kiran bedi
-
వెండితెరపై కిరణ్ బేడీ బయోపిక్.. టైటిల్ ఇదే!
భారతదేశపు తొలి మహిళా ఐపీఎస్ ఆఫీసర్ కిరణ్ బేడి జీవితం వెండితెరపైకి రానుంది. ‘బేడి: ది నేమ్ యు నో.. ది స్టోరీ యూ డోన్ట్’ అనే టైటిల్తో ఆమె బయోపిక్ తెరకెక్కనుంది. ‘వన్ వే, అనదర్ టైమ్’ వంటి చిత్రాలతో అంతర్జాతీయ స్థాయిలో ప్రసంశలు అందుకున్న దర్శక–నిర్మాత, రచయిత కుశాల్ చావ్లా ఈ బయోపిక్కు దర్శకత్వం వహించనున్నారు. డ్రీమ్ స్లేట్ పిక్చర్స్ పతాకంపై గౌరవ్ చావ్లా ఈ సినిమాను నిర్మించనున్నారని, వచ్చే ఏడాది ఈ సినిమా విడుదయ్యేలా ప్లాన్ చేస్తున్నారని టాక్. ‘‘కిరణ్ బేడీగారు జీవితంలో ఎదుర్కొన్న సవాళ్ల గురించి మాత్రమే కాదు... ఆమె జీవితంలోని వ్యక్తిగత, వృత్తిపరమైన అంశాలను కూడా ఈ సినిమాలో చూపించబోతున్నాం’’ అని మేకర్స్ పేర్కొన్నారు. ఇక 1966లో జాతీయ జూనియర్ టెన్నిస్ చాంపియన్గా వార్తల్లో నిలిచారు కిరణ్ బేడీ. ఆ తర్వాత ఐపీఎస్ ఆఫీసర్గా ఎన్నో సంస్కరణలు చేశారు. ‘పాండిచ్చేరికి లెఫ్టినెంట్ గవర్నర్గా చేశారు. అలాగే రామన్ మెగసెసే అవార్డ్స్తో పాటు ఎన్నో జాతీయ, అంతర్జాతీయ అవార్డులు అందుకున్నారు కిరణ్ బేడీ. ఇక వెండితెరపై ఆమె పాత్రను ఎవరు చేస్తారు? అనేది చిత్రబృందం ప్రకటించలేదు. -
ఢిల్లీ మంత్రి జైలు విలాసాలపై ఘాటుగా స్పందించిన కిరణ్ బేడీ
న్యూఢిల్లీ: మనీలాండరింగ్ కేసులో తీహార్ జైల్లో శిక్షననుభవిస్తున్న ఢిల్లీ మంత్రి, ఆప్ నాయకుడు సత్యేంద్ర జైన్ ఈ మధ్య తరుచూ వార్తల్లో నిలుస్తున్నారు. జైలులో పోక్సో కేసులో నిందితుడైన ఖైదీతో మసాజ్ చేయించుకున్న ఘటన వెలుగులోకి వచ్చినప్పటి నుంచి వివాదాలకు కేరాఫ్ అడ్రస్గా మారారు. జైలులో ఉంటూనే సకల రాజభోగాలు అనుభవిస్తున్నారు. గదిలోనే రుచికరమైన ఆహారం, తనకు ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ లాగిస్తూ ఇటీవల కెమెరాకు చిక్కారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. తాజాగా సత్యేంద్ర జైన్ జైలు విలాసాలపై పుదుచ్చేరి మాజీ లెఫ్టెనెంట్ గవర్నర్ కిరణ్ బేడీ ఘాటుగా స్పందించారు. మంత్రికి మసాజ్ చేసిన వ్యక్తి ఫిజియోథెరపీలో డిగ్రీ చేశాడా అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తీహార్ జైలు సూపరింటెండెంట్ను సస్పెండ్ చేసిన ఢిల్లీ ప్రభుత్వం.. జైన్పై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ఈ మేరకు ఓ జాతీయా మీడియాతో గురువారం మాట్లాడారు. చదవండి: మసాజ్ వీడియో మరువకముందే మరొకటి.. జైలులో ఆప్ మంత్రికి పసందైన విందు.. తీహార్ జైలు పాలకుల తప్పిదం.. ఢిల్లీ రాజకీయ పాలనకు అద్దం పడుతోందని మండిపడ్డారు. తమ సొంత మంత్రి జైలులో ఉంటే అధికారులు మాత్రం ఎలా చర్యలు తీసుకుంటారని సెటైర్లు వేశారు. ‘సొంత మంత్రి జైలులో ఉండటం చాలా అరుదైన సందర్భం.. లోపల ఉన్న జైలు బాస్ ఇప్పటికీ బాస్గా కొనసాగుతున్నాడు. అతను ఏదైనా చేయగలడు, అడగగలడు. అతని ఆదేశాలకు జూనియర్లు కట్టుబడి ఉంటారు. అవకతవకలు జరిగాయని సూపరింటెండెంట్ని ప్రభుత్వ సస్పెండ్ చేసింది. మరి మంత్రి సంగతేంటి? ఇలా ఎన్నికైన ప్రజాప్రతినిధులను సస్పెండ్ చేసే వ్యవస్థ మనకు లేదా. ఆప్ నేతకు మసాజ్ చేస్తున్న ‘పెద్దమనిషి’ ఫిజియో కాదని తెలిసింది. అతను అత్యాచారం కేసులో నిందితుడని జైలు అధికారులు పేర్కొంటున్నారు. మరి అతనికి ఫిజియోథెరపీలో డిగ్రీ ఉందా.. లేదా రేప్ చేయడానికి ముందు అతను ఫిజియోథెరపిస్ట్గా పనిచేశారా’ అంటూ ఢిల్లీ ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెట్టారు. అనుమతి ఉంటే లెఫ్టినెంట్ గవర్నర్ జైన్ సస్పెన్షన్ లేదా తొలగింపును రాష్ట్రపతికి సిఫారసు చేయాలని డిమాండ్ చేశారు. కాగా భారత తొలి మహిళా ఐపీఎస్ అధికారిణీ అయిన కిరణ్ బేడీ.. 1993లో ఢిల్లీ జైళ్ల ఐజీగా నియమితులయ్యారు. తిహార్లో జైళ్ల డైరెకర్ట్ జనరల్గా ఉన్న సమయంలో పలు జైలు సంస్కరణలు ప్రవేశపెట్టినందుకు రామన్ మెగాసెస్ అవార్డు పొందారు. 2015లో బీజేపీలో చేరారు. చదవండి: అయినాసరే ఆడబిడ్డల్ని గమనిస్తూ ఉండాలి: కిరణ్ బేడీ -
అయినాసరే ఆడబిడ్డల్ని గమనిస్తూ ఉండాలి: కిరణ్ బేడీ
ఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలన చర్చకు దారి తీసింది శ్రద్ధా వాకర్ హత్యోదంతం. దేశ రాజధానిలో ప్రియుడి చేతిలో కిరాతకంగా హత్యకు గురైంది ఆమె. ఆమె మృతదేహాన్ని ముక్కలుగా చేసి ఫ్రిడ్జ్లో దాచి.. ఆపై నగరంలో అక్కడక్కడ పడేశాడు నిందితుడు అఫ్తాబ్ అమీన్ పూనావాలా. ఆలస్యంగా వెలుగు చూసి వార్తల్లో ప్రముఖంగా నిలిచిన ఈ కేసుపై మాజీ ఐపీఎస్ అధికారిణి, పుదుచ్చేరి మాజీ లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆడబిడ్డల విషయంలో పేరెంట్స్ చాలా జాగ్రత్తగా ఉండాలి. మీతో ఎలాంటి సంబంధం లేదని వాళ్లు చెప్పినా సరే ఆ మాటల్ని పట్టించుకోకూడదు. వాళ్లను నిరంతరం గమనిస్తూ ఉండాలి అని తల్లిదండ్రులకు సూచించారామె. ఢిల్లీ ఉదంతంపై స్పందిస్తూ.. ఆమె ఇంటి నుంచి వెళ్లిపోయింది. కానీ, ఆమె ఆచూకీ గురించి ఆలస్యంగా పట్టించుకున్నారు ఆమె కుటుంబ సభ్యులు. కాబట్టి, జరిగిన దారుణానికి బాధ్యత ఆ తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యులపై కూడా ఉంటుంది అని కిరణ్బేడీ తెలిపారు. శ్రద్ధ తల్లిదండ్రులు ఆమె బాగోగుల గురించి మరింత పట్టించుకుని ఉండాల్సింది. ఆమె ఉంటున్న ఫ్లాట్ చుట్టుపక్కల వాళ్లు, యజమాని సైతం బాధ్యతగా వ్యవహరించి ఉండాల్సింది. ఒకరకంగా ఈ ఘటనకు ఆమె కుటుంబమే కారణంగా అనిపిస్తోంది. అంతేకాదు.. ఇది సమాజ వైఫల్యం, స్నేహితులది కూడా అని కిరణ్బేడీ ఓ జాతీయ మీడియాతో వ్యాఖ్యానించారు. ఆడపిల్లను పెంచే సామాజిక బాధ్యతపై ఆమె స్పందిస్తూ.. స్వతంత్ర భావజాలం అలవర్చుకునేలా అమ్మాయిలను పెంచాలని ఆమె తల్లులకు సూచించారు. ఆపై వారు(ఆడపిల్లలు) ఎలా ఉంటారో? ఎక్కడ జీవిస్తారో? అని ఆందోళన చెందొద్దని, వారికి భరోసా ఇవ్వడం కుటుంబం యొక్క బాధ్యత అని ఆమె అభిప్రాయపడ్డారు. శ్రద్దా వాకర్ హత్య కేసు దర్యాప్తుపైనా స్పందించిన కిరణ్ బేడీ.. డేటింగ్ యాప్లో శ్రద్ధకు నిందితుడు అఫ్తాబ్ ఎలా దగ్గరయ్యాడు? అనే కోణంలోనూ తప్పనిసరిగా దర్యాప్తు చేపట్టాలని అధికారులకు సూచించారామె. సంబంధిత వార్త: శ్రద్ధ శవాన్ని ఫ్రిజ్లో ఉంచి.. మరో యువతితో రొమాన్స్! -
'మామ్పవర్ 360’.. కెరీర్కు గుడ్బై చెప్పిన మహిళలను తిరిగి..
కెరీర్, కుటుంబం... వీటిలో విలువైనది ఏమిటి? అనే ప్రశ్నకు – విలువైన జవాబు... ‘రెండిటినీ సమన్వయం చేసుకొని ముందుకు వెళ్లడం’ కుటుంబ బాధ్యతల్లో పడి విలువైన కెరీర్ను కోల్పోతున్న ప్రతిభావంతులైన మహిళలలో ‘మామ్పవర్ 360’తో స్ఫూర్తి నింపుతున్న లక్ష్మీ శేషాద్రి గురించి... బిడ్డకు తల్లి అయిన తరువాత ‘కెరీరా?’ ‘కుటుంబమా?’ అనే డోలాయమాన స్థితి ఎంతోమంది మహిళలకు ఎదురవుతుంది. చాలామంది కుటుంబాన్నే ఎంపిక చేసుకుంటారు. కెరీర్కు గుడ్బై చెబుతారు. నిజానికి వారు తమ రంగాలలో ప్రతిభావంతులు, ఎన్నో విజయాలు సాధించాల్సిన వారు. ఒక బిడ్డకు తల్లి అయిన తరువాత జయశ్రీ ఉల్లాల్ ముందుకు ‘కుటుంబమా? కెరీరా?’ అనే ప్రశ్నలు వచ్చి నిలుచున్నాయి. కుటుంబం వైపే మొగ్గు చూపింది ఆమె మనసు. అయితే, ఆమె శక్తిసామర్థ్యాల గురించి తెలిసిన కుటుంబసభ్యులు ఇది సరికాదన్నారు. తన ప్రతిభ వృథా పోకూడదు అనుకున్నారు. జయశ్రీ మనసు మార్చుకుంది. కుటుంబ జీవితాన్ని, కెరీర్ను సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లాలని నిర్ణయించుకుంది. జయశ్రీ ఉల్లాల్ కుటుంబ జీవితానికే పరిమితమై ఉంటే ‘అమెరికాస్ రిచెస్ట్ సెల్ఫ్–మేడ్ ఉమెన్’ జాబితాలో ఆమె చోటు సంపాదించేది కాదు. ప్రపంచవ్యాప్తంగా ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచేది కాదు. కుటుంబ సభ్యుల ప్రోత్సాహం వల్ల తాను వదులుకున్న కెరీర్లోకి మళ్లీ వచ్చి దూసుకుపోయింది. అయితే ఆ అదృష్టం చాలామందికి లేకపోవడం వల్ల ఇంటికే పరిమితమైపోతున్నారు. అలాంటి వారికి ‘మామ్పవర్ 360’ కొత్తశక్తిని ఇవ్వనుంది. లక్ష్మీశేషాద్రి ఈ సంస్థకు శ్రీకారం చుట్టింది. బెంగళూరుకు చెందిన లక్ష్మి ఇంజనీర్, సోషల్–ఎంటర్ప్రెన్యూర్, మిసెస్ ఇండియా యూనివర్స్–2016 మాతృత్వం తరువాత కెరీర్కు గుడ్బై చెప్పిన మహిళలను తిరిగి ట్రాక్పై తీసుకురావడానికి ‘మామ్పవర్ 360’ ద్వారా కృషి చేస్తోంది లక్ష్మీ శేషాద్రి. ‘ఎంపవర్ మామ్స్ ఆన్ ఏ 360 లెవెల్’ అనేది ఆమె నినాదం.మాతృత్వం తరువాత కెరీర్ను వదులుకున్న ప్రతిభావంతులైన మహిళలను ఒకే వేదికపై తీసుకురావడానికి, ఒకరికొకరు సహాయ సహకారాలు అందించుకోవడానికి ‘మామ్పవర్ 360’ క్రియాశీల పాత్ర పోషించనుంది. ‘మామ్ పవర్ కాన్ఫరెన్స్’ పేరుతో సదస్సులు నిర్వహిస్తారు. వీటికి ముఖ్య అతిథులుగా వివిధ రంగాలకు చెందిన మామ్–ఎచీవర్స్, మామ్–ఎంటర్ప్రెన్యూర్స్ హాజరవుతారు. తమ అనుభవాలను పంచుకుంటారు. ‘ఒకరితో ఒకరికి ఆత్మీయ సంభాషణకు వీలయ్యే అర్థవంతమైన వేదికకు రూపకల్పన చేయాలనేది నా లక్ష్యం. ఈ వేదికలో హోమ్మేకర్ మామ్, వర్కింగ్ మామ్, ఎంటర్ప్రైజింగ్ మామ్...ఉంటారు. మామ్పవర్ 360 ద్వారా ఆన్లైన్, ఆఫ్లైన్లలో టాక్ టు ఇన్స్పైరింగ్ ఉమెన్ కార్యక్రమాలు నిర్వహిస్తాం. కొత్త ఆలోచనలతో ముందడుగు వేయడానికి ఇవి ఉపకరిస్తాయి. ఎంటర్ప్రెన్యూర్స్, ఇన్ఫ్లూయెన్సర్స్, కంటెంట్ క్రియేటర్స్కు నెట్వర్కింగ్ ప్లాట్ఫామ్గా మామ్పవర్ ఉపయోగపడుతుంది’ అంటుంది లక్ష్మీ శేషాద్రి. ప్యానల్లో కిరణ్ బేడి, రూప డి, నిరూప శంకర్, సిమ్రాన్ చోప్రా, గౌరీ కపూర్, డా.చైత్ర ఆనంద్, అను ప్రభాకర్, బిందు సుబ్రహ్మణ్యం... మొదలైన వారు ఉన్నారు. వృత్తి–వ్యకిగత జీవితాన్ని ఎలా సమన్వయం చేసుకోవాలి అనే విషయంలో విలువైన సలహాలు ఇస్తారు. వీరితోపాటు ‘మదర్హుడ్ హాస్పిటల్స్’ టాప్ డాక్టర్స్, చైల్డ్ సైకాలజిస్ట్లు, ఫిట్నెస్, న్యూట్రిషన్, పేరెంటింగ్, రిలేషన్షిప్ ఎక్స్పర్ట్లు తమ సలహాలు అందిస్తారు. ‘గత రెండు సంవత్సరాలు...మహిళలకు కఠిన సమయం. ఇంటిపని, కుటుంబబాధ్యతలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న సమయంలో తమ శక్తిసామర్థ్యాల గురించి ఆలోచించే సమయం చిక్కడం లేదు. మామ్పవర్ 360 వేదిక ద్వారా తమను తాము పునరావిష్కరించుకునే అవకాశం మహిళలకు వస్తుంది’ అంటున్నారు మదర్హుడ్ హాస్పిటల్స్ సీయివో విజరత్న. -
ఉక్కు మహిళకు తగిన మహిళ.. కిరణ్ బేడి
1972లో 23 ఏళ్ల వయసులో ఐపీఎస్ సర్వీస్లోకి వచ్చిన కిరణ్ బేడి ప్రస్తుతం 72 ఏళ్ల వయసులో పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్గా ఉన్నారు. నేరస్థులకు సింహస్వప్నంగా ఉంటూనే, నేర స్వభావం గల ఖైదీలను తిరిగి మనుషులుగా మార్చే విధంగా ఆమె జైలు సంస్కరణలను తీసుకొచ్చారు. తీహార్ జైలు ఇప్పుడు కొంచెం మానవత్వంతో ప్రవర్తిస్తోందంటే.. జైళ్ల ఇన్స్పెక్టర్ జనరల్గా బేడీ తీసుకున్న చర్యల కారణంగానే. ఆ క్రితం వరకు తీహార్లో శుభ్రత ఉండేది కాదు. ఖైదీలకు పోషకాహారం పెట్టేవాళ్లు కాదు. జైల్లో మానవ హక్కులన్నవే ఉండేవి కావు. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో డిప్యూటీ డైరెక్టర్గా, యాంటీ టెర్రరిస్ట్ స్పెషలిస్టుగా కూడా మాదక ద్రవ్య సామ్రాజ్యాలపై, తీవ్రవాద కార్యకలాపాలపై బేడీ పట్టు బిగించారు. కిరణ్ బేడీ అమృత్సర్ అమ్మాయి. అక్కడి ఒక కాలేజ్లో పొలిటికల్ సైన్స్ టీచర్గా ఆమె కెరీర్ మొదలైంది. తర్వాత సివిల్స్ రాసి ఐ.పి.ఎస్. అయ్యారు. కెరీర్ మొదటి నుంచి కూడా ఆమె ఎంత స్ట్రిక్టుగా ఉండేవారో చెప్పడానికి ఇప్పటికీ ఒక సందర్భం ఉదాహరణల్లోకి వస్తుంటుంది. ట్రాఫిక్ డ్యూటీలో ఉన్నప్పుడు ఏకంగా ప్రధాని ఇందిరాగాంధీ కాన్వాయ్లోని వాహనానికే ఆమె రాంగ్ పార్కింగ్ చలాన్ రాశారట! అందుకు శ్రీమతి గాంధీ ఆమెను ప్రశంసించి బ్రేక్ ఫాస్ట్కు పిలిచారని కూడా అంటారు. అయితే ఆ పిలవడం అన్నది అప్పుడు కాదు, వేరే సందర్భంలో అంటారు కిరణ్బేడీ. అయినా ఈ ఉక్కుమహిళ నుంచి స్ఫూర్తిని పొందడానికి సందర్భాలతో పనేముంది? అయినా ఏదో ఒక సందర్భం ఉండాలంటే మాత్రం.. ఈరోజు (జూన్ 9) కిరణ్ బేడీ జన్మదినం. -
షాకింగ్ వీడియోను పోస్ట్ చేసిన కిరణ్ బేడి... మండిపడుతున్న నెటిజన్లు
Shark Jumping Unbelievably High To Grab The Chopper: ప్రముఖులు, సెలబ్రెటీలు వైరల్ వీడియోలు పోస్ట్ చేసే ముందు చాలా జాగ్రత్త ఉండాలి. లేదంటే నెటిజన్ల ట్రోలింగ్కి గురవ్వాల్సిందే. అచ్చం అలానే ఒక సినిమాలో సీన్ని వైరల్ వీడియో పోస్ట్ చేసి నెటజన్ల ఆగ్రహానికి గురయ్యారు మాజీ ఐపీఎస్ అధికారిణి కిరణ్బేడీ. అసలేం జరిగిందంటే...ఒక షార్క్ చేప సముద్రంలోంచి పైకి ఎగిరి హెలికాప్టర్ పై దాడి చేస్తున్న వైరల్ వీడియోని మాజీ ఐపీఎస్ అధికారిణి, పుదుచ్చేరి మాజీ లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. పైగా ఈ వీడియోకి నేషనల్ జియోగ్రాఫిక్ ఒక మిలియన్ డాలర్లు చెల్లించిందని కూడా ట్వీట్ చేశారు. నిజానికి ఇది 2017లో వచ్చిన ఫైవ్ హెడ్డ్ షార్క్ ఎటాడ్ చిత్రంలోని సన్నివేశం. దీంతో నెటిజన్లు ఈ వీడియోని చూసి ఒక్కసారిగా షాక్కి గురై ఆమెను దారుణంగా ట్రోల్ చేయడవ మొదలుపెట్టారు. అంతేకాదు అత్యంత మేధావులైన ఐఏఎస్ లేదా ఐపీఎస్ అధికారులు ఇలాంటి ఫేక్ వీడియోని పోస్ట్ చేయడం ఏంటని ఒకరు, అయినా అసలు అదేలా సాధ్యం అని కూడా ఆలోచించకుండా ఈ వీడియోని పోస్ట్ చేశారంటు మరోకరు ఇలా రకరకాలుగా కామెంట్లు చేయడం మొదలు పెట్టారు. దీంతో కిరణ్ బేడి స్పందించడమే కాకుండా మళ్లీ ఆ వీడియోని పోస్ట్ చేస్తూ పూర్తి వివరణ ఇచ్చారు. ఈ సన్నివేశం ఎక్కడ నుంచి వచ్చింది అనేదానికంటే అసలు అలా చేయాలనే ఊహ రావడం గ్రేట్ అని అన్నారు. అయినా ఇలాంటి సాహసోపేతమైన సన్నివేశాన్ని తీయాలనే ఆలోచన తట్టినందుకు మనం ప్రశంసించాలి అంటూ ట్విట్టర్లో చెప్పుకొచ్చారు. ఐతే ఆమె గతంలో కూడా ఇలాంటి ఫేక్ వీడియోలు పోస్ట్ చేసి నెటిజన్ల ట్రోలింగ్కి గురయ్యారు. Watch this 🥹🥺🙄😳😲 pic.twitter.com/Io0PQb567U — Kiran Bedi (@thekiranbedi) May 11, 2022 (చదవండి: వైరల్ వీడియో: సింహాన్ని తరిమిన శునకం) -
కిరణ్ బేడీకి షాక్!
కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి రాజకీయాలను ఎంతో సన్నిహితంగా గమనిస్తున్నవారిని సైతం ఆశ్చర్యపరిచే పరిణామం ఇది. అక్కడ ముఖ్యమంత్రి నారాయణస్వామి సారథ్యంలో కొనసాగుతున్న ప్రభుత్వం మరికొన్ని నెలల్లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల వరకూ వుంటుందా...ఈలోగానే ఎమ్మెల్యేల రాజీనామాలతో కుప్పకూలుతుందా అని అందరూ ఆసక్తికరంగా చూస్తుండగా, ఎవరూ ఊహించని విధంగా అక్కడి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ పదవి కోల్పోయారు. వాస్తవానికి ఆమె అయిదేళ్ల పదవీకాలం కూడా మరో మూడు నెలల్లో ముగియాల్సివుంది. కానీ ఆమెను అలా సజావుగా రిటైర్ కానీయకుండా... కనీసం రాజీనామా చేయమని కూడా కోరకుండా ఉద్వాసన పలికి కేంద్రం భిన్నంగా వ్యవహరించింది. గవర్నర్లుగా వున్నవారికీ, ముఖ్యమంత్రులకూ పడని సంద ర్భాలు చోటుచేసుకోవటం కొత్తేమీ కాదు. కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ ఒకే పార్టీకి చెందిన ప్రభు త్వాలుంటే ఈ వివాదం వుండదు. అలాగని విపక్షాలు ఏలుతున్న రాష్ట్రాలన్నిటా కూడా ఆ పరిస్థితి లేదు. గతంలో ఢిల్లీలో తరచుగా, ఈమధ్య పశ్చిమ బెంగాల్లో అప్పుడప్పుడు ఆ మాదిరి సమస్యలు ఏర్పడ్డాయి. ఇటీవలికాలంలో ఢిల్లీలో వివాదాలేమీ లేవనే చెప్పాలి. కానీ పుదుచ్చేరిలో అలా కాదు. 2016 మే నెలలో లెఫ్టినెంట్ గవర్నర్గా వచ్చింది మొదలు కిరణ్ బేడీ నిరంతరం వివాదాల్లోనే వున్నారు. తనను తొలగించాక రాష్ట్ర ప్రజలనుద్దేశించి విడుదల చేసిన ప్రకటనలో లెఫ్టినెంట్ గవ ర్నర్గా రాజ్యాంగపరమైన, నైతికపరమైన బాధ్యతల్ని పవిత్ర కర్తవ్యంగా భావించి నిర్వర్తించినట్టు చెప్పుకున్నారు. ఆమె నిజంగా అలా అనుకునే ఈ నాలుగున్నరేళ్లూ పనిచేసివుండొచ్చు. కానీ ప్రజ లంతా అలా అనుకునేలా వ్యవహరించివుంటే వేరుగా వుండేది. దేశంలో తొలి మహిళా ఐపీఎస్ అధికారిగా కిరణ్ బేడీ అందరికీ గుర్తుండిపోతారు. ఐపీఎస్ అధికారిగా ఆమె అందరి మన్ననలూ పొందిన సందర్భాలున్నాయి. అలాగే శాంతిభద్రతల నిర్వహణకు సంబంధించిన అతి చిన్న అంశాల్లో అతిగా స్పందించి వివాదాల్లో చిక్కుకున్న సందర్భాలున్నాయి. 2015లో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలప్పుడు బ్రహ్మాండమైన రాజకీయ ఎత్తుగడగా లెక్కేసుకుని కిరణ్ బేడీని పార్టీలో చేర్చు కోవటమేకాక, ఆమెను సీఎం అభ్యర్థిగా కూడా ప్రకటించి బీజేపీ అధిష్టానం భంగపడింది. అయినా ఆ మరుసటి సంవత్సరం ఆమెకు లెఫ్టినెంట్ గవర్నర్ అవకాశం వచ్చింది. కానీ అక్కడ కూడా అంచనాలకు తగినట్టు ఆమె వ్యవహరించలేకపోయారు. కిరణ్ బేడీ తీరును నిరసిస్తూ 2019 ఫిబ్రవరిలో ముఖ్యమంత్రి నారాయణస్వామి వారం రోజులపాటు లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయం ఎదుట ధర్నా సాగించిన సంగతిని ఎవరూ మరిచి పోరు. చివరకు సుదీర్ఘ చర్చలు నడిచి రాజీ కుదిరింది. కానీ ఆ తర్వాతైనా పెద్దగా మారిందేమీ లేదు. ప్రజలెన్నుకున్నవారు ప్రభుత్వ యంత్రాంగాన్ని నడిపించాలా, లెఫ్టినెంట్ గవర్నర్గా వున్నవారు సొంత చొరవతో దూసుకుపోతూ సమాంతరంగా పెత్తనం సాగించాలా అన్న వివాదం పుదుచ్చేరిలో చాన్నాళ్లుగా సాగుతోంది. పారిశుద్ధ్యం నుంచి అవినీతి వరకూ సమస్యలు తలెత్తినచోటల్లా కిరణ్ బేడీయే ప్రత్యక్షమవుతూ అధికారులకు ఆదేశాలు జారీచేయటం, వారిని మందలించటం వంటివి చేస్తుంటే జనం దృష్టిలో ప్రభుత్వం దోషిగా మారిన సందర్భాలున్నాయి. అవినీతి, ఆశ్రిత పక్షపాతం, నత్తనడకన పనులు సాగుతుండటం కిరణ్ బేడీలో అసహనం కలిగించి వుండొచ్చు. వాటన్నిటినీ ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొస్తే వేరుగా వుండేది. అధికారులు సైతం అప్రమత్తంగా వ్యవహరించేవారు. లెఫ్టినెంట్ గవర్నర్ తీరు జన సంక్షేమ కార్యక్రమాల అమలుకు ఆటంకంగా మారిందని నారాయణస్వామి ఒకమారు ఆరోపించారు. ఇక సామాజిక మాధ్యమాల్లో ఇద్దరి మధ్యా కొనసాగిన ప్రచ్ఛన్న యుద్ధానికి అంతేలేదు. ఆఖరికి నూతన సంవత్సర వేడుకలు ప్రజలు జరుపు కోవాలా, వద్దా అనే అంశంలోనూ ప్రభుత్వానికీ, ఆమెకూ మధ్య ఏకాభిప్రాయం లేదు. కరోనా కారణంగా ఎవరూ ఇళ్లనుంచి బయటకు రావొద్దని కిరణ్ బేడీ విజ్ఞప్తి చేయగా... కొన్ని శక్తులు ఈ వేడుకలను అడ్డుకోవాలని చూసినా ప్రజలు ఉత్సాహంగా జరుపుకున్నారంటూ ఆ మర్నాడు నారాయణస్వామి ప్రకటించారు. కిరణ్ బేడీని తొలగించాలంటూ రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్కు వినతిపత్రం కూడా ఇచ్చారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె తీరు పెద్ద చర్చనీయాంశంగా మారితే అది అన్నా డీఎంకే–బీజేపీ కూటమికి నష్టం చేకూరుస్తుందని కేంద్రంలోని పెద్దలు భావించటం వల్లే తాజా పరిణామం చోటుచేసుకుందన్నది కొందరి విశ్లేషణ. అందులో నిజం లేకపోలేదు. ద్విచక్ర వాహనదారులకు తక్షణం హెల్మెట్ ధారణ తప్పనిసరి చేయాలనడం, రేషన్ దుకాణాల్లో సరుకులిచ్చే బదులు నగదు బదిలీ చేయాలని కిరణ్ బేడీ పట్టుబట్టడం అధికార కూటమికి మాత్రమే కాదు... విపక్షానికి కూడా మింగుడు పడలేదు. ఎన్నికలు ముంగిట్లో వుండగా ఆమె ఇలా వ్యవహరించటం వల్ల కొంపమునుగుతుందని, కేందమ్రే ఆమెతో అలా చేయిస్తున్నదని ప్రభుత్వం ప్రచారం చేస్తుందని విపక్షం భయపడింది. మొత్తానికి కిరణ్బేడీ పదవిలో వున్నçప్పటిలాగే పోగొట్టుకోవటంలోనూ సంచలనం సృష్టిం చారు. ఇక ఇన్నాళ్లూ ఆమెతో ఎడతెగని వివాదాల్లో చిక్కుకుని ప్రస్తుతం మైనారిటీలో పడిన నారాయణస్వామి సర్కారు పూర్తి పదవీకాలం పూర్తి చేసుకుంటుందా... కిరణ్ బేడీ తరహాలో ముందుగానే అధికారం నుంచి వైదొలగవలసి వస్తుందా అన్నది ఒకటి రెండురోజుల్లో తేలిపోతుంది. -
కిరణ్ బేడికి బై బై.. తమిళిసైకి బాధ్యతలు
సాక్షి చెన్నై/న్యూఢిల్లీ: పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో కీలక పరిణామాలు సంభవించాయి. లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీని కేంద్రం పదవి నుంచి తొలగించింది. ఈ మేరకు మంగళవారం రాత్రి రాష్ట్రపతి భవన్ నుంచి ఒక ప్రకటన వెలువడింది. తెలంగాణ గవర్నర్ తమిళిసై.. పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్గా అదనపు బాధ్యతలను నిర్వహిస్తారని తెలిపింది. మరొకరిని నియమించే వరకు ఆ బాధ్యతలు తమిళిసై నిర్వర్తిస్తారు. సీఎం నారాయణ స్వామి ప్రభుత్వం మైనారిటీలో పడిపోయిన కొద్ది గంటల్లోనే ఈ పరిణామాలు చోటుచేసుకోవడం గమనార్హం. మేలో జరగనున్న ఎన్నికల్లో కిరణ్ బేడీపై వ్యతిరేకతను ప్రతిపక్షాలు ప్రధాన ప్రచారాంశంగా మలుచుకోరాదనే కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. గత నెలలో కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన ఇద్దరు ఎమ్మెల్యేల్లో ఒకరైన ఎ.నమశ్శివాయం ప్రధాన డిమాండ్లలో కిరణ్ బేడీ తొలగింపు ఒకటని సమాచారం. నారాయణ స్వామి ఏమంటున్నారు? మాజీ ఐపీఎస్ అధికారి కిరణ్బేడీ 2016 మేలో పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్గా నియమితులయ్యారు. అప్పటి నుంచి నారాయణ స్వామి ప్రభుత్వంతో విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఆమె పనితీరు అప్రజాస్వామికంగా ఉందంటూ నారాయణ స్వామి ఆరోపిస్తున్నారు. 2019లో, తిరిగి గత నెలలో లెఫ్టినెంట్ గవర్నర్ అధికార నివాసం ఎదుట నారాయణ స్వామి ధర్నాకు కూడా దిగారు. సీఎం నారాయణ స్వామి మీడియాతో మాట్లాడుతూ..‘మా ఎమ్మెల్యే మల్లాడి నారాయణ స్వామిని కిరణ్ బేడీ పలుమార్లు వేధింపులకు గురి చేశారు. దీనిపై రాష్ట్రపతి కోవింద్కు కూడా ఫిర్యాదు చేశాం. రోజువారీ పరిపాలనా వ్యవహారాల్లోనూ కిరణ్ బేడీ జోక్యం చేసుకుంటున్నారు. సమస్యలు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారు’అని చెప్పారు. తన ప్రభుత్వానికి ఇప్పటికీ మెజారిటీ ఉందని సీఎం నారాయణ స్వామి ఎన్డీటీవీతో అన్నారు. కృష్ణారావు, కుమార్ల రాజీనామాలను ఆమోదించలేదనీ, అవి ఇంకా స్పీకర్ పరిశీలనలోనే ఉన్నాయన్నారు. నేడు రాహుల్ రాక బలం కోల్పోవడంతో ప్రభుత్వాన్ని రద్దు చేయాలని సీఎం నారాయణస్వామి నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అసెంబ్లీలో మొత్తం 30 స్థానాలకు గాను 2016 ఎన్నికల్లో 15 సీట్లు గెలుపొందిన కాంగ్రెస్ అధికారం చేపట్టింది. ముగ్గురు డీఎంకే ఎమ్మెల్యేలు, ఒక ఇండిపెండెంట్ ఎమ్మెల్యే మిత్రపక్షాలుగా ఉన్నారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్ప డుతున్నారనే ఆరోపణలపై కాంగ్రెస్ ఎమ్మెల్యే ధనవేలును ఆ పదవి నుంచి పార్టీ తొలగించింది. ఇటీవల మంత్రి నమశ్శివాయం, ఎమ్మెల్యే దీపా యన్దన్ సైతం రాజీనామా చేశారు. కొన్ని రోజుల క్రితం మంత్రి పదవికి రాజీనామా చేసిన మల్లాడి కృష్ణారావు ఈనెల 15న ఎమ్మెల్యే పదవికి సైతం రాజీనామా చేశారు. మరో కాంగ్రెస్ ఎమ్మెల్యే జాన్కుమార్ మంగళవారం తన రాజీనామా పత్రాన్ని స్పీకర్కు అందజేశారు. స్పీకర్ను కలుపుకుని అసెంబ్లీలో కాంగ్రెస్ బలం 10కి పడింది. మూడు డీఎంకే, ఒక స్వతంత్ర అభ్యర్థులను కలుపుకున్నా 14కి పరిమితం కాగలదు. ప్రతిపక్షంలో ఎన్ఆర్ కాంగ్రెస్ 7, అన్నాడీఎంకే 4, నామినేటెడ్ (బీజేపీ) ఎమ్మెల్యేలు 3తో కలుపుకుని మొత్తం 14 సభ్యుల బలం ఉంటుంది. అధికార, ప్రతిపక్షాలకు సమబలం ఏర్పడడంతో ప్రభుత్వం మైనార్టీలో పడింది. ఒక ఎమ్మెల్యేకు బీజేపీ గాలం వేస్తే మ్యాజిక్ ఫిగర్ 15 స్థానాలతో అధికారంలోకి రాగలదు. ప్రభుత్వం మెజార్టీ కోల్పోయిన నేపథ్యంలో పుదుచ్చేరి చేరుకున్న రాష్ట్ర పార్టీ ఇన్చార్జ్ దినేష్ గుండూరావుతో నారాయణస్వామి, మంత్రులు, ఎమ్మెల్యేలు సమాలోచనలు జరిపారు. మరో రెండు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు సమీస్తున్నందున మంత్రివర్గమే రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. -
పుదుచ్చేరి జిల్లా కలెక్టర్పై విష ప్రయోగం?
సాక్షి ప్రతినిధి, చెన్నై: పుదుచ్చేరి జిల్లా కలెక్టర్ పూర్వ గార్గ్పై విష ప్రయోగం జరిగిందన్న అభియోగాలతో సీబీ–సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు. పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతం లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ వైఖరిని వ్యతిరేకిస్తూ సీఎం నారాయణస్వామి నేతృత్వంలో శుక్రవారం రాజ్నివాస్ ఎదుట ఆందోళన చేపట్టారు. ఈ కార్యక్రమం బందోబస్తు ఏర్పాట్లపై చర్చించేందుకు కలెక్టరేట్లో అధికారులు గురువారం సమావేశమయ్యారు. సమావేశంలో పాల్గొన్న అధికారులకు ప్రైవేటు కంపెనీకి చెందిన తాగునీటి సీసాలను అందజేశారు. కలెక్టర్ పూర్వగార్గ్ వాటర్ బాటిల్ తెరవగానే స్పిరిట్ వంటి రసాయనం వాసన గుప్పుమనడంతో తాగకుండా అధికారులకు అప్పగించారు. దీనిపై విచారణ జరపాలని ఆదేశించారు. మిగతా బాటిళ్లలో మాత్రం స్వచ్ఛమైన నీరే ఉంది. జిల్లా కలెక్టర్కు అందజేసిన బాటిల్లోని నీరు మాత్రమే విషతుల్యంగా ఉండడంతో అధికారులు హతాశులయ్యారు.ఈ ఘటనను లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ ఖండించారు. లెఫ్టినెంట్ గవర్నర్కి వ్యతిరేకంగా సీఎం నారాయణస్వామి శుక్రవారం ధర్నా చేశారు. -
ఫోటోలు చూస్తుంటే గూస్బంప్స్ వస్తున్నాయి
పాత ఫొటోలు తిరగేస్తుంటాం. ఓ చోట వేళ్లు ఆగిపోతాయ్. ఏళ్లూ ఆగి, వెనక్కు వెళతాయి. ఓ ఐపీఎస్ వేళ్లు అలాగే ఆగాయి. కిరణ్ బేడీ ఫొటోలు పెట్టి..కనుక్కోండి ఎవరో అన్నాడు. ఈజీ పజిల్! ఉత్తేజాన్నిచ్చే పజిల్ కూడా.మనం నింపడం కాదు.. మనల్ని నింపే పజిల్.. బేడీ! ఒక పౌరుడిగా సోనూ సూద్ ఎలాంటి వారో, ఒక ఐపీఎస్ ఆఫీసర్గా దీపాంశు కబ్రా అలాంటి వారు. ఛత్తీస్గఢ్లోని బిలాస్పూర్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆయన. ఈ కరోనా సమయంలో బాధితులకు ఆయన అందించని సహాయమే లేదు. అయితే ఈ స్టోరీ సోనూ సూద్ది గానీ, దీపాంశు కబ్రాది గానీ కాదు. సెప్టెంబర్ 15న దీపాంశు రెండు ఫొటోలు జతపరిచిన ఒక ఏకవర్ణ చిత్రాన్ని ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ‘ఈ వండర్ ఉమన్ ఆఫ్ ఇండియా ఎవరో ఊహించగలరా?’ అని ఆయన ప్రశ్న. ఆమె రాసిన పుస్తకం పేరు ఒకటేదైనా చెప్పమని కూడా ఆయన బ్రెయిన్ టీజర్ ఇచ్చారు. దీపాంశుకు ఇలాంటి పజిల్స్ పెట్టడం అలవాటు. వెంటనే అంతా ఉత్సాహంగా ఆ ‘చెప్పుకోండి చూద్దాం’లో పాల్గొన్నారు. ‘‘సర్.. మళ్లీ ఈజీ క్వొశ్చన్ అడిగారు! కరెక్ట్ ఆన్సర్స్ చెప్పీ చెప్పీ అలసిపోయాను సర్..’’ అని జోక్ చేస్తూ.. ‘‘ఆమె ఎవరో కాదు. ఈ దేశంలోని ప్రతి అమ్మాయికీ, ప్రతి మహిళకు ఇన్స్పిరేషన్. ఆమే.. కిరణ్ బేడీ’’ అన్నారు ఒకరు. ‘‘ఇప్పుడీమె పుదుచ్చేరి గవర్నర్గా ఉన్నారు’’ అని ఇంకొకరు.మిగతావి ఇలా ఉన్నాయి. ‘‘ఈ ఫొటోలు చూస్తుంటే నా ఒంటి మీద గూస్బంప్స్ వస్తున్నాయి సర్.’’ ‘‘భారతదేశ తొలి మహిళా ఐపీఎస్ ఆఫీసర్, ప్రస్తుతం పుదుచ్ఛేరి లెఫ్టినెంట్ గవర్నర్గా ఉన్న కిరణ్ బేడీ. ఆమె రాసిన ఒక పుస్తకం ‘ఇటీజ్ ఆల్వేస్ పాజిబుల్: ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ తీహార్ ప్రిజన్’’ ‘‘తొలి ఐపీఎస్ మహిళా అధికారి మాత్రమే కాదు, టెన్నిస్ చాంపియన్ కూడా’’. ∙∙ కరెక్టే. ఆమె కిరణ్ బేడీనే. తేలిగ్గానే తెలుస్తోంది. నలభై ఐదేళ్ల క్రితం 1975 రిపబ్లిక్ డే పరేడ్లో మొత్తం పురుషులే ఉన్న ఢిల్లీ పోలీస్ దళాన్ని కిరణ్ బేడీ ముందుండి నడిపిస్తున్న ఫొటో ఒకటి, ట్రాఫిక్ డీసీపీగా ఏషియన్ గేమ్స్ ఏర్పాట్లకు ముందు వాహనాల రద్దీని క్లియర్ చేస్తున్నప్పటి ఫొటో ఇంకొకటి.. ఈ రెండిటినీ కలిపి దీపాంశు కబ్రా పోస్ట్ చేశారు. ప్రత్యేక సందర్భంగా ఆయన ఈ ట్వీట్ చేయలేదు. ట్వీట్ చేయడంతో కిరణ్ బేyీ మళ్లీ సోషల్ మీడియాలో మరొకసారి ప్రాముఖ్యంలోకి వచ్చారు. దీపాంశు ప్రశ్నకు సమాధానంగా.. ‘‘కిరణ్ బేడీ మ్యామ్ చాలా స్ట్రాంగ్’’ అని షాలినీ అనే యువతి కామెంట్ పెట్టింది. అలాగే ఎక్కువ మంది బేడీ రాసిన పదిహేనుకు పైగా పుస్తకాలలో మరొకటి.. ‘వ్హాట్ వెంట్ రాంగ్.. అండ్ కంటిన్యూస్’ని ప్రస్తావించారు. అపరాధుల జీవితాల్లోని నీలి నీడల సంకలనం అది. 1972లో 23 ఏళ్ల వయసులో ఐపీఎస్ సర్వీస్లోకి వచ్చిన కిరణ్ బేడి ప్రస్తుతం 71 ఏళ్ల వయసులో పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్గా ఉన్నారు. నేరస్థులకు సింహస్వప్నంగా ఉంటూనే, నేర స్వభావం గల ఖైదీలను తిరిగి మనుషులుగా మార్చే విధంగా జైలు సంస్కరణలను తీసుకొచ్చారు. తీహార్ జైలు ఇప్పుడు కొంచెం మనిషిగా ప్రవర్తిస్తోందంటే.. జైళ్ల ఇన్స్పెక్టర్ జనరల్గా బేడీ తీసుకున్న చర్యల కారణంగానే. ఆ క్రితం వరకు తీహార్లో శుభ్రత ఉండేది కాదు. ఖైదీలకు పోషకాహారం పెట్టేవాళ్లు కాదు. జైల్లో మానవ హక్కులన్నవే ఉండేవి కావు. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో డిప్యూటీ డైరెక్టర్గా, యాంటీ టెర్రరిస్ట్ స్పెషలిస్టుగా కూడా మాదక ద్రవ్య సామ్రాజ్యాలపై, తీవ్రవాద కార్యకలాపాలపై బేడీ పట్టు బిగించారు. కిరణ్ బేడీ అమృత్సర్ అమ్మాయి. అక్కడి ఒక కాలేజ్లో పొలిటికల్ సైన్స్ టీచర్గా ఆమె కెరీర్ మొదలైంది. తర్వాత సివిల్స్ రాసి ఐ.పి.ఎస్. అయ్యారు. కెరీర్ మొదటి నుంచి కూడా ఆమె ఎంత స్ట్రిక్టుగా ఉండేవారో చెప్పడానికి ఇప్పటికీ ఒక సందర్భం ఉదాహరణల్లోకి వస్తుంటుంది. ట్రాఫిక్ డ్యూటీలో ఉన్నప్పుడు ఏకంగా ప్రధాని ఇందిరాగాంధీ కాన్వాయ్లోని వాహనానికే ఆమె రాంగ్ పార్కింగ్ చలాన్ రాశారట! అందుకు శ్రీమతి గాంధీ ఆమెను ప్రశంసించి బ్రేక్ ఫాస్ట్కు పిలిచారని కూడా అంటారు. అయితే ఆ పిలవడం అన్నది అప్పుడు కాదు, వేరే సందర్భంలో అంటారు కిరణ్బేడీ. అయినా ఈ ఉక్కుమహిళ నుంచి స్ఫూర్తిని పొందడానికి సందర్భాలతో పనిలేదు. అందుకే కదా దీపాంశు ట్విట్టర్లో ఈ వండర్ ఉమన్ను తలచుకుని, తలపింపజేశారు. -
దుకాణదారుల నిర్లక్ష్యం..ఇకపై సహించం : కిరణ్ బేడి
పుదుచ్చేరి : కరోనా నిబంధనలు ఉల్లంఘించే దుకాణాదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడి బుధవారం హెచ్చరించారు. ఒక దుకాణదారుడు నిబంధనల్ని ఉల్లంఘిస్తే ఆ ప్రాంతం మొత్తాన్ని ప్రమాదంలోకి నెట్టివేసినట్లే అవుతుందన్నారు. అంతేకాకుండా షాపు యజమాని కుటుంబంతో సహా ఎంతోమంది జోవనోపాదిపై ఈ ప్రభావం పడుతుందన్నారు. కాబట్టి ప్రభుత్వ నిబంధనల్ని కచ్చితంగా పాటించాలని ఉల్లంఘించిన వారిపై చట్టపరంగా విచారణ జరిపి చర్యలు తీసుకుంటామన్నారు. ఒకరిద్దరు దుకాణాదారుల నిర్లక్ష్యంతో వందల మందికి కరోనా సోకే అవకాశం ఉందని, దుకాణాదారులందరూ తమ ప్రాంగణాల్ని ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోలన్నారు. ఇప్పుడు ప్రతీ ఒక్కరూ మాస్క్ ధరిస్తున్నా భౌతిక దూరం, వ్యక్తిగత పరిశుభ్రత పాటించడంలో మాత్రం విఫలమవుతున్నారని పేర్కొన్నారు. (అంబేడ్కర్ ఇంటిపై దాడి ) మార్కెట్ అసోసియేషన్లు, మున్సిపాలిటీ కమిషనర్లు కరోనా నివారణ చర్యల్ని ప్రత్యక్షంగా పర్యవేక్షించాలని కిరణ్ బేడీ కోరారు. ఎప్పటికప్పుడు శానిటైజేషన్ నిర్వహిస్తూ పరిసర ప్రాంతాలను శుభ్రంగా ఉంచాలన్నారు. పుదుచ్చేరి వ్యాప్తంగా రోజుకి 70 కిపైగా కేసులు నమోదవుతున్నందున ప్రతీ ఒక్కరూ జాగ్రత్తగా వ్యవహరించాలని, ఇందులో ప్రజల సహకారం ఉండాలని ఈ సందర్భంగా కోరారు. ఇక గడిచిన 24 గంటల్లో పుదుచ్చేరిలో 112 కేసులు నమోదైనట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది. (‘ఆర్థిక సంక్షోభం తీవ్రతరం’ ) -
కౌంట్డౌన్ మొదలైంది!
