NDA alliance
-
బడ్జెట్లో ఏపీకి నిల్!
విజయవాడ, సాక్షి: ఎన్డీయే కూటమి సర్కార్లో టీడీపీ, జేడీయూలు కీలక భాగస్వాములుగా ఉన్నాయి. బిహార్కు ప్రత్యేక హోదా సాధ్యం కాదని తేల్చిచెప్పిన కేంద్రం.. వీలుచిక్కినప్పుడల్లా ఆర్థికంగా ప్యాకేజీలు ఇస్తూ వస్తోంది. అదే ఏపీ విషయంలో అటు ప్రత్యేక హోదా, ఇటు ప్యాకేజీ రెండూ ఇవ్వడం లేదు. కానీ, బాబు సర్కార్కు అప్పులిప్పించడంలో సాయం చేస్తోంది. ప్చ్.. ఇప్పుడు బడ్జెట్లోనూ ఇదే వివక్ష ప్రదర్శించింది. నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్(Union Budget 2025) ప్రసంగంలో ఎక్కడా ఆంధ్రప్రదేశ్ ప్రస్తావన కానరాలేదు. పోనీ.. రాష్ట్రాల వారీగా విడుదల చేసిన జాబితాలోనూ ఏపీ పేరు ఉందా? అంటే అదీ లేదు. కొత్త ప్రాజెక్టులేవీ ప్రకటించలేదు. సరికదా.. అమరావతి, మెట్రో రైల్.. లాంటి కీలకాంశాల గురించి ప్రస్తావించలేదు. టీడీపీ(TDP)కి ప్రస్తుతం 21 మంది ఎంపీలు ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం.. చంద్రబాబు మీదే ఆధారపడి నడుస్తోందంటూ టీడీపీ గప్పాలు కొట్టుకుంటోంది. అలాంటిది ప్రత్యేక కేటాయింపులను సాధించడంలో ఇటు చంద్రబాబు, అటు బీజేపీకి దగ్గరైన పవన్ కల్యాణ్లు ఘోరంగా విఫలమయ్యారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. బిహార్ విషయంలో.. గత ఏడాది సార్వత్రిక ఎన్నికల తర్వాత జులైలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో కూడా రహదారుల అభివృద్ధి, గంగానది రెండు లైన్ల వంతెన నిర్మాణం, విద్యుదుత్పత్తి కేంద్రం వంటి పలు ఆర్థిక వరాలు ఇచ్చింది. ఏపీకి మాత్రం అరకోర నిధులను పడేస్తోంది. -
‘సూపర్ సిక్స్’ ఇవ్వలేం
తల్లికి వందనంపై ఇక తర్జన భర్జన లేదు.. 46 లక్షల మంది తల్లులకు షాక్! అన్నదాతా సుఖీభవపై ఆలోచనే అనవసరం.. 54 లక్షల మంది రైతన్నల్లో నిర్వేదం! ఆడబిడ్డ నిధి కింద ఏటా రూ.18 వేల సాయం గల్లంతే.. 1.80 కోట్ల మంది అక్క చెల్లెమ్మల ఆక్రందన! నిరుద్యోగ భృతి నీటి పాలేనని కోటి మంది యువతలో తీవ్ర ఆందోళన!సూపర్ సిక్స్లు.. సెవెన్లు ఇక గాలిలో కలిసినట్లే! ఎందుకంటే.. సూపర్ సిక్స్లు కావాలంటే ఏపీ వృద్ధి రేటు 15 శాతానికి పెరగాలి! అందుకే.. విజన్ 2047 డాక్యుమెంట్లను ఇంట్లో భద్రంగా దాచుకోమని తనను నమ్మి ఓట్లు వేసిన ప్రతి ఒక్కరికీ సీఎం చంద్రబాబు పరోక్షంగా చెప్పేశారు! ప్రెస్ మీట్ సాక్షిగా వారిలో ఏ మూలో దాగిన ఆశలను పటాపంచలు చేశారు!! సాక్షి, అమరావతి: ఇందుమూలంగా ఐదున్నర కోట్ల మంది ప్రజానీకానికి తెలియచేయునది ఏమనగా.. సంపద సృష్టించాకే సూపర్ సిక్స్ హామీలను అమలు చేస్తామంటూ ఎన్నికల వాగ్దానాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు చేతులెత్తేశారు! తన మార్కు రాజకీయాన్ని ప్రజలకు మరోసారి రుచి చూపించారు. మోకాలికి బోడి గుండుకు ముడిపెడుతూ.. సూపర్ సిక్స్ హామీలకు, వృద్ధి రేటుకు లంకె పెట్టారు! కేంద్రం ఇస్తున్న డబ్బులతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి.. సంపద సృష్టించి.. ఆదాయం పెరిగితే.. అప్పుడు రైతు భరోసా, తల్లికి వందనం అమలు చేస్తామని వెల్లడించారు. గాడి తప్పిన ఆర్థిక వ్యవస్థను గాటన పెట్టేందుకు తొమ్మిదేళ్లు పడుతుందో పదేళ్లు పడుతుందో అంతుబట్టడం లేదంటూ కాడి పారేశారు. సూపర్ సిక్స్లు.. సెవెన్లు అంటూ ఎన్నికల హామీలతో ఊరించి ఏడు నెలల పాటు దాగుడు మూతలతో నెట్టుకొచ్చిన సీఎం చంద్రబాబు ఎట్టకేలకు ముసుగు తొలగించారు! వాస్తవ పరిస్థితిని చెప్పి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నానంటూ తన మనసులో ఎప్పుడో ఆవిష్కృతమైన వాటిని కుండబద్ధలు కొట్టారు. రాష్ట్రాల ఆర్ధిక ఆరోగ్య సూచికలపై నీతి ఆయోగ్ నివేదిక ఆధారంగా సీఎం చంద్రబాబు సోమవారం సచివాలయంలో విలేకరుల సమావేశంలో ప్రజెంటేషన్ ఇచ్చారు. అబ్బే... ఇప్పుడు చేయలేం...! రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ) ఏటా 15 శాతం మేర పెరిగి తద్వారా ఆదాయం, సంపద సమకూరిన తరువాతే సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. రాబడి తగ్గుతోందని.. ప్రజలందరూ దీన్ని అర్థం చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నానన్నారు. ఇప్పుడు సూపర్ సిక్స్ పథకాల అమలుకు వెసులుబాటు లేదని, అవకాశం ఉంటే ఒక్క నిమిషం కూడా జాప్యం చేయనని చెప్పారు. వృద్ధి రేటు పెరిగి సంపద, ఆదాయం పెరిగితేనే వెసులుబాటు వస్తుందని, అప్పటి వరకు సూపర్ సిక్స్ అమలులో జాప్యం తప్పదని సీఎం స్పష్టం చేశారు. వీటితో మాకేం సంబంధం? బాబు చేస్తారని ఓటు వేశామని, హామీలు అమలు చేయాలనే విధంగా సామాన్య ప్రజలు ఆలోచన చేస్తున్నారని, అందుకే వాస్తవ పరిస్థితిని చెప్పి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నానని వెల్లడించారు. నమ్మి ఓట్లు వేశాం కదా..! ఇంకా హామీలను అమలు చేయడం లేదని కొంత మంది ఆలోచన చేస్తున్నారని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. డబ్బులున్నాయి కదా..! ఎందుకు అమలు చేయడం లేదు? నమ్మి ఓట్లు వేశాం కదా..! అనే ఫీలింగ్లోకి ప్రజలు వెళ్తున్నారని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం నుంచి పోలవరానికి రూ.12,150 కోట్లు రాగా, అమరావతికి రూ.15,000 కోట్లు వచ్చాయని, విశాఖ ఉక్కు రివైవ్ (పునరుద్ధరణ)కు రూ.11,114 కోట్లు ఇచ్చిందని, అయితే వాటిని సంక్షేమానికి వ్యయం చేయలేనని చంద్రబాబు పేర్కొన్నారు. తొమ్మిదేళ్లు పడుతుందో.. పదేళ్లు పడుతుందో..! గాడి తప్పిన ఆర్ధిక వ్యవస్థను పునరుద్ధరించే ప్రయత్నం చేస్తున్నానని, ఇందుకు తొమ్మిదేళ్లు పడుతుందో పదేళ్లు పడుతుందో తెలియడం లేదని, సూపర్ సిక్స్ హామీల అమలుకు లేట్ అవుతుందని చంద్రబాబు చెప్పారు. విశ్వ ప్రయత్నం చేసినా ఇంకా పూర్తిగా కంట్రోల్లోకి రాలేదన్నారు. ఆర్ధికంగా వెసులుబాటు వచ్చిన తరువాత సంపద సృష్టించడం ద్వారా ఆదాయం పెంచిన అనంతరం సంక్షేమ పథకాలను అమలు చేస్తానన్నారు. అందుకే ప్రజలకు వాస్తవాలు చెబుతూ అవగాహన కల్పిస్తున్నామన్నారు. గత ప్రభుత్వం ఎక్కువ అప్పులు చేసింది.. గత ప్రభుత్వం ఎక్కువ అప్పులు చేసిందని, మూలధన వ్యయం తక్కువ చేసిందని, దీంతో వృద్ధి తగ్గిపోయిందని చంద్రబాబు పేర్కొన్నారు. గత ప్రభుత్వం నిర్వాకం కారణంగా వృద్ధి రేటు తగ్గిపోయి అప్పులు పెరిగాయన్నారు. రెవెన్యూ మాత్రం పెరగలేదన్నారు. తద్వారా ఏడాదికి రూ.76 వేల కోట్లు నష్టపోతున్నట్లు చెప్పారు. అభివృద్ధిపై డబ్బులు వ్యయం చేయడం ద్వారా 15 శాతం వృద్ధి సాధించే ప్రయత్నం చేస్తున్నానని, తద్వారా సంపద వస్తుందని, దాన్ని సంక్షేమానికి వెచ్చిస్తానని తెలిపారు. శ్రీలంకలా రాష్ట్రం.. ప్రజల కోరికలు తీర్చాలంటే రెవెన్యూ రాబడి పెరగాల్సి ఉందని సీఎం చంద్రబాబు తెలిపారు. రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థతో పాటు మిగతా వ్యవస్థలను గాడిలో పెట్టేందుకు చర్యలు తీసుకుంటున్నానని, అయితే ఇందుకు ఇంకా సమయం పడుతుందన్నారు. రాష్ట్రం శ్రీలంకలా అవుతోందని గతంలోనే చెప్పానని, ఇప్పుడు నీతి ఆయోగ్ కూడా రాష్ట్ర ఆరోగ్య సూచికల్లో అదే చెప్పిందన్నారు. గత ప్రభుత్వం అప్పులు చేసి జల్సాలు చేసిందని సీఎం చంద్రబాబు ఆరోపించారు. అప్పులు తీర్చే స్థోమత కూడా లేకుండా చేసిందన్నారు. కచ్చితంగా వ్యయం చేయాల్సిన వేతనాలు, పెన్షన్లు, వడ్డీల చెల్లింపు, పరిపాలన వ్యయం గత ప్రభుత్వంలో 64.6 శాతానికి పెరిగిందన్నారు. మరో పక్క మూలధన వ్యయం తగ్గిపోయిందన్నారు. టీడీపీ మేనిఫెస్టోలో ఇతర హామీలివీ...⇒ పూర్ టు రిచ్.. పీ–4 పథకాలు అంటూ ఇంతవరకు ఏ ఒక్కటీ ప్రకటించలేదు ⇒ ఏటా జాబ్ క్యాలెండర్ జాడే లేదు ⇒ బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనారిటీలకు 50 ఏళ్లకే రూ.4 వేల పింఛను హామీ మేనిఫెస్టోకే పరిమితం. ⇒ రూ.5 వేల కోట్లతో ఆదరణ పథకం పునరుద్ధరణ అమలు చేయలేదు ⇒ ఉద్యోగుల సీపీఎస్, జీపీఎస్ విధానాన్ని పునఃసమీక్షిస్తామని చెప్పి కనీసం చర్చ కూడా జరపలేదు ⇒ అధికారంలోకి రాగానే ఉద్యోగులకు ఐఆర్, డీఏ ప్రకటిస్తామనే హామీని విస్మరించారు ⇒ వలంటీర్ల గౌరవ వేతనాన్ని రూ.5 వేల నుంచి రూ.10 వేలకు పెంచకపోగా ఏకంగా ఆ వ్యవస్థకే మంగళం పాడారు ⇒ కాపుల సంక్షేమ కోసం ఐదేళ్లలో రూ.15 వేల కోట్లు కేటాయిస్తామని బడ్జెట్లో అందుకు తగ్గట్టు నిధులు ఇవ్వలేదు ⇒ విద్యుత్ బిల్లుల భారం తగ్గించకపోగా ఆర్నెల్లలోనే రూ.15 వేల కోట్లకుపైగా చార్జీల భారం మోపారు. ⇒ ఉచితంగా ఇసుక అంటూ పచ్చముఠాల దోపిడీ విధానాన్ని తీసుకొచ్చారు. -
బీజేపీకి షాక్.. కూటమికి సీఎం నితీష్ కుమార్ గుడ్బై.. ఎక్కడంటే?
ఇంఫాల్ : బీహార్ సీఎం నితిష్ కుమార్ (cm nitish kumar) బీజేపీకి ఝలక్ ఇచ్చారు. మణిపూర్ (manipur) బీజేపీ (bjp) నేతృత్వంలోని ఎన్డీయే కూటమితో జనతా దళ్ (యునైటెడ్) తెగదెంపులు చేసుకుంటున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు జేడీయూ యూనిట్ అధినేత కాష్ బీరెన్ సింగ్ రాష్ట్ర అధికార బీజేపీకి మద్దతు ఉప సంహరించుకుంటున్నట్లు మణిపూర్ గవర్నర్ అజయ్ కుమార్ బహ్లాకు లేఖ రాశారు. ప్రతిపక్ష బాధ్యత వహిస్తారని సూచించారు.మణిపూర్లో తమపార్టీకి చెందిన ఏకైక ఎమ్మెల్యే ఎండీ అబ్దుల్ నసీర్కు అసెంబ్లీలో ప్రతిపక్ష స్థానంలో సీటును కేటాయించాలని కోరారు. ఇకపై రాష్ట్రంలో బీజేపీకి జేడీయూ మద్దతు ఉండబోదని, అసెంబ్లీలో సైతం ప్రతిపక్ష పాత్రకే పరిమితమవుతారని లేఖలో పేర్కొన్నారు. గతంలో బీజేపీకి కాన్రాడ్ సంగ్మా నేతృత్వంలోని నేషనల్ పీపుల్ పార్టీ మద్దతు ఉపసంహరించుకుంది. తాజాగా, జేడీయూ సైతం కమలానికి గుడ్ బై చెప్పడం మణిపూర్ రాష్ట్ర రాజకీయాలు చర్చాంశనీయంగా మారాయి. 2022 మణిపూర్ అసెంబ్లీ ఎన్నికల్లో జేడీయూ ఆరు స్థానాలను గెలుచుకుంది. అయితే ఎన్నికలు ముగిసిన కొన్ని నెలల తర్వాత ఐదురుగు జేడీయూ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరారు. 60 మంది సభ్యుల అసెంబ్లీలో ప్రస్తుతం బీజేపీకి 37 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. బీజేపీకి నాగా పీపుల్స్ ఫ్రంట్కు చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలు, ముగ్గురు స్వతంత్రులు మద్దతిస్తున్నారు. బీజేపీకి మద్దతు ఉపసంహరించుకుంటే బీహార్లో అభివృద్ది ఆగిపోతుందనే అనుమానాల్ని జేడీయూ నేతలు కొట్టి పారేస్తున్నారు. కేంద్ర ఎన్డీఏ కూటమిలో జేడీయూ ప్రముఖ పాత్ర పోషిస్తుంది. కాదు కూడదు అంటే .. అది బీజేపీకే నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని అంటున్నారు. -
కాంతి లేని కూటమి పాలన
ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో అపూర్వ విజయం సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి ఏడు నెలల పాలన పూర్తి చేసుకుంది. పాలనపై తనదైన ముద్ర వేయ డానికి ఇది సరిపడ సమయంగానే భావించ వచ్చు. అందునా, 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా సుదీర్ఘ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ఉన్న ప్రభుత్వం కాబట్టి 7 నెలలు గణనీయమైన సమయంగానే పరిగణించాలి. ముందుగా, ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాల అమలు విషయానికి వస్తే పెద్దగా చెప్పుకోడానికి ఏమీలేదు. ‘నీకు 15,000... నీకు 15,000’గా పాపులర్ అయిన ‘తల్లికి వందనం’ పథకాన్ని వచ్చే విద్యా సంవత్సరానికి ఇస్తామని తాజగా ప్రకటించి మరో వాయిదా వేశారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే, ఈ పథకం మునుపు జగన్ ప్రభుత్వం ఇచ్చిన ‘అమ్మ ఒడి’కి పేరు మార్పు పథకం. అంటే, ఉన్న పథకానికి తిలోదకాలు ఇచ్చి కొత్త పథకం ఇవ్వకుండా ‘అప్పు రేపు’ తరహా గోడ మీద రాత గారడీ చేయడమే! ‘దీపం’ పథకాన్ని చంద్రబాబు మార్కు చాకచక్యంతో ముందుగానే అరకొరగా అమలు చేసే ప్రణా ళిక సిద్ధం చేశారు. ఇరవై లక్షల ఉద్యోగాలు లేదా నిరుద్యోగ భృతి ఇస్తాము అన్న హామీపై నోరు మెదపట్లేదు. అలాగే, ప్రతి మహిళకూ సంవత్సరానికి రూ. 18,000 ఇస్తా మంటూ చేసిన వాగ్దానమూ అటకెక్కినట్టే ఉంది. మహిళలకి ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం ఉగాదికి అని వస్తున్న వార్తల్లో నిజం ఎంతో వేచి చూడాలి. రైతులకు వాగ్దానం చేసిన సంవత్సరానికి 20 వేల రూపాయల పథకం రేపో మాపో అని దాటేస్తున్నారు – ఇది కూడా గత ప్రభుత్వం ఇచ్చిన పథకమే అయినప్పటికీ వారు ఇచ్చిన రూ. 13,500 కూడా గడచిన సంవత్సరానికి ఇంకా ఇవ్వనేలేదు. వెరసి, ‘సూపర్ సిక్స్’ హమీలలో ఒక్కటి కూడా చిత్త శుద్ధితో అమలు చెయ్యలేదు అనేది సుస్పష్టం.‘నాడు–నేడు’ పథకం ద్వారా పెక్కు ప్రభుత్వ బడులను జగన్ ప్రభుత్వం ఆధునీకరించి, మరుగుదొడ్ల నిర్వహణకై ప్రత్యేక నిధులు కేటాయించి, పిల్లలకి స్వచ్ఛమైన వాతావరణం కల్పిస్తూ అధ్యాపకులకీ, పిల్లల తల్లి–తండ్రులకీ పర్యవేక్షణ అప్పజెబితే, లోకేష్ అధ్యాపకులకు ఉపశమనం పేరిట పర్యవేక్షణ పద్ధతికి తూట్లు పొడిచారు. పేద పిల్లలకు ఇంగ్లీషు చదువు చెప్పించి విప్లవాత్మకమైన మార్పులు జగన్ తెస్తే, మాతృ భాష పేరుతో సదస్సులు పెట్టి తమ అస్మదీయులైన మాజీల నోటితో ఆ పథకానికి తెర దించే కార్యక్రమం మొదలు పెట్టారు. బుడమేరు వరద తీవ్రతను ముందుగానే అంచనా వేయలేక పోవటం, ప్రజలని సురక్షిత ప్రాంతాలకి తరలించలేకపోవటంలో ప్రభుత్వ అలసత్వం కొట్టొచ్చినట్లు కనిపించింది. అధికార లెక్కల ప్రకారంగానే 45 మంది చనిపోయారంటే ధన, ప్రాణ నష్టం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోచ్చు. ప్రభుత్వంలో ఉన్నవారే అత్యంత సున్నితమైన తిరుపతి లడ్డూ వివాదానికి తెరలేపటం చాలా దిగజారుడు చర్యగా నిలిచిపోతుంది. ఆ సందర్భంగా పవన్ కల్యాణ్ చేసిన సనాతన ధర్మ పరిరక్షణ హావభావ కేళి రాష్ట్ర రాజకీయ చరిత్రలోనే ఒక చెరగని మచ్చగా మిగిలిపోతుంది.పవన్ కల్యాణ్ ప్రతి విషయానికీ గత ప్రభుత్వానిదే బాధ్యత అనడం ఒక రివాజుగా పెట్టుకున్నారు. అది ఎంత చవకబారు స్థాయికి చేరిందో ఇటీవల జరిగిన ‘గేమ్ ఛేంజర్’ సినిమా ఈవెంట్కి వచ్చి రోడ్డు ప్రమాదంలో అసువులు బాసిన ఇద్దరు యువకుల ఉదంతం చెబుతుంది. కనీసం ఆ కుర్రాళ్లు చనిపోయిన రహదారి తీరు ఎలా ఉందో తెలుసుకోకుండా జగన్ రోడ్లు బాగు చేయకపోబట్టే వారు చనిపోయారు అని ఒక ఉప ముఖ్యమంత్రి అనడం సిగ్గు చేటు. మరుసటి రోజు స్వయానా ఆయనే వెళ్లి సంఘటనా స్థలాన్ని పరిశీలించిన చిత్రాలలో చక్కని రోడ్డు కనిపిస్తూనే ఉంది. పై పెచ్చు యువతను బైక్ స్టంట్లు చేయమని, సైలెన్సర్లు తీసేసి రచ్చ చేయమని ఒక సినీ వేదిక పైనుంచి పిలుపు నివ్వడం అత్యంత హేయమైన చర్య. రాష్ట్రంలో జరిగిన ప్రతిపక్ష కార్య కర్తల బహిరంగ హత్యలు, నేతల అరెస్టులు ఒక ఎత్తయితే, సోషల్ మీడియా కార్యకర్తలపై పెట్టిన వేల కొలది కేసులు బహుశా రాష్ట్ర చరిత్రలోనే కనివిని ఎరుగం. చంద్రబాబు వాగ్దానాలు నీటిమూటలనే విషయం ఇప్పుడు కళ్ళు తెరిచి పరిశీలించగలిగే ఎవరికైనా అర్థమవుతుంది. ‘సూపర్ సిక్స్’ అని హమీ ఇచ్చిన వారికే వాటిపై విశ్వాసం లేదు అనేది ఇప్పుడు అందరికీ విదితమయ్యింది. అయితే, ఇవన్నీ తెలిసే ఈ రాష్ట్ర ప్రజలు అటువంటి తీర్పు ఇచ్చారా? సామాజిక సమీకరణాలే తప్ప ప్రభుత్వ పనితీరు కానీ, వాగ్దానాల అమలుపై నమ్మకం గానీ మన రాష్ట్రంలో ప్రాధాన్యత సంత రించుకోవా? రానున్న కాలం ఈ ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలి. డా‘‘ జి. నవీన్ వ్యాసకర్త సామాజిక, రాజకీయ విశ్లేషకులుnaveen.prose@gmail.com -
‘చంద్రబాబు ఎప్పుడు చెయ్యిస్తారో చెప్పలేం’
గత రెండు సార్వత్రి ఎన్నికల్లో 280 ఫ్లస్ సీట్లతో సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేసుకోగలిగే స్థాయి నుంచి.. 2024 ఎన్నికల్లో 240 సీట్లకు పడిపోయి మిత్రపక్షాల మీద ఆధారపడే స్థాయికి చేరుకుంది బీజేపీ. అయితే కింగ్మేకర్లుగా తమ తమ రాష్ట్రాలకు కావాల్సింది సాధించుకోవడంలో ఇటు ఏపీ సీఎం చంద్రబాబు, అటు బీహార్ సీఎం నితీశ్కుమార్లు విఫలమవుతున్నారే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ తరుణంలో.. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి సచిన్ పైలట్ సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు, నితీశ్ కుమార్లు ఎన్డీయే కూటమికి ఎప్పుడు హ్యాండిస్తారో ఎవరూ ఊహించలేరని వ్యాఖ్యానించారు. సోమవారం ఇందిరాగాంధీ పంచాయితీ రాజ్భవన్లో లోక్స్వరాజ్ మంచ్ నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ..‘‘400 సీట్లు సాధిస్తామని ఒకప్పుడు ప్రగల్భాలు పలికిన వారు ఇప్పుడు 240 సీట్లకే పరిమితమయ్యారు(పరోక్షంగా మోదీని ఉద్దేశిస్తూ..). చంద్రబాబు ఎప్పుడు మనసు మార్చుకుంటారో తెలియదు. నితీశ్ కుమార్ ఎప్పుడు తన మద్దతు వెనక్కి తీసుకుంటారో తెలియదు. ప్రజాస్వామ్యంలో అధికారం శాశ్వతమని భావించకూడదు.. .. సమయం ఎప్పుడూ ఒకేలా ఉండదు. మంచీచెడులు ఉంటాయి. కీర్తి అనేది తాత్కాలికం. అధికారంలో ఉన్నా, లేకున్నా ప్రజల పక్షాన నిలిచిన వారే, ప్రజల హృదయాలలో స్థానం సంపాదించుకుని శాశ్వతంగా గుర్తుండిపోతారు అని అన్నారాయన. అలాగే ఇండియా కూటమి మధ్య బీటల అంశంపై ప్రస్తావిస్తూ.. లోక్సభ ఎన్నికలు ఇంకా నాలుగేళ్ల దూరంలో ఉన్నాయని, ఈలోపు ప్రతిపక్ష పార్టీలన్నీ ఏకతాటి పైకి వచ్చే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఎన్టీయే కూటమిలో బీజేపీ(240) తర్వాత టీడీపీ 16 స్థానాలు, జనతాదళ్ (యూ) 12, అతిపెద్ద పార్టీలుగా ఉన్నాయి. -
కూటమి కథ పునరావృతం అవుతుందా?
ఆంధ్రప్రదేశ్లో తెలుగు దేశం, జనసేన, (Janasena) బీజేపీల కూటమి ప్రభుత్వం ఏర్పడి ఇంకా పట్టుమని పది నెలలు అయినా కాలేదు. కానీ, ఇంతలోనే కూటమిలో లుకలుకలు బెకబెక మంటూ బయ టకు వస్తున్నాయి. 2014లో ఇవే మూడు పార్టీల కూటమి, 2018 నాటికి ఎంత వికృత రూపం దాల్చిందో అందరికీ తెలిసిందే. ఇప్పడు పాత చేదు గుళికలు గొంతు దిగక ముందే అంతవరకు ఛీ... ఛా... అనుకున్న ఆ మూడు పార్టీల నాయకుల మధ్య ఏ చీకటి ఒప్పందం కుదిరిందో ఏమో కానీ, మళ్ళీ చేతులు కలిపారు. కానీ ప్రస్తుతం కూటమిలో విభేదాలు చాపకింద నీరులా పరుచుకుంటున్నాయి. అయిష్టంగా, అవసరార్థం ఆలింగనం చేసుకున్న మూడు పార్టీల మధ్య, సయోధ్య ‘నానాటికి తీసికట్టు నాగం భొట్లు’ అన్నట్లు పలచన అవుతోందని, ఎన్నికల సమయంలో కనిపించిన సయోధ్య ఇప్పడు కనిపించడం లేదనే అభిప్రాయం పార్టీల గడప దాటి ప్రజల్లో బలపడుతోంది. అందుకే, రాజకీయ పరిశీలకులు కూటమిలో పరిస్థితి పైకి కనిపించినంత చక్కగా ఏమీ లేదనీ, ఒక విధంగా తుఫాను ముందు ప్రశాంతత వంటి పరిస్థితి రూపు దిద్దుకుంటోందనీ అంటున్నారు. గత ఆగస్టులో అంటే కూటమి ప్రభుత్వం ఏర్పడిన మూడు నాలుగు నెలలకే... కర్నూల్ జిల్లాలో (Kurnool District) బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి, టీడీపీ మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు మధ్య మొదలైన కుమ్ములాటల కథ ఇప్పటికీ చల్లారలేదు సరికదా, కొత్తకుంపట్లు వెలిగిస్తోంది. ‘టీడీపీలో ఐదు వర్గాలు ఉన్నాయి. అలాంటప్పుడు ఆ పార్టీతో సయోధ్య ఎలా సాధ్యం’ అంటూ బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి పేల్చిన తూటా టీడీపీ నాయకత్వానికి గుచ్చుకుంది. 2019 ఎన్నికలకు ముందు కాంగ్రెస్తో చేతులు కలిపి ధర్మపోరాటం పేరిట చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) సాగించిన రాజకీయాలను, ఆ సందర్భంగా ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలపై ఆయన వ్యాఖ్యలు, ఇతర నేతలు స్థాయి మరిచి చేసిన దాడిని, చేసిన అవమానాలను బీజేపీ నాయకులు మరిచిపోలేక పోతున్నారనీ; ఈ నేపథ్యంలో చంద్రబాబు ప్రతి కదలికనూ అనుమానంతో చూస్తున్నా రనీ అంటున్నారు. కమల దళం అనివార్యంగా మరోమారు చంద్రబాబుతో చేతులు కలిపినా, గతంలో లాగా బాబును విశ్వసించడం లేదనీ... అందుకే, మహారాష్ట్రలో శివసేన (యూబీటీ), ఎన్సీపీ (ఎస్పీ)తో పాటుగా ఇతర రాష్ట్రాల్లోని ఇతర పార్టీలను ఎన్డీఏ పలుపులోకి తెచ్చుకునే ప్రయత్నాలు చేస్తోందని అంటున్నారు. కేంద్రంలో ప్రభుత్వ మనుగడకు టీడీపీ మద్దతు అవసరం కారణంగా ఆయ నతో సయోధ్యత ఉన్నట్లు నటిస్తూనే, చంద్రబాబుకు చెక్ పెట్టేందుకు ఇలా జాగ్రత్తలు తీసుకుంటోందని అంటున్నారు. అయితే, బీజేపీ రహస్య వ్యూహం చంద్రబాబుకు తెలియదా అంటే... తెలుసు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలకు ముసుగు తొడిగి ప్రజలను మాయ చేసేందుకు కేంద్ర సహకారం అవసరం కాబట్టి చంద్రబాబు నాయుడు ప్రధానమంత్రి నరేద్ర మోదీపై కపట ప్రేమను ఒలక పోస్తూ పబ్బం గడుపుకునే ప్రయత్నాలు చేస్తున్నారని అంటున్నారు. అంటే, ఇద్దరికి ఇద్దరూ ‘నువ్వొకందుకు పోస్తే, నేనొ కందుకు తాగుతున్నాను’ అన్నట్లు ‘ఆస్కార్’ స్థాయిలో ప్రేమ కథను రక్తి కట్టిస్తున్నారు. ఇలా బీజేపీ – టీడీపీ సంబంధాలు పరస్పర అవిశ్వాసంతో అడుగులు వేస్తుంటే... ఇక టీడీపీ – జనసేన సంబంధాలు ముదిరి పాకాన పడే స్థాయికి చేరుకున్నాయి. నిజానికి కూటమి నేతలు ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి, పవన్ కల్యాణ్, ఆయన వీరాభిమానులు ఏమి చెప్పినా, ఒకరిపై ఒకరు లేని ప్రేమను ఎంతగా ఒలక పోసుకున్నా, 2018 నాటి చరిత్ర పునరావృతం అవుతున్న సంకే తాలు స్పష్టమవుతున్నాయని, అస్మదీ యులే అంటున్నారు.చదవండి: బీద పిల్లల నోట్లో మట్టి కొట్టే యత్నం ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) పోటీ చేసిన పిఠాపురం నియోజకవర్గంలోనే పిఠాపురం అర్బన్ క్రెడిట్ కో ఆపరేటివ్ సొసైటీ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల సందర్భంగా ఇరు పార్టీల మధ్య రాజుకున్న విభేదాల కుంపటి మెల్లమెల్లగా కుల కుంపట్లు రాజేసింది. పవన్ కల్యాణ్ కులం లేదు మతం లేదంటూనే కులాన్ని సొంతం చేసుకున్నారు. కానీ, కులం ప్రాతిపదికన కష్టనష్టాలను ఎదుర్కొంటూ కూడా టీడీపీని భుజాన మోసిన తమకు చంద్రబాబు పాలనలో ‘న్యాయం’ జరగడం లేదని అస్మదీయులు అసంతృప్తి గళం వినిపిస్తున్నారు. ఇలా ఎలా చూసినా, ప్రస్తుతం చిన్న చిన్న పగుళ్ళుగా కనిపిస్తున్న కూటమి విభేదాలు మొదటి వార్షికోత్సవం నాటికే బీటలు బారినా ఆశ్చర్య పోనవసరం లేదు.– రాజనాల బాలకృష్ణఫ్రీలాన్స్ జర్నలిస్ట్ ‘ 99852 29722 -
ఎన్నికల మహా పాఠం
తాజా మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు ఎన్డీఏ కూటమికి ఒకటి, ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమికి మరొకటితో... పైకి వన్ ఆల్ అనిపించాయి. రెండు చోట్లా గద్దె మీద ఉన్న పార్టీలే అధికారాన్ని నిలబెట్టుకున్నాయి. రెండు విజయాల్లోనూ కొన్ని పోలికలున్నాయి. రెండు రాష్ట్రాల్లోనూ అధికార పార్టీలు మునుపటి కన్నా పెద్ద మెజారిటీతో విజయం సాధించాయి. అనేక కారణాలు విజయాన్ని ప్రభావితం చేసినా, ప్రధానంగా సంక్షేమ పథకాలు కీలక భూమిక పోషించాయి. మరీ ముఖ్యంగా, మహిళలకు నగదు బదలీ పథకం గేమ్ ఛేంజరైనట్టు విశ్లేషణ. మహారాష్ట్రలో మహిళలకు నెలకు రూ. 1500 ఇస్తూ ఏక్నాథ్ శిందే తెచ్చిన ‘ముఖ్యమంత్రి మాఝీ లడ్కీ బహిన్ యోజన’, జార్ఖండ్లో అర్హులైన స్త్రీలకు నెలవారీగా వెయ్యి రూపాయల హేమంత్ సోరెన్ సర్కార్ ‘ముఖ్య మంత్రి మయ్యా సమ్మాన్ యోజన’ వారిని విజయతీరాలకు చేర్చాయి. మరిన్ని రాష్ట్రాల్లో ఇలాంటి పథకాలు రావడం ఖాయమని తేల్చేశాయి. భవిష్యత్ ఎన్నికల ముఖచిత్రాన్ని మార్చేశాయి. ఎన్నికల్లో గెలుపోటములు సహజమే కావచ్చు. కానీ, మహారాష్ట్రలో అధికార మహాయుతి కూటమి సాధించిన మహా విజయం, ప్రతిపక్ష మహావికాస్ ఆఘాడీ (ఎంవీఏ) కూటమి మూటగట్టు కున్న ఘోర పరాజయం మాత్రం ఆశ్చర్యపరుస్తాయి. పోలింగ్ రోజు సాయంత్రం 5 గంటల తర్వాత దాదాపు 9.5 లక్షల ఓట్లు పెరిగాయంటూ వస్తున్న ఆరోపణల మాట ఎలా ఉన్నా, 288 స్థానాల మహారాష్ట్ర అసెంబ్లీలో మెజారిటీ మార్కుకు కేవలం 13 తక్కువగా 132 స్థానాలు బీజేపీ గెలవడం విశేషం. కేవలం అయిదు నెలల క్రితం లోక్సభ ఎన్నికల్లో మహారాష్ట్రలో 48 స్థానాలకు గాను 9 మాత్రమే గెల్చిన బీజేపీ, ఆ ప్రాతిపదికన ఇప్పుడు కేవలం 83 సీట్లే గెలవాలి. కానీ, అప్పటి లెక్క కన్నా మరో 49 స్థానాలు అదనంగా తన ఖాతాలో వేసుకోగలిగింది. అంటే, జూన్ నాటి ఎదురు దెబ్బల నుంచి బీజేపీ మళ్ళీ పూర్తిస్థాయిలో పుంజుకుంటే, అప్పట్లో దక్కిన కొద్దిపాటి ఉత్సాహం, ఊపును కాంగ్రెస్ చేజార్చుకుంది. మహారాష్ట్రలో బీజేపీ, కాంగ్రెస్లు 75 స్థానాల్లో ముఖాముఖి పోరుకు దిగితే, హస్తానికి పట్టుమని 10 దక్కడం గమనార్హం. ఇది నిర్ద్వంద్వంగా స్వయంకృతం. కాంగ్రెస్ తప్పిదాలకు కొదవ లేదు. మరాఠీ భాషే తెలియని పెద్దలను పార్టీ పరిశీలకులుగా పంపిన ఘనత ఈ గ్రాండ్ ఓల్డ్ పార్టీది. పరిశీలకులుగానే కాదు... ప్రచారకులుగానూ బయటి జనాభాయే. వచ్చేది హంగ్ అసెంబ్లీ అంటూ పార్టీ అధిష్ఠానానికి వర్తమానం పంపి, ఎమ్మెల్యేలను బెంగళూరుకు తరలించేందుకు ప్రత్యేక ఏర్పాటు చేయించారంటే క్షేత్రస్థాయి వాస్తవాలకు ఎంత దూరంగా ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. ‘బటేంగే తో కటేంగే’, ‘ఏక్ హై తో సేఫ్ హై’ లాంటి నినాదాలతో జనంలో భయాన్నీ, అభద్రతనూ పెంచుతూ మహాయుతి కూటమి ప్రచారం హోరెత్తిస్తే, సరైన ప్రచార కథనాన్ని ఎంచుకోవడంలో మహావికాస్ ఆఘాడీ కూటమిలోని మూడు ప్రతిపక్షాలూ విఫలమయ్యాయి. దాదాపు 40 పైచిలుకు స్థానాల్లో ముస్లిమ్ల మద్దతు కోసం చూసుకొని, మెజారిటీ వర్గాలు బీజేపీ వైపు మొగ్గేలా చేశాయి. అలాగే, ‘ఇండియా’ కూటమి ప్రధాన పక్షాలు ఇతర పార్టీలను కలుపుకొని పోవడంలో, కనీసం నియంత్రించడంలో విఫలమయ్యాయి. అలా దాదాపు 17 శాతం ఓట్ షేర్ వచ్చిన ‘ఇతరులు’ కూటమి అవకాశాల్ని దెబ్బ తీశారు.2023 నవంబర్ – డిసెంబర్లలో మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ ఎన్నికల్లో ఓటమికి కారణాలను అధ్యయనం చేసేందుకు కాంగ్రెస్ వేసుకున్న అంతర్గత కమిటీలు ఇప్పటికీ తమ నివేదికలు ఇవ్వనేలేదు. ఆ పార్టీలో జవాబుదారీతనం లేకపోవడానికి ఇది ఓ మచ్చుతునక. దూరదృష్టి లేకపోవ డంతో పాటు ఉదాసీనత కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలను పట్టి పడిస్తోంది. ప్రతిపక్షాలకు భిన్నంగా బీజేపీ పటిష్ఠమైన వ్యూహంతో ముందుకు వెళ్ళింది. ఆరెస్సెస్ శతవసంత వత్సరంలో అడుగిడిన వేళ మహారాష్ట్రలో కాషాయ విజయాన్ని కానుకగా అందించాలన్న సంకల్పం సైతం సంఘ్ కార్యకర్తలను లక్ష్యసాధనకు పురిగొల్పింది. పోలింగ్ బూత్ స్థాయి దాకా వెళ్ళి వారు శ్రమించడం ఫలితమిచ్చింది. మహారాష్ట్రలో రాహుల్ గాంధీ పరిమితంగా ప్రచారం చేస్తే, ‘చొరబాటు దారుల’ బూచితో బీజేపీ భయపెట్టిన జార్ఖండ్లో హేమంత్ సోరెన్, ఆయన సతీమణి కల్పన దాదాపు 100 ర్యాలీలలో పాల్గొని విజయసాధనకు శ్రమించాల్సిన విధానం ఏమిటో చూపెట్టారు. ఇటీవల జమ్ము – కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో నేషనల్ కాన్ఫరెన్స్, ఇప్పుడు జార్ఖండ్లో జేఎంఎం భుజాల మీద ఎక్కి, హస్తం విజయకూటమిలో నిలిచింది కానీ, వ్యక్తిగతంగా అది సాధించిన సీట్లు స్వల్పమే. ఈ ఫలితాలు ఆత్మపరిశీలన తప్పనిసరి అని కాంగ్రెస్కు పదే పదే బోధిస్తున్నాయి. రాజ్యాంగ పరిరక్షణ, అధికార బీజేపీ ఆశ్రిత పక్షపాతం లాంటి పాత పాటకు పరిమితం కాకుండా కొత్త పల్లవి అందుకోవాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తున్నాయి. విజేతగా నిలిచిన బీజేపీ, ముఖ్యంగా మోదీ ఇప్పటికే స్వరం పెంచి, ప్రతిపక్షాలపై విరుచుకు పడుతున్నారు. మోదీ, షాలు మళ్ళీ పట్టు బిగించారు. ఇదే ఊపులో కమలనాథులు ఉమ్మడి పౌరస్మృతి, ఒక దేశం... ఒకే ఎన్నిక, వక్ఫ్ బిల్లు వగైరాలపై వేగం పెంచవచ్చు. బీమా రంగంలో పూర్తి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల లాంటి విపరీత సంస్కరణలకూ గేట్లెత్తే అవకాశం ఉంది. మహారాష్ట్ర పీఠమెక్కే కొత్త దేవేంద్రులకూ చాలా బాధ్యతలున్నాయి. దేశానికి ఆర్థిక కేంద్రంగా, స్థూలజాతీయోత్పత్తిలో దాదాపు 14 శాతం అందించే మహారాష్ట్రలో సంక్షేమ పథకాలను అమలు చేస్తూనే, ఆర్థిక ఆరోగ్యాన్ని కాపాడాలి. అవినీతి, నిరుద్యోగం, రైతాంగ సమస్యల లాంటివి ఎన్నికల ప్రచారంలో వెనుకపట్టు పట్టినా, ఇకనైనా ఆ కీలక అంశాలపై దృష్టి పెట్టాలి. వెరసి, మహా ఫలితాల దరిమిలా అధికార, ప్రతిపక్షాలు అందరికీ చేతి నిండా పని ఉంది. -
మహారాష్ట్రలో ఎన్డీఏ కూటమి హవా.. బండి సంజయ్ రియాక్షన్ ఇదే
సాక్షి, కరీంనగర్ జిల్లా: మహారాష్ట్రలో ఎన్డీయే కూటమి విజయదుందుభి మోగిస్తుందని.. కాంగ్రెస్ ఐరన్ లెగ్ పార్టీ అని రుజువైందని కేంద్రమంత్రి బండి సంజయ్ వ్యాఖ్యానించారు. బీజేపి ఒంటరిగా 125 స్థానాలు గెలవబోతుందని.. యూపీలో ఏడు స్థానాలలో ముందంజలో ఉందన్నారు. ఎన్ని అబద్దాల ప్రచారం చేసిన ఎన్డీయే కూటమినే మహారాష్ట్ర ప్రజలు నమ్మారన్నారు. మహారాష్ట్రలో హిందూ సమాజం ఐకమత్యాన్ని చాటారన్నారు.కర్ణాటక, తెలంగాణ నుంచి మహారాష్ట్రకి కాంగ్రెస్ డబ్బులు పంపింది. ఆ రాష్ట్రాల్లో కాంగ్రెస్ వైఫల్యాలే మహారాష్ట్రలో గెలుపు వచ్చింది. రేవంత్ రెడ్డి ప్రచారం చేసిన అన్ని స్థానాలలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. వాస్తవాన్ని గ్రహించారు కాబట్టే కాంగ్రెస్ కూటమి ఓటమి చెందింది. మోదీ అభివృద్ధి మంత్రం పనిచేసింది. ఇండియా కూటమి చీలీపోవడం ఖాయం. తెలంగాణలో కూడా కాంగ్రెస్కి ఇదే గతి పడుతుంది’’ అని బండి సంజయ్ వ్యాఖ్యానించారు.‘‘మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీ మోసాలను మేము ప్రచారం చేశాం. ఇప్పటికైనా తెలంగాణలో ఇచ్చిన హామీ నెరవెర్చండి.. లేదంటే మహారాష్ట్రలో పట్టిన గతే పడుతుంది. ఇచ్చింది ముఫ్ఫై వేల నోటిఫికేషన్ లు.. చెప్పింది మాత్రం యాభై వేల ఉద్యోగాలు ఇచ్చామని.. ఇక్కడి డబ్బులతో మహారాష్ట్రలో యాడ్స్ ఇచ్చారు’’ అని బండి సంజయ్ మండిపడ్డారు. -
Maharashtra Elections: మళ్లీ మహాయుతి!
న్యూఢిల్లీ: బీజేపీ సారథ్యంలోని మహాయుతి కూటమి మహారాష్ట్రలో అధికారం నిలుపుకోనుందని ఎగ్జిట్ పోల్స్ జోస్యం చెప్పాయి. జార్ఖండ్లో కూడా ఎన్డీఏ కూటమిదే పై చేయని తేల్చాయి. రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ బుధవారం సాయంత్రం ముగిసింది. ఆ వెంటనే ఆ రాష్ట్రాల ఫలితాలపై ఎగ్జిట్ పోల్స్ వెలువడ్డాయి. బీజేపీ, శివసేన (షిండే), ఎన్సీపీ (అజిత్)లతో కూడిన మహాయుతి విజయం ఖాయమని దాదాపుగా అన్ని సంస్థలూ అంచనా వేశాయి. కాంగ్రెస్, శివసేన (యూబీటీ), ఎన్సీపీ (ఎస్పీ)లతో కూడిన విపక్ష మహా వికాస్ అఘాడీ ఓటమి చవిచూడనున్నట్టు చెప్పాయి. ఒక్క లోక్పోల్ మాత్రమే ఎంవీఏ గెలుస్తుందని పేర్కొంది. 288 అసెంబ్లీ స్థానాలకు గాను ఆ కూటమికి 150కి పైగా స్థానాలు వస్తాయని, మహాయుతి 130 లోపే సాధిస్తుందని అంచనా వేసింది. జార్ఖండ్లో నవంబర్ 13, 20 తేదీల్లో రెండు విడతల్లో పోలింగ్ జరగ్గా మహారాష్ట్రలో బుధవారం ఒకే విడతలో ముగియడం తెలిసిందే. రెండు రాష్ట్రాల్లోనూ శనివారం ఓట్ల లెక్కింపు జరిగి ఫలితాలు వెలువడతాయి.జార్ఖండ్లో టఫ్ ఫైట్ జార్ఖండ్లో అధికార జేఎంఎం–కాంగ్రెస్ కూటమికి, బీజేపీ సారథ్యంలోని విపక్ష ఎన్డీఏ కూటమికి మధ్య హోరాహోరీ సాగిందని ఎగ్జిట్ పోల్స్ తేల్చాయి. అత్యధిక పోల్స్ ఎన్డీఏకే మొగ్గుతున్నట్టు పేర్కొన్నాయి. బొటాబొటి మెజారిటీతో అధికారం దక్కించుకోవచ్చని అభిప్రాయపడ్డాయి. ఈ అంచనాల నేపథ్యంలో అక్కడ చివరికి హంగ్ వచి్చనా ఆశ్చర్యం లేదని పరిశీలకులు భావిస్తున్నారు. ఒక్క యాక్సిస్ మై ఇండియా మాత్రమే జేఎంఎం కూటమి గెలుస్తుందని అంచనా వేసింది. 81 అసెంబ్లీ సీట్లకు గాను దానికి 53 సీట్లొస్తాయని, ఎన్డీఏ కూటమి 25కు పరిమితమవుతుందని పేర్కొంది. మహారాష్ట్రపై తమ అంచనాలను గురువారం ప్రకటించనున్నట్టు సంస్థ తెలిపింది. -
నయవంచనకు నకలు పత్రం!
దొంగ హామీలతో, వక్రమార్గంలో అయిదు నెలలక్రితం అధికారాన్ని చేజిక్కించుకున్న నాటినుంచీ అనామతు పద్దులతో తప్పించుకు తిరుగుతున్న ఆంధ్రప్రదేశ్ ఎన్డీయే కూటమి సర్కారు ‘తప్పనిసరి తద్దినం’లా సోమవారం బడ్జెట్ను ప్రవేశపెట్టింది. ఘనమైన అంకెలు చూసి జనం నవ్విపోరా అన్న వెరపు లేకుండా రూ. 2,94,427 కోట్లతో ఈ బడ్జెట్ తీసుకొచ్చారు. ఇందులో రెవెన్యూ వ్యయం రూ. 2.35 లక్షల కోట్లు, మూలధన వ్యయం రూ. 32,712 కోట్లు, ద్రవ్యలోటు రూ. 68,742 కోట్లు, రెవెన్యూ లోటు రూ. 34,743 కోట్లు ఉంటుందని అంచనా వేశారు. మొన్నటి ఎన్నికల్లో భూమ్యా కాశాలను ఏకం చేస్తూ మోత మోగించిన సూపర్ సిక్స్ హామీల జాడ లేకుండా... అంచనా వేస్తున్న పన్ను రాబడి రూ. 24,000 కోట్లూ వచ్చే మార్గమేమిటో చెప్పకుండా ఆద్యంతం లొసుగులు, లోపాలతో బడ్జెట్ తీసుకురావడం బాబు సర్కారుకే చెల్లింది. ఈమాత్రం బడ్జెట్ కోసం అయిదు నెలలు ఎందుకు ఆగాల్సివచ్చిందో కూటమి నేతలే చెప్పాలి. 53.58 లక్షలమంది రైతులకు రూ. 20,000 చొప్పున రూ. 10,716.74 కోట్లు కేటాయించాల్సిన ‘అన్నదాత సుఖీభవ’ పథకానికి కేవలం వెయ్యి కోట్లు మాత్రమే విదిల్చి రైతు సంక్షేమమే లక్ష్యమంటూ బీరాలు పోవటం... 84 లక్షల మంది విద్యార్థులకు ‘తల్లికి వందనం’ పథకం కింద రూ. 12,600 కోట్లు కావాల్సి వుండగా కేవలం రూ. 5,387.03 కోట్లు కేటాయించి ఊరుకోవటం దుస్సాహసానికి పరాకాష్ఠ.రైతులకు జగన్మోహన్ రెడ్డి హయాంలో విజయవంతంగా అమలైన ఉచిత పంటల బీమా పథకానికి ఈ ఖరీఫ్ సీజన్ తర్వాత మంగళం పాడుతున్నట్టు ప్రభుత్వమే చెప్పింది. ఇక రూ. 3 లక్షల వరకూ సున్నావడ్డీ రాయితీ, డ్రిప్ పరికరాలపై 90 శాతం సబ్సిడీ వగైరాల గురించి ప్రస్తావన లేదు. అలాగే ధరల స్థిరీకరణ నిధికీ, ప్రకృతి వైపరీత్యాల నిధికీ ఇచ్చిందేమీ లేదు! అయినా రైతు సంక్షే మానికి కట్టుబడివున్నారట! పద్దెనిమిదేళ్లు నిండిన ప్రతి మహిళకూ ప్రతి నెలా రూ. 1,500 చొప్పున ఏడాదికి రూ. 18,000 ఇస్తామని చెప్పిన ‘ఆడబిడ్డ’ నిధికి రూ. 32,400 కోట్లు కేటాయించాల్సి వుండగా ఇచ్చింది సున్నా. ఏడాదిలో ఇంటింటికీ మూడు సిలెండర్లు ఉచితమని ఊదరగొట్టిన పథకం కింద కోటీ 54 లక్షల కుటుంబాల కోసం రూ. 4,000 కోట్లు అవసరం కాగా దానికోసం కేటా యించింది కేవలం రూ. 895 కోట్లు! ఈ అరకొర మొత్తంతో ఇంటికో సిలెండరైనా ఇవ్వగలుగు తారా? లబ్ధిదారుల జాబితాకు అడ్డగోలుగా కోత పెడితే తప్ప ఇది అసాధ్యం. నిరుద్యోగ యువతకు నెలకు రూ. 3,000 చొప్పున ఏడాదిలో కోటిమందికి మొత్తం రూ. 36,000 కోట్లు కావాల్సి వుండగా దాని ఊసే లేదు! జాబ్ క్యాలెండర్, డిజిటల్ లైబ్రరీల ఏర్పాటు వగైరాల గురించిన ప్రస్తావన లేదు. అంకుర సంస్థలకు ప్రాజెక్టు వ్యయంలో రూ. 10 లక్షల వరకూ సబ్సిడీ ఇస్తామని చెప్పిన వాగ్దానానికి సైతం చోటులేదు. చిన్న, మధ్యతరహా పరిశ్రమల రంగానికి తగినన్ని నిధులు కేటాయిస్తే, చెప్పిన రీతిలో సబ్సిడీ సొమ్ము అందిస్తే ఉద్యోగ కల్పన సాధ్యమవుతుంది. కానీ వీటి గురించి మాట్లాడింది లేదు. ఆ రంగానికి బాబు హయాంలో పెట్టిపోయిన బకాయిలు కరోనా మహమ్మారి విజృంభించిన కాలంలో సైతం చెల్లించి ఆ పరిశ్రమలకు ఊపిరులూదిన జగన్ సర్కారుకూ, ఈ మాయదారి కూటమి ప్రభుత్వానికీ పోలికెక్కడ! యువతకు ఏటా లక్షల్లో ఉద్యోగాలు కల్పిస్తామన్న హామీ మాట దేవుడెరుగు – మూడు లక్షలమంది వలంటీర్లకు మంగళం పాడినట్టు బడ్జెట్ అధికారికంగా తేల్చి చెప్పింది. కాపు వర్గానికి సైతం మొండిచెయ్యి చూపారు.‘బడ్జెట్ అంటే అంకెల సముదాయం మాత్రమే కాదు... అది మనం పాటిస్తున్న విలువలు, ఆకాంక్షల వ్యక్తీకరణ’ అని ఒకనాటి అమెరికా ఆర్థిక మంత్రి జాకబ్ ల్యూ ఉవాచ. పీఠంపై పేరాశతో మొన్నటి ఎన్నికల్లో ఎడాపెడా వాగ్దానాలిచ్చినవారి నుంచి విలువలేమి ఆశించగలం? వారికి జనం ఆకాంక్షలెలా అర్థమవుతాయి? అందుకే– వంచనాత్మక విన్యాసాలు ఆగలేదు. బడ్జెట్లో అంకెల గారడీ సరే, బయట పారిశ్రామికవేత్తలతో సైతం బాబు అదే మాదిరి స్వోత్కర్షలకు పోయారు. రానున్న రోజుల్లో ఏకంగా 15 శాతం వృద్ధి రేటు సాధిస్తారట! అవకాశాల కల్పనతో సంపద సృష్టించి, పేదల జీవన ప్రమాణాలు పెంచుతారట!! కూటమి సర్కారు గద్దెనెక్కినప్పటి నుంచీ పన్ను రాబడి మైనస్లోకి పోయిందని సాక్షాత్తూ కాగ్ చెప్పింది. జగన్ సర్కారు హయాంలో మొన్న ఏప్రిల్లో పన్ను రాబడిలో దాదాపు 11 శాతం వృద్ధి నమోదు కాగా, ఆ తర్వాత తగ్గటం సంగతలా వుంచి మైనస్లోకి పోయింది. మే నెలలో –2.8 శాతం, ఆ తర్వాత వరసగా –8.9, –5.3, –1.9, –4.5 శాతాలకు పడిపోయిందని కాగ్ నివేదిక బయటపెట్టింది. వాస్తవం ఇలావుంటే పన్ను రాబడి కింద అదనంగా రూ. 24,000 కోట్లు వస్తాయని బడ్జెట్ నమ్మబలుకుతోంది. అంటే రానున్న కాలంలో అదనపు పన్నుల మోత మోగుతుందన్నమాట!జగన్ ప్రభుత్వం చేసిన అప్పుల గురించి గడచిన అయిదేళ్ళూ సాగించిన దుష్ప్రచారం అంతా ఇంతా కాదు. కూటమి నేతలు, వారి వందిమాగధ మీడియా నోటికొచ్చినట్టు రూ. 12 లక్షల కోట్లు, రూ. 14 లక్షల కోట్లు అంటూ తప్పుడు ప్రచారాలు చేశారు. తీరా మొన్న మార్చి 31 నాటికి ఆ అప్పు రూ. 6.46 లక్షల కోట్లని తాజా బడ్జెట్ వెల్లడించింది. ఇందులో గ్యారెంటీల కింద తెచ్చిన అప్పు రూ. 1,54,797 కోట్లనూ తీసేస్తే నికరంగా ఉన్నది రూ. 4.91 లక్షల కోట్లు మాత్రమే! నిజానికి ఈ బడ్జెట్ చదివిన ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్ ఈ విషయంలో గతంలో తప్పుడు ప్రచారం చేశామని క్షమాపణలు చెప్పాలి. కానీ ఆపాటి నిజాయితీ ఆశించటం అత్యాశే. మొత్తానికి నయవంచనకూ, నేల విడిచిన సాముకూ ఈ బడ్జెట్ అసలు సిసలు ఉదాహరణ. -
జార్ఖండ్లో ఎన్డీఏ పక్షాల సీట్ల పంపకాలు ఖరారు
సాక్షి, న్యూఢిల్లీ: జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల కోసం ఎన్డీఏ మధ్య సీట్ల పంపకాలు ఖరార య్యాయి. బీజేపీ 68, ఆల్ జార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్ (ఏజేఎస్యూ) 10, జనతాదళ్ యునైటెడ్ (జేడీయూ) 2, లోక్జనశక్తి పార్టీ (రామ్విలాస్) 1 స్థానంలో పోటీ చేయాలని శుక్రవారం నిర్ణయించాయి. ఏజేఎస్యూ– సిల్లి, రామ్గఢ్, గోమియా, ఇచాగర్, మాండు, జుగ్సాలియా, డుమ్రి, పాకూర్, లోహర్దగా, మనోహర్పూర్, జేడీయూ– జంషెడ్పూర్ వెస్ట్, తమర్ స్థానాల నుంచి, ఎల్జేపీ (ఆర్) ఛత్రా అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. జార్ఖండ్లో నవంబర్ 13, 20ల్లో రెండు దళల్లో పోలింగ్ జరగనుంది. 23న ఫలితాలు ప్రకటించనున్నారు. -
ఇలాంటి ముఖ్యమంత్రిని ఇంత వరకు చూడలేదు..
