం ఒత్తిడి తెస్తున్నారని, తద్వారా విలేజి రెవెన్యూ అధికారులు రైతుల నుంచి లంచం డిమాండ్ చేస్తున్నారని తమకు ఫిర్యాదులు అందాయని వెల్లడించారు. రెడ్హ్యాండెడ్గా పట్టుబడే సిబ్బందితోపాటు డబ్బుల కోసం ఒత్తిడి చేసే అధికారిపైనా కేసులు నమోదు చేసి అరెస్ట్ చేస్తామని స్పష్టం చేశారు. దళారులు ఎంతటివారైనా వారిపై కేసులు నమోదు చేసి, జైలుకు పంపుతామని హెచ్చరించారు. ఏ ప్రభుత్వ శాఖలోనూ అవినీతి, అక్రమాలు జరిగినా బాధితులు ఏసీబీ అధికారుల దృష్టికి తీసుకురావాలని, ఎటువంటి సందేహాలు పెట్టుకోకుండా నేరుగా జిల్లాలోని తమ కార్యాలయానికి వచ్చి ఫిర్యాదు చేయాలన్నారు. సెల్ నెంబర్ 9440446150 (డీఎస్పీ), 9440446153 నంబర్కు ఫోన్ చేయాలని సూచించారు. ఎస్ఎంఎస్ పంపినా ఫర్వాలేదని పేర్కొన్నారు. ఈ మెయిల్ చేయొచ్చని అన్నారు. -
ట్రాన్స్కో.. మేలుకో!
కిందకు వేలాడుతున్న విద్యుత్ తీగలు పెచ్చులూడి న స్తంభాలు చేతికి అందేలా ట్రాన్స్ఫార్మర్లు పట్టించుకోని ట్రాన్స్కో అధికారులు పెనుమూరు : ట్రాన్స్కో అధికారుల నిర్లక్ష్యం గ్రామీణ ప్రజలకు సంకటంగా మారింది. పెనుమూరు మండలంలో పలుచోట్ల విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లకు, స్తంభాలకు, లైన్లకు పచ్చని తీగలు అల్లుకుంటున్నాయి. దీనికితోడు లూప్లైన్స్ కారణంగా చేతికి అందే ఎత్తులో విద్యుత్ తీగలు వేలాడుతున్నాయి. విద్యుత్ షాక్తో గేదె మృతి చెందినా, ఆఖరుకు మనిషి చనిపోయినా ట్రాన్స్కో అధికారులు పట్టించుకోవడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చే స్తున్నారు. నంజరపల్లె, కలికిరి గొల్లపల్లె, యల్లంపల్లె, లక్కలపూడి వాండ్లవూరు, రామక్రిష్ణాపురం ప్రాంతాల్లో చేతికి తగిలేలా విద్యుత్ తీగలు ఉన్నాయి. కొన్ని చోట్ల విద్యుత్ స్తంభాలకు స్టే వైర్లు లేక ఓ వైపునకు ఒరిగిపోయాయి. దీంతో విద్యుత్ స్తంభాలు ఎప్పు డు కూలుతాయో అని ప్రజలు భయపడుతున్నారు.గుడ్యాణంపల్లె, కొటార్లపల్లె, ఎర్రమట్టిపల్లె, విడిదిపల్లె, గుంటిపల్లె, పులికల్లు ప్రాంతాల్లో హెచ్డీఎఫ్సీ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్కు, వైర్లకు పచ్చని తీగలు అల్లుకున్నాయి. పెద్దకలికిరిలో తీగలు విద్యుత్ వైర్లకు అల్లుకుని ఉన్న కారణంగా ఇటీవల ఓ పశువు విద్యుత్షాక్కు గురై మృతి చెందింది. కలికిరి గొల్లపల్లెలో చేతులకు అందేలా విద్యుత్ తీగలు ఉన్నాయి. గాలికి విద్యుత్ తీగలు ఒక్కటై మంటలు చెలరేగుతున్నాయి. ఈ విషయం ట్రాన్స్కో అధికారులకు చెప్పినా పట్టించుకోక పోవడంతో విద్యుత్ తీగలు ఒకదానికొకటి తాకకుండా గ్రామస్తులు కర్రలు ఏర్పాటు చేశారు.కొన్ని చోట్ల లూప్లైన్లు ఉండటంతో కర్రలు ఏర్పాటు చేసుకున్నారు. ఇక్కడ గతంలో ఓ మహిళ విద్యుత్ షాక్తో మృతి చెందింది. గొడుగుమానుపల్లె, సాతంబాకం, కలవగుంట ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు పెచ్చులు ఊడి ప్రమాదకరంగా దర్శనమిస్తున్నాయి. కొన్ని చోట్ల మామిడి, తమలపాకు, చెరకు తోటలకు విద్యుత్ తీగలు తగులు తున్నాయి. చిన్నకలికిరిలో విద్యుత్ లైన్లు చేతికి అందే ఎత్తులో ఉన్నాయి. రెండు నెలల క్రితం జీడీనెల్లూరు ఎమ్మెల్యే నారాయణస్వామి ట్రాన్స్కో ఏఈ రామిరెడ్డితో కలిసి గ్రామాన్ని సందర్శించారు. వెంటనే విద్యుత్ లైన్లు సరిచేయాలని ఆదేశించారు. ఇంత వరకు అతీగతీ లేదు. ఇప్పటికైనా ట్రాన్స్కో అధికారులు నిర్లక్ష్యం వీడాల్సి ఉంది. -
విద్యుత్ అధికారులతో కేసీఆర్ భేటీ
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం తెలంగాణకు రావాల్సిన విద్యుత్వాటా రాకుండా అడ్డుకుంటున్న ఏపీ సీఎం చంద్రబాబు తీరును తెలంగాణ అసెంబ్లీలో ఎండగట్టేందుకు సీఎం కేసీఆర్ సిద్ధమవుతున్నారు. తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు, విద్యుత్ సమస్యలపై సోమవారం శాసనసభ రెండో సెషన్లో చర్చ జరగనుంది. దీంతో విద్యుత్ వివరాల కోసం శనివారం కేసీఆర్ తెలంగాణ ఇంధనశాఖ ముఖ్య కార్యదర్శి ఎస్.కె.జోషీ, తెలంగాణ జెన్కో, ట్రాన్స్కో సీఎండీ ప్రభాకర్రావులతో భేటీ అయ్యారు. తెలంగాణ హక్కులు, ఏపీ ఉల్లంఘనలపై పలు డాక్యుమెంట్లను ఈ భేటీలో అధికారులు సీఎంకు అందించారని తెలిసింది. -
స్టీల్ప్లాంట్కు క్యాప్టివ్ విద్యుత్ షాక్
యుద్ధప్రాతిపదికన పునరుద్ధరణ పనులు ఉక్కునగరం: స్టీల్ప్లాంట్కు వరుస కష్టాలు తప్పడం లేదు. ట్రాన్స్కో రెండో లైను పునరుద్ధరించిన ఆనందం కొన్ని గంటలకే ఆవిరైంది. వివరాలిలా..తుపాను తర్వాత సోమవారం సాయంత్రం ట్రాన్స్కో రెండో లైను ద్వారా విద్యుత్ సరఫరా ప్రారంభమైంది. సుమారు 100 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్కు అందుబాటులోకి వచ్చింది. దీంతో ప్రధాన ఉత్పత్తి విభాగాల పనులు వేగవంతం చేయాలని యోచిస్తు న్న తరుణంలో రాత్రి థర్మల్ పవర్ ప్లాంట్కు నీటిని సరఫరా చేసే పంప్ హౌస్-4లోని రిలీవింగ్ వాల్వ్ పేలింది. దీంతో క్యాప్టివ్ విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. వెయ్యి మిల్లీ మీటర్ల వ్యాసం కలిగిన 6 పైపులు ఒక్కొక్కటి గంటకు 11వేల క్యూబిక్ మీటర్ల నీటిని విడుదల చేయడంతో కేవలం 20నిమిషాల్లో పంప్హౌస్లో సుమారు 10 అడుగుల ఎత్తులో నీరుచేరింది. దీంతో పంప్హౌస్లో ఉన్న 1350కెవి మోటార్లు పది, 780కెవి మోటార్లు నాలుగు మునిగిపోయాయి. వెంటనే నీటిని రాకుండా, ఉన్న నీటిని తొలగించే పనులు యుద్ధప్రాతిపదికన చేపట్టారు. మోటార్లను హీటింగ్ పనులు నిర్వహిస్తున్నారు. నిరంతరం పనులు కొనసాగుతున్నప్పటికీ మరో రెండు రోజుల వరకు పూర్తిస్థాయి విద్యుత్ చేసే పరిస్ధితులు కనిపించడం లేదు. మరమ్మతు పనులను సీఎండీ మధుసూదన్, డెరైక్టర్(ఆపరేషన్స్) డి.ఎన్.రావులు స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. -
బకాయిల షాక్
విద్యుత్శాఖకు రావాల్సింది రూ.176.89 కోట్లు సాక్షి, మహబూబ్నగర్: ‘గడువులోపు మీ విద్యుత్ బిల్లులు చెల్లించండి.. లేకుండా ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా మీ ఇంటికి విద్యుత్ సరఫరా నిలిపివేయబడుతుంది. మళ్లీ విద్యుత్ సరఫరా తిరిగి పొందాలంటే బిల్లుతో పాటు ఫెనాల్టీ చెల్లించాలి. అంతేకాదు.. రీ కనెక్షన్ ఫీజు కూడా చెల్లించాల్సి ఉంటుంది’ అంటూ ప్రతి నెలా ట్రాన్స్కో సిబ్బంది మైకులతో ఊదరగొడుతుంటారు. అన్నట్టుగానే గడువు దాటిన వెంటనే విద్యుత్ కనెక్షన్ తీసేస్తారు. దీనిని చూస్తే మన ట్రాన్స్కో అధికారులు ఎంత బాగా బిల్లులు వసూలు చేస్తున్నారో అనుకుంటున్నారు కదూ.. ఈ ప్రతాపమంతా సామాన్యులపైనే. కొన్ని సంస్థలు కోట్ల రూపాయల్లో బిల్లులు బకాయిలున్నా వారి జోలికిమాత్రం వెల్లడం లేదు. జిల్లాలో ప్రభుత్వరంగ సంస్థలు రూ. 177.89 కోట్లు బకాయి పడి ఉన్నాయి. కానీ, వారినుంచి ఆ డబ్బులు వసూలే చేయడంలో ట్రాన్స్కో అధికారులు చేతులెత్తేస్తున్నారు. ప్రభుత్వ సంస్థల నుంచి యేడాది 8కోట్ల రూపాయలు వసూలు కావాల్సి ఉండగా. కేవలం కోటి రూపాయలు మాత్రమే వసూలు చేసి చేతులు దులుపుకుంటున్నారు. ప్రభుత్వానికి నోటీసులు పంపించాం : సదాశివరెడ్డి, ట్రాన్స్కో ఎస్ఈ ప్రభుత్వ కార్యాలయాల నుంచి ట్రాన్స్కోకు ప్రతినెలా రూ.8 కోట్లు రావాల్సి ఉంది. కానీ, రూ. కోటిమాత్రమే వస్తున్నాయి. ముఖ్యంగా మున్సిపాలిటీ, పంచాయితీరాజ్, ఆర్డబ్ల్యూఎస్ శాఖల నుంచి బకాయిలు భారీగా పేరుకుపోయాయి. అడిగితే బడ్జెట్ లేదంటున్నారు. వారిని హెచ్చరించడానికి అప్పుడప్పుడు లైట్లు బంద్చేస్తున్నాం, అంతకుమించి ఏం చేయలేకపోతున్నాం. బకాయిలకు సంబంధించి ప్రభుత్వానికి కూడా నోటీసులు పంపించాం’’ -
బకాయి చెల్లించకుంటే కరెంట్ కట్