సాక్షి, చెన్నై: పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్గా కిరణ్బేడి నాలుగేళ్లు పూర్తి చేసుకుని ఐదో వసంతంలోకి అడుగు పెట్టారు. ఈసందర్భంగా తన సేవలను గుర్తు చేస్తూ పుదుచ్చేరి ప్రజలకు ఆమె ఓ లేఖ రాయడమే కాదు, చివరగా కౌంట్డౌన్ మొదలైందంటూ ముగించారు. కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరికి 2016లో మాజీ ఐపీఎస్ అధికారి కిరణ్బేడి లెఫ్టినెంట్ గవర్నర్గా నియమితులైన విషయం తెలిసిందే. ఆమె బాధ్యతలు స్వీకరించడం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేసింది. సీఎం నారాయణస్వామి నేతృత్వంలోని ప్రభుత్వానికి, లెఫ్టినెంట్ గవర్నర్కు మధ్య నాలుగేళ్లుగా అధికార వార్ కొనసాగుతూనే వస్తోంది. ఈ పరిస్థితుల్లో ఆదివారం తాను లెఫ్టినెంట్ గవర్నర్గా పగ్గాలు చేపట్టి నాలుగేళ్లు ముగించి, ఐదో వసంతంలోకి అడుగు పెట్టడంతో ప్రజలకు కిరణ్ ఓ లేఖాస్త్రం సంధించారు. అందులో తాను బాధ్యతలు స్వీకరించడం, ప్రజాహితాన్ని కాంక్షిస్తూ చేపట్టిన కార్యక్రమాల గురించి వివరించారు. రాజ్ నివాస్ సేవల్ని, ఎదుర్కొన్న సవాళ్లను గుర్తు చేశారు. ప్రజాహిత కార్యక్రమాల్ని ఎన్నడూ రాజ్ నివాస్ అడ్డుకోలేదని వివరించారు. రాజ్ నివాసన్ ప్రజల నివాస్గా మారిందన్నారు. వారంలో ఓ రోజు ప్రజలతో మమేకం అయ్యే రీతిలో కార్యక్రమాలు సాగిందని గుర్తు చేస్తూ, ఇప్పుడు కరోనా అందుకు అడ్డు వచ్చినట్టు పేర్కొన్నారు. మున్ముందు ఈ కార్యక్రమాలు కొనసాగేనా అన్నది కాలమే నిర్ణయిస్తుందన్నారు. ఆర్థిక పరిస్థితి మెరుగు లక్ష్యంగా.. ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగు లక్ష్యంగా చర్యలు తీసుకోవాల్సి ఉందన్నారు. ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయ పరమైన సిద్ధాంతాల్ని పునఃపరిశీలించాల్సి ఉందని వివరించారు. మద్యం దుకాణాల వేలం, ఆస్తి, వినోద పన్నుల బకాయిల వసూళ్లు, కొన్నేళ్లుగా చెల్లించకుండా ఉన్న ప్రభుత్వ స్థలాల లీజుకు సంబంధించిన అద్దెల వసూళ్లు అంశాలపై పునఃపరిశీలన తప్పనిసరిగా పేర్కొన్నారు. కరోనా రూపంలో పర్యాటక ఆదాయం పూర్తిగా కోల్పోవడం జరిగిందని పేర్కొంటూ, ప్రస్తుతం చేతిలో ఉన్న ఆస్తుల ఆధారంగా ఆదాయం పెంచుకోవాల్సిన ఉందన్నారు. విజయన్ కమిటీ నివేదికను అమలు చేయాల్సి ఉందన్నారు. ప్రస్తుతం నియమించ బడ్డ లేదా ఎంపిక చేసిన అధికారులు నిబద్ధత, నిజాయితీతో పనిచేసి ప్రజల జీవన ప్రమాణాల మెరుగు, ఆర్థిక పరిస్థితుల మెరుగు దిశగా ముందుకు సాగాలని సూచించారు. ఇలా అన్ని విషయాల గురించి ప్రస్తావిస్తూ, చివరగా పుదుచ్చేరికి సేవ చేయడానికి వచ్చి నాలుగేళ్లు పూర్తి అయిందని, ఐదో ఏట అడుగు పెట్టానని, ఇక, తన కౌంట్డౌన్ మొదలైందని ముగించారు. ఈ దృష్ట్యా, మళ్లీ అవకాశం ఇచ్చినా, ఆ పదవిలో కిరణ్ కొనసాగేది అనుమానమేనా అన్న చర్చ బయలు దేరింది. -
నెటిజన్ల ఆగ్రహానికి గురైన కిరణ్ బేడీ
ప్రపంచ దేశాలకు పాకుతున్న కరోనా వైరస్ ప్రజలను కబలిస్తూ అల్లకల్లోకలం సృష్టిస్తోంది. ఓ వైపు ఈ మహమ్మారి విజృంభిస్తుంటే.. అంతకంటే వేగంగా కరోనా వైరస్పై నకిలీ వార్తలు ప్రచారమవుతున్నాయి. సోషల్ మీడియాలో కరోనాపై ఫేక్న్యూస్లు పోస్ట్ చేస్తూ కొంతమంది ఆకతాయిలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. అయితే కరోనాపై అసత్య ప్రచారాలు చేయవద్దని కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు పదేపదే నొక్కి చెబుతున్నాయి. అలాగే వదంతులను ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామనీ హెచ్చరిస్తున్నాయి. అయిన్పటికీ అనేకమంది తప్పుడు వార్తలను నమ్మి మోసపోతున్నారు. తాజాగా ఈ బాధితుల్లోకి పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ చేరారు. (ఓ గాడ్! మీరు ఇంట్లో లుంగీ ధరిస్తారా?) ఇటీవల కిరణ్ బేడి ట్విటర్లో ఓ వీడియో షేర్ చేశారు. ఓ ప్రాంతంలో కోడిపిల్లలు గుంపులుగా తిరుగుతున్న వీడియోను షేర్ చేస్తూ.. ‘‘కోడిగుడ్డు వల్ల కరోనా వస్తుందన్న మూఢనమ్మకంతో మనం వాటిని పడేస్తున్నాం. అయితే అవన్నీ ఒక వారం తర్వాత పొదిగి ఇలా కోడిపిల్లలు అవుతాయి. ఇది సృష్టి స్వభావం. జీవితానికి దాని సొంత మార్గాలు ఉంటాయి’’ అంటూ ట్వీట్ చేశారు. ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో కిరణ్ బేడీ నకిలీ వీడియోను షేర్ చేశాశారని నెటిజన్లు మండిపడుతున్నారు. సాధారణంగా మనం ఉపయోగించే ఎగ్స్ ఎలా పొదుగుతాయని నెటిజన్లు ఆమెను ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి నకిలీ వార్తలు పోస్ట్ చేసేముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోవాలని సూచిస్తున్నారు. అంతేగాక ‘వాట్సాప్ను అన్ఇన్స్టాల్ చేయండి. నేను మళ్లీ చెబుతున్నాను. వాట్సాప్ అన్ ఇన్స్టాల్ చేయండి’ అంటూ కిరణ్ బేడీపై కొంతమంది సోషల్ మీడియా వేదికగా విరుచుకుపడుతున్నారు. (అసత్య ప్రచారానికి చెక్పెట్టేలా.. ) Eggs which were thrown as waste because of corona , after one week hatched . The creation of nature 🤔 (Fwded) Life has its own mysterious ways.. pic.twitter.com/H7wMQqc7jc — Kiran Bedi (@thekiranbedi) April 5, 2020 -
పుదుచ్చేరి సీఎంకు షాక్
సాక్షి, చెన్నై : పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడి అధికార సమరంలో మరోసారి ఆధిపత్యాన్ని చాటుకున్నారు. ఆమె తీసుకున్న నిర్ణయానికి కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గవర్నర్ నిర్ణయాలతో ముఖ్యమంత్రి నారాయణ స్వామి సర్కారుకు దెబ్బ మీద దెబ్బ తగులుతూనే ఉంది. తాజాగా ఎన్నికల కమిషనర్ నియామకంలో ప్రభుత్వానికి భంగపాటు తప్పలేదు. కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో సీఎం నారాయణ స్వామి సర్కారుకు పక్కలో బల్లెంలా లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడి మారారు. సీఎం, లెఫ్టినెంట్ గవర్నర్ మధ్య అధికార సమరం రోజు రోజుకూ ముదురుతూనే ఉంది. ఉచిత బియ్యం పంపిణీకి ప్రభుత్వం సిద్ధం కాగా, దానిని అడ్డుకున్నారు. ఉచిత బియ్యంకు బదులుగా లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లోకి నగదు పంపిణీకి తగ్గ ఉత్తర్వులు ఇచ్చి సీఎంకు ఆమె షాక్ ఇచ్చారు. ఈ ఉత్తర్వులను కోర్టు సైతం సమర్థించింది. దీనిని వ్యతిరేకిస్తూ నారాయణ స్వామి అప్పీలుకు వెళ్లి ఉన్నారు. అదే సమయంలో పర్యాటకంగా ప్రగతి పథంలో దూసుకెళ్తున్న పుదుచ్చేరిలో రాష్ట్ర ప్రభుత్వం క్యాసినో క్లబ్స్ (పేకాట) ఏర్పాటుకు తీసుకున్న నిర్ణయంలో కిరణ్ జోక్యం చేసుకున్నారు. క్యాసినోకు నో చెప్పేస్తూనే, చెక్ పెట్టేశారు. ఈ పరిణామాలు సీఎం నారాయణ స్వామి సర్కారును ఇరకాటంలో పడేశాయి. ఈ నేపథ్యంలో తాజాగా మరో దెబ్బ ఆ సర్కారుకు తప్పలేదు. చదవండి: సీఎం గారూ.. మీ ప్రవర్తన హద్దుమీరింది! ఎన్నికల కమిషనర్ నియమకంలో.. పుదుచ్చేరి రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా రిటైర్డ్ ఐఏఎస్ బాలకృష్ణన్ను సీఎం నారాయణస్వామి ప్రభుత్వం నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. దీనికి చెక్ పెడుతూ కిరణ్ కొత్త బాట వేశారు. కేంద్ర పాలిత ప్రాంతంలో ఎన్నికల అధికారి నియమకానికి సంబంధించి పత్రికలకు ప్రత్యేక ప్రకటనలు ఇచ్చి, అర్హులైన వారిని ఎంపిక చేయడం కోసం దరఖాస్తులను ఆహ్వానించారు. అదే సమయంలో రాష్ట్ర ఎన్నికల అధికారిగా బాలకృష్ణన్ బాధ్యతలు స్వీకరించడంతో, ఆయన నియమక ఉత్తర్వులను రద్దుచేస్తూ కిరణ్ మరో ఉత్తర్వులిచ్చారు. వ్యవహారం మద్రాసు హైకోర్టుకు చేరింది. కిరణ్ ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలని మంత్రి నమశివాయం కోర్టు తలుపులు తట్టారు. కొన్ని నెలలుగా విచారణలో ఉంటూ వచ్చిన ఈ పిటిషన్ గురువారం తిరస్కరణకు గురైంది. అఖిల భారత స్థాయిలో దరఖాస్తులను ఆహ్వానించి, అర్హులైన వారిని ఎన్నికల కమిషనర్ పదవికి ఎంపిక చేయడం అన్న అంశాన్ని కోర్టు పరిగణనలోకి తీసుకుంది. ఇది కొత్త మార్గం అని, దీనిని ఆహ్వానించాల్సిన అవసరం ఉందంటూ, ఎన్నికల కమిషనర్ నియమకాన్ని రద్దు చేస్తూ లెఫ్టినెంట్ గవర్నర్ ఇచ్చిన ఉత్తర్వులను న్యాయమూర్తి సమర్థించారు. ఎన్నికల కమిషనర్ నియమకంలో నారాయణ సర్కారు భంగ పాటే కాదు, దెబ్బ మీద దెబ్బ అన్నట్టుగా పరిస్థితి మారింది. వరుసగా తమ సర్కారుకు ఎదురు దెబ్బలు కోర్టు రూపంలో తగులు తుండడంతో నారాయణకు సంక్లిష్ట పరిస్థితులు తప్పడం లేదు. చదవండి: సీఎంకి షాక్ ఇచ్చేలా హైకోర్టు ఉత్తర్వులు -
సీఎంకి షాక్ ఇచ్చేలా హైకోర్టు ఉత్తర్వులు
సాక్షి, చెన్నై : పుదుచ్చేరి సీఎం నారాయణ స్వామికి షాక్ ఇచ్చే రీతిలో శుక్రవారం మద్రాసు హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. అధికార వార్లో తన పంతాన్ని లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్బేడీ నెగ్గించుకున్నారు. పుదుచ్చేరిలో ఉచిత బియ్యంకు బదులుగా రేషన్ కార్డుదారుల బ్యాంక్ ఖాతాల్లో నగదు జమ చేయడానికి తగ్గట్టు కిరణ్ ఇచ్చిన ఉత్తర్వులకు కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎన్నికల మేనిఫెస్టోగా ప్రకటించిన రేషన్ కార్డుదారులకు ఉచిత బియ్యం పంపిణీకి సైతం కిరణ్ అడ్డుకట్ట వేశారు. ఉచిత బియ్యంకు బదులుగా రేషన్ కార్డుదారుల బ్యాంక్ ఖాతాల్లో నగదు జమచేయాలని ఉత్తర్వుల్ని ఆమె జారీ చేశారు. ఆమె ఉత్తర్వులకు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ సైతం ఆమోద ముద్ర వేయడంతో, దీనిని అమలు చేయాల్సిన అవశ్యం నారాయణ సర్కారుకు ఏర్పడింది. ఉచిత బియ్యం పథకానికి తమ ప్రభుత్వ నిధుల్ని కేటాయించడం జరుగుతోందని, ఇందులో కేంద్రం జోక్యం తగదని ఇప్పటికే నారాయణ స్వామి స్పష్టం చేసి ఉన్నారు. అలాగే, కిరణ్ ఉత్తర్వులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటాలు సైతం సాగాయి. చివరకు ఈ ఉత్తర్వులను వ్యతిరేకిస్తూ మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. గ్రీన్ సిగ్నల్.. ఈ ఉత్తర్వుల వ్యవహారం కోర్టుకు చేరడంతో కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో ఏడాదిన్నర కాలంగా ఉచిత బియ్యం పంపిణీ అన్నది ఆగిపోయింది. ఈ పిటిషన్ మీద శుక్రవారం తుది విచారణ న్యాయమూర్తి కార్తికేయన్ నేతృత్వంలోని బెంచ్ ముందు సాగింది. కేంద్ర ప్రభుత్వం తరఫున హాజరైన న్యాయవాదులు తమ వాదనలో పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతం అని, కేంద్రం తీసుకునే నిర్ణయాలు, ఉత్తర్వులు అమలు చేయాల్సిన అవసరం ఉందని వివరించారు. లెప్టినెంట్ గవర్నర్ కిరణ్బేడీ ఇచ్చిన ఉత్తర్వులకు రాష్ట్రపతి ఆమోదం సైతం లభించి ఉందని వాదించారు. నారాయణస్వామి ప్రభుత్వం తరఫున హాజరైన న్యాయవాదులు ఉచిత బియ్యం పంపిణీకి పట్టుబడుతూ వాదన వినిపించారు. రాష్ట్ర నిధుల్ని వెచ్చిస్తున్నప్పుడు, కేంద్రం జోక్యం ఏమిటో అని ప్రశ్నించారు. వాదనల అనంతరం నారాయణస్వామి సర్కారుకు షాక్ ఇచ్చే రీతిలో న్యాయమూర్తి ఉత్తర్వులు జారీచేశారు. -
పాపాయితో హైలెవల్ మీటింగ్కి
పుదుచ్చేరిలోని లెఫ్ట్నెంట్ గవర్నర్ ఆఫీస్లో మంగళవారం అత్యవసర సమావేశం జరుగుతోంది. ఆ సమావేశాన్ని ఏర్పాటు చేసినవారు లెఫ్ట్నెంట్ గవర్నర్ కిరణ్ బేడి! వివిధ శాఖల కార్యదర్శులు ఈ హైలెవల్ మీటింగ్కి హాజరయ్యారు. వారిలో ఐటీ శాఖ నుంచి వచ్చిన ఓ మహిళా కార్యదర్శి కూడా ఉన్నారు. సమావేశం గంభీరంగా సాగుతోంది. అంతలో.. మీటింగ్ హాలు బయట నుంచి పసిబిడ్డ ఏడుపు! ఆ ఏడుపు వింటూ మహిళా కార్యదర్శి స్థిమితంగా ఉండలేకపోయారు. అది గమనించారు కిరణ్ బేడి. ‘ఏమైంది?’ అన్నట్లు ఆమె వైపు చూశారు. ‘‘బయట ఏడుస్తున్నది నా కూతురే. పది నెలలు. నేను కనిపించకపోతే ఏడ్చేస్తుంది. వాళ్ల అమ్మమ్మ దగ్గర కూర్చోబెట్టి వచ్చాను’’ అని చెప్పారు ఆ ఆఫీసర్. పసికందు ఏడుపు ఆపడం లేదు. ‘‘వెళ్లి పాపను తెచ్చుకోండి’’ అన్నారు కిరణ్ బేడీ. ఆమె ముఖంలో సంతోషం. పరుగున వెళ్లి, పాపను ఎత్తుకుని తనతోపాటు లోపలికి తెచ్చుకుంది. ఆమె రాగానే మళ్లీ మీటింగ్ మొదలైంది. తల్లి ఒడిలో కూర్చొని ఉన్న పాప కూడా ఏడుపు మాని కిరణ్ బేడీ వైపే గంభీరంగా చూడ్డం మొదలు పెట్టింది. ఆ తల్లీ బిడ్డల ఫొటోను కిరణ్ బేడీ తన ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ‘చైల్డ్ ఈజ్ హ్యాపీ’ అని కామెంట్ రాశారు. స్ట్రిక్ట్ ఆఫీసర్ అని కిరణ్బేడీకి పేరు. దేశంలోనే తొలి మహిళా ఐపీఎస్ అధికారి. కుటుంబ బాధ్యతల వల్ల మహిళలు ఉద్యోగాలను సరిగా చేయలేరు అనే మాటను కిరణ్ ఒప్పుకోరు. బిడ్డ ఏడుస్తుంటే పనిపై ధ్యాసపెట్టడం తల్లికి కష్టమే. బిడ్డ దగ్గర ఉంటే ఆ తల్లి ఇంకా బాగా పనిచేస్తుంది అంటారు ఆమె. ఇప్పుడీ ట్విట్టర్లో కూడా కిరణ్ బేడీ ‘చైల్డ్ ఈజ్ హ్యాపీ’ అన్నారు కానీ.. ‘మదర్ ఈజ్ హ్యాపీ’ అని అనలేదు. దానర్థం.. పిల్లల లాలన కూడా డ్యూటీలో భాగమేనని. పిల్లల బాధ్యతను సక్రమంగా నెరవేరిస్తే పిల్లలు సంతోషంగా ఉంటారు. వాళ్లసంతోషం తల్లిని సంతోషంగా ఉంచుతుంది. పనిలో తల్లి సామర్థ్యాన్ని పెంచుతుంది. -
నిరసనల మధ్య కిరణ్బేడీ యానాం పర్యటన
తూర్పుగోదావరి, యానాం: యానాం విచ్చేసిన పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ పర్యటన గురువారం ప్రజల నిరసనల మధ్య ప్రారంభమైంది. స్ధానిక ప్రభుత్వ అతిథి గృహం వద్దకు చేరుకున్న నియోజకవర్గ పరిధిలోని వందలాదిమంది ప్రజలు నల్లజెండాలు, బెలూన్లు, ధస్తులు ధరించి ఆమె పర్యటనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ముఖ్యంగా సంక్షేమ పథకాలు అడ్డుకుంటున్నారని, యానాం అభివృద్ధికి సంబంధించిన ఫైల్స్ను ఆమోదించకుండా కావాలనే జాప్యం చేస్తున్నారని వారు ఆరోపించారు. ఉచితబియ్యం పథకానికి సంబంధించి బియ్యం ఇవ్వడం లేదని, అభివృద్ధి పనులకు సంబంధించి కోట్లాది రూపాయలు నిలిపి వేశారని వారు ఆరోపించారు. పేదవర్గాలకు వ్యతిరేకంగా ఎల్జీ వైఖరి పేదవర్గాలకు వ్యతిరేకంగా ఎల్జీ కిరణ్బేడీ వ్యవహరిస్తున్నారని యానాం పర్యటన వల్ల ప్రజాసమస్యలు పరిష్కారం కాకపోగా, వేలాది రూపాయిల ప్రజాధనం ఆమె పర్యటకు, ఏర్పాట్లకు ఖర్చవుతున్నాయని పుదుచ్చేరి ఆరోగ్యశాఖ మంత్రి మల్లాడి కృష్ణారావు ఆరోపించారు. గురువారం ఆయన çస్వగృహంలో విలేకరులతో మాట్లాడుతూ వరద ప్రభావిత ప్రాంతాల్లో గృహనిర్మాణాలు ఉన్నాయ ని చెబుతూ ఫ్రాన్స్తిప్ప, వెంకటరత్నం నగర్, అ య్యన్ననగర్, కురసాంపేట తదితర ప్రాంతాల్లోని భవనాలను తీసివేయాలని అన్యాయంగా ఎల్జీ ఆదేశాలు జారీ చేశారని వారికి విద్యుత్తు, తాగునీరు నిలుపుదల చేశారన్నారు. 2018లో యానాంకు ఇంజినీరింగ్ కళాశాల మంజూరైతే నిర్మాణ పనులు చేపట్టకుండా నిలిపివేశారని, రూ.137కో ట్లతో చేపట్టే వరద నియంత్రణ çపనులను నిలిపివేశారని ఆరోపించారు. జీఎస్పీసీ కంపెనీ ఇచ్చిన రూ.19 కోట్లు వేట నష్టపరిహారంలో రూ.10 కోట్లు పంపిణీ చేసి మిగతా రూ.తొమ్మిది కోట్లు ఇవ్వకుండా నిలిపివేశారని ఆయన ఆరోపించారు. ఆమె అనుకూలంగా మీడియాలో ప్రచారానికి 12 మందిని పుదుచ్చేరి నుంచి రప్పించుకున్నారని, ఆమెకు ఆమెతో వచ్చిన వారికి కాకినాడలో ఒక ఖరీదైన హోటల్లో బ్రేక్ఫాస్ట్కు రూ.52వేలు ఖర్చయ్యిందని ఈ విధంగా ప్రజాధనం దుర్వినియోగం చేయడమేమిటని ఆయన ప్రశ్నించారు. -
సీఎం.. నాతో పెట్టుకోవద్దు : గవర్నర్
పుదుచ్చేరి ప్రభుత్వంలో రాజ్యాంగాధినేత, ముఖ్యమంత్రి నడుమ వైషమ్యాలు కొత్తేమి కాదు. నారాయణస్వామి సీఎంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి, లెఫ్టినెంట్ గవర్నర్గా కిరణ్బేడి నియమితులైన రోజు నుంచి ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేయకుండానే పరిణామాలు భగ్గుమంటున్నాయి. సాక్షి, చెన్నై: ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వంలో గవర్నర్ జోక్యం తగదని సీఎం నారాయణస్వామి, కేంద్రపాలిత ప్రాంతంలో గవర్నరే పాలనాధికారి అంటూ కిరణ్బేడి మధ్య ఆధిపత్యపోరు సాగుతోంది. సీఎం అనేకసార్లు న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించాల్సి వచ్చింది. ఈ దశలో ఇరువురూ తాజాగా ఒకరిపై ఒకరు మరోసారి సవాళ్లు విసురుకున్నారు. పుదుచ్చేరి పాగూర్ నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే తంగవేలు ముఖ్యమంత్రి నారాయణస్వామి, మంత్రులు, కాంగ్రెస్ ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు చేశారు. నారాయణస్వామి, ఆయన కుమారుడు భూ అపహరణకు పాల్పడినట్లు, అందుకు ఆధారాలు కూడా ఉన్నట్లు తంగవేలు గవర్నర్ కిరణ్బేడీని కలిసి ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే తంగవేలు తనను కలిసి సీఎంపై చేసిన ఫిర్యాదులపై గవర్నర్ పత్రికాప్రకటన కూడా విడుదల చేశారు. నిరూపిస్తే రాజీనామా: సీఎం నారాయణస్వామి ‘నేను, నా కుమారుడు భూ అపహరణకు పాల్పడినట్లుగా ఆధారాలతో నిరూపిస్తే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తా. అయితే ఆరోపణలు నిరూపించకుంటే ప్రజాజీవితం నుంచి తప్పుకునేందుకు కిరణ్బేడీ సిద్ధమా’ అని ముఖ్యమంత్రి నారాయణస్వామి సవాల్ విసిరారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే తంగవేలు గవర్నర్ను కలిసినపుడు తాను, తన కుమారుడు భూఅపరణ కేసులు ఎదుర్కొంటున్నట్లుగా ఆరోపణలు చేశారని ఆయన అన్నారు. అంతేగాక అందుకు ఆధారాలు కూడా ఉన్నాయని ఆమె అనడమేగాక రాజ్నివాస్ ఒక పత్రికా ప్రకటన కూడా విడుదల చేసిందని సీఎం చెప్పారు. ఈ ఆరోపణలను నారాయణస్వామి ఖండించారు. ఆధారాలు, పత్రాలు లేకుండానే కేవలం మౌఖికంగా ఆమె ఈ ఆరోపణలు చేశారని విమర్శించారు. ఫిర్యాదుపై విచారణ జరపకుండానే నిర్ధారించుకున్నారని అన్నారు. దీనిని బట్టి ఆమెకు పరిపాలన తెలియదని తేటతెల్లమైందని దుయ్యబట్టారు. తానే కాదు నా కుటుంబసభ్యులెవరైనా భూ అపహరణ కేసులను ఎదుర్కొంటున్నట్లు రుజువుచేస్తే సీఎం పదవి నుంచి తప్పుకుంటానని పునరుద్ఘాటించారు. నిరూపించలేకుంటే ప్రజాజీవితం నుంచి తప్పుకునేందుకు ఆమె సిద్ధమాని ప్రశ్నించారు. నాతో ఢీకొనవద్దు: కిరణ్బేడి సీఎం నారాయణస్వామి విసిరిన సవాల్కు సామాజిక మాధ్యమాల ద్వారా స్పందించారు. సీఎం సవాల్ విసరాల్సింది నాకు కాదు.. వారి ఎమ్మెల్యేకు. సదరు ఎమ్మెల్యేను సస్పెండ్ చేసినట్లు తెలిసింది. ఆరోపణలు చేసింది వారి ఎమ్మెల్యేనే. తండ్రీ, కొడుకులు భూ అపహరణకు సంబంధించి ఆధారాలున్నట్లు చెప్పింది కూడా ఎమ్మెల్యే తంగవేలే. ఆధారాలను సామాజిక మాధ్యమాల్లో ఉంచాలని మీ ఎమ్మెల్యేకు సవాల్ విసరుకోండి. లేదా ప్రత్యేక అసెంబ్లీ సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని ఆధారాలను సమర్పించాలని కోరండి. ఆధారాలుంటే సీబీఐకి అప్పగించాల్సిందిగా హితవు పలికాను కాబట్టి నాపై సవాళ్లు విసరొద్దు. సీబీఐ విచారణకు వస్తే ఆరోపణలను ఎదుర్కోండి. అంతేగానీ దయచేసి నాతో ఢీకొనవద్దు. -
సూర్యుడు ఓం అంటున్నాడు!
న్యూఢిల్లీ: ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తున్న వీడియోలు నకిలీవా?, ఒరిజినల్వా అని తేల్చుకోలేని పరిస్థితి ఉంది. కొందరు సెలబ్రిటీలు సైతం తమ ట్విట్టర్ ఖాతాల్లో నకిలీ వీడియోలను పోస్ట్ చేసి నెటిజన్ల ట్రోల్స్ బారిన పడిన వారు కూడా ఉన్నారు. తాజాగా అలాంటి ఇబ్బందినే ఎదుర్కొన్నారు పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ. ఇంతకీ విషయమేమిటంటే.. ‘సూర్యుడు ఓం అని పలుకుతున్నాడు. అమెరికా అంతరిక్ష సంస్థ నాసా దాన్ని రికార్డు చేసింది’ అని ఆమె ఒక వీడియోను ట్విట్టర్ ఖాతా ద్వారా శనివారం పోస్ట్ చేశారు. ఇంకేముంది ఆ ట్వీట్ను 7వేల మందికి పైగా రీట్వీట్ చేయడంతో పాటు వందల మంది దానిపై స్పందించారు. అయితే వాస్తవానికి ఇదో నకిలీ వీడియో. ఇది భారత వాట్సాప్ గ్రూపుల్లో చాలాకాలాంగా సర్క్యులేట్ అవుతోంది. అందులో ఎలాంటి ఓం వినిపించదు. దీంతో పలువురు నెటిజన్లు ట్రోల్స్ చేస్తూ ‘‘సూర్యుడు.. ‘వాహ్ మోదీజీ.. వాహ్’ అని అనడం కూడా ప్రారంభిస్తాడు’’ అంటూ కిరణ్ బేడీపై వ్యంగ్య వ్యాఖ్యలు కనిపించాయి. అసలు సంగతి ఏంటంటే ‘సూర్యుడు నిశ్శబ్దంగా ఉండడు. సూర్యుడి గుండెచప్పుడు వినడం ద్వారా శాస్త్రవేత్తలు దానిలోని సౌర పదార్థాల ప్రవాహాలను, తరంగాలను, అలజడులను మరింత విస్తృతంగా శోధిస్తున్నారు. దీంతో గతంలో తెలియని అనేక సౌర రహస్యాలను తెలుసుకునేందుకూ వీలు ఏర్పడింది’ అని 2018లో నాసా ఒక ట్వీట్ చేసింది. -
మేడం.. ఇవేనా మీరు ప్రచారం చేసేది..!
పుదుచ్చేరి : సోషల్ మీడియా విసృతి పెరగడంతో వాస్తవాల కంటే అసత్య వార్తలే ఎక్కువగా ప్రచారమవుతున్నాయి. ముఖ్యంగా వాట్సాప్లో చాలామంది తమకు వచ్చిన మెజేజ్లలో ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకునే ప్రయత్నం చేయకుండానే మరొకరికి ఫార్వార్డ్ చేస్తున్నారు. దాంతో మేలు కంటే కీడే ఎక్కువగా జరుగుతోంది. సచిన్ టెండూల్కర్, ఆనంద్ మహింద్ర వంటి వారు స్ఫూర్తిమంతమైన వార్తల్ని ప్రచారం చేస్తుండగా.. కొందరు ప్రముఖులు మాత్రం అనాలోచితంగా మెసేజ్లు ఫార్వార్డ్ చేసి నెటిజన్ల ఆగ్రహానికి గురవుతున్నారు. పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్, మాజీ ఐపీఎస్ అధికారిణి కిరణ్బేడీ తాజాగా ఆ జాబితాలో చేరారు. ఎన్నో నెలలుగా వాట్సాప్లో చక్కర్లు కొడుతున్న ఓ అసత్య వార్తను ఆమె ట్విటర్లో పోస్టు చేసి ట్రోలింగ్ బారిన పడ్డారు. ఆమె ఓ వీడియోను పోస్టు చేసి.. ‘సూర్యుడి నుంచి వస్తున్న ఓంకార శబ్దాన్ని నాసా రికార్డు చేసింది’ అని క్యాప్షన్ కూడా ఇచ్చారు. దీంతో నెటిజన్లు ఆమెను ట్రోలింగ్ చేయడం మొదలు పెట్టారు. నాసా గతంలో విడుదల చేసిన అసలు వీడియోను పోస్టు చేసి.. వాస్తవాలు తెలుసుకోండి మేడం..! అని కామెంట్లు చేస్తున్నారు. ఒక కేంద్రపాలిత ప్రాంతానికి అత్యున్నత అధికారిగా ఉన్న వ్యక్తి ఇలాంటి నమ్మకాలను, అసత్యాలను ప్రచారం చేస్తారా అని ప్రశ్నిస్తున్నారు. ట్వీట్ చేసే ముందు వాస్తవాలను తెలుసుకోండి అని ఎద్దేవా చేస్తున్నారు. కాగా, 40 రోజులపాటు సూర్యుడు, హీలియోస్ఫెరిక్ అబ్జర్వేటరీ (ఎస్వోహెచ్వో)కి చెందిన డేటాను మిచెల్సన్ డాప్లర్ ఇమేజర్ సాయంతో ఎ.కొసొవికెవ్ అనే శాస్త్రవేత్త ప్రాసెస్ చేశారు. ఈ వీడియోను 2018లో నాసా యూట్యూబ్లో అప్లోడ్ చేసింది. pic.twitter.com/ArRwljjDVE — Kiran Bedi (@thekiranbedi) January 4, 2020 -
సీఎం గారూ.. మీ ప్రవర్తన హద్దుమీరింది!
పుదుచ్చేరి: లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ, సీఎం నారాయణస్వామిల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. కిరణ్ బేడీ పదవి బాధ్యతలు స్వీకరించినప్పటీ నుంచే సీఎం నారాయణస్వామిపై అసంతృప్తి వ్యక్తం చేస్తూనే ఉంది. ప్రతిగా సీఎం నారాయణస్వామి కూడా గట్టిగానే కౌంటర్ ఇస్తున్నారు. కాగా.. గత కొద్దిరోజులుగా వీరిరువురి మధ్య తీవ్రస్థాయిలో మాటలయుద్ధం జరుగుతోంది. పుదుచ్చేరి ఆదాయం పెంచుకునేందుకు కాసినోలు, మద్యం తయారీ సంస్థలు, లాటరీ కంపెనీలు స్థాపించాలని సీఎం నారాయణస్వామి భావిస్తుండగా, కిరణ్ బేడీ అందుకు అభ్యంతరం చెబుతుండడంతో ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత వైరం నెలకొంది. చదవండి: 'పాకిస్తాన్ వెళ్లమంటారా అంటూ కేంద్రమంత్రి సీరియస్' ఈ క్రమంలో సీఎం నారాయణస్వామి కిరణ్ బేడీ గురించి ప్రస్తావిస్తూ.. ఆమె దెయ్యం, మనస్సాక్షి లేని వ్యక్తి, జర్మనీ నియంత హిట్లర్కు చెల్లెలు అంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై కిరణ్ బేడీ కూడా కాస్త ఘాటుగా స్పందించింది. సీఎం కాస్త హుందాగా నడుచుకుంటే మంచిదని హితువు పలికారు. కొన్నిరోజులుగా మీరు నన్ను అనేక పేర్లతో దూషిస్తున్న విధానం గమనిస్తున్నాను. ఇటీవలే మీ ప్రవర్తన హద్దుమీరింది. లెఫ్టినెంట్ గవర్నర్గా నేనెప్పుడూ ప్రజల క్షేమం గురించే ఆలోచిస్తాను. ఈ సందర్భంగా బుద్ధుడు పేర్కొన్న హితోక్తిని కూడా కిరణ్ బేడీ ప్రస్తావించారు. 'ఎవరైనా ఒకర్ని దూషించినప్పుడు రెండో వ్యక్తి ఆ తిట్లను స్వీకరించకపోతే, ఆ తిట్లు మొదటి వ్యక్తి వద్దే ఉంటాయి' అంటూ వ్యాఖ్యానించారు. -
మగపిల్లల్నే హద్దుల్లో పెంచాలి
ఇంట్లో ఆడపిల్లలకు జాగ్రత్త చెబితే ఆ పిల్ల ఒక్కటే సురక్షితంగా ఉంటుంది. ఇంట్లో మగపిల్లవాడిని.. ‘జాగ్రత్త’ అని హెచ్చరిస్తే బయటి ఆడపిల్లలంతా సురక్షితంగా ఉంటారు. ‘దిశ’ ఘటన తర్వాత అమ్మాయిల భద్రత కోసం అనేక మంది అనేక విధాలైన సలహాలు ఇస్తున్నారు. అందులో ఇదీ ఒకటిలా అనిపించవచ్చు. అయితే మిగతా సలహాల కన్నా ఇది ఫలవంతమైనది. ఇప్పటికిప్పుడు కాకపోవచ్చు. ఒక జనరేషన్ మగపిల్లల్ని తల్లిదండ్రులు నియంత్రణలో పెంచితే.. ఇప్పుడు చాలామంది అంటున్నట్లు, ఆశిస్తున్నట్లు.. సమాజంలో మార్పు వస్తుంది. సమాజంలో మార్పు రావడం అంటే ఇంట్లో అబ్బాయిల్ని సంస్కారవంతంగా పెంచడం. ఈ సూచన ఇచ్చినవారు పుదుచ్ఛేరి గవర్నర్ కిరణ్ బేడీ. ‘‘తల్లిదండ్రులకు ఆడపిల్లల్ని మాత్రమే హద్దుల్లో పెంచడం తెలుసు. ఆ హద్దుల్నే మగపిల్లలకు ఏర్పరిస్తే, వాళ్ల ప్రవర్తనను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంటే మహిళలపై నేరాలు వాటంతటవే తగ్గిపోతాయి’’ అని బేడీ అన్నారు. ఆవిడే ఇంకో సలహా కూడా ఇచ్చారు. పరీక్షల కోసం చదువులు కాకుండా.. విలువల కోసం విద్య అనే విధానం రావాలి అన్నారు. మరి దోషుల్ని శిక్షించడంపై బేడీ ఏమన్నారు? ‘శిక్ష తీవ్రంగా ఉండాలి. తప్పు చేసినవాళ్లకే కాదు, తప్పు చేయాలన్న ఆలోచన రాబోయిన వారు కూడా ఆ శిక్ష గుర్తొచ్చి హడలెత్తిపోవాలి అన్నారు కిరణ్ బేడీ. ‘దిశ’ దారుణ ఘటనపై స్పందించమని అడిగినప్పుడు ఆమె ఇలా అన్నారు. -
వకీల్ వర్సెస్ ఖాకీ: కిరణ్బేడీ మళ్లీ రావాలి!!
న్యూఢిల్లీ : పార్కింగ్ విషయంలో ఢిల్లీ పోలీసులు, న్యాయవాదుల మధ్య తలెత్తిన వివాదం చినికిచినికి గాలివానలా మారింది. న్యాయవాదుల తీరును నిరసిస్తూ పోలీసులు ఆందోళన బాట పట్టారు. పోలీస్ హెడ్ క్వార్టర్స్ వద్ద తమకు న్యాయం చేయాలన్న ప్లకార్డులు ప్రదర్శిస్తూ.. శనివారం నాటి ఘటనకు సంబంధించి వీడియో క్లిప్పింగ్ చూసి తప్పెవరిదో తేల్చాలని డిమాండ్ చేశారు. పోలీసుల నిరసనకు ఐపీఎస్ అసోసియేషన్ మద్దతు తెలిపింది. వివిధ రాష్ట్రాల పోలీసులు కూడా పెద్దఎత్తున వీరికి మద్దతు తెలుపుతున్నారు. ఆందోళన విరమించాలని ఉన్నతాధికారులు కోరుతున్నప్పటికీ తప్పు చేసిన వారిని గుర్తించి శిక్షించే వరకు ఆందోళన ఆపేది లేదని, దీనిపై రాతపూర్వకంగా హామీ ఇవ్వాలని ఢిల్లీ పోలీసులు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం పరిస్థితులను కమిషనర్ పట్నాయక్ కేంద్ర హోంశాఖ అధికారులకు వివరించారు. ఈ ఘటనను సుమోటాగా తీసుకున్న ఢిల్లీ హైకోర్టు ఆదివారం విచారణ చేపట్టి, జ్యుడిషియల్ విచారణకు ఆదేశించింది. స్పెషల్ కమిషనర్ (శాంతిభద్రతలు) సంజయ్ సింగ్ను సస్పెండ్ చేయడంతోపాటు పలువురు పోలీసు అధికారులపై చర్యలకు ఆదేశించింది. ఢిల్లీ హైకోర్టు ఆదేశాలపై కేంద్ర హోంశాఖ సుప్రీంకోర్టులో అప్పీల్ దాఖలు చేసింది. బార్ కౌన్సిల్ సభ్యులకు ఢిల్లీ హైకోర్టు సమన్లు పంపింది. గొడవ మొదలైంది ఇలా..! తీస్ హజారీ కోర్టు వద్ద పార్కింగ్ విషయంలో పోలీసులకు లాయర్లకు మధ్య శనివారం గొడవ జరిగింది. ఈ ఘటనలో దాదాపు 20 మంది పోలీసులకు గాయాలయ్యాయి. అదే సమయంలో 40 మంది లాయర్లకు కూడా గాయపడ్డట్టు సమాచారం. ఈ ఘటనపై సీరియస్ అయిన ఢిల్లీ హైకోర్టు ఇద్దరు సీనియర్ పోలీస్ ఆఫీసర్లను బదిలీ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. మరో ఇద్దరిపై వేటు వేయడమే కాకుండా గాయపడిన లాయర్లకు పరిహారం చెల్లించాలని ఆదేశించింది. అయితే లాయర్లపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం పోలీసులను బాధించింది. అదేవిధంగా సాకేత్ కోర్టులో ఓ పోలీసుపై పలువురు లాయర్లు దాడికి పాల్పడ్డారు. ఘర్షణకు పోలీసుల తీరే కారణమంటూ లాయర్లు సోమవారం నిరసన చేపట్టారు. లాయర్ల వల్లే ఘర్షణ వాతావరణం చోటుచేసుకుందని పోలీసులు ఆరోపిస్తున్నారు. ఘర్షణ తీవ్రం కావడంతోనే ముందు జాగ్రత్తగా గాల్లోకి కాల్పులు జరిపినట్లు పోలీసులు చెబుతున్నారు. శాంతిభద్రతలను కాపాడాల్సిన ఖాకీలే న్యాయంకోసం ఈ నేపథ్యంలో శాంతిభద్రతలను కాపాడాల్సిన ఖాకీలే, తమకు న్యాయం చేయాలంటూ నినదించారు. అసాధారణరీతిలో రోడ్లపైకి రావడమే కాకుండా.. ఏకంగా పోలీసు ప్రధాన కార్యాలయం ఎదుటే ఆందోళన చేపట్టారు. విధుల్లోకి రావాలంటూ సీనియర్ అధికారులు విజ్ఞప్తి చేసినా పోలీసులు పట్టించుకోలేదు. న్యాయవ్యవస్థపై నమ్మకం ఉంచి పోలీసులు నిరసనలు నిలిపివేయాలని కమిషనర్ పట్నాయక్ కోరారు. సోమవారం కూడా పోలీసులపై లాయర్లు దాడి చేయడం అనేది క్షమించరానిదన్న కమిషనర్ దీనిపై చట్టపరంగా పోరాడుదాం అని పిలుపునిచ్చారు. సంఘటన జరిగిన వెంటనే కొంతమంది పోలీసులు మాత్రమే నిరసన వ్యక్తం చేశారు. అయితే ఈ వార్త దావానంలా వ్యాపించడంతో వందల సంఖ్యలో పోలీసులు తమ విధులకు బ్రేక్ ఇచ్చి పోలీస్ హెడ్క్వార్టర్స్కు చేరుకుని గొంతును కలిపారు. ఉన్నతాధికారులు స్పందించేవరకు వెనక్కి తగ్గేది లేదని పోలీసులు తేల్చిచెప్పారు. దీంతో ఆ ఏరియాలో ట్రాఫిక్ నిలిచిపోయింది. గంటగంటకు నిరసనలో పాల్గొనే పోలీసుల సంఖ్య పెరిగిపోతుండటంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. అంతేకాకుండా ఒక మార్గాన్ని ట్రాఫిక్ పోలీసులు మూసివేయడం జరిగింది. కిరణ్ బేడీ మళ్లీ రావాలి అంటూ పోలీసుల నినాదాలు పోలీస్ హెడ్ క్వార్టర్స్ దగ్గర నిరసనకు దిగిన పోలీసు సిబ్బంది.. ఢిల్లీ సీపీ (కమిషనర్ ఆఫ్ పోలీస్) పై ఆగ్రహం వ్యక్తం చేశారు. తోటి పోలీసులకు అన్యాయం జరుగుతుంటే పట్టించుకోవడం లేదని ఆవేదన చెందారు. సీపీ అంటే ఎలా ఉండాలి.. కిరణ్ బేడీలా ఉండాలి అంటూ నినాదాలు చేశారు. కమిషనర్ గా మీరే కావాలంటూ దేశంలోనే తొలి మహిళా ఐపీఎస్ కిరణ్ బేడీ ఫొటోలతో ప్లకార్డులు ప్రదర్శించారు. తమకు న్యాయం చేయాలంటూ డిమాండ్ చేశారు. తాము నిరసనలు చేపట్టేందుకు రాలేదని తమ బాధను పోలీస్ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకొచ్చేందుకు వచ్చామని కొంతమంది పోలీసులు చెప్పారు. న్యాయవృత్తిలో ఉన్నవారే పోలీసులపై చేయి చేసుకుంటే సామాన్య ప్రజలు తమను లెక్కచేస్తారా అంటూ వారు ఆవేదన వ్యక్తం చేశారు. -
‘హెల్మెట్ లేకపోవడం వల్లే సీఎం భార్య మృతి’
చెన్నై: ముఖ్యమంత్రి నారాయణ స్వామి భార్య హెల్మెట్ లేకుండా మృతి చెందినట్లు పుదుచ్చేరి గవర్నర్ కిరణ్బేడి అన్నారు. పుదుచ్చేరి సీఎం, గవర్నర్ మధ్య ఘర్షణ వల్ల హెల్మెట్ చట్టం అమలులోకి రావడానికి చిక్కులు ఏర్పడ్డాయి. ద్విచక్ర వాహనాల్లో వెళ్లేవారు రోడ్డు ప్రమాదాల వల్ల ప్రాణాలు కోల్పోవడాన్ని నిరోధించడానికి నిర్బంధ హెల్మెట్ చట్టాన్ని సుప్రీం కోర్టు ప్రవేశపెట్టింది. అయితే తమిళనాడు, పుదుచ్చేరిలలో ఈ చట్టాన్ని కఠినంగా అమలు చేయడం లేదు. ఇలా ఉండగా హెల్మెట్ లేకుండా వెళితే ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకోవాలని, వాహన చోదకుల డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేయాలంటూ పోలీసు అధికారులకు మద్రాసు హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. ఈ ఉత్తర్వుల ద్వారా రాష్ట్ర పోలీసు శాఖ హెల్మెట్ చట్టాన్ని కఠినంగా అమలు చేయడంలో నిమగ్నమైంది. పుదుచ్చేరి సీఎం గవర్నర్ మధ్య కోల్డ్వార్ కారణంగా ఈ వ్యవహారంలో అభిప్రాయబేదాలు తలెత్తాయి. హెల్మెట్ చట్టాన్ని అమలుపర్చడంలో చిక్కులు కొనసాగుతున్నాయి. ఇలా ఉండగా పుదుచ్చేరి సీఎం నారాయణ స్వామి భార్య కలైసెల్వి (52) 2013 మే 14న బంధువుతో బైకుపై వెళుతుండగా, పుదుచ్చేరి మురుగా థియేటర్ సిగ్నల్ సమీపంలో టెంపో వ్యాను ఢీకొనడంతో తలకు తీవ్ర గాయమై ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయాన్ని కిరణ్ బేడి శనివారం ప్రస్తావించారు. -
కిరణ్బేడీకి మద్రాస్ హైకోర్టు షాక్
-
ఐదో రోజుకు నారాయణస్వామి ధర్నా
పుదుచ్చేరి: లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడి వైఖరికి నిరసనగా పుదుచ్చేరి ముఖ్యమంత్రి వి.నారాయణస్వామి రాజ్నివాస్ బయట చేస్తున్న ధర్నా ఆదివారం ఐదోరోజుకు చేరింది. సం క్షేమ పథకాలపై ప్రభుత్వ ప్రతిపాదనలకు బేడి ఆమోదం తెలపకుంటే నిరసనను తీవ్రతరం చేసి జైల్భరో ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. ఉచిత బియ్య పంపిణీ పథకంతోపాటు మరో 39 సంక్షేమ పథకాల ప్రతిపాదనలు, పరిపాలనా సంబంధ నిర్ణయాల్ని లెఫ్టినెంట్ గవర్నర్ అడ్డుకుంటున్నారని ఆరోపించారు. బేడికి వ్యతిరేకంగా ముఖ్యమంత్రి, మంత్రులు, అధికార పార్టీ నాయకులు తమ ఇళ్లపై నల్ల జెండాలు ఎగరవేశారు. తమ నిరసన తెలిపేందుకు నల్ల జెండాలు ఎగరవేసే స్థాయికి చేరడం దురదృష్టకరమని నారాయణస్వామి పేర్కొన్నారు. విభేదాలపై ఫిబ్రవరి 21న బహిరంగ చర్చకు వస్తానని బేడి చేసిన ప్రతిపాదనను అంగీకరిస్తున్నానని చెప్పారు. డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ పుదుచ్చేరి వెళ్లి నారాయణస్వామి ఆందోళనకు సంఘీభావం ప్రకటించారు. సంక్షేమ పథకాల అమలుకు అడ్డుపడుతున్న కిరణ్ బేడిని కేంద్రం వెనక్కి పిలవాల ని డిమాండ్ చేశారు. బేడి ప్రజాస్వామిక విలు వల్ని అణగదొక్కుతున్నారని ఆరోపించారు. -
అట్టుడుకుతున్న పుదుచ్చేరి..
