husband
-
ట్రాఫిక్ సిగ్నల్లో భార్య రీల్స్ .. ప్రభుత్వ ఉద్యోగం పోగొట్టుకున్న భర్త
ఛండీఘడ్ : ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఓ భార్య చేసిన అత్యుత్సాహం భర్త కొంప ముంచింది. ప్రభుత్వ ఉద్యోగం నుంచి సస్పెండయ్యారు. దీంతో భర్త లబోదిబో మంటూ మళ్లీ తనని విధుల్లోకి తీసుకోవాలని ఉన్నతాధికారుల్ని ప్రాధేయపడుతున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే? లేటెస్ట్ ఇంటర్నెట్ సెన్సేషన్ హర్యానా సాంగ్ మ్యూజిక్ లవర్స్ని తెగ ఆకట్టుకుంటోంది. అందుకే సమయం ఎప్పుడైనా, సందర్భం ఏదైనా ఉత్తరాది రాష్ట్రాల ప్రజలు ఆ సాంగ్ పాడటం లేదంటే, డ్యాన్స్లతో అదరగొట్టేస్తున్నారు. అందుకు సంబంధించిన వీడియోలు వైరల్గా మారాయి.ఈ తరుణంలో మార్చి 20న సాయంత్రం 4:30 గంటల సమయంలో జ్యోతి అనే మహిళ తన వదిన పూజతో కలిసి స్థానికంగా ఉండే దేవాలయానికి వెళ్లింది. దైవ దర్శనం అనంతరం తిరుగు ప్రయాణంలో ఛండీఘడ్ సెక్టార్-20 గురుద్వారా చౌక్ సిగ్నల్లో జ్యోతి అత్యుత్సాహం ప్రదర్శించింది. తన వదిన పూజ సాయంతో హర్యాన్వీ ఫోక్సాంగ్కు డ్యాన్స్ వేసింది. తన వదిన వీడియో తీస్తే ఆమె డ్యాన్స్ చేసిన దృశ్యాలు సోషల్ మీడియాలో తెగచక్కెర్లు కొట్టాయి.चंडीगढ़: पुलिसकर्मी की पत्नी ने ज़ेबरा क्रॉसिंग पर बनाई रील, ट्रैफिक नियमों की उड़ाई धज्जियां; रोड पर लगा जाम महिला के खिलाफ पुलिस ने FIR दर्ज की, हालांकि थाने में ही बेल दे दी गई. मामला सेक्टर-20 में गुरुद्वारा चौक के पास का है.#Chandigarh pic.twitter.com/l2j4fTYFGv— Ishani K (@IshaniKrishnaa) March 27, 2025 ఈ వీడియో వైరల్ కావడంతో, హెడ్ కానిస్టేబుల్ జస్బీర్ చండీగఢ్లోని సెక్టార్ 34 పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ సంఘటనపై చండీగఢ్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఏఎస్ఐ బల్జిత్ సింగ్ నేతృత్వంలోని బృందం సెక్టార్ 20లోని గురుద్వారా చౌక్, సెక్టార్ 17లోని పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన సీసీటీవీ ఫుటేజ్లను సమీక్షించింది. సీసీటీవీ ఫుటేజీల్లో ట్రాఫిక్కు అంతరాయం, ప్రజా భద్రతకు ప్రమాదం కలిగించడం వంటి నేరాల కింద డ్యాన్స్ చేసిన జ్యోతిపై, వీడియో తీసిన పూజపై బీఎన్ఎస్ సెక్షన్ 125, 292 3(5) కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.సెక్టార్ 19 పోలీస్ స్టేషన్లో సీనియర్ కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్న జ్యోతి భర్త అజయ్ కుందును పదవి నుండి సస్పెండ్ చేశారు. ఎందుకంటే భార్య డ్యాన్స్ వీడియోను అజయ్ తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో పోస్ట్ చేయడంపై అతనిపై చర్యలు తీసుకున్నారు. కేసులు నమోదు కావడంతో జ్యోతి,పూజలు బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించారు. విచారణ చేపట్టిన కోర్టు ఇద్దరికి బెయిల్ మంజూరు చేసింది. -
భార్యను హత్య చేసిన ఘటన.. టెకీ ఆత్మహత్యాయత్నం!
బెంగళూరు: భార్యను హత్య చేసిన భర్త, భర్తను హత్య చేసిన భార్య.. ఇవే ఇటీవల కాలంలో ఎక్కువగా కనిపిస్తున్నాయి. వైవాహిక బంధాన్ని తేలిగ్గా తీసుకుంటున్నారో.. లేక ఆ బంధంలో భారాన్ని మోయలేకపోతున్నారో కానీ ఈ తరహా హత్యోదంతాలు కుటుంబాల్ని చిన్నాభిన్నం చేస్తున్నాయి.తాజాగా మరో హత్య వెలుగుచూసింది. బెంగళూరులో టెకీగా పని చేస్తున్న 36 ఏళ్ల వ్యక్తి.. భార్యను హత్య చేసిన ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. రాకేష్ రాజేంద్ర ఖేదకర్.. ఒక సాప్ట్ వేర్ కంపెనీలో ప్రొఫెషనల్ ఇంజనీర్ గా పని చేస్తున్నాడు. అయితే భార్యా భర్తల మధ్య చోటు చేసుకున్న చిన్నపాటి గొడవ కారణంగా భార్య గౌరీ అనిల్ షెంబేకర్ (32)ను హత్య చేశాడు . బుధవారం వీరిద్దరూ కలిసి డిన్నర్ చేసే క్రమంలో వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలోనే తన చేతిలో ఉన్న కత్తిని భర్తపైకి విసిరింది భార్య. దీంతో భర్త రాజేంద్రకు గాయమైంది. దాంతో సహనాన్ని కోల్పోయిన భర్త.. అదే కత్తితో భార్యపై విచక్షణా రహితంగా దాడి చేశాడు. దాంతో ఆమె స్పాట్ లోనే చనిపోయింది.సూట్ కేస్ లో ప్యాక్ చేసి..అయితే భార్య మృతదేహాన్ని సూట్ కేస్ లో పార్శిల్ చేసి ఇంటి లోపల పెట్టిన భర్త.. అక్కడ నుంచి వెళ్లిపోయాడు. ఇదే విషయాన్ని తన అత్త మామలకు ఫోన్ చేసి చెప్పాడు. తాను మీ కూతుర్ని హత్య చేశానంటూ ఫోన్ చేప్పాడు. డెడ్ బాడీని బయట సూట్ కేస్ లో ప్యాక్ చేసినట్లు వెల్లడించాడు. దాంతో ఆ విషయాన్ని మహారాష్ట్ర పోలీసులకు సమాచారం అందించారు. అక్కడన్నుంచి కర్ణాటక పోలీసులకు సమాచారం అందడంతో అక్కడకు చేరుకున్న పోలీసులు ఒక ప్యాక్ చేసి ఉన్న ఒక సూట్ కేస్ కనిపించింది. అందులో మృతదేహాన్ని వెలికి తీసి పోస్ట్ మార్టంకు పంపగా అది హత్యగా ధృవీకరించారు. మెడపై, చాతీలో కత్తిపోట్లు ఉన్నట్లు పోస్టుమార్టం రిపోర్ట్ లో వెల్లడైంది.ఆత్మహత్యకు యత్నంభార్యను హత్య చేసిన తర్వాత పుణెకు పారిపోయాడు భర్త రాజేంద్ర.. అయితే అక్కడ ఆత్మహత్యకు ప్రయత్నించాడు. అతను ఎక్కుడున్నాడో విషయాన్ని ట్రేస్ చేసిన పోలీసులు.. పుణె పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడకు వెళ్లిన పుణె పోలీసులకు అతను అపస్మారక స్థితిలో కనిపించాడు. దాంతో అతన్ని పుణె ఆస్పత్రిలో చేర్చించారు. ఈ సమాచారం అందుకున్న బెంగళూరు పోలీసులు పుణెకు చేరుకున్నారు. రాజేంద్ర సృహలోకి వచ్చిన తర్వాత అరెస్ట్ చేసి బెంగళూరు తీసుకురానున్నట్లు పోలీసులు తెలిపారు.ఏడాది క్రితమే బెంగళూరుకు..మహారాష్ట్రకు చెందిన వీరిద్దరికి రెండేళ్ల క్రితమే వివాహం జరగ్గా, ఏడాది క్రితమే బెంగళూరుకు వచ్చారు. కొంతకాలంగా వీరి వైవాహిక సాఫీగానే సాగింది. భర్త ఒక ప్రైవేటు కంపెనీ సాప్ట్ వేర్ ఇంజనీర్ గా చేస్తున్నాడు. ప్రస్తుతం అతను వర్క్ ఫ్రమ్ హోమ్ విధులు నిర్వర్తిస్తున్నాడు. భార్య మాస్ మీడియలో బ్యాచలర్ డిగ్రీ కంప్లీట్ చేసింది. -
భార్య, భర్త ఓ ప్రియుడు
-
భార్యను ముక్కలు చేసి.. సూట్కేసులో కుక్కి..
సాక్షి, బెంగళూరు: జీవిత భాగస్వామిని హత్య చేసి మృతదేహాన్ని ముక్కలుగా నరకడం వంటి కిరాతక నేరాలు దేశంలో అక్కడక్కడా జరుగుతున్నాయి. అలాంటి ఘోరం బెంగళూరులోనూ చోటుచేసుకుంది. ఒక వ్యక్తి తన భార్యను దారుణంగా హత్య చేసి ముక్కలుగా ఖండించి సూట్కేసులో పెట్టి పారిపోయాడు. ఈ ఘటన బెంగళూరులోని హుళిమావు పరిధిలోని దొడ్డకమ్మనహళ్లిలో జరిగింది.రెండేళ్ల కిందటే పెళ్లి.. మహారాష్ట్రకు చెందిన రాకేశ్ (37) అనే వ్యక్తి తన భార్య గౌరి సాంబేకర్ (32)ను హత్య చేశాడు. ఆ తర్వాత మృతదేహాన్ని ముక్కలుగా కట్ చేసి సూట్కేసులో నింపేశాడు. రెండేళ్ల క్రితం రాకేశ్, గౌరికి వివాహం జరిగింది. నెల రోజుల క్రితమే దొడ్డకమ్మనహళ్లిలోని ఇంటికి మారారు. ఇద్దరు ప్రైవేటు కంపెనీలో ఉద్యోగులు. ప్రస్తుతం వర్క్ ఫ్రం హోం కింద ఇంట్లోనే ఉంటూ పని చేసుకుంటున్నారు... గురువారం ఏం జరిగిందో కానీ హత్య చేసి, మీ కూతురు ఆత్మహత్య చేసుకుందని ఆమె తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెప్పాడు. దీంతో ఆందోళన చెందిన గౌరి తల్లిదండ్రులు తమ ఊళ్లోని సమీప పోలీస్ స్టేషన్కు వెళ్లి సమాచారమిచ్చారు. ఆ పోలీసులు వెంటనే హుళిమావు పోలీసులకు తెలియజేశారు. పోలీసులు ఇంటికి వెళ్లి తాళాలు బద్ధలు కొట్టి ఇంట్లోకి వెళ్లి పరిశీలించగా బాత్రూంలో సూట్కేసులో గౌరి మృతదేహం ముక్కలై కనిపించడంతో కంగుతిన్నారు. ఆమె హత్యకు ఇంకా కారణాలు తెలియరాలేదు. నిందితుడు రాకేశ్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. ఆగ్నేయ డీసీపీ సారా ఫాతిమా, క్లూస్ టీం చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. -
‘నేను పెళ్లి చేసుకోలేదు.. బతికిపోయా’, మీరట్ ఘటనపై బాగేశ్వర్ బాబా
లక్నో: ‘థ్యాంక్ గాడ్. నేను పెళ్లి చేసుకోలేదు. లేదంటే’.. ఉత్తరప్రదేశ్లోని మీరట్లో మర్చంట్ నేవీ అధికారి సౌరభ్ రాజ్పుత్ హత్య కేసుపై బాగేశ్వర్ బాబాగా ప్రచారంలో ఉన్న ధీరేంద్ర కృష్ణ శాస్త్రి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.ప్రేమించి పెళ్లాడిన భర్త సౌరభ్ రాజ్పుత్ను ప్రియుడు సాహిల్ సాయంతో కట్టుకున్న భార్య ముస్కాన్ దారుణంగా హత్య చేసి,ముక్కలు చేసిన ఘటన సంచలనం సృష్టించింది. తమ వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే నెపంతో ప్రియుడితో కలిసి భర్త అడ్డు తొలగించుకుంది. అనంతరం, ప్రియుడి సాయంతో ముస్కాన్ తన భర్త సౌరభ్ రాజ్ మృతదేహాన్ని 15 ముక్కలుగా నరికి శరీర భాగాన్ని బులుగు రంగు ప్లాస్టిక్ డ్రమ్ములో దాచి పెట్టి పైన సిమెంటుతో కప్పిపెట్టారు.దారుణం వెలుగులోకి రావడంతో పోలీసులు నిందితుల్ని కటకటాల్లోకి నెట్టారు. ఈ నేపథ్యంలో సౌరభ్ రాజ్ ఘటనపై ఓ కార్యక్రమంలో పాల్గొన్న ధీరేంద్ర కృష్ణ శాస్త్రి స్పందించారు. ప్రియుడి సాయంతో భర్తను హతమార్చిన ఘటనను ఉదహరించారు. ‘ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి. తల్లి దండ్రులు వారి పిల్లల్ని సరిగ్గా పెంచలేదు. వారి పెంపకంలో లోపాలు కనిపిస్తున్నాయి. అందుకే తల్లిదండ్రులు వారి పిల్లలకు విలువల్ని నేర్పించాలి. ఇందుకోసం శ్రీరామ చరిత్మానస్ బోధనలను పాటించాలని సూచించారు.#WATCH | Meerut, UP | On the Meerut murder case, Bageshwar Dham's Dhirendra Shastri said, "The Meerut case is unfortunate. In the present society, the declining family system, the advent of Western culture and married men or women engaged in affairs are destroying families...… pic.twitter.com/ULalTXvTj5— ANI (@ANI) March 27, 2025 ‘ప్రస్తుతం మనదేశంలో బ్లూ డ్రమ్ బాగా పాపులరైంది. చాలా మంది భర్తలు షాక్లో ఉన్నారు. థ్యాంక్ గాఢ్.నేను పెళ్లి చేసుకోలేదు’ అని నవ్వుతూ ప్రతిస్పందించారు. మీరట్ ఘటన దురదృష్టకరం. క్షీణిస్తున్న కుటుంబ వ్యవస్థ, పాశ్చాత్య సంస్కృతి, వివాహిత స్త్రీ, పురుషుల వ్యవహారాలు కుటుంబాలను నాశనం చేస్తున్నాయి. అందుకే ఉన్నతవంతమైన కుటుంబాన్ని నిర్మించేందుకు ప్రతి భారతీయుడు శ్రీరామచరిత్మానస్ను ఆచరించాలని కోరారు. -
ఆళ్లగడ్డలో రూపాయి పావలా కమీషన్ దందా
-
యూపీలో మరో దారుణం
మెయిన్పురి: ఉత్తరప్రదేశ్లోని మెయిన్పురి జిల్లాలో మరో హత్య కేసు వెలుగులోకి వచ్చింది. పెళ్లైన రెండు వారాలకే ప్రేమికుడితో కలిసి కుట్ర పన్ని భర్తను చంపించిందో భార్య. ఒకే గ్రామానికి చెందిన ప్రగతి యాదవ్, అనురాగ్ యాదవ్ పదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. అయితే.. ప్రగతి కుటుంబ సభ్యులు ఆమెకు బలవంతంగా మార్చి ఐదో తేదీన దిలీప్ యాదవ్తో వివాహం జరిపించారు. అయిష్టంగానే పెళ్లి చేసుకున్న ప్రగతి ఎలాగైనా దిలీప్ను అడ్డు తొలగించుకోవాలనుకుంది. అనురాగ్తో కలిసి దిలీప్ను హతమార్చాలని పథకం వేసింది. ఈ హత్యకు ఏర్పాట్లు చేయడానికి అనురాగ్కు ప్రగతి రూ .1 లక్ష ఇచ్చింది.రాంజీ అనే కిరాయి హంతకుడిని ఈ పని కోసం రూ.2 లక్షలకు నియమించుకున్నారు. దిలీప్ మార్చి 19వ తేదీన పని మీద కన్నౌజ్ జిల్లాకు వెళ్లి తిరిగొస్తూ పట్నా కెనాల్ సమీపంలో ఓ హోటల్ వద్ద ఆగాడు. గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు దిలీప్ వద్దకొచ్చి తమ బైక్ పాడైందని, సాయపడాలంటూ దిలీప్ను తమ ఇంకో బైక్పై ఎక్కించుకుని తీసుకెళ్లారు. మార్గమధ్యంలో దిలీప్పై దాడి చేసి తీవ్రంగా గాయపరిచి పొలంలో పడేసి పరారయ్యారు.దిలీప్ను ఆస్పత్రికి తరలించి చికిత్స అందించినా అప్పటికే పరిస్థితి విషమించడంతో మూడు రోజుల తర్వాత అతను మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి ఘటనాస్థలి సమీప ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించగా గుర్తుతెలియని వ్యక్తుల దృశ్యాలు రికార్డయ్యాయి. వీటి సాయంతో కిరాయి హంతకుడు రాంజీని గుర్తించి పోలీసులు అరెస్టు చేశారు. అతనిచ్చిన సమాచా రంతో అనురాగ్, ప్రగతిని అదుపులోకి తీసుకున్నారు. -
భార్యకు భర్త యజమాని కాడు!
ప్రయాగ్రాజ్: భార్య తనతో ఉన్న ఇంటిమేట్ వీడియోను ఫేస్బుక్లో అప్లోడ్ చేసిన వ్యక్తిపై అలహాబాద్ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పెళ్లి చేసుకోగానే భార్యకు భర్త యజమాని అయిపోడని వ్యాఖ్యానించింది. అతనిపై క్రిమినల్ కేసు కొట్టేయాలంటూ దాఖలైన పిటిషన్ను తోసిపుచ్చింది. ‘ఇంటిమేటెడ్ వీడియోను ఫేస్బుక్లో అప్లోడ్ చేసి దరఖాస్తుదారుడు (భర్త) వివాహ బంధానికున్న పవిత్రతను ఉల్లంఘించారు. భార్య తనపై ఉంచిన నమ్మకాన్ని పోగొట్టారు. భార్య గౌరవాన్ని కాపాడలేకపోయారు. ఇలాంటి కంటెంట్ను షేర్ చేయడం భార్యాభర్తల మధ్య బంధాన్ని నిర్వచించే గోప్యతను ఉల్లంఘించడమే అవుతుంది. ఈ నమ్మక ద్రోహం వైవాహిక బంధం పునాదినే దెబ్బతీస్తుంది’అని విచారణ సందర్భంగా జస్టిస్ వినోద్ దివాకర్ వ్యాఖ్యానించారు. భార్య అంటే భర్తకు కొనసాగింపు కాదని, తనకంటూ సొంత హక్కులు, కోరికలు, ఉన్న వ్యక్తని ఆయన పేర్కొన్నారు. తామిద్దరూ సాన్నిహిత్యంతో ఉన్న వీడియోలను తన భర్త మొబైల్లో చిత్రీకరించి, తనకు తెలియకుండా ఫేస్బుక్లో అప్లోడ్ చేశాడని, తరువాత బంధువులు, గ్రామస్తులతో పంచుకున్నాడంటూ మీర్జాపూర్ జిల్లాలో ప్రద్యుమ్న్ యాదవ్ అనే వ్యక్తిపై అతని భార్య కేసు నమోదు చేసింది. తాను ఆమె భర్త కాబట్టి అది నేరం కాదని, తనపై మోపిన క్రిమినల్ కేసులను కొట్టేయాలని ప్రద్యుమ్న్ కోర్టులో పిటిషన్ దాఖలుచేశారు. భార్యాభర్తల మధ్య రాజీ కుదిరే అవకాశం ఉంది కాబట్టి.. కేసును కొట్టేయాలంటూ ఆయన తరపు న్యాయవాది సైతం వాదించారు. ఫిర్యాదుదారు చట్టబద్ధంగా వివాహం చేసుకున్న భార్య అయినప్పటికీ, ఆమెను అశ్లీల వీడియో తీసి బంధువులకు, గ్రామస్తులకు పంపే హక్కు భర్తకు లేదని కోర్టు తేల్చి చెప్పింది. -
ఆమెకు ఆయనే కనుపాప! యస్.. భరించేవాడే భర్త!!
సోషల్ మీడియా జమానాలో చీటికిమాటికి గొడవలు పడి వేరు కాపురాల దగ్గరి నుంచి.. విడాకుల లాంటి తీవ్ర నిర్ణయాల దాకా వెళ్తున్న జంటలు షరామాములుగా మారిపోయాయి. ఈ తరుణంలో భార్యభర్తల అనుబంధానికి ప్రతీకగా నిలిచే జంటలూ అక్కడక్కడా.. అప్పుడప్పుడే మనకు కనిపిస్తున్నాయి. అదిగో అలాంటి అరుదైన జంట గురించి.. భార్య మీద అపరిమితమైన ప్రేమ ఉన్న గొప్ప భర్త గురించి ఇప్పుడు మనం చెప్పుకోబోయేది. భార్య అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటే ఏ భర్త అయినా ఏం చేస్తాడు?. ఎవరి సంగతి ఎందుకోలేండి.. ఇక్కడ.. ఈ భర్త మాత్రం ఆమెను కంటికి రెప్పలా కాపాడుకుంటున్నాడు. ఎక్కడికి వెళ్లినా తన భార్య, కూతురు.. ఇద్దరినీ తన వెంటే ఉండేలా ఏర్పాటు చేసుకున్నాడు. వెంకటేష్ నందిని.. సొంతూరు కృష్ణా జిల్లా జగ్గయ్యపేట. గత ఏడు సంవత్సరాలుగా వలసజీవనానికి అలవాటు పడ్డారు. ప్రస్తుతానికి.. మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో నివాసముంటున్నారట. వరంగల్ ఖమ్మం జాతీయ రహదారి వర్ధన్నపేట వద్ద సాక్షి వర్ధన్నపేట రిపోర్టర్ అజీజుద్దీన్కు కనిపించారు. వాళ్లను పలకరించగా.. చాన్నాళ్లుగా నందినికి ఫిట్స్ ఉందట. ఆమెను ఒంటరిగా వదిలేసి వెళ్తే.. ఆమెకు జరగరానిది ఏదైనా జరుగుతుందేమోనని ఆయన భయమట. అందుకే నందినితో పాటు కుమార్తె ఆదిలక్ష్మిని ఇలా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వాహనంలో తీసుకెళ్తూ నిత్యం కంటికి రెప్పలా కాపాడుకుంటూ బ్రతుకు వెళ్లదీస్తున్నాడు. -
‘మీకెందుకివ్వాలమ్మా భరణం?’.. మహిళ కేసులో హైకోర్టు కీలక తీర్పు!
ఢిల్లీ: భర్త నుంచి తాత్కాలిక భరణం కోరుతూ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఉన్నత చదువులు చదువుకున్నారు. వివాహం కాకముందు ఉద్యోగం చేశారు. భారీ మొత్తంలో వేతనం తీసుకున్నారు. అలాంటి మీకు భరణం ఎందుకివ్వాలి? అని ప్రశ్నించింది. ఉద్యోగం చేసేందుకు అన్నీ అర్హతలు ఉన్న పిటిషినర్కు భరణం ఇచ్చే అంశాన్ని ప్రోత్సహించడం లేదని వ్యాఖ్యానించింది. వెంటనే, ఆమె అర్హతకు తగ్గ ఉద్యోగాన్ని చూసుకోవాలని సూచించింది. కేసు పూర్వాపరాల్ని పరిశీలిస్తే.. వాళ్లిద్దరూ భార్య, భర్తలు. 2019 డిసెంబర్లో వివాహం చేసుకున్నారు. అనంతరం సింగపూర్లో సెటిల్ అయ్యారు. అయితే, సింగపూర్కు వెళ్లిన తనని.. తన భర్త, అతని తల్లిదండ్రులు వేధిస్తున్నారనే కారణంతో భార్య ఫిబ్రవరి 2021లో భారత్కు తిరిగి వచ్చారు. తన బంగారాన్ని ఆమ్మి స్వదేశానికి వచ్చినట్లు, ఆర్థిక ఇబ్బందుల కారణంగా తన బంధువులు ఇంట్లో నివాసం ఉంటున్నారు. కాబట్టి, తన భర్త నుంచి భరణం కావాలని కోరుతూ జూన్ 2021లో ట్రయల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విచారణ చేపట్టిన ట్రయల్ కోర్టు ఆ పిటిషన్ కొట్టివేసింది. దీంతో మహిళ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. పిటిషన్లో తన భర్త భారీ మొత్తంలో సంపాదిస్తూ లగ్జరీగా బతుకుతున్నారని, తనకు ఎలాంటి సొంత ఆదాయం లేదని, భర్త నుంచి తాత్కాలిక భరణం కోరుతున్నట్లు పేర్కొన్నారు.ఆ పిటిషన్పై జస్టిస్ చంద్రదారి ధర్మాసనం విచారణ చేపట్టింది. విచారణ సమయంలో సీఆర్పీసీ సెక్షన్ 125 ను సమర్ధిస్తూనే ఉద్యోగం చేసేందుకు అన్నీ అర్హతలు ఉండి, ఖాళీగా ఉండే మహిళల విషయంలో ఇది వర్తించదు. అందుకే, మహిళ దాఖలు చేసిన పిటిషన్ను కొట్టివేస్తున్నట్లు వ్యాఖ్యానించింది. ఉన్నత విద్య, మంచి ఉద్యోగం చేసిన అనుభవం ఉన్న భార్య.. భర్త నుంచి భరణం పొంది ఖాళీగా ఉండడాన్ని సహించదు. కాబట్టి, కోర్టు ఈ కేసులో తాత్కాలిక భరణాన్ని ప్రోత్సహించడం లేదు. ఎందుకంటే పిటిషనర్ ఆస్ట్రేలియాలో మాస్టర్స్ డిగ్రీ పూర్తిచేసినట్లుగా, వివాహానికి ముందు దుబాయ్లో మంచి ఆదాయం సంపాదించినట్లు గుర్తించింది. ఆమె చదివిన చదువుకు మంచి ఉద్యోగాలు, వేతనాలు వస్తాయని కోర్టు భావిస్తోంది. ఆమె.. తన భర్త ఇచ్చే తాత్కాలిక భరణం మీద ఆధారపడకుండా స్వయంగా సంపాదించుకునే అవకాశాలపై దృష్టి సారించాలని సూచించింది. అదే సమయంలో ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును సమర్ధించింది. మహిళ దాఖలు చేసిన పిటిషన్ను కొట్టివేసింది. -
చీటింగ్ యాప్ : భర్త ఫోన్లను ఎక్కువగా చెక్ చేస్తోంది ఈ నగరంలోనేనట!
భార్యాభర్తల బంధానికి పునాది నమ్మకం. పరస్పరం విశ్వాసమే ఏ బంధాన్నైనా పటిష్టంగా ఉంచుకుంది. ఆ నమ్మకం వమ్ము అయినపుడు అపోహలు, అనుమానాలకు తావిస్తుంది. పైగా స్మార్ట్ యుగం. చేతిలో స్మార్ట్ఫోన్లేనిదే క్షణం నడవదు. ప్రేమ మొదలు, షాపింగ్ దాకా అంతా అన్లైన్లోనే. అందుకే తమ భాగస్వాములను వ్యవహారాల్ని పసిగట్టేందుకు స్మార్ట్ఫోన్ను మించిన డిటెక్టర్ లేదు. దీనికి డేటింగ్ యాప్లుకూడా తోడయ్యాయి. ఈ నేపథ్యంలోనే భర్త మొబైల్ ఫోన్ను చెక్ చేయాలనే కోరిక భార్యకు ఉంటుంది. భార్య ఫోన్లో ఎవరితో చాట్ చేస్తుంది, ఎవరితో టచ్లో ఉందో అనే ఆరాటం కూడా భర్తలకు ఎక్కువగా. అన్నట్టు ఇది నేరుగా ఉండదు సుమా. గుట్టుచప్పుడు గాకుండా సాగుతుందన్నట్టు అచ్చం వాళ్లు మోసం చేస్తున్నట్టే. ఏదైనా తేడా వచ్చిందో... అంతే సంగతులు. ఇంతకీ విషయం ఏమిటంటే.. తెలుసుకుందాం.CheatEye.ai నివేదిక ప్రకారం, మహిళలు తమ భాగస్వాములను అనుమానించే నగరంగా లండన్ నిలుస్తోంది. భార్యలు భర్తల ఫోన్లను ఎంత చెక్ చేస్తున్నారనే విషయంపై ఈ స్టడీ జరిగింది. లండన్లో జరిగిన టిండర్-సంబంధిత శోధనలలో 27.4శాతం మంది తమ భాగస్వామి గుట్టును వెలికితీయడంపై దృష్టి సారించారని ఇటీవలి విశ్లేషణలో వెల్లడైంది. ముఖ్యంగా, ఈ శోధనలలో 62.4శాతం తమ భర్తలు లేదా బాయ్ఫ్రెండ్లు డేటింగ్ యాప్ను రహస్యంగా ఉపయోగిస్తున్నారా అని నిర్ధారించుకోవడానికే ఈ యాప్లోకి వస్తున్నారట. ఇక లండన్ తరువాత మాంచెస్టర్ బర్మింగ్హామ్ తరువాతి టాప్ ప్లేస్లో నిలిచాయి. భాగస్వాములపై అనుమానంతో జరిగి టిండర్ చెకింగ్స్లో మాంచెస్టర్లో, 8.8శాతంగా బర్మింగ్హామ్లో 8.3శాతంగా ఉన్నాయి. అయితే, బర్మింగ్హామ్ లో 69 అనుమానాస్పద శోధనలు పురుష భాగస్వాములపై మహిళలే నిర్వహింనవే ఎక్కువట. గ్లాస్గో నగరం కూడా కూడా ఈ జాబితాలో కనిపించింది, 4.7శాతం టిండర్-సంబంధిత శోధనలు అవిశ్వాసం గురించి ఆందోళనలతో ముడిపడి ఉన్నాయి. ఈ స్కాటిష్ నగరంలో, 62.1శాతం మంది అనుమానాస్పద కార్యకలాపాలు పురుష భాగస్వాములను లక్ష్యంగా ఉన్నాయట. దీనికి ప్రధాన నగరాల్లో, ముఖ్యంగా యువకులలో డేటింగ్ యాప్లకు పెరుగుతున్న ప్రజాదరణ కారణమని నిపుణురాలు సమంతా హేస్ విశ్లేషించారు."లండన్ వంటి నగరాల్లో, డేటింగ్ అనేది డైనమిక్గా ఉంటుంది. ఇది సహజంగానే భాగస్వాముల కార్యకలాపాలపై అనుమానం పరిశీలనకు దారితీస్తుంది" అని ఆమె వివరించారు. 18 నుండి 24 సంవత్సరాల వయస్సు గల యువకులు తమ భాగస్వాముల విశ్వసనీయత గురించి ముఖ్యంగా ఆందోళన చెందుతున్నారని హేస్ తెలిపారు.ఇలాంటి సర్వే మన ఇండియాలో జరిగితే పరిస్థితి ఏంటి భయ్యా అంటున్నారు నెటిజన్లు. జర జాగ్రత్త భయ్యో అంటూ కమెంట్ చేస్తున్నారు వ్యంగ్యంగా. భార్యభర్తల మధ్య నమ్మకం ఉండాలి బ్రో.. మూడో వ్యక్తి రాకూడదు. అప్పుడ అది నూరేళ్ల బంధం అవుతుంది అంటున్నారు మరికొంతమంది. -
భర్త ఆమోదం కావాలంది.. ఉద్యోగం పోగొట్టుకుంది
సాధారణంగా ఉద్యోగం వచ్చిన వెంటనే చాలామంది జాయిన్ అయిపోతారు. కొందరు అమ్మానాన్నలను అడగాలని, పెళ్ళైన మహిళలైతే తమ భర్తలకు చెప్పాలని అనుకుంటారు. ఇటీవల ఓ మహిళ ఉద్యోగానికి ఎంపికైన తరువాత.. తన భర్త ఆమోదం కావాలని అడిగిన వెంటనే జాబ్ పోగొట్టుకుంది.ముంబైకి చెందిన ఒక సీఈఓ తన కంపెనీలో సీనియర్ పదవికి ఎంపికైన ఒక మహిళను ఉద్యోగంలో చేరడానికి ముంచే తొలగించారు. ఎందుకంటే ఆ మహిళ జాబ్ ఆఫర్ను అంగీకరించే ముందు తన భర్త ఆమోదం పొందాలని అడిగింది. దీంతో తక్షణమే ఆమెను ఆ ఉద్యోగానికి రిజెక్ట్ చేశారు. దీనికి సంబంధించిన ఒక ట్వీట్ కూడా నెట్టింట్లో వైరల్ అవుతోంది.Spoke to a candidate tdy, who wanted us to meet her husband after we had selected her.Instant reject.P.s: This was for a senior level hire.— Vinod Chendhil (@vinodchendhil) March 18, 2025కంపెనీలో సీనియర్ స్థాయి ఉద్యోగానికి ఎంపికైన మహిళ.. ఉద్యోగంలో చేరడానికే సొంత నిర్ణయం తీసుకోవడం లేదు. దీనికే తన భర్త ఆమోదం కావాలని చెబుతోంది. రేపు కంపెనీ కోసం పెద్ద నిర్ణయాలు ఎలా తీసుకోగలుగుతుంది. ఆమె పూర్తిగా తన భర్త మీదనే ఆధారపడి ఉందని.. కంపెనీ సీఈఓ భావించి రిజెక్ట్ చేశారు.ఇదీ చదవండి: 'పెట్రోల్ కార్ల ధరలకే ఎలక్ట్రిక్ కార్లు'.. నితిన్ గడ్కరీప్రస్తుతం కంపెనీ సీఈఓ పోస్ట్ నెట్టింట్లో వైరల్ అవుతోంది. దీనిపైన పలువురు నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు. ఇందులో కొందరు సీఈఓ చేసిన పనిని సమర్దిస్తుంటే.. మరికొందరు తప్పుబడుతున్నారు. ఇంకొందరు మహిళలు తరచుగా ఎదుర్కొనే సామాజిక అడ్డంకులను ఎత్తి చూపారు.Bcas she wants her husband to say yes for her to join us. Why would an independent woman want that. Basically she wants her husband to interview us to see if its ok for her to join. Shows she is totally dependent on him. How will she ever take any decisions, if she cannot take a…— Vinod Chendhil (@vinodchendhil) March 18, 2025 -
‘బట్టతల’ అంటూ భార్య వేధింపులు.. భర్త ఆత్మహత్య
మైసూరు: బట్టతల అంటూ భార్య అవహేళన చేయడంతో అవమానాన్ని తట్టుకోలేక భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద ఘటన కర్ణాటకలో చామరాజనగర తాలూకాలోని ఉడిగాలలో ఆదివారం జరిగింది.వివరాల ప్రకారం.. పరమశివమూర్తి (32)కి మమతతో రెండేళ్ల కిందట పెళ్ళి జరిగింది. లారీ డ్రైవర్ అయిన పరమశివమూర్తికి పెళ్లినాటికే కొంత బట్టతల ఉంది. పెళ్లి తరువాత ఉన్న జుట్టు కూడా రాలిపోయింది. భార్య మమత ‘నీకు జట్టు లేదు, నీతో బయటకి రావాలంటే సిగ్గుగా ఉంది’ వంటి మాటలనేది. దీంతో ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి.ఇదే క్రమంలో భర్తపై గృహహింస, కట్నం వేధింపుల కేసు కూడా పెట్టడంతో కొన్ని రోజులు జైలులో ఉండి ఇటీవలే పరమశివమూర్తి విడుదలయ్యాడు. జైలు నుంచి బయటికి వచ్చిన పరమ శివమూర్తి.. భార్య సోషల్ మీడియాలోని ‘సింగిల్’ స్టేటస్ చూసి మరింత ఆవేదన చెందాడు. ఈ వరుస పరిణామాల నేపథ్యంలో నోట్ రాసి పెట్టి.. ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై చామరాజనగర గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేసిన దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. -
ఏం కష్టమొచ్చిందో.. దంపతుల ఆత్మహత్య.. అనాథలైన పిల్లలు
సిద్దిపేట: జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఏం కష్టమొచ్చిందో దంపతులు ఆత్మ హత్య చేసుకున్నారు. ముందుగా భార్య పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకోగా, ఆపై భార్త కూడా పురుగుల మందు తాగి ప్రాణాలు తీసుకున్నాడు.వివరాల్లోకి వెళితే.. తొగుట మండలం ఎల్లారెడ్డిలో ఈ దారుణం జరిగింది. కెమ్మసారం భాగ్య పురుగులు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. దీన్ని చూసిన భర్త నాగరాజ్.. భార్య లేని జీవితం వద్దకుని అతను కూడా పురుగుల మందు సేవించాడు. దాంతో నాగరాజ్ కూడా తనువు చాలించాడు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు విచారణ చేపట్టారు. అయితే ఆ దంపతులకున్న నలుగురు పిల్లలు అనాథులుగా మారిపోయారు. అమ్మా, నాన్న ఇక తమతో ఉండరని తెలిసి రోదిస్తున్నారు. ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001మెయిల్: roshnihelp@gmail.com -
భర్తపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భార్య
జగిత్యాల: జిల్లాలోని పొలాసలో దారుణం చోటు చేసుకుంది. భర్తపై పెట్రోల్ పోసి నిప్పంటించింది భార్య. భర్త కమాలకర్ కు ఇప్పటికే రెండు పెళ్లిళ్లు అవ్వగా, మరో పెళ్లి చేసుకున్నాడనేది కూడా ఆమె ఆరోపిస్తోంది. తమను రోజూ చిత్రహింసలు పెడుతున్నాడని, అందుచేత భర్తపై పెట్రోల్ పోసి నిప్పు అంటించినట్లు భార్య చెబుతోంది.గత కొన్ని నెలలుగా మద్యానికి బానిసై తమను వేధిస్తున్నాడని భార్య పేర్కొంది. భార్యా పిల్లలను కొడుతుండటంతో ఓపిక నశించి కమలాకర్ పై పెట్రోల్ పోసి తగలబెట్టినట్లు చెబుతోంది. పిల్లలతో కలిసి కమాలకర్ పై పెట్రోల్ పోసి నిప్పంటించినట్లు భార్య స్పష్టం చేసింది. ప్రస్తుతం జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కమాలకర్ పరిస్థితి విషమంగా ఉంది. -
‘భార్య అలా చేస్తే భర్తకు ఇంతకు మించిన నరకం మరొకటి ఉండదు’ :హైకోర్టు
భోపాల్ : పెళ్లైన మహిళలు, వారి పురుష స్నేహితుల సాన్నిహిత్యంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. వివాహం తర్వాత పురుషుడు లేదా స్త్రీ తమ స్నేహితులతో అసభ్యకరమైన ఫోన్ ఛాటింగ్లు చేయకూడదని, తన భార్య ఆ తరహా చాటింగ్లు చేస్తుంటే ఏ భర్త కూడా సహించలేడని పేర్కొంది. దిగువ కోర్టు విడాకులు మంజూరు చేస్తూ ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ ఓ మహిళ హైకోర్టును ఆశ్రయించింది. ఆ పిటిషన్పై విచారణ చేపట్టిన హైకోర్టు ధర్మాసనం మహిళ దాఖలు చేసిన పిటిషన్ను కొట్టివేసింది. ఈ సందర్భంగా ఫోన్ ఛాటింగ్పై వ్యాఖ్యానించింది. నా భార్య చాటింగ్ చేస్తోందిమధ్యప్రదేశ్కు చెందిన భార్య,భర్తల గొడవ ఇప్పుడు ఆ రాష్ట్రంలోనే చర్చకు దారితీసింది. 2018లో దంపతులకి వివాహమైంది. అయితే, ఆ ఇద్దరి దంపతుల మధ్య పొరపొచ్చలొచ్చాయి. అప్పుడే తన భార్య నుంచి విడాకులు కావాలని కోరుతూ భర్త ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించారు. ‘విచారణలో నా భార్య వివాహం తరువాత కూడా ఆమె ప్రియుడితో మాట్లాడుతోంది. అందుకు వాట్సప్ చాటింగే నిద్శనం. పైగా ఆ చాటింగ్ అసభ్యంగా ఉందని ఆధారాల్ని అందించారు.లేదు.. నా భర్తే నాకు రూ.25లక్షల భరణం ఇవ్వాలికానీ పిటిషనర్ భార్య మాత్రం భర్త చేస్తున్న ఆరోపణల్ని ఖండించింది. నా భర్త చెప్పినట్లుగా నేను ఎవరితోను సాన్నిహిత్యంగా లేను. చాటింగ్ చేయడం లేదు.నా భర్త కావాలనే నాకు వ్యతిరేకంగా సాక్ష్యాలు పుట్టించాడు. నా ఫోన్ హ్యాక్ చేసి మరి మరో ఇద్దరు పురుషులతో చాటింగ్ కూడా చేశారు. నా వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించనందుకు రూ.25లక్షలు భరణం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ, పలు ఆరోపణలు చేసింది.భార్యే నిందితురాలుఅంతేకాదు, ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు భార్య-భర్త ఏపిసోడ్ భర్త చెప్పేవన్నీ నిజాలేనని నిర్ధారించింది. వాటిని నివృత్తి చేసుకునేందుకు భార్య తండ్రిని సైతం విచారించింది. విచారణలో ఆమె తండ్రి కూడా అంగీకరించారు. తన కుమార్తె పరాయి మగాడితో చాటింగ్ చేస్తుందన్న విషయాన్ని గుర్తించినట్లు కోర్టుకు చెప్పారు. దీంతో ఫ్యామిలీ కోర్టు విడాకులు మంజూరు చేసింది.నాకు విడాకులొద్దు.. భర్తతోనే కలిసుంటాఫ్యామీలి కోర్టు నిర్ణయాన్ని సవాలు చేస్తూ బాధిత మహిళ మధ్యప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు జస్టిస్ వివేక్ రష్యా, జస్టిస్ గజేంద్ర సింగ్ల ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. విచారణలో పిటిషనర్ తన ప్రియుడితో సె* లైఫ్ గురించి చాటింగ్ చేసినట్లు గుర్తించింది. భార్య పరాయి పురుషుడితో ఈ తరహా చాటింగ్ చేస్తే ఏ భర్త సహించలగడనే అభిప్రాయం వ్యక్తం చేసింది. భర్తలకు ఇంతకంటే నరకం మరొకటి ఉండదువివాహం తర్వాత, భర్త మరియు భార్య ఇద్దరూ తమ స్నేహితులతో మొబైల్, చాటింగ్, ఇతర మార్గాల ద్వారా మాట్లాడుకునే స్వేచ్ఛ ఉందని గుర్తు చేస్తూ.. సంభాషణ స్థాయి సౌమ్యంగా, గౌరవప్రదంగా ఉండాలి. ముఖ్యంగా, మహిళ.. పురుషుడితో.. పురుషుడు స్త్రీతో మాట్లాడితే జీవిత భాగస్వామికి వ్యతిరేకంగా ఉండకూడదు’ అని కోర్టు పేర్కొంది. ఒక భాగస్వామి ఇలా అసభ్యకరమైన చాటింగ్ చేస్తే.. భర్తలకు ఇంతకంటే నరకం మరొకటి ఉండదని తెలిపింది. చివరగా.. కింది కోర్టు ఇచ్చిన తీర్పును సమర్ధించింది. -
భర్తతో బుల్లితెర నటి వాసంతి హోలి సెలబ్రేషన్స్ (ఫోటోలు)
-
మటన్ కర్రీ వండలేదనే కోపంతో భార్యను చంపిన భర్త
సాక్షి,మహబూబ్ నగర్: జిల్లాలో దారుణం జరిగింది. మటన్ కూర వండలేదని భార్యను కడతేర్చాడు ఓ కసాయి భర్త. సీరోల్ ఎస్సై సీఎహెచ్ నాగేష్ వివరాల మేరకు.. సీరోల్ మండల కేంద్రానికి చెందిన ఎం కళావతి,ఎం బాలు భార్యభర్తలు. వ్యవసాయం చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. అయితే ఈ క్రమంలో బాలుకి నాన్ వెజ్ తినాలని బుద్ధి పుట్టింది. ముందుగా చికెన్ కూర తిందామని అనుకున్నాడు. అసలే బర్డ్ ఫ్లూ అంటున్నారు. ఎందుకొచ్చిన గొడవ అనుకుని షాపుకెళ్లి మటన్ కూర తెచ్చాడు.మటన్ తినాలని ఉంది. అందుకే మటన్ తెచ్చా. వెంటనే మటన్ కూర చేయమని భార్యను కోరాడు. అందుకు భార్య అంగీకరించలేదు. దీంతో ఇరువురి మధ్య వాగ్వాదం జరిగింది.ఈ క్రమంలో నిందితుడు బాలుకి కోపం నషాళానికి అంటింది. ఏం చేయాలే పాలుపోలేదు. పట్టరాని కోపంతో భార్య కళావతిని వెనక్కి నెట్టాడు. ఫలితంగా బాధితురాలు ప్రాణాలు పోగొట్టుకుంది. భర్త నెట్టడంతో బాధితురాలి తలకి బలమైన గాయాలయ్యాయి. అక్కడికక్కడే మరణించింది. అనంతరం బాలు పరారయ్యాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టు మార్టమ్ నిమిత్తం మహబూబ్ నగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
Ranya Rao : రన్యారావు కేసులో భారీ ట్విస్ట్
బెంగళూరు : కన్నడ నటి రన్యారావు కేసులో భారీ ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. ఆమెపై డీఆర్ఐ అధికారులకు ఆమె భర్తే జతిన్ హుక్కేరి ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. పెళ్లైన రెండు నెలల నుంచి తరచు విదేశాలకు వెళ్తోంది. ఆమె విదేశీ టూర్లతో నిత్యం గొడవలు జరిగేవి.ఈ క్రమంలో తన భార్య ప్రవర్తనపై అనుమానం రావడంతో తన భర్త రన్యారావు డీఆర్ఐ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో రన్యారావు కదలికలపై నిఘా పెట్టిన డీఆర్ఐ అధికారులు.. ఆమె బంగారం స్మగ్లింగ్ చేస్తున్నట్లు గుర్తించి అరెస్ట్ చేశారు. 15 రోజుల్లో నాలుగుసార్లు దుబాయ్కు వెళ్లడంకన్నడ హీరోయిన్ రన్యారావు (Ranya Rao) బంగారం అక్రమరవాణా కేసులో కటకటాలపాలైంది. 15 రోజుల్లో నాలుగుసార్లు దుబాయ్కు వెళ్లడం, అదికూడా ప్రతిసారి సేమ్ డ్రెస్ ధరించడంతో అధికారులకు అనుమానమొచ్చింది. సోమవారం (మార్చి 3న) ఆమెను బెంగళూరు ఎయిర్పోర్టులో తనిఖీ చేయగా 14 కిలోలకు పైగా బంగారంతో అడ్డంగా దొరికిపోయింది. దీంతో ఆమెను అరెస్టు చేసిన అధికారులు జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. ఇకపోతే రన్యా రావు తండ్రి కర్ణాటక డీజీపీ డాక్టర్ కే.రామచంద్రారావు పెళ్లయ్యాక మళ్లీ కలిసిందే లేదన్న డీజీపీఇప్పటికే ఈ విషయంపై డీజీపీ స్పందిస్తూ రన్యాకు నాలుగు నెలలకిందటే పెళ్లి జరిగిందని, అప్పటినుంచి తనను కలవలేదని పేర్కొన్నారు. కూతురు, అల్లుడు చేసే పనుల గురించి తనకెటువంటి విషయాలు తెలియదన్నాడు. ఈ క్రమంలో రన్యా భర్త ఎవరన్న వివరాలు బయటకు వచ్చాయి. రన్యా భర్త పేరు జతిన్ హుక్కేరి. ఈయన ఆర్కిటెక్ట్. బెంగళూరులో బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ పట్టా పొందాడు. తర్వాత లండన్లో డిస్రప్టివ్ మార్కెట్ ఇన్నొవేషన్ కోర్సు చదివాడు. తండ్రి డీజీపీ, భర్త ఆర్కిటెక్ట్మొదట్లో బెంగళూరులోని పలు రెస్టారెంట్లకు డిజైనర్గా పని చేశాడు. లండన్లోనూ ఆర్కిటెక్ట్గా సేవలందించాడు. WDA & DECODE LLC సంస్థను స్థాపించడంతోపాటు దానికి క్రియేటివ్ డైరెక్టర్గానూ వ్యవహరిస్తున్నాడు. క్రాఫ్ట్ కోడ్ కంపెనీకి ఫౌండర్ కూడా ఇతడే! రన్యారావును పెళ్లి చేసుకున్నాక తనతో కలిసి పలుమార్లు దుబాయ్ ట్రిప్కు వెళ్లినట్లు తెలుస్తోంది. ఇకపోతే ఎయిర్పోర్టులో బంగారం స్మగ్లింగ్ చేస్తూ రన్యా దొరికిపోగా.. ఆమె ఇంటిని సైతం తనిఖీ చేశారు. ఈ సోదాలో రూ.2.06 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు, రూ.2.67 కోట్ల నగదు అధికారులు స్వాధీనం చేసుకున్నారు.సినిమారన్యా రావు.. కిశోర్ నమిత్ కపూర్ యాక్టింగ్ స్కూల్లో నటనపై శిక్షణ తీసుకుంది. మాణిక్య అనే కన్నడ చిత్రంతో వెండితెరకు పరిచయమైంది. ఇది ప్రభాస్ మిర్చి మూవీకి రీమేక్గా తెరకెక్కింది. పటాస్ కన్నడ రీమేక్ పటాకిలో హీరోయిన్గా నటించింది. తమిళంలో వాఘా మూవీ చేసింది. ఎనిమిదేళ్లుగా వెండితెరకు దూరంగా ఉంటోంది. -
‘మెడలో తాళి, నుదుటున బొట్టు లేదు.. మీ భర్త మిమ్మల్ని ఎలా ప్రేమిస్తారు’: కోర్టు
ముంబై : వాళ్లిద్దరూ భార్యా, భర్తలు. అయితే, భర్త తనని వేధిస్తున్నాడని ఆరోపిస్తూ భార్య కోర్టును ఆశ్రయించింది. భర్త నుంచి తనకు విడాకులు కావాలని కోరింది. ఈ కేసుపై కోర్టు విచారణ చేపట్టింది. విచారణ సమయంలో న్యాయమూర్తికి, మహిళకు మధ్య జరిగిన సంభాషణ సోషల్ మీడియాలో వైరల్గా మారింది.పూణేకు చెందిన అంకుర్ ఆర్ జగిధర్ లాయర్గా విధులు నిర్వహిస్తున్నారు. తాజాగా, ఓ మహిళ తన భర్త నుంచి తనకు విడాకులు ఇప్పించాలని కోరుతూ తనని సంప్రదించిందని, అందుకే ఆమె తరుఫున వాదిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. అయితే, తాజాగా తన క్లయింట్ కేసు పూణే జిల్లా కోర్టులో విచారణకు వచ్చిందని, విచారణ సమయంలో న్యాయమూర్తితో జరిగిన వాదనలను భార్య తరుఫు లాయర్ లింక్డిన్లో పోస్ట్ చేశారు. ఆ పోస్టులో పూణే జిల్లా కోర్టులో ‘‘నా క్లయింట్ విడాకుల కేసు విచారణ జరిగింది. విచారణలో భర్త తన డిమాండ్లను నెరవేర్చాలని కోర్టును కోరింది. అయితే, ఈ కేసు విచారిస్తున్న న్యాయమూర్తి నా క్లయింట్ను ఇలా ప్రశ్నించారు. ‘‘ఏమ్మా.. మిమ్మల్ని చూస్తుంటే మొడలో మంగళసూత్రం, నుదుట బొట్టు పెట్టుకునేవారిలా కనిపించడం లేదే? వివాహం జరిగిన స్త్రీగా మీరు కనిపించకపోతే.. మీ వారు.. మిమ్మల్ని ఎలా ఇష్టపడతారు? అందుకే భర్తలతో ప్రేమగా ఉండండి. కఠువగా ఉండకండి అని సలహా ఇచ్చారు.అంతేకాదు.. మాటల మధ్యలో న్యాయమూర్తి ఇలా అన్నారు. ‘‘ఒక స్త్రీ బాగా సంపాదిస్తే, ఆమె ఎప్పుడూ తనకంటే ఎక్కువ సంపాదిస్తున్న భర్తనే కోరుకుంటుంది. తక్కువ సంపాదిస్తున్న వ్యక్తి చాల్లే అని సరిపెట్టుకోదు. అదే బాగా సంపాదించే వ్యక్తి తాను వివాహం చేసుకోవాలనుకుంటే, తన ఇంట్లో పాత్రలు కడిగే పనిమనిషినైనా సరే వివాహం చేసుకోవాలనుకుంటాడు. కాబట్టి మీరు మీ భర్త పట్ల కాస్త ప్రేమను చూపించండి. కఠినంగా ఉండొద్దు అని ఇద్దరు దంపతుల్ని ఒక్కటి చేసే ప్రయత్నం చేశారని వివరిస్తూ’’ సదరు న్యాయవాది రాసిన సోషల్ మీడియా పోస్టు నెట్టింట్లో చక్కెర్లు కొడుతోంది. -
భర్తకు బడితే పూజ
-
‘నా భార్య నా రక్తం తాగేస్తోంది.. ఏం చేయమంటారు!’