బాన్సువాడ : జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాలు కోట్ల రూపాయల్లో విద్యుత్ బకాయిలు పడడంతో వాటి వసూలుకు ట్రాన్స్కో కార్యాచరణను రూపొందించింది. ఇటీవల ట్రాన్స్కో సీఎండీతో జరిగిన సమీక్షలో ప్రభుత్వ కార్యాల యాల బకాయిలపైనే చర్చించినట్లు సమాచారం. ఈ మేర కు ప్రభుత్వ కార్యాలయాలకు విద్యుత్తు సరఫరాను నిలిపివేయాలని నిర్ణయించారు. మొండి బకాయిలను ఎలాగైనా వసూలు చేయాల్సిందేనని సీఎండీ ఆదేశించడంతో జిల్లాలోని ట్రాన్స్కో అధికారులు ప్రభుత్వ కార్యాలయాల కు విద్యుత్తు సరఫరా నిలిపివేతే మార్గమని భావిస్తున్నారు. ఇప్పటికే గృహ విద్యుత్తు కనెక్షన్లు ఉన్న వినియోగ దారులు ఒక నెల బిల్లు చెల్లించకున్నా విద్యుత్తు కనెక్షన్ను తొలగిస్తున్న అధికారులు, ప్రభుత్వ కార్యాలయాల నుంచి ముక్కుపిండి మరీ బకాయిలను వసూలు చేయాలని భావిస్తున్నారు. ఎన్పీడీసీఎల్ బాన్సువాడ పరిధిలోని గ్రామీణ నీటి సరఫరా పథకం (ఆర్డబ్ల్యూఎస్)కు చెందిన ఎత్తిపోతల పథకాలు, మంచినీటి నిర్వహణ పథకాలకు సంబంధించి సుమారు రూ. 2 కోట్ల బకాయి చెల్లించాల్సి ఉంది. ఈ బకాయిల వసూలు కోసం పలుమార్లు ఎన్పీడీసీఎల్ బాన్సువాడ డివిజన్లోని ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కార్యాలయానికి విద్యుత్తు సరఫరాను నిలిపివేసింది. ఆరు నెలల్లో మూడు సార్లు నెల రోజుల పాటు విద్యుత్తు సరఫరాను నిలిపివేయడంతో కార్యాలయంలో పని చేయాల్సిన సిబ్బంది ఇబ్బందుల పాలవుతున్నారు. వాస్తవానికి ఆర్డబ్ల్యూఎస్ కార్యాలయానికి సంబంధించిన విద్యుత్తు బిల్లు నెలనెలా చెల్లిస్తున్నారు. కానీ వివిధ పథకాలకు సంబంధించి విద్యుత్తు బిల్లును చెల్లించకపోవడంతో కార్యాలయ విద్యుత్తును తొలగించారు. మొదట వివిధ పథకాలకు విద్యుత్తు సరఫరాను నిలిపివేయగా, గ్రామాల్లో మంచినీటి సరఫరా లేక ప్రజలు ఆందోళనలు చేశారు. దీంతో మంత్రి పోచారం శ్రీనివాస్రెడ్డి ట్రాన్స్కో అధికారులతో మాట్లాడి విద్యుత్తు సరఫరాను పునరుద్ధరింపచేయించారు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా, ఆర్డబ్ల్యూఎస్ అధికారులకే ఇబ్బంది కలిగించాలని, అప్పుడే విద్యుత్తు బకాయిలను చెల్లిస్తారని నిర్ణయించిన ట్రాన్స్కో డీఈ, డివిజనల్ కార్యాలయానికి విద్యుత్తు సరఫరాను నిలిపివేశారు. దీంతో ట్రాన్స్కో-ఆర్డబ్ల్యూఎస్ అధికారుల మధ్య పలుమార్లు వాగ్యుద్ధం జరిగినట్లు సమాచారం. ఇదిలా ఉండగా, ట్రాన్స్కో బాన్సువాడ డివిజన్ పరిధిలోనే వివిధ ప్రభుత్వ కార్యాలయాలు సుమారు రూ. 20 కోట్ల బకాయి ట్రాన్స్కోకు ఉండడం గమనార్హం. ఇందులో గ్రామ పంచాయతీల ద్వారా రావాల్సిన బకాయి రూ. 15కోట్లు కాగా, ఆర్డబ్ల్యూఎస్, పంచాయతీరాజ్, వ్యవసాయ శాఖల ద్వారా మరో రూ. 5 కోట్ల బకాయి రావాల్సి ఉంది. ఎస్సీ, ఎస్టీల నుంచి సుమారు 7 కోట్ల బకాయి, గృహ విద్యుత్తు కనెక్షన్ల నుంచి రూ. 15 కోట్ల వరకు రావాల్సి ఉందని సమాచారం. జిల్లా వ్యాప్తంగా కోట్ల రూపాయలు ప్రభుత్వ కార్యాలయాల నుంచి బకాయిలు రావాల్సి ఉండడంతో ఎలాగైనా వాటిని వసూలు చేయాలనే లక్ష్యంతో ట్రాన్స్కో అధికారులు ఉన్నారు. -
సమ్మెకు తాత్కాలిక పరిష్కారం
సాక్షి, మంచిర్యాల : డిమాండ్ల సాధన కోసం విద్యుత్ స్పాట్ బిల్లింగ్ ఆపరేటర్లు సమ్మె చేస్తున్న నేపథ్యంలో ట్రాన్స్కో ఉన్నతాధికారులు తాత్కాలిక పరిష్కారాన్ని సిద్ధం చేశారు. ఇం దులో భాగంగా విద్యుత్శాఖ సిబ్బందితో గురువారం నుంచి వినియోగదారులకు బిల్లులు అందించేందుకు స మాయత్తమయ్యారు. టాన్స్కో శాఖ ఎంపిక చేసిన కాం ట్రాక్టర్లకు చెందిన ఆపరేటర్ల ద్వారా వినియోగదారులకు బిల్లులు అందజేసే సేవలను పొందుతోంది. జిల్లాలోని 3,77,592 సర్వీసులకు చెందిన బిల్లులు వినియోగదారులకు అందిస్తున్నందుకు రూ.9.21 లక్షలను ఆయా కాం ట్రాక్టర్లకు ప్రతి నెలా చెల్లిస్తోంది. ఆపరేటర్ల సేవలను బట్టి వారికి సదరు గుత్తేదార్లు భత్యం ఇస్తుంటారు. తమకు నిర్ధేశిత వేతనం అందజేయాలని డిమాండ్ చేస్తూ ఈనెల ఒకటో తేదీ నుంచి ఆపరేటర్లు సమ్మె చేస్తున్నారు. ఆలస్యం అయితే.. బిల్లుల మోతే..! బిల్లులు అందజేసే సమయంలో సమ్మె చేయడంతో వినియోగదారులతోపాటు ట్రాన్స్కో వర్గాలు ఆలోచనలో పడ్డాయి. సమ్మె ముగిసిన అనంతరం బిల్లులు ఆలస్యంగా అందజేస్తే ఆ మేరకు విద్యుత్ యూనిట్లు పెరిగి భారం వినియోగదారులపై పడనుంది. ప్రస్తుతం గృహ కేటగిరీ స్లాబ్లు 50 యూనిట్ల వరకు అయితే యూనిట్కు రూ.1.45 పైసల చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. 50-100 యూనిట్ల లోపు అయితే మొదటి యాభై యూనిట్లకు రూ.1.45, 51-100 వరకు రూ.2.60 విద్యుత్ వర్గాలు చార్జీ వేస్తాయి. 100-200 యూనిట్ల వరకు వాడితే మొదటి యాభై యూనిట్లకు రూ.2.60, 51-100 వరకు రూ.3.25, 151-200 యూనిట్లకు రూ.3.60 చెల్లించాల్సి ఉంటుంది. ఇదే విధంగా యూనిట్లు పెరిగినకొలది చెల్లించే ధరలు పెరుగుతాయి. ఈ నేపథ్యంలో తాజాగా సమ్మె చేస్తున్న తర్వాత బిల్లులు వస్తే తమ పరిస్థితి ఏం కాను అని పలువురు వినియోగదారులు వ్యాఖ్యానిస్తున్నారు. ఆపరేటర్ల డిమాండ్లు ఇవే.. పట్టణ ప్రాంతాల్లో కనెక ్షన్ ఇచ్చే రూ.1.45 ను రూ.2 చేయాలని, గ్రామీణ ప్రాంతాల్లోని చెల్లించే రూ.1.80ని రూ.2.50లకు పెంచాలి. కనీస వేతనంగా రూ.10 వేలు చెల్లించాలి. ఉద్యోగ భద్రత కల్పించాలి. ఈ విషయమై ట్రాన్స్కో ఎస్ఈ అశోక్ను సంప్రదించగా ఆపరేటర్లు సమ్మె చేస్తున్న విషయం తమ దృష్టికి వచ్చిందన్నారు. సమ్మెతో బిల్లుల చెల్లింపు ఆలస్యం అయ్యే అవకాశాలున్నందున విద్యుత్ శాఖ వర్గాలచే బిల్లులు చెల్లించే సన్నాహాలు చేయాలని ఆదేశాలు వచ్చినట్లు వివరించారు. సమస్యను పరిష్కరించేందుకు ఉన్నతాధికారులు తగు నిర్ణయాలు తీసుకుంటారని వివరించారు. -
అధికారుల నిర్లక్ష్యం.. ఈ బాలుడ్నిలా..!
-
సౌర విద్యుత్పై భారీ ఆశలు
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: బొగ్గు ఆధారిత విద్యుత్పై ఆధార పడడాన్ని తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సౌర విద్యుత్ ఉత్పత్తిపై దృష్టి సారిస్తోంది. ఇందులో భాగంగా మన జిల్లాలో వెయ్యి మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యమున్న సౌర విద్యుత్ ప్లాంటు ఏర్పాటుకు సన్నాహాలు చేస్తోంది. విద్యుత్ ప్లాంటు ఏర్పాటుకు అవసరమైన భూమిని కూడా జిల్లా అధికార యంత్రాంగం గుర్తించింది. అయితే ప్లాంటు ఏర్పాటుకు అవసరమైన మౌలిక సౌకర్యాల కల్పనకు అవసరమైన నిధులు విడుదల కావాల్సి ఉంది. వెయ్యి మెగావాట్ల సామర్థ్యమున్న సోలార్ విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టు ఏర్పాటుకు అవసరమైన ఐదువేల ఎకరాలకు పైగా భూమి గట్టు మండలంలో ఉన్నట్లు అధికార యంత్రాంగం గుర్తించింది. దేశంలోనే అతి పెద్దదిగా భావిస్తున్న ప్రాజెక్టు ఏర్పాటుకు అవసరమైన సహకారాన్ని అందిస్తామని సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సెసి) ఈ యేడాది మార్చిలో ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సౌకర్యాల కల్పన అభివృద్ధి సంస్థ (టీఎస్ఐఐసీ)తో ఒప్పందం కూడా కుదుర్చుకుంది. ఆరు నెలల్లో ఎంపిక చేసిన స్థలంలో మౌలిక సౌకర్యాల కల్పన పూర్తి చేయాలని అంగీకారానికి వచ్చారు. కాంపిటీటీవ్ బిడ్డింగ్ పద్ధతిలో డెవలపర్స్ను ఎంపిక చేయాలని నిర్ణయించారు. మౌలిక సౌకర్యాల కల్పనకు త్వరలో నిధులు విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అయితే వెయ్యి మెగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తి ప్లాంటును ప్రభుత్వమే నెలకొల్పుతుందా లేక ప్రైవేటు పెట్టుబడుదారులకు అవకాశం కల్పిస్తుందా అనే అంశంపై స్పష్టత రావడం లేదు. ఔత్సాహికులు ముందుకు వస్తే జపాన్ ఆర్థిక సంస్థ జికా సహకారంతో మౌలిక సౌకర్యాల కల్పనతో పాటు రుణాలు అందేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ధర నిర్ణయంపైనే ఆసక్తి సౌర విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లు నెలకొల్పేందుకు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ఆసక్తి చూపుతున్నా యూనిట్ ధర నిర్ణయంపై స్పష్టత రావడం లేదు. రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ (ట్రాన్స్కో) సౌర విద్యుత్ యూనిట్ ధరను రూ.6.50 నుంచి రూ.7.50గా పేర్కొంటోంది. పెట్టుబడులతో పోలిస్తే ట్రాన్స్కో నిర్ణయిస్తున్న ధర అంత లాభదాయం కాదనే భావన ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్ కొనుగోలు విధానంలో పారదర్శకత లేదంటూ గతంలో ఔత్సాహిక పెట్టుబడిదారులు ఆరోపించారు. సబ్సిడీలు, పన్ను రాయితీ, కనీసం 25 ఏళ్ల పాటు విద్యుత్ కొనుగోలు చేసేలా ప్రభుత్వంతో ఒప్పందం వంటి అంశాలపై స్పష్టత ఇస్తే ముందుకు వచ్చే యోచనలో పారిశ్రామికవేత్తలున్నారు. కాగా జిల్లాలో సౌర విద్యుత్ ప్లాంటు ఏర్పాటుపై బిడ్లను ఆహ్వానిస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ ఇస్తే స్పష్టత వస్తుందని నెడ్క్యాప్ డీఎం గోవిందరాజులు ‘సాక్షి’కి వెల్లడించారు. గట్టు మండలంలో గతంలో సెసి సర్వే చేసినా సరైన భూమి దొరకలేదన్నారు. విద్యుత్ ప్లాంటు ఏర్పాటుకు అవసరమైన స్థలం ఎంపిక పూర్తి కావాల్సి ఉందన్నారు. జెన్కో ఆధ్వర్యంలో రాష్ట్ర విద్యుత్ ఉత్పత్తి సంస్థ జెన్కో ఆధ్వర్యంలో తొలి సారిగా ధరూరు మండలం రేవులపల్లి వద్ద సోలార్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ప్రియదర్శిని జూరాల జల విద్యుత్ కేంద్రం ఆవరణలో రూ. 12.8 కోట్ల వ్యయంతో ప్లాంటు నిర్మించారు. జవహర్లాల్ నెహ్రూ నేషనల్ సోలార్ మిషన్ ఈ ప్లాంటు ఏర్పాటుకు సహకారం అందించింది. ఒక మెగావాట్ విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం కలిగిన ఈ పవర్ ప్లాం టును 2012లో ప్రారంభించారు. యేటా1.4 మిలియ న్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతోంది. జెన్కోతో పాటు వాల్యూలాబ్స్ అనే ఐటీ సంస్థ 8 మెగావాట్లు, రేస్ ఇన్ఫ్రా 10 మెగావాట్లు. ఓ మీడియా సంస్థ 10 మెగావాట్ల సామర్థ్యమున్న సోలార్ విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లను జిల్లాలో ఇప్పటికే నెలకొల్పాయి. -
కోత..వాత !