సాక్షి, చెన్నై : ప్రభుత్వం వర్సెస్ గవర్నర్ వివాదంతో పుదుచ్చేరి అట్టుడుకుతుంది. లెప్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడి.. ప్రభుత్వ పాలనలో జోక్యం చేసుకోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం అవుతుంది. కొన్ని రోజుల క్రితం పుదుచ్చేరి ప్రభుత్వం హెల్మెట్ను తప్పనిసరిగా ధరించాలనే నియమాన్ని తీసుకొచ్చింది. అయితే ఈ నిర్ణయాన్ని తక్షణమే పాటించాలంటూ కిరణ్ బేడి ప్రజలను ఒత్తిడి చేస్తుండటంతో సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. కిరణ్ బేడి చర్యలను వ్యతిరేకిస్తూ పుదుచ్చేరి ముఖ్యమంత్రి నారాయణ స్వామి రాజ్భవన్ ముట్టడి, ధర్నాకు పిలుపునిచ్చారు. సాక్షాత్తు ముఖ్యమంత్రే ధర్నాకు పిలుపున్వివడంతో రాష్ట్రంలో ఉద్రిక్తత నెలకొంది. ధర్నాలో భాగంగా బుధవారం నారాయణ స్వామి కిరణ్ బేడి ఇంటి ఎదురుగా ఉన్న రోడ్డు మీదే నిద్రపోయారు. సీఎంకు మద్దతుగా మంత్రులు, డీఎంకే కార్యకర్తలు కూడా అక్కడే బైఠాయించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను ట్విటర్ ద్వారా షేర్ చేశారు. ఈ విషయం గురించి నారాయణ స్వామి మాట్లాడుతూ.. ‘ప్రజలకు సంబంధించి ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలను దశల వారిగా అమలు చేయాలి. అంతేతప్ప తక్షణమే జరిగిపోవాలంటూ ప్రజలను ఇబ్బంది పెట్టకూడదు. కిరణ్ బేడి చర్యల వల్ల ప్రజల్లో మాపై వ్యతిరేకత పెరిగే అవకాశం ఉంది. అందుకే ఆమె చర్యలను వ్యతిరేకిస్తూ.. రాజ్భవన్ ముట్టడి, ధర్నాకు పిలుపునిచ్చాన’ని పేర్కొన్నారు. అంతేకాక నరేంద్ర మోదీ ఆదేశాల మేరకే కిరణ్ బేడి తమను ఇబ్బంది పెడుతున్నారని ఆయన ఆరోపించారు. నారాయణస్వామి చేపట్టిన ధర్నాకు డీఎంకే కూడా మద్దతు పలకటంతో భారీ సంఖ్యలో జనాలు రాజ్ భవన్ ముందుకు చేరుకున్నారు. -
ట్రాఫిక్ పాఠాలు చెప్పిన కిరణ్ బేడీ
సాక్షి, చెన్నై : పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. స్వతహాగా ఐపీఎస్ అధికారి. ఇప్పుడు లెఫ్టినెంట్ గవర్నర్గా కొరడా ఝుళిపిస్తున్నారు. పుదుచ్చేరిలోని కాంగ్రెస్ సర్కారుకు ముచ్చమటలు పట్టిస్తున్నారు. ఈ పరిణామాలు ఓ వైపు ఉంటే, మరో వైపు చాలా కాలం తర్వాత తనలోని ఐపీఎస్ను బయటకు తీశారు కిరణ్ బేడీ. సోమవారం నుంచి పుదుచ్చేరిలో హెల్మెట్ తప్పనిసరి చేశారు. అలాగే, సీట్ బెల్ట్ ధరించాల్సిందేనన్న హుకుం జారీ అయింది. ఉదయం నుంచే హెల్మెట్, సీట్ బెల్ట్ తప్పనిసరి అన్నది అమల్లోకి రావడంతో కిరణ్ ఐపీఎస్ అవతారం ఎత్తక తప్పలేదు. ప్రజల్లో చైతన్యం తీసుకురావడంతో పాటుగా, అవగాహన కల్పించే విధంగా పుదుచ్చేరిలోని పలు మార్గాల్లో ఆమె తిష్ట వేశారు. పోలీసులతో కలిసి వాహనదారులను బెంబేలెత్తించారు. హెల్మెట్ లేకుండా వెళ్లే వాళ్లను పిలిచి మరీ క్లాస్ పీకారు. పరిమితిని మించి ఓవర్ లోడింగ్తో సాగే వారి భరతం పట్టారు. ఓ మోటార్ సైకిల్ మీద ఇద్దరు మహిళల్ని ఎక్కించుకుని ఓ యువకుడు రాగా, అతిడికి తీవ్రంగానే క్లాస్ పీకారు. వెనుక ఉన్న మహిళల్లో ఓ యువతిని కిందకు దించేశారు. బస్సులో వెళ్లమని సలహా ఇచ్చారు. ఇక పిల్లల్ని ఎక్కించుకుని హెల్మెట్ లేకుండా వెళ్తున్న వాళ్లకు అయితే, కిరణ్ క్లాస్ ముచ్చెమటలు పట్టించక తప్పలేదు. సీట్ బెల్ట్ ధరించకుండా కార్లు నడిపిన వాళ్లను వదలి పెట్టలేదు. మంగళవారం నుంచి హెల్మెట్, సీట్ బెల్ట్ తప్పనిసరిగా ధరించాల్సిందేనని హెచ్చరించి పంపించారు. -
‘మోదీకి నేనంటే చాలా ఇష్టం.. అందుకే’
సాక్షి, విశాఖపట్నం : దేశంలో నిరంకుశ పాలన అంతం కావాలంటే ప్రధాని నరేంద్ర మోదీకి ఉద్వాసన పలకడం ఒక్కటే మార్గమని పుదుచ్చేరి సీఎం నారాయణ స్వామి అన్నారు. విశాఖపట్నంలో జరుగుతున్న ఇండియా టుడే కాన్క్లేవ్ సౌత్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.... ‘ మేము(కాంగ్రెస్) ఆయనను బయటికి పంపాల్సిన అవసరం లేదు. ఆయన పాలన పట్ల ప్రతీ ఒక్కరిలో అసంతృప్తి రగులుతోంది. ఈ కారణంగా ఆయన సొంత మనుషులు, పార్టీ వాళ్లే ఏదో ఒకరోజు ఆయనను బయటికి నెట్టివేస్తారు. కేవలం ఇద్దరు మనుషుల చేతుల్లో బీజేపీ నలిగిపోతుందని ఆ పార్టీ నాయకులే నా దగ్గర గోడు వెళ్లబోసుకున్నారు. 2019 ఎన్నికల తర్వాత ఆయన పదవి నుంచి దిగిపోక తప్పదు’ అని వ్యాఖ్యానించారు. ఆయనకు నేనంటే చాలా ఇష్టం... ప్రధాని మోదీకి ముఖ్యమంత్రులతో మాట్లాడే సమయమే ఉండదని నారాయణ స్వామి విమర్శించారు. గతంలో ఆయన అపాయింట్మెంట్ కోసం ఆరు సార్లు ప్రయత్నిస్తే కనీసం రెండుసార్లైనా దొరికేది.. కానీ ఇప్పుడు పరిస్థితి మరీ అధ్వానంగా తయారైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ మోదీకి నేనంటే ఎంతో ఇష్టం. అందుకే కిరణ్బేడీని పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్గా పంపించారు’ అని నారాయణ స్వామి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అంతేకాకుండా పాలన పరమైన విషయాల్లో కిరణ్బేడి అతిగా జోక్యం చేసుకుంటున్నారని, లెఫ్టినెంట్ గవర్నర్గా ఉండేకంటే ఓ చౌకీదార్లా ఉండేందుకే ఆమె ఉత్సాహం చూపుతున్నారంటూ ఎద్దేవా చేశారు. -
గవర్నర్ కిరణ్ బేడీ ఎమ్మెల్యే అంబలగన్ మధ్య తీవ్ర వాగ్వాదం
-
లెఫ్టినెంట్ గవర్నర్కు ఎమ్మెల్యే లెఫ్ట్రైట్..
ఉప్పలం : పుదుచ్చేరిలో గాంధీ జయంతి వేడుకల సందర్భంగా వేదికపై లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ ఏఐఏడీఎంకే ఎమ్మెల్యే అంబలగన్ మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. కిరణ్ బేడీ సమక్షంలోనే ఆమె పనితీరును ఎమ్మెల్యే ఆక్షేపించడంతో ఇరువురు మధ్య వాగ్వాదం జరిగింది. కిరణ్ బేడీ పర్యవేక్షణలో తన నియోజకవర్గంలో ఎలాంటి పనులూ జరగలేదన్నారు. ఎన్నో ప్రాజెక్టులను ప్రకటించినా ఏ ఒక్కటీ కార్యరూపం దాల్చలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఆయనకు సర్ధిచెప్పేందుకు కిరణ్ బేడీ ప్రయత్నించినా అంబలగన్ వినిపించుకోకుండా విమర్శల దాడి కొనసాగించారు. ఎమ్మెల్యే మైక్ను కట్ చేయాలని ఆమె అధికారులకు సూచించడంతో ఆగ్రహంతో ఊగిపోయిన ఎమ్మెల్యే ఆమెపై బిగ్గరగా కేకలు వేశారు. వేదిక దిగి వెళ్లిపోవాలని లెఫ్టినెంట్ గవర్నర్ పదేపదే కోరినా నిరాకరించిన ఎమ్మెల్యే కిరణ్ బేడీనే సభా ప్రాంగణం నుంచి వెళ్లిపోవాలని డిమాండ్ చేశారు. కిరణ్ బేడీపై ఎమ్మెల్యే అంబలగన్ విమర్శల దాడి చేయడం ఇదే మొదటిసారి కాదు. పుదుచ్చేరిలో అభివృద్ధి పనుల్లో జాప్యం చేస్తున్న బేడీని కేంద్రం వెనక్కిపిలవాలని ఈ ఏడాది మార్చిలో ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. ఎన్నికైన ప్రజాప్రతినిధులకు, ప్రజలకు మధ్య దూరం పెంచేందుకు ఆమె ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. -
చిన్న కష్టానికే అంతగా చలించిపోవడమా!!!
అమ్మ తిట్టింది...ఆత్మహత్య! ఒక్క మార్కు తక్కువొచ్చింది... ఆత్మహత్య!... ప్రతి చిన్నదానికీ ఏదో నిరాశ.. చేతిలోంచి జారిపడిన మట్టిముద్ద నేలపాలవుతుంది. మళ్ళీ లేవదు. అదే బంతి కిందపడితే వెంటనే పైకి లేస్తుంది. విద్యార్థులుగా మీరు నిభాయించుకోగలగాలి. తప్పయితే క్షమించండని అడగాలి. ఒప్పయితే ఒప్పని నిలబడాలి. ఒక్క మార్కు తక్కువొస్తే వచ్చేసారి కాలేజి ఫస్ట్ రా, యూనివర్శిటీ ఫస్ట్ రా...అదీ సాధన. అప్పడు నీవు చరిత్రకెక్కుతావు. ఇప్పుడు పుదుచ్చేరి గవర్నర్గా ఉన్న కిరణ్ బేడీ...ఒకనాడు తండ్రికి భారం కాకూడదని 20 కి.మీ. నడిచివెళ్ళి చదువుకుంది. ఐఏఎస్కి ప్రయత్నించింది. ఐపిఎస్కు ఎంపికయింది. భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఐపిఎస్ అధికారిగా రికార్డుకెక్కింది. ఇందిరాగాంధీ ఆమెకు ఆదర్శ మహిళ. ప్రధానమంత్రిగా శ్రీమతి గాంధీ ఉన్న కాలంలో జరిగిన ఏషియాడ్ క్రీడలప్పుడు ట్రాక్ ఇంచార్జిగా కిరణ్ బేడీని నియమించారు. ఒకరోజు విధుల్లో ఉండగా ట్రాక్ దగ్గర ప్రధానమంత్రి కారు ట్రాఫిక్ నియమాలకు విరుద్ధంగా పార్క్ చేసి ఉంది. అది ప్రధానమంత్రి కారు అని చెబుతున్నా పట్టించుకోకుండా క్రేన్తో వ్యాన్లో పెట్టించి పోలీస్ స్టేషన్కు తరలించింది. సామాన్యుడికి ఒక రూలు, ప్రముఖులకు మరో రూలా? ససేమిరా అంగీకరించేది కాదు. నియమోల్లంఘన జరిగితే ఎవరినీ లెక్కచేయకుండా విధులు నిర్వర్తించినందుకు చరిత్రలో బహుశా ఆమె పొందినన్ని బదిలీలు మరెవరూ పొంది ఉండలేదేమో. అయినా సరే. వెనకడుగు వేయలేదు. ఒకసారి రిపబ్లిక్ డే పరేడ్ ఏర్పాట్లను అత్యుత్తమంగా నిర్వహించినందుకు ఇందిరాగాంధీ ఆమెను ఆహ్వానించి తనతో కలిసి భోజనం చేసే అవకాశం కల్పించారు. కక్షసాధింపు బదిలీల్లో భాగంగా ఒకసారి ఆమెను తీహార్ జైలుకు డీజీగా పంపారు. ఒక్క తప్పుచేసి జీవితంలో ఇక్కడకు వచ్చిన వాళ్ళు మళ్ళీ ఉత్తములుగా బతకాలని ఒక మంచి వాతావరణం ఏర్పాటు చేసి ఆమె దానిని అతి కొద్దికాలంలోనే ఆశ్రమంగా మార్చేసారు. అక్కడ విధుల్లో ఉన్నప్పుడే ఆమె ఒక పుస్తకాన్ని రాసారు. ఆ రోజున ఆమె ఉన్న స్థాయికి ప్రధానమంత్రిని అడిగినా వెళ్ళి ఆవిష్కరించి ఉండేవారు. కానీ పేరు మోసిన నేరస్థుడు, ఖైదీ ఛార్లెస్ శోభారాజ్తో ఆవిష్కరింపచేసారు. ఇన్ని కీర్తి ప్రతిష్టలు ఆవిడకేం ఒక్క రోజులో రాలేదు. జీవితంలో అన్ని కష్టసుఖాలకు ఓర్చి నిలబడింది. ఒక సంకల్పంపెట్టుకుంటే జీవితాంతం దానికోసం పరిశ్రమించాలి. అంతపెద్ద స్థాయికి వెళ్ళిపోయిన తరువాత కూడా ఎం.ఎస్. సుబ్బలక్ష్మిగారు ఒక కచ్చేరీ చేయాలంటే ఆరుగంటలు సాధన చేసి వెళ్ళేవారు. అదీ నిబద్ధత. దాన్ని జీవితంలో అలవాటు చేసుకోండి. అబ్దుల్ కలాం మంచి దార్శనికుడు. ఫెయిల్ (ఊఅఐఔ) అన్నమాటకు కొత్త నిర్వచనం చెప్పాడు. ఫస్ట్ అటెంప్ట్ ఇన్ లెర్నింగ్ (ఊజీటట్ట అ్ట్ట్ఛఝp్ట ఐn ఔ్ఛ్చటnజీnజ) అంటే నేర్చుకోవడంలో ప్రథమ ప్రయత్నం చేసినవాడు.. అని. విఫలమయితే నిరాశపడకూడదు. మళ్ళీ రెట్టించిన ఉత్సాహంతో లే... మరోసారి ప్రయత్నించు. ‘‘నా దేశ విద్యార్థులు ఆ స్థాయిని అందుకోవాలి. ఉన్నత వ్యక్తిత్వాన్ని సంతరించుకోవాలి. వాళ్ళ వ్యక్తిత్వం పువ్వు వికసించినట్లు రేకురేకుగా వికసనం పొందాలి. వాళ్ళు అటువంటి ఆత్మ స్థయిర్యం పొందాలి.’’ అని కలాం కలలు కన్నాడు. ఆ కలలను నిజం చేయడమే ఆయనకు మీరు అర్పించే నివాళి. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
ఫ్రాన్స్ విజయంపై కిరణ్ బేడీ ట్వీట్.. నెటిజన్ల ఫైర్!
న్యూఢిల్లీ : ఆదివారం రాత్రి జరిగిన ఫిఫా ప్రపంచ కప్ ఫైనల్లో ఫ్రాన్స్ 4 - 2 తేడాతో క్రొయేషియాపై ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఫ్రాన్స్ జట్టుకి ప్రపంచం నలుమూలల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సందర్భంగా మాజీ ఐపీఎస్ అధికారి, ప్రస్తుత పుదుచ్చేరి లెఫ్నినెంట్ గవర్నర్ కిరణ్ బేడి కూడా ట్విటర్ వేదికగా అభినందనలు తెలిపారు. కాస్తా భిన్నంగా చెప్పడంతో ట్విటర్ ఫాలోవర్స్ కిరణ్ బేడిని తెగ ట్రోల్ చేస్తున్నారు. We the Puducherrians (erstwhile French Territory) won the World Cup. 👏👏🤣🤣 Congratulations Friends. What a mixed team-all French. Sports unites. — Kiran Bedi (@thekiranbedi) July 15, 2018 ‘పుదుచ్చేరి వాసులు(ఒకప్పటి ఫ్రెంచ్ పాలిత ప్రాంతం) ఫిఫా వరల్డ్ కప్ గెలిచారా...? అభినందనలు. క్రీడలే ఐక్యతకు చిహ్నం’ అంటూ ట్వీట్ చేశారు. ప్రస్తుతమున్న పుదుచ్చేరి ఒకప్పడు ఫ్రెంచ్ వారి ఆధీనంలో ఉన్న సంగతి తెలిసిందే. అందుకే కిరణ్ బేడి పుదుచ్చేరి వాసులను ఒకప్పటి ఫ్రెంచ్ వలసవాదులుగా గుర్తిస్తూ ఇలా ట్వీట్ చేశారు. కానీ నెటిజన్లకు కిరణ్ బేడి ట్వీట్ నచ్చలేదు. దాంతో వారు కిరణ్ బేడిపై సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘మేము భారతీయులం మేడమ్.. మీ ప్రచార కార్యక్రమాలు ఆపండి’ అని ట్వీట్ చేయగా మరికొందరు ‘నేను మాత్రం మీరు భారత భూభాగానికే గవర్నర్ అయ్యారని భావిస్తున్నాను. కానీ మీరు మాత్రం మమ్మల్ని ఫ్రెంచ్ వలసవాదులుగా గుర్తించి సంతోషిస్తున్నారు. ఏం చేస్తాం మా ఖర్మ. ఇంకా ఢిల్లీలో ఉన్న మూర్ఖులు మిమ్మల్ని ముఖ్యమంత్రిని చేయాలనుకుంటున్నారు. అదృష్టం అంత పని చేయలేదు’ అని ట్వీట్ చేశారు. There are other ways to celebrate a French victory than to be so servile I'm a born Pondicherrian, I don't feel I've won at all France won, and it's a game and I love the game.I don't need the crutch of a colonial mindset to enjoy Please do consider pulling this tweet down. — Alo Pal (@AloPal) July 15, 2018 మరొక నెటిజనైతే ఇంకాస్తా ఘాటుగానే స్పందించారు. ‘నేను పుదుచ్చేరి వాసిగానే జన్మించాను. ఫ్రెంచ్ టీం గెలిస్తే.. నేను గెలిచనట్లు అనుకోవడం లేదు. గెలిచింది ఫ్రాన్స్.. మేము కాదు. అయినా విజయాన్ని ఆస్వాదించేందుకు చాలా మార్గాలు ఉన్నాయి. ఒక వలసవాదిగానే గెలుపును ఆస్వాదించనవసరం లేదు. ముందు మీ ఆలోచనా విధనాన్ని మార్చుకొండి’ అంటూ విమర్శించారు. -
స్త్రీలోక సంచారం
పుదుచ్చేరి లñ ఫ్టినెంట్ గవర్నర్ కిరణ్బేడీ నేడో, రేపో.. ఆ కేంద్ర పాలిత ప్రాంత ముఖ్యమంత్రి వేలు నారాయణస్వామిపై విరుచుకుపడే ప్రమాదం కనిపిస్తోంది. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్ మధ్య తెలెత్తిన వివాదాల కేసు విషయంలో.. ‘ప్రజాప్రతినిధుల పాలనా వ్యవహారాలకు గవర్నర్ అడ్డుతగలడం సరికాదు’ అని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును నారాయణ స్వామి ఉటంకిస్తూ, ఇది కిరణ్బేడీకి కూడా వర్తిస్తుందనీ, తన పాలనలో ఆమె జోక్యం చేసుకోవడం కోర్టు ధిక్కారం అవుతుందని అసందర్భంగా వ్యాఖ్యానించడంపై బేడీ ఆగ్రహంతో ఉన్నారు ::: కొద్ది రోజుల క్రితమే సోషల్ మీడియా నుంచి ‘క్విట్’ అయిన ఉక్రెయిన్ సంతతి హాలీవుడ్ నటి మిలా క్యునిస్ (35) తనెందుకు క్విట్ అయిందీ తొలిసారిగా వెల్లడించారు. సోషల్ మీడియాను ‘లౌడెస్ట్, యాంగ్రీయస్ట్, మోస్ట్ నెగటివ్’ అని అభిప్రాయపడిన మిలా, ‘కాస్మోపాలిటన్’ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో.. ‘ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ లాంటి వేదికలు.. దారిన పోయే ప్రతి దానయ్య అభిప్రాయానికీ చోటు ఇవ్వడంతో సెలబ్రిటీల వ్యక్తిగత జీవితం నరకప్రాయం అవుతోంది’ అని వ్యాఖ్యానించారు. ‘పోటస్’ (ప్రెసిడెంట్ ఆఫ్ ది యునైటెడ్ స్టేట్స్) పదవికి జరిగే ఎన్నికల్లో తనెప్పటికీ పోటీ చేసేది లేదనీ, అదేమీ నిష్కళంకమైన వ్యవహారం కాదని అమెరికన్ ప్రముఖురాలు, మీడియా మొఘల్ ఓప్రా విన్ఫ్రే అన్నారు. 2020లో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో తను పోటీ చేసే అవకాశాలున్నాయని కొద్దికాలంగా పదే పదే వస్తున్న వార్తల్ని ఖండిస్తూ, ‘నీచమైన, నికృష్టమైన, మోసపూరిత, దగాకోరు, వెన్నుపోటు రాజకీయ వ్యవస్థ.. నాలాంటి వాళ్లను మింగేస్తుంది. అందులో నేను ఇమడలేను’ అని వోగ్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె అన్నారు ::: మహిళల డ్రైవింగ్పై దశాబ్దాలుగా ఉన్న నిషేధాన్ని సౌదీ అరేబియా జూన్ 24న తొలగించి వారమైనా కాకుండానే, నిషేధం ఎత్తివేతకు నిరసనగా ఒక మహిళ కారును తగలబెట్టి, పారిపోయిన దుండగుల కోసం మక్కా పోలీసులు గాలిస్తున్నారు. ఓ షాపింగ్మాల్ బయట పార్క్ చేసి ఉన్న తన కారును ఎవరో ఆగంతకులు దగ్ధం చేశారని సల్మా అల్షెరీఫ్ అనే 31 ఏళ్ల ఉద్యోగిని ఇచ్చిన ఫిర్యాదుపై గత వారం రోజులుగా నిందితుల కోసం పోలీసులు వేట కొనసాగిస్తున్నారు ::: దక్షిణ కొరియా ప్రథమ మహిళ కిమ్ జంగ్ సూక్.. సియోల్లోని ‘ఐవమ్ థియేటర్’లో చదువుతున్న భారతీయ విద్యార్థుల బృందాన్ని కలుసుకున్నారు. ఈ నెల 8 నుంచి 11 వరకు భర్త మూన్ జే ఇన్ (దక్షిణ కొరియా అధ్యక్షుడు) తో పాటు భారత్లో పర్యటించనున్న నేపథ్యంలో విద్యార్థులతో ముచ్చటించిన సూక్.. వారితో కలిసి ‘దంగల్’ సినిమాను చూసిన సందర్భంలో ఆమిర్ ఖాన్వే తను గతంలో మరో రెండు సినిమాలు చూసినట్లు కూడా చెప్పారు ::: అన్నా మే బ్లెస్సింగ్ అనే 92 ఏళ్ల మహిళను ఆరిజోనా పోలీసులు అరెస్టు చేసి, ఐదులక్షల డాలర్ల పూచీకత్తుపై మాత్రమే ఆమెకు బెయిల్ మంజూరు చేయడానికి వీలవుతుందని చెప్పడంతో తనను కారుణ్య మరణానికి అనుమతించమని ఆ వృద్ధ మహిళ విజ్ఞప్తి చేస్తున్నారు. తనను అనాథాశ్రమంలో చేర్చడానికి తన కొడుకు (72) చేస్తున్న ప్రయత్నాల గురించి తెలుసుకున్న అన్నా.. ఆ క్షణికావేశంలో అతడిని తుపాకీతో కాల్చి చంపడంతో ఆమెకీ పరిస్థితి దాపురించింది ::: బోన్ క్యాన్సర్ నుంచి కోలుకుంటున్న మూడేళ్ల కాలిఫోర్నియా బాలిక స్కయ్ సర్వీన్ మెకార్మిక్.. అంతకుముందు ట్రాన్స్ప్లాంటేషన్ కోసం తన ఎముకల్లోని మూలుగ (బోన్ మ్యారో)ను దానం చేసిన హేడన్ ర్యాల్స్ అనే యువతి పెళ్లికి ‘ఫ్లవర్ గర్ల్’గా వెళ్లింది. పూలగుత్తి పట్టుకుని పెళ్లి కూతురు పక్కన తోడుగా ఉండేందుకు రమ్మని.. సరిగ్గా ఆ చిన్నారి బర్త్డే రోజే పిలుపు రావడంతో స్కయ్ తల్లిదండ్రులు కృతజ్ఞతాపూర్వకమైన సమ్మతిని తెలియజేస్తూ, తమ కూతురికి పునర్జన్మనిచ్చిన హేడర్ ర్యాల్స్ పెళ్లికి వెళ్లి వచ్చారు ::: వజ్రాల ఆభరణాలను విక్రయించే ప్రముఖ ఆస్ట్రేలియన్–బ్రిటిష్ కంపెనీ ‘రియో టింటో’.. తమ భారతీయ వాణిజ్య రాయబారిగా ఇండియన్ ఉమెన్స్ క్రికెట్ టీమ్ కెప్టెన్ మిథాలీ రాజ్ని ప్రకటించింది. ‘ఒకప్పుడు రాజులకు, రాణులకు మాత్రమే అందుబాటులో ఉన్న వజ్రాల ఆభరణాలు ఇప్పుడు సామాన్య పౌరులు కూడా కొనగలిగే ధరల్లో లభ్యం అవుతున్నాయని’.. ముంబైలో జరిగిన ప్రారంభ కార్యక్రమంలో మిథాలీ అన్నారు. -
మన్మోహన్ సింగ్పై కేజ్రీవాల్ ప్రశంసలు
సాక్షి, న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోదీ విద్యార్హతపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మోదీ కాలేజీ డిగ్రీ నకిలీదంటూ ఆరోపించారు. అంతేకాకుండా ‘మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ వంటి విద్యావంతుడైన మేధావిని దేశ ప్రజలు మిస్ అవుతున్నారు. ఆయనలాంటి విద్యావంతుడినే ప్రధాని కావాలని ప్రజలు కోరుకుంటున్నారంటూ’ ట్వీట్ చేశారు. అయితే గతంలో యూపీఏ ప్రభుత్వాన్ని విమర్శించిన కేజ్రీవాల్.. మన్మోహన్ సింగ్ను ధృతరాష్ట్రుడితో పోలుస్తూ వ్యాఖ్యలు చేశారు. ‘అంతేకాకుండా అవినీతిలో కూరుకుపోయిన కాంగ్రెస్ పార్టీ.. మన్మోహన్ సింగ్ను ముందుకుతెచ్చి ప్రధానిని చేసింది. మరి ధృతరాష్ట్రుడి వంటి మన్మోహన్ సింగ్ తన ప్రభుత్వంలోని, కాంగ్రెస్ పార్టీలోని అవినీతిని అరికట్టడంలో విఫలమయ్యారంటూ’ గతంలో ట్వీట్ చేశారు. 2015 ఎన్నికల సమయంలో బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి కిరణ్బేడిని..‘బీజేపీ మన్మోహన్ సింగ్గా’ అభివర్ణిస్తూ ఎద్దేవా చేశారు. People missing an educated PM like Dr Manmohan Singh Its dawning on people now -“PM तो पढ़ा लिखा ही होना चाहिए।” https://t.co/BQTVtMbTO2 — Arvind Kejriwal (@ArvindKejriwal) May 31, 2018 -
నో టాయిలెట్..నో రైస్!: కిరణ్బేడి
పుదుచ్చేరి: బహిరంగ మల విసర్జన రహిత, పరిశుభ్రమైన గ్రామాలకే ఉచిత బియ్యం అందించాలని పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడి శనివారం జారీచేసిన ఉత్తర్వులు వివాదాస్పదమయ్యాయి. ఆమె కొన్ని గ్రామాలు సందర్శించి అక్కడి పారిశుధ్య నిర్వహణపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఫలానా గ్రామం చెత్త రహిత, బహిరంగ మల విసర్జన రహితమని మే 31 లోగా స్థానిక ప్రజాప్రతినిధితోపాటు పంచాయతీ అధికారి నుంచి పౌర సరఫరాల కమిషనర్కు లేఖ వస్తేనే అక్కడ ఉచిత బియ్యం పథకం అమలు చేయాలని పేర్కొన్నారు. అయితే ఈ నిర్ణయం నిరంకుంశంగా ఉందని అన్ని వైపుల నుంచి విమర్శలు రావడంతో కిరణ్ బేడి తన ఉత్తర్వులను వెనక్కి తీసుకున్నారు. జూన్ చివరి నాటికి పుదుచ్చేరిలోని అన్ని గ్రామాలు బహిరంగ మల విసర్జన రహితంగా మారుతాయని ప్రభుత్వం హామీ ఇచ్చిన నేపథ్యంలో తన నిర్ణయాన్ని నిలుపుదల చేస్తున్నట్లు పేర్కొన్నారు. -
ఆంధ్రప్రదేశ్ గవర్నర్గా వెళ్లను..
యానాం : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్గా తాను వెళుతున్నట్లు వస్తున్న వార్తలను పుదుచ్చేరి లెఫ్ట్నెంట్ గవర్నర్ కిరణ్ బేడీ తోసిపుచ్చారు. తాను ఏపీకి గవర్నర్గా వెళ్లనున్నట్లు వచ్చే వార్తలు నిరాధారమని ఆమె అన్నారు. ఆమె నిన్న (గురువారం) విలేకరులతో మాట్లాడుతూ తాను చేపట్టే కార్యక్రమాలతో ఈ ప్రాంతంలో తనకు మంచి పేరు వస్తోందని, ఈ తరుణంలో పుదుచ్చేరిలోనే ఎల్జీగా పూర్తికాలం కొనసాగుతానన్నారు. ఇక ఏ రాష్ట్రానికి వెళ్లే ప్రసక్తే లేదని కిరణ్ బేడీ స్పష్టం చేశారు. కాగా కిరణ్ బేడీ వెళ్లిపోతున్నట్లు వచ్చిన వార్తలతో సంబరాలు చేసుకున్న కాంగ్రెస్ వర్గీయులు ...ఆమె క్లారిటీ ఇవ్వడంతో నిరుత్సాహానికి గురయ్యారు. -
పుదుచ్చేరిలో బీజేపీ ఎమ్మెల్యేలకు షాక్
సాక్షి, చెన్నై: పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ నామినేట్ చేసిన ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేలకు అసెంబ్లీ స్పీకర్ వైద్యలింగం షాకిచ్చారు. మద్రాస్ హైకోర్టు ఆదేశాలతో అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనేందుకు వచ్చిన ఎమ్మెల్యేలు వి.స్వామినాథన్, కె.జి.శంకర్, ఎస్.సెల్వగణపతిలను సభలోకి రాకుండా అడ్డుకున్నారు. దీంతో అసెంబ్లీలోకి దూసుకెళ్లేందుకు యత్నించిన ముగ్గురు ఎమ్మెల్యేలను మార్షల్స్ బయటకు ఈడ్చుకొచ్చి పడేశారు. ప్రభుత్వ వ్యవహారశైలిపై తీవ్రంగా మండిపడ్డ స్వామినాథన్.. స్పీకర్ వైద్యలింగంపై కోర్టు ధిక్కార కేసు వేయనున్నట్లు మీడియాకు తెలిపారు. -
బేడి, ఖేర్ల ట్వీటర్ ఖాతాలు హ్యాకింగ్
న్యూఢిల్లీ: పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడి, ప్రముఖ నటుడు అనుపమ్ ఖేర్, బీజేపీ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్, రాజ్యసభ సభ్యుడు స్వపన్ దాస్గుప్తాల ట్వీటర్ అకౌంట్లు హ్యాకింగ్కు గురయ్యాయి. ఈ పని వెనక టర్కీ కేంద్రంగా పనిచేస్తున్న, పాక్ అనుకూల అయిల్దిజ్ టిమ్ బృందం ఉన్నట్లు తెలిసింది. బేడి ఖాతాలో టర్కిష్, ఆంగ్ల భాషల్లో ట్వీట్లతో పాటు టర్కీ జెండా ఎమోజి కనిపించింది. ‘మా సోషల్ మీడియా అకౌంట్లను మూసివేస్తున్నందుకు నిరసన తెలుపుతున్నాం. మాపై నిషేధాన్ని తొలగించే వరకూ ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఖాతాలకు ముప్పు తప్పదు’ అని టర్కిష్ భాషలో ట్వీట్ వచ్చింది. సమస్యను పరిష్కరించడానికి తమ బృందాలు కృషి చేస్తున్నాయని ట్వీటర్ వెల్లడించింది. -
ఒకే వేదికపై ఆ ఇద్దరు
సాక్షి, చెన్నై : ఆరు నెలల అనంతరం పుదుచ్చేరి సీఎం నారాయణ స్వామి, లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడి ఒకే వేదిక మీదకు వచ్చారు. పుదుచ్చేరిలో నారాయణస్వామి అధికారం చేపట్టినప్పటి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడి పక్కలో బల్లెంలా మారిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే రీతిలో కిరణ్, ఆమె ప్రయత్నాల్ని తిప్పికొట్టే విధంగా సీఎం ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ కాలం నెట్టుకు వచ్చారు. గవర్నర్ కావాలనే తమ పథకాల్ని అడ్డుకుంటున్నారని ఆరోపిస్తూ, ప్రజల్ని పాలకులు రెచ్చగొట్టిన సందర్భాలు అనేకం. పలు సార్లు కిరణ్బేడీ పర్యటనలను కూడా అడ్డుకునే విధంగా ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది. ఆరు నెలలుగా సీఎం నిర్ణయాల్ని గవర్నర్, గవర్నర్ నిర్ణయాల్ని సీఎం వ్యతిరేకించడం, అడ్డు పడడం వంటి చర్యలు సాగాయి. దీంతో వీరివురి సమస్యకు పరిష్కారం లేదా అనే సందేహం చాలమంది అధికారపార్టీ నేతల్లో ఉండేది. ఈ నేపథ్యంలో మంగళవారం జరిగిన మహాత్మా గాంధీ వర్ధంతి వేడుకలో, బుధవారం జరిగిన ప్రభుత్వ కార్యక్రమంలోనూ ఈ ఇద్దరు ఒకే వేదిక మీద ప్రత్యక్షం కావడం ప్రాముఖ్యత సంతరించుకుంది. వేదిక ముఖ్యమంత్రి, గవర్నర్లు అందరిని ఆశ్చర్యపరుస్తూ, ఆకర్షించే రీతిలో కనిపించారు. ఇప్పటికైనా ఇరువురు తమ పంతాలను పక్కన పెట్టి సమష్టిగా పుదుచ్చేరి ప్రగతికి శ్రమించాలని అటు ప్రజలు, ఇటు పార్టీల నేతలు ఆకాంక్షిస్తున్నారు. -
నన్ను కాదు.. మోదీనే!
తమిళనాట పట్టు సాధించడం లక్ష్యంగానే బన్వరిలాల్ పురోహిత్ను కేంద్రంలోని బీజేపీ పాలకులు ప్రథమ పౌరుడిగా రంగంలోకి దించారు. రాజకీయాల్లోనే కాదు, పాలనపరంగా పట్టున్న పురోహిత్, ప్రధాని నరేంద్ర మోదీ తమిళనాడు మీద ప్రయోగించిన అస్త్రంగా చెప్పవచ్చు. ఇందుకు బలాన్ని చేకూర్చే రీతిలో పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ వ్యాఖ్యలు ఉండడం గమనార్హం. సాక్షి, చెన్నై : రాష్ట్ర గవర్నర్గా పగ్గాలు చేపట్టిన కొద్ది రోజుల వరకు రాజ్భవన్ వరకే పరిమితం అన్నట్టుగా బన్వరి లాల్ పురోహిత్ వ్యవహరించారు. రెండు రోజుల క్రితం తమిళనాట ఇక, తానే పాలన అన్నట్టుగా ఆయన వేసిన తొలి అడుగు చర్చకు, వివాదానికి దారితీసింది. పుదుచ్చేరిలో కాంగ్రెస్ ప్రభుత్వానికి పక్కలో బల్లెంలా లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ ఏ విధంగా మారారో, దానికి రెట్టింపుగా, ఏకంగా తమిళనాడు పాలనను పురోహిత్ తన గుప్పెట్లోకి తీసుకునే పనిలో పడ్డట్టు సమాచారం. అదే సమయంలో కిరణ్ బేడీని అనుసరిస్తూ పురోహిత్ ముందుకు సాగుతున్నారనే చర్చ బయలుదేరింది. అయితే, తనను కాదు, ప్రధాని నరేంద్ర మోదీని అనుసరిస్తూ పురోహిత్ పయనం అన్నట్టు కిరణ్ తాజాగా వ్యాఖ్యానించడం గమనించ దగ్గ విషయం. ప్రధాని పిలుపు మేరకే.. పురోహిత్ తనను అనుసరిస్తున్నారన్న ప్రచారం ఊపందుకోవడంతో ఓ మీడియాతో పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ స్పందించారు. ఇటీవల ఢిల్లీలో జరిగిన గవర్నర్ల మహానాడులో ప్రజల్లోకి చొచ్చుకు వెళ్లే విధంగా ఆదేశాలు వచ్చినట్టు పేర్కొన్నారు. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీ తమ ప్రసంగాల్లో ప్రజలతో మమేకం కావాలని, ప్రజల్లో ఒకరిగా వారికి దగ్గర కావాలని, వారి సమస్యలను తెలుసుకోవాలని సూచించినట్టు వివరించారు. అందుకే తాను, ప్రజల్లోకి వెళ్తున్నట్టు పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు, ఆయన ఆకాంక్ష మేరకు పురోహిత్ తమిళనాడులో చొచ్చుకు వెళ్తున్నారేగానీ, తనను అనుసరించడం లేదని స్పష్టం చేశారు. ప్రజల్లోకి వెళ్లినప్పుడే దగ్గరుండి వారి సమస్యలు తెలుసుకునేందుకు వీలుందన్నారు. రాజ్భవన్కే పరిమితం కాదు గవర్నర్ అంటే, రాజ్భవన్కే పరిమితం కావాలన్న రూల్ లేదని, ప్రజల్లోకి వెళ్లేందుకు, సమావేశాలు నిర్వహించేందుకు తగ్గ అధికారాలు ఉన్నట్టు వివరించారు. గవర్నర్కు అధికారాలు లేనప్పుడు, ఎందుకు అన్ని ఫైల్స్ సంతకం కోసం, ఆమోదం కోసం రాజ్ భవన్కు వస్తున్నాయని ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. రాజ్ భవన్కే పరిమితం కావాల్సిన అవసరం లేదని, ఇక ప్రతి గవర్నర్ ప్రజల్లోకి వెళ్తారని, వారికి దగ్గరగా ఉండి, సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తారని అన్నారు. -
కిరణ్ బేడీకి షాక్
పుదుచ్చేరి: పుదుచ్చేరి లెప్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీకి షాక్ తగిలినట్లయింది. ఆమె ప్రమాణస్వీకారం చేయించిన ముగ్గురు ఎమ్మెల్యేల ఎన్నిక చెల్లదని అసెంబ్లీ కార్యదర్శి తేల్చారు. కిరణ్ బేడి నిర్ణయాన్ని శాసనసభ కార్యదర్శి విన్సెంట్ రాయ్ తప్పుబట్టారు. కేంద్రం నామినేట్ చేసిన ముగ్గురు వ్యక్తులతో బేడీ పుదుచ్చేరి అసెంబ్లీలో ప్రమాణస్వీకారం చేయించిన విషయం తెలిసిందే. ప్రమాణస్వీకారం అనంతరం లెఫ్టినెంట్ గవర్నర్ ముగ్గురు ఎమ్మెల్యేలను నియమించడానికి నిబంధనలు ఒప్పుకుంటాయని ట్వీటర్ ద్వారా బేడీ పేర్కొన్నారు. కాగా, బేడీ నిర్ణయాన్ని అప్పట్లో కాంగ్రెస్, డీఎంకే పార్టీలు వ్యతిరేకించాయి. -
కిరణ్బేడీకి షాక్
టీ.నగర్: పుదుచ్చేరిలో ఏడుగురు ఎమ్మెల్యేల బోర్డు అధ్యక్షుల పదవీకాలాన్ని పెంచుతూ కేంద్ర ప్రభుత్వం అంగీకారం తెలిపింది. దీంతో గవర్నర్ కిరణ్బేడి నిర్ణయానికి చుక్కెదురైంది. ఈ అనూహ్య పరిణామాలతో పుదుచ్చేరి చీఫ్ సెక్రటరీ మనోజ్ ఫరిదా బదిలీ అయ్యారు. పుదుచ్చేరిలో 30కి పైగా బోర్డు అధ్యక్షుల పదవులు కూటమి పార్టీల ఎమ్మెల్యేలకు, పార్టీ నిర్వాహకులకు అందజేయడం పరిపాటి. 2016 మేలో కాంగ్రెస్–డీఎంకే కూటమి ప్రభుత్వం ఏర్పాటుచేసింది. కాంగ్రెస్లో ఎమ్మెల్యేలు ధనవేలు, విజయవేణి, బాలన్, తీప్పాయిందాన్, జయమూర్తి ఐదుగురు డీఎంకేలో శివ, గీతా ఆనందన్ బోర్డు అధ్యక్షులుగా పదవులు చేపట్టారు. ఏడుగురు బోర్డు అధ్యక్షులు ఏడాదిపాటు మాత్రమే పదవుల్లో కొనసాగే వీలుంది. అంతేకాకుండా వారి కార్యనిర్వహణ సామర్థ్యాన్ని బట్టి వారు పదవుల్లో కొనసాగే అవకాశం ఉందనే నిబంధన మేరకు గవర్నర్ కిరణ్బేడి అంగీకారం తెలిపారు. ఇలావుండగా ఏడాది కాలం పూర్తయిన సందర్భంగా బోర్డు అధ్యక్షుల పదవీ కాలాన్ని పొడిగించేందుకు మంత్రి వర్గం నిర్ణయించి గవర్నర్కు ఫైలు పంపింది. అయితే దీన్ని నిరాకరించిన గవర్నర్ బోర్డు అధ్యక్షుల ఏడాది కాలం కార్యాచరణ నివేదికను కోరుతూ నిషేధం విధించారు. దీంతో ఏడుగురు ఎమ్మెల్యేలు బోర్డు అధ్యక్షుల పదవుల్లో కొనసాగలేక తప్పుకున్నారు. తర్వాత ఈ ఫైలును ఏకాభిప్రాయం కుదరలేదంటూ కేంద్ర ప్రభుత్వానికి కిరణ్బేడి పంపారు. ఆ తర్వాత హోంశాఖ మంత్రి రాజ్నాథ్సింగ్ను ముఖ్యమంత్రి నారాయణస్వామి కలిసి బోర్డు అధ్యక్షుల పదవీ కాలం కొనసాగింపునకు అనుమతిని ఇవ్వాలంటూ ఒత్తిడి తెచ్చారు. కేంద్ర హోంశాఖ నుంచి గురువారం పుదుచ్చేరి గవర్నర్, ప్రధాన కార్యదర్శికి ఒక లేఖ అందింది. కేంద్ర ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి సతీష్కుమార్ ఇచ్చిన ఉత్తర్వుల్లో ఏడుగురు ఎమ్మెల్యేలు మళ్లీ బోర్డు అధ్యక్షుల పదవుల్లో కొనసాగేందుకు అనుమతి అందజేస్తున్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ అనుమతితో కొద్ది రోజుల్లో బోర్డు అధ్యక్షులందరూ తమ పదవులను అందుకోనున్నారు. పుదుచ్చేరి సీఎస్ బదిలీ: గవర్నర్తో విభేదాల కారణంగా పుదుచ్చేరి చీఫ్ సెక్రటరీ మనోజ్ ఫరిదా బదిలీకి గురయ్యారు. పుదుచ్చేరి 2016 ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ అధికారం చేపట్టింది. ముఖ్యమంత్రి నారాయణస్వామి ఆధ్వర్యంలో మంత్రివర్గం ఏర్పాటైంది. అదే సమయంలో కేంద్ర ప్రభుత్వం కిరణ్బేడీని గవర్నర్గా నియమించగా కేంద్ర ప్రభుత్వ జాయింట్ సెక్రటరీగా చీఫ్ సెక్రటరీ మనోజ్ ఫరిదా హోదా పెంచబడింది. అయినప్పటికీ ఆయన ఢిల్లీ వెళ్లకుండా పుదుచ్చేరిలో పనిచేస్తూ వచ్చారు. ఇలావుండగా గవర్నర్గా బాధ్యతలు చేపట్టగానే కిరణ్బేడి ప్రభుత్వ వ్యవహారాల్లో జోక్యం చేసుకోసాగారు. దీంతో సీఎం నారాయణసామితో ఘర్షణ వైఖరి ఏర్పడింది. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వానికి అండగా మనోజ్ ఫరిదా నిలిచారు. ఆ తర్వాత ముగ్గురు నామినేటెడ్ ఎమ్మెల్యేల వ్యవహారంలోను కేంద్ర హోంశాఖకు వ్యతిరేకంగా చీఫ్ సెక్రటరీ పనిచేస్తున్నట్లు గవర్నర్, బీజేపీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు ఆరోపణలు చేశారు. ఈ పరిస్థితుల్లో పుదుచ్చేరి చీఫ్ సెక్రటరీ మనోజ్ ఫరిదా అకస్మికంగా ఢిల్లీకి బదిలీ అయ్యారు. ఆయనకు బదులుగా ఢిల్లీలో చీఫ్ సెక్రటరీగా పనిచేస్తూ వచ్చిన అశ్విన్కుమార్ పుదుచ్చేరికి నియమితులయ్యారు. ఆయన త్వరలో పుదుచ్చేరికి వచ్చి పదవీ భాద్యతలు స్వీకరించనున్నారు. -
ఏమో... ఎవరికి తెలుసు?
పుదుచెర్రీ : మాజీ ఐపీఎస్ అధికారిణి, పుదుచెర్రీ లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ మరోసారి వార్తల్లో నిలిచారు. తనను కలిసేందుకు వచ్చిన ఓ బాలుడికి అప్యాయ ఆతిథ్యం ఇచ్చారు. ఏకంగా గవర్నర్ కుర్చీలోనే అతన్ని కూర్చోబెట్టారు. రాజ్ నివాస్(పుదుచ్చేరి రాజ్ భవన్)కు ప్రజల సందర్శనార్థం అనుమతి ఉన్న విషయం తెలిసిందే. శనివారం ఓ కుటుంబం అక్కడికి రాగా.. అదే సమయంలో కిరణ్ బేడీ కార్యాలయంలో ఉన్నారు. విషయం తెలుసుకున్న ఆ కుటుంబసభ్యులతో వెళ్లి ఆమెను కలిశారు. వారితో కాసేపు మాట్లాడిన బేడీ, బాలుడిని ఆప్యాయంగా పలకరించారు. అంతేకాదు, తన కుర్చీలో కూర్చోమని స్వయంగా కిరణ్ బేడీయే ఆ బాలుడితో అన్నారు. దీంతో, ఆ బాలుడు ఆ కుర్చీలో కూర్చుని ఆనందపడ్డాడు. ఈ విషయాన్ని కిరణ్ బేడీ తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలిపారు. సందర్శనార్థం వచ్చే చిన్నారులను కొంచెం సేపు లెఫ్టినెంట్ గవర్నర్ కుర్చీలో కూర్చోబెడతానని ఆమె ట్విట్టర్లో తెలిపారు. ‘‘ఏమో దీనిని స్ఫూర్తి పొంది.. ఏదో ఓ రోజున వాళ్లే ఈ పుదుచ్చేరికి లెఫ్టినెంట్ గవర్నర్ అవుతారేమో, ఎవరికి తెలుసు?’’అని ఆ ట్వీట్ లో స్ఫూర్తిదాయక ట్వీట్ ను బేడీ చేశారు. Our youngest visitor for today received a pleasant surprise when HLG @thekiranbedi asked him to sit in her chair! ☺ pic.twitter.com/7tjKE2YvMb — Lt. Gov. Puducherry (@LGov_Puducherry) October 28, 2017 -
గోడ దూకిన కిరణ్ బేడీ
సాక్షి, చెన్నై : ధైర్య సాహసాలకు మరోపేరైన పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడి మరో సాహసం చేశారు. గురువారం ఆమె కరైకల్ ప్రాంతంలో పర్యటించారు. ఈ సమయంలోనే అక్కడి ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించారు. ఆసుపత్రిలోని సౌకర్యాలు, రోగులకు అందుతున్న సదుపాయాల గురించి అక్కడివారిని అడిగి తెలుసుకున్నారు. పారిశుద్ధ్య పరిస్థితులు సరిగ్గా లేకపోవడంతో.. ఆమె అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆసుపత్రి ప్రాంగణంలో ప్రత్యేకంగా ఉన్న ‘అవర్ లేడీ ఆఫ్ లార్డ్స్‘ గదిని గమనించారు. ఆ గదికి చుట్టూ 4 అడుగుల మేర ఇటుక గోడ నిర్మించి ఒక గేట్ పెట్టారు. అవర్ లేడీ ఆఫ్ లార్డ్స్ గదిని సందర్శించాలని కిరణ్ బేడీ ఆసుపత్రి అధికారులకు తెలిపారు. గేట్ చాలాకాలం పాటు మూసివుంచడంతో.. తాళం చెవులు ఎక్కడపెట్టారో అధికారులు మర్చిపోయారు. కొద్దిసేపు తాళం చెవుల కోసం ఎదురు చూసిన కిరణ్ బేడి.. చివరకు గోడను ఎక్కి అవతలకు దూకి షెడ్లోకి వెళ్లారు. దీంతో చేసేదీలేక.. కరైకల్ కలెక్టర్ ఆర్. కేశవన్, సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ వీజే చంద్రన్, మరికొందరు అధికారులు కూడా గోడ దూకి షెడ్లోకి వెళ్లారు. -
మోదీ తల్లి డాన్స్ చేశారా?
చెన్నై: దీపావళి స్ఫూర్తిని వెల్లడించేందుకు పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడి తన ట్విటర్ పేజీలో ఒక వీడియోను షేర్ చేశారు. గుజరాతీ జానపద బాణికి లయబద్ధంగా వృద్ధ మహిళ నృత్యం చేస్తున్న ఈ వీడియో చూడగానే ఆకట్టుకుంది. ఈ వృద్ధురాలు మరెవరో కాదు, ప్రధాని నరేంద్ర మోదీ తల్లి హీరాబెన్ అని చెప్పి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. ‘97 ఏళ్ల వయసులోనూ దీపావళి స్ఫూర్తిని నింపుకుని తన సొంత గృహంలో దివాళి వేడుక చేసుకుంటున్న ఈమె ఎవరో కాదు ప్రధాని మోదీ మాతృమూర్తి’ అని కిరణ్ బేడి ట్వీట్ చేశారు. అయితే తర్వాత తప్పు తెలుసుకుని సవరించుకున్నారు. వీడియోలో కనిపించిన వృద్ధురాలు ప్రధాని మోదీ తల్లి హీరాబెన్ కాదని తెలిపారు. ‘వీడియోలో ఉన్న వృద్ధురాలిని గుర్తించడంలో పొరపాటు జరిగింది. కానీ అమ్మ ఉత్సాహానికి సెల్యూట్ చేస్తున్నాను. నేను కనుక 96 ఏళ్లు బతికితే ఆవిడలా ఉండాలని కోరుకుంటాన’ని మరో ట్వీట్ చేశారు. కాగా, ఈ వీడియోకు 13 వేల మంది పైగా లైక్ కొట్టగా, 4100 మంది రీట్వీట్ చేయడం విశేషం. దాదాపు వెయ్యి మంది కామెంట్లు పెట్టారు. కిరణ్ బేడి షేర్ చేసిన వీడియో ఇదే -
మోదీ తల్లి డాన్స్ చేశారా?