లక్నో: ‘నా భార్యకు నాకు మధ్య గొడవలు జరుగుతున్నాయి. తను ప్రతి రోజు నా కలలోకి వస్తుంది. నా గుండెలపై కూర్చుంటుంది. నా రక్తాన్ని తాగేందుకు ప్రయత్నిస్తుంది. అందుకే నేను నిద్ర పోలేకపోతున్నా. ఫలితమే నా విధుల్లో సమయ పాలన పాటించలేకపోతున్నా’అంటూ ఓ పారామిలటరీ జవాన్ తన కమాండర్కు లేఖ రాశారు. ఆ లేఖ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. భార్య పోరు పడలేక సదరు జవాన్ రాసిన ఆ లేఖను లక్షల మంది నెటిజన్లు షేర్ చేస్తున్నారు. ఇంతకి ఏం జరిగింది?దేశంలో శాంతి భద్రతలకు విఘూతం కలగకుండా డేగ కన్నుతో నిత్యం రక్షణ కల్పించే పారా మిలరీ విభాగంలో ప్రొవిన్సియల్ ఆర్మ్డ్ కానిస్టేబులరీ (pac) విభాగం ఉంది. ఉత్తరప్రదేశ్ కేంద్రంగా 44వ ప్రదేషిక్ ఆర్మ్డ్ కాన్స్టేబులరీ (Pradeshik Armed Constabulary) విభాగంలో ఓ జవాన్ విధులు నిర్వహిస్తున్నారు. విధుల్లో సిన్సియర్గా, స్ట్రిక్ట్గా ఉండే సదరు జవాన్లో ఇటీవల కాలంలో సమయ పాలన లోపించింది. డ్యూటీ టైంకు రాకపోవడం,షేవింగ్ చేసుకోకపోవడం, చిందవందరగా యూనిఫారమ్ ధరించడం, ఇచ్చిన పనిని సకాలంలో చేయకుండా ఆలస్యం చేస్తుండేవారు.విధుల్లో నిర్లక్ష్యం.. అందుకు కారణంఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ గత నెల 17న పీఏసీ 44వ బెటాలియన్ జీస్వ్కాడ్ కమాండర్ మదుసూధన్ శర్మ సదరు జవాన్కు విధుల్లో అలసత్వం వహిస్తున్నారని, వివరణ ఇవ్వాలని నోటీసులు జారీ చేశారు. ఆ నోటీసుల్లో.. మందురోజు విధులు ఎలా జరిగాయో తెలుసుకుని.. ఆ రోజు విధులు ఎక్కడ నిర్వహించాలో ప్రతి రోజు ఉదయం బ్రీఫింగ్ ఉంటుంది. ఆ బ్రీఫింగ్కు గైర్హాజరు కావడం కాకుండా ఆలస్యంగా రావడం, మిలటరీ విభాగంలో విధులు నిర్వహించే వారు తప్పని సరిగా ఫుల్ షేవింగ్ చేసుకోవాలి. కానీ అలా షేవింగ్ చేసుకోకుండా విధులు నిర్వహించడం, ఇష్టానుసారంగా యూనిఫారమ్ ధరించడం, ఇచ్చిన పనిని సకాలంలో పూర్తి చేయకుండా ఆలస్యం ఎందుకు చేస్తున్నారో లేఖలో పేర్కొన్నారు. వివరణ ఇచ్చేందుకు ఒకరోజు సమయం కూడా ఇచ్చారు.అసలేం జరిగిందంటే?కమాండర్ నుంచి వచ్చిన లేఖపై సదరు పీఏసీ జవాన్ వివరణ ఇచ్చారు. తాను విధుల్లో ఎందుకు నిర్లక్ష్యంగా ఉంటున్నారో భావోద్వేగంతో పలు కారణాల్ని జత చేశారు. ‘సార్ నేను ఫిబ్రవరి 16న డ్యూటీకి ఆలస్యంగా వచ్చాను. ఎందుకంటే వ్యక్తిగత సమస్యలు నన్ను తీవ్రంగా వేధిస్తున్నాయి. వాటి వల్ల రాత్రిపూట నిద్రపోవడం కష్టంగా మారింది. కొద్ది రోజుల క్రితం నా భార్యతో గొడవలు జరిగాయి. గొడవ తర్వాత నా భార్య నా కలలోకి వస్తుంది. నా గుండెలపై కూర్చుకుంటుంది. నా రక్తాన్ని తాగేందుకు ప్రయత్నిస్తుంది. దీనికి తోడు నా తల్లిని అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడుతున్నాయి. కారణంగా నిద్రలేమి సమస్యలతో బాధపడుతున్నాను. తీవ్ర మనోవేధనకు గురవుతున్నా. దీని నుంచి భయటపడేందుకు చికిత్స తీసుకుంటున్నాను. నేను పడుతున్న కష్టాల నుంచి విముక్తి కలిగించేలా ఓ దారి చూపాలని ఆ లేఖలో ప్రాధేయపడ్డారు. ఆ లేఖపై 44వ బెటాలియన్ పీఏసీ కమాండంట్ సత్యేంద్ర పటేల్ స్పందించారు. ఆన్లైన్లో వైరల్ అవుతున్న లేఖ నిజమేనా? అదే నిజమైతే ఎవరు రాశారో? పరిశీలిస్తాం. సదరు జవాన్కు ఇబ్బందులు ఉంటే అతనికి అండగా నిలుస్తాం. చికిత్స కూడా అందిస్తాం’అని అన్నారు. -
భర్తతో తిరుమల శ్రీవారిని దర్శించుకున్న హన్సిక (ఫోటోలు)
-
ఖరీదైన కారు చెత్త కుప్పలో... అసలు సంగతి తెలిసి విస్తుపోతున్న జనం
ప్రియురాలు అలిగితే ప్రియుడు గ్రహించి అలక తీర్చాలి. అది రూల్.అయితే పెళ్ళికి ముందు ఈ అలకలు ముద్దు..ముద్దుగా బాగానే ఉంటాయి. భార్యాభర్తలుగా మారిన తరువాతే అలకలు కాస్త చిరాకులు, పరాకులుగా, వివాదంగా మారిపోతాయి. అందుకే ‘‘అలుక సరదా మీకూ అదే వేడుక మాకూ..కడకు మురిపించి గెలిచేది మీరేలే’’ అంటూ కోప్పకుండానే తనమనసులోని మాట చెప్పేశాడు సినీకవి ఆరుద్ర. అలాగే అలిగిన భార్యను ఎలాగైనా బుజ్జగించాలనుకున్నాడో భర్త. తన ప్రేమసముద్రంలో లేచిన ప్రణయకలహానికి చెక్ పెట్టాలనుకున్నాడు. కానీ సీన్ సితార్ అయింది!అలిగిన తన భార్యకు వాలెంటైన్స్ రోజున ఖరీదైన బహుమతి ఇవ్వాలనుకున్నాడు. ఎలాగైన ఆమె ప్రేమను పొందాలనుకున్నాడు. బాగా ఆలోచిస్తే ఆమెకు కార్లంటే పిచ్చ ప్రేమ అని గుర్తొచ్చింది. అంతే క్షణం ఆలోచించకుండా లగ్జరీ కారును కొనుగోలు చేశాడు. ప్రేమికుల రోజున 27 లక్షల రూపాయల విలువ చేసే ఎస్యూవీని గిఫ్ట్గా ఇచ్చాడు. అయితే అది ఆమెకు నచ్చలేదు. తిరస్కరించింది. దీంతో భర్తగారు బాగా హర్ట్ అయ్యాడు. వెంటనే లక్షల విలువైన కారును చెత్తకుప్పలో పడేశాడు. ఇంతకీ అంత ఖరీదైన కారు ఆమెకు ఎందుకు నచ్చలేదో తెలిస్తే.. ‘‘మొదట మగవారు వేస్తారు వేషాలు పెళ్ళి కాగానే చేస్తారు మోసాలు’’ అనిపించక మానదు.రష్యా స్థానిక మీడియా కథనాల ప్రకారం..రష్యా రాజధాని మాస్కో సమీపంలో మైటిష్చి పట్టణంలో ఓ జంటకు ఈ మధ్య విభేదాలొచ్చాయి. తగాదాలతో దూరంగా ఉంటున్నారు. దీంతో భార్యను ప్రసన్నం చేసుకునేందుకు చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో మరో పయత్నం చేశాడు. ఖరీదైన పోర్షేకారును కొనుగోలు చేశాడు. అయితే యాక్సిడెంట్లో స్వల్పంగా డ్యామేజీ అయినా కారది. అలాంటి దానికి రెడ్ రిబ్బన్ కట్టేసి మేనేజ్ చేద్దామనుకున్నాడు. ‘సీతతో అదంత వీజీ కాదన్నట్టు’ ఆమె ఈ విషయాన్ని ఇట్టే పసిగట్టేసింది. పైగా కార్ల లవర్ కదా అందుకే దాంట్లోని లోపాన్ని చటుక్కున గుర్తించింది. హన్నన్నా.. ఇంతటి అవమానమా? అంటూ మండిపడింది. అందుకే మరి ఛీ... పొమ్మంది. ఇక ఏం చేయాలో తెలియక ఖరీదైన ఆ పోర్షేకారును తీసుకుపోయి పెద్ద చెత్తకుప్పలో పడేశాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇది వైరల్గా మారింది. అసలా కారును చెత్తలో ఎలా పడేశాడు? కంటైనర్లో ఈ కారు ఎలా పట్టింది అనేది నెటిజన్లు మధ్య చర్చకు దారి తీసింది. దాదాపు రెండు వారాలుగా, పోర్స్చే కారు ఆ ప్రదేశంలోనే ఉండిపోవడంతో ఇది స్థానికంగా ఆసక్తిని రేకెత్తించింది. ఫోటోలకు ఎగబడ్డారు. దీంతో ఆ ప్రదేశం టూరిస్ట్ ప్లేస్గా మారిపోయిందట. -
ఆటోడ్రైవర్ అఘాయిత్యం
దొడ్డబళ్లాపురం(కర్ణాటక ): ఓ కిరాతక భర్త భార్యను హత్య చేసి ఆపై తానూ ఆత్మహత్య చేసుకున్న విషాద సంఘటన బెంగళూరు తిగళరపాళ్యలోని ముబారక్ నగర్లో చోటుచేసుకుంది. వివరాలు.. సురేశ్ (40), మమత (33) దంపతులు, అతడు ఆటో డ్రైవర్గా కుటుంబాన్ని పోషించేవాడు. అయితే సురేశ్ ఈ మధ్య సరిగా పనికి వెళ్లకపోవడంతో మమత గొడవపడేది. బుధవారం పండుగ అని ఇంట్లోనే ఉన్నాడు. మమత ప్రశ్నించడంతో రగడ మొదలైంది. ఆ సమయంలో వారి కొడుకు (6) అక్కడే ఉన్నాడు. సురేశ్ కోపం పట్టలేక మమతను గొంతు నులిమి చంపి, తరువాత తానూ ఉరి బిగించుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే సురేశ్ భార్యకు మొబైల్లో అశ్లీల చిత్రాలు చూపించి వేధించేవాడని, ఈ విషయాన్ని మమత సురేశ్ తల్లికి చెప్పడంతో సహించలేక హత్య చేసినట్టు కూడా స్థానికులు చెబుతున్నారు. వీరిద్దరి స్వస్థలం తుమకూరు జిల్లా గుబ్బి. బ్యాడరహళ్లి పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. -
డాక్టర్ సుమంత్ రెడ్డిపై హత్యాయత్నం.. దారి తప్పిన భార్య కథ
సాక్షి, హైదరాబాద్ : వాళ్లిద్దరూ భార్య భర్తలు. ఎనిమిదేళ్ల క్రితం వివాహం చేసుకున్నారు. దంపతులిద్దరూ సమాజంలో గౌరవప్రదమైన డాక్టర్, లెక్చరర్గా విధులు నిర్వహిస్తున్నారు. అయితే, లెక్చరర్గా విద్యాబుద్ధులు నేర్పించే భార్య పక్కదారి పట్టింది. దారుణానికి ఒడిగట్టింది. తన వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని ప్రియుడితో కలిసి భర్తను హతమార్చేందుకు ప్లాన్ చేసింది. హత్యను రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేసింది. ముందస్తు ప్లాన్ ప్రకారం, అనుకున్నట్లుగా భర్త చనిపోకపోవడంతో చివరికి పోలీసులకు పట్టుబడింది. దోషిగా కటకటాల్లోకి వెళ్లనుంది.రాష్ట్రంలో సంచలనం సృష్టించిన వరంగల్ డాక్టర్ సుమంత్ రెడ్డిపై జరిగిన హత్యాయత్నం ఘటనలో అసలు సూత్రధారి, పాత్రదారి బాధితుడి భార్య ఫ్లోరా మరియా అని తేలడం అందర్నీ షాక్కు గురి చేసింది. మంగళవారం నిందితులను పోలీసులు మీడియా ఎదుట హాజరు పరిచే అవకాశం ఉన్నట్లు సమాచారం.పోలీసుల వివరాల మేరకు, డాక్టర్ సుమంత్ రెడ్డి, ఫ్లోరా మరియాలు ఎనిమిది సంవత్సరాల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. కాజీపేటలో సుమంత్ క్లినిక్ను నిర్వహిస్తుండగా, అతని భార్య ఫ్లోరా మరియా రంగశాయిపేటలో డిగ్రీ లెక్చరర్గా పనిచేస్తోంది. అయితే, క్లినిక్ ప్రారంభించకముందు ఓ ఆస్పత్రిలో డాక్టర్గా సుమంత్ పనిచేసేవారు. ఆ సమయంలో ఫ్లోరా మరియా ఓ జిమ్లో చేరింది. అక్కడే ఆమెకు సామెల్ అనే యువకుడు పరిచయమయ్యాడు. ఆ పరిచయం ప్రేమగా మారింది. వారిద్దరి మధ్య వివాహేతర సంబంధం మొదలైంది. ఆ విషయం సుమంత్కు తెలిసిపోవడంతో భార్య ఫ్లోరాను మందలించాడు.అయినా, ఆమె వినిపించుకోలేదు. భర్తను వద్దనుకొని, ప్రియుడే కావాలని అనుకున్న ఆమె, చివరికి భర్తను అడ్డొదగొట్టాలని అనుకుంది. ఇందుకోసం ప్రియుడు సామెల్, అతని స్నేహితుడు ఏఆర్ కానిస్టేబుల్ రాజును ఆమె పురమాయించింది. నేరం చేస్తే మట్టికి అంటకుండా ఉండాలన్న ఉద్దేశ్యంతో భర్తను ఎక్కడ, ఎలా హత్య చేయాలో ఫ్లోరా చెప్పింది.సుమంత్ను చంపి, రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు స్కెచ్ వేసింది. ప్లాన్ ప్రకారం, యాక్సిడెంట్ ప్లాన్ విఫలమయ్యాక, ప్లాన్ బీ ప్రకారం ఈ నెల 20న రాత్రి ఖాజీపేట నుండి బట్టుపల్లి బైపాస్ రహదారిలో సమంత్ కారును అడ్డగించి, అతడిపై ఐరన్ రాడ్లతో దాడి చేశారు. చనిపోయాడనుకున్న తర్వాత నిందితులు పరారయ్యారు. కానీ చావుబతుకుల మధ్య ఉన్న బాధితుణ్ని స్థానికులు అత్యవసర చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం బాధితుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. సుమంత్పై జరిగిన హత్యాయత్నంపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఈ దర్యాప్తులో కట్టుకున్న భార్య ఫ్లోరా మరియా, ఆమె ప్రియుడు సామెల్, సామెల్ స్నేహితుడు ఏఆర్ కానిస్టేబుల్ రాజు నిందితులని తేలింది. మంగళవారం నిందితులను పోలీసులు మీడియా ఎదుట హాజరుపరచి, హత్యయత్నానికి సంబంధించిన వివరాలను వెల్లడించనున్నారు. -
Sleep Divorce నయా ట్రెండ్: కలిసి పడుకోవాలా? వద్దా?!
కాలం మారుతోంది, మారుతోన్న కాలంతో పాటు సాంకేతికతా మారుతోంది. అయితే ఇదే తరుణంలో మనుషుల ఆలోచన ధోరణి మరింతగా మారుతోంది. దైనందిన వ్యవహారాలలో చిత్రవిచిత్రమైన పోకడలు చోటు చేసుకుంటున్నాయి. అసలు ఇలాంటివి కూడా ఉంటాయా అనేవిధమైన అలవాట్లు, పద్ధతులు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. తాజాగా ఇలాంటి ఓ ట్రెండ్ వేగంగా విస్తరిస్తోంది. అదే స్లీపింగ్ డివోర్స్. విడాకుల గురించి అందరికీ తెలుసు. మరి ఈ నిద్ర విడాకులు ఏంటనేగా సందేహం. అయితే ఈ కథనంలోకి వెళ్లవలసిందే! ప్రస్తుతం సమాజంలో నిద్ర విషయంలో ఒక కొత్త ట్రెండు మొదలైంది. మనుషుల ఆలోచన ధోరణి మారడంతో స్లీపింగ్ డివోర్స్ ఇప్పుడు కుటుంబాలలో ఒక భాగంగా మారింది. అంటే నిద్ర విడాకులు.. అంటే మరేంటో కాదు... రాత్రిపూట నిద్రపోయే సమయంలో భార్యాభర్తలు విడివిడిగా వేరువేరు గదుల్లో పడుకుని ఎవరికి వారు హాయిగా నిద్రపోతారు. తెల్లవారి లేచిన తర్వాత మళ్లీ ఇంట్లో కలిసి ఉంటారు. దీనినే స్లీపింగ్ డివోర్స్ అంటారు.రాత్రి పడుకున్న తర్వాత ఒకరు స్మార్ట్ఫోన్ వినియోగిస్తూ ఉండడం, ఒకరికి ఇష్టం లేకుండా మరొకరు గట్టిగా హత్తుకుని పడుకోవడం లాంటి సమస్యలకు పరిష్కారంగా చాలా జంటలు స్లీపింగ్ డైవర్స్ విధానాన్ని అవలంబిస్తున్నారు. అయితే ఈ స్లీపింగ్ డివోర్స్తో మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా అంటే.. లాభనష్టాలు రెండూ ఉంటాయి!దంపతుల మధ్య బంధం బలంగా ఉండాలంటే వారు కలిసి పడుకుంటేనే మంచిదని మానసిక వైద్య నిపుణులంటారు. కానీ ఇప్పుడు భార్యాభర్తల మధ్య బంధం బలంగా ఉండాలంటే, ఎలాంటి గొడవలు లేకుండా ఉండాలంటే విడివిడిగా పడుకోవడమే మంచిదని చెబుతున్నారు. వివాహబంధాన్ని కాపాడుకోవడానికే ఈ ట్రెండు ఫాలో అవుతున్నట్టు చెబుతున్నారు. ఎవరి వెర్షన్ వారిదే... నిద్ర అసమానతలతో ఇద్దరు ఒకేచోట పడుకుని రోజూ కీచులాడుకునే కంటే, విడివిడిగా పడుకొని మిగతా సమయాలలో కలిసి ఉండటం ఉత్తమమని కొందరు చెబుతున్నారు. అయితే ఇలా భార్యాభర్తలు విడివిడిగా పడుకోవడం వల్ల వారి మధ్య బంధం బలహీనంగా మారుతుందని, ఒకరినొకరు అర్థం చేసుకునే స్వభావం తగ్గుతుందని కొందరు మానసిక వైద్య నిపుణులు చెబుతున్నారు. ఏది ఏమైనా స్లీపింగ్ డివోర్స్ విషయంలో ఎవరి వర్షన్ వాళ్ళది.. ఎవరైనా సరే హాయిగా నిద్రపోవడమే ముఖ్యమని చెబుతూ ఉండడం గమనార్హం. పైగా వివాహ బంధాన్ని కాపాడుకోవడానికి ఈ ట్రెండ్ను ఫాలో అవుతున్నట్లు చెబుతుండడం గమనార్హం. ఒకే బెడ్పై కలిసి పడుకోవాల్సిన కపుల్స్.. వేరువేరు గదుల్లో పడుకోవడం లేదా, వేరు వేరు మంచాలపై పడుకోవడం వల్ల ఎవరూ నష్టపోయే పని ఏం ఉండదని కొందరి వాదన. కలిసి పడుకునే సమయంలో వచ్చే గురక, దుప్పటిని ఇద్దరు పంచుకోవడం, ఇద్దరిలో ఒకరు స్మార్ట్ఫోన్ వాడడం, ఒకరికి ఇష్టం లేకుండా మరొకరు హత్తుకోవడం ఇలా ఎన్నో సమస్యలకు చెక్ పెట్టేందుకే నిద్ర విడాకులు విధానాన్ని అవలంబిస్తున్నారు. అయితే, ఇలా విడివిడిగా నిద్రించడంతో కంటినిండా నిద్రపట్టి మరుసటి రోజు మరింత యాక్టివ్గా టూర్లో పాల్గొన్నట్టు అనేక మంది చెప్పుకొచ్చారు. ఈ స్లీప్ డివోర్స్ కారణంగా లాభనష్టాలు రెండూ ఉన్నాయని మానసిక నిపుణులు చెబుతున్నారు. ఒకేచోట ఇష్టం లేకుండా కలిసి పడుకోవడం వల్ల బంధాలు బీటలు వారేకంటే విడివిడిగా ఉంటూ సంతోషంగా ఉండడమే బెటర్ అనే వాదనలు వినిపిస్తున్నాయి. అయితే దీర్ఘకాలంగా జంటలు కలిసి నిద్రించకపోతే ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. బంధం బలోపేతంగా ఉండాలంటే కచ్చితంగా కపుల్స్ కలిసి పడుకోవాలని సూచిస్తున్నారు. భాగస్వాములు ఇద్దరి నిద్రలో ఉండే అసమానతల కారణంగా ఒకరివల్ల మరొకరికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండాలని, ఈ స్లీపింగ్ డైవర్స్ ట్రెండును ఫాలో అవుతున్నారు. ఎవరికి వారు ప్రశాంతంగా సుఖంగా నిద్ర΄ోవడానికి విడివిడి గదులను లేదా విడివిడి పడకలను ఎంచుకుంటున్నారు. అన్నింటికీ మించి భార్యాభర్తల మధ్య గురక సమస్య...భాగస్వాముల నిద్రలో అసమానతలే కారణం. పురుషుల్లో 45 శాతం మంది భాగస్వామికి దూరంగా విడిగా పడుకునేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారట. అయితే, మహిళల్లో మాత్రం కేవలం 25 శాతం మందే ఇందుకు సుముఖంగా ఉన్నట్టు పరిశోధకుల అంచనా. ఇదీ చదవండి: ఒక్క సోలార్ బోట్ కోసం అధిక జీతమిచ్చే ఉద్యోగం, అన్నీ వదిలేశారు!ఇటీవల హిల్టన్ ట్రెండ్స్ పేరిట విడుదలైన ఓ నివేదికలో పలు ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగు చూశాయి. ఈ నివేదిక ప్రకారం, రోజుల తరబడి టూర్లకు వెళ్లే జంటల్లో ఏకంగా 63 శాతం మంది ఒంటరిగా నిద్రించేందుకే మొగ్గు చూపుతున్నారట. అంతేకాకుండా ఇలా చేస్తే కంటినిండా నిద్ర పట్టిందని, మరుసటి రోజు టూర్ను బాగా ఎంజాయ్ చేశామని చెబుతున్నారు. ఇక పిల్లాజల్లాతో వెళ్లేవాళ్లు కూడా తమ బిడ్డల్ని వేరే గదిలో నిద్రపుచ్చేందుకే మొగ్గు చూపుతున్నారట. ఈ ట్రెండ్పై అమెరికన్ అకాడమీ ఆఫ్ స్లీప్ మెడిసిన్ కూడా దృష్టి సారించింది. కమ్మటి నిద్రకోసమే తాము విడివిడిగా పడుకున్నట్టు అనేక జంటలు చెప్పారు. -
భర్తను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న జాయింట్ కమిషనర్ భార్య
బౌద్ధనగర్: తనను వేధింపులకు గురి చేస్తూ.. మరో మహిళతో కలిసి ఉన్న జీహెచ్ఎంసీ జాయింట్ కమిషనర్ను రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని పోలీసులకు అప్పగించింది ఆయన భార్య. ఈ ఘటన వారాసిగూడ పోలీస్స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటుచేసుకుంది. ఇన్స్పెక్టర్ రాచకొండ సైదులు, బాధితురాలు చెప్పిన వివరాల ప్రకారం.. సికింద్రాబాద్లోని వారాసిగూడకు చెందిన జానకీరామ్ జీహెచ్ఎంసీ జాయింట్ కమిషనర్గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆయనకు గతంలో వివాహమైంది. కొంత కాలం తర్వాత దంపతులు విడాకులు తీసుకున్నారు. 2018లో బౌద్ధనగర్కు చెందిన కల్యాణితో జానకీరామ్కు రెండో పెళ్లి జరిగింది. కొన్నాళ్ల పాటు వీరి కాపురం సజావుగానే సాగింది. ఆ తర్వాత జానకీరామ్, కల్యాణి కలిసి ఆయన తల్లిదండ్రులతో నివసించసాగారు. ఈ క్రమంలోనే కల్యాణిని అత్తామామలతో పాటు తన భర్త అన్న, వదిన వేధింపులకు గురి చేసేవారు. జానకీరామ్కు మరో వివాహం చేసేందుకు కల్యాణిని ఇంట్లో నుంచి వెళ్లగొట్టే ప్రయత్నాలు చేశారు. ఈ నేపథ్యంలో జానకీరామ్ నాలుగు నెలల క్రితం భార్యను ఆమె పుట్టింట్లో వదిలేసి వెళ్లాడు. అప్పటి నుంచి కల్యాణి ఎన్నిసార్లు ఫోన్లు చేసినా భర్త లిఫ్ట్ చేసేవాడు కాదు. దీంతో భర్తపై అనుమానం కలిగిన కల్యాణి శుక్రవారం తన కుటుంబ సభ్యులతో కలిసి వారాసిగూడలోని భర్త ఇంటికి వెళ్లి చూడగా.. అతను మరో అమ్మాయితో కలిసి ఉన్నాడు. వీరిద్దరినీ పట్టుకొని దేహశుద్ధి చేశారు. వారాసిగూడ పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని జానకీరామ్తో పాటు సదరు మహిళను అదుపులోకి తీసుకున్నారు. కాగా.. తన భర్త మరో మహిళను పెళ్లి చేసుకుని కాపురం పెట్టినట్లు సమాచారం రావడంతో వారిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నట్లు బాధితురాలు కల్యాణి తెలిపారు. తన భర్తతో పాటు ఆయన కుటుంబ సభ్యులు తనను శారీరకంగా, మానసికంగా వేధింపులకు గురి చేశారని, తాను 3 నెలల గర్భిణిగా ఉన్న సమయంలో కడుపుపై భర్త తన్నడంతో గర్భస్రావం జరిగిందని తెలిపారు. గ్యాస్ సిలిండర్ లీక్ చేసి చంపేందుకు ప్రయత్నించాడని ఫిర్యాదులో కల్యాణి పేర్కొన్నారు. 20 మంది దాడి చేశారు: జానకీరామ్ తనతో పాటు ఇంట్లో ఉన్న తన స్నేహితురాలిపై 20 మంది దాడికి పాల్పడ్డారని జాయింట్ కమిషనర్ జానకీరామ్ వారాసిగూడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తన భార్య కల్యాణి, బావమరిది బులిశెట్టి భాస్కర్ సుమారు 20 మందితో కలిసి ఇంట్లోకి వచ్చి దాడి చేశారన్నారు. ఇరువురి ఫిర్యాదుల మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ రాచకొండ సైదులు తెలిపారు. -
పతి దేవుడిపై ప్రతీకారమా? బెంబేలెత్తుతున్న బట్టతల బంగారమ్స్!
కాదేదీ వైరల్కు అనర్హం అన్నట్టు ఉంటుంది సోషల్ మీడియా వ్యవహారం. ఎపుడు ఎలాంటి వీడియో వైరల్ అవుతుందో తెలియదు. అనేక సామాజిక అంశాలతోపాటు, ప్రేయసీ ప్రియుల చిలిపి తగాదాలు, భార్యభర్తల సరసాలు ,ఫైటింగ్లు లాంటి వీడియోలు నెట్టింట సందడి చేస్తూ ఉంటాయి. అలా తన పతిదేవుడిపై ఒక సతీమణి ప్రతీకారం తీర్చుకున్న వైనం వైరల్గా మారింది. ప్రతీకారం అంటే అదేదో హింసా, ప్రతి హింస అనుకునేరు. చదవండి మరి!తనకు చపాతి కావాలని అడిగాడు ఓ భర్త. ‘హే...పో.. ఇపుడెవరు చేస్తారు’ అంది భార్యామణి విసుగ్గా. నేనేమైనా మణులు, మాణిక్యాలు అడిగానా, చపాతియేగా..నాకోసం ఆ మాత్రం చేయలేవా అన్నాడు భర్త. అంతే క్షణాల్లో అక్కడి వాతావరణం మారిపోయింది. ముందు ఇల్లు పీకి పందిరేసినంత పనిచేసిన భార్య చివరికి చపాతీ తయారీకి రంగంలోకి దిగింది. ‘‘ఇగో.. నేను చపాతీ చేయాలంటే నువ్వు సాయం చేయాలి మరి అంది గోముగా.. ఓ..దానిదేముంది చేసేద్దాం అన్నాడు భార్యామణి అసలు ప్లాన్ తెలియని భర్త.అంతే కిచెన్ లోకి వెళ్లి గోధుమపిండి తీసుకొచ్చింది. బాగా పిసికి మెత్తగా పిండిని రెడీ చేసేసింది. ఆ తర్వాత ఇంటి పక్కన ఉన్న ఖాళి ప్రదేశంలో, చపాతీలు కాల్చేందుకు కట్టెల పొయ్యి సిద్ధం చేసింది. ఇది చూసి ఇంకా ఉత్సాహంతో రంగంలోకి దిగాడు భర్త. మాంచిగా మఠం వేసుకుని కూర్చున్నాడు. మరి చపాతీలు చేయడానికి పీట ఏది అని అడిగాడు.. దానికి ఆమె పీటా, గీటా లేదని చెప్పింది. ‘‘అదేమిటోయ్..పీట లేకుండా చపాతీ ఎలా చేసేది’’ అంటూ భార్యమీద గుర్రుమన్నాడు. అప్పుడు తన ప్లాన్ను పక్కాగా అమలు చేసే సమయం కోసం ఎదురు చూస్తున్న భార్యామణి అటు ఇటు చూసిన ఆమె మీ గుండుగా నున్న....గా, దాని మీద చేస్తాను అన్నది. ఓసి నీ దుంపదెగ ఇదేం పని హూంకరించాడు భర్త. అవన్నీ జాన్తా నహీ.. మీకు చపాతి కావాలా? వద్దా? అని ఆమె ప్రశ్నించింది. సరే అలానే కానివ్వూ అని అన్నాడు. అలా అనడం ఆలస్యం, ఇంక ఏ మాత్రం సంకోచించకుండా, నున్నటి అతగాడి గుండు మీద తన ప్రతాపన్నంతా చూపించింది (చాలా రోజులనుంచి బోడి గుండు మీదు కోపం ఉన్నట్టుంది పాపం..) చపాతీలు వత్తడం మొదలుపెట్టింది. భర్త చక్కగా పిండిలో ముంచి ఇవ్వడం, ఆమె గుండ్రంగా చపాతీ వత్తడి, ఆ తరువాత దాన్ని ఆయనగారు తీసి పెనం మీద కాల్చడం.. ఇందులో చూడవచ్చు. గతేడాది నవంబరులో షేర్ అయిన ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో నవ్వులు పూయిస్తోంది. ఈ వీడియోని చూసిన నెటిజన్లు ఫన్నీగా కమెంట్స్ చేశారు.అరే... ఇందేంది భయ్యా.. నవ్వి నవ్వి మేం పోతే ఎవరు గ్యారెంటీ అంటూ కామెంట్ చేస్తున్నారు. కిచెన్లో చపాతీలు తయారు చేయడానికి పీట కూడా లేదా? ఎంత బోడిగుండు అయితే మాత్రం భర్త తల మీద చపాతీలు చేస్తారా? రివెంజ్ ఇలా తీర్చుకుంటారా అన్నారు. అంతేకాదు కొంతమంది భార్యలు కూడా ఇదే ఫాలో అయితే బోడినెత్తి బంగారు బాబుల పరిస్థితి ఏంటి బాసూ అంటూ వ్యాఖ్యానించారు. మరికొందరేమో సోషల్ మీడియాలో హైప్ కోసం ఇలాంటి పనులు చేస్తున్నారని వ్యంగ్యంగా వ్యాఖ్యానిస్తున్నారు. View this post on Instagram A post shared by GUAH BOCAH BOJONGGEDE (@katababa_) -
అంకుల్ మా అమ్మను.. మా నాన్నే చంపాడు
కడప అర్బన్ : భర్తే కాలయముడిగా మారి భార్య తలపై సుత్తితో కొట్టి దారుణంగా హత్య చేసిన సంఘటన కడప నగరంలో సంచలనం కలిగించింది. మద్యం సేవించడానికి డబ్బులను ఇవ్వలేదనే నెపంతో జీవితాంతం తోడు నీడగా నిలిచి, పిల్లలకు మంచి తండ్రిగా చూసుకోవాల్సిన ఆ వ్యక్తి భార్యను కిరాతకంగా హత్య చేసిన సంఘటన హృదయవిదారకంగా మారింది. ఈ సంఘటన వారి ముగ్గురు పిల్లల జీవితాన్ని సుడిగుండంలోకి నెట్టేసింది. కడప నగరంలోని టూటౌన్ సీఐ బి. నాగార్జున, ఎస్ఐ ఎస్కెఎం హుసేన్, మృతురాలి బంధువులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. నగరంలోని బెల్లమండివీధి, చిన్నమునిరావు వీధిలో గత నెల రోజులక్రిందట ఓ ఇంటిలో బాడుగకు పఠాన్ ఇమ్రాన్ఖాన్, అతని భార్య పఠాన్ జమీల (28) చేరారు. వీరికి ముగ్గురు సంతానం. వీరిలో షాహిదాఖానం(9), ఏజాజ్ఖాన్ (7), అలినాఖానం(5) ఉన్నారు. ఇమ్రాన్ఖాన్ ఎలక్ట్రిషన్ పనిచేసుకుంటూ జీవనం సాగించేవాడు. భార్యతో తరచూ గొడవపడుతూ తాను మద్యం సేవించి వచ్చి మరింత తీవ్రస్థాయిలో భార్యను వేధించేవాడు. ఈ క్రమంలోనే గురువారం సాయంత్రం వరకు పనిచేసుకుని వచ్చిన ఇమ్రాన్ఖాన్ తన భార్యకు రూ. 1000 డబ్బులు ఇచ్చాడు. ఆ డబ్బులో రూ. 500 దాచిపెట్టి, రూ.300 తన భర్తకు మద్యం సేవించేందుకు ఇచ్చింది. రూ. 200 కూరగాయలను తీసుకుని వచ్చింది. రాత్రి 9 గంటల సమయంలో తనకు మద్యం సేవించడానికి ఇంకా డబ్బులు కావాలంటూ భార్య జమీలతో భర్త వాగ్వాదానికి దిగాడు. ఈ నేపథ్యంలో భార్య జమీల ఈనెల అద్దె డబ్బులను కట్టాలని, అదే కట్టకుండా డబ్బులను మద్యానికి ఇవ్వమని అంటున్నావా? అనీ అరిచింది. తీవ్ర ఆగ్రహానికి గురైన భర్త తాను ఉపయోగించే ఎలక్రిషన్ కిట్లో ఉన్న సుత్తిని తీసుకుని ఆవేశంతో ఊగిపోతూ భార్య తలపై మూడు సార్లు దాడి చేశాడు. ఈ దెబ్బలకు రక్తపుమడుగులో అక్కడికక్కడే జమీల కుప్పకూలిపోయింది. తన తండ్రి తల్లిని సుత్తితో బాదిన విషయాన్ని గమనించిన పెద్దకుమార్తె షాహిదాఖానమ్ భయంతో తన బంధువుల ఇంటికి పరుగుతీసింది. వారికి చెప్పగానే జమీల బావ, అన్నదమ్ములు పరుగెత్తుకుంటూ వచ్చారు. పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎట్టకేలకు స్థానిక ప్రజల సాయంతో జమీలను ఆటోలో రిమ్స్కు తరలించారు. రిమ్స్ డాక్టర్లు ఆమె మృతి చెందిందని నిర్ధారించారు. సంఘటన స్థలాన్ని పోలీసులు పరిశీలించారు. చుట్టుపక్కలా విచారించారు. తమ తల్లి దారుణంగా హత్యకు గురి కావడం, తన తండ్రే హత్య చేయడంతో ముగ్గురు పిల్లలు అనాథ«లుగా మారారు. వారి భవిష్యత్తు ఎలా వుంటుందోననీ స్థానికులు అనుకుంటున్నారు. ఏది ఏమైనా ఈ సంఘటనతో ఐదుగురు జీవితాలను ఛిన్నాభిన్నం చేసింది విశాఖ వసంత కేసు.. నాగేంద్ర ఫోన్ హిస్టరీ చూసి షాకైన పోలీసులు! -
పెద్దలను ఒప్పించి ప్రేమ పెళ్లి.. మూడు నెలలకు ట్విస్ట్!
నాకు పెళ్ళయి 3 నెలలు అవుతోంది. నా భార్య బాగా చదువుకుంది. ఉద్యోగం చేస్తుంది. పెళ్ళి చేసుకుంటే సంతోషంగా ఉండొచ్చు అని ఇద్దరం ఇష్టపడి పెద్దలను ఒప్పించి పెళ్ళి చేసుకున్నాం. పెళ్ళి సమయంలో మా అత్త, మామ వాళ్ళు ఇష్టపూర్వకంగానే నాకు కొంత కట్నం కూడా ఇచ్చారు. పెళ్ళైన ఒక నెల వరకూ చాలా బాగుంది. కానీ అంతలోనే బాగా మారిపోయింది. ప్రతిదానికి అలక, ఏ విషయాన్నైనా సాగదీయడం, నా జీతం నీకు ఇవ్వను, నా ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టుకుంటాననడం, మా అమ్మానాన్నకు డబ్బులు ఇవ్వొద్దు అనడం, వాళ్ళు మన ఇంట్లో ఉండకూడదు అని తరచూ గొడవలు చేయడం, గొడవ అయిన ప్రతిసారి తన కట్నం డబ్బులు తనకు ఇచ్చేయమని రచ్చ చేస్తుంది. గంటలు గంటలు మేకప్ వేసుకోవడం, తయారయి ఫోటోలు దిగడం, వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం, తెలియని వాళ్ళతో కూడా గంటలు గంటలు చాటింగ్ చేయడం... వద్దంటే ఏడుస్తోంది. తల గోడకేసి కొట్టుకుంటుంది. మమ్మల్ని బెదిరించడం కోసం తనకు తానే చిన్న చిన్న గాయాలు చేసుకుంటుంది. నేను తనతో ఎంతోమంచి జీవితాన్ని ఊహించుకున్నాను. నా కలల ప్రపంచం ఒక్కసారిగా కూలిపోయింది. ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు. నన్ను ఈ సమస్య నుంచి బయటకు తీసుకువచ్చే సలహా ఇవ్వగలరు.– ఆదినారాయణ, హైదరాబాద్ముందుగా మీరు ఒక విషయం గ్రహించాలి. ప్రపంచంలో ఏ ఇద్దరు వ్యక్తులు ఒకేలా ఆలోచించరు. అలాగే కలహాలు లేని కాపురాలు కూడా ఉండవు. తల్లిదండ్రుల నుండి వచ్చే వారసత్వ లక్షణాలు, పెరిగిన వాతావరణం ఒక మనిషి వ్యక్తిత్వాన్ని, ప్రవర్తనను ప్రభావితం చేస్తాయి. అతిగా అలగడం, మొండితనం, ఓర్వలేనితనం, తరచు మానసిక సంయమనం కోల్పోవడం, విపరీతమైన కోపం, తమని తాము గాయపరచుకోవడం అనేవి సాధారణంగా ‘బార్డర్లైన్ పర్సనాలిటీ’ అనే ఒక ప్రత్యేకమైన మనస్తత్వం ఉన్న వాళ్ళలో చూస్తాం. ఈ సమస్యతో బాధపడే వాళ్ళు ఇతరులతో అంత సులభంగా సర్దుకుపోలేరు. తమ చుట్టూ ఉన్న వాళ్ళని ఏదో ఒకరకంగా కంట్రోల్ చేయాలని అనుకుంటారు. మీ అత్తమామల సహాయం తీసుకుని మీ భార్యాభర్తలిద్దరూ, మంచి సైకియాట్రిస్ట్ లేదా క్లినికల్ సైకాలజిస్ట్ని సంప్రదించండి. మీ ఇద్దరితో వివరంగా మాట్లాడి అవసరమైన సలహాలు, సూచనలు మానసిక వైద్యులు అందిస్తారు. ఆమె మనస్తత్వాన్ని ముందు మీరు అర్థం చేసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. తన పరిస్థితి గురించి మీకు అవగాహన వస్తే, తనతో ఎలా మసులుకోవాలో తెలిసే అవకాశం కూడా ఉంటుంది. అలాగే మీరూ మానసికంగా చాలా ఒత్తిడిలో ఉన్నారు కాబట్టి మీరు కూడా కౌన్సెలింగ్ తీసుకుంటే మంచిది. మీరు తొందరపడి ఎలాంటి తీవ్ర నిర్ణయమూ తీసుకోకండి. మీ బంధాన్ని తెంచుకోవటం సులభం కావచ్చు. దాన్ని జాగ్రత్తగా పదికాలాల పాటు నిలబెట్టుకోవాలంటే ఇరువైపుల నుండి కొంత సర్దుబాటు, సహనం, నిరీక్షణ, త్యాగం అవసరం. మీరు విడాకులు తీసుకున్నా ఇంతకంటే మంచి జీవిత భాగస్వామి దొరుకుతుందన్న గ్యారెంటీ కూడా ఉండకపోవచ్చు. ఆల్ ది బెస్ట్!డా. ఇండ్ల విశాల్ రెడ్డి, సీనియర్ సైకియాట్రిస్ట్, విజయవాడ. మీ సమస్యలు, సందేహాలు పంపవలసిన మెయిల్ ఐడీ: sakshifamily3@gmail.com -
ఇంట్లో ఆమె.. డ్యూటీలో ఆయన బాస్
గజ్వేల్: స్పౌజ్ ఆప్షన్ వల్ల ఒకే చోట ఉద్యోగాలు చేసే అరుదైన అవకాశాన్ని పలువురు దంపతులు దక్కించుకున్నారు. ఒకే కార్యాలయంలో భర్త బాస్గా ఉంటే, భార్య కిందిస్థాయి ఉద్యోగిగా విధులు నిర్వహిస్తున్నారు. ఇలాంటి కోవలోనే ములుగు ఏడీఏ (అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్(Assistant Director of Agriculture)(గా అనిల్ పనిచేస్తుండగా, భార్య ప్రగతి(Pragathi) ఆయన కిందిస్థాయి ఉద్యోగిగా ఏఓ(అగ్రికల్చర్ ఆఫీసర్)గా పనిచేస్తున్నారు. 2005లో ఏఓగా ఉద్యోగం పొందిన అనిల్(anil) ఆ తర్వాతికాలంలో ఏడీఏగా ప్రమోషన్ పొందారు. 2007లో ప్రగతిని పెళ్లి చేసుకున్నారు. ఆమెకు సైతం 2009లో ఏఓగా ఉద్యోగం వచ్చింది. కొండపాక, సిద్దిపేట, గజ్వేల్ ప్రాంతాల్లో పనిచేసిన అనిల్ 2021లో ములుగుకు ఏడీఏగా వెళ్లారు. సంగారెడ్డి, సిద్దిపేట భూసార కేంద్రాల్లో పనిచేసిన ప్రగతి 2018 నుంచి ములుగులో ఏఓగా కొనసాగుతున్నారు. ఇదే సమయంలో స్పౌజ్ ఆప్షన్లో తన భర్త ఏడీఏ రావడంతో ఆమెకు కలిసి వచి్చంది. ఇంట్లో ఆమె బాస్ అయితే ఉద్యోగంలో మాత్రం భర్త బాస్గా వ్యవహరిస్తున్నారు.ఆయన హెచ్ఎం.. ఆమె టీచర్ గజ్వేల్ మండలం కొడకండ్లకు చెందిన శ్రీశైలం, సరిత దంపతులు. 2008లోనే టీచర్లుగా ఉద్యోగం సాధించారు. ఇరువురు వివిధ ప్రాంతాల్లో పనిచేసి ప్రస్తుతం జగదేవ్పూర్ మండలం తిమ్మాపూర్ ప్రాథమిక పాఠశాలలో ప్రస్తుతం ఒకే చోట పనిచేస్తున్నారు. ఈ పాఠశాలలో శ్రీశైలం హెచ్ఎంగా వ్యవహరిస్తుండగా, సరిత తన భర్త కిందిస్థాయి ఉద్యోగిగా టీచర్ విధులను నిర్వహిస్తున్నారు. -
పెళ్లై పాతికేళ్లు : ఆంటీ కోసం అంకుల్ డ్యాన్స్! వైరల్ వీడియో
భార్యాభర్తల మధ్య ప్రేమానురాగాలు (Husband And Wife Relationship) కాలం గడిచే కొద్దీ మరింత బలపడతాయి. పిల్లలు, బాధ్యతలు, కష్టాలు కన్నీళ్లు ఎన్ని ఉన్నా వారి మధ్య సాన్నిహిత్యం పెరుగుతుంది. సంసార సాగరాన్ని ఈదుతున్న క్రమంలో వారి సఖ్యత మరింత దృఢపడుతుంది. పది కాలాల పాటు పదిలంగా ఉంటుంది. కాపురం చేసే కళ కాలు తొక్కేనాడే తెలుస్తుందనేది సామెత. అలా ఒకరి పట్ల ఒకరు విశ్వాసంతో, ఒకరి ఇష్టా ఇష్టాలను గౌరవించుకుంటూ పోతే ఎలాంటి విభేదాలకు, పొరపచ్చాలకు తావుండదు. ఇద్దరిమధ్య ఆరోగ్యకరమైన బంధం ఏర్పడుతుది. అది భవిష్యత్తరాలకు పునాది అవుతుంది. ఇదంతా ఎందుకంటే 25వ వార్షికోత్సవం (25th Wedding Anniversary) సందర్భంగా భార్య కోసం ఒక భర్త చేసిన రొమాంటిక్ డ్యాన్స్ ఇంటర్నెట్లో హృదయాలను గెలుచుకుంటోంది. సతీపతుల బంధం కాలానికి లొంగేదికాదు, ఏ వయసులోనైనా అది మనోహరమైనదే,స్వచ్ఛమైనదే తేల్చి చెప్పిన ఈ వీడియో నెట్టింట విశేషంగా నిలుస్తోంది.మూడు ముళ్లు, ఏడు అడుగులతో మొదలైన ఆలుమగల అనుబంధం నూరేళ్లు చల్లగా ఉండాలని దీవిస్తారు పెద్దలు. అలా పాతికేళ్ల పాటు దంపతులుగా జీవించిన ఒక జంట తమ 25వ పెళ్లి రోజు వేడుకలను నిర్వహించుకుంటోంది. చుట్టూ కుటుంబ సభ్యులు, హితులు,సన్నిహితులు, అతిథులు అంతా ఉత్సాహంగా ఉన్నారు. దంపతులు అందంగా ముస్తాబయ్యారు. అందరి సమక్షంలో మరోసారి దండలు మార్చుకున్నారు. దీంతో ఆనందంగా శుభాకాంక్షలు అందిస్తున్నారు. ఇంతలో భర్త ఉత్సాహంగా డ్యాన్స్ వేయడం మొదలు పెట్టాడు. దీంతో పక్కనే భార్య సిగ్గుల మొగ్గైంది. అటు అతిథులు కూడా గొంతు కలిపారు. అక్కడే ఉన్న యువత చప్పట్లతో వారిని ఉత్సాహ పరిచారు. మరికొందరు ఈ ఆయన డ్యాన్స్ను తమ కెమెరాలలో బంధించారు. View this post on Instagram A post shared by Sakshi Bisht | Cabin Attendant (@sakshi__bisht1) బాలీవుడ్ మూవీ కభీ ఖుషీ కభీ గమ్ సినిమాలో షారుఖ్ ఖాన్ క్లాసిక్ సాంగ్ ‘ యే లడ్కా హై’ పాటు చక్కటి అభినయం చేస్తూ భార్యపై తన ప్రేమను బహిరంగంగా వ్యక్త పరిచడం నెటిజనులను బాగా ఆకట్టుకుంది. దీంతో ఈ రొమాంటిక్ డ్యాన్స్కు సోషల్ మీడియాలో వైరల్గామారింది. సాక్షి బిస్త్ అనే యూజర్ ఐడీలో గత ఏడాది అక్టోబరులో పోస్ట్ అయిన ఈ వీడియో దాదాపు 11.1 లక్షల వ్యూస్ సంపాదించింది. భార్యభర్తల ప్రేమ అనురాగం పటిష్టంగా ఉండాలంటే ఒకరిపై మరొకరికి నమ్మకం ఉండాలి. భాగస్వాముల మధ్య విశ్వసనీయత ముఖ్యం అంటూ పలువురు ఈ జంటకు అభినందనలు తెలిపారు. -
కుమార్తె భవిష్యత్తు కోసం తండ్రి కిడ్నీఅమ్మేస్తే.. కానీ భార్య మాత్రం..