-
ఆకాంక్షలు ఆవిరి! చేతులెత్తేసిన చంద్రబాబు సర్కార్
సాక్షి, అమరావతి: ‘‘రాష్ట్ర ప్రజలు ఎన్నో ఆకాంక్షలతో ఎన్డీఏ కూటమికి బలమైన తీర్పునిచ్చారు. కానీ ఇప్పటికిప్పుడు వారి ఆకాంక్షలు (హామీలు) నెరవేర్చే పరిస్థితి ఏమాత్రం కనిపించడం లేదు. ఉద్యోగులు, పింఛన్దారులకు బకాయిల చెల్లింపులతో పాటు రాష్ట్రంపై రూ.10 లక్షల కోట్ల అప్పుల భారం ఉంది. కేంద్ర ప్రభుత్వం ఉదారంగా సాయం అందించాలి. లేకుంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో వనరుల సమీకరణ, అభివృద్ధి ప్రణాళికలు రూపొందించడం చాలా కష్టం, సంక్లిష్టం. సంక్షోభాన్ని అధిగమించే మార్గాలను అన్వేషించాల్సి ఉంది. మేధావులు, విద్యావేత్తలతో విస్తృతమైన చర్చలు జరపాలి. అందుకే అర్ధవంతమైన చర్చల తర్వాతే పూర్తి స్థాయి బడ్జెట్కు వెళ్లాలని మా ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం ఉన్న ఆందోళనకరమైన ఆరి్ధక పరిస్థితిని అర్ధం చేసుకొని రాష్ట్ర పునర్నిర్మాణంలో ప్రజలందరూ ప్రభుత్వానికి సహకరించాలి’’ అని గవర్నర్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. ఓటాన్ అక్కౌంట్ బడ్జెట్ సమావేశాల సందర్భంగా సోమవారం అసెంబ్లీ హాలులో ఉభయసభలనుద్దేశించి గవర్నర్ ప్రసంగించారు. నాడు 13.5 శాతం సమ్మిళిత వృద్ధి సాధించాం సవాళ్లను అధిగమించి సన్రైజ్ ఆంధ్రప్రదేశ్ దిశగా 2014–19లో గట్టి పునాది వేశాం. పోలవరం ప్రాజెక్టును 72 శాతం పూర్తి చేశాం. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకులలో రాష్ట్రం నెం.1గా అవతరించింది. కాకినాడ సెజ్ పోర్ట్, భావనపాడు, రామాయపట్నం ఓడరేవుల అభివృద్ధికి శ్రీకారం చుట్టాం. వృద్ధాప్య పింఛన్ల పెంపుదల, రైతు రుణమాఫీ లాంటి సంక్షేమ కార్యక్రమాలు అమలుతో 2014–19 మధ్య 13.5 శాతం సమ్మిళిత వార్షిక వృద్ధి రేటు సాధించాం. 2019 జూన్లో బాధ్యతలు స్వీకరించిన ప్రభుత్వం ప్రజావేదికను కూల్చడంతో బ్రాండ్ ఏపీకి భారీ నష్టం జరిగింది. 2014–19తో పోలిస్తే 2019–24 మధ్య మూలధన వ్యయం 60 శాతం తగ్గిపోయింది. మూడు రాజధానుల ఆలోచనతో ప్రజలను గందరగోళానికి గురిచేసింది. అమరావతి రాజధాని ప్రాంతం పూర్తిగా నాశనమైంది. రూ.2 లక్షల కోట్ల సంపద నష్టానికి దారి తీసింది. ఇంధన రంగం రూ.1,29,503 కోట్ల భారీ నష్టానికి గురైంది. సహజ వనరులు దురి్వనియోగమయ్యాయి. రీ–సర్వే, ఏపీ భూ హక్కు చట్టం ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీశాయి. ఇసుకను కొల్లగొట్టడంతో రూ.19,000 కోట్ల నష్టం వాటిల్లింది. ఖనిజ రాబడిలో రూ.9,750 కోట్ల నష్టం వాటిల్లింది. ఎర్రచందనం విక్రయాల వల్ల 2014–2019 మధ్య రూ.1,623 కోట్ల ఆదాయం వస్తే 2019–2024 మ«ద్య కేవలం రూ.441 కోట్లకు ఆదాయం పడిపోయింది. చిన్నారులపై నేరాలు, అత్యాచారాలు పెరిగాయి గత ఐదేళ్లలో మహిళలు, చిన్నారులపై నేరాలు.. ఎస్సీలు, ఎస్టీలు, ఇతర బలహీన వర్గాలపై అఘాయిత్యాలు పెరిగాయి. ఎక్సైజ్ ఆదాయ మార్గాలను గత ప్రభుత్వం అపహాస్యం పాలు చేసింది. ఎక్సైజ్పై వ్యాట్ను తగ్గించి ప్రత్యేక మార్జిన్గా రాష్ట్ర బెవరేజెస్ కార్పొరేషన్కు మళ్లించారు. జీతాలు, పింఛన్ల భారీ బకాయిలతో పాటు సుమారు రూ.10 లక్షల కోట్ల రుణ భారం తిరిగి చెల్లించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వంపై పడింది. ఇప్పటికిప్పుడు హామీలన్నీ అమలు చేయలేంప్రజలు ప్రభుత్వ మార్పును బలంగా కోరుకోవడం వల్లే 93 శాతం స్ట్రయిక్ రేట్తో ఎన్డీఏకు చారిత్రక తీర్పునిచ్చారు. గాడి తప్పిన పాలనను తిరిగి గాడిలో పెట్టడం సవాలుతో కూడుకున్న పని. ఎన్నికల హామీలను నెరవేర్చడం ప్రారంభించాం. “సూపర్ సిక్స్ఙ్ వాగ్దానాల అమలుకు కట్టుబడి ఉన్నాం. ఇప్పటికే 16,347 ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి మెగా డీఎస్సీని ప్రకటించడం, ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని రద్దు చేయడం, సామాజిక భద్రత పింఛన్లను రూ.4 వేలకు పెంచడం, నైపుణ్య గణన, ఉచితంగా ఇసుక సరఫరా లాంటివి చేపట్టాం. అన్న క్యాంటీన్లను కూడా ప్రారంభిస్తున్నాం. మిగిలిన హామీల అమలుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నా ఇప్పటికిప్పుడు వారి ఆకాంక్షలను నెరవేర్చడం సాధ్యం కాదని తెలియజేస్తున్నా. వనరుల సమీకరణ చాలా కష్టంగా ఉంది. నిధుల లేమి కారణంగా అభివృద్ధి ప్రణాళిక చాలా సంక్లిష్టంగా ఉంది. ఇప్పటికే ప్రధానితో పాటు పలువురు కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్ర ఆరి్ధక పరిస్థితిని వివరించాం. రాష్ట్రానికి ఉదారంగా సాయాన్ని అందించాలని విజ్ఞప్తి చేశాం. ప్రస్తుతమున్న ఆందోళనకరమైన ఆరి్ధక పరిస్థితిని అర్ధం చేసుకుని రాష్ట్ర పునరి్నర్మాణంలో ప్రభుత్వానికి సహకరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా. -
అస్తిత్వాన్ని తాకట్టు పెట్టారు
కోల్కతా: కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం ఎక్కువకాలం కొనసాగదని, త్వరలోనే కూలిపోతుందని పశి్చమబెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ అన్నారు. బెదిరించి, భయపెట్టి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందన్నారు. మమత ఏ పార్టీ పేరు తీసుకోకపోయినప్పటికీ ఆమె పరోక్షంగా ఎన్డీఏ కీలకపక్షాలను ఉద్దేశించే పలు ఘాటు విమర్శలు చేశారు. అమరువీరుల దినోత్సవ భారీ ర్యాలీలో మమత ఆదివారం మాట్లాడారు. ‘పిరికిపందలు, అత్యాశాపరులైన నాయకులు ఆర్థిక తాయిలాలకు లొంగిపోయారు. మంత్రిపదవులకు బదులుగా డబ్బు ఇస్తామనడం ఎప్పుడైనా విన్నామా? పార్టీలు డబ్బుకు అమ్ముడు పోవడం చూశామా? వాళ్లు (ఎన్డీఏ మిత్రపక్షాలు) పిరికిపందలు, సిగ్గులేని వారు. అత్యాశాపరులు. అస్తిత్వాన్ని తాకట్టు పెట్టారు’ అని మమత ధ్వజమెత్తారు. సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ ర్యాలీలో పాల్గొన్నారు. కేంద్రంలోని ఎన్డీఏ సర్కారు ఎక్కువకాలం కొనసాగదని, మతతత్వశక్తులకు విజయం లభించినా.. ఓటమి తప్పదని అఖిలేశ్ అన్నారు. -
‘బీజేపీతో పొత్తుపై పునరాలోచించండి’.. సీఎం నితీష్కు పార్టీ నేత విజ్ఞప్తి
శ్రీనగర్: బీజేపీకి సొంతంగా మెజార్టీ దక్కకపోవటంతో మిత్రపక్షం సహకారంతో కేంద్రంలో అధికారంలోకి వచ్చింది. ఎన్డీయే కూటమిలో బిహార్ సీఎం నితీష్కుమార్ జేడీయూ పార్టీ కీలకంగా వ్యవహారించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా జమ్ము కశ్మీర్ రాష్ట్ర జేడీ(యూ) జనరల్ సెక్రటరీ వివేక్ బాలి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీజేపీ కూటమిలో భాగస్వామిగా జేడీ(యూ) పార్టీ ఉండటంపై పునరాలోచించాలని ఆ పార్టీ చీఫ్, బిహార్ సీఎం నితీష్ కుమార్కు విజ్ఞప్తి చేశారు.‘‘జమ్ము కశ్మీర్ బీజేపీ నేతలు చేస్తున్నట్లు చర్యలు కారణంగా మా పార్టీ చీఫ్ నితీష్ కుమార్ బీజేపీ నేతృత్వంలోని కూటమిలో భాగస్వామ్య పార్టీగా ఉండటంపై పునరాలోచించాలని కోరుతున్నాం. మేము ఇస్లామిక్ స్కాలర్లను తిరిగి సమాజంలోకి తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నాం. వారు దేశ అభివృద్ధిలో కీలకంగా వ్యవహరిస్తారు. అందుకే వారిని మేము వదిలిపెట్టాలని అనుకోవటం లేదు. అయితే మా ప్రయత్నాలను మాత్రం బీజేపీ ఉద్దేశపూర్వకంగా అడ్డుకోవాలని ప్రయత్నాలు చేస్తోంది’’ అని వివేక్ బాలి తెలిపారు. ఇక.. లోక్ సభఎన్నికల్లో బిహార్లో సీఎం నితీష్ కుమార్ పార్టీ జేడీ (యూ) 12 స్థానాల్లో విజయం సాధించింది. మ్యాజిక్ ఫిగర్ దాటని బీజేపీ.. మిత్రపక్షాల సాయంతో ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దీంతో ఎన్డీయే కూటమిలో సీఎం నితీష్ కుమార్ కీలకంగా మారారు. -
ఉప ఎన్నికల్లో ఎన్డీయేకు షాక్.. ఇండియా కూటమి జోరు
ఢిల్లీ, న్యూఢిల్లీ: ఏడు రాష్ట్రాల్లో 13 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో ఇండియా కూటమి భారీ విజయాన్ని అందుకుంది. ఏకంగా 10 స్థానాల్లో ఇండియా కూటమి విజయం సాధించగా.. కేవలం రెండు స్థానాల్లోనే ఎన్డీయే కూటమి విజయాన్ని అందుకుంది. మరో స్థానంలో ఇండిపెండెంట్ అభ్యర్థి విజయం సాధించారు. కాగా, ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం నుంచే ఇండియా కూటమి అభ్యర్థులు లీడింగ్లో కొనసాగారు. ఇక, బెంగాల్ తృణముల్ కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేసింది. నాలుగు స్థానాల్లో ఉప ఎన్నికలు జరుగగా అన్ని స్థానాల్లో టీఎంసీ అభ్యర్థులు గెలుపొందారు. బెంగాల్లోని రాయిగంజ్ (కృష్ణ కల్యాణి), రణఘాట్ సౌత్ (ముకుత్ మణి అధికారి), బాగ్ద (మధుపర్ణ ఠాకూర్), మాణిక్తలా(సప్తి పాండే) విజయం సాధించారు. ఇక్కడ బీజేపీకి గట్టి షాక్ తగింది. మరోవైపు.. హిమాచల్ ప్రదేశ్లోని డెహ్ర, నలగార నియోజకవర్గాల్లో కాంగ్రెస్ విజయం సాధించగా.. హమీర్పూర్ స్థానంలో బీజేపీ గెలుపొందింది. ఇక, మధ్యప్రదేశ్లోని అమర్వర అసెంబ్లీలో బీజేపీ అభ్యర్ధి కమలేష్ ప్రతాప్ సింగ్ విజయం సాధించారు. పంజాబ్లోని జలంధర్ వెస్ట్ స్థానం నుంచి ఆమ్ ఆద్మీ అభ్యర్థి మోహిందర్ భగత్ విజయం అందుకున్నారు. తమిళనాడులోని విక్రవండి అసెంబ్లీ స్థానంలో డీఎంకే అభ్యర్థి అన్నియుర్ శివ ఘన విజయం సాధించారు. ఉత్తరాఖండ్లోని బద్రీనాథ్ (లాక్ పత్ సింగ్), మంగళూర్(క్వాజి మొహమ్మద్ నిజాముద్దిన్) కాంగ్రెస్ విజయభేరి మోగించింది. కాగా, బీహార్లోని రూపౌలి స్థానంలో స్వతంత్ర అభ్యర్థి శంకర్ సింగ్ గెలుపొందడం ఆసక్తికరంగా మారింది. మొత్తంగా.. ఉప ఎన్నికల ఫలితాలు ఇండియా కూటమి బూస్ట్ ఇవ్వగా, ఎన్డీయే కూటమికి షాకిచ్చాయి.సీఎం సతీమణి విజయం..హిమాచల్ ప్రదేశ్లోని దేహ్రాలో రాష్ట్ర ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖు సతీమణి, కాంగ్రెస్ అభ్యర్థి కమలేశ్ ఠాకుర్ విజయం సాధించారు. తన సమీప భాజపా అభ్యర్థిపై 9వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. నాలాగఢ్ స్థానంలో కాంగ్రెస్ నేత హర్దీప్ సింగ్ బవా 8,990 ఓట్ల తేడాతో భాజపా అభ్యర్థిపై విజయం సాధించారు. ఇక, హమీర్పుర్ స్థానంలో భాజపా అభ్యర్థి ఆశీష్ శర్మ గెలుపొందారు.బెంగాల్లో తృణమూల్ క్లీన్స్వీప్..పశ్చిమ బెంగాల్లో ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలుపొంది జోరుమీదున్న తృణమూల్ కాంగ్రెస్.. తాజా ఉప ఎన్నికల్లోనూ హవా కొనసాగించింది. ఇక్కడ రాయ్గంజ్, రాణాఘాట్, బాగ్దా, మాణిక్తలా.. నాలుగు స్థానాల్లోనూ టీఎంసీ అభ్యర్థులు విజయం సాధించారు. ఇక, ఉత్తరాఖండ్లో మంగలౌర్, బద్రీనాథ్ స్థానాలను కాంగ్రెస్ దక్కించుకుంది.పంజాబ్ బైపోల్ ఆప్దే..పంజాబ్లోని జలంధర్ స్థానంలో ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి మోహిందర్ భగత్ విజయం సాధించారు. తన సమీప భాజపా అభ్యర్థి షీతల్పై 37వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. తమిళనాడులోని విక్రావండి స్థానంలో డీఎంకే అభ్యర్థి అన్నియుర్ శివ విజయం సాధించారు. మధ్యప్రదేశ్లోని అమర్వాడాలో భాజపా నేత కమలేశ్ షా గెలుపొందారు. బిహార్లోని రూపౌలి స్థానంలో స్వతంత్ర అభ్యర్థి శంక్ సింగ్ జయకేతనం ఎగురవేశారు. Assembly by-elections: Out of 13 Assembly seats, Congress won four seats. TMC won 4 seats. AAP won the Jalandhar West seat in Punjab. BJP won 2 seats, DMK won 1 seat. Independent candidate Shankar Singh won on Rupauli seat of Bihar. pic.twitter.com/lJWtsVWI46— ANI (@ANI) July 13, 2024 -
‘నీట్’పై నోరు మెదపరేమి?
తిరుపతి సిటీ (తిరుపతి జిల్లా)/మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): నీట్ పేపర్లీక్ వల్ల దేశవ్యాప్తంగా 24 లక్షల మంది విద్యార్థులు రోడ్డున పడ్డారని, అయినా కేంద్రం నోరు మెదపకపోవడం దారుణమని ఐక్య విద్యార్థి సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశవ్యాప్త విద్యార్థి సంఘాల పిలుపు మేరకు గురువారం రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలు మూతపడ్డాయి. తిరుపతి ఎస్వీ వర్సిటీ ఏడీ బిల్డింగ్ వద్ద జిల్లా ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్, ఎన్ఎస్యూఐ, పీడీఎస్యూ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.సంఘాల నేతలు మాట్లాడుతూ..లక్షల మంది విద్యార్థుల జీవితాలు ఆయోమయంలో ఉన్నా రాష్ట్రంలోని ఎన్డీఏ కూటమి నేతలు, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్కళ్యాణ్ స్పందించక పోవడం దారుణమన్నారు. ఎన్టీఏను రద్దు చేసి, కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేసి యువతకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. నీట్ పరీక్ష రాసిన విద్యార్థులకు మోదీ సర్కార్ నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఎన్టీఏ, కేంద్రప్రభుత్వ దిష్టిబొమ్మలను దగ్దం చేసేందుకు ప్రయత్నించిన విద్యార్థి సంఘాల నేతలను పోలీసు అడ్డుకుని దిష్టిబొమ్మలను లాక్కొన్నారు.ధర్నాలో విద్యార్థి సంఘాల నేతలు రవి, అక్బర్, నవీన్, ప్రవీణ్, మల్లి కార్జున, హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు. అలాగే, నీట్ లీకేజీ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు చేయాలని, పరీక్ష రద్దు చేయాలని కోరుతూ దేశవ్యాప్త విద్యాసంస్థల బంద్లో భాగంగా విజయవాడ సిద్ధార్థ కళాశాల కూడలి వద్ద విద్యార్థి సంఘాల నాయకులు గురువారం ఆందోళన చేశారు. కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ప్లకార్డులను ప్రదర్శిస్తూ నినాదాలు చేస్తున్న నాయకులు కళాశాల లోపలికి వెళ్లే ప్రయత్నం చేయడంతో పోలీసులు వారిని అడ్డుకుని అరెస్ట్ చేసి మాచవరం పోలీస్స్టేషన్కు తరలించారు. -
కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఎసరు పెడుతున్న కూటమి ప్రభుత్వం
-
Weekly Roundup : పార్లమెంట్ చిత్రం
18వ లోక్ సభ కొలువుదీరింది. పార్లమెంట్ తాత్కాలిక సమావేశాల్లో భాగంగా నూతనంగా ఎన్నికైన ఎంపీలు ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకార సమయంలో పలువురు ఎంపీలు చేసిన నినాదాలపై ఎన్డీయే కూటమి అభ్యంతరం వ్యక్తం చేసింది. 48 ఏళ్ల లోక్ సభ చరిత్రలో తొలి సారి స్పీకర్కు ఎన్నిక జరిగింది. స్పీకర్ ఓం బిర్లా ఎన్నిక, రాష్ట్రపతి ఎమర్జెన్సీపై వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రపతి ప్రసంగ ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా నీట్ పరీక్ష పేపర్ లీక్పై చర్చ జరగాలని ప్రతి పక్షాలు పట్టుబట్టాయి. ప్రధాని మోదీ స్పందించాలని డిమాండ్ చేశారు. శుక్రవారం ఉభయ సభలు హోరెత్తిరిపోవడంతో సోమవారానికి (జులై 1)కి వాయిదా పడ్డాయి. 18వ లోక్సభ సమావేశాల్లో భాగంగా మొదటి రోజు ప్రధాని మోదీతో సహా 262 మంది ఎంపీలు ప్రమాణం చేశారు.ఇంగ్లీష్, సంస్కృతం, హిందీ, డోగ్రీ, బెంగాలీ, అస్సామీ, ఒడియా, కన్నడ, తెలుగు, మరాఠీ ఇలా భారతీయ భాషలలో కొత్తగా ఎన్నికైన ఎంపీలు ప్రమాణ స్వీకారం చేయడం వల్ల లోక్సభ భాషా వైవిధ్యాన్ని ప్రదర్శించింది.మోదీ ప్రమాణం చేసేటప్పుడు ఎన్డీయే నేతలు జైశ్రీరామ్ నినాదాలు చేశారు. అప్పుడు విపక్ష నేతలంతా లేచి రాజ్యాంగ ప్రతిని చూపించారు.ఏపీ నుంచి కేంద్రమంత్రిగాఉన్న రామ్మోహన్ నాయుడు శ్రీకాకుళం ఎంపీగా తెలుగులో ప్రమాణ స్వీకారం చేశారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పార్లమెంట్ కు పంచె కట్టులో వెళ్లారు.రైతు నేత వీపీఐ (ఎం) ఆమ్రా రామ్ ట్రాక్టర్లో పార్లమెంట్ కు వచ్చారు.తీహార్ జైలులో ఉన్న బారాముల్లా స్వతంత్ర ఎంపీ, నిందితుడు అబ్దుల్లా రషీద్ షేక్ బెయిల్ దొరక్కపోవడంతో ప్రమాణం చేయలేకపోయారు.పార్లమెంట్ సమావేశాల తొలి రోజు ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. పార్లమెంట్ హౌజ్కు విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పల నాయుడు సైకిల్పై చేరుకున్నారు. లోక్సభలో తొలిసారి అడుగుపెట్టిన అప్పలనాయుడు, ఢిల్లీలో తన అతిథి గృహం నుంచి సైకిల్పై పార్లమెంట్కు చేరుకున్నారు.ధర్మేంద్ర ప్రధాన్ విద్యాశాఖ మంత్రి ప్రమాణ స్వీకార సమయంలో నీట్ అంటూ ప్రతిపక్ష ఎంపీలు నినాదాలు చేశారు. నీట్ ఫెయిల్డ్ మినిస్టర్ అని నినాదాలు చేశారు.రెండో రోజు ప్రమాణ స్వీకారాలు..రెండో రోజు 274 మంది ఎంపీలు ప్రమాణ స్వీకారం చేశారు.రెండో రోజు ప్రమాణ స్వీకారంలో భాగంగా స్వతంత్ర సభ్యుడు రాజేష్ రంజన్ అలియాస్ పప్పూ యాదవ్ ' నీట్ పరీక్ష మళ్లీ నిర్వహించాలి' అని రాసి ఉన్న టీ షర్ట్ ధరించి ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారు.తమిళనాడులోని కృష్ణగిరి లోక్సభ స్థానానికి కాంగ్రెస్ తరపున పోటీ చేసి గెలిచిన గోపీనాథ్ తెలుగులో ప్రమాణ స్వీకారం. తాజాగా జరిగిన ఎన్నికల్లో క్రిష్ణగిరి ఎంపీగా గోపీనాథ్ 1,92, 486 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఏఐఏడీఎంకే పార్టీకి చెందిన జయప్రకాష్ పై గెలుపొంది పార్లమెంటులో అడుగు పెట్టారు.రెండో రోజు సభాపతి స్థానంలో ఉన్న రాధామోహన్ సింగ్ ప్రమాణ స్వీకారం చేయించారు.హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఉర్ధూలో ప్రమాణం చేస్తూ.. జై భీం, జై తెలంగాణ, జై పాలస్తీనా, అల్లాహో అక్బర్ అంటూ ప్రమాణం పూర్తి చేశారు. ఇక అసదుద్దీన్ ఓవైసీ జై పాలస్తీనా నినాదం ఇవ్వడంపై పలువురు మంత్రులు, బీజేపి సభ్యులు అభ్యంతరం చెప్పారు. దీనిపై సభాపతి స్థానంలో ఉన్న రాధామోహన్ సింగ్ నిబంధనల ప్రకారం వ్యవహరిస్తానని, నిబంధనలు పరిశీలించి.. రికార్డుల నుంచి తొలగించే విషయాన్ని పరిశీలిస్తానని సభ్యులకు సూచించారు.ఉత్తరప్రదేశ్లోని రాయ్బరేలీ నుంచి ఎంపీగా గెలిచిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రాజ్యాంగ ప్రతిని పట్టుకుని ప్రమాణం చేసి.. 'జై హింద్, జై సంవిధాన్' అని నినదించారు. ఆయన తల్లి సోనియా గాంధీ, సోదరి ప్రియాంక గాంధీ వాద్రా సందర్శకుల గ్యాలరీ నుంచి ఈ కార్యక్రమాన్ని వీక్షించారు.ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీదాదాపు పదేళ్ల తర్వాత లోక్సభలో విపక్ష పార్టీ సభ్యుడికి ప్రతిపక్ష నేత హోదా దక్కింది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆ బాధ్యతలు స్వీకరించారు. దీంతో కేబినెట్ మంత్రికి ఉండే సౌకర్యాలు పొందనున్నారు. లోక్సభలో విపక్ష కూటమికి నేతృత్వం వహించడమే కాకుండా.. ఈసీ, సీబీఐ, ఈడీ వంటి ప్రభుత్వ సంస్థలకు బాస్ల నియామకంలో కీలక భూమిక పోషించనున్నారు.2014, 2019లలో మొత్తం సీట్లలో 10 శాతం దక్కించుకోకపోవడంతో ప్రతిపక్ష నేత పాత్ర పోషించే అవకాశం ఎవరికీ రాలేదు. దీంతో రెండుసార్లు ప్రతిపక్ష సభ్యుడి హోదా ఖాళీగా ఉంటూ వచ్చింది. ఈసారి 99 సీట్లను గెలుచుకోవడంతో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్కు ఆ హోదా దక్కింది. మూడో రోజు సమావేశాల్లో మూజూవాణి ఓటు ద్వారా బుధవారం స్పీకర్గా ఓం బిర్లా రెండోసారి ఎన్నిక అయ్యారు.అధికార ఎన్డీయే కూటమి, ప్రతిపక్ష ఇండియా కూటమి మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో 48 ఏళ్ల లోక్ సభ చరిత్రలో తొలి సారి స్పీకర్ కు ఎన్నిక జరిగింది. మూజువాణి ఓటుతో ఎన్డీయే స్పీకర్ అభ్యర్థి కోట ఎంపీ మరోసారి స్పీకర్గా ఎన్నిక అయ్యారు.స్పీకర్ తొలి ప్రసంగంలో ఎమర్జెన్సీ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ప్రతిపక్ష ఇండియా కూటమి అభ్యంతం తెలపగా.. ఎన్డీయే ఎంపీలు అనుకూలంగా నినాదాలు చేశారు. రాష్ట్రపతి నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంలో దోషులపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. 1975 నాటి ఎమర్జెన్సీ రోజుల్ని ప్రస్తావించారు.మోదీ, విపక్ష నేత రాహుల్ గాంధీ, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు 61 ఏళ్ళ ఓం బిర్లాను స్పీకర్ స్థానం వరకు తోడ్కొని వెళ్లి కూర్చోబెట్టారు.స్పీకర్ ఎన్నిక అయ్యక బిర్లాను పోడియం వరకు తీసుకువెళ్లే సందర్భంలో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. బిర్లాను అభినందించే క్రమంలో మోదీ, రాహుల్ కరచాలనం చేసుకున్నారు.స్పీకర్ ఎన్నిక సందర్భంగా రాహుల్ సరికొత్త వస్త్రధారణతో ఆకట్టుకున్నారు. తెలుపు రంగు లాల్చీ పైజామ ధరించి లోక్ సభకు వచ్చారు.స్పీకర్ బాధ్యతలు చెబడుతూనే ఓం బిర్లా తీసుకున్న తొలి నిర్ణయం లోక్ సభ కాక రేపింది.1975 నాటి ఇందిరా గాంధీ ఎమర్జెన్సీ విధానాన్ని ఖండిస్తూ స్పీకర్ స్వయంగా తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. దీంతో ఎమర్జెన్సీ ప్రస్తావన నిరసిస్తూ ప్రతిపక్షాలు నినాదాలతో హోరెత్తించారు.రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగం.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గురువారం ఉభయ సభలను ఉదేశిస్తూ ప్రసంగించారు. ఎమర్జెన్సీ ఒక చీకటి అధ్యాయం. రాజ్యాంగంపై దాడి అని వ్యాఖ్యానించారు. రాష్ట్రపతి ప్రసంగంలో ఎమర్జెన్సీ అంశాన్ని చొప్పించడాన్ని కాంగ్రెస్ తీవ్రంగా ఖండించింది.రాష్ట్రపతి ప్రసంగం పూర్తిగా ప్రభుత్వ స్క్రిప్ట్. తప్పుల తడక అని విపక్షాలు విమర్శలు గుప్పించాయి. చివరికి రాష్ట్రపతి ప్రసంగంలో కూడా ఎమర్జెన్సీ ప్రస్తావన తీసుకురావడం సిగ్గుచేటు. నిజానికి మోదీ పదేళ్ల పాలనలో అప్రకటిత ఎమర్జెన్సీ కొనసాగుతోందని విపక్షాలు దుయ్యబట్టాయి. ప్రధాని మోదీ మంత్రి వర్గ సభ్యులను ఎగువ సభకు పరిచయం చేశారు.పార్లమెంట్ లో నీట్ రగడ..శుక్రవారం నీట్ పరీక్ష లో అక్రమాలపై వెంటనే చర్చించాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. లోక్ సభ స్పీకర్ , రాజ్య సభలో చైర్మన్ అంగీకరించలేదు. దీంతో ఉభయ సభలు పలుమార్లు వాయిదా పడ్డాయి.నీట్ పరీక్షపై చర్చ చేపట్టకుండా ప్రభుత్వం ఎందుకు వెనకంజ వేస్తోందని రాజ్య సభలో విపక్షాలు నిలదీశాయి. నీట్పై చర్చించాలని 22 నోటీసులు వచ్చాయని, వాటిని తిరస్కరిస్తున్నట్లు ప్రకటించారు. దీంతో విపక్ష సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ వెల్లోకి దూసుకువెళ్లారు. బిగ్గరగా నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. రాజ్య సభ మూడు సార్లు వాయిదా పడింది.ప్రతి పక్ష నేత మల్లికార్జున ఖర్గే సైతం వెల్లోకి దూసుకురావటంపై రాజ్య సభ చైర్మన్ జగదీప్ ధన్ ఖడ్ ఆగ్రహం వ్యక్తంచేశారు చేశారు. అనంతరం నీట్ రగడ నడుమ ఉభయ సభలు సోమవారానికి (జులై 1) వాయిదా పడ్డాయి. -
Sonia Gandhi: ఫలితాలు ప్రధానికి నైతిక ఓటమే
న్యూఢిల్లీ: ఎన్డీఏ కూటమికి మెజారిటీ తగ్గిస్తూ తాజా లోక్సభ ఎన్నికల్లో వెలువడిన ప్రజాతీర్పు ప్రధాని మోదీ వ్యక్తిగత, రాజకీయ, నైతిక ఓటమికి నిదర్శనమని కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ విమర్శించారు. ఒక జాతీయ పత్రికలో రాసిన సంపాదకీయంలో మోదీ, ఎన్డీఏ ప్రభుత్వంపై సోనియా విమర్శలు సంధించారు. ‘‘ ఎన్నికల ప్రచారంవేళ తానొక దైవాంశ సంభూతుడిని అన్నట్లు స్వయంగా ప్రకటించుకుని 400 సీట్ల ఖాయమని భ్రమలో గడిపిన ప్రధాని మోదీకి జూన్ 4న వెల్లడైన ఫలితాలు ప్రతికూల సంకేతాలు చూపించాయి. విభజన, విద్వేష రాజకీయాలు, మోదీ పరిపాలనా విధానాలను ప్రజలు తిరస్కరిస్తున్నట్లు నాటి ఫలితాల్లో వెల్లడైంది. ఏకాభిప్రాయం ఉండాలని మోదీ వల్లెవేస్తారుగానీ ఆచరణలో అవేం ఉండవు. స్పీకర్ ఎన్నికలు ఇందుకు తార్కాణం. డెప్యూటీ స్పీకర్ పదవి విషయంలో విపక్షాల సహేతుక విజ్ఞాపనను పట్టించుకుంటే స్పీకర్ ఎన్నిక విషయంలో ప్రభుత్వానికి మేం సంపూర్ణ మద్దతు ఇస్తామని ‘ఇండియా’ కూటమి స్పష్టంచేసింది. అయినాసరే మోదీ వైఖరి మారలేదు. 17వ లోక్సభలోనూ డెప్యూటీ స్పీకర్ పదవిని విపక్షాలకు కేటాయించలేదు’’ అని అన్నారు. అంతటి మెజారిటీ మోదీ సర్కార్కు రాలేదు ‘‘రాజ్యాంగంపై ఎన్డీఏ దాడి అంశం నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే లోక్సభ తొలి సెషన్లోనే ఎమర్జెన్సీ అంశాన్ని మోదీ సర్కార్ పదేపదే ప్రస్తావించింది. పారీ్టలకతీతంగా, పక్షపాతరహితంగా వ్యవహరించాల్సిన స్పీకర్ కూడా అదే బాటలో పయనిస్తూ ‘ఎమర్జెన్సీ’పై తీర్మానం చదవడం దిగ్భ్రాంతికరం. నాటి ఎమర్జెన్సీకి కారణమైన ఇందిరాగాం«దీని ఆనాడు ప్రజలు తిరస్కరించినా తర్వాత సార్వత్రిక ఎన్నికల్లో ఆమెకు ఓటర్లు బ్రహ్మరథం పట్టారు. భారీ మెజారిటీతో గెలిపించారు. అంతటి మెజారిటీ మోదీ సర్కార్కు కూడా రాలేదు’’ అని సోనియా అన్నారు. ఆ మూడు చట్టాల అమలు నిలిపేయాలి ‘‘పార్లమెంట్లో దారుణమైన భద్రతావైఫల్యాన్ని ఎలుగెత్తిచాటినందుకు అక్రమంగా ఇరుసభల్లో 146 మంది విపక్ష సభ్యులను బహిష్కరించారు. వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపే కీలకమైన మూడు నూతన నేర బిల్లులను ఎలాంటి చర్చ జరపకుండానే ఏకపక్షంగా చట్టాలుగా ఆమోదింపజేసుకున్నారు. బిల్లులను సంస్కరించాల్సిఉందని, చర్చ జరగాలని ఎందరో న్యాయకోవిదులు మొత్తుకున్నా ప్రభుత్వం పట్టించుకోలేదు. అందుకే వీటిపై సమగ్ర చర్చ జరగాలి. అప్పటిదాకా ఈ నేర చట్టాల అమలును తాత్కాలికంగా నిలిపేయాలి’’ అని సోనియా అన్నారు. నీట్ లీకేజీలపై ప్రధాని మాట్లాడరా? ‘‘లక్షలాది మంది యువత భవిష్యత్తును ఛిద్రం చేస్తూ నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ ఉదంతం వెలుగుచూస్తే మోదీ మాట్లాడరా? పరీక్ష పే చర్చా అంటూ తరచూ విద్యార్థులతో మాట్లాడే మోదీ ఈసారి ఎందుకు అదే విద్యార్థులకు మరోసారి పేపర్ లీక్ కాబోదని భరోసా ఇవ్వలేకపోతున్నారు? దారుణ నిర్లక్ష్యానికి విద్యాశాఖ మంత్రి నైతిక బాధ్యత వహించాలి. ఎన్సీఈఆర్టీ, యూజీసీ, విశ్వవిద్యాలయాల్లో ప్రమాణాలు గత పదేళ్లలో ఎంతగా పడిపోయాయో ఇట్టే అర్థమవుతోంది’’ అని అన్నారు. -
18వ లోక్సభ స్పీకర్గా ఓం బిర్లా
న్యూఢిల్లీ, సాక్షి: లోక్సభ స్పీకర్ ఎవరనేదానిపై ఉత్కంఠకు తెరపడింది. బుధవారం ఉదయం జరిగిన ఎన్నికలో.. 18వ లోక్సభ స్పీకర్గా ఓం బిర్లా ఎన్నికయ్యారు. ఎన్డీయే అభ్యర్థి ఓం బిర్లా పేరును ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిపాదించగా.. వరుసగా మంత్రులు ఆ ప్రతిపాదనను బలపరిచారు. అటు ఇండియా కూటమి తరపున కె.సురేశ్ పేరును శివసేన (యూబీటీ) ఎంపీ అరవింద్ సావంత్ తీర్మానం తీసుకొచ్చారు. దీన్ని పలువురు విపక్ష ఎంపీలు బలపర్చారు. అనంతరం మూజువాణీ విధానంలో ఓటింగ్ చేపట్టా.. ఇందులో ఓం బిర్లా విజేతగా నిలిచినట్లు ప్రొటెం స్పీకర్ భర్తృహరి మహతాబ్ ప్రకటించారు.విపక్ష కూటమి ఓటింగ్కు పట్టుబట్టకపోవడంతో.. ఓం బిర్లా ఎన్నిక సుగమమైంది. ఓం బిర్లా ఎన్నికపై ప్రధాని మోదీ, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పరస్పర కరచలనం ద్వారా అభినందనలు తెలియజేశారు. ఈ ఇద్దరితో పాటు పార్లమెంట్ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు దగ్గరుండి ఓం బిర్లాను స్పీకర్ చెయిర్లో కూర్చోబెట్టారు. #WATCH | BJP MP Om Birla occupies the Chair of Lok Sabha Speaker after being elected as the Speaker of the 18th Lok Sabha.Prime Minister Narendra Modi, LoP Rahul Gandhi and Parliamentary Affairs Minister Kiren Rijiju accompany him to the Chair. pic.twitter.com/zVU0G4yl0d— ANI (@ANI) June 26, 2024ప్రధాని మోదీ మాట్లాడుతూ.. సభను నడిపించడంలో స్పీకర్ పాత్ర ఎంతో కీలకం. కొత్తగా ఎన్నికైన ఎంపీలకు స్పీకర్ స్ఫూర్తిగా నిలుస్తారు. గత ఐదేళ్లుగా విజయవంతంగా సభను నడిపించారు. ఓం బిర్లా చరిత్ర సృష్టించారు. 17వ లోక్సభను నిర్వహించడంలో ఆయన పాత్ర అమోఘం. ఆయన నేతృత్వంలోనే కొత్త పార్లమెంట్ భవనంలోకి అడుగుపెట్టాం. జీ-20 సమ్మిట్ ఆయన సలహాలు, సూచనలు అవసరం. మరో ఐదేళ్లు కూడా సభను విజయవంతంగా నడిపిస్తారని ఆశిస్తున్నా. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. సభలో విపక్షాల సభ్యులు చర్చించేందుకు అవకాశం ఇవ్వలి. మా గొంతు నొక్కితే సభ సజావుగా నిర్వహించినట్లు కాదు. ప్రజల గొంతుక ఎంత సమర్థవంతంగా వినిపించామన్నదే ముఖ్యం. ఓం బిర్లాకు వైఎస్సార్సీపీ అభినందనలులోక్ సభ స్పీకర్గా ఎన్నికైన ఓం బిర్లాకు వైఎస్ఆర్సీపీ అభినందనలు తెలిపింది. లోక్సభ పక్ష నేత మిథున్రెడ్డి మాట్లాడుతూ.. ‘‘గడిచిన లోక్సభను ఓం బిర్లా ఎంతో హుందాగా నడిపారు. ప్రజాస్వామ్య విలువలను నిలబెట్టారు. కొత్తగా ఎన్నికైన సభ్యులకు మాట్లాడే అవకాశం ఇచ్చారు.అదే తరహాలో ఈసారి కూడా విజయవంతంగా సభను నడపాలి’’ అని ఆకాంక్షించారు. ఇక.. రెండోసారి స్పీకర్గా ఎన్నికైన ఓం బిర్లాకు వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి అభినందనలు తెలిపారు. విజయవంతంగా స్పీకర్ పదవి నిర్వహించాలని కోరారాయన. స్పీకర్గా ఓం బిర్లా ట్రాక్ రికార్డు.. లోక్సభ స్పీకర్ పదవికి ఎన్నిక జరగడం 48ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి. బుధవారం జరిగిన ఎన్నిక ప్రక్రియలో ఇండియా కూటమి అభ్యర్థి సురేష్పై ఓం బిర్లా విజయం సాధించారు. ఓం బిర్లా(61) రాజస్థాన్లోని కోటా నుంచి మూడోసార్లు ఎంపీగా గెలిచారు. 2014లో ఎన్నికైన ఆయన లోక్సభలో 86శాతం హాజరును నమోదు చేసుకున్నారు. 671 ప్రశ్నలడిగారు. 2019లో గెలిచాక అనూహ్యంగా స్పీకర్ పదవి చేపట్టారు. ఇప్పుడు.. తొలి నుంచి జరుగుతున్న ప్రచారం నడుమే రెండోసారి స్పీకర్ పదవి చేపట్టబోతున్నారు. లోక్సభ స్పీకర్ పదవిని వరుసగా రెండుసార్లు చేపట్టిన ఐదో వ్యక్తి ఓం బిర్లా. ఆయనకంటే ముందు ఎం.ఎ.అయ్యంగార్, జి.ఎస్.ధిల్లాన్, బలరాం ఝాఖడ్, జి.ఎం.సి.బాలయోగి వరసగా రెండు విడతలు ఈ పదవికి ఎన్నికయ్యారు. వీరిలో బలరాం ఝాఖడ్ ఒక్కరే పదేళ్ల పదవీకాలాన్ని పూర్తి చేశారు. -
Lok Sabha Speaker Election: 1946 తర్వాత మళ్లీ ఇప్పుడే..
న్యూఢిల్లీ, సాక్షి: దేశ చరిత్రలోనే తొలిసారి లోక్సభ స్పీకర్ పదవికి ఎన్నిక జరగబోతోంది. స్పీకర్ పదవి విషయంలో అధికార-ప్రతిపక్ష కూటమికి మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడం.. ఇరు పక్షాల నుంచి అభ్యర్థులు నిలపడంతో ఎన్నిక అనివార్యమైంది. ఈ క్రమంలో 78 ఏళ్ల తర్వాత.. అదీ స్వాతంత్ర దేశంలో తొలిసారి ఈ ఎన్నిక జరగబోతోంది.దేశంలో.. 1925 ఆగస్టు 24న సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీకి ఎన్నికలు నిర్వహించారు. ఆ ఎన్నికల్లో స్వరాజ్య పార్టీ అభ్యర్థి విఠల్భాయ్ జె పటేల్ స్పీకర్గా నెగ్గారు. టి.రంగాచారియార్పై కేవలం రెండు ఓట్ల (58-56) తేడాతో ఆయన విజయం సాధించారు. 1925 - 1946 మధ్య ఆరుసార్లు స్పీకర్ పదవికి ఎన్నికలు జరిగాయి. అయితే.. 1946లో కాంగ్రెస్ నేత జి.వి.మౌలాంకర్ స్పీకర్గా ఎన్నికయ్యారు. తర్వాత సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ.. పార్లమెంటు(పాత పార్లమెంట్)గా మారింది. ఆ తర్వాత తాత్కాలిక పార్లమెంటుకు కూడా మౌలాంకర్ స్పీకర్గా కొనసాగారు.1952లో తొలి సార్వత్రిక ఎన్నికల తర్వాత లోక్సభ, రాజ్యసభలు ఏర్పాటయ్యాయి. 1956లో మాలంకర్ మరణంతో డిప్యూటీ స్పీకర్గా ఉన్న అయ్యంగార్.. స్పీకర్ అయ్యారు. ఆ తర్వాత 1957లో రెండో సాధారణ ఎన్నికల తర్వాత కూడా స్పీకర్గా అయ్యంగార్ నియమితులయ్యారు. అలా.. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి లోక్సభ స్పీకర్ ఎన్నిక ఏకాభిప్రాయంతోనే జరుగుతోంది. ఎం.ఎ.అయ్యంగార్, జి.ఎస్.ధిల్లాన్, బలరాం జాఖడ్, జి.ఎం.సి.బాలయోగి వరసగా రెండు విడతలు ఈ పదవికి ఎన్నికయ్యారు. లోక్సభ స్పీకర్ అధికార పక్షం తీసుకుంటే.. డిప్యూటీ స్పీకర్ పదవిని ప్రతిపక్షం తీసుకోవడం ఆనవాయితీగా వచ్చింది. యూపీఏ హయాంలో కూడా విపక్షాలకు డిప్యూటీ ఇచ్చారు. అయితే.. 2014లో ఆ ఆనవాయితీని ఎన్డీయే కూటమి బ్రేక్ చేసింది. తన మిత్రపక్షానికి డిప్యూటీ స్పీకర్ పదవి ఇచ్చుకుంది. ఇక 2019 ఎన్నికల్లో బీజేపీ సంపూర్ణ మెజారిటీతో నెగ్గడంతో మిత్రపక్షానికి కూడా ఇవ్వకుండా ఆ పోస్టును ఖాళీగా ఉంచింది. అయితే ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికలతో లోక్సభలో తమ బలాన్ని పెంచుకున్న ప్రతిపక్షాలు ఈసారి డిప్యూటీ సీఎం పదవికి పట్టుబట్టాయి. -
దేశ చరిత్రలోనే తొలిసారి లోక్సభ స్పీకర్ పదవికి ఎన్నిక!