-
గవర్నర్పై కేసు పెడతాం : సీఎం వార్నింగ్
సాక్షి, చెన్నై: పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడిపై పరువునష్టం దావా వేయనున్నట్టు ఆ రాష్ట్ర సీఎం నారాయణ స్వామి పేర్కొన్నారు. అధికారుల్ని, మంత్రుల్ని బెదిరిస్తున్న కిరణ్ బేడిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయనున్నట్టు తెలిపారు. పుదుచ్చేరిలో సీఎం నారాయణ స్వామి, లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ భేడి మధ్య వివాదం సాగుతూ వస్తున్న విషయం తెలిసిందే. గత ఏడాది జరిగిన ప్రైవేటు కళాశాలల్లో వైద్య సీట్ల భర్తీలో అవకతవకలు గవర్నర్-సీఎంల మధ్య వివాదానికి దారి తీశాయి. ఈ వ్యవహారంలో ప్రభుత్వ పెద్దల ప్రమేయం ఉందనే అర్థంలో గవర్నర్ కిరణ్ బేడీ స్పందించారు. కాగా, శనివారం హుటాహుటిన మీడియా సమావేశం ఏర్పాటుచేసిన సీఎం నారాయణస్వామి.. బేడీ వ్యాఖ్యలను ఖండించారు. తమ ప్రభుత్వంపై నిరాధారమైన ఆరోపణలు చేస్తోన్న కిరణ్ బేడిపై పరువునష్టం దావా వేయనున్నట్టు ప్రకటించారు. ‘‘అధికారుల్ని, మంత్రుల్ని బెదిరిస్తూ, హెచ్చరికలతో ముందుకు సాగుతున్న కిరణ్ బేడీపై అవసరమైతే ఎఫ్ఐఆర్ నమోదు చేస్తాం. అసలు ఆమె లెఫ్టినెంట్ గవర్నర్ పదవికి అర్హురాలేకాదు. కానీ కేంద్రం ఆమెను మాపై పడేసింది. ఇప్పుడు మాకు ఆమె శిరోభారంగా మారింది. ఎక్కడ ఏ సంఘటన జరిగినా, అందుకు ప్రభుత్వాన్ని బాధ్యులుగా చేరుస్తూ ఆమె చేస్తున్న వ్యాఖ్యలు దారుణం, ఖండనీయం’’ అని సీఎం నారాయణస్వామి ఘాటుగా వ్యాఖ్యానించారు. -
గవర్నర్ ఫొటోకు క్షీరాభిషేకం
తిరువొత్తియూరు(పుదుచ్చేరి): ప్రభుత్వ పాలనా వ్యవహారాల్లో జోక్యం చేసుకుని అభివృద్ధి పనులకు ప్రోత్సాహం ఇస్తున్న గవర్నర్ కిరణ్బేడీ చర్యలకు మద్దతు తెలుపుతూ కొందరు అభిమానులు ఆమె ఫొటోను పాలతో అభిషేకించారు. గవర్నర్ చర్యలకు ఓ వైపు నుంచి మద్దతు, మరో వైపు నుంచి వ్యతిరేకత ఎదురవుతోంది. ఆమెతో తీవ్ర క్లిష్ట పరిస్థితి ఎదుర్కొంటున్న అధికార కాంగ్రెస్ పార్టీ ఆమెను హిట్లర్లా చిత్రీకరించిన బ్యానర్లతో వ్యతిరేకతను వ్యక్తం చేసింది. ఈ సంఘటన సామాజిక మాధ్యమాల్లో సంచలనం కలిగించింది. ఇందుకు జవాబుగా అన్నట్లు యానాంలోని ఆమె అభిమానులు దుకాణం వీధిలో కిరణ్బేడి ఫొటోకు క్షీరాభిషేకం చేసి మద్దతు తెలిపారు. ఈ దృశ్యం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. ఇది తెలుసుకున్న కిరణ్బేడీ ఇకపై అభివృద్ధి పనులకు ప్రోత్సాహం అందించేలా చర్యలు తీసుకుంటానని తెలిపారు. -
సీఎం వర్సెస్ లెఫ్టినెంట్ గవర్నర్!
పుదుచ్చేరి: పుదుచ్చేరి కాంగ్రెస్ ప్రభుత్వం, లెప్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ మధ్య మళ్లీ ఘర్షణ తారాస్థాయికి చేరింది. లెప్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ మంగళవారం కేంద్రం నామినేట్ చేసిన ముగ్గురు వ్యక్తులతో ఎమ్మెల్యేలుగా ప్రమాణం చేయించారు. బీజేపీ పుదుచ్చేరి శాఖ అధ్యక్షుడు వీ స్వామినాథన్, పార్టీ కోశాధికారి కేజీ శంకర్, విద్యావేత్త ఎస్ సెల్వ గణపతిలతో ఆమె హడావిడిగా ప్రమాణస్వీకారం చేయించారు. దీనిపై నారాయణస్వామి ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నది. తమ ప్రభుత్వానికి సమాచారం ఇవ్వకుండా ఇలా ఏకపక్షంగా వ్యవహరించడం రాజ్యాంగ విరుద్ధమని వాదిస్తున్నది. మరోవైపు ఈ నియామకాలపై స్టే విధించాలంటూ మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ప్రభుత్వాన్ని సంప్రదించకుండా గవర్నర్ ఎలా ఎమ్మెల్యేలను నామినేట్ చేస్తారని, ఇది సమాఖ్యస్ఫూర్తికి వ్యతిరేకమని సీఎం వీ నారాయణస్వామి అంటుండగా.. ఆయన ఆరోపణలను కిరణ్ బేడీ తోసిపుచ్చారు. తాను రాజ్యాంగం ప్రకారమే నడుచుకున్నట్టు ఆమె తెలిపారు. ‘కేబినెట్ మంత్రులు నా దగ్గరకు వచ్చి.. మీరు ఎందుకు ప్రజలను కలుస్తున్నారు? వారి సమస్యలను ఎందుకు పరిష్కరిస్తున్నారు? అని ప్రశ్నిస్తున్నారు. మీరు రబ్బర్స్టాంప్లా ఉండాలని మంత్రులు అంటున్నారు’ అని కిరణ్ బేడీ అన్నారు. -
కిరణ్కు అభయం
►కేంద్రం అధికారాలు సీఎంకు హోం శాఖ వివరణ ►ఇక, సంకటంలో నారాయణ సర్కారు చెన్నై : పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీకి కేంద్రం అభయం ఇచ్చింది. సీఎం నారాయణ స్వామి సర్కారును సంకటంలోకి నెట్టే రీతిలో గవర్నర్కు ప్రత్యేక అధికారాలు ఇచ్చింది. సీఎం నారాయణ స్వామి ఇచ్చిన ఫిర్యాదుకు కేంద్ర హోం శాఖ ఇచ్చిన వివరణ మున్ముందు పుదుచ్చేరిలో ఎలాంటి వివాదాలకు ఆజ్యం పోస్తాయోనన్న ఉత్కంఠ నెలకొంది. కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే రీతిలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. ఇందుకు అస్త్రంగా లెఫ్టినెంట్ గవర్నర్గా కిరణ్ బేడీని రంగంలోకి దించిన విషయం తెలిసిందే. ప్రభుత్వం ఏర్పడి ఏడాదికి పైగా అవుతున్నా, లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ, సీఎం నారాయణ స్వామి మధ్య నిత్యం సమరమే. వీరిద్దరి మధ్య చాప కింద నీరులా సాగుతున్న వివాదం చివరకు ముదిరి పాకాన పడింది. ప్రభుత్వానికి అండగా అన్నాడీఎంకే, డీఎంకే అండగా నిలవడంతో కిరణ్ను రీకాల్ చేయడానికి తగ్గ ప్రయత్నాలు సాగాయి. ప్రభుత్వ వ్యవహారాల్లో లెఫ్టినెంట్ గవర్నర్ జోక్యం, తమకు కల్పించిన హక్కులను కాలరాసే రీతిలో వ్యవహరిస్తున్నారని ఆరోపణలతో కిరణ్ను బర్తరఫ్ చేయాలని లేదా, వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ, కేంద్ర హోం శాఖకు ఫిర్యాదులు చేరాయి. అయితే, ఈ ఫిర్యాదుల్ని పరిశీలించిన కేంద్ర హోం శాఖ కిరణ్కు మరింత అభయాన్ని ఇస్తూ, లెఫ్టినెంట్ గవర్నర్కు ఉన్న అధికారాలను వివరిస్తూ సీఎం నారాయణ స్వామికి సవవిరంగా లేఖాస్త్రాన్ని సంధించడం గమనార్హం. నారాయణ ప్రభుత్వానికి సంకట పరిస్థితులు రాష్ట్రాల గవర్నర్ల కన్నా, లెఫ్టినెంట్ గవర్నర్కు ప్రత్యేక అధికారాలు ఉంటాయన్న విషయాన్ని గుర్తు చేస్తూ అందులో వివరించారు. స్వతహాగా నిర్ణయాలు తీసుకునే అధికారం కూడా ఉన్నట్టు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, మంత్రి వర్గంతో సంబంధం లేకుండా, ముందుకు సాగే అవకాశం ఉందని, అవసరం అయితే, అన్ని వ్యవహారాల్లో జోక్యం చేసుకునేందుకు సైతం వీలుందని వివరించడం గమనార్హం. అలాగే, మంత్రివర్గం నుంచి వచ్చే ఫైల్స్లో ఏదేని అనుమానాలు ఉన్నా, అధికారుల్ని పిలిపించి సమీక్షించడం, అవసరం అయితే, సంబంధిత మంత్రితో మాట్లాడేందుకు సైతం అధికారం ఉన్నట్టు అందులో పేర్కొనడం బట్టి చూస్తే, మున్ముందు నారాయణ సర్కారుకు కిరణ్రూపంలో మరిన్ని సంకట పరిస్థితులు తప్పవని స్పష్టం అవుతోంది. అలాగే విభేదాలు తలెత్తినా, అభిప్రాయభేదాలు ఎదురైనా, సమస్యలు తాండవించినా.. కీలక నిర్ణయం తీసుకునేందుకు తగ్గ సిఫార్సును రాష్ట్రపతికి చేసే అధికారం కూడా లెఫ్టినెంట్ గవర్నర్కు ఉన్నట్టు అందులో హెచ్చరించి ఉండడం గమనార్హం. అయితే, వీటన్నింటి గురించి పట్టించుకోకుండా, పుదుచ్చేరి ప్రగతి తనకు లక్ష్యం అని నారాయణ ముందుకు సాగుతున్నారు. ఆగస్టులో పుదుచ్చేరి హార్బర్ నుంచి సరకుల రవాణా విస్తృతం, సెప్టెంబరులో పుదుచ్చేరి విమానాశ్రయం నుంచి విమాన సేవలు సాగేందుకు తగ్గ ఏర్పాట్లలో మునిగారు. -
కిరణ్ బేడీ రబ్బర్ స్టాంప్ కాదా?
న్యూఢిల్లీ: పుదుచ్చేరి ముఖ్యమంత్రి వి. నారాయణ స్వామి, ఆయన మంత్రివర్గ సభ్యులపై రాష్ట్ర లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ సోమవారం అవినీతి ఆరోపణలు చేస్తూ చిందులు వేయడం సోషల్ మీడియాలో రోజంతా హల్చల్ చేసింది. తాను రబ్బర్ స్టాంప్ లెఫ్ట్నెంట్ గవర్నర్గా ఉండదల్చుకోలేదని, సమర్థురాలైన పాలనాధికారిగా ఉండాలనుకుంటున్నానని కూడా నొక్కి చెప్పారు. ఉన్నతాధికారులంతా తనకే రిపోర్ట్ చేయాలని, తన ఆదేశాలకే కట్టుబడి పనిచేయాలని కూడా ఆమె ఇదివరకే ఆదేశించారు. కిరణ్ బేడీ నిజంగా సమర్థరాలైన పాలనాధికారే అయినట్లయితే దేశ ప్రజస్వామ్య వ్యవస్థ గురించి, సమాఖ్య స్ఫూర్తి గురించి సరైన అవగాహన ఉండి ఉండాలి. నారాయణ స్వామి, ఆయన మంత్రివర్గ సభ్యులు, శాసన సభ్యులు అందరూ కూడా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైనవారు. ముఖ్యమంత్రి మాటను కూడా ఖాతరు చేయకుండా కిరణ్ బేడీ ఏకపక్షంగా వ్యవహరించడం ఏ ప్రజాస్వామ్య విలువలను గౌరవిస్తున్నట్లు? పుదుచ్చేరి ప్రైవేటు వైద్య కళాశాల సీట్ల యాజమాన్య కోటా సీట్ల భర్తీ విషయంలో అవినీతి జరగకుండా చూడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిది. అందులో జోక్యం చేసుకునే అధికారం లెఫ్ట్నెంట్ గవర్నర్కు ఉండదు. సీట్ల భర్తీలో అవినీతి జరిగినట్లు ఫిర్యాదులు అందితే తనకున్న అధికారాల మేరకు దర్యాప్తు జరిపించి అవినీతిపరులపైన చర్యలు తీసుకోవచ్చు. తానే 26 మంది విద్యార్థుల జాబితాను కళాశాల అధికారులకు ఇచ్చి వారందరికీ సీట్లు ఇమ్మని హుకుం జారీ చేసే అధికారం ఆమెకు ఎక్కడిది? అది అవినీతి, ఆశ్రితపక్షపాతం కిందకు రాదా? అవినీతి ఆరోపణలను నిరూపించినట్లయితే అందుకు ఏ శిక్షకైనా తాను సిద్ధమేనని ముఖ్యమంత్రి సవాల్ చేస్తున్నప్పుడు చట్ట ప్రకారం చర్యలకు సిద్ధం కావచ్చుగదా! కిరణ్ బేడీ రాష్ట్ర ప్రభుత్వ విధుల్లో జోక్యం చేసుకోవడం ఇదే మొదటిసారి కాదు. అధికారులు ‘వాట్సాప్’ గ్రూపును ఉపయోగించడాన్ని ముఖ్యమంత్రి గత జనవరిలో నిషేధించినప్పుడు జోక్యం చేసుకున్నారు. రాష్ట్ర కేబినెట్ నిర్ణయాన్ని తిరస్కరించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మనోజ్ పరిధాపై చర్యకు ఏప్రిల్ నెలలో ఆదేశించారు. అసెంబ్లీ స్పీకర్ వైథిలింగం ఆదేశాలపై పుదుచ్ఛేరి మున్సిపల్ కమిషనర్ను తొలగించిందుకు చీఫ్ సెక్రటరీపై మండిపడ్డారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన పుదుచ్చేరి ప్రభుత్వంపై లెఫ్ట్నెంట్ గవర్నర్ పెత్తనం చెలాయించడమంటే కేంద్రం పెత్తనం సాగించడమే. నరేంద్ర మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఎప్పుడూ రాష్ట్రాల పట్ల కేంద్రం సమాఖ్య స్ఫూర్తిని ప్రదర్శించాలని అనేవారు. బీజేపీ కూడా రాష్ట్రాలపై కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పెత్తనాన్ని వ్యతిరేకిస్తూ సమాఖ్య స్ఫూర్తిని మంటగలుపుతోందని తరచూ విమర్శించేది. ప్రధాన మంత్రయ్యాక నరేంద్ర మోదీ అప్పుడప్పుడు సమాఖ్య స్ఫూర్తి అంటున్నారుగానీ, బీజేపీ ఒక్కసారి కూడా సమాఖ్య స్ఫూర్తి గురించి మాట్లాడటం లేదు. కేంద్రం కనుసన్నల్లో నడుచుకునే గవర్నర్లు రబ్బరు స్టాంపులుకాకుండా మరేమిటో! -ఓ సెక్యులరిస్ట్ కామెంట్ -
సీఎం, గవర్నర్ మాటల యుద్ధం
పుదుచ్చేరి: పుదుచ్చేరి ముఖ్యమంత్రి వి. నారాయణస్వామి, లెఫ్టినెంట్ గవర్నర్(ఎల్జీ) కిరణ్ బేడీ మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. వీరిద్దరూ పరస్పరం విమర్శస్త్రాలు ఎక్కుపెట్టుకుంటున్నారు. కిరణ్బేడీ తీరుపై తీవ్ర అసహనంతో ఉన్న సీఎం.. అధికారులకు ఆంక్షలు విధించారు. లెఫ్టినెంట్ గవర్నర్ను కలవొద్దని, తప్పనిసరైతే ప్రభుత్వ అనుమతి తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పీజీ మెడికల్ అడ్మిషన్ల ప్రక్రియలో అనవసరంగా కిరణ్బేడీ జోక్యం చేసుకుంటున్నారని గతవారం నారాయణస్వామి విమర్శించారు. మంత్రులను, ఎమ్మెల్యేలపై సోషల్ మీడియాలో దుమ్మెత్తిపోయడం మానుకోవాలని, అగౌరపరిచే వ్యాఖ్యలు మానుకోవాలని అసెంబ్లీ వేదికగా ఆమెకు సూచించారు. నారాయణస్వామి వైఖరిని కిరణ్బేడీ తప్పుబట్టారు. ‘మీరు కోరుకుంటున్నది రబ్బర్ స్టాంపునా లేదా బాధ్యతాయుతమైన పాలకురాలినా’ అని నారాయణస్వామిని అని ప్రశ్నించారు. పుదుచ్చేరికి న్యాయం, నైతిక నిష్ఠ, మంచి పాలన కావాలని పేర్కొన్నారు. కాగా, కిరణ్ బేడీని పదవి నుంచి తొలగించాలని సీఎం నారాయణస్వామి, ఎమ్మెల్యేలు జనవరిలో ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాసిన సంగతి తెలిసిందే. -
కిరణ్బేడీపై నగ్మా సంచలన వ్యాఖ్యలు
పుదుచ్చేరి: పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్బేడీపై ఆలిండియా మహిళా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, సినీనటి నగ్మా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఆమె ఫక్తు బీజేపీ ప్రతినిధిగా వ్యవహరిస్తున్నారని ఆమె మండిపడ్డారు. విధులు నిర్వర్తించటానికి బదులుగా ఆమె కేంద్రానికి అనుకూలంగా పుదుచ్చేరిలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారని ఆరోపించారు. పేద విద్యార్థులకు స్కాలర్షిప్పులు, పేదలకు రేషన్ బియ్యం పంపిణీతోపాటు ఇతర సంక్షేమ కార్యక్రమాలను అమలు కాకుండా కిరణ్బేడీ అడ్డుపడుతున్నారని నగ్మా విమర్శించారు. గవర్నర్ ఇలా ఎందుకు చేస్తున్నారో అర్థం కావటం లేదని అన్నారు. రాజకీయాలు మాని రాష్ట్ర అభివృద్ధికి సాయపడాలని లెఫ్టినెంట్ గవర్నర్ను కోరారు. బీజేపీయేతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలకు కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం అవరోధాలు సృష్టిస్తోందని నగ్మా ఆరోపించారు. -
తగ్గని కిరణ్
పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్బేడీ ఏ మాత్రం తగ్గడం లేదు. సీఎం నారాయణ స్వామి సర్కారును ఢీ కొట్టే విధంగా ముందుకు సాగుతున్నారు. పీఎఫ్ నిధిలో రూ.36 కోట్లను దారి మళ్లించి ఉండడాన్ని ప్రస్తుతం వెలుగులోకి తెచ్చారు. సాక్షి, చెన్నై: కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్బేడీ, సీఎం నారాయణ స్వామి నేతృత్వంలోని ప్రభుత్వం మధ్య వివాదం ముదురుతోంది. గత వారం రోజులుగా కిరణ్కు వ్యతిరేకంగా ప్రభుత్వ నేతృత్వంలో ఏర్పడ్డ అఖిల పక్షం తీవ్ర నినాదాల్ని అందుకుంది. ఆమెను బర్తరఫ్ చేయాలని, డిస్మిస్ చేయాలని, వెనక్కు తీసుకోవాలన్న నినాదాలతో ఢిల్లీకి ఫిర్యాదుల మీద ఫిర్యాదుల్ని వెల్లువెత్తించారు. ఈ వివాదాల నేపథ్యంలో శనివారం కిరణ్బేడీ ఢిల్లీ వెళ్లారు. ఢిల్లీ పెద్దలతో రెండు రోజుల పాటుగా బేటీలతో బిజీ అయ్యారు. ఆ పెద్దల అండదండాలతో కూడిన భరోసా దక్కిందో ఏమోగానీ దూకుడు పెంచే పనిలో లెఫ్టినెంట్ గవర్నర్ నిమగ్నం కావడం గమనార్హం. నారాయణ స్వామి ప్రభుత్వంతో ఢీ కొట్టే విధంగా సోమవారం ఆమె స్పందించారు. పీఎఫ్ నిధి దారి మళ్లించి ఉండడాన్ని పసిగట్టి, వెలుగులోకి తెచ్చారు. క్రిమినల్ కేసు నమోదుకు తగ్గ చర్యల్లో భాగంగా న్యాయ శాఖ అభిప్రాయాలను తెలుసుకునేందుకు నిర్ణయించడంతో పుదుచ్చేరిలో సాగుతున్న అధికార ఆధిపత్య సమరానికి మరింత ఆజ్యం పోసినట్టు అయింది. పీఎఫ్ దారి మళ్లింపు ప్రభుత్వ రంగ సంస్థలు, సహకారం సంస్థల్లోని ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్(పీఎఫ్) నిధిలో రూ.36 కోట్లను ఇతర పనులకు దారి మళ్లించినట్టు కిరణ్ గుర్తించారు. తన పరిశీలనలో వచ్చిన అంశాన్ని వెలుగులోకి తెస్తూ తొలుత ట్విట్టర్లో రూ.36 కోట్లు ఏమైనట్టు అని ప్రశ్నించడంతో నారాయణ స్వామి ప్రభుత్వ వర్గాలకు పుండు మీద కారం చల్లినట్టు అయింది. దీంతో మంత్రి కందస్వామి సమాధానం ఇస్తూ, ఇది తమ హయాంలో జరిగింది కాదని, ఎప్పుడో జరిగిన దాన్ని ఇప్పుడు తెర మీదకు తెచ్చి తమ మీద నిందలు వేయడానికి లెఫ్టినెంట్ గవర్నర్ సిద్ధమైనట్టున్నారని మీడియా ముందు విరుచుకు పడ్డారు. తాము గవర్నర్కు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న దృష్ట్యా, తమ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే విధంగా, చెడ్డ పేరు తీసుకొచ్చే రీతిలో ఆమె చర్యలు ఉన్నాయని ధ్వజమెత్తారు. దీంతో కిరణ్ స్పందించారు. మంత్రి వ్యాఖ్యల్ని పరిగణనలోకి తీసుకుని, అస్సలు ఆ నగదు దారి మళ్లింపు అన్నది క్రిమినల్ నేరంగా అభివర్ణిస్తూ, అందుకు తగ్గ చర్యలకు కసరత్తుల్లో పడ్డారు. ఇందుకు గాను న్యాయ శాఖ అభిప్రాయాన్ని తీసుకునేందుకు నిర్ణయించి, ఆ శాఖ కార్యదర్శికి ఓ లేఖ రాయడం గమనార్హం. అందులో పీఎఫ్ నిధి దారి మళ్లింపు అన్నది క్రిమినల్ చర్య కిందకు వస్తుందన్న విషయం తన పరిశీలనలో తేలిందని గుర్తు చేశారు. పీఎఫ్ దారి మళ్లింపు ఎలా జరిగింది, పీఎఫ్ నిధి విషయంలో ఏమి జరుగుతున్నదో, మంత్రి 11 నెలలుగా ఏమి చేశారో, సమగ్ర వివరాలతో పాటుగా క్రిమినల్ కేసు విషయంలో అభిప్రాయం తెలియజేయాలని ఆ లేఖ ద్వారా కోరారు. అయితే, పీఎఫ్ దారి మళ్లింపు వ్యవహారంలో క్రిమినల్ కేసు నమోదుకు తగ్గ చర్యల్లో భాగంగా న్యాయ శాఖ అభిప్రాయాన్ని స్వీకరించేందుకు కిరణ్ నిర్ణయించడం పుదుచ్చేరిలో సాగుతున్న వివాదానికి మరింత ఆజ్యం పోసినట్టు అయింది. -
ఢిల్లీకి కిరణ్
సాక్షి, చెన్నై: పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్బేడి శనివారం ఢిల్లీ వెళ్లారు. ప్రభుత్వ పెద్దల నుంచి వచ్చిన పిలుపుతో కారైక్కాల్ పర్యటను అర్ధాంతరంగా రద్దు చేసుకుని మరీ ఢిల్లీకి విమానం ఎక్కేశారు. అక్కడ హోంమంత్రితో భేటీ కానున్నారు. అలాగే, ప్రధాని నరేంద్ర మోదీతోనూ బేటీ అయ్యే అవకాశాలు ఉన్నట్టు అధికార వర్గాల పేర్కొంటున్నాయి. పుదుచ్చేరిలో సాగుతున్న అధికార ఆధిపత్య సమరం రసవత్తరంగా మారింది. లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడి, సీఎం నారాయణస్వామిల మధ్య సాగుతున్న వార్ రచ్చకెక్కడంతో పంచాయతీ ఢిల్లీకి చేరింది. సీఎం నారాయణస్వామి నేతృత్వంలో అఖిలపక్షం రాష్ట్రపతి, ప్రధాని, హోం మంత్రుల అనుమతి కోసం ఎదురుచూస్తోంది. అపాయింట్మెంట్ కోసం ఓ వైపు ఎదురు చూస్తూనే మరోవైపు ఇప్పటికే ఫిర్యాదుల రూపంలో ఢిల్లీకి అన్ని వివరాలను చేర వేశారు. తనకు వ్యతిరేకంగా సాగుతున్న పరిణామాలను నిశితంగా కిరణ్బేడి పరిశీలిస్తూ, వాటిని ఎదుర్కొనేందుకు సిద్ధమేనని స్పష్టం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ నుంచి వచ్చిన పిలుపుతో ఆగమేఘాలపై కిరణ్ బయలుదేరి వెళ్లారు. ఢిల్లీకి కిరణ్: పుదుచ్చేరి పరిధిలోని కారైక్కాల్లో పలు కార్యక్రమాలు, అభివద్ధి పనుల్లో పాల్గొనేందుకు కిరణ్ బేడి ముందస్తుగా నిర్ణయించారు. మూడు రోజుల పర్యటనగా కార్యచరణ సిద్ధమైంది. శుక్రవారం పర్యటన నిమిత్తం కారైక్కాల్కు వెళ్లారు. ఢిల్లీ నుంచి వచ్చిన పిలుపుతో అన్ని కార్యక్రమాల్ని రద్దు చేసుకుని రాజ్ భవన్కు చేరుకున్నారు. శనివారం ఉదయం ఆరున్నర గంటలకు రోడ్డు మార్గంలో చెన్నైకు చేరుకున్నారు. ఎనిమిదిన్నర గంటలకు మీనంబాక్కం విమానాశ్రయం నుంచి విమానంలో ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. పుదుచ్చేరి ప్రభుత్వం సాగిస్తున్న వ్యవహరాలు, అందుకు తాను ఆక్షేపణ తెలియజే యడానికి గల కారణాలు, తదితర అంశాలను నివేదిక రూపంలో ముందస్తుగా ఆమె సిద్ధం చేసుకున్నట్టు సమాచారం. అన్ని వివరాలతో కూడిన నివేదికను ఢిల్లీ పెద్దల దృష్టికి తీసుకెళ్లేందుకు నిర్ణయించారు. కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్సింగ్తో ఆమె భేటీ కానున్నారు. అలాగే, ప్రధాని నరేంద్ర మోదీతోనూ భేటీ అయ్యే అవకాశాలు ఉన్నట్టు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. తనను ఇరకాటంలో పెట్టే విధంగా పుదుచ్చేరి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును ఢిల్లీ పెద్దల దష్టికి తీసుకెళ్లి, తన పంతా న్ని నెగ్గించుకునే పనిలో పడ్డట్టు సమాచారం. -
కిరణ్బేడి తొలి ప్రసంగానికి నో చాన్స్
సాక్షి, చెన్నై: పుదుచ్చేరి సీఎం నారాయణ స్వామి లెఫ్టినెంట్ గవర్నర్కు బదులుగా తాను అసెంబ్లీ ప్రారంభ సమావేశాల్లో తొలి ప్రసంగంచేశారు. లెఫ్టినెంట్ గవర్నర్ ప్రసంగంతో మొదలుకావాల్సిన అసెంబ్లీని, తన ప్రసంగంతో మంగళవారం ప్రారంభించారు. పుదుచ్చేరిలో అధికారంపై పైచేయి సాధించడంపై లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడి, సీఎంల మధ్య సమరం సాగుతున్న విషయం తెలిసిందే. తనకు అవకాశం కల్పించాలని స్పీకర్ వైద్యలింగంకు కిరణ్బేడీ లేఖ రాసినా ఫలితం శూన్యం. -
రబ్బరుస్టాంపులా ఉండను: కిరణ్ బేడీ
హైదరాబాద్: పుదుచ్చేరిలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి, అక్కడి లెఫ్టినెంట్ జనరల్ కిరణ్ బేడీకి మధ్య పొరపొచ్చాలు ముదురుతున్నాయి. పాలనా బాధ్యతలు చూసుకోవాల్సిన తనను పుదుచ్చేరి ప్రభుత్వం రబ్బరు స్టాంపులా మాత్రమే ఉండమంటోందని మంగళవారమిక్కడ పీటీఐకి ఇచ్చిన ఇంటర్వూ్యలో బేడీ ఆరోపించారు. ఎల్జీ బాధ్యతలేమిటో తెలుసుకోవాలని వారికి చెప్పానని, ఈ విషయంలో తాను వెనక్కి తగ్గనని స్పష్టం చేశారు. ఎల్జీగా తన రెండేళ్ల పదవీకాలం ముగియగానే(వచ్చే ఏడాది మే 29) పదవి నుంచి తప్పుకుంటానని పునరుద్ఘాటించారు. -
గవర్నర్ను డమ్మీగా ఉండాలంటున్నారు!
హైదరాబాద్: పుదుచ్చేరి ప్రభుత్వం తానొక డమ్మీగా ఉండాలని కోరుకుంటోందని ఆ రాష్ట్ర లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్బేడీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నారాయణసామి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంతో కిరణ్ బేడీకి విభేదాలు పెరిగిపోతున్న నేపథ్యంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. తన విధులు, బాధ్యతలను సక్రమంగా నెరవేర్చేందుకు ఎన్ని అడ్డంకులు ఎదురైనా వెనక్కి తగ్గేది లేదన్నారు. మంగళవారం హైదరాబాద్లో జరిగిన 35వ ఆలిండియా పోలీస్ ఈక్వెష్ట్రియన్ చాంపియన్షిప్ పోటీలకు ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆమె విలేకరులతో మాట్లాడారు. వచ్చే మే 29వ తేదీన పదవి నుంచి వైదొలగనున్నట్లు గతంలో చేసిన ప్రకటనకు కట్టుబడి ఉన్నట్లు ఆమె స్పష్టం చేశారు. లెఫ్టినెంట్ గవర్నర్గా ఒక లక్ష్యం కోసం పదవిని చేపట్టానని, పదవీకాలం ముగిసేవరకు ఉండాలని అనుకోవటం లేదని ఆమె చెప్పారు. ఆమె పనితీరుపై అసంతృప్తి వ్యక్తంచేస్తూ ఎనిమిది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్సింగ్కు మెమోరాండం ఇచ్చిన తర్వాతి రోజే ఆమె రిటైర్మెంట్ ప్రకటన చేశారు. ఈ విషయమై ఆమె మాట్లాడుతూ రెండేళ్లపాటు మాత్రమే ఉండాలని మొదటే అనుకున్నానని చెప్పారు. అవినీతి, నేర నిర్మూలన కోసం పలు చర్యలు తీసుకున్నానని తెలిపారు. స్వచ్ఛ పుదుచ్చేరి లక్ష్యంగా తాను చేపట్టే పనులకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించటం లేదని ఆరోపించారు. పుదుచ్చేరి అప్పుల ఊబిలో కూరుకుపోయిందని, దాని నుంచి రాష్ట్రాన్ని రక్షించేందుకు శాయశక్తులా కృషి చేస్తున్నానని కిరణ్ బేడి అన్నారు. -
డమ్మీగా ఉండాలంటున్నారు: కిరణ్ బేడీ
పుదుచ్చేరి ప్రభుత్వం తనను డమ్మీగా ఉంచాలనుకుంటోందని ఆ రాష్ట్ర లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ అన్నారు. నారాయణసామి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంతో విభేదాలు ఎక్కువైన నేపథ్యంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. తన విధులు, బాధ్యతలను సక్రమంగా నెరవేర్చేందుకు ఎన్ని అడ్డంకులు ఎదురైనా వెనక్కి తగ్గేది లేదన్నారు. మంగళవారం హైదరాబాద్లో జరిగిన 35వ ఆలిండియా పోలీస్ ఈక్వెస్ట్రియన్ చాంపియన్షిప్ పోటీలకు ఆమె ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. వచ్చే మే 29వ తేదీన పదవి నుంచి వైదొలగనున్నట్లు గతంలో చేసిన ప్రకటనకు కట్టుబడి ఉన్నట్లు ఆమె స్పష్టం చేశారు. లెఫ్టినెంట్ గవర్నర్గా ఒక లక్ష్యం కోసం పదవిని చేపట్టానని, పదవీకాలం ముగిసే వరకు ఉండాలని అనుకోవటం లేదని చెప్పారు. ఆమె పనితీరుపై 8మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్సింగ్కు మెమోరాండం ఇచ్చిన తర్వాతి రోజే ఆమె రిటైర్మెంట్ ప్రకటన చేశారు. ఈ విషయమై ఆమె మాట్లాడుతూ రెండేళ్లపాటు మాత్రమే ఉండాలని మొదటే అనుకున్నానని చెప్పారు. అవినీతి, నేర నిర్మూలన కోసం ఆమె పలు చర్యలు తీసుకున్నారు. స్వచ్ఛ పుదుచ్చేరి లక్ష్యంగా తాను చేపట్టే పనులకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించటం లేదని, పదవి నుంచి తప్పుకుంటానని గత ఆగస్టులో కిరణ్బేడీ చేసిన ప్రకటన సంచలనం రేపింది. పుదుచ్చేరి అప్పుల ఊబిలో కూరుకుపోయిందని, దాని నుంచి రాష్ట్రాన్ని రక్షించేందుకు శాయశక్తులా కృషి చేస్తున్నానని అన్నారు. -
వచ్చే ఏడాది పదవి వదులుకుంటా: గవర్నర్
న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి నారాయణస్వామితో విభేదాలతో మరోసారి వార్తల్లోకి వచ్చిన పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడి సంచలన ప్రకటన చేశారు. పదవీ త్యాగానికి సిద్ధపడుతున్నట్టు వెల్లడించారు. వచ్చే ఏడాది గవర్నర్గిరిని వదులుకుంటానని ‘ఏఎన్ఐ’ వార్తా సంస్థతో చెప్పారు. 2018, మే 29 నాటికి తాను పదవిలోకి వచ్చి రెండేళ్లు పూర్తవుతుందని, తర్వాత తాను పదవిలో కొనసాగనని అన్నారు. దీని గురించి ప్రభుత్వ పెద్దలకు సమాచారం అందించినట్టు తెలుస్తోంది. కిరణ్ బేడి ప్రకటన రాజకీయ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేసింది. సీఎం నారాయణస్వామితో ఏర్పడిన విభేదాల కారణంగానే ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారన్న ప్రచారం మొదలైంది. కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ కు పుదుదచ్చేరి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేసిన మరుసటి రోజే కిరణ్బేడి ఈ నిర్ణయం వెలువరించడం గమనార్హం. మాజీ ఐపీఎస్ అధికారి అయిన కిరణ్బేడి 2016, మే 29న పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ గా బాధ్యతలు చేపట్టారు. శాంతిభద్రతల పరిరక్షణ, పరిసరాల పరిశుభ్రత, అవినీతి అంతం కోసం పలు చర్యలు చేపట్టారు. -
గవర్నర్ వర్సెస్ సీఎం
► కిరణ్బేడీ, నారాయణస్వామి కోల్డ్వార్ ► ప్రభుత్వ అధికారుల తంటాలు టీనగర్: పుదుచ్చేరిలో గవర్నర్ కిరణ్బేడి, ముఖ్యమంత్రి నారాయణస్వామి మధ్య కోల్డ్వార్తో ప్రభుత్వ అధికారులు తంటాలు పడుతున్నారు. పుదుచ్చేరి గవర్నర్ కిరణ్బేడి ప్రభుత్వ అధికారులను వెంటనే సంప్రదించేందుకు వాట్సప్ గ్రూప్లను ప్రారంభించి నిర్వహిస్తున్నారు. ప్రజా సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు, ప్రభుత్వ శాఖలతో నేరుగా చర్చలు జరిపేందుకు ఈ వాట్సాప్ గ్రూపులను వినియోగిస్తున్నారు. ఇందులో ప్రధాన కార్యదర్శి, ఐఏఎస్, పీసీఎస్ అధికారులు చోటుచేసుకున్నారు. గత 29వ తేదీన గవర్నర్ వాట్సాప్ గ్రూపులో సహకార సంఘాల రిజిస్ట్రార్ శివకుమార్ అసభ్య వీడియోను పంపడం చర్చకు దారితీసింది. అతన్ని వెంటనే గవర్నర్ బంగళాకు రప్పించిన కిరణ్బేడి సస్పెండ్ ఉత్తర్వులను అందజేశారు. అంతేకాకుండా సీబీసీఐడీ పోలీసులచే కేసు నమోదైంది. కాగా, గవర్నర్ చర్యలను నేతలు, అధికారులు ఖండించారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి నారాయణస్వామి ఆధ్వర్యంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో ప్రభుత్వ ఉత్తర్వులను వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్లలో ఉపయోగించేందుకు నిషేధం విధించారు. ఇది ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులుగా అన్ని శాఖలకు సర్కులర్గా పంపారు. ఈ చర్య కారణంగా గవర్నర్ వాట్సాప్ గ్రూప్ నుంచి అధికారులు వైదొలిగారు. ఇలావుండగా పుదుచ్చేరి సీఎం నారాయణస్వామి సోషల్ మీడియా నెట్వర్క్ వినియోగంపై నిషేధ ఉత్తర్వులను గురువారం గవర్నర్ కిరణ్బేడి రద్దు చేస్తూ ఉత్తర్వులిచ్చారు. ప్రజలతో ఎన్నుకోబడిన ప్రభుత్వపు నిర్ణయాన్ని గవర్నర్ రద్దు చేయడంతో గవర్నర్, పాలకుల మధ్య ప్రచ్ఛన్న యుద్ధానికి దారి తీసింది. ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు గవర్నరా? ముఖ్యమంత్రా? ఎవరి అదుపాజ్ఞలకు లోబడాలని తెలియకుండా అవస్థలు పడుతున్నారు. దీంతో ప్రజా సంక్షేమ పనులకు ఆటంకం ఏర్పడే పరిస్థితి నెలకొంది. దీనిపై సీఎం నారాయణస్వామి స్పందిస్తూ గవర్నర్తో నిర్వహణ రీతిగా కొన్ని లోపాలు ఉండొచ్చని, అయితే ఆమెతో ఎటువంటి ఘర్షణ లేదని అన్నారు. కుషు్బకు పాస్పోర్ట్ చిక్కులు: నటి కుషు్బకు పాస్పోర్టు చిక్కులు ఎదురయ్యాయి. ఆమె మద్రాసు హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ లో ఈ విధంగా తెలిపారు. తన పాస్పోర్టు బుక్లో పేజీలు ఉపయోగించి పూర్తయిందని, అదనపు పేజీలను జతచేయాలని కోరుతూ పాస్పోర్టు కార్యాలయంలో అభ్యర్థించానని, అదే విధంగా పాస్పోర్టు రెన్యువల్ చేయాలని కోరినట్లు తెలిపారు. తన కోర్కెను పాస్పోర్టు అధికారి నిరాకరించారని, తనపై క్రిమినల్ కేసు ఉన్నందున రెన్యువల్ వీలుకాదని గత నెల 28న పాస్పోర్టు అధికారి ఉత్తర్వులు జారీ చేశారని తెలిపారు. ఇది చట్టవిరుద్ధమని దీన్ని రద్దు చేయాలని తెలిపారు. తాను ఈనెల 12న విదేశాలకు వెళ్లనున్నందున పాస్పోర్ట్ను రెన్యువల్ చేసేందుకు ఉత్తర్వులివ్వాలని కోరారు. ఈ పిటిషన్ పై శుక్రవారం విచారణ జరిపిన న్యాయమూర్తి రాజేంద్రన్ వారంలోగా పాస్ట్పోర్టు సదరన్ రీజియన్ అధికారి కోర్టులో సంజాయిషీ పిటిషన్ దాఖలు చేయాలని కోరుతూ ఉత్తర్వులిచ్చారు. -
కిరణ్ బేడీని పదవి నుంచి తీసేయండి
పుదుచ్చేరి: లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీని పదవి నుంచి తొలగించాలని పుదుచ్చేరి ముఖ్యమంత్రి నారాయణస్వామి, ఎమ్మెల్యేలు శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. అధికారిక సమాచారం కోసం సోషల్ మీడియా వాడటాన్ని నిషేధిస్తూ సీఎం నారాయణ స్వామి తీసుకున్న నిర్ణయాన్ని లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ రద్దు చేయడంతో ఇరువర్గాల మధ్య వివాదం రాజుకుంది. అధికారిక సమాచారం కోసం వాట్రాప్ వాడుకోవాలంటూ ఇటీవలే కిరణ్ బేడీ అధికారులకు సూచించారు. అనంతరం సోషల్ మీడియా ద్వారా సమాచారం పంపడాన్ని రద్దు చేస్తూ సీఎం నిర్ణయం తీసుకున్నారు. -
ముఖ్యమంత్రికి షాకిచ్చిన కిరణ్ బేడి
-
పుదుచ్చేరిలో బేడీ వర్సెస్ స్వామి
పుదుచ్చేరి/న్యూఢిల్లీ: పుదుచ్చేరిలో సోషల్ మీడియా వాడకంపై అధికార కాంగ్రెస్ ప్రభుత్వం, లెఫ్టినెంట్ గవర్నర్ల మధ్య వివాదం మరింత ముదిరింది. అధికారిక సమాచారం కోసం సోషల్ మీడియా వాడటాన్ని నిషేధిస్తూ సీఎం నారాయణ స్వామి తీసుకున్న నిర్ణయాన్ని లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ రద్దు చేశారు. కొద్ది రోజులుగా ఢిల్లీలోనే ఉంటున్న బేడీ.. తన ఆదేశాల కాపీని గురువారం ట్వీటర్లో పోస్ట్ చేశారు. ప్రభుత్వ ఉత్తర్వులు చెల్లవని, మార్గదర్శకాలకు అవి విరుద్ధంగా ఉన్నాయన్నారు. అభివృద్ధి దిశగా పుదుచ్చేరి పయనించాలంటే సమాచార రంగంలో తిరోగమనం సరికాదని, అందువల్లే ప్రభుత్వ ఉత్తర్వులు రద్దు చేస్తున్నట్లు చెప్పారు. అధికారిక సమాచారం కోసం వా ట్సప్ వాడుకోవాలంటూ ఇటీవలే బేడీ అధికారులకు సూచించారు. అనంతరం సోషల్ మీడియా ద్వారా సమాచారం పంపడాన్ని రద్దు చేస్తూ సీఎం నిర్ణయం తీసుకున్నారు. -
ముఖ్యమంత్రికి షాకిచ్చిన కిరణ్ బేడి
పుదుచ్చేరి: ఢిల్లీలో మొన్నటివరకు మాజీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్- సీఎం అరవింద్ కేజ్రీవాల్ మధ్య బాహాటంగా ఘర్షణ తలెత్తిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే తరహా పరిస్థితి మరో కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో పునరావృతం అవుతుందా? అంటే పరిస్థితులు ఔననే సంకేతాలు ఇస్తున్నాయి. పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడి ఆ ప్రాంత ముఖ్యమంత్రి వీ నారాయణస్వామికి తాజ్ షాక్ ఇచ్చారు. ఆయన జారీచేసిన ఆదేశాలను రద్దు చేశారు. అధికారిక కార్యకలాపాల కోసం సోషల్ మీడియాను వినియోగించకుండా నిషేధం విధిస్తూ సీఎం నారాయణస్వామి ఆదేశాలు జారీచేయగా.. ఆ ఆదేశాలు చెల్లవంటూ కిరణ్ బేడీ స్పష్టం చేశారు. సీఎం నారాయణస్వామిది కాంగ్రెస్ పార్టీ కాగా.. బీజేపీ కిరణ్బేడిని లెఫ్టినెంట్ గవర్నర్గా నామినేట్ చేసిన సంగతి తెలిసిందే. -
వాట్సాప్ రచ్చ
► కిరణ్బేడీపై వ్యతిరేకత ► శివకుమార్కు మద్దతు ► పొరబాటు జరిగినట్టు వివరణ వాట్సాప్లో అశ్లీల వీడియో వ్యవహారం పుదుచ్చేరిలో రచ్చకెక్కింది. తమతో సంప్రదింపులు జరపకుండా పుదుచ్చేరి సివిల్ సర్వీసు అధికారిపై గవర్నర్ చర్యలు తీసుకోవడాన్ని మంత్రులు వ్యతిరేకించే పనిలో పడ్డారు. పొరబాటున ఆ మెసేజ్ వెళ్లిందే గానీ, పని గట్టుకుని గవర్నర్కు పంపించ లేదంటూ శివకుమార్కు మద్దతుగా గళం విప్పే వారి సంఖ్య పెరిగింది. సాక్షి, చెన్నై: పుదుచ్చేరి ప్రగతి లక్ష్యంగా లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ తన అధికారాల మేరకు సరికొత్త సంస్కరణల బాటలో పయనిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా అధికారుల్ని ఏకం చేస్తూ వాట్సాప్ గ్రూప్ను రూపొందించారు. సహకార సంఘా ల రిజిస్ట్రార్ శివకుమార్ నెంబరు నుంచి ఆ గ్రూప్లోకి వెళ్లిన ఓ మెసేజ్ పెద్ద దుమారాన్నే రేపింది. అందులో అశ్లీల వీడియోలు ఉండడంతో గవర్నర్ ఆగ్రహానికి శివకుమార్ గురి కావాల్సి వచ్చింది. ఆయన్ను సీనియర్ ఎస్పీ రాజీవ్ రంజన్ అదుపులోకి తీసుకుని విచారిస్తున్న సమాచారంతో పుదుచ్చేరి కాంగ్రెస్ ప్రభుత్వంలోని మంత్రుల్లో ఆగ్రహం రేగింది. వాట్సాప్ రచ్చ: తమతో సంప్రదింపులు జరపకుండా, ఎలాంటి సమాచారం ఇవ్వకుండా శివకుమార్ను అదుపులోకి తీసుకున్న సీనియర్ ఎస్పీపై మంత్రులు నమశ్శివాయం, షాజహాన్, కందస్వామి నేతృత్వంలో పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు శివాలెత్తి ఉన్నారు. పుదుచ్చేరి సివిల్ సర్వీసు పరీక్షల ద్వారా ఉన్నత పదవిలో ఉన్న అధికారిపై చర్యలు తీసుకోవాలంటే, ప్రభుత్వంతో సంప్రదింపులు జరపాల్సిన అవసరం ఉందని, అయితే, ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఎలా అదుపులోకి తీసుకుంటారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ, శివకుమార్ను తమ వెంట తీసుకెళ్లి ఉన్నారు. ఈ సమాచారంతో రాజ్భవన్ వర్గాలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేయడంతో వివాదం ముదిరింది. శివకుమార్పై ఆగమేఘాలపై కేసు నమోదు కావడంతో గవర్నర్ తీరుపై మంత్రులు శివాలెత్తే పనిలో పడ్డారు. ఇన్నాళ్లు పుదుచ్చేరిలో గవర్నర్, ప్రభుత్వానికి మధ్య సాగుతున్న అంతర్యుద్ధం తాజా రచ్చతో తెర మీదకు వచ్చినట్టు అయింది. గవర్నర్ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తే పనిలో పడ్డారు. పొరబాటు: బాధ్యత గల పదవిలో ఉన్న ఉన్నతాధికారి పనిగట్టుకుని గవర్నర్కు మెసేజ్ పంపించేందుకు ఆస్కారం లేదన్న విషయాన్ని పరిగణించాలని శివకుమార్కు మద్దతుగా గళం విప్పే వాళ్లు పుదుచ్చేరిలో ఉండడం గమనార్హం. ఓ అధికారి ఈ విషయంపై మాట్లాడుతూ శివకుమార్ రాత్రి భోజనం చేస్తున్న సమయంలో వాట్సాప్కు వచ్చిన ఓ మెసేజ్ను చూసి, తక్షణం తన ఎడమ చేతితో డిలీట్ చేయడానికి ప్రయత్నించారని, అది కాస్త పొరబాటున గ్రూప్కు ఫార్వార్డ్ కావడంతోనే ఈ వివాదం తలెత్తినట్టుగా పేర్కొన్నారు. జరిగిన పొరబాటును భూతద్దంలో పెట్టి మరీ రచ్చకెక్కడం శోచనీయమంటూ గవర్నర్ తీరును దుయ్యబట్టే పనిలో పడ్డారు. లెఫ్టినెంట్ గవర్నర్ను వెనక్కు తీసుకోవాలని కేంద్రాన్ని డిమాండ్ చేసే పనిలో మంత్రులు నిమగ్నమయ్యారు. అధికారాల మేరకే: తాజా రచ్చ వ్యవహారంపై సీఎం నారాయణ స్వామి స్పందిస్తూ తమ మంత్రులు ఎవ్వరూ సీనియర్ ఎస్పీతో దురుసుగా ప్రవర్తించలేదన్నారు. హఠాత్తుగా ఓ అధికారిని అదుపులోకి తీసుకుని ఉన్నట్టుగా వచ్చిన సమాచారంతో తమ మంత్రులు అక్కడికి వెళ్లారేగానీ, గవర్నర్కు వ్యతిరేకంగా వ్యవహరించాలన్న ఉద్దేశంతో మాత్రం కాదన్నారు. గవర్నర్ తన అధికారాల మేరకు పనిచేస్తున్నారని, ఇక, తాము తమకున్న అధికారాల మేరకు పనిచేస్తున్నామంటూ డొంక తిరుగుడు సమాధానం ఇచ్చారు. దీన్ని బట్టి చూస్తే పుదుచ్చేరిలో గవర్నర్, ప్రభుత్వానికి మధ్య సఖ్యత ఏ పాటిదో స్పష్టం అవుతోంది. -
కిరణ్బేడీకి అశ్లీల వీడియో పంపిన అధికారి
సాక్షి ప్రతినిధి, చెన్నై: పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్(ఎల్జీ) కిరణ్బేడీకి వాట్సాప్లో అశ్లీల వీడియో పంపించాడనే ఆరోపణలతో శివకుమార్ అనే ప్రభుత్వాధికారిపై సస్పెన్షన్ వేటు పడింది. ప్రజా సమస్యలను వెనువెంటనే పరిష్కరించేందుకు అన్ని శాఖల అధికారులతో కిరణ్బేడీ ఓ వాట్సాప్ గ్రూప్ను ఏర్పాటు చేశారు. దాని ద్వారానే అన్ని శాఖల అధికారులకు ఆమె ఆదేశాలు జారీ చేస్తుంటారు. ఈ నేపథ్యంలో శుక్రవారం అర్ధరాత్రి సహకార సంఘాల రిజిస్ట్రార్ పేరుతో ఈ గ్రూపునకు మూడు ఫోల్డర్లలో ఓ వీడియో వచ్చింది. అయితే ఈ వీడియోలను చూసిన కిరణ్ బేడీ సహా అధికారులంతా బిత్తరపోయారు. అందులో 30కి పైగా అసభ్య మెసేజ్లు, వీడియోలు ఉన్నాయి. దీంతో వీటిని పంపిన అధికారిపై వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని సీఎస్ మనోజ్ ప్రీతాను ఆమె ఆదేశించారు. దీనిపై సీనియర్ ఎస్పీ రాజీవ్రంజన్ విచారణ జరిపి శనివారం తెల్లవారుజామున రిజిస్ట్రార్ శివకుమార్ను అదుపులోకి తీసుకున్నారు. -
లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్బేడి అసంతృప్తి
-
కొత్త సీఎం వచ్చినా దూకుడు తగ్గించని గవర్నర్
చెన్నై: పారిశుధ్యంపై పోరు కోసం రాజీనామా చేయడానికి కూడా వెనుకాడనని పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్బేడీ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్గా మారాయి. ఇంతకీ పుదుచ్చేరిలో ఆమెకు ఎదురవుతున్న కష్టాలు ఏమిటో అన్న అంశంపై దృష్టి పెట్టే వాళ్లు అధికమయ్యారు. అక్కడి కాంగ్రెస్ పాలకులు, గవర్నర్ కిరణ్బేడీ మధ్య సాగుతున్న అంతర్యుద్ధంలో ఉద్యోగులు నలిగి పోతున్నట్టుగా సంకేతాలు వెలువడుతున్నాయి. పుదుచ్చేరిలో కాంగ్రెస్, డీఎంకే కూటమి ఎన్నికల్లో విజయ ఢంకా మోగించగానే, కొత్త ప్రభుత్వానికి పక్కలో బల్లెం అన్నట్టుగా లెఫ్టినెంట్ గవర్నర్గా కిరణ్బేడీని కేంద్రం నియమించింది. కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు ముందే పగ్గాలు చేపట్టిన కిరణ్బేడీ తన దూకుడును పెంచారు. సంస్కరణలు, కొత్త విధానాలు అంటూ పుదుచ్చేరి సమగ్రాభివృద్ధి లక్ష్యంగా, అక్కడి ప్రజల మనసు చూరగొనే రీతిలో దూసుకెళ్లారు. అదే సమయంలో లెఫ్టినెంట్ గవర్నర్తో సరితూగే విధంగా సీఎం అభ్యర్థిగా నారాయణస్వామిని కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించింది. ఢిల్లీ స్థాయిలో చక్రం తిప్పడమే కాకుండా, రాజకీయ అనుభవం, ఆంగ్లం అనర్గళంగా మాట్లాడగలిగే నారాయణ స్వామి నేతృత్వంలోని కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక తన దూకుడును కిరణ్ బేడీ తగ్గించ లేదు. ఈ సమయంలో సీఎం, లెఫ్టినెంట్ గవర్నర్ల మధ్య విభేదాలు సాగుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. అయితే వాటిని సీఎం, గవర్నర్ ఇద్దరూ ఖండించిన సందర్భాలు అనేకం ఉన్నాయి. పుదుచ్చేరి ప్రగతి కోసం తామిద్దరం శ్రమిస్తున్నామని వారు స్పష్టం చేశారు. కాగా కొత్త ప్రభుత్వ పాలకులు తమ రాజకీయాన్ని ప్రదర్శించే పనిలో పడ్డట్టుంది. కిరణ్ బేడీ సంస్కరణలకు చెక్ పెట్టే రీతిలో సీఎం చాప కింద నీరులా వ్యవహరిస్తున్నట్టు సమాచారం. అందుకే పారిశుధ్య కార్మికుల ద్వారానే కిరణ్బేడీకి వ్యతిరేకంగా నిరసనలు సాగించేందుకు తగ్గట్టుగా వ్యూహ రచన చేసినట్టు తెలిసింది. ఆదివారం తమకు సెలవు కావాలంటూ కార్మికులు గళం విప్పారు. దీంతో గవర్నర్ ఆదేశాలు రాజ్భవన్ వరకే పరిమితం చేయాలని, తాము ఆదేశించే వాటినే అమలు చేయాలన్నట్టుగా ప్రభుత్వ సిబ్బందికి ఆదేశాలు సైతం వెళ్లినట్లు సమాచారం. ఈ సీఎం నారాయణ స్వామి, గవర్నర్ కిరణ్ బేడీ మధ్య ఉద్యోగులు, కార్మికులు నలిగి పోతున్నట్టుగా ప్రచారం సాగుతోంది. పాలకులు చెప్పింది వినాలో, గవర్నర్ ఆదేశాలను అనుసరించాలో అన్న సందిగ్ధంలో వారు ఉన్నారు. పైకి తమ మధ్య విభేదాలు లేవన్నట్టుగా ఆ ఇద్దరూ చెప్పుకుంటున్నా, లోలోపల పాలనా పరంగా ఉన్న హక్కులపై అంతర్యుద్ధమే సాగుతున్నట్టు పుదుచ్చేరిలో చర్చ సాగుతుంది. ఈ చర్చ నేపథ్యంలో ఉద్యోగులతో జరిగిన సమాలోచనలో కిరణ్ తీవ్రంగా స్పందించారు. పై స్థాయి అధికారులు ఇతర ప్రాంతాలకు చెందిన వారైనా, కింది స్థాయిలో అమలు చేసే వాళ్లంతా స్థానికులు కావడం లెఫ్టినెంట్ గవర్నర్ ఆదేశాల బేఖాతరు చేస్తున్నట్టు సమాచారం. ఈ పరిస్థితుల్లో ఇక్కడ సాగుతున్న వ్యవహారాలు, తాజా పరిస్థితుల నేపథ్యంలోనే అధికారులు, కింది స్థాయి సిబ్బందికి హెచ్చరికలు చేయడంతోపాటుగా, ప్రజల మన్ననల్ని అందుకునే విధంగా రాజీనామా నినాదంతో కిరణ్ వ్యూహాత్మకంగా వ్యవహరించే పనిలో పడ్డట్టుగా పుదుచ్చేరిలో చర్చ హోరెత్తడం గమనార్హం. -
రజనీకాంత్ ప్రజలకు సందేశం ఇస్తే..