ఖమ్మం : ఇప్పటికే అరకొర విద్యుత్ సరఫరాతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే.. అవి చాలవన్నట్లు సోమవారం నుంచి మరిన్ని గంటల పాటు కోత విధిస్తూ ట్రాన్స్కో అధికారులు ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిసింది. వర్షాలు లేక పంటలు అంతంతమాత్రమే సాగు చేసినా.. విద్యుత్ కోతల బాధలు మాత్రం జిల్లా ప్రజలకు తప్పడంలేదు. జిల్లా కేంద్రం.. మండల సబ్స్టేషన్, మున్సిపాలిటీ కేంద్రాలు దేన్నీ వదలిపెట్టకుండా కోతల వాతలు పెడుతున్నారు. గంటల కొద్దీ విద్యుత్ సరఫరా నిలిచిపోతుండడంతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడే ఇలా ఉంటే రానున్న వ్యవసాయ సీజన్లో ఇంకెలా ఉంటుందోనని బెంబేలెత్తుతున్నారు. పెరిగిన విద్యుత్ కోతలు జిల్లాకు సరఫరా చేసే విద్యుత్ కంటే వినియోగం ఎక్కువగా ఉండటంతోపాటు విశాఖపట్నం, కేటీపీఎస్లో 10 యూనిట్లు మరమ్మతులకు గురికావడంతో మరిన్ని గంటల పాటు కోతలు విధిస్తున్నట్లు తెలిసింది. ఇప్పటి వరకు జిల్లా కేంద్రంలో 4 గంటలు, మున్సిపల్, మండల సబ్ స్టేషన్ కేంద్రాల్లో 6గంటల కోత ఉండేది. అయితే సోమవారం నుంచి జిల్లాకేంద్రంలో 6 గంటలు, మండల, సబ్స్టేషన్, మున్సిపల్ కేంద్రాల్లో 8 గంటల పాటు కోతలు విధించేందుకు రం గం సిద్ధం చేశారు. ఈ సంవత్సరం వ్యవసాయ సీజన్ ఆ రంభంలో జిల్లా కేం ద్రంలో రెండు గం టలు,మున్సిపల్ కేంద్రాల్లో నాలుగు గంటలు, మండల కేంద్రాల్లో ఆరు గంటల కోత ఉండేది. వర్షాలు లేకపోవడం, వేసవిని తలపించే ఎండలతో ఈ కోతలకే ప్రజలు విలవిలలాడారు. అయితే జూలై చివరి నుంచి జిల్లా కేంద్రంలో 4 గంటలు, మున్సిపల్, పట్ట ణ కేంద్రాల్లో 6 గంటల పాటు కోత విధిం చారు. ఇక సోమవారం నుంచి జిల్లా కేంద్రం లో ఉదయం 3 గంటలు, సాయంత్రం 3గంట లు, మండల, మున్సిపల్, సబ్స్టేషన్ కేంద్రా ల్లో ఉదయం 4 గంటలు, సాయంత్రం 4 గంట లు కోత విధించనున్నారు. అయితే ఉదయం విద్యార్థులు పాఠశాలలకు వెళ్లడం, ఉద్యోగులు కార్యాలయాలకు, ఇతరులు తమ దైనందిన కార్యక్రమాలకు వెళ్లేందుకు బాక్సు లు సిద్ధం చేసుకోవాల్సి ఉంటుంది. ఉదయం 5 నుంచి 8 గంటల వరకు కోత విధిస్తే బడిపిల్లలతోపాటు ఉద్యోగులకు బాక్సులు తయా రు చేయడం కష్టమేనని మహిళలు అంటున్నారు. ఇక మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 వరకు కోత విధిస్తే తమ వ్యాపారాలు కష్టమేనని చిల్లర దుకాణాల వారు, వెల్డింగ్ షాపుల నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి
గండేడ్: ట్రాన్స్కో అధికారుల నిర్లక్ష్యానికి ఓ నిండు ప్రాణం బలైపోయింది. ఎర్తింగ్ సమస్యను పరిష్కరించాలని గ్రామస్తులు అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం శూన్యం. దీంతో పిండిగిర్ని ఆన్ చేస్తుండగా విద్యుదాఘాతమవడంతో ఓ యువతి దుర్మరణం చెందింది. ఆగ్రహానికి గురైన స్థానికులు విద్యుత్ అధికారులను దిగ్బంధించారు. ఈ సంఘటన మండల పరిధిలోని చిన్నవార్వాల్ గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన ఖాజన్నగౌడ్, పద్మమ్మ దంపతుల రెండో కూతురు వెంకటేశ్వరి (22)బీఈడీ వరకు చదివింది. భార్యాభర్తలు కిరాణ దుకాణంతో పాటు ఓ పిండిగిర్నిని నడుపుతున్నారు. ఇంటి వద్ద ఉంటున్న వెంకటేశ్వరి తల్లిదండ్రులకు సాయంగా ఉంటోంది. ఈక్రమంలో శనివారం రాత్రి 9 గంటల సమయంలో పిండిగిర్ని ఆన్ చేసేందుకు వెళ్లిన ఆమెకు కరెంట్షాక్ తగిలి అపస్మారక స్థితికి చేరుకుంది. వెంకటేశ్వరిని ఆస్పత్రికి తరలించేందుకు 108కు సమాచారం ఇచ్చారు. గంటసేపు దాటినా ఫలితం లేకుండా పోవడంతో పొరుగు గ్రామం నుంచి ఓ ఆర్ఎంపీని తీసుకొచ్చి చూపించారు. అప్పటికే మహేశ్వరి మృతిచెందినట్లు డాక్టర్ నిర్ధారించారు. యువతి మృతితో తల్లిదండ్రులు, కుటుంబీకులు, బంధువులు కన్నీటిపర్యంతమయ్యారు. పలు ఇళ్లకు కరెంట్ షాక్.. గ్రామానికి విద్యుత్ సరఫరా చేసేందుకు ఏర్పాటు చేసిన రెండు మినీ ట్రాన్స్ఫార్మర్ల వద్ద ఎర్తింగ్ సరిగా లేదు. దీంతో రెండు నెలలుగా పలు ఇళ్లకు హైఓల్టేజీ విద్యుత్ ప్రసారమై కరెంట్ షాక్ వస్తోంది. ఈక్రమంలోనే శనివారం రాత్రి కూడా హైఓల్టేజీ విద్యుత్ సరఫరా అయింది. అదే సమయంలో పిండిగిర్ని ఆన్ చేసేందుకు వెళ్లిన వెంకటేశ్వరి విద్యుదాఘాతంతో దుర్మరణం పాలైంది. ఎర్తింగ్ సమస్యపై పలుమార్లు ట్రాన్స్కో అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయిందని గ్రామస్తులు తెలిపారు. వెంకటేశ్వరి మృతితో గ్రామస్తులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. ఆదివారం ఏఈ జంగయ్య సిబ్బందితో చిన్నవార్వాల్కు చేరుకొని వివరాలు సేకరించారు. ట్రాన్స్కో అధికారుల నిర్లక్ష్యానికి యువతి బలైపోయిందని స్థానికు లు మండిపడ్డారు. గ్రామస్తులంతా అధికారులను చుట్టుముట్టి ఘెరావ్చేశారు. గ్రామంలోని ఎర్తింగ్ సమస్యను పరిష్కరించాకే ఇక్కడి నుంచి కదలాలని భీష్మించారు. గ్రామంలో 30 ఏళ్ల క్రితం ఏర్పాటు చేసిన విద్యుత్ తీగలే ఉన్నాయని, వాటిని తక్షణమే మార్చాలని డిమాండ్ చేశారు. గ్రామానికి మరో రెండు మినీ ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేయాలన్నారు. దీంతో ఏఈ జంగయ్య ట్రాన్స్కో ఉన్నతాధికారులతో ఫోన్లో మాట్లాడారు. విద్యుత్ సిబ్బంది వెంటనే ఎర్తింగ్ సమస్యను పరిష్కరించారు. 15 రోజుల్లో అదనపు మినీ ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేసి విద్యుత్ తీగలు మారుస్తామని హామీ ఇచ్చారు. దీంతో గొడవ సద్దుమణిగింది. నెలరోజుల్లో ఇద్దరి మృతి.. చిన్నవార్వాల్ గ్రామంలో ఎర్తింగ్ సమస్య ఇద్దరిని బలితీసుకుంది. శనివారం రాత్రి వెంకటేశ్వరి మృత్యువాత పడగా.. గతనెల 27న గ్రామానికి చెందిన బోయిని వెంకటయ్య సెల్ఫోన్ చార్జింగ్ పెడుతూ కరెంట్ షాక్తో మృతిచెందాడు. శనివారం రాత్రి గ్రామస్తుడు ఇక్బాల్ ఇంట్లో ఫ్యాన్ కాలిపోయి ఇంటి పైకప్పునకు షాక్ వచ్చింది. దీంతో పాటు గొల్ల లక్ష్మయ్య, బాబు ఇళ్లకు కూడా షాక్ వచ్చింది. దీంతో గ్రామస్తులు ఉలిక్కిపడ్డారు. చివరకు అధికారుల హామీతో గ్రామస్తులు శాంతించారు. -
‘స్టోర్ రూం’లో ఏం జరిగింది
నిజామాబాద్ నాగారం : ట్రాన్స్కో జిల్లా స్టోర్లో లక్షల రూపాయల విలువ చేసే కాపర్, అల్యూమిని యం వైర్లు మాయమైన విషయమై విచారణ జరపడానికి వరంగల్ ఎస్ఈ కిషన్, అసిస్టెంట్ సెక్రటరీ మనోహర్స్వామి శుక్రవారం జిల్లాకు వచ్చారు. వారితోపాటు జి ల్లాకు చెందిన ట్రాన్స్కో సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్ కిషన్ ఉదయం 11 నుంచి రాత్రి 8 గంటల వరకు స్టోర్ రూమ్లో విచారణ జరిపారు. శనివారం కూడా విచారణ కొనసాగనుంది. నెలలోగా నివేదిక.. ట్రాన్స్ఫార్మర్ మరమ్మతుల సమయంలో కాలిపోయిన కాపర్, అల్యూమినియం వైర్లను కాంట్రాక్టర్ స్టోర్ రూంలో అందించి రశీదు పొందాలి. ఆ తర్వాతే మరమ్మతులకు సంబంధించిన బిల్లులు కాంట్రాక్టర్కు చెల్లిస్తారు. అయితే కాంట్రాక్టర్ కాపర్, అల్యూమినియం అందించకున్నా.. అధికారులు వారితో కుమ్మక్కై రశీదులు ఇచ్చారు. సదరు కాంట్రాక్టర్ కాపర్, అల్యూమినియం వైర్లను అమ్ముకొని, అధికారులకు వాటా ఇచ్చేవారని తెలుస్తోంది. కొన్ని నెలల క్రితం ఈ విషయం బయటికిపొక్కడంతో అప్పటి ఎస్ఈ విషయాన్ని ఎన్పీడీసీఎల్ సీఎండీ కార్తికేయ మిశ్రా దృష్టికి తీసుకెళ్లారు. ఆయన ఆదేశాలతో విచారణ జరిపిన ట్రాన్స్కో అధికారులు నలుగురు ఏఈలు, ఏడీఈని సస్పెండ్ చేశారు. పూర్తి స్థాయి విచారణ జరిపేందుకు వరంగల్ ఎస్ఈ కిషన్ శుక్రవారం జిల్లాకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. స్టోర్ రూమ్లో అక్రమాలు జరిగినట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. ఈ కేసుకు సంబంధించిన చార్జిషిట్లో కామారెడ్డి ఏడీ ఈ రఘుకుమార్, నిజామాబాద్ ప్రస్తుత స్టోర్ ఏడీఈ వెంకటరమణ, కరీంనగర్ ఏఈ శ్రీహరి, సస్సెండ్ అయిన స్టోర్ ఏఈ ప్రశాంత్రెడ్డిల పేర్లు ఉన్నాయన్నారు. వీరిని విడివిడిగా విచారిస్తున్నామన్నారు. విచారణను నెలలోగా పూర్తి చేసి నివేదికను సీఎండీ కార్తికేయ మిశ్రాకు అందిస్తామని తెలిపారు. -
రైతు బతుకులో ‘సౌర’ వెలుగులు
- అందుబాటులో సౌర పంపుసెట్లు - నెడ్క్యాప్, ట్రాన్స్కో శిక్షణ శిబిరాలు అనకాపల్లి: రైతుల విద్యుత్ కష్టాలకు త్వరలో తెర పడనుంది. వ్యవసాయ క్షేత్రాల్లో ప్రయోగాత్మకంగా సౌర విద్యుత్ వినియోగంపై అధికారులు సమాయత్తమవుతున్నారు. సౌర విద్యుత్ తో పనిచేసే నీటి పంపుల వినియోగంలో రైతులకు ఎదురయ్యే లాభనష్టాలను అంచనా వేసుకొని, పూర్తిస్థాయి వినియోగంపై ప్రభుత్వం దృష్టి సారించనుంది. దేశవ్యాప్తంగా పెరిగిన విద్యుత్ కోత, వ్యవసాయ రంగానికి అవసరమైన విద్యుత్ను దృష్టిలో ఉంచుకొని సంప్రదాయ వనరులైన పవన, సౌరశక్తిపై దృష్టి పెట్టాల్సిన అవసరాన్ని పాలకులు, అధికారులు గుర్తించారు. పరిశ్రమలకు తోడు, గృహావసరాల విద్యుత్ సరఫరాకు డిమాండ్ పెరగడంతో ఆ ప్రభావం వ్యవసాయ రంగానికి సరఫరా చేసే విద్యుత్పై పడింది. దశల వారీగా వ్యవసాయ రంగానికి కేటాయించే విద్యుత్ వేళలను కుదించడంతో రైతులు నానా అవస్థలు పడుతున్నారు. ఏడు గంటల పాటు సరఫరా చేసే విద్యుత్ను సైతం లోడింగ్ను బట్టి ఫీడర్ల వారీగా రెండు విడతలుగా సరఫరా చేయడంతో ఉపయోగం ఉండదని రైతుల వాదన. దీంతో రైతులకు అవగాహన కల్పించి, రాయితీపై సౌర విద్యుత్ను అందించేందుకు నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ డెవలప్మెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (నెడ్క్యాప్) ముందుకొచ్చింది. ప్రయోగాత్మకంగా శిక్షణ శిబిరాలు నెడ్క్యాప్, ట్రాన్స్కో శాఖలు ఎంపిక చేసిన రైతులకు సౌర నీటి పంపుల వినియోగంపై అవగాహన కల్పించనున్నారు. దీనికి ఇప్పటికే రెండు శాఖల అధికారులు వ్యవసాయ విస్తరణ, పరిశోధన విభాగాల శాస్త్రవేత్తలకు అవగాహన కల్పించారు. ఉత్తర కోస్తా మండలి వ్యవసాయ పరిశోధన స్థానంలో ఈ నెల 15వ తే దీన 300 మంది రైతులకు సౌర నీటి పంపుసెట్ల వినియోగంపై అవగాహన సదస్సు నిర్వహించాలని భావించారు. అనివార్య కారణాలతో వాయిదా వేసిన ఈ సదస్సును ఈ నెల 18న నిర్వహించే అవకాశం ఉంది. సౌర విద్యుత్ పంపుసెట్లకు అవసరమైన మోటార్లు, ప్యానెల్స్ను సరఫరా చేసే వివిధ సంస్థలు అవగాహన సదస్సులో తమ ఉత్పత్తులను ప్రదర్శించనున్నాయి. దశల వారీగా సౌర విద్యుత్ పంపుసెట్లను వినియోగంలోకి వస్తే రైతులకు విద్యుత్ కష్టాలు తీరినట్లే. -
ట్రాన్స్ఫార్మర్ల కష్టాలు
పెండింగ్లో 32 వేల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు తీవ్ర ఇబ్బందుల్లో రైతులు బోర్లలో నీరున్నా ప్రయోజనం సున్నా అనంతపురం టౌన్ : వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల మంజూరులో తీవ్ర జాప్యం జరుగుతుండటంతో రైతులు నష్టపోతున్నారు. బోర్లలో నీరు పుష్కలంగా ఉన్నా.. సకాలంలో విద్యుత్ కనెక్షన్ రాకపోవడంతో పంటలు సాగు చేయలేకపోతున్నారు. అనధికారికంగా కనెక్షన్ తీసుకుందామంటే ట్రాన్స్ఫార్మర్పై అధిక లోడ్ పడుతుందన్న నెపంతో తోటి రైతులు అంగీకరించకపోతుండడంతో అన్నదాతలు అవస్థలు పడుతున్నారు. దీంతో కనెక్షన్ కోసం ట్రాన్స్కో అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారు. ఏళ్లు గడుస్తున్నా అతీగతీలేకపోవడంతో దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. 2011-12 ఆర్థిక సంవత్సరంలో దరఖాస్తు చేసుకున్న వారికి ఇప్పుడు కనెక్షన్లు మంజూరు చేస్తున్నారంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. జిల్లాలో వర్షాధారంగా 8.75 లక్షల హెక్టార్లు, బోరుబావుల కింద 1.57 లక్షల హెక్టార్లలో పంటలు సాగు చేస్తున్నారు. ప్రస్తుతం 2.10 లక్షల విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. వీటితో పాటు భూగర్భ జలాలు మెరుగ్గా ఉన్న చోట బోర్లు వేసుకోగా పుష్కలంగా నీరు పడటంతో 32 వేల మంది రైతులు విద్యుత్ కనెక్షన్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈ బోర్ల కింద కూడా పంటలు సాగైతే మరో లక్ష ఎకరాలకు పైగా సాగు విస్తీర్ణం పెరుగుతుంది. అయితే.. ట్రాన్స్కో అధికారులు మాత్రం కనెక్షన్ల మంజూరుకు కాలయాపన చేస్తున్నారు. ప్రస్తుతం రెండేళ్ల కింద దరఖాస్తు చేసుకున్న వారికి కనెక్షన్లు ఇస్తున్నారు. వీటన్నింటికీ మెటీరియల్ సరఫరా చేస్తే ట్రాన్స్ఫార్మర్లు అమర్చడం కూడా అధికారులకు పెద్ద సవాలే. పెండింగ్ కనెక్షన్లు పూర్తయ్యేదెన్నడో? ప్రతి ఐదు వ్యవసాయ కనెక్షన్లకు ఒక ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయాలి. ఈ లెక్కన 32 వేల కనెక్షన్లకు ఏడు వేలకు పైగా ట్రాన్స్ఫార్మర్లు అమర్చాలి. వీటితో పాటు దిమ్మెలు నిర్మించాలి. ప్రస్తుతం ప్రతి నెలా వంద కనెక్షన్లు కూడా మంజూరు చేయడం లేదు. దరఖాస్తు చేసుకున్న రైతులందరికీ కనెక్షన్లు మంజూరు కావాలంటే ప్రజాప్రతినిధులు ప్రత్యేక బడ్జెట్ ద్వారా మెటీరియల్, ట్రాన్స్ఫార్మర్లు తీసుకురావాల్సిన అవసరముంది. మెటీరియల్ కంటే దరఖాస్తులే ఎక్కువ జిల్లాలో వ్యవసాయ కనెక్షన్ల కోసం రైతుల నుంచి భారీగా డిమాండ్ ఉంది. ప్రస్తుతం 32 వేల వరకూ కనెక్షన్లు పెండింగ్లో ఉన్నాయి. ఇవి ఎప్పటిలోగా పూర్తి చే యగలమని చెప్పే పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే ప్రభుత్వం నుంచి వస్తున్న మెటీరియల్ కంటే రైతుల దరఖాస్తులే అధికంగా ఉంటున్నాయి. పెండింగ్లో ఉన్న దరఖాస్తులన్నీ క్లియర్ కావాలంటే ప్రభుత్వ స్థాయిలో నిర్ణయం తీసుకోవాలి. - ప్రసాద్రెడ్డి, ట్రాన్స్కో ఎస్ఈ -
మామూళ్లిస్తేనే..
