Devotion
-
Bhagavad Gita: అసలైన ఆస్తికులు
కొండలు, కోనలు, అడవులు, పక్షులు, పశువులు, సూర్యచంద్రులు, నక్షత్రాలు, గ్రహాలు-ఇవన్నీ మనల్ని ప్రేరేపిస్తాయి. ఏకాగ్రచిత్తంతో ప్రకృతిని పరిశీలిస్తూ పోగా, పోగా అది అద్భుతం అనిపిస్తుంది! ఎంతో విజ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. ప్రకృతి పరిశీలకులుగా ఆరంభించి ఆ ప్రకృతి ప్రేమికులుగా, ఆరాధకులుగా మారిపోతాం. దత్తా త్రేయుని లాగా, ఆంగ్లకవి విలియం వర్డ్స్వర్త్ లాగా ప్రకృతిని మన గురువుగా, దైవంగా పరిగణిస్తాం. అయితే అక్కడే ఆగిపోతే కేవలం హేతువాదులుగా, భౌతిక వాదులుగా మిగిలిపోతాం. లేదా నాస్తికులుగా మిగిలిపోయే అపాయం కూడాఉంది. భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఇలా అంటాడు: ‘‘భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం, మనసు, బుద్ధి, అహంకారం అని నా ప్రకృతి ఎనిమిది విధాలుగా ఉది. ఈ ప్రకృతిని ‘అపరా’ లేక ‘జడ ప్రకృతి’ అని అంటారు. ఇది కాక ఈ సంపూర్ణ జగత్తును ధరించునట్టి మరొకప్రకృతి ఉంది. అదే నా జీవ రూప పరాప్రకృతి’ లేక ‘చేతన ప్రకృతి’ అని తెలుసుకో’’ (భగవద్గీత 7–అ 4, 5 శ్లోకాలు).అంటే... జడప్రకృతి, చేతనా ప్రకృతి అనేవి దైవం అనే నాణేనికి రెండు వైపులన్నమాట (బొమ్మ, బొరుసు)! జడప్రకృతిని పరిశీలించి,ప్రేమించి, ఆరాధిస్తున్నవారు అంతటితో తృప్తి పడక చేతనా ప్రకృతిని కూడా పరిశీలించి, పరిశోధించటానికి పరిశ్రమిస్తే– అంటే రెండో వైపును కూడా చూడటానికి ప్రయత్నించి చూస్తే వారే దార్శనికులు, ద్రష్టలు, ఋషులు అవుతారు; పరిపూర్ణ ఆస్తికులవుతారు. అయితే తమాషా ఏంటంటే కొంతమంది కనపడే ప్రకృతిని మాత్రమే నమ్మి నాస్తికులవుతారు. మరి కొందరు కనపడని దైవాన్ని గుడ్డిగా నమ్మి ప్రత్యక్షంగా కనబడే దైవ ప్రతిరూపాలే అయిన మనుషులను దూషిస్తారు, ద్వేషిస్తారు. దైవానికి ఉన్న రెండు వైపులను చూసినవారు పరా ప్రకృతిని, అపరా ప్రకృతిని ప్రేమిస్తారు, పూజిస్తారు. దేన్నీ నిరాకరించరు. వారే నిజమైన ఆధ్యాత్మికత్వం కలవారు, స్వచ్ఛమైన ఆస్తికులు.– రాచమడుగు శ్రీనివాసులు అసలైన ఆస్తికులు -
ఐర్లాండ్ రాజధాని డబ్లిన్లో వాసవీ మాత అగ్నిప్రవేశ దినోత్సవ వేడుకలు
శ్రీ వాసవి సమాఖ్య ఐర్లాండ్ వారి ఆధ్వర్యంలో విశ్వరూపిణి, శ్రీమత్ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకి, ఆర్తజన బాంధవి, ఆశ్రీతకల్పవల్లి, లలితా పరాభట్టారిక స్వరూపిణి అయిన శ్రీ శ్రీ శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి అగ్నిప్రవేశ దినోత్సవాన్ని పురస్కరించుకొని మాఘ శుద్ధ విదియ రోజు వేడుకలు ఘనంగా జరిగాయి.వందమందికి పైగా వాసవి మాత భక్తులు ,కార్యక్రమ నిర్వాహక సభ్యులు, స్థానిక VHCCI ఆలయానికి చేరుకొని అక్కడ మొదటగా విశ్వశాంతి కొరకు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి హోమము, అమ్మవారికి విశేష అభిషేకం నిర్వహించారు. వివిధరకాల పుష్పాలతో అమ్మవార్ని అలంకరించారు. పల్లకి సేవ అనంతరం అమ్మవారికి షోడశోపచార పూజలు, అష్టోత్తరం, లలిత సహస్రనామ పఠనము, సామూహిక కుంకుమార్చన, మహా మంగళహారతి నిర్వహించారు.హాజరైన భక్తులందరికీ ఆంధ్రాభవన్, ఇండియన్ వైబ్, తాలి రెస్టారెంట్, రుచి రెస్టారెంట్స్ నుండి రుచికరమైన నోరూరించే వంటకాలతో అందరికి బోజనాలను వడ్డించారు. కార్యక్రమానికి ముఖ్య ఉభయదారులుగా దాతలు శ్రీనివాస్ వెచ్చ, శిరీష, సంతోష్ కుమార్ పారేపల్లి, శ్రీనివాస్ సూడా, శృతి ముత్తుకుమార్, బాలాజీ జ్యోత్స్నా, రేణుక దినేష్, నితేశ్ గుప్తా, రఘు వల్లంకొండ, ప్రవీణ్ మదిరే, వెంకట్ జూలూరి లకు కార్యక్రమ నిర్వాహక సభ్యులు, కార్యక్రమ పురోహితులు సాయి ప్రజ్వల్ ద్వారా సత్కరించి అందరికి పేరు పేరునా కృతఙ్ఞతలు తెలియజేసారు. తరువాత అమ్మవారి అలంకరణ, పుష్పాలంకరణ సేవకు కృషిచేసిన సభ్యుల్లో కావ్య , దివ్య , లావణ్య, , రేణుక మరియు శిరీష తదితరులకు కార్యక్రమ నిర్వాహక సభ్యులు ప్రత్యేక కృతఙ్ఞతలు తెలియజేసారు.తరువాత కార్యక్రమంలో నిర్వాహక సభ్యులైన నవీన్ సంతోష్, నరేంద్ర, భార్గవ్, శ్రీనివాస్ వెచ్చ మరియు మాణిక్ అందరు ఇలాంటి కార్యక్రమాలు ముందు ముందు మరెన్నో జరగాలని కోరుకున్నారు. చివరిగా ఆలయ సభ్యులైన రమణ, సాగర్ తదితరులకు సభ్యులందరు కృతఙ్ఞతలు తెలియజేసారు, నిర్వాహక సభ్యులతో పాటుగా సేవాదళ్ సభ్యుల్లో ముఖ్యంగా సంతోష్, సాయి తేజ, సందీప్, ప్రఫుల్ల, సుధీర్, సంపత్ తదితరులు చురుగ్గా పాల్గొన్నారు. -
పని చెయ్యడమే!
సూఫీ సాధువులలో అత్యంత ప్రముఖులు ఇబ్రహీం. ఆయన జీవనశైలి నిరాడంబరమైనది. ఇబ్రహీం నిశ్చలమైన ధ్యానం ప్రాముఖ్యాన్ని నొక్కి చెప్పారు. ఆయన కుటుంబం అరబ్ మూలాలతో కూడినది. ఇప్పటి అఫ్గానిస్తాన్లోని బాల్ఖ్లో జన్మించారు. కొంతమంది చరిత్రకారుల ప్రకారం, ఆయన 2వ రషీద్ ఖలీఫా ఉమర్ మాతృ వంశానికి చెందినవారు. సన్యాసిగా మారడానికి సింహాసనాన్ని విడిచి పెట్టారు. తన జీవితంలో పాక్షికంగాసంచార జీవనం గడిపారు. ఆయన భిక్షా టనను అసహ్యించుకున్నారు. జీవనో పాధి కోసం అవిశ్రాంతంగా పని చేశారు. ఒకానొకమారు ఇబ్రహీం ఓ ధనవంతుడిని కలుసు కున్నారు. అతడు ఆయన జ్ఞాని అని తెలియక తోటమాలిగా నియమించాడు. కొన్ని రోజులు గడిచాయి. ఒకరోజు ఆ ధనవంతుడి ఇంటికి కొందరు స్నేహితులు వచ్చారు. అందరూ కలిసి తోటలోకి ప్రవేశించారు. ఇబ్రహీంను చూసి తమకు తినడానికి మంచి మామిడిపళ్ళు కావాలని అడిగారు. సరే నని ఇబ్రహీం పండ్లు కోసిచ్చారు. వాటిని తిన్న మిత్రులు పుల్లగా ఉన్నాయని ధనవంతుడితో అన్నారు. అప్పుడు ధనవంతుడు ఇబ్రహీంను పిలిచి ‘ఏమిటీ పళ్ళన్నీ పుల్లగా ఉన్నాయంటున్నారు... చాలా కాలంగా తోటలో పని చేస్తు న్నావు. ఏ పండ్లు పుల్లటివో, ఏవి తియ్యటివో తెలియవా’ అని కసురుకున్నాడు. అందుకు ఇబ్రహీం చాలా నిదానంగా, ప్రశాంతంగా ఇలా జవాబిచ్చారు: ‘మీరు నాకు తోటమాలి పని అప్పజెప్పారు తప్ప పండ్లు తినమని చెప్ప లేదు. తింటే కదా వాటి రుచి తెలిసేది?’ ఈ సంఘటన తర్వాతే ఆ ధనవంతుడికి తన ఎదుట ఉన్న వ్యక్తి సామాన్యుడు కాదని, గొప్ప జ్ఞాని అని తెలుసుకున్నారు. కొన్ని నిముషాల ముందు కసురుకున్నందుకు తనను క్షమించమని ప్రాధేయపడ్డాడు ధనవంతుడు.సాధువుగా ఉండాలనుకుంటే, ఈ లోకంలోని లేదా పరలోకంలోని వస్తువులను కోరుకోవద్దని ఇబ్రహీం చెప్పేవారు. దృష్టంతా ఆ దేవునిమీదే కేంద్రీకరించినప్పుడే మిమ్మల్ని తన సాధువుగా చేసుకుంటా డనే వారు. ‘ముసుగులు తొలగించినప్పుడే ఆనందం తలుపు తెరవ బడు తుంద’న్నది ఆయన సూక్తి. – యామిజాల జగదీశ్పని చెయ్యడమే! -
ఆత్మసాక్షాత్కారం సాధించాలంటే..వీటిని జయించాలి!
భ్రమలో ఉండేవారిని అజ్ఞానం ఎంతో తికమకపరుస్తుంది. అటువంటి వారు అనాత్మను ఆత్మగాను; ఆత్మను అనాత్మగాను తలచి ఒకదానిపై వేరొకదానిని ఆరోపించుకుంటున్నారు. వారి సహజ ప్రకృతి వల్ల సచ్చిదానందం అనే వాస్తవాన్ని మరచి పోతున్నారు. ప్రాపంచిక విషయాల్లోనే సంతోషం ఉందనుకుంటున్నారు. భ్రమలో ఉండేవారు ఆత్మనే పరమాత్మ అనే వాస్తవాన్ని తెలుసుకోలేక పోతున్నారు. అటువంటి వారికి విగ్రహా రాధన మొదటి మెట్టుగా పెద్దలు చెప్పారు. ఆత్మే ఎప్పుడూ బంధరహితంగా ఉంటుందనే సత్యం తెలియనంత వరకు అల్పప్రాణులు అనేక దీక్షలు, వ్రతాలు, తీర్థయాత్రలు చేయడానికి పూనుకుంటారు. ఎంతకాలం ఈ శరీరమే ‘నేను’ అనే భావాన్ని కలిగి ఉంటారో అంతకాలం వారెవరూ ఆత్మసాక్షాత్కారం పొందలేరు.ఆధ్యాత్మిక మార్గం ప్రకారం... శారీరక స్పృహ అజ్ఞాన సూచికే. దేహవాసన, శాస్త్రవాసన, లోకవాసన అని మూడు వాసనలు ఉంటాయి. దేహ ధర్మములను ఆత్మపై ఆరోపించడమే ‘దేహవాసన’. నేను సాధించాను, నేను పండితుడను, నేను శాస్త్రాన్ని పఠించాను అనే భావన ‘శాస్త్రవాసన’. ఈ ప్రపంచమే యథార్థమైనది అని తలచి ప్రపంచంతో సంబంధాన్ని కలిగి ఉండటమే ‘లోకవాసన’. వాసనలు ఉన్నంతకాలం మోక్షం లభించదు. వాసనలను దూరం చేయడానికి దివ్య నామ సంకీర్తన, నిరంతర దైవదర్శనం ఉపయోగపడతాయి.ఆధ్యాత్మిక, ఆచార పర ప్రయాణమే ‘అంతరంగ ప్రయాణం’. సద్గుణాలను పెంచుకొని, మనస్సును పరిశుద్ధం చేసికొని జ్ఞానంతో వాటిని కలుష రహితంగా ఉంచాలి. సృజనాత్మకమైన బుద్ధిబలం పెరిగిన కొలదీ తాత్విక చింతనముందడుగు వేస్తుంది, సత్యాన్వేషణ పట్ల జిజ్ఞాస పెరుగుతుంది. వయసు పెరిగిన కొలది శరీరం ఏ విధంగా పెరుగుతుందో, అదే విధంగా మనలో ఉండే మనస్సు, బుద్ధి బలం (జ్ఞానము) కూడా సద్గుణాలతో వెలగాలి. ఈ భౌతిక ప్రపంచం శాశ్వతం కాదని గుర్తెరగాలి. తర్కంలో చురుకు దనాన్ని పెంచుకొని నిత్య, అనిత్య వస్తు భేదమును సరిగా తెలుసుకోవాలి. ఆ తర్వాత నిరంతర ఆచరణతో, శుద్ధ సంకల్పంతో ప్రయత్నించి జిజ్ఞాసాపరుడు అంతరాత్మ సాక్షాత్కారం పొందగలడు.-శ్రీ గణపతిసచ్చిదానందస్వామి -
Maha Kumbh Mela 2025 : ఏకంగా ఇంటినే వెంట తెచ్చుకున్న దంపతులు!
‘‘ఆలోచనల్లో పదును ఉండాలేగాని ఆవాసాలకు కొదవేముంది?’’ అన్నట్టుగా ఉంది ఆ దంపతలు తీరు. కాదేదీ నివాసానికి అనర్హం అంటూ వారు సృష్టించిన సరికొత్త కదిలే ఇల్లు అందరినీ ఆకట్టుకుంటోంది. ఆధ్యాత్మిక యాత్రకు సృజనాత్మకత రంగరించిన వారి ప్రయాణం చూపరుల ప్రశంసలకు నోచుకుంటోంది.ప్రయాగ్రాజ్లోని మహా కుంభ్ ప్రస్తుతం ఓ జంటకు నివాసంగా మారింది. అక్కడి రద్దీని దృష్టిలో ఉంచుకుని నివాసాలకు ఇబ్బందిని ముందే గ్రహించిన కర్ణాటకకు చెందిన దంపతులలు ఓ వినూత్న తరహా ఇంటికి రూపకల్పన చేశారు. ఇప్పుడు ఆ నివాసం ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటోంది. అంతేకాదు డబుల్ డెక్కర్ కారును ప్రదర్శించేలా ఉన్న వీరి ఇంటి వీడియో పారిశ్రామిక ప్రముఖులను కూడా ఆకర్షిస్తోంది. అదే విధంగా ప్రముఖ వ్యాపార దిగ్గజం ఆనంద్ మహీంద్రా దృష్టిని సైతం ఆకట్టుకుంది. విశిష్టమైన మార్పులు ఆవిష్కరణలతో వైవిధ్యానికి ప్రసిద్ధి చెందిన మహీంద్రా ఈ క్రియేషన్ వెనుక ఉన్న చాతుర్యం పట్ల తన ఇష్టాన్ని వ్యక్తం చేసింది, ‘అవును, నేను అలాంటి మార్పులు ఆవిష్కరణలకు నేను ఆకర్షితుడిని అవుతాను అనేది ఖచ్చితంగా నిజం. అయితే అది మహీంద్రా వాహనంపై ఆధారపడినప్పుడు, నేను మరింత ఆకర్షితుడని అవుతా‘ అని మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఈ వీడియోను ఉద్దేశించి హిందీలో ఒక పోస్ట్లో తెలిపారు.ఇన్నోవాయే ఇల్లుగా మారింది...ఈ కారు పేరు టయోటా ఇన్నోవా కాగా అదే వీరి మొబైల్ హోమ్గా రూపాంతరం చెందింది.ఈ రకమైన మార్పు చేర్పులు, సవరణలకు దాదాపు రూ. 2 లక్షలు పైగానే ఖర్చయిందని ఆ ‘ఇంటికా’కారు యజమాను వెల్లడించారు. రూఫ్టాప్ టెంట్కు రూ. 1 లక్ష .. పూర్తిస్థాయి వంటగదికి రూ.1లక్ష పర్యావరణ హితమైన రీతిలో వారి విద్యుత్ అవసరాలను తీర్చడానికివాహనం సోలార్ ప్యానెల్ను కూడా వీరు ఏర్పాటు చేసుకున్నారు.ఈ జంట తమ అనుకూలీకరించిన సెటప్ను పూర్తిగా ఉపయోగించుకుని, వీలైనంత ఎక్కువ కాలం కుంభమేళాలో ఉండాలని ప్లాన్ చేస్తున్నారు. ఇంటిని మిస్ అవుతున్న ఫీలింగ్ ఏమీ రాకపోవడం వల్లనో ఏమో... కుంభ్ మేళా అనంతరం కూడా తమ ఇంటికారులో షికారు కంటిన్యూ చేయాలని వీరు భావిస్తున్నట్టు కనిపిస్తోంది.రోడ్ ట్రిప్కు సై...ఈవెంట్లో ఆథ్యాత్మిక సౌరభాలను ఆస్వాదించిన తర్వాత, ఈ వాహనం మీద వారు ఆరు నెలల పాటు సుదీర్థమైన రోడ్ ట్రిప్ను ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు, అందులో భాగంగా వీరు విదేశాల్లోకి అంటే... నేపాల్లోకి కూడా ప్రవేశించవచ్చు. ఈ వాహనానికి అభిమాని అయిన భర్త తాను రాబోయే రోడ్ ట్రిప్ కోసం మరింత ఆసక్తిగా ఉన్నట్టుగా తన ఉత్సాహాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు భార్య తమ వంట అవసరాల కోసంఇ–కామర్స్ ప్లాట్ఫారమ్ ద్వారా సౌకర్యవంతంగా తాజా కూరగాయలను ఆర్డర్ చేస్తూన్నానని తెలిపారు.ఈ భార్యాభర్తల ఐడియాను చూపిస్తున్న వీడియో ఆన్లైన్లో అనేకమంది ప్రశంసలకు నోచుకుంది. ఈ జంట సృజనాత్మకత, సమయానుకూలతను నెటిజన్లు కొనియాడుతున్నారు. మరీ ముఖ్యంగా ‘జుగాద్‘ (వినూత్న పరిష్కారాలు)లో ఇటీవల భారతీయులు బాగా రాణిస్తున్నారనే విషయాన్ని పలువురు హైలైట్ చేస్తూ వారి వనరులను ప్రశంసిస్తూ చేసే కామెంట్స్ వెల్లువెత్తాయి. మరికొందరు ‘పర్ఫెక్ట్ క్యాంపింగ్ వ్యాన్‘ అనే భావనను మెచ్చుకున్నారు వినూత్న తరహాలో వాన్ లైఫ్ డ్రీమ్ను జీవించినందుకు జంటను అభినందించారు. ఓ అవసరం నుంచి పుట్టిన సృజనాత్మకత వాహనాలను చక్రాలపై అసాధారణ నివాసాలుగా మార్చింది. ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలకు నోచుకుంది.Haan, yah bilkul sach hai ki main aise sanshodhanon aur aavishkaaron se mohit hoon. lekin mujhe yah sveekaar karana hoga ki jab ve mahindra vaahan par aadhaarit hote hain to main aur bhee adhik mohit ho jaata hoon!! 🙂 pic.twitter.com/rftq2jf2UN— anand mahindra (@anandmahindra) January 23, 2025 -
ఈశ్వరాజ్ఞ
రజతాచలం పైని వనాంతర సీమలలో వసంతం నిండుగా కమ్ముకుని ఉంది. ఆ ప్రకృతి రామణీయకతలో ఒకచోట దాగి ఏకాంత క్షణాలను గడుపుతూ, ఆనందిస్తున్నారు శివపార్వతులు. వారి ఏకాంతాన్ని ఎవరూ భంగపరచకుండా నంది కాపు కాస్తున్నాడు. అలాఉండగా, అది రజతాచలమని, అక్కడ మదనారియైన శివుడు వసిస్తూ ఉంటాడనే ఆలోచన మరచి, ఆవసంత శోభను తాము కూడా ఆనందించి తరించాలనే ఉద్దేశంతో గంధర్వ గణాలు ఒక్కసారిగా వచ్చి గిరిపై పడ్డాయి. తమ అరుపులతో, కేరింతలతో ఆ వన ప్రాంతంలో అట్టహాసం చేయసాగాయి. ఆ శబ్దానికి ఉలిక్కిపడిన నంది, కోపగించి, వారిపై మాటల దూషణలతో విరుచుకుపడ్డాడు. ’అంధులా మీరు? లోకేశ్వరుడైన ఈశ్వరుడు, ఈశ్వరితో ఏకాంతంలో ఉండగా, ఇలా వచ్చి గోల చేయడం తగిన పనికాదు. ఆలస్యం చేయక, ఇక్కడి నుండి వెంటనే దూరంగా వెళ్ళిపొండి!’ అని మందలించాడు. నంది మాటలను వారు లెక్క చేసే స్థితిలో లేరు. గంధర్వ గణాల ఆ స్థితిని ఆత్మలో ఎరిగిన శంకరుడు, ఉగ్రుడై చెంతనే పడివున్న గడ్డిపోచలను పిడికిట పట్టి ‘పిశా చాలుగా మారండని’ శపించి వారిపై విసిరాడు. కనువిందు చేసే అంద మైన రూపాలు కాస్తా అంతలోనే అంతరించిపోయి, రూపురేఖలు తప్పి వికటాంగులయ్యారు గంధర్వులు. ఆ సందర్భాన్ని తెనాలి రామకృష్ణకవి ఇలా వర్ణించాడు ఉద్భటారాధ్య చరిత్రలో. కం. కొఱకును బోవం బడిక /ల్లుఱక పయింబడిన కరణి నొకపనికై రా నుఱుమని పిడుగై వారికి /గఱకంఠుని చేత నీచగతి వాటిల్లెన్.పక్షులు ఎఱను ఏరి తినడానికని వెళ్ళగా, ఇంతలో ఎక్కడి నుండి వచ్చిందో తెలియని పడికల్లు – తుపాకి గుండు – వేగంగా వచ్చి వెంటాడి మీద పడినట్లుగా, రజతాచలంపైని వసంత శోభను ఆనందించాలనే ఒక పని మీద రాగా, ఉరుము లేకుండానే మీద పడిన పిడుగు చందంగా,శంకరుడి శాపం తగిలి నీచ గతి ప్రాప్తించింది కదా అని గంధర్వ గణాలు బాధపడడం పై పద్యం భావం. ఏదైనా తప్పుతుందేమో కాని ఈశ్వరాజ్ఞ తప్పదు కదా!– భట్టు వెంకటరావుఈశ్వరాజ్ఞ -
Mahakumbh Mela 2025 పవిత్ర స్నానం గురించి బాధపడకండి..ఇలా చేస్తే పుణ్యఫలం!
