Rinku Singh
-
Ind vs Eng: టీమిండియాకు శుభవార్త!.. పాపం అతడిపై వేటు!
ఇంగ్లండ్తో నాలుగో టీ20(India Vs England)కి ముందు టీమిండియాకు శుభవార్త! నయా ఫినిషర్ రింకూ సింగ్(Rinku Singh) పూర్తి ఫిట్నెస్ సాధించాడు. పుణె మ్యాచ్లో ఆడేందుకు అతడు సన్నద్ధమవుతున్నాడు. ఈ విషయాన్ని టీమిండియా అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డష్కాటే ధ్రువీకరించాడు.భారత క్రికెట్ జట్టు ప్రస్తుతం ఇంగ్లండ్తో టీ20 సిరీస్తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఐదు మ్యాచ్ల సిరీస్లో భాగంగా ఇప్పటికి మూడు పూర్తి చేసుకుంది. కోల్కతా, చెన్నై టీ20లలో గెలిచిన టీమిండియా.. రాజ్కోట్(Rajkot T20I)లో మాత్రం విఫలమైంది. బ్యాటర్ల వైఫల్యం కారణంగా 26 పరుగుల తేడాతో ఓడిపోయింది. దీంతో ఇంగ్లండ్పై ఆధిక్యం 2-1కు తగ్గింది.వెన్ను నొప్పి కారణంగా..ఇదిలా ఉంటే.. కోల్కతా వేదికగా జరిగిన తొలి టీ20 తుదిజట్టులో చోటు దక్కించుకున్న రింకూ సింగ్.. మిగిలిన రెండు మ్యాచ్లకు మాత్రం దూరమయ్యాడు. వెన్ను నొప్పి కారణంగా అతడు ఇబ్బందిపడుతున్నట్లు బీసీసీఐ వెల్లడించింది. అయితే, తాజా సమాచారం ప్రకారం అతడు ఫిట్నెస్ సాధించినట్లు తెలుస్తోంది.జురెల్పై వేటు పడే అవకాశంఈ విషయం గురించి కోచ్ డష్కాటే మాట్లాడుతూ.. అతడు బుధవారం నెట్స్లో ప్రాక్టీస్ చేసినట్లు తెలిపాడు. ఒకవేళ రింకూ తిరిగి వస్తే బ్యాటింగ్ ఆర్డర్ మరింత పటిష్టమవుతుంది. అయితే, అతడు వస్తే ధ్రువ్ జురెల్పై వేటు పడే అవకాశం ఉంది.మూడో టీ20లో ఎనిమిదో స్థానంలో బరిలోకి దిగిన జురెల్.. ఒత్తిడిలో చిత్తైపోయాడు. నాలుగు బంతులు ఎదుర్కొని కేవలం రెండు పరుగులే చేసి అవుటయ్యాడు. నిజానికి బ్యాటింగ్ ఆర్డర్లో ఇంకాస్త ముందు వస్తే పరిస్థితి వేరేగా ఉండేది. కానీ లెఫ్ట్- రైట్ కాంబినేషన్ కోసం వాషింగ్టన్ సుందర్- అక్షర్ పటేల్లను ఆరు, ఏడు స్థానాల్లో పంపడంతో జురెల్కు దెబ్బ పడింది.రింకూ లేదంటే.. ఆ ఇద్దరిలో ఒకరు?ఇక రింకూకు కోల్కతా టీ20లో బ్యాటింగ్ చేసే అవకాశమే రాలేదు. గతేడాది కూడా అతడి ప్రదర్శన అంతంతమాత్రంగానే ఉంది. పద్దెనిమిది మ్యాచ్లలో కలిపి అతడు 245 పరుగులే చేశాడు. అయితే, 2023లో మాత్రం 12 మ్యాచ్లలోనే 262 పరుగులతో సత్తా చాటాడు. ఈ నేపథ్యంలో రింకూ సింగ్పై సెలక్టర్లు నమ్మకం ఉంచుతారా? లేదంటే.. శివం దూబే, రమణ్దీప్ సింగ్లలో ఒకరికి తుదిజట్టులో చోటిస్తారా? అన్నది ఆసక్తికరంగా మారింది.కాగా శుక్రవారం పుణె వేదికగా టీమిండియా- ఇంగ్లండ్ మధ్య నాలుగో టీ20 జరుగనుంది. ఈ మ్యాచ్లో గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలని సూర్య సేన పట్టుదలగా ఉండగా.. 2-2తో సమం చేయాలని బట్లర్ బృందం భావిస్తోంది. ఇక ఇరుజట్ల మధ్య ఆదివారం ముంబైలో ఆఖరిదైన ఐదో టీ20 జరుగుతుంది.ఇంగ్లండ్తో టీ20లకు భారత జట్టు(అప్డేటెడ్)సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అక్షర్ పటేల్ (వైస్ కెప్టెన్), సంజూ శాంసన్ (వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, హర్షిత్ రాణా, అర్ష్దీప్ సింగ్, మహ్మద్ షమీ, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్, వాషింగ్టన్ సుందర్, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), శివం దూబే, రమణ్దీప్ సింగ్.చదవండి: చరిత్ర సృష్టించిన సౌరాష్ట్ర బ్యాటర్.. రంజీల్లో ఆల్టైమ్ రికార్డు -
తండ్రికి స్పోర్ట్స్ బైక్ గిఫ్ట్ ఇచ్చిన రింకూ సింగ్.. వీడియో
టీమిండియా స్టార్ ప్లేయర్, కేకేఆర్ ఫినిషర్ రింకూ సింగ్ డౌన్ టు ఎర్త్ క్రికెటర్లలో ఒకడు. పేద కుటుంబం నుంచి వచ్చిన రింకూ సింగ్.. తనకు ఇష్టమైన ఆటకోసం ఎన్నో కష్టాలు పడ్డాడు. ఒకొనొక దశలో స్వీపర్గా పనిచేసిన రింకూ.. ఇప్పుడు భారత టీ20 జట్టులో కీలక ఆటగాడిగా కొనసాగుతున్నాడు.అయితే రింకూ సింగ్ విజయం వెనక అతడి తండ్రిది ఖన్చంద్ర సింగ్ కీలక పాత్ర. ఖన్చంద్ర సిలిండర్ల మోస్తే వచ్చే డబ్బుతో రింకూ క్రికెట్ ఆడేవాడు. అతడి సంపాదనతో కుటుంబం మొత్తం గడిచేది. అయితే తాజాగా రింకూ సింగ్ తన తండ్రిపై ప్రేమను చాటుకున్నాడు. తన తండ్రికి రింకూ ఖరీదైన నింజా స్పోర్ట్స్ బైక్ను గిఫ్ట్గా ఇచ్చాడు. ఆ బైక్ ఖరీదు రూ. 3.19 లక్షలగా ఉన్నట్లు తెలుస్తోంది. నింజా స్పోర్ట్స్ బైక్తో రింకూ తండ్రి అలీఘడ్లో చక్కర్లు కొడుతున్నాడు. ఆ సిటీలోని చిన్న చిన్న వీధుల్లో అతను కవాసాకి నింజా బైక్ను రైడ్ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది.కాగా తన తనయుడు స్టార్ క్రికెటర్ అయినప్పటికి.. ఖన్చంద్ర ఇంకా వంటగ్యాస్ సిలిండర్లను సరఫరా చేసే పనని వదలకపోవడం విశేషం. మరోవైపు రింకూ సమాజ్వాదీ పార్టీ ఎంపీ ప్రియా సరోజ్ను పెళ్లి చేసుకోనున్న విషయం తెలిసిందే. వీరిద్దరి పెళ్లికి ఇరు కుటుంబాలు అంగీకరించారు. త్వరలోనే ఎంగేజ్మెంట్ జరిగే అవకాశముంది. కాగా రింకూ సింగ్ ప్రస్తుతం ఇంగ్లండ్తో టీ20 సిరీస్కు సిద్దమవుతున్నాడు. బుధవారం జరగనున్న తొలి టీ20లో రింకూ ఆడనున్నాడు.చదవండి: IND vs ENG: ఇంగ్లండ్తో తొలి టీ20.. భారత తుది జట్టు ఇదే! అతడికి నో ఛాన్స్? View this post on Instagram A post shared by Sonu Lefti (@sonulefti0700) -
రింకూ సింగ్, ఎంపీ ప్రియా సరోజ్ల పెళ్లి.. అఫీషియల్ అప్డేట్
టీమిండియా విధ్వంసకర బ్యాటర్, టీ20 స్పెషలిస్ట్ రింకూ సింగ్.. సమాజ్వాదీ పార్టీ ఎంపీ (లోక్సభ) ప్రియా సరోజ్ పెళ్లాడబోతున్నారు. ఈ విషయాన్ని ప్రియా తండ్రి, సమాజ్వాదీ పార్టీ ఎమ్మెల్యే తూఫానీ సరోజ్ ధృవీకరించారు. రింకూ, ప్రియాల పెళ్లికి ఇరు కుటుంబాలు అంగీకరించాయని తూఫానీ సరోజ్ తెలిపారు. ప్రస్తుతం ప్రియా తిరువనంతపురంలో జరుగుతున్న పార్లమెంటరీ కమిటీ మీటింగ్తో బిజీగా ఉందని తూఫానీ పేర్కొన్నారు. రింకూ కూడా త్వరలో ఇంగ్లండ్తో జరుగబోయే టీ20 సిరీస్ సన్నాహకాల్లో నిమగ్నమయ్యాడని అన్నారు. రింకూ, ప్రియాల నిశ్చితార్థం జరిగిందని గత కొద్ది రోజులుగా సోషల్మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు. శీతాకాల పార్లమెంట్ సమావేశాలు అనంతరం రింకూ, ప్రియా ఎంగేజ్మెంట్, పెళ్లి తేదీలను వెల్లడిస్తామని తెలిపారు. లక్నోలో ఎంగేజ్మెంట్ వేడుక జరుగుతుందని స్పష్టం చేశారు.కాగా, రింకూ సింగ్, ప్రియా సరోజ్ గత కొంతకాలంగా ప్రేమలో ఉన్నారు. పెద్దల అంగీకారంతోనే పెళ్లి చేసుకోవాలని వారు డిసైడయ్యారు. తాజాగా ఇరువురి కుటుంబాలు పెళ్లికి అంగీకరించినట్లు ప్రియా తండ్రి వెల్లడించారు. స్నేహితురాలి తండ్రి ద్వారా ప్రియాకు రింకూతో పరిచయం ఏర్పడినట్లు తెలుస్తుంది.27 ఏళ్ల రింకూ భారత్ తరఫున 30 టీ20లు, రెండు వన్డేలు ఆడాడు. 26 ఏళ్ల ప్రియా ప్రస్తుతం ఉత్తర్ప్రదేశ్లోని మచ్లిషెహర్ లోక్సభ స్థానం నుంచి ఎంపీగా ఉన్నారు. 2024 జనరల్ ఎలెక్షన్స్లో ప్రియా సిట్టింగ్ బీజేపీ ఎంపీ బీపీ సరోజ్పై 35000 ఓట్ల తేడాతో గెలుపొందింది. ప్రియాకు ఇవే తొలి ఎన్నికలు. వారణాసికి చెందిన ప్రియా పాలిటిక్స్లోకి రాక ముందు 'లా'లో బ్యాచ్లర్ డిగ్రీ పొందింది. ప్రియా తన ఉన్నత చదువులను ఢిల్లీలో పూర్తి చేసింది. ప్రియా తండ్రి తూఫానీ సరోజ్ మూడు సార్లు ఎంపీగా పని చేశారు. ప్రస్తుతం అతను జౌన్పూర్ జిల్లాలోని కేరాకట్ అసెంబ్లీ స్థానం నుంచి సమాజ్వాదీ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నారు. కాగా, ఈ నెల 22 నుంచి ఇంగ్లండ్తో టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్లో రింకూ సింగ్ పాల్గొననున్నాడు. ఇందు కోసం అతను కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో టీమిండియాతో కలిసి ప్రాక్టీస్ చేస్తున్నాడు. -
అది నిజమే.. కానీ..: రింకూ ‘ఎంగేజ్మెంట్’లో ట్విస్ట్!
టీమిండియా స్టార్ క్రికెటర్ రింకూ సింగ్(Cricketer Rinku Singh)కు ఎంపీ ప్రియా సరోజ్(Priya Saroj)తో నిశ్చితార్థం జరిగినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే, ఈ వార్తల్ని ప్రియా తండ్రి తుఫానీ సరోజ్ ఖండించారు. ఇరు కుటుంబాల మధ్య రింకూ- ప్రియల పెళ్లి గురించి చర్చలు జరుగుతున్న మాట వాస్తవమేనని.. అయితే, ఎంగేజ్మెంట్ మాత్రం కాలేదన్నారు.పెళ్లి ముచ్చట్లు జరుగుతున్నాయి ‘‘ప్రియ ప్రస్తుతం తిరువనంతపురంలో ఉంది. రింకూతో ఆమె నిశ్చితార్థం జరిగినట్లు వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవం. ఇరు కుటుంబాలు ఈ విషయం గురించి చర్చిస్తున్నాయి. అయితే, రింకూ- ప్రియలపై పెళ్లిపై ఇంతవరకు నిర్ణయం తీసుకోలేదు’’ అని తెలిపారు. రింకూ కుటుంబం నుంచే పెళ్లి ప్రతిపాదన వచ్చిందని తుఫానీ సరోజ్ ఈ సందర్భంగా తెలిపారు. విధ్వంసకర ఇన్నింగ్స్తో వెలుగులోకిమరోవైపు.. నిశ్చితార్ధం జరిగిందన్న వార్తలను రింకూ సింగ్ కుటుంబ సభ్యులు ఖండించడం గమనార్హం. కాగా ఐపీఎల్(IPL)లో కోల్కతా నైట్రైడర్స్ తరఫున విధ్వంసకర ఇన్నింగ్స్తో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చాడు ఉత్తరప్రదేశ్ కుర్రాడు రింకూ సింగ్. గుజరాత్ టైటాన్స్తో మ్యాచ్లో ఒకే ఓవర్లో ఐదు సిక్సర్లు బాది సత్తా చాటాడు. అద్భుతమైన షాట్లు, భారీ హిట్టింగ్తో అభిమానుల మనసు గెలుచుకున్నాడు. ఈ క్రమంలోనే అంతర్జాతీ క్రికెట్లోనూ అడుగుపెట్టాడు రింకూ సింగ్. భారత జట్టు తరఫున ఎన్నో విలువైన ఇన్నింగ్స్లు ఆడిన రింకూ సింగ్... నయా ఫినిషర్గా నీరాజనాలు అందుకుంటున్నాడు. ఇప్పటి వరకు టీమిండియా తరఫున 27 ఏళ్ల రింకూ సింగ్ ఇప్పటి వరకు 30 టీ20లు, రెండు వన్డేలు ఆడాడు. ఆయా ఫార్మాట్లలో 507, 55 పరుగులు సాధించాడు. ఇక ఐపీఎల్ మెగా వేలం-2025కి ముందు కోల్కతా ఫ్రాంఛైజీ అతడిని రూ. 13 కోట్లకు అట్టిపెట్టుకుంది.ఆ ఫొటోలతో బలపడిన ప్రచారంఅయితే, జీవితంలోనూ రింకూ కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించనున్నట్లు శుక్రవారం వార్తలు వచ్చాయి. అందుకు తగ్గట్టుగానే రింకూ సోదరి నేహా సింగ్ తమ ఇంట్లో బంధువుల కోలాహలం నిండిన ఫొటోలు షేర్ చేసింది. తన అన్నయ్యను ప్రేమగా హత్తుకుని ఉన్న ఫొటోలు పంచుకుంటూ ప్రేమను కురిపిస్తున్నట్లుగా ఎమోజీలు జతచేసింది. ఈ నేపథ్యంలో క్రికెట్ వర్గాల్లో రింకూ ఎంగేజ్మెంట్ వా ర్తలు విపరీతరం సర్క్యులేట్ అయ్యాయి.యువ ఎంపీగా ప్రస్థానంఉత్తరప్రదేశ్కు చెందిన రాజకీయ నాయకురాలు ప్రియా సరోజ్తో త్వరలో రింకూ ఏడడుగులు వేయనున్నట్లు ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో ప్రియా సరోజ్ గురించి నెటిజన్లు ఆరా తీయడం మొదలుపెట్టారు.కాగా ప్రియా సమాజ్వాదీ పార్టీ తరఫున 2024 సాధారణ ఎన్నికల్లో పోటీ చేశారు. 25 ఏళ్ల వయసులోనే మచిలీషహర్ నియోజకవర్గం నుంచి ఆమె ఎంపీగా విజయం సాధించారు. ప్రస్తుతం లోక్సభ ఎంపీగా కొనసాగుతున్నారు. పార్లమెంట్లో తనదైన శైలిలో స్పీచ్లు ఇస్తూ యువ నేతల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు. ఇక ప్రియా తండ్రి తుఫానీ సరోజ్ గతంలో మూడుసార్లు ఎంపీగా పనిచేయడంతో పాటు ప్రస్తుతం ఉత్తరప్రదేశ్లోని కేరాకట్ ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నారు. ఆయనే స్వయంగా కూతురి ఎంగేజ్మెంట్ గురించి స్పందించడంతో వదంతులకు చెక్ పడింది.చదవండి: CT 2025: వన్డేల్లోనూ అదరగొడతాడు.. అతడిని సెలక్ట్ చేయండి: సెహ్వాగ్ Rinku Singh gets engaged to Samajwadi Party MP Priya Saroj. 💍- Many congratulations to them! ❤️ pic.twitter.com/7b7Hb0D2Em— Mufaddal Vohra (@mufaddal_vohra) January 17, 2025 View this post on Instagram A post shared by Neha ❤️ (@_neha_singh_0700) -
ఎంపీతో రింకూ సింగ్ నిశ్చితార్థం? ఆమె ఎవరంటే?
టీమిండియా క్రికెటర్ రింకూ సింగ్(Cricketer Rinku Singh Engagement) త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు. సమాజ్వాదీ పార్టీ ఎంపీ ప్రియా సరోజ్(MP Priya Saroj)తో అతడి నిశ్చితార్థం జరిగినట్లు సమాచారం. రింకూ- ప్రియాల ఎంగేజ్మెంట్కు సంబంధించిన వివరాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.చెల్లెలితో రింకూ సింగ్బంధువుల కోలాహలంఈ నేపథ్యంలో కాబోయే వధూవరులకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. అయితే, అటు రింకూ గానీ.. ఇటు ప్రియా గానీ నిశ్చితార్థం విషయమై అధికారికంగా స్పందించలేదు. అయితే, రింకూ చెల్లెలు నేహా సింగ్(Neha Singh) తన అన్నతో కలిసి ఉన్న ఫొటోలను తాజాగా షేర్ చేసింది. ఇందులో బంధువుల కోలాహలంతో పాటు.. ఇల్లంతా అలంకరించినట్లుగా కనిపిస్తోంది. దీనిని బట్టి నిశ్చితార్థం జరిగినట్లు నెటిజన్లు అంచనాకు వస్తున్నారు.పేద కుటుంబంలో జన్మించిన రింకూకాగా ఉత్తరప్రదేశ్లోని అలీఘర్లోని పేద కుటుంబంలో రింకూ కుమార్ సింగ్ జన్మించాడు. అతడి తండ్రి ఇంటింటికి గ్యాస్ సిలిండర్లు వేసి కుటుంబాన్ని పోషించేవాడు. ఒక్కోసారి రింకూ కూడా తండ్రికి ఆరోగ్యం సహకరించనపుడు సిలిండర్లు వేసేవాడు. ఒకానొక సమయంలో స్వీపర్గానూ రింకూ పనిచేశాడు.కోటీశ్వరుడిగా ఎదిగిన రింకూఅయితే, ఎన్ని కష్టాలు ఎదురైనా రింకూ మాత్రం క్రికెట్పై ప్రేమను వదులుకోలేదు. ఒక్కో మెట్టు ఎక్కుతూ తొలుత ఐపీఎల్లో అడుగుపెట్టిన ఈ ఎడమచేతి వాటం బ్యాటర్.. కోల్కతా నైట్ రైడర్స్ తరఫున అదరగొట్టాడు. ఈ క్రమంలో టీమిండియా తరఫున అంతర్జాతీయ క్రికెట్లోనూ ఎంట్రీ ఇచ్చి నయా ఫినిషర్గా ఎదిగాడు. ఆర్థికంగానూ స్థిరపడ్డాడు.ఇప్పటి వరకు భారత్ తరఫున 27 ఏళ్ల రింకూ సింగ్ 30 టీ20లు, రెండు వన్డేలు ఆడి 507, 55 పరుగులు సాధించాడు. ఇక ఐపీఎల్ మెగా వేలం-2025కి ముందు కోల్కతా ఫ్రాంఛైజీ అతడిని రూ. 13 కోట్లకు రిటైన్ చేసుకుంది.ఎవరీ ప్రియా సరోజ్?ఇక ప్రియా సరోజ్ విషయానికొస్తే.. వారణాసిలో 1998లో జన్మించిన ఆమె.. న్యూఢిల్లీలోని ఎయిర్ ఫోర్స్ గోల్డెన్ జూబ్లీ ఇన్స్టిట్యూట్లో విద్యాభ్యాసం చేశారు. ఢిల్లీ యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ డిగ్రీ పొందారు. అనంతరం.. అమిటి యూనివర్సిటీ నుంచి ఎల్ఎల్బీ పూర్తి చేశారు.రాజకీయాలపై ఆసక్తి కలిగి ఉన్న ప్రియా సరోజ్ 2024 సాధారణ ఎన్నికల్లో సమాజ్వాదీ పార్టీ తరఫున పోటీ చేశారు. మచ్లిశహర్ లోక్సభ నియోజక వర్గం నుంచి ఎంపీగా గెలుపొందారు. తన ప్రత్యర్థి బీపీ సరోజ్పై 35850 ఓట్ల తేడాతో విజయం సాధించి పార్లమెంట్లో అడుగుపెట్టారు. ప్రియా సరోజ్ నికర ఆస్తుల విలువ రూ. 11.3 లక్షలుగా సమాచారం. ఇక ప్రియా తండ్రి తూఫానీ సరోజ్ కూడా మూడుసార్లు ఎంపీగా గెలుపొందారు. ప్రస్తుతం కేరాకట్ ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే, రింకూ- ప్రియల నిశ్చితార్థ వార్తలను తూఫానీ సరోజ్ తాజాగా ఖండించారు.చదవండి: CT 2025: వన్డేల్లోనూ అదరగొడతాడు.. అతడిని సెలక్ట్ చేయండి: సెహ్వాగ్ Rinku Singh gets engaged to Samajwadi Party MP Priya Saroj. 💍- Many congratulations to them! ❤️ pic.twitter.com/7b7Hb0D2Em— Mufaddal Vohra (@mufaddal_vohra) January 17, 2025 -
శతక్కొట్టిన షారుఖ్ ఖాన్.. రింకూ సింగ్కు షాక్!