- రైతులకు తప్పని ట్రాన్స్ఫార్మర్ కష్టాలు - డబ్బు ఇవ్వనిదే స్పందించని సిబ్బంది - నూతన ట్రాన్స్ఫార్మర్లకోసం ఎదురు చూపులు - పెండింగ్లో 2 వేల దరఖాస్తులు నెల్లూరు(హరనాథపురం): విద్యుత్ సరఫరాలో కీలకమైన ట్రాన్స్ఫార్మర్ మరమ్మతులకు గురైతే రైతులకు చుక్కలు కనిపిస్తున్నాయి. జిల్లాలో 11,316 సింగిల్ ఫేస్, 23,928 త్రీఫేస్ ట్రాన్స్ఫార్మర్లు ఉన్నాయి. కాలిపోయినప్పుడు వెం టనే మార్చేందుకు రోలింగ్ పేరుతో నాలుగు శాతం ట్రాన్స్ఫార్మర్లను సిద్ధంగా ఉంచాల్సి ఉండగా ప్రస్తుతం అవి 2.3 శాతం మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఒక్కో ట్రాన్స్ఫార్మర్ విలు వ రూ.75 వేలు నుంచి రూ.లక్ష వర కు ఉంటుంది. ప్రతి నెలా జిల్లాలో సుమారు 500 ట్రాన్స్ఫార్మర్లు కాలి పోతుంటాయి. ఒక్క నెల్లూరు డివిజ న్లోని వీటి సంఖ్య నెలకు 180 వర కు ఉంటుంది. కాలిపోయిన ట్రాన్స్ఫార్మర్లకు మరమ్మతులు చేసేందుకు ట్రాన్స్కో ఆధ్వర్యంలో నెల్లూరు, కావలి, గూడూరు, ఆత్మకూరులో కేంద్రాలు నిర్వహిస్తున్నారు. మరో నాలుగు సెంటర్లు ప్రైవేటు రంగంలో నడుస్తున్నాయి. రైతు అవసరాలే ఆదాయ వనరు ట్రాన్స్ఫార్మర్ కాలిపోతే సంబంధిత ఏఈ దృష్టికి తీసుకెళ్లి రికార్డుల్లో నమోదు చేసుకోవాలి. రైతు ఫిర్యాదు చేసిన 48 గంటల్లో అధికారులే ప్రభుత్వ వాహనంలో మరో ట్రాన్స్ఫార్మర్ తీసుకొచ్చి అమర్చాలి. అయితే గ్రామీణ ప్రాంతాల్లో వారం రోజుల వరకు ఏర్పాటు చేయని పరిస్థితి నెలకొంది. రైతులు చందాల వేసుకుని ఏఈ, లైన్మన్, హెల్పర్ల చేయితడిపితే కాని స్పందన ఉండడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ట్రాన్స్ఫార్మర్ కాలిపోయిన సమయంలో రైతుల అవసరాన్ని బట్టి రూ.3 వేలు నుంచి రూ.12 వేలు వరకు వసూలు చేస్తున్నట్లు సమాచారం. కావలి, గూడూరు డివిజన్లలో రూ.10 వేలు వరకు, నెల్లూరు, ఆత్మకూరు డివిజన్లలో రూ.15వేల వరకు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ట్రాన్స్ఫార్మర్లను తరలించేందుకు 19 సబ్డివిజన్ల పరిధిలో మూడు వాహనాలు మాత్రమే ఉండడంతో రవాణా చార్జీలు సైతం రైతులపైనే పడుతున్నాయి. మరమ్మతు కేంద్రాల్లోనూ దందా అక్రమ వసూళ్ల దందా ట్రాన్స్ఫార్మర్ మరమ్మతుల కేంద్రాల్లోనూ సాగుతున్నట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముడుపులిచ్చిన వారికి వెంటనే కొత్తవి ఇస్తున్నారని, లేని పక్షంలో రోజుల తరబడి తిప్పుతున్నారని ఆరోపిస్తున్నారు. మరోవైపు కొత్త ట్రాన్స్ఫార్మర్ల మంజూరులోనూ తీవ్ర జాప్యం జరుగుతుండడంతో ప్రస్తుతం జిల్లాలో 2 వేల దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. వ్యవసాయానికి సరఫరా చేసే విద్యుత్ కు సంబంధించి లోఓల్టేజీ సమస్య తీవ్రంగా ఉండడంతో త్రీఫేస్ ట్రాన్స్ఫార్మర్ల కోసం రైతులు ఎదురుచూస్తున్నారు. -
మళ్లీ కోతలు షురూ..
- వానాకాలం మొదట్లోనే మొదలు.. - మండల కేంద్రాల్లో 2 గంటలు.. - సబ్స్టేషన్ పరిధిలోనూ 2గంటలు - అధికారికంగా మరింత కోత సాక్షి ప్రతినిధి, కరీంనగర్ : కరెంట్ కోతలు మళ్లీ మొదలయ్యాయి. విభజన తర్వాత వానాకాలం మొదట్లోనే కరెంట్ కష్టాలు ఎదురవుతున్నాయి. ఉత్పత్తి తగ్గిందంటూ ప్రభుత్వం విద్యుత్ కోతలు విధించేందుకు అనుమతి ఇచ్చింది. కరీంనగర్ సర్కిల్లో శుక్రవారం నుంచి కోతలను అమలులో పెట్టింది. ప్రస్తుతం వ్యవసాయానికి విద్యుత్తు అవసరం కొంత మేరకే ఉంది. అయినప్పటికీ ఉత్పత్తి తగ్గడంతో సరఫరా మెగావాట్లు తగ్గాయని, ట్రాన్స్కో నుంచి కోతలకు ఆదేశాలిచ్చారని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం గ్రామాలు, మండల కేంద్రాలు, సబ్స్టేషన్ పరిధిలోని ప్రాంతాల్లోని అన్ని వర్గాల కనెక్షన్లపై విద్యుత్ కోతలు విధిస్తున్నారు. గ్రామాల్లో అధికారికంగా ఆరు గంటలు కోత విధిస్తున్నట్లు అధికారులు చెబుతున్నా... అది ఏడు నుంచి 8 గంటలకు పైగా ఉంటుంది. గ్రామాల్లో ఆరు గంటలు జిల్లా వ్యాప్తంగా గ్రామాల్లో ఆరు గంటల విద్యుత్ సరఫరాను నిలిపివేస్తున్నారు. పలు సందర్భాల్లో రాత్రి కూడా సరఫరా నిలిపివేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ఉదయం, సాయంత్రం వేళల్లో విద్యుత్ కోతను అమలు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. అయితే పలు కారణాలు, సరఫరాలో సాంకేతిక కారణాలు అంటూ రోజూ రాత్రిపూట గంటపాటు కోత విధిస్తున్నారు. అంతేకాకుండా ఉదయం నుంచి సాయంత్రం వరకు పలుమార్లు ఎల్ఆర్ తీసుకుంటున్నారు. దీంతో గ్రామాల్లో అధికారిక కోత 6గంటలే అయినా... తీసేస్తుంది మాత్రం 8గంటల వరకు ఉంటుంది. ప్రతీసారీ విద్యుత్ కోతలకు గ్రామాలనే టార్గెట్ చేస్తున్న అధికారులు... ఈసారి కూడా పల్లెలపైనే పడ్డారు. ముందుగా పల్లెలకు విద్యుత్ సరఫరా ఆపేస్తున్నారు. పునఃప్రారంభం వేసవి నుంచి విద్యుత్ సరఫరా కొంత మెరుగ్గానే ఉంది. రబీ తర్వాత వ్యవసాయ మోటర్లు నడవడం లేదని, జిల్లాకు కావాల్సిన విద్యుత్తు సరఫరా అవుతుందంటూ నిరంతర విద్యుత్ ఇచ్చారు. అయితే గ్రామాల్లో మాత్రం అనధికారికంగా గంటో, రెండు గంటలో కోత పెట్టినా... కొద్ది రోజులకే పరిమితం చేశారు. తాజాగా శుక్రవారం మళ్లీ కరెంట్ కోతలు మొదలుపెట్టారు. విద్యుత్ ఉత్పత్తి తగ్గిందని ఎమర్జెన్నీ లోడ్ రిలీఫ్ (ఈఎల్ఆర్) తీసుకుంటున్నారు. మండలాల్లో 2గంటలు జిల్లాలోని అన్ని మండల కేంద్రాల్లో ఉదయం, సాయంత్రం వేళల్లో 2 గంటల కోత విధిస్తున్నారు. రెండు రోజుల నుంచే కోతలు అమలు చేస్తున్నా... శుక్రవారం అధికారికంగా ప్రకటించారు. అన్ని మండలాలు, డివిజన్లకు ఫోన్ సమాచారమిచ్చారు. మండల కేంద్రాల్లో అధికారికంగా 2గంటలు కోత పెడుతున్నా మరో గంటపాటు అడపాదడపా తీసేస్తున్నారు. సబ్స్టేషన్ పరిధిలో 2 గంటలు జిల్లాలోని 226 సబ్స్టేషన్ కేంద్రాల్లో అధికారిక కోత 2 గంటలు పెడుతున్నారు. ఇక్కడ కూడా అధికారిక కోతకు అదనంగా 30నుంచి 50 నిమిషాలపాటు అనధికారికంగా సరఫరా నిలిపివేస్తున్నట్లు వినియోగదారులు ఆరోపిస్తున్నారు. -
రైతులతో ట్రాన్స్కో‘మిత్రభేదం’
నిజామాబాద్ నాగారం : కరెంటోళ్లు కర్షకులతో కటీఫ్ చేసినట్లున్నారు. ఈ మధ్య రైతులతో మిత్రబేధం పాటిస్తున్నారు. ఒక్క ఫోన్కాల్ చేస్తే చాలు.. 24గంటల్లో ట్రాన్స్ఫార్మర్లను మరమ్మతులు చేసి ఇస్తామంటూ ‘రైతుమిత్ర’ పేరిట ట్రాన్స్కో ప్రారంభించిన పథకం ఆగిపోయింది. రైతుల సంక్షేమం కోసం చేపట్టిన ఈ పథకం సరిగా అమలు కాకపోవడంతో అన్నదాతలు ఇబ్బందులు పడుతున్నారు. ఎన్పీడీసీఎల్ సీఎండీ కార్తికేయమిశ్రా ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఈ పథకం ఏడాదిలోపే రెండుసార్లు నిలిచింది. తాజాగా నెలరోజుల నుంచి అమలు కావడం లేదు. ప్రతిష్టాత్మకంగా రైతుమిత్ర రైతుల ఇబ్బందులు, కష్టాలు ప్రత్యక్షంగా చూసిన సీఎండి కార్తికేయమిశ్రా ప్రతిష్టాత్మకంగా రైతుమిత్ర పథకం ప్రారంభించారు. వరంగల్ రీజియన్ పరిధిలోని వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ జిల్లాలో ఏడాదిన్నర క్రితం ప్రారంభించారు. రైతుల పంటపొలాలకు సంబంధించిన ట్రాన్స్ఫార్మర్ల మరమ్మతులు, నూతన ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాటు.. తదితర విషయాల్లో సమస్యలు తలెత్తితే ఒక్క ఫోన్కాల్తో 24గంటల్లో సమస్య పరిష్కరించడం ఈ పథకం ఉద్దేశం. ఈ పథకాన్ని రైతులు బాగానే సద్వినియోగం చేసుకున్నారు. ట్రాన్స్ఫార్మర్ చెడిపోయిన వెంటనే టోల్ఫ్రీ నంబర్- 9440811600కు ఫోన్ చేస్తే సరిపోయేది. జిల్లాలోని మారుమూల గ్రామంలో, అటవీ ప్రాంతంలో సాగుచేస్తున్న పంటపొలాల్లో నుంచి ఫోన్ చేసినా అధికార యంత్రాంగం అక్కడికి చేరుకోని సమస్యను తెలుసుకునేవారు. 24గంటల్లో రైతుల ట్రాన్స్ఫార్మర్ల సమస్యను పరిష్కరించే వారు. ఈ పథకం పనితీరు ఎలా ఉందో తెలుసుకోవడానికి సీఏండీ ప్రత్యేక శ్రద్ధ కూడా తీసుకునేవారు. నెలకు 700ట్రాన్స్ఫార్మర్ల మరమ్మతులు ట్రాన్స్ఫార్మర్ల మరమ్మత్తులకు సంబంధించి జిల్లాలో ప్రతి నెలా సుమారు 700వరకు ట్రాన్స్ఫార్మర్ల మర్మతులు అయ్యేవి. వీటిపై సీఎండీ సీరియస్ ఉండడంతో అధికారులు బాగానే పని చేశారు. గతంలో ట్రాన్స్ఫార్మర్ చెడిపోతే ఎప్పుడు బాగవుతుందో తెలియని పరిస్థితి. దాన్ని బాగు చేయాలంటే రైతులే స్వంత ఖర్చులతో దగ్గరలోని డివిజన్ కార్యాలయానికి తరలించేవారు. ఒక్కో ట్రాన్స్ఫార్మర్ బాగు చేయాలంటే అధికారులు ముడుపులు సైతం తీసుకునేవారు.ఈక్రమంలో రైతుమిత్ర పథకం వారిపాలిట వరంలా మారింది. ట్రాన్స్ఫార్మర్ చెడిపోతే అధికారులే వచ్చి..బాగుచేయించి మళ్లీ యథావిథిగా పెట్టేవారు. ఇందుకు సంబంధించి రైతుల నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకునేవారు కాదు. రవాణా సైతం ఉచితంగానే చేసేవారు. నెలకు 700వరకు ట్రాన్స్ఫార్మర్లు చెడిపోయిన 24గంటల్లో బాగు చేసి రైతులకు కష్టం కలుగకుండా చూసేవారు. రైతులకు మళ్లీ కష్టాలు రైతుమిత్ర పథకం ఆగిపోవడంతో రైతులకు మళ్లీ కష్టాలు మొదలయ్యాయి. జిల్లాలో మే నుంచి ఈ పథకాన్ని నిలిపివేశారు. గతంలో కూడా రెండు సార్లు నిలిపివేయడంతో ట్రాన్స్ఫార్మర్ మరమ్మతుల్లో అధికారులు, సిబ్బంది మళ్లీ మాముళ్లకు అలవాటు పడటంతో అధికారులు పథకాన్ని పునఃప్రారంభించారు. ఇప్పు డు నెల గడుస్తోంది.. పథకం ఎందుకు ఆపివేశారో తెలియదు. దీంతో రైతులకు మళ్లీ పాతకష్టాలు మొదలయ్యాయి. వెంటనే రైతుమిత్ర ను ప్రారంభించాలని వారు కోరుతున్నారు. తీసుకురావడానికే రెండువేలు ఖర్చు మాది మాక్లూర్ మండలం కల్లెడ. ఐదుగురు రైతులం కలిసి ఒక ట్రాన్స్ఫార్మర్ను పొలంలో ఏర్పాటు చేసుకున్నాం. రెండు నెలల కిందట అది చెడిపోవడంతో రైతుమిత్ర ద్వారా ఎలాంటి ఖర్చు లేకుండా మరమ్మతులు చేసి ఇచ్చారు. ఇప్పుడు మళ్లీ చెడిపోయింది. రైతుమిత్ర పథకం లేదని చెప్పడంతో మేమే రూ. రెండువేలు రవాణా ఖర్చులు భరించి తీసువచ్చాం. -గంగారెడ్డి, రైతు -