మహా కుంభమేళా (Maha Kumbh Mela 2025) ఒక ప్రత్యేకమైన శక్తివంతమైన సమారంభం. ఎందరో సాధువులు, బాబాలు, అవధూతలు, సిద్ధులు, యోగులు, వైష్ణవులు, శాక్తులు, ఇలా హైందవ ధర్మంలో ఉన్న అనేక ఆచారాలకు సంబంధించిన ఎందరో మహిమాన్వితులు మహాకుంభ మేళాకు తరలి వెళతారు. ప్రపంచ నలుమూలల నుండి లక్షలాదిగా భక్తులు ఆ దివ్య మహోత్సవ సందర్శనార్థం ప్రయాగ చేరుకుంటారు. నదులకు సహజ సిద్ధంగా దివ్యశక్తిని ఆకర్షించే గుణం ఉంటుంది. ఈ కారణంగానే ఎన్నో దివ్య క్షేత్రాలు, ధామాలు పుణ్యనదుల పరీవాహక ప్రాంతాల్లో కొలువుదీరి ఉంటాయి. ఈ సంవత్సరం మహా కుంభమేళ ప్రయాగలో జరుగుతుంది. భూమాతను ఆసురీ శక్తుల ప్రభావం నుండి కాపాడేందుకు, దివ్యశక్తిని పెంచేందుకు ఎందరో యోగులు, సిద్ధులు, గురువులు ప్రత్యక్ష, పరోక్ష రూ΄ాలతో కృషి చేస్తుంటారు. మహా కుంభమేళా సమయంలో ఎందరో సాధువులు, మహా యోగులు నదీ గర్భంలోకి తమ త΄ోశక్తులను కూడా ప్రవహింపచేసి, అక్కడికి వచ్చిన అనేక మంది భక్తులను అనుగ్రహిస్తారు. నదిలోని దివ్య శక్తి, విశ్వంలో గ్రహాల అమరిక వల్ల ఉత్పన్నమయ్యే విశ్వశక్తి, మహాయోగుల తపోశక్తి వెరసి, దివ్య ప్రకంపనలు భూ గ్రహమంతా విస్తరిస్తాయి. అక్కడికి చేరుకున్న వ్యక్తులకే కాకుండా, ఈ దివ్య ప్రకంపనలు సామూహిక చైతన్యానికి కూడా ప్రయోజనాన్ని చేకూరుస్తాయి. యోగవిద్యలో చెప్పిన ఇడా, పింగళ, సుషుమ్న నాడులకు, ప్రయాగరాజ్ లోని త్రివేణి సంగమం వద్ద గంగా, యమున, సరస్వతీ నదుల కలయికకు మధ్య అవినాభావ సంబంధం ఉంది. త్రివేణి సంగమం వద్ద మూడు పుణ్యనదులు కలిసి ఒక పవిత్ర తీర్థంగా మారినట్లే, మానవుడిలో ఇడా, పింగళ సుషుమ్న నాడులు భృకుటీ మధ్య భాగంలో సంగమిస్తాయి. అందుకే బొట్టు పెట్టుకునే ప్రదేశాన్ని జ్ఞాన త్రివేణిగా అభివర్ణిస్తారు. ఈ మూడు నాడులు ఏకీకృతం అయినప్పుడు చైతన్య జాగృతి కలుగుతుంది. అందుకే భకుటీ మధ్యంలో గంధం, కుంకుమ, పసుపు లేదా భస్మాన్ని బొట్టుగా ధరిస్తారు. భ్రూ మధ్యంలో మూడు నాడుల కలయిక అన్నది యోగంలో చెప్పే అమృతత్వ స్థితిని ప్రదానం చేసేందుకు మార్గం అవుతుంది. ఈ సంవత్సరం సంక్రాంతి నుండి శివరాత్రి వరకు దాదాపు 45 రోజుల పాటు సాగే ఈపవిత్ర సమయంలో ఆధ్యాత్మిక చింతనతో పాటుగా మనసును క్లేశ రహితంగా మార్చుకోవడం వల్ల దివ్య శక్తిని ఎక్కడ ఉన్నా పొందవచ్చు. త్రివేణి సంగమ స్థలికి చేరుకోలేని వారు, ఇంటి వద్దే 45 రోజుల పాటు ధ్యాన సాధన చేయడం ద్వారా కూడా అమృతతత్వాన్ని సిద్ధింపచేసుకోవచ్చు. – మాతా ఆనందమయి,ఆధ్యాత్మిక గురువు చదవండి: రూ. కోటి జాబ్ కాదని..తొలి ప్రయత్నంలోనే సివిల్స్ : తండ్రి భావోద్వేగ క్షణాల్లో -
పట్నాల మల్లన్నకు పదివేల దణ్ణాలు
తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన సిద్దిపేట జిల్లా కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయం. భక్తులు కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా విరాజిల్లుతోంది. మల్లికార్జున స్వామి ఆయన సతీమణులు లింగ బలిజల ఆడబిడ్డ అయిన బలిజ మేడలమ్మ, యాదవుల ఆడబిడ్డ అయిన గొల్లకేతమ్మలు నిత్యం పూజలందుకుంటున్నారు. ప్రతీ యేడాది మూడు నెలల పాటు జాతర జరుగుతుంది. రెండు పద్దతుల్లో స్వామి వారికి కళ్యాణం నిర్వహిస్తారు. మార్గశిర మాసం చివరి ఆదివారం వీరశైవ ఆగమ పద్దతి ప్రకారం స్వామి వారి కళ్యాణం, మహాశివరాత్రి సందర్బంగా యాదవ సాంప్రదాయం ప్రకారం స్వామి వారి కళ్యాణం నిర్వహించనున్నారు. జనవరి 19 నుంచి మార్చి 24వ తేదీ వరకు తెలుగురాష్ట్రాలతో పాటు ఒడిశా, చత్తీస్çగడ్, కర్ణాటక నుంచి భక్తులు భారీగా తరలి రానున్నారు. పది ఆదివారాలు జాతర వారాలుగా నిర్వహిస్తారు. ఇదే విధంగా తెలంగాణలో ఐనవోలు, ఓదెలలో సైతం ఇదే విధంగా పట్నాలు వేసి మొక్కులు చెల్లించుకోవడం కొన్ని సంవత్సరాలుగా కొనసాగుతున్న ఆనవాయితీ.కొమురవెల్లి మల్లన్నకు ప్రకృతి సిద్దమైన ఐదు రంగులను ఉపయోగించి పట్నం వేస్తారు. ఇందుకోసం పసుపు, కుంకుమ, గులాబీరంగు(బుక్క గులాల్), ఆకుపచ్చ పొడి (తంగేడు, చిక్కుడు ఆకులను ఎండబెట్టి పొడి చేస్తారు) తెల్ల పిండి (బియ్యం పిండి)ని వాడుతారు. పట్నాలు వేసేందుకు పసుపు, కుంకుమ, భక్తులు బస చేసిన ప్రాంతాల్లో వేసేది చిలక పట్నం. ఆలయంలోని గంగిరేణి చెట్టు వద్ద వేసేది నజర్ పట్నం. ఆలయం లోపల వేసేది ముఖ మండప పట్నం. మల్లన్నకు ప్రతి ఏడాది లేదా రెండు లేదా మూడేండ్లకు ఒకసారి పట్నాలు వేసి భక్తులు మొక్కులు చెల్లించుకుంటారు. మహాశివరాత్రి సందర్బంగా కొమురవెల్లిలోని తోట బావి దగ్గర పెద్ద పట్నం వేస్తారు. ఈ పెద్ద పట్నం 41 వరుసలతో దాదాపు 50 గజాల్లో వేస్తారు. జానపద రూపాల్లో ఒగ్గు పూజారులు కథను చెబుతూ పట్నం వేస్తారు. పట్నంలోకి మల్లికార్జునుడిని ఆహ్వానించి కల్యాణం చేసి తమ కోరికలను విన్నవించుకుంటారు. నుదుటిన బండారి పెట్టి కంకణాలు కట్టి ఒగ్గు పూజా కతువు నిర్వహిస్తారు. అలాగే స్వామివారి చరిత్రను సైతం వివరిస్తుంటారు. కొందరు ఇంటి వద్ద సైతం మల్లన్న పట్నాలు వేసి ఓ పండుగ లాగ బంధువులను పిలిచి చేస్తారు.పట్నంలో ఒకే కొమ్ము ఉన్న శూలంపెద్ద పట్నం వేసే ముందు ఒగ్గు పూజారులు తమ ఆచారం ప్రకారం గర్భాలయంలోని మూల విరాట్కు పట్టువస్త్రాలను సమర్పిస్తారు. స్వామివారిని పల్లకిలో ఊరేగింపుగా తీసుకువెళ్లి, కోనేట్లో స్నానం ఆచరింపజేస్తారు. పట్నం వేసే ప్రదేశంలో సుంకు పట్టిన తర్వాత, గొంగళిలో బియ్యం పోసి మైలపోలు తీస్తారు. స్వామివారు ధరించే ఒకటే కొమ్ము ఉన్న శూలం (ఒరగొమ్ము), డమరుకాన్ని నెలకొల్పుతారు. పసుపు, కుంకుమ, తెల్ల పిండి, సునేరు, పచ్చ రంగులను ప్రమథ గణాలుగా సమ్మిళితం చేసి, నిమ్మకాయతో చిత్ర కన్ను నెలకొల్పి శివలింగాన్ని చిత్రిస్తారు. రకరకాల డిజైన్లతో సర్వాంగ సుందరంగా పట్నాన్ని తీర్చిదిద్దుతారు.పట్నం దాటడం....ఆ తర్వాత ఉత్సవ విగ్రహాలను తీసుకొని పట్నం పై పెట్టి పూజారులు పూజలు నిర్వహిస్తారు. తర్వాత.. శివసత్తులు పట్నం దాటుతారు.. ఈ వేడుకను చూసేందుకు, పట్నం ముగ్గుపొడిని సేకరించుకొనేందుకు భక్తులు పోటీ పడతారు. ఈ ముగ్గును పొలాల్లో చల్లితే పంటలు బాగా పండుతాయని నమ్ముతారు. పట్నాల మొక్కుల తర్వాత భక్తులు అగ్ని గుండాల కార్యక్రమంలో నిప్పుల మీద నడుస్తారు. అనంతరం స్వామివారిని దర్శించుకుంటారు.– గజవెల్లి షణ్ముఖ రాజుసాక్షి, సిద్ధిపేట -
Mahakumbh Mela 2025: పర్యావరణం బాబా..ఏకంగా తల పైనే పంటలు పండిస్తున్నాడు..!
ఆధ్యాత్మిక శోభతో అలరారుతున్న ఈ మహా కుంభమేళ(Mahakumbh Mela 2025)లో రకరకాల బాబాలు దర్శనమిచ్చి ఆశ్చర్యపరుస్తున్నారు. పావురం బాబా నుంచి, ఇంజనీర్ బాబాల వరకు అందరిది ఒక్కో నేపథ్యం కానీ వాందర్నీ ఒకచోట చేర్చింది ఈ ఆధ్యాత్మికతే. ఈ కుంభమేళాలో కొందరి బాబాల బ్యాగ్రౌండ్ ఆశ్చర్యం కలిగించేలా ఉన్నాయి. ఇంకొందరూ అందరి హితం కోరేలా జీవనం సాగిస్తున్నారు. అలాంటి కోవకు చెందిన మరో బాబా ఈ మహాకుంభమేళలో హైలెట్గా నిలిచాడు. పర్యావరణ స్ప్రుహ కలిగించేలా అతడి ఆహార్యం ఎలా ఉందే చూస్తే కంగుతింటారు.ఈ పర్యావరణ బాబా పేరు అనాజ్ వాలే బాబా(Anaaj Wale Baba). ఈయన ఉత్తరప్రదేశ్లోని సోన్భద్రకు చెందిన బాబా. పర్యావరణం కోసం ఎంతమంది పాటుపడ్డారు. కానీ ఈ బాబా అత్యంత విభిన్నమైన శైలిలో పాటుపడుతూ..అందరి దృష్టిని ఆకర్షించాడు. అతను పంటలనే(crops) ఏకంగా తన తల(Head)పై పండిస్తున్నాడు. మిల్లెట్లు, గోధుమలు, పప్పుధాన్యాలు, బఠానీల(wheat, millet, gram, and peas)తో సహా చాలా రకాల పంటలను తలపై పండించాడట. ఈ అసాధారణ ప్రయత్నాన్ని గత ఐదేళ్లు నుంచి చేస్తున్నట్లు తెలిపాడు ఆ బాబా. కేవలం అటవీ నిర్మూలనపై అవగాహన పెంచడం, పచ్చదనాన్ని ప్రోత్సహించడమే తన అసాధారణ ప్రయత్నం వెనుకున్న లక్ష్యమని అన్నారు అనాజ్ వాలే బాబా. చెట్లు నరకడం వల్ల యావత్తు ప్రపంచంపై ఎలాంటి ప్రభావితం చూపుతుందో తెలియడంతో ఇలా చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపాడు. తన అసాధారణ విధానమైన పనితో ప్రజలు ప్రభావితమై మరిన్ని మొక్కలు నాటి పచ్చదనంతో కళకళలాడేలా చేస్తారనేది తన ఆశ అని అన్నారు. ఈ కారణాల రీత్యా మహా కుంభమేళా కోసం కిలా ఘాట్ సమీపంలో ఉంటున్న ఈ అనాబ్ వాలే బాబా అందరి దృష్టిని ఆకర్షించేలా హైలెట్గా నిలిచారు. ఈ కుంభమేళాకి వచ్చే సందర్శకులు అతడి అసాధారణమైన ప్రయత్నానికి ఫిదా అవ్వడమే గాక ఆశ్చర్యపోతున్నారు. అంకితభావంతో తలపై మొక్కలను పెంచుతున్నారు. క్రమతప్పకుండా వాటికి నీళ్లు పోసి వాటి బాగోగులు చూస్తుంటారా బాబా. ఆయన దీన్ని హఠ యోగతో మిళితమైన పర్యావరణ కార్యకర్తగా చెబుతుంటాడు. ఒకరకంగా ఇది ఆధ్యాత్మిక, పర్యావరణ బాధ్యతల మధ్య సామరస్యాన్ని ప్రతిబింబిస్తుంది. ఈ మేళా ముగినిస తర్వాత కూడా ఈ అనాజ్ వాలే బాబా సోన్భద్రకు తిరిగి వచ్చి అటవీకరణ, పర్యావరణంతో ఈ పుడమి కళకళలాడేలా ప్రోత్సహించే లక్ష్యాన్ని కొనసాగించాలనుకుంటున్నట్లు తెలిపారు.కాగా, ఈ మహా కుంభమేళాలో సామాజిక పర్యావరణ విలువలను ప్రోత్సహించేలా ఇతర ముఖ్యమైన కార్యక్రమాలు కూడా ఉన్నాయి. జనవరి 13న మొదలైన ఈ కుంభమేళా, ఫిబ్రబరి 26,2025తో పూర్తవనుంది. గంగా, యమునా, సరస్వతి నదుల సంగమ స్థలమైన ఈ పవిత్ర ప్రదేశంలో సాన్నాలు చేస్తే పాపాలు పోతాయనేది భక్తుల ప్రగాఢ నమ్మకం.(చదవండి: 'ఇంజనీర్ బాబా': ఏరోస్పేస్ ఇంజనీరింగ్, ఫోటోగ్రఫీ వదిలి మరీ..) -
దురలవాట్లను దూరం చేసే కొల్లూరు మూకాంబికాలయం