విజయ్ హజారే ట్రోఫీ(Vijay Hazare Trophy 2024-25)లో తమిళనాడు బ్యాటర్ షారుఖ్ ఖాన్(Shahrukh Khan) అద్భుత శతకంతో మెరిశాడు. విధ్వంసకర ఆట తీరుతో ఉత్తరప్రదేశ్ జట్టు బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఆకాశమే హద్దుగా చెలరేగి తమిళనాడుకు భారీ విజయం అందించాడు. విశాఖ వేదికగాకాగా దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ(వీహెచ్టీ)లో గ్రూప్-‘డి’లో తమిళనాడు గురువారం నాటి మ్యాచ్లో ఉత్తరప్రదేశ్(యూపీ)తో తలపడింది. విశాఖపట్నంలోని డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఏసీఏ-వీడీసీఏ క్రికెట్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్కు వర్షం ఆటంకం కలిగించింది. దీంతో 47 ఓవర్లకు మ్యాచ్ను కుదించారు. ఇక విశాఖలో టాస్ గెలిచిన యూపీ.. తొలుత బౌలింగ్ చేసింది. ఈ క్రమంలో బ్యాటింగ్కు దిగిన తమిళనాడు నిర్ణీత 47 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 284 పరుగులు చేసింది.టాపార్డర్లో ఓపెనర్లు నారాయణ్ జగదీశన్(0) డకౌట్ కాగా.. తుషార్ రహేజా(15), ప్రదోష్ పాల్(0) కూడా విఫలమయ్యారు. ఇక మిడిలార్డర్లో బాబా ఇంద్రజిత్(27), విజయ్ శంకర్(16) కూడా నిరాశపరిచారు. ఈ క్రమంలో ఇన్నింగ్స్ చక్కదిద్దే బాధ్యత తీసుకున్న షారుఖ్ ఖాన్ యూపీ బౌలర్లకు చుక్కలు చూపించాడు.శతక్కొట్టిన షారుఖ్.. అలీ హాఫ్ సెంచరీఆరో స్థానంలో బ్యాటింగ్ చేసిన షారుఖ్.. 85 బంతుల్లో 13 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 132 పరుగులతో అజేయంగా నిలిచాడు. అతడికి తోడుగా ఏడో నంబర్ బ్యాటర్ మొహమద్ అలీ(75 బంతుల్లో 76 నాటౌట్) కూడా బ్యాట్ ఝులిపించాడు. ఫలితంగా తమిళనాడు మెరుగైన స్కోరు సాధించింది.హాఫ్ సెంచరీ చేసినా రింకూకు షాక్!ఇక లక్ష్య ఛేదనలో యూపీ ఆది నుంచే తడబడింది. ఓపెనర్లు అభిషేక్ గోస్వామి(14), ఆర్యన్ జుయాల్(8)లతో పాటు.. వన్డౌన్ బ్యాటర్ కరణ్ శర్మ(8) కూడా విఫలమయ్యాడు. నితీశ్ రాణా(17) చేతులెత్తేయగా.. ప్రియమ్ గార్గ్(48), కెప్టెన్ రింకూ సింగ్(Rinku Singh- 55) రాణించారు. అయితే, లోయర్ ఆర్డర్లో విప్రజ్ నిగమ్(2), సౌరభ్ కుమార్(7), శివం మావి(2), యశ్ దయాల్(1), ఆకిబ్ ఖాన్(0 నాటౌట్) సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు.114 పరుగుల భారీ తేడాతో ఘన విజయంఈ నేపథ్యంలో 32.5 ఓవర్లలో 170 పరుగులకే యూపీ జట్టు ఆలౌట్ అయింది. ఫలితంగా తమిళనాడు 114 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. తమిళనాడు బౌలర్లలో సందీప్ వారియర్, వరుణ్ చక్రవర్తి, విజయ్ శంకర్ రెండేసి వికెట్లు తీయగా.. సీవీ అచ్యుత్, మొహమద్ అలీ, కెప్టెన్ ఆర్. సాయి కిషోర్ ఒక్కో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.కాగా విజయ్ హజారే ట్రోఫీ తాజా సీజన్లో తమిళనాడు తొలుత చండీగఢ్తో తలపడగా.. వర్షం వల్ల టాస్ పడకుండానే మ్యాచ్ ముగిసింది. తాజాగా రెండో మ్యాచ్లో యూపీని మట్టికరిపించి తొలి గెలుపు నమోదు చేసింది. ఇదిలా ఉంటే...‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ షారుఖ్ ఖాన్కు లిస్ట్-‘ఎ’ క్రికెట్లో ఇదే తొలి శతకం కావడం విశేషం.చదవండి: IND Vs AUS 4th Test: చరిత్ర సృష్టించిన ఆసీస్ యువ ఓపెనర్.. 95 ఏళ్ల రికార్డు బద్దలు -
కెప్టెన్గా రింకూ సింగ్
టీమిండియా స్టార్ క్రికెటర్ రింకూ సింగ్కు సువర్ణావకాశం వచ్చింది. దేశవాళీ వన్డే టోర్నమెంట్ విజయ్ హజారే ట్రోఫీ-2024లో అతడు ఉత్తరప్రదేశ్ జట్టుకు సారథిగా ఎంపికయ్యాడు. దేశీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో అద్భుత ప్రదర్శన కనబరిచిన రింకూకు ఈ అవకాశం దక్కింది.టీ20 టోర్నీలో అదరగొట్టిన రింకూకాగా సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ తాజా ఎడిషన్లో ఉత్తరప్రదేశ్ జట్టుకు భారత వెటరన్ పేసర్ భువనేశ్వర్ కుమార్ సారథ్యం వహించాడు. అతడి కెప్టెన్సీలో యూపీ క్వార్టర్ ఫైనల్స్ వరకు చేరుకుంది. ఇక ఈ టోర్నీలో రింకూ తొమ్మిది మ్యాచ్లలో కలిపి 152కు పైగా స్ట్రైక్రేటుతో 277 పరుగులు చేశాడు.ఇక లిస్ట్-ఏ(వన్డే ఫార్మాట్) క్రికెట్లోనూ రింకూ సింగ్కు మెరుగైన రికార్డు ఉంది. ఇప్పటి వరకు 57 మ్యాచ్లు ఆడిన ఈ ఎడమచేతి వాటం బ్యాటర్ ఖాతాలో 1899 పరుగులు ఉన్నాయి. ఇందులో ఒక సెంచరీతో పాటు 17 అర్ధ శతకాలు ఉన్నాయి.ఈసారి రింకూ కెప్టెన్సీలో భువీఈ నేపథ్యంలో విజయ్ హజారే ట్రోఫీ-2024కు ప్రకటించిన జట్టుకు రింకూ సింగ్ కెప్టెన్గా ఎంపికయ్యాడు. సీనియర్ సెలక్షన్ కమిటీ ప్రకటించిన 19 మంది సభ్యులతో కూడిన జట్టులో సారథిగా ఛాన్స్ కొట్టేశాడు. అయితే, భువీ ఈసారి కేవలం బౌలర్గానే బరిలోకి దిగనున్నాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో కెప్టెన్సీ చేసిన భువనేశ్వర్.. ఆటగాడిగానూ రాణించాడు.ఈ టోర్నీలో తొమ్మిది మ్యాచ్లలో కలిపి పదకొండు వికెట్లు తీశాడు. ఇందులో హ్యాట్రిక్ కూడా ఉండటం విశేషం. అయితే, విజయ్ హజారే ట్రోఫీలో మాత్రం రింకూ కెప్టెన్సీలో భువీ ఆడనున్నాడు. ఇక యూపీ జట్టులో రింకూ, భువీతో పాటు నితీశ్ రాణా, మొహ్సిన్ ఖాన్, శివం మావి వంటి ఐపీఎల్ స్టార్లు కూడా ఉన్నారు. ఇక ఈ దేశీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ డిసెంబరు 21 నుంచి ఆరంభం కానుంది.విజయ్ హజారే ట్రోఫీ-2024కు ఉత్తరప్రదేశ్ జట్టురింకూ సింగ్ (కెప్టెన్), భువనేశ్వర్ కుమార్, మాధవ్ కౌశిక్, కరణ్ శర్మ, ప్రియమ్ గార్గ్, నితీశ్ రాణా, అభిషేక్ గోస్వామి, అక్షదీప్ నాథ్, ఆర్యన్ జుయాల్, ఆరాధ్య యాదవ్, సౌరభ్ కుమార్, కృతజ్ కుమార్ సింగ్, విప్రాజ్ నిగమ్, మొహ్సిన్ ఖాన్, శివం మావి, అక్విబ్ ఖాన్, అటల్ బిహారీ రాయ్, కార్తికేయ జైస్వాల్, వినీత్ పన్వర్.చదవండి: ‘రోహిత్ శర్మ వెంటనే తప్పుకోవాలి.. అతడిని కెప్టెన్ చేయండి’ఇప్పటికైనా చోటిస్తారా?.. టీమిండియా సెలక్టర్లకు స్ట్రాంగ్ మెసేజ్ -
SA Vs IND: తిలక్ వర్మ అజేయ సెంచరీ.. మూడో టీ20లో భారత్ గెలుపు (ఫొటోలు)
-
ఖరీదైన ఇంటిని కొన్న రింకూ సింగ్.. ఎన్ని కోట్లంటే?
ఐపీఎల్-2025 సీజన్ మెగా వేలానికి ముందు టీమిండియా స్టార్ ప్లేయర్ రింకూ సింగ్ను రూ. 13 కోట్ల భారీ ధరకు కోల్కతా నైట్రైడర్స్ రిటైన్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఫ్రాంచైజీ నుంచి భారీగా సొమ్ము రావడంతో రింకూ సింగ్ ఎట్టకేలకు తన సొంతంటి కలను నేరవేర్చుకున్నాడు.అలీఘర్లోని ఓజోన్ సిటీలో ఖరీదైన విల్లాను రింకూ సింగ్ కొనుగోలు చేశాడు. 500 చదరపు గజాల స్థలం గల ఇంటిని రూ. 3.5 కోట్ల భారీ మొత్తం వెచ్చించి రింకూ సొంతం చేసుకున్నట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. కాగా ఒకప్పుడు ఇదే ఓజోన్ సిటీలోని రింకూ తండ్రి గ్యాస్ సిలిండర్లు వేసి తన కుటుంబాన్ని పోషించేవాడు. ఇప్పుడు అదే సొసైటీలో కొడుకు విల్లాను కొనుగోలు చేసి తండ్రికి బహుమతిగా ఇచ్చాడు. దీంతో రింకూపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇది కాదా సక్సెస్ అని రింకూను కొనియాడుతున్నారు.ఒకే ఓవర్లో 5 సిక్సర్లు..కాగా ఐపీఎల్-2023 సీజన్లో గుజరాత్ టైటాన్స్ పేసర్ యశ్దయాల్ బౌలింగ్లో ఆఖరి ఓవర్లో వరుసగా ఐదు సిక్స్లు బాది రింకూ ఓవర్ నైట్స్టార్గా మారిపోయాడు. ఆ తర్వాత భారత జట్టులోకి రింకూ ఎంట్రీ ఇచ్చాడు. అంతర్జాతీయ క్రికెట్లో కూడా రింకూ తన మార్క్ను చూపించాడు. కాగా ఐపీఎల్ 2024 సీజన్ రింకూ సింగ్కు రూ. 55 లక్షల వేతనం మాత్రమే వచ్చేది. కానీ తన అద్బుతప్రదర్శనలతో రింకూ ఇప్పుడు కోటీశ్వరుడు అయిపోయాడు.ఈ ఏడాది నుంచి అతడు రూ. 13 కోట్లు అందుకుంటాడు. కేకేఆర్ అంటిపెట్టుకున్న వారిలో రింకూనే టాప్ రిటెన్షన్ కావడం గమనార్హం. రింకూ సింగ్ ప్రస్తుతం దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్కు సన్నద్దమవుతున్నాడు.చదవండి: #Shreyas Iyer: శ్రేయస్ అయ్యర్ ఊచకోత.. కెరీర్లో తొలి డబుల్ సెంచరీ -
IPL 2025: మన లీడర్.. మన కెప్టెన్.. రీటైన్ను సంపూర్ణంగా వాడుకుంది ఎవరు?
గత మూడేళ్లుగా పేలవ ఆట తీరుతో వెనుకబడ్డ సన్రైజర్స్ హైదరాబాద్ను తన అద్భుత కెప్టెన్సీతో ఈసారి టైటిల్ రేసులో నిలిపాడు ప్యాట్ కమిన్స్. ఆస్ట్రేలియాకు వన్డే వరల్డ్కప్ అందించిన సారథిగా నీరాజనాలు అందుకున్న ఈ ఫాస్ట్ బౌలర్.. ఫ్రాంఛైజీ తనకు చెల్లించిన రూ. 20.50 కోట్లకు పైసా వసూల్ ప్రదర్శన ఇచ్చాడు.సహచర ఆటగాళ్లతో మమేమకమవుతూ సరైన సమయంలో అవకాశాలు ఇచ్చి జట్టును ఫైనల్కు తీసుకువెళ్లాడు. తద్వారా ఆరెంజ్ ఆర్మీకి ఇష్టమైన కెప్టెన్గా మారిపోయాడు. కానీ.. జాతీయ జట్టు విధుల దృష్ట్యా ఈసారి కమిన్స్ అసలు ఐపీఎల్ ఆడతాడా? కెప్టెన్గా కొనసాగుతాడా? అనే సందేహాలు వ్యక్తమయ్యాయి. అయితే, రిటెన్షన్ లిస్టు విడుదల సందర్భంగా సన్రైజర్స్ ఆ అనుమానాలన్నింటినీ పటాపంచలు చేసింది.మన లీడర్.. మన కెప్టెన్వచ్చే ఏడాది కూడా ప్యాటీనే రైజర్స్ను ముందుకు నడిపించబోతున్నాడని..ఫ్రాంఛైజీ అధికారికంగా ప్రకటించింది. ‘‘మన లీడర్.. మన కెప్టెన్... ప్యాటీ కమిన్స్ మిమ్మల్ని ఉప్పల్లో మరోసారి కలిసేందుకు సిద్ధంగా ఉన్నాడు’’ అంటూ ఆరెంజ్ ఆర్మీకి శుభవార్త అందించింది. ఇక ఈ ఏడాది పరుగుల విధ్వంసంతో రికార్డులు తిరగరాసిన సన్రైజర్స్.. రిటెన్షన్ల విషయంలోనూ దూకుడుగా వ్యవహరించింది. హార్డ్ హిట్టర్ హెన్రిక్ క్లాసెన్ కోసం ఏకంగా రూ. 23 కోట్లు ఖర్చు చేసింది. ఆ జట్లు వదిలేశాయిఇదిలా ఉంటే.. ఇతర ఫ్రాంఛైజీలలో కోల్కతా, ఢిల్లీ, లక్నో, పంజాబ్, బెంగళూరు తమ కెప్టెన్లను వేలంలోకి వదిలివేయగా.. చెన్నై, ముంబై, గుజరాత్, రాజస్తాన్ మాత్రం తమ సారథులను కొనసాగించాయి. దీంతో ఈసారి ఈసారి ఐపీఎల్ వేలం ఆసక్తికరంగా సాగడం ఖాయం.ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మెగా వేలం ఈనెల నెలాఖరున జరగనుండగా... రీటైన్ చేసుకున్న ఆటగాళ్ల జాబితాను ఐపీఎల్ నిర్వాహకులు వెల్లడించిన విషయం తెలిసిందే. ఇందులో కొందరు ఆటగాళ్లు అనూహ్యంగా కోట్లు కొల్లగొట్టగా... మరికొందరు స్టార్ ప్లేయర్లు ఫ్రాంచైజీ నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోయారు. అధిక ధర వీరికేఅందరికంటే అత్యధికంగా దక్షిణాఫ్రికా ‘హార్డ్ హిట్టర్’ హెన్రిచ్ క్లాసెన్కు సన్రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ రూ. 23 కోట్లు కేటాయించగా... విరాట్ కోహ్లీకి రాయల్ చాలెంజర్స్ బెంగళూరు... నికోలస్ పూరన్కు లక్నో సూపర్ జెయింట్స్ రూ.21 కోట్లు ఇచ్చి అట్టిపెట్టుకున్నాయి. ఈ సీజన్లో ముంబై ఇండియన్స్ జట్టుకు సారథ్యం వహించిన హార్దిక్ పాండ్యా... ఇక మీదట కూడా నాయకుడిగా కొనసాగడం ఖాయం కాగా... ముంబై మొత్తంగా ఐదుగురు ప్రధాన ఆటగాళ్లను అట్టిపెట్టుకుంది. మేటి పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు అత్యధికంగా రూ. 18 కోట్లు కేటాయించిన ఫ్రాంచైజీ సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యాలకు చెరో రూ. 16 కోట్ల 35 లక్షలు వెచ్చించింది.ఇక ‘హిట్మ్యాన్’ రోహిత్ శర్మకు రూ. 16 కోట్ల 30 లక్షలు కేటాయించింది. హైదరాబాద్ ఆటగాడు ఠాకూర్ తిలక్ వర్మకు రూ.8 కోట్లు ఇచ్చి ముంబై తమ వద్దే పెట్టుకుంది. రీటైన్ను సంపూర్ణంగా వాడుకుంది ఎవరంటే?ఆటగాళ్ల కొనుగోలు కోసం ఒక్కో జట్టు రూ.120 కోట్లు ఖర్చు చేసుకునే అవకాశం ఉండగా... అందులో రూ. 75 కోట్లు రిటెన్షన్కు కేటాయించారు. తాజా జాబితాను చూస్తే ముంబై ఇండియన్స్ జట్టు రీటైన్ను సంపూర్ణంగా వాడుకోగా... అత్యల్పంగా పంజాబ్ కింగ్స్ జట్టు కేవలం ఇద్దరు ప్లేయర్లనే అట్టి పెట్టుకుంది. పంజాబ్ మరీ ఇద్దరినేపంజాబ్ హెడ్ కోచ్గా బాధ్యతలు చేపట్టిన ఆ్రస్టేలియా దిగ్గజ కెప్టెన్ రికీ పాంటింగ్ వ్యూహాల్లో భాగంగా... కేవలం ఇద్దరు ‘అన్క్యాప్డ్’ ప్లేయర్లను మాత్రమే రీటైన్ చేసుకున్న పంజాబ్ వద్ద వేలం కోసం అత్యధికంగా రూ. 110.5 కోట్లు మిగిలి ఉన్నాయి. ఈ ఏడాది జట్టుకు ఐపీఎల్ టైటిల్ అందించిన శ్రేయస్ అయ్యర్ను కోల్కతా నైట్ రైడర్స్ వేలానికి వదిలేయగా... తొమ్మిదేళ్లుగా ఢిల్లీ క్యాపిటల్స్తో కొనసాగుతున్న రిషబ్ పంత్ను ఫ్రాంచైజీ వదిలేసుకుంది. లక్నో సూపర్ జెయింట్స్ యాజమాన్యం కేఎల్ రాహుల్పై నమ్మకం ఉంచలేదు. రింకూ సింగ్కు జాక్పాట్.. ధోనీ ‘అన్క్యాప్డ్’ ప్లేయర్చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ధోనీ సహా మొత్తం ఐదుగురు ప్లేయర్లను అట్టిపెట్టుకోగా... రాజస్తాన్ రాయల్స్ కూడా ఆరుగురు ప్లేయర్లను రీటైన్ చేసుకుంది. స్పిన్ ఆల్రౌండర్ అక్షర్ పటేల్ కోసం ఢిల్లీ క్యాపిటల్స్ రూ. 16 కోట్ల 50 లక్షలు కేటాయించగా... సిక్సర్ల వీరుడు రింకూ సింగ్కు కోల్కతా రూ.13 కోట్లు ఇచ్చి అట్టిపెట్టుకుంది. వెస్టిండీస్ ద్వయం రసెల్, నరైన్తో పాటు మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తికి తలా రూ. 12 కోట్లు కేటాయించింది. కోల్కతా వదిలేసుకున్న శ్రేయస్ అయ్యర్ కోసం వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ పోటీ పడటం ఖాయమే కాగా... సారథి కోసం చూస్తున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు పంత్పై కన్నేసే అవకాశాలు ఉన్నాయి. బేబీ మలింగకు రూ. 13 కోట్లుజాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించి ఐదేళ్లు దాటిపోయిన ధోనీని ఐపీఎల్ నిబంధనల ప్రకారం ‘అన్క్యాప్డ్’ ప్లేయర్ కోటాలో రీటైన్ చేసుకున్న చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ... మాజీ సారథికి రూ.4 కోట్లు కేటాయించింది. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్తో పాటు స్పిన్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజాకు చెరో రూ. 18 కోట్లు వెచ్చించింది. శ్రీలంక పేసర్ పతిరణకు రూ. 13 కోట్లు, పేస్ ఆల్రౌండర్ శివమ్ దూబేను రూ.12 కోట్లకు అట్టిపెట్టుకుంది. రాజస్తాన్ రైట్రైట్రిటైనింగ్లో మొత్తం ఆరు అవకాశాలను వాడుకున్న రాజస్తాన్ రాయల్స్... సంజూ సామ్సన్, యశస్వి జైస్వాల్కు చెరో రూ.18 కోట్లు కేటాయించింది. రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్కు చెరో రూ. 14 కోట్లు వెచ్చించింది.పూరన్ కోసం అంత అవసరమా?కేఎల్ రాహుల్ను వేలానికి వదిలేసిన లక్నో సూపర్ జెయింట్స్ జట్టు నిలకడగా ఆడతాడో లేదో తెలియని వెస్టిండీస్ హిట్టర్ నికోలస్ పూరన్ కోసం రూ. 21 కోట్లు కేటాయించింది. గాయాలతో సహవాసం చేసే సూపర్ ఫాస్ట్ బౌలర్ మయాంక్ యాదవ్, స్పిన్నర్ రవి బిష్ణోయ్కు రూ. 11 కోట్లు కేటాయించిన లక్నో... మొహసిన్ ఖాన్, ఆయుష్ బదోనీలకు చెరో రూ. 4 కోట్లు వెచ్చించింది. స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్కు రూ.18 కోట్లు కేటాయించిన గుజరాత్ టైటాన్స్ ఫ్రాంచైజీ... కెప్టెన్ శుబ్మన్ గిల్ను రూ. 16 కోట్ల 50 లక్షలకు అట్టిపెట్టుకుంది. వేలానికి రానున్న ప్రధాన ఆటగాళ్లు కేఎల్ రాహుల్, రిషబ్ పంత్, శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్, అర్ష్దీప్ సింగ్, సిరాజ్, చాహల్, అశ్విన్, వాషింగ్టన్ సుందర్, భువనేశ్వర్, శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహర్, షమీ (భారత్). వార్నర్, మ్యాక్స్వెల్, కామెరూన్ గ్రీన్, మిచెల్ స్టార్క్, స్టొయినిస్ ఆస్ట్రేలియా). బెయిర్స్టో, లివింగ్స్టోన్, స్యామ్ కరన్, బట్లర్, ఫిల్ సాల్ట్ (ఇంగ్లండ్). డుప్లెసిస్, డేవిడ్ మిల్లర్, క్వింటన్ డికాక్, నోర్జే (దక్షిణాఫ్రికా). కాన్వే, రచిన్ రవీంద్ర, బౌల్ట్ (న్యూజిలాండ్). చదవండి: Ind vs Pak: భారత బ్యాటర్ల విధ్వంసం.. అయినా పాక్ చేతిలో తప్పని ఓటమి -
‘పరుగుల విధ్వంసం తప్ప.. ఇంకోటి వద్దన్నారు’