ఢిల్లీ, సాక్షి: లోక్సభ స్పీకర్ ఎన్నికలో ట్విస్ట్ చోటుచేసుకుంది. దేశ చరిత్రలోనే తొలిసారిగా ఆ పోస్టుకు ఎన్నిక జరగబోతోంది. ఇన్నేళ్లలో ఏకగ్రీవంగానే లోక్సభ స్పీకర్ ఎన్నిక జరుగుతూ వచ్చింది. అయితే 18వ లోక్సభ స్పీకర్ పదవి కోసం అధికార-ప్రతిపక్షాల మధ్య ఏకాభిప్రాయం కోసం జరిగిన చర్చలు విఫలం అయ్యాయి. దీంతో.. ఇటు ఎన్డీయే కూటమి, అటు ఇండియా కూటమి అభ్యర్థుల్ని బరిలో నిలిపాయి. ఎన్డీయే కూటమి తరఫున ఓం బిర్లా, ఇండియా కూటమి తరపున సీనియర్ ఎంపీ కే.సురేష్ నామినేషన్ వేశారు. లోక్సభలో ఎన్డీయే కూటమికి 294 మంది ఎంపీల బలం ఉంది. అయినప్పటికీ తొలిసారి జరుగుతుండడంతో ఈ ఎన్నికపై ఆసక్తి నెలకొంది. ఇదిలా ఉంటే.. మరోసారి లోక్సభ స్పీకర్ అభ్యర్థిగా ఓం బిర్లానే ఎన్డీయే కూటమి ఎంచుకుంది. స్పీకర్ పోస్టుకు ఆయన నామినేషన్ దాఖలు చేశారు. అంతకు ముందు.. ఓం బిర్లాను లోక్సభ స్పీకర్గా కొనసాగిస్తారని ప్రచారం నడిచిన సంగతి తెలిసిందే. ఈక్రమంలో ఇవాళ ఉదయం ఓం బిర్లా.. ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. అదే సమయంలో.. ఓం బిర్లా ఎన్నికను ఏకగ్రీవం చేసేందుకు ఎన్డీయే తీవ్రంగా యత్నించింది. బీజేపీ అగ్రనేత రాజ్నాథ్ సింగ్.. ఇండియా కూటమి నేతలతో చర్చలు జరిపారు. అయితే ఆనవాయితీగా వస్తున్న డిప్యూటీ స్పీకర్ పోస్టును ప్రతిపక్షాలకు వదిలేయాలని కాంగ్రెస్ చీఫ్ ఖర్గేతో పాటు ఇండియా కూటమి నేతలంతా ప్రతిపాదించారు. దీంతో.. మరోసారి ఫోన్ చేసి పిలుస్తామంటూ రాజ్నాథ్సింగ్ వాళ్లకు చెప్పారు. అయితే డిప్యూటీ స్పీకర్ విషయంలో అధికార కూటమి తటపటాయించింది. ఈ క్రమంలో మరోసారి ఎన్డీయే నుంచి పిలుపు రాకపోవడంతో.. అభ్యర్థినే నిలపాలని ఇండియా కూటమి నిర్ణయించింది. దీంతో దేశచరిత్రలోనే.. రేపు(జూన్ 26, 2024) తొలిసారి లోక్సభ స్పీకర్ పదవికి ఎన్నిక జరగబోతోంది. No consensus on Speaker's post. INDIA bloc is likely to field its candidate for the post of Speaker of the 18th Lok Sabha: Sources pic.twitter.com/seZyieAIhS— ANI (@ANI) June 25, 2024 ఇంతకు ముందు ప్రొటెం స్పీకర్ విషయంలోనూ కే.సురేష్ పేరు తెర మీదకు వచ్చిన సంగతి తెలిసిందే. కేరళ కాంగ్రెస్ సీనియర్ నేత అయిన సురేష్.. ఎనిమిదిసార్లు లోక్సభకు ఎన్నికయ్యారు.నిన్న 280 మంది ఎంపీలు లోక్సభలో ప్రమాణం చేయగా.. ఇవాళ మిగతా వాళ్లు చేస్తున్నారు. ఇక రేపు(జూన్ 26) స్పీకర్ ఎన్నిక జరగనుంది. ప్రొటెం స్పీకర్ భర్తృహరి మెహతాబ్ సమక్షంలో ఎంపీలు స్పీకర్ను ఎన్నుకోనున్నారు. -
స్పీకర్ పదవిపై వీడని సస్పెన్స్
న్యూఢిల్లీ: 18వ లోక్సభ స్పీకర్గా ఎవరుంటారనే దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఎన్డీఏలోని మిత్రపక్షాలతో బీజేపీ సంప్రదింపులు మొదలుపెట్టింది. ఈ నెల 26న జరిగే స్పీకర్ ఎన్నికకు మంగళవారం నామినేషన్లు దాఖలు చేయాల్సి ఉంటుంది. 293 మంది ఎంపీలతో ఎన్డీఏ సంకీర్ణానికి స్పష్టమైన మెజారిటీ ఉంది. ఎన్డీఏ తమ స్పీకర్ అభ్యర్థి ఎవరనే దానిపై ఎలాంటి సంకేతాలు ఇవ్వలేదు. పలు ప్రతిపాదనలను పరిశీలిస్తోంది. అయితే విపక్ష ఇండియా కూటమికి ఎలాంటి అవకాశం ఇవ్వకూడదని భావిస్తోంది. మరోవైపు ఇండియా కూటమి స్పీకర్ పదవికి పోటీపడే అంశాన్ని చురుకుగా పరిశీలిస్తోందని విశ్వసనీవర్గాలు తెలిపాయి. స్పీకర్పై ఎలాంటి తుది నిర్ణయాన్ని తమకు తెలుపలేదని, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుతో సహా కూటమి నేతలందరూ కలిసి నిర్ణయం తీసుకుంటారని కేంద్రమంత్రి కె.రామ్మోహన్ నాయుడు తెలిపారు. బీజేపీ నాయకత్వం తనతో సంప్రదింపులు జరిపిందని ఎన్డీఏ భాగస్వామ్య పక్ష నాయకుడొకరు తెలిపారు. వివరాలు వెల్లడించేందుకు నిరాకరించారు. బీజేపీ తమ అగ్రనేతలందరికీ మునుపటి శాఖలే కేటాయించి.. కొనసాగింపును భూమికగా ఎంచుకున్నందున 17వ లోక్సభ స్పీకర్ ఓం బిర్లాను కొనసాగించొచ్చనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై ఎలాంటి అధికారిక సమాచారం లేదు. ఎన్డీఏ వైఖరిని బట్టి స్పీకర్ పోస్టుకు తమ అభ్యరి్థని పోటీకి నిలుపడంపై నిర్ణయం తీసుకుంటామని ఇండియా కూటమి నేతలు చెబుతున్నారు. డిప్యూటీ స్పీకర్ పదవిని ప్రతిపక్షాలకు కేటాయించడం సంప్రదాయంగా వస్తోందని, బీజేపీకి అందుకు ముందుకు రాకపోతే పోటీచేయక తప్పదని ఇండియా కూటమి నేతలు అంటున్నారు. కొత్త స్పీకర్పై ఏకాభిప్రాయాన్ని నిర్మించడానికి విపక్షాలతో ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతుందని, అలా జరపని పక్షంలో తాము స్పీకర్ పదవికి పోటీ పెడతామని ఇండియా కూటమి భాగస్వామ్య పక్షమైన రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ ఎంపీ ఎన్కే ప్రేమచంద్రన్ సోమవారం విలేకరులతో అన్నారు. ఎన్డీఏ అభ్యర్థి ఎవరనేది మాకు తెలిపిన తర్వాత పోటీపై నిర్ణయం తీసుకుంటామని ఇండియా కూటమికి చెందిన నాయకుడొకరు అన్నారు. బలహీనవర్గాలకు చెందిన అభ్యరి్థని పోటీపెట్టాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇండియా కూటమికి 234 మంది ఎంపీల బలముంది. -
కూటమి నేతలు మైండ్ గేమ్ ఆడుతున్నారు: మిథున్ రెడ్డి
-
Parliament Session: లోక్సభ ఎంపీల ప్రమాణ స్వీకారం
పార్లమెంట్ సమావేశాలు.. అప్డేట్స్ ఏపీ నుంచి వైఎస్సార్సీపీ నాయకురాలు గుమ్మా తనుజా రాణి హిందీలో ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారు.మీ అందరి ఆశీస్సులతో.. జగనన్న దీవెనలతో ఈరోజు పార్లమెంటులో ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది.. pic.twitter.com/DqRcsYMdc5— Dr Gumma Thanuja Rani (@ArakuPalguna) June 24, 2024 పార్లమెంట్ భవనం మెట్లు దిగుతూ కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్.. అక్కడే ఉన్న కాంగ్రెస్ ఎంపీలు కేసీ వేణుగోపాల్, కె.సురేష్ను ఆప్యాయంగా పలికరించారు.#WATCH | Delhi: Congress MPs KC Venugopal and K Suresh, and Union Minister-BJP MP Giriraj Singh share a candid moment on the staircase of the new Parliament building. pic.twitter.com/po1LQqqJLg— ANI (@ANI) June 24, 2024 తెలుగులో బండి సంజయ్ ప్రమాణంతెలంగాణ నుంచి కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ తెలుగులో ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారు.Union Ministers Bandi Sanjay Kumar and Sukanta Majumdar take oath as members of the 18th Lok Sabha. pic.twitter.com/re8wf295RF— ANI (@ANI) June 24, 2024 కేంద్ర మంత్రులు జి. కిషన్రెడ్డి, చిరాగ్ పాశ్వాన్ ఎంపీలుగా ప్రమాణ స్వీకారం చేశారు.Union Ministers G Kishan Reddy and Chirag Paswan take oath as members of the 18th Lok Sabha. pic.twitter.com/aUiSfimQyU— ANI (@ANI) June 24, 2024 కేంద్ర మంత్రులు భూపేందర్ యాదవ్, గజేంద్ర షెకావత్ ఎంపీలుగా ప్రమాణ స్వీకారం చేశారు.Union Ministers Bhupender Yadav and Gajendra Singh Shekhawat take oath as members of the 18th Lok Sabha. pic.twitter.com/BAXUduVIVt— ANI (@ANI) June 24, 2024 కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారు.#WATCH | Union Minister and BJP MP Dharmendra Pradhan takes oath as a member of the 18th Lok Sabha. pic.twitter.com/9rcS4OSwkj— ANI (@ANI) June 24, 2024 ఏపీ నుంచి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారు.Union Minister Ram Mohan Naidu Kinjarapu takes oath as a member of the 18th Lok Sabha. pic.twitter.com/d3E1DC8Yjw— ANI (@ANI) June 24, 2024 లోక్సభలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారు.Union Minister and BJP MP Piyush Goyal takes oath as a member of the 18th Lok Sabha. pic.twitter.com/Ls4hhIIDbb— ANI (@ANI) June 24, 2024 కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారు.Union Minister Shivraj Singh Chouhan takes oath as a member of the 18th Lok Sabha. pic.twitter.com/nZpQ0GGxmz— ANI (@ANI) June 24, 2024 కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ 18 లోక్సభ పార్లమెంట్ సమావేశాల్లో ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారు.Union Minister Nitin Gadkari takes oath as a member of the 18th Lok Sabha. pic.twitter.com/XMLofSCdX8— ANI (@ANI) June 24, 2024 అమిత్ షా ఎంపీగా ప్రమాణంహోంమంత్రి అమిత్ షా ఎంపీగా లోక్సభలో ప్రమాణ స్వీకారం చేశారు.#WATCH | Union Home Minister Amit Shah takes oath as a member of the 18th Lok Sabha. pic.twitter.com/3rlhhGKLbJ— ANI (@ANI) June 24, 2024 రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారు.#WATCH | Defence Minister Rajnath Singh takes oath as a member of the 18th Lok Sabha. pic.twitter.com/GDJFlyqkth— ANI (@ANI) June 24, 2024 ఎంపీగా మోదీ ప్రమాణంమొదటగా నరేంద్ర మోదీ ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన చేత లోక్సభ ప్రొటెం స్పీకర్గా భర్తృహరి మహతాబ్ ఎంపీ ప్రమాణం చేయించారు.#WATCH | Prime Minister Narendra Modi takes oath as a member of the 18th Lok Sabha. pic.twitter.com/3tjFrbOCJ0— ANI (@ANI) June 24, 2024 రాహుల్ గాంధీ వయనాడ్ స్థానం రాజీనామాను ప్రోటెం స్పీకర్ భర్తృహరి మహతాబ్ ఆమోదించారు.Pro-tem Speaker Bhartruhari Mahtab accepts the resignation of Congress leader Rahul Gandhi from Wayanad Lok Sabha seat.Rahul Gandhi kept the Raebareli Lok Sabha seat. pic.twitter.com/rFoya8nCJb— ANI (@ANI) June 24, 2024 పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం.. ప్రారంభమైన 18వ లోక్సభప్రమాణం చేయనున్న ఎంపీలులోక్సభ ప్రొటెం స్పీకర్గా భర్తృహరి మహతాబ్మొదట ఎంపీగా ప్రమాణం చేయనున్న ప్రధాని నరేంద్ర మోదీపార్లమెంట్ ప్రాంగణంలో మీడియాతో ప్రధాని మోదీఇది చాలా పవిత్రమైన రోజుఎంపీలందరికీ స్వాగతం పలుకుతున్నాఎంపీలు ప్రజల ఆకాంక్షల్ని నెరవేర్చాలిమాకు మూడోసారి వరుసగా సేవ చేసేందుకు అవకాశం ఇచ్చారు10 ఏళ్లలో దేశాభివృద్ధికి కృషి చేశామూడోసారి ప్రధానిగా ప్రజలకు సేవ చేసే అవకాశం నాకు దక్కిందికొత్త లక్ష్యాలు చేరుకోవడానికి మనమంతా కృషి చేయాలివికసిత్ భారత్ లక్ష్యాన్ని చేరుకోవాలి#WATCH | PM Narendra Modi says, "...The 18th Lok Sabha is starting today. The world's largest election was conducted in a very grand and glorious manner... This election has also become very important because for the second time after independence, the people of the country have… pic.twitter.com/bASHVtfh3S— ANI (@ANI) June 24, 2024 ఆ ఖర్మ నాకు పట్టలేదు: వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్రెడ్డివైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులు, రాజంపేట ప్రజల మద్దతుతో మూడోసారి ఎంపీ ఎన్నికయ్యాహ్యాట్రిక్ విజయాలతో పార్లమెంట్లు అడుగుపెట్టడం సంతోషంగా ఉందిమా పార్టీ అధినేత వైయస్ జగన్కు ధన్యవాదాలురాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా పార్లమెంట్లో పని చేస్తాజాతీయ, రాష్ట్ర ప్రయోజనాల ఉండే బిల్లులకు మద్దతిస్తాంరాష్ట్ర ప్రయోజనాలకు విరుద్ధంగా ఉంటే వ్యతిరేకిస్తాం బీజేపీలో చేరాల్సిన కర్మ నాకు పట్టలేదుకూటమినేతలు మైండ్ గేమ్ ఆడుతున్నారుగతంలో నేను విపక్షంలో ఉన్నప్పుడు కూడా ఇలాగే బీజేపీలో చేరుతారని ప్రచారం చేశారువైయస్ జగన్మోహన్ రెడ్డి నన్ను సొంత తమ్ముడిలా భావిస్తారువైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి పునర్వైభవం సాధించే వరకు కష్టపడతారాజంపేటలో అత్యధిక రోడ్లు వేయించిన ఘనత మాదేసాక్షి టీవీతో ఎంపీ మిథున్ రెడ్డి మరికాసేపట్లో పార్లమెంట్ సమావేశాలు ప్రారంభంఎంపీలుగా ప్రమాణం చేయనున్న సభ్యులుప్రధాని మోదీ సహా 280 మంది ప్రమాణంమోదీ తర్వాత కేంద్ర మంత్రులుఆ తర్వాత ఇంగ్లీష్ అక్షర క్రమంలో ఒక్కొక్కరుగా సభ్యుల ప్రమాణంనేడు ఏపీ, రేపు తెలంగాణ ఎంపీల ప్రమాణంప్రొటెం స్పీకర్గా భర్తృహరి మెహతాబ్ ప్రమాణంలోక్సభ ప్రొటెం స్పీకర్గా ప్రమాణం చేసిన భర్తృహరి మెహతాబ్భర్తృహరితో ప్రమాణం చేయించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము#WATCH | Delhi: BJP MP Bhartruhari Mahtab takes oath as pro-tem Speaker of the 18th Lok SabhaPresident Droupadi Murmu administers the oath pic.twitter.com/VGoL5PGEkT— ANI (@ANI) June 24, 2024ఎన్డీయే అలా ముందుకు..పార్లమెంట్ సమావేశాలు సజావుగా నిర్వహించాలని భావిస్తున్న ఎన్డీయేసభా కార్యకలాపాలకు సహకరించాలని ప్రతిపక్షాలను కోరే అవకాశంస్పీకర్ ఎన్నిక ఏకగ్రీవం అయ్యేందుకు సహకరించాలని కోరనున్న బీజేపీ అగ్రనేతఅమిత్ షా లేదంటే రాజ్నాథ్ సింగ్తో భేటీ అయ్యే ఛాన్స్ ఐక్యంగా ఇండియా కూటమిపార్లమెంట్ సమావేశాల తొలిరోజే ఐక్యత చాటాలని ఇండియా కూటమి నిర్ణయంగతంలో గాంధీ విగ్రహం ఉన్న గేట్-2 వద్ద భేటీఐక్యంగా పార్లమెంట్లోకి ఎంట్రీప్రొటెం స్పీకర్ ఎంపిక నిర్ణయంపై నిరసన తెలిపే అవకాశంనీట్పైనా కేంద్ర ప్రభుత్వాన్నినిలదీసే ఛాన్స్సంబంధిత వార్త: ప్రొటెం స్పీకర్కు ఇండియా కూటమి సహాయ నిరాకరణ?! కాసేపట్లో పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం ప్రొటెం స్పీకర్గా భర్తృహరి మెహతాబ్ ప్రమాణం18వ లోక్సభ తొలి సమావేశంనేడు, రేపు ఎంపీలుగా సభ్యుల ప్రమాణ స్వీకారంసభ్యులతో ప్రమాణం చేయించనున్న ప్రొటెం స్పీకర్ఎల్లుండి స్పీకర్ ఎన్నికడిప్యూటీ స్పీకర్ పోస్టు ఉంటుందా? ఉండదా?.. ఉంటే ఎవరికి వెళ్తుంది? అనే దానిపై చర్చ27న ఉభయ సభల సభ్యుల్ని ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగం -
ప్రొటెం స్పీకర్కు ఇండియా కూటమి సహాయ నిరాకరణ?!
పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా.. పద్దెనిమిదవ లోక్సభ ఇవాళ తొలిసారి భేటీ కానుంది. కొత్తగా ఎన్నికైన సభ్యులు ఎంపీలుగా ప్రమాణం చేయడం, స్పీకర్ ఎన్నిక, రాష్ట్రపతి ప్రసంగం.. నేపథ్యాలతో నాలుగు రోజులపాటు ఈ సమావేశాలు జరగనున్నాయి. అయితే.. ఈ సమావేశాల్లో ప్రతిపక్ష ఇండియా కూటమి సహాయ నిరాకరణ చేపట్టాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. పార్లమెంట్లో ఇవాళ, రేపు సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది. ప్రొటెం స్పీకర్ ప్యానెల్లో ఇండియా కూటమి ఎంపీలు కూడా సభ్యులుగా ఉన్నారు. ప్రొటెం స్పీకర్గా ఒడిశాకు చెందిన సీనియర్ ఎంపీ భర్తృహరి మహతాబ్ను నియమించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. సీనియర్ ఎంపీలు కే సురేష్(కాంగ్రెస్), టీఆర్ బాలు(డీఎంకే), బీజేపీ ఎంపీలు రాధా మోహన్ సింగ్.. ఫగ్గాన్ సింగ్ కులాస్తే, సుదీప్ బంధోపాధ్యాయ(టీఎంసీ)లను ప్రొటెం స్పీకర్ సహాయ ప్యానెల్లో సభ్యులుగా నియమించారు.అయితే ప్రొటెం స్పీకర్గా ఒడిశాకు చెందిన సీనియర్ ఎంపీ భర్తృహరి మహతాబ్ నియామకాన్ని ఇండియా కూటమి తొలి నుంచి వ్యతిరేకిస్తోంది. సభలో సీనియర్ ఎంపీలు ఉన్నప్పటికీ.. ఉద్దేశపూర్వకంగానే భర్తృహరిని ఎంపిక చేశారంటూ అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. ఈ క్రమంలోనే ప్రొటెం స్పీకర్ ప్యానెల్లోని బీజేపీ ఎంపీలిద్దరు తప్ప మిగతా ముగ్గురు.. భర్తృహరికి సహకరించొద్దని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇక.. పార్లమెంట్సమావేశాలు ఈ ఉదయం 11గం. ప్రారంభం కానున్నాయి. అరగంట ముందుగానే పార్లమెంట్ కాంప్లెక్స్ గేట్ నంబర్ 2 వద్ద ఇండియా కూటమి ఎంపీలు చేరుకుంటారు. తమ ఐక్యతను ప్రదర్శిస్తూ ఒకేసారి పార్లమెంట్లోకి ప్రవేశించబోతున్నట్లు తెలుస్తోంది. గతంలో ఈ గేట్ వద్దే ఎంపీలు నిరసన తెలిపే గాంధీ విగ్రహం ఉండేది. ఆ తర్వాత గాంధీ విగ్రహంతో పాటు మిగతా వాటిని ‘ప్రేరణ స్థల్’ కి ఏర్పాటు చేశారు. లోక్సభ సమావేశాల్లో.. తొలుత భర్తృహరి మెహతాబ్తో ప్రోటెం స్పీకర్ గా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణం చేయిస్తారు. ఆ తర్వాత ఎంపీలంతా పార్లమెంట్ భవనానికి చేరుకుంటారు. 18వ లోక్సభ ప్రారంభానికి ముందు.. కాసేపు ఎంపీలంతా మౌనం పాటించి కుర్చీల్లో కూర్చుంటారు.ముందుగా ఆనవాయితీ ప్రకారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఎంపీగా ప్రమాణం చేస్తారు. ఆ తర్వాత వరుసగా కేంద్ర మంత్రులు సహా మొత్తం 280 మంది ఎంపీలు ఇవాళ ప్రమాణం చేస్తారు. రేపు మిగతా ఎంపీలు ప్రమాణం చేస్తారు. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి.. ఇవాళ ఏపీ, రేపు తెలంగాణ ఎంపీలు ప్రమాణం చేస్తారు. ఇక.. స్పీకర్ ఎన్నిక 26వ తేదీన ఉండనుంది. ఇక 27వ తేదీన రాష్ట్రపతి ముర్ము లోక్సభ-రాజ్యసభ సభల సభ్యుల్ని ఉద్దేశించి ప్రసంగిస్తారు.ఇదిలా ఉంటే.. ఏకాభిప్రాయంతో స్పీకర్ ఎన్నికకు ప్రయత్నాలు సాగిస్తోంది ఎన్డీయే కూటమి. ఈ క్రమంలోనే ఓం బిర్లా కే మళ్లీ స్పీకర్ పదవి ఇచ్చే అవకాశం ఉందనే ప్రచారం నడుస్తోంది. ఇక డిప్యూటీ స్పీకర్ పదవి ఇవ్వాలని విపక్ష కూటమి కోరే అవకాశాలున్నాయి. సంప్రదాయంగా ప్రతిపక్షానికి, లేదంటే మిత్రపక్షాలకు డిప్యూటి స్పీకర్ పదవి కట్టబెట్టే అవకాశం లేకపోలేదు.డిప్యూటీ స్పీకర్ విషయంలో.. 2014లో అన్నా డీఎంకేకు డిప్యూటీ స్పీకర్ పదవి ఇచ్చింది ఎన్డీయే కూటమి16 వ లోకసభ లో (2014లో) ఏఐఏడిఎంకే కి చెందిన తంబిదొరై డిప్యూటీ స్పీకర్గా నియమితులయ్యారుఅయితే 17 వ లోకసభ లో (2019 లో ) మాత్రం ఆ పోస్ట్ ఖాళీగానే ఉంది -
Sanjay Raut: టీడీపీ స్పీకర్ పదవికి పోటీ చేస్తే.. ఇండియా కూటమి మద్దతిస్తుంది
ముంబై: లోక్సభ స్పీకర్ పదవికి అధికార ఎన్డీఏ పక్షంలోని తెలుగుదేశం పార్టీ(టీడీపీ) పోటీ చేస్తే ప్రతిపక్ష ఇండియా కూటమి పార్టీలన్నీ మద్దతిచ్చే అవకాశముందని శివసేన(యూబీటీ) నేత సంజయ్ రౌత్ చెప్పారు. లోక్సభ స్పీకర్ పోస్టు చాలా కీలకమైందని, ఈ పదవి బీజేపీకి దక్కితే, ప్రభుత్వానికి మద్దతిచ్చే టీడీపీ, జేడీయూలతో పాటు చిరాగ్ పాశ్వాన్, జయంత్ చౌదరిలకు చెందిన పార్టీలను ముక్కలు చేస్తుందని ఆరోపించారు. బీజేపీని నమ్మి మోసపోయిన అనుభవం తమకు కూడా ఉందని రౌత్ పేర్కొన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘లోక్సభ స్పీకర్ పదవిని టీడీపీ కోరుతున్నట్లుగా విన్నాను. అదే జరిగితే, ఇండియా కూటమి ఈ విషయాన్ని చర్చిస్తుంది. మా భాగస్వామ్య పక్షాలన్నీ టీడీపీకి మద్దతిచ్చేందుకు ప్రయత్నిస్తాయి’అని చెప్పారు. నిబంధన ప్రకారం ప్రతిపక్ష పార్టీకి డిప్యూటీ స్పీకర్ పోస్టు కేటాయించాలన్నారు. లోక్సభ ఎన్నికల అనంతరం రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) అగ్ర నేతలు బీజేపీపై చేసిన వ్యాఖ్యలపై సంజయ్ రౌత్.. గతంలో బీజేపీ చేసిన తప్పిదాలను ఆర్ఎస్ఎస్ సరిచేయాలనుకోవడం మంచి పరిణామమేనని పేర్కొన్నారు. జూన్ 7వ తేదీన పార్లమెంట్ సెంట్రల్ హాల్లో జరిగిన భేటీలో ప్రధాని మోదీ ఎన్డీఏ పార్లమెంటరీ పక్షం నేతగా, బీజేపీ పార్లమెంటరీ పార్టీ, లోక్సభలో బీజేపీ నేతగా ఎన్నికయ్యారని రౌత్ అన్నారు. ‘బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం ప్రత్యేకంగా జరగలేదు. అలా జరిగిన పక్షంలో నేత ఎవరనే ప్రశ్న ఉదయిస్తుంది, అప్పుడిక పరిణామాలు వేరుగా ఉంటాయి’అని అభిప్రాయపడ్డారు. మోదీ ఎన్డీఏ పార్లమెంటరీ పక్షం నేతగా మాత్రమే ఎన్నికవడం తీవ్రంగా పరిగణించాల్సిన అంశమని రౌత్ వ్యాఖ్యానించారు. -
స్పీకర్ పదవి.. బీజేపీ రిస్క్ చేస్తుందా?
హోరాహోరీ సార్వత్రిక ఎన్నికల సమరం ముగిసింది. అంతా ఊహించినట్టే నరేంద్ర మోదీ వరుసగా మూడోసారి ప్రధానిగా ప్రమాణస్వీకారం కూడా చేశారు. మోదీ 3.0 మంత్రివర్గమూ కొలువుదీరింది. కానీ గత రెండు ఎన్నికల మాదిరిగా సొంతంగా మెజారిటీ సాధించడంలో బీజేపీ ఈసారి విఫలమైంది. దాంతో ఎన్డీఏ సంకీర్ణ సర్కారు మనుగడలో భాగస్వామ్య పక్షాల పాత్ర కీలకంగా మారింది. ఈ నేపథ్యంలో అందరి కళ్లూ అతి కీలకమైన లోక్సభ స్పీకర్ పదవిపైనే నెలకొన్నాయి. ఎన్డీఏ కీలక భాగస్వామి టీడీపీ ఆ పదవిపై ఆసక్తిగా ఉందంటూ ముందునుంచీ వార్తలొస్తున్నాయి. తాజాగా జేడీ(యూ) పేరూ విని్పస్తోంది. అవి నాలుగైదు కేబినెట్ బెర్తులు కోరినా ఎన్డీఏ పెద్దన్న బీజేపీ మాత్రం చెరో రెండింటితో సరిపెట్టింది. కనుక స్పీకర్ పోస్టుపై ఆ పార్టీలు పట్టుదలగా ఉన్నట్టు చెబుతున్నారు. కానీ అపారమైన విచక్షణాధికారాలుండే స్పీకర్ పాత్ర కీలక సమయాల్లో అత్యంత నిర్ణాయకంగా మారుతుంటుంది. మరీ ముఖ్యంగా సంకీర్ణ ప్రభుత్వాల్లో లోక్సభ స్పీకర్ పాత్రకుండే ప్రాధాన్యం అంతా ఇంతా కాదు. పైగా గతంలో టీడీపీకి స్పీకర్ పోస్టు ఇచ్చి సర్కారును కుప్పకూల్చుకున్న అనుభవమూ బీజేపీకి ఉంది. ఈ నేపథ్యంలో కీలక పదవిని మిత్రపక్షాల చేతిలో పెట్టే రిస్క్కు బీజేపీ పెద్దలు మరోసారి సిద్ధపడతారా అన్నది సర్వత్రా ఆసక్తి రేపుతోంది...అది 1999. రాజకీయ అస్థిరతకు చెక్ పెట్టే ఉద్దేశంతో వాజ్పేయి సారథ్యంలోని ఎన్డీఏ సంకీర్ణ ప్రభుత్వం లోక్సభలో బలపరీక్షకు సిద్ధపడింది. మద్దతిస్తామన్న పలు ఇతర పారీ్టలు తీరా అసలు సమయానికి అడ్డం తిరగడంతో ఒకే ఒక్క ఓటు తేడాతో ప్రభుత్వం కుప్పకూలింది. నాడు స్పీకర్గా ఉన్న టీడీపీ నేత జీఎంసీ బాలయోగి తీసుకున్న నిర్ణయమే అందుకు కారణంగా మారడం విశేషం! అంతకు కొద్ది రోజుల ముందే ఒడిశా ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన కాంగ్రెస్ ఎంపీ గిరిధర్ గమాంగ్ను ఓటింగ్కు అనుమతించాలా, లేదా అన్న ధర్మసందేహం తలెత్తింది. స్పీకర్గా తన విచక్షణాధికారాలను ఉపయోగించి గమాంగ్ను ఓటింగ్కు అనుమతిస్తూ బాలయోగి నిర్ణయం తీసుకున్నారు. చివరికి విశ్వాస తీర్మానానికి అనుకూలంగా 269 ఓట్లు రాగా వ్యతిరేకంగా 270 వచ్చాయి. అలా గమాంగ్ వేసిన ఒక్క ఓటు ప్రభుత్వాన్ని పడ గొట్టింది. ఎన్డీఏ సర్కారుకు బయటినుంచి మద్దతిచి్చన టీడీపీ అధినేత చంద్రబాబు కోరిక మేరకు స్పీకర్ పదవిని ఆ పారీ్టకిస్తూ నాటి ప్రధాని వాజ్పేయి నిర్ణయం తీసుకున్నారు. పాతికేళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు బాబు మరోసారి టీడీపీకి స్పీకర్ పదవి కోరుతున్నట్టు వార్తలొస్తుండటం విశేషం! జిస్కా స్పీకర్, ఉస్కీ సర్కార్! మోదీ 3.0 ప్రభుత్వం కొలువుదీరినా బీజేపీకి సొంతంగా మెజారిటీ రాని విషయం తెలిసిందే. లోక్సభలో మెజారిటీ మార్కు 272 కాగా బీజేపీకి 240 మంది ఎంపీలే ఉన్నారు. ఎన్డీఏ భాగస్వాముల్లో 16 ఎంపీలున్న టీడీపీ, 12 మంది ఉన్న జేడీ(యూ) ప్రభుత్వ మనుగడకు కీలకంగా మారాయి. సంకీర్ణ ప్రభుత్వాల మనుగడలో స్పీకర్ పదవి ఎంత కీలకమో 1999 నాటి వాజ్పేయి ప్రభుత్వ ఉదంతం నిరూపించింది. పైగా ‘జిస్కా స్పీకర్, ఉస్కీ సర్కార్ (స్పీకర్ పదవి దక్కిన వారిదే సర్కారు)’ అన్న నానుడి హస్తిన రాజకీయ వర్గాల్లో బాగా ఫేమస్ కూడా. అలాంటి కీలకమైన స్పీకర్ పదవిని ఈసారి టీడీపీ కోరుతోంది. మోదీ అందుకు అంగీకరించే సాహసం చేస్తారా అన్నదానిపై రకరకాల విశ్లేషణలు వెలువడుతున్నాయి. 2014, 2019ల్లో బీజేపీ సొంతగానే మెజారిటీ సాధించడంతో ఆయనకు ఇలాంటి పరీక్ష ఎదురవలేదు. అయితే మంత్రివర్గ కూర్పులో భాగస్వాముల డిమాండ్లకు మోదీ పెద్దగా తలొగ్గలేదు. టీడీపీ ఐదారు, జేడీ(యూ) నాలుగైదు బెర్తులు అడిగినా వాటికి చెరో రెండు పదవులతో సరిపెట్టారు. పైగా కీలకమైన శాఖలన్నింటినీ బీజేపీకే కేటాయించారు. కనుక స్పీకర్ పదవిని కూడా బీజేపీయే అట్టిపెట్టుకోవచ్చన్న అభిప్రాయం విని్పస్తోంది. పవర్స్ అన్నీ ఇన్నీ కావులోక్సభ స్పీకర్కు సాధారణ అధికారాలతో పాటు అత్యంత కీలకమైన విచక్షణాధికారాలు కూడా ఉంటాయి. సభా నిబంధనలను తన విచక్షణ మేరకు నిర్వచించగలుగుతారు. అందుకే స్పీకర్ పదవిని పాలక పక్ష బలానికి, ఆధిపత్యానికి ప్రతీకగా భావిస్తుంటారు. లోక్సభను అజమాయిషీ చేస్తూ కార్యకలాపాలను సజావుగా నడిపించేది స్పీకరే. కనుక ఆ పదవి దక్కే పార్టీ సహజంగానే లోక్సభ కార్యకలాపాల అజెండా తదితరాలను ప్రభావితం చేయగలుగుతుంది. నిర్ణాయక సందర్భాల్లో ఇది కీలకంగా మారుతుంది. సభలో ప్రవేశపెట్టే బిల్లులు ద్రవ్య బిల్లా, సాధారణ బిల్లా అన్నది స్పీకరే నిర్ధారిస్తారు. సభా సంఘాలను ఏర్పాటు చేస్తారు. వాటి చైర్పర్సన్లు, సభ్యులను నియమిస్తారు. సభ్యుల సస్పెన్షన్ వంటి కీలక నిర్ణయాలు తీసుకోవాల్సింది స్పీకరే. పార్లమెంటు సంయుక్త సమావేశాలకు సారథ్యం వహిస్తారు. అన్నింటికీ మించి ఏ అంశంపై అయినా సభలో ఓటింగ్ జరిగి రెండు పక్షాలకూ సమానంగా ఓట్లొస్తే స్పీకర్ పాత్ర మరింత కీలకంగా మారుతుంది. ఆయన నిర్ణాయక ఓటు ఎవరికి వేస్తే వారే నెగ్గుతారు!– సాక్షి, నేషనల్ డెస్క్ -
Indian stock market: భారీ లాభాలకు అవకాశం
ముంబై: దలాల్ స్ట్రీట్ ఈ వారం భారీ కొనుగోళ్లతో కళకళలాడొచ్చని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వ ఏర్పాటు, కేంద్ర మంత్రుల ప్రమాణ స్వీకారంతో ఆర్థిక సంస్కరణల కొనసాగింపుపై మరింత స్పష్టత రావడంతో బుల్ పరుగులు తీసే వీలుందంటున్నారు. ఇక అమెరికా ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ సమావేశం నుంచి ఈ వారం మార్కెట్లు సంకేతాలు అందిపుచ్చుకోవచ్చు. అలాగే దేశీయ ద్రవ్యల్బోణ గణాంకాలు, ప్రపంచ పరిణామాలు ఈ వారం ట్రేడింగ్ను నిర్దేశిస్తాయని స్టాక్ నిపుణులు చెబుతున్నారు. డాలర్ మారకంలో రూపాయి విలువ, విదేశీ ఇన్వెస్టర్ల క్రయ విక్రయాలు, క్రూడాయిల్ ధరలపైనా ఇన్వెస్టర్లు దృష్టి సారించవచ్చంటున్నారు. ఇటీవల పబ్లిక్ ఇష్యూ పూర్తి చేసుకున్న క్రోనాక్స్ ల్యాబ్ సైన్సెస్ షేర్లు సోమవారం ఎక్సే్చంజీల్లో లిస్ట్ కానున్నాయి. ఇదే రోజున లీ ట్రావెన్యూస్ టెక్నాలజీ ఐపీఓ సోమవారం ప్రారంభమై, బుధవారం ముగుస్తుంది. ఎగ్జిట్ పోల్స్, ఎన్నికల ఫలితాలు, ఆర్బీఐ ద్రవ్య విధాన నిర్ణయాల వెల్లడి నేపథ్యంలో గతవారం తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతూ లాభ, నష్టాల మధ్య ట్రేడయ్యాయి. సెన్సెక్స్ 76,795 వద్ద కొత్త రికార్డు నమోదుతో పాటు 2,732 పాయింట్లు లాభపడింది. నిఫ్టీ 23,339 వద్ద జీవితకాల గరిష్టాన్ని అందుకుంది. మొత్తంగా 759 పాయింట్లు ఆర్జించింది. కళ్లన్నీ ఫెడ్ సమావేశం పైనే..! అమెరికా ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ సమావేశ నిర్ణయాలు గురువారం(జూన్ 13న) విడుదల కానున్నాయి. కీలక వడ్డీరేట్లను యథాతథంగా (5.25–5.50 శ్రేణిలో) ఉంచొచ్చని అంచనాలు నెలుకొన్నాయి. యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ వడ్డీరేట్ల కోత తర్వాత ఫెడ్ రిజర్వ్ తొలి రేట్ల తగ్గింపు సెపె్టంబర్లోనా.? డిసెంబర్లోనా..? అనే అంశంపై స్పష్టత కోసం మార్కెట్ వర్గాలు ఎదురుచూస్తున్నాయి. అలాగే ద్రవ్యోల్బణం, ఆర్థిక స్థితిగతులపై ఫెడ్ చైర్మన్ జెరోమ్ పావెల్ వ్యాఖ్యలు కీలకం కానున్నాయి. ద్రవ్యోల్బణ డేటాపై దృష్టి దేశీయంగా మే నెల రిటైల్ ద్రవ్యోల్బణం, పారిశ్రామికోత్పత్తి డేటా జూన్ 12న, హోల్సేల్ ద్రవ్యోల్బణ గణాంకాలు జూన్ 14న విడుదల కానున్నాయి. రిటైల్ ద్రవ్యల్బోణం ఏప్రిల్లో 4.85%, మార్చిలో 4.83 శాతంగా నమోదైంది. ఈసారి మేలో4.8శాతంగా నమోదవ్వొచ్చని ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. ఐఐపీ డేటా 4.9% నుంచి 3.9 శాతానికి దిగిరావచ్చని భావిస్తున్నారు.రూ.14,794 కోట్ల అమ్మకాలు దేశీయ ఈక్విటీ మార్కెట్ నుంచి విదేశీ ఇన్వెస్టర్లు తొలి వారంలో రూ.14,794 కోట్లను వెనక్కి తీసుకున్నారు. లోక్సభ ఎన్నికల ఫలితాలు అంచనాలకు భిన్నంగా రావడం.., అదే సమయంలో చైనా స్టాక్ మార్కెట్ ఆకర్షణీయంగా ఇందుకు ప్రధాన కారణాలు. మరోవైపు డెట్ మార్కెట్లో రూ.4,000 కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టారు. ఇక మే నెలలో ఎన్నికల ఫలితాలపై భిన్న అంచనాల కారణంగా రూ.25,586 కోట్లు ఉపసంహరించుకున్నారు. కాగా ఏప్రిల్లో రూ.8,700 కోట్లకు పైగా పెట్టుబడులు వెనక్కి తీసుకున్నారు. -
కాసేపట్లో కాబోయే మంత్రులకు మోదీ తేనేటి విందు
సాక్షి, ఢిల్లీ: నరేంద్ర మోదీ సారధ్యంలో కొలువుదీరబోయే కొత్త మంత్రి వర్గంపై ఒక అంచనా వచ్చేసింది. కేబినెట్లో చోటు దక్కిన ఎంపీలకు పీఎంవో కార్యాలయం నుంచి ఫోన్ కాల్స్ వెళ్తున్నాయి. కాసేపట్లో ప్రధాని మోదీ తన నివాసంలో నూతన మంత్రి వర్గ సభ్యులకు తేనేటి విందు ఇవ్వనున్నట్లు సమాచారం. ఇక.. కేంద్ర కేబినెట్లో ఇద్దరు టీడీపీ ఎంపీలకు చోటు లభించింది. టీడీపీ ఎంపీల్లో రామ్మోహన్నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్కు కాల్స్ వెళ్లాయి. అలాగే మిత్రపక్షాల ఎంపీల్లో కుమారస్వామి(జేడీఎస్), ప్రతాప్రావ్ జాదవ్లకు ఫోన్ కాల్స్ వెళ్లినట్లు సమాచారం. మరోవైపు బీజేపీ సీనియర్లు రాజ్ నాథ్ సింగ్ , నితిన్ గడ్కరీ, పియూష్ గోయల్, జితేంద్రసింగ్, శర్బానంద సోనోవాల్, జ్యోతి రాధిత్య సింధియాలకు సైతం కబురు వెళ్లినట్లు సమాచారం.మంత్రి మండలిలో కిషన్రెడ్డి , బండి సంజయ్ చోటు దక్కింది. కిషన్ రెడ్డి నివాసం నుంచి ఒకే కారులో వారు బయలుదేరి వెళ్లారు. ఇంకా ఎవరెవరికి కాల్స్ వెళ్లాయనేదానిపై కాసేపట్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇవాళ సాయంత్రం కర్తవ్యపథ్లో ప్రధానిగా నరేంద్ర మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు తెలుస్తోంది. -
కేబినెట్లో ఎవరెవరో...!
న్యూఢిల్లీ: మోదీ 3.0 మంత్రివర్గంలో చోటు దక్కించుకునేది ఎవరన్నది ఆసక్తికరంగా మారింది. బీజేపీకి సొంతగా మెజారిటీ రాని నేపథ్యంలో ఈసారి మంత్రివర్గ కూర్పులో ఎన్డీఏ మిత్రపక్షాలకు పెద్దపీట వేయడం తప్పనిసరిగా మారింది. ఈ నేపథ్యంలో మంత్రులుగా పార్టీలవారీగా పలువురి పేర్లు విని్పస్తున్నాయి... బీజేపీ అమిత్ షా మళ్లీ హోం, రాజ్నాథ్సింగ్ రక్షణ శాఖల బాధ్యతలు చేపట్టవచ్చంటున్నారు. నితిన్ గడ్కరీ, పీయూష్ గోయల్, ప్రహ్లాద్ జోషీ, జ్యోతిరాదిత్య సింధియా, జితిన్ ప్రసాద, నిత్యానంద రాయ్, రాజీవ్ ప్రతాప్ రూడీ, కిరెన్ రిజిజు కూడా మంత్రులుగా కొనసాగే వీలుంది. మధ్యప్రదేశ్ మాజీ సీఎం శివరాజ్సింగ్ చౌహాన్కు పార్టీ అధ్యక్ష బాధ్యతలు ఇవ్వకుంటే మంత్రిగా చాన్సున్నట్టు చెబుతున్నారు. వీరితో పాటు కిషన్రెడ్డి, ఈటల రాజేందర్, డీకే అరుణ, ధర్మపురి అరవింద్, బండి సంజయ్ (తెలంగాణ), పురందేశ్వరి (ఏపీ), ధర్మేంద్ర ప్రధాన్, గజేంద్రసింగ్ షెకావత్, బస్వరాజ్ బొమ్మై, పీసీ మోహన్, గోవింద్ కర్జోల్, దుష్యంత్ సింగ్, సురేశ్గోపీ, శాంతను ఠాకూర్, జితేంద్ర సింగ్, జుగల్ కిశోర్ శర్మ, శర్బానంద సోనోవాల్, బైజులీ కలితా మేధి, బిప్లవ్ దేబ్ తదితరుల పేర్లు వినిపిస్తున్నాయి.జనసేన వల్లభనేని బాలÔౌరి పేరు విని్పస్తోంది.జేడీ(యూ) మూడు కేబినెట్, ఒకట్రెండు సహాయ బెర్తుల కోసం పార్టీ అధ్యక్షుడు, బిహార్ సీఎం పట్టుబడుతున్నట్టు సమాచారం. రెండు కేబినెట్ పదవులు దక్కవచ్చని జాతీయ మీడియా అభిప్రాయపడుతోంది. పార్టీ మాజీ చీఫ్ లలన్సింగ్తో పాటు భారతరత్న కర్పూరీ ఠాకూర్ కుమారుడు రామ్నాథ్ ఠాకూర్ పేర్లు ఇప్పటికే ఖరారైనట్టు తెలుస్తోంది.టీడీపీ కనీసం నాలుగు కేబినెట్ పదవులు కోరుతోంది. శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు ఆదివారం మోదీతో పాటు ప్రమాణం చేయడం ఖాయమని చెబుతున్నారు. రూ.5,705 కోట్ల ఆస్తులతో ఈ లోక్సభ ఎన్నికల్లో పోటీపడ్డ అభ్యర్థుల్లో అత్యంత సంపన్నుడిగా రికార్డు సృష్టించిన పెమ్మసాని చంద్రశేఖర్తో పాటు వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి, డి.ప్రసాదరావు, టి.కృష్ణప్రసాద్ పేర్లు కూడా విని్పస్తున్నాయి.ఆరెల్డీ పార్టీ చీఫ్ జయంత్ చౌదరికి బెర్తు ఖాయమంటున్నారు.శివసేన రెండు బెర్తులు అడుగుతోంది. పార్టీ చీఫ్, మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే కుమారుడు శ్రీకాంత్ షిండే పేరు గట్టిగా విని్పస్తోంది. ఆయన మాత్రం తన బదులు పార్టీ కోసం ఏళ్ల తరబడి కష్టించిన ఇతరులకు అవకాశం దక్కాలంటున్నారు. ఎల్జేపీ కనీసం ఒక్క బెర్తు ఖాయంగా కని్పస్తోంది. పార్టీ చీఫ్ చిరాగ్ పాస్వాన్ మోదీతో పాటు ప్రమాణస్వీకారం చేయవచ్చని చెబుతున్నారు. జేడీ(ఎస్) హెచ్.డి.కుమారస్వామికి వ్యవసాయ శాఖ కోరుతోంది.అప్నాదళ్ (ఎస్) అనుప్రియా పటేల్కు మళ్లీ స్థానం దక్కేలా ఉంది. -
యూపీలో ‘ఇండియా’ మ్యాజిక్ అసలు కథ
2024 ఎన్నికల ఘట్టం ముగిసింది. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి మరోమారు అధికారం చేపట్టేందుకూ రంగం సిద్ధమైంది. అయితే ఈ ఎన్నికల్లో బీజేపీ 300 కంటే తక్కువ సీట్లకే పరిమితమయ్యేందుకు ముఖ్యకారణం ఉత్తర ప్రదేశ్ (యూపీ)లో ‘ఇండియా’ కూటమి అత్యద్భుత ప్రదర్శనే అనడంలో సందేహం అవసరం లేదు. హోరాహోరీగా ఎన్నికల్లో ఇండియా కూటమి ఏకంగా 43 స్థానాలను కైవసం చేసుకోగా (సమాజ్వాదీ పార్టీ 37, కాంగ్రెస్ ఆరు) ఎన్డీయే 36 సీట్లతో (బీజేపీ 33) సర్దుకోవాల్సి వచ్చింది. ఈ ఫలితాలు చాలామందిని ఆశ్చర్యానికి గురిచేశాయి. ఎందుకంటే హిందుత్వ భావజాలానికి బాగా మద్దతున్న రాష్ట్రమిది. నరేంద్ర మోదీ నేతృత్వంలో ఇది మరింత లోతుకు చేరింది. 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు యూపీలో 2019 నాటి కంటే మెరుగైన ఫలితాలు సాధిస్తామని బీజేపీ చాలా ధీమాగానే ఉండింది. అయితే పోలింగ్ శాతం తక్కువ కావడం, మోదీ అనుకూల పవనాలేవీ లేకపోవడం, స్థానికాంశాలకు ఎక్కువ ప్రాధాన్యం లభించడం వంటి కారణాలతో బీజేపీకి గట్టి పోటీ తప్పలేదు. అయితే గత కొన్నేళ్లుగా క్షేత్రస్థాయిలో చాలా పరిణామాలు చోటు చేసుకున్నాయి. బీజేపీ వీటిని పెద్దగా పట్టించుకోలేదని ఈ ఫలితాలు రుజువు చేస్తున్నాయి.రాజకీయంగా మళ్లీ పుంజుకుంటున్న దశలో ఉన్న సమాజ్వాదీ పార్టీతో ‘ఇండియా’ కూటమి ఏర్పాటు, పప్పూ అన్న ఇమేజ్ చట్రం నుంచి బయటపడ్డ రాహుల్ గాంధీ, యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్పై ప్రజల్లో... మరీ ముఖ్యంగా దళితులు, కొన్ని ఓబీసీ వర్గాల్లో పెరిగిపోయిన అసంతృప్తి; అస్తవ్యస్తంగా ఉన్న రాష్ట్ర ఆర్థిక పరిస్థితి... వెరసి ఈ ఫలితాలు! యూపీ ఎన్నికల్లో ‘ఇండియా’ కూటమి ప్రదర్శనకు కర్త, కర్మ, క్రియ సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవే. 2022 అసెంబ్లీ ఎన్నికల్లో 2014 తరువాత మొదటిసారి ఓ నేత బీజేపీకి సవాలు విసిరే స్థితిలో కనిపించాడు. గత ఎన్నికల్లో ఓటమి తరువాత ఓబీసీ, దళిత వర్గాలకు చెందిన చిన్న పార్టీలన్నింటినీ కూడగట్టి అఖిలేశ్ఒంటరిగానే యూపీలో బీజేపీ వ్యతిరేక ఫ్రంట్ను నిర్మించగలిగాడు. దళిత ఓటర్లను తనవైపు తిప్పుకునేందుకు బాబాసాహెబ్ వాహినిని సృష్టించాడు. వెనుకబడిన వర్గాల నేతగా తనను తాను ఆవిష్కరించుకున్న అఖిలేశ్ ఎన్నికల యుద్ధాన్ని కాస్తా హిందూత్వ– సామాజిక న్యాయాల మధ్య పోరుగా మార్చేశాడు. 2024 ఎన్నికల్లోనూ కాంగ్రెస్ డిమాండ్లను తట్టుకుని సీట్ల సర్దుబాటు చర్చలను ఫలవంతం చేయడం ద్వారా వారికి 11 సీట్లు, తన పార్టీ, వర్గానికి 62 సీట్లు కేటాయించుకునేలా చేయగలిగాడు. అంతేకాకుండా ముస్లిం– యాదవ్ల పార్టీ అన్న ముద్రను పోగొట్టుకునేందుకు ప్రయత్నించాడు. కుటుంబ సభ్యులతోపాటు యాదవులకు కేటాయించిన సీట్లు ఐదింటికి పరిమితం చేసుకున్నాడు. మిగిలిన సీట్లన్నింటినీ అన్ని వర్గాల వారికీ కేటాయించాడు.రాహుల్ గాంధీపై అప్పటివరకూ ఉన్న ప్రజాభిప్రాయం 2024 ఎన్నికల్లో గణనీయంగా మారినట్లు స్పష్టమవుతోంది. భారత్ జోడో యాత్ర, భారత్ న్యాయ్ యాత్రలు ఇందుకు ఉపకరించి ఉండవచ్చు. అమేథీ, రాయ్ బరేలీల్లో కాంగ్రెస్ విజయాలు దీనికి తార్కాణంగా చెప్పుకోవచ్చు. గాంధీ కుటుంబానికి కంచుకోటలుగా ఉన్న ఈ రెండు నియోజకవర్గాలు గత ఎన్నికల్లో బీజేపీకి పట్టం కట్టిన విషయం ఇక్కడ ప్రస్తావనార్హం. ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన న్యాయ్ గ్యారెంటీలు కూడా చాలావరకూ ప్రజాదరణకు నోచుకున్నాయి. మరీ ముఖ్యంగా జాబ్ గ్యారెంటీ, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్లను యాభై శాతం కంటే ఎక్కువ చేసేందుకు రాజ్యాంగ మార్పులు. ఇండియా కూటమి భాగస్వాములు కలిసికట్టుగా ఎన్నికల ర్యాలీలు నిర్వహించడం కొంత ఆలస్యంగా మొదలైనప్పటికీ మే నెలలో మాత్రం దాదాపు ఆరు జరిగాయి. అన్ని సమావేశాల్లోనూ అఖిలేశ్ ప్రజాకర్షక నేతగా కనిపించారు. ‘ఇండియా’ కూటమి నేతలు క్షేత్రస్థాయిలో అధికార పక్షంపై ఉన్న అసంతృప్తిని ఒడిసిపట్టుకోవడంలో విజయం సాధించారని చెప్పాలి. కులాధారిత జనగణన, రాజ్యాంగాన్ని సమూలంగా మార్చేస్తారన్న దళితుల ఆందోళన, అగ్నివీర్, ప్రశ్నపత్రాలు తరచూ లీక్ అవుతూండటం వంటి అంశాలను సమర్థంగా వాడుకుని అధికార పక్షానికి సవాలు విసిరారు ‘ఇండియా’ కూటమి నేతలు. మతం ప్రధానంగా సాగిన బీజేపీ ప్రచారం ప్రభావం నుంచి జనాలను తమవైపునకు మళ్లించడంలో విజయం సాధించారు. అయోధ్య రామాలయం ఉన్న ఫైజాబాద్లోనూ బీజేపీ ఓటమి పాలు కావడమే కాదు... విజయం సాధించిన సమాజ్వాదీ పార్టీ నేత అవదేశ్ సింగ్ దళిత వర్గానికి చెందిన వాడు కావడం గమనార్హం.2014 నుంచి బహుజన్ సమాజ్ పార్టీ ఉత్తర ప్రదేశ్లో తన పట్టు, ప్రాభవం రెండింటినీ కోల్పోతూ వస్తోంది. ఆ కారణంగానే జాట్ కులేతరులు బీజేపీవైపు ఎక్కువగా మొగ్గారు. తద్వారా యాదవుల ఆధిపత్యం నుంచి తప్పించుకోవచ్చునని ఆలోచించారు. అయితే ఎస్పీ కాంగ్రెస్తో జట్టు కట్టడంతో బీఎస్పీ, బీజేపీల కంటే ‘ఇండియా’ కూటమి తమకు మేలు చేయగలదన్న నమ్మకం వాళ్లకు కలిగింది. భీమ్ ఆర్మీ/ఆజాద్ సమాజ్ పార్టీ వైపు దళితులు మొగ్గడం వెనుక కారణమూ ఇదే. చంద్రశేఖర్ ఆజాద్ ఏర్పాటు చేసిన ఈ పార్టీ చతుర్ముఖ పోరులోనూ నగీనా రిజర్వ్డ్ స్థానం నుంచి విజయం సాధించింది.యూపీలో బీజేపీ కూటమి ఓటమికి మరో బలీయమైన కారణం ఆ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి. ద్రవ్యోల్బణం, నిరుద్యోగం రెండూ ఆర్థిక వ్యవస్థ పరిస్థితిని చర్చనీయాంశంగా చేశాయి. అధికారిక లెక్కల ప్రకారం 2017 నుంచి 2021 వరకూ యూపీ ఆర్థిక వ్యవస్థ యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలో ఆశించిన స్థాయిలో రాణించలేదు. రాష్ట్ర స్థూల ఉత్పత్తి కేవలం 1.95 శాతం చొప్పున మాత్రమే వృద్ధి చెందింది. తలసరి ఆదాయ వృద్ధి ఏడాదికి 0.43 శాతం మాత్రమే. అంతకు మునుపు అంటే 2012–2017 మధ్యకాలంలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి ఏడాదికి 6.92 శాతం చొప్పున పెరగ్గా 2007–2012 మధ్యకాలంలో బీఎస్పీ అధినేత్రి మాయవతి కాలంలో 7.28 శాతం చొప్పున పెరిగింది. యోగీ ఆదిత్యనాథ్ హయాంలో శాంతిభద్రతల పరిస్థితి మెరుగైందని చాలామంది చెబుతూంటారు. అదే సమయంలో చాలామందికి యోగి బుల్డోజర్ రాజకీయాలు అంతగా నచ్చలేదు కూడా! యూపీలో ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా యమునా, గంగ ఎక్స్ప్రెస్ వే, సనౌటా–పుర్కాజీ ఎక్స్ప్రెస్ వే, వారణాసి – నోయిడాల మధ్య ఎనిమిది లేన్ల రహదారి వంటి అనేక భారీ ప్రాజెక్టులు మొదలయ్యాయి. అలాగే కుశినగర్, జేవార్ల వద్ద అంతర్జాతీయ విమానాశ్రయానికీ ప్రణాళిక సిద్ధమైంది. కానీ, ఈ రెండింటికీ బీజం పడ్డది మాయావతి కాలంలో. అఖిలేశ్ ఈ ఆలోచనలను కొనసాగించారు. మొత్తమ్మీద 2024 ఎన్నికలు హిందూత్వ భావజాలానికీ, సామాజిక న్యాయాన్ని కోరే మండల్ వర్గాలకూ మధ్య హోరాహోరీగానే సాగింది. రాముడి చుట్టూ తిరిగిన రాజకీయాలను కాస్తా ప్రజల జీవనోపాధి సమస్యల వైపు మళ్లించిన ఘనత ‘ఇండియా’ కూటమికి దక్కుతుంది. ఇంకోలా చెప్పాలంటే 2014 తరువాత మొదటిసారి బీజేపీ మతతత్వ పాచిక పారలేదని చెప్పాలి. -వ్యాసకర్త ‘మాయా, మోదీ, ఆజాద్: దళిత్ పాలిటిక్స్ ఇన్ ద టైమ్ ఆఫ్ హిందుత్వ’ రచయిత్రి (సజ్జన్ కుమార్తో కలిసి). - సుధా పాయీ -
ఎన్డీయే కూటమిపై బెంగాల్ సీఎం మమత సంచలన వ్యాఖ్యలు
కోల్కతా: ఎన్డీయే కూటమి పక్ష నేతగా నరేంద్ర మోదీ మూడోసారి ప్రధానిగా ప్రమాణస్వీకారం చేసే కార్యక్రమంలో తామ పార్టీ పాల్గొనటం లేదని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అన్నారు. ఆమె శనివారం టీఎంసీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘కేంద్రంలో చట్టవిరుద్ధంగా, అప్రజాస్వామ్యంగా ప్రభుత్వం కొలువుదీరుతోంది. అందుకే ప్రధాని ప్రమాణ స్వీకార కార్యక్రమంలో టీఎంసీ పాల్గొనటం లేదు. 400 సీట్లు గెలుస్తామన్న వారు(బీజేపీ) కనీస మెజార్టి మార్క్ కూడా సాధించుకోలేకపోయింది. వెంటనే ఇండియా కూటమి ప్రభుత్వాని ఏర్పాటు చేస్తుందని చెప్పటం లేదు. ... కానీ, పరిస్థితులు మారటాన్ని మేము ఆసక్తిగా చూస్తూ ఉంటాం. కొన్ని రోజులకు ఇండియా కూటమి ప్రభుత్వం వస్తుంది. కొన్ని సార్లు ప్రభుత్వాలు ఒకరోజు మాత్రమే ఉంటాయి. ఏదైనా జరిగితే.. ఎన్డీయే కూటమి ప్రభుత్వం కేవలం 15 రోజులు మాత్రమే ఉండొచ్చు?’’ అని మమత అన్నారు. రాబోయే రోజుల్లో ఇండియా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఆమె పరోక్షంగా సంకేతాలు ఇచ్చినట్లు అయింది.మరోవైపు.. గురువారం జరిగిన ఇండియా కూటమి సమావేశం ముగిసిన అనంతరం కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖేర్గే మాట్లాడుతూ.. బీజేపీ తమను పాలించవద్దని ప్రజలు సైతం గ్రహిస్తారని అన్నారు. ఇక.. ఇండియా కూటమి 232 స్థానాల్లో విజయం సాధించగా.. టీఎంసీ బెంగాల్లో 29 స్థానాల్లో గెలుపొందింది. అత్యధిక స్థానాల్లో విజయం సాధించిన నాలుగో పార్టీగా టీఎంసీ నిలిచింది. రేపు (ఆదివారం) ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకారం చేయనున్న క్రమంలో ఇండియా కూటమిలో బలమైన నేతగా ఉన్న సీఎం మమత చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. -
టీడీపీకి రెండు కేంద్రమంత్రి పదవులు ఖరారు!