కర్ణాటక రాష్ట్రంలోని మంగళూరుకు సుమారు 130 కిలోమీటర్ల దూరంలో... దట్టమైన అడవుల మధ్యన నెలకొని ఉంది మూకాంబికాలయం. ఆ రాష్ట్రంలోని ఏడు మోక్షపురాల్లో కొల్లూరు మూకాంబిక గుడి ఒకటి. ఆలయం ఉన్నది కర్ణాటక రాష్ట్రంలో అయినా, ఆమెను ఎక్కువగా సందర్శించుకునేది కేరళీయులే కావడం విశేషం. క్షేత్రపురాణం: జగద్గురు ఆదిశంకరులు కుడజాద్రి పర్వతంపై ఉండి అమ్మవారి కోసం తపస్సు చేశారు. ఆయన తపస్సుకు మెచ్చి, అమ్మవారు ప్రత్యక్షమైంది. ఆమెను తనతోబాటు తన జన్మస్థలమైన కేరళకు రావలసిందిగా శంకరులు చేసిన ప్రార్థనకు అంగీకరించిన దేవి, అందుకు ఒక షరతు విధిస్తుంది. అదేమంటే, తాను వచ్చేటప్పుడు శంకరులు వెనక్కు తిరిగి చూడకూడదని, ఒకవేళ వెనక్కి తిరిగి చూస్తే అక్కడే తాను శిలలా మారిపోతానంటుంది. అందుకు అంగీకరిస్తాడు శంకరులు. ముందుగా శంకరులు, వెనుక అమ్మవారు వెళ్తూ ఉంటారు. కొల్లూరు ప్రాంతానికి రాగానే అమ్మవారి కాలి అందెల రవళి వినిపించకపోవడంతో, వెనక్కు తిరిగి చూస్తాడు శంకరులు. ఇచ్చిన మాట తప్పి వెనక్కు తిరిగి చూడడంతో అమ్మవారు అక్కడే శిలలా మారిపోతుంది. తన తప్పిదాన్ని మన్నించమని ప్రార్థించిన శంకరులతో తనను అక్కడే ప్రతిష్ఠించమని చెబుతుంది. దీంతో ఆదిశంకరులు శ్రీ చక్రంతోపాటు మూకాంబిక పంచలోహ విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠించారు. శంకరుల వెంట వచ్చేటప్పుడు అమ్మవారు మాట్లాడనందువల్ల ఆమెకు మూకాంబిక అనే పేరు వచ్చింది. నాటినుంచి అమ్మవారికి ఆదిశంకరులు సూచించిన విధానంలోనే పూజాదికాలు జరుగుతున్నాయి. మూకాంబిక ఆలయాన్ని సందర్శించుకున్నవారు ఒక్కసారైనా హారతి సమయంలో అమ్మవారి దివ్యమంగళరూపాన్ని సందర్శించుకోవాలని తహతహలాడుతుంటారు. అమ్మవారికి ప్రదోష కాలంలో ఇచ్చే హారతి ప్రత్యేకమైనది.సౌపర్ణికానది: ఆలయానికి సమీపంలో సౌపర్ణికా నది ప్రవహిస్తుంటుంది. ఈ నది లోతు తక్కువ. కుటజాద్రి పర్వతం నుంచి ఉద్భవించే ఈ నదిలో ఇతర నదీపాయలు కూడా కలుస్తాయి. ఈ నది ఒడ్డున సుపర్ణుడు అంటే గరుత్మంతుడు తన తల్లి దుఃఖాన్ని పోగొట్టమని కోరుతూ అమ్మవారిని గురించి ఘోర తపస్సు చేసి వరం పొందాడట. ఆ నాటినుంచి ఈ నదికి సౌపర్ణికానది అని పేరు వచ్చింది. ఈ నదిలో అనేక వనమూలికలు ఉంటాయని, అందువల్ల ఈ నదిలో స్నానం చేస్తే చర్మరోగాలు నయం అవుతాయని చెబుతారు. ఇతర సందర్శనీయ స్థలాలు ఆలయ బయటి ప్రాకారంలో విఘ్నేశ్వరుడు, కుమారస్వామి తదితర దేవతల సన్నిధులున్నాయి. కొల్లూరు చుట్టుపక్కల మంగుళూరు మంగళాదేవి, ఉడిపి కృష్ణుడు, కుందాపూర్, భత్కల్, షిమోగా, ధర్మస్థల, శృంగేరీ శారదాపీఠాలు సందర్శనీయ స్థలాలు. ఇక్కడ గల కుటజాద్రి పర్వత శ్రేణి అందమైన అటవీ సంపదతో ఆకట్టుకుంటుంది. ఈ పర్వతశ్రేణి ట్రెక్కింగ్కు అనుకూలంగా ఉంటుంది. ఎలా వెళ్లాలి? మంగుళూరు నుంచి ప్రతి పది నిమిషాలకు ఒక బస్సు కొల్లూరుకు వెళుతుంటుంది. ప్రైవేటు వాహనాలు కూడా ఉన్నాయి. మంగుళూరుకు నేరుగా అన్ని ప్రధాన నగరాలనుంచి బస్సులు, రైళ్లు ఉన్నాయి. మంగుళూరులో విమానాశ్రయం కూడా ఉంది. (చదవండి: లోకహితం కోసం ప్రాణాలర్పించిన అసురుడు..!) -
సంస్కృతి సంప్రదాయం మహాసమ్మేళనం
ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక ఉత్సవం...సాంస్కృతిక–సామాజిక మేలుకలయికదాదాపుగా 40కోట్లమంది పుణ్యస్నానాలు...నాగసాధువుల ప్రత్యేక ఆకర్షణ.ప్రయాగ ప్రత్యేకతమకరే యే దివానాథే వృషగే చ బృహస్పతౌ ‘కుంభయోగో భవేత్తత్ర ప్రయాగే చాతిదుర్లభః ‘‘అంటే మాఘ అమావాస్యనాడు బృహస్పతి వృషభరాశిలో ఉన్నప్పుడు ప్రయాగలో కుంభపర్వం జరుగుతుంది. (prayaga)ప్రయాగలో మూడు కుంభస్నానాలు ఉన్నాయి. ఇక్కడ మొదటి కుంభస్నానం (makara sankranti)మకర సంక్రాంతి నుండిప్రారంభమవుతుంది. రెండవ స్నానం మౌని అమావాస్య నాడు జరుగుతుంది. మూడవ స్నానం వసంత పంచమి రోజున జరుగుతుంది. ఈ మూడింటి కలయికే (kumbh mela)’కుంభమేళా’.నీటి నుంచే ఈ సమస్త విశ్వాన్ని సృష్టించాడట సృష్టికర్త. అందుకేప్రాణులన్నింటికీ నీరు తల్లిలాంటిదని చెబుతున్నాయి పురాణాలు. ఆ నీరే గలగలా పారే నదులుగా దర్శనమిస్తోంది. నదుల వల్లనే నాగరికతలు ఏర్పడ్డాయి. మనిషి మనుగడకు, సంస్కతి సాంప్రదాయాలకు, వైభవానికి నదులు సాక్షిభూతంగా నిలిచాయి. వేదభూమిగా పిలిచే ఈదేశంలో ప్రవహించే నదులు తీర్థము అనే పేరుతో దైవస్వరూపాలుగా వర్ణించబడి, గంగా గోదావరి నర్మదా కావేరి మొదలైన పేర్లతో గౌరవింపబడుతున్నాయి. అలాంటి తీర్థాలెన్నో ఈ భూమిపై ప్రవహిస్తూ ఈ భూమిని దివ్యభూమిగా మారుస్తున్నాయి.తీర్థం అంటే పుణ్యమైన, లేదా పవిత్రమైన నీరు అని అర్థం. అటువంటి తీర్థాలని సేవించి వాటిలో స్నానం చేస్తే పాలు తొలగి అంతఃకరణ శుద్ధి కూడా కలుగుతుంది. తీర్థాలన్నింటిలోకీ ప్రధానమైనది గంగానది. గంగానదిని తలిచినా చాలు... సకల పాలు తొలగుతాయని మనకి పురాణాలు చెబుతున్నాయి. నదీజలాల్లో అమతత్వం ఉందని అవి రోగాలను నివారించి దీర్ఘాయుష్షును కలిగిస్తాయని యజుర్వేదంలో చెప్పబడింది. ‘ఓ జలమా! పవిత్రమైన నీటితో మాకు తప్తి కలిగించు’’ ‘‘అఫ్స్వంతరమత మఫ్సుభేషజం’’ అంటూ ప్రార్థించడం ఈ వేదంలోని పవిత్రభావన. నదీ స్నానంవల్ల శారీరక శుద్ధి, ఆయుర్వృద్ధి కలుగుతాయి.మహాకుంభమేళా అంటే?దేవతలు–రాక్షసులు క్షీరసాగరాన్ని చిలుకగా అందులోనుంచి అమతం పుట్టింది. శ్రీమహావిష్ణువు మోహినీ అవతారం ధరించి దేవతలకు అమతాన్ని పంచుతున్నప్పుడు దానినుంచి నాలుగు చుక్కలు హరిద్వార్లోని గంగానదిలో, ఉజ్జయినిలోని క్షి్రపా నదిలో, నాసిక్లోని గోదావరిలో, ప్రయాగలోని త్రివేణి సంగమంలో పడ్డాయి. జ్యోతిష్యశాస్త్రం సూచించిన కొన్ని ప్రత్యేకమైన రోజులలో, ఆయా ప్రదేశాలలోని నదుల్లో స్నానం చేయడం వల్ల మనం కూడా అలా పడ్డ ఆ అమతత్వాన్ని పొందవచ్చని పెద్దలు చెబుతారు. ఆ ప్రత్యేకమైన రోజులకే కుంభమేళ అని పేరు. కుంభమేళా సమయంలో అమృతస్నానం చేయడం అనాదిగా వస్తున్న సాంప్రదాయం. ఋగ్వేదంలో దీని ప్రస్తావన కనిపిస్తుంది.దాస్యవిముక్తికి...అమృతబిందువులు నేలపై పడటం వెనుక మరో పురాణకథనం కూడా ఉంది. గరుత్మంతుడు తన తల్లి దాస్యవిముక్తికోసం అమృతాన్ని తేవలసిన అవసరం ఏర్పడింది. అలా అమృతాన్ని తెస్తున్న మార్గంలో నాలుగుచుక్కలు ఆ అమృతభాండం నుంచి నేలజారి నాలుగు పుణ్యతీర్థాలలో పడ్డాయి. ఆ ప్రదేశాలలోనే కుంభమేళాలను ఆచరిస్తున్నారు.విస్తృత ఏర్పాట్లు– స్థానికులకు ఉపాధిప్రపంచం వ్యాప్తంగా కుంభమేళాకు తరలివస్తున్న ఆధ్యాత్మిక జిజ్ఞాసులందరినీ దష్టిలో పెట్టుకొని ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేసింది. తాత్కాలిక వసతులతో ఏకంగా ఒక టెంట్ గ్రామాన్ని ఏర్పాటు చేసింది ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం. అందులోకి ప్రవేశిస్తే చాలు ఆధ్యాత్మిక ప్రపంచంలోకి కళ్ళ ముందర నిలబడుతుంది. అనేక ఆధ్యాత్మిక సంస్థలు అక్కడికి వచ్చినటువంటి వారందరికీ లోటు లేకుండా ఉచితంగా అన్న ప్రసాదాలను అందజేస్తూ భక్తుల ఆకలిని తీరుస్తున్నాయి. ఆధ్యాత్మికతోపాటు ఆర్థిక పరిపుష్టిని కూడా కలిగించనుంది కుంభమేళ. ప్రస్తుతం జరుగుతున్న కుంభమేళా కోసం సుమారుగా 7,500 కోట్లతో ప్రభుత్వం ఏర్పాట్లు చేయగా కుంభమేళా జరిగినన్ని రోజులు సుమారు 2లక్షల కోట్ల మేర వ్యాపారం జరగనుందని ఆల్ ఇండియా ట్రేడర్స్ ఫెడరేషన్ అంచనా వేస్తోంది. దీని ద్వారా 30 వేల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆదాయం సమకూరనుంది.కుంభమేళా టెంట్ గ్రామంలోకి ప్రవేశించినప్పటి నుండి వయోవద్ధులను, నడవలేని వారిని స్నాన ఘాట్ ల వరకు చేర్చేందుకు, నదీ మధ్యలోకి వెళ్లి వద్దకు వెళ్లి స్నానం చేయడానికి పడవ వారికి, తినుబండారాల దుకాణాల వారికి యాత్రికులద్వారా ఆదాయం కూడా బాగా సమకూరుతోంది.యాత్రికుల భద్రత –పరిసరాల పరిశుభ్రత విషయంలో ప్రభుత్వం పెద్ద ఎత్తున చర్యలు చేపట్టింది. కోట్ల కొద్ది జనం వస్తోన్నా పరిశుభ్రత విషయంలో ఇబ్బందులేమీ లేవని కుంభమేళాకు వెళ్లి స్నానం చేసిన వారు చెబుతున్నారు. అధికారులు ఎప్పటికప్పుడు ఈ విషయంలో పర్యవేక్షణ చేస్తూ తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారని వారంతా సంతోషం వెలిబుచ్చుతున్నారు.జలమార్గాన్నీ క్రమబద్ధీకరిస్తోందిసంగమ స్థలం వరకు ప్రయాణించే పడవల విషయంలో ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటోంది. బోట్లతో నిరంతరం పోలీసులు నదిలో పహార కాస్తు నదిలో పడవలు బోట్లు జామ్ ఏర్పడకుండా తగిన చర్యలు తీసుకుంటున్నారు. ట్రైన్లు విమానాలు బస్సులు అన్నింటిలోనూ టికెట్లు దొరికే పరిస్థితి లేకపోవడంతో సొంత ఏర్పాట్లతో కుంభమేళాకి వెళుతున్న వారికి తగినట్టుగా పార్కింగ్ వ్యవస్థని ఏర్పాటు చేసింది. ఆనందకరమైన వాతావరణంలో ఆధ్యాత్మిక అనుభూతితో కొత్త విషయాలను తెలుసుకున్నామన్న సంతప్తితో భక్తులు తిరుగు ప్రయాణమవుతున్నారు → కుంభమేళాలో స్నానం ఎందుకు చేయాలి?కార్తీకమాసంలో వెయ్యిసార్లు గంగాస్నానం, మాఘమాసంలో వందసార్లు గంగాస్నానం, వైశాఖంలో నర్మదానదిలో కోటిసార్లు స్నానం చేస్తే ఎంత ఫలితం వస్తుందో, ప్రయాగలో కుంభమేళా జరిగే సమయంలో ఒక్కసారి స్నానంచేస్తే ఆ పుణ్యఫలాన్ని పొందవచ్చని స్కాందపురాణం చెబుతోంది.→ నాగసాధువులుఆది శంకరాచార్యులవారు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సాధు,సంతు సమాజమును ఒక్క చోటికి చేర్చి,13 అఖారాలను ఏర్పరిచి సనాతన ధర్మరక్షక వ్యవస్థను ఏర్పరిచారు. తరువాత కాలములో అనేక ధర్మాచార్యులు ఈ వ్యవస్థను దశదిశలా విస్తరింపజేసారు. అటువంటి సాధువులలో కొందరిని నాగసాధువులని పిలుస్తారు. వీరు కుంభమేళాలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తారు. వీరికి శరీరంతో తాదాత్మ్యం ఉండదు. మనం జీవిస్తున్న సమాజానికి అతీతంగా ఉండే ఆ యోగుల తత్త్వం మనకు అంతుపట్టదు. అందుకే వారు మనకు సాధారణ సామాజిక జీవితంలో ఎదురుపడరు.→ స్నానం చేసేటప్పుడు ఏం చేయాలి?భక్తితో గంగను తలచుకుంటూ నదిలో మూడు మునకలు వేయాలి. పవిత్రమైన నదిని అపరిశుభ్రం చేయకుండా జాగ్రత్త తీసుకోవాలి. స్నానం తరువాత దగ్గరలో ఉన్న ఆలయాలను దర్శించుకోవాలి.→ కుంభమేళాకి పోలేనివారికి...పురాణాలు, జ్యోతిష్యశాస్త్రం కుంభమేళాలో చేసే పవిత్ర స్నానవిశిష్టతను ఎంతో కీర్తించాయి. అయితే ఆరోగ్యరీత్యా, వయోభారంవల్ల అక్కడికి పోలేనివారు అక్కడినుంచి తెచ్చిన నీటిని తాము స్నానం చేసే నీటిలో కలుపుకొని స్నానం చేయవచ్చు. అదీ కుదరకపోతే తామున్న చోటే గంగానదీ పేరును తలచుకుని స్నానం చేయవచ్చు.ఐక్యత మరియు ఏకత్వాల పండుగ కుంభమేళా. శాశ్వతమైన, అనంతమైన దివ్య స్వభావాన్ని కుంభమేళాలో అనుభవించగలం. నదీ ప్రవాహంలాగే జనప్రవాహం కూడా కుంభమేళా వైపు సాగి సముద్రంలో నదులు సంగమించినట్టు వివిధ ప్రదేశాలవారు ఏకమయ్యే సంగమస్థలం కుంభమేళా.→ అందరి చూపు–కుంభమేళా వైపుగత కొద్ది రోజులుగా ప్రయాగలో జరుగుతున్న మహాకుంభమేళా భారతదేశంలోని ప్రజలనే కాదు ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల ప్రజల దష్టిని ఆకర్షిస్తోంది. పలు మతాలకు చెందినవారు కుంభమేళా కోసమే ఇక్కడికి వచ్చి, పవిత్ర స్నానం చేసి ఆనందపరవశులవుతున్నారు. భారతీయ ఆధ్యాత్మికత పట్ల ఆకర్షితులవుతున్నారు.స్టీవ్ జాబ్స్ భార్య కుంభమేళాపై ఆసక్తితో కుంభమేళాలో ఉండే గురువులు సాధువుల వద్ద సనాతన ధర్మంలోని పలు అంశాలనుతెలుసుకుంటూ మోక్షమార్గాన్ని అన్వేషిస్తున్నారు. ఎంతోమంది విదేశీ పరిశోధకులు ఈ కుంభమేళాను ఆసక్తితో గమనిస్తున్నారు.→ ఆధ్యాత్మిక ప్రపంచంప్రపంచం నలుమూలల నుంచి చేరుతున్న జన సందోహంతో అక్కడ నూతన ప్రపంచం ఏర్పడింది. కుంభమేళా కి వచ్చినవారు ముఖ్యంగా యువతరం ఈ వాతావరణాన్ని ఆసక్తిగా గమనిస్తోంది. ఆధ్యాత్మిక గురువుల నుంచి ఆసక్తిగా అనేక అంశాలను తెలుసుకుంటున్నారు యువత.నాలుగు రకాల కుంభమేళాలు4 సం.ల కొకసారి జరిగేది – కుంభమేళా6 సం.ల కొకసారి జరిగేది – అర్ధ కుంభమేళా12 సం.ల కొకసారి జరిగేది – పూర్ణ కుంభమేళా12 సం.ల కొకసారి జరిగే పూర్ణ కుంభమేళాలు 12 సార్లు పూర్తయితే (144 సం.లకు) – మహా కుంభమేళా.ప్రయాగ, హరిద్వార్, ఉజ్జయిని మరియు నాసిక్ ఈ నాలుగు పుణ్యక్షేత్రాలలో ఈ నాలుగు కుంభమేళాలు జరుగుతాయి. బహస్పతి వృషభ రాశిలో ఉన్నప్పుడు ప్రయాగలో, కుంభ రాశిలో ఉన్నప్పుడు హరిద్వార్లో, సింహ రాశిలో ఉన్నప్పుడు ఉజ్జయిని మరియు నాసిక్లో కుంభమేళాలు జరుపుకుంటారు.– అప్పాల శ్యాంప్రణీత్ శర్మ వేద పండితులు -
'గజేంద్ర మోక్షం' ఆధారంగా ఆలయం!