‘ఇదిగో ఏవండి. మిమ్మల్ని. నా మాట వినండి. మనకున్నది ఒక్కతే కూతురు. కూతూర్ని బాగా చదవించాలి. దాని పెళ్లి చేయాలి. ఇవన్ని చేయాలంటే డబ్బులు బాగా అవసరం. అందుకే మీరో ఈ త్యాగం చేయండి. మీ కిడ్నీని రూ.10 లక్షలకు అమ్మేయ్యండి. డబ్బులు వస్తాయి. వచ్చిన డబ్బును బ్యాంక్లో వేద్దాం. ఆ డబ్బే భవిష్యత్తులో కూతురు చదువు, పెళ్లికి ఉపయోగపడతాయి’ అంటూ ఓ మహిళ భర్త కిడ్నీని అమ్మేందుకు ఒప్పించింది. చివరికి ఏం చేసిందంటే? పశ్చిమ బెంగాల్కు చెందిన ఓ మహిళ తన భర్త కిడ్నీని విక్రయించమని బలవంతం చేసింది. భార్య పోరు తట్టుకోలేక భర్త తన కిడ్నీని అమ్మాడు. ఆ డబ్బుతో తన ప్రేమికుడితో కలిసి భార్య పారిపోయింది. నివ్వెరపోయే ఉదంతం హౌరా జిల్లాలోని సంక్రైల్లో జరిగింది. సంక్రైల్కు చెందిన ఓ మహిళ తన కుమార్తె చదువు, పెళ్లి కోసం డబ్బును పొదుపు చేస్తాననే నెపంతో అతని కిడ్నీని రూ. 10 లక్షలకు అమ్మాలని తన భర్తపై ఒత్తిడి తెచ్చింది.భార్య తెస్తున్న ఒత్తిడికి తట్టుకోలేక భర్త కిడ్నీని విక్రయించేందుకు అంగీకరించాడు. అదే సమయంలో తన అవయవ దానం చేయగా వచ్చిన డబ్బు భవిష్యత్తులో కుమార్తె చదువు, వివాహం చేయడం సులభం అవుతుందని ఆశించాడు. భార్య దురుద్దేశాన్ని పట్టించుకోలేదు. దీంతో నిందితురాలు, తన ప్రియుడితో కలిసి భర్త కిడ్నీని అమ్మేందుకు సిద్ధమైంది. భర్త కిడ్నీని అమ్మేందుకు సుమారు ఏడాది పాటు ప్రయత్నించింది. ఈ క్రమంలో మూడు నెలల క్రితం కిడ్నీ అవసమరయ్యే వ్యక్తి దొరికాడు. కిడ్నీని అమ్మగా రూ.10లక్షలు వచ్చాయి. ఫేస్బుక్ ప్రేమికుడితోబాధిత భర్త పేదరికం నుంచి కుటుంబాన్ని గట్టెక్కించేందుకు ప్రాణ త్యాగానికి సిద్ధమైతే, భార్య ఫేస్బుక్లో యాక్టీవ్ ఉండే బరాక్పూర్కు చెందిన పెయింటర్ ప్రేమలో మునిగి తేలింది. భర్త కిడ్నీ అమ్మగా వచ్చిన రూ.10లక్షలు తీసుకుని ప్రియుడితో పరారైంది. ఓ వైపు అనారోగ్య సమస్యలు, కుమార్తె భవిష్యత్తు.. మరోవైపు రోజులు గడుస్తున్నా అడ్రస్ లేని భార్య జాడ. దీంతో ఏం చేయాలో పాలుపోక భర్త పోలిసుల్ని ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పోలీసుల దర్యాప్తులో భార్య ఆచూకీ లభ్యమైంది. ప్రియుడితో కలిసి సహజీవనం చేస్తున్నట్లు తేలింది.అనంతరం, భర్త తన పదేళ్ల కుమార్తె తన కుటుంబ సభ్యుల్ని వెంటబెట్టుకుని భార్య నివాసం ఉండే ఇంటికి వెళ్లారు. పదేళ్ల కూతుర్ని చూసైనా ఆ తల్లి గుండె కరుగుతుందేమోనని నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నం విఫలమైంది. ప్రియుడి మోజులో పడ్డ బాధితురాలు భర్తను బెదిరించింది. నువ్వు ఏం చేసుకుంటావో చేసుకో. నీకు విడాకులు ఇస్తా. నేను ఈ గడప దాటి బయటకు రాను అంటూ ప్రియుడి ఇంట్లోనే ఉండిపోయింది. భార్య చేసిన నిర్వాకంతో మనోవేధనకు గురయ్యాడు. కుమార్తెకు బంగారు భవిష్యత్తు ఇవ్వాలనే ధృడ సంకల్పంతూ వడివడిగా అడుగులేసుకుండూ ఇంటికి పయనమయ్యాడు బాధిత భర్త. -
US air crash: భారతీయ యువతి లాస్ట్ మెసేజ్ భర్త కన్నీరుమున్నీరు
అమెరికన్ ఎయిర్లైన్స్ ప్రాంతీయ జెట్, యుఎస్ ఆర్మీ బ్లాక్ హాక్ హెలికాప్టర్ ఢీకొన్న ప్రమాదంలో మరణించిన వారిలో భారతీయు యువతి ఉండటం విషాదాన్ని నింపింది. 2001 తర్వాత అమెరికాలో జరిగిన అత్యంత ఘోరమైన విమాన ప్రమాదంలో భావిస్తున్న ఈ ఉదంతంలో 67 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.అమెరికా రోనాల్డ్ రీగన్ నేషనల్ ఎయిర్పోర్ట్ ( Ronald Reagan Airport)వద్ద జరిగిన ఘోర విమాన26 ఏళ్ల అష్రాహుస్సేన్ రజా (Ashra Hussain Raja) కూడా చనిపోయారు. దీంతో బాధితుడి కుటుంబం విషాదంలో మునిగిపోయింది. ఆమె భర్త, హమాద్ స్నేహితుల మధ్య శోకసంద్రంలో మునిగిపోయారు. మరికొద్ది క్షణాల్లో ల్యాండ్ విమానం అవుతుందనగా ఈ ఘోరం జరిగింది.భారతీయ వలసదారుల కుమార్తె అయిన హుస్సేన్ రజా 2020లో ఇండియానా విశ్వవిద్యాలయం నుండి పట్టభద్రురాలైంది .ఆగస్టు 2023లో స్నేహితుడు హమాద్ను ప్రేమ వివాహం చేసుకుంది. వాషింగ్టన్ డీసీలో కన్సల్టెంట్గా (consultant in Washington, DC)ఉద్యోగం చేస్తున్నారని ఆమె మరణం తమకు తీరని లోటని ఆమె మామ డాక్టర్ హాషిమ్ రాజా(Dr.Hashim Raja) విషాద వదనంతో చెప్పారు. విద్యాపరంగా చాలా తెలివైనది. అద్భతుంగా వంట చేస్తుంది. నా కొడుకుకు ప్రాణ స్నేహితురాలు" అని అస్రా హుస్సేన్ మామ హషీమ్ రజా అన్నారు. వైద్యుడిగా చాలామందికి వైద్యం చేశాను, సలహాలిచ్చాను చాలా మరణాలను చూశాను. కానీ ఇలా జరుగుతుందని అనుకోలేదంటూ భావోద్వేగానికి లోనయ్యారు.ఆమె అక్కడ ఒక ఆసుపత్రి కోసం టర్నరౌండ్ ప్రాజెక్ట్లో పని చేయడానికి నెలకు రెండుసార్లు విచితకు ప్రయాణించిందని చెప్పారు. తన కెరీర్లో రాణిస్తూ ఎంతోమందికి ఆదర్శంగా నిలిచిందని గుర్తు చేసుకున్నారు. నైట్ షిప్ట్లలో మేల్కొని ఉండేందుకు తరచుగా తనకి ఫోన్ చేసేదని, అందరి కోసం ఆలోచించేదని .ఎవరికి ఏ కష్టం వచ్చినా వెంటనే స్పందించేది” అని ఆయన తెలిపారు. మరోవైపు భార్య అష్రా తనకు పంపిన మెసేజ్ను తలుచుకుంటూ భర్త హమాద్ రాజా కన్నీరు మున్నీరవుతున్నారు. “మేం 20 నిమిషాల్లో ల్యాండ్ అవుతున్నాం” అని ఆమె మెసేజ్ చేసిందని, ఆమె కోసం ఎయిర్పోర్ట్లో ఎదురు చూస్తుండగానే అంతా జరిగిపోయిందని ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. “ఇదంతా ఒక పీడకలలా ఉంది” అంటూ హమాద్ గుండెలవిసేలా రోదిస్తున్నారు. నిజానికి ఒక రోజు ఆమె రావాల్సి ఉంది.. కానీ ముందుగానే ప్లాన్ చేసుకుంది. ఇందుకేనేమో అంటూ కంటతడిపెట్టుకన్నారు. ఇలాంటి ప్రమాదాల గురించి వినడమేగానీ,తమ జీవితాల్లో ఇంత విషాదం ఉంటుందని కలలో కూడా ఊహించలేదంటూ విలపించారు. -
పెళ్లి తర్వాత నా భర్తనే మారిపోయాడు: వరలక్ష్మి శరత్ కుమార్
దాదాపు 12 ఏళ్ల తర్వాత ప్రేక్షకుల ముందుకొచ్చిన చిత్రం మదగజరాజా. ఈ చిత్రంలో విశాల్, వరలక్ష్మి శరత్కుమార్ కీలక పాత్రల్లో నటించారు. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా కోలీవుడ్ ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్ను సొంతం చేసుకుంది. దీంతో ఈ మూవీని టాలీవుడ్ ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. తాజాగా ఈ చిత్రం జనవరి 31 తెలుగులో విడుదలైంది. ఈ నేపథ్యంలో వరలక్ష్మి శరత్కుమార్ ఓ ఇంటర్వ్యూకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. అదేంటో తెలుసుకుందాం.గతేడాది వివాహాబంధంలోకి అడుగుపెట్టిన వరలక్ష్మి తన భర్త గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంది. పెళ్లి తర్వాత తన కోసం పూర్తిగా మారిపోయాడని తెలిపింది. నా కోసం ముంబయి నుంచి హైదరాబాద్కు షిఫ్ట్ అవుతున్నారని పేర్కొంది. ప్రతి విషయంలో నాకు ఫుల్ సపోర్ట్గా ఉంటారని వెల్లడించింది. నా కోసం ఆయన తన లైఫ్ స్టైల్ పూర్తిగా మార్చుకున్నారని వివరించింది.ఇంటర్వ్యూలో వరలక్ష్మి మాట్లాడుతూ..'నికోలయ్తో పెళ్లి తర్వాత నా జీవితం ఏమీ మారలేదు. నాకోసం అతని జీవితాన్నే పూర్తిగా మార్చుకున్నాడు. నా కోసం ఆయనే హైదరాబాద్ షిఫ్ట్ అవుతున్నారు. అంతేకాదు తన పేరును నికోలయ్ సచ్దేవ్ వరలక్ష్మీ శరత్కుమార్గా మార్చుకున్నారు. నా కెరీర్ పరంగా ఫుల్ సపోర్ట్గా ఉన్నారు. నాకు అసలు పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశం కూడా ఉండేది కాదు. వివాహం అనేది నాకు సెట్ కాదనుకునేదాన్ని. కానీ నికోలయ్తో పరిచయం తర్వాత నా జీవితానికి అతనే సరైన భాగస్వామి అని అర్థమైంది. అలా పెద్దల అంగీకారంతో వివాహాబంధంలోకి అడుగుపెట్టాం' అని చెప్పింది. సినిమాల విషయానికొస్తే కోలీవుడ్తో పాటు టాలీవుడ్లో సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది. వీరసింహారెడ్డి, కోట బొమ్మాళి, హనుమాన్ చిత్రాలతో తెలుగులో గుర్తింపు తెచ్చుకుంది. గతేడాది కన్నడలో కిచ్చా సుదీప్ హీరోగా నటించిన మూవీలోనూ కీలకపాత్ర పోషించింది.పెళ్లి తర్వాత నా కోసం మా ఆయన చాలా మార్చుకున్నాడు - Actress #VaralaxmiSarathkumar#NicholaiSachdev #MadhaGajaRaja #TeluguFilmNagar pic.twitter.com/doquPrV0ft— Telugu FilmNagar (@telugufilmnagar) January 31, 2025 -
వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని..
హత్నూర(సంగారెడ్డి): వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ప్రియుడితో కలిసి భర్తనే హత్య చేసింది భార్య. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం రెడ్డి ఖానాపూర్లో చోటు చేసుకుంది. సోమవారం ఎస్ఐ సుభాష్ తెలిపిన వివరాల ప్రకారం.. కామారెడ్డి జిల్లా బిక్నూర్ మండలం మల్లుపల్లి గ్రామానికి చెందిన మల్లె నారాయణ(42) మూడేళ్ల కిందట ఉపాధి నిమిత్తం హత్నూర మండలం రెడ్డి ఖానాపూర్ గ్రామానికొచ్చి అద్దె ఇంట్లో ఉంటున్నాడు. గ్రామంలోనే ఎఫ్పీఓ (ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్) కార్యాలయంలో సీఈవోగా పని చేస్తున్నాడు. భార్య లక్ష్మీ సొంత మల్లుపల్లి గ్రామంలోనే ఉండేది. నాలుగు రోజుల కిందట భర్త వద్దకు రెడ్డి ఖానాపూర్ గ్రామానికి వచ్చింది . లక్ష్మీకి బిక్నూర్ మండలం రామేశ్వరపల్లి గ్రామానికి చెందిన బీజేపీ ఎస్సీ మోర్చా మండల అధ్యక్షుడు కడారి రాకేశ్తో వివాహేత సంబంధం కొనసాగిస్తుంది. ఈ విషయం తెలిసి భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని ఎలాగైన భర్తను అడ్డు తొలగించుకోవాలని పథకం వేసింది. పథకం ప్రకారం శుక్రవారం రాత్రి ప్రియుడు రాకేశ్, బిక్నూర్ గ్రామానికి చెందిన సాగర్ రమేశ్, డప్పు శ్రీకాంత్, కడారి శ్రీకాంత్తో కలిసి భర్త నారాయణను రెడ్డి ఖానాపూర్ గ్రామ శివారులోని సొసైటీ కార్యాలయం వద్ద హత్య చేసి మృతదేహాన్ని పల్పనూరు గ్రామ శివారులో పడి వేశారు. మరుసటి రోజు (శనివారం) ఏమీ తెలియనట్లు భర్త కనిపించడం లేదని హత్నూర పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సోమవారం గ్రామ ఉదయం శివారులో మృతదేహం ఉందనే సమాచారం మేరకు ఘటన స్థలాన్ని పటాన్ చెరువు డీఎస్పీ రవీందర్ రెడ్డి, సీఐ నదిముద్దీన్ పరిశీలించారు. అనుమానితురాలుగా ఉన్న భార్యను అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో విచారించగా నేరం ఒప్పుకుంది. లక్ష్మీ, రాకేశ్తోపాటు వీరికి సహకరించిన మరో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్లు ఎస్ఐ సుభాష్ తెలిపారు. లక్ష్మీ సైతం బీజేపీ బీసీ మహిళా మండలాధ్యక్షురాలు పని చేస్తున్నట్లు పేర్కొన్నారు.హత్య కేసులో నిందితుల రిమాండ్హత్నూర(సంగారెడ్డి): భర్తను హత్య చేయించిన భార్యతోపాటు ఇందుకు సహకరించిన నలుగురిని మంగళవారం రిమాండ్కు తరలించినట్లు జిన్నారం సీఐ ఎండీ నయీముద్దీన్ తెలిపారు. హత్నూర పోలీస్ స్టేషన్లో ఎస్ఐ సుభాష్తో కలిసి వివరాలు వెల్లడించారు. కామారెడ్డి జిల్లా బిక్నూరు మండలం మల్లుపల్లి గ్రామానికి చెందిన మల్లె నారాయణ (42) వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని భార్య లక్ష్మీనర్సవ్వ, ప్రియుడు కడారి రాకేష్, చెట్లపల్లి సాగర్, కడారి శ్రీకాంత్, డప్పు శ్రీకాంత్ కలిసి హత్య చేయించిన విషయం తెలిసిందే. పథకం ప్రకారం తన ప్రియుడైన రాకేశ్కు రూ.40 వేలు సుపారీ ఇచ్చింది. లక్ష్మీ నర్సవ్వ ఖానాపూర్లో ఉండే భర్త దగ్గరకు మూడు రోజుల కిందట వచ్చింది. అతడు ఆఫీసులో ఉండగానే తాగడానికి కల్లు తెమ్మని చెప్పింది. అతడు వచ్చే లోపు పథకం ప్రకారం నలుగురు నిందితులు వచ్చి ఆఫీసులోని ఓ గదిలో దాక్కున్నారు. నారాయణ కల్లు తీసుకొని రాగానే వారి వెంట తెచ్చుకున్న కత్తి, కట్టే ఇనుప రాడుతో ఒక్కసారిగా దాడి చేసి నరికి చంపేశారు. ఈ హత్యపై ఎస్సై సుభాష్ తనదైన శైలిలో విచారణ చేయగా భార్య లక్ష్మీతోపాటు మరో నలుగురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు తెలిపారు. హత్యకు ఉపయోగించిన కారు, కత్తి కట్టే ఇనుప రాడును స్వాధీనం చేసుకున్నట్లు సీఐ వెల్లడించారు. -
‘నాన్నా క్షమించు.. పింకీ టార్చర్ తట్టుకోలేకపోతున్నా’
బెంగళూరు: దేశంలో భార్యా బాధిత మరణాలు పెరుగుతున్నాయి. సాఫ్ట్వేర్ ఇంజినీర్ అతుల్ సుభాష్ ఆత్మహత్య ఘటన మరువకముందే కర్ణాటక మరో వ్యక్తి ఇలానే ఆత్మహత్య చేసుకున్నాడు. తన భార్య వేధింపులు భరించలేకనే తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్టు నోట్ రాసిపెట్టి చనిపోయాడు.వివరాల ప్రకారం.. కర్ణాటకలోని హుబ్బళ్లికి చెందిన పీటర్ గొల్లపల్లి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంట్లో ఉరి వేసుకుని చనిపోయాడు. ఈ సందర్భంగా తన మరణానికి భార్య పింకీనే కారణం అంటూ నోట్ రాసి పెట్టి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ క్రమంలో తన పేరెంట్స్ను క్షమించమని కోరాడు. సూసైడ్ నోట్లో.. నాన్న, నన్ను క్షమించండి. పింకీ వేధింపులు భరించలేక నేను చనిపోతున్నాను. తను నా మరణాన్ని కోరుకుంటోంది. అన్నయ్య జోయల్.. మన పేరెంట్స్ను బాగా చూసుకో’ అంటూ రాసిపెట్టి ఆత్మహత్య చేసుకున్నాడు.అనంతరం, పీటర్ చనిపోయిన విషయం తెలుసుకుని తల్లిదండ్రులు కన్నీటిపర్యంతమవుతున్నారు. ఈ సందర్బంగా పీటర్ సోదరుడు జోయల్ మాట్లాడుతూ..పీటర్, పింకీ రెండేళ్ల క్రితమే వివాహం జరిగింది. గత కొద్ది నెలలుగా వారి మధ్య మనస్పర్థలు వచ్చాయి. దీంతో, మూడు నెలలుగా వారిద్దరూ దూరంగా ఉంటున్నారు. పీటర్ నుంచి పింకీ విడాకులు తీసుకోవాలని చూస్తోంది. ఈ క్రమంలోనే పీటర్ వద్ద పరిహారంగా రూ.20 లక్షలు డిమాండ్ చేసింది. దీంతో, పీటర్ తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నాడు. పింకీ వల్లే ఇటీవల పీటర్ తన ఉద్యోగం కూడా పోగొట్టుకున్నాడు. ఆమె వల్ల చాలా ఒత్తిడిలో ఉన్నట్టు తెలిపాడు.పీటర్ ఆత్మహత్యపై సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. పీటర్ సూసైడ్ను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం, పీటర్ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఆత్మహత్యకు ప్రేరేపించడంపై వ్యవహరించే భారతీయ న్యాయ సంహిత (BNS), 2023లోని సెక్షన్ 108 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు. -
Keerthy Suresh: భర్తతో కీర్తి స్టెప్పులు.. ఈ ఫోటోలు చూశారా?
-
Meerpet Case: గురుమూర్తి ఫోన్లో ఏముంది?.. వెలుగులోకి విస్తుపోయే విషయాలు
సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మీర్పేట(Meerpet Case) వెంకటమాధవి హత్య కేసులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. భర్తను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు. గురుమూర్తి(Gurumurthy) కాల్ డేటా Call Data) మొత్తాన్ని చెక్ చేసిన పోలీసులు.. అతనికి ఎవరితోనైనా వివాహేతర సంబంధాలు ఉన్నాయన్న కోణంలో ఆరా తీస్తున్నారు. ఆధారాలు దొరకకుండా భార్యను హత్య చేయడం వెనుక మరో మహిళతో అక్రమ సంబంధం కారణంగానే భార్యను హత్య చేసి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. మాధవి మృతదేహం బూడిద ఆధారాల కోసం పోలీసులు లోతైన విచారణ చేపట్టారు.ఇంకా ఎలాంటి ఆధారాలు దొరకలేదు: డీసీపీఎల్బీ నగర్ డీసీపీ ప్రవీణ్ కుమార్ ‘సాక్షి’ మీడియాతో మాట్లాడుతూ, ఈ కేసులో విచారణ కొనసాగుతుందని.. ఇప్పటివరకు మిస్సింగ్ కేసు గానే మేము విచారణ చేస్తున్నామన్నారు. ఈ కేసులో ఎలాంటి ఆధారాలు లభించలేదన్నారు. సీసీ కెమెరాలు రికార్డయిన దృశ్యాలు ఆధారంగా దర్యాప్తు చేస్తున్నామన్నారు. వెంకట మాధవి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు తమ కూతురిని గురుమూర్తే హత్య చేశాడని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆ కోణంలో కూడా దర్యాప్తు కొనసాగుతుందన్నారు.బాడీని ముక్కలు ముక్కలు చేసి చెరువులో పడేసినట్లు ఇంకా ఆధారాలు దొరకలేదు. సీసీ కెమెరా ఫుటేజ్లో మాత్రం వెంకట మాధవి ఇంట్లోకి వెళ్లిన దృశ్యాలు మాత్రమే ఉన్నాయి. ఇంటి నుంచి బయటకు వచ్చినట్టు దృశ్యాలు లేవు. వెంకట మాధవిని భర్త గురుమూర్తి హత్య చేసినట్లు వాళ్ల కుటుంబ సభ్యులు అనుమానిస్తున్నారు. సైంటిఫిక్ ఎవిడెన్స్ ఆధారంగా కేసు దర్యాప్తు చేస్తున్నామని డీసీపీ వెల్లడించారు.ప్రకాశం జిల్లా జేపీ చెరువుకు చెందిన విశ్రాంత ఆర్మీ జవాన్ గురుమూర్తి (39), వెంకట మాధవి (35) భార్యాభర్తలు. వారికి 13 ఏళ్ల క్రితం వివాహమైంది. ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు. ఐదేళ్ల క్రితం జిల్లెలగూడ న్యూ వేంకటేశ్వర కాలనీలోకి వచ్చి, అద్దె ఇంట్లో ఉంటున్నారు. గురుమూర్తి కంచన్బాగ్లోని డీఆర్డీఓలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. గురుమూర్తి విపరీత ప్రవర్తన, అనుమానిస్తూ వేధిస్తుండటంతో భార్య మాధవి ఇబ్బందిపడుతూ ఉండేది. ఇరువురి మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి.ఈ నెల 16న గురుమూర్తి, మాధవి మధ్య మరోసారి వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో గురుమూర్తి ఆమెను పాశవికంగా హత్యచేశాడు. కానీ ఎవరికీ చెప్పకుండా ఇంట్లోంచి వెళ్లిపోయిందని అందరికీ చెప్పాడు. మాధవి తల్లి ఉప్పాల సుబ్బమ్మ తన కూతురు కనిపించకుండా పోయిందని ఈ నెల 18న మీర్పేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.ఇదీ చదవండి: హైదరాబాద్: కిడ్నీ ఆపరేషన్ కేసులో కీలక మలుపుఇంట్లో గొడవ జరిగిన సమయంలోనే మాధవిని గురుమూర్తి హత్య చేశాడు. కానీ ఏమీ ఎరగనట్టుగా అత్తమామలతో పాటు వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కానీ భార్యభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నట్టు తెలుసుకున్న పోలీసులు గురుమూర్తిపై నిఘా పెట్టారు. అతడి ప్రవర్తన, కదలికలపై అనుమానం రావడంతో అదుపులోకి తీసుకొని విచారించగా.. అసలు నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసుకు సంబంధించి లోతుగా దర్యాప్తు చేస్తున్నామని మీర్పేట్ సీఐ నాగరాజు తెలిపారు.భార్యను హత్య చేసిన గురుమూర్తి పోలీసులకు ఎలాంటి ఆధారాలు, ఆనవాళ్లు చిక్కకుండా పక్కా ప్లాన్ చేశాడు. శరీరంలోని ఎముకలను పొడిగా ఎలా మార్చాలని యూట్యూబ్, ఇతర సామాజిక మాధ్యమాల్లో శోధించాడు. క్రైమ్, హర్రర్ సినిమాలు చూశాడు. ముందుగా వీధి కుక్క మీద ప్రయోగం చేశాడు. కుక్కను ఇంట్లోకి తీసుకొచ్చి చంపేశాడు. ముక్కలుగా నరికి, ఎముకలతో సహా కుక్కర్లో ఉడకబెట్టాడు. తర్వాత అదే తరహాలో భార్య శరీరాన్ని కూడా ముక్కలు చేసి, ఉడకబెట్టాడు. ఎండబెట్టి, కాల్చి పొడి చేశాడు.మాధవి మిస్సింగ్ కేసు నేపథ్యంలో.. జిల్లెలగూడ న్యూవేంకటేశ్వర కాలనీలో గురుమూర్తి, మాధవి నివాసమున్న ఇల్లు, పరిసర ప్రాంతాలను పోలీసులు మూడు రోజులుగా క్షుణ్నంగా పరిశీలించినట్టు తెలిసింది. ఆమె హత్యకు గురై ఉంటే ఏమైనా ఆధారాలు లభిస్తాయేమోనని డ్రైనేజీ మ్యాన్హోల్స్, నాలాలను కూడా తెరిచి పరిశీలించినట్టు స్థానికులు తెలిపారు. కానీ నిందితుడిని విచారించిన సమయంలో అసలు సంగతి బయటపడింది. -
భార్యను కుక్కర్ లో పెట్టి..!
-
భార్యపై అనుమానంతో ముక్కలుగా నరికిన భర్త
-
మీర్పేట్లో కిరాతం.. భార్యను ముక్కలుగా నరికి కుక్కర్లో ఉడకబెట్టి..
సాక్షి, హైదరాబాద్: మీర్పేటలో దారుణం జరిగింది. డీఆర్డీవో కాంట్రాక్ట్ ఉద్యోగి గురుమూర్తి.. అనుమానంతో భార్యను కిరాతకంగా చంపేశారు. భార్య వెంకట మాధవిని చంపి ముక్కలుగా నరికి కుక్కర్లో ఉడకబెట్టిన భర్త.. ఉండకబెట్టిన మాంసాన్ని చెరువులో పడేశారు.ఈ నెల 13వ తేదీ నుంచి వెంకట మాధవి కనిపించకుండా పోయింది. ఈ నెల 18న తన భార్య వెంకటమాధవి కనిపించడం లేదంటూ ఆమె తల్లిదండ్రులతో కలిసి భర్త గురుమూర్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కమర్షియల్ సిలిండర్ తీసుకొచ్చి ముక్కలను ఉడకబెట్టిన భర్త.. ముక్కలను ఎండబెట్టి రోకలితో పొడిగా మార్చాడు. తర్వాత మృతదేహం పొడిని చెరువులో కలిపాడు. మూడు రోజుల పాటు ఇంట్లో మృతదేహాన్ని కాల్చివేసి పొడిగా మార్చేశాడు. బాడీ మొత్తాన్ని పొడిగా మార్చడంతో ఆనవాళ్లు దొరకలేదు.గురుమూర్తి గతంలో ఆర్మీలో పనిచేసి రిటైర్ అయ్యారు. 13 ఏళ్ల క్రితం వెంకటమాధవితో గురుమూర్తికి వివాహం జరిగింది. వారికి ఇద్దరు సంతానం. తూప్రాన్పేట్లోని దండుపల్లిలో నివాసముంటున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. గత కొన్ని రోజులుగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయని గుర్తించారు.దీంతో గురుమూర్తిని అదుపులోకి తీసుకుని విచారించగా, అసలు నిజం వెలుగులోకి వచ్చింది. తానే భార్యను హత్య చేసినట్లు అంగీకరించాడు. మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా చేసి కుక్కర్లో ఉడికించానని, ఆ తర్వాత వాటిని జిల్లెలగూడ చెరువులో పడేసినట్టు తెలిపాడు. దీంతో మృతదేహం ఆనవాళ్ల కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.ఇదీ చదవండి: ఓసారి మా ఇంటికొచ్చి.. టీ తాగి వెళ్లండి! -
'మగాడు కేవలం దానికోసమే'.. హీరోయిన్ టబు కథనాలపై స్పందించిన టీమ్!
హీరోయిన్ టబు తెలుగువారికి కూడా సుపరిచితమే. తెలుగులో వెంకటేష్ సరసన కూలి నెంబర్ వన్ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత నిన్నే పెళ్లాడతా, చెన్నకేశవరెడ్డి ,ఆవిడే మా ఆవిడ లాంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉంది. దాదాపు 50 ఏళ్లు దాటినా కూడా తనదైన గ్లామర్తో సినీ ప్రియులను అలరిస్తోంది. ప్రస్తుతం బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ సరసన భూత్ బంగ్లా చిత్రంలో నటిస్తోంది. అయితే ఇప్పటి వరకు ఈ ముద్దుగుమ్మ పెళ్లి చేసుకోలేదు.తాజాగా ఆమె తన పెళ్లి గురించి మాట్లాడారని కొన్ని వార్తలొచ్చాయి. మగాడు కేవలం బెడ్ మీదకే మాత్రమే పనికొస్తాడని టబు ఓ ఇంటర్వ్యూలో చెప్పారని సోషల్ మీడియాతో పాటు పలువురు వార్త కథనాలు రాసుకొచ్చారు. ఇలా బోల్డ్ కామెంట్స్ చేయడంపై కొందరు ఆమెను విమర్శిస్తుంటే.. మరికొందరు సమర్థించారంటూ ప్రచురించారు. ఈ నేపథ్యంలో టబుపై వస్తున్న వార్తలపై ఆమె టీమ్ ఘాటుగానే స్పందించింది. ఇలాంటి నిరాధారమైన వార్తలు ప్రచురించినందుకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది.ఖండించిన టబు టీమ్..ఇటీవల ఆన్లైన్లో వచ్చిన అసభ్యకర కథనాలను టబు టీమ్ ఖండిస్తూ ఒక ప్రకటన విడుదల చేసింది. కొద్ది రోజులుగా అనేక వార్తా వెబ్సైట్లు, సోషల్ మీడియా హ్యాండిల్లు వివాహంపై టబు తన అభిప్రాయాలను ప్రస్తావిస్తూ మాట్లాడారని ప్రచురించాయి. ఈ కథనాలన్నీ కేవలం కల్పితమని వాటిలో ఎలాంటి నిజం లేదని టబు టీమ్ స్పష్టం చేసింది. ఆమె ఎప్పుడు ఇలా మాట్లాడలేదని.. కేవలం అభిమానులను తప్పుదారి పట్టించేందుకే ఇలా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలా చేయడం నైతికి ఉల్లంఘన కిందకు వస్తుందని ప్రకటనలో పేర్కొంది. ఆమె ప్రతిష్టను దెబ్బతీసేలా కథనాలు ప్రచురించిన వారంతా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది టబు టీమ్.కాగా.. టబు ప్రస్తుతం అక్షయ్ కుమార్తో భూత్ బంగ్లా చిత్రం కోసం షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఇందులో పరేష్ రావల్ కూడా నటిస్తున్నారు. చాలా గ్యాప్ తర్వాత ప్రియదర్శన్ - అక్షయ్ కుమార్ కాంబోలో సినిమాను తెరకెక్కిస్తున్నారు. వీరిద్దరూ గతంలో 'హేరా ఫేరీ', భాగమ్ భాగ్, గరం మసాలా, దే దానా దాన్, భూల్ భూలయ్యా వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలను అందించారు. అంతేకాదు దాదాపు 25 సంవత్సరాల తర్వాత అక్షయ్, టబుల కాంబో రిపీట్ కానుంది. వీరిద్దరూ చివరిసారిగా 'హేరా ఫేరి'లో కలిసి నటించారు.ఈ చిత్రాన్ని శోభా కపూర్, ఏక్తా ఆర్ కపూర్ నిర్మాణ సంస్థ బాలాజీ టెలిఫిలిమ్స్, అ క్షయ్ కుమార్ నిర్మాణ సంస్థ కేప్ ఆఫ్ గుడ్ ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రం ఏప్రిల్ 2, 2026న థియేటర్లలో విడుదల కానుంది. కాగా.. టబు చివరిసారిగా డూన్: ప్రొఫెసీ అనే వెబ్ సిరీస్లో కనిపించింది. ఈ సిరీస్ ద్వారా ఆమె హాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. -
బౌండరీ దాటితే ఔటే!
కవిత, కుమార్లకు మూడేళ్ల కిందట వివాహమైంది. మొదట్లో చిలకాగోరింకల్లా ఉండేవారు. కాలం గడిచేకొద్దీ వారి వైవాహిక బంధంలో ఉక్కపోత మొదలైంది. కవిత వస్త్రధారణ నుంచి ఆమె స్నేహితుల వరకు అంతా తనకు నచ్చినట్లే ఉండాలంటాడు కుమార్. అలా లేకుంటే ఏదో ఒక కారణంతో గొడవ పెట్టుకుంటున్నాడు. ఇది కవితకు నచ్చడంలేదు. క్రమంగా ఇద్దరి మధ్య దూరం పెరిగింది. దాన్ని సరిచేసుకునేందుకు కుమార్ ఎలాంటి ప్రయత్నమూ చేయడం లేదు. ఏం చేయాలో అర్థంకాక కవిత కౌన్సెలింగ్కు వెళ్లింది. కాలంతో పాటు మారని మనుషులు..మన దేశంలో భర్తంటే భరించేవాడు. కుటుంబంలో భర్తదే ప్రధానపాత్ర. అతని మార్గాన్నే భార్య అనుసరించాలి. కాలం మారినా, పురుషులతో సమానంగా మహిళలు ఉద్యోగాలు చేస్తున్నా చాలామంది పురుషులు తమ ఆధిపత్యమే సాగాలనే భావజాలంలోనే ఉంటున్నారు. కుమార్దీ అదే బాట. అందుకే తన భార్య తనకు నచ్చినట్టుగా ఉండాలని కోరుకుంటున్నాడు, అలా కోరుకోవడంలో తప్పు లేదనుకుంటున్నాడు. ఆ క్రమంలో వారిద్దరి మధ్య దూరం పెరిగింది. ఒకరితో ఒకరు మనసు విప్పి మాట్లాడుకోలేకపోతున్నారు. ముఖ్యంగా కవిత తన మనసులోని మాట చెప్పలేకపోతోంది. దాంతో మనసులో అసహనం, కోపం పెరిగిపోతున్నాయి. ఆ నేపథ్యంలోనే కౌన్సెలింగ్కు వెళ్లింది. ఆమె చెప్పినదాన్ని బట్టి వారికి ‘హెల్దీ బౌండరీస్’ గురించి అవగాహన లేదని తెలిసింది. సరిహద్దులు అవసరం..భార్య అయినంత మాత్రాన తన మాట తప్పక వినాలని, భర్త అయినంత మాత్రాన తాను చెప్పినట్లే నడుచుకోవాలని అనుకోవడమే జంటల మధ్య చాలా సమస్యలకు కారణం. ఏ బంధంలోనైనా బౌండరీస్ అవసరం. సరిహద్దులు అనేవి మన శారీరక, మానసిక వెల్ బీయింగ్ను కాపాడుకోవడానికి మన చుట్టూ గీసుకునే అదృశ్య రేఖలు. అవసరాలు, అంచనాలు, ఆమోదయోగ్యమైన ప్రవర్తన ఏమిటో తెలియజేసే చర్యలు. ప్రతి జంటకూ హెల్దీ బౌండరీస్ గురించిన అవగాహన అవసరం. ⇒ ప్రతి వ్యక్తికీ తనకంటూ కొన్ని ఇష్టాయిష్టాలు, అభిప్రాయాలు ఉంటాయి. వాటిని గుర్తించి, గౌరవించినప్పుడే బంధం బలపడుతుంది. అది సంప్రదాయాన్ని తిరస్కరించడం కాదు. బంధం మరింత బలపడటానికి మార్గం. ⇒ ‘నువ్వలా చేస్తున్నావు’, ‘నువ్విలా అంటున్నావు’ అని కాకుండా.. ‘నేనిలా అనుకుంటున్నాను’, ‘నేనిలా ఫీలవుతున్నాను’ అని మాట్లాడటం వల్ల చాలా సమస్యలు పరిష్కారమవుతాయి. ⇒ ఒక వ్యక్తిని గౌరవించడమంటే వారి వ్యక్తిత్వాన్ని గౌరవించడం. భార్యకు లేదా భర్తకు కూడా పర్సనల్ స్పేస్ ఉంటుందని గుర్తించడం. ⇒ సంప్రదాయానికి, స్వేచ్ఛకు మధ్య సమతౌల్యం సాధించాలి. అది ఒకరి పట్ల మరొకరికి అవగాహనను, నమ్మకాన్ని పెంచుతుంది. ⇒సరిహద్దులను సెట్ చేయడం సవాలే. భాగస్వామి ఒప్పుకోకపోవచ్చు. అది మీ బాధ్యత కాదు. మీ అంచనాలకు అనుగుణంగా స్థిరంగా ఉండండి. ⇒హద్దులు దాటితే పరిణామాలు ఎలా ఉంటాయో నిర్ణయించుకోండి. పరస్పర చర్చల ద్వారా హద్దులను సర్దుబాటు చేసుకోండి. వీటిని కవిత, కుమార్లకు మూడు సెషన్లలో వివరించి, వారి మధ్య ఉన్న అపోహలను తొలగించి, ఓపెన్ కమ్యూనికేషన్ డెవలప్ అయ్యేలా కొన్ని ఎక్సర్సైజ్లు చేయించారు. ఇప్పుడిద్దరూ చిలకాగోరింకల్లా ఉంటున్నారు. రకరకాల హద్దులు..శరీరానికి, గోప్యతకు సంబంధించినవి ఫిజికల్ బౌండరీస్. బహిరంగ స్థలాల్లో ముద్దులు పెట్టుకోవడం, కౌగిలించుకోవడం ఇష్టం లేకపోతే ఆ నిర్ణయాన్ని భాగస్వామి గౌరవించాలి. మీ సమయాన్ని ఎలా నిర్వహించుకుంటారనేది మీ టైమ్ బౌండరీస్పై ఆధారపడి ఉంటుంది. గడపాల్సిన సమయానికి పరిమితులు పెట్టడం, మీకోసం సమయం కేటాయించుకోవడం అందులో భాగం. భావాలు, భావోద్వేగాలకు సంబంధించినవి ఎమోషనల్ బౌండరీస్. ఇతరుల భావోద్వేగాలకు మీరు బాధ్యత వహించాల్సిన అవసరం లేదని అర్థం చేసుకోవడం ఇందులో భాగం. ఆస్తులు, ఆర్థిక వ్యవహారాలకు సంబంధించినవి ఫైనాన్షియల్ బౌండరీస్. మీ ఆర్థిక స్వాతంత్య్రాన్ని కాపాడుకోవడం ఇందులో భాగం.శృంగారంలోనూ సరిహద్దులుండాలి. అసౌకర్యంగా అనిపించే వాటికి నో చెప్పాలి. మానసిక శక్తి తగ్గించే చర్చలు నిరాకరించే హక్కును, నెగటివిటీ లేదా గ్యాస్లైటింగ్ నుంచి మీ మనస్సును కాపాడుకోవడమే మానసిక సరిహద్దు.మీ ఆన్లైన్ వ్యవహారాలు ఎలా ఉండాలో నిర్ణయించేది డిజిటల్ బౌండరీసే! -
తాడిపత్రిలో దారుణం.. భార్యను నరికి చంపిన భర్త
సాక్షి, అనంతపురం: తాడిపత్రిలో దారుణం చోటు చేసుకుంది. భార్యను భర్త వెంకటేశ్వరరెడ్డి వేట కొడవలితో నరికి చంపాడు. భార్య పుష్పావతి అక్కడికక్కడే మృతి చెందింది. తాడిపత్రి పట్టణంలోని హేమాద్రి లాడ్జిలో ఘటన జరిగింది. దంపతుల సమస్యలను పరిష్కరించేందుకు ఇరు వర్గాల పెద్దలు లాడ్జిలో సమావేశమయ్యారు. ఒంటరిగా మాట్లాడాలని చెప్పిన భర్త.. భార్యను హత్య చేశాడు. ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.అనుమానాస్పదంగా మహిళ మృతికోనసీమ జిల్లా: రామచంద్రపురం మండలం తోటపేట గ్రామంలో ఈ నెల 12న దామిశెట్టి మహాలక్ష్మి (54) అనుమానాస్పదంగా మృతి చెందింది. సహజ మరణంగా భావించిన బంధువులు సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు నిర్వహించారు. అయితే ఆమె ఒంటిపై బంగారం లేదని, బంగారం కోసమే హత్య చేసి ఉంటారని ద్రాక్షారామ పోలీసులకు బంధువులు ఫిర్యాదు చేశారు. దీంతో పాతిపెట్టిన మహాలక్ష్మి మృతదేహాన్ని బయటకు తీశారు. స్మశానవాటిక వద్దనే వైద్యులు పోస్టుమార్టం నిర్వహించారు. అనుమానాస్పద మృతి కింద కేసుగా నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.ఇదీ చదవండి: జంట హత్యల కేసులో వీడిన మిస్టరీ -
Keerthy Suresh: భర్త ఆంటోనితో కీర్తి మొదటి సంక్రాంతి.. స్పెషల్ గెస్ట్గా విజయ్ (ఫోటోలు)
-
నా భర్త వల్లే ఇది సాధ్యమైంది.. ఈ ఫొటో ఆయన కోసమే! (ఫోటోలు)
-
అకారణంగా వదిలేశాడు...న్యాయం చేయండి
సుభాష్నగర్: కట్నం తీసుకొని పెళ్లి చేసుకున్నాడు..ఆపై బిడ్డను కన్నాడు..సన్నిహితంగా ఉంటూనే విడాకుల నోటీసు ఇచ్చాడు. ఇదేంటని అమ్మాయి తల్లిదండ్రులు, పెద్దమనుషుల సమక్షంలో ప్రశ్నస్తే నిష్కారణంగా నాకు వద్దు అంటున్నాడు. దీంతో ఆ అమ్మాయి తనకు న్యాయం చేయాలని కోరుతూ భర్త ఇంటి ముందు మౌనదీక్షకు దిగింది. సూరారం పరిధిలోని లక్ష్మీనగర్లో చోటుచేసుకున్న ఈ సంఘటనపై పోలీసులు తెల్పిన వివరాలిలా ఉన్నాయి. ఏపీలోని అంబేడ్కర్ కోనసీమ జిల్లాకు చెందిన విశ్వనాథ్, అనంతలక్ష్మి దంపతుల కుమార్తె శ్రీరమ్యకు సూరారం లక్ష్మీ నగర్ ప్రాంతానికి చెందిన మైనం భాస్కరరావు, విజయలక్ష్మిల కుమారుడు శ్రీ తేజతో 2023లో వివాహం జరిగింది. మొదట్లో 3 నెలల పాటు కాపురం సజావుగా సాగింది. ఈ క్రమంలో గర్భందాల్సిన రమ్యను అబార్షన్ చేయించుకోవాలని శ్రీతేజ ఒత్తిడి తెచ్చాడు. దీంతో ఆమె అంగీకరించక పోవడంతో భార్యపైకి కోపం పెంచుకున్నాడు. ప్రసవం కోసం పుట్టింటికి వెళ్ళిన భార్యతో ప్రేమగా ఉంటూనే పథకం ప్రకారం విడాకులకు దరఖాస్తు చేశాడు. ప్రసవం తర్వాత పుట్టిన బాబును చూడడానికి రాలేదు సరికదా..విడాకుల నోటీసు చేతిలో పెట్టాడు. దీంతో రమ్య 9 నెలల కొడుకును, తల్లిదండ్రులను తీసుకుని రెండురోజుల క్రితం భర్త ఇంటికి వచి్చంది. వీరిని శ్రీతేజతోపాటు కుటుంబ సభ్యులు ఇంట్లోకి రానివ్వకుండా..తాళం వేసి వెళ్లిపోయారు. దీంతో రమ్య తన గోడును కాలనీ వాసులకు చెప్పి ఇంటి ముందు మౌన పోరాటానికి దిగింది. శ్రీతేజపై చర్యలు తీసుకొని న్యాయం చేయాలని రమ్య తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
మొదటి భర్త ఉండగానే రెండో పెళ్లి
హొసపేటె: మొదటి భర్త ఉండగానే అతనిని వదిలేసి మరో పెళ్లి చేసుకున్న కేసులో మహిళకు జేఎంఎఫ్సీ కోర్టు జైలు శిక్ష విధించింది. వివరాలు.. దేవిక అనే మహిళకు 2008 మార్చి 21న సత్యనారాయణ అనే వ్యక్తితో పెళ్లయింది, వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. 2014 ఫిబ్రవరి 25న బీదర్ జిల్లా భాల్కి తాలూకా ఆలహళ్లి గ్రామానికి చెందిన అంబరీష్ ను రిజిస్ట్రార్ కార్యాలయంలో రెండో పెళ్లి చేసుకుంది. దీంతో తనను మోసం చేసిందని మొదటి భర్త టీబీ డ్యాం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. క్రైం ఎస్ఐ స్వామి కేసు దర్యాప్తు చేసి నిందితురాలిపై విచారణ జరిపి చార్జిషిటును దాఖలు చేశారు. హొసపేటెలోని జేఎంఎఫ్సీ కోర్టులో విచారణ సాగుతోంది. మంగళవారం తుది విచారణలో నేరం రుజువు కావడంతో జడ్జి అశోక్.. నిందితురాలు దేవికకు రెండేళ్ల సాధారణ జైలు శిక్ష, రూ.5000 జరిమానా విధించారు. పీపీ రేవణ్ణ సిద్దప్ప వాదనలు వినిపించారు. -
ఆ బాధను ఎలా అధిగమించాలి..?