టీ20 క్రికెట్లో టీమిండియా దూకుడు మంత్రంతో దూసుకెళ్తోందని మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా అన్నాడు. ఇందుకు కొత్త హెడ్కోచ్ గౌతం గంభీర్, నూతన సారథి సూర్యకుమార్ యాదవ్లే కారణమని పేర్కొన్నాడు. ఫలితంతో సంబంధం లేకుండా పరుగుల విధ్వంసం సృష్టించేందుకు యంగిస్తాన్ సిద్ధమైందని.. మున్ముందు పొట్టి ఫార్మాట్లో భారత జట్టు మరిన్ని సంచలనాలు సృష్టించడం ఖాయమని అభిప్రాయపడ్డాడు.లంక పర్యటనతో మొదలుకాగా టీమిండియా ప్రధాన కోచ్గా రాహుల్ ద్రవిడ్ స్థానాన్ని భర్తీ చేసిన గంభీర్.. శ్రీలంక పర్యటనతో తన ప్రయాణం ప్రారంభించాడు. సూర్యకుమార్ పూర్తిస్థాయి కెప్టెన్ అయిన తర్వాత జరిగిన పొట్టి సిరీస్లో లంకను భారత్ 3-0తో క్లీన్స్వీప్ చేసింది. అనంతరం వీరిద్దరి కాంబినేషన్లో స్వదేశంలో టీమిండియా ఇటీవలే బంగ్లాదేశ్తో టీ20 సిరీస్ ఆడింది.బంగ్లా బౌలింగ్ ఊచకోతసొంతగడ్డపై యువ ఆటగాళ్లతో నిండిపోయిన సూర్యసేన ఆకాశమే హద్దుగా చెలరేగి.. బంగ్లానూ 3-0తో వైట్వాష్ చేసింది. అయితే, లంక పర్యటనతో పోలిస్తే ఈసారి మరింత వేగంగా, మరింత దూకుడుగా పరుగులు రాబట్టింది. తొలి టీ20లో 11.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించిన భారత్.. ఆఖరి రెండు మ్యాచ్లలో బంగ్లా బౌలింగ్ను ఊచకోత కోసింది. వరుసగా 221, 297 పరుగులు సాధించి వారెవ్వా అనిపించింది.ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా తన యూట్యూబ్ చానెల్ వేదికగా మాట్లాడుతూ.. ‘‘గౌతం గంభీర్, సూర్యకుమార్ యాదవ్ జోడీ టీమిండియాకు సరికొత్త దూకుడు మంత్రాన్ని ఉపదేశించింది. మ్యాచ్ అయినపోయిన తర్వాత రింకూ సింగ్ స్వయంగా ఈ విషయాన్ని పంచుకున్నాడు.పరుగుల విధ్వంసం తప్ప.. ఇంకోటి వద్దన్నారువిధ్వంసకరంగా బ్యాటింగ్ చేయడం తప్ప.. వేరే విషయాల గురించి ఆలోచించవద్దని తమకు ఆదేశాలు వచ్చాయన్నాడు. ఫియర్లెస్ క్రికెట్ ఆడాలని.. వికెట్ పడుతుందనే బెంగ వద్దని మేనేజ్మెంట్ చెప్పిందన్నాడు. దీనిని బట్టి కోచ్, కెప్టెన్ దూకుడు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.నిజానికి పరుగులు రాబట్టాలనే తొందరలో వికెట్ పారేసుకుంటే జట్టులో చోటు దక్కదని ఆటగాళ్లు భయపడతారు. అయితే, స్వయంగా మేనేజ్మెంట్ రంగంలోకి దిగి ఫాస్ట్గా ఆడమని చెప్పటమే గాక.. ఆ క్రమంలో ప్రతికూల ఫలితాలు వచ్చినా అండగా ఉంటే.. అంతకంటే ఆటగాళ్లకు ఇంకేం కావాలి.బలహీన జట్లపై మాత్రమేనా?జట్టులో తమ స్థానానికి వచ్చిన ఢోకా ఏమీ లేదని ప్లేయర్లు భావిస్తే.. ఫలితాలు కూడా ఇలాగే ఉంటాయి మరి! ఈ యంగిస్తాన్ భవిష్యత్తులో మరిన్ని అద్భుతాలు చేయడం ఖాయంగా కనిపిస్తోంది’’ అని ప్రశంసలు కురిపించాడు. అయితే, ఇప్పటి వరకు యువ టీమిండియా శ్రీలంక, బంగ్లాదేశ్ వంటి బలహీన జట్లపై తమ బ్యాటింగ్ ప్రతాపాన్ని చూపిందన్న ఆకాశ్ చోప్రా.. పటిష్ట జట్లపై కూడా ఇదే విధానాన్ని అనుసరిస్తే కొన్నిసార్లు చిక్కులు తప్పవని అభిప్రాయపడ్డాడు. ఏదేమైనా తమ బ్యాటింగ్.. ముఖ్యంగా పవర్ ప్లేలో ఎలా ఉంటుందో ఇప్పటికే చూపించిందని పేర్కొన్నాడు. కాగా బంగ్లాదేశ్తో మూడు మ్యాచ్ల టీ20 సిరీస్లో అభిషేక్ శర్మ మినహా మిగతా బ్యాటర్లు 180కి పైగా స్ట్రైక్రేటుతో పరుగులు చేశారు.చదవండి: మళ్లీ శతక్కొట్టాడు: ఆసీస్తో టెస్టులకు టీమిండియా ఓపెనర్గా వస్తే! -
భారత కుర్రాళ్ల జోరు.. బంగ్లా పులుల బేజారు (ఫోటోలు)
-
IND vs BAN: న్యూఢిల్లీలో నితీశ్ ‘షో’.. సిరీస్ భారత్ సొంతం
అందివచ్చి న అవకాశాన్ని రెండు చేతులా ఒడిసి పడుతూ... ఆంధ్రప్రదేశ్ ఆల్రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి అటు బ్యాటింగ్లో ఇటు బౌలింగ్లో విజృంభించిన వేళ... బంగ్లాదేశ్పై భారత్ ఘనవిజయం సాధించింది. నితీశ్, రింకూ సింగ్ అర్ధశతకాలతో టీమిండియా భారీ స్కోరు చేయగా... బంగ్లాదేశ్ కనీస ప్రతిఘటన లేకుండానే పరాజయం పాలైంది. దీంతో మరో మ్యాచ్ మిగిలుండగానే భారత జట్టు టి20 సిరీస్ను 2–0తో కైవసం చేసుకుంది. సిరీస్లోని చివరిదైన మూడో టి20 మ్యాచ్ శనివారం హైదరాబాద్లో జరుగుతుంది. న్యూఢిల్లీ: టెస్టు సిరీస్లో బంగ్లాదేశ్ను చిత్తు చేసిన భారత జట్టు... టి20ల్లోనూ అదే జోరు కనబర్చింది. ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన టీమిండియా మరో మ్యాచ్ మిగిలుండగానే 2–0తో సిరీస్ పట్టేసింది. స్వదేశంలో టీమిండియాకు ఇది వరుసగా 16వ సిరీస్ విజయం కావడం విశేషం. ఆంధ్ర ఆటగాడు నితీశ్ కుమార్ రెడ్డి ఆల్రౌండ్ ప్రదర్శన ఫలితంగా... మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా బుధవారం జరిగిన రెండో టి20లో భారత్ 86 పరుగుల తేడాతో బంగ్లాదేశ్ను ఓడించింది. పరుగుల తేడా పరంగా బంగ్లాపై టీమిండియాకిదే అతిపెద్ద విజయం. మొదట బ్యాటింగ్కు దిగిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 221 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ నితీశ్ (34 బంతుల్లో 74; 4 ఫోర్లు, 7 సిక్సర్లు) మెరిపించాడు. రింకూ సింగ్ (29 బంతుల్లో 53; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ధ సెంచరీ చేయగా... హార్దిక్ పాండ్యా (19 బంతుల్లో 32; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) కూడా దూకుడుగా ఆడాడు. అనంతరం లక్ష్యఛేదనలో బంగ్లాదేశ్ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 135 పరుగులకే పరిమితమైంది. మహ్ముదుల్లా (39 బంతుల్లో 41; 3 సిక్సర్లు) మినహా ఇతర బ్యాటర్లు విఫలమయ్యారు. వైజాగ్ కుర్రాడి వీరవిహారం... టాస్ ఓడి మొదట బ్యాటింగ్కు దిగిన భారత జట్టుకు శుభారంభం దక్కలేదు. రెండు బౌండరీలతో జోరు కనబర్చిన ఓపెనర్ సంజూ సామ్సన్ (10) రెండో ఓవర్ చివరి బంతికి ఔట్ కాగా.. కాసేపటికే మరో ఓపెనర్ అభిõÙక్ శర్మ (15) అతడిని అనుసరించాడు. కెప్టెన్ సూర్యకుమార్ (8) కూడా వెనుదిరగడంతో టీమిండియా 41 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో విశాఖపట్నం కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి చక్కటి ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నాడు. బంగ్లా బౌలర్లపై ఎదురుదాడికి దిగి ఫలితం రాబట్టాడు. మహ్ముదుల్లా బౌలింగ్లో 6,4తో మోత ప్రారంభించిన నితీశ్... రిషాద్ వేసిన 10వ ఓవర్లో రెండు సిక్సర్లు బాదాడు. దీంతో 10 ఓవర్లు ముగిసేసరికి భారత స్కోరు 100 పరుగులు దాటింది. ఆడుతున్న రెండో మ్యాచ్లోనే భారీ సిక్సర్లతో విరుచుకుపడిన నితీశ్ 27 బంతుల్లో తొలి అంతర్జాతీయ అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. మిరాజ్ వేసిన 13వ ఓవర్లో నితీశ్ 6,4,2,6,6 బాది మొత్తం 26 పరుగులు రాబట్టాడు. ఇదే జోష్లో మరో భారీ షాట్కు ప్రయత్నించి నితీశ్ ఔట్ కాగా.. ఆ తర్వాత బాదే బాధ్యత రింకూ, పాండ్యా తీసుకున్నారు. వీరిద్దరూ విజృంభించడంతో భారత్ భారీ స్కోరు చేయగలిగింది. ఆది నుంచి తడబాటే! ఛేదన ఏ దశలోనూ బంగ్లాదేశ్ లక్ష్యం దిశగా సాగలేదు. భారత్ తరఫున బౌలింగ్ చేసిన ఏడుగురు ప్రభావవంతంగా బంతులు వేయగా... పరుగులు రాబట్టేందుకు బంగ్లా బ్యాటర్లు అష్టకష్టాలు పడ్డారు. మూడో ఓవర్లో పర్వేజ్ హుస్సేన్ (16)ను ఔట్ చేసి అర్ష్ దీప్ వికెట్ల పతనానికి తెరలేపగా... అది చివరి వరకు కొనసాగింది. వాషింగ్టన్ సుందర్, అభిషేక్ శర్మ, మయాంక్ యాదవ్, రియాన్ పరాగ్ కూడా ఒక్కో వికెట్ ఖాతాలో వేసుకున్నారు. బ్యాట్తో సంచలన ఇన్నింగ్స్ ఆడిన నితీశ్ కుమార్ రెడ్డి బంతితోనూ చెలరేగి తన కోటా 4 ఓవర్లలో 23 పరుగులే ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు. స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్: సామ్సన్ (సి) నజ్ముల్ (బి) తస్కీన్ 10; అభిషేక్ (బి) తన్జీమ్ 15; సూర్య (సి) నజు్మల్ (బి) ముస్తఫిజుర్ 8; నితీశ్ కుమార్ రెడ్డి (సి) మిరాజ్ (బి) ముస్తఫిజుర్ 74; రింకూ సింగ్ (సి) జాకిర్ అలీ (బి) తస్కీన్ 53; పాండ్యా (సి) మిరాజ్ (బి) రిషాద్ 32; రియాన్ పరాగ్ (సి) మహ్ముదుల్లా (బి) తన్జీమ్ 15; సుందర్ (నాటౌట్) 0; వరుణ్ చక్రవర్తి (సి) పర్వేజ్ (బి) రిషాద్ 0; అర్ష్ దీప్ (సి) లిటన్ దాస్ (బి) రిషాద్ 6; మయాంక్ యాదవ్ (నాటౌట్) 1; ఎక్స్ట్రాలు: 7, మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 221. వికెట్ల పతనం: 1–17, 2–25, 3–41, 4–149, 5–185, 6–213, 7–214, 8–214, 9–220, బౌలింగ్: మిరాజ్ 3–0–46–0; తస్కీన్ 4–0–16–2; తన్జీమ్ 4–0–50–2; ముస్తఫిజుర్ 4–0–36–2; రిషాద్ 4–0–55–3; మహ్ముదుల్లా 1–0–15–0. బంగ్లాదేశ్ ఇన్నింగ్స్: పర్వేజ్ (బి) అర్ష్ దీప్ 16; లిటన్ దాస్ (బి) వరుణ్ 14; నజ్ముల్ (సి) పాండ్యా (బి) సుందర్ 11; తౌహిద్ (బి) అభిõÙక్ 2; మిరాజ్ (సి) (సబ్) రవి బిష్ణోయ్ (బి) రియాన్ 16; మహ్ముదుల్లా (సి) రియాన్ (బి) నితీశ్ 41; జాకీర్ అలీ (సి) సుందర్ (బి) మయాంక్ యాదవ్ 1; రిషాద్ (సి) పాండ్యా (బి) వరుణ్ 9; తన్జీమ్ (సి) పాండ్యా (బి) నితీశ్ 8; తస్కీన్ (నాటౌట్) 5; ముస్తఫిజుర్ (నాటౌట్) 1; ఎక్స్ట్రాలు 11, మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 135. వికెట్ల పతనం: 1–20, 2–40, 3–42, 4–46, 5–80, 6–83, 7–93, 8–120, 9–127, బౌలింగ్: అర్ష్ దీప్ 3–0–26–1; నితీశ్ కుమార్ రెడ్డి 4–0–23–2; వాషింగ్టన్ సుందర్ 1–0–4–1; వరుణ్ చక్రవర్తి 4–0–19–2; అభిషేక్ 2–0–10–1; మయాంక్ యాదవ్ 4–0–30–1; రియాన్ పరాగ్ 2–0–16–1. -
దులీప్ ట్రోఫీ.. శాంసన్, రింకూ ఎంట్రీ! తుది జట్లు ఇవే
దులీప్ ట్రోఫీ-2024లో భాగంగా రౌండ్-2 మ్యాచ్లు ప్రారంభమయ్యాయి. అనంతపురం వేదికగా ఇండియా-ఎ, ఇండియా-డి జట్లు తలపడతున్నాయి. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఇండియా-డి జట్టు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్.. తొలుత భారత్-ఎను బ్యాటింగ్ ఆహ్హనించాడు. డి జట్టులోకి సంజూ శాంసన్, సౌరభ్ కుమార్ రాగా.. ఎ జట్టులోకి తిలక్ వర్మ, విధ్వత్ కావేరప్ప, కుమార్ కుశాగ్రా వచ్చారు. దులీప్ ట్రోఫీలో భాగమైన చాలా మంది భారత క్రికెటర్లు బంగ్లాదేశ్తో టెస్టు సిరీస్కు సన్నద్దమయ్యేందుకు వెళ్లడంతో ఈ మార్పులు చోటు చేసుకున్నాయి.తుది జట్లుఇండియా D : అథర్వ తైదే, యశ్ దూబే, శ్రేయాస్ అయ్యర్ (సి), దేవదత్ పడిక్కల్, సంజు శాంసన్ (వికెట్ కీపర్), రికీ భుయ్, సరాంశ్ జైన్, సౌరభ్ కుమార్, హర్షిత్ రాణా, అర్ష్దీప్ సింగ్, విధ్వత్ కావరప్పఇండియా A : ప్రథమ్ సింగ్, మయాంక్ అగర్వాల్(కెప్టెన్), తిలక్ వర్మ, రియాన్ పరాగ్, శాశ్వత్ రావత్, కుమార్ కుషాగ్రా(వికెట్ కీపర్), షామ్స్ ములానీ, తనుష్ కోటియన్, ప్రసిద్ధ్ కృష్ణ, ఖలీల్ అహ్మద్, ఆకిబ్ ఖాన్బౌలింగ్ ఎంచుకున్న ఇండియా-బిఇక ఈ టోర్నీలో మరోవైపు అనంతపూర్లో బి స్టేడియంలో ఇండియా-బి, ఇండియా-సి జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన భారత్-బి టీమ్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. భారత-బి జట్టులోకిఇండియా సి: అభిషేక్ పోరెల్ (వికెట్), ఇషాన్ కిషన్, రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), రజత్ పటీదార్, అన్షుల్ కాంబోజ్, బాబా ఇంద్రజిత్, బి సాయి సుదర్శన్, మయాంక్ మార్కండే, మానవ్ జగ్దూసకుమార్ సుతార్, వైషక్ విజయ్కుమార్, సందీప్ వారియర్ఇండియా బి: అభిమన్యు ఈశ్వరన్ (కెప్టెన్), నితీష్ కుమార్ రెడ్డి, ముఖేష్ కుమార్, ముషీర్ అహ్మద్ ఖాన్, నారాయణ్ జగదీసన్ (వికెట్ కీపర్), నవదీప్ సైనీ, రాహుల్ చాహర్, రవిశ్రీనివాసన్ సాయి కిషోర్, రింకు సింగ్, సర్ఫరాజ్ ఖాన్, వాషింగ్టన్ సుందర్భారత బి జట్టులోకి ముఖేష్ కుమార్, రింకూ సింగ్, జగదీసన్ రాగా, ఇండియా సి జట్టులోకి మయాంక్ మార్కండే, రజిత్ పాటిదార్ ఎంట్రీ ఇచ్చారు. -
రింకూ, శ్రేయస్, సుందర్లపై దృష్టి
సాక్షి, అనంతపురం: దేశవాళీ క్రికెట్ టోర్నీ దులీప్ ట్రోఫీలో నేడు రెండో దశ మ్యాచ్లు ప్రారంభం కానున్నాయి. అనంతపురం వేదికగా జరగనున్న ఈ మ్యచ్ల్లో భారత్ ‘ఎ’ జట్టుతో భారత్ ‘డి’... భారత్ ‘బి’ జట్టుతో భారత్ ‘సి’ తలపడనున్నాయి. తొలి రౌండ్ మ్యాచ్ల్లో భారత్ ‘బి’, ‘సి’ జట్లు విజయాలు సాధించాయి. ఈ నెల 19 నుంచి భారత్, బంగ్లాదేశ్ మధ్య తొలి టెస్టు ప్రారంభం కానున్న నేపథ్యంలో సర్ఫరాజ్ ఖాన్ మినహా టీమిండియా ప్లేయర్లెవరూ రెండో రౌండ్ దులీప్ ట్రోఫీ మ్యాచ్లో పాల్గొనడం లేదు. తొలి మ్యాచ్లో ఆడిన శుబ్మన్ గిల్, కేఎల్ రాహుల్, ధ్రువ్ జురేల్, కుల్దీప్ యాదవ్, ఆకాశ్దీప్, యశస్వి జైస్వాల్, రిషబ్ పంత్, యశ్ దయాళ్, అక్షర్ పటేల్... తమతమ జట్లను వీడి టీమిండియాతో జట్టు కట్టారు. దీంతో భారత్ ‘సి’ జట్టులో మినహా మిగిలిన టీమ్లలో మార్పులు చోటు చేసుకున్నాయి. భారత ‘ఎ’ జట్టుకు మయాంక్ అగర్వాల్ సారథ్యం వహించనుండగా.. ‘బి’ టీమ్కు అభిమన్యు ఈశ్వరన్ కెపె్టన్గా వ్యవహరించనున్నాడు. ‘సి’ టీమ్కు రుతురాజ్ గైక్వాడ్, ‘డి’ జట్టుకు శ్రేయస్ అయ్యర్ సారథ్యం వహించనున్నారు. ప్రధాన ఆటగాళ్ల గైర్హాజరీలో దేశవాళీల్లో నిలకడ కొనసాగిస్తున్న యువ ఆటగాళ్లకు ఈ మ్యాచ్లు మంచి అవకాశం కానున్నాయి. రింకూ సింగ్, రుతురాజ్ గైక్వాడ్, శ్రేయస్ అయ్యర్, మయాంక్ అగర్వాల్, వాషింగ్టన్ సుందర్ వంటి వాళ్లు మెరుగైన ప్రదర్శన చేసి జాతీయ జట్టులో చోటు దక్కించుకోవాలని భావిస్తున్నారు. గత మ్యాచ్లో భారత్ ‘ఎ’ జట్టుకు సారథిగా వ్యవహరించిన శుబ్మన్ గిల్ అందుబాటులో లేకపోవడంతో మయాంక్కు జట్టు పగ్గాలు దక్కాయి. రెండేళ్ల క్రితం జాతీయ జట్టు తరఫున చివరి టెస్టు ఆడిన మయాంక్ తిరిగి సెలెక్టర్ల దృష్టిలో పడాలంటే భారీగా పరుగులు చేయాల్సిన అవసరముంది. బంగ్లాదేశ్తో రెండు మ్యాచ్ల సిరీస్లో తొలి టెస్టు కోసమే భారత జట్టును ఎంపిక చేయగా... దులీప్ ట్రోఫీలో మెరుగైన ప్రదర్శన చేస్తే బంగ్లాతో రెండో టెస్టు కోసం ప్రకటించనున్న జట్టులో చోటు దక్కించుకునే అవకాశం లేకపోలేదు.ఈ ఏడాది ఆరంభంలో ఇంగ్లండ్తో స్వదేశంలో జరిగిన టెస్టు సిరీస్ ద్వారా అంతర్జాతీయ అరంగేట్రం చేసిన మిడిలార్డర్ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ చక్కటి ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం బంగ్లాదేశ్తో తొలి టెస్టు కోసం ప్రకటించిన టీమిండియాలో సభ్యుడైన సర్ఫరాజ్... ఈ మ్యాచ్ అనంతరం నేరుగా చెన్నైలో జట్టుతో చేరనున్నాడు. భారత్ ‘బి’ జట్టు తరఫున బరిలోకి దిగనున్న సర్ఫరాజ్ ఖాన్... మరో మంచి ఇన్నింగ్స్తో రాణించి టీమిండియాలో చేరాలనుకుంటున్నాడు. ఇక గత మ్యాచ్లో భారీ సెంచరీతో చెలరేగిన సర్ఫరాజ్ సోదరుడు ముషీర్ ఖాన్ అదే జోరు కొనసాగించాలనుకుంటున్నాడు. అటు బ్యాట్తో ఇటు బంతితో సత్తాచాటగల స్పిన్ ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ భారత్ ‘బి’ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఇంగ్లండ్తో సిరీస్లో ఆకట్టుకోలేకపోయిన రజత్ పాటిదార్తో పాటు శ్రేయస్ అయ్యర్ తిరిగి సత్తాచాటి సెలెక్టర్ల దృష్టిలో పడాలని చూస్తున్నారు. గత మ్యాచ్ ప్లెయింగ్ ఎలెవన్లో చోటు దక్కించుకోలేకపోయిన దేవదత్ పడిక్కల్, సంజూ సామ్సన్ భారత్ ‘డి’ జట్టు తరఫున ఈ మ్యాచ్లోనైనా అవకాశం దక్కించుకుంటారా చూడాలి. ఇక పేస్ బౌలర్లు ముఖేశ్ కుమార్, ప్రసిద్ధ్ కృష్ణ, అర్ష్దీప్ సుదీర్ఘ టెస్టు సీజన్కు ముందు లయ అందుకునేందుకు ఇది చక్కటి అవకాశం. వచ్చే ఏడాది జరగనున్న ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్కు ముందు భారత్ మొత్తం 10 టెస్టులు ఆడనుండగా... పేస్ బౌలర్లకు విరివిగా అవకాశాలు వచ్చే చాన్స్ ఉంది. ఈ నేపథ్యంలో దులీప్ ట్రోఫీలో రాణించిన వారిపై సెలెక్టర్ల దృష్టి ఉండనుంది. ఇక గత మ్యాచ్లో ఎనిమిది వికెట్లతో సత్తాచాటిన లెఫ్టార్మ్ స్పిన్నర్ మానవ్ సుతార్ అదే జోరు కొనసాగించాలని చూస్తున్నాడు.దులీప్ ట్రోఫీలో తెలుగు రాష్ట్రాల ఆటగాళ్లుతిలక్ వర్మ (భారత్ ‘ఎ’) షేక్ రషీద్ (భారత్ ‘ఎ’) నితీశ్ కుమార్ రెడ్డి (భారత్ ‘బి’) రికీ భుయ్ (భారత్ ‘డి’) శ్రీకర్ భరత్ (భారత్ ‘డి’) -
రింకూ సింగ్కు లక్కీ ఛాన్స్.. ఆ జట్టు నుంచి పిలుపు?
