Hit and run case
-
హిట్ అండ్ రన్ కేసులో సినీహీరో హర్షవర్ధన్ అరెస్ట్
బంజారాహిల్స్: హిట్ అండ్ రన్ కేసులో సినీ హీరో సాధుల హర్షవర్ధన్తో పాటు అతడి స్నేహితుడు మాడే సాంకేత్ శ్రీనివాస్ అలియాస్ తేజను బంజారాహిల్స్ పోలీసులు ఆదివారం అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. బంజారాహిల్స్లోని బసవతారకం కేన్సర్ ఆస్పత్రి సమీపంలో శనివారం తెల్లవారుజామున అతి వేగంగా వచి్చన కారు ఫుట్పాత్ పైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో అక్కడ నిద్రిస్తున్న గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందగా మరో ఇద్దరు గాయపడ్డారు. వివరాల్లోకి వెళితే..నిజామాబాద్ అర్బన్కు చెందిన హర్షవర్దన్ సినిమా హీరోగా నటిస్తూ బంజారాహిల్స్ రోడ్డునెంబర్–13లోని ఓ అపార్ట్మెంట్లో తన స్నేహితులు మాడే సాంకేత్ శ్రీనివాస్ అలియాస్ తేజ, వంశీ, రాకేష్తో కలిసి ఉంటున్నాడు. శనివారం తెల్లవారుజామున జూబ్లీహిల్స్లోని ఓ పబ్లో మద్యం తాగిన రాకేష్ తనను పికప్ చేసుకోవాలని ఫోన్ చేయడంతో హర్షవర్ధన్కు చెందిన కారులో బయలుదేరిన తేజ, కార్తీక్ బంజారాహిల్స్ రోడ్డునెంబర్–12 మీదుగా వేగంగా దూసుకెళ్తూ హిట్ అండ్ రన్కు పాల్పడ్డారు. తేజ కారు నడుపుతుండగా, కార్తీక్ పక్కన కూర్చున్నాడు. ఈ ఘటనతో భయాందోళనకు లోనైన తేజ, కార్తీక్తో పాటు గదిలో ఉన్న హర్షవర్ధన్, వంశీ తదితరులు కూడా పరారయ్యారు. పక్కా సమాచారంతో పోలీసులు వీరందరినీ అదుపులోకి తీసుకుని విచారించగా మిస్టరీ వీడింది. కారు హర్షవర్దన్ది కాగా డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా తేజ కారు నడిపి ఈ ప్రమాదానికి కారకుడయ్యాడు. ఈ నేపథ్యంలో కారు ఇచి్చన హర్షవర్ధన్తో పాటు నడిపిన తేజపై పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. బంజారాహిల్స్ ఇన్స్పెక్టర్ కేఎం రాఘవేంద్ర కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
TG: హిట్ అండ్ రన్.. ఇద్దరు కానిస్టేబుల్స్ మృతి
సాక్షి, గజ్వేల్: తెలంగాణలో మరో హిట్ అండ్ రన్ కేసు వెలుగు చూసింది. ఈ ప్రమాదంలో ఇద్దరు కానిస్టేబుల్స్ మృతి చెందారు. మృతిచెందిన కానిస్టేబుళ్లను పరందాములు, వెంకటేశ్గా గుర్తించారు.వివరాల ప్రకారం.. సిద్దిపేట-జాలిగామ బైపాస్లో ఆదివారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో ఇద్దరు కానిస్టేబుళ్లు మృతిచెందారు. ఈ ప్రమాదంలో మృతిచెందిన కానిస్టేబుళ్లను పరందాములు, వెంకటేశ్గా గుర్తించారు. వీరిలో పరందాములు రాయపోలు పీఎస్లో, వెంకటేశ్ దౌల్తాబాద్ పీఎస్లో విధులు నిర్వహిస్తున్నారు. అయితే, వీరిద్దరూ మారధాన్ కోసం వెళ్తున్నట్టు తెలిసింది. -
పోలీసులు దర్యాప్తు కొనసాగించవచ్చు
సాక్షి, హైదరాబాద్: చార్జిషీట్ దాఖలు చేసిన తర్వాత.. సమాచారం అందించి కోర్టు అనుమతితో పోలీసులు దర్యాప్తు కొనసాగించవచ్చని హైకోర్టు స్పష్టం చేసింది. దర్యాప్తు అధికారులు అనుమతి కోరితే అనుమతించే అధికారం కోర్టుకు ఉందని స్ప ష్టం చేసింది. ఇలాంటి అంశాల్లో నిందితుల వాదన వినాలన్న నిబంధన ఎక్కడా లేదని తేల్చిచెప్పింది. రెండేళ్ల క్రితం జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 45లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ చిన్నారి మృతి చెందగా.. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం అనంతరం నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. కారుపై స్టిక్కర్ ఆధారంగా మాజీ ఎమ్మెల్యే షకీల్కు చెందినదిగా గుర్తించిన పోలీసులు.. ప్రమాద సమయంలో కారులో షకీల్ కొడుకు రాహిల్, స్నేహితులు ఆఫ్నాన్, మాజ్ ఉన్నట్లు నిర్ధారించారు. అయితే అనూహ్యంగా కారు తానే నడిపాను అంటూ ఆఫ్నా న్ అనే యువకుడు పోలీసులకు లొంగిపోయాడు. కేసును రీ ఓపెన్ చేసిన పోలీసులు ఈ కేసులో ఏ1గా ఉన్న రాహిల్ను ఏప్రిల్ 8న అరెస్ట్ చేశారు. ఇదిలా ఉండగా, ఈ కేసు తదుపరి దర్యాప్తునకు అనుమతిస్తూ కింది కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను నిలిపివేయాలని కోరుతూ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రాహిల్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటి షన్పై జస్టిస్ కె.సుజన విచారణ చేపట్టారు. కింది కోర్టులో విచారణ ప్రక్రి య ప్రారంభించాక, సాక్షుల వాంగ్మూలం నమోదు దశలో దర్యాప్తునకు అనుమతించడం చట్టవిరుద్ధమని పిటిషనర్ న్యాయవాది వాదించారు. రాజకీయ కారణాలతోనే కేసును తిరగదోడుతున్నారన్నారు. కింది కోర్టు ఉత్తర్వులు చట్టబద్ధమేనని ప్రభుత్వ తరఫు న్యాయవాది చెప్పారు. గతంలో దర్యాప్తు లోపభూయిష్టంగా ఉందంటూ డీసీపీ ఫిబ్రవరిలో ఇచ్చిన నివేదిక ఆధారంగా తదుపరి దర్యాప్తునకు ఉన్నతాధికారులు ఆదేశించారని వెల్లడించారు. వాదనలను విన్న న్యాయమూర్తి.. జూబ్లీహిల్స్ కేసులో విచారణ ప్రక్రియ ఇంకా ప్రారంభం కాలేదని అభిప్రాయపడ్డారు. కేసులో దర్యాప్తు కొనసాగించినంత మాత్రాన నిందితులకు ఇబ్బంది ఏం కాదంటూ చెప్పారు. రాహిల్ దాఖలు చేసిన పిటిషన్ను కొట్టివేశారు. -
పూణే తరహాలో మరో హిట్ అండ్ రన్.. బైకర్ మృతి
ముంబై: మహారాష్ట్రలో హిట్ అండ్ రన్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. తాజాగా ఓ మైనర్ బాలుడు మద్యం సేవించి కారు నడిపి.. బైక్ను ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి మృతిచెందాడు. ఈ ప్రమాద ఘటనలో కారు నడిపిన మైనర్ను పోలీసులు అరెస్ట్ చేశారు.వివరాల ప్రకారం.. ముంబైలోని గోరేగావ్ ప్రాంతంలో గురువారం తెల్లవారుజామున మైనర్(17) ఎస్యూవీ కారును రాంగ్ రూట్లో నడుపుతూ ఎదురుగా వస్తున్న బైక్ను ఢీకొట్టాడు. ఈ క్రమంలో బైక్పై ఉన్న నవీన్ వైష్ణవ్(24) తీవ్రంగా గాయపడ్డాడు. అనంతరం, కారు పక్కనే ఉన్న కరెంట్ స్థంభాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు నడుపుతున్న మైనర్ గాయపడటంతో కిందపడిపోయాడు. ప్రమాదం జరిగిన తర్వాత మైనర్ అక్కడి నుంచి పారిపోయే ప్రయత్నం చేయడంతో స్థానికులు అతడిని పట్టుకున్నారు.స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకుని నవీన్ను స్థానిక ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే నవీన్ మృతిచెందినట్టు వైద్యులు నిర్ధారించారు. కాగా, నవీన్ వైష్ణవ్ ఆ ఏరియాలో పాలు అమ్మే వ్యక్తిగా గుర్తింంచారు. ఇక, ఈ ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. మైనర్ను అరెస్ట్ చేశారు. మైనర్ను ముంబైకి చెందిన ఇక్బాల్ జివానీ కుమారుడిగా గుర్తించారు. ఈ సందర్భంగా ఇక్బాల్పై కూడా కేసు నమోదు చేశారు. మరోవైపు.. ప్రమాదం సమయంలో నిందితుడు మద్యం సేవించి ఉన్నట్టు పోలీసులు తెలిపారు. -
నెల వ్యవధిలో మూడు హిట్ అండ్ రన్ కేసులు
ముంబై: మహారాష్ట్రలో వరుసగా చోటు చేసుకుంటున్న హిట్ అండ్ రన్ ఉదంతాలు చర్చనీయాంశంగా మారుతున్నాయి. తాజాగా.. నగరంలో మరో ప్రమాదం జరగ్గా, బాధితుడు ప్రాణం కోల్పోయిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఈ నెల 20వ తేదీన వర్లీ ప్రాంతంలో ఓ బీఎండబ్ల్యూ కారు వేగంగా వెళ్తూ.. బైక్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో గాయపడిన బైకర్.. జూలై 27న మృతి చెందారు. ఈ ఘటన జూలై 20న ముంబైలోని వర్లీ ప్రాంతంలో చోటుచేసుకుంది. క్షతగాత్రుడ్ని వినోద్ లాల్(28)గా పోలీసులు నిర్ధారించారు. ఇక ప్రమాదానికి కారణమైన వ్యక్తిని కిరణ్ ఇందుల్కర్గా గుర్తించి అరెస్ట్ చేశారు. ముంబైలో ఈ నెలలో ఇది మూడో హిట్ అండ్ రన్ కేసు. జూలై 7న ముంబైలోని వర్లీలో శివసేన నాయకుడు రాజేష్ షా కుమారుడు మిహిర్ షా నడిపిన బీఎండబ్ల్యూ.. ముందు వెళ్తున్న ఓ స్కూటర్ను ఢీకొట్టడంతో ఒక మహిళ మరణించగా.. ఆమె భర్త గాయపడ్డాడు. జూలై 22 న ముంబైలో వేగంగా వెళ్తున్న ఆడి కారు రెండు ఆటో-రిక్షాలను ఢీకొట్టింది. ఈ ఘటనలో రెండు ఆటో రిక్షాల డ్రైవర్లు, ఇద్దరు ప్రయాణికులు గాయపడ్డారు. -
Hit And Run Case: రూ. 1.98 కోట్ల పరిహారం చెల్లించాలని ఆదేశం
న్యూఢిల్లీ: గత ఎనిమిదేళ్ల క్రితం జరిగిన ఓ రోడ్డు ప్రమాదం కేసులో దాదాపు రెండు కోట్ల నష్ట పరిహారం చెల్లించాలంటూ ఇన్సూరెన్స్ కంపెనీని ట్రిబ్యూనల్ ఆదేశించింది. రూ.1.21 కోట్లను పరిహారంగా, 77.61 లక్షలను వడ్డీ రూపంలో.. మొత్తం రూ. 1.98 కోట్లను మృతుడి తల్లిదండ్రులకు 30 రోజుల్లోగా ఇవ్వాలని ఆదేశించింది.వివరాలు 2016 ఏప్రిల్ 4న ఢిల్లీలో హిట్ అండ్ రన్ ఘటన జరిగింది. సివిల్స్ లైన్ ప్రాంతంలో ఓ మైనర్ బాలుడు నిర్లక్ష్యంగా మెర్సిడెస్ బెంజ్ కారు నడపడంతో రోడ్డు దాటుతున్న 32 ఏళ్ల సిద్ధార్థ్ శర్మ అనే వ్యక్తి మరణించాడు. ఈ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు స్థానిక సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యాయి. సిద్ధార్థ్ను ఢీకొట్టిన తర్వాత కారు ముందు టైర్ పగిలిపోవడంతో దూరంగా వెళ్లి ఆగిపోయింది. ఘటన అనంతరం నిందితుడైన మైనర్ కారును అక్కడే వదిలి తన స్నేహితులతో కలిసి పారిపోయాడు.దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మైనర్ అతివేగమే ప్రమాదానికి కారణంగా పోలీసులు తేల్చారు. కారు ఢీకొన్న సమయంలో సిద్ధార్థ్ 20 అడుగుల దూరంలో ఎగిరిపడినట్లు సీసీటీవీ ఫుటేజీ ద్వారా గుర్తించారు. తాజాగా ఈ ఘటనపై విచారణ చేపట్టిన మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్ ట్రిబ్యూనల్ బాధతుడైన సిద్ధార్థ శర్మ తల్లిదండ్రులకు రూ.1.21 కోట్లను పరిహారంగా, 77.61 లక్షలను వడ్డీ రూపంలో.. మొత్తం రూ. 1.98 కోట్లను 30 రోజుల్లోగా ఇవ్వాలని ఇన్సూరెన్స్ కంపెనీని ఆదేశించింది. అంతేగాక కారు రిజిస్ట్రేషన్ చేసిన మైనర్ తండ్రి నుంచి పరిహారం మొత్తాన్ని రికవరీ చేసుకునేదుకు బీమా కంపెనీకి కోర్టు అనుమతినిచ్చింది. మైనర్ కుమారుడిని మెర్సిడెస్ కారు నడుపడం అడ్డుకోవడంలో తండ్రి విఫలమైనట్లు చెబుతూ అతన్ని కూడా బాధ్యులుగా ట్రిబ్యునల్ పేర్కొంది. -
ముంబై బీఎండబ్ల్యూ కేసు: మిహిర్ షాకు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ
ముంబై: ముంబై బీఎండబ్ల్యూ స్పోర్ట్స్ కారు హిట్ అండ్ రన్ కేసు నిందితుడు మిహిర్ షాకు మంగళవారం ముంబై కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది. కోర్డు ఆదేశాల మేరకు నిందితుడు జూలై 30 వరకు జ్యుడీషియల్ కస్టడీలో ఉంటారు. హిట్ అండ్ రన్ కేసులో నిందితుడు మిహిర్ షాను పోలీసులు జూలై 9న అరెస్ట్ చేశారు. ఇక ఇదే కేసులో మిహిర్ షా డ్రైవర్ అరెస్ట్ పోలీసులు అరెస్ట్ చేయగా జూలై 11వ తేదీన అతనికి కూడా కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది. ఈ కేసుతో సంబంధం ఉన్న నిందితుడి తండ్రి రాజేశ్ షాను పోలీసులు జూలై 7న అరెస్ట్ చేయగా.. ఆయన జూలై 8న కోర్టు బెయిల్ మంజూరు చేసింది.జులై 7 ఆదివారం ఉదయం 5.30 గంటలకు ముంబైలోని వర్లీ ప్రాంతంలో మిహిర్ షా మద్యం మత్తులో బీఎండబ్ల్యూ కారును వేగంగా నడుపుతూ ముందువెళ్తున్న స్కూటీని ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో 45 ఏళ్ల కావేరీ నఖ్వా మృతి చెందగా.. ఆమె భర్త ప్రదీప్ నక్వా తీవ్రంగా గాయపడ్డారు. అనంతరం నిందితుడు పరారయ్యాడు. నిందితుడు తండ్రి మహరాష్ట్ర పాల్ఘర్ ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన డిప్యూటీ లీడర్గా ఉన్న రాజేష్ షా కావడంతో ఈ ప్రమాదంపై విమర్శలు వెల్లువెత్తాయి.దీంతో మహరాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే రంగంలోకి దిగారు. నేరస్తులు ఎంతటివారైనా ఉపేక్షించేది లేదని, నిందితుల్ని వెంటనే అరెస్ట్ చేయాలని ఆదేశించారు. సీఎం ఆదేశాలతో అతడి ఆచూకీ కోసం 11 పోలీస్ శాఖ ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. ప్రమాదం జరిగిన 72 గంటల అనంతరం ప్రధాన నిందితుడు మిహిర్ షాను అరెస్ట్ చేశారు. కేసు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. -
మిహిర్ షా : కటింగ్,షేవింగ్ చేసి.. రూటు మార్చి..పోలీసుల్ని ఏమార్చి!