డాక్టరు గారూ! నేనొక ప్రభుత్వ ఉద్యోగినిని. నా పిల్లలిద్దరూ అమెరికాలో ఉద్యోగం చేస్తున్నారు. 3 నెలల క్రితం 55 సంవత్సరాల నా భర్త సడెన్ హార్ట్ ఎటాక్తో మరణించారు. రాత్రి భోజనానికి తనకిష్టమైన కూర వండించుకుని తిన్నారు. ఉదయాన్నే నిద్ర లేచేసరికి పక్కనే విగత జీవిగా కనిపించారు. అప్పటినుంచి నాకు ఇంటికి రావాలంటేనే భయంగా ఉంటోంది. రాత్రుళ్లు నిద్ర పట్టడం లేదు. అలాగే నిద్రలో ఉలిక్కిపడి లేవడం, గట్టిగా ఏడవడం చేస్తున్నాను. ఉన్నట్టుండి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, గుండె దడ, విపరీతమైన భయం వేస్తున్నాయి. నాభర్త చనిపోవడానికి నా నిర్లక్ష్యమే కారణమేమోననే వేదన నన్ను కలచి వేస్తోంది. ఎంత సర్ది చెప్పుకుందామన్నా నావల్ల కావడం లేదు. ఈ బాధను అధిగమించే మార్గం చెప్పగలరా?– శాంతిశ్రీ, విజయనగరంమీరు అనుభవిస్తున్న ఈ వేదన, బాధ పూర్తిగా అర్థం చేసుకోగలను. మీ స్థానంలో ఉన్న వారికి ఇలాంటి లక్షణాలు ఉండటం చాలా సహజం. మీకున్న ఈ నిద్రలేమి, గుండెదడ, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ప్యానిక్ ఎటాక్ని సూచిస్తున్నాయి. ఈ మానసిక స్థితి ఇటువంటి ట్రామాటిక్ సంఘటనకు సహజమైన ప్రతిస్పందన. సైలెంట్ హార్ట్ ఎటాక్స్ని ముందుగా అంచనా వేయడం లేదా పూర్తిగా నివారించడం అసాధ్యం అని మీరు గుర్తించాలి. అందువల్ల మీరు వారిపై చూపించిన ప్రేమ, ఆప్యాయతలను పదే పదే గుర్తు తెచ్చుకోవడం ద్వారా మీలో ఉన్న గిల్ట్ ఫీలింగ్ తగ్గుతుంది. దగ్గరిలోని సైకియాట్రిస్ట్ట్ని సంప్రదించి, మైండ్ఫుల్నెస్ థెరపీ, కాగ్నిటివ్ థెరపీ తీసుకోవడం వలన మీ బాధ తగ్గడమే కాక మీ ఆలోచనలు మార్చడానికి, కోపింగ్ స్ట్రేటజీస్ పెంచడానికి సహాయపడుతుంది. అలాగే డీప్ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్, ధ్యానం, ప్రోగ్రెసివ్ మజిల్ రిలాక్సేషన్ వంటివి తప్పక సహాయపడతాయి. నిద్ర వచ్చినా రాకపోయినా నిద్ర షెడ్యూల్ పాటించడం చాలా ముఖ్యం. అవసరాన్ని బట్టి కొన్ని రకాల మందులు కూడా మీరు త్వరగా కోలుకోవడానికి సహకరిస్తాయి.డా. ఇండ్ల విశాల్ రెడ్డి, సీనియర్ సైకియాట్రిస్ట్, విజయవాడ. (మీ సమస్యలు, సందేహాలు పంపవలసిన మెయిల్ ఐడీ: sakshifamily3@gmail.com) -
Keerthy Suresh: భర్తతో జాలీగా వెకేషన్.. కానీ! (ఫోటోలు)
-
దొంగ జంట.. ఇద్దరూ ఇద్దరే
-
కీచక భర్త హత్య .. ఆపై ముక్కలు
దొడ్డబళ్లాపురం: భార్యను పరుల పడకలోకి వెళ్లాలని వేధించడమే కాక.. కన్న కుమార్తెపై అత్యాచారయత్నం చేసిన ఓ కీచక భర్తను భార్యే హత్యచేసి మృతదేహాన్ని ముక్కలుగా నరికి మాయం చేసిన ఘటన కర్ణాటకలో తీవ్ర సంచలనం సృష్టించింది. వివరాల్లోకి వెళితే.. బెళగావి జిల్లా చిక్కోడి తాలూకా ఉమరాణి గ్రామ నివాసి శ్రీమంత ఇట్నాళ (35), భార్య సావిత్రి కూలి పనులు చేస్తూ జీవిస్తుంటారు. వారికి ఇద్దరు కుమార్తెలు. డబ్బుల కోసం సావిత్రిని పరాయి పురుషులతో పడుకోవాలని శ్రీమంత బలవంతం చేసేవాడు. దీంతో ఆమె భర్త దూరం పెట్టసాగింది.తనను నిత్యం అదే తరహాలో వేధించడమే కాకుండా.. ఇటీవల కన్న కూతురిపైనే శ్రీమంత అత్యాచారయత్నానికి ఒడిగట్టాడు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన సావిత్రి బండరాయితో బాది భర్తను హత్య చేసింది. తరువాత మృతదేహాన్ని ముక్కలుగా చేసి చిన్న డ్రమ్ములో వేసి ఊరి బయటకు తీసుకెళ్లి విసిరేసింది. ఇంట్లో రక్తపు మరకలను శుభ్రం చేసింది. భర్త దుస్తులను కాల్చివేసింది. హత్యకు ఉపయోగించిన బండరాయిని కడిగి షెడ్లో దాచిపెట్టింది. కాగా గురువారం శ్రీమంత మృతదేహం ముక్కలు లభించడంతో పోలీసులు దర్యాప్తు చేయగా విషయం బయటపడింది. తానే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు సావిత్రి ఒప్పుకుంది. -
మా వారి ప్రవర్తనతో విసిగిపోయాను...
మా ఆయన సాఫ్ట్వేర్ ఇంజనీర్గా తన పనిలో నిత్యం బిజీగా ఉంటారు. తన ఉద్యోగం చాలా ఒత్తిడితో కూడుకుని ఉండటం, ఇంటిదగ్గర ఉన్నప్పుడు కూడా ఏదో ఒక మీటింగ్కు అటెండ్ అవాల్సి రావడం, వర్క్ ఫ్రమ్ హోం, రాత్రుళ్లు లేటుగా పడుకోవడం వంటివి కోవిడ్ సమయం నుంచి ఎక్కువయ్యాయి. పడుకున్న కొన్ని గంటలు సరిగా నిద్ర పోకపోవడం, పొద్దున్నే చిరాకుగా ఉండటం చీటికీ మాటికీ కోపం తెచ్చుకోవడం ఈ మధ్య ఎక్కువయ్యాయి. పిల్లల మీద ఉట్టిపుణ్యానికి అరుస్తున్నారు. నా భర్త వేరే ఏ దురలవాట్లు లేని మంచి వ్యక్తి అని ఎంతో ఆనందించే నేను ఈ మధ్య ఆయన ప్రవర్తనతో విసిగిపోయాను. మీ సలహా కోసం ఎదురు చూస్తూ...– ఓ సోదరి, హైదరాబాద్ప్రియమైన చెల్లెమ్మా! మీ భర్త దీర్ఘకాలిక వత్తిడి వలన కొన్ని మానసిక లక్షణాలకు లోనవుతున్నట్లు కనిపిస్తుంది. కోవిడ్ తర్వాత పని సంస్కృతిలోని మార్పుల వలన ఈ రోజులలో చాలామంది సాఫ్ట్వేర్ ఉద్యోగుల్లో ఇంటికి, ఆఫీస్కి తేడా కనుమరుగవుతోంది. మీ వారి లక్షణాలను ‘బర్న్ అవుట్’ అని అంటాము. మీ ఆయనకు ఎలాంటి వ్యసనాలు లేవన్నారు. కాని వారు తన ఉద్యోగాన్ని, ఫ్యామిలీ లైఫ్ ని సరిగ్గా బ్యాలెన్స్ చేయలేకపోతున్నారు. నిద్ర సరిగా లేకపోవడం, అతి కోపం, చిరాకు ఇవి తన పనిలో సామర్థ్యాన్ని తగ్గించడమే గాక, తన మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయి. వీటిని ఇలాగే వదిలేస్తే మున్ముందు శారీరక సమస్యలు కూడా రావచ్చు. పనివేళలపై ముఖ్యంగా ఇంటి వద్ద పని వేళలపై సరిహద్దులు పెట్టడం, సరైన సమయపాలన చేయడం ద్వారా వృత్తి, జీవిత సమతుల్యం మెరుగుపరుచుకోవాలి. పని ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పుడు కొంతపని ఇతరులకు అప్పగించడం లేదా నిరాకరించడం చేయగలగాలి. మీ కుటుంబ సమయం, విశ్రాంతి సమయాన్ని కూడా మీ మీటింగుల లాగే, అనివార్యమైనవిగా మీ కేలండర్లో రాసుకోవాలి. సరైన నిద్ర, వ్యాయామం, సమయానికి ఆహారం తీసుకోవడం వల్ల ఒత్తిడిని చాలా వరకు నియంత్రించవచ్చు. మీ వారి ప్రవర్తన ఎలా కుటుంబాన్ని ప్రభావితం చేస్తుందో వారితో సానుభూతితో చర్చించండి. ఒక జీవిత భాగస్వామిగా మీ మద్దతు తనకు ఉందని తెలిసినప్పుడు వారు కూడా మార్పునకు గట్టిగా కృషి చేస్తారు. మీరు కూడా ఈ పరిస్థితుల వలన ఒత్తిడికి లోనవకుండా మీ మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోండి. అప్పటికీ మార్పు రాకపోతే ఒక సైకియాట్రిస్ట్ను కలిసి థెరపీ ద్వారా, మందుల ద్వారా వారి ఒత్తిడిని తగ్గించి మీ కుటుంబ జీవన నాణ్యతను ఖచ్చితంగా మెరుగు పరుచుకోవచ్చును. -
భర్తతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పీవీ సింధు (ఫొటోలు)
-
ఆస్ట్రేలియాలో భర్తతో విన్యాసాలు.. భయపడిపోయిన సోనాక్షి సిన్హ (ఫోటోలు)
-
గతేడాది విషాదం..! విడాకులైన వ్యక్తితో సోనియా పెళ్లి (ఫోటోలు)
-
భార్య కోసమే వీఆర్ఎస్, భర్త గుండె పగిలిన వైనం, వీడియో వైరల్
కేన్సర్తో బాధపడుతున్న భర్తను రక్షించుకునేందుకు నేపాలీ యువతి పడిన వేదన, ప్రేమతో అతనికి సేవలు, చివరకు అతను కన్నుమూసిన తీరు పలువురి హృదయాలను కదిలించింది. భార్యభర్తల ప్రేమ అంటే ఇలా ఉండాలి అంటూ చాలామంది అభిప్రాయపడ్డారు. దాదాపు ఇలాంటి మరో విషాద ఘటన గురించి తెలిస్తే కళ్లు చెమర్చక మానవు. రాజస్థాన్లోని కోటాలో ఈ ఘటన జరిగింది.జైపూర్కు చెందిన దేవేంద్ర సందాల్ కోటాలోని సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్లో మేనేజర్గా పని చేసేవారు.. అతని భార్య టీనా అనారోగ్యం బారిన పడింది. దీంతో ఆమెను కంటికి రెప్పలా కాపాడుకువాలనే లక్ష్యంతో మూడేళ్ల పదవీకాలం ఉండగానే ముందస్తు రిటైర్మెంట్ ( వీఆర్ఎస్) తీసుకున్నారు. ఈ సందర్బంగా దేవంద్ర సహోద్యోగులు వీడ్కోలు పార్టీ ఇచ్చారు. ఈ పార్టీలో భార్యాభర్తలిద్దరూ ఉత్సాహంగా, నవ్వుతూ కనిపించారు. దండలు, శాలువాలు, స్నేహితులిచ్చిన పూల బొకేలతో ఫోటోలకు ఫోజులిచ్చారు. కానీ ఎవ్వరూ ఊహించని విధంగా అక్కడి పరిస్థితి మారిపోయింది.नियति का खेल !पत्नी की तबीयत को देखते हुए पति ने लिया था VRS, रिटायरमेंट पार्टी में ही पत्नी की मौत,बीमार पत्नी की सेवा के लिए नौकरी छोड़ी, विदाई पार्टी में पत्नी ने हीं दुनिया छोड़ दी ।pic.twitter.com/yUn0xAGFch— राहुल चेची 🇮🇳 (@Rahulchechi26) December 25, 2024కళ్లు తిరుగుతున్నాయంటూ టీనా కుర్చీలో కూలబడింది. భార్య వీపుపై రుద్దుతూ సపర్యలు చేస్తూ మంచినీళ్లకు కోసం అడిగాడు. ఇంతలోనే పరిస్థితి మరింత విషమంగా మారిపోయింది. వెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికీ ఫలితం లేకపోయింది. అప్పటికే ఆమె చనిపోయినట్టు వైద్యులు ధవీకరించారు.భర్తతో నవ్వుతూ, సంతోషంగా ఉన్న టీనా ఒక్కసారిగా గుండెపోటుతో మరణించిన దృశ్యాలు సంబంధించిన వీడియోలో రికార్డయ్యాయి. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అప్పటివరకూ హాయిగా నవ్వుతూ, అందర్నీ పలకరిస్తూ ఫొటోలు దిగిన ఆమెకు అవే చివరి క్షణాలవుతాయని ఎవరనుకుంటారు. అందరూ చూస్తుండగానే క్షణాల్లో టీనా ఈ ప్రపంచం నుంచి శాశ్వత వీడ్కోలు తీసుకోవడం విషాదాన్ని నింపింది. -
చిల్లర భరణం
-
Sunandha Mala Setti: స్వర్ణగిరిని సందర్శించిన బుల్లితెర నటి (ఫోటోలు)
-
12 ఏళ్ల క్రితం ప్రేమ పెళ్లి, ఇపుడు భార్యకు ప్రేమ పెళ్లి
'పురుషులందు పుణ్యపురుషులు వేరయా' అని వేమన అంటే, 'పురుషుల్లో మంచివారు నల్లహంసలంత అరుదు' అన్నాడు లాటిన్ కవి జువెనాల్. ఇపుడు నెటి జనులు మహాపురుషుడిగా అభివర్ణిస్తున్న కథ ఒకటి వైరల్గా మారింది. పెళ్లయ్యి ఇద్దరు బిడ్డలు పుట్టిన తరువాత మరొకవ్యక్తిని ప్రేమించిన భార్యకు దగ్గరుండి మరీ పెళ్లి చేశాడో భర్త. ట్విస్ట్ ఏంటంటే..12 ఏళ్ల క్రితం ఈమెను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఏం మనస్పర్దలు వచ్చాయో, ఏమైందో ఏమో తెలియదు గానీ, అప్పటికే పెళ్లయ్యి ఇద్దరు బిడ్డలున్న వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది భార్య. ఇది తెలిసిన భర్త ఆమెకు అతనితో(భార్య ప్రియుడితో) వివాహం జరిపించడం నెట్టింట వైరల్గా మారింది. ఘర్ కా కాలేశ్ అనే యూజర్ ట్విటర్లో ఈ వీడియోను పోస్ట్ చేశారు. బిహార్లో ఈ ఘటన చోటు చేసుకున్నట్టు తెలిపారు. దీనిపై నెటిజన్లు విభిన్నంగా స్పందించారు. Extra-Marital Affair (Mother of three children fell in love with the father of two children, the husband got his wife married to her boyfriend; they had love marriage 12 years ago) Saharsa Bihar pic.twitter.com/0QV5Trw8PS— Ghar Ke Kalesh (@gharkekalesh) December 19, 2024 ; -
Revathi Husband: నా భార్య మృతికి బన్నీకి ఎలాంటి సంబంధం లేదు.
-
వివాహేతర సంబంధం: భార్యా బిడ్డలపై భర్త దాడి
మైసూరు: వేరే మహిళతో కలిగిన తన అక్రమ సంబంధాన్ని ప్రశ్నించిన భార్య, కుమార్తెపై భర్త తన ప్రియురాలితో కలిసి దాడి చేసి హత్య బెదిరింపులకు పాల్పడిన ఘటన నగరంలోని ఎన్ఆర్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. వివరాలు.. బెంగళూరుకు చెందిన శ్వేత అనే మహిళ తన భర్త సంతోష్కుమార్, అతని ప్రియురాలు శిల్పలపై ఎన్ఆర్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. శ్వేత, సంతోష్ దంపతులకు ఇద్దరు కుమార్తెలున్నారు. వీరు బెంగళూరులోని కెంగేరి లింగదీరనహళ్లి బడావణెలో నివసిస్తున్నారు. వీరి అన్యోన్య దాంపత్య జీవితంలో సుడిగాలిలో శిల్ప ఎంట్రీ ఇచ్చింది. సుమారు ఆరు నెలల క్రితం సంతోష్ కుమార్ జీవితంలోకి శిల్ప ప్రవేశంతో శ్వేత దాంపత్య జీవితంలో కుదుపు ఏర్పడింది. తరచూ మొబైల్లో సంతోష్ కుమార్తో మాట్లాడుతూ అశ్లీల మెసేజ్లను పంపుతూ దగ్గరయిన శిల్ప క్రమంగా దంపతుల దాంపత్య జీవితానికి కంటకంగా మారారు. శిల్ప ప్రేరణతో సంతోష్ కుమార్ తరచు భార్య, పిల్లలపై దాడి జరిపి రగడ సృష్టించేవారు. ఈ విషయంపై గతంలో శ్వేత కెంగేరి పోలీసు స్టేషన్లో భర్తపై ఫిర్యాదు చేశారు. ఈ పరిణామం ఇద్దరు పిల్లలపై కూడా ప్రభావం చూపింది. చిన్న కుమార్తె మానసికంగా కుంగి మైసూరులో తల్లి ఇంటిలో ఉండిపోయింది. కుమార్తెను చూసేందుకు శ్వేత తన పెద్ద కుమార్తెతో కలిసి మైసూరుకు వచ్చినప్పుడు బన్నిమంటప ఎల్ఐసీ సర్కిల్ వద్ద సంతోష్ కుమార్, అతని ప్రియురాలు శిల్ప ఎదురై శ్వేత, ఆమె కుమార్తెపై దాడి చేసి హత్య చేస్తామని బెదిరించారు. దాడికి గురైన శ్వేత ఘటన నుంచి కోలుకున్న అనంతరం ఎన్ఆర్ పోలీసు స్టేషన్లో భర్త, ఆమె ప్రియురాలిపై ఫిర్యాదు చేసింది. -
క్షణికావేశంలో భార్యను బలిగొని.. పశ్చాత్తాపంతో ఆమె సమాధి వద్దే..
చిత్తూరు జిల్లా: క్షణికావేశంలో చేసిన తప్పునకు పశ్చాత్తాపంతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఇది. చిత్తూరు జిల్లా రామకుప్పం మండలం బైపరెడ్లపల్లికి చెందిన గంగిరెడ్డి(49), సుజాత భార్యాభర్తలు. ఇద్దరు కుమారులతో కలిసి పదేళ్ల కిందట బెంగళూరు వెళ్లి కూరగాయల వ్యాపారం చేస్తున్నారు. ఈ క్రమంలో ఆరు నెలల కిందట ఘర్షణ పడ్డారు. గంగిరెడ్డి క్షణికావేశంలో భార్య సుజాతపై కత్తితో దాడి చేయడంతో ఆమె ప్రాణాలు కోల్పోయింది. భార్యను తానే చంపేశానని గంగిరెడ్డి అక్కడి పోలీస్స్టేషన్లో లొంగిపోయాడు. ఈ కేసులో 6 నెలల జైలు జీవితం గడిపి.. శనివారం బెయిల్పై విడుదలై స్వగ్రామంలో ఉన్న కుమారుల వద్దకు వచ్చాడు. రాత్రి వారితో కలిసి భోజనం చేశాడు. ఇకపై తనను అందరూ భార్యను చంపేశానన్న ఏహ్య భావంతో చూస్తారని, క్షణికావేశంలో భార్యను చంపుకొన్నానని.. తనకు బతకాలని లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. రాత్రి ఇంట్లో కుమారులతో కలిసి నిద్రించాడు. ఆదివారం తెల్లవారుజామున మెలకువ వచ్చిన కుమారులకు ఇంట్లో తండ్రి కనిపించలేదు. గ్రామంలో వెతికారు. గంగిరెడ్డి తన తండ్రి, భార్య సమాధుల వద్ద చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుని ఉండటాన్ని గమనించారు. మృతుడి కుమారుడు నవీన్కుమార్రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్ఐ వెంకటమోహన్ కేసు దర్యాప్తు చేన్నారు.చదవండి: ఏపీలో రెచ్చిపోతున్న ప్రేమోన్మాదులు.. యువతి మృతి, మరొకరికి గాయాలు -
పెళ్లి రోజు స్పెషల్.. భర్తతో హన్సిక లవ్లీ పోస్ట్ (ఫొటోలు)
-
హ్యాపీయెస్ట్ బర్త్డే మై బడ్డీ : గాయని బర్త్డే విషెస్ వైరల్ (ఫోటోలు)
-
విశాఖలోని సింగరాయకొండలో దారుణం
-
విశాఖలో దారుణం.. భార్యకు మత్తు మందు ఇచ్చి..
సాక్షి, విశాఖపట్నం: నగరంలో దారుణం జరిగింది. భార్యకు కూల్డ్రింక్లో మత్తు మందు ఇచ్చి, ఆపై నిప్పంటించి భర్త హత్యాయత్నానికి పాల్పడ్డాడు. మత్తులోకి జారుకున్న తర్వాత ఒంటిపై భర్త నిప్పు అంటించాడు. మంటలు అంటుకున్న కొద్దిసేపటికి బాధితురాలు కేకలు వేయడంతో స్థానికులు రక్షించి ఆసుపత్రికి తరలించారు. గ్యాస్స్టవ్ ప్రమాదమని చుట్టుపక్కల వారిని నమ్మించే ప్రయత్నం చేశాడు. చికిత్స పొందుతూ ఆమె కోలుకోవడంతో అసలు బండారం బయటపడింది. విశాఖలోని మురళీనగర్ సింగరాయ కొండపై నివసిస్తున్న వెంకటరమణ, కృష్ణవేణిలకు ఐదేళ్ల క్రితం పెళ్లయి కుమారుడు, కుమార్తె ఉన్నారు. వెంకటరమణకు మద్యం వ్యసనంతో పాటు భారీగా అప్పులున్నాయి. ఈ విషయంలో దంపతుల మధ్య తరచూ ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో భార్యను హత్య చేయాలని భావించిన వెంకటరమణ.. 16వ తేదీ రాత్రి మత్తు మందు కలిపిన కూల్డ్రింక్ తెచ్చి భార్యకు ఇచ్చాడు. అనంతరం నిప్పంటించాడు. మత్తుమందు ప్రభావం నుంచి కోలుకున్నాక.. కృష్ణవేణి కేకలు వేయడంతో స్థానికులు ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. -
భర్త బండారాన్ని.. బయటపెట్టిన భార్య
-
ఆమె.. ఆయనలో సగభాగం.. భర్తకు పునర్జన్మనిచ్చిన భార్య
సాక్షి, ఖమ్మం జిల్లా: వివాహం జన్మజన్మల అనుబంధమని, చెరోసగంగా భార్యాభర్తలు జీవనం సాగించడం అన్యోన్య దాంపత్యమని పెద్దలు చెబుతారు. ఈ తరహాలోనే ఓ మహిళ తన భర్తను బతికించుకునేందుకు కాలేయదానం చేసి ఆయనలో సగభాగంగా మారడమే కాదు.. కలకాలం కష్టసుఖాల్లో పాలుపంచుకుంటానని పెళ్లి రోజున చేసిన ప్రతిజ్ఞకు కట్టుబడి నిలిచినట్లయింది.రఘునాథపాలెం మండలం పెద్ద ఈర్లపూడికి చెందిన ధారావత్ శ్రీను ఖమ్మంలోని ఏపీజీవీబీలో విధులు నిర్వర్తిస్తున్నాడు. ఆయన భార్య లావణ్య ఎల్ఎల్బీ చివరి సంవత్సరం చదువుతుండగా వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కొన్నాళ్ల క్రితం శ్రీను అనారోగ్యం బారిన పడడంతో ఖమ్మంలోని ఓ ఆస్పత్రిలో పరీక్షలు చేయించుకున్నాడు. కామెర్లు సోకగా కాలేయం సమస్య ఎదురైందని వైద్యులు గుర్తించారు.ఆపై హైదరాబాద్లో చికిత్స చేయించుకున్నా నయం కాలేదు. అంతేకాక వివిధ పరీక్షల అనంతరం కాలేయ మార్పిడి మాత్రమే శ్రీనును బతికిస్తుందని వైద్యులు తేల్చిచెప్పారు. దీంతో కాలేయదానం చేసే వారి కోసం ఆరా తీస్తుండగా లావణ్యే ముందుకొచి్చంది. తన భర్తను కాపాడుకోవడానికి లివర్ ఇస్తానని చెప్పడంలో పరీక్షలు చేసిన వైద్యులు సరిపోతుందని నిర్ధారించారు. ఈ మేరకు లావణ్య లివర్ నుంచి 65శాతం మేర తీసిన సికింద్రాబాద్లోని కిమ్స్ ఆస్పత్రి వైద్యులు ఈనెల 16న శస్త్రచికిత్స ద్వారా శ్రీనుకు అమర్చారు. ప్రస్తుతం దంపతులిద్దరూ ఆరోగ్యంగా ఉండగా కోలుకుంటున్నారని కుటుంబీకులు తెలిపారు.భర్తకు లివర్ దానం చేసి బతికించుకున్న భార్యఖమ్మం - పెద్ద ఈర్లపూడికి చెందిన ధారావత్ శ్రీను లివర్ సమస్యతో బాధపడుతున్నారు. చికిత్స కోసం ఆస్పత్రికి వెళ్లగా లివర్ మార్చాల్సిందేనని వైద్యులు చెప్పారు. కానీ, ఎంత వెతికినా డోనర్ దొరక్కపోవడంతో అతని భార్య లావణ్య ముందుకొచ్చింది. ఆమె… pic.twitter.com/Jh0mA4IyaM— Telugu Scribe (@TeluguScribe) November 21, 2024 -
ఆధ్యాత్మిక శోభ : భర్తతో కలిసి బిగ్బాస్ నటి సంప్రదాయపూజలు
-
అత్త, వారి బంధువుల వేధింపులు తాళలేక క్షోభ అనుభవిస్తున్నా
పంజగుట్ట: గత 10 నెలలుగా అత్త, అత్త తరపు బంధువులు పెట్టే వేధింపులను తట్టుకోలేకపోతున్నానని, తమ సమీపబంధువు గౌతంరెడ్డి, అత్త గుణపటి పార్వతి, భర్త ఆదాల దామోదర్ రెడ్డి నుంచి తనకు, తన కుటుంబానికి ఆపద ఉందని గ్రీన్పార్క్, మారీగోల్డ్, ఆవాసా హోటల్స్ డైరెక్టర్ ఆదాల దామోదర్ రెడ్డి సతీమణి రచనా రెడ్డి వాపోయారు. ఇంట్లో ఉన్న తనను ఈ నెల 6న 15మంది బౌన్సర్లు వచ్చి దాడిచేసి కిడ్నాప్ చేసేందుకు యతి్నంచారన్నారు.ఈ విషయమై జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసినా ఇప్పటివరకు ఎఫ్ఐఆర్ చెయ్యలేదని ఆమె ఆరోపించారు. శనివారం సోమాజిగూడ ప్రెస్క్లబ్లో తన సోదరితో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. 2022 సంవత్సరంలో తనకు దామోదర్ రెడ్డికి వివాహం అయ్యిందని అప్పటినుండి కొద్దికాలం సజావుగానే తమ దాంపత్యం కొనసాగిందన్నారు. తన భర్త తన మాటవింటున్నాడు కానీ తన అత్త పార్వతి భర్తనుండి విడదీసేందుకు కుట్రలు పన్నిందన్నారు. తమ సమీపబంధువు గ్రీన్పార్క్, మారీగోల్డ్ హోటల్స్ సీఈఓ గౌతంరెడ్డి మా అత్త సాయంతో తనను మానసిక క్షోభకు గురిచేస్తున్నారన్నారు. తన భర్తనుండి విడాకుల నోటీసు ఇప్పించడంతో గత కొంతకాలంగా తాను ఇల్లు వదిలి వెల్లిపోయానని తిరిగి కోర్టు ఆదేశాలతో గత నెల ఫిల్మ్నగర్ లోని తన భర్త ఇంటికి వచ్చినట్లు తెలిపారు. అప్పటినుండి తనను ఇంట్లోవేసి తాళం వెయ్యడం, గదిలో బంధించడం తీవ్రమానసిక వేదనకు గురిచేశారని తెలిపారు. తన అత్త పార్వతి, భర్త దామోదర్ రెడ్డి, గౌతమ్ రెడ్డి నుండి తనకు తన కుటుంబానికి ప్రాణహాని ఉందని రచనా రెడ్డి వాపోయారు. -
న్యాయ సలహా : మిమ్మల్ని వెళ్లగొట్టే హక్కు వారికి లేదు!
నా వయసు 45 సంవత్సరాలు. మా పెళ్లి జరిగి పాతికేళ్లకు పైగా అయింది. పెళ్లయిన నాటినుంచి నాకు భర్త నుంచి ఆదరణ లేదు సరికదా, చీటికిమాటికీ నాపై చెయ్యి చేసుకోవడం, అత్తమామలు, ఆడబిడ్డల నుంచి ఆరళ్లు... పిల్లలు పుట్టి, పెద్దవాళ్లయినా నాకీ మానసిక, శారీరక బాధలు తప్పడం లేదు. అదేమంటే నన్ను ఇంటిలోనుంచి వెళ్లగొడతానని బెదిరిస్తున్నారు. ఈ పరిస్థితులలో నేను ఏం చేయాలి? సలహా ఇవ్వగలరు. – కె. సుజాత, శంషాబాద్పెళ్ళైన తర్వాత భర్త ఇంటికి వెళ్ళి, గృహిణిగా వుండే స్త్రీలే మన సమాజంలో ఎక్కువ. అలా గృహిణిగా వుంటున్న స్త్రీలని ఏదో వారికి సేవ చేయటానికి మాత్రమే కట్నం ఇచ్చి మరీ పెళ్ళి చేశారు అనే పురుషాహంకార భావజాలాలు కల్గిన భర్తలు, అత్త–మామలూ కూడా ఎక్కువే! ఉద్యోగం వదిలేసి, తనకంటూ స్వంత ఆదాయం లేకుండా కొన్ని సంవత్సరాల పాటు కాపురం చేశాక ‘‘నేను వదిలేస్తే నీకు జీవితం లేదు.. వుండటానికి నీడ కూడా దొరకదు.. నీకు విడాకులు ఇస్తాను, రోడ్డున పడతావ్’’ అంటూ బెదిరిస్తూ మహిళలపై అజమాయిషి చలాయించేవారిని తరచు చూస్తుంటాం. ముందూ వెనుకా ఎవరి సహాయం లేకుండా, పెద్దగా చదువుకోకుండా, ఉద్యోగంలో చాలా గ్యాప్ వచ్చి లేదా పుట్టినింటినుంచి పెద్దగా ఆదరణ లేదు అని అనుకున్న స్త్రీలైతే భర్త వదిలేస్తే వారి పరిస్థితి ఏమిటి అని భయపడుతూ, వారికి ఎదురయ్యే గృహహింసను కూడా మౌనంగా భరిస్తూ ఉంటారు.నిజానికి అలా భయపడవలసిన అవసరం లేదు. ఇలాంటి పరిస్థితులలో మహిళలకు ఎంతో బాగా ఉపయోగపడే, రక్షణ కల్గించే చట్టమే ‘గృహ హింస చట్టం, 2005’. ఈ చట్టంలోని సెక్షన్ 19 ప్రకారం, భర్త (లేదా అత్త–మామలు) నివసిస్తున్న ఇంట్లోనే, విడాకుల కేసు లేదా మరేయితర కేసులు నడుస్తున్నప్పటికీ గృహహింసకు గురైన మహిళకు కూడా సమానంగా నివసించే హక్కు వుంటుంది. కొన్ని సందర్భాలలో ఐతే భార్య/ గృహ హింసకి గురవుతున్న స్త్రీ రక్షణ కొరకు భర్తను ఇంట్లోనుంచి వెళ్లిపోవాలి అని కూడా కోర్టులు ఆదేశాలు ఇచ్చాయి. భర్త పేరిట ఇల్లు ఉన్నా గాని, అలాంటి ఆదేశాలు ఇచ్చే అవకాశం కల్పిస్తుంది ఈ చట్టం. అలా కుదరని పక్షంలో భర్త నివసించే ఇంటికి సమానమైన ప్రత్యామ్నాయ వసతిని కల్పించవలసి ఉంటుంది. అంతేకాక, మరలా గృహహింసకు పాల్పడే వీలు లేకుండా భర్త – తన కుటుంబ సభ్యులపై కూడా ఇంజక్షన్ ఇస్తూ కోర్టు ‘ ప్రొటెక్షన్ ఆర్డరు / రక్షణ ఉత్తర్వులు ’’ ఇవ్వవచ్చు. కాబట్టి, భర్త వదిలేస్తే ఇక తనకి జీవితం వుండదు అనుకునే ధోరణి అవసరం లేదు. గృహ హింసని భరించాల్సి అవసరం అంతకంటే లేదు. గృహహింస చట్టం, 2005 అనేది ఒక ప్రత్యేక చట్టం. ఇందుకుగాను మీరు నేరుగా మెజిస్ట్రేట్ ను గానీ, స్త్రీ – శిశు సంక్షేమ శాఖను గానీ సంప్రదించ వచ్చు. ఐపీసీ 498అ (కొత్త చట్టం – సెక్షన్ 85 బీ.ఎన్.ఎస్) కు, గృహ హింస చట్టానికి సంబంధం లేదు. ఆరోపణలు, గృహహింస ఒకటే అయినప్పటికీ రెండు కేసులు వేర్వేరుగా పిర్యాదు చేయాలి. – శ్రీకాంత్ చింతల, హైకోర్టు న్యాయవాది మీకున్న న్యాయపరమైన సమస్యలు, సందేహాలకోసం sakshifamily3@gmail.com కు మెయిల్ చేయవచ్చు. -
అవి రెండే.. కానీ ఒకటయిపోతాయి!
అతిథిని పూజించేవాడు ఒక్క గృహస్థు మాత్రమే. అలా గౌరవించడంలో ఎంత లీనమయి ఉంటారంటే అసలు భగవంతుడే స్వయంగా వచ్చినా ఏమరుపాటు పొందుతారు. సీతారాముల విగ్రహాలను అలంకరించడానికి తులసీదాసు గంధం తీస్తుంటాడు. రామలక్ష్మణులు స్వయంగా అతిథులుగా వస్తారు. వచ్చి ఆ గంధం తమకు పూయమంటారు. ఇది సీతారాములకే మీకు కాదు వెళ్ళండంటాడు. వారు వెళ్ళబోతుంటే.. హనుమ చిలకరూపంలో వచ్చి అసలు విషయం చెబుతాడు. రాజకుమారుల రూపంలో ఉన్న వారిని అప్పుడు చందనాదులతో సేవించి దర్శనం పొందుతాడు తులసీదాసు.ఇక్కడ నీకున్నదేదో ఇక్కడ శరీరం వదిలిపెట్టేయడంతోనే సరి. కానీ ఈ శరీరంతో ఉండగా నలుగురికి పనికివచ్చే మంచి పని చేసినప్పుడు అది మాత్రమే పుణ్యంగా నీ వెంట వస్తుంది. మనం ఈ శరీరాన్నిగానీ, ద్రవ్యాన్నిగానీ, శక్తినిగానీ దేనిని వాడకుండా దాచుకోవడం సాధ్యమయ్యేది కాదు. అది కాలంతో వెళ్ళి΄ోవలసిందే. మెరుపు ఎలా వచ్చిపోతుంటుందో అలా భోగాలు వచ్చి పోతుంటాయి తప్ప వాటి వలన ఏ ఫలితమూ ఉండదంటారు శంకరాచార్యుల వారు. సూర్యోదయాలు, చంద్రోదయాలు వస్తుంటాయి, పోతుంటాయి.. ఆయుర్దాయం కరిగిపోతుంటుంది. ఆయువు ఉన్న కాలంలో ఎవరు తమ జీవితాన్ని పండించుకుంటారో వారు గట్టెక్కుతారు. ఆ అదృష్టం అతిథిపూజ చేసిన గృహస్థుకు సులభంగా దక్కుతుంది. అతిథి కూడా ఏ అవసరం వచ్చినా గృహస్థుదగ్గరకే ΄ోతాడు తప్ప ఇతర ఆశ్రమాలవారిని ఆశ్రయించడు. మన దేశ ద్రవ్యం మన దేశంలోనే చెల్లుబాటవుతుంది కదా. ఇతర దేశాలకు ΄ోవాలంటే విదేశీమారక ద్రవ్యం అవసరం. అలాగే ఇక్కడ చేసిన మంచిపని .. మారక ద్రవ్యంలాగా శరీరం విడిచిపెట్టినా పుణ్యం రూపంలో నీ వెంట వస్తుంది.గృహస్థాశ్రమంలో మరో విశేషం ఉంది. దంపతుల మనసు ఏకీకృతమయితే పరమ సంతోషంగా, పరమ ప్రశాంతంగా జీవితం హాయిగా గడుస్తుంది. సాధారణంగా ఇద్దరున్నప్పుడు ఒకరు మరొకరితో ముఖాముఖి మాట్లాడితే తప్ప ఒకరి భావాలు మరొకరికి అర్థం కావు. కానీ దాంపత్యంలో అది పండిందని గుర్తు ఏమిటంటే – ఆయన ఆమెతో, ఆమె ఆయనతో నోరు విప్పి మాట్లాడనక్కరలేదు. అలా చూపులు చాలు భావ ప్రసరణకు,. ఆ స్థాయికి చేరుకోవడం అంటే రెండు మనసులు ఒకటి కావడం.సీతమ్య ఏ పని చేసినా దీనివలన మా ఆయన కీర్తినిలబడుతుంది గదా అని ఆలోచిస్తుందట. రాముడు ఏ పని చేసినా దీనివల్ల సీత సంతోషిస్తుంది గదా! అని ఆలోచిస్తుంటాడట. కొంతకాలం గడిచాక ఒకరికి ఏ అవసరం వచ్చినా మరొకరు అడగాల్సిన పనిలేకుండానే దానిని నెరవేరుస్తారు. పట్టాభిషేక ఘట్టం. అందరికీ అన్నీ ఇచ్చేసారు. చిట్టచివర సీతమ్మ తన మెడలోంచి హారం తీసి పట్టుకున్నది. నీ ప్రశాంతతకు, మన దాంపత్యానికి, మన కలయికకు కారుకులయిన వారికి దానిని అనుగ్రహించు అన్నాడు రాముడు. వెంటనే సీతమ్మ దానిని హనుమకు ఇచ్చేసింది. రాముడు ఫలానా అని పేరు చెప్పక΄ోయినా ఆమె గ్రహించేసింది. దాంపత్యం పండినప్పుడు ఆయన మనసు ఆవిడ దగ్గర, ఆవిడ మనసు ఆయన దగ్గర ఉంటాయి. కారణం – రెండంటూ ఉంటే కదూ.. ఉన్నది ఒకటే అయిపోతుంది. - చాగంటి కోటేశ్వరరావు -
దాడిలో భర్త మృతి.. గర్భిణి భార్య చేత బెడ్ శుభ్రం చేయించి..
దిండోరి: మధ్యప్రదేశ్లోని దిండోరిలో మానవత్వం మంటగలిగిన ఉదంతం చోటుచేసుకుంది. దాడిలో ఒక యువకుడు మృతి చెందగా, పుట్టెడు దు:ఖంలో మునిగిన అతని భార్యకు ఆస్పత్రిలో ఘోర అవమానం ఎదురయ్యింది. ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలు వైరల్గా మారాయి. ఈ ఉదంతం దిండోరి జిల్లాలోని గడసరాయ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని లాల్పూర్ గ్రామంలో చోటుచేసుకుంది.వివరాల్లోకి వెళితే లాల్పూర్ గ్రామంలో చోటుచేసుకున్న భూ వివాదం రక్తాపాతానికి దారితీసింది. భూవివాదం కారణంగా ఓ వర్గం ఒక కుటుంబ సభ్యులపై పదునైన ఆయుధాలతో దాడికి తెగబడింది. ఆ కుటుంబ పెద్దతో పాటు అతని ముగ్గురు కుమారులపై నిందితులు దాడి చేశారు. ఈ దాడిలో వృద్ధ తండ్రితో పాటు అతని ముగ్గురు కుమారుల్లో ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు.బాధిత కుటుంబానికి చెందిన సోదరులు శివరాజ్, రామరాజ్ పరిస్థితి విషమంగా ఉండడంతో వారిని స్థానికులు గడసరాయ్లోని ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అయితే శివరాజ్ ఆరోగ్య కేంద్రంలోని మంచంపై చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటన అనంతరం శివరాజ్ భార్య తన భర్త మృతిచెందిన బెడ్పై ఉన్న రక్తపు మరకలను శుభ్రం చేసింది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షం అయ్యాయి. దీంతో జిల్లా వైద్య యంత్రాంగంలో కలకలం చెలరేగింది. దీనిని తీవ్రంగా పరిగణించిన ఉన్నత వైద్యాధికారులు సదరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని వైద్యునితో పాటు సిబ్బందికి షోకాజ్ నోటీసు జారీ చేశారు. ఇది కూడా చదవండి: నేడు గంగోత్రి.. రేపు యమునోత్రి మూసివేత -
భార్య మీద అనుమానంతో దుబాయ్ నుంచి వచ్చి...
కరీంనగర్ (మల్లాపూర్): అనుమానం పెనుభూతమై భార్యను గొంతు నొక్కి అతికిరాతకంగా చంపేశాడోభర్త. ఈ దారుణం మండలంలోని వెంకట్రావ్పేటలో బుధవారం జరిగింది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. మండలంలోని వేంపల్లి గ్రామానికి చెందిన వెల్మల రమేశ్కు రాయికల్ మండలం అల్లీపూర్ గ్రామానికి చెందిన సునీతతో 2015లో వివాహం జరిపించారు. వీరికి కూతురు ఆద్య (8), కుమారుడు జయసూర్య(6) సంతానం. కొంతకాలంగా వెంకట్రావ్పేటలో ఉంటున్నారు. రమేశ్ ఉపాధి కోసం దుబాయ్ వెళ్లి వస్తున్నాడు. నెలక్రితం దుబాయ్ నుంచి వచ్చిన రమేశ్కు సునీత వివాహేతర సంబంధం పెట్టుకుందన్న అనుమానం కలిగింది. ఇదే విషయమై బుధవారం ఉదయం భార్యాభర్తలు గొడవపడ్డారు. దీంతో రమేశ్ క్షణికావేశంలో సునీత ముఖంపై బలంగా కొట్టాడు. గొంతు నులిమి హతమార్చి అక్కడి నుంచి పరారయ్యాడు. విషయం తెలుసుకున్న సునీత కుటుంబసభ్యులు ఘటనాస్థలికి వెళ్లి బోరున విలపించారు. గ్రామస్తుల సమాచారం మేరకు ఎస్సై కిరణ్కుమార్ విచారణ చేపట్టారు. మెట్పల్లి డీఎస్పీ ఉమామహేశ్వర్రావు, కోరుట్ల సీఐ సురేష్బాబు ఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతురాలు తండ్రి మందల గంగరాజం ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
ఎంతకు తెగించింది..! భర్త రూ.8 కోట్లు ఇవ్వలేదని, ప్రియుడితో కలిసి
బెంగళూరు: 20 రోజుల క్రితం జరిగిన హత్య కేసును పోలీసులు తాజాగా ఛేధించారు. పోలీసుల విచారణలో విస్తుపోయే విషయాలు వెలుగుచూశాయి. లగ్జరీ జీవితానికి అలవాటుపడిన మహిళ.. సొంత భర్తనే డబ్బులు డిమాంఢ్ చేయడం.. అతడు నిరాకరించడంతో ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసినట్లు తేలింది. పక్కా ప్లాన్ ప్రకారం హత్య చేసి మరో రాష్ట్రంలో మృతదేహాన్ని పడేసి నిప్పంటించిన మహిళ.. చివరకు పోలీసుల దర్యాప్తులో అడ్డంగా దరికిపోయింది.పోలీసుల వివరాల ప్రకారం.. అక్టోబర్ 8న కొడగు జిల్లాలో అక్టోబరు 8న సగం కాలిపోయిన మృతదేహాన్నికర్ణాటక పోలీసులు గుర్తించారు. సొంటికొప్ప టౌన్ సమీపంలోని కాఫీ ఎస్టేట్లో లభ్యమైన మృతదేహం 54 ఏళ్ల రమేష్ అనే తెలంగాణ వ్యాపారిదిగా గుర్తించారు. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలించారు. ఎరుపు రంగు మెర్సిడెస్ బెంజ్ కారు అక్కడ అనుమానాస్పదంగా తిరిగినట్లు గుర్తించారు. ఆ కారు ఎవరిదో తెలుసుకునేందుకు తుమకూరు వరకు 500కుపైగా సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలించారు. చివరకు కారు నంబర్ ప్లేట్ను కనుగొన్నారు. హైదరాబాద్కు చెందిన 52 ఏళ్ల వ్యాపారవేత్త రమేష్ పేరుతో ఆ కారు రిజిస్టర్ అయినట్లు గుర్తించారు.రమేష్ అదృష్యమైనట్లు అతని భార్య నిహారిక(29) ఇటీవల మిస్సింగ్ ఫిర్యాదును నమోదు చేసింది. దీంతో పోలీసులు కారు రిజిస్టర్ అయిన తెలంగాణలోని పోలీసులను సంప్రదించారు. అయితే రమేష్ హత్యలో ఆమె పాత్ర ఉన్నట్లు కొడగు పోలీసులు అనుమానించారు. ఆమెను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. రూ.8 కోట్ల ఆస్తి కోసం ప్రియుడైన వెటర్నరీ డాక్టర్ నిఖిల్, గతంలో జైలులో పరిచయమైన అంకుర్ సహాయంతో భర్త రమేష్ను హత్య చేసినట్లు ఆమె ఒప్పుకుంది. అక్టోబర్ 1న హైదరాబాద్లోని ఉప్పల్ ప్రాంతంలో ఊపిరాడకుండా చేసి రమేష్ను చంపినట్లు కొడగు పోలీస్ అధికారి తెలిపారు.నిందితులు అతడి ఇంటికి చేరుకుని డబ్బు తీసుకున్నారని చెప్పారు. ఆ తర్వాత రమేష్ మృతదేహంతో అతడి కారులో బెంగళూరుకు ప్రయాణించారని పేర్కొన్నారు బంకులో పెట్రోల్ నింపుకున్న తర్వాత కొడగు జిల్లా సుంటికొప్ప సమీపంలోని కాఫీ తోటలో రమేష్ మృతదేహానికి నిప్పంటించారని పోలీస్ అధికారి తెలిపారు. ఆ తర్వాత ముగ్గురు నిందితులు హైదరాబాద్కు చేరుకున్నారని, మూడు రోజుల తర్వాత తన భర్త కనిపించడంలేదని నిహారిక ఫిర్యాదు చేసిందని చెప్పారు.కాగా, నిహారిక చిన్నప్పుడు పేదరికం వల్ల చాలా ఇబ్బందిపడినట్లు తెలిసిందని పోలీస్ అధికారి తెలిపారు. 16వ ఏటా ఆమె తండ్రి మరణించడంతో తల్లి రెండో పెళ్లి చేసుకుందని చెప్పారు. చదువులో రాణించిన నిహారిక ఇంజినీరింగ్ పూర్తి చేసి ఉద్యోగంలో చేరిందని అన్నారు. ఒక వ్యక్తిని పెళ్లాడిన ఆమె ఒక బిడ్డకు జన్మనిచ్చిందని, ఆ తర్వాత భర్త నుంచి విడిపోయిందని చెప్పారు. హర్యానాలో ఉన్నప్పుడు ఆర్థిక మోసానికి పాల్పడి జైలుకు కూడా వెళ్లిందని అన్నారు. జైలులో అంకుర్ పరిచయమైనట్లు వెల్లడించారు.జైలు నుంచి విడుదలైన తర్వాత హైదరాబాద్కు చెందిన వ్యాపారవేత్త రమేష్తో నిహారికకు రెండో పెళ్లి జరిగినట్లు పోలీసులు తెలిపారు. అతడికి కూడా ఇది రెండో వివాహమని చెప్పారు. నిహారికకు రమేష్ విలాసవంతమైన జీవితాన్ని అందించాడని చెప్పారు. అయితే లగ్జరీ లైఫ్కు అలవాటు పడిన ఆమె రమేష్ను రూ.8 కోట్లు అడిగిందని, అంత డబ్బు ఇచ్చేందుకు భర్త నిరాకరించడతో అతడి ఆస్తి కోసం హత్య చేయాలని ప్లాన్ వేసిందన్నారు. రిలేషన్షిప్లో ఉన్న వెటర్నరీ డాక్టర్ నిఖిల్, జైలులో పరిచయమైన అంకుర్తో కలిసి రమేష్ను హత్య చేసి 800 కిలోమీటర్ల దూరంలో మృతదేహాన్ని పడేసి కాల్చివేశారని పోలీస్ అధికారి వివరించారు. ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. -
భర్తను సూట్కేసులో దాక్కోమని చెప్పి ఊపిరి తీసింది..!