టీమిండియా విధ్వంసకర ఆటగాడు రింకూ సింగ్ మళ్లీ రెడ్ బాల్ క్రికెట్ ఆడేందుకు సిద్దమయ్యాడు. దులీప్ ట్రోఫీ-2024లో ఇండియా-బి జట్టు తరపున రింకూ ఆడనున్నాడు. భారత-బి జట్టులోని చాలా మంది ఆటగాళ్లు బంగ్లాదేశ్తో టెస్టు సిరీస్ ఆడేందుకు వెళ్లనున్నారు.ప్రస్తుతం బి జట్టులో భాగంగా ఉన్న యశస్వీ జైశ్వాల్, రిషబ్ పంత్, సర్ఫరాజ్ ఖాన్, యశ్ దయాల్లకు బంగ్లాతో టెస్టు సిరీస్కు ఎంపికయ్యారు. సెప్టెంబర్ 12 నుంచి జరగనున్న తదుపరి రౌండ్ మ్యాచ్లకు వీరిందరూ అందుబాటులో ఉండరు.ఈ నేపథ్యంలోనే రింకూ సింగ్తో పాటు మరో ఉత్తరప్రదేశ్ ఆటగాడు ఆకిబ్ ఖాన్కు దులీప్ ట్రోఫీలో ఆడేందుకు పిలుపు వచ్చింది అయితే ఈ దేశీవాళీ టోర్నీకి ముందు ఎంపిక చేసిన జట్లలో రింకూకు చోటు దక్కలేదు. దీంతో అతడు యూపీ టీ20లో లీగ్లో భాగమయ్యాడు. కానీ ఇప్పుడు సెలక్టర్లు నుంచి పిలుపు రావడంతో అతడు ఇండియా బి జట్టుతో చేరనున్నాడు."దులీప్ ట్రోఫీలో ఆడేందుకు అవకాశం వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. కష్టపడి పనిచేయడమే నా పని. మొదట జట్లను ప్రకటించినప్పుడు.. నా పేరు లేకపోవడం కాస్త నిరుత్సాహపడ్డాను. కానీ ఇప్పడు మళ్లీ పిలుపు రావడంతో సంతోషంగా ఉంది" అని టైమ్స్ ఆఫ్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రింకూ పేర్కొన్నాడు. అతడు త్వరలోనే అనంతపూర్లో ఉన్న భారత జట్టుతో చేరనున్నాడు.చదవండి: IND vs BAN: అప్పుడు జీరో.. కట్ చేస్తే..! ఇప్పుడు ఏకంగా టీమిండియాలో ఎంట్రీ? -
బంతితో చెలరేగిన రింకూ సింగ్.. ఒకే ఓవర్లో మూడు వికెట్లు
ఇప్పటి వరకు తన బ్యాటింగ్ మెరుపులతో ఆకట్టుకున్న టీమిండియా నయా ఫినిషర్ రింకూ సింగ్.. ఇప్పుడు తన బౌలింగ్ నైపుణ్యాలతోనూ అభిమానులను ఫిదా చేస్తున్నాడు. దీంతో ఈ లెఫ్టాండర్ బ్యాటర్ ఇలాగే నిలకడగా రాణిస్తే భారత జట్టుకు మరో అదనపు స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ దొరికినట్టేనంటూ అతడిని ప్రశంసిస్తున్నారు. ఉత్తరప్రదేశ్కు చెందిన రింకూ సింగ్ యూపీ టీ20 లీగ్ 2024లో మీరట్ మెవెరిక్స్ జట్టుకు కెప్టెన్గా వ్యవహరిస్తున్నాడు.ఈ క్రమంలో సారథ్య బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తున్న రింకూ... ఆల్రౌండ్ ప్రతిభతోనూ ఆకట్టుకుంటున్నాడు. ఇటీవల నోయిడా సూపర్ కింగ్స్తో మ్యాచ్లో 64 పరుగులు చేయడంతో పాటు రెండు కీలక వికెట్లు తీసిన విషయం తెలిసిందే. తాజాగా కాన్పూర్ సూపర్స్టార్స్తో మ్యాచ్లోనూ మూడు వికెట్లు పడగొట్టి ఔరా అనిపించాడు.ఏకనా క్రికెట్ స్టేడియంలో బుధవారం జరిగిన మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన మీరట్ మెవెరిక్స్కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. విధ్వంసకర ఓపెనర్గా పేరొందిన స్వస్తిక్ చికరా డకౌట్ అయ్యాడు. అయితే, మరో ఓపెనర్ అక్షయ్ దూబే సైతం 14 బంతుల్లో 11 పరుగులు చేసి నిష్క్రమించాడు.ఆ తర్వాతి స్థానంలో వచ్చిన మాధవ్ కౌశిక్ నెమ్మదిగా ఇన్నింగ్స్ ఆరంభించినా.. క్రమంగా క్రీజులో పాతుకుపోయి అద్భుత ఇన్నింగ్స్తో అదరగొట్టాడు. మాధవ్ 18, రితురాజ్ శర్మ 14 పరుగులతో ఉన్న సమయంలో వర్షం ఆటంకం కలిగించింది. ఈ క్రమంలో మ్యాచ్ను తొమ్మిది ఓవర్లకు కుదించారు. అప్పటికి మెవెరిక్స్ స్కోరు 49-2.26 బంతుల్లో 52 పరుగులువర్షం తగ్గిన తర్వాత మళ్లీ ఆట మొదలుపెట్టగా మాధవ్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కేవలం 26 బంతుల్లోనే 52 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఇందులో ఐదు ఫోర్లు, నాలుగు సిక్సర్లు ఉన్నాయి. ఈ క్రమంలో నిర్ణీత తొమ్మిది ఓవర్లలో మెవెరిక్స్ మూడు వికెట్ల నష్టానికి 90 పరుగులు చేసింది.ఈ నేపథ్యంలో డక్వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం కాన్పూర్ సూపర్స్టార్స్కు 106 పరుగుల లక్ష్యం విధించారు. ఈ క్రమంలో ఐదు ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 61 పరుగులు చేసిన కాన్పూర్ టార్గెట్ ఛేదించేలా కనిపించింది. అయితే, ఆరో ఓవర్లో బంతితో రంగంలోకి దిగిన మెవెరిక్స్ కెప్టెన్ రింకూ సింగ్.. స్పిన్ మాయాజాలంతో కాన్పూర్ బ్యాటర్లకు వరుస షాకులిచ్చాడు.ఒకే ఓవర్లో మూడు వికెట్లు తీసిన రింకూ సింగ్ఈ రైటార్మ్ ఆఫ్బ్రేక్ స్పిన్నర్కు ఫోర్తో స్వాగతం పలికిన శౌర్య సింగ్(5).. ఆ మరుసటి బంతికే పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత ఆదర్శ్ సింగ్, సుధాంశుల వికెట్లు కూడా పడగొట్టాడు రింకూ. ఒకే ఓవర్లో మూడు వికెట్లు(3/7) పడగొట్టి కాన్పూర్ను కోలుకోలేని దెబ్బకొట్టాడు. ఈ క్రమంలో 7.4 ఓవర్లలోనే కాన్పూర్ కథ(83 రన్స్) ముగియగా.. 22 పరుగుల తేడాతో మీరట్ మెవెరిక్స్ జయభేరి మోగించింది. దీంతో ఇప్పటి వరకు ఆడిన ఆరు మ్యాచ్లలో ఐదింట గెలిచి పాయింట్ల పట్టికలో మొదటిస్థానంలో నిలిచింది. View this post on Instagram A post shared by UP T20 League (@t20uttarpradesh) -
ఆల్రౌండ్ షోతో అదరగొట్టిన రింకూ సింగ్
యూపీ టీ20 లీగ్లో టీమిండియా చిచ్చరపిడుగు రింకూ సింగ్ చెలరేగిపోతున్నాడు. ఈ టోర్నీలో ఇప్పటివరకు మూడు మ్యాచ్లు ఆడిన అతను.. మూడింటిలో అజేయంగా (7 నాటౌట్ (2), 48 నాటౌట్ (35), 64 నాటౌట్ (35)) నిలిచి 119 పరుగులు చేశాడు. ఈ టోర్నీలో మీరట్ మెవెరిక్స్కు నాయకత్వం వహిస్తున్న రింకూ.. తాజాగా నోయిడా సూపర్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో 35 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 64 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఫలితంగా తొలుత బ్యాటింగ్ చేసిన మెవెరిక్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. మెవెరిక్స్ ఇన్నింగ్స్లో రింకూతో పాటు మాధవ్ కౌశిక్ (40) రాణించాడు. నోయిడా బౌలర్లలో నమన్ తివారి, కునాల్ త్యాగి చెరో 2 వికెట్లు పడగొట్టగా.. పియూశ్ చావ్లా, కార్తికేయ యాదవ్, నితీశ్ రాణా తలో వికెట్ దక్కించుకున్నారు.164 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన నోయిడా.. నిర్ణీత ఓవర్లలో 152 పరుగులకే (8 వికెట్ల నష్టానికి) పరిమితమై 11 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. కావ్య టియోటియా (65) నోయిడాను గెలిపించేందుకు విఫలయత్నం చేశాడు. ఆఖర్లో ఆదిత్య శర్మ (8 బంతుల్లో 21) బ్యాట్ ఝులిపించినా ప్రయోజనం లేకుండా పోయింది. నోయిడా కెప్టెన్ నితీశ్ రాణా ఓ మోస్తరు స్కోర్ (21) చేశాడు. మెవెరిక్స్ బౌలర్లలో విజయ్ కుమార్ 3 వికెట్లు పడగొట్టాడు.బంతితోనూ రాణించిన రింకూ..బ్యాట్తో ఇరగదీసిన రింకూ సింగ్ బౌలింగ్లోనూ (2/18) సత్తా చాటాడు. విశాల్ చౌదరీ, యశ్ గార్గ్, జీషన్ అన్సారీ తలో వికెట్ పడగొట్టారు. -
ఒకవేళ అదే జరిగితే ఆర్సీబీకి ఆడుతా: రింకూ సింగ్
ఐపీఎల్-2025 మెగా వేలానికి బీసీసీఐ ప్రణాళికలు రచిస్తోంది. అయితే ఇంకా ఆటగాళ్ల రిటెన్షన్ రూల్స్పై ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ మాత్రం ఇంకా ఎటువంటి ఆధికారిక ప్రకటన చేయలేదు.వాస్తవానికి మెగా వేలానికి ముందు ఫ్రాంచైజీలు గరిష్టంగా ముగ్గురు లేదా నలుగురు ఆటగాళ్లను మాత్రమే రిటైన్ చేసుకొని మిగతా ఆటగాళ్లను రిలీజ్ చేయాల్సి ఉంటుంది. కానీ కొన్ని ఫ్రాంచైజీలు మాత్రం రిటైన్ చేసుకునే ఆటగాళ్ల సంఖ్యను పెంచాలని డిమాండ్ చేస్తున్నాయి. ఇదే విషయాన్ని గత నెలలో జరిగిన ఐపీఎల్ గవర్నింగ్ బాడీ మీటింగ్లో కూడా ఆయా ఫ్రాంచైజీలు ప్రస్తావించాయి. కానీ ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ మాత్రం ఆయా ఫ్రాంచైజీల అభ్యర్ధననను తిరష్కరించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో మెగా వేలాన్ని ఈ ఏడాది చివరలో నిర్వహించాలని బీసీసీఐ భావిస్తున్నట్లు సమాచారం. అందుకు తగ్గట్టే ఆయా ఫ్రాంచైజీలు కూడా తమ జట్టులో సమూల మార్పులు దిశగా అడుగులు వేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.ఆర్సీబీకి ఆడాలని ఉంది: రింకూ ఇక ఐపీఎల్ మెగా వేలం వార్తల నేపథ్యంలో టీమిండియా ఫినిషర్, కోల్కతా నైట్రైడర్స్ ఆటగాడు రింకూ సింగ్ తన మనసులోని మాటను బయట పెట్టాడు. ఒకవేళ కేకేఆర్ అతడిని రిటైన్ చేసుకోపోతే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) తరపున ఆడాలన్న తన కోరికను రింకూ వ్యక్తపరిచాడు. విరాట్ కోహ్లి ఆర్సీబీలో ఉన్నందున ఆ ఫ్రాంచైజీకి ఆడాలనకుంటున్నట్లు అతడు తెలిపాడు.కాగా తన ఐపీఎల్ అరంగేట్రం నుంచి రింకూ కేకేఆర్ తరపున ఆడుతున్నాడు. కొన్ని సీజన్లలో అతడిని కోల్కతా వేలంలోకి విడిచిపెట్టినప్పటకి తిరిగి మళ్లీ సొంతం చేసుకుంది. ఆ జట్టు ఫినిషర్గా రింకూ మారాడు. అయితే ఈ ఏడాది సీజన్లతో కేకేఆర్ ఛాంపియన్స్గా నిలిచినప్పటకి రింకూ మాత్రం తన మార్క్ను చూపించలేకపోయాడు. ఇప్పటివరకు ఐపీఎల్లో కేకేఆర్ తరపున 45 మ్యాచ్లు ఆడిన రింకూ 143.34 స్ట్రైక్ రేటుతో 893 పరుగులు చేశాడు. -
రింకూ, సూర్యకుమార్ అద్భుత బౌలింగ్.. సూపర్ ఓవర్లో లంకను చిత్తు చేసిన భారత్
శ్రీలంకతో జరిగిన మూడో టీ20లో టీమిండియా ఓడాల్సిన మ్యాచ్లో గెలిచింది. పార్ట్ టైమ్ బౌలర్ల అయిన రింకూ సింగ్, సూర్యకుమార్ అద్బుతంగా బౌలింగ్ చేసి మ్యాచ్ను 'టై' చేశారు. అనంతరం సూపర్ ఓవర్లో టీమిండియా ఘన విజయం సాధించింది. 138 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనలో శ్రీలంక తడబడింది. చివరి ఏడు వికెట్లను 22 పరుగుల వ్యవధిలో (4.2 ఓవర్లలో) కోల్పోయింది. 19వ ఓవర్ వేసిన రింకూ సింగ్ కేవలం మూడు పరుగులు మాత్రమే ఇచ్చి 2 వికెట్లు తీయగా.. 20వ ఓవర్ వేసిన కెప్టెన్ సూర్యకుమార్ 5 పరుగులిచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు. రింకూ, స్కై సూపర్ బౌలింగ్తో చెలరేగడంతో మ్యాచ్ 'టై'గా మారి సూపర్ ఓవర్కు దారి తీసింది.GG & SURYA 🤝 DOING INNOVATION. 😄- A 20th over of the match was bowled by Suryakumar Yadav and he defended 6 runs. 🤯pic.twitter.com/dBIT8XdqX0— Mufaddal Vohra (@mufaddal_vohra) July 30, 2024సూపర్ ఓవర్లో వాషింగ్టన్ సుందర్ సూపర్గా బౌలింగ్ చేసి రెండు వికెట్లు తీసి రెండు పరుగులు మాత్రమే ఇచ్చాడు. అనంతరం సూర్యకుమార్ తొలి బంతికే బౌండరీ బాది టీమిండియాకు చిరస్మరణీయ విజయాన్నందించాడు. ఈ గెలుపుతో భారత్ మూడు మ్యాచ్ల సిరీస్ను 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది. ఓడాల్సిన మ్యాచ్ను సూపర్ ఓవర్ దాకా తీసుకెళ్లి గెలవడంతో పార్ట్ టైమ్ బౌలర్లు రింకూ సింగ్, సూర్యకుమార్ యాదవ్లపై ప్రశంసల వర్షం కురుస్తుంది. ముఖ్యంగా చివరి ఓవర్ అద్భుతంగా బౌలింగ్ చేసిన స్కైను అభిమానులు ఆకాశానికెత్తుతున్నారు. RINKU SINGH, THE STAR IN THE 19TH OVER. 🔥 pic.twitter.com/eDv1Qt3uYj— Johns. (@CricCrazyJohns) July 30, 2024నిజమైన మ్యాచ్ విన్నర్ అంటూ కొనియాడుతున్నారు. సూపర్ ఓవర్ వేసిన సుందర్పై కూడా ప్రశంసల వర్షం కురుస్తుంది. సూపర్ ఓవర్లో అద్బుతంగా బౌలింగ్ చేశాడంటూ నెటిజన్లు కితాబునిస్తున్నారు. రెగ్యులర్ మ్యాచ్లో రెండు, సూపర్ ఓవర్లో రెండు వికెట్లు తీయడంతో పాటు కీలకమైన 25 పరుగులు చేసిన సుందర్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా ఎంపికయ్యాడు. రెగ్యులర్ కెప్టెన్గా తొలి సిరీస్లోనే అద్భుతంగా రాణించిన సూర్యకుమార్కు ప్లేయర్ ఆఫ్ సిరీస్ అవార్డు లభించింది.ఇక ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 137 పరుగులు చేసింది. శుభ్మన్ గిల్ (39), రియాన్ పరాగ్ (26), సుందర్ (25) ఓ మోస్తరు పరుగులు చేశారు. లంక బౌలరల్లో తీక్షణ 3, హసరంగ 2, విక్రమసింఘే, అశిత ఫెర్నాండో, రమేశ్ మెండిస్ తలో వికెట్ పడగొట్టారు.అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన శ్రీలంక ఆదిలో గెలుపు దిశగా పయనించినప్పటికీ చివర్లో తడబడి ఓటమిని కొనితెచ్చుకుంది. ఆ జట్టు నిర్ణీత ఓవర్లు పూర్తయ్యేసరికి 8 వికెట్ల నష్టానికి 137 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఓపెనర్లు నిస్సంక (26), కుశాల్ మెండిస్ (43), వన్డౌన్ బ్యాటర్ (46) ఓ మోస్తరు స్కోర్లు చేసినా ప్రయోజనం లేకుండా పోయింది. మిగతా ఆటగాళ్లంతా కనీసం రెండంకెల స్కోర్లు కూడా చేయలేకపోయారు. భారత బౌలర్లలో సుందర్, బిష్ణోయ్, రింకూ సింగ్, స్కై తలో 2 వికెట్లు తీశారు. కాగా, ఇరు జట్ల మధ్య మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ ఆగస్ట్ 2, 4, 7 తేదీల్లో కొలొంబో వేదికగా జరుగనుంది. -
టెస్ట్ల్లోకి రింకూ..?
పొట్టి ఫార్మాట్లో అత్యుత్తమ ఫినిషర్గా పేరు తెచ్చుకున్న భారత అప్ కమింగ్ స్టార్ రింకూ సింగ్పై టీమిండియా తాజా మాజీ బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రింకూకు టెస్ట్ల్లో అవకాశాలు కల్పిస్తే ఖచ్చితంగా రాణిస్తాడని ఆశాభావం వ్యక్తం చేశాడు. రింకూకు ఉన్న టెంపర్మెంట్ సుదీర్ఘ ఫార్మాట్కు సరిగ్గా సరిపోతుందని అభిప్రాయపడ్డాడు. రింకూ నెట్స్లో బ్యాటింగ్ చేసే విధానం చూస్తే, అతనెందుకు టెస్ట్ జట్టులో ఉండకూడదని అనిపిస్తుందన్నాడు. రింకూ ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 50కి పైగా సగటు కలిగి ఉన్నాడన్న విషయాన్ని గుర్తు చేశాడు. సరిగ్గా వినియోగించుకుంటే రింకూ టెస్ట్ల్లో సత్తా చాటగలడని ఆశాభావం వ్యక్తం చేశాడు. ప్రముఖ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాథోడ్ రింకూపై తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచాడు. 26 ఏళ్ల రింకూ ఫస్ట్క్లాస్ క్రికెట్లో ఉత్తర్ప్రదేశ్కు ప్రాతినిథ్యం వహిస్తాడు. ఈ ఫార్మాట్లో అతను 47 మ్యాచ్లు ఆడి 54.70 సగటున 3173 పరుగులు చేశాడు. త్వరలో భారత్.. స్వదేశంలో బంగ్లాదేశ్తో టెస్ట్ సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్ కోసం భారత సెలెక్టర్లు రింకూ సింగ్ పేరును పరిశీలిస్తారేమో చూద్దాం.ఇదిలా ఉంటే, రింకూ.. భారత్ టీ20 వరల్డ్ కప్ 2024 గెలిచిన జట్టులో రిజర్వ్ సభ్యుడిగా ఉన్నాడు. జట్టు కూర్పులో సమతుల్యత కోసం ప్రపంచకప్ జట్టుకు రింకూని ఎంపిక చేయలేదు. తాజాగా జింబాబ్వే ముగిసిన టీ20 సిరీస్లో రింకూ చెప్పుకోదగ్గ స్కోర్లేమీ చేయలేదు. ఈ సిరీస్లో అతను నాలుగు ఇన్నింగ్స్ల్లో 60 పరుగులు మాత్రమే చేశాడు. ఓవరాల్గా రింకూ టీ20 కెరీర్లో 15 ఇన్నింగ్స్లు ఆడి 83.2 సగటున, 176.27 స్ట్రయిక్రేట్తో 416 పరుగులు చేశాడు. రింకూ గతేడాది వన్డేల్లోనూ అరంగేట్రం చేశాడు. ఈ ఫార్మాట్లో అతను రెండు మ్యాచ్లు ఆడి 55 పరుగులు చేశాడు. -
రింకూ సింగ్ ఖాతాలో ప్రత్యేక రికార్డు.. ధోని, విరాట్ కంటే వేగంగా..!