ఎట్టకేలకు.. వెలుగు
ఎట్టకేలకు.. కార్పొరేషన్లో వెలుగు నెల్లూరు(అర్బన్), న్యూస్లైన్: ఎట్టకేలకు బుధవారానికి నెల్లూరు కార్పొరేషన్కు విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. ఏదైతేనేం ట్రాన్స్కో తన పంతాన్ని నెగ్గించుకొంది. నెల్లూరు నగర పాలక సంస్థకు, విద్యుత్ శాఖకు మధ్య ఓ విధంగా ప్రచ్ఛన్న యుద్ధమే జరుగుతోంది. రెండు శాఖల మధ్య సమన్వయం కుదరకపోవడంతో దాని ప్రభావం కార్పొరేషన్పై పడింది. దీంతో కార్పొరేషన్ కార్యాలయానికి విద్యుత్ సరఫరా నిలిపివేశారు. సుమారు మూడు వారాల క్రితం కార్పొరేషన్ కార్యాలయానికి విద్యుత్ సరఫరా నిలిపివేశారు. పాత బకాయిలన్నీ పేరుకుపోయి వడ్డీలు పెరిగి కార్పొరేషన్ కరెంటు బిల్లు బకాయి సుమారు రూ.24 కోట్లకు చేరింది. పాతబకాయిలు చెల్లించాలంటూ ఇటీవల పలు దఫాలుగా నోటీసులు జారీ చేశారు. ఫలితం లేకపోవడంతో తొలుత కార్పొరేషన్ కార్యాలయానికి విద్యుత్ సరఫరా నిలిపివేశారు. బుధవారం కొంతమొత్తం చెల్లించడంతో ఎట్టకేలకు కార్యాలయానికి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. పలు దఫాలుగా కార్పొరేషన్ అధికారులు తిరుపతిలోని ట్రాన్స్కో సీఈని కలిసినట్టు సమాచారం. తొలుత రూ.50 లక్షలు బిల్లు చెల్లిస్తామని, విద్యుత్ సరఫరా పునరుద్ధరించాలని కోరారని తెలిసింది. అయితే వారు ససేమిరా అన్నట్టు సమాచారం. మరోసారి కలిసినప్పుడు 12 వాయిదాలకు అవకాశం ఇచ్చినట్టు తెలుస్తోంది. అయితే వాయిదాకు రూ.2 కోట్లు చొప్పున చెల్లించాలని షరతు విధించారని సమాచారం. అయితే కార్పొరేషన్ ఖజానా ఖాళీ అయి పోవడంతో అధికారులకు ఏమిచేయాలో పాలుపోవడంలేదు. నెల్లూరు మున్సిపాలిటీ చరిత్రలో కరెంటు బిల్లు కట్టలేని దుస్థితి నెలకొనడం ఇదే ప్రథమం. ఓ విధంగా నగర పాలక సంస్థ పరువు వీధిన పడినట్టైంది. ఇదిలా ఉండగా జనరల్ ఫండ్ అకౌంట్ను హోల్డ్లో ఉంచారని సమాచారం. ఈ అకౌంట్ నుంచి ఎలాంటి చెల్లింపులు జరగకుండా నిలిపివేశారని తెలిసింది. మొదటి వాయిదా బిల్లు చెల్లించేందుకే ఈ అకౌంట్ నుంచి చెల్లింపులు నిలిపివేశారని తెలుస్తోంది. బుధవారం రూ.2.17 కోట్లకు చెక్కు ఇవ్వడంతో సాయంత్రం విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. దీంతో కార్పొరేషన్ కరెంటు కథ సుఖాంతమైంది. సబ్స్టేషన్ వివాదమే కారణమా.. నవాబుపేట సబ్స్టేషన్ను పగలకొట్టిన ఉదంతాన్ని దృష్టిలో ఉంచుకుని ట్రాన్స్కో అధికారులు కరెంటు బిల్లు విషయంలో ఈ విధంగా వ్యవహరిస్తున్నట్టు తెలుస్తోంది. సబ్స్టేషన్ను పగలకొట్టిన వివాదంలో నగర పాలక సంస్థలోని టౌన్ప్లానింగ్ విభాగం చైన్మన్లపై ట్రాన్స్కో కేసులు పెట్టింది. అదే విధంగా విద్యుత్ బిల్లుల కోసం చర్చించేందుకు వచ్చే ట్రాన్స్కో అధికారులకు కార్పొరేషన్ ఉన్నతాధికారులు కనీస మర్యాద కూడా ఇవ్వరనే ఆరోపణ కూడా ఉంది. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకుని ట్రాన్స్కో అధికారులు కొరడా ఝుళిపించారని సమాచారం. రెండు శాఖల అధికారుల మధ్య సమన్వయ లోపంతో కార్పొరేషన్ రూ.లక్షల్లో ప్రజాధనం నష్టపోయింది. -
లోడ్.. రిలీఫ్
తగ్గుముఖం పట్టిన వ్యవసాయ విద్యుత్ వినియోగం గత నెలతో పోలిస్తే రెండు మిలియన్ యూనిట్లు తగ్గుదల ఊపిరి పీల్చుకుంటున్న అధికార యంత్రాంగం క్రమంగా పెరుగుతున్న గృహ విద్యుత్ వినియోగం పరిశ్రమలకు పవర్ హాలిడే నుంచి మినహాయింపు నల్లగొండ, న్యూస్లైన్ : రబీ గండం గట్టెక్కింది. వ్యవసాయానికి విద్యుత్ వినియోగం రోజురోజుకూ తగ్గుతుండడంతో ట్రాన్స్కో ఊపిరి పీల్చుకుంది. వారం రోజులుగా నాన్ ఆయకట్టులో వరికోతలు ఊపందుకోవడంతో విద్యుత్ వినియోగం గణనీయంగా తగ్గిపోయింది. గత వారం రోజుల్లో వ్యవసాయ అవసరాలకు విద్యుత్ వినియోగం సగానికి సగం పడిపోయింది. ఏప్రిల్ 30వ తేదీన జిల్లాలోని అన్ని అవసరాలకు 14.57 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం కాగా అది కాస్తా శుక్రవారానికి 12.67 మిలియన్ యూనిట్లకు చేరింది. వారం రోజుల వ్యవధిలో రెండు మిలియన్ యూనిట్లు మేరకు విద్యుత్ వినియోగం తగ్గిపోయింది. ఇదిలా ఉంటే పంటల సాగుకోసం జిల్లాలో ఏడు మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగించే పరిస్థితి నుంచి క్రమేణా సగానికి తగ్గిపోయింది. రబీ సీజన్లో రోజుకు 17.62 మిలియన్ యూనిట్ల విద్యుత్ కేటాయించినా ఎటూ సరిపోకపోవడంతో కోతలు విధించిన విషయం తెలిసిందే. దీంతో రైతులు పంటలు కాపాడుకునేందుకు రేయింబవళ్లు శ్రమించాల్సి వచ్చింది. మార్చి, ఏప్రిల్లో పరిశ్రమలకు కోత విధించి వ్యవసాయానికి వీలైనన్ని ఎక్కువ గంటలపాటు విద్యుత్ సరఫరా చేసే ప్రయత్నాలతో పెద్దగా వివాదాలేవీ లేకుండానే సీజన్లో పంటలను కాపాడగలిగారు. ఇదిలా ఉంటే ఓ వైపు వ్యవసాయ విద్యుత్ వినియోగం తగ్గిపోతుండగా, మరోవైపు గృహ విద్యుత్ వినియోగం పెరిగిపోతుంది. ఊపిరి పీల్చుకున్న యంత్రాంగం... ప్రస్తుతం జిల్లాలో విద్యుత్ వినియోగం పూర్తిగా అదుపులోకి వచ్చిందని చెప్పొ చ్చు. వ్యవసాయానికి విద్యుత్ వాడకం తగ్గిపోవడంతో గృహ అవసరాలకు ఎలాంటి కోతలు పెట్టడం లేదు. తప్పని పరిస్థితుల్లో మాత్రమే పై నుంచి కోత విధిస్తున్నారు. ఈ నెలలో ఇప్పటి వరకు ఎలాంటి కోతలు లేకుండానే విద్యుత్ సరఫరా చేసినట్లు అధికారులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే గతంలో పరిశ్రమలకు ప్రతి శుక్రవారం పవర్ హాల్డే అమలుచేశారు. కానీ ప్రస్తుతం విద్యుత్ వాడకం తగ్గిపోవడంతో ప్రతి శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే కోత విధిస్తున్నారు. దీనిని 8వ తేదీ నుంచి అమలు చేస్తున్నారు. అంతకుముందు ఉదయం 6 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు కోత అమల్లో ఉన్న సంగతి తెలిసిందే. తగ్గిన విద్యుత్ వినియోగం.. గత నెలతో పోలిస్తే ఈ నెలలో విద్యుత్ వినియోగం భారీగా తగ్గిపోయింది. ఏప్రిల్లో జిల్లాకు రోజూ 17.62 మిలియన్ యూనిట్లు కేటాయించగా 16.62 మిలియన్ యూనిట్లు వినియోగించారు. ఈ నెల మొదటి, రెండో వారాల్లో కేటాయించిన కోటాకు మించి కూడా విద్యుత్ వాడకం జరిగింది. కానీ వ్యవవసాయ పనులు పూర్తయ్యే చివరి వారంలో మాత్రం విద్యుత్ వాడకం 15 నుంచి 14.57 మిలియన్ యూనిట్లకు చేరింది. ఇక వ్యవసాయ పనులు పూర్తిస్థాయిలో తగ్గుముఖం పట్టడంతో ఈ నెల మొదటి వారంలో 13 మిలియన్ యూనిట్లకు చేరింది. రోజురోజుకూ విద్యుత్ వాడకం తగ్గుతుండడంతో శుక్రవారం నాటికి 12.67 మిలియన్ యూనిట్లకు చేరింది. వేసవి ఉక్కుపోత ఎక్కువగా ఉండడంతో గృహవసరాలకు విద్యుత్ వినియోగం పెరిగింది. ఎండలు భరించలేక ఎయిర్ కూలర్లు, ఎయిర్ కండీషనర్ల వాడకం పెరిగింది. గతంతో పోలిస్తే ఈ సీజన్లో విద్యుత్ కొరత సమస్యలు పెద్దగా తలెత్తలేదని చెప్పొచ్చు. -
తెలంగాణ జెన్కో, ట్రాన్స్కోలను ఏర్పాటు చేయండి
గవర్నర్ కార్యాలయం నుంచి ఆదేశాలు సాక్షి, హైదరాబాద్: రాష్ర్ట విభజన నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేకంగా జెన్కో, ట్రాన్స్కో సంస్థలను ఏర్పాటుచేయాలని గవర్నర్ కార్యాలయం నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ మేరకు గవర్నర్ సలహాదారు నుంచి జెన్కో, ట్రాన్స్కో యాజమాన్యాలకు లేఖలు అందినట్టు తెలిసింది. ఇందుకనుగుణంగా కొత్త సంస్థల ఏర్పాటుకు ఆయా యాజమాన్యాలు చర్యలు తీసుకుంటున్నాయి. వాస్తవానికి కొత్త వాటిని ఏర్పాటుచేయాలంటే కేబినెట్ ఆమోదం తప్పనిసరి. కంపెనీ లక్ష్యాలు, ఉద్దేశాలకు కేబినెట్ ఆమోదం తెలిపిన తర్వాతే వాటిని రిజిస్టర్ చేయాల్సి ఉంటుంది. అందువల్ల తెలంగాణలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రత్యేకంగా కంపెనీలు ఏర్పాటుచేసుకోవాలని మొదట్లో భావించారు. అయితే, ప్రస్తుతం రాష్ర్టపతి పాలన నేపథ్యంలో గవర్నర్ ఆమోదం తెలిపితే కేబినెట్ ఆమోదం తెలిపినట్టేనని న్యాయనిపుణులు పేర్కొంటున్నారు. దీంతో తాజాగా తెలంగాణకు ప్రత్యేక కంపెనీలను ఏర్పాటు చేయాలని ఆదేశిస్తూ గవర్నర్ కార్యాలయం అన్ని ప్రభుత్వరంగ సంస్థలు, కంపెనీలకు లేఖలు రాసినట్టు తెలిసింది. -
కర్ణాటక తీరు చట్టవిరుద్ధం