పురాతన ఆలయం, చెక్కు చెదరని శిల్పకళా సౌందర్యం, ఆహ్లాదకరమైన తుంగభద్ర (Tungabhadra) నదీతీరం.. వెరసి ఆధ్యాత్మిక పరిమళాలు వెదజల్లే రాజోలి (Rajoli) వైకుంఠ నారాయణస్వామి నిలయం. జోగులాంబ గద్వాల జిల్లా రాజోలిలో ఈ ఆలయాన్ని 12వ శతాబ్దంలో కల్యాణి చాళుక్య రాజు త్రిభువన మల్ల సోమేశ్వరుడు నిర్మించారని ఆధారాలు చెబుతున్నాయి. వైకుంఠ నారాయణస్వామి ఆలయం ముందు భాగంలో గరుత్మంతుని గుడి ఉంది. గుడికి ఎడమ భాగాన ధ్వజపీఠం, ఆ వెనుక బలిపీఠాలు ఉన్నాయి. వైకుంఠంలో వెలసిన శ్రీమన్నారాయణుడే రాజోలిలో కొలువైనట్లు భక్తుల విశ్వాసం. ఇక్కడున్న శ్రీమన్నారాయణుడు చతుర్భుజుడు. మూడున్నర అడుగుల దివ్య మంగళుడు. అన్నిచోట్లా దర్శనమిస్తున్నట్టు కాకుండా.. ఇక్కడ చక్ర హస్తంలో గధ, గధ హస్తంలో చక్రం ధరించి ఉంటాడు. ఇలాంటి స్వామివారి దర్శనం ఎక్కడా ప్రాచుర్యంలో లేదు. నారాయణుడికి ఇరువైపులా శ్రీదేవి, భూదేవి ఉన్నారు. స్వామి నెలకొన్న పీఠం రెండు అడుగుల ఎత్తు, అడుగున్నర వెడల్పు ఉంది. ఒకటిన్నర ఎత్తు ఉన్న అమ్మవారి విగ్రహాలు అందంగా, కళాత్మకంగా ఉన్నాయి. పక్కగుడిలోని అమ్మవారు కూర్చున్న పీఠం అడుగు కాగా, ఆమె మూర్తి ఒకటిన్నర అడుగుల ఎత్తు ఉంది. దేవాలయం బయట పురాణ, మాయణ, గవత, వైష్ణవ పురాణగాథలు, జలభూభాగాల్లోని జంతు జాలాలను అద్భుత శిల్ప కళానైపుణ్యం ఉట్టి పడేలా మలిచారు. ఈ శిల్ప కళను చూడాలంటే రెండు కళ్లు చాలవు.ఇప్పటి రాజోలి.. ఒకప్పుడు అడవి గజేంద్ర మోక్షం(Gajendra Moksham) ఆధారంగా ఆలయ నిర్మాణం జరిగిందని ఇక్కడి ప్రజల విశ్వాసం. ప్రస్తుతం రాజోలి గ్రామం ఉన్న ప్రదేశమంతా అడవి. దీనికి కొద్ది దూరంలో రాంపాడు అనే గ్రామం ఉండేది. ఈ అడవిలో ఏనుగులు విపరీతంగా సంచరిస్తుండేవి. వేసవి కాలంలో ఏనుగులు తాగునీటికి చాలా ఇబ్బంది ఉండేవి. అక్కడికి కొద్దిదూరంలో అంటే.. ప్రస్తుతం తూర్పు గార్లపాడు గ్రామం దగ్గర దేవమ్మ మడుగు ఉండేది. ఏనుగులు అక్కడికి వెళ్లి దాహం తీర్చుకునేవి. ఒకరోజు ఏనుగులు దాహం తీర్చుకోవడానికి వెళ్లగా ఆ మందకు పెద్దదిక్కైన ఒక ఏనుగును మడుగులో ఉన్న మొసలి పట్టుకుంది. ఎంతకూ అది వదలకపోవడంతో ఆ ఏనుగు నారాయణుడిని ప్రార్థించిందని.. ఆ మొర విన్న స్వామి వైకుంఠం నుంచి ఏనుగును కాపాడేందుకు వచ్చారని భక్తుల నమ్మకం. శరణు వేడుకున్న వారిని కాపాడాలనే తొందరలో శంఖు, చక్ర, గధ, పద్మధరుడైన మహా విష్ణువు, చక్ర హస్తంలో గధ, గధ హస్తంలో చక్రం ధరించి వచ్చారంటారు. ఆ విషయం అమ్మవార్లు చెప్పాక స్వామివారు గమనించారని.. శరణు కోరిన ఏనుగును చక్రంతో కాపాడారని.. దాని ఆధారంగా ఇక్కడ గుడి నిర్మాణం జరిగిందని స్థానికులు చెబుతారు.తిరుమల వెంకన్నను దర్శించినంత ఫలితం అప్పట్లో కొన్నేళ్ల క్రితం ఈ ప్రాంతీయులు, వేంకటేశ్వరస్వామి దర్శనానికి తిరుమలకు వెళ్లారు. వారిని అక్కడివారు ఎక్కడినుంచి వచ్చారని పలకరించగా.. తాము తుంగభద్ర నదీతీరంలోని రాజోలి ప్రాంతం వారిమని సమాధానమిచ్చారు. అందుకు వారు ఆశ్చర్యానికి లోనై.. సాక్షాత్తు వైకుంఠ నారాయణస్వామి కొలువైన ఆ దేవాలయాన్ని వదిలి ఇంత దూరం వచ్చారా? ఇక్కడి శ్రీనివాసుడే అక్కడి వైకుంఠ నారాయణుడని, అది సాక్షాత్తు వేంకటేశ్వరస్వామి సన్నిధిని.. కలియుగ వైకుంఠమని స్పష్టం చేసినట్టు ఒక కథనం ప్రాచుర్యంలో ఉంది. ఈ ఆలయానికి సమీపంలోనే తుంగభద్ర నదిలో రాంపాటి ఈశ్వరాలయం ఉంది.శ్రీమదలం పురీక్షేత్ర మహత్మ్యమ్ (స్థల పురాణం)లో ఒక శ్లోకం ఉంది. అందులో ‘తుంగా నారాయణస్సాక్షాత్ భద్రాదేవోమహేశ్వరః ఉభయోసంగమే యత్ర ముక్తిస్త్రత నసంశయః’.. అంటే తుంగ, భద్ర అనే రెండు నదులు పశ్చిమ కనుమల్లో వేర్వేరు చోట్ల ద్వారా ఒకచోట రెండు కలుస్తాయి. ఉంగానది సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు కాగా భద్రా నది పరమేశ్వరుడిగా చెబుతారు. ఈ నదులు ఎక్కడ ప్రవహిస్తాయో.. అక్కడ స్నానం చేస్తే మోక్షం సిద్ధిస్తుంది. అంతటి పవిత్రమైన వైష్ణవ క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది రాజోలి. ఇక్కడ వైకుంఠనారాయణ ఆలయంతో పాటు ఎడమవైపు శ్రీలక్ష్మి ఆలయం, వాయవ్య దిశలో అంజనేయ స్వామి, వేణుగోపాలస్వామి ఆలయం, నవగ్రహాలయం, ఈశ్వరాలయం, భువనేంద్రస్వామి ఆలయం ఉన్నాయి. ప్రతి ఆలయానికి ఒక ప్రత్యేక చరిత్ర ఉంది.ఇలా ఎంతో చరిత్ర కలిగిన ఈ వైకుంఠ నారాయణస్వామి ఆలయం నిరాదరణకు గురవుతోందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దేవాదాయ శాఖలో విలీనమైనా.. ఆలయానికి మాన్యాలున్నా అభివృద్ధి జరగలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఆలయాన్ని వెలుగులోకి తెస్తే ముక్కోటి ఏకాదశి రోజు ఎంతో వ్యయ ప్రయాసలకోర్చి తిరుపతి దాకా వెళ్లనవసరం లేదని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. ఈ ఆలయం ఒక్క రాజోలికే కాక తెలంగాణకు, దేశానికే తలమానికమని వారు స్పష్టం చేస్తున్నారు. చదవండి: ఆ గుడిలో దేవుడు లేడు.. అయినా జనాల క్యూ!ఉమ్మడి రాష్ట్రంలో పట్టించుకోకపోయినా.. ప్రత్యేక రాష్ట్రంలోనైనా ఆలయాన్ని అభివృద్ధిలోకి తెచ్చి చరిత్రను కాపాడాలని కోరుతున్నారు. ఇప్పటికే ముక్కోటి ఏకాదశికి జిల్లా నలుమూలలతో పాటు, కర్నూల్ జిల్లా నుంచి భక్తులు వస్తుంటారు. అమావాస్య రోజు, వైకుంఠ ఏకాదశి రోజు స్థానికులు దాతల సహాయంతో వేలాది మంది భక్తులకు అన్నదానం, అల్పాహారం, తీర్థప్రసాదాలు అందజేస్తున్నారు. పుష్కరాల సమయాల్లో తుంగభద్ర నదీ పరీవాహక గ్రామాల్లో ఈ ఆలయం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెడితే ఆలయం మరింత అభివృద్ధిలోకి నోచుకుంటుందని భక్తులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యేక దృష్టి పెట్టాలి రాజోలిలోని వైకుంఠ నారాయణస్వామి ఆలయానికి ఎంతో చరిత్ర ఉంది. ప్రభుత్వం ఈ ఆలయంపై శ్రద్ధ పెట్టాలి. ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనం ఉంటుంది. ఇది చాలా మందికి తెలియక ఎన్నో వ్యయ ప్రయాసలతో దూరాన ఉన్న క్షేత్రాలకు వెళ్తున్నారు. ఈ ఆలయం విశిష్టత తెలిసినట్లయితే భక్తులు ఎక్కువగా దర్శించుకుని, ఆలయాభివృద్ధి జరిగే అవకాశముంది. – సురేశ్, శాంతినగర్ చరిత్ర కలిగిన ఆలయం గజేంద్ర మోక్షం ఆధారంగా నిర్మించిన వైకుంఠ నారాయణస్వామి ఆలయంలో ప్రతి ముక్కోటి ఏకాదశికి ఉత్తర ద్వార దర్శనం ఉంటుంది. చరిత్ర కలిగిన ఈ ఆలయం వివక్షకు గురవుతోంది. ప్రత్యేక రాష్ట్రంలోనైనా ఆలయం ప్రాచుర్యంలోకి తీసుకురావాలని స్థానికంగా ఎంతో కృషి చేస్తున్నాం. ప్రతి అమావాస్యకు అన్నదాన కార్యక్రమాలు, భజనలు చేస్తూ ఆధ్యాత్మికత భావనను పెంచుతున్నాం. ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టి ఆలయాన్ని అభివృద్ధి చేయాలి. – అంజి, రాజోలి -
Mahakumbh 2025 : డస్కీ బ్యూటీ, ‘ఏంజలీనా జోలీ’ వైరల్ వీడియో
ప్రయాగ్రాజ్లో అత్యంత వైభవోపేతంగా సాగుతు మహాకుంభమేళా సాగుతోంది, పవిత్ర త్రివేణిసంగమానికి కోట్లదిమంది భక్తులు తరలివస్తున్నారు. భక్తజన సందోహం భక్తి పారవశ్యంతో ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను సంతరించు కుంటోంది. ఈ మేళాలో ఇప్పటికే దేశానికి చెందిన సాధువులతో పాటు, విదేశాలకుచెందిన సాధువులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. తాజాగా పూసల దండలు అమ్ముకునే అమ్మాయి ఇంటర్నెట్ను ఆకర్షిస్తోంది.ఇండోర్ నుండి మహాకుంభమేళాకు వచ్చిన యువతి నెట్టింట సంచలనంగా మారింది. ఆమె తేనె రంగు కళ్లతో డస్కీ బ్యూటీ వెలిగిపోతోంది. కోటేరు ముక్కు, చంద్రబింబం లాంటి మోము, తేజస్సుతో వెలిగిపోతున్న కళ్లు ‘మోనాలిసా’ ను తలపిస్తోంది. ఆమె ప్రశాంతమైన చిరునవ్వుతో, పొడవాటి, సిల్కీ, జడ జుట్టు అద్బుతమైన ఆమె సౌందర్యానికి మరింత వన్నెతీసుకొచ్చింది.దీంతో మేళాకు హాజరయ్యే ఫోటోగ్రాఫర్లు, వ్లాగర్లు, ఆమెతో సెల్ఫీలు , వీడియోల కోసం ఎగబడుతున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెటిజన్లను మంత్ర ముగ్దుల్ని చేస్తున్నాయి. సోషల్ మీడియాలో ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ‘మోనాలిసా ఆఫ్ మహాకుంభ్’, ‘ఏంజలీనా జోలీ’, ‘‘ఎంత అందమైన కళ్లు’’, ‘చాలా అందంగా ఉంది’ అంటూ వ్యాఖ్యానించారు. మరోవైపు ‘‘ఎందుకలా ఆమె వెంటపడుతున్నారు.. సిగ్గుచేటు" అంటూ మరికొంతమంది కమెంట్ చేశారు. (Maha Kumbh Mela 2025: ‘కండల బాబా’ స్పెషల్ ఎట్రాక్షన్, ఎవరీ బాహుబలి)కాగా ఈ ఏడాది మహాకుంభమేళాలో ఐఐటీ బాబా, విదేశీ బాబా,అందమైన సాధ్వి, కండల బాబా ఇలా చాలామంది విశేషంగా నిలుస్తున్నారు. ఏరోస్పేస్ ఇంజనీర్, ఐఐటీ బాంబే పూర్వ విద్యార్థి హర్యానాకు చెందిన అభయ్ సింగ్ సన్యాసి జీవితాన్ని స్వీకరించారు. అలాగే రష్యాకు చెందిన బాబా కండలు దీరిన దేహంతో మహాకుంభమేళాలో ఆకట్టుకున్నసంగతి తెలిసిందే.एक गरीब लड़की इंदौर(MP) से महाकुंभ आती है, मालाएं बेचती है और दिन के 2 से ढाई हजार कमा लेती है।ये मेले हमारी सांस्कृतिक पहचान ही नहीं बल्कि आर्थिक समृद्धि के भी प्रतीक हैं। pic.twitter.com/BGhwuFbm0D— 𝙼𝚛 𝚃𝚢𝚊𝚐𝚒 (@mktyaggi) January 17, 2025 పన్నెండేళ్లకు ఒకసారి జరిగే కుంభమేళా ఈ ఏడాది జనవరి 13 సోమవారం ప్రారంభమై ఫిబ్రవరి 26 వరకు జరగనుంది. మొత్తం 45 రోజులపాటు సాగే ఈ ఆధ్యాత్మిక వేడుకలో పవిత్రమైన త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించేందుకు కోట్లాదిమంది తరలి వస్తున్నారు. इनसे मिलिए ये हैं महाकुंभ मेला में माला बेचने वाली वायरल गर्ल मोनालिसा.. इनकी आंखे बहुत सुंदर है.. इसको कहते हैं किस्मत बदलते देर नहीं लगती.. #महाकुम्भ_अमृत_स्नान #महाकुंभ2025 #MahaKumbhMela2025 pic.twitter.com/Et87nnpRql— 🌿🕊️RACHNA MEENA 🌿❤️ (@RACHNAMEENA34) January 18, 2025 -
తిరుపతిలో ఇంటర్నేషనల్ టెంపుల్స్ కన్వెన్షన్ అండ్ ఎక్స్పో
ఆంధ్రప్రదేశ్లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుపతిలో ప్రపంచంలోనే అతిపెద్ద అంతర్జాతీయ దేవాలయాల కన్వెన్షన్ అండ్ ఎక్స్పో ((ITCX) జరగనుంది. 2025 ఫిబ్రవరి 17 -19 తేదీల మధ్య అంతర్జాతీయ దేవాలయాల సదస్సు మరియు ప్రదర్శన (ఐటీసీఎక్స్) ఉంటుందని నిర్వాహకులు ఒక ప్రకటనలో తెలిపారు.ఆలయ నిర్వాహకులు, ప్రతినిధులు జనవరి 31, 2025లోపు ఉచితంగా నమోదు చేసుకోవచ్చు. ఒక్కో ఆలయానికి ఇద్దరు ప్రతినిధులకు వసతి కూడా ఉంటుంది. అదనపు ట్రస్టీలు నామమాత్రపు రుసుము చెల్లించాల్సి ఉంటుంది. 111 మంది నిపుణులైన వక్తలతో సెమినార్లు, ఇంటరాక్టివ్ వర్క్షాప్లు, ప్రత్యేక మాస్టర్క్లాస్లు, ప్రెజెంటేషన్లు, వర్క్షాప్లు , మాస్టర్క్లాస్లు - ఆలయ చర్చలు ఉంటాయి. ఈ సమావేశాలకు 58కి పైగా దేశాల నుండి హిందూ,సిక్కు, బౌద్ధ, జైన మత సంస్థల నుండి కీలక ప్రతినిధులు పాల్గొననున్నారు. మూడు రోజుల స్మారక కార్యక్రమంలో ప్రపంచ వ్యాప్తంగా 1581కి పైగా ప్రతిష్టాత్మక దేవాలయాల ప్రముఖులు సమావేశమవుతారు.టెంపుల్ కనెక్ట్ వ్యవస్థాపకుడు గిరేష్ కులకర్ణి నేతృత్వంలో జరుగుతున్న ఈ మైలురాయి కార్యక్రమానికి ప్రసాద్ లాడ్ (ఐటీసీఎక్స్ 2025 చైర్మన్,మహారాష్ట్ర శాసన మండలి సభ్యుడు) సహ-నాయకత్వం వహిస్తున్నారు "ఇన్క్రెడిబుల్ ఇండియా" కార్యక్రమం కింద భారత ప్రభుత్వ పర్యాటక మంత్రిత్వ శాఖసహకారంతో ఆలయాల కుంభమేళా నిర్వహిస్తున్నామని గిరేష్ కులకర్ణి ఒక ప్రకటనలో తెలిపారు. తొలి ఎడిషన్ 2023లో వారణాసిలో ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. -
లోకహితం కోసం ప్రాణాలర్పించిన అసురుడు..!
గయాసురుడు... పేరుకే అసురుడు కానీ ఎంతో మంచి మనసున్న దైవభక్తి పరాయణుడు. అతడొకసారి విష్ణువును గురించి గొప్ప తపస్సు చేసి, తనను తాకిన వారికి మోక్షం లభించే విధంగా వరం పొందాడు. తన శక్తితో శరీరాన్ని కొన్ని యోజనాల పొడవు, వెడల్పు విస్తరించి, జీవించసాగాడు. దాంతో ప్రతివారూ గయుణ్ణి తాకి మోక్షం ΄పొందసాగారు. ఫలితంగా స్వర్గానికి, నరకానికి వచ్చేవారే లేకుండా పోవడంతో ఇంద్రుడికి, యమధర్మరాజుకు పని లేకుండా పోయింది. దాంతో వారిద్దరూ కలిసి బ్రహ్మవద్దకు వెళ్లి, ఈ విషయాన్ని గురించి మొరపెట్టుకున్నారు. సృష్టికి విరుద్ధంగా జరుగుతున్న ఈ వైచిత్రి గురించి త్రిమూర్తులు పరిపరివిధాలుగా ఆలోచించి చివరకు ఒక నిర్ణయం తీసుకున్నారు. దాని ప్రకారం ఇంద్రుడు గయాసురుడి వద్దకెళ్లాడు. ‘‘గయాసురా! లోకకల్యాణం కోసం మేమంతా కలసి ఒక యజ్ఞం చేయదలచుకున్నాము. ఆ యజ్ఞాన్ని చేసేందుకు అనువైన ప్రదేశం కోసం అన్వేషించగా పరమ పవిత్రమైన నీ శరీరమే అందుకు తగినదనిపించింది. కనుక నీవు అనుమతిస్తే, నీ శరీరాన్ని యజ్ఞకుండంగా మార్చుకుని ఈ యజ్ఞాన్ని నిర్వహిస్తాము’’ అని అడిగాడు ఇంద్రుడు. గయాసురుడు అందుకు ఆనందంగా అంగీకరించి, తన శరీరాన్ని పెంచి ఉత్తరదిశగా తలను ఉంచి పడుకున్నాడు. సకల దేవతలు, రుషులు అందరూ ఈ ప్రాంతానికి చేరుకోగా, బ్రహ్మదేవుడు యజ్ఞం ఆరంభించాడు. అయితే, యజ్ఞంలో ప్రజ్వరిల్లుతున్న అగ్నితత్వాన్ని తట్టుకోలేక గయుడి తల కదలడం ప్రారంభించింది. బ్రహ్మ సూచన మేరకు ‘దేవవ్రత’ అనే శిలను గయుడి తల మీద ఉంచి, ఆ శిలమీద విష్ణువు నిల్చున్నాడు. ఫలితంగా గయాసురుడి శరీరం కదలడం ఆగిపోయింది. బ్రహ్మదేవుడు చేస్తున్న యజ్ఞవేడిమిని, తన భారాన్ని మౌనంగా భరిస్తున్న గయాసురుడిని చూసి హృదయం ద్రవించిపోయిన విష్ణువు ‘‘వత్సా! ఏదైనా వరాన్ని కోరుకో’’ అని అడిగాడు. అందుకు గయాసురుడు ‘‘దేవా! ఈ పవిత్రమైన యజ్ఞం వల్ల, అంతకన్నా పరమ పవిత్రమైన నీ పాదధూళి సోకడం వల్ల నా జన్మ ధన్యమైంది. నేను ఇంతకుముందు నేను కోరుకున్న వరం ఎంతో అనుచితమైనదైనప్పటికీ, మీ భక్తుడినైన నన్ను సంహరించలేక, ఈ విధంగా చేశారని నాకు అర్థమైంది. అందుకు క్షమాపణలు కోరుకుంటున్నాను. నేను మిమ్మల్ని కోరేది ఒకటే! నా తలపై ఉంచిన శిలమీద మీ పాదాలను శాశ్వతంగా ఉంచే భాగ్యాన్ని ప్రసాదించండి. మీ పాదాలను దర్శించుకున్న వారికీ, ఈ క్షేత్రంలో కానీ, మరెక్కడైనా కానీ, నన్ను తలచుకుంటూ పిండప్రదానాలు, పితృదేవతల పూజలూ చేస్తే వారి పితరులు తరించేటట్లు, వారి వంశం అభివృద్ధి చెందేటట్లు వరాన్ని ప్రసాదించండి’’ అని కోరుకున్నాడు. నిష్కల్మషమైన హృదయంతో గయాసురుడు కోరుకున్న వరాన్ని విష్ణువు అనుగ్రహించాడు. గయుడి శరీరాన్ని ఉంచిన ప్రదేశమే గయ. పాదాలను ఉంచిన ప్రదేశం పాదగయ. రాక్షసుడైనప్పటికీ, లోకహితం కోరుకున్న గయుడు ధన్యుడైనాడు. ‘‘నేను మిమ్మల్ని కోరేది ఒకటే! నా తలపై ఉంచిన శిలమీద మీ పాదాలను శాశ్వతంగా ఉంచే భాగ్యాన్ని ప్రసాదించండి. మీ దాలను దర్శించుకున్న వారికీ, ఈ క్షేత్రంలో కానీ, మరెక్కడైనా కానీ, నన్ను తలచుకుంటూ పిండప్రదానాలు, పితృదేవతల పూజలూ చేస్తే వారి పితరులు తరించేటట్లు, వారి వంశం అభివృద్ధి చెందేటట్లు వరాన్ని ప్రసాదించండి’’ – డి.వి.ఆర్(చదవండి: ఆరోగ్య.. సంతాన ప్రదాత : మల్లూరు నరసింహస్వామి) -
త్రీ ఇడియట్స్లోని మాధవన్లా ఫోటోగ్రఫీ వైపు మళ్లాడు..!కట్ చేస్తే..
ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో మహా కుంభమేళా అత్యంత వైభవోపేతంగా జరుగుతోంది. ఇందులో పాల్గొనేందుకు దేశవిదేశాల నుంచి భక్తులు తండోపతండాలుగా తరలివస్తున్నారు. దీని పేరుకి తగ్గట్టుగానే ఈ కుంభ మేళ ఆధ్యాత్మిక గురువులుగా మారిన మహా మహా మేధావులను పరిచయం చేసింది. ఎందరో గొప్ప గొప్ప చదువులు చదివి వాటన్నింటిని పరిత్యజించి సాధువుగా జీవిస్తున్న వాళ్లను కళ్లకుకట్టినట్లు చూపించింది. చూడటానికి సాదాసీదా సాధువుల అనుకుంటే పొరపడ్డట్టే.. అనేలా వాళ్ల చరితలు ఉన్నాయి. వారంతా ఏకంగా ఐఐటీ వంటి ప్రతిష్టాత్మకమైన యూనివర్సిటీల్లో చదివి, మంచి జీతాలతో హుందాగా జీవించినవారే. ఆధ్యాత్మికతకు ఆకర్షితులై..అందుకోసమే జీవితాన్ని అర్పించి..సాధువులుగా జీవిస్తూ..అందర్నీ ఆశ్చర్యచికితుల్ని చేశారు. వారి జీవన విధానం మహాత్తర జీవన సారాన్ని గురించి వెలుగెత్తి చాటింది. అలాంటికోవకు చెందిన వ్యక్తే ఈ మహకుంభమేళలో ప్రధాన ఆకర్షణగా నిలిచాడు. అతనెవరంటే..ఉత్తరప్రదేశ్లో(Uttar Pradesh,)ని ప్రయాగ్రాజ్ (Prayagraj)లో జరుగుతున్న మహా కుంభమేళా(Maha Kumbh Mela)లో పాల్గొని త్రివేణి సంగమ పవిత్ర జలాల్లో స్నానమాచరించి తరిచేందుకు లక్షలాది భక్తులు తరలివస్తున్నారు. ఈ ఆధ్మాత్మిక సంబరంలో మునిగితేలుతున్న ఎందరో సాధువులు, రుషులు, మత గురువుల మధ్య ఓ వ్యక్తి మీడియా దృష్టిని ఆకర్షించాడు. అతడే హర్యానా(Haryana,)కు చెందిన అభిసింగ్(Abhey Singh). ఆయన్ని అంతా ఇంజనీర్ బాబాగా పిలుస్తారు. ఎంతో ఉన్నతమైన జీవితాన్ని గడుపుతున్న వ్యక్తి అకస్మాత్తుగా దైవ చింతన వైపుగా మళ్లాడు. అంతే ఇక వెంటనే ఉన్నతోద్యోగాన్ని, విలాసవంతమైన జీవితాన్ని తృణప్రాయంగా విడిచి పెట్టి సన్యాసిలా జీవిస్తున్నాడు. అతడి కథ వింటే విస్తుపోతారు. అంతటి హోదాను వదలుకుని సాదాసీధాగా బతకాలని ఎలా నిర్ణయించుకున్నాడు?. ఇది మనోనిబ్బరమా..? ఆధ్యాత్మికతకున్న శక్తినా? అనేది మాటలకందనిది. ఇక్కడ అభిసింగ్ ముంబైలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) నుంచి ఏరోస్పేస్ ఇంజనీరింగ్(Aerospace Engineer) డిగ్రీని పూర్తి చేసిన ఉన్నత విద్యావంతుడు. ఆ తర్వాత క్యాంపస్ ప్లేస్మెంట్ మంచి ఉద్యోగాన్ని కూడా పొందాlo. అయితే ఇది తన కెరీర్ కాదని త్రీ ఇడియట్స్లోని మాధవన్ మాదిరి ఫోటోగ్రఫీపై మక్కువతో ట్రావెల్ ఫోటోగ్రఫీ కెరీర్ వైపుకి మళ్లాడు. ఆ కళ అతనికి జీవతం విలువ, తత్వశాస్త్రం గురించి తెలుసుకునేందుకు దోహదపడింది. ఆ తర్వాత భౌతిక శాస్త్రాన్ని బోధించే కోచింగ్ సెంటర్ను ప్రారంభించాడు. అలా ఓ ఎంటర్ప్రెన్యూర్ టీచర్గా మంచి సక్సెస్ని కూడా అందుకున్నాడు. అయినా అవేమి అతడికి సంతృప్తినివ్వలేదు. క్రమంగా అతడి మనసు దైవ చింతన, ఆధ్యాత్మికత వైపుకి దృష్టిమళ్లింది. అందులో మమేకమై..గొప్ప ఆధ్యాత్మిక సత్యాలను తెలుసుకోవాలనే జిజ్ఞాస రేకెత్తింది. అలా అతను శివ సాధువుగా మారిపోయాడు. ఆయన తరచుగా అంతా శివమయం, సత్యమే శివుడు అని మాట్లాడుతుంటాడు. అంతేగాదు ఇంత సాధారణంగా ఉండే ఇంజనీరింగ్ బాబాకు సోషల్ మీడియాలో దాదాపు 30 వేలకు పైగా మంచి ఫాలోయింగ్ ఉంది కూడా. ప్రస్తుతం ఈ కుంభమేళలో పాల్గొన్న ఆయన అక్కడకు వచ్చిన మీడియా ముందు జర్నలిస్ట్లతో అనర్గళంగా ఇంగ్లీష్లో మాట్లాడటంతో అతడెవరనే ఉత్సుకతను రేకెత్తించింది. ఈ క్రమంలోనే అతడి ఆధ్మాత్మికత ప్రయాణం వెలుగులోకి వచ్చింది. (చదవండి: సోయా చంక్స్ లేదా మీల్ మేకర్ ఆరోగ్యానికి మంచి గేమ్ ఛేంజర్..!) -
మహాకుంభ మేళలో యోగమాతగా తొలి విదేశీ మహిళ..!
మహా కుంభమేళా హిందువులకు పెద్ద పండుగలాంటిది. కుంభమేళా సమయంలో హిందువులు త్రివేణీ సంగమంలో స్నానం చేయాలని అనుకుంటారు. తద్వారా తాము చేసిన పాపాలు తొలగిపోతాయని భావిస్తారు. ఈ మహాకుంభ మేళని 144 ఏళ్ల కోసారి నిర్వహిస్తారు. ఇది 12 పూర్ణకుంభమేళాలతో సమానం. దీనిని ప్రయాగ్రాజ్లోనే నిర్వహించడం ఆనవాయితీ. అలాంటి మహా కుంభమేళలో ఎందరెందరో ప్రముఖుల, నాగసాధువులు, యోగగురువులు పెద్ద ఎత్తున పాల్గొంటారు. తాజాగా ఈ కుంభ మేళలో ప్రధాన ఆకర్షణగా యోగ మాతగా తొలి విదేశీ మహిళ నిలిచింది. ఆమె ఏ దేశస్తురాలు..మన హిందూ ఆచారాలను అనసరించడానికి రీజన్ తదితరాల గురించి తెలుసుకుందామా..!.యోగమాతా(Yogmata) కైకో ఐకావా(Keiko Aikawa) సిద్ధ గురువు లేదా హిమాలయ సమాధి యోగి హోదాను పొందిన తొలి భారతీయేతర మహిళగా చరిత్ర సృష్టించారు. ఆమె ప్రపంచ ప్రఖ్యాత ధ్యాన నిపుణురాలు. అంతేగాదు మహామండలేశ్వర్ బిరుదుతో సత్కరించబడిన తొలి విదేశీ మహిళ కూడా ఆమెనే. ఈ మహామండలేశ్వర్ అనేది ఆది శంకరాచార్య స్థాపించిన దశనామి క్రమంలో హిందు సన్యాసులకు ఇచ్చే బిరుదు. ఈ బిరుదు ప్రకారం వారిని గొప్ప ఆధ్యాత్మిక నాయకుడిగా పరిగణిస్తారు. ఆమె ప్రస్తుతం జరగుతున్న మహాకుంభ మేళలో పాల్గొననున్నది. నేపథ్యం..1945లో జపాన్లో జన్మించిన యోగమాత కైకో ప్రకృతి వైద్యంలో మంచి ఆసక్తిని పెంచుకున్నారు. ఈ అభిరుచి పశ్చిమ దేశాలలో హిప్పీ ఉద్యమం ద్వారా సంక్రమించింది. అలాగే కైకో జపాన్లో యోగాను ప్రాచుర్యంలోకి తీసుకురావడానికి ఎంతగానో కృషి చేసింది.ఆ నేపథ్యంలోనే టిబెట, చైనా, భారతదేశం గుండా పర్యటనలు చేసింది. 1972లో జపాన్ జనరల్ హెల్త్ ఇన్స్టిట్యూట్ను స్థాపించింది. అక్కడ యోగా నృత్యం, ప్రాణ యోగాను నేర్చుకుంది. ఆధ్యాత్మిక గురువుగా ఎలా మారిందంటే..1984లో జపాన్లో పైలట్ బాబాను కలిసినప్పుడు పరివర్తన చెందింది. ఎత్తైన హిమాలయాలలో సిద్ధ మాస్టర్స్తో కలిసి యోగాను నేర్చుకోవడానికి పైలెట్ బాబా ఆమెను ఆహ్వానించారు. అక్కడ ఆమె "సమాధి" పొందడానికి కఠినమైన శిక్షణ పొందింది. హిందూ, బౌద్ధ మతాల ప్రకారం సమాధి అనేది శరీరానికి కట్టుబడి ఉండగానే సాధించగల అత్యున్నత మానసిక ఏకాగ్రత స్థితి. ఇది వ్యక్తిని అత్యున్నత వాస్తవికతతో ఏకం చేస్తుంది. 1991లో తన తొలి బహిరంగ సమాధిని ప్రదర్శించింది. ఇది ఒక అసాధారణ యోగ సాధన. ఇందులో ఆమె ఆహారం, నీరు లేకుండా 72 గంటలకు పైగా గాలి చొరబడి భూగర్భ ఆవరణలో ఉండటం జరిగింది. ఈ ఘనతను కొద్దిమంది మాత్రమే సాధించగలరు. ప్రస్తుతం ప్రజలకు అందుబాటులో ఉన్న ఇద్దరు సిద్ధ మాస్టర్లలో ఒకరు. 2024లో పైలట్ బాబా మరణానంతరం అతని వారసురాలిగా యోగా మాత కేవలానంద్గా పేరుపొందింది. ఆమె తరుచుగా హిమాలయ రహస్య ధ్యానం"ను బోధిస్తుంది, సాధన చేస్తుంది. ఆమె అంతర్గత పరివర్తన శక్తిని విశ్వసిస్తుంది. ప్రతి ఒక్కరిలోనూ విశ్వ ప్రేమ ఉంటుంది. దానిని గుర్తించి, సమతుల్యత, ప్రశాంతతను సాధించడమే ధ్యానం లక్ష్యం. అని చెబుతుంటుంది యోగమాత కైకో.(చదవండి: పల్లవించిన ప్రజ్ఞ! తమిళులైనా.. తెలుగులో..) -
సంక్రాంతి వచ్చెనట సందడి తెచ్చెనట!
మంచుకు తడిసిన ముద్దబంతులు... ముగ్గులు... పూలు విచ్చుకున్న గుమ్మడి పాదులు... కళ్లాపిలు.... వంట గదుల్లో తీపీ కారాల ఘుమఘుమలు...కొత్త బట్టలు... కొత్త అల్లుళ్ల దర్పాలు...పిల్లల కేరింతలు... ఓపలేని తెంపరితనాలుసంక్రాంతి అంటే సందడే సందడి.మరి మేమేం తక్కువ అంటున్నారు సినిమా తారలు.మా సంక్రాంతిని వినుమా అని ముందుకొచ్చారు.రచయిత్రులు ఊసుల ముత్యాల మాలలు తెచ్చారు.‘ఫ్యామిలీ’ అంతా సరదాగా ఉండే సంబరవేళ ఇది.ప్రతిరోజూ ఇలాగే పండగలా సాగాలని కోరుకుంటూసంక్రాంతి శుభాకాంక్షలు తెలియచేస్తున్నాం.ఇన్పుట్స్ : సాక్షి సినిమా, ఫ్యామిలీ బ్యూరోమన పండుగలను ఎన్నో అంశాలను మిళితం చేసి ప్రయోజనాత్మకంగా రూపొందించారు మన పెద్దలు. ప్రకృతిలో వచ్చే మార్పులకు అనుగుణంగా పండుగ విధులుగా చెప్పి వ్యక్తిగత, కుటుంబపరమైన, సామాజిక క్షేమాలని కలిగించేవిగా వాటిని రూపొందించారు. మన పండుగల్లో ఖగోళ, ఆయుర్వేద, ఆర్థిక మొదలైన శాస్త్రవిజ్ఞానాలు మిళితమై ఉంటాయి. తెలుగువారి ప్రధానమైన పండుగ సంక్రాంతిలో కూడా అంతే! ప్రధానంగా చాంద్రమానాన్ని పాటించే తెలుగువారు సౌరమానాన్ని పాటించే ముఖ్యమైన సందర్భం ఇది. సూర్యుడు ధనూరాశిలో ప్రవేశించినప్పటి నుండి ధనుర్మాసం అంటారు. అది డిసెంబరు 15 కాని, 16వ తేదీ కాని అవుతుంది. అప్పటి నుండి మకర సంక్రమణం వరకు అంటే జనవరి 14 కాని, 15 వ తేదీ వరకు కాని ఉంటుంది. సూర్యుడు మకర రాశిలో ప్రవేశించే రోజు మకర సంక్రాంతి. ఆ రోజు నుండి సూర్యుడు తన గమన దిశని దక్షిణం నుండి ఉత్తరానికి మార్చుకుంటాడు కనుక మకర సంక్రమణానికిప్రాధాన్యం. ఆ రోజు పితృదేవతలకి తర్పణాలు ఇస్తారు. బొమ్మల కొలువుపెట్టుకునే సంప్రదాయం కొన్ని ప్రాంతాలలో ఉంది. అసలు ప్రధానమైనది సంక్రాంతి. ఈ పుణ్యకాలంలో దానాలు, తర్పణాలుప్రాధాన్యం వహిస్తాయి. ఈ సమయంలో చేసే దానాలకి ఎన్నో రెట్లు ఎక్కువ ఫలితం ఉంటుంది. దానికి కారణం ఈ మూడురోజులు పాతాళం నుండి వచ్చి భూమిని పరిపాలించమని శ్రీమహావిష్ణువు బలిచక్రవర్తికి వరం ఇచ్చాడు. కనుక బలి తనకి ఇష్టమైన దానాలు చేస్తే సంతోషిస్తాడు. అందులోనూ గుమ్మడికాయను దానం చేయటం మరీ శ్రేష్ఠం. గుమ్మడిని దానం ఇస్తే భూగోళాన్ని దానం ఇచ్చినంత ఫలితం. మకరరాశిలో ఉండే శ్రవణానక్షత్రానికి అధిపతి అయిన శని శాంతించటానికి నువ్వుల దానం చేయటం శ్రేయస్కరం. వస్త్రదానం,పెరుగుదానంతో పాటు, ఏ దానాలు చేసినా మంచిదే. భోగినాడు ఏ కారణంగానైనా పేరంటం చేయనివారు ఈ రోజు చేస్తారు. అసలు మూడురోజులు పేరంటం చేసే వారున్నారు. సంక్రాంతి మరునాడు కనుము. కనుముని పశువుల పండగ అని కూడా అంటారు. ఈ రోజు పశువుల శాలలని శుభ్రం చేసి, పశువులని కడిగి, కొమ్ములకి రంగులు వేసి,పూలదండలని వేసి, ఊరేగిస్తారు. వాటికి పోటీలు పెడతారు. ఎడ్లకి పరుగు పందాలు, గొర్రె పొట్టేళ్ళ పోటీలు, కోడిపందాలు మొదలైనవి నిర్వహిస్తారు. నాగలి, బండి మొదలైన వాటిని కూడా పూజిస్తారు. ఇప్పుడు ట్రాక్టర్లకి పూజ చేస్తున్నారు. భూదేవికి, రైతులకి, పాలేర్లకి, పశువులకి, వ్యవసాయ పనిముట్లకి కూడా తమ కృతజ్ఞతలని తెలియచేయటం పండుగలోని ప్రతి అంశంలోనూ కనపడుతుంది. మాంసాహారులు ఈరోజు మాంసాహారాన్ని వండుకుంటారు. సాధారణంగా కోడిపందెంలో ఓడిపోయిన కోడినో, గొర్రెనో ఉపయోగించటం కనపడుతుంది. ఓడిపోయిన జంతువు పట్ల కూడా గౌరవమర్యాదలని చూపటం అనే సంస్కారం ఇక్కడ కనపడుతుంది. పంటను పాడుచేసే పురుగులని తిని సహాయం చేసినందుకు పక్షులకోసం వరికంకులను తెచ్చి కుచ్చులుగా చేసి, ఇంటి ముందు వసారాలలో కడతారు. కొన్ని ప్రాంతాలలో ఇప్పటికీ కనుమునాడు గుడిలో వరికంకుల గుత్తులను కట్టే సంప్రదాయం కొనసాగుతోంది. ‘కనుము నాడు కాకైనా కదలదు’,‘కనుము నాడు కాకైనా మునుగుతుంది’,‘కనుము నాడు మినుము తినాలి’ అనే సామెతలు కనుముకి పితృదేవతలకు ఉన్న సంబంధాన్ని సూచిస్తాయి. మొత్తం నెల రోజులు విస్తరించి, నాలుగు రోజుల ప్రధానంగా ఉన్న పెద్ద పండగ సంక్రాంతి తెలుగువారికి ఎంతో ఇష్టమైన వేడుక. – డా. ఎన్.అనంతలక్ష్మిముక్కనుముముక్కనుము నాడు ప్రత్యేకంగా చేయవలసినవి పెద్దగా కనిపించవు. పండగలో అలసిపోయిన వారి విశ్రాంతి కోసం కావచ్చు. కానీ, కొంతమంది కనుమునాడు కాక ఈ రోజుని మాంసాహారం తినటానికి కేటాయిస్తారు. సంక్రాంతికి అందరూ తమ గ్రామాలకి చేరుకుంటారు. అల్లుళ్లు, ముఖ్యంగా కొత్త అల్లుళ్లు తప్పనిసరి. నెల రోజులు విస్తరించి, నాలుగు రోజులు ప్రధానంగా ఉండే సంక్రాంతి పెద్దపండుగ. పెద్దల పండుగ కూడా. పెద్ద ఎత్తున చేసుకునే పండుగ కూడా.థీమ్తో బొమ్మల కొలువుసంక్రాంతికి ప్రతియేటా ఐదు రోజులు బొమ్మలు కొలువు పెడుతుంటాం. చిన్నప్పటి నుంచి నాకున్న సరదా ఇది. నేను, మా అమ్మాయి, మనవరాలు కలిసి రకరకాల బొమ్మలను, వాటి అలంకరణను స్వయంగా చేస్తాం. ప్రతి ఏటా ఒక థీమ్ను ఎంచుకుంటాం. అందకు పేపర్, క్లే, అట్టలు, పూసలు, క్లాత్స్.. ఎంచుకుంటాం. ఈ సారి ఉమెన్ పవర్ అనే థీమ్తో నవదుర్గలు పెట్టాం. అమ్మ వార్ల బొమ్మలు ఇప్పటికీ ఇంట్లో ఉన్నాయి. గుడిలాగా అలంకారం చేశాం. గుడికి అమ్మాయిలు వస్తున్నట్టు, పేపర్లతో అమ్మాయిల బొమ్మలను చేశాం. తిరుపతి చందనం బొమ్మల సేకరణ కూడా ఉంది. ఆ బొమ్మలతో కైలాసం అనుకుంటే శివపార్వతులుగా, తిరుపతి అనుకుంటే వెంకటేశ్వరస్వామి, పద్మావతి... ఇలా థీమ్కు తగ్గట్టు అలంకరణ కూడా మారుస్తాం. ఈ బొమ్మల కొలువుకు మా బంధువులను, స్నేహితులను పిలుస్తుంటాం. ఎవరైనా అడిగితే వాళ్లు వచ్చేవరకు ఉంచుతాం. – శీలా సుభద్రాదేవి, రచయిత్రిపండగ వైభోగం చూతము రారండి– రోహిణితమిళ, మలయాళ, కన్నడ సినిమాలలో ఎంతో పెద్ద పేరు తెచ్చుకున్న రోహిణి అనకాపల్లి అమ్మాయి అనే విషయం చాలామందికి తెలియదు. అయిదేళ్ల వయసులో చెన్నైకి వెళ్లిపోయినా... అనకాపల్లి ఆమెతోనే ఉంది. అనకాపల్లిలో సంక్రాంతి జ్ఞాపకాలు భద్రంగా ఉన్నాయి. నటి, స్క్రీన్ రైటర్, పాటల రచయిత్రి, డబ్బింగ్ ఆర్టిస్ట్ రోహిణి మొల్లెటి... ‘సంక్రాంతి ఇష్టమైన పండగ’ అంటుంది, ఆనాటి పండగ వైభోగాన్ని గుర్తు చేసుకుంటుంది.