కొన్నిగంటలపాటు భర్తను సూట్కేసులో కుక్కి ఆయన చనిపోయేందుకు కారణమైన ఓ ఫ్లోరిడా మహిళను కోర్టు దోషిగా తేల్చింది. ఫ్లోరిడాలోని వింటర్పార్క్ అపార్ట్మెంట్లో సారా బూన్, భర్త జార్జ్ టోరెస్తో కలిసి ఉంటున్నారు. 2020లో టోరెస్ ఓ సూట్కేస్లో శవమై కనిపించాడు. అతని భార్య బూన్ను అనుమానించిన పోలీసులు ప్రశ్నించగా.. ‘ఇద్దరం మద్యం తాగి ఉన్నాం. ఆటలో భాగంగా అతను సూట్కేసులో దాక్కున్నాడు. అతని వేళ్లు బయటికి ఉన్న కారణంగా జిప్ తీసుకోగలడని భావించాను. నేను మేడపైకి వెళ్లి పడుకున్నా. నిద్రలేచి చూసే సరికి అతను ఇంకా సూట్కేసులోనే ఉన్నాడు. అప్పటికే అతని ఊపిరి ఆగిపోయింది’ అని వెల్లడించింది. కేసు విచారణ నాలుగేళ్లపాటు కొనసాగింది. చివరికి బూన్ ఫోనే ఆమెను పట్టించింది. తనను సూట్కేసులోంచి తీయాలని టోరెస్ వేడుకుంటుండగా, తాను నవి్వన దృశ్యాలను బూన్ తన ఫోన్లో బంధించింది. అంతేకాదు శ్వాస తీసుకోవడం కష్టంగా ఉందని, బయటికి తీయాలని టోరెస్ బతిమాలుతుండగా ‘నీకు దక్కాల్సింది అదే.. నన్ను మోసం చేసినప్పుడు నాకు కూడా అలాగే అనిపించింది. నేను కూడా గట్టిగా ఊపిరి పీల్చుకోలేకపోయాను’ అంటూ బూన్ సమాధానం ఇవ్వడం వీడియోలో రికార్డు అయ్యింది. దీంతో కోర్టు బూన్ను దోషిగా తేల్చింది. డిసెంబర్లో శిక్ష ఖరారు చేయనుంది. – వాషింగ్టన్ -
మహిళపై సామూహిక అత్యాచారం.. ఏడుగురు అరెస్ట్
రేవా: మధ్యప్రదేశ్లోని రేవా జిల్లాలో అత్యంత దారుణం చోటుచేసుకుంది. భర్తతో కలిసి విహారయాత్రకు వెళ్లిన ఓ మహిళపై ఎనిమిదిమంది అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఉదంతంలో పోలీసులు ఏడుగురిని అరెస్ట్ చేశారు. పరారైన మరో నిందితుని కోసం గాలిస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గూఢ్ తహసీల్లోని ఒక పర్యాటక ప్రాంతంలో ఈ సామూహిక అత్యాచార ఘటన అక్టోబర్ 21న చోటుచేసుకుంది. రేవా హెడ్క్వార్టర్స్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (డీఎస్పీ) హిమాలి పాఠక్ మీడియాకు ఈ కేసుకు సంబంధించిన వివరాలు తెలియజేస్తూ.. బాధిత మహిళకు ఇటీవలే వివాహం జరిగిందని, ఆమె, ఆమె భర్త వయస్సు 19 నుండి 20 ఏళ్ల మధ్య ఉంటుందని, వీరిద్దరూ ప్రస్తుతం కాలేజీలో చదువుకుంటున్నారని తెలిపారు.బాధితురాలిని పోలీసులు విచారించినప్పుడు.. ఆమె తనపై లైంగిక దాడికి పాల్పడిన ఎనిమిది మందిలో ఒకరికి చేతులు, ఛాతీపై టాటూలు ఉన్నాయని తెలిపింది. పోలీసులు ఈ కేసు విచారణలో భాగంగా పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. బాధితురాలి గుర్తింపును బహిర్గతం చేయకుండా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని అన్నారు.బాధిత దంపతులు గూఢ్ పోలీస్ స్టేషన్లో ఈ ఘటనపై ఫిర్యాదు చేశారని, వెంటనే ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ నిపుణులు బాధితురాలికి వైద్య పరీక్షలు చేశారన్నారు. వెంటనే తాము ఈ ఘటనపై ఎఫ్ఐఆర్ నమోదు చేశామని తెలిపారు. గూఢ్ పారిశ్రామిక ప్రాంతంలోని ఒక దేవాలయానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఫౌంటెన్ వద్ద ఆ మహిళ, ఆమె భర్త గొడవ పడ్డారని డీఎస్పీ తెలిపారు. అదే ఫౌంటెన్ దగ్గర ఐదుగురు వ్యక్తులు తనపై వంతులవారీగా అత్యాచారానికి పాల్పడ్డారని బాధిత మహిళ తన వాంగ్మూలంలో పేర్కొంది. ఈ కేసులో పోలీసులు గుర్హ్ నివాసి రామ్కిషన్ కోరి, దీపక్ కోరి, రవేష్ కుమార్ గుప్తా, రాంపూర్ బఘెలాన్ వాసి సుశీల్ కోరి, రాజేంద్ర కోరి, తరుణ్ కోరి, నైగర్హి వాసి లవకుష్ కోరిలను అరెస్టు చేశారు. పరారీలో ఉన్న గూఢ్ నివాసి రజనీష్ కోరిని త్వరలోనే అరెస్టు చేస్తామన్నారు.నిందితులు బాధితురాలి భర్తను బందించారని ఎస్పీ సింగ్ తెలిపారు. అలాగే వారు ఈ ఘటనకు సంబంధించిన వీడియోను రికార్డు చేశారన్నారు. కాగా ఈ ఘటనపై మధ్యప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ జితూ పట్వారీ మీడియాతో మాట్లాడుతూ ఈ ఘటన రెండు రోజుల వరకూ ఎవరికీ తెలియజేదని, ఇది ఆటవిక రాజ్యం కాదా? అని ప్రశ్నించారు. రాష్ట్ర హోంశాఖ పేరును జంగిల్ రాజ్ శాఖగా మార్చాలని ఎద్దేవా చేశారు. మధ్యప్రదేశ్లో నేరాలు పెరిగిపోతున్నాయని, రాష్ట్రంలో ప్రతిరోజూ 18 నుంచి 20 మంది మహిళలు అత్యాచారానికి గురవుతున్నారని ఆయన ఆరోపించారు. ఇది కూడా చదవండి: ఈ నెల 28న భూమి సమీపానికి భారీ గ్రహశకలం -
వైవాహిక అత్యాచారం కేసుల విచారణ వాయిదా
న్యూఢిల్లీ: వైవాహిక అత్యాచారం ఘటనల్లో భర్తపై నేరం మోపకుండా చట్టం కల్పిస్తున్న రక్షణలపై నమోదైన కేసుల విచారణను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం నాలుగు వారాలు వాయిదావేసింది. నవంబర్ పదో తేదీన సీజేఐ చంద్రచూడ్ పదవీవిరమణ నేపథ్యంలో ఇక ఈ కేసులను ఆయన విచారించబోరని తెలుస్తోంది. కోర్టుకు దీపావళి సెలవు దినాలు మొదలుకానున్న నేపథ్యంలో ఈ కేసుల వాదోపవాదనలను ముగించలేకపోతున్నానని ఆయన చెప్పారు. కేసులో తగిన పత్రాల దాఖలుకు సంబంధిత న్యాయవాదులకు తగు గడువు ఇస్తున్నట్లు ఆయన వెల్లడించారు. సీజేఐ చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్ధివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాల ధర్మాసనం కాకుండా ఈ కేసుల తదుపరి విచారణను మరో ధర్మాసనం ఆలకించే వీలుంది. మైనర్కాని భార్యతో బలవంతంగా శృంగారం చేసిన భర్తకు భారతీయ శిక్షా స్మృతి, భారతీయ న్యాయ సంహిత(బీఎన్ఎస్) చట్టాలు విచారణ నుంచి రక్షణ కల్పిస్తున్న విషయం తెల్సిందే. ఈ కేసుల విచారణ అక్టోబర్ 17న మొదలైంది. ఐపీసీ సెక్షన్ 375 ప్రకారం 18ఏళ్లు దాటిన భార్యతో బలవంతగా భర్త సంభోగించినా అది రేప్గా పరిగణించబోరు. అలాగే బీఎన్ఎస్లోని సెక్షన్ 63(రేప్)(2) ప్రకారం చూసినా ఈ చర్యను అత్యాచారంగా పరిగణించరు. మారుతున్న సామా జిక పోకలు, ఆధునిక సమాజంలో భర్త సాన్నిహిత్య పరిస్థితుల్లో భార్య సమ్మతి ఉంది లేదు అనే అంశాన్ని నిరూపించడం అసంభవమని కేంద్రం గతంలో సుప్రీంకోర్టుకు తెలిపింది. చట్టాలను దుర్విని యోగం చేస్తూ ఈ మినహాయింపు రక్షణ నుంచి భర్తను పక్కకు జరిపితే భారతీయ సామాజిక, కుటుంబ వ్యవస్థలో కొత్త సమస్యలు ఉత్పన్నమ య్యే ప్రమాదముందని కేంద్రం పేర్కొంది. -
ట్రెండింగ్లో సాక్షి మాలిక్: ఆమె భర్త ఎవరో తెలుసా? అతడి బ్యాగ్రౌండ్ ఇదే! (ఫొటోలు)
-
ఐదు రోజులుగా భర్త అంత్యక్రియలను నిర్వహించని భార్య
సదాశివపేట రూరల్(సంగారెడ్డి): ఆస్తి వివాదంతో జీవితంపై విరక్తి చెంది ఉరేసుకొని యువకు డు ఆత్మహ్యకు పాల్పడ్డాడు. ఆస్తిలో వాటా ఇవ్వాల్సిందేనని మృతుడి భార్య, బంధువులు ఆందోళన చేపట్టడంతో ఐదు రోజుల తర్వాత అంత్యక్రియలు జరిగాయి. ఈ ఘటన సదాశివపేట మండల పరిధిలోని తంగడపల్లి గ్రామంలో మంగళవారం ఆలస్యంగా వెలు గులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన సిరిపురం మణయ్య, మణెమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు నవీన్, రాములు, కుమార్తె రజిత ఉన్నారు. గతేడాది చిన్న కుమారుడు నవీన్ మృతి చెందాడు. అతడి భార్యకు భూమి ఇవాల్సి వస్తుందని మణయ్య, మణెమ్మ దంపతులు తమ మూడెకరాల భూమిని అల్లుడు హోంగార్డ్ మల్లేశం పేరుపై సెల్ డీడ్ చేశారు. ఈ విషయం తెలిసి భూమిలో సగం వాటా తనకు ఇవ్వాలని పెద్దకుమారుడు రాములు(32) అడిగాడు. వారు ఒప్పుకోకపోవడంతో మనస్తాపానికి గురై 18న ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని అదే రోజు రాత్రి సదాశివపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఆస్తిలో తమకు వాటా ఇవ్వాలని మృతుడి భార్య, బంధువులు ఆందోళన చేశారు. ఈ నేపథ్యంలో మృతదేహం ఐదురోజులుగా ఆస్పత్రిలోనే ఉంది. మంగళవారం సమస్య సద్దుమణగడంతో మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. వారి ఫిర్యాదు మేరకు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టినట్లు సీఐ మహేష్ గౌడ్ తెలిపారు. -
‘కర్వా చౌత్’ హామీని విస్మరించిన భర్తపై ఫిర్యాదు
ఆగ్రా: యూపీలోని ఆగ్రాలో ఒక విచిత్ర ఉదంతం చోటుచేసుకుంది. పుట్టింటిలో ఉన్న ఒక మహిళకు ఆమె భర్త ‘కర్వా చౌత్’ వ్రతానికి ముందురోజు తన ఇంటికి తీసుకువెళానని హామీనిచ్చాడు. అయితే దానిని భర్త నెరవేర్చకపోవడంతో భార్య నేరుగా పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేసింది.వివరాల్లోకి వెళితే మల్పురా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక యువతికి ఏడాది క్రితం మధురలో వివాహం జరిగింది. ఆమె భర్త ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. పెళ్లయిన నాలుగు నెలల వరకూ వారి కాపురం సవ్యంగానే సాగింది. ఆ తర్వాత ఆమెకు భర్త, అత్తమామల నుంచి వేధింపులు మొదలయ్యాయి.దీనిని ఆమె వ్యతిరేకించడంతో అత్తామామలు ఆమెను ఇంటి నుంచి గెంటివేశారు. దీంతో ఆమె రెండు నెలలుగా తన పుట్టింటిలోనే ఉంటోంది. అలాగే ఈ విషయమై బాధితురాలు ఆగ్రా ఫ్యామిలీ కౌన్సెలింగ్ సెంటర్ను ఆశ్రయించింది. ఈ నేపధ్యంలో భర్త కర్వా చౌత్ వ్రతానికి ఒక రోజు ముందు తన భార్యను ఇంటికి తీసుకెళ్తానని కౌన్సెలర్ ఎదుట హామీనిచ్చాడు.అయితే భర్త ఈ హామీని విస్మరించాడు. దీంతో కౌన్సెలింగ్ అధికారులు భర్తను కేంద్రానికి పిలిపించారు. అక్కడికి వచ్చిన భర్త కౌన్సెలింగ్ అధికారులతో తన భార్య తన తల్లిదండ్రులతో అసభ్యకరమైన భాషలో మాట్లాడుతుంటుందని ఆరోపించాడు. ఉదయం 9 గంటల వరకు నిద్రపోతూనే ఉంటుందని, ఏ పనీ చేయదని పేర్కొన్నాడు. ప్రస్తుతం భార్యాభర్తలిద్దరికీ కౌన్సెలింగ్ జరుగుతోంది. ఇది కూడా చదవండి: నగరమంతా తిప్పి.. సెల్ఫోన్తో ఉడాయించి.. -
పెళ్లింట విషాదం.. భార్యకు పురుగులమందు కలిపి
సాక్షి, నల్లగొండ: పెళ్లింట విషాదం చోటుచేసుకుంది. పురుగులమందు కలిపిన కూల్డ్రింక్ను భార్యకు తాగించి.. ఓ భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. ఆమె ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఏఎస్ఐ ప్రభాకర్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. నల్లగొండ జిల్లా గుర్రంపోడు మండలం మొసంగి గ్రామానికి చెందిన బడుగుల వెంకటయ్య(43)– జ్యోతి దంపతులు ఈనెల 16న కుమార్తె వివాహం జరిపించారు. ఆదివారం తమ కుమార్తెను అత్తగారి ఇంటి నుంచి తీసుకురావాల్సి ఉండగా, పురుగుల మందు కలిపిన కూల్ డ్రింక్ను భార్య జ్యోతికి ఇచ్చి, తాను గదిలోకి వెళ్లి తలుపులు వేసుకొని గడియ పెట్టుకున్నాడు. అప్పటికే కొంచెం కూల్డ్రింక్ తాగిన జ్యోతి పురుగుల మందు వాసన ఉండడంతో పారబోసింది. అనుమానం వచ్చి చుట్టుపక్కల వారిని పిలిచింది. వారు వచ్చి తలుపులు తెరిచారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో హుటాహుటిన నల్లగొండకు తరలించారు. వెంకటయ్య మృతి చెందగా, జ్యోతి ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఆమె పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టు సమాచారం. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదని పోలీసులు తెలిపారు.ఇంగ్లిష్ మీడియంలో పాఠాలు అర్థం కావడంలేదని.. చిలుకూరు: ఇంగ్లిష్ మీడియంలో పాఠాలు అర్థం కావడం లేదని, దీంతో మార్కులు తక్కువ వస్తున్నాయని ఇంటర్ విద్యార్థి మనస్తాపంతో ఉరివేసుకొని ఆత్యహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా చిలుకూరు మండల పరిధిలోని కవిత జూనియర్ కళాశాలలో ఆదివారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. పోలీసులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలం సజ్జాపురానికి చెందిన బీమన శేఖర్ కుమారుడు బీమన వినయ్ (17) చిలుకూరు మండల పరిధిలోని కవిత జూనియర్ కళాశాలలో ఎంపీసీ గ్రూప్లో చేరాడు. 10వ తరగతి వరకు తెలుగు మీడియంలో చదివిన వినయ్.. ఇంటర్లో ఇంగ్లిష్ మీడియంలో సబ్జెక్టులు అర్థంకాక మార్కులు తక్కువగా వస్తున్నాయని కొంతకాలంగా బాధపడుతున్నాడు. ఈ క్రమంలో దసరా సెలవులకు ఇంటికి వెళ్లిన వినయ్ తిరిగి కళాశాలకు వెళ్లడానికి ఇష్టపడలేదు. దీంతో తల్లిదండ్రులు సర్ది చెప్పి ఆదివారం అతడిని మేనమామ, బంధువులు తీసుకొని వచ్చి కళాశాలలో విడిచి పెట్టి వెళ్లారు. ఆ సమయంలో స్టడీ అవర్స్ నడుస్తుండటంతో విద్యార్థులు, అధ్యాపకులు తరగతి గదుల్లో ఉన్నారు. హాస్టల్ గదిలో లగేజీ పెట్టి వస్తానని వెళ్లిన వినయ్ అక్కడున్న ఫ్యాన్కు టవల్తో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అరగంట తరువాత గమనించిన తోటి విద్యార్థులు, అధ్యాపకులు వెంటనే అతడిని చికిత్స నిమిత్తం కోదాడలోని ప్రైవేట్ వైద్యశాలకు తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. వినయ్ తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రాంబాబు తెలిపారు. దసరా సెలవులు ముగించుకుని తిరిగి వెళ్లిన రోజే ఇలా జరగడంతో కుటుంబ సభ్యులు దిగ్భ్రాంతికి లోనయ్యారు. -
భార్యాభర్తల సంబంధాలు ఎలా ఉండాలి?
అల్లాహ్ స్త్రీలపై పురుషులకు కొంత ఆధిక్యత ప్రసాదించడం వల్ల, పురుషులు తమ సంపదను స్త్రీల కోసం ఖర్చు పెడుతున్నందువల్ల పురుషులు స్త్రీలపై వ్యవహార కర్తలవుతారు. కనుక సుగుణవతులైన స్త్రీలు తమ భర్తకు విధేయత చూపుతూ వారి కనుసన్నలలో నడుచుకుంటారు. పురుషులు (ఇంటిపట్టున) లేనప్పుడు దేవుని రక్షణలో వారి హక్కులు కాపాడుతుంటారు. మీ మాటలకు ఎదురు చెప్పి తిరగబడతారని భయం ఉన్న స్త్రీలకు (నయానా భయానా) నచ్చజెప్పండి. (అలా దారికి రాకపోతే) వారిని మీ పడకల నుండి వేరు చేయండి. ఆ తరువాత వారు మీకు విధేయులయిపోతే ఇక వారిని అనవసరంగా వేధించడానికి సాకులు వెతకకండి. పైన అందరికంటే అధికుడు, అత్యున్నతుడైన అల్లాహ్ ఉన్నాడని గుర్తుంచుకోండి.భార్యాభర్తల మధ్య సంబంధాలు చెడిపోతాయని భయం ఉంటే భర్త బంధువుల నుండి ఒక మధ్యవర్తిని భార్య బంధువుల నుండి ఒక మధ్యవర్తిని పెట్టుకోండి. వారిద్దరు కలిసి పరిస్థితిని చక్కదిద్దదలచుకుంటే అల్లాహ్ దంపతుల మధ్య సానుకూలత కలిగిస్తాడు. అల్లాహ్ సర్వజ్ఞాని. సమస్తమూ ఎరిగినవాడు. (దివ్య ఖుర్ఆన్: 4:34–35)వివరణ: భార్య విననప్పుడు నచ్చజెప్పడం, పడకగదికి దూరంగా ఉండటం, విధేయత కనబరిస్తే ఆమెను మనసారా స్వీకరించడం ఎంత దానశీలి అయినా, ఎన్నిసార్లు దైవపూజలు చేసే వారయినా, భార్యని కొట్టే వారిని ప్రవక్త అభిమానించేవారు కాదు. 35 ఆయత్ (వాక్యం)లో అల్లాహ్ ఎంతోమంచి పరిష్కారం చూపాడు. భార్యాభర్తల మధ్య పొసగనపుడు అటువైపు నుండి ఒక మధ్యవర్తి ఇటువైపు నుండి ఒకరు మధ్యవర్తిత్వం వహించి వారిద్దరి మధ్య సమాధానం కుదిరిస్తే ఆ దంపతులు కూడా సమాధాన పడితే ఇద్దరి మధ్య అల్లాహ్ సానుకూలత కలిగిస్తాడు. మనిషికి దేవుడు మంచి చెడుల విచక్షణ జ్ఞానం, స్వేచ్ఛ, స్వాతంత్రాలు ఇచ్చాడు. కాబట్టి వాటిని ఆయన అడ్డుకోకుండా స్వయంగా మనిషి సంకల్పించుకుంటే అల్లాహ్ దానిని పరిపూర్ణం చేస్తాడు. ఏ విషయంలోనూ ఎవరికీ బలవంతం పెట్టాడు. మనిషి విచక్షణను బట్టి అల్లాహ్ ఆ మనిషితో వ్యవహరిస్తాడు. కాబట్టి మనుషులమైన మనం మంచిని ఆలోచిస్తూ మంచినే కాంక్షిస్తూ మంచి చేస్తుంటే దేవుడు కూడా సహకరిస్తాడు. అంతా మంచే జరుగుతుంది. అల్లాహ్ మనందరికీ మంచి చేసే భాగ్యాన్ని కలుగజేయుగాక ఆమీన్ (తథాస్తు)ఆధారం: అంతిమ దైవ గ్రంథం ఖుర్ఆన్ భావామృతం– మొహమ్మద్ అబ్దుల్ రషీద్ -
కోడలు వరకట్నం కేసు పెట్టిందని...
రాంగోపాల్పేట్: భర్తతో పాటు అత్తా, మామలపైన కోడలు వరకట్న వేధింపుల కేసు నమోదు చేయించడంతో మనస్థాపం చెందిన ఓ కుటుంబంలోని ముగ్గురు ట్యాబ్లెట్లు, ఇంజక్షన్ తీసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ ఘటన మహంకాళి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం నాగోల్కు చెందిన తోట భావనారాయణ (52), పద్మావతి (47) భార్యాభర్తలు, వీరి కుమారుడు సుజన్ (23). భావనారాయణ, సుజన్లు ప్రైవేటు కంపెనీలో మార్కెటింగ్ విభాగంలో పనిచేస్తుండగా పద్మావతి గృహిణి. సుజన్(23)కు కొత్తగూడెం చుంచుపల్లి ప్రాంతానికి చెందిన కావ్యశ్రీతో ఇదే ఏడాది ఫిబ్రవరి 14వ తేదీన వివాహం చేశారు. వివాహం జరిగిన కొద్ది రోజులకే భార్యాభర్తల మధ్య గొడవలు మొదలయ్యాయి. దీంతో కావ్యశ్రీ ఇటీవల చుంచుపల్లి పోలీస్ స్టేషన్లో వరకట్న వేధింపుల కేసు నమోదు చేయించింది. చుంచుపల్లి పోలీసులు సుజన్కు ఫోన్ చేసి తల్లిదండ్రులతో పాటు కౌన్సిలింగ్ కోసం రావాలని ఇటీవల కోరగా రెండు మూడు రోజులు టైం అడిగారు. మంగళవారం ఉదయం పోలీస్ స్టేషన్కు రావాలని మరో మారు పోలీసులు సూచించారు. దీంతో ఈ నెల 5వ తేదీ ఉదయం ఆన్లైన్ ద్వారా సికింద్రాబాద్ ప్రాంతంలోని తాజ్ ట్రైస్టార్ హోటల్ మూడవ అంతస్తులోని 308 గదిని బుక్ చేసుకుని ముగ్గురు అక్కడ దిగారు. సోమవారం రాత్రి కోడలు కావ్యశ్రీకి ఫోన్ చేసి కేసు విత్డ్రా చేసుకోవాలని, లేకపోతే తాము కుటుంబంతో సహా ఆత్మహత్య చేసికుంటామని చెప్పారు.ఆ తర్వాత వారి మధ్య సంభాషణ ఏమి జరిగిందో తెలియదు కానీ..మంగళవారం ముగ్గురు డైజోఫాం ట్యాబ్లెట్లు, షుగర్కు వాడే ఇన్సులిన్ ఎక్కువ మోతాదులో తీసుకున్నారు. ఉదయం 10.30 గంటల వరకు వీరి గది తలుపులు తెరవకపోవడంతో పాటు హోటల్ సిబ్బంది తలుపు కొట్టినా ఎలాంటి స్పందన రాలేదు. దీంతో మరో తాళం చెవితో తాళం తెరిచి చూడగా ముగ్గురు అపస్మారక స్థితిలో ఉన్నారు. దీంతో వెంటనే మహంకాళి పోలీసులకు సమాచారం అందించి వారిని యశోద ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత పద్మావతి సోదరి అక్కడికి చేరుకుని ఆర్థిక పరిస్థితి బాగాలేదని గాం«దీకి తీసుకుని వెళ్లారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉందని, ఇప్పటికిప్పుడు ఏమీ చెప్పలేమని వెల్లడించారు. మహంకాళి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
చనిపోయిన భార్యపై ప్రేమతో..
బ్రహ్మపూర్: భార్యాభర్తల బంధం విడదీయరానిదని అంటారు. ఆలుమగలులో ఏ ఒక్కరు దూరమైనా మరొకరు విలవిలలాడిపోతారు. ఒంటరితనానికి లోనవుతుంటారు. అయితే ఒడిశాలోని బ్రహ్మపూర్కు చెందిన ఓ భర్త తన భార్య చనిపోయాక, ఆమెను మరచిపోలేక చేసిన పనిని చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.దక్షిణ ఒడిశాలోని బ్రహ్మపూర్లో ప్రశాంత్ నాయక్(52) అనే వ్యాపారవేత్త భార్య కిరణ్ కరోనా కాలంలో మరణించారు. వారిద్దరికీ 1997లో వివాహం జరిగింది. వారికి ముగ్గురు సంతానం. ప్రశాంత్ తన భార్య దూరమవడాన్ని జీర్ణించుకోలేక పోయాడు. దీంతో ఆయన సిలికాన్ మెటీరియల్తో భార్య విగ్రహాన్ని తయారు చేయించాడు. దానిని తన డ్రాయింగ్ రూమ్లో ఉంచాడు. ప్రశాంత్ తన పెద్ద కూతురు వివాహం సందర్భంగా ఆ సిలికాన్ విగ్రహానికి చీర, నగలు ధరింపజేశాడు.ప్రశాంత్ కుమార్తె మెహక్ తన తల్లి విగ్రహాన్ని ఎంతో అపురూపంగా చూసుకుంటుంది. ప్రతీరోజూ ఆ విగ్రహానికి చీరలు, నగలు మారుస్తుంటుంది. మెహక్ ప్రస్తుతం ఎంబీఏ చదువుతోంది. ఈ విగ్రహాన్ని చూసినప్పుడల్లా తన భార్య తనతోనే ఉన్నట్లు అనిపిస్తుందని ప్రశాంత్ తెలిపారు. ఇంట్లో అమ్మ విగ్రహం ఏర్పాటు చేయాలని తన పిల్లలు కోరారని ప్రశాంత్ పేర్కొన్నారు.బెంగళూరుకు చెందిన శిల్పి ఫైబర్, రబ్బరు, సిలికాన్ ఉపయోగించి ఏడాదిపాటు శ్రమించి ఈ విగ్రహాన్ని రూపొందించారు. ఇందుకోసం ప్రశాంత్ కుమార్ ఎనిమిది లక్షల రూపాయలు ఖర్చు చేశారు. ఈ విగ్రహాన్ని ప్రశాంత్ తన పెద్ద కుమార్తె పెళ్లికి ముందు ఇంటికి తీసుకువచ్చారు. ఆ విగ్రహాన్ని చూసినప్పుడల్లా తమ తల్లి తమతోనే ఉన్నదనిపిస్తుందని ప్రశాంత్ పిల్లలు చెబుతుంటారు.ఇది కూడా చదవండి: Weekly Horoscope: ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే.. -
భర్త పుట్టినరోజు.. బోలెడంత ప్రేమతో నయనతార పోస్ట్ (ఫొటోలు)
-
ఆయనకు స్త్రీ లాగా అలంకరించుకోవడం ఇష్టం!
మా ఆయన వయసు 27 ఏళ్లు. మా పెళ్లై ఏడాదయింది. ఒకరోజు రాత్రి నా దుస్తులు ధరించి అద్దంలో చూసుకుంటూ మురిసిపోవడం చూసి షాక్ తిన్నాను. ఏమిటిది అని అడిగితే అలా డ్రెస్ చేసుకుని ఆనందిస్తుంటానని చెప్పారు. నేనెంత గొడవ చేస్తున్నాన, ఆయన మాత్రం అప్పుడప్పుడు అలా చేస్తూనే ఉన్నాడు. రాత్రిపూట నా డ్రెస్ వేసుకుని, ఉదయం మార్చుకుని ఆఫీసుకు వెళుతున్నారు. ఇతరత్రా మేము హ్యాపీగానే ఉన్నాం కానీ ఈ అలవాటు ఇలాగే కొనసాగితే ఎటువంటి పరిణామాలకు దారితీస్తుందోనని చాలా భయంగా ఉంది. మా వారి ఈ వింత ప్రవర్తనకు ఏదైనా పరిష్కారముందా?– సంధ్య, హన్మకొండమీ వారు ట్రాన్స్ వెస్టిజమ్ అనే ఒక అరుదైన సమస్యకు లోనయినట్లు అర్థమవుతోంది. పురుషుడు స్త్రీగాను, స్త్రీ– పురుషుడుగానూ అలంకరించుకుని లైంగికానందం పోందే ఈ వింత సమస్యకు ఒక ముఖ్య కారణం చిన్న వయసులో తల్లిదండ్రులు అమ్మాయిలు లేరని అబ్బాయిలకు గౌను, జడ వేసి పూలు పెట్టి అమ్మాయిలు లేని లోటును ఇలా తీర్చుకోవటం. మీ దాంపత్య జీవితం బాగానే ఉందన్నారు కాబట్టి కొంతవరకు నయం. మీరు ఆయనను ఎలాగైనా చికిత్సకు ఒప్పించగలిగితే సైకియాట్రిస్టుల పర్యవేక్షణలో బిహేవియర్ మాడిఫికేషన్, కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ లాంటి కొన్ని ప్రత్యేక మానసిక చికిత్సలు చేసి మీ వారిని ఆ ప్రవర్తన నుంచి బయట పడేయవచ్చు. కేవలం మందుల ద్వారా లేదా కౌన్సెలింగ్ ద్వారా ఇలాంటి వింత ప్రవర్తనను మార్చలేము. రెండూ అవసరమే.ప్రేమికుడు దూరమవుతాడేమో...నేను గత రెండు సంవత్సరాలనుండి ఒక అబ్బాయిని ప్రేమిస్తున్నాను. ఇప్పటివరకు సంతోషంగానే ఉన్నాం కానీ ఈ మధ్య నాలో ఒక కొత్త భయం మొదలయింది. తను ఇంకెవరితో అయినా కొత్తగా బంధాన్ని ఏర్పరుచుకుంటాడేమో అని.. ఈ ఆలోచన నుంచి నేను బయట పడలేక΄ోతున్నాను. దీనికి కారణం ఏంటి? ఎలా ఈ ఆలోచన నుంచి బయటపడాలి?– రాణి, జనగామమీలో ఏర్పడిన ఈ భయం కేవలం మీ ఊహ కావచ్చు. అకారణంగా కొందరిలో ఇలాంటి అభద్రతా భావాలు రావడం సహజమే! ఈ అభద్రత రావడానికి మీ రిలేషన్లో ఇటీవల ఏమైనా ఆ మార్పులు వచ్చాయా? లేక మీరు ఇంకేదైనా ఒత్తిడిలో ఉండి ఇలా ఆలోచిస్తున్నారా అని స్వయం పరిశీలన చేసుకోండి. మీ ప్రేమికుడితో మీ భయాన్ని పంచుకోండి. అతణ్ణి నొప్పించకుండా, నిందించకుండా ఎలాంటి సందర్భాలలో మీకీ భావాలు కలుగుతున్నాయో చెప్పడం ద్వారా అతను కూడా మీ బాధను అర్థం చేసుకుని, మీలోని ఫీలింగ్స్ను తగ్గించేందుకు తప్పకుండా సహకరిస్తాడు. మీ అభద్రత భావాన్ని అధిగమించాలంటే ఇద్దరూ కలిసి సమయాన్ని గడపటం, ఇద్దరికీ ఇష్టమైన పనులు చేస్తూ ఉండాలి. దీనివల్ల మీ బంధం మరింత గట్టిపడుతుంది. మీలో ఆత్మవిశ్వాసం పెంచుకునేందుకు, ఏదైనా కొత్త హాబీ, ధ్యానం, వ్యాయామం లాంటివి చేయండి. ఇదే విషయం గురించి అతిగా ఆలోచించడం మానేసి, అతడిలో మీకు బాగా నచ్చిన విషయాలు లేదా అంశాలు ఏంటో ఒకసారి గుర్తుచేసుకోండి. దీర్ఘకాలం ΄ాటు ఉండే రిలేషన్షిప్స్లో అభద్రత కొంత సహజమే అయినప్పటికీ అది మిమ్మల్ని మరీ బాధించి, మనోవేదనకు గురి చేస్తుంటే మాత్రం ఒకసారి సైకియాట్రిస్ట్ను లేదా క్లినికల్ సైకాలజిస్టును మీ ఇద్దరూ కలిస్తే, మీలోని ఈ భయాన్ని, అభద్రతను తగ్గించి, మీ మధ్య సంబంధాన్ని మరింత బలపర్చేందుకు కౌన్సెలింగ్ ద్వారా తగిన సూచనలు, సలహాలు చేస్తారు. ఆల్ ద బెస్ట్!– డా. ఇండ్ల విశాల్ రెడ్డి సీనియర్ సైకియాట్రిస్ట్, విజయవాడ. మీ సమస్యలు, సందేహాలు పంపవలసిన మెయిల్ ఐడీ: sakshifamily3@gmail.com -
కేరళలో తొలిసారి.. భర్త స్థానంలో సీఎస్గా బాధ్యతలు స్వీకరించిన భార్య
తిరువనంతపురం: కేరళలో అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పదవీ విరమణ చేస్తున్న భర్త స్థానంలో భార్య నూతన చీఫ్ సెక్రటరీగా బాధ్యతలు చేపట్టారు. 1990 బ్యాచ్ ఐఏఎస్ అధికారి వేణు కేరళ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఆగష్టు 31న పదవీ విరమణ చేశారు. వేణు స్థానంలో ఆయన భార్య శారదా మురళీధరన్ సీఎస్ పదవి బాద్యతలు చేపట్టారు.ఆమె గతంలో ప్రణాళిక విభాగంలో అదనపు ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. 1990 బ్యాచ్ ఐఏఎస్ శారదను తదుపరి సీఎస్గా ఎంపిక చేస్తూ కేరళ కేబినెట్ ఆగష్టు 21న నిర్ణయం తీసుకుంది. కాగా కేరళ చరిత్రలోనే తొలిసారి ప్రధాన కార్యదర్శిగా రిటైర్ అవుతున్న భర్త స్థానంలో భార్య బాధ్యతలు స్వీకరించడం ఇదే తొలిసారి కావడం విశేషం.For the first time in India (at least as far as anyone can remember!), Kerala’s outgoing ChiefSecretary, Dr V, Venu, handed over the CS’s post to his wife, Sarada Murlidharan, at a formal handover ceremony at the secretariat in Thiruvananthapuram. Both are IAS officers of the… pic.twitter.com/E0nZmDDIWi— Shashi Tharoor (@ShashiTharoor) September 1, 2024కాగా భార్యభర్తలిద్దరూ 1990 బ్యాచ్ ఐఏఎస్ అధికార్లే అయినప్పటికీ.. వేణు అతని భార్య కంటే కొన్ని నెలలు పెద్దవాడు. ఇదిలా ఉండగా ఈ విషయాన్ని తిరువనంతపురం కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ‘తిరువనంతపురంలోని సచివాలయంలో జరిగిన అధికారిక కార్యక్రమంలో భారతదేశంలోనే తొలిసారిగా (ఎవరికైనా గుర్తున్నంత వరకు!) కేరళ ప్రధాన కార్యదర్శి డాక్టర్ వీ వేణు.. ఆయన భార్య శారదా మురళీధరన్కు సీఎస్ పదవిని అప్పగించారు.’ అని పేర్కొన్నారు.శుక్రవారం వేణు వీడ్కోలు సందర్భంగా సీఎం పినరయి విజయన్ మాట్లాడుతూ.. కేరళ చరిత్రలోనే తొలిసారి ప్రధాన కార్యదర్శిగా రిటైర్ అవుతున్న భర్త వీ వేణు నుంచి శారదా మురళీధరన్.. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరిస్తున్నారని చెప్పారు. ఇటువంటి ఘటనలు అరుదుగా జరుగుతాయన్నారు. భార్యాభర్తలు ఇద్దరూ కలెక్టర్లుగా.. వివిధ శాఖల అధిపతులుగా, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులుగా వేర్వేరు సమయాల్లో విధులు నిర్వర్తిస్తుంటారని అన్నారు. -
భర్తకు రెండో వివాహం చేసిన భార్య..
మహబూబాబాద్ అర్బన్ : ఓ భార్య తన భర్తకు దగ్గర ఉండి మరో వివాహం చేసింది. తాను ఇష్టపడుతున్న యువతితో ఏడు అడుగులు వేయించింది. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని భక్తమార్కండేయ దేవాలయంలో జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. చిన్నగూడురు మండలం ఉగ్గంపల్లి గ్రామానికి చెందిన దాసరి సురేశ్, సరిత దంపతులకు కొన్ని ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి కుమారుడు, కుమారై ఉన్నారు. కాగా, జిల్లా కేంద్రంలోని భక్తమార్కండేయ గుడి వీధికి చెందిన లాకా పద్మ, వీరస్వామి దంపతుల చిన్న కుమారై సంధ్య వరుసకు సురేశ్కు మరదలు అవుతుంది. సంధ్య మానసిక దివ్యాంగురాలు. సంధ్యను ఇష్టపడుతున్నట్లు సురేశ్ తన భార్య సరితకు చెప్పడంతో ఆమె భర్త రెండో వివాహనికి అంగీకరించింది. దీంతో బుధవారం ఇరువర్గాల పెద్దలు, భార్య సరిత సమక్షంలో పట్టణంలోని భక్తమార్కండేయ దేవాలయంలో వివాహం జరిపించారు. కాగా, భర్తకు రెండో వివాహం జరిపించిన విషయం సోషల్ మీడియాలో, జిల్లా కేంద్రంలో చర్చనీయాంశమైంది. దీనిపై సరితను వివరణ కోరగా సంధ్యను తన భర్త సురేశ్ ఇష్టపడ్డాడని, సంధ్య మానసిక దివ్యాంగురాలు అన్నారు. పిల్లల మనసత్వం కలదని, తన పిల్లల మాదిరిగానే చూసుకుంటానని చెప్పింది. పోలీసులకు ఫిర్యాదు..వివాహం జరగకముందు సంధ్య సోదరి భర్త నాగరాజు ఉదయం 11 గంటలకు తన మరదలు మానసిక దివ్యాంగురాలు కావొచ్చన్నారు. కానీ రెండో వివాహం చేయడం నేరమని గొడవకు దిగి 100 డయల్కు కాల్ చేశాడు. బ్లూకోర్టు సిబ్బంది వివాహం జరుగుతున్న ఆలయానికి చేరుకుని ఆధార్ కార్డు పరిశీలించారు. పెళ్లికూతురు మేజరని, ఇరువురి ఇష్టపూర్వకంగా వివాహం జరుగుతుందని తెలిపారు. 100 డయల్కు కాల్ చేసిన వ్యక్తిని మందలించి అక్కడి నుంచి పంపించారు. ఇదిలా ఉండగా రెండో వివాహాన్ని పోలీసులే ప్రోత్సహించారని పలువురు పెద్దలు పేర్కొన్నారు. -
భర్తకు రెండో పెళ్లి చేసిన గొప్ప భార్య
-
ఎమ్మెల్యే గల్లా మాధవి భర్త అరాచకాలు..
సాక్షి ప్రతినిధి, గుంటూరు: గుంటూరు పశ్చిమ తెలుగుదేశం ఎమ్మెల్యే గళ్లా మాధవి భర్త గళ్లా రామచంద్రరావు అరాచకాలు పెచ్చరిల్లుతున్నాయి. తన రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం ఓ రైతును బెదిరించడమేకాకుండా, అతనిపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయించిన ఘటన తాజాగా వెలుగుచూసింది. పోలీసులు కూడా గళ్లా రామచంద్రరావుకే మద్దతు పలుకుతుండటంతో బాధితుడు జిల్లా కోర్టును ఆశ్రయించాడు. వివరాల్లోకి వెళ్తే.. పెదకూరపాడు నియోజకవర్గం పీసపాడు గ్రామానికి చెందిన కమ్మ వెంకటరావు గుంటూరు విద్యానగర్లో నివాసం ఉంటున్నాడు. అతనికి పిడుగురాళ్లలో సుమారు 8 ఎకరాల పొలం ఉంది. గళ్లా రామచంద్రరావుకు చెందిన భ్రమర రియల్ ఎస్టేట్కు గతంలో వెంకటరావు ఎకరం రూ. 48 లక్షలు చొప్పున 4.90 ఎకరాలు అమ్మాడు. దీనికి సంబంధించి గతేడాది ఏప్రిల్ నాలుగున అగ్రిమెంట్ చేసుకుని మూడు చెక్కులు రామచంద్రరావు ఇచ్చాడు. ఆ చెక్కుల్లో రెండు బౌన్స్ అయ్యాయి. ఇది కాకుండా తాను అమ్మకుండా ఉన్న మిగిలిన భూమిలో భ్రమర వారు మట్టి తోలుతున్నారని తెలిసి వెంకటరావు వెళ్లి అడిగితే.. కాళ్లు విరగ్గొడతానని రామచంద్రరావు బెదిరించాడు. దీంతో వెంకటరావు గురజాల కోర్టును ఆశ్రయించి ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చుకున్నాడు. తాము అగ్రిమెంట్ చేయించుకున్న 4.90 ఎకరాలకు ఈ ఏడాది ఫిబ్రవరిలో రిజి్రస్టేషన్ కోసం భమ్రర వారు ప్రయతి్నంచగా.. 1బీ అడంగల్లో 3.90 ఎకరాలు మాత్రమే కనపడుతుండటంతో అంతవరకే రిజిస్టర్ చేయించుకున్నారు. దానికి వెంకటరావుకు డబ్బులు చెల్లించి బౌన్స్ అయిన చెక్కులు వెనక్కి తీసేసుకున్నారు. ఎన్నికలు అవ్వగానే వేధింపులు ఎన్నికలు ముగిసి రామచంద్రరావు భార్య మాధవి ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత వెంకటరావుకు వేధింపులు మొదలయ్యాయి. రిజి్రస్టేషన్ చేయకుండా మిగిలిన ఎకరాతో పాటు వెంకటరావు అమ్మకుండా ఉన్న 3 ఎకరాల 7 సెంట్ల భూమి రూ. 30 లక్షలు ఇస్తామని, రామచంద్రరావుకు పుట్టిన రోజు గిఫ్టుగా ఆ భూమి అంతా రిజి్రస్టేషన్ చేయాలంటూ రామచంద్రరావు అనుచరులు ఒత్తిడి తీసుకురావడంతో పాటు చంపుతాం అంటూ బెదిరించారు. ఈ క్రమంలో గడిచిన శనివారం వెంకటరావు, అతని కుమారుడు హరికృష్ణ బయటకు వచ్చి తిరిగి వెళ్తుంటే వారి బండిని ఢీకొట్టి దాడి చేశారు. కొద్దిసేపటి తర్వాత పట్టాభిపురం పోలీసులు వెంకటరావు, అతని కుమారుడికి వేరేవారితో ఫోన్ చేయించి మీపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదయ్యిందని, ఎమ్మెల్యే కాళ్ల మీద పడి మాట్లాడుకోండి అని చెప్పించారు. దీంతో పోలీసుల వద్దకు వెళ్తే తమకు న్యాయం దక్కదని భావించిన బాధితులు కోర్టును ఆశ్రయించారు. గుంటూరుకు రామచంద్రరావే సీఎం లాంటివాడని, అతనిని కాదంటే బతకలేరంటూ తమను బెదిరిస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. బెంగళూరు నుంచి ఇటీవలే ఇంటికి వచి్చన తనపై కూడా తప్పుడు కేసు నమోదు చేశారని, తమ ప్రాణాలకు ఏమైనా జరిగితే రామచంద్రరావే బాధ్యత వహించాలని హరికృష్ణ ఆవేదన వెలిబుచ్చాడు. -
భారీగా భరణం.. భార్యకు షాకిచ్చిన జడ్జి
సాధారణంగా భారతదేశంలో భర్త నుంచి విడాకులు తీసుకున్నాక మహిళలకు కొన్ని హక్కులుంటాయి. వీటి ద్వారా మాజీ భర్త ఆస్తిని ఆమె అడగవచ్చు. ఆర్థిక సాయంగా భరణం పొందవచ్చు. ఈ క్రమంలోనే ఓ మహిళ తన భర్త నుంచి విడాకులు కోరుతూ భరణం కావాలని కోర్టు మెట్లు ఎక్కింది. అయితే ఒకటి కాదు రెండు కాదు తన భర్త నుంచి నెలవారీ భరణం రూ.6 లక్షలు ఇవ్వాలంటూ కోర్టులో జడ్జి ముందు డిమాండ్ చేసింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్గా మారింది. ఈ ఘటన కర్ణాటకలో వెలుగుచూసింది. ఓ దంపతులు తమకు విడాకులు కోరుతూ కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. అయితే విచారణ సందర్భంగా సదరు వివాహిత.. తన భర్త నుంచి నెలకు భరణంగా రూ. 6.16 లక్షలు ఇప్పించాలంటూ న్యాయమూర్తిని కోరారు.మోకాలినొప్పికి ఫిజియో థెరపీ చేయించుకునేందుకు నెలకు రూ.4 నుంచి 5 లక్షలు, దుస్తులు, షూలకు రూ.15 వేలు, ఇంట్లో భోజనానికి రూ.60 వేలు, హోటల్లో భోజనానికి వెళితే మరికొంత ఖర్చు అవుతుందని మొత్తం లెక్కలు చెప్పింది.😱Wife ask for ₹6,16,300 per month as #MaintenanceAnd her advocate is trying to justify.Judge-"If she want to spend this much, let her earn, not on the husband"pic.twitter.com/XexRGe5hUb— ShoneeKapoor (@ShoneeKapoor) August 21, 2024అవన్నీ విలాసవంతమైన ఖర్చులుఅయితే వివాహిత డిమాండ్లు విన్న మహిళా జడ్జి షాక్కు గురైంది. ఒక్క మహిళకు నెలకు రూ. 6 లక్షలు ఎక్కువ అని, అవన్నీ విలాసవంతమైన ఖర్చులని ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘ఎవరైనా ఇంత ఖర్చు చేస్తారా? మీరు మీ కోసం అంత మొత్తం ఖర్చు చేయాలనుకుంటే మీరు సంపాదించుకోండి. భర్త నుంచి కోరడం కాదు. మీకు వేరే బాధ్యతలు లేవు. పిల్లలను చూసుకునే పని లేదు. ఇవన్నీ మీకోసం మాత్రమే అడుగుతున్నారు. హిందూ వివాహ చట్టం 1955 సెక్షన్ 24 ఉద్దేశం ఇది కాదు. భర్తతో గొడవల కారణంగా విడాకులు అడుగుతున్నారు. కానీ రూ. 6,16,000 అడగటం సరి కాదు. మీ కారణాలు సహేతుకంగా ఉండాలి. భర్తకు ఇది శిక్ష కాకూడదు.’ అంటూ మహిళను హెచ్చరించింది. భర్త నుంచి ఆరు లక్షలు ఇప్పించేందు న్యాయమూర్తి నిరాకరించారు. వాస్తవ ఖర్చులతో మళ్లీ కోర్టుకు రావాలని తెలిపారు. -
ఆయనకు విపరీతమైన అనుమానం!