హైకోర్టులో ట్రాన్స్కో పిటిషన్ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రానికి 500 మెగావాట్ల విద్యుత్ సరఫరా కాకుండా అడ్డుకున్న కర్ణాటక ప్రభుత్వంపై ట్రాన్స్కో న్యాయ పోరాటానికి దిగింది. జాతీయ విద్యుత్ చట్టం-2003 స్ఫూర్తికి విరుద్ధంగా కర్ణాటక వ్యవహరిస్తోందంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. కర్ణాటకలోని జేఎస్డబ్ల్యూ, శాలివాహన తదితర సంస్థల నుంచి 500 మెగావాట్ల విద్యుత్ను రాష్ట్రంలోని విద్యుత్ సంస్థలు కొనుగోలు చేస్తున్నాయి. 2013 జూన్ నుంచి 2014 ఏప్రిల్ 30 వరకు విద్యుత్ సరఫరా చేసేందుకు ఒప్పందం చేసుకున్నాయి. ఈ ఏడాది మార్చి వరకు రాష్ట్రానికి విద్యుత్ సరఫరా జరిగింది. అయితే, ఏప్రిల్ 1 నుంచి విద్యుత్ సరఫరా కాకుండా కర్ణాటక అడ్డుకుంది. ఇందుకోసం జాతీయ విద్యుత్ చట్టం-2003లోని సెక్షన్ 11ను ప్రయోగించింది. ఈ సెక్షన్ ప్రకారం భూకంపాలు, ప్రకృతి వైపరీత్యాలు వంటి అత్యవసర సందర్భాల్లో విద్యుత్ను ఉత్పత్తి చేయాలని ఆదేశించే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుంది. కానీ, ఇలా ఉత్పత్తి చేసిన విద్యుత్ను సొంత రాష్ట్రానికే సరఫరా చేయాలని ఆదేశించే అధికారం మాత్రం లేదు. నిజానికి ఒక రాష్ట్రంలో ఉత్పత్తి చేస్తున్న విద్యుత్ను అదే రాష్ట్రానికి ఇవ్వాలంటూ ప్రైవేట్ విద్యుత్ ప్లాంట్లను (ఐపీపీ) శాసించే అవకాశం లేదని కేంద్ర ప్రభుత్వం కూడా ఇప్పటికే స్పష్టం చేసింది. ఏ రాష్ట్ర ప్రభుత్వం ఆ రాష్ట్రానికే పరిమితమై ఆలోచిస్తే దేశవ్యాప్తంగా విద్యుత్ సరఫరా దెబ్బతింటుందని అభిప్రాయపడిం ది. ఇవే విషయాలను పేర్కొంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా, విచారణకు స్వీకరించినట్టు ట్రాన్స్కో వర్గాలు తెలిపాయి. -
30 గంటలుగా కరెంటు లేదు !
భీమ్గల్, న్యూస్లైన్ : ‘వ్యవసాయానికి ఏడు గంటల విద్యుత్ సరఫరా చేస్తామన్నారు.. దాన్ని ఐదు గంటలకు కుదించారు.. ఇదన్నా సక్రమంగా ఇస్తున్నారా అంటే అదీ లేదు. మా ఊర్లో 30 గంటలుగా కరెంటు లేదు. అసలు పంటలు ఉంటాయా..’ అంటూ జాగిర్యాల గ్రామ రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం భీమ్గల్ పట్టణ శివారులోని విద్యుత్ సబ్స్టేషన్ వద్దకు గ్రామానికి చెందిన రైతులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్భంగా వారు ట్రాన్స్కో అధికారుల తీరుకు నిరసనగా సబ్స్టేషన్ ఎదుట బైఠాయించారు. విషయం తెలుసుకుని వచ్చిన ఏఈ అశోక్ను నిలదీశారు. పొట్ట దశలో ఉన్న పంటలు నీరు లేక ఎండిపోతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. పక్క గ్రామాలకు ఉంటున్న విద్యుత్ తమ గ్రామానికి ఎందుకు ఉం డడం లేదని ప్రశ్నించారు. ఏ నుంచి సి, బి నుంచి డి గ్రూపుల మధ్యన విద్యుత్ వేళలు షిఫ్టింగ్ సమయం లో ఇలా జరిగిందని ఏఈ తెలిపారు. సరిగ్గా అదే స మయంలో పైనుంచి విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో అంతరాయం ఏర్పడిందన్నారు. ఇక ముందు అలా జరగకుండా చూస్తామని హామీ ఇచ్చారు. ఆందోళనలో గ్రామ ఉప సర్పంచ్ చిన్నోల్ల నవీన్, మాజీ ఉప సర్పంచ్ సంగెం రాజేశ్వర్, రైతులు కల్లెడ దేవేందర్, చిన్నోల్ల సురేష్, బొంగు రాజేశ్వర్ గౌడ్, కల్లెడ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
ఊరంతా షాక్
భీతిల్లిన మైలారం వాసులు ‘సింగిల్ ఫేజ్’ ట్రాన్స్ఫార్మర్ ఎర్తింగ్ లోపమే కారణం పలువురికి గాయాలు వర్గల్, న్యూస్లైన్: వర్గల్ మండలం మైలారం గ్రామం ఆది వారం విద్యుత్ షాక్కు గురైంది. ఇంట్లో స్విచ్ బోర్డులు, సిమెంట్ గోడలు, టీవీ స్విచ్లు ఇలా వేటిని తాకినా షాకిచ్చాయి. పలువురికి గాయాలయ్యాయి. సాయంత్రం ఆరుగంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. కాలనీ ప్రజలు ఒక్కసారిగా భీతిల్లిపోయారు. గ్రామస్థులు తెలి పిన వివరాల ప్రకారం... మజీద్ సమీప సింగిల్ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్ ద్వారా విద్యుత్ సరఫరా అయ్యే ఇళ్లల్లో ఆదివారం హైఓల్టేజీ సరఫరా అయ్యింది. దీంతో గోడలు, స్విచ్లు తాకినా కాలనీ వాసులు షాక్కు గురయ్యారు. ఇదే పరిస్థితిలో దండు లక్ష్మి, సింగారం నాగరాజు, నరేష్గౌడ్, అశోక్ తదితరులు షాక్ తగిలి త్రుటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. ట్రాన్స్కో క్యాజువల్ సిబ్బంది స్వామికి స్థానికులు ఫోన్ ద్వారా సమాచారం చేరవేయడంతో ఆయన వెంటనే గ్రామానికి చేరుకున్నారు. విద్యుత్ సరఫరా నిలిపేసి ఎర్తింగ్ లోపాన్ని సరిచేయడంతో ఊపిరి పీల్చుకున్నారు. ట్రాన్స్ఫార్మర్ ఎర్తింగ్కు నీటి తడి తగ్గడంతో హైఓల్టేజీ సరఫరా జరిగిందని స్వామి తెలిపారు. -
పేలిన ట్రాన్స్ఫార్మర్
అమలాపురం రూరల్, న్యూస్లైన్ : అమలాపురం సమీపంలోని ఈదరపల్లి వంతెన వద్ద రోడ్డు పక్కగా ఉన్న ఓ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ బుధవారం ఉదయం 8గంటల సమయంలో అకస్మాత్తుగా పేలిపోయింది. ఈ దుర్ఘటనలో భార్యాభర్తలు గాయపడ్డారు. వివరాలు ఇలా ఉన్నాయి. ట్రాన్స్ఫార్మర్ పేలే సమయానికి అటుగా వెళుతున్న భార్యాభర్తలు కూతాడి ముకుంద్, పెద్దింట్లమ్మ ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. ఇంటినుంచి అల్పాహారం నిమిత్తం హోటల్కు వెళుతున్నపుడు వీరీ ప్రమాదం బారిన పడ్డారు. పేలిన ట్రాన్స్ఫార్మర్ నుంచి మంటలతో కూడిన మరుగుతున్న చమురు వీరిపై పడింది. ముకుంద్ స్వల్ప గాయాలతో తప్పించుకోగా పెద్దింట్లమ్మ తీవ్రంగా గాయపడింది. ఆమె వీపు భాగం మంటల్లో చిక్కుకోగా హాహాకారాలు చేస్తూ పరుగులు తీసింది. స్థానికంగా పనిచేస్తున్న జట్టు కూలీలు ఆమెపై ఇసుక పోసి, గోనెసంచులు కప్పి రక్షించారు. సర్పంచ్ నక్కా సంపత్కుమార్ వారిని 108 అంబులెన్స్లో ఏరియా ఆస్పత్రికి తరలించారు. పెద్దింట్లమ్మ పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో మెరుగైన వెద్యం కోసం ఆమెను కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ట్రాన్స్కో డీఈ చలపతిరావు, ఏఈ ఎం.సతీష్ సంఘటన స్థలానికి వచ్చి పరిస్థితి సమీక్షించారు. 70 శాతం పైగా శరీరం కాలిపోగా పెద్దింట్లమ్మ పరిస్థితి విషమంగా ఉందని కాకినాడ వైద్యులు చెబుతున్నారు. ఇళ్లల్లో పనులు చేసుకుని బతికే పెద్దిం ట్లమ్మ ఈ ెప్రమాదానికి గురవడంతో కుటుంబసభ్యులు తల్లడిల్లుతున్నారు. తప్పిన పెను ప్రమాదం ప్రమాదం జరిగిన సమయంలో జన సంచారం లేకపోవడం వల్ల పెనుప్రమాదం తప్పిందని స్థానికులు చెబుతున్నారు. ఈ ట్రాన్స్ఫార్మర్ ఉన్న ప్రాంతంలోనే స్కూల్ బస్సులను ఆపి విద్యార్థులను ఎక్కించుకుంటారని, అయితే బంద్ కారణంగా బుధవారం దుకాణాలు మూసి ఉన్నాయని, విద్యార్థులూ లేరని తెలిపారు. ఈ ట్రాన్స్ఫార్మర్లో ఆయిల్ లీకేజీపై ట్రాన్స్కో అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని గ్రామస్తులు ఆరోపించారు.ట్రాన్స్ఫార్మర్లో ఉండే గ్యాస్ వల్ల పేలుడు సంభవించి ఉండవచ్చని ట్రాన్స్కో అధికారులు అంటున్నారు. పేలిపోయిన ట్రాన్స్ఫార్మర్ శకలాలను పరిశీలన కోసం రాజమండ్రి విద్యుత్ కార్యాలయానికి పంపుతున్నామని పేర్కొన్నారు. కాగా బాధితులను శాఖ తరఫున ఆదుకుంటామని డీఈ చలపతిరావు హామీ ఇచ్చారు. -
లోవోల్టేజీపై రైతన్నల ఆగ్రహం
సిద్దిపేట రూరల్, న్యూస్లైన్: సాగుకు ఆటంకంగా మారుతున్న లోవోల్టేజీ సమస్యను అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని, మోటర్లు కాలిపోతున్నా పట్టించుకోవడం లేదని ఆగ్రహించిన రైతన్నలు విద్యుత్ అధికారులను నిర్భందించారు. సమస్య పరిష్కరించేంత వరకూ విడిచిపెట్టే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. స్థానికంగా చర్చనీయాంశమైన ఈ సంఘటన సిద్దిపేట మండలం బుస్సాపూర్లో మంగళవారం చోటు చేసుకుంది. రైతులు తెలిపిన వివరాల ప్రకారం...గ్రామంలో లోవోల్టేజీ సమస్యతో గత కొంతకాలంగా మోటర్లు కాలిపోతున్నాయి. ఈ విషయాన్ని విద్యుత్ అధికారులకు తెలిపినప్పటికీ సరైన చర్యలు తీసుకోలేదు. దీంతో ఆగ్రహించిన రైతన్నలు మంగళవారం గ్రామానికి వచ్చిన విద్యుత్ లైన్మెన్ మొహినోద్దిన్, కాంట్రాక్టు సిబ్బంది రవిలను నిలదీశారు. సమస్య పరిష్కారానికి వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. అయితే అందుకు ట్రాన్స్కో సిబ్బంది సరైన సమాధానం ఇవ్వకపోవడంతో వారిద్దరినీ మధ్యాహ్నం 12 గంటలకు గ్రామస్తులంతా స్థానిక పంచాయతీ కార్యాలయంలో నిర్బంధించారు. విషయం తెలుసుకున్న రూరల్ ఏఈ హుస్సేన్ సంఘటన స్థలానికి చేరుకుని గ్రామస్తులను శాంతింపజేసే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం కనిపించలేదు. పరిస్థితిని క్షేత్రస్థాయిలో పరిశీలించి చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేయడంతో...ట్రాన్స్కో ఏఈ వ్యవసాయ క్షేత్రాలను పరిశీలించి విద్యుత్ లోడును తనిఖీ చేశారు. లోడు ఎక్కువగా ఉన్నందున మిరుదొడ్డి మండలం గుడికందుల ఫీడర్కు బుస్సాపూర్ గ్రామ వ్యవసాయ మోటార్లను అనుసంధానం చేస్తానని ఏఈ హామీ ఇవ్వడంతో శాంతించిన గ్రామస్తులు 5 గంటల తర్వాత నిర్బంధించిన విద్యుత్ సిబ్బందిని విడిచిపెట్టారు. -
ల్యాప్టాప్కు బీమా లేకపోతే జీతం కట్!