ముంబై బీఎండబ్ల్యూ స్పోర్ట్స్ కారు హిట్ అండ్ రన్ కేసు నిందితుడు మిహిర్ షా (24) పచ్చి తాగుబోతని (Habitual Drinker) పోలీసులు నిర్ధారించారు. హిట్ అండ్ రన్ కేసులో అరెస్టైన మిహిర్షాను విచారించగా ఈ విషయాన్ని గుర్తించామని పోలీసులు తెలిపారు. జులై 7 ఆదివారం ఉదయం 5.30 గంటలకు ముంబైలోని వర్లీ ప్రాంతంలో మిహిర్ షా మద్యం మత్తులో బీఎండబ్ల్యూ కారును వేగంగా నడుపుతూ ముందువెళ్తున్న స్కూటీని ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో 45 ఏళ్ల కావేరీ నఖ్వా మృతి చెందగా.. ఆమె భర్త ప్రదీప్ నక్వా తీవ్రంగా గాయపడ్డారు. అనంతరం నిందితుడు పరారయ్యాడు.నిందితుడు తండ్రి మహరాష్ట్ర పాల్ఘర్ ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన డిప్యూటీ లీడర్గా ఉన్న రాజేష్ షా కావడంతో ఈ ప్రమాదంపై విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో మహరాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే రంగంలోకి దిగారు. నేరస్తులు ఎంతటివారైనా ఉపేక్షించేది లేదని, నిందితుల్ని వెంటనే అరెస్ట్ చేయాలని ఆదేశించారు. సీఎం ఆదేశాలతో అతడి ఆచూకీ కోసం 11 పోలీస్ శాఖ ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. ప్రమాదం జరిగిన 72 గంటల అనంతరం ప్రధాన నిందితుడు మిహిర్ షాను అరెస్ట్ చేశారు. కేసు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.నేను పెద్ద తప్పే చేశాతాజాగా, కేసు విచారణలో మిహిర్షా హిట్ అండ్ రన్లో మహిళ ప్రాణాలు తీసినందుకు పశ్చాతాపపడుతున్నట్లు సమాచారం. మహిళ ప్రాణం తీసి నేను పెద్ద తప్పే చేశా. నా కెరియర్ ఇక ముగిసిందని విచారణలో పోలీసుల ఎదుట విచారం వ్యక్తం చేసినట్లు జాతీయ మీడియా కథనాలు చెబుతున్నాయి.కటింగ్, షేవింగ్ చేసిఇక కేసు నుంచి తప్పించుకునేందుకు నిందితుడు విశ్వప్రయత్నాలు చేశాడు. పోలీసుల్ని తప్పుదోవ పట్టించేందుకు మీసాలు, గడ్డాలు తొలిగించాడు. కటింగ్ కూడా చేయించుకున్నాడని బార్బర్ షాపు యజమాని ఇచ్చిన స్టేట్మెంట్ను రికార్డ్ చేసుకున్నారు పోలీసులు. రాజేష్ షా అరెస్ట్.. బెయిల్పై విడుదలహిట్ అండ్ రన్ కేసు నిందితుడు మిహిర్ షా తండ్రి రాజేశ్ షాను పోలీసులు అరెస్ట్ చేసి ముంబై కోర్టులో హాజరు పరిచారు. విచారణ చేపట్టిన కోర్టు రాజేష్ షా, డ్రైవర్ రాజరిషి బిదావత్లకు వరుసగా 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ, ఒకరోజు పోలీసు కస్టడీ విధించింది. అయితే ఈ కేసులో రాజేష్ షాకు బెయిల్ లభించగా, బిదావత్ పోలీసు కస్టడీని జూలై 11 వరకు పొడిగించింది.కుమారుడు చేసిన ఘన కార్యం.. ముగిసిన తండ్రి పొలిటిక్ కెరియర్కుమారుడు మిహిర్ షా చేసిన ప్రమాదంతో రాజేష్ షా పొలిటికల్ కెరియర్ ఓ రకంగా ముగిసినట్లేనని శివసేన నేతలు చర్చించుకుంటున్నారు. ఇప్పటికే పార్టీకి చెందిన అన్ని పదవుల నుంచి తొలగించినట్లుగా శివసేన వర్గాలు వెల్లడించాయి. పాల్ఘర్లో ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన డిప్యూటీ లీడర్గా ఉన్న రాజేష్ షా హిట్ అండ్ రన్ కేసులో అరెస్టయిన సంగతి తెలిసిందే. -
ముంబై బీఎండబ్ల్యూ ఘటన.. మిహిర్ షాకు పోలీస్ కస్టడీ
ముంబై: ముంబై బీఎండబ్ల్యూ హిట్ అండ్ రన్ కేసులో ప్రధాన నిందితుడు మిహిర్ షాను జూలై 16 వరకు పోలీసు కస్టడీ విధించింది కోర్టు. దీంతో నేటి నుంచి ఏడు రోజులపాటు మిహిర్ షాను ముంబై పోలీసులు విచారించనున్నారు. ప్రమాదానికి సంబంధించిన విషయాలను నిందితుడి నుంచి రాబట్టనున్నారు. అయితే మిహిర్ మొబైల్ ఇంకా రికవరీ కాలేదని పోలీసులు తెలిపారు.కాగా జులై 7న (ఆదివారం తెల్లవారుజామున) మద్యం మత్తులో మిహిర్ షా బీఎండబ్ల్యూ కారుతో ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టడంతో 45 ఏళ్ల మహిళ అక్కడికక్కడే మృతిచెందిన విషయం తెలిసిందే. ఆమె భర్త గాయాలతో బయటపడ్డాడు. అయితే ప్రమాదం జరిగినప్పటి నుంచి మిహిర్ షా పరారీలో ఉన్నాడు. దాదాపు 72 గంటల తర్వాత నిందితుడిని విహార్లో ముంబై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు నిందితుడు తండ్రి, శివసేన నాయకుడు రాజేష్ షాను పార్టీ సస్పెండ్ చేసింది. ఇక ప్రమాదం తర్వాత మిహిర్ తన ప్రియురాలికి 40 సార్లు ఫోన్ చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. మహిళను కారుతో గుద్ది చంపిన తర్వాత కారును విడిచిపెట్టి ఆటో ఎక్కి ఆమె ఇంటికి వెళ్లిన్నట్లు పోలీసులు తెలిపారు. ప్రియురాలిని విచారణ నిమిత్తం అదుపులోకి తీసుకోవచ్చని పేర్కొన్నారు.చదవండి: ముంబై బీఎండబ్ల్యూ ఘటన... నిందితుడి తండ్రిపై శివసేన చర్యలు -
హిట్ అండ్ రన్ కేసు: నిందితుడు మందు తాగిన బార్ కూల్చివేత
ముంబయి: బీఎండబ్ల్యూ కారు హిట్ అండ్ రన్ కేసును మహారాష్ట్ర సర్కారు సీరియస్గా తీసుకుంది. కారును వేగంగా నడిపి మహిళ మృతికి కారణమైన మిహిర్ షాను ఇప్పటికే అరెస్టు చేసిన పోలీసులు కేసులో వేగంగా దర్యాప్తు చేస్తున్నారు. దీనికి తోడు ప్రమాదానికి ముందు నిందితుడు మిహిర్ షా మందు తాగిన జుహూ తారారోడ్లోని బార్పైనా అధికారులు కొరడా ఝళిపిస్తున్నారు.తాజాగా బుధవారం(జులై 10) బృహన్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్(బీఎంసీ)అధికారులు బార్లో అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. పోలీసుల బందోబస్తుతో వచ్చి మరీ కూల్చివేత ప్రత్యేక డ్రైవ్ చేపట్టారు. మిహిర్షా అధికార శివసేన పార్టీకి చెందిన నేత రాజేష్ షా కుమారుడు కావడంతో ప్రభుత్వంపై ఈ కేసులో ఒత్తిడి రోజురోజుకు పెరుగుతోంది. కాగా, ఆదివారం(జులై 7) ఉదయం వర్లిలో చేపలు కొనేందుకు బైక్పై వెళ్లిన దంపతులను వేగంగా వచ్చిన బీఎండబ్ల్యూ కారు ఢీ కొట్టింది. ఢీవ కొట్టడమే కాకుండా మహిళను ఒకటిన్నర కిలోమీటరు దూరం వరకు ఈడ్చుకెళ్లింది. ఈ ప్రమాదంలో మహిళ దుర్మరణం పాలయింది. -
ముంబై బీఎండబ్ల్యూ కేసు.. కీలక నిందితుడి అరెస్ట్
ముంబై: ముంబైలోని వర్లీలో జరిగిన బీఎండబ్ల్యూ కారు రోడ్డు ప్రమాదం కేసులో కీలక పురోగతి చోటుచేసుకుంది. మద్యం మత్తులో లగ్జరీ కారు నడుపుతూ దంపతులను ఢీకొట్టి మహిళ ప్రాణాలు పోవడానికి కారణమైన నిందితుడు మిహిర్ షాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రమాదం జరిగినప్పటి నుంచి అతడు పరారీలో ఉండగా.. 72 గంటల తర్వాత ముంబయికి 65 కిలోమీటర్ల దూరంలో ఉన్న విరార్లోని అపార్ట్మెంట్లో మిహిర్ షాను ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. అతని తల్లి, సోదరిని కూడా అదుపులోకి తీసుకున్నారు. వీరిని వర్లీ పోలీస్ స్టేషన్కు తరలించారు. అయితే గత మూడు రోజులుగా కొడుకును దాచి పెట్టడంతో తండ్రి, శివసేన(ఏక్నాథ్ షిండే) నేత రాజేష్ షాా ప్రమేయం ఉందా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇక షాు అరెస్టుకు ముందు అతడి తప్పతాగి రూ. 18 వేల బిల్ చేసిన ద వైస్ గ్లోబల్ తపస్ బార్ను పోలీసులు సీజ్ చేశారు. కాగా ఈ హిట్ అండ్ రన్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. బాధితురాలు కావేరీ నక్వాను నిందితుడు మిహిర్ షా కారు తన బానెట్పై సుమారు 1.5 కిలోమీటర్లు ఈడ్చుకెళ్లిన్నట్లు సీసీ సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి.కారు బలంగా ఢీకొట్టడంతో కావేరీ నక్వా ఎగిరి కారు బానెట్పై పడగా.. అలాగే కిలోమీటర్ దూరం పైగా ఈడ్చుకెళ్లాడు. ఆ తర్వాత కారుమీదున్న బాడీని కిందకు దించాడు. అనంతరం అదే కారు రివర్స్ చేసి ఆమె శరీరం మీద నుంచి పోనిచ్చినట్లు సీసీ సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయని స్థానిక పోలీసులు కోర్టులో వెల్లడించారు అసలేం జరిగిందంటే.. ముంబైలోని వర్లీలో ఆదివారం ఉదయం వేగంగా వెళ్తున్న బీఎండబ్ల్యూ కారు ముందు వెళ్తున్న స్కూటీని ఢీకొట్టిన సంగతి తెలిసిందే. దీంతో స్కూటీపై ఉన్న దంపతులు ఎగిరిపడ్డారు. వేగంగా వెళ్తున్న కారు మహిళపై నుంచి దూసుకెళ్లడం వల్ల కావేరి నక్వా (45) అక్కడికక్కడే మరణించింది. ఆమె భర్త ప్రదీప్కు స్వల్పగాయాలయ్యాయి. చేపలు అమ్ముకుంటూ జీవిస్తున్న ఈ దంపతులు ఇంటికి వెళ్తుండగా ప్రమాదం జరిగింది.కొత్త క్రిమినల్ కోడ్ భారతీయ న్యాయ సంహిత ప్రకారం నేరపూరిత హత్య, ర్యాష్ డ్రైవింగ్, సాక్ష్యాలు నాశనం చేయడం వంటి సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ప్రమాదానికి కారణమైన కారు రాజేష్ షా పేరుతో రిజిస్టర్ అయింది. ప్రమాదం అనంతరం నిందితులు సాక్ష్యాలను ధ్వంసం చేయడానికి ప్రయత్నించినట్లుగా పోలీసులు తెలిపారు.కారునిందితుడు మిహిర్ శనివారం అర్ధరాత్రి జూహూలోని ఓ బార్లో మద్యం తాగి.. తిరిగి ఇంటికి వెళ్తున్న సమయంలో కారు తానే నడుపుతానని పట్టుబట్టి డ్రైవరు సీటులోకి మారి ప్రమాదానికి కారణమయ్యాడు. ఈ ఘటనపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ శిండే స్పందించారు. చట్టం అందరికీ సమానమేనని తెలిపారు. ఎవరినీ విడిచిపెట్టబోమని చెప్పారు.కాగా ఈ ప్రమాదం పుణెలో జరిగి పోర్చే కారు ప్రమాద ఘటనను గుర్తు చేసింది. 17 ఏళ్ల మైనర్ బాలుడు మద్యం మత్తులో కారు నడిపి ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ల ప్రాణాలను బలి తీసుకున్న విషయం తెలిసిందే. ఈ కేసులో అనేక ట్విస్టుల అనంతరం నిందితుడు తల్లి, తండ్రి, తాత అరెస్ట్ అయ్యారు. చివరికి నిందితుడైన మైనర్ను అతని అత్త సంరక్షణలో ఉండేలా న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. -
ముంబై హిట్ అండ్ రన్ కేసు: ఒళ్లు గగుర్పొడిచేలా.. వెలుగులోకి సంచలన విషయాలు
ముంబై : ముంబై బీఎండబ్ల్యూ స్పోర్ట్స్ కారు హిట్ అండ్ రన్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నిందితుడు మిహిర్ షా బాధితురాలు కావేరీ నక్వాను కారు బానెట్పై సుమారు 1.5 కిలోమీటర్లు ఈడ్చుకెళ్లాడు. ఈ దృశ్యాలన్నీ సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి.గత ఆదివారం ఉదయం 5.30 గంటల సమయంలో ముంబై వ్రోలి అనే ప్రాంతంలో బీఎండబ్ల్యూ స్పోర్ట్స్ కారు హిట్ అండ్ రన్ కేసు నమోదైంది. స్థానిక కోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా హిట్ అండ్ రన్ ఎలా జరిగిందో పోలీసులు కోర్టుకు వివరాలు అందించారుఈ కేసులో ప్రధాన నిందితుడైన శివసేన నేత రాజేష్ షా కుమారుడు మిహిర్ షా.. పూటుగా మద్యం సేవించి ఉదయం చేపల మార్కెట్కి వెళ్లి తిరిగి వస్తున్న కావేరీ నక్వా, పార్ధిక నక్వా ప్రయాణిస్తున్న స్కూటీని ఢీకొట్టాడు. బలంగా ఢీకొట్టడంతో కావేరీ నక్వా ఎగిరి కారు బానెట్పై పడ్డారు. అలాగే కిలోమీటర్ దూరం పైగా ఈడ్చుకెళ్లాడు. ఆ తర్వాత కారుమీదున్న బాడీని కిందకు దించాడు. అనంతరం అదే కారు రివర్స్ చేసి ఆమె శరీరం మీద నుంచి పోనిచ్చినట్లు సీసీ సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయని స్థానిక పోలీసులు కోర్టులో వెల్లడించారు. స్థానికుల సమాచారం, బాధితురాలి భర్త ఫిర్యాదు, సీసీటీవీ పుటేజీ వీడియోల ఆధారంగా ప్రమాదం తర్వాత మిహిర్ షా కారును వదిలేసి ప్రియురాలి ఇంటికి వెళ్లాడు. తప్పించుకునేందుకు అక్కడి నుంచి మరో ప్రాంతానికి పరారయ్యాడని పోలీసులు గుర్తించారు. మిషిర్ షా ప్రియురాల్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.కాగా ప్రమాదం జరగడానికి కొన్ని గంటల ముందు మిహిర్ జుహూ ప్రాంతంలోని ఓ బారులో పీకల వరకు మద్యం సేవించినట్టు దర్యాప్తులో తేలింది. అక్కడి సీసీటీవీ దృశ్యాలను పోలీసులు పరిశీలించారు. ఆ బార్లో నిందితుడు రూ.18వేల బిల్లు చేసినట్లు తేలింది.ప్రమాద సమయంలో కారులో మిహిర్తో పాటు అతడి డ్రైవర్ కూడా ఉన్నాడు. బార్ నుంచి ఇంటికి వెళ్తూ కారు తానే నడుపుతానని పట్టుబట్టి నిందితుడు డ్రైవర్ సీట్లోకి మారినట్లు తెలిసింది. ప్రస్తుతం ఈ ఘటన తీవ్ర దుమారం రేపుతుంది. కాగా,ఇదే కేసులో మిహిర్ మిషిర్ షా తండ్రి శివసేన నేత రాజేష్ను పోలీసులు అరెస్ట్ చేసి స్థానిక కోర్టులో హాజరు పరిచారు. విచారణ చేపట్టిన కోర్టు సోమవారం సాయంత్రం రాజేష్ షాకు కోర్టు బెయిల్ రూ.15వేల పూచీకత్తుతో ప్రొవిజినల్ బెయిల్ను మంజూరు చేసింది. -
ముంబై హిట్ అండ్ రన్ కేసు.. అతడికి బెయిల్ మంజూరు
ముంబై: మహారాష్ట్రలో జరిగిన హిట్ అండ్ రన్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసు ప్రధాన నిందితుడు మిషిర్ షా తండ్రి, శివసేన నేత రాజేష్ షాకు బెయిల్ లభించింది. సోమవారం సాయంత్రం రాజేష్ షాకు కోర్టు బెయిల్ రూ.15వేల పూచీకత్తుతో ప్రొవిజినల్ బెయిల్ను మంజూరు చేసింది.ఇక, ఈరోజు ఉదయం హిట్ రన్ కేసులో భాగంగా పోలీసులు రాజేష్, కారు డ్రైవర్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో సిటీ కోర్టులో ప్రవేశపెట్టిన అనంతరం రాజేష్కు 14 రోజుల పాటు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. ఇక, తాజాగా కోర్టు రాజేష్ షాకు బెయిల్ మంజూరు చేసింది. ఇదిలా ఉండగా.. కారుతో ఢీకొట్టి మహిళ మరణానికి కారణమైన మిషిర్ షాకు లుక్ అవుట్ నోటీస్ను పోలీసులు జారీ చేశారు. పరారీలో ఉన్న అతడి కోసం పోలీస్ బృందాలు వెతుకుతున్నాయి.VIP hit & run coward Mihir Shah's father Rajesh Shah (Shinde Faction Sena leader) gets bail a day after he was arrested. Son still absconding.#EknathShinde pic.twitter.com/iuzOMUlwqb— Kedar (@shintre_kedar) July 8, 2024మరోవైపు.. ఈ ఘటనపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. చట్టం ముందు అంతా సమానమేనని షిండే తెలిపారు. ఈ ఘటనలో ఉన్నది ఎంత పెద్ద ధనవంతుడైనా, రాజకీయ నాయకుడైన ఎవరినీ వదిలి పెట్టేది లేదన్నారు. ఇక, షిండే ఇలా వ్యాఖ్యలు చేసిన కొన్ని గంటల్లోనే రాజేష్ షాకు బెయిల్ రావడం మహారాష్ట్రలో చర్చనీయాంశంగా మారింది.ఇది కూడా చదవండి: ముంబై హిట్ అండ్ రన్ ఘటనపై సీఎం షిండే సంచలన కామెంట్స్.. -
శివసేన నేత కుమారుడికి చెక్!.. సీఎం షిండే సంచలన కామెంట్స్
ముంబై: మహారాష్ట్రలో హిట్ అండ్ రన్ కేసు సంచలనంగా మారింది. ఈ ప్రమాదానికి శివసేన నేత కుమారుడు మిహిర్ షానే కారణమని బాధితులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే కీలక వ్యాఖ్యలు చేశారు.కాగా, సీఎం షిండే సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. హిట్ రన్ కేసులో నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే, ఈ ప్రమాదంలో నిందితులు ఎంతటివారైనా వదిలిపెట్టేది లేదన్నారు. చట్టం తన పని తాను చేస్తుంది. నిందితులకు శిక్ష పడేలా పోలీసులకు ఆదేశాలు జారీ చేసినట్టు స్పష్టం చేశారు. మహారాష్ట్ర ప్రజలే మాకు ముఖ్యం. ప్రజల భద్రత కోసం ఎలాంటి నిర్ణయాలు తీసుకోవడానికైనా సిద్ధంగా ఉన్నాం అని కామెంట్స్ చేశారు. ఇక, ఈ కేసు దర్యాప్తును వేగవంతం చేసినట్టు పోలీసు అధికారులు చెప్పారు.మరోవైపు.. మహారాష్ట్రలోని వర్లీ పోలీసులు మిహిర్పై ర్యాష్ డ్రైవింగ్, హత్యకు సంబంధించి కేసుతోపాటు, మోటారు వాహనాల చట్టంలోని సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం మిహార్ షా పారారీలో ఉండటంతో ఆరుగురు పోలీసుల బృందం అతనికోసం గాలిస్తుంది.జరిగింది ఇది.. ఇదిలా ఉండగా.. మహారాష్ట్రలో ఆదివారం ఉదయం బీఎండబ్ల్యూ స్పోర్ట్స్ కారు.. బైక్ను ఢీకొట్టడంతో ఓ మహిళ ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ముంబై వర్లిలోని సాసూన్ డాక్ ఫిష్ మార్కెట్ నుంచి భార్య కావేరీ నక్వాతో పార్థిక్ నక్వా బైక్పై వెళ్తున్నారు. ఈ సమయంలో బీఎండబ్ల్యూ స్పోర్ట్స్ కారు వేగంగా వచ్చి బైక్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కావేరీ నక్వా మరణించగా.. ఆమె భర్త పార్థిక్ నక్వాకు తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ప్లాన్ ప్రకారమే జంప్..మిహిర్ షా మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో శివసేన నాయకుడు రాజేష్ షా కుమారుడు. రాజేష్ షా వ్యాపారాల్లో మిహిర్ షా సహకారం అందిస్తూ పలు కార్యక్రమాల్లో పాల్గొంటుఉన్నాడు. ఇక, ఈ ప్రమాదానికి ముందు.. మిహిర్ మద్యం మత్తులో ఉన్నాడు. డ్రైవర్తో లాంగ్ డ్రైవ్ వెళ్లాలని సూచించాడు. జుహూ నుంచి వర్లీకి వెళ్లే మార్గంలో డ్రైవర్ రాజేంద్ర సింగ్ బిజావత్ ను పక్కకు తప్పించి మిహిర్ షానే స్వయంగా డ్రైవ్ చేశాడు. ప్రమాదం తరువాత కారును బాంద్రా కళానగర్లో వదిలి అక్కడి నుంచి మిహిర్ షా పరారయ్యాడు. అంతకుముందు.. కారుపై ఉన్న శివసేన స్టిక్కర్ ను తొలగించే ప్రయత్నం చేశాడు. కారున తన తండ్రి పేరుపై ఉందని తెలియకుండా ఉండేందుకు నంబర్ ప్లేట్ ను సైతం తొలగించాడని పోలీసులు గుర్తించారు. -
మద్యం మత్తులో బీభత్సం.. కేసు నుంచి అధికార పార్టీ నేత కుమారుణ్ని తప్పిస్తున్నారా?
ముంబై అధికార శివసేన పార్టీ నేత రాజేష్ షా కుమారుడు మిహిర్ షా (24) హిట్ అండ్ రన్ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఆదివారం ఉదయం మిషిర్ షా బీఎండబ్ల్యూ స్పోర్ట్స్ కారు ఢీకొట్టడంతో ఓ మహిళ ప్రాణం కోల్పోయింది. అయితే ఈ కేసులో మిషిర్ షాను తప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆదివారం ఉదయం 5.30 గంటల సమయంలో మిహిర్ షా ప్రయాణిస్తున్న బీఎండబ్ల్యూ స్పోర్ట్స్ కారు ముంబై వర్లిలోని సాసూన్ డాక్ ఫిష్ మార్కెట్కి వెళ్లి తిరిగి వస్తున్న భార్య కావేరీ నక్వా,ఆమె భర్త పార్థిక్ నక్వా ప్రయాణిస్తున్న ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో బాధితురాలు కావేరీ నక్వా మరణించగా.. భర్త పార్థిక్ నక్వా గాయాల పాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతుడున్నాడు.అయితే ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగే సమయంలో కారులో కారు డ్రైవర్ రాజేంద్ర సింగ్ బిజావత్తో పాటు మిహిర్ షా ఉన్నాడు. ప్రమాదం జరిగిన వెంటనే పరారైన మిహిర్ షా కోసం పోలీసులు గాలింపు చర్యల్ని ముమ్మరం చేశారు. డ్రైవర్ను బిజావత్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అధికార పార్టీ నేత కుమారుడికి అనుకూలంగాహిట్ అండ్ రన్ కేసులో పోలీసులు నమోదు చేసిన సెక్షన్లపై వివాదం నెలకొంది. భారతీయ న్యాయ సంహిత సెక్షన్ల కింద అంటే హత్యతో సమానం కాని నేరాల కింద పోలీసులు కేసు నమోదు చేయడం పలు అనుమానాలకు తావిస్తుంది. హిట్ అండ్ రన్ కేసులో సాధారణంగా నేరపూరిత నరహత్య, ర్యాష్ డ్రైవింగ్,సాక్ష్యాలను ధ్వంసం చేయడం మొదలైన వాటిపై కేసు నమోదు చేస్తారని పలువురు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మద్యం సేవించిన కారు డ్రైవర్ బిజావత్ నుంచి రక్త నమోనాలకు సేకరించారు.రిపోర్ట్స్ రావాల్సి ఉంది.వాళ్లు సమాజంలో పేరున్న పెద్దోళ్లు.. మనమేం చేయలేంరోడ్డు ప్రమాదంపై తన భార్య కావేరీ నక్వా మరణంపై ఆమె భర్త పార్థిక్ నక్వా కన్నీరు మున్నీరవుతున్నారు. ‘‘ఫిష్ మార్కెట్ నుంచి తిరిగి వస్తున్న తమ వెహికల్ను బీఎండబ్ల్యూ కారు ఢీకొట్టింది. నా భార్య ఎగిరి 100 మీటర్ల అవతల పడింది. నాకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదంతో నా భార్యను కోల్పోయా. నాకు ఇద్దరు పిల్లలు. వారి సంరక్షణ ఎవరు చూసుకోవాలి. వాళ్లంటే సమాజంలో పేరున్న పెద్ద మనుషులు. వారిని ఎవరు ఏం చేయలేరు. చివరికి బాధపడాల్సి మనమే అంటూ హిట్ అండ్ రన్ కేసులో ప్రధాన కారకుడైన మిహిర్ షా‘‘ను ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారు.పోలీసులు వెర్షన్ ఎలా ఉందంటే? బీఎండబ్ల్యూ కారు మిహిర్ షా పేరు మీద రిజిస్టర్ అయినట్లు పోలీసులు చెబుతున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో మిహిర్ షా, డ్రైవర్ ఇద్దరు కారులో ఉన్నారు. పోలీసు వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం.. మిహిర్ షా గత రాత్రి జుహులోని ఓ బార్లో మద్యం సేవించాడు. ఇంటికి వెళుతుండగా, డ్రైవర్ని లాంగ్ డ్రైవ్ చేయమని అడిగాడు. వర్లీ ప్రాంతంలో కారు డ్రైవ్ చేస్తున్న మిహిర్ షా.. కావేరీ నక్వా ప్రయాణిస్తున్న స్కూటీని ఢీ కొట్టాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. సీఎం ఏక్ నాథ్ షిండ్ ఏమన్నారంటే?మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండ్ హిట్ అండ్ రన్ కేసుపై స్పందించారు. ఈ ఘటన దురదృష్టకరమని పేర్కొంటూ నిందితులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. నిందితులు ఎంతటివారైనా చట్టం తన పని తాను చేస్తుందని పేర్కొన్నారు. చట్టం ముందు అందరూ సమానమే దేశంలో చట్టం ముందు అందరూ సమానమేనని, ఆ విషయంలో ఎవరి పట్ల వివక్ష చూపబోమని, ఈ కేసులో బాధితులకు న్యాయం జరిగేలా.. నిందితులకు శిక్షపడేలా పోలీసులకు ఆదేశాలు జారీ చేసినట్లు ఏక్ నాథ్ షిండ్ వెల్లడించారు. -
హిట్ అండ్ రన్ : మహిళ ప్రాణం తీసిన అధికార పార్టీ నేత కుమారుడు!