విజయవాడ, సాక్షి: నరేంద్ర మోదీ ప్రధానిగా.. కొత్తగా కొలువు దీరనున్న కేంద్ర కేబినెట్లో మిత్రపక్షం తెలుగు దేశం పార్టీకి రెండు మంత్రి పదవులు ఖరారైనట్లు తెలుస్తోంది. శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడికి కేంద్ర కేబినెట్ హోదా, అలాగే గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్కు సహాయ మంత్రి పదవి దాదాపుగా ఖరారైనట్లు సమాచారం. ఈ మేరకు ఢిల్లీ టీడీపీ వర్గాలు లీకులు అందిస్తున్నాయి. ఇక.. టీడీపీ నుండి మరొకరికి అవకాశం ఉండొచ్చనే ఊహాగానాలు వినిపించినప్పటికీ.. ఇంకా స్పష్టత రాలేదు. కేబినెట్ పదవులతో పాటు లోక్సభ స్పీకర్గానీ లేదంటే డిప్యూటీ స్పీకర్ పోస్టును సైతం టీడీపీ కోరుతోందన్నది తెలిసిందే. -
కేంద్ర కేబినెట్లో తెలుగు రాష్ట్రాలకే పెద్దపీట!
ఢిల్లీ: కేంద్రంలో కొలువుదీరబోయే ఎన్డీయే ప్రభుత్వ మంత్రివర్గంలో తెలుగు రాష్ట్రాలకు పెద్దపీట దక్కనున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో బీజేపీ తన స్థానాల్ని డబుల్ చేసుకోగా.. ఏపీలోనూ కూటమి ద్వారా మంచి ఫలితాన్నే రాబట్టుకోగలిగింది. దీంతో తెలంగాణ నుంచి ఇద్దరు లేదా ముగ్గురికి, అలాగే ఏపీ నుంచి ఐదారుగురికి కేబినెట్లో చోటు దక్కవచ్చనే సంకేతాలు అందుతున్నాయి.తెలంగాణ నుంచి కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా కొనసాగే అవకాశం కనిపిస్తోంది. అయితే బీసీ కోటాలో కరీంనగర్ ఎంపీ బండి సంజయ్కు మంత్రి పదవి దక్కవచ్చనే ప్రచారం ఊపందుకుంది. ఇక.. మహిళా కోటాలో మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణకు కేంద్ర సహాయ మంత్రి పదవి దక్కే అవకాశాలున్నాయి. ఇక.. కేంద్ర కేబినెట్లో బెర్త్ ఆశిస్తున్న ఈటల రాజేందర్కు.. తెలంగాణ బీజేపీ పగ్గాలు అప్పగించవచ్చనే చర్చ ఆ పార్టీలో నడుస్తోంది.ఏపీ బీజేపీ నుంచి రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరికి, సీఎం రమేష్కు మంత్రివర్గంలో చాన్స్ దక్కనున్నట్లు తెలుస్తోంది. జనసేన నుంచి బాలశౌరికి సహయ మంత్రి పదవి దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదేవిధంగా కూటమిలో కీలకంగా మారిన టీడీపీ నుంచి రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్కు, రాయలసీమ నుంచి పార్థసారధికి మంత్రివర్గంలో ఛాన్స్ దక్కనున్నట్లు తెలుస్తోంది.మంత్రివర్గ కూర్పుపై కొనసాగుతున్న కసరత్తు..ఎన్డీయే భాగస్వామి పక్షాల అధినేతలతో విడివిడిగా శుక్రవారం జేపీ నడ్డా, అమిత్ షా, రాజ్నాథ్ సింగ్ సమావేశమయ్యారు. మంత్రివర్గంలో కోరుకుంటున్న పదవులు, స్థానాలపై నేతలు చర్చించారు. ఇవాళ కూడా మంతివర్గ కూర్పుపై కసరత్తు కొనసాగుతోంది. టీడీపీ, జేడీ(యూ)కు అధిక ప్రాధాన్యం కలిగిన శాఖలు దక్కే అవకాశం కనిపిస్తోంది. టీడీపీ నుంచి రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్కు కేబినెట్లో ఛాన్స్ లభించనుంది. మరో ఇద్దరికి సహాయ మంత్రి పదవులు లభించే అవకాశం ఉన్నట్లు సమాచారం. మంత్రివర్గం రేసులో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, చిత్తూరు ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు ఉన్నారు.రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగపడే మంత్రిత్వ శాఖలు తీసుకుంటామని టీడీపీ నేత రామ్మోహన్ నాయుడు అన్నారు. పట్టణాభివృద్ధి, జలవనరుల శాఖ, పరిశ్రమల శాఖలను టీడీపీ ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక.. జనసేన నుంచి బాలశౌరికి సహాయ మంత్రి అవకాశం లభించనున్నట్లు సమాచారం. ఏపీ బీజేపీ కోటాలో పురందేశ్వరికి మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశం ఉంది. మంత్రి పదవి కోసం ముమ్మరంగా సీఎం రమేష్ లాబీయింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. కేంద్ర మంత్రివర్గంలో ఎన్డీయే పక్ష పార్టీలు భాగస్వామ్యం కానున్నాయి. కీలకమైన హోమ్, ఆర్థిక, రక్షణ విదేశాంగ శాఖలు బీజేపీకే కేటాయించనున్నట్లు సమాచారం. మూడు మంత్రి పదవులు, రెండు సహాయ మంత్రి పదవులను టీడీపీ కోరుతున్నట్లు తెలుస్తోంది.టీడీపీకి లోక్సభ డిప్యూటీ స్పీకర్ పదవి దక్కే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు.. జేడీ(యూ) మూడు మంత్రి పదవులు కోరుతున్నట్లు తెలుస్తోంది. శివసేన, ఎన్సీపీ, ఆర్ఎల్డీకి ఒక్కొక్క మంత్రి పదవి కేటాయించనున్నట్లు సమాచారం. దీంతో పాటు బీహార్ ప్రత్యేక హోదా ప్రకటించాలని సీఎం నితీశ్ కుమార్ కోరుతున్నారు. -
‘ ఏడాదిలోపు మధ్యంతర ఎన్నికలు ’.. చత్తీస్గఢ్ మాజీ సీఎం సంచలన వ్యాఖ్యలు
రాయ్పూర్: దేశంలో ఆరు నెలల నుంచి ఏడాది లోపు మధ్యంతర ఎన్నికలు రానున్నాయని చత్తీస్గఢ్ మాజీ సీఎం భూపేష్ బఘేలా సంచలన వ్యాఖ్యలు చేశారు. మధ్యంతర ఎన్నికల కోసం కాంగ్రెస్ కార్యకర్తలు ఇప్పటినుంచే సిద్ధంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. ఆయన శుక్రవారం ఓ బహిరంగ సభలో మాట్లాడారు.‘‘ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సిద్ధంగా ఉండండి. ఆరు నెలల నుంచి ఏడాది లోపు దేశంలో మధ్యంతర ఎన్నికలు రానున్నాయి. ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్, రాజస్థాన్ సీఎం భజన్లాల్, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్లను పక్కన పెట్టనున్నారు. యోగి ఆదిత్యనాథ్ కుర్చి కదులుతోంది. సీఎం భజన్లాల్ తడబడుతున్నారు. ఫడ్నవిస్ రాజీనామా చేస్తున్నారు. .. రోజుకు మూడు డ్రెస్సులు మార్చే వారు (మోదీ) ఇప్పడు ఒకే డ్రెస్తో మూడు కార్యక్రమాలకు హాజరవుతున్నారు. ఇప్పడు వాళ్లు ఏం తింటున్నారు, ఏం తాగుతున్నారు, ఏం ధరిస్తున్నారనేది ఇక పట్టించుకోవాల్సిన అవసరం లేదు. లోక్ సభ ఎన్నికల్లో ప్రజలు బీజేపీకి గట్టి గుణపాఠం. పార్టీలను విడగొట్టే, ప్రజల చేత ఎన్నకోబడిన సీఎంలను జైలులో పెట్టిన బీజేపీకి ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పారు’’ అని బఘేలా అన్నారు.మరోవైపు.. ఎన్డీయే కూటమి పక్షనేతగా నరేంద్రమోదీని భాగస్వామ్య పక్షనేతలు శుక్రవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్న రోజునే భూపేష్ ఇటువంటి వ్యాఖ్యలు చేయటంతో సంచలనంగా మారింది. -
ఎన్డీయే కూటమి: ముగిసిన మంత్రివర్గ కసరత్తు
ఢిల్లీ: ఎన్డీయే కూటమిలో భాగంగా ఏర్పడే సంకీర్ణ ప్రభుత్వంలో మంత్రివర్గ కూర్పుపై శుక్రవారం జరిగిన కసరత్తు ముగిసింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, బీజేపీ అగ్రనేతల నేతృత్వంలో సుదీర్ఘంగా మంత్రివర్గ కూర్పుపై భేటీలు జరిగాయి. జేపీ నడ్డా నివాసంలో ఎన్డీయే భాగస్వామి పక్ష నేతలను ఒక్కొక్కరిని పిలిచి బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, అమిత్ షా, రాజ్నాథ్సింగ్లు చర్చలు జరిపారు. ముందుగా ఎన్సిపీ చీఫ్ అజిత్ పవార్, శివసేన చీఫ్ ఏక్నాథ్ షిండేతో బీజేపీ అగ్ర నేతలు చర్చించారు. అనంతరం టీడీపీ చీఫ్ చంద్రబాబుతో మంత్రివర్గంపై చర్చలు జరిపారు. అయితే మంత్రివర్గం కూర్పు ఫైనల్ అయిందా? లేదా? అనే అంశంపై అధకారికంగా స్పష్టత లేదు.ఇక.. ఎన్డీయే పక్ష నేత నరేంద్ర మోదీ ఎల్లుండి( 9వ తేదీ) ప్రమాణస్వీకారం చేయటంతో కేంద్రంలో కొత్త ప్రభుత్వ కొలువుదీరనుంది. అందుకోసం శుక్రవారం భాగస్వామ్య పక్ష నేతలు మోదీని ఏకగ్రీవంగా ఎన్డీయే పక్షనేతగా ఎన్నుకున్న విషయం తెలిసిందే. మోదీ.. కూటమి నేతలతో కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కోరారు. ఎన్డీయే పక్షనేతగా తనను ఎన్నుకున్నారని రాష్ట్రపతికి మోదీ తెలిపారు. ఎంపీల మద్దతు లేఖను రాష్ట్రపతికి అందజేశారు. -
వచ్చే ఐదేళ్లు దేశ సేవకే అంకితమవుతాం: నరేంద్ర మోదీ
న్యూఢిల్లీ, సాక్షి: కేంద్రంలో నరేంద్ర మోదీ నేతృత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆహ్వానించారు. శుక్రవారం సాయంత్రం ఎన్డీయే పక్ష నేత నరేంద్ర మోదీ, భాగస్వామ్య పక్ష నేతలు రాష్ట్రపతి భవన్కు వెళ్లారు. రాష్ట్రపతి ముర్మును కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరారు. ఎన్డీయే పక్షనేతగా తనను ఎన్నుకున్నారని రాష్ట్రపతికి తెలిపారు. ఎన్డీయే కూటమి ఎంపీల మద్దతు లేఖను రాష్ట్రపతికి మోదీ అందజేశారు. అనంతరం మోదీ మీడియాతో మాట్లాడారు. ‘‘ 18వ లోక్సభ చాలా ప్రత్యేకం. ఎన్డీయేకు మూడో సారి దేశ సేవ చేసే భాగ్యం లభించింది. ఈ అవకాశం ఇచ్చిన దేశ ప్రజలకు ధన్యవాదాలు. వచ్చే ఐదేళ్లు దేశసేవకే అంకితమవుతాం. దేశ ప్రజల ఆశలు, ఆకాంక్షలు పూర్తి చేసేందుకు శ్రమిస్తాం. ఎన్డీయే నేతలు నన్ను మరోసారి పక్ష నేతగా ఎన్నుకున్నారు. ముమ్ముందు మరింత ఉత్సాహంతో పనిచేస్తాం. ఆజాదీగా అమృత్ ఉత్సవాల తర్వాత ఇదే తొలి ఎన్నిక. మంత్రి మండలి జాబితా ఇవ్వాలని రాష్ట్రపతి కోరారు. ఎల్లుండి సాయంత్రం ప్రమాణస్వీకారం సౌకర్యంగా ఉంటుంది. మంత్రుల జాబితాను రాష్ట్రపతికి అందజేస్తాను’ అని మోదీ తెలిపారు.NDA will form a strong, stable and growth-oriented government. Speaking outside Rashtrapati Bhavan. https://t.co/qstllaPjna— Narendra Modi (@narendramodi) June 7, 2024 భాగస్వామ్య పక్షాల నేతలు వెంటరాగా.. మోదీ రాష్ట్రపతి భవన్కు చేరుకున్నారు. తమ కూటమికి మద్దతు ఇస్తున్న పార్టీల లేఖలు, కొత్తగా ఎంపికైన మొత్తం ఎంపీల జాబితాను రాష్ట్రపతికి అందజేశారాయన. ఆ వెంటనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా రాష్ట్రపతి ముర్మును మోదీని ఆహ్వానించారు.జేపీ నడ్డా నివాసంలో మంత్రివర్గ కూర్పుపై కసరత్తుమంత్రివర్గ కూర్పుపై ఎన్డీయే భాగస్వామి పక్ష నేతలత బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో కసరత్తు జరుగుతోంది. జేపీ నడ్డా, అమిత్ షా, రాజ్నాథ్ సింగ్లు.. ఎన్డీయే భాగస్వామ్య పార్టీల నేతలను ఒక్కొక్కరిని పిలిచి మాట్లాడుతున్నారు. బీజేపీ అగ్ర నేతలు.. అజిత్ పవార్, ఏక్నాథ్ షిండేతో చర్చలు జరిపారు.ప్రభుత్వ ఏర్పాటుకు మోదీని ఆహ్వానించిన రాష్ట్రపతి ముర్ము -
ప్రభుత్వ ఏర్పాటుకు మోదీని ఆహ్వానించిన రాష్ట్రపతి ముర్ము
న్యూఢిల్లీ, సాక్షి: కేంద్రంలో నరేంద్ర మోదీ నేతృత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆహ్వానించారు. శుక్రవారం సాయంత్రం ఎన్డీయే పక్ష నేత నరేంద్ర మోదీ, భాగస్వామ్య పక్ష నేతలు రాష్ట్రపతి భవన్కు వెళ్లారు. రాష్ట్రపతి ముర్మును కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరారు. భాగస్వామ్య పక్షాల నేతలు వెంటరాగా.. మోదీ రాష్ట్రపతి భవన్కు చేరుకున్నారు. తమ కూటమికి మద్దతు ఇస్తున్న పార్టీల లేఖలు, కొత్తగా ఎంపికైన మొత్తం ఎంపీల జాబితాను రాష్ట్రపతికి అందజేశారాయన. ఆ వెంటనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా రాష్ట్రపతి ముర్మును మోదీని ఆహ్వానించారు.#WATCH | Delhi: Narendra Modi meets President Droupadi Murmu at the Rashtrapati Bhavan and stakes claim to form the government. He was chosen as the leader of the NDA Parliamentary Party today. pic.twitter.com/PvlK44ZC2x— ANI (@ANI) June 7, 2024ఎన్డీయే పక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నికైన నరేంద్రమోదీ మూడోసారి ప్రధాని కావటం ఇప్పటికే ఖరారైంది. ఆదివారం సాయంత్రం మోదీ ప్రధానిగా కర్తవ్యపథ్లో ప్రమాణం చేయనున్నారు.ఎన్డీయే కూటమిలోని పార్టీల ఎంపీలు ఇవాళ ఎన్డీయే పక్ష నేతగా నరేంద్ర మోదీని ఏకగ్రీవంగా ఎన్నుకున్న విషయం తెలిసిందే. బీజేపీ సొంతంగా 240 సీట్లు గెలువగా.. సొంతంగా మ్యాజిక్ ఫిగర్ 272 సీట్లను దాటలేకపోయింది. దీంతో బీజేపీ కూటమిలోని మిత్ర పక్షాల మద్దతు మరోసారి కేంద్రంలో ప్రభుత్వం కొలుదీరనుంది.మరోవైపు.. కేంద్ర మంత్రి పదవులపై నిన్న ఎన్డీయే భాగస్వామ్య పక్షాల మధ్య సుదీర్ఘంగా చర్చలు జరిగాయి. అయితే రాష్ట్రపతిని కలిసిన అనంతరం ఎన్డీయే నేతలు మరోసారి భేటీ అయ్యే అవకాశం కనిపిస్తోంది. బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో జరగబోయే భేటీకి మిత్రపక్షాల నేతలంతా హాజరుకానున్నారు. ఇప్పటికే అమిత్ షా, అజిత్ పవార్లు నడ్డా నివాసానికి చేరుకున్నారు. మంత్రి వర్గ కూర్పుపై ఈ భేటీలో ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉంది. -
మోదీ అధ్యక్షతన ఎన్డీఏ పార్లమెంటరీ కమిటీ సమావేశం
న్యూఢిల్లీ: నరేంద్ర మోదీ అధ్యక్షతన ఎన్డీఏ పార్లమెంటరీ కమిటీ సమావేశం ఆరంభమైంది. ఎన్డీఏ కూటమి పార్టీల ఎంపీలంతా ఈ సమావేశానికి హాజరయ్యారు. పార్లమెంట్ సెంట్రల్ హాల్లో ఈ సమావేశం జరుగుతోంది. ఎన్డీఏ కూటమి నేతగా మోదీని ఇప్పటికే ఎన్నుకున్న విషయం తెలిసిందే.కాగా ఈ భేటీలో మోదీని ఎన్డీఏ ప్రధాని అభ్యర్థిగా ఎన్నుకోనున్నారు. ఈ సమావేశానికి ఎన్డీయే పక్షాల నేతలు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నితిశ్ కుమార్, ఏక్ నాథ్ షిండేలతో పాటు, .బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు,బీజేపీ పార్టీల అధ్యక్షులు, ఎంపీలు ఈ సమావేశానికి హాజరయ్యారు.క్యాబినెట్ కూర్పుపై కూడా ఈ భేటీలో ప్రధానంగా చర్చింనున్నారు. మిత్రపక్షాల నుంచి కీలకశాఖలు కావాలనే డిమాండ్లు వచ్చిన నేపథ్యంలో గురువారం బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో అమిత్ షా, రాజ్నాథ్సింగ్, ఇతర సీనియర్ నేతలు సమావేశమై చర్చించిన విషయం తెలిసిందే.ప్రాథమికంగా జరిగిన చర్చల్లో కీలకమైన రక్షణ, ఆర్థిక, హోం, విదేశీ వ్యవహారాల శాఖలను తమ వద్దే అట్టిపెట్టుకోవాలని బీజేపీ నేతల నిర్ణయించినట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. బీజేపీకి సొంతంగా 240 సీట్లు (ఎన్డీఏకు 293) మాత్రమే వచ్చినందువల్ల ప్రభుత్వ ఏర్పాటులో టీడీపీ (16 సీట్లు), జేడీయూ (12 సీట్లూ)లపై పూర్తిగా ఆధారాపడాల్సిన పరిస్థితి నెలకొంది.ఈ పార్టీలు నలుగురు ఎంపీలకు ఒక కేబినెట్ మంత్రి పదవిని అడుగుతున్నట్లు సమాచారం. ఈ లెక్కన టీడీపీకి నాలుగు, జేడీయూకు మూడు కేబినెట్ బెర్తులు ఇవ్వాల్సి ఉంటుంది. -
Lok Sabha Election Results 2024: 8 లేదా 9న ప్రమాణం!
సాక్షి, న్యూఢిల్లీ: మోదీ ముచ్చటగా మూడోసారి ప్రధాని పీఠాన్ని అధిరోహించబోతున్నారు. వరుసగా మూడుసార్లు ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసి జవహర్లాల్ నెహ్రూ నెలకొలి్పన రికార్డును మోదీ సమం చేయబోతున్నారు. ఈ నెల 8 లేదా 9న ప్రమాణం స్వీకారం చేసే అవకాశం ఉంది. ప్రధాని సహా నూతన మంత్రివర్గ ప్రమాణ స్వీకారానికి రాష్ట్రపతి భవన్లో ఏర్పాట్లు జరుగుతున్నాయి. కాగా, బుధవారం మోదీ నేతృత్వంలో కేంద్ర మంత్రివర్గం సమావేశమైంది. ఎన్డీయే–2 ప్రభుత్వంలో ఇదే చివరి కేబినెట్ సమావేశం. లోక్సభ ఎన్నికల ఫలితాలతోపాటు నూతన ప్రభుత్వ ఏర్పాటుపై విస్తృతంగా చర్చించారు. ప్రస్తుత 17వ లోక్సభను రద్దు చేయాలని కేబినెట్ సిఫార్సు చేసింది. ఢిల్లీలోని ప్రధాని నివాసంలో ఉదయం 11.30 గంటలకు జరిగిన కేబినెట్ భేటీలో మోదీ మాట్లాడారు. రాజకీయాల్లో గెలుపోటములు ఒక భాగమేనని అన్నారు. నెంబర్ గేమ్ కొనసాగుతుందని చెప్పారు. గత పదేళ్ల పాలనలో ఎన్నో మంచి పనులు చేశామని, భవిష్యత్తులోనూ ప్రజా సంక్షేమం కోసం కృషి చేస్తూనే ఉంటామని వెల్లడించారు. పదేళ్లలో మంత్రులంతా కష్టపడి పనిచేశారని ప్రశంసించారు. మంత్రివర్గ సమావేశం అనంతరం మోదీ రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసి తనతోపాటు మంత్రివర్గ సహచరుల రాజీనామా లేఖలను సమరి్పంచారు. మోదీతోపాటు కేంద్ర మంత్రుల రాజీనామాలను రాష్ట్రపతి ఆమోదించారు. నూతన ప్రభుత్వం ఏర్పడే వరకు ఆపద్ధర్మ ప్రధానమంత్రిగా వ్యవహరించాలని మోదీని కోరారు. 17వ లోక్సభను రద్దు చేయాలని కోరుతూ కేబినెట్ చేసిన సిఫార్సు లేఖను రాష్ట్రపతి అందజేశారు. దీంతో 17వ లోక్సభను రద్దు చేస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేసినట్లు రాష్ట్రపతి భవన్ వర్గాలు వెల్లడించాయి. ఉప రాష్ట్రపతి ధన్ఖడ్తో మోదీ భేటీ ప్రధాని మోదీ బుధవారం తన పదవికి రాజీనామా చేసిన తర్వాత ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ధన్ఖడ్ మూడు కమలం పువ్వులున్న పుష్పగుచ్ఛాన్ని మోదీకి అందజేసి అభినందనలు తెలియజేశారు. వరుసగా మూడుసార్లు విజయం సాధించినందుకు గుర్తుగా మూడు కమలం పువ్వులను ఇచి్చనట్లు తెలుస్తోంది. అలాగే మోదీ కూడా కొన్ని రకాల మిఠాయిలను ఉప రాష్ట్రపతికి అందజేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం రాత్రి ప్రధాని నరేంద్ర మోదీ, దిగిపోతున్న మంత్రివర్గానికి రాష్ట్రపతి భవన్లో విందు ఇచ్చారు. ఉపరాష్ట్రపతి జగ్దీప్ ధన్ఖడ్, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా కూడా దీనికి హాజరయ్యారు. టీడీపీ, జేడీ(యూ) మద్దతుతో ప్రభుత్వ ఏర్పాటు సార్వత్రిక ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీ మిత్రపక్షాల సహాయంతో వరుసగా మూడోసారి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సిద్ధమవుతోంది. ఈసారి కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన సంఖ్యా బలం బీజేపీకి లభించలేదు. ఇతర పార్టీలపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. టీడీపీ, జేడీ(యూ), ఇతర మిత్రపక్షాల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని బీజేపీ పెద్దలు నిర్ణయించారు. ఇదిలా ఉండగా, కేంద్రంలో నూతన ప్రభుత్వ ఏర్పాటుకు కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి సైతం తన వంతు ప్రయత్నాలు ప్రారంభించింది. దీంతో హస్తినలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఎన్డీయే నుంచి కొన్ని భాగస్వామ్య పక్షాలు ప్రతిపక్ష కూటమిలో చేరబోతున్నాయంటూ ఢిల్లీలో ఊహాగానాలు మొదలయ్యాయి. -
Lok Sabha Election Result 2024: ఎన్డీఏ నేతగా మోదీ
బీజేపీ సారథ్యంలోని అధికార ఎన్డీఏ కూటమి నేతగా ప్రధాని నరేంద్ర మోదీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మంగళవారం వెలువడ్డ లోక్సభ ఎన్నికల ఫలితాల్లో ఎన్డీఏ మెజారిటీ స్థానాలు సాధించడం తెలిసిందే. దాంతో మోదీ వరుసగా మూడోసారి ప్రధాని కానున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం ఢిల్లీలో ప్రధాని నివాసంలో ఎన్డీఏ కీలక సమావేశం జరిగింది. మోదీ అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో బీజేపీతో పాటు ఎన్డీఏ పక్షాల అగ్ర నేతలంతా పాల్గొన్నారు. న్యూఢిల్లీ/బెంగళూరు: బీజేపీ సారథ్యంలోని అధికార ఎన్డీఏ కూటమి నేతగా ప్రధాని మోదీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మంగళవారం వెలువడ్డ లోక్సభ ఎన్నికల ఫలితాల్లో ఎన్డీఏ మెజారిటీ స్థానాలు సాధించడం తెలిసిందే. దాంతో మోదీ వరుసగా మూడోసారి ప్రధాని కానున్నారు. తొలి ప్రధాని నెహ్రూ తర్వాత ఈ ఘనత సాధించనున్న నాయకునిగా రికార్డు సృష్టించనున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం ఢిల్లీలో ప్రధాని నివాసంలో ఎన్డీఏ కీలక సమావేశం జరిగింది. మోదీ అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో బీజేపీతో పాటు ఎన్డీఏ పక్షాల అగ్ర నేతలంతా పాల్గొన్నారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, జేడీ(యూ) చీఫ్ నితీశ్కుమార్, శివసేన అధినేత ఏక్నాథ్ షిండే, ఎల్జేపీ (ఆర్వీ) చీఫ్ చిరాగ్ పాశ్వాన్, జేడీ(ఎస్) నేత హెచ్.డి.కుమారస్వామి, ఎన్సీపీ నాయకుడు ప్రఫుల్ పటేల్, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ సహా 16 పారీ్టలకు చెందిన 21 మంది నాయకులు భేటీలో పాల్గొన్నారు. బీజేపీ నుంచి పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా, అగ్ర నేతలు అమిత్ షా, రాజ్నాథ్సింగ్ తదితరులు హాజరయ్యారు. భేటీనుద్దేశించి తొలుత మోదీ మాట్లాడారు. ఎన్నికల విజయానికి కూటమి పక్షాలను అభినందించారు. కేంద్రంలో ఎన్డీఏ వరుసగా మూడోసారి మెజారిటీ సాధించడం చరిత్రాత్మకమని అభిప్రాయపడ్డారు. ఇది గత 60 ఏళ్లలో ఎవరికీ సాధ్యపడని ఘనత అన్నారు. వీలైనంత త్వరగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా నితీశ్ సూచించారు. ఇండియా కూటమిలో చేరాలంటూ ఎన్డీఏ పారీ్టలకు కాంగ్రెస్ బాహాటంగానే పిలుపులిస్తున్న నేపథ్యంలో అనిశ్చితికి తావు లేకుండా తక్షణం ప్రభుత్వం కొలువుదీరాలని నేతలన్నారు. అందుకు వీలుగా శాఖల పంపకం తదితర మంతనాలను వీలైనంత త్వరగా పూర్తి చేసుకోవాలని నిర్ణయించారు. ప్రభుత్వ కూర్పుపైనా భేటీలో నేతలు చర్చించారు. శుక్రవారం ఎన్డీఏ ఎంపీలంతా సమావేశమై మోదీని తమ నాయకునిగా లాంఛనంగా ఎన్నుకుంటారని హెచ్ఏఎం(ఎస్) జితిన్రాం మాంఝీ వెల్లడించారు. అనంతరం రాష్ట్రపతిని కలిసి ఎన్డీఏ కూటమికి మద్దతు లేఖలు సమరి్పస్తామని భేటీ అనంతరం మీడియాకు వెల్లడించారు. మోదీపై నేతల ప్రశంసలు దేశ ఘన వారసత్వాన్ని ప్రగతికి, సమగ్రాభివృద్ధికి ఎన్డీఏ ప్రభుత్వం పాటుపడుతుందంటూ ఎన్డీఏ భేటీలో నేతలంతా తీర్మానం చేశారు. ప్రజల జీవన ప్రమాణాలను పెంచేందుకు కృషి చేస్తుందని పేర్కొన్నారు. ‘‘ప్రధాని మోదీ సారథ్యంలో గత పదేళ్లలో పలు ప్రజానుకూల నిర్ణయాలతో దేశం అన్ని రంగాల్లోనూ వృద్ధి బాటన సాగుతోంది. ఆయన నాయకత్వంలో 2024 లోక్సభ ఎన్నికల్లో సమైక్యంగా పోటీ చేసి గొప్ప విజయం సాధించడం మాకందరికీ గర్వకారణం. మోదీని మా నాయకునిగా ఏకగ్రీవంగా ఎన్నుకుంటున్నాం’’ అంటూ నేతలు తీర్మానించారు. ఎన్డీఏతోనే ఉంటాం తాము ఎన్డీఏలోనే కొనసాగుతామని బాబు, నితీశ్ స్పష్టం చేశారు. ఈ విషయంలో ఎలాంటి ఊహాగానాలకూ తావు లేదన్నారు. దేశ నిర్మాణం కోసం పదేళ్లుగా మోదీ చేసిన కృషిని ప్రస్తుతిస్తూ నేతలంతా ఆయన్ను అభినందించారని తెలిపారు. ‘‘అంతర్జాతీయంగా భారత్ స్థాయిని మోదీ పెంచారు. ఆయన లక్ష్యాల సాధనకు సహకరిస్తాం’’ అన్నారు.కీలక శాఖలు, స్పీకర్ ఎన్డీఏ పక్షాల డిమాండ్లు 2014, 2019ల్లోనూ కేంద్రంలో ఎన్డీఏ సంకీర్ణ ప్రభుత్వమే ఏర్పాటైనా ఆ రెండుసార్లూ బీజేపీకి ఒంటరిగానే సంపూర్ణ మెజారిటీ వచి్చంది. ఈసారి మాత్రం ఆ పార్టీ 240 లోక్సభ స్థానాలకు పరిమితమై మెజారిటీకి 32 సీట్ల దూరంలో నిలిచింది. దాంతో ప్రభుత్వ ఏర్పాటులో భాగస్వామ్య పక్షాల మద్దతు కీలకంగా మారింది. ఈ నేపథ్యంలో మోదీ 3.0 సర్కారు పనితీరు గత రెండుసార్లతో పోలిస్తే చాలా భిన్నంగా ఉండేలా కనిపిస్తోంది. ఎన్డీఏ భాగస్వాములంతా కీలక శాఖలు డిమాండ్ చేస్తున్నట్టు చెబుతున్నారు. విశ్వసనీయ వర్గాలతో పాటు జాతీయ మీడియా పేర్కొంటున్న మేరకు ఎవరేం కోరుతున్నారంటే... టీడీపీ: ఏకంగా 7 నుంచి 8 కేబినెట్ బెర్తులు, ఒక సహాయ మంత్రి పదవి కోరుతోంది! వ్యవసాయ, రవాణా, గ్రామీణాభివృద్ధి, ఆరోగ్యం, ఐటీ–వాణిజ్య, విద్య, గృహ నిర్మాణ, జల శక్తి, ఆర్థిక (సహాయ) శాఖలతో కూడిన జాబితాను బీజేపీ ముందు పెట్టినట్టు తెలుస్తోంది. లోక్సభ స్పీకర్ పదవి కూడా అడుగుతోంది. జేడీ(యూ): జేడీ(యూ) పార్టీ కనీసం మూడు కేబినెట్ పదవులు డిమాండ్ చేస్తోంది. ఒకట్రెండు సహాయ మంత్రి పదవులు కూడా కోరవచ్చంటున్నారు. మరోవైపు విపక్షాల ‘ఇండియా’ కూటమి కూడా ఇప్పటికే తమను ఆకర్షించేందుకు ప్రయతి్నస్తోందని జేడీ(యూ) సీనియర్ నేత, బిహార్ మంత్రి విజయ్కుమార్ చౌదరి మీడియాకు చెప్పడం విశేషం. ఆయన వ్యాఖ్యలను బీజేపీపై ఒత్తిడి పెంచే వ్యూహంగా భావిస్తున్నారు. ఎల్జేపీ (ఆర్వీ): ఒక కేబినెట్, ఒక సహాయ మంత్రి పదవి కోసం పట్టుబడుతోంది. బిహార్లో పోటీ చేసిన ఐదు లోక్సభ స్థానాల్లోనూ పార్టీ ఘనవిజయం సాధించడం తెలిసిందే. హెచ్ఏఎం(ఎస్) నేత జితిన్రాం మాంఝీ కూడా కేబినెట్ పదవి ఆశిస్తున్నారు. శివసేన: ఒక కేబినెట్, మరో సహాయ మంత్రి పదవి కోరుతోంది. వ్యవసాయ శాఖపై జేడీ(ఎస్) కన్ను: తనకు వ్యవసాయ శాఖ కావాలంటూ జేడీ(ఎస్) నేత కుమారస్వామి స్పష్టమైన సంకేతాలిచ్చారు. ఆయన పార్టీ జేడీ(ఎస్) రెండు లోక్సభ స్థానాలు గెలిచింది. ‘‘కేంద్ర వ్యవసాయ శాఖపై మా పారీ్టకి ఆసక్తి ఉంది. అయితే మేమేమీ డిమాండ్లు చేయడం లేదు. మాకు కర్నాటక ప్రయోజనాలే ప్రధానం. కేంద్ర మంత్రివర్గంలో రాష్ట్రానికి ఎలాంటి ప్రాతినిధ్యం కలి్పంచాలో మోదీ నిర్ణయిస్తారు. అయినా దానిపై సరైన సమయంలో మాట్లాడుకుందాం’’ అని చెప్పుకొచ్చారు. -
తగ్గిన ఎన్డీఏ బలం.. పవర్ ఖాయం! హ్యాట్రిక్!
న్యూఢిల్లీ: పాలక ఎన్డీఏ కూటమి పదేళ్ల జోరుకు బ్రేకులు ఎన్డీఏ సారథి బీజేపీ దూకుడుకు ముకుతాడు విపక్ష ఇండియా కూటమికి నైతిక విజయం కూటమి సారథి కాంగ్రెస్కు పునరుజ్జీవం లోక్సభ ఎన్నికల్లో ఓటర్లు విలక్షణమైన తీర్పు వెలువరించారు. గత రెండు ఎన్నికల ఆనవాయితీకి భిన్నంగా బీజేపీని ఈసారి మెజారిటీకి ఓ 32 స్థానాల దూరంలోనే ఉంచారు. 2019 లోక్సభ ఎన్నికల్లో సొంతగానే 303 సీట్లు కైవసం చేసుకున్న కమలం పార్టీ ఏకంగా 63 స్థానాలు తగ్గి 240కే పరిమితమైంది. దాంతో నరేంద్ర మోదీ శకం మొదలయ్యాక తొలిసారిగా ప్రభుత్వ ఏర్పాటుకు ఎన్డీఏ భాగస్వాములపై ఆధారపడాల్సిన పరిస్థితిలో పడింది. ఎన్డీఏ కూటమి కూడా కనాకష్టంగా మెజారిటీ మార్కు 272ను దాటింది. 2019లో 353 సీట్లు రాగా ఈసారి 293కే పరిమితమైంది. మరోవైపు 2019లో కేవలం 52 సీట్లతో కుదేలైన కాంగ్రెస్ బలం ఈసారి దాదాపు రెట్టింపైంది. 99 సీట్లలో గెలిచి సత్తా చాటింది. కాంగ్రెస్ సారథ్యంలో ఇండియా కూటమి కూడా అంచనాలకూ మించి రాణించింది. 233 సీట్లు కైవసం చేసుకుని గౌరవప్రదమైన స్థానంలో నిలిచింది. అత్యంత కీలకమైన ఉత్తరప్రదేశ్లో బీజేపీకి అనూహ్యంగా కోలుకోలేని ఎదురుదెబ్బ తగిలింది. 2019లో 62 సీట్లు నెగ్గిన పార్టీ ఈసారి ఏకంగా సగానికి సగం సీట్లు కోల్పోయి 33కే పరిమితమైంది. గత ఎన్నికల్లో చతికిలపడ్డ అఖిలేశ్ సారథ్యంలోని సమాజ్వాదీ పార్టీ అక్కడ 38 స్థానాలతో దుమ్ము రేపింది. పశ్చిమబెంగాల్లో కూడా బీజేపీ అంచనాలను అందుకోలేక 12 స్థానాలతో సరిపెట్టుకుంది. మమతా సారథ్యంలోని తృణమూల్ కాంగ్రెస్ 29 సీట్లతో సత్తా చాటింది. స్మృతీ ఇరానీతో పాటు పలువురు కేంద్ర మంత్రులు ఓటమి చవిచూశారు. ఈసారి లోక్సభ ఫలితాలను ఏ ఎగ్జిట్ పోల్ సర్వే కూడా ప్రతిఫలించలేకపోవడం విశేషం. మొత్తమ్మీద కేంద్రంలో పదేళ్ల ఏక పార్టీ పాలనకు కాలం చెల్లి తిరిగి నిజమైన సంకీర్ణ శకానికి తెర లేచింది. విపక్ష కూటమి కూడా పదేళ్ల తర్వాత గణనీయ శక్తిగా రూపుదిద్దుకుంది. అంతటితో ఆగకుండా కేంద్రంలో అధికారంపైనా కన్నేసినట్టు సంకేతాలు వెలువడుతున్నాయి...! ఆకట్టుకున్న ఇండియా కూటమి ఏడు విడతల్లో సుదీర్ఘంగా సాగిన సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రక్రియ జూన్ 1తో ముగియడం తెలిసిందే. దేశమంతా ఉత్కంఠగా ఎదురు చూసిన ఓట్ల లెక్కింపు మంగళవారం ఉదయం 8 గంటలకు మొదలైంది. ఎన్డీఏ కూటమి ఆధిపత్యం 300లోపు స్థానాలకు పరిమితం కాగా ఇండియా కూటమి తొలి రౌండ్ నుంచే అనూహ్య రీతిలో ముందంజ వేసింది. క్రమంగా పుంజుకుంటూ 200 స్థానాలు దాటేసింది. చూస్తుండగానే 233కు చేరి పరిశీలకులను కూడా ఆశ్చర్యపరిచింది. ప్రధాని మోదీ వారణాసిలో తొలి రౌండ్లో వెనకబడ్డారు! చివరికి ఆయన నెగ్గినా మెజారిటీ మాత్రం బాగా తగ్గింది. 2019లో 4.79 లక్షల మెజారిటీ రాగా ఈసారి లక్షన్నర పై చిలుకుతో సరిపెట్టుకున్నారు. బీజేపీలో మోదీ కంటే కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్సింగ్లకు ఎక్కువ మెజారిటీ రావడం విశేషం. మరోవైపు రాహుల్గాంధీ మాత్రం పోటీ చేసిన రెండు స్థానాల నుంచీ భారీ విజయం సాధించారు. ఆయనకు కేరళలోని వాయనాడ్లో 3.64 లక్షలు, యూపీలోని రాయ్బరేలీలో 3.9 లక్షల మెజారిటీ రావడం విశేషం. కీలక రాష్ట్రాల్లో బీజేపీ కుదేలు కీలకమైన యూపీలో ఈసారి బీజేపీకి ఏకంగా 29 సీట్లకు కోత పడింది! మహారాష్ట్రలోనూ గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అక్కడి 48 స్థానాల్లో 2019లో 43 సీట్లు ఒడిసిపట్టిన ఎన్డీఏ ఈసారి కేవలం 17కు పరిమితమైంది! బీజేపీ బలం 23 నుంచి ఏకంగా 10కి తగ్గింది. అక్కడ కాంగ్రెస్ సీట్ల సంఖ్య 1 నుంచి ఏకంగా 13కు పెరిగింది. దాని భాగస్వాములైన శివసేన (యూబీటీ) 9, ఎన్సీపీ (ఎస్పీ) 7 సీట్లు గెలుచుకున్నాయి! బిహార్లోనూ ఎన్డీఏకు 9 సీట్లకు కోతపడింది. బీజేపీ 12, భాగస్వాములు జేడీ(యూ) 12, ఎల్జేపీ(ఆర్వీ) 5 సీట్లలో నెగ్గాయి. 2019లో క్లీన్స్వీప్ చేసిన రాజస్తాన్ (25)లో కూడా బీజేపీకి ఈసారి 11 సీట్లకు కోత పడింది. కర్నాటకలోనూ పార్టీ బలం 25 నుంచి 17కు తగ్గింది. బెంగాల్లో 6 స్థానాలు తగ్గాయి. మరో క్లీన్స్వీప్ రాష్ట్రం హరియాణా (10)లోనూ ఈసారి బీజేపీ ఐదే గెలిచింది. మధ్యప్రదేశ్లో మాత్రం మొత్తం 29 సీట్లూ నెగ్గి క్లీన్స్వీప్ చేసింది. గుజరాత్లో ఒక్కటి మినహా 24 సీట్లు గెలుచుకుంది. తూర్పు రాష్ట్రం ఒడిశా బీజేపీ నెత్తిన పాలు పోసింది. అక్కడి 21 లోక్సభ స్థానాల్లో బీజేపీకి ఏకంగా 20 దక్కాయి! ఏపీలో కూడా ఎన్డీఏ కూటమికి 21 సీట్లు దక్కాయి. తెలంగాణలోనూ 2019లో 4 సీట్లలో నెగ్గిన బీజేపీ ఈసారి 8 స్థానాలు గెలుచుకుంది. అయితే కేరళలో తొలిసారి బోణీ కొట్టినా తమిళనాట మాత్రం సున్నా చుట్టింది. మరోవైపు ఇండియా కూటమి కీలక రాష్ట్రాల్లో దుమ్ము రేపింది. తమిళనాట మొత్తం 39 స్థానాలూ కూటమి ఖాతాలోనే పడ్డాయి! యూపీలో 2019లో కేవలం 5 స్థానాలతో సరిపెట్టుకున్న ఎస్పీ ఈసారి ఏకంగా 37 సీట్లు ఒడిసిపట్టింది. రాష్ట్రంలో కాంగ్రెస్ బలం కూడా 1 నుంచి 7కు పెరిగింది. బెంగాల్లో టీఎంసీకి 7 సీట్లు, బిహార్లో కూటమికి 9 స్థానాలు పెరిగాయి. రాజస్తాన్లో 2019లో సున్నా చుట్టిన కాంగ్రెస్ ఈసారి 8 సీట్లు నెగ్గింది. హరియాణాలోనూ 5 స్థానాలు దక్కించుకుంది. కర్నాటకలో పార్టీ స్థానాలు ఒకటి నుంచి 8కి పెరిగాయి. ఓట్ల శాతం ఇలా... బీజేపీ ఈసారి 36.58 శాతం ఓట్లు సాధించింది. ఇది 2019తో పోలిస్తే 0.72 శాతం తక్కువ. 2019 కంటే ఎక్కువ స్థానాల్లో పోటీ చేసినా పార్టీ ఓట్ల శాతం తగ్గిపోవడం విశేషం. కాంగ్రెస్ ఓట్ల శాతం మాత్రం 19.46 నుంచి 21.22కు పెరిగింది. యూపీలో దుమ్ము రేపిన సమాజ్వాదీ పార్టీ ఓట్ల శాతం 2.55 నుంచి 4.59కు పెరిగింది. మాయావతి సారథ్యంలోని బీఎస్పీ ఓట్లు మాత్రం 2.04 నుంచి 1.58కు తగ్గిపోయింది. పశ్చిమబెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ ఓట్ల శాతం 4.06 నుంచి 4.38కు పెరిగింది. జేడీ(యూ) ఓట్ల శాతం 1.45 నుంచి 1.25కి తగ్గింది. ఆప్ ఓట్ల శాతం 0.44 నుంచి 1.11కు పెరిగింది. దక్షిణాదిన తమిళనాడులో పాలక డీఎంకే ఓట్ల శాతం 2.34 నుంచి 1.82కు తగ్గింది. హస్తినలో నంబర్గేమ్! మోదీ కాళ్ల కిందకు నీళ్లు? ఆయనపై ఎన్డీఏలో అభ్యంతరాలు జాతీయ మీడియాలో వార్తలు దేశవ్యాప్తంగా సాధించిన అనూహ్య ఫలితాలతో జోష్లో ఉన్న ఇండియా కూటమి ఏకంగా కేంద్రంలో అధికారంపై కన్నేసినట్టు వార్తలొస్తున్నాయి! ఈ దిశగా జేడీ(యూ)తో పాటు పలు ఇతర ఎన్డీఏ భాగస్వాములతో ఇప్పటికే కాంగ్రెస్ నేతలు మంతనాలు జరుపుతున్నట్టు చెబుతున్నారు. బీజేపీ కూడా ఈ పరిణామాలను నిశితంగా గమనిస్తోందని సమాచారం. ఎన్డీఏ కూటమి సుస్థిరత కోసం పలు ఇండియా కూటమిలోని పక్షాలతో పాటు స్వతంత్రులు, ఇతర పార్టీలతోనూ బీజేపీ పెద్దలు ఇప్పటికే జోరుగా సంప్రదింపులకు సాగిస్తున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మొత్తమ్మీద హస్తినలో జోరుగా నంబర్గేమ్ సాగుతోందంటూ వస్తున్న వార్తలతో జాతీయ రాజకీయాలు ఒక్కసారిగా రంజుగా మారాయి. ఎన్డీఏనే వరుసగా మూడోసారి ప్రభుత్వం ఏర్పాటు చేసినా, ప్రధానిగా మోదీ అభ్యర్ధిత్వానికి జేడీ(యూ) వంటి భాగస్వామ్య పక్షాలు సుతరామూ అంగీకరించకపోవచ్చని జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి! ఈ నేపథ్యంలో హస్తినలో రాజకీయ పరిణామాలు ఎలాంటి మలుపు తీసుకుంటాయన్నది అత్యంత ఆసక్తికరంగా మారింది. 18వ లోక్సభలో పార్టీల బలాబలాలు (మొత్తం స్థానాలు 543) ఎన్డీఏ 291 (రంగు మార్చాలి. లేదంటే ఎన్డీఏ, ఇండియా కూటమి పక్కపక్కన విడిగా పెట్టుకోవాలి) బీజేపీ 241 టీడీపీ 16 జేడీ(యూ) 12 శివసేన 7 ఎల్జేపీ (ఆర్వీ) 5 జనసేన 2 జేడీ(ఎస్) 2 ఆరెల్డీ 2 ఎన్సీపీ 1 అప్నాదళ్ 1 ఏజీపీ 1 యూపీపీఎల్ 1 ఏజేఎస్యూపీ 1 హెచ్ఏఎం(ఎస్) 1 ఇండియా కూటమి 233 కాంగ్రెస్ 99 ఎస్పీ 37 టీఎంసీ 29 డీఎంకే 22 శివసేన (యూబీటీ) 9 ఎన్సీపీ (ఎస్పీ) 7 ఆర్జేడీ 4 సీపీఎం 4 ఆప్ 3 జేఎంఎం 3 ఐయూఎంఎల్ 3 సీపీఐ 2 సీపీఐ(ఎంఎల్)(ఎల్) 2 ఎన్సీ 2 వీసీకే 2 ఆరెస్పీ 1 కేసీ 1 ఆరెలీ్టపీ 1 బీఏడీవీపీ 1 ఎండీఎంకే 1 ఇతరులు 17 వైఎస్సార్సీపీ 4 మజ్లిస్ 1 అకాలీదళ్ 1 ఏఎస్పీకేఆర్ 1 వీఓటీపీపీ 1 జెడ్పీఎం 1 ఎస్కేఎం 1 స్వతంత్రులు 7 -
ఎన్డీయే ఆధిక్యం.. మెజార్టీ మార్క్ క్రాస్
న్యూఢిల్లీ, సాక్షి: లోక్సభ సార్వత్రిక ఎన్నికల్లో అధికార ఎన్డీయే కూటమి హవా కొనసాగుతోంది. ఇప్పటివరకు వెలువడిన ఫలితాల ప్రకారం.. ఆధిక్యంలో మెజార్టీ మార్క్ దాటేసింది. దేశవ్యాప్తంగా సుమారు 301 స్థానాల్లో ఎన్డీయే ముందంజలో ఉంది. ఇండియా కూటమి పోరాటం కొనసాగుతోంది. కాంగ్రెస్ సహా కూటమి అభ్యర్థులు 206 స్థానాల్లో ముందంజలో ఉన్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 272. -
Akhilesh Yadav: ఎగ్జిట్ పోల్స్లో విశ్వసనీయత ఎంత?