పుదుచ్చేరికి బ్రాండ్ అంబాసిడర్గా తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ వ్యవహరించాలని లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ కోరారు. రజనీకాంత్ ప్రజలకు సందేశం ఇస్తే ఆరోగ్యకరమైన పుదుచ్చేరిగా మారుతుందని అన్నారు. ప్రాస్పరస్ పుదుచ్చేరి కార్యక్రమాన్ని ఆమె ఆదివారం ప్రారంభించారు. పుదుచ్చేరికి బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించాలంటూ గతంలో కూడా కిరణ్ బేడీ రజనీకాంత్ను కోరారు. మే 29న పుదుచ్చేరి లెఫ్టినెంగ్ గవర్నర్గా కిరణ్ బేడీ బాధ్యతలు చేపట్టాక ప్రతి శని, ఆదివారాల్లో పలు ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. మున్సిపల్ కార్మికులతో కలసి వ్యర్థపదార్థాలను తొలగించి పరిసరాలను శుభ్రంగా ఉంచేలా చర్యలు చేపడుతున్నారు. ఈ కార్యక్రమంలో ప్రజలు కూడా భాగస్వాములు కావాలని కిరణ్ బేడీ కోరారు. ఇంటి పరిసరాలు, రోడ్లపై చెత్తను తొలగించి శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం పుదుచ్చేరికి అన్నివిధాలా సాయం చేస్తోందని, పుదుచ్చేరి ఇండస్ట్రియల్ కారిడర్గా అభివృద్ధి చెందుతోందని చెప్పారు. -
వీక్లీ ఆఫ్!
సాక్షి, చెన్నై : పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. గస్తీలో ఉండే పోలీసు సిబ్బందికి ఇక వీక్లీఆఫ్ వర్తింప చేస్తూ చర్యలు తీసుకున్నారు. దీంతో పుదుచ్చేరి పోలీసు వర్గాల్లో హర్షం వ్యక్తం అవుతోంది. శాంతి భద్రతల పర్యవేక్షణలో పోలీసుల పాత్ర కీలకం. విమర్శలు, ఆరోపణలు ఉన్నా, పోలీసు యంత్రాంగం అన్నది లేకుంటే, పరిస్థితి ఆగమ్య గోచరమే. పోలీసులకు సెలవులు తక్కువే. నిత్యం విధుల్లో ఉంటూ ప్రజా భద్రతను పర్యవేక్షిస్తున్న పోలీసులకు ప్రప్రథమంగా వారంలో ఓ రోజు సెలవు దొరికిన పక్షంలో ఆనంద తాండవమే. ఓ రోజు సెలవు దొరికితే చాలు, పోలీసుల కుటుంబాల్లోనూ ఆనందం వికసిస్తుంది. సెలవుల కోసం, పనిభారంతో అనేక చోట్ల పోలీసులు సతమతం అవుతూ వస్తుంటే, ప్రప్రథమంగా వీక్లీఆఫ్ ఇవ్వడానికి పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ నిర్ణయించడం ఆహ్వానించదగ్గ విషయమే. వీక్లీ ఆఫ్ : మాజీ ఐపీఎస్ అధికారిణిగా పోలీసుల కష్టాల్ని కిరణ్ బేడీ ప్రత్యక్షంగా తిలకించారన్నది జగమెరిగిన సత్యం. ఐపీఎస్ అధికారిణిగా, రాజకీయ నాయకురాలిగా అవతరించి, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరికి లెఫ్టినెంట్ గవర్నర్గా బాధ్యతల్ని నిర్వర్తిస్తున్న కిరణ్బేడీ ప్రజలు, అధికారుల నుంచి మంచి మార్కుల్నే కొట్టేస్తున్నారు. ప్రజాహితం లక్ష్యంగా పుదుచ్చేరిలో దూసుకెళుతున్న కిరణ్ బేడీ, అందరి మన్ననలు అందుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. తన సంస్కరణలతో అధికార వర్గాల్లో మార్పులు తీసుకొచ్చిన కిరణ్ బేడి , ప్రస్తుతం ప్రజల్లో మమేకం అయ్యే విధంగా కార్యక్రమాలతో ముందుకు సాగుతున్నారు. పుదుచ్చేరిలో శాంతి భద్రతలు ఒకప్పుడు అధ్వానంగా ఉన్నాయి. కిరణ్ రాకతో కొంత మేరకు మెరుగు పడ్డాయని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో పోలీసుల కష్టాల్ని గుర్తించిన ఈ లెఫ్టినెంట్ గవర్నర్ వారంలో ఓ రోజు సెలవు తీసుకునేందుకు తగ్గ చర్యలు తీసుకున్నారు. పోలీసుల సేవల్ని ప్రశంసిస్తూ పుదుచ్చేరిలో శనివారం సాయంత్రం జరిగిన కార్యక్రమంలో గస్తీ సిబ్బందిని ఉద్దేశించి ప్రత్యేకంగా ఆమె కొనియాడారు. డీజీపీ ఆదేశిస్తే, వారంలో ఓ రోజు గస్తీ సిబ్బందికి సెలవులు ఇచ్చేందుకు సిద్ధం అని ప్రకటించారు. గస్తీ సిబ్బంది తమ తమ ప్రాంతాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారని, శాంతి భద్రతల పర్యవేక్షణలో గానీయండి, నేరగాళ్ల కదలికల్ని గుర్తించడంలో గానీ వారి కృషి అభినందనీయమని వ్యాఖ్యలు చేశారు. ఇంతలో వేదిక మీదున్న డీజీపీ సునీల్కుమార్ గస్తీ సిబ్బంది వారంలో ఓరోజు సెలవు ఇచ్చేందుకు సిద్ధం అని, ప్రకటించడంతో అందుకు కిరణ్ బేడి ఆమోదముద్ర వేయడం విశేషం. అయితే, ఈ వీక్లీ ఆఫ్ అన్నది అందరికీ ఒకే సారిగా ఇవ్వలేం అని, కొందరికి ఓ రోజు, మరి కొందరికి మరో రోజు అన్నట్టుగా వంతుల వారీగా కొనసాగిస్తామని డీజీపీ ప్రకటించారు. ఈ వీక్లీఆఫ్ అన్నది గస్తీ సిబ్బందికి మాత్రమేనని, తదుపరి అందరికీ వర్తింపచేయడానికి తగ్గ చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. -
కలెక్టర్ బంఫర్ ఆఫర్.. కానుకగా ‘కబాలి’ టికెట్లు!
సూపర్ స్టార్ రజనీకాంత్కు ఉన్న అభిమానగణం గురించే అందరికీ తెలిసిందే. ఆయన సినిమాలంటే అభిమానులు పడి చస్తారు. దీనిని దృష్టిలో పెట్టుకొని పుదుచ్చేరి కలెక్టర్ తాజాగా అభిమానులకు ఓ ఆఫర్ ఇచ్చారు. స్వచ్ఛభారత్ లాంటి ప్రజాసేవల్లో పాల్గొన్నవారికి రజనీ తాజా సినిమా ‘కబాలి’ టికెట్లు కానుకగా ఇస్తామని ప్రకటించారు. ఊహించినట్టే ఈ ప్రకటనకు అద్భుతమైన ప్రతిస్పందన వచ్చింది. ఈ విషయాన్ని పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడి ట్విట్టర్లో తెలిపారు. ఈ నేపథ్యంలో రజనీకి కిరణ్ బేడి ఓ విజ్ఞప్తి చేశారు. పుదుచ్చేరి అభివృద్ధి కోసం ఆయన ఈ కేంద్రపాలిత ప్రాంతం బ్రాండ్ అంబాసిడర్గా ఉండాలని కోరారు. Request Super Star Rajani to b Brand Ambassador of #prosperouspuducherry to be #OpenDeficationFree #ODF @PMOIndia https://t.co/fbCXLCTKuF — Kiran Bedi (@thekiranbedi) 30 June 2016 -
ఎమ్మెల్యే కాళ్లకు మొక్కిన కిరణ్ బేడి!
పుదుచ్చేరి: ఆమె ఎక్కడున్నా తన ప్రత్యేకత చాటుకుంటారు. తొలి మహిళా ఐపీఎస్ గా ఘనత సాధించిన కిరణ్ బేడి తన ఉద్యోగ జీవితంలోనూ తనదైన ముద్ర వేశారు. తాజాగా పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ గా బాధ్యతలు చేపట్టిన ఈ మాజీ ఐపీఎస్ తన మార్క్ చూపిస్తున్నారు. ఆమెకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. తాను బాధ్యతలు చేపట్టిన సందర్బంగా పుదుచ్చేరి ఎమ్మెల్యేలు ఆమెను మర్యాదపూర్వకంగా కలుసుకుని అభినందనలు తెలిపారు. ఈ సందర్బంగా కాంగ్రెస్ మహిళా ఎమ్మెల్యే విజయవేణి... కిరణ్ బేడికి సాలువా కప్పి పాదాభివందనం చేసింది. ఆమెను లేవదీసి కాళ్లు పట్టుకోవద్దని కిరణ్ బేడి ఉపదేశించారు. ఆత్మగౌరవంతో బతకాలని ఎవరి కాళ్లు పట్టుకోవాల్సిన అవసరం లేదని వివరించారు. అక్కడితో ఆగకుండా మహిళా ఎమ్మెల్యేకు తాను కూడా పాదాభివందనం చేశారు. దీంతో మహిళా ఎమ్మెల్యేతో పాటు అక్కక ఉన్నవారంతా ఒక్కసారిగా అవాక్కయ్యారు. ఈ వీడియో సోషల్ మీడియాలో సంచారం చేస్తోంది. లెఫ్టినెంట్ గవర్నర్ గా బాధ్యతలు చేపట్టిన వెంటనే కిరణ్ బేడి తనదైన శైలి చూపించారు. వీఐపీలు, రాజకీయ నేతల కార్లకు ఎలాంటి సైరన్లు ఉండరాదని ఆదేశాలు జారీ చేశారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్ పాటించాలని, రాజకీయ నేతలకు మినహాయింపు ఇవొద్దని ఆదేశించారు. పుదుచ్చేరిని క్లీన్ సిటీగా మార్చేందుకు అందరూ సహకరించాలని కిరణ్ బేడి పిలుపునిచ్చారు. అక్కడితో ఆగకుండా పారిశుద్ధ్య కార్మికులతో కలిసి నగరంలోని పరిసరాలను పరిశుభ్రం చేశారు. -
పుదుచ్చేరి సీఎంగా నారాయణస్వామి
పుదుచ్చేరి: కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీ మంత్రి వి.నారాయణస్వామి పుదుచ్చేరి పదో సీఎంగా బాధ్యతలు చేపట్టారు. సోమవారం ఇక్కడి గాంధీ థిడాల్లో నారాయణ, మరో ఐదుగురు మంత్రుల చేత లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్బేడీ ప్రమాణం చేయించారు. వీరిలో సీఎం పీఠం కోసం పోటీపడిన నమశ్శివాయమ్, మల్లాది కృష్ణారావు, ఎంఓహెచ్ఎఫ్ షాజహాన్, ఎం.కందసామి, కమలాకన్నన్ ఉన్నారు. యానాం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కృష్ణారావు తెలుగులో ప్రమాణం చేశారు. వీరంతా గతంలో రాష్ట్ర మంత్రులుగా పనిచేసినవారే. 30 మంది సభ్యుల అసెంబ్లీలో 15 మంది సభ్యుల బలం ఉన్న కాంగ్రెస్ శాసనసభా పక్షనేతగా 69 ఏళ్ల నారాయణ గత నెలలో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. -
ఇక కుయ్.. కుయ్.. మోతలు వద్దు
పుదుచ్చేరి: మాజీ ఐపీఎస్ అధికారిణి, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ పాలనలో తన మార్క్ చూపుతున్నారు. రౌడీయిజం చేస్తే తాట తీస్తానంటూ ఇటీవల వార్నింగ్ ఇచ్చిన కిరణ్ బేడీ.. కీలక నిర్ణయం తీసుకున్నారు. వీఐపీల కార్లకు, వారి ఎస్కార్ట్, పైలట్ వాహానాలకు సైరన్లు వాడకంపై నిషేధం విధించారు. లెఫ్టినెంట్ గవర్నర్ సెక్రటరీ దేవా నిధి ఈ మేరకు ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. అంతేగాక వీఐపీల వాహానాలకు ఎలాంటి మినహాయింపు ఇవ్వరాదంటూ ట్రాఫిక్ పోలీసులకు కిరణ్ బేడీ ఆదేశాలు జారీ చేశారు. వీఐపీల కోసం ట్రాఫిక్ను ఆపరాదని, ప్రజలకు అసౌకర్యం కలిగించరాదని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాల్సిందేనని ఆదేశించారు. కాగా వాహానాలకు సైరన్లు వాడకం విషయంలో అంబులెన్స్లు, ఫైర్ సర్వీసులు వంటి అత్యవసర సర్వీసులకు మినహాయింపు ఇచ్చారు. -
పుదుచ్చేరిలో కిరణ్ బేడీ హల్చల్
పుదుచ్చేరి: కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ హల్ చల్ చేశారు. తన సర్వీసులో అసాంఘిక శక్తులు, రౌడీల గుండెల్లో రైళ్లు పరుగెత్తించిన రిటైర్డ్ ఐపీఎస్ అధికారిణి కిరణ్ బేడీ.. లెఫ్టినెంట్ గవర్నర్ హోదాలోనూ అదే మార్క్ చూపుతున్నారు. రౌడీయిజం చేస్తే తాట తీస్తానని, అవినీతి పరుల అంతం చూస్తానంటూ వార్నింగ్ ఇచ్చారు. పుదుచ్చేరి మంత్రులు, అధికారులు ట్రాఫిక్ రూల్స్ పాటించాల్సిందేనని కిరణ్ బేడీ స్పష్టం చేశారు. పుదుచ్చేరిలో ఆక్రమణలను వారంలోగా తొలగిస్తామని చెప్పారు. ప్రజల నుంచి ఫిర్యాదుల కోసం 1031 హెల్ప్ లైన్ నెంబర్ ఏర్పాటు చేశారు. కిరణ్ బేడీ తీరు, వ్యాఖ్యలు రాజకీయంగా కలకలం రేపుతున్నాయి. ఇటీవల పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్గా కిరణ్ బేడీ బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. -
కాంగ్రెస్కు పక్కలో బల్లెం!
కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో అధికార పగ్గాలు చేపట్టనున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి మున్ముందు సంకట పరిస్థితులు ఎదురుకానున్నాయి. ఇందుకు కారణం పక్కలో బల్లెంలా ఆ రాష్ట్రానికి లెఫ్టినెంట్ గవర్నర్గా కిరణ్బేడి నియమితులు కావడమే. డైనమిక్ లేడీగా పేరెన్నికగన్న కిరణ్ బేడీని పుదుచ్చేరికి పంపుతూ కేంద్రం ఆదివారం నిర్ణయం తీసుకోవడం గమనార్హం. చెన్నై: కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో లెఫ్టినెంట్ గవర్నర్కు అధికారాలు ఎక్కువ. ప్రభుత్వం తరఫున ఏ పథకం తీసుకురావాలన్నా, అధికార బదిలీల్లోగానీ, నిధుల విడుదల్లో గానీ, అన్ని రకాల వ్యవహారాల్లో గవర్నర్ సంతకం, అనుమతి తప్పని సరి. ఈ అనుమతుల వ్యవహారంలో ఇది వరకు పుదుచ్చేరిలో అధికారంలో ఉన్న ఎన్ఆర్ కాంగ్రెస్ సర్కారు లెఫ్టినెంట్ గవర్నర్తో ఢీకొట్టే స్థాయికి వెళ్లింది. లోక్సభ ఎన్నికల్లో ఎన్డీఏతో కలిసి ఎన్ఆర్ కాంగ్రెస్ పయనించడంతో, లెఫ్టినెంట్ గవర్నర్గా ఉన్న వీరేంద్ర కఠారియాను మార్పించుకుంది. తదుపరి అండమాన్ గవర్నర్ ఏకే సింగ్కు అదనపు పగ్గాల్ని కేంద్రం అప్పగించింది. రెండేళ్లుగా ఏకే సింగ్ నెలలో రెండు మూడు రోజులు మాత్రమే పుదుచ్చేరిలో అడుగు పెట్టేవారు. దీంతో ఎన్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వానికి అనుకూలంగా పరిస్థితులు మారాయి. తాజాగా జరిగిన ఎన్నికల్లో ఎన్ఆర్ కాంగ్రెస్ పతనమైంది. కాంగ్రెస్-డీఎంకే నేతృత్వంలోని కూటమి మెజారిటీ దక్కించుకుని అధికార పగ్గాలు చేపట్టేందుకు సిద్ధమైంది. ఈ పరిస్థితుల్లో కొత్త ప్రభుత్వానికి పక్కలో బల్లెంగా కొత్త గవర్నర్ నియమించ బడుతుండడం చర్చనీయాంశంగా మారింది. అది కూడా డైనమిక్ లేడీగా పేరు గడించిన, మాజీ ఐపీఎస్ అధికారిణి కిరణ్ బేడీని నియమించడంతో కొత్త ప్రభుత్వానికి ఇక రోజూ సంకట పరిస్థితులే. లెఫ్టినెంట్ గవర్నర్గా కిరణ్బేడీ అధికార పగ్గాలు చేపట్టేందుకు కాంగ్రెస్ సన్నద్ధం అవుతోన్నది. ఆ పార్టీ తరఫున సీఎం అభ్యర్థి ఎవరన్నది ఇంకా తేలాల్సి ఉంది. ఈ పరిస్థితుల్లో కొత్తగా ఏర్పడనున్న ప్రభుత్వానికి ఇక, అధికారాలు కరువైనట్టే అన్న ప్రశ్న ఆదివారం బయలు దేరింది. ఇందుకు కారణం, మాజీ ఐపీఎస్ అధికారి కిరణ్ భేడి పూర్తి స్థాయిలో పుదుచ్చేరికి లెఫ్టినెంట్ గవర్నర్గా నియమితులు కావడమే. ఇక్కడ ప్రభుత్వం ఉన్నా, సంతకాలు, అనుమతుల కోసం గవర్నర్ ఎదుట నిలబడాల్సిందే. ఈ దృష్ట్యా, కేంద్రంలోని బీజేపీ సర్కారు వ్యూహాత్మకంగా వ్యవహరించి కిరణ్బేడీని ఇక్కడకు పంపించేందుకు నిర్ణయించినట్టు స్పష్టం అవుతోంది. కాంగ్రెస్ సర్కారుకు మున్ముందు ఇరకాటంలో పెట్టడానికే అన్నది జగమెరిగిన సత్యం. విధి నిర్వహణలో నిక్కచ్చితనం, నిజాయితీ ఆమె నైజం అన్న విషయం తెలిసిందే. అయితే, తనకు పదవి దక్కడంపై స్పందించిన కిరణ్ భేడి ప్రజా సేవకు తాను అంకితం అని ఆమె పేర్కొన్నారు. -
పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్గా బేడీ
న్యూఢిల్లీ: పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్గా బీజేపీ నాయకురాలు, మాజీ ఐపీఎస్ అధికారిణి కిరణ్ బేడీ నియమితులయ్యారు. ఈమేరకు ఆదివారం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఉత్తర్వులు జారీ చేశారు. బేడీ గతంలో ఢిల్లీ పోలీసు శాఖలో పనిచేశారు. రిటైరైన తర్వాత సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారేతో కలసి ప్రజా ఉద్యమాల్లో పాల్గొన్నారు. ఏడాది క్రితం జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీలో చేరారు. బీజేపీ సీఎం అభ్యర్థిగా ఎన్నికల బరిలో దిగి ఘోరంగా ఓడారు. కృష్ణానగర్ నుంచి పోటీచేసి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ చేతిలో ఓటమి పాలయ్యారు. తర్వాత క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఎట్టకేలకు బీజే పీ ప్రభుత్వం ఆమెకు లెఫ్టినెంట్ గవర్నర్ పదవిని కట్టబెట్టింది. ఎల్జీగా నియమితులైన బేడీకి కేజ్రీవాల్ అభినందనలు తెలిపారు. తాజాగా పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల్లో 30 సీట్లకు గాను కాంగ్రెస్ డీఎంకే కూటమి 17 సీట్లను గెల్చుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. -
పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్గా బేడీ
న్యూఢిల్లీ: పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్గా బీజేపీ నాయకురాలు, మాజీ ఐపీఎస్ అధికారిణి కిరణ్ బేడీ నియమితులయ్యారు. ఈమేరకు ఆదివారం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఉత్తర్వులు జారీ చేశారు. బేడీ గతంలో ఢిల్లీ పోలీసు శాఖలో పనిచేశారు. రిటైరైన తర్వాత సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారేతో కలసి ప్రజా ఉద్యమాల్లో పాల్గొన్నారు. ఏడాది క్రితం జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీలో చేరారు. బీజేపీ సీఎం అభ్యర్థిగా ఎన్నికల బరిలో దిగి ఘోరంగా ఓడారు. కృష్ణానగర్ నుంచి పోటీచేసి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ చేతిలో ఓటమి పాలయ్యారు. తర్వాత క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఎట్టకేలకు బీజే పీ ప్రభుత్వం ఆమెకు లెఫ్టినెంట్ గవర్నర్ పదవిని కట్టబెట్టింది. ఎల్జీగా నియమితులైన బేడీకి కేజ్రీవాల్ అభినందనలు తెలిపారు. తాజాగా పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల్లో 30 సీట్లకు గాను కాంగ్రెస్ డీఎంకే కూటమి 17 సీట్లను గెల్చుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. -
కిరణ్ బేడీ భర్త కన్నుమూత
న్యూఢిల్లీ: తొలి ఐపీఎస్ అధికారిణి కిరణ్ బేడీ భర్త బ్రిజ్ బేడీ(76) ఆదివారం గుర్గావ్లో గుండెపోటుతో మరణించారు. బ్లాడర్లో క్యాన్సర్, కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న ఆయన గత 5 నెలలుగా అమృత్సర్, ఢిల్లీలలో చికిత్స పొందుతున్నారని కిరణ్ బేడీ వెల్లడించారు. అమృత్సర్లోని ఫోర్టిస్-ఎస్కార్ట్స్లో చికిత్స పొందుతున్న ఆయన్ను గత నెల 28న ఇక్కడి మేదాంత-మెడిసిటీ ఆసుపత్రికి తీసుకొచ్చి చికిత్సచేస్తుండగా శనివారం ఉదయం 11గంటల సమయంలో ఆయనకు గుండెపోటు వచ్చింది. పంజాబ్లో మత్తుపదార్ధాలకు బానిసలైన వారి బాగుకోసం, వారి పిల్లల విద్యాభ్యాసం కోసం ఆయన ఎంతగానో కృషిచేశారు. ఆయనకు అమృత్సర్ అంటే మహా ప్రాణం. అక్కడ పాఠశాలను ప్రారంభించి 600 మందికి విద్యనందిస్తున్నారు’ అని కిరణ్ బేడీ ట్వీట్ చేశారు. -
నేను కిరణ్ పెషావారియా
ఆడపిల్లలు నడుముకు వడ్డాణం వెతుక్కుంటున్న రోజుల్లో ఆమె బెల్ట్ కట్టుకుంది. పాదాలకు పట్టీలతో మురిసిపోతున్నప్పుడు ఆమె పోలీసు బూట్లు తొడుక్కుంది. లావణ్యమైన చేతులు కరుకైన లాఠీని ఝళిపించాయి. అందమైన కళ్లు నేరస్తులపై నిప్పులు చిమ్మించాయి. మీసాలు అక్కర్లేదు.భారతదేశ స్త్రీకి ఉండే దమ్ము ఏమిటో ఆమే చూపింది. అవును ఆమే కిరణ్ బేడీ. అమృత్సర్ స్వర్ణాలయ శిఖరంపై విరిసిన వెలుగు కిరణం.ఖాకీ దుస్తులు నేర్చిన కొత్త సంస్కారం. విధి నిర్వహణకి కొండగుర్తు. నిబద్ధతకు దిక్సూచీ. ఈ రోజుల్లో ఆడవాళ్లు పెళ్లి తర్వాత ఇంటిపేరును మార్చుకోవడాన్ని ఇష్టపడట్లేదు. కిరణ్ పెషావారియాగా ఉన్న మీరు కిరణ్ బేడీగా మారడం ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు నేను కిరణ్ పెషావారియానే. పెషావారియా అనే సంతకం పెడతాను. నా తాజాపుస్తకంలో కూడా అదే సంతకం ఉంది. మధ్యలో కొద్దికాలం మాత్రమే నా పుట్టింటిపేరు మిస్సయిపోయింది. మహిళలు వారి గుర్తింపును ఎప్పటికీ వదులుకోకూడదు. మీరు దైవాన్ని, విధిని నమ్ముతారా? నేను మంచి కర్మని, మంచి ఉద్దేశాన్ని, ఎక్కువమందికి మేలు చేయడాన్ని నమ్ముతాను. ఒక మహత్తర ప్రయాణం ఢిల్లీ ఎన్నికలతో ఆగిపోయిందనుకుంటున్నారా? ఇకపై మీ ప్రణాళిక ఏంటి? నేను రాజకీయ జగత్తుకు చెందిన దాన్ని ఎప్పుడూ కాదు. ఎలక్షన్లలో పోరాడటానికి కారణం నేను చేయాలనుకున్న సామాజిక సేవా పరిధిని విస్తరించుకోవడానికి మాత్రమే. ముందూ అదే చేశాను. ఇప్పుడూ అదే చేస్తున్నాను. ఇకముందూ అదే చేస్తాను. ఈ ప్రయాణానికి బ్రేక్ ఉండదు. ఎలక్షన్ కేవలం అదనపు ప్రక్రియ మాత్రమే. మీ భర్త బ్రిజ్ మీ ఓటమితో బాధపడుతున్నారా? లేదు. అస్సల్లేదు. నా విషయాల్లో తనెప్పుడూ జోక్యం చేసుకోలేదు. నా ప్రతి నిర్ణయాన్నీ గౌరవించారు. మీ అమ్మాయి సైనాకి వాళ్ల అమ్మ సమయం ఇప్పుడయినా దొరుకుతుందా? సైనా ఇప్పుడు ఎనిమిదేళ్ల బిడ్డకు తల్లి. చాలా బిజీగా ఉంటుంది.ఇప్పుడు తనే వాళ్ల అమ్మకు సమయం ఇవ్వాలి. మీరు చూసిన పురుషాధిక్యత ఇప్పుడు లేనట్లనిపిస్తోందా? పరివర్తన వచ్చిందంటారా? ఇది ఒక పురుష ప్రపంచం అని నేనెప్పుడూ అనుకోలేదు. కానీ, కీలక నిర్ణయం తీసుకునే అధికారం ఇంకా పురుషుల గుప్పిట్లోనే ఉంది. పురుషుల గుప్పిట నుండి మహిళల చేతుల్లోకి కండబలం, ధనబలం, ఎక్కడికైనా వెళ్లగలిగే స్వేచ్ఛ... అనే మూడు శక్తులు ఇప్పటికీ రాలేదు. ఎలాంటి ఆహారాన్ని ఇష్టపడతారు? సాత్వికమైన ఆహారాన్నే తింటాను. కేలరీస్ విషయంలో జాగ్రత్తగా ఉంటాను. పోషకాలే కాదు, విలువలున్న ఆహారాన్నే ఇష్టపడతాను.మీ భర్తకు రోజుకు ఐదు ప్రేమ లేఖలు రాసేవారు. ఆ ప్రేమ ఇంకా అలాగే ఉందా? వయసు పెరిగితే కుదురు కూడా పెరుగుతుంది కదా! సాక్షి పాఠకులకు ఏం చెప్పాలనుకుంటున్నారు? మళ్లీ కలుద్దాం..! ప్రకాశ్లాల్ పెషావారియా, ప్రేమ్లతల నలుగురు కూతుళ్లలో ఒక కూతురు కిరణ్. తండ్రి ఆమెను గొప్ప టెన్నిస్ క్రీడాకారిణి చేయాలనుకున్నాడు. అఖిల భారత అంతర్ విశ్వవిద్యాలయాల టెన్నిస్ టైటిల్ను కిరణ్ బేడీ ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో, ఆంధ్రా యూనివర్సిటీలోనే గెలుచుకున్నారు. (1968) జాతీయ స్థాయి ఆసియా స్థాయి పోటీలలో కిరణ్ 22 ఏళ్ల వయసుకు ఆ ఆటలో చాంపియన్ షిప్ సాధించినా ఇంతటితోనే ఆగిపోవడంలో విశేషం ఏమీ లేదనుకుంది. ఒక మహిళగా దేశ మహిళలకు ఆదర్శం కావాలి... ఒక యువతిగా దేశ యువతకు స్ఫూర్తినివ్వాలి... అవే ఆలోచనలు. ఐ.ఏ.ఎస్ నుంచి.... దేశ సేవ చేయాలంటే ఏం చేయాలి? ఐఏఎస్ ఒక ఉన్నతమార్గం. ఇంగ్లిష్ సాహిత్యంతో బీఏ చేసి, తరువాత ఎంఏ రాజనీతి శాస్త్రం చదివి తను పుట్టి పెరిగిన అమృత్సర్నే కళాశాలలో అధ్యాపకురాలిగా పని చేస్తున్న కిరణ్ తన దృష్టినంతా సివిల్ సర్వీసెస్ మీదే పెట్టారు. ఢిల్లీ వెళ్లి కోచింగ్ తీసుకున్నారు. పరీక్షలు రాస్తే ఫలితాలు వచ్చాయి. ఆమె వెంటనే తన కళాశాలలో పని చేసే తోటి అధ్యాపకుడైన బ్రిజ్ బేడీకి ఫోన్ చేసి తన పేరు ఐఏఎస్ల జాబితాలో లేదని, ఐపీఎస్ వచ్చిందని కన్నీళ్ల పర్యంతం అయ్యారు. రాని దాని కోసం బాధపడకుండా వచ్చినదానిలోనే ఎందుకు విజయం సాధించకూడదు అంటూ బ్రిజ్ ఆమెను సాంత్వన పరిచారు. కానీ కిరణ్ తల్లిదండ్రులు మహిళలకు స్థానంలేని పోలీస్ శాఖలో కూతురు చేరడానికి ఇష్టపడలేదు. అయినా బ్రిజ్ ప్రోద్బలంతో పోలీస్ శాఖలో చేరాలని నిర్ణయించుకున్నారు. ఆ తర్వాత ఆమె బ్రిజ్నే వివాహం చేసుకున్నారు. అలా కిరణ్ పెషావారియా కిరణ్ బేడీ అయ్యారు. పెళ్లయిన రెండు మాసాలకే ట్రైనింగ్లో చేరాలని కిరణ్కి ఆదేశాలు వచ్చాయి. మొదటి పోస్టింగ్ ఢిల్లీలో. అప్పటికి బ్రిజ్ అమృత్సర్లో ఒక పరిశ్రమను స్థాపించుకున్నాడు. భార్యను ఆపలేదు. 520 కిలోమీటర్ల దూరంలో ఉన్నా ఢిల్లీకి ప్రతి వారాంతంలో వెళుతూ ఉండేవారు. ప్రతి బాధ్యత ఒక సవాలు 1972లో పోలీస్ సర్వీస్లో చేరిన నాటి నుంచి 2007లో ‘వ్యక్తిగత కారణాల’తో ఉద్యోగానికి రాజీనామా చేసే వరకు కిరణ్ నిత్యం సంఘర్షణ పడ్డారు. కానీ రాజీ పడలేదు. తలొంచలేదు. ఆమె సామర్థ్యం ఎంత విశిష్టమైనదంటే విధి నిర్వహణలో ఎంత దూకుడుగా ఉన్నా ఏదో ప్రాధాన్యంలేని పోస్టుకు బదలీ చేసి, ఖాళీగా ఉంచడానికి ప్రభుత్వాలు సాహసించలేదు. ఢిల్లీ ట్రాఫిక్ కమిషనర్, మిజోరం డిప్యూటీ పోలీస్ ఇన్స్పెక్టర్ జనరల్, చండీగఢ్ లెఫ్టినెంట్ గవర్నర్, నార్కోటిక్స్ (మత్తు పదార్థాలు) కంట్రోల్ బ్యూరో డెరైక్టర్ జనరల్, ఐక్య రాజ్యసమితి శాంతి స్థాపక శాఖకు పోలీస్ సలహాదారు వంటి పదవులను ఆమె నిర్వహించారు. ఆసియాలోనే అతి పెద్ద కారాగారం తిహార్ జైలు అధిపతిగా కూడా కిరణ్ను పంపించారు. అరాచకానికీ, అకృత్యాలకీ కేంద్రంగా పేరు మోసిన ఆ జైలును ‘ఆరు మాసాలలో ప్రశాంతమైన నిలయంగా మారుస్తాను’ అని ఆమె ప్రతిన పూని, దానిని నెరవేర్చారు. అడుగడుగునా సంచలనాలు... కిరణ్ బేడీ ఉద్యోగ జీవితంలో చవి చూసిన అనుభవాలు అసాధారణం. ఇవన్నీ ఆమె సంచలనం కోసం చేయలేదు. విధి నిర్వహణలో భాగంగానే చేశారని మరచిపోకూడదు. ఢిల్లీలో ఇందిర కారును పక్కకు లాగించి అందరి కన్నెర్రకు గురైన కిరణ్, గోవాలో కూడా ఇందిర కారణంగానే వివాదంలో చిక్కుకున్నారు. 1983 మార్చిలో కిరణ్ గోవాలో పదవీ బాధ్యతలు స్వీకరించారు. అక్కడ జౌరీ నదిలో పడవల మీద అవతలి ఒడ్డుకు చేరేవారు. ఆ రద్దీని తట్టుకోవడానికే వంతెన కట్టారు. కానీ అది ప్రారంభోత్సవానికి నోచుకోలేదు. ఇందిరాగాంధీ రావాలి. కానీ ఆమె రాక వాయిదా పడుతూనే వచ్చింది. ఒకరోజు కిరణ్ అటుగా పోతూ ఈ రద్దీని చూసి విషయం తెలుసుకుని ప్రారంభోత్సవం వరకు రాకపోకలు జరగకుండా ఏర్పాటు చేసిన బ్యారికేడ్లను స్వయంగా పక్కకు తప్పించి వాహనాలు, మనుషుల రాకపోకలకు అవకాశం కల్పించారు. సరిగ్గా అప్పుడే ఆమె ఏకైక కుమార్తె సైనా భరూచ్ ఆరోగ్యం క్షీణించింది. దీనితో కిరణ్ సెలవుకు దరఖాస్తు పెట్టి వెళ్లారు. అయితే ఆమెకు ప్రభుత్వం సెలవు మంజూరు చేయలేదు. అయినా ఆమె ఢిల్లీ వెళ్లారు. దీనిని ఆసరా చేసుకుని నాటి ముఖ్యమంత్రి ప్రతాప్సింహ్ రానే ‘కిరణ్ బేడీ కనిపించడం లేదు’ అంటూ దుష్ర్పచారం మొదలుపెట్టారు. దీనితో మీడియా రానేను చీల్చి చెండాడింది. ఒక న్యాయవాది కేసులో ఆమెకు ఎదురైన మరో అనుభవం మరీ నాటకీయంగా ఉంటుంది. 1988 జనవరిలో సెయింట్ స్టీఫెన్ కళాశాల (ఢిల్లీ)లో చదువుకుంటున్న ఒక విద్యార్థిని పర్సును ఒక వ్యక్తి అపహరించాడు. వారం తరువాత మహిళలకు చెందిన ఒక మరుగుదొడ్డిలో అసభ్య రాతలు రాస్తూ దొరికాడు. ఇతడి పేరు రాజేశ్ అగ్నిహోత్రి అనీ, టీస్హాజరీ కోర్ట్స్ కాంప్లెక్స్లో న్యాయవాది అనీ తేలింది. అయితే బేడీ అతడిని అన్యాయంగా కేసులో ఇరికించారని న్యాయవాదులంతా గొడవ ప్రారంభించారు. అయితే బేడీ అతడికి బేడీలు వేయడం సరైనదేనని సమర్థించారు. న్యాయవాదులు అల్లర్లకు దిగితే లాఠీచార్జి కూడా జరిగింది. చివరికి వాద్వా కమిటీ వేసి, ఆమెను మిజోరాం రాష్ట్రానికి బదలీ చేశారు. అక్కడ నుంచి వచ్చి కొద్దిరోజులు ఢిల్లీలో పని చేశాక, తిహార్ జైలు ఇన్స్పెక్టర్ జనరల్గా నియమించారు. 2,500 కరడుగట్టిన నేరగాళ్లు ఉండే ఈ జైలులో ఆమె పలు సౌకర్యాలు కల్పించారు. యోగాకు, చదువుకోవడానికి వీలు కల్పించారు. అయితే చార్లెస్ శోభారాజ్ తప్పించుకున్న ఘటనలో ఆమె ఆరోపణలను ఎదుర్కొని ఆ పదవి నుంచి తప్పుకోవలసి వచ్చింది. చిత్రం ఏమిటంటే, దేశంలో చాలామంది రాజకీయ నాయకులు, సహోద్యోగులు ఆమె చర్యలకు, సంస్కరణలకు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేసినా అక్కడ ఖైదీలకు చేసిన సేవలకీ, తెచ్చిన మార్పుకీ గుర్తింపుగా మెగెసెసె పురస్కారం దక్కింది. ఇదే చిత్రం. ప్రేమ... పెళ్లి... డ్యూటీ 1971లో పంజాబ్లోని హోషియార్పూర్లో ఒక టెన్నిస్ కోర్టులో కిరణ్ బేడీ బ్రిజ్ బేడీ కలుసుకున్నారు. తొలి చూపులు కలిశాయి. అతడికి సైన్యంలో, ఇంజనీర్గా కొన్ని మంచి అవకాశాలు వచ్చినా భూస్వామి కావడాన అమృత్సర్లోనే పరిశ్రమ స్థాపించుకున్నాడు. అతడి పట్ల కిరణ్ ప్రేమ గొప్పగా ఉండేది. ఐపీఎస్ ట్రైనింగ్ కోసం వెళ్లినా ఒకే రోజున 1,2,3,4,5 నెంబర్లతో అతడికి ఉత్తరాలు రాసేది. వాళ్ల పెళ్లి నిరాడంబరంగా జరిగింది. ఇద్దరికీ కర్మకాండల మీద పెద్దగా నమ్మకం లేకపోవడంతో ఒక శివాలయంలో ఏడు అడుగులు నడిచారు. ఇద్దరి సంపాదనలో కొంత ఖర్చు పెట్టి మిత్రులకు విందు ఇచ్చారు. అది జరిగిన రెండు మాసాలకే ట్రైనింగ్కు ఆమె వెళ్లిపోయింది. ఆయన ‘విజిటింగ్ హజ్బండ్’గా మిగిలి పోయాడు. అయినా ఏనాడూ ఆమె ఉన్నతికి అడ్డు తగలలేదు. 1975లో కూతురు పుట్టింది. మొదటి పేరు సుకృతి. తరువాత పెట్టుకున్న పేరు సైనా. ఆమె జర్నలిస్ట్. భర్త భరూచా కూడా జర్నలిస్ట్. షార్ట్ ఫిల్మ్స్ తీస్తారు ఆ ఇద్దరు. సైనాకు 13 ఏటనే ల్యూకోడెర్మా సోకింది. అందుకే ఆమె పెద్దగా బయట తిరగరు. తల్లిని డ్యూటీకి వెళ్లవద్దని, తన దగ్గర ఉండమని చిన్నారి సైనా ఎంత చెప్పినా, ‘నేను పోవాలి’ అంటూ కిరణ్ విధులకు వెళ్లిపోయేవారు. దీనితో సైనా అటు ఢిల్లీలోనే ఉన్నా తల్లి ప్రేమకీ, అమృత్సర్లో ఉండిపోయిన తన ప్రేమకీ నోచుకోలేక పోయిందని బ్రిజ్ బాధ పడుతూ ఉంటారు. క్రేన్ బేడీ-ఇందిర 1973 సంవత్సరం, గణతంత్ర దినోత్సవం. మొదటిసారి ఒక మహిళ ఖాకీదుస్తులలో కవాతు చేసింది. ఆ దృశ్యం సాక్షాత్తు నాటి ప్రధాని ఇందిరాగాంధీని సైతం ఆనందాశ్చర్యాలలో ముంచెత్తేటట్టు చేసింది. మరునాడే తనతో బ్రేక్ఫాస్ట్ చేయవలసిందిగా కిరణ్ బేడీకి ఇందిర వర్తమానం పంపింది. సరిగ్గా తొమ్మిదేళ్లకి మరో సంఘటన జరిగింది. ఆగస్ట్ 5, 1982న ఢిల్లీలో కన్నాట్ప్లేస్లో డీహెచ్ఐ 1817 నెంబరు అంబాసెడార్ కారు రాంగ్ పార్కింగ్లో ఉంది. అది పీఎం హౌస్ కారు. అంటే ఇందిరాగాంధీ గృహావసరాలకు ఉపయోగించుకునే వాహనం. ఆ కారును నాటి ఢిల్లీ ట్రాఫిక్ కమిషనర్గా ఉన్న కిరణ్బేడీ పక్కకు లాగి పెట్టించారు. మరునాడు పేపర్లలో ప్రధాని కారు గురించి వార్త పతాక శీర్షికలలో దర్శనమిచ్చింది. ఆ మరునాడే గోవాకి బదలీ చేస్తూ కిరణ్ చేతికి పత్రాలు వచ్చాయి. ఈ ఉదంతం తరువాతే కిరణ్ బేడీని క్రేన్బేడీ అని పిలవడం మొదలైంది. ఇది జరిగిన మూడు దశాబ్దాల తరువాత 2015లో ఢిల్లీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా బరిలో ఉన్నప్పుడు ఒక టీవీ ఇంటర్వ్యూలో ఆమె ఇదే విషయాన్ని గుర్తు చేసుకున్నారు. నిజానికి ఇందిర కారును పక్కకు లాగిన ఘనత తనది కాదని నిర్మల్సింగ్ అనే ఎస్ఐదని కాని నిర్మల్సింగ్ కంటే పై అధికారి అయిన అశోక్ టాండన్, అంతకంటే పై స్థాయిలో ఉన్న తాను ఈ విషయంలో ఎస్ఐకి గట్టి మద్దతుగా నిలబడ్డామని చెప్పారు. పత్రికల వాళ్లు నిర్మల్సింగ్పై చర్య తీసుకుంటారా అని అడిగారు. ‘తీసుకోను. పైగా అతడు చూపించినా సాహసానికి పురస్కారం కూడా ఇస్తాను!’ అని ఆనాడు కరాకండీగా చెప్పగలిగారు కిరణ్. నిజమే, ఆమెలో చండశాసనుడైన పోలీస్ అధికారి, చల్లని స్పర్శ ఇవ్వగలిగిన స్త్రీ ప్రవృత్తి రెండూ ఉన్నాయి. మహిళా ఐపీఎస్ అధికారిగా కిరణ్ బేడీ తాను నిర్వహించిన పదవులన్నిటికీ వన్నె తెచ్చారు. 1986లో ఢిల్లీ నార్త్ డిస్ట్రిక్ట్ డీసీపీగా విధులు నిర్వహించేటప్పుడు మత్తుపదార్థాల నిరోధానికి కృషి చేశారు.{పతి పోలీస్ స్టేషన్ పరిధిలోనూ డీటాక్స్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. తోటి ఉద్యోగులతో కలసి ‘నవజ్యోతి పోలీస్ ఫౌండేషన్’ పేరిట ఆమె నెలకొల్పిన స్వచ్ఛంద సంస్థ దేశప్రజలందరినీ ఆకట్టుకుంది. రెండు మూడేళ్ల క్రితం సామాజిక కార్యకర్త అన్నా హజారే ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున జరిగిన అవినీతి నిరోధక ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించారు. ఉద్యోగ జీవితంలో ఆరోపణల కారణంగా ఏ ఒక్క ఉద్యోగి మీద చర్య తీసుకోలేదు. వేటు వేయలేదు. పైగా వారిలో విశ్వాసం పెరగడానికి ఒకేరోజు 1,600 మంది సిబ్బందికి పదోన్నతులు కల్పించారు. ‘ఈ దేశంలో దమ్ములున్న ఏకైక మహిళ కిరణ్బేడీ’ అని కుష్వంత్ సింగ్ కితాబిచ్చారు. ► టెన్నిస్లో ఆసియా స్థాయి పోటీల్లో ఛాంపియన్ షిప్ ► టీచర్గా కెరియర్ ప్రారంభం ► ఐఏఎస్కు సెలక్ట్ కాలేదని కన్నీరుమున్నీరు ► తోటి అధ్యాపకుడైన బ్రిజ్ బేడీని పెళ్లాడారు ►{పధాని ఇందిర కూడా రూల్స్కి అతీతం కాదన్నారు ► తీహార్ జైల్ను పరివర్తన మందిరంగా మార్చారు ► అత్తగారంటే దైవసమానం.. అత్తమ్మ ఆశీర్వాదం లేనిదే ఏ పనీ చేసేవారు కాదు ► విజయశాంతి ‘కర్తవ్యం’ సినిమాకు కిరణ్ జీవితమే మూలం. అదే హిందీలో ‘తేజస్విని’ పేరుతో వచ్చింది వరించిన పురస్కారాలు: రామన్ మెగసెసే, రాష్ట్రపతి పతకం, ‘అత్యంత ఆరాధనీయ మహిళ’గా ది వీక్ మేగజైన్ అవార్డు, ఐక్యరాజ్యసమితి అవార్డు, ఐఐటీలో డాక్టొరేట్ - డాక్టర్ గోపరాజు నారాయణరావు -
స్కూళ్లు తెరిచాక చూడాలి.. అసలు సంగతి!