ఓ అధికార పార్టీకి చెందిన నేత కుమారుడి నిర్వాకంతో మహిళ ప్రాణాలు కోల్పోయింది. నిందితుడు తన లగ్జరీ బీఎండబ్ల్యూ స్పోర్ట్స్ కారుతో మహిళ, ఆమె భర్త ప్రయాణిస్తున్న స్కూటీని అతివేగంతో ఢీకొట్టాడు. సినీ ఫక్కీలో జరిగిన ఈ హిట్ అండ్ రన్ ప్రమాదంలో బాధితురాలు గాల్లోంచి ఎగిరి దూసుకెళ్లింది. 100 మీటర్ల అవతల పడిపోయింది. చికిత్స పొందుతూ కన్నుమూసింది. ఇంతకీ ఆ రాజకీయ నేత ఎవరు?ముంబై వర్లిలోని అట్రియా మాల్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదివారం ఉదయం 5.30గంటల సమీపంలో బీఎండబ్ల్యూ కారు దంపతులు ప్రయాణిస్తున్న ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో భార్య కావేరీ నక్వా దుర్మరణం చెందగా.. భర్త పార్థిక్ నక్వా తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.అయితే ఆ బీఎండబ్ల్యూ కారు ముంబై అధికార ఏక్ నాథ్ షిండ్ నేతృత్వంలోని శివసేన పార్టీ నేత రాజేష్ షాకి చెందినదిగా పోలీసులు గుర్తించారు.Hit and run case in Mumbai.A BMW car hit a scooty in the Worli area. One female dead.#Mumbai pic.twitter.com/rFdfir4pjF— Vivek Gupta (@imvivekgupta) July 7, 2024ప్రమాద సమయంలో మహరాష్ట్ర పాల్ఘర్ జిల్లా శివసేన నేత రాజేష్ షా బీఎండబ్ల్యూ స్పోర్ట్స్ కారును ఆయన కుమారుడు మిహిర్ షా డ్రైవ్ చేసినట్లు పోలీసులు ప్రాథమిక విచారణలో నిర్ధారించారు. ఆదివారం ఉదయం 5.30గంటల సమయంలో మిహిర్ షా తన బీఎండబ్ల్యూ స్పోర్ట్స్ కారుతో వ్రోలి ప్రాంతానికి వెళుతున్నాడు. అదే సమయంలో సాసూన్ డాక్ ఫిష్ మార్కెట్కి వెళ్లి తిరిగి వస్తున్న దంపతులు ప్రయాణిస్తున్న స్కూటీని బలంగా ఢీకొట్టారు.ఈ కారు ప్రమాదంతో బాధితురాలు గాల్లోకి దూసుకెళ్లింది. సుమారు 100 మీటర్ల అవతల పడిపోవడంతో తీవ్రగాయాల పాలైంది. ప్రమాదంతో అప్రమత్తమైన స్థానికులు బాధితుల్ని అత్యవసర చికిత్స కోసం నాయర్ ఆస్పత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతున్న భార్య మరణించగా.. భర్తకు గాయాలైనట్లు వైద్యులు తెలిపారు. కారు ఎవరిదో.. నిర్ధారించే పనిలో పోలీసులు మరోవైపు రోడ్డు ప్రమాదానికి కారణమైన బీఎండబ్ల్యూ కారును వ్రోలీ పోలీసులు సీజ్ చేశారు. ఈ కారు ఎవరిది? శివసేన పార్టీ నేత రాజేష్ షాకి చెందినదేనా? ప్రమాదానికి కారకులు ఎవరనేది త్వరలో నిర్ధారిస్తామన్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. సీఎం షిండే ఆగ్రహం.. పోలీస్ శాఖకు ఆదేశాలుతన పార్టీకి చెందిన నేత కుమారుడు హిట్ అండ్ రన్ కేసులో ఓ మహిళ ప్రాణాలు పోయిందంటూ అటు జాతీయ మీడియా, ఇటు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ కావడంతో ముంబై సీఎం ఏక్నాథ్ షిండ్ స్పందించారు. ప్రమాదానికి కారకులైన వారిని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టబోమని హెచ్చరించారు. నిందితుల్ని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు వ్రోలీ పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. -
Hyderabad: హిట్ అండ్ రన్ కేసు నమోదు
నల్లకుంట: మద్యం మత్తులో కారు నడిపి రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖకు చెందిన ఓ అధికారి వీరంగం సృష్టించిన ఘటన నల్లకుంట పోలీస్ స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అడ్మిన్ ఎస్సై శ్రీనివాస్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. బాగ్అంబర్పేట డీడీ కాలనీకి చెందిన యడవల్లి శ్రీనివాస్ సీతారమేష్(46)టీచర్గా పని చేస్తున్నాడు. ఈ నెల 18న రాత్రి అతను బైక్పై విద్యానగర్ లక్కీ కేఫ్ సమీపంలోని ఐరావత్ ఐ క్లినిక్ రోడ్డులో వెళుతున్నాడు. అదే సమయంలో వేగంగా దూసుకువచి్చన కారు ముందు వెళుతున్న బైక్ను ఢీకొట్టడంతో రమేష్ కిందపడ్డాడు. ఈ ఘటనపై బాధితుడు రమేష్ ఈ నెల 19న నల్లకుంట పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన ఎస్సై రమాదేవి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనపై కేసు నమోదు చేయలేదని సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని ఎస్సై పేర్కొన్నారు. ఫిర్యాదు అందిన వెంటనే కేసు నమోదు చేశామన్నారు. స్థానికులు కారును అడ్డుకుని కారు నడుపుతున్న వ్యక్తిని నిలదీస్తూ సెల్ ఫోన్లో వీడియో తీశారు. ప్రమాద సమయంలో అతను మద్యం మత్తులో ఉన్నట్లు సమాచారం.కారు కుడివైపు ముందు డోర్ పక్కన బీరు బాటిల్ ఉన్నట్లు సామాజిక మాధ్యమాల్లో వీడియో వైరల్గా మారింది. కాగా ఘటన జరిగిన సమయంలో కారు నడుపుతున్న వ్యక్తి పక్కన ఓ చిన్నారి కూడా ఉండటం గమనార్హం. -
మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రాహిల్కు ఊరట
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రాహిల్కు నాంపల్లి కోర్టులో ఊరట లభించింది. హిట్ అండ్ రన్ కేసులో అరెస్టై ప్రస్తుతం చంచల్గూడ జైల్లో ఉన్న రాహిల్కు నాంపల్లి కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. రెండు 20 వేల షూరిటీలు సమర్పించాలని కోర్టు ఆదేశించింది. అలాగే హైకోర్టు ఆదేశాలను పాటించాలని రాహిల్కు సూచించింది. ఈ మేరకు పోలీస్ కస్టడీ పిటిషన్ను నాంపల్లి కోర్టు కొట్టి వేసింది. కాగా ప్రగతి భవన్ వద్ద కారు ప్రమాదం కేసులో రాహిల్ నిందితుడిగా ఉన్న విషయం తెలిసిందే. ప్రమాదం తర్వాత రాహిల్ దుబాయ్కు పారిపోయాడు. అతడి కోసం గత కొంత కాలం గాలించిన పోలీసులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. ఈ క్రమంలో రహేల్ దుబాయ్ నుంచి హైదరాబాద్కు తిరిగి వస్తుండగా(ఏప్రిల్ 8న) పంజాగుట్ట పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. అనంతరం జడ్జీ ముందు హాజరు పరచగా.. ఈ నెల 22 వరకు రిమాండ్ విధించారు. ప్రస్తుతం చంచల్గూడ జైలులో ఉన్నారు. -
హైదరాబాద్ కేబుల్ బ్రిడ్జిపై హిట్ అండ్ రన్
సాక్షి, హైదరాబాద్: నగరం నడిబొడ్డున మరో హిట్ అండ్ రన్ కేసు నమోదు అయ్యింది. దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై ఫొటోలు దిగుతుండగా ఓ కారు ఇద్దరు యువకుల్ని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. శుక్రవారం అర్ధరాత్రి దాటాక కేబుల్ బ్రిడ్జిపై ఫొటోలు దిగుతున్నారు ఇద్దరు. ఆ సమయంలో ఓ కారు వేగంగా వచ్చి వీళ్లను ఢీ కొట్టి వెళ్లిపోయింది. ప్రమాదంలో అక్కడికక్కడే చనిపోయిన వ్యక్తిని అనిల్గా గుర్తించారు. తీవ్ర గాయాలపాలైన అజయ్.. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు వైద్యులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న మాదాపూర్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా ప్రమాదానికి కారణమైన కారును గుర్తించినట్లు తెలుస్తోంది. -
హిట్ అండ్ రన్.. బ్రెయిన్ డెడ్ విద్యార్థి అవయవదానం
హైదరాబాద్: కోకాపేటలో హిట్ అండ్ రన్ కేసు నమోదైంది. వేగంగా వచ్చిన ఆటో ఓ బైకును ఢీ కొట్టి ఆపకుండా వెళ్లిపోయింది. దీంతో బైక్ పై ఉన్న విద్యార్థి తీవ్రంగా గాయపడ్డారు. అయితే పుట్టెడు శోకంలోనూ.. బ్రెయిన్ డెడ్ అయిన ఆ విద్యార్థి అవయవదానానికి అతని తల్లిదండ్రులు ముందుకొచ్చి పెద్ద మనసు చాటుకున్నారు. వివరాల్లోకి వెళ్తే బిస్వాల్ ప్రభాస్ అనే విద్యార్థి హైదరాబాద్ కోకాపేట ఔటర్ రింగ్ రోడ్డు ఎగ్జిట్ వద్ద బైక్ పై వస్తున్నాడు. ఈ సమయంలో వేగంగా వచ్చిన ఆటో ప్రభాస్ ను ఢీ కొట్టి ఆపకుండా వెళ్లిపోయింది. దీంతో విద్యార్థికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే విద్యార్థిని సమీప ఆస్పత్రికి తరలించారు. వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు బ్రెయిన్ డెడ్ అని ప్రకటించారు. కొడుకు మరణ వార్త విన్న తల్లిదండ్రులు శోక సంద్రంలో మునిగారు. బిస్వాల్ ప్రభాస్ అవయవాలు దానం చేయాలని నిర్ణయించుకున్నారు. లివర్, కిడ్నీలు దానం చేస్తున్నట్టు తెలిపారు. అవయవ దానం చేసిన బిస్వాల్ ప్రభాస్ కు సెల్యూట్ చేస్తూ ఆస్పత్రి సిబ్బంది శ్రద్ధాంజలి ఘటించారు. మరోవైపు ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
నార్సింగీ హిట్ అండ్ రన్ కేసుపై అనుమానాలు
సాక్షి, రంగారెడ్డి: నార్సింగీలో సోమవారం మరో హిట్ అండ్ రన్ కేసు చోటుచేసుకుంది. ఔటర్ రింగు రోడ్డుపై రోడ్డు దాటుతున్న యువకుడిని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. దీంతో యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. అయినా వాహనం ఆపకుండా అక్కడి నుంచి వెళ్లిపోయింది. గచ్చిబౌలి నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న నార్సింగీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఓఆర్ఆర్పై ప్రమాద సమయంలో ఎంట్రీ, ఎగ్జిట్ అయిన వాహనాల ఫుటేజీని పరిశీలిస్తున్నారు. యువకుడిని ఢీకొట్టి పరారైంది రెడీ మిక్సర్ వాహనంగా పోలీసులు గుర్తించారు. పోలీసుల అనుమానం.. రోడ్డు ప్రమాదంలో మృతుడిని ఆర్మీ సైనికుడిగా గుర్తించారు. గోల్కొండ ఆర్టలరీ సెంటర్లో విధులు నిర్వహిస్తున్న జవాన్ కులాన్గా గుర్తించారు. హింట్ అండ్ రన్ కేసులో పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అతడు అసలు ఔటర్ రింగ్ రోడ్ వైపు ఎందుకు వచ్చాడు అని పోలీసులు ఆరా తీస్తున్నారు. సీసీటీవీ ఫుటేజ్ను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. విషయం తెలుసుకున్న ఆర్మీ జవాన్లు ప్రమాద స్థలానికి భారీగా చేరుకున్నారు. -
జూలై 1 నుంచి ‘భారత’ చట్టాలు
న్యూఢిల్లీ: వలసపాలన నాటి నేర న్యాయ వ్యవస్థ చట్టాలను సంస్కరించి నేటి ఆధునిక సమాజ అవసరాలకు తగ్గట్లుగా కేంద్ర ప్రభుత్వం రూపొందించిన భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్షా సంహిత, భారతీయ సాక్ష్యా చట్టాలు జూలై ఒకటో తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి. హిట్ అండ్ రన్ కేసులకు సంబంధించిన నిబంధనలు మాత్రం ఇప్పుడే అమలుకావు. హిట్ అండ్ రన్ కేసులపై ట్రక్కు డ్రైవర్లు దేశవ్యాప్తంగా కొద్దివారాల క్రితం ధర్నాకు దిగిన నేపథ్యంలో ఈ నిబంధనల అమలును ప్రస్తుతానికి పక్కనబెట్టారు. ఈ మూడు నూతన చట్టాలకు గత ఏడాది డిసెంబర్ 21న పార్లమెంట్ ఆమోదం తెలపగా డిసెంబర్ 25వ తేదీన రాష్ట్రపతి ముర్ము ఆమోదముద్ర వేశారు. ఇండియన్ పీనల్ కోడ్, కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసిజర్, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్1872ల స్థానంలో ఈ మూడు చట్టాలు తెచి్చన సంగతి తెల్సిందే. దోషులను శిక్షించడంకంటే ముందు బాధితులకు సత్వర న్యాయం అందించే లక్ష్యంతోనే ఈ చట్టాలను తెచ్చామని బిల్లులపై చర్చ సందర్భంగా పార్లమెంట్లో హోం మంత్రి అమిత్షా వ్యాఖ్యానించారు. ఐపీసీలో లేని ఉగ్రవాదం అనే దానికి తొలిసారిగా కొత్త చట్టంలో సరైన నిర్వచనం పొందుపరిచారు. రాజదోహ్రం అనే పదాన్ని తొలగించి దాని స్థానంలో ‘దేశ వ్యతిరేక నేరాలు’ అనే సెక్షన్ను జతచేశారు. వేర్పాటువాదం, సాయుధపోరాటాలు, దేశ సార్వ¿ౌమత్వాన్ని భంగపరిచే చర్చలు, దేశ, విదేశాల్లో ఉంటూ చేసే విధ్వంసకర కుట్రలు, దేశ ఆర్థిక వ్యవస్థను ఛిన్నాభిన్నం చేసే కుట్ర విద్వేష ప్రసంగాలు.. ఇలా పలు రకాల నేరాలను ఇకపై దేశవ్యతిరేక నేరాలుగా పరిగణిస్తారు. ఈ నేరాలకు గరిష్టంగా జీవితఖైదు పడొచ్చు. రాజద్రోహం అనే పదాన్ని తొలగించి దేశద్రోహం అనే నిర్వచించారు. దోషులకు మేజిస్ట్రేట్ విధించే జరిమానా మొత్తాలను పెంచారు. అన్ని భాగస్వామ్య వర్గాల సలహాలు, సూచనలు స్వీకరించి సమగ్ర చర్చలు, సంప్రతింపుల తర్వాతే ముసాయిదా బిల్లులు చట్టాలుగా రూపుదాల్చాయని అమిత్ షా అన్నారు. -
హైదరాబాద్ బొల్లారంలో మరో హిట్ అండ్ రన్ కేసు
-
HYD: తోపుడుబండిపైకి దూసుకెళ్లిన కారు.. పరారీలో డాక్టర్
సాక్షి, హైదరాబాద్: నగరంలోని బొల్లారంలో మరో హిట్ అండ్ రన్ కేసు నమోదైంది. గురువారం తెల్లవారుజామున బొల్లారం పరిధిలో వేగంగా కారు నడుపుతూ ఓ వైద్యుడు.. ఫుట్పాత్ వెంట ఉన్న తోపుడుబండిపైకి దూసుకెళ్లాడు. ప్రమాదం జరిగిన వెంటనే అక్కడే ఉన్న పలువురు వ్యక్తులు వెంటాడి కారును అడ్డగించి డాక్టర్ కార్తీక్ను పట్టుకున్నారు. ప్రమాదానికి కారణమైన డాక్టర్.. హైదరాబాద్ నగరంలోని ఓ ఆస్పత్రిలో న్యూరో సర్జన్గా సమాచారం. ఈ ఘటనలో సయ్యద్ పాషా అనే వ్యక్తి తీవ్రంగా గాయపడగా, తాను పని చేస్తున్న ఆస్పత్రిలోనే చికిత్స అందిస్తానని చెప్పిన డాక్టర్.. బాధితుడిని తన కారులో తీసుకెళ్లాడు. ఈ క్రమంలో అత్తాపూర్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించి, ఆ వైద్యుడు పరారయ్యాడు. ప్రస్తుతం బాధితుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. ఇదీ చదవండి: షణ్ముక్ గంజాయి కేసు.. దర్యాప్తులో సంచలన విషయాలు! -
పంజాగుట్ట యాక్సిడెంట్ కేసులో బిగ్ అప్డేట్
-
Hit And Run Jubilee Hills: జూబ్లీహిల్స్లో స్పోర్ట్స్ కారు బీభత్సం
హైదరాబాద్: జూబ్లీహిల్స్ లో మరో హిట్ అండ్ రన్ వెలుగులోకి వచ్చింది. ఇటీవల జూబ్లీహిల్స్ పెద్దమ్మగుడి వద్ద బైకును కారు ఢీకొట్టిన ఘటనలో వ్యక్తి మృతి చెందారు. ఈ ఘటన మరువకముందే మరో ఘటన కలకలం రేగింది. హైదరాబాద్ జూబ్లీహిల్స్లో వైట్ డెకో స్పోర్ట్స్ కారు బీభత్సం సృష్టించింది. అతి వేగాంగా వెళ్లి ఎదురుగా ఉన్న రెండు బైకులను ఢీకొట్టింది. ఈ ఘటనలో అన్నాచెల్లితో పాటు మరో వాహనదారుడికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని మాదాపూర్లోని మెడికవర్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. కార్ నెంబర్ ఆధారంగా గుంటూరుకు చెందిన బిక్కి అశోక్గా పోలీస్ గుర్తించారు. గుంటూరు బయల్దేరిన జూబ్లీహిల్స్ పోలీస్ బృందం -
‘హిట్ అండ్ రన్’కు ఏ దేశంలో ఎటువంటి శిక్ష?
కేంద్ర ప్రభుత్వం ‘హిట్ అండ్ రన్’ కేసులో కఠినమైన నిబంధనలను రూపొందించింది. పదేళ్ల జైలు శిక్ష, రూ. 7 లక్షల జరిమానా విధించింది. దేశంలో చాలావరకూ రోడ్డు ప్రమాదాలు నిర్లక్ష్యం కారణంగానే చోటుచేసుకుంటున్నాయి. రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందుతున్నవారి సంఖ్య కూడా అధికంగానే ఉంటోంది. మనదేశాన్ని మినహాయించి ఇతర దేశాల్లో ‘హిట్ అండ్ రన్’ కేసులలో ఎలాంటి శిక్ష ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. బంగ్లాదేశ్ బంగ్లాదేశ్లో వాహన చట్టం, 1927 ప్రకారం ప్రమాదం జరిగిన తర్వాత, పోలీసులు అక్కడికి వచ్చి చర్యలు చేపట్టే వరకు వాహనం డ్రైవర్ తన వాహనంతో పాటు అక్కడే ఉండాలి. బంగ్లాదేశ్లో హిట్ అండ్ రన్ లేదా ఏ వాహన సంబంధిత ప్రమాదంలో ఎవరైనా మరణిస్తే అందుకు కారకులైనవారు నేరస్తులవుతారు. ‘హిట్ అండ్ రన్’కేసులో మరణశిక్ష విదించే అవకాశం కూడా ఉంది. ఇటువంటి కేసులో డ్రైవర్ను వెంటనే అరెస్టు చేస్తారు. అతనికి బెయిల్ లభించే అవకాశం కూడా ఉండదు. చైనా చైనాలో ‘హిట్ అండ్ రన్’లో పెను ప్రమాదం జరిగితే నేరస్తుని డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేస్తారు. జీవితకాల నిషేధం కూడా ఉండవచ్చు. చైనా క్రిమినల్ కోడ్, ఆర్టికల్ 133 కింద హిట్ అండ్ రన్ కేసులో తీవ్రమైన శారీరక హాని లేదా మరణం సంభవించినట్లయితే, నేరస్తునికి 3 నుండి 7 సంవత్సరాల జైలు శిక్ష విధించే అవకాశం ఉంది. బ్రిటన్ యూకేలో ఏదైనా రోడ్డు ప్రమాదం జరిగితే డ్రైవర్ తన పూర్తి పేరు, చిరునామాను పోలీసులకు తెలియజేయాలి. అలాంటి సందర్భాలలో నేరస్తునికి గరిష్టంగా 6 నెలల జైలు శిక్ష, ఐదు వేల పౌండ్ల జరిమానా కూడా ఉంటుంది. దీనితో పాటు అతను డ్రైవింగ్ చేయకుండా నిషేధం విధిస్తారు. అమెరికా యునైటెడ్ స్టేట్స్లో ‘హిట్ అండ్ రన్’లో విధించే శిక్ష ప్రతీ రాష్ట్రానికీ మారుతూ ఉంటుంది. దీనిని థర్డ్ డిగ్రీ నేరంగా పరిగణిస్తారు. శిక్షాకాలం ఒకటి నుంచి ఐదేళ్లు లేదా అంతకంటే ఎక్కువ ఉండవచ్చు. దీంతో పాటు జరిమానా కూడా చెల్లించాల్సి ఉంటుంది. ఆస్ట్రేలియా ఆస్ట్రేలియాలో హిట్ అండ్ రన్ ఉదంతంలో డ్రైవర్ ప్రమాద స్థలంలో వాహనాన్ని ఆపి, వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలి. ఆస్ట్రేలియాలో ట్రాఫిక్ నేరాల కోసం ఒక ప్రత్యేక కమిషన్ ఉంది. ఇది ప్రతి రోడ్డు ప్రమాదంలో దాని తీరుతెన్నులను గమనించి డ్రైవర్కు ఒక పాయింట్ను ఇస్తుంది. దీని ప్రకారం డ్రైవర్కు జరిమానా విధించవచ్చు. లేదా అతని లైసెన్స్ను సస్పెండ్ లేదా రద్దు చేసే అవకాశం ఉంది. కెనడా కెనడాలో క్రిమినల్ కోడ్ ప్రకారం ‘హిట్ అండ్ రన్’ను నేరంగా పరిగణిస్తారు. ఇటువంటి కేసులో ఐదేళ్ల పాటు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. ప్రమాదంలో ఎవరైనా మృతి చెందితే అందుకు కారకులపై గరిష్టంగా పదేళ్ల జైలు శిక్ష విధిస్తారు. దక్షిణ కొరియా దక్షిణ కొరియాలో ‘హిట్ అండ్ రన్’ తీవ్రమైన నేరంగా పరిగణిస్తారు. అలాంటి ప్రమాదంలో ఎవరైనా చనిపోయి, డ్రైవర్ పరారైతే అతనికి కనీసం ఐదేళ్ల జైలు లేదా గరిష్టంగా జీవిత ఖైదు విధిస్తారు. దీనితో పాటు భారీ జరిమానా కూడా ఉంటుంది. హాంకాంగ్ హాంకాంగ్లో ప్రమాదం జరిగిన తర్వాత, డ్రైవర్ వెంటనే వాహనం ఆపివేయాలి. అలాగే పోలీసులకు సమాచారం ఇవ్వాలి. నేరస్తుడు హిట్ అండ్ రన్ ప్రమాదంలో బాధితులకు సహాయం చేయకపోతే, అతనికి ఒక సంవత్సరం జైలు శిక్ష లేదా జరిమానా కూడా విధించే అవకాశం ఉంది. న్యూజిలాండ్ న్యూజిలాండ్లో ప్రమాదానికి కారణమైన డ్రైవర్లు వాహనాన్ని తప్పనిసరిగా ఆపాలి. ఒకవేళ డ్రైవర్ ప్రమాదం జరిగిన ప్రదేశం నుండి పారిపోతే, అతనికి మూడు నెలల జైలు శిక్ష లేదా భారీ జరిమానా విధించే అవకాశం ఉంది. అతని డ్రైవింగ్ లైసెన్స్ కనీసం ఆరు నెలల పాటు సస్పెండ్ చేసేందుకు అవకాశం ఉంది. రోడ్డు ప్రమాదంలో ఎవరైనా చనిపోతే అందుకు కారకులపై ఐదేళ్ల జైలు శిక్ష లేదా 20 వేల న్యూజిలాండ్ డాలర్లు జరిమానాగా విధించే అవకాశం ఉంది. అలాగే అతని డ్రైవింగ్ లైసెన్స్ను ఏడాది పాటు రద్దు చేసేందుకు అవకాశం ఉంది. -
జూబ్లీహిల్స్ హిట్ అండ్ రన్ కేసులో సంచలన విషయాలు
-
HYD: హిట్ అండ్ రన్ కేసులో కొత్త కోణం.. ఐటీ ఉద్యోగి రుత్విక్..