నా చిన్నప్పుడు .. సంక్రాంతికి స్కూల్కి సెలవులు ఇచ్చేవారు. అదో ఆనందం. అలాగే కొత్త బట్టలు కొనిపెట్టేవాళ్లు. ఇంట్లో చక్కగా పిండి వంటలు చేసి పెట్టేవాళ్లు. ఫుల్లుగా తినేవాళ్లం. మాది అనకాపల్లి. నాకు ఐదేళ్లప్పుడు చెన్నై వెళ్లిపోయాం. సో... నాకు ఊహ తెలిశాక జరుపుకున్న పండగలన్నీ చెన్నైకి సంబంధించినవే.సంక్రాంతికి నెల ముందే నెల గంట పడతారు. అప్పట్నుంచి రోజూ ముగ్గులు పెట్టేవాళ్లం. అయితే ఎవరి ముగ్గు వారిది అన్నట్లు కాకుండా మా ముగ్గుకి ఇంకొకరు రంగులు వేయడం, మేం వెళ్లి వాళ్ల ముగ్గులకు రంగులు వేయడం... ఫైనల్లీ ఎవరి ముగ్గు బాగుందో చూసుకోవడం... అవన్నీ బాగుండేది. నేను రథం ముగ్గు వేసేదాన్ని. ఇక సంక్రాంతి అప్పుడు గంగిరెద్దుల సందడి, హరిదాసులను చూడడం భలేగా అనిపించేది. సంక్రాంతి నాకు ఇష్టమైన పండగ. ఎందుకంటే మనకు అన్నం పెట్టే రైతుల పండగ అది. వారికి కృతజ్ఞత తెలపాలనుకుంటాను. రైతుల విలువ పిల్లలకు చెప్పాలి. ఏమీ చెప్పకుండా పండగ చేసుకుంటే ఇది కూడా ఓ వేడుక అనుకుంటారు... అంతే. అసలు ఈ పండగ ఎందుకు చేసుకుంటున్నామో పిల్లలకి చెప్పాలి. అర్థం తెలిసినప్పుడు ఇంకాస్త ఇన్ వాల్వ్ అవుతారు.ఇప్పుడు పండగలు జరుపుకునే తీరు మారింది. వీలైనంత వైభవంగా చేయాలని కొందరు అనుకుంటారు. అయితే ఎంత గ్రాండ్గా చేసుకుంటున్నామని కాదు... అర్థం తెలుసుకుని చేసుకుంటున్నామా? లేదా అనేది ముఖ్యం. తాహతుకి మించి ఖర్చుపెట్టి పండగ చేసుకోనక్కర్లేదన్నది నా అభిప్రాయం.సంక్రాంతి అంటే నాకు గుర్తొచ్చే మరో విషయం చెరుకులు. చాలా బాగా తినేవాళ్లం. ఇప్పుడూ తింటుంటాను. అయితే ఒకప్పటి చెరుకులు చాలా టేస్టీగా ఉండేవి. ఇప్పటి జనరేషన్ చెరుకులు తింటున్నారో లేదో తెలియడం లేదు. షుగర్ కేన్ జ్యూస్ తాగుతున్నారు. అయితే చెరుకు కొరుక్కుని తింటే పళ్లకి కూడా మంచిది. మన పాత వంటకాలు, పాత పద్ధతులన్నీ మంచివే. ఇలా పండగలప్పుడు వాటి గురించి చెప్పడం, ఆ వంటకాలు తినిపించడం చేయాలి.నెల్నాళ్లూ ఊరంతా అరిసెల వాసనపండగ మూడు రోజులు కాదు మాకు నెల రోజులూ ఉండేది. వ్యవసాయం, గోపోషణ సమృద్ధిగా ఉండటం వల్ల నెల ముందు నుంచే ధాన్యం ఇల్లు చేరుతుండేది. నెల గంటు పెట్టగానే పీట ముగ్గులు వేసేవారు. వాటిల్లో గొబ్బిళ్లు పెట్టేవారు. రోజూ గొబ్బిళ్లు పెట్టి, వాటిని పిడకలు కొట్టేవారు. ఆ గొబ్బి పిడకలన్నీ పోగేసి, భోగిరోజున కర్రలు, పిడకలతోనే భోగి మంట వేసేవాళ్లు. మామూలు పిడకల వాసన వేరు, భోగి మంట వాసన వేరు. ప్రధాన సెలబ్రేషన్ అంటే ముగ్గు. బొమ్మల కొలువు పెట్టేవాళ్లం. అందరిళ్లకు పేరంటాలకు వెళ్లేవాళ్లం. ఊరంతా అరిసెల వాసన వస్తుండేది. కొత్త అటుకులు కూడా పట్టేవారు. చెరుకు గడలు, రేగుపళ్లు, తేగలు, పిల్లల ఆటలతో సందడిగా ఉండేది. బంతిపూల కోసం అక్టోబర్లో మొక్కలు వేసేవాళ్లం. అవి సంక్రాంతికి పూసేవి. కనుమ నాడు గోవులను అలంకరించి, దండం పెట్టుకునే వాళ్లం. చేసుకున్న పిండి వంటలు పంచుకునేవాళ్లం. హరిదాసులకు, గంగిరెద్దుల వాళ్లకు ధాన్యాన్ని ఇచ్చేవాళ్లం. ఇప్పటికీ పండగలను పల్లెలే సజీవంగా ఉంచుతున్నాయి. పట్టణాల్లో మాత్రం కొన్నేళ్లుగా టీవీల్లోనే సంక్రాంతి సంబరాలను చూస్తున్నాం. – రమారావి, కథకురాలు, ఆధ్యాత్మికవేత్తనా జీవితంలో సంక్రాంతి చాలా స్పెషల్– మీనాక్షీ చౌదరి‘ఆరు నెలలు సావాసం చేస్తే వీరు వారవుతారు’ అనేది మన అచ్చ తెలుగు సామెత. తెలుగుతనం ఉట్టిపడే పేరున్న మీనాక్షీ చౌదరి తెలుగు అమ్మాయి కాదు. ఉత్తరాది అమ్మాయి మీనాక్షీ చౌదరి కాస్త బాపు బొమ్మలాంటి తెలుగింటి అమ్మాయిగా మారడానికి మూడు సంవత్సరాల కాలం చాలదా! మీనాక్షీ నటి మాత్రమే కాదు స్విమ్మర్, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి కూడా. ఫెమినా మిస్ ఇండియా గ్రాండ్ ఇంటర్నేషనల్ (2018) కిరీటాన్ని గెలుచుకుంది. ‘ఇచ్చట వాహనములు నిలపరాదు’ సినిమా తో తెలుగు తెరకు సైలెంట్గా పరిచయం అయిన చౌదరి ‘హిట్: ది సెకండ్ కేస్’తో హిట్ కొట్టింది. సూపర్హిట్ సినిమా ‘లక్కీభాస్కర్’ లో సుమతిగా సుపరిచితురాలైంది. కొందరికి కొన్ని పండగలు ప్రత్యేకమైనవి. సెంటిమెంట్తో కూడుకున్నవి. మీనాక్షీ చౌదరికి కూడా సరదాల పండగ సంక్రాంతి ప్రత్యేకమైనది. సెంటిమెంట్తో కూడుకున్నది. ఈ హరియాణ అందాల రాశి చెప్పిన సంక్రాంతి ముచ్చట్లు ఇవి.మాది హర్యానా రాష్ట్రంలోని పంచకుల. మూడేళ్లుగా నేను హైదరాబాద్లో ఉంటూ తెలుగు సినిమాల్లో పని చేస్తున్నాను కాబట్టి సంక్రాంతి పండగ గురించి నాకు తెలుసు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ప్రతి జనవరిలో ఒక సెలబ్రేషన్ (సంక్రాంతి) ఉంది. సంక్రాంతి–సినిమా అనేది ఒక బ్లాక్ బస్టర్ కాంబినేషన్ . సినిమా ఇండస్ట్రీకి సంక్రాంతి అన్నది సినిమాల రిలీజ్కి, సెలబ్రేషన్స్ కి చాలా మంచి సమయం. కుటుంబమంతా కలిసి సందడిగా పూజలు చేసి సెలబ్రేట్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంటుంది. అది నాక్కూడా చాలా ఎగ్జయిటెడ్గా ఉంటుంది. గాలిపటాలంటే నాకు చాలా ఇష్టం. కానీ, ఎగరేయడంలో నేను చాలా బ్యాడ్ (నవ్వుతూ). అయినా, మా ఫ్రెండ్స్తో కలిసి మా ఊర్లోనూ, హైదరాబాద్లోనూ ఎగరేసేందుకు ప్రయత్నిస్తుంటాను. హైదరాబాద్లో ప్రతి ఏటా అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్ నిర్వహించడం సంతోషించదగ్గ విషయం. ఎందుకంటే గాలిపటాలు ఎగరేయడం అన్నది కూడా ఒక ఆటే. సంక్రాంతి టు సంక్రాంతి2024 నాకు చాలా సంతోషంగా, గ్రేట్ఫుల్గా గడిచింది. గత ఏడాది మంచి సినిమాలు, మంచి కథలు, పాత్రలు, మంచి టీమ్తో పని చేయడంతో నా కల నిజం అయినట్లు అనిపించింది. 2025 కూడా అలాగే ఉండాలని, ఉంటుందని కోరుకుంటున్నాను. చూస్తుంటే సంక్రాంతి టు సంక్రాంతి వరకు ఓ సర్కిల్లా అనిపిస్తోంది. నా జీవితం లో కూడా సంక్రాంతి చాలా స్పెషల్. ఎందుకంటే గత ఏడాది నేను నటించిన ‘గుంటూరు కారం’ వచ్చింది.. ఈ ఏడాది కూడా ‘సంక్రాంతికి వస్తున్నాం’ విడుదలవుతోంది! అందుకే చాలా సంతోషంగా... ఎగ్జయిటింగ్గా ఉంది.ముగ్గుల లోకంలోకి– దివి వాఢత్యాదివి పదహారు అణాల తెలుగు అమ్మాయి. ఎం.టెక్ అమ్మాయి దివి మోడలింగ్లోకి ఆ తరువాత సినిమాల్లోకి వచ్చింది. ‘బిగ్బాస్4’తో లైమ్లైట్లోకి వచ్చింది. హీరోయిన్గా చేసినా, పెద్ద సినిమాలో చిన్న పాత్ర వేసినా తనదైన మార్కును సొంతం చేసుకుంది. గ్లామర్ పాత్రలలో మెరిసినా, నాన్–గ్లామరస్ పాత్రలలో కనిపించినాతనదైన గ్రామర్ ఎక్కడీకి పోదు! మంచి పాత్రల కోసం ఎదురుచూస్తున్నట్లుగానే... మహా పండగ సంక్రాంతి కోసం ఎదురు చూడడం దివికి ఇష్టం. సంక్రాంతి వస్తే చాలు... ఆమెకు రెక్కలు వస్తాయి. సరాసరి వెళ్లి విజయవాడలో వాలిపోతుంది. పండగ సంతోషాన్ని సొంతం చేసుకుంటుంది. భోగిమంటల వెలుగు నుంచి గగనసీమలో గాలిపటాల వయ్యారాల వరకు దివి చెప్పే సంక్రాంతి కబుర్లు...మాది హైదరాబాదే అయినా, నేను పుట్టింది విజయవాడలో. ఊహ తెలిసినప్పటి నుంచి సంక్రాంతి వచ్చిందంటే చాలు, విజయవాడలోని మా అమ్మమ్మగారి ఇంట్లో వాలిపోతా. వారం ముందు నుంచే మా ఇంట్లో పండుగ సందడి మొదలయ్యేది. మా మామయ్యలు, పిన్నులు, చుట్టాలందరితో కలసి గారెలు, అరిసెలు ఇలా ఇతర పిండి వంటలు చేసుకుని, ఇరుగు పొరుగు వారికి ఇచ్చుకుంటాం. పండుగ రోజు ఉదయాన్నే లేచి భోగి మంటలు వేసుకునేవాళ్లం. తర్వాత నలుగు పెట్టుకుని స్నానం చేసి, ముగ్గులు పెడతాం. అమ్మమ్మ పూజ చే స్తే, మేమంతా పక్కనే కూర్చొని, దేవుడికి దండం పెట్టుకునేవాళ్లం. కానీ ఆ రోజుల్ని ఇప్పుడు చాలా మిస్ అవుతున్నా. ఏది ఏమైనా సంక్రాంతికి కచ్చితంగా ఊరెళతాను. ఆ మూడు రోజుల పాటు బయటి ప్రపంచాన్ని మర్చిపోయి కుటుంబ సభ్యులతో కలసి పండుగ చేసుకోవటం నాకు చాలా ఇష్టం. సాయంత్రం స్నేహితులతో కలసి సరదాగా గాలిపటాలు ఎగరేస్తా. ఇప్పుడు నటిగా ఎదుగుతున్న సమయంలో సంక్రాంతి జరుపుకోవటం మరింత ఆనందంగా ఉంది. ఊరెళితే చాలు, అందరూ ఇంటికొచ్చి మరీ పలకరిస్తుంటారు. వారందరినీ చూసినప్పుడు నాపై నాకే తెలియని విశ్వాసం వస్తుంది. చివరగా సంక్రాంతికి ప్రత్యేకించి గోల్స్ లేవు కాని, అందరినీ సంతోషంగా ఉంచుతూ, నేను సంతోషంగా ఉంటే చాలు. ఇక నన్ను బాధించే వ్యక్తులకు, విషయాలకు చాలా దూరంగా ఉంటా. ఇంటర్వ్యూ: శిరీష చల్లపల్లిమర్చిపోలేని పండుగ– అంజలి‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ లో సీత ఎవరండీ? అచ్చం మన పక్కింటి అమ్మాయి. మన బంధువుల అమ్మాయి. తన సహజనటనతో ‘సీత’ పాత్రకు నిండుతనం తెచ్చిన అంజలికి... ‘మాది రాజోలండీ’ అని చెప్పుకోవడం అంటే ఇష్టం. మూలాలు మరవని వారికి జ్ఞాపకాల కొరత ఉంటుందా! కోనసీమ పల్లె ఒడిలో పెరిగిన అంజలి జ్ఞాపకాల దారిలో వెళుతుంటే....మనం కూడా ఆ దారిలో వెళుతున్నట్లుగానే, పల్లె సంక్రాంతిని ప్రత్యక్షంగా చూస్తున్నట్లుగానే ఉంటుంది! ఒకటా ... రెండా... పండగకు సంబంధించిన ఎన్నో విషయాలను నాన్స్టాప్గా చెబుతుంది. అంజలి చెప్పే కోనసీమ సంక్రాంతి ముచ్చట్లు తెలుసుకుందాం...చిత్ర పరిశ్రమలోకి రావాలనుకునే తెలుగమ్మాయిలందరికీ నటి అంజలి ఓ స్ఫూర్తి. మనందరి అమ్మాయి.. తెలుగమ్మాయి.. ఈ పెద్ద పండుగను ఎలా జరుపుకుంటుందంటే...కోనసీమజిల్లా రాజోలు మా ఊరు. గోదావరి జిల్లాల్లో సంక్రాంతి పండుగ గురించి పెద్దగా చెప్పక్కర్లేదు.. అందరికీ వారం ముందు నుంచి పండుగ మొదలయితే, మాకు నెల ముందు నుంచే ఇంకా చెప్పాలంటే పండుగయిన తర్వాతి రోజే.. వచ్చే సంక్రాంతి కోసం ఏర్పాట్లు చేస్తుంటాం. మా తాతయ్య సుబ్బారావుగారు పండుగలంటే అందరూ కలసి చేసుకోవాలని చెప్పేవారు. అందుకే, చిన్నప్పటి నుంచే నాకు అదే అలవాటు. మా ఫ్యామిలీ చాలా పెద్దది. అందరూ వస్తే ఇల్లు మొత్తం నిండిపోయేది. అయినా సరే, ఏ పండుగైనా అందరం కలసే జరుపుకుంటాం. ఇంట్లోనూ పొలాల్లోనూ ఘనంగా పూజలు నిర్వహిస్తాం. చిన్నప్పుడు కజిన్స్ అందరం కలసి ఉదయాన్నే భోగి మంటలు వేయటానికి, అందులో ఏమేం వేయాలో అనే విషయాల గురించి వారం ముందు నుంచే మాట్లాడుకునేవాళ్లం. తాతయ్య పిండివంటలన్నీ చేయించేవారు. అందుకే, ఈ పండుగ కోసం ఎంతో ఎదురు చూసేదాన్ని. కాని, సిటీకి వచ్చాక అంత ఎంజాయ్మెంట్ లేదు. చిన్నతనంలో మా పెద్దవాళ్లు ముగ్గు వేస్తే, మేము రంగులు వేసి, ఈ ముగ్గు వేసింది మేమే అని గర్వంగా చెప్పుకుని తిరిగేవాళ్లం. అందుకే, ముగ్గుల పోటీల్లో నేనెప్పుడూ పాల్గొనలేదు. గాలిపటాన్ని కూడా ఎవరైనా పైకి ఎగరేసిన తర్వాత ఆ దారాన్ని తీసుకుని నేనే ఎగరేశా అని చెప్పుకుంటా. అందుకే, సంక్రాంతి నాకు మరచిపోలేని పండుగ.నిండుగా పొంగితే అంతటా సమృద్ధిసంక్రాంతి పండగ అనగానే తెల్లవారకుండానే పెద్దలు పిల్లల్ని నిద్రలేపడం, చలికి వణుకుతూ ముసుగుతన్ని మళ్లీ పడుకోవడం ఇప్పటికీ గుర్తు వస్తుంటుంది. సందడంతా ఆడపిల్లలదే. ముగ్గులు వేయడం, వాటిల్లో గొబ్బెమ్మలు పెట్టి, నవధాన్యాలు, రేగుపళ్లు వేసేవాళ్లం. ముగ్గులు వేయడం, గొబ్బెమ్మలు పెట్టడం, ఆవు పిడకల మీద మట్టి గురిగలు పెట్టి, పాలు పొంగించేవాళ్లం. ఎటువైపు పాలు పొంగితే అటువేపు సస్యశ్యామలం అవుతుందని నమ్మకం. నిండుగా పొంగితే అంతటా సమృద్ధి. మిగిలిన గురుగుల్లోని ప్రసాదాన్ని అలాగే తీసుకెళ్లి లోపలి గదుల్లో మూలకు పెట్టేవారు ఎలుకల కోసం. సాధారణ రోజుల్లో ఎలుకలు గింజలు, బట్టలు కొట్టేస్తున్నాయని వాటిని తరిమేవారు. అలాంటిది సంక్రాంతికి మాత్రం, బయట పక్షులతోపాటు ఇంట్లో ఎలుకలకు కూడా ఇలా ఆహారం పెట్టేవాళ్లు. ముగ్గులు పెట్టడంలో ఇప్పడూ పోటీపడే అమ్మాయిలను చూస్తున్నాను. మేం ఉండేది వనపర్తిలో. అప్పటి మాదిరిగానే ఇప్పడూ జరుపుకుంటున్నాం. – పోల్కంపల్లి శాంతాదేవి, రచయిత్రి -
సందళ్లే సందళ్లే.. సంక్రాంతి సందళ్లే..!