జింబాబ్వేతో జరిగిన రెండో టీ20లో భారత అప్ కమింగ్ స్టార్ రింకూ సింగ్ ఓ ప్రత్యేకమైన రికార్డు నెలకొల్పాడు. ఈ మ్యాచ్లో 22 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 48 పరుగులు చేసి అజేయంగా నిలిచిన రింకూ.. భారత్ తరఫున టీ20ల్లో చివరి రెండు ఓవర్లలో అత్యధిక సిక్సర్లు (18) బాదిన ఆటగాళ్ల జాబితాలో నాలుగో స్థానానికి ఎగబాకాడు. ఈ జాబితాలో హార్దిక్ పాండ్యా (32 సిక్సర్లు) టాప్లో ఉండగా.. విరాట్ (24), ధోని (19) రెండు, మూడు స్థానాల్లో నిలిచారు. 32 సిక్సర్ల మార్కును చేరుకునేందుకు హార్దిక్కు 193 బంతులు, 24 సిక్సర్ల మార్కును చేరుకునేందుకు కోహ్లికి 158 బంతులు, 19 సిక్సర్ల మార్కును చేరుకునేందుకు ధోనికి 258 బంతులు అవసరం కాగా.. రింకూ కేవలం 48 బంతుల్లోనే 18 సిక్సర్ల మార్కును తాకాడు. రింకూ కెరీర్లో చివరి రెండు ఓవర్లలో 334.69 స్ట్రయిక్రేట్తో పరుగులు సాధించడం గమనార్హం. తన టీ20 కెరీర్లో ఇప్పటివరకు (13 ఇన్నింగ్స్లు) 25 సిక్సర్లు బాదిన రింకూ.. 178.76 స్ట్రయిక్రేట్తో 80.8 సగటున 404 పరుగులు చేశాడు. అంతర్జాతీయ స్థాయిలో కనీసం 15 మ్యాచ్లు ఆడిన ఆటగాళ్లలో ఇవే అత్యుత్తమ గణాంకాలు. రింకూ తన టీ20 కెరీర్లో చేసిన స్కోర్లు ఇలా ఉన్నాయ. 38(21), 37*(15), 22*(14), 31*(9), 46(29), 6(8), 68*(39), 14(10), 16*(9), 9*(9), 69*(39), 0(2), 48*(22)🚨 WHAT A SHOT, RINKU 🚨 pic.twitter.com/gNZKRjAYZ9— Johns. (@CricCrazyJohns) July 7, 2024జింబాబ్వేతో రెండో టీ20లో 15వ ఓవర్లో క్రీజ్లోకి వచ్చిన రింకూ.. తొలి 14 బంతుల్లో కేవలం 18 పరుగులు మాత్రమే చేశాడు. చివరి రెండు ఓవర్లలో గేర్ మార్చిన రింకూ.. 8 బంతుల్లో 4 సిక్సర్లు, ఓ బౌండరీ బాది టీమిండియా భారీ స్కోర్కు దోహదపడ్డాడు. ఈ మ్యాచ్లో రింకూ కొట్టిన ఓ సిక్సర్ స్టేడియం బయటపడింది.ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా.. యువ ఓపెనర్ అభిషేక్ శర్మ (47 బంతుల్లో 100; 7 ఫోర్లు, 8 సిక్సర్లు) శతక్కొట్టడంతో నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 234 పరుగులు చేసింది. అభిషేక్తో పాటు రుతురాజ్ గైక్వాడ్ (47 బంతుల్లో 77 నాటౌట్; 11 ఫోర్లు, సిక్సర్), రింకూ సింగ్ కూడా చెలరేగడంతో భారత్ భారీ స్కోర్ చేసింది. అనంతరం ఛేదనలో చేతులెత్తేసిన జింబాబ్వే.. ముకేశ్ కుమార్ (3.4-0-37-3), ఆవేశ్ ఖాన్ (3-0-15-3), రవి బిష్ణోయ్ (4-0-11-2), వాషింగ్టన్ సుందర్ (4-0-28-1) ధాటికి 18.4 ఓవర్లలో 134 పరుగులకే కుప్పకూలి ఘోర పరాజయాన్ని (100 పరుగుల తేడాతో) మూటగట్టుకుంది. ఈ మ్యాచ్లో గెలుపుతో భారత్.. తొలి టీ20లో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకుంది. ప్రస్తుతం ఐదు మ్యాచ్ల ఈ సిరీస్లో భారత్, జింబాబ్వే చెరో విజయంతో సమంగా ఉన్నాయి. మూడో మ్యాచ్ జులై 10న జరుగనుంది. -
అభిషేక్, రుతురాజ్, రింకూ ఊచకోత.. జింబాబ్వే టార్గెట్ 235 పరుగులు
హరారే వేదికగా జింబాబ్వే జరుగుతున్న రెండో టీ20లో భారత బ్యాటర్లు విధ్వంసం సృష్టించారు. టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 234 పరుగుల భారీ స్కోర్ సాధించింది. భారత బ్యాటర్లలో ఓపెనర్ అభిషేక్ శర్మ విధ్వంసకర సెంచరీతో చెలరేగాడు.జింబాబ్వే బౌలర్లకు అభిషేక్ చుక్కలు చూపించాడు. మైదానం నలుమూలల బౌండరీల వర్షం కురిపించాడు. కేవలం 46 బంతుల్లోనే తన సెంచరీ మార్క్ను అందుకున్నాడు. సరిగ్గా 100 పరుగులు చేసి అభిషేక్ ఔటయ్యాడు. అతడి ఇన్నింగ్స్లో 7 ఫోర్లు, 8 సిక్స్లు ఉన్నాయి. అతడితో పాటు ఫస్ట్ డౌన్ బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. రుతురాజ్ 47 బంతుల్లో 11 ఫోర్లు,1 సిక్స్తో 77 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. రింకూ సింగ్( తన బ్యాట్కు పనిచెప్పాడు. రింకూ కేవలం 22 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్స్లతో 48 పరగులు చేసి నాటౌట్గా నిలిచాడు. ఇక జింబాబ్వే బౌలర్లలో ముజుబ్రానీ,మసకజ్డా తలా వికెట్ సాధించారు. -
T20 WC: గిల్తో పాటు అతడు ఇంటికి! వాళ్లిద్దరు అక్కడే..
టీ20 ప్రపంచకప్-2024లో టీమిండియా అదరగొడుతోంది. లీగ్ దశలో ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే సూపర్-8కు చేరుకున్న రోహిత్ సేన.. తదుపరి కెనడాతో తలపడనుంది.ఫ్లోరిడాలోని ఫోర్ట్ లాడెర్డేల్లో ఇరు జట్ల మధ్య జూన్ 15న మ్యాచ్ జరుగనుంది. ఈ నేపథ్యంలో భారత జట్టుకు సంబంధించిన ఓ ఆసక్తికర అప్డేట్ తెరమీదకు వచ్చింది.వరల్డ్కప్-2024 జట్టులో ట్రావెలింగ్ రిజర్వు ప్లేయర్లుగా ఉన్న స్టార్ ఓపెనర్ శుబ్మన్ గిల్, యువ పేసర్ ఆవేశ్ ఖాన్ స్వదేశానికి తిరిగి రానున్నట్లు సమాచారం. అయితే, వీరితో పాటు ఇదే కేటగిరిలో ఉన్న రింకూ సింగ్, ఖలీల్ అహ్మద్ మాత్రం ప్రధాన జట్టుతో కొనసాగనున్నట్లు తెలుస్తోంది.ప్రస్తుతం వీరు నలుగురు టీమిండియాతో కలిసి చార్టెడ్ ఫ్లైట్లో ఫ్లోరిడాకు చేరుకున్నట్లు సమాచారం. అక్కడ కెనడాతో మ్యాచ్ ముగిసిన తర్వాత గిల్, ఆవేశ్ ఖాన్ భారత్కు తిరిగి పయనం కానున్నట్లు తెలుస్తోంది. కారణం ఏమిటి?ఈ మెగా టోర్నీలో కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లి ఓపెనర్గా బరిలోకి దిగుతున్న విషయం తెలిసిందే. అదే విధంగా బ్యాకప్ ఓపెనర్గా యశస్వి జైస్వాల్ అందుబాటులో ఉన్నాడు. సంజూ శాంసన్ రూపంలో మరో ఆప్షన్ కూడా ఉంది.ఈ నేపథ్యంలో గ్రూప్ దశ ముగిసిన తర్వాత ఇక శుబ్మన్ గిల్తో అవసరం ఉండదని బీసీసీఐ భావిస్తున్నట్లు సమాచారం. మరోవైపు.. గ్రూప్ దశలోని నాలుగు మ్యాచ్లు అమెరికాలో పూర్తి చేసుకున్న తర్వాత టీమిండియా.. మిగతా మ్యాచ్ల కోసం వెస్టిండీస్కు వెళ్లనుంది.అవసరం లేదుఇక విండీస్ పిచ్లు స్లోగా.. స్పిన్నర్లకు కాస్త అనుకూలంగా ఉంటాయన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అదనపు పేసర్తో అవసరం లేదు.ఇప్పటికే పేస్ దళ నాయకుడు జస్ప్రీత్ బుమ్రాతో పాటు అర్ష్దీప్ సింగ్, మహ్మద్ సిరాజ్తో పాటు ఆల్రౌండర్లు హార్దిక్ పాండ్యా, శివం దూబే అందుబాటులో ఉన్నారు. కాబట్టి ఎక్స్ట్రాగా ఆవేశ్ ఖాన్ను ఇంటికి పంపించాలని మేనేజ్మెంట్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది.అయితే, హిట్టర్ రింకూ సింగ్తో పాటు బ్యాకప్ పేసర్గా ఖలీల్ అహ్మద్ను మాత్రం కొనసాగించనుందని సమాచారం. కాగా టీ20 వరల్డ్కప్-2024లో టీమిండియా ఇప్పటి వరకు ఐర్లాండ్, పాకిస్తాన్, అమెరికా జట్లపై విజయాలు సాధించింది. గ్రూప్- ఏ టాపర్గా సూపర్-8కు అర్హత సాధించింది.చదవండి: T20 World Cup 2024: వరల్డ్కప్ టోర్నీ నుంచి అవుట్.. శ్రీలంకకు ఏమైంది? -
వంద కోట్ల స్కాం బయటపెట్టిన అధికారిని పిచ్చోడని వేటు వేశారు..కట్ చేస్తే 15 ఏళ్ల తర్వాత
బుల్లెట్లు శరీరంలోకి దూసుకుపోయినా ఫైట్ చేయడం సినిమాల్లోని హీరోలకే సాధ్యం. అదే రియల్ లైఫ్లో హీరో అయినా జీరో అయిపోతాడు. కానీ ఈ సంక్షేమ అధికారి కథ వింటే ఆ మాట తప్పు అని ఒప్పుకుంటారు. తన నిజాయితీకి బహుమానంగా ఏడు రౌండ్లు కాల్పులు జరిపారు దుండగులు. చావు అంచాలదాక వెళ్లి వచ్చాడు. ఆయన స్థానంలో మరొకరు ఉంటే జీవచ్ఛవంలా అయిపోతారు. కానీ ఆయన ఎక్కడైతే తనకు ఇలాంటి పరిస్థితి ఎదురయ్యిందో అక్కడకే మళ్లీ ఐఏఎస్ హోదాలో వచ్చి మరీ వాళ్ల పనిపట్టారు. ఇలాంటి కథ సినిమాల్లోనే చూస్తాం. కానీ రియల్ లైఫ్లో కూడా సాధ్యమే అని ప్రూవ్ చేసి అందరికి ఆదర్శంగా నిలిచారు ఆయనే....ఆ అధికారి పేరు రింకు సింగ్ రాహీ. ఉత్తరప్రదేశ్కి చెందిన రింకు రాష్ట్ర స్థాయి పీసీఎస్ ఎగ్జామ్ 2007 క్వాలిఫై అయ్యి సంక్షేమ శాఖలో అధికారిగా ఉద్యోగం పొందాడు. తన విధులు నిర్వర్తిస్తున్నప్పుడూ సంక్షేమ నిధుల్లో అవకతవకలు జరిగినట్లు గుర్తించారు. ఆయన చేసిన దర్యాప్తులో డిపార్టుమెంట్ నుంచి పెద్దమొత్తంలో సంక్షేమ నిధులు మళ్లీంచబడ్డాయని తేలుతుంది. దీంతో ఎలా జరిగిందనే దిశగా..క్షణ్ణంగా దర్యాప్తు చేయగా ఏకంగా రూ. 100 కోట్ల స్కాలర్షిప్ స్కామ్ని వెలికితీశారు రాహీ. దీంతో కోర్టు ఈ కుంభకోణానికి పాల్పడ ఎనిమిది మందిపై కేసులు నమోదు చేసి జైల్లో పెట్టారు. వారిలో నలుగురికి పదేళ్ల జైలు శిక్ష పడింది. దీంతో వారంతా కక్షతో రాహీని హత్య చేసేందకు కుట్ర పన్నారు. అదను చూసి ఏకంగా అతడిపై ఏడు రౌండ్లు తుపాకీ కాల్పులు జరిపారు. ఈ దాడిలో రాహి తీవ్రంగా గాయపడ్డాడు. కుడివైపు కన్ను, దవడ పూర్తిగా దెబ్బతిన్నాయి. వినికిడిని, ఒక కంటిని కోల్పోయాడు. చెప్పాలంటే అందవిహీనంగా అయ్యిపోయి సర్వం కోల్పోయినవాడుగా అయ్యిపోయాడు రాహీ. అంతేగాదు ఆ దాడి కారణంగా రాహీ నాలుగు నెలలు పైగా ఆస్పత్రిలోనే ఉన్నాడు. కనీసం ఆయన మెడికల్ లీవ్ని కూడా ఆమోదించకుండా అతనిపట్ల నిర్థాక్షిణ్యంగా వ్యవహరించారు అతడి పైఅధికారులు. ఇదంతా ఒక ఎత్తు అయితే అయితే..తన నిజాయితీని అధికారులు గుర్తించకపోగా..పిచ్చోడని ముద్రవేసి సస్పెండ్ చేశారు. అతను కష్టపడి వెలికితీసిన ఆధారాలన్ని వీగిపోయాయి. ఇవన్నీ రాహీని శారీరకంగా, మానసికంగా చాలా నిరాశనిస్ప్రుహల్లోకి నెట్టేశాయి. ఒక చిన్న అధికారిగా ఉంటే ఇలాంటి స్కామ్లకు అడ్డుకట్టవేయలేనని భావించి..ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలని అనుకుంటాడు. విధికి ఎదురీదైనా అనుకున్న లక్ష్యం సాధించాలని నిశ్చయించకున్నాడు. సరిగ్గా 40 ఏళ్ల వయసులో వికలాంగులో కోటలో యూపీఎస్సీ ఎగ్జామ్కి రాసేందుకు ప్రిపేర్ అయ్యాడు. తన చివరి ప్రయత్నంలో 2021లో ఉత్తీర్ణ సాధించి 683వ ర్యాంకు సాధించారు. ఎక్కడైతే పిచ్చోడని ముద్ర వేయించుకుని సస్పెండ్ అయ్యాడో అదే ప్రాంతానికి 15 ఏళ్ల తర్వాత ఐఏఎస్ ఆఫీసర్గా వచ్చారు. ఉత్తరప్రదేశ్లోని ముజఫర్నగర్కు మేజిస్ట్రేట్ అఫీసర్గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ మేరకు రాహీ మాట్లాడతూ..తనకు ప్రజా ప్రయోజనాలే ముఖ్యం అని చెప్పారు. స్వప్రయోజనాలకు, ప్రజా ప్రయోజనాలకు మధ్య ఎప్పుడైనా ఘర్షణ తలెత్తితే, తాను ప్రజా ప్రయోజనాలను ఎంచుకుంటానని నిర్భయంగా చెప్పారు. ప్రస్తుతం ఆయనకి 44 ఏళ్లు, తొమ్మిదేళ్ల కొడుకు కూడా ఉన్నాడు. నిజంగా రింకు సింగ్ రాహీ రియల్ హీరో కదూ. అంతటి పరిస్థితి ఎదర్కొంటే..ఎవ్వరైనా చాలా అవమానంగా భావించి కుంగిపోతారు. ఆయన మాత్రం విధికే సవాలు విసిసి లేచి నిలబడి తానేంటో చూపించాడు. అతడకి కథ ఎందరికో స్ఫూర్తి.(చదవండి: అల్జీమర్ వ్యాధికి దానిమ్మ చెక్ పెట్టగలదా? పరిశోధనలో షాకింగ్ విషయాలు) -
రింకూ సెలక్ట్ కాకపోవడానికి కారణం ఆ రూలే: ఆర్పీ సింగ్
టీ20 ప్రపంచకప్-2024 కోసం ఎంపిక చేసిన భారత జట్టు గురించి ప్రధాన జట్టులో రింకూ సింగ్కు చోటు దక్కకపోవడానికి కారణం ఐపీఎల్లోని నిబంధనే అని పేర్కొన్నాడు,టీమిండియా నయా ఫినిషర్గా ప్రశంసలు అందుకుంటున్న రింకూ సింగ్ గురించి భారత మాజీ పేసర్ ఆర్పీ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టీ20 ప్రపంచకప్-2024 కోసం ఎంపిక చేసిన జట్టులో అతడికి చోటు దక్కకపోవడానికి ఐపీఎల్ నిబంధననే కారణమని వాపోయాడు.కాగా అమెరికా- వెస్టిండీస్ వేదికగా జూన్ 1 నుంచి ఈ మెగా ఈవెంట్ ఆరంభం కానుంది. ఈ క్రమంలో జూన్ 5న టీమిండియా తమ తొలి మ్యాచ్ ఆడనుంది.ఇక ఈ ఐసీసీ టోర్నీకి ప్రకటించిన 15 మంది సభ్యుల జట్టులో రింకూ సింగ్కు చోటు దక్కలేదన్న విషయం తెలిసిందే. అతడికి కేవలం రిజర్వ్ ప్లేయర్గానే అవకాశం ఇచ్చారు సెలక్టర్లు.నిజానికి టీ20లలో టీమిండియా తరఫున ఫినిషర్గా రాణిస్తున్న రింకూకు మొండిచేయి చూపడానికి కారణం ఐపీఎల్-2024లో అతడి ప్రదర్శన ఓ కారణమని చెప్పవచ్చు. గతేడాది 14 మ్యాచ్లు ఆడిన ఈ కోల్కతా నైట్ రైడర్స్ లోయర్ ఆర్డర్ బ్యాటర్.. 474 పరుగులు చేశాడు.ఒకే ఓవర్లో ఐదు సిక్స్లు బాది సిక్సర్ల కింగ్గా పేరొందాడు. ఈ క్రమంలో టీమిండియా తరఫున అరంగేట్రం చేసిన రింకూ.. ఇప్పటి వరకు 15 టీ20లు ఆడి 356 పరుగులు సాధించాడు.నిలకడైన ఆటతో జట్టులో స్థానం సుస్థిరం చేసుకుంటాడని అంతా భావించారు. వరల్డ్కప్ రేసులోనూ రింకూ ముందుంటాడని అభిప్రాయపడ్డాడు. అయితే, తాజా ఐపీఎల్ ఎడిషన్లో మాత్రం రింకూకు ఎక్కువగా బ్యాటింగ్ చేసే అవకాశమే రాలేదు.ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన కారణంగా ఈ లోయర్ ఆర్డర్ బ్యాటర్ అవసరం ఎక్కువగా లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో 11 ఇన్నింగ్స్లో భాగమైన రింకూ 168 పరుగులు మాత్రమే చేయగలిగాడు.ఈ నేపథ్యంలో ఆర్పీ సింగ్ మాట్లాడుతూ.. ‘‘వరల్డ్కప్ జట్టులో రింకూ సింగ్ పేరు తప్పక ఉండాల్సింది. దురదృష్టవశాత్తూ అతడికి స్థానం దక్కలేదు. ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ గనుక లేకపోయి ఉంటే అతడు కచ్చితంగా ప్రపంచకప్ జట్టుకు ఎంపికయ్యేవాడు’’ అని పేర్కొన్నాడు. -
కొంచెం బాధపడ్డాను.. కానీ రోహిత్ భయ్యా మాత్రం చాలా: రింకూ
టీ20 వరల్డ్కప్-2024కు మరో మూడు రోజుల్లో తెరలేవనుంది. జూన్ 1 నుంచి అమెరికా, వెస్టిండీస్ల వేదికగా ఈ మెగా టోర్నీ ఆరంభం కానుంది. ఈ మెగా ఈవెంట్ కోసం భారత జట్టు ఇప్పటికే అమెరికా గడ్డపై అడుగు పెట్టింది. ఇక ఇది ఇలా ఉండగా.. భారత టీ20 వరల్డ్కప్ ప్రధాన జట్టులో నయా ఫినిషర్ రింకూ సింగ్కు చోటు దక్కకపోయిన సంగతి తెలిసిందే.రింకూకు మెయిన్ స్వ్కాడ్లో కాకుండా రిజర్వ్ జాబితాలో సెలక్టర్లు చోటిచ్చారు. సెలక్టర్లు తీసుకున్న ఈ నిర్ణయంపై పెద్ద ఎత్తున చర్చ నడిచింది. ఈ క్రమంలో వరల్డ్కప్ జట్టులో చోటుదక్కకపోవడంపై తొలిసారి రింకూ స్పందించాడు. జట్టు సెలక్షన్ తర్వాత భారత కెప్టెన్ రోహిత్ శర్మ తనతో మాట్లాడాని, ఎంతో సపోర్ట్గా నిలిచాడని రింకూ చెప్పుకొచ్చాడు."టీ20 వరల్డ్కప్ ప్రధాన జట్టులో చోటు దక్కకపోవడం నాకు కొంచెం బాధ కల్గించంది. ఎందుకంటే మనం బాగా ఆడుతున్నప్పటకి ఎంపిక కాకపోతే సహజంగా ఎవరైనా బాధపడతారు. అయితే నన్ను ఎంపిక చేయకపోవడంలో సెలక్టర్లు తప్పేమి లేదు. టీమ్ కాంబినేషన్ కారణంగా నన్ను ఎంపిక చేయలేదు. నేను మొదట్లో కొంచెం బాధపడ్డాను. ఆ తర్వాత మన చేతిలో లేని వాటి గురించి ఎక్కువగా ఆలోచించకూడదని నాకు నేనే సర్ది చెప్పుకున్నాను. ఏది జరిగినా సరే అది మన మంచికే అనుకున్నాను. రోహిత్ భయ్యా కూడా నాతో మాట్లాడు. సెలక్షన్ గురించి ఎక్కువగా ఆలోచించవద్దు అని రోహిత్ చెప్పాడు. కష్టపడి పనిచేస్తూ ఉంటూ రెండేళ్ల తర్వాత మళ్లీ ప్రపంచకప్ ఉంటుందని రోహిత్ నాకు సపోర్ట్గా నిలిచాడని" దైనిక్ జాగరణ్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రింకూ పేర్కొన్నాడు. -