సాక్షి, హైదరాబాద్: నగరంలో చోటుచేసుకున్న హిట్ అండ్ రన్ కేసులో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. ఈ ప్రమాదానికి ముఖ్య కారకుడైన ఐటీ ఉద్యోగి రుత్విక్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. మద్యం మత్తులోనే కారు అతి వేగంతో నడిపి ప్రమాదానికి కారణమైనట్టు పోలీసులు గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జూబ్లీహిల్స్లో బుధవారం తెల్లవారుజామున జరిగిన హిట్ అండ్ రన్ కేసులో తారక్రామ్ మృతికి కారణమైన ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారిలో నలుగురు యువకులు, ఒక యువతి ఉన్నారు. కాగా, ఈ కేసులో మరో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. ఈ ప్రమాదానికి ఐటీ ఉద్యోగి రుత్విక్ రెడ్డి కారణమని పోలీసులు నిర్ధారించారు. అయితే, రుత్విక్ రెడ్డి ఇటీవలే సాఫ్ట్వేర్ ఉద్యోగం పొందాడు. ఈ క్రమంలో తాను పనిచేస్తున్న ఆఫీసును ఫ్రెండ్ చూపిస్తానంటూ వారిని తీసుకుని మాదాపూర్కు వెళ్లాడు. అనంతరం, ఫ్రెండ్స్తో కలిసి బార్లో ఫుల్గా మద్యం సేవించారు. తెల్లవారుజామున నాలుగు గంటల వరకు బార్లోనే ఫుల్గా మద్యం తాగి బిర్యానీ తిన్నారు. అనంతరం, ఆఫీసును చూసి తిరిగి వస్తున్నా క్రమంలో మద్యం మత్తులో కారును అతి వేగంతో డ్రైవ్ చేశాడు. జూబ్లీహిల్స్లోని పెద్దమ్మ గుడి సమీపంలో బైక్పై వెళ్తున్న తారక్ను ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో తారక్ మృతిచెందాడు. -
Hyderabad: హిట్ అండ్ రన్ కేసులో ఐదుగురు అరెస్ట్
హైదరాబాద్: అదుపుతప్పిన వేగంతో వెనుక నుంచి దూసుకొచ్చిన కారు ఢీకొట్టడంతో ఓ బౌన్సర్ అక్కడికక్కడే మృతి చెందిన ఘటన బుధవారం జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. సికింద్రాబాద్ సిక్ విలేజ్ గాంధీనగర్కు చెందిన లింగాల తారక్రామ్ (30), కె.రాజు మాదాపూర్ నోవాటెల్లో బౌన్సర్లుగా పని చేస్తున్నారు. ఎప్పటిలాగే మంగళవారం సాయంత్రం డ్యూటీకి వెళ్లి బుధవారం తెల్లవారుజామున 5 గంటలకు బైక్పై జూబ్లీహిల్స్ మీదుగా ఇంటికి వెళ్తున్నారు. పెద్దమ్మ గుడి సమీపంలోకి రాగానే శ్రీ జ్యువెలర్స్ మలుపు వద్ద వెనుక నుంచి అతివేగంగా దూసుకువచ్చిన బ్లాక్ కలర్ కారు ఢీకొట్టి ఆగకుండా దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో తారక్రామ్ అక్కడికక్కడే మృతి చెందాడు. రాజు తీవ్రంగా గాయపడ్డాడు. సమాచారం అందుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. మృతుడు తారక్రామ్కు రెండేళ్ల క్రితం సుధారాణితో వివాహం కాగా 7 నెలల కుమారుడున్నాడు. గత కొంతకాలంగా బౌన్సర్గా పని చేస్తున్నాడు. ప్రమాదానికి కారణమైన కారు కోసం జూబ్లీహిల్స్ పోలీసులు గాలింపు చేపట్టారు. గచ్చిబౌలి, మాదాపూర్ వైపు, జూబ్లీహిల్స్, పంజగుట్ట, బేగంపేట రోడ్లపై ఉన్న సీసీ ఫుటేజీలను వడబోస్తున్నారు. సీసీ కెమెరాలకు కూడా అందనంత స్పీడ్గా 100 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో కారు దూసుకెళ్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు. ఈ వేగానికి కారు నంబర్ ఏ ఒక్క కెమెరాలో కూడా చిక్కడం లేదు. కారులో ఎంతమంది ఉన్నారని స్పష్టం తెలియడం లేదు. కారులో ఎంతమంది ఉన్నారు.. వీరు ఎక్కడి నుంచి వస్తున్నారు.. అన్నది తెలియాల్సి ఉంది. జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా ఈ కేసుకు సంబంధించిన వివరాలు తెలుసుకునేందుకు డీసీపీ విజయ్కుమార్ బుధవారం రాత్రి ఎస్ఆర్నగర్ స్టేషన్ను సందర్శించారు. మరోవైపు గాయపడిన రాజు యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మృతుడి బంధువుల ఆందోళన కారును అతివేగంగా నడిపిన నిందితుడ్ని ఇంతవరకు అరెస్టు చేయలేదని అసంతృప్తి వ్యక్తం చేస్తూ మృతుడి కుటుంబ సభ్యులు బుధవారం రాత్రి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించి ఆందోళన నిర్వహించారు. న్యాయం చేయాలంటూ నినాదాలు చేయడమే కాకుండా ఈ ఘటనకు కారకుడైన నిందితుణ్ణి తమ ముందు ప్రవేశపెట్టాలని, కారును కూడా చూపించాలని డిమాండ్ చేశారు. తారక్రామ్ తల్లి రాజమణి, భార్య సుధారాణి, సోదరుడు గణేష్, బావలు ప్రదీప్, సునీల్ తదితరులతో పాటు పెద్ద సంఖ్యలో బంధుమిత్రులు మృతదేహాన్ని రోడ్డుపై ఉంచి కన్నీరుమున్నీరవుతూ తమకు న్యాయం చేయాలంటూ డిమాండ్ చేశారు. పోలీసులు భారీ సంఖ్యలో మొహరించి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చే ప్రయత్నం చేశారు. కాగా ఈ ఆందోళన కొనసాగుతున్న సమయంలోనే ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కాన్వాయ్ అదే దారిలో వెళ్లడంతో కొంత ఉద్రిక్తత నెలకొంది. పోలీసుల అదుపులో ఐదుగురు నిందితులు జూబ్లీహిల్స్లో బుధవారం తెల్లవారుజామున జరిగిన హిట్ అండ్ రన్ కేసులో తారక్రామ్ మృతికి కారణమైన ఐదుగురు నిందితులను గురువారం తెల్లవారుజామున పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. కారును కూడా స్వాదీనం చేసుకున్నారు. ఇది కొత్త వెర్నా కారు అని పోలీసులు గుర్తించారు. ద్వారంపూడి నాగ అనే పేరుతో ఈ కారు రిజిస్ట్రేషన్ అయిఉందని నిర్ధారించారు -
రోజంతా అల్లాడించి...రోడ్డెక్కిన ట్రక్కులు
న్యూఢిల్లీ: హిట్ అండ్ రన్ కేసుల్లో ప్రతిపాదిత కఠిన చట్టాలను నిరసిస్తూ లారీలు, ట్రక్కుల డ్రైవర్లు చేపట్టిన సమ్మె మంగళవారం దేశవ్యాప్త గందరగోళానికి, అత్యవసర సేవల్లో తీవ్ర అంతరాయానికి దారి తీసింది. ఆయిల్ ట్యాంకర్ల డ్రైవర్లు కూడా సమ్మెలో పాల్గొనడంతో పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ కొరత ఏర్పడింది. సమ్మె రోజుల పాటు కొనసాగుతుందన్న వార్తల నేపథ్యంలో దేశమంతటా వాహనదారులంతా పెట్రోల్ బంకులకు పోటెత్తారు. దాంతో ఎక్కడ చూసినా బంకుల ముందు భారీ క్యూ లైన్లే దర్శనమిచ్చాయి. ఇది నగరాలు, పట్టణాల్లో భారీ ట్రాఫిక్ జామ్లకు దారితీసింది. అత్యధిక బంకుల్లో చూస్తుండగానే నిల్వలు అడుగంటి నో స్టాక్ బోర్డులు దర్శనమిచ్చాయి. వంట గ్యాస్ సిలిండర్లతో పాటు కాయగూరలు, ఇతర నిత్యావసరాల సరఫరా కూడా నిలిచిపోయి జనం తీవ్ర ఇక్కట్ల పాలయ్యారు. కేంద్రంతో ఆలిండియా మోటార్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ (ఏఐఎంటీసీ) జరిపిన చర్చలు ఎట్టకేలకు మంగళవారం రాత్రికి ఫలించాయి. కొత్త చట్టాన్ని ఇప్పటికిప్పుడే అమలు చేయడం లేదని కేంద్రం తరఫున హోం శాఖ కార్యదర్శి అజయ్ భల్లా వారికి హామీ ఇచ్చారు. దానిపై ఏఐఎంటీసీతో లోతుగా చర్చించాకే నిర్ణయం తీసుకునేలా అంగీకారం కుదిరిన్నట్టు సంఘం చైర్మన్ మల్కిత్సింగ్ బల్ తెలిపారు. దాంతో సమ్మె విరమిస్తున్నట్టు సంఘం ప్రకటించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. సర్వత్రా నో స్టాక్...! రోడ్డు ప్రమాద మృతికి బాధ్యుడైన వాహనదారు పోలీసులకు ఫిర్యాదు చేయకుండా పారిపోయేతే పదేళ్ల దాకా కఠిన కారాగార శిక్ష, రూ.7 లక్షల దాకా జరిమానా విధించేలా భారత న్యాయ సంహితలో చేర్చిన సెక్షన్లపై లారీలు, ట్రక్కుల డ్రైవర్లు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తుండటం తెలిసిందే. వాటి రద్దు డిమాండ్తో మహారాష్ట్ర తదితర చోట్ల సోమవారం నుంచే మూడు రోజుల సమ్మెకు దిగారు. అది మంగళవారాకల్లా దేశమంతటా విస్తరించింది. దాంతో పెట్రోల్, డీజిల్ కోసం వాహనదారులంతా ఒక్కసారిగా రోడ్డెక్కడంతో అన్ని రాష్ట్రాల్లోనూ పరిస్థితి చేయి దాటింది. పెట్రోల్ బంకులన్నీ జనంతో పోటెత్తి కన్పించాయి. కిలోమీటర్ల పొడవున వాహనదారులు బారులు తీరారు. నో స్టాక్ బోర్డు పెట్టి బంకులను మూసేయడం ఉద్రిక్తతకు, గొడవలకు దారి తీసింది. పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు రంగంలోకి దిగాల్సి వచ్చింది. మరోవైపు డ్రైవర్లు కూడా తమ లారీలు, ట్రక్కులను హైవేలపై రోడ్డుకు అడ్డంగా పెట్టి వాహనాల రాకపోకలను కూడా అడ్డుకుంటూ కన్పించారు. -
ట్రక్కు డ్రైవర్ల ఆందోళన.. పెట్రోల్ బంక్లపై ఎగబడుతున్న జనం
ఢిల్లీ: హిట్ అండ్ రన్ కేసుల్లో కేంద్రం తీసుకువచ్చిన కఠిన నిబంధనలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ట్రక్కు డ్రైవర్లు ఆందోళన చేపట్టారు. దేశవ్యాప్తంగా రోడ్లపై రాస్తారోకోలు, ర్యాలీలు నిర్వహిస్తున్నారు. ఈ ఆందోళనలతో ఇంధన ట్రక్కులు దేశవ్యాప్తంగా నిలిచిపోయాయి. దీంతో ఇంధన కొరత ఏర్పడుతుందని జనం పెట్రోల్ బంక్లపై ఎగబడుతున్నారు. థానే జిల్లాలోని మీరా భయాందర్ ప్రాంతంలో ముంబై-అహ్మదాబాద్ హైవేపై ట్రక్కు డ్రైవర్లు నిరసన చేపట్టారు. ఈ క్రమంలో పోలీసులపై రాళ్లు రువ్వారు. రాళ్లదాడితో పోలీసు వాహనం ధ్వంసమైంది. షోలాపూర్, కొల్హాపూర్, నాగ్పూర్, గోండియా జిల్లాల్లో కూడా రోడ్లు దిగ్బంధించారు. ఛత్తీస్గఢ్లోనూ నిరసనలు మిన్నంటాయి. రాష్ట్రవ్యాప్తంగా 12,000 మందికి పైగా ప్రైవేట్ బస్సు డ్రైవర్లు సమ్మెను ప్రకటించారు. రాయ్పూర్, బిలాస్పూర్, దుర్గ్, రాజ్నంద్గావ్లోని బస్ స్టేషన్లలో వందలాది మంది ప్రయాణికులు చిక్కుకున్నారు. ఆందోళనలు రాబోయే రోజుల్లో ఇంధన సరఫరాకు ఆటంకం కలిగిస్తాయని భయపడి ప్రజలు వివిధ నగరాల్లోని పెట్రోల్ పంపుల వద్ద క్యూ కట్టారు. అటు.. పశ్చిమబెంగాల్, పంజాబ్, మధ్యప్రదేశ్లోనూ డ్రైవర్ల ఆందోళనలు తీవ్ర స్థాయికి చేరాయి. భారతీయ శిక్షా స్మృతి స్థానంలో కేంద్రం ఇటీవల భారత న్యాయ సంహితను తీసుకొచ్చింది. ఇందులో హిట్ అండ్ రన్ కేసుల్లో కఠిన నిబంధనలు తీసుకొచ్చింది. రోడ్డు ప్రమాదాలకు కారణమైన ట్రక్కు డ్రైవర్లు పోలీసులకు సమాచారం అందించాలి. లేదంటే పదేళ్ల జైలు శిక్షతో పాటు రూ.7 లక్షల జరిమానా విధించే అవకాశాన్ని కల్పించారు. దీంతో ట్రక్కు డ్రైవర్లు ఆందోళన చేపట్టారు. ఈ కఠిన నిబంధనలకు భయపడి కొత్తవారు ఈ వృత్తిలోకి రావడంలేదని నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇదీ చదవండి: వరుసగా మూడోనెల తగ్గిన ఫ్యూయెల్ ధర.. ఎంతంటే.. -
చైతన్యపురి హిట్ అండ్ రన్: ఇద్దరి పరిస్థితి విషమం
సాక్షి, హైదరాబాద్: చైతన్యపురి హిట్ అండ్ రన్ కేసులో పోలీసులు మరిన్ని వివరాలు తెలియజేశారు. ప్రమాదంలో గాయపడ్డ ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు చైతన్యపురి సీఐ తెలిపారు. మరో ఐదుగురు గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు వెల్లడించారు. ప్రమాదానికి గురైన కారు చౌటుప్పల్ ఎంఆర్వో హరికృష్ణదిగా గుర్తించారు. ఆదివారం అర్ధరాత్రి ఈ ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. చైతన్య పురి పోలీస్ స్టేషన్ పరిధిలో.. ఎల్బీనగర్-ఉప్పల్ రోడ్లో వేగంగా దూసుకుపోతున్న కారు రాజీవ్ గాంధీనగర్ కమాన్ వద్ద ప్రమాదానికి గురైంది. కారు చౌటుప్పల్ ఎంఆర్ఓ హరికృష్ణ సతీమణి పేరుతో ఉన్నట్లు తెలిపారు. ప్రమాద సమయంలో హరికృష్ణ కొడుకు సాయికార్తీక్ అతని ఫ్రెండ్స్ ఆ కారులో ఉన్నటులు సమాచారం. కమాన్ను డీకొట్టడంతో కారులో ఉన్నఏడుగురు యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. కమాన్ వద్ద ఉన్న యువకుడికి ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. సాయి కార్తీక్ తన తండ్రి కారును తీసుకుని తన స్నేహితులతో కలిసి ఓ బర్త్ డే పార్టీకి వెళ్లగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ప్రమాదంలో గాయపడిన ఏడుగురిలో.. నలుగురు యువకులను గాంధీ ఆస్పత్రి కి తరలించి, సాయి కార్తీక్తో పాటు మరో ఇద్దరు యువకులని కొత్తపేట ఓమ్ని హాస్పిటల్కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై చైతన్యపురి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
Hit And Run Video: ట్రాఫిక్ కానిస్టేబుల్పైకి దూసుకెళ్లిన కారు
విధుల్లో ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్ను రాంగ్ డైరెక్షన్లో వచ్చిన ఓ కారు వేగంగా దూసుకొచ్చి ఢికొట్టింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. వివరాల్లోకి వెళ్లితే.. ఉత్తరప్రదేశ్ లక్నోలోని అవధ్ ప్రాంతంలో ఉన్న కూడలి వద్ద విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ కానిస్టేబుల్పై నుంచి ఓ కారు వైగంగా దూసుకెళ్లింది. ఈ ఘటనలో ట్రాఫిక్ కానిస్టేబుల్కు తీవ్ర గాయాలు అయ్యాయి. అతన్ని స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు అక్కడ ఉన్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయింది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ మారింది. ట్రాపిక్ను అదుపులో ఉంటే కానిస్టేబుల్ భద్రతలేకుండా పోయిందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. కాగా ఈ ఘటనకు పాల్పడిన కారు డ్రైవర్ను అరెస్ట్ చేసి.. అదుపులోకి తీసుకున్నట్లు పోలీసు పేర్కొన్నారు. लखनऊ के अवध चौराहे पर हादसा.. बेअन्दाज़ शख्स ने उल्टी दिशा में कार दौड़ाई और ट्रैफिक सिपाही पर चढ़ा दी हादसे के बाद चालक कार लेकर भाग निकला, घायल सिपाही अस्पताल में भर्ती पुलिस ने फुटेज की मदद से चालक अभिषेक दास को गिरफ्तार किया..@lkopolice pic.twitter.com/25izaQmiCc — Suraj Shukla (@suraj_livee) December 4, 2023 -
HYD: హయత్ నగర్లో హిట్ అండ్ రన్
సాక్షి, హైదరాబాద్: నగరంలో మరో హిట్ అండ్ రన్ కేసు నమోదు అయ్యింది. మద్యం మత్తులో అతివేగంతో కారు నడపడంతో ఓ ప్రాణం పోయింది. యాక్సిడెంట్ చేసి కారుతో సహా నిందితుడు పరారయ్యాడు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నప్పటికీ.. ఇప్పటిదాకా నిందితులను అదుపులోకి తీసుకోలేదని తెలుస్తోంది. దీంతో బాధిత కుటుంబం న్యాయ పోరాటానికి దిగింది. హయాత్ నగర్లో ఓ వైట్ కలర్ బెంజ్ కారు వేగంగా ఓ వ్యక్తిని ఢీ కొట్టింది. దీంతో ఆ వ్యక్తి స్పాట్లోనే చనిపోగా.. కారు అక్కడి నుంచి వేగంగా వెళ్లిపోయింది. మృతుడ్ని పోషం కృష్ణారెడ్డిగా గుర్తించిన పోలీసులు.. హిట్ అండ్ రన్ కేసుగా నమోదు చేసుకున్నారు. సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వైట్ కలర్ బెంజ్ కారు నెంబర్ TS08EZ6717 ఆధారంగా.. ఓనర్ను వరాల శ్వేతారెడ్డిగా గుర్తించారు. అయితే.. మద్యం మత్తులో పవన్ రెడ్డి కారు నడిపి కృష్ణారెడ్డి మృతికి కారణమైనట్లు తేలింది. దీంతో.. మోటర్ వెహికిల్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు పోలీసులు. అయితే.. ఇప్పటివరకు నిందితుడ్ని అరెస్ట్ చేయలేదని బాధిత కుటుంబం ఆరోపిస్తోంది. నిందితులను అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తోంది. -
హైదరాబాద్లో మరో హిట్ అండ్ రన్ కేసు
సాక్షి, హైదరాబాద్: నగరంలో మరో హిట్ అండ్ రన్ కేసు నమోదు అయ్యింది. అంబర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ కారు.. వృద్ధురాలు ఢీ కొట్టింది. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందగా.. కారు అక్కడి నుంచి వేగంగా వెళ్లిపోయింది. అంబర్పేట్ నుంచి ఉప్పల్ వెళ్లే రోడ్డులో.. కింగ్ ప్యాలెస్ హోటల్ వద్ద బుధవారం ఈ ఘటన చోటు చేసుకుంది. మృతురాలిని వినాయక్నగర్కు చెందిన ముత్యాలమ్మగా పోలీసులు గుర్తించారు. చెత్త పడేయడానికి వెళ్లి ఆమె ప్రమాదానికి గురైనట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. కేసు నమోదు చేసుకున్న అంబర్పేట పోలీసులు.. సీసీ కెమెరా ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. ఇదీ చదవండి: మొదటి భార్య ఫిర్యాదుతో శవం వెలికితీత -
బంజారాహిల్స్లో కారు బీభత్సం.. రాంగ్రూట్లో వచ్చి బైక్ను ఢీకొట్టి.