ఉద్యోగాల పేరుతో ఎక్కడెక్కడో సెటిల్ అయ్యి ఉన్నా..ఈ పండగకి మాత్రం తమ సొంతూళ్లకి చేరి చేసుకునే గొప్ప పండుగా సంక్రాంతి. అందర్నీ ఒక చోటకు చేర్చే పండుగ. ఎంత వ్యయప్రయాసలు కోర్చి అయినా.. ఈ పండగకి సోంతూరికి వెళ్తేనే ఆనందం. అలాంటి ఈ పండుగ విశిష్టత ఏంటి, దేశమంతా ఏఏ పేర్లతో ఈ పండగను జరుపుకుంటుంది తదితరాల గురించి చూద్దామా..!.సంక్రాంతి పండగా ప్రకృతికి కృతజ్ఞత చెబుతూ జరుపుకునే సంబరం. ఈ పండుగ నాటికి రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యం ఇంటికి చేరుతుంది. అందుకే సంతోషంతో ఈ పండుగ చేసుకుంటారు. పురాణ కథనం ప్రకారం తమ పూర్వీకులకు తర్పణం సమర్పించేందుకు భగీరథ మహర్షి గంగమ్మను భువిపైకి ఆహ్వానిస్తాడు. అది సరిగ్గా మకర సంక్రాంతి పండుగ రోజునే. అందుకే ఈరోజున మకర సంక్రాంతి పండుగను జరుపుకుంటారు.సూర్యుడు ధనస్సు రాశి నుంచి మకర రాశిలోకి సంచారం చేసిన సమయంలోనే మకర సంక్రాంతి పండుగ ప్రారంభమవుతుంది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది జనవరి 14న(మంగళవారం) మకర సంక్రాంతి పండుగ వచ్చింది. ఈ పవిత్రమైన రోజునే సూర్యుడు దక్షిణాయానం పూర్తి చేసుకుని ఉత్తరాయణం పుణ్యకాలాన్ని ప్రారంభిస్తాడు. ఈ పర్వదినంలో ప్రతి ఒక్కరూ తమ సామర్థ్యం మేరకు దానధర్మాలు చేయాలి. ఇలా చేయడం వల్ల సుఖసంతోషాలతో హాయిగా ఉంటామని విశ్వసిస్తారు. కొత్తగా పెళ్లి చేసుకున్న వారు బొమ్మల నోము, సావిత్రి గౌరీ వ్రతం చేస్తారు. మరికొందరు మకర సంక్రాంతి రోజున తమ పూర్వీకుల ఆత్మ శాంతి కోసం తమ సామర్థ్యం మేరకు దానధర్మాలు చేస్తారు. అంత మహిమాన్వితమైన మకర సంక్రాంతిని దేశమంతా ఏఏ పేర్లతో ఎలా జరుపుకుంటుందో చూద్దామా..!.ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో సంక్రాంతిని "మకర సంక్రాంతి" అని పిలుస్తారు. అక్కడ పెద్దల పేరు చెప్పి భోజనం పెట్టడం లేదా ఏవైన దానధర్మాలు చేయడం వంటివి చేస్తారు. వరి దుబ్బులు తీసుకొచ్చి పక్షులకు ఆహారం పెట్టడం వంటివి చేస్తారు.తమిళనాడులో మకర సంక్రాంతిని పొంగల్గా జరుపుకుంటారు. అక్కడ ఈ రోజున రైతులు తమ ఎద్దులను అలంకరించి పూజిస్తారు. వాళ్లు ఈ పండగను వ్యవసాయ ఉత్పాదకత, శ్రేయస్సుకు చిహ్నంగా భావిస్తారు.కేరళలో మకర సంక్రాంతి పేరు మకరవిళక్కు. ఈ రోజున శబరిమల ఆలయం దగ్గర ఆకాశంలో మకర జ్యోతి కనిపిస్తుంది. ప్రజలు దానిని సందర్శిస్తారుకర్ణాటకలో ఈ పండుగను ఎల్లు బిరోధు అని పిలుస్తారు. ఈ రోజున మహిళలు కనీసం 10 కుటుంబాలతో చెరకు, నువ్వులు, బెల్లం, కొబ్బరితో చేసిన వస్తువులను ఒకరికొకరు ఇచ్చి పుచ్చుకుంటారు.పంజాబ్లో మకర సంక్రాంతిని మాఘిగా జరుపుకుంటారు. మాఘి నాడు శ్రీ ముక్తసర్ సాహిబ్లో ఒక ఉత్సవం జరుగుతుంది. ఇక్కడ ప్రజలు ఈ రోజున నృత్యం చేసి ఆడి, పాడతారు. ఈ రోజున కిచిడి, బెల్లం, ఖీర్ తినే సంప్రదాయం ఉంది. గుజరాత్లో మకర సంక్రాంతిని ఉత్తరాయణ పుణ్య కాలంగా జరుపుకుంటారు. ఆ రోజున గాలిపటాల పండుగ జరుగుతుంది. అలాగే ఉండియు, చిక్కీ వంటకాలు తింటారు.హిమాచల్ ఫ్రదేశ్లో ఈ పండుగను మాఘాసాజీ అని పిలుస్తారు. సాజి అనేది సంక్రాంతికి పర్యాయపదం. కొత్త నెల ప్రారంభం… మాఘమాసం కూడా నేటినుంచే ప్రారంభం అవుతుంది. ఉత్తరాయణం ప్రారంభ సూచికగా ఈ పండుగ చేసుకుంటారు.ఉత్తరాఖండ్లోని కుమావున్ ప్రాంతంలో మకర సంక్రాంతి గొప్ప ఉత్సాహంతో జరుపుకుంటారు. అక్కడ ఈ రోజున నేతిలో వేయించి తీసిన పిండి పదార్ధాలను కాకులకు ఆహారంగా పెడతారు. ఒడిషాలో ప్రజలు మకర చౌలా పేరుతో సంక్రాంతిని జరుపుకుంటారు. కొత్తబియ్యం, బెల్లం, నువ్వులు. కొబ్బరి వంటి వాటితో చేసిన ఆహార పదార్ధాలను తయారు చేస్తారు ముఖ్యంగా కోణార్కో లోని సూర్యదేవాలయానికి ఈరోజు భక్తులు పోటెత్తుతారు. సూర్యుడు మకర రాశిలో ప్రవేశించిన ఉత్తరాయణ పుణ్యకాలంలో సూర్యభగవానుడిదర్శనం చేసుకుంటారు.పశ్చిమ బెంగాల్లో పౌష్ సంక్రాంతి పేరుతో ఈ పండుగ జరుపుకుంటారు. ప్రజలు గంగానది బంగాళా ఖాతంలో కలిసే ప్రదేశంలో పుణ్యస్నానాలు ఆచరిస్తారు. దీన్ని పౌష్ పర్బన్ అనే పేరుతో కూడాజరుపుకుంటారు. ఇక్కడి ప్రజలు ఖర్జూర పండును ఎక్కువగ ఉపయోగిస్తారు. కొత్త బియ్యం, కొబ్బరి, బెల్లం ఖర్జూరాలతో తయరు చేసిన ఖీర్ వంటివి ఆరగిస్తారు.,డార్జిలింగ్ లోని హిమాలయ ప్రాంతాల్లో ఈరోజున ప్రజలు శివుడిని ఆరాధిస్తారు.బీహార్,జార్ఖండ్లలో ఈ రోజున ఉత్సాహంగా గాలిపటాలు ఎగరేసి ఆనంద డోలికల్లో మునిగిపోతారు. సాయంత్రం వేళ ప్రత్యేక ఖిచిడీని తయారు చేసి పాపడ్, నెయ్యి, కూరగాయలతో చేసిన వంటకాన్ని బంధువులు స్నేహితులతో కలిసి సామూహికంగా ఆరగిస్తారు.ఇతర దేశాల్లో..నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంక, కాంబోడియా వంటి దేశాల్లోనూ ఈ పండగ కనిపిస్తుంది. అక్కడ ప్రజలు నది -సముద్రం కలిసే సంగమ ప్రదేశంలోనూ పుణ్యస్నానాలు ఆచరిస్తారట. అలాగే పతంగులు, తీపి వంటలు ప్రధానంగా ఉంటాయట.(చదవండి: Sankranti 2025 : అసలు భోగి పళ్లు ఎలా పోయాలో తెలుసా?) -
భోగి వైభోగం
సౌరమానాన్ని ఆధారంగా చేసుకున్న పండగ భోగి. తెల్లవారు జామునే భోగి మంట వేస్తారు. కర్రపుల్లలు, పిడకల దండలు, పాత సామాన్లు, కొబ్బరిమట్టలు... లాంటివాటితో పెద్దపెద్ద మంటలు వేస్తారు. పాత వస్తువులతో పాటు, మనుషుల మనసుల్లో దాగి ఉన్న పాత అలవాట్లను సైతం అగ్నిలో దహింపచేసి, ఆరోజు నుంచి కొత్త ఆయనంలోకి, కొత్త జీవితాన్ని మొదలుపెట్టడానికి కొత్త మార్గంలో ప్రయాణించడానికి సూచనగా భావిస్తారు. గ్రామాల్లో నాలుగు రోడ్ల కూడళ్లలో భోగిమంట వేస్తారు. అలా అందరూ ఒకచోట చేరటం వలన సమైక్యత ఏర్పడుతుంది. ఈ రోజున భోగి మంట వేసుకోవటం వెనుక కూడా ఆరోగ్య రహస్యం దాగి ఉంది. సరిగ్గా భోగితో దక్షిణాయనం పూర్తయ్యి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభం అవుతుంది. చలి కూడా వెనకపడుతుంది. ఒక్కసారిగా వాతావరణం వేడిగా మారుతుంది. ఆ వేడిని తట్టుకోవడం కోసమే ఈ మంట వేసుకునే సంప్రదాయం వచ్చి ఉండవచ్చునని ఆధ్యాత్మికవేత్తల అభిప్రాయం. వీటి నుండి వచ్చే పొగ ఆరోగ్యం కలిగించేదే కాని హాని కలిగించేది కాదు. ఈ మంట వేయడానికి పిల్లలందరూ ఇంటింటికీ వెళ్లి తోటి పిల్లల్నందర్నీ నిద్రలేపి పరాచికాలాడుకుంటూ, చలికాచుకుంటూ కోలాహలంగా కనిపిస్తారు. సైన్సుపరంగా చెప్పాలంటే, చలికాలం వాతావరణంలో సూక్ష్మక్రిములు అభివృద్ధి చెందడానికి అనువైన కాలం. అందువల్ల అందరూ ఏకకాలంలో భోగిమంటలు వేయడం వల్ల సూక్ష్మక్రిములన్నీ నశించిపోయి అంటువ్యాధులు ప్రబలకుండా ఉంటాయి. అదేవిధంగా ఎప్పటెప్పటి నుంచో మూలన పడి ఉన్న పాత సామానును ఏడాదికోసారి ఈ విధంగా వదిలించుకోవడం వల్ల దుమ్ము, ధూళి, ఎలుకలు, వాటిని తినడానికి పాములు చేరకుండా ఉంటాయనేది పెద్దల మాట. భోగం అంటే పిల్లలకు భోగం చేయడం. పిల్లలకు భోగిపళ్లు పోసేటప్పుడు రేగు పళ్లు, రాగి పైసలు, పువ్వులు మూడిటినీ కలిపి తలచుట్టూ మూడుసార్లు తిప్పి తలమీద పోస్తారు. కొన్ని ప్రాంతాలలో రేగుపళ్లు, చిల్లరడబ్బులు, కొత్తబియ్యం, తేగ ముక్కలు, చెరకు ముక్కలు, పాలకాయలు, పచ్చి శనగ కాయలు, పూలరేకలు అన్నీ కలిపి పోస్తారు. దీనివల్ల దృష్టి దోషం పోతుందని విశ్వాసం. పిల్లలు కూర్చునే పీటకింద ఇంట్లో తయారు చేసుకున్న పిండివంటన్నీ వేస్తారు. వాటిని తరవాత ఇంట్లో నమ్మకంగా పనిచేసే వారికి ఇచ్చేస్తారు. చివర్లో పేరంటాళ్లకి వాయినం ఇస్తారు. ఇందులో ఆరోగ్యానికి ఉపకరించే మొలకెత్తిన శనగలు తమలపాకులు, వక్క ఇస్తారు. మన పండుగల వెనుక సంప్రదాయంతోపాటు ఆరోగ్య కోణమూ దాగి ఉంది. అందుకే ఈ వంటకాలు, వాయినాలు ఆనవాయితీగా వస్తున్నాయి.వస్తు వ్యామోహానికి మంటమనుషుల మీదైనా, వస్తువుల మీదైనా వెర్రివ్యామోహం పనికిరాదు. కరుడుగట్టిన అలాంటి కోరికలేవైనా ఉంటే వాటిని వదిలించుకోవాలి. అప్పుడే జీవితం నిశ్చింతగా ఉంటుంది. ఈ మాటను ఊరికే చెబితే ఎవరూ వినరు కాబట్టి భోగిమంట రూపంలో చెబితే వింటారన్నది పెద్దల నమ్మకం. ఇక పోతే, భోగిపండ్లు లేదా రేగుపండ్లలో ఎనలేని ఔషధగుణాలు ఉన్నాయి. చలికాలంలో ఎవరికైనా జీర్ణశక్తి మందగిస్తుంది. పీచు పదార్థాలను ఎక్కువగా తీసుకుంటే కాని సమస్య తొలగిపోదు. ఒకప్పుడు ఇప్పుడున్నంత ఆరోగ్య చైతన్యం లేదు కనక.. ఆ లోటును పూడ్చేందుకు రేగుపండ్లను తినమనే వారు. రేగులోని జిగట పదార్థం అన్నవాహికను శుభ్రం చేస్తుంది. ‘భుక్త్వాచ బదరీఫలం’ అన్నది అందుకే. భోంచేసిన తర్వాత రేగుపండ్లు తింటే మంచిదని దాని అర్థం. రేగుపండ్లు శరీరంలో వేడిని పుట్టించే రసాయనాలను ఉత్పత్తి చేస్తాయి. ఆకలి పుట్టిస్తాయి. రేగుపండ్లకున్నప్రాశస్త్యాన్ని దృష్టిలో పెట్టుకునే.. పండగపూట పిల్లలకు చిల్లర నాణేలతో కలిపి భోగిపండ్లు పోస్తారు. మహా భక్తురాలైన గోదాదేవి భోగినాడే రంగనాథుని పతిగా పొందిందని ద్రవిడ వేదం చెబుతోంది. అందువల్ల విష్ణ్వాలయాలలో భోగిరోజు గోదా రంగనాథులకు కల్యాణం జరిపిస్తారు. – డి.వి.ఆర్. -
భోగభాగ్యాల భోగి పండగ దేనికి సంకేతమంటే.?
'భగ' అనే పదం నుంచి భోగి అన్నమాట పుట్టిందని శాస్త్ర వచనం. 'భగ' అంటే 'మంటలు' లేదా 'వేడి'ని పుట్టించడం అని అర్ధం. మరోక అర్థంలో భోగం అంటే సుఖం పురాణాల ప్రకారం ఈరోజున శ్రీ రంగనధాస్వామిలో గోదాదేవి లీనమై భోగాన్ని పొందిందని దీనికి సంకేతంగా 'భోగి పండగ' ఆచరణలోకి వచ్చిందని పురాణ గాథ. అయితే చాలామంది భావించే విధంగా భోగి మంటలు వెచ్చదనం కోసం మాత్రమే కాదు ఆరోగ్యం కోసం కూడా. అలాంటి ఈ పండుగను అనాథిగా ఆచారిస్తూ రావడానికి గల కారణం, ఆరోగ్య రహాస్యలు గురించి సవివరంగా చూద్దామా..!భోగినాడు సూర్యుడు ఉత్తర ఆయనం వైపు పయనం ప్రారంభిస్తారు. సూర్యుడు కొంత కాలం భూమధ్యరేఖకి దక్షిణం వైపు ప్రయాణించి ఆ తర్వాత దక్షిణం నుంచి దిశ మార్పుచుని ఉత్తరం వైపు ప్రయాణిస్తాడు. సూర్యుడు ప్రయాణించే దిక్కుని బట్టి…దక్షిణం వైపు పయనిస్తే దక్షిణాయానం.. ఉత్తరం వైపు పయనిస్తే ఉత్తరాయణం అంటారు. మకర రాశిలోకి ప్రారంభ దశలో ఆ సూర్యని కాంతి సకల జీవరాశుల మీద పడడంతో మంచి జరుగుతుందని శాస్త్రం చెబుతోంది. సూర్యుడే ఆరోగ్యకారుడు ఆ ఆరోగ్యాన్ని ఇవ్వమని కోరుకునే పండుగ ఈ మకర సంక్రాంతి.. ఇక భోగ భాగ్యాలను అందించే పండుగ భోగి అని పెద్దలు చెబుతున్నారు.ఆరోగ్య రహస్యం..ధనుర్మాసం నెలంతా ఇంటి ముందు ఆవు పేడతో పెట్టిన గొబ్బెమ్మలను పిడకలుగా చేస్తారు. వాటినే ఈ భోగి మంటలలో వాడుతారు. దేశీ ఆవు పేడ పిడకలని కాల్చడం వలన గాలి శుద్ధి అవుతుంది. సుక్ష్మక్రిములు నశిస్తాయి. భోగి మంటలు పెద్దవిగా రావడానికి అందులో రావి, మామిడి, మేడి మొదలైన ఔషధ చెట్ల బెరళ్లు వేస్తారు. అవి కాలడానికి ఆవు నెయ్యిని జోడిస్తారు. ఈ ఔషధ మూలికలు ఆవు నెయ్యి ఆవు పిడకలని కలిపి కాల్చడం వలన విడుదలయ్యే గాలి అతి శక్తివంతమైంది. మన శరీరంలోని 72 వేల నాడులలోకి ప్రవేశించి శరీరాన్ని శుభ్ర పరుస్తుంది. అందువల్లే భోగి మంటల్లో పాల్గొనే సాంప్రదాయం వచ్చింది. భోగి మంటలు ఎందుకంటే..చాలా మందికి భోగి మంటలు ఎందుకు వేస్తారో తెలియదు. పురాణాల ప్రకారం, దీనికి వెనుక ఒక కథ ఉంది. ఒకానొక సమయంలో రురువు అనే రాక్షసుడు ఉండేవాడు. ఆ రాక్షసుడు బ్రహ్మదేవుడి గురించి ఘోరంగా తపస్సు చేశాడు. అతడి తపస్సుకి మెచ్చి బ్రహ్మదేవుడి ప్రత్యక్షమై ఏం వరం కావాలని అడిగాడు. దానికి ఆ రాక్షసుడు మరణం లేకుండా వరం ఇవ్వమని అడుగుతాడు. అందుకు బ్రహ్మదేవుడు అంగీకరించలేదు. అప్పుడు రురువు ఎవరైనా సరే 30 రోజుల పాటు గొబ్బెమ్మలు ఇంటిముందు పెట్టి, అవి ఎండిపోయిన తర్వాత మంటల్లో వేసి ఆ మంటల్లో నన్ను తోస్తేనే మరణించేలా వరమివ్వమని బ్రహ్మదేవుడిని కోరాడు. అనంతరం రురువు వర గర్వంతో దేవతలందరినీ ఇబ్బంది పెట్టడం ప్రారంభించాడు. అప్పుడు దేవతలందరూ ఈ ధనుర్మాసంలో 30 రోజులపాటు ఇంటిముందు గొబ్బెమ్మలు పెట్టి.. ఆ తర్వాత వాటిని మంటల్లో పెట్టి రాక్షసుడిని అందులో తోస్తారు. అలా రాక్షసుడు చనిపోవడానికి సంకేతంగా భోగి రోజు భోగి మంటలు వేసుకోవడం ఆచారంగా వస్తోంది.ఈ పండగ సందేశం, అంతరార్థం..చలికాలంలో సూక్ష్మక్రిముల బెడద ఎక్కువగా ఉంటుంది. వాటిని తొలగిపోవడానికి మన పెద్దలు ఇలా భోగి మంటలు వేసి ఆరోగ్యాన్ని సంరక్షించుకునేవారని చెబుతుంటారు. ఇక ఈ పండుగ మనకు ఇచ్చే సందేశం ఏంటంటే..చెడు అలవాట్లను, అసూయా, ఈర్ఘ, దుర్భద్ధిని ఈ మంటల రూపంలో దగ్ధం చేసుకుని మంచి మనుసుతో జీవితాన్ని ప్రారంభించి సానుకూలా ఆలోచనలతో మంచి విజయాలను అందుకోవాలనే చక్కటి సందేశాన్ని ఇస్తోంది. మనం అగ్ని ఆరాధకులం. కనుక మాకు అసలైన భోగాన్ని కలిగించమనీ, అమంగళాలను తొలగించమని ప్రార్థిస్తూ అగ్నిహోత్రాన్ని రగులుస్తాము. గతించిన కాలంలోని అమంగళాలను, చేదు అనుభవాలు, అలాగే మనసులోని చెడు గుణాలను, అజ్ఞానాన్ని అన్నింటినీ అత్యంత పవిత్రమైన అగ్నిలో వేసి దగ్ధం చేసుకోవటమే భోగి. ఇలా మంగళాలను, జ్ఞానాన్ని పొందాలనే కోరికతో అగ్నిహోత్రుడిని పరబ్రహ్మ స్వరూపంగా భావించి పూజించటమే భోగి మంటల వెనక ఉన్న అంతరార్థం.(చదవండి: సంక్రాంతి అంటే పతంగుల పండుగ కూడా..!) -