ప్రపంచకప్ జట్టులో దక్కని చోటు.. రింకూ ఆసక్తికర వ్యాఖ్యలు
సానుకూల దృక్పథం ఉంటే ఎన్ని అవాంతరాలు ఎదురైనా విజయవంతంగా ముందుకు సాగవచ్చంటున్నాడు టీమిండియా నయా ఫినిషర్ రింకూ సింగ్. టైమ్ బాగాలేదంటూ కాలం వృథా చేసే మనిషిని కాదని.. దేవుడు తనకు అన్నీ ఇచ్చాడని పేర్కొన్నాడు. ప్రస్తుతం తనకు రోజులు బాగానే గడుస్తున్నాయని తెలిపాడు.క్రికెటర్గా జూనియర్ లెవల్లో ఎన్నో ట్రోఫీలు గెలిచానన్న రింకూ సింగ్.. ఈసారి ప్రపంచకప్ను ముద్దాడే అవకాశం తనకు తప్పక వస్తుందని ధీమా వ్యక్తం చేశాడు. కాగా జూన్ 1 నుంచి అమెరికా- వెస్టిండీస్ వేదికగా మొదలయ్యే టీ20 ప్రపంచకప్-2024 కోసం బీసీసీఐ ఇప్పటికే జట్టును ప్రకటించిన విషయం తెలిసిందే.పదిహేను మంది సభ్యులతో కూడిన ప్రధాన జట్టులో రింకూ సింగ్కు చోటు దక్కలేదు. ట్రావెలింగ్ రిజర్వ్ ప్లేయర్గా మాత్రమే అతడిని ఎంపిక చేశారు సెలక్టర్లు. ఈ నేపథ్యంలో రింకూకు అన్యాయం జరిగిందంటూ పలువురు మాజీ క్రికెటర్లు సెలక్షన్ కమిటీ తీరును తప్పుబట్టారు.అయితే, తాను మాత్రం ప్రతికూల పరిస్థితుల్లోనూ పాజిటివీతోనే ఉంటానని రింకూ సింగ్ అంటున్నాడు. ‘‘సాకులు వెదుక్కునే వాళ్లే టైమ్ బాగాలేదని చెప్తూ ఉంటారు. నాకు అన్ని అవయవాలు సక్రమంగానే ఉన్నాయి కాబట్టి మన టైమ్ బాగున్నట్లే కదా.టీమిండియా వరల్డ్కప్ ఫైనల్లో ఓడిపోయినపుడు చాలా మంది ఏడ్చారు. ఏదేమైనా గతాన్ని మరిచి ముందుకు సాగాల్సి ఉంటుంది! నిజానికి నేను జూనియర్ లెవల్లో ట్రోఫీలు గెలిచాను. కానీ సీనియర్ లెవల్లో ఒక్కసారి కూడా టైటిల్ సాధించలేదు.అయితే, ఈసారి టీ20 ప్రపంచకప్ రూపంలో మెగా టోర్నీలో భాగం కాబోతున్నాను. ఈసారి వరల్డ్కప్ను నా చేతుల్లోకి తీసుకుంటాననే అనుకుంటున్నా. మేజర్ ఈవెంట్లో ట్రోఫీ గెలవాలన్నది ప్రతి ఒక్క క్రికెటర్ కల’’ అని రింకూ సింగ్ చెప్పుకొచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియోను కేకేఆర్ సోషల్ మీడియాలో షేర్ చేసింది.కాగా ఐపీఎల్లో కోల్కతా నైట్ రైడర్స్కు ప్రాతినిథ్యం వహిస్తున్న రింకూ ఈ ఏడాది 11 ఇన్నింగ్స్ ఆడి కేవలం 168 పరుగులు మాత్రమే చేశాడు. ప్రస్తుతం అతడు క్వాలిఫయర్-1 ఆడేందుకు సన్నద్ధమవుతున్నాడు. అహ్మదాబాద్లో మంగళవారం జరుగనున్న ఈ మ్యాచ్లో కేకేఆర్ సన్రైజర్స్ హైదరాబాద్తో తలపడనుంది.చదవండి: KKR vs SRH: ప్రమాదకారి.. ఫైనల్ చేరే తొలి జట్టు ఇదే: పాక్ లెజెండ్ View this post on Instagram A post shared by IPL (@iplt20) -
హార్దిక్ బదులు అతడిని ఎంపిక చేయాల్సింది: పాక్ మాజీ స్టార్
టీ20 వరల్డ్కప్-2024 నేపథ్యంలో బీసీసీఐ ప్రకటించిన జట్టుపై పాకిస్తాన్ మాజీ స్పిన్నర్ డానిష్ కనేరియా తన అభిప్రాయాలు పంచుకున్నాడు. యశస్వి జైస్వాల్ వంటి యంగ్ స్టార్లకు చోటివ్వడం సరైన నిర్ణయమని.. అయితే, రింకూ సింగ్కు మాత్రం అనాయ్యం జరిగిందని పేర్కొన్నాడు.లోయర్ ఆర్డర్లో హిట్టింగ్ ఆడగల రింకూను పక్కన పెట్టడం సరికాదని టీమిండియా సెలక్టర్ల తీరును కనేరియా విమర్శించాడు. హార్దిక్ పాండ్యా బదులు రింకూను జట్టుకు ఎంపిక చేయాల్సిందని అభిప్రాయపడ్డాడు.రింకూ సింగ్కు అనాయ్యంకాగా జూన్ 1 నుంచి అమెరికా- వెస్టిండీస్ వేదికగా మొదలయ్యే ప్రపంచకప్నకు బీసీసీఐ మంగళవారం 15 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. రోహిత్ శర్మ సారథ్యంలోని ఈ టీమ్లో రింకూ సింగ్కు స్థానం దక్కలేదు. రిజర్వ్ ప్లేయర్గా మాత్రమే అతడు ఎంపికయ్యాడు.వీళ్లంతా భేష్ఈ నేపథ్యంలో డానిష్ కనేరియా మాట్లాడుతూ.. ‘‘నాణ్యమైన క్రికెటర్లను ఉత్పత్తి చేస్తుందనే పేరు భారత్కు ఉంది. ఇటీవలి కాలంలో దుమ్ములేపుతున్న యశస్వి జైస్వాల్, అంగ్క్రిష్ రఘువంశీ ఇందుకు చక్కని ఉదాహరణలు.మయాంక్ యాదవ్ సైతం తన పేస్ నైపుణ్యాలతో అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు. ఇక అభిషేక్ శర్మ పవర్ హిట్టింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.పాండ్యాకు ఎందుకు చోటిచ్చారు?రింకూ విషయానికొస్తే.. అతడు కచ్చితంగా టీ20 వరల్డ్కప్ జట్టులో ఉండాల్సింది. నా అభిప్రాయం ప్రకారం.. ఐపీఎల్ ప్రదర్శనను గనుక పరిగణనలోకి తీసుకుంటే హార్దిక్ పాండ్యాను ప్రపంచకప్నకు ఎంపిక చేయకుండా ఉండాల్సింది.ఇప్పటికే జట్టులో శివం దూబే ఉన్నాడు. అందుకే పాండ్యా బదులు రింకూను ఎంపిక చేస్తే డౌన్ ఆర్డర్లో శక్తిమంతమైన కూర్పు కుదిరి ఉండేది’’ అని స్పోర్ట్స్ నౌ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.కాగా ప్రపంచకప్ ఈవెంట్లో కెప్టెన్ రోహిత్ శర్మకు డిప్యూటీగా హార్దిక్ పాండ్యాను ఎంపిక చేసింది బీసీసీఐ. అయితే, డానిష్ కనేరియా మాత్రం వైస్ కెప్టెన్నే పక్కనపెట్టాల్సిందని చెప్పడం గమనార్హం.టీ20 ప్రపంచకప్-2024 టోర్నీకి బీసీసీఐ ప్రకటించిన జట్టురోహిత్ శర్మ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, సంజూ శాంసన్, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, యజ్వేంద్ర చాహల్, అర్ష్దీప్ సింగ్, మహ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా.రిజర్వ్ ప్లేయర్లు: శుబ్మన్ గిల్, రింకూ సింగ్, ఖలీల్ అహ్మద్, అవేశ్ ఖాన్.చదవండి: అమెరికా వరల్డ్కప్ జట్టులో ఐదుగురు భారత సంతతి ఆటగాళ్లు.. -
T20 WC జట్టులో నో ఛాన్స్.. రింకూతో రోహిత్ సీరియస్ డిస్కషన్
టీ20 ప్రపంచకప్-2024 టోర్నీలో పాల్గొనబోయే భారత జట్టును బీసీసీఐ ఇప్పటికే ప్రకటించింది. అమెరికా- వెస్టిండీస్ వేదికగా జూన్ 1 నుంచి ఆరంభం కానున్న ఈ మెగా టోర్నీలో టీమిండియాకు రోహిత్ శర్మ సారథ్యం వహించనున్నాడు.సుదీర్ఘ విరామం తర్వాత ఈ ఏడాది జనవరిలో అఫ్గనిస్తాన్తో స్వదేశంలో సిరీస్ ద్వారా విరాట్ కోహ్లితో పాటు రోహిత్ అంతర్జాతీయ టీ20లలో రీఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. అంతకు ముందు అతడి గైర్హాజరీలో హార్దిక్ పాండ్యా, సూర్య కుమార్ యాదవ్ భారత జట్టును ముందుకు నడిపించారు.అయితే, అనుభవానికే పెద్ద పీట వేసిన బీసీసీఐ ఐసీసీ టోర్నీలో మాత్రం రోహిత్ శర్మనే కెప్టెన్గా ఉంటాడని ప్రకటించింది. అందుకు అనుగుణంగానే అతడి సారథ్యంలో 15 మంది సభ్యులతో కూడిన జట్టును మంగళవారం ప్రకటించింది.రాహుల్పై వేటు.. రింకూకు మొండిచేయిహార్దిక్ పాండ్యాకు వైస్ కెప్టెన్గా ఛాన్స్ ఇచ్చిన సెలక్టర్లు.. వికెట్ కీపర్ కోటాలో రిషభ్ పంత్, సంజూ శాంసన్లకు అవకాశం ఇచ్చారు. ఈ క్రమంలో కేఎల్ రాహుల్పై వేటు వేశారు. అదే విధంగా.. కచ్చితంగా వరల్డ్కప్ ఆడతాడనుకున్న నయా ఫినిషర్ రింకూ సింగ్కు కూడా మొండిచేయి చూపారు.ఈ విషయం గురించి గురువారం రోహిత్ శర్మతో కలిసి ప్రెస్మీట్లో పాల్గొన్న బీసీసీఐ చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ స్పందిస్తూ.. ఇందుకు గల కారణం వెల్లడించాడు. అదనపు బౌలర్ అవసరం ఉన్నందు వల్లే దురదృష్టవశాత్తూ రింకూకు చోటివ్వలేకపోయామని తెలిపాడు.రింకూతో రోహిత్ సీరియస్ డిస్కషన్ఈ క్రమంలో రోహిత్ శర్మ రింకూతో ముచ్చటించిన వీడియో వైరల్గా మారింది. ఐపీఎల్-2024లో భాగంగా రోహిత్ ప్రాతినిథ్యం వహిస్తున్న ముంబై శుక్రవారం కోల్కతా నైట్ రైడర్స్తో తలపడనుంది.వాంఖడే వేదికగా జరుగనున్న ఈ మ్యాచ్కు ముందు కేకేఆర్ ప్రాక్టీస్ చేస్తుండగా హిట్మ్యాన్ అక్కడికి వెళ్లాడు. కేకేఆర్ సారథి శ్రేయస్ అయ్యర్తో పాటు రింకూ, మెంటార్ గౌతం గంభీర్తో మమేకమయ్యాడు. రోహిత్ను చూడగానే రింకూ నవ్వుతూ పలకరించాడు.ఆ తర్వాత రోహిత్ రింకూతో సీరియస్గా డిస్కస్ చేసినట్లు కనిపించింది. బహుశా వరల్డ్కప్ ఈవెంట్ గురించే హిట్మ్యాన్ మాట్లాడి ఉంటాడని అభిమానులు భావిస్తున్నారు. కాగా వరల్డ్కప్-2024 జట్టుతో పాటు రింకూ రిజర్వ్ ప్లేయర్గా ప్రయాణించనున్నాడు. టీ20 ప్రపంచకప్-2024లో పాల్గొనే టీమిండియారోహిత్ శర్మ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, సంజూ శాంసన్, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, యజ్వేంద్ర చాహల్, అర్ష్దీప్ సింగ్, మహ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా.రిజర్వ్ ప్లేయర్లు: శుబ్మన్ గిల్, రింకూ సింగ్, ఖలీల్ అహ్మద్, అవేశ్ ఖాన్.Match Hitman ke ghar rakhoge toh mehman nawazi ke liye Hitman khud aayega na 😎🫶#MumbaiMeriJaan #MumbaiIndians | @ImRo45 | @ShreyasIyer15 | @rinkusingh235 | @KonaBharat | @GautamGambhir pic.twitter.com/6W9VRKbZBs— Mumbai Indians (@mipaltan) May 2, 2024 -
'రింకూ ఒక అద్బుతం.. కానీ అతడిని సెలక్ట్ చేయలేకపోయాం'
టీ20 వరల్డ్కప్-2024కు ప్రకటించిన భారత జట్టులో నయా ఫినిషర్ రింకూ సింగ్కు చోటు దక్కకపోయిన సంగతి తెలిసిందే. 15 మంది సభ్యులతో కూడిన ప్రధాన జట్టులో రింకూకు ఛాన్స్ ఇవ్వని సెలక్టర్లు.. నామమాత్రంగా స్టాండ్బైగా ఎంపిక చేశారు. ప్రస్తుతం ఇదే విషయం క్రీడా వర్గాల్లో హాట్టాపిక్గా మారింది. అద్బుత ఫామ్లో రింకూను ఎంపిక చేయకపోవడాన్ని చాలా మంది మాజీ క్రికెటర్లు తప్పుబడుతున్నారు.తాజాగా ఈ విషయంపై బీసీసీఐ సెలక్షన్ కమిటీ చైర్మెన్ అజిత్ అగార్కర్ స్పందించాడు. జట్టులో అదనపు బౌలర్ అవసరం ఉండటంతోనే రింకూను సెలక్ట్ చేయలేదని అగార్కర్ తెలిపాడు.రింకూ సింగ్ అద్బుతమైన ఆటగాడని మాకు తెలుసు. దురుదృష్టవశాత్తూ రింకూను సెలక్ట్ చేయలేకపోయాం. అతడిని ఎంపిక చేయకపోవడానికి వెనుక ఓ కారణముంది. మేము ఎక్స్ట్రా స్పిన్నర్ను ఎంపిక చేయాలనుకున్నాం. అందుకే రింకూకు ప్రధాన జట్టులో చోటు దక్కలేదు. మా నిర్ణయం రింకూను బాధపెట్టవచ్చు. కానీ జట్టు బ్యాలెన్స్ కారణంగా అతడిపై వేటు వేయక తప్పలేదు. అయినప్పటికి అతడు ట్రావెలింగ్ రిజర్వ్గా జట్టుతో పాటు వెళ్తాడని ప్రెస్ కాన్ఫరెన్స్లో అగార్కర్ పేర్కొన్నాడు. -
'అతడేం తప్పు చేశాడు.. ఎవరి కోసమో బలి పశువు చేశారు'
టీ20 వరల్డ్కప్-2024 కోసం 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును బీసీసీఐ సెలక్షన్ కమిటీ మంగళవారం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మెగా టోర్నీలో టీమిండియా కెప్టెన్గా రోహిత్ శర్మ, వైస్ కెప్టెన్గా హార్దిక్ పాండ్యా వ్యవహరించనున్నారు.అయితే ఈ జట్టు ఎంపికపై భిన్నభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్, నయా ఫినిషర్ రింకూ సింగ్లను ఎంపిక చేయకపోవడాన్ని చాలా మంది మాజీ క్రికెటర్లు తప్పుబడుతున్నారు. ఈ మెగా ఈవెంట్కు కేఎల్ రాహుల్ను పూర్తిగా పరిగణలోకి తీసుకోని సెలక్టర్లు.. రింకూను మాత్రం స్టాండ్ బైగా ఎంపిక చేశారు. ఈ క్రమంలో రింకూకు ప్రధాన జట్టులో చోటు ఇవ్వకపోవడాన్ని భారత మాజీ చీఫ్ సెలెక్టర్ కృష్ణమాచారి శ్రీకాంత్ తీవ్రంగా వ్యతిరేకించాడు. రింకూ సింగ్ లాంటి పవర్ హిట్టర్ను ఎంపిక చేయకపోవడం సెలక్టర్లు తీసుకున్న చెత్త నిర్ణయమని శ్రీకాంత్ మండిపడ్డాడు.'రింకూ సింగ్ ఏం తప్పు చేశాడు. సెలక్టర్ల నిర్ణయం నన్ను షాక్కు గురిచేసింది.ప్రస్తుతం ఇదే విషయం గురించి ప్రపంచవ్యాప్తంగా చర్చించుకుంటున్నారు. తను ఇప్పటివరకు భారత్ తరపున ఆడిన అన్ని మ్యాచ్ల్లోనూ సత్తాచాటాడు. అతడు గతంలో దక్షిణాణఫ్రికాతో సిరీస్లో మ్యాచ్ విన్నింగ్ నాక్స్ ఆడాడు.అటువంటి అద్భుత ఆటగాడిని ఎందుకు వరల్డ్కప్కు ఎంపిక చేయలేదు? అతడి బదులు జైశ్వాల్ను పక్కన పెట్టాల్సింది. నా వరకు అయితే రింకూ సింగ్ కచ్చితంగా వరల్డ్ కప్ జట్టులో ఉండాల్సిందే. అస్సలు నలుగురు స్పిన్నర్లను ఎంపిక చేయాల్సిన అవసరం ఏముంది? కొంతమందిని సంతోషపెట్టడానికి రింకూ సింగ్ను బలి పశువు చేశారని' తన యూట్యూబ్ ఛానల్లో శ్రీకాంత్ పేర్కొన్నాడు.భారత టీ20 ప్రపంచకప్ జట్టు:రోహిత్ శర్మ(కెప్టెన్), యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, సంజూ శాంసన్, రిషభ్ పంత్(కీపర్), హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్దీప్ సింగ్, మహ్మద్ సిరాజ్. -
నా కుమారుడు వరల్డ్కప్ జట్టుకు ఎంపికవుతాడని స్వీట్లు, టపాసులు తెచ్చా: రింకూ తండ్రి ఆవేదన
టీ20 వరల్డ్కప్ 2024 కోసం టీమిండియాను నిన్న (ఏప్రిల్ 30) ప్రకటించారు. అందరూ ఊహించినట్లుగానే మెజార్టీ శాతం ఎంపికలు జరిగినప్పటికీ.. రింకూ సింగ్ లాంటి టాలెంటెడ్ ఆటగాడిపై శీతకన్ను చూపడం అందరినీ ఆశ్చర్య పరిచింది. సెలెక్టర్లు రింకూను ట్రావెలింగ్ రిజర్వ్ ఆటగాడిగా ఎంపిక చేసి చేతులు దులుపుకున్నారు. రింకూ సింగ్కు వరల్డ్కప్ జట్టులో చోటు దక్కకపోవడంపై చాలామంది మాజీలు అసంతృప్తి వ్యక్తం చేశారు. రింకూ లాంటి మ్యాచ్ ఫినిషర్ను వరల్డ్కప్ జట్టుకు ఎంపిక చేయనందుకు సెలెక్టర్లను నిందించారు. ఈ క్రమంలో రింకూ సింగ్ తండ్రి ఖన్చంద్ర సింగ్ స్పందించాడు.A heartbreaking video. 💔Rinku Singh's father talking about the exclusion of Rinku from the main squad. pic.twitter.com/Q2MuBmx2rp— Mufaddal Vohra (@mufaddal_vohra) May 1, 2024 ఓ స్థానిక న్యూస్ ఛానల్తో మాట్లాడుతూ ఇలా అన్నాడు. రింకూ వరల్డ్కప్ జట్టులో ఉంటాడని మాకు పూర్తి నమ్మకం ఉండింది. సంబురాలు చేసుకునేందుకు స్వీట్లు, టపాసులు కూడా తెచ్చుకున్నాం. రింకూ వరల్డ్కప్ జట్టుకు ఎంపికవడమే కాకుండా తుది జట్టులో కూడా ఉంటాడని ఊహించాం. మా దురదృష్టం కొద్ది అలా జరగలేదు. రింకూ గుండె పగిలిపోయినంత పనైపోయింది. రింకూ ఈ విషయంలో తన తల్లికి చాలా సర్దిచెప్పాడు. 15 మందిలో లేనపోయినా జట్టుతో పాటు వెళ్తానని ఆమెతో చెప్పాడు. కాగా, 26 ఏళ్ల రింకూ టీమిండియా తరఫున 15 టీ20ల్లో 176.2 స్ట్రయిక్రేట్తో 89 సగటున 356 పరుగులు చేశాడు. ఇందులో 2 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.టీ20 వరల్డ్కప్ కోసం టీమిండియా: రోహిత్ శర్మ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, సంజూ శాంసన్, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చహల్, అర్ష్దీప్ సింగ్, మొహమ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రాట్రావెలింగ్ రిజర్వ్: శుభ్మన్ గిల్, రింకూ సింగ్, ఖలీల్ అహ్మద్, అవేష్ ఖాన్ -
అవకాశాల్లేవు.. వరల్డ్కప్ జట్టులో మాత్రం అతడికి చోటివ్వండి!