సాక్షి, హైదరాబాద్: బంజారాహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. శుక్రవారం తెల్లవారుజామున 4.15 గంటలకు రాంగ్ రూట్లో వస్తున్న బీఎండబ్ల్యూ కారు ఎదురుగా వస్తున్న బైక్ను బలంగా ఢీకొంది. అంతటితో ఆగకుండా బైక్ను కొంత దూరం వరకు లాక్కెళ్లింది. ఈ ఘటనలో జీహెచ్ఎంసీ ఏరియా మేనేజర్ పనిచేస్తున్న బాలచందర్ తీవ్రంగా గాయపడ్డారు. నికులు బాల చందర్ను ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి కారణమైన బీఎండబ్ల్యూ కారు నెంబర్ (TS09EJ5688) పోలీసులు నిర్థారించారు. ఈ సమయంలో కారులో డ్రైవర్తో పాటు ఇద్దరు మహిళలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి సంబంధించిన వీడియోలు సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. -
షాకింగ్ ఘటన: బైక్ను ఢీకొట్టి.. కారుపై యువకుడితో 3 కిలోమీటర్లు లాక్కెళ్లి
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో రోడ్డు ప్రమాదాలు ఇటీవల ఎక్కువగా వెలుగుచూస్తున్నాయి. తాజాగా ఢిల్లీలోని హై సెక్యూరిటీ వీఐపీ జోన్లో కంఝవాలా తరహా ఘటన చోటుచేసుకుంది. వేగంగా ప్రయాణిస్తున్న కారు టూవీలర్ను ఢీకొట్టడంతో ఓ వ్యక్తి ఊహించని రీతిలో ప్రాణాలు కోల్పోగా.. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ దారుణం కస్తూర్భా గాంధీ మార్గంలో శనివారం అర్థరాత్రి జరిగింది. ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలను రోడ్డు మీద వెళ్తున్న మరో వ్యక్తి తన ఫోన్లో చిత్రీకరించడంతో ఈ వీడియో నెట్టింట్లో వైరల్గా మారింది. టాల్స్టాయ్ మార్గ్ కూడలి వద్ద బైక్పై వెళుతున్న ఇద్దరు యువకులను మహింద్రా ఎక్స్యూవీ కారు ఢీకొట్టింది. దీంతో బైక్ పైన ఉన్న ఓ వ్యక్తి కారుపై పడ్డాడు. మరో వ్యక్తి రోడ్డుపై ఎగిరి పడ్డాడు. ఇంత ఘోరం జరిగిన తర్వాత కూడా డ్రైవర్ కారును ఆపకుండా.. పైన వ్యక్తిని అలాగే ఉంచి వేగంగా వెళ్లనిచ్చాడు. దీన్నంతటినీ ప్రత్యక్షసాక్షి అయిన మహ్మద్ బిలాల్ తన స్కూటీతోపాటు కారును వెంబడిస్తూ వీడియో తీశాడు. హారన్ కొడుతూ, అరుస్తూ డ్రైవర్ను అప్రమత్తం చేసేందుకు ప్రయత్నించినప్పటికీ కారు ఎంతకూ ఆపలేదు. అలాగే 3 కిలోమీటర్లు పోనిచ్చాడు. చదవండి: కర్నాటక: ఎన్నికల సిత్రం.. మామిడిచెట్టులో కరెన్సీ కట్టల బ్యాగు అనంతరం గాయపడిన వ్యక్తిని ఢిల్లీ గేట్ సమీపంలో కారు నుంచి కింద పడవేసి అక్కడి నుంచి పారిపోయాడు. దీంతో యువకుడి తలకు తీవ్ర గాయమవ్వడంతో అక్కడికక్కడే మరణించాడు. మృతుడిని 30 ఏళ్ల దీపాంశు వర్మగా గుర్తించారు. ఈ ఘటనలో గాయపడిన అతని బంధువు 20 ఏళ్ల ముకుల్ పరిస్థితి విషమంగా ఉంది. దీనిపై సమాచారం అందుకున్న ఢిల్లీ పోలీసులు హత్య కేసు నమోదు చేశారు. కారు నడిపిన వ్యక్తి హర్నీత్ స్ంగ్ చావ్లాను అరెస్టు చేశారు. అతనితో పాటు అతని కుటుంబం కూడా కారులో ఉన్నట్లు గుర్తించారు. ప్రమాద సమయంలో డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. చదవండి: ది కేరళ స్టోరీ విడుదల వివాదం.. తమిళనాడు ప్రభుత్వానికి హెచ్చరిక #WATCH | Man Dies In Delhi Hit-And-Run, Seen Lying On Roof As Car Driven For 3 Km Following a car hit a motorcycle one of the men on a motorcycle was thrown several feet away, while the other landed on the roof of the car Incident took place at the intersection of Kasturba… pic.twitter.com/7ta267NDjT — Subodh Kumar (@kumarsubodh_) May 3, 2023 -
ఢిల్లీ హిట్ అండ్ రన్ కేసులో చార్జిషీట్
న్యూఢిల్లీ: సంచలనం సృష్టించిన ఢిల్లీ హిట్ అండ్ రన్ కేసులో ఏడుగురు నిందితులపై పోలీసులు శనివారం 800 పేజీల చార్జిషీట్ దాఖలు చేశారు. దాదాపు 120 మంది సాక్ష్యాలను అందులో పొందుపరిచారు. నిందితుల్లో నలుగురిపై హత్యా నేరం మోపారు. దీనిపై విచారణను ఏప్రిల్ 13కు మెట్రోపాలిటన్ జడ్జి సన్యా దలాల్ వాయిదా వేశారు. గత డిసెంబర్ 31న ఢిల్లీలో న్యూ ఇయర్ వేడుకలు చేసుకుని అర్ధరాత్రి దాటాక స్కూటీపై వెళ్తున్న అంజలీసింగ్ అనే 20 ఏళ్ల యువతిని నిందితులు కారుతో ఢీకొట్టడం, ఆమె కారు కింద చిక్కుకుందని తెలిసి కూడా అలాగే 12 కిలోమీటర్లకు పైగా లాక్కెళ్లడం తెలిసిందే. దాంతో ఒళ్లంతా ఛిద్రమై అంజలి అత్యంత బాధాకరంగా మరణించింది. -
యువతిని కారుతో ఈడ్చుకెళ్లిన ఘటన.. కేంద్ర హోంశాఖ కీలక నిర్ణయం
న్యూఢిల్లీ: ఢిల్లీలో జనవరి 1న యువతిని కారులో ఈడ్చుకెళ్లిన ఘటనకు సంబంధించి విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకుంది కేంద్ర హోంశాఖ. మొత్తం 11 మంది పోలీసులను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. డీసీపీ స్థాయి అధికారితో పాటు 10 మంది పోలీసులపై వేటు వేసింది. జనవరి 1న ఈ ఘటన జరిగిన రూట్లో డ్యూటీ చేసిన అధికారులపై ఈమేరకు చర్యలకు ఉపక్రమించింది. వీరంతా ఆ రోజు మూడు పోలీస్ కంట్రోల్ రూం వ్యాన్లు, రెండు పికెట్లలో విధులు నిర్వహించారు. ఢిల్లీ కంఝవాలాలో జనవరి 1న స్కూటీపై వెళ్తున్న అంజలి అనే యువతిని కారుతో ఢీకొట్టారు కొందరు యువకులు. మద్యం మత్తులో వాహనాన్ని నడిపారు. అంజలి చక్రాల మధ్య ఇరుక్కున్నా పట్టించుకోకుండా 12 కిలోమీటర్లు కారును అలాగే రోడ్డుపై తిప్పారు. ఈ కిరాతక ఘటనలో యువతి మృతిచెందింది. తెల్లవారుజామున నడిరోడ్డుపై నగ్నంగా ఆమె మృతదేహం లభ్యమవ్వడం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ ఘటనకు సంబంధించిన నిందితులను పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు. అయితే అంజలిని 12 కిలోమీటర్లు ఈడ్చుకెళ్లిన రోజు విధుల్లో ఉన్న పోలీసులపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే ఆరోజు విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులను హోంశాఖ సస్పెండ్ చేసింది. చదవండి: ప్రపంచంలోనే అతిపెద్ద రివర్ క్రూయిజ్ను ప్రారంభించిన మోదీ.. -
అంజలి మద్యం సేవించలేదన్న పోస్టుమార్టం నివేదిక
-
హైదరాబాద్: మలక్పేట హిట్ అండ్ రన్ కేసులో డాక్టర్ శ్రావణి మృతి
-
హిట్&రన్ కేసు: డాక్టర్ శ్రావణి కన్నుమూత
సాక్షి, హైదరాబాద్: మలక్పేట్ హిట్ అండ్ రన్ కేసు విషాదంగా ముగిసింది. కారు ఢీ కొన్న ప్రమాదంలో గాయపడ్డ డాక్టర్ శ్రావణి కన్నుమూసింది. చావు బతుకుల నడుమ కొట్టుమిట్టాడుతూ.. మూడు రోజులుగా ఆమె నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. అయితే.. ప్రమాదంలో తలకు బలమైన గాయం కావడంతోనే ఆమె కన్నుమూసిందని వైద్యులు ప్రకటించారు. ఇక నిందితుడిని ఓల్డ్ మలక్పేటకు చెందిన ఇబ్రహీంగా గుర్తించారు. అంతేకాదు.. నిందితుడికి లైసెన్స్, కారుకు పేపర్లు సైతం లేవని వెల్లడించారు పోలీసులు. శ్రావణి హస్తినాపురంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో డెంటల్ డాక్టర్గా విధులు నిర్వహించేవారు. ఇదిలా ఉంటే.. నెల వ్యవధిలో ఆ కుటుంబంలో ఇది రెండో విషాదం. సుమారు 25 రోజుల కిందటే శ్రావణి తల్లి గుండెపోటుతో కన్నుమూయడం గమనార్హం. దీంతో ఆ కుటుంబం శోకంలో మునిగిపోయింది. సెప్టెంబర్ 21వ తేదీన ఓలా బైక్ బుక్ చేస్కొని శ్రావణి వెళ్తుండగా.. గుర్తు తెలియని కారు ఒకటి బైక్ను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఓలా బైక్ డ్రైవర్ వెంకటయ్య, శ్రావణి గాయపడగా.. పోలీసులు ఆస్పత్రిలో చేర్పించారు. అయితే ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ శ్రావణి పరిస్థితి విషమంగా మారింది. చివరకు ఆమె తుది శ్వాస విడిచింది. ఇక సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుడు ఇబ్రహీంను గుర్తించారు పోలీసులు. ఇదీ చదవండి: న్యూడ్ కాల్స్తో ఆమె నన్ను వేధిస్తోంది సార్.. -
'సెల్మన్ భాయ్' పై ‘సల్మాన్ భాయ్’ కేసు
కండల వీరుడు, స్టార్ సల్మాన్ ఖాన్ గురించి బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఉన్న క్రేజ్ తెలిసిందే. అభిమానులు ఆయన్ని ముద్దుగా ‘సల్మాన్ భాయ్’ అని పిలుచుకుంటూ ఉంటారు. అయితే కొన్ని సంవత్సరాల క్రితం ఆయనపై హిట్ అండ్ రన్ కేసు నమోదైన విషయం విదితమే. ఈ కాన్సెప్ట్ ఆధారంగా తయారైన వీడియో గేమ్ ‘సెల్మన్ భాయ్’. అది తన ముద్దు పేరు ‘సల్మాన్ భాయ్’ని పోలి ఉందని, అందులోని చిత్రాలు ఆయన్ని వ్యంగంగా చూపిస్తున్నాయని, గేమ్ డెవలపర్స్పై సల్మాన్ ముంబై సివిల్ కోర్టులో గత నెల ఫిర్యాదు చేశాడు. సల్లు భాయ్ కేసును విచారించిన ముంబై సివిల్ కోర్టు జడ్జి ‘సెల్మన్ భాయ్’ వీడియో గేమ్ను తాత్కాలికంగా నిలిపివేయాలని తాజాగా ఆదేశించారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులను సివిల్ కోర్టు జడ్జి కెఎం జైస్వాల్ సోమవారం (సెప్టెంబర్ 6న) జారీ చేయగా, మంగళవారం (సెప్టెంబర్ 7) నుంచి దాని కాపీ అందుబాటులోకి వచ్చింది. ఆ గేమ్ సల్మాన్ ఖాన్ హిట్ అండ్ రన్ కేసుకు పేరడీల ఉందని ప్రాథమిక విచారణ తేలినట్లు ఆ ఉత్తర్వుల్లో తెలిపారు. కాబట్టి ఆ వీడియో గేమ్ ప్రమోషన్స్, లాంచింగ్, రీ లాంచింగ్ల్లో సల్మాన్ ఖాన్కి సంబంధించిన ఎటువంటి విషయాలు లేకుండా నిషేధించారు. అలాగే ఆ గేమ్ని గూగుల్ ప్లే స్టోర్ లాంటి అన్ని ప్లాట్ఫామ్ నుంచి తొలగించాలని గేమ్ డెవలపర్స్ పేరడీ స్టూడియోస్ ప్రైవేట్ లిమిటెడ్కు ఆదేశాలు జారీ చేశారు. ఈ గేమ్కి సంబంధించి సల్మాన్ ఎటువంటి అనుమతి ఇవ్వలేదని అందులో పేర్కొన్నారు. ‘‘సెల్మన్ భాయ్’ గేమ్ డెవలపర్స్ నా అనుమతి లేకుండానే కమర్షియల్గా లబ్ధిపొందారని’ గతనెల సల్మాన్ ఖాన్ ఫైల్ చేసిన కేసులో ఫిర్యాదు చేశాడు. ఈ విషయమై సెప్టెంబర్ 20లోగా అఫిడవిట్ దాఖలు చేయాలని గేమ్ డెవలపర్స్కి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇటీవలే సల్మాన్ ఖాన్ ‘రాధే: ది మోస్ వాంటెడ్ భాయ్’తో ఓటీటీ ద్వారా ప్రేక్షకులని పలరించాడు. కాగా ప్రస్తుతం ఆయన తదుపరి సినిమా లాల్ సింగ్ చద్ధా షూటింగ్ జరుపుకుంటోంది. -
నిందితుడిని పట్టించిన సీసీ ఫుటేజీలు
విజయనగరం క్రైమ్/పూసపాటిరేగ: పూసపాటిరేగ మండలం కనిమెట్ట గ్రామ సమీపంలో 16వ నంబర్ జాతీయ రహదారిపై మే 31న జరిగిన హిట్ అండ్ రన్ రహదారి ప్రమాద నిందితుడు పట్టుబడ్డాడు. సాంకేతిక సాక్ష్యాధారాలు, సీసీ టీవీ ఫుటేజీల ఆధారంగా నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్టు విజయనగరం డీఎస్పీ పి.అనిల్కుమార్ తెలిపారు. జిల్లా పోలీసు కార్యాలయ సమావేశ మందిరంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేసు వివరాలను వెల్లడించారు. శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస పట్టణం గాజులకొల్లివలసకు చెందిన భార్యాభర్తలు రౌతు రోహిణి, యోగేశ్వరరావులు విశాఖపట్నానికి మోటారు సైకిల్పై వెళ్తుండగా వెనుక నుంచి గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో ఇద్దరి తలలకు బలమైన గాయాలు కావడం, ఘటనా స్థలంలోనే మృతిచెందిన విష యం తెలిసిందే. దీనిపై కేసు నమోదు చేసిన పూసపాటిరేగ ఎస్ఐ ఆర్.జయంతి దర్యాప్తు చేపట్టారు. ప్రమాద స్థలంలో దొరికిన సాంకేతిక సాక్ష్యాలు, ఎక్సేంజ్ ఆఫ్ మెటిరియల్లో బైక్కు అంటిన వైట్ పెయింట్, ఫాగ్ లైట్ కవర్లు ఆధారంగా ఢీకొట్టిన వాహనం తెలుపు రంగు ఎర్టిగా కారుగా గుర్తించారు. ప్రమాద స్థలానికి దగ్గరగా జాతీయ రహదారిపై ఉన్న అరబిందో ఫార్మా కంపెనీ సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలించారు. ప్రమాద సమయంలో నాలుగు ఎర్టిగా కార్లు వెళ్లడం గమనించారు. అరబిందో ఫార్మాకు, ప్రమాద స్థలానికి నాలుగు కిలోమీటర్లు దూరం. ఈ లెక్కన బైక్ను వేగంగా క్రాస్ చేసి ప్రమాదానికి కారణమైన కారును గుర్తించారు. టోల్ గేట్ సిబ్బంది సహకారంతో కారు నంబర్ (ఏపీ 39బీవీ9909)ను సేకరించారు. ఈ చలానా యాప్ ద్వారా కారు నంబర్ అడ్రస్ విశాఖ పట్నానికి చెందిన నాయని శంకర రెడ్డిదిగా గుర్తించారు. వెంటనే ఎస్ఐ, సిబ్బంది విశాఖపట్నం వెళ్లారు. సీసీ ఫుటేజీలో కారు డ్రైవర్ వేసుకున్న మాస్క్ డిజైన్తో అక్కడ ఉన్న కారు డ్రైవర్ వేసుకున్న మాస్క్ డిజైన్ మ్యాచ్ కావడంతో విచారణ జరిపి నిందితుడిని అరెస్టు చేశారు. కారును సీజ్చేసి పూసపాటిరేగ స్టేష న్కు తరలించారు. కేసు ఛేదించిన ఎస్ఐ, సిబ్బందితో పాటు, వారికి మోనటరింగ్ చేసిన భోగాపురం సీఐ శ్రీధర్ను డీఎస్పీ అభినందించారు. చదవండి: అర్ధరాత్రి కారు చీకటి.. ఆ ఫోన్ కాల్ కాపాడింది కులాంతర వివాహం చేసుకున్నాడని.. -
హిట్ అండ్ రన్.. కవర్తో కప్పేశారు
యాలాల: మండల పరిధిలోని జక్కేపల్లి సమీపంలో బుధవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదానికి కారణమైన కారును పోలీసులు గుర్తించారు. అయితే ఆటోను ఢీకొని వేగంగా వెళ్లిపోయిన కారు, జక్కేపల్లి శివారులోని ఓ పొలంలో కారుపై టార్ఫాలిన్ కవర్, గడ్డికప్పి ఉంచి తప్పించేందుకు యత్నించినప్పటికి గ్రామస్తులు, పోలీసులు కారును పట్టుకున్నారు. ఇందుకు సంబంధించి ఎస్ఐ విఠల్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. తాండూరు పట్టణంలోని సాయిపూర్కు చెందిన చంద్రకాంత్రెడ్డి మరో ఇద్దరు వ్యక్తులతో కలిసి బుధవారం సాయంత్రం స్విఫ్ట్కారు (టీఎస్07 ఈకే 4509)లో యాలాల నుంచి తాండూరు వైపు వెళ్తున్నారు. అదే సమయంలో బెన్నూరు నుంచి జోగు సదానందం అలియాస్ సతీష్, అమృతయ్యతో కలిసి ఆటోలో యాలాల వైపు వెళ్తున్నారు. అయితే జక్కేపల్లి శివారులో కారు ఆటోను ఢీకొనడంతో సదానందం అక్కడికక్కడే మృతి చెందగా, అమృతయ్యకు గాయాలయ్యాయి. కాగా ఘటన జరిగిన అనంతరం కారు వేగంగా జక్కేపల్లి వైపు వెళ్లిపోయిందని స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. బెన్నూరు ఎంపీటీసీ లక్ష్మయ్యతో పాటు వార్డు సభ్యులు, యువకులు పోలీసుల సహాయంతో బుధవారం రాత్రి వరకు గుర్తుతెలియని వాహనం కోసం ముకుందాపూర్, జక్కేపల్లి, గిరిజాపూర్ వరకు జల్లెడపట్టారు. అయితే జక్కేపల్లి గ్రామానికి చెందిన యాదవరెడ్డి పొలంలో ప్రమాదానికి కారణమైన కారు ఉన్నట్లు స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో గురువారం ఉదయం అక్కడికి చేరుకున్నారు. ఆటోను ఢీకొన్న కారు ముందుభాగం దెబ్బతిని ఉండటంతో పాటు కారుపై టార్ఫాలిన్ కవర్, గడ్డి కప్పి ఉంచినట్లు గుర్తించారు. అనంతరం కారును పీఎస్కు తరలించారు. ప్రమాదానికి కారణమైన చంద్రకాంత్రెడ్డితో పాటు కారును దాచిపెట్టడానికి సహకరించిన వారిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. -
బెంట్లీ కారుతో ఎమ్మెల్యే తనయుడు విధ్వంసం
కర్ణాటక, బొమ్మనహళ్లి: ఆదివారం నగరంలోని మేక్రి సర్కిల్ వద్ద వరుసగా వాహనాలను ఢీకొట్టి, అక్కడే వదిలివెళ్లిన అత్యంత ఖరీదైన బెంట్లీ కారు ఎవరిదనేది పోలీసులు గుర్తించారు. ఈ కారును డ్రైవింగ్ చేస్తు ప్రమాదానికి కారణమైన వ్యక్తి బెంగళూరు శాంతి నగర నియోజకవర్గం ఎమ్మెల్యే హ్యారిస్ కుమారుడు అయిన మహ్మద్ నలపాద్గా గుర్తించారు. ప్రమాదం జరిగిన చోటతో పాటు చట్టుపక్కల సిసి కెమెరాల్లో నమోదైన చిత్రాల ఆధారంగా పోలీసులు గుర్తించారు. దాంతో విచారణకు హాజరు కావాలని పోలీసులు నలపాడుకు నోటిసు జారి చేసినట్లు డీసీపి రవికాంతెగౌడ తెలిపారు. ఈ ప్రమాదంపై ఇప్పటికే నగరంలోని సదాశివర నగర పోలిస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. ఏం జరిగింది నలపాద్కు వివాదాల్లోకి దిగడం కొత్త కాదు. గతంలో ఓ కేఫ్లో యువకున్ని తీవ్రంగా కొట్టి కొన్ని నెలల పాటు సెంట్రల్ జైలులో రిమాండు అనుభవించడం తెలిసిందే. తాజాగా ఆదివారం మేక్రిసర్కిల్ వద్ద ఉన్న అండర్ పాస్లో బెంట్లి కారులో వేగంగా వచ్చి ద్విచక్ర వాహనంతో పాటు ఆటోను ఢీకొన్నారు. దీంతో బైకిస్టు కాలు విరిగిపోగా, ఆటో పూర్తిగా డ్యామేజీ అయింది. కారు డ్రైవర్ అజాగ్రత్త వల్లనే ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదం జరిగిన వెంటనే కారును అక్కడ వదలి వెళ్ళి పోవడం జరిగింది. ఆధారాలున్నాయి: డీసీపీ గౌడ ఈ ప్రమాదం కేసులో తానే డ్రైవింగ్ చేశానని ఒక వ్యక్తి వచ్చి పోలీసుల వద్ద లొంగిపోయాడు. అయితే పోలీసులు జరిపిన విచారణలో ఈ వ్యక్తి డ్రైవింగ్ చేయలేదని తేలింది. మహ్మద్ నలపాడ్ నడిపాడని గుర్తించి కేసు నమోదు చేసి నోటీసులు పంపారు. నోటిసులు అందిన వెంటనే విచారణకు హాజరు కావాలి. రానిపక్షంలో తదుపరి చర్యలు ఉంటాయని డీసీపీ రవికాంతేగౌడ అన్నారు.కారును నడిపింది నలపాడేనని ఆధారాలు ఉన్నాయని, హాజరుకాక పోతే తాము కోర్టులో ఆధారాలను ప్రవేశ పెడతామని తెలిపారు. ప్రమాద సమయంలో అతడు జారుకున్నాడు. కానీ స్నేహితుడు నఫి మహ్మద్నసీర్, అతని బాడిగార్డ్ బాలకృష్ణలను స్థానికులు గుర్తించారు. పలు చోట్ల ట్రాఫిక సిగ్నల్స్ వద్ద సిసి కెమరాల్లో నలపాడు కారు నడుపుతున్నట్లు రికార్డయింది. చిన్న ప్రమాదమే: దినేష్ గుండూరావు కాగా, ఇది ఒక చిన్న ప్రమాదం అని దానిని పెద్దగా చేయ వద్దని కేపిసిసి అధ్యక్షుడు దినేష్ గుండూరావు అన్నారు. కేపీసీసీ ఆఫీసులో మీడియాతో మాట్లాడారు. పోలీసులు నోటీసులు ఇచ్చారన్నారు. కానీ కొంత మంది పని కట్టుకుని రాజకీయం చేస్తున్నారని అన్నారు. ఎమ్మెల్యే కుమారుడైనా, ఇతరులైనా చట్టం ముందు అందరూ సమానమే అన్నారు. -
‘నా చెల్లెలి చావుకు కారణం నువ్వే..’