మా పెళ్ళయి పదేళ్ళయింది. ఇద్దరు పిల్లలు. మొదట్లో కొంతకాలం బాగున్నాం కానీ, తర్వాత నుంచి నా భర్తకు అనుమానం జబ్బు పట్టుకుని నన్ను మానసికంగా వేధిస్తున్నాడు. ప్రతివాళ్లతోనూ నాకు సంబంధం అంటగట్టి అనరాని మాటలతో చిత్రవధ చేస్తున్నాడు. సినిమాలకు, ఫంక్షన్లకు వెళ్ళినపుడు ఈ బాధ మరీ ఎక్కువవుతోంది. ఏం చేయాలో అర్థం కావడంలేదు. దయచేసి సలహా ఇవ్వగలరు. – ఒక సోదరి, తెనాలిమీరనుభవిస్తున్న మానసిక క్షోభను అర్థం చేసుకోగలను. వాస్తవం గాకున్నా... ఎలాంటి ఆధారం లేకున్నా ఇలా భార్యాభర్తలు ఒకరినొకరి శీలాన్ని శంకించే మానసిక రుగ్మతను ‘డెల్యూజనల్ డిజాస్ట్టర్ లేదా కాంజుగల్ ΄ారనోయియా’ అంటారు. మిగతా అన్ని విషయాల్లో వీరు మామూలుగానే ఉంటారు. ఏవేవో ఊహించుకుని ఇలాంటి భ్రమలు– భ్రాంతులకు లోనవుతూ, కేవలం జీవిత భాగస్వామిని మాత్రమే ఇలా అనుమానిస్తూ, వేధిస్తూ ఉంటారు. మానసిక రుగ్మత ఉందంటే ఒప్పుకోరు. మీరు మీ బంధువులు, ఇతర పెద్దల సహకారంతో ఆయన్ని ఏదో ఒక విధంగా ఒప్పించి, వైద్యుల దగ్గరకు వెళ్లగలిగితే, ‘యాంటీ సైకోటిక్స్’అనే మందులు, కౌన్సెలింగ్ ద్వారా చికిత్స చేసి, ఈ అనుమానాల ఊబి నుంచి పూర్తిగా బయటపడేస్తారు. మళ్ళీ మీరు ప్రశాంతంగా, సంతోషంగా జీవితాన్ని గడపగలరు. మా చుట్టాలబ్బాయి చిన్నప్పటినుంచి చదువులో టాప్! రెండు పీహెచ్డీలు చేశాడు. ఒక పెద్ద కంపెనీలో మంచి జీతంతో ఆఫర్ కూడా వచ్చింది. అయితే ఇటీవల ఉన్నట్టుండి అతని ప్రవర్తనలో బాగా మార్పు వచ్చింది. ఎవ్వరితోనూ మాట్లాడడు. ఒక్కడూ గదిలో తలుపులు వేసుకుని కూచుంటాడు. రోజుల తరబడి స్నానం చేయడు. తన లో తాను నవ్వుకోవడం... మాట్లాడుకోవడం. మా బంధువులందరూ చదువు ఎక్కువ అవడం వల్ల ఈ పిచ్చి వచ్చిందంటున్నారు. నిజమేనా?– కుమార్, కర్నూలుచదువుకు, తెలివితేటలకు, మానసిక జబ్బు రావడానికీ ఎలాంటి సంబంధం లేదు. ఇది కేవలం అ΄ోహ మాత్రమే. ఎక్కువ చదివిన వారందరికీ మెంటల్ రావాలని లేదు. అలాగే తెలివితేటలు లేనివారికి, ఎక్కువ చదువుకోనివారికీ మానసిక జబ్బులు రావని ఏమీ లేదు. మానసిక వ్యాధులకు వారసత్వ కారణాలు కొన్నయితే, పరిస్థితుల ప్రభావం, దిగ్భ్రాంతి కలిగించే సంఘటనలు జరగడం, ఆల్కహాల్, డ్రగ్స్ తీసుకోవడం, తీవ్రమైన ఒత్తిడులకు గురికావడం వంటివి ఇతర కారణాలు. ఆలస్యం చేయకుండా అతణ్ణి ఒకసారి సైకియాట్రిస్ట్కు చూపించమని చెప్పండి. స్కిజోఫ్రినియా అనే మానసిక జబ్బుకు లోను కావడం వల్ల వారికి మీరు పేర్కొన్న లక్షణాలుండే అవకాశం ఉంది. తొలిదశలోనే గుర్తించి, సరయిన చికిత్స చేయిస్తే, తొందరగా కోలుకుని తిరిగి మంచి జీవితాన్ని గడపగలడు.– డా. ఇండ్ల విశాల్ రెడ్డి సీనియర్ సైకియాట్రిస్ట్, విజయవాడ. మీ సమస్యలు, సందేహాలు పంపవలసిన మెయిల్ ఐడీ: sakshifamily3@gmail.com -
సునామీలో కొట్టుకుపోయిన భార్య, 13 ఏళ్లుగా వెతుకులాట!
మనకు అత్యంత ప్రియమైన వాళ్లను ఏదైన దుర్ఘటనలో కోల్పోతే ఆ బాధ మాటలకందనిది. ఇది అలాంటి ఇలాంటి ఆవేదన కాదు. అందులోనూ తల్లి బిడ్డలు, భార్యభర్తల్లో ఎవ్వరైన కానరాని లోకలకు వెళ్తే ఆ బాధ అంత తేలిగ్గా మర్చిపోలేంది. బతుకున్నన్ని రోజులు ఆ శోకాన్ని మోస్తుంటాం. అయితే కొన్నేళ్లుకు మాములు మనుషులుగా అవుతాం. రాను రాను వారి జ్ఞాపకాలతో కాలం వెళ్లదీసే ప్రయత్నం చేస్తాం. కానీ జపాన్కి చెందిన వ్యక్తిని చూస్తే ఓ దుర్ఘటనలో గల్లంతైన వ్యక్తి కోసం ఇంతలా కళ్లల్లో ఒత్తులు వేసుకుని అన్వేషిస్తారా అని ఆశ్యర్యపోతారా. ప్రేమంటే ఇది కదా అనే ఫీల్ వస్తుంది. ఎవరతను? అతడి గాథ ఏంటంటే..జపనీస్ వ్యక్తి యసువో టకామట్సుకి 2011లో సంభవించిన ప్రకృతి విపత్తు భార్యను దూరం చేసి, తీరని ఎడబాటు మిగిల్చింది. అయితే ఆ భయానక సునామీలో భార్య కోల్పోయినప్పటికీ ఇప్పటి వరకు ఆమె అవశేషాలు కనిపించలేదు. ఆమెకు అంత్యక్రియలు మంచిగా చేయాలనే ఆశతో ఆ నాటి నుంచి నేటి వరకు ఆమె అవశేషాల కోసం తీవ్రంగా గాలిస్తున్నాడు. నిజానికి ఆ సునామీలో సుమారు 20 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక యుసువో భార్య యుకో ఓ బ్యాంకులో పనిచేస్తుండగా ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ఆమె ఎగిసిన రాకాసి అలల తాకిడికి కొట్టుకుపోయింది. దీంతో తకామాట్సు ఆమె అవశేషాల కోసం ఒక వాలంటీర్ సహాయంతో అన్వేషించడం మొదలుపెట్టాడు. అంతేగాదు తన భార్య అవశేషాలు దొరక్కపోతాయా..? అని డైవింగ్ నేర్చుకుని మరీ మురికినీటిలో ముమ్మరంగా గాలిస్తున్నాడు. మంచు జలాలతో అపారమైన సవాళ్లు ఉన్నప్పటికీ తన భార్య అవశేషాల కోసం ఆ ఇరువురు వెతకడం విశేషం. ఇక యుకో చివరిగా తన భర్త కోసం ఫోన్లో రెండు సందేశాలను పంపింది. ఒకటి పంపేలోపు దుర్ఘటన భారిన పడగా ఇంకొకటి ఈ ఘటనకు కొద్ది క్షణాల ముందు పంపించింది. ఆమె చివరి సందేశం మీరు బాగున్నారా..? ఇంటికి వెళ్లాలనుకుంటున్నా అని పంపించింది. పంపాలనుకున్న సందేశం.. సునామీ అత్యంత వినాశకరమైనద అని నాటి దుర్ఘటనను వివరించే యత్నం చేసింది. కాగా, తకామట్సు ఈ అన్వేషణ ఫలించడం కష్టమని తెలుసు కానీ తాను చేయగలిగింది ఏమన్నా ఉందంటే ఆమె అవశేషాల కోసం అన్వేషించడం మాత్రమే అని ఆవేదనగా చెప్పాడు. అంతేగాదు ఈ సముద్రంలో వెతుకుతూ ఉంటే తాను ఆమెకు దగ్గరగా ఉన్న అనుభూతి కలుగుతుందని కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఈ దంపతులు ప్రేమకు అసలైన అర్థం ఇచ్చారు కదా..!. అంతేగాదు భార్యభర్తలు ఒకరికొకరుగా ఉండటం అనే పదానికి అసలైన భాష్యం ఇచ్చారు ఈ ఇరువురు.(చదవండి: ప్రధాని మోదీకి రాఖీ కట్టేందుకు సరిహద్దులు దాటి వచ్చే పాక్ సోదరి ఎవరో తెలుసా..) -
ఎంత అమానుషం: భార్యను తాడుతో కట్టేసి.. బైక్పై ఈడ్చుకెళ్లిన భర్త
రాజస్థాన్లో అమానుష ఘటన వెలుగుచూసింది. తాగిన మైకంలో ఓ భర్త తన భార్యపై క్రూరంగా ప్రవర్తించాడు. భార్య కాళ్లకు తాడు వేసి దానిని బైక్కు కట్టి కొంతదూరం లాక్కెళ్లాడు. ఈ ఘోర దృశ్యాలకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్గా మారింది. వీడియోలో.. మట్టి, రాళ్లు కలిగిన నేల మీద మహిళను ఈడ్చుకెళ్తుండే.. ఆమె నొప్పితో బాధపడుతూ సాయం కోసం అరవడం వినిపిస్తోంది. అక్కడే ఓ మహిళ, మరో వ్యక్తి (వీడియో తీస్తున్న అతను) ఉన్నప్పటికీ దీనిని ఆపేందుకు కూడా ప్రయత్నించలేదు. నాగౌర్ జిల్లాలో ఈ దారుణం చోటుచేసుకుంది.మహిళను కొంతదూరం లాక్కెళ్లిన తర్వాత అతడు బైక్ దిగి ఓ సాధించినట్లు నడుం మీద చేయి వేసి దర్జాగా నిల్చొని ఉన్నాడు. గాయాలపాలైన భార్య మెల్లగా లేచి ఏడుస్తూ నిలబడి ఉంటుంది. అయితే ఈ 40 సెకన్ల నిడివి గల ఈ వీడియోకు చెందిన ఘటన గత నెలలో జరిగినట్లు తెలుస్తోంది. తాజాగా సోషల్ మీడియాలోషేర్ చేయడంతో చక్కర్లు కొడుతోంది. అయితే జైసల్మేర్లో ఉన్న తన సోదరి ఇంటికి వెళ్లాలని భార్య అనుకోగా..భర్త ఆమెపై ఈ విధంగా దాడి చేసినట్లు తెలుస్తోంది. వ్యక్తిని ప్రేమ్ రామ్ మేఘ్వాల్గా(32) గుర్తించిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. మేఘ్వాల్ నిరుద్యోగి, డ్రగ్స్ బానిసైనట్లు పంచౌడీ పోలీస్ స్టేషన్ అసిస్టెంట్ సబ్-ఇన్స్పెక్టర్ సురేంద్ర కుమార్ తెలిపారు. ప్రస్తుతం మహిళ పంజాబ్లోని తన తల్లిదండ్రుల వద్ద ఉంటున్నట్లు సమాచారం.Shocking incident in Nagaur: A man, under the influence of alcohol,tied his wife to the back of a bike and dragged her on the road.The video went viral, leading to the man's arrest. Prior to this, the wife was reportedly held captive at home. She is now with her mother in Punjab. pic.twitter.com/Nfik4CJpqj— Smriti Sharma (@SmritiSharma_) August 13, 2024 -
ఓటీటీకి క్రేజీ వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్!
కోలీవుడ్ నటుడు సత్యరాజ్, రేఖ ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న తాజా వెబ్ సిరీస్ 'మై హస్బెండ్ ఫర్ఫెక్ట్'. ఈ సిరీస్లో టాలీవుడ్ హీరోయిన్ వర్షబొల్లమ్మ కూడా నటించారు. ఫ్యామిలీ డ్రామాగా రూపొందించిన ఈ వెబ్ సిరీస్కు తమిర దర్శకత్వం వహించారు. తాజాగా ట్రైలర్ రిలీజ్ చేసిన మేకర్స్.. స్ట్రీమింగ్ డేట్ను కూడా ఖరారు చేశారు.ట్రైలర్ చూస్తుంటే ఓ ఉమెన్స్ కాలేజీలో ప్రొఫెసర్గా పనిచేసే పాత్రలో సత్యరాజ్ కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఆయనకు భార్యగా రేఖ కనిపించనున్నారు. టైటిల్ చూస్తుంటేనే భార్య, భర్తల కోణంలోనే కథను తెరకెక్కించినట్లు అర్థమవుతోంది. ట్రైలర్లో వచ్చే సన్నివేశాలు చూస్తుంటే ఫ్యామిలీలో వైఫ్ అండ్ హస్బెండ్ ఎమోషన్స్తోనే ప్రధానంగా తెరకెక్కించారని కనిపిస్తోంది.కాగా.. మై పర్ఫెక్ట్ హస్బెండ్ వెబ్ సిరీస్ను మహమ్మద్ రషిత్ నిర్మించగా.. విద్యాసాగర్ సంగీతం అందించారు. ఈ ఫ్యామిలీ డ్రామా సిరీస్ను ఆగస్టు 16 నుంచి డిస్నీ ప్లస్ హాట్స్టార్ స్ట్రీమింగ్ కానుంది. తమిళంలో రూపొందిన ఈ సిరీస్ తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ, మరాఠీ, బెంగాలీ భాషల్లోనూ అందుబాటులో ఉండనుంది. ఈ విషయాన్ని హాట్స్టార్ అధికారికంగా వెల్లడించింది. -
భార్యకు సర్ఫ్రైజ్ ఇవ్వబోయి పేలిపోయాడు..కట్చేస్తే అతడు..!
హనీమూన్ను గుర్తుండిపోయేలా చేద్దాం అనుకుని భార్యకు ఓ పీడకలను అందించాడు. ఇలాంటి సర్ఫ్రైజ్ ఏ భర్తి ఇంతవరకు ఇచ్చి ఉండడేమో..!. కానీ ఇలాంటి భయానక పరిస్థితి ఏ భార్యకు ఎదురుకాకూడదు. ఈ ఆ ఘటన నుంచి ఆ భార్య ఇప్పటికీ పూర్తిగా బయటపడలేదు కూడా. అసలేం జరిగిందంటే..కెనడాకు చెందిన నూతన వధూవరులు లెవీ స్టాన్ఫోర్డ్, భార్య అమీ హనీమూన్కు వెళ్లారు. అతను తన కుటుంబంలోని ఆరుగురు సభ్యులతో కలిసి మంచి మంచి ప్రదేశాలను చూడటానికి వెళ్లాడు. 23 ఏళ్ల లెవీ తన హనీమూన్ గుర్తుండిపోయేలా చేయడానికి, భార్య అమీని ఆకట్టుకోవడానికి చక్కటి ప్లాన్ వేశాడు. ఐతే లెవీ చిన్నతనంలో గ్రామంలో పెరగడంతో అతడికి పేలుడు పదార్థాలు జీవితంలో ఓ భాగం కూడా. అందువల్ల ఒక పరికరాన్ని సిద్ధం చేశాడు. ఇది సరస్సులో పేలి ఒక అందమైన నీటి ఫౌంటైన్ని సృష్టిస్తుంది. అదే చేద్దాం అనుకున్నాడు లెవీ. అంతేగాదు ఆ పేలుడు శబ్దాన్ని రికార్డు చేయమని తన సోదరుడకి కూడా చెప్పాడు. అతను పరికరాన్ని నీటిలోకి విసిరేద్దాం అనుకుంటుండగా..ఇంకా 60 సెకన్లు ఉందనంగా దురదృష్టవశాత్తు..చేతిలోనే అది పేలిపోయింది. లెవీ ఆ భయానక ప్రమాదంలో ఎడమ చేతిని కోల్పోయాడు. రక్తంలో తడిసిపోయి బట్టలన్నీ ఊడిపోయాయి. చచ్చిపోతున్నంత బాధను అనుభవించాడు. శరీరమంతా గాయలమయం అయిపోయింది. కోలుకోవడానికి సంవత్సరం పట్టింది. ఆ తర్వాత మునుపటిలా ఆర్బరిస్ట్గా పనిచేయలేకపోయాడు. అయితే అతడి ప్రియురాలు, అమీ మాత్రం అతడిని వదిలి వెళ్లిపోలేదు. ఈ చేదు ఘటన తర్వాత వాళ్ల మధ్య ప్రేమ రెట్టింపు అయ్యింది. ఈ ఘటనలో లెవీ ఎడమ చేయి కోల్పోవడమే గాక చాలా భాగాలకు తొడ చర్మాన్ని కత్తిరించి అతికించడం జరిగింది. చెప్పాలంటే శరీరం అంతా గాయాలతో చిందరవందరగా ఉంది. అయినా అతడి భార్య లెవీ వెన్నంటే ఉండి కంటికి రెప్పలా కాచుకుంది. నిజమైన ప్రేమకు అర్థం ఏంటో చూపించింది అమీ. అయితే ఈ చేదు ఘటన తర్వాత ఇరువురు వాదులాడుకోలేదని, భగవంతడు ప్రసాదించిన రెండో జీవితాన్ని సద్వినియోగం చేసే ప్రయత్నం చేశామని ఆత్మవిశ్వాసంగా చెప్పాడు లెవీ. ఇప్పుడు ఆ జంటకు నలుగురు పిల్లలు కూడా. ప్రస్తుతం అతడు ఈ ఘటనతో మోటివేషనల్ స్పీకర్, కమెడియన్, ఎంటర్టైనర్గా ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఒక్కోసారి మరుపురాని జ్ఞాపకంగా మార్చుకుందామని చేసే పనులు మర్చిపోలేని పీడకలలా విధి మార్చేసినా..తట్టుకుని నిలబడి తమ బాంధవ్యాన్ని స్ట్రాంగ్గా చేసుకుంది ఈ జంట. పైగా పరిపూర్ణమైన వ్యక్తులుగా నిలిచి ఎందరిగో స్ఫూర్తినిచ్చారు. ప్రతికూలతలను సానుకూలంగా మార్చుకుని జీవితాన్ని ఆనందమయంగా చేసుకోవడం అంటే ఏంటో తెలియజెప్పింది ఈ జంట. (చదవండి: సారా అలీఖాన్ వెయిట్ లాస్ జర్నీ..96 కిలోల నుంచి..!) -
అక్కడ భర్త జీతం అంతా భార్య చేతిలో పెట్టాల్సిందేనట..!
ఈ రోజుల్లో భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలు చేస్తూ చేతినిండా డబ్బు సంపాదిస్తున్నారు. కానీ ఇదివరకటి రోజుల్లో పరిస్థితులు వేరు. భర్త సంపాదిస్తే.. భార్య ఇంటి బాధ్యతలు చూసుకునేది. తన సంపాదనలో నుంచి ఇంటి ఖర్చులు పోను.. కొంత డబ్బును భార్యకు పాకెట్మనీగా ఇచ్చేవాడు భర్త. అదీగాక మన దేశంలో ఎక్కడ భర్త జీతం మొత్తం తీసుకొచ్చి భార్య చేతలో పెట్టడమనేది అస్సలు జరగని పని. కానీ జపాన్లో మాత్రం జీతం రాగానే రూపాయి ఖర్చు చేయకుండా డబ్బు మొత్తం భార్య చేతిలో పెట్టాల్సిందేనట!ఆపై దానిపై అధికారమంతా ఆమెదే! డబ్బు నిర్వహణ మొత్తం భార్యలే చూసుకోవడం, కొంత మొత్తాన్ని భర్తకు పాకెట్మనీగా ఇవ్వడం అక్కడ ఏళ్లుగా కొనసాగుతోంది. ఈ పద్ధతిని అక్కడ ‘కొజుకై’గా పిలుస్తారు. అక్కడి జనాభాలో దాదాపు 74 శాతం మంది దంపతులు ఇప్పటికీ ఈసంప్రదాయాన్ని అనుసరిస్తున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. అదీగాక చైనా మహిళలు పొదుపు విషయంలో ఇతర దేశాల మహిళకు స్ఫూర్తిగా ఉంటారట.ఇంటి ఖర్చుల గురించి ఇల్లాలి కంటే బాగా ఎవ్వరికీ తెలియదు. ! అందుకే మహిళల్ని హోమ్ మినిస్టర్లు అని పిలుస్తుంటారు. అయితే జపాన్లో భార్యలు ఉద్యోగం చేసినా, చేయకపోయినా.. ఇంటి ఖర్చుల కోసం కొంత డబ్బును భార్య చేతికిస్తారు భర్తలు.ఇది అక్కడ సర్వసాధారణం.పొదుపు మదుపుల్లో నిష్ణాతులు వారే..అక్కడ చాలావరకు ప్రతి ఇంట్లో సంపాదనంతా తెచ్చి భార్య చేతిలో పెట్టే భర్తలే కనిపిస్తారట! ఇలా భర్త సంపాదనను ఖర్చులు, పొదుపులు అనే రెండు వర్గాలుగా విభజించుకుంటారట జపాన్ మహిళలు. ఇంటికి సరిపడా నిత్యావసరాలు, రేషన్, ఇతర ఖర్చులు, పిల్లల స్కూల్ ఫీజులు.. వంటి వాటికి ఖర్చుల కోసం పక్కన పెట్టుకున్న డబ్బును వినియోగిస్తుంటారట అక్కడి మహిళలు!. ఇక ఇందులో నుంచే తమ భర్తకు నెలకు సరిపడా ఖర్చుల కోసం కొంత డబ్బును పాకెట్మనీ రూపంలో అందిస్తుంటారు. ఇలా భర్త డబ్బును మేనేజ్ చేస్తూ.. వాళ్లకు పాకెట్మనీని అందించే ఈ పద్ధతిని ‘కొజుకై’ అనే పేరుతో పిలుస్తున్నారు జపనీయులు. ఇంటి అవసరాల కోసం డబ్బు ఎలా ఖర్చు పెట్టాలో తెలిసినంతగా.. పొదుపు-మదుపులపై మహిళలకు అవగాహన ఉండదనుకుంటారు చాలామంది. ఐతే జపాన్ మహిళలు ఇందులోనూ నిష్ణాతులేనట! భర్త తెచ్చిన సంపాదనను ఇంటి అవసరాల కోసం బ్యాలన్స్డ్గా ఖర్చు చేయడంతో పాటు.. మిగిలిన డబ్బును పొదుపు చేయడంలోనూ వారు ముందుంటారట!.ఈ క్రమంలో లాభాలొచ్చే సంస్థల్లో పెట్టుబడులు పెట్టడంతో పాటు కొంత డబ్బును ప్రత్యేకమైన ‘మనీ పర్సు’లో దాచుకుంటారట! అత్యవసర పరిస్థితుల్లో ఇది తమను ఆదుకుంటుందని వారి నమ్మకం. అంతేకాదు.. ఒకవేళ ఎప్పుడైనా తమ భర్తకు దూరంగా ఉండాల్సి వచ్చినా లేదంటే తమ భర్త నుంచి విడిపోవాల్సి వచ్చినా.. పరిస్థితులు సద్దుమణిగే దాకా ఈ డబ్బు వారికి ఆర్థికంగా భరోసా కల్పిస్తుందని జపాన్ మహిళలు చెబుతున్నారు. ఏదేమైనా ఆర్థిక విషయాల్లో జపాన్ మహిళల ముందుచూపు ఎంతోమందికి స్ఫూర్తిదాయకం కదూ!!.(చదవండి: 115 ఏళ్ల బామ్మ..! ఆమె సుదీర్ఘకాల జీవిత రహస్యం ఇదే..!) -
ఆయన గురించి చెప్పుకునేంత సీన్ లేదు: తాప్సీ ఆసక్తికర కామెంట్స్
హీరోయిన్ తాప్సీ ప్రస్తుతం ఫిర్ ఆయీ హసీన్ దిల్రూబా చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు రానుంది. గతంలో సూపర్ హిట్గా నిలిచిన మూవీకి సీక్వెల్గా ఈ సినిమాను తీసుకొస్తున్నారు. విక్రాంత్ మాస్సే, సన్నీ కౌశల్ కీల పాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీ నేరుగా ఆగస్టు 9న నెట్ఫ్లిక్స్లో విడుదల కానుంది.అయితే ఈ ఏడాది మార్చిలో తాప్సీ పన్ను వివాహాబంధంలోకి అడుగుపెట్టింది. తన ప్రియుడు మథియాస్ బోను పెళ్లాడింది. డెన్మార్కు చెందిన మాజీ బ్యాడ్మింటన్ ప్లేయర్తో ఏడడుగులు వేసింది. అయితే తాజా ఇంటర్వ్యూలో తన భర్త గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది. తన భర్త మథియాస్ బో గురించి కొంతమందికి ఇంకా తెలియకపోవడం బాధకరమని తెలిపింది. అలాంటి వారి పట్ల విచారంగా ఉందని వెల్లడించింది.తాప్సీ మాట్లాడుతూ.." నా భర్త మథియాస్ బో ఎవరో తెలియని వారి గురించి నేను చాలా బాధపడ్డా. నేను బయటకు వచ్చి అతని గురించి ప్రజలకు చెప్పాలనుకోవడం లేదు. ఎందుకంటే అతను పెద్ద క్రికెటర్ కాదు.. బిజినెస్మెన్ అంతకన్నా కాదు. అతని గురించి మీకు నిజంగా తెలుసుకోవాలని అనిపించడం లేదు అంతే. ప్రపంచంలో బ్యాడ్మింటన్లో అతిపెద్ద విజయాలు సాధించిన వారిలో ఈయన ఒకరు " అని వెల్లడించింది. కాగా.. తాప్సీ 2024 మార్చిలో ఉదయపూర్లో మాజీ డానిష్ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు మథియాస్ బోను వివాహం చేసుకుంది. కాగా.. ప్రస్తుతం తాప్సీ భర్త భారత బ్యాడ్మింటన్ ప్లేయర్లకు కోచ్గా వ్యవహరిస్తున్నారు. -
భార్యకు మూడు పెళ్లిళ్లు చేయించిన భర్త
మధ్యప్రదేశ్లోని ఖర్గోన్ జిల్లాలో వింత ఉదంతం చోటుచేసుకుంది. స్థానికంగా ఇది సంచలనం సృష్టించింది. ఒక భర్త స్వయంగా తన భార్యకు మూడు పెళ్లిళ్లు చేయించాడు. దీని వెనుక గల బాగోతం తెలిసినవారంతా తెగ ఆశ్చర్యపోతున్నారు.ఆ భర్త తన భార్య కోసం ఆర్థికంగా ఉన్నతస్థాయిలో ఉన్నవారి సంబంధాలు చూసేవాడు. ఆమె తన భార్య అని వారికి తెలియకుండా ఆమెకు పెళ్లి జరిపించేవారు. తరువాత ఆమె అత్తవారింటికి వెళ్లి, అక్కడ నగదు, నగలు మూటగట్టుకుని, భర్త దగ్గరకు వచ్చేసేది. తరువాత వారిద్దరూ కలసి అక్కడి నుంచి పరారయ్యేవారు. ఈ విధంగా సదరు భర్త ఆ భార్యకు మూడు పెళ్లిళ్లు చేశాడు. అయితే దొంగ వ్యవహారాలు ఎంతోకాలం దాగవన్నట్లు ఆ మహిళ పోలీసులకు పట్టుబడింది. తాము సాగిస్తున్న వ్యవహారాలన్నీ ఆమె పోలీసుల ముందు ఉంచింది.ఈ ఉదంతం గురించి పోలీసులు మీడియాకు తెలియజేస్తూ డబ్బు సంపాదనకు ఈ భార్యాభర్తలు జనాలను మోసం చేస్తుంటారన్నారు. భర్తే స్వయంగా భార్యకు పెళ్లి చేస్తూ, తాను ఆమెను సోదరుడినని పెళ్లివారిముందు నమ్మబలికేవాడు. ఆమెకు వివాహం జరిగిపించాక వారి ఇంటితో తిష్టవేసి, ఆ ఇంటిలోని నగదు, నగలను తస్కరించేవాడు. ఇందుకు ఆమె సహకారం అందించేంది. లేదంటే ఆమెనే చోరీకి పాల్పడి, భర్త దగ్గరకు వచ్చేసేది. ఈ భార్యాభర్తల వ్యవహారం అత్యంత విచిత్ర పరిస్థితుల్లో బయటపడింది.ఖార్గోన్ జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన మహిళ తన కుమార్తె చాలా రోజులుగా కనిపించడం లేదంటూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. తన కుమార్తె.. భర్తతో కలిసి దొంగ పెళ్లికూతురి నాటకం ఆడుతోందని ఆమెకు తెలియదు. పోలీసులు విచారణ ప్రారంభించి, ఆ మహిళ అల్లుడిని విచారించగా అసలు విషయం వెలుగు చూసింది. దీంతో పోలీసులు ఆ భార్యాభర్తలను అరెస్టు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. -
'తొలిప్రేమ' వాసుకి పుట్టినరోజు.. భర్తతో సింపుల్గా సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
భార్యను రైలు ఢీకొన్నదని.. భర్త కూడా రైలుకెదురెళ్లి..
భార్యాభర్తల బంధం విడదీయరానిదని అంటారు. ఒకవేళ భాగస్వామిలో ఒకరు దూరమైతే మరొకరు తల్లడిల్లిపోతుంటారు. ఊహకందని నిర్ణయాలు కూడా తీసేసుకుంటారు. ఇంటిలోనివారికి, బంధువులకు విషాదాన్ని మిగులుస్తుంటారు. సరిగ్గా ఇలాంటి ఉదంతం రాజస్థాన్లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..రాజస్థాన్లోని చురు జిల్లాలో రాజల్దేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక మహిళ రైలు ఢీకొని మృతి చెందింది. ఈ విషయం తెలియగానే భర్త అనూహ్య నిర్ణయం తీసుకున్నాడు. అతను కూడా రైలుకు ఎదురెళ్లి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఉదంతానికి సంబంధించిన వివరాలను పోలీసులు మీడియాకు తెలిపారు. బాబులాల్ రేగర్ (50)కు తన భార్య సంతోష్ రేగర్ (43)తో ఏదో విషయమై మనస్పర్థలు వచ్చాయి. దీంతో వారిద్దరూ కొంతకాలంగా విడివిడిగా ఉంటున్నారు.రెండు రోజుల క్రితం సంతోష్ రేగర్ తన ఇంటికి సమీపంలోని రాజల్దేసర్లోని రైల్వేస్టేషన్ సమీపంలో రైలు ఢీకొని మృతి చెందింది. ఈ విషయం తెలియగానే భర్త బికనీర్-ఢిల్లీ ప్యాసింజర్ రైలుకు ఎదురెళ్లాడు. ఆ రైలు అతనిని ఢీకొనడంతో మృతిచెందాడు. పోస్టుమార్టం అనంతరం భార్యాభర్తల మృతదేహాలను బంధువులకు అప్పగించినట్లు పోలీసులు తెలిపారు. -
కిడ్నాప్ ఎలా అవుతుంది.. అతను నా భర్త..
-
భర్త వివాహేతర సంబంధం లైవ్ లో పట్టుకున్న భార్య
-
‘సహజీవనంలో భాగస్వామిని అలా విచారించలేం’
సహజీవనంలో భాగస్వామిపై 498 కేసుకు సంబంధించి కేరళ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. లివ్ ఇన్ రిలేషన్షిప్లో మహిళతో సహజీవనం చేసే వ్యక్తిని భర్తగా పరిగణించలేమని పేర్కొంది. మహిళ రిలేషన్షిప్లో ఉన్న వ్యక్తిని భర్తగా భావించి సెక్షన్ 498 ప్రకారం క్రూరత్వం కింద విచారించలేమని స్పష్టం చేసింది.చట్టబద్ధంగా వివాహం చేసుకోని మహిళ తనతో రిలేషన్లో ఉంటున్న వ్యక్తి క్రూరత్వానికి పాల్పడినందుకు ఐపీసీ సెక్షన్ 498A కింద కేసు పెట్టలేమని హైకోర్టు వెల్లడించింది. ఈ మేరకు ఫిర్యాదు చేసిన మహిళతో రిలేషన్లో ఉన్న వ్యక్తిపై విచారణను రద్దు చేస్తూ గురువారం కోర్టు తీర్పునిచ్చింది.కాగా 2023 మార్చి నుంచి 2023 ఆగస్టు వరకు తాము లివ్ ఇన్ రిలేషన్లో ఉన్న సమయంలో తన భాగస్వామి మానసికంగా, శారీరంగా వేధించాడని మహిళ ఫిర్యాదు చేసింది. ఈ కేసును విచారించిన కేరళ హైకోర్టు భర్త అనే పదానికి నిర్వచనాన్ని చెబుతూనే, లివ్ ఇన్ పార్ట్నర్ని భర్తగా చూడలేమని చెప్పింది.సెక్షన్ 498A కింద నేరాన్ని నమోదు చేయాలంటే. భర్త లేదా భర్త బంధువులు క్రూరత్వానికి పాల్పడి ఉండాలని కోర్టు సూచించింది. మహిళతో చట్టబద్దంగా వివాహం జరిగిన వ్యక్తిని భర్తగా పరిగణిస్తారని తెలిపింది. చట్టబద్ధమైన వివాహం లేకుండా స్త్రీ భాగస్వామిని సెక్షన్ 498 ఏ క్రూరత్వం కింద విచారించలేమని చెప్పింది. -
కూతురితో అసభ్యంగా ప్రవర్తించాడని.. భర్తను చంపిన భార్య
సంగారెడ్డి: కూతురితో అసభ్యంగా ప్రవర్తించిన భర్తను భార్య గొడ్డలితో నరికి చంపింది. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండలం సుల్తాన్పూర్లో బుధవారం అర్థరాత్రి చోటు చేసుకుంది. సుల్తాన్పూర్కు చెందిన మన్నే మాణయ్య (45), ఇందిర దంపతులకు కూతురు సుకన్య ఉంది. ఏడాది కిందట సుకన్య భర్త చనిపోవడంతో తల్లిదండ్రుల వద్దే ఉంటోంది. మద్యానికి బానిసైన మాణయ్య ఇంట్లో ఉంటున్న కూతురిపై కన్నేశాడు. ఆమెతో అసభ్యంగా ప్రవర్తించడం మొదలు పెట్టాడు. బుధవారం అర్ధరాత్రి అతిగా మద్యం సేవించి భార్య, కూతురితో గొడవకు దిగాడు. గొడ్డలితో బెదిరిస్తూ కూతురితో అసభ్యంగా ప్రవర్తించాడు. భార్య అడ్డుకున్నా వినలేదు. దీంతో మాణయ్య చేతిలో ఉన్న గొడ్డలిని లాక్కొని ఇందిర భర్తను నరికి చంపింది.ఘటన విషయం తెలుసుకున్న జోగిపేట సీఐ అనిల్ సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకున్నారు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని సంగారెడ్డి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. తల్లీకూతురు ఇద్దరూ పోలీస్ స్టేషన్లో లొంగిపోయారు. -
కామారెడ్డి జిల్లా: భార్య ఘాతుకం.. పాడుబడ్డ ఇంటిలో షాకింగ్ దృశ్యం
సాక్షి, కామారెడ్డి జిల్లా: బాన్సువాడ మండలం తిర్మలాపూర్లో దారుణం జరిగింది. రాములు అనే వ్యక్తిని గొడ్డలితో భార్య మంజుల, మృతుడి తండ్రి నారాయణ నరికి చంపారు. రాములును హత్య చేసి ఇంటి ప్రక్కనే ఉన్న మరో పాడుబడ్డ ఇంటి లోపల నీటి ట్యాంకులో పడేశారు. ఆపై దుర్వాసన వస్తుందని ఆ ఇంటి ఆవరణలోనే పాతిపెట్టారు.తన భర్త రాములు కనబడటం లేదని ఈ నెల 16న భార్య మంజుల పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దుర్వాసన వస్తుందని కాలనీ వాసులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఘాతుకం బయటపడింది. కుళ్లిపోయిన స్థితిలో ఉన్న రాములు మృతదేహాన్ని బాన్సువాడ పోలీసులు వెలికితీశారు. తండ్రి నారాయణ, భార్య మంజులను అదుపులోకి తీసుకొని పోలీసులు విచారణ జరుపుతున్నారు. -
జిమ్ ట్రైనర్తో ప్రేమ.. భర్త అడ్డుగా ఉన్నాడని.. మూడేళ్ల తర్వాత!
చండీగఢ్: ప్రియుడి మోజులో పడి ఓ మహిళ కట్టుకున్న భర్తను కడతేర్చేందుకు సిద్దమైంది. ఒకటి కాదు రెండు ప్లాన్లు వేసి అతడిని వదిలించుకోవాలనుకుంది. మొదటి ప్రయత్నంలో అతడు ప్రాణాలతో బయటపడగా.. రెండో సారి పక్కా ప్లాన్ ప్రకారం హత్య జరిపించింది. చివరికి అనుమానాస్పద ప్రవర్తనే ఆమె నేరాన్ని పోలీసులకు పట్టించింది. ఈ కేసుపై దర్యాప్తు చేసిన పోలీసులు మూడేళ్ల తర్వాత ఆ మహిళను అరెస్ట్ చేశారు. హర్యానాలోని పానిపట్లో ఈ సంఘటన వెలుగుచూసింది.వివరాలు.. కంప్యూటర్ ఇనిస్టిట్యూట్ నిర్వహించిన వినోద్ బరారాకు నిధితో వివాహమైంది. ఆ దంపతులకు ఒక కుమార్తె ఉంది. వీరు పానిపట్లో నివాసం ఉంటున్నారు. నిధికి కొన్నేళ్ల క్రితం సుమిత్ అనే జిమ్ ట్రెయినర్తో పరిచయం ఏర్పడింది. అనంతరం ఇది ప్రేమగా మారింది. ఈ విషయం వినోద్కు తెలియడంతో దంపతుల మధ్య తరచూ గొడవలు జరిగేవి. దీంతో వినోద్ను ఎలాగైనా అడ్డుతొలగించుకొని సుమిత్తో జీవించాలని నిధి నిర్ణయించుకొంది.పంజాబ్కు చెందిన దేవ్ సునార్ అనే లారీ డ్రైవర్కు రూ. 10 లక్షలు సుపారీ ఇచ్చి.. తన భర్తను వాహనంతో ఢీకొట్టి చంపాలని సూచించింది. 2021 అక్టోబర్ 5న వినోద్ను ఇంటి సమీపంలోనే దేవ్ లారీతో ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడ్డాడు. కానీ, ప్రాణాలతో బయటపడ్డాడు. నిందితుడైన లారీ డ్రైవర్ దేవ్ సునర్ను పోలీసులు అరెస్ట్ చేశారు. కేసును వెనక్కి తీసుకోవాలని వినోద్ను సునర్ బెదిరించాడు. కానీ అతడు నిరాకరించాడు. దీంతో భర్తను ఎలాగైన సరే అడ్డు తొలగించుకోవాలన్న మహిళ మరో ప్లాన్ వేసింది. అదే ఏడాది డిసెంబర్ 15న దేవ్.. నిధి ఇంటికి వెళ్లి మంచానపడి ఉన్న వినోద్ను పాయింట్ బ్లాంక్ రేంజిలో కాల్చి చంపాడు. పోలీసులు దేవ్ను హంతకుడిగా గుర్తించి అరెస్టు చేశారు. కోర్టులో కేసు వెనక్కి తీసుకోనందుకే వినోద్ను చంపినట్లు పోలీసులకు చెప్పాడు.ఈ ఘటన తర్వాత దేవ్ కుటుంబ అవసరాలను నిధి, జిమ్ ట్రైనర్ సుమిత్లే చూసుకొంటున్నారు. వినోద్ హత్య తర్వాత నిధి సైతం విలాసవంతంగా జీవించింది. కుమార్తెను ఆస్ట్రేలియాలోని బంధువు వద్దకు పంపింది. ఆమె విలాసవంతమైన జీవనశైలి వినోద్ కుటుంబీకుల్లో అనుమానాలను పెంచింది. దీంతో అతడి సోదరుడు ప్రమోద్ మూడేళ్ల తర్వాత పానిపట్ ఎస్పీ అజీత్ సింగ్కు విషయం చెప్పాడు.తన సోదరుడి భార్యపై అనుమానం వ్యక్తం చేశాడు. దీంతో పోలీసుల ప్రత్యేక బృందం నిందితుడు దేవ్ కాల్ డేటాను వెలికి తీసింది. తరచూ జిమ్ ట్రెయినర్ సుమిత్తో మాట్లాడుతున్నట్లు దానిలో గుర్తించారు. దీంతో పోలీసులు అతడి కాల్ డేటాను వెలికి తీయగా నిధితో సంబంధం బయటపడింది. దీంతో సుమిత్ను అదుపులోకి తీసుకొని విచారించగా అసలు కుట్ర వెలుగులోకి వచ్చింది. నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. -
మరణశయ్యపై భర్తకు మాట...తోడుగా కోడలు : 67 ఏళ్ల వయసులో
అబ్బ! వంటలు భలే ఉన్నాయండి..అంటూ అతిథులు లొట్టలేసుకుంటూ తింటూ ఉంటే కష్టపడి వండిన వారి ఆనందాన్ని మాటల్లో వర్ణించలేం. కేరళలోని అలప్పూలో నివసించే మహిళ ఫిలోకు కూడా అంతే. పెళ్లిళ్లు, పేరంటాలు, పార్టీలు అంటే చాలు కష్టపడి వెజ్.. నాన్ వెజ్ పచ్చళ్లు తయారు చేసి ఇచ్చేసేది. ఆమె పికెల్స్కు విదేశాల్లో కూడా ఫ్యాన్స్ ఉన్నారంటే ఆమె చేతి మహిమను అర్థం చేసుకోవచ్చు. మధ్యలో ఆటంకాలొచ్చినా.. చివరికి భర్తకిచ్చిన మాట నెరవేర్చాలనే ఉద్దేశంతో వ్యాపారవేత్తగా మారిపోయింది. బెటర్ ఇండియా అందించిన వివరాల ప్రకారం స్టోరీ ఏంటంటే..ఫిలో ఇంటర్ అయిపోయిన వెంటనే ఒక ఇంటికి భార్యగా వెళ్లిపోయింది. చిన్నప్పటినుంచి వంటలు చేయడం ఆసక్తి. ఇక పచ్చళ్లలో ఆమె చేయని ప్రయోగం లేదని చెప్పవచ్చు. అలాగే ఏదైనా చేయాలనే గాఢమైన కోరిక ఉండేది. ఆ కోరికతోనే 2015లో భర్త, కోడలు టిన్సీ సాయంతో ఊరగాయ వ్యాపారాన్ని మొదలు పెట్టింది. కానీ మొదట్లో పెద్దగా విజయంసాధించలేదు. మళ్లీ తిరిగి కోడలి సహకారంతో ఫిలో 60 ఏళ్ల వయసులో వ్యాపారవేత్తగా అవతరించింది. అత్తాకోడళ్లు ద్వయం విజయవంతంగా వ్యాపారాన్ని నడిపించారు. View this post on Instagram A post shared by മുഹമ്മ ക്കാരൻ (@muhammakkar)కేవలం ఫేస్బుక్ పేజీతో చిన్న స్థాయిలోనే వ్యాపారాన్ని ప్రారంభించారు. చికెన్, స్వీట్ లైమ్, బీఫ్ వంటి రెండు మూడు రకాల ఊరగాయలను విక్రయించేవారు. కేవలం నోటి మాట ద్వారానే అయినా వ్యాపారం బాగానే సాగింది. మళ్లీ అనుకోకుండా భర్త థామస్ అనారోగ్యం కారణంగా వ్యాపారాన్ని నిలిపివేయాల్సి వచ్చింది. కేన్సర్తో బాధపడుతూ మూడు నెలలు ఆయన ఆసుపత్రికి పరిమితమయ్యారు. ఆ తరువాత కూడా చికిత్స కోసం తరచుగా వెల్లూరుకు వెళ్లాల్సి వచ్చేది. దీంతో వ్యాపారం ముందుకు సాగలేదు. ఇదంతా గమనించిన థామస్ తన భార్యకు ఒకటే మాట చెప్పారు. ‘ఫిలో.. నీలో చాలా టాలెంట్ ఉంది. నీ పచ్చళ్లు అందరికీ నచ్చుతాయి. ఆ సామర్థ్యం నీ దగ్గర ఉంది. వ్యాపారాన్ని కొనసాగించు. ఏదో ఒకరోజు కచ్చితంగా నువ్వు గొప్పదానివి అవుతావు. నామాట విను’’ అంటూ తన కోరికను వెల్లడించారు.ఆ మాటలే వేదమంత్రాలయ్యాయి. ఈ సారి పకడ్బందీగా రంగంలోకి దిగారు అత్తాకోడళ్లు. 2018లో కొత్త అవతార్లో లోగో, ప్యాకేజింగ్ మార్చేసి, ‘ఫిలోస్ పికిల్స్’ స్టార్ట్ చేశారు. దీనికి తోడు ముఖ్యమైన FSSAI (ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా) ఫుడ్ లైసెన్స్ తెచ్చుకున్నారు. 10వేల రూపాయల పెట్టుబడితో మళ్లీ పచ్చళ్ల తయారీ మొదలు పెట్టారు. స్థానిక సూపర్ మార్కెట్లకు అందించే వారు. ఇది ప్రచారానికి బాగా ఉపయోగపడింది. ఫుడ్ బ్లాగర్ మృణాల్ దాస్ వెంగలాట్ 2019లో వారి ఉత్పత్తుల గురించి ఒక వీడియోను పోస్ట్ చేసారు. ఇది మంచి ఆర్డర్లను తెచ్చిపెట్టింది. దీంతో ఒక ఇన్స్టా పేజీని కూడా స్టార్ట్ చేశారు. ఇక అప్పట్నించి విదేశాలకు సైతం రుచికరమైన పచ్చళ్లను సరఫరా చేస్తూ వ్యాపారంలో రాణిస్తున్నారు. రొయ్యల ఊరగాయ, చేపలు, మాంసం ఊరగాయలు, చెమ్మీన్ చమ్మంతి పొడి (ఎండిన రొయ్యల పొడి) బెస్ట్ సెల్లర్స్గా నిలిచాయి. మామిడి, నిమ్మకాయ. సీజన్ల వారీగా, అనేక కూరగాయల ఊరగాయలను కూడా తయారు చేస్తారు. చాలా శ్రద్ధగా ప్రేమతో పచ్చళ్లు తయారు చేస్తాం అంటారు ఫిలో. ‘‘జీవితం అంతా బాధ్యతలతోనే గడిచిపోయింది. 60 ఏళ్లు దాటాక విసుగు, అలసట వస్తుంది..దీంతో ఈ వయసులో ఏం చేస్తాంలే అనుకుంటాం. కానీ ఈ ధోరణి మారాలి. మన నైపుణ్యంపై దృష్టి పెట్టాలి. అలా నేను ఫిలోస్ ప్రారంభించాక, ఒత్తిడి, ఆందోళన మాటుమాయమైంది. కొత్త ఉత్సాహం వచ్చింది. గౌరవం, ప్రేమ లభిస్తోంది’’ అంటారామె ఆ స్వర్గంనుంచి తన భర్త కేజే థామస్ తనను, తన విజయాన్ని చూస్తూ ఉంటాడనే ఆశతో. -
ఖమ్మంలో అమానవీయ ఘటన.. భార్య గుండె కుడివైపున ఉందంటూ..