రాజధాని కాలుష్యాన్ని తగ్గించేందుకు ప్రారంభించిన సరి-బేసి కార్ల ఫార్ములా గురించి ఢిల్లీ తొలి మహిళా పోలీసు కమిషనర్ కిరణ్ బేడీ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం స్కూళ్లకు సెలవులు ఉన్నాయని, జనవరి ఒకటో తేదీ కూడా కావడంతో జనం ఇంకా సెలవు మూడ్లోనే ఉన్నారని ఆమె అన్నారు. దానివల్ల ట్రాఫిక్ అంత ఎక్కువగా ఉండకపోవచ్చని, అయితే స్కూళ్లు తెరిచిన తర్వాత కూడా దీన్ని సమర్థంగా అమలు చేయగలిగితే మంచిదని అన్నారు. జనవరి ఒకటో తేదీ నుంచి 15వ తేదీ వరకు సరి-బేసి పద్ధతిలో కార్లను అనుమతిస్తున్న సందర్భంగా ఈ 15 రోజుల పాటు స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. ఈ సమయంలో స్కూలు బస్సులను డీటీసీ తన ఆధీనంలోకి తీసుకుని, సిటీబస్సులుగా నడిపిస్తుంది. ప్రస్తుతం ఎవరూ సరి-బేసి వ్యవస్థను విజయవంతం అయ్యిందని గానీ, విఫలం అయ్యిందని గానీ చెప్పకూడదని, అందరూ దీనికి సహకరించాలనే చెప్పాలని అన్నారు. సరి బేసి ప్లాన్కు అసలైన పరీక్ష మాత్రం స్కూళ్లు తెరిచిన తర్వాతే ఎదురువుతుందని, అప్పుడే ఢిల్లీవాసులు అందరూ నిజంగా రోడ్లను ఉపయోగిస్తారని ఆమె అన్నారు. అలాగే, ఢిల్లీ-యూపీ సరిహద్దుల్లో భారీగా వాహనాలు నిలిచిపోయాయని, వాటి గురించి కూడా ఆలోచించాలని చెప్పారు. కిరణ్ బేడీ ఢిల్లీలో పనిచేసినప్పుడు రోడ్లమీద అడ్డదిడ్డంగా పార్కింగ్ చేసిన కార్లు, ఇతర వాహనాలను క్రేన్లతో టోయింగ్ చేయించి, అక్కడినుంచి తరలించేవారు. అందుకే ఆమెను అప్పట్లో 'క్రేన్ బేడీ' అని కూడా పిలిచేవాళ్లు. Monday is the real test to be achieved to begin with for #OddEvenPlan as we are right now into school holiday holiday season & a weekend.. — Kiran Bedi (@thekiranbedi) January 1, 2016 The 2nd real test for #OddEvenPlan to succeed will b when d school holidayseason ends.It's then when all Delhites r truly back using roads.. — Kiran Bedi (@thekiranbedi) January 1, 2016 Huge problem on Delhi-UP border--Commuters stranded. Tackling Delhi Pollution needed a Comprehensive-Co-option,which did not happen.. — Kiran Bedi (@thekiranbedi) January 1, 2016 -
ఆ వ్యాఖ్యలు క్షమార్హం కాదు: కిరణ్ బేడి
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీపై పరుష పదజాలంతో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ విరుచుకుపడడాన్ని బీజేపీ నాయకురాలు కిరణ్ బేడి తప్పుబట్టారు. ప్రపంచంలో అత్యంత గౌరవనీయ వ్యక్తుల్లోని మొదటి 10 మందిలో ప్రధాని మోదీ ఒకరని అన్నారు. అలాంటి వ్యక్తిని పిరికివాడు, మానసిక దౌర్బల్యం కలిగిన వారిగా విమర్శించడం సరికాదని ఉద్బోధించారు. ఈ వ్యాఖ్యలు క్షమార్హం కాదన్నారు. ప్రధానిపై చేసిన వ్యాఖ్యలకు కేజ్రీవాల్ విచారం వ్యక్తం చేయాలని సూచించారు. ప్రజలను దిగ్భ్రాంతి, బాధకు గురిచేసేవిగా కేజ్రీవాల్ వ్యాఖ్యలు ఉన్నాయని అన్నారు. జాతికి ఆయన క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తన కార్యాలయంలో సీబీఐ సోదాలు చేయడంతో ప్రధాని మోదీపై కేజ్రీవాల్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తనను లక్ష్యంగా చేసుకునే ఈ సోదాలు జరిపారని ఆరోపించారు. మంగళవారం ఉదయం నుంచి తన కార్యాలయంతో పాటు పలుచోట్ల సీబీఐ దాడులు చేసిందని తెలిపారు. విద్యా శాఖ కార్యాలయంలోనే సోదాలు జరిపామని సీబీఐ ఇచ్చిన వివరణలో వాస్తవంలేదని ఆయన స్పష్టం చేశారు. -
వాటి జోలికే వెళ్లను!
తోటి నటీనటులు బయోపిక్స్ బాట పడుతున్నా, కరీనా కపూర్ మాత్రం వాటి జోలికి వెళ్లనంటున్నారు. ‘‘బయోపిక్స్లో నటించాలని చాలా ఆఫర్లు వచ్చాయి, కానీ అదేదో ట్రెండ్ కాబట్టి చేయడం కరెక్ట్ కాదు. కిరణ్ బేడీ మీద సినిమా తీయాలని నన్ను సంప్రదించారు. కానీ నేను ఒప్పుకోలేదు. మరెవరి పాత్రలోనో నన్ను ఊహించుకోలేను. కానీ నా సహనటులు మాత్రం బయోపిక్స్లో నటి స్తూ ఈ ట్రెండ్ ను కొనసాగిస్తున్నారు. తమకు బాగా సూట్ అయ్యే పాత్రలనే ఎంచుకుంటున్నారు. ఉదాహరణకు ‘మేరీ కోమ్’ సినిమా తీసుకోండి...ప్రియాంక చోప్రా తప్పించి ఆ సినిమాకు ఎవరూ న్యాయం చేయలేర న్న విధంగా నటించారు. ఈ పాత్ర కోసమే నేను పుట్టానా? అన్న విధంగా ఉండాలి. నేను నటించిన ‘ఓమ్కారా’, ‘చమేలి’ సినిమాల్లోని పాత్రలు అలాంటివే. అప్పుడు ఆలోచిస్తా’’ అని అంటున్నారు కరీనా కపూర్. -
జూన్ 9న పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు
ఈరోజు మీతో పాటు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు: కిరణ్బేడి (మాజీ ఐపిఎస్ అధికారి), సోనమ్ కపూర్ (నటి) ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న వారి వ్యక్తిగత సంవత్సర సంఖ్య 5. వీరికి ఈ సంవత్సరమంతా అభివృద్ధి దాయకంగా ఉంటుంది. ధైర్యం, సాహనం, సమయస్ఫూర్తిని ఉపయోగించి పనులు చేస్తారు. అన్నింటా విజయాన్ని సాధిస్తారు. విదేశాలకు వెళ్లాలన్న కోరిక నెరవేరుతుంది. కొత్త వ్యాపారాలు, ప్రాజెక్టులు స్థాపిస్తారు. రిస్క్తో కూడుకున్న పనులు చాలా చాకచక్యంగా, నైపుణ్యంగా పూర్తి చేస్తారు. శుభపరిణామాలు ఎదురవుతాయి. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి ఇది చాలా మంచి సమయం. విద్యార్థులు మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధిస్తారు. ప్రభుత్వ పాలన, రక్షణ రంగాలలో ఉన్న వారు, యూనిఫారమ్ ధరించి చేసే వృత్తి, ఉద్యోగాలలో ఉన్నవారికి చాలా ప్రోత్సాహవంతంగా ఉంటుంది. లక్కీనంబర్స్: 1,5,6,9; లక్కీడేస్: మంగళ, బుధ, శుక్రవారాలు; లక్కీ కలర్స్: రెడ్, గ్రీన్, పర్పుల్, ఎల్లో సూచనలు: దూకుడును, అహంకారాన్ని, అత్యుత్సాహాన్ని తగ్గించుకోవడం, ఆంజనేయస్వామికి సింధూరం లేదా వెన్నతో అలంకారం చేయటం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకం చేయించుకోవడం, రక్తదానం చేయడం, తోబుట్టువులకు అండగా నిలవడం, వికలాంగులకు అన్నదానం చేయడం. - డా. మహమ్మద్ దావూద్, జ్యోతిష, సంఖ్యాశాస్త్ర నిపుణులు -
'నేను మళ్లీ ఎన్నికల్లో పోటీ చేయను'
పనాజీ: ఢిల్లీ బీజేపీ సీఎం అభ్యర్థిగా పోటీ చేసి పరాభావం ఎదుర్కొన్న తొలి మహిళ పోలీస్ ఆఫీసర్ కిరణ్ బేడీకి రాజకీయాలపై ఆసక్తి తగ్గినట్లుంది. ఇక ఎన్నికల్లో పోటీ చేసే ప్రసక్తే లేదని ఆమె తాజాగా స్పష్టం చేయడమే అందుకు ప్రధాన కారణం. కాగా తనకు ప్రజా సేవ చేయాలని ఉందని మాత్రం ఆమె తెలియజేశారు. అయితే అందుకు క్రియాశీల రాజకీయాలను మాత్రం ఎంచుకోనని అన్నారు. 'నేను ప్రజా సేవచేయడానికి మళ్లీ వస్తున్నా. కానీ రాజకీయాల్లోకి రాను. రాజకీయం అనేది నా భాష కాదు. అందుచేత తిరిగి ఎన్నికల్లో పోటీ చేసే ఉద్దేశం లేదు'అని తెలిపారు. వుమెన్ ఎకానిమిక్ ఫోరం కార్యక్రమంలో భాగంగా ఆదివారం పనాజీకి వచ్చిన కిరణ్ బేడీ.. ఢిల్లీ రాజకీయాలపై అడిగిన మీడియా ప్రశ్నలకు పై విధంగా స్పందించింది. తన జీవితం పలు విషయాల్లో ఉన్నతస్థితిలోనే సాగిందన్నారు. కాగా ఢిల్లీ ఎన్నికలు అనేవి తన జీవితంలో ఒక మరిచిపోలేని అనుభూతిగా ఆమె అభివర్ణించారు. బీజేపీ ఇచ్చిన ఆ అవకాశం తన జీవితానికి ఎంతోగానో ఉపయోగపడిన కారణంగా ధన్యవాదాలు తెలియజేశారు. -
కిరణ్ బేడీని తేవడం సరైనదేనా?
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘోరంగా పరాజయం పాలైన కొన్ని రోజుల తర్వాత.. ఆ ఎన్నికల్లో బీజేపీ అనుసరించిన వ్యూహాలు, ఎత్తుగడలపై.. ఆ పార్టీ సైద్ధాంతిక మార్గదర్శి అయిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) పలు ప్రశ్నలు లేవనెత్తింది. పార్టీ సీఎం అభ్యర్థిగా కిరణ్బేడీని తీసుకురావటాన్ని ప్రశ్నించింది. ‘‘పార్టీలో ఐక్యత లోపించటం, ప్రణాళికారచన లోపం.. మరీ ముఖ్యంగా పార్టీ కార్యకర్తల మనోభావాలను పట్టించుకోవటంలో లోపం వల్ల బీజేపీ ఓడిపోయిందా?’’ అని ఆర్ఎస్ఎస్ తన అధికార వారపత్రిక ‘పాంచజన్య’లో వ్యాఖ్యానించింది. ఢిల్లీ ఎన్నికల్లో ‘‘పార్టీ నేతలు కొందరు తమను ప్రజలు అత్యధికంగా ఆమోదిస్తారన్న భ్రమల్లో కూరుకుపోయారా? ‘మోదీ హవా’పైనే ఎక్కువగా ఆధారపడ్డారా?’’ అని నిర్మొహమాటంగా ప్రశ్నించింది. ‘‘బీజేపీ ఎందుకు ఓడిపోయింది? అనేది ప్రశ్న. కిరణ్బేడీని సీఎం అభ్యర్థిని చేయటం సరైన నిర్ణయమేనా? హర్షవర్థన్ను కానీ మరొక ఢిల్లీ నేతను గానీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ముందుకుతెచ్చినా.. లేదా అసలు ఎవరినీ సీఎం అభ్యర్థిగా ప్రకటించకుండా ఉంటే భిన్నమైన ఫలితాలు వచ్చేవా?’’ అని వ్యాఖ్యానించింది. ‘‘బీజేపీకి తన సిద్ధాంతం, అన్ని పరిస్థితుల్లోనూ కట్టుబడి ఉండే కార్యకర్తలు కాక.. ఇంకేం ఆస్తులు ఉన్నాయో పార్టీ నేతలు జవాబు చెప్పాలి’’ అని ప్రశ్నించింది. పార్టీ అనేది తమ ఇష్టానుసారం నడిచే ఒక యంత్రం అని ప్రభుత్వంలోని, పార్టీలోని కొందరు వ్యక్తులు భావించినట్లయితే.. ఢిల్లీ ఫలితాలు ఈ భ్రమను తొలగించాయి’’ అని వ్యాఖ్యానించింది. ఢిల్లీలో బీజేపీ ఓటు బ్యాంకు చెక్కుచెదరకుండా కాపాడుకోగలగటానికి కారణం.. పార్టీ కార్యకర్తల్లోని జాతీయ సిద్ధాంతం.. పార్టీ పట్ల వారి అంకితభావం, నిబద్ధతలేనని పేర్కొంది. ఢిల్లీ ఓటమిపై బీజేపీ నైరాశ్యం వీడి ఆత్మావలోకనం చేసుకోవలసిందిగా ఆర్ఎస్ఎస్ తాజా ‘పాంచజన్యం’లోని ముఖచిత్ర వ్యాసంలో సూచించింది. ఢిల్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ విజయంపైనా.. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలను ఆమ్ ఆద్మీ పార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్ నేరవేర్చాల్సిన అవసరం గురించీ ఆర్ఎస్ఎస్ కథనం ప్రస్తావించింది. -
'ఇంకా జీర్ణించుకోలేకపోతున్న ఆరెస్సెస్'
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) దారుణంగా ఓడిపోవడాన్ని ఆరెస్సెస్ ఇంకా జీర్ణించుకోలేక పోతుంది. పార్టీ నేతలకు కూడా తెలపకుండా రాత్రికి రాత్రే ముఖ్యమంత్రి అభ్యర్ధిగా కిరణ్ బేడీని ఎంపిక చేయడంపై ఆరెస్సెస్ ప్రశ్నలు లేవనెత్తింది. ఈ విషయాలపై తమ పత్రిక 'పాంచజన్య' లో భిన్న కథనాలు ప్రచురించింది. ముఖ్యమంత్రి అభ్యర్థిగా కిరణ్ బేడీ ఎంపిక సరైనదేనా అని ఆరెస్సెస్ ప్రశ్నించింది. ఢిల్లీ బీజేపీ నేత హర్షవర్ధన్ను లేదా స్థానిక నాయకుడిని ఎవరినైనా బరిలో నిలిపింటే పరిస్థితి భిన్నంగా ఉండేదని అభిప్రాయపడింది. తాజాగా ఢిల్లీలో బీజేపీ ఓటమి నేపథ్యంలో తన పత్రికలో 'ఆకాంక్షోం కి ఉదాన్' (గాలిలో మేడలు ), 'వాదె, సవాల్, కేజ్రీవాల్' (హామీలు, ప్రశ్నలు, కేజ్రీవాల్) శీర్షికలతో రెండు వార్త కథనాలు ప్రచురించింది. 'బీజేపీ ఎక్కువగా ప్రధాని నరేంద్ర మోదీ చరిష్మాపై ఆధారపడటం కూడా ఓటమికి కారణమైంది. కిరణ్ బేడీ అభ్యర్దిత్వాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ... పార్టీలో సమిష్టితత్వం లోపించింది. మరీ ముఖ్యంగా కార్యకర్తల సెంటిమెంట్లను గౌరవించకపోవడం ఓటమికి దారి తీసింది' అని మనోజ్ వర్మ తన వ్యాసంలో పేర్కొన్నారు. ఇదిలా ఉండగా పార్టీ ఓటమికి పలు తప్పిదాలే కారణమని బీజేపీ నేతలు అంగీకరిస్తున్నారు. కాగా ఆ అంశాలను పాంచజన్యలో ఎన్నికలకు ముందే ప్రచురించడం విశేషం. బీజేపీ నేతలు ఇప్పటికీ పార్టీ ఓటమిపై విశ్లేషిస్తున్నారు. బీజేపీకి చెందిన కొందరు నాయకులు మాత్రం.. 'పార్టీకి కంచుకోటగా ఉన్న కృష్ణానగర్ సీటు కోల్పోవడం గమనించినట్లయితే, బీజేపీ నేతలతో పాటు పార్టీ కార్యకర్తలు కూడా ఎన్నికలలో సహకరించలేదన్నది వాస్తవం' అని విశ్లేషిస్తున్నారు. సీఎం అభ్యర్ధిగా కిరణ్ బేడీని ఎంపిక చేయడం పార్టీ కార్యకర్తలకు ఇష్టం లేదు. -
ఢిల్లీకి సేవ చేయడానికే రాజకీయాల్లోకి వచ్చా: కిరణ్ బేడీ
సాక్షి, న్యూఢిల్లీ: ‘నేను అధికారం కోసం ఉన్నత స్థానానికి ఆశపడి రాజకీయాల్లోకి రాలేదు. నలభై ఏళ్ల కాలంగా నా ఉన్నతికి కారణమైన ఢిల్లీకి సేవ చేయాలనే ఉద్దేశంతో మాత్రమే రాజకీయాల్లోకి వచ్చాను’ అని బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి కిరణ్ బేడీ సోమవారం చెప్పారు. ఎన్నికల ప్రచారంలో ఆలోచనలు పంచుకోవడానికి ప్రారంభించిన ‘ఆన్ ఓపెన్ లెటర్ టు ఫెల్లో ఇండియన్స్’ అనే బ్లాగులో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. ‘ఇంత వరకు పలు సందర్భాల్లో నగరానికి సేవ చేశాను. కానీ అది చాలా చిన్న పరిమాణంలో మాత్రమే ఉండేది. ప్రస్తుతం ఓటింగ్ రాజకీయాల్లోకి వచ్చాను. ఇప్పుడు ఎదురైన ఓటమి నన్ను బాధించడం లేదు. ఢిల్లీలో సుస్థిర ప్రభుత్వం ఉండాలని మాత్రమే నేను కోరుకున్నాను’ అని తెలిపారు. విధానసభ ఎన్నికల్లో పార్టీ ఓటమికి పూర్తి బాధ్యత వహిస్తున్నట్లు ఆమె చెప్పారు. ‘నేను పరీక్షలో ఫెయిల్ అయ్యా. నా నిర్ణయాలకు పూర్తి బాధ్యత వహిస్తున్నా. అయితే వ్యక్తిగతంగా నేను ఫెయిల్ కాలేదు. ఇచ్చిన సమయంలో నా పూర్తి శక్తిని, అనుభవాన్ని పూర్తిగా పార్టీకి అందించా. అయితే ఆ శక్తి సరిపోలేదు.’ అని పేర్కొన్నారు. అధికారం కోసం రాజకీయాల్లో చేరాననే అపవాదు వినడానికి తన తల్లిదండ్రులు బతికి లేరన్నారు. తాజా ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ మొత్తం 70 స్థానాల్లో 67 సీట్లను గెలవగా, బీజేపీ తరఫున సీఎం అభ్యర్థిగా రంగంలోకి దిగిన కిరణ్ బేడీ కృష్ణా నగర్ నియోజకవర్గం నుంచి న్యాయవాది ఎస్కే.బగ్గా చేతిలో 2,277 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. ఎన్నికల ప్రచార సమయంలో అభివృద్ధి పనులు నిలిచిపోవడంపట్ల ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచార తీరును ఆమె విమర్శించారు. టెలివిజన్ అందరికీ అందుబాటులో ఉన్న ఈ రోజుల్లో జనసభలను నిషేధించాలని అభిప్రాయపడ్డారు. ఎన్నికల ప్రచారం చట్టబద్ధంగా, పారదర్శకంగా, నిజాల ఆధారంగా, టెక్నాలజీ ఆధారంగా, నిష్పక్షపాతంగా, గౌరవపూర్వకంగా జరగాలని అభిప్రాయపడ్డారు. -
ఎన్నికల రాజకీయాల్లో ఓడిపోయా:కిరణ్ బేడీ
న్యూఢిల్లీ: ఎన్నికల రాజకీయాల్లో తాను ఓడిపోయానని బీజేపీ నేత, ఇటీవల ఢిల్లీ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో ఆ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా పోటీ చేసిన కిరణ్బేడీ తెలిపారు. ఢిల్లీ ఎన్నికల్లో ఘోరపరాజయం తరువాత ఈ మాజీ ఐపీఎస్ అధికారి సోమవారం దానిపై వివరణ ఇచ్చారు. శక్తివంచన లేకుండా కృషి చేసినప్పటికీ ఎన్నికల రాజకీయ పరీక్షలో గెలవలేకపోయానని ఆమె తన బ్లాగు ద్వారా విడుదల చేసిన బహిరంగ లేఖలో పేర్కొన్నారు. అయితే, తాను మానసికంగా మాత్రం ఓడిపోలేదని ఆమె అన్నారు. తన అనుభవాన్ని పణంగా పెట్టి పోరాడినా అది సరిపోలేదని ఆమె వ్యాఖ్యానించారు. ప్రజలు ఆప్ ఇచ్చిన ఉచిత నీరు, విద్యుత్తు చార్జీల తగ్గింపు వంటి వాటివైపు మొగ్గు చూపారన్నారు. కానీ, వీటి వల్ల దీర్ఘకాలంలో నష్టం జరుగుతుందన్నారు. కృష్ణానగర్ నియోజకవర్గంలో తన ఓటమికి అనేక కారణాలు ఉన్నాయని ఆమె అన్నారు. ఫలితాలు వెలువడిన వెంటనే ఓటమికి కారణం తాను కాదని, బీజేపీయేనని వ్యాఖ్యానించి కలకలం సష్టించిన సంగతి తెలిసిందే. -
ప్రశ్నార్థకంగా మారిన బేడీ భవితవ్యం
న్యూఢిల్లీ: ‘ఇది నా ఓటమి కాదు. ఇది బీజేపీ ఓటమి’ ఢిల్లీ ఎన్నికల్లో ఎదురైన అవమానకర ఓటమిపై బీజేపీ నాయకురాలు కిరణ్బేడీ స్పందన ఇది. మాజీ పోలీస్ అధికారి అయిన కిరణ్ బేడీ వీలుకుదిరినప్పుడల్లా రాజకీయ నాయకులపై విరుచుకుపడుతుండేవారు. అవినీతి వ్యతిరేక ఉద్యమ సమయంలో రాజకీయ నాయకులను వేదిక కూడా ఎక్కనివ్వని ఆమె, అనుకోనిరీతిలో బీజేపీలో చేరడం, ఆ పార్టీ సీఎం అభ్యర్థిగా ఎన్నికవడం, ఎన్నికల్లో ప్రజల వ్యతిరేకతతో ఘోర ఓటమిని మూటగట్టుకోవడం అంతా రెండు వారాల వ్యవధిలోనే జరిగిపోయింది. ఈ ఎన్నికల్లో చవిచూసిన ఓటమితో అప్పుడే ఆమె భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. కిరణ్బేడీ పోలీస్ అధికారిగా ఉన్న సమయంలో అనేక క్లిష్ట పరిస్థితులను చాకచక్యంతో ఎదుర్కొన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ తరఫున రాజకీయ నాయకురాలిగా అరంగేట్రం చేశారు. ఈ ఎన్నికలే ఆమె జీవితంలో ఇప్పటి వరకు ఎదుర్కొన్న అతి క్లిష్టమైన పరీక్ష. ‘టఫ్ టాస్క్ మాస్టర్’గా పేరుగాంచిన బేడీని ముందుపెట్టి ఢిల్లీ పీఠం ఎక్కాలని బీజేపీ భావించింది. దీంతో 1993 తర్వాత అత్యంత హోరాహోరీగా సాగిన ఎన్నికలుగా ఇవి మారిపోయాయి. కానీ ఫలితాలకు వచ్చేసరికి బేడీ నేతృత్వంలోని బీజేపీ కేవలం మూడు నియోజకవర్గాలకే పరిమితమైపోయింది. సాక్షాత్తూ బీజేపీ తరఫున సీఎం అభ్యర్థిగా బరిలోకి దిగిన బేడీ... కృష్ణానగర్ నియోజకవర్గంలో ఆప్ అభ్యర్థి ఎస్.కె.బగ్గా చేతిలో ఓటమి పాలయ్యారు. 1993 నుంచి ఈ నియోజకవర్గం ఎమ్మెల్యేగా కేంద్రమంత్రి హర్షవర్ధ(బీజేపీ) గెలుపొందుతూ వస్తున్నారు. అలాంటి నియోజకవర్గం నుంచి కిరణ్ బేడీ ఓటమి పాలయ్యారు. బేడీపై గెలుపొందిన ఎస్.కె.బగ్గాకి మితభాషి, మంచి వ్యక్తిగా ప్రజల్లో పేరుంది. బగ్గా స్థానిక వ్యక్తి కాగా బేడీ బయటి నుంచి వచ్చి పోటీ చేశారు. ఆమె ఓటమికి ఇది కూడా ఒక కారణం కావచ్చు. అంతే కాకుండా బేడీ పాల్గొన్న సభలకు ప్రజాదరణ కూడా అంతంత మాత్రమే లభించింది. ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్న సభలు కూడా పేలవంగా మారాయి. ఢిల్లీ ఐరన్ లేడీగా ముద్ర ఉన్న బేడీ... 1982లో కన్నాట్ సర్కస్ వద్ద పార్కు చేసి ఉన్న మాజీ ప్రధాని ఇందిరా గాంధీ కారును నెట్టుకుపోవడం వంటి ఘటనలు గురించిన వార్తలు ఈ ఎన్నికల సమయంలో హల్చల్ చేశాయి. దీంతో ‘ఒక డీసీపీ ఎప్పుడూ అలాంటి పనులు చేయరని’ ఆ ఘటనపై ఆమె వివరణ ఇచ్చుకున్నా నష్టం మాత్రం జరిగిపోయింది. -
ఢిల్లీలో ఆప్ విజయంపై ఉద్ధవ్ వ్యాఖ్య
సాక్షి, ముంబై: ఢిల్లీలో బీజేపీ పరాజయానికి కిరణ్ బేడీ కాకుండా మోదీయే కారణమన్న అన్నా హజారే వ్యాఖ్యలతో తాను కూడా ఏకీభవిస్తున్నానని శివసేన అధ్యక్షులు ఉద్ధవ్ ఠాక్రే పరుషంగా వ్యాఖ్యానించారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం మంగళవారం మధ్యాహ్నం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ‘లాటేపేక్షా సునామి మోటీ అస్తే’ (అలల కంటే సునామి ప్రభావం అధికంగా ఉంటుంది) అని ఢిల్లీ ప్రజలు నిరూపించారంటూ మోదీని ఎద్దేవా చేశారు. ఈ ఫలితాలు నరేంద్ర మోదీకి పరాజయం అని పేర్కొనడం తప్పు కాదన్నారు. దేశమంతా మోదీ అలలు ఊపేస్తున్నాయన్న చర్చ జరిగిందని, కానీ ఢిల్లీ ప్రజలు అలల కన్నా సునామీ గొప్పదని నిరూపించారని అన్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధ్యక్షలు అరవింద్ కేజ్రీవాల్ను ఉద్ధవ్ ఠాక్రే ఫోన్లో అభినందించారు. ఢిల్లీలోని ప్రజలు ఎలాంటి ఒత్తిళ్లు, ఆశలకు లొంగకుండా కావల్సిన వారికే పట్టంకట్టారని బీజేపీని ఉద్దేశించి పరోక్షంగా ఎద్దేవా చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో శివసేన భాగస్వామిగా ఉన్నప్పటికీ రెండు పార్టీల మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ అధ్యక్షులు అమిత్ షా తమకు సరైన గౌరవం ఇవ్వడం లేదన్న భావన శివసేన కార్యకర్తల్లో నెలకొంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో శివసేన కూడా బీజేపీకి వ్యతిరేకంగా 18 స్థానాల్లో తమ అభ్యర్థులను బరిలోకి దింపింది. ప్రమాణ స్వీకారోత్సవాలకు వెళ్తాను..! ముఖ్యమంత్రిగా కేజ్రీవాల్ పదవీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి తనకు ఆహ్వానం అందితే తప్పకుండా వెళతానని ఉద్ధవ్ ఠాక్రే వెల్లడించారు. తాను కేజ్రీవాల్తో మాట్లాడి అభినందించానని చెప్పారు. ఢిల్లీ కోసం పని చేయాలని చెప్పానని, సీఎం పదవి నుంచి రాజీనామా చేసే తప్పిదం మరోసారి చేయకూడదని కూడా సూచించానని తెలిపారు. బీజేపీ ముక్త్ భారత్ యాత్ర ప్రారంభమైంది ఢిల్లీ ఎన్నికల ఫలితాలతో బీజేపీ ముక్త్ భారత్ యాత్ర (బీజేపీ లేని దేశం) ప్రారంభమైందని ఎన్సీపీ అధికార ప్రతినిధి నవాబ్ మాలిక్ పేర్కొన్నారు. బీజేపీ అహంకారానికి ప్రజలు ఇచ్చిన తీర్పు ఓ చెంపపెట్టుగా ఉందన్నారు. తప్పుడు వాగ్దానాలు చేసే బీజేపీని ప్రజలు తిరస్కరించడం ప్రారంభించారని చెప్పారు. మరోవైపు ఢిల్లీలో ఘనవిజయం సాధించిన ఆప్ అధ్యక్షులు అరవింద్ కేజ్రీవాల్కు శుభాకాంక్షలు తెలిపారు. బీజేపీకి ప్రజలు బుద్దిచెప్పారు తమకు తిరుగులేదన్న అహంకారంతో ముందుకు వెళ్తున్న బీజేపీకి ప్రజలు బుద్ధిచెప్పారని ఎన్సీపీ నాయకుడు ధనంజయ్ ముండే పేర్కొన్నారు. అధికారంలో ఉన్న రూ. 10 లక్షల సూట్పై వంద రూపాయల సామాన్యుని మఫ్లర్ గెలిచిందని వ్యాఖ్యానించారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం ధనంజయ్ ముండే విలేకరులతో మాట్లాడారు. లోకసభ ఎన్నికల అనంతరం జరిగిన మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి భారీ మెజారిటీ లభించింది. దీంతో బీజేపీ నాయకులకు అహంకారం, గర్వం పెరిగిపోయింది. దీన్ని గమనించిన సామాన్య ప్రజలు బీజేపీకి బుద్ధిచెప్పారని ఆయన పేర్కొన్నారు. -
వై-ప్లస్ సెక్యురిటీ వదులుకున్నకిరణ్ బేడీ
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా పోటీలో నిలిచిన కిరణ్ బేడీ వై-ప్లస్ సెక్యురిటీ వదులుకున్నారు. ఎన్నికల్లో ఓడిపోవడంతో ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారు. హస్తిన అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ ఘోరంగా ఓడిపోవడంతో ఆమె అంతకుముందు క్షమాపణ చెప్పారు. బీజేపీ సీఎంగా అభ్యర్థిగా ప్రకటించడంతో ఆమెకు వై-ప్లస్ సెక్యురిటీ కల్పించారు. తనకిక వై-ప్లస్ సెక్యురిటీ అవసరం లేదని, రేపటి నుంచి భద్రతాధికారులు రావాల్సిన అవసరం లేదని సెక్యురిటీ సిబ్బందితో కిరణ్ బేడీ అన్నారు. తనకు భద్రత కల్పించిన సిబ్బందికి ఆమె ధన్యవాదాలు తెలిపారు. -
'నా భార్యకు బీజేపీ కేడర్ సహకరించలేదు'
చండీగఢ్: బీజేపీ కేడర్ సహకరించకపోవడం వల్లే పార్టీ పరాజయం పాలైందని ఆ పార్టీ ఢిల్లీ ముఖ్యమంత్రి అభ్యర్థి కిరణ్ బేడీ భర్త బ్రిజ్ బేడీ అన్నారు. గత ఎన్నికల్లో క్రిష్ణానగర్ నియోజక వర్గం నుంచి హర్షవర్థన్ భారీ మెజారిటీతో గెలుపొందారు. కానీ అదే నియోజక వర్గం నుంచి బరిలో నిలిచిన కిరణ్ బేడీ 2200 ఓట్ల తేడాతో ఓటమి చెందింది..అంటే బీజేపీ కేడర్ సహకరించలేదనే విషయం స్పష్టంగా అర్థం అవుతుందని ఆయన అన్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకి 17 రోజుల ముందు కిరణ్ బేడీని బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించిన విషయం తెలిసిందే. -
కాంగ్రెస్లో కలవరం!
-
కిరణ్ బేడీతో సీతారామన్ భేటీ
న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి, బీజేపీ నాయకురాలు నిర్మలా సీతారామన్ ఆదివారం ఢిల్లీ ముఖ్యమంత్రి అభ్యర్థి కిరణ్ బేడీతో సమావేశమయ్యారు. కిరణ్ బేడీ నివాసానికి వెళ్లి ఆమెతో చర్చలు జరిపారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత రోజే వీరి భేటీ జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది. బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీ మధ్య పోటీ ఉంటుందని ఎగ్జిట్ పోల్స్ పేర్కొన్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీకి పూర్తి మెజారిటీ వస్తుందని ఎగ్జిట్ పోల్స్ వెల్లడించడంతో బీజేపీ నాయకులు నిరుత్సాహానికి గురయ్యారు. -
ఢిల్లీ ప్రజలు.. ఓటెత్తారు!
-
ఫోర్త్ ఎస్టేట్ : ఢిల్లీ పీఠమెవరిది ? Part 2
-
ఫోర్త్ ఎస్టేట్ : ఢిల్లీ పీఠమెవరిది ? Part 1
-
ఆమ్ ఆద్మీ వైపే.. ఎగ్జిట్ పోల్స్ మొగ్గు!
-
ఢిల్లీ ప్రజలు ఓటెత్తుతున్నారు..!
-
హస్తిన అసెంబ్లీ పోలింగ్ చిత్రాలు
-
'బీజేపీని గెలిపించడానికే బరిలోకి'
న్యూఢిల్లీ: ఢిల్లీ మొత్తం ఏరియాతో తాను సంబంధాలు కలిగి ఉన్నానని బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి, కృష్ణా నగర్ నుంచి పోటీకి దిగిన కిరణ్ బేడీ అన్నారు. కృష్ణా నగర్కు తాను పరాయినని ప్రచారం చేస్తున్న వారిని ఆమె తప్పుబట్టారు. కిరణ్ బేడీ శనివారం ఉదయం ఓటు హక్కును వినియోగించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడారు. బీజేపీని గెలిపించడం కోసం తాను ఎన్నికల బరిలోకి దిగానని కిరణ్ బేడీ స్పష్టం చేశారు. కృష్ణా నగర్లో పోలింగ్ కేంద్రాలను ఆమె పరిశీలించారు. మరోవైపు ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ బీకే దత్ కాలనీలో ఉన్న పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. మద్యం, డబ్బు పంపిణీ చేసే పార్టీలకు ఓటు వేయవద్దని ఆయన ఈ సందర్భంగా ఢిల్లీ ఓటర్లుకు పిలుపునిచ్చారు. -
'బీజేపీ వంద శాతం గెలిచి తీరుతుంది'
న్యూఢిల్లీ: హస్తిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధిస్తుందని కేంద్ర మంత్రి హర్షవర్దన్ జోస్యం చెప్పారు. శనివారం కృష్ణనగర్లో పోలింగ్ కేంద్రానికి ఆయన తల్లితో కలసి వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు. అనంతరం హర్షవర్థన్ విలేకర్లతో మాట్లాడుతూ... ఈ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా వెలువడిన సర్వేలపై స్పందించేందుకు ఆయన నిరాకరించారు. ఎన్ని సర్వేలు ఏం చెప్పిన వంద శాతం విజయం బీజేపీదే అని ఆయన స్పష్టం చేశారు. అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్కే ఘన విజయం సాధించే అవకాశాలున్నాయని సర్వేలు వెల్లడించిన విషయాన్ని విలేకర్లు ప్రశ్నించగా హర్షవర్థన్పై విధంగా స్పందించారు. 2013 డిసెంబర్లో జరిగిన న్యూఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో హర్షవర్ధన్ సీఎం అభ్యర్థిగా బీజేపీ ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు బీజేపీ గెలుచుకున్న... ప్రభుత్వ ఏర్పాటకు బీజేపీ సుముఖత వ్యక్తం చేయలేదు. -
హస్తినలో ఓటు వేసిన ప్రముఖులు
-
ఓటు హక్కు నివియోగించుకున్న కేంద్ర మంత్రి
-
హస్తినలో ఓటు వేసిన ప్రముఖులు
న్యూఢిల్లీ : ఢిల్లీ బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి కిరణ్ బేడీ శనివారం తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా ఆమె నీతి బాగ్లోని పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. అలాగే ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ, మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్, మాజీమంత్రి హర్షవర్థన్, రాష్ట్రపతి కుమార్తె శర్మిష్ట ముఖర్జీ తదితరులు ఓటు వేశారు. కాగా శర్మిష్ట గ్రేటర్ కౌలాష్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ఓటు హక్కును వినియోగించుకున్న అనంతరం ఆమె...తన గెలుపుపై ధీమా వ్యక్తం చేశారు. మరోవైపు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ రాష్ట్రపతి భవన్లో ఏర్పాటు చేసిన మోడల్ పోలింగ్ స్టేషన్లో పర్యటించిన ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించారు. -
కిరణ్ బేడీ కోసం సీనియర్ నేతల ర్యాలీలు
న్యూఢిల్లీ: రాష్ట్ర బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి కిరణ్బేడీ విజయం కోసం బీజేపీ సీనియర్ నేతలు ప్రచారానికి చివరిరోజైన గురువారం చెమట చిందించారు. కిరణ్బేడీ పోటీచేస్తున్న కృష్ణ నగర్ నియోజకవర్గంలో పలు ర్యాలీలు నిర్వహించారు. కాగా ఉత్తర, దక్షిణ ఢిల్లీల్లోని మంగోల్పురి, సుల్తాన్పురి, కిరారి, నంగోలీ, మున్డ్కా ప్రాంతాల్లో జరిగిన ర్యాలీల్లో కిరణ్బేడీ పాల్గొన్నారు. ఆమె తన చివరి ర్యాలీని కృష్ణ నగర్లో నిర్వహించారు.ఈ ర్యాలీలో ఆమెతోపాటు కేంద్ర మంత్రి, స్థానిక నేత హర్షవర్ధన్, తూర్పుఢిల్లీ లోక్సభ సభ్యుడు మహేష్ గిరి కూడా ఉన్నారు. ఈ సందర్భంగా తనను కలిసిన లాయర్లతో బేడీ మాట్లాడుతూ.. బీజేపీ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కృష్ణ నగర్లో జరిగిన ర్యాలీలో ఆమె మాట్లాడుతూ.. ప్రజలకు సేవ చేసేందుకు తనను దీవించాలని కోరారు. అలాగే తన హయాంలో మంచి పాలనను అందిస్తానని స్థానికులకు హామీ ఇచ్చారు. ఇదిలా ఉండగా, కిరణ్బేడీ గెలుపు కోసం పూర్తిస్థాయిలో కృషిచేయాలని స్థానికుడైన కేంద్ర మంత్రి హర్షవర్ధన్కు పార్టీ అధిష్టానం ఆదేశాలు ఇచ్చిందని తెలిసింది. గతంలో ఇక్కడి నుంచి హర్షవర్ధన్ పలుమార్లు గెలిచిన సంగతి తెలిసిందే. -
ఢిల్లీ ప్రజల చూపు.. ఆప్ వైపే!
-
ఢిల్లీలో ఎన్నికల ప్రచార హోరు ముగిసింది!
-
కంటతడి పెట్టిన కిరణ్ బేడీ
న్యూఢిల్లీ: ఐపీఎస్ అధికారిగా అక్రమాలపై కొరడా ఝుళిపించి కఠిన ఖాకీ అని పేరు తెచ్చుకున్న బీజేపీ ఢిల్లీ సీఎం అభ్యర్థి కిరణ్ బేడీ కంటతడి పెట్టారు! బుధవారం న్యూఢిల్లీలో జరిగిన రోడ్షోలో ప్రసంగిస్తూ ఆమె భావోద్వేగానికి గురయ్యారు. తనను ప్రేమిస్తున్న ప్రజలను, ప్రజాసేవ రూపంలో తిరిగి ప్రేమిస్తానని అన్నారు. తను పోటీ చేస్తున్న కృష్ణానగర్లో రోడ్షోకు వెళ్లిన బేడీ కోసం కొందరు ప్రజలు ఫ్లాస్కుల్లో టీ తేవడంతో ఆమె కన్నీటిపర్యంతయ్యారు. 'నాపై కురిపిస్తున్న ప్రేమ గురించి చెప్పడానికి మాటలు లేవు. వారి ప్రేమను కాపాడుకోవడానికి శాయశక్తులా కృషి చేస్తా. మేం నిజాయితీతో వారికి సేవ చేస్తా' అని కంటతడితో అన్నారు. -
ఉద్వేగంతో.. కంటతడి పెట్టిన కిరణ్ బేడీ!
-
ఢిల్లీ ఎన్నికల్లో.. విజయం మనదే!
-
నెట్లోనూ హోరాహోరీ
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు సోషల్ మీడియాలోనూ పార్టీల పోరాటం ఫేస్బుక్, ట్విటర్ వెబ్సైట్లలో ఆప్, బీజేపీ, కాంగ్రెస్ల ప్రచారం న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీపడుతున్న ఆప్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు.. రాజధాని వీధుల్లో బహిరంగ సభలతోనే కాదు.. ఇంటర్నెట్లోని సోషల్ మీడియాలో కూడా సమాంతరంగా పోరాటం సాగిస్తున్నాయి. రాజకీయ పార్టీల ఎన్నికల ప్రచారానికి, యువ, సాంకేతిక పరిజ్ఞానం గల ఓటర్లను ఆకర్షించేందుకు సోషల్ మీడియా కొత్త రణరంగంగా మారింది. గణనీయంగా ఉన్న ఈ ఓటు బ్యాంకును ఆకర్షించేందుకు ఆయా పార్టీలు ప్రత్యేకంగా సోషల్ మీడియా విభాగాలను ఏర్పాటు చేసుకుని మరీ సమగ్రమైన ప్రణాళికలను అమలు చేస్తున్నాయి. ఈ మూడు పార్టీలకూ కలిపి ట్విటర్లో 26 లక్షల మంది అనుచరులు (ఫాలోయర్లు), ఫేస్బుక్లో కోటికి పైగా ‘ఇష్టాలు’ ఉన్నాయి. హాష్ట్యాగ్లు, ట్వీట్లు, వీడియోలు, ఫేస్బుక్ పోస్టులతో మూడు పార్టీలూ ఒక దానితో మరొకటి ముమ్మరంగా పోరాటం చేస్తున్నాయి. ఇంటర్నెట్ పోరాటం ఎలా చేయాలనే దానిపై ప్రతి పార్టీకీ భిన్నమైన వ్యూహం ఉంది. ఆప్కు 200 మంది వలంటీర్లు: ‘‘పార్టీ సోషల్ మీడియాను నిర్వహించేందుకు మాకు 16 మందితో కేంద్ర బృందం ఉంది. మరో 55 మంది సభ్యులు దేశ, విదేశాల నుంచి పనిచేస్తుంటారు. క్రియాశీలంగా పనిచేసే 200 మంది స్వచ్ఛంద కార్యకర్తలు (వలంటీర్లు) కూడా ఉన్నారు’’ అని ఆమ్ ఆద్మీ పార్టీ సోషల్ మీడియా సమన్వయకర్త అంకిత్లాల్ వివరించారు. ఆప్కు ఫేస్బుక్లో 23 లక్షల లైక్లు ఉండగా.. ట్విటర్లో 11 లక్షల మంది ఫాలోయర్లు ఉన్నారు. బీజేపీకి వేయి మంది సైన్యం బీజేపీ వేయి మందికి పైగా స్వచ్ఛంద కార్యకర్తల సైన్యంతో తమ పార్టీ నేతల సందేశాలను వివిధ సోషల్ మీడియా వేదికలపై ప్రచారం చేయడానికి కృషి చేస్తోంది. ‘‘వీరిలో అత్యధికులు ఐటీ కంపెనీలు, బీపీఓల్లో పనిచేస్తున్న వారే. ఆన్లైన్ ప్రచారం కోసం వారు రెండు వారాలు సెలవు తీసుకుని మరీ తమకు తాముగా కృషి చేస్తున్నారు’’ అని బీజేపీ ఢిల్లీ విభాగం కమ్యూనికేషన్ సెల్ సమన్వయ కర్త ఖేంచంద్శర్మ పేర్కొన్నారు. బీజేపీకి ఫేస్బుక్లో 73 లక్షల లైక్లు ఉంటే, ట్విటర్లో 12 లక్షల ఫాలోయర్లు ఉన్నారు. కాంగ్రెస్కు 70 మంది వలంటీర్లు: ఇక కాంగ్రెస్ పార్టీ మిగతా రెండు పార్టీలకన్నా సోషల్ మీడియాలోకి ఆలస్యంగా ప్రవేశించినట్లు కనిపిస్తోంది. ఈ పార్టీకి ఫేస్బుక్లో 35 లక్షల లైక్లు, ట్విటర్లో 3 లక్షల ఫాలోయర్లు ఉన్నారు. కాంగ్రెస్ ఇంటర్నెట్ ప్రచారంలో 12 మంది సభ్యుల బృందం నిరంతరం పనిచేస్తుంటో మరో 70 మంది స్వచ్ఛంద కార్యకర్తలు తమ ఇళ్ల నుంచే రోజుకు ఏడెనిమిది గంటలు పనిచేస్తున్నారు. కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రచారం మొత్తం స్వచ్ఛంద కార్యకర్తల ఆధారంగానే నడుస్తోందని ఢిల్లీ పీసీసీ సోషల్ మీడియా చైర్పర్సన్ రాధికాఖేరా పేర్కొన్నారు. -
సంక్షేమమే ఎజెండా..