ఢిల్లీకి చెందిన ముఖేశ్ గోయల్ కిరాణా కొట్టు నడుపుతుంటారు. ఆయనకు ఇద్దరు రత్నాల్లాంటి పిల్లలు. కొడుకు మయాంక్(25) తండ్రికి చేదోడువాదోడుగా ఉంటూనే సివిల్స్కు ప్రిపేర్ అవుతున్నాడు. కూతురు కనక్(21).. ఓవైపు కామర్స్లో మాస్టర్స్ డిగ్రీ చేస్తూనే మరోవైపు సీఏ ఇంటర్న్షిప్ కోర్సు కూడా చేస్తోంది. అంతేకాదు ఇటీవలే ఎల్ఐసీ ఎంట్రన్స్ ఎగ్జామ్ పాస్ అయ్యింది. ఆ ఆనందంలో తండ్రి ఆమెకు ఇచ్చిన బహుమతి ప్రస్తుతం వారి జీవితాల్లో విషాదాన్ని నింపింది. కొత్త ఏడాది తీరని శోకం మిగిల్చింది.. తన దినచర్యలో భాగంగా భాగంగా జనవరి 2న కనక్ ట్యూషన్కు బయలుదేరింది. ముకార్బా చౌక్ వద్దకు రాగానే వెనుక నుంచి వచ్చిన ఓ గుర్తు తెలియని వాహనం ఆమెను ఢీకొట్టి వెళ్లిపోయింది. రక్తపు మడుగులో పడి ఉన్న కనక్ను దగ్గర్లోని ఆస్పత్రిలో చేర్పించారు స్థానికులు. విషయం అందుకున్న కుటుంబ సభ్యులు అక్కడికి వెళ్లే సరికే కనక్ మరణించిందన్న విషయాన్ని వైద్యులు ధ్రువీకరించారు. ‘హంతకుడి’ జాడ తెలియలేదు హిట్ అండ్ రన్ కేసుగా నమోదైన కనక్ డెత్ కేసులో నిందితులెవరూ పోలీసులు ఇంతవరకూ కనిపెట్టలేదు. సీసీటీవీ ఫుటేజీల్లో సదరు వాహనానికి సంబంధించిన ఎటువంటి ఆధారాలు లభించకపోవడం, ప్రమాదం జరిగిన చోట జన సమ్మర్ధం ఎక్కువగా ఉండటంతో కూడా ఈ కేసులో కాస్త జాప్యం జరుగుతుందంటూ పోలీసులు చెప్పడంతో కనక్ అన్నయ్య రంగంలోకి దిగాడు. నా చెల్లెలి హంతకులెవరో తెలియాలి అంతే.. ‘ట్యూషన్లతో మొదలైన కనక్ దినచర్య ఇంటర్న్షిప్తో ముగుస్తుంది. ఎల్ఐసీ ఎంట్రన్స్ ఎగ్జామ్ పాస్ అయిన తర్వాత సెప్టెంబరులో నాన్న తనకు స్కూటీ కొనిచ్చాడు. సమయానికి ఇంటికి చేరుకోవడంతో పాటు తనకు ఇబ్బందులు రాకుండా ఉంటాయని భావించారు. కానీ ఇప్పుడు ఇలా జరిగిపోయింది. తను మాకు శాశ్వతంగా దూరమైంది. అయితే నా చెల్లెలి చావుకు కారణమైన వాళ్లెవరో తెలుసుకోవాలనుకుంటున్నాను. అందుకే కనక్, స్కూటీ ఫొటోలతో కూడిన పాంప్లెంట్స్ పంచడంతో పాటుగా పోలీసుల అనుమతి తీసుకుని బారికేడ్లు కూడా ఏర్పాటు చేశాను. అయితే ఒక్కటి మాత్రం నిజం.. కనక్ను పొట్టనబెట్టుకున్న ఆ వ్యక్తి ఇవన్నీ చూస్తూనే ఉంటారు. దయచేసి తనకు తానుగా ముందుకు వచ్చి పోలీసుల ఎదుట లొంగిపోతే మంచిది. ఎందుకంటే ఏ రోజుకైనా నిజం బయటపడక తప్పదు. ఒకవేళ ప్రత్యక్ష సాక్షులెవరైనా ఉంటే ఇప్పటికైనా సమాచారం ఇచ్చి మాకు సహాయపడండి’ అని కనక్ సోదరుడు మయాంక్ మీడియా ముఖంగా అభ్యర్థించాడు. అయినా ఆక్సిడెంట్ చేసిన ఆ వ్యక్తికి అంత మంచితనమే ఉంటే వెంటనే తానే కనక్ని ఆస్పత్రికి తీసుకువెళ్లేవాడు గానీ ఇలా చేయడు కదా.. అయితే కాస్త ఆలస్యమైనా సరే ఈ హిట్ అండ్ రన్ డ్రైవర్ను పట్టుకోవాలని ప్రయత్నిస్తున్న మయాంక్ ప్రయత్నాలు తొందరగా ఫలించాలని కోరుకుందాం. -
శంషాబాద్లో మందుబాబుల వీరంగం!
సాక్షి, శంషాబాద్ : తాగిన మైకంలో కొందరు వ్యక్తులు రంగారెడ్డి జిల్లా శంషాబాద్లో వీరంగం సృష్టించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ నుంచి తప్పించుకునే యత్నంలో ట్రాఫిక్ పోలీసులను కారుతో ఢీకొట్టి మందుబాబులు పరారయ్యేందుకు యత్నించారు. అయితే 2 కిలోమీటర్ల మేర వెంబడించి నిందితులను పోలీసులు పట్టుకున్నారు. శంషాబాద్ పోలీస్స్టేషన్కు నిందితులను తరలించారు. అయితే కారును ఆపే క్రమంలో ఎస్ఐకి స్వల్పగాయాలయ్యాయి. ఎస్ఐ, కానిస్టేబుల్ కారును అపేందుకు యత్నించగా, మందుబాబులు ఎస్ఐని, వారి వాహనాన్ని.. పోలీసుల నుంచి తప్పించుకునే యత్నంలో మరో బైకును ఢీకొట్టినట్లు తెలుస్తోంది. కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు వివరించారు. -
విధి ఆడిన వింత నాటకంలో..!
ఫ్లోరిడా : విధి బలీయమైనదని కొందరు నమ్ముతారు.. మరికొందరు కొట్టిపారేస్తారు. అయితే డగ్లస్ పార్క్హర్స్ట్(68) అనే వ్యక్తి మృతిచెందడం ఎన్నో అంశాలను వెలుగులోకి తెచ్చింది. ఐదు దశాబ్దాల కిందట చేసిన పాపమే ఇప్పుడు అతడి పాలిట మృత్యువైందని బాధితురాలి కుటుంబంతో పాటు నెటిజన్లు అంటున్నారు. ఆ వివరాల్లోకెళ్తే... గత శుక్రవారం అమెరికా ఫ్లోరిడాలోని శాన్ఫోర్డ్లో జరిగిన కారు ప్రమాదం (హిట్ అండ్ రన్ కేసు)లో డగ్లస్ అనే వృద్ధుడు మృతిచెందాడు. తాగిన మైకంలో ఉన్న కరోల్ షారో(51) బేస్బాల్ పార్కు స్టేడియంలో వాహనాన్ని నడిపి ఈ ప్రమాదానికి కారణమయ్యారని పోలీసులు తెలిపారు. హిట్ అండ్ రన్లో గాయపడ్డ డగ్లస్ను హాస్పిటల్కు తరలిస్తుండగా చనిపోయాడు. 50 ఏళ్ల కిందట డగ్లస్ కారు కింద పడి ఓ చిన్నారి చనిపోయినట్లుగానే ఇప్పుడు అతడు ప్రాణాలు వదలడం గమనార్హం. అసలేమైందంటే.. 1968లో వియత్నానికి చెందిన డగ్లస్ పార్క్హర్స్ట్(18) తాగిన మైకంలో కారును నడిపాడు. ఈ క్రమంలో చిన్నారి కరోలీ(4) మృతికి కారణమయ్యాడు. హిట్ అండ్ రన్ కేసులో తన సోదరి చనిపోయిందని కరోలీ అక్క ఫిర్యాదు చేశారు. అక్కతో కలిసి చిన్నారి కరోలీ రోడ్డు దాటుతుండగా నిందితుడు డగ్లస్ తాగిన మైకంలో వాహనాన్ని నడపంతో కారు పాపను ఢీకొట్టింది. దీంతో కరోలీ 40 అడుగుల దూరంలో పడిపోయి తీవ్రరక్తస్రావమై చనిపోయింది. కేసు విచారణలో.. తనకు ఏ పాపం తెలియదని, ఏదో వస్తువును ఢీకొట్టిన మాట వాస్తవమేనన్నాడు డగ్లస్. కానీ ఏ చిన్నారి కూడా తనకు రోడ్డుపై కనిపించలేదని చెప్పడంతో నిర్దోషిగా బటయకొచ్చాడు. 2013లో మరోసారి కరోలీ సోదరి కేసును రీఓపెన్ చేయించారు. ఈసారి నిజం బట్టబయలైంది. కొన్ని సాక్ష్యాధారాలు, పరిస్థితుల కారణంగా నిందితుడు డగ్లస్ తన తప్పును అంగీకరించాడు. కానీ అప్పటికే నేరం జరిగి చాలాకాలం (45 ఏళ్లు) అయిపోయిందని.. ఇప్పుడు నిందితుడికి శిక్ష వేయలేమని కోర్టు తీర్పిచ్చింది. 50 ఏళ్లకు న్యాయం ఐదు దశాబ్దాల తర్వాతనైనా దేవుడు న్యాయం జరిగేలా చూశాడని కరోలీ కేసును విచారణ చేసిన పోలీసు అధికారి (రిటైర్డ్) రస్ జాన్సన్ అన్నారు. అందుకే చివరికి కరోల్ అనే పేరున్న యువతి కారణంగానే, అదేతీరుగా హిట్ అండ్ రన్ ప్రమాదంలో నిందితుడు డగ్లస్ చనిపోయాడని చెప్పారు. నెటిజన్లు సైతం ఈ విషయంపై పోస్టులు చేస్తున్నాడు. నా చెల్లికి జరిగినట్లే : తన చెల్లెలు కరోలీ మృతికి కారణమైన వ్యక్తి డగ్లస్ పార్క్హర్స్ట్(68) కూడా అదే తీరుగా చనిపోయాడని డార్లీన్ అన్నారు. ఇప్పుడు ఓ వలయం పూర్తయింది. ఇక ఈ విషయాన్ని వదిలేయాలని అభిప్రాయపడ్డారు. -
బెయిల్పై ఈశాన్యరెడ్డి విడుదల
సాక్షి, హైదరాబాద్: ర్యాష్ డ్రైవింగ్తో ప్రాణాన్ని బలితీసుకున్న కేసులో చంచల్గూడ మహిళా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న ఈశాన్యరెడ్డికి కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో మంగళవారం సాయంత్రం జైలు నుంచి విడుదలైంది. కుషాయిగూడ డీఏఈ కాలనీలో ఆదివారం రాత్రి ఫుట్పాత్పై నిద్రిస్తున్న వ్యక్తిపై కారు ఎక్కించి అతని మృతికి కారణమైన ఇంజినీరింగ్ విద్యార్థిని ఈశాన్యరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసి చంచల్గూడ మహిళ జైలుకు తరలించారు. ఎట్టకేలకు ఆమెకు బెయిల్ రావడంతో జైలు నుంచి విడుదలైంది. -
సల్మాన్ ఖాన్పై వారెంట్.. కొట్టివేత
సాక్షి, ముంబై : బాలీవుడ్ సల్మాన్ ఖాన్కు ఊరట లభించింది. హిట్ అండ్ రన్ కేసులో దాఖలు చేసిన వారెంట్ను ముంబై సెషన్స్ కోర్టు శనివారం కొట్టేసింది. ఈ కేసులో బాంబే హైకోర్టు ఆదేశాలనుసారం సల్మాన్ వ్యవహరించకపోవటంతో ఈ నెల 4వ తేదీన కోర్టు ఈ వారెంట్ను జారీ చేసింది. అయితే శనివారం కోర్టుకు హాజరైన సల్మాన్.. ఆ ప్రక్రియను పూర్తి చేశారు. షూరిటీ ప్రక్రియ.. హిట్ అండ్ రన్ కేసులో బాంబే హైకోర్టు సల్మాన్ను నిర్దోషిగా ప్రకటించింది. తీర్పు వెలువరించే సమయంలో నిందితుడు షూరిటీని సమర్పించాల్సిందిగా కోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది మరో కొత్త షూరిటీ పేరుతో రెన్యువల్ చేయాల్సి ఉంది. దీంతో సల్మాన్ తన బాడీగార్డ్ గుర్మీత్సింగ్ జోలీ అలియాస్ షేరా పేరును కోర్టుకు సమర్పించాడు. అయితే అందుకు సంబంధించిన అధికార ప్రక్రియను మాత్రం సల్మాన్ పూర్తి చేయలేదు. దీంతో ఏప్రిల్ 4న సెషన్స్ కోర్టు సల్మాన్కు బెయిలబుల్ వారెంట్ను జారీ చేసింది. దీనిపై సల్మాన్ కోర్టును అభ్యర్థించటంతో ఏప్రిల్ 11న దానిపై స్టే విధిస్తూ.. షూరిటీ ప్రక్రియను పూర్తి చేసేందుకు ఏప్రిల్ 25వ తేదీ వరకు గడువు ఇచ్చింది. ఈ నేపథ్యంలో శనివారం కోర్టుకు హాజరైన సల్మాన్.. షేరాతో ఆ ఫామ్లపై సంతకాలు చేయించాడు. దీంతో కోర్టు వారెంట్ను కొట్టేస్తున్నట్లు ప్రకటించింది. హిట్ అండ్ రన్ కేసు నేపథ్యం... 2002లో ఫుట్పాత్పై నిద్రిస్తున్న వారిపై నుంచి సల్మాన్ తన కారును పోనివ్వటంతో ఒకరు మృతి చెందగా.. నలుగురు గాయపడ్డారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో 13 ఏళ్ల విచారణ తర్వాత బాంబే సెషన్స్ కోర్టు సల్మాన్ను దోషిగా తేలుస్తూ మే 2015లో ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. దీనిని సవాల్ చేస్తూ సల్మాన్ హైకోర్టును ఆశ్రయించగా.. డిసెంబర్ 2015లో కోర్టు ఆయన్ని నిర్దోషిగా ప్రకటించింది. ఈ తీర్పుపై మహారాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా... అది పెండింగ్లో ఉంది. -
లొంగిపోయిన బీజేపీ బహిష్కృత నేత
సాక్షి, పాట్నా: హిట్ అండ్ రన్ కేసులో నిందితుడు, తొమ్మిది మంది చిన్నారుల మృతికి కారకుడైన బీజేపీ బహిష్కృత నేత మనోజ్ బైతా పోలీసుల ఎదుట లొంగిపోయారు. నిందితుడు బైతాను తొలుత శ్రీక్రిష్ణ మెడికల్-హాస్పిటల్లో చేర్పించామని, మెరుగైన వైద్యం కోసం పాట్నా మెడికల్ కాలేజీ హాస్పిటల్కు తరలించినట్లు పోలీసులు బుధవారం వెల్లడించారు. బిహార్లోని ముజఫర్పూర్ శివార్లలో ఉన్న ఝంజా గ్రామంలో గత శనివారం మధ్యాహ్నం 1:30 గంటలకు రోడ్డు దాటేందుకు 9 మంది విద్యార్థులు సిద్ధంగా ఉన్నారు. అదే సమయంలో తన ఎస్యూవీ కారులో అటుగా వెళ్తున్న బీజేపీ నేత మనోజ్ బైతా తన వాహనంతో విద్యార్థులను ఢీకొడుతూ వారిపైనుంచి దూసుకెళ్లాడు. మరో 20 మందిని వాహనంతో ఢీకొట్టారు. అనంతరం భయందోళనకు గురైన బైతా తన వాహనాన్ని అక్కడే వదిలి పరారైన విషయం తెలిసిందే. అయితే ఆ ప్రమాదంలో స్కూలు విద్యార్థులు 9 మంది అక్కడికక్కడే మృతిచెందగా, మరో 20 మంది గాయపడ్డారు. బిహార్లోని ముజఫర్పూర్ శివార్లలో ఉన్న ఝంజా గ్రామంలో చోటుచేసుకుంది. అదే ప్రమాదంలో గాయపడ్డ నిందితుడు బైతాను ముజఫర్పూర్కు తీసుకెళ్తే మృతిచెందిన విద్యార్థుల తల్లిదండ్రులు, గాయపడ్డవారి బంధువులు, సన్నిహితులు దాడిచేసే ప్రమాదం ఉందని చికిత్స కోసం పాట్నాకు తరలించినట్లు తెలిపారు. కాగా, మద్యం మత్తులో వాహనం నడిపి చిన్నారుల మృతికి కారణమైన ప్రమాదంపై బీజేపీ నేతపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తిన నేపథ్యంలో మనోజ్ బైతాను పార్టీ నుంచి ఆరేళ్లపాటు ఇదివరకే బహిష్కరించిన విషయం తెలిసిందే. -
హిట్ అండ్ రన్ కేసులో బిజినెస్మెన్ అరెస్ట్
న్యూఢిల్లీ : మెర్సిడిస్ హిట్ అండ్ రన్ కేసులో ప్రమేయమున్నట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న 27 ఏళ్ల బిజినెస్మెన్ సవ్నీత్ సింగ్ను ఢిల్లీ పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. అతుల్ అరోరా అనే విద్యార్థి ఆదివారం రాత్రి స్కూటర్పై తన స్నేహితుడిని డ్రాప్ చేసి వస్తుండగా.. మెర్సిడెస్ కారు ఢీకొని అక్కడికక్కడే మృతి చెందిన విషయం తెలిసిందే. పశ్చిమ్ విహార్ ప్రాతంలో చోటు చేసుకున్న ఈ ఘటనలో.. 100 కిలోమీటర్లకు పైగా వేగంతో ప్రయాణించిన కారు విద్యార్థిని సుమారు 50 మీటర్ల మేర ఈడ్చుకెళ్లింది. ప్రమాదం జరిగాక కనీసం ఆగి కూడా చూడకుండా.. మెర్సిడెస్ కారులోని వ్యక్తి పరారయ్యాడు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా ప్రమాదానికి కారణమైన వ్యక్తిని రాజౌరీ క్రైం బ్రాంచ్ పోలీసులు గుర్తించారు. ప్రమాదానికి కారణమైన మెర్సిడిస్ కారును కూడా పోలీసులు సీజ్ చేశారు. ఈ సంఘటన జరిగిన సమయంలో సవ్నీత్ సింగ్ పీకల్లోతు వరకు తాగి ఉన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. సవ్నీత్ సింగ్ తన స్నేహితునితో కలిసి రెస్టారెంట్కు వెళుతుండగా ఈ సంఘటన చోటుచేసుకుందని పోలీసులు తెలిపారు. బడాబాబుల విలువైన కార్లు ఢిల్లీ పౌరుల పాలిట శాపంగా మారుతున్నాయి. హై ఎండ్ వాహనాలు.. అదుపులేని వేగంతో దూసుకొస్తూ మనుషుల ప్రాణాలు బలిగొనడం ఇటీవల దేశ రాజధానిలో పరిపాటిగా మారింది. దక్షిణ ఢిల్లీ ప్రాంతంలో బీఎమ్డబ్ల్యూ కారు అతివేగం మూలంగా ఓ ఉబర్ డ్రైవర్ ప్రాణాలు కోల్పోయిన ఘటన జనవరిలో జరిగింది. అదే నెలలో ఢిల్లీ శివార్లలో జరిగిన మరో ఘటనలో ఆడీ స్పీడు.. ఓ మహిళా సాఫ్ట్వేర్ ఇంజనీర్తో సహా నలుగురిని పొట్టనబెట్టుకుంది. రోడ్డు ప్రమాదాల్లో 97 శాతం అతివేగం, నిర్లక్ష్య పూరిత డ్రైవింగ్ మూలంగానే జరుగుతున్నాయని రిపోర్టులు వెల్లడిస్తున్నాయి. -
ఇక సుప్రీంలో సల్మాన్ కేసు విచారణ
న్యూఢిల్లీ: బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ను హిట్ అండ్ రన్ కేసు వెంటాడుతోంది. ఈ కేసును సుప్రీం కోర్టు విచారించనుంది. ఈ కేసులో బాంబే హైకోర్టు సల్మాన్ను నిర్దోషిగా ప్రకటించడాన్ని సవాల్ చేస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీం కోర్టు విచారణకు స్వీకరించింది. కాగా వెంటనే విచారణను ప్రారంభించాలని మహారాష్ట్ర ప్రభుత్వం కోరగా, 6 నెలల తర్వాత విచారిస్తామని సుప్రీం కోర్టు పేర్కొంది. 2002 సెప్టెంబర్ 28 అర్ధరాత్రి ఒక బార్లో మద్యం సేవించి, మితిమీరిన వేగంతో డ్రైవింగ్ చేస్తూ సల్మాన్ బాంద్రా శివార్లలో పేవ్మెంట్పై పడుకున్న వారిపై వాహనంతో దూసుకెళ్లడంతో ఓ వ్యక్తి చనిపోగా, మరో నలుగురు తీవ్ర గాయపడ్డారన్న ఆరోపణలతో కేసు నమోదైంది. 13 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ అనంతరం హిట్ అండ్ రన్ కేసులో సెషన్ కోర్టు సల్మాన్ను దోషిగా ప్రకటించి ఐదేళ్ల జైలుశిక్ష విధించింది. కాగా బాంబే హైకోర్టు సల్మాన్ఖాన్ను నిర్దోషిగా ప్రకటించి విడుదల చేసింది. -
నలిగిపోయిన నాలుగో సింహం!