సాక్షి, ఖమ్మం: ఖమ్మంలో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. గుండె కుడివైపు ఉందంటూ వివాహమైన 20 రోజులకే భార్యను పుట్టింటికి పంపించాడు భర్త. మోసం చేసి వివాహం చేశారంటూ భర్త తిరిగి న్యాయస్థానాన్ని ఆశ్రయించగా, ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు.. భార్యకు అనుకూలంగా తీర్పు నిచ్చింది. న్యాయస్థానం తీర్పును కూడా భర్త భేఖాతరు చేశారు. న్యాయం కోసం ఏడేళ్లుగా బాధితురాలు ఒంటరి పోరాటం చేస్తోంది.ఖమ్మం జయనగర్ కాలనీకి చెందిన అబ్బనపల్లి భవానిని పెద్దల సమక్షంలో 2018లో బోనకల్ మండలానికి చెందిన తవుడోజు భాస్కరాచారి వివాహమాడాడు. 20 రోజులు కాపురం చేసి భార్య భవానిని పుట్టింటికి పంపించాడు. గుండె కుడివైపున ఉందంటూ భార్యపై వేధింపులకు దిగాడు. భర్త భాస్కరాచారి ఇంటికి వెళ్లిన భవానిపై మామ వెంకటేశ్వర్లు దాడి చేశాడు.బోనకల్ పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్గా భవాని మామ విధులు నిర్వహిస్తున్నాడు. ప్రస్తుతం భవాని భర్త భాస్కరచారి పరారీలో ఉండగా, భర్త ఆచూకీ తెలపకుండా అత్తమామలు గోప్యంగా ఉంచుతున్నారు. న్యాయం చేయాలంటూ బాధిత మహిళ ఆవేదన వ్యక్తం చేస్తోంది. -
ప్రియురాలితో గదిలో.. భార్యకు దొరికిపోయిన భర్త
-
లోక్సభలో ఏకైక ఎంపీ దంపతుల జంట.. అందరి దృష్టి వీరిపైనే?
ఎన్నికల పోరులో వేర్వేరు స్థానాల నుంచి గెలిచి లోక్సభకు చేరుకునే దంపతులు చాలా అరుదుగా కనిపిస్తారు. అయితే ఈసారి 18వ లోక్సభలో యూపీ నేత అఖిలేష్ యాదవ్, ఆమె భార్య డింపుల్ యాదవ్ పార్లమెంట్లో అడుగుపెట్టనున్నారు. ఈ నేపధ్యంలో ఈ జంట ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు.సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, ఆయన భార్య డింపుల్ యాదవ్ ఒకేసారి లోక్సభకు ఎన్నికవడం ఇదే తొలిసారి. అఖిలేష్ తన సంప్రదాయ స్థానమైన కన్నౌజ్ నుంచి ఎంపీగా ఎన్నిక కాగా, అతని భార్య డింపుల్ యాదవ్ మెయిన్పురి స్థానం నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. ఈ ఎన్నికల్లో వీరిద్దరూ రికార్డు స్థాయి ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఎస్పీ నుంచి అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలుపొందిన ఎంపీల్లో డింపుల్ యాదవ్ అగ్రస్థానంలో ఉన్నారు. తరువాతి స్థానంలో ఆమె భర్త అఖిలేష్ యాదవ్ ఉండటం విశేషం.లోక్సభ కార్యకలాపాల సమయంలో ఇద్దరూ సభలో కూర్చున్నప్పుడు పలువురి దృష్టి వీరిపై నిలవనుంది. 2019 లోక్సభ ఎన్నికల్లో అఖిలేష్ యాదవ్ అజామ్గఢ్ నుంచి పోటీ చేసి గెలుపొందారు. అదే సమయంలో డింపుల్ యాదవ్ కన్నౌజ్ నుంచి పోటీ చేసినా, విజయం సాధించలేకపోయారు. అయితే ఎస్పీ వ్యవస్థాపకులు ములాయం సింగ్ యాదవ్ మరణంతో మెయిన్పురి సీటు ఖాళీ అయ్యింది. అప్పుడు అక్కడ జరిగిన ఉప ఎన్నికల్లో విజయం సాధించి డింపుల్ యాదవ్ లోక్సభకు చేరుకున్నారు.అఖిలేష్ యాదవ్ తొలిసారిగా తన భార్యతో కలిసి లోక్సభకు హాజరుకావడమే కాకుండా, ఈసారి ఆయనతో పాటు ఆయన ముగ్గురు సోదరులు కూడా ఎంపీలుగా సభకు రానున్నారు. కన్నౌజ్ నుంచి అఖిలేష్ యాదవ్, మెయిన్పురి నుంచి డింపుల్ యాదవ్, అజంగఢ్ నుంచి ధర్మేంద్ర యాదవ్, ఫిరోజాబాద్ నుంచి అక్షయ్ యాదవ్, బదౌన్ నుంచి ఆదిత్య యాదవ్లు ఎంపీలుగా ఎన్నికయ్యారు. ఈ విధంగా ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఎంపీలుగా లోక్సభలోకి అడుగుపెట్టడం మరో రికార్డు కానుంది. -
మరిన్ని చిక్కుల్లో సీమా హైదర్.. భారత్ వచ్చిన పాక్ భర్త?
పాక్ నుంచి పారిపోయివచ్చి, తన ప్రియుడు సచిన్తో పాటు యూపీలోని నోయిడాలో ఉంటున్న సీమా హైదర్ ఇప్పుడు మరిన్ని చిక్కుల్లో పడ్డారు. ఆమె పాకిస్తాన్ భర్త గులాం హైదర్ భారత్ వచ్చినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ముందుగా ఆయనే స్వయంగా తన యూట్యూబ్ చానల్లో తెలిపారు. గులాం హైదర్ ఆ వీడియోలో..‘పిల్లలూ మీ నాన్న ఇండియా వస్తున్నారు. అన్ని ఏర్పాట్లూ పూర్తయ్యాయి’ అని పేర్కొన్నారు. గ్రేటర్ నోయిడా కోర్టు సీమా హైదర్ పాకిస్తాన్ భర్త గులాం హైదర్ను జూన్ 10న కోర్టుకు హాజరు కావాలని సమన్లు జారీ చేసింది. ఈ నేపధ్యంలోనే ఆయన ఈరోజు (సోమవారం) నోయిడా కోర్టుకు హాజరు కావాల్సివుంది. సీమా హైదర్ పాక్ నుంచి భారత్ వచ్చినది మొదలు ముఖ్యాంశాలలో కనిపిస్తున్నారు. సీమా-సచిన్ ల ప్రేమకథ దేశవ్యాప్తంగా హల్చల్ చేసింది. సీమా తనతో పాటు తన నలుగురు పిల్లలను కూడా పాకిస్తాన్ నుంచి భారత్కు తీసుకువచ్చారు. ఈ పిల్లలు సీమా, ఆమె పాక్ భర్త గులాం హైదర్లకు జన్మించారు.తన పిల్లలను తనకు అప్పగించాలంటూ సీమా హైదర్ పాకిస్తాన్ భర్త గులాం హైదర్ కోర్టును ఆశ్రయించారు. కరాచీలో నివసిస్తున్న ఆయన.. సచిన్ మీనాతో సీమా పెళ్లి చెల్లుబాటు కాదంటూ భారతీయ న్యాయవాది ద్వారా నోయిడాలోని కుటుంబ న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఇంతలోనే సీమా తాను హిందూ మతంలోకి మారానని, పాకిస్తాన్కు తిరిగి వెళ్లబోనని, తన పిల్లలు కూడా హిందూ మతాన్ని స్వీకరించారని పేర్కొంది.ఈ ఉదంతం గురించి మానవ హక్కుల కార్యకర్త అన్సార్ బర్నీ మాట్లాడుతూ గులాం హైదర్ వాదన న్యాయబద్ధంగా ఉందని, అంతర్జాతీయ చట్టాల ప్రకారం చిన్న పిల్లలను మత మార్పిడి చేయడంపై నిషేధం ఉన్నదన్నారు. సీమా ప్రస్తుతం భారత్లో స్థిరపడినప్పటికీ, ఆమె పిల్లలు పాకిస్తాన్ పౌరులని అన్నారు. గులాం హైదర్ తన భార్య సీమా నుంచి ఏమీ కోరుకోవడం లేదని, తన పిల్లలను పాకిస్తాన్కు తీసుకు వెళ్లాలని మాత్రమే అనుకుంటున్నారని అన్సార్ తెలిపారు. మరి ఈ కేసులో కోర్టు ఎలాంటి తీర్పు ఇవ్వనున్నదో వేచి చూడాల్సిందే. -
ఫోన్ లో ఫోటోలు చూసి షాక్..బయటపడ్డ సంచలన నిజాలు
-
తన భర్త తనకి కావాలంటూ నక్షత్ర డిమాండ్
-
'మిస్ వైజాగ్' నక్షత్ర ప్రేమ-పెళ్లి-లొల్లి
-
వారం క్రితమే వివాహం.. గేమింగ్ జోన్లో అగ్నికి ఆహుతై..
గుజరాత్లోని రాజ్కోట్ గేమింగ్ జోన్ ఘటన పెను విషాదాన్ని మిగిల్చింది. వినోదం కోసం వచ్చిన జనం ఊహించని ప్రమాదంలో చిక్కుకున్నారు. ఈ ఘటనలో 32 మంది ప్రాణాలు కోల్పోయారు. వారిలో కొత్తగా పెళ్లయిన జంట అక్షయ్ ధోలారియా, ఖ్యాతి ఉన్నారు. ఈ జంటకు వారం క్రితమే వివాహం జరిగింది. ఈ నేపధ్యంలో వారు ఆనందంగా గేమింగ్ జోన్కు వచ్చారు. అయితే ఊహించని విధంగా సంభవించిన అగ్నిప్రమాదానికి వారిద్దరూ బలయ్యారు. 24 ఏళ్ల అక్షయ్ తన తల్లిదండ్రులతో కలిసి కెనడాలో ఉంటున్నాడు. ఖ్యాతి(20)ని వివాహం చేసుకునేందుకు కొద్దిరోజుల క్రితమే రాజ్కోట్కు వచ్చాడు. గత శనివారం వీరి వివాహం వైభవంగా జరిగింది. పెళ్లయిన ఏడు రోజులకే ఈ జంట లోకాన్ని విడిచి వెళ్లిపోయింది. వారి శరీరాలు గుర్తించలేని విధంగా అగ్నికి మాడిపోయాయి. వేలికి ధరించిన ఉంగరం ఆధారంగా అక్షయ్ మృతదేహాన్ని గుర్తించారు. ఈ దంపతుల మృతదేహాలను డీఎన్ఏ పరీక్షలకు తరలించారు.ఈ అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని, అయితే షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి ఉండవచ్చని భావిస్తున్నామని, విచారణ తర్వాతే ఖచ్చితమైన కారణం తెలుస్తుందని పోలీసు అధికారులు తెలిపారు. అగ్నిమాపక శాఖ అనుమతి లేకుండానే ఈ వినోద కేంద్రం నడుస్తున్నదని విచారణ అధికారులు చెబుతున్నారు. మరోవైపు టీఆర్పీ గేమింగ్ జోన్ యజమానిని పోలీసులు విచారణ కోసం అదుపులోకి తీసుకున్నారు. అగ్నిప్రమాదంపై విచారణ జరుపుతున్న స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) వీలైనంత త్వరగా నివేదిక సమర్పించాలని కోరినట్లు గుజరాత్ హోం మంత్రి హర్ష్ సంఘ్వీ మీడియాకు తెలిపారు. -
ఆగ్రాలో మరో అద్భుతం: భర్త జ్ఞాపకార్థం ఎర్ర తాజ్మహల్
ఆగ్రా అనగానే అందరికీ ముందుగా గుర్తుకు వచ్చేది అందమైన తాజ్ మహల్. ఈ ప్రేమ చిహ్నాన్ని చూసేందుకు ప్రపంచం నలుమూలల నుంచి జనం ఆగ్రాకు తరలి వస్తుంటారు. మొఘల్ చక్రవర్తి షాజహాన్ తన భార్య ముంతాజ్ కోసం ఈ తాజ్ మహల్ నిర్మించారు. అయితే ఆగ్రాలో మరో తాజ్ మహల్ కూడా ఉంది. దీని వెనుక కూడా ఒక ఓ ప్రేమకథ ఉంది. ఓ భార్య తన భర్త జ్ఞాపకార్థం రెడ్ తాజ్ మహల్ నిర్మించారు. ఈ తాజ్ మహల్ ఎర్ర ఇసుకరాయితో నిర్మించారు. ఇది తెల్లని తాజ్ మహల్ను పోలివుంటుంది. అయితే పరిమాణంలో తాజ్మహల్ కన్నా చిన్నదిగా ఉంటుంది.ఈ ఎర్ర తాజ్ మహల్ ఆగ్రాలోని ఎంజీ రోడ్డులో గల రోమన్ క్యాథలిక్ స్మశానవాటికలో ఉంది. ప్రముఖ చరిత్రకారుడు రాజ్కిషోర్ శర్మ పుస్తకం ‘తవారిఖ్-ఎ-ఆగ్రా’లో రాసిన వివరాల ప్రకారం భారతదేశం బ్రిటిష్ పాలనలో ఉన్నప్పుడు, వారి సైన్యం దేశంలోని వివిధ ప్రాంతాల్లో విడిది చేసింది. అదే సమయంలో ఆగ్రా కోట భద్రత కోసం జాన్ విలియం హాసింగ్ అనే డచ్ అధికారిని ఇక్కడ నియమించారు. నాడు అతనితో పాటు అతని భార్య ఆలిస్ హాసింగ్ కూడా ఆగ్రాకు వచ్చారు. ఆ భార్యాభర్తల మధ్య ఎంతో ప్రేమ ఉండేది.వారు తాజ్మహల్ను చూసి తెగ సంబరపడిపోయారు. దీంతో ఆ దంపతులు తమలో ఎవరు ముందుగా ఈ లోకాన్ని విడిచి వెళతారో వారి జ్ఞాపకార్థం మరొకరు తాజ్మహల్ను నిర్మించాలని నిర్ణయించుకున్నారు. జాన్ హాసింగ్ 1803, జూలై 21న మృతి చెండారు. దీంతో అతని భార్య.. భర్త జ్ఞాపకార్థం ఆగ్రాలోని రోమన్ క్యాథలిక్ శ్మశానవాటికలో రెడ్ తాజ్ మహల్ను నిర్మించారు. -
బాచుపల్లిలో భార్యను పాశవికంగా హత్య చేసిన భర్త
నిజాంపేట్: కుటుంబ కలహాలు ఓ మహిళ ప్రాణాలు తీశాయి. కర్కోటకుడైన ఓ భర్త..భార్యను అతిదారుణంగా హత్య చేసి..మృతదేహాన్ని ముక్కలుగా నరికేందుకు యత్నంచాడు. బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. దీనిపై శుక్రవారం మృతురాలి కుటుంబ సభ్యులు, పోలీసులు తెలి్పన వివరాలు ఇలా ఉన్నాయి. ప్రకాశం జిల్లా కొనకనమెట్ల మండలం గోట్లగట్టు గ్రామానికి చెందిన మధులత(29)కు ప్రకాశం జిల్లా దర్శికి చెందిన నాగేంద్ర భరద్వాజ్కు 2020లో వివాహం జరిగింది. వీరిద్దరు సాఫ్ట్వేర్ ఉద్యోగులు కావడంతో బాచుపల్లి పరిధిలోని సాయి అనురాగ్ కాలనీలోని ఎంఎస్ఆర్ ప్లాజా బి బ్లాక్లో నివాసం ఉంటున్నారు. పెళ్లయిన కొద్దిరోజుల తర్వాత దంపతుల మధ్య విభేదాలు ఏర్పడి తరచు గొడవ పడేవారు. డబ్బుల విషయంలో గొడవలు జరిగాయని, భరద్వాజ్ తరుచుగా మధులతను అనుమానించేవాడని బంధువులు ఆరోపించారు. ఈ నేపథ్యంలో మధులత పుట్టింటికి వెళ్లిపోయింది. ఆ సమయంలో గర్భవతిగా ఉన్న మధులత మగ బిడ్డకు జన్మనిచి్చంది. ఇక నాటి నుంచి భరద్వాజ్ భార్య వద్దకు వెళ్లలేదు. ఈదశలో బంధువులు జోక్యం చేసుకుని ఈ ఏడాది ఫిబ్రవరి 22న ఇద్దరికి రాజీ కుదుర్చి మధులతను భరద్వాజ్తో కాపురానికి పంపించారు. విచక్షణ కోల్పోయి..రాజీ కుదుర్చినా వారిద్దరి మధ్య గొడవలు సద్దుమణగలేదు. ఈ నేపథ్యంలో ఏపీలో ఈ నెల 13న ఎన్నికలు ఉండటంతో తాను పుట్టింటికి వెళ్తానని మధులత చెప్పగా..ఈ నెల 4న ఇద్దరి మధ్య గొడవ ప్రారంభం అయ్యింది. విచక్షణ కోల్పోయిన భరద్వాజ్ భార్య మధులత తలను నేలకేసి కొట్టి కత్తితో విచక్షణా రహితంగా పొడిచి హత్య చేశాడు. అనంతరం ముక్కలుగా నరికి మాయం చేయాలనుకుని మోకాలి కింద భాగాలను కోసే ప్రయత్నం చేశాడు. వీలుకాక ఈ ప్రయత్నాన్ని విరమించుకుని ప్రమాదంగా చిత్రీకరించే యత్నం చేశాడు. ఇందులో భాగంగా ఇంట్లోని వంట గ్యాస్ను లీక్ చేసి భార్య మృతదేహాన్ని ఇంట్లోనే పెట్టి తాళం వేసి కుమారుడితో పరారయ్యాడు. గ్యాస్ వాసన రావడంతో అపార్ట్మెంట్ వాసు లు పోలీసులకు సమాచారం ఇవ్వగా..పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి తలుపులు బద్ధలు కొట్టి గ్యాస్ను నిలిపివేశారు. అనంతరం మధుల త మృతదేహాన్ని చూసి ఖంగుతిన్నారు. హత్య చేసి స్నేహితుడి ఇంటికి.... భార్యను హత్య చేసిన భరద్వాజ్ చందానగర్లోని స్నేహితుడు శ్రీనివాస్ ఇంటికి వెళ్లాడు. తాను భార్యను హత్య చేశానని, తన కుమారుడిని జాగ్రత్తగా చూసుకో వాలని చెప్పి భార్యను పొడిచిన కత్తితోనే తాను సైతం పొడుచుకున్నాడు. దీంతో భయాందోళనకు గురైన శ్రీనివాస్ 100కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వగా పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. భరద్వాజ్కు పైవేటు ఆసుపత్రిలో చికిత్స చేయించి అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. పసికందు ముందే.. కుమారుడు శ్రీజై (17 నెలలు) ఇంట్లో ఆడుకుంటుండగా..బాలుని ముందే భరద్వాజ్ భార్యతో గొడవ పడి హత్య చేశాడు. మే 4న రాత్రి సుమారు 9 గంటల సమయంలో ఈ హత్య చేసినట్లు పోలీసులు పేర్కొంటున్నారు. పోలీసుల వివరణ మధులత హత్య కేసు విషయమై బాచుపల్లి ఎస్హెచ్ఓ ఉపేందర్ను వివరణ కోరగా ఈ నెల 4న తమకు సుమారు రాత్రి 12 గంటల సమయంలో సమాచారం వచ్చిందని తెలిపారు. వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని భరద్వాజ్ను అదుపులోకి తీసుకొని అరెస్టు చేసి రిమాండ్కు తరలించామన్నారు. అదే రాత్రి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాం«దీకి తరలించడం జరిగిందన్నారు. ఎన్నికల విధుల్లో ఉన్న కారణంగా మీడియాకు కేసు వివరాలు వెల్లడించలేదన్నారు.అన్నీ అనుమానాలే.. మధులత హత్యపై పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ నెల 4న హత్య జరగగా పోలీసులు ఈ విషయాన్ని గోప్యంగా ఉంచారు. మీడియాకు తెలుపలేదు. అలాగే అపార్ట్మెంట్ వద్ద ఇంత గొడవ జరిగినా విషయం బయటకు పొక్కలేదు. హత్యకు గురైన మధులత కుటుంబ సభ్యులు సైతం హత్య జరిగిన 20 రోజుల తర్వాత ఈ విషయాన్ని శుక్రవారం మీడియాకు వెల్లడించడం కూడా ఆశ్చర్యానికి గురిచేస్తోంది. -
బాచుపల్లిలో దారుణం.. సాఫ్ట్వేర్ ఇంజనీర్ను హత్య చేసిన భర్త
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్లోని బాచుపల్లిలో దారుణం చోటుచేసుకుంది. కుటుంబ కలహాలతో భార్యను భర్తతో కత్తితో హత్య చేశాడు. మే 5న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.వివరాలు.. సాయి అనురాగ్ కాలనీలో నాగేంద్ర భరద్వాజ్, అతని భార్య సాఫ్ట్వేర్ ఇంజరీర్గా పనిచేస్తున్న మధులతతో కలిసి జీవిస్తున్నాడు. ఇద్దరి మధ్య కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఈనెల 5వ తేదీన ఇద్దరి మధ్య మరోసారి గొడవ జరగడంతో నాగేంద్ర కోపంతో రగిలిపోయాడు. భార్య మధులతను కత్తితో పొడిచి చంపాడు. అనంతరం ఆమె మృతదేహాన్ని ముక్కలుగా చేయడానికి ప్రయత్నంచగా విఫలమయ్యాడుదీంతో గ్యాస్ లీకేజ్ చేసి ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. ఇవేవి ఫలించకపోవడంతో చివరికి తాను కత్తితో కోసుకొని హత్యాయత్నానికి పాల్పడ్డాడు. మధులత తండ్రి రంగనాయకులు పిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. -
వాటే స్కెచ్.. ప్రియుడి మోజులో పడి భర్తను కడతేర్చిన భార్య..
-
Sireesha: భర్తతో విడాకులు.. ట్రెండింగ్లో తెలుగు నటి (ఫోటోలు)
-
త్రినయని సీరియల్ నటి కన్నుమూత.. తిరిగి వచ్చేయంటూ నటుడు ఎమోషనల్ (ఫోటోలు)
-
హోటల్ గదిలో భార్య.. రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న భర్త
లక్నో: భార్య పరాయి వ్యక్తులతో గడుపుతుండగా.. భర్త రెడ్హ్యండెడ్గా పట్టుకున్నాడు. భార్య ప్రవర్తనపై అనుమానం వచ్చిన భర్త.. ఆమెను ఫాలో అవ్వగా.. గురువారం రాత్రి ఓ హోటల్ గదిలో అసభ్యకరమైన రీతిలో పట్టుబడింది. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్లోని కాస్గంజ్ వెలుగుచూసింది. కాగా భార్యభర్తలిద్దరూా వైద్యులు కావడం గమనార్హం.మహిళ పట్టుబడటంతో ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఇది భౌతిక ఘర్షణకు దారి తీసింది. దీనికి సంబంధించిన దృశ్యాలను వీడియో తీయడంతో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. వైద్య దంపతుల మద్య గతకొంతకాలంగా భార్యతో గొడవలు జరుగుతున్నాయి. కుటుంబ వివాదాల నేపథ్యంలో ఇద్దరు ఏడాదిగా వేర్వేరుగా జీవిస్తున్నారు. ఈ క్రమంలో భార్య కదలికలపై అనుమానం పెంచుకున్న భర్త... ఆమెను అనుసరించాడు. గురవారం ఆమె హోటల్ గదిలో ఉన్న సమాచారంతో తన కుటుంబ సభ్యులతో కలిసి భర్త హోటల్ గదిలోకి చొరబడ్డాడు. ఇద్దరు వ్యక్తులతో భార్య ఏకాంతంగా గడుపుతున్న సమయంలో పట్టకున్నాడు. దీంతో పట్టుబడిన భార్య, వ్యక్తులపై భర్త, బంధువులు తీవ్రంగా దాడి చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు మహిళతోపాటు ఘజియాబాద్, బులంద్షహర్కు చెందిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతోపాటు భార్య, ఇద్దరు వ్యక్తులపై భర్త ఫిర్యాదు చేశాడు. మహిళ మాత్రం ఇప్పటి వరకు తన భర్తపై ఎలాంటి ఫిర్యాదు చేయలేదని పోలీసులు తెలిపారు. దీనిపై తదుపరి విచారణ కొనసాగుతోందని పేర్కొన్నారు. -
వివాహితపై అత్తింటివారి దాడి
మదనపల్లె: కాపురం చేసేందుకు అత్తారింటికి వచ్చిన భార్యపై భర్త, అత్తామామలు దాడిచేసి, విచక్షణారహితంగా కొట్టి గాయపరిచిన ఘటన బుధవారం సాయంత్రం మదనపల్లె మండలంలో జరిగింది. తట్టివారిపల్లె పంచాయతీ దేవతానగర్లో నివాసం ఉంటున్న రెడ్డెప్ప, రామలక్ష్మమ్మల కుమారుడు ఎం.నరసింహులు(34)కు సోమల మండలం పెద్ద ఉప్పరపల్లెకు చెందిన స్వప్న(28)తో వివాహం జరిగింది. వీరికి ఆరేళ్ల వయసున్న కుమారుడు ఉన్నాడు. భర్తతో విభేదాల కారణంగా స్వప్న ఆరునెలలుగా పుట్టినింటిలోనే ఉంటోంది.ఈ క్రమంలో భర్త నరసింహులు, మౌనిక అనే వేరొక అమ్మాయిని ఇంట్లో తెచ్చి పెట్టుకున్నాడని తెలియడంతో, కాపురం నిలబెట్టుకునే ఉద్దేశంతో తల్లి శకుంతల, అన్న మురళితో కలిసి బుధవారం భర్త నరసింహులు ఇంటికి వెళ్లింది. కోడలు స్వప్నను ఇంటిలోకి రానివ్వకుండా, గుమ్మంలోనే మామ రెడ్డెప్ప, అత్త రామలక్షుమ్మలు అడ్డుకున్నారు. ఇన్నాళ్లుకు మొగుడు గుర్తుకు వచ్చాడా... ఇంట్లోకి రానవసరం లేదంటూ బయటకు నెట్టేందుకు ప్రయతి్నంచారు. తన భర్త ఇంటిలోకి రావద్దని చెప్పడానికి మీరెవరని, స్వప్న మొండిగా లోనికి వెళ్లేందుకు ప్రయతి్నంచడంతో అత్తమామలు, కోడలిపై దాడికి పాల్పడ్డారు.కుమార్తెను అత్తామామలు విచక్షణారహితంగా కొడుతుండటంతో అడ్డుకునేందుకు వెళ్లిన తల్లి శకుంతలను సైతం వారు కాలితో తన్ని గెంటేయడంతో ఇద్దరూ కిందపడ్డారు. ఈలోపు అక్కడకు చేరుకున్న భర్త నరసింహులు చెప్పా పెట్టకుండా ఇంటికి వచ్చేందుకు నీకెంత ధైర్యమంటూ రోడ్డుమీద అందరూ చూస్తుండగానే, కాలితో తన్నుతూ, కొడుతూ వీరంగం సృష్టించాడు. భార్య, అత్తను తీవ్రంగా గాయపరిచాడు. దీంతో బాధితులు పోలీసులకు సమాచారం అందించి, చికిత్స నిమిత్తం జిల్లా ఆస్పత్రికి వెళ్లారు. తల్లి శకుంతలకు కడుపునకు శస్త్రచికిత్స జరిగిన ప్రదేశంలో బలంగా కాలితో తన్నడంతో ఆమె పరిస్థితి విషమంగా ఉంది. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు తాలూకా సీఐ ఎన్.శేఖర్ తెలిపారు. -
గృహస్థాశ్రమ వైశిష్ట్యం : ఇష్టాయిష్టాలు కలిసాయా!?
గృహస్థాశ్రమ ప్రవేశం చేయడానికి ఒక యువకుడికి, ఒక యువతికి ఉండవలసిన సాధారణ లక్షణాలు ఐదింటిని శ్రీరామాయణం నిర్దేశించింది. వాటిలో మొదటిది శీలం. అంటే స్వభావం. అది పుట్టుకతో వస్తుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క స్వభావం ఉంటుంది. కొంతమందికి సంగీతం, కొంతమందికి ఆధ్యాత్మిక చింతన, మరికొందరికి చిత్రలేఖనం.... అలా అది వారికి బాగా ఇష్టమైన విషయంగా ఉంటుంది. పెళ్ళి సంబంధం చూసేటప్పుడు ఒకరికి ఇష్టమైన విషయం మరొకరికి కూడా ఇష్టమేనా, అయిష్టం లేదు కదా.. అని చూస్తారు. ఆ పరిశీలన పెద్దలు చేస్తారు.తరువాత వయస్సు. ఇద్దరిలో ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అన్నది ఉండదు. రెండు కళ్ళల్లో ఏది మంచిదంటే ఏమని చెప్పగలం? బండి చక్రాలు రెండూ సమన్వయంతో పనిచేయాలి. జీవితం నుండి మొదట ఆయన నిష్క్రమిస్తే.. ఆవిడ పుణ్యకార్యం చేయదు. ఆమె వెళ్ళి΄ోతే...ఆయన తమ కడుపున పుట్టిన కూతురును కూడా కన్యాదానం చేయలేడు. ఆవిడ నిష్క్రమణతోనే ఆయనకు పుణ్యకార్యం చేసే అధికారం కూడా ΄ోతుంది. అందువల్ల ఇద్దరూ సమానమే. ఇద్దరూ కలిసి ఉంటేనే సౌభాగ్యం, సంతోషం. అంటే వాళ్ళ వయసులో ఎవరు పెద్దయితే గొప్ప అన్నదానికన్నా ప్రధానమైనది– ఒకరు నడిపించాలి, మరొకరు నడవాలి–అనేది. ఇక్కడ నడిపించేవారిది ఎక్కువ, నడిచేవారిది తక్కువ అనుకోకూడదు. అన్వయం జాగ్రత్తగా చేసుకోవాలి. వరుడి వయసు పెద్దదయి ఉండాలి–అన్నారు. వయస్సు అంటే కాలం. కాలం అనుభవానికి, అవగాహనకు గుర్తు. ఎవరు ముందు ప్రపంచంలోకి వచ్చారో.. వాళ్ళుఅనుభవాన్ని, అవగాహనను ఎక్కువ సాధిస్తారు. మనం ఎంత చదివాం అన్నదానికన్నా... దానికి అనుభవం ఎంత తోడయింది... అన్నది ప్రధానం. ఒక ఉద్యోగానికి వెడితే అనుభవం ఎంత అన్నదాని ప్రాధాన్యత ఇస్తారు. అలాగే వివాహం విషయంలో.. లోకజ్ఞానం, లోక ప్రవృత్తిని సరిగా అర్థం చేసుకుని భార్యకు అవగాహన కలిగించగలిగిన వాడయి ఉండాలి.అనుభవం అన్నమాటలోనే అంతర్లీనంగా ఉండే విషయం– భార్యపట్ల పరమ ప్రేమతో మెలుగుతూ ఆమెకు రక్షకుడయి ఉండాలన్నది. ఆమె గుణాలు, ప్రతిభ ప్రకాశించడానికి ఆయన అవకాశం కల్పించగలగాలి. ఆమె బలహీనతలు... శారీరకం కావచ్చు, నడవడిరీత్యా కావచ్చు... వాటిని కప్పగలగడంతోపాటూ ఆమె గౌరవమర్యాదలు తగ్గకుండా చూడగలగాలి. సంసారాన్ని సాఫీగా నడపడంలో ఆమెకు ఆయన అనుక్షణం అండగా నిలవాలి. ఒక అమాయకురాలైన కూతురు తెలిసీ తెలియక చేసే తప్పులను తల్లిదండ్రులు ఎలా సరిదిద్దుతూ కాపాడుతుంటారో భార్యను అలా కాపాడుకోగలిగి ఉండాలి. అది భర్త లక్షణం. భార్యది – అంకిత భావం. పిచ్చి ప్రేమ. భర్త ప్రేమకు కారణం ఉంటుంది. భార్య ప్రేమకు కారణం ఉండదు. అనుగమించడం, అంకితభావంలో మసులు కోవడం ఆమె కర్తవ్యం. ఆమెకు ప్రేమను పంచడం, ప్రతి కష్టంలో ఆమెకు రక్షణగా నిలవడం ఆయన బాధ్యత. ఆమెది పాతివ్రత్యం. ఆయనది ఏకపత్నీవ్రతం. అందువల్ల ఎక్కువ తక్కువలను వారి మధ్య ΄ోల్చిచూడకూడదు. కామసంబంధమైన ప్రవత్తి కలిగినా ఆయన దృష్టిలో ఆమె వినా మరొకరికి స్థాన ఉండదు. ఆమెకు ఆయనే సర్వస్వం. ఇది దాంపత్యం. ఇదే గృహస్థాశ్రమం. ఇది సనాతన ధర్మ వైభవం.-చాగంటి కోటేశ్వరరావు -
‘మేం కలిసి బతుకుతాం.. కలిసే చనిపోతాం’ భార్య మృతి తట్టుకోలేక..
వివాహ సమయంలో పెద్దలు, వేదమంత్రాలు, అగ్నిసాక్షిగా ప్రమాణం చేసిన దంపతులు.. చివరి మజిలీలో కూడా కలిసే ప్రయాణం చేశారు. జీవితాంతం తోడు నీడగా ఉంటానని చేసిన పెళ్లి నాటి ప్రమాణాన్ని పాటిస్తూ భార్య వెంటే తుదివరకు నడిచాడు ఆ భర్త.. రోడ్డు ప్రమాదంలో భార్య తనువు చాలించిన గంటల వ్యవధిలోనే.. ఆమె దూరమవ్వడాన్ని తట్టుకోలేక అతడు కూడా ప్రాణాలు విడిచిన ఘటన ఉత్తర ప్రదేశ్లో వెలుగుచూసింది.వివరాలు.. హర్దోయికి చెందిన యోగేష్ కుమార్కు(36) మణికర్ణిక కుమారి(28)కు ఆరేళ్ల కిత్రమే వివాహమైంది. యోగేష టీచర్గా విధులు నిర్వర్తిస్తుండగా.. కుమారి హాస్పిటల్లో నర్సుగా పనిచేస్తుంది. అయితే ఎప్పటిలాగే ఆసుపత్రికి వెళ్తుండగా సుర్సా పోలీస్ స్టేషన్ పరిధిలోని లక్నో-హర్దోయ్ హైవేపై సోమవారం జరిగిన ప్రమాదంలో మణికర్ణిక మృతి చెందింది. ఆమె ప్రయాణిస్తున్న స్కూటీని గుర్తుతెలియని వాహనం ఢీ కొట్టటడంతో అక్కడికక్కడే మృత్యువాతపడింది.ఆమె గుర్తింపు కార్డు, మొబైల్ నంబర్ సహాయంతో భర్తకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న యోగేష్ తన భార్య వస్తువులను తీసుకొని ఇంటికి వచ్చాడు. భార్య తనను వదిలి వెళ్లడం జీర్ణించుకోలేక మనోవేదనతో గదిలోకి వెళ్లి ఉరేసుకొని ప్రాణాలు విడిచాడు. భార్య మృతికి సంతాపం తెలిపేందుకు వచ్చిన ఇరుగుపొరుగు వారు తలుపు తట్టినా స్పందించకపోవడంతో తలుపులు పగులగొట్టి చూడగా యోగేష్ సీలింగ్కు ఉరివేసుకుని కనిపించాడు. అనంతరం పోలీసులకు సమాచారం అందించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. యోగేష్ సూసైడ్ నోట్ కూడా రాశాడు. ‘మేమిద్దరం కలిసి బతుకుతాం.. కలిసే చనిపోతాం’ అని అందులో రాసి ఉంది. చదవండి: గన్ మిస్ఫైర్.. డీఎస్పీ మృతి -
హబ్బీతో మౌనీరాయ్ విషు సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
Viveka Case : సత్యమేవ జయతే
వివేకా హత్య కేసుకు సంబంధించి సునీతారెడ్డి నిజాలను దాస్తున్నారా. అసలు వాస్తవాలు బయటకు రాకుండా ఉండేందుకు అబద్ధాలను ప్రచారం చేస్తున్నారా. నిజాలు బయటకు వస్తే సునీతారెడ్డి దంపతులు కేసులో ఇరుక్కోవడం ఖాయమా. అసలు వివేకా హత్యకేసు విచారణలో బయటపడ్డ వాస్తవాలేంటి… సునీతారెడ్డి చేస్తున్న అబద్ధపు ప్రచారం ఏంటి? వివేకా హత్యకేసులో కుమార్తె సునీతారెడ్డి వ్యవహరిస్తున్న తీరు అనుమానాలకు దారితీస్తోంది. ఓ వైపు తన తండ్రి హంతకులను పట్టుకోవాలని చెబుతున్న సునీతా…మరోవైపు కేసులో వాస్తవాలు బయటకు రాకుండా కుట్రలు చేస్తోంది. ఇప్పటికే విచారణ పూర్తయిన ఈ కేసులో సునీతారెడ్డి ఆమె భర్త నర్రెడ్డి రాజశేఖరరెడ్డి పాత్రపై ఎన్నో అనుమానాలున్నాయి. హత్య జరిగినప్పటి నుంచి ఈ దంపతుల తీరు… సాక్ష్యాలను తారుమారు చేయడానికి యత్నించిన వైనంపై ఇప్పటికీ పూర్తి విచారణ జరగలేదు. సీబీఐ అధికారులతో కలిసి సాక్ష్యులను బెదిరించడానికి సునీతారెడ్డి దంపతులు చేసిన ప్రయత్నాలపై కేసులు నమోదయ్యాయి. ఈ కేసులో MP అవినాష్రెడ్డిని ఇరికించేందుకు యత్నించిన సునీతారెడ్డి… ఇప్పుడు వారిపై రాజకీయంగా బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు. రాజకీయ లబ్దికోసమే ఈ కేసును సునీతారెడ్డి వాడుకుంటున్నారనే దానికి ఆమె ప్రకటనలే సజీవసాక్ష్యాలు. గత ఐదేళ్లలో వివేకా హత్య కేసును జాగ్రత్తగా పరిశీలిస్తే… వివేకా హత్యకు సంబంధించి సునీతారెడ్డి దంపతులు సమాధానం చెప్పాల్సిన ప్రశ్నలు చాలానే ఉన్నాయి. వివేకా హత్య జరిగిన స్థలంలో దొరికిన లేఖను దాచిపెట్టమని పీఏ కృష్ణారెడ్డికి చెప్పింది సునీత దంపతులు కాదా? షమీమ్ను వివేకానందరెడ్డి రెండో పెళ్లి చేసుకుంటే… ఆయనతో సునీతకు, నర్రెడ్డి రాజశేఖరరెడ్డికి గొడవలు ఉన్న మాట వాస్తవం కాదా? షమీమ్ కొడుకుకు ఆస్తిలో వాటా వస్తోందనే భయంతోనే తప్పుడు సాక్ష్యం చెప్పాలని PA కృష్ణారెడ్డిని బెదిరించారా? వివేకా చెక్ పవర్ తీసేసి ఆయనను ఆర్ధికంగా తీవ్ర ఇబ్బంది పెట్టింది సునీత, నర్రెడ్డి రాజశేఖరరెడ్డి కాదా? అవినాష్రెడ్డి పేరు చెప్పకపోతే… తన భర్త నర్రెడ్డి రాజశేఖరరెడ్డి జైలుకు వెళ్లాల్సి వస్తుందని పీఏ కృష్ణారెడ్డితో అన్నది నిజమా కాదా? వివేకానంద రెడ్డిని నరికానని బాహాటంగా ప్రకటించిన దస్తగిరి బెయిల్కు సునీత సహకరించిందా? లేదా? హత్య గురించి సుదీర్ఘ ప్రకటనలు చేస్తున్న వారు వివేకా రెండో పెళ్లి గురించి, ఆస్తుల సెటిల్మెంట్ల గురించి ఎందుకు మాట్లాడడం లేదు? వివేకా హత్య తర్వాత ఆస్తులన్నీ హడావిడిగా మీ పేరిట ఎందుకు మార్చుకున్నారు? రాజకీయ ఆకాంక్షతోనే TDPకి అనుకూలంగా రాజకీయాలు చేస్తున్నారా? మార్చి 15, 2019న వివేకానందరెడ్డి హత్యకేసు వెలుగులోకి వచ్చింది. వివేకానందరెడ్డి చనిపోయిన విషయాన్ని PA కృష్ణారెడ్డి మొదట ఆయన కుటుంబ సభ్యులకే తెలిపారు. పీఏ కృష్ణారెడ్డి హత్య విషయం తెలియగానే ముందుగా వివేకా అల్లుడు నర్రెడ్డి రాజశేఖరరెడ్డికి ఉదయం 6 గంటల 18నిమిషాలకు ఫోన్ చేసి విషయం చెప్పారు. కేవలం కొన్ని సెకన్ల పాటు జరిగిన ఈ ఫోన్ సంభాషణలో … వివేకా బాత్రూమ్లో రక్తపు మడుగులో పడి ఉన్నారు అని పీఏ కృష్ణారెడ్డి… వివేకా అల్లుడు రాజశేఖరరెడ్డికి చెప్పారు. రక్తపు మడుగులో పడి ఉన్న మృతదేహం, ఆ ప్రదేశాన్ని వివేకా అనుచరుడు ఇనయతుల్లా తన సెల్ఫోన్ ద్వారా ఫొటోలు, వీడియోలు తీసి నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, నర్రెడ్డి శివప్రకాశ్రెడ్డిలకు వాట్సాప్ చేశారు. వాటిని చూసిన తర్వాత కూడా శివప్రకాశ్రెడ్డి.. అప్పటి టీడీపీ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న ఆదినారాయణరెడ్డి తనకు ఫోన్ చేస్తే వివేకా గుండెపోటుతో చనిపోయారని చెప్పారు. అదే విషయాన్ని ఆదినారాయణరెడ్డి మీడియాకు వెల్లడించారు కూడా. ఇక్కడ అత్యంత కీలకమైన అంశం వివేకా స్వదస్తూరితో రాసిన లేఖ, ఆయన వాడుతున్న సెల్ఫోన్. వీటి విషయంలో సొంత కుటుంబ సభ్యులు పాటించిన గోప్యత అనుమానస్పదంగా ఉంది. వివేకా రాసినట్లు చెబుతున్న లేఖ, సెల్ఫోన్ను తాము వచ్చే వరకు పోలీసులకు అప్పగించవద్దని పీఏ కృష్ణారెడ్డికి వివేకా అల్లుడు రాజశేఖరరెడ్డి ఆదేశించారు. వీరంతా పులివెందుల చేరుకున్న తర్వాతే సెల్ఫోన్లోని మెసేజ్లు, ఇతర వివరాలను డిలీట్ చేసి వాటిని పోలీసులకు అప్పగించారనే చర్చ ఉంది. వివేకానందరెడ్డి రాజకీయ వారసత్వం ఆశిస్తున్న అల్లుడు నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, బావమరిది శివ ప్రకాశ్రెడ్డి ఆయనపై కక్ష పెంచుకుని హత్యకు కుట్రపన్ని ఉండొచ్చు. నిజం తెలిసిన తరువాత కూడా ఎందుకు వివేకా అల్లుడు రాజశేఖర్రెడ్డి అబద్ధం చెప్పారు. లేఖను దాచిపెట్టారు అనేది తేలితే కేసు సగం కొలిక్కి వచ్చినట్లే. వివేకా హత్యకేసులో మరో కీలకమైన అంశం ఆయన రెండో వివాహం. షమీమ్ అనే మహిళను 2010లో వివేకానందరెడ్డి రెండో వివాహం చేసుకున్నారు. వివాహం పూర్తిగా ముస్లిం సాంప్రదాయం ప్రకారం జరిగింది. తన పేరును అక్బర్గా మార్చుకున్న వివేకా షమీమ్ను వివాహం చేసుకున్నారు. ఈ విషయంపై వివేకా కుమార్తె, అల్లుడు, బావమరిది ఆయనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పెళ్లి కారణంగా వివేకానందరెడ్డికి, ఆయన కుమార్తె సునీతారెడ్డికి మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. ఈ విషయం కారణంగానే దాదాపు 2013 నుంచి సునీతారెడ్డి తండ్రితో మాట్లాడడం లేదని ఆమె భర్త నర్రెడ్డి రాజశేఖరరెడ్డి సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలంలో స్పష్టంగా చెప్పాడు. వైఎస్ వివేకానందరెడ్డి షమీమ్ను రెండో వివాహం చేసుకోవడంతో ఆయన కుటుంబంలో తలెత్తిన విభేదాలే ఈ హత్యకు దారి తీశాయనే వాదన ఉంది. తన రెండో భార్య ద్వారా జన్మించిన కుమారుడిని వివేకా వారసుడిగా ప్రకటిస్తారనే ప్రచారం జరిగింది. ముఖ్యంగా సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలంలో వివేకా రెండో భార్య షమీమ్ ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పింది. తన కొడుకుకు ఆస్తిలో వాటా ఇస్తానని వివేకా చెప్పినట్లు షమీమ్ తన వాంగ్మలంలో చెప్పారు. తన కొడుకుకు ఆస్తి వస్తుందనే కారణంతో వివేకా మొదటి భార్య కుటుంబం తనపై కక్ష్య గట్టిందని… చాలాసార్లు తనను బెదిరించినట్లు షమీమ్ సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలంలో పూసగుచ్చినట్లు వివరించారు. ఇక ఎర్రగంగిరెడ్డిని తమ ఇంటికి పంపి… వివేకాతో పూర్తిగా సంబంధాలు తెంచుకోవాలని బెదిరించినట్లు షమీమ్ స్పష్టంగా సీబీఐకి చెప్పింది. వివేకా తన వారసుడిగా షమీమ్కు కుమారుడు షెహన్షాను ప్రకటిస్తారనే అనుమానంతోనే… సునీతారెడ్డి దంపతులు వివేకా చెక్పవర్ తొలగించినట్లు తెలుస్తోంది. దీంతో వివేకా చనిపోవడానికి ముందు తీవ్రమైన ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్నట్లు చాలామంది వాంగ్మూలంలో చెప్పారు. వివేకా హత్య కేసులో సాక్ష్యులను బెదిరించేందుకు సునీతారెడ్డి దంపతులు తీవ్రంగా యత్నించారు. వివేకానందరెడ్డి వద్ద దశాబ్దాలుగా పనిచేస్తున్న పీఏ కృష్ణారెడ్డిని తప్పుడు సాక్ష్యం చెప్పని నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, సునీతారెడ్డిలు తీవ్రంగా వేధించారు. వివేకా హత్య కేసులో భాస్కర్రెడ్డి, అవినాష్రెడ్డికి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పాలని సునీతారెడ్డి పీఏ కృష్ణారెడ్డిపై ఒత్తిడి తీసుకువచ్చింది. అయితే తాను అబద్ధపు సాక్ష్యం చెప్పదిలేదని కృష్ణారెడ్డి తెగేసి చెప్పడంతో… నర్రెడ్డి సునీతారెడ్డి తన అసలు స్వరూపం బయటపెట్టారు. సీబీఐ అధికారులతో కలిసి కృష్ణారెడ్డిని తీవ్రంగా హింసించారు. తన తండ్రి వద్ద 30ఏళ్లపాటు పనిచేసిన వ్యక్తిపైనే సునీతారెడ్డి ఇంతటి దారుణాలకు పాల్పడ్డారు. లేఖను దాచిపెట్టమని చెప్పింది కూడా కృష్ణారెడ్డికే. ఎన్నిరకాలుగా హింసించినా కృష్ణారెడ్డి అబద్ధపు సాక్ష్యం చెప్పకపోవడంతో… ఆయన కుటుంబాన్ని టార్గెట్ చేశారు. పిఏ కృష్ణారెడ్డి కుమారులను పిలిపించి సీబీఐ అధికారి రాంసింగ్ ద్వారా బెదిరింపులకు దిగారు. ఇక సునీతారెడ్డి దంపతులు నేరుగా రంగంలోకి దిగి కృష్ణారెడ్డి కుమారుడి వివాహం రద్దు చేయించారు. అంతే కాకుండా అబద్ధపు సాక్ష్యం చెప్పకపోతే మరోసారి అరెస్టు చేయిస్తామని కృష్ణారెడ్డిపై బెదిరింపులకు దిగారు. ఇక అసహనంతో కృష్ణారెడ్డి అబద్ధం చెప్పకపోతే… తన భర్త నర్రెడ్డి రాజశేఖరరెడ్డి జైలుకు వెళ్లాల్సి ఉంటుందని సునీతారెడ్డి మాట జారింది. ఇంతే కాదు వివేకా హత్య కేసులో సునీతారెడ్డిపై అనుమానం రావడానికి మరో ప్రధాన కారణం… దస్తగిరి ముందస్తు బెయిల్ పిటిషన్ను వ్యతిరేకించకపోవడం. అప్రూవర్గా మారడానికి ముందే దస్తగిరి వేసిన బెయిల్ పిటిషన్ను సునీతారెడ్డి ఎందుకు వ్యతిరేకించలేదనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ కేసులో వివేకాను తామే నరికామని… టీవీ చానెల్ల ముందు స్టేట్మెంట్లు ఇచ్చిన దస్తగిరికి వ్యతిరేకంగా సునీతారెడ్డి ఒక్కమాట కూడా మాట్లాడకపోవడం… మరో అనుమానం. ఇప్పటికైనా దస్తగిరి బెయిల్ రద్దు చేయమని అడిగే అవకాశం ఉన్నా సునీతారెడ్డి… కనీసం మాట మాట్లాడటం లేదు. తండ్రిని హత్య చేసిన వ్యక్తి రోడ్డుపై తిరుగుతుంటే … సునీతారెడ్డి ఏమీ అనకపోవడం ఆమె ఉద్దేశాన్ని బహిర్గతం చేస్తోంది. ఈ కేసులో రాజకీయ కోణాన్ని మాట్లాడుతున్న సునీతారెడ్డి అబద్ధాలను పదే పదే వల్లె వేస్తున్నారు. కడప ఎంపీ టికెట్ కోసమే తన తండ్రి హత్య జరిగిందని చెబుతున్న సునీతారెడ్డి… తాను గతంలో మాట్లాడిన మాటలపై ఇప్పుడు నోరు మెదపడం లేదు. వివేకా హత్య జరగడానికి ముందే… కడప ఎంపీ సీటు ఖరారైందనే విషయం గతంలోనే సునీతారెడ్డి చెప్పారు. ఇప్పుడు మాత్రం వంశవృక్షాన్ని పవర్పాయింట్ ప్రెజంటేషన్ రూపంలో వేస్తూ… అవినాష్రెడ్డి కుటుంబంపై చాలా కాలంగా తనలోపల ఉన్న అక్కసును వెళ్లగక్కుతున్నారు. వివేకా హత్య కేసుకు సంబంధించి నిందితులకు శిక్షపడటం కన్నా… తన రాజకీయ ప్రత్యర్ధులపై బురదజల్లే ఆలోచనే సునీతారెడ్డిలో ఎక్కువగా కనిపిస్తోంది. ఇక తన తండ్రి హత్యకేసుతో పొలిటికల్ మైలేజ్ పొందాలనుకుంటున్న సునీతారెడ్డికి… ఆమె సోదరి షర్మిల తోడయ్యారు. కేవలం ఎన్నికల్లో లబ్దిపొందాలనే ఏకైక ఎజెండాతో షర్మిల ఏకంగా అవినాష్రెడ్డే హంతకుడంటూ తేల్చేశారు. రాజకీయంగా కడపలో తనకు ప్రత్యర్ధి అయిన వ్యక్తి అవినాష్రెడ్డిపై షర్మిల చేసిన కామెంట్స్ వెనక ఉన్న ఉద్దేశం… అందరికీ ఇప్పటికే అర్ధమైంది. ఎందుకు చాలా కాలంగా షర్మిల అవినాష్రెడ్డిని టార్గెట్ చేశారో… ఎన్నికల సమయం వచ్చాక మరింత స్పష్టంగా అర్ధమవుతోంది. -
'భర్త కోరికలు తీర్చలేకపోయా.. అందుకే మరో అమ్మాయితో'
ఎవరైనా తన భర్త కోసం తమ లైఫ్లో కొన్నింటిని త్యాగం చేస్తారు. ఎంత బిజీ లైఫ్ ఉన్నప్పటికీ భార్య భర్తల మధ్య అన్యోన్యత దెబ్బతినకుండా చూసుకుంటారు. కట్టుకున్న భర్త కోసం కొంత సమయమైనా కేటాయిస్తారు. ఇది సాధారణంగా ఎక్కడైనా జరిగేదే. కానీ ఓ సింగర్ తన భర్త కోసం చేసిన పని చూస్తే కచ్చితంగా షాకవ్వాల్సిందే. ఎందుకంటే తన భర్తకు సమయం కేటాయించలేకపోతున్నానంటూ బాధపడింది. అంతే కాకుండా తన భర్త కోసం ఏదో ఒకటి చేయాలనుకుంది. చివరికీ మరో అమ్మాయితో తన భర్తకు పెళ్లి చేసి ఆ లోటును తీర్చింది. ఇంతలా షాకింగ్ ఇచ్చిన ఆ సింగర్ కథేంటో తెలుసుకుందామా? ప్రముఖ మలేషియన్ సింగర్ అజ్లిన్ అరిఫిన్ తన భర్తకు రెండో పెళ్లి చేసి వార్తల్లో నిలిచింది. తన బిజీ కెరీర్ కారణంగా.. భర్త కోసం తగినంత టైం కేటాయించలేకపోయానని ఆమె తెలిపింది. అందుకే అతనికి కొత్త భాగస్వామిని తీసుకొచ్చానని సింగర్ వెల్లడించింది. ఆమె భర్త వాన్ ముహమ్మద్ హఫీజామ్ వయస్సు ప్రస్తుతం 47 సంవత్సరాలు కాగా.. 26 ఏళ్ల వైద్యురాలితో పెళ్లి చేసింది. మార్చి రెండో వారంలో వివాహం జరిగినట్లు సమాచారం. భర్తకు రెండో పెళ్లిపై అజ్లిన్ అరిఫిన్ మాట్లాడుతూ..'నా బిజీ లైఫ్లో భర్తను సరిగా చూసుకోలేకపోయా. అందువల్ల అతని కోరికలు తీర్చలేకపోతున్నా. అందుకే రెండో పెళ్లికి నేనే చొరవ తీసుకున్నా. ఈ వివాహం తర్వాత కూడా నేను అతనితో సంతోషంగా ఉన్నా. మేం ముగ్గురం ఒకే ఇంట్లో ఉంటున్నాం. నేను అతనితో నా ఖాళీ సమయాన్ని గడుపుతున్నా' అని అన్నారు. కాగా.. 42 ఏళ్ల అజ్లిన్ అరిఫిన్ ప్రతిరోజు తన వృత్తిలో భాగంగా వివిధ నగరాలకు వెళ్లాల్సి వస్తుంది. ఆ సమయంలో తన భర్త ఒంటరిగా ఉంటున్నాడని.. అతను ఒంటరితనం నుంచి బయటపడేందుకే తాను ఇలాంటి నిర్ణయం తీసుకున్నానని అజ్లిన్ చెప్పుకొచ్చింది. అంతేకాదు.. అజ్లిన్ మొదట తన మేనేజర్ ఆడమ్ ఫామి అనే వ్యక్తిని పెళ్లాడింది. వీరిద్దరూ 2011లో పెళ్లి చేసుకుని ఆరేళ్ల తర్వాత విడిపోయారు. ఆ తర్వాత అస్లిన్ ఆధ్యాత్మికత వైపు మళ్లి నాలుగేళ్లపాటు సింగిల్ జీవితాన్ని గడిపారు. ఆ తర్వాత వాన్ ముహమ్మద్ హఫీజామ్తో 2021లో రెండో వివాహంజరిగింది. -
‘ఇదేందిరా మావా..ఈ భార్యలున్నారే..!’ వైరల్ వీడియో
పొద్దున్న లేచింది మొదలు..సోషల్ మీడియాలో రకరకాల వీడియోలు హల్చల్ చేస్తుంటాయి. కొన్ని జీవిత సత్యాల్ని అవగతం చేయిస్తాయి. ఇంకొన్ని నవ్వు పుట్టిస్తాయి. మరి కొన్ని ఆలోచింప చేస్తాయి. మరికొన్ని సెటైరికల్గా, వ్యంగ్యంగా, తమాషాగా ఉంటాయి. మన నిత్య జీవితంలో ఇలాంటి వీడియోలు చూడటం మనకి ఒక అలవాటుగా మారి పోయింది. తాజాగా అలాంటి వీడియో ఒకటి నెట్టింట హల్చల్ చేస్తోంది. దీన్ని చూసిన నెటిజన్లు ‘ఈ ఆడోళ్లున్నారే..’ అని కొందరు, ఏందిరా మావా..ఇది మరికొందరు యూజర్లు కమెంట్ చేస్తున్నారు. ఈ వీడియో ఇప్పటికే 11. 5 మిలియన్ల వ్యూస్ను సొంతం చేసుకుంది. No way! 😂pic.twitter.com/4M7jmK70wl — Figen (@TheFigen_) April 7, 2024 వీడియో సారాంశం ఏమిటంటే.. తుఫాన్లు, సునామీలు, ప్రళయం ఏం వచ్చినా పట్టించుకోకుండా నిద్రపోతున్న భార్య, భర్త ఫోన్కు మెసేజ్కు రాంగానే మాత్రం ఠపీమని లేస్తుంది. -
Britain: భార్యను 224 ముక్కలుగా నరికేశాడు
లండన్: భార్యను భర్త హత్యచేసి ఏకంగా 224 ముక్కలుగా నరికి మృతదేహాన్ని మాయంచేసిన దారుణ ఘటన బ్రిటన్లో చోటుచేసుకుంది. నికొలస్ మెట్సన్ (28), హోలీ బ్రామ్లీ (26) లింకన్ సిటీలోని బస్సింగ్హామ్లో ఉంటున్నారు. గత నెల 17 నుంచి బ్రామ్లీ కనిపించట్లేదని పోలీసులకు ఫిర్యాదు అందింది. ఆమె తనను చితకబాది వెళ్లిపోయిందని పోలీసులకు నికొలస్ చెప్పాడు. ఫ్లాట్ను తనిఖీ చేయగా పెద్ద మొత్తంలో రక్తపు మరకలు, అతిగా శుభ్రం చేసినట్లు అమ్మోనియా, బ్లీచింగ్ ఆనవాళ్లు కనిపించాయి. దాంతో అతన్ని అరెస్ట్చేసి విచారణ మొదలెట్టారు. తనకేం తెలీదని మెట్సన్ తొలుత వాదించాడు. ఈలోపు సమీపంలోని విథమ్ నదిలో నరికిన చేయి సహా చిన్నిచిన్న శరీరభాగాలున్న ప్లాస్టిక్ బ్యాగులు కొట్టుకుపోవడం చూసి స్థానికుడు పోలీసులకు సమాచారమిచ్చాడు. పోలీసు గజ ఈతగాళ్లు వాటిని సేకరించి ల్యాబ్కు పంపించారు. అసలేమాత్రం గుర్తుపట్టలేనంతగా హోలీ బ్రామ్లీ శరీరాన్ని పలుమార్లు పొడిచి 224 ముక్కలుగా నరికి భర్త నదిలో పడేశాడు. శరీరభాగాలను పడేయటంతో సాయపడినట్లు భర్త స్నేహితుడు జాషువా హ్యాన్కాక్ తన నేరాన్ని అంగీకరించాడు. పోలీసులు తమదైన శైలిలో విచారించడంతో ఎట్టకేలకు భర్త తన నేరాన్ని ఒప్పుకున్నాడు. ఆమె చంపడానికి ముందు పెంపుడు కుక్క పిల్ల, పెంపుడు ఎలుకలనూ చంపేశాడు. తన మాజీ జీవితభాగస్వాములనూ మెట్సన్ హింసించినట్లు 2013, 2016, 2017 పోలీసు రికార్డుల్లో ఉంది. జంతువుల పట్ల అతను అమానుషంగా ప్రవర్తించేవాడని పోలీసు విచారణలో వెల్లడైంది. హత్యచేసి దాదాపు వారంపాటు శరీరం ముక్కలున్న బ్యాగులను దాచి తర్వాత వాటిని పడేశాడు. హత్య తర్వాత భార్య బ్యాంక్ ఖాతా నుంచి 50 పౌండ్లు విత్డ్రా చేసి వాడుకున్నాడు. ‘భార్యను హత్య చేస్తే భర్తకు కలిగే లాభాలేంటి?. ఆ తర్వాత నన్ను ఎవరైనా వెంబడిస్తారా?. కూపీ లాగుతారా?’ అంటూ హత్యకు ముందు కొన్ని అంశాలపై ఆన్లైన్లో సెర్చ్చేశాడు. ఈ ఆన్లైన్ సెర్చ్ హిస్టరీని సైతం పోలీసులు వెలికితీశారు. -
Lok sabha elections 2024: మ్యాచ్ ఫిక్సింగ్ అంటారని..