ఐపీఎల్-2023.. ఆఖరి ఓవర్లో ఐదు సిక్సర్లతో జట్టును గెలిపించిన ఘనత.. ఆడిన 14 మ్యాచ్లలో కలిపి 474 పరుగులతో సత్తా చాటి ‘నయా ఫినిషర్’గా బిరుదు.. అదే ఏడాది ఆగష్టులో టీమిండియా తరఫున అరంగేట్రం.. ఇప్పటికే ఆటగాడు ఎవరో అర్థమైపోయి ఉంటుంది కదా.. అవును.. రింకూ సింగ్. కోల్కతా నైట్ రైడర్స్ తరఫున గతేడాది దంచికొట్టిన ఈ యూపీ లెఫ్టాండ్ బ్యాటర్.. సిక్సర్ల కింగ్గా పేరొందాడు. అదే జోష్లో టీమిండియా తలుపుతట్టి అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. ఇప్పటి వరకు భారత్ తరఫున 15 టీ20లు, రెండు వన్డేలు ఆడిన రింకూ ఆయా ఫార్మాట్లలో వరుసగా 356, 55 పరుగులు సాధించాడు. దేశవాళీ క్రికెట్లోనూ రాణించాడు. అయితే.. ఐపీఎల్-2024లో మాత్రం అతడికి ఎక్కువగా బ్యాటింగ్ చేసే అవకాశం రావడం లేదు. ఈ క్రమంలో ఇప్పటి వరకు ఆడిన ఆరు మ్యాచ్లలో కలిపి రింకూ 83 పరుగులు చేశాడు. రెండుసార్లు అజేయంగా నిలిచాడు. అయితే.. అతడి స్ట్రైక్రేటు(162.75) మెరుగ్గా ఉంది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్, కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘అతడికి ఎక్కువగా బ్యాటింగ్ చేసే అవకాశం రావడం లేదు కాబట్టి.. సెలక్టర్లు రింకూ సింగ్ పేరును మర్చిపోరనే అనుకుంటున్నా. ఈ టోర్నీ తర్వాత అతడు నేరుగా టీమిండియాలో అడుగుపెట్టగల సత్తా కలిగిన వాడు. నిలకడైన ఆట తీరుతో ఆకట్టుకోవడం చూస్తున్నాం. టీమిండియా కీలక సభ్యుల్లో అతడూ ఒకడు. కొంతమంది స్టార్ల కంటే కూడా అద్భుతంగా ఆడగలిగినవాడు’’ అంటూ సంజయ్ మంజ్రేకర్.. టీ20 ప్రపంచకప్-2024 ఆడే భారత జట్టులో రింకూ సింగ్కు తప్పక చోటు కల్పించాలని సెలక్టర్లకు విజ్ఞప్తి చేశాడు. కాగా మే 26న ఐపీఎల్ పదిహేడో ఎడిషన్ ముగియనుండగా.. జూన్ 1 నుంచి వరల్డ్కప్ సమరం మొదలుకానుంది. పొట్టి ఫార్మాట్లో సాగే ఈవెంట్కు వెస్టిండీస్- అమెరికా సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్నాయి. జూన్ 5న ఐర్లాండ్తో మ్యాచ్తో టీమిండియా ఈ ఐసీసీ టోర్నీలో తమ ప్రయాణం ఆరంభించనుంది. చదవండి: హార్దిక్ను పట్టించుకోని ఆకాశ్.. రోహిత్ మాట విని అలా! వైరల్ వీడియో var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_7552012696.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
నేనేమైనా తక్కువా?.. ఒకే ఓవర్లో రింకూ సిక్సర్ల వర్షం
ఐపీఎల్-2024.. విశాఖ సాగర తీరాన.. బుధవారం రాత్రి.. డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి స్టేడియం.. కోల్కతా నైట్ రైడర్స్ బ్యాటర్ల పరుగుల వరదతో తడిసి ముద్దైంది. ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లపై ఏమాత్రం కనికరం లేకుండా కేకేఆర్ ఆటగాళ్లు విరుచుకుపడ్డారు. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న తమ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ నమ్మకాన్ని నిలబెడుతూ.. ఓపెనర్ సునిల్ నరైన్ మరోసారి వీర బాదుడు బాదాడు. 35 ఏళ్ల ఈ బౌలింగ్ ఆల్రౌండర్ ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపిస్తూ తనకు తానే సాటి అని మరోసారి నిరూపించుకున్నాడు. కేవలం 39 బంతుల్లోనే 85 పరుగులు(7 ఫోర్లు, 7 సిక్సర్లు) సాధించి నరైన్ సత్తా చాటాడు. ఇక తన తొలి ఐపీఎల్ ఇన్నింగ్స్లోనే వన్డౌన్ బ్యాటర్ అంగ్క్రిష్ రఘువంశీ(27 బంతుల్లో 54) సైతం ధనాధన్ ఇన్నింగ్స్తో మెరిశాడు. Raghuvanshi Ji ke ang ang mein talent hai 🤌#DCvKKR #TATAIPL #IPLonJioCinema #TATAIPLinBhojpuri pic.twitter.com/YKUIw577kD — JioCinema (@JioCinema) April 3, 2024 ఇక నాలుగో స్థానంలో వచ్చిన పవర్ హిట్టర్ ఆండ్రీ రసెల్ సరేసరి. 19 బంతుల్లోనే 4 ఫోర్లు, 3 సిక్స్ల సాయంతో 41 రన్స్ చేశాడు. మరి ఈ ముగ్గురు పరుగుల విధ్వంసం సృష్టిస్తుంటే.. తానేమీ తక్కువ కాదన్నట్లు చెలరేగిపోయాడు సిక్సర్ల కింగ్ రింకూ సింగ్. Yeh toh Rinku ke daayein haath ka khel hai 😅#IPLonJioCinema #TATAIPL #DCvKKR #TATAIPLinBengali pic.twitter.com/AIDYeZNbpk — JioCinema (@JioCinema) April 3, 2024 ఆరో స్థానంలో బ్యాటింగ్కు వచ్చిన ఈ యూపీ సంచలనం.. ఈ పరుగుల విధ్వంసంలో తనదైన ముద్ర వేశాడు. కేవలం 8 బంతులు ఎదుర్కొని 26(ఒక ఫోర్, 3 సిక్సర్లు) పరుగులు సాధించాడు. తన ఇన్నింగ్స్లోని మూడు సిక్సర్లను అన్రిచ్ నోర్జే బౌలింగ్లోనే బాదడం విశేషం. పందొమ్మిదో ఓవర్లో సౌతాఫ్రికా స్పీడ్స్టర్ నోర్జే వేసిన తొలి రెండు బంతులను సిక్సర్గా మలిచిన రింకూ సింగ్.. మధ్యలో బాల్కు గ్యాప్ ఇచ్చాడు. ఆ తర్వాత నాలుగో బంతికి మరో భారీ షాట్తో ఆరు పరుగులు పిండుకున్నాడు. ఇక ఆ మరుసటి బంతిని బౌండరీకి తరలించాడు. అయితే, అదే ఓవర్లో ఆఖరి బంతి(లో ఫుల్ టాస్)కి మరోసారి షాట్కు యత్నించిన రింకూ.. వార్నర్ చేతికి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఉన్నది కాసేపే అయినా.. విశాఖ స్టేడియంలోని ప్రేక్షకులకు తన వంతు వినోదం అందించాడు రింకూ!! ఢిల్లీకి నాలుగో ఓటమి ఇక ఈ మ్యాచ్లో కేకేఆర్ విధించిన 273 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక ఢిల్లీ క్యాపిటల్స్ చతికిలపడిన విషయం తెలిసిందే. తమకు రెండో హోం గ్రౌండ్ అయిన విశాఖలో ఏకంగా 106 పరుగుల తేడాతో ఓడి.. ఐపీఎల్-2024లో నాలుగో పరాజయాన్ని నమోదు చేసింది. ఇక అంతకు ముందు ఇదే వేదికపై పంత్ సేన చెన్నై సూపర్ కింగ్స్పై గెలిచిన విషయం తెలిసిందే. అలా ఢిల్లీకి ఇప్పటి వరకు ఒక్క విజయం దక్కింది. చదవండి: తొలి ఇన్నింగ్స్లోనే పరుగుల విధ్వంసం.. ఎవరీ అంగ్క్రిష్ రఘువంశీ? var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_7522010156.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); Shah Rukh Khan offered the blank check to Gautam Gambhir and results are visible. KKR wins three out of three matches of the season. You need special efforts to beat this special team. Lord Rinku Singh is on a mission.pic.twitter.com/5KsVkhD9lN — Sujeet Suman (@sujeetsuman1991) April 3, 2024 -
రింకూ సింగ్ కు ఊహించని గిఫ్ట్ ఇచ్చిన కోహ్లి.. ఫోటో వైరల్
ఐపీఎల్-2024లో భాగంగా కోల్కతా నైట్రైడర్స్తో జరిగిన మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓటమి చవిచూసిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్లో ఆర్సీబీ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి(83) అద్బుతమైన ఇన్నింగ్స్ ఆడినప్పటికి.. తన జట్టు మాత్రం 7 వికెట్ల తేడాతో ఘోర ఓటమి చవిచూసింది. కాగా కోహ్లి ఓటమి బాధలో ఉన్నప్పటికి మాత్రం తన మంచి మనసును చాటుకున్నాడు. మ్యాచ్ అనంతరం కింగ్ కోహ్లి కోల్కతా డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్లి ఆటగాళ్లను కలిశాడు. యువ క్రికెటర్లకు విరాట్ విలువైన సూచనలు చేశాడు. ఈ క్రమంలో కేకేఆర్ ఫినిషర్ రింకూ సింగ్కు కోహ్లి స్పెషల్ గిఫ్ట్ ఇచ్చాడు. కోహ్లి తన బ్యాట్ను రింకూకు గిఫ్ట్గా ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలను రింకూ సింగ్ ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశాడు. తనకు బ్యాట్ను గిఫ్ట్గా ఇచ్చినందుకు కోహ్లికి రింకూ ధన్యవాదాలు తెలియజేశాడు. "సలహాలు ఇచ్చినందుకు ధన్యవాదాలు భయ్యా.. అదేవిధంగా బ్యాట్ ఇచ్చినందుకు కూడా థాంక్స్" అంటూ ఇన్స్టా స్టోరీలో రింకూ రాసుకొచ్చాడు. చదవండి: IPL 2024: బెయిర్ స్టో స్టన్నింగ్ క్యాచ్.. రాహుల్కు మైండ్ బ్లాంక్! వీడియో వైరల్ Rinku Singh thanking Virat Kohli for the gift. 👌 - Kohli is always there for youngsters. pic.twitter.com/p23y7ZHFj8 — Johns. (@CricCrazyJohns) March 30, 2024 -
IPL 2024 RCB Vs KKR Pics: ఆర్సీబీపై నైట్రైడర్స్ అలవోక విజయం (ఫొటోలు)
-
స్టార్క్ బౌలింగ్లో భారీ సిక్సర్ బాదిన రింకూ! మెరుపు ఇన్నింగ్స్
కోల్కతా నైట్ రైడర్స్ జట్టు ఐపీఎల్-2024 సన్నాహకాల్లో తలమునకలైంది. కేకేఆర్ ఆటగాళ్లు రెండు జట్లుగా విడిపోయి ఇంట్రా- స్వ్కాడ్ మ్యాచ్తో బిజీబిజీగా గడిపారు. మెగా టోర్నీ ఆరంభానికి ముందు ప్రాక్టీస్ మ్యాచ్లో చెమటోడ్చారు. ఇక ఈ మ్యాచ్లో కేకేఆర్ స్టార్, టీమిండియా నయా ఫినిషర్ రింకూ సింగ్, ఐపీఎల్ వేలం చరిత్రలో అత్యధిక ధరకు అమ్ముడైన ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్ మధ్య పోరు హైలైట్గా నిలిచింది. సన్నాహకాల్లో భాగంగా టీమ్ పర్పుల్, టీమ్ గోల్డ్గా విడిపోయిన కేకేఆర్ ఈడెన్ గార్డెన్స్ మైదానంలో మంగళవారం ప్రాక్టీస్ చేసింది. పర్పుల్కు స్టార్క్ సారథ్యం వహించగా.. టీమ్ గోల్డ్లో ఉన్న రింకూ సింగ్ అతడికి చుక్కలు చూపించాడు. వరల్డ్క్లాస్ పేసర్ అయిన స్టార్క్ బౌలింగ్లో రింకూ భారీ సిక్సర్ బాదాడు. కళ్లు చెదిరే రీతిలో మిడ్ వికెట్ మీదుగా సిక్స్ కొట్టి సత్తా చాటాడు. అంతేకాదు స్టార్క్ బౌలింగ్లో బాగానే పరుగులు పిండుకున్నాడు. Rinku Singh smashed a SIX to Mitchell Starc 🍿💥 This is Cinema!! pic.twitter.com/zQNhfPrqSR — कट्टर KKR समर्थक 🦁🇮🇳 ™ (@KKRWeRule) March 19, 2024 ఇక ఈ మ్యాచ్లో స్టార్క్ నాలుగు ఓవర్లు బౌలింగ్ చేసి ఏకంగా 40 పరుగులు సమర్పించుకుని ఒక వికెట్ మాత్రమే తీయగలిగాడు. మరోవైపు.. రింకూ సింగ్ 16 బంతుల్లోనే 37 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. అదే విధంగా కేకేఆర్లో జేసన్ రాయ్ స్థానాన్ని భర్తీ చేస్తూ కొత్తగా వచ్చిన ఫిల్ సాల్ట్ 41 బంతులు ఎదుర్కొని 78 పరుగులతో విధ్వంసం సృష్టించాడు. ఇక వైస్ కెప్టెన్ నితీశ్ రాణా 30 బంతుల్లో 50 పరుగులతో రాణించగా... మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి 40 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు తీశాడు. అయితే, ఈ ప్రాక్టీస్ మ్యాచ్లో ఎట్టకేలకు టీమ్ పర్పుల్ విజయం సాధించింది. Starc⚡ vs Russell 💪?! Join #KnightLIVE to witness thrilling Practice Match https://t.co/0Z8XOaYXxE — KolkataKnightRiders (@KKRiders) March 19, 2024 కాగా వన్డే వరల్డ్కప్-2023లో అదరగొట్టిన ఆస్ట్రేలియా స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ కోసం కేకేఆర్ కనీవినీ ఎరుగని రీతిలో ఏకంగా రూ. 24.75 కోట్లు ఖర్చు పెట్టిన విషయం తెలిసిందే. దాదాపు ఎనిమిదేళ్ల విరామం తర్వాత అతడు ఐపీఎల్లో రీఎంట్రీ ఇవ్వనున్నాడు. ఇక ఐపీఎల్-2024లో కేకేఆర్ సన్రైజర్స్తో మార్చి 23న తొలి మ్యాచ్ ఆడనుంది. -
బాల్ బాయ్కు సారీ చెప్పిన రింకూ సింగ్.. అసలేం జరిగిందంటే..?
క్రికెట్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న ఐపీఎల్-2024 సీజన్ ఆరంభానికి సమయం అసన్నమైంది. మార్చి 22న చెపాక్ వేదికగా సీఎస్కే, ఆర్సీబీ మధ్య జరగనున్న తొలి మ్యాచ్తో ఈ మెగా ఈవెంట్కు తెరలేవనుంది. ఐపీఎల్-2024 సీజన్కు సమయం దగ్గరపడడంతో అన్నీ జట్లు తమ ప్రాక్టీస్లో మునిగి తేలుతున్నాయి. ఈ క్రమంలో కోల్కతా నైట్రైడర్స్ సైతం ఈడెన్ గార్డెన్స్లో ప్రీ ట్రైనింగ్ క్యాంప్ను ఏర్పాటు చేసింది. ఈ ప్రాక్టీస్ క్యాంప్లో కేకేఆర్ ఆటగాళ్లు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ క్రమంలో టీమిండియా నయా ఫినిషర్, కేకేఆర్ స్టార్ రింకూ సింగ్ తన మంచి మనసును చాటుకున్నాడు. రింకూ సింగ్.. ఓ బాల్ బాయ్కు క్షమాపణలు చెప్పాడు. అసలేం జరిగిందంటే? ప్రాక్టీస్ సెషన్లో భాగంగా నెట్స్లో భారీ షాట్లను రింకూ ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఈ క్రమంలో ఒక బంతిని రింకూ స్ట్రెయిట్ డ్రైవ్ ఆడాడు. బంతి నేరుగా వెళ్లి బౌండరీ వెలుపల ఉన్న బాల్బాయ్ నుదుటికి తాకింది. ఇది చూసిన రింకూ సింగ్ ఆ కుర్రాడి దగ్గరకు వెళ్లి క్షమాపణలు చెప్పాడు. అదేవిధంగా రింకూ కేకేఆర్ హెడ్ కోచ్ అభిషేక్ నాయర్ వద్ద టోపీ తీసుకుని ఆ యువకుడికి గిప్ట్గా ఇచ్చాడు. ఆ టోపీపైన రింకూ సంతకం చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియోను కేకేఆర్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్గా మారింది. ఇది చూసిన నెటిజన్లు రింకూపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. Beautiful Gesture from Rinku Singh and KKR. pic.twitter.com/6lXpcWSogS — Ak Yadav (@AkYadav174212) March 12, 2024 -
రింకూ సింగ్కు బంపరాఫర్.. టీ20 వరల్డ్కప్ జట్టులో ఛాన్స్?
ధర్మశాల వేదికగా ఇంగ్లండ్తో ఐదో టెస్టుకు టీమిండియా సిద్దమవుతోంది. మార్చి 7 నుంచి ఇరు జట్ల మధ్య ఈ ఆఖరి టెస్టు ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ కోసం ఇంగ్లండ్ జట్టు ఇప్పటికే ధర్మశాలకు చేరుకోగా.. భారత జట్టు సోమవారం అక్కడ అడుగుపెట్టింది. అయితే టెస్టు జట్టులో లేని టీమిండియా ఆటగాడు రింకూ సింగ్ సైతం ధర్మశాలకు చేరుకున్నాడు. భారత ఆటగాళ్లతో కలిసి తిరుగుతూ రింకూ కన్పించాడు. జట్టులో సభ్యునిగా లేని రింకూ సింగ్ ధర్మశాలలో కన్పించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. జట్టులో లేనప్పటికీ అక్కడకు ఎందుకు వెళ్లాడని అభిమానులు సోషల్ మీడియా వేదికగా తెగ చర్చించికుంటున్నారు. అయితే రింకూ ధర్మశాలకు వెళ్లడానికి ఓ కారణం ఉంది. ధర్మశాలలో టీ20 వరల్డ్ కప్ ప్రాబబుల్స్తో సోమవారం బీసీసీఐ నిర్వహించిన ఫొటో షూట్లో రింకూ సింగ్ పాల్గోనున్నాడు. ఆటగాళ్లతో కలిసి ఫోటోలకు ఫోజులు ఇచ్చాడు. బీసీసీఐ ఆదేశాల మేరకే రింకూ అక్కడికి వెళ్లినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో మేలో ప్రకటించనున్న టీ20 వరల్డ్కప్ భారత జట్టులో ఈ నయా ఫినిషర్కు చోటు ఖాయమైనట్లే. కాగా టీ20ల్లో రింకూ సింగ్ అద్బుతమైన ప్రదర్శన కనబరుస్తున్నాడు. ఇప్పటివరకు కేవలం 15 మ్యాచ్లు ఆడిన రింకూ 89.00 సగటుతో 356 పరుగులు చేశాడు. అందులో రెండు ఫిప్టీలు ఉన్నాయి. చదవండి: IPL 2024: ధోని సంచలన నిర్ణయం.. సీఎస్కే కెప్టెన్గా రుత్రాజ్ గైక్వాడ్!? -
BCCI: వాళ్లపై వేటు.. 30 ఏళ్ల వయసులో వీళ్లకు ఛాన్స్! రూ. కోటి..
ఇచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటున్న యువ ఆటగాళ్లపై భారత క్రికెట్ నియంత్రణ మండలి వరాల జల్లు కురిపించింది. ప్రతిభను నిరూపించుకునే వారికి సముచిత స్థానం కల్పిస్తూ తాజా వార్షిక కాంట్రాక్ట్ల(2023-24)లో పెద్దపీట వేసింది. అదే సమయంలో క్రమశిక్షణారాహిత్యం ప్రదర్శించిన ఆటగాళ్లను సహించేది లేదంటూ కొరడా ఝులిపించింది. ‘వార్షిక కాంట్రాక్ట్లలో ఈ సారి శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్ల పేర్లను పరిశీలించడం లేదు’ అని బోర్డు అధికారికంగా ప్రకటించడం ఇందుకు నిదర్శనం. రంజీల్లో ఆడమని ఆదేశించినా వీరిద్దరు బేఖాతరు చేసినందుకు వల్లే ఇలా వేటు పడిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వీరి సంగతి ఇలా ఉంటే.. యువ సంచలనం, డబుల్ సెంచరీల వీరుడు యశస్వి జైస్వాల్ డబుల్ ప్రమోషన్ పొంది నేరుగా ‘బి’ గ్రేడ్ క్రాంటాక్ట్ దక్కించుకున్నాడు. అతడితో పాటు మరో పది మంది కొత్తగా బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టులు చేజిక్కించుకున్నారు. వీరంతా ‘సి’ గ్రేడ్లో ఉండటం గమనార్హం. అంటే మ్యాచ్ ఫీజులతో పాటు రూ. కోటి వార్షిక వేతనం అందుకుంటారన్నమాట..! ఆ పది మంది ఎవరు? వారి ప్రదర్శన ఎలా ఉంది?! రింకూ సింగ్ దేశవాళీ క్రికెట్, ఐపీఎల్లో సత్తా చాటిన ఉత్తరప్రదేశ్ బ్యాటర్ రింకూ సింగ్. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత గతేడాది ఐర్లాండ్తో టీ20 సిరీస్ సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. నయా ఫినిషర్గా నీరాజనాలు అందుకుంటున్నాడు. ఇక రింకూ ఇప్పటి వరకు భారత్ తరఫున 15 టీ20లు ఆడి 176.23 స్ట్రైక్రేటుతో 356 పరుగులు చేశాడు. ఇందులో రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇప్పటి వరకు 20 సిక్స్లు, 31 ఫోర్లు బాదాడు. ఇక వన్డేల్లోనూ అడుగుపెట్టిన 26 ఏళ్ల లెఫ్టాండర్ రింకూ సింగ్ రెండు మ్యాచ్లలో కలిపి 55 పరుగులు సాధించాడు. నంబూరి తిలక్ వర్మ హైదరాబాదీ స్టార్ తిలక్ వర్మ అండర్19 వరల్డ్కప్లో సత్తా చాటి ఐపీఎల్-2022లో ముంబై ఇండియన్స్ తరఫున ఎంట్రీ ఇచ్చాడు. రెండు సీజన్లలో కలిసి 740 పరుగులు చేసి టీమిండియా సెలక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. తద్వారా అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన ఈ 21 ఏళ్ల లెఫ్టాండ్ బ్యాటర్.. రైటార్మ్ ఆఫ్ బ్రేక్ స్పిన్నర్ కూడా!ఇప్పటి వరకు టీమిండియా తరఫున 16 టీ20లు ఆడి 336, నాలుగు వన్డేలు ఆడి 68 పరుగులు చేశాడు. రుతురాజ్ గైక్వాడ్ దేశవాళీ క్రికెట్లో సత్తా చాటి చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ ఓపెనర్గా పేరొందిన మహారాష్ట్ర క్రికెటర్ రుతురాజ్ గైక్వాడ్. టీమిండియా తరఫున ఆరు వన్డేలు ఆడి 115, 19 టీ20లు ఆడి 500 పరుగులు చేశాడు. ఇందులో ఓ సెంచరీ, మూడు అర్ధ శతకాలు ఉన్నాయి. గతేడాది ఆసియా క్రీడల్లో భారత ద్వితీయ శ్రేణి జట్టుకు కెప్టెన్గా వ్యవహరించిన 27 ఏళ్ల ఈ రైట్హ్యాండ్ బ్యాటర్ గోల్డ్ మెడల్ అందించాడు. శివం దూబే సీఎస్కే స్టార్ క్రికెటర్, ముంబై పేస్ ఆల్రౌండర్ శివం దూబే 2019లోనే టీమిండియా తరఫున ఎంట్రీ ఇచ్చాడు. అయితే, చాలాకాలం పాటు మళ్లీ జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు. ఈ క్రమంలో హార్దిక్ పాండ్యా గైర్హాజరీ నేపథ్యంలో ఈ ఏడాది అఫ్గనిస్తాన్తో జరిగిన టీ20 సిరీస్తో పునరాగమనం చేసిన 30 ఏళ్ల దూబే.. అదిరిపోయే ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. భారత్ తరఫున ఇప్పటి వరకు 21 టీ20లు ఆడి 276 పరుగులు చేసి, ఎనిమిది వికెట్లు తీశాడు. రవి బిష్ణోయి రాజస్తాన్కు చెందిన రవి బిష్ణోయి 2022లో టీమిండియా తరఫున అరంగేట్రం చేశాడు. ఈ కుడిచేతి వాటం స్పిన్నర్.. ఇటీవలి కాలంలో అద్భుత ప్రదర్శనతో ఐసీసీ ర్యాంకింగ్స్లో నంబర్ వన్ స్థానాన్ని దక్కించుకున్నాడు. ఇప్పటి వరకు 24 టీ20లు, ఒక వన్డే ఆడి ఆయా ఫార్మాట్లలో 36, 1 వికెట్ పడగొట్టాడీ 23 ఏళ్ల బౌలర్. ముకేశ్ కుమార్ బెంగాల్ పేసర్, 30 ఏళ్ల ముకేశ్ కుమార్ గతేడాది టీమిండియాలో అడుగుపెట్టాడు. ఇప్పటి వరకు 3 టెస్టులు, 6 వన్డేలు, 14 టీ20లు ఆడిన ఈ రైటార్మ్ బౌలర్ ఆయా ఫార్మాట్లలో వరుసగా 7, 5, 12 వికెట్లు తీశాడు. ప్రసిద్ కృష్ణ 2021లో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు రైటార్మ్ ఫాస్ట్బౌలర్ ప్రసిద్ కృష్ణ. 28 ఏళ్ల ఈ కర్ణాటక బౌలర్ ఇప్పటి వరకు అంతర్జాతీయ క్రికెట్లో రెండు టెస్టుల్లో రెండు వికెట్లు తీసిన 28 ఏళ్ల ప్రసిద్.. 17 వన్డేలు, 5 టీ20లలో 29, 8 వికెట్లు పడగొట్టాడు. ఆవేశ్ ఖాన్ మధ్యప్రదేశ్కు చెందిన ఫాస్ట్ బౌలర్ ఆవేశ్ ఖాన్. 27 ఏళ్ల ఈ రైటార్మ్ పేసర్ 2022లో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. ఇప్పటి వరకు భారత్ తరఫున 8 వన్డేలు, 20 టీ20 మ్యాచ్లు ఆడి 9, 19 వికెట్లు తీశాడు. రజత్ పాటిదార్ లేటు వయసులో టీమిండియా సెలక్టర్ల పిలుపు అందుకున్న మధ్యప్రదేశ్ క్రికెటర్ రజత్ పాటిదార్. 1993లో ఇండోర్లో జన్మించిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్ 2023లో తొలిసారి టీమిండియా(వన్డే)కు ఆడాడు. తాజాగా ఇంగ్లండ్తో స్వదేశంలో సిరీస్తో టెస్టుల్లో ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పటి వరకు ఒక వన్డేలో 22, మూడు టెస్టుల్లో కలిపి 63 పరుగులు సాధించాడు. జితేశ్ శర్మ విదర్భ వికెట్ కీపర్ బ్యాటర్ జితేశ్ శర్మ.. 2022లో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. 30 ఏళ్ల ఈ రైట్హ్యాండర్ ఇప్పటి వరకు 9 టీ20లు ఆడి 100 పరుగులు చేశాడు. చదవండి: BCCI Annual Players Contract List: పూర్తి వివరాలు.. విశేషాలు -
నా సహోదరుడా.. అంటూ రింకూ సింగ్ భావోద్వేగం
India vs England, 4th Test- Rinku Singh's Emotional Post: టీమిండియా యువ క్రికెటర్ ధ్రువ్ జురెల్పై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇంగ్లండ్తో నాలుగో టెస్టులో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడిన ఈ వికెట్ కీపర్ బ్యాటర్.. దురదృష్టవశాత్తూ సెంచరీకి పది పరుగుల దూరంలో నిలిచిపోయాడు. అయితేనేం.. అతడు సాధించిన ఆ 90 పరుగులు భారత ఇన్నింగ్స్లో అత్యంత ముఖ్యమైనవి. టీమిండియా 307 పరుగులు మార్కును అందుకుందంటే అందుకు జురెలే కారణం. ముఖ్యంగా మూడో రోజు ఆటలో భాగంగా కుల్దీప్ యాదవ్(28)తో కలిసి ఎనిమిదో వికెట్కు 76 విలువైన పరుగులు జోడించిన తీరు అద్భుతం. అలా తొలి ఇన్నింగ్స్లో 149 బంతులు ఎదుర్కొన్న ధ్రువ్ జురెల్.. ఆరు ఫోర్లు, నాలుగు సిక్సర్ల సాయంతో 90 పరుగులు చేసి కష్టాల్లో ఉన్న జట్టును గట్టెక్కించాడు. ఈ నేపథ్యంలో టీమిండియా నయా సంచలనం రింకూ సింగ్.. జురెల్ను ఉద్దేశించి ఉద్వేగపూరిత నోట్ రాశాడు. జురెల్తో కలిసి ఉన్న ఫొటోను పంచుకుంటూ.. ‘‘నా సహోదరుడా... కలలు నిజమయ్యే తరుణం ఇది’’ అంటూ సహచర ఆటగాడిపై ప్రేమను కురిపించాడు. కాగా రింకూ సింగ్, ధ్రువ్ జురెల్ దేశవాళీ క్రికెట్లో ఉత్తరప్రదేశ్కు ఆడతారన్న విషయం తెలిసిందే. అలా పరిచయమైన వీరిద్దరి మధ్య మంచి అనుబంధం ఉంది. ఇదిలా ఉంటే.. మాజీ క్రికెటర్లు వసీం జాఫర్, వీరేంద్ర సెహ్వాగ్ తదితరులు ధ్రువ్ జురెల్ నైపుణ్యాలను కొనియాడుతూ సోషల్ మీడియా వేదికగా అభినందనలు తెలిపాడు. ఇక ఇంగ్లండ్తో రాజ్కోట్ టెస్టు సందర్భంగా అరంగేట్రం చేసిన ధ్రువ్ జురెల్.. రాంచి మ్యాచ్లో తాను సాధించిన విలువైన అర్ధ శతకాన్ని తన తండ్రికి అంకితమిచ్చాడు. మరోవైపు.. దేశవాళీ క్రికెట్, ఐపీఎల్లో అద్బుత ప్రదర్శనలతో ఆకట్టుకున్న రింకూ సింగ్.. గతేడాది టీమిండియా తరఫున అరంగేట్రం చేశాడు. టీ20 ఫార్మాట్లో నయా ఫినిషర్గా అవతరించిన ఈ యూపీ బ్యాటర్.. వన్డేల్లోనూ తనదైన ముద్ర వేయాలని పట్టుదలగా ఉన్నాడు. చదవండి: ఏంటి సర్ఫరాజ్.. హీరో అవ్వాలనుకుంటున్నావా? రోహిత్ సీరియస్! View this post on Instagram A post shared by Rinku 🧿🇮🇳 (@rinkukumar12) -
INDA Vs ENGA: 5 వికెట్లతో చెలరేగిన భారత స్పిన్నర్.. ఇంగ్లండ్ చిత్తు
England Lions vs India A, 2nd unofficial Test: ఇంగ్లండ్ లయన్స్తో అనధికారిక రెండో టెస్టులో భారత-ఏ జట్టు ఘన విజయం సాధించింది. ఇంగ్లిష్ యువ జట్టును ఏకంగా ఇన్నింగ్స్ 16 పరుగుల తేడాతో మట్టికరిపించింది. సమిష్టి ప్రదర్శనతో ఈ సిరీస్లో తొలి గెలుపు నమోదు చేసింది. భారత్-ఏ- ఇంగ్లండ్ లయన్స్ మధ్య మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా తొలి అనధికారిక టెస్టు డ్రాగా ముగిసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అహ్మదాబాద్ వేదికగా బుధవారం మొదలైన మ్యాచ్లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. వాళ్లిద్దరి అద్భుత సెంచరీల కారణంగా భారత బౌలర్ల విజృంభణ కారణంగా 52.4 ఓవర్లలో 152 పరుగులు చేసి ఆలౌట్ అయింది. దీంతో తొలి రోజే బ్యాటింగ్కు దిగిన ఇండియా-ఏ జట్టు భారీ స్కోరు చేసింది. ఓపెనర్, కెప్టెన్ అభిమన్యు ఈశ్వరన్(58) అర్ధ శతకంతో మెరవగా.. మరో ఓపెనర్ దేవ్దత్ పడిక్కల్ సెంచరీ(105)తో సత్తా చాటాడు. తిలక్ వర్మ 6 పరుగులకే అవుటై నిరాశ పరచగా.. నాలుగో నంబర్లో బ్యాటింగ్ చేసిన సర్ఫరాజ్ ఖాన్ అద్భుత సెంచరీతో చెలరేగాడు. Dear Sarfraz khan You deserves much better ball knowledge management, But unfortunately we don't have we have crupt management ever,#SarfrazKhan #INDvsENG #INDAvENGA #INDvENG#ViratKohli #Ashwin #Jadejapic.twitter.com/fPB49WhrV4 — Captain of DC - PC (RP¹⁷ ) (@Branded_Tweet) January 24, 2024 160 బంతుల్లో 18 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో ఏకంగా 161 పరుగులు రాబట్టాడు. మిగతా వాళ్లలో స్పిన్ ఆల్రౌండర్లు వాషింగ్టన్ సుందర్(57), సౌరభ్ కుమార్(77) అర్ధ శతకాలతో ఆకట్టుకున్నారు. నిరాశ పరిచిన తిలక్, రింకూ రింకూ సింగ్ మాత్రం డకౌట్గా వెనుదిరిగి విమర్శలు మూటగట్టుకున్నాడు. ఈ నేపథ్యంలో 489 పరుగుల వద్ద యువ భారత్ తమ మొదటి ఇన్నింగ్స్ ముగించింది. తద్వారా 337 పరుగుల భారీ ఆధిక్యం సాధించింది. ఈ క్రమంలో రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన 321 పరుగులకే ఆలౌట్ అయి ఓటమిని చవిచూసింది. ఆల్రౌండర్ సౌరభ్ కుమార్ ఐదు వికెట్లతో చెలరేగి ఇంగ్లండ్ లయన్స్ పతనాన్ని శాసించాడు. తన అద్భుత బ్యాటింగ్తో ఇంగ్లండ్ బౌలర్లకు చుక్కలు చూపించి భారత్-ఏ విజయంలో కీలక పాత్ర పోషించిన సర్ఫరాజ్ ఖాన్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఇరు జట్ల మధ్య ఫిబ్రవరి 1 నుంచి మూడో అనధికారిక టెస్టు ఆరంభం కానుంది. చదవండి: Ind Vs Eng 1st Test: పాపం జడ్డూ.. ఇది మరీ అన్యాయం!.. అంపైర్ను సమర్థించిన రవిశాస్త్రి -
ఇంగ్లండ్ లయన్స్తో రెండో టెస్టు.. భారత జట్టులోకి రింకూ సింగ్!
ఇంగ్లండ్ లయన్స్తో రెండో అనధికారిక టెస్టులో తలపడేందుకు భారత-ఎ జట్టు సిద్దమవుతోంది. జనవరి 24 నుంచి అహ్మదాబాద్ వేదికగా ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇప్పటికే తొలి టెస్టు డ్రాగా ముగిసిన సంగతి తెలిసిందే. ఇక రెండో టెస్టు కోసం భారత జట్టులోకి మిడిలార్డర్ బ్యాటర్ రింకూ సింగ్ను సెలక్టర్లు చేర్చారు. తొలుత కేవలం మూడో అనధికారిక టెస్టుకు మాత్రమే రింకూను ఎంపిక చేసిన సెలక్టర్లు.. ఇప్పుడు రెండో టెస్టుకు కూడా అతడికి ఛాన్స్ ఇచ్చారు. ఈ విషయాన్ని బీసీసీఐ అధికారికంగా మంగళవారం ప్రకటించింది. కాగా రింకూ ప్రస్తుతం రంజీ ట్రోఫీ-2024లో ఉత్తరప్రదేశ్ తరపున ఆడతున్నాడు. అయితే సెలక్టర్లు నుంచి పిలుపు రావడంతో అనుకున్నదానికంటే ముందే భారత-ఏ జట్టుతో రింకూ కలవనున్నాడు. ఇంగ్లండ్ లయన్స్తో రెండో టెస్టుకు భారత జట్టు: అభిమన్యు ఈశ్వరన్ (కెప్టెన్), సాయి సుదర్శన్, రజత్ పాటిదార్, సర్ఫరాజ్ ఖాన్, తిలక్ వర్మ, కుమార్ కుషాగ్రా, వాషింగ్టన్ సుందర్, సౌరభ్ కుమార్, అర్ష్దీప్ సింగ్, తుషార్ దేశ్పాండే, విద్వాత్ కావరప్ప, ఉపేంద్ర యాదవ్, ఆకాష్ దీప్, యశ్ దయాల్, రింకు సింగ్ -
INDA Vs ENGA: భారత జట్టులో తిలక్, రింకూలకు చోటు: బీసీసీఐ ప్రకటన
India ‘A’ squad for Matches against England Lions: ఇంగ్లండ్ లయన్స్తో ఆఖరి రెండు మ్యాచ్లలో తలపడే భారత్-‘ఏ’ జట్టును బీసీసీఐ ప్రకటించింది. అభిమన్యు ఈశ్వరన్ సారథ్యంలో లయన్స్తో పోటీ పడనున్న ఈ టీమ్లో తిలక్ వర్మ, రింకూ సింగ్లకు కూడా చోటు దక్కింది. కాగా భారత యువ క్రికెట్ జట్టుతో మూడు అనధికారిక టెస్టులు ఆడేందుకు ఇంగ్లండ్ యువ టీమ్ ఇండియాకు వచ్చింది. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య జనవరి 12- 13 వరకు రెండు రోజులపాటు ప్రాక్టీస్ మ్యాచ్ జరిగింది. ఇది డ్రాగా ముగిసిపోయింది. ఇక జనవరి 17 నుంచి భారత్-‘ఏ’- ఇంగ్లండ్ లయన్స్ మధ్య తొలి అనధికారిక టెస్టు మొదలైంది. ఇందుకు సంబంధించిన ఫలితం శనివారం తేలనుంది. ఇదిలా ఉంటే.. జనవరి 24- 27 వరకు రెండు జట్ల మధ్య రెండో అనధికారిక టెస్టు, ఫిబ్రవరి 1- 4 వరకు మూడో అనధికారిక టెస్టు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో ఈ రెండు మ్యాచ్లలో ఇంగ్లండ్ లయన్స్తో తలపడే భారత యువ జట్టుకు బెంగాల్ బ్యాటర్ అభిమన్యు ఈశ్వరన్ కెప్టెన్గా కొనసాగనున్నాడు. ఇక రంజీ ట్రోఫీ-2024లో సత్తా చాటుతున్న టీమిండియా స్టార్లు.. హైదరాబాదీ తిలక్ వర్మ, యూపీ బ్యాటర్ రింకూ సింగ్లు కూడా ఈ జట్టులో చోటు సంపాదించారు. తిలక్ రెండు మ్యాచ్లకు అందుబాటులో ఉండనుండగా.. రింకూ ఆఖరి టెస్టు కోసం జట్టుతో చేరనున్నాడు. ఈ మ్యాచ్లన్నీ అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరుగనున్నాయి. యువ జట్ల మధ్య పోటీ ఇలా ఉంటే.. జనవరి 25 నుంచి టీమిండియా- ఇంగ్లండ్ మధ్య ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్ ఆరంభం కానున్న విషయం తెలిసిందే. ఇంగ్లండ్ లయన్స్తో రెండో మ్యాచ్కు భారత్- 'ఏ' జట్టు: అభిమన్యు ఈశ్వరన్ (కెప్టెన్), సాయి సుదర్శన్, రజత్ పాటిదార్, సర్ఫరాజ్ ఖాన్, తిలక్ వర్మ, కుమార్ కుషాగ్రా, వాషింగ్టన్ సుందర్, సౌరభ్ కుమార్, అర్ష్దీప్ సింగ్, తుషార్ దేశ్పాండే, విద్వత్ కావేరప్ప, ఉపేంద్ర యాదవ్, ఆకాశ్ దీప్, యశ్ దయాళ్. ఇంగ్లండ్ లయన్స్తో మూడో మ్యాచ్కు భారత్- 'ఏ' జట్టు: అభిమన్యు ఈశ్వరన్ (కెప్టెన్), సాయి సుదర్శన్, రజత్ పాటిదార్, తిలక్ వర్మ, రింకూ సింగ్, కుమార్ కుషాగ్రా, వాషింగ్టన్ సుందర్, షామ్స్ ములానీ, అర్ష్దీప్ సింగ్, తుషార్ దేశ్పాండే, విద్వత్ కావేరప్ప, ఉపేంద్ర యాదవ్, ఆకాశ్ దీప్, యశ్ దయాళ్. చదవండి: Glenn Maxwell Captaincy Quit: గ్లెన్ మాక్స్వెల్ సంచలన నిర్ణయం? -
IND Vs AFG Highlights Pics: అఫ్గానిస్తాన్పై 3–0తో సిరీస్ సొంతం (ఫొటోలు)
-
IND vs AFG 3rd T20I: రోహిత్ సూపర్... భారత్ ‘డబుల్ సూపర్’...
ఏమా ఉత్కంఠ... ఏమిటా మలుపులు... ఒక టి20 సమరం అభిమానులందరినీ కట్టిపడేసింది. ఒక ద్వైపాక్షిక సిరీస్లో, అదీ అఫ్గానిస్తాన్తో పోరు ఏకపక్షం అనుకుంటే నరాలు తెగే పరిస్థితి వచి్చంది. 212 పరుగులు చేశాక భారత్ గెలుపు ఖాయమనిపించి నిశి్చంతగా ఉండగా... అఫ్గానిస్తాన్ మేమేమీ తక్కువ కాదన్నట్లుగా స్కోరు సమం చేసేసింది. ‘సూపర్ ఓవర్’లో ఫలితం తేలుతుందనుకుంటే అక్కడా ఇరు జట్లూ సమమే. చివరకు అంతా రెండో సూపర్ను ఆశ్రయించాల్సి వచి్చంది... ఇక్కడ చివరకు పైచేయి సాధించిన టీమిండియా గట్టెక్కింది. తుది ఫలితంతో గెలుపు భారత్దే అయినా ఆఖరి వరకు అఫ్గాన్ చూపిన పోరాటపటిమ అసమానం. బెంగళూరు: టి20 ప్రపంచకప్కు ముందు తాము ఆడిన ఆఖరి సిరీస్ను భారత్ ఘనంగా ముగించింది. అఫ్గానిస్తాన్తో జరిగిన మూడు మ్యాచ్ల పోరును టీమిండియా 3–0తో సొంతం చేసుకుంది. చిన్నస్వామి స్టేడియంలో బుధవారం జరిగిన చివరి టి20లో భారత్ రెండో ‘సూపర్ ఓవర్’లో విజయం సాధించింది. తొలి సూపర్ ఓవర్ ఓవర్లో ఇరు జట్లు 16 పరుగులతో సమంగా నిలిచాయి. రెండో సూపర్ ఓవర్లో ముందుగా భారత్ 11 పరుగులు చేయగా... అఫ్గాన్ 1 పరుగుకే 2 వికెట్లు కోల్పోయింది. నిబంధనల ప్రకారం ‘సూపర్ ఓవర్’లో రెండు వికెట్లు పడితే ఇన్నింగ్స్ ముగిసినట్టే కావడంతో భారత విజయం ఖరారైంది. అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ రోహిత్ శర్మ (69 బంతుల్లో 121 నాటౌట్; 11 ఫోర్లు, 8 సిక్స్లు) అంతర్జాతీయ టి20ల్లో ఐదో సెంచరీతో చెలరేగగా... రింకూ సింగ్ (39 బంతుల్లో 69 నాటౌట్; 2 ఫోర్లు, 6 సిక్స్లు) మరో మెరుపు ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నాడు. వీరిద్దరు ఐదో వికెట్కు 95 బంతుల్లోనే అభేద్యంగా 190 పరుగులు జోడించారు. అనంతరం అఫ్గానిస్తాన్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 212 పరుగులు సాధించింది. గుల్బదిన్ (23 బంతుల్లో 55 నాటౌట్; 4 ఫోర్లు, 4 సిక్స్లు), గుర్బాజ్ (32 బంతుల్లో 50; 3 ఫోర్లు, 4 సిక్స్లు), ఇబ్రహీమ్ జద