లక్నో: ఎన్డీఏ కూటమి అధికార పగ్గాలు చేపట్టడం ఖాయమంటూ ఫలితాలిచ్చిన పలు ఎగ్జిట్ పోల్స్ విశ్వసనీయతపై సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ అనుమానం వ్యక్తంచేశారు. సోమవారం లక్నోలో పత్రికాసమావేశంలో ఆయన మాట్లాడారు. ‘‘ఎన్డీఏ సంపూర్ణ మెజారిటీతో విజయం సాధిస్తుందని పలు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు చూస్తుంటే అనుమానమొస్తోంది. వీటిని ఎలా విశ్వసించాలి?. ఫలితాల వెల్లడివేళ బీజేపీ అనుకూల వాతావరణాన్ని సృష్టించేందుకు ఎగ్జిట్ పోల్స్ ప్రయతి్నస్తున్నాయి’ అని ఆరోపించారు. -
Exit Poll 2024: భారీ మెజార్టీతో ఎన్డీఏ హ్యాట్రిక్
ఎన్డీఏ హ్యాట్రిక్ ఖాయమని ఎగ్జిట్ పోల్స్ పేర్కొన్నాయి. భారీ మెజారిటీతో కేంద్రంలో అధికారాన్ని నిలబెట్టుకుంటుందని మెజా రిటీ ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. బీజేపీ యూపీలో స్థానాలను పెంచుకోవడంతో పాటు గుజరాత్, మధ్యప్రదేశ్ల్లో క్లీన్స్వీప్ చేస్తుందని కర్ణాటకలో హవా కొనసాగించడమే గాక బెంగాల్లో చొచ్చుకుపోతుందని చెప్పాయి. కాంగ్రెస్ సారథ్యంలోని విపక్ష ఇండియా కూటమి 150 మార్కు దాటొచ్చని తెలిపాయి. న్యూఢిల్లీ: కేంద్రంలో పాలక ఎన్డీఏ కూటమిదే మళ్లీ అధికారమని మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ పేర్కొన్నాయి. భారీ మెజారిటీతో కూటమి హ్యాట్రిక్ కొట్టడం, నరేంద్ర మోదీ వరుసగా మూడోసారి ప్రధాని కావడం ఖాయమని అభిప్రాయపడ్డాయి. శనివారం సాయంత్రం సార్వత్రిక ఎన్నికల తుది విడత పోలింగ్ ముగుస్తూనే ఎగ్జిట్ పోల్స్ వెల్లువెత్తాయి. గుజరాత్, మధ్యప్రదేశ్ల్లో మరోసారి బీజేపీ క్లీన్స్వీప్ చేస్తుందని వాటిలో చాలావరకు పేర్కొన్నాయి. కర్నాటకలో కూడా బీజేపీ హవాయే కొనసాగుతుందని, పశ్చిమబెంగాల్లో మరింతగా చొచ్చుకుపోతుందని వెల్లడించడం విశేషం. బిహార్, రాజస్తాన్, హరియాణాల్లో మాత్రం ఎన్డీఏకు సీట్లు కాస్త తగ్గుతాయని అంచనా వేశాయి. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. విపక్షాల అవకాశవాద రాజకీయాలను జనం పూర్తి గా తిరస్కరించారన్నారు. వాస్తవ ఫలితాల్లో తమకు ఎగ్జిట్ పోల్స్ అంచనాలను మించి వస్తాయని ధీమా వెలిబుచ్చారు. కాంగ్రెస్ మాత్రం ఎగ్జిట్ పోల్స్ను మోదీ ప్రభావితం చేశారని ఆరోపించింది. వాస్తవ ఫలితాలు చాలా భిన్నంగా రాను న్నాయని విశ్వాసం వెలిబుచి్చంది. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెలువడ్డ నేపథ్యంలో ఇప్పుడిక అందరి కళ్లూ జూన్ 4న జరిగే ఓట్ల లెక్కింపు జరిగాక రాబోయే అసలు ఫలితాలపైనే కేంద్రీకృతమయ్యాయి. ఏ సర్వే ఏం చెప్పింది...? ఇండియాటుడే–మై యాక్సిస్ ఎగ్జిట్ పోల్ ఎన్డీఏకు 361 నుంచి 401 స్థానాలిచి్చంది. ఇండియా కూటమికి 131 నుంచి గరిష్టంగా 166 రావచ్చని తెలిపింది. ఎన్డీఏకు 368 దాకా వస్తాయని రిపబ్లిక్ భారత్–మారై్టజ్ సర్వే పేర్కొంది. ఇండియా కూటమికి 133, ఇతరులకు 48 రావచ్చని తెలిపింది. ఎన్డీఏకు 392 దాకా, ఇండియాకు 161, ఇతరులకు 20 దాకా రావచ్చని జన్ కీ బాత్ అభిప్రాయపడింది. ఎన్డీఏకు బీజేపీ లక్ష్యంగా పెట్టుకున్న మేరకు 401 స్థానాలు దక్కుతాయని ఇండియా టీవీ–సీఎన్ఎక్స్ అంచనా వేయడం విశేషం. ఇండియా కూటమికి 139, ఇతరులకు 38 స్థానాలు రావచ్చని తెలిపింది. టుడేస్ చాణక్య కూడా కూడా ఎన్డీఏకు 385 నుంచి ఏకంగా 415 సీట్లిచి్చంది! ఇండియా కూటమి 96 నుంచి 118 మధ్య సాధిస్తుందని పేర్కొంది. న్యూస్ నేషన్ ఎన్డీఏకు 378, ఇండియా కూటమికి 169 స్థానాలిచి్చంది. దైనిక్ భాస్కర్ ఎన్డీఏ కూటమికి 350 దాకా, ఇండియా కూటమికి గరిష్టంగా 201, ఇతరులకు 49 సీట్లిచి్చంది. రిపబ్లిక్ టీవీ సర్వేలో ఎన్డీఏకు 359, ఇండియాకు 154, ఇతరులకు 30 స్థానాలొచ్చాయి. ఏబీపీ న్యూస్–సీ వోటర్ ఎన్డీఏకు 353–383, ఇండియాకు 152 నుంచి 182 సీట్లిచ్చింది. ఎన్డీఏకు 371, ఇండియాకు 125 రావచ్చని ఇండియా న్యూస్ పేర్కొంది. టైమ్స్ నౌ–ఈటీజీ సర్వే ఎన్డీఏకు 358, ఇండియా కూటమికి 152 స్థానాలిచ్చింది. రాష్ట్రాల్లో ఇలా... కేంద్రంలో అధికార సాధనకు అత్యంత కీలక రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్పై బీజేపీ మరోసారి పట్టు నిలుపుకుంటోందని సర్వేలన్నీ తెలిపాయి. బీజేపీకి యూపీలో ఏకంగా 67 సీట్ల దాకా రావచ్చని ఇండియాటుడే వెల్లడించింది. సమాజ్వాదీ, కాంగ్రెస్ సింగిల్ డిజిట్లకే పరిమితమవుతాయని తెలిపింది. కర్నాటకలో ఈసారి కూడా బీజేపీకి 23, భాగస్వామి జేడీ(యూ)కు 3 సీట్లు వస్తాయని తెలిపింది. ఇక పశి్చమబెంగాల్లోనైతే పాలక తృణమూల్ కాంగ్రెస్ను తోసిరాజని 23 నుంచి 27 స్థానాలతో బీజేపీ తొలిసారిగా రాష్ట్రంలో అతి పెద్ద పారీ్టగా అవతరించనుందని ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. ఇండియాటుడే అయితే బెంగాల్లో బీజేపీకి 30 పై చిలుకు, తృణమూల్కు 11 నుంచి 12 స్థానాలివ్వడం విశేషం. కీలకమైన మహారాష్ట్రలో ఎన్డీఏ కూటమికి సీట్లు 2019తో పోలిస్తే కాస్త తగ్గి 30 నుంచి 32 దాకా రావచ్చని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి.సర్వత్రా ఆసక్తి నెలకొన్న ఒడిశాలోనైతే 21 సీట్లకు గాను ఎన్డీఏకు ఏకంగా 18 నుంచి 20 వస్తాయని, అధికార బిజూ జనతాదళ్ ఒకట్రెండు సీట్లకు మించబోదని ఇండియాటుడే పేర్కొనడం విశేషం. దక్షిణాదిన కేరళలోనూ తొలిసారి కమలవికాసం ఖాయమని ఎగ్జిట్ పోల్స్ పేర్కొన్నాయి. అక్కడ బీజేపీకి 3 సీట్ల దాకా ఖాయమని పేర్కొన్నాయి. లెఫ్ట్ ఫ్రంట్ కుదేలవుతుందని, కాంగ్రెస్కే మెజారిటీ సీట్లు వస్తాయని తెలిపాయి. రాజస్తాన్, బిహార్లలో ఎన్డీఏకు ఐదారు స్థానాలు తగ్గి ఆ మేరకు ఇండియా కూటమికి పెరగవచ్చని పేర్కొన్నాయి. ఏపీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడమే గాక మెజారిటీ లోక్సభ స్థానాలూ నెగ్గుతుందని కొన్ని ఎగ్జిట్ పోల్స్, ఎన్డీఏ కూటమిదే విజయమని మరికొన్ని పేర్కొన్నాయి. తెలంగాణలో బీజేపీకే ఎక్కువ లోక్సభ స్థానాలొస్తాయని తెలిపాయి.2019లో ఏం జరిగింది?2019 లోక్సభ ఎన్నికల్లో కూడా మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ ఎన్డీఏ గెలుస్తుందనే జోస్యం చెప్పాయి. మొత్తం 13 ఎగ్జిట్ పోల్స్ సగటును చూస్తే ఎన్డీఏకు 306, యూపీఏకు 120 సీట్లొస్తాయని పేర్కొన్నాయి. చివరికి ఎన్డీఏకు 353 స్థానాలు రాగా యూపీఏ కేవలం 93 సీట్లతో సరిపెట్టుకుంది. బీజేపీకి సొంతంగానే 303 స్థానాలు రాగా కాంగ్రెస్ కేవలం 53 సీట్లు నెగ్గింది. -
విజయం సరే... విలువలు?
ఈ నేల మీద భగవంతుడి ప్రస్థానమే రాజ్యం. సుప్రసిద్ధ జర్మన్ తత్త్వవేత్త హెగెల్ చేసిన సూత్రీకరణ ఇది. హెగెల్ నుంచి స్ఫూర్తి పొందిన వారిలో కార్ల్ మార్క్స్ వంటి తత్త్వవేత్తలే కాదు, మన ప్రధాని మోదీ వంటి వారు కూడా ఉన్నారు. ఇది నిన్న మొన్ననే నిగ్గుతేలినటువంటి ఒక నగ్నసత్యం. హెగెల్ సూత్రీకరణను మోదీ మరింత విప్లవీకరించారు.ఒక ప్రత్యేక కార్యం కోసం దేవుడు పంపగా వచ్చిన దూతను తానని ఈమధ్యనే ఒక ఇంటర్వ్యూలో ఆయన చెప్పారు. ఆ దేవుని తరఫున ఈ భూమ్మీద తన ప్రస్థానమే రాజ్యమని ఆయన భావన కావచ్చు. ఇందుకోసం ఆయన ఫ్రాన్స్ చక్రవర్తి పద్నాలుగో లూయీని అరువు తెచ్చుకున్నారు. ‘ఐయామ్ ది స్టేట్’ (నేనే రాజ్యం) అనే కొటేషన్తో పద్నాలుగో లూయీ చరిత్రలో నిలబడిపోయిన సంగతి తెలిసిందే.హెగెల్ గతితర్కాన్ని, లూయీ నిరంకుశత్వాన్ని గ్రైండర్లో వేయగా వచ్చిన సింథసిస్నే మోదీ తన దేవదూత కార్యంగా ప్రకటించారనుకోవాలి. తాను పొలిటికల్ సైన్స్తో ఎమ్మే చదివానని ఏదో సందర్భంలో ఆయనే చెప్పుకున్నారు. కనుక థామస్ హాబ్స్ తత్త్వధారను కూడా ఆయన అనివార్యంగా చదివుండాలి. హాబ్స్ ప్రతిపాదించిన సంపూర్ణ సార్వభౌమాధికార ప్రతిపాదన మోదీ మనసును రంజింపజేసి ఉండవచ్చు.‘‘నేను అందరిలానే పుట్టానని అమ్మ చనిపోయేంతవరకు అనుకునేవాడిని. కానీ, ఆ తర్వాత అర్థమైంది నాకు. దేవుడు ఏదో ప్రత్యేక కార్యం కోసం నన్ను పంపించాడు. నా ద్వారా ఆయన అమలు చేయానుకుంటున్న పథకం సమగ్ర స్వరూపం నాక్కూడా తెలియదు. ఆయన ఆదేశిస్తాడు, నేను అమలు చేస్తాన’’ని ప్రధానమంత్రి ఆ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. బహుశా దేవుడు ఆశిస్తున్న సమగ్ర పథకాన్ని అమలు చేయాలంటే పార్లమెంట్లో బీజేపీకి మూడింట రెండొంతుల మెజారిటీ ఉండాలేమో! అంతవరకే దేవుడు చెప్పి ఉంటాడు. అందుకోసమే ఈ ఎన్నికల్లో ‘అబ్ కీ బార్... చార్ సౌ పార్’ అనే నినాదాన్ని మోదీ ఎత్తుకున్నారు. ఆ నినాదం కేవలం దైవ సంకల్పం!అధికారంలోకి రావడానికి సాధారణ మెజారిటీ (272) చాలు. మరి ‘చార్ సౌ పార్’ కోసం ఎందుకింత ధ్యాస. ఎందుకిన్ని ధ్యానాలు, ఎందుకిన్ని దండాలు? ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్టుగా రాజ్యాంగాన్ని మార్చడానికేనా? రాజ్యాంగంలోని సెక్యులర్, సోషలిస్టు పదాలను ఎత్తివేయడానికా? బలహీన వర్గాల అభ్యున్నతిని కాంక్షించిన రాజ్యాంగ ఆదేశాలను తుంగలో తొక్కడానికా? రిజర్వేషన్లు ఎత్తివేయడానికా?... అవి ప్రతిపక్షాలు కాబట్టి ఉద్దేశపూర్వకంగా ఇటువంటి ఆరోపణలు చేస్తాయని కూడా అనుకోవచ్చు.భారీ మెజారిటీ ఉంటే ప్రభుత్వం మరింత బలంగా ఉండవచ్చన్నది బీజేపీ నేతల తలపోత కావచ్చు. ఇప్పటికే పట్టుబిగించిన ప్రజాస్వామ్య వ్యవస్థలపై మరింత బిగువుగా పెత్తనం కొనసాగించవచ్చు. ప్రతిపక్షాలను నలిపేయవచ్చు. రాష్ట్ర ప్రభుత్వాలను స్థానిక సంస్థల స్థాయికి దిగజార్చి కేంద్ర సార్వభౌమాధికారాన్ని పటిష్ఠం చేయవచ్చు. ఏమో... దేవుడు ఆదేశిస్తే పార్లమెంటరీ వ్యవస్థ కొమ్మలు నరికి అధ్యక్ష పాలనను అంటుకట్టవచ్చు. ఈ రకమైన బృహత్కార్యాలను అమలు చేయాలంటే ఎన్డీఏ కూటమికి ఆ మాత్రం మెజారిటీ అవసరమవుతుంది.కానీ, ఎన్డీఏ 400 మార్కును దాటే అవకాశం కనిపించడం లేదు. ఎగ్జిట్ పోల్స్ లెక్కల ప్రకారం గతంలో ఉన్న బలాన్నే యధాతథంగా కాపాడుకునే అవకాశం కనిపిస్తున్నది. ఇది మూడింట రెండొంతుల మెజారిటీకి ఓ రెండడుగుల దూరం. జాతీయ మీడియా పూర్తిగా బీజేపీకి అనుకూలంగా ఎగ్జిట్ పోల్ ఫలితాలను ఇచ్చిందన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ప్రచార ఘట్టంలో ఎన్డీఏ నాయకత్వంలో కనిపించిన అసహనం, ప్రతిపక్షాలపై వారు అవధులు దాటి చేసిన ఆరోపణలు, మైనారిటీ మతాన్ని టార్గెట్గా చేసుకొని సాగించిన అనైతిక ప్రచారం వగైరాలు మారుతున్న రాజకీయ వాతావరణానికి సంకేతాలుగా చాలామంది భావించారు.ప్రతిపక్షాలను నిందించడం కోసం మహాత్మాగాంధీ పేరును మోదీ వాడుకున్న తీరు దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించింది. ‘గాంధీ సినిమా (1982) వచ్చేవరకూ ఆయన గురించి ప్రపంచంలో పెద్దగా తెలియదు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఆయన్ను ప్రమోట్ చేయలేదు. మార్టిన్ లూథర్ కింగ్, నెల్సన్ మండేలా కంటే గాంధీ ఏం తక్కువ? వాళ్లకొచ్చినంత పేరు గాంధీకి రాలేదంటే అప్పటి ప్రభుత్వాలే కారణమ’ని ఆయన ఏబీపీ ఇంటర్వ్యూలో ఆక్షేపించారు.ప్రతిపక్షాల మీద ప్రధాని విచక్షణా రహితంగా చేసిన దాడుల్లో భాగంగానే దీన్ని పరిగణించాలేమో! ఎందుకంటే గాంధీకి దేశదేశాల్లో ఉన్న ప్రాచుర్యం గురించి ప్రధానికి తెలియదనుకోవడం నమ్మశక్యంగా లేదు. గాంధీ మరణాన్ని ఆ రోజుల్లోనే సకల దేశాల్లోని వార్తా పత్రికలు బ్యానర్ వార్తగా ప్రకటించాయి. మోదీ ఉదాహరించిన మార్టిన్ లూథర్ కింగ్, నెల్సన్ మండేలాలే స్వయంగా తాము గాంధీ నుంచి స్ఫూర్తి పొందామని పలుమార్లు ప్రకటించారు. గాంధీ ప్రవచించిన అహింసాయుత ఆందోళనా పద్ధతులనే మార్టిన్ లూథర్ కింగ్ అమెరికాలో ఆచరణలో పెట్టారు.గాంధీ పుట్టిన భారతదేశాన్ని సందర్శించాలన్న ఆకాంక్షను కూడా ఆ రోజుల్లో కింగ్ వెల్లడించారు. పండిత్ నెహ్రూ ఆహ్వానంపై 1956లో ఆయన ఇండియాలో దిగిన వెంటనే చెప్పిన మాట ఎన్నటికీ మరపునకు రాదు. ‘నేను విదేశాలకు పర్యాటకునిగా వెళ్తుంటాను. కానీ, ఈ దేశానికి ఒక యాత్రికునిగా వచ్చాన’న్నారు. అన్యాయానికి, వివక్షకు గురయ్యే సకల దేశాల ప్రజానీకానికి సత్యాగ్రహమనే దివ్యాస్త్రాన్ని ప్రసాదించిన మహాత్మాగాంధీ పుట్టిన దేశం ఆనాటి మహోన్నతుల దృష్టిలో ఒక యాత్రాస్థలమే. నల్ల సూర్యుడు మండేలా కూడా తన స్ఫూర్తిప్రదాతగా గాంధీని పేర్కొన్నారు. ‘గాంధీ ఆఫ్ సౌతాఫ్రికా’గా తనను పరిగణించడాన్ని గర్వంగా భావించారు.రిచర్డ్ అటెన్బరో తీసిన సినిమా చూసేవరకూ ప్రపంచానికి గాంధీ తెలియదన్న మోదీ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో పెద్దఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గాంధీపై ఆల్బర్ట్ ఐన్స్టీన్ లాంటి సుప్రసిద్ధ శాస్త్రవేత్తలు, విజ్ఞానులు, దేశాధినేతలు చేసిన వ్యాఖ్యానాలను వారు ఉటంకిస్తున్నారు. ‘ఇటువంటి వ్యక్తి (గాంధీ) ఒకరు ఈ నేల మీద రక్తమాంసాలతో నడయాడాడంటే భవిష్యత్తు తరాలు నమ్మకపోవచ్చ’ని ఐన్స్టీన్ చెప్పిన మాటలు మనకు సుపరిచితమైనవే. ప్రపంచంలోనే ఆల్టైమ్ అగ్రశ్రేణి నవలాకారుడు, రష్యన్ రచయిత లియో టాల్స్టాయ్ – గాంధీల మధ్యనున్న స్నేహబంధం, నడిచిన ఉత్తర ప్రత్యుత్తరాల గురించి కూడా ప్రపంచానికి తెలుసు.విఐ లెనిన్, విన్స్టన్ చర్చిల్, ఫ్రాంక్లిన్ రూజ్వెల్ట్, మార్టిన్ లూథర్కింగ్, ఆల్బర్ట్ ఐన్స్టీన్, అడాల్ఫ్ హిట్లర్, మావో జెడాంగ్, నెల్సన్ మండేలా, పండిత్ నెహ్రూ, మదర్ థెరిసా, మార్గరెట్ థాచర్ తదితర శక్తిమంతమైన, ప్రభావవంతమైన వ్యక్తులు ఇరవయ్యో శతాబ్దాన్ని శాసించారు. వీరందరిలోకి అత్యంత శక్తిమంతుడిగా మహాత్మాగాంధీ గుర్తింపుపొందడమే కాకుండా ఈ జాబితాలోని పలువురి అభిమానాన్ని, గౌరవాన్ని కూడా ఆయన చూరగొన్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇరవయ్యో శతాబ్దం – గాంధీ శతాబ్దం!అటువంటి గాంధీ మహాత్ముడిని సరిగ్గా ప్రమోట్ చేయలేకపోయారని ప్రధాని వాపోవడం ఒక ప్రకృతి వైచిత్రి. కార్పొరేట్ శక్తులన్నీ కలిసి ప్రమోట్ చేసి గద్దెనెక్కించడానికి ఆయనేమన్నా గుజరాత్ మోడలా? గాంధీ పుట్టింది గుజరాతే. కానీ ఆయన భారతీయ ఆత్మకు ప్రతీక. భారతీయ సహజీవనానికి ప్రతీక. భారతీయ సంస్కృతికి, భారతీయ సమైక్యతకు ప్రతీక. పల్లె స్వరాజ్యాన్ని ప్రేమించినవాడు. ఈశ్వరుడూ – అల్లా ఒకరేనని భజనలు చేసినవాడు. విద్వేషాన్ని ప్రేమతో జయించినవాడాయన. ఆయనే ఒక మూర్తీభవించిన భారతీయత. ఆయనను ప్రభుత్వాలు ప్రమోట్ చేయడమేమిటి? ఇన్నేళ్ల తర్వాత ఈ విషయంలో ప్రధాని వ్యాకులత చెందడం ప్రజలకు అసహజంగా అనిపించింది.మోదీజీ తీసిన ‘గాంధీ బాణం’ ఎన్నికల కోసమేనన్నది అందరికీ అర్థమవుతూనే ఉన్నది. ఈసారి ఎన్నికల ప్రచారంలో ఆయన ఊహించని కొత్త పుంతలు తొక్కారు. ఫైవ్ ట్రిలియన్ ఎకానమీ ఊసే లేదు. మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్పై చర్చే లేదు. ఏటా రెండు కోట్ల ఉద్యోగాల హామీని అటకపై నుంచి మళ్లీ కిందికి దించలేదు. విదేశాల నుంచి బ్లాక్ మనీని తీసుకొస్తానన్న పదేళ్ల కిందటి హామీని పొరపాటున కూడా మళ్లీ ప్రస్తావించలేదు. రైతులకు గిట్టుబాటు ధరలపై స్వామినా«థన్ కమిటీ సిఫారసులను అమలు చేస్తామని పదేళ్ల కింద ఇచ్చిన హామీకి చెదలు పట్టాయి. కీలకమైన ప్రజాసమస్యల ప్రస్తావనకు సమయం సరిపోలేదు.జనజీవన స్రవంతి నుంచి ముస్లిం మతస్థులను వేరు చేసే ప్రయత్నం ఎన్నికల ప్రచారంలో బీజేపీ నేతలు ముమ్మరంగా చేశారు. ఈ విధ్వంసకర ధోరణికి సాక్షాత్తు ప్రధానే నాయకత్వం వహించారు. ప్రతిపక్షాలను ‘ముజ్రా’ డ్యాన్సర్లుగా అభివర్ణించారు. బీజేపీ గెలవకపోతే బీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను ముస్లింలు లాగేసుకుంటారని రెచ్చగొట్టారు. ప్రతిపక్షాలు గెలిస్తే హిందువుల మంగళ సూత్రాలు లాక్కొని ముస్లింలకు పంచుతారని దారుణమైన ఆరోపణలు చేశారు. సమాజాన్ని విభజించే విత్తన బంతులను య«థేచ్ఛగా వెదజల్లారు. ఈ పని చేసినందుకు యావత్తు భారతదేశం చింతించవలసిన రోజు రావచ్చు. ఇదంతా చేసింది ‘చార్ సౌ పార్’ కోసమేనా?ఒకవేళ ఎన్డీఏ కూటమి 400 సీట్ల మార్కు దాటినా, అందుకు కారణం ఈ విద్వేష ప్రచారం కాబోదు. ప్రత్యామ్నాయ కూటమి సమర్ధతపై జనానికి నమ్మకం కుదరకపోవడం కావచ్చు. ఈసారి కూడా గెలిస్తే నెహ్రూ తర్వాత వరసగా మూడు ఎన్నికల్లో గెలిచిన ప్రధానిగా ఆయన రికార్డును మోదీ సమం చేస్తారు. కానీ, జనంలో నాటిన విద్వేష బీజాలు ఎటువంటి పరిణామాలకు దారితీస్తాయన్నదే బుద్ధిజీవుల మెదళ్లను తొలుస్తున్న ప్రశ్న.వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com -
డివిడెండ్ జోష్.. సూచీలు ఖుష్
ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ)బోర్డు కేంద్ర ప్రభుత్వానికి రూ.2.1 లక్షల కోట్ల భారీ డివిడెండ్ ఇచ్చేందుకు ఆమోదం తెలపడంతో గురువారం స్టాక్ సూచీలు సరికొత్త రికార్డు్డలు నెలకొల్పాయి. కేంద్రంలో ఎన్డీఏ కూటమి మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యలు ఇన్వెస్టర్లలో విశ్వాస్వాన్ని నింపాయి. అలాగే దేశంలో ఎగుమతులు పెరగడంతో పాటు మే నెలలో ఉద్యోగ కల్పన 18 ఏళ్ల గరిష్టానికి చేరినట్లు వెల్లడైన గణాంకాలు సెంటిమెంట్ను బలపరిచాయి. ఫలితంగా సూచీలు దాదాపు 2% ర్యాలీ చేసి ఈ జనవరి 29 తర్వాత అతిపెద్ద ఒక రోజు లాభాన్ని ఆర్జించాయి. సెన్సెక్స్ 1,197 పాయింట్లు పెరిగి 75,418 ముగిసింది. నిఫ్టీ 370 పాయింట్లు బలపడి 22,968 వద్ద నిలిచింది.కొనుగోళ్ల జోరు – రికార్డు హోరు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు అందుకున్న సూచీలు ఉదయం ఫ్లాటుగా మొదలయ్యాయి. మెటల్, ఫార్మా మినహా అన్ని రంగాల్లో కొనుగోళ్ల వెల్లువెత్తడంతో సూచీలు స్థిరంగా ముందుకు కదలాడాయి. మిడ్సెషన్ నుంచి ఆర్బీఐ డివిడెండ్ ప్రకటనల బలపడటంతో ఐటీ, బ్యాంకింగ్ షేర్లకు భారీ డిమాండ్ నెలకొంది. దశలో సెన్సెక్స్ 1,279 పాయింట్లు దూసుకెళ్లి 75వేల స్థాయిపైన 75,500 వద్ద, నిఫ్టీ 396 పాయింట్లు బలపడి 22,968 వద్ద జీవిత కాల గరిష్టాలను నమోదు చేశాయి. జూన్ 4 తర్వాత స్టాక్ మార్కెట్ భారీ లాభాల్లో దూసుకుపోవచ్చని నిపుణులు భావించారు. అయితే సార్వత్రిక ఎన్నికల ఫలితాల కంటే ముందే సరికొత్త రికార్డులను నమోదు చేయడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఆర్బీఐ భారీ డివిడెండ్ మరోసారి స్థిరమైన ప్రభుత్వమే ఏర్పడొచ్చన్న అంచనాలు సూచీల పరుగుకు ప్రధాన కారణమని భావిస్తున్నారు.→ జీవితకాల గరిష్టానికి ఇన్వెస్టర్ల సంపద సెన్సెక్స్ ర్యాలీతో బీఎస్ఈలో రూ.4.28 లక్షల కోట్ల సంపద సృష్టి జరిగింది. దీంతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈలోని లిస్టెడ్ కంపెనీల మొత్తం మార్కెట్ విలువ జీవితకాల గరిష్ట స్థాయి రూ.420 లక్షల కోట్లకు చేరింది. → అదానీ గ్రూప్ షేర్లకు డిమాండ్ అదానీ గ్రూప్కు చెందిన ప్రధాన కంపెనీ అదానీ ఎంటర్ప్రైజెస్ బీఎస్ఈ సెన్సెక్స్లో చోటు దక్కనుండడంతో ఈ గ్రూప్లోని తక్కిన షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. మొత్తం గ్రూప్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 17.23 లక్షల కోట్లకు చేరింది. → మెప్పించిన గో డిజిట్ ఆన్లైన్ వేదికగా బీమా సేవలు అందించే గో డిజిట్ జనరల్ ఇన్సూరెన్స్ షేరు లిస్టింగ్ మెప్పించింది. బీఎస్ఈలో ఇష్యూ ధర(రూ.272)తో పోలిస్తే 3% లాభంతో ప్రీమియంతో రూ.281 వద్ద లిస్టయ్యింది. ఇంట్రాడేలో 15% ఎగసి రూ.314 వద్ద గరిష్టాన్ని నమోదు చేసింది. చివరికి 12% లాభంతో రూ.306 వద్ద ముగిసింది. మార్కెట్ విలువ రూ.28,043 కోట్లుగా నమోదైంది. → ఎన్ఎస్ఈ రికార్డ్ఎన్ఎస్ఈలో నమోదైన కంపెనీల మార్కెట్ విలువ తొలిసారి 5 ట్రిలియన్ డాలర్లను అధిగమించింది. గతేడాది డిసెంబర్లో 4 ట్రిలియన్ డాలర్ల మార్కెట్ క్యాప్ మైలురాయిని అందుకుంది. -
జమ్మలమడుగు ఎమ్మెల్యేపై రాళ్ల దాడి
జమ్మలమడుగు/జమ్మలమడుగు రూరల్: ఎన్డీఏ కూటమి అభ్యర్థి కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగులో సోమవారం సాయంత్రం 6 గంటలు దాటాక నవాజ్ కట్ట సమీపంలోని 116, 117 పోలింగ్ బూత్లలో ఓటర్లు బారులు తీరి ఉన్నారు. అధికారులు వారికి స్లిప్పులు ఇచ్చి పోలింగ్ నిర్వహిస్తున్న సమయంలో బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదినారాయణరెడ్డి కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. దీంతో డీఎస్పీ వైఎస్సార్సీపీ కార్యకర్తలపై లాఠీచార్జి చేశారు. ఇదే అదనుగా భావించిన ఆది, భూపేష్ వర్గీయులు రాళ్లతో దాడులు చేయించారు. ఈ దాడుల్లో ఎమ్మెల్యే సుధీర్రెడ్డి తలపై గాయమైంది. దీంతో వైఎస్సార్సీపీ నాయకులు ఎమ్మెల్యే సుధీర్రెడ్డిని కాపాడుకునేందుకు ఎదురు దాడి చేశారు. సుధీర్రెడ్డిపై రాళ్ల దాడి జరిగిందన్న విషయం తెలుసుకున్న పట్టణంలోని నాయకులు, కార్యకర్తలు భారీగా ఎమ్మెల్యే కార్యాలయానికి చేరుకున్నారు. పార్టీ సీనియర్ నాయకుడు హృషి కేశవరెడ్డి ఎమ్మెల్యేను పరామర్శించటానికి వెళుతున్న సమయంలో ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్న టీడీపీ కార్యాలయం వద్ద గూమిగూడి ఉన్న కార్యకర్తలు రాళ్లతో దాడులు చేశారు. ఈ దాడిలో కారు అద్దాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. మైలవరం మండలం చేరెడ్డి చెన్నకేశవరెడ్డికి చెందిన కారును ఎ.కంబాలదిన్నె గ్రామానికి చెందిన టీడీపీ, బీజేపీ కార్యకర్తలు దాడి చేసి కారు అద్దాలను ధ్వంసం చేశారు. ఎమ్మెల్యే సుధీర్రెడ్డిపై ఆదినారాయణరెడ్డి వర్గీయులు దాడి చేయగా.. ఎమ్మెల్యేకు బలమైన గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు వెంకటేశ్వర కాలనీ వద్ద గల 116, 117 బూత్ల వద్దకు బలగాలను మోహరించారు. వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలంతా ఎమ్మెల్యే కార్యాలయానికి భారీగా చేరుకున్నారు. ముద్దనూరు మండలం నుంచి మేనమామ అయిన మునిరాజారెడ్డి తన అనుచరులతో జమ్మలమడుగుకు చేరుకున్నారు. భారీగా కార్యకర్తలు వస్తుండటంతో టీఎన్ఆర్ థియేటర్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. -
Lok Sabha Election 2024: నువ్వా నేనా?!
యూపీ, పశ్చిమబెంగాల్ మాదిరే బిహార్లోనూ లోక్సభ ఎన్నికలు మొత్తం ఏడు దశల్లోనూ జరుగుతున్నాయి. బీజేపీ, జేడీ(యూ), లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్)తో కూడిన ఎన్డీఏ కూటమి; కాంగ్రెస్, ఆర్జేడీ, వామపక్షాలతో కూడిన విపక్ష ఇండియా కూటమి హోరాహోరీ తలపడుతున్నాయి. 40 స్థానాలకు తొలి మూడు విడతల్లో 14 చోట్ల పోలింగ్ ముగిసింది. ఈ నెల 13న నాలుగో దశలో దర్భంగా, ఉజియార్పూర్, సమస్తిపూర్, బెగుసరాయ్, ముంగేర్ లోక్సభ స్థానాల్లో పోలింగ్ జరగనుంది. వీటిలో 2019 ఎన్నికల్లో బీజేపీ మూడు, ఎల్జేపీ, జేడీ(యూ) ఒక్కో చోట గెలిచాయి. ఈసారి ఆర్జేడీ అధినేత లాలు ప్రసాద్ అనారోగ్య సమస్యలను పక్కన పెట్టి మరీ ప్రచారం చేస్తున్నారు. ఈ విడతలో ఇద్దరు కేంద్ర మంత్రుల భవిష్యత్ను ఓటర్లు తేల్చనున్నారు... బెగుసరాయ్ బిహార్లోని హాట్ సీట్లలో ఇదీ ఒకటి. కేంద్ర గ్రామీణాభివృద్ధి, పంచాయితీరాజ్ మంత్రి, బీజేపీ సిట్టింగ్ ఎంపీ గిరిరాజ్ సింగ్ మళ్లీ బరిలో దిగారు. ఆయనపై ఇండియా కూటమి నుంచి సీపీఐ సీనియర్ నాయకుడు అవధేశ్ కుమార్ రాయ్ పోటీ చేస్తున్నారు. ఆయన ఇక్కడ 1967లో గెలిచారు. 57 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ బరిలో దిగుతుండటం విశేషం! ఈ నియోజకవర్గంలో భూమిహార్ సామాజికవర్గ ప్రాబల్యం ఎక్కువ. గిరిరాజ్ కూడా ఆ కులానికి చెందినవారే. 2019లో సీపీఐ అభ్యర్థి కన్హయ్య కుమార్ను ఆయన 4.2 లక్షల ఓట్ల మెజారిటీతో ఓడించారు. విపక్షాలన్నీ సంఘటితం కావడం ఈసారి ఆయనకు కాస్త ప్రతికూలమే. 2004 దాకా ఇక్కడ కాంగ్రెస్దే హవా! 2004, 2009ల్లో జేడీ(యూ) గెలిచింది. ఉజియార్పూర్ కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి, బీజేపీ నేత నిత్యానందరాయ్ ఇక్కడి సిట్టింగ్ ఎంపీ. 2014లోనూ ఇక్కడ ఆయనే నెగ్గారు. 2019లో రాయ్ చేతిలో ఓడిన రాష్రీ్టయ లోక్ సమతా అధ్యక్షుడు ఉపేంద్ర కుశ్వహ ఎన్డీఏలో చేరడంతో హ్యాట్రిక్ విజయంపై బీజేపీ భరోసాతో ఉంది. 2014లో రాయ్ చేతిలో ఓడిన అలోక్ కుమార్ మెహతా మరోసారి ఆర్జేడీ నుంచి పోటీలో ఉన్నారు. ఈ లోక్సభ స్థానం పరిధిలోని ఆరు అసెంబ్లీ సీట్లలో ఎన్డీఏ, ఇండియా కూటముల చేతుల్లో చెరి సగం ఉన్నాయి. ఇక్కడ యాదవ, కుశ్వాహ సామాజికవర్గాల ప్రాబల్యం ఎక్కువ. ముస్లింలు, బ్రాహ్మణుల ఓట్లు కూడా ఎక్కువే. ముంగేర్ ఒకప్పుడు కాంగ్రెస్ కంచుకోట. కొన్నేళ్లుగా జేడీ(యూ)కే జై కొడుతోంది. జేడీ(యూ) మాజీ చీఫ్, సిట్టింగ్ ఎంపీ రాజీవ్ రంజన్ సింగ్ (లలన్ సింగ్) ఈసారీ బరిలో ఉన్నారు. ఆర్జేడీ నేత గ్యాంగ్స్టర్ అశోక్ మెహతో జైలు పాలవడంతో పార్టీ తరఫున ఆయన భార్య అనితా దేవి పోటీ చేస్తున్నారు. ఈ నియోజకవర్గ పరిధిలోని ఆరు అసెంబ్లీ స్థానాల్లో ఎన్డీఏ, ఇండియా కూటములు చెరో సగం గెలుచుకున్నాయి. ఇక్కడ ఏ సామాజిక వర్గానిదీ పూర్తి ఆధిపత్యం కాకపోవడం విశేషం! మొకామ సిట్టింగ్ ఆర్జేడీ ఎమ్మెల్యే అయిన గ్యాంగ్స్టర్ అనంత్సింగ్ అనూహ్యంగా లలన్సింగ్కు మద్దతుగా ప్రచారం చేస్తున్నారు. దాంతో పరిస్థితులు ఆయనకు మరింత అనుకూలంగా మారాయి. ఆయుధాల చట్టం కేసులో పదేళ్ల జైలుశిక్ష అనుభవిస్తున్న అనంత్ ఈ నెల 5న పెరోల్పై విడుదలై మరీ లలన్సింగ్కు ప్రచారం చేస్తున్నారు. భారీ వాహన కాన్వాయ్తో నియోజకవర్గమంతా చుట్టేస్తున్నారు. దర్భంగా దీన్ని మిథిల ప్రాంత రాజధానిగా పరిగణిస్తుంటారు. మైథిలీ బ్రాహ్మణుల ఆధిపత్యమున్న ఈ లోక్సభ స్థానంలో 2009 నుంచీ బీజేపీయే గెలుస్తూ వస్తోంది. అగ్రవర్ణాలకు చెందిన సిట్టింగ్ ఎంపీ గోపాల్ జీ ఠాకూర్ మళ్లీ బీజేపీ నుంచి బరిలో ఉన్నారు. ఆయనపై కాస్త వ్యతిరేకత కనిపిస్తోంది. యాదవులు, అగ్ర వర్ణాలతో పాటు ఓబీసీ ఓట్లపైనా బీజేపీ ఆశలు పెట్టుకుంది. మాజీ క్రికెటర్ కీర్తి ఆజాద్ ఇక్కడ 1999, 2009, 2014ల్లో బీజేపీ తరఫున గెలిచారు. 2021లో తృణమూల్ కాంగ్రెస్లో చేరిపోయారు. ఈ లోక్సభ స్థానం పరిధిలోని ఆరు అసెంబ్లీ స్థానాల్లో ఐదు బీజేపీ, జేడీ(యూ) చేతుల్లోనే ఉన్నాయి. ఈ విడత ఇక్కడి ఓటర్ల నాడి ఎవరికీ అందడం లేదు! ఇక్కడ ముస్లింలు, యాదవుల ఓట్లు ఎక్కువ. ఆర్జేడీ నుంచి లలిత్ కుమార్ యాదవ్ పోటీ చేస్తున్నారు. ఆర్జేడీ ముస్లింకు టికెటివ్వకపోవడం, పైగా ముస్లిం అభ్యర్థులను ఓడించిన చరిత్ర ఉండటంతో ఈసారి లలిత్కు వారి మద్దతు దక్కకపోవచ్చని భావిస్తున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
Lok Sabha Election 2024: ఎన్డీఏకు 150 సీట్లూ కష్టమే
అలీరాజ్పూర్/ఖర్గోన్: బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ఈసారి లోక్సభ ఎన్నికల్లో కనీసం 150 స్థానాలను కూడా గెల్చుకోదని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. రాజ్యాంగాన్ని పరిరక్షించేందుకే కాంగ్రెస్ ఈ ఎన్నికల్లో పోరాడుతుంటే కమలంపార్టీ, ఆర్ఎస్ఎస్లు రాజ్యాంగాన్ని మార్చేందుకు కంకణం కట్టుకున్నాయని రాహుల్ ఆరోపించారు. సోమవారం మధ్యప్రదేశ్లోని అలీరాజ్పూర్ జిల్లాలోని జోబాట్, సేగోన్ పట్టణాల్లో రాహుల్ ఎన్నికల ప్రచారంచేశారు. రాత్లాం–ఝబువా, ఖర్గోన్ లోక్సభ నియోజకవర్గాల అభ్యర్థుల తరఫున ఎన్నికల ర్యాలీల్లో ప్రసంగించారు.హక్కుల్ని లాగేద్దామని మోదీ ఆశపడుతున్నారు‘‘కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుతీరాక ప్రజా ప్రయోజనాల కోసం 50 రిజర్వేషన్ల పరిమితిని ఎత్తేస్తుంది. కులగణన అనేది ప్రజల జీవన స్థితిగతులపై వాస్తవ గణాంకాలను అందిస్తుంది, దీంతో దేశంలో రాజకీయ గతే మారిపోతుంది. రాజ్యాంగాన్ని మార్చేస్తామని బీజేపీ నేతలు ఇప్పటికే ప్రకటించేశారు. ఈసారి 400 ఖాయం అని బడాయిలుపోతున్నారుగానీ కనీసం వారికి 150 సీట్లుకూడా రావు. రాజ్యాంగాన్ని పరిరక్షించేది విపక్షాల ‘ఇండియా’ కూటమి మాత్రమే. రాజ్యాంగంలో ఉంది కాబట్టే గిరిజనులు, దళితులు, ఓబీసీలు లబ్ధిపొందగల్గుతున్నారు. జలం, జమీన్(భూమి), జంగల్(అడవి)పై గిరిజనులకు హక్కులున్నాయి. ప్రజల హక్కులను లాగేసుకోవాలని ప్రధాని మోదీ ఆశపడుతున్నారు. ఆ ఆశలు నెరవేరకుండా మేం అడ్డుకుంటాం’’ అని రాహుల్ అన్నారు. మేం చేయబోయే విప్లవాత్మకమైన పని ఇదే‘‘వాళ్లు ఇప్పుడున్న రిజర్వేషన్లను లాక్కోవడం సంగతి పక్కనబెట్టండి. మేం ఆ రిజర్వేషన్లను 50 శాతం దాటేలా చేస్తాం. కోర్టులు రిజర్వేషన్ల పరిమితిని 50 శాతం దగ్గరే నిలిపేశాయి. భూమి, అడవికి తొలి యజమానులైన మిమ్మల్ని ఆదివాసీలుగా మేం గుర్తిస్తున్నాం. బీజేపీ వాళ్లు మిమ్మల్ని వనవాసీలంటున్నారు. మీ హక్కుల పరిరక్షణ కోసమే అటవీ హక్కుల చట్టం, పేసా చట్టాలు అమల్లో ఉన్నాయి. మీ అందరికీ చేకూరిన లబ్దిని మీకు దూరం చేయాలని వారు కుట్ర పన్నారు. విపక్షాల కూటమికి ఓటేసి అధికారం కట్టబెడితే కులగణన చేసి గిరిజనులు, దళితులు, ఓబీసీలు, జనరల్ కేటగిరీ పేదల ఆర్థిక స్థితిగతులను మెరుగుపరుస్తాం. మేం చేయబోయే విప్లవాత్మకమైన పని ఇదే. ఏటా 2 కోట్ల ఉద్యోగాలిస్తామని మోదీ అబద్ధాలు చెప్పారు. మేం కోట్లాది మంది పేదలను లఖ్పతిలుగా మారుస్తాం’’ అని చెప్పారు.పాతికమందికే అన్ని ఇచ్చే కుట్ర‘‘రాజ్యాంగం, రిజర్వేషన్లు, గిరిజనుల అటవీభూములు, ప్రభుత్వరంగాన్ని కాపాడేందుకు మేం కష్టపడుతుంటే వీటిపై సర్వాధికారాన్ని అదానీ సహా ఓ పాతికమంది కుబేరులకు ధారాదత్తం చేద్దామని మోదీ ఆశపడుతున్నారు. మేం ఆ పని జరగనివ్వం’’ అని ప్రకటించారు. ఉపాధి కూలీ వేతనం రూ.400కు పెంచుతాం‘‘మహాలక్ష్మీ యోజన ద్వారా పేద మహిళల ఖాతాలో ఏటా రూ.1 లక్ష జమచేసి పేదరికం నుంచి బయటపడేస్తాం. పథకంలో భాగంగా మహిళకు నెలకు రూ.8,500 అందుతాయి. మేం గెలిస్తే రైతుల పంటలకు కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పిస్తాం. అందుకోసం చట్టం తెస్తాం. మా ప్రభుత్వం ఏర్పడ్డాక వీలైనంత త్వరగా రైతుల రుణాలను మాఫీచేస్తాం. గత 45 ఏళ్ల గరిష్ట స్థాయికి నిరుద్యోగిత పెరిగింది. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద రోజువారీ వేతనంను రూ.250 నుంచి రూ.400కు పెంచుతాం. పెహ్లీ నౌకరీ పక్కా పథకం కింద యువతకు కంపెనీల్లో అప్రెంటిస్షిప్ కింద ఏటా రూ.1లక్ష జమచేస్తాం. తర్వాత ఉద్యోగాలిస్తాం’’ అని హామీ ఇచ్చారు. -
ఎన్నికల కమిషనా.. ఎన్డీఏ కమిషనా?