సినిమాకూ, నిజజీవితానికీ చాలా తేడా ఉంటుంది. సినిమాలో డ్రామా ఉంటే..రియల్లైఫ్లో లైఫ్ మాత్రమే ఉంటుంది. అందుకేనేమో ఎక్కడలేని ఆసక్తినీ రేకెత్తించే సినిమా కథలే హిట్టై కూర్చుంటున్నాయి. సామాన్యుల జీవితాలేమో ఫట్మంటున్నాయి. సినిమా హీరోలు రారాజులుగా వెలుగుతుంటే.. వారిని ఆరాధించే సామాన్యుడు దిక్కులేని చావు చస్తున్నాడు. వారి చక్రాల కిందపడి నలిగిపోతున్నాడు. జీవితపు చరమాంకంలో ముంబై వీధుల్లో బిచ్చమెత్తుకు తిరిగిన రవీంద్ర పాటిల్ కూడా అలాగే నలిగిపోయాడు. మహారాష్ట్రలోని చాలామంది కుర్రాళ్లలాగే రవీంద్ర పాటిల్కు కూడా సల్మాన్ ఖాన్ అంటే చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచీ అతడి కండలు తిరిగిన దేహాన్నే చూస్తూ పెరిగాడు. తన హీరోలాగే తానూ కండలు పెంచాలనుకున్నాడు. చివరకు పెంచాడు కూడా. ఈ దేహదారుఢ్యమే అతడిని పోలీస్ శాఖలో ఉద్యోగం సంపాదించేలా చేసింది. 1997లో ముంబై పోలీస్ డిపార్ట్మెంట్లో కానిస్టేబుల్గా చేరాడు. కెరీర్ ప్రారంభించిన రెండేళ్లకే ఉగ్రవాదుల ఆటకట్టించే ‘స్పెషల్ ఆపరేషన్ స్క్వాడ్’ కమాండోగా శిక్షణ కూడా పూర్తి చేసుకున్నాడు. సరిగ్గా అప్పుడే బాలీవుడ్ సూపర్స్టార్ సల్మాన్ఖాన్కు ముంబై అండర్వరల్డ్ నుంచి బెదిరింపులు మొదలయ్యాయి. తన ప్రాణాలకు ముప్పు ఉందని, రక్షణ కావాలనీ పోలీస్ కమిషనర్కు విన్నవించుకున్నాడు సల్మాన్. కమీషనర్ ఆదేశంతో బాడీగార్డ్ కోసం వేటలో పడ్డారు అధికారులు. ఆ సమయంలోనే వారి కంటపడ్డాడు రవీంద్ర పాటిల్. రూపంలో సల్మాన్కు పోటీగా ఉన్నాడు. ఓ రకంగా సల్మాన్ను మించిన ఫిజిక్తో పోలీసు అధికారుల దష్టిని ఆకర్షించాడు. ఇలాంటి వాడైతేనే సూపర్స్టార్కు సరైన జోడు అనుకున్నారో ఏమో.. స్పెషల్ ఆపరేషన్ స్క్వాడ్ నుంచి పాటిల్ను తప్పించారు. సల్మాన్కు బాడీగార్డ్గా పనిచేయమంటూ ఆదేశించారు. ఇది పాటిల్లో ఎక్కడలేని సంతోషాన్ని నింపింది. ఎగిరి గంతేశాడు. ‘‘ఇకపై సల్మాన్కు దగ్గరగా ఉండబోతున్నాను.. సల్మాన్ను రోజూ చూస్తాను.. సల్మాన్ కుటుంబంలో ఒకడిగా మారబోతున్నాను..’’ ఇలా ఒకటా రెండా బోలెడన్ని ఆలోచనలు అతడిని ఉక్కిరిబిక్కిరి చేశాయి. వెంటనే విధుల్లో చేరిపోయాడు. అయితే, ఆ రోజు అతడికి తెలియలేదు. అదే అతడి జీవితాన్ని సర్వనాశనం చేయబోతోందని..! రోజులు నెమ్మదిగా గడుస్తున్నాయి. సల్మాన్తో కలిసి తిరగడం వల్ల ప్రముఖులతో పరిచయాలు, భారీ పార్టీలు, ఖరీదైన గిఫ్టులు, బ్రాండెడ్ దుస్తులు.. ఇలా తన జీవితంలో ఎన్నడూ చూడని మార్పును చూస్తున్నాడు పాటిల్. సల్మాన్ను చూడాలని ఉందనే తన స్నేహితుల కోరికా కాదనేవాడు కాదు. ఎలాగోలా వారు సూపర్స్టార్ని కలిసేలా చేసేవాడు. దీంతో బంధుమిత్రుల దగ్గర పరపతినీ పెంచుకున్నాడు. అలా జీవితం కొన్నాళ్లు సాఫీగానే సాగింది. కానీ, 2002 సంవత్సరం పాటిల్ జీవితంపై కోలుకోలేని దెబ్బ కొట్టింది. సెప్టెంబర్ 28 అర్ధరాత్రి రోడ్డు పక్కన నిద్రిస్తున్న ఐదుగురి మీదుగా సల్మాన్ఖాన్కు చెందిన టయోటా ల్యాండ్ క్రూజర్ వెళ్లిపోయింది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి మరణించగా మిగిలినవారు గాయపడ్డారు. అయితే, ఆ సమయంలో కారు వెనక సీటులో కూర్చున్న రవీంద్ర పాటిల్.. ప్రమాదానికి కారణం సల్మాన్ ఖాన్ తప్పతాగి డ్రైవ్ చేయడమేనని పేర్కొన్నాడు. తాను వద్దని వారిస్తున్నా, వినకుండా వేగంగా కారు నడిపాడని.. ఫలితంగా ప్రమాదం సంభవించిదనీ సమీప పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా చేశాడు. ఇదే అతడి జీవితాన్ని తలకిందులు చేసింది. సల్మాన్ లాంటి హై ప్రొఫైల్ వ్యక్తికి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పినందుకు పోలీస్ డిపార్ట్మెంట్ నుంచీ, వెలుపలి నుంచీ పాటిల్ తీవ్ర ఒత్తిడి ఎదుర్కోవాల్సి వచ్చింది. ఉద్యోగంలో ఉన్నతాధికారుల వేధింపులు తాళలేకపోయాడు. కేసును ఉపసంహరించుకోవాల్సిందిగా ఎవరెన్ని చెప్పినా దానికి అంగీకరించలేదు. ఒకరోజు ఎవరికీ చెప్పకుండా అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. అలా అదశ్యం కావడంతో కేసు విచారిస్తున్న న్యాయస్థానం పాటిల్పై అరెస్టు వారెంట్ జారీ చేసింది. దీంతో, 2006లో మహాబలేశ్వరంలో పోలీసుల చేతికి చిక్కి జైలు ఊచలు లెక్కపెట్టాడు. తర్వాత బెయిల్పై విడుదలైనా కుటుంబ సభ్యులు అతడిని ఆదరించలేదు. భార్య విడాకులు తీసుకుంది. ఎక్కువ కాలం విధులకు హాజరు కాలేదంటూ పోలీస్ శాఖ పాటిల్ను ఉద్యోగం నుంచి తప్పించింది. దీంతో, ముంబై వీధుల్లో బిచ్చమెత్తుకునే స్థితికి దిగజారాడు. మరోవైపు, అతడిని క్షయ వ్యాధి పట్టిపీడించింది. ఈ దశలో 2007లో బిచ్చమెత్తుకున్న డబ్బుతోనే ఆసుపత్రికి చేరాడు. అక్కడే అక్టోబర్ 4న కన్నుమూశాడు. తాను చనిపోవడానికి రెండ్రోజుల ముందు కలిసిన స్నేహితుడితో..,‘‘ఆ ప్రమాదం నా జీవితాన్ని సర్వనాశనం చేసింది’’ అని వ్యాఖ్యానించాడు. చివరి వరకూ ఒకే మాటపై నిలబడిన ఆ కానిస్టేబుల్ తుదిశ్వాస వరకూ న్యాయం జరుగుతుందనే భావించాడు! -
హిట్ అండ్ రన్ కేసు: ఇద్దరు మృతి
తిరునెల్వలి: హిట్ అండ్ రన్ కేసులో ఇద్దరు యువకులు మృతిచెందారు. ఈ ఘటన తమిళనాడులో నాగనూర్కు 25 కిలోమీటర్ల దూరంలో తిరునెల్వలి ప్రాంతంలో ఆదివారం చోటుచేసుకుంది. బైక్పై వెళుతున్న ఇద్దరు యువకులను ఎదురుగా వస్తున్న ఓ గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. విజయనారాయణ గ్రామం నుంచి బైక్పై తిరిగివస్తుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో ఎస్. పరమశివన్ (18), సుదలిముత్తు (17) అనే ఇద్దరు యువకులు అక్కడిక్కడే మృతిచెందినట్టు పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదానికి కారణమైన వాహనాన్ని గుర్తించేందుకు గాలింపు చర్యలు చేపట్టినట్టు పోలీసులు వెల్లడించారు. -
ఆ రోజు కారును నేను నడపలేదు: సల్మాన్
ఢిల్లీ: ప్రముఖ బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ఖాన్ హిట్ అండ్ రన్ కేసులో బుధవారం సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేశాడు. ఈ కేసు విషయంలో సల్మాన్ వివరణ ఇచ్చుకున్నాడు. తాను ఆ రోజు రాత్రి కారును నడపలేదని, డ్రైవరే కారును నడపినట్టు తెలిపాడు. కారు డ్రైవర్ స్టేట్మెంట్ను పోలీసులు రికార్డ్ చేయలేదని చెప్పాడు. కాగా, 2002లో ముంబైలోని బాంద్రా ప్రాంతంలో ఫుట్ పాత్ పై నిద్రిస్తున్నవారిపై నుంచి సల్మాన్ కారు నడపడంతో ఒ వ్యక్తి మరణించగా, మరో నలుగురికి గాయాలయ్యాయి. ఆ సమయంలో సల్మాన్ మోతాదుకు మించి మద్యం సేవించాడని రుజువైన కారణంగా ముంబై సెషన్స్ కోర్టు అతడికి ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. -
సల్మాన్కు సుప్రీం కోర్టు నోటీసు
న్యూఢిల్లీ: హిట్ అండ్ రన్ కేసులో బాలీవుడ్ నటుడు సల్మాన్ఖాన్ నిర్దోషిత్వాన్ని సవాలు చేస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం వేసిన అప్పీలుపై స్పందన తెలపాలని సుప్రీం కోర్టు ఆయనను ఆదేశించింది. ‘సర్వోన్నత న్యాయస్థానంలో నిర్దోషిగా తేలడం ముఖ్యం. అదే చివరి నిరూపణ అవుతుంది’ అని పేర్కొంది. -
‘సల్మాన్ తాగి నడిపారు’
న్యూఢిల్లీ: 2002 నాటి హిట్ అండ్ రన్ కేసులో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్.. మద్యం తాగి వాహనం నడిపారని మహారాష్ట్ర సర్కారు సుప్రీంకోర్టుకు నివేదించింది. కేసులో సల్మాన్కు బాంబే హైకోర్టు క్లీన్ చిట్ ఇవ్వటంపై సుప్రీంలో సవాల్ చేసిన సర్కారు.. శుక్రవారం సుప్రీంకోర్టులో వాదనలు వినిపించింది. ప్రభుత్వం తరపున వాదించిన అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ.. ఘటన జరిగిన రోజు సల్మాన్ వాహనం నడుపగా.. ఆయన డ్రైవర్ వెనకాల సీట్లో ఉన్నారన్నారు. హైకోర్టు తీర్పుకు హేతుబద్ధత లేదని.. న్యాయ వ్యవస్థను అవహేళన చేసినట్లుందన్నారు. కేసు విచారణను కోర్టు ఈ నెల 12కు వాయిదా వేసింది. -
సల్మాన్ ను వెంటాడుతున్న 'హిట్ అండ్ రన్'
న్యూఢిల్లీ: బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ఖాన్ను హిట్ అండ్ రన్ కేసు వీడని నీడలా వెంటాడుతోంది. సుప్రీంకోర్టులో సల్మాన్ కు వ్యతిరేకంగా దాఖలయిన పిటిషన్ నేడు విచారణకు రానుంది. ఈ కేసులో సల్మాన్కు వ్యతిరేకంగా మహారాష్ట్ర ప్రభుత్వం గత నెల 22న సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేసింది. సల్మాన్ ను నిర్దోషిగా ప్రకటిస్తూ గతంలో బొంబాయి హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం ఈ పిటిషన్ దాఖలు చేసిన విషయం అందరికీ విదితమే. 13 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ అనంతరం హిట్ అండ్ రన్ కేసులో బొంబాయి హైకోర్టు సల్మాన్ఖాన్ను నిర్దోషిగా ప్రకటించి విడుదల చేసింది. ఈ కేసుకు సంబంధించి ఆయనపై ఉన్న అన్ని అభియోగాలనూ హైకోర్టు తోసిపుచ్చింది. అంతకుముందు సెషన్ కోర్టు ఆయనను దోషిగా ప్రకటించి ఐదేళ్ల జైలుశిక్ష విధించింది. దీనిపై ఆయన బొంబాయి హైకోర్టును ఆశ్రయించడంతో ఊరట లభించింది. హిట్ అండ్ రన్ మొదలైందిలా... 2002 సెప్టెంబర్ 28 అర్ధరాత్రి ఒక బార్లో మద్యం సేవించి, మితిమీరిన వేగంతో డ్రైవింగ్ చేస్తూ సల్మాన్ బాంద్రా శివార్లలో పేవ్మెంట్పై పడుకున్న వారిపై వాహనంతో దూసుకెళ్లాడని, ఆ ఘటనలో ఒక వ్యక్తి చనిపోగా, మరో నలుగురు తీవ్ర గాయాల పాలయ్యారన్న ఆరోపణలతో ఈ బాలీవుడ్ నటుడిపై కేసు నమోదైంది. -
'బెయిల్ ఇవ్వడం కుదరదు.. 30 వరకు కస్టడీలోనే'
కోల్ కతా: ఫుల్లుగా తాగి నిర్లక్ష్యంగా కారు నడిపి యువ మిలటరీ అధికారిని ఢీకొట్టిన కేసులో నిందితులకు బెయిలిచ్చేందుకు కోర్టు నిరాకరించింది. వారిని ఈ నెల(జనవరి) 30 వరకు పోలీసుల కస్టడీకి అనుమతినిచ్చింది. రిపబ్లిక్ డేను పురస్కరించుకొని ఈ నెల 13న రెడ్ రోడ్డు ఏరియాలో వైమానిక దళ సైనికులు రిహార్సల్స్ చేస్తుండగా సాంబియా సోహ్రాబ్, సోనూ అలియాస్ షానవాజ్ ఖాన్ వేగంగా ఆడి కారులో వెళుతూ అభిమన్యు గౌడ్ అనే సైనికుడిని ఢీకొట్టారు. అనంతరం అక్కడి నుంచి పారిపోయారు. దీంతో కోల్ కతా పోలీసులు ఢిల్లీ పోలీసుల సహాయంతో వారిని ఒక్కొక్కరిగా అదుపులోకి తీసుకొని కోర్టులో హాజరుపరిచారు. ఈ సందర్భంగా నిందితులు బెయిల్ పిటిషన్ పెట్టుకోగా కోర్టు బెయిలిచ్చేందుకు నిరాకరించింది. వీరిలో సాంబియా ఆర్జేడీ మాజీ ఎమ్మెల్యే మహ్మద్ సోహ్రాబ్ కుమారుడు. వీరిపై హత్య, నేరపూరిత కుట్ర, సాక్ష్యాలను మాయం చేయాలని ప్రయత్నించడం, హానీ కలిగించడంవంటి ఆరోపణల పేరిట కేసులు నమోదు చేశారు. -
హిట్ అండ్ రన్ కేసులో మరొకరి అరెస్ట్
కోల్ కతా: పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్ కతాలో సంచలనం సృష్టించిన హిట్ అండ్ రన్ కేసులో మరొకరిని పోలీసులు అరెస్ట్ చేశారు. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నేత కుమారుడు సాంబియా సోహ్రాబ్ స్నేహితుడు సోనూను కోల్ కతా పోలీసు విభాగానికి చెందిన ఎస్టీఎఫ్ అధికారులు ఆదివారం రాత్రి ఢిల్లీలో అదుపులోకి తీసుకున్నారు. ఈ నెల 13న సాంబియా, అతడి మిత్రులు ఆడీ కారుతో వైమానిక దళ అధికారి అభిమాన్యు గౌడ్(21) ఢీకొట్టి పారిపోయారు. రిపబ్లిక్ డే పరేడ్ ప్రాక్టీస్ లో పాల్గొన్న ఆ అధికారి ప్రాణాలు కోల్పోయారు. శనివారం రాత్రి సాంబియాను పోలీసులు పట్టుకున్నారు. ఆదివారం అతడిని కోర్టులో హాజరుపరిచారు. అతడికి బెయిల్ ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. ఈ నెల 30 వరకు పోలీసు కస్టడీకి పంపింది. కాగా, ప్రమాదం జరిగిన సమయంలో సాంబియా, అతడి స్నేహితులు మద్యం సేవించివున్నారని పోలీసులు గుర్తించారు. -
విజయపథాన సల్మాన్ ఖాన్
ముంబై: ఈ ఏడాదంతా బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్కు మంచి రోజులే. ఆయన నటించిన ‘బజరంగీ భాయ్జాన్’ చిత్రం బాక్సాఫీస్ వద్ద 300 కోట్ల రూపాయలను వసూలు చేసింది. ఇటీవలే విడుదలైన ‘ప్రేమ్ రతన్ ధన్ పాయో’ చిత్రం 200 కోట్ల రూపాయలను వసూలు చేసింది. 2002 నుంచి కార్ యాక్సిడెంట్ కేసులో దోషిగా ఎదుర్కొంటున్న ఆరోపణల నుంచి బయటపడడం మామూలు విజయం కాదు. డిసెంబర్ 27వ తేదీన 50వ పుట్టిన రోజును జరుపుకుంటున్న సల్మాన్ ఖాన్కు ఇంతకన్నా పెద్ద గిఫ్ట్ ఎవరివ్వగలరు! కారు యాక్సిడెంట్ కేసులో సల్మాన్ ఖాన్ నిర్దోషి అంటూ బాంబే హైకోర్టు గురువారం తీర్పు ఇచ్చిన విషయం తెల్సిందే. దీన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేస్తామంటూ మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం వేరే విషయం. ప్రస్తుతానికి కోర్టు కేసులో విజయం ఆయనదే. అచ్చం ఆయన డిక్టేట్ చేసిన స్క్రిప్ట్లాగా ఈ ఏడాది ఆయనకు గడచిపోతోంది. 1990 దశకంలో బాలీవుడ్ బ్యాడ్ బాయ్గా ముద్రపడిన సల్మాన్ ఖాన్ క్రమక్రమంగా నిజమైన హీరోగా, గుడ్ బాయ్గా అభిమానుల మెప్పు సంపాదించడం సాధారణ విషయమేమి కాదు. బాలీవుడ్ కండల వీరుడిగా అస్తమానం అమ్మాయిలతో గొడవ పడడం, మద్యం మత్తులో ఎవరిపై పడితే వారిపై చేయి చేసుకుంటూ మీడియాలో సంచలనం సృష్టిస్తూ కారు యాక్సిడెంట్ కేసులో ఇరుక్కొని పూర్తిస్థాయి బ్యాడ్ బాయ్గా ముద్రపడిన విషయం తెల్సిందే. కారు యాక్సిడెంట్ నుంచి వచ్చిన గుణపాఠమో లేక ఆయన విధేయ మేనేజర్ రేష్మ శెట్టిలాంటి వారి సలహాలు, సూచనలు బుద్ధిగా పాటిస్తూ రావడమో స్పష్టంగా తెలియదుగానీ తనదైన నడతను మార్చుకుంటూ వచ్చి ప్రస్తుతం లక్షలాది అభిమానులకు ప్రేమ పాత్రుడయ్యారు. -
హిట్ అండ్ రన్ కేసులో సల్మాన్కు ఊరట
-
సల్మాన్ భవిష్యత్తేమిటో... ఈ వారమే తేలనుంది!
ముంబై: హిట్ అండ్ రన్ కేసులో బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ భవిషత్తేమిటో ఈ వారం తేలనుంది. 2002నాటి ఈ కేసులో సల్మాన్ ఖాన్ కు ఐదేళ్ల జైలు శిక్ష పడిన సంగతి తెలిసిందే. ఈ శిక్షను సవాలు చేస్తూ ఆయన దాఖలుచేసిన అప్పీలుపై బొంబాయి హైకోర్టు ఈ వారంలోనే తీర్పు ఇవ్వనుంది. ఈ కేసులో వాదనలు ఆదివారంతో ముగిశాయి. సోమవారం నుంచి తీర్పు డిక్టేషన్ ను ప్రారంభిస్తానని న్యాయమూర్తి ఏఆర్ జోషీ తెలిపారు. 2002లో తాగి వాహనం నడిపి పేవ్ మెంట్ మీద పడుకున్న ఓ వ్యక్తిని ఢీకొని.. అతని మరణానికి కారణమైనట్టు సల్మాన్ ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. ఈ కేసులో 49 ఏళ్ల సల్మాన్ కు సెషన్ కోర్టు ఐదేళ్ల జైలుశిక్ష విధించింది. ఐపీసీ ప్రకారం అతనిపై పలు అభియోగాలు రుజువైనట్టు కింది కోర్టు పేర్కొంది. ఈ తీర్పుపై సల్మాన్ బొంబాయి హైకోర్టును ఆశ్రయించగా.. న్యాయస్థానం వాదనలు వినడానికి ముందే ఆయనకు బెయిల్ మంజూరుచేసింది. 2002 సెప్టెంబర్ 28న 'రాణి బార్ అండ్ రెస్టారెంట్'లో మద్యాన్ని సేవించిన సల్మాన్ టయోటా లెక్సెస్ కారును స్వయంగా నడుపుతూ ఓ షాపులోకి దూసుకెళ్లాడని, దీంతో ఒక వ్యక్తి మరణించగా.. నలుగురు గాయపడ్డారని ప్రాసిక్యూషన్ వాదిస్తుండగా.. ఆ సమయంలో కారు నడిపింది సల్మాన్ కాదు ఆయన కుటుంబ డ్రైవర్ అమిత్ దేశాయ్ అని సల్మాన్ తరఫు న్యాయవాది పేర్కొంటున్నారు. -
'ఆ హీరోకు ఐదేళ్లు జైలుశిక్ష వేయడం కరెక్టే'
ముంబై: హిట్ అండ్ రన్ కేసులో బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్కు సెషన్స్ కోర్టు ఐదేళ్లు జైలు శిక్ష విధించడం సబబేనని, అతను నేరం చేసినట్టు నిరూపితమైందని బాంబే హైకోర్టులో పబ్లిక్ ప్రాసిక్యూటర్ సందీప్ షిండే వాదించినట్టు సమాచారం. జాతీయ మీడియాలో వచ్చిన కథనం ప్రకారం.. నిందితుడు సల్మాన్ ఖాన్పై ఎలాంటి కనికరం చూపాల్సిన అవసరం లేదని, కింది కోర్టు విధించిన శిక్షను అమలు చేయాలని సందీప్ షిండే హైకోర్టును కోరారు. 2002 నాటి హిట్ అండ్ రన్ కేసులో సల్మాన్ ఖాన్ను దోషిగా పేర్కొన్న ముంబై సెషన్స్ కోర్టు అతడి ఐదేళ్ల జైలు శిక్షను ఖరారు చేయగా.. బాంబే హైకోర్టు ఆ తీర్పును రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసు విచారణ ప్రస్తుతం బాంబే హైకోర్టులో సాగుతోంది. కింది కోర్టు తీర్పును రద్దు చేయాలంటూ సల్మాన్ దాఖలు చేసిన పిటిషన్ను జస్టిస్ ఏ ఆర్ జోషి విచారిస్తున్నారు. కోర్టులో సందీప్ షిండే, ప్రాసిక్యూటర్ పూర్ణిమా కంథారియా తమ వాదనలు వినిపిస్తూ.. 'ప్రమాదం జరిగిన సమయంలో సల్మాన్ మద్యం సేవించాడు. ఆ మరుసటి రోజు వైద్య పరీక్షల కోసం అతడిని ఆస్పత్రికి తీసుకువచ్చినపుడు మద్యం తాగినట్టు వాసన వచ్చింది' అని కోర్టుకు తెలియజేసినట్టు సమాచారం. ప్రమాదం జరిగిన సమయంలో సల్మాన్ కారు డ్రైవర్ అశోక్ సింగ్ వాహనాన్ని నడుపుతున్నాడని, టైరు పేలడంతో వాహనం అదుపుతప్పి ఫుట్పాత్పైకి దూసుకెళ్లిందన్న సల్మాన్ తరపు న్యాయవాదుల వాదనను తోసిపుచ్చారు. ప్రమాద స్థలంలో సల్మాన్ ఉన్నాడని సందీప్ షిండే, పూర్ణిమా కంథారియా కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. -
సుప్రీంకోర్టులో సల్మాన్ ఖాన్కు ఊరట
న్యూఢిల్లీ: బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ కు మరో ఊరట లభించింది. హిట్ అండ్ రన్ కేసులో దోషిగా నిరూపితుడైన సల్మాన్ కు ముంబై హైకోర్టు మంజూరు చేసిన బెయిల్ ను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ ను సుప్రీంకోర్టు సోమవారం తిరస్కరించింది. హిట్ అండ్ రన్ కేసులో గడిచిన మే 8న ముంబై సెషన్స్ కోర్టు సల్మాన్కు ఐదేళ్ల జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే. శిక్షపడిన కొన్నిగంటల్లోనే ఆయన న్యాయవాదులు హైకోర్టును ఆశ్రయించడంతో మొదట రెండు రోజుల పాటు తాత్కాలిక బెయిల్ లభించింది. ఆతర్వాత బెయిల్ గడువును మరింతకాలం పొడిగించిన సంగతి విదితమే. -
హిట్ అండ్ రన్: తల్లినే చంపేశాడు
బీజింగ్: చైనాలో విషాదకర సంఘటన జరిగింది. హిట్ అండ్ రన్ కేసులో ఓ వ్యక్తి తల్లి ప్రాణాలు తీశాడు. తాను చేసిన యాక్సిడెంట్లో చనిపోయింది తల్లేనని ఆలస్యంగా తెలుసుకున్న నిందితుడు పోలీసులకు లొంగిపోయాడు. చైనాలో హుబీ ప్రావిన్స్లో ఓ వ్యక్తి తన కొడుకుతో కలసి మోటార్ సైకిల్పై అతివేగంగా వెళ్తూ ఇద్దరు మహిళలను ఢీకొట్టాడు. వారికి సాయం చేద్దామని కొడుకు చెప్పినా వినకుండా ఆ వ్యక్తి అక్కడి నుంచి పారిపోయాడు. తీవ్రంగా గాయడిపన ఇద్దరు మహిళల్లో ఒకరు ప్రమాద స్థలంలో మరణించగా, మరొకరు ఆస్పత్రిలో చనిపోయారు. అనంతరం నిందితుడికి అసలు విషయం తెలిసింది. హిట్ అండ్ రన్ లో ప్రాణాలు కోల్పోయిన ఇద్దరు మహిళల్లో తన తల్లి కూడా ఉందని తెలుసుకున్నాడు. మరుసటి రోజు పోలీస్ స్టేషన్కు వెళ్లి లొంగిపోయాడు. -
మరో 'హిట్ అండ్ రన్' దోషికి బెయిల్
న్యూఢిల్లీ: బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ తరువాత వేరొక హిట్ అండ్ రన్ కేసులో దోషిగా తేలిన వ్యక్తికి బెయిల్ లభించింది. బీఎండబ్ల్యూ కారుతో ఇద్దరిని ఢీకొట్టి పారిపోయిన ఘటనలో దోషిగా తేలిన గుజరాత్ వైద్యుడి కుమారుడు విస్మయ్ షాకు సోమవారం సుప్రీంకోర్టు బెయిల్ మంజురు చేసింది. విస్మయ్.. 2013లో బీఎండబ్ల్యూ కారుతో ఇద్దరిని ఢీకొట్టి పారిపోయాడు. కేసు నిరూపణ కావడంతో అతడికి స్థానిక కోర్టు అయిదేళ్ల జైలు శిక్ష, రూ.25వేల జరిమానా విధించింది. కారుతో ఢీ కొట్టడంతో ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు. మృతిచెందిన వారి కుటుంబాలకు రూ.5లక్షల చొప్పున నష్టపరిహారం చెల్లించాల్సిందిగా కోర్టు ఆదేశించింది. విస్మయ్ తండ్రి అమిత్షా అహ్మదాబాద్లో కంటి వైద్య నిపుణులు. నిన్న సల్మాన్, ఇవాళ విస్మయ్.. ఇలా దోషులకు వరుసగా బెయిల్ లభిస్తుండటం సర్వత్రా చర్చనీయాంశమైంది. -
తుది అంకానికి సల్మాన్ ఖాన్ కేసు
-
సల్మాన్ బెయిల్ రద్దు చేయండి
ముంబై: 1993 ముంబై పేలుళ్ల దోషి యాకుబ్ మెమన్ ఉరిశిక్షకు వ్యతిరేకంగా బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ చేసిన ట్వీట్లపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. వెంటనే హిట్ అండ్ రన్ కేసులో ఆయన బెయిల్ను రద్దు చేయాలని డిమాండ్ చేసింది. ఈ విషయంలో వెంటనే జోక్యం చేసుకొని సల్మాన్ బెయిల్ను రద్దు చేసేలా చూడాలంటూ ముంబై బీజేపీ అధ్యక్షుడు ఆశిష్ షెలార్ మహారాష్ట్ర గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్రావుకు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆశిష్ మీడియాతో మాట్లాడుతూ ఓ దోషికి సల్మాన్ మద్దతు తెలపడం తనను తీవ్రంగా బాధపెట్టిందని, ఒక నేరానికి మద్దతు తెలిపిన ఆయన బెయిల్ రద్దు చేయాలని గవర్నర్కు లేఖ ఇచ్చినట్లు స్పష్టం చేశారు. యాకూబ్ మెమన్ పెద్ద సంఖ్యలో మారణ హోమానికి పాల్పడ్డారని చెప్పారు. ఇదిలా ఉండగా, సల్మాన్ నివాసం ముందు బీజేపీ యువజన విభాగం బీజేపీ యువ మోర్చా ఆందోళన నిర్వహిస్తోంది. -
సుప్రీంకోర్టుకు సల్మాన్ బెయిల్ పంచాయితీ
న్యూఢిల్లీ: బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కు హిట్ అండ్ రన్ కేసులో మంజూరైన బెయిల్ ను రద్దు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్ ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. గత రెండు నెలల క్రితం సల్మాన్ కు బాంబే హైకోర్టు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. అయితే దీన్ని సవాల్ చేస్తూ ఇటీవల దాఖలైన పిటిషన్ పై విచారణ చేపట్టేందుకు మంగళవారం సుప్రీం అంగీకారం తెలిపింది. సల్మాన్ కు హిట్ అండ్ రన్ కేసులో కింది కోర్టు విధించిన ఐదేళ్ల జైలు శిక్షను బాంబే హైకోర్టు సస్పెండ్ చేస్తూ.. సల్మాన్ కు బెయిల్ మంజూరు చేసింది. -
సల్మాన్ కేసు 13కు వాయిదా
ముంబై: ‘హిట్ అండ్ రన్’ కేసులో పడిన ఐదేళ్ల జైలుశిక్షను సవాలు చేస్తూ బాలీవుడ్ నటుడు సల్మాన్ఖాన్ దాఖలు చేసిన అప్పీలు విచారణను బాంబే హైకోర్టు జూలై 13కు వాయదా వేసింది. సల్మాన్ న్యాయవాది అమిత్ దేశాయ్ విజ్ఞప్తి మేరకు కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. ‘పేపర్బుక్’ (ఆధారాలు, పత్రాల నివేదిక)ను ఇరుపక్షాలకు కోర్టు ఇదివరకే అందజేసింది. అయితే డాక్యుమెంట్లు సరిగ్గా ఉన్నాయో లే దో సరిచూసుకోడానికి మూడువారాల గడువు ఇవ్వాలని కోర్టుకు అమిత్ విజ్ఞప్తి చేశారు. డాక్యుమెంట్లలో ఏవైనా వేరే భాషల్లో ఉంటే వాటిని ఇంగ్లిష్లోకి అనువదించుకోవాల్సి ఉంటుందని కోర్టుకు తెలిపారు. ఆధారాలు పోగొట్టుకు పోయాయేమో సరిచూసుకోవాల్సి ఉంటుందని చెప్పారు. దీనిపై స్పందించిన జస్టిస్ ఏఆర్ జోషీ.. డాక్యుమెంట్లను సరిచేసుకునేందుకు జూలై 13 వరకు గడువిచ్చారు. -
'సల్మాన్ కేసు పేపర్లు కాలిపోయాయి'
ముంబై:ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆర్టీఐ(సమాచారహక్కు చట్టం) నిర్వీర్యం అవుతోందా?, సమాచార హక్కు చట్టం ప్రభుత్వ నిర్లక్ష్యానికి గురవుతోందా? అంటే అవుననే పరిస్థితులే కనిపిస్తున్నాయి. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ హిట్ అండ్ రన్ కేసులో కీలకమైన సమాచారం అగ్గిపాలు అయిందంటూ అధికారులు ఇచ్చిన సమాధానం ఇందుకు మరింత బలాన్నిస్తుంది. ఇటీవల ఆ కేసుకు సంబంధించిన ముఖ్యమైన సమాచారాన్ని తెలుసుకునేందుకు ఆర్టీఐ ఉద్యమ కారుడు మన్సూర్ దర్వేష్ దాఖలు చేసుకున్న పిటిషన్ కు .. ఆ పేపర్లు కాలిపోయాయని ప్రభుత్వం నుంచి వచ్చిన సమాధానం ఆందోళన కలిగిస్తోంది. 2002 నాటి సల్మాన్ ఖాన్ హిట్ అండ్ రన్ కేసులో ప్రభుత్వం నుంచి నియమితులైన న్యాయ సలహాదారులు, న్యాయవాదులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ తదితర వివరాలను తెలుసుకునేందుకు దర్వేష్ పిటిషన్ దాఖలు చేసుకున్నాడు. అయితే ఆ కేసుకు సంబంధించి తమ దగ్గర ఎటువంటి సమాచారం అందుబాటులో లేదని.. జూన్ 21, 2012న సచివాలయంలో సంభవించిన అగ్నిప్రమాదంలో సల్మాన్ కేసు పేపర్లు బూడిద అయిపోయాయని ఆర్టీఐ అధికారులు సమాధానం ఇచ్చారు. దీనిపై దర్వేష్ మండిపడుతున్నాడు. ఎటువంటి అవతవకలు లేకండా ఆ కేసు దర్యాప్తు జరుపుతామని ప్రభుత్వం ప్రజలకు ముందు హామీ ఇచ్చిన సంగతిని ఆయన గుర్తు చేశారు. ఆ కేసు విచారణ నిష్పక్షపాతంగా జరగాలంటే ప్రభుత్వం తిరిగి ఆ ఫైల్స్ ను పునరుద్ధరించాలని దర్వేష్ విజ్ఞప్తి చేశాడు. -
సల్మాన్ కేసులో అనేక అనుమానాలు
- కమాల్ వాంగ్మూలంలో కీలక అంశాలు - సల్మాన్ ఇరకాటంలో పడే అవకాశం సాక్షి, ముంబై: హిట్ అండ్ రన్ కేసులో మరో ప్రత్యక్ష సాక్షి, గాయకుడు కమాల్ ఖాన్ పోలీసు స్టేషన్లో ఇచ్చిన వాంగ్మూలంలో అనేక కీలక అంశాలు వెలుగుచూశాయి. సల్మాన్ ఖాన్కు బెయిల్ లభించడంలో కీలక పాత్ర పోషించిన డిఫెన్స్ లాయర్ కమాల్ ఖాన్ ఎందుకు విచారించలేదని, ఆయన సాక్ష్యం ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. అయితే ముంబై పోలీసుల వద్ద కమాల్ ఖాన్ చెప్పిన సాక్ష్యం ఉందని తెలిసింది. ముంబై పోలీసులకు కమాల్ ఖాన్ లిఖిత పూర్వకంగా తెలిపిన వివరాల్లో అనేక విషయాలు భిన్నంగా ఉన్నాయి. ఆయన చెప్పిన సాక్ష్యంతో సల్మాన్ ఖాన్ ఇరకాటంలో పడే అవకాశాలు కన్పిస్తున్నాయి. ప్రమాదం జరిగిన సమయంలో కారులో సల్మాన్తోపాటు బాడీగార్డు రవీంద్ర పాటిల్, తాను ఉన్నానని కమాల్ పేర్కొన్నారు. కారు నడిపింది సల్మాన్: కమాల్ ‘2002 సెప్టెంబరు 27న రాత్రి నేను సల్మాన్ కలిసేందుకు ఆయన ఇంటికి వెళ్లాను. అక్కడ డిన్నర్ చేయాలన్న ప్లాన్ చేశాం. సల్మాన్ ఖాన్తోపాటు ఆయన బాడిగార్డు, నేను ల్యాండ్ క్రూజర్ కారులో జుహూ నుంచి రైన్ హోటల్ కు వెళ్లాం. సల్మాన్ ఖాన్ సోదరుడు సోహెల్తోపాటు బాడిగార్డు మరో కారులో అక్కడికి వచ్చారు. రాత్రి 11 గంటలకు అక్కడికి చేరాం. సల్మాన్,సోహైల్, నేను సర్వీసు కౌంటర్ వద్ద స్నాక్స్ తీసుకున్నాం. రెండు గంటల తర్వాత మేము తెలుపు రంగు ల్యాండ్ క్రూజర్ కారులో జెడబ్ల్యూ మెరియట్ హోటల్కు చేరుకున్నాం. అక్కడ కొంతసేపు ఉన్నతర్వాత అక్కడి నుంచి బయలుదేరాం. సల్మాన్ ఖాన్ డ్రైవ్ చేయసాగాడు. ఆయన పక్కన సీట్లో బాడిగార్డు కూర్చున్నాడు. నేను డ్రైవర్ వెనుకాల సీట్లో కూర్చున్నాను. మేము ఇంటివైపు వెళ్తూ ఉన్నాం. సెయింట్ అండ్రూస్ రోడ్డుపై నుంచి హిల్ రోడ్డు వరకు వచ్చాం. అక్కడ ఓ రైట్ టర్న్ తీసుకుంటుండగా సల్మాన్ కారు కంట్రోల్ కాలేదు. కారు ఓ భవనం వద్ద ఫుట్పాత్పైకి ఎక్కి భవనంలోకి దూసుకెళ్లింది. అదే సమయంలో అరుపులు విన్నాం. కారు దగ్గర ప్రజలు గుమిగూడారు. సల్మాన్ బయటికి రా అంటూ కొందర అరుస్తున్నారు. కొందరు గాయలైనవారికి సాయం చేస్తున్నారు. ఎప్పుడైతే మేము కారులో నుంచి దిగామో అప్పుడు కొందరు మా వద్దకి వచ్చి తోయసాగారు. సల్మాన్ ఖాన్ బాడిగార్డు అక్కడున్నవారికి నేను పోలీసునని చెప్పడంతో జనం కొంత శాంతించారు. ఈ సమయంలో నా సెల్ ఫోన్ కిందపడిపోయింది. నేను సల్మాన్ ఖాన్ ఇంటివైపు పరుగెత్తి వాచ్మెన్ను పిలిచాను. సల్మాన్ ఖాన్ కారు ప్రమాదానికి గురైందని సోహెల్ ఖాన్కు ఫోన్ చేయమని చెప్పాను. సోహెల్ ఖాన్కు ఈ విషయం చెప్పిన అనంతరం నేను కొంత సమయం వాచ్మెన్ కుర్చీలో కూర్చున్నాను. అనంతరం నేను ఇంటికి ఆ తర్వాత అక్కడి నుంచి లోనవాలా వెళ్లాను.’ అని కమాల్ తన వాంగ్మూలంలో పేర్కొన్నాడు. బెయిల్పై అనేక అనుమానాలు హిట్ అండ్ రన్ కేసులో బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్కు బెయిల్ లభించిన తీరుపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బెయిలు మంజూరుకోసం కారణాలను ృసష్టించారా అనే అనుమానాన్ని ముంబై సేషన్స్ కోర్టు ప్రభుత్వ న్యాయవాది ప్రదీప్ ఘరాత్ వ్యక్తం చేశారు. ముంబై సెషన్స్ కోర్టులో న్యాయమూర్తి ఇచ్చిన తీర్పు కాపీ అందకపోవడంతో తాత్కాలికంగా రెండు రోజుల బెయిల్ను హై కోర్టు మంజూరు చేసిన సంగతి తెలిసిందే. కాని ముంబై సేషన్స్ కోర్టు న్యాయమూర్తి దేశ్పాండే ప్రకటించిన తీర్పును టైప్ చేసే సమయంలో కోర్టులో విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని ప్రదీప్ ఘరాత్ మీడియాకు తెలిపారు. సల్మాన్ ఖాన్ కేసులో తీర్పును టైప్ చేసే సమయంలో రెండు గంటలపాటు విద్యుత్ సరఫరా నిలిచిపోవడంపై పలు అనుమానాలకు తావిస్తోందని ఆయన అన్నారు. ముంబైలో సాధారణంగా విద్యుత్ సరఫరా నిలిచిపోవడం అరుదని అన్నారు. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో తీర్పును టైప్ చేయడంలో జాప్యమయిందని, తద్వారా బెయిల్ లభించేందుకు సల్మాన్ ఖాన్కు అవకాశం లభించిందని ఘరాత్ చెప్పడం విశేషం. -
ఇంటికి చేరుకున్న సల్మాన్
-
సల్మాన్ కు బెయిల్
-
ఇంటికి చేరుకున్న సల్మాన్
ముంబై: హిట్ అండ్ రన్ కేసులో బాంబే హైకోర్టు నుంచి బెయిల్ పొందిన బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ సెషన్స్ కోర్టు ఫార్మాలటీస్ అన్నింటినీ పూర్తి చేసి శుక్రవారం సాయంత్రం ఇంటికి చేరుకున్నాడు. సల్మాన్ రూ.30 వేల పూచీకత్తుతో పాటు, పాస్ పోర్టును కూడా సెషన్స్ కోర్టుకు సమర్పించారు. తొలుత ఈరోజు హైకోర్టులో కేసు విచారణ జరిగే సమయంలో సల్మాన్ వ్యక్తిగతంగా హాజరుకాలేదు. విచారణ సమయంలో ఆయన బాంద్రాలోని ఇంట్లో ఉన్నారు. అయితే బెయిల్ మంజూరు కావడంతో సెషన్స్ కోర్టుకు సల్మాన్ హాజరయ్యాడు. అంతకుముందు ముంబై సెషన్స్ కోర్టు సల్మాన్ ఖాన్ కు ఐదేళ్ల జైలుశిక్ష విధించిన సంగతి తెలిసిందే. దీనిపై బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన సల్మాన్ కు హైకోర్టులో ఉపశమనం లభించింది. దీంతోపాటు సెషన్స్ కోర్టు తీర్పును కూడా హైకోర్టు సస్పెండ్ చేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఏ ఎం తిప్సే ఈ మేరకు ఉత్తర్వులు జారీచేశారు. వ్యక్తిగత పూచీకత్తుతో పాటు 30 వేల రూపాయల బాండ్ సమర్పించాల్సిందిగా సల్మాన్ ను ఆదేశించారు. సల్మాన్ తరపున సీనియర్ న్యాయవాది అమిత్ దేశాయ్ వాదనలు వినిపించారు. -
సల్మాన్.. ఎప్పటిదాకా ఈ రన్...
హిట్ అండ్ రన్...హిట్కు ఎన్నో కారణాలుండొచ్చు. రక్తంలో మద్యం మత్తు ఎక్కువైతే 'హిట్' జరుగొచ్చు. రక్తంలో మానవత్వం ఆనవాళ్లు లేకపోతే, మదాంధకారం ఎక్కువైతేనే 'రన్'. అవినీతి వ్యవస్థ అండగా నిలుస్తోందన్న విశ్వాసం ఉంటే... అర్థ, అంగబలంతో బయటపడొచ్చని అర్థం చేసుకుంటే 'రన్'... హిట్ అండ్ రన్ కేసులో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ మొదటిసారి యాక్సిడెంట్ జరిగిన రోజున 'రన్' (పారిపోయాడు), అవినీతి వ్యవస్థను ఆసరా చేసుకొని గత 13 ఏళ్లుగా 'రన్'.... నేను కూడా 'హిట్ అండ్ రన్' కేసులో బాధితుడినే. 1998లో నాకు పెళ్లయింది. నా భార్య గర్భవతి. అదే సంవత్సరం అక్టోబర్ నెలలో ఓ రోజు, మధ్యాహ్నం 2 గంటల సమయం... నేను ఆటోలో వెళ్తున్నాను. సల్మాన్ ఖాన్ యాక్సిడెంట్ చేసిన ఆమెరికన్ ఎక్స్ప్రెస్ బేకరీకి దగ్గరిలోనే ఉన్నాను. ఇంతలో ర్యాష్గా వచ్చిన ఓ కారు నేను ప్రయాణిస్తున్న ఆటోను బలంగా ఢీకొంది. ఆటో తలకిందులైంది. ఆటో కింద నా కాలు చిక్కుకుపోవడం వల్ల కాలు నుజ్జునుజ్జు అయింది. కారు డ్రైవర్ సీటులో నుంచి ఓ యువతి, ఆమెతోపాటు ఆమె స్నేహితురాలు దిగారు. కాకతాళీయంగా ఆ యువతి పాలీహిల్లో ఉంటున్న ఓ సినీ ప్రముఖుడి కూతురు. నా పరిస్థితిని చూసి వెంటనే ఆ యువతి కారెక్కి పారిపోయింది. నుజ్జునుజ్జయిన నా కాలు నుంచి రక్తం చిమ్ముతోంది. నన్ను చూసిన బాటసారులకు నాకు ఎలా సాయం చేయాలో అర్థం కాలేదు. ఇంతలో రెండు బలమైన చేతులు వచ్చి నన్ను పసిపిల్లాడిలా ఎత్తుకొని, తన కారులో కూర్చోబెట్టుకున్నాయి. నేను చచ్చిపోతానా? అని ఆ బలమైన చేతుల ఆసామిని అడిగాను. ఏం చావవంటూ భరోసా ఇచ్చాడు. నన్ను సమీపంలోని ఆస్పత్రిలో చేర్చి, నా ద్వారా ఇంటి ఫోన్ నెంబర్ తీసుకొని ఇంటికి ఫోన్ చేసి విషయం చెప్పాడు. ఆ తర్వాత ఆ ఆసామి తన దారిన తాను వెళ్లిపోయాడు. నా కాలుకు ఆ రోజంతా ఆపరేషన్ చేశారట. మర్నాడు యాక్సిడెంట్కు గురైన ఆటో డ్రైవర్ వచ్చి నన్ను పలకరించాడు. అదృష్టవశాత్తు ఆ యాక్సిడెంట్లో ఆయనకు పెద్ద గాయాలేవీ తగల్లేదు. యాక్సిడెంట్ చేసిన కారు నెంబర్ తాను సగమే చూశానని, ఆ విషయం పోలీసులకు ఫిర్యాదు చేశానని చెప్పాడు. ఆ మర్నాడు నన్ను రక్షించిన ఆ బలమైన ఆసామి నన్ను పలకరించేందుకు వచ్చాడు. అతని పేరు సమారితన్. ఆస్ట్రేలియాలో ఇండియన్ జిమ్ ఇన్స్ట్రక్టర్గా పని చేస్తున్నాడట. అతని తండ్రి 'హిట్ అండ్ రన్' కేసులో చనిపోతే అంత్యక్రియలకు వచ్చాడట. రెండున్నర నెలల తర్వాత కూడా నేను బెడ్ మీదనే ఉన్నాను. ఆలోగా యాక్సిడెంట్ చేసిన అమ్మాయిని పోలీసులు గుర్తించారు. ఆ తర్వాత ఆమె స్వయంగా ఓ బొకే పట్టుకొని నా దగ్గరికి వచ్చింది. నా దగ్గరికి ఎందుకొచ్చావ్, పోలీసుల దగ్గరికి వెళ్లకపోయావా? అని ప్రశ్నించాను. ఆమె నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. యాక్సిడెంట్ చేసిన రోజున ఎందుకు పారిపోయావ్ అంటే, జనం తిడతారని భయపడి వెళ్లిపోయానంది. క్లుప్తంగా సారీ చెప్పి వెళ్లి పోయింది. ఆ తర్వాత నాకు ఎన్నో ఆపరేషన్లు జరిగాయి. బోలెడంత డబ్బు ఖర్చయింది. జీవిత బీమా కంపెనీల నుంచి తప్ప మరెక్కడి నుంచి నాకు సాయం అందలేదు. ఈ రోజున కూడా నేను కుంటుతూనే నడుస్తున్నా. ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే... తాగి కారు నడిపినందుకు కాదు, గుద్దినందుకూ కాదు. సిగ్గులేకుండా, పిరికిపందలా పారిపోయినందుకు. నీవు నేడు, నిన్ను స్టార్గా నిలబెట్టిన నీ బాధితుల భూతానికి భయపడిపోతున్నావు. వెన్నెముక లేని సినీ పరిశ్రమ కూడా ఈ రోజు నీ వెనకాల నడుస్తున్నందుకు సిగ్గు పడుతున్నా. ఏదో రోజు మీలో ఎవరో ఒకరు మీ ఇంట్లో ఉన్న వారి కోసం జెల్లీ పాస్టరీస్ కొనేందుకు అమెరిక్ ఎక్స్ప్రెస్ బేకరీకి వస్తారు. తిరిగి వెళుతుండగా తాగి కారు నడుపుతున్న సల్మాన్ కారు ఢీకొంటుంది. మీ కాలు కూడా జెల్లీ పాస్టరీలా అవుతుంది. ఆయన మళ్లీ రన్. ఎన్నేళ్లయినా మీరు విరిగిన కాలుతో అలా ఆస్పత్రి వార్డులో డాక్టర్ కోసం ఎదురుచూస్తూనే ఉంటారు. ఏదో పని మీద అటువైపు వచ్చిన సల్మాన్ మిమ్మల్ని గుర్తించడు. ఓ అభిమాని అనుకొని చేతులూపుతూ వెళతారు. -చారుదత్ ఆచార్య, దర్శకుడు, రచయిత (చారుదత్ ఆచార్య సినిమా దర్శకుడు, స్క్రిప్ట్, మాటల రచయిత. ఐఎండీబీకి కాంట్రిబ్యూటర్. గత ఏడాది విడుదలైన 'సోనాలీ కేబుల్' చిత్రానికి దర్శకత్వం వహించారు. 'నోటోంకీ సాలా' చిత్రానికి స్క్రీప్లే, మాటలు రాశారు. దమ్ మారో దమ్ తదితర చిత్రాలకు మాటలు రాశారు. ఆయన ఓ ఆంగ్ల వెబ్సైట్కు రాసిన వ్యాసం నుంచి ఈ భాగాన్ని ఇక్కడ అందిస్తున్నాం)