ట్రాన్స్కో సిబ్బందికి అధికారుల మెమోలు సాక్షి, హైదరాబాద్: మీరు కంప్యూటర్ కొన్నారా...? అయితే, దానికి బీమా చేయించలేదా..? అయితే, మీ జీతం కట్ చేస్తాం..! మీ మీద క్రమశిక్షణాచర్యలు తీసుకుంటాం!! ఏంటి కంప్యూటర్కు బీమా చేయించకపోతే ఏకంగా క్రమశిక్షణ చర్యలా అని వాపోతున్నారా..? అవునండీ.. ట్రాన్స్కోలో ఇప్పుడు ఇదే జరుగుతోంది. ట్రాన్స్కో ఇచ్చిన రుణంతో కంప్యూటర్ కొనుగోలు చేసి... బీమా చేయించకపోతే జీతంలో కోత విధిస్తామని, చర్యలు తీసుకుంటామని సిబ్బందికి ట్రాన్స్కో అధికారులు మెమోలు జారీచేస్తున్నారు. ఈ విధంగా సుమారు వంద మందికిపైగా ఉద్యోగులకు వారం రోజుల క్రితం మెమోలు జారీ అయినట్టు సమాచారం. అయితే, రూ. 50 వేలు పెట్టి కంప్యూటర్ కొనుగోలు చేస్తే... బీమా చేయించేందుకు ఏడాదికి 2 వేలు ఖర్చు చేయాల్సి వస్తుందని ఉద్యోగులు వాపోతున్నారు. -
ఉద్యోగాలు అమ్మబడును
సాక్షి ప్రతినిధి, కడప: దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలనే తలంపుతో అధికారపార్టీ నేతలున్నారు. అందుకు తగ్గట్టుగా సహకారం అందించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. ప్రభుత్వ నిబంధనలు కాదని కాంట్రాక్టులు మొదలుకుని ఉద్యోగాల వరకు కోరుకున్న వారికి అప్పగిస్తూ స్వామిభక్తి ప్రదర్శిస్తున్నారు. పారదర్శకతతో చేపట్టాల్సిన నియామకాలలో అధికార పార్టీ నేతల సిఫార్సు, అనుకున్న మేరకు ధనం చేకూరితే నకిలీ సర్టిఫికెట్లకు సైతం ఉద్యోగాలు అప్పగిస్తున్నారు. జిల్లాలోని అధికారుల శైలి పాలకపక్ష పార్టీ నాయకులకు కల్పతరువుగా మారింది. తాజాగా ట్రాన్స్కో యంత్రాంగానికి ఆ జాబితాలో చోటు దక్కింది. రేయ్.. అబ్బీ ఎందాక చదువుకున్నావ్... పాపం ఎన్ని రోజులని ఈసేద్యపు పనులతో కష్టపడతావ్... మన ఊరిలో సబ్స్టేషన్ ఆపరేటర్గా వెళ్తావా! నేను మాట్లాడి ఉద్యోగం ఇప్పిస్తాను... సరేన్నా! నేను 10 మాత్రమే పాస్ అయ్యా... దానికి ఐటీఐ ఎలక్ట్రిషియన్ చదివి ఉండాలంట కదా..? అదంతా నేను చూసుకుంటాలే.. అధికారంలో ఉండగా ఇట్లాంటి చిన్న పనులు కూడా చేయించుకోలేమా! ఏందీ... సరేన్నా నీ ఇష్టం. ఇది గ్రామీణ నాయకులు నిరుద్యోగుల మధ్య కొన్ని రోజులుగా జరుగుతున్న సంభాషణ.. అంతలోనే రెండురోజులు గడిచాక... నువ్వు చెప్పింది నిజమేబ్బీ... ఐటీఐ చదివిండాలంటా! సరే నేను ఒక మాట చెబుతా వింటావా...ఏమీ లేదు. ఐటీఐ సర్టిఫికెట్టు నీపేరుతో నేనే తీసుకువస్తా.. ట్రాన్సుకో ఆఫీసర్లను మేనేజ్ చేయాలా. వాళ్లు రెండు లక్షలు అడుగుతాండారు... నువ్వు రెడీ అంటే చూడూ...ఉద్యోగం నీదే. అయినా పెద్దకారు పైరు దిగుబడే కదా... ఆలోచించు నువ్వు సిద్ధమైతే నేను రెడీ... సరేలేన్నా.. ఎంత కాలమని ఇట్లానే ఉండాలా... నేను ఆలెక్క తెస్తానుగానీ నువ్వు మాట్లాడి నాకే ఉద్యోగం ఇప్పించున్నా... ఈ సంభాషణలు జిల్లాలో ఇటీవల జోరుందుకున్నాయి. అందుకు నిదర్శనంగానే ట్రాన్స్కోలో నియమాకాలు జరుగుతున్నాయి. పైరవీలకే ప్రాధాన్యం కమలాపురం మండలం కుప్పూరివారిపల్లె సబ్స్టేషన్ను ఇటీవల ప్రారంభించారు. అందులో నలుగురు ఆపరేటర్లు, ఒక వాచ్మెన్ పోస్టును భ ర్తీ చేశారు. ఆపరేటర్ పోస్టుకు ఐటీఐ ఎలక్ట్రీ షియన్ పూర్తి చేసి ఉండాలనేది కనీస నిబంధన. స్థానిక నాయకుడు అధికారపార్టీకి చెందిన ఎమ్మెల్యే సిఫార్సు లెటర్ తెచ్చుకున్నారు. నకిలీ సర్టిఫికెట్లు సృష్టించి నలుగురు ఆపరేటర్ల పోస్టులలో తన వారిని నియమించుకున్నాడు. అధికార పార్టీ ఎమ్మెల్యే సిఫార్సు, లక్షలో నగదు వస్తుండటంతో ఆలస్యం చేయకుండా ట్రాన్స్కో యంత్రాంగం ఉద్యోగాలను కట్టబెట్టింది. సర్టిఫికేట్లు నకిలీనా..! ఒరిజినలా అని చూడకుండా ఉద్యోగాలను కట్టబెట్టారు. ట్రాన్సుకో పేరు చెప్పి గ్రామీణ నాయకుడు సందిట్లో సడేమియా అన్నట్లుగా ఒక్కొక్కరి నుంచి రూ. 2లక్షలు వసూలు చేసి జేబులో వేసుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవల జిల్లాలో 17 సబ్సేష్టన్లను నూతనంగా నిర్మించారు. వాటిల్లో సుమారు 85 మందిని (ఆపరేటర్లు, వాచ్మెన్లు) ఉద్యోగాలలో నియమించారు. ప్రతి సబ్స్టేషన్ లోనూ స్థానిక నాయకుల పైరవీలకే ప్రాధాన్యత ఇస్తూ నియామకాలు చేశారు. ఈమొత్తం వ్యవహారంలో దాదాపు రూ. కోటికి పైగా చేతులు మారినట్లు తెలుస్తోంది. వెరిఫికేషన్ ఏదీ..! గతంలో సబ్స్టేషన్ ఆపరేటర్ల నియామకాలను స్థానిక ట్రాన్స్కో ఏడి స్థాయి అధికారి చేసేవారు. కాలక్రమేణా అధికార పార్టీ నేతల పైరవీలతో గ్రామస్థాయి నేతలు తమ అనుచరులకు ఉద్యోగాలు ఇప్పించుకుంటున్నారు. ఆశాఖ ఉన్నతాధికారి జోక్యంతో ఇటీవల ఇబ్బడి ముబ్బడిగా నియామకాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అధికార పార్టీ నేతల పైరవీ లేఖలతో పాటు, నగదు ముట్టజెప్పకపోతే నియామకాలు చేపట్టడంలేదనే ఆరోపణలు ఉన్నాయి. ఈక్రమంలో నకిలీ సర్టిఫికేట్లు ఉన్నా ఏమాత్రం పట్టించుకోవడంలేదని తెలుస్తోంది. వాస్తవానికి ఉద్యోగాలు పొందిన అభ్యర్థుల సర్టిఫికెట్లను వెరిఫికేషన్ చేయాల్సి ఉంది. అటువంటి చర్యలు ఏమాత్రం తీసుకుంటున్న దాఖలాలు లేవు. ట్రాన్కో ఎస్ఈ గంగయ్య ఏమంటున్నారంటే.. నకిలీ సర్టిఫికెట్ల ఆరోపణలొస్తే విచారణ చేసి అలాంటి వారిని తొలగిస్తున్నాం. పాయసంపల్లె సబ్స్టేషన్లో ఇరువురిని తొలగించాం. కప్పూరువారిపల్లె నియామకాలపై విచారణ కోసం ఆయా విద్యా సంస్థలకు పంపాం. నివేదిక రాగానే చర్యలు తీసుకుంటాం. ఇకపై ఉద్యోగాలు పొందిన ప్రతి ఒక్కరి సర్టిఫికెట్ను విచారణకు పంపుతాం. -
జెన్కోకు ట్రాన్స్ కో షాక్!
సాక్షి, హైదరాబాద్: జెన్కోకు ట్రాన్స్కో మరోసారి షాక్ ఇచ్చింది. వైఎస్సార్ జిల్లా ముద్దనూరులో ఏర్పాటు చేయతలపెట్టిన 20 మెగావాట్ల సామర్థ్యం గల సోలార్ విద్యుత్ ప్లాంటుకు విద్యుత్ సరఫరా లైన్లను (నెట్వర్క్) సమకూర్చలేమని తేల్చి చెప్పింది. దీంతో సోలార్ విద్యుత్ ప్లాంటు ప్రతిపాదనను జెన్కో విరమించుకున్నట్టు సమాచారం. ఈ జిల్లాలో ప్రైవేట్ సంస్థలు ఏర్పాటు చేయనున్న పవన, సోలార్ విద్యుత్ ప్లాంట్లకు విద్యుత్ సరఫరా లైన్లను ఇచ్చేందుకే జెన్కోను పక్కన పెట్టారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. నిజానికి సోలార్ విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటులో మొదటి నుంచీ జెన్కోను పక్కన పెడుతూనే ఉన్నారు. ట్రాన్స్కో నిర్వహించిన సోలార్ విద్యుత్ టెండర్లలో జెన్కోను పాల్గొనకుండా ప్రభుత్వ పెద్దలే ఒత్తిడి తెచ్చారని అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. దీంతో ట్రాన్స్కో నిర్వహించిన సోలార్ టెండర్లలో ప్రైవేట్ సంస్థలు మాత్రమే పాల్గొన్నాయి. ఇప్పుడు వైఎస్సార్ జిల్లాలో సోలార్ విద్యుత్ ప్లాంటు ఏర్పాటుకు ముందుకు వచ్చిన జెన్కోను నెట్వర్క్ సాకుతో మరోసారి పక్కన పెడుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ముద్దనూరులో 1,050 మెగావాట్ల సామర్థ్యం కలిగిన థర్మల్ ప్లాంటును జెన్కో ఇప్పటికే ఏర్పాటు చేసింది. అక్కడే 20 మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్లాంటును కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. నెట్వర్క్ లేదనే పేరుతో దీనికి కూడా ట్రాన్స్కో ద్వారా ప్రభుత్వ పెద్దలే మోకాలడ్డారని తెలుస్తోంది. ఈ మొత్తం వ్యవహారం కేవలం ప్రైవేట్ సంస్థల లబ్ధి కోసమే నడుస్తోందని విద్యుత్రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. -
బదిలీకి డబ్బు బదిలీ!