సాక్షి, అమరావతి: ఐదేళ్లుగా కొనసాగుతున్న పథకాలను ఎన్నికల కోడ్ ఉందన్న కారణంతో ఆపేస్తే ఆ లబ్ధిదారుల పరిస్థితేంటి? కొనసాగుతున్న పథకాలను ఆపాల్సిన పనిలేదని ఎన్నికల నిబంధనల్లో స్పష్టంగా ఉన్నా కూడా... ఎన్నికల కమిషన్ ఎందుకిలా చేస్తోంది? ఎన్డీఏ కూటమితో చంద్రబాబు నాయుడు జతకట్టినంత మాత్రాన ఎన్నికల కమిషన్ ఈ రాష్ట్రాన్ని ‘టార్గెట్’ చేయాల్సిన అవసరం లేదు కదా? ఏ రాష్ట్రానికీ వర్తించని నిబంధన ఇక్కడే ఎందుకట? పంట నష్టపోయిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వటమనేది వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ క్రమం తప్పకుండా చేస్తున్నారు. ఇప్పటిదాకా ఎలాంటి ఇబ్బందీ లేదు కూడా. కానీ ఎన్నికల కోడ్ సాకుగా చూపించి ఇపుడు ఏకంగా 6,95,857 మంది రైతుల ఖాతాల్లోకి డబ్బులు వెళ్లకుండా నిలిపేయటం దుర్మార్గం కాదా? పంట వేసుకునే సమయంలో రైతుకు అవసరమనే కదా ప్రభుత్వం రూ.847.22 కోట్ల ఇన్పుట్ సబ్సిడీని విడుదల చేసింది!!. మరి ఆ సబ్సిడీని నిలిపేస్తే రైతులు ఇబ్బందులు పడరా? రైతుల ఇబ్బందులు ఈ ఎన్డీఏ కూటమికి గానీ..ఎన్నికల కమిషన్కు గానీ పట్టవా? ఎవరేమైపోయినా మాకు రాజకీయాలే ముఖ్యమనుకుంటే ఎలా చంద్రబాబూ? విత్తన సబ్సిడీ అందకపోతే ఎలా? నిజానికి రబీ కోతలు పూర్తి కావడంతో ఖరీఫ్ సాగుకు సన్నద్ధమవుతున్న అన్నదాతలు విత్తనాల కోసం ఎదురుచూస్తున్నారు. అలాంటి విత్తన సబ్సిడీపై ఎన్నికల కమిషన్ ఆంక్షలు విధించటం వారికి మింగుడుపడటం లేదు. నిజానికి గతంలో మాదిరే సీజన్కు ముందే సబ్సిడీపై పంపిణీ కోసం 6.19 లక్షల క్వింటాళ్ల విత్తనాన్ని సిద్ధం చేసి... కోడ్ నేపథ్యంలో పంపిణీకి అనుమతినివ్వాల్సిందిగా ఈసీకి అధికారులు లేఖ రాశారు. ఐదేళ్లుగా ఏ విత్తనాలు ఏయే తేదీల్లో పంపిణీ చేసారో ఆ లేఖలో స్పష్టంగా పేర్కొన్నారు. ఏటా కోతలు పూర్తయిన వెంటనే పచ్చిరొట్ట విత్తనాలను సబ్సిడీపై పంపిణీ చేస్తున్నామని, అదును దాటి పోయాక పంపిణీ చేస్తే రైతులు తీవ్రంగా నష్టపోతారని అధికారులు లేఖలో పేర్కొన్నా... ఈసీ తిరస్కరించింది. రబీ కరువు పంట నష్టం అంచనాలకూ బ్రేకు వర్షాభావ పరిస్థితుల కారణంగా రబీ సీజన్లో 84 మండలాలను కరువు మండలాలను ప్రకటిస్తూ మార్చి రెండోవారంలో ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. తాజాగా ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో పంట నష్టం అంచనా వేసేందుకు అనుమతివ్వాలని కోరుతూ ఈసీకి అధికారులు లేఖ రాశారు. ఇన్నాళ్లూ మిన్నకున్న ఈసీ... నష్టం అంచనాపై ఆంక్షలు విధించింది. అనుమతి ఇవ్వలేమని తేచ్చిచెప్పేసింది. దీంతో రబీ కరువు సాయం అందుతుందో లేదో అనే ఆందోళన రైతుల్లో వ్యక్తమవుతోంది. ‘విద్యా దీవెన’ నిధులపైనా విషమే! పేద విద్యార్ధులకు చెల్లించే ‘విద్యా దీవెన’ నిధులనూ చంద్రబాబు కూటమి నిలుపు చేయించింది. ఈసీకి పదేపదే ఫిర్యాదులు చేయటంతో... ఎన్డీఏ భాగస్వామి కనక బాబుకు అనుకూలంగానే ఈసీ నిర్ణయం తీసుకుంది. ఈ నిధుల చెల్లింపునూ నిలిపేసింది. నిజానికి విద్యార్థులు ఇప్పుడు కాలేజీలు మారాల్సి ఉంటుంది. విద్యా దీవెన నిధులు చెల్లిస్తే గానీ కాలేజీలు వారికి సర్టిఫికెట్లు ఇవ్వలేమని చెబుతున్నాయి.ప్రభుత్వం ఇప్పటికే రూ.610.79 కోట్లు విడుదల చేసినా... కూటమి కుట్ర కారణంగా పేద విద్యార్దులు బయట అప్పులు చేసి కాలేజీలకు చెల్లింపులు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. లేదంటే వారి భవిష్యత్తు ప్రమాదంలో పడుతుంది. ఇన్ని దారుణాలు జరుగుతున్నా... చంద్రబాబు, పవన్ కల్యాణ్ నీరో చక్రవర్తుల మాదిరి తమాషా చూస్తున్నారు తప్ప రైతుల గురించి గానీ, విద్యార్థుల గురించి గానీ ఆలోచిస్తే ఒట్టు. ఇప్పుడు రైతులు, విద్యార్థులు అప్పుల పాలైతే నీ కళ్లు చల్లబడతాయా చంద్రబాబూ? ఈసీపై ఒత్తిళ్లు... ఎన్డీఏ భాగస్వామి కనక ఓకే నిజానికి ఇన్పుట్ సబ్సిడీ, విద్యా దీవెన చెల్లింపులు గత ఐదేళ్ల నుంచీ అమలవుతున్నాయి. ఇవేమీ కొత్తవి కావు. లబ్దిదారుల ఎంపిక కూడా ఎప్పుడో చేశారు. ఎన్నికల షెడ్యూల్ వచ్చాక చేసిందేమీ లేదు. కొనసాగుతున్న పథకాలకు ఎన్నికల కోడ్ వర్తించదని నియమావళిలో స్పష్టంగా ఉంది. కాబట్టి వీటికి కేంద్ర ఎన్నికల సంఘం సహజంగానే అనుమతివ్వాలి. మరో చిత్రమేంటంటే మిగతా రాష్ట్రాల్లో ఇలా ఏ పథకాన్నీ అడ్డుకోవటం లేదు కూడా. ఉదాహరణకు తెలంగాణలో పంటలు దెబ్బతిన్న రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చేందుకు గత నెల 23వ తేదీన కేంద్ర ఎన్నికల సంఘం అనుమతించింది. దీంతో తెలంగాణ ప్రభుత్వం ఈ నెల 4న ఇన్పుట్ సబ్సిడీని విడుదల చేస్తూ జీవో ఇచ్చింది. అంతేకాదు. రైతు బంధు నిధులను విడుదల చేస్తూ సోమవారమే జీవో ఇచ్చింది. మంగళ, బుధ వారాల్లో ఇవి రైతుల ఖాతాల్లోకి పడతాయని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా చెప్పారు కూడా. నిజానికి 2019 ఎన్నికల్లో చూసుకున్నా... అప్పుడు అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు ఎన్నికలకు కేవలం మూడు రోజుల ముందు ‘పసుపు కుంకుమ’ పేరిట మూడో విడత నిధులను మహిళల ఖాతాల్లో వేశారు. అప్పుడు చంద్రబాబు ప్రభుత్వానికి గానీ, ఇప్పుడు రేవంత్రెడ్డి ప్రభుత్వానికి గానీ లేని నిబంధన ఒక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికే ఎందుకు వర్తింపజేస్తున్నారు? దీన్నిబట్టి చంద్రబాబు తనకు అలవాటైన కుట్రను ఎంత లోతుగా కొనసాగిస్తున్నారో... ఈసీపై తన ‘బీజేపీ మిత్రుల’ ద్వారా ఎంత ఒత్తిడి చేయిస్తున్నారో ఈజీగానే అర్థం చేసుకోవచ్చు. పింఛన్లపైనా ఇలాంటి దారుణాలే... కేంద్ర ఎన్నికల కమిషన్పై అటు చంద్రబాబు, బీజేపీలోని ఆయన మిత్రులు, ఎల్లో మీడియా, నిమ్మగడ్డ రమేశ్... ఇలా పచ్చ మంద మొత్తం కలిసి దారుణంగా ఒత్తిడి తెచ్చి సామాజిక పింఛన్లు తీసుకునే అవ్వా తాతలను, దివ్యాంగులను రాచిరంపాన పెట్టారు. వృద్ధులు, వికలాంగులు, వితంతవుల ఇంటికి పింఛను రాకుండా అడ్డుకుని... వాల్లను మండుటెండల్లో సచివాలయాల చుట్టూ, బ్యాంకులు చుట్టూ తిప్పుతూ కొంత మంది వృద్దులు మరణానికి కూడా కారణమయ్యిందీ ముఠా. మొదటి నెల సచివాలయాల ద్వారా ప్రభుత్వం పంపిణీ చేయగా.. ప్రతి ఊరికీ సచివాలయం ఉండటంతో వృద్ధులు కొంత ఊపిరి పీల్చుకున్నారు. కానీ అది కూడా నచ్చని పచ్చ ముఠా... నిధుల్ని నేరుగా వారి ఖాతాల్లో వెయ్యాలని ఈసీపై ఒత్తిడి తెచ్చాయి. ఈసీ అలాగే చేయటంతో... బ్యాంకులకు వెళ్లలేక, ఏటీఎంల వద్ద ఎండల్లో నిల్చోలేక వృద్ధులు నరకయాతన అనుభవించారు. చంద్రబాబును ప్రతి ఒక్కరూ నోరారా తిట్టుకున్నారు. జనం ఆగ్రహం తమ మీదకు మళ్లుతోందని భయపడ్డ బాబు... అదంతా వైఎస్ జగన్ వల్లే అయిందంటూ తన రామోజీరావు చేత దుర్మార్గపు కథనాలు రాయించాడు. ఈ కుట్రలన్నిటికీ ప్రజలే జబాబు చెబుతారు బాబూ!!. -
Lok Sabha Elections 2024: యూపీ... హస్తినకు గేట్వే
ఉత్తరప్రదేశ్. లోక్సభ ఎన్నికలనగానే అందరి మదిలో మెదిలే రాష్ట్రం. రాజకీయంగానే కాక జనాభాపరంగా, భౌగోళికంగానూ దేశంలో యూపీది ఎప్పుడూ కీలక పాత్రే. 2024 లోక్సభ ఎన్నికల ముంగిట ఇక్కడి రాజకీయ ముఖచిత్రం కూడా కొత్త మలుపులు తిరుగుతోంది. ఆయోధ్య రామమందిరం కల సాకారం చేసి హిందువుల మనసుల్లో గుడి కట్టుకున్న బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి మరింత దూకుడు పెంచగా, విపక్ష ఇండియా కూటమి కూడా వ్యూహాలకు పదును పెడుతోంది. యూపీ కుంభస్థలాన్ని కొట్టిన పార్టీ హస్తినలో పాగా వేసినట్లేననేది నానుడి. స్టేట్ స్కాన్ దేశ రాజకీయాలకు గుండెకాయ వంటి యూపీలో సత్తా చాటేందుకు పార్టీలన్నీ అ్రస్తాలను రెడీ చేసుకుంటున్నాయి. దేశంలోనే అత్యధికంగా ఏకంగా 80 లోక్సభ స్థానాలున్న రాష్ట్రం యూపీ. దేశాన్నేలే నాయకులను తీర్చిదిద్దడంలోనూ ఈ రాష్ట్రానిది ఘన చరిత్రే. ఏకంగా 8 మంది ప్రధానులను అందించింది యూపీ. ఈ రికార్డుకు మరే రాష్ట్రమూ దరిదాపుల్లో కూడా లేదు... ఈ ఎన్నికలు అత్యంత కీలకం... ఒకప్పుడు కాంగ్రెస్, సమాజ్వాదీ, బహుజన సమాజ్ పార్టీ వంటి పార్టీలకు కంచుకోటగా ఉన్న యూపీలో 2014 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ పూర్తిస్థాయిలో పాగా వేసింది. అనంతరం అసెంబ్లీ ఎన్నికల్లోనూ ప్రత్యర్థులను మట్టి కరిపించింది. 2019 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి రాష్ట్రంలో అత్యధిక సీట్లు గెలుచుకుని తన స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకుంది. యూపీలో క్లీన్ స్వీప్ ద్వారానే బీజేపీ వరుసగా రెండుసార్లు బంపర్ మెజారిటీతో హస్తిన పీఠాన్ని చేజిక్కించుకోగలిగింది. కాంగ్రెస్ గత ఎన్నికల్లో ఒంటరి పోరు చేసి కకావికలమైంది. మాయావతి నేతృత్వంలోని బీఎస్పీ, అఖిలేశ్ యాదవ్ సారథ్యంలోని ఎస్పీ కలిసి పోటీ చేసినా ప్రభావం చూపలేకపోయాయి. బీజేపీ హవాలో చిన్నా చితకా పార్టీలు సోదిలో కూడా లేకుండా పోయాయి. ఈసారి కూడా యూపీలో సత్తా చాటాలని బీజేపీ ఉవి్వళ్లూరుతోంది. ఎన్నికల షెడ్యూలైనా రాకుండానే తొలి విడతలో అభ్యర్థులను ప్రకటించిన 195 సీట్లలో ఏకంగా 51 స్థానాలు యూపీ నుంచే ఉండటం విశేషం! ఎస్పీ ఈసారి విపక్ష ఇండియా కూటమి భాగస్వామిగా కాంగ్రెస్తో కలిసి పోటీ చేస్తోంది. 2014లో యూపీలో ఏకంగా 71 సీట్లు గెలిచిన బీజేపీ 2019లోనూ 62 స్థానాలు నెగ్గింది. ఎన్డీఏ భాగస్వామి అప్నాదళ్(ఎస్) 2 సీట్లు గెలిచింది. బీఎస్పీ, ఎస్పీ, రాష్ర్టీయ లోక్ దళ్ (ఆర్ఎల్డీ)తో కూడిన మహా కూటమి 15 సీట్లకే పరిమితమైంది. బీఎస్పీ 38 స్థానాల్లో పోటీ చేసి 10 సీట్లలో విజయం సాధించగా, ఎస్పీ 37 సీట్లలో పోటీ చేసి ఐదే నెగ్గింది. ఆర్ఎల్డీ 3 సీట్లలోనూ మట్టికరిచింది. 67 సీట్లలో పోటీ చేసిన కాంగ్రెస్ ఒకే ఒక్క స్థానంతో ఘోర పరాజయం మూటగట్టుకుంది. కేవలం సోనియాగాంధీ మాత్రమే రాయ్బరేలీలో నెగ్గారు. అతి పెద్ద రాష్ట్రం కావడంతో యూపీలో ఈసారి మొత్తం ఏడు దశల్లోనూ పోలింగ్ జరుగుతోంది. అయోధ్య.. బీజేపీ బ్రహా్మస్త్రం ఈసారి 400 పైగా లోక్సభ స్థానాలే లక్ష్యంగా బీజేపీ ముందునుంచే చకచకా పావులు కదిపింది. అయోధ్య రామమందిర కలను సాకారం చేయడం హిందువుల ఓట్లను కొల్లగొట్టడం ఖాయమని నమ్ముతోంది. ప్రధాని మోదీ మరోసారి వారణాసి నుంచి పోటీ చేయడం ఎప్పట్లాగే మరింతగా కలిసొస్తుందని భావిస్తోంది. రాష్ట్రంలోనూ బీజేపీ సర్కారే ఉండటం, మౌలిక సదుపాయాలకు పెద్దపీట వేసి, వేలాది కోట్లతో భారీ ఎత్తున అభివృద్ధి కార్యకలాపాలను చేపడుతుండటమూ బీజేపీకి కలిసొచ్చేదే. యూపీలో రెండుసార్లు బీజేపీ జెండా రెపరెపలాడించిన సీఎం యోగి ఆధిత్యనాథ్ పార్టీకి అదనపు బలం. జాట్ల మద్దతు దండిగా ఉన్న మాజీ ప్రధాని చౌధరి చరణ్ సింగ్ మనుమడు జయంత్ నేతృత్వంలోని ఆర్ఎల్డీ ఇండియా కూటమికి గుడ్బై చెప్పి ఎన్డీఏలో చేరడం కాషాయదళంలో కొత్త జోష్ నింపింది. చరణ్ సింగ్కు భారతరత్న ప్రకటనతో జాట్ల ఓట్లు ఎన్డీఏకేనని బీజేపీ భావిస్తోంది. మరో భాగస్వామి అప్నాదళ్ (ఎస్)కూ యూపీలో మంచి పట్టుంది. ప్రధాని మోదీ ఇప్పటికే రాష్ట్రంలో ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. ఆయనకు తోడు రాజ్నాథ్సింగ్, సీఎం యోగితో సహా పలువురు కేంద్ర మంత్రులు కూడా కలియదిరుగుతున్నారు. ‘ఇండియా’ కూటమి పోటీనిచ్చేనా? విపక్ష ‘ఇండియా’ కూటమి యూపీలో ఇంకా కాలూచేయీ కూడదీసుకునే పనిలోనే ఉంది. కూటమి భాగస్వాముల్లో ఎస్పీ 63 సీట్లలో, కాంగ్రెస్ 17 సీట్లలో పోటీ చేసేలా ఒప్పందం కుదిరింది. సోనియా రాజ్యసభకు వెళ్లడంతో రాయ్బరేలీ నుండి ప్రియాంక పోటీ చేసే అవకాశం కన్పిస్తోంది. 2019 పరాజయం నేపథ్యంలో అమేథీలో రాహుల్ గాంధీ ఈసారి బరిలో దిగుతారో, లేదో చూడాలి. ఈ రెండు తప్ప మిగతా 15 స్థానాలకూ కాంగ్రెస్ ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించింది. వెనకబడ్డ, దళిత, మైనారిటీ వర్గాలపై అఖిలేశ్ బాగా దృష్టి పెట్టారు. కానీ గత ఎన్నికల సరళిని బట్టి చూస్తే, యాదవేతర ఓబీసీలు, జాతవేతర దళిత ఓటర్లను బీజేపీ తనవైపు తిప్పుకునేలా కనిపిస్తోంది. ఇక ఆర్ఎల్డీ గుడ్బై చెప్పడం ఇండియా కూటమికి ఎదురుదెబ్బే. బీఎస్పీ ఈసారి ఒంటరి పోరుకు సిద్ధమైంది. ఇవన్నీ బీజేపీకి మరింత కలిసొచ్చే అవకాశముందని విశ్లేషకుల అంచనా. ముస్లింల రూటెటు? యూపీ జనాభాలో 19% ఉన్న ముస్లింల ఓట్లపై విపక్షాలు ప్రధానంగా గురి పెడుతున్నాయి. 24 లోక్సభ సీట్లలో వీరు 20 నుంచి ఏకంగా 50 శాతం దాకా ఉన్నారు. దాంతో ఆ స్థానాల్లో వారు కీలకం కానున్నారు. ఈసారి ఎస్పీ, కాంగ్రెస్ జట్టు కట్టేందుకు ముస్లిం ఫ్యాక్టర్ కూడా ప్రధాన కారణమే. 2014, 2019ల్లో అవి విడిగా పోటీ చేయడంతో ముస్లిం ప్రాబల్య స్థానాల్లో బీజేపీ బాగా లాభపడింది. 2019లో ఎస్పీ, బీఎస్పీ నెగ్గిన స్థానాల్లో ముస్లింల ప్రాబల్యమున్నవే ఎక్కువ! రాహుల్ భారత్ జోడో యాత్ర, అఖిలేశ్ పీడీఏ (వెనుకబడిన, దళిత, మైనారిటీ) యాత్రలు యూపీలో ముస్లిం ప్రాబల్య జిల్లాల్లోనే సాగాయి. సర్వేలు ఏమంటున్నాయి...? యూపీలో ఎన్డీఏ కూటమికి ఏకంగా 70 నుంచి 72 సీట్లు రావచ్చని పలు ఒపీనియన్ పోల్స్ అంచనా వేస్తున్నాయి. ఇండియా కూటమి ఆరేడు స్థానాలకు మించకపోవచ్చని చెబుతున్నాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
Lok sabha elections 2024:ఎన్డీఏ హ్యాట్రిక్ ఖాయం
న్యూఢిల్లీ: లోక్సభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఘనవిజయం సాధించి హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని టైమ్స్ నౌ–ఈటీజీ సర్వే పేర్కొంది. ఎన్డీఏకు 383 స్థానాలొస్తాయని, విపక్ష ఇండియా కూటమి 118 సీట్లకే పరిమితం అవుతుందని అంచనా వేసింది. అధికార బీజేపీ ఏకంగా 344 సీట్లు సాధిస్తుందని, కాంగ్రెస్ తన చరిత్రలోనే అత్యల్పంగా కేవలం 37 లోక్సభ స్థానాలతో కుదేలవనుందని పేర్కొంది. ఎన్డీఏ కూటమి ఏకంగా 49 శాతం ఓట్లు ఒడిసిపడుతుందని, ఇండియా కూటమికి 34 శాతం వస్తాయని తేల్చింది. ఆంధ్రప్రదేశ్లో 25 స్థానాలకు గాను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏకంగా 22 సీట్లు సాధించి లోక్సభలో మూడో అతి పెద్ద పార్టీగా అవతరిస్తుందని వెల్లడించింది. తమిళనాట డీఎంకేకు కూడా 22 స్థానాలొస్తాయని, పశి్చమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్కు 19, ఒడిశాలో బిజూ జనతాదళ్కు 11 సీట్లొస్తాయని తెలిపింది. కేజ్రీవాల్ అరెస్టుతో సంక్షోభంలో పడ్డట్టు కని్పస్తున్న ఆప్ 6 స్థానాలతో మెరుగైన ప్రదర్శన చేస్తుందని సర్వే పేర్కొనడం విశేషం. ఇక అందరి దృష్టినీ ఆకర్షిస్తున్న తెలంగాణలో 17 స్థానాలకు గాను కాంగ్రెస్కు 9 దక్కుతాయని, బీజేపీ 5, మజ్లిస్ ఒక స్థానం గెలుచుకుంటాయని వివరించింది. అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్య ఓటమికి తోడు నేతల వలస తదితరాలతో కుంగిపోయిన బీఆర్ఎస్ 2 స్థానాలకు పరిమితబమవుతుందని తెలిపింది. 2019 లోక్సభ ఎన్నికల్లో ఎన్డీఏకు 353 స్థానాలు రావడం తెలిసిందే. అందులో ఒక్క బీజేపీయే ఏకంగా 303 స్థానాలు సాధించింది. కాంగ్రెస్ కేవలం 52 సీట్లతో ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయింది. యూపీఏకు 91, ఇతరులకు 98 సీట్లొచ్చాయి. -
దారి తప్పిన మేధావి.. ఎందుకీ మార్పు?
జయప్రకాష్ నారాయణ.. తెలుగు రాష్ట్రాలకు పరిచయం అక్కర్లేని పేరు. మాజీ ఐఏఎస్ అధికారిగా, లోక్సత్తా అనే పార్టీ పెట్టి ఒక్క సీటు కూడా గెలవకపోయినా.. మేధావిగా గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే తాజాగా ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు రాజకీయంగానే కాదు.. ఏపీ జనాల్లోనూ తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ‘‘ఏపీలో ఎన్డీఏ కూటమికి లోక్సత్తా మద్ధతు. అభివృద్ధి, సంక్షేమం కోసం పాటుపడేవారికి ఓటేయండి. నాపై కూడా కులం ముద్ర వేసి తిట్టేవాళ్లు ఉంటారు అయినా రాష్ట్ర భవిష్యత్ కోసమే ఈ నిర్ణయం’’ : జయప్రకాష్ నారాయణ .. అభిప్రాయాలు చెప్పడంలో తప్పులేదు కావొచ్చు. కానీ.. దానికి ఎంచుకున్న సమయం, సందర్భం కూడా చూడాలి కదా. ఇప్పుడు జేపీకి అలియాస్ నాగభైరవ జయప్రకాష్ చౌదరికి కొన్ని ప్రశ్నలు అడుగుదాం. సీఎం జగన్ వచ్చిన తర్వాత పాఠశాలలు బాగుపడ్డాయి, పిల్లల చదువులు బాగున్నాయి, ఆస్పత్రులు బాగున్నాయి, వైద్యం బాగా అందుతోంది, అభివృద్ది పెరిగింది అంటూ ఇన్నాళ్లు మీరు యూట్యూబ్లో చేసిన వీడియోలకు మీ మాటలకు పొంతన ఎందుకు కుదరడం లేదు? ►పేదలు బాగుపడటం జేపీ గారికి నచ్చటం లేదా? ►పేదపిల్లలు ఉచితంగా ఇంగ్లీష్ మీడియం చదువుకోవటం జేపీ గారికి నచ్చటం లేదా? ►ప్రజలందరికి కార్పొరేట్ వైద్యం అందించాలనే ఉద్దేశ్యంతో ఇబ్బడిముబ్బడిగా మెడికల్ కాలేజీలు పెట్టటం .. సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు కట్టటం జెపిగారికి నచ్చటం లేదా? ►పేద ప్రజలకి తలదాచుకునేదుందుకు 30 లక్షల మందికి ఇంటి స్థలాలిచ్చి ఇల్లు కట్టించటం జేపీ గారికి నచ్చటం లేదా? ►గడచిన 75 ఏళ్లలో ఏ ముఖ్యమంత్రి ఆలోచన చేయని విధంగా 950 కిలోమిటర్లు తీరప్రాంతాన్ని అభివృద్ధి చేయటం .. అందులో భాగంగా ప్రతీ 50 కిలోమీటర్లకు ఒక పోర్ట్ కానీ లేదా ఫిషింగ్ హార్బర్ కానీ పెట్టటం జేపీ గారికి నచ్చటం లేదా? ►దక్షిణ భారతదేశం మొత్తానికి మనమే విధ్యుత్ సరఫరా చేసే స్థాయికి చేరాలనే లక్ష్యంతో అనేకరకమైన విద్యుతు ప్లాంటులు నిర్మించటం జేపీ గారికి నచ్చటం లేదా? ►ఎక్కడా లంచాలకి తావులేకుండా ప్రభుత్వ పథకాలన్నీ నేరుగా లబ్ధిదారులకే ఇవ్వటం జేపీ గారికి నచ్చటం లేదా? ►ఇటుపక్క కాకినాడ సెజ్ అటుపక్క శ్రీసిటీలలో అనేక కొత్త కంపెనీలు రావటం జేపీ గారికి నచ్చటం లేదా? ►ఉద్దానం సమస్యని పరిష్కారించటం నచ్చలేదు .. భోగాపురం ఎయిర్పోర్ట్ కట్టటం జేపీ గారికి నచ్చటం లేదా? ►రాష్ట్ర తలసరి ఆదాయం పెరగటం జేపీ గారికి నచ్చటం లేదా? ►16 లక్షల మంది కొత్తగా టాక్స్ పేయర్లు పెరగటం కూడా జేపీ గారికి నచ్చటం లేదా? ►విద్యా వైద్యంలో మన రాష్ట్రం దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో ఉండటం జేపీ గారికి నచ్చటం లేదా? ►కేంద్ర మరియు ఇతర రాష్ట్రాలతో పోల్చినా లేదా అంతకుముందు చంద్రబాబు ప్రభుత్వంతో పోల్చినా ప్రతీ రంగంలో మన రాష్ట్రం మెరుగైన ఫలితాలు సాధించటం జేపీ గారికి నచ్చటం లేదా? ఇలా ఒకటేమిటి అనేకం .. అసలు రాష్ట్రం బాగుపడటం జేపీ గారికి నచ్చటం లేదా?.. అంతే కాదండోయ్ .. లక్షల కోట్లు దోచుకున్న చంద్రబాబు రామోజీ ముఠా మీద కేసులు పెట్టటం జేపీ గారికి అసలే నచ్చటం లేదా? విద్యారంగం వైద్యరంగం విద్యుత్ రంగం లాంటి వన్నీ ఒక్క కులం చేతిలోనే ఉండాలా? .. ముఠాలుగా ఏర్పడి ప్రజలని దోచుకోవాలా? పేద ప్రజలు మీ ఇళ్ల పక్కన ఉండటానికి వీల్లేదా? దోమలమీద యుద్ధం .. పుష్కరాలకు లైట్లు రంగుల పేరుతో రాష్టాన్ని దోచుకోవాలి ... దోచుకున్న డబ్బులతో ఓట్లు కొనాలి .. కేసుల్లేకుండా వ్యవస్థల్ని మానేజ్ చేయాలి .. అప్పుడే మీకు నచ్చుతుందా? అలా చేసే వాళ్ళకే మీరు మద్ధతిస్తారా?.. -
Punjab: ఎన్డీయే కూటమిలోకి శిరోమణి అకాలీదళ్!
చంఢీగఢ్: సార్వత్రిక ఎన్నికలు బీజేపీ 400 సీట్లలో గెలిచి నరేంద్ర మోదీ మూడోసారి ప్రధాని కావాలని దూసుకుపోతోంది. ఇప్పటికే రెండు జాబితాల్లో 267 మంది అభ్యర్థులను లోక్సభ ఎన్నికలకు ప్రకటించి.. ప్రచారంలో సైతం స్పీడ్ పెంచింది. మరోవైపు బీజేపీ.. ఎన్డీయే కూటమి విస్తరణపై కూడా ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. పంజాబ్లోని శిరోమణి అకాలీదళ్(ఎస్ఏడీ) బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమిలో చేరడానికి చర్చలు జరగుతున్నాయని బీజేపీ పార్టీ సీనియర్ నేత ఎస్ఎస్ చన్నీ తెలిపారు. ‘ఇరుపార్టీల మధ్య చర్చలు కొనసాగుతున్నాయి. మరికొంత సమయం పడుతుంది. శిరోమణి అకాలీదళ్ మార్చి 22న కోర్ కమిటీ సమావేశం నిర్వహించనుంది. అనంతరం వాళ్లు నిర్ణయం తీసుకోనున్నారు. ఇరు పార్టీల మర్యాదపూర్వక సమావేశం జరగనుంది. ఇరుపార్టీల పొత్తుకు సంబంధించి బీజేపీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది’ అని ఎస్ఎస్ చన్నీ వెల్లడించారు. శిరోమణి అకాలీదళ్ కోర్ కమిటీ సమావేశం ఛండీగఢ్లో జరుగనుంది. ఎస్ఏడీ పార్టీ జనరల్ సెక్రటరీ దల్జీత్ సింగ్ చీమా తమ కోర్ కమిటీ సమావేశంలో ఎన్నికల వ్యహరించాల్సిన వ్యూహాలు, పొత్తులపై కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపారు. కోర్ కమిటీలో మీటింగ్లో దేశం, రాష్ట్రంలోని అన్ని విషయాలపై చర్చిస్తామని తెలిపారు. అదేవిధంగా తమతో భావ సారూప్యత ఉన్న పార్టీతో పొత్తు పెట్టుకునే అవకాశం ఉన్నట్లు చెప్పకనే చెప్పారు. అయితే బీజీపీతో మళ్లీ పొత్తు విషయంలో శిరోమణి అకాలీదళ్ ముందు నుంచి వెనకడుగు వేస్తోంది. అయితే రైతుల పంటలకు మద్దతు ధర, సిక్కు ఖైదీల విడుదల విషయంలో ఎస్ఏడీ బీజేపీని వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. పొత్తు వ్యవహారంపై పంజాబ్ కాంగ్రెస్ నేత ప్రతాప్ సింగ్ బజ్వా స్పందిస్తూ.. శిరోమణి అకాలీదళ్ ఆసక్తికే వదిలేస్తున్నామని తెలిపారు. ఎందుకంటే వారిది రైతు సమస్యలపై పోరాడే, మత సిద్ధాంతాలతో కూడుకున్న పార్టీ అని అన్నారు. ఇక.. ఎస్ఏడీ బీజేపీతో పొత్తుపెట్టుకుంటే బీజేపీ బలపడుతుంది. కానీ.. రైతుల సమస్యలపై పోరాటం చేసే ఎస్ఏడీకి ఈ పొత్తు నష్టం కలిగిస్తుందన్నారు. ఇక.. 2020లో కేంద్ర తీసుకువచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ.. శిరోమణి అకాలీదళ్ ఎన్డీయే కూటమి నుంచి వైదోలగింది. అయినప్పటికీ ఎన్డీయే ప్రభుత్వం తీసుకువచ్చే పలు చట్టాలకు ఎస్ఏడీ మద్దతు ఇస్తూ వస్తోంది. మరోవైపు బీజేపీ ప్రభుత్వం తీసుకు వచ్చిన ‘ఒకే దేశం-ఒకే ఎన్నిక’, పౌరసత్వ సవరణ చట్టాన్ని మాత్రం ఎస్ఏడీ బహిరంగానే వ్యతిరేకించింది. చదవండి: CAAపై స్టేకు సుప్రీం నిరాకరణ.. పిటిషన్లపై కేంద్రానికి నోటీసులు -
స్నేహం కాదు, దాసోహం!
ఇప్పుడున్న పరిస్థితులలో చంద్రబాబు స్నేహ హస్తాన్ని అందుకోవలసిన అవసరం బీజేపీకి ఉన్నదా? కామన్సెన్స్ ఉన్న వాళ్లె వరైనా లేదనే చెబుతారు. మూడోసారి కూడా ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాబోతున్నదని సర్వేలన్నీ చెబుతున్నాయి. ఎన్డీఏకు సవాల్ విసరడం కోసం కాంగ్రెస్ పార్టీ కుట్టించుకున్న ‘ఇండియా’ బొంత ప్రతిపక్షాలకు స్ఫూర్తినివ్వలేక పోయింది. ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ సమరశీలతను కోల్పోవడం బీజేపీకి అయాచిత వరంగా మారింది. ఈ పరిస్థితు లలో తనకు ఏమాత్రం బలం లేని ఆంధ్రప్రదేశ్ నుంచి ఒకటి రెండు సీట్లు గెలిచి తీరవలసిన అవసరం బీజేపీకి లేదు. ఈ ఎన్నికల్లో గెలవాల్సిన తక్షణ లక్ష్యంతోపాటు బీజేపీకి ఒక దీర్ఘకాలిక వ్యూహం కూడా ఉన్నది. దేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ కాషాయ ధ్వజాన్ని రెపరెపలాడించడం కోసం అది వ్యూహాన్ని రూపొందించుకున్నది. ఇది బహిరంగ రహస్యం. తెలుగు రాష్ట్రాలకు సంబంధించినంత వరకు బీజేపీ తొలి టార్గెట్ తెలంగాణ. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో గురి తప్పినా 14 శాతం ఓట్లను సమీకరించుకోగలిగింది. గెలిచే అవకాశాలున్నాయన్న వాతావరణాన్ని ఎన్నికల ముందు సృష్టించగలిగి ఉంటే అసెంబ్లీ ఎన్నికల్లో తమ ఓట్ల శాతం రెట్టింపు అయి వుండేదన్న అంచనా ఆ పార్టీకి ఉన్నది. ఈ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలను సాధిస్తామన్న అంచనాతో ఆ పార్టీ శ్రేణులున్నాయి. రాజకీయ పరిశీలకుల అభి ప్రాయాలు కూడా ఈ అంచనాకు అనుగుణంగానే ఉన్నాయి. తెలంగాణ ఏక్నాథ్ షిండే ఎవరో త్వరలోనే తేలిపోతుందని ఇటీవల లక్ష్మణ్ వంటి సీనియర్ బీజేపీ నేతలు కూడా వ్యాఖ్యా నిస్తున్నారు. శివసేనలోని మెజారిటీ ఎమ్మెల్యేలను తనవైపు తిప్పుకొని బీజేపీ సహకారంతో గద్దెనెక్కిన మహారాష్ట్ర ముఖ్య మంత్రి ఏక్నాథ్ షిండే ఎపిసోడ్ను ఈ నాయకుల మాటలు గుర్తు చేస్తున్నాయి. మహారాష్ట్ర ప్రయోగాన్ని తెలంగాణలోనూ రిపీట్ చేయగలిగితే బీజేపీ తన లక్ష్యాన్ని దాదాపుగా చేరు కున్నట్టే! తెలంగాణ షిండేకు పార్టీ తీర్థప్రసాదాలను ఇవ్వడం ఆ తర్వాత ఒక లాంఛనం మాత్రమే! లోక్సభ ఎన్నికల్లో కనీసం 8 సీట్లు బీజేపీ ఖాతాలో పడితే షిండే ప్రయోగం ప్రారంభం కావచ్చన్న అభిప్రాయం బలపడు తున్నది. ఈ ప్రయోగం విజయవంతం కావాలంటే బీజేపీకి తన సహకారం అవసరమనే ఒక ప్రతిపాదన చంద్రబాబు ద్వారా ఆ పార్టీ పెద్దలకు చేరింది. ఆ తర్వాతనే ఆంధ్రప్రదేశ్లో పొత్తుల కథ ముందుకు కదిలింది. ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ బలహీన పడి, బీజేపీ బలం పుంజుకుంటే ముందుగా ముప్పు ముంచు కొచ్చేది కాంగ్రెస్కే! తెలంగాణ భవన్లో స్విచాఫ్ చేస్తే గాంధీ భవన్లో చీకటి కమ్ముతుందన్నమాట!! తెలంగాణలో ఏక్నాథ్ ఎఫెక్ట్కూ, ఆంధ్రప్రదేశ్లో పొత్తు లకూ ఏమిటి లంకె? చంద్రబాబుకు బీజేపీ చేయగలిగిన ప్రత్యుపకారమేమిటి? బీజేపీ జతగూడితే చంద్రబాబు ఏపీలో గెలుస్తాడా? ఇటువంటి ప్రశ్నలు సహజంగా తలెత్తుతాయి. కేంద్రంలో ఎన్డీఏ కూటమి తిరిగి అధికారంలోకి రావడానికి తొంభై శాతం అవకాశాలున్నాయనుకుంటే ఏపీలో జగన్ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రావడానికి నూరు శాతం అవకా శాలున్నాయి. దేశవ్యాప్తంగా బీజేపీకి 40 శాతం ఓటర్ల మద్దతు కనిపిస్తుంటే, ఏపీలో వైసీపీకి 50 శాతానికి పైగా ఓటర్ల మద్దతు కనిపిస్తున్నది. డజన్కు పైగా జాతీయస్థాయి సర్వేలు దాదాపుగా ఇదే అభిప్రాయాన్ని వెల్లడించాయి. బీజేపీకి ఈ విషయంపై స్పష్టమైన అవగాహన ఉన్నది. కానీ చంద్రబాబుకు బీజేపీతో పొత్తు ప్రాణావసరం. ఆయనకది జీవన్మరణ సమస్య. ఎన్డీఏ కూటమి తరఫున 400 సీట్లు, 50 శాతం ఓట్లు సంపా దించి రికార్డు సృష్టించాలని బీజేపీ పెద్దలు కలలు కంటున్నారు. గడచిన ఎన్నికల్లో ఎన్డీఏకి 45 శాతం ఓట్లు లభించాయి. 1984లో ఇందిరాగాంధీ హత్యానంతరం ఏర్పడిన సానుభూతి ప్రభంజనంలో కాంగ్రెస్ పార్టీ 414 సీట్లు గెలిచింది. 49 శాతం ఓట్లకే పరిమితమైంది. ఎన్డీఏ కూటమి ఆ రికార్డుపై కన్నేసింది. అందు కోసం కలసిరాగల ప్రతి రాజకీయ పక్షాన్నీ తన దొడ్లో కట్టేసుకుంటున్న పరిణామాలు చూస్తూనే ఉన్నాము. చంద్రబాబు విజ్ఞప్తిని మన్నించడానికి అది ఒక కారణం కావచ్చు. ఆంధ్రప్రదేశ్కు సంబంధించినంత వరకు మరో ప్రత్యా మ్నాయం కూడా బీజేపీకి లేదు. రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రంతో సఖ్యంగా ఉండే వైఖరిని జగన్మోహన్రెడ్డి అవలంబిస్తున్నప్పటికీ, సైద్ధాంతికంగా బీజేపీ భావజాలానికి, రాజకీయ కూటమికి దూరంగానే ఉంటున్నారు. రాజకీయ – సైద్ధాంతిక విభేదాలున్నప్పటికీ కేంద్రంతో సఖ్యంగా ఉండే వైఖరిని ఎంజీ రామచంద్రన్ నుంచి నవీన్ పట్నాయక్ వరకు పలువురు ముఖ్య మంత్రులు అవలంబించి వారి రాష్ట్రాల ప్రయోజ నాలను కాపాడుకొచ్చారు. ఏపీ సీఎం జగన్దీ అదే వైఖరి. టీడీపీ వినతిని బీజేపీ నాయకత్వం అంగీకరించడానికి ఇది కూడా ఒక కారణం కావచ్చు. ఆంధ్రప్రదేశ్లో బీజేపీ దీర్ఘకాలిక వ్యూహం ఫలించాలంటే వైసీపీ, టీడీపీల్లో ఏదో ఒక పార్టీ క్షీణించాలి. ఆ ఖాళీని మాత్రమే బీజేపీ ఆక్రమించగలదు. సాపేక్షంగా వైసీపీ యువ పార్టీ. పన్నెండేళ్ల వయసు. ఎదిగే దశ. యాభైశాతం ఓటుతో బలంగా ఉన్నది. పైగా అధికారంలో ఉన్నది. టీడీపీ అధినేతతో పోల్చితే వైసీపీ అధినేత వయసు పాతికేళ్లు తక్కువ. పాలనా సంస్కరణలు అమలు చేస్తూ, సామాజిక విప్లవాలను ఆవిష్కరిస్తూ, సరికొత్త శక్తులను పార్టీ నిర్మాణంలోకి సమీకరించుకున్నది. ఇప్పుడు మండే నెత్తురుతో ఆ పార్టీ ఇంజన్ నడుస్తున్నది. ఇందుకు భిన్నంగా టీడీపీ పరిస్థితి కనిపిస్తున్నది. చంద్రబాబుకు వృద్ధాప్యం మీదపడింది. ఉపన్యాసాల్లో ఒక మాటకు బదులు మరో మాట చెబుతున్నారు. పార్టీలోకి కొత్త తరం రావడం లేదు. వచ్చినా ఒక సామాజిక వర్గం నుంచే వస్తున్నారు. పార్టీ నాయకత్వం బాగా బలహీనపడింది. అధినేత సొంత కొడుకుతో పాటు, బావమరిది కూడా అప్రయోజకులుగా ముద్ర పడ్డారు. ఆ కారణంగానే బాబు జైల్లో పడ్డప్పుడు అసలు వారసు లకంటే పవన్ కల్యాణ్ ఎక్కువ వీరంగం వేశారు. పార్టీ క్షీణ దశతో పాటు చంద్రబాబుపై వస్తున్న అవినీతి ఆరోపణలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. చంద్రబాబు పార్టీని గుప్పెట్లోకి తీసుకొని నెమ్మదిగా దాని స్థానాన్ని ఆక్రమించే ప్రయత్నాలు బీజేపీ చేయవచ్చు. గతంలో పలుమార్లు అవకాశ వాద పొత్తులతో బీజేపీని దగ్గరకు తీసుకొని, దాన్ని ఎదగనీయ కుండా బాబు నిర్వీర్యం చేశాడు. ఇప్పుడు దానికి బీజేపీ ప్రతీ కారం తీర్చుకోవచ్చు. ఈసారి చంద్రబాబుకు బీజేపీతో పొత్తు ధృతరాష్ట్ర కౌగిలి కాబోతున్నది. ఏదో అద్భుతం జరగకపోతుందా? ఈ ఒక్కసారికి సూర్యుడు పడమటి కొండపై ఉదయించకపోతాడా? అనే ఆశ చంద్రబాబు, రామోజీ అండ్ గ్యాంగ్లో మిణుకుమిణుకుమంటున్నది. వారు తప్ప వివేకవంతులెవరూ ఈసారి జగన్మోహన్ రెడ్డి ఓడిపోతాడని భావించడం లేదు. సర్వేలు మాత్రమే కాదు. క్షేత్ర వాస్తవికత కూడా అందుకు భిన్నంగా లేదు. ప్రజాస్వామ్య వ్యవస్థలోని పెత్తందారీ పోకడల కీళ్లు విరిచిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి. ఫలితంగా బలహీన వర్గాల ప్రజలు పెద్ద ఎత్తున రాజకీయ స్రవంతిలోకి ప్రవేశిస్తున్నారు.ఒకటి కాదు,రెండు కాదు వరసగా మూడుసార్లు జగన్ సభలకు లక్షోప లక్షలుగా జనం హాజరయ్యారు. నేడు నాలుగో సభ పోటెత్తు తున్నది. రాజకీయ సభలకు ఈ స్థాయిలో జనం హోరెత్తడం వర్త మాన భారతంలో ఇంకెక్కడా మనకు కనిపించదు. వచ్చే ఎన్ని కల్లో జగన్ ప్రభంజనానికి ఇంతకంటే రుజువేమి కావాలి? మరోసారి అధికారం దూరం కాబోతున్నదన్న ఏడుపే కాదు, చేసిన పాపాలు శాపాలై కేసుల రూపంలో వెంటాడ బోతున్నాయన్న భయం బాబు, రామోజీలను నిద్రపోనీయడం లేదు. స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం కేసులో అరెస్టయిన బాబు ఇప్పుడు బెయిల్పై బయటకొచ్చారు. ‘ముసలివాణ్ణి, ఆరోగ్యం బాగాలేదు, దయచూడండ’ని కోర్టువారిని బతిమాలు కొని బయటకొచ్చి తిరుగుతున్నారు. అమరావతి ప్రాంతాల ఎస్సీ, ఎస్టీ, బలహీన వర్గాలకు చెందిన 1500 ఎకరాల అసైన్డ్ భూమిని కొల్లగొట్టిన కేసు తలపై వేలాడుతున్నది. ఇన్నర్ రింగ్ రోడ్డును స్వప్రయోజనాల కోసం అష్టవంకర్లు తిప్పిన కేసు. నిబంధనలను అటకెక్కించి ఫైబర్నెట్ను బినామీకి అంటగట్టిన కేసు. చేలాగాళ్ల డిస్టిలరీలకు అడ్డగోలు అనుమతులిచ్చిన కేసు. ఇసుక కుంభకోణంలో పదివేల కోట్లు దోచేసిన కేసు... ఇలా వరుసగా అనేకం చంద్రబాబును వెన్నాడుతున్నాయి. ప్రతి కేసులోనూ చంద్రబాబు మీద పలు సెక్షన్లు నమోద య్యాయి. వాటిలో సీఆర్పీసీ 409 సెక్షన్ కింద నేరం రుజువైతే ప్రతి కేసులోనూ యావజ్జీవ కారాగార శిక్ష పడుతుంది. అవినీతి నిరోధక చట్టం 13 (2) రెడ్ విత్ 13 (1) సీ, డీ సెక్షన్ల కింద నేరం రుజువైతే ఒక్కో కేసులో పదేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉన్నది. 17ఏ సెక్షన్ సాయంతో తప్పించుకోవాలనే చంద్ర బాబు ఎత్తు పారలేదు. ఆ సెక్షన్ చంద్రబాబుకు వర్తించదని సర్వోన్నత న్యాయస్థానం ఇప్పటికే స్పష్టం చేసింది. చంద్రబాబు మీద నమోదు చేసిన అభియోగాలకు స్పష్టమైన ఆధారాలు న్నాయని విజయవాడ ఏసీబీ న్యాయస్థానం అభిప్రాయపడి రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే. ఆధారాలున్నందువలన కేసు కొట్టి వేయడం సాధ్యం కాదని సుప్రీంకోర్టు కూడా పేర్కొ న్నది. బాబుకు యావజ్జీవ కారాగార శిక్ష తప్పదు. హరిహర బ్రహ్మాదులొచ్చినా ఆపలేరు. కానీ బీజేపీ వాళ్లు ఆపగలరని చంద్రబాబు దింపుడుకళ్లం ఆశ. అందుకే వారి ముందు సాగిలపడ్డారు. ఇప్పుడు నడుస్తున్న కేసులే దడ పుట్టిస్తుంటే ముగిసిపోయిందనుకున్న ఐఎమ్జీ కేసు ముందు కొచ్చింది. సీబీఐ దర్యాప్తుకు మీరు ఆదేశిస్తారా? మమ్మల్ని ఆదే శించమంటారా అని ప్రభుత్వ న్యాయవాదిని న్యాయస్థానం ప్రశ్నించడం బాబు క్యాంపులో గుబులు రేకెత్తిస్తున్నది. ఒకవేళ దర్యాప్తుకు ఆదేశిస్తే అచ్చం అలాంటిదే సింగపూర్ ప్రైవేట్ కంపె నీలతో సీఆర్డీఏ కుదుర్చుకున్న స్టార్టప్ ఏరియా కుంభకోణం తెరమీదికొస్తుంది. దాని మీద విచారణ తప్పదు. గత మూడు రోజులుగా యెల్లో మీడియాలో కామెడీ షో నడుస్తున్నది. చివరి రోజు స్వయంగా చంద్రబాబే టెలీకాన్ఫరెన్స్ ద్వారా ఆ షోను కొనసాగించారు. ‘బాబ్బాబూ! మాక్కొంచెం ఎక్కువ సీట్లు దానం చెయ్యవా ప్లీజ్...!’ అని అమిత్ షా, నడ్డాలు బతిమాలుకున్నారట. ‘ఛస్తే కుదరదు, ఇచ్చింది తీసు కోండి, ఎక్కువ సీట్లిస్తే మీరు గెలవర’ని బాబు గట్టిగా చెప్పా రట! అంతేగాకుండా అనేక జాతీయ, అంతర్జాతీయ పరిణామా లను వారికి వివరించారట. ఆర్థికశాస్త్రాన్ని వారికి బోధించారట. చివరికి రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఈ పొత్తును కుదుర్చుకుంటున్నట్టుగా వివరించి షా, నడ్డాల కళ్లు తెరిపించారట! బాబు విషయ పరిజ్ఞానానికి వారు అబ్బురపడిపోయారట. చివరికి బీజేపీ, జనసేనలకు కలిసి 8+30 సీట్లను బాబు అనుగ్రహించ డంతో వారు సంతృప్తి చెందారట! అమావాస్య తర్వాత సీట్ల పంపకాలను అధికారికంగా ప్రకటిస్తారట! ఆ తర్వాత మన యెల్లో మీడియా బాబు విజయో త్సవాలు పేరుతో వారోత్సవాలు నిర్వహిస్తుంది. జయజయ మహావీర మహాధీర ధౌరేయ....... వంటి గద్యాలను రోజుకొకటి చొప్పున వినవలసి రావచ్చు. వాస్తవానికి ఆంధ్రప్రదేశ్లో పోటీ చేసే సీట్ల సంఖ్యపై బీజేపీ వారికి పెద్దగా ఆసక్తి లేదు. ఒక్క సీటు కూడా తాము గెలవబోవడం లేదనే విషయం వారికి స్పష్టంగా తెలుసు. వారి దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం ఒకటి రెండు సీట్లు కాదు. మొత్తం పార్టీయే వాతాపి జీర్ణం. రాజకీయ చరమాంకంలో కూడా చంద్రబాబు అండ్ కో ప్రదర్శిస్తున్న అతిశయాన్ని చూస్తే మాత్రం దిగ్భ్రాంతి కలుగుతున్నది. తాను కేసుల నుంచి బయటపడేందుకు కాళ్ల మీద పడి పొత్తు కుదుర్చుకున్నారని లోక మంతా తెలుసు. కానీ దానికి ‘రాష్ట్ర ప్రయోజనాల కోసం’ అనే ముసుగు వేయడం, దాన్ని యెల్లో మీడియా విస్తృతంగా ప్రచా రంలో పెట్టడం మాత్రం ఏవగింపు కలిగిస్తున్నది. చంద్ర బాబుకు, రామోజీకి పడిసెం పడితే తెలుగు ప్రజలంతా తుమ్మా లన్నట్టుంది ఈ వ్యవహారం! వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
Times Now and ETG Survey: బీజేపీకి 333 పైమాటే
న్యూఢిల్లీ: ఇప్పటికిప్పుడు లోక్సభ ఎన్నికలు జరిగితే బీజేపీ ఘనవిజయం ఖాయమని టైమ్స్ నౌ చానల్–ఈటీజీ సర్వే శుక్రవారం పేర్కొంది. మొత్తం 543 లోక్సభ స్థానాలకు గాను ఆ పార్టీ ఒంటరిగా ఏకంగా 333 నుంచి 363 లోక్సభ స్థానాలు కైవసం చేసుకుంటుందని అంచనా వేసింది. బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ కూటమి 378 స్థానాలదాకా సాధించవచ్చని వివరించింది. విపక్ష ఇండియా కూటమికి కేవలం 120, ఇతరులకు 45 స్థానాలు రావచ్చని పేర్కొంది. ఇండియా కూటమిలోని ప్రధాన పక్షమైన కాంగ్రెస్కు 28 నుంచి గరిష్టంగా 48 సీట్లొస్తాయని వివరించింది. తమిళనాట డీఎంకేకు 24 నుంచి 28 సీట్లు, ఒడిశాలో బిజూ జనతాదళ్కు 10 నుంచి 11 సీట్లు వస్తాయని వెల్లడించింది. 42 లోక్సభ స్థానాలున్న పశి్చమబెంగాల్లో మమతా బెనర్జీ సారథ్యంలోని అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఈసారి 17 నుంచి 21 స్థానాలతో సరిపెట్టుకుంటుందని పేర్కొంది. అక్కడ బీజేపీకి 20 నుంచి 24 సీట్లు రావచ్చని పేర్కొంది. ఏడు సీట్లున్న ఢిల్లీలో ఆప్ 5 నుంచి మొత్తం 7 స్థానాలూ కొల్లగొట్టవచ్చని సర్వే వెల్లడించడం విశేషం. యూపీలో బీజేపీ క్లీన్స్వీప్ అత్యంత కీలకమైన ఉత్తరప్రదేశ్లో బీజేపీ క్లీన్స్వీప్ ఖాయమని సర్వే పేర్కొంది. రాష్ట్రంలో 80 స్థానాలకు ఎన్డీఏ కూటమికి 72 నుంచి 78 వస్తాయని, కాంగ్రెస్, సమాజ్వాదీలతో కూడిన ‘ఇండియా’ కూటమి 2 నుంచి 6 సీట్లకు పరిమితమవుతుందని తెలిపింది. ఇక బీఎస్పీ కేవలం 1 స్థానంతో సరిపెట్టుకోవాల్సి రావచ్చని అభిప్రాయపడింది. గుజరాత్లోనైతే మొత్తం 26 సీట్లనూ బీజేపీ క్లీన్స్వీప్ చేస్తుందని పేర్కొంది. బిహార్లో 42 సీట్లకు గాను బీజేపీ, జేడీ(యూ)తో కూడిన ఎన్డీఏ కూటమికి 31 నుంచి ఏకంగా 36 స్థానాలు రావచ్చని సర్వే అభిప్రాయపడింది. కాంగ్రెస్, ఆర్జేడీ తదితరులతో కూడిన ఇండియా కూటమి 2 నుంచి 4 సీట్లకు పరిమితమవుతుందని పేర్కొంది. ఇక 48 సీట్లున్న మహారాష్ట్రలో బీజేపీ, శివసేన (షిండే), ఎన్సీపీ (అజిత్ పవార్)లతో కూడిన ఎన్డీఏ కూటమికి 34 నుంచి 38, కాంగ్రెస్, శివసేన (యూబీటీ), ఎన్సీపీ (శరద్ పవార్)లతో కూడిన ఇండియా కూటమికి 9 నుంచి 13 స్థానాలు రావచ్చని వివరించింది. కర్ణాటకలో ఎన్డీఏకు 22 నుంచి 24, కాంగ్రెస్కు కేవలం 4 నుంచి 6 సీట్లు రావచ్చని పేర్కొంది. -
Lok Sabha elections 2024: జూన్ నుంచి మూడో టర్ము
న్యూఢిల్లీ: లోక్సభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఘనవిజయం ఖాయమని ప్రధాని నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. జూన్ నుంచి తమ మూడో టర్ము పాలన మొదలవుతుందని ధీమా వెలిబుచ్చారు. ‘‘ఆ తర్వాత సాకారమయ్యే వికసిత భారత్ దేశ యువత కలలకు ప్రతిరూపంగా ఉంటుంది. దేశ రూపురేఖలు ఎలా ఉండాలో నిర్ణయించే పూర్తి హక్కులు వారికున్నాయి. వారి కలలే నా సంకల్పం.నా సంకల్పమే వికసిత భారతానికి హామీ. ఈ నయా భారత్లో చిన్న లక్ష్యాలకు చోటు లేదు. పెద్ద పెద్ద కలలు కంటూ వాటి సాకారానికి నిరి్వరామంగా కృషి చేస్తున్నాం. పదేళ్లుగా ఈ వేగం ప్రపంచాన్నే అబ్బురపరుస్తోంది’’ అన్నారు. అమృత్ భారత్ పథకంలో భాగంగా దేశవ్యాప్తంగా రూ.41 వేల కోట్లతో తలపెట్టిన 2,000 పై చిలుకు రైల్వే ప్రాజెక్టులకు సోమవారం ఆయన వర్చువల్గా శంకుస్థాపన చేశారు.వీటిలో 27 రాష్ట్రాల పరిధిలో 554 అమృత్ భారత్ రైల్వే స్టేషన్ల పునరభివృద్ధి, 1500 రోడ్ ఓవర్ బ్రిడ్జిలు, అండర్బ్రిడ్జి పనులున్నాయి. తెలంగాణలో రూ.230 కోట్లతో 15 అమృత్ భారత్ స్టేషన్లు, రూ.169 కోట్లతో 17 రైల్ ఫ్లై ఓవర్లు, అండర్ పాస్లకు మోదీ భూమి పూజ చేశారు. రూ.221 కోట్లతో పూర్తయిన 3 రైల్ ఫ్లై ఓవర్, 29 రైల్ అండర్ పాస్లను జాతికి అంకితం చేశారు.కాంగ్రెస్ పాలనలో రైల్వే శాఖ రాజకీయ క్రీడలకు వేదికగా కునారిల్లిందని ఈ సందర్భంగా ఆయన ఆరోపించారు. తమ పాలనలో పదేళ్లుగా ఆధునికతను అందిపుచ్చుకుని దూసుకుపోతోందన్నారు. ‘‘కొన్నేళ్లుగా భారత్ అన్ని రంగాల్లోనూ శరవేగంగా ప్రగతి సాధిస్తోంది. పన్నుల రూపేణా ప్రజలు చెల్లిస్తున్న ప్రతి రూపాయినీ వారి సంక్షేమానికే వెచి్చస్తున్నాం. గత కొద్ది రోజుల్లో దేశవ్యాప్తంగా పలు ఐఐటీలు, ఐఐఎంలు, ఎయిమ్స్లను ప్రారంభించా’’ అని చెప్పారు.టెక్స్టైల్ రంగ ప్రగతికి సాయంటెక్స్టైల్ రంగానికి కేంద్రం అన్నివిధాలా మద్దతుగా నిలుస్తుందని మోదీ చెప్పారు. ‘‘దేశాభివృద్ధిలో ఆ రంగానిది కీలక పాత్ర వికసిత భారత లక్ష్యసాధనలో టెక్స్టైల్ రంగం పాత్రను మరింతగా పెంచేందుకు కృషి చేస్తున్నాం’’ అన్నారు. భారత్ టెక్స్–2024ను మోదీ ప్రారంభించారు.‘‘వికసిత భారతానికి పేదలు, యువత, రైతులు, మహిళలు నాలుగు స్తంభాలు. వారందరికీ టెక్స్టైల్ రంగంలో గణనీయమైన పాత్ర ఉంటుంది’’ అని ఈ సందర్భంగా అన్నారు. 2014లో రూ.7 లక్షల కోట్లున్న భారత టెక్స్టైల్ రంగం విలువ ఇప్పుడు రూ.12 లక్షల కోట్లకు పెరిగిందని చెప్పారు. నాలుగు రోజుల భారత్ ఎక్స్పోలో 100కు పైగా దేశాల నుంచి 3,500కు పైగా ఎగ్జిబిటర్లు, 3,000 పై చిలుకు కొనుగోలుదారులు, 40 వేల మందికి పైగా వ్యాపారవేత్తలు తదితరులు పాల్గొంటున్నారు. -
PM Modi: టార్గెట్ 400.. అసలు సాధ్యమేనా??
డబ్బులు ఊరికే రావు.... తళతళా మెరిసే గుండుతో టీవిలో కనబడినప్పుడల్లా ఊదరగొడుతూ ఉంటాడు ఓ పెద్దాయన... వాస్తవమే కదా మరి.. దీన్నే రాజకీయ భాషలో చెప్పాల్సి వస్తే... అధికార పీఠం కూడా ఊరికే దక్కదు.. దశాబ్ద కాలంగా దేశాన్నిఏలుతున్న ఎన్డీయే కూటమికి మాత్రం ఈ సూత్రం వర్తించదనే చెప్పొచ్చు. మరో రెండు నెలల్లో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీయే కూటమికి అధికారం అవలీలగానే దక్కబోతోంది కాబట్టి! విపక్షాల బలహీనతే ఎన్డీయే కు ఇప్పుడు పెద్ద బలం. అదే అధికారాన్ని మరోమారు బంగారు పళ్లెంలో పెట్టి అప్పగించబోతోంది. 2014 కు ముందు పదేళ్లు నిరాటంకంగా పాలించిన యూపీఏ కూటమి స్వయంకృత చేష్టలు ఆ పార్టీని అప్పట్లో అధికారానికి దూరం చేశాయి. ఫలితంగా ఎన్డీయే కూటమి కేంద్రంలో కొలువు తీరింది.. ఆనాటి నుంచీ నానాటికీ బలపడుతూ.. విపక్ష పార్టీలకు అందనంత ఎత్తుకు ఎదిగి పోయింది. . రాబోయే ఎన్నికల్లో హ్యాట్రిక్ సాధించడం ద్వారా మరోమారు హస్తినలో పాగా వేసేందుకు సిద్ధమవుతోంది. ఎన్డీయే కూటమికి ఈసారి విజయం నల్లేరుపై నడకే కావొచ్చు కానీ... తన ప్రాబల్యాన్ని ఈమేరకు పెంచుకుంటుంది అన్నదే ప్రధాన ప్రశ్న. కేంద్ర హోం మంత్రి అమిత్ షా.. తాను పార్టీ అధ్యక్షునిగా ఉన్న కాలంలో, 400 పైచిలుకు సీట్లు 50 శాతం ఓటు బ్యాంకు లక్ష్యంగా ముందుకు సాగాలని పార్టీ శ్రేణులతో తరచూ అంటూ ఉండేవారు. ప్రస్తుత పరిణామాలు గమనిస్తే... ఈసారి ఎన్నికల్లో ఆ లక్ష్య సాధన కష్టమేమీ కాబోదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఆ మధ్య ఇండియా టీవీ సిఎన్ఎక్స్ చేపట్టిన ఒక సర్వే ప్రకారం 61 శాతం ప్రజానీకం మళ్ళీ మోదీ నే ప్రధానిగా చూడాలి అనుకుంటున్నామని చెప్పగా.. రాహుల్ గాంధీ వైపు మొగ్గు చూపింది మాత్రం కేవలం 21 శాతం మందే కావడం గమనార్హం. . బ్రిటన్ కు చెందిన ‘ది గార్డియన్‘ పత్రిక తాజాగా ఒక విశ్లేషణ వెలువరిస్తూ.. కేంద్రంలో ఉన్నబలహీన ప్రతిపక్షమే ప్రస్తుత అధికార పక్షాన్ని హ్యాట్రిక్ దిశగా నడిపించడం ఖాయమని అంచనా వేసింది. తదనుగుణంగానే ఇటీవలి రెండు సంఘటనలు ఈ అంచనాల్ని మరింత పెంచాయి.అందులో ఒకటి అయోధ్యలో రామ విగ్రహ ప్రతిష్ఠాపన కాగా... రెండోది మిత్రునిగా మారిన ’ప్రియమైన శత్రువు’ నితీష్ కుమార్ ఎన్డీయే తీర్థం పుచ్చుకోవడం. మోదీ హవా ప్రధాని మోదీ గుజరాత్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించే నాటికి ఆ రాష్ట్రం భూకంపం తాకిడికి అతలాకుతలమై ఆర్ధిక వ్యవస్థ చితికిపోయి ఉంది. దీని తాలూకు దుష్పరిణామాల నుంచి ఆ రాష్ట్రాన్ని కేవలం మూడేళ్ళలో బయట పడేయడమే కాదు.. గుజరాత్ ను ఒక రోల్ మోడల్ గా తీర్చిదిద్ది దేశ విదేశాల్లో ఆ రాష్ట్ర కీర్తి ఇనుమడిల్లేలా చేశారు. ఆ తర్వాత జాతీయ రాజకీయాల్లోకి వచ్చారు. పెచ్చుమీరిన ద్రవ్యోల్బణం, వేళ్లూనుకున్న అవినీతి, నిరుద్యోగ భూతం, మౌలిక వసతుల లేమి, ఉగ్రవాదం, జాతీయ భద్రతా సవాళ్లు, ఆర్ధిక తిరోగమనం, కరెంటు ఖాతా లోటు రికార్డు స్థాయికి పెరిగిపోవడం, రూపాయి విలువ పడిపోవడం.. ఇలా ఎన్నో సమస్యలు దిగ్బంధం చేసిన ఆ తరుణంలో 2014 ఎన్నికల్లో ఎన్డీయే కూటమికి 31 శాతం ఓట్లతో 335 సీట్లు చేజిక్కించుకోవడం ద్వారా తొలిసారి ప్రధాని పగ్గాలు చేపట్టి తన సత్తా ఏమిటో నిరూపించుకోవడం చరిత్ర చెబుతున్న సత్యమే. బలాలు ఎన్ని ఉన్నప్పటికీ హిందీ బెల్ట్ సహకరించినట్లుగా తూర్పు, దక్షిణ భారతాల్లో బీజేపీ ఇప్పటికీ తగిన పట్టు మాత్రం సంపాదించలేక పోతోంది. అక్కడ ప్రాంతీయ పార్టీలదే హవా. ఇప్పటికిప్పుడు ఈ రాష్ట్రాల నుంచి ప్రమాదకర సంకేతాలేవీ లేనప్పటికీ ఈ రాష్ట్రాలపై ఫోకస్ పెడితే ఇక ఇప్పట్లో మోదీ టీం కు తిరుగే ఉండదు. రాబోయే ఎన్నికల్లో విజయ భేరి మోగించడం ద్వారా ముచ్చటగా మూడోమారూ అధికార దండాన్ని అందిపుచ్చుకునేందుకు సిద్ధమవుతున్న ఎన్డీయే కూటమి ప్రగతికి దోహదం చేసిన పరిణామాలు, సంస్కరించాల్సిన అంశాలను పరిశీలిద్దాం. అయోధ్య రామాలయం: అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి 2019 లో బీజం పడింది. కోట్లాది హిందూ ఓటర్ల మనసులు గెలుచుకునేలా ఎప్పటికప్పుడు పావులు కదుపుతూ వచ్చిన బీజేపీ... తాజా ఎన్నికల వేళకు తనదైన శైలిలో అడుగులు వేయగలిగింది. ఆగమేఘాల మీద పనులు ప్రారంభించి మొన్న జనవరి లో బాల రాముని విగ్రహ ప్రతిష్ఠాపన తో తన లక్ష్యాన్ని చేరుకోవడంలో కృతకృత్యమైంది. ఓటు బ్యాంకును పెంచే వాటిలో ఇదొక తాజా పరిణామం. పెట్టుబడులు స్టాక్ మార్కెట్లు: ఆర్ధిక, సామాజిక, ఆరోగ్య రంగాలతో పాటు విదేశీ పొర్టుఫోలియో మదుపర్లపై విధిస్తున్న సర్ చార్జీని రద్దు చేయడం వంటి విదేశీ విధానాల్లోనూ అనుసరించిన విప్లవాత్మక విధానాలు మోదీ సర్కారు కీర్తి ప్రతిష్టలను దేశ విదేశాల్లో ఇనుమడింప జేశాయి. కేంద్రంలో స్థిరమైన సర్కారు ఏర్పడిందన్న భరోసా, మోదీ పై ఉన్న అచంచల విశ్వాసం.. విదేశీ మదుపరులకు స్థైర్యాన్నిచ్చాయి. దీంతో పెట్టుబడుల వరద మొదలైంది. మార్కెట్ సూచీలు దూసుకెళ్లాయి. స్టాక్ మార్కెట్లు పరుగులు తీశాయి. మధ్యలో కొవిడ్ పరిణామాలు వెనక్కి లాగినా.. అవన్నీ తాత్కాలికమేనని నిరూపిస్తూ ప్రస్తుతం స్టాక్ మార్కెట్ సూచీలు రికార్డు స్థాయిల్లో దూసుకెళ్తున్నాయి. మేక్ ఇన్ ఇండియా పేరిట దేశాన్ని గ్లోబల్ డిజైనింగ్ హబ్ గా తీర్చిదిద్దడం. శిశు మరణాలను తగ్గించేందుకు, లింగ వివక్షని రూపు మాపేందుకు భేటీ బచావో, భేటీ పడావో కార్యక్రమం. యువతలో నైపుణ్యాలను వెలికితీసే స్కిల్ ఇండియా, ఆర్ధిక సంస్కరణల్లో భాగంగా డిజిటల్ ఇండియాలపై దృష్టి. మురికివాడల సంస్కృతికి చర్మ గీతం పాడే రీతిలో అర్హులైన పేద ప్రజానీకానికి ఇల్లు దక్కేలా ప్రధాన మంత్రి ఆవాస్ యోజన. యువ భారతంలో వ్యాపార నైపుణ్యాలను వెలికి తీసేందుకు, వారిని భవిష్యత్ వ్యాపారవేత్తలుగా తీర్చి దిద్ధేందుకు దోహదం చేసేలా అంకుర సంస్థల ఏర్పాటుకు ప్రోత్సహించడం. తద్వారా నైపుణ్యాలకు కొదువ లేక నిధుల లేమితో సతమతమయ్యే ఎంతోమంది నిరుద్యోగ యువతకు మేలు చేకూర్చడం. నల్లధనంపై పోరాటం లో భాగంగా డీమోనిటైజేషన్ పేరిట పెద్ద నోట్ల ఉపసంహరణ ముస్లిం మహిళలకు షాదీ షాగున్ యోజనతో పాటు సౌభాగ్య, ప్రధాన మంత్రి ధన్ యోజన, ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన, ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ యోజన, ప్రధాన మంత్రి యువ యోజన, సంకల్ప్ సే సిద్ది, ఉడాన్, ఈశ్రమ పోర్టల్ ఆవిష్కరణ వంటి పథకాలు. ఆరోగ్య రంగంలో పేదలకు ఉపకరించేలా రూ. 10 లక్షల వరకు ఆరోగ్య బీమా విద్యా వ్యవస్థలో సమూల మార్పులకు శ్రీకారం చుడుతూ జాతీయ విద్యా విధానాన్ని 2026 నాటికి దేశమంతటా అందుబాటులోకి తెచ్చేలా చేయడం. గత దశాబ్ద కాలంలో వివిధ ఎక్సప్రెస్ వే ల నిర్మాణం, రవాణా సదుపాయాలకు దూరంగా ఉండే గ్రామాలకు సైతం రైల్వే సదుపాయాలను కల్పించడం, వందే భారత్ రైళ్లు, చిన్నపట్టణాలు, నగరాల్లో విమానాశ్రయాల నిర్మాణం. విద్యుత్ వెలుగులకు నోచుకోని గ్రామాలకు కరెంట్ సదుపాయాలూ అందించడం. సమాజంలోని బడుగు, బలహీన వర్గాల ఖాతాల్లో నేరుగా సొమ్ములను బదిలీ చేసే జన్ ధన్ యోజన పథకం. చిన్న వర్తకులు, వ్యాపారస్థులకు ప్రయోజనం చేకూరేలా డిజిటల్ పేమెంట్ వ్యవస్థకు శ్రీకారం చుడుతూ యూపీఐ పేమెంట్ విధానాన్ని ప్రవేశపెట్టడం. సమస్యలూ ఉన్నాయి.. అవినీతి నల్లధనం: కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు అవినీతి, లంచగొండితనం వేళ్ళూనుకుపోయాయి. ఇది అంత తేలిగ్గా పరిష్కారం అయ్యేది కానే కాదు. అవినీతి, కుంభకోణాలకు ఆమడదూరం ఉంటామని చెప్పే పార్టీ లో వాటితో నేరుగానో, పరోక్షంగానో ప్రమేయం ఉన్న కొందరు రాజకీయ వేత్తలు ఉండటం ఓ పెద్ద మచ్చ. నల్ల ధనం నిరోధం ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న మాదిరిగానే ఉంది. బ్లాక్ మనీ నిరోధం దిశగా పెద్ద నోట్ల రద్దు వంటి సంచలనాత్మక నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం వేసిన అడుగులు నామమాత్రమే. ధరలు రైతులు: ద్రవ్యోల్బణం నియంత్రణలోనే ఉందంటూ రిజర్వు బ్యాంకు చెబుతున్నప్పటికీ ధరలు మాత్రం దిగివచ్చిన దాఖలాలు కనిపించడం లేదు. సామాన్యుడి నడ్డి విరుగుతూనే ఉంది. దళారీ వ్యవస్థ నిర్మూలనలోనూ చర్యలు నామమాత్రమే. పంజాబ్, హర్యానా రైతులు దేశ రాజధానిలో లబోదిబో మంటూ నిరసనలకు దిగుతున్నా వారి సమస్యల పరిష్కారం దిశగా సరైన అడుగులు పడటం లేదు. ►డిజిటల్ పేమెంట్ వ్యవస్థకు సంబంధించి ఇప్పటికీ పరిష్కారం కాని విషయాలు చాలానే ఉన్నాయి. చెల్లింపులు చేసినప్పుడు ఎదురయ్యే అవాంఛనీయ పరిణామాలపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాల్సి ఉంది. ►వందే భారత్ రైళ్లు ఓ గొప్ప విజయమని చెప్పుకునే దేశంలో.. ఇప్పటికీ గబ్బుకొట్టే రైళ్లు, అక్కరకు రాని స్టేషన్లు, సరైన పహారా వ్యవస్థ లేని రైల్వే క్రాసింగ్ లు వంటి సమస్యలతో రైల్వే రంగం కొట్టుమిట్టాడుతోంది. ►జనాభా విస్తరణతో నగరాలుగా మారుతున్న పట్టణాలు, పట్టణాలుగా రూపు సంతరించుకుంటున్న మండల స్థాయి గ్రామాల్లో మౌలిక వసతుల లేమి ప్రధాన సమస్యగా నిలుస్తోంది. ఈనేపథ్యంలో స్మార్ట్ నగరాల నిర్మాణం ఎప్పటికి, ఎంతవరకు కార్యరూపం దాలుస్తుందో స్పష్టంగా చెప్పలేని పరిస్థితి. పాలకులు మారొచ్చు గాక.. ప్రభుత్వాలు కొత్త రూపు సంతరించుకోవచ్చు గాక.. కాలానుగుణ మార్పుల్లో భాగంగా కొత్త విధానాలతో ప్రజలకు ఉపయుక్తమయ్యే రీతిలో కార్యాచరణ ఉన్నప్పడే అసలైన అడుగు పడినట్లు. ప్రపంచ ఆర్ధిక వ్యవస్థల్లో మూడో స్థానం దిశగా భారతావని అడుగులు వేస్తోందని మోదీ సర్కారు చెబుతోంది. వచ్చేది ఎన్డీయే ప్రభుత్వమేననే సంకేతాలు ఇప్పటికే వెలువడుతున్నాయి. కొలువు దీరబోయే కొత్త ప్రభుత్వం అఖండ భారతంలో వెలుగులు విరబూయించాలంటే ప్రజల తలరాతలు మార్చగలగాలి. లేకుంటే అంకెలన్నీ హంగూ ఆర్భాటాలతో కాగితాలపై కనిపించే మెరుపు తీగలు గానే మిగిలిపోతాయి. అలా జరగదనే భావిద్దాం. ఈసారి బృహత్తర లక్ష్యాలతో ఎన్డీయే సర్కారు ముందుకు సాగాలని, స్వర్ణ భారతం ఆవిష్కృతమవ్వాలని ఆశిద్దాం. ✍️బెహరా శ్రీనివాస రావు సీనియర్ పాత్రికేయులు -
మోదీ కలలు కంటున్నారు: విపక్షాలు
న్యూఢిల్లీ: ఈసారి లోక్సభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి 400కుపైగా స్థానాల్లో ఘన విజయం సాధిస్తుందని ప్రధాని మోదీ ధీమా వ్యక్తంచేయడంపై విపక్ష పార్టీలు విమర్శలు పెంచాయి. ‘‘ మోదీ కలలు కంటున్నారు. ఏకంగా 400కుపైగా సీట్లు గెల్చుకుంటామని మోదీ చెప్పడం చూస్తుంటే మళ్లీ అధికారంలోకి వస్తామనే విశ్వాసం ఆయనకు లేదని అర్థమవుతోంది. బీజేపీ ప్రభుత్వం దేశ లౌకిక భావనను గాయపరిచింది. గత ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను గాలికొదిలేసి ద్రోహం చేసింది. మహిళలు, ఎస్సీ, ఎస్టీల కోసం ఏం చేసింది? రెండు కోట్ల ఉద్యోగాల హామీ ఎందుకు ఇంతవరకు నెరవేర్చలేదు?. గత మే నుంచి రావణకాష్టంగా రగిలిపోతున్న మణిపూర్లో మోదీ ఎందుకు ఇంతవరకు ఒక్కసారైనా పర్యటించలేదు?’’ అని సీపీఐ నేత బినోయ్ విశ్వం నిలదీశారు. ‘‘ 400 లేదా 500 సీట్లు గెలుస్తామని కల కనే హక్కు మోదీకి ఉంది. కానీ వాస్తవం వేరు. వేరే వాళ్ల కలలకు తగ్గట్లు నడుచుకోవాలో, సొంత నిర్ణయాలు తీసుకోవాలో ప్రజలే నిర్ణయించుకుంటారు’ అని సీపీఐ(ఎం) నేత జాన్ బ్రిటస్ చెప్పారు. ‘ ఇందిరా గాంధీ, నెహ్రూల పేర్లు ప్రస్తావించకుండా ప్రధాని ప్రసంగం అస్సలు ముగియదు. ఇందిరా గాంధీ, నెహ్రూల పేర్లు స్మరించుకుంటేగానీ మోదీకి ఎన్నికల్లో గిట్టుబాటు అవుతుంది’’ అని కాంగ్రెస్ ఎంపీ మాణిక్కం ఠాకూర్ ఎద్దేవాచేశారు. ‘‘ బాధ్యతాయుతమైన ప్రధాని పదవిలో కూర్చున్నందుకైనా కాస్తంత గౌరవప్రదంగా మాట్లాడాలి. 400కుపైగా గెలుస్తామనడం చూస్తుంటే ఈవీఎంల విశ్వసనీయతపై అనుమానాలొస్తున్నాయి’’ అని మరో కాంగ్రెస్ ఎంపీ డ్యానిష్ అలీ అనుమానం వ్యక్తంచేశారు. ‘‘ నెహ్రూ గతించి దాదాపు 60 ఏళ్లు గడుస్తున్నా మోదీ ఇంకా ఆయననే లక్ష్యంగా చేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ గురించి మోదీ ఇంతగా పట్టించుకుంటుంటే మాకే చాలా ఆశ్చర్యంగా ఉంది. మోదీ ఆయన ప్రసంగమంతా కాంగ్రెస్కే అంకితమిచ్చారు. ఇప్పుడు పెరిగిన ధరల గురించి మోదీ ఇంకా నెహ్రూ, ఇందిర గాంధీలనే తిడుతున్నారు. ధరలు పెరిగిన తర్వాత వచ్చే ఎన్నికల్లో ప్రతిసారీ కాంగ్రెస్ గెలిచినట్లు చరిత్ర చెబుతోంది. ఇప్పుడు కూడా ధరలు పెరిగాయి!’’ అని కాంగ్రెస్ నేత శశిథరూర్ వ్యాఖ్యానించారు. -
General Elections 2024: వెయ్యేళ్ల అభివృద్ధికి పునాది
న్యూఢిల్లీ: పార్లమెంటు సాక్షిగా ప్రధాని నరేంద్ర మోదీ లోక్సభ ఎన్నికల శంఖారావం చేశారు. ఈసారి కూడా ఘనవిజయం సాధించి ఖాయంగా హ్యాట్రిక్ కొడతామన్నారు. ‘‘సాధారణంగా నేను అంకెల జోలికి వెళ్లను. కానీ ఈసారి మాత్రం దేశం మనోగతాన్ని స్పష్టంగా అంచనా వేయగలను. ఎన్డీఏ కూటమికి ఏకంగా 400 పైచిలుకు స్థానాలొస్తాయి’’ అని జోస్యం చెప్పారు. బీజేపీ ఒంటరిగానే కనీసం 370 స్థానాలు సాధిస్తుందని ధీమా వెలిబుచ్చారు. ‘‘మళ్లీ అధికారంలోకి వచ్చేస్తున్నాం. వచ్చాక చాలా పెద్ద నిర్ణయాలు తీసుకుంటాం. మూడో టర్మ్లో వెయ్యేళ్ల ప్రగతికి పటిష్ట పునాదులు వేస్తాం’’ అని ప్రకటించారు. విపక్షాలన్నీ అప్పుడే కాడి కింద పడేశాయంటూ ఎద్దేవా చేశారు. ‘‘కనీసం ఎన్నికల్లో పోటీ చేసేందుకు కూడా వాటికి ధైర్యం చాలడం లేదు. తమకు మరిన్ని సీట్లు తగ్గి మరోసారి విపక్ష పాత్ర ఖాయమన్న నిర్ణయానికి వచ్చేశాయి’’ అన్నారు. కాంగ్రెస్ దుకాణం త్వరలో మూతపడుతుందని, దశాబ్దాల పాటు విపక్ష స్థానానికే పరిమితమవుతుందని ప్రధాని జోస్యం చెప్పారు. భారతీయుల సామర్థ్యంపై నెహ్రూకు, ఇందిరాగాం«దీకి ఎన్నడూ నమ్మకమే లేదంటూ ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. దశాబ్దాల కాంగ్రెస్ పాలన కూడా అదే ఆత్మవిశ్వాస రాహిత్య ధోరణిలో సాగిందని విమర్శించారు. పదేళ్ల పాలనలో తాము సాధించిన ఘనతలను సాధించాలంటే కాంగ్రెస్కు కనీసం 100 ఏళ్లయినా పట్టి ఉండేదంటూ ఎద్దేవా చేశారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చకు సోమ వారం లోక్సభలో బదులిస్తూ ప్రధాని పూర్తిగా ఎన్నికల మూడ్లోకి వెళ్లిపోయారు. ‘‘మహా అయితే 100 నుంచి 125 రోజులు! మేం వరుసగా మూడో సారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాం’’ అని స్పష్టం చేశారు. ‘అబ్ కీ బార్ (ఈసారి)’ అంటూ మోదీ పదేపదే నినదించగా, ‘400 పార్ (400 స్థానాలు దాటేస్తాం)’ అంటూ బీజేపీ సభ్యులంతా ప్రతిసారీ ముక్త కంఠంతో గొంతు కలిపారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా ఈ మాటే అంటున్నారని రాజ్యసభలో ఆయన వ్యాఖ్యలను ఉటంకిస్తూ మోదీ చెప్పారు. తమ ప్రభుత్వ ఘనతలను వివరిస్తూ, విపక్షాలను, ముఖ్యంగా కాంగ్రెస్ను, గాంధీ కుటుంబాన్ని ప్రధాని తూర్పారబట్టారు. వాటిపై విపక్షాల అభ్యంతరాలను, సభ్యుల నినాదాలను పట్టించుకోకుండా దాదాపు 100 నిమిషాల పాటు ఏకధాటిగా ప్రసంగించారు. శతాబ్దాల ఎదురుచూపులు ఫలించి అయోధ్యలో మళ్లీ కొలువుదీరిన రాముడు దేశ ప్రగతి పయనానికి నూతన జవసత్వాలు అందిస్తాడన్నారు. కూటమి సారథిగానూ కాంగ్రెస్ విఫలం పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో నిర్మాణాత్మక సలహాలిచ్చే అవకాశాన్ని విపక్షాలు చేజార్చుకున్నాయని మోదీ అన్నారు. ‘‘దాంతో వారిపై దేశ ప్రజలకు పూర్తిగా భ్రమలు తొలగాయి. విపక్షాలు తాము సుదీర్ఘకాలం పాటు విపక్షాలుగానే ఉంటామంటూ తీర్మానించుకున్నాయి. వారు మాట్లాడుతున్న ప్రతి మాటా అందుకు అద్దం పడుతోంది. వాటి నిర్ణయాన్ని అభినందిస్తున్నా’’ అంటూ చెణుకులు విసిరారు. ఓటమి భయంతో చాలామంది విపక్ష నేతలు ఇప్పటికే స్థానాలు మారుతున్నారని, రాజ్యసభకు వెళ్లే ప్రయత్నాల్లోనూ పడ్డారని మోదీ ఎద్దేవా చేశారు. ‘‘విపక్షాలన్నీ కిందా మీదా పడి ఏర్పాటు చేసిన ఇండియా కూటమి విచి్చన్నమైంది. ఇప్పుడా పారీ్టలన్నీ ఎక్ల చలో (ఒంటరిగా పోతాం) అంటున్నాయి’’ అని తృణమూల్ కాంగ్రెస్ నిర్ణయాన్ని ఉద్దేశించి బెంగాలీలో చమత్కరించారు. దేశంలో విపక్షాల ఈ దీన స్థితికి కాంగ్రెసే ప్రధాన కారణమని ఆయన ఆరోపించారు. తద్వారా కాంగ్రెస్ ఒక పారీ్టగానే గాక కూటమి సారథిగా కూడా విఫలమైందని చెప్పే ప్రయత్నం చేశారు. ‘‘కుటుంబ పాలనతో కాంగ్రెస్ ముందే పూర్తిగా భ్రష్టు పట్టిపోయింది. నిర్మాణాత్మక విపక్ష పాత్ర పోషించడంలోనూ గత పదేళ్లుగా పదేపదే విఫలమైంది. తద్వారా ప్రజల నమ్మకం చూరగొనే సువర్ణావకాశాన్ని చేజేతులా పోగొట్టుకుంది. దశాబ్దాల పాటు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఇప్పుడిక దశాబ్దాల పాటు విపక్షంలోనే ఉండాలని గట్టిగా నిర్ణయించుకుంది! ప్రజలు కూడా ఆ పార్టీని అక్కడే ఉంచడం ద్వారా ఆశీర్వదిస్తారు! అక్కడి నుంచి కాంగ్రెస్ మరిన్ని ఎత్తులకు చేరి త్వరలో లోక్సభ ప్రేక్షకుల గ్యాలరీల్లో దర్శనమిస్తుంది’’ అంటూ జోస్యం చెప్పారు. కాంగ్రెస్ ఒకే ప్రోడక్టును పదేపదే లాంచ్ చేస్తోందని రాహుల్ను, ఆయన చేపట్టిన భారత్ జోడో, న్యాయ్ యాత్రలను ఉద్దేశించి మోదీ అన్నారు. ‘‘ఇది ఎన్నికల వేళ. కాస్త కష్టపడి ఏదన్నా కొత్తగా ప్రయతి్నంచాల్సింది. జనాలకు కొత్త సందేశమేదన్నా ఇవ్వాల్సింది. కానీ ఈ విషయంలోనూ కా>ంగ్రెస్ ఘోరంగా విఫలమైంది’’ అంటూ తూర్పారబట్టారు. ఈ దెబ్బతో కాంగ్రెస్ దుకాణం బహుశా అతి త్వరలో మూతబడవచ్చని జోస్యం చెప్పారు. ‘‘దాంతో ఏం చేయాలో తెలియని అయోమయ స్థితికి కాంగ్రెస్ దిగజారింది. రద్దు సంస్కృతిని అలవర్చుకుంది. కేవలం నాపై అక్కసుతో దేశం సాధించిన, సాధిస్తున్న ప్రతి ఘనతనూ రద్దు చేసి చూపించే ప్రయత్నం చేస్తోంది’’ అంటూ మండిపడ్డారు. ‘‘దేశానికి కావాల్సింది ఆరోగ్యకరమైన విపక్షం. కానీ రాహుల్కు ఎక్కడ పోటీ వస్తారోనని కాంగ్రెస్లోని యువ నేతల గళాలను నాయకత్వమే అణచేస్తోంది. దానిది రాచకుటుంబాన్ని దాటి చూడలేనితనం’’ అంటూ దుయ్యబట్టారు. అవినీతికి విపక్షాల అండ! బీజేపీ సర్కారుపై విపక్షాలు చేస్తున్న అవినీతి ఆరోపణలపై మోదీ తీవ్రంగా మండిపడ్డారు. అవినీతికి, అందుకు పాల్పడుతున్న నేతలకు విపక్షాలే అడుగడుగునా కొమ్ముకాస్తున్నాయని ఆరోపించారు. అవినీతి నేతలను కీర్తిస్తూ దేశానికి అవి ఏం సందేశమిస్తున్నాయని ప్రశ్నించారు. పైగా అవినీతిపై ఉక్కుపాదం మోపుతున్నందుకు తనపై, తన ప్రభుత్వంపై నిత్యం దుమ్మెత్తిపోస్తున్నాయని ఆక్షేపించారు. ‘‘నన్నెంత విమర్శించినా అవినీతిపై, అవినీతి నేతలపై కఠిన చర్యలు ఆగబోవు. దోచిందంతా కక్కాల్సిందే. దేశాన్ని దోచుకుంటున్న వారు మూల్యం చెల్లించాల్సిందే. పవిత్ర సభ సాక్షిగా దేశానికి నా వాగ్దానమిది’’ అన్నారు. దర్యాప్తు సంస్థలు విపక్ష నేతలను లక్ష్యం చేసుకుంటున్నాయన్న ఆరోపణలను తోసిపుచ్చారు. ‘‘కాంగ్రెస్ హయాంలో అలాగే జరిగింది. అప్పట్లో దేశంలో ఎటు చూసినా అవినీతి తాండవమాడేది. పార్లమెంటులో చర్చంతా అవినీతి చుట్టే సాగేది. మా పాలనలో మాత్రం దర్యాప్తు రాజ్యాంగ నిర్దేశం మేరకు స్వతంత్రంగా పని చేస్తున్నాయి. వాటి పనితీరుపై తీర్పు చెప్పాల్సింది కోర్టులు మాత్రమే’’ అని చెప్పారు.కాంగ్రెష్ పాలనలో ఈడీ కేవలం రూ.5,000 కోట్ల విలువైన ఆస్తులు జప్తు చేయగా తమ హయాంలో అది ఏకంగా రూ.లక్ష కోట్లు దాటిందని చెప్పారు. కాంగ్రెస్ పాలనలో ఓబీసీలకు అన్యాయం కాంగ్రెస్, ఆ పార్టీ సారథ్యంలోని యూపీఏ సర్కారు ఓబీసీలకు తీరని అన్యాయం చేశాయని, ఓబీసీ నేతలను ఘోరంగా అవమానించాయని మోదీ దుయ్యబట్టారు. ఎన్డీఏ సర్కారులో ఓబీసీల లెక్కలు తీసిన కాంగ్రెస్ నేతలు అతి పెద్ద ఓబీసీనైన తనను మాత్రం మర్చిపోయారన్నారు. వెనకబడ్డ వర్గాలకు చెందిన దివంగత బిహార్ సీఎం కర్పూరి ఠాకూర్కు భారతరత్న ఇచ్చి తాము గౌరవించుకున్నామన్నారు. ‘‘1970లో బిహార్లో ఆయన ప్రభుత్వాన్ని అస్థిరపరిచి సీఎం పదవి నుంచి దింపేందుకు ప్రయతి్నంచిన చరిత్ర కాంగ్రెస్ది. ఆయనను కనీసం విపక్షనేతగా కూడా ఓర్వలేకపోయింది’’ అంటూ మండిపడ్డారు. యూపీఏ హయాంలో తెరపైకి తెచి్చన జాతీయ సలహా మండలిని రాజ్యంగేతర శక్తిగా మోదీ అభివర్ణించారు. అందులో ఓబీసీలు ఎందరున్నారో చెప్పాలన్నారు. దేశ సామర్థ్యంపై నెహ్రూకు నమ్మకం లేదు భారతీయులు దద్దమ్మలు, బద్ధకస్తులని భావించేవారు ఇందిరది కూడా ఫక్తు అదే ధోరణి: మోదీ దేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూపై మోదీ తన ప్రసంగంలో సునిశిత విమర్శలు చేశారు. దేశం చిరకాలం పాటు ఎదర్కొన్న ఇక్కట్లకు, కశీ్మరీల సమస్యలకు ఆయన ఘోర తప్పిదాలే మూల కారణమని ఆరోపించారు. ‘‘భారతీయుల శక్తి సామర్థ్యాలపై నెహ్రూకు ఎన్నడూ నమ్మకమే లేదు. వాళ్లు బద్ధకస్తులని, తెలివితక్కువ వాళ్లని భావించేవారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పుడు ఎర్రకోట నుంచి చేసిన ప్రసంగంలో ఇదే విషయాన్ని నెహ్రూ స్పష్టంగా పేర్కొన్నారు. యూరోపియన్లు, జపానీయులు, చైనీయులు, రష్యన్లు, అమెరికన్ల మాదరిగా భారతీయులకు కష్టపడే స్వభావం లేదన్నారు. మనలను న్యూనతపరిచేందుకు వాళ్లను పొగిడారు. నెహ్రూ కుమార్తె, మాజీ ప్రధాని ఇందిరాగాం«దీది కూడా అదే ధోరణి. ఏదన్నా మంచి పని పూర్తయ్యే దశలో బద్దకించడం భారతీయులకు అలవాటని, అడ్డంకి ఎదురవుతూనే ఆశలొదిలేసుకుంటామని, కొన్నిసార్లు మొత్తం దేశమే ఓటమిని ఒప్పుకున్నట్టుగా కనిపిస్తుందని తక్కువ చేసి మాట్లాడారామె. భారతీయుల పట్ల ఆ రాచకుటుంబం భావన ఇదీ! తమను పాలకులుగా భావించుకుంటూ నిత్యం ప్రజలను కించపరిచిన చరిత్ర గాంధీ కుటుంబానిది. నెహ్రూ, ఇందిరల ఈ భావజాలమే కాంగ్రెస్కూ పాకింది. గాంధీ కుటుంబం చేతిలో బందీగా మారిన ఆ పార్టీ ప్రజల ఆకాంక్షలను, విజయాలను ఎప్పుడూ గుర్తించలేదు. గుర్తించజాలదు కూడా. భారతీయుల శక్తిసామర్థ్యాలను గుర్తించడంలో ఇందిర ఘోరంగా విఫలమయ్యారు గానీ నేటి కాంగ్రెస్ నేతలను మాత్రం అప్పట్లోనే ఆమె సరిగ్గా అంచనా వేశారనిపిస్తుంది! ఎందుకంటే ఆమె వ్యాఖ్యలు వారికి అతికినట్టుగా సరిపోతాయి’’ అని మోదీ అన్నారు. భారత్, భారతీయుల శక్తి సామర్థ్యాలపై తనకు అపారమైన విశ్వాసముందని చెప్పారు. ప్రధానిగా తన మూడో టర్ములో భారత్ ప్రపంచంలో మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని, ఇది తన హామీ అని మోదీ చెప్పారు. కాంగ్రెస్ మాత్రం అధికారంలో ఉండగా పెద్దగా ఆలోచించేందుకు కూడా జంకిందని ఎద్దేవా చేశారు. దాని తీరు చూస్తే జాలేస్తోందన్నారు. ‘‘కాంగ్రెస్ సారథ్యంలోని యూపీఏ సర్కారు చేసిన తప్పులన్నింటినీ మా తొలి టర్ములో సరిదిద్దుతూ వచ్చాం. రెండంకెలకు చేరిన ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేశాం. రెండో టర్ములో నూతన భారతానికి పటిష్టమైన పునాదులు వేశాం. ఇక మూడో టర్ములో వికసిత భారత్ లక్ష్యాన్ని సాకారం చేసే దిశగా సాగుతాం’’ అంటూ భవిష్యద్దర్శనం చేశారు. జీఎస్టీ, డిజిటైజేషన్, పెండింగ్ పథకాల పూర్తి వంటి పలు ఘనతలు తమ సొంతమన్నారు. తమ కృషి వల్ల భారత్ నేడు అంతర్జాతీయంగా ఇన్నొవేషన్లకు, పరిశోధనలకు, తయారీ రంగానికి కేంద్రంగా రూపుదిద్దుకుందన్నారు. స్వచ్ఛ ఇంధనం, సెమీ కండక్టర్ల వంటి పలు రంగాల్లో స్వావలంబన సాధించాల్సి ఉందని చెప్పారు. -
Bihar political crisis: మళ్లీ కూటమి మారిన నితీశ్
పట్నా: బిహార్ రాజకీయ రగడకు ఊహించిన విధంగానే తెర పడింది. గోడదూకుళ్లకు పెట్టింది పేరైన జేడీ(యూ) అధినేత, బిహార్ ముఖ్యమంత్రి నితీశ్కుమార్ మళ్లీ కూటమి మారారు. ఆదివారం ఇండియా కూటమికి గుడ్బై చెప్పి మరోసారి బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ గూటికి చేరారు. ఉదయం సీఎం పదవికి రాజీనామా చేసి జేడీ(యూ), ఆర్జేడీ, కాంగ్రెస్, వామపక్షాలతో కూడిన మహాఘట్బంధన్ సర్కారుకు చరమగీతం పాడారు. సాయంత్రానికల్లా బీజేపీ మద్దతుతో మళ్లీ ప్రభుత్వం ఏర్పాటు చేశారు. తద్వారా 72 ఏళ్ల నితీశ్ బిహార్ ముఖ్యమంత్రిగా రికార్డు స్థాయిలో తొమ్మిదోసారి పగ్గాలు చేపట్టారు. బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా తదితరుల సమక్షంలో రాజ్భవన్లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ ఆయనతో ప్రమాణస్వీకారం చేయించారు. బిహార్ బీజేపీ చీఫ్ సమ్రాట్ చౌధరి, పార్టీ నేత విజయ్కుమార్ సిన్హాలకు డిప్యూటీ సీఎం పదవులు దక్కాయి. నితీశ్ చర్యపై కాంగ్రెస్తో పాటు విపక్ష ఇండియా కూటమిలోని ఆర్జేడీ, డీఎంకే, జేఎంఎం, ఆప్ తదితర పారీ్టలు మండిపడ్డాయి. బిహార్ ప్రజలే ఆయనకు బుద్ధి చెబుతారన్నాయి. భాగస్వాములను మోసగించడంలో సిద్ధహస్తుడైన ఆయన మరోసారి ఊసరవెల్లి నైజాన్ని చాటుకున్నారంటూ కాంగ్రెస్ దుయ్యబట్టింది. నితీశ్ వంటి ఆయారాం, గయారాంల ని్రష్కమణతో ఇండియా కూటమికి నష్టమేమీ లేదని పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. ‘‘ఆయన ఇలా చేస్తారని నాకు ముందే తెలుసు. ఎన్డీఏలోకి వెళ్లడం ఖాయమని ఆర్జేడీ చీఫ్ లాలు, ఆయన కుమారుడు తేజస్వి కూడా నాకు చెప్పారు. కానీ ఇండియా కూటమి చెదిరిపోకుండా ఉండాలని నేను బయటికి చెప్పలేదు’’ అన్నారు. ఆట ఇప్పుడే ఆరంభమైందని తేజస్వి అన్నారు. లోక్సభ ఎన్నికల్లో జేడీ(యూ) మట్టి కరవడం ఖాయమంటూ శాపనార్థాలు పెట్టారు. నితీశ్ది ద్రోహమంటూ సీపీఐ (ఎంఎల్) దుయ్యబట్టింది. గోడ దూకుడుకు పర్యాయపదంగా ఆయన చరిత్రలో నిలిచిపోతారంటూ ఎన్సీపీ (శరద్ పవార్) ఎద్దేవా చేసింది. ‘‘స్నోలీగోస్టర్ (విలువల్లేని వ్యక్తి) పదం నితీశ్కు బాగా సరిపోతుంది. ఇదే వర్డ్ ఆఫ్ ద డే’’ అంటూ కాంగ్రెస్ నేత శశిథరూర్ చమత్కరించారు. పదేపదే కూటములు మార్చడం నితీశ్కు పరిపాటేనని తృణమూల్ కాంగ్రెస్ పేర్కొంది. జేడీ(యూ) మాత్రం కాంగ్రెస్ స్వార్థపూరిత వైఖరి వల్లే నితీశ్ ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచి్చందని చెప్పుకొచి్చంది. కొత్త సర్కారుకు ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. బిహారీల ఆకాంక్షలను నెరవేర్చేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పాటుపడుతుందంటూ ఎక్స్లో పోస్ట్ చేశారు. ఇక ఎటూ వెళ్లను: నితీశ్ అంతకుముందు ఆదివారం రోజంతా పట్నాలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతూ వచ్చాయి. ఉదయమే జేడీ(యూ) శాసనసభా పక్షం నితీశ్ నివాసంలో భేటీ అయింది. ఏ నిర్ణయమైనా తీసుకునే హక్కును ఆయనకు కట్టుబెడుతూ తీర్మానించింది. వెంటనే నితీశ్ రాజ్భవన్కు వెళ్లి సీఎం పదవికి రాజీనామా సమరి్పంచారు. తర్వాత మీడియాతో మాట్లాడారు. మహాఘట్బంధన్లో పరిస్థితులు సజావుగా లేకపోవడం వల్లే ప్రభుత్వాన్ని రద్దు చేస్తున్నట్టు చెప్పారు. మరోవైపు ప్రభుత్వ ఏర్పాటుకు నితీశ్కు మద్దతిస్తూ బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు తీర్మానించారు. ఆ వెంటనే తమను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహా్వనించాల్సిందిగా గవర్నర్ను నితీశ్ కోరడం, సీఎంగా ప్రమాణం చేయడం చకచకా జరిగిపోయాయి. తర్వాత నితీశ్ మరోసారి మీడియాతో మాట్లాడారు. ఎన్డీఏను వీడి ఇకపై ఎటూ వెళ్లేది లేదని చెప్పుకొచ్చారు. ఆయన తమ సహజ భాగస్వామి అని బీజేపీ చీఫ్ నడ్డా అన్నారు. జేడీ(యూ)తో కలిసి లోక్సభ ఎన్నికల్లో బిహార్లో మొత్తం 40 సీట్లనూ స్వీప్ చేస్తామని అన్నారు ఇండియా కూటమికి చావుదెబ్బ! తృణమూల్ కాంగ్రెస్, ఆప్ ఇచి్చన ఇటీవలి షాక్లకు ఇప్పటికే మూలుగుతున్న కాంగ్రెస్ సారథ్యంలోని ఎన్డీఏ కూటమికి నితీశ్ తాజా ని్రష్కమణతో కోలుకోలేని దెబ్బ తగిలింది. ఇప్పటికే దూకుడు మీదున్న బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ కూటమిని ఈ పరిణామం మరింత బలోపేతం చేసింది. లోక్సభ ఎన్నికల్లో పశి్చమబెంగాల్లో అన్ని స్థానాల్లోనూ తృణమూల్ ఒంటరిగానే పోటీ చేస్తుందని పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ ప్రకటించడం తెలిసిందే. పంజాబ్లోనూ ఆప్ది ఒంటరిపోరేనని రాష్ట్ర సీఎం భగవంత్ మాన్ కూడా అదే రోజు స్పష్టం చేశారు. అధికారమే పరమావధి 2020లో ఏర్పాటైన ప్రస్తుత బిహార్ అసెంబ్లీ పదవీకాలంలో నితీశ్ సారథ్యంలో ఇది ఏకంగా మూడో ప్రభుత్వం కావడం విశేషం! అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం బీజేపీ మద్దతుతో నితీశ్ సీఎం అయ్యారు. జేడీ(యూ)లో చీలికకు బీజేపీ కుట్ర చేస్తోందంటూ 2022లో ఆ ప్రభుత్వాన్ని కుప్పకూల్చి ఆర్జేడీ, కాంగ్రెస్, వామపక్షాలతో కలిసి మహాఘట్బంధన్ సర్కారును ఏర్పాటు చేశారు. 18 నెలలకే దాన్నీ పడదోసి తాజాగా మరోసారి ఎన్డీఏతో జట్టు కట్టి మళ్లీ సీఎంగా పీఠమెక్కారు. మొత్తమ్మీద కూటములు మారడం నితీశ్కు ఇది ఐదోసారి. ఆయన తొలిసారిగా 2000లో బిహార్ సీఎం పదవి చేపట్టారు. 2013లో ఎన్డీఏతో 17 ఏళ్ల బంధాన్ని తెంచుకుని కాంగ్రెస్, సీపీఐ మద్దతుతో ప్రభుత్వాన్ని నిలబెట్టుకున్నారు. 2014 లోక్సభ ఎన్నికల్లో జేడీ(యూ) ఘోర ఓటమికి బాధ్యత వహిస్తూ సీఎం పదవి నుంచి నితీశ్ కుమార్ తప్పుకున్నారు. కానీ 2015లో ఆర్జేడీ, కాంగ్రెస్తోకలిసి పోటీ చేసి మళ్లీ ముఖ్యమంత్రి అయ్యారు. 2017లో తిరిగి ఎన్డీఏ గూటికి చేరి 2022 దాకా అందులో కొనసాగారు. -
ఇలా రాజీనామా, అలా ప్రమాణం!
పట్నా/న్యూఢిల్లీ: బిహార్లో రాజకీయ సంక్షోభం క్లైమాక్స్కు చేరుతోంది. ఆర్జేడీ, కాంగ్రెస్, వామపక్షాలతో కూడిన మహాఘట్బంధన్ సంకీర్ణ సర్కారుకు జేడీ(యూ) సారథి, సీఎం నితీశ్కుమార్ గుడ్బై చెప్పడం, మళ్లీ బీజేపీతో దోస్తీ కట్టి ఎన్డీఏ కూటమిలో చేరడం ఖాయమైనట్టు కని్పస్తోంది. అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు, ఆదివారం ఉదయం నితీశ్ సారథ్యంలో పటా్నలో ఎన్డీఏ శాసనసభా పక్ష భేటీ జరగనుంది. బీజేపీ, జేడీ(యూ), జితిన్రాం మాంఝీ సారథ్యంలోని హిందూస్తాన్ అవామీ లీగ్ అందులో పాల్గొంటాయి. ఎమ్మెల్యేలంతా కలిసి శాసనసభాపక్ష నేతగా నితీశ్ను ఎన్నుకుంటారు. వెంటనే ఆయన గవర్నర్ను కలిసి సీఎం పదవికి రాజీనామా చేస్తారు. ఎన్డీఏ పక్షాల మద్దతు లేఖలు సమరి్పంచి మళ్లీ ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం కోరతారు. సాయంత్రం సీఎంగా ప్రమాణస్వీకారం చేస్తారు. బీజేపీ నేత సుశీల్కుమార్ మోదీ ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తారని సమాచారం. మాంఝీ కూడా రెండు మంత్రి పదవులు డిమాండ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఆదివారం విధులకు రావాల్సిందిగా సచివాలయ సిబ్బందికి ఆదేశాలు వెళ్లడం వంటివన్నీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సూచికలేనని చెబుతున్నారు. పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా నితీశ్ను బలపరిచే అవకాశముందని వార్తలొస్తున్నాయి. కనీసం ఏడెనిమిది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల సెల్ ఫోన్లు శనివారమంతా స్విచాఫ్ కావడం వాటిని బలపరుస్తోంది! దాంతో పరిస్థితిని సమీక్షించేందుకు కాంగ్రెస్ అధిష్టానం తరఫున ఛత్తీస్గఢ్ మాజీ సీఎం భూపేశ్ బఘెల్ హుటాహుటిన పట్నా చేరుకున్నారు. ఇండియా కూటమిలోకి రావాల్సిందిగా మాంఝీతో మంతనాలు జరిపారు. మరోవైపు నితీశ్తో చేదు అనుభవాల నేపథ్యంలో ఈ మొత్తం వ్యవహారంపై బీజేపీ వ్యూహాత్మకమౌనం పాటిస్తోంది. శనివారం పటా్నలో జరిగిన పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో దీనిపై లోతుగా చర్చ జరిగినా జేడీ(యూ)ను తిరిగి ఎన్డీఏలోకి ఆహా్వనించడంపై ఎలాంటి ప్రకటనా వెలువడలేదు. ఇక ఘట్బంధన్ సంకీర్ణంలో ప్రధాన భాగస్వామ్య పక్షమైన ఆర్జేడీ ఎలాగైనా సర్కారును కాపాడుకునేందుకు ముమ్మరంగా ప్రయత్నాలు కొనసాగిస్తోంది. ఆర్జేడీ నేతలతో పార్టీ చీఫ్ లాలు మంతనాల్లో మునిగి తేలుతున్నారు. జేడీ(యూ) లేకుండా ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవ్వాలని నేతలు ప్రతిపాదించారు. అయితే బీజేపీ, జేడీ(యూ) కలిస్తే 123 ఎమ్మెల్యేలతో మెజారిటీ మార్కు (122)ను సులువుగా దాటేస్తారంటూ లాలు కుమారుడు, డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ వాటిని తిరస్కరించినట్టు చెబుతున్నారు. ఇలా శనివారమంతా పట్నాలో హై వోల్టేజ్ పొలిటికల్ డ్రామా నడిచింది. ఇండియా కూటమి ఖతమే: జేడీ(యూ) బిహార్లో ఘట్బంధన్ సంకీర్ణం కుప్పకూలనుందని జేడీ(యూ) రాజకీయ సలహాదారు, అధికార ప్రతినిధి కేసీ త్యాగి స్పష్టం చేశారు. శనివారం ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ నాయకులు నితీశ్ను పదేపదే అవమానించడమే ఇందుకు కారణమని చెప్పారు. కాంగ్రెస్ సారథ్యంలోని విపక్ష ఇండియా కూటమి కూడా కుప్పకూలే దశలో ఉందని ఆయన జోస్యం చెప్పారు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ మాత్రం కూటమికి వచి్చన ముప్పేమీ లేదని ఆశాభావం వెలిబుచ్చారు. అయితే, నితీశ్తో మాట్లాడేందుకు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పదేపదే ప్రయత్నించినా ఆయన ‘బిజీ’గా ఉండటంతో వీలు కాలేదని వెల్లడించారు! ఇండియా కూటమి నుంచి జేడీ(యూ) వైదొలగుతున్నట్టు ఎలాంటి సమాచారమూ లేదని ఖర్గే చెప్పుకొచ్చారు. -
Bihar Politics: రేపే ఎన్డీఏలోకి నితీశ్?
పట్నా/న్యూఢిల్లీ: బిహార్ రాజకీయం రసకందాయంలో పడింది. ఆర్జేడీ, కాంగ్రెస్, వామపక్షాలతో కూడిన అధికార మహాఘట్బంధన్ సంకీర్ణానికి జేడీ(యూ) సారథి, ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ గుడ్బై చెప్పి ఎన్డీఏ కూటమిలో చేరడం దాదాపుగా ఖాయమైందని తెలుస్తోంది. పాత నేస్తం బీజేపీతో మళ్లీ జట్టు కట్టి ఆయన కొత్తగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. ఆదివారమే నితీశ్ మరోసారి సీఎంగా ప్రమాణస్వీకారం చేయవచ్చని జేడీ(యూ) వర్గాలంటున్నాయి. రాష్ట్ర బీజేపీ అగ్ర నేత సుశీల్కుమార్ మోదీకి ఉప ముఖ్యమంత్రి పదవి దక్కనుందని సమాచారం. ‘‘(నితీశ్కు ఇంతకాలంగా బీజేపీలోకి) మూసుకుపోయిన తలుపులు తెరుచుకోవచ్చు. రాజకీయాంటేనే అవకాశాల ఆటస్థలి. కనుక ఏదైనా సాధ్యమే’’ అంటూ శుక్రవారం సుశీల్ చేసిన నర్మగర్భ వ్యాఖ్యలు కూడా ఇందుకు బలం చేకూరుస్తున్నాయి. బిహార్ తాజా పరిణామాలపై రాష్ట్ర బీజేపీ చీఫ్ సమర్థ్ చౌదరి, సుశీల్కుమార్ ఇప్పటికే ఢిల్లీ వెళ్లి కేంద్ర హోం మంత్రి అమిత్ షా తదితర బీజేపీ అగ్ర నేతలతో చర్చలు జరిపి వచ్చారు. ఈ నేపథ్యంలో జేడీ(యూ)ను ఎన్డీఏలోకి తీసుకోవడంపై శని, ఆదివారాల్లో బిహార్ బీజేపీ రెండు రోజుల రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో చర్చించనున్నారు. ఆదివారమే పొత్తు నిర్ణయం వెలువడవచ్చని తెలుస్తోంది. ఆ రోజు ఉదయమే జేడీ(యూ) ఎమ్మెల్యేలతో నితీశ్ సమావేశం కానుండటం విశేషం! మరోవైపు 10 మంది దాకా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా బీజేపీతో టచ్లో ఉన్నట్టు వస్తున్న వార్తలు అధికార సంకీర్ణంలో కలకలం రేపుతున్నాయి. నితీశ్ స్పష్టత ఇవ్వాలి: ఆర్జేడీ సంకీర్ణంలో ప్రధాన భాగస్వామి అయిన ఆర్జేడీతో నితీశ్కు విభేదాల నేపథ్యంలో బిహార్లో రెండు రోజులుగా రాజకీయ రగడ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఆయన ఎన్డీఏలో చేరతారన్న వార్తలు గురువారం కలకలం రేపాయి. జేడీ(యూ) ని్రష్కమిస్తే సంకీర్ణ ప్రభుత్వం మైనారిటీలో పడుతుంది. దాన్ని కాపాడుకునేందుకు అవసరమైన 8 మంది ఎమ్మెల్యేల కోసం ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. నలుగురు ఎమ్మెల్యేలున్న ఎన్డీఏ భాగస్వామి హిందూస్తానీ అవామ్ మోర్చా చీఫ్ జితిన్రామ్ మాంఝీతో శుక్రవారం మంతనాలు జరిపారు. మాంఝీ మాత్రం నితీశ్ కూడా త్వరలో ఎన్డీఏలోకి వస్తారని మీడియాతో చెప్పుకొచ్చారు! ఘట్బంధన్ సర్కారు ఒకట్రెండు రోజుల్లోనే కుప్పకూలడం ఖాయమని ఆయన కుమారుడు సంతోష్ జోస్యం చెప్పారు. మొత్తం ఉదంతంపై నితీశ్ తక్షణం స్పష్టమైన ప్రకటన చేసి ఊహాగానాలకు తెర దించాలని ఆర్జేడీ ఎంపీ మనోజ్ ఝా కోరడం విశేషం. -
Times Now ETG Survey on Elections 2024: మళ్లీ ఎన్డీఏనే!
న్యూఢిల్లీ: ఇప్పటికిప్పుడు లోక్సభకు ఎన్నికలు జరిగితే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ కూటమి హ్యాట్రిక్ కొడుతుందని టైమ్స్ నౌ నవజీవన్, ఈటీజీ ఒపీనియన్ పోల్ బుధవారం వెల్లడించింది. మొత్తం 543 స్థానాల్లో ఎన్డీఏ కూటమికి ఏకంగా 323 సీట్లొస్తాయని అంచనా వేసింది. విపక్ష ఇండియా కూటమి 163 సీట్లకు పరిమితమవుతుందని చెప్పింది. ఇతర ప్రాంతీయ పార్టీలన్నీ కలిపి 57 స్థానాలు దక్కించుకుంటాయని వెల్లడించింది. ముఖ్యంగా ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘనవిజయం సాధించిన మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లోనైతే ఆ పార్టీ దాదాపుగా క్లీన్స్వీప్ చేస్తుందని తెలిపింది. 2019 లోక్సభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి 354 సీట్లు రావడం తెలిసిందే. కాంగ్రెస్ సారథ్యంలోని యూపీఏకు 93 సీట్లు రాగా ఇతరులకు 96 దక్కాయి. -
పవన్ కల్యాణ్ను బీజేపీనే వద్దనుకుందా?
సాక్షి, కృష్ణా: స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో అరెస్టైన చంద్రబాబు నాయుడిని.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాజమండ్రి జైలుకు వెళ్లి మరీ పరామర్శించి వచ్చారు. జైలు నుంచి బయటకు వచ్చి రాగానే.. వచ్చే ఎన్నికలకు కలిసి వెళ్తామంటూ ప్రకటించి ఇరు పార్టీల క్యాడర్లను బిత్తరపోయే ప్రకటన చేశారు. ప్రకటనకు ఇది సమయమా? కాదా? అని ఆయన ఆలోచించుకోలేదన్నది అక్కడే అర్థమైంది. ఆపై ఆయన బాడీ లాంగ్వేజ్ పూర్తిగా మారిపోయిందన్నది వారాహి యాత్ర ప్రసంగాలతో అర్థమైపోతోంది. అబద్ధపు ప్రసంగాలతో ఊదరగొడుతున్నారాయన. ఈ క్రమంలో తాజాగా ఆయన చేసిన మరో కామెంట్.. ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. వారాహి 4 యాత్రలో భాగంగా.. కృష్ణా జిల్లా పెడన బహిరంగ సభలో పవన్ చేసిన వ్యాఖ్యలు పరిశీలిస్తే.. ‘‘ఎన్డీయేలో భాగస్వామి అయ్యి ఉండి కూడా.. చాలా ఇబ్బందులు ఉండి కూడా.. బయటికి రావడానికి టీడీపీ అనుభవమే ప్రధాన కారణం. జనసేన పోరాట పటిమకు టీడీపీ అనుభవం అవసరం’’ అంటూ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యల ఆధారంగా . ఎన్డీయే నుంచి బయటకు వచ్చేసినట్లు పవన్ స్వయంగా ప్రకటించేసినట్లయ్యింది. #PawanaKalyan #TDP #JanaSenaParty pic.twitter.com/DAH2BJIgjd — Vattikoti Vishnu (@Vattikoti1989) October 5, 2023 ఈ మధ్యకాలంలో.. పవన్ వ్యాఖ్యల గురించి ఏపీ బీజేపీ నేతలెవరూ స్పందించడం లేదు.పైగా పొత్తు అంశం జాతీయ నాయకత్వమే చూసుకుంటుందని దాటవేత సమాధానం ఇచ్చారు ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరి. కానీ, ఇదే పురందేశ్వరి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా ఎంపికయ్యాక.. త్వరలో పవన్ తో భేటీ అవుతానని ప్రకటించారు. ఇక ఇప్పుడేమో ‘‘పవన్ ప్రతీ మాటకూ స్పందించాలా?’’ అని అంటున్నారు. ఎందుకు ఆమె వాయిస్ మారింది. ఈలోపే.. పవన్ ఎన్డీయే నుంచి బయటకు వచ్చేసినట్లు ఎందుకు ప్రకటించారు?.. బాబు పెట్టిన చిచ్చే.. నిజంగా ఎన్డీయేలో పవన్ ఇబ్బందులు పడ్డారా? పడితే ఆ ఇబ్బందులు ఏంటి?.. అసలు ఎన్డీయే కూటమి నుంచి జనసేననే బయటకు వచ్చేసిందా?.. లేదంటే పరిస్థితులు, పవన్ తీరు వల్లే జనసేనను ఎన్డీయే కూటమి, బీజేపీ దూరం పెట్టేలా చేసిందా?.. 1. గతంలో టీడీపీతో నడిచి ఘోరంగా భంగపడిన బీజేపీ.. దానిని దూరం పెడుతూ వస్తోంది. కనీసం ప్రతిపక్ష హోదా కోసమైనా ఈసారి జనసేనతో కలిసి నడవాలనే ఆలోచన చేసింది. కానీ, పవన్ చేజేతులారా ఆ అవకాశాన్ని పొగొట్టారు. 2. బీజేపీని-టీడీపీని ఒకే లైన్లోకి తేవాలని పవన్ మొదటి నుంచి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇది బీజేపీకి మింగుడు పడని విషయం. పైగా విషయంపైనే ఆ మధ్య హస్తిన పర్యటనకు వెళ్లారు కూడా. కానీ, పవన్ ఉద్దేశం.. టీడీపీ పొత్తుపై అయిష్టత, అంతకు మించి చంద్రబాబుతో పొంచి ఉన్న రాజకీయ ప్రమాదాన్ని అంచనా వేసిన బీజేపీ అందుకు ఒప్పుకోలేదు. ఈ క్రమంలోనే జాతీయ స్థాయి కీలక నేతలు సైతం పవన్కు అపాయింట్మెంట్ ఇవ్వలేదని స్పష్టమవుతోంది. 3. ప్రతిపక్ష ఇండియా కూటమికి కౌంటర్గా.. హస్తినలో జరిగిన బల ప్రదర్శనలో భాగంగానే ఎన్డీయే కూటమి పార్టీగా జనసేన తరపున పవన్ హాజరయ్యారు. మీటింగ్లోనూ సందడి చేశారు. దీంతో ప్రధానికి పవన్ దగ్గరంటూ జనసేన క్యాడర్ మురిసిపోయింది. కానీ, ఆ తర్వాత జరిగిన పరిణామాలే బీజేపీతో పవన్కు గ్యాప్ మరింత పెరిగేలా చేసినట్లు స్పష్టమవుతోంది. అందులో ప్రధాన కారణం.. చంద్రబాబు పార్టీతో పవన్ చేసిన పొత్తు ప్రకటన. 4. స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో చంద్రబాబు నాయుడు దొరికింది పక్కా ఆధారాలతో. అందుకే ఆయన అరెస్ట్ వ్యవహారాన్ని బీజేపీ పట్టించుకోలేదు. తన తండ్రి అరెస్ట్ విషయంలో అటెన్షన్ కోసం ఢిల్లీ వెళ్లిన లోకేష్ను బీజేపీ తేలికగానే తీసుకుంది. అయితే.. అవినీతి కేసులో అరెస్ట్ అయిన మాజీ సీఎం చంద్రబాబును జైలుకు వెళ్లి కలవడమే కాకుండా.. మాటమాత్రమైనా చెప్పకుండా టీడీపీతో పొత్తుపై ప్రకటన చేసేశారు. దీంతో.. బీజేపీ ఆ అంశాన్ని మరింత తీవ్రంగా పరిగణించినట్లు తెలుస్తోంది. 5. ప్యాకేజీ స్టార్ దత్త పుత్రుడనే విమర్శలకు మరింత బలం చేకూరుస్తూ.. టీడీపీ, చంద్రబాబు నాయుడికి మద్దతుగా నిలుస్తూ.. తరచూ కలుస్తూ వస్తున్నాడు. ఈ వ్యవహారాల్ని బీజేపీ నిశితంగా గమనిస్తూ వస్తోంది. చివరకు పొత్తు, ఇరు పార్టీలు కలిసి పని చేయాలనే తీర్మానాల నడుమ జనసేనను పక్కనపెట్టేయాలని నిర్ణయించేసింది. కానీ, పవన్ మాత్రం టీడీపీ కోసమే ఎన్డీయే నుంచి బయటకు వచ్చేసినట్లు ప్రజల చెవ్వుల్లో పువ్వులే పెట్టేలా ప్రకటన చేశారు. ఇకపై టీడీపీకి తానే పెద్ద దిక్కు అన్నట్లు చెబుతున్నారు. మరి ఆ మాటలకు ఆంతర్యం ఏంటో?.. -
కేంద్రంలో మళ్లీ ఎన్డీయే ప్రభంజనం
న్యూఢిల్లీ: దేశంలో రాబోయే లోక్సభ ఎన్నికల్లో కేంద్రంలో అధికార ఎన్డీయే మరోసారి ఘన విజయం సాధిస్తుందని జాతీయ వార్తా సంస్థ ‘టైమ్స్ నౌ’ తాజా సర్వేలో వెల్లడయ్యింది. మొత్తం 543 లోక్సభ స్థానాలకు గాను బీజేపీ కూటమి ఏకంగా 307 స్థానాలు గెలుచుకుంటుందని తెలియజేసింది. మెజార్టీ మార్కును సులువుగా అధిగమించి, కేంద్రంలో వరుసగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని తేల్చిచెప్పింది. కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని విపక్ష ‘ఇండియా’ కూటమి 175 స్థానాలకే పరిమితం అవుతుందని వివరించింది. ఇతరులు 61 సీట్లలో విజయం సాధించే అవకాశం ఉందని పేర్కొంది. ఇక 25 లోక్సభ స్థానాలున్న ఆంధ్రప్రదేశ్లో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దాదాపు క్లీన్ స్వీప్ చేస్తుందని టైమ్స్ నౌ సర్వే ఉద్ఘాటించింది. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కుంభకోణంలో అరెస్టయిన తర్వాత ఈ సర్వే జరిగింది. సర్వే ఫలితాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్లో అధికార పార్టీ 24 నుంచి 25 స్థానాల్లో జయకేతనం ఎగురవేస్తుంది. గత ఎన్నికల్లో 22 సీట్లు గెలుచుకున్న వైఎస్సార్సీపీ ఈసారి దాదాపు మొత్తం సీట్లను కైవసం చేసుకుంటుంది. అంతేకాదు 51.10 శాతం ఓట్లు దక్కించుకుంటుంది. ప్రతిపక్ష టీడీపీకి ఒక స్థానం లభించే అవకాశం ఉంది. ఆ పారీ్టకి 36.40 శాతం ఓట్లు లభిస్తాయి. జనసేన పార్టీ కనీసం ఒక్క స్థానంలోనూ గెలిచే పరిస్థితి లేదు. కేవలం 10.10 శాతం ఓట్లు సాధించనుంది. బీజేపీకి కనాకష్టంగా 1.30 శాతం ఓట్లు పడతాయని అంచనా. ఇతరులు 1.10 శాతం ఓట్లు సాధించనున్నారు. -
బీజేపీ – అన్నాడీఎంకే బంధానికి బ్రేక్.. ఎన్డీఏ కూటమికి బై..బై!
అనుకున్నదే అయ్యింది.. విమర్శలు ప్రతివిమర్శలు, అపనమ్మకాలు..ఆరోపణలు, ఎత్తులు.. పైఎత్తులతో ఇన్నాళ్లూ పడుతూ లేస్తూ సాగిన అన్నాడీఎంకే– బీజేపీ బంధానికి సోమవారం తెరపడింది. ఎన్డీయే కూటమని నుంచి ప్రధాన భాగస్వామి అయిన అన్నాడీఎంకే బయటకు వచ్చినట్లు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి పళణిస్వామి ప్రకటించారు. ఈ మేరకు పార్టీ జిల్లా కార్యదర్శుల సమావేశంలో స్పష్టం చేశారు. రాష్ట్రంలోని బీజేపీ నేతల తీరే ఈ నిర్ణయానికి కారణమని వెల్లడించారు. సాక్షి, చైన్నె: బీజేపీ – అన్నాడీఎంకే బంధానికి బ్రేక్ పడింది. ఎన్డీఏ కూటమికి బై..బై చెబుతూ సోమవారం అన్నాడీఎంకే కీలక ప్రకటన చేసింది. 2024 లోక్సభ ఎన్నికల్లో అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణి స్వామి నేతృత్వంలోనే కూటమి ఏర్పాటు అవుతుందని స్పష్టం చేశారు. ఈ మేరకు చైన్నెలో జరిగిన పార్టీ జిల్లా కార్యదర్శులు, రాష్ట్ర కమిటీ నేతలు, ఎంపీ, ఎమ్మెల్యేల సమావేశంలో నిర్ణయించారు. ఈ ప్రకటనతో అన్నాడీఎంకే వర్గాలు సంబరాల్లో మునిగిపోయాయి. వివరాలు.. అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత మరణం తదుపరి చోటు చేసుకున్న పరిణామాలతో ఈ పార్టీ ప్రభుత్వంలో బీజేపీ జోక్యం పెరిగిన విషయం తెలిసిందే. సీఎంగా పగ్గాలు చేపట్టినానంతరం పళణి స్వామి 2017 నుంచి బీజేపీతో స్నేహ పూర్వకంగా మెలుగుతూ వచ్చారు. 2019 లోక్సభ ఎన్నికలతో పాటు 2021 అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలలోనూ బంధం పదిలం అన్నట్లుగానే ముందుకు సాగారు. అయితే, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా అన్నామలై పగ్గాలు చేపట్టినానంతరం రెండు పార్టీల మధ్య క్రమంగా దూరం పెరుగుతూ వచ్చింది. బీజేపీని బలోపేతం చేయడమే లక్ష్యంగా మిత్రపక్షం అన్నాడీఎంకేను సైతం అన్నామలై టార్గెట్ చేయడం వివాదానికి ఆజ్యం పోసింది. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణిస్వామితో పాటు దివంగత నేతలు అన్నాదురై, జయలలితకు వ్యతిరేకంగా అన్నామలై తీవ్ర వ్యాఖ్యలు చేయడం వివాదంగా మారింది. ఢిల్లీ పర్యటన తర్వాత మారిన సీను.. వారం క్రితం అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణి స్వామి ఢిల్లీ పర్యటన అనంతరం పరిణామాలు వేగంగా మారాయి. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో చర్చల సమయంలో చోటు చేసుకున్న పరిణామాలను పళణి తీవ్రంగా పరిగణించినట్లు తెలుస్తోంది. తమ శత్రువులు పన్నీరు, దినకరన్ను బీజేపీ అక్కున చేర్చుకునే ప్రయత్నాలు చేస్తుండ డం, పుదుచ్చేరితోపాటు తమిళనాడులో 20 సీట్లను ఆశించడం వంటి సమాచారంతో బీజేపీతో ఇక కటీఫ్ అన్న నినాదాన్ని అన్నాడీఎంకే నేతలు అందుకున్నారు. సుదీర్ఘచర్చ తర్వాత కఠిన నిర్ణయం.. అన్నాడీఎంకే జిల్లాల కార్యదర్శుల సమావేశం సోమవారం సాయంత్రం రాయపేటలోని ఎంజీఆర్ మాళిగైలో జరిగింది. గంటన్నర పాటు జరిగిన ఈ సమావేశంలో జిల్లాల కార్యదర్శులు, ఎమ్మెల్యేలు, రాష్ట్ర కమిటీ నేతలు ముక్తకంఠంతో బీజేపీతో తెగతెంపులు చేసుకోవాలని నినాదించారు. ఢిల్లీలో అమిత్షా చర్చల సమయంలో చోటు చేసుకున్న పరిణామాలు, అన్నామలైపై ఫిర్యాదు చేయడానికి వెళ్లిన పార్టీ నేతలకు ఎదురైన నిరాశపూరిత పరిణామాల గురించి సైతం ఈ సమావేశంలో చర్చించడం గమనార్హం. కూటమి నుంచి బయటకు వచ్చిన పక్షంలో ఎదురయ్యే పరిణామాలు, ఈడీ, ఐటీ, సీబీఐ దాడులు, వాటిని తిప్పికొట్టే విధంగా నేతలు సిద్ధమయ్యే విధంగా చర్చించారు. సుదీర్ఘర సమాలోచన అనంతరం పార్టీ నేతలు మునుస్వామి, జయకుమార్, ఎస్పీ వేలుమణి, నత్తం విశ్వనాథన్, దిండుగల్ శ్రీనివాసన్ మీడియా ముందుకు వచ్చారు. పళణి నేతృత్వంలోనే కూటమి మీడియాతో నేతలు మాట్లాడుతూ, తమ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో జరిగిన సమావేశంలో నేతలందరూ ఏకగ్రీవంగా తీర్మానం చేశామని వివరించారు. గత ఏడాది కాలంగా పథకం ప్రకారం రాష్ట్ర బీజేపీ నేతలు అన్నాడీఎంకే దివంగత నేతలను, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని గురిపెట్టి తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారని గుర్తు చేశారు. పురట్చి తమిళర్ పళణి స్వామి నేతృత్వంలో మదురై వేదికగా జరిగిన భారీ మహానాడును సైతం విమర్శించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు కోట్ల మంది అన్నాడీఎంకే కేడర్ మనోభావాలకు వ్యతిరేకంగా బీజేపీ చర్యలు ఉంటున్నాయని ధ్వజమెత్తారు. అందుకే ఆ పార్టీకి దూరంగా ఉండాలని నిర్ణయించామన్నారు. ఎన్డీఏ కూటమి నుంచి తాము బయటకు వచ్చేశామని ప్రకటించారు. కేవలం రాష్ట్రంలోని బీజేపీ నేతల తీరు కారణంగానే కూటమి నుంచి బయటకు వచ్చేశామని, ఇక, బీజేపీతో పొత్తు ప్రసక్తే లేదని స్పష్టంచేశారు. 2024 లోక్సభ ఎన్నికలలో అన్నాడీఎంకే నేతృత్వంలో కూటమి అని, దీనికి తమ ప్రధాన కార్యదర్శి పళణి స్వామి నేతృత్వం వహిస్తారని ప్రకటించారు. స్వీట్లు పంచి.. ఎన్డీఏకు బై..బై....చెప్పేశామని మునుస్వామి ప్రకటన చేయడంతో రాష్ట్రవ్యాప్తంగా అన్నాడీఎంకే వర్గాలు సంబరాల్లో మునిగిపోయాయి. ఇక బీజేపీతో ఆరేళ్ల బంధం వీడడంతో అన్నాడీఎంకే వర్గాలు బాణా సంచా పేల్చుతూ సందడి చేశారు.ి అన్నాడీఎంకే కార్యాలయం ఎంజీఆర్మాళిగై పరిసరాలు సంబరాల కోలాహలంలో మునిగింది. ఆనంద తాండవం చేస్తూ నేతలు పళణికి మద్దతుగా నినాదాలు చేశారు. ఇదిలా ఉండగా, జాతీయస్థాయిలో ఎన్డీఏ కూటమిలో అన్నాడీఎంకే కీలంగా ఉన్న నేపథ్యంలో తాజా నిర్ణయం మున్ముందు ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందో అనే ఉత్కంఠం ప్రస్తుతం నెలకొంది. రాష్ట్రనేతలెవరూ మాట్లాడొద్దు– బీజేపీ అధిష్టానం అన్నాడీఎంకే నిర్ణయంపై తమ పార్టీ అధిష్టానం సరైన సమయంలో స్పందిస్తుందని బీజేపీ తమిళనాడు అధ్యక్షుడు అన్నామలై వ్యాఖ్యానించారు. కోయబత్తూరులో నా మట్టి... నా ప్రజలు యాత్రలో పాల్గొంటున్న ఆయన్ని మీడియా ప్రతినిధులు సాయంత్రం అన్నాడీఎంకే నిర్ణయంపై ఆయన్ని ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ అధిష్టానం అన్ని అంశాలను గమనిస్తోందని, తగిన సమయంలో స్పందిస్తుందని స్పష్టం చేశారు. ప్రస్తుతం తన యాత్ర విజయవంతంగా కొనసాగుతోందని, తమ పార్టీకి ఏ నిర్ణయమైనా అధిష్టానం తీసుకోవాల్సి ఉంటుందని వెల్లడించారు. తాను కూడా త్వరలో మీడియా ముందుకు వచ్చి అన్ని వివరాలను తెలియజేస్తానని ముగించారు. బీజేపీ ఎమ్మెల్యే, జాతీయ మహిళా మోర్చా అధ్యక్షురాలు వానతీ శ్రీనివాసన్ కూడా అన్నామలై తరహాలోనే స్పందించారు. ఇక అన్నాడీఎంకే ప్రకటనపై బీజేపీ అధిష్టానం సోమవారం రాత్రి స్పందించింది. పొత్తు అంశంపై రాష్ట్రనేతలెవరూ మాట్లాడకూడదని స్పష్టం చేసింది. ఈమేరకు ఆదేశాలు జారీ చేసింది. ముందే చెప్పిన ‘సాక్షి’ అన్నాడీఎంకే, బీజేపీ మధ్య అంతరాలు అంతకంతకూ పెరుగుతున్న నేపథ్యంలో ఈ రెండు పార్టీల మధ్య పొత్తు బెడిసికొట్టే అవకాశం ఉందనే విషయంపై గతంలోనే ‘సాక్షి’ పలుమార్లు విశ్వసనీయ కథనాలు ప్రచురించింది. అన్నాడీఎంకే కార్యదర్శుల సమావేశంలో పళణి స్వామి ఈమేరకు ఎన్డీఏ నుంచి బయటకు వస్తున్నట్లు ప్రకటించే అవకాశం ఉందని స్పష్టం చేసింది. సోమవారం అదే నిజమైంది. -
తమిళనాట ట్విస్ట్.. ఎన్డీఏకు అన్నాడీఎంకే గుడ్బై..
సాక్షి, చెన్నై: దేశ, తమిళనాడు రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఎన్డీఏ కూటమి నుంచి తాము వైదొలగుతున్నట్టు అన్నాడీఎంకే ఓ ప్రకటనలో స్పష్టం చేసింది. ఈ సందర్బంగా అన్నాడీఎంకే నేతలు తమిళనాడు బీజేపీ నేతలపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ సందర్బంగా అన్నాడీఎంకే డిప్యూటీ కోఆర్డినేటర్ కేపీ మునుస్వామి సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. ఈరోజు నుంచి బీజేపీ, ఎన్డీయే కూటమితో అన్నాడీఎంకే తెగతెంపులు చేసుకుంటోంది. నేడు జరిగిన పార్టీ సర్వసభ్య సమావేశంలో ఈ మేరకు అన్నాడీఎంకే ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. బీజేపీ రాష్ట్ర నాయకత్వం మా పార్టీ నేతలపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపణలు చేశారు. గత ఏడాది కాలంగా మా పార్టీ జనరల్ సెక్రటరీ పళనిస్వామి, పార్టీ కేడర్పై అనవసర రాద్దాంతం చేస్తున్నారని మండిపడ్డారు. VIDEO | AIADMK announces to break alliance with BJP in #TamilNadu. "We are breaking our alliance with BJP and NDA. AIADMK will form a new alliance and face upcoming Parliamentary elections," says party. pic.twitter.com/TWpbMrQKPT — Press Trust of India (@PTI_News) September 25, 2023 ఇదే సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు మునుస్వామి. వచ్చే సార్వత్రిక ఎన్నికల కోసం తాము సిద్ధంగా ఉన్నామన్నారు. అన్నాడీఎంకే కొత్త కూటమిని ఏర్పాటు చేసి ఎన్నికలకు వెళ్తుందని స్పష్టం చేశారు. ఇక, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే, బీజేపీ కలిసి పోటీ చేసిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో డీఎంకే భారీ మెజార్టీతో విజయం సాధించింది. Chennai, Tamil Nadu | K P Munusamy, AIADMK Deputy Coordinator says, "AIADMK unanimously passed a resolution in the meeting. AIADMK is breaking all ties with BJP and NDA alliance from today. The state leadership of the BJP has been continuously making unnecessary remarks about our… pic.twitter.com/HSx3NJKKOJ — ANI (@ANI) September 25, 2023 అయితే, తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై దివంగత ముఖ్యమంత్రి జయలలితను విమర్శించడంతో మొదలుపెట్టి ఆ పార్టీ హయాంలో జరిగిన అవినీతి జాబితాను విడుదల చేస్తానని అనడం, అలాగే, దివంగత సీఎం అన్నాదురై పైనా వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం అన్నాడీఎంకే నేతలకు అస్సలు మింగుడుపడలేదు. దీంతో ఆ పార్టీలో సీనియర్లంతా అన్నామలై తీరుపై నిప్పులు చెరిగారు. ఇదే తరుణంలో మాజీ మంత్రి జయకుమార్ సైతం అన్నామలై తీరుపై ఇటీవల కాస్త ఘాటుగానే స్పందించడం, ఢిల్లీలో బీజేపీ నేతలను అన్నాడీఎంకే నేతలు కలవడం వంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి. కాగా, అన్నామలై తీరుపై బీజేపీ పెద్దలకు చెప్పినా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం, వారి ప్రోద్బలం లేకుండా ఆయన అలా మాట్లాడి ఉండరని పళనిస్వామి భావించినట్టు కూడా ఇటీవల వార్తలు వచ్చాయి. దీంతో అన్నాడీఎంకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. మరోవైపు.. ఎన్డీయే కూటమి నుంచి అన్నాడీఎంకే బయటకు రావడంతో ఆ పార్టీ నేతలు తమిళనాడులో సంబురాలు చేసుకున్నారు. పలు ప్రాంతాల్లో బాణాసంచా కాల్పి సంబురాలు జరుపుకుంటున్నారు. #WATCH | Tamil Nadu | AIADMK workers burst crackers in Chennai after the party announces breaking of all ties with BJP and NDA from today. pic.twitter.com/k4UXpuoJhj — ANI (@ANI) September 25, 2023 అన్నాడీఎంకే ప్రకటనపై తమిళనాడు బీజేపీ చీఫ్ కే. అన్నామలై స్పందించారు. ప్రస్తుతం తాను దుర్గ పూజలో ఉన్నానని చెప్పుకొచ్చారు. ఇప్పుడు రాజకీయాలు మాట్లాడదలచుకోలేదని స్పష్టం చేశారు. దీనిపై తర్వాత మాట్లాడుతానని తెలిపారు. #WATCH | Coimbatore | On AIADMK breaking alliance with BJP and NDA, Tamil Nadu BJP president K Annamalai says, "I will speak to you later, I don't speak during Yatra. I will speak later." pic.twitter.com/yObr5hSeT3 — ANI (@ANI) September 25, 2023 ఇది కూడా చదవండి: మీరు డమ్మీ సీఎం, అబద్దాల కోరు.. అందుకే పక్కన పెట్టేశారు -
కర్ణాటక రాజకీయాల్లో కీలక పరిణామం
ఢిల్లీ: కర్ణాటక రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. వచ్చే ఏడాది జరగబోయే సార్వత్రిక ఎన్నికలకు కర్ణాటకలో బీజేపీకి తన పాత మిత్రుడు తోడు నిలిచాడు. వచ్చే ఏడాది జరగనున్న ఎన్నికల్లో ఎన్డీయే, జేడీఎస్ కలిసే పోటీ చేస్తున్నట్లు ప్రకటించాయి. ఈమేరకు జనతాదళ్ సెక్యులర్ (జేడీఎస్) ఎన్డీయేలో చేరుతున్నట్లు స్పష్టం చేసింది. జేడీఎస్ చీఫ్, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి.. బీజేపీ చీఫ్ జేపీ నడ్డా, హోం మంత్రి అమిత్ షాలతో సమావేశమైన అనంతరం ఈ ప్రకటన వెలువడింది. అయితే ఈ చేరిక తదనంతర.. సీట్ల పంపకాలపై స్పష్టత రావాల్సి ఉంది. అయితే.. జేడీఎస్కు నాలుగు సీట్లు కేటాయించినట్లు తెలుస్తోంది. ట్విట్టర్ (ఎక్స్) వేదికగా ఇరుపార్టీల నేతలు ఫొటోలు షేర్ చేస్తూ ఈ మేరకు తెలిపారు. 'ఎన్డీయే, జేడీఎస్ కలిసి పోటీ చేస్తాయని తెలపడానికి సంతోషం వ్యక్తం చేస్తున్నా. ఎన్డీయేలో చేరినందుకు జేడీఎస్కు అభినందనలు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో మరోసారి ఎన్డీయేకి మరింత బలం చేకూర్చినట్లయింది' అని బీజేపీ చీఫ్ జేపీ నడ్డా అన్నారు. Met Former Chief Minister of Karnataka and JD(S) leader Shri H.D. Kumaraswamy in the presence of our senior leader and Home Minister Shri @AmitShah Ji. I am happy that JD(S) has decided to be the part of National Democratic Alliance. We wholeheartedly welcome them in the NDA.… pic.twitter.com/eRDUdCwLJc — Jagat Prakash Nadda (@JPNadda) September 22, 2023 బీజేపీతో చేరిపోతున్నారా..? అని గతవారం కుమారస్వామిని అడగగా.. గణేష్ చతుర్థి తర్వాత ఏదో ఒక ప్రకటన వెలువరిస్తామని ఆయన చెప్పారు. ప్రస్తుతం అధికారికంగా ప్రకటించారు. అయితే.. లోక్సభ ఎన్నికల కోసం నాలుగు సీట్లు జేడీఎస్కే కేటాయించనున్నట్లు తెలుస్తోంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఇక్కడ ఓటమి పాలైంది. ఆ స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. అయితే ఈ పొత్తు సార్వత్రిక ఎన్నికలకే పరిమితం అవుతుందా? రాష్ట్ర రాజకీయాల్లోనూ కొనసాగుతుందా? అనేదానిపై మాత్రం ఇరు వర్గాలు స్పష్టత ఇవ్వలేదు. ఇదీ చదవండి: ఎన్సీపీలో రగులుతున్న వివాదం.. శరద్ పవార్ వర్గం ఎమ్మెల్యేలపై అనర్హత వేటు? -
Times Now Survey On 2024 Elections: మళ్లీ ఎన్డీయేనే..
న్యూఢిల్లీ: దేశంలో ఇప్పటికిప్పుడు లోక్సభ ఎన్నికలు జరిగితే జాతీయ స్థాయిలో అధికార జాతీయ ప్రజాస్వామ్య కూటమి(ఎన్డీయే) వరుసగా మూడోసారి అధికారంలోకి రావడం ఖాయమని ప్రఖ్యాత ‘టైమ్స్ నౌ’సర్వే తేలి్చచెప్పింది. మొత్తం 543 స్థానాలకు గాను ఎన్డీయేకు 296 నుంచి 326, విపక్ష ఇండియా కూటమికి 160 నుంచి 190 స్థానాలు లభిస్తాయని వెల్లడించింది. ఎన్డీయేలోని ప్రధానపక్షమైన బీజేపీ సొంతంగానే 288 నుంచి 314 సీట్లు గెలుచుకుంటుందని స్పష్టం చేసింది. ఇక విపక్ష ఇండియా కూటమిలో ప్రధాన పార్టీ అయిన కాంగ్రెస్ 62 నుంచి 80 స్థానాలకే పరిమితం అవుతుందని పేర్కొంది. ఓట్ల శాతంపరంగా చూస్తే ఎన్డీయేకు 42.60శాతం, ఇండియాకు 40.20 శాతం ఓట్లు లభిస్తాయని సర్వే వివరించింది. ఆంధ్రప్రదేశ్లో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ క్లీన్స్వీప్ చేస్తుందని తేలి్చంది. రాష్ట్రంలో 25 లోక్సభ స్థానాలకు గాను దాదాపు మొత్తం స్థానాలు కైవసం చేసుకుంటుందని వెల్లడించింది. వైఎస్సార్సీపీకి 24 నుంచి 25 సీట్లు లభిస్తాయని తేలి్చచెప్పింది. అంతేకాకుండా ఆ పార్టీ ఓట్ల శాతం కూడా పెరుగనున్నట్లు గుర్తించింది. 2019 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో వైఎస్సార్సీపీ 49.8 శాతం ఓట్లతో 22 స్థానాల్లో నెగ్గింది. ఈసారి 51.3 శాతం ఓట్లతో మొత్తం స్థానాలను తన ఖాతాలు వేసుకుంటుందని టైమ్స్ నౌ సర్వే తేల్చడం విశేషం. అంటే కిందటి ఎన్నికలతో పోలిస్తే ఇప్పుడు ఆ పార్టీ ఓట్ల శాతం 1.50 శాతం పెరుగనున్నట్లు తేటతెల్లమవుతోంది. వైఎస్సార్సీపీ పట్ల నానాటికీ పెరుగుతున్న ప్రజాదరణకు ఇది నిదర్శనమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మరోవైపు తెలంగాణలో అధికార భారత రాష్ట్ర సమితికి(బీఆర్ఎస్) 9 నుంచి 11 లోక్సభ స్థానాలు లభిస్తాయని సర్వే తెలియజేసింది. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేకు 2 నుంచి 3, కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమికి 3 నుంచి 4 స్థానాలు దక్కుతాయని పేర్కొంది. ఇతరులు ఒక సీటు గెలుచుకోనున్నట్లు అంచనావేసింది. ఆంధ్రప్రదేశ్లో ఎవరికెన్ని సీట్లు కూటమి/పార్టీ సీట్లు వైఎస్సార్సీపీ 24–25 ఎన్డీయే 0–1 ఇండియా 0 ఆంధ్రప్రదేశ్లో ఓట్ల శాతం కూటమి/పార్టీ ఓట్ల శాతం వైఎస్సార్సీపీ 51.3 ఎన్డీయే 1.13 ఇండియా – తెలంగాణలో ఎవరికెన్ని సీట్లు కూటమి/పార్టీ సీట్లు బీఆర్ఎస్ 9–11 ఎన్డీయే 2–3 ఇండియా 3–4 ఇతరులు 1 తెలంగాణలో ఓట్ల శాతం కూటమి/పార్టీ ఓట్ల శాతం బీఆర్ఎస్ 38.40 ఎన్డీయే 24.30 ఇండియా 29.90 ఇతరులు 7.40 జాతీయ స్థాయిలో ఏ కూటమికి ఎన్ని సీట్లు (మొత్తం సీట్లు 543) కూటమి సీట్లు ఎన్డీయే 296–326 (ఓట్ల శాతం 42.60) ఇండియా 160–190 (ఓట్ల శాతం 40.20) పార్టీ సీట్లు బీజేపీ 288–314 కాంగ్రెస్ 62–80 వైఎస్సార్సీపీ 24–25 డీఎంకే 20–24 టీఎంసీ 22–24 బీజేడీ 12–14 బీఆర్ఎస్ 9–11 ఆమ్ ఆద్మీ పార్టీ 5–7 ఇతరులు 70–80 ఏ కూటమికి ఎన్ని సీట్లు కూటమి సీట్లు ఓట్ల శాతం ఎన్డీయే 296–326 42.60 ఇండియా 160–190 40.20 మొత్తం సీట్లు 543 – ఏ పారీ్టకి ఎన్ని సీట్లు పార్టీ సీట్లు బీజేపీ 288–314 కాంగ్రెస్ 62–80 వైఎస్సార్సీపీ 24–25 డీఎంకే 20–24 టీఎంసీ 22–24 బీజేడీ 12–14 బీఆర్ఎస్ 9–11 ఆప్ 5–7 ఇతరులు 70–80 -
పవన్ నిలకడ లేనోడు: సీపీఐ నారాయణ
సాక్షి, హైదరాబాద్: జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎన్డీయే మిత్రపక్ష కూటమి సమావేశానికి హాజరు కానున్న నేపథ్యంలో సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ స్పందించారు. ప్రత్యేక ప్యాకేజీని పాచిపోయిన లడ్డూలతో పోల్చి.. ఇవాళ ఎన్డీయేలో ఎలా చేరుతున్నాడో చెప్పాలంటూ పవన్ను ఏకిపారేశాయాన. పవన్ కల్యాణ్ తీరు బాధాకరమని, ఈ తీరు సరికాదని ఆక్షేపించారు. ‘‘పవన్ కల్యాణ్ ఒక దళారీ.. అందుకే టీడీపీ-బీజేపీ మధ్య అనుబంధానం చేస్తున్నాడు. ఈ మధ్యవర్తిత్వం అస్సలు మంచిది కాదు. గతంలో పవనే ప్రత్యేక ప్యాకేజీని పాచిపోయిన లడ్డూలతో పోల్చాడు. అసలు ప్రత్యేక హోదా ఇవ్వని బీజేపీతో ఎలా అంటకాగుతారు? అని నారాయణ పవన్ను నిలదీశారు. పైగా బీజేపీతో కలవడం.. లౌకిక వాదానికి ప్రమాదకరమని అన్నారాయన. నిన్నటి వరకు చేగువేరా దుస్తులు వేసుకుని.. ఇప్పడు సావర్కర్ దుస్తులు వేసుకునేందుకు సిద్ధమయ్యాడు. రేపు గాడ్సేలా తుపాకీ పట్టుకునేందుకు సిద్ధమవుతాడు. అసలు పవన్కు నిలకడ లేదు. కదలకుండా మూడు నిమిషాలు మాట్లాడగలిగితే.. ఆ తర్వాత పవన్ రాజకీయ స్థిరత్వం గురించి మాట్లాడుకోవచ్చు అని ఎద్దేశా చేశారాయన. ఇదీ చదవండి: కారు కూతలు.. అధమ రాజకీయం -
ఎన్డీయే భేటీకి 38 పార్టీలు.. ప్రతిపక్ష కూటమికి 26 పార్టీల మద్దతు!
సార్వత్రిక ఎన్నికలకు సమయం సమీపిస్తుండటంతో అటు అధికార బీజేపీ, ప్రతిపక్షాలు తమ వ్యూహాలకు పదును పెట్టాయి. 2024 ఎన్నికల్లో కేంద్రంలోని మోదీ సర్కార్ను గద్దె దించడమే లక్ష్యంగా దేశంలోని ప్రతిపక్షాలు పావులు కదుపుతున్న వేళ.. అధికార బీజేపీ ప్రతివ్యూహాలు సిద్ధం చేసుకుంటోంది. ఓవైపు కేంద్రంలోని బీజేపీ సర్కార్కు వ్యతిరేకంగా ఐక్యంగా పోరాడేందుకు ప్రధాన విపక్షాలు ప్రయత్నిస్తున్నాయి.ఎన్నికల కార్యచరణ, పొత్తులపై చర్చించేందుకు మిత్రపక్షాలతో కలిసి వరుస సమావేశాలు నిర్వహిస్తున్నాయి. తొలుత బిహార్లోని పాట్నాలో మెగా విపక్షాల భేటీ నిర్వహించగా.. తాజాగా 26 ప్రతిపక్షాలు బెంగుళూరు వేదికగా రెండ్రోజులు(సోమవారం, మంగళవారం) సమావేశం కానున్నాయి. మరోవైపు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సైతం మిత్ర పక్షాలతో కలిసి బల ప్రదర్శనకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలో మంగళవారం ఢిల్లీలో ఎన్డీయే కూటమి(నేషనల్ డెమోక్రటిక్ అలయెన్స్) భేటీ కానుంది. ఈ సమావేశానికి 38 పార్టీలు హాజరు కానున్నాయని బీజేపీ తాజాగా ప్రకటించింది. ఈ మేరకు బీజేపీ జాతీయధ్యక్షుడు జేపీ నడ్డా సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. ఎన్డీయే పరిధి క్రమంగా పెరుగుతోందన్నారు. ప్రధాని మోదీ ప్రభుత్వ పథకాలు, విధానాలపై ప్రజల్లో సానుకూల ప్రభావం ఉందని, ఇది తమలో ఎంతో ఉత్సాహాన్ని నింపుతోందన్నారు. చదవండి: బెంగళూరు వేదికగా ప్రతిపక్ష పార్టీల భేటీ.. లైవ్ అప్డేట్స్.. ఇక ఎన్డీయే సమావేశానికి ఇప్పటికే ఉన్న మిత్ర పక్షాలతోపాటు కొత్తగా చేరిన పార్టీలు సైతం హాజరుకానున్నాయి. ఎన్డీయే మీటింగ్కు ఎన్సీపీ చీలిక వర్గం నేతలు సైతం హాజరు కానున్నారు. అజిత్ పవార్తో కలిసి ఎన్డీయే భేటీకి వెళ్లనున్నట్లు ప్రఫుట్ పటేల్ పేర్కొన్నారు. వీరితోపాటు బిహార్లోనూ మాజీ కేంద్రమంత్రి, ప్రముఖ ఓబీసీ నాయకుడు దివంగత రామ్ విలాస్ పాశ్వాన్ కుమారుడు చిరాగ్ పాశ్వాన్కు కూడా ఎన్డీయే సమావేశానికి ఆహ్వానం అందించింది. ఇదిలా ఉండగా సుహెల్దేవ్ భారతీయ సమాజ్ పార్టీ అధినేత ఓం ప్రకాశ్ రాజ్ భర్ ఎన్డీయేలో చేరుతున్నట్లు ఆదివారం ప్రకటించిన విషయం తెలిసిందే. తూర్పు ఉత్తర ప్రదేశ్లోని ఓబీసీ ఓటర్ల ప్రభావం ఎక్కువగా ఉండే ఎస్బీఎస్పీ.. 2019లో ఎన్డీయే నుంచి వైదొలొగింది. తిరిగి మళ్లీ సొంత గూటికి చేరుతుంది. చదవండి: మరోసారి శరద్ పవార్ను కలిసిన అజిత్ పవార్.. -
పొలిటికల్ భేటీలు.. బిగ్ షాకిచ్చిన కుమారస్వామి
సాక్షి, బెంగళూరు: నేడు బెంగళూరులో ప్రతిపక్షాల సమావేశం నేపథ్యంలో అటు కేంద్రంలో అధికారంలో బీజేపీ అలర్ట్ అయ్యింది. ఈనేపథ్యంలో రేపు(మంగళవారం) ఢిల్లీలో ఎన్డీయే మిత్రపక్షాల సమావేశం జరగనుంది. దీంతో, దేశంలో పొలిటికల్ హీట్ నెలకొంది. ఇక, విపక్షాల సమావేశానికి 26 పార్టీలకు ఆహ్వానం అందింది. ఎన్డీయే కూటమి సమావేశానికి సుమారు 30 పార్టీలకు ఆహ్వానం అందినట్లు సమాచారం. కాగా, కాసేపట్లో ప్రతిపక్ష నేతల సమావేశం ప్రారంభం కానుంది. ఇదిలా ఉండగా.. పొలిటికల్ భేటీల నేపథ్యంలో కర్ణాటకలో జేడీఎస్ అధినేత, మాజీ సీఎం హెచ్డీ కుమారస్వామి కీలక వ్యాఖ్యలు చేశారు. తాజాగా కుమారస్వామి మాట్లాడుతూ.. జేడీఎస్ను విపక్షాలు తమ భాగస్వామిగా భావించడం లేదు. ఈ నేపథ్యంలో విపక్షాల మహాకూటమిలో తాము చేరే ప్రసక్తి లేదన్నారు. ఇక, ఇదే సమయంలో ఎన్డీయే కూటమి సమావేశంపై కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్డీయే నుంచి తమకు ఎలాంటి ఆహ్వానం అందలేదన్నారు. ఆ ఫ్రంట్నూ చూద్దామంటూ పరోక్షంగా సంకేతాలిచ్చారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. On joint Opposition meeting in Bengaluru, JD(S) leader HD Kumaraswamy says, "Opposition never considered JD(S) a part of them. So, there is no question of JD(S) being a party of any Mahagathbandhan." On any invitation from NDA, he says, "NDA has not invited our party for any… pic.twitter.com/hPoH2ClgDw — ANI (@ANI) July 17, 2023 మరోవైపు.. రానున్న లోక్సభ ఎన్నికల్లో కన్నడనాట బీజేపీ, జేడీఎస్ పార్టీలు పొత్తు పెట్టుకోవాలని జాతీయస్థాయి నాయకులు భావిస్తుంటే, రాష్ట్ర బీజేపీ ఇందుకు సుముఖంగా లేదని తెలుస్తోంది. తమ ఓటు బ్యాంకును అప్పనంగా జేడీఎస్కు అప్పజెప్పడమేనని రాష్ట్ర బీజేపీ నాయకులు ఆందోళనతో ఉన్నారు. ఈ ఏడాది మేలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, జేడీఎస్లను కాదని ప్రతిపక్ష కాంగ్రెస్ విజయదుందుభి మోగించి సర్కారును ఏర్పాటు చేయడం తెలిసిందే. మరో ఏడాదిలో సార్వత్రిక ఎన్నికలు రాబోతున్నాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ ఎక్కువ సీట్లు గెలవకుండా చేతులు కలపాలని జేడీఎస్, బీజేపీలు కోరుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇది కూడా చదవండి: వీడియో: వందే భారత్ రైలులో మంటలు.. భయంతో పరుగు తీసిన ప్రయాణీకులు -
18న ఎన్డీఏ భేటీకి రండి
న్యూఢిల్లీ: ఎన్డీయే పక్షాలతో ఈనెల 18న జరగబోయే కీలక భేటీకి పలు పార్టీల అగ్రనేతలను బీజేపీ ఆహ్వానిస్తోంది. బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా వారికి ఈ మేరకు లేఖ రాశారు. లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) నేత చిరాగ్ పాశ్వాన్కూ లేఖ అందింది. ఆయనతో కేంద్ర మంత్రి నిత్యానంద్ రాయ్ ఇప్పటికే భేటీ కావడం తెలిసిందే. బిహార్ మాజీ సీఎం, హిందుస్తానీ ఆవామ్ మోర్చా చీఫ్ జితన్ రామ్ మాంఝీ కూడా హాజరవుతారని సమాచారం. మోదీ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చాక ఇంతటి విస్తృతస్థాయిలో ఎన్డీయే భేటీ జరగనుండటం ఇదే తొలిసారి. -
విపక్షాల ఐక్యతకు కౌంటర్గా ఎన్డీయే బలప్రదర్శన!
సాక్షి, న్యూఢిల్లీ: 2024 సార్వత్రిక ఎన్నికలకు దృష్టిలో ఉంచుకునే రాజకీయ పరిణామాలు శరవేగంగా.. రోజుకో మలుపు తిరుగుతున్నాయి. బీజేపీకి అధికారం దూరం చేసే క్రమంలో.. సాధ్యమైనంత వరకు ఐక్యంగా ఉండాలని విపక్షాలు ప్రయత్నిస్తున్నాయి. అవసరమైతే ఉమ్మడి ప్రధాని అభ్యర్థిని నిలపాలనే యోచనలోనూ ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈలోపే బీజేపీ మరో ప్లాన్తో ముందుకు వచ్చింది. విపక్ష కూటమి సమావేశం కంటే ముందే ఎన్డీయే కూటమి బలప్రదర్శన చేయాలని నిర్ణయించుకంది. ఈ మేరకు జులై 18వ తేదీన ఎన్డీయే విస్తృతస్థాయి సమావేశానికి సిద్ధమవుతున్న బీజేపీ.. మిత్రపక్షాలకు సమాచారం అందించింది. ఎన్డీయే పక్షాలనే కాదు.. ఏ కూటమికి చెందని కొన్ని పార్టీలకు సైతం ఆహ్వానం పంపినట్లు తెలుస్తోంది. ఈ లిస్ట్లో అకాలీదళ్, చిరాగ్ పాశ్వాన్ కూడా ఉన్నారు. మరోవైపు కర్ణాటకలో జేడీఎస్తోనూ పొత్తు కోసం యత్నిస్తున్న బీజేపీ.. ఆ పార్టీకి ఆహ్వానం పంపింది. ఇక తమిళనాడులో గత కొంతకాలంగా విబేధాలతో దూరంగా ఉంటూ వస్తున్న మిత్రపక్షం అన్నాడీఎంకేకు సైతం ఆహ్వానం పంపింది. పార్లమెంట్ సమావేశాలకు ముందరే జరగనున్న ఈ కీలక సమావేశం ద్వారా విపక్షాల ఐక్యతకు కౌంటర్ ఇవ్వాలని బీజేపీ భావిస్తోంది. మంత్రివర్గ విస్తరణపై సమావేశం ప్రధాని నరేంద్ర మోదీ నివాసంలో ఇవాళ(గురువారం) మంత్రివర్గ పునర్వవ్యస్థీకరణ భేటీ జరిగింది. ప్రధాని మోదీ, అమిత్ షా, జేపీ నడ్డా కసరత్తు చేసినట్లు తెలుస్తోంది. నాలుగు గంటలకు పైగా సాగిన సమావేశంలో.. కేబినెట్ మార్పులు చేర్పులపైనే ప్రధానాంశంగా చర్చ జరిగింది. ఈ శని లేదంటే ఆదివారం మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఎన్నికల దృష్ట్యానే ఈ కేబినెట్ కూర్పు ఉండనున్నట్లు తెలుస్తోంది. -
నితీశ్కుమార్ తిరిగి ఎన్డీయేలోకి?!
అతిత్వరలో బీహార్లోనూ మహారాష్ట్ర తరహా రాజకీయ సంక్షోభం నెలకొంటుంది. అదీ అధికార పక్షంలోనే!. నితీశ్ కుమార్ వైఖరి నచ్చక కొందరు ఎమ్మెల్యేలు జేడీయూ నుంచి బయటకు వచ్చేస్తారు. ప్రభుత్వం కూలిపోయే పరిస్థితుల నడుమ నితీశ్ మరో దారి లేక తిరిగి బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమిలోకి అడుగు పెడతారు!!. మహారాష్ట్రలో అజిత్ పవార్తో పాటు ఎనిమిది మంది ఎన్సీపీ ఎమ్మెల్యేల జంపింగ్ పరిణామం నడుమ.. తర్వాతి వంతు బీహార్దేనంటూ రాజకీయ విశ్లేషణలు మొదలయ్యాయి. పైగా ప్రభుత్వం కూలిపోయే తరుణంలో గత్యంతరం లేని స్థితిలో నితీశ్ తిరిగి ఎన్డీయే కూటమిలో చేరతారంటూ పలు మీడియా విశ్లేషణలు జరుగుతున్నాయి. దీనికి తోడు గత నాలుగైదు రోజులుగా నెలకొన్న పరిస్థితులూ ఆ అనుమానాలకు బలం చేకూర్చేలా ఉండడంతో.. నితీశ్ వైఖరిపైనా అనుమానాలు కలుగుతూ వస్తున్నాయి. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వాన్ని వచ్చే సార్వత్రిక ఎన్నికలను విపక్షాలు నిర్వహించదల్చిన భేటీ.. మహారాష్ట్ర ఎన్సీపీ ఎపిసోడ్ కారణంగా వాయిదా పడింది. అదే సమయంలో బీహార్ గత నాలుగు పర్యటనలో నితీశ్ ప్రభుత్వంపై దుమ్మెత్తిపోసిన బీజేపీ అగ్రనేత, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా.. ఆశ్చర్యంగా తాజా పర్యటనలో మాత్రం పన్నెత్తి మాట అనలేదు. పైగా అవినీతి పక్షంతో పొత్తు(జేడీయూ మిత్రపక్షం ఆర్జేడీకి) దేనికి అంటూనే.. దానిని దూరంగా ఉండాలంటూ నితీశ్ సర్కార్కు పరోక్ష సూచన చేశారు కూడా. ఈ నేపథ్యంలోనే నితీశ్.. పాత మిత్ర కూటమికి మళ్లీ దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారంటూ ఊహాగానాలు మొదలయ్యాయి. 2017లో ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్పై బీజేపీ అవినీతి ఆరోపణలు చేయగా.. నితీశ్ కుమార్ ఆర్జేడీతో బంధాన్ని తెంచుకుని బీజేపీతో పొత్తుకు ముందుకు వెళ్లారు. అయితే.. తాజా ఊహాగానాలను పటాపంచల్ చేశారు బీహార్ బీజేపీ సీనియర్ నేత, రాజ్యసభ ఎంపీ సుశీల్ మోదీ. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అదంతా మీడియా సృష్టేనని తేల్చిపడేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ నితీశ్ను బీజేపీ దగ్గరకు తీయబోదని స్పష్టం చేశారాయన. ‘‘బీజేపీకి ఆయన(నితీశ్) దూరం జరిగాక అమిత్ షా ఓ స్పష్టత ఇచ్చారు. ఇకపై బీజేపీ ఎప్పటికీ నితీశ్ను అంగీకరించబోదని. అలాంటప్పుడు నితీశ్ మళ్లీ ఎన్డీయేలో చేరే ప్రస్తావన ఎక్కడి నుంచి వస్తుంది! అని సుశీల్ మోదీ మీడియాతో స్పష్టం చేశారు. అయితే.. బీజేపీకి చెందిన మరో సీనియర్, కేంద్ర మంత్రి రామ్దాస్ అథావాలే మాత్రం మరో తరహా ప్రకటన ఇచ్చారు. బీహార్లోనే కాదు.. యూపీలోనూ మహారాష్ట్ర పరిణామాలు ఏర్పడొచ్చని చెబుతున్నారాయన. సోమవారం మధ్యాహ్నం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీహార్ జేడీయూలో, ఉత్తర ప్రదేశ్ ఎస్పీలోనూ ఆయా పార్టీ చీఫ్ల మీద ఉన్న అసంతృప్తితో కొందరు బయటకు రావడం ఖాయం. ఎస్పీలో జయంత్ చౌద్రి ఎన్డీయే కూటమిలో చేరే అవకాశం లేకపోలేదు అని సంచలన ప్రకటన చేశారు అథావాలే. ఇదిలా ఉంటే.. ఈ ఏడాది జనవరిలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ భేటీలో జేడీయూతోగానీ, నితీశ్ కుమార్ను గానీ దగ్గరకు తీయొద్దంటూ ఏకంగా ఓ తీర్మానం పాస్ చేసింది పార్టీ. ఇదిలా ఉంటే.. మహా పరిణామాల నేపథ్యంలో విపక్షాల భేటీ వాయిదా పడిందనే ప్రచారానికి చెక్ పెడుతూ.. ఈ నెలలోనే భేటీ ఉంటుందని విపక్షాల తరపున ఒక ప్రకటన వెలువడింది కూడా. ఇదీ చదవండి: ఎన్పీసీని బలోపేతం చేస్తాం.. పునర్నిర్మిస్తాం! -
ఇలాంటివి చాలా చూశాను.. ఎవ్వరినీ విడిచిపెట్టను..
ముంబై: ఇంతకాలం నమ్మిన బంటుగా ఉన్న అజిత్ పవార్ మరోసారి ప్లేటు ఫిరాయించడంతో ఆత్మరక్షణలో పడింది ఎన్సీపీ నాయకత్వం. ఎన్సీపీలో ఎటువంటి చీలిక లేదంటూనే అజిత్ పవార్ ప్రఫుల్ పటేల్ వంటి కీలక నాయకులతో వెళ్లి షిండే ప్రభుత్వంలో చేరడంపై శరద్ పవార్ తీవ్రస్థాయిలో స్పందించారు. ఇలాంటివి నా రాజకీయ జీవితంలో చాలా చూశానని పార్టీ వ్యతిరేక చర్యలకు పాల్పడిన వారిని విడిచిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. రెండు రోజుల క్రితమే ప్రతిపక్ష నాయకుడి పదవికి రాజీనామా చేసిన అజిత్ పవార్ ఆదివారం 40 మంది ఎమ్మెల్యేలతో షిండే ప్రభుత్వానికి మద్దతు తెలిపి డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం కూడా చేశారు. దీంతో హుటాహుటిన ఒకచోట చేరిన ఎన్సీపీ వర్గాలు ప్రెస్ మీట్ నిర్వహించి పార్టీ ధిక్కరణకు పాల్పడినవారిపై కఠిన చర్యలు తప్పవని అన్నారు. నాకు ఇలాంటివి కొత్తేమీ కాదు. 1980లో కూడా ఇలాగే 58 మంది ఎమ్మెల్యేలు ఉన్న మా పార్టీకి కొంతమంది వెన్నుపోటు పొడిచారు. ఆరోజు నాతో ఆరుగురు మాత్రమే మిగిలినప్పుడు కూడా నేను భయపడకుండా మళ్ళీ పార్టీని యధాస్థితికి తీసుకొచ్చాను. అప్పుడు నన్ను విడిచి వెళ్లిన వారంతా వారి నియోజకవర్గాల్లో ఓటమి పాలయ్యారని గుర్తు చేశారు. పార్టీ అభీష్టానికి వ్యతిరేకంగా వ్యవహరించిన ప్రతి ఒక్కరి పైనా కఠిన చర్యలు తీసుకుంటామని, పార్టీని కూడా పునర్నిర్మించుకుంటామని అన్నారు. పార్టీని విడిచి వెళ్లిన వారిలో కొంతమందిపై బీజేపీ ప్రభుత్వం అవినీతి ఆరోపణలు చేసిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుని ఉంటారని ఆయన ఆరోపించారు. అయితే నాతో పాటు చాలాకాలం కలిసి పనిచేసి, నేను వర్కింగ్ ప్రెసిడెంట్లుగా నియమించిన ప్రఫుల్ పటేల్, సునీల్ తత్కరే కూడా వారితో వెళ్లడమే నన్ను కొంచెం బాధించిందని అన్నారు. ఇది కూడా చదవండి: ఇప్పటికీ మాది అదే పార్టీ.. ఆ గుర్తు పైనే పోటీ చేస్తాం: అజిత్పవార్