బాలాఘాట్: అనుభా ముంజారే మధ్యప్రదేశ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే. ఈమె భర్త కంకర్ ముంజారే గతంలో ఎమ్మెల్యే, ఎంపీగా ఎన్నికయ్యారు. తాజాగా బాలాఘాట్ లోక్సభ స్థానానికి బీఎస్పీ అభ్యరి్థ. తామిద్దరి మధ్య సిద్ధాంత వైరుధ్యాలు ఉన్నందున ఒకే ఇంట్లో ఉండలేకపోతున్నానంటూ కంకర్ ముంజారే ఓ విచిత్ర నిర్ణయం తీసుకున్నారు. ‘భిన్న సిద్ధాంతాలు కలిగిన పారీ్టల్లో కొనసాగుతూ ఇద్దరం ఒకే చోట ఉంటే మ్యాచ్ ఫిక్సింగ్ అని అందరూ మమ్మల్ని అనుమానిస్తారు. అందుకే శుక్రవారం నుంచి వేరే చోట ఓ గుడిసెలో ఉంటున్నాను. ఎన్నికల పోలింగ్ రోజున ఏప్రిల్ 19వ తేదీన తిరిగి మా ఇంటికి వెళ్తా’అని ఆయన తెలిపారు. భర్త నిర్ణయం తనను బాధిస్తోందని అనుభ చెప్పారు. ‘గతంలో ఆయన గోండ్వానా గణతంత్ర పార్టీ తరఫున పారస్వాడ స్థానానికి, నేను బాలాఘాట్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసినప్పుడు కూడా ఒకే ఇంట్లో ఉన్నాం. పెళ్లైనప్పటి నుంచి 33 ఏళ్లుగా కుమారుడితోపాటు కలిసే సంతోషంగా ఉంటున్నాం’అని ఆమె అన్నారు. కాంగ్రెస్ తరఫున ఎన్నికల ప్రచారంలో భర్త కంకర్పై విమర్శలు చేయబోనన్నారు. కాగా, 2023 నవంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బాలాఘాట్లో బీజేపీ సీనియర్ నేత గౌరీశంకర్ బిసెన్పై అనుభా ముంజారే ఘన విజయం సాధించారు. -
భార్యాపిల్లలను చంపి బ్యాగులో కుక్కిన భర్త.. విస్తుపోయే విషయం వెల్లడి
లక్నో: ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో ఆదివారం(మార్చ్ 30) దారుణ ఘటన వెలుగు చూసింది. లక్నోలోని సర్వన్ నగర్లో నివాసం ఉంటున్న రామ్ లఖన్ తన భార్య ఇద్దరు పిల్లలను చంపి బ్యాగులో కుక్కి వారి మృతదేహాలను రెండు రోజుల పాటు వారి ఇంట్లోనే ఉంచుకున్నాడు. ఇంటి నుంచి దుర్వాసన వస్తుండటంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేయగా హత్యల విషయం బయటపడింది. భార్యకు స్కార్ఫ్తో ఉరివేసి చంపి అనంతరం నిద్రిస్తున్న ఇద్దరు పిల్లలను రామ్లఖన్ హత్య చేశాడు. హత్యల తర్వాత రామ్లఖన్ పారిపోయాడు. సెల్ఫోన్ లొకేషన్ను ట్రేస్ చేసిన పోలీసులు అతడిని పట్టుకుని అరెస్టు చేశారు. భార్యకు వివాహేతర సంబంధం ఉందన్న అనుమానంతోనే రామ్ లఖన్ ఈ హత్యలు చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. భార్య పిల్లలు తన పక్కనే నిద్రిస్తున్నారని అనుకోవడం కోసమే వారి మృతదేహాలను ఇంట్లోనే ఉంచుకున్నానని రామ్లఖన్ విచారణ సందర్భంగా పోలీసులకు తెలిపాడు. ఇదీ చదవండి.. ప్రాణం తీసిన బర్త్ డే కేక్ -
భార్యాభర్తలను విడదీసిన లోక్సభ ఎన్నికలు!
రాబోయే లోక్సభ ఎన్నికలు పచ్చని సంసారాల్లో చిచ్చులు కూడా పెడుతున్నాయి. భార్యాభర్తల మధ్య కలహాలకు కారణమవుతున్నాయి. ఇటువంటి పరిస్థితి మధ్యప్రదేశ్లోని బాలాఘాట్లో చోటుచేసుకుంది. బాలాఘాట్ లోక్సభ స్థానానికి జరగబోయే ఎన్నికలు భార్యాభర్తల మధ్య వివాదాలకు కారణంగా నిలిచాయి. ‘ఎన్నికల ప్రచారం అయ్యే వరకు నేను ఒక్కడినే ఇంట్లో ఉంటాను.. లేదంటే నువ్వు ఒక్కర్తివే ఇంట్లో ఉండు. ఇద్దరం ఒకే చోట ఉండటం కుదరదు’ అంటూ బీఎస్పీ నేత, మాజీ ఎంపీ కంకర్ ముంజరే తన భార్య, కాంగ్రెస్ నేత, ఎమ్మెల్యే అనుభా ముంజరేను కోరారు. దీంతో అనుభా ముంజరే దిక్కుతోచని స్థితిలో చిక్కుకున్నారు. మాజీ ఎంపీ కంకర్ ముంజరే బీఎస్పీ టికెట్పై లోక్సభ ఎన్నికల బరిలో దిగారు. అతని భార్య అనుభా ముంజరే గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ టిక్కెట్పై పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆమె ప్రస్తుతం లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీ చేస్తున్న సామ్రాట్ సరస్వర్ కోసం ప్రచారం సాగిస్తున్నారు. అనుభ ముంజరే, కంకర్ ముంజరేలు భార్యాభర్తలుగా ఒకే ఇంట్లో ఉంటూ వేర్వేరు పార్టీలకు ప్రచారం చేయడం వారికి సమస్యగా మారింది. మరోవైపు అనుభ ముంజరే బీఎస్పీ నుంచి పోటీ చేస్తున్న తన భర్త కంకర్ ముంజరేకు ప్రచారం చేస్తారా లేక కాంగ్రెస్ అభ్యర్థి తరఫున ప్రచారం చేస్తారా? అంటూ పలువురు మరో సమస్యను లేవదీస్తున్నారు. ఈ నేపధ్యంలో భర్త కంకర్ ముంజరే తన భార్యతో ‘ఏప్రిల్ 19వ తేదీన ఇక్కడ లోక్సభ ఎన్నికల ఓటింగ్ ముగిసే వరకు ఇంటికి దూరంగా ఉండు. మీ సోదరి ఇంటికి లేదా వేరే ఎక్కిడికైనా వెళ్లి కాంగ్రెస్ తరపున ప్రచారం సాగించు. ఈ ఇంటిలో ఉంటూ కాంగ్రెస్కు ప్రచారం చేయవద్దు. నువ్వు ఇల్లు వదిలి వెళ్లకపోతే నేను ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయి ఎన్నికలకు ప్రచారం చేసుకుంటాను. ఈ విషయంలో నువ్వు ఎలాంటి ప్రశ్నలు వేయవద్దు. ఇది మా పార్టీ విధివిధానాలకు సంబంధించిన విషయం. నేను ఇందులో ఏ మాత్రం రాజీపడను’ అని భార్యతో తెగేసి చెప్పేశాడట. -
భార్య ప్రాణాలు తీసిన భర్త ఐపీఎల్ బెట్టింగ్.. రూ. కోటికిపైగా అప్పులు!
క్రికెట్ బెట్టింగ్ ఓ కుటుంబంలో విషాదాన్ని నింపింది. భర్త ఐపీఎల్ బెట్టింగ్ వ్యసనానికి భార్య బలైంది. భర్త చేసిన అప్పు తీర్చలేక, రుణదాతల ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకొని ప్రాణాలు విడిచింది. ఈ విషాదం కర్ణాటక రాష్ట్రంలో మార్చి 18న జరగ్గా ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాలు.. చిత్రదుర్గ జిల్లాకు చెందిన దర్శన్ బాబు హోసదుర్గలో అసిస్టెంట్ ఇంజనీర్గా(ప్రభుత్వ ఉద్యోగి) పనిచేస్తున్నాడు. రంజితతో 2020లో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే దర్శన్కు క్రికెట్పై బెట్టింగ్ అంటే సరదా. ఈ సరదా కాస్తా నెమ్మదిగా వ్యసనంగా మారింది. 2021 నుంచి 23 వరకు బెట్టింగ్లో ఇరుకున్నాడు. ఈక్రమంలో పలుమార్లు పందెంలో ఓడిపోవడంతో ఇతరుల నుంచి అప్పు తీసుకోవడం ప్రారంభించాడు. బెట్టింగ్లకు డబ్బులు సరిపోని సమయంలో ఇంట్లోని ఏదో ఒక వస్తువును వాళ్ల వద్ద తాకట్టు పెట్టేవాడు. రుణదాతల నిత్యం వేధింపులతో విసిగిపోయిన అతని భార్య(23) మార్చి 18న అత్మహత్య చేసుకుంది. ఇంట్లోని ఫ్యాన్కు ఉరేసుకొని ప్రాణాలు విడిచింది. కూతురు మరణంపై తండ్రి వెంకటేష్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వడ్డీ వ్యాపారుల నిత్యం వేధింపుల వల్ల తన కూతురు తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడిందని వెంకటేష్ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. డబ్బును అప్పుగా ఇచ్చిన 13 మంది వ్యక్తుల పేర్లను కూడా అతను పేర్కొన్నాడు. దర్శన్కు బెట్టింగ్లో పాల్గొనడం ఇష్టం లేకపోయినా.. త్వరగా డబ్బులు సంపాదించవచ్చని, తక్కువ సమయంలో ధనవంతులు కావొచ్చంటూ తన అల్లుడిని ట్రాప్ చేశారని ఆరోపించారు. తన భర్త క్రికెట్ బెట్టింగ్ల ద్వారా డబ్బులు పొగొట్టుకుంటున్నట్లు రంజితకు 2021లో తెలిసినట్లు వెంకటేష్ పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. తమ విచారణలో పోలీసులకు సూసైడ్ నోట్ లభించింది. అందులో ఆమె ఎదుర్కొన్న వేధింపులను వివరించింది. దర్శన్కు దాదాపు రూ. కోటి వరకు అప్పులు ఉన్నట్లు సమాచారం. 2021 నుంచి 2023 వరకు ఐపీఎల్ బెట్టింగ్లు పెట్టి డబ్బులు పొగొట్టుకున్నాడు. అతను పందెం కాసేందుకు దాదాపు రూ. 1.5 కోట్లకు పైగా అప్పు చేసినట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటి వరకు రూ.1 కోటి తిరిగి ఇచ్చేశాడని.. ఇంకా రూ. 84 లక్షల కట్టాల్సి ఉందని పోలీసులు పేర్కొన్నారు. -
కవిత భర్త అనిల్కు ఈడీ నోటీసులు
సాక్షి, హైదరాబాద్: కవిత భర్త అనిల్కు ఈడీ నోటీసులు జారీ చేసింది. కవిత పీఆర్వో రాజేష్,ముగ్గురు అసిస్టెంట్లకు కూడా నోటీసులిచ్చింది. సోమవారం హాజరుకావాలని ఈడీ ఆదేశించింది. నిన్న కవిత ఇంట్లో సోదాలు చేస్తున్న సమయంలో ఐదుగురు సెల్ఫోన్లు ఈడీ అధికారులు సీజ్ చేశారు. కాగా, లిక్కర్ కేసులో అరెస్టైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు రిమాండ్ విధించింది రౌస్ అవెన్యూ కోర్టు. అలాగే ఏడు రోజుల ఈడీ కస్టడీకి అనుమతించింది. అరెస్టు అక్రమమని కవిత తరఫు లాయర్ల వాదనను కోర్టు తిరస్కరించింది. ఈ క్రమంలో రిమాండ్ విధిస్తూ.. ఈ నెల 23న మధ్యాహ్నాం 12 గంటలకు కవితను తిరిగి హాజరు పరచాలని ఈడీని ఆదేశించింది. అలాగే రిమాండ్లో కుటుంబ సభ్యులు, న్యాయవాదులను కలిసేందుకు కవితకు అవకాశం కల్పిస్తూనే.. ఇంటి భోజనానికి కోర్టు అనుమతించింది. కవిత కస్టడీ రిపోర్టులో ఏముందంటే? ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కవిత కీలకంగా ఉన్నారు సౌత్ లాబీ పేరుతో లిక్కర్ స్కాంలో కీలకంగా వ్యవహరించారు ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో కీలక కుట్ర దారు, ప్రధాన లబ్ధిదారు కవితే ఆమ్ అద్మీ పార్టీకి కవిత లిక్కర్ స్కాం ముడుపుల కింద వంద కోట్లు ఇచ్చారు మాగుంట శ్రీనివాస్ రెడ్డితో కలిసి ఆప్ నేతలతో కవిత కుట్రకు పాల్పడ్డారు కవితకు బినామీగా రామచంద్ర పిళ్లై ఉన్నారు పిళ్లై ద్వారా కవిత మొత్తం వ్యవహారం నడిపించారు అరుణ్ పిళ్లైని డమ్మీగా పెట్టి ఇండోస్పిరిట్ కంపెనీలో.. కవిత వాటా పొందారు ఇతరులతో కలిసి 100 కోట్ల రూపాయల లంచాలను ఆప్ నేతలకు కవిత ఇచ్చారు కేసు నుంచి తప్పించుకునేందుకు కవిత తన మొబైల్ లోని ఆధారాలు తొలగించారు సౌత్ గ్రూప్ లోని శరత్ చంద్రారెడ్డి, మాగుంట శ్రీనివాస్ రెడ్డి, రాఘవ మాగుంటతో కలిసి ఆప్ నేతలతో కవిత కుట్రలు పన్నారు మాగుంట ద్వారా రూ. 30 కోట్లను కవిత ఢిల్లీకి చేర్చారు రూ. 30 కోట్లను అభిషేక్ బోయినపల్లి ఢిల్లీకి తీసుకెళ్లాడు అని ఈడీ పేర్కొంది. ఇదీ చదవండి: కవిత రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు -
భర్త వేధింపులు తాళలేక భార్య విషాదం!
మహబూబ్నగర్: భర్త వేధింపులు తాళలేక భార్య ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలోని ముమ్మళ్లపల్లిలో చోటు చేసుకుంది. ఎస్ఐ మంజునాథ్రెడ్డి కథనం మేరకు.. పాన్గల్ మండలం బుసిరెడ్డిపల్లికి చెందిన కృష్ణయ్య కుమార్తె సరిత (25)ను కొత్తకోట మండలం ముమ్మళ్లపల్లికి చెందిన నాయిని మారుతికిచ్చి ఆరేళ్ల కిందట వివాహం జరిపించారు. వీరికి కుమార్తె, కుమారుడు ఉన్నారు. మారుతి జిల్లాకేంద్రంలోని మార్కెట్యార్డులో కూలి పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తుండేవారు. బుధవారం ఉదయం భర్త, పిల్లలు బంధువుల ఇంట్లో జరిగే వివాహానికి వెళ్లారు. ఒంటరిగా ఉన్న సరిత ఇంట్లో ఉరేసుకుంది. ఇంటికి వచ్చిన మారుతి తలుపులు తెరిచి చూడగా సరిత ఉరేసుకొని కనిపించడంతో గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటన స్థలానికి చేరుకున్న ఎస్ఐ సరిత తల్లిదండ్రులతో వివరాలు సేకరించారు. కొంతకాలంగా మారుతి అదనపు కట్నం కోసం భార్యను వేధించేవాడని తండ్రి వాపోయాడు. కృష్ణయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వివరించారు. ఇవి చదవండి: భర్త, అత్త వేధింపులతో వివాహిత తీవ్ర నిర్ణయం..! చివరికి.. -
వాళ్లను వదిలిపెట్టొద్దు.. గీతాంజలి భర్త ఆవేదన
సాక్షి, గుంటూరు జిల్లా: తెనాలిలో విషాద ఛాయలు అలుముకున్నాయి. టీడీపీ, జనసేన ట్రోలింగ్స్ తట్టుకోలేక గీతాంజలి ఆత్మహత్యకు పాల్పడిందని ఆమె భర్త బాలచందర్, ఇతర కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. గీతాంజలిది చిన్న పిల్ల మనస్తత్వం అని, ఇలా జరుగుతుందని మేము ఊహించలేదన్నారు. వీడియో మాట్లాడినప్పుడు చాలా ఆనంద పడిందని, ఆ వీడియోకి సోషల్ మీడియాలో వస్తున్న కామెంట్లకు తనలో తానే బాధపడిందని, ఫోన్ చూస్తూ నిత్యం ఏడ్చేదన్నారు. ‘‘తెల్లవారుజామున 3 గంటల వరకు ఫోను చూస్తూ ఏడుస్తూనే ఉంది. ఇంకా ఎవరికీ ఎటువంటి ఇబ్బందులు ఉండవని చివరగా ఫోన్ చేసి ఆత్మహత్య చేసుకుంది. ఒక మహిళ మీద ఇలాంటి ట్రోలింగ్స్ ఎవరైనా చేస్తారా?. ట్రోలింగ్స్ తట్టుకోలేక మా అమ్మాయి దూరమైంది. ఎవరైతే ట్రోలింగ్ చేసారో వాళ్ల మీద కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇదీ చదవండి: టీడీపీ, జనసేన ఆన్లైన్ మృగాల వికృత క్రీడ.. ఓ చెల్లెమ్మను చంపేశారు! -
బిష్ణుపూర్ లోక్సభ బరిలో విచిత్ర పోరు
2024 లోక్సభ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్ నుంచి బరిలోకి దిగే తమ 42 మంది అభ్యర్థుల పేర్లను తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ప్రకటించింది. ఈ నేపధ్యంలో ఇక్కడి బిష్ణుపూర్ స్థానం చర్చనీయాంశంగా మారింది. విడాకులు తీసుకున్న ఒక జంట ఈ సీటు నుంచి పరస్పరం పోటీకి దిగడం ఆసక్తికరంగా మారింది. బంకురా జిల్లాలోని బిష్ణుపూర్ లోక్సభ స్థానం నుంచి ప్రస్తుత ఎంపీ సౌమిత్రా ఖాన్కు బీజేపీ టిక్కెట్ కేటాయించింది. అదే స్థానం నుండి అతని మాజీ భార్య సుజాత మండల్కు టీఎంసీ టికెట్ ఇచ్చింది. రాష్ట్రంలో 2021 అసెంబ్లీ ఎన్నికలకు ముందు సౌమిత్రా ఖాన్, సుజాత మండల్ విడిపోయారు. ఆ సమయంలో సుజాత మండల్ తృణమూల్ కాంగ్రెస్లో ఉన్నారు. 2019 లోక్సభ ఎన్నికలకు ముందు సౌమిత్ర ఖాన్ టీఎంసీ నుండి బీజెపీలో చేరారు. టీఎంసీ లోక్సభ అభ్యర్థుల పేర్లను ప్రకటించడంతో కాంగ్రెస్తో పొత్తుపై వస్తున్న ఊహాగానాలకు తెరపడింది. అయితే కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే మాట్లాడుతూ నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియకు ముందు ఏ సమయంలోనైనా కూటమి ఏర్పడవచ్చని అన్నారు. కాగా పశ్చిమ బెంగాల్లోని 42 లోక్సభ స్థానాల్లో ఆరుగురు ముస్లిం అభ్యర్థులకు టీఎంసీ టిక్కెట్లు ఇచ్చింది. బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్లో జరిగిన మెగా ర్యాలీలో టీఎంసీ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ తమ పార్టీ అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ, మోదీ హామీకి ఎలాంటి వారెంటీ లేదని వ్యాఖ్యానించారు. -
జయసుధ భర్త మరణం.. అప్పులపై జయసుధ క్లారిటీ!
జయసుధ.. ఈ పేరు తెలుగువారికి పరిచయం అక్కర్లేదు. అంతలా తెలుగు సినీ ప్రియుల గుండెల్లో తన పేరును లిఖించుకుంది. ఆనాటి స్టార్స్ ఎన్టీఆర్, ఏఎన్నార్, శోభన్ బాబు లాంటి దిగ్గజాల సరసన తనదైన నటనతో మెప్పించింది. తెలుగు, తమిళ తదితర భాషల్లో హీరోయిన్గా చాలా పేరు తెచ్చుకుంది. ఆ తర్వాత సహాయ నటిగా ఎన్నో సినిమాలు చేసింది. ఇప్పటికీ వెండితెరపై అభిమానులను అలరిస్తోంది. గతేడాది విజయ్ నటించిన చిత్రం వారీసు(వారసుడు)లో తల్లి పాత్రలో మెరిసింది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన జయసుధ తన వ్యక్తిగత జీవితం గురించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించింది. తన భర్త ఆత్మహత్యకు అప్పులు కారణం కాదని వివరించింది. తాము నిర్మించిన చిత్రాలతో కష్టాలు పడ్డామని తెలిపింది. నా భర్త నితిన్ ఆరు సినిమాలు తీశారు. వాటిలో మూడు సక్సెస్ కాగా.. మరో మూడు చిత్రాలు ఫెయిల్ అయ్యానని పేర్కొంది. అందరూ అనుకున్నట్లు మాకు ఎలాంటి అప్పులు లేవని జయసుధ వివరించింది. జయసుధ మాట్లాడుతూ.. 'నా భర్త ఫ్యామిలీలో వాళ్ల బ్రదర్ కూడా అలానే చనిపోయారు. వాళ్ల మా అత్తగారి తరఫున ఇద్దరు అలాగే సూసైడ్ చేసుకున్నారు. ఆయన సూసైడ్కు నేను కారణం కాదు. ఆ పరిస్థితి మన ఫ్యామిలీలో ఎవరికీ రాకూడదని కోరుకుంటున్నా. నేనే కదా సంపాదించేది. అప్పట్లో అప్పులంటే మాకు భయమే లేదు. మాకు సూసైడ్ చేసుకునేంత అప్పులు ఉండేవి కావు. కానీ సోషల్ మీడియా వచ్చాక ఎక్కువగా చెడునే ప్రచారం చేస్తున్నారు. కానీ ఇక్కడ మంచి కూడా ఉంది. నేను కూడా రోజు సోషల్ మీడియా చూస్తాను.' అని అన్నారు. ఆయనను కాపాడేందుకు మేము.. నా భర్త తరఫు ఫ్యామిలీ కూడా ఆయనను కాపాడడానికి చివరి వరకు ప్రయత్నించామని జయసుధ తెలిపారు. కానీ విధిరాత అనేది ఒకటి ఉంటుంది కదా? అని ఆమె అన్నారు. ఆయన మరణం తర్వాత నేను షాక్లో ఉన్నానని తెలిపింది. కానీ ఆ తర్వాత దిల్ రాజు నిర్మించిన శతమానంభవతి సినిమా చేసినట్లు వివరించింది. ఫస్ట్ చేయకూడదని అనుకున్నా.. కానీ సినిమా చేయడం వల్లే ఆ విషాదం నుంచి బయటపడినట్లు జయసుధ వెల్లడించింది. ఆ సమయంలో నా ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్గా ఉన్నారని జయసుధ పేర్కొంది. -
అన్ఫాలో.. ఫాలో!
అస్టార్ హీరోయిన్ నయనతార, ప్రముఖ దర్శకుడు విఘ్నేష్ శివన్ ప్రేమ వివాహం చేసుకున్న విషయం, కవల పిల్లలు (కుమారులు) ఉన్న విషయం తెలిసిందే. కాగా ఈ దంపతులు అన్యోన్యంగా కనిపిస్తారు. అలాంటిది తాజాగా తన భర్త విఘ్నేష్ శివన్ను నయనతార ఇన్స్టాగ్రామ్లో అన్ఫాలో కావడం చర్చనీయాంశంగా మారింది. గత ఏడాది ఇన్స్టాగ్రామ్ ఖాతాని ప్రారంభించిన నయనతార తక్కువ సమయంలోనే 78 లక్షల మంది ఫాలోవర్స్ని సొంతం చేసుకున్నారు. ఇన్స్టాలో విఘ్నేష్ని ఫాలో అవుతూ వచ్చిన నయనతార అకస్మాత్తుగా అన్ఫాలో అయ్యారు. గత నెల ఫిబ్రవరి 14న ప్రేమికుల రోజున కూడా ‘మా ప్రేమ బంధానికి పదేళ్లు’ అంటూ భర్తతో ఉన్న ఫొటోలు షేర్ చేసిన నయనతార ఇప్పుడు ఇలా అన్ఫాలో కావడం చాలామందిని ఆశ్చర్యపరిచింది. అయితే సాంకేతిక కారణాల వల్లే అలా జరిగి ఉండొచ్చని కొందరు అభిప్రాయపడ్డారు. కాగా అన్ఫాలో వార్త వైరల్ అయిన కొంత సమయానికి తిరిగి విఘ్నేష్ని ఫాలో అయ్యారు నయనతార. -
అది చాలా నిజం: రష్మిక
‘‘రష్మికా మందన్నాకి భర్తగా రావాలంటే అత నికి ఏయే లక్షణాలు ఉండాలి? ఆమె నేషనల్ క్రష్ కాబట్టి ఆమె భర్త ప్రత్యేకంగా ఉండాలి. చెప్పాలంటే ఆమె భర్త వీడీలా ఉండాలి.. అంటే ‘వెరీ డేరింగ్’.. ఆమెను చక్కగా చూసుకోవాలి. మేం ఆమెను రాణి అని పిలుస్తాం. ఆమె భర్త రాజులా ఉండాలి’’ అంటూ సోషల్ మీడియా వేదికగా రష్మికా మందన్నా అభిమాని షేర్ చేశాడు. ఆ పోస్ట్కి ‘అది.. చాలా నిజం’ అని రష్మిక స్పందించడం హాట్ టాపిక్ అయింది. అంటే.. ఆ అభిమాని పేర్కొన్నట్లు తనకు వీడీలాంటి భర్త కావాలని ఈ బ్యూటీ స్పష్టం చేశారు. ఇక.. ‘వీడీ’ అంటే విజయ్ దేవరకొండ అంటూ పలువురు నెటిజన్లు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆ విధంగా ఈపోస్ట్ వైరల్గా మారింది. -
12 ఏళ్లుగా భార్యను గదిలో బంధించిన భర్త.. ఎందుకంటే!
బెంగళూరు: కట్టుకున్న భార్యపట్ల అమానవీయంగా ప్రవర్తించాడో భర్త. అర్థం లేని అనుమానాలతో ఆమెను గృహ నిర్బంధంలో బంధించాడు. కనీసం వాష్రూమ్ సదుపాయం లేని ఓ గదిలో ఉంచి తాళం వేశాడు. తన పిల్లలను కూడా కలవనివ్వలేదు. ఒకటి కాదు రెండు దాదాపు గత 12 ఏళ్లుగా భార్యను ఇలాగే వేధిస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నాడు శాడిస్టు భర్త. కర్ణాటకలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ఈ దారుణం చుట్టు పక్కల వాళ్లకు తెలియడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఆ మహిళకు బయటకు తీసుకువచ్చి జరిగిన విషయం గురించి తెలుసుకొని నివ్వెర పోయారు. భర్త ఏ పనిమీద బయటకు వెళ్లినా తనను ఇంట్లో ఉంచి తాళం వేసి వెళ్తాడని బాధితురాలు పోలీసులకు తెలిపింది. పిల్లలతో స్వేచ్ఛగా మాట్లాడనివ్వకుండా, పదే పదే కొట్టేవాడని చెప్పింది. గత 12 ఏళ్లుగా మానసిక క్షోభకు గురి చేశాడని, ఇంట్లోనే బంధించి ఇంటిని జైలుగా మార్చాడని పేర్కొంది. చాలా కాలంగాచి ఈ బాధతో కుంగిపోయానని ఆవేదన వ్యక్తం చేసింది. తనను బంధించిన గదిలోనే ఒక చిన్న పెట్టెలో కాలకృత్యాలు తీర్చుకొనే దానినని బాధితురాలు వాపోయింది. విషయం తెలిసిన పోలీసులు ఆమె భర్తను అదుపులోకి తీసుకుని ఈ విషయమై కౌన్సెలింగ్ ఇచ్చారు. భర్తపై ఫిర్యాదు చేయడానికి బాధితురాలు నిరాకరించింది. ఇకపై అతడికి విడాకులు ఇచ్చి పుట్టింట్లో ఉంటానని తెలిపింది. కాగా అతడికి బాధితురాలు మూడో భార్య మొదట రెండు పెళ్లిళ్లు అయ్యాయి. కానీ అతడి వేధింపులకు తాళలేక వారిద్దరూ వదిలేసి వెళ్లిపోయారు. వీరికి ఇద్దరు పిల్లల -
దారుణం: 12 ఏళ్లుగా ఆమెకు ఇల్లే జైలు
బెంగళూరు: శాస్త్రసాంకేతికతతో మనిషి అభివృద్ధి వైపు పరుగులు పెడుతున్న కాలం మనదని చెబుతాం. స్త్రీలు సగర్వంగా తిరిగగలిగే సమాజంలో ఉన్నామని అనుకుంటాం. కానీ కర్ణాటకలో జరిగిన ఓ ఘటనను చూస్తే అవన్నీ ప్రసంగాలకే పరిమితమవుతున్నాయా? అని ప్రశ్నించుకోకతప్పదు! కర్ణాటకాలో ఓ మహిళకు పుష్కరకాలంగా ఇల్లే కారాగారంగా మారింది. కర్ణాటకాలోని మైసూరులో దారుణం వెలుగులోకి వచ్చింది. 12 ఏళ్లుగా ఓ అనుమానపు భర్త తన భార్యను ఇంట్లోనే బంధించాడు. భర్త పనికి వెళ్లే ముందు తనను ఇంట్లో ఉంచి తాళం వేసుకుని వెళతాడని మహిళ(32) పోలీసులకు తెలిపింది. మరుగుదొడ్డి కోసం ఇంట్లో చిన్న బాక్స్ను ఉపయోగించానని ఆవేదన వ్యక్తం చేసింది. పిల్లలు పాఠశాల నుంచి వచ్చినా భర్త ఇంటికి వచ్చేవరకు లోపలికి అనుమతి ఉండదని తెలిపింది. కిటికీ నుంచే పిల్లలకు భోజనం అందిస్తానని కన్నీరు పెట్టుకుంది. ‘‘నాకు పెళ్లయి 12 ఏళ్లైంది.. నన్ను ఎప్పుడూ ఇంట్లో బంధించి చిత్రహింసలు పెట్టేవాడు. ఆ ప్రాంతంలో ఆయన్ని ఎవరూ ప్రశ్నించరు. నా పిల్లలు స్కూల్కి వెళతారు. కానీ నా భర్త పని నుంచి వచ్చే వరకు బయటే ఉంటారు. నేను వారికి కిటికీలోంచి ఆహారం ఇస్తాను. నా తల్లిదండ్రుల ఇంటికి ఎప్పుడు వెళ్లానో కూడా సరిగా గుర్తులేదు." అని పోలీసులకు మహిళ తెలిపింది. అయితే.. భర్తపై కేసు పెట్టడానికి మాత్రం బాధిత మహిళ ఇష్టపడలేదు. తన తల్లిదండ్రుల ఇంటి వద్దే ఉంటానని పోలీసులకు తెలిపింది. అక్కడి నుంచే వివాహ సమస్యలను పరిష్కరించుకుంటానని పేర్కొంది. భర్తకు బాధిత మహిళ మూడో భార్య. గత మూడు వారాలుగా ఆమె ఇంట్లోనే ఉండటం గమనించామని పోలీసులు తెలిపారు. ఆమె కదలికలపై పూర్తి నిషేధం ఉంచినట్లు గుర్తించామని వెల్లడించారు. పనికి వెళ్లే ముందు ఆమెను ఇంట్లో ఉంచే తాళం వేయడం తాము గమనించినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం ఆమెను రక్షించామని, తల్లిదండ్రుల వద్దకే మహిళ వెళ్లడానికి ఇష్టపడినట్లు తెలిపారు. భర్తకు కౌన్సిలింగ్ ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఇదీ చదవండి: ఆరు చోట్ల బాంబులు పెట్టాం.. ముంబైకి బాంబు బెదిరింపు కాల్ -
భర్తకు ఆదాయం లేకపోయినా..మెయింటెనెన్స్ ఇవ్వాల్సిందేనా?
ఇటీవల కాలంలో దంపతుల మధ్య సయోధ్య లేకపోవడం వల్లనో లేక ఇతరత్ర కారణాల వల్లనో విడాకులకు దారితీస్తున్నాయి. ఫ్యామిలీ కోర్టుల్లో అందుకు సంబంధించిన కేసులు సంఖ్య కూడా ఎక్కువగానే ఉన్నాయి. ఇద్దరి సమ్మతంతో విడిపోయినప్పటికీ స్త్రీకి ఎంతో కొంత భరణం ఇవ్వాల్సి ఉంటుంది. దాన్ని క్లైయిమ్ చేసుకోవాల్సింది సదరు మహిళే. ఒకవేళ ఆమె క్లైయిమ్ చేసుకున్నప్పటికీ కొందరూ ప్రబుద్ధులు తనకు ఆదాయం లేదని, లేదా కుటుంబాన్ని చూసుకోవాల్సి ఉందంటూ భరణం ఇవ్వకుండా తప్పించుకునే ప్లాన్లు వేస్తుంటారు. దీంతో సదరు మహిళలు ఇబ్బందులు పడుతుంటారు. అయితే అలాంటి ఎత్తుగడలకు చెక్పెడుతూ అలహాబాద్ ధర్మాసనం సంచలన తీర్పు ఇచ్చింది. అసలేం జరిగిందంటే..అలహాబాద్కు చెందిన ఓ జంటకు 2015లో వివాహం అయ్యింది. అదనపు కట్నం డిమాండ్ చేస్తున్నారని సదరు మహిళ అత్తమామలపై ఎఫ్ఐఆర్ కేసు నమోదు చేసింది. ఆ తర్వాత ఆమె 2016 నుంచి తల్లిదండ్రులతోనే జీవిస్తుంది. అయితే ఫామిలీ కోర్టు ఆమెకు నెలకు రూ. 2000 భరణం ఇవ్వాలని తీర్పు ఇచ్చింది. దీన్ని సవాలు చేస్తూ సదరు వ్యక్తి హైకోర్టుని ఆశ్రయించాడు. తనకు ఆదాయం లేదని, తన తల్లిదండ్రులను, అక్కచెల్లెళ్లను చూసుకోవాల్సి ఉండటంతో తాను భరణం చెల్లించలేనంటూ పిటీషన్ వేశాడు. అంతేగాదు తన భార్య టీచింగ్ ద్వారా నెలకు రూ. 10 వేలకు సంపాదిస్తున్నారని కాబట్టి తాను ఇవ్వలేనని పిటిషన్లో పేర్కొన్నాడు. అయితే ధర్మాసనం ఆదాయం లేకపోయినా లేదా ఉద్యోగం లేకపోయినా రోజూ కూలిగా రూ. 300 నుంచి రూ. 400 వరకు సంపాదించొచ్చు అంటూ ఆ వ్యక్తికి మొట్టికాయలు వేసింది. ఉద్యోగం ఉన్నా, లేకపోయినా విడిపోయిన భార్యకు మెయింటెనెన్స్ చెల్లించాల్సిందేనని పేర్కొంది ధర్మాసనం. ఆ వ్యక్తి పిటిషన్ను జస్టిస్ రేణూ అగర్వాల్ సారధ్యంలోని అలహాబాద్ హైకోర్టు లక్నో బెంచ్ తోసి పుచ్చింది. సదరు వ్యక్తి ఆయన భార్యకు చెల్లించాల్సిన మొత్తం భరణం రికవరీ బాధ్యతలు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ప్రిన్సిపల్ జడ్జిని ఆదేశించారు జస్టిస్ రేణు అగర్వాల్. అలాగే సదరు వ్యక్తి తన భార్య ఉద్యోగం చేస్తుందనేందుకు ఆధారాలు సమర్పించడంలో కూడా విఫలమయ్యారని హైకోర్టు పేర్కొంది. అదీగాక ఆ వ్యక్తి ఆరోగ్యంగానే ఉన్నందున కార్మికుడిగా పని చేసైనా భార్యకు భరణం ఇవ్వాలని న్యాయస్థానం ఆదేశించింది. కాగా, ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సదరు వ్యక్తి గతేడాది ఫిబ్రవరి 21న రివిజన్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే, సీఆర్పీసీ 125 సెక్షన్ కింద భార్యకు భరణం చెల్లించాలని ఫ్యామిలీ కోర్టు ఆదేశించడం జరిగింది. ఇలాంటి సమస్యలనే ఫేస్ చేస్తుంటే..భయపడొద్దు. ధైర్యంగా మహిళలకు అనుకూలమైన చట్టాల గురించి సవివరంగా తెలుసుకుని కోర్టులో పోరాడండి. అదే సమయంలో మహిళలు కూడా తమ వైవాహిక బంధాన్ని చిన్న చిన్న విషయాలకు తెంచుకునే యత్నం చేయకుండా పెద్దలతో సయోధ్య చేసుకునేలా ప్రయత్నించి, మను వివాహ వ్యవస్థను కాపాడుకునే యత్నం చేద్దాం. (చదవండి: జీవితాన్ని దిద్దుకుంది... పేదల పక్షాన నిలిచింది) -
Keerthi Bhat: పెళ్లికి ముందే భర్తతో కలిసుంటున్న బిగ్బాస్ 'కీర్తి'.. తన ఇల్లు చూశారా? (ఫోటోలు)