సిద్దిపేట అర్బన్, న్యూస్లైన్: నిబంధనలకు విరుద్ధంగా విద్యుత్ శాఖలో సిబ్బందిని డిప్యుటేషన్లకు పంపుతున్నారు. ఇలా చేయడం వల్ల స్థానికంగా సమస్యలు తలెత్తుతున్నాయి. డిప్యుటేషన్పై వెళ్లిన ఉద్యోగులు మాత్రం ఎక్కడో విధుల నిర్వహిస్తూ జీతాలు మాత్రం ఇక్కడే పొందుతున్నారు. అయితే వీరికి అవగాహన లేని పనులు చేయిస్తుండడం వల్ల చాలాచోట్ల ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. బదిలీలకు సంబంధించి ఉన్నతాధికారులు ఇచ్చిన మార్గదర్శకాలను పక్కన పెట్టి ట్రాన్స్కో జిల్లా అధికారులు తమ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కొన్ని అక్రమ బదిలీలు డివిజన్ పరిధిలో జరిగితే.. మరి కొందరిని ఇతర డివిజన్లకూ బదిలీ చేశారు. వీటిలో చాలావరకు ‘చేతులు తడిపి’ తెచ్చుకున్నవే అని తెలుస్తోంది. ఈ వ్యవహారం మొత్తానికి యూని యన్ నాయకులే ప్రధాన కారణమనే ఆరోపణలూ వినిపిస్తున్నాయి. ఈ అక్రమ బదిలీలకు సంబంధించి సిద్దిపేటలోని ఈఆర్వోలో పనిచేయాల్సిన శ్రీనివాస్ యూడీసీ, అశోక్ జూనియ ర్ అసిస్టెంట్ ప్రస్తుతం డివిజన్ ఆఫీసులో వి ధులు నిర్వహిస్తున్నారు. సిద్దిపేట డివిజన్ ఆఫీసులో పనిచేయాల్సిన సలీం పాషా ప్రస్తుతం వీఆర్వోలో పనిచేస్తున్నారు. వీరే కాకుండా సిద్దిపేట డివిజన్లో పనిచేయాల్సిన శ్రీనివాస్రెడ్డి లైన్ ఇన్స్పెక్టర్ ప్రస్తుతం ఎం ఆర్టీ సిద్దిపేటలో, జేఎల్ఎం బి.శంకరయ్య ప్రస్తుతం ఎంఆర్టీ సిద్దిపేటలో, లైన్మన్ గౌస్ ప్రస్తుతం ఎంఆర్టీ సంగారెడ్డిలో, లైన్మన్ భూపతిరావు తూప్రాన్లో, లైన్ ఇన్స్పెక్టర్ రామచంద్రం జోగిపేటలో, కాంట్రాక్ట్ జేఎల్ఎం శ్రీనివాస్రావు ప్రస్తుతం తూప్రాన్లో విధులు నిర్వహిస్తున్నారు. వీరే కాకుండా అక్రమ డిప్యుటేన్లపై జిలాల్లో మొత్తం 33 మంది విధులు నిర్వహిస్తున్నట్లు సమాచారం. వీరి డిప్యుటేషన్లను రద్దు చేయాలని 2013 ఫిబ్రవరి 28న సీఎండీ అనిల్కుమార్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఎస్ఈతో పాటు డీఈలు ఎవరు ఈ ఆదేశాలను పాటించడంలేదన్న ఆరోపణలున్నాయి. నా హయాంలో ఎవరికీ ఇవ్వలేదు ఈ విషయమై సిద్దిపేట డీఈ శ్రీనివాస్రెడ్డిని వివరణ కోరగా తాను సిద్దిపేటకు వచ్చినప్పటి నుంచి ఎవరికీ డిప్యుటేషన్లు ఇవ్వలేదని తెలిపా రు. గతంలో ఇచ్చిన వాటిపై తాను జోక్యం చేసుకోనని స్పష్టం చేశారు. -
అంధకారంలో జోగిపేట
జోగిపేట, న్యూస్లైన్: గ్రామ పంచాయతీగా ఉన్న కాలం నాటి నుంచి ట్రాన్స్కో బిల్లులు చెల్లించకపోవడంతో ప్రస్తుతం అవి రూ.2.50 కోట్లు మేర పేరుకుపోయాయి. గతంలోనే ట్రాన్స్కో అధికారులు సరఫరా నిలిపివేసేందుకు సిద్ధమైనా, డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ కలుగజేసుకుని సర్దిచెప్పడంతో ఆ దిశగా చర్యలు తీసుకోలేదు. ప్రస్తుతం జోగిపేట లోని వీధి దీపాలకు సంబంధించి నగర పంచాయతీ రూ.1.21 కోట్లు, పట్టణానికి సరఫరా చేసే తాగునీటి బోరుమోటార్ల బిల్లులకు సంబంధించి రూ.1.24 కోట్లు బకాయి ఉంది. ప్రతినెల తాగునీటి బోరుమోటార్, వీధి దీపాలకుగాను రూ.15 లక్షల వరకు బిల్లులు వస్తున్నాయి. చాలా కాలంగా సర్కార్ నుంచి నిధులు రాకపోవడంతో నగర పంచాయతీ అధికారులు ఈ బిల్లులు చెల్లిం చడం లేదు. దీంతో తాజాగా ట్రాన్స్కో అధికారులు జోగిపేట, అందోల్ పట్టణాల్లో ఉన్న 32 బ టర్ఫ్లయి లైట్లకు విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. దీంతో రెండు పట్టణాల్లోనూ అంధకారం అలముకుంది. రూ. 30 లక్షలు చెల్లిస్తేనే సరఫరా ప్రస్తుతం నగర పంచాయితీ బకాయి పడి ఉన్న బకాయి బిల్లులో రూ.30 లక్షలు చెల్లిస్తే సరఫరా పునరుద్ధరిస్తాం. ఈ విషయం ఏపీసీపీడీసీఎల్ ఎస్ఈ దృష్టిలో కూడా ఉంది. నగర పంచాయతీ అధికారులు బిల్లు చెల్లింపు వ్యవహారంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. అందువల్లే సరఫరా నిలిపివేశాం. - విజయ్కుమార్, ట్రాన్స్కో డీఈ పంచాయతీ కాలం నాటి బిల్లులవి ప్రస్తుతం ట్రాన్స్కో చెల్లించాల్సిన బకాయిలో ఎక్కువ మొత్తం గ్రామ పంచాయతీ కాలం నాటిది. అప్పటి బకాయి చెల్లించమంటే మాకేం సంబంధం. అయినప్పటికీ రూ.5 లక్షలు సోమవారం చెల్లించేందుకు ఏర్పాట్లు చేశాను. 15 రోజుల్లో ప్రభుత్వం నుంచి నిధులు రాగానే బకాయి చెల్లిస్తాను. -జి.విజయలక్ష్మి, కమిషనర్, జోగిపేట పంచాయతీ -
మడకశిర మునిసిపాలిటీలో ఆర్థిక సంక్షోభం
మడకశిర, న్యూస్లైన్ : మడకశిర మునిసిపాలిటీ ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. ఆదాయం తక్కువ, వ్యయం ఎక్కువగా ఉండడమే ఇందుకు కారణం. వీధి దీపాల విద్యుత్ బిల్లులను కూడా చెల్లించలేని పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం మునిసిపాలిటీకి ఏడాదికి దాదాపు రూ.12లక్షల వరకు ఆదాయం లభిస్తోంది. ఈ నిధులు సిబ్బంది జీతాలు చెల్లించడానికే సరిపోతోంది. అభివృద్ధి పనుల కోసం ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు రూ.2 కోట్ల నిధులు మంజూరయ్యాయి. వీటితో కార్యాలయ భవన నిర్మాణానికి రూ.50 లక్షలు ఖర్చు చేయాల్సి ఉంది. మిగిలిన రూ.1.50కోట్ల నిధులతో డ్రెయినేజీ పనులు చేపట్టాల్సి ఉంది. మిగతా అభివృద్ధి పనులకు నిధులు లేవు. దీంతో వీధిదీపాలు, తాగునీటి పథకాల నిర్వహణ కష్టంగా మారింది. వీధి దీపాల విద్యుత్ బిల్లులు రూ.84 లక్షల వరకు పేరుకుపోయాయి. ట్రాన్స్కో అధికారులు నోటీసులు జారీ చేసినా ఫలితం లేదు. గత్యంతరంలేక ట్రాన్స్కో అధికారులు వీధి దీపాలకు విద్యుత్ సరఫరాను పలు సార్లు నిలిపి వేశారు. విద్యుత్ బకాయిలను చెల్లించడానికి ప్రభుత్వం నుంచి ప్రత్యేక గ్రాంట్ను మంజూరు చేయించాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. అయితే ఈ విషయాన్ని ప్రజాప్రతినిధులు పట్టించుకోవడంలేదని వాపోతున్నారు. ప్రజల జీవితాల్లో వెలుగు నింపే దీపావళి సమయంలో కూడా వీధిదీపాలకు విద్యుత్ సరాఫరా నిలిపివేశారు. ప్రజల నుంచి వ్యతిరేకత రావడంతో మునిసిపల్ అధికారులు రూ.2 లక్షలు విద్యుత్ బిల్లులను చెల్లించడంతో తాత్కాలికంగా విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు చొరవ తీసుకొని ప్రభుత్వం నుంచి ప్రత్యేక గ్రాంట్ను మంజూరు చేయించి మునిసిపాలిటీని ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. -
వ్యవసాయానికి రెండు విడతలుగా 7గంటల విద్యుత్
మిర్యాలగూడ, న్యూస్లైన్ వ్యవసాయానికి ఏడు గంటల పాటు విద్యుత్ సరఫరా చేయడానికి ట్రాన్స్కో అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఏ ఫీడర్ నుంచి ఎన్ని గంటల పాటు వ్యవసాయానికి విద్యుత్ సరఫరా అవుతుందనే విషయం తెలుసుకోవడానికి సబ్స్టేషన్లలోని ఫీడర్లకు ఎంఆర్ఐ (మీటర్ రీడింగ్ ఇన్స్ట్రమెంట్) అమర్చారు. ఎంఆర్ఐ సహాయంతో ఏ రోజు ఎన్ని గంటలు వ్యవసాయానికి సరఫరా చేశారనే విషయం తెలిసిపోతుంది. దాంతో రైతుల నుంచి ఎదురయ్యే విమర్శలతో పాటు సబ్స్టేషన్లలోని ఆపరేటర్ల అవకతవకలకు కూడా చెక్ పడే అవకాశాలున్నాయి. ఎంఆర్ఐతో సుమారు 40 రోజులకు సంబంధించిన విద్యుత్ సరఫరా వివరాలను ఒకేసారి కంప్యూటర్ సహాయంతో పరిశీలించుకునే అవకాశం ఉంది. జిల్లాలో 728 వ్యవసాయ విద్యుత్ ఫీడర్లకు ఎంఆర్ఐ మిషన్లను అమర్చారు. గతంలోనే ఈ మిషన్లు అమర్చినా వాటి ద్వారా వచ్చే వివరాలు సేకరించలేదు. కానీ ప్రస్తుతం ఖరీఫ్ సీజన్లో పుష్కలంగా విద్యుదుత్పత్తి అవుతున్నా 7 గంటల పాటు సరఫరా కావడం లేదని విమర్శలు రావడంతో రీడింగ్ పద్ధతి అమలు చేస్తున్నారు. రోజుకు 17మి.యూ. విద్యుత్ వినియోగం జిల్లాలో రోజుకు 17 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం అవుతుంది. 3,05,498 వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లుండగా గృహ వినియోగదారులు కనెక్షన్లు 7,37,298ు ఉన్నాయి. వాటితో పాటు 11వేల చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, 780 భారీ పరిశ్రమలు ఉన్నాయి. వీటన్నింటికీ 17 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం అవుతుంది. రెండు విడతలుగా సరఫరా వ్యవసాయానికి రెండు విడతలుగా విద్యుత్ సరఫరా చేస్తున్నారు. జిల్లాలోని వ్యవసాయ కనెక్షన్లను రెండు గ్రూపులుగా విభజించి వాటికి రెండు విడతలుగా సరఫరా చేస్తున్నారు. (ఎ) గ్రూపులో వారికి రాత్రి 9గంటల నుంచి 12 వరకు 3 గంటలపాటు, ఉదయం 6 నుంచి 10గంటల వరకు 4 గం టల పాటు, (బి) గ్రూపు వారికి రాత్రి 12 గంటల నుంచి 3గంటల వరకు 3గంటల పాటు, ఉదయం 10 గంటల నుంచి 2 గంటల వరకు 4 గంటల పాటు విద్యుత్ సరఫరా చేస్తున్నారు. చేతులు దులుపుకునే ప్రయత్నం వ్యవసాయానికి సబ్స్టేషన్లలో ఉండే ఫీడర్కు 7 గంటల పాటు విద్యుత్ సరఫరా చేసి ట్రాన్స్కో అధికారులు చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఫీడర్ నుంచి సంబంధిత ట్రాన్స్ఫార్మర్లకు విద్యుత్ సరఫరా కాగానే ఓవర్ లోడ్ కారణంగా ట్రాన్స్ఫార్మర్ల వద్ద విద్యుత్ ట్రిప్ అవుతుంది. అలా అయితే వారికి ఎలాంటి సంబంధమూ లేదు. ఫీడర్కు సరఫరా అయ్యే సమయాన్ని మాత్రమే లెక్కగట్టే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ట్రాన్స్ ఫార్మర్పై అనుమతి లేని మోటార్లను తొలగిం చడంతో పాటు అధిక మోటార్లు ఉన్న ట్రాన్స్ఫార్మర్ వద్ద మరో ట్రాన్స్ఫార్మర్ను మం జూరు చేసి ఓవర్ లోడ్ తగ్గించాల్సిన బాధ్యత కూడా ట్రాన్స్కో అధికారులపై ఉంది. అలా చేయకపోవడంతో ఫీడర్ వద్ద సరఫరా చేసినా ఓవర్లోడ్ కారణంగా కొన్ని చోట్ల రైతులకు 7గంటల విద్యుత్ సరఫరా కావడం లేదు. -
సీమాంధ్ర విద్యుత్ ఉద్యోగులు 72 గంటల సమ్మెకు పిలుపు
-
నేటి అర్ధరాత్రి నుంచి విద్యుత్ ఉద్యోగుల సమ్మె
-
మళ్లీ మొదలైన విద్యుత్ కోతలు
కాకినాడ: విద్యుత్ కోతలు మళ్లీ మొదలైయ్యాయి. వ్యవసాయానికి ఏడు గంటలు విద్యుత్ ఇస్తున్నామంటూ గొప్పలు చెప్పుకుంటున్న పాలకులకు వాస్తవంలో మాత్రం విద్యుత్ సమస్యలపై శ్రద్ధ చూపడం లేదు. తాజాగా కాకినాడ నగరంలో సోమవారం ఆరు గంటల పాటు విద్యుత్ కోత విధించడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురైయ్యారు. ఎమర్జెన్సీ లోడు పేరుతో విద్యుత్ కోతలు విదిస్తున్నట్లు నగర వాసులు ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉండగా, మెదక్ జిల్లాలోని ర్యాలమడుగు గ్రామంలో నెలరోజుల నుంచి కరెంటు కోతల సమస్య అధికమైంది. సరఫరా ఎప్పుడుంటుందో...ఎప్పుడు ఉండడం లేదో తెలియని పరిస్థితి. దీంతో వ్యవసాయ బోర్లు కూడా పనిచేయకపోవడంతో లక్షల రూపాయలు పెట్టుపడిపెట్టి సాగుచేస్తున్న పంటలు ఎండిపోతున్నాయి. విషయాన్ని ట్రాన్స్కో ఉన్నతాధికారులకు తెలిపినా ఫలితం లేకపోవడంతో రైతులంతా ఆగ్రహంతో ఉన్నారు. ఇదే సమయంలో శనివారం కొందరు ట్రాన్స్కో అధికారులు బిల్లుల వసూళ్లకు గ్రామానికి వచ్చారు. అప్పటికే ట్రాన్స్కో పనితీరుపై కోపంగా ఉన్న రైతులు, గ్రామస్థులు వారిని పంచాయతీ కార్యాలయంలో నిర్బంధించారు. బిల్లులు సక్రమంగా చెల్లిస్తున్నా, కోతలు ఎందుకు విధిస్తున్నారంటూ ప్రశ్నించారు. సమయం, సందర్భం లేని కరెంటు కోతలతో పంటలు ఎండిపోయాయనీ ఆవేదన వ్యక్తం చేశారు. ట్రాన్స్కో ఉన్నతాధికారులు వచ్చి అప్రకటిత కరెంటు కోతలుండవని స్పష్టమైన హామీ ఇచ్చేంతవరకూ అధికారులను విడిచిపెట్టే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు.