irrigation
-
పొలం ఎండి.. గుండె మండి
వరి పంటంతా పశువుల పాలు.. మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం వీరారం గ్రామానికి చెందిన రైతు గుండె మైసాలు ఎకరం వేరుశనగ, మరో ఎకరం వరిసాగు చేశారు. ఆరు తడి పంట కావడంతో వేరుశనగ చేతికి వచ్చింది. కానీ బావిలో నీళ్లు అడుగంటి సాగునీరు లేక వరి ఎండిపోయింది. దీనితో దిక్కుతోచని మైసాలు.. పొలాన్ని వదిలేయగా బుధవారం పశువులు, గొర్రెల మందలు మేస్తున్నాయి. పంట పెట్టుబడి, రెక్కల కష్టం అంతా వృథా అయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. – మరిపెడ రూరల్సాక్షి, హైదరాబాద్/నెట్వర్క్: రాష్ట్రంలో పంటలకు కష్టకాలం వచ్చింది. రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. యాసంగిలో సాగుచేసిన వరి, మొక్క జొన్న తదితర పంటలకు నీరందక ఎండిపోతున్నాయి. గోదావరి ప్రాజెక్టుల నుంచి నీటి విడుదల విషయంలో అధికార యంత్రాంగంలో అయోమయం నెలకొంటే... కృష్ణా ప్రాజెక్టుల పరిధిలో పంటలకు సరిపడా నీళ్లు లేక బిక్కమొహం వేసే పరిస్థితి నెలకొంది. గత ఏడాదితో పోలిస్తే వానలు మెరుగ్గానే ఉన్నా, పలు ప్రాజెక్టుల్లో నీటి నిల్వలున్నా కూడా పంటలకు అందడం లేదు. మరోవైపు భూగర్భ జలాలు అడుగంటిపోయి బోర్లు, బావులు వట్టిపోతున్నాయి. ఎక్కడికక్కడ పంటలు ఎండిపోతుండటంతో పశువుల మేత కోసం వదిలేస్తున్న దుస్థితి కనిపిస్తోంది. కాళేశ్వరం ఎత్తిపోతలు నిలిచిపోవడంతో.. గోదావరి నదిపై ఉన్న కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి ఎత్తిపోతలను నిలిపివేయడంతో.. ఎల్లంపల్లి ప్రాజెక్టులో ఉన్న నీళ్లు హైదరాబాద్ తాగునీటి అవసరాలకు మాత్రమే వినియోగించుకునే పరిస్థితి. దీనితో మిడ్ మానేరులో ఉన్న నీటిని అవసరానికి అనుగుణంగా లోయర్ మానేర్, మల్లన్నసాగర్కు వదులుతున్నారు. మల్లన్నసాగర్లోని నిల్వలు మరో 20 రోజులకు మించి సాగునీటి అవసరాలు తీర్చలేవని రైతులు ఆందోళన చెందుతున్నారు. కరీంనగర్, వరంగల్ ఉమ్మడి జిల్లాల్లోని చెరువుల్లో నిల్వ ఉన్న నీళ్లు కూడా కనీసం 20రోజుల పాటు అయినా పంటలకు అందే స్థాయిలో లేవు. ⇒ రాష్ట్రంలో ఎల్లంపల్లి దిగువన ఉన్న మిడ్మానేరును ఆనుకొని ఉన్న సిరిసిల్ల జిల్లా తీవ్రమైన సాగునీటి కష్టాలను ఎదుర్కుంటోంది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు (ఎస్సారెస్పీ) నుంచి లోయర్ మానేరు, వరంగల్ మీదుగా సూర్యాపేట వరకు సాగునీటిని ‘వార బందీ (వారానికి ఒకసారి మాత్రమే సాగునీటిని వదలడం)’ కింద ఇస్తుండటంతో తమ పంటలు ఎండిపోతున్నాయని రైతులు వాపోతున్నారు. పెద్దపల్లి జిల్లాలో కూడా ఎస్సారెస్పీ నీటి విడుదలను వారబందీ పద్ధతిలోనే కొనసాగిస్తున్నారు. ⇒ మరోవైపు దేవాదుల నుంచి జనగామ జిల్లాలోని చెరువులకు ఇటీవలే సాగునీటిని వదిలినా.. ఆ నీటితో చెరువులు నింపేలోపు పొలాలన్నీ ఎండిపోతాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ⇒ మెదక్ జిల్లాలోని పొలాలకు నీళ్లు అందించేందుకు సాగునీటి ప్రాజెక్టులు లేవు. దీనితో 95శాతం మంది రైతులు బోరుబావుల ఆధారంగా పంటలను సాగు చేస్తున్నారు. ఇప్పుడు భూగర్భ జలాలు గణనీయంగా తగ్గిపోవడంతో పంటలు ఎండిపోతున్నాయి. ⇒ రాష్ట్రంలోని నాగర్కర్నూల్, వనపర్తి, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, కామారెడ్డి, జనగామ, వికారాబాద్, మహబూబ్నగర్, భూపాలపల్లి సహా చాలా జిల్లాల్లో సాగునీటి కష్టాలు తీవ్రరూపం దాల్చాయి. కృష్ణా నది పరిధిలోనూ అదే పరిస్థితి.. దక్షిణ తెలంగాణలో కృష్ణా నది పరిధిలోని ప్రాజెక్టుల కింద పరిస్థితి విభిన్నంగా ఉంది. నాగార్జునసాగర్ ఎడమ కాల్వ పరిధిలోని నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లో చివరి ఆయకట్టుకు, మొక్కజొన్న పంటకు నీరు అందడం లేదు. మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లాలో ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు లేక, భూగర్భ జలాలు ఇంకిపోయి రైతులు ఆందోళన చెందుతున్నారు. గద్వాల ప్రాజెక్టు పరిధిలోని పొలాలకు సాగునీటితోపాటు భూగర్బ జలాలు కొంత ఆశాజనకంగా ఉన్నా... కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్సాగర్ల కింద పొలాలకు నీరు అందడం లేదు. మహబూబ్నగర్, వనపర్తి, నారాయణపేట, వికారాబాద్ జిల్లాల్లో సాగయ్యే వేరుశనగకు వారానికో తడి నీరు కూడా లేక, భూగర్భ జలాలు ఎండిపోవడంతో రైతులు ఆగమాగం అవుతున్నారు. బాగా పెరిగిన వరి సాగుతో.. వ్యవసాయ శాఖ లెక్కల ప్రకారం.. యాసంగి సీజన్కు సంబంధించి ఫిబ్రవరి నెలాఖరు వరకు రాష్ట్రంలో 69.22 లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటల సాగు చేపట్టారు. ఇందులో 53.24 లక్షల ఎకరాలు వరి పంటే. ఇది గత సంవత్సరంతో పోలిస్తే 5 లక్షల ఎకరాలు అధికం కూడా. వరి తర్వాత మొక్కజొన్న 7.50 లక్షల ఎకరాల్లో సాగయింది. మహబూబ్నగర్, వికారాబాద్, నిజామాబాద్తోపాటు పలు జిల్లాల్లో కలిపి 2.35లక్షల ఎకరాల్లో వేరుశనగ పంట వేశారు. రెండేసి లక్షల ఎకరాల్లో కందులు, జొన్నలు సాగయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం సన్న వడ్లకు క్వింటాలుకు రూ.500 బోనస్ ఇస్తుండటంతో ఈ సారి వరిసాగు భారీగా పెరిగింది. అయితే వరి సాగుకు నీటి వినియోగం ఎక్కువ. అందులోనూ వరి పొట్టకొచ్చే సమయంలో నీళ్లు కీలకం. ఇలాంటి సమయంలో సాగునీరు లేక రైతులు ఆందోళన చెందుతున్నారు. ఎస్సారెస్పీ కింద కరీంనగర్, పెద్దపల్లి, వరంగల్ జిల్లాలకు నీళ్లు అందుతుండగా.. అక్కడ కూడా వారబందీ విధానం పెట్టే ఆలోచనలో నీటిపారుదల శాఖ ఉంది. ఎస్సారెస్పీ నీటితో రెండుమూడేళ్లుగా యాసంగిలో సూర్యాపేట పొలాలకు నీరు అందగా.. ఈసారి ఎస్సారెస్పీ నీరు రావడం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలో సాగునీటి సమస్యతో చాలా పొలాలు ఎండిపోయాయని, వాటిలో పశువులను మేపుతున్నామని రైతులు వాపోతున్నారు. మొక్కజొన్న, వేరుశనగకు కూడా సమస్య.. రాష్ట్రంలోని చాలా జిల్లాల్లో సాగైన మొక్కజొన్న, వేరుశనగ పంటలకు వారానికోసారి కూడా సాగునీళ్లు అందని పరిస్థితి ఉందని రైతులు వాపోతున్నారు. మహబూబ్నగర్, వికారాబాద్, నాగర్కర్నూల్ తదితర జిల్లాల్లో వేరుశనగ.. మెదక్, నిజామాబాద్, జగిత్యాల, ఖమ్మం, కామారెడ్డి జిల్లాల్లో మొక్కజొన్న పంట ఎండిపోతోంది. నీటి విడుదల విషయంలో అధికారులకు సరైన అవగాహన లేకపోవడమే ఈ పరిస్థితికి కారణమని రైతులు అంటున్నారు. జనగామ జిల్లా దేవరుప్పులకు చెందిన రైతు ఉప్పుల శ్రీను రెండెకరాల్లో వరి సాగు చేశారు. ఆయన తన పొలంలోని బోరు ఆధారంగానే ఏటా రెండు పంటలు సాగు చేసేవారు. కానీ బోరు ఎండిపోవడంతోపాటు చెరువుల్లోకి దేవాదుల రిజర్వాయర్ నీరు కూడా రాలేదు. దీనితో వరి ఎండిపోయింది. పంట చేతికి వచ్చే అవకాశం లేకపోవడంతో పొలాన్ని మూగజీవాలకు వదిలేశారు. ఈ చిత్రంలోని వ్యక్తి మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరు మండలం ఉగ్గంపల్లికి చెందిన బర్తపురం కొమిరెల్లి. ఆకేరు వాగు పక్కనే ఉన్న రెండున్నర ఎకరాల్లో యాసంగి వరిసాగు చేశారు. గతేడాది భారీ వర్షాలతో చెక్డ్యామ్ కొట్టుకుపోవడంతో నీటి నిల్వ తగ్గింది. ఇప్పుడు పూర్తిగా ఎండిపోయింది. దీనితో పదిహేను రోజులుగా పొలానికి నీళ్లు లేక నెర్రెలు బారింది. లక్ష రూపాయల దాకా పెట్టుబడి పెట్టానని, ఇప్పుడు పశువులను మేపడానికి తప్ప ఏమీ చేయలేని పరిస్థితి ఉందని కొమిరెల్లి కన్నీరు పెడుతున్నారు. పంటలు ఎండిపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు. 12 ఎకరాల పొలం ఎండిపోతోంది గోదావరి నీళ్ల మీద ఆశతో 12 ఎకరాల్లో వరి వేసిన. ఈసారి నీళ్లు తక్కువ వచ్చాయని పొలాలకు సరిగా వదలలేదు. వారబందీ పేరుతో రావలసిన నీళ్లను కూడా మూడు రోజులుగా ఇవ్వడం లేదు. రూ.మూడు లక్షలకుపైగా పెట్టుబడి పెట్టా. నీళ్లు సక్రమంగా విడుదల చేయక పంట ఎండిపోతోంది. కొన్నేళ్లుగా ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ రాలేదు. నీళ్లు బాగుంటే మరో 45 రోజుల్లో పంట చేతికి వచ్చేది. ఇట్లాగయితే ఎలా? – సుంకరి వెంకన్న, రైతు, సీతారాంపురం, జాజిరెడ్డిగూడెం మండలం, సూర్యాపేట జిల్లా -
మళ్లీ సాగునీటి సంఘాలు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మళ్లీ సాగునీటి వినియోగదారుల సంఘాల వ్యవస్థను పునరుద్ధరించాలని రాష్ట్ర ప్రభుత్వానికి తెలంగాణ వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ సిఫార్సు చేసింది. ప్రతి చెరువుకు ఒక సాగునీటి సంఘాన్ని ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది. గతంలో సాగునీటి వినియోగదారుల సంఘాలకు ఎన్నికలు నిర్వహించి కమిటీని ఎన్నుకునేవారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ వ్యవస్థను రద్దు చేసింది. ఇప్పుడు ఎన్నికలకు బదులు ప్రభుత్వమే చెరువు కింద సాగుచేసే రైతులతో సాగునీటి వినియోగదారుల సంఘాన్ని ఏర్పాటు చేయాలని రైతు కమిషన్ సూచించింది. ఈ మేరకు కమిషన్ చైర్మన్ ఎం.కోదండరెడ్డి ఇటీవల రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్కుమార్రెడ్డికి వినతిపత్రం సమర్పించారు. చిన్న నీటిపారుదల శాఖను ఏర్పాటు చేయండి నీటిపారుదల శాఖ పునర్వ్యవస్థీకరణ పేరుతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం చిన్న నీటిపారుదల శాఖను నీటిపారుదల శాఖలో విలీనం చేసింది. భారీ, మధ్యతరహా ప్రాజెక్టుల నిర్వహణకే నీటిపారుదల శాఖలోని యంత్రాంగం పరిమితం కావడంతో గత 10 ఏళ్లలో చెరువుల నిర్వహణ అస్తవ్యస్తంగా మారిందని రైతు కమిషన్ అభిప్రాయపడింది. రాష్ట్రంలో 46,531 చెరువులుండగా, వాటికింద 25.11 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. గత ప్రభుత్వం భారీ, మధ్యతరహా ప్రాజెక్టులకు చెరువులను అనుసంధానం చేసి.. వాటిని నింపినప్పటికీ, నిర్వహణను పట్టించుకోలేదనే విమర్శలున్నాయి. మిషన్ కాకతీయ పథకం కింద చెరువుల పునరుద్ధరణ చేపట్టినా పూర్తి స్థాయిలో అమలు కాలేదు. దీంతో మళ్లీ చెరువుల ఆక్రమణలు జరుగుతున్నాయని రైతు కమిషన్ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో నీటిపారుదల శాఖ నుంచి చిన్న నీటిపారుదల శాఖను విభజించి పాత విధానంలో చెరువుల నిర్వహణను పునరుద్ధరించాలని ప్రభుత్వానికి సూచించింది. చెరువుల సంవత్సరంగా 2025! 2025 ఏడాదిని చెరువుల సంవత్సరంగా ప్రకటించి రాష్ట్ర వ్యాప్తంగా చెరువుల పునరుద్ధరణకు ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టాలని కూడా రైతు కమిషన్ ప్రభుత్వాన్ని కోరింది. చెరువుల తూములు, కట్టలు, కాల్వలకు మరమ్మతులు చేపట్టాలని సూచించింది. కాకతీయులు, కుతుబ్షాహీలు, అసఫ్జాహీల కాలంలో రాష్ట్రంలో గొలుసుకట్టు చెరువుల వ్యవస్థ ఉండేది.ఒక చెరువు నిండితే దాని కింద ఉన్న చెరువులను నింపుకుంటూ నీళ్లు ప్రవహించేవి. చెరువులు ఆక్రమణకు గురికావడం, లేఅవుట్లు రావడంతో గొలుసుకట్ట వ్యవస్థ దెబ్బతిన్నదని రైతు సంఘం పేర్కొంది. ఈ నేపథ్యంలో 2025 సంవత్సరంలో చెరువుల పునరుద్ధరణ, మరమ్మతులకు ప్రత్యేక కార్యాచరణ అమలు చేయాలని, వాటి కింద చివరి ఆయకట్టుకు కూడా సాగునీరు అందించేందుకు ఏర్పాట్లు చేయాలని సిఫార్సు చేసింది. -
ఉదయ సముద్రం ప్రాజెక్టు ప్రారంభోత్సవం
-
ఎన్నిక కాదు.. ఎంపికే!
సాక్షి, అమరావతి: సాగునీటి సంఘాల ఎన్నికలను ప్రభుత్వం అపహాస్యం చేస్తోంది. సంప్రదింపులు, ఏకాభిప్రాయం ముసుగులో టీడీపీ కూటమి నేతలు, కార్యకర్తలకు పదవులు పంచి పెట్టేలా 2018లో సవరించిన సాగు నీటి సంఘాల చట్టాన్ని ఆయుధంగా వాడుకుంటోంది. ఈ మేరకు సాగునీటి సంఘాలకు ఎన్నికలు నిర్వహించేలా 2019 ఫిబ్రవరి 8న జారీ చేసిన ఉత్తర్వుల (జీవో ఎంఎస్ నెంబరు 20)ను ఉపయోగించుకుంటోంది. ఇందులో భాగంగా 49,020 ప్రాదేశిక నియోజకవర్గాలు (టీసీ), 6,149 సాగునీటి వినియోగదారుల సంఘాలు (డబ్ల్యూయూఏ), 245 డిస్ట్రిబ్యూటరీ కమిటీలు, 53 ప్రాజెక్టు కమిటీలకు ఎన్నికలు నిర్వహించడానికి 26 జిల్లాల కలెక్టర్లు సోమవారం నోటిఫికేషన్ జారీ చేశారు. ఎన్నిక పేరుతో తాము ఎంపిక చేసిన నేతలు, కార్యకర్తలకే సాగు నీటి సంఘాల పదవులను టీడీపీ కూటమి పెద్దలు కట్టబెట్టడానికి రంగం సిద్ధం చేశారు. రాష్ట్రంలో భారీ ప్రాజెక్టుల కింద 21,03,825 హెక్టార్లు, మధ్య తరహా ప్రాజెక్టుల కింద 1,85,804 హెక్టార్లు, చిన్న నీటి వనరుల విభాగంలో 5,55,056 హెక్టార్లు.. వెరసి 28,44,685 హెక్టార్ల ఆయకట్టు ఉంది. నీటి వృథాకు అడ్డకట్ట వేసి.. యాజమాన్య పద్ధతుల ద్వారా ఆయకట్టు చివరి భూములకు నీళ్లందించి, దిగుబడులు పెంచాలన్న లక్ష్యంతో సాగు నీటి సంఘాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. వాటికి 2014 వరకూ సాధారణ ఎన్నికల తరహాలోనే ఎన్నికలు నిర్వహించింది. ఆయకట్టు రైతులు తమ ఓటు ద్వారా ప్రాదేశిక నియోజకవర్గాల ప్రతినిధులు, సాగునీటి సంఘాలు, డిస్ట్రిబ్యూటరీ, ప్రాజెక్టు కమిటీల అధ్యక్షులను ఎన్నుకునేవారు. కానీ.. టీడీపీ కూటమి ప్రభుత్వం 2018లో ఆ విధానానికి స్వస్తి పలుకుతూ సంప్రదింపులు, ఏకాభిప్రాయం ముసుగులో తమ వారికే పదవులు కట్టబెట్టేలా చట్టాన్ని సవరించి, సాగునీటి సంఘాలను నీరుగార్చింది. 40 రోజుల్లో ఎన్నికల ప్రక్రియ పూర్తి రాష్ట్రంలో 26 జిల్లాల్లో సాగు నీటి సంఘాల ఎన్నికలకు సోమవారం కలెక్టర్లు నోటిఫికేషన్లు జారీ చేయడం ద్వారా ఎన్నికల ప్రక్రియను ప్రారంభించారు. సంఘాల వారీగా ఓటర్ల జాబితా తయారు చేసేందుకు రెవెన్యూ శాఖ నుంచి ఒకరు, జల వనరుల శాఖ నుంచి ఇంకో అధికారిని నియమించారు. ఎన్నికల సిబ్బంది నియామకం ప్రక్రియను కూడా పూర్తి చేశారు. ఎన్నికల ప్రక్రియ 40 రోజుల్లో అంటే నవంబర్ 27తో పూర్తవుతుంది. -
కమీషన్ల కోసమే కాళేశ్వరం కట్టారు
-
నేడు మల్లన్న చెంతకు కృష్ణమ్మ
సాక్షి, హైదరాబాద్/కాళేశ్వరం/నాగార్జునసాగర్: శ్రీశైలం మల్లన్న చెంతకు కృష్ణమ్మ శనివారం చేరుకోనుంది. కృష్ణా ప్రధాన పాయపై కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్ డ్యా మ్ల నుంచి విడుదల చేస్తున్న వరద ప్రవాహం శుక్రవారం జూరాల ప్రాజెక్టుకు చేరుకుంది. జూరాలలో విద్యుత్ కేంద్రం, గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. శనివారం వర ద ప్రవాహం శ్రీశైలం ప్రాజెక్టుకు చేరుకుంటుంది. పశి్చమ క నుమల్లో వర్షాలు తగ్గుముఖం పట్టడంతో కృష్ణా ప్రధాన పా యలో శుక్రవారం వరద మరింత తగ్గింది.ఆల్మట్టి డ్యామ్లోకి 43,478 క్యూసెక్కుల నీరు రాగా, గేట్లు ఎత్తి 65,480 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. నారాయణపూర్ డ్యామ్లోకి 65,801 క్యూసెక్కుల నీరు చేరగా, గేట్లు ఎత్తి 70,780 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. ఎగువ నుంచి వరద వస్తుండటంతో జూరాల ప్రాజెక్టులో విద్యుదుత్పత్తి చేస్తూ.. గేట్లు ఎత్తి దిగువకు 34,818 క్యూసెక్కులను వదిలేస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టు ఎడమ కేంద్రంలో తెలంగాణ జెన్కో విద్యుదుత్పత్తి చేస్తూ 7,063 క్యూసెక్కుల నీటిని దిగువకు తరలిస్తుండటంతో నీటి నిల్వ 33.11 టీఎంసీలకు తగ్గింది. నాగార్జునసాగర్లోకి వరద ప్రవాహం చేరడం లేదు. సాగర్ కుడి కాలువ, ఏఎమ్మార్పీ ద్వారా 8,165 క్యూసెక్కులను విడుదల చేస్తుండటంతో నీటి నిల్వ 123.5 టీఎంసీలకు తగ్గింది. నేడు తుంగభద్ర డ్యామ్లోకి వరద ఉధృతి మరింత పెరిగే అవకాశంకృష్ణా ప్రధాన ఉపనది తుంగభద్రలో వరద ఉధృతి మరింత పెరిగింది. తుంగభద్ర డ్యామ్లోకి 1,08,270 క్యూసెక్కుల రా కతో నీటి నిల్వ 58.67 టీఎంసీలకు చేరుకుంది. తుంగభద్ర బే సిన్ పరిధిలో విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో శనివారం తుంగభద్ర డ్యామ్లోకి వరద ఉధృతి మరింత పెరుగుతుందని సీడబ్ల్యూసీ ) అంచనా వేసింది. వరద ఇలానే కొనసాగితే నాలుగు రోజుల్లో తుంగభద్ర ప్రాజెక్టు నిండుతుంది. సాగర్ ఎడమ కాల్వకు నీటి విడుదలనాగార్జునసాగర్ జలాశయం నుంచి ఎడమకాల్వ ద్వారా అధికారులు శుక్రవారం 4వేల క్యూసెక్కులకు నీటిని విడుదల చేశారు. సాగర్ కుడి కాల్వ ద్వారా ఏపీలోని వివిధ జిల్లాలకు గత రెండు రోజుల నుంచి నిత్యం 5,700 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. కాళేశ్వరం వద్ద 8.500 మీటర్ల ఎత్తులో నీటిప్రవాహంతెలంగాణలోని గోదావరి, మహారాష్ట్రలో ప్రాణహిత నదికి వరద తాకిడి పెరిగింది. అన్నారం(సరస్వతీ) బరాజ్ వద్ద మానేరు వాగు నుంచి 15 వేల క్యూసెక్కుల వరద రాగా, బరాజ్లోని మొత్తం 66 గేట్లు పూర్తిగా పైకి ఎత్తి నీటిని దిగు వకు వదిలారు. ఆ వరద నీరు దిగువన కాళేశ్వరం వద్ద కలు స్తోంది. గడ్చిరోలి జిల్లా మీదుగా ప్రాణహిత నదికి వరద పోటెత్తింది. ఆ నీరంతా కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద కలుస్తుండడంతో పుష్కరఘాట్లను తాకుతూ వరద దిగువకు తరలిపోతోంది. పుష్కర ఘాట్ల వద్ద 8.500 మీటర్లు ఎత్తులో నీటిప్రవాహం కొనసాగుతోంది. అక్కడినుంచి మేడిగడ్డ (లక్ష్మీ) బరాజ్కు వరద తాకిడి పెరుగుతోంది. బరాజ్ వద్ద 3.73 లక్ష ల క్యూసెక్కుల వరద ప్రవాహం చేరుతోంది.బరాజ్లో మొ త్తం 85 గేట్లు పైకి ఎత్తి వచి్చన వరదను వచి్చనట్టు దిగువకు తరలిస్తున్నారు. దిగువన తుపాకులగూడెం బరాజ్లోకి 3,75, 430 క్యూసెక్కులు చేరుతుండగా.. అంతే స్థాయిలో దిగువకు వదిలారు. దుమ్ముగూడెం(సీతమ్మసాగర్)లోకి 3,47,511 క్యూసెక్కులు చేరుతుండగా అంతే స్థాయిలో దిగువకు వదిలేస్తున్నారు. దాంతో భద్రాచలం వద్ద వరద ఉధృతి పెరుగుతోంది. భద్రాచలం వద్దకు శుక్రవారం సాయంత్రం 6 గంటలకు 3.75 లక్షల క్యూసెక్కులు చేరుతుండటంతో నీటి మట్టం(సముద్ర మట్టానికి) 40.2 మీటర్లకు వరద చేరింది. -
సాగునీటి కోసం రోడ్డెక్కిన రైతులు
కడెం(ఖానాపూర్): రబీ సీజన్లో సాగు చేసిన పంటలకు నీరందించాలని డిమాండ్ చేస్తూ అన్నదాతలు ఆందోళన చేపట్టారు. నిర్మల్ జిల్లాలోని సదర్మాట్ కాలువకు నీటిని విడుదల చేయాలని కడెం మండలంలోని లింగాపూర్ గ్రామానికి చెందిన రైతులు నచ్చన్ఎల్లాపూర్ వద్ద నిర్మల్–మంచిర్యాల ప్రధాన రహదారిపై గురువారం బైఠాయించారు. వారం రోజులుగా సదర్మాట్ కాలువకు నీటిని విడుదల చేయకపోవడంతో కడెం మండలంలోని లింగాపూర్, మాసాయిపేట్, నచ్చన్ఎల్లాపూర్, పెద్దూర్తండా, చిట్యాల్, ధర్మాజీపేట్, తదితర గ్రామాల్లోని సుమారు 13 వేల ఎకరాల్లో పంటలు ఎండిపోయే పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు అక్కడకు చేరుకుని వారితో మాట్లాడి ఆందోళన విరమింపజేశారు. రైతులు ఆందోళన చెందవద్దు: ఎమ్మెల్యే వెడ్మ సదర్మాట్ రైతాంగానికి ప్రభుత్వం అండగా ఉంటుందని, కాలువ నీళ్లు వస్తాయ ని రైతులు ఆందోళన చెందవద్దని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ హామీ ఇచ్చారు. సదర్మాట్ చివరి ఆయకట్టు వరకు నీటిని విడుదల చేయాలని ఈఎన్సీ నుంచి ఎస్ఈకి గురువారమే ఆదేశాలు వచ్చాయని ఆయన వెల్లడించారు. -
కళ్లెదుటే అభివృద్ధి
సాక్షి ప్రతినిధి, విజయవాడ: కళ్లెదుటే ఇంత అభివృద్ధి కనిపిస్తున్నా రాష్ట్రంలో కొంతమంది మాత్రం ఒప్పుకోవట్లేదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విమర్శించారు. విజయవాడను గతంలో ఎప్పుడూ లేని విధంగా రూ.వందల కోట్లతో అభివృద్ధి చేశామన్నారు. ఏకంగా రూ.400 కోట్లతో అంబేడ్కర్ పార్కును మీ కళ్లెదుటే ప్రారంభించి పూర్తి చేశామని గుర్తు చేశారు. గత సర్కారు హయాంలో బెజవాడలో ఓ ఫ్లైఓవర్ కూడా పూర్తి కాని దుస్థితి నెలకొనగా మనందరి ప్రభుత్వం వచ్చాక దాన్ని పూర్తి చేయడమే కాకుండా మరో రెండు ఫ్లైఓవర్లు నిర్మించామని చెప్పారు. మంగళవారం విజయవాడలో పర్యటించిన సీఎం జగన్ కనకదుర్గ వారధి వద్ద ఇరిగేషన్ రిటైనింగ్ వాల్, కృష్ణా రివర్ ఫ్రంట్ పార్కు (కృష్ణ జలవిహార్)లను ప్రారంభించారు. రూ.239 కోట్లతో నగరంలో ఐదు చోట్ల నిర్మించే మురుగు నీటి శుద్ధి ప్లాంట్ల నిర్మాణ పనులకు శంకుస్ధాపన చేశారు. õవిజయవాడ పురపాలక సంస్థ పరిధిలో అర్హులైన లబ్ధిదారులకు ఇళ్ల స్ధలాలపై సంపూర్ణ హక్కులు కల్పిస్తూ పత్రాలు అందజేశారు. కొందరు లబ్ధిదారులకు సీఎం జగన్ స్వయంగా వీటిని అందించారు. తూర్పు నియోజకవర్గ ఇన్చార్జి దేవినేని అవినాష్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ ఏమన్నారంటే.. లబ్ధిదారులకు ఇళ్ల స్థలాలపై సంపూర్ణ హక్కులు కల్పిస్తూ పత్రాలను అందజేస్తున్న సీఎం జగన్, వృద్ధురాలిని ఆప్యాయంగా పలకరిస్తున్న ముఖ్యమంత్రి 31,866 పట్టాల రెగ్యులరైజ్... ఈరోజు విజయవాడలో వివిధ కేటగిరీలకు సంబంధించి 31,866 పట్టాలను రెగ్యులరైజ్ చేసి ఆయా కుటుంబాలకు సంపూర్ణ హక్కులు కల్పించే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. 22 ఏ కింద చేర్చడంతో హక్కులు లేక, రిజిస్ట్రేషన్ జరగక ఇబ్బంది పడుతున్న దాదాపు 21 వేల మంది వీరిలో ఉన్నారు. ఈ దుస్థితిని తొలగిస్తూ విజయవాడ సెంట్రల్, వెస్ట్, ఈస్ట్లో 16 కాలనీల వాసులకు మంచి చేస్తున్నాం. భ్రమరాంబపురంలో ఇళ్లు కట్టుకుని దశాబ్దాలుగా జీవిస్తున్న నిరుపేద కుటుంబాలు రెగ్యులరైజ్ కాకపోవడంతో అమ్ముకునే స్వేచ్ఛ లేక ఇబ్బంది పడుతున్నట్లు అవినాష్ నా దృష్టికి తెచ్చాడు. వీటన్నింటికీ పరిష్కారం చూపుతూ రెగ్యులరైజ్ జరుగుతోంది. ఎలాంటి వివాదాలు లేని 9,125 పట్టాలను కూడా రెగ్యులరైజ్ చేస్తున్నాం. రూ.400 కోట్లతో అంబేడ్కర్ పార్కు విజయవాడలో మీ బిడ్డ ప్రభుత్వం రూ.400 కోట్లు పైచిలుకు ఖర్చు పెట్టి అంబేడ్కర్ పార్కుకు అందరి కళ్లెదుటే పునాది రాయి వేయడంతోపాటు ప్రారంభించటాన్ని కూడా చూశారు. గతంలో విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుకు వెళ్లాలంటే ఒక్క ఫ్లై ఓవర్ కూడా పూర్తి కాని పరిస్థితి నుంచి 58 నెలల వ్యవధిలో పెండింగ్ ఫ్లై ఓవర్ను పూర్తి చేయడమే కాకుండా మరో రెండు ఫ్లై ఓవర్లు అదే రోడ్డులో నిర్మించాం. కనకదుర్గమ్మ ఫ్లై ఓవర్ కూడా కలిపితే ఇంకో ఫ్లై ఓవర్ కూడా సాకారమైంది. ఇవన్నీ మన కళ్ల ఎదుటే యుద్ధ ప్రాతిపదికన పూర్తయ్యాయి. బెజవాడ ట్రాఫిక్ కష్టాలకు విముక్తి గుంటూరు నుంచి ట్రాఫిక్ విజయవాడ మీదుగా వెళ్లాల్సిన అవసరం లేకుండా ట్రాఫిక్ కష్టాలకు విముక్తి కల్పిస్తూ కాజ నుంచి చిన్న అవుటపల్లి వైపు వెళ్లేలా చేపట్టిన ఔటర్ పనుల ప్రాజెక్టు పూర్తి కావచ్చింది. మరో రెండు నెలల్లో దీన్ని ప్రారంభించేలా పనులు జరుగుతున్నాయి. 58 నెలలుగా మన ప్రభుత్వంలో ప్రతి ఇంటికీ మంచి చేస్తూ ప్రతి అడుగూ అభివృద్ధి దిశగా వేస్తున్నాం. మనందరి ప్రభుత్వంలో స్కూళ్లు, హాస్పటళ్లు బాగుపడ్డాయి. గ్రామీణ స్థాయిలో వ్యవసాయం బాగుపడింది. వలంటీర్లు, సచివాలయ వ్యవస్థల ద్వారా ఎప్పుడూ చూడని మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఒక్క రూపాయి లంచం లేకుండా వివక్షకు తావులేకుండా అర్హులందరికీ పారదర్శకంగా మేలు చేస్తున్నాం. కార్యక్రమంలో మంత్రి అంబటి రాంబాబు, ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్సీలు తలశిల రఘరాం, కల్పలతారెడ్డి, మొండితోక అరుణకుమార్, రుహూల్లా ఎమ్మెల్యేలు వెలంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణు, మేయర్ రాయన భాగ్యలక్ష్మి, పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జి ఆసిఫ్, డీసీఎంఎస్ చైర్మన్ పడమట స్నిగ్థ, నీటి పారుదల, మున్సిపల్ శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు శశిభూషణ్, శ్రీలక్ష్మి, సీసీఎల్ఏ సాయిప్రసాద్, జిల్లా కలెక్టర్ ఎస్.ఢిల్లీరావు, జాయింట్ కలెక్టర్ డాక్టర్ పి.సంపత్కుమార్, నగర కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఆర్డీవో భవాని శంకర్, డిప్యూటీ మేయర్లు అవుతు శైలజారెడ్డి, బెల్లం దుర్గ తదితరులు పాల్గొన్నారు. రూ.500 కోట్లతో కరకట్ట గోడలు.. కృష్ణా నదికి వరదలు వచ్చినా ఇబ్బంది లేకుండా దాదాపు రూ.500 కోట్లతో కరకట్ట గోడలు నిర్మించాం. గతంలో వరద వస్తే కృష్ణలంక ప్రాంతం నీట మునిగేది. గత పాలకులు మాటలకే పరిమితమయ్యారు. ఇలా గోడ కట్టాలని ఆలోచన చేసిన పాపాన పోలేదు. కృష్ణలంక ప్రాంతంలో అక్కచెల్లెమ్మలు, పిల్లలు, అవ్వలు, తాతలు సాయంత్రం పూట ఆహ్లాదకరంగా గడిపేందుకు పార్కు సుందరీకరణ పనులు చేపట్టాం. చిత్తశుద్ధితో నిర్మించారు వరద వచ్చినప్పుడల్లా మా ప్రాంతంలోని ఇళ్లు ముంపునకు గురయ్యేవి. దీన్ని పరిష్కరించేందుకు ఎంతో మంది నాయకులు హామీ ఇచ్చినా ఎవరూ పట్టించుకోలేదు. కానీ సీఎం జగన్ ఇచ్చిన మాట ప్రకారం రిటైనింగ్ వాల్ నిర్మించారు. వారధి దిగువనే కాకుండా, ఎగువన కూడా నిర్మించారు. ఎగువ ప్రాంతంలో పార్కు అభివృద్ధి చేస్తాననడం సంతోషంగా ఉంది. – కసగోని జ్యోతి, రణదివెనగర్ శాశ్వత పరిష్కారం లభించింది రాణిగారితోట తారకరామనగర్ కరకట్ట దిగువన కూలీ పనులు చేసుకుంటూ కుటుంబంతో జీవిస్తున్నాం. తుపానులు వచ్చినప్పుడల్లా తట్టాబుట్టా సర్దుకుని పునరావాస కేంద్రాలకు వెళ్లే వాళ్లం. వరద ముంపునకు గురైన మా ప్రాంతాన్ని సీఎం జగన్ కళ్లారా చూసి చలించిపోయి గోడ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. గోడ నిర్మాణంతో శాశ్వత పరిష్కారం లభించింది. – ఏలూరి వినయ్, తారకరామనగర్ సీఎం జగన్కు రుణపడి ఉంటాం మేం 45 ఏళ్లుగా విజయవాడ నందమూరినగర్లో ఉంటున్నాం. కూలి పనులు చేసుకుంటూ అక్కడే ఒక బీ–ఫారం పట్టా ఉన్న ఇల్లు కొనుక్కున్నాను. అయితే ఎప్పుడు ఎవరొచ్చి ఖాళీ చేయమంటారోనని నిత్యం భయంతో కాలం వెళ్లదీశాను. కంటి నిండా నిద్ర ఉండేది కాదు. ఒక్కోసారి తిండి ఉండేది కాదు. ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి... పోయాయి. ఎప్పటి నుంచో అధికారులు, నాయకుల చుట్టూ కాళ్లరిగేలా తిరిగాను. కానీ ఫలితం లేకుండా పోయింది. బీ–ఫారం పట్టాకు సంపూర్ణ భూ హక్కు పత్రాలను ముఖ్యమంత్రి జగన్ చేతుల మీదుగా అందుకోవడం ఎంతో సంతోషంగా ఉంది. జీవితాంతం సీఎం జగన్కు రుణపడి ఉంటాం. – చోడవరపు దుర్గ, నందమూరినగర్, విజయవాడ -
కేసులు పెట్టినా ధైర్యంగా ఎదుర్కొంటాం: కేటీఆర్
హైదరాబాద్, సాక్షి: రాష్ట్రంలో ప్రాజెక్టులపై కాంగ్రెస్ ప్రభుత్వం సిల్లీ రాజకీయాలు చేస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. గురువారం మీడియాతో చిట్ చాట్ నిర్వహించిన కేటీఆర్.. మాకు(బీఆర్ఎస్)కు సెన్స్ లేదని కాంగ్రెస్ వాళ్లు అంటున్నారని.. మరి సెన్స్ ఉండి నీళ్లు వృధా పోతుంటే కాంగ్రెస్ వాళ్లు ఏం చేస్తున్నారంటూ ప్రశ్నించారు. ‘‘రేపు మేడిగడ్డ,అన్నారం పర్యటనకు వెళ్తున్నాం. మేడిగడ్డ దగ్గర కుంగిన పిల్లర్లు, అన్నారం బ్యారేజ్ లను పరిశీలిస్తాం. అన్నారం బ్యారేజ్ దగ్గర మీడియా సమావేశం నిర్వహిస్తాం. కడియం శ్రీహరి, హరీష్ రావు ఇద్దరు రెండు బ్యారేజ్ లపై మాట్లాడుతారు. ప్రాజెక్టు కుంగడం.. ఇదేం కొత్తది కాదు. ఈ విషయంలో రాజకీయాలు చేయడం తగదు అంటూ ఉత్తమ్ కుమార్ రెడ్డి కేటీఆర్ హితవు పలికారు. ‘‘డ్యాం సేఫ్టీ అధికారులు ప్రాజెక్టు కుంగిన దగ్గర సోయిల్ టెస్ట్ చేశారా?. కనీసం కింద దిగకుండా పై పైన చూసి పోవటం కాదు. దీన్ని ప్రామాణికంగా చేసుకొని మాట్లాడటం సరికాదు. మార్చి 1 తర్వాత నీళ్ళు ఇచ్చే పరిస్తితి లేదు. సెన్స్ మాకు లేదు అంటున్నారు.. ఉండి మీరు నీళ్లు వృధాగా పోతుంటే మీరేం చేస్తున్నారు?. అందర్నీ తికమక పెడుతున్నారు. .. మొన్న ప్రభుత్వానికి ఇచ్చింది రాజకీయ ప్రేరేపిత రిపోర్ట్ మాత్రమే. మేం డ్యాం సందర్శనకు వెళ్తున్నామని.. వాళ్లు వెళ్తామంటున్నారు. సిల్లీ రాజకీయాలు చేస్తున్నారు. ఈ పోటీ యాత్రలు మానుకోవాలి. మమ్మల్ని బద్నాం చేయాలని ప్రభుత్వం చూస్తోంది. ఇప్పటికైనా ఒక పంప్ ఆన్ చేసి నీళ్ళు వదలండి. కాంగ్రెస్ నాయకులు పాలమూరు రంగారెడ్డికి బరాబర్ చూసి రండి. ఏనుగు వెళ్తే, ఎలుక చిక్కినట్టు ఉంది. ఉద్దండ పూర్ కట్టిందే కేసీఆర్. కేసీఆర్ ను బద్నాం చేయాలని రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి చూస్తున్నారు. రాజకీయం కోసం కేసిఆర్ మీద, గత ప్రభుత్వ పెద్దల మీద కేసులు పెట్టేలా చూస్తున్నారు. .. కోర్టులు ఉన్నాయి, దైర్యంగా ఎదుర్కొంటాం. బ్యారేజ్ కొట్టుకుపోవాలని ప్రభుత్వం ఆలోచనగా కనిపిస్తోంది. నీళ్ళు లీక్ అయ్యే దగ్గర కాపర్ డ్యాం ఏర్పాటు చేసి నీళ్ళు ఇవ్వొచ్చు. వెదిరే శ్రీరామ్ తెలివి తక్కువ వాడు, ఎంపి టికెట్ కోసం ప్రయత్నం చేస్తున్నట్టు ఉన్నాడు. అందుకే ఈ విమర్శలు. కాళేశ్వరంకు 400 అనుమతులు ఉన్నాయి. .. ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ వ్యక్తి కానీ, బీజేపీ కింద పని చెసే సంస్థల పట్ల ప్రేమ ఎందుకు?. కాంగ్రెస్ నాయకులు రిజర్వాయర్ కు బరాజ్ కు తేడా తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది.. ‘‘మల్కాజ్గిరి పార్లమెంట్ స్థానంలో పోటీ చేద్దాం. నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి పోటీ చేస్తా. సీఎం పదవికి రాజీనామా చేసి రేవంత్ పోటీ చేయాలి. మల్కాజ్గిరిలో తేల్చుకుందాం.. ఇద్దరిలో ఎవరు గెలుస్తారో చూద్దాం’’ అని సీఎం రేవంత్రెడ్డికి కేటీఆర్ సవాల్ విసిరారు. -
Congress vs BRS: ఇరిగేషన్ వార్ తారాస్థాయికి..
హైదరాబాద్, సాక్షి: అసెంబ్లీ నుంచి సీన్ మారి రోడ్డెక్కింది. తెలంగాణలో అధికార ప్రతిపక్షాల నడుమ నీళ్ల నిప్పులు తారాస్థాయికి చేరాయి. ఈ క్రమంలోనే మంగళవారం పోటాపోటీ ప్రదర్శనలకు ఇరు పార్టీలు సిద్ధం అయ్యాయి. ఐదో రోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఉదయం 10 గంటలకు ప్రారంభం కానున్నాయి. ఓటాన్ అకౌంట్ బడ్జెట్పైచర్చ జరగాల్సి ఉంది. అయితే అది వాయిదా పడే అవకాశాలే ఎక్కువ కనిపిస్తున్నాయి. ఎందుకంటే.. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రుల మేడిగడ్డ సందర్శనకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ప్రాజెక్టు సందర్శనకు ప్రజాప్రతినిధులకు ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ఇప్పటికే ఆహ్వానాలు పంపారు. దీంతో అంతా బస్సుల్లో మేడిగడ్డ ప్రాజెక్టుకు బయల్దేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. సీఎం హోదాలో రేవంత్రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించనున్నారు. ఈ క్రమంలో ప్రజాప్రతినిధులంతా రోడ్డు మార్గాన బస్సుల్లో రావాలని ఇప్పటికే ఆయన ఆదేశాలు జారీ చేశారు. మధ్యాహ్నాం మూడు గంటల ప్రాంతంలో బస్సులు మేడిగడ్డకు చేరుకోనున్నాయి. గంటన్నర పాటు ప్రాజెక్టును, పిల్లర్లు కుంగిన ప్రాంతాన్ని ప్రజాప్రతినిధులంతా సందర్శిస్తారు. ఆపై సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో అధికారుల పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఉండనుంది. సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్లు మీడియాతో మాట్లాడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే.. ఎంఐఎం సభ్యులు సైతం మేడిగడ్డ వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. తొలిసారి కేసీఆర్ సభ మరోవైపు కృష్ణా నది కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు - KRMBకి అప్పగించడంపై బీఆర్ఎస్ విమర్శలు ఎక్కుపెట్టంది. కృష్ణా జలాల పరిరక్షణ పేరిట ఆ పార్టీ అధినేత కేసీఆర్ అధ్యక్షతన మర్రిగూడ బైపాస్లో భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేసింది. సాయంత్రం 4గం. ప్రాంతంలో ఈ సభ జరగనుంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత బీఆర్ఎస్ నిర్వహించబోయే బహిరంగ సభ ఇదే కావడంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. ఈ క్రమంలోనే నల్లగొండ, ఖమ్మంల నుంచి 2 లక్షల మంది సభకు తరలించాలని నిర్ణయించింది. ఈ సభలో కృష్ణా జలాల విషయంలో కాంగ్రెస్ చేస్తున్న మోసాన్ని కేసీఆర్.. తెలంగాణ ప్రజలకు వివరిస్తారని బీఆర్ఎస్ శ్రేణులు చెబుతున్నాయి. నల్లగొండలో ఉద్రిక్తత! కేసీఆర్ సభకు కౌంటర్గా.. నల్లగొండ క్లాక్ టవర్లో మినీ సభకు కాంగ్రెస్ సిద్ధమైంది. గత పదేళ్లలో కృష్నా జలాల విషయంలో బీఆర్ఎస్ అవలింభించిన విదాల్ని వివరించడంతో పాటు ప్రాజెక్టులను పూర్తి చేయకపోవడంపైనా పవర్ పాయింట్ ప్రజంటేషన్కు సిద్ధమైంది. అలాగే.. కేసీఆర్ కోసం గులాబీ కుర్చీ, కండువాను సిద్దం చేశాయి కాంగ్రెస్ శ్రేణులు. దీనిని బీఆర్ఎస్ అడ్డుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో పట్టణంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. -
ఒక్క దరఖాస్తు.. అధికారి చొరవ..
నిర్మల్: కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ‘ప్రజాపాలన’వల్ల సుదీర్ఘకాలంగా ఉన్న తమ ఊరి సమస్య పరిష్కారమవుతోందని నిర్మల్ జిల్లా కడెం మండలం ఉడుంపూర్ గ్రామ వాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ గ్రామం కవ్వాల్ అభయారణ్య ప్రాంతంలో ఉంటుంది. ఇక్కడ దాదాపు 2,500 జనాభా ఉండగా.. ఈ ఊరికి అటవీ ప్రాంతం నుంచి వచ్చే వాగు ఉంది. ఈ వాగుపై ఎప్పుడో కట్టిన చెక్డ్యామ్ 30–40 ఏళ్ల కిందటే కొట్టుకుపోయింది. గతంలో చెక్డ్యామ్ నుంచి వచ్చే కాలువతో సమీపంలోని చెరువులు నింపేవారు. అయితే చెక్డ్యామ్, కాలువ దెబ్బతినడంతో సాగునీటికి గ్రామస్తులు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉడుంపూర్ కవ్వాల్ అభయారణ్యం పరిధిలో ఉండటంతో కాంక్రీట్ నిర్మాణాలు చేపట్టడానికి అటవీశాఖ అనుమతులివ్వడం లేదు. ఏళ్లుగా గ్రామస్తులు మొర పెట్టుకుంటున్నా.. ఎవరూ పరిష్కారం కోసం ప్రయత్నం చేయలేదు. కదిలిన అధికారి.. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమాన్ని ఈనెల 3న ఉడుంపూర్లో నిర్వహించారు. కడెం మండల ఇన్చార్జిగా ఉన్న జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి (డీఆర్డీవో) విజయలక్ష్మి ఆరోజు ఉడుంపూర్లో కార్యక్రమాన్ని పరిశీలించేందుకు వచ్చారు. ఈ సందర్భంగా ‘ఆరు గ్యారంటీ’ల దరఖాస్తులతోపాటు తమ ఊరి సమస్యను ప్రభుత్వం పరిష్కరించాలంటూ గ్రామస్తులు డీఆర్డీవో విజయలక్ష్మికి దరఖాస్తును అందించారు. వెంటనే స్పందించిన ఆమె సభ కాగానే, గ్రామస్తులతో కలసి మోటార్బైక్పై కొంతదూరం, ఆపై కాలినడకన అటవీ ప్రాంతంలో ఉన్న చెక్డ్యామ్ వద్దకు వెళ్లి పరిశీలించారు. అనంతరం ఆమె ఉడుంపూర్ నీటి సమస్యను జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ దృష్టికి తీసుకెళ్లారు. అలాగే ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మబొజ్జుతో చర్చించారు. వారి సూచనల మేరకు వెంటనే రూ.9 లక్షల అంచనాలతో పనులకు ప్రణాళికలు రూపొందించారు. అటవీ ప్రాంతంలో చెట్లకు ఇబ్బంది కలగకుండా కాలువ తవ్వకానికి పథకం సిద్ధం చేశారు. ఎమ్మెల్యే వెడ్మబొజ్జు చేతుల మీదుగా శనివారం చెక్ డ్యామ్ ప్రాంతం నుంచి కాలువ తవ్వకం పనులు ప్రారంభించారు. ప్రజాపాలనతో తమ ఊరి దీర్ఘకాలిక సమస్యకు పరిష్కారం లభించడంతో ఉడుంపూర్వాసులు హర్షం వ్యక్తంచేస్తున్నారు. సీఎం రేవంత్రెడ్డికి, ఎమ్మెల్యే బొజ్జు, జిల్లా అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. -
CM Jagan: ఏపీకి జలాభిషేకం
సాక్షి, గుంటూరు: కడలి పాలవుతున్న నదీ జలాలను బంజరు భూములకు మళ్లించి రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయడమే లక్ష్యంగా దివంగత వైఎస్సార్ జలయజ్ఞం చేపట్టగా ఆయన తనయుడు సీఎం జగన్ ప్రాధాన్యత క్రమంలో ప్రాజెక్టులను పూర్తి చేసి జాతికి అంకితం చేస్తున్నారు. ఆయకట్టుకు నీళ్లందించడం ద్వారా జలయజ్ఞం ఫలాలను రైతులకు అందిస్తున్నారు. కోవిడ్, ఆర్థిక ఇబ్బందుల్లోనూ సాగునీటి పనులను పరుగులెత్తించారు.రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా 2019, 2020, 2021, 2022 ఖరీఫ్, రబీతో కలిపి ఏటా కోటి ఎకరాలకు సీఎం జగన్ నీళ్లందించారు. దేశవ్యాప్తంగా ఈ ఏడాది వర్షాభావ పరిస్థితులు నెలకొన్నా రాష్ట్రంలో ఆయకట్టుకు సమృద్ధిగా నీళ్లందించడంతో రైతులు భారీ ఎత్తున పంటలు సాగు చేశారు. రికార్డు స్థాయిలో ధాన్యపు దిగుబడులతో ఏపీని మళ్లీ దేశ ధాన్యాగారం (రైస్ బౌల్ ఆఫ్ ఇండియా)గా సీఎం జగన్ నిలిపారు.♦ వైఎస్సార్ చేపట్టిన సంగం, నెల్లూరు బ్యారేజ్లలో మిగిలిన పనులను సీఎం జగన్ పూర్తి చేసి 2022లో జాతికి అంకితమిచ్చారు.♦ హంద్రీ–నీవా సుజల స్రవంతి ప్రధాన కాలువ నుంచి నీటిని ఎత్తిపోసి కర్నూలు, నంద్యాల జిల్లాల్లో 77 చెరువులను నింపడం ద్వారా లక్కవరం ఎత్తిపోతల పథకాన్ని సీఎం జగన్ పూర్తి చేసి సెప్టెంబరు 18న జాతికి అంకితం చేశారు.♦ గాలేరు–నగరిలో అంతర్భాగమైన అవుకు వద్ద రెండో టన్నెల్ను పూర్తి చేసి నవంబర్ 30న జాతికి అంకితం చేశారు. ప్రస్తుత డిజైన్ మేరకు 20 వేల క్యూసెక్కులు తరలించేందుకు మార్గం సుగమం చేశారు.♦ వెలిగొండ ప్రాజెక్టు మొదటి సొరంగంలో మిగిలిన 2.833 కి.మీ. పనులను 2021 జనవరి 13 నాటికే సీఎం జగన్ పూర్తి చేశారు. రెండో సొరంగంలో మిగిలిన 7.698 కి.మీ.లో 7.506 కి.మీ. పనులు పూర్తయ్యాయి. మిగిలిన 192 మీటర్ల పనులు పూర్తి చేసి సొరంగాలను జాతికి అంకితం చేయనున్నారు. ♦విభజన తర్వాత అధికారంలోకి వచ్చిన చంద్రబాబు కమీషన్ల దాహంతో పోలవరాన్ని నీరుగార్చారు. జగన్ అధికారంలోకి వచ్చాక అప్రోచ్ ఛానల్, స్పిల్వే, స్పిల్ ఛానల్, ఫైలట్ ఛానల్, ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్లను పూర్తి చేసి 2021లో గోదావరి వరద ప్రవాహాన్ని స్పిల్వే మీదుగా మళ్లించారు. బాబు అవినీతితో ఈసీఆర్ఎఫ్ డ్యామ్ నిర్మాణ ప్రాంతంలో అగా«దాలను పూడ్చి యధాస్థితికి తెచ్చే పనులను వేగవంతం చేశారు. నీటి పారుదలలో రికార్డు♦ కృష్ణా డెల్టా వరదాయిని పులిచింతల ప్రాజెక్టును దివంగత వైఎస్సార్ సాకారం చేశారు. గత సర్కారు నిర్వాసితులకు పునరావాసం కల్పించకపోవడం వల్ల 2019 వరకూ పూర్తి స్థాయిలో 45.77 టీఎంసీలను నిల్వ చేయలేని దుస్థితి నెలకొంది. నిర్వాసితులకు వేగంగా పునరావాసం కల్పించిన సీఎం జగన్ 2019 ఆగస్టులోనే పులిచింతలలో 45.77 టీఎంసీలను నిల్వ చేసి కృష్ణా డెల్టాలో రెండో పంటకూ నీళ్లందించేందుకు మార్గం సుగమం చేశారు.♦ గత సర్కారు నిర్వాసితులకు పునరావాసం కల్పించకపోవడం వల్ల గండికోట, చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, సోమశిల, కండలేరులో కూడా పూర్తి స్థాయిలో నీటిని నిల్వ చేయలేని పరిస్థితి ఏర్పడింది. సీఎం జగన్ గండికోట నిర్వాసితులకు రూ.వెయ్యి కోట్లతో, చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్వాసితులకు రూ.250 కోట్లతో పునరావాసం కల్పించారు. దీంతో గండికోటలో 26.85 టీఎంసీలు, చిత్రావతిలో పది టీఎంసీలు నిల్వ చేస్తున్నారు.♦ తెలుగుగంగ ప్రధాన కాలువ, లింక్ కెనాల్కు రూ.500 కోట్లతో లైనింగ్ చేయడం ద్వారా సకాలంలో వెలిగోడు, బ్రహ్మంసాగర్ను నింపడానికి సీఎం జగన్ మార్గం సుగమం చేశారు. బ్రహ్మంసాగర్ మట్టికట్టకు డయాఫ్రమ్ వాల్ ద్వారా లీకేజీలకు అడ్డుకట్ట వేసి పూర్తి స్థాయిలో 17.74 టీఎంసీలు నిల్వ చేస్తున్నారు. ♦ గత నాలుగున్నరేళ్లలో ఆరు రిజర్వాయర్లలో గరిష్ట స్థాయిలో నీటి నిల్వకు మార్గం సుగమం చేయడం ద్వారా నీటి పారుదల రంగ చరిత్రలో సీఎం జగన్ రికార్డు సృష్టించారు. -
నీటిపారుదల అదనపు బాధ్యతలపై స్మితాసబర్వాల్ అయిష్టత!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర నీటిపారుదల శాఖ కార్యదర్శిగా అదనపు బాధ్యతల్లో కొనసాగడం పట్ల ఐఏ ఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ ప్రభుత్వం వద్ద అయిష్టత వ్యక్తం చేసినట్లు తెలిసింది. నీటిపారుదల శాఖపై నిర్వహిస్తున్న సమీక్షలకు ఆమె ఎందుకు రావడం లేదని ఇటీవల ఆ శాఖమంత్రి ఎన్.ఉత్తమ్కుమార్ రెడ్డి ప్రశ్నించగా.. ఈ మేరకు అధికారులు వివరణ ఇచ్చినట్లు సమాచారం. గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి కేసీఆర్కు కార్యదర్శిగా వ్యవహరించిన స్మితా సబర్వాల్ ప్రస్తుతం మిషన్ భగీరథ విభాగం కార్యదర్శిగా కొనసాగుతున్నారు. రజత్కుమార్ పదవీ విరమణ చేసిన సమయంలో స్మితా సబర్వాల్కు నీటిపారుదల శాఖ పూర్తి అదనపు బాధ్యతలు అప్పగి స్తూ సీఎస్ శాంతి కుమారి ఉత్తర్వులు జా రీచేశారు. అయితే ఆమె ఆ బాధ్యతలు స్వీకరించలేదు. నీటిపారుదల శాఖ కార్య దర్శిగా పూర్తి బాధ్యతలు అప్పగిస్తే ఆ పోస్టులో కొనసాగుతానని స్మితా సబర్వాల్ పేర్కొన్నారని ఆశాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఫైళ్లపై సంతకాలు చేయడానికి కూడా ఆమె అయిష్టత వ్యక్తంచేయడంతో రెండు వారాలుగా ముఖ్యమైన ఫైళ్లు పెండింగ్లో ఉండిపోయాయని వెల్లడించారు. -
ప్రాజెక్టుల జాప్యానికి బాధ్యుడు చంద్రబాబే
శ్రీకాకుళం (పాత బస్టాండ్): రాష్ట్రంలో ప్రాజెక్టుల జాప్యానికి పూర్తి బాధ్యుడు చంద్రబాబునాయుడే నని మంత్రి ధర్మాన ప్రసాదరావు స్పష్టం చేశారు. పద్నాలుగేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆయన సాగునీరు, వ్యవసాయం, ఇతర రంగాల అభివృద్ధిని గాలికి వదిలేసి కేవలం నాలుగేళ్ల పాలన చేసిన తమ ప్రభుత్వాన్ని విమర్శించడం సరికాదని హితవు పలికారు. శనివారం శ్రీకాకుళంలోని ఆర్ అండ్ బీ అతిథి గృహంలో మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు ప్రాజెక్టుల వద్దకు కనీస అవగాహనతో వచ్చి ఉంటే బాగుండేదన్నారు. పద్నాలుగేళ్లు ముఖ్యమంత్రిగా ఉండి ఒక్క ప్రాజెక్టునైనా పూర్తి చేశారా అని ప్రశ్నించారు. అబద్ధాలు మాట్లాడటం చంద్రబాబుకు అలవాటుగా మారిందన్నారు. తమ ప్రభుత్వం పాలన ప్రారంభించి కేవలం నాలుగేళ్లు మాత్రమే అయిందని.. అందులో రెండేళ్లు కరోనా కష్టకాలంలోనే గడిచిపోయిందని గుర్తు చేశారు. ఇప్పటికే వంశధార ప్రాజెక్టు 77 శాతం పూర్తయిందని, డిసెంబర్ నాటికి పూర్తి చేసి జాతికి అంకితం చేయనున్నట్లు మంత్రి ప్రకటించారు. టీడీపీ హయాంలో ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పనులు కేవలం 23 శాతం మాత్రమే చేశారన్నారు. నేరడి బ్యారేజీ సమస్యపై ఒడిశా ముఖ్యమంత్రితో చర్చించామని.. ఇలాంటి ప్రయత్నం చంద్రబాబు ఎప్పుడైనా చేశారా అని ధర్మాన ప్రశ్నించారు. రూ.200 కోట్లతో లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును తయారు చేసి సాగునీరు అందించడం జరుగుతోందని తెలిపారు. చంద్రబాబు నిర్వాసితులను నిర్లక్ష్యం చేస్తే, ఇటీవల వారికి రూ.200 కోట్లు మంజూరు చేసి ఆదుకున్నామని గుర్తు చేశారు. మళ్లీ అధికారంలోకి వస్తే వంశధార నిర్వాసితులకు న్యాయం చేస్తామంటున్న చంద్రబాబునాయుడు 14 ఏళ్లు నిర్వాసితులను ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు. ‘విధ్వంసం’ అనే మాటను చంద్రబాబు ఉపసంహరించుకోవాలని మంత్రి డిమాండ్ చేశారు. తెలుగుదేశం పార్టీ హయాంలో ‘నీరు–చెట్టు’ పేరుతో నాయకులు దోపిడీ చేశారన్నారు. వ్యవసాయం దండగ అన్న వ్యక్తి నేడు వ్యవసాయ రంగంపై మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. ప్రాజెక్టులపై ఇన్వెస్ట్మెంట్ దండగ అని చంద్రబాబు తన ‘మనసులో మాట’ పుస్తకంలో రాసుకున్నారని మంత్రి ధర్మాన ప్రసాదరావు గుర్తు చేశారు. -
డెడ్ స్టోరేజీకి ‘నాగార్జున సాగర్’!.. ఆందోళనలో ఆయకట్టు రైతులు
సాక్షిప్రతినిధి, నల్లగొండ: నాగార్జునసాగర్ ఆయకట్టు రైతుల్లో ఆందోళన నెలకొంది. బోరుబావుల వసతి ఉన్నవారు నార్లు పోసి నీటివిడుదల కోసం ఎదురుచూస్తుండగా, మిగతావారు ఎగువ కృష్ణానది నుంచి వరద వస్తుందా? లేదా? అన్న ఆందోళనలో ఉన్నారు. నాగార్జునసాగర్ ప్రాజెక్టు పరిధిలోని ఎడమకాల్వ ద్వారా ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం జిల్లాల పరిధిలో స్థిరీకరించిన ఆయకట్టు 6.57 లక్షల ఎకరాలు. గతేడాది జూలై 28వ తేదీన ఎడమ కాల్వ ద్వారా వ్యవసాయ అవసరాలకు సాగునీటిని విడుదల చేశారు. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. శ్రీశైలం ప్రాజెక్టు వరకే... గత నెల చివరలో కురిసిన వర్షాలతో కృష్ణానదికి ఎగువ నుంచి వరద రాక మొదలైంది. అది కూడా శ్రీశైలం ప్రాజెక్టు వరకే వస్తోంది. దిగువకు అంటే నాగార్జునసాగర్ ప్రాజెక్టులోకి నీరు రాలేదు. ఈ ఆగస్టులోనూ ఇంతవరకు వర్షాలు పడలేదు. శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు (215.81 టీఎంసీలు) కాగా, ప్రస్తుతం 864.57 అడుగుల (120.92 టీఎంసీలు) మేర మాత్రమే నీటినిల్వ ఉంది. ప్రస్తుతం ఎగువ నుంచి 65 వేల క్యూసెక్కుల నీరు ఇన్ఫ్లోగా వస్తోంది. కృష్ణానదికి ఎగువ నుంచి పెద్ద ఎత్తున వరద వస్తే మరో వారంలో ఈ ప్రాజెక్టు నుంచి నీటి విడుదలకు అవకాశం ఉంటుంది. లేదంటే 15 రోజులకుపైగా సమయం పట్టవచ్చని, ఆ ప్రభావం నాగార్జునసాగర్ ఆయకట్టుపైనా తీవ్రంగా ఉంటుందని చెబుతున్నారు. వ్యవసాయశాఖ కూడా అప్పుడే ముమ్మరంగా వరినాట్లు వద్దని, పంటలు ఎండిపోయే పరిస్థితి రావొచ్చని పేర్కొంటోంది. చదవండి: అంకాపూర్ @మక్కవడలు.. చికెన్తో నంజుకుని తింటే.. ఆ టేస్టే వేరు! సాగర్ 570 అడుగులకు చేరితేనే.... నాగార్జునసాగర్ ప్రాజెక్టు గరిష్ట నీటిమట్టం 590 అడుగులు. కుడి, ఎడమ కాల్వలకు నీరు విడుదల చేయాలంటే సాగర్ జలాశయంలో కనీసం 570 అడుగుల మేర నీటినిల్వ ఉండాలి. అయితే ప్రస్తుతం నాగార్జునసాగర్ ప్రాజెక్టు డెడ్ స్టోరేజీకి దగ్గరలో ఉంది. డెడ్ స్టోరేజీ 510 అడుగులు కాగా, ప్రస్తుతం 515.4 అడుగుల మేర నీరు నిల్వ ఉంది. నల్లగొండ, హైదరాబాద్ తాగునీటి అవసరాలకు మాత్రమే ఈ నీటిని వినియోగించుకునే పరిస్థితి నెలకొంది. వ్యవసాయానికి ఇచ్చే పరిస్థితి లేదు. సాగర్ రిజర్వాయర్లోని బ్యాక్వాటర్ నుంచే నల్లగొండ జిల్లాలో మిషన్ భగీరథ కింద 597 గ్రామాలకు రోజుకు 25 క్యూసెక్కుల తాగునీటిని సరఫరా చేయాల్సి వస్తోంది. హైదరాబాద్ జంట నగరాలకు తాగునీటి అవసరాల కోసం రోజుకు 595 క్యూసెక్కుల నీటిని సరఫరా చేస్తున్నారు. నారు ఎండిపోతోంది పదిహేను రోజుల క్రితం వరినారు పోశాను. ఎడమకాల్వ నీటికోసం ఎదురుచూస్తున్నా. బోరుబావుల కింద ఐదు ఎకరాలు నాట్లు వేశా. ఎడమకాల్వ నుంచి నీరు విడుదల కాకపోవడంతో బోర్లలో కూడా నీరు తగ్గిపోయింది. నారుమడి, నాట్లు ఎండిపోయే దశకు చేరుకున్నాయి. సకాలంలో సాగునీరు అందించకుంటే నష్టపోయే ప్రమాదం ఉంది. – పసునూరి హనుమంతరెడ్డి, రైతు,యాద్గార్పల్లి, మిర్యాలగూడ సాగర్ ప్రాజెక్టు కుడి, ఎడమ కాల్వలకు నీటి విడుదల ఇలా... ►2019- ఆగస్టు 12 ►2020- ఆగస్టు 8 ►2021- ఆగస్టు 2 ►2022 - జూలై 28 ప్రాజెక్టుల నీటిమట్టం ఇలా... (అడుగుల్లో) గరిష్టం ప్రస్తుతం శ్రీశైలం 885 864.57 నాగార్జున సాగర్ 590 515.4 -
గోదావరిపై లిఫ్ట్ ఇరిగేషన్ ఘనత నాదే
సాక్షి, రాజమహేంద్రవరం/రాజమహేంద్రవరం రూరల్/మధురపూడి/సీతానగరం: గోదావరిపై ఉన్న ప్రతి లిఫ్ట్ ఇరిగేషన్ తెచ్చిన ఘనత తనకే దక్కుతుందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. తూర్పుగోదావరి జిల్లా పర్య టనలో భాగంగా మంగళవారం సీతానగరం మండలం పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకాన్ని పరిశీలించిన ఆయన అనంతరం కోరుకొండ బహిరంగ సభలో ప్రసంగించారు. ఆవ భూముల్లో రూ.500 కోట్ల అవినీతి జరిగిందన్నారు. రాష్ట్రంలో జే–ట్యాక్స్ నడుస్తుంటే రాజానగ రంలో జక్కంపూడి ట్యాక్స్ నడుస్తోందని ఆరోపించారు. బ్లేడ్ బ్యాచ్ పట్ల జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. దళితుడిని చంపి డోర్ డెలివరీ చేసిన అనంతబాబును పక్కన పెట్టు కుంటావా జగన్ అని ప్రశ్నించారు. ముని కూడలిలో గతంలో శిరోముండనానికి గురైన యువకుడితో మాట్లాడించారు. పురుషోత్త పట్నం ప్రాజెక్టు వద్ద ప్రభుత్వంపై విమర్శలు చేశారు. పురుషోత్తపట్నం ఒక చరిత్రని, రెండులక్షల రైతుల జీవితాన్ని మార్చే ప్రాజెక్టుకు నీళ్లు అందించాలన్న ప్రాజెక్టును నాశనం చేశారన్నారు. తాను కట్టడం వల్లే దానిని వాడకూడదని జగన్ ఆలోచిస్తున్నాడన్నారు. ప్రజావేదికను కూల్చినట్టు ప్రాజెక్టు కూలిస్తే ఇక్కడి ప్రజలు తాటతీస్తారని హెచ్చరించారు. పోలవరంపై చేతులెత్తేశారు రాజమహేంద్రవరంలో సాగునీటి ప్రాజెక్టులపై చంద్రబాబు పవర్పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. పోలవరం ప్రాజెక్టు 41.15 మీటర్ల ఎత్తులోనే నిర్మాణమంటున్న సీఎం జగన్ దీనిని నిర్మించలేనని చేతులెత్తేసి, కేంద్ర ప్రభుత్వమే నిర్మించాలంటున్నారని విమర్శించారు. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణానికి కేంద్రమే నిధులిస్తుందని, మనం చేయాల్సిందల్లా ఎలాంటి ఆరోపణలు తప్పులు చేయకుండా, వారి సూచనల ప్రకారం ప్రాజెక్ట్ నిర్మించడమేనని చెప్పారు. వైఎస్ జగన్ చేసిన పనుల వల్లే కాఫర్ డ్యామ్, డయాఫ్రమ్ వాల్ మొత్తం పోయాయన్నారు. చేయాల్సిన నాశనంచేసి, ఇప్పుడు కేంద్రమే నిర్మించాలంటూ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ప్రాజెక్ట్ నిర్మాణాలు ఎందుకు దెబ్బతిన్నాయనే దానిపై హైదరాబాద్ ఐఐటీ ఒక నివేదిక ఇచ్చిందని తెలిపారు. అందులో 14 కారణాలు చెబితే.. 13 కారణాలు వైఎస్సార్సీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం, చేతగానితనమేనని తేల్చాయని పేర్కొన్నారు. -
త్వరలో నీటిపారుదల సమీకృత చట్టం
సాక్షి, హైదరాబాద్: నీటిపారుదల శాఖకు సంబంధించిన 18 వేర్వేరు చట్టాలను కలిపి కొత్తగా ఒక సమీకృత నీటిపారుదల చట్టాన్ని తెస్తున్నామని ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్కుమార్ తెలిపారు. ఇప్పటికే ముసాయిదా బిల్లును సిద్ధం చేశామని, బడ్జెట్ సమావేశాల్లో కాకుండా ఆ తర్వాత జరిగే సమావేశాల్లో ఈ బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టే అవకాశముందన్నారు. నీటిపారుదలశాఖపై ఈఎన్సీ సి.మురళీధర్తో కలసి మంగళవారం ఆయన జలసౌధలో సమీక్ష నిర్వహించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. నిజాం కాలం నాటి ఫసలి చట్టం 1935 అమల్లో ఉండగా రాష్ట్ర నీటిపారుదల రంగంలో సమూల మార్పులు రావడంతో కొత్త చట్టం అనివార్యమైందన్నారు. నీటిపారుదల శాఖ పునర్వ్యవస్థీకరణతోపాటు నీటి నిర్వహణ పద్ధతులు, ఆర్థికపరమైన అధికారాలు, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ నిబంధనల్లో భారీ మార్పులు వచ్చాయని... నీటిపారుదల ఆస్తుల పరిరక్షణ, నీటి భద్రత, నిర్వహణ అంశాలు పాత చట్టాల్లో లేవని, కొత్త చట్టంలో వాటిపై కచి్చతమైన నిబంధనలను పొందుపరచనున్నట్లు రజత్కుమార్ వెల్లడించారు. సెక్షన్–3పై వెనక్కి తగ్గలేదు.. ఏపీ, తెలంగాణ మధ్య కృష్ణా జలాల పంపకాల కోసం అంతర్రాష్ట్ర నదీ జలాల వివాద చట్టం–1956లోని సెక్షన్ 3 కింద ట్రిబ్యునల్ ఏర్పాటుపై కేంద్ర ప్రభుత్వ నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నామని రజత్కుమార్ తెలిపారు. కృష్ణా జలాల పంపిణీ బాధ్యతను కొత్త ట్రిబ్యునల్కు అప్పగించాలా లేక ఇప్పటికే మనుగడలో ఉన్న కృష్ణా ట్రిబ్యునల్–2 లేదా మరే ఇతర ట్రిబ్యునల్కు అప్పగించాలా? అనే అంశంపై న్యాయశాఖ సలహా మేరకు చర్యలు తీసుకుంటామని గత అపెక్స్ కౌన్సిల్ భేటీలో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి హామీ ఇచ్చారని ఆయన గుర్తుచేశారు. దీనిపై నెల రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని ఆ శాఖ అధికారులు గతేడాది డిసెంబర్లో హామీ ఇచ్చారని... అందువల్ల ఈ విషయమై మళ్లీ సుప్రీంకోర్టుకు ఎందుకు వెళ్లాలనే భావనతో ఉన్నామని చెప్పారు. ఒకవేళ కేంద్రం నిర్ణయం తీసుకోకుంటే మళ్లీ సుప్రీంకోర్టుకు వెళ్తామని స్పష్టం చేశారు. కృష్ణా జలాల్లో ఉమ్మడి ఏపీకి 811 టీఎంసీల వాటా ఉండగా తెలంగాణకు 575 టీఎంసీలు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నామని, ట్రిబ్యునల్ ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటామన్నారు. గోదావరి జలాల విభజనకూ కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటును ఏపీ కోరడంపై స్పందిస్తూ తమకు ఎలాంటి అభ్యంతరం ఉండదన్నారు. ఎనిమిది డ్యామ్ల మరమ్మతుల కోసం కేంద్రానికి ప్రతిపాదనలు.. ఆనకట్టల భద్రతా చట్టం కింద కడెం, మూసీ, స్వర్ణతోపాటు మొత్తం 8 డ్యామ్ల మరమ్మతుల కోసం కేంద్రానికి ప్రతిపాదనలు పంపిస్తున్నామని తెలిపారు. మూసీ ప్రాజెక్టు పరిస్థితి ఆందోళనకరంగా ఉందన్నారు. సీతమ్మసాగర్ జలాశయం నిర్మాణంతో సీతారామ ప్రాజెక్టుకు సంబంధించిన పంపులు నీటమునగనున్నాయని జరుగుతున్న ప్రచారంలో వాస్తవంలేదని రజత్కుమార్ స్పష్టం చేశారు. -
ఇంత విషమా? కూసింత బాబుగారి వైపు చూడరా?
ఊహించిందే. ఎప్పటిలాగే విషపు రాతలు. సీమంతైనా మేలు చేశారా? అంటూ సీఎం జగన్ను, ఏపీ ప్రభుత్వాన్ని ఉద్దేశిస్తూ చంద్రబాబుకు కొమ్ముకాస్తూ కాకమ్మ కథలు రాసింది ఈనాడు . అఫ్కోర్స్.. అది కర్నూల్లో రాయలసీమ గర్జన నేపథ్యంలో ఉక్రోశంతో రాసిందే!. కానీ. పరిస్థితులను ఒక్కసారి బేరీజూ వేసుకోవాలి కదా. ఆ మాత్రం సోయి లేకపోతే ఎలా? అన్నింటికి మించి తల్లి పాలు త్రాగి రొమ్ము గుద్దే చంద్రబాబు ఘనతను కూడా ఒక్కసారైన గుర్తించాలి కదా!. పద్నాలుగేళ్లుగా ముఖ్యమంత్రిగా చేసిన బాబు రాయలసీమ లోనే కాదు, రాష్ట్రంలో ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్ అయినా పూర్తి చేసారా?.. ఇదీ ఈనాడు గుర్తించాల్సిన ప్రధానమైన విషయం. అంతెందుకు సొంత నియోజకవర్గం కుప్పంలోనే బ్రాంచ్ కెనాల్ పూర్తి చేయలేకపోయాడు. మరి సీఎం జగన్.. ఆరు నెలల్లో హంద్రీ–నీవా కుప్పం బ్రాంచ్ కెనాల్ను పూర్తి చేస్తారు. బాబు హయాంలో కంటే.. సీఎం జగన్ హయాంలోనే ఇరిగేషన్ పనులు ఊపందుకున్నాయనడానికి ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలి. అయినా ఇది జనమెరిగిన సత్యం. ► వైఎస్ జగన్ మోహన్రెడ్డి సీఎం అయ్యాక 2 సంవత్సరాలు కరోనా ఉంది అని మరిచిపోతే ఎలా?.. అయినా కూడా పరిస్థితులకు ఎదురొడ్డి పనులను త్వరగతిన పూర్తి చేసే యత్నం చేస్తున్నారు కదా. ఓ.. బాబూ డైరెక్షన్ కదా.. అందుకే అవేమీ పేపర్కి ఎక్కవేమో!. ► ఇది పక్కన పెడితే.. రాయలసీమలో శ్రీ సిటీ సంగతి ఏంటి? అది ఆనాడు మహానేత వైఎస్ఆర్ ప్రారంభించారు. ఇప్పుడు అది ఏపీ పరిశ్రమల కేంద్రంగా విరజిల్లుతోంది. అచ్చం శ్రీసిటీ లాగా .. కడప కొప్పర్తిని అభివృద్ధి చేస్తున్నారు జన నేత వైఎస్ జగన్. మరి చంద్రబాబు ఏం చేశాడు?.. సీమ లో పుట్టి సీమకు ద్రోహం చేయడం తప్పించి!. ► కరువు సీమగా పేరొందిన రాయలసీమకు నీళ్లు ఇవ్వాలని, 2007-08లో ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి.. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ను 11 వేల క్యూసెక్కుల నుంచి 44 వేల క్యూసెక్కుల సామర్ద్యానికి పెంచడానికి చర్యలు చేపట్టారు. అప్పుడేం జరిగిందో ఈనాడుకు గుర్తు లేనట్లుంది. ఒకసారి గుర్తు చేద్దాం.. బాబుగారి(చంద్రబాబు) ఆదేశాల మేరకు, యెల్లో పార్టీ నేతలు దేవినేని ఉమ చౌదరి , కోడెల శివప్రసాదరావు చౌదరి తదితరులు పెద్ద ఎత్తున విజయవాడ ప్రకాశం బ్యారేజీ వద్దకు చేరుకున్నారు. ధర్నా చేసి మరీ రాయలసీమకు వైఎస్ జలాన్ని మళ్లిస్తున్నారని, ఇది జలదోపిడీ అంటూ ఆందోళన చేశారు. మరొకటి చూద్దాం.. ► మద్రాస్ లో వరదలు వచ్చినప్పుడు పక్కనే తిరుపతిలో పదివేల ఉద్యోగాలు కల్పన కోసం హెచ్సీఎల్ ఏర్పాటు చేస్తామని.. ఆ కంపెనీ చైర్మన్ శివనాడార్ తిరుమలకు వచ్చిన సందర్బంలో ప్రకటించారు. కానీ, సీఎంగా చంద్రబాబు చేసింది ఏంటి?.. శివనాడార్పై ఒత్తిడి తెచ్చి తన అమరావతిలో పెట్టమని ఒత్తిడి చేయడమా?. ► కేంద్రం ఇచ్చిన అన్ని సంస్థల్లో ఉన్నతమైంది ఎయిమ్స్. ఆ ఎయిమ్స్ అనంతపురం నుంచి మంగళగిరికి తరలిపోయింది బాబుగారి దయవల్ల కాదా? ► శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం (నవంబర్ 16,1937) .. రాజధాని, హైకోర్టుల్లో ఏదో ఒకటి రాయలసీమకు ఇవ్వాలి. అందులో ఏం కావాలో కోరుకునే స్వేచ్ఛ సైతం రాయలసీమకుంది. కానీ చంద్రబాబు ఏం చేశాడు? అన్నీ అమరావతి లోనే పెట్టి మా వాళ్ళు మాత్రమే బాగుపడాలని కోరుకున్నాడు. పోనీ ఇవన్నీ పక్కనపెడితే.. ► కాపు గర్జన సందర్భంగా అప్పుడు తునిలో రైలు తగలపడితే ఇది రాయలసీమ రౌడీల పని అని ప్రకటన ఇచ్చాడు చంద్రబాబు. మరి అరెస్ట్ చేసింది కోస్తా కాపులను!. రాయలసీమ ద్రోహిగా బాబుగారు సాధించిన పై ఘనతలు.. బహుశా ఈనాడుకు, దాని అధినేత రామోజీరావు, మిగిలిన యెల్లో మీడియా పేపర్లు.. ఛానెల్స్ దృష్టిలో ఏనాటికీ పడవేమో! -
ముగిసిన కృష్ణా రివర్ మేనేజ్మెంట్ కమిటీ సమావేశం
-
అన్నదాతపై జీఎస్టీ పిడుగు
సాక్షి, హైదరాబాద్: జీఎస్టీ భూతం సూక్ష్మసేద్యానికి విఘాతం కలిగిస్తోంది. వివిధ పంటల కోసం వ్యవసాయ భూముల్లో సూక్ష్మసేద్యం పరికరాలను ఏర్పాటు చేసుకోవాలంటే రైతులు 12 శాతం జీఎస్టీ భరించాల్సిరావడమే దీనికి కారణం. సూక్ష్మసేద్యం కోసం ఇప్పటికే లక్షలాది దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. అయితే జీఎస్టీ సొమ్ము చెల్లించలేక రైతులు వెనుకడుగు వేస్తుండటంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు. రాష్ట్రప్రభుత్వం ఎస్సీ, ఎస్టీలకు ఉచితంగా, బీసీ రైతులకు 90 శాతం, ఇతరులకు 80 శాతం వరకు సబ్సిడీ అందిస్తోంది. ఎకరానికి సూక్ష్మసేద్యం ఏర్పాటు చేసుకోవాలంటే దాదాపు రూ.25 వేల నుంచి రూ.30 వేల వరకు ఖర్చు అవుతుంది. నాలుగు ఎకరాల్లో సూక్ష్మసేద్యం ఏర్పాటు చేసుకోవాలంటే రూ.లక్షకుపైగానే ఖర్చుకానుంది. కానీ, జీఎస్టీ భారాన్ని మాత్రం ఆ వర్గాల రైతులు భరించాల్సి వస్తోంది. అంటే ఎకరానికి రూ. 3 వేల నుంచి రూ. 4 వేల వరకు అన్నివర్గాలూ జీఎస్టీ కింద చెల్లించాల్సి వస్తోంది. నాలుగెకరాల్లో సూక్ష్మసేద్యం నెలకొల్పాలంటే రూ. 12–16 వేల వరకు ఖర్చు చేయాల్సి వస్తుంది. ఎస్సీ, ఎస్టీలకు వేల రూపాయలు ఖర్చయ్యే సూక్ష్మసేద్యం పరికరాలను ఉచితంగా బిగిస్తున్నా, జీఎస్టీని మాత్రం ఆయా రైతులు భరించాల్సి వస్తోంది. సూక్ష్మసేద్యంతో నీటి ఆదా...: సూక్ష్మసేద్యం ద్వారా అద్భుత ఫలితాలు వస్తున్నందున ఈ ఏడాది కూడా పెద్దమొత్తంలో రైతులకు సూక్ష్మసేద్యం పరికరాలు అందించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. సూక్ష్మసేద్య పద్ధతి ద్వారా రాష్ట్రంలో 43 శాతం(25 టీఎంసీల) నీటిని పొదుపు చేశారు. వివిధ రకాల పంటల సాగును నూతన పద్ధతుల ద్వారా ప్రోత్సహించారు. ఈ పథకాన్ని పంటల సాగుకు వాడటంతో 33 శాతం విద్యుత్ అంటే 1,703 లక్షల యూనిట్లు ఆదా అయినట్లేనని న్యాబ్కాన్స్ సంస్థ చేసిన సర్వేలో తేలింది. మైక్రో ఇరిగేషన్ అమలు వల్ల 52 శాతం దిగుబడి పెరిగినట్లు గుర్తించారు. ఎందుకంటే మొక్కకు అవసరమైన నీరు నేరుగా సూక్ష్మసేద్యం పైపుల ద్వారా వెళుతుంది. మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్ట్లో అందించిన పరికరాల ద్వారా ఏడేళ్ల వరకు లబ్ధిపొందవచ్చు. అందుకే ఈ పద్ధతిని ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. అయితే గత లెక్కల ప్రకారం చూస్తే సూక్ష్మసేద్యంలో తెలంగాణ వెనుకబడింది. దేశవ్యాప్తంగా 2.30 కోట్ల ఎకరాల్లో సూక్ష్మసేద్యం అందుబాటులోకి వచ్చింది. కానీ, తెలంగాణలో కేవలం 5 లక్షల ఎకరాల్లోపే ఉందని అంచనా. ఆయిల్పాం సాగుకు దెబ్బ ప్రస్తుతం 55 వేల ఎకరాలకే పరిమితమైన ఆయిల్పాం విస్తీర్ణాన్ని రానున్న రోజుల్లో 20 లక్షల ఎకరాలకుపైగా విస్తరించాలని రాష్ట్ర సర్కారు లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటివరకు ప్రభుత్వ సంస్థ ఆయిల్ ఫెడ్ పరిధిలోనే ఉన్న ఆయిల్పాం సాగును ప్రైవేట్ కంపెనీలకు అప్పగించింది. రాష్ట్రంలో 10 ప్రైవేట్ కంపెనీలకు వివిధ జిల్లాల్లో ఆయిల్పాం సాగుకు అవసరమైన ఏర్పాట్లు చేసే బాధ్యత అప్పగించింది. 2022–23 వ్యవసాయ సీజన్లో రెండు లక్షల ఎకరాల్లో సాగు చేయాలని ఉద్యానశాఖ నిర్దేశించింది. ఆయిల్పాం సాగులో సూక్ష్మసేద్యం పరికరాలే కీలకపాత్ర పోషిస్తాయి. కానీ, సూక్ష్మసేద్యం ఏర్పాటులో జీఎస్టీ భారం వల్ల అనేకచోట్ల రైతులు వెనకడుగు వేస్తున్నారు. సూక్ష్మసేద్యం మంజూరైన చోట్ల కూడా రైతులు జీఎస్టీ భారం భరించలేక, ఆ సొమ్ము చెల్లించకపోవడంతో అవి నిలిచిపోయాయి. రైతులకు భారం కానున్న నేపథ్యంలో ప్రభుత్వం ముందుకు రావాలని, లేకుంటే కంపెనీలైనా ఆ భారాన్ని భరించాలని పలువురు కోరుతున్నారు. ఇదీ చదవండి: Indian Racing League: రెడీ టూ రైడ్.. ఇండియన్ రేసింగ్ లీగ్కు సర్వం సిద్దం -
పల్లెల్లోకి రండి.. నీటి పరుగు చూపిస్తాం: మంత్రి హరీశ్రావు
సిద్దిపేటజోన్/సిద్దిపేటకమాన్:హైదరాబాద్, ఢిల్లీలో కూర్చొని మాట్లాడడం కాదు.. తెలంగాణ పల్లెల్లో, సిద్దిపేట నియోజకవర్గ పరిధిలో క్షేత్రస్థాయిలో చూస్తే కాళేశ్వరం గురించి తెలుస్తుందని మంత్రి హరీశ్రావు అన్నారు. సిద్దిపేటలోని క్యాంపు కార్యాలయంలో బుధవారం జరిగిన కార్యక్రమంలో నియోజకవర్గ పరిధిలోని వివిధ కుల సంఘాలకు రూ.2 కోట్ల విలువైన కమ్యూనిటీ భవన నిర్మాణ ప్రొసీడింగ్ పత్రాలు అందించారు. ఈ సందర్భంగా హరీశ్రావు మాట్లాడుతూ.. నీరు పారలేదంటున్న వాళ్లు సిద్దిపేట నియోజకవర్గానికి వచ్చి చెరువులను చూస్తే తెలుస్తుందన్నారు. ఎప్పుడూ నిండని రాఘవాపూర్ చెరువు ఇప్పుడు గోదారి నీటితో కళకళలాడుతోందని, ఒకప్పుడు రాఘురూకుల, చింతమడక, నారాయణరావుపేట, తోర్నాలలు కరువు ప్రాంతాలుగా ఉండేవని, ఇప్పుడవి సస్యశ్యామలం అయ్యాయని తెలిపారు. రాష్ట్రంలో గుంటెడు భూమైనా పడావు పడి ఉందా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ హయాంలో సిద్దిపేట నియోజకవర్గం పరిధిలో కరంట్ సమస్యపై విద్యుత్ కార్యాలయం వద్ద వంటావార్పు, రాత్రి బస చేశామని, కానీ.. ఇప్పుడు సీఎం కేసీఆర్ హయాంలో రాష్ట్రంలో 24 గంటలు నాణ్యమైన విద్యుత్ వస్తోందని తెలిపారు. తెలంగాణలో రైతుల బావుల వద్ద మీటర్లు పెట్టలేదని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాష్టానికి వచ్చే 30 వేల కోట్లు ఆపిందని ఆరోపించారు. కేంద్రం వద్ద 16 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, అవి భర్తీ చేయకపోగా, ఉన్న ఉద్యోగాలను ఊడగొట్టేపని పెట్టుకుందన్నారు. నియోజకవర్గ పరిధిలో ప్రతి ఊరికి కుల సంఘాల భవనాలున్నాయని, ఒక్కో ఊరిలో రెండు, మూడు, ఐదు, ఎనిమిది, 11 చొప్పున కమ్యూనిటీ భవనాలు ఉన్నాయని చెప్పారు. ఇబ్బందైనా కష్టపడి నిధులు తెచ్చానని, కొబ్బరికాయలు కొట్టి కొట్టి చెయ్యి నొప్పి పెట్టిందని చమత్కరించారు. కాగా, బుధవారం సిద్దిపేట ప్రభుత్వ మెడికల్ కళాశాలలో జరిగిన వార్షికోత్సవంలో కూడా ఆయన పాల్గొన్నారు. మెరుగైన వైద్యమే సీఎం ధ్యేయం పేదలు, గ్రామీణ ప్రాంత వాసులకు మెరుగైన వైద్యం అందించాలన్నదే సీఎం కేసీఆర్ ధ్యేయమని ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. బుధవారం సిద్దిపేట ప్రభుత్వ మెడికల్ కళాశాల వార్షికోత్సవంలో ఆయన మాట్లాడుతూ రష్యా, ఉక్రెయిన్ యుద్ధం సందర్భంగా తెలంగాణకు తిరిగి వచ్చిన వైద్య విద్యార్థులు ఆ ప్రాంతాలకు వెళ్లలేక ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. నేషనల్ మెడికల్ కౌన్సిల్ అనుమతి ఇస్తే వారికి సహకరించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి హరీశ్ స్పష్టం చేశారు. -
పంటలకు పోల‘వరం’..నిర్మాణ దశలోనే అందుతున్న నీరు
పిఠాపురం: పోలవరంలోనే ఉంది వరం. నిర్మాణ దశలోనే రైతులకు వరంగా మారింది. వర్షాధారంతోనే సాగయ్యే మెట్ట భూములకు పనులు పూర్తి కాకుండానే సాగునీరందిస్తోంది. ఇప్పటి వరకు పోలవరం ఎడమ కాలువ 80 శాతం పనులు పూర్తి కాగా ప్రాజెక్టు పనులు తుది దశకు చేరుకున్నాయి. వర్షాభావ పరిస్థితుల్లో పోలవరం కాలువ వేల ఎకరాలలో పంటలకు నీరందించి సిరులు కురిపిస్తోంది. కాలువ తవ్విన ప్రాంతాల్లో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు జలకళ ఉట్టిపడుతోంది. ఎక్కడ చూసినా కాలువ నిండా నీటి నిల్వలు ఉండడంతో సమీప పొలాలకు రైతులుమోటార్ల ద్వారా నీటిని తోడి సాగు చేస్తున్నారు. ఎనిమిదేళ్లుగా పోలవరం కాలువపై ఆధార పడి జిల్లాలో సుమారు 2580 ఎకరాల వరకూ మెట్ట భూముల్లో 2300 ఎకరాల వరకు వరి సాగు చేస్తున్నారు. అపరాల నుంచి వరి వరకు పోలవరం కాలువపైనే ఆధారపడి సాగు చేస్తున్నారు. ఇంకా ప్రారంభం కాకుండానే రైతులకు ఉపయోగపడుతున్న ఈ కాలువ పనులు పూర్తయితే వేలాది ఎకరాల భూములు సస్యశ్యామలమవుతాయి. రబీకి అండగా.. వర్షాకాలంలో కాలువ నిండుగా మారి ఎద్దడి సమయంలో సాగు చేసే రబీ పంటకు నీరందిస్తోంది. జగ్గంపేట, ప్రత్తిపాడు, కిర్లంపూడి, పెద్దాపురం, తొండంగి, గొల్లప్రోలు తదితర మండాలల్లో ఎక్కువగా పంట పొలాలకు రబీ సీజన్లో నీటి ఎద్దడి ఎదురవుతుంది. అలాంటి సమయంలో కాలువ చివరి భూములకు, మెట్ట భూములకు ప్రస్తుతం పోలవరం కాలువే నీటి వనరుగా మారిపోయింది. కాలవకు ఆనుకుని కిలో మీటరు దూరంలో ఉన్న అన్ని భూములకూ రైతులు ఇంజిన్ల ద్వారా నీటిని తోడుకుంటున్నారు. సాగు చేసుకుంటున్నారు. వర్షాల కోసం ఎదురు చూడకుండా కాలువలోని నీటి సహాయంతో ముందుగా నారు మళ్లు వేసుకుంటున్నారు. నీటి ఎద్దడి ఎదురైతే వెంటనే ఇంజిన్ల సహాయంతో నీటిని తోడి పంట ఎండిపోకుండా కాపాడుకుంటున్నారు. కాలువు సమీపంలోని రైతులు ఇంజిన్లతో నీటిని తోడుకోవడం ఖర్చుతో కూడుకున్న పని. దీంతో ఎక్కువ మంది కలిసి నిధులు సమకూర్చుకుని పెద్ద ఇంజిన్లను ఏర్పాటు చేసుకుంటున్నారు. పోలవరం కాలువే కాపాడుతోంది నేను ఎనిమిదెకరాలు సాగు చేస్తున్నాను. కాలువ తవ్వక ముందు నీటి ఎద్దడి వస్తే పంటలు ఎండిపోయి తీవ్ర నష్టాలు వచ్చేవి. ఎనిమిదేళ్లుగా పోలవరం కాలువ అండగా నిలిచింది. ఖరీఫ్ నుంచి రబీ, అపరాల సాగు వరకు నీటి ఎద్దడి ఎదురైనా ఇబ్బంది లేకుండా ఉంటోంది. పక్కనే కాలువ నిండా ఎప్పుడు నీరు ఉంటుండడంతో మాకు భయం లేకుండా పోయింది. ఒక వేళ నీటి ఎద్దడి వస్తే ఇంజన్లతో నీరు తోడుకుని సాగునీటి అవసరాలు తీర్చుకుంటున్నాం. – కోరుమిల్లి నూకరాజు, కౌలు రైతు, చెందుర్తి, గొల్లప్రోలు మండలం. కాలువ లేనప్పుడు కష్టాలు పడ్డాం కాలువ లేని సమయంలో చాలా కష్టాలు పడ్డాం. పంట వేయడమే గగనంగా ఉండేది. నీరందక పంటలు ఎండిపోయేవి. ఎక్కువగా బోర్లపై ఆధారపడే వాళ్లం. అదీ కొందరికే అవకాశం ఉండేది. కౌలు రైతులయితే ఒక పక్క పంటలు పోవడం వల్ల అటు కౌలు, ఇటు పెట్టుబడి నష్ట పోయేవారు. ఇప్పుడు పోలవరం కాలువ కొండంత అండగా నిలిచింది. ఎప్పుడు కావాలన్నా అప్పుడు పంటలు వేసుకుంటున్నాం. . – వాసంశెట్టి శ్రీనివాస్, కౌలు రైతు చెందుర్తి, గొల్లప్రోలు మండలం. పోలవరం కాలువ రైతులకు వరమే బోర్లతో పని లేకుండా కాలువ నీటితో సాగు చేసుకుంటున్నారు. కొంత పెట్టుబడి అయినా పంట నష్ట పోకుండా కాపాడుకోగలుగుతున్నారు. ఇంతకు ముందు కంటే ఇప్పుడు సాగు విస్తీర్ణం బాగా పెరిగింది. గతంలో అపరాల సాగు అంతంత మాత్రంగానే ఉండేది. ఇప్పుడు సాగు పెరిగింది. రైతులు ధైర్యంగా సాగు చేసుకుంటున్నారు. నీటి ఎద్దడి వల్ల పంటలు పోయాయనే మాట వినపడటంలేదు. – సత్యనారాయణ, వ్యవసాయశాఖాధికారి. గొల్లప్రోలు. ఇదీ చదవండి: రీసర్వేలో మరో మైలురాయి.. 8 లక్షలకుపైగా ఎకరాలకు సరిహద్దుల నిర్ణయం -
Anakapalle: అయ్యన్నపాత్రుడు ఇంటి వద్ద భారీగా పోలీసులు
-
భలే దొంగలు...ఏకంగా 60 అడుగుల బ్రిడ్జినే...
Thieves Stolen 60 Feet Steel Bridge: ఇటీవల దొంగతనానికి వచ్చి గోడ కన్నంలో ఇరుక్కుపోయిన ఘటన గురించి విన్నాం. బంగారం, డబ్బులు, ఇంట్లో ఫర్నిచర్ వంటివి ఎత్తుకుపోవడం గురించి విన్నాం. కానీ అసాధ్యమైనవి, అలాంటివి కూడా ఎత్తుకుపోతారా అనిపించే వాటిని ఒక దొంగల ముఠా పక్కా ప్లాన్తో ఎత్తుకుపోయింది. పైగా స్థానికుల సాయంతో దర్జాగా పట్టుకెళ్లిపోయింది. వివరాల్లోకెళ్తే...బిహార్లోని రోహతాస్ జిల్లాలో పట్టపగలు 60 అడుగుల వంతెనను దొంగలించారు. అసలెవరూ ఊహించని విధంగా అసాధారణమైన దాన్ని ఎత్తుకెళ్లిపోయారు. పోలీసుల కథనం ప్రకారం...అమియావర్ గ్రామం వద్ద 1972లో అర్రా కాలువపై వంతెన నిర్మించారు. ఇది ఇప్పుడూ చాలా పాతది మాత్రమే కాదు, ప్రమాదకరమైనది కూడా. అయితే స్థానిక గ్రామస్తులు ప్రస్తుతం ఈ వంతెనను వినియోగించడంలేదు. ఈ మేరకు ఒక దొంగల ముఠా నీటి పారుదల శాఖ అధికారులుగా ఆ గ్రామంలోని స్థానికులకు పరిచయం చేసుకున్నారు. ఆ వంతెనను కూల్చివేస్తున్నామని చెప్పడమే కాకుండా గ్రామస్తుల సాయం కూడా తీసుకున్నారు. ఆ వంతెన ఉక్కుతో కూడిన నిర్మాణం. ఆ ముఠా గ్యాస్ కట్టర్లు, ఎర్త్మూవర్ యంత్రాలను ఉపయోగించి వంతెనను కూల్చివేసి, మూడు రోజుల్లో మొత్తం మెటల్ని స్వాహా చేశారు. దీంతో నీటి పారుదల శాఖ అధికారుల అప్రమత్తమై పోలీసులకు ఫిర్యాదు చేశారు. చోరీ పై ఫిర్యాదు అందడంతో పోలీసులు ఘటనస్థలికి వచ్చి దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ వంతెన 60 అడుగుల పొడవు, 12 అడుగుల ఎత్తు ఉంటుందని చెబుతున్నారు పోలీసులు. గతంలో ఇలాంటి ఘటనలు చెక్ రిపబ్లిక్, యూఎస్లోని పెన్సిల్వేనియా, ఉక్రెయిన్ వంటి దేశాల్లో చోటు చేసుకున్నాయి. ఏదిఏమైన దొంగలకు కూడా రొటిన్గా చేసే దొంగతనాలు పై బోర్ కొట్టిందో ఏమో ఇలా వైరైటీగా దొంగతనం చేయాలనుకున్నారు కాబోలు. Bihar |60-feet long-abandoned steel bridge stolen by thieves in Rohtas district Villagers informed some people pretending as mechanical dept officials uprooted bridge using machines like JCB & gas-cutters. We've filed the FIR:Arshad Kamal Shamshi, Junior Engineer,Irrigation dept pic.twitter.com/o4ZWVDkWie — ANI (@ANI) April 9, 2022 (చదవండి: ఏ క్షణంలోనైనా మీ ప్రాణాలు పోవచ్చు.. మాజీ సీఎంలకు వార్నింగ్) -
పోలవరం నిర్వాసితులకు పరిహారం నేరుగా వారి ఖాతాల్లోకే
-
టీడీపీ నేత దేవినేనిని నమ్మి మోసపోయాం
సాక్షి, అమరావతి: టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమ మాటలు నమ్మి మోసపోయామని ట్రాన్స్ట్రాయ్ కంపెనీ కింద సబ్ కాంట్రాక్టులు చేసిన కాంట్రాక్టర్లు ఆవేదన వ్యక్తం చేశారు. అప్పటి బిల్లులు చెల్లించకపోవడంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వాపోయారు. ఈ మేరకు సబ్ కాంట్రాక్టర్లు తాడేపల్లిలో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిని కలిసి మంగళవారం వినతిపత్రం అందజేశారు. టీడీపీ హయాంలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం రూ.20 కోట్లుపైనే ఖర్చు చేసినా ఇంతవరకు బిల్లులు మంజూరు చేయలేదన్నారు. అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమ తమను మోసం చేశారని తెలిపారు. తమ సమస్యలను సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకెళ్లి న్యాయం జరిగేలా చూడాలని విన్నవించారు. -
వేగంగా వెలిగొండ పనులు
పెద్దదోర్నాల: వెలిగొండ ప్రాజెక్టు పనులు వేగంగా జరుగుతున్నాయని ఇరిగేషన్ స్పెషల్ ప్రిన్సిపల్ సెక్రటరీ కేఎస్ జవహర్రెడ్డి తెలిపారు. ప్రకాశం జిల్లా పెద్దదోర్నాల మండల పరిధిలోని కొత్తూరు వద్ద ప్రాజెక్టు సొరంగం నిర్మాణ పనులను జవహర్రెడ్డి, ఇంజనీర్ ఇన్ చీఫ్ నారాయణరెడ్డి సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా జవహర్రెడ్డి మాట్లాడుతూ.. నల్లమల సాగర్లో తొలి దశలో 10.6 టీఎంసీల నీరు నిల్వ చేసేలా ప్రణాళికలు రూపొందించినట్లు తెలిపారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే నెల్లూరు, వైఎస్సార్, ప్రకాశం జిల్లాల్లో లక్షలాది మందికి సాగు, తాగునీరు అందుతుందన్నారు. ప్రకాశం జిల్లాలో 1.19 లక్షల ఎకరాలు సాగులోకి వస్తాయని వివరించారు. మంగళవారం కొత్తూరు వద్ద సొరంగ నిర్మాణాలను పరిశీలించి.. జిల్లాలో జరుగుతున్న వివిధ ఇరిగేషన్ ప్రాజెక్టు పనులపై సమీక్ష జరుపుతామని చెప్పారు. బోటులో కొల్లం వాగుకు చేరుకున్న ఆయన అక్కడి నుంచి రెండో సొరంగంలో జరుగుతున్న మాన్యువల్ నిర్మాణ పనులను పరిశీలించారు. మొదటి సొరంగం నుంచి 14వ కిలోమీటరు వద్ద రెండో సొరంగంలోకి తీసిన అప్రోచ్ టన్నెల్ను సైతం పరిశీలించారు. -
ఏఐబీపీ ప్రాజెక్టులన్నీ పూర్తికావాల్సిందే!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో సత్వర సాగునీటి ప్రాయోజిత కార్యక్రమం (ఏఐబీపీ) కింద ఆర్థిక సాయం అందిస్తున్న ప్రాజెక్టులను పూర్తి చేసే విషయంలో కఠినంగా వ్యవహరించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఏళ్లకు ఏళ్లు గడుస్తున్నా ప్రాజెక్టుల పనులు పూర్తి కాకపోవడం, పూర్తి ఆయకట్టుకు నీరివ్వకపోవడం పై గుర్రుగా ఉన్న కేంద్రం ఈ ఆర్థిక ఏడాది ముగిసేలోగా ప్రాజెక్టులన్నీ పూర్తి చేయాలని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. తెలంగాణకు సంబంధించి 8 ప్రాజెక్టులను వచ్చే ఏడాదిలోగా వంద శాతం పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేసిన కేంద్రం, పనుల పురోగతిపై ఈ నెల 31న సమీక్ష నిర్వహించనుంది. 8 ప్రాజెక్టులు.. 8 నెలలు... రాష్ట్రంలో ఏఐబీపీ కింద కేంద్రం ఆర్థిక సాయం అందిస్తున్న ప్రాజెక్టులు 11 ఉండగా అందులో గొల్లవాగు, రాలివాగు, మత్తడి వాగు పనులు పూర్తయ్యాయి. సుద్దవాగు, పాలెంవాగు, జగన్నా«థ్పూర్, భీమా, ఇందిరమ్మ వరద కాల్వ, దేవాదుల, ఎస్సారెస్పీ–2, కొమురం భీం ప్రాజెక్టులు పూర్తి చేయాలి. ఈ ప్రాజెక్టులకు రూ.19,500 కోట్లు ఖర్చు చేయగా, మరో రూ.2వేల కోట్లు మేర నిధుల అవసరాలున్నాయి. ఇందులో కేంద్రం సాయం రూ.4,500 కోట్లకుగాను ఇంకా రూ.175 కోట్లు నిధులు విడుదల కావాల్సి ఉంది. ఎస్సారెస్పీ స్టేజ్–2కి రూ.9 కోట్లు, దేవాదులకి రూ.145 కోట్లు, జగన్నాథ్పూర్కు రూ.6.50 కోట్లు, భీమాకు రూ.29 కోట్ల మేర నిధులు ఇవ్వాలి. ఈ నిధులను గత ఆర్థిక ఏడాదిలోనే విడుదల చేయాల్సి ఉన్నా కేంద్రం నయాపైసా ఇవ్వలేదు. ఈ ఏడాది ఆ నిధుల విడుదలకు సానుకూలంగా ఉంది. ఏఐబీపీ కింద ఉన్న కొన్ని ప్రాజెక్టులకు రాష్ట్రం తరఫున ఇవ్వాల్సిన నిధులను సమకూర్చడంలో ప్రభుత్వం వెనకాముందూ చేస్తోంది. దీనికి తోడు దేవాదుల పరిధిలోనే 2,400 ఎకరాలు, వరద కాల్వ కింద మరో 6వేల ఎకరాలు, ఎస్సారెస్పీ–2 కింద 700 ఎకరాలు మేర భూసేకరణ పనులు ముందుకు సాగడం లేదు. ఈ సేకరణను వేగవంతం చేసి పనులు ముగించి ఈ వానాకాలానికే 11 ప్రాజెక్టుల కింద నిర్ణయించిన 6.50 లక్షల ఎకరాలకు నీరివ్వాలని కేంద్రం ఆదేశించినా అది జరగలేదు. 4 లక్షల ఎకరాల్లో మాత్రమే నీరందించగలిగారు. అయితే వచ్చే ఏడాది మార్చి నాటికి అన్ని ప్రాజెక్టుల పనులను పూర్తి చేయాలని కేంద్రం కొత్త లక్ష్యాలను నిర్దేశించింది. దీనికి అనుగుణంగా నిధుల విడుదల చేసే అవకాశాలున్నాయి. కేంద్ర జల శక్తి శాఖ కార్యదర్శి ఈ నెల 31న రాష్ట్ర అధికారులతో ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ ప్రాజెక్టుల పురోగతిని సమీక్షించనున్నారు. పనుల పూర్తికి రాష్ట్రం తీసుకున్న చర్యలు, నిధుల వ్యయం, అవరోధాలు తదితరాలపై సమగ్ర నివేదికలతో సిద్ధం కావాలని జల శక్తి శాఖ సీనియర్ జాయింట్ కమిషనర్ ఏకే ఘా రాష్ట్రానికి లేఖ రాశారు. -
Sitarama Lift Irrigation Project: అయ్యో .. ‘రామా’
సాక్షి, హైదరాబాద్: సీతారామ ఎత్తిపోతల పథకం ద్వారా ఈ ఏడాది వానాకాలానికల్లా సుమారు లక్ష ఎకరాలకు సాగు నీరందిస్తామన్న హామీ నీరుగారినట్లే కనబడుతోంది. పూర్తికాని భూసేకరణ, నిధుల లేమి, కొరవడిన ప్రభుత్వ పర్యవేక్షణ అన్నీ కలిసి ఆశలకు గండికొడుతున్నాయి. గోదావరి నీటిని ఎత్తిపోసేలా మూడు పంప్హౌస్లు సిద్ధం చేసినా, ఆయకట్టుకు నీరిచ్చే సత్తుపల్లి ట్రంక్ పనులు మాత్రం ముందుకు కదలడం లేదు. మూడు పంప్హౌస్లు సిద్ధమైనా.. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 6.74 లక్షల ఎకరాలకు నీరిచ్చేలా సీతారామను చేపట్టారు. మూడున్నరేళ్ల కింద మూడు పంప్హౌస్ల నిర్మాణాన్ని చేపట్టారు. రెండు పంప్హౌస్ల్లో ఆరు మోటార్లను గతేడాదే పూర్తి చేయగా, మూడో పంప్హౌస్లో 7 మోటార్ల బిగింపు ప్రక్రియ కూడా ఇటీవల పూర్తయింది. చిన్నచిన్న పనులు మాత్రమే మిగిలి ఉండగా.. విద్యుత్ సరఫరా చేస్తే నీటిని ఎత్తిపోసేందుకు పంప్హౌస్లు సిద్ధంగా ఉన్నాయి. అయితే ఈ మూడు పంప్హౌస్ల పరిధిలో 114 కిలోమీటర్ల ప్రధాన కాల్వ ఉన్నా ఆయకట్టు మాత్రం లేదు. ఈ ప్రధాన కాల్వ పనులకు సంబంధించే రూ.450 కోట్ల మేర బిల్లులు ఏడాదిన్నరగా పెండింగ్లో ఉన్నాయి. వీటి విషయంలో ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు. ఇక ప్రాజెక్టులో భాగంగా మూడో పంప్హౌస్ దిగువన 116 కిలోమీటర్ల పొడవునా సత్తుపల్లి ట్రంక్ కెనాల్ తవ్వాల్సి ఉంది. దీనిద్వారా సత్తుపల్లి, అశ్వారావుపేట నియోజకవర్గాల పరిధిలో 1.24 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు సాగు నీరందించడంతో పాటు మరో 22 వేల ఎకరాల ఆయకట్టు స్థిరీకరించాలని నిర్ణయించారు. ఈ వానాకాలానికే సుమారు లక్ష ఎకరాలకు నీరివ్వాలని ఫిబ్రవరిలో జరిగిన సమీక్షలో స్పెషల్ సీఎస్ రజత్కుమార్ ఇంజనీర్లను ఆదేశించారు. అయితే ఇది జరిగి ఆరు నెలలు గడిచినా ఇంతవరకు భూసేకరణకు గానీ, జరిగిన పనులకు గానీ ఒక్క రూపాయి చెల్లించలేదు. ముందుకు సాగని పనులు కెనాల్ తవ్వేందుకు 1,650 ఎకరాల భూసేకరణ జరగాల్సి ఉండగా, ఇప్పటివరకు 500 ఎకరాలు సేకరించారు. ఇందుకోసం రూ.40 కోట్లు చెల్లించారు. మరో 214 ఎకరాలకు సంబంధించి ప్రభు త్వం నిర్ణయించిన ధరకంటే అధిక ధర పరిహారంగా చెల్లించాలని రైతులు కోర్టుకు వెళ్లడంతో సేకరణ ఆగిపోయింది. ఇక మిగతా భూమిలో కొంతమేర అవార్డు చేసినా, ప్రభుత్వం చెల్లించా ల్సిన రూ.60 కోట్ల విడుదలలో జాప్యం జరుగుతోంది. దీంతో కాల్వ పనులు ముందుకు సాగడం లేదు. ఇప్పటివరకు సేకరించిన భూమి, అటవీ శాఖ నుంచి బదలాయించిన 1,202 ఎకరాల భూమి పరిధిలోనే ప్రస్తుతం కాల్వ తవ్వకం జరుగుతోంది. వచ్చే ఏడాది జూన్ నాటికే..! 116 కిలోమీటర్ల కెనాల్ తవ్వకానికి 2.20 కోట్ల క్యూబిక్ మీటర్ల మేర మట్టిపని చేయాల్సి ఉండగా, ఇంతవరకు 52 లక్షల క్యూబిక్ మీటర్ల మేర మాత్రమే జరిగింది. సుమారు 25 కిలోమీటర్ల మేర కెనాల్ తవ్వకం పూర్తయినా, మిగతా పనుల పూర్తికి భూసేకరణ జరగకపోవడం ప్రధాన అడ్డంకిగా మారింది. దీనికి తోడు తవ్విన పనులకు సంబంధిం చిన రూ.45 కోట్ల బిల్లులు ప్రభుత్వం ఆరు నెలలుగా పెండింగ్లో పెట్టింది. ఈ నిధుల విడుదలపై ఇంతవరకు ఎలాంటి స్పష్టత లేదు. ప్రధాన కాల్వ పరిధిలో పనిచేస్తున్న ఏజెన్సీలే ఇక్కడా పనిచేస్తుండగా.. నిధుల విడుదల లేకపోవడంతో సంస్థలు పనివేగాన్ని తగ్గించుకుంటున్నాయి. యంత్రాలను ఇతర ప్రాజెక్టుల పనులకు తరలిస్తున్నాయి. ప్రభుత్వం కూడా ఇతర ప్రాధాన్యత శాఖలకు నిధుల వెచ్చింపు ఎక్కువగా చేస్తుండటంతో వచ్చే ఏడాది జూన్ నాటికే ఈ పనులు పూర్తయ్యే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. -
Telangana: ‘పవర్’ఫుల్ డిమాండ్!
రాష్ట్రంలోని ప్రధాన సాగునీటి ఎత్తిపోతల పథకాలన్నీ జూన్, జూలై నాటికి అందుబాటులోకి రానుండటంతో అందుకు అనుగుణంగానే విద్యుత్ డిమాండ్ ఎన్నడూ లేనంతగా ఉండనుంది. గత ఏడాది వినియోగానికి అదనంగా 3 వేల మెగావాట్లు కలుపుకొని మొత్తంగా 6,520 మెగావాట్ల విద్యుత్ అవసరాలు ఉంటాయని ఇరిగేషన్ శాఖ ప్రాథమిక అంచనా. కాళేశ్వరం సహా అన్ని ప్రధాన ప్రాజెక్టుల్లోని పంప్హౌస్ల్లో కనీసం నాలుగు నెలల పాటు మోటార్లను నడపాల్సి ఉంటుందంటూ లెక్కగట్టింది. ఒక్క కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోనే కనీసం 4,720 మెగావాట్ల విద్యుత్ అవసరాలుంటాయని విద్యుత్ శాఖకు నివేదించింది. –సాక్షి, హైదరాబాద్ ప్రధాన ఎత్తిపోతల పథకాలను ఈ ఏడాది వానాకాలం నాటికి పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో దేవాదుల, కాళేశ్వరంలోని మల్లన్నసాగర్, బస్వాపూర్ రిజర్వాయర్లు, పాక్షికంగా డిండి, పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతలను పూర్తి చేయడంతోపాటు ఇప్పటికే సిద్ధమైన కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు, కోయిల్సాగర్ వంటి ఎత్తిపోతల పథకాల కింద పూర్తి స్థాయిలో ఆయకట్టుకు నీరివ్వాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. వర్షాలు ఏమాత్రం సహకరించకపోయినా, కృష్ణా, గోదావరిలో వచ్చిన నీటిని వచ్చినట్లుగా ఎత్తిపోతల పథకాల ద్వారా మళ్లించుకోవాలని దిశానిర్దేశం చేశారు. ప్రస్తుతం ప్రాజెక్టుల వారీగా నీటిని తీసుకునే రోజులు, నడపనున్న పంపులు, ఎత్తిపోసే నీళ్లు ఆధారంగా ఎంత విద్యుత్ అవసరాలు ఉన్నాయో లెక్కించాలని సూచించారు. ఇప్పటివరకు కల్వకుర్తి, బీమా, నెట్టెంపాడు, అలీసాగర్, ఏఎంఆర్పీ, దేవాదుల, కోయిల్సాగర్ వంటి ఎత్తిపోతల పథకాలు పనిచేస్తుండగా, వీటికి గరిష్టంగా 1,500 మెగావాట్ల విద్యుత్ అవసరం అవుతోంది. అయితే ఈ ఏడాది దేవాదుల కింద పూర్తి ఆయకట్టుకు నీళ్లివ్వాలని భావిస్తున్నారు. ఇప్పటికే సమ్మక్కసాగర్ బ్యారేజీ నిండిన నేపథ్యంలో దీనికి నీటి లభ్యత పెరగనుంది. ఈ నేపథ్యంలో ఖరీఫ్లో కనీసంగా 20 టీఎంసీల నీటినైనా ఎత్తిపోయాలని భావిస్తున్నారు. ఇక్కడి అన్ని ప్యాకేజీల్లో కలిపి 48 మోటార్లు ఉండగా, 500 మెగావాట్లు అవసరమని లెక్కగట్టారు. ఇక పాలమూరులోని ప్రాజెక్టుల కింద కనీసం 8 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరందించేలా కృష్ణాలోకి వచ్చే నీటిని ఎత్తిపోయాల్సి ఉంటుంది. ఈ ప్రాజెక్టుల్లోని 40 మోటార్లు తిరిగినా 800 మెగావాట్ల విద్యుత్ అవసరం ఉంటుంది. కాళేశ్వరం కింద పెరగనున్న డిమాండ్ ఇక కాళేశ్వరం ద్వారా గత ఖరీఫ్లో పెద్దగా ఎత్తిపోతలు జరగలేదు. జూన్ నుంచి డిసెంబర్ వరకు 15 టీఎంసీలు ఎత్తిపోయగా, అనంతరం మూడు నెలల్లో 35 టీఎంసీలను ఎత్తిపోశారు. దీంతో పెద్దగా విద్యుత్ అవసరం పడలేదు. కానీ ఈసారి మేడిగడ్డ మొదలు బస్వాపూర్ వరకు రిజర్వాయర్లన్నీ సిద్ధమవుతున్నాయి. ముఖ్యంగా 50 టీఎంసీల సామర్థ్యం ఉన్న మల్లన్నసాగర్తో పాటు 11.39 టీఎంసీల సామర్ధ్యం ఉన్న బస్వాపూర్ రిజర్వాయర్ సిద్ధమవుతోంది. ఇక 14 టీఎంసీల సామర్థ్యం ఉన్న కొండపోచమ్మసాగర్ను ఈ ఏడాది పూర్తి స్థాయిలో నింపాలని నిర్ణయించారు. అంటే మేడిగడ్డ నుంచి బస్వాపూర్ వరకే కనీసంగా 120 టీఎంసీల మేర నీటి నిల్వకు అవకాశం ఉంది. దీంతోపాటే ప్రధాన రిజర్వాయర్ల కింద కాల్వల పనులు పూర్తవుతున్నాయి. దీనికి తోడు ఎస్సారెస్పీ ఆయకట్టుకు కాళేశ్వరం ద్వారా నీరందిస్తున్నారు. మొత్తంగా కాళేశ్వరం ద్వారా 250–300 టీఎంసీల నీటిని ఎత్తిపోసే అవకాశాలున్నాయి. ఈ స్థాయిలో నీటిని ఎత్తిపోయాలంటే ఎల్లంపల్లి వరకే 71 మోటార్లను నడపాల్సి ఉంటుంది. దీనికే 3,049 మెగావాట్ల విద్యుత్ కావాలి. దీని దిగువన బస్వాపూర్ వరకు నీటిని తరలించాలంటే మరో 28 మోటార్లను నడిపించాలి. దీనికి మరో 1,672 మెగావాట్లు అవసరం. ఇక పాలమూరు, డిండి ఎత్తిపోతల పథకాల ద్వారా వానాకాలంలో నీటి ఎత్తిపోతలు సాధ్యపడేలా లేవు. అయితే ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన రిజర్వాయర్లను మాత్రం స్థానిక ప్రవాహాల ద్వారా వచ్చే నీటితో నింపేలా ప్రణాళికలు వేశారు. వీటితో పాటే ఏఎంఆర్పీ, ఐడీసీ పథకాలను కలుపుకొని మొత్తంగా వానాకాలంలో అన్ని ఎత్తిపోతల పథకాల కింద 4 నెలల పాటు 607 మోటార్లు నడుస్తాయని, వాటి సామర్థ్యాన్ని బట్టి 6,520 మెగావాట్ల అవసరం ఉంటుందని ఇరిగేషన్ శాఖ అంచనా వేసింది. గత ఖరీఫ్లో విద్యుత్ 2 వేల మెగావాట్లను కూడా దాటలేదు. యాసంగిలో 2,000–2,800 మెగావాట్లు వినియోగించినట్లు అంచనా. కానీ ఈ ఏడాది మాత్రం భారీగా విద్యుత్ అవసరాలు ఉండనున్నట్లు విద్యుత్ శాఖకు నివేదించింది. ప్రధాన పథకాల కింద అవసరాలు ఇలా.. -
హల్దివాగు దశ, దిశ మారుతోందా!
సాక్షి, సిద్దిపేట: సమృద్ధిగా వర్షాలు పడితేగానీ నిండుగా నీరు కనిపించని హల్దివాగు దశ, దిశ మారుతోంది. కాలంతో పనిలేకుండా రైతులకు నీళ్లు అందేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. కొండపోచమ్మ సాగర్ జలాశయం నుంచి సంగారెడ్డి కాల్వ ద్వారా హల్ది వాగులోకి.. అక్కడి నుంచి మంజీరా మీదుగా నిజాంసాగర్లోకి గోదావరి జలాలను తరలించనున్నారు. సీఎం కేసీఆర్ మంగళవారం ఉదయం 10.30 గంటలకు నీటి విడుదలకు శ్రీకారం చుట్టనున్నారు. ఈ మేరకు ఏర్పాట్లను ఆర్థిక మంత్రి హరీశ్రావు సోమవారం పరిశీలించారు. కొండపోచమ్మ టు నిజాంసాగర్ కొండపోచమ్మ జలాశయం నుంచి సంగారెడ్డి కాల్వ ద్వారా 6.12 కిలోమీటర్ వద్ద నుంచి హల్దివాగులోకి గోదావరి జలాలను వదిలే పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. తొలుత ఈ కాల్వ నుంచి వర్గల్ మండలం చౌదరిపల్లి బంధం చెరువులోకి నీటిని వదులుతారు. అక్కడి నుంచి మత్తడి దూకుతూ గొలుసుకట్టు చెరువులైన వర్గల్ పెద్దచెరువు, శాకారం ధర్మాయిచెరువు, అంబర్పేట కాని చెరువులు నిండి నాచారం మీదుగా హల్దివాగుకు గోదావరి జలాలు చేరుతాయి. మొత్తం 98 కిలోమీటర్ల పొడవుండే ఈ వాగు మెదక్ జిల్లా తుప్రాన్ మండలం యావపూర్, నాగులపల్లి మీదుగా కామారెడ్డి జిల్లాలో మంజీరానదిలో కలుస్తుంది. దీంతో కామారెడ్డి జిల్లాలోని బాన్సువాడ, బీరుకూరు, నస్రుల్లాబాద్, నిజామాబాద్ జిల్లా బోధన్, కోటగిరి, వర్గి, ఆర్మూరు మొదలైన ప్రాంతాల రైతులకు చెందిన 14,268 ఎకరాలకు ప్రత్యక్షంగా, మరో 20వేల ఎకరాలకు పరోక్షంగా సాగునీరు అందించేందుకు దోహదపడనుంది. పదిరోజుల్లో నిజాంసాగర్కు.. మంగళవారం సీఎం కేసీఆర్ చేతుల మీదుగా విడుదల చేసే గోదావరి జలాలు హల్దివాగును దాటుకుంటూ పది రోజుల్లో నిజాంసాగర్కు చేరుకోనున్నాయి. కొండపోచమ్మ సాగర్ నుంచి రోజుకు 1,600 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తారు. సంగారెడ్డి కాల్వ ద్వారా హల్దీవాగులోకి ప్రవేశించే జలాలు.. వాగుపై ఉన్న 32 చెక్ డ్యామ్లను నింపుకొంటూ పది రోజుల్లో నిజాంసాగర్లోకి చేరుతాయి. ఏర్పాట్లన్నీ సిద్ధం సీఎం కేసీఆర్ మంగళవారం గోదావరి జలాలను హల్దివాగులోకి విడుదల చేయనున్నారు. ఉదయం 10.30 గంటలకు వర్గల్ మండలం అవుసులోనిపల్లి గ్రామంలో సంగారెడ్డి కెనాల్ నుంచి హల్ది వాగు కాల్వలోకి నీటిని విడుదల చేస్తారు. తర్వాత 11.15 గంటలకు మర్కూక్ మండలంలోని పాములపర్తిలో గోదావరి జలాలను గజ్వేల్ కాల్వలోకి విడుదల చేస్తారు. ఈ మేరకు ఏర్పాట్లు, బందోబస్తును మంత్రి హరీశ్రావు పరిశీలించారు. చదవండి: హాట్హాట్గా ఓటు వేట -
జలమండలికి ప్రత్యేక టారిఫ్
సాక్షి, హైదరాబాద్: జలమండలికి సంబంధించిన విద్యుత్ సబ్సిడీలను ప్రభుత్వం విడుదల చేయట్లేదని, వీటిని సకాలంలో విడుదల చేయాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాయాల్సిందిగా రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు చేసిన విజ్ఞప్తిని రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి(టీఎస్ఈఆర్సీ) తోసిపుచ్చింది. జలమండలికి ప్రస్తుతం రాయితీపై అమలు చేస్తున్న ప్రత్యేక టారిఫ్ స్థానంలో పాత హెచ్టీ–4(బీ) కేటగిరీ టారిఫ్ను కొనసాగించా లన్న డిస్కంల మరో విజ్ఞప్తిని కూడా ఈఆర్సీ నిరాకరించింది. జలమండలి ప్రత్యేక టారిఫ్పై పెండింగ్లో ఉన్న కేసులో ఇటీవల డిస్కంలు దాఖలు చేసిన మధ్యంతర పిటిషన్ను కొట్టివేస్తూ గురువారం ఈఆర్సీ ఉత్తర్వులు జారీ చేసింది. సత్వరమే పెండింగ్ టారిఫ్ ప్రతిపాదనలను దాఖలు చేయాలని, టారిఫ్ ఉత్తర్వుల్లో జలమండలికి సంబంధించిన ప్రత్యేక టారిఫ్ అంశంపై తుది ఆదేశాలు జారీ చేస్తామని స్పష్టం చేసింది. అప్పట్లోగా జలమండలికి సంబంధించిన తాగునీటి సరఫరా పంప్హౌస్లకు విద్యుత్ కనెక్షన్లను కట్ చేయబోమని డిస్కంలు ఇచ్చిన హామీకి కట్టుబడి ఉండాలని ఈఆర్సీ కోరింది. హైదరాబాద్ మెట్రో రైలు కోసం యూనిట్ విద్యుత్కు రూ.3.95 చొప్పున అమలు చేస్తున్న ప్రత్యేక టారిఫ్ను తాగునీటి సరఫరా పంప్హౌస్లకు సైతం వర్తింపజేయాలని జలమండలి చేసిన విజ్ఞప్తి పట్ల సానుకూలంగా స్పందిస్తూ గతేడాది జూలైలో ఈఆర్సీ తాత్కాలిక నిర్ణయం తీసుకుంది. 2019–20, 2020–21 సంవత్సరాల్లో ఈ ప్రత్యేక టారిఫ్ను వర్తింపజేయాలని అప్పట్లో ఈఆర్సీ ఆదేశించింది. ప్రత్యేక టారిఫ్ అమలుతో గతేడాది జూన్ నాటికి రూ.538.95 కోట్లు నష్టపోయామని డిస్కంలు తెలిపాయి. జలమండలి ద్వారా తాగునీటి సరఫరాకు అవుతున్న ఖర్చులతో పోలిస్తే అవుతున్న వ్యయం అధికంగా ఉందని, 2016–17లో రూ.232 కోట్లు, 2017–18లో రూ.330 కోట్లు, 2018–19లో రూ.299 కోట్లు, 2019–20లో రూ.577 కోట్లు, 202–21 అక్టోబర్ వరకు రూ.265 కోట్ల నష్టాలు వచ్చాయని జలమండలి ఈఆర్సీకి నివేదించింది. పాత టారిఫ్ ప్రకారం విద్యుత్ చార్జీలు పెంచితే భరించలేమని వాదనలు వినిపించింది. డిస్కంలు, జలమండలి వాదనలు విన్న ఈఆర్సీ.. డిస్కంల మధ్యంతర పిటిషన్ను కొట్టివేస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. -
అనూహ్యం తుంగభద్రలో 4.94 టీఎంసీల పెరుగుదల
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి ప్రాజెక్ట్ అయిన తుంగభద్ర డ్యామ్ పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 105.79 టీఎంసీలుగా తేలింది. 2008లో ఇది 100.85 టీఎంసీలు కాగా.. గడచిన పుష్కర కాలంలో వరద ప్రవాహం వల్ల డ్యామ్లో పూడిక తొలగడంతో నీటి నిల్వ సామర్థ్యం 4.94 టీఎంసీల మేర పెరిగింది. తుంగభద్ర బోర్డు ఇటీవల డ్యామ్లో పూర్తి నీటి నిల్వ సామర్థ్యాన్ని తేల్చేందుకు చేయించిన టోపోగ్రాఫిక్ (స్థలాకృతి), బ్యాథిమెట్రిక్ (నీటి లోతు) సర్వేల్లో ఈ విషయం స్పష్టమైంది. ఈ దృష్ట్యా వచ్చే బోర్డు సమావేశంలో సర్వే వివరాలను వెల్లడించి, నీటి నిల్వ సామర్థ్యాన్ని ఖరారు చేయాలని తుంగభద్ర బోర్డు నిర్ణయించింది. ఈ క్రమంలో తాజా నీటి నిల్వ సామర్థ్యం మేరకు.. మూడు రాష్ట్రాలకు దామాషా పద్ధతిలో నీటిని పంపిణీ చేయాలని తుంగభద్ర బోర్డును ఇప్పటికే ఏపీ ప్రభుత్వం కోరింది. తొలినాళ్లలో నీటి నిల్వ సామర్థ్యం 132.47 టీఎంసీలు 1944లో బ్రిటిష్ సర్కార్ పాలనలో మద్రాసు, హైదరాబాద్ ప్రభుత్వాల మధ్య కుదిరిన ఒప్పందం మేరకు కర్ణాటకలో హోస్పేట్ వద్ద తుంగభద్రపై 133 టీఎంసీల సామర్థ్యంతో డ్యామ్ నిర్మాణం చేపట్టారు. 1953 నాటికి నిర్మాణం పూర్తికాగా.. అప్పట్లో నిర్వహించిన సర్వేలో డ్యామ్ పూర్తి సామర్థ్యం132.47 టీఎంసీలని తేలింది. డ్యామ్ వద్ద 230 టీఎంసీల నీటి లభ్యత ఉంటుందని అంచనా వేసిన బచావత్ ట్రిబ్యునల్ కర్ణాటకకు 138.99, ఏపీకి 66.5 (ఎల్లెల్సీకి 24, హెచ్చెల్సీకి 32.50, కేసీ కెనాల్కు 10), తెలంగాణకు 6.51 చొప్పున మొత్తం 212 టీఎంసీలను పంపిణీ చేస్తూ వస్తోంది. ఏటా 0.57 టీఎంసీల తగ్గుదల ఏటా ప్రవాహంతో కలిసి డ్యామ్లోకి మట్టి చేరుతూ వస్తోంది. కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) మార్గదర్శకాల మేరకు డ్యామ్లో నీటి నిల్వ ఏ మేరకు ఉందో తెలుసుకునేందుకు తొలిసారిగా 1963లో తుంగభద్ర బోర్డు సర్వే చేయించింది. డ్యామ్లో పూడిక పేరుకుపోవడంతో నీటి నిల్వ సామర్థ్యం 114.66 టీఎంసీలకు తగ్గిందని అప్పట్లో బోర్డు తేల్చింది. పూడికతో నీటి నిల్వ సామర్థ్యం తగ్గడం, అతివృష్టి, అనావృష్టి సమయాల్లో నదిలో వరద రోజులు తగ్గడంతో డ్యామ్ వద్ద నీటి లభ్యత తగ్గిపోతోందని గుర్తించిన బోర్డు నీరు లభించిన మేరకు దామాషా పద్ధతిలో నీటిని పంపిణీ చేస్తూ వస్తోంది. ఈ క్రమంలో 2008లో నిర్వహించిన సర్వేలో డ్యామ్ నీటి నిల్వ సామర్థ్యం 100.85 టీఎంసీలకు తగ్గినట్లు వెల్లడైంది. అంటే 1953 నుంచి 2008 వరకూ 55 ఏళ్లలో 21.62 టీఎంసీల మేర తగ్గింది. 1953 నుంచి 2008 వరకూ వివిధ సందర్భాల్లో నిర్వహించిన సర్వేలను పరిశీలిస్తే.. డ్యామ్లో పూడిక పేరుకుపోతుండటం వల్ల నీటి నిల్వ సామర్థ్యం ఏటా 0.57 టీఎంసీల మేర తగ్గుతున్నట్టు స్పష్టమవుతోంది. ఇదిలావుంటే.. 2008 తర్వాత వివిధ సందర్భాల్లో డ్యామ్కు భారీ ఎత్తున వరద ప్రవాహం వచ్చి చేరగా.. గేట్లు ఎత్తేసి వరదను దిగువకు విడుదల చేశారు. ఆ వరద ప్రవాహంలో డ్యామ్లోని పూడిక కొంతమేర తొలగిపోయినట్టు తాజా సర్వేల్లో వెల్లడైంది. దాంతో నీటి నిల్వ సామర్థ్యం 2008లో నిర్వహించిన సర్వేతో పోలిస్తే తాజాగా 4.94 టీఎంసీల మేర పెరిగినట్టు తేలింది. వచ్చే సమావేశంలో మూడు రాష్ట్రాల అధికారులతో తుంగభద్ర బోర్డు చర్చించి నీటి నిల్వ సామర్థ్యాన్ని ఆమోదించనుంది. -
తుంగభద్ర బోర్డుకు తెలంగాణ వినతి
సాక్షి, హైదరాబాద్: తుంగభద్ర నదీ జలాల్లో రాజోలిబండ మళ్లింపు పథకం(ఆర్డీఎస్)కు ఉన్నవాస్తవ నీటి వాటా వినియోగానికి వీలుగా చేపట్టిన కాల్వల ఆధునీకరణ పనులను వేగవంతం చేయించాలని తెలంగాణ ప్రభుత్వం మరోమారు తుంగభద్ర బోర్డుకు విన్నవించింది. కాల్వల ఆధునీకరణ పనుల్లో త్వరితగతిన పనులు పూర్తిచేసేలా కర్ణాటక, ఆంధ్రప్రదేశ్లకు ఆదేశాలివ్వాలని కోరింది. ప్రస్తుతం వర్కింగ్ సీజన్ ఆరంభమైన దృష్ట్యా పనులు మొదలు పెట్టేలా చూడాలంది. ఈ మేరకు రెండ్రోజుల కిందట తెలంగాణ బోర్డు కార్యదర్శికి లేఖ రాసింది. కర్ణాటక నుంచి ఆర్డీఎస్కు నీటిని తరలించే కాల్వలన్నీ పూడికతో నిండిపోవడంతో ఆశించిన మేర నీరు రావడం లేదు. దీంతో ఆర్డీఎస్ కాల్వల ఆధునీకరణ కోసం కర్ణాటకకు రాష్ట్రం రూ.72కోట్ల మేర డిపాజిట్ సైతం చేసింది. ఇందులో ప్యాకేజీ–1 పనులను 25%, ప్యాకేజీ–2 పనులను మరో 55% వరకు పూర్తి చేసింది. అయితే ఆనకట్టకు మరోవైపున ఉన్న కర్నూలు జిల్లా నేతలు, రైతులు ఆధునీకరణ పనులకు అడ్డు తగులుతుండటంతో పనులన్నీ నిలిచిపోయి రాష్ట్రానికి ఏటా కనీసం నాలుగు టీఎంసీలు కూడా రాష్ట్రానికి రావడం లేదు. దీంతో కేవలం 30వేల ఆయకట్టుకు మాత్రమే అంతంతమాత్రంగా సాగునీరందుతోంది. కాల్వల ఆధునీకరణ పనుల పురోగతిపై పదేపదే విన్నవిస్తున్నా ఏపీ ప్రభుత్వం అలసత్వం చూపుతోందని వారం రోజుల కిందట జరిగిన బోర్డు భేటీలో తెలంగాణ నిలదీసింది.దీనిపై ఏపీ, కర్ణాటకల నుంచి స్పందన లేకపోవడంతో మరోమారు లేఖ రాసింది. ఈ కాల్వల ఆధునీకరణ పనుల్లో జాప్యాన్ని నివారించి త్వరితగతిన పనులు పూర్తి చేసేలా కర్ణాటక, ఏపీలకు ఆదేశాలివ్వాలని కోరింది.( చదవండి: దశాబ్దాల స్వప్నం .. శరవేగంగా సాకారం) -
ఎకానమీకి వ్యవసాయం ఆశాకిరణం
ముంబై: దేశవ్యాప్తంగా బలంగా విస్తరించిన రుతుపవనాలు, మంచి వర్షపాతంతో ప్రస్తుత ఖరీఫ్ సీజన్ లో పంటల ఉత్పత్తి భారీగా పెరగనుందని రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ ఓ నివేదికలో వెల్లడించింది. ఈ ఏడాది ఖరీఫ్ దిగుబడి 5–6 శాతం ఎక్కువగా ఉంటుందని, సాగు విస్తీర్ణం కూడా పెరగడంతో, ఉత్పాదకత జోరుగా ఉంటుందని అంచనా వేసింది. వ్యవసాయం బలంగా ఉండడం అన్నది కరోనాతో బలహీనపడిన ఆర్థిక వ్యవస్థకు మద్దతునిచ్చే అంశమేనని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఆగస్ట్ 21 నాటికి దీర్ఘకాల సగటు కంటే 7 శాతం అధికంగా వర్షపాతం నమోదైనట్టు.. దీని ఫలితంగా చాలా రాష్ట్రాల్లో పంటల విత్తుకు దోహపడినట్టు క్రిసిల్ నివేదిక తెలియజేసింది. ఖరీఫ్ సీజన్ 2020లో 109 మిలియన్ హెక్టార్లలో 2–3 శాతం అధికంగా విత్తు వేయడం ఉంటుందని పేర్కొంది. వరి సాగు పెరగనుందని, మంచి వర్షాలకు తోడు, ఈశాన్య, దక్షిణాది రాష్ట్రాల్లో కార్మికులు పట్టణాల నుంచి పల్లెలకు తిరిగి వలసపోవడం దోహదపడే అంశాలుగా తెలిపింది. లాభదాయకత కూడా ఎక్కువే.. కరోనా కారణంగా సరఫరా పరంగా ఏర్పడిన అవాంతరాలతో రైతులు అధికంగా పాడైపోయే గుణమున్న టమాటా వంటి వాటికి బదులు తక్కువ పాడైపోయే స్వభావం కలిగిన వంకాయ, బెండకాయ వంటి పంటలకు మళ్లినట్టు క్రిసిల్ రీసెర్చ్ డైరెక్టర్ హేతల్ గాంధీ తెలిపారు. ఖరీఫ్ సీజన్ సాగు భారీగా పెరగడం వల్ల పలు నిత్యావసర వస్తువల ధరలు తగ్గే అవకాశం ఉంటుందన్నారు. ఖరీఫ్ సీజన్ లో సాగు లాభదాయకత మొత్తం మీద 3–5% అధికం కానుందని క్రిసిల్ నివేదిక పేర్కొంది. సాగు విస్తీర్ణంపెరగడం, అధిక ఉత్పాదకత, కనీస మద్దతు ధరలకు ప్రభుత్వ కొనుగోళ్లు మద్దతునిస్తాయని వివరించింది. యాపిల్ సాగులో లాభదాయకత మెరుగుపడుతుందని, పత్తి, మొక్కజొన్న ధరలపై ఒత్తిళ్లు కొనసాగుతాయని పేర్కొంది. ఏపీ తదితర రాష్ట్రాల్లో జోరుగా వరిసాగు కార్మికులు వలసపోవడం వల్ల పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో ఎక్కువ మంది రైతులే నేరుగా విత్తనాలను వేయనున్నారు. ఇది తక్కువ ఉత్పాదకతకు దారితీయనుంది. కానీ, అదే సమయంలో ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, బిహార్ వంటి రాష్ట్రాల్లో కార్మికులు వెనక్కి వెళ్లిపోవడం వల్ల విత్తడంలో వృద్ధి కనిపించనుంది. దీంతో మొత్తం మీద గతేడాది కంటే ఖరీఫ్ సీజన్ 2020లో వరి ఉత్పాదకత పెరగనుంది. ఉత్తర భారత రైతులకు ఖరీఫ్ సీజన్ 2020 ఎంతో లాభాన్ని మిగల్చనుంది. పంటల సాగు మిశ్రమంగా ఉండడానికి తోడు ప్రభుత్వ కొనుగోళ్లు అధికంగా ఉండడం వల్లే ఇది సాధ్యం కానుంది. – హేతల్ గాంధీ, క్రిసిల్ రీసెర్చ్ డైరెక్టర్ -
సీఈలకే అధికారాలు
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో నీటి పారుదల రంగంలో వచ్చిన విప్లవాత్మక మార్పులకు అనుగుణంగా జలవనరుల శాఖను పునర్వ్యవస్థీకరించాలని నిర్ణయించినట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు తెలిపారు. తెలంగాణ ఏర్పడక ముందు, తర్వాత పరిస్థితిలో ఎంతో మార్పు వచ్చిందని.. సాగునీటి వసతులు పెరిగాయని పేర్కొన్నారు. ప్రాజెక్టులు, కాల్వలు, రిజర్వాయర్లు, పంపుహౌస్లు, ఆయకట్టు పెరిగినందున పనిభారం కూడా పెరిగిం దన్నారు. మారిన పరిస్థితికి అనుగుణంగా జలవనరుల శాఖలో సీఈలు బాధ్యులుగా అధిక ప్రాదేశిక ప్రాంతాలను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. గతంలో మాదిరిగా వివిధ విభాగాల కింద కాకుండా జలవనరుల శాఖ అంతా ఒక విభాగంగానే పనిచేస్తుందని వెల్లడించారు. జల వనరుల శాఖ పునర్వ్యవస్థీకరణపై ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం ప్రగతిభవన్లో సమీక్ష నిర్వహించారు. క్షేత్రస్థాయిలో ప్రస్తుతం 13 చీఫ్ ఇంజనీర్ల ప్రాదేశిక ప్రాంతాలు ఉండగా.. వాటి సంఖ్యను 19కి పెంచాలని సూత్రప్రాయంగా నిర్ణయించారు. ఆదిలాబాద్, మంచిర్యాల, జగిత్యాల, కరీంనగర్, నిజామాబాద్, కామారెడ్డి, రామగుండం, వరంగల్, ములుగు, ఖమ్మం, కొత్తగూడెం, గజ్వేల్, సంగారెడ్డి, నల్లగొండ, సూర్యాపేట, మహబూబ్నగర్, వనపర్తి, నాగర్కర్నూల్, హైదరాబాద్ కేంద్రాలుగా సీఈ ప్రాదేశిక ప్రాంతాలుగా ఏర్పాటు చేయాలని ప్రాథమికంగా నిర్ణయం తీసుకున్నారు. ఈ ప్రాదేశిక ప్రాంతాల పరిధిలోని ప్రాజెక్టులు, చెరువులు, ఐడీసీ లిఫ్టులు, రిజర్వాయర్లు, బ్యారేజీలు, పంప్ హౌస్లు, కాలువలు, సబ్స్టేషన్లు అన్నీ సీఈ పరిధి కిందికే వస్తాయి. గతంలో భారీ, మధ్యతరహా, చిన్నతరహా, ఐడీసీ వంటి వివిధ విభాగాల కింద ఉన్న నీటి పారుదల శాఖ ఇకపై కేవలం జల వనరుల శాఖగా మాత్రమే కొనసాగుతుంది. కాకతీయుల కాల్వల పునరుద్ధరణకు ఆదేశం.. మెదక్ జిల్లాలోని ఘనపూర్ ఆనకట్టకు వనదుర్గ ప్రాజెక్టుగా పేరు పెట్టాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. పాకాల ప్రాజెక్టు కింద కాల్వలను పునరుద్ధరించాలనిæ అధికారులను ఆదేశించారు. కాకతీయుల కాలంలో నిర్మించిన కాల్వలు శిథిలమైపోయాయని, వీటిని పునరుద్ధరించడం ద్వారా 30వేల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించ వచ్చని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి ముఖ్యమంత్రికి విన్నవించారు. దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి కేసీఆర్.. కాకతీయులు నిర్మించిన పాకాల కాల్వలను పునరుద్ధరించడం అంటే వారసత్వాన్ని కాపాడుకోవడమేనని వ్యాఖ్యా నించారు. వెంటనే అంచనాలు తయారు చేయాల్సిందిగా అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో మంత్రులు ఎస్.నిరంజన్రెడ్డి, ఈటల రాజేందర్, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్రెడ్డి, ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి, ఎమ్మెల్సీ శేరి సుభాష్రెడ్డి, నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రజత్ కుమార్, సీఎంఓ కార్యదర్శి స్మితా సబర్వాల్, సీఎం ఓఎస్డీ శ్రీధర్ దేశ్పాండే, డిప్యూటీ ఈఎన్సీ అనిత, డీడీఏ చందర్రావు, ఎస్ఈ ఆర్.కోటేశ్వర్ రావు, ఈఈలు కె.ప్రసాద్, ఎస్.విజయ్ కుమార్, డీఈఈ వెంకట నారాయణ, ఏఈఈ శివకుమార్, కేపీఎంఏ రత్నం పాల్గొన్నారు. -
కొత్త సచివాలయం డిజైన్పై ఎల్లుండి ప్రకటన
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్రావు రెండు రోజుల పాటు కీలక సమావేశాలు నిర్వహించనున్నారు. సీఎం కేసీఆర్ సోమవారం సాగునీటి, ఆర్ అండ్ బీ శాఖలపై సుదీర్ఘంగా సమీక్షించనున్నారు. గోదావరి, కృష్ణా నదుల సాగునీటికి సంబంధించి అంశాలపై ఈ భేటీలో చర్చిస్తారు. భవిష్యత్లో గోదావరి కృష్ణా జలాల వినియోగంపై ఈ సమావేశంలో తుది నిర్ణయం తీసుకోనున్నారు. రేపు మధ్యాహ్నం నీటి పారుదలశాఖ, ఎల్లుండి ఆర్ అండ్ బీ శాఖపై సమీక్ష నిర్వహించనున్నారు. ఈ సమీక్షా సమావేశాలకు ఆయా శాఖల మంత్రులు, ఉన్నతాధికారులు హాజరు కానున్నారు. ఇక సాగునీటి రంగానికి ఒకే గొడుకు కిందకు తీసుకు రావాలని ముఖ్యమంత్రి నిర్ణయించిన విషయం తెలిసిందే. మరోవైపు మంగళవారం మధ్యాహ్నం జరిగే సమావేశంలో కేసీఆర్ కొత్త సచివాలయం నిర్మాణంకి సంబంధించి తుది నిర్ణయం తీసుకోనున్నారు. అనంతరం క్యాబినెట్ ఆమోదించిన తర్వాత డిజైన్లపై అధికారిక ప్రకటన చేస్తారు. (సచివాలయం కూల్చివేతకు గ్రీన్ సిగ్నల్) కాగా తెలంగాణ సచివాలయం పాత భవనాల కూల్చివేతకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. కొత్త భవనాలను నిర్మించే క్రమంలో పాత వాటిని తొలగించడానికి కేంద్ర పర్యవరణ శాఖ అనుమతులు అవసరం లేదని న్యాయస్థానం స్పష్టం చేసింది. సచివాలయ భవనాల కూల్చివేతను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను ధర్మాసనం కొట్టివేసింది. (సచివాలయ పాత భవనాలను పేల్చి.. కూల్చేద్దాం!) -
ఏసీబీ వలలో ఏఈ
ఇల్లెందు: నీటిపారుదల(ఇరిగేషన్) శాఖలో ఏఈగా పనిచేస్తున్న నవీన్కుమార్ ఓ కాంట్రాక్టర్ నుంచి రూ.1.20 లక్షలు లంచం తీసుకుంటూ సోమవారం ఏసీబీ వలకు చిక్కాడు. ఏసీబీ వరంగల్ డీఎస్పీ మధుసూదన్ విలేకరుల సమావేశంలో వెల్లడించిన వివరాలిలా ఉన్నాయి.. ఇల్లెందు మండలం మర్రిగూడెం పంచాయతీ కోటన్ననగర్ గ్రామంలోని అనంతారం చెరువును మిషన్ కాకతీయ ట్రిపుల్ ఆర్ పథకం కింద ఇల్లెందుకు చెందిన కాంట్రాక్టర్ గుండ్ల రమేష్ మరమ్మతు చేశారు. ఈ పనులు గత వేసవిలోనే పూర్తయ్యాయి. ఈ మేరకు ఏఈ నవీన్కుమార్ ఎంబీ కూడా పూర్తి చేశాడు. వీటికి సంబంధించి రమేష్కు రూ.20 లక్షల బిల్లులు రావాల్సి ఉంది. క్వాలిటీ కంట్రోల్ అధికారులు పనులను తనిఖీ చేశాకే బిల్లులు మంజూరవుతాయి. అయితే పనులు తనిఖీ చేసే అధికారులను తీసుకొస్తానని, అందుకు రూ.1.20 లక్షలు లంచం ఇవ్వాలని నవీన్కుమార్ డిమాండ్ చేశాడు. రమేష్ పలుమార్లు కార్యాలయం చుట్టూ తిరిగినా అతడిలో మార్పు రాకపోవడంతో విసుగు చెంది ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. దీంతో ఇల్లెందుకు చేరుకున్న ఏసీబీ అధికారులు.. రమేష్ నుంచి రూ.1.20 లక్షలు లంచం తీసుకుంటుండగా నవీన్కుమార్ను రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. అతడిపై కేసు నమోదు చేసి, రిమాండ్కుతరలించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ.. అవినీతి, లంచగొండితనాన్ని నిర్మూలించాల్సిన బాధ్యత అధికారులు, ప్రజలపై ఉందని అన్నారు. ఎవరైనా అవినీతికి పాల్పడితే ఏసీబీని సంప్రదించాలని కోరారు. అవసరమైతే టోల్ఫ్రీ నంబర్ 1064కు ఫోన్ చేయాలని సూచించారు. ఆయన వెంట ఏసీబీ సీఐలు రమణమూర్తి, రవీందర్, సిబ్బంది ఉన్నారు. ప్రైవేట్ కార్యాలయం నుంచే కార్యకలాపాలు... ఇల్లెందులో పని చేస్తున్న కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు తమ అవినీతి సామ్రాజ్యాన్ని కొనసాగించేందుకు ప్రైవేటు కార్యాలయాలను ఏర్పాటు చేసుకున్నారు. ఇరిగేషన్ ఏఈ నవీన్కుమార్ కూడా ఇల్లెందు సుభాష్నగర్లో పాల కేంద్రం వెనుక గల్లీలో ఓ ఇల్లు అద్దెకు తీసుకుని అక్కడి నుంచే తన అవినీతి కార్యకలాపాలను కొనసాగించాడు. ఏసీబీ అధికారులకు పట్టుబడింది కూడా ఈ ప్రైవేట్ కార్యాలయంలోనే. ఏఈ ఒక్కరే కాదు.. ఇతర విభాగాల్లో పని చేస్తున్న ఏఈలు, పలు శాఖల అధికారులు కూడా ప్రైవేట్ కార్యాలయాల నుంచే కార్యకలాపాలు సాగిస్తుండడం గమనార్హం. ఏడాదిలో ఏసీబీకి చిక్కిన ముగ్గురు ఏఈలు.. ఇల్లెందులో ఏడాది కాలంలో ముగ్గురు ఏఈలు ఏసీబీ వలలో చిక్కారు. గత ఏడాది జూలై 29న మున్సిపల్ ఏఈ అనిల్, ఈ ఏడాది ఫిబ్రవరి 9న అదే మున్సిపాల్టీలో పని చేస్తున్న ఇన్చార్జ్ ఏఈ, టెక్నికల్ అసిస్టెంట్ బాబురావు ఏసీబీకి పట్టుబడ్డారు. ఇప్పుడు నీటిపారుదల విభాగం ఏఈ నవీన్కుమార్ దొరికిపోయాడు. ఏడాది కాలంలోనే ముగ్గురు ఏఈలు ఏసీబీ వలలో చిక్కడం చర్చనీయాంశంగా మారింది. -
కట్టలు, కాల్వలకు పునరుజ్జీవం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఉపాధి కోల్పోయిన గ్రామీణ కూలీలకు పనుల కల్పనే లక్ష్యంగా ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టులు, చెరువుల్లోని కాల్వలు, కట్టల పునరుద్ధరణకు బృహత్ కార్యాచరణ సిద్ధం చేసింది. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు ఉపాధి హామీ పథకాన్ని నీటిపారుదల శాఖకు అనుసంధానించి రూ.1,200 కోట్ల మేర పనులు చేపట్టేందుకు ముందుకొచ్చింది. వర్షాలు, నీటి లభ్యత పుష్కలంగా ఉండనున్న దృష్ట్యా చెరువులు, ప్రాజెక్టుల పరిధిలోని కట్టలు, కాల్వలు, ఫీడర్ చానళ్ల అభివృద్ధి.. చెట్లు, పొదల తొలగింపును పకడ్బందీగా చేపట్టాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు మంగళవారం జరిగిన సమీక్షలో జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ‘ఉపాధి’తో అభివృద్ధి.. లాక్డౌన్ పరిస్థితుల్లో వివిధ ప్రాంతాల్లో పనిచేస్తున్న వలస కూలీలంతా సొంత గ్రామాలకు తరలిపోయిన విషయం తెలిసిందే. అయితే గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి లేక కూలీలంతా కష్టంగా నెట్టుకొస్తున్న నేపథ్యంలో కూలీలకు పని కల్పన లక్ష్యంగా కేంద్రం ఎన్ఆర్ఈజీఎస్ పనుల కింద భారీగా నిధుల కేటాయింపులు జరిపి, గ్రామీణ స్థాయిలో 260 రకాల అభివృద్ధి పనులు చేపట్టేందుకు అవకాశం ఇచ్చింది. ఈ పనుల్లో నీటి పారుదల రంగానికి సంబంధించిన పనులే 23దాకా ఉన్నాయి. ప్రధానంగా చెరువుల పూడికతీత, కాల్వలు, కట్టలు, ఫీడర్ చానళ్లలో పూడికతీత, చెట్లు, పొదల తొలగింపు, కాల్వలు, పిల్ల కాల్వల లైనింగ్ పనులు, ప్రధాన ప్రాజెక్టుల్లోనూ కాల్వల పునరుద్ధరణ పనులకు అనుమతించింది. ఇందులో భాగంగా కృష్ణా, గోదావరి బేసిన్లోని చెరో 15వేల చెరువులు కలిపి 30 వేల చెరువుల కింద కట్ట, కాల్వలు, ఫీడర్ చానళ్ల పునరుద్ధరణకు రూ.500 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి అందించింది. ఈ పనులతో 30 వేల చెరువుల పరిధిలోని కాల్వల్లో కోటి క్యూబిక్ మీటర్ల పూడికతీత తీయనున్నారు. ఎస్సారెస్పీ, నిజాంసాగర్, నాగార్జునసాగర్, దేవాదుల, కల్వకుర్తి, బీమా, జూరాల వంటి భారీ ప్రాజెక్టులతో పాటు పోచారం, ఘణపురం, శనిగరం, సాత్నాల, వైరా, ర్యాలివాగు, గొల్లవాగు, పెద్దవాగు వంటి సాగునీటి ప్రాజెక్టుల పరిధిలోనూ ప్రధాన, బ్రాంచ్ కాల్వల మరమ్మతుల నులను రూ.700 కోట్లతో చేపట్టనున్నారు. -
‘ఈ ఏడాదిలోనే ప్రకాశం జిల్లాకు నీళ్లు అందిస్తాం’
సాక్షి, కర్నూలు: వెలుగొండ హెడ్ రెగ్యులేటరీ ద్వారా ఈ ఏడాదిలోనే ప్రకాశం జిల్లాకు నీళ్లు అందిస్తామని నీటి పారుదలశాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. ఆయన సోమవారం విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్తో కలిసి శ్రీశైలం డ్యామ్ నుంచి బోట్లో వెళ్లి వెలుగొండ హెడ్ రెగ్యులేటరీ ప్రాంతంలోని పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ కలలను సాకారం చేసే దిశగా తలపెట్టిన అతి ముఖ్యమైన ప్రాజెక్టు వెలుగొండ హెడ్ రెగ్యులేటరీ అన్నారు. ఈ ప్రాజెక్టు ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల్లో ఉన్న రైతాంగానికి తాగు, సాగు నీటి అవసరాలు తీర్చుతుందని తెలిపారు. (ఏపిలోకి నైరుతి రుతుపవనాలు) గత ప్రభుత్వాలు 12 సంవత్సరాలు అవుతున్నా వెలుగొండ ప్రాజెక్టు పనులను అంతంత మాత్రంగానే పూర్తి చేశారని మంత్రి అనిల్ కుమార్ మండిపడ్డారు. గత ప్రభుత్వం ఐదేళ్లలో కేవలం నాలుగు కిలోమీటర్ల టన్నెల్ను మాత్రమే పూర్తి చేసిందన్నారు. కానీ తమ ప్రభుత్వం కేవలం16 నెలల్లో మూడు కిలోమీటర్లు టన్నెల్ను పూర్తి చేసిందని తెలిపారు. జూన్ 25 లోపు వెలుగొండ హెడ్ రెగ్యులేటరీ ప్రాజెక్టు పనులను పూర్తి చేసి సెప్టెంబర్ వరకు ప్రకాశం జిల్లాకు నీళ్లు అందిస్తామని తెలిపారు. ఏడున్నర కిలోమీటర్ల దూరమున్న రెండో టన్నెల్ పనులను 18 నెలల లోపు పూర్తి చేసి రైతాంగానికి నీళ్లు అందిస్తామని మంత్రి అనిల్ కుమార్ పేర్కొన్నారు. -
‘సాగునీటి’కి కోతే!
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రం ప్రవేశపెట్టనున్న వార్షిక బడ్జెట్లో సాగునీటి శాఖకు మళ్లీ కోతపడే అవకాశాలున్నాయి. ఆర్థిక మాంద్యం, కేంద్ర కేటాయింపుల్లో తగ్గుదల నేపథ్యంలో ఈమారు సాగునీటి రంగానికి బడ్జెట్ కేటాయింపులు తగ్గే సంకేతాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2019–20లో మినహా అంతకుముందు ఏడాదుల్లో వరుసగా రూ.25 వేల కోట్ల మేర కేటాయింపులు చేయగా, ఈ ఏడాది రూ.10 వేల కోట్లకు మించి ఉండకపోవచ్చని అంచనా వేస్తున్నారు. ఎప్పటి మాదిరే రుణ సంస్థల నుంచి ప్రధాన ప్రాజెక్టులకు తీసుకుంటున్న రుణాల ద్వారానే మళ్లీ గట్టెక్కే అవకాశం ఉందని చెబుతున్నారు. ప్రాధాన్యత ఉన్న ప్రాజెక్టులకే.. ఆర్థిక మాంద్యం దెబ్బతో గతేడాది సెప్టెంబర్లో ప్రవేశపెట్టిన పూర్తిస్థాయి బడ్జెట్లో సాగునీటి శాఖకు కేవలం రూ.8,476.17 కోట్లకు తగ్గించింది. ఇందులో మేజర్ ఇరిగేషన్కు రూ.7,794.30 కోట్లు కేటాయించగా, మైనర్ ఇరిగేషన్కు రూ.642.30 కోట్లు కేటాయించింది. ఇందులో నిర్వహణ పద్దు కింది కేటాయింపులను పక్కనపెడితే ప్రగతిపద్దు కింది కేటాయింపులు కేవలం రూ.6,500 కోట్లు మాత్రమే ఉన్నాయి. మొత్తంగా 2019–20 వార్షికంలో ఏప్రిల్ నుంచి ఇంతవరకు రూ.18 వేల కోట్ల మేర ఖర్చయింది. ఇందులో రూ.10 వేల కోట్ల మేర రుణాల ద్వారా చేసిన ఖర్చు కాగా, మిగతా రూ.8 వేల కోట్లు రాష్ట్ర బడ్జెట్ నుంచి కేటాయించారు. ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తున్న సీతారామ ఎత్తిపోతల, కాళేశ్వరం, పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టులకే అధిక నిధుల ఖర్చు జరిగింది. వచ్చే వార్షిక బడ్జెట్లో రూ.21 వేల కోట్లు రాష్ట్ర బడ్జెట్ నుంచి, మరో రూ.22 వేల కోట్లు రుణాల రూపేణా కేటాయించాలని సాగునీటి శాఖ ఆర్థిక శాఖకు ప్రతిపాదనలు పంపింది. అయితే కేంద్ర వాటా తగ్గడం, ఆర్థిక మాంద్యం ఛాయలు తగ్గకపోవడంతో ఈ ఏడాది సైతం బడ్జెట్లో కేటాయింపులు రూ.10 వేల కోట్లకు మించి ఉండవని నీటి పారుదల వర్గాలు చెబుతున్నాయి. ఇందులోనూ మునుపటి మాదిరే కాళేశ్వరం, సీతారామ, పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టులకే అధికంగా కేటాయింపులు దక్కే అవకాశం ఉంది. పాలమూరు–రంగారెడ్డికి రూ.2 వేల కోట్లు, కాళేశ్వరం ప్రాజెక్టుకు రూ.1,500 కోట్లు, సీతారామ ఎత్తిపోతలకు మరో రూ.2 వేల కోట్లు, దేవాదులకు రూ.600 కోట్లు, తుపాకులగూడెంకు రూ.300 కోట్లు కేటాయించే అవకాశాలున్నాయి. రాష్ట్ర బడ్జెట్ నిధులతో పాటే ఇప్పటికే ఏర్పాటు చేసిన కార్పొరేషన్ల ద్వారా గరిష్టంగా రూ.15 వేల కోట్ల మేర రుణాలతోనే ఈ ప్రాజెక్టులకు నిధుల లభ్యత పెంచనున్నారు. పాత ప్రాజెక్టులకు నిరాశే.. ఇక పాత ప్రాజెక్టులకు మాత్రం మళ్ళీ నిరాశ తప్పేలా లేదు. ముఖ్యంగా ఉమ్మడి పాలమూరు జిల్లాలోని కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమాతో పాటు ఎల్ఎల్బీసీ టన్నెల్తో పాటు ఆదిలాబాద్ జిల్లాలోని ప్రాజెక్టులకు నిధుల కోత తప్పదని నీటిపారుదల వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. పాలమూరు జిల్లా ప్రాజెక్టులు పూర్తవ్వాలంటే కనిష్టంగా రూ.1,200 కోట్లు అవసరముంది. అయితే ఇప్పటికే సాగునీటి శాఖ పరిధిలో రూ.10 వేల కోట్ల మేర పెండింగ్ బిల్లులుండగా, ఇందులో ప్రధాన పనులకు సంబంధించి రూ.5,500 కోట్లున్నాయి. ప్రస్తుతం బడ్జెట్లో ప్రవేశపెట్టే నిధులు పనులకు సంబంధించిన పెండింగ్ పనులకే చెల్లిస్తే, మిగిలే నిధులు చాలా తక్కువ. ఇవీ ప్రాధాన్యత ప్రాజెక్టులకు ఖర్చుచేస్తే పెండింగ్ ప్రాజెక్టుల పూర్తి కష్టతరంగా మారనుంది. -
జలం వర్షించే.. పొలం హర్షించే
సాక్షి, అమరాతి: కృష్ణా, గోదావరి, వంశధార జలాలను ఒడిసి పట్టి.. ఆయకట్టు చివరి భూములకు సైతం నీళ్లందించడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక రచించింది. రాష్ట్రంలో భారీ, చిన్న, మధ్య తరహా ప్రాజెక్టులు, ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల అభివృద్ధి సంస్థ(ఏపీఎస్ఐడీసీ) కింద ప్రస్తుత నీటి సంవత్సరంలో 87,62,037 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించాలని నిర్ణయించింది. మూడు నదులపై ఉన్న ప్రాజెక్టుల కింద ఆయకట్టుకు శుక్రవారం వరకూ 20,62,891 ఎకరాల్లో రైతులు పంటలు వేశారు. గతేడాది ఇదే సమయానికి కేవలం 9.87 లక్షల ఎకరాల్లోనే పంటలు సాగు చేయడం గమనార్హం. ఈ ఏడాది సెపె్టంబర్ ఆఖరు నాటికి సింహభాగం ఆయకట్టుకు నీటిని అందించడానికి సర్కారు చర్యలు చేపట్టింది. ఆయకట్టు చివరి భూములకు కూడా నీళ్లందించేలా యాజమాన్య పద్ధతులను అమలు చేయాలని అధికారులను ఆదేశించింది. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న ఐదేళ్లలో ఏనాడూ ఆయకట్టుకు పూర్తిస్థాయిలో నీళ్లందించిన దాఖలాలు లేవు. గత పదేళ్లలో ఎన్నడూ లేని రీతిలో కృష్ణా, గోదావరి, వంశధార పరీవాహక ప్రాంతాల్లో సమృద్ధిగా వర్షాలు కురిశాయి. మూడు నదుల్లోనూ నీటి లభ్యత భారీగా పెరిగింది. ప్రధానంగా కృష్ణా నది వరద నీటిని పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్, హంద్రీ–నీవా ద్వారా రాయలసీమ, నెల్లూరు జిల్లాల ప్రాజెక్టులకు ప్రభుత్వం తరలించింది. పులిచింతల ప్రాజెక్టులో పూర్తి సామర్థ్యం మేరకు నీటిని నిల్వ చేశారు. గోదావరి కుడిగట్టుపై తాడిపూడి, పట్టిసీమ ఎత్తిపోతల పథకాలు, ఎడమ గట్టుపై పుష్కర, చాగల్నాడు, రాజానగరం, తొర్రిగడ్డ, పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకాల ద్వారా వరద నీటిని ఒడిసి పడుతున్నారు. వంశధార, నాగావళి నదుల వరద జలాలను తోటపల్లి, నారాయణపురం, గొట్టా బ్యారేజీల్లో నిల్వ చేశారు. సమర్థవంతంగా నీటి పంపిణీ రిజర్వాయర్లలో నిల్వ చేసిన నీటిని వృ«థా కానివ్వకుండా, సమర్థవంతమైన యాజమాన్య పద్ధతుల ద్వారా ఆయకట్టుకు సరఫరా చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ధవళేశ్వరం బ్యారేజీ నుంచి గోదావరి డెల్టాకు జూన్ మొదటి వారంలోనే నీటిని విడుదల చేశారు. కృష్ణా డెల్టాకు జూన్ రెండో వారంలోగానే సాగునీరు విడుదల చేశారు. తూర్పుగోదావరి జిల్లాలో ఏలేరు రిజర్వాయర్ కింద ఉన్న ఆయకట్టుకు జూన్ మొదటి వారంలోనే నీటిని విడుదల చేశారు. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో తోటపల్లి ప్రాజెక్టు కింద ఆయకట్టుకు, శ్రీకాకుళం జిల్లాలో వంశధార ప్రాజెక్టు కింద ఆయకట్టుకు జూన్ మొదటివారంలో నీటిని విడుదల చేశారు. తూర్పు గోదావరి జిల్లాలో పుష్కర, చాగల్నాడు, రాజానగరం, తొర్రిగడ్డ, పురుషోత్తపట్నం ఎత్తిపోతల ద్వారా ఆయకట్టుకు జూన్ రెండో వారం నుంచి నీరు అందిస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో తాడిపూడి ఎత్తిపోతల కింద ఆయకట్టుకూ జూన్ రెండోవారంలో నీటిని విడుదల చేశారు. ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో భారీ, మధ్య, చిన్న తరహా ప్రాజెక్టుల కింద రైతులు భారీ ఎత్తున పంటలు సాగు చేస్తున్నారు. కృష్ణా బేసిన్లో సాగు జోరు శ్రీశైలం, సాగర్ రిజర్వాయర్లలో నిల్వ గరిష్ట స్థాయికి చేరుకోగానే ఆయకట్టుకు నీటిని విడుదల చేయడం ప్రారంభించారు. సాగర్ కుడి, ఎడమ కాలువల ఆయకట్టుకు ఆగస్టు 11న.. శ్రీశైలం నుంచి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా తెలుగుగంగ, గాలేరు–నగరి, కుడిగట్టు కాలువ(ఎస్సార్బీసీ)లకు ఆగస్టు 7న, హంద్రీ–నీవాకు ఆగస్టు 6న నీటిని విడుదల చేశారు. ఎస్సార్బీసీ, తెలుగుగంగ, గాలేరు–నగరి ఆయకట్టుకు సెపె్టంబర్ మూడో వారం నుంచి నీటిని విడుదల చేయనున్నారు. హంద్రీ–నీవా ద్వారా కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో చెరువులు నింపి, కొంత భాగం ఆయకట్టుకు నీళ్లందించాలని నిర్ణయించారు. తుంగభద్ర జలాశయం కింద హెచ్చెల్సీ, ఎల్లెల్సీ ఆయకట్టుకు ఇప్పటికే నీటిని విడుదల చేశారు. సెప్టెంబర్ ఆఖరు నాటికి సింహభాగం ఆయకట్టులో రైతులు పంటలు సాగు చేయనున్నారు. ఈ ఏడాది పంటల దిగుబడి భారీగా పెరుగుతుందని వ్యవసాయ శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. -
కలసిసాగారు... నీరు పారించారు...
కాలువలు శుభ్రంగా ఉంటేనే పంట పొలాలకు సాగునీరందేది. ఏటా వాటి నిర్వహణ కోసం కొంత బడ్జెట్ కేటాయించడం పరిపాటి. ఆ నిధులు వెచ్చిస్తున్నట్టు రికార్డుల్లో కనిపిస్తున్నాయి. కానీ వెంగళరాయ సాగర్ పరిధిలోని 12 ఎల్, 10 ఆర్ కాలువల దుస్థితి మాత్రం అసలు వాస్తవాన్ని బయటపెడుతున్నాయి. కాలువలన్నీ తుప్పలతో పూడుకుపోయాయి. సాగునీరు సక్రమంగా అందక 2500 ఎకరాల్లో సాగు ప్రశ్నార్థకమైంది. చేసేది లేక నాలుగేళ్లుగా అక్కడి రైతులే వాటిని శ్రమదానంతో శుభ్రపరచుకుని నీరు పారించుకుంటున్నారు. మక్కువ: వెంగళరాయసాగర్ ప్రాజెక్ట్ కాలువల ఆధునికీకరణకు కోట్లాది రూపాయిలు ఖర్చుచేశామని గత పాలకులు గొప్పగా చెప్పుకున్నారు. కానీ శివారు గ్రామాల ప్రజలకు మాత్రం సాగు నీటి కష్టాలు తీరలేదు. గడచిన నాలుగేళ్లు ఈ కాలువలను అధికారులు, పాలకులు పట్టించుకోకపోవడంతో మక్కువ మండలంలోని వెంక ట భైరిపురం గ్రామానికి చెందిన రైతులు గ్రామంలో కమీషన్ పాట(ధాన్యం కొనుగోలు చేసిన వ్యాపారులు అందించాల్సిన సొమ్ము) ద్వారా కొంతమొత్తం, రైతులు చందాలు ఎత్తుకొని మరికొంత వెచ్చించి, ఏటా ఖరీఫ్ సీజన్లో కాలువల్లో పేరుకుపోయిన పూడికలు తొలగించుకొని పంటలు సాగుచేసుకుంటున్నారు. 9 గ్రామాలకు అందని సాగునీరు... వెంగళరాయసాగర్ ప్రాజెక్టు కుడి ప్రధాన కాలువ పరిధిలోని 12ఎల్ కాలువ మండలంలోని చప్పబుచ్చమ్మపేట, మేళాపువలస, ములక్కాయవలస, పాపయ్యవలస, కాశీపట్నం, వెంకటభైరిపురం, కొయ్యానపేట, కొండరేజేరు గ్రామాల రైతులకు చెందిన సుమారు 2500 ఎకరాలున్నాయి. నాలుగేళ్లనుంచి కాలువల నిర్వహణ చేపట్టకపోవడంతో ఈ కాలువల ద్వారా పూర్తిస్థాయిలో సాగునీరు సరఫరా కావడంలేదు. కాలువల్లో తూటికాడలు, నాచు, పిచ్చిమొక్కలు ఏపుగా పెరిగిపోయి నీరు పారడంలేదు. మండలంలోని కాశీపట్నం గ్రామం సమీపంలోని 10ఆర్ కాలువ వద్ద గతంలో ఏర్పాటుచేసిన మదుము, యూటీ శిథిలావస్థకు చేరుకోవడంతో కాలువ మధ్యలో పెద్దగొయ్యి ఏర్పడి నీరు పంటపొలాల మీదుగా సీతానగరం మండలం తామరఖండి గెడ్డలోకి వృథాగా పోతోంది. దిగువనున్న పాపయ్యవలస, కొయ్యానపేట, కొండరేజేరు, వెంకటభైరిపురం గ్రామాల పరిధిలోని కాలువలకు సాగునీరు అందట్లేదు. అయినా వాటిని చక్కదిద్దేందుకు ఇరిగేషన్ అధికారులు చొరవ చూపలేదు. శ్రమదానంతో కాలువల నిర్వహణ.. అధికారులు కాలువల నిర్వహణ సరిగ్గా చేపట్టకపోవడంతో రైతులు శ్రమదానంతో ఈ నెల 14వ తేదీ నుంచి కొండరేజేరు గ్రామానికి చెందిన రైతులు కన్నంపేట గ్రామం నుంచి కొండరేజేరు వరకు కాలువలో ఉన్న పూడికలను తొలగించుకున్నారు. కొయ్యానపేట గ్రామానికి చెందిన రైతులు 12ఎల్, ఆర్ కాలువలో పేరుకుపోయిన పూడికలను మూడురోజులపాటు తొలగించుకొని పంటపొలాలకు సాగునీరు సమకూర్చుకుంటున్నారు. శనివారం వెంకటభైరిపురం గ్రామానికి చెందిన సుమారు 150మంది పురుషులు, మహిళలు కలసికట్టుగా కాలువల్లో పేరుకుపోయిన పూడికలు, తూటికాడలు తొలగిస్తున్నారు. సుమారు 7కిలోమీటర్ల పొడవునా తుప్పలు తొలగిస్తున్నారు. వెంకటభైరిపురం గ్రామానికి చెందిన రైతులు ఏటా రూ. లక్ష వరకు వెచ్చించి, కాలువలు నిర్వహించుకుంటున్నారు. ఎల్బీసీ పరిధిలోని 12ఎల్ కాలువ మొత్తం పూడికలతో నిండిపోవడంతో సరాయివలస, కొండబుచ్చమ్మపేట గ్రామాలకు చెందిన పంటపొలాలకు సాగునీరు అందకపోవడంతో, చందాలు ఎత్తుకొని పూడికలు తొలగించుకునేందుకు సమాయత్తమవుతున్నారు. అదును దాటిపోతున్నా... జరగని ఉభాలు.. శివారు గ్రామాలైన వెంకటభైరిపురం, కొండరేజేరు, కొయ్యానపేట, సరాయివలస, గోపాలపురం గ్రామాల పంటపొలాలకు కాలువల ద్వారా సాగునీరు అందకపోవడంతో ఖరీఫ్సీజన్ సగం పూర్తయినా పంటపొలాలకు సాగునీరు అందకపోవడంతో రైతులు ఉభాలు జరిపించలేకపోతున్నారు. దీనివల్ల నారుమడులు ముదిరిపోతున్నాయి. తప్పనిసరి పరిస్థితుల్లో సొంతంగా కాలువలు శుభ్రం చేసి నీటిని సమకూర్చుకుంటున్నారు. అధికారులు ఇప్పటికైనా వారి సమస్య పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాల్సిందే. సాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్నాం.. నాలుగేళ్లుగా కాలువల నిర్వహణ చేపట్టకపోవడంతో సాగునీటికోసం అనేక అవస్థలు పడుతున్నాం. ఏటా రైతులు చందాలు ఎత్తుకొని, కాలువల్లో పూడికలు తొలగించుకుంటున్నాం. ఏటా ఖరీ ఫ్ సీజన్ ముగిసిన సమయంలో ఉభాలు జరి పిస్తుండటంతో దిగుబడులు రావడం లేదు. సాగు చేసినప్పటికి వచ్చిన దిగుబడులు పెట్టుబడులకే సరిపోతున్నాయి. ఏటా మేమే కాలు వ శుభ్రపరచుకుంటున్నా... ఇరిగేషన్ అధికా రులు పట్టించుకోవడం లేదు. – రెడ్డి శ్రీరాము, వెంకటభైరిపురం, రైతు సీజన్ పూర్తవుతున్నా ఉభాలు జరగలేదు.. నాకు పదెకరాల పొలం ఉంది. అదంతా కాలువ పరిధిలోనే ఉన్నందున కాలువ ద్వారా నీరురాకపోవడంతో ఇంతవరకు ఉభా లు జరిపించలేకపోయాం. ఖరీఫ్సీజన్ ముగుస్తుండటంతో నారుమడులు ముదిరిపోతున్నా యి. ముదిరిన నారు నాటినా ప్రయోజనం ఉండదు. దిగుబడి శాతం తగ్గిపోతుంది. ప్రతి ఏటా ఇదేతంతు జరుగుతుంది. అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. – జాగాన తిరుపతినాయుడు, రైతు, వెంకటభైరిపురం -
అన్నీ అనుమానాలే?
టీడీపీ పాలనలో హంద్రీ–నీవా, గాలేరు–నగరి ప్రాజెక్టులకు సంబంధించి చేపట్టిన పనులపై ప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటీ తొలిరోజు మంగళవారం నిర్వహించిన పరిశీలనల్లో అన్నీ అనుమానాలే వ్యక్తం అయ్యాయి. నిబంధనలు ఏం చెబుతున్నాయి.. అందుకు విరుద్ధంగా పనులకు ఎలా అనుమతులు ఇచ్చారంటూ ఒక్కో పనిని సునిశితంగా పరిశీలిస్తూ నిపుణులు పర్యటన సాగించారు. సాక్షి, బి.కొత్తకోట / తిరుపతి: గత ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టు పనులను పరిశీలించిన నిపుణుల కమిటీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలిసింది. ప్రాజెక్టు పనుల పరిశీలనకు రిటైర్డ్ సీఈ ఐఎస్ఎన్ రాజు, రిటైర్డ్ ఇంజినీర్ ఇన్ చీఫ్ అబ్దుల్ బషీర్, రిటైర్డ్ ఇంజినీర్ ఇన్ చీఫ్ ఎల్.నారాయణ రెడ్డి, రిటైర్డ్ ఆర్ అండ్ బీ ఇంజినీర్ ఇన్ చీఫ్ సుబ్బరాయ శర్మ, ఏపీ జెన్కో డైరెక్టర్ జీ.ఆదిశేషులను ప్రభుత్వం నియమించింది. ఈ బృందం మంగళవారం గాలేరు–నగరిలో భాగమైన మల్లెమడుగు రిజర్వాయర్ పనులు, హంద్రీ–నీవాలో భాగమైన కుప్పం ఉపకాలువ పనులు పరిశీలించింది. ఎన్నో ప్రశ్నల ను లేవనెత్తింది. తొలుత మల్లెమడుగు రిజర్వాయర్ను పరిశీలించి రూ.120కోట్లతో ఇక్కడ పనులు ఎలా చేపట్టారని అధికారులపై అనుమానం వ్యక్తంచేశారు. గాలేరు–నగరి పూర్తి కాలేదు.. ప్రస్తుతానికి ఒక టీఎంసీ సామర్థ్యంతో రిజర్వాయర్ నిర్మిస్తే సరిపోతుంది కదా? ఇది తెలిసీ భారీ అంచనాతో పనులు చేపట్టడానికి కారణమేమిటని అనుమానం వ్యక్తంచేశారు. ప్రస్తుతం 17శాతం పూర్తయిన పనులు పరిశీలించాక ఒక టీఎంసీ సామర్థ్యానికే రిజర్వాయర్ను నిర్మించాలని సూచనలిచ్చారు. గాలేరు–నగరి పూర్తయి నీటి లభ్యత అందుబాటులోకి రాగానే రిజర్వాయర్ సామర్థ్యం పెంచుకోవచ్చ ని సూచనచేశారు. అక్కడి నుంచి కుప్పం ఉపకాలువ పరిశీలనకు వచ్చిన కమిటీ ఈ పనులపై అడుగడుగునా అనుమానాలు, అసంతృప్తిని వ్యక్తం చేసింది. రూ.413 కోట్ల పనులను రూ.430.27 కోట్లకు అప్పగించినా నిర్ణీత గడువులో పనిచేయకపోగా అదనంగా రూ.144.7 కోట్ల పెంపు వెనుక పెద్ద వ్యవహారమే నడిచిందని బలంగా అనుమానం వ్యక్తం చేశారని తెలిసింది. కుప్పం ఉపకాలువ 4వ కిలోమీటర్ నుంచి ప్రారంభమైన పరిశీలన చివరిదాకా సాగింది. 4వ కిలోమీటర్కు సమీపంలోని ఎత్తిపోతల పథకాన్ని పరిశీలించాక 11వ కిలోమీటర్ వద్ద గ్యాస్ పైప్లైన్ దాటేందుకు తవ్విన సొరంగం, పైప్లైన్ పనులు చూశారు. 26వ కిలోమీటర్ వద్ద జరిగిన ఇన్వర్టర్ సైఫన్ పైప్లైన్ చూశాక కమిటీకి తీవ్రమైన అనుమానాలు తలెత్తినట్టు తెలిసింది. అసలు ఈ సైఫన్ విధానం పని చేపట్టాలని డీటైల్డ్ ప్రాజెక్టు నివేదికలో ఉందా అని ఆరా తీశారు. కాలువను తవ్వాల్సిన చోట సైఫన్ పద్ధతి అమలుచేసే విషయంలో తెర వెనుక ఏదో బలమైన వ్యవహరం నడిచిందని కమిటీ నిర్ధారణకు వచ్చినట్టు తెలిసింది. ఇక్కడ కాలువను నిర్మించకపోవడం వల్లే అదనంగా రూ.110 కోట్లు పెంచుకొన్నట్టు నిర్ధారించారని తెలిసింది. డీపీఆర్లోని పనులు చేపట్టడం నిబంధనలను పూర్తిగా ఉల్లంఘించడం ఒక ఎత్తయితే, దానికి భారీగా చెల్లింపులు చేయడం సాహసమేనని కమిటీ సభ్యులు చర్చించినట్టు తెలిసింది. దీనికి అనుమతులు ఇచ్చిందెవరని అధికారులను అడిగినట్టు తెలిసింది. కాలువ తవ్వకంలోనూ నిబంధనలు పాటించకుండా కాంట్రాక్టర్ల ఇష్టం మేరకు పనులు చేశారని తేల్చారు. అదే సమయంలో చేసిన పనుల్లో 20 కిలోమీటర్ల కాలువ తవ్వకం తగ్గినప్పుడు అంచనాలు తగ్గాలి కదా, అలా కాకుండా రూ.144 కోట్ల అదనపు చెల్లింపులు చేయడమేమిటని ఆశ్చర్యపోయినట్టు తెలిసింది. 140 కిలోమీటర్ వద్ద సొరంగం, కాలువలోనే పెద్దదైన అక్విడెట్ పనులు పరిశీలించారు. కాలువ పరిశీలన సమయంలో జరిగిన పనులకు నిబంధనలు పాటించలేదని, ఇష్టారాజ్యంగా వ్యవహరించారని తేల్చారని సమాచారం. నేడు మదనపల్లెలో కమిటీ సభ్యులు రెండో రోజు బుధవారం మదనపల్లె సమీపంలోని 59వ ప్యాకేజీకి చెందిన సొరంగం పనులు, చిప్పిలి, గుంటివారిపల్లె సమ్మర్ స్టోరేజీ ట్యాంకు పనులను పరిశీలించనున్నారు. -
లోకేష్ను నిలదీసినా.. సిగ్గు లేకుండా విమర్శలా..
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రాజెక్టులకు జలకళ వచ్చిందని ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్కుమార్ యాదవ్ అన్నారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ..శ్రీశైలం ప్రాజెక్టు నుంచి శుక్రవారం నీటిని విడుదల చేశామని..మరో పది రోజులు వరద వస్తే.. నాగార్జున సాగర్లో పూర్తిస్థాయి నీటిని నిల్వ చేసుకోవచ్చన్నారు. రాయలసీమ జిల్లాలకు హంద్రీనీవా, పోతిరెడ్డిపాడు ద్వారా నీటిని విడుదల చేశామని చెప్పారు. ఎప్పటికప్పుడు అన్ని నదుల వరద, ప్రాజెక్టుల పరిస్థితిని అంచనా వేస్తూ నీటిని విడుదల చేస్తున్నామని తెలిపారు. టీడీపీ నేతలు సిగ్గులేకుండా మాట్లాడుతున్నారు.. ముంపు ప్రాంతాలను తరలించకుండా గత ప్రభుత్వం కాఫర్ డ్యామ్ను నిర్మించిందన్నారు. టీడీపీ ప్రభుత్వం ప్రణాళిక లోపం స్పష్టంగా కనబడుతోందన్నారు. సాక్షాత్తు లోకేష్ను గిరిజనులు నిలదీశారని..అయినా టీడీపీ నేతలు సిగ్గు లేకుండా విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గిరిజనుల పట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విశాల హృదయంతో స్పందించారని తెలిపారు. ముంపు బాధిత కుటుంబాలకు అదనంగా ఐదు వేలు సాయం ప్రకటించారన్నారు. 25 వేల కుటుంబాలకు మేలు జరిగేలా సీఎం నిర్ణయం తీసుకున్నారన్నారు. -
చిరు ధాన్యాలను ప్రోత్సహించేలా ప్రణాళిక
-
అక్రమార్కుల భరతం పడతాం
సాక్షి, కొడవలూరు: ఇరిగేషన్, ఉపాధిహామీ పనుల్లో గడిచిన ఐదేళ్లలో చోటు చేసుకున్న అవినీతిపై విచారణ జరిపిస్తామని ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి స్పష్టం చేశారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం జరిగిన సర్వసభ్య సమావేశానికి ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గడిచిన ఐదేళ్లలో నీరు–చెట్టు పథకంలో భారీగా అవినీతి జరిగిందన్నారు. ఈ విషయాన్ని సీఎం జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకుపోవడం జరిగిందని తెలిపారు. విచారణలో అవినీతిని నిగ్గుతేల్చి అక్రమార్కుల భరతం పడతామన్నారు. నీరు–చెట్టులోని అవినీతి కారణంగా రైతులు ఎన్నో ఇబ్బందులు పడ్డారన్నారు. ఎంతో మంది అధికారులు బలయ్యారని తెలిపారు. ఉపాధి పనుల్లోనూ భారీగా అవకతవకలు జరిగాయని, వీటిపై తహసీల్దార్, ఎంపీడీఓలతో విచారణ జరిపిస్తామన్నారు. గతంలో జరిగిన అవినీతికి, ఏకపక్ష నిర్ణయాలకు విసిగిపోయిన ప్రజలు తనను 40వేల మెజార్టీతో గెలిపించారన్నారు. గత ప్రభుత్వం మహిళా తహసీల్దార్పై ప్రజాప్రతినిధి దాడికి పాల్పడిన చర్యలు తీసుకోకుండా నిరంకుశంగా వ్యవహరించిందన్నారు. ప్రభుత్వ వైద్యులు మండల కేంద్రాల్లోనే నివాసం ఉండాల్సిన అవసరం ఉందన్నారు. ఈ విషయంలో వైద్యులు మానవతతో వ్యవహరించాలన్నారు. ఊటుకూరులో బోరు బావిలో పడిన బాలికను కొనఊపిరితో ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకొస్తే వైద్యులు అందుబాటులో లేరన్నారు. అనంతరం కోవూరు వైద్యశాలకు తీసుపోయినా ఫలితం లేకుండా పోయిందన్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా వైద్యులు బాధ్యత తీసుకోవాలని సూచించారు. అమ్మఒడి పథకాన్ని ప్రజల్లోకి తీసుకుపోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. ఇప్పటికీ గిరిజనులు బడులకు పోవడం లేదని తెలిపారు. ఎంఈఓ, ఐసీడీఎస్, పంచాయతీ కార్యదర్శులు సమైక్యంగా కృషి చేసి అమ్మఒడిని ప్రజల్లోకి తీసుకుపోయి ప్రతీబిడ్డా చదివేలా చేయాలన్నారు. గృహనిర్మాణ శాఖలో లబ్ధిదారులను ముప్పతిప్పలు పెట్టారన్నారు. అందువల్లే గృహాలన్నీ వివిధ దశల్లో నిలిచిపోయి ఉన్నాయన్నారు. సమావేశం ప్రారంభమైనా ఆర్డబ్ల్యూఎస్ ఏఈ అందుబాటులోకి రాకపోవడంపై ఆయన స్పందిస్తూ పునరావృతం కాకుండా చూసుకోవాలని సూచించారు. ఎంపీపీ నల్లావుల వెంకమ్మ అధ్యక్షతన జరిగిన సమావేశంలో తహసీల్దార్ ఎన్వీ ప్రసాద్, ఎంపీడీఓ డీవీ నరసింహారావు, వైస్ఎంపీపీ కొండా శ్రీనివాసులురెడ్డి, ఎంఈఓ వసంతకుమారి, వైద్యాధికారులు రామకృష్ణ, సుచిత్ర, ఎస్సై శ్రీనివాసులురెడ్డి, ఎంపీటీసీ సభ్యులు పాల్గొన్నారు. -
చినుకమ్మా! ఎటుబోతివే..!!
సాక్షి, అమరావతి: నైరుతి రుతు పవనాలు పక్షంరోజులుగా మొహం చాటేశాయి. కరువు ఛాయలు ప్రస్ఫుటం అవుతున్నాయి. రైతులు అష్ట కష్టాలు పడి కన్న బిడ్డల్లా పెంచుకున్న మామిడి, బొప్పాయి, అరటి, బత్తాయి లాంటి పండ్ల తోటలు నీరందక ఎండిపోతున్నాయి. జూన్ నెల వచ్చి 20 రోజులవుతున్నా రాష్ట్రంలో చినుకు జాడలేదు. జోరుగా వ్యవసాయ పనులు సాగాల్సిన కాలంలో పంట భూములు ఎడారిని తలపిస్తున్నాయి. రిజర్వాయర్లన్నీ నిండుకున్నాయి. భూగర్భ జలమట్టం దారుణంగా పాతాళానికి పడిపోయిది. ఉన్న బోర్లు ఎండిపోతుండగా... కొత్తగా బోర్లు వేసినా నీటి జాడలేని పరిస్థితి. అనంతపురం, వైఎస్సార్ కడప, చిత్తూరు, కర్నూలు, ప్రకాశం జిల్లాల్లో వేల ఎకరాల్లో పండ్ల తోటలు నిలువునా మాడిపోతున్నాయి. మిరప, టమోట, వంగ, బెండ తదితర కూరగాయల తోటలు కూడా ఎండిపోయాయి. మార్కెట్లో కిలో టమోటా రూ.45 చేరడానికి ఇది కారణమని వ్యాపారులు అంటున్నారు. అనంతపురం జిల్లాలో కంది పోకుండా పండ్ల తోటల్లో కాయలను ఎండ నుంచి కాపాడుకోవడం కోసం పాత చీరలను దానిమ్మ చెట్లకు కప్పుతున్నారు. కొందరు రైతులు ఇలా టమోటా, దానిమ్మ పంటలను ఎండ నుంచి కాపాడుకునేందుకు మార్కెట్లో వేలాది రూపాయలు వెచ్చించి పాత చీరలను కొనుగోలు చేశారు. అయిదేళ్లు కరువును ఎదుర్కొన్న రైతులు ఈ ఏడాదైనా సకాలంలో వర్షాలు కురుస్తాయని, పంటలు వేసుకుని తిండి గింజలతోపాటు నాలుగు రూపాయలు సంపాదించుకుందామని ఆశించిన రైతులకు ప్రకృతి తీవ్ర నిరాశ కలిగిస్తోంది. రుతుపవనాలు ఒకటి రెండు రోజుల్లో వస్తే నెలాఖరులోపు మంచి వర్షాలు కురుస్తాయని రైతులు ఆశలు పెట్టుకున్నారు. ఖరీఫ్ సాగుపై దుష్ప్రభావం నైరుతీ రుతు పవనాలు సకాలంలో రానందున ఖరీఫ్ సాగుపై దుష్ప్రభావం తప్పకపోవచ్చని వ్యవసాయ, విపత్తు నిర్వహణ శాఖల నిపుణులు అంటున్నారు. సాధారణంగా జూన్ అయిదో తేదీలోగా నైరుతీ రుతు పవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించాలి. రుతు పవనాల రాకకు ముందస్తు సూచికగా జూన్ ఆరంభం నుంచి వర్షాలు కురవాలి. అయితే ఈ ఏడాది దీనికి పూర్తి విరుద్ధమైన పరిస్థితి నెలకొంది. జూన్ 20వ తేదీ వచ్చినా రుతు పవనాల జాడలేదు. ముందస్తు వర్షాలూ లేవు. వీటన్నింటికీ మించి ఎండలు భగ్గుమంటున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 43 నుంచి 46 డిగ్రీల సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతుండటవల్ల భూమి సెగలు కక్కుతోంది. తాగునీటికీ కటకట సాగు నీరే కాదు తాగు నీటి సమస్య కూడా వేధిస్తోంది. భూగర్భ జలమట్టం రోజురోజుకూ కిందకు పడిపోతోంది. అయిదేళ్లుగా వరుసగా వర్షాభావం ఉండటమే ఇందుకు కారణం. రాష్ట్రంలోని 4800 పైగా గ్రామాల్లో తీవ్ర సాగునీటి ఎద్దడి నెలకొంది. గ్రామీణ నీటి సరఫరా విభాగం కొంత వరకూ ట్యాంకర్లు, ఇతర మార్గాల ద్వారా తాగునీరు సరఫరా చేస్తున్నా వేలాది గ్రామాల వారికి సమస్య తప్పడంలేదు. మైళ్ల దూరం నుంచి చాలా గ్రామాల మహిళలు బిందెలతో నీరు మోసుకెళుతున్న దృశ్యాలు రాష్ట్రంలో తాగునీటి సమస్యకు అద్దం పడుతున్నాయి. పశువులు ఆకలితో అలమటిస్తుంటే తట్టుకోలేక మనసు చంపుకుని అన్నదాతలు వీటిని కటికోళ్లకు ఇస్తున్నారు. ఇప్పటికే 67 శాతం లోటు వర్షపాతం జూన్ ఒకటో తేదీతో ఖరీఫ్ సీజన్ ప్రారంభమైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకూ అధికారిక గణాంకాల ప్రకారమే రాష్ట్రంలో సగటు వర్షపాత లోటు 67 శాతానికి చేరింది. ఈనెల ఒకటో తేదీ నుంచి ఇప్పటి వరకూ కురవాల్సిన వర్షం (సాధారణం) కంటే నెల్లూరు జిల్లాలో 94 శాతం, కృష్ణా 91, శ్రీకాకుళం 81.70, ప్రకాశం 78.30, పశ్చిమ గోదావరి 78.10 శాతం, విజయనగరం 76.40, విశాఖపట్నం 64.80, వైఎస్సార్ 63.20, గుంటూరు 59.80, కర్నూలు జిల్లాలో 58.60 శాతం వర్షపాతం లోటు నమోదైంది. -
‘టెండర్ల’కు చెమటలు
సాక్షి, విజయవాడ : టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అవకతవకల ప్రక్షాళనకు కొత్త ప్రభుత్వం మొగ్గుచూపడంతో అధికారులు ఆ పనుల్లో నిమగ్నమయ్యారు. జలవనరుల శాఖలో అవినీతి.. ఆశ్రిత పక్షపాతం.. బంధుప్రీతితో జరిగిన టెండర్ల కేటాయింపుపై కొరడా ఝుళిపించేందుకు సిద్ధమయ్యారు. పాతిక శాతం దాటని పనులకు సంబంధించి టెండర్లను రద్దు చేయాలని ఉన్నతాధికారులకు సిఫార్సు చేశారు. జలవనరుల శాఖలో గత ప్రభుత్వ హయాంలో అనుమతించిన టెండర్లను అధికారులు సమీక్షిస్తున్నారు. 25 శాతం కంటే తక్కువ పనులు జరిగిన కాంట్రాక్టులను రద్దు చేయాలంటూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అమలు చేసే పనిలో నిమగ్నమయ్యారు. జిల్లాలో గతంలో కేటాయించిన పనులపై సమీక్షించి నత్తనడకన సాగుతున్న పనులను రద్దు చేయాలని ఉన్నతాధికారులకు సిఫార్సు చేస్తున్నారు. రూ.45 కోట్ల జైకా నిధులతో మున్నేరు అభివృద్ధి.. గత ఏడాది జైకా (జపాన్ ఇంటర్నేషనల్ కో–ఆపరేషన్ ఏజెన్సీ), వరల్డ్ బ్యాంకుల నుంచి వచ్చిన నిధులతో చెరువులు, కాలువల మరమ్మతులు చేపట్టారు. జైకా నుంచి వచ్చిన రూ.45 కోట్ల నిధులతో మున్నేరు మెయిన్ కెనాల్ అభివృద్ధి పనులు, చెరువుల అభివృద్ధి చేపట్టారు. 50 కిలోమీటర్ల పొడవు మున్నేరు కాలువ గట్ల బలోపేతం, ధ్వంసమైన బ్రిడ్జిలను తిరిగి నిర్మించడం వంటి కార్యక్రమాలను చేపట్టారు. ప్యాకేజ్–1లో ఐదు చెరువులు, ప్యాకేజ్–2లో ఏడు చెరువుల అభివృద్ధికి టెండర్లు పిలిచారు. వాస్తవంగా ఆన్లైన్ ద్వారా టెండర్లు దాఖలు చేసినప్పటికీ నాటి అధికార పార్టీ నేతలకు చెందిన కాంట్రాక్టర్లకే ఈ పనులు దక్కాయి. మున్నేరు ప్రధాన కాలువ పనులు 20 శాతం పూర్తికాగా.. ప్యాకేజ్ 1, 2లలో పనులు మాత్రం ఇంకా ప్రారంభం కాలేదు. దీంతో ఈ ప్రాజెక్టుపై ప్రస్తుత పరిస్థితి తెలియజేస్తూ ఒక నివేదికను సిద్ధం చేశారు. వరల్డ్ బ్యాంకు నిధులతో చెరువుల అభివృద్ధి.. వరల్డ్ బ్యాంకు నుంచి వచ్చిన సుమారు రూ.100 కోట్లతో పశ్చిమ కృష్ణాలోని 78 చెరువుల అభివృద్ధి పనులు చేపట్టారు. వరల్డ్ బ్యాంకు నిబంధనల ప్రకారం బాక్స్ టెండర్లు మాత్రమే వేయాల్సి ఉంది. ఇది తెలుగుదేశం నేతలకు వరంగా మారింది. జలవనరుల శాఖ మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అనుచరులకు తప్ప బయట కాంట్రాక్టర్లకు కనీసం టెండర్ ఫారాలు కూడా దక్కకుండా జాగ్రత్త పడ్డారు. వరల్డ్ బ్యాంకు నుంచి వచ్చిన నిధులతో రెడ్డిగూడెంలో 9 చెరువులు, గన్నవరంలో మూడు చెరువులు, మైలవరంలో నాలుగు చెరువులు, బాపులపాడులో 10 చెరువులు, ముసునూరులో 7 చెరువులు, చాట్రాయిలో 8 చెరువులు, విసన్నపేటలో 11 చెరువులు, నూజివీడులో 8 చెరువులు, తిరువూరులో 3 చెరువులు, విజయవాడ రూరల్లో ఒక చెరువు, కోడూరులో 4 చెరువులు, ఆగిరిపల్లిలో రెండు, ఏకొండూరు, గంపలగూడెంలో 4 చెరువులకు గట్ల బలోపేతం చేసి, పూడికలు తీసి చెరువుల ద్వారా సాగునీటి వసతికి ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు. ఐదు శాతం అధిక ధరలకు.. తొలుత టెండర్ల ధరలపై 25 శాతం అధిక రేట్లకు టెండర్లు వేశారు. అయితే దీనిపై అధికారులు అభ్యంతరాలు వ్యక్తం చేసి రద్దు చేశారు. దీంతో టెండర్ రేటుపై ఐదు శాతం అధికంగా టెండర్లు దాఖలు చేశారని అధికారులు చెబుతున్నారు. ఈ టెండర్లను మంత్రి అనుచరులే దక్కించుకోగా.. 17 చెరువులకు అగ్రిమెంట్లు పూర్తయ్యాయి. అందులో ఆరు చెరువులకు పనులు ప్రారంభంకాకపోగా, 11 చెరువులకు సంబంధించి 20 శాతంలోపు పనులు జరిగాయి. అయితే ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కావడంతో తెలుగు తమ్ముళ్లు పనులు విషయంలో వెనుక్కు తగ్గారు. ప్రస్తుతం ఈ పనుల ప్రస్తుత స్థితిని వివరిస్తూ కమిషనర్ కార్యాలయానికి లేఖ రాస్తున్నట్లు ఇరిగేషన్ అధికారులు చెబుతున్నారు. వాస్తవంగా ఈ టెండర్లు రద్దయితేనే మంచిదనే భావన అధికారుల్లో వ్యక్తమవుతోంది. -
కొత్త ఆశలు!
సాక్షి, చిన్నంబావి: నూతన పరిషత్ పాలకవర్గం కొలువుదీరనుండగా.. మండలంలోని ఆయా గ్రామాల్లో నెలకొన్న సమస్యలు పరిష్కారమవుతాయని ప్రజలు కొంత ఆశతో ఎదురుచూస్తున్నారు. గ్రామాల్లో ఎలాంటి సమస్యలు లేకుండా నిబద్ధతలో పనిచేస్తామని హమీల వర్షం గుప్పించి అధికారంలోకి వచ్చిన ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఎంపీపీలకు మండలంలోని పలు సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి. ఒకవైపు ప్రజల సమస్యలు పరిష్కరిస్తూ..మరోవైపు అభివృద్ధి వనరులు సమకూర్చేందుకు వీరికి శక్తికి మించిన భారంకానుంది. పల్లెల బలోపేతం కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన పంచాయతీరాజ్ చట్టం విధులు, విధానాలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. కొత్త మండలం.. సమస్యలతో సతమతం నూతనంగా ఏర్పడిన చిన్నంబావి మండలంలో అనేక సమస్యలు తిష్ట వేశాయి. మండలంలో ఒక్క ప్రభుత్వ కార్యాలయానికి పక్కా భవనం లేదు. పేరుకే మండలం ఏర్పడింది కాని చాలా వరకు శాఖలు ఉమ్మడి మండలం అయిన వీపనగండ్లలోనే కొనసాగుతున్నాయి. ఎంపీడీఓ, ఎంఈఓ, ఉద్యానవనశాఖ, పశువైద్యశాల, ప్రభుత్వ ఆసుపత్రి తదితర కార్యాలయాలన్ని అక్కడే కొనసాగుతున్నాయి. అదేవిధంగా చాలా కార్యాలయాలు అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి. దీనికితోడు ఇక్కడ ఒక్క పాఠశాల కూడా లేకపోవడంతో స్థానికులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. బ్యాంకు, సంక్షేమ హాస్టల్ను ఏర్పాటు చేసేందుకు నూతన ప్రజాప్రతినిధులను ప్రజలు కోరుతున్నారు. రైతుల కల నెరవేరేనా..? కృష్ణానది చెంతనే ఉన్న గుక్కెడు నీరు అందక పంటలు ఎండిపోతున్నాయని ఇక్కడి ప్రాంత రైతులు అధికారులను, ప్రజాప్రతినిధులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్న కనీసం వాటి పరిష్కారం దిశగా అడుగులు వేయకపోవడం బాధకరమని ఇక్కడి ప్రాంత రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జూరాల ప్రాజెక్టుకు టెయిలండ్ ప్రాంతం కావడంతో పంటల చివరి దశకు వచ్చే సరికి సాగునీరు అందక వేల ఎకరాల్లో పంటలు ఎండిపోయి రైతులు అప్పుల పాలవుతున్నారు. కృష్ణానదిపై ఉన్న చెల్లెపాడు, చిన్నమారూర్ మినీలిప్టులు గత దశాబ్ధ కాలంగా మరమ్మతుకు గురై శిథిలావస్థకు చేరాయి. ఎన్నికల సమయానికి లిప్టుల ప్రస్తావన తప్ప వాటికి పూర్తిస్థాయి పరిష్కార మార్గం చూపడం లేదని ఆందోళన చెందుతున్నారు. ఆ రెండు లిప్టులను మరమ్మతు చేస్తే దాదాపుగా 12వేల ఎకరాలకు సాగునీరు పుష్కాలంగా అందుతుంది. వీటి పరిష్కారం కోసం ఎంపీపీ,జడ్పిటిసిలు ప్రయత్నించాలని ఇక్కడి ప్రాంత రైతులు కోరుతున్నారు. -
అనుసంధానం.. అంతామాయ!
సాక్షి, అమరావతి: పది వేల ఎకరాల్లో వరి సాగుకు ఒక టీఎంసీ నీళ్లు అవసరం. ఆరుతడి పంటలైతే ఒక టీఎంసీ నీటితో 15 వేల ఎకరాల్లో సాగు చేయవచ్చు. కానీ, 58 టీఎంసీలతో 15.01 లక్షల ఎకరాలకు ఒకేసారి నీటిని అందించడం సాధ్యమేనా? 5.80 లక్షల ఎకరాలకు మించి ఒక్క ఎకరాకైనా అదనంగా నీళ్లందించడం సాధ్యం కాదని సాగునీటి రంగ నిపుణులు తేల్చిచెప్పేశారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాత్రం దీన్ని పెడచెవిన పెట్టారు. అధికారాంతమున కమీషన్లు వసూలు చేసుకోవడానికి, సాగునీరు ఇస్తామంటూ రైతుల చెవ్వుల్లో పువ్వులు పెట్టి ఓట్లు కొల్లగొట్టడానికి చింతలపూడి ఎత్తిపోతల పథకానికి అనుబంధంగా రూ.6,719 కోట్లతో గోదావరి–పెన్నా అనుసంధానం తొలిదశ, కోటపాడు– చానుబండ–విస్సన్నపేట ఎత్తిపోతల పథకాలను చేపట్టారు. ఈ రెండు ఎత్తిపోతల పథకాలకు హైడ్రలాజికల్, పర్యావరణ, కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ) తదితర అనుమతులు తీసుకోలేదు. ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ గోదావరి–పెన్నా నదుల అనుసంధానం తొలి దశ పనులను నిలిపివేయాలని జాతీయ హరిత ట్రిబ్యునల్(ఎన్జీటీ) శుక్రవారం ఇచ్చిన తీర్పు చంద్రబాబు ప్రభుత్వ వ్యవహార శైలికి అద్దం పట్టిందని సాగునీటి రంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. అంచనా వ్యయం భారీగా పెంపు గోదావరి నదికి వరద వచ్చే 90 రోజుల్లో పశ్చిమ గోదావరి జిల్లా రౌతులగూడెం వద్ద నుంచి రోజుకు 56 క్యూమెక్కుల(1977.64 క్యూసెక్కులు) చొప్పున 15.50 టీఎంసీలను ఎత్తిపోసి పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల్లో 2.1 లక్షల ఎకరాలకు సాగునీరు, 6.65 లక్షల మందికి తాగునీరు అందించాలన్న లక్ష్యంతో రూ.1,701 కోట్ల వ్యయంతో 2008 అక్టోబర్ 24న చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చేపట్టారు. 2014లో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని విస్తరించి.. గోదావరి నుంచి రోజుకు అదనంగా 138.52 క్యూమెక్కులు(4,897 క్యూసెక్కులు) చొప్పున 90 రోజుల్లో 38 టీఎంసీలు తరలించి, నాగార్జునసాగర్ ఎడమ కాలువ కింద 2.1 లక్షల ఎకరాలు, ఎర్రకాల్వ కింద 27 వేలు, కొవ్వాడ కాలువ కింద 17 వేలు, తమ్మిలేరు ప్రాజెక్టు కింద 24 వేల ఎకరాలు.. వెరసి 2.80 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలని నిర్ణయించారు. చింతలపూడి ఎత్తిపోతల పథకం అంచనా వ్యయాన్ని 2016 సెప్టెంబరు 3న రూ.4,909.80 కోట్లకు పెంచేసి కాంట్రాక్టర్లకు అప్పగించారు. ఈ పనులను 2019 ఖరీఫ్ నాటికి పూర్తి చేసి 4.9 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్లందిస్తామని అప్పట్లో చంద్రబాబు పలుమార్లు హామీ ఇచ్చారు. బాబు ఎత్తులు చిత్తు గోదావరి–పెన్నా నదుల అనుసంధానం తొలిదశలో చంద్రబాబు ప్రభుత్వం నిబంధనలను తుంగలో తొక్కడాన్ని ఎన్జీటీ మరోసారి బహిర్గతం చేసింది. చంద్రబాబుకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ‘వ్యాప్కోస్’ నివేదిక ఆధారంగా గోదావరి–పెన్నా నదుల అనుసంధానానికి సమగ్ర ప్రాజెక్టు నివేదికను రూపొందించి.. సీడబ్ల్యూసీ, పర్యావరణ, హైడ్రలాజికల్, సైట్ క్లియరెన్స్లు తీసుకుని పనులు చేపట్టే వారని సాగునీటి రంగ నిపుణులు అంటున్నారు. కమీషన్ల కక్కుర్తితో ఎలాంటి అనుమతులు లేకుండానే వ్యాప్కోస్ నివేదికను వక్రీకరించి.. గోదావరి–పెన్నా అనుసంధానం చేపట్టి లబ్ధి పొందడానికి చంద్రబాబు ఎత్తుగడ వేశారు. ఆ ఎత్తును ఎన్నికల్లో రైతులు చిత్తు చేశారని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ప్రణాళికా లోపానికి పరాకాష్ట - నాగార్జున సాగర్ కుడి కాలువకు 152 టీఎంసీలను బచావత్ ట్రిబ్యునల్ కేటాయించింది. 2014కు ముందు నాగార్జునసాగర్లో నీటి మట్టం 545 అడుగులు ఉన్నప్పుడు కూడా కుడి కాలువ కింద వరి సాగుకు ప్రభుత్వం నీటిని విడుదల చేసింది. కానీ, 2014 నుంచి 2018 ఖరీఫ్ వరకూ చంద్రబాబు ప్రభుత్వం ఏ ఒక్క ఏడాది కూడా కుడి కాలువ ఆయకట్టులో వరి సాగుకు నీటిని విడుదల చేయలేదు. దాంతో టీడీపీ సర్కార్ తీరుపై గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుండటంతో ఎన్నికల్లో ఘోర పరాభవం తప్పదని చంద్రబాబు గుర్తించారు. ప్రజాగ్రహాన్ని చల్లార్చడం, కమీషన్లు మింగేయడమే లక్ష్యంగా ‘వ్యాప్కోస్’ నివేదికను వక్రీకరించి, రూ.6,020.15 కోట్లతో గోదావరి–పెన్నా నదుల అనుసంధానం తొలిదశకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. - పట్టిసీమ ఎత్తిపోతల ద్వారా పోలవరం కుడి కాలువలోకి ఇప్పటికే 8,500 క్యూసెక్కులను ఎత్తిపోస్తున్నారు. గోదావరి–పెన్నా అనుసంధానం తొలిదశలో భాగంగా.. చింతలపూడి ఎత్తిపోతల పథకం ద్వారా ఏడు వేల క్యూసెక్కులను పోలవరం కుడి కాలువలోకి ఎత్తిపోసి, పట్టిసీమ జలాలతో కలిపి తరలిస్తే ప్రవాహ నష్టాలు, మార్గమధ్యంలో వినియోగం పోనూ ప్రకాశం బ్యారేజీకి 14 వేల క్యూసెక్కులు చేరుతాయని.. వాటిలో ఏడు వేల క్యూసెక్కులు కృష్ణా డెల్టాకు విడుదల చేసి, మిగతా ఏడు వేల క్యూసెక్కులను ప్రకాశం బ్యారేజీ జల విస్తరణ ప్రాంతంలో హరిశ్చంద్రాపురం నుంచి ఐదు దశల్లో నీటిని ఎత్తిపోసి నాగార్జున సాగర్ కుడి కాలువలో పోసి, 9.61 లక్షల ఎకరాలకు నీళ్లందించాలని నిర్ణయించారు. చంద్రబాబు ఈ పనులను రెండు ప్యాకేజీలుగా విభజించి, ఎన్నికలకు ఆరు నెలల ముందు కోటరీ కాంట్రాక్టర్లకు అప్పగించి కమీషన్లు దండుకున్నారు. - ఎన్నికలకు మూడు నెలల ముందు అప్పటి జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ప్రాతనిధ్యం వహిస్తున్న కృష్ణా జిల్లాలో, అదీ మైలవరం, నూజివీడు, జగ్గయ్యపేట నియోజకవర్గాల్లో టీడీపీపై తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమవుతుండటాన్ని గుర్తించిన చంద్రబాబు.. రైతులను ఆకట్టుకోవడానికి రూ.699 కోట్లతో కోటపాడు–చానుబండ–విస్సన్నపేట ఎత్తిపోతలను మంజూరు చేశారు. చింతలపూడి ఎత్తిపోతల పథకం ద్వారా గోదావరి జలాలను మళ్లించి, కోటపాడు–చానుబండ–విస్సన్నపేట ఎత్తిపోతల ద్వారా 50 వేల ఎకరాలకు సాగు నీరందిస్తామని ప్రకటించారు. ఆ పనులను కోటరీ కాంట్రాక్టర్లకు అప్పగించి కమీషన్లు జేబులో వేసుకున్నారు. ఈ ఆయకట్టుకూ 2019 ఖరీఫ్ నాటికే నీళ్లందిస్తామని చెప్పారు. -
మోటార్లకు తగ్గట్టే తిరగనున్న మీటర్లు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన భారీ, మధ్యతరహా ఎత్తిపోతల ప్రాజెక్టుల పరిధిలో ఈ ఏడాది నుంచి విద్యుత్ అవసరాలు భారీగా పెరగనున్నాయి. గతంలో ఎన్నడూ లేనంతగా విద్యుత్ డిమాండ్ ఏర్పడనుందని నీటిపారుదల, విద్యుత్ శాఖలు అంచనా వేస్తున్నాయి. గరిష్టంగా 6 వేల మెగావాట్ల మేర విద్యుత్ డిమాండ్ ఉంటుందని, ఇందులో కాళేశ్వరం ప్రాజెక్టుకే గరిష్టంగా 3,800 మెగావాట్లు అవసరం ఉంటుందని గుర్తించాయి. అవసరాలకు తగ్గట్లే విద్యుత్ సరఫరా చేసే విషయంపై దృష్టి సారించాయి. 6 వేల మెగావాట్లు..: రాష్ట్రంలో నిర్మాణ పనులు పూర్తయినా, కొనసాగుతున్న 22 ఎత్తిపోతల ప్రాజెక్టులతో 61.65 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు, మరో 27.87 లక్షల ఎకరాల ఆయకట్టుకు స్థిరీకరణ చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మొత్తం ఎత్తిపోతల పథకాలు అందుబాటులోకి వస్తే 12,084 మెగావాట్ల మేర విద్యుత్ అవసరం ఉంటుంది. ప్రస్తుతం అలీసాగర్, గుత్పా, ఉదయసముద్రం, దేవాదుల, ఎల్లంపల్లి, బీమా, నెట్టెంపాడు, కోయిల్సాగర్, కల్వకుర్తి ఎత్తిపోతల పథకాల ద్వారా నిర్దేశించిన ఆయకట్టుకు నీటిని సరఫరా చేస్తున్నాయి. నీటిని తీసుకునే మోటార్ల సామర్థ్యాన్ని బట్టి ఒక్కో ప్రాజెక్టు పరిధిలో పంపు మోటార్లు, వాటికి అనుగుణంగా విద్యుత్ అవసరాలను గుర్తించారు. ప్రస్తుతం 14 ఎత్తిపోతల పథకాలు పనిచేస్తుండగా, వీటికి 1,410 మెగావాట్ల మేర విద్యుత్ వినియోగిస్తున్నారు. 90 రోజులపాటు నడిచే ఈ ఎత్తిపోతల పథకాలకు యూనిట్కు రూ.6.40 చొప్పున గణించినా, రూ.1,750 కోట్ల మేర బిల్లులు చెల్లించాల్సి వస్తోంది. ఈ ఏడాది ఖరీఫ్ నుంచి కల్వకుర్తితోపాటు బీమా, నెట్టెంపాడులు పూర్తిస్థాయిలో వినియోగంలోకి రానున్నాయి. దీనికితోడు కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని ఎత్తిపోసేలా ఇప్పటికే మోటార్లకు వెట్రన్ నిర్వహిస్తున్నారు. సీతారామలో కొన్ని పంపులైనా నడపాలని భావిస్తున్నారు. దీంతో ఈ ఏడాది నుంచి అదనంగా మరో 4,500 మెగావాట్ల మేర విద్యుత్ వినియోగం అదనంగా అవసరం ఉంటుంది. ఇప్పటికే ఉన్న విద్యుత్ అవసరాలను కలుపుకొని మొత్తంగా 6 వేల మెగావాట్ల డిమాండ్ దాటుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. కాళేశ్వరానికే భారీ డిమాండ్... కాళేశ్వరంలో మేడిగడ్డ మొదలు అన్నిదశల్లో ఉన్న పంప్హౌస్ల్లో 82 మోటార్లను ఏ ర్పాటు చేస్తుండగా, ఇందులో ప్యాకేజీ–8లో 139 మెగావాట్లు, ప్యాకేజీ–6లో 126 మెగావాట్ల సామర్థ్యం ఉన్న భారీ మోటార్లను వాడుతున్నారు. ఈ మొత్తం మోటార్ల ను నడిపించేందుకు 4,800 మెగావాట్ల విద్యుత్ అవసరాలను గుర్తించారు. వచ్చే ఖరీఫ్లో అన్ని మోటార్లను నడిపించే వీలులేకున్నా మేడిగడ్డ నుంచి కొండపోచమ్మ సాగర్ వరకు 70 మోటార్లతో నీటిని ఎత్తిపోసేలా ప్రణాళికలు జరుగుతున్నాయి. ఇందులో మేడిగడ్డ మొదలు మిడ్మానేరు వరకు ఒక టీఎంసీ నీటిని ఎత్తిపోసేందుకే 1,600 మెగావాట్ల విద్యుత్ అవసరం ఉంటుందని అధికారులు గుర్తించారు. అనుకున్నది అనుకున్నట్టుగా పనులు పూర్తయితే గోదావరి నుంచి 2 టీఎంసీల నీటిని 6 నెలలపాటు ఎత్తిపోసేందుకు ఈ ఏడాది గరిష్టంగా 3,800 మెగావాట్ల విద్యుత్ అవసరమని ట్రాన్స్కో, నీటి పారుదల శాఖలు అంచనా వేశాయి. జూలై నుంచి నీటిని ఎత్తిపోయనుండగా, జూలైలో 600 మెగావాట్ల విద్యుత్ అవసరాలతో మొదలై గోదావరిలో వరద ఎక్కవగా ఉండే అక్టోబర్, నవంబర్, డిసెం బర్ నెలల్లో 3,800 మెగావాట్ల డిమాండ్ ఉంటుందని తేల్చాయి. దీనికి గాను రెండు శాఖలు ప్రణాళికలు రూపొందించుకోవాలని గురువారం సమీక్ష సందర్భంగా సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. -
ఎంఈఐఎల్ 130 ప్రాజెక్టుల రికార్డు!
ఇంజినీరింగ్, ఇన్ఫ్రా దిగ్గజం ఎంఈఐఎల్ గత ఆర్థిక సంవత్సరంలో 130 ప్రాజెక్టులను పూర్తి చేసి రికార్డుల్లోకి ఎక్కింది. లిఫ్ట్ ఇరిగేషన్, తాగునీరు, విద్యుత్ ఉత్పత్తి, సరఫరా, పంపిణీ, గ్యాస్ ప్రాసెసింగ్, గ్యాస్ పంపిణీ తదితర రంగాలలో ప్రాజెక్టులను పూర్తి చేసింది. ప్రాజెక్టులను నిర్ణీత గడువు కన్నా ముందే నాణ్యతతో రాజీపడకుండా పూర్తి చేయడం ఎంఈఐఎల్ ప్రత్యేకత. రికార్డు సమయంలో400 220 కేవీ సబ్స్టేషన్ను నిర్మాణాన్ని పూర్తి చేయడం ద్వారా ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్, ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్, లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ లోకి ఎంఈఐఎల్ ఎక్కింది. అలాగే రాగేశ్వరీ వద్ద గ్యాస్ ప్రాసిసింగ్ యూనిట్ను కూడా కేవలం ఆరునెలల కాలంలోనే నెలకొల్పి రికార్డులను తిరగరాసింది. 2018-19 సంవత్సరానికి గాను తెలంగాణాలో మిషన్ భగీరథ కింద కరీంనగర్, సిరిసిల్లా, వెములవాడ, చొప్పదండి, పెద్దపల్లి-రమగుండం,మహబూబ్నగర్, నల్గొండ, పాలేరు-వరంగల్ వంటి ప్రాజెక్ట్లతో పాటు రాజస్థాన్లోని రాగేశ్వరి గ్యాస్ టెర్మినల్ ప్లాంట్, అసింద్, కోట్రి, షాపుర, పాలి, ఓడిషాలోనిభూవనేశ్వర్ బల్క్ వాటర్, కియోన్జహర్ వాటర్ ప్రాజెక్ట్, అలాగే ఉత్తరప్రదేశ్లోని వారణాసి, ఆగ్రా లలో తాగునీటి సరఫరా ప్రాజెక్టులను పూర్తి చేసింది. ఇక సాగునీటి రంగంలో పురుషోత్తపట్నం స్టేజ్-2, కొండవీటివాగు, చింతలపూడి, హంద్రీ-నీవా ఫేస్-2, కర్నాటకలోని ఉత్తర కోలార్, దసరహళ్లి, కాన్వా, గుజరాత్లోని సౌనీయోజనతో పాటు ఆరు ఎత్తిపోతల పథకాలను దిగ్విజయంగా పూర్తిచేసింది. అలాగే విద్యుత్ రంగంలో నర్సాపూర్, కలికిరి, గజ్వేల్, కేతిరెడ్డిపల్లి, మహేశ్వరం, పొదిలి, సత్తేనపల్లి ప్రాజెక్ట్లను పూర్తి చేసింది. ఎంఈఐఎల్ పూర్తిచేసిన 130 పైగా ప్రాజెక్ట్లో కొన్ని పూర్తిస్థాయిలోని ప్రాజెక్టులుగా కాగా మరికొన్ని ప్రాజెక్ట్ల్లో భాగమైన నిర్దేశించిన పనికి సంబంధించిన ప్యాకేజీలు కూడా ఉన్నాయి. ప్రతీ ప్యాకేజీని సాంకేతికంగా ఒక ప్రాజెక్ట్గానే పరిగణిస్తారు. రికార్డ్ సమయంలో రాగేశ్వరి గ్యాస్ టెర్మినల్... రికార్డ్ సమయంలో రాజస్థాన్లోని రాగేశ్వరి గ్యాస్ టెర్మినల్ ప్లాంట్ను 6 నెలల్లోనే పూర్తి చేసింది. కెయిర్న్ ఇండియా కోసం నిర్మించిన ఈ ప్రాజెక్టు పనులను 2018 సెప్టెంబర్లో మొదలుపెట్టి మార్చి 2019 నాటికి పూర్తి చేసింది. ఈ ప్రాజెక్ట్ ఆపరేషన్, మెయింటెనెన్స్ పనులను ఎంఈఐఎల్ 18నెలల పాటు చూడనుంది. సౌరాష్ట్ర బ్రాంచ్కెనాల్పై జల విద్యుత్... అలాగే గుజరాత్లోని సౌరాష్ట్ర బ్రాంచ్ కెనాల్పైన రెండు హైడల్ విద్యుత్ ఉత్పత్తి చేసే ప్లాంట్లను ఎంఈఐఎల్ పూర్తి చేసి విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించింది. ఇందులో ఒక్కో యూనిట్లో 15 మెగా మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయనుంది. మరో 15 మెగావాట్ల సామర్థ్యం గల జల విద్యుత్ ప్లాంటును కూడా త్వరలోనే అందుబాటులోకి తీసుకురానుంది. మూడో ప్లాంటు అందుబాటులోకి వస్తే మొత్తం 45 మెగావాట్ల విద్యుత్ను ఉత్పత్తి అవుతుంది. రాయచూర్లో వైటీపీఎస్ ఇక కర్ణాటక రాష్ట్రంలోని రాయచూర్ జిల్లాలో వైటీపీఎస్ ప్రాజెక్ట్ను గడువుకంటే ముందే ఎంఈఐఎల్ పూర్తి చేసింది. ప్లాంటుకు అవసరమైన నీటిని కృష్ణనది నుంచి తీసుకునేలా ఏర్పాట్లు చేసింది. ఒక్కసారి ప్లాంట్లులో వాడిన నీటిని (బూడిద నీరు) చెరువులకు పంపించి చెరువు ద్వారా మళ్లీ నీటినివైటీపీఎస్ ప్లాంట్కు తరళించేలా ఏర్పాట్లు చేశారు. నీటి వృథా కాకుండా ఎంఈఐల్ ఇలా ఏర్పాటు చేసింది. కాళేశ్వరంలోని లింక్-1 సబ్స్టేషన్లు... ఇక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్ట్లోని లింక్-1 సబ్స్టేషన్లను ఎంఈఐఎల్ పూర్తి చేసింది. మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం, ప్యాకేజ్-8 సబ్స్టేషన్ను విజయంతంగా పూర్తిచేయడంతో కాళేశ్వరం ప్రాజెక్టు లింక్-1లోని నాలుగు సబ్స్టేషన్లు అందుబాటులోకివచ్చాయి. కాళేశ్వరం ప్రాజెక్ట్కు గుండెకాయ లాంటి లింక్-1లోని ప్యాకేజ్-8 రామడుగు 400 కేవీ సబ్స్టేషన్ను ఎంఈఐఎల్ విజయవంతంగా చార్జ్చేసింది. ప్రపంచంలోనే అతి పెద్దదైన భూగర్భ పంపింగ్స్టేషన్ను ప్యాకేజ్-8లో ఎంఈఐఎల్ ఏర్పాటు చేసింది. ఈ పంప్హౌస్లో ఒక్కొక్కటి 139 మెగావాట్ల సామర్థ్యంకలిగిన 7 భారీ పంప్మోటార్లకు విద్యుత్ అందించేలా రామడుగులో 400/13.8/11 కేవీ సబ్స్టేషన్ను ఎంఈఐఎల్ విజయంతంగా చార్జ్ చేసింది. 360 మెగావాట్ల మొత్తం సామర్థ్యం కలిగిన 9 పంప్మోటర్లను సుందిళ్లలో ఏర్పాటు చేశారు. ఈ మోటార్లకు విద్యుత్ను అందించేందుకు 400 కేవీ సబ్ష్టేషన్, 480 మెగావాట్ల సామర్థ్యం కలిగిన అన్నారం పంప్హౌజ్లోని 12 పంప్ మోటార్లకు విద్యుత్ సదుపాయాన్ని కల్పించేందుకు ఈ 220/11 కేవీఅన్నారం సబ్స్టేషన్, 600 మెగావాట్ల సామర్థ్యం కలిగిన మేడిగడ్డ పంప్హౌజ్లోని 17 పంప్మోటార్లకు విద్యుత్ను అందించేందుకు 220/11 కేవీ మేడిగడ్డ సబ్స్టేషన్ను ఎంఈఐఎల్ ఏర్పాటు చేసింది. ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు నగరానికి తాగునీటి సరఫరా పథకంలో భాగంగా 70,000 గృహాలకు శుద్ధి చేసిన నీటిని సరఫరా చేసే ప్రాజెక్టును కూడా ఎంఈఐఎల్ దిగ్విజయంగా పూర్తి చేసింది. ఇందుకుగాను ఎంఈఐఎల్ 544 కిలోవాట్ల సామర్థ్యం గల మూడు టర్బైన్ పంప్లను ఏర్పాటు చేసింది. రోజుకు 122 మిలియన్ లీటర్ల నీటిని శుద్ధిచేసేలా వాటర్ ప్లాంట్ను ఏర్పాటు చేసింది. లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులలో పురుషోత్తపట్నం స్టేజ్-2, హంద్రీనీవా రెండో దశ, కొండవీటివాగు, చింతలపూడి ప్రాజెక్టులను కూడా రికార్డ్ సమయంలో పూర్తి చేసింది. -
టీఆర్ఎస్కు సాగునీరే ప్రచారాస్త్రం!
సాక్షి, వనపర్తి: మూడు నెలల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భారీగా ఓట్లు రాల్చిన సాగునీటి, సంక్షేమపథకాల అస్త్రాలు ప్రస్తుత లోక్సభ ఎన్నికల్లో కూడా మరోమారు ఓట్లు రాల్చనున్నాయా.? అంటే అవుననే సమాధానాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. జిల్లాలో మొత్తం వ్యవసాయ యోగ్యమైన భూమి 3.86 లక్షల ఎకరాలుండగా ఖరీఫ్లో సుమారు 2.86 లక్షల ఎకరాల్లో, రబీలో సుమారు 95 వేల ఎకరాల్లో వివిధ పంటలు సాగుచేస్తారు. రబీలో వర్షాధారిత పంటలు వేరుశనగ, వరిమాత్రమే సాగు చేస్తారు. జిల్లాకు ప్రధాన సాగునీటి వనరులైన జూరాల, రాజీవ్ భీమా ఫేస్–2, కేఎల్ఐ ప్రాజెక్టుల నుంచి సాగునీరు అందుతుంది. కాల్వల పనులు పూర్తి చేయటంతో పాటు సమీపంలోని చెరువులను, కుంటలను కృష్ణాజలాలతో నింపటంతో వనపర్తి జిల్లా సాగునీటి ఆయకట్టు గణనీయంగా పెరిగింది. లక్ష ఎకరాలకు కృష్ణా జలాలు వనపర్తి జిల్లా పరిధిలోనే సుమారు లక్ష ఎకరాలకు జూరాల, భీమా, కేఎల్ఐ ప్రాజెక్టులతో సాగునీరు అందిస్తున్నారు. అత్యధికంగా జూరాల ప్రాజెక్టు ఎడవ కెనాల్ నుంచి సుమారు 67 వేల ఎకరాలకు అమరచింత, కొత్తకోట, పెబ్బేరు, శ్రీరంగాపురం, వీపనగండ్ల, చిన్నంబావి మండలాలకు, భీమా ఫేస్–2 కాల్వ ద్వారా వనపర్తి మండలం, పెద్దమందడి మండలంలో కొంత భాగం, పానగల్ మండలంలో కొన్ని గ్రామాల్లోని సుమారు 22 వేల ఎకరాలకు, కేఎల్ఐ ప్రాజెక్టు ద్వారా గోపాల్పేట, రేవల్లి మండలాలు పూర్తిగా పానగల్, పెద్దమందడి, ఖిల్లాఘనపురం మండలాలు కొంత భాగాలకు మొత్తంగా సుమారుగా 28 వేల ఎకరాలకు సాగునీరు అందుతోంది. దశాబ్దాల కాలంగా బీడుగా మిగిలిన చెరువులు సైతం ప్రస్తుతం జలకళను సంతరించుకున్నాయి. తుమ్మలు మొలిచిన బీడు భూముల్లో ప్రస్తుతం పచ్చని సిరుల పంటలు దర్శనమిస్తున్నాయి. సీఎంఆర్ఎఫ్ ప్రభావమూ ఎక్కువే.. 2014లో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రాష్ట్రంలో అత్యధికంగా సీఎం ఆర్థికసాయం మంజూరైన టాప్ త్రీలో జిల్లాలో వనపర్తి జిల్లా ఒకటి. అనారోగ్య సమస్యలతో సాయం కోరి వచ్చిన వారందరికీ మంత్రి నిరంజన్రెడ్డి సీఎం ఆర్థికసాయం మంజూరు చేయించారు. గడిచిన ఐదేళ్లలో సాయం పొందిన కుటుంబాలు వేల సంఖ్యలో ఉంటాయని పార్టీ శ్రేణులు తెలిపారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న కొద్ది రోజులు మినహాయిస్తే మిగతా రోజుల్లో కనీసం రోజుకు ఒక్కటైన చెక్కు మంజూరవుతుంది. -
చేయూతనివ్వండి!
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి ఆర్థిక సాయం కోసం 15వ ఆర్థిక సంఘం తలుపుతట్టనుంది. రాష్ట్రంలో 32 లక్షల ఎకరాలకు పైగా సాగునీరు అందించేందుకు చేపడుతున్న బృహత్తర ప్రాజెక్టుకు ఉదారంగా నిధులిచ్చి ఆదుకోవాలని విజ్ఞప్తి చేయనుంది. ఈ మేరకు ఆదివారం హైదరాబాద్ రానున్న ఆర్థిక సంఘం ప్రతినిధుల ముందు ఉంచాల్సిన ప్రతిపాదనలపై ప్రభుత్వం నివేదిక సిద్ధం చేసింది. ఏకంగా కాళేశ్వరం ప్రాజెక్టుకే రూ.20 వేల కోట్ల మేర ఆర్థిక సాయం అందించి చేయూతనివ్వాలని కోరనుంది. నిర్వహణకే భారీ నిధులు అవసరం... కాళేశ్వరం, పాలమూరు–రంగారెడ్డి, సీతారామ వంటి భారీ ఎత్తిపోతల పథకాల ద్వారా నిర్ణీత ఆయకట్టుకు నీటిని మళ్లించాలంటే విద్యుత్, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ (ఓఅండ్ఎం)కే రాష్ట్ర ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. 2020–21 నుంచి 2024–25 వరకు ఐదేళ్ల కాలానికి విద్యుత్ అవసరాలకు వెచ్చించే ఖర్చు, నిర్వహణ భారం కలిపి రూ.40,170 కోట్లు ఉంటుందని నీటి పారుదల శాఖ అంచనా వేసింది. వీటిలో విద్యుత్ అవసరాల ఖర్చు రూ.37,796 కోట్లు కాగా, ఓఅండ్ఎంకు అయ్యే వ్యయం రూ.2,374 కోట్లు ఉండనుంది. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి విద్యుత్ అవసరం 4,627 మెగా వాట్లు కాగా, ఇందులో 2020–21 నుంచి విద్యుత్ చార్జీల కిందే రూ.2,310 కోట్లు మేర చెల్లించాల్సి ఉంటుందని అంచనా వేసింది. మొత్తంగా ఐదేళ్లలో రూ.11,220 కోట్లు అవసరం ఉంటుందని లెక్కలేసింది. ఈ నిర్వహణ భారాన్ని కేంద్రమే భరించేలా చూడాలని ప్రభుత్వం కోరనుంది. ఇక ప్రాజెక్టు పనుల కోసం రూ.66,227 కోట్లతో ఒప్పందాలు జరగ్గా, ఇందులో రూ.35,787 కోట్ల మేర పనులు పూర్తయ్యాయి. మరో రూ.28,291 కోట్ల మేర పనులు చేయాల్సి ఉంది. మిగతావి ఓఅండ్ఎంకు కేటాయించారు. ఇందులో రూ.9,874 కోట్ల మేర ఇప్పటికే తీసుకున్న రుణాలు అందాల్సి ఉంది. ఇవి పోనూ భవిష్యత్తు నిధుల అవసరాలు రూ.18,417 కోట్ల మేర ఉండనున్నాయి. ఇందులోనూ కొంత భారాన్ని కేంద్రం భరించాలని రాష్ట్రం కోరే అవకా శం ఉంది. ఇప్పటికే నీతి ఆయోగ్ సైతం కాళేశ్వరం ప్రాజెక్టుకు రూ.20 వేల కోట్ల మేర ఆర్థిక సాయం చేయాలని సిఫార్సు చేసినా, అలాంటిదేమీ జరగ లేదు. దీంతో ఇప్పుడైనా సానుకూల నిర్ణయం చేయాలని కోరే అవకాశం ఉందని నీటి పారుదల వర్గాలు చెబుతున్నాయి. మొత్తంగా రూ.20 వేల కోట్ల మేర ఆర్థిక సాయం కోరేలా ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు వెల్లడించాయి. నేడు కాళేశ్వరం సందర్శన.. 15వ ఆర్థిక సంఘం ప్రతినిధులు ఆదివారం కాళేశ్వరం ప్రాజెక్టు పనులను పరిశీలించనున్నారు. మధ్యాహ్నం 12కి హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో మేడిగడ్డ చేరుకుని పనులను పరిశీలిస్తారు. తర్వాత ప్యాకేజీ–6లోని పంప్హౌజ్ పనులను చూస్తారు. అక్కడే ప్రాజెక్టు పనులపై సీఎస్ ఎస్కే జోషి, ఈఎన్సీ హరిరామ్, సీఈ నల్లా వెంకటేశ్వర్రావుతో కూడిన బృందం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేయనుంది. అనంతరం మిషన్ కాకతీయ కింద పునరుద్ధరించిన చెరువుల పనులను సంఘం ప్రతినిధులు పరిశీలించే అవకాశం ఉంది. -
సీతారామలో కీలక ముందడుగు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సీతారామ ఎత్తిపోతల పథకంలో మరో కీలక ముందడుగు పడింది. భద్రాద్రి–కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లోని 6.74 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు ఉద్దేశించిన ఈ పథకానికి తుది అటవీ అనుమతులు మంజూరయ్యాయి. అత్యంత కీలకమైన ఈ అనుమతిని మంజూరు చేస్తూ కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వశాఖ చెన్నై కార్యాలయం డిప్యూటీ కన్జర్వేటర్ కె.గణేశ్కుమార్ ఉత్తర్వులిచ్చారు. గోదావరి నదిపై భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని దుమ్ముగూడెం ఆనకట్ట నుంచి నీటిని మళ్లించి భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల పరిధిలోని 6.75 లక్షల ఎకరాలకు నీరందించేందుకు సీతారామ ఎత్తిపోతల పథకం నిర్మాణాన్ని తెలంగాణ ప్రభుత్వం చేపట్టింది. ఈ ప్రాజెక్టుకోసం సుమారు 20,946.72 ఎకరాల భూసేకరణ జరపాల్సి ఉండగా, అటవీభూమి 3,827.63 ఎకరాలు. ఇందులో మణుగూరు డివిజన్లో 212.95 హెక్టార్లు, పాల్వంచ పరిధిలో 618.95, కొత్తగూడెం డివిజన్ పరిధిలో 369.09, సత్తుపల్లిలో 277.41, ఖమ్మం డివిజన్ పరిధిలో 52.64 హెక్టార్ల భూమి అవసరం ఉంది. ఈ అటవీ భూముల పరిధిలో కాల్వలు, టన్నెళ్లు, పంప్హౌస్లు, విద్యుత్ లైన్ల నిర్మాణాలు చేపట్టాల్సి ఉంది. ఈ అటవీ అనుమతులకు స్టేజ్–1 క్లియరెన్స్ గత ఏడాది ఫిబ్రవరిలోనే మంజూరయింది. భూములకు పరిహారాన్ని చెల్లించడంతో బుధవారం తుది స్టేజ్–2 అనుమతులు మంజూరు చేసింది. ఇప్పటికే వన్యప్రాణి బోర్డు, పర్యావరణ అనుమతులు సైతం మంజూరు అయ్యాయి. తాజాగా అటవీ అనుమతులకు క్లియరెన్స్ దక్కడంతో పనులు మరింత వేగం పుంజుకోనున్నాయి. -
ప్రాణహితనా.. వార్ధానా?
సాక్షి, హైదరాబాద్: ప్రాణహిత ప్రాజెక్టులో భాగంగా నిర్మించ తలపెట్టిన తమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణం మళ్లీ తెరపైకి వచ్చింది. కొన్నేళ్లుగా పక్కన పెట్టిన ఈ బ్యారేజీ నిర్మాణాన్ని ఏ నదిపై నిర్మించాలన్న తర్జన భర్జన మొదలైంది. వెయిన్గంగ, వార్ధా నదుల సంగమం అనంతరం ఏర్పడే ప్రాణహిత నదిపై తమ్మిడిహెట్టి నిర్మాణాన్ని తొలుత ప్రతిపాదించగా, కొత్తగా కేవలం వార్ధా నదిపై వీర్దండ వద్ద నిర్మించాలన్న ప్రతిపాదనపైనా అధ్యయనం చేయాలని అధికారులను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. ఈ రెండు ప్రతిపాదనల్లో ఏది పూర్వ ఆదిలాబాద్ జిల్లాకు మేలు చేస్తుందో తనకు నివేదిక ఇవ్వాలని సూచించారు. ఇప్పుడైనా తేలుతుందా.. వెయిన్గంగ, వార్ధా నదులు కలిసిన అనంతరం ప్రాణహిత నదిపై తమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మించడం ద్వారా ఆదిలాబాద్ జిల్లాలో 56 వేల ఎకరాలకు నీరందించాలని 2004లో నిర్ణయించారు. రాష్ట్ర ఏర్పాటు అనంతరం బ్యారేజీలో రీడిజైన్ తర్వాత జిల్లాలో మరో 1.44 లక్షల ఎకరాలను కలిపి మొత్తం 2 లక్షల ఎకరాలకు నీరిచ్చేలా ప్రణాళిక రూపొందించారు. తమ్మిడిహెట్టి వద్ద 4.5 టీఎంసీ సామర్థ్యంతో బ్యారేజీ నిర్మించి 20 టీఎంసీల నీటిని ఎత్తిపోసేలా మొదట రూ.639 కోట్లతో అంచనా వేశారు. వన్యప్రాణి సంరక్షణ కారణంగా ప్రాణహిత నదిపైనే ఒకటిన్నర కిలోమీటర్ ఎగువకు బ్యారేజీ ప్రాంతాన్ని మార్చడంతో అంచనా వ్యయం రూ.1,918.70 కోట్లకు చేరింది. ప్రాణహిత నదిపై 6.45 కిలోమీటర్ల మేర బ్యారేజీ నిర్మాణానికి 107 గేట్లు ఏర్పాటు చేయాల్సి ఉంటుందని, స్పిల్వే నిర్మాణమే 3 కిలోమీటర్లు ఉంటుందని ఇంజనీర్లు పేర్కొన్నారు. ఈ నిర్మాణంతో మహారాష్ట్ర లోని చంద్రాపూర్, గడ్చిరోలి జిల్లాల్లో 509 ఎకరాల ముంపు, ప్రస్తుత ఆసిఫాబాద్ జిల్లాలో 300 ఎకరాల ముంపు ఉంటుందని అంచనా వేశారు. బ్యారేజీ నిర్మాణం గత ఐదేళ్లుగా జరగకపోవడంతో ప్రస్తుత లెక్కల ప్రకారం అంచనా వ్యయం రూ.1,918.70 కోట్ల నుంచి రూ.2,600 కోట్లకు చేరుతోంది. పునరాలోచనలో ప్రభుత్వం... బ్యారేజీ వ్యయం భారీగా పెరుగుతుండటంతో పునరాలోచించిన ప్రభుత్వం కేవలం వార్ధా నది వరకే పరిమితం చేయాలని నిర్ణయించింది. వార్ధాపై నిర్మాణంతో కేవలం కిలోమీటర్ మేరకే బ్యారేజీ నిర్మాణం అవసరమవుతుండగా ఇందుకు 28 గేట్లు సరిపోనున్నాయి. ముంపు ప్రాంతం 400 ఎకరాలకు మించదని, వ్యయం సైతం రూ.700 కోట్లు దాటదని నీటిపారుదల వర్గాలు అంచనా వేశాయి. వార్ధా నదిలో 60 టీఎంసీల నీటి లభ్యత ఉండగా ఇందులో 20 టీఎంసీలు ఆదిలాబాద్ జిల్లా అవసరాలకు సరిపోతాయని లెక్క గట్టాయి. ఈ ప్రాజెక్టుపై శుక్రవారం సమీక్షించిన సీఎం గత ప్రతిపాదనలతో పాటు కొత్త ప్రతిపాదనలపై సమగ్ర అధ్యయనం చేయాలని ఆదేశించారు. వార్ధా వద్ద నీటి లభ్యత ఉన్నా అది తక్కువ సమయంలోనే భారీగా ఉంటుంది. ప్రస్తుతం ప్రతిపాదిస్తున్న బ్యారేజీ సామర్థ్యం 1.5 టీఎంసీలే కావడంతో అంత తక్కువ సమయంలో నిర్ణీత 20 టీఎంసీలు మళ్లించడం సాధ్యమా? అన్న అనుమానాన్ని సమీక్ష సందర్భంగా ఇంజనీర్లు లేవనెత్తారు. ఈ నేపథ్యంలో నీటి లభ్యత, లభ్యత కాలం, మళ్లింపు అవకాశాలపై అధ్యయనం చేయాలని సీఎం ఆదేశించారు. దీంతోపాటు పెద్దవాగులో సైతం 16 నుంచి 18 టీఎంసీల మేర లభ్యత ఉన్న దృష్ట్యా, ఆ నీటిని కాళేశ్వరంలో భాగంగా ఉన్న సుందిళ్ల వరకు ఎలా తరలించాలన్న దానిపైనా పరిశీలన చేయాలని సూచించారు. -
వైఎస్ జగన్ను కలిసిన ఇరిగేషన్ రిటైద్ డీఈ దేముడు
-
ఆనంద‘సాగు’రం
ఖమ్మంఅర్బన్: జిల్లాలోని రైతులకు..ముఖ్యంగా నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ (ఎన్నెస్పీ) కాల్వల పరిధిలో పంటలను సాగు చేసేవారికి ఈ ఏడాది సాగునీరు పుష్కలంగా అందనుంది. ఇప్పటికే ప్రాజెక్ట్ నిండుకుండలా మారడంతో రెండు పంటలకు జలాలు విడుదల చేసేందుకు ఢోకా లేదని అధికారులు ప్రకటించడంతో...జిల్లా రైతులు పంటల తడులకు ఇబ్బంది ఉండదని ఆనందసాగరంలో ఉన్నారు. మొత్తం 21మండలాలు ఉండగా..17 మండలాల పరిధిలో సాగర్ ప్రధాన కాల్వ పారుతోంది. ప్రత్యక్షంగా రెండు లక్షల 50వేల ఎకరాల వరకు సాగు అవుతుండగా, పరోక్షంగా మరో లక్ష ఎకరాలకు చెరువులు, కుంటలు, వాగులు, బావుల్లో నీరు ఊరి..సాగు కష్టాలు తీరతాయి. సాగర్ ఎడమకాల్వ మొత్తానికి ఈఏడాది 132 టీఎంసీల నీరు సాగు, తాగు నీటి అవసరాలకు విడుదల చేయాలని నిర్ణయించారు. దాంట్లో 99టీఎంసీలు తెలంగాణకు, మిగిలిన టీఎంసీలు ఏపీకి విడుదల చేసేందుకు నిర్ణయించారు. ఖరీఫ్లో ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం జిల్లాల పరిధిలో 45 టీఎంసీలు విడుదలకు నిర్ణయించగా మన జిల్లాలోని ఆయకట్టుకు 20 టీఎంసీలు వాడుకోనున్నారు. దీని ద్వారా ఖమ్మం ఎన్నెస్పీ సర్కిల్ పరిధిలో మొత్తంగా లక్షా 26 వేల ఎకరాల వరకు వరి పైర్లకు, లక్షా 28 వేల ఎకరాల్లో ఆరుతడి పంటలైన మిర్చి, పత్తి, మొక్కజొన్న, చెరకు, ఇతరత్రా కూరగాయలు సాగుకు నీరందనుంది. చుక్కనీరు వృథా కాకుండా..ఆయకట్టు చివరి భూములవరకు సాగు నీరు అందించేందుకు ప్రణాళిక ప్రకారం వ్యవహరించాలని ఇటీవల జరిగిన ఇంజినీర్ల సమావేశంలో ఎన్నెస్పీ ఎస్ఈ సుమతీదేవి సూచించారు. గతేడాది నిరాశే.. జిల్లాలోని 16–17 బ్రాంచ్కాల్వ, బోనకల్, మధిర బ్రాంచ్ కాల్వల పరిధిలోని రెండు వేల కిలోమీటర్ల మేజర్లు, మైనర్లు, సబ్ మైనర్ కాల్వల ద్వారా రైతుల పంట భూములకు సాగర్ నీరు అందిస్తుంటారు. గతేడాది ఖరీఫ్కు సాగర్ నీరు విడుదల చేయలేదు. అయినా కొంతమంది రైతులు మొండిగా..పంటలు వేసి, నీరందక ఇబ్బంది పడుతుండడంతో మంత్రులు తన్నీరు హరీశ్రావు, తుమ్మల నాగేశ్వరరావులు ఆయకట్టుకు అక్టోబర్ నెలలో జలాలు విడుదల చేయించారు. అదీ..వారబందీ విధానంతో అమలు చేశారు. తర్వాత రబీ సాగుకు కూడా 9రోజులు ఆన్, 6 రోజులు ఆఫ్ విధానంలో మొత్తం 8తడుల నీరు క్రమపద్ధతిలో అందించడంతో గండం తొలగింది. ఈఏడాది ఖరీఫ్కు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సాగునీటి కష్టం ఉండబోదు. గత నెలలో మిర్యాలగూడెంలో జరిగిన ఎన్నెస్పీ, ఆయకట్టు పరిధి రైతుల సంయుక్త సమావేశంలో జిల్లా నుంచి హాజరైన మాజీ నీటి సంఘాల చైర్మన్లు..గతేడాది రబీ తరహాలోనే వారబందీ విధానంలో విడుదల చేసినా సరిపోతుందనే అభిప్రాయం వ్యక్తం చేశారు. తద్వారా తక్కువ నీటి వినియోగంతో ఎక్కువ దిగుబడి కూడా వచ్చిందని వివరించారు. అయితే..నీటి నిల్వలు పుష్కలంగా ఉండడంతో ఇంజినీర్లు మాత్రం నిరంతరాయంగా మొదటి తడి వరకే ఇవ్వడానికి నిర్ణయించారు. వారబందీ విధానం ద్వారా అయితేనే నీటి వినియోగం తక్కువగా ఉంటుందని, పైగా దిగుబడి పెరగడంతోపాటు, తర్వాత కాలంలో రబీ సాగు, విద్యుత్ తయారీ, తాగు నీటి అవసరాలకు సాగర్ నీరు ఉపయోగ పడుతుందనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఎంతో ఆనందంగా ఉంది.. గత 20రోజుల కిందట కూడా సాగర్ ఆయకట్టు పరిధిలో నీళ్లిస్తారో లేదోనని భయం భయంగా ఉన్నాం. ఇప్పుడు ప్రాజెక్ట్లోకి నీరు పుష్కలంగా చేరడంతో మా చింత తీరింది. నీళ్లొస్తే..బోర్లు, బావుల్లో ఊట పెరుగుద్ది. ఆయకట్టు పరిధిలోని పంటలకు డోకా ఉండదు. – మంకిన వెంకటేశ్వర్లు, చెన్నారం రైతు నేలకొండపల్లి మండలం -
నీళ్లు ప్రవహిస్తున్నాయ్.. బీళ్లు చివురిస్తున్నాయ్
ఈ నాలుగేండ్లలో కేసీఆర్ నేతృత్వంలో తీసుకున్న చర్యలవల్ల తెలంగాణ కోటి ఎకరాల మాగాణంగా మారడానికి మరెంతో కాలం పట్టదు. నాలుగేళ్ల మా శాఖ ప్రగతిని, కాంగ్రెస్ పార్టీ పదేళ్ల పాలనతో పోల్చితే తప్ప వాస్తవాలు అర్థం కావు. గత పాలకుల హయాంలో పెట్టిన ఖర్చు, సాధించిన ప్రగతి పోల్చుకుంటే వాస్తవం తెలుస్తుంది. మా చిత్తశుద్ధి ఏమిటో అందరికీ అర్థం అవుతుంది. కాలం నీటి ప్రవాహం లాంటిది. అది ఎక్కడా స్థిరంగా ఆగిపోదు. ఆ ప్రవాహం మాదిరి కదిలే కాలంతో పాటే మనం ఎన్నో పనులు పూర్తి చేయగలిగాం. దేశంలో మరే రాష్ట్రం పోటీ పడని రీతిలో సాగునీటి రంగంలో అద్భుత ప్రక్రియలకు శ్రీకారం చుట్టాం. దేశవ్యాప్తంగా మన రాష్ట్రంలోని ప్రాజెక్టుల విషయంలో వస్తోన్న ప్రశంసలే మా శాఖ పని తీరుకు గీటురాయి. నీళ్లు, నిధులు, నియామ కాలు అన్న నినాదంతో పోరాడి సాధించుకున్న తెలం గాణ రాష్ట్రం ఉద్యమ నాయ కుడు కేసీఆర్ నేతృత్వంలో నాలుగేండ్లు నడిచింది. ఈ నాలుగేండ్లలో సాగునీటి రంగంలో సాధించిన ప్రగతి నీళ్ల మంత్రిగా నాకు సంతృప్తిని మిగి ల్చింది. ఇంకా సాధించవలసింది ఎంతో ఉన్నా తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో మార్పు స్పష్టంగా కనబడుతున్నది. తెలంగాణ రాష్ట్ర సమితి అధికార పగ్గాలు చేపట్టిన తక్షణమే ఉద్యమ ఆకాంక్ష అయిన సాగునీటి రంగంపై దృష్టి సారించింది. అందుబాటులో ఉన్న అన్ని వనరుల ద్వారా గ్రామీణ నియోజకవర్గాల్లో లక్ష ఎకరాలకు సాగు నీరు చొప్పున మొత్తంగా రాష్ట్రంలో కోటి ఎకరాలకు సాగునీటి సౌకర్యం కల్పించడమే ధ్యేయంగా ప్రణాళికలు తయారు చేసుకు న్నది. ఈ లక్ష్యాన్ని సాధించడానికి నాలుగంచెల వ్యూహాన్ని అను సరించింది. తెలంగాణ గ్రామీణ సామాజిక, ఆర్థిక వ్యవస్థకు ఆధా రాలుగా ఉన్న 46,500 చెరువులను దశలవారీగా పునరుద్దరించడం, గత ప్రభుత్వాలు ప్రారంభించి అనేక కారణాల వల్ల పూర్తి కాకుండా మిగిలిపోయిన ప్రాజెక్టులను పూర్తి చేసుకోవడంతో పాటు వాటిలో కొన్నింటిని తెలంగాణ అవసరాలకు అనుగుణంగా రీ ఇంజనీరింగ్ చేసుకుని పూర్తి చేసుకోవడం, గత ప్రభుత్వాలు ఆమోదించి అట కెక్కించిన ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేసి నిర్దేశిత ఆయకట్టుకు సాగునీరు, వందలాది గ్రామాలకు తాగునీరు అందించడం, గత ప్రభుత్వాల కాలంలో నిధులు లేక, నిర్వహణ లేక నిర్లక్ష్యానికి గురయి శిథిలమైపోయిన పాత సాగునీటి ప్రాజెక్టుల కాలువల వ్యవ స్థను ఆధునీకీకరించి పూర్తి ఆయకట్టుకు సాగునీరు అందించడమే లక్ష్యంగా ముందుకెళ్లింది. ఈ నాలుగంచెల వ్యూహాన్ని అమలు చేయడానికి ఉద్యమ నాయకుడి నేతృత్వంలోని ప్రభుత్వం ఈ నాలుగేండ్ల కాలంలో శాయశక్తులా ప్రయత్నించింది. మెరుగైన ఫలితాలను సాధించింది కూడా. చెరువుల పునరుద్ధరణ కోసం ‘మిషన్ కాకతీయ’ పేరుతో ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని ప్రారంభించింది. ప్రతి యేటా రాష్ట్రం లోని 20శాతం చెరువులను పునరుద్ధరించేలా చర్యలు తీసుకుంది. ప్రభుత్వ అభీష్టం మేరకు కాకుండా స్థానిక ప్రజలను, ప్రజాపతిని ధులను సంప్రదించి వారికి అవసరమైన చెరువులను పునరుద్ధ రించే స్వేచ్ఛ అధికారులకిచ్చాం. చిన్ననీటిపారుదల వ్యవస్థను బలో పేతం చేశాం. అధికార వికేంద్రీకరణ, అవసరమైన వ్యవస్థల ఏర్పాటు ద్వారా టెండర్ల ప్రక్రియను 90 నుంచి 15 రోజులకు కుదిం చాం. పరిపాలనా అనుమతుల ప్రక్రియలో వేగాన్ని, ప్రజల భాగ స్వామ్యాన్ని పెంచాం. పూడిక మట్టి ఉపయోగాలపై ప్రజల్లో చైత న్యం కలిగించాం. వేలాది మంది ప్రజలు, రైతులు పాల్గొన్న ఈ కార్యక్రమం ఒక ప్రజా ఉద్యమంగా మారింది. రైతులు తమ స్వంత ఖర్చులతో పూడిక మట్టిని తరలించుకుపోయి తమ పొలాల్లో చల్లుకుని మెరుగైన దిగుబడి సాధించుకున్నారు. దీంతో రసాయనిక ఎరువులపై ఖర్చు కూడా తగ్గింది. మొదటి దశలో 8,029 చెరువుల పునరుద్ధరించి 6.73లక్షల ఎకరాలకు, రెండోదశలో 7,264 చెరువుల ద్వారా 4.29లక్షల ఎకరాలకు, మూడో దశలో 2,566 చెరువుల ద్వారా 1.45లక్షల ఎకరాలకు ఆయకట్టు అందేలా చేశాం. మొత్తం మీద మిషన్కాకతీయ ద్వారా 17,859 చెరువుల కింద 12.47లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరిగింది. ఆయా చెరువుల్లో 8.20 టీఎంసీల నీటి నిల్వ పునరుద్ధరణ జరిగింది. 1.05లక్షల ఎకరాలు కొత్తగా సాగులోకి వచ్చాయి. ప్రజలు, అధికారులు, ప్రజాప్రతి నిధుల సహకారంతో మిషన్ కాకతీయ ద్వారా ఆశించిన ఫలితాలు, మార్పులు సాకారం అయ్యాయి. దీనికి తోడు 165 ఎత్తిపోతల పథ కాల కింద నాలుగేండ్లలో కొత్తగా 1.23లక్షల ఎకరాలకు సాగునీటి సౌకర్యాన్ని కల్పించి 27వేల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించాం. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సాగునీటి ప్రాజెక్టులు పెండింగ్లో పడేందుకు గల కారణాలను విశ్లేషించుకున్నాం. ప్రధాన అవరోధంగా మారిన భూసేకరణ సమస్యను ‘ల్యాండ్ ప్రొక్యూర్ మెంట్ పాలసీ జీవో నెం: 123 (30.07.2015) ద్వారా పరిష్కరించుకున్నాం. ఆ తర్వాత 2013 భూసేకరణ సవరణ చట్టాన్ని రూపొందించుకున్నాం. ఇది మంచి ఫలితాలనిచ్చింది. ప్రాజెక్టు పనుల్లో వేగం పుంజుకుంది. రైలు, రోడ్డు శాఖల నుంచి అనుమతులు పొందడంతో మరింత ఉపశమనం లభించింది. ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టు విషయంలో మహారాష్ట్రతో పదేండ్లుగా అపరిష్కృతంగా ఉన్న అంతర్రాష్ట్ర వివాదాలను మనమే చొరవ తీసుకుని పరిష్కరించడం ద్వారా ప్రాణహిత, గోదావరి, పెన్ గంగా నదులపై ప్రాజెక్టుల నిర్మాణానికి ఒప్పందం కుదుర్చుకోగలిగాం. ఈ ఒప్పంద ఫలితంగా ప్రాణహితపై తమ్మిడిహట్టి వద్ద, గోదా వరిపై మేడిగడ్డ వద్ద, పెన్ గంగా నదిపై చనాక కొరాట వద్ద బ్యారే జీల నిర్మాణానికి మార్గం సుగమం అయింది. ఈ నాలుగేండ్లలో కల్వకుర్తి, ప్రాణహిత, కాళేశ్వరం, కాళేశ్వరం ఎత్తిపోతల పథకం (చిన్న కాళేశ్వరం), పాలమూరు–రంగారెడ్డి, పెన్ గంగ కాలువ, చనాకకొరాట బ్యారేజీ, తుపాకులగూడెం బ్యారేజీ లాంటి కీలక ప్రాజెక్టులకు అటవీ, పర్యావరణ, వన్యప్రాణి అనుమతులు సాధిం చడంలో పురోగతి సాధించాం. డిండి, సీతారామా ప్రాజెక్టుల అను మతుల ప్రక్రియ వేగం పుంజుకుంది. కాళేశ్వరం ప్రాజెక్టుకు ఒక్క సంవత్సరంలోనే 10 కీలక అనుమతులు పొందడం ఒక రికార్డు. ముఖ్యమంత్రి స్థాయిలో కొన్ని నెలలపాటు ఇంజనీరింగ్ నిపుణు లతో, రిటైర్డ్ ఇంజనీర్లతో సమావేశమై సర్వే ఆఫ్ ఇండియా మ్యాపులు, గూగుల్ ఎర్త్ సాఫ్ట్ వేర్ సహాయంతో అధ్యయనం చేసిన తర్వాత ప్రాణహిత– చేవెళ్ల సుజల స్రవంతి, రాజీవ్ దుమ్ముగూడెం, ఇందిరా సాగర్, ఎస్సారెస్పీ వరద కాలువ, దేవాదుల, కాంతనపల్లి ప్రాజెక్టులను తెలంగాణ అవసరాలకు అనుగుణంగా రీఇంజనీరింగ్ చేసుకుని పనులు చేపడుతున్నాం.ఈ నాలుగేండ్లలో మా సర్కార్ 8 పెండింగ్ ప్రాజెక్టులని పూర్తి చేసింది. మరో 11 ప్రాజెక్టుల ద్వారా పాక్షికంగా నీటి సరఫరా చేయ డానికి చర్యలు తీసుకుంది. వీటి ద్వారా కొత్తగా 9.12 లక్షల ఎక రాలకు సాగునీటి సౌకర్యం కల్పించి, మరో 2 లక్షల ఎకరాల ఆయ కట్టును స్థిరీకరించాం. పాలమూరు జిల్లాలో నాలుగు (కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్) ఎత్తిపోతల పథకాల కింద 2016–17 సంవత్సరంలో 4.5 లక్షల ఎకరాలకు, 2017–18 సంవ త్సరం రబీపంట కాలంలో 6.50 లక్షల ఎకరాలకు సాగునీరు అందించి 700 పైగా చెరువులని నింపడంతో ఆ జిల్లాలో అద్భుత ఫలితాలు కనిపిస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేనంత పంట దిగు బడి వచ్చింది. జిల్లా నుంచి వలసలు ఆగిపోయినాయి. వలసెళ్లిన వారు ఇంటిముఖం పట్టారు. మెదక్ జిల్లాలో సింగూరు కాలువలను పూర్తి చేసి మెదక్ జిల్లాలో 2017 లో 30 వేల ఎకరాలకు, 2018 రబీలో 40 వేల ఎకరాలకు సాగునీరు అందించాం. దేశానికి స్వతం త్రం వచ్చిన తర్వాత ఒక ప్రాజెక్టు నుంచి మెదక్ జిల్లాలో నీరివ్వడం ఇదే తొలి సారి. కరీంనగర్ జిల్లాలో ఎల్లంపల్లి ప్రాజెక్టు ముంపు గ్రామాల పునరావాస సమస్యలను పరిష్కరించి, రాయపట్నం బ్రిడ్జ్ని నిర్మించి 20 టీఎంసీల పూర్తి స్థాయి నిల్వ సాధించగలిగాం. ఎత్తిపోతల నుంచి 25 వేల ఎకరాలు, చెరువులను నింపినందున మరో 37వేల ఎకరాలు స్థిరీకరణ జరిగింది. 2016లో ఎస్సారెస్పీ రెండో దశ కాల్వల ద్వారా సూర్యాపేట, తుంగతుర్తి నియోజక వర్గాల్లోని వందలాది చెరువులను నింపాం. ఖమ్మం జిల్లాలో 11 నెలల రికార్డు సమయంలో భక్త రామదాసు ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసి చెరువులను నింపడం వల్ల 6 వేల ఎకరాలకు సాగునీ రిచ్చాం. డీబీఎం–60 కాలువ పనులు ఈ సంవత్సరం జూన్ కల్లా పూర్తి చేసి భక్తరామదాసు ప్రాజెక్టు ద్వారా 58,958 ఎకరాలకు సాగు నీరు అందించబోతున్నాం. పాలేరు పాత కాలువను 4 నెలల్లో పున రుద్దరించి 10 వేల ఎకరాలకు సాగునీరు అందించాం. ఎస్సారెస్పీ పునరుజ్జీవన పథకం పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి. ఈ పనులు పూర్తయితే కాళేశ్వరం నీళ్లు వరదకాలువ ద్వారా ఎస్సారెస్పీ జలాశయానికి రివర్స్ పంపింగ్ అవుతాయి. దిగువ మానేరు వరకు ఉన్న 5 లక్షల ఎకరాలకు, సరస్వతి కాలువ కింద 40 వేల ఎకరా లకు, లక్ష్మి కాలువ కింద ఉన్న 25 వేల ఎకరాలకు, అలీ సాగర్, గుత్ప ఎత్తిపోతల పథకాల కింద ఉన్న లక్ష ఎకరాలకు నికరంగా నీరు అందుతుంది. మిడ్ మానేరు జలాశయాన్ని సంపూర్ణంగా పూర్తి చేసి 25 టీఎంసీల నీటి నిల్వకు సిద్ధంగా ఉంచాం. మిడ్ మానేరు కింద మరో 70,000 ఎకరాల కొత్త ఆయకట్టుకు సాగునీరు అందిం చాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. నాగార్జునసాగర్ ప్రాజెక్టు పంప్ హజ్ పనులు పూర్తి అయిన కారణంగా గత రబీలో అనేక చెరువు లను నింపి చెరువుల కింది ఆయకట్టును కాపాడం. ఎల్ఎల్సీ కింద 50,000 ఎకరాల కొత్త ఆయకట్టుకు నీరందించే లక్ష్యంతో కాలువ పనులు జరుగుతున్నాయి. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించిన ప్రాణహిత– చేవెళ్లప్రాజెక్టు 2008 లో ప్రారంభమైనా తెలంగాణ ఏర్పడే నాటికి అటకెక్కింది. తెలంగాణ ఏర్పడగానే ప్రభుత్వం ఈ ప్రాజెక్టుని కూలంకషంగా సమీక్షించింది. తొలుత మహారాష్ట్రతో వివాదాలను పరిష్కరించుకునే కృషి జరిపాం. అయితే, తమ భూభాగంలో ముంపును అనుమతించలేమని, తుమ్మిడిహట్టి బ్యారేజీ ఎఫ్ఆర్ఎ ల్ని 152మీటర్ల నుంచి 148 మీటర్లకు తగ్గించమని మహారాష్ట్ర కోరింది. అదే సమయంలో తమ్మిడిహట్టి వద్ద 165 టీఎంసీల నీటి లభ్యత మాత్రమే ఉందని, అందులో పైరాష్ట్రాలు భవిష్యత్తులో వాడుకునే వీలున్న 63 టీఎంసీలున్నాయని కేంద్ర జలవనరుల సంఘం స్పష్టం చేసింది. తమ్మిడిహట్టి వద్ద నుంచి తరలించగలిగే నీటి పరిమాణాన్ని పునఃసమీక్షించుకోమని సూచించింది. జలాశ యాల నిల్వ సామర్థ్యాన్ని పెంచుకోవాలని సిఫారసు చేసింది. ఈ పరిస్థితుల్లో భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా శ్రీరాంసాగర్, నిజాంసాగర్, సింగూరు, వరద కాలువ ఆయకట్టును స్థిరీకరించడా నికి ఈ ప్రాజెక్టు రీఇంజనీరింగ్ అవసరమయింది. గోదావరిపై మేడి గడ్డ, అన్నారం, సుందిళ్ల వద్ద బ్యారేజీలు, పంప్హౌజ్లు నిర్మించి రోజుకు 2 టీఎంసీల నీటిని ఎత్తిపోసి యెల్లంపల్లికి చేర్చడం, అక్కడి నుంచి మిడ్మానేరు, అనంతగిరి, రంగనాయక సాగర్, మల్లన్నసా గర్, కొండ పోచమ్మ సాగర్ తదితర జలాశయాలకు నీటిని తర లించి 13 జిల్లాల్లో 18.25 లక్షల కొత్త ఆయకట్టుకు, 18.80 లక్షల ఎకరాల స్థిరీకరణకు నీరందించాలనే లక్ష్యంతోనే కాళేశ్వరం ప్రాజెక్టు రూపకల్పన జరిగింది. హైదారాబాద్ నగరానికి, దారి పొడవునా ఉన్న వందలాది గ్రామాలకు తాగునీరు, పారిశ్రామిక అవసరాలకు నీరందించడం కూడా ఈ ప్రాజెక్టు లక్ష్యం. నిధుల కొరత లేకుండా ప్రభుత్వం తీసుకున్న చర్యలతో ‘నభూతో నభవిష్యత్’ అనే రీతిలో కాళేశ్వరం ప్రాజెక్టు పనులు మూడు షిఫ్టుల్లో జరుగుతున్నాయి. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఈ ప్రాజెక్టు కోసం కార్మికులు, ఇంజనీర్లు శ్రమిస్తున్నారు. బ్యారేజీలు, పంప్హౌజ్, సర్జ్ఫూల్స్, టన్నెళ్లు, కాల్వలు, పైప్లైన్లు, సబ్స్టేషన్లు, ట్రాన్స్మిషన్ లైన్లు.. ఇలా ఏకకాలంలో అనేక పనులు యుద్ధప్రాతిపదికన సాగుతు న్నాయి.ఈ ప్రాజెక్టు ద్వారా ఎల్లంపల్లి నుంచి మిడ్ మానేరు జలాశ యానికి నీటిని ఎత్తిపోసి ఎస్సారెస్పీ కింద రెండు దశల్లోని ఆయక ట్టుకు 2018లోనే నీరిచ్చేలా అన్ని చర్యలు తీసుకుంటున్నాం. కాళేశ్వరం ప్రాజెక్టు బ్యారేజీల కారణంగా 150 కిలోమీటర్ల మేర గోదావరి సజీవం కాబోతోంది. వ్యవసాయం, చేపల పెంప కం, టూరిజం, జలరవాణా, పరిశ్రమల స్థాపన వంటి రంగాల్లో అనూహ్యమైన ఆర్థిక ప్రగతి జరగనుంది. ఒక్క మాటలో చెప్పా లంటే కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణాకు ‘గ్రోత్ ఇంజన్’ లాగా మార బోతున్నది. కృష్ణా జలాల్లో న్యాయమైన వాటా పొందడానికి బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ముందు, సుప్రీంకోర్టు ముందు వాదనలు మా ప్రభుత్వం కొనసాగిస్తోంది. 12.30 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే పాలమూరు–రంగారెడ్డి, 4 లక్షల ఎకరాలకు ఉద్దేశించిన డిండి ఎత్తిపోతల పథకాల ద్వారా మహబూబ్ నగర్, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల్లోని కరువు పీడిత, ఫ్లోరైడ్ పీడిత ప్రాంతాలకు సాగు, తాగునీరు అందించడానికి ప్రాజెక్టుల నిర్మాణాన్ని కొనసాగి స్తోంది. దేవాదుల, కల్వకుర్తి ప్రాజెక్టుల నీటినిల్వ సామర్థ్యాన్ని పెంచింది. గత రెండేళ్లుగా రూ. 25 వేల కోట్ల మేర అత్యధికంగా నిధులు కేటాయించి పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయడంలో మా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. సాగునీటి శాఖలో ప్రభుత్వం అనేక సంస్కరణలు ప్రవేశ పెట్టింది. శాఖ పునర్వ్యవస్థీకరణ, కొత్త చీఫ్ ఇంజనీర్ యూనిట్ల ఏర్పాటుతో పాటు ఈపీసీ పద్ధతిని, మొబిలైజేషన్ అడ్వాన్సులను మా ప్రభుత్వ రద్దు చేసింది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని విని యోగించుకోవడానికి నీటిపారుదల శాఖ.. ఐఐటీ, ఐఐటీహెచ్, బిట్స్, ఇస్రో, నాబార్డు, ఇక్రిశాట్ లాంటి ఉన్నతస్థాయి సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ నాలుగేండ్లలో కేసీఆర్ నేతృత్వంలో తీసుకున్న చర్యలవల్ల తెలంగాణ కోటి ఎకరాల మాగాణంగా మార డానికి మరెంతో కాలం పట్టదు. నాలుగేళ్ల మా శాఖ ప్రగతిని, కాంగ్రెస్ పార్టీ పదేళ్ల పాలనతో పోల్చితే తప్ప వాస్తవాలు అర్థం కావు. కాలం నీటి ప్రవాహం లాంటిది. అది ఎక్కడా స్థిరంగా ఆగి పోదు. ఆ ప్రవాహం మాదిరి కదిలే కాలంతో పాటే మనం ఎన్నో పనులు పూర్తి చేయగలిగాం. దేశంలో మరే రాష్ట్రం పోటీ పడని రీతిలో సాగునీటి రంగంలో అద్భుత ప్రక్రియలకు శ్రీకారం చుట్టాం. దేశవ్యాప్తంగా మన రాష్ట్రంలోని ప్రాజెక్టుల విషయంలో వస్తోన్న ప్రశంసలే మా శాఖ పని తీరుకు గీటురాయి. వ్యాసకర్త సాగునీటి శాఖ మంత్రి, తన్నీరు హరీష్ రావు -
ద్వీపకల్పాన్ని తలపిస్తున్న అశ్వారావుపేట
సాక్షి నెట్వర్క్: ఎడతెరిపిలేని వర్షాలతో ఉత్తర తెలంగాణ ఉక్కిరిబిక్కిరవుతోంది. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. లక్షలాది ఎకరాల్లో పంట నీటమునిగింది. అనేక గ్రామాలు జలదిగ్బంధంలోనే ఉన్నాయి. రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి. ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్, ఖమ్మం, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల్లో రోజంతా ముసురేసింది. చెరువులు, కుంటలు అలుగుపోస్తున్నాయి. అన్ని ప్రాజెక్టులకు భారీగా వరద రావడంతో గేట్లను ఎత్తివేశారు. గోదావరి, ప్రాణహిత, పెన్గంగ నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. వర్షం ధాటికి అనేక ఇళ్లు కూలుతుండగా, రవాణా వ్యవస్థ స్తంభించింది. మంచిర్యాల, నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాల ప్రజలకు జన్నారం నుంచే రాకపోకలు సాగుతుండగా, బ్రిడ్జి లేకపోవడంతో జన్నారం మండలం కలమడుగు, ధర్మపురి మీదుగా 50 కిలోమీటర్ల దూరం తిరిగి వాహనాలు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. జన్నారం మండలం చింతగూడలో ఇల్లు కూలి ఓ వృద్ధురాలు మృతి చెందింది. ఇందన్పల్లి వంతెన అప్రోచ్ రోడ్డు వద్ద ఆదివారం బురదలో దిగబడిన వ్యాన్ సోమవారం వరద ఉధృతికి కొట్టుకుపోగా, పోలీసులు క్రేన్ తెప్పించి బయటకు తీశారు. ఆసిఫాబాద్లోని అంబేద్కర్చౌక్, గాంధీచౌక్, వివేకానందచౌక్ జలమయమయ్యాయి. గుండి వాగు, పెద్దవాగు, తుంపెల్లి ఒర్రె పొంగిపొర్లుతున్నాయి. నిర్మల్ జిల్లాలో కడెం, స్వర్ణ, గడ్డెన్నవాగు ప్రాజెక్టులకు భారీ వరద రావడంతో గేట్లు ఎత్తివేశారు. సారంగాపూర్ మండలంలోని ధని కొత్త చెరువు అలుగులో నుంచి 20 గేదెలు కొట్టుకుపోగా, అందులో 17 మృత్యువాతపడ్డాయి. మామడ మండలంలోని గోదావరి నదిపై నిర్మిస్తున్న సదర్మాట్ బ్యారేజీ వద్ద మట్టి కట్ట, బిగించడానికి సిద్ధంగా ఉంచిన గేట్లు కొట్టుకుపోయాయి. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం 3 రోజులుగా వరద నీటిలోనే ఉంది. దుబార్పేట్ గ్రామం వరద నుంచి తేరుకోలేదు. 300 మందికి మండల కేంద్రం లోని వ్యవసాయ మార్కెట్లోని రైతు విశ్రాంతి భవనంలో ఆశ్రయం కల్పించారు. గిరిజన గురుకుల పాఠశాలలో భారీగా వరద నీరు చేరడంతో 800 మంది విద్యార్థినులకు మండల కేంద్రంలోని యూత్ ట్రైనింగ్ సెంటర్లో ఆశ్రయం కల్పిస్తున్నారు. కుంటాల జలపాతం వద్ద ఏర్పా ట్లు చేసిన బారికేడ్లు వరదకు కొట్టుకుపోయాయి. ద్వీపకల్పాన్ని తలపిస్తున్న అశ్వారావుపేట అశ్వారావుపేట ప్రాంతం ద్వీపకల్పాన్ని తలపిస్తోంది. రెండువైపులా ఉన్న పశ్చిమగోదావరి జిల్లాలోని జీలుగుమిల్లి, జంగారెడ్డిగూడెం, కుక్కునూరు, వేలేరు పాడు మండలాలకు రాకపోకలు నిలిచిపోయాయి. భద్రాచలం డివిజన్లోని దుమ్ముగూడెం మండలం గంగోలు వద్ద రహదారిపై వరద ఉధృతంగా ప్రవహిస్తుండడంతో రాకపోకలు స్తంభించాయి. ఆర్టీసీ బస్సులను నిలిపేశారు. కాళేశ్వరం వద్ద 8 మీటర్ల ఎత్తులో ప్రవాహం జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరం వద్ద, వాజేడు మండలం పేరూరు వద్ద గోదావరి మళ్లీ పెరుగుతోంది.కాళేశ్వరం వద్ద సోమవారం సాయంత్రం 8 మీటర్ల ఎత్తులో ప్రవాహం వెళ్తోంది. అన్నారం వద్ద లక్ష క్యూసెక్కుల వరద తరలిపోగా, కాళేశ్వరం వద్ద 3.50 లక్షల క్యూసెక్కుల నీరు మేడిగడ్డ వైపునకు వెళ్తున్నట్లు ఇరిగేషన్ అధికారులు తెలిపారు. వాజేడు మండల పేరూరు వద్ద 11.67 మీటర్ల ఎత్తున గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. ఏటూరునాగారం మండలం రామన్నగూడెం పుష్కరఘాట్ వద్ద ఆదివారం 7 మీటర్ల వరకే ఉన్న గోదావరి ప్రవాహం సోమవారం సాయంత్రం 5 గంటల సమయంలో 8.4 మీటర్లకు పెరిగింది. పెరుగుతున్న ఎస్సారెస్పీ నీటి మట్టం నిజామాబాద్ జిల్లాలోని ఎస్సారెస్పీ నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. ఎగువ ప్రాంతాల నుంచి వరద భారీగా వస్తుండటంతో ఆదివారం రాత్రి 10 గంటల వరకు 33.125 టీఎంసీలుగా ఉన్న నీటి మట్టం సోమవారం రాత్రి 7 గంటల వరకు 34.827 టీఎంసీలకు చేరింది. ప్రాజెక్టులోకి 70,550 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1,090 అడుగుల (90.138 టీఎంసీలు)కుగాను సోమవారం రాత్రి ఏడు గంటలకు వరకు 1072.80 అడుగులు (34.827 టీఎంసీలు)కు చేరుకుంది. నిజామాబాద్ నగరంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కందకుర్తి త్రివేణి సంగమం వద్ద గోదావరి ఉధృతి పెరిగింది. కామారెడ్డి జిల్లాలోని నిజాంసాగర్ ప్రాజెక్టులోకి సోమవారం సాయంత్రం 480 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తోంది. ఓసీపీల్లో నిలిచిన బొగ్గు ఉత్పత్తి గోదావరిఖని: భారీ వర్షాలతో ఓసీపీల్లో బొగ్గు ఉత్పత్తి నిలచింది. మట్టి వెలికితీత పనులు ముందుకు సాగడం లేదు. రామగుండం రీజియన్లో 50 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయినట్లు అధికారులు పేర్కొన్నారు. తాలిపేరు, కిన్నెరసానికి వరద తాలిపేరు, కిన్నెరసాని జలాశయాల్లోకి భారీగా వరదనీరు వస్తోంది. తాలిపేరు జలాశయం పూర్తిగా నిండింది. దీంతో మొత్తం 25 గేట్లు ఎత్తి 1,72,000 క్యూసెక్కుల నీటిని కిందకు వదులుతున్నారు. ఇన్ఫ్లో 1,77,000 క్యూసెక్కులుగా ఉంది. పాల్వంచ మండలంలోని కిన్నెరసాని జలాశయం నీటిమట్టం 407 అడుగులు కాగా 403.60 అడుగుల మేర నీరుంది. ఇన్ఫ్లో 35,000 క్యూసెక్కులు ఉండగా, అవుట్ఫ్లో 30,000 క్యూసెక్కులు ఉంది. భద్రాచలం వద్ద గోదావరి 44.5 అడుగుల నీటి మట్టంతో ప్రవహిస్తోంది. భద్రాచలంలోని అశోక్ నగర్కాలనీలో సుమారు 30కి పైగా ఇళ్లలోకి వరదనీరు చేరడంతో వారిని పునరావాస శిబిరానికి తరలించారు. వాగులో పురిటినొప్పులతో... మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం వేలుబెల్లి గ్రామ సమీపంలోని కత్తెర్లవాగు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో వాహనాల రాకపోకలు నిలిచాయి. సోమవారం రాత్రి గ్రామానికి చెందిన ఓ మహిళకు పురిటినొప్పులు రాగా గ్రామస్తులు వాగు దాటించి 108 అంబులెన్స్ ఎక్కించారు. భద్రాద్రి జిల్లా అతలాకుతలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అతలాకుతలం అవుతోంది. అనేకచోట్ల రోడ్లు మునిగిపోవడం, కోతకు గురికావడంతో వందకుపైగా గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. జిల్లావ్యాప్తంగా ఇప్పటివరకు 3,465.2 హెక్టార్లలో పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. 35 హెక్టార్లలో ఇసుక మేటలతో ఆయా రైతులు నష్టపోయారు. -
16 ప్రాజెక్టుల్లో నిర్మాణంలో ఉన్నవి ఐదే
న్యూఢిల్లీ: దేశంలో 16 సాగునీటి, విద్యుత్ ప్రాజెక్టులకు కేంద్రం అనుమతులు ఇవ్వగా దశాబ్దం తర్వాత ఐదు మాత్రం నిర్మాణంలో ఉన్నాయని కంప్ట్రోలర్ ఆడిటర్ జనరల్(కాగ్) నివేదిక తూర్పారబట్టింది. నిర్మాణం నత్తనడకన సాగుతుండగా వాటి అంచనా వ్యయం విపరీతంగా పెరిగిందని తెలిపింది. 2008 ఫిబ్రవరిలో అప్పటి కేంద్ర కేబినెట్ పలు సాగునీటి, విద్యుత్ ప్రాజెక్టులకు అనుమతులు మంజూరు చేసింది. వాటిల్లో ప్రస్తుతం పనులు నడుస్తున్నవి గోసిర్కుండ్, తీత్సా, సరయూ, ఇందిరాసాగర్ పోలవరం, షాపూర్–కాండి ప్రాజెక్టులు. కాగా, 2017 వరకు వీటి నిర్మాణానికి వెచ్చించిన మొత్తం రూ.13,299 కోట్లుగా కాగ్ తేల్చింది. ఈ ఐదు ప్రాజెక్టులు 8 శాతం నుంచి 99 శాతం వరకు పనులు పూర్తి చేసుకున్నాయి. వీటి అంచనా వ్యయం మాత్రం 2,341 శాతం పెరిగిపోగా వీటి వల్ల అంత ప్రయోజనం దక్కుతుందా అనే అనుమానాలు కలుగుతున్నాయంది. ఈ ప్రాజెక్టుల నివేదిక తయారీ, అనుమతులు, సర్వే, భూ సేకరణ నుంచి అమలు వరకు ప్రతి దశలోనూ నిర్వహణ లోపాలున్నాయని తెలిపింది. -
‘రైతు ఆత్మహత్యలు నివారించేందుకే..’
సాక్షి, కరీంనగర్ : తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయని నీటి పారుదల శాఖ మంత్రి టి. హరీశ్ రావు అన్నారు. రామడుగు మండలం లక్ష్మీపూర్ వద్ద కాళేశ్వరం ప్రాజెక్టు 8వ ప్యాకేజీ టన్నెల్ పనులను జాతీయ మీడియాతో కలిసి మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ప్రాజెక్టు పనులను ఆయన మీడియాకు వివరించారు. ప్రస్తుతం 60 శాతం పనులు పూర్తయ్యాయని ఆయన పేర్కొన్నారు. దేశంలో విదర్భ తర్వాత తెలంగాణలోనే రైతు ఆత్మహత్యలు అత్యధికంగా జరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. రైతు ఆత్మహత్యలను నివారించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ సోషల్ ఇంజనీర్గా మారారన్నారు. అందులో భాగంగానే వ్యాప్కోస్ సంస్థ ద్వారా కాళేశ్వరం ప్రాజెక్టుకు రూపకల్పన చేశారని హరీశ్ రావు పేర్కొన్నారు. -
ఇది ‘చెరువూరు’
సాక్షి, హైదరాబాద్: ఊరికి ఉత్తరాన కర్విరాల చెరువు. తూర్పున కొత్త కుంట. రెండు చెరువుల్లోంచి పునాదులు వేసుకున్న ఊరే కర్విరాల కొత్తగూడెం. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలంలోని ఓ చిన్న గ్రామమిది. పల్లె తలాపున చిన్న గుట్ట. పొలిమేరలోని చెరువులే జీవనాధారం. ఈడొచ్చిన ఒడ్డోళ్ల పోరగాళ్లు చిన్నగుట్టను పగులగొట్టి కంకర చేసి పొట్టపోసుకుంటారు. ఇతర జాతుల వారికి చెరువుపై ఆధారపడి కుల వృత్తులు, చేతి వృత్తులతో జీవనం. ఊరు పుట్టిన 200 ఏళ్ల చరిత్రలో చెరువులు నిండిన సందర్భాలు చాలా తక్కువే. కాలం కలిసిరానప్పుడు ఒడ్డెర్లు వలసలతో, మిగతా కులాల నాటు సారా పెట్టి కాలం గడిపేవాళ్లట. అలాంటి ఊరు ఇప్పుడు వలసలను, గుడంబాను జయించింది. మిషన్ కాకతీయ కింద నీటి పారుదల మంత్రి హరీశ్రావు ఈ చెరువులను పునరుద్దరించారు. వానలతో పని లేకుండా గోదావరి జలాలతో నింపారు. దాంతో వలస పోయిన వాళ్లతో పాటు సుదూరంలోని సైబీరియా నుంచి కూడా పక్షులు వచ్చి కొత్తగూడెంలో సందడి చేస్తున్నాయిప్పుడు. చెరువే ఆదరువు కర్విరాల చెరువుకు ఎగువన, కొత్తకుంటకు దిగువన లింగమంతుల గుట్ట, చిన్నగుట్ట, వడ్లు దంచే బండ... ఇవన్నీ నీటి ప్రవాహానికి అడ్డంకిగా ఉన్నాయి. పరీవాహక ప్రాంతం ఎక్కువగా లేక చెరువులు నిండవు. ఆయకట్టు తక్కువే ఉన్నా చెరువు నీళ్లపై ఆధారపడి బోరు, బావుల కింద సాగు సాగేది. చేతి వృత్తులు బలపడేవి. మిషన్ కాకతీయ తొలి దశలో కొత్తకుంటకు రూ.26 లక్షలు, రెండో దశలో కర్విరాల చెరువుకు రూ.22 లక్షలు ఖర్చు చేసి పూడిక తీశారు. ఉపాధి హామీ పనులతో గ్రామస్థులంతా ఏకమై చెరువు క్యాచ్మెంటు ఏరియాను పునరుద్ధరించారు. హరీశ్ చొరవ చూపి శ్రీరాంసాగర్ కాల్వ నుంచి గోదావరి జలాలు తెచ్చి చెరువులు నింపారు. నిండిన చెరువుల్లో చేపలు పెంచారు. భూగర్భ జలాలు పెరిగి కర్విరాల చెరువు కింద 600 ఎకరాలకు, కొత్తకుంట కింద 300 ఎకరాలకు సాగునీరందుతోంది. చెరువులకు జలకళ రావడంతో వలస పోయిన గ్రామస్థులు తిరిగొచ్చారు. చేతి వృత్తులు పూర్తిగా అంతరించాయి గానీ కుల వృత్తులు ఇప్పుడిప్పుడే కొత్త జీవం పోసుకుంటున్నాయి. నాటుసారా పెట్టొద్దని ఊరు తీర్మానం చేసుకుంది. శీతాకాలంలో సైబీరియా నుంచి కొంగ జాతులొచ్చి వేసవి ముగిసే దాకా చెరువు మీదే గడిపి వర్షాకాలం ప్రారంభంలో తిరిగి వెళ్లిపోతున్నాయి. బోర్లకు నీళ్లు మళ్లినయి నాకు రెండు ఎకరాలుంది. బోరు నీళ్లే దిక్కు. చెరువుల పూడిక తీసి గోదావరి నీళ్లతో నింపినంక బోర్లళ్లకు నీళ్లు మళ్లినయి. రెండు కార్ల పంట వచ్చింది. కానీ ఈ ఏడాది చెరువుకు గోదావరి నీళ్లు రాలేదు. బోర్లు మళ్లీ మొదటికొచ్చినై. ప్రభుత్వం మళ్లీ గోదావరి నీళ్లొదిలి మా చెరువులు నింపాలె. – పేర్ల ప్రహ్లాద చెరువు నిండితే చుట్టాలొస్తరు చెరువుల్ల నీళ్లున్నప్పుడు మా ఊరికి సైబీరియా కొంగలొస్తయి. ఈ పక్షులు ఒక రకంగా మా చుట్టాలు. ఆర్నెల్ల పాటు చేప పిల్లల తిని బతుకుతై. గట్టు మీద సవారు చింతల తోపు చెట్ల మీద ఉంటై. –బండి అంతయ్య -
ఆయకట్టుకు ఆయువు!
సాక్షి, హైదరాబాద్: చెరువులకు పూర్వ వైభవం తీసుకొచ్చే లక్ష్యంతో ప్రభుత్వం చేపట్టిన మిషన్ కాకతీయ పథకాన్ని నీతి ఆయోగ్ ప్రశంసించింది. చెరువుల పునరుద్ధరణ ద్వారా నీటి లభ్యత పెరగడంతో చిన్న, సన్నకారు రైతుల వ్యవసాయ ఆధారిత ఆదాయంలో గణనీయ పెరుగుదల కనిపిస్తోందని పేర్కొంది. సాగునీరు అందని 63 శాతం గ్యాప్ ఆయకట్టుకు చెరువుల ద్వారా నీటి లభ్యత పెరిగిందని, ఫలితంగా సాగు విస్తీర్ణం, దిగుబడులు పెరిగాయని వెల్లడించింది. దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్రాలు నీటి సంరక్షణ కోసం చేపడుతున్న పథకాలను సమీక్షించిన నీతి ఆయోగ్.. నీటి నిర్వహణ ఉత్తమ పద్ధతుల పథకాలను పేర్కొంటూ నివేదికను తయారు చేసింది. ఆ నివేదికను తన వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. నీటి నిర్వహణ ఉత్తమ పద్ధతుల్లో మిషన్ కాకతీయ ఒకటని కీర్తించింది. గత రబీలో 16 లక్షల ఎకరాలకు నీళ్లు 2017 ఆగస్టులో రాష్ట్రంలో పలు చెరువులను పరిశీలించిన అనంతరం తాము గుర్తించిన అంశాలను నీతి ఆయోగ్ తన నివేదికలో పేర్కొంది. పూడికతీత వల్ల చెరువుల నిల్వ సామర్థ్యం పెరిగిందని, తద్వారా సాగును ప్రోత్సహించినట్లయిందని తెలిపింది. భూమిలో నీటి సాంద్రత పెరిగిందని, మెజార్టీ ఆయకట్టు స్థిరీకరణ జరిగిందని వెల్లడించింది. చిన్న నీటి వనరుల కింద 265 టీఎంసీల నీటి కేటాయింపులు ఉండగా, 25 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాల్సి ఉంది. అయితే ఎన్నడూ 10 లక్షల ఎకరాలకు మించి అందిందిలేదు. అయితే చెరువుల పునరుద్ధరణ తర్వాత గత రబీలో ఏకంగా 16 లక్షల ఎకరాల ఆయకట్టు చెరువుల కింద పంట సాగైంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని గ్యాప్ ఆయకట్టులో 63 శాతం ఆయకట్టుకు మిషన్ కాకతీయ నీరందించగలిగిందని నీతి ఆయోగ్ తెలిపింది. గణనీయంగా పెరిగిన దిగుబడి రైతులు పూడిక మట్టిని తమ పొలాల్లో వినియోగించుకోవడంతో ప్రధానంగా రసాయనిక, పురుగు మందుల వాడకం తగ్గిందని, పంటల దిగుబడి గణనీయంగా పెరిగిందని నీతి ఆయోగ్ పేర్కొంది. ఎండిన బోరు బావులకు కాకతీయ ప్రాణం పోసిందని, చెరువుల ఆయకట్టు కింద 17 శాతం ఎండిన బావులు, బోరు బావులు పునరుజ్జీవం పొందాయని తెలిపింది. చేపల ఉత్పత్తి 62 శాతం పెరిగిందని వెల్లడించింది. గతంలో మిషన్ కాకతీయ చెరువులపై అధ్యయనం చేసిన నాబ్కాన్స్ సంస్థ కూడా పూడిక మట్టితో రసాయన ఎరువుల వాడకం 35 నుంచి 50 శాతం తగ్గిందని, రైతుకు ఎరువుల కొనుగోళ్లపై 27.6 శాతం ఆర్థిక భారం తగ్గిందని తన అధ్యయనంలో తేల్చిందని చిన్న నీటి పారుదల వర్గాలు పేర్కొన్నాయి. ఇప్పుడు నీతి ఆయోగ్ పరిశీలనలో అవే వెల్లడయ్యాయని చెప్పాయి. పంటల దిగుబడి పరంగా చూసినా, వరి ఎకరాకు 2 నుంచి 5 క్వింటాళ్లు, పత్తి ఎకరాకు 2 నుంచి 4 క్వింటాళ్లు, కందులు ఎకరాకు 0.5 నుంచి 1.5 క్వింటాళ్లు, మొక్కజొన్న ఎకరాకు 4 నుంచి 5 క్వింటాళ్ల మేర పెరిగాయని తెలిపాయి. -
‘సప్త సముద్రాలకు’ పునరుజ్జీవం!
సాక్షి, హైదరాబాద్: ఆకలి చావులు.. వలసలకు నిలయం.. సాగుకు నీళ్లు లేక గోసటిల్లిన నేల. పసిపిల్లలను, పండుటాకులను వదిలేసి ఎందరో వలసలు పోగా పల్లెలు పడావు పడిన ప్రాంతం. తరతరాలుగా కరువు కాళనాగై పగబట్టినట్టు వెంటబడి తరుముతుంటే సాగు చేయలేక, జోడెద్దులను సాకలేక కబేళాలకు అమ్ముకున్న రైతన్నల కన్నీళ్లతో నిండిన నేల పాలమూరు జిల్లా. ఇప్పుడు అదే బీడు భూముల్లో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. వాగులు.. వంకలు.. గొలుసుకట్టు చెరువులు.. పాడుబడ్డ కుంటలు.. సకల జల స్థావరాలను నింపుతూ నెర్రెలు బాసిన భూముల్లో జీవం నింపుతోంది. పాడుబడిన పాలమూరు జిల్లా మిషన్ కాకతీయ తొలి ఫలాలతో పచ్చని పంట చేనుగా మారింది. 45 వేల ఎకరాలు.. 60 గ్రామాలు గొలుసుకట్టు చెరువులు అంటే మొదటగా గుర్తొచ్చేది వనపర్తి నియోజకవర్గ పరిధిలో ఉండే సప్త సముద్రాలు. రంగ సముద్రం, రాయ సముద్రం, కృష్ణ సముద్రం, వీర సముద్రం, గోపాల సముద్రం, మహభూపాల సముద్రం, శంకరమ్మ సముద్రం.. సప్త సముద్రాలుగా పేరెన్నికగన్నాయి. వనపర్తిని కేం ద్రంగా చేసుకుని పరిపాలనను సాగించిన నాటి రాజులు వీటిని నిర్మించారు. అంతటి ప్రాముఖ్యం ఉన్న ఈ చెరువులకు గతంలో ఆదరణ కరువైంది. పాడుబడిన పాలమూరులో నీళ్లు పారిస్తామని ఉద్య మ సమయంలోనే హరీశ్రావు హామీ ఇచ్చారు. అందుకు తగ్గట్లుగానే మిషన్ కాకతీయ కింద సప్త సముద్రాలను మరమ్మతు చేయించారు. 45 వేల ఎకరాలను సాగులోకి తెచ్చారు. తొలుత బీమా ఎత్తిపోతల నుంచి నీళ్లను తోడి కొత్తకోట మండలంలోని కానాయిపల్లిలో 160 ఏళ్ల కిందట రాణీ శంకరమ్మ పాలనలో నిర్మించిన శంకర సముద్రాన్ని నింపారు. అటు నుంచి కృష్ణ సముద్రానికి, తర్వాత పెబ్బేరు మండలం శ్రీరంగాపూర్లోని రంగ సముద్రంలోకి నీళ్లు మళ్లాయి. తర్వాత కొత్తకోట మండలం రాయణిపేట వద్ద వనపర్తి సంస్థానాధీశుల కాలంలో నిర్మించిన రాయ సముద్రాన్ని నింపారు. అటు నుంచి వనపర్తి రాజు రాజారామేశ్వరరావు వంశీయులు నిర్మించిన మహభూపాల సముద్రం చెరువును.. తర్వాత పెబ్బేరు మండలంలోని వీర సముద్రం చెరువు, పెద్దమందడి మండలంలోని గోపాల సముద్రం చెరువును నింపి 45 వేల ఎకరాలకు సాగునీరుతోపాటు 60 గ్రామాలకు తాగునీరు అందిస్తున్నారు. గూటికి చేరిన వలస పక్షులు వనపర్తి జిల్లా వలసలకు నిలయం. భూమిని పడావు పెట్టి ఊరు ఊరంతా వలస వెళ్లటం అక్కడ సర్వ సాధారణం. మిషన్ కాకతీయ, ఇతర పెండింగ్ ప్రాజెక్టుల పూర్తితో ఇప్పుడీ గ్రామాలకు నీళ్లు వచ్చాయి. ఊళ్లలోనే పని దొరుకుతుండటంతో వలసపోయిన కుటుంబాలు తిరిగి వచ్చాయి. సాగు పనుల్లో నిమగ్నమయ్యాయి. 30 ఏళ్లుగా బోసినట్లు కన్పించిన ఖానాపురం ఇప్పుడు పల్లె రూపం సంతరించుకుంది. వలస పోయేటోన్ని శంకర సముద్రం నిండింది. మూడు పంటలకు నీరు పుష్కలంగా అందుతోంది. గతంలో ఏడాదిలో 10 నెలలు వలస పోయేటోన్ని. ఇప్పుడు ఊరిలోనే పొలం పనులు చేసుకుం టున్నాం. – నారాయణ, శ్రీరంగాపురం కళ్లెదుటే సుందర స్వప్నం ఉమ్మడి రాష్ట్రంలో ‘సప్త సముద్రాలు’ ఉనికి కోల్పోయాయి. వీటిని పునరుద్ధరిస్తే వనపర్తి జిల్లాలో కరువును రూపుమాపొచ్చని కేసీఆర్ నాతో చెప్పారు. రికార్డు సమయంలో మరమ్మతు పూర్తి చేశాం. ఇప్పుడు ఈ సుందర స్వప్నం ఆవిష్కృతమైంది. రైతన్నల మోముల్లో చిరునవ్వు ఆనందం కలిగిస్తోంది. – మంత్రి హరీశ్రావు -
‘ఇరిగేషన్ డే’గా విద్యాసాగర్రావు జన్మదినం
సాక్షి, హైదరాబాద్: నీటి పారుదలరంగ నిపుణుడు, ప్రభుత్వ సలహాదారు దివంగత ఆర్.విద్యాసాగర్రావు పుట్టినరోజు నవంబర్ 14ను తెలంగాణ ‘ఇరిగేషన్ డే’గా ప్రకటించాలని రాష్ట్ర ఇంజనీర్ల జేఏసీ, రిటైర్డ్ ఇంజనీర్స్ అసోసియేషన్లు సంయుక్తంగా ప్రభుత్వాన్ని కోరాయి. విద్యాసాగర్రావు కన్న కలలను సాకారం చేసే దిశగా కృషి చేస్తామని స్పష్టం చేశాయి. ఆదివారం విద్యాసాగర్రావు ప్రథమ వర్ధంతి సందర్భంగా జలసౌధ ప్రాంగణంలో ఇంజనీర్లు శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సమావేశానికి సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది వైద్యనాథన్తో పాటు సీఈలు సునీల్, ఓఎస్డీ శ్రీధర్రావు దేశ్పాండేతో పాటు ఇంజనీర్ల జేఏసీ నాయకులు వెంకటేశం, మోహన్సింగ్, వెంకటరమణారెడ్డి, సల్లా విజయ్కుమార్, చక్రధర్, రిటైర్డ్ ఇంజనీర్స్ అసోసియేషన్ నాయకులు శ్యాంప్రసాద్రెడ్డి, రాంరెడ్డి, ముత్యంరెడ్డి, రమణ హాజరయ్యారు. ఈ సందర్భంగా వైద్యనాథన్ మాట్లాడుతూ, కృష్ణా జలాల్లో తెలంగాణ వాటాకోసం విద్యాసాగర్రావు తీవ్రంగా తపించేవారని, సుప్రీంకోర్టులో పిటిషన్లు వేసిన సందర్భంలో తాను ఆయనతో సుదీర్ఘంగా చర్చించినట్టు చెప్పారు. ఆయనిచ్చిన విలువైన సూచనల ఆధారంగా కోర్టుల్లో పిటిషన్లు వేశామని గుర్తు చేశారు. తెలంగాణ రిటైర్డ్ ఇంజనీర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి శ్యాంప్రసాద్రెడ్డి ప్రసంగిస్తూ విద్యాసాగర్రావును వాటర్ మ్యాన్ ఆఫ్ తెలంగాణగా అభివర్ణించారు. డిండి ఎత్తిపోతల పథకానికి విద్యాసాగర్రావు పేరు పెట్టినందుకు ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి కేసీఆర్కు ధన్యవాదాలు తెలిపారు. సీఈ సునీల్ మాట్లాడుతూ, డిండి ప్రాజెక్టుని అనుకున్న సమయానికి పూర్తిచేసి నల్లగొండ జిల్లా ఫ్లోరైడ్ పీడిత ప్రాంతాలైన మునుగోడు, దేవరకొండకు సాగునీరు, తాగునీరు అందిస్తామన్నారు. శ్రీధర్రావు దేశ్పాండే మాట్లాడుతూ, విద్యాసాగర్రావు ఆశయ సాధనకు పునరంకిత మవుతామని, తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన అన్ని ప్రాజెక్టులని సకాలంలో పూర్తి చేసి తెలంగాణని కోటి ఎకరాల మాగాణంగా మార్చే కృషిలో పాలుపంచుకుంటామన్నారు. -
గిరి సీమల్లో కొబ్బరి సిరులు
అమలాపురం: మైదానంలో డెల్టా ప్రాంతాలకు.. మెట్టలో సాగునీటి సౌలభ్యమున్న ప్రాంతాలకు మాత్రమే పరిమితమైన కొబ్బరి సాగు.. ఇకనుంచీ కొండకోనల్లోనూ జోరుగా సాగనుంది. గిరి సీమల్లో సిరులు కురిపించడం ద్వారా గిరిపుత్రుల జీవితాల్లో కొత్త వెలుగులు నింపనుంది. మొట్టమొదటిగా తూర్పు కనుమల్లో విశాఖ మన్యంలో కొబ్బరి సాగుకు శ్రీకారం చుడుతున్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో కొబ్బరిసాగును ప్రోత్సహించేందుకు సెంట్రల్ ప్లానిటేషన్ క్రాప్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్(సీపీసీఆర్ఐ) ముందుకొచ్చింది. ఇందులో భాగంగా విశాఖ మన్యంలో 100 ఎకరాలకు సరిపడే కొబ్బరి మొక్కలను గిరి రైతులకు అందించనుంది. అన్నీ సవ్యంగా సాగితే విశాఖతోపాటు ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాల్లోని ఏజెన్సీ ప్రాంతాల్లోనూ కొబ్బరిసాగుకు సీపీసీఆర్ఐ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. కొండ ప్రాంతాల్లో సాగుకు చేయూత.. కొబ్బరి అనగానే ముందుగా గుర్తుకొచ్చేది కేరళే. అక్కడ పశ్చిమ కనుమల విస్తీర్ణం ఎక్కువైనప్పటికీ కొబ్బరి సాగు పెద్దఎత్తున సాగుతుండడం విశేషం. మన రాష్ట్రంలో మాత్రం ఆ పరిస్థితి లేదు. కేవలం ఉభయగోదావరి, ఉత్తరాంధ్ర, చిత్తూరు జిల్లాల్లోని మైదాన, మెట్ట ప్రాంతాల్లో సుమారు 3.01 లక్షల ఎకరాల్లో కొబ్బరి సాగవుతోంది. కేరళలో వర్షపు నీటిని నిల్వ చేయడం.. బిందు సేద్యం(డ్రిప్ ఇరిగేషన్), ఆచ్ఛాదన(మల్చింగ్) విధానాలతో కొండ ప్రాంతాల్లో కొబ్బరిని విజయవంతంగా సాగు చేస్తున్నారు. వాటర్ స్టోరేజ్ ట్యాంకులు, చెక్డ్యామ్లను నిర్మించి.. వాటి ద్వారా నీటిని మళ్లించి మంచి దిగుబడి సాధిస్తున్నారు. ఇదే విధానంతో రాష్ట్రంలోనూ కొబ్బరి సాగును ప్రోత్సహించేందుకు కేరళలోని కాసర్ఘోడ్లోని సీపీసీఆర్ఐ ప్రధాన కార్యాలయం ముందుకొచ్చింది. సంస్థ డైరెక్టర్ డాక్టర్ పాలెం చౌడప్ప ప్రత్యేక శ్రద్ధ తీసుకుని రాష్ట్రంలోని ఏజెన్సీ ప్రాంతాల్లో సాగుకు చేయూతనిచ్చేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. ఈ క్రమంలో తొలి విడతగా ప్రయోగాత్మకంగా విశాఖ మన్యంలోని చింతపల్లి, పాడేరు ప్రాంతాల్లో ఎంపిక చేసిన రైతులకు వచ్చేనెలలో ఆరువేల కొబ్బరి మొక్కలను ఉచితంగా అందించనున్నారు. ఎకరాకు 60 మొక్కల చొప్పున వంద ఎకరాల్లో కొబ్బరితోట సాగు చేసేలా గిరిజన రైతులను ఎంపిక చేశారు. వీరికి మొక్కలతోపాటు కాపు వచ్చేవరకు ఎరువులు, బిందు సేద్యం పరికరాలను ఉచితంగా అందించనున్నారు. సాగులో సాంకేతిక పరిజ్ఞానాన్ని సైతం అందుబాటులోకి తెస్తారు. కొబ్బరిలో కోకో, పోక, ఏజెన్సీలో సాగు జరిగే కాఫీ, డ్రాగన్ ఫ్రూట్, అనాస వంటి పంటల్నీ సాగు చేసేలా ప్రోత్సహించనున్నారు. ఇక్కడ సాగు విజయవంతమైతే.. విశాఖతోపాటు ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాల్లోని ఏజెన్సీ ప్రాంతాల్లోనూ దీన్ని అమలు చేస్తారు. నీరు నిల్వ చేస్తూ.. కొండలపై సాగు చేస్తూ... కేరళ రైతులు వర్షం రూపంలో పడిన ప్రతి నీటిబొట్టునూ కాపాడుకోవడానికి ప్రాధాన్యమిస్తారు. నీటిని నిల్వ చేసుకోవడం, దానిని తోటలకు మళ్లించడం ద్వారా అక్కడి రైతులు సముద్ర తీరప్రాంతమైన ఇసుక నేలలు, కొండవాలు ప్రాంతాల్లోనూ కొబ్బరి పంటను పండించి అధిక దిగుబడులు సాధిస్తున్నారు. ఇళ్లు, ఇతర భవంతులపై పడే వర్షపు నీటిని ప్రత్యేకంగా నిర్మించిన ట్యాంకులకు మళ్లించి.. దీన్నుంచి డ్రిప్ ద్వారా కొబ్బరి, ఇతర మొక్కలకు నీటిని ప్రవహింపచేస్తున్నారు. ఇదే రీతిలో కొండవాలు ప్రాంతాల్లో పడే వర్షపు నీటిని దిగువ ప్రాంతంలో ఏర్పాటు చేసిన ట్యాంకుల్లోకి మళ్లిస్తున్నారు. ఈ నీరు ట్యాంకులోకి వెళ్లేందుకు అనువుగా గట్లు వేస్తూ.. ట్యాంకులోకి నీరు వెళ్లేచోట అడుగున వెడల్పుగా బ్లాక్మెటల్ వేస్తారు. తొలుత ఇళ్లు, భవనాలన ఉంచి వచ్చే నీటిని, తరువాత దిగువన నిర్మించిన ట్యాంకు నీటిని కొబ్బరి సాగుకోసం వినియోగిస్తున్నారు. దీర్ఘకాలికంగా మంచి ఆదాయం... ఏజెన్సీలో కొబ్బరిసాగు చేస్తే గిరి రైతులు దీర్ఘకాలికంగా మంచి ఆదాయం పొందుతారు. కాఫీ, మామిడి, జీడి మామిడి కన్నా కొబ్బరి ఎక్కువకాలం పంట. నెలనెలా దిగుబడి రూపంలో ఆదాయం వస్తుంది. కొబ్బరితోపాటు దీనిలో విలువైన అంతర పంటలను కూడా సాగు చేయించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. సాగుకు అవసరమైన అన్ని రకాల సాయాన్ని ఉచితంగా అందించాలని నిర్ణయించుకున్నాం. కేరళ తరహాలోనే బిందు సేద్యం పద్ధతిలో ఏజెన్సీలోనూ కొబ్బరిసాగు చేయవచ్చు. –పాలెం చౌడప్ప, డైరెక్టర్ సీపీసీఆర్ఐ, కాసరఘోడ్, కేరళ -
సాగునీటి కోసం ఉద్యమించాలి
భూత్పూర్ (దేవరకద్ర) : తెలంగాణ ప్రజలు సాగు, తాగునీటి కోసం ఉద్యమించాలని సామాజికవేత్త, సీనియర్ జర్నలిస్టు పొన్నాల గౌరీశంకర్ అన్నారు. కృష్ణా– సావిత్రి నదుల పరిక్రమ సైకిల్ యాత్రను విజయవంతంగా పూర్తిచేసి భూత్పూర్ వచ్చిన సందర్భంగా ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడారు. కృష్ణానది నీళ్లు ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రజల జన్మహక్కు అన్నారు. దక్షిణ భారతదేశ రాష్ట్రాల పరిపాలన సౌలభ్యం కోసం రెండో రాజధానితోపాటు ఉప పార్లమెంట్, ఉప రాజ్యసభ, ఇతర కేంద్ర కార్యాలయాలు హైదరాబాద్లో ఏర్పాటు చేయాలని కోరుతూ కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో దాదాపు 6 వేల కి.మీ. సైకిల్యాత్ర చేపట్టానన్నారు. కృష్ణానది పుష్కరాల సందర్భంగా సైకిల్యాత్ర ప్రారంభించానని గుర్తుచేశారు. తెలుగు రాష్ట్రాల్లో మాతృభాషలో పరిపాలన జరగాలని, ప్రాంతీయ విభేదాలతో రెండు రాష్ట్రాలుగా విడిపోయిన కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులు, నియామకాలు, నీళ్లు సక్రమంగా పంపిణీ చేయాలన్నారు. తాను కర్ణాటక, మహారాష్ట్రలో సైకిల్యాత్ర చేపడితే సైకిల్పై ఉన్న తెలుగు భాషతోపాటు కర్ణాటక, మహారాష్ట్ర భాషల్లో బోర్డు రాసే వరకు తనను ఆయా రాష్ట్రాల్లో సైకిల్ యాత్ర చేపట్టనీయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ జగన్ చేపట్టిన సంకల్పన యాత్ర యావత్ ఆంధ్రప్రదేశ్లో విజయవంతంగా జరుగుతుందని, ప్రత్యేక హోదాపై చేస్తున్న పోరాటాలు చేయడం సరైందేనన్నారు. అనంతరం ఆయన శ్రీశైలానికి సైకిల్పై బయలుదేరి వెళ్లారు. జడ్చర్లలో ఘన స్వాగతం.. జడ్చర్ల టౌన్ : పైరుపచ్చని తెలంగాణ సాధన, తెలుగును పరిపాలన భాషగా అమలు చేయాలని కోరుతూ హైదరాబాద్కు చెందిన జర్నలిస్టు గౌరీశంకర్ చేపట్టిన సైకిల్ యాత్ర శుక్రవారం జడ్చర్లకు చేరుకుంది. జడ్చర్ల ఫ్లైఓవర్ వద్ద సీఐ బాలరాజు ఆయనకు స్వాగతం పలికారు. పైరు పచ్చని తెలంగాణ రాష్ట్ర సాధననే తన యాత్ర ప్రధాన ఉద్దేశమన్నారు. నదుల అనుసంధానం ద్వారానే పైరుపచ్చని తెలంగాణ సాధ్యమని ప్రభుత్వం గుర్తించాలన్నారు. అందుకోసం తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాటుపడాలన్నారు. అలాగే హైదరాబాద్ను దేశ రెండో రాజధానిగా చేయాలని, తద్వారా దక్షిణ భారతదేశానికి ప్రతిష్ట పెరుగుతుందన్నారు. దేశంలో జర్నలిస్టులపై జరుగుతున్న దాడులను అరికట్టాలని, జర్నలిస్టులకు జీతభత్యాలను ప్రభుత్వాలే ఇవ్వాలని, హెల్త్కార్డులు, అక్రిడిటేషన్ కార్డులను అందరికీ ఇవ్వాలని, పత్రికా రంగం విడిచిన వారికి పింఛన్ సౌకర్యం కల్పించాలని కోరారు. తన లక్ష్యాలు పూర్తయ్యే వరకు సైకిల్ యాత్ర కొనసాగిస్తానన్నారు. జడ్చర్ల నుంచి కర్నూలు, ఆత్మకూర్, శ్రీశైలం మీదుగా కల్వకుర్తి, హైదరాబాద్ వరకు ప్రస్తుత యాత్ర ముగిస్తానని ఆయన పేర్కొనన్నారు. -
చివరిదశకు ‘ఉదయసముద్రం’ పనులు
సాక్షి, హైదరాబాద్: నల్లగొండ జిల్లాలోని ఉదయసముద్రం ప్రాజెక్టు నిర్మాణపనులు తుదిదశకు చేరుకున్నాయని నీటి పారుదల మంత్రి టి.హరీశ్రావు తెలిపారు. ఏప్రిల్ 5న ఒకటి, అదే నెల 25న మరొక పంపు డ్రై రన్కు ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్పారు. మిగతా పనులన్నీ జెట్ స్పీడ్తో చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రాజెక్టు పనులను శనివారం శాసనమండలిలోని మినిస్టర్స్ చాంబర్స్లో సమీక్షించారు. త్వరలోనే ఈ ప్రాజెక్టు అందుబాటులోకి రానున్నదన్నారు. ప్రాజెక్టు నుంచి బ్రాహ్మణ వెల్లంల రిజర్వాయర్లోకి నీరు చేరేవిధంగా మే నెల చివరికల్లా పనులు పూర్తిచేయాలని అధికారులకు సూచించారు. రిజర్వాయర్ డెలివరీ సిస్టర్న్ పనులు పూర్తయ్యాయని, 3.665 కిలోమీటర్ల పొడవున్న కాలువకట్ట పనుల్లో మిగిలినవాటిని రెండు నెలల్లో పూర్తి చేయాలని ఆదేశించారు. 6.9 కిలోమీటర్ల అప్రోచ్ కెనాల్ నిర్మాణం పూర్తయిందని చెప్పారు. 10.625 కిలో మీటర్ల టన్నెల్ పనుల్లో 2.22 మీట ర్లు మినహా మిగతావన్నీ పూర్తయ్యాయని తెలిపారు. మే చివరికల్లా మొత్తం టన్నెల్ పనులు పూర్తిచేయాలని ఆదేశించారు. టన్నెల్ పనులు పూర్తయితేనే రిజర్వాయర్లో నీరు నింపేందుకు వీలవుతుందన్నారు. ఆ లోగా పంప్హౌస్ పనులు మరింత వేగవంతం చేయాలని కోరారు. ఖరీఫ్లోగా రిజర్వాయర్ నుంచి 40 చెరువులను నింపేవిధంగా పనులు యుద్ధప్రాతిపదికన చేపట్టాలని ఆదేశించారు. లెఫ్ట్ మెయిన్ కెనాల్ కింద మొదటి డిస్ట్రిబ్యూటరీ ద్వారా 40 చెరువులను నింపడానికి గాను ఫీడర్ చానళ్ల పనులను కూడా ఏకకాలంలో పూర్తి చేయాలని ఇరిగేషన్ మంత్రి ఆదేశించారు. సమీక్షలో ఇరిగేషన్ సీఈ ఎస్.సునీల్, ఎస్ఈ హమీద్ ఖాన్, ఈఈ గంగం శ్రీనివాస్రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
జూన్ నాటికి ప్రాజెక్టులన్నీ పూర్తి: ఎంపీ కవిత
మంథని/మహదేవపూర్: కాళేశ్వరం ప్రాజెక్టుతో తెలంగాణ కరువు తీరనుందని ఎంపీ కవిత అన్నారు. పెద్దపల్లి జిల్లా మంథని మండలం అన్నారం పంపుహౌస్, సుందిళ్ల బ్యారేజీ పనులు, మహదేవపూర్ మండలంలో గోదావరి నదిపై నిర్మిస్తున్న మేడిగడ్డ బ్యారేజీ పనులను మంగళవారం ఆమె సందర్శించారు. జూన్ నాటికి రాష్ట్రంలోని ప్రాజె క్టులన్నీ పూర్తవుతాయని కవిత తెలిపారు. అన్నారం బ్యారేజీ నుంచి 2 టీఎంసీల నీటిని ప్రతిరోజూ వాడుకోవచ్చన్నారు. రాష్ట్ర ప్రజలకు తాగునీరు, సాగునీరు, పరిశ్రమలకు కావాల్సిన నీరు 2050 వరకు ఎలాంటి కొరత లేకుండా కాళేశ్వరం ద్వారా అందనుందన్నారు. కవిత వెంట మిషన్ భగీరథ వైస్ చైర్మన్ వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్యేలు జీవన్రెడ్డి, బాజిరెడ్డి గోవర్ధన్, పుట్ట మధు తదితరులు ఉన్నారు. -
చెరువు పనుల్లో.. చిలక్కొట్టుడు
మిషన్ కాకతీయ.. చెరువులను పునరుద్ధరించే గొప్ప పథకం. ప్రతి వర్షపు చుక్క నీటిని నిల్వ చేసుకోవడం.. రైతుల మోములో ఆనందం నింపడం దీని లక్ష్యం. కానీ క్షేత్రస్థాయిలో అధికారుల అవినీతి, బాధ్యతా రాహిత్యంతో మిషన్ కాకతీయ అభాసుపాలవుతోంది. చాలా చోట్ల చెరువులు ఆక్రమణలకు గురైనా అధికారులు రికార్డుల్లో ఉన్న పూర్తి విస్తీర్ణానికి టెండర్లు పిలుస్తున్నారు. అలా కొద్దిమొత్తంలో పనులకే ఎక్కువ సొమ్ము ముట్టజెబుతున్నారు.. దీనికితోడు సగం సగం పనులే చేసినా.. నాసిరకంగా చేసినా కూడా మొత్తం బిల్లు మంజూరు చేస్తున్నారు. కాంట్రాక్టర్లతో కుమ్మక్కై ముడుపులు పుచ్చుకుంటున్నారు. మరోవైపు పలు చోట్ల చేసిన పనులకు కూడా బిల్లులు మంజూరు చేయడం లేదు. అలాంటి చోట్ల కాంట్రాక్టర్లు పనులను మధ్యలోనే నిలిపేస్తున్నారు. అప్పులు తెచ్చి పనులు చేసినా బిల్లులు రావడం లేదంటూ వాపోతున్నారు. మొత్తంగా చెరువుల పునరుద్ధరణ లక్ష్యం దెబ్బతినే పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో మిషన్ కాకతీయలో క్షేత్రస్థాయి పరిస్థితిపై ఈ వారం ‘ఫోకస్’.. – సాక్షి నెట్వర్క్ నీటి సంరక్షణ, భూగర్భ జలాల పెంపు, రైతులకు సాగునీరు లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం 2015లో ‘మిషన్ కాకతీయ’పథకాన్ని ప్రారంభించింది. రాష్ట్రవ్యాప్తంగా గుర్తించిన సుమారు 45 వేలకుపైగా చెరువులను పునరుద్ధరించి.. కాకతీయుల నాటి గొలుసుకట్టు చెరువులను అనుసంధానించాలని నిర్ణయించింది. ప్రతి నీటి బొట్టును ఒడిసిపట్టేలా చర్యలు చేపట్టింది. ఈ మేరకు ఒక్కో విడతలో సుమారు 9 వేల చెరువుల చొప్పున ఎంపిక చేస్తూ.. పునరుద్ధరణ పనులు చేపట్టింది. ప్రభుత్వ లక్ష్యం ఇంత ఘనంగా ఉన్నా క్షేత్రస్థాయిలో పరిస్థితులు మాత్రం విభిన్నంగా ఉన్నాయి. చాలా చోట్ల ఇప్పటికే చెరువులు ఆక్రమణలకు గురయ్యాయి. కానీ రికార్డుల్లో మాత్రం పూర్తి విస్తీర్ణం నమోదై ఉంది. అయితే అధికారులు ఇలా ఆక్రమణలకు గురైన మేర భూమి విస్తీర్ణాన్ని తగ్గించకుండా... పూర్తి విస్తీర్ణాన్ని లెక్కించి కాంట్రాక్టర్లకు పనులు అప్పగించారు. దీంతో కాంట్రాక్టర్లు కొంతమేరకే పనులు చేశారు. అధికారులు వారితో కుమ్మక్కై పూర్తి మొత్తానికి బిల్లులు మంజూరు చేశారు. ఇక ఉన్నమేరౖనా పునరుద్ధరణ పనులు పూర్తి చేయకపోయినా, నాసిరకంగా చేసినా కూడా పట్టించుకోలేదు. దీంతో చాలా చోట్ల చెరువుల తూములకు గండ్లు పడ్డాయి. కట్ట, మత్తడి దెబ్బతిన్నాయి. కాలువలు కనిపించకుండానే పోయాయి. మరోవైపు బిల్లుల జాప్యం.. రెండు, మూడు విడతల పనుల్లో కేవలం కట్టను చదును చేయడం, మట్టిని నేర్పడం, తూముల మరమ్మతు వంటి పనులు మాత్రమే జరిగాయి. కొన్నిచోట్ల మొదటి విడతలో మంజూరైన పనులే ఇప్పటివరకు పూర్తికాకపోవడం గమనార్హం. పలుచోట్ల చేసిన పనులకు సంబంధించి బిల్లులు రాకపోవడంతో కాంట్రాక్టర్లు మిగతా పనులను నిలిపివేశారు. బిల్లుల చెల్లింపుల జాప్యంతో ఈసారి పాత కాంట్రాక్టర్లలో చాలా వరకు నాలుగో దశకు టెండర్ వేయలేదు కూడా. వాస్తవానికి నిధుల సమస్య కారణంగానే నాలుగో విడతలో ప్రతిపాదించిన చెరువుల సంఖ్యలో ప్రభుత్వం కోత విధించిందని అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. అప్పుల పాలవుతున్నామంటున్న కాంట్రాక్టర్లు రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలంలోని పోమాల్పల్లి–కొండారెడ్డిపల్లి గ్రామశివారులో ఉన్న పెద్ద చెరువు 68 ఎకరాల్లో ఉంది. కాంట్రాక్టర్ రూ.14.25 లక్షలకు ఈ చెరువు పునరుద్ధరణ పనులు దక్కించుకున్నారు. ఏడాది క్రితమే పనులు పూర్తిచేసినా.. ఇప్పటివరకు రూ.6 లక్షల బిల్లులు మాత్రమే చెల్లించారు. అప్పులు చేసి పనులు పూర్తి చేశానని, బిల్లులు చెల్లించక నానా అవస్థలు పడుతున్నానని కాంట్రాక్టర్ వాపోతున్నారు. ఇక కరీంనగర్ జిల్లా జమ్మికుంటలోని నాయిని చెరువును మినీ ట్యాంక్బండ్గా అభివృద్ధి చేసే పనులు చేస్తున్న కాంట్రాక్టర్దీ ఇదే తరహా పరిస్థితి. రూ.2.4 కోట్ల అంచనాతో చేపట్టిన ఈ పనుల్లో రూ. కోటికిపైగా విలువైన పనులు పూర్తయినా.. కాంట్రాక్టర్కు ఇప్పటివరకు రూ.30 వేల మేర మాత్రమే బిల్లులు చేతికందినట్లు చెబుతున్నారు. ఈ రెండు చోట్ల మాత్రమే కాదు.. రాష్ట్రవ్యాప్తంగా చాలా చోట్ల కూడా పనులు పూర్తయినా బిల్లులు రావడం లేదని కాంట్రాక్టర్లు గగ్గోలు పెడుతున్నారు. బిల్లు రాదు పని కాదు ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని హీరాపూర్ చెరువును మిషన్ కాకతీయ మూడో దశలో ఎంపిక చేశారు. 16 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ చెరువు పునరుద్ధరణకు రూ.26 లక్షలు మంజూరయ్యాయి. కానీ కాంట్రాక్టర్ చెరువు కట్టకు మాత్రమే మరమ్మతు పనులు చేశారు. ఇందుకోసం రెండెకరాల్లో మాత్రమే మట్టిని తీశారు. చెరువు తూము, మత్తడి పనులు మధ్యలోనే ఆగిపోయాయి. రెండు కాలువల్లో ఒక కాలువ మాత్రమే చేపట్టారు. దీనిపై సంబంధిత కాంట్రాక్టర్ను వివరణ కోరగా.. చేసిన పనులకు సంబంధించి గతేడాది సెప్టెంబర్ 18న రూ.7 లక్షల బిల్లు పెట్టినప్పటికీ ఇప్పటికీ సొమ్ము రాలేదని, దాంతో పనులు నిలిపేశామని చెప్పారు. చిన్న నీటి పారుదల శాఖ జేఈ ప్రవీణ్కుమార్ను సంప్రదించగా.. బిల్లులు విడుదల కాలేదని, మంజూరైన వెంటనే పనులను పునః ప్రారంభింపజేస్తామని తెలిపారు. పనులు చేయకపోయినా బిల్లులు.. వికారాబాద్ జిల్లాలోని పరిగి మండలం గడిసింగాపూర్ శివారులోని రాయిని చెరువు విస్తీర్ణం సుమారు 30 ఎకరాలు. ఈ చెరువు పునరుద్ధరణకు ప్రభుత్వం రూ.62 లక్షలు మంజూరు చేసింది. మొత్తం చెరువులో పూడికతీయాల్సి ఉండగా.. కేవలం చెరువు కట్టకు అవసరమైన మేర మాత్రమే మట్టి తవ్వారు. సుమారు 20 శాతం పనులే పూర్తయినా.. 60 శాతం పనులు పూర్తయినట్లుగా రికార్డుల్లో పేర్కొన్నారు. ఈ మేరకు బిల్లులు కూడా మంజూరయ్యాయి. ఇక కాంట్రాక్టర్ చెరువు తూములను నాసిరకంగా నిర్మించడంతో గ్రామ రైతులు పలుమార్లు ఆందోళన చేశారు. గతేడాది అప్పటి కలెక్టర్ దివ్యదేవరాజన్కు ఫిర్యాదు కూడా చేశారు. లేని భూమికి టెండర్లు రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం గూడూరులోని రామయ్య చెరువు 40 ఎకరాల్లో విస్తరించి ఉంది. మిషన్ కాకతీయ రెండో విడతలో ఈ చెరువు పునరుద్ధరణ కోసం ప్రభుత్వం రూ.40.5 లక్షల అంచనాతో టెండర్లు నిర్వహించింది. ఓ కాంట్రాక్టర్ 22 శాతం తక్కువ (లెస్)కు ఈ పనులను దక్కించుకున్నారు. అయితే చెరువులో సుమారు పదెకరాలకుపైగా ఆక్రమణకు గురైంది. ఈ మేరకు విస్తీర్ణం, టెండర్ ధరను తగ్గించాల్సి ఉన్నా అధికారులు చూసీ చూడనట్లు వదిలేశారు. దీంతో కాంట్రాక్టర్కు లబ్ధి చేకూరింది. పనుల్లో తొండి.. తూముకు గండి మహబూబ్నగర్ జిల్లా నారాయణపేట మండలం కొల్లంపల్లిలోని గౌని చెరువును మిషన్ కాకతీయ తొలి విడతలో పునరుద్ధరణకు ఎంపిక చేశారు. రికార్డుల ప్రకారం చెరువు విస్తీర్ణం 81.18 ఎకరాలు. కానీ అందులో 21 ఎకరాలకుపైగా ఆక్రమణలకు గురైనట్లు అధికారులే చెబుతున్నారు. కానీ మొత్తం విస్తీర్ణాన్ని లెక్కించి.. రూ.35 లక్షలకు పనులు అప్పగించారు. ఇక కాంట్రాక్టర్ ఏదో పైపైన పనులే చేశారు. తూము, కట్ట నిర్మాణం నాసిరకంగా చేశారు. ముళ్ల పొదలను కూడా తొలగించలేదు. ఈ అరకొర పనులకు కూడా అధికారులతో కుమ్మక్కై రూ.10 లక్షలు బిల్లు తీసుకున్నారు. దీంతో ఈ ఏడాది కురిసిన కొద్దిపాటి వర్షాలకే తూముకు గండిపడింది. ఆయకట్టు రైతులంతా కలసి ఆ తూమును మూసివేశారు. ఇక చెరువంతా ముళ్ల చెట్లతో నిండిపోయింది. ఇక ఉపాధి హామీ పథకం కింద మరో రూ.24 లక్షలు వెచ్చించి చెరువులో ఒండ్రు మట్టి తవ్వకాలు చేపట్టారు. అయినా చెరువు పూడికతీత పూర్తి కాలేదు. మొరం పోసి.. కానిచ్చేశారు..! జగిత్యాల జిల్లా రాయికల్ మండల కేంద్రంలోని పెద్ద చెరువు 125 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. మిషన్ కాకతీయ తొలివిడతలో ఈ చెరువును పునరుద్ధరణకు ఎంపిక చేశారు. రూ.1.33 కోట్లకు కాంట్రాక్టుకు ఇచ్చారు. పూడికతీతతోపాటు తూముల నిర్మాణం, పంట కాలువ పనులు, మత్తడి నిర్మాణం చేయాలి. కానీ అధికారుల పర్యవేక్షణ లోపించడంతో కాంట్రాక్టర్ ఇష్టానుసారంగా పనులు చేసి, బిల్లు తీసేసుకున్నారు. తూముల నిర్మాణం, చెరువుకట్ట, పంట కాల్వల పనుల్లో నాణ్యత లేదని రైతులు మొత్తుకుంటున్నారు. రాయికల్ నుంచి చెర్లకొండాపూర్కు వెళ్లే ప్రజలు ఈ చెరువు మత్తడిపై నుంచే ప్రయాణిస్తారు. ఈ మేరకు మత్తడిని పటిష్టం చేయాల్సి ఉండగా.. కాంట్రాక్టర్ గతంలో ఉన్న మత్తడిపైనే కాస్త మొరం పోసి వదిలేశారు. -
పొంచి ఉన్న సాగునీటి కష్టాలు
ఉత్తర తెలంగాణ వరప్రదాయిని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఆయకట్టుకు సాగునీటి కష్టాలు పొంచి ఉన్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. యాసంగి పంటకు నాలుగు లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీటిని అందిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. కానీ జలాశయంలో నీటి లభ్యత పరిమితంగా ఉన్న నేపథ్యంలో ఇప్పటి నుంచే నీటిని పొదుపుగా వాడుకోవాలని నీటి పారుదలశాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. లేనిపక్షంలో చివరి తడులకు ఇబ్బందులు ఎదురవుతాయని చెబుతున్నారు. సాక్షిప్రతినిధి, నిజామాబాద్: యాసంగికి నీటి విడుదల ప్రారంభమైన 2017 డిసెంబర్ 25 నాటికి శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో 47 టీఎంసీల నీటి నిల్వ ఉంది. గత ఏడాది ఈ యాసంగి సీజను (2016 డిసెంబర్ 25) నాటికి ఎస్సారెస్పీలో 80 టీఎంసీల నీళ్లు ఉన్నాయి. గత సీజనుతో పోల్చితే ఈ ఏడాది నీటి నిల్వ సగానికి తగ్గడంతో ఆయకట్టుకు సాగునీరం దడం ప్రశ్నార్థకమవుతోంది. చివరి తడులకు ఇబ్బందులు..? ఈ యాసంగి సీజనులో ప్రాజెక్టు కింద మొత్తం నాలుగు లక్షల ఎకరాలకు సాగునీటిని విడుదల చేయాలని ప్రభుత్వం డిసెంబర్లో నిర్ణయించింది. లక్ష్మి కాలువ కింద నిజామాబాద్ జిల్లా పరిధిలో 16 వేల ఎకరాలు, నిర్మల్ జిల్లా పరిధిలోని సరస్వతి కాలువ కింద ఉన్న మరో 16,300 ఎకరాల ఆయకట్టు ఉంది. అలాగే జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లాల పరిధిలో సుమారు 3.67 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరందించాలని భావిస్తున్నారు. కాకతీయ కాలువ పరిధిలోని ఎల్ఎండీ ఎగువ భాగం వరకు ఆయకట్టుకు సాగునీటిని అందించేలా నీటి పారుదలశాఖ ప్రణాళిక రూపొందించింది. మొత్తం ఎనిమిది తడులు నీటిని ఇవ్వాలని నిర్ణయించారు. కాకతీయ కాలువకు వారబందీ విధానంలో నీటిని విడుదల చేస్తున్నారు. మొదట్లో రోజుకు ఐదు వేల క్యూసెక్కులు నీటిని విడుదల చేశారు.అయితే చివరి ఆయకట్టుకు సాగునీరు చేరకపోవడంతో ఇప్పుడు రోజుకు ఆరు వేల క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. ఇలా ఒక్కో తడికి 4.8 టీఎంసీల చొప్పున నీరు జలాశయం నుంచి విడుదలవుతోంది. ఈ లెక్కన ఎనిమిది తడులకు సుమారు 38.4 టీఎంసీల నీళ్లు అవసరం ఉంటుంది. కానీ నీటి విడుదల ప్రారంభించే నాటికి జలాశయంలో 47 టీఎంసీలు మాత్రమే నీటి నిల్వ ఉంది. డెడ్స్టోరేజీ, ఎవాబ్రేషన్ లాస్, తాగునీటి అవసరాలు పోగా కేవలం సుమారు 33 టీఎంసీలు మాత్రమే వాడుకునేందుకు వీలుంటుంది. కానీ ఎనిమిది తడులకు 38.4 టీఎంసీల నీటి అవసరం ఉన్న నేపథ్యంలో సుమారు ఐదు టీఎంసీల నీటి కొరత ఏర్పడే అవకాశం ఉందని ప్రాజెక్టు వర్గాలు భావిస్తున్నాయి. దీంతో పంట కీలక దశ చివరి తడికి ఇబ్బంది వస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ పరిస్థితుల్లో రైతులు నీటిని వృథా చేయకుండా, పొదుపుగా వాడుకోవాలని నీటిపారుదల శాఖ «అధికారులు సూచిస్తున్నారు. గత యాసంగి సీజనులో 80 టీఎంసీలు.. గతేడాది ఈ యాసంగి సీజను ప్రారంభమయ్యే నాటికి ఎస్సారెస్పీలో 80 టీఎంసీల నీటి నిల్వ ఉంది. దీంతో ఆయకట్టుకు ఎలాంటి ఇబ్బందులు రాలేదు. కానీ ఈసారి 47 టీఎంసీలే ఉండటంతో సాగునీటి ఇబ్బందులు పొంచి ఉన్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కాగా గతేడాది యాసంగి సీజను మాదిరిగానే ఈసారి కూడా ఆయకట్టు రైతులు వరి వైపే మొగ్గుచూపడంతో నీటి అవసరాలు ఎక్కువగా ఉన్నాయి. ‘‘ప్రస్తుత పరిస్థితుల్లో నీటిని వృథా చేయకుండా వినియోగించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రాజెక్టులో నీటి లభ్యత దృష్ట్యా ఇందుకు రైతులు సహకరించాలి.’’ అని ఎస్సారెస్పీ ప్రాజెక్టు పర్యవేక్షక ఇంజనీర్ శ్రీనివాస్రెడ్డి పేర్కొన్నారు. -
బోధన్ ఇరిగేషన్ డీఈ ఇంటిపై ఏసీబీ దాడి
సాక్షి, బోధన్: నిజామాబాద్ జిల్లా బోధన్ ఇరిగేషన్ డిఈ శ్రావణ్ కుమార్ రెడ్డి ఇంటిపై ఏసీబి దాడులు చేసింది. బాన్సువాడ లోని ఆయన నివాసంలో రూ.40లక్షల విలువైన ఆస్తులు ఉన్నట్లు గుర్తించారు. ఖదీదైన కారును సీజ్ చేశారు. ఆర్మూర్లో ఉన్న ఆయన ఇంట్లో కూడా ఏసీబీ సోదాలు జరిపింది. ఇక్కడా విలువైన అస్తులు ఉన్నట్లు గుర్తించిన అధికారులు వాటికి సంబంధించిన పత్రాలను సీజ్ చేశారు. -
ఇరిగేషన్ శాఖ ఉద్యోగి ఆత్మహత్య
-
తాగునీటి గండం గట్టెక్కినట్లే!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా కురుస్తున్న వర్షాలు, ఎగువ రాష్ట్రాల నుంచి దిగువకు వస్తున్న ప్రవాహాలతో రాష్ట్ర ప్రాజెక్టులు జలకళ సంతరించుకుంటున్నాయి. ప్రస్తుతం ప్రాజెక్టుల్లో ఉన్న నీటితో పూర్తిస్థాయి సాగు అవసరాలను తీర్చే అవకాశాలు లేకున్నా, తాగునీటి గండం నుంచి మాత్రం గట్టెక్కే అవకాశాలున్నాయని నీటి పారుదల వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ అవసరాలకు పెద్దదిక్కుగా ఉన్న సాగర్లోకి స్థిరంగా ప్రవాహాలు వస్తుండటం, ఎగువ శ్రీశైలానికి భారీ ప్రవాహాలు కొనసాగుతుండటం రాష్ట్రానికి ఉపశమనమిస్తోంది. మిషన్ భగీరథకు ఢోకాలేదు నాగార్జునసాగర్, శ్రీరాంసాగర్, నిజాంసాగర్, జూరాల, శ్రీశైలం, కడెం, సింగూరు వంటి ప్రధాన ప్రాజెక్టుల్లో పూర్తి స్థాయి నీటి నిల్వలు 727.39 టీఎంసీలు కాగా ప్రస్తుతం 438.9 టీఎంసీల మేర నిల్వలున్నాయి. ఇందులో ప్రాజెక్టుల్లో కనీస నీటి మట్టాలకు దిగువన 168 టీఎంసీలు ఉండాల్సిందే. శ్రీశైలంలో ఏపీ వాటా మరో 100 టీఎంసీలు, ఆవిరి నష్టాలు మరో 20 టీఎంసీలను పక్కన పెట్టినా, గరిష్టంగా 150 టీఎంసీల రాష్ట్ర వాటా ఉన్నట్టే. ఇందులో ఇప్పటికే సాగు ప్రాజెక్టులకింద ఉన్న తాగునీటి కేటాయింపులు 40 నుంచి 50 టీఎంసీల వరకు ఉన్నాయి. ఇక మిషన్ భగీరథ కింద ఈ ఏడాది జనవరి నుంచి 60 టీఎంసీల అవసరాలు ఉండనున్నాయి. ముఖ్యంగా నాగార్జునసాగర్ కింద వచ్చే జూలై వరకు మిషన్ భగీరథకు 16 టీఎంసీలు, హైదరాబాద్, నల్లగొండ తాగునీటి అవసరాలకు మరో 16 టీఎంసీలు, కల్వకుర్తి కింద 5 టీఎంసీల మేర అవసరం ఉంది. ప్రస్తుతం సాగర్లో కనీస నీటి మట్టం 510 అడుగులకు ఎగువన 13 టీఎంసీల నీటి లభ్యత ఉంది. అయితే ఎగువన వర్షాలు కురుస్తుండటంతో శ్రీశైలంలోకి 1.21లక్షల క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోంది. దీంతో ప్రాజెక్టులో నిల్వ 181 టీఎంసీలకు చేరింది. ఇక్కడ లభ్యతగా ఉన్న నీటిని అవసరానికి తగ్గట్టు ప్రస్తుతం తెలంగాణ వినియోగించుకుంటోంది. ప్రస్తుతం శ్రీశైలానికి వస్తున్న ప్రవాహాలతో మరింత నిల్వలు పెరిగితే వాటా ప్రకారం సాగర్నుంచి గరిష్టంగా 70 నుంచి 80 టీఎంసీల వాటా అయినా దక్కే అవకాశం ఉంది. ఈ నీటితో వచ్చే ఏడాది వరకు తాగునీటి కష్టాలను సమర్ధంగా ఎదుర్కొనే అవకాశం ఉంది. ఇక గోదావరి బేసిన్ పరిధిలోని సింగూరు, ఎల్లంపల్లి, కడెంలు పూర్తి స్థాయి మట్టాలకు చేరుకున్నాయి. ఎస్సారెస్పీలో అనుకున్న మేర నీటి నిల్వలు చేరకున్నా, ప్రాజెక్టులో లభ్యతగా ఉన్న 37.38 టీఎంసీల నీటితో తాగునీటి అవసరాలకు ఢోకాలేదు. ఒక్క నిజాంసాగర్ ప్రాజెక్టు కింది తాగునీటి అవసరాలకు మాత్రం కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. సింగూరుకు మరిన్ని ప్రవాహాలు కొనసాగితే, అక్కడి నుంచి నిజాంసాగర్కు నీటి విడుదల జరిగే ఆస్కారం ఉంది. అదే జరిగితే ఇక్కడి అవసరాలు సైతం తీరుతాయని నీటి పారుదల వర్గాలు చెబుతున్నాయి. -
కట్టలు తెగిన నిర్లక్ష్యం
బనగానపల్లె/కోవెలకుంట్ల: తెలుగుదేశం ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా శ్రీశైలం రైట్ బ్రాంచ్ కెనాల్ (ఎస్సార్బీసీ)ని వరుస గండ్లు వెంటాడుతున్నాయి. కర్నూలు, వైఎస్ఆర్ జిల్లాల్లోని 1.92 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే ప్రధాన కాల్వ గత ఆరేడేళ్లుగా నిర్లక్ష్యానికి గురవుతోంది. ఆదివారం తెల్లవారు జామున బనగానపల్లె సమీపంలో ఎస్సార్బీసీ ప్రధాన కాల్వకు భారీ గండి పడటంతో పట్టణంలోని పలు కాలనీలు నీట మునిగాయి. ఇళ్లలోకి నీరు రావడంతో కాలనీవాసులు భయాందోళనకు గురయ్యారు. రెండేళ్ల క్రితం ఇదే కాలువకు భారీ గండి పడి పంట పొలాలు నీట మునిగి నష్టం సంభవించింది. అదే ఏడాది అవుకు సమీపంలో మరో గండి పంట పొలాలను ముంచెత్తింది.అప్పుడు తాత్కాలిక మర మ్మతులతో సర్కార్ చేతులు దులుపుకున్న ఫలితంగా ఆదివారం భారీ గండి పడి బనగానపల్లె వాసులను భయాందోళనకు గురిచేసింది. ఎస్సార్బీసీని పటిష్టం చేస్తూ ఎప్పటికప్పుడు పర్యవేక్షించాల్సిన సర్కార్ నిద్రమత్తులో తూగుతూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతోందన్న విమర్శలు తాజా గండి నేపథ్యంలో వెల్లువెత్తుతున్నాయి. గండికి ప్రధాన కారణాలు గత ఏడాది అధికారులు అనాలోచితంగా ప్రవాహస్థాయికి మించి కాల్వకు నీటిని విడుదల చేశారు. అప్పటి నుంచి ఏడాదిగా కాల్వ పటిష్టతను పట్టించుకున్న దాఖలాలు లేవు. నీరు–చెట్టు పథకం కింద కాల్వలోకి జేసీబీలను దించి పనులు చేయించే సమయంలో కాల్వ దెబ్బతినడం, కట్టపై నిత్యం భారీ వాహనాలు తిరగడం, అధికారుల పర్యవేక్షణ కొరవడటం వల్ల మళ్లీ గండి పడినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదన్న విమర్శలు ఉన్నాయి. కాల్వ పటిష్టతను పరిశీలించిన తర్వాత నీటిని విడుదల చేయాల్సిన అధికారులు అదేదీ పట్టించుకోకుండా సామర్థ్యానికి మించి ఒకేసారి నీటిని విడుదల చేయడంతో గండి పడి నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. ముందస్తు సమాచారం లేకుండానే.. శుక్రవారం వరకు ఎస్సార్బీసీ ప్రధాన కాల్వ ద్వారా నీటిని విడుదల చేయని అధికారులు శనివారం ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఒకేసారి సుమారు 1,500 క్యూసెక్కులు విడుదల చేయడంపై కొందరు ఇంజనీరింగ్ అధికారులే తప్పుబడు తున్నారు. ప్రధాన కాల్వ దెబ్బతిన్నందున దశలవారీగా నీటిని విడుదల చేయాల్సిన అధికారులు ఇలా ఒకేసారి విడుదల చేయడంతో గండ్లు పడే ప్రాంతాలను అధికారులు గుర్తించలేకపోయారు. కట్టుబట్టలతో రోడ్లపైకి ... ఎస్సార్బీసీకి గండి పడి నీరంతా బనగానపల్లె పట్టణంలోని వివిధ కాలనీల్లోకి చేరింది. పెండేకంటి నగర్, ఆర్టీసీ బస్టాండ్ ఏరియా, ఈద్గానగర్, ఎరుకలికాలనీ.. తదితర ప్రాంతాలను నీరు ముంచెత్తింది. ఎరుకలి కాలనీలోని ఇళ్లలో రెండు అడుగుల లోతు నీరు ప్రవహించి బియ్యం, కందిపప్పు, వంట సామగ్రి తడిచిపోయింది. ఆర్టీసీ బస్టాండ్, పెట్రోల్బంకు, పవర్ హౌస్ ప్రాంతానికి విస్తరించడంతో ఈ ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. ఆర్టీసీ వాహనాల రాకపోకలు నిలిచిపోగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణంలోకి భారీగా నీరు చేరడంతో ప్రహరీకి గండి కొట్టారు. దీంతో ఈద్గానగర్ జలదిగ్బంధమైంది. ఇళ్లలోకి నీరు చేరడంతో కాలనీవాసులు కట్టుబట్టలతో రోడ్డుపైకి చేరారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు రోడ్లపై గడపాల్సి వచ్చిందని, అధికారులు ఎవరూ పట్టించుకోకపోవడంతో.. పండుగ పూట చిన్నపిల్లలు, వృద్ధులు ఆకలితో అలమటించాల్సి వచ్చిందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. -
డిసెంబర్కి ‘ఉదయ సముద్రం’ పూర్తి
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: ఉదయ సముద్రం ప్రాజెక్టు పనులు డిసెంబర్ చివరి నాటికి పూర్తి చేస్తామని భారీ నీటిపారుదల మంత్రి హరీశ్రావు తెలిపారు. సోమవారం నల్లగొండ జిల్లా నార్కట్పల్లి మండలం బ్రాహ్మణవెల్లంల ప్రాజెక్టు పనులను మంత్రి జగదీశ్రెడ్డితో కలసి ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. జనవరి మొదటి వారంలోగా బ్రాహ్మణవెల్లెంల ప్రాజెక్టులోకి చెరువులు నింపడానికైనా నీళ్లు విడుదల చేస్తామన్నారు. వీటన్నింటినీ తమ ప్రభుత్వం ఒక్కొక్కటిగా పరిష్కరించి ముందుకెళుతోం దన్నారు. టన్నెల్లో ఇంకా 675 మీటర్ల పని మిగిలి ఉందని, నెలకు 200 మీటర్ల చొప్పున మూడు నెలల్లో పూర్తి చేయాలని అధికారు లను, ఏజెన్సీని ఆదేశించామన్నారు. 15 రోజులకోసారి ఈ పనుల విషయమై కలెక్టర్ను రివ్యూ చేయాలని చెప్పామన్నారు. సకాలంలో నిర్ధారిత పని చేయకపోతే సదరు ఏజెన్సీని తొలగించి బ్లాక్లిస్టులో పెట్టి ప్రత్యామ్నాయ ఏజెన్సీకి పనులు అప్పగిం చాలని ప్రాజెక్టు సీఈ సునీల్ను ఆదేశిం చామని మంత్రి పేర్కొన్నారు. పనులన్నీ పూర్తి చేసి డిసెంబర్లో ట్రయల్ రన్ నిర్వహిస్తామన్నారు. ప్రాజెక్టు పరిధిలో ముం దుగా 40 వేల ఎకరాలకైనా నీళ్లు ఇవ్వాలన్న లక్ష్యంతో ముందుకు వెళ్తున్నట్లు చెప్పారు. కానీ కృష్ణానదిలో ఇప్పటి వరకు నీళ్లు ఆశాజనకంగా లేవని, ఇటీవల కొంత వరద వచ్చిందన్నారు. తాగునీటికి ఇక ఢోకా లేదని, ఇంకా కొంత వరద వస్తే అటు ఎన్నెస్పీకి, ఇటు లోలెవల్ కెనాల్, ఉదయ సముద్రం, ఏఎమ్మార్పీకి నీళ్లు ఇచ్చే అవకాశం ఉంటుం దని ఆయన వివరించారు. మిగిలి ఉన్న భూ సేకరణ కూడా త్వరితగతిన పూర్తి చేయాల న్నారు. ఏఎమార్పీ కాలువల్లో జంగిల్ కటిం గ్ కోసం నిధులు మంజూరు చేస్తామన్నారు. -
కొత్త ఏడాదికి మంచినీటి కానుక
-
కొత్త ఏడాదికి మంచినీటి కానుక
ఇంటింటికీ మిషన్ భగీరథ ద్వారా తాగునీరు సరఫరా చేస్తాం: కేసీఆర్ సాక్షి, హైదరాబాద్: కొత్త సంవత్సర కానుకగా వచ్చే జనవరి ఒకటో తేదీన రాష్ట్రంలోని అన్ని గ్రామాల ప్రజలకు సురక్షిత తాగునీటిని అం దించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు అధికారులను ఆదేశించారు. అందుకోసం ఈ ఏడాది డిసెంబర్ చివరి నాటికి మిషన్ భగీరథ పనులన్నీ పూర్తి చేయాలని స్పష్టం చేశారు. గ్రామాల్లో ట్యాంకుల నిర్మాణం, పైపులైన్ల ఏర్పాటు, నల్లాలు బిగించడం లాంటి పనులన్నీ పూర్తి చేయాలన్నారు. వచ్చే నెల నుంచే ఇంటేక్ వెల్స్ నుంచి నీటిని తీసుకుని.. ట్రీట్మెంట్ ప్లాంట్ల ద్వారా మంచినీటిని పంపింగ్ చేయాలని చెప్పారు. అధికారులు, ప్రజాప్రతినిధులు, వర్కింగ్ ఏజెన్సీలు రేయిం బవళ్లు పనిచేసి అయినా లక్ష్యాన్ని చేరుకోవా లని సూచించారు. ఎక్కడ చిన్న జాప్యం జరిగినా తన దృష్టికి తీసుకురావాలని, ఏ సమస్య వచ్చినా జోక్యం చేసుకుని పరిష్కరిం చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. మిషన్ భగీరథపై గురువారం ప్రగతి భవన్లో కేసీఆర్ ఉన్నతస్థాయి సమావేశం నిర్వహిం చారు. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మంత్రులు ఈటల రాజేందర్, పోచారం శ్రీనివాసరెడ్డి, ఇంద్రకరణ్రెడ్డి, తుమ్మల నాగేశ్వర్రావు, జగదీశ్రెడ్డి, జూపల్లి కృష్ణారావు, మహేందర్రెడ్డి, డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్రెడ్డి, మిషన్ భగీరథ వైస్చైర్మన్ వేముల ప్రశాంత్రెడ్డి, సంబంధిత శాఖల ఉన్నతాధికారులు సమావేశంలో పాల్గొన్నారు. ఇది జీవన్మరణ సమస్య మిషన్ భగీరథ రాష్ట్ర ప్రభుత్వానికి జీవన్మరణ సమస్య అని.. అనుకున్న సమయంలో ప్రజలకు సురక్షిత మంచి నీరు అందించటం రాష్ట్ర గౌరవానికి సంబంధించిన అంశమని సీఎం పేర్కొన్నారు. రాష్ట్రంలోని అన్ని ఆవాస ప్రాంతాలకు సురక్షిత మంచి నీరు అందిం చకుంటే వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోమని సవాలు చేసి మరీ మిషన్ భగీరథ పనులు చేస్తున్నామని మరోసారి గుర్తు చేశారు. దేశంలో ఎవరూ తీసుకోని సవాల్ స్వీకరించా మని.. దానికి తగినట్లు పనిచేయాలని అధికారులు, ప్రజాప్రతినిధులకు సూచించా రు. రూ.43 వేల కోట్ల భారీ వ్యయంతో చేపట్టిన ఈ పథకాన్ని ఇకపై స్వయంగా తానే పర్యవేక్షిస్తానని చెప్పారు.మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు కూడా తమ పరిధిలో పనులను నిరంతరం సమీక్షిం చాలని, పర్యటనలు జరపాలని ఆదేశించారు. ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా వివిధ సెగ్మెంట్ల పరిధిలో జరుగుతున్న మిషన్ భగీరథ పనుల పురోగతిని సీఎం సమీక్షించారు. మొత్తం 19 ఇంటెక్వెల్స్లో ఇప్పటికే 16 పూర్త య్యాయని, మిగతావి త్వరలోనే పూర్తవుతా యని అధికారులు వివరించారు. 50 వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లలో 15 పూర్తయ్యాయని, 27 పూర్తికావచ్చాయని, మిగతావి పురోగతిలో ఉన్నాయని చెప్పారు. మొత్తంగా 49,238 కి.మీ.కు గాను 43,427 కి.మీ. (88 శాతం) పైపులైన్లు సిద్ధంగా ఉన్నాయన్నారు. గ్రామాల్లో అంతర్గత పనులు మినహా మిగతావన్నీ డిసెంబర్లోగా పూర్తి చేస్తామన్నారు. ముప్పై ఏళ్ల ముందస్తు ప్లాన్ ఇది.. రాబోయే 30 ఏళ్ల అవసరాలను దృష్టిలో పెట్టుకుని మిషన్ భగీరథ రూపొందించామని.. అప్పటికి ప్రజలకు సరిపడే నీటిని అందించేలా ట్యాంకులు, పైపులైన్ల సామర్థ్యాన్ని మరోసారి మదింపు చేయాలని సీఎం ఆదేశించారు. అవసరమైతే ట్యాంకుల సంఖ్య, నీటి నిల్వ సామర్థ్యం పెంచాలని... ప్రతి జిల్లాలో మం త్రుల సమక్షంలో ఎమ్మెల్యేలు, అధికారులు సమావేశమై నిర్ణయం తీసుకోవాలని సూచిం చారు. ఇంటేక్ వెల్స్, వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ల నిర్మాణం పూర్తయ్యే నాటికే వాటికి కావలసిన విద్యుత్ సరఫరా, సబ్స్టేషన్ల నిర్మాణం జరగాలన్నారు. ఆ పనుల పర్య వేక్షణకు ట్రాన్స్కో, డిస్కంల నుంచి ముగ్గురు అధికారులను నియమించాలని సూచించారు. తాగునీటికి ప్రాధాన్యం జలాశయాల నీటిని వాడుకునే విషయంలో మంచినీటికే అధిక ప్రాధాన్యం ఉంటుందని కేసీఆర్ చెప్పారు. రాష్ట్రంలోని అన్ని బ్యారేజీలు, రిజర్వాయర్లలో 10 శాతం నీటిని మిషన్ భగీరథకు కేటాయిస్తామని.. అందుకు చట్టం కూడా తెచ్చామని తెలిపారు. రిజర్వాయర్లలో నీటిని తీసుకోగల కనీస మట్టం (ఎండీడీఎల్) ఉండేలా చూసుకోవాలని.. దీనిపై నీటి పారుదల శాఖ అంచనాలు రూపొందించాలని, ఆ మేరకు ప్రాజెక్టుల ఆపరేషన్ మాన్యువల్ను మార్చాలని సూచించారు. రాష్ట్రంలో 19 ప్రాంతాల్లోని నీటి వనరుల్లో కేవలం దుమ్ముగూడెం వద్ద మాత్రమే 365 రోజులు నీటి లభ్యత ఉంటుందని.. మిగతా 18 నీటి వనరులలో నిరంతరం నీరు అందుబాటులో ఉండేందుకు ఇది ఎండీడీఎల్ పాటించడం అవసరమని పేర్కొన్నారు. వర్కింగ్ ఏజెన్సీలకు గొప్ప అనుభవం పథకం వర్కింగ్ ఏజెన్సీలు సమన్వయంతో వ్యవహరించాలని... ఈ పథకం వర్కింగ్ ఏజెన్సీలకు కూడా ప్రతిష్టాత్మకమని కేసీఆర్ వ్యాఖ్యానించారు. ప్రభుత్వం ఎప్పటికప్పుడు బిల్లులు చెల్లిస్తోందని, సకాలంలో పనులు పూర్తి చేసిన వారికి 1.5 శాతం ఇన్సెంటివ్ అందిస్తోందని తెలిపారు. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. జాప్యం చేస్తున్న వర్కింగ్ ఏజెన్సీల నుంచి పనులను తప్పించడానికి ప్రభుత్వం వెనుకాడదని ఈ సందర్భంగా సీఎం హెచ్చరించారు. మూడు కీలక పథకాలూ విజయవంతం ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కార్యక్రమాలు మూడు అని.. ఒకటి నిరంతర విద్యుత్ సరఫరా, రెండోది రైతులకు సాగునీరు అందివ్వడం, మూడోది ప్రజలకు సురక్షిత మంచినీటి సరఫరా అని సీఎం కేసీఆర్ వెల్లడించారు. ‘‘విద్యుత్ రంగంలో అద్భుత విజయం సాధించాం. 45 శాతం వ్యవసాయ పంపుసెట్లకు 24 గంటల విద్యుత్ అందిస్తున్నాం. త్వరలోనే వంద శాతం పంపుసెట్లకు 24 గంటలు ఉచిత విద్యుత్ అందిస్తాం. సాగునీరు అందించేందుకు ప్రాజెక్టులు శరవేగంగా నిర్మిస్తున్నాం. పనులు అనూహ్యంగా జరుగుతున్నాయి. బడ్జెట్లో రూ.25 వేల కోట్లు కేటాయించడంతో పాటు ఇతర ఆర్థిక సంస్థల ద్వారా కూడా నిధులు సమకూరుస్తున్నాం. మొత్తం ఏడాదికి రూ.58 వేల కోట్ల వరకు నీటి పారుదల ప్రాజెక్టులకు ఖర్చు పెడుతున్నాం. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా వచ్చే ఏడాది నుండే గోదావరి జలాలు అందుబాటులోకి వస్తాయి.. అదే సమయంలో ఇంటింటికీ మంచినీరు అందుతుంది..’’అని కేసీఆర్ పేర్కొన్నారు. జీఎస్టీ తగ్గించాలని కేంద్రంపై ఒత్తిడి జీఎస్టీ వల్ల తమపై అధిక భారం పడుతుందని సమీక్ష సందర్భంగా వర్కింగ్ ఏజెన్సీలు ప్రస్తావించాయి. పరికరాలు, మెటీరియల్ కొనుగోలు సందర్భంగా 18 శాతం జీఎస్టీ చెల్లించాల్సి వస్తోందని.. దాంతో నిర్మాణ వ్యయం పెరుగుతుందని వివరించాయి. దీనిపై స్పందించిన సీఎం కేసీఆర్... ప్రజోపయోగ పనులపై జీఎస్టీ తగ్గించాలంటూ కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నట్లు వివరించారు. త్వరలోనే హైదరాబాద్లో జరిగే జీఎస్టీ కౌన్సిల్ సమా వేశంలో ఈ విషయాన్ని గట్టిగా ప్రస్తావిస్తామన్నారు. కేంద్రం సానుకూలంగా స్పందిం చకుంటే వర్కింగ్ ఏజెన్సీలకు నష్టం జరక్కుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. -
15న ‘పురుషోత్తపట్నం’ నీరు విడుదల
కలెక్టర్ కార్తికేయ మిశ్రా సీతానగరం (రాజానగరం) : పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం ద్వారా గోదావరి నీటిని ఈ నెల 15న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విడుదల చేస్తారని కలెక్టర్ కార్తికేయ మిశ్రా తెలిపారు. స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ను, పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం పనులు, గండికోట వద్ద నీటి డెలివరీ ఫాయింట్, పురుషోత్తపట్నం నుంచి సీతానగరం, నాగంపల్లి మీదుగా అచ్చయ్యపాలెం, గండికోట మార్గాలను ఆదివారం ఆయన పరిశీలించారు. ఏర్పాట్లు ముమ్మరంగా చేయాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. పైలాన్ ఏర్పాటుపై అసహన వ్యక్తం పైలాన్ ఏర్పాటుపై కలెక్టర్ అసహనం వ్యక్తం చేశారు. ఎత్తిపోతల పథకానికి కాస్త దూరంలో విద్యుత్ స్తంభాల వద్ద ఏర్పాటు చేసిన పైలాన్ను తక్షణమే తొలగించి, వేరే ప్రాంతంలో ఏర్పాటు చేయాలని ఆదేశించారు. రిమోట్ ద్వారా స్విచ్ ఆన్ చేసి మొదటి దశ నీరు విడుదల చేసేందుకు అవసరమైన అన్ని పనులు పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. వర్షం కురిసే అవకాశం ఉన్నందున టెంట్లు, షామియానాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ సీఎం సీతానగరం నుంచి పథకం వద్దకు కాన్వాయ్ ద్వారా చేరుకుని నీరు విడుదల చేస్తారని చెప్పారు. అనంతరం సీతానగరం చేరుకుని గండికోట వద్ద పోలవరం ఎడమ కాలువలో పథకం నీరు డెలివరీ పాయింట్ను పరిశీలిస్తారని తెలిపారు. అక్కడి నుంచి జగ్గంపేటలో నిర్వహించే సభకు వెళ్తారని చెప్పారు. కలెక్టర్ వెంట రాజమహేంద్రవరం అర్బన్ ఎస్పీ ఎస్.పి.బి.రాజకుమారి, సబ్ కలెక్టర్ వి.విజయరామరాజు, అసిస్టెంట్ కలెక్టర్ ఆనంద్, జలవనరుల శాఖ ఎస్ఈ ఎస్.సుగుణాకరరావు, ఈఈ శ్రీనివాసరెడ్డి, ఆర్అండ్బీ ఎస్ఈ సి.ఎస్.ఎన్.మూర్తి, విద్యుత్ శాఖ డీఈ రాజబాబు, ఏడీఈ కె.రత్నాలరావు, ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్ టి.రమేష్ కిషోర్, అడిషనల్ ఎస్పీ ఆర్.గంగాధర్, డీఎస్పీలు జి.శ్రీనివాసరావు, కె.రామకృష్ణ, తహసీల్దార్ కె.చంద్రశేఖరరావు, టి.గోపాలకృష్ణ, కె.పోశయ్య, దేవి, ఎంపీడీఓ డి.శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. -
ఆ పొరపాటే ఎడమన కూడా
-మరో పట్టిసీమ కానున్న పురుషోత్తపట్నం ఎత్తిపోతలు – ఇంకా పనులు పూర్తికాకున్నా 15న నీరు తోడేందుకు సన్నాహాలు – కిలోమీటర్ మేర భూమిపైనే పైపులు – ప్రారంభ దశలోనే మురారి, మల్లేపల్లి బ్రిడ్జిలు – తాత్కాలిక ఏర్పాట్లకు అధికారుల యత్నాలు – నేడు ప్రాజెక్టు పనుల పరిశీలనకు సీఎం చంద్రబాబు సాక్షి, రాజమహేంద్రవరం / సీతానగరం : ‘పోలవరం ప్రాజెక్టు కుడి కాలువపై నిర్మించిన పట్టిసీమ ఎత్తిపోతల పథకంలాగే ఎడమ కాలువపై ఏర్పాటు చేస్తున్న పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం కూడా పూర్తి కాకముందే సీఎం చంద్రబాబు జాతికి అంకితం చేయనున్నారా? ఎక్కడికక్కడ తాత్కాలిక ఏర్పాట్లతో నీరు పారించాలని అధికారులు సన్నాహాలు చేస్తున్నారా?’ అంటే అవుననే సమాధానాలు వస్తున్నాయి. పనులు పూర్తి చేయకుండానే ఈ నెల 15న అనుకున్న ప్రకారం ప్రాజెక్టును సీఎం చంద్రబాబు ప్రారంభించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి కాకుండానే పట్టిసీమను ప్రారంభించి జాతికి అంకితం చేసినట్లుగా ఇప్పుడు పురుషోత్తపట్నం ప్రాజెక్టును కూడా ప్రారంభించనున్నారు. ప్రాజెక్టు పనులు ఈ నెల 15కి పూర్తి అయ్యే పరిస్థితి కనపడడంలేదు. అయితే అనుకున్న తేదీ ప్రకారం ఎలాగైనా ప్రారంభించేందుకు యంత్రాగం హడావుడిగా తాత్కాలిక ఏర్పాట్లు చేస్తోంది. హడావుడితో నాణ్యతకు తిలోదకాలు గోదావరి నుంచి పురుషోత్తపట్నం వద్ద పంప్హౌస్ల ద్వారా నీటిని తోడి 10.10 కిలోమీటర్ల దూరంలోని పోలవరం కాలువకు పంపించి అక్కడ నుంచి ఏలేరు ప్రాజెక్టుకు, ఆయకట్టును నీటిని అందించే లక్ష్యంతో రూ.1,638 కోట్లతో ఎత్తిపోతల పనులు ప్రారంభించారు. ఏలేరు జలాశయం నుంచి విశాఖకు గోదావరి నీటిని అందించేందుకు పురుషోత్తపట్నం స్టేజ్ -1, స్టేజ్ -2గా పనులు విభజించి చేపడుతున్నారు. స్టేజ్ -1లో పంప్హౌస్ వద్ద పది పంపులను ఏర్పాటు చేసి ఒకో పంప్ ద్వారా 350 క్యూసెక్కులు నీటిని తోడాలని ప్రతిపాదించారు. ఆ లెక్కన మొత్తం 3,500 క్యూసెక్కుల నీటిని తోడవచ్చు. స్టేజ్ -2లో రామవరంలో పోలవరం 50వ కిలోమీటరు వద్ద పంప్హౌస్ నిర్మించి 8 పంపుల ద్వారా 175 క్యూసెక్కుల చొప్పున మొత్తం 1,400 క్యూసెక్కుల నీటిని ఏలేరులోకి 13.12 కిలోమీటర్ల మేర రెండు లైన్లలో ఏర్పాటు చేసే పైపులైన్ల ద్వారా పంపింగ్ చేయాల్సి ఉంది. అలాగే 57.885 కిలో మీటరు కృష్ణవరం వద్ద క్రాస్ రెగ్యులేటరు నిర్మించి గ్రావిటీ ద్వారా నీటిని అందించేందుకు ప్రతిపాదించారు. ఆగస్టు 15కి నీటిని అందిస్తామని ప్రభుత్వం, ఇరిగేషన్ అధికారులు చెబుతుండగా పనులు మాత్రం పూర్తి కాలేదు. జగ్గంపేట మండలంలో ఒక వరస పైపులైన్ ద్వారా నీటిని పంపాలని చూస్తున్నారు. హడావుడి పనులతో నాణ్యతకు తిలోదకాలు ఇచ్చారు. పోలవరం కాలువ ద్వారా రామవరం వద్ద స్టేజ్ -2కు నీరు చేరేందుకు మురారి, మల్లేపల్లి వద్ద వంతెనలు పూర్తి కావాల్సి ఉంది. ఈ వంతెనల పనులు ప్రారంభ దశలో ఉన్నాయి. ఇవి పూర్తయితే కానీ నీరు పారేందుకు వీలులేదు. బ్రిడ్జి వద్ద తాత్కాలికంగా రోడ్డు కింద తూములు ఏర్పాటు చేసి నీరు పారించాలని అధికారులు భావిస్తున్నారు. తాత్కాలిక ఏర్పాట్లతో హడావుడిగా పనులు చేస్తే ముప్పు తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. భూమిపైకి లేచిన పైపులు.. 10 పంపుల నుంచి ఐదు వరసలలోని తరలించేందుకు పైపులను అమర్చాల్సి ఉంది. మొదటి ఫేజ్లో రెండు వరసల మేర భూమిలో పైపులు వేశారు. అయితే గత నెల 18న ఈపథకంలో భాగంగా వేసిన 150 పైపులు భూమిలో నుంచి పైకి లేచాయి. దాదాపు కిలో మీటరు మేర లేచిన పైపుల్లో కొన్ని చోట్ల జాయింట్లు విడిపోయాయి. పైపులు వేయడానికి తీసిన గోతుల్లో ఈ మధ్య కురిసిన వర్షాలు, గోదావరిలో వరద వల్ల నీరు ఊరుతుండడంతో పైపులు పైకి ఉబికి వచ్చాయి. ఈ నెల 15 కల్లా నీరు తోడాలన్న ఉద్దేశంతో నాణ్యతా ప్రమాణాలు పట్టించుకోకుండా పైపులు అమర్చారు. పైపులు అమర్చే ముందు కాలువలో ఇసుక వేయలేదు. ఫలితంగా రామవరపు ఆవ వద్ద భూమిలో నీరు ఊరడంతో భూమిలోని పైపులు పైకి లేచాయి. ప్రారంభానికి తాత్కాలిక ఏర్పాట్లు... కాలువలో ఇసుక నింపి పైప్లైన్ వేయాల్సి ఉండగా, 15 కల్లా నీటిని విడుదల చేయాలనే ఉద్దేశంతో పనులలో తీసుకోవలసిన నాణ్యతా చర్యలను మమ అనిపించి, పైప్లైన్ వేశారని పలువురు ఆరోపించారు. పైకి లేచిన పైపులను యంత్రాల ద్వారా తీవ్ర ఒత్తిడితో కిందకు నొక్కినా ప్రయోజనం లేకపోయింది. ఒక వరస మేర కిలోమీటరు పొడవున పైప్లైన్ భూమి పైనే ఉంచి, ప్రారంభోత్సవానికి అడ్డంకి లేకుండా చేయడానికి ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. సీఎం చంద్రబాబు ప్రాజెక్టును ప్రారంభించిన తర్వాత రెండు మోటార్లను ఆఫ్ చేసి పైప్లైన్ను సరిచేయవచ్చని అధికారులు భావిస్తున్నారు. -
రెండేళ్లలో కష్టాలన్నీ తీరుతాయి
సిద్దిపేటలో మంత్రి హరీశ్రావు సాక్షి, సిద్దిపేట: మరో రెండేళ్లలో తెలంగాణ ప్రజల కష్టాలన్నీ తీరిపోతాయని భారీ నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్రావు అన్నారు. గురువారం సిద్దిపేటలో వివిధ అభివృద్ధి పనులను ఆయన పరిశీలించారు. డిగ్రీ కళాశాలలో విద్యార్థులతో కలసి భోజనం చేశారు. ప్రభుత్వ పనితీరుపై విద్యార్థుల తల్లిదండ్రులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో సాగునీరు లేక రైతులు ఇబ్బందులు పడ్డారని, నీటి కోసం బోర్లు వేసి అప్పుల పాలయ్యారని పేర్కొన్నారు. రైతులు ఇబ్బంది పడవద్దనే ఆలోచనతో కృష్ణా, గోదావరి జలాలను పొలాలకు మళ్లించే చర్యలు చేపట్టామన్నారు. రెండేళ్లలో సాగు, తాగు నీటి కష్టాలు తీరుతాయని మంత్రి భరోసా ఇచ్చారు. సిద్దిపేటలోని కోమటి చెరువు ఇతర జిల్లాలకు దిక్సూచిగా నిలిచిందన్నారు. ‘కరువు కాటకాలు, ఆర్థిక ఇబ్బందులతోనే కుటుంబ కలహాలు అధికంగా ఉంటాయి. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలతో అత్తపై కోడలుకు.. కోడలుపై అత్తకు ప్రేమలు పెరిగాయి’అని మంత్రి చమత్కరించారు. ప్రభుత్వం వృద్ధులకు రూ.వెయ్యి పెన్షన్, ఆరు కిలోల బియ్యం, ప్రభుత్వ ఆస్పత్రిలో మెరుగైన వైద్య సేవలతో సుఖ ప్రసవాలు, అనంతరం రూ. 12 వేల పారితోషికం అందిస్తోందని వివరించారు. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలతో ప్రజల్లో ఆత్మవిశ్వాసం పెరిగిందన్నారు. రోజు రోజుకు పెరిగిపోతున్న వాతావరణ కాలుష్యాన్ని అధిగమించకపోతే వచ్చే తరానికి చీకటే మిగులుతుందని హెచ్చరించారు. వారికి ఎంత ఆస్తి సంపాదించి ఇచ్చామనేది కాదని, ఎంత మంచి వాతావరణం అందచేశామనేది కీలకమన్నారు. -
మైనర్ ఇరిగేషన్ అధికారులతో మంత్రి సమీక్ష
అనంతపురం టౌన్: రాప్తాడు నియోజకవర్గంలోని మైనర్ ఇరిగేషన్ అధికారులతో మంత్రి పరిటాల సునీత నగరంలోని తన స్వగృహంలో మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గానికి గతంలో మంజూరైన పనులు, ఇంకా కావాల్సిన ప్రతిపాదనలపై చర్చించారు. మండలాల వారీగా పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. చెరువుల్లో జంగిల్ క్లియరెన్స్, కాలువల్లో పూడికతీత, దారి పక్కన కంప చెట్ల తొలగింపు పనులు చేపట్టాలని సూచించారు. పనుల్లో జాప్యం చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
ఇరిగేషన్(vs) టీడీపీ
►ముదిరిన వివాదం ►ఇరిగేషన్ ఎస్ఈపై బదిలీ వేటు...? ►టీడీపీ కార్యాలయానికి స్థలమివ్వలేదంటూ ఆరోపణ ►ఎన్ఎస్పీ కార్యాలయ భవన నిర్మాణాన్ని ఆపలేదని అక్కసు ►పట్టించుకోని ఎస్ఈ శారద ►శారదపై ఇప్పటికే ఇరిగేషన్ మంత్రికి ఫిర్యాదు ►బదిలీ కోసం ఒత్తిడి ►తనకా విషయం తెలియదంటున్న ఇరిగేషన్ సీఈ వీర్రాజు ఒంగోలు: టీడీపీ జిల్లా అధ్యక్షుడు దామచర్ల జనార్ధన్ ఇరిగేషన్ అధికారుల మధ్య వివాదం పతాకస్థాయికి చేరింది. పార్టీ కార్యాలయ నిర్మాణానికి ఎన్ఎస్పీ స్థలాన్ని అప్పగించలేదన్న అక్కసుతో ఇరిగేషన్ ఎస్ఈ శారదను బదిలీ చేయించేందుకు టీడీపీ జిల్లా నేత ఇరిగేషన్ మంత్రిపై ఒత్తిడి తెచ్చినట్లు ఆ పార్టీ వర్గాల్లోనే జోరుగా ప్రచారం సాగుతోంది. ఒంగోలు నగరం నడిబొడ్డున నెల్లూరు–కర్నూలు హైవే పక్కన సర్వే నం.88లో నాగార్జున సాగర్ ప్రాజెక్టు (ఎన్ఎస్పీ) 1.92 ఎకరాల విలువైన స్థలం ఉంది. స్థలానికి తూర్పు వైపున ఇరిగేషన్ ప్రాజెక్టు సీఈ కార్యాలయం, పడమర వైపున నాగార్జున యూనివర్సిటీ, దక్షిణం వైపున నెల్లూరు–కర్నూలు హైవే ఉంది. ప్రస్తుత మార్కెట్ ధరల ప్రకారం ఈ స్థలం విలువ సుమారు రూ.25 కోట్లకుపైనే ఉంటుంది. ప్రస్తుతం ఈ స్థలంలో రూ.5 కోట్ల నిధులతో ఎన్ఎస్పీ ఎస్ఈ కార్యాలయ నిర్మాణాన్ని చేపట్టారు. ఒక్కొక్క ఫ్లోర్ 9 వేల చ.అ.ల ప్రకారం రెండు ఫ్లోర్లు నిర్మిస్తున్నారు. పనులు వేగవంతం చేశారు. అయితే ఆ విలువైన స్థలంపై జిల్లా అధికార పార్టీ నేత కన్నుపడింది. టీడీపీ జిల్లా కార్యాలయం నిర్మాణం పేరుతో ఈ స్థలాన్ని స్వాధీనం చేసుకునేందుకు సిద్ధమయ్యారు. 99 సంవత్సరాల లీజు కింద తొలుత స్థలాన్ని సొంతం చేసుకునేందుకు ప్రతిపాదించారు. ఒక ఎకరం స్థలానికి నెలకు వెయ్యి రూపాయల చొప్పున 1.92 ఎకరాల స్థలానికి నెలకు రూ.1800 లీజు కింద చెల్లించే పద్ధతిలో ప్రతిపాదనలు సిద్ధమైనట్లు సమాచారం. ఎన్ఎస్పీ స్థలాన్ని టీడీపీ కార్యాలయానికి అప్పగించాలంటూ తొలుత పార్టీ జిల్లా అధ్యక్షుడి హోదాలో దామచర్ల జనార్ధన్ ఇరిగేషన్ ఎస్ఈ, సీఈలపై అధికార పార్టీ నేత ఒత్తిడి తెచ్చినట్లు తెలుస్తోంది. అయితే అప్పటికీ ఎన్ఎస్పీ ఎస్ఈ కార్యాలయ భవన నిర్మాణ పనులు ప్రారంభం కావటంతో తామేమీ చేయలేమంటూ ఇద్దరూ తేల్చి చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో స్థలం కోసం జనార్ధన్ ఇరిగేషన్ మంత్రి దేవినేని ఉమ ద్వారా అధికారులపై ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం. ఇదే సమయంలో ముందు ఎన్ఎస్పీ భవన నిర్మాణాన్ని ఆపాలని ఆ తర్వాత ఇరిగేషన్ మంత్రి పేషీ ద్వారా స్థలం కోసం అనుమతులు తెప్పిస్తామంటూ టీడీపీ జిల్లా నేత ఎస్ఈ శారదపై ఒత్తిడి తెచ్చినట్లు తెలుస్తోంది. అయినా ఇవేమీ పట్టించుకోలేదు. దీంతో ఎస్ఈపై అధికార పార్టీ నేత మరింత ఆగ్రహంతో ఉన్నట్లు సమాచారం. పైగా ఎస్ఈ శారద కరణం బలరాం వర్గీయురాలంటూ ఇప్పటికే విస్తృతంగా ప్రచారం చేస్తున్న దామచర్ల వర్గం టీడీపీ కార్యాలయానికి స్థలమివ్వలేదన్న సాకు చూపి ఆమె బదిలీకి పట్టుపట్టినట్లు తెలుస్తోంది. కొంత కాలంగా శారదను బదిలీ చేయించేందుకు సరైన కారణం దొరక్కపోవడంతో జనార్ధన్ మిన్నకుండిపోయినట్లు సమాచారం. ఈ స్థల వివాదంపై సీఈ వీర్రాజును ‘సాక్షి’ ప్రశ్నించగా ఎన్ఎస్పీ ఎస్ఈ కార్యాలయ భవన నిర్మాణం వేగవంతం చేసినట్లు చెప్పారు. ఎన్ఎస్పీ స్థలం టీడీపీకి ఇవ్వాలన్న అధికార పార్టీ ఒత్తిడి విషయం ఎస్ఈ శారదకు మాత్రం తెలుసు అని అన్నారు. ఒంగోలులో ఎన్ఎస్పీకి సరైన సొంత భవనం కూడా లేదు. ఉన్న భవనాలు చిన్నపాటి వర్షం కురిసినా జలమయమవుతున్నాయి. అధికారులు వర్షాకాలంలో వాటిలో కూర్చొని పని చేసే పరిస్థితి కూడా లేదు. కార్యాలయం ఎదురుగానే ఉన్న 2 ఎకరాల స్థలంలో సొంత భవనాలు నిర్మించుకోవాలన్న ప్రతిపాదన కూడా ఎన్ఎస్పీ సిద్ధం చేసుకుంది. అయితే విలువైన స్థలాన్ని టీడీపీ జిల్లా కార్యాలయం పేరుతో సొంతం చేసుకునేందుకు అధికార పార్టీ ప్రయత్నిస్తున్న ఎన్ఎస్పీ కింది స్థాయి అధికారులు, సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు అధికార పార్టీ నేతల కొమ్ముకాస్తూ స్థలాన్ని అప్పగించేందుకు సిద్ధమయ్యారని అదే శాఖలో పని చేస్తున్న కొందరు అధికారులు విమర్శలు గుప్పించటం గమనార్హం. -
మసనోబు ఫుకుఓక ఆవిష్కరణ..
► విత్తన బంతులతో సేద్యం! బంజరు భూముల్లో, కొండలు, గుట్టల్లో, ఎడారి ప్రాంతాల్లో చెట్ల పెంపకానికి దోహదపడటంతోపాటు రాజు టైటుస్ వంటి ప్రకృతి వ్యవసాయదారులు తమ పొలాలను దున్నకుండా విత్తన బంతులతో సేద్యం చేస్తుండడం విశేషం. 1940లోనే జపాన్ ప్రకృతి వ్యవసాయ శాస్త్రవేత్త మసనోబు ఫుకుఒకా విత్తన బంతుల విధానాన్ని కనిపెట్టారు. ప్రస్తుతం అన్ని దేశాలకూ విత్తన బంతుల వాడకం విస్తరించింది. విత్తన బంతుల తయారీ ఇలా.. మెత్తని జల్లెడ పట్టిన ఎర్రమట్టి మూడు పాళ్లు, పశువులు/వానపాముల ఎరువు ఒకపాలు, జీవామృతం మిశ్రమాన్ని కలిపి.. రొట్టెల ముద్దలు చేసినట్టు.. గులాబ్ జామూన్ సైజులో చేసుకోవాలి.రెండు, మూడు విత్తనాలను అందులో చొప్పించి 3–4 గంటలు ఆరబెట్టాలి. గట్టి పడిన విత్తన ముద్దలను నిల్వ చేసుకొని.. వర్షాకాలంలో గుట్టలపైనా క్షీణించిన అడవుల్లో వెదజల్లాలి. ఇదే పద్ధతిని అనుసరించి భూమిని దుక్కి చేయకుండా పంట విత్తనాలతో సైతం విత్తన బంతులు తయారు చేసి.. సేద్యం చేయవచ్చు అని రాజు ౖటైటుస్ చెబుతున్నారు. -
సకాలంలో పోలవరం పూర్తిచేస్తాం
సీఎం చంద్రబాబు వెల్లడి - కృష్ణా డెల్టాకు జూన్లోనే నీరు ఇచ్చాం - కుంటలు, చెక్డామ్ల వల్ల భూగర్భ జలాలు పెరిగాయి - కృష్ణా తూర్పు డెల్టాకు నీరు విడుదల చేసిన సీఎం సాక్షి, విజయవాడ/సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టును సకాలంలోనే పూర్తి చేస్తామని సీఎం చంద్రబాబు అన్నారు. పట్టిసీమ ప్రాజెక్టును ఏడాదిలోనే పూర్తి చేయడం ద్వారా కృష్ణాడెల్టాకు సాగునీరు అందిస్తున్నామన్నారు. విజయ వాడలోని కృష్ణా తూర్పు డెల్టా ప్రధాన హెడ్ స్లూయిస్ ద్వారా ప్రకాశం బ్యారేజీ నుంచి సీఎం సోమవారం సాగు నీరు విడుదల చేశారు. ఈ సందర్భంగా కృష్ణమ్మకు పూజలు చేశారు. గేట్ల స్విచ్ ఆన్ చేసి 2,500 క్యూసె క్కుల నీటిని కాలువలకు విడుదల చేశారు. ఈ సందర్భంగా విలేకరులతో సీఎం చంద్ర బాబు మాట్లాడుతూ.. ఏటా ఆగస్టులో కృష్ణాడెల్టా కాలువలకు నీరు అందించే వారని, ఈ ఏడాది జూన్లోనే పట్టిసీమ నుంచి తెచ్చిన గోదావరి నీరు ఇస్తున్నా మన్నారు. దీనివల్ల తుపాన్లు రావడానికి ముందే రైతులకు పంటలు చేతికి అందుతాయనే ఆశాభావం వ్యక్తం చేశారు. పురుషోత్తపట్నం ఎత్తిపోతల ద్వారా విశాఖ నగరానికి తాగునీరు ఇస్తామన్నారు. గాలేరు–నగరి ప్రాజెక్టును అడ్డుకు న్నారని, రైతులకు నచ్చజెప్పి పరిహారం అందించామని పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లాలో వంశధార, నాగావళి నదుల అనుసంధానం పూర్తి చేస్తామన్నారు. చిత్తూరు జిల్లాలోని మడకశిర, కుప్పంలకు నీళ్లు తీసుకువెళ్లామని చెప్పారు. వెలిగొండ ప్రాజెక్టు ద్వారా రాబోయే సంవత్సరా లలో రాయలసీమకు నీరు అందిస్తామన్నారు. భూగర్భ జలాలు పెరిగాయి.. రాష్ట్రంలో పంట కుంటలు, చెక్డ్యామ్లు నిర్మించడం వల్ల భూగర్భ జలాలు 90 టీఎం సీలు పెరిగాయని ముఖ్యమంత్రి తెలిపారు. ఇప్పటి వరకు కురిసిన వర్షాలు వల్ల భూగర్భ జలం మీటరు పెరిగిందన్నారు. రైతులకు ఇబ్బందులు లేకుండా ఉండటానికి రూ. 2 వేల కోట్ల ఇన్పుట్ సబ్సిడీ అందించా మన్నారు. ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలియచేస్తూ మైనార్టీల అభివృద్ధి కోసం రూ. 845 కోట్ల బడ్జెట్ కేటాయించామని, పెళ్లి చేసుకునే మైనార్టీ యువతులకు దుల్హాన్ పథకం కింద రూ. 100 కోట్లు ఇచ్చామన్నారు. పనులు వేగవంతం చేయండి.. పోలవరం ప్రాజెక్టు పనులను మరింత వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. తన నివాసంలో పోలవరం ప్రాజెక్టు పనులపై ఆయన సమీక్ష నిర్వహించి వర్చువల్ ఇన్స్పెక్షన్ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సకాలంలో ప్రాజెక్టు పూర్తికి నిర్మాణ సంస్థలు, అధికారులు కలిసి రావాలని కోరారు. -
‘డిండి’లో మళ్లీ మార్పులు!
- అలైన్మెంట్ మార్చేలా ప్రతిపాదనలు - కొత్తగా 2.5 టీఎంసీలతో రిజర్వాయర్లు - మరో 20 వేల ఎకరాలకు నీరిచ్చేలా అధికారుల ప్రణాళిక సాక్షి, హైదరాబాద్: మహబూబ్నగర్, నల్లగొండ జిల్లాల్లో ఫ్లోరైడ్ బాధిత ప్రాంతాలకు సాగునీరు అందించేందుకు ఉద్దేశించిన డిండి ప్రాజెక్టు అలైన్మెంట్లో మళ్లీ మార్పులు జరుగుతున్నాయి. గతంలో నిర్ణయించిన అలైన్మెంట్ను పక్కనపెట్టి కొత్తగా కల్వకుర్తి నియోజకవర్గ పరిధిలో 20 వేల ఎకరాలకు అదనంగా నీరిచ్చేలా కొత్త ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయి. మార్పుల్లో భాగంగా అదనంగా 2.5 టీఎంసీల సామర్థ్యంతో మూడు అదనపు రిజర్వాయర్లు రానున్నాయి. దీనిపై మరో 10ృ15 రోజుల్లో స్పష్టతనిచ్చేలా నీటిపారుదలశాఖ కసరత్తు చేస్తోంది. డిండికి ముందే మలుపు.. శ్రీశైలానికి వరద ఉండే 60 రోజుల్లో రోజుకు 0.5 టీఎంసీ చొప్పున 30 టీఎంసీల నీటిని పాలమూరుృరంగారెడ్డి ప్రాజెక్టులో అంతర్భా గంగా ఉండే నార్లాపూర్ రిజర్వాయర్ నుంచి డిండికి తరలించాలని గతంలో నిర్ణయిం చారు. అయితే నార్లాపూర్ నుంచి డిండికి నీటిని తరలించే అలైన్మెంట్తో కల్వకుర్తి ప్రాజెక్టు కింద 90 వేల ఎకరాల ఆయకట్టు దెబ్బతినే అవకాశం ఉంటుందని మహబూబ్ నగర్ జిల్లా నేతలు అభ్యంతరాలు లేవనెత్తారు. కానీ ప్రాజెక్టు అధికారులు మాత్రం 27,551 ఎకరాల నష్టమే ఉంటుందని తేల్చారు. ఈ నేపథ్యంలో సర్కారు ‘వ్యాప్కోస్’ ద్వారా సర్వే చేయించగా ఆ సంస్థ ఐదు ప్రతిపాదనలు సిద్ధం చేసింది. నార్లాపూర్ నుంచి డిండికి నీటిని తరలించే ప్రణాళికకు ఓకే చెబుతూనే రంగాయపల్లి పంప్హౌస్లో పంపింగ్ మెయిన్ తగ్గిం చాలని, గ్రావిటీ టన్నెల్ ఏర్పాటు చేయాలని సూచించింది. దీనికి రూ. 3,384.47 కోట్లు అవుతుందని తెలిపింది. ఈ ప్రతిపాదన ప్రకారం నార్లాపూర్ నుంచి డిండికి సుమారు 50 కిలోమీటర్ల దూరంపాటు కాల్వలను, సుమారు 7 వేల క్యూసెక్కుల నీటిని తరలించాల్సి ఉంది. ఈ ప్రతిపాదనను అధికారులు పరిశీలించగా 5వ కిలోమీటర్ నుంచి 20వ కిలోమీటర్ వరకు ఉన్న అలైన్మెంట్, రంగాయపల్లి వద్ద నిర్మించే పంపింగ్ మెయిన్ రిజర్వ్ ఫారెస్ట్లో ఉందని వెల్లడైంది. దీన్ని ఎలా తప్పించాలన్న చర్చలు జరుగుతున్న సమయంలోనే కొత్త ప్రతిపాదనలు తెరపైకి వచ్చాయి. ఈ ప్రతిపాదనల ప్రకారం నార్లపూర్ నుంచి వచ్చే నీటిని నేరుగా డిండికి తరలించకుండా దానికి ఎగువనే 10వ కిలోమీటర్ పాయింట్ వద్ద 410 మీటర్ల కాంటూర్లో ఉల్పర అనే గ్రామం వద్ద ఒక టీఎంసీ సామర్థ్యంతో రిజర్వాయర్ నిర్మిస్తారు. అక్కడి నుంచి నేరుగా డిండి దిగువన 10 కిలోమీటర్ల దూరంలోని ప్రధాన కాల్వలోకి నీటిని తరలించి ముందుగా నిర్ణయించిన ఆయకట్టుకు నీరిచ్చేలా ప్రణాళిక వేశారు. ఈ క్రమంలో ఉల్పర దిగువన గోకారం, ఎర్రవల్లి జంట చెరువులను కలిపేసి 0.75 టీఎంసీతో ఒక రిజర్వాయర్, ఇర్విన్ వద్ద 0.75 టీఎంసీతో మరో రిజర్వాయర్ నిర్మించే ప్రతిపాదనలు చేస్తున్నారు. దీని ద్వారా డిండి దిగువన 10వ కిలోమీటర్ వరకు ఉన్న టన్నెల్ నిర్మాణాన్ని పూర్తిగా తప్పించవచ్చు. అదీగాక ఉల్పర నుంచి పూర్తిగా గ్రావిటీ మార్గాన నీటిని తరలించవచ్చు. కొత్తగా 20 వేల ఎకరాలకు ఆయకట్టు వస్తుంది. -
గత పాలకులే చెరువుల్ని మింగేశారు
నిజాంపేటలో పలు అభివృద్ధి పనులు ప్రారంభించిన మంత్రి హరీశ్రావు హైదరాబాద్: గత ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా చెరువులు కనుమరుగయ్యా యని, చెరువులు, శిఖం భూములను కబ్జా చేసి లేఅవుట్లు, అపార్టుమెంట్లను నిర్మించారని, దీంతో వర్షం పడ్డ ప్రతిసారి అపార్టుమెంట్లు జలమయం అవుతున్నాయని రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖామంత్రి టి.హరీశ్రావు అన్నారు. నిజాంపేట భండారి లేఅవుట్లోని రూ. 30.5 లక్షలతో తుర్క చెరువు అభివృద్ధి పనులకు సహచర మంత్రి మహేందర్రెడ్డితో కలసి ఆదివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..తుర్క చెరువు నుంచి పాపయ్యకుంట వరకు 60 నుంచి 70 క్యూసెక్కుల నీళ్లు వెళ్లే విధంగా ఓపెన్ నాలాను నిర్మించాలని, ఇందు కోసం రూ. 28 లక్షలను మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. పాపయ్యకుంట నుంచి అంబీర్ చెరువు మధ్యలో రెండు అపార్టుమెంట్లు వెలిశాయని, పలు ప్రహరీ నిర్మించారని ఇంజనీర్ ప్రసాద్ మంత్రి హరీశ్రావు దృష్టికి తీసుకు వచ్చారు. దీంతో ఆయా ప్రాంతాల్లో ఉన్న అక్రమ నిర్మాణాలను వెంటనే తొలగించాలని ఆర్డీఓ, ఇరిగేషన్, గ్రామ కార్యదర్శులను ఆదేశించారు. అనంతరం షాపూర్నగర్ రైతు బజారులో రూ. 36 లక్షలతో నిర్మించనున్న షెడ్ల పనులను మంత్రులు హరీశ్రావు, మహేందర్రెడ్డిలు ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంపీ మల్లారెడ్డి, ఎమ్మెల్సీలు శంభీపూర్రాజు, మైనంపల్లి హన్మంతరావు, ఎమ్మెల్యే వివేకానంద్, ఎంపీపీ సన్న కవిత, జడ్పీ వైస్ఛైర్మన్ ప్రభాకర్రెడ్డి, సర్పంచ్ శెనిగల ప్రమీల, కొలన్ శ్రీనివాస్రెడ్డి, కార్పొరేటర్లు మంత్రి సత్యనారాయణ, రావుల శేషగిరి, జగన్ తదితరులు ఉన్నారు. -
చెరువుకు శోకం.. రైతుకు శాపం
టి.నరసాపురం : మెట్ట ప్రాంతంలోని సాగునీటి చెరువులు ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా కుచించుకుపోతున్నాయి. ఫలితంగా భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. సాగునీటి ఎద్దడి తలెత్తి రైతులు తీవ్ర నష్టాలకు గురవుతున్నారు. తాగునీటికీ కటకటలు తప్పడం లేదు. చెరువుల్ని అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నీరు–చెట్టు పథకాన్ని అమలు చేస్తున్నా ఆచరణలో అంతంతమాత్రంగానే ఉంది. అధికార పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు ఈ పథకాన్ని చెరబట్టారు. నిధులు.. చెరువుల్లోని మట్టిపైన కన్నేసి అసలు లక్ష్యాన్ని నీరుగారుస్తున్నారు. అక్కడక్కడా పనులు చేపట్టినా ఆక్రమణలు తొలగించకుండా తూతూమంత్రంగా మట్టి తొలగించి అమ్ముకోవడానికే పరిమితమయ్యారు. వర్షాకాలం వచ్చినా.. తొలకరి వర్షాలు జిల్లాను పలకరించాయి. వేసవిలో పూర్తిగా ఎండిపోయిన చెరువులు నేడోరేపో నీటితో నిండే అవకాశాలున్నా రైతులకు అక్కరకు వచ్చే పరిస్థితి లేదు. వీటి కళింగలు శిథిలమయ్యాయి. ఇన్లెట్, అవుట్ లెట్స్ పూడుకుపోయాయి. దీనివల్ల చెరువుల్లోని నీరు పొలా ల్లోకి పారే అవకాశం లేకుండా పోయింది. భారీ వర్షాలు కురిసినప్పుడు చెరువులు పొంగితే మాత్రం పొలాలన్నీ నీటమునిగి పంట నష్టం ఏర్పడుతోంది. జిల్లాలో 100 ఎకరాలకు పైగా విస్తీర్ణం గల సాగునీటి చెరువులు 450 ఉండగా, సాధారణ, మధ్యస్థాయి చెరువులు 3,100 ఉన్నాయి. మొత్తంగా ఈ చెరువులన్నీ 1.80 లక్షల ఎకరాల్లో విస్తరించి ఉన్నాయి. వీటిని అభివృద్ధి చేస్తే మెట్ట ప్రాంతంలో దాదాపు 10 లక్షలకు పైగా ఎకరాలకు సాగునీరు అందుతుంది. దీంతో రైతుల కష్టాలు తీరిపోతాయి. కానీ.. చెరువుల అభివృద్ధిపై ప్రభుత్వం కనీస శ్రద్ధ కూడా చూపటం లేదు. జిల్లాలోని అన్ని చెరువులు ఆక్రమణల బారినపడి బక్కచిక్కాయి. జమ్మి చెరువు పెద్ద ఉదాహరణ టి.నరసాపురం మండలం ముక్కినవారి గూడెంలో 108 ఎకరాల విస్తీర్ణంలో జమ్మి చెరువు ఉంది. దీనిని మినీ రిజర్వాయర్గా అభివృద్ధి చేయాలనే ప్రతిపాదన నేటికీ అమలుకు నోచుకోలేదు. ఈ చెరువు ఎగువ, దిగువ తూముల కింద 3 వేల ఎకరాల ఆయకట్టులో పంటలు సాగయ్యేవి. చెరువులో నీరుండటం వల్ల భూగర్భ జలమట్టం పెరిగి 10 గ్రామాల్లోని పొలాలకు మేలు కలిగేది. ఈ చెరువు లోతట్టులో దాదాపు 40 ఎకరాలు ఆక్రమణకు గురయ్యాయి. ఎక్కడికక్కడ మడులు కట్టి మరీ వ్యవసాయం చేస్తున్నారు. గత ఏడాది కురిసిన వర్షాలకు చెరువు నిండి కళింగ పక్కన గండి పడింది. 6 వేల ఇసుక బస్తాలు వేసి గండిని తాత్కాలికంగా పూడ్చారు. ఈ చెరువు తూములు సైతం శిథిలావస్థకు చేరాయి. గత ఏడాది వేసిన ఇసుక బస్తాలు చివికిపోయాయి. ఇదే ప్రాంతంలో గండిపడే ప్రమాదం పొంచివుంది. అదే జరిగితే సమీపంలోని 3 వేల ఎకరాల్లో పంటలు నీటమునిగి రైతులు నష్టపోయే పరిస్థితి ఉంది. గండిపడితే ఆ పొలాల్లో ఇసుక మేటలు వేసే అవకాశం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. జమ్మిచెరువులోని ఆక్రమణల్ని తొలగించి.. మరమ్మతులు చేపట్టాలని ఏళ్ల తరబడి రైతులు కోరుతున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోంది. ఈ పరిస్థితి ఒక్క జమ్మి చెరువుకే పరిమితం కాలేదు. మెట్టలోని అన్ని చెరువులు ఇలాంటి దుస్థితిలోనే కొట్టుమిట్టాడుతున్నాయి. కొత్త తూములు కట్టిస్తాం జమ్మిచెరువుకు తిరిగి గండిపడే అవకాశాలు ఉన్న విషయాన్ని ఇరిగేషన్ అసిస్టెంట్ ఇంజినీర్ ఎస్.ఇమ్మానియేల్ దృష్టికి తీసుకెళ్లగా.. రెండు కొత్త తూములు నిర్మించేందుకు రూ.20 లక్షలు మంజూరయ్యాయని చెప్పారు. చెరువు కళింగను పూర్తిస్థాయిలో ఆధునికీకరించడానికి రూ.కోటి ఖర్చవుతుందని అంచనా వేసి, ప్రభుత్వానికి నివేదించామని చెప్పారు. నిధులొస్తే ఆ పనులు చేపడతామన్నారు. గొలుసుకట్టు చెరువుల అభివృద్ధిలో భాగంగా ఏనుగుబంధం చెరువు, చింతల చెరువుకు రూ.4.50 లక్షల చొప్పున మంజూరయ్యాయన్నారు. ఈ నిధులతో ఆ చెరువులకు తూములు నిర్మిస్తున్నామన్నారు. మళ్లీ గండి తప్పదు వర్షాకాలం నెత్తిమీదకు వచ్చింది. గత ఏడాది జమ్మి చెరువు కట్టకు గండిపడింది. తాత్కాలికంగా ఇసుక బస్తాలు వేశారు. పటిష్టమైన చర్యలు చేపట్టలేదు. ఈ ఏడాది ఏ మాత్రం వర్షాలు పడినా గండిపడి పొలాలు నీట మునుగుతాయి. ఇసుక మేటలు వేస్తాయి. అధికారులు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలి. – మక్కిన వెంకట గోపాలరావు, మాజీ సర్పంచ్ పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయాలి మెట్ట ప్రాంతంలోని చెరువులన్నీ ఆక్రమణల బారినపడ్డాయి. తూములు, కళింగలు శిథిలావస్థకు చేరాయి. మరమ్మతులు చేయకపోవడంతో ఏటా రైతులు నష్టపోతున్నారు. భూగర్భ జలాలు పడిపోయాయి. అతిపెద్దదైన జమ్మిచెరువును పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయాలి. చెరువు కట్టకు గండిపడకుండా వెంటనే చర్యలు చేపట్టాలి. అన్ని చెరువుల్లో ఆక్రమణలు తొలగించాలి. – ఆకుల శ్రీను, రైతు, మక్కినవారి గూడెం ప్రధాన పనులు వదిలేసి.. ఎంతో ప్రాధాన్యత ఉన్న జమ్మి చెరువు అభివృద్ధిని గాలికొదిలేశారు. ఎందుకూ పనికిరాని ఏనుగు బంధం, చింతల చెరువులకు కొత్తగా తూములు కట్టిస్తున్నారు. ఆ చెరువుల కింద సాగయ్యే విస్తీర్ణం లేదు. నీరు పారే అవకాశం కూడా లేదు. అయినా అటువంటి చెరువులకు వృథాగా డబ్బు ఖర్చు చేస్తున్నారు. రైతులందరికీ ఉపయోగపడే జమ్మి చెరువును పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయాలి. – సిరిమళ్ల వెంకట సత్యనారాయణ, రైతు, మక్కినవారి గూడెం -
చెరువుకు శోకం.. రైతుకు శాపం
టి.నరసాపురం : మెట్ట ప్రాంతంలోని సాగునీటి చెరువులు ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా కుచించుకుపోతున్నాయి. ఫలితంగా భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. సాగునీటి ఎద్దడి తలెత్తి రైతులు తీవ్ర నష్టాలకు గురవుతున్నారు. తాగునీటికీ కటకటలు తప్పడం లేదు. చెరువుల్ని అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నీరు–చెట్టు పథకాన్ని అమలు చేస్తున్నా ఆచరణలో అంతంతమాత్రంగానే ఉంది. అధికార పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు ఈ పథకాన్ని చెరబట్టారు. నిధులు.. చెరువుల్లోని మట్టిపైన కన్నేసి అసలు లక్ష్యాన్ని నీరుగారుస్తున్నారు. అక్కడక్కడా పనులు చేపట్టినా ఆక్రమణలు తొలగించకుండా తూతూమంత్రంగా మట్టి తొలగించి అమ్ముకోవడానికే పరిమితమయ్యారు. వర్షాకాలం వచ్చినా.. తొలకరి వర్షాలు జిల్లాను పలకరించాయి. వేసవిలో పూర్తిగా ఎండిపోయిన చెరువులు నేడోరేపో నీటితో నిండే అవకాశాలున్నా రైతులకు అక్కరకు వచ్చే పరిస్థితి లేదు. వీటి కళింగలు శిథిలమయ్యాయి. ఇన్లెట్, అవుట్ లెట్స్ పూడుకుపోయాయి. దీనివల్ల చెరువుల్లోని నీరు పొలా ల్లోకి పారే అవకాశం లేకుండా పోయింది. భారీ వర్షాలు కురిసినప్పుడు చెరువులు పొంగితే మాత్రం పొలాలన్నీ నీటమునిగి పంట నష్టం ఏర్పడుతోంది. జిల్లాలో 100 ఎకరాలకు పైగా విస్తీర్ణం గల సాగునీటి చెరువులు 450 ఉండగా, సాధారణ, మధ్యస్థాయి చెరువులు 3,100 ఉన్నాయి. మొత్తంగా ఈ చెరువులన్నీ 1.80 లక్షల ఎకరాల్లో విస్తరించి ఉన్నాయి. వీటిని అభివృద్ధి చేస్తే మెట్ట ప్రాంతంలో దాదాపు 10 లక్షలకు పైగా ఎకరాలకు సాగునీరు అందుతుంది. దీంతో రైతుల కష్టాలు తీరిపోతాయి. కానీ.. చెరువుల అభివృద్ధిపై ప్రభుత్వం కనీస శ్రద్ధ కూడా చూపటం లేదు. జిల్లాలోని అన్ని చెరువులు ఆక్రమణల బారినపడి బక్కచిక్కాయి. జమ్మి చెరువు పెద్ద ఉదాహరణ టి.నరసాపురం మండలం ముక్కినవారి గూడెంలో 108 ఎకరాల విస్తీర్ణంలో జమ్మి చెరువు ఉంది. దీనిని మినీ రిజర్వాయర్గా అభివృద్ధి చేయాలనే ప్రతిపాదన నేటికీ అమలుకు నోచుకోలేదు. ఈ చెరువు ఎగువ, దిగువ తూముల కింద 3 వేల ఎకరాల ఆయకట్టులో పంటలు సాగయ్యేవి. చెరువులో నీరుండటం వల్ల భూగర్భ జలమట్టం పెరిగి 10 గ్రామాల్లోని పొలాలకు మేలు కలిగేది. ఈ చెరువు లోతట్టులో దాదాపు 40 ఎకరాలు ఆక్రమణకు గురయ్యాయి. ఎక్కడికక్కడ మడులు కట్టి మరీ వ్యవసాయం చేస్తున్నారు. గత ఏడాది కురిసిన వర్షాలకు చెరువు నిండి కళింగ పక్కన గండి పడింది. 6 వేల ఇసుక బస్తాలు వేసి గండిని తాత్కాలికంగా పూడ్చారు. ఈ చెరువు తూములు సైతం శిథిలావస్థకు చేరాయి. గత ఏడాది వేసిన ఇసుక బస్తాలు చివికిపోయాయి. ఇదే ప్రాంతంలో గండిపడే ప్రమాదం పొంచివుంది. అదే జరిగితే సమీపంలోని 3 వేల ఎకరాల్లో పంటలు నీటమునిగి రైతులు నష్టపోయే పరిస్థితి ఉంది. గండిపడితే ఆ పొలాల్లో ఇసుక మేటలు వేసే అవకాశం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. జమ్మిచెరువులోని ఆక్రమణల్ని తొలగించి.. మరమ్మతులు చేపట్టాలని ఏళ్ల తరబడి రైతులు కోరుతున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోంది. ఈ పరిస్థితి ఒక్క జమ్మి చెరువుకే పరిమితం కాలేదు. మెట్టలోని అన్ని చెరువులు ఇలాంటి దుస్థితిలోనే కొట్టుమిట్టాడుతున్నాయి. కొత్త తూములు కట్టిస్తాం జమ్మిచెరువుకు తిరిగి గండిపడే అవకాశాలు ఉన్న విషయాన్ని ఇరిగేషన్ అసిస్టెంట్ ఇంజినీర్ ఎస్.ఇమ్మానియేల్ దృష్టికి తీసుకెళ్లగా.. రెండు కొత్త తూములు నిర్మించేందుకు రూ.20 లక్షలు మంజూరయ్యాయని చెప్పారు. చెరువు కళింగను పూర్తిస్థాయిలో ఆధునికీకరించడానికి రూ.కోటి ఖర్చవుతుందని అంచనా వేసి, ప్రభుత్వానికి నివేదించామని చెప్పారు. నిధులొస్తే ఆ పనులు చేపడతామన్నారు. గొలుసుకట్టు చెరువుల అభివృద్ధిలో భాగంగా ఏనుగుబంధం చెరువు, చింతల చెరువుకు రూ.4.50 లక్షల చొప్పున మంజూరయ్యాయన్నారు. ఈ నిధులతో ఆ చెరువులకు తూములు నిర్మిస్తున్నామన్నారు. మళ్లీ గండి తప్పదు వర్షాకాలం నెత్తిమీదకు వచ్చింది. గత ఏడాది జమ్మి చెరువు కట్టకు గండిపడింది. తాత్కాలికంగా ఇసుక బస్తాలు వేశారు. పటిష్టమైన చర్యలు చేపట్టలేదు. ఈ ఏడాది ఏ మాత్రం వర్షాలు పడినా గండిపడి పొలాలు నీట మునుగుతాయి. ఇసుక మేటలు వేస్తాయి. అధికారులు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలి. – మక్కిన వెంకట గోపాలరావు, మాజీ సర్పంచ్ పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయాలి మెట్ట ప్రాంతంలోని చెరువులన్నీ ఆక్రమణల బారినపడ్డాయి. తూములు, కళింగలు శిథిలావస్థకు చేరాయి. మరమ్మతులు చేయకపోవడంతో ఏటా రైతులు నష్టపోతున్నారు. భూగర్భ జలాలు పడిపోయాయి. అతిపెద్దదైన జమ్మిచెరువును పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయాలి. చెరువు కట్టకు గండిపడకుండా వెంటనే చర్యలు చేపట్టాలి. అన్ని చెరువుల్లో ఆక్రమణలు తొలగించాలి. – ఆకుల శ్రీను, రైతు, మక్కినవారి గూడెం ప్రధాన పనులు వదిలేసి.. ఎంతో ప్రాధాన్యత ఉన్న జమ్మి చెరువు అభివృద్ధిని గాలికొదిలేశారు. ఎందుకూ పనికిరాని ఏనుగు బంధం, చింతల చెరువులకు కొత్తగా తూములు కట్టిస్తున్నారు. ఆ చెరువుల కింద సాగయ్యే విస్తీర్ణం లేదు. నీరు పారే అవకాశం కూడా లేదు. అయినా అటువంటి చెరువులకు వృథాగా డబ్బు ఖర్చు చేస్తున్నారు. రైతులందరికీ ఉపయోగపడే జమ్మి చెరువును పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయాలి. – సిరిమళ్ల వెంకట సత్యనారాయణ, రైతు, మక్కినవారి గూడెం -
ముందస్తు నీరు... అందని తీరు
- వారం రోజులు దాటుతున్నా డెల్టాలో చేలుకు చేరని కాలువ నీరు - ప్రశ్నార్థకంగా మారిన 4.80 లక్షల ఎకరాల్లో సాగు - - మడి తడవక రైతులు సతమతమవుతుంటే ఏరువాకంటూ పాలకులు హడావుడి అమలాపురం : ‘నీరు పల్లమెరుగ’ంటారు...నిజమే. కానీ ఆ సహజ సూత్రాన్నే మార్చేస్తున్నారు నేటి పాలకులు... నీటి పారుదల అధికారులు. డెల్టా కాలువ పరిస్థితి చూస్తే అది నిజమేనని రుజువవుతోంది. డెల్టా కాలువలకు నీరు విడిచిపెట్టి ఎనిమిది రోజులవుతున్నా కోన సీమ ప్రాంతంలోని పల్లంలో ఉండే కాలువలకు కూడా నీరు చేరడం లేదు ... మడి తడవడం లేదు. ఓ వైపు నీరు రాక ... సాగు కాక సతమతమవుతుంటే ప్రభుత్వం మరో వైపు ఏరువాకంటూ ఆర్భాటం చేయడం చూసి డెల్టా రైతులు ముక్కున వేలేసుకుంటున్నారు. గోదావరి డెల్టాలో ఈ ఏడాది ముందస్తు సాగు కోసమంటూ అధికారులు జూన్ ఒకటిన సాగునీరు విడుదల చేశారు. ప్రధాన పంట కాలువల నుంచి ఛానల్స్, వాటి నుంచి పంట బోదెలకు, వాటి ద్వారా చేలకు చేరడానికి సాధారణంగా నాలుగైదు రోజులు పడుతుంది. శివారు ఆయకట్టుకు వారం రోజుల్లో చేరుతుంది. కానీ ఈసారి కాలువలకు నీరు వదిలి వారం రోజులు దాటుతున్నా ప్రధాన పంట కాలువలను, ఛానల్స్ను ఆనుకుని ఉన్న చేలకు నీరు చేరకపోవడం గమనార్హం. ఆధునికీకరణ, నీరు–చెట్టు పనులు పేరుతో ప్రధాన పంట కాలువలకు అడ్డుకట్టు వేసి దిగువునకు నీరు వెళ్లకుండా చేశారు. దీంతో రెండు డెల్టాలో సుమారు 4.80 లక్షల ఎకరాల్లో ముందస్తు ఖరీఫ్ సాగు అనేది లేకుండాపోయింది. నీరు విడుదలైనా పలుచోట్ల నిలిపివేయడంతో రైతుల నుంచి విమర్శలు వెల్లువెత్తడం, విషయాన్ని ‘సాక్షి’లో ఈ నెల 7వ తేదీన ‘సస్యశ్యామలంపై స్వార్థపు చీడ’ అనే కథనం రావడంతో అధికారులు హడావిడిగా కాలువలకు వేసిన అడ్డుకట్టలు తొలగించి కిందదకు నీరు వదిలారు. దిగువున ఛానల్స్, పంట బోదెలపై ఇంకా పనులు జరుగుతూనే ఉండడం గమనార్హం. చాలా పనులు వారం, పది రోజులు క్రితం మొదలు కావడం చూస్తుంటే ముందస్తుగా సాగునీరు విడుదల చేయడంపై అధికారులకు ఉన్న చిత్తశుద్ధి ఏపాటితో ఆర్థం చేసుకోవచ్చు. పనులు పేరుతో ఛానల్స్, పంట బోదెలపై పనులు చేస్తూ నీరుకు అడ్డుకట్టు వేయడంతో చేలకు నీరు చేరడం లేదు. తూర్పు, మధ్య డెల్టాలో పరిస్థితి చూస్తేంటే మరో వారం రోజుల వరకు శివారుకు సాగునీరందే పరిస్థితి కనిపించడం లేదు. ఇదే జరిగితే ఖరీఫ్కు ముందస్తు సాగుకు నీరంటూ పాలకులు చేసిందంతా ప్రచారమే తప్ప వాస్తవం కాదనిపిస్తోంది. పని మొదలు పెట్టి వారమే అయింది మధ్య డెల్టాలో కీలకమైన విలస ఛానల్ ఇది. దీనిపై ముక్తేశ్వరం, ముమ్మిడివరం, అమలాపురం మండలాల్లో సుమారు 5 వేల ఎకరాల్లో ఆయకట్టు ఉంది. ముక్తేశ్వరం బ్యాంకు కెనాల్కు నీరు వచ్చినా సిరిపల్లి లాకుల వద్ద పనులు జరుగుతుండడంతో ఇదిగో ఇలా లాకులు మూసి దిగువున పనులు చేస్తున్నారు. దీంతో ఒకటో తారీఖున నీరు ఇచ్చినా ఈ ప్రాంత రైతులకు 15 వరకు నీరందే అవకాశం లేదు. రిటైనింగ్ వాల్ కోసం నీరు వదల్లేదు... ముక్తేశ్వరం బ్యాంకు కెనాల్ నుంచి ముమ్మిడివరం పరిసర ప్రాంతాలకు సాగునీరందించే ఠానేల్లంక ఛానల్ల్లో చుక్కనీరు లేదు. ఆయిల్ ఇండియా నిధులు రూ.1.20 కోట్లతో ఇక్కడ ఛానల్కు లాంగ్ రివిట్మెంట్ పనులు చేస్తున్నారు. ఈ కారణంగా నీరు నిలిపివేశారు. దీనిపై సుమారు 700 ఎకరాల ఆయకట్టు ఉంది. పైగా ఈ ఛానల్ ఎగువున పనులు చేస్తున్నా.. దిగువున కనీసం పూడిక తొలగించకపోవడంతో నీరు సరఫరా సాఫీగా జరుగుతుందనే నమ్మకం రైతులకు కలగడం లేదు. -
‘సాగునీటి’ పరుగులు
- ఏడాదికాలంగా అందివస్తున్న ఫలాలు - శరవేగంగా ప్రాజెక్టుల పనులు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రం ఏర్పాటయ్యాక రెండేళ్లు సాగునీటి విషయంగా కొంత ఇబ్బంది ఎదురైనా.. గత ఏడాది కాలంగా మాత్రం బాగా కలిసొచ్చింది. నిర్మాణంలోని ప్రాజెక్టుల కింద పాక్షికంగా ఆయకట్టు వృద్ధిలోకి రావడం, గతేడాది చివర్లో కురిసిన వర్షాలకు నాగార్జునసాగర్, శ్రీరాంసాగర్, నిజాం సాగర్ వంటి ప్రాజెక్టులు నిండడం సాగునీటి రంగానికి కొత్త ఊపిరిలూదింది. మిషన్ కాకతీయ కింద పునరుద్ధరించిన చెరువులన్నీ జలకళను సంతరించు కోవడంతో రబీ సాగు రికార్డు స్థాయిలో పెరిగింది. అయితే భూసేకరణ సమస్యల కారణంగా పలు ప్రాజెక్టుల పనుల్లో జాప్యం జరుగుతోంది. పొరుగు రాష్ట్రంతో జల జగడాలు కొంత తగ్గినా ఇబ్బందులు మాత్రం అలాగే కొనసాగుతున్నాయి. నిర్మాణంలో ఉన్న వాటికే ప్రాధాన్యం కేసీఆర్ ప్రభుత్వం కొత్తగా చేపట్టిన ప్రాజెక్టులకన్నా ఇప్పటికే నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేయడానికే ప్రాధాన్యమిస్తోంది. గత మూడేళ్లుగా బడ్జెట్లో భారీగా నిధులు కేటాయించడంతోపాటు వేగంగా పనుల పూర్తికి చర్యలు చేపట్టింది. పాలమూ రు జిల్లాలోని కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్సాగర్ ప్రాజెక్టుల కింద కొత్తగా 4.50 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరందించారు. 350 చెరువులు నింపారు. మెదక్ జిల్లా సింగూరు కాలువలను పూర్తి చేసి 30 వేల ఎకరాలకు నీరందించారు. కరీంనగర్లో ఎల్లంపల్లి ఎత్తిపోతల నుంచి 25వేల ఎకరాలు, చెరువులు నింపి మరో 37,000ఎకరాలను స్థిరీకరించారు. ఎస్సారెస్పీ కాలువలు తవ్విన తరువాత ప్రత్యేకమైన డ్రైవ్ చేపట్టి మొదటిసారిగా సూర్యాపేట, తుంగతుర్తి నియోజకవర్గాలకు నీటిని తరలించి.. వందలాది చెరువులు నింపారు. ఖమ్మం జిల్లాలో 11 నెలల రికార్డు సమయంలో భక్త రామదాసు ఎత్తిపోతల పథకాన్ని పూర్తిచేసి చెరువులను నింపడంతో 6 వేల ఎకరాలకు సాగునీరు అందించగలిగారు. ఈ ప్రాజెక్టులో మిగతా పనులను వేగంగా పూర్తిచేసి ఈ ఖరీఫ్లోనే 58,958 ఎకరాలకు సాగునీరు అందించేలా చర్యలు చేపట్టారు. ఆదిలాబాద్ జిల్లాలో గత పదేళ్లుగా భూసేకరణ కారణంగా నిలిచిపోయిన 57 చెరువు పనులను ఈ సారి పూర్తి చేయగలిగారు. కొలిక్కి వచ్చిన రీడిజైనింగ్ కాళేశ్వరం, ప్రాణహిత, తుపాకులగూడెం, దేవాదుల, ఇందిరమ్మ వరద కాల్వ, డిండి ఎత్తిపోతల పథకాల్లో కేసీఆర్ సర్కారు చేపట్టిన రీడిజైనింగ్ కొలిక్కి వచ్చింది. కొత్తగా చేపట్టిన వాటిలో కాళేశ్వరం పనులు శరవేగంగా సాగుతున్నాయి. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను వచ్చే ఏడాది నాటికి పూర్తి చేసి నీటిని తరలించేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే మల్లన్నసాగర్తోపాటు దానికింద ఉన్న రిజర్వాయర్లపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. మరోవైపు పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు పనులు మొదలైనా.. ఆ ప్రాజెక్టుకు కేసుల బెడద వెంటాడుతోంది. -
చూపంతా ‘పాలమూరు’ వైపే!
ఈ ఖరీఫ్లో పూర్తి చేయాల్సినవాటిల్లో పాలమూరు జిల్లాల్లోని ప్రాజెక్టులు ముందు వరసలో ఉన్నాయి. జిల్లాలోని కల్వకుర్తి, నెట్టెంపాడు, రాజీవ్ భీమా, కోయిల్సాగర్లను పూర్తి చేసి వాటి కింద నిర్ణయించిన మొత్తం 8.30 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్లివ్వాలని ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉంది. గతేడాది కల్వకుర్తి కింద 1.60 లక్షలు, నెట్టెంపాడు కింద 1.20 లక్షలు, భీమా కింద 1.40 లక్షలు, కోయిల్సాగర్ కింద మరో 20 వేల ఎకరాల ఆయకట్టు వృద్ధిలోకి వచ్చింది. ఈ ఏడాది కొత్తగా 3.70 లక్షల ఎకరాల ఆయకట్టు సాగులోకి రావాల్సి ఉంది. కృష్ణా బేసిన్లో మంచి వర్షాలు కురిసే ఆగస్టు నాటికైనా ప్రాజెక్టు పనులను పూర్తి చేస్తే ఖరీఫ్కు సాగునీరిచ్చే అవకాశం ఉంది. గడువు సమీపిస్తున్న నేపథ్యంలో నీటి పారుదల శాఖ ప్రధాన ప్రాజెక్టుల పరిధిలో నెలకొన్న భూసేకరణ, ఆర్అండ్ఆర్, రైల్వే, రహదారుల క్రాసింగ్లపై దృష్టి పెట్టింది. మంత్రి హరీశ్రావు అధికారులను ఉరుకులు పరుగులు పెట్టిస్తూనే.. మరోవైపు జిల్లాల్లో ‘ప్రాజెక్టు నిద్ర’ చేస్తున్నారు. పెరగనున్న సాగు.. రాష్ట్రంలో ప్రధాన ప్రాజెక్టులైన నాగార్జునసాగర్, శ్రీరాంసాగర్, నిజాంసాగర్, జూరాల, ఆర్డీఎస్, కడెం, మూసీ, ఎల్లంపల్లి తదితర ప్రాజెక్టుల పరిధిలో మొత్తంగా 21.29 లక్షల మేర ఆయకట్టు ఉండగా.. గతేడాది వరకు గరిష్టంగా 16 లక్షల ఎకరాలకు నీరందుతూ వచ్చింది. అయితే జలయజ్ఞం ప్రాజెక్టులు పూర్తవుతుండటంతో వాటి కింద కొత్తగా 12 లక్షల ఎకరాల ఆయకట్టు సాగులోకి వచ్చింది. 2016–17లో గరిష్టంగా 21 లక్షల ఎకరాల మేర ఆయకట్టుకు నీరందింది. ఈ ఖరీఫ్లో కొత్తగా మరో 8.73 లక్షల ఎకరాలకు నీరందించ గలిగితే ప్రాజెక్టుల కింద సాగు 29 లక్షల నుంచి 30 లక్షల ఎకరాలకు చేరే అవకాశం ఉంది. -
పల్లెలకు పచ్చని పందిరి
‘సాక్షి’ ఇంటర్వ్యూలో నీటి పారుదల మంత్రి హరీశ్రావు - కోటి ఎకరాల సాగును మాటల్లో కాదు.. చేతల్లో చూపుతున్నాం - ఇప్పటికే ప్రాజెక్టుల కింద 12 లక్షల ఎకరాలకు సాగునీరు - ఒక్క పాలమూరులోనే 4.5 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చి వలసలు ఆపాం - వచ్చే ఏడాది 9.67 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చేందుకు సిద్ధం చేశాం - రీ ఇంజనీరింగ్తో గోదావరిని సజీవం చేస్తామని వ్యాఖ్య సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం సాగునీటి రంగంలో తెచ్చిన మార్పులు విప్లవాత్మకమని, పల్లె ప్రజల జీవన చిత్రమే మారుతోందని నీటి పారుదల మంత్రి టి.హరీశ్రావు పేర్కొన్నారు. కృష్ణా, గోదావరి నదీ జలాల్లో రాష్ట్రానికి ఉన్న నీటి వాటాలను సంపూర్ణంగా వినియోగంలోకి తేవడం, అసెంబ్లీ నియోజకవర్గానికి లక్ష ఎకరాల చొప్పున నీరందించడం లక్ష్యంగా సాగుతు న్న ప్రభుత్వం... ఇప్పటికే బీడు భూముల్లో హరిత పందిరి వేసిం దన్నారు. పలు ప్రాజెక్టుల పూర్తి, మిషన్ కాకతీయ కారణంగా ఈ ఏడాది 60 లక్షల టన్నుల ధాన్యం దిగుబడులు వచ్చాయన్నారు. ఆరునూరైనా లక్ష్యం మేరకు కోటి ఎకరాలకు నీరందించి ప్రజల ఆశలు నెరవేరుస్తామని... తెలంగాణను కోటి ఎకరాల మాగాణగా మారుస్తామని పేర్కొన్నారు. రాష్ట్రంలోని ప్రాజెక్టుల స్థితిగతులు, లక్ష్యాలు, వివాదాలు, భూసేకరణ తదితర అంశాలపై హరీశ్రావు ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వూ్య ఇచ్చారు. ప్రశ్న: రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల పరిస్థితి ఏమిటి? హరీశ్రావు: సాగునీటి రంగ అభివృద్ధి మీదే తెలంగాణ పునర్నిర్మాణం ఆధా రపడి ఉన్నదన్న సంగతి ప్రభుత్వానికి తెలుసు. వ్యవసాయాభివృద్ధి జరిగితే తెలంగాణ నుంచి ప్రజల వలసలు ఆగిపో తాయి. రైతుల ఆత్మహత్యలు ఆగుతాయి. వ్యవసాయం పుంజుకుంటే గ్రామాల్లో వృత్తులవారు బతుకు తారు. ఇక పంటలకు గిట్టుబాటు ధరలు లభించాలి. నాణ్యమైన విత్తనాలు, ఎరువులు దొరకాలి. పంటలకు నిల్వ, మార్కెటింగ్ సౌకర్యం ఉండాలి. ఇవన్నీ అందుబాటులో ఉన్నా సాగునీటి సర ఫరా లేకుంటే వ్యవసాయ సంక్షోభం సమసిపోదు. అందువల్లే రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో కనీసం లక్ష ఎకరాల చొప్పున సాగునీరు అందించి.. తెలంగాణను కోటి ఎకరాల మాగాణగా మార్చేందుకు సీఎం కేసీఆర్ కంకణం కట్టుకున్నారు. 36 నెలల పసి తెలంగాణ అయినప్పటికీ.. మిషన్ కాకతీయ, ఎత్తిపోతల పథకాలు, మధ్యతరహా, భారీ ప్రాజెక్టులు విజయవంతంగా సాగుతున్నాయి. రాష్ట్రం ఏర్పాటయ్యాక కొత్తగా 6.54 లక్షల ఎకరాలకు సాగునీరివ్వడంతోపాటు మరో 5.82 లక్షల ఎకరాలను స్థిరీకరించి మా సత్తా చూపాం. వచ్చే సంవత్సరం మరో 9.67 లక్షల ఎకరాలను సాగులోకి తీసుకురావడంతోపాటు 3.08 లక్షల ఎకరాలను స్థిరీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ప్రాజెక్టుల పరిధిలో ప్రధాన సమస్యలకు పరిష్కారమేదీ? ప్రాజెక్టులు నత్తనడకన సాగడానికి ప్రధాన అవరోధమైన భూసేక రణ సమస్యను పరిష్కరించేందుకు తీసుకువచ్చిన జీవో 123 మంచి ఫలితాలు ఇచ్చింది. ప్రాజెక్టు పనులు వేగం పుంజుకున్నాయి. చిన్న నీటి పారుదల పనులూ గాడిన పడ్డాయి. కానీ ప్రతిపక్ష నేతలు కొందరు రైతుల పేర్ల మీద, ఎప్పుడో చనిపోయిన వారి పేర్లతో, ఏళ్ల కింద వలసవెళ్లినవారి పేర్లతో 123 జీవోపై తప్పుడు కేసులు వేసి.. స్టే వచ్చేలా చేశారు. దానివల్ల 4 నెలల విలువైన కాలం వృథా అయింది. ఇప్పుడు జీవో 123కి చట్ట రూపం కూడా కల్పించాం. దీని ద్వారా భూసేకరణ వేగంగా జరిగి ప్రాజెక్టుల పనులు పుంజుకుంటాయి. అనుమతుల్లో జాప్యం మాటేమిటి? అటవీ శాఖ అధికారులతో సంప్రదింపులు జరిపి వేగంగా అనుమతులు పొందుతున్నాం. రైల్వే, రోడ్డు భవనాల శాఖలతో ప్రతీ నెలా ఉన్నత స్థాయి సమావేశాలు నిర్వహిస్తున్నందున ఆయా శాఖల క్లియరెన్స్తో పనులు ముందుకు సాగుతున్నాయి. రీ ఇంజనీరింగ్పై వ్యతిరేకత వస్తోంది కదా.. కొన్నేళ్ల కింద చేపట్టిన పలు ప్రాజెక్టు ల్లో సాంకేతిక, డిజైన్ల లోపాలు, నీటి లభ్యతపై, అమలులో ఎదురవుతున్న సమస్యలు, అంత ర్రాష్ట్ర సమస్యలు, వన్యప్రాణి కేంద్రా లు, బొగ్గు గనుల వంటివి ప్రాజెక్టులకు అవరోధాలుగా మారనున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. సీఎం స్వయంగా ఇంజనీరింగ్ నిపుణులతో, రిటైర్డ్ ఇంజనీర్లతో సమావేశమై.. సర్వే ఆఫ్ ఇండియా మ్యాపులు, గూగుల్ ఎర్త్ సహా యంతో పరిశీలించారు. ప్రాజెక్టులను రీ ఇంజనీరింగ్ చేస్తే అవరోధాలను అధిగమించవచ్చని గుర్తించారు. అనంతరమే ప్రాణహిత–చేవెళ్ళ సుజల స్రవంతి, దుమ్ముగూడెం, ఇందిరా సాగర్, ఎస్సారెస్పీ వరద కాలువ, దేవాదుల, కంతనపల్లి ప్రాజెక్టులను రీ ఇంజనీరింగ్ చేయాలని నిర్ణయించడం జరిగింది. ఇక రీ ఇంజనీ రింగ్తో కొత్త బ్యారేజీల నిర్మాణం జరిగి గోదావరి నది సజీవంగా మారుతుంది. ఎల్లంపల్లి, శ్రీరాంసాగర్ జలాశ యాలను కలుపు కొంటే నిజామాబాద్ జిల్లా కందకుర్తి నుంచి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం దాకా 470 కిలోమీటర్ల పొడవున్న గోదావరి నది.. దాదాపు 274 కిలోమీటర్ల పొడవునా 365 రోజులు సజీవంగా ఉంటుంది. శ్రీరాంసాగర్ (90 టీఎంసీలు), సదర్ మాట్ (1.58), ఎల్లంపల్లి (20), సుందిళ్ల (9), అన్నారం (10), మేడిగడ్డ (16), తుపాకుల గూడెం (7), దుమ్ముగూడెం ఆనకట్ట (1.3) కలిపి మొత్తం 146.3 టీఎంసీల నీటి నిల్వ సాధ్యపడుతుంది. ఇలా గోదావరి నది సజీవం అవుతు న్నందున ఉత్తర తెలంగాణ రూపురేఖలు మారబోతున్నాయి. వ్యవసాయం, చేపల పెంపకం, టూరిజం, జల రవాణా వంటి రంగాల్లో అనూహ్య ఆర్థిక ప్రగతి జరగనుంది. కాళేశ్వరం వివాదాలపై మీ కామెంట్ ప్రాణహిత–చేవెళ్ల పథకాన్ని రీ డిజైన్ చేసి రెండు భాగాలుగా విభజించడం జరిగింది. ప్రాణహిత ప్రాజెక్టు ద్వారా ఆదిలాబాద్ జిల్లాలో 2 లక్షల ఎకరాలకు, కాళేశ్వరం ద్వారా 18 లక్షల కొత్త ఆయకట్టుకు నీరందించడంతోపాటు.. శ్రీరాం సాగర్, నిజాంసాగర్, సింగూరు ప్రాజెక్టుల కింద ఉన్న మరో 18 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించాల నేది లక్ష్యం. కాళేశ్వరంలో మార్పులు కేవలం బీడు భూములకు నీళ్లందించడం, దారిలో గ్రామాలకు తాగునీటిని అందించడమే. కానీ ప్రతిపక్షాలు దీన్ని అర్థం చేసుకోకుండా రాద్ధాంతం చేస్తున్నాయి. దేశంలోని ఎక్కడి కాంట్రాక్టర్లయినా టెండర్లలో పాల్గొంటా రు. తక్కువ ధర కోట్ చేసినవారు కాంట్రాక్టు పొందుతారు. అందులో మేం చేకూర్చిన లబ్ధి ఏమిటి? ఇక ప్రాజెక్టుపై ఏపీ కొర్రీలు పెడుతోంది. కానీ అవి పెద్ద అడ్డంకి అని మేం భావించడం లేదు. నదీ జలాల వినియోగంపై వివాదాలు ఇంకెన్నాళ్లు? ఇది దురదృష్టకరం. ఉమ్మడి ఏపీలో జరుగుతున్న అన్యాయమే ఇప్పుడూ జరిగితే అంగీకరించబోం. అందుకే కృష్ణా, గోదావరి జలాల్లో తెలంగాణకు న్యాయమైన వాటా కోసం ట్రిబ్యునళ్లు, కోర్టులు, బోర్డుల ముందు కొట్లాడుతున్నాం. కృష్ణా జలాల్లో రాష్ట్రానికి ఉన్న హక్కుల మేరకే వినియోగం చేస్తున్నాం. ఒక్క చుక్క అదనంగా కోరుకోవడం లేదు. కృష్ణా నికర జలాల్లో ఉమ్మడి ఏపీకి ఉన్న 811 టీఎంసీల కేటాయింపులో... ఏపీకి 512 టీఎంసీలు, తెలంగాణకు 299 టీఎంసీలు వాటాగా ఉన్నాయి. తెలంగాణకు మరో 77 టీఎంసీల మిగులు జలాల కేటాయింపులూ ఉన్నాయి. అయినా రాష్ట్రం 200 టీఎంసీలకు మించి వాడటం లేదు. నీటి వాటాను తమ పరిధిలో ఎక్కడైనా వాడుకునే వెసులుబాటు తెలంగాణకు ఉన్నందున.. పాలమూరు–రంగారెడ్డి, డిండిలకు నీటిని వాడుకుందామని నిర్ణయించాం. పాలమూరు ద్వారా మహబూబ్నగర్, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల్లో 12.30 లక్షల ఎకరాలకు.. డిండి ఎత్తిపోతల ద్వారా నల్లగొండ జిల్లాలోని ఫ్లోరైడ్ పీడిత ప్రాంతాల్లో 3.41 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలని లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. ఇక గోదావరిలో హక్కుగా ఉన్న 954 టీఎంసీలను పూర్తిగా వాడుకునేలా పథకాలు చేపడుతున్నాం. మిషన్ కాకతీయ లక్ష్యాలు నెరవేరుతున్నాయా? మూడేళ్లలో 24 వేల చెరువులను పునరుద్ధరించాలని లక్ష్యంగా పెట్టుకోగా.. మొదటి విడతకు సంబంధించి 7,896 చెరువుల పనులు పూర్తయ్యాయి. మిగతావాటి పనులు వచ్చే నెలలో పూర్తికానున్నాయి. రెండో విడతలోని 4,802 పనులు పూర్తికాగా.. మిగతా పనులు వివిధ దశల్లో ఉన్నాయి. మూడో విడతలో 6,500 చెరువుల పునరుద్ధరణ లక్ష్యంగా పెట్టుకున్నాం. 2016లో విస్తారంగా వర్షాలు కురవడంతో చాలా చెరువులు జలకళ సంతరించుకున్నాయి. పునరుద్ధరణ జరిగిన 17 వేల చెరువులతోపాటు ప్రాజెక్టుల ద్వారా నింపిన పలు చెరువుల నీటితో.. 2016–17లో రికార్డు స్థాయిలో 15.70 ఎకరాలకు సాగునీరు అందించాం. చెరువుల కింద ఖరీఫ్, రబీ కలిపి గతంలో ఎన్నడూ 11 లక్షల ఎకరాలకు మించి నీరివ్వకపోవడం గమనార్హం. ఇక చెరువుల పూడిక మట్టి చల్లుకున్న పొలాల్లో పంటల పరిస్థితి మెరుగ్గా ఉన్నట్టు తేలింది. పంట ఏపుగా పెరిగిందని, రసాయన ఎరువులు, పురుగుల మందుల వాడకం తగ్గిందని రైతులు చెబుతున్నారు. ఈ అంశాలపై వ్యవసాయ శాఖ, మిచిగాన్ యూనివర్సిటీవారి అధ్యయనం కొనసాగుతోంది. త్వరలోనే ఇక్రిశాట్ ఆధ్వర్యంలో సమగ్ర అధ్యయనం జరపడానికి అవగాహన కుదుర్చుకున్నాం. చెరువుల పునరుద్ధరణతో భూగర్భ జలాలూ వృద్ధి చెందినట్లు ఆ శాఖ అధ్యయనంలో తేలింది. నీటి పారుదలకు నిధులు, కేంద్ర సాయం మాటేమిటి? మా ప్రభుత్వం తొలి బడ్జెట్లోనే నీటి పారుదల శాఖకు నిధులు రూ.8,500 కోట్లు కేటాయించింది. ఇక పెండింగ్లో ఉన్న ప్రాజెక్టుల పూర్తి, పాలమూరు, డిండి, ప్రాణహిత, కాళేశ్వరం, ఛనాకా–కొరట, సీతారామ ఎత్తిపోతల ప్రాజెక్టులు, మిషన్ కాకతీయ పనుల పూర్తికోసం.. 2016–17 బడ్జెట్ నుంచి రికార్డు స్థాయిలో రూ.25,000 కోట్లు కేటాయించటం జరిగింది. 2017–18 బడ్జెట్లోనూ అదే ఒరవడి కొనసాగిస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం కూడా ప్రధాన మంత్రి కృషి సించాయీ యోజన కింద 11 ప్రాజెక్టులకు నిధులు ఇచ్చేందుకు సుముఖత తెలిపింది. మరో 28 ప్రాజెక్టులను క్యాడ్వామ్ పథకంలో చేర్చి కాలువల ఆధునీకరణకు నిధులు ఇచ్చేందుకు అంగీకరించింది. -
‘కాళేశ్వరానికి’ కొండ పోచమ్మ బ్రేకులు
సామర్థ్యం పెంచితే సమస్యలని తేల్చిచెప్పిన ఇంజనీర్లు.. - ప్రాజెక్టు డీపీఆర్ పూర్తయ్యాక ఇప్పుడు మార్పులు ఎలా? - కేంద్ర పర్యావరణ, జల వనరుల శాఖలకు, సీడబ్ల్యూసీ, బోర్డుకు ఏం చెబుదాం - సీఎం ఆదేశాల నేపథ్యంలో నీటిపారుదల శాఖ తర్జనభర్జన సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టుపై మళ్లీ తర్జనభర్జన మొద లైంది. విస్తృత చర్చలు, ఎన్నో మార్పులు చేర్పులు చేసి కొలిక్కి తెచ్చిన ఈ ప్రాజెక్టులో మార్పులతో అంతా మళ్లీ మొదటికి వస్తోంది. ప్రతిపాదిత కొండ పోచమ్మ రిజర్వాయర్ సామర్థ్యం పెంచాలన్న ప్రభుత్వ నిర్ణయంతో ఇప్పటికే సిద్ధమైన ప్రాజెక్టు సమగ్ర నివేదిక(డీపీఆర్)లో మార్పులు అనివార్యం కాను న్నాయి. వ్యయ అంచనాలు పెరగడం, మరింత భూసేకరణ చేయాల్సి రావడం, కొత్త కాల్వల నిర్మా ణంతో ప్రాజెక్టు డీపీఆర్ పూర్తిగా మారిపోనుంది. దీంతో ఇప్పటికే కేంద్ర పర్యావరణ శాఖ నుంచి పొందిన అనుమతులు, సీడబ్ల్యూసీ ముందు చేసిన వాదనలు, గోదావరి బోర్డుకు సమర్పిం చిన లెక్కలన్నీ మళ్లీ మొదటికి వచ్చే అవకాశం కనిపిస్తుండటంతో.. దీనిపై నీటి పారుదల శాఖ మల్లగుల్లాలు పడుతోంది. మూడేళ్ల కసరత్తు వృథా..! కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో మూడేళ్లుగా అనేక మార్పులు, చేర్పులు జరిగిన అనంతరం ప్రాజెక్టు స్వరూపం ఓ కొలిక్కి వచ్చింది. ముఖ్యమంత్రి స్థాయి లో చర్చలు, వ్యాప్కోస్ సర్వేలు, అధికారుల అంచనా లు, పొరుగు రాష్ట్రాల అభ్యంతరాల పరిశీలన అనం తరం.. ప్రాజెక్టు కింద కొత్తగా సాగులోకి వచ్చే ఆయ కట్టు, పాత ప్రాజెక్టుల కింద స్థిరీకరణ, రిజర్వాయర్ల సామర్థ్యం, ప్రాజెక్టు వ్యయం తదితరాలపై ప్రభుత్వం సమగ్ర నివేదిక రూపొందిం చింది. ప్రాజెక్టుకు మొత్తంగా రూ.80,499.71 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేశారు. గోదావరి నుంచి 180 టీఎంసీలను మళ్లించి.. 18,25,700 ఎకరాల కొత్త ఆయకట్టుకు నీరివ్వడంతోపాటు మరో 18,82,970 ఎకరాల పాత ఆయకట్టును స్థిరీకరిం చాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. మొత్తంగా 150 టీఎంసీలు నిల్వ చేసుకునేలా 26 రిజర్వాయర్లను నిర్మించేందుకు ప్రణాళిక రూపొందించారు. అందులో భాగంగా పాత ప్రాణహిత–చేవెళ్ల నమూనాలో ప్రతిపాదించిన 11.43 టీఎంసీల రిజర్వాయర్ల సామర్థ్యాన్ని 144 టీఎంసీలకు పెంచారు. భారీగా భూసేకరణ ఈ ప్రాజెక్టుకు 80 వేల ఎకరాల భూసేకరణ అవస రమని, అందులో 2,866 హెక్టార్లు (13,706 ఎకరా ల) అటవీ భూమి అవసరమని ప్రభుత్వం తేల్చింది. ఈ వివరాలనే కేంద్ర పర్యావరణ శాఖకు, జల సంఘానికి సమర్పించింది. అయితే ఈ వివరాలపై కేంద్రం తొలుత విభేదించినా.. రాష్ట్ర ప్రభుత్వ ఒత్తిళ్ల తో పర్యావరణ మదింపు చేసేందుకు అనుమతిచ్చిం ది. సీడబ్ల్యూసీ కూడా కొన్ని సందేహాలు లేవనెత్తినా చివరికి సానుకూలత తెలిపింది. మరోవైపు ఈ ప్రాజె క్టుపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే గోదావరి బోర్డు, కేంద్ర జల సంఘానికి ఫిర్యాదులు చేసింది. దాంతో కేంద్రం, బోర్డులు రాష్ట్ర ప్రభుత్వ వివరణ కూడా కోరాయి. ప్రభుత్వం ఇంకా వివరణ చెప్పాల్సి ఉంది. ఇలాంటి సమయంలో కొండపోచమ్మ రిజర్వాయర్ సామర్థ్యం పెంచాలని నిర్ణయించడం నీటిపారుదల శాఖకు తలనొప్పి వ్యవహారంగా మారింది. భారీగా పెరగనున్న వ్యయం కొండపోచమ్మ రిజర్వాయర్ను 7 టీఎంసీల సామర్థ్యంతో రూ.519.70 కోట్లతో నిర్మించేందుకు కేబినెట్ అనుమతి తీసుకుని.. పరిపాలనా అనుమతులిచ్చి, డీపీఆర్లు కూడా సమర్పించారు. కానీ ఇప్పుడు దాని సామర్థ్యాన్ని 21 టీఎంసీలకు పెంచడమంటే మొత్తం వ్యవహారమంతా మొదటికి వస్తుందని నీటి పారుదల వర్గాలు చెబుతున్నాయి. ప్రాజెక్టు వ్యయం మరో రూ.2,300 కోట్ల మేర పెరుగుతుందని, అదనంగా మరో 3 నుంచి 4 వేల ఎకరాల భూసేకరణ అవసరమవుతుందని, ముంపు గ్రామాల సంఖ్య కూడా ఎక్కువగా ఉంటుందని స్పష్టం చేస్తున్నాయి. ఈ మార్పులతో కొత్తగా డీపీఆర్ తయారు చేయాలంటే చాలా సమయం పడుతుందని అంటున్నాయి. ఒకవేళ కొత్త డీపీఆర్ చేయకుండా పాత డీపీఆర్తో ముందుకెళితే ఆంధ్రప్రదేశ్ మళ్లీ గోదావరి బోర్డు, కేంద్రం ముందు పంచాయితీ పెట్టే అవకాశాలున్నా యని చెబుతున్నాయి. అంతేగాకుండా కొత్త డీపీఆర్కు మళ్లీ కేంద్ర సంస్థల అనుమతి పొందాలంటే అనేక వివరణలు ఇచ్చుకోవాల్సి ఉంటుందని నీటి పారుదల వర్గాలు పేర్కొంటు న్నాయి. ఈ నేపథ్యంలో ఎలా ముందుకు సాగాలో తెలియక తర్జనభర్జన పడుతున్నాయి. డీపీఆర్ కోరిన బోర్డు ఇక మరోవైపు గోదావరి బోర్డు కాళేశ్వరం ప్రాజెక్టుపై మళ్లీ తెలంగాణ వివరణ కోరింది. ప్రాజెక్టు డీపీఆర్ను త్వరగా సమర్పించాలని సూచిస్తూ బోర్డు సభ్య కార్యదర్శి సమీర్ ఛటర్జీ బుధవారం లేఖ రాశారు. ఎంత ఆయకట్టు, ఎంత నీటి వినియోగం, ఎంత ఖర్చవుతుందనే వివరాలు తెలపాలని అందులో సూచించారు. -
రెండేళ్లలో ‘డిండి’ నుంచి సాగునీరు
►ఇబ్రహీంపట్నం ప్రాంతాన్నిసస్యశ్యామలం చేస్తాం ►అధికారుల అలసత్వంతోనే సంక్షేమ పథకాల్లో జాప్యం ►ప్రతి గ్రామంలో శ్మశానవాటిక,డంపింగ్ వార్డులకు వారం రోజుల్లో స్థలాలు కేటాయించాలి ►రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు యాచారం(ఇబ్రహీంపట్నం): డిండి ప్రాజెక్టు నుంచి రానున్న రెండేళ్లలో ఇబ్రహీంపట్నం నియోజకవర్గానికి సాగునీరు అందిస్తామని, ఈ ప్రాతానికి సాగునీరు ఇచ్చే విషయంలో సీఎం కేసీఆర్ చిత్తశుద్ధితో ఉన్నారని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. మండల పరిధిలోని కొత్తపల్లి గ్రామంలో ఉపాధి హామీ పథకం అమలుపై కూలీలతో, గ్రామజ్యోతి పథకం అమలుపై గునుగల్ గ్రామంలో గ్రామస్తులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభల్లో ఆయన మాట్లాడుతూ... అత్యంత కరువు ప్రాంతమైన ఇబ్రహీంపట్నంకు రెండేళ్ల కాలంలో డిండి ప్రాజెక్టు నుంచి శివన్నగూడ ద్వారా సాగునీరు అందిస్తామని అన్నారు. కరువు పరిస్థితుల నేపథ్యంలో వంద రోజులు పనిదినాలు పూర్తి చేసుకున్న కుటుంబాలకు మరిన్ని పనిదినాలు పెంచే విధంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతామని అన్నారు. ఉపాధి పథకం కింద మంజూరయ్యే నిధుల ద్వారా గ్రామాలను సమగ్రాభివృద్ధి చేసుకునే అవకాశం ఉందన్నారు. అధికారుల నిర్లక్ష్యం, అలసత్వం వల్లే సంక్షేమ పథకాలు సక్రమంగా అమలు కావడం లేదన్నారు. సంక్షేమ పథకాల అమలుపై క్షేత్రస్థాయి పర్యటనలు చేసి విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రతి గ్రామంలో డంపింగ్యార్డు, శ్మశానవాటికల నిర్మాణం కోసం రూ.లక్షల నిధులు మంజూరు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నప్పటికీ అధికారులు నిర్లక్ష్యం కారణంగా సక్రమంగా అమలు కావడం లేదని మండిపడ్డారు. రంగారెడ్డి జిల్లాలోని 415 గ్రామాల్లో వారం రోజుల్లోపే డంపింగ్యార్డులు, శశ్మానవాటికల కోసం ప్రభుత్వ స్థలాలను గుర్తించాలని అధికారులకు సూచించారు. వారం రోజుల్లో స్థలాలను గుర్తించి తనకు నివేదిక అందజేయాలని అధికారులను ఆదేశించారు. అధికారులు ఏం చేస్తున్నారో తెలియడం లేదని ఆగ్రహాం వ్యక్తం చేశారు. ప్రభుత్వాన్ని రూ.లక్షల నిధులు అడిగే బదులు ఈజీఎస్ పథకం కింద మంజూరైన పనులను పూర్తి చేసుకుని గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. జెడ్పీ చైర్పర్సన్ పట్నం సునీతారెడ్డి మాట్లాడుతూ... సంపూర్ణ అక్షరాస్యత కోసం కృషి చేయాలని సూచించారు. తాగునీటిని వృథా చేయకుండా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ నీతుప్రసాద్ మాట్లాడుతూ... ప్రతి ఇంటికీ మరుగుడొడ్డి నిర్మించే విషయంలో నిధుల కొరత లేదని అన్నారు. గ్రామాల్లో అవసరం ఉన్న కుటుంబాలకు మరుగుదొడ్లు నిర్మించే విధంగా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని రూ.300 కోట్ల నిధులు సిద్ధంగా ఉన్నాయని.. అధికారులను సూచించారు. కృష్ణాజలాలు లేకుంటే గ్రామాలే ఖాళీ అయ్యేవి: ఎమ్మెల్యే మంచిరెడ్డి మూడేళ్లుగా ఈ ప్రాంతంలో సమృద్ధిగా వర్షాల్లేవు. భూగర్భజలాలు అడుగంటాయి. కృష్ణాజలాలు లేకపోతే ఈ ప్రాంతంలో నీటి ఇబ్బందుల వల్ల ప్రజలు గ్రామాలనే ఖాళీ చేయాల్సి వచ్చేదని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి పేర్కొన్నారు. గునుగల్, కొత్తపల్లి గ్రామాల్లో ఆయన మాట్లాడుతూ... సాగునీరే అందజేయడమే ఈ ప్రాంత ప్రజలకు శరణ్యమని అన్నారు. నియోజకవర్గంలో ఉపాధి పనులు జోరుగా సాగుతున్నాయని అన్నారు. మరో రూ100 కోట్లు మంజూరు చేసే విధంగా పంచాయతీ రాజ్ శాఖమంత్రి జూపల్లి కృష్ణారావు, కమిషనర్ నీతుప్రసాద్ కృషి చేయాలని కోరారు. డిసెంబర్లోపు ఈ ప్రాంత గ్రామాలకు మిషన్ భగీరథ పథకం ద్వారా తాగునీరు అందించడానికి కృషి చేస్తున్నామని అన్నారు. సాగునీరు, తాగునీరు అందించడంతోనే ఈ ప్రాంత సమస్యలు తీరుతాయని అన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ జ్యోతినాయక్, జెడ్పీటీసీ రమేష్గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ సత్తు వెంకటరమణారెడ్డి, వైస్ ఎంపీపీ రామకృష్ణ, గునుగల్, కొత్తపల్లి సర్పంచ్లు అచ్చెన మల్లికార్జున్, లతానారాయణరెడ్డి, డీపీఓ పద్మజారాణి, ఇబ్రహీంపట్నం ఆర్డీఓ మధుకర్రెడ్డి, తహసీల్దార్ పద్మనాభరావు, ఎంపీడీఓ ఉష, ఈఓపీఆర్డీ శంకర్నాయక్, ఈజీఎస్ ఏపీడీ తిరుపతయ్య, ఏపీఓ నాగభూషణం, ఆయా గ్రామాల ఎంపీటీసీలు గడల మాధవి, సంధాని, సర్పంచ్లు సత్యపాల్, పాశ్ఛ భాషా, నర్రె మల్లేష్, పలు పార్టీల నాయకులు పాల్గొన్నారు. -
ఇరిగేషన్ కార్యాలయాల తరలింపును సహించేది లేదు
రైతుల కోసం జైలుకు వెళ్లేందుకు కూడా సిద్ధమే ఇరిగేషన్ కార్యాలయాల స్థలాల కబ్జాకే తరలింపు డ్రామా వైఎస్సార్ సీపీ కేంద్ర సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్షి ్మ ధవళేశ్వరం: ఇరిగేషన్ కార్యాలయాలను ధవళేశ్వరం నుంచి తరలించాలని చూస్తే సహించేది లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యురాలు జక్కంపూడి విజయలక్షి ్మ స్పష్టం చేశారు. ఆమె గురువారం వైఎస్సార్ సీపీ రాజమహేంద్రవరం రూరల్ కో–ఆర్డినేటర్ ఆకుల వీర్రాజుతో కలిసి ధవళేశ్వరం ఇరిగేషన్ సర్కిల్ కార్యాలయంలో ఎస్ఈ బి.రాంబాబును కలిశారు. ఇరిగేషన్ డివిజన్ కార్యాలయాలు ఇక్కడ ఉండటం వల్ల కలిగే లాభాలను, వాస్తవ పరిస్థితులను ఉన్నతాధికారులకు తెలపాలని జక్కంపూడి విజయలక్షి ్మ ఎస్ఈ రాంబాబును కోరారు. ఒక ప్రక్క ఉద్యోగులకు ఇరిగేషన్ శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు కార్యాలయాన్ని జీవోపై పూర్తి సమీక్ష వరకు తరలించబోమని హామి ఇచ్చినప్పటికీ తరలింపులో అధికారుల అత్యుత్సాహం ఏమిటని ఆమె ప్రశ్నించారు. ధవళేశ్వరంలోని ఇరిగేషన్ కార్యాలయాల స్థలాలను కబ్జా చేసేందుకే 29 ఏళ్ళ క్రితం వచ్చిన జీఓను తెరమీదకు తీసుకువచ్చారని ఆమె ఆరోపించారు. ఒక పక్క ఈస్ట్రన్ డివిజన్కు ధవళేశ్వరంలో కార్యాలయం కడుతుండగా తరలింపు ప్రక్రియ ఏమిటని ప్రశ్నించారు.సెంట్రల్ డివిజన్ కార్యాలయ మరమ్మతులకు కూడా నిధులు విడుదల కాగా అమలాపురంలో అద్దె భవనంలోకి మార్చాలని ప్రయత్నించడం ఏమిటని ఎస్ఈని ప్రశ్నించారు. సెంట్రల్ డివిజన్లో ఉన్న మైనర్ ఇరిగేషన్ కార్యాలయాలను పెద్దాపురం డివిజన్లో కలిపేందుకు ప్రయత్నిస్తే సహించేది లేదన్నారు. రైతులు,ఉద్యోగులను ఇబ్బందులకు గురి చేసే విధంగా కార్యాలయాలను తరలించాలని చూస్తే వేలాది మంది రైతులతో ఇరిగేషన్ కార్యాలయాలను ముట్టడిస్తామన్నారు. రైతుల కోసం అవసరమైతే జైలుకు వెళ్లేందుకు అయినా తాను సిద్ధమేనని జక్కంపూడి విజయలక్ష్మీ స్పష్టం చేశారు. వైఎస్సార్ సీపీ రాజమహేంద్రవరం రూరల్ కో ఆర్డినేటర్ ఆకుల వీర్రాజు మాట్లాడుతూ కనీసం ఉద్యోగులకు కూడా తెలియకుండా కార్యాలయాల తరలింపునకు ప్రయత్నించారంటే అధికారుల అత్యుత్సాహం తెలుస్తోందన్నారు. ప్రజాప్రతినిధుల ఒత్తిళ్ళకు తలొగ్గకుండా రైతుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకోవాలన్నారు. మాజీ ఎంపీటీసీ సభ్యుడు సాధనాల చంద్రశేఖర్ (శివ), వైఎస్సార్ సీపీ నాయకులు పెన్నాడ జయప్రసాద్, గరగ శ్రీనివాసరావు, ముద్దాల అను, ఆకుల రాజా, షట్టర్ బాషా, మిరప రమేష్, గపూర్, ముత్యాల జాన్ తదితరులు పాల్గొన్నారు. -
బ్యారేజ్ గేట్లు ఎత్తేసిన మతిస్థిమితంలేని వ్యక్తి
-
ప్రకాశం బ్యారేజ్ గేట్లు ఎత్తేసిన మతిస్థిమితంలేని వ్యక్తి
అధికారుల అలసత్వంతో భారీగా నీరు వృథా సాక్షి, అమరావతి/తాడేపల్లి రూరల్(మంగళగిరి): నీటిపారుదల అధికారుల పర్య వేక్షణలో ఉండాల్సిన ప్రకాశం బ్యారేజ్ ఓ మతిస్థిమితం లేని వ్యక్తి కంట్రోల్లోకి వెళ్లిన ఘటన కలకలం రేపింది. అధికారులు, సిబ్బంది అలసత్వం వల్ల 1,500 నుంచి 2,000 క్యూసెక్కుల నీరు వృథా అయ్యింది. మంగళవారం మధ్యాహ్నం ఒకటిన్నర సమయంలో బ్యారేజ్ నుంచి నీరు ఒక్కసారిగా విడుదలై దిగువకు ప్రవహించటం మొదలెట్టింది. సమాచారం అందుకున్న నీటిపారుదల అధికారులు హుటాహుటిన బ్యారేజ్ వద్దకు చేరుకుని పరిశీలించగా, మతిస్థిమితంలేని ఓ వ్యక్తి గేట్లు ఓపెన్ అయ్యే స్విచ్లు ఆన్ చేసుకుంటూ వెళుతున్నాడు. జనరేటర్ రూం ఉద్యోగులు ఆ వ్యక్తిని పట్టుకుని, పోలీసులకు అప్పగించారు. అనంతరం గేట్లను కిందకు దింపారు. బ్యారేజీలో నీరు ఒక్కసారిగా విడుదల కావడంతో కృష్ణా దిగువ ప్రాంతంలో యాప్రాన్ పనులు చేస్తున్న కూలీలు భయాందోళనకు గురయ్యారు. కొంతమంది పరుగులు తీయగా మరికొందరు దగ్గర్లోని పొక్లెయిన్లపై, కరెంట్ దిమ్మల మీద ఎక్కి ప్రాణ భయంతో కేకలు వేశారు. పోలీసులు మతిస్థిమితంలేని వ్యక్తిని విచారించగా, పిడుగురాళ్ల మండలం తుమ్మల చెరువుకి చెందిన ముర్రపోకల బంగార్రాజుగా తేలింది. -
ధవళేశ్వరం టు అమలాపురం..
ఇరిగేషన్ సెంట్రల్ డివిజన్ కార్యాలయం మార్పు ఉద్యోగులకు మాట మాత్రంగానైనా చెప్పని వైనం జిల్లాకు చెందిన ఓ మంత్రే కారణం? ఆందోళనకు సిద్ధమవుతున్న ఇరిగేషన్ ఉద్యోగులు అడిగే వాడికి చెప్పే అవసరం లేదన్నట్టుగా మొండిగా వ్యవహరించే ప్రస్తుత ప్రభుత్వం ఎలాంటి నిర్ణయమైనా తీసుకుంటుందనడానికి ఇదో ఉదాహరణ. ఉమ్మడి రాజధానిపై పదేళ్లు ఉండే అవకాశం ఉన్నప్పటికీ సీఎం చంద్రబాబు హడావుడిగా అమరావతిలో తాత్కాలికంగా నిర్మించిన కొత్త రాజధానికి ఉద్యోగులను బలవంతంగా తీసుకువచ్చారు. హడావుడి తరలింపుపై ఎంతమంది వారించినా ప్రభుత్వం ససేమిరా అంది. ఇది అసరాగా తీసుకుని...ఇప్పుడు ధవళేశ్వరంలోని ఇరిగేషన్ సెంట్రల్ డివిజన్ కార్యాలయానికి అమలాపురానికి ఉన్నఫళంగా మార్పుకు శ్రీకారం చుట్టింది. ఆ కార్యాలయ ఉద్యోగులకు ఈ మార్పు విషయాన్ని మాట మాత్రంగా చెప్పకపోవడం.. ప్రభుత్వ మొండి వైఖరి నిదర్శనం. ఇప్పుడు ఉద్యోగులు ఉద్యమ బాట పడతానంటున్నారు. ఇదీ ఆ కథా కమామిషు.. ధవళేశ్వరం (రాజమహేంద్రవరం రూరల్) : జిల్లాకు చెందిన ఓ మంత్రి మెప్పు కోసం వందేళ్ల పైబడి చరిత్ర కలిగిన ఇరిగేషన్ సెంట్రల్ డివిజన్ కార్యాలయాన్ని అమలాపురానికి మార్చేశారు. కార్యాలయ సిబ్బందికి కూడా చెప్పకుండానే గురువారం కార్యాలయ ప్రారంభ తంతును ముగించారు. మంత్రి మెప్పు కోసమే ఇరిగేషన్ ఉన్నతాధికారి కాటన్ దొర ఆశయానికి తూట్లు పొడుస్తున్నారని ఇరిగేషన్ ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కార్యాలయం మార్పుపై మైనర్ ఇరిగేషన్ రైతాంగంలోనూ ఆందోళన నెలకొంది. సెంట్రల్ డెల్టాతో పాటు మైనర్ ఇరిగేషన్ విభాగం కూడా సెంట్రల్ డివిజన్ కార్యాలయం పరిధిలోనే ఉన్నాయి. మైనర్ ఇరిగేషన్ రైతాంగానికి ఇబ్బందే ధవళేశ్వరంలోని సెంట్రల్ డివిజన్ కార్యాలయాన్ని అమలాపురానికి మారిస్తే మైనర్ ఇరిగేషన్ రైతాంగానికి ఇబ్బందులు తప్పవు. రైతులకు ఏ ఇబ్బంది వచ్చినా ధవళేశ్వరం వచ్చేవారు. ఈ కార్యాలయాన్ని అమలాపురం మారిస్తే వంద కిలోమీటర్లు వెళ్లాల్సిందే. సెంట్రల్ డివిజన్ పరిధిలో చాగల్నాడు ఎత్తిపోతల పథకం ,తొర్రిగడ్డ పంపింగ్ స్కీమ్, వెంకటనగరం పంపింగ్ స్కీమ్, మైనర్ ఇరిగేషన్ ట్యాంక్స్,పిఆర్ ట్యాంక్స్ ఉన్నాయి. కాటన్ దొర ఆశయానికి తూట్లు ఉభయగోదావరి జిల్లాలను ధాన్యాగారంగా మార్చిన అపర భగీరథుడు కాటన్ దొర ఆశయానికి పాలకులు తూట్లు పొడుస్తున్నారు. వందేళ్ళ క్రితం ధవళేశ్వరంలో సెంట్రల్ డివిజన్, ఈస్ట్రన్ డివిజన్, హెడ్వర్క్స్ డివిజన్లను అప్పట్లో ఏర్పాటు చేశారు. ధవళేశ్వరం సెంట్రల్ డివిజన్ కార్యాలయానికి సంబంధించి అమలాపురం, పి.గన్నవరం, రాజమహేంద్రవరంలోని సబ్ డివిజన్ కార్యాలయాలను ఏర్పాటు చేశారు. సెంట్రల్ డివిజన్ కార్యాలయంతో పాటు మరికొన్ని కార్యాలయాల మార్పుకు 1988లో అప్పటి ప్రభుత్వం జీఓ జారీ చేసింది. అయితో న్యాయపోరాటంతో అప్పట్లో అందుకు బ్రేక్ పడింది. మంత్రి మెప్పు కోసమే! జిల్లాకు చెందిన మంత్రి మెప్పు కోసమే హడావుడిగా ధవళేశ్వరంలోని సెంట్రల్ డివిజన్ కార్యాలయాన్ని అమలాపురానికి మారుస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆ మంత్రిని ప్రసన్నం చేసుకునేందుకు ఇరిగేషన్ ఉన్నతాధికారి భారీ స్కెచ్తో అమలాపురానికి కార్యాలయాన్ని మారుస్తున్నారని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. న్యాయపరంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉద్యోగులకు కార్యాలయ మార్పుపై ఎటువంటి సమాచారం తెలీయకుండా జాగ్రత్త పడ్డారు. డివిజన్ కార్యాలయానికి సంబంధించి క్షేత్ర స్థాయిలో పర్యటించేది ఒక్క ఈఈ మాత్రమేనని, అమలాపురం, పి.గన్నవరంలో సబ్డివిజన్ కార్యాలయ అధికారులే క్షేత్ర స్థాయిలో పర్యటిస్తారని, ఇప్పుడు ఏకంగా డివిజన్ కార్యాలయాన్నే అక్కడికు మార్చడంలో మర్మం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. -ఆందోళనకు సిద్ధమవుతున్న ఉద్యోగులు కనీసం ముందుగా తెలియజేయకుండా హడావుడిగా సెంట్రల్ డివిజన్ కార్యాలయాన్ని అమలాపురం తరలించడానికి గురువారం ప్రారంభోత్సవం చేయడంతో ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది. ఇరిగేషన్ ఉన్నతాధికారి వైఖరిపై వారు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. విషయాన్ని ఏపీ ఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షుడు అశోక్బాబు దృష్టికి తీసుకువెళ్లారు. రాష్ట్ర స్థాయి నాయకుల సూచనల మేరకు అన్ని సంఘాలను కలుపుకొని ప్రత్యక్ష పోరాటానికి దిగేందుకు ఉద్యోగులు సన్నద్ధమవుతున్నారు. సొంతం వద్దు.. అద్దె ముద్దు.. ధవళేశ్వరంలో సొంత భవనంలో ఉన్న సెంట్రల్ డివిజన్ కార్యాలయాన్ని అమలాపురంలో అద్దె భవనంలోకి మార్చేందుకు అధికారులు మక్కువ చూపడంపై ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. కనీసం అక్కడ పూర్తి స్థాయి సొంత భవనం కూడా లేకపోయినప్పటికీ హడావుడిగా వారం రోజుల్లో కార్యాలయం అమలాపురానికి వెళ్లిపోవాలని సూచిస్తున్న ఇరిగేషన్ ఉన్నతాధికారి అత్యుత్సాహంపై ఉద్యోగ సంఘాలు మండిపడుతున్నాయి. ఆందోళన చేపడతాం.. మైనర్ ఇరిగేషన్ రైతాంగానికి ఇబ్బంది చేకూర్చే విధంగా డివిజన్ కార్యాలయాన్ని అమలాపురానికి తరలిస్తే సహించేది లేదని వైఎస్సార్ సీసీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మీ అన్నారు. అమలాపురంలో సబ్ డివిజన్ కార్యాలయం ఉన్నప్పటికీ ఏకపక్షంగా ఈ కార్యాలయాన్ని తరలించడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. వెంటనే కార్యాలయ తరలింపు ప్రతిపాదనను విరమించుకోవాలని డిమాండ్ చేశారు. అటు సెంట్రల్ డెల్టా రైతాంగానికి ఇటు మైనర్ ఇరిగేషన్ రైతాంగానికి అందుబాటులో ఉండే ధవళేశ్వరంలోనే కార్యాలయాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఉత్తర్వులనే అమలు చేశా.. సెంట్రల్ డివిజన్ కార్యాలయం తరలింపు వ్యవహరంలో ప్రభుత్వ ఉత్తర్వులను అమలు చేశామని ఇరిగేషన్ సర్కిల్ ఎస్ఇ రాంబాబు స్పష్టంచేశారు. ఈ ప్రతిపాదన గతంలో ఉన్నదేనని ఇందులో ఎవరి ఒత్తిడి లేదన్నారు. -
చంద్రబాబు వాడుకుని వదిలేసే రకం
సీఎంపై ఎంపీ జేసీ దివాకర్రెడ్డి వ్యాఖ్య రాయదుర్గం: ముఖ్యమంత్రి చంద్రబాబు కూరల్లో కరివేపాకులా వ్యక్తులను అవసరమైనపుడు మాత్రమే వాడుకుని వదిలేసే రకమని అనంతపురం ఎంపీ జేసీ దివాకర్రెడ్డి వ్యాఖ్యానించారు. ఆ అప్రదిష్టను తొలగించుకోవడానికే తన అల్లుడు దీపక్రెడ్డికి ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారన్నారు. దీపక్రెడ్డి ఎమ్మెల్సీగా ఎన్నికైన తర్వాత తొలిసారి రాయదుర్గం నియోజకవర్గ కేంద్రానికి వచ్చిన సందర్భంగా ఆదివారం ఆయనకు సన్మాన సభ ఏర్పాటు చేశారు. ఈ సభలో ఎంపీ జేసీ దివాకర్రెడ్డి మాట్లాడుతూ.. బాబుకు ఉన్నంత ఆశ దేశంలో ఏ ఒక్కరికీ లేదన్నారు. జిల్లాకు సాగునీరు ఇచ్చేలా ప్రజాప్రతినిధులు ముఖ్యమంత్రిపై ఒత్తిడి తేవాలని కోరారు. రాజకీయాల్లో డబ్బుకే ప్రాధాన్యత ఉందన్నారు. ప్రజల జేబుల్లో చేతులు పెట్టకూడదని, అలా అలవాటు చేసుకుంటే వారి రాజకీయ జీవితం ముగిసినట్టేనని పేర్కొన్నారు. -
బిందుసేద్యం లక్ష్యాలు పూర్తి
- టార్గెట్ రీచ్ అయిన ఏపీఎంఐపీ - 15వేల హెక్టార్లకు గాను 15179 హెక్టార్లకు సూక్ష్మసేద్యం - మార్చిలోనే 3500 హెక్టార్లకు మంజూరు కర్నూలు(అగ్రికల్చర్): ఆంధ్రప్రదేశ్ మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్టు (ఏపీఎంఐపీ)జిల్లాలో 2016-17 లక్ష్యాలను అధిగమించింది. కరువు సీమలో డ్రిప్, స్ప్రింక్లర్ల వ్యవసాయం భారీగా పెరిగింది. వర్షాలు తగ్గిపోవడం, భూగర్భ జలాలు అడుగంటి పోతున్న నేపథ్యంతో నీటిని పొదుపుగా వినియోగించి అధిగ దిగుబడులు సాధించేందుకు రైతులు డ్రిప్, స్ప్రింక్లర్ల సేద్యం వైపు దృష్టి సారించారని ఏపీఎంఐపీ ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీనివాసులు తెలిపారు. 2016-17లో జిల్లాకు 15వేల హెక్టార్లకు సూక్ష్మసేద్యం కల్పించాల్సి ఉండగా ప్రభుత్వం రూ.106 కోట్ల బడ్జెట్ ఇచ్చింది. ఆర్థిక సంవత్సరం ముగిసే సమయానికి 15,179 హెక్టార్లకు సూక్ష్మసేద్యం మంజూరు చేశారు. అయితే ఒక్క మార్చిలోనే 3500 హెక్టార్లకు పూర్తి చేశారు. ఇప్పటి వరకు 11వేల హెక్టార్లకు పరికరాలను కూడా అమర్చారు. మిగిలిన వాటికి నెలాఖరులోగా పూర్తి చేస్తామని పీడీ స్పష్టం చేశారు. 2015-16లో 7380 హెక్టార్లకు మాత్రమే డ్రిప్ కల్పించారు. అదే 2016-17లో రెట్టింపు కంటే ఎక్కువగా ప్రగతి సాధించారు. రూ.106 కోట్లు బడ్జెట్ ఇవ్వగా రూ.86 కోట్లు వ్యయం చేశారు. స్ప్రింక్లర్ల సేద్యం పెరగడం వల్ల నిధులు పూర్తిస్థాయిలో ఖర్చు కాలేదు. 7700 హెక్టార్లకు డ్రిప్ సదుపాయం కల్పించగా మిగిలినది స్ప్రింక్లర్ల సేద్యమే. ముఖ్యంగా సూక్ష్మ సేద్యం కారణంగా అరటిలో దిగుబడులు భారీగా పెరిగాయి. ఎస్సీ రైతులకు 1600 హెక్టార్లు, ఎస్టీ రైతులకు 650 హెక్టార్ల వరకు సూక్ష్మ సేద్యం సదుపాయం కల్పించారు. -
ఏపీ ప్రభుత్వ తీరును కడిగిపారేసిన కాగ్
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్న సాగునీటి ప్రాజెక్టులపై కాగ్ భారీగా అక్షింతలు వేసింది. ముఖ్యంగా పట్టిసీమ ప్రాజెక్ట్ తీరుపై కాగ్ కడిగిపరేసింది. పట్టిసీమను ఓ ప్రతికూల ప్రాజెక్ట్గా కాగ్ నివేదిక పేర్కొంది. ఈ ప్రాజెక్ట్పై ఖర్చు చేసిన దానికి, దాని వల్ల పొందే ప్రయోజనానికి మధ్య పొంతనే లేదని కాగ్ వెల్లడించింది. పోలవరం కుడికాల్వ, డిస్ట్రిబ్యూటరీలు పూర్తికాకుండా పట్టిసీమ ప్రాజెక్ట్ను చేపట్టారని కాగ్ రిపోర్ట్ పేర్కొంది. పారిశ్రామిక, గృహ వినియోగదారులను గుర్తించకుండానే పట్టిసీమ పథకం చేపట్టడం మూలంగా ప్రాజెక్ట్ వ్యయం విపరీతంగా పెరిగిపోయిందని తెలిపింది. పట్టిసీమ టెండర్ ప్రీమియం గరిష్ట పరిమితిని కూడా సడలించారని, అధిక ధరలతో టెండర్లను ఒప్పుకున్నారని.. దీని ద్వారా 199 కోట్ల అధనపు భారం పడిందని కాగ్ నివేదిక తేటతెల్లం చేసింది. అవసరం లేకున్నా నిర్మాణ పద్ధతిని మార్చారని, దీని ద్వారా 106 కోట్ల అదనపు భారం పడిందని తెలిపింది. పైపుల మీద రాయితీ ఉన్నా.. సెంట్రల్ ఎక్సైజ్ సుంకాన్ని కాంట్రాక్టర్కు తిరిగి చెల్లించారని రిపోర్ట్ వెల్లడించింది. ఈపీసీ ఒప్పందాల్లో లేని నిబంధనల కారణంగా ప్రభుత్వం మరో రూ. 20.62 కోట్లు నష్టపోయిందని వెల్లడించింది. కాగ్ రిపోర్ట్లోని అంశాలు.. ► గురు రాఘవేంద్ర పులికనుమ ప్రాజెక్ట్లో 4.12 కోట్లు ప్రభుత్వం నష్ట పోయింది. పైపుల సామర్థ్యం తగ్గినా.. మిగులు అనేది ప్రభుత్వానికి దక్కకుండా పోయింది. సరైన నిర్వహన, శ్రద్ధ లేకపోవడం మూలంగా ఈ ప్రాజెక్ట్ ప్రయోజనాలు అందడం లేదు. ► పురుషోత్తపట్నం పంప్హౌస్ విషయంలో కాంట్రాక్టర్కు రూ. 1.57 కోట్ల అనుచిత లబ్ధి చేకూరింది. ► పుష్కర ఎత్తిపోతల పథకం కింద సరైన ఆయకట్టు ఏర్పాటు కావడం లేదు. డిస్ట్రిబ్యూటరీలు ఏర్పాటైనా వాటిమీద కాంక్రీట్ పనులు పూర్తి కావడం లేదు. ప్రభుత్వం చెబుతున్న ఆయకట్టు టార్గెట్ను చేరుకోవడం లేదు. ► వ్యవసాయ మార్కెట్ యార్డ్ల పనితీరు ఘోరం. 99 మార్కెట్ యార్డ్లు తనిఖీ చేస్తే.. 90 చోట్ల ఎలాంటి లావాదేవీలు జరగలేదు. వీటిని పర్యవేక్షించడానికి సరైన యంత్రాంగం లేదు. మార్కెటింగ్ శాఖ వద్ద కనీస వివరాలు లేవు. ► హంద్రీనీవా సుజల స్రవంతి ప్యాకేజీ 53లో పనుల పరిధి తగ్గినా ప్రభుత్వానికి డబ్బు మిగల్లేదు. రూ. 6.47 కోట్ల మిగులు ఖజానాకు చేరలేదు. ► హంద్రీనీవా సుజల స్రవంతి ప్యాకేజీ 610లో కాంట్రాక్టర్కు లబ్ధి. రూ. 4.97 కోట్ల మేర అధిక చెల్లింపులు. ► వృద్ధాప్య పెన్షన్ల కోసం చేసిన దరఖాస్తులు లక్షల కొద్ది పెండింగ్లో ఉన్నాయి. వయో వృద్ధుల సంక్షేమం కోసం పెద్దగా నిధులు ఇవ్వడం లేదు. ► విశాఖలోని ప్రధాన వాణిజ్య ప్రాంతంలో భూమిని ప్రైవేటు సంస్థకు కేటాయించారు. దీని ద్వారా ప్రభుత్వానికి 63.89 లక్షల రూపాయల నష్టం. ► రెసిడెన్సియల్ స్కూళ్లకు ఆహారాన్ని తక్కువగా సరఫరా చేస్తున్నారు. ప్రమాణాలకు అనుగుణంగా సరఫరా చేయడం లేదు. పర్యవేక్షణ అత్యంత పేలవంగా ఉంది. ► కడపలోని యోగి వేమన విశ్వవిద్యాలయానికి నిధులు విడుదల చేయడం లేదు. -
పెన్ను పట్టలే.. ఫైలు ముట్టలే..!
⇒ప్రభుత్వ శాఖల్లో స్తంభించిన పాలన ⇒కొనసాగిన ఉద్యోగుల నిరసన ఇందూరు(నిజామాబాద్ అర్బన్) : జిల్లా పరిపాలన రెండో రోజు కూడా స్తంభించింది. బోధన్లో నీటిపారుదల శాఖ డిప్యూటీ ఈఈ గంగాధర్ను బోధన్ ఎమ్మెల్యే ప్రధాన అనుచరుడు అబిద్ అసభ్య పదజాలంతో దూషించినందుకు నిరసనగా అబిద్పై కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ టీఎన్జీవోస్ ఆధ్వర్యంలో ఉద్యోగులు రెండో రోజు మంగళవారం పెన్డౌన్ చేపట్టారు. కలెక్టరేట్లోని జిల్లా కేంద్రంలో ఉన్న అన్ని శాఖలకు చెందిన అన్ని కేడర్ల ఉద్యోగులు ఉదయం వారి వారి కార్యాలయాలకు హాజరై పనులు చేయకుండా నిరసనను తెలిపారు. అనంతరం ప్రగతిభవన్ ఎదుట మధ్యాహ్నం వరకు ధర్నా చేపట్టారు. దీంతో ఏ ఒక్క శాఖలో కూడా పెన్ను, ఫైలు కదల్లేదు. పరిపాలన వ్యవస్థ మొత్తం స్తంభించింది. కార్యాలయాలన్ని ఉద్యోగుల్లేక వెలవెలబోయాయి. ధర్నాలో టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు అలుక కిషన్ మాట్లాడుతూ.. ఇరిగేషన్ డిప్యూటీ ఈఈని అసభ్యకరంగా, అవమానించే విధంగా మాట్లాడిన బోధన్ ఎమ్మెల్యే ముఖ్య అనుచరుడు అబిద్ను వెంటనే పోలీసులు అరెస్టు చేయాలన్నారు. సంఘటనపై ఒక్క ప్రజాప్రతినిధి కూడా స్పందించకపోవడం బాధకరమన్నారు. దుర్బాషలాడిన అబిద్ను కాపాడేందుకు బోధన్ ఎమ్మెల్యే ప్రయత్నాలు చేయడం సరికాదని ఆరోపించారు. ఉద్యోగులు కావాలో... అనుచరులు కావాలో తేల్చుకోవాల్సిన సమయం వచ్చిం దన్నారు. మండల కేంద్రాల్లో కూడా పెన్డౌన్ నిరసన కార్యక్రమాలను చేపట్టి ఉధృతం చేస్తామన్నారు. నిరసన కార్యక్రమంలో టీఎన్జీవోస్ కార్యదర్శి సతీష్, ట్రెజరీ ఉద్యోగుల సంఘం నాయకులు కిషన్, రెవెన్యూ ఉద్యోగుల సం ఘం నాయకులు రమణ్రెడ్డి, వార్డెన్ల సంఘం జిల్లా అధ్యక్షుడు రాజా గంగారాం, అన్ని శాఖల ఉద్యోగులు, డ్రైవర్స్, నాల్గవ తరగతి ఉద్యోగ సంఘాలు పాల్గొన్నారు. -
పురుషోత్తపట్నం ‘ఎత్తిపోతలు’ అడ్డగింపు
–2013 భూసేకరణ చట్ట ప్రకారం పరిహారం ఇచ్చిన తర్వాతే పనులన్న రైతులు సీతానగరం (రాజానగరం) : మండలంలోని రామచంద్రపురం వద్ద పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం పనులను రైతులు అడ్డుకున్నారు. హైకోర్టు సూచించిన ప్రకారం భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం ఇచ్చాకే పనులు చేయాలని రైతులు డిమాండ్ చేశారు. మంగళవారం ఉదయం 9 గంటలకు రామచంద్రపురం వద్ద గల తొర్రిగడ్డ పంపింగ్ స్కీమ్ ఎడమ కాలువ వద్ద ఎత్తిపోతల పథకం పనులు చేయడానికి పొక్లెయిన్ తరలివచ్చింది. కాలువ వద్ద పనులు చేయడానికి సిద్ధపడగా సమాచారం అందుకున్న రైతులు హుటాహుటిన తరలివెళ్లి పనులను అడ్డుకున్నారు. తొర్రిగడ్డ ఎడమ కాలువలో రామచంద్రపురం దూళ్ళపాటి డ్యామ్ వద్ద ఎత్తిపోతల పథకం పైప్లైన్ వేయడానికి పొక్లెయిన్తో తవ్వకాలు ప్రారంభించారు. రామచంద్రపురానికి చెందిన రైతులు కలగల బాలకృష్ణ, చల్లమళ్ల గాంధీ, కోడేబత్తుల దొరాజీ, చల్లమళ్ల ధర్మరాజు, చల్లమళ్ల విజయ్కుమార్ చౌదరి, కోడేబత్తుల శ్రీనివాసరావు, కోడేబత్తుల పెంటయ్య, ప్రసాద్తోపాటుగా అధిక సంఖ్యలో రైతులు తరలివెళ్ళి పనులను అడ్డుకున్నారు. సమాచారం అందుకున్న మెగా ఇంజనీరింగ్ కంపెనీ అధికారులు ఘటనా స్థలికి తరలివచ్చారు. పొక్లెయిన్తో ప్రభుత్వ భూములలో పనులు చేస్తున్నామని, కాలువ వద్ద పైప్లైన్కు చెందిన పైప్లు ఏర్పాటు చేస్తే, ఖరీఫ్కు సాగునీటికి అంతరాయం కలగదని తెలిపారు. దీంతో రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ రామచంద్రపురం వద్ద పనులు చేయడానికి మేము ఎంతమాత్రం సుముఖంగా లేమని, హైకోర్టు తీర్పుననుసరించి 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారంతోపాటుగా వివిధ ప్రయోజనాలు కల్పించాకే ఇక్కడ పనులు చేయడానికి అంగీకరిస్తామని తెలిపారు. దీనితో పొక్లెయిన్ తీసుకుని అక్కడ నుంచి అధికారులు నిష్క్రమించారు. -
కాగ్ రిపోర్ట్: లోపాలమయంగా తెలంగాణ ప్రాజెక్టులు!
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న నీటి పారుదల ప్రాజెక్టుల అమలులో ఉన్న లోపాలను కాగ్ ఎత్తిచూపింది. సరైన ప్రణాళిక లేకపోవడం, డిజైన్లు సమర్పించడం, వాటిని ఆమోదించడంలోనూ, పునరావాస కార్యక్రమాలు, అటవీ అనుమతులు పొందడంలో జాప్యం వల్ల ప్రాజెక్టులు పూర్తికాలేదని కాగ్ స్పష్టం చేసింది. 2015-16 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఎంపిక చేసిన మధ్యతరహా నీటిపారుదల ప్రాజెక్టుల అమలు విషయంలో కాగ్ ఆడిట్లో వెల్లడైన ముఖ్యమైన విషయాలు.. ► రెండు సంవత్సరాలలో మొత్తం ఐదు ప్రాజెక్టులను పూర్తి చేయడం లక్ష్యంగా కాగా, కొన్ని అనుబంధ పనులు మినహాయించి రెండు ప్రాజెక్టులు మాత్రమే పూర్తయ్యాయని కాగ్ తెలిపింది. దీంతో.. 52000 ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యానికి గాను కేవలం 13900 ఎకరాలకు మాత్రమే సాగునీటి సామర్థ్యం కల్పించారని కాగ్ వెల్లడించింది. ► అన్ని ప్రాజెక్టుల్లో ప్రతిసంత్సరం వ్యయంలో మిగుళ్లు(రూ. 319.02 కోట్లు) ఉన్నాయని కాగ్ తెలిపింది. ► సత్వర సాగునీటి ప్రయోజనం కింద చేపట్టిన గొల్లవాగు, నీల్వాయి, జగన్నాథ్పూర్ వద్ద పెద్దవాగులకు సంబంధించి మొత్తం గ్రాంటును అందుకున్నప్పటికీ 11 సంవత్సరాల తరువాత కూడా ఇంకా పూర్తికావలసి ఉన్నాయని కాగ్ తెలిపింది. ► వర్షపాతం- వర్షనీటి ప్రవాహాల మధ్య నిష్పత్తిని వర్తింపచేయడంలోనూ, వరద ప్రవాహాలను సమీక్షించడంలోనూ కేంద్ర జల సంఘం చేసిన సిఫారసులను పాటించలేదని కాగ్ తెలిపింది. దీంతో ప్రాజెక్టుల్లో విశ్వసనీయమైన నీటి లభ్యతను లెక్కించడంలో శాస్త్రీయతను ఆడిట్ పరీక్షించలేకపోయిందంది. ► ప్రతి గ్రామంలో కల్పించే సాగునీటి సమార్ధ్యాన్ని పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ నియమావళి నిర్దేశించిన విధంగా ప్రాజెక్టుల సమగ్ర నివేదికలో పొందు పరచలేదని కాగ్ తెలిపింది. ► మత్తడివాగు, జగన్నాథ్పూర్ వద్ద పెద్దవాగు ప్రాజెక్టుల్లో సంబంధిత కాలువలు లేకుండానే హెడ్ రెగ్యులేటర్లు ప్రణాళికలో చేర్చి నిర్మించారని కాగ్ స్పష్టం చేసింది. ► గుత్తేదారు సంస్థలచే సర్వే అండ్ ఇన్వెస్టిగేషన్లోనూ(ఎస్ అండ్ ఐ), అటవీ భూముల కొరకు ప్రతిపాదనలు సమర్పించడంలోనూ జాప్యాలున్నాయని తెలిపింది. అలాగే ఆశించిన విధంగా ఎస్ అండ్ ఐ నివేదికను గుత్తేదారు సమర్పించలేదని తెలిపింది. ► డిజైన్లను సమర్పించడంలో, ఆమోదించడంలో జాప్యాలున్నాయని, సకాలంలో డిజైన్లు ఖరారు చేయడంలో ప్రభుత్వ ఆదేశాలను పాటించలేదని కాగ్ తెలిపింది. ► ఒప్పందాలను నిర్దేశించిన విధంగా సంస్థలు అంచనాలను తయారు చేయలేదని కాగ్ తెలిపింది. ఎటువంటి కారణాలు లేకుండానే చెల్లింపుల షెడ్యూళ్లను చాలాసార్లు సవరించారంది. ► ప్రాజెక్టు ప్రభావిత కుటుంబాలకు పునరావాస, పునర్నిర్మాణ సదుపాయాలు అందకపోవడం, ఆలస్యంగా అందిన సందర్భాలున్నాయని, ఫలితంగా ప్రాజెక్టుల అమలులో జాప్యమైందని తెలిపింది. ► ఒప్పంద వ్యయంలో తగినటువంటి మార్పు చేయకుండానే ప్రాజెక్టు ప్రాథమిక పరిమితులలో మార్పులను అంగీకరించిన సందర్భాలున్నాయని.. ఇది గుత్తేదారు సంస్థలకు ఆయాచిత లబ్దికి దారితీసిందని కాగ్ తెలిపింది. -
‘ఎత్తిపోతల’ పేరుతో దోపిడీ
- వైఎస్సార్ సీపీ యువజన విభాగం అధ్యక్షుడు జక్కంపూడి రాజా - కోర్టును ఆశ్రయించి, న్యాయం పొందిన రైతులు అభినందనీయులు - ప్రభుత్వం కళ్ళు తెరవాలని హితవు సీతానగరం (రాజానగరం) : ఎత్తిపోతల పథకాల పేరుతో రాష్ట్ర ప్రభుత్వం దోపిడీకి పాల్పడుతోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా ఆరోపించారు. సీతానగరం మండలం ఇనుగంటివారిపేటలో శుక్రవారం పర్యటించిన ఆయన విలేకర్లతో మాట్లాడారు. పట్టిసీమ ఎత్తిపోతల పథకం పేరుతో ప్రభుత్వ పెద్దలు అందినకాడికి వేలాది కోట్లు దోచుకున్నారన్నారు. పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం పేరుతో తిరిగి దోపిడీకి పాల్పడుతున్నారని దుయ్యబట్టారు. ఒకవైపు పోలవరం ప్రాజెక్ట్ పూర్తవుతుందంటూనే మరోపక్క ఎత్తిపోతల పథకం ఏర్పాటు చేస్తున్నారని, సీఎం జేబులు నింపుకోవడానికే ఈ పథకాలని ఆరోపించారు. పోలవరం పూర్తయితే ఎత్తిపోతల పథకాలు దేనికని ప్రశ్నించారు. ఎత్తిపోతల పథకం పైపులైన్ మార్గంలో భూములు కోల్పొయే రైతులను అధికారులు, ప్రజాప్రతినిధులు భయాందోళనలకు గురి చేసి సంతకాలు చేయించారని విమర్శించారు. కొంతమంది రైతులు హైకోర్టును ఆశ్రయించి, న్యాయం పొందారన్నారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం భూములు తీసుకోవాలని హైకోర్టు తీర్పు ఇచ్చిందని, తద్వారా రైతులు విజయం సాధించారని కొనియాడారు. ప్రజా శ్రేయస్సు కోసం పాటుపడాల్సిన ప్రభుత్వం ప్రజలకు, రైతులకు వ్యతిరేకంగా పని చేస్తోందని, అధికార పార్టీ నేతలు ప్రజాధనాన్ని దోచుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం రైతుల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని 2013 భూసేకరణ చట్టం ప్రకారం రైతులకు పరిహారం అందించాలని, ఆ చట్టం ప్రకారం వర్తించాల్సిన అంశాలను అమలు చేయాలని రాజా కోరారు. కార్యక్రమంలో పార్టీ మండల కన్వీనర్ పెదపాటి డాక్టర్బాబు, రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి, రాష్ట్ర సేవాదళ్ కార్యదర్శి వలవల రాజా, చళ్ళమళ్ళ సుజీరాజు, జిల్లా కార్యదర్శి వలవల వెంకట్రాజు, ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు అంబటి రాజు తదతరులు పాల్గొన్నారు. -
కష్టాల్లో ముంచేను
కూతవేటు దూరంలోనే గోదావరి ప్రవహిస్తోంది. పంట కాలువల్లో మాత్రం నీరు అడుగంటుతోంది. ఫలితంగా వరి చేలకు సాగునీరు అందక అన్నదాతలు కష్టాల పాలవుతున్నారు. పంటల్ని గట్టెక్కించేందుకు వంతులవారీ విధానం అమలు చేస్తున్నా.. ఆచంట, పాలకొల్లు నియోజకవర్గాల్లోని శివారు ఆయకట్టుకు నీరందక వరి చేలు ఎండి బీటలు వారుతున్నాయి. వరి దుబ్బులు పొట్ట, ఈనిక దశలో ఉన్న కీలక తరుణంలో సాగునీరు ఇవ్వకపోతే నిండా నష్టాల ఊబిలో కూరుకుపోతామని రైతులు ఆందోళన చెందుతున్నారు. యలమంచిలి/ఆచంట : యలమంచిలి మండలం వడ్డిలంక చానల్ పరిధిలోని కాజ బ్రాంచి కాలువపై ఆధారపడిన ఆయకట్టు పరిధిలోని వరి చేలకు వెంటనే సాగునీరివ్వకపోతే ఆత్మహత్యలే శరణ్యమని రైతులు గగ్గోలు పెడుతున్నారు. ఈ కాలువపై ఆధారపడి సుమారు 300 ఎకరాల్లో వరి సాగు చేస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ చేలన్నీ ఈనిక దశలో ఉన్నాయి. ఈ సమయంలో నీటితడి ఇవ్వకపోతే గింజ పాలుపోసుకోక తప్పలుగా మారిపోయే ప్రమాదం ఉందని కలగంపూడి, కాజ తూర్పు గ్రామాలకు చెందిన రైతులు తోటకూర శ్రీనివాసరాజు, గుంటూరు నాగరాజు, పాలంకి వెంకటేశ్వరరావు తదితరులు చెప్పారు. ఇప్పటికే నాలుగుసార్లు ఎరువులు, గుళికలు, పురుగు మందులు వాడాల్సి రావడం వల్ల ఎకరానికి రూ.20 వేల నుంచి రూ.25 వేల వరకు పెట్టుబడి అయ్యిందన్నారు. ఇప్పటికిప్పుడు నీరు పెట్టకపోతే కంకులన్నీ చొప్పలుగా మారి పూర్తిగా నష్టపోతామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మందులు చల్లడం, కీలక తరుణంలో నీరు అందకపోవడంతో మందు కసరు కంకుల తలకు ఎక్కి వరి దుబ్బుల ఎగువ చివరి భాగంలో ఎరుపు రంగు వస్తోందని వివరించారు. ఇది ఎక్కువైతే కంకులు పూర్తిగా బయటకు రావని, చేనంతా గడ్డిగా మారిపోతుం దని ఆందోళన చెందుతున్నారు. వంతులవారీ విధానంలో సక్రమంగా నీరివ్వకపోవడమే దీనికి కారణమని వాపోతున్నారు. సాగునీటి కోసం కోసం డెల్టా లస్కర్ ఫోన్ చేస్తుంటే మూడు రోజులు నుంచి స్పందించడం లేదని తెలిపారు. కాలువకు ఎగువన ఉన్న ఆర్యపేట, యలమంచిలి రైతులు వరి మానేసి మినుము, పెసర చల్లుతుంటే తాము కూడా అపరాల సాగు వైపు మొగ్గు చూపామని గుర్తు చేశారు. ఆ సమయంలో ఇరిగేషన్, వ్యవసాయ అధి కారులు వచ్చి కాలువ పై భూముల్లో సాగు లేదు కాబట్టి దిగువ భూములకు పుష్కలంగా నీరిస్తామని, వరి సాగు చేయాలని చెప్పడంతో నాట్లు వేశామని కాజ తూర్పు, కలగంపూడి గ్రామాల రైతులు వివరించారు. సాగునీటి ఎద్దడి ఏర్పడిన తరుణంలో నీరి వ్వండి మహాప్రభో అని వేడుకుంటున్నా పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. ఆచంట నియోజకవర్గంలోనూ ఇదే సమస్య ఆచంట నియోజకవర్గ పరిధిలోనూ ఇదే సమస్య నెలకొంది. ఆచంట మండలం భీమలాపురం, ఆచంట వేమవరం, వల్లూరు గ్రామాల్లో శివారు ఆయకట్టు నీరందటం లేదు. సుమారు 500 ఎకరాల్లో పంట ఎండిపోయే దుస్థితి దాపురించింది. రానున్న రోజుల్లో సాగునీటి ఎద్దడి తీవ్రరూపం దాల్చే ప్రమాదం కనిపిస్తోంది. పెనుగొండ మండలం వడలి, రామన్నపాలెం, తామరాడ గ్రామాల్లో ఇప్పటికే వరిచేలు బీటలు వారాయి. ఈ మూడు గ్రామాల్లో సుమారు 500 ఎకరాల్లో పంట ఎండిపోతోంది. సాగునీరివ్వలంటూ అక్కడి రైతులు రోడ్డెక్కి ఆం దోళనలు చేయగా.. సమస్యను పరిష్కరించాలి్సన ప్రభుత్వం ఆ పని మానేసి సాగునీరు అడిగిన రైతులపై కేసులు నమోదు చేయించింది. ఇదిలావుంటే.. పెనుమంట్ర మండలం ఎస్.ఇలి్లందల పర్రు, మల్లిపూడి, జుత్తిగ గ్రామాల్లోని ఆయకట్టుకు నీరందక 300 ఎకరాల్లో పంట దెబ్బతింటోంది. మరోవైపు అటు పాలకొల్లు, ఇటు ఆచంట నియోజకవర్గాల పరిధిలో గల పోడూరు మండలంలోని కవిటం, తూర్పుపాలెం, వద్దిపర్రు, గుమ్ములూరు, పెనుమదం గ్రామాల్లోనూ సాగునీటి ఎద్దడి నెలకొంది. పంట పాలుపోసుకునే కీలక దశలో నీటి సమస్య మొదలైంది. మరో 10 రోజులపాటు ఇదే పరిస్థితి కొనసాగితే పంటకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. సాగునీరిచ్చి 15 రోజులైంది యలమంచిలి మండలం కాజ బ్రాంచి కాలువపై ఆధారపడి సుమారు 300 ఎకరాల్లో వరి సాగు చేస్తున్నాం. ఈ భూములకు సాగునీరిచ్చి 15 రోజులైంది. ప్రస్తుతం చేలన్నీ ఈనిక, పొట్ట దశలో ఉన్నాయి. ఇప్పుడు నీరు పెట్టకపోతే ఒక్క గింజలో కూడా పాలు గట్టిపడవు. అదే జరిగితే పెట్టిన సొమ్ముంతా నష్టపోతాం. వెంటనే సాగునీరు ఇచ్చి పంటల్ని కాపాడాలి. – బొక్కా పురుషోత్తం, కౌలు రైతు, కలగంపూడి, యలమంచిలి మండలం అధికారులు స్పందించడం లేదు దాళ్వా ప్రారంభంలో అధికార యంత్రాంగమంతా వచ్చి వరి సాగు చేయమని బతిమలాడారు. తీరా సాగు చేశాక నీరందక రైతులంతా అల్లాడుతుంటే ఒక్కరూ పట్టించుకోవడం లేదు. మేమంతా కలసి పాలకొల్లు లాకుల వద్దకు వెళితే ఒక్క అధికారి కూడా దొరకలేదు. ఫోన్ చేస్తుంటే ఎవరూ తీయడం లేదు. – చెల్లుబోయిన వెంకటేశ్వరరావు, రైతు, కాజ, యలమంచిలి మండలం -
నీటిని వృధాగా సముద్రంలో కలిపారు
-
నీటిని వృధాగా సముద్రంలో కలిపారు
అమరావతి: శ్రీశైలంలో 854 అడుగుల నీరు ఉన్నా రాయలసీమకు నీరు ఇవ్వలేని పరిస్థితి నెలకొందని ప్రతిపక్షనేత వైఎస్ జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సందర్భంగా రాష్ట్రంలో కరువు పరిస్థితులు, ప్రాజెక్టులపై మాట్లాడిన వైఎస్ జగన్.. ఆర్అండ్ఆర్ కింద తెలంగాణకు 120 కోట్లు కట్టి ఉంటే పులిచింతలకలో 48 టీఎంసీలు నిల్వచేసే అవకాశం ఉండేదని అన్నారు. కృష్ణా బేసిన్లో 40 శాతం ఇన్ఫ్లో తగ్గిపోయిందని వైఎస్ జగన్ అన్నారు. 55 టీఎంసీల నీటిని సముద్రంలో వృధాగా కలిపారని ఆవేదన వ్యక్తం చేశారు. పట్టిసీమ నుంచి 42 టీఎంసీల నీటిని ప్రకాశం బ్యారేజీకి తరలించారని అన్నారు. -
దేశంలో 76 లక్షల హెక్టార్లకు సాగు నీరు
కేంద్రహోంమంత్రి రాజ్నాథ్ సింగ్ వెల్లడి సూరజ్కుండ్ (హరియాణ): 2019 నాటికి దేశంలో 76 లక్షల హెక్టార్ల భూమికి సాగునీరు అందించాలని లక్ష్యంగా నిర్ణయించినట్లు కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. ఉత్పాదక వ్యయాన్ని తగ్గించి వ్యవసాయాన్ని లాభదాయకంగా మార్చేందుకు కేంద్రం ప్రణాళికలు రచిస్తోందన్నారు. సూరజ్కుండ్లో హరియాణ ప్రభుత్వం నిర్వహించిన ‘వ్యవసాయ సదస్సు– 2017’లో మంత్రి పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘యూరియా లాంటి ముఖ్యమైన ఎరువులను తక్కువ ధరకు అందించాలని కేంద్రం నిర్ణయించింది. వేప పూత యూరియాను ఉత్పత్తి చేయాలని నిర్ణయం తీసుకుందన్నారు. తమ ప్రభుత్వం వ్యవసాయం, సాగునీటికి నాబార్డు నిధుల కింద రూ.20 వేల కోట్లను కేటాయించినట్లు తెలిపారు. రుతుపవనాల మార్పులతో పంటలకు నష్టం వాటిల్లితే ప్రధానమంత్రి ఫసల్ భీమా యోజన పథకం రైతులకు రక్షణగా నిలుస్తుందన్నారు. దేశంలో ఎక్కడ్నుంచైనా రైతులు తమ పంట ఉత్పత్తులను అమ్ముకునేవిధంగా జాతీయ వ్యవసాయ ఎలక్ట్రానిక్ మార్కెట్ (ఈ–నామ్)లను ప్రవేశ పెట్టినట్లు తెలిపారు. 2018 మార్చి నాటికి దేశవ్యాప్తంగా 585 వ్యవసాయ మార్కెట్లను ఈ– నామ్తో అనుసంధానించాలని లక్ష్యంగా పెట్టుకుందన్నారు. -
కేటాయింపు ఎంతో!
జిల్లాలోని మెట్టప్రాంత సాగునీటి పథకాలు ఏళ్లతరబడి పెండింగ్లో ఉన్నాయి. డెల్టా ఆధునికీకరణ పనులు ముందుకుసాగడం లేదు. ఏటేటా నిర్మాణ వ్యయం పెరిగిపోతోంది. అయినా సర్కారు శ్రద్ధ కనబరచడం లేదు. ప్రతిఏటా అరకొర నిధులు విదిలిస్తోంది. ఈ నేపథ్యంలో బుధవారం 2017–18 బడ్జెట్ను శాసనసభలో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. ఈ సారైనా పూర్తిగా నిధులు కేటాయిస్తుందా అన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. కొవ్వూరు : జిల్లాకు వచ్చిన ప్రతిసారీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గత ఎన్నికల్లో 15 సీట్లూ తమ పార్టీకి కట్టబెట్టిన ప్రజల రుణం తీర్చుకోలేనిదని, జిల్లాకు సముచిత ప్రాధాన్యం ఇస్తామని పదేపదే వల్లెవేశారు. కానీ ఈ మూడేళ్లలో ఆయన జిల్లాకు ప్రత్యేకంగా చేసిందేమీ లేదు. గత బడ్జెట్లలో జిల్లాకు ఒనగూరిన ప్రయోజనం శూన్యం. ఇంకా రెండేళ్లే సమయం ఉన్నందున ఈ సారైనా జిల్లా అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తారా అని ప్రజలు నిరీక్షిస్తున్నారు. జిల్లా రైతులపై శీతకన్ను పొరుగు జిల్లాకు నీటిని తరలించేందుకు పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని రూ.1,340 కోట్లతో ఆగమేఘాలపై పూర్తిచేసిన ప్రభుత్వం జిల్లా రైతులపై కపట ప్రేమ చూపిస్తోంది. మెట్ట ప్రాంత పథకాలపై శీతకన్ను వేసింది. దీంతో రైతుల నుంచి సర్కారు తీరుపై తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. ‘తాడిపూడి’ వ్యయం రెట్టింపు తాడిపూడి ఎత్తిపోతల పథకానికి నిధులు విడుదల కాకపోవడంతో అసంపూర్తిగా నిలిచింది. నిర్మాణ వ్యయంపై రూ.526.27 కోట్ల నుంచి రూ.1,042 కోట్లకు పెరిగింది. అధికారులు ఇటీవల కొత్త అంచనాలను తయారు చేసి ప్రభుత్వానికి పంపారు. ఇప్పటి వరకు రూ.488.11 కోట్లు ఖర్చు చేశారు. ఇంకా రూ.554 కోట్ల మేర నిధులు అవసరం ఉందని అధికారులు చెబుతున్నారు. 2015 బడ్జెట్లో రూ.70కోట్లు కేటాయించారు. వినియోగం కూడా అంతంతమాత్రంగానే జరిగింది. దీంతో గత ఏడాది రూ.55 కోట్లు కేటాయించింది. ప్రాజెక్టు నిర్మాణ వ్యయం భారీగా పెరగడంతో కొత్త అంచనాలకు అనుగుణంగా నిధులు విడుదల కావాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు. రెండు లక్షల ఎకరాలకు సాగునీరు అందించే ఈ పథకం నిర్మాణ పనులకు ప్రభుత్వం ఏమేర ని««ధులు కేటాయిస్తుందో వేచిచూడాలి. డెల్టా ఆధునికీకరణపైనా చిన్నచూపు దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి డెల్టా ఆధునికీకరణకు భారీ ఎత్తున నిధులు సమకూర్చారు. జిల్లాకు రూ.1,383.96 కోట్లు కేటాయించగా.. వీటిలో రూ.660 కోట్లు విలువైన పనులు మాత్రమే జరిగాయి. 2015–16 బడ్జెట్లో రూ.15కోట్లు, గత ఏడాది బడ్జెట్లో రూ.42.50 కోట్లు మాత్రమే జిల్లాకు కేటాయించారు. ఇంకా సుమారు రూ.720కోట్లకు పైగా పనులు చేపట్టాల్సి ఉంది. వీటికి అవసరమైన నిధులను ప్రభుత్వం కేటాయించడం లేదు. జిల్లాలో అత్యవసరంగా చేపట్టాలి్సన 188 పనులకు ప్రభుత్వం 92 జీవో జారీ చేసింది. దీనిలో 83 కాలువ పనులు, 105 డ్రెయిన్లుకు సంబంధించిన పనులు పూర్తి చేయాలని నిర్ణయించారు. వీటిలో 95 పనులకు గతంలో టెండర్లు పిలిస్తే కేవలం 32 పనులు పూర్తి చేశారు. ఇంకా 29 పనులు ప్రారంభం కాలేదు. ఎర్రకాలువ ఆ«ధునికీకరణదీ అదే దుస్థితి ఎర్రకాలువ ఆధునికీకరణ పనులకు రూ.104 కోట్లు కేటాయించారు. దీనిలో రూ.40 కోట్ల విలువైన పనులు పూర్తయ్యాయి. దీనికి 2015లో రూ.150 కోట్లు కేటాయించగా, గత ఏడాది రూ.2.60 కోట్లు కేటాయించారు. ప్రభుత్వం నిధుల విడుదల చేయకపోవడంతో నిర్మాణ వ్యయం ఏటేటా పెరుగుతోంది. కొత్త వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లలోనూ కోత కొత్త వ్యవయసాయ కనెక్షన్లలోనూ జిల్లాపై ప్రభుత్వం పక్షపాతం ప్రదర్శిస్తోంది. గత ఏడాది జిల్లాకు 1,800 కనెక్షన్ల మంజూరు మాత్రమే లక్ష్యంగా ఇచ్చారు. దీంతో ఆరునెలల నుంచి కొత్త కనెక్షన్లు ఇవ్వడం లేదు. ఫలితంగా రైతులు అవస్థలు పడుతున్నారు. రాష్ట్రంలో విద్యుత్ మిగులులో ఉందని ప్రభుత్వం చెబుతున్నా వ్యవసాయ కనెక్షన్లు ఇవ్వకపోవడంతో రైతుల్లో అసంతృప్తి నెలకొంది. ఈ బడ్జెట్లోనైనా అవసరమైన వారందరికీ కనెక్షన్లు కేటాయిస్తారని రైతులు ఆశగా ఎదురుచూస్తున్నారు. డెల్టాలో ఆక్వా యూనివర్సిటీ ఏర్పాటు, ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకానికి నిధుల కేటాయింపు ఎలా ఉటుందోననే అంశంపైనా సర్వత్రా ఆసక్తి నెలకొంది. చింతలపూడిపై ఏదీ కనికరం జిల్లాలోని మెట్టప్రాంత మండలాలకు సాగునీరు అందించే చింతలపూడి పథకం నిర్మాణ పనులపై ప్రభుత్వం చిన్నచూపు చూస్తోంది. రూ.1,701 కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ పథకానికి భూసేకరణతో కలిపి కేవలం రూ. 719.4 కోట్లు ఖర్చు చేశారు. ఇంకా సుమారు రూ.982 కోట్లు అవసరం. 2015 బడ్జెట్లో రూ.22.03 కోట్లు, గత ఏడాది రూ.83 కోట్లు మాత్రమే కేటాయించింది. దీంతో పనులు మందకొడిగా సాగుతున్నాయి. అదనంగా మరో 2.8 లక్షల ఎకరాలకు నీరందించేందుకు రుపొందించిన రెండోదశకు ఇప్పటికీ టెండర్ల ప్రక్రియ పూర్తి కాలేదు. ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.1,701 నుంచి రూ.4,909.80 కోట్లకు పెరిగింది. దీనికి సంబంధించి పరిపాలనా ఆమోదం లభించి ఏడు నెలులు కావస్తోంది. ఏడాది ఈ రెండో దశకు నిధులిస్తామని ఊరిస్తున్నా.. ఇప్పటివరకూ కేటాయించలేదు. ఈ బడ్జెట్లోనైనా నిధులు కేటాయించి పనులు పూర్తి చేస్తే పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల్లో నాలుగు లక్షల ఎకరాలకు సాగునీరు అందే అవకాశం ఉంది. -
‘సాగర్’లో కనీస నీటి మట్టం కష్టమే
⇒ పంపులు దించి నీటిని తోడాల్సిందే ⇒ మెట్రో వాటర్ బోర్డుకు నీటిపారుదలశాఖ స్పష్టం సాక్షి, హైదరాబాద్: రాజధాని తాగునీటి అవసరాలకు ప్రధాన వనరుగా ఉన్న నాగార్జున సాగర్ ప్రాజెక్టులో ఈ ఏడాది సైతం కనీస నీటి మట్టాలను నిర్వహించడం సాధ్యం కాదని హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు (హెచ్ఎండ బ్ల్యూఎస్ఎస్బీ)కు నీటిపారుదల శాఖ తేల్చి చెప్పింది. శ్రీశైలం, సాగర్లో నెలకొన్న నీటి కొరత, మున్ముందు ఉన్న రబీ సాగు, తాగు అవసరాల దృష్ట్యా, కనీస నీటి మట్టాలకు దిగువకు వెళ్లాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది. కనీస నీటి మట్టాలకు దిగువ నుంచి నీటిని తోడేలా పంపులను దించాల్సిందేనని పేర్కొంది. ఈ మేరకు నీటిపారుదలశాఖ ఉన్నతాధికారులు హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బీ మేనేజింగ్ డైరెక్టర్కు లేఖ రాశారు. 824 అడుగులకు చేరిన శ్రీశైలం ఈ ఏడాది ఎగువన శ్రీశైలం నుంచే అధిక నీటి వినియోగం జరగడంతో సాగర్కు అనుకున్న స్థాయిలో నీటి విడుదల కాని విషయం తెలిసిందే. దీంతో ప్రస్తుతం సాగర్లో నీటినిల్వ.. 590 అడుగులకు గానూ 514 అడుగులకు చేరింది. ఈ మట్టంలో ప్రస్తుతం 138 టీఎంసీల మేర నీటి లభ్యత ఉన్నా, కనీస నీటిమట్టం 510 అడుగులకు పైన 7 టీఎంసీల లభ్యత మాత్రమే ఉంది. ఇప్పటికే శ్రీశైలం కనీస నీటి మట్టం దిగువకు వెళ్లి ఇరు రాష్ట్రాలు నీటిని తోడేసుకుంటున్నాయి. ఇక్కడ కనీస నీటిమట్టం 834 అడుగులైతే ఇప్పటికే అది 824 అడుగులకు చేరింది. ఈ నేపథ్యంలో సాగర్లో ఉన్న లభ్యత నీటినే సాగు, తాగు అవసరాలకు వాడాల్సి ఉంది. ఇందులో సాగర్ కింద సాగు చేసిన రబీల పంటలకు కొన్ని విడతల్లో నీటి సరఫరా జరగ్గా, మరింత నీటిని సరఫరా చేయాల్సి ఉంది. హైదరాబాద్కు 8 టీఎంసీలు అవసరం హైదరాబాద్ అవసరాలకు నెలకు 1.8 టీఎంసీల చొప్పున సాగర్ నుంచే విడుదల చేయాల్సి ఉంది. జూన్లో వర్షాలు కురిసి ప్రవాహాలు మొదలయ్యే వరకు తాగునీటికి 8 టీఎంసీలైనా అవసరం ఉంటుంది. ప్రస్తుతం కనీస నీటి మట్టానికి ఎగువన ఉన్న నీటితో ఈ అవసరాలను తీర్చడం సాధ్యం కానందు న కచ్చితంగా కనీస నీటి మట్టాలకు దిగువ నుంచి నీటిని తీసుకోవాల్సిందే. కిందటేడాది సైతం ఇదే రీతిన 503 అడుగుల వరకు వెళ్లి నీటిని తీసుకున్నారు. ఈ ఏడాది సైతం అదే పరిస్థితి ఎదురయ్యేలా ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకొనే కనీస నీటి మట్టాలను నిర్వహిం చాలన్న హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బీ వినతిని నీటిపారుదలశాఖ తోసిపుచ్చింది. ప్రస్తుతం ఉన్న నీటిని జూన్ వరకు కాపాడటం కష్టతర మని, ఈ దృష్ట్యా వేసవి కాలానికి ముందు గానే పంపులను కిందికి దించే ఏర్పాట్లు చేసుకోవాలని సూచించింది. -
అవసరమైన సిబ్బంది వివరాలివ్వండి...
జూరాల, సింగూరు భద్రతపై కదిలిన నీటిపారుదల శాఖ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రధాన సాగు, తాగు నీటి ప్రాజెక్టులైన జూరాల, సింగూరు డ్యామ్ల నిర్వహణ విషయంలో నీటిపారుదల శాఖ నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందంటూ ఫిబ్రవరి 20న ‘సాక్షి’ పత్రికలో ప్రచురితమైన కథనంపై ఆ శాఖ అధికారులు స్పందించారు. ఈ డ్యామ్ల భద్రతకు పెద్దపీట వేయాల్సిన నీటి పారుదల శాఖ అధికారులు వాటి నిర్వహణ, అందుకు తీసుకోవా ల్సిన చర్యల విషయంలో నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్న అంశంపై ఈఎన్సీ మురళీధర్ సోమవారం సంబంధిత వెకానికల్ అండ్ వర్క్స్ సూపరింటెండెంట్ ఇంజనీర్ వివరణ కోరారు. ప్రాజెక్టుల పరిధిలో ప్రస్తుతం ఉన్న గేట్లు, క్రేన్స్, జనరేటర్ల వివరాలు అడిగారు. గ్రీజింగ్, వెల్డింగ్, గేట్ల నిర్వహణకు అవసరమైన సిబ్బంది గురించి కూడా వివరాలు కోరినట్లు నీటి పారుదల శాఖ వర్గాల ద్వారా తెలిసింది. కాగా జూరాల పరిధిలో వర్క్ ఇన్స్పెక్టర్, గేటు ఆపరేట్లర్లు, ఫిట్టర్లు, ఎలక్ట్రీషియన్లు, వాచ్మెన్లు, ఆపరేటర్లు కలిపి మొత్తంగా 19మంది వరకు అవసరం ఉండగా.. ప్రస్తుతం ఒక్క ఉద్యోగి కూడా అక్కడ లేడు. సింగూరు పరిధిలోనూ 13 మంది సిబ్బంది అవసరం ఉండగా ఒక హెల్పర్, ఇద్దరు వాచ్మెన్లు మాత్రమే ఉన్నారు. ఇదే విషయాన్ని ‘సాక్షి’ నీటిపారుదల శాఖ దృష్టికి తెచ్చింది. -
సంతకాలు సగమే
పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకానికి ఆది నుంచీ అవాంతరాలు సంతకాలకు దూరంగా çసగం మంది సీతానగరం: పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం నిర్మాణానికి ఆది నుంచీ అవాంతరాలు ఎదురవుతూనే ఉన్నాయి. అంతా సాఫీగా సాగిపోతోందని ... రైతులంతా పూర్తి అంగీకారంగా ఉన్నారని ‘దేశం’ నేతలు ... అధికారులు ఓ వైపు చెబుతున్నా ఇంకోవైపు సగం మంది రైతుల నుంచి కూడా అంగీకార పత్రాలు చేతికి రాకపోవడంతో ప్రభుత్వ వర్గాల్లో ఆందోళన నెలకొంది. పలు పథకాల్లో తమ భూములను కోల్పోయామని, ఉన్న కొద్దిపాటి భూములు ఇచ్చేది లేదని ఎదురుతిరిగి పైప్లై¯ŒS మార్గంలో భూసేకరణ నిమిత్తం చేపట్టిన సర్వేలను అడ్డుకున్నారు. రాజకీయ ఒత్తిడితో, అధికారుల బెదిరింపులతో సగం మంది రైతులు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. పథకంలో పురుషోత్తపట్నం, రామచంద్రపురం, వంగలపూడి, చినకొండేపూడి, నాగంపల్లి రైతులున్నారు. మొత్తం రైతులు 321 మంది ఉండగా, 203.62 ఎకరాలు భూసేకరణలో ఉంది. ఇప్పటికి 206 మంది రైతులు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. తొలుత భూ సర్వేను రైతులు అడ్డుకుని నిలిపివేయడంతో జిల్లా కలెక్టర్ సమావేశం నిర్వహించి రైతులతో సంప్రదించగా భూసర్వే సక్రమంగా జరిగింది. పరిహారం విషయంలో పలు సమావేశాలు, చర్చలు అనంతరం రూ.28 లక్షలు అందిస్తామని, నాగంపల్లి రెవెన్యూలో రూ.24 లక్షలు అందించడానికి అధికారులు, ప్రజాప్రతినిధులు రైతులను ఒప్పించారు. దీంతో 206 మంది రైతులు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. మిగిలిన 115 మంది రైతులు సంతకాలు చేయలేదు. వీరికి అధికారులు, ప్రజాప్రతినిధులు బుజ్జగింపు చర్యలు చేపట్టారని సమాచారం. రూ.28 లక్షలు నష్టదాయకమే... ప్రభుత్వం రైతులపై ఒత్తిడి తెచ్చి పరిహారం పెంచామని చెప్పి రూ.28 లక్షలు అందించడం కూడా కొంతమంది రైతులకు రుచించడం లేదు. మార్కెట్ ధర కూడా ప్రభుత్వం అందించడం లేదని, ఎకరానికి రూ.50 లక్షలు అందించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. సగానికి పైగా ఒప్పంద పత్రాలపై సంతకాలు చేసిన రైతులకు పరిహారం మార్చి నెలాఖరుకు అందించే అవకాశం ఉంది. భూ సేకరణ చట్టం ప్రకారం రూ.28 లక్షలు వస్తుందని, అదనంగా ఫల వృక్షాలకు, బోరులకు ధర చెల్లించాల్సి ఉంటుందని, రైతులకు పెంచి ఇచ్చింది ఏమీ లేదని రైతులు అభిప్రాయపడుతున్నారు. కోర్టును ఆశ్రయించే దిశగా అడుగులు.. ఒప్పంద పత్రాలపై సంతకాలు చేయని రైతులు త్వరలో కోర్టును ఆశ్రయించేందుకు కసరత్తు చేస్తున్నారు. తెలంగాణలో రెండు ప్రముఖ ప్రాజెక్టులకు స్టే తీసుకువచ్చిన తెలంగాణా న్యాయవాదులను రైతులు సంప్రదిస్తున్నట్టు తెలుస్తోంది. -
ఇందిర ‘జలభ్రమ’
ఐదేళ్లుగా నత్తనడకన పనులు వేసిన బోర్లు 873.. పని చేస్తున్నవి వందలోపే.. విద్యుత్ కనెక్షన్లు, మోటర్ల బిగింపు అంతంతే.. అమలుకు అడ్డంకిగా..విద్యుత్శాఖ తీరు, నిధుల మంజూరు ఆదిలాబాద్ అర్బన్ : బీడు భూముల్లోనూ రతనాలు పండించవచ్చని ఆశించిన రైతన్నకు నిరాశే ఎదురవుతోంది. దళితులు, గిరిజనులను సాగుదారులుగా చేయడంతో పాటు తోడ్పాటు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇందిర జలప్రభ పథకం లక్ష్యాన్ని చేరుకోవడం లేదు. ఉపాధి హామీ, నాబార్డు నిధులతో చేపట్టే ఈ కార్యక్రమం ఐదేళ్లు గడచినా నత్తనడకన పనులతో ముందుకు సాగని పరిస్థితి. పలుమార్లు జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో చర్చించినా పురోగతి లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. జిల్లాలో ఇదీ పరిస్థితి.. జిల్లా వ్యాప్తంగా ఉన్న భూములను కొన్ని బ్లాకులుగా విభజించారు. వీటి ద్వారా ఇందిర జలప్రభ కింద వ్యవసాయ భూముల్లో బోర్లు వేయాలని నిర్ణయించారు. ఇలా జిల్లాలో ప్రస్తుతం ఉన్న 18 మండలాల్లో ఈ పథ కం కింద వ్యవసాయ భూముల్లో బోర్ల తవ్వకాలు జరిపారు. అధికారులు వేసిన బోర్లలో మొత్తం 873 బోర్ల విజయవంతమై పుష్కలంగా నీళ్లు పడ్డాయి. వీటన్నింటికీ విద్యుత్ కనెక్షన్లు ఇచ్చి మోటర్లు బిగించి వ్యవసాయ భూముల్లో సాగు నీరు పారియాల్సి ఉంది. జిల్లా వ్యాప్తంగా 873 బోర్ల విజయవంతమైతే అందులోంచి 730 బోర్లకు విద్యుత్ కనెక్షన్లు ఇవ్వాలని సంబంధిత అధికారులు విద్యుత్ శాఖకు నివేదించారు. సంబంధిత అధికారులు కేవలం 587 బోర్లకు మాత్రమే విద్యుత్ కనెక్షన్లు ఇచ్చారు. మిగతా 143 బోర్లకు కనెక్షన్లు ఇవ్వాల్సి ఉందని అధికారుల వద్ద ఉన్న లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. ఇక విద్యుత్ కనెక్షన్లు ఇచ్చిన 398 బోర్లకు మాత్రమే మోటర్లు బిగించారు. ఇందులోనూ వందలోపే ప్రస్తుతం పని చేస్తున్నాయని అధికారుల వద్ద సమచారం ఉంది. జిల్లా వ్యాప్తంగా సుమారు రూ.12.75 కోట్లకుపైగా ఖర్చు చేసి దాదాపు 50వేల ఎకరాల భూమిని సాగులోకి తీసుకురావాలని లక్ష్యంగా నిర్ణయించారు. కానీ విద్యుత్ శాఖ ద్వారా చేపడుతున్న పనుల్లో జాప్యంతో సాగుదారులుగా మారనున్న రైతుల ఆశలు ఆవిరవుతున్నాయి. దీనికితోడు ప్రభుత్వం కూడా ఈ పథకానికి సరైన సమయంలో నిధులు విడుదల చేయకపోవడంతో మరింత వెనుకబడింది. పథకం పూర్తికి ఇంకెంత కాలం పడుతుందని, బీడు భూముల్లో వ్యవసాయం చేసుకునేదెప్పుడోనని లబ్ధిదారులు ఆశగా ఎదురుచూస్తున్నారు. సాగుదారులుగా మారేదెప్పుడో.. దళిత, గిరిజన రైతులు సాగుదారులుగా మారే పరిస్థితి ఇప్పట్లో కన్పించడం లేదు. ప్రస్తుతం ప్రభుత్వం పంపిణీ చేసిన భూములకే సాగునీరు అందక పంటలు ఎండిపోయే పరిస్థితి ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా బోర్లు వేసినా.. వాటికి పూర్తి స్థాయిలో విద్యుత్ కనెక్షన్లు, మోటర్లు బిగించకపోవడంతో పథకం సత్ఫలితాలు కన్పించడం లేదు. సాగునీరందక వ్యవసాయ భూములు సైతం బీడుగా మారి నష్టాల పాలవుతున్నామని రైతులు వాపోతున్నారు. ఇదిలా ఉండగా, జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో ఈ పథకంపై పలుసార్లు చర్చించారు. ముందుగా వేసిన బోర్లకు విద్యుత్ కనెక్షన్లు ఇచ్చి, మోటర్లు బిగించడం వంటి పనులు పూర్తి చేయాలని నిర్ణయించారు. పనులు పూర్తయ్యే వరకు కొత్తగా బోర్లు వేయరాదని జిల్లా మంత్రులు గతంలో అధికారులకు సూచించడంతో అప్పటి నుంచి కొత్త బోర్ల తవ్వకాలు నిలిచిపోయాయి. విద్యుత్ శాఖ పనులు పూర్తయితేనే మిగతా బోర్లకు ప్రభుత్వం నిధులు విడుదల చేసే అవకాశం ఉన్నట్లు భావించారు. కాగా, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో పథకం ‘ఇందిరా జలభ్రమ’గా మారిందని పలువురు పేర్కొనడం గమనార్హం. -
ముఖ్యమంత్రి కాదు.. ముఖ్య‘కంత్రి’!
కేరళలో తెలుగు రైతుల భిక్షాటన.. సీఎం సిగ్గుతో తలదించుకోవాలి ఉరవకొండ ‘మహాధర్నా’లో చంద్రబాబుపై వైఎస్ జగన్ ఫైర్.. హంద్రీనీవా కోసం దశాబ్దాల పోరాటం ♦ వైఎస్ హయాంలోనే 90% పనులు పూర్తి ♦ మూడేళ్లలో మిగిలిన 10% చేయలేదు ♦ డిస్ట్రిబ్యూటరీలు పూర్తి చేస్తే అనంతలో 1.18లక్షల ఎకరాలకు నీరు ♦ హంద్రీనీవాకు రెండుసార్లు బాబు శంకుస్థాపన ♦ కాంట్రాక్టర్లు, కమీషన్లపైనే ఆయన దృష్టి ♦ పట్టిసీమపై పచ్చి అబద్దాలు.. సీమకే కాదు డెల్టాకూ అన్యాయం సాక్షిప్రతినిధి, అనంతపురం: ‘‘వలసలు, ఆత్మహత్యలు అధికంగా ఉన్న జిల్లా ఏదైనా ఉందంటే అది అనంతపురమే! రాజస్తాన్లోని జైసల్మీర్ కంటే అధ్వాన్న పరిస్థితులు ఉన్నాయి. పదిమందికి అన్నం పెట్టే రైతులు కేరళ వీధుల్లో నిలబడి భిక్షమెత్తుకుంటున్నారంటే చంద్రబాబు సిగ్గుతో తలదించుకోవాలి. హంద్రీ–నీవా ఫేజ్–1లో డిస్ట్రిబ్యూటరీలు పూర్తిచేస్తే 1.18లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది. పొలాలు సస్యశ్యామలం అవుతాయి. చంద్రబాబు మాత్రం రైతుల శ్రేయస్సు విస్మరించి కాంట్రాక్టర్ల కోసం, కమిషన్ల కోసం కక్కుర్తిపడుతున్నారు. అబద్దాలతో వంచిస్తున్నారు. ఇలాంటి వ్యక్తిని ముఖ్యమంత్రి అనడం కంటే ముఖ్య ‘కంత్రి’ అనాలి.’ అని ప్రతిపక్షనేత, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. హంద్రీ–నీవా ద్వారా ఆయకట్టుకు నీరివ్వాలనే డిమాండ్తో సోమవారం ఉరవకొండలోని క్లాక్టవర్ సర్కిల్లో వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు శంకర్నారాయణ అధ్యక్షతన జరిగిన ధర్నాలో జగన్మోహన్రెడ్డి పాల్గొని ప్రసంగించారు. ప్రసంగం ఆయన మాటల్లోనే... ‘‘నిత్యం కరువు, కాటకాలతో అల్లాడుతున్న ‘అనంత’ ను ఆదుకునేందుకు ‘హంద్రీ–నీవా సుజల స్రవంతి’ ఒక్కటే సంజీవని అని దశాబ్దాలుగా పోరాటాలు చేస్తు న్నాం. ప్రాజెక్టు కోసం ఆరాటపడుతున్నాం. శ్రీశైలం నుంచి 40టీఎంసీలను రాయలసీమకు రప్పించి నాలుగు జిల్లాలలో 6 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు రూ. 6,850కోట్లతో దివంగత సీఎం వైఎస్రాజశేఖరరెడ్డి ప్రాజెక్టును చేపట్టారు. వైఎస్ హయాంలో రూ.4వేలకోట్లకుపైగా ఖర్చుచేసి ఫేజ్–1 లో 90శాతం పనులు పూర్తి చేశారు. తక్కిన 10శాతం డిస్ట్రిబ్యూటరీ కాలువల పనులను పూర్తి చేస్తే 1.18లక్షల ఎకరాలకు సాగునీరు, 10లక్షలమందికి తాగునీరు అందేది. అందులో ఉరవకొండ నియోజకవర్గంలోనే 80వేల ఎకరాలకు సాగునీరు అందేది. కానీ మూడేళ్లలో ఈ 10శాతం పనులు కూడా చంద్రబాబు పూర్తి చేయలేదు. చంద్రబాబు తాను 9ఏళ్లు సీఎంగా ఉన్న కాలంలో కేవలం రూ.24 కోట్లు కేటాయించి చేతులు దులుపుకున్నారు. ఆ కాలంలో ఒక కిలోమీటరు కాలువ కానీ, ఒక లిఫ్ట్ లేదా ఒక ఇటుక కానీ పెట్టిన పాపాన పోలేదు. కానీ 1996 ఎన్నికల్లో ఉరవకొండకు వచ్చి 40టీఎంసీల హంద్రీ–నీవాను 5.5 టీఎంసీలకు కుదించి శంకు స్థాపన చేశారు. కనీసం అదీ పూర్తిచేయ లేదు. మళ్లీ సిగ్గులేకుండా 1999లో ఎన్నికలొచ్చినపు డు రాప్తాడు నియోజకవర్గంలోని ఆత్మకూరులో మళ్లీ రెండోసారి శంకుస్థాపన చేశారు. ఎన్నికలొచ్చినపుడ ల్లా వచ్చి ప్రాజెక్టుకు టెంకాయ కొడతాడు. ఎన్నికల తర్వాత ప్రజలతో, హంద్రీ–నీవాతో నాకేం పని, అనంతపురం రైతులు ఎటుపోతే నాకేమి అన్నట్లు వదిలేస్తాడు. అది ఆయన ‘మనసులో మాట’ చంద్రబాబుకు రైతులపై ఏమాత్రం ప్రేమలేదు. నీటిపారుదలపై అంతకంటే ప్రేమలేదు. 9ఏళ్ల సీఎంగా ఉన్న కాలంలో ‘మనసులోమాట’ అని పుస్తకం రాశారు. అందులో చంద్రబాబు రాసిందేమిటో తెలుసా? ప్రభుత్వం నీటిపారుదల మీద కోట్లు ఖర్చుపెడితే, ప్రభుత్వానికి రైతుల నుంచి వచ్చే నీటి తీరువా లక్షల్లో మాత్రమే ఉంటుంది. కాబట్టి ప్రాజెక్టులు నిర్మించడం వృథా అని తన మనసులో మాటను పుస్తకంలో రాశారు. అంత గొప్ప ముఖ్యమంత్రి చంద్రబాబు. హంద్రీ–నీవా ప్రాజెక్టుపై ధ్యాస ఉంటే ప్రాజెక్టు పూర్తి కావాలంటే రూ.2వేల కోట్లు కేటాయించాలి. యుద్ధప్రాతిపదికన పనులు పూర్తి చేయాలి. కానీ బాబు కేటాయింపులు చూస్తే 2014–15లో రూ.100 కోట్లు మాత్రమే. 2015–16లో రూ.380 కోట్లు మాత్రమే. 2016–17కు రూ.504కోట్లు మాత్రమే కేటాయించారు. ఈ ఏడాది ఆగస్టు నుంచి డిసెంబర్ వరకూ హంద్రీనీవాలో మోటర్లకు 5నెలల కరెంటు బిల్లు రూ.359కోట్లు. కేటాయించిన మొత్తంలో బిల్లులు చెల్లిస్తే తక్కిన డబ్బులతో ప్రాజెక్టులు ఎలా నిర్మిస్తారు? ప్రాజెక్టులపై బాబుకు ధ్యాసలేదు. పూర్తి చేయాలనే ఆలోచనలేదు. కాంట్రాక్టర్లతో లాలూచీ పడి, కమిషన్లు ఎలా తీసుకోవాలా అని కుమ్మక్కవుతాడు. హంద్రీ–నీవా 36వ ప్యాకేజీలో రూ.35కోట్ల పనులు పెండింగ్లో ఉన్నాయి. ఆ పెండింగ్ పనులకు రీఎస్టిమేట్ చేయించి రూ.363కోట్లకు అంచనాలు పెంచి తన అస్మదీయులకు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. జీఎన్ఎస్ఎస్ 23ప్యాకేజీలో రూ.11కోట్ల పనులు మిగిలిపోతే వీటిని అంచనాలను రూ.110కోట్లకు పెంచి తనకు కావల్సిన వాళ్లకు, బినామీలకు కట్టబెట్టి కమిషన్లు తీసుకునేందుకు కక్కుర్తి పడుతున్నారు. ముందు ఎలక్షన్.. ఆపై కలెక్షన్ల మేనిఫెస్టో.. ఎన్నికలకు ముందు ప్రజలను ఎంత చక్కగా మోసం చేయగలం అనే అంశాలపై అధ్యయనం చేసి ఎన్నికల మేనిఫెస్టోను రూపొందిస్తారు. ఎన్నికల తర్వాత ‘కలెక్షన్ మేనిఫెస్టో’ ముందుకొస్తుంది. మల్యాలకు వెళ్లి అదేదో ఆయనే ప్రాజెక్టు కట్టినట్లు నిలబడి ఫోజులిస్తారు. ‘అనంత’కు వచ్చిన ప్రతీసారి ‘అదిగో హంద్రీ–నీవా! నా కలలోకి వస్తోంది. తీవ్రంగా కష్టపడుతాను అంటూ ఇక్కడే మంచం వేసుకుని పడుకుంటా!’ అంటారు. నిజానికి వైఎస్ హయాంలో ఫేజ్–1, 90శాతం పూర్తయింది. 2012లో అప్పటి సీఎం కిరణ్కుమార్రెడ్డి జీడిపల్లి వద్ద రిజర్వాయర్ను ప్రారంభించి జాతికి అంకితం చేశాడు. ఇవన్నీ ప్రజలు మరిచిపోయారని తిరిగి చంద్రబాబు వచ్చి రిబ్బన్ కటింగ్ చేస్తున్నారు. ప్రాజెక్టులు కట్టినోళ్లు గొప్పోళ్లా? ప్రాజెక్టు గేట్లు ఎత్తే లష్కర్లు గొప్పోళ్లా అని అడుగుతున్నా? మోసం చేయడంలో చంద్రబాబు పీహెచ్డీ తీసుకున్నారు. నాడు వ్యతిరేకించిన వ్యక్తి ఇరిగేషన్ మంత్రి.. రాయలసీమ, ప్రకాశం, నెల్లూరులోని తీవ్ర కరువు పరిస్థితులు దృష్టిలో ఉంచుకుని పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యాన్ని 11వేల క్యూసెక్కుల నుంచి 55వేల క్యూసెక్కులకు పెంచి 85శాతం పనులు వైఎస్సార్ పూర్తిచే శారు. మిగిలిన 15శాతం పనులు ఇప్పటికీ పూర్తికాలేదు. జీఎన్ఎస్ఎస్, వెలిగొండ ఏ ప్రాజెక్టు తీసుకున్నా పెండింగే! బాబు కేబినెట్లోని ఇరిగేషన్ మంత్రి బొంకడంలో బాబు కంటే నాలుగురెట్లు ఎక్కువ పీహెచ్డీలు చేశారు. పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంచడాన్ని వ్యతిరేకిస్తూ ప్రకాశం బ్యారేజీ వద్ద ధర్నా చేసిన వ్యక్తి ఇవాళ చంద్రబాబు కేబినెట్లో నీటిపారుదల శాఖ మంత్రి. వీరికి సీమ, ప్రకాశం, నెల్లూరుపై ప్రేమ ఉందని మనకు కథలు చెబుతారు. రైతులు భిక్షమెత్తుతున్నా పట్టించుకున్నారా? ‘అనంత’ నుంచి 4.50లక్షలమంది రైతులు, రైతుకూలీలు కేరళ, తమిళనాడు, కర్నాటకకు వలసపోయారు. కేరళలో రైతులు నడిరోడ్డున నిల్చొని మాకు భిక్షం వేయండని అడుతున్నారంటే చంద్రబాబు సిగ్గుతో తలదించుకోవాలి. ఉపాధిహామీ పథకం పనులు ఇవ్వరు. వైఎస్ హయాంలో లేబర్ కాంపొనెంట్కు (కూలీల కోసం) 98 శాతం నిధులు ఖర్చు చేసేవారు. ప్రతి ఒక్కరికీ పని దక్కేది. వంద నుంచి 150రోజులు పనిదినాలు కల్పించారు. కానీ ఇప్పుడు లేబర్ కాంపొనెంట్ను 40శాతానికి తగ్గించారు. వలసలు పోతున్నా, కేరళలో అడుక్కుంటున్నారని తెలిసినా బాబు ఏమాత్రం పట్టించుకునే పాపాన పోలేదు. బాబు పుణ్యాన రైతుల పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. సీమలో ఒకమాట...డెల్టాలో మరోమాట.. రాయలసీమ, నెల్లూరు, ప్రకాశంలో ఉన్నపుడు పట్టిసీమ నిర్మించి 45 టీఎంసీల నీటిని ‘సీమ’కు ఇస్తున్నా అంటారు. కానీ పట్టిసీమ ద్వారా డెల్టాకు ఇచ్చే 45 టీఎంసీల మేర నీటిని శ్రీశైలం నుంచి తీసుకోవచ్చని జీవో మాత్రం ఇవ్వరు. ఇదే వ్యక్తి డెల్టాలో పర్యటిస్తే పట్టిసీమ కట్టాను. 45 టీఎంసీలు తెచ్చి ఇక్కడ పంటలు కాపాడాను అంటాడు. ఇదే వ్యక్తి పులిచెంతల ప్రాజెక్టులో ఆర్అండ్ఆర్ ప్యాకేజీ కింద తెలంగాణ వారికి పరిహారం ఇస్తే 45 టీఎంసీల నీటిని స్టోరేజ్ చేసుకోవచ్చనేది తెలీదు. కానీ చేయరు. పట్టిసీమ ద్వారా 45 టీఎంసీల నీరు తెస్తే.. ప్రకాశం బ్యారేజీ నుంచి 55 టీఎంసీలు సముద్రం పాలయ్యాయి. దాని గురించి చెప్పడు. నమ్మేవాళ్లుండాలి గానీ.. చంద్రబాబును నమ్మేవారు ఉండాలే కానీ, హంద్రీ–నీవా ద్వారా శ్రీకాకుళానికి నీళ్లిస్తానంటారు. జీఎన్ఎస్ఎస్ ద్వారా ఆఫ్రికాకు, అక్కడి నుండి కాలువలు తవ్వి అమెరికాకు నీళ్లిస్తాననగలడు. అధికారం కోసం సొంతమామను వెన్నుపోటు పొడవగలడు. ఎన్నికలపుడు అదే ఎన్టీఆర్ విగ్రహాలకు దండ వేయగలడు. అంత గొప్పవ్యక్తి మన ముఖ్యమంత్రి. వైఎస్ పుణ్యమా అని ప్రాజెక్టులు ఒక కొలిక్కి వస్తే మిగిలిన పనులు పూర్తిచేయడు. పైగా కుళాయిలు తిప్పి తానే కట్టానంటాడు. వైఎస్ చనిపోయిన తర్వాత గ్రామగ్రామాన వైఎస్ విగ్రహాలు వచ్చాయి. కానీ బాబు మాత్రం భవిష్యత్తులో విగ్రహాలుండవేమో అని ఎవరూ గుర్తుంచుకోరేమో అని వైజాగ్ సమ్మిట్లో తన విగ్రహానికి తానే పూలమాల వేసుకున్నాడు. మంచి చేస్తే ప్రజలు గుర్తుంచుకుంటారు. ఇది వైఎస్ పాలసీ. మంచిచేసినా చేయకపోయినా ప్రచారం చేస్తే చాలనేది చంద్రబాబు పాలసీ. ప్రజలు వైఎస్ను, చంద్రబాబు ఇద్దరినీ గుర్తుంచుకుంటారు. ఎక్కడైనా నీళ్లు కన్పిస్తే వైఎస్ గుర్తుకు వస్తాడు. మోసం, కరువు కన్పిస్తే చంద్రబాబు పేరు గుర్తుకు వస్తుంది. రెండేళ్లలో హంద్రీ–నీవా పూర్తిచేస్తాం.. మీటింగ్ అయిన తర్వాత సాయంత్రం ఐదారుగురు మంత్రులు టీవీల ముందుకొస్తారు. మంత్రులు నన్ను తిట్టడానికి కాదు, ప్రజల ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలి. హంద్రీ–నీవా ప్రాజెక్టు పూర్తి చేయకపోతే రైతులు, దేవుడు మొట్టికాయలు వేస్తారు. ప్రాజెక్టు పూర్తి చేయకపోతే పోరాటం ఆపేది లేదు. ఒక్క ఏడాది పోతే ఎన్నికల సంవత్సరం వస్తుంది. ఆ తర్వాత మన ప్రభుత్వం వస్తుంది. రెండేళ్లు సమయం ఇవ్వండి. హంద్రీ–నీవా పూర్తి చేసి చూపిస్తా!’’ అని జగన్మోహన్రెడ్డి అన్నారు. నయవంచన.. దురాశ.. దుర్మార్గం.. దుష్టత్వం ‘‘రాజకీయాల్లో ఒక్కో నాయకుడికి ఒక్కో విశిష్టత ఉంటుంది. గుణగణాలు ఉంటాయి. చంద్రబాబుకు ఉన్న గుణగణాలు ఏవంటే ఆయన సీఎం అవడంతోనే ఆయనతో పాటు కరువొస్తుంది. కరువొచ్చినా ఇన్సురెన్స్, ఇన్పుట్సబ్సిడీ అంతంతమాత్రమే వస్తాయి. రుణాలు మాఫీ కావు. కొత్త రుణాలు రావు. చంద్రబాబు మాత్రం రెయిన్గన్స్ అంటాడు. వర్షంతో యుద్ధం అంటాడు. నాలుగురోజుల్లో కరువును జయించా అని చెబుతాడు. బాబులో ఇంకా చాలా గుణగణాలు ఉన్నాయి. కేంద్రంతో ఎప్పుడూ స్నేహం చేస్తాడు. రాష్ట్రంతో యుద్ధం చేస్తాడు. రాష్ట్రప్రయోజనాలను తాకట్టుపెడతాడు. కాంట్రాక్టర్లతో స్నేహం చేస్తాడు. రైతులతో యుద్దం చేస్తాడు. కాంట్రాక్టర్లతో కమిషన్లు తీసుకుంటారు. రైతులకు నీళ్లివ్వరు. ఎన్టీఆర్తో కయ్యమాడుతారు ...బాలకృష్ణతో వియ్యమాడుతాడు. మోదీ బలహీనంగా ఉన్నపుడు ఢీ అంటాడు. మోదీ బలంగా ఉన్నపుడు కాళ్లుపట్టుకుని రాష్ట్రాన్ని తాకట్టుపెడతాడు. కేసీఆర్ను అందితే జట్టుపట్టుకుంటారు. దొరికిపోతే కేసీఆర్ కాళ్లు పట్టుకుంటారు. కృష్ణా, గోదావరి నుంచి పై నుంచి ఆ రాష్ట్రం నీళ్లు తీసుకెళుతుంటే ప్రశ్నించరు. కోతలు కొండంత కోస్తారు. చేతలు ఆవగింజంత చేయరు. తమ పార్టీ తెలుగుదేశం అంటారు. రోజు విదేశాల్లో కన్పిస్తారు. ఒకరోజు సింగపూర్, దావోస్, చైనా, జపాన్ అంటారు. ఎక్కడికి వెళితే ఆ దేశాన్ని తీసుకొస్తా అంటారు. అవినీతిపై యుద్దం అని చెవుల్లో కాలిఫ్లవర్ పెడతారు. గుడిభూములను కూడా వదలకుండా అవినీతి చేస్తారు. ఇలాంటి వాడిని ముఖ్యమంత్రి అంటారా ముఖ్య కంత్రీ అంటారా మీరే చెప్పాలి. ఈయన గుణగణాలను చెప్పాల్సి వస్తే మోసం, కుతంత్రం, నయవంచన, అవినీతి, దురాశ, దుర్మార్గం, దుష్టత్వం, ప్రమాదం... ఇలాంటి దుర్గుణాలన్నీ ఒకే మనిషిలోఉన్నాయంటే అది చంద్రబాబులోనే కన్పిస్తాయి. ఇవన్నీ ఉన్నా నిరంతరం అబద్దాలాడుతారు. -
శాఖల మధ్య స్థలవివాదం
మాదంటే మాది అంటున్న ఆర్టీసీ, ఇరిగేషన్ పరిశీలన చేసి నివేదికకు ఆదేశించిన జేసీ అన్నవరం : అన్నవరం ఆర్టీసీ బస్టాండ్ పక్కన గల ఖాళీ స్థలం వివాదం మరోసారి వెలుగులోకి వచ్చింది. అన్నవరం నడిబొడ్డులో మెయిన్రోడ్ పక్కన గల ఈ స్థలం రూ.కోట్లు విలువ చేస్తుంది. ఈ స్థలంపై ఆర్టీసీ, ఇరిగేషన్ శాఖల మధ్య వివాదం నెలకొనడంతో ఖాళీ స్థలాన్ని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్.సత్యనారాయణ బుధవారం పరిశీలించారు. ఆ స్థలం తమదేనని ఆర్టీసీ అధికారులు అంటుండగా కాదు అది ఇరిగేషన్శాఖదని ఎవరికీ బదలాయించలేదని ఆ శాఖ అధికారులు చెబుతున్నారు. దీంతో ఆ స్థలం పై రెండు శాఖల మధ్య వివాదం ఏర్పడింది. పెద్దాపురం ఆర్డీఓ విశ్వేశ్వరరావు, శంఖవరం తహసీల్దార్ వెంకట్రావు తదితరులు జేసీ వెంట ఉన్నారు. ఈ స్థలం వాస్తవ పరిస్థితిపై నివేదిక ఇవ్వమని రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులను జేసీ ఆదేశించారని ఆర్డీఓ ‘సాక్షి’కి తెలిపారు. ఆర్టీసీ లీజుకు ఇవ్వడంతో మొదలైన వివాదం ఆర్టీసీ బస్టాండ్ నిర్మాణానికి 2000 సంవత్సరంలో ఇరిగేషన్ శాఖ, అన్నవరం దేవస్థానం నుంచి సేకరించిన 2.38 ఎకరాల స్థలాన్ని రెవెన్యూ అధికారులు ఆర్టీసీకి అప్పగించారు. అందులో ఎకరం స్థలంలో ఆర్టీసీ బస్టాండ్ నిర్మాణం జరిగింది. మిగతా స్థలం ఖాళీగా ఉంది. ఆ ఖాళీగా ఉన్న స్థలంలో హోటల్ నిర్మాణం నిమిత్తం ఏపీఎస్ఆర్టీసీ అధికారులు గతేడాది స్విస్ చాలెంజ్ పద్ధతిలో ఓ కాంట్రాక్టర్కు 43 సంవత్సరాలు లీజుకు అప్పగించారు. ఆ స్థలంలో హోటల్ నిర్మాణానికి ఆ కాంట్రాక్టర్ శంకుస్థాపన చేయడంతో ఇరిగేషన్ శాఖ అభ్యంతరం చెప్పింది. ఆ స్థలం తమదేనని ఆర్టీసీకి అప్పగించలేదని తెలిపింది. దీంతో ఆ హోటల్ నిర్మాణం ఆగిపోయింది. తనకు ఆర్టీసీ స్థలం అప్పగించలేదని కాంట్రాక్టర్ కోర్టుకు వెళ్లడంతో దీనిపై నివేదిక ఇవ్వాలని కోర్టు రెవెన్యూ, ఇరిగేషన్ శాఖ అధికారులను ఆదేశించడంతో మళ్లీ ఈ వ్యవహారం వెలుగు చూసింది. మాకు అప్పగించినట్టు రికార్డు ఉంది ఆ ఖాళీ స్థలాన్ని తమకు అప్పగించినట్టు రికార్డులు ఉన్నాయి. అప్పుడు అప్పగించి ఇప్పుడు ఇవ్వలేదని ఇరిగేషన్ అధికారులు అంటే చెల్లదు. దీనిపై వివరణ ఇవ్వాలని ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులను ఆర్టీసీ ఉన్నతాధికారులు కోరారు. - డీఎస్ఎన్ రాజు, ఈఈ, ఆర్టీసీ ఆ స్థలాన్ని రెవెన్యూ శాఖకు అప్పగించలేదు ఆ స్థలాన్ని రెవెన్యూశాఖకు ఇరిగేషన్ శాఖ అప్పగించలేదు. రెవెన్యూ అధికారులు స్థలాన్ని అప్పగించినట్టు చెబితే అందుకు మేం భాద్యులం కాదు. ఈ వివాదంపై సంయుక్త పరిశీలన నిర్వహించమని జేసీ ఆదేశించినందున మా వద్ద ఉన్న రికార్డుల ప్రకారం నివేదిక అందజేస్తాం. - ఇరిగేషన్ డీఈ శేషగిరిరావు -
సాగునీటి కోసం ఐక్యంగా ఉద్యమిద్దాం
- వైఎస్ఆర్సీపీ శ్రీశైలం నియోజకవర్గ ఇన్చార్జ్ బుడ్డా శేషారెడ్డి వెలుగోడు: రబీ పంటలకు సాగునీటి సాధనకు పార్టీలకు అతీతంగా ఉద్యమిద్దామని వైఎస్ఆర్ సీపీ శ్రీశైలం నియోజకవర్గ ఇన్చార్జ్ బుడ్డా శేషారెడ్డి పిలుపునిచ్చారు. సాగునీటి సాధనకు చేపట్టాల్సిన కార్యాచరణ రూపొదించేందుకు బుధవారం స్థానిక తెలుగు గంగ అతిథి గృహం వద్ద రైతులు, రైతు సంఘాల నాయకులతో బుడ్డా శేషారెడ్డి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో వెలుగోడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లో 2 టీఎంసీల నీరు ఉన్నప్పుడే రబీ పంటలకు నీరు ఇచ్చారన్నారు. ప్రస్తుతం 6 టీఎంసీల నీరు ఉన్నా ఆయకట్టుకు ఇవ్వమని చెప్పడం దారుణమన్నారు. అధికార పార్టీ నేతల మాటలు నమ్మి రైతులు ఇప్పటికే ఎకరాకు రూ.10 నుంచి రూ.20 వేలు ఖర్చు చేసి వరి మడులు సాగు చేశారన్నారు. మరో పది రోజుల్లో నీరందకపోతే నారుమడులకు ఎండిపోతాయన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పోరాటమే శరణ్యమన్నారు. ప్రతి గ్రామంలో రైతు సంఘాలు ఏర్పాటు చేద్దామన్నారు. అనంతరం తెలుగుగంగ ఎస్ఈ రాఘవరెడ్డి, ఈఈ పుల్లారావులకు వేరు వేరుగా వినతిపత్రాలు అందజేశారు. సమావేశానికి వెలుగోడు, మహానంది, బండిఆత్మకూరు మండలాల రైతులు, రైతు సంఘాల నాయకులు పాల్గొన్నారు. -
ముదిరిన ఉద్యోగినుల వివాదం
ఆందోళనకు దిగిన దళిత సంఘ నాయకులు ధవళేశ్వరంలో ఇరిగేషన్ కార్యాలయాలు మూసివేత ధవళేశ్వరం: ఇరిగేషన్శాఖలో ఉద్యోగినుల మధ్య నెలకొన్న వివాదం తారస్థాయికి చేరింది. దళిత ఉద్యోగినికి అన్యాయం జరిగిందంటూ దళిత ఉద్యోగులు, దళిత సంఘ నాయకులు ఆందోళనకు దిగడంతో శనివారం ధవళేశ్వరంలోని ఇరిగేషన్ కార్యాలయాలన్నీ మూతపడ్డాయి. ధవళేశ్వరం తూర్పు డివిజన్ కార్యాలయంలో అసిస్టెంట్ టెక్నికల్ ఆఫీసర్గా పనిచేస్తున్న సునీతకు, జూనియర్ అసిస్టెంట్గా పని చేస్తున్న వాసుదేవికి మధ్య గత కొంత కాలంగా వివాదం నడుస్తోంది. దీనిపై గతంలో కార్యాలయంలో రాజీ ప్రయత్నాలు కూడా జరిగాయి. అయి నావివాదం మరింత ముదిరింది. ఇటీవల ధవళేశ్వరంలోని తల్లి ఇంటికి వెళ్తున్న వాసుదేవిపై బైక్పై వచ్చిన కొందరు దాడి చేశారు. సునీత వర్గీయులే తనపై దాడి చేశారని ఈ నెల 17న వాసుదేవి సునీత, మరో ఇద్దరిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై ధవళేశ్వరం పోలీసుస్టేషన్లో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదయింది. అయితే నేటి వరకూ వాసుదేవికి న్యాయం జరగ లేదంటూ దళిత ఉద్యోగులు, దళిత సంఘ నాయకులు శనివారం పెద్ద ఎత్తున తరలి వచ్చి ధవళేశ్వరం తూర్పు డివిజన్ కార్యాలయాన్ని ముట్టడించారు. కార్యాలయంలో దళిత ఉద్యోగికి అన్యాయం జరుగుతున్నా పట్టించుకోకపోవడం దారుణమని డివిజన్ ఈఈ అప్పలనాయుడిని నిలదీశారు. మరో ఉద్యోగి కుమారుడి ఆలనపాలన చూసుకోవాలని దళిత ఉద్యోగికి అప్పగిస్తున్నారంటే దళితులపై వివక్ష ఏమిటో అర్థమవుతుందని దళిత నాయకులు విప్పర్తి ఫణి,తలారి వరప్రసాద్, దేవదాసి రాంబాబు, గుర్రాల వెంకట్రావు తదితరులు ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై ఈఈ మాట్లాడుతూ ఘటనపై సునీతను వివరణ కోరామని, ఆమె నుంచి సమాధానం రావాల్సి ఉందని చెప్పారు. తనకు ఉద్యోగులందరూ సమానమేనన్నారు. దళిత నాయకుల ఆందోళనతో ఇరిగేషన్ కార్యాలయాలన్నీ మూతపడ్డాయి. ఆందోళనలో దళిత నాయకులు జంగా శ్యామ్, తలారి మూర్తి, దేవదాసి రమేష్, మురళి, పెద్ద సంఖ్యలో ఉద్యోగులు పాల్గొన్నారు. -
పల్లె కళకళ!
కామారెడ్డి : పల్లె తల్లివంటిదని, పట్నం ప్రియురాలివంటిదని అంటారు. పల్లెల్లో పనులు దొరకని పరిస్థితుల్లో పలువురు పట్టణాలకు వలస వెళ్లడం కనిపిస్తుంది. అయితే పట్టణాల్లో ఏదో ఒక పని దొరికినప్పటికీ అక్కడ బతకడం భారంగా ఉంటోంది. ఇంటి అద్దెతోపాటు పలు ఖర్చులుంటాయి. వచ్చే కూలి డబ్బులనూ ఆ ఖర్చులకే వెచ్చించాల్సి వస్తోంది. పట్టణాల్లోనూ సరైన పనులు లభించడం లేదు. దీంతో చాలా మంది స్వగ్రామాల్లో నివసించడానికే ఆసక్తి చూపుతున్నారు. పల్లెల్లోనే ఏదో ఒక పని చేసుకుని జీవించాలనుకుంటున్నారు. అందుకే ఎంతగా పట్టణీకరణ జరిగినా పల్లె జనాభా మాత్రం పెద్దగా తగ్గడం లేదు. జిల్లాల పునర్వ్యవస్థీకరణ తరువాత ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం నో యువర్ డిస్ట్రిక్ట్ పేరుతో గణాంకాలను విడుదల చేసింది. కామారెడ్డి జిల్లాలో 87.29 శాతం మంది పల్లెల్లోనే జీవిస్తున్నారని ఆ నివేదిక పేర్కొంటోంది. 12.71 శాతం మంది మాత్రమే పట్టణాల్లో నివసిస్తున్నారు. జిల్లాలో కామారెడ్డి మున్సిపాలిటీ మినహా పట్టణాలేవీ లేకపోవడంతో జనాభాలో అత్యధికం గ్రామీణ ప్రాంతంలోనే జీవిస్తోంది. కామారెడ్డి జిల్లాలో 323 పంచాయతీలు ఉండగా.. 478 రెవెన్యూ గ్రామాలు, వందకుపైగా గిరిజన తండాలు ఉన్నాయి. జిల్లా జనాభా 9,72,625 కాగా గ్రామీణ ప్రాంతాల్లో నివసించేవారు 8,49,003 మంది. పట్టణ ప్రాంతాల్లో నివసించేవారు 1,23,622 మంది ఉన్నారు. వ్యవసాయమే జీవనాధారం జిల్లాలో అత్యధికులు వ్యవసాయంపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో జీవించేవారిలో తొంభై శాతం మంది వ్యవసాయంపైనే ఆధారపడి ఉన్నారు. జిల్లాలో 1,33,267 మంది రైతులు ఉండగా 2,13,224 మంది వ్యవసాయ కూలీలు ఉన్నారు. 1,81,047 హెక్టార్లలో వ్యవసాయ భూములు ఉన్నాయి. వరి ప్రధాన పంట కాగా మక్క, సోయా, పప్పు దినుసులు, చెరుకు, పత్తి పంటలు సాగవుతాయి. జిల్లాలో వ్యవసాయంపైనే ఆధారపడినవారు అత్యధిక మంది ఉన్నా.. సరైన సాగునీటి వసతి లేని కారణంగా ఎక్కువగా వర్షాధారంగా భూగర్భ జలాలపై ఆధారపడి పంటలు సాగు చేస్తున్నారు. జిల్లాలో అధికారికంగా వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు 82,132 ఉండగా, అనధికారికంగా మరో 8 వేల కనెక్షన్లు ఉన్నట్లు తెలుస్తోంది. వర్షాభావ పరిస్థితులు ఏర్పడినప్పుడు ఈ ప్రాంత రైతులు తీవ్ర ఆటుపోట్లు ఎదుర్కొంటున్నారు. వ్యవసాయం తరువాత బీడీలే... జిల్లాలో వ్యవసాయం తరువాత ఎక్కువ మంది ఉపాధి పొందేది బీడీలపైనే. బీడీ పరిశ్రమకు కామారెడ్డి జిల్లా కేంద్రబిందువుగా ఉంది. ఇక్కడ ఎన్నో కంపెనీలు కొనసాగుతున్నాయి. జిల్లాలో 40 వేలపైచిలుకు బీడీ కార్మికులు ఉన్నారు. ఇందులో 90 శాతం మంది మహిళలే.. 28,715 మంది కార్మికులకు జీవన భృతి అందుతోంది. వివిధ కారణాలతో మరో 12 వేల మంది దాకా జీవనభృతి అందుకోలేకపోతున్నారు. ప్రభుత్వం పల్లెల అభివృద్ధిపై దృష్టి పెట్టి, సరైన ఉపాధి అవకాశాలు కల్పించాలని ప్రజలు కోరుతున్నారు. -
ఇక సాగునీటి వంతు
భీమవరం : జిల్లాలోని రైతులకు సాగునీటి ఇబ్బందులు తప్పడం లేదు. ఈ ఏడాది దాళ్వాలోనూ వంతులవారీ విధానం అమలు చేయాల్సిన పరిస్థితులు తలెత్తుతున్నాయి. ప్ర«ధానంగా డెల్టా ప్రాంతంలోని యలమంచిలి, పాలకొల్లు, ఆచంట, పెనుగొండ, పెనుమంట్ర, నరసాపురం, మొగల్తూరు మండలాల్లో సాగునీటి ఇబ్బందుల కారణంగా ఇప్పటివరకు 70 శాతం విస్తీర్ణంలో మాత్రమే వరినాట్లు పూర్తయ్యాయి. ఉండి వ్యవసాయ సబ్ డివిజన్ పరిధిలో 75 శాతం వరకు నాట్లు పడ్డాయి. ఇప్పటివరకు పాలకొల్లు మండలంలో 60 శాతం మాత్రమే నాట్లు పూర్తవగా, పోడూరు మండలంలో 80 శాతం, ఆచంట మండలంలో 70 శాతం, భీమవరం వ్యవసాయ డివిజన్ పరిధిలోని వీరవాసరం, భీమవరం, పాలకోడేరు మండలాల్లో 80 శాతం నాట్లు పూర్తయినట్టు అధికారిక గణాంకాలు సూచిస్తున్నాయి. జనవరి మొదటి వారానికే నాట్లు పూర్తి చేయాలని వ్యవసాయ అధికారులు విస్తృత ప్రచారం చేశారు. ఈ నెలాఖరు నాటికి గాని పూర్తిస్థాయిలో ఊడ్పులు అయ్యే అవకాశం లేదు. 5,100 క్యూసెక్కులతో సరి డెల్టాకు రోజూ 6 వేల క్యూసెక్కుల నీరు విడుదల చేస్తే సాగు సజావుగా సాగిపోతుంది. నీటి కొరత ఉండటంతో ప్రస్తుతం 5,100 క్యూసెక్కులు మాత్రమే విడుదల చేస్తున్నారు. దీనివల్ల శివారు ప్రాంతాలకు నీరందటం లేదు. సాగునీటికి ఇబ్బంది లేదని అధికారులు చెబుతున్నా శివారు భూములకు సక్రమంగా అందటం లేదని రైతులు చెబుతున్నారు. తొలి దశలోనే పరిస్థితి ఇలా ఉంటే కీలకమైన సమయాల్లో సాగునీటి పంపిణీ ఎలా ఉంటుందోనని ఆందోళన చెందుతున్నారు. గోదావరిలో లభ్యత 10 వేల క్యూసెక్కులే ప్రస్తుతం గోదావరిలో 10 వేల క్యూసెక్కుల నీరు మాత్రమే అందుబాటులో ఉంటోంది. ఉభయ గోదావరి జిల్లాల్లోని డెల్టాలకు 9,500 క్యూసెక్కుల నీటిని పంపిణీ చేస్తున్నారు. ఇప్పటికే సీలేరు నుంచి నీరు తీసుకోవాల్సిన పరిస్థితి ఉండటంతో రానున్న రోజుల్లో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని గుర్తించిన జల వనరుల శాఖ అధికారులు ఈనెల 10వ తేదీ నుంచి వంతుల వారీ విధానం అమలు చేయాలని నిర్ణయించారు. అయితే, చాలా ప్రాంతాల్లో నాట్లు పూర్తికాకపోవడంతో వంతుల వారీ విధానాన్ని సాగునీటి సంఘాలు, రైతులు వ్యతిరేకించారు. దీంతో ప్రస్తుతానికి అన్ని ప్రాంతాలకు సాధారణ పద్ధతిలోనే నీటిని పంపిణీ చేస్తున్నారు. ఈనెల 20వ తేదీ నాటికి నాట్లు వేసే ప్రక్రియ ఒక కొలిక్కి వస్తుందని.. ఆ తరువాత వంతులవారీ విధానాన్ని అమలు చేసేందుకు సన్నద్ధమవుతున్నామని జల వనరుల శాఖ అధికారులు చెబుతున్నారు. 20 తరువాత నిర్ణయం ప్రస్తుతం సాగునీటి సరఫరాకు ఎటువంటి ఇబ్బందులు లేవు. వంతులవారీ విధానాన్ని ఎప్పటినుంచి అమలు చేయాలనే దానిపై ఈనెల 20వ తేదీ తరువాత నిర్ణయం తీసుకుంటాం. 20వ తేదీ నాటికి రైతులంతా నాట్లు పూర్తి చేయాలని చెబుతున్నాం. – పొత్తూరి రామాంజనేయరాజు, చైర్మన్, పశ్చిమ డెల్టా ప్రాజెక్ట్ కమిటీ -
పాకాల.. ప్రత్యేక ప్రణాళిక...
అన్ని రంగాల్లో అభివృద్ధికి కలెక్టర్ చర్యలు ఇరిగేషన్ రంగంలో రూ.8కోట్లతో ప్రతిపాదనలు ఎకో టూరిజంతో పాటు జింకల పార్కు ఏర్పాటుకు రంగం సిద్ధం కాటేజీలు, విశ్రాంతి గృహం,బోట్ యూనిట్ కూడా.. పాకాల మీదుగా కొత్త రోడ్డుకు రూ.3కోట్లు హన్మకొండ :వరంగల్ రూరల్ జిల్లాను వ్యవసాయపరంగా అగ్రభాగంలో నిలబెట్టడమే కాకుండా ‘రైస్ బౌల్’గా పేరు తీసుకురావడంలో కీలక పాత్ర పోషిస్తున్న పాకాల సరస్సు అభివృద్ధికి అడుగులు పడుతున్నాయి. ప్రఖ్యాతి గాంచిన పాకాల సరస్సును నీటి పారుదల, పర్యాటకపరంగా అభివృద్ధి చేయడంతో పాటు పాకాల మీదుగా రోడ్డు రవాణా విషయంలోనూ మరిన్ని చర్యలు తీసుకుంటున్నారు. తద్వారా వరంగల్ రూరల్ జిల్లాకు సరికొత్త కళ రావడంతో పాటు 962 హెక్టార్ల విస్తీర్ణం కలిగి 3.2 టీఎంసీల నీటి నిల్వ సామర్ధ్యంతో 30వేల హెక్టార్లను సస్యశ్యామలం చేస్తున్న పాకాల సరస్సు మరింత ప్రఖ్యాతి చెందనుంది. సమీకృత అభివృద్ధి అత్యంత ప్రతిష్టాత్మక పాకాల సరస్సును అభివృద్ధి చేసేందుకు జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా ప్రత్యేక ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారు. ఇరిగేషన్, టూరిజం, అటవీ శాఖలతో కలిపి పాకాలను సమీకృత అభివృద్ధి దిశగా తీసుకువెళ్లేందుకు కార్యాచరణ రూపొంచారు. జిల్లా ఆవిర్భావం సమయంలోనే పాకాలను లక్నవరం సరస్సు స్థాయిలో అభివృద్ధి చేస్తామని చెప్పిన కలెక్టర్.. ఇందుకు సంబంధించి ఆచరణలో అడుగులు వేస్తున్నారు. అటవీ శాఖతో కలిసి.. పాకాల సరస్సును పర్యాటకపరంగా అభివృద్ధి చేసేందుకు పర్యాటక, అటవీ శాఖలను సమన్వయం చేస్తూ కలెక్టర్ ముందుకెళుతున్నారు. ఇందులో భాగంగా పాకాలలో ఎకో టూరిజం అభివృద్ధికి రంగం సిద్ధం చేశారు. పర్యాటకంలో భాగంగా వన్యప్రాణుల సంరక్షణకు ప్రాధాన్యం ఇస్తున్నారు. గతంలో వచ్చిన రూ.20లక్షలకు తోడు కలెక్టర్ ప్రత్యేకంగా మరో రూ.15లక్షలు కేటాయించి పాకాలా జింకల పార్క్ ఏర్పాటు కోసం మొత్తం రూ.35లక్షలు అటవీ శాఖకు మంజూరు ఇచ్చారు. మరోవైపు రూ.60లక్షలతో ఆరు కాటేజీలు, ఒక విశ్రాంతి గృహం, మరో బోట్ యూనిట్ ఏర్పాటు చేయనున్నారు. పెద్ద బోట్లు నడిపేందుకు వీలుగా బోటింగ్ పాయింట్ నిర్మించనున్నారు. అదేవిధంగా పర్యాటకుల వాహనాల పార్కింగ్కు ప్రత్యేక ఏర్పాట్లు చేయనున్నారు. అదేవిధంగా పర్యాటకులను మరింతగా ఆకర్షించేందుకు నర్సంపేట నుంచి పాకాల మీదుగా ఇల్లెందు వెళ్లే రోడ్డుకు రూ.3కోట్లు ఇప్పటికే మంజూరయ్యాయి. రూ.8కోట్లతో స్లూ గేట్లు.. పర్యాటక రంగంగా పాకాల అభివృద్ధి చేస్తూనే వ్యవసాయ పరంగా మరింత తీర్చిదిద్దేందుకు చర్యలు చేపడుతున్నారు. -
వచ్చే ఖరీఫ్ నాటికి సాగునీటిని అందివ్వాలి
వైఎస్ఆర్ర్ సీపీ జిల్లా అధ్యక్షుడు భగవంత్రెడ్డి లింగాల : నాగర్కర్నూల్ జిల్లాలోని అన్ని గ్రామాలకు వచ్చే ఖరీఫ్ నాటికి ఎంజీకేఎల్ఐ కాల్వల ద్వారా సాగునీటిని అందివ్వాలని వైఎస్ఆర్ సీపీ జిల్లా అధ్యక్షుడు మాదిరెడ్డి భగవంత్రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం లింగాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దివంగత వైఎస్ రాజశేఖర్రెడ్డి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో సాగునీటికి అధిక ప్రాధాన్యం ఇచ్చారని తెలిపారు. అప్పటల్లో కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు, కోయిల్సాగర్ ప్రాజెక్టులను ఏర్పాటు చేయించారని తెలిపారు. 10లక్షల ఎకరాలకు సాగునీటిని అందివ్వాలనే సంకల్పం వైఎస్కు ఉండేదన్నారు. కేఎల్ఐ కాల్వల నిర్మాణానికి రూ.2990కోట్లు అంచనాలు ఉండగా అప్పట్లో రూ.1,930కోట్లు ఇచ్చారన్నారు. నేటి ప్రభుత్వం మిగులు పనులు చేయకుండా కాల్వల నిర్మాణం మేమే చేపట్టామని చెప్పుకోవడం హస్యాస్పదంగా ఉన్నారు. నాగర్కర్నూల్ జిల్లాలోని నాలుగు నియోజకవర్గాలకు సాగునీటిని అందివ్వాలని, ఆ తర్వాతనే డిండికి నీటిని తరలించాలన్నారు. సమావేశంలో రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు నిరంజన్, నాయకులు కొండుర్ శేఖర్, మన్సూర్, ఉస్సేన్, లింగాల మండల శాఖ అధ్యక్షులు ఇర్కు శ్రీనివాసులు, ప్రధాన కార్యదర్శి రాజేష్ తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో పార్టీ బలోపేతానికి కృషి నూతనంగా ఏర్పడిన నాగర్కర్నూల్ జిల్లాలో వైఎస్ఆర్ సీపీని బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నట్లు జిల్లా అధ్యక్షుడు భగవంత్రెడ్డి అన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు సమాయత్తం కావాలని పిలుపునిచ్చారు. -
సాగునీటి కోసం రైతుల ఆందోళన
సంతమాగులూరు: ప్రకాశం జిల్లా సంతమాగులూరు మేజర్కు వెంటనే రబీ సాగుకు నీటిని విడుదల చేయాలని రైతులు ఆందోళన చేపట్టారు. సోమవారం ఉదయం సుమారు 100 మంది రైతులు సంతమాగులూరులోని ఎన్నెస్పీ కార్యాలయం వద్ద ధర్నాకు దిగారు. అద్దంకి బ్రాంచ్ కెనాల్కు తక్షణం నీరు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. -
రబీకి సాగునీరు లేనట్లే
నంద్యాల: రబీ సీజన్కు సాగునీరు అందించే అవకాశం లేదని తెలుగుగంగ సూపరింటెండింగ్ ఇంజినీర్ రాఘవరెడ్డి తెలిపారు. ఆయన బుధవారం అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ప్రస్తుతం వెలుగోడు రిజర్వాయర్లో నాలుగు టీఎంసీల నీరు నిల్వ ఉంది. కడపకు తెలుగుగంగ ద్వారా 14టీఎంసీల నీరు ఇవ్వాల్సి ఉండగా ఇప్పటి వరకు 12టీఎంసీలు నీరు విడుదల చేశారు. ఇక రెండు టీఎంసీల నీరు ఇవ్వాల్సి ఉంది. ఈ నీటిని విడుదల చేశాక మిగిలిన రెండు టీఎంసీల నీటిని వేసవిలో నంద్యాల, ఆళ్లగడ్డ, ఆత్మకూరు, వెలుగోడు మున్సిపాలిటీల తాగునీటికి వినియోగించాల్సి వస్తుంది. దీంతో రబీ సీజన్లో సాగునీటిని అందించే అవకాశం లేదని అధికారులు ప్రకటించారు. -
తెల్లకార్డుదారులు అందరికీ కల్యాణలక్ష్మి
మంత్రి హరీశ్రావు సిద్దిపేట జోన్: తెల్ల కార్డులున్న వారం దరికీ కల్యాణలక్ష్మి పథకం వర్తిస్తుందని భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్ రావు తెలిపారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలో 124 మంది కల్యాణలక్ష్మి లబ్ధిదారులకు రూ. 51 వేల చొప్పున రూ. 63.24 లక్షల ను చెక్కు రూపంలో అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ వర్గాలతోపాటు ఓసీ, బీసీ వర్గాల్లో ప్రతి పేదింటికీ ఈ పథకం వర్తించే దిశగా ప్రభుత్వం ప్రణాళిక రూపొందించిందని చెప్పారు. నగదు రహిత లావాదేవీల్లో దేశంలోనే ఇబ్రహీంపూర్ రెండవ స్థానం ఆక్రమించిందన్నారు. భవిష్యత్తులో సిద్దిపేటలోని ప్రతి పల్లె ఇబ్రహీంపూర్ను స్ఫూర్తిగా తీసుకొని నగదురహిత లావాదేవీల గ్రామంగా మారాలని పిలుపునిచ్చారు. -
పార్టీ అధికారంలోకి వస్తే నేనే సీఎం: కోమటిరెడ్డి
కడెం: రాష్ట్రంలో 2019 లో కాంగ్రెస్దే అధికారమని, అప్పుడు సీఎం రేసులో తానే ఉంటానని సీఎల్పీ ఉపనేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. భవిష్య త్తులో ఎప్పటికైనా తాను సీఎంను కావటం ఖాయమని పేర్కొన్నారు. ఆయన తన స్నేహితులతో కలసి శుక్రవారంరాత్రి నిర్మల్ జిల్లా కడెంకు వచ్చారు. శనివారం హరితా రిసార్ట్స్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆనాడు ఆంధ్రావారిని తీవ్రంగా విమర్శించిన ప్రభుత్వ పెద్దలు.. నేడు ఆంధ్రా వారికే వివిధ కాంట్రాక్టు పనులు అప్పగిస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వ ఖజానాను సీఎం ఇష్టారా జ్యంగా దుబారా చేస్తున్నారని విమర్శించారు. పెద్దనోట్ల రద్దుతో సామాన్యులు ముఖ్యంగా రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారని, మోదీ నిర్ణయం సరికాదని అన్నారు. ఆయన ఉదయం వాకింగ్కని ప్రాజెక్టుకు వెళ్లి పరిశీలించారు. వరద గేట్ల నుంచి లీకేజీలు, నీటిమట్టం గది, గేట్లు ఎత్తే గదులను చూసి, వాటిని మరమ్మతులు చేయాలని ఇరిగేషన్ ఉన్నతాధికారులతో ఫోన్లో మాట్లాడారు. -
‘కృష్ణా’ నీటిపై నేడే భేటీ
-
‘కృష్ణా’ నీటిపై నేడే భేటీ
- వాదనలతో సిద్ధమైన తెలంగాణ, ఏపీ - 103 టీఎంసీలు కోరుతున్న తెలంగాణ - ఇప్పటికే అదనంగా వాడారంటున్న ఏపీ సాక్షి, హైదరాబాద్: కృష్ణా జలాల వినియోగంపై తేల్చుకునేందుకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సిద్ధమయ్యాయి. ఇరు రాష్ట్రాల నీటి అవసరాలను తేల్చేందుకు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు బుధవారం కీలక భేటీ నిర్వహించనుంది. ఇందులో రెండు రాష్ట్రా లు తమ నీటి అవసరాలపై సమర్పిం చిన ఇండెంట్లతోపాటు మైనర్ ఇరిగేషన్ కింద నీటి లెక్కలపైనా చర్చ జరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం ప్రాజెక్టుల్లో లభ్యతగా ఉన్న నీటిలో 103 టీఎంసీలు కేటారుుంచాలని తెలంగాణ కోరుతోంది. ఏపీ 47 టీఎంసీల మేర కోరుతోంది. ఇప్పటివరకు వచ్చిన నీటిలో ఎక్కువగా ఏపీ వినియోగించిందని తెలంగాణ చెబుతుండగా, తెలంగాణయే అధికంగా వాడిందని ఏపీ పేర్కొంటోంది. దీనికి తోడు తెలంగాణలో కురిసిన వర్షాలతో చెరువులన్నీ నిండాయని, వాటి కింద 89.15 టీఎంసీల మేర నీటి వినియోగించారని అం టోంది. దీన్ని తెలంగాణ ఖండిస్తోంది. ఈ ఏడాది మొత్తంగా చెరువుల కింద 20 నుంచి 25 టీఎంసీలకు మించి వినియోగం లేదని స్పష్టం చేస్తోంది. పట్టిసీమ ద్వారా గోదావరి నుంచి కృష్ణాకు తరలించిన 50 టీఎంసీలను కృష్ణాలో చేసిన వినియోగం కిందే చూడాలని డిమాండ్ చేస్తోంది. అలాగే మైనర్ ఇరిగేషన్ కింద ఏపీకి ఉన్న వాటా లెక్కలను పరిగణనలోకి తీసుకోవాలని కోరుతోంది. దీనిపై బోర్డు ఎలా స్పందిస్తుం దన్నది బుధవారంనాటి సమావేశంలో తేలనుంది. ఆ ప్రాజెక్టులు బోర్డు పరిధిలోకి వద్దు.. గోదావరి నదీ జలాలను వినియోగిం చుకుంటున్న ప్రాజెక్టులపై బోర్డు పర్యవేక్షణ సరిపోతుందని తెలంగాణ పేర్కొంది. వాటిని బోర్డు పరిధిలోకి తేవాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు గోదావరి బోర్డు ఇచ్చిన ముసారుుదా నోటిఫికేషన్పై తన అభిప్రాయాలను తెలిపింది. -
జైకా నిధులా...ఆగాల్సిందే
► ప్రతిపాదనల్లో సాంకేతిక లోపాలతో పనుల మంజూరులో జాప్యం ► కొత్త ఆర్థిక సంవత్సరంలోనే పనులు జరిగే అవకాశం విజయనగరం గంటస్తంభం: జైకా నిధులతో ప్రాజెక్టుల అభివృద్ధి జరగాలంటే మరికొంత కాలం వేచి చూడక తప్పని పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం పంపిన ప్రతిపాదనల్లో సాంకేతికపరమైన లోపాలు ఉండడంతో పనుల మంజూరులో జాప్యం చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో అభివృద్ధి పనులు మూడు,నాలుగు నెలల్లో జరిగే అవకాశాలు కనిపించడం లేదు. కొత్త ఆర్థిక సంవత్సరం నాటికి అంతా ఒక కొలిక్కి రావచ్చనే సమాచారం ప్రస్తుతం షికారు చేస్తుంది. జిల్లాలో తోటపల్లి తరహా భారీ ప్రాజెక్టుతో పాటు పలు మధ్యతరహా సాగునీటి ప్రాజెక్టులు ఉన్న విషయం తెలిసిందే. దాదాపు అన్ని ప్రాజెక్టులు నుంచి పూర్తిస్థారుు విస్తీర్ణానికి సాగునీరు అందని పరిస్థితి. ప్రాజెక్టుల చెంత నిర్మాణాలు, కాలువలు ఆధ్వానంగా ఉండడం ఇందుకు కారణం. నీరు చెట్టు పథకంలో మట్టి పనులు చేసినప్పటికీ నిర్మాణాలకు రాష్ట్ర ప్రభుత్వం రెండేళ్లుగా నిధులు విడుదల చేయకపోవడంతో అలా పడి ఉన్నారుు. నిధుల కోసం జపం.. ఈ నేపథ్యంలో అధికారులు పనుల నిర్వహణకు నిధులు విడుదల చేయాలని రెండేళ్లుగా ప్రతిపాదనలు పంపుతున్నారు. ప్రభుత్వం నుంచి మాత్రం నిధులు విడుదల జరగడం లేదు. జపాన్ ఇంటిగ్రేటెడ్ కోపరేటవ్ ఏజెన్సీ(జైకా) సాయం చేస్తుండడంతో జిల్లాలో ఉన్న ప్రాజెక్టులు ఆధునీకికరణ పనులకు ప్రతిపాదనలు పంపాలని ఉన్నతాధికారులు జిల్లా అధికారులను కోరారు. ఈ మేరకు జిల్లా అధికారులు ఆండ్ర ప్రాజెక్టు పనులకు రూ.37 కోట్లు, వెంగళరాయసాగర్కు రూ.70 కోట్లు, వట్టిగెడ్డకు రూ.40 కోట్లు, పెదంకాలం ప్రాజెక్టు అభివృద్ధికి రూ.20 కోట్లతో ప్రతిపాదనలు గతేడాది పంపారు. కానీ నిధులు మాత్రం ఇంతవరకు మంజూరు కాలేదు. నిధులు రాకపోవడానికి కారణాలేంటి..? ప్రతిపాదనలు పంపి ఏడాది కావస్తున్నా ఇంతవరకు నిధులు మంజూరు కాకపోవడానికి కారణాలు అనేకం. అధికారులు పంపిన ప్రతిపాదనలు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర జలమండలికి పంపడంలో జాప్యం, వారు జైకాకు నివేదించడం, జైకా బృందం రాష్ట్రానికి వచ్చి ప్రాజెక్టులు పరిశీలించడంలో విపరీతమైన జాప్యం కారణంగా నిధులు మంజూరు కాలేదు. ఎట్టకేలకు జైకా బృందం పక్షం రోజలు క్రితం జిల్లాకు వచ్చి ప్రాజెక్టులు పరిశీలించింది. దీంతో నిధులు విడుదల అవుతాయని అంతా అనుకుంటున్నారు. ప్రస్తుతం వరి కోతలు జరుగుతుండడం, భూమి గట్టి పడుతుండడంతో జనవరి నుంచి పనులు ఆరంభించవచ్చని అధికారులు భావించారు. కానీ పరిస్థితి వేరేలా ఉంది. ప్రాజెక్టులు పరిశీలన చేసిన జైకా బృందం క్షేత్రస్థారుు పరిస్థితికి, ముందుగా ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలకు మధ్య తేడాని గమనించించింది. ప్రతిపాదనల్లో సాంకేతిక సమస్యలున్నాయని, మార్పు చేసి తిరిగి పంపించాలని సూచించింది. ఈ మేరకు జలవనరులశాఖ అధికారులు ప్రతిపాదనలు మార్చి పంపిస్తున్నారు. ఈ ప్రతిపాదనలు కేంద్ర జలమండలి (సీడబ్ల్యూసీ)కి వెళ్లి అక్కడ నుంచి జైకాకు వెళ్లాలి. ఇందుకు కొంత సమయం పడుతుంది. వారు పరిశీలించి పనులకు నిధులు మంజూరు చేస్తే తర్వాత టెండర్ల పక్రియ జరుగుతుంది. ఇదంతా జరిగేసరికి రెండు, మూడు నెలలు సమయం పడుతుంది. ఈ ఏడాదిలో మరి నిధులు రాకపోవచ్చని అధికారులు భావిస్తున్నారు. ఒకవేళ వచ్చినా పనులు చేసే సరికి సమయం పడుతుందని, వచ్చే ఆర్థిక సంవత్సరం నాటికి ప్రాజెక్టు పనులు ప్రారంభమయ్యే అవకాశముందంటున్నారు. అంతా అనుకున్నట్లు జరిగితే సాగునీరు... ఈ నేపథ్యంలో వచ్చే ఖరీఫ్ నాటికి ఈ ప్రాజెక్టుల కింద సాగునీరు అందే అవకాశం ఉంటుంది. వాస్తవానికి ఈ ఆర్థిక సంవత్సరం ఆరంభంలోనే నిధులు విడుదలవుతాయని అధికారులు భావించారు. ఈ ఏడాది ఖరీఫ్ నాటికి ప్రాజెక్టుల అధునీకీకరణ జరిగి నీరందుతుందని అనుకున్నారు. కానీ ఆపరిస్థితి లేదు. పోనీ వచ్చే ఏడాది ఖరీఫ్ నాటికి నీరందాలంటే మార్చి, ఏప్రిల్ నాటికి పనులు ప్రారంభమై జూన్ నాటికి పూర్తి కావాలి. ఇందులో ఏమాత్రం తేడా వచ్చినా రైతులు కల వచ్చే ఏడాది కూడా నెరవేరదు. వాస్తవానికి ఈ నాలుగు ప్రాజెక్టులు సక్రమంగా లేకపోవడం వల్ల ఈ ఏడాది సగం విస్తీర్ణానికి కూడా నీరంద లేదు. 15 వేల ఎకరాలకుపైగా సాగు నీరందకుండా పోరుుంది. కావున ప్రభుత్వం ఇప్పటికై నా స్పందించి నిధులు వచ్చేట్లు చేస్తే రైతులకు సాగునీటి చింత తీరుతుంది. -
సాగునీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యం
- పరిశ్రమల ఏర్పాటుతో యువతకు ఉపాధి - వైఎస్ జగన్ ఎదిగే నాయకుడు - విలేకరుల సమావేశంలో డిప్యూటీ సీఎం కేఈ ఎమ్మిగనూరు: సాగునీటి ప్రాజెక్టు నిర్మాణం, పెండింగ్ పనులను పూర్తి చేసేందుకు ప్రాధాన్యం ఇచ్చి జిల్లాలోని ఆయకట్టుకు పుష్కలంగా నీరిచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు రెవెన్యూశాఖా మంత్రి, డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి పేర్కొన్నారు. ఎమ్మెల్యే డా.బి. జయనాగేశ్వరరెడ్డితో కలసి ఆదివారం ఆయన ఎమ్మిగనూరులో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. హంద్రీ నీవా ప్రాజెక్టు ద్వారా డోన్, పత్తికొండ, ఆలూరు ప్రాంతాల ఆయకట్టుకు నీరు అందుతోందన్నారు. ఈ ప్రాజెక్టు కాలువ విస్తరణకు రూ.1300 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎదిగే నాయకుడని, ఆయనకు మరింత భవిష్యత్తు ఉందన్నారు. అయితే ఇప్పటి నుంచే సీఎం కుర్చీపై కాకుండా ప్రజల పక్షాన పోరాడాలని సూచించారు. రాష్ట్రాన్ని దారుణంగా విడగొట్టిన పాపం కాంగ్రెస్దని, ఎన్నికల్లో ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానన్న కేంద్ర మాజీ మంత్రి ఇప్పుడేమో రైతుల కోసం పోరాడుతున్నట్లు కవరింగ్ ఇచ్చుకునేందుకు డిల్లీ నాయకులతో సమావేశాలు పెట్టారని ఎద్దేవా చేశారు. జిల్లాలో పరిశ్రమల స్థాపనకు అనువైన వాతావరణం ఏర్పడిందని చెప్పిన కేఈ.. అందువల్లే అంబూజ, సోలార్జీ, ఏరోడ్రమ్ కంపెనీలు ముందుకొచ్చాయన్నారు. అనంతరం ఎమ్మిగనూరులో ఇండోర్ స్టేడియం, నందవరం రెవెన్యూ కార్యాలయాలను ఆయన ప్రారంభించారు. కార్యక్రమాల్లో జెడ్పీ వైస్ చైర్పర్సన్ పుష్పావతి, ఎంపీపీలు నరసింహారెడ్డి, శంకరయ్య, మున్సిపల్ వైస్ చైర్మన్ కొండయ్య చౌదరి, మార్కెట్యార్డు చైర్మన్ సంజన్న, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు ఈరన్నగౌడ్, దేశాయ్మాధవరావు, బీసీ సంఘం జిల్లా అధ్యక్షులు విక్రమ్కుమార్గౌడ్, ఆర్డీఓ ఓబులేసు తదితరులు పాల్గొన్నారు. -
డీడీ మొత్తం పీడీ అకౌంట్లకు జమ
– యూటీఆర్ నెంబర్ ఇచ్చిన వారం రోజుల్లోగా డ్రిప్ మంజూరు – ఏపీఎంఐపీ పీడీ వెంకటేశ్వర్లు, ఏపీడీ ఆర్.విజయశంకరరెడ్డి వెల్లడి అనంతపురం అగ్రికల్చర్ : పెద్ద నోట్లు రద్దుచేసిన తర్వాత ఎదురవుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని డ్రిప్ కోసం కట్టాల్సిన డీడీ మొత్తాన్ని రైతుల అకౌంట్లలో జమ చేసుకునేలా చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్టు పీడీ ఎం.వెంకటేశ్వర్లు, ఏపీడీ ఆర్.విజయశంకరరెడ్డి ఆదేశించారు. శనివారం సాయంత్రం స్థానిక ప్రాంతీయ ఉద్యాన శిక్షణా కేంద్రంలో ఎంఐడీసీ సత్యనారాయణమూర్తితో కలిసి ఎంఐ ఇంజనీర్లు, ఎంఐఏవోలు, ఇరిగేషన్ కంపెనీ డీసీవోలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లాకు కేటాయించిన 35 వేల హెక్టార్ల లక్ష్యంలో ఇప్పటివరకు 11 వేల హెక్టార్లకు మంజూరు చేశామన్నారు. ఇంకా లక్ష్యసాధన ఎక్కువగా ఉన్నందున పరిశీలన, కంప్యూటరీకరణ, మంజూరు, ఇన్స్టాలేషన్ ప్రక్రియ మరింత వేగవంతం చేయాలన్నారు. మీ–సేవాలో వచ్చిన దరఖాస్తులను వందశాతం ప్రాథమిక పరిశీలన రెండు రోజుల్లో పూర్తి చేయాలని ఆదేశించారు. చాలా వరకు డబుల్ రిజిష్ట్రేషన్లు ఉన్నందున వడపోత కార్యక్రమం చేయాలన్నారు. ఇప్పటికే 18 వేల దరఖాస్తులు డబుల్ రిజిస్ట్రేషన్ల కింద తేలాయన్నారు. పీఐఆర్ తర్వాత అర్హత జాబితా సిద్ధంచేసి రైతులతో డీడీలు కట్టించాలని తెలిపారు. డీడీలు కట్టడానికి ఇబ్బందులు ఎదురవుతున్న నేపథ్యంలో ఆ మొత్తాన్ని రైతు అకౌంట్లలో జమ చేయించి అక్కడి నుంచి ఆర్టీజీఎస్ ద్వారా ఏపీఎంఐపీ పీడీ ఖాతాల్లోకి జమ చేయించాలని సూచించారు. ఈ క్రమంలో బ్యాంకర్లు ఇచ్చే యుటీఆర్ నెంబర్ను దరఖాస్తుకు జత చేస్తే సరిపోతుందన్నారు. యూటీఆర్ నెంబర్ వచ్చిన వారం రోజుల్లోగా డ్రిప్ మంజూరు చేస్తామన్నారు. మంజూరు చేసిన వెంటనే రైతులు తమ పొలాల్లో గుంతలు (ట్రెంచ్) తవ్వుకోవాలన్నారు. లేదంటే డ్రిప్ యూనిట్లు రద్దు చేస్తామన్నారు. గుంతలు తవ్వుకున్న వారం రోజుల్లోగా పొలాల్లో పరికరాలు అమర్చి ట్రయల్ రన్ నిర్వహించాలని ఆదేశించారు. బోరుబావులున్న ప్రతి రైతుకూ డ్రిప్ యూనిట్లు అందించడానికి చర్యలు తీసుకోవాలన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఎంఐఏవోలు, కంపెనీ ప్రతినిధులు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. ఏదైనా సమస్యలుటే 18004252960 టోల్ఫ్రీ నెంబర్కు గాని, లేదంటే పీడీ–79950 87057, ఏపీడీ–79950 87058, ఎంఐడీసీ–79950 10045 నెంబర్లలో సంప్రదించాలని సూచించారు. -
అనంతలో సాగునీటి కోసం రైతుల పోరుబాట
-
తగ్గిన ఇసుక మోత!
• క్యూబిక్ మీటర్పై ఉన్న రూ.560 రుసుము తొలగింపు • నీటిపారుదల-మైనింగ్ శాఖల మధ్య అవగాహన సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న సాగునీటి ప్రాజెక్టులపై ఇసుక భారం తగ్గనుంది. ఇసుకను నేరుగా నీటిపారుదల శాఖే తీసుకునేలా వెసులుబాటు ఇవ్వడం, గతంలో విధించిన రుసుమును ఇప్పుడు పూర్తిగా ఎత్తివేయడంతో ప్రాజెక్టుల వ్యయం తగ్గుతోంది. ఈ మేరకు మంత్రి హరీశ్రావు నిర్వహించిన సమీక్ష సందర్భంగా నీటి పారుదల, మైనింగ్ శాఖల మధ్య అవగాహన కుదిరింది. అయితే నీటిపారుదల శాఖ సీనరే జీ చార్జీలను మాత్రం చెల్లించాల్సి ఉంటుంది. భారీగా ఇసుక అవసరాలు ప్రస్తుతం రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులకు మొత్తంగా 1.87 కోట్ల క్యూబిక్ మీటర్ల ఇసుక అవసరాలు ఉన్నాయి. గతంలో ప్రాజెక్టుల నిర్మాణానికి అవసరమయ్యే ఇసుకను సమకూర్చుకోవాల్సిన బాధ్యత పూర్తిగా కాంట్రాక్టర్లపైనే ఉండేది. మైనింగ్ శాఖ ఇసుక క్వారీలను గుర్తించి కలెక్టర్కు నివేదించేది. దానికి అనుగుణంగా కలెక్టర్ క్వారీల కేటాయింపు చేసేవారు. ఈ ప్రక్రియకు నెలల తరబడి సమయం పడుతుండడం, రీచ్లు కేటాయించినా వాటిలో తగినంత ఇసుక లభ్యతగా లేకపోవడంతో ప్రాజెక్టుల నిర్మాణాల్లో జాప్యం జరుగుతోంది. దీనికితోడు క్యూబిక్ మీటర్ ఇసుకకు రూ.560 రుసుముగా నీటి పారుదల శాఖ నుంచి మైనింగ్ శాఖ వసూలు చేసేది. అదనంగా రూ.40 చొప్పున సీనరేజీ చార్జీలు వసూలు చేసేవారు. వీటిని నీటి పారుదలశాఖ ప్రాజెక్టు వ్యయాల్లోనే చూపేది. దీంతో ఒక్కో ప్రాజెక్టుకు ఇసుక కోసం వందల కోట్లను ఖర్చు చేయాల్సి వచ్చేది. పాలసీలో సవరణలతో.. తాజాగా ప్రాజెక్టుల నిర్మాణానికి అవసరమైన ఇసుకను రిజర్వాయర్ల నుంచి నీటి పారుదల శాఖ సొంతంగా వెలికితీసి వినియోగించుకునేలా రాష్ట్ర ఇసుక పాలసీలో సవరణలు చేశారు. నీటిపారుదల శాఖకు చెందిన ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు ఇసుక మేటలను గుర్తించిన తర్వాత.. మైనింగ్ ఏడీ, ఇరిగేషన్ ఈఈలు సంయుక్తంగా హద్దులను నిర్ణయిస్తారు. అలా లభించే ఇసుక పరిమాణం లెక్కించి.. జిల్లాస్థాయి ఇసుక కమిటీ ఆమోదానికి పంపుతారు. ఇక ఇసుక వెలికితీతలో ఎలాంటి అక్రమాలు జరుగకుండా ట్రక్కులకు జీపీఎస్ అమర్చడం, పరిమాణానికి అనుగుణంగా సీనరేజీ చార్జీలను మైనింగ్ విభాగానికి చెల్లించాల్సిన బాధ్యతలను ఇరిగేషన్ ఈఈకి అప్పగించాలని నిర్ణయించారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ప్రాంతాల్లో ఏకంగా 22 కోట్ల క్యూబిక్ మీటర్ల ఇసుక అందుబాటులో ఉందని మైనింగ్ శాఖ గుర్తించింది. ఆ ఇసుకను కాళేశ్వరం ప్రాజెక్టు అవసరాలకు వాడాలని నిర్ణయించారు -
సాగునీటిపై టీఆర్ఎస్ సర్కార్ కృషి భేష్ !
ప్రశంసించిన సీఎల్పీ నేత కె.జానారెడ్డి - 50 వేల ఎకరాలకు సాగునీరివ్వడం అభినందనీయం - ఇరిగేషన్ అధికారుల పనితీరు బాగుందని కితాబు - ఎంపీ గుత్తాతో కరచాలనం.. ఆప్యాయంగా పలకరింపు - చర్చనీయాంశమైన అధికార, విపక్ష నేతల కలయిక పెద్దవూర: సీఎల్పీ నేత కె.జానారెడ్డి టీఆర్ఎస్ ప్రభుత్వ పనితీరును ప్రశంసించారు. నిన్నమొన్నటి వరకు ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్పై విరుచుకుపడిన ఆయన.. రైతులకు సాగు నీటిని అందించే విషయమై ప్రభుత్వం చేస్తున్న కృషిని అభినందించారు. జానారెడ్డి, టీఆర్ఎస్ నేత, ఎంపీ గుత్తాసుఖేందర్ రెడ్డి గురువారం నల్లగొండ జిల్లా పెద్దవూర మండలంలోని ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు (ఏఎమ్మార్పీ) లో లెవల్ వరదకాల్వ పంప్హౌస్ ట్రయల్ రన్ నిర్మాణ పనులను వేర్వేరుగా పరిశీలించారు. ఉదయం తొమ్మిది గంటలకే గుత్తా అక్కడికి చేరుకుని పనులు పరిశీ లించి తిరుగుపయనమయ్యారు. ఇదే సమయం లో జానారెడ్డి అక్కడకు రాగానే గుత్తా పెద్దాయన వద్దకు వెళ్లారు. ఇద్దరూ కరచాలనం చేసుకుని ఆప్యాయంగా పలకరించుకున్నారు. అక్కడ ఏం చూసి వస్తున్నావ్ అంటూ గుత్తాను జానారెడ్డి ప్రశ్నించారు. ప్రారంభ ఏర్పాట్లను పరిశీలించానని, సభా ప్రాంగణం ఏర్పాటు చేసే ప్రదేశాన్ని చూసి సూచనలు చేసి వస్తున్నట్లు సుఖేందర్రెడ్డి వివరించి అక్కడి నుంచి వెళ్లిపోయారు. అనంతరం జానారెడ్డి వరద కాల్వ పంప్హౌస్ పనులను పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. తీవ్ర కరువుతో అల్లాడుతున్న ఈ ప్రాంతంలోని ప్రజలకు 50 వేల ఎకరాలకు సాగునీరు ఇవ్వటానికి ప్రభుత్వం కృషి చేస్తోందని ఇది సంతోషకరమని వ్యాఖ్యానించారు. వారం, పది రోజులుగా ఇరిగేషన్ శాఖ అధికారులు చేస్తున్న కృషి అభినందనీయమని ప్రశంసించారు. రైతుల ఆకాంక్ష మేరకు పంప్హౌస్ను పరిశీలించటానికి వచ్చినట్లు జానారెడ్డి తెలిపారు. ఏఎమ్మార్పీ లో లెవల్ కెనాల్ పలు కారణాలతోనే ఆలస్యమైనట్లు పేర్కొన్నారు. వచ్చే సీజన్ నాటికైనా ప్రాజెక్టు పరిధిలోని ప్రతి ఎకరాకు సాగునీరు అందేలా అధికారులు చర్యలు చేపట్టాలని కోరారు. ప్రాజెక్టులో ఉన్న లోపాలను సరిచేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అంతకుముందు వరదకాల్వ పరిశీలన సమయంలో కూడా గుత్తా విలేకరులతో మాట్లాడారు. 1997లో మంజూరైన ఈ ప్రాజెక్టు పనులు 19 ఏళ్ల తర్వాత కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధతో లక్ష్యాన్ని చేరుతున్నందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసి రైతాంగానికి సాగు నీరు అందించేందుకు చిత్తశుద్ధితో పనిచేస్తుం దని కితాబిచ్చారు. అధికార, విపక్ష నేతల కలయిక, జానా వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. -
అంధకారంలో సున్నిపెంట
విద్యుత్ బకాయి చెల్లించకపోవడంత సరఫరా నిలిపివేత శ్రీశైలం ప్రాజెక్టు : ఏపీ ట్రాన్స్కోకు శ్రీశైలం ప్రాజెక్టు ఇరిగేషన్ శాఖ విద్యుత్ బకాయి చెల్లించపోవడంతో గురువారం ఉదయం నుంచి రాత్రి వరకు విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. కాలనీ మొత్తం అంధకార మయమైంది. ఇరిగేషన్ శాఖ రూ.14 కోట్లు బకాయి ఉంది. ఇదిలా ఉండగా సున్నిపెంట కాలనీలో ఏపీ ›ట్రాన్స్కో మీటర్లు బిగించి కనెక్షన్లను స్వాధీనం చేసుకోవాల్సిందిగా గతంలో జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. ట్రాన్స్కో మీటర్లు బిగిస్తున్నా కనెక్షన్లను తమ కంట్రోల్లోకి తీసుకోకపోవడంతో బిల్లుల వసూలు బాధ్యత ఎవరి తీసుకోవాలనే సందిగ్ధం నెలకొంది. విద్యుత్ సరఫరాను వెంటనే పునరుద్ధరించాలని ఇరిగేషన్ ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు ట్రాన్స్కో అధికారులను కోరారు. -
వచ్చే మే దాకా 100 టీఎంసీలు!
- కృష్ణా నీటి అవసరాలపై పూర్తయిన కసరత్తు - రబీకి 90 టీఎంసీలు, హైదరాబాద్ తాగునీటికి 10 టీఎంసీలు - నేడో, రేపో బోర్డుకు ప్రతిపాదనలు సాక్షి, హైదరాబాద్: వచ్చే ఏడాది మే వరకు కృష్ణా జలాల అవసరాలపై రాష్ట్రం చేస్తున్న కసరత్తు కొలిక్కి వచ్చింది. మళ్లీ వర్షాకాలం ఆరంభమయ్యే వరకు రాష్ట్ర సాగు, తాగు అవసరాలకు మొత్తంగా 100 టీఎంసీల కృష్ణా నీరు అవసరం ఉంటుందని నీటి పారుదల శాఖ అంచనాలు సిద్ధం చేసింది. ఇందులో రబీ అవసరాలకే 90 టీఎంసీల మేర కేటాయించాలని నిర్ణయించగా.. మరో 10 టీఎంసీలు హైదరాబాద్ తాగునీటి అవసరాలకు తీసుకోవాలని నిర్ణయించింది. దీనిపై ఒకట్రెండు రోజుల్లో కృష్ణా బోర్డుకు ప్రతిపాదనలు పంపనుంది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నాగార్జునసాగర్ ఎడమ కాల్వ కింద 6.40 లక్షల ఎకరాలకు సాగునీరివ్వాలని నిర్ణయించింది. ఏఎంఆర్పీ కింద నల్లగొండ జిల్లాలో చెరువులు నింపడంతోపాటు జిల్లా తాగునీటి అవసరాలు తీర్చాలని సంకల్పించింది. అలాగే నెట్టెంపాడు, కల్వకుర్తి, భీమా కింద సాధ్యమైనంత ఎక్కువగా సాగు నీరివ్వాలని భావిస్తోంది. ఈ అవసరాలను దృష్టిలో పెట్టుకొని నీటి లెక్కలను రూపొందించింది. 25 లక్షల ఎకరాలకు సాగునీరు రాష్ట్రంలోని ప్రధాన ప్రాజెక్టుల్లో ఆశించిన స్థాయిలో నీరున్న దృష్ట్యా ప్రస్తుత రబీలో సుమారు 25 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలని రాష్ట్ర స్థాయి సమీకృత నీటి నిర్వహణ, ప్రణాళిక స్టాండింగ్ కమిటీ(శివమ్) నిర్ణయించింది. ఇందులో భారీ ప్రాజెక్టుల కింద 21.09 లక్షల ఎకరాలు, మధ్య తరహా ప్రాజెక్టుల కింద 3.22 లక్షల ఎకరాలకు నీరిచ్చే అవకాశం ఉందని తెలిపింది. ప్రాజెక్టుల్లో నీటి లభ్యత, ఆయకట్టు, కెనాల్స్, ఫీల్డ్ చానల్స్ తదితర అంశాలపై బుధవారం జలసౌధ కార్యాలయంలో శివమ్ కమిటీ సమీక్ష జరిపింది. -
ప్రతి ఎకరాకు నీటివసతి కల్పించాలి
జాయింట్ కలెక్టర్–2 ప్రకాష్కుమార్ ఒంగోలు టౌన్ : జిల్లాలోని ప్రతి ఎకరాకు నీటి వసతి కల్పించేందుకు సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్–2 ఐ.ప్రకాష్కుమార్ సూచించారు. ఆత్మ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి కృషి సంశయన యోజనపై వ్యవసాయ, దాని అనుబంధ శాఖల అధికారులతో కలెక్టరేట్లోని ఆయన చాంబర్లో బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రకాష్కుమార్ మాట్లాడారు. జిల్లావ్యాప్తంగా 9 లక్షల హెక్టార్లకు రబీ, ఖరీఫ్ సీజన్లలో సాగునీరు అందించేందుకు సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని సూచించారు. ప్రస్తుతం 6 లక్షల హెక్టార్లకు నీటివసతి ఉందని, దానిని మరింత పెంచేందుకు చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. ప్రతి ఎకరాకు నీటి వసతి కల్పించేందుకు నీటివనరులపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. మన్నేరు, పాలేరు, మూసి వంటి జీవనదుల వద్ద రిజర్వాయర్ల నిర్మాణాలు చేపట్టడం ద్వారా పంటలకు నీటివసతి కల్పించేందుకు అవకాశం ఉంటుందన్నారు. మైనర్ ఇరిగేషన్, మేజర్ ఇరిగేషన్, డ్రిప్ ఇరిగేషన్ వంటివాటిపై ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. తదుపరి నిర్వహించే సమావేశానికి పూర్తిస్థాయి నివేదికలతో హాజరుకావాలని ఆదేశించారు. సమావేశంలో ఆత్మ ప్రాజెక్టు డైరెక్టర్ కేవీ సుబ్బారావు, వ్యవసాయ, జలవనరులశాఖ, భూగర్భ జలవనరులశాఖ, ముఖ్య ప్రణాళికశాఖ, ఉద్యాన, అటవీశాఖల అధికారులు పాల్గొన్నారు. సమావేశంలో పాల్గొన్న హైదరాబాద్కు చెందిన కాంటెక్ ఇంజినీరింగ్ సొల్యూషన్ లిమిటెడ్ కంపెనీ ప్రతినిధి ప్రధానమంత్రి కృషి సంశయన యోజన గురించి పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా అధికారులకు వివరించారు. -
సాగునీటికీ కావేరి జలాలు
-
సాగునీటికీ కావేరి జలాలు
బెంగళూరు/న్యూఢిల్లీ: తమిళనాడుకు కావేరి జలాలు విడుదల చేసే క్రమంలో కర్ణాటక అసెంబ్లీ సోమవారం ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించింది. తమ రాష్ట్ర సాగునీటి అవసరాలకు నీటి విడుదలపై తగిన నిర్ణయం తీసుకునేలా ప్రభుత్వానికి అన్ని అధికారాలు కట్టబెడుతూ తీర్మానం చేశారు. మంగళవారం మధ్యాహ్నంలోగా తమిళనాడుకు నీటి విడుదలపై సమాచారమివ్వాలన్న సుప్రీంకోర్టు ఆదేశం నేపథ్యంలో తీర్మానం తెచ్చారు. 4 కావేరి రిజర్వాయర్ల నుంచి తాగునీటికే నీటిని విడుదల చేయాలన్న గత తీర్మానంలో మార్పులు చేస్తూ... సాగునీటి అసవరాలకూ నీరివ్వొచ్చని తాజా తీర్మానంలో పేర్కొన్నారు. తమిళనాడుకు నీటి విడుదలపై సుప్రీంకోర్టు ఉత్తర్వుల్ని పాటిస్తామంటూ పరోక్ష సంకేతాలిచ్చిన సీఎం సిద్ధరామయ్య... తాగునీటి అవసరాలతో పాటు, పంటల్ని కాపాడేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తామన్నారు. కర్ణాటక ఎప్పుడూ కోర్టు ఉత్తర్వుల్ని ధిక్కరించలేదని పేర్కొన్నారు. కావేరీ పరివాహకంలో రైతులు నీటి విడుదల చేయాలని కోరుతున్నారని, నీటిని విడుదల చేస్తే కొంత సహజంగా తమిళనాడుకు వెళ్తుందన్నారు. బోర్డు ఏర్పాటుపై ఆదేశించలేరు: కేంద్రం ఈ వివాదంపై కేంద్రం తొలిసారి స్పందించింది. కావేరి నీటి నిర్వహణ బోర్డును(సీడబ్ల్యూఎంబీ) ఏర్పాటు చేయాలని తమను ఆదేశించకూడదని సుప్రీంకోర్టుకు తెలిపింది. కావేరి పరివాహకంలో క్షేత్ర స్థాయి నిజ నిర్ధారణ కోసం సాంకేతిక నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేస్తామంది. వివాదం చట్టసభల పరిధిలో ఉందని, సీడబ్యూఎంబీ ఏర్పాటు ఆదేశాల్ని సమీక్షించడం, వెనక్కి తీసుకోవడమో చేయాలని కోరింది. -
శరవేగంగా సాగర్ ఆధునీకరణ పనులు
- ఎడమ కాల్వ కింద 90 శాతం పనులు పూర్తి - కాల్వ కింద 1.5 లక్షల ఎకరాలకు సాగునీరు - హరీశ్రావుకు అధికారుల నివేదిక - మిగతా పనులు త్వరగా పూర్తి చేయాలన్న మంత్రి సాక్షి, హైదరాబాద్: నాగార్జునసాగర్ ఆధునీకరణ పనులు శరవేగంగా కొనసాగుతున్నారుు. ఎడమ కాలువకు సంబంధించి ఇప్పటికే 90 శాతం పనులు పూర్తికాగా.. మిగతా చోట్ల సైతం వేగంగా పనులు జరుగుతున్నాయి. ఈ మేరకు ‘కాడా’ కమిషనర్ మల్సూర్, సాగర్ సీఈ సునీల్లు శుక్రవారం నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్రావుకు నివేదిక సమర్పించారు. ఏయే ప్యాకేజీల పనులు ఏ మేరకు పూర్తయ్యాయో వివరించారు. సాగర్ ఎడమ కాలువ అభివృద్ధి కోసం ప్రపంచ బ్యాంకు నిధులతో సహా మొత్తం రూ.1,611 కోట్లు ఖర్చు చేస్తున్నారు. అందులో 2014 జూన్కు ముందు రూ.634 కోట్లు ఖర్చు చేయగా.. గత రెండేళ్లలో రూ.732 కోట్లు ఖర్చు చేసి మిగతా పనులు పూర్తి చేస్తున్నారు. ఎడమ కాలువ పరిధిలో పనులను 10 ప్యాకేజీల కింద విభజించగా.. ఇప్పటివరకు 5, 6, 15 ప్యాకేజీల పనులు పూర్తయ్యారుు. 1, 16, 17 ప్యాకేజీల్లో 90 శాతం.. 2, 3, 4, 7 ప్యాకేజీల్లో 70 శాతానికిపైగా పనులు పూర్తి చేశారు. ఇక ఎడమ కాలువకు అనుబంధంగా మరో 25 డిస్ట్రిబ్యూషన్ కాలువల్లోనూ మరమ్మతు పనులు జరుగుతున్నారుు. నాలుగు ప్యాకేజీల పరిధిలో డిస్ట్రిబ్యూషన్ పనులు పూర్తికాగా.. మరో 6 ప్యాకేజీల పరిధిలో దాదాపు పూర్తి కావచ్చారుు. మరో 9 ప్యాకేజీల్లో 70 శాతానికి పైగా పూర్తయ్యారుు. మొత్తంగా డిస్ట్రిబ్యూషన్ కాలువల్లో 80 శాతానికిపైగా పనులు పూర్తి చేశారు. ఇక నీటి వినియోగ సహకార సంఘాల కింద ఉన్న 9 ప్యాకేజీల్లో పనులు పూర్తయ్యాయి. మరో 21 ప్యాకేజీల్లో 80 శాతానికి పైగా పనులు పూర్తయినట్లు నివేదికలో తెలిపారు. ఈ మొత్తం పనులు పూర్తయితే ఎడమ కాలువ కింద 1.5 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరందనుంది. త్వరగా పూర్తి చేయండి కృష్ణా పరీవాహక ప్రాంతంలో నీటి కేటారుుంపులను సమర్థంగా వాడుకుంటే.. రైతు ఆత్మహత్యలు లేని తెలంగాణను చూడవచ్చని హరీశ్రావు శుక్రవారం ఒక ప్రకటనలో అభిప్రాయపడ్డారు. సాగర్ ఎడ మ కాలువ ఆధునీకరణ పనులు ప్రారంభమై ఎనిమిదేళ్లయినా ఇంకా పూర్తికాకపోవడంపై విస్మయం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా యుద్ధ ప్రాతిపదికన కాలువల మరమ్మతులు పూర్తి చేయాలని, అడ్డంకులను అధిగమించాలని అధికారులకు సూచించారు. సీఈ, ఎస్ఈ, ఈఈ స్థారుు అధికారులంతా రెగ్యులర్గా పనులు జరిగే ప్రదేశాలకు వెళ్లాలని, కుటుంబ సభ్యుల్లా కలసి పని చెయ్యాలని పేర్కొన్నారు. -
‘మల్లన్న సాగర్’కు రూ. 9,200 కోట్లు
భారీగా పెరిగిన రిజర్వాయర్ వ్యయ అంచనా * గత ఒప్పంద విలువ రూ. 1,954 కోట్లే * నీటి నిల్వ సామర్థ్యం పెంపు వల్లే పెరిగిన అంచనా వ్యయం * బస్వాపూర్, పాములపర్తి, గంధమల రిజర్వాయర్ల వ్యయ అంచనాలూ రెడీ * త్వరలోనే టెండర్లు పిలవనున్న ప్రభుత్వం సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టులో భాగంగా మెదక్ జిల్లాలో చేపట్టనున్న కొమరవెల్లి మల్లన్న సాగర్ (తడ్కపల్లి) రిజర్వాయర్ అంచనా వ్యయం సిద్ధమైంది. ఈ నిర్మాణానికి రూ. 9,200 కోట్లు ఖర్చవుతుందని నీటిపారుదల శాఖ తేల్చింది. అలాగే రూ. 600 కోట్లతో పాములపర్తి, రూ. 1,700 కోట్లతో బస్వాపూర్, రూ. 900 కోట్లతో గంధమల, రూ. 600 కోట్లతో ఇమామాబాద్ రిజర్వాయర్ల వ్యయ అంచనాలనూ సిద్ధం చేసింది. ఈ అంచనాలపై హైపవర్ కమిటీ చర్చించాక ప్రభుత్వం వాటికి ఆమోదం తెలుపనుంది. అనంతరం టెండర్లు పిలవనుంది. సామర్థ్యానికి తగ్గట్లే మల్లన్న సాగర్ వ్యయ పెరుగుదల... 160 టీఎంసీల నీటిని నిల్వ చేసేందుకు ప్రాణహిత నదిపై పెద్దగా రిజర్వాయర్లు లేని దృష్ట్యా సిద్దిపేటలోని మల్లన్న సాగర్ రిజర్వాయర్ సామర్థ్యాన్ని 1.5 టీఎంసీల నుంచి 50 టీఎంసీలకు, గజ్వేల్ నియోజకవర్గ పరిధిలోని కొండపోచమ్మ రిజర్వాయర్ (పాములపర్తి) సామర్థ్యాన్ని ఒక టీఎంసీ నుంచి 21 టీఎంసీలకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అలాగే ఇమామాబాద్ రిజర్వాయర్ సామర్థ్యాన్ని ఒక టీఎంసీ నుంచి 3 టీఎంసీలకు పెంచగా నల్లగొండ జిల్లాలో కొత్తగా గంధమల రిజర్వాయర్ను 10 టీఎంసీలతో, బస్వాపూర్ రిజర్వాయర్ను 11.39 టీఎంసీలతో చేపట్టాలని నిర్ణయించింది. మల్లన్న సాగర్ పాత వ్యయం అంచనా రూ. 1,864 కోట్లు ఉండగా దాన్ని 4.86 శాతం అధికంగా కోట్ చేయడంతో అంచనా వ్యయం రూ. 1,954.59 కోట్లకు చేరింది. ప్రస్తుతం రిజర్వాయర్ను 50 టీఎంసీలకు పెంచి నిర్మాణం చేపట్టనుండటంతో అంచనా వ్యయం ఏకంగా రూ. 9,200 కోట్లకు పెరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టులో మల్లన్నసాగర్ రిజర్వాయర్ ప్రస్తుతం కీలకంగా మారింది. ఈ రిజర్వాయర్ కిందే మెదక్ జిల్లాలో 5 లక్షల ఎకరాల ఆయకట్టును నిర్ణయించారు. దీంతోపాటే ఇక్కడి నుంచి ఒకవైపున నల్లగొండ జిల్లాలోని గంధమల, బస్వాపూర్లకు లింకేజీ ఉంది. మరోవైపున కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గాల్లో నిర్మించనున్న ఏడు రిజర్వాయర్లకు మల్లన్న సాగర్ నుంచే నీటి తరలింపు ప్రణాళిక రూపొందించారు. మరోపక్క సింగూరు ప్రాజెక్టుకు నీరు, నిజాంసాగర్ ఆయకట్టు స్థిరీకరణకు మల్లన్న సాగర్ నుంచి నీటి సరఫరా చే యాలని నిర్ణయించారు. మొత్తంగా 13 లక్షల ఆయకట్టుకు నీరందించేందుకు మల్లన్న సాగర్ కీలకంగా మారనుంది. దీని కింద 14,367 ఎకరాల ముంపు ఉంటుందని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. -
ఐదు చోట్ల లెస్.. రెండు చోట్ల ఎక్సెస్
రూ.3,940కోట్ల డిండి పనులకు టెండర్లు ఖరారు సాక్షి, హైదరాబాద్: మహబూబ్నగర్, నల్లగొండ జిల్లాల్లో ఫ్లోరైడ్ బాధిత ప్రాంతాలకు సాగునీరు అందించేందుకు ఉద్దేశించిన డిండి ఎత్తిపోతల పథకం పనుల ఆర్థిక టెండర్లు(ప్రైస్ బిడ్) సోమవారం ఖరారయ్యాయి. మొత్తంగా 7 ప్యాకేజీలకుగానూ రూ.3,940 కోట్ల పనులను ఎంఆర్కేఆర్, నవయుగ, ఎస్ఈడబ్ల్యూ, కేతన్, మెగా, హెచ్ఈఎస్, రాఘవ, మహాలక్ష్మి ఇన్ఫ్రా వంటి సంస్థలు పనులు దక్కించుకున్నాయి. నార్లాపూర్ నుంచి డిండికి నీటిని తీసుకునే అలైన్మెంట్ ఖారారు కానుందున, అంతలోగా నల్లగొండ జిల్లాలో ఖరారైన సింగరాజుపల్లి(0.8 టీఎంసీ), గొట్టిముక్కల(1.8 టీఎంసీ), చింతపల్లి(0.99 టీఎంసీ), కిష్టరాంపల్లి(5.68 టీఎంసీ), శివన్నగూడం(11.96 టీఎంసీ)ల రిజర్వాయర్లు వాటికి అనుబంధంగా మెయిన్ కెనాల్ పనులకు ప్రభుత్వం టెండర్లు పిలిచింది. సోమవారం అధికారులు ఈ ప్రైస్బిడ్లను తెరిచారు.ఇందులో రూ.633.28 కోట్ల విలువైన ప్యాకేజీ-1 పనులను ఎంఆర్కేఆర్-నవయుగ 1.4 శాతం లెస్తో, రూ.394.38 కోట్ల విలువైన ప్యాకేజీ-2ను ఎస్ఈడబ్ల్యూ-కాంత్రి సంస్థ 2.1 శాతం ఎక్సెస్తో, ప్యాకేజీ-3లోని రూ.472.93 కోట్ల పనులను కేసీఎల్-ఎస్వీఆర్ సంస్థ 1.2 శాతం లెస్తో, ప్యాకేజీ-4లోని రూ.409.71 కోట్ల పనులను మెగా-హెచ్ఈఎస్లు 1.9 ఎక్సెస్తో, ప్యాకేజీ-5లో రూ.498.58 కోట్ల పనులను మహాలక్ష్మి-ఎస్ఎన్సీ 0.6 శాతం లెస్తో, ప్యాకేజీ-6లోని రూ.1289.59 కోట్ల పనులను రాఘవ-హెచ్ఈఎస్-నవయుగలు 0.5 శాతం లెస్తో, ప్యాకేజీ-7లోని రూ.241.77 కోట్ల పనులను ఎస్ఈడబ్ల్యూ-ఎస్ఎల్ఈసీ-సీఎంఆర్లు ఒక శాతం లెస్తో దక్కించుకున్నాయి. మొత్తంగా ప్రాజెక్టులోని 7 ప్యాకేజీల్లో 2 ప్యాకేజీల్లో ఎక్సెస్కు... 5 చోట్ల లెస్కు టెండర్లు దాఖలయ్యాయి. -
‘చంద్రబాబు డైరెక్షన్...కాంగ్రెస్ యాక్షన్’
కరీంనగర్: తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులను అడ్డుకునే కుట్రలో భాగంగా ఏపీ సీఎం చంద్రబాబు డైరెక్షన్ మేరకే.. ఇక్కడి కాంగ్రెస్ నేతలు యాక్షన్ చేస్తున్నారని రాష్ట్ర భారీనీటిపారుదల, మార్కెటింగ్ శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు ఆరోపించారు. పాలమూరు, డిండి ప్రాజెక్టులను ఆపాలని టీడీపీ ఫిర్యాదు చేస్తే వారితో చెట్టపట్టాలేసుకొని ఉత్తమ్కుమార్రెడ్డి, జైపాల్రెడ్డి వంటి నేతలు ధర్నాలకు దిగడమే ఇందుకు నిదర్శనమన్నారు. ప్రతిపక్ష పార్టీలు ఎన్ని అడ్డంకులు సష్టించినా ప్రాజెక్టులన్నింటినీ పూర్తిచేసి రాష్ట్రంలోని కోటి ఎకరాలను సస్యశ్యామలం చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని ఆయన స్పష్టం చేశారు. సోమవారం కరీంనగర్ మార్కెట్ కమిటీ పాలకవర్గం ప్రమాణ స్వీకారోత్సవంలో హరీశ్రావు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. గత ప్రభుత్వాలు తెలంగాణను నిర్లక్ష్యం చేశాయని, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో అలసత్వం వల్లే రైతాంగానికి ఈ దుస్థితి దాపురించిందన్నారు. రూ. 25 వేల కోట్లతో సాగునీటి ప్రాజెక్టులు పూర్తిచేసి గోదావరి జలాలను తెలంగాణలోని ప్రతి ఎకరాకు అందించి తీరుతామన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రాజెక్టుల విషయంలో రాద్ధాంతం చేయడం మానుకోవాలని హితవు పలికారు. మల్లన్నసాగర్ ప్రాజెక్ట్ పూర్తయితే ఉనికి లేకుండా పోతామనే బెంగతోనే ప్రాజెక్టుల విషయంలో కాంగ్రెస్ గందరగోళం సృష్టిస్తోందని మండిపడ్డారు. అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రాజెక్టుల నిర్మాణంలో అలసత్వం వహించి తెలంగాణకు తీరని ద్రోహం చేసింది చాలక.. ఇప్పుడు అడుగడుగునా అడ్డుతగలడం మూర్ఖత్వమని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ హయాంలో తెలంగాణను విస్మరించి కేవలం ఆంధ్రప్రదేశ్లోనే 156 టీఎంసీల నీటి సామర్థ్యం గల రిజర్వాయర్లను నిర్మించారని, మూడో పంటకు సైతం పులిచింతల ప్రాజెక్ట్ను నిర్మిస్తుంటే.. మంత్రి పదవి కోసం కిరణ్కుమార్రెడ్డి వద్ద మోకరిల్లిన ఉత్తమ్కుమార్రెడ్డికి ప్రాజెక్టుల విషయంలో మాట్లాడే నైతిక అర్హతే లేదని హరీశ్రావు దుయ్యబట్టారు. కాంగ్రెస్ హయాంలో తెలంగాణలో చేపట్టిన 20 టీఎంసీల నీటి సామర్థ్యం గల ఎల్లంపల్లి ప్రాజెక్టులో 21 గ్రామాలు మునిగాయని, 25 టీఎంసీల నీటి నిల్వ చేసి మిడ్మానేరులో 12 గ్రామాలు ముంపునకు గురయ్యాయని గుర్తుచేశారు. 50 టీఎంసీల సామర్థ్యం గల మల్లన్న సాగర్ ప్రాజెక్టులో 8 గ్రామాలు ముంపునకు గురవుతుంటే కాంగ్రెస్ పార్టీ గగ్గోలు పెట్టడం దేనికోసమో బోధపడడం లేదని ఎద్దేవా చేశారు. ఒక పంటకు కూడా నీళ్లు లేక ఆకలితో అలమటించే తెలంగాణ రైతుల కడగండ్లు తీర్చేందుకు ప్రాజెక్టులు కడుతుంటే జీర్ణించుకోలేకపోవడం కాంగ్రెస్, టీడీపీలకే చెల్లిందన్నారు. -
సాగునీటి కోసం రైతుల ఆందోళన
లింగంపేట: సాగునీటి కోసం నిజామాబాద్ జిల్లాలోని లింగంపేట పరిధిలోని మూడు గ్రామాల ప్రజలు లింగంపేట అంబేద్కర్ చౌరస్తా వద్ద ఆందోళనకు దిగారు. మత్తైకాలువ నుంచి బోర్ల ద్వారా చెరువులను నింపుకొని కింద ఉన్న రైతుల పొట్ట కొడుతున్నారని ధర్నా దిగారు. స్థానిక ఎమ్మార్వో వచ్చి తమ సమస్య పరిష్కరించేంత వరకూ ఆందోళన విరమించేది లేదని భీష్మించుకు కూర్చున్నారు. ధర్నా జరిగే స్థలానికి చేరుకున్న పోలీసులు వారికి సర్దిచెప్పే ప్రయత్నం చేస్తున్నారు. -
8న కల్వకుర్తి ఆయకట్టుకు నీటి విడుదల
- 1.50లక్షల ఎకరాలకు నీరిచ్చేలా ప్రణాళిక సాక్షి, హైదరాబాద్ పాలమూరు జిల్లాలో ఇప్పటి కే నిర్మాణంలో ఉన్న నెట్టెంపాడు, భీమా, కోయిల్సాగర్ ప్రాజెక్టు కింద ఆయకట్టుకు నీటిని విడుదల చేసిన ప్రభుత్వం ఈ నెల 8 నుంచి కల్వకుర్తి ఎత్తిపోతల పథకం కింది ఆయకట్టుకు నీటిని విడుదల చేయాలని నిర్ణయించింది. కల్వకుర్తి లిఫ్టు-3 కింద నీటిని విడుదల చేయడం ద్వారా మొత్తంగా 1.50లక్షల ఎకరాలకు నీరందించాలని భావిస్తోంది. దీనికి సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయినట్లు నీటి పారుదల శాఖ వర్గాలు వెల్లడించాయి. గత రెండేళ్లతో పోలిస్తే ఈ ఏడాది కృష్ణా జలాల్లో ఆశాజనకంగా నీటి లభ్యత ఉన్న నేపథ్యంలో జులై నుంచి జూరాల ప్రాజెక్టు నీటిపై ఆధారపడ్డ నెట్టెంపాడు, భీమా, కోయిల్సాగర్లకు నీటిని మళ్లిస్తోంది. ఇప్పటికే ఈ మూడు ప్రాజెక్టు లపరిధిలో 12 టీఎంసీల వరకు నీటిని మళ్లించి 1.50లక్ష లనుంచి 2 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరందించింది. నీటి విడుదల కొనసాగుతోంది. మొత్తంగా కల్వకుర్తి కింద 1.50లక్షల ఎకరాలు, నెట్టెంపాడు కింద 1.50లక్షలు, భీమా ద్వారా 1.40లక్షలు, కోయిల్సాగర్ ద్వారా 20వేల ఎకరాలకు కలిపి మొత్తంగా 4.60లక్షల ఎకరాలకు నీరివ్వాలని నిర్ణయించగా, ఇందులో ఇప్పటికే సగం అంచనాకు చేరుకుంది. తాజాగా కల్వకుర్తిలోని గుడిపల్లి వద్ద మూడో లిఫ్టులోని రెండు మోటార్లను ఈ నెల 8న ఆరంభించి ఆయకట్టుకు నీరిచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఇదే మూడో లిఫ్టులోని మిగతా మూడు మోటార్లను విడతల వారీగా ఆరంభించేందుకు కసరత్తు చే స్తోంది. కృష్నా జలాల్లో తమకున్న నీటి వాటా 299 టీఎంసీల్లోంచే ఈ నీటిని వాడుకుంటున్నందున దీనికి ఎవరి అభ్యంతరం ఉండబోదని తెలంగాణ భావిస్తోంది. -
'రాజ' ముద్ర
వైఎస్ హయాంలోనే ‘తెలంగాణ మాగాణ’కు బీజాలు - జలయజ్ఞంలో మొత్తం 86 ప్రాజెక్టులు చేపట్టిన నేత - అందులో 33 ప్రాజెక్టులు తెలంగాణలోనే.. కరువు రక్కసితో అల్లాడుతున్న తెలంగాణలో సిరులు పండాలి.. వలసబాట పట్టిన తెలంగాణ రైతన్న ముఖంపై చిరునవ్వు వెల్లివిరియాలి..సాగుకు యోగ్యమైన ప్రతి ఎకరాకు నీళ్లు పారాలి.. నాడు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కన్న కలలివి! ఈ మహా సంకల్పానికి మహోన్నత యజ్ఞం.. అదే జలయజ్ఞం!! ఏళ్ల తరబడి బీళ్లుగా మిగిలిపోయిన భూములకు చేవనిచ్చేందుకు చేపట్టిన ఆ యజ్ఞ ఫలాలు ఇప్పుడిప్పుడే ప్రజలకు చేరువవుతున్నాయి. తెలంగాణలో సుమారు 50 లక్షల ఎకరాలకు సాగునీరు ఇచ్చేందుకు నాడు తలపెట్టిన సంకల్పం ప్రస్తుతం లక్ష్యానికి చేరువైంది. జలయజ్ఞం పేరుతో వైఎస్ రాజశేఖరరెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 86 ప్రాజెక్టుల నిర్మాణం మొదలుపెట్టగా అందులో 33 ప్రాజెక్టులు తెలంగాణలో చేపట్టినవే. 18 భారీ, 12 మధ్యతరహా ప్రాజెక్టులు, రెండు ప్రాజెక్టుల ఆధునీకరణ, మరో ఫ్లడ్ బ్యాంకు పనులను రూ.1,11,433.23 కోట్లతో చేపట్టారు. ఈ ప్రాజెక్టుల ద్వారా సుమారు 387.88 టీఎంసీల కృష్ణా, గోదావరి నీటిని వినియోగంలోకి తెచ్చి 51.47 లక్షల ఎకరాలకు సాగునీరిచ్చేలా ప్రణాళికలు రూపొందించారు. ఇందులో వైఎస్ హయాంలోనే గుత్ప, అలీసాగర్, సుద్దవాగు ప్రాజెక్టులు పూర్తయ్యాయి. వాటి కింద 1,07,584 ఎకరాలకు సాగు నీరిచ్చారు. ఏఎంఆర్పీ, దేవాదుల, ఎస్సారెస్పీ-2, మత్తడివాగు వంటి ప్రాజెక్టులను పాక్షికంగా పూర్తి చేసి మరో 4 లక్షల ఎకరాలకు నీరందించారు. ఇప్పటివరకు జలయజ్ఞం కింద చేపట్టిన ప్రాజెక్టులపై మొత్తం రూ.48 వేల కోట్లు ఖర్చుకాగా సుమారు 6.50 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు సాగులోకి వచ్చింది. మరో లక్ష ఎకరాల మేర స్థిరీకరణ జరిగింది. ఈ ఏడాది మరిన్ని ప్రాజెక్టులు అందుబాటులోకి రానున్నాయి. అందులో పాలమూరు, ఆదిలాబాద్ జిల్లాలోని ప్రాజెక్టులు ముందు వరుసలో ఉన్నాయి. - సోమన్నగారి రాజశేఖర్రెడ్డి, సాక్షి ప్రతినిధి ‘పాలమూరు’పై చెరగని ముద్ర కరువుతో కొట్టుమిట్టాడుతున్న మహబూబ్నగర్ జిల్లా ముఖచిత్రం మార్చాలంటే పొలం తడపడం తప్ప మరో మార్గం లేదని భావించిన వైఎస్.. జలయజ్ఞం ప్రాజెక్టుల్లో ఈ జిల్లాకు పెద్దపీట వేశారు. ఇందులో భాగంగా కల్వకుర్తి (25 టీఎంసీలు), భీమా (20 టీఎంసీలు), నెట్టెంపాడు (20 టీఎంసీలు), కోయిల్సాగర్ (3.90 టీఎంసీలు) ప్రాజెక్టులు చేపట్టారు. 7.80 లక్షల ఎకరాల ఆయకట్టును సాగులోకి తెచ్చే లక్ష్యంతో రూ.7,969.38 కోట్లతో వీటిని చేపట్టారు. భారీగా నిధులు కేటాయించడంతో పనులు శరవేగంగా జరిగాయి. 2009లో సెప్టెం బర్ నాటికే ఈ 4 ప్రాజెక్టుల కింద 60% పనులు పూర్తయ్యా యి. రూ.2,990 కోట్లతో చేపట్టిన కల్వకుర్తిలో వైఎస్ హయాంలో రూ.2,904.01 కోట్లు ఖర్చవగా, భీమా కింద రూ.1,492.38 కోట్లు, నెట్టెంపాడు కింద రూ.1,124.52 కోట్లు, కోయిల్సాగర్ కింద రూ.235.91 కోట్లు ఖర్చు చేశారు. అయితే వైఎస్ మరణానంతరం వచ్చిన సీఎంలు ప్రాజెక్టులపై చిన్నచూపు చూశారు. భూసేకరణ, పరిహారం చెల్లింపులో ఇబ్బందులు, రహదారులు, రైల్వే క్రాసింగ్లపై పట్టింపు తగ్గడంతో ప్రాజెక్టులు అటకెక్కాయి. అయితే ప్రస్తుత ప్రభుత్వం పాలమూరు ప్రాజెక్టులకు అధిక ప్రాధాన్యం ఇచ్చి వాటి పూర్తికి చొరవ చూపుతోంది. దీంతో ఈ ఏడాది 4.60 లక్షల ఎకరాలకు నీరందించే చర్యలు మొదలయ్యాయి. ఇప్పటికే కొంత ఆయకట్టుకు జూరాల నుంచి నీరు అందుతోంది. వచ్చే ఏడాది మిగతా 3.20 లక్షల ఎకరాలకు నీరిచ్చి మొత్తం ఆయకట్టును వృద్ధిలోకి తెచ్చేలా ప్రణాళికలు వేశారు. అదే జరిగితే ఆయకట్టుకు పారే ప్రతి నీటి బొట్టులో వైఎస్ ముద్ర కనబడటం ఖాయం. ఎల్లంపల్లి’ ఘనత వైఎస్దే.. 2004 జూలై 28న వైఎస్ ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. కరీంనగర్ జిల్లాలో 1,65,700 ఎకరాల ఆయకట్టుకు సాగు నీరు, ఆదిలాబాద్ జిల్లాలోని 30 వేల ఎకరాల స్థిరీకరణ కోసం 20.17 టీఎంసీల నీటి నిల్వతో దీన్ని చేపట్టారు. ఈ ప్రాజెక్టు ఈ ఏడాది నుంచి పూర్తిస్థాయిలో వినియోగంలోకి వచ్చింది. గతేడాది 10 టీఎంసీల మేర నిల్వ చేయగా.. అది ఈ ఏడాది 20 టీఎంసీలకు చేరింది. గతేడాది నిల్వ చేసిన నీటితోనే ప్రస్తుత ప్రభుత్వం హైదరాబాద్ తాగునీటి అవసరాలను తీర్చింది. ప్రాజెక్టు కింద ఉన్న ఆయకట్టు లక్ష్యం 1.65 లక్షల ఎకరాల్లో ఈ ఏడాది సుమారు 25 వేల ఎకరాలకు నీరివ్వాలని అధికారులు ప్రణాళికలు వేస్తున్నారు. ప్రాజెక్టులో ఉన్న మేడారం పంప్హౌస్, గంగాధరం పంప్హౌస్కు త్వరలో ట్రయల్న్ ్రనిర్వహించేందుకు కసరత్తు చేస్తున్నారు. సెప్టెంబర్ చివర్లో డిస్ట్రిబ్యూటరీ నెట్వర్క్కు నీటిని అందించేందుకు ట్రయల్ రన్ నిర్వహించాలని భావిస్తున్నారు. వచ్చే ఏడాదికల్లా పూర్తిస్థాయి ఆయకట్టుకు నీరందించే ఈ ప్రాజెక్టు వెనుక వైఎస్ కృషిని మరవలేం. గోదావరి ప్రణాళిక ఆయనదే ఎగువ రాష్ట్రాల జల దోపిడీతో కృష్ణా జలాలు కిందకు రావడం కరువైన పరిస్థితుల్లో.. గోదావరి జలాలే తెలంగాణకు శరణ్యమని భావించిన వ్యక్తి వైఎస్సార్! సముద్రం పాలవుతున్న గోదావరి నీటికి అడ్డుకట్ట వేసి.. ఉపనదులైన వార్దా, పెన్గంగ, ఇంద్రావతి, ప్రాణహిత నదుల నీటిని ఎక్కడికక్కడ వినియోగంలోకి తెచ్చేలా ప్రాజెక్టులకు రూపకల్పన చేశారు. ప్రాణహిత-చేవెళ్ల, ఎల్లంపల్లి, దేవాదుల, కంతనపలి,్ల, రాజీవ్ దుమ్ముగూడెం, ఇందిరా దుమ్ముగూడెం ప్రాజెక్టులు ఇందులో ప్రధానమైనవి. వీటి ద్వారా 300 టీఎంసీల నీటిని వినియోగంలోకి తెచ్చేలా ప్రణాళిక వేశారు. ఇందులో దేవాదుల, ఎల్లంపల్లి ప్రాజెక్టులు ఇప్పటికే వినియోగంలోకి రాగా, ప్రాణహిత, కంతనపల్లి ప్రాజెక్టులు రీ ఇంజనీరింగ్ చేసుకొని టెండర్ల దశలను దాటుకొని ముందుకు వెళ్తున్నాయి. ప్రాణహితకు ప్రాణం పోసిన నేత.. చెంతనే గోదావరి పారుతున్నా చుక్క నీటికి నోచుకోక బీళ్లుగా మారిన ఉత్తర తెలంగాణలోని పొలాలకు ఊపిరిలూదేందుకు ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు ఊపిరిలూదారు వైఎస్! ఏకంగా 160 టీఎంసీల నీటిని మళ్లించి 16.40 లక్షల ఎకరాలకు సాగునీరు, పరిశ్రమల అవసరాలకు 16 టీఎంసీలు, జంటనగరాల తాగునీటికి 30 టీఎంసీలు, గ్రామీణ ప్రాంత తాగునీటికి 10 టీఎంసీలు వినియోగించేలా ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. 2008 డిసెంబర్ 16న ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన వైఎస్.. మరుసటి రోజు.. అంటే డిసెంబర్ 17నే ప్రాజెక్టుకు రూ.35,200 కోట్ల పనులకు పరిపాలన అనుమతులు ఇస్తూ జీవో విడుదల చేశారు. టెండర్లు ఆహ్వానించి 28 ప్యాకేజీలకు ఒప్పందాలు చేసుకున్నారు. అనుమతుల కోసం కేంద్రానికి ప్రతిపాదనలు పంపారు. విసృ్తత ప్రయోజనాల దృష్ట్యా, కేంద్రం సూత్రప్రాయ అంగీకారం తెలపడమే కాకుండా ప్రధానమంత్రి ప్యాకేజీ కింద ఆర్థిక సాయం చే సేందుకు సైతం ముందుకు వచ్చింది. దీన్ని జాతీయ ప్రాజెక్టుగా గుర్తించాలంటూ కేంద్రంపై వైఎస్ ఒత్తిడి తెచ్చారు. అయితే ప్రస్తుతం వివిధ కారణాలతో రీడిజైన్ చేస్తుండటంతో ప్రాజెక్టు నిర్మాణంలో జాప్యం జరుగుతోంది. -
ఎల్–14 ఎత్తిపోతలకు గండి
వేములపల్లి : మండల కేంద్రంలోని ఎడమకాల్వపై ఉన్న ఎల్–14 ఎత్తిపోతలకు కొందరు గండికొట్టి స్థానిక చిన్నచెరువుకు అక్రమంగా నీటి తరలించారు. దీంతో ఆగ్రహించిన లిఫ్టు పరిధిలోని రైతులు శనివారం ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ.. ఇప్పటికే వర్షాలు లేక పంటలు ఎండిపోతున్నాయని, వచ్చే కొద్దిపాటి నీటిని కూడా కొందరు వ్యక్తులు లిఫ్టుకు గండికొట్టి తరలించకపోవడం బాధాకరమన్నారు. ఈ విషయాన్ని ఎన్ఎస్పీ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. లిఫ్టు పరిధిలో సుమారు 2వేలపై చిలుకు ఎకరాల్లో పంటలు సాగు చేస్తున్నట్లు తెలిపారు. చెరువులోకి నీటిని తరలించేందుకు ఫీడర్ ఛానల్ ఉన్నప్పటికీ ఎత్తిపోతల ప్రహరీ పగులగొట్టి నీటిని తరలించడం సరికాదన్నారు. అధికారులు స్పందించి గండిని పూడ్చడంతో పాటు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో గున్రెడ్డి గోపాల్రెడ్డి, శ్యాంసుందర్, అనిల్, అనంతరెడ్డి, లక్ష్మయ్య, యాకూబ్తో పాటు పలు గ్రామాల రైతులు పాల్గొన్నారు.