నేలకు చుక్కలు
ఒకప్పటి రోజుల్లో ఇంటి ఇల్లాలు ΄పొద్దున్నే లేవగానే చేసే పని,,, వాకిలి ఊడ్చి నీళ్లు చల్లి ముగ్గు వేయడం. వెసులుబాటును బట్టి, సందర్భాన్ని బట్టీ చిన్న ముగ్గెయ్యాలో... పెద్ద ముగ్గెయ్యాలో... చుక్కల ముగ్గు పెట్టాలో, గీతల ముగ్గు వెయ్యాలో ముందే అనుకునేవారు. ఇక సంక్రాంతి నెల వచ్చిందంటే పోటా పోటీలుగా ముగ్గులు వేసేవారు. పెద్ద ఎత్తున ముగ్గుల పోటీలు కూడా పెట్టేవాళ్లు. ముగ్గుల మీద కార్టూన్లు కూడా బాగానే పడేవి. ఇక ముగ్గులోకి దించటం, ముగ్గు΄పొయ్యటం లాంటి జాతీయాలు, ముత్యాల ముగ్గు లాంటి సినిమాల సంగతి సరేసరి. ముగ్గులు ఒకప్పుడు శుభాశుభ సంకేతాలుగా పనిచేసేవి. పూర్వం సాధువులు, సన్యాసులు, బ్రహ్మచారులు రోజూ ఇల్లిల్లూ తిరిగి భిక్ష అడిగేవారు. ఏ ఇంటి ముందైనా ముగ్గు లేదంటే ఆ ఇంటిలోకి అడుగుపెట్టేవారు కాదు. వారే కాదు యాచకులు కూడా ముగ్గు లేని ఇళ్ళకు వెళ్లేవారు కాదు! ఎందుకంటే, ఇంటి వాకిట్లో ముగ్గు లేదంటే అక్కడ అశుభం జరిగిందని గుర్తు. అందుకే మరణించినవారికి శ్రాద్ధకర్మలు చేసే రోజున ఉదయం ఇంటిముందు ముగ్గు వేయరు. ధనుర్మాసంలో ప్రతి ఇంటిముందు తెల్లవారుఝామున ఇంటిముందు అందమైన ముగ్గులు వేసి ముగ్గు మధ్యలో గొబ్బెమ్మలు, గుమ్మడి పూలు ఉంచి వాటిని బియ్యం పిండి, పసుపు, కుంకుమ, పూలతో అలంకరించి పూజించడం ఆచారం. ఎందుకంటే గొబ్బెమ్మలను పూజించడం వల్ల మంచి జరుగుతుందని విశ్వాసం.గొబ్బియల్లో... గొబ్బియల్లోముగ్గులకు ఎంత ప్రాధాన్యముందో, ముగ్గులలో పెట్టే గొబ్బిళ్లు లేదా గొబ్బెమ్మలకు కూడా అంతే ప్రాధాన్యతనిస్తారు తెలుగువాళ్లు. ఎందుకంటే గొబ్బెమ్మలు కృష్ణుడికి ఎంతో ఇష్టమైన గోపికా స్త్రీల రూపాలకి సంకేతంగా భావిస్తారు. ముగ్గుమధ్యలో పెట్టే పెద్ద గొబ్బెమ్మ గోదాదేవికి సంకేతం. ఆవు పేడని పవిత్రంగా భావిస్తారు. పేడతో చేసిన గొబ్బెమ్మలు ముగ్గుల మీద పెట్టడం సంప్రదాయంగా వస్తోంది. పెళ్లి కాని వాళ్ళు గొబ్బెమ్మలు పెడితే త్వరగా పెళ్లి అవుతుందని విశ్వాసం. గొబ్బెమ్మలు చుట్టూ తిరుగుతూ గొబ్బియెల్లో గొబ్బియెల్లో.. అని పాట పాడుతూ సందడిగా నృత్యం చేస్తారు. కృష్ణుడి మీద గోపికలకి ఉన్న భక్తి తమకు రావాలని కోరుకుంటూ గొబ్బెమ్మలు పెడతారు.గొబ్బెమ్మలు గోదాదేవితో సమానం కనుకే వాటిని కాలితో తొక్కరు. ఇంటి లోగిలి అందంగా ఉన్న ఇళ్ల మీద లక్ష్మీదేవి ఆశీస్సులు ఉంటాయని నమ్ముతారు. అలా అందంగా అలంకరించడం అనేది లక్ష్మీదేవిని తమ ఇంట్లోకి ఆహ్వానించినట్టేనని భావిస్తారు. శ్రీ కృష్ణుడి చుట్టూ గోపికలు ఎలా అయితే చేరి పాటలు పాడి సరదాగా నృత్యాలు చేస్తారో,, అలాగే గొబ్బిళ్ళ చుట్టూ కూడా చేరి పాటలు పాడుతారు.– డి.వి.ఆర్. భాస్కర్ -
వచ్చాడు బసవన్న
ఉదయం పూట చెట్ల కొమ్మలపై మంచుపూలు స్వాగతం పలుకుతుండగా సన్నాయి రాగం మధురంగా వినిపిస్తుంది. చేగంట మోగుతుండగా బసవన్న పాట వినిపిస్తుంది... ‘డూ డూ బసవన్నా ఇటురారా బసవన్నా/ఉరుకుతూ రారన్న రారన్న బసవన్నా/అమ్మవారికి దండం బెట్టు అయ్యగారికి దండం బెట్టు/రారా బసవన్నా... రారా బసవన్నా....’గంగిరెద్దులు ఊళ్లోకి అడుగు పెడితే ఊరికి సంక్రాంతి కళ సంపూర్ణంగా వచ్చినట్లే. విశేషం ఏమిటంటే... గంగిరెద్దుల ముందు పెద్దలు చిన్న పిల్లలై పోతారు. ‘దీవించు బసవన్నా’ అంటూ పిల్లలు పెద్దలై భక్తిపారవశ్యంతో మొక్కుతారు. కాలం ముందుకు వెళుతున్న కొద్దీ ఎన్నో కళలు వెనక్కి పోతూ చరిత్రలో కలిసిపోయాయి. అయితే గంగిరెద్దుల ఆట అలా కాదు. కాలంతో పాటు నిలుస్తోంది. ‘ఇది మన కాలం ఆట’ అనిపిస్తోంది...కొత్త కాలానికి... కొత్త చరణాలుకాలంతో పాటు బసవన్న పాటలోకి కొత్త చరణాలు వస్తుంటాయి. సందర్భాన్ని బట్టి ఆ పాటలో చరణాలు భాగం అవుతుంటాయి. ఒక ఊళ్లో... సంక్రాంతి సెలవులకు వచ్చిన పిల్లాడు బైక్ యాక్సిడెంట్లో చనిపోయాడు. అది ఎన్నో సంవత్సరాల చేదు జ్ఞాపకం అయినా సరే, ఊళ్లో సంక్రాంతి రోజు ప్రతి ఇల్లు పండగ కళతో కళకళలాడినట్లు ఆ ఇల్లు కనిపించదు. జ్ఞాపకాల దుఃఖభారంతో కనిపిస్తుంది. ఆ భారం నుంచి ఆ ఇంటి వాళ్లను తప్పించడానికి బసవడు ఆడుతాడు పాడుతాడు. ‘నవ్వించు బసవన్న నవ్వించు/అమ్మ వారికి దండం పెట్టి నవ్వించు/అయ్యవారికి దండం పెట్టి నవ్వించు/ వాళ్లు హాయిగా ఉండేలా దీవించు..ఆ దీవెన ఎంతో పవర్పుల్.పండగపూట బసవన్న ఇంటిముందుకు రాగానే బియ్యం లేదా పాత బట్టలతో రావడం ఒక విషయం అయితే... భవిష్యత్ వాణి అడగడం, ఆశీర్వాదం ఒక మరో విషయం. గంగిరెద్దులాయన సంచిలో బియ్యం పోస్తు ‘మా అబ్బాయికి ఈ సంవత్సరమన్నా ఉద్యోగం వస్తుందా బసవన్నా’ అని అడుగుతుంది ఒక అమ్మ, ‘అవును’ అన్నట్లు తల ఆడిస్తుంది. ‘మా తల్లే’ అని కంటినిండా సంతోషంతో గంగిరెద్దు కాళ్లు మొక్కుతుంది ఆ అమ్మ. గంగిరెద్దుల ఆటలో విశేషం ఏమిటంటే, తెలుగు ప్రాంతాల్లో ఒక్కో చోట ఒక్కో రకమైన ప్రత్యేతలు ఉన్నాయి. ఉదాహరణకు శ్రీకాకుళం జిల్లా మందస ప్రాంతంలో గంగిరెద్దుల వారి పాటల్లో తత్వం ధ్వనిస్తుంది. సామాజిక విశ్లేషణ ఉంటుంది. ఉదా: ‘దేవా! ఏమి జరుగుతున్నది ప్రపంచం/అహో! ఏం చిత్రంగున్నదీ ప్రపంచం/ పసుపురాత తగ్గిపోయి....΄పౌడరు రాతలెక్కువాయె’...సంక్రాంతి రోజుల్లో బసవన్నల విన్యాసాలకు ప్రత్యేకంగా రంగస్థలం అక్కర్లేదు. ఊళ్లోకి అడుగుపెడితే... అణువణువూ ఆ కళకు రంగస్థలమే. మనసంతా ఉల్లాసమే. తరతరాల నుంచి ప్రతి తరానికి దివ్యమై అనుభవమే.– బోణం గణేష్, సాక్షి, అమరావతి -
జాతి జాగృతి కోసం.. బంజారా భగవద్గీత : కేతావత్ సోమలాల
రామంతాపూర్: పురాణాల ప్రకారం, దైవత్వాన్ని పొందిన మొట్టమొదటి ధార్మిక గ్రంథం భగవద్గీత. దీన్ని భారతీయ సంస్కృతి, సంస్కారాలను ప్రభావితం చేసిన జ్ఞాన ప్రవాహంగా పరిగణిస్తారు. హిందువులకు ఎంతో పవిత్రమైన ఆధ్యాత్మిక గ్రంథం. మనిషి ఎలా మసులు కోవాలి.. కష్టసుఖాల్లో ఎలా వ్యవహరించాలి తదితర విషయాలపై మానవాళిని సన్మార్గంలో నడిపే పవిత్ర గ్రంథం భగవద్గీత. భారతీయ సంస్కృతికి గోపురం వంటి గీతను సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడు మానవ ప్రపంచానికి అందించారు. దాదాపు ప్రపంచంలోనే అన్ని భాషల్లోకి అనువదించబడినా బంజారాలకు మాత్రం చేరలేదు. దాంతో వారికి భగవద్గీత సారాన్ని అందించాలని అనుకున్నారు హబ్సిగూడవాసి కేతావత్ సోమ్లాల. తన జాతి జాగృతం కోసం మొక్కవోని సంకల్పంతో 16 నెలలు శ్రమించి భగవద్గీతలోని 701 శ్లోకాలను బంజారాభాషలోకి అనువదించారు. తెలుగు లిపిలో బంజారాలకు సులభంగా అర్థమయ్యే రీతిలో గీతను మలిచి అందజేశారు. యాదాద్రి, భువనగిరి జిల్లాలోని ఆకుతోట బావి తండాకు చెందిన సోమ్లాల స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో డిప్యూటీ మేనేజర్గా విధులు నిర్వర్తించి వీఆర్ఎస్ తీసుకున్నారు. విద్యార్థి దశలోనే బంజారాలను చైతన్యపరుస్తూ 200లకుపైగా పాటలు రాశారు. తండాలు తిరుగుతూ ఈ పాటలు పాడి బంజారాలను ఉత్తేజపరిచారు. విద్యార్థి దశలోనే బంజారా భాషలోకి అనువాదం చేసేందుకు ఎంతో శ్రమించారు. బంజారా భాషలో మల్లె మొగ్గ అనే పదాన్ని ఏమాంటారో తెలుసుకోవడం కోసం తిరగని తండా లేదు. పువ్వుడా అంటారని తెలుసుకొని ఆ పదాన్ని గీతలోకి చేర్చారు. దాదాపు 50 భగవద్గీతలు చదివి 1988 ఆగస్టు నెలలో అనువాదం మొదలుపెట్టారు. దాదాపు 16 నెలలు కృషి చేస్తే పూర్తయింది. కానీ ముద్రణకు మాత్రం 25 ఏళ్లు నిరీక్షించాల్సి వచి్చంది. బంజారా భగవద్గీతను అప్పటి టీటీడీ ప్రెస్ అధికారి రవ్వ శ్రీహరి సహకారంతో తిరుమల బ్రహ్మోత్సవాల్లో అప్పటి సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హెచ్ఎల్ దత్తు, జడ్జి రమణ ఆవిష్కరించారు. బంజారాల కోసం అనువదించిన భగవద్గీతతో పాటు ది హిస్టరీ ఆఫ్ బంజారా, బంజారా గీతమాల వంటి రచనలు చేసిన సోమ్లాల్కు కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు ప్రకటించింది. 2024 సంవత్సరం ఏప్రిల్ నెలలో భారత రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము చేతులమీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్నారు. 2001లో ఆల్ ఇండియా బంజారా సేవా సమితి ముంబై వారు సోమ్లాల్కు బంజారా జానపద బ్రహ్మ అనే అవార్డు అందించారు. మాజీ సీఎం కేసీఆర్ బంజారా సాహిత్యానికి సోమలాల్ చేస్తున్న సేవలను గుర్తించి బంగారు కంకణం తొడిగారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సైతం ఆయనను అభినందించారు. పేద కుటుంబంలో జన్మించిన ఆయన జనగామలోని ప్రభుత్వ హాస్టల్లో పదో తరగతి చదువుతున్న సమయంలో ఈ హాస్టల్ పక్కనే ఉన్న గీత మందిరం నుంచి ప్రతిరోజూ ఉదయం లౌడ్ స్పీకర్లో వినిపించే గీతా శ్లోకాలను వింటూ స్ఫూర్తి పొందారు. వెనుకబడిన తన బంజారా సమాజానికి గీతా సారాన్ని అందించాలని నిర్ణయించుకున్నారు. -
ముక్కోటి ఏకాదశి విశిష్టత..! ఉత్తరద్వార దర్శనం అంటే..
శేషతల్పం మీద శయనించే విష్ణుమూర్తిని దర్శించుకోడానికి వైకుంఠానికి తరలివెళ్లే ముక్కోటి దేవతలతో కలిసి స్వామి భూలోకానికి వచ్చే శుభ సందర్భం వైకుంఠ ఏకాదశి(Vaikunta Ekadasi). పరమ పవిత్రమైన ఈ రోజున ఉత్తర ద్వారం నుంచి స్వామిని దర్శించుకుంటే జన్మ జన్మల పాపాలు తొలగిపోయి పుణ్య లోకాలు ప్రాప్తిస్తాయని ప్రతీతి. ముక్కోటి ఏకాదశి రోజు విష్ణుదర్శనం తర్వాత పూజచేసి ఉపవాసం ఉంటే అఖండ ఐశ్వర్యం సిద్ధిస్తుందంటారు. శుక్రవారం వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆ పర్వదినం గురించి.. ఈ రోజు శ్రీ మహావిష్ణువు గరుడ వాహనారూఢుడై మూడు కోట్ల దేవతలతో భూలోకానికి దిగివచ్చి భక్తులకు దర్శనమిస్తాడు కనుక దీనికి ముక్కోటి ఏకాదశి అనే పేరు వచ్చిందంటారు. ఈ ఒక్క ఏకాదశి మూడు కోట్ల ఏకాదశులతో సరిసమానమైన పవిత్రతను సంతరించుకున్నందువల్ల దీన్ని ముక్కోటి ఏకాదశి అంటారని కూడా చెబుతారు. ముక్కోటి ఏకాదశి నాడే పాలకడలి నుంచి అమృతం పుట్టిందంటారు. మహాభారత యుద్ధంలో భగవద్గీతను కృష్ణుడు అర్జునునికి ఇదే రోజున ఉపదేశించాడని కూడా భక్తుల విశ్వాసం. ముక్కోటి నాడు విష్ణుమూర్తిని నియమ నిష్ఠలతో పూజ చేసివారికి పుణ్యఫలముతో పాటు కార్యసిద్ధి కలుగుతుందని, వైకుంఠ ఏకాదశి రోజున నిష్ఠనియమాలతో వ్రతమాచరించే వారికి మరో జన్మంటూ ఉండదని పురాణాలు చెబుతున్నాయి.ముక్కోటి ఏకాదశి నాడు చేసే విష్ణుపూజ, గీతా పారాయణం, గోవింద నామ స్మరణం, పురాణ శ్రవణం మోక్ష ప్రాప్తి కలిగిస్తాయి. ఇవన్నీ చేయకపోయినా.. ఓం నమోనారాయణాయ అనే అష్టాక్షరీ మంత్రాన్ని 108 సార్లు జపించడం ద్వారా మీరనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. ఇంకా ఏకాదశి రోజు విష్ణు, వేంకటేశ్వర స్వామి ఆలయాలను దర్శించుకోవచ్చు. ఈ రోజున వైష్ణవ ఆలయాల్లో ప్రత్యేక పూజలు, హోమాలు, ప్రవచనాలు, ప్రసంగాలు ఉంటాయి. ఈ రోజున ముఖ్యమైనవి ఉపవాసం, జాగరణ. అటు తర్వాత జపం, ధ్యానం. వైకుంఠ ఏకాదశి రోజున దేశవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులు, ఆధ్యాత్మికవేత్తలు, ఆస్తికులు సముద్రాల్లోనూ, పుణ్యనదుల్లోనూ పవిత్ర స్నానం ఆచరించడమే కాకుండా, ఉపవాసాలు చేసి, జాగరణ ఉంటూ, నియమ నిష్ఠలతో పూజాదికాలు చేసి, తమ భక్తి ప్రపత్తులను చాటుకుంటారు. దేశవ్యాప్తంగా ఉన్న సుమారు 356 వైష్ణవ దేవాలయాల్లో దాదాపు ఒకే సమయంలో, ఒకే విధమైన పూజాదికాలు అత్యంత వైభవంగా జరగడం విశేషం.తిరుమలలో వైకుంఠ ఏకాదశి తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర(Tirumala Venkateswara temples) స్వామివారి దేవాలయంలో కూడా ఇదే మాదిరిగా వైకుంఠద్వారా ప్రవేశం, తదనంతరం దైవదర్శనం అనుమతిస్తారు. ఈ ఏకాదశికి ముందురోజు అనగా దశమినాటి రాత్రి ఏకాంత సేవానంతరం బంగారు వాకిలి మూసివేస్తారు. పిదప తెల్లవారు జామున వైకుంఠ ఏకాదశినాడు సుప్రభాతం మొదలుకొని మరునాడు అనగా ద్వాదశినాటి రాత్రి ఏకాంతసేవ వరకూ శ్రీవారి గర్భాలయానికి ఆనుకొని ఉన్న వైకుంఠద్వారాన్ని తెరచి ఉంచుతారు. ఈ రెండు రోజులూ భక్తులు శ్రీవారి దర్శనం తర్వాత ముక్కోటి ప్రదక్షిణ మార్గంలో వెళ్తారు. శ్రీరంగంలో...శ్రీరంగం లోని శ్రీ రంగనాథస్వామి దేవాలయం(Sri Ranganathaswamy)లో వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు 21 రోజులు జరుగుతాయి. దీనిలో మొదటి భాగాన్ని పాగల్ పట్టు (ఉదయం పూజ) అని రెండవ భాగాన్ని ఇర పట్టు (రాత్రి పూజ) అని పిలుస్తారు. విష్ణువు అవతారమైన రంగనాథస్వామిని ఆ రోజు వజ్రాలతో చేసిన వస్త్రాల్ని అలంకరించి వెయ్యి స్తంభాల ప్రాంగణంలోనికి వైకుంఠ ద్వారం గుండా తీసుకొని వచ్చి అక్కడ భక్తులకు దర్శనమిస్తారు. ఈ ద్వారం గుండా వెళ్ళిన భక్తులు వైకుంఠం చేరుకుంటారని భక్తుల నమ్మకం. (చదవండి: అనంతపద్మనాభ స్వామి ఆలయం..! కొండనే ఆలయాలుగా..)