బీజేపీ విజన్ డాక్యుమెంట్ విడుదల సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ ప్రజల సంక్షేమమే ఎజెండాగా భారతీయ జనతా పార్టీ విజన్ డాక్యుమెంట్ విడుదల చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముద్రతో రూపొందిన ఈ మేనిఫెస్టో మధ్యతరగతి ప్రజల ఆలోచనలను ప్రతిబింబించింది. బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి కిరణ్బేడీ, ఆ పార్టీ సీనియర్ నేతలు నిర్మలా సీతారామన్, అనంత్కుమార్, హర్షవర్ధన్, సతీష్ ఉపాధ్యాయలతో కలిసి మంగళవారం డాక్యుమెంట్ విడుదల చేశారు. 35 అంశాలు, 270 పాయింట్లు ఉన్న ఈ మేనిఫెస్టోలో అభివృద్ధికి, మహిళల భద్రతకు, పాలనలో పారదర్శకతకు ప్రాధాన్యతనిచ్చారు. ఢిల్లీని అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దుతామన్న హామీని ప్రధానంగా చెప్పారు. అయితే ఆప్ ప్రచార అస్త్రమైన ఢిల్లీకి ప్రత్యేక రాష్ట్ర హోదా అనే అంశాన్ని ఈ డాక్యుమెంట్ స్పృశించలేదు. 2013లో ఎన్నికల్లో విద్యుత్తు ఛార్జీలను 30 శాతం తగ్గిస్తామని ఇచ్చిన హామీని కూడా పక్కనబెట్టింది. ‘విజన్ డాక్యుమెంట్ మహిళా భద్రత, విద్యుత్తు, నీరు, పారిశుధ్యం, వాణిజ్యం, వ్యాపారం, విద్య, గృహవసతి, రవాణా, ఉపాధి, పర్యావరణ వ్యవహారాలకు ప్రాధాన్యాన్ని ఇచ్చింది’ అని కిరణ్ బేడీ వెల్లడించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రతి విభాగంలో పనితీరును పారదర్శకంగా చేస్తామని హామీ ఇచ్చారు. నిధులను జాగ్రత్తగా ఖర్చు చేస్తామని తెలిపారు. ప్రభుత్వ సిబ్బంది, అధికారులు ప్రజల్లో తిరుగుతూ తనిఖీలు నిర్వహిస్తారని చెప్పారు. ‘మన్కీ బాత్’ తరహాలో ‘దిల్ కీ బాత్’ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేడియోలో నిర్వహించే ‘మన్ కీ బాత్’ కార్యక్రమం తరహాలో ప్రతి నెల ‘దిల్ కీ బాత్’ కార్యక్రమం నిర్వహిస్తామని బేడీ తెలిపారు. ఇందులో తనతో పాటు కేబినెట్ మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా పాల్గొంటారని వివరించారు. వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ప్రజలతో మాట్లాడే సదుపాయం కూడా అందిస్తామని చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలసి పనిచేయాల్సిన ఆవశ్యకత ఉందని, తమ ప్రభుత్వం కేంద్రంతో కలిసి సమన్వయంతో ముందుకుపోతుందని వివరించారు. ఇతర రాష్ట్రాలలో విజయవంతమైన పథకాలను ఢిల్లీలో అమలుచేస్తామని వెల్లడించారు. ప్రతి కార్యక్రమాన్ని నిరంతరం సమీక్షిస్తామని చెప్పుకొచ్చారు. మేనిఫెస్టోలోని ముఖ్యాంశాలు పతి ఇంటికీ నీరు, మధ్యతరగతి ప్రజలకు లక్ష ఇళ్లు నిర్మాణం ఢిల్లీవాసులకు నిర్బంధ ఆరోగ్య బీమా స్మార్ట్ సిటీ, స్కిల్ హబ్ల ఏర్పాటు పేదలకు, బీపీఎల్ కుటుంబాలకు సబ్సీడీ రేట్లతో విద్యుత్తు మహిళా భద్రత పర్యాటన, మెడికల్ టూరిజం కేంద్రంగా ఢిల్లీ వ్యాపారం కోసం ఢిల్లీలో అనువైన వాతావరణం సృష్టించడం {పభుత్వ భవనాలు పూర్తిగా వినియోగించడం, స్కూళ్లు, కాలేజీలలో సెకండ్ హాఫ్లో ఇతర క్లాసులు నిర్వహించడం దక్షిణ ఢిల్లీలోని వివాదాస్పద బస్ రాపిడ్ ట్రాన్స్పోర్టు కారిడార్ రద్దు పతి 5 కి.మీలకు ఒక 15 పడకల ఆస్పత్రి, అంబులెన్సు ఈశాన్య వాసుల భద్రతకు అన్నీ పోలీసు స్టేషన్లలో ప్రత్యేక సెల్, 24 గంటల హెల్ప్లైన్ అనధికార కాలనీల క్రమబద్ధీకరణ -
హస్తినలో ఎన్నికల వేడి
-
బేడీ సహాయకుడి రాజీనామా, వాపస్
న్యూఢిల్లీ: అసెంబ్లీ ఎన్నికల ముంగిట ఢిల్లీ బీజేపీకి కిరణ్ బేడీ ప్రచార సహాయకుడు నరేంద్ర టాండన్ ఝలక్ ఇచ్చారు! బేడీ నియంతృత్వ పోకడలకు పోతున్నారని ఆరోపిస్తూ పార్టీకి రాజీనామా చేశారు. పార్టీ పెద్దలు బుజ్జగించి చివరికి ఆయనతో రాజీనామా ఉపసంహరించుకునేలా చేశారు. ఇంతకుముందు పార్టీ నగర విభాగానికి కార్యదర్శిగా పనిచేసిన టాండన్.. సోమవారం ఉదయం పార్టీ అధ్యక్షుడు అమిత్షాకు తన రాజీనామా లేఖ పంపారు. ఆయన దాన్ని ఆమోదించారు. అయితే నేతలు బుజ్జగించడంతో రాజీనామా ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించారు. -
‘ఉపద్రవీ’ కేజ్రీవాల్
ఢిల్లీ ఎన్నికల్లో హోరెత్తుతున్న పోస్టర్ వార్ కేజ్రీవాల్ గోత్రాన్ని ప్రస్తావిస్తూ బీజేపీ పోస్టర్ ఈసీకి ఫిర్యాదు చేసిన ఆప్ సాక్షి, న్యూఢిల్లీ: బీజేపీ తాజాగా జారీ చేసిన ప్రకటనలో గోత్రం పేరుతో తనపై దాడిచేయడం పట్ల ఆమ్ ఆద్మీ పార్టీ నేత అరవింద్ కే జ్రీవాల్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ విషయమై ఆప్ బీజేపీపై ఎన్నికల కమిషన్కు ఫిర్యాదుచేసింది. కొద్ది రోజులుగా బీజేపీ తనపైనా, తన పిల్లలపైనా, అన్నా హజారే పైనా వ్యక్తిగత దాడులు చేస్తూ పత్రికల్లో ప్రకటనలు చేయటంపై కేజ్రీవాల్ తీవ్రంగా స్పందించారు. వ్యక్తిగత ఆరోపణలను భరించే సహనం ఉండాలని అన్నా చెప్పటం వల్ల తొలి ప్రకటనపై తాను స్పందించలేదని, అయితే బీజేపీ తాజా ప్రకటనలో అన్ని హద్దులను అతిక్రమించటంతో మాట్లాడక తప్పలేదని కేజ్రీవాల్ అన్నారు. సోమవారం ఉదయం బీజేపీ పత్రికల్లో ఇచ్చిన కార్టూన్ ప్రకటనలో కేజ్రీవాల్పై పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించింది. ‘‘గణతంత్ర దినోత్సవాన్ని దేశ ప్రజలు జాతీయ పర్వదినంగా భావిస్తారు. అలాంటి పర్వదినానికి ఆటంకం కలిగించేందుకు ‘ఉపద్రవీ’ గోత్రం ఉన్న వ్యక్తి నిరుడు సిద్ధమయ్యారు. అందువల్లే ఈ ఏడాది ఆయనకు ఆహ్వానం అందలేదు.’’ అంటూ ఆరోపణలు చేసింది. ఈ ఆరోపణలను కేజ్రీవాల్ తీవ్రంగా ఖండించారు. తన గోత్రీకులైన అగర్వాల్ కులస్థులందరినీ బీజేపీ కించపరిచిందని ఆయన అన్నారు. తనతో పోరాడాలనుకుంటే బిజెపి తనపై ఆరోపణలు చేయాలే కానీ మొత్తం అగర్వాల్ కులంపై దాడిచేయడం సమంజసం కాదని కేజ్రీవాల్ ఆరోపించారు. కుల రాజకీయాలతో బీజేపీ పూర్తిగా దిగజారిందని ఆయన అన్నారు. ఢిల్లీ ప్రజలు ఇలాంటి నిందారాజకీయాలను ఆమోదించరనీ అన్నారు. బీజేపీ వాణిజ్యప్రకటనను వెంటనే ఉపసంహరించుకోవాలని, బహిరంగ క్షమాపణ చెప్పాలని లేనట్లయితే తాము రంగంలోకి దిగుతామని ఆప్ నేత ఆశుతోష్ చెప్పారు. ఈ వ్యవహారంపై ఆప్, బీజేపీలు రెండూ కూడా ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు చేసుకున్నాయి. కేజ్రీవాల్ ఆరోపణలపై బీజేపీ స్పందించింది. కేంద్ర విద్యుత్తు శాఖ మంత్రి పియూష్ గోయల్ ఈ అడ్వర్టయిజ్మెంట్లో గోత్రం ప్రస్తావన ఉపమానం మాత్రమేనని చెప్పారు. ఆప్ డీఎన్ఏ, అరాచ కతతో కూడిన దాని రాజకీయ సిద్ధాంతాల గురించి చెప్పడం కోసమే ఈ ఉపమానాన్ని ఉపయోగించినట్లు ఆయన చెప్పారు. తాము ఎన్నడూ సమాజాన్ని కులాల పేరిట విడదీయబోమని ఆయన చెప్పారు. -
కేజ్రీవాల్, ఈసీలకు నోటీసులు
అఫిడవిట్లో సమాచారాన్ని దాచారన్న పిటిషన్పై హైకోర్టు సమన్లు సాక్షి, న్యూఢిల్లీ: ఆప్ నేత కేజ్రీవాల్ తన అఫిడవిట్లో సమాచారాన్ని దాచారంటూ దాఖలైన పిటిషన్పై ఢిల్లీ హైకోర్టు ఆయనకు, ఎన్నికల సంఘానికి నోటీసులు జారీ చేసింది. న్యూఢిల్లీ నియోజక వర్గం నుంచి వేసిన నామినేషన్లో కేజ్రీవాల్ తనపై నమోదైన ఎఫ్ఐఆర్ సమాచారాన్ని దాచిపెట్టడం నేరమని ఆయనకు ప్రత్యర్థిగా పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి కిరణ్ వాలియా కోర్టును ఆశ్రయించారు. కేజ్రీవాల్ ఎన్నికలో పోటీచేయటాన్ని సవాలు చేస్తూ ముందుగా ఈసీకి ఫిర్యాదు చేసినప్పటికీ, ఈసీ పరిగణనలోకి తీసుకోకపోవటంతో హైకోర్టులో పిటిషన్ వేశారు. అంతేకాకుండా, ఘజియాబాద్లో నివసించే కేజ్రీవాల్ నామినేషన్ పత్రాలలో తన చిరునామాగా బీకేదత్ కాలనీని పేర్కొన్నారని తెలిపారు. ఒకవేళ ఆయన దత్ కాలనీలో నివసించినా అది అక్రమమేనని ఆమె చెప్పారు. దత్ కాలనీ ప్రభుత్వ కాలనీ అని ఆ కాలనీలో ఇంటిని అద్దెకు ఇవ్వడం నేరమని ఆమె చెప్పారు. -
బీజేపీవి విష రాజకీయాలు
ఓటమి తప్పదని ఆ పార్టీలో ఆందోళన: కేజ్రీవాల్ న్యూఢిల్లీ: ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) అధికారంలోకి రావడం ఖాయమని ఆ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ధీమా వ్యక్తం చేశారు. ఓటమిని తప్పించుకోడానికే బీజేపీ విష రాజకీయాలకు పాల్పడుతోందని ఆరోపించారు. అలాగే ఈసారి కాంగ్రెస్ పార్టీకి ఒక్క సీటు కూడా రాబోదని జోస్యం చెప్పారు. ఢిల్లీ ఎన్నికలు అత్యంత ప్రతిష్టాత్మకమైనవి కాబట్టే బీజేపీ అగ్రనేతలంతా ప్రచారానికి దిగారని పేర్కొన్నారు. ఈ నెల 7న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పీటీఐ వార్తా సంస్థకు అరవింద్ కేజ్రీవాల్ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఎన్నికల్లో గెలుపుపై బీజేపీ ఆందోళనలో ఉన్నందువ ల్లే ఆ పార్టీ నేతలు తనపై, తన కుటుంబం, వర్గంపై ఆరోపణలకు దిగుతున్నారని మండిపడ్డారు. ఆ పార్టీలో పెరుగుతున్న నిరాశానిస్పృహలకు ఇదే నిదర్శనమని పేర్కొన్నారు. దక్షిణ ఢిల్లీ ప్రాంతంలోని ఓ చర్చిపై దాడి ఘటనను ప్రస్తావిస్తూ.. ఎన్నికల ఆఖరి దశలో బీజేపీ ఇలాంటి చర్యలకు పాల్పడి ఓటర్లను చీల్చుతుందని, గత లోక్సభ ఎన్నికల సందర్భంగా ఉత్తరప్రదేశ్లో ఇదే వ్యూహాన్ని అనుసరించిందని వ్యాఖ్యానించారు. తాము ప్రేమ, వాత్సల్యంతో కూడిన రాజకీయాలు చేస్తే.. బీజేపీ మాత్రం విషపూరిత రాజకీయాలకు పాల్పడుతోందన్నారు. తన ప్రత్యర్థి, బీజేపీ సీఎం అభ్యర్థిని కిరణ్ బేడీపై స్పందిస్తూ.. ఆమె ముఖ్యమంత్రి అయితే కాంగ్రెస్లో మౌనం దాల్చిన మన్మోహన్సింగ్లాగే ఉండిపోతారన్నారు. ఐపీఎస్ మాజీ అధికారిగా ఆమె పోలీస్ ఉద్యోగానికే సరిపోతారని, సీఎం పోస్టుకు తగరని వ్యాఖ్యానించారు. -
‘కంపెనీల’ నుంచి ఆప్కు 2 కోట్లు
నకిలీ కంపెనీల నుంచి వసూలు చేశారని ఆప్ మాజీ అనుబంధ సంస్థ ‘అవామ్’ ఆరోపణ 31 కంపెనీల నుంచి మిడ్నైట్ హవాలా నడిపించారంటూ బీజేపీ ఆరోపణ ఖండించిన ఆప్.. సిట్తో దర్యాప్తు చేయించాలని డిమాండ్ తప్పు చేస్తే శిక్షించాలన్న కేజ్రీవాల్ సాక్షి, న్యూఢిల్లీ: ఎన్నికల కోసం గత సంవత్సరం నాలుగు నకిలీ కంపెనీల నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) రూ. 2 కోట్లను వసూలు చేసిందని ఆప్ నుంచి విడిపోయిన ఆప్ వాలంటీర్ యాక్షన్ మంచ్(అవామ్) ఆరోపించింది. హేమప్రకాశ్ అనే వ్యక్తి నుంచి నాలుగు వేర్వేరు కంపెనీల ద్వారా రూ. 50 లక్షల చొప్పున నాలుగు దఫాలుగా మొత్తం రెండు కోట్ల రూపాయలు 2014 ఏప్రిల్లో ఆప్ బ్యాంకు ఖాతాలో జమ అయ్యాయని అవామ్ ప్రతినిధి గోపాల్ గోయల్ సోమవారం విలేకరుల సమావేశంలో ఆరోపణలు చేశారు. ఈ నాలుగు కంపెనీల రిజిస్ట్రేషన్ చిరునామాలు గోకుల్పురి, పాలం కాలనీ, రాంలీలా పార్కు, కర్వాల్నగర్లోని జుగ్గీ జోపిడీల్లో ఉన్నాయని తెలిపారు. ఈ నాలుగు రిజిస్ట్రేషన్లు కూడా గత ఏడాది ఏప్రిల్ నెలలోనే చేసినట్టు ఉందన్నారు. కంపెనీ కార్యకలాపాలు, డెరైక్టర్లు ఎవరనేది వివరాలు లేవన్నారు. కంపెనీ రిజిస్ట్రేషన్లో ప్రస్తావించిన చిరునామాలైన కరావల్ నగర్, పాలం కాలనీ, గోకుల్ పురి, రామ్లీలాపార్క్లకు వెళ్లి ఆరా తీయగా జుగ్గీ జోపిడీలు ఉన్నాయనీ. ఈ ప్రాంతాలలో కంపెనీలకు సంబంధించిన ఎలాంటి సమాచారం లభించలేదన్నారు. గత లోక్సభ ఎన్నికల్లో టికెట్లు విక్రయించి అక్రమంగా సొమ్ముచేసుకుందని కూడా గోపాల్ ఆప్పై ఆరోపణలు చేశారు. నాలుగు కంపెనీలకు హేమ ప్రకాశ్ ఒకరే డెరైక్టర్ అనీ, ఇవి ఎలాంటి వ్యాపారాలు చేయటం లేదని, దీనిపై సీబీఐ లేదా, ఈడీ లేదా ఇతర దర్యాప్తు సంస్థలతో కేంద్రం దర్యాప్తు చేయించాలని అవామ్ డిమాండ్ చేసింది. మొత్తం 31 బోగస్ కంపెనీలను సృష్టించి నల్లధనాన్ని చందాల రూపంలో తీసుకుందని గోపాల్ అన్నారు. ఇదో పెద్ద కుట్ర: కేజ్రీవాల్ తనకు వ్యతిరేకంగా పెద్ద కుట్ర జరుగుతోందని ఆప్ అధినేత, సీఎం అభ్యర్ధి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. బినామీ కంపెనీల నుంచి అక్రమంగా చందాలు తీసుకున్న వివాదంపై ఆయన స్పందించారు. ‘ఎన్నికలకు ముందే బీజేపీ ఓడిపోయింది. నాపై, ఆప్కు వ్యతిరేకంగా పెద్ద కుట్ర పన్నుతున్నారు. ఎన్నికలు ఢిల్లీ ప్రజలకు పరీక్ష పెడుతున్నాయి. నిజాయితీ, వాస్తవాలకు మద్దతు ఇస్తారని నమ్ముతున్నాను’ అని పేర్కొన్నారు. ఆప్ నేత యోగేంద్ర యాదవ్ మాట్లాడుతూ స్వచ్ఛంద సేవా సంస్థ అవామ్ చేసిన ఆరోపణలను నిరాధారమైనవిగా ఖండించారు. గతంలోనూ ఇలాంటి ఆరోపణలే చేశారని, విచారణ కూడా జరిగిందన్నారు. కాంగ్రెస్, బీజేపీలు అక్రమ మార్గాల్లో విరాళాలు తీసుకుంటున్నాయని, ఆప్ విరాళాల సేకరణలో పూర్తి పారదర్శకత ఉంటుందని చెప్పారు. తాము తీసుకుంటున్న చందాల్లో ఎలాంటి అవకతవకలు జరగలేదన్నారు. ఈ ఆరోపణలపై దర్యాప్తునకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఆరోపణలపై సుప్రీం కోర్టు పర్యవేక్షణలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసి విచారణ జరిపించాలని ఆప్ నేత యోగేంద్ర యాదవ్ డిమాండ్ చేశారు. తప్పు చేసినట్లు తేలితే ఎలాంటి శిక్షకైనా సిద్ధంగా ఉన్నామన్నారు. విచారణ జరిపించాలి: బీజేపీ డిమాండ్ ఆమ్ఆద్మీ పార్టీ బినామీ కంపెనీల నుంచి సేకరించిన విరాళాలపై విచారణ జరిపించాలని బీజేపీ డిమాండ్ చేసింది. ఆప్ అక్రమ చందాల వసూళ్లు మిడ్నైట్ హవాలా వంటివని ఇటీవల ఆప్ నుంచి బీజేపీలో చేరిన షాజియా ఇల్మీ అన్నారు. కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, నిర్మలా సీతారామన్, బీజేపీ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావులు వేర్వేరుగా విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఆప్ తీరుపై ధ్వజమెత్తారు. బోగస్ కంపెనీల నుంచి విరాళాల రూపంలో నల్లధనాన్ని తీసుకుని వాటిని తెల్లధనంగా చలామణి చేస్తోందని ఆరోపించారు. అక్రమ చందాల దందాపై దేశ ప్రజలకు వివరణ ఇచ్చి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. -
పార్టీల ప్రచారమంతా ‘ఆమె’ చుట్టూనే..!
న్యూఢిల్లీ: మహిళా భద్రత...ప్రస్తుత విధానసభ ఎన్నికల్లో ప్రధానాంశంగా మారింది. బరిలోకి దిగిన మహిళా అభ్యర్థులంతా ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ హామీలు గుప్పిస్తున్నారు. తమను గెలిపిస్తే బస్సులు, మెట్రో రైళ్ల వంటి ప్రజా రవాణా ప్రదేశాల్లో మార్షల్స్ను ఏర్పాటు చేస్తామని, సీసీటీవీ కెమెరాలతో నిరంతర నిఘా ఉంచుతామని వాగ్దానాలిస్తూ మహిళా ఓటర్లను ఆకట్టుకునే యత్నం చేస్తున్నారు. అంతేకాకుండా మహిళలతో ఎలా ప్రవర్తించాలనే దానిపై మగవాళ్లకు శిక్షణ కూడా ఇప్పిస్తామంటున్నారు. బీజేపీ సీఎం అభ్యర్థి కిరణ్ బేడీ మాజీ ఐపీఎస్ అధికారి కూడా కావడంతో ఆ పార్టీ తమకు అధికారమిస్తే రాజధానిలో మహిళా భద్రతను మెరుగుపరుస్తామని చెప్తోంది. ఈ విధంగా అన్ని పార్టీలు ఇబ్బడి ముబ్బడిగా హామీలిస్తూప్రజలకు అర చేతిలో వైకుంఠం చూపిస్తున్నారు. రేప్ కేపిటల్గా మారిన రాజధాని గత కొన్నేళ్లుగా దేశ రాజధానిలో మహిళలకు భద్రత కొరవడింది. వారికి రక్షణ కల్పించడంలో గత ప్రభుత్వాలు విఫమవడంతో జాతీయ రాజధాని... ‘రేప్ కేపిటల్’ అనే అపఖ్యాతిని మూటగట్టుకుంది. ప్రస్తుత ఎన్నికల్లో పోటీచేస్తున్న 673 మందిలో మహిళలు కేవలం 19 మంది మాత్రమే ఉన్నారు. ప్రధాన పార్టీలైన బీజేపీ, ఆప్, కాంగ్రెస్ కూడా చాలా తక్కువ మంది మహిళలకు పోటీ చేసే అవకాశమిచ్చాయి. మొత్తం 70 స్థానాలు ఉండగా, బీజేపీ తరఫున ఎనిమిదిమంది, ఆప్ తరఫున ఆరుగురు, కాంగ్రెస్ తరఫున ఐదుగురు ఎన్నికల బరిలో నిలిచారు. నగరంలో మొత్తం ఓటర్లు సుమారు కోటి 30 లక్షలు కాగా అందులో మహిళా ఓటర్లు 50 లక్షల తొంభై వేల మంది. కీలకమైన అంశం ‘ మహిళా భద్రత అనేది కీలకమైన అంశం. లింగ నిష్పత్తి తగ్గుముఖం పట్టడం, సాంఘిక దురాచారాలైన వరకట్నం లాంటివి మహిళలపై వేధింపులకు మూల కారణాలు. నేను మంత్రిగా ఉన్న సమయంలో అబ్బాయిలకు కౌన్సిలింగ్ ఇవ్వడానికి ‘సాక్షం’ అనే పథకాన్ని ప్రారంభించా. అదే పథకాన్ని ఢిల్లీలో కూడా అమలు చేయాలని కోరుతున్నా. ఒకసారి దీని గురించి అవగాహన కల్పిస్తే పరిస్థితుల్లో కూడా మార్పులు చోటుచేసుకుంటాయి’ - కృష్ణతీరథ్ (పటేల్నగర్ బీజేపీ అభ్యర్థి) చట్టాలను సరిగ్గా అమలు చేయాలి ‘మహిళల కోసం చేసిన చట్టాలను సరిగా అమలు చేయాలి. విచారణను వేగవంతం చేయాలి. నగరం మొత్తం సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయాలి. అవకాశమిస్తే మహిళ భద్రతకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటాం’ - రజనీ అబ్బీ (తిమర్పూర్ బీజేపీ అభ్యర్థి) భద్రతా సిబ్బంది సంఖ్య పెంచాలి భద్రతా సిబ్బంది సంఖ్య పెంచాలి. బహిరంగ ప్రదేశాల్లో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయాలి, మాకు అవకాశమిస్తే మహిళా భద్రత కోసం హోం గార్డుల సంఖ్యను పెంచుతాం. క్యాబ్లలో ప్రయాణించే మహిళల భద్రత కోసం డ్రైవర్లకు ఫోన్ చేస్తూ ఎప్పటికప్పుడు సమీక్షించేలా చూస్తాం.’ - శర్మిష్టా ముఖర్జీ, గ్రేటర్ కైలాశ్ కాంగ్రెస్ అభ్యర్థి అనేక పథకాలు తెచ్చాం ‘ మహిళల భద్రత కోసం గత 15 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో అనేక ముఖ్యమైన పథకాలను తీసుకొచ్చాం. కానీ 49 రోజుల ఆప్ పాలనలో వాటన్నింటినీ గాలికొదిలేశారు’. - కిరణ్ వాలియా, ఆరోగ్య, మహిళా, శిశు సంక్షేమ శాఖ మాజీ మంత్రి మార్షల్స్ను నియమిస్తాం ‘మేమే మహిళా భద్రత అంశం నుంచి ఎప్పుడూ పక్కకు వెళ్లలేదు. మాకు అవకాశమిస్తే 10,000 మందితో ప్రత్యేక మహిళా దళం ఏర్పాటు చేస్తాం. మెరుగైన భద్రత కల్పించేందుకు ప్రజా రవాణా ప్రాంతాల్లో మార్షల్స్ను నియమిస్తాం.’ - బందనా కుమారి, షాలిమార్ ఆప్ అభ్యర్థి -
కిరణ్ బేడీ కార్యాలయంపై న్యాయవాదుల దాడి
న్యూఢిల్లీ: ఢిల్లీ బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి కిరణ్ బేడీ కార్యాలయంపై సోమవారం న్యాయవాదులు దాడి చేశారు. ఈ సందర్భంగా బీజేపీ కార్యకర్తలకు, న్యాయవాదులకు మధ్య ఘర్షణ జరిగింది. ఢిల్లీలోని కృష్ణానగర్ నియోజకవర్గంలో జరిగిన ఈ ఘటనలో ముగ్గురు గాయపడ్డారు. ఆ సమయంలో కిరణ్ బేడీ కార్యాలయంలో లేరు. న్యాయవాదులు కిరణ్ బేడీ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేస్తూ వ్యతిరేక నినాదాలు చేశారు. బీజేపీ కార్యకర్తలు అడ్డుకోవడంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. తన కార్యాలయంపై న్యాయవాదులు దాడిచేశారని, కొందరు గాయపడినట్టు సమాచారం అందిందని కిరణ్ బేడీ చెప్పారు. -
కిరణ్ బేడీ... నైస్ లేడీ: కేజ్రీవాల్
న్యూఢిల్లీ: కిరణ్ బేడీని ఇప్పటికీ అభిమానిస్తున్నానని ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) నేత అరవింద్ కేజ్రీవాల్ చెప్పారు. 'కిరణ్ బేడీ చాలా మంచి మహిళ(నైస్ లేడీ). ఆమెను అభిమానిస్తా' అని ఆయన పేర్కొన్నారు. తనను విషపు మనిషి అంటూ కిరణ్ బేడీ చేసిన వ్యాఖ్యలపై ఆయనీవిధంగా స్పందించారు. తమ రాజకీయ ప్రయోజనాల కోసం కిరణ్ బేడీని బీజేపీ పావుగా వాడుకుంటోందని, ఈ విషయాన్ని ఆమె గ్రహించలేకపోతున్నారని కేజ్రీవాల్ అన్నారు. ఆమెతో చర్చకు సిద్దమని పునరుద్ఘాటించారు. కిరణ్ బేడీపై తాము వ్యక్తిగత విమర్శలు చేయలేదని ఆయన స్పష్టం చేశారు. బీజేపీ నాయకులే తనను, తన కుటుంబాన్ని టార్గెట్ చేశారన్నారు. -
హస్తిన పీఠం కమలానికే!
ది వీక్-ఐఎంఆర్బీ సర్వేలో వెల్లడి ఎన్నికల్లో ఆప్-బీజేపీ పోటాపోటీ: ఏబీపీ న్యూస్-నీల్సన్ సర్వే బీజేపీ వైపే ఓటరు చూపు: ఇండియా టీవీ-సీటీవీ న్యూఢిల్లీ: ఢిల్లీ అధికార పీఠాన్ని దక్కించుకునే అసెంబ్లీ ఎన్నికల రేసులో బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీలు పోటాపోటీగా దూసుకుపోతున్నాయి. దాంతో ఓటరు ఏ పార్టీకి అధికారాన్ని కట్టబెట్టనున్నాడో తెలుసుకునేందుకు సర్వే సంస్థలు రంగంలోకి దిగాయి. ఢిల్లీ అసెంబ్లీలోని 70 స్థానాల్లో 36 సీట్లను బీజేపీ కైవసం చేసుకోనుందని ‘ది వీక్-ఐఎంఆర్బీ’ సర్వేలో తేలింది. ఆప్కు 29 సీట్లు, కాంగ్రెస్కు కేవలం నాలుగు సీట్లు వస్తాయని తెలిపింది. 39 శాతం మంది ఓటర్లు బీజేపీకి జై కొడుతున్నారని తేల్చింది. ఆప్ నేత కేజ్రీవాల్ సీఎం కావాలని 40 శాతం మంది ఓటర్లు, బీజేపీ నాయకురాలు కిరణ్ బేడీ సీఎం కావాలని 39 శాతం మంది ఓటర్లు కోరుకుంటున్నారు. కేజ్రీవాల్, బేడీ, మనీష్ సిసోడియాలు స్పష్టమైన మెజారిటీతో నెగ్గుతారని సర్వే తెలిపింది. ఎన్నికల్లో బీజేపీకి 37 సీట్లు, ఆప్ 28 సీట్లు, కాంగ్రెస్కు 5-8సీట్లు రావొచ్చని ఇండియా టీవీ-సీఓటర్ ఒపీనియన్ పోల్లో తేలింది. ఇక, బీజేపీ 37 సీట్లు, ఆప్ 29, కాంగ్రెస్ 4 సీట్లు పొందొచ్చని తలీమ్ రీసెర్చ్ ఫౌండేషన్-జీ న్యూస్ సర్వేలో వెల్లడైంది. సీఎం పదవికి కేజ్రీవాల్, బేడీల మధ్యే పోటీ నెలకొందని ఏబీపీ న్యూస్-నీల్సన్ ‘స్నాప్ పోల్’లో వెల్లడైంది. సీఎం పదవికి ఉత్తమ అభ్యర్థిగా కేజ్రీవాల్ 47 శాతం ఓట్లతో ప్రథమ స్థానంలో నిలవగా, 44 శాతం ఓట్లతో బేడీ రెండోస్థానంలో నిలిచారు. మహిళా ఓటర్లలో 50 శాతం మంది కేజ్రీవాల్ వైపు మొగ్గుచూపగా, బేడీకి 41.4 శాతం మద్దతు తెలిపారు. ఢిల్లీలో మరోసారి హంగ్ అసెంబ్లీ ఏర్పడుతుందని న్యూస్ నేషన్ నిర్వహించిన మరో ఒపీనియన్ పోల్లో వెల్లడైంది. -
మీ పాలనలో మహిళలకు భద్రత కరువు
బీజేపీపై కేజ్రీవాల్ ధ్వజం న్యూఢిల్లీ: కేంద్రంలోని మోదీ సర్కారు పాలనలో ఢిల్లీలో అత్యాచార ఘటనలు పెరిగిపోయాయని, మహిళలకు భద్రత కరువైందని ఆప్ నేత కేజ్రీవాల్ విమర్శించారు. మహిళలకు భద్రత కల్పించడమంటే వారిని నాలుగు గోడల మధ్య బంధించడమన్నదే బీజేపీ విధానమని దుయ్యబట్టారు. తాము అధికారంలోకి వస్తే ఢిల్లీలో 10-15 లక్షల సీసీటీవీ కెమెరాలను ఏరా్పాటు చేసి, మహిళల భద్రతకు పెద్దపీట వేస్తామని చెప్పారు. తాను తన కోసం ధర్నాలు చేయలేదని, ప్రజల కోసం చేశానని చెప్పారు. ‘‘ఢిల్లీలో రాష్ట్రపతి పాలన విధించిన తర్వాత గత తొమ్మిది నెలల్లో ఢిల్లీలో రేప్ ఘటనలు 30 శాతం పెరిగాయి. 2,069 ఘటనలు చోటుచేసుకున్నాయి’’ అని వివరించారు. అమ్మాయిలు జీన్ ప్యాంట్లు వేసుకోకూడదు, చదువుకోకూడదన్నది బీజేపీ విధానమైతే.. కట్టుదిట్టమైన చర్యలతో వారిపై అఘాయిత్యాలను అరికట్టడం తమ విధానమని పేర్కొన్నారు. ఈ రెండింట్లో ఏది కావాలో తేల్చుకోవాలని ప్రజలను కోరారు. కిందటేడాది 49 రోజుల్లోనే ఢిల్లీ సీఎం పీఠం నుంచి దిగిపోయినందుకు కేజ్రీవాల్ మరోసారి ప్రజలకు క్షమాపణలు చెప్పారు. -
ప్రచారక్ మోదీ.. ధర్నేబాజ్ కేజ్రీవాల్
సోనియా విమర్శలు కొన్ని శక్తులు మత వాతారవణం కలుషితం చేయాలని చూస్తున్నాయి ‘‘దేశం నినాదాలతో నడవదు. దేశ నిర్మాణంలో త్యాగాలు ఉంటాయి. కాంగ్రెస్ వ్యతిరేక పార్టీల్లో ఇది లేదు. ఒకరు ప్రచారక్.. (మోదీని ఉద్దేశించి) ఇంకొకరు ధర్నేబాజ్ (కేజ్రీవాల్ ధర్నాలను ఉద్దేశించి). వారితో ఏమీ జరగదు. ఢిల్లీకి అభివృద్ధి కావాలి. సుపరిపాలన కావాలి. తప్పుడు హామీలు కాదు. అందుకోసం కాంగ్రెస్కే ఓటు వేయండి. తప్పుడు హామీలు ఇచ్చేవారి నుంచి ఢిల్లీని కాపాడండి’’ అని కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ఓటర్లను కోరారు. మంచి పాలన కోసం తాము మద్దతు ఇస్తే నెలన్నరలోనే బాధ్యత మరిచి వెళ్లిపోయిందని ఆప్ను విమర్శించారు. కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ... ఢిల్లీలో ఎన్నికలు జరిపించకుండా దాటవేసిందని, రాష్ట్రపతి పాలన ముసుగులో ప్రభుత్వాన్ని నడిపిందని దుయ్యబట్టారు. ఏడాది కాలంలో ఢిల్లీలో శాంతిభద్రతల పరిస్థితి దిగజారిపోయిందన్నారు. ‘‘ఢిల్లీ ప్రజల కష్టాలకు బాధ్యులు.. ప్రభుత్వాన్ని నడిపించకుండా వెళ్లిన ఆప్, రాష్ట్రపతి పాలన ముసుగులో అధికారం చెలాయించిన బీజేపీలే. కాంగ్రెస్ 15 ఏళ్ల పాలనలో షీలా దీక్షిత్ నేతృత్వంలో ఢిల్లీ అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించింది. మేం 895 అనధికార కాలనీలను క్రమబద్ధీకరించాం’’ అని చెప్పారు. నల్లధనాన్ని వెనక్కి తెచ్చి పేదల ఖాతాల్లో రూ.15 లక్షల చొప్పున వేస్తామన్న హామీ ఏమైందని, యువతకు ఉపాధి ఎక్కడ చూపారని మోదీని ప్రశ్నించారు. ఆహార భద్రత చట్టం ద్వారా కేవలం 40 శాతం మందికే లాభం చేకూర్చేలా మోదీ ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. యజమానులతో సంబంధం లేకుండా భూములు లాక్కునేలా భూసేకరణ చట్టంపై ఆర్డినెన్సు తెచ్చారని ధ్వజమెత్తారు. అధికారంలోకి వచ్చిన కొన్ని శక్తులు మత వాతావరణాన్ని కలుషితం చేయడానికి కుట్రలు చేస్తున్నాయంటూ.. ఇటీవల ఢిల్లీలో త్రిలోక్పురి, దిల్షాన్గార్డెన్లలో చెలరేగిన ఘర్షణలను ప్రస్తావించారు. -
ధర్నాలా.. అభివృద్ధా?
ఏది కావాలో తేల్చుకోండి: మోదీ బీజేపీ పాలిత రాష్ట్రాలను చూడండి మాకే పూర్తి మెజారిటీ ఇవ్వండి ‘బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అభివృద్ధిని చూడండి.. కమలానికే పట్టం కట్టండి’ అని ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీ ప్రజలకు పిలుపునిచ్చారు. ఢిల్లీకి బాధ్యతాయుత ప్రభుత్వం అవసరమని పేర్కొన్నారు. ఢిల్లీ సమస్యలను పక్కనపెట్టి.. టీవీలు, మీడియాలో కనిపించేందుకు ధర్నాలు చేసేవారితో ప్రయోజనమేమీ ఉండదని కేజ్రీవాల్ను ఉద్దేశించి అన్నారు. సమస్యల నుంచి పారిపోయేవారిని, ప్రజలకు వెన్నుపోటు పొడిచిన వారిని దూరంగా ఉంచాలని కోరారు. కిందటి ఎన్నికల్లో ఎవరికీ మెజారిటీ ఇవ్వకపోవడంతో ఏడాది కాలం వృథా అయిందని, ఈసారి అలా కాకుండా బీజేపీకి సంపూర్ణ మెజారిటీ ఇవ్వాలన్నారు. మోదీ అదృష్టం కారణంగానే పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గాయని కాంగ్రెస్ చేస్తున్న ప్రచారంపైనా మోదీ తనదైన శైలిలో స్పందించారు. ‘‘వాళ్లు చెబుతున్నదే నిజమనుకుందాం. మీకు అదృష్టవంతులు కావాలా..? దురదృష్టవంతులా? నా అదృష్టం కారణంగా మీకు ధరలు తగ్గితే మంచిదేగా. మోదీ అదృష్టం దేశానికి ఉపయోగపడుతుందంటే ఇంతకు మించిన అదృష్టం మరేమీ ఉంటుంది? ఇక దురదృష్టవంతులను తీసుకురావాల్సిన అసరమేముంది? ’’ అని ప్రశ్నించారు. నినాదాలు చేసేవారు, తప్పుడు హామీలు ఇచ్చేవారు బీజేపీకి వ్యతిరేకంగా తెరవెనక బేరసారాలు చేస్తుంటారని ఆరోపించారు. కిందటిసారి ఆప్, కాంగ్రెస్ తెరవెనుక చేతులు కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయని, ఇప్పుడు మళ్లీ ఎన్నికలు వచ్చేసరికి మీడియాలో కనిపించేందుకు వారే ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారని ధ్వజమెత్తారు. అమాయకపు ముఖాలతో ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. ఢిల్లీలో బీజేపీ సర్కారు ఉంటే సీఎంకు.. తనపైన ఉండే మోదీ, కేంద్ర ప్రభుత్వం భయం ఉంటుందన్నారు. అలాకాకుండా వేరేవారికి పీఠం అప్పగిస్తే.. ఆయనపైన ఎవరూ ఉండరని, ఢిల్లీని ఇంకాస్త వెనక్కు తీసుకువెళ్తారని చెప్పారు. -
కిరణ్బేడీకి వెన్నుదన్నుగా హర్షవర్ధన్
న్యూఢిల్లీ: కృష్ణానగర్ నియోజకవర్గ ఓటర్లు కిరణ్బేడీ విషయంలో ఎంతమాత్రం సుముఖంగా లేరంటూ వచ్చిన వార్తలు బీజేపీలో కలవరం రేకెత్తించాయి. దీంతో ఈ పరిస్థితిని అధిగమించేందుకుగాను స్థానికంగా ఎంతో ప్రాబల్యం కలిగిన కేంద్ర మంత్రి డాక్టర్ హర్షవర ్ధన్ను ఆమెకు మద్దతుగా రంగంలోకి దించింది. బేడీ సునాయాస విజయం కోసం ఆమెకు మద్దతుగా పనిచే యాల్సిందిగా హర్షవర్ధన్ను అధిష్టా నం ఆదేశించిందని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. బీజేపీ సంప్రదాయ సీటుగా భావించే ఈ నియోజక వర్గంలో 1993 నుంచి 2013 ఎన్నికల వరకూ హర్షవర్ధన్ విజయపరంపరను కొనసాగించారు. ఆ తర్వాత జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఆయన చాందినీచౌక్ స్థానంలో విజయకేతనం ఎగురవేశారు. అయితే ప్రస్తుత ఎన్నికల్లో హర్షవర ్ధన్ కు బదులు కిరణ్బేడీని బీజేపీ రంగంలోకి దించడంతో పార్టీ కార్యకర్తలు నిరాశకు లోనయ్యారని, ఆమెను వారంతా బయటి వ్యక్తిగా భావిస్తున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ నియోజక వర్గంలో కిరణ్బేడీ చేపడుతున్న రోడ్షోలు, ఎన్నికల ప్రచార సభలకు స్పందన ఆశించినరీతిలో ఉండడం లేదంటున్నారు. ఈ పరిస్థితి మెరుగుపడాల్సిన అవసరం ఉందని తమ పార్టీ భావించిందన్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడి నుంచి కిరణ్బేడీ బరిలోకి దిగినప్పటికీ ఆమెకు మద్దతుగా హర్షవర ్ధన్ తోనూ ప్రచారం చేయాలని నిర్ణయించిందంటున్నారు. కిరణ్బేడీ ఎట్టిపరిస్థితుల్లోనూ విజయకేతనం ఎగురవేసేలా చూడాలంటూ హర్షవర ్ధన్ ను ఆదేశించిందని చెబుతున్నారు. ఇరువురి మధ్య విభేదాలు ఇదిలాఉంచితే కిరణ్బేడీ, హర్షవర ్ధన్ మధ్య సత్సంబంధాలు లేవనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి. గత నెల 15వ తేదీన బేడీ... బీజేపీలో చేరారు. అదే నెల 20వ తేదీన నగరానికి చెందిన ఏడుగురు ఎంపీలను తేనీటి విందుకు ఆహ్వానించారు. ఆ విందుకు హర్షవర ్ధన్ ఆలస్యంగా వచ్చారు. బేడీ ఆయనను కలవకుండానే అక్కడ నుంచి నిష్ర్కమించారు. వీరిరిరవురి మధ్య దూరం నానాటికీ పెరుగుతుండడం అధిష్టానాన్ని ఆందోళనకు లోనుచేసింది. ఈ నియోజకవర్గంలో బేడీ అత్యధిక మెజారిటీతో విజయం సాధించాలని బీజేపీ ఆశిస్తోంది. ఈ నేపథ్యంలో బేడీకి అన్నివిధాలుగా అండదండగా నిలవాలని, ఆమె నిర్వహించే రోడ్షోలు, ఎన్నికల సభల్లో పాల్గొనాలని ఆదేశించింది. ఆప్ దూకుడుకు కళ్లెం వేసేదెలా? ప్రస్తుత ఎన్నికల్లో తమ ప్రత్యర్థి అయిన ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)ని ఎంతమేరకు ఎదుర్కోగలమనే సందేహాలు బీజేపీని వేధిస్తున్నాయి. గత ఎన్నికల్లో ఆప్ కంటే ఎక్కువ స్థానాల్లో గెలుపొందినప్పటికీ ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మేజిక్ ఫిగర్ను చేరుకోవడంలో బీజేపీ విఫలమైంది. దీంతో ఈసారి ఎలాగైనా ఢిల్లీ పీఠాన్ని చేజిక్కించుకోవాలని భావిస్తోన్న బీజేపీ... ఆప్పై విమర్శల వర్షం కురిపిస్తోంది. ఇందులో భాగంగానే ఆ పార్టీని ఓఅరాచకవాది నడిపిస్తున్నాడంటూ ప్రధాని నరేంద్ర మోదీ కొద్దిరోజుల క్రితం నగరంలో జరిగిన ఎన్నికల ర్యాలీలో ఘాటుగా వ్యాఖ్యానించారు. అలాగే పార్టీ యంత్రాంగంతో పాటు కేంద్ర మంత్రులను కూడా కమలదళంప్రచారంలోకి దింపింది. ఎనిమిది మంది మినహా మిగిలిన కేంద్ర మంత్రులు, ఎంపీలంతా ఎన్నికల ప్రచారంలో నిమగ్నమయ్యేలా పార్టీ చర్యలు తీసుకుంది. అంతేకాకుండా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) కూడా తమ కార్యకర్తలను ప్రచారానికి పంపింది. గత ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కొని ఆప్ 28 చోట్ల గెలుపొంది రెండో స్థానంలో నిలిచింది. అయినప్పటికీ ఇప్పటికీ ఆప్ పరిస్థితి అంతంతగానే ఉంది. రాజకీయ అనుభవం లేని వ్యక్తి ఆధ్వర్యంలో ఔత్సాహికులతో గజిబిజి భావాజాలంతో ఆ పార్టీ నడుస్తోంది. అంతే కాకుండా షాజియా ఇల్మీలాంటి ముఖ్యనాయకులు కూడా ఆ పార్టీని వీడి బీజేపీలో చేరారు. ఆప్ 49 రోజుల పాలన తర్వాత ఆ పార్టీ నాయకులపై ముఖ్యంగా అరవింద్ కేజ్రీవాల్పై వ్యంగ్య వ్యాఖ్యలు, వేళాకోళాలు అధికమయ్యాయి. కేజ్రీవాల్ను... మోదీ వ్యంగ్యంగా ఏకే-47 అని పిలవడం మొదలుపెట్టారు. ఇలాంటి ప్రతికూలతలను పక్కన పెడితే నగరంలోని పేదలు, మైనారిటీలు ఆప్ వైపు మొగ్గుచూపుతున్నారు. దిగువ మధ్యతరగతి ప్రజలు, మురికి వాడల్లో నివశించే జుగ్గీజోపడీ సమూహాలను నైపుణ్యంతో కేజ్రీవాల్ ఆకట్టుకున్నారు. పోలీసుల చేతివాటాన్ని, అధికారుల ఉదాసీనత వల్ల వీరంతా అనేక బాధలను ఎదుర్కొంటున్నారు. అలాగే హిందుత్వ సంప్రదాయవాదుల మతతత్వ అజెండా కారణంగా మైనారిటీలు ఒంటరివారయ్యారు. అలాంటి వారికి ప్రత్యామ్నాయంగా ఆప్ కనిపించింది. ఆ వర్గాలన్నీ ఇప్పుడు ఆ పార్టీపైనే ఆశలు పెట్టుకున్నాయి. అయితే కాంగ్రెస్ మరీ అంత బలహీనంగా లేదని, ఆ పార్టీ బీజేపీ ఓట్లను చీల్చే అవకాశం ఉందని, అది తమకు లాభిస్తుందని బీజేపీ మంత్రి ఒకరు ఆశాభావం వ్యక్తం చేశారు. -
బేడీ వైపు ఢిల్లీవాలా మొగ్గు
ఢిల్లీ మహిళలు కిరణ్బేడీ వైపు అధికంగా మొగ్గుతున్నారు. రకరకాల చింతలతో నిత్యం కుతకు తలాడే దేశ రాజధానిలో లోతుగా విస్తరించిన అభద్రతా భావాన్ని ఆమె అయితేనే అర్థం చేసుకోగలరని భావిస్తున్నారు. అవినీతి నిర్మూలన, భద్రత, మెరుగైన జీవితం అనే మూడే ఢిల్లీ ఓటర్ల ప్రాథమిక డిమాండ్లు. మోదీ నాయకత్వం, బేడీ పరిపాలనాధికారం కలసి ఓటర్లకు నమ్మిక కలిగిస్తున్నాయి. ఇందుకు భిన్నంగా ఆమ్ ఆద్మీ పార్టీకి ఉద్వేగభరితమైన ఓటర్ల నుంచి లేదా భయం రాజకీయాలతో బాధపడుతున్న వారి నుంచి ప్రధానంగా మద్దతు లభిస్తోంది. శాసనసభ ఎన్నికలకు ముందు ఢిల్లీలోని ఓ గోదాములోకి ఐదు వేల విస్కీ సీసాలను తరలించడానికి ఎంత మంది కావాలి? నిస్సందేహంగా సీసాలతో ప్రభావితం చేయాలనుకునే వారికంటే చాలా తక్కువే. ఎన్నికల కమిషన్ జరిపిన దాడిలో దొరికిన ఆ సీసాలు అక్రమంగా నిల్వచేసినవి. అంటే ఓటర్ల ను ప్రభావితం చేయడానికి దాచినవేననేది స్పష్టమే. చట్టబద్దంగా మద్యాన్ని అమ్ముకునేవారెవరికీ అక్రమంగా నిల్వచేయాల్సిన అవసరం ఉండదు. అవినీతికి కూడా మంచి నిర్వహణా నైపుణ్యాలు కొన్ని ఉండటం అవసరమనడానికి ఇదే ఆధారం. దోషిగా ఆరోపణకు గురైన వ్యక్తి, తనను తాను పవిత్రమూర్తిగా భావించుకునే ఒక పెద్దమనిషి పార్టీకి చెందినవారు. తానేతప్పూ చేసి ఎరుగనని సదరు అభ్యర్థి ఖండిస్తారనడంలో సందేహం లేదు. తప్పును అంగీకరించడమంటే ఎన్నికల కమిషన్ విధించే శిక్షను ఆహ్వానించడమే. ఇలాంటి వ్యవహారాల విచారణకు సమయం పడుతుంది. అది పూర్తయ్యేసరికి ఎన్నికలు జరిగిపోయి చాలా కాలమే అయిపోతుంది. ఆలోగా ఈ పొగమంచులో నిజాన్ని మీడియా నుంచి దాచేసి, నిస్సిగ్గుగా ఎన్నికల ప్రచారం కొనసాగించవచ్చు. అయిచే నిజాన్ని ఎరిగిన బాపతు కూడా ఉన్నారు... వారు ఓటర్లు. ఎంతైనా మందు కొట్టడమమేది మహోత్సాహంగా సాగే వ్యవహారం. తాగుబోతులో లేదా మానసికంగా కుంగిపోయినవాళ్లో మాత్రమే ఒంటరిగానే ఆ పని కానిచ్చేస్తారు. శ్రీమాన్ ఐదు వేల సీసాల వారు కాస్త పాత కాలపు సజ్జు అని ఓ మోస్తరు విచారణ జరిపినా తెలిసిపోతుంది. అదే లక్ష్య సాధన కోసం ఇంతకంటే తెలివైన పద్ధతిని కనిపెట్టిన వాళ్లు కూడా ఉన్నారు. అలాంటి వాళ్లు ప్రత్యక్ష పంపిణీ కిందకు వచ్చే సీసాలను పంపిణీ చేయరు. సంతకాలు, ఆనవాలు లేని చిట్టీలను పంపిణీ చేస్తారు. ఆచూకీ కనిపెట్టడం కష్టమయ్యే ఆ చిట్టీలను పుచ్చుకుని సంబంధిత మద్యం వ్యాపారి మందు సీసా అప్పగించేస్తాడు. ఈ ఘటన ఒకటి రెండు ప్రశ్నలను రేకెత్తిస్తోంది. ఇప్పుడు దొరికినది మొత్తం నిల్వ చేసిన దాన్లో ఓ చిన్న భాగమే అనే సమంజసమైన సూత్రాన్ని బట్టి చూద్దాం. శ్రీమాన్ ఐదువేల సీసాల వారి అవసరం పట్టుబడ్డ వాటికంటే తేలికగానే రెండు లేదా మూడున్నర రెట్లు ఉండవచ్చు. కాబట్టి ఆయన రాజకీయ విస్కీ వ్యయం కనీసం రూ. 20 లక్షలు. అంతకంటే ఎక్కువేనని దాదాపు నిశ్చయంగా చెప్పొచ్చు. అంటే ఏ ప్రమాణాల ప్రకారం చూసినా ఆ అభ్యర్థి మొత్తం ఎన్నికల వ్యయం రెండు కోట్ల రూపాయలకు పైనే. ప్రజా జీవితంలోని నిజాయితీయే తమ అత్యంత మౌలిక సూత్రమని చెప్పుకునే పార్టీ అభ్యర్థి ఆయన. అలాంటి నిజాయితీ నుంచి ఢిల్లీని ఆ భగవంతుడే కాపాడాలి. ఇంతకు ఈ లంచం పనిచేస్తుందా? మహా అయితే పాక్షికంగా పనిచేస్తుంది. మన సమాజం స్థిరంగానూ, ప్రగతిశీలంగానూ పరిణామం చెందుతోంది. కులం, మతం ప్రాతిపదికగా కలిగిన సంప్రదాయకమైన గెలుపు లెక్కలకు అతీతంగా ఓటు చేసే వర్గం ఒకటి దేశంలో ఆవిర్భవించిం దని తాజా ఎన్నికల జనాభా లెక్కలు తెలుపుతున్నాయి. ఇది ఒక ఆరోగ్యకర పరిణామం. సంప్రదాయకమైన పాత లెక్కలూ ఇంకా ఉన్నాయి, ఢిల్లీ ఎన్నికల్లోనూ అవి కనిపిస్తాయి. కానీ ఎన్నికల ప్రక్రియలో వాటికి ఇప్పుడు అంత ప్రాధాన్యం లభించడం లేదు. ఇటీవలి జమ్మూకశ్మీర్ ఎన్నికలకు సంబంధించిన గణాంకాలలో ఒక అంశం ప్రత్యేకించి ఆసక్తికరం. శ్రీనగర్ అంచున, దాల్ లేక్ ఒడ్డునున్న హజరత్బల్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి మసూద్ అల్ హస్సన్కు 2,635 మంది కశ్మీరీలోయ ఓటర్లు ఓటు చేశారు. ఇదేమంత పెద్ద సంఖ్య కాదనిపిస్తుంది. కానీ అవి మొత్తం పోలైన ఓట్లలో దాదాపు 10 శాతం, కాంగ్రెస్కు లభించిన వాటికి రెండున్నర రెట్ల కంటే ఎక్కువ. హజరత్బల్ చాలా ప్రత్యేకమైన స్థలం. మొహమ్మద్ ప్రవక్త శిరోజం మె-ఎ ముకద్దాస్ అనే పవిత్ర అవశేషం ఉన్న ప్రపంచ ప్రసిద్ధ ప్రార్థనా స్థలం. అక్కడ కమలం గుర్తుకు అనుకూలంగా ఓటింగ్ మిషన్ మీటను నొక్కిన ఓటర్లు ఎవరు? వాళ్లదొక కొత్త వర్గం. జాతి లేదా భావోద్వేగాలపరమైన అంశాలకంటే అభివృద్ధి, ఉద్యోగాలను మరింత ముఖ్యమైనవిగా భావించే బాపతు. దేశంలో ఇతర చోట ్లకూడా అభివృద్ధికి ప్రాముఖ్యతనిచ్చే ఇలాంటి వర్గం ఓటర్లలో అధిక భాగంగా మారుతోంది. ఈ ఓటర్లలో మహిళలు, యువతదే అగ్రశ్రేణి. రెండు కారణాల వల్ల ఢిల్లీ మహిళలలో అత్యధికులు బీజేపీ వైపు మొగ్గుతున్నారు. లైంగిక సమానత్వం, మహిళా సాధికారతలను ప్రధాని నరేంద్ర మోదీ తన పరిపాలనలోని విలక్షణ ఇతివృత్తంగా మలచారు. శక్తివంతమైన ఆయన ఉపన్యాసాలలోనూ, ‘‘బేటీ బచావో, బేటీ పడావో’’ ఉద్యమం వంటి విధానాలలోనూ కూడా ఇది కనిపిస్తుంది. అప్పుడే అది ప్రబల స్థాయి సహానుభూతిని కలగజేసింది. ఇక రెండవది, రకరకాల చింతలతో నిత్యం కుతకుతలాడే దేశ రాజధాని నగరంలో లోతుగా విస్తరించిన అభద్రతా భావాన్ని కిరణ్బేడీ అర్థం చేసుకోగలరని వారికి నమ్మిక కలిగింది. అనుభవంగల పోలీసు అధికారిణి అయిన ఆమె అయితేనే మాటల హామీలకు మించి మరేమైనా చేస్తారని కూడా వారు విశ్వసిస్తున్నారు. అవినీతి నిర్మూలన, భద్రత, మరింత మెరుగైన జీవితం అనే మూడు అంశాలే ఢిల్లీ ఓటర్ల ప్రాథమిక డిమాండ్లు. నరేంద్ర మోదీ నాయకత్వం, ఢిల్లీలో బేడీ పరిపాలనాధికారం కలసి ఆ మూడు అంశాలకు సంబంధించి ఓటర్లకు తిరిగి నమ్మిక కలిగిస్తున్నాయి. ఇందుకు భిన్నంగా ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)కి ఉద్వేగభరితమైన ఓటర్ల నుంచి లేదా భయం రాజకీయాలు సోకి బాధపడుతున్న వారి నుంచి ప్రధానంగా మద్దతు లభిస్తోంది. ఇది క్షేత్రస్థాయి వాస్తవికతను ప్రతిఫలించే అంచనాయే తప్ప తీర్పు కాదు. ఆ అర్థంలో ఆప్ గతించిన కాలానికి ప్రాతినిధ్యం వహిస్తోంది. ఢిల్లీ ఓటర్లది అత్యంత మిశ్రమ సంపుటి. ఆ అంశమే దే శంలోని ఇతర ప్రాంతాలకు ఆ నగరం సూక్ష్మ రూపమని వ్యాఖ్యానించేట్టు ప్రేరేపిస్తుంది. అయితే అది కట్టుకథ. ప్రతి ఓటరూ తన తక్షణ ఆవరణంలోని సమస్యల ప్రాతిపదికపైనే ఒక నిర్ణయానికి వస్తాడు. కాబట్టి బిహార్లో జనతాదళ్ (యూ) కొంత వరకు పనిచేయవచ్చు. కానీ ఢిల్లీలోని బిహార్ సంతతి ఓటర్లలో సైతం అది పనిచేయదు. మనం కోరుకునే పార్టీయే గెలవాలని అంతా ఆశిస్తాం. శ్రీమాన్ ఐదు వేల సీసాలవారు ఓటమిపాలు కావాలని కూడా అంతగానూ మనం అంగీకరిస్తాం. -
కేజ్రీవాల్ - కిరణ్ బేడీల మధ్యే పోటీ: స్నాప్ పోల్
న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి పదవికి ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) చీఫ్ అరవింద్ కేజ్రీవాల్, బీజేపీ నేత కిరణ్ బేడీల మధ్యే పోటీ నెలకొందని ఏబీపీ న్యూస్-నీల్సన్ 'స్నాప్ పోల్'లో వెల్లడైంది. ఢీల్లీ సీఎం పదవికి ఉత్తమ అభ్యర్థిగా కేజ్రీవాల్ 47 శాతం ఓట్లతో ప్రథమ స్థానంలో నిలిచారు. ఇటీవలే బీజేపీలో చేరిన కిరణ్ బేడీ సర్వేలో 44 శాతం ఓట్లతో రెండోస్థానంలో నిలిచారు. సర్వే ఫలితాల ప్రకారం.. మహిళా ఓటర్లలో 50 శాతం మంది కేజ్రీవాల్ వైపు మొగ్గుచూపగా, బేడీకి 41.4 శాతం మద్దతు తెలిపారు. కిరణ్బేడీ ఆప్లో చేరి ఉండాల్సిందని 44 శాతం మంది అభిప్రాయపడగా, బీజేపీలో చేరడమే సరైందని 23 శాతం అభిప్రాయపడ్డారు. ఢిల్లీలో ఈ నెల శని-సోమవారాల(17-19 తేదీలు) మధ్య నిర్వహించిన ఈ సర్వేలో 1,489 మంది పాల్గొన్నారు. ఇదిలా ఉండగా, ఢిల్లీలో మరోసారి హంగ్ అసెంబ్లీ ఏర్పడుతుందని జనవరి 11-15 తేదీల మధ్య న్యూస్ నేషన్ నిర్వహించిన మరో ఒపీనియన్ పోల్లో వెల్లడైంది. -
సీఎం అభ్యర్థిగా వస్తే.. చర్చకు ఓకే
న్యూ ఢిల్లీ: బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాను ఢిల్లీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తే ఆయనతో చర్చకు సిద్ధమని ఆమ్ ఆద్మీ పార్టీ నేత కేజ్రీవాల్ తెలిపారు. శనివారం ఆప్ మానిఫెస్టోను కేజ్రీవాల్ విడుదల చేశారు. ఈ సంద్భంగా ఆయన మాట్లాడుతూ...ఢిల్లీ బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా కిరణ్ బేడీ స్థానంలో అమిత్ షాను ప్రకటిస్తే తనతో చర్చకు సిద్ధమని స్పష్టం చేశారు. ఇంతకు ముందు కిరణ్ బేడీని బహిరంగ చర్చకు రావాలని కేజ్రీవాల్ సవాలు విసిరారు. అందుకు తాను సిద్ధమేనని, కానీ ఇప్పుడు కాదు అసెంబ్లీలో చర్చిద్దామని కిరణ్ బేడీ సమాధానమిచ్చారు. కేజ్రీవాల్, కిరణ్ బేడీలు ఇద్దరూ అన్నా హజారే చేపట్టిన అవినీతి నిర్మూలన ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించారు. ఆ తర్వాత కేజ్రీవాల్ అమ్ ఆద్మీ పార్టీని స్థాపించారు. 49 రోజుల పాటు ఢిల్లీ ముఖ్యమంత్రిగా కూడా వ్యవహరించారు. -
కిరణ్ బేడీపై కట్జూ వివాదాస్పద వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: ప్రెస్ కౌన్సిల్ మాజీ చైర్మన్ జస్టిస్ మార్కండేయ కట్జూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసి విమర్శలపాలయ్యారు. ఢిల్లీ బీజేపీ ముఖ్యమంత్రి కిరణ్ బేడీ కంటే షాజియా ఇల్మీ అందగా ఉంటుందని కట్జూ ట్వీట్ చేశారు. అంతేగాక ఢిల్లీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా షాజియాను ప్రకటించివుంటే బీజేపీ విజయం సాధించేదని కట్జూ పేర్కొన్నారు. ప్రజలు అందంగా ఉన్నవారికే ఓటు వేస్తారంటూ మరో ట్వీట్ చేశారు. ఓటు హక్కు వినియోగించుకోని తనలాంటి వారు కూడా షాజియాకే ఓటు వేస్తారని కట్జూ ట్విట్టర్లో పేర్కొన్నారు. కట్జూ వ్యాఖ్యలను విమర్శిస్తూ నెటిజన్లు ట్వీట్లు చేశారు. -
బేడీ ర్యాలీకి మిశ్రమ స్పందన
న్యూఢిల్లీ: బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి కిరణ్ బేడీ మొదటిసారిగా త్రిలోక్పురిలో చేపట్టిన ఎన్నికల ర్యాలీకి ప్రజల నుంచి మిశ్రమ స్పందన లభించింది. గత సంవత్సరం అక్టోబరులో జరిగిన అల్లర్ల ప్రభావం కొట్టొచ్చినట్లు కనిపించింది. ర్యాలీ ప్రారంభంలో కొద్ది మందే హాజరవ్వగా, వీధుల్లోకి వె ళ్లేకొద్ది ప్రజలు తమ ఇళ్ల తలుపులు, కిటికీలు మూసేసుకున్నారు. అయితే మరో వర్గం ప్రజలు పూలతో స్వాగతం పలికారు. ఎమ్మెల్యే అభ్యర్థి కిరణ్ వైద్, ఆప్ మాజీ ఎమ్మెల్యే వినోద్కుమార్ బిన్నీలతో కలసి బేడీ ర్యాలీలో పాల్గొన్నారు. స్థానిక ప్రజలు చెప్పిన సమస్యలు సావ ధానంగా ఆలకించిన కిరణ్ బేడీ తమ పార్టీ అధికారంలోకి రాగానే అన్నింటిని పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. 2013 శాసన సభ ఎన్నికల్లో ఈ స్థానం నుంచి ఆప్ అభ్యర్థి మనీష్ శిసోడియా భారీ మెజారిటీతో గెలిచారు. యువత కోసం ప్రత్యేక కార్యక్రమం ఢిల్లీ శాసన సభ ఎన్నికల్లో బీజేపీ తన మేనిఫెస్టో ప్రకటించకపోయినా పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి కిరణ్ బేడీ మాత్రం తన సొంత ఆలోచనలతో ముందుకు వెళుతున్నారు. మహిళల రక్షణ కోసం బుధవారం ప్రత్యేక కార్యక్ర మం ప్రకటించిన ఆమె తాజాగా యువత అభివృద్ధికి 15 అంశాలతో మరో కార్యక్ర మం చేపడతామని ప్రకటించారు. దీనిలో భాగంగా నగరంలోని క్రీడా ప్రాంగణాలు, సౌకర్యాలు యువత కోసం పూర్తి స్థాయిలో ఉపయోగిస్తామని తెలిపారు. అంతేకాకుండా అన్ని ఆటల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలకు ఒకే ఛానల్ ద్వారా అనుమతులు ఇస్తామని ప్రకటించారు. -
'ఆనాడే కిరణ్ బేడీకి సీఎం పోస్ట్ ఆఫర్ చేశాం'
న్యూఢిల్లీ: ఢిల్లీ బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి కిరణ్ బేడీకి అప్పట్లోనే ఆ పదవిని ఇవ్వడానికి ఆఫర్ చేసినట్లు ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్ తాజాగా స్పష్టం చేశారు. గురువారం జాతీయ న్యూస్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటూర్యూలో కేజ్రీవాల్ ఈ వ్యాఖ్యలు చేశారు. గతంలో తమ పార్టీ పోటీకి దిగేనప్పుడే ఆమెకు సీఎం పదవిని ఆఫర్ చేశామని తెలిపారు. కిరణ్ బేడీ విధివిధానాలు నచ్చే తాము అప్పట్లో ఆ పదవికి ఆమెను ఆఫర్ చేశామన్నారు.అయితే ఆమె తాజాగా బీజేపీ తీర్థం పుచ్చుకోవడంతో తాను దిగ్బ్రాంతికి గురయినట్లు కేజ్రీవాల్ తెలిపారు. కిరణ్ బేడీని బీజేపీ ఎన్నికల్లో దింపి బలిపశువును చేసిందని కేజ్రీవాల్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా కిరణ్ బేడీ తనను విషపూరితమైన వ్యక్తిగా వ్యాఖ్యానించినా.. ఆమెపై తాను ఎప్పటికీ ఆ తరహా వ్యాఖ్యలు చేయబోనన్నారు. ఫిబ్రవరి 10 తరువాత కిరణ్ బేడీనీ బీజేపీ మరచిపోవడం ఖాయమని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. -
కిరణ్ బేడీకి రెండు ఓటరు కార్డులు
ఈసీ విచారణ ప్రారంభం న్యూఢిల్లీ: ఢిల్లీ బీజేపీ సీఎం అభ్యర్థి కిరణ్ బేడీకి వేర్వేరు చిరునామాలతో రెండు ఓటరు ఐడీ కార్డులున్న విషయం వెలుగుచూసింది. ఎన్నికల కమిషన్(ఈసీ) రికార్డుల ప్రకారం ఉదయ్పార్క్, తల్కతోరా లేన్ చిరునామాలతో ఆమెకు రెండు ఓటరు కార్డులు(టీజెడ్డీ1656909, ఎస్జెఈ0047969) ఉన్నాయి. నిబంధనలకు విరుద్ధంగా ఇవి ఎలా జారీ అయ్యాయో తేల్చేందుకు విచారణ ప్రారంభించామని, త్వరలోనే తుది నిర్ణయం తీసుకుంటామని ఈసీ తెలిపింది. మొదటి కార్డు(తల్కతోరా)ను తొలగించాలని ఆమె దరఖాస్తు చేశారో లేదో తెలుసుకుంటామంది. నామినేషన్ పత్రాల్లో ఆమె ఉదయ్పార్క్ చిరునామాలో ఉంటున్నట్లు పేర్కొన్నారు. ఈ ఉదంతంపై క్షుణ్ణంగా దర్యాప్తు జరిపించాలని ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) నేత అరవింద్ కేజ్రీవాల్ డిమాండ్ చేయగా మరోపక్క.. తన ప్రత్యర్థి కేజ్రీవాల్ ప్రతికూల వ్యక్తి అని, ఆయన బృందం అత్యంత విషపూరితమైందని బేడీ విమర్శించారు. కాగా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు మరికొద్ది రోజుల్లో జరగనుండడంతో బీజేపీ తన ముఖ్య నాయకుల్లో కొందరిని బుధవారం ఎన్నికల ప్రచారంలోకి దింపింది. కేంద్ర మంత్రులు సుష్మా, స్మృతి ఇరానీలు ఢిల్లీలో పలు చోట్ల ఎన్నికల సభల్లో ప్రసంగించారు. ప్రధాని మోదీ నాలుగు సభలో పాల్గొననున్నారు. కాగా, ప్రత్యర్థి పార్టీ సీనియర్ నేత ఒకరు తమ పార్టీకి చెందిన కొంతమంది అభ్యర్థులపై మీడియాలో దుష్ర్పచారం చేయడానికి కుట్రపన్నారని, దీనిపై ఈసీకి ఫిర్యాదు చేస్తామని కేజ్రీవాల్ తెలిపారు. -
ఆసక్తికరంగా మారిన ‘కృష్ణనగర్’ పోరు
సాక్షి, న్యూఢిల్లీ : బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి కిరణ్ బేడీ బరిలోకి దిగడంతో కృష్ణనగర్ నియోజకవర్గ పోరు ఆసక్తికరంగా మారింది. గత ఎన్నికల్లో ఇక్కడి నుంచి అప్పటి బీజేపీ సీఎం అభ్యర్థి హర్షవర్ధన్ పోటీ చేశారు. హర్షవర్ధన్ ఈ నియోజకవర్గానికి చిరపరిచితుడు కాగా కిరణ్ బేడీ పూర్తిగా కొత్త. మాజీ పోలీసు అధికారిణి వ్యక్తిత్వం, పనితీరు ఇక్కడివారికి సుపరిచితమే. ఈ నియోజకవర్గ అభ్యర్థిగా ప్రకటించినప్పటి నుంచి బేడీ విస్తృతంగా పర్యటిస్తూ ఓటర్లకు దగ్గరయ్యేందుకు యత్నిస్తున్నారు. ఆటోవాలాలు, టీవాలాలు, చిన్నారులు, యువత, మహిళలతో ముచ్చటిస్తూ అందరినీ ఆకట్టుకునేందుకు యత్నిస్తున్నారు. కమలానికి కంచుకోటగా ముద్రపడిన నియోజకవర్గాల్లో ఒకటైన కృష్ణనగర్ నుంచి కిరణ్బేడీ గెలుపొందే అవకాశముంది. అయితే ప్రత్యర్థులు మాత్రం ఆమెను ఎలాగైనా ఓడించాలని తహతహలాడుతున్నారు. ఇక్కడినుంచి ఈసారి పోటీచేస్తున్న అభ్య ర్థులంతా పంజాబీలే. కాంగ్రెస్ పార్టీ ఇక్కడి నుంచి బన్సీలాల్ను బరిలోకి దింపింది. లాల్... ఇక్కడివారికి సుపరిచితుడే. ఈ నియోజకవర్గం పరిధిలోని గీతాకాలనీ మున్సిపల్ వార్డు నుంచి ఆయన రెండుసార్లు కౌన్సిలర్గా ఎన్నికయ్యారు. మూడోసారి ఈ సీటు మహిళలకు రిజర్వ్ కావడంతో ఆయన తన భార్యను అభ్యర్థిగా నిలబెట్టారు. అయితే ఆమె ఓడిపోయారు. 2012 మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్పార్టీ....లాల్కు టికెట్ ఇవ్వలేదు. దీంతో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగి కాంగ్రెస్ అభ్యర్థికి ధరావత్తు కూడా దక్కకుండా చేశారు. ఈ నేపథ్యంలో లాల్... కిరణ్ బేడీకి కొంతమేర పోటీ ఇవ్వగలరని భావిస్తున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ ఇక్కడ నుంచి ఎస్.కె.బగ్గాకు టికెట్ ఇచ్చింది. లోక్సభ ఎన్నికల సమయంలో ఆయన కాంగ్రెస్ను వీడి ఆప్లో చేరారు. గత ఎన్నికల్లో ఆప్ అభ్యర్థి బయటి వ్యక్తే అయినప్పటికీ ఆయనకు గణనీయంగానే ఓట్లుపడ్డాయని, ఈసారి ఆప్ అభ్యర్థి స్థానికుడైనందువల్ల ఓట్ల సంఖ్య ఇంకా పెరగవచ్చని అంటున్నారు. -
పాలనా అనుభవం కలిగిన సీఎం అవసరం
న్యూఢిల్లీ: నగర మహిళకు భద్రతా భావం కలగాలంటే పరిపాలనా అనుభవం కలిగిన మహిళా ముఖ్యమంత్రి అవసరమని బీజేపీ ఎంపీ మీనాక్షి లేఖి పేర్కొన్నారు. తమ పార్టీ అధిష్టానం సీఎం అభ్యర్థిగా బరిలోకి దింపిన మాజీ ఐపీఎస్ అధికారిణి కిరణ్బేడీకి ఓటు వేయాలని ఆమె ఓటర్లకు విజ్ఞప్తిచేశారు. బుధవారం ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ అధికారంలోకి వస్తే చేయాల్సిన పనులకు సంబంధించి తమ పార్టీ అనేక ప్రణాళికలను రూపొందించిందన్నారు. ‘నగరంలో నివసిస్తున్న మహిళల సమస్యలను బాగా అర్థం చేసుకోవాలంటే పరిపాలనా అనుభవం కలిగిన మహిళా ముఖ్యమంత్రి అవసరం. మహిళా భద్రతకు సంబంధించి మా వద్ద అనేక ప్రణాళికలు సిద ్ధంగా ఉన్నాయి. అయితే అధికారంలోకి వస్తే మాత్రమే వాటిని అమలు చేయగలుగుతాం’ అని మీనాక్షి పేర్కొన్నారు. విధానసభ ఎన్నికల్లో విజయం సాధిస్తే మహిళల సౌకర్యం కోసం అనేకం అందుబాటులోకి తీసుకొస్తామని మీనాక్షి చెప్పారు. కమ్యూనిటీ పోలీసింగ్, మహిళా ట్యాక్సీలను వంటివి ప్రవేశపెడతామన్నారు. -
కేజ్రీవాల్కు కిరణ్ బేడీ నోటీసు
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ ఎన్నికలు కిరణ్ బేడీ, కేజ్రీవాల్ల వ్యక్తిగత పోరాటంగా మారిపోతున్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ఎన్నికల ప్రచార పోస్టర్లపై తన ఫోటోను ప్రచురించి అవకాశవాదిగా చిత్రీకరించటాన్ని ఖండిస్తూ బీజేపీ సీఎం అభ్యర్థి బేడీ ఆప్ సీఎం అభ్యర్థి కేజ్రీవాల్కు లీగల్ నోటీసును పంపించారు. కేజ్రీవాల్ తన ఫోటోను తన అనుమతి లేకుండా దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. తన ఫోటోను వాడటంపై, తనను అవకాశవాదిగా చిత్రీకరించడంపై సంజాయిషీ ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు. ఆప్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఢిల్లీలో ఆటోల వెనుక పోస్టర్లు అతికించింది. ఈ పోస్టర్లలో కేజ్రీవాల్, బేడీల ఫోటోలను ముద్రించింది. కేజ్రీవాల్ ఫోటో కింద నిజాయితీపరుడు, బేడీ ఫోటో కింద అవకాశవాది అని రాసి ఉంది. నిజాయితీపరుడైన కేజ్రీవాల్ లేదా అవకాశవాదియైన బేడీలలో ఒకరిని ఎన్నుకోవలసిందిగా ఓటర్లకు సూచించే ఈ పోస్టర్ల పట్ల బీజేపీ మండిపడింది. పార్టీ ఢిల్లీ అధ్యక్షుడు సతీష్ ఉపాధ్యాయ్ మాట్లాడుతూ అబద్ధాలు ప్రచారం చేయటం ఆప్కు ఓ అలవాటుగా మారిందన్నారు. కేజ్రీవాల్పై చర్య తీసుకోవాలని ఈసీని కోరతామని బేడీ చెప్పారు. ‘కేజ్రీవాల్ అభ్యర్థిత్వాన్ని రద్దు చేయండి’ మరోవైపు ఎన్నికల నియమావళిని కేజ్రీవాల్ ఉల్లంఘించారని, అందువల్ల ఆయన అభ్యర్థిత్వాన్ని రద్దు చేయాలని కాంగ్రెస్, బీజేపీలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాయి. ఓటర్లకు లంచాలు ఇస్తున్నారంటూ పార్టీ ప్రతిష్టను కేజ్రీవాల్ దెబ్బతీశారని బీజేపీ ఆరోపించగా, నామినేషన్లో తప్పుడు చిరునామా ఇచ్చారని కాంగ్రెస్ ఆరోపించింది. రాహుల్ రోడ్ షో... కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ఆరంభించారు. మంగళవారం దక్షిణ ఢిల్లీలో రోడ్ షో నిర్వహించారు. కాల్కాజీ, గోవింద్పురిల మీదుగా జరిగిన రోడ్ షోలో మాట్లాడుతూ ప్రధాని మోదీ మాటలు పెద్ద ఎత్తున మాట్లాడుతున్నారని, పనులు చేయడం లేదని ఆరోపించారు. దేశంలో ముగ్గురు నలుగురు పారిశ్రామిక వేత్తల పనులు మాత్రమే జరుగుతున్నాయన్నారు. తాము మళ్లీ అధికారంలోకి వస్తామని.. పేదలకు విద్యుత్తు, మంచినీటిని అతి తక్కువ ధరలకు అందిస్తామని రాహుల్ హామీ ఇచ్చారు. కేజ్రీవాల్కు ఈసీ మందలింపు.. కేజ్రీవాల్ను ఎన్నికల సంఘం తీవ్రంగా మందలించింది. ఢిల్లీ ఎన్నికల ప్రచార సభల్లో కాంగ్రెస్, బీజేపీల నుంచి లంచం తీసుకుని తన పార్టీకి ఓటేయాలని ఓటర్లను కోరడం ఎన్నికల నియమావళి ఉల్లంఘన కిందకు వస్తుందని హెచ్చరించింది. పలు మార్లు నోటీసులు ఇచ్చినప్పటికీ, పదే పదే ఆ విషయాన్ని ప్రస్తావించటం సరి కాదని స్పష్టం చేసింది. ఇలాంటి ప్రకటనలు పదే పదే చేస్తే తీవ్రమైన చర్య తీసుకోవలసి వస్తుందని తేల్చి చెప్పింది. బీజేపీ, కాంగ్రెస్ల ఫిర్యాదులపై ఈసీ కేజ్రీవాల్ను సంజాయిషీ కోరింది. ఆయన తన వివరణలో తన మాటల్ని సమర్థించుకున్నారు. ‘బీజేపీ, కాంగ్రెస్ వాళ్లు ఇచ్చే డబ్బులను తిరస్కరించకండి. తీసుకోండి. ఓటు మాత్రం ఆప్కు వేయండి. ఈ సారి వాళ్లను ఫూల్స్ చేద్దాం’ అని కేజ్రీవాల్ ఓటర్లకు చెప్పడం తెలిసిందే. -
కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు
-
చేయాల్సినవి చాలా ఉన్నాయ్.. అన్నీ చేస్తాం!
-
రిపబ్లిక్ డే పరేడ్ కు ఆహ్వానంపై రాజకీయాలు
సాక్షి, న్యూఢిల్లీ: గణతంత్ర వేడుకలకు ఆహ్వానంపై రాజకీయాలు మొదలయ్యాయి. తమ పార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్నువేడుకలకు ఆహ్వానించకపోగా, బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి కిరణ్ బేడీని విఐపీ ఎన్క్లోజర్లో ముందువరుసలో కూర్చోబెట్టారని ఆప్ నేత ఆశీష్ ఖేతాన్ విమర్శించారు. జాతీయ కార్యక్రమాలను రాజకీయ లబ్దికోసం ఉపయోగించుకోవడం ముఖ్యంగా ఎన్నికల సమయంలో ఉపయోగించుకోవడం బాధాకరమని ఆయన అభిప్రాయపడ్డారు.మాజీ ముఖ్యమంత్రిగా తనను గణతంత్ర దినోత్సవ పరేడ్ కు ఆహ్వానించకపోవడంపట్ల కేజ్రీ వాల్ రెండురోజుల కిందటే అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే మాజీ ముఖ్యమంత్రిని పరేడ్కు ఆహ్వానించే సంప్రదాయం లేదని బీజేపీ పేర్కొంది. సామాన్యుడినని చెప్పుకునే కేజ్రీవాల్కు ప్రత్యేకంగా ఎందుకు ఆహ్వానించాలని ఈశాన్య ఢిల్లీ ఎంపీ మనోజ్ తివారీ వ్యాఖ్యానిం చారు. పరేడ్కు హాజరుకావాలనుకుంటే కేజ్రీవాల్ సామాన్యుల మాదిరిగానే రావాలని ఆయన సూచించారు. అయితే కేజ్రీవాల్ను తోసిరాజని బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి కిరణ్బేడీనిపరేడ్కు ఆహ్వానించడం చర్చనీయాం శంగా మారింది. దీనిపై ఆప్ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. పరేడ్కు ఆహ్వానం అందాలంటే కేజ్రీవాల్.. బీజేపీలో చేరాలంటూ కిరణ్ బేడీ చేసిన వ్యాఖ్య ఈ వివాదాన్ని మరింత తీవ్రం చేసింది. -
మోదీ, బేడీ జోడీతోనే అభివృద్ధి
సాక్షి, న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ, ఢిల్లీ బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి కిరణ్ బేడీ జోడీతోనే ఢిల్లీ సమగ్రాభివృధ్ధి సాధ్యమని కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రి ఎం.వెంకయ్య నాయుడు అన్నారు. ఢిల్లీ భవిష్యత్తు కేంద్రంతో ముడిపడి ఉన్నందున ఢిల్లీలో బీజేపీకే పట్టం కట్టాలన్నారు. మంగళవారం సాయంత్రం వెంకయ్య నాయుడును ఆయన నివాసంలో కిరణ్ బేడీ కలుసుకున్నారు. ఢిల్లీలోని దక్షిణాది రాష్ట్రాల ఓటర్ల మద్దతు లభించేలా చూడాలని కోరారు. ఢిల్లీ అభివృధ్ధి కోసం కేంద్రం చేపట్టిన కార్యక్రమాల గురించి ఆయనను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వెంకయ్య మీడియాతో మాట్లాడుతూ.. ‘ఢిల్లీలో బీజేపీ అధికారంలోకి వచ్చాకే అక్రమ కాలనీల క్రమబద్ధీకరణ మొదలుకొని ట్రాఫిక్ రద్దీ నియంత్రణ, నిరుపేదలకు ఇళ్ల స్థలాల వంటి పనులు చేసింది. ఎన్నో ఏళ్లుగా అపరిషృ్కతంగా ఉన్న సమస్యలను పరిష్కరించింది. దక్షిణాది ఓటర్లు సహా మిగిలిన వారంతా ఎన్నికల్లో బీజేపీని గెలిపిస్తే మరింత అభివృధ్ధి సాధ్యమవుతుంది’ అని పేర్కొన్నారు. బీజేపీ వద్ద డబ్బులు తీసుకొని తమ పార్టీకి ఓటేయాలంటూ ఆప్ నేత అరవింద్ కేజ్రీవాల్ చేసినవ్యాఖ్యలపై వెంకయ్య ఘాటుగా స్పందించారు. ‘కాంగ్రెస్తో కలిసి అధికారం అందుకుని, అది సాధ్యంకాక పలాయనం చిత్తగించిన కేజ్రీవాల్ తీరును విమర్శిస్తూ సొంత పార్టీ నేతలే బయటకు వస్తున్నారు. డబ్బులు తీసుకోవాలంటూ తప్పుగా మాట్లాడితే ఢిల్లీ ప్రజలు సైతం బుద్ధిచెబుతారు’ అని అన్నారు. మెజార్టీ ఇవ్వకుంటే ప్రజలకే ఇబ్బంది: బేడీ ప్రస్తుత ఎన్నికల్లో బీజేపీకి సంపూర్ణ మెజారిటీ ఇవ్వకపోతే ఢిల్లీ ప్రజలు ఇబ్బంది పడటం ఖాయమని కిరణ్ బేడీ అన్నారు. బీజేపీకి పట్టం కడితేనే నగర ప్రజల వికాసంతోపాటు, మహిళా భద్రతకు తమ ప్రభుత్వం భరోసా ఇస్తుందన్నారు. తన అనుమతి లేకుండా తన ఫొటోలను ప్రచారానికి ఆప్ వాడుకోవడంపై ఆమె ఆగ్రహం వ్యక్తంచేశారు. అయితే దీనిపై న్యాయపోరాటం చేసేందుకు తన వద్ద తగినంత సమయం లేదని పేర్కొన్నారు. ఈ ఎన్ని కల్లో తమ పార్టీ గెలుపు తథ్యమంటూ ఆమె ధీమా వ్యక్తం చేశారు. -
'సబ్ కీ సాత్..సబ్ కీ వికాస్' నినాదంతోనే ప్రచారం
న్యూఢిల్లీ: మహిళల భద్రత, యువతకు ఉపాధి కల్పన, పేదలకు సౌకర్యాలు కల్పించడమే తన లక్ష్యమని బీజేపీ ఢిల్లీ ముఖ్యమంత్రి అభ్యర్థి కిరణ్ బేడీ తెలిపారు. సోమవారం సాక్షి టీవీకిచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. అనైతిక పద్ధతిలో కేజ్రీవాల్ ప్రచారం సాగుతోందన్నారు. తన అనుమతి లేకుండా తన ఫొటోతో దుష్ప్రచారం చేస్తున్నారని బేడీ ప్రత్యర్థులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీలో ఏర్పాటయ్యే ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వంతో సత్సంబంధాలుంటేనే రాష్ట్రంలో అభివృద్ధి సాధ్యమౌతుందని అభిప్రాయ పడ్డారు. ప్రధాని ఇచ్చిన 'సబ్ కీ సాత్..సబ్ కా వికాస్' నినాదాన్ని కేంద్ర బిందువుగా చేసుకొని తన ప్రచారాన్ని నిర్వహిస్తున్నానని కిరణ్ బేడీ తెలిపారు. -
నా ఫొటోతో నెగిటీవ్ ప్రచారం చేస్తున్నారు
న్యూఢిల్లీ: ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ అనైతిక పద్ధతుల్లో ప్రచారం చేస్తున్నారని ఢిల్లీ బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి కిరణ్ బేడీ విమర్శించారు. తన అనుమతి లేకుండా తన ఫొటోతో వ్యతిరేక ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. సోమవారం 'సాక్షి'కి కిరణ్ బేడీ ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. మహిళలకు భద్రత, యువతకు ఉపాధి, పేదలకు తక్కువ ధరకే విద్యుత్, తాగునీరు అందించడమే తన లక్ష్యమని కిరణ్ బేడీ చెప్పారు. ఢిల్లీ అభివృద్ధి చెందాలంటే కేంద్ర ప్రభుత్వంతో సత్సంబంధాలు అవసరమని పేర్కొన్నారు. మోదీ ఇచ్చిన సబ్ కా సాత్.. సబ్ కా వికాస్ నినాదంపై ప్రజలను ఓట్లు అడుగుతున్నాని తెలిపారు. ఈ రోజు ఆమె కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడుతో సమావేశమయ్యారు. -
భద్రతపై భరోసా కల్పిస్తూ బేడీ ప్రచారం
న్యూఢిల్లీ: ఎన్నికల ప్రచారం జోరందుకున్న నేపథ్యంలో బీజేపీ తరఫు ముఖ్యమంత్రి అభ్యర్థి కిరణ్బేడీ.. నగర మహిళలకు భద్రతపై భరోసా కలిగేలా హామీలు గుప్పిస్తున్నారు. ఐపీఎస్ అధికారిణిగా మూడు దశాబ్దాలకు మించిన తన పరిపాలనా అనుభవాన్ని రంగరించి ముందుకు సాగుతున్నారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే మహిళలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా సమర్థమంతమైన పాలన అందిస్తామని, వారికి భద్రత కల్పిస్తామని, ఉపాధితోపాటు సంక్షేమ పథకాలను అందుబాటులోకి తీసుకొస్తామని చెబుతున్నారు. పోలీసు అధికారిణిగా తనకున్న అనుభవంతో మహిళా భద్రతకు సంబంధించి ఎదురవుతున్న సమస్యలను ఆరు అంశాలతో కూడిన ప్రణాళికను అమలు చేయడంద్వారా పరిష్కరిస్తానని చెబుతున్నారు. తల్లిదండ్రులు, ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, పోలీసులు, ప్రాసిక్యూషన్, కారాగారా లు, మీడియా, రాజకీయ నాయకుల సహకారం తో ముందుకు సాగుతానని చెబుతున్నారు. బాలురు, బాలికల మధ్య సమానత్వం, మతబోధకుల ద్వారా సమాజానికి చక్కని సందేశాలను పంపడం తదితరాలు ఈ ప్రణాళికలో భాగంగా ఉన్నాయి. ఈ విషయమై కిరణ్బేడీ ఆదివారం మీడియాతో మాట్లాడుతూ ‘అన్ని మతాల ప్రబోధకులు ఇందులో కీలకపాత్ర పోషించాలి. మహిళల హుందాతనానికి సంబంధించి సమాజానికి సరైన సందేశాలు అందించాలి’ అని అన్నారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న మహిళా హెల్ప్లైన్ ద్వారా సమర్థమైన సేవలందిస్తామని చెప్పారు. విద్యుత్, తాగునీటి సమస్యలకూ చెక్ నగరవాసులు ఎన్నో ఏళ్లుగా ఎదుర్కొంటున్న తాగునీరు, విద్యుత్ కొరత సమస్యల పరిష్కారానికి శాయశక్తులా కృషి చేస్తానని బేడీ చెబుతున్నా రు. ఇందుకోసం బీజేపీ పాలిత హరియాణా ప్రభుత్వ సహకారం కూడా తీసుకుంటానని చెబుతున్నారు. ‘వేసవి సమీపిస్తోంది. అందువల్ల తాగునీరు, విద్యుత్ కొరత సమస్యల పరి ష్కారానికి ముందుగానే తగు జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. హరియాణా ప్రభుత్వ సహ కారం ఉన్నంతకాలం మనకు ఎటువంటి సమస్యలూ రావు. ఆ ప్రభుత్వం నగరానికి నీటి ని సరఫరా చేస్తుంది’ అని అన్నారు. ఇదిలాఉంచి తే సామాజిక మాధ్యమ వేదికల ద్వారా కిరణ్ బేడీ ఎప్పటికప్పుడు తన ఆలోచనలను నగరవాసుల ముందుంచుతున్నారు. ఇంకా రోడ్షోలు, ర్యాలీలు, స్థానికులతో సంభాషించడంద్వారా వారికి చేరువయ్యేందుకు యత్నిస్తున్నారు. స్వయంసహాయక బృందాలద్వారా శిక్షణ మహిళలకు సాధికారత కల్పించేందుకుగాను స్వయంసహాయక బృందాలద్వారా వారికి శిక్షణ ఇప్పిస్తామని కిరణ్బేడీ శనివారం ట్వీటర్లో పేర్కొన్నారు. దీంతోపాటు గ్రామీణ, పట్టణ మహిళలపైనా దృష్టి సారిస్తామన్నారు. మహిళల కు భద్రత కల్పించే విషయంలో స్వచ్ఛంద సంస్థ లు కూడా కీలకపాత్ర పోషించాలన్నారు. ఇందు లో పాలుపంచుకునే ఎన్జీఓలకు ప్రభుత్వం నుం చి అవసరమైన నిధులను అందిస్తామన్నారు. మహిళా భద్రతలో భాగంగా సివిల్ డిఫెన్స్ వాలంటీర్లను అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. ‘మన్ కీ బాత్’ తరహాలో ‘దిల్లీ కీ బాత్’ అధికారపగ్గాలు చేపట్టిన తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన ‘మన్ కీ బాత్’ మాదిరిగానే తాను కూడా ‘ఢిల్లీ కీ బాత్’ కార్యక్రమాన్ని నగరవాసులకు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. కెరీర్ మేళాలు నిర్వహిస్తాం ప్రస్తుతం నగరంలో అందుబాటులో ఉన్న కళాశాలలు, పాఠశాలల్లో వృత్తివిద్యలో సాయంత్రం వేళ శిక్షణ ఇస్తామని బేడీ చెప్పారు. కార్పొరేట్, విద్యాసంస్థల సహకారంతో కెరీర్ మేళాలను నిర్వహిస్తామన్నారు. తద్వారా ఉపాధి అవకాశాలను మెరుగుపరుస్తామన్నారు. తాను పైన చెప్పిందంతా రాజకీయ ప్రకటన కాదని, ఇదొక సామాజిక విప్లవం తీసుకొచ్చే ప్రయత్నమని వివరించారు. -
ఫోర్త్ ఎస్టేట్ : ఆప్ కీ బీజేపీ
-
'నాపై కిరణ్ బేడీ పోటీ చేయాల్సింది'
న్యూఢిల్లీ: బీజేపీ సీఎం అభ్యర్థి కిరణ్ బేడీపై ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్ మాటల యుద్ధం కొనసాగిస్తూనే ఉన్నారు. తాను పోటీకి దిగిన ఢిల్లీ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కిరణ్ బేడీ పోటీ చేస్తే బాగుండేదని కేజ్రీవాల్ తాజాగా పేర్కొన్నారు. తామిద్దరం అవినీతిపై ఉద్యమిస్తున్నా.. ప్రస్తుత పోటీ మాత్ర వేర్వేరు నియోజకవర్గాల నుంచి జరగడం పెద్దగా ఆసక్తినివ్వడం లేదన్నారు. త్వరలో జరుగనున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కేజ్రీవాల్-బేడీల మధ్య ప్రధాన పోటీ జరుగుతున్నా.. అది సీఎం అభ్యర్థుల వరకే పరిమితమయ్యింది. ఢిల్లీ నియోజకవర్గం నుంచి కేజ్రీవాల్ బరిలోకి దిగుతుండగా, బేడీ మాత్రం బీజేపీకి మంచి పట్టున్నకృష్ణా నగర్ నుంచి పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కేజ్రీవాల్ వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. ఇప్పటికే నామినేషన్లు ప్రక్రియ పూర్తయిన తరుణంలో కేజ్రీవాల్ మరోసారి బేడీని టార్గెట్ చేశారు. 'ఈసారి నాకు ప్రధానమైన అభ్యర్థి కిరణ్ బేడీ. గతంలో నేను మూడు సార్లు సీఎం పదవిని చేపట్టిన షీలా దీక్షిత్ పై పోటీ చేసి గెలిచా. కిరణ్ బేడీ అక్కడి (కృష్ణా నగర్) నుంచి కాకుండా ఢిల్లీలో పోటీకి దిగాల్సింది' అని కేజ్రీవాల్ స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా ట్విట్టర్ నుంచి తన అకౌంట్ ను బేడీ తొలగించడంపై కేజ్రీవాల్ ఆవేదన వ్యక్తం చేశారు. తన అకౌంట్ ను ఆమె ఎందుకు బ్లాక్ చేశారో తెలియదని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. తాను ఎప్పుడూ ట్విట్టర్ లో మర్యాదపూర్వకమైన భాషనే వాడుతున్నా.. తన అకౌంట్ తొలగించడం ఇప్పటికీ నమ్మశక్యంగా లేదన్నారు. -
బీజేపీ బ్రహ్మాస్త్రం.. కిరణ్బేడీ
బేడీపై శాంతి భూషణ్ ప్రశంసలు సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ప్రయోగించిన బ్రహ్మాస్త్రం కిరణ్ బేడీ అని ఆమ్ ఆద్మీపార్టీ(ఆప్) వ్యవస్థాపక సభ్యుడు, ప్రముఖ న్యాయవాది శాంతి భూషణ్ అన్నారు. కిరణ్ బేడీని పార్టీలో చేర్చుకోవడం, ముఖ్యమంత్రి అభ్యర్థిని చేయడం బీజేపీ మాస్టర్ స్ట్రోక్ అని గురువారం విలేకరులతో అన్నారు. కిరణ్బేడీ ఢిల్లీ ముఖ్యమంత్రి అయితే అన్నా హజారే ఎంతో సంతోషిస్తారని శాంతిభూషణ్ వ్యాఖ్యానించారు. అవినీతికి వ్యతిరేకంగా అన్నాహజారే చేసిన పోరాట ప్రభావం బేడీపై తీవ్రంగా ఉందని.. ఆమె బీజేపీలో చేరటం ఎన్నికల్లో ఆ పార్టీ ప్రత్యర్థులకు తిరుగులేని దెబ్బ అని అన్నారు. కిరణ్ బేడీ తనకు బాగా తెలుసునని ఆమె ముఖ్యమంత్రి అయితే ఢిల్లీకి నిజాయితీతో కూడిన సర్కారును అందిస్తారని చెప్పారు. అయితే తాను కిరణ్ బేడీని మాత్రమే సమర్థిస్తున్నానని, బీజేపీని కాదని కూడా ఆయన స్పష్టం చేశారు. కిరణ్ బేడీ ఆప్ తరపున సీఎం అయితే బాగుండేదని చెప్పారు. ఆప్లో ఏదీ సక్రమంగా లేదని, వ్యవస్థాపక సిద్ధాంతాల నుంచి ఆ పార్టీ పక్కదారి పట్టిందని ఈ విషయం పై పార్టీ పున:సమీక్ష జరపాలని శాంతిభూషణ్ అభిప్రాయపడ్డారు. పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ అధికార పిపాసి అని ఆయన ఆరోపించారు. కేజ్రీవాల్ కన్నా అజయ్ మాకెన్ మెరుగైన సీఎం అభ్యర్థి అని అభిప్రాయపడ్డారు. పార్టీ నేషనల్ కౌన్సిల్ దారితప్పిన కేజ్రీవాల్ను పార్టీ కన్వీనర్ పదవి నుంచి తప్పించాలని ఆయన అభిప్రాయపడ్డారు. కాగా, కిరణ్బేడీ శాంతి భూషణ్కు కృతజ్ఞతలు తెలియజేశారు. ఆప్లో కలకలం: శాంతి భూషణ్ వ్యాఖ్యలు ఆప్లో తీవ్ర కలకలాన్ని సృష్టించాయి. పార్టీ కన్వీనర్ కేజ్రీవాల్ మాట్లాడుతూ.. పార్టీలోని అంతర్గత ప్రజాస్వామ్యానికి శాంతిభూషణ్ వ్యాఖ్య లు ప్రతిబింబమని కేజ్రీవాల్ తెలిపారు. శాంతి భూషణ్కు అన్ని విషయాలు తెలిసినట్టు లేదని తాము తెలియజెప్తామని అన్నారు. శాంతి భూషణ్ కుమారుడు ప్రశాంత్ కూడా తండ్రి మాటలను ఖండించారు. ఆ మాటల్లో తప్పు లేదు... కాంగ్రెస్, బీజేపీల నుంచి డబ్బులు తీసుకుని ఆమ్ ఆద్మీ పార్టీకి ఓటేయమని తాను అనటంలో తప్పేమీ లేదని అరవింద్ కేజ్రీవాల్ గురువారం అన్నారు. రాజకీయాల్లో స్వచ్ఛత కోసమే తాను ఆ మాటలన్నానని స్పష్టం చేశారు. ఆ రెండు పార్టీలు ఎన్నికల సందర్భంగా పంచి పెట్టేది పూర్తిగా నల్లధనమని, ఆ సొమ్ముల్ని తీసుకుని వాటికి ఓటు వేయవద్దని చెప్పటం లంచాన్ని ప్రోత్సహించినట్లు కాదని ఆయన అన్నారు. కాగా, కేజ్రీవాల్ వ్యాఖ్యలపై షోకాజ్ నోటీసు ఇచ్చిన ఈసీ.. ఆయన జవాబివ్వటం కోసం మరో రెండు రోజులు గడువిచ్చింది. అరవింద్ కేజ్రీవాల్ మాటలను యునెటైడ్ జనతాదళ్ అధ్యక్షుడు శరద్ యాదవ్ సమర్థించారు. కేజ్రీవాల్కు ఇచ్చిన షోకాజ్ నోటీసును వెనక్కి తీసుకోవాలని ఈసీకి లేఖ రాశారు. ఎన్నికల బరిలో 693 మంది నామినేషన్ల పరిశీలన అనంతరం ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి నిలిచిన అభ్యర్థు లు 693మంది అని ఎన్నికల సంఘం తెలి పింది. 923 మంది నామినేషన్ వేయగా, 230 నామినేషన్లను తిరస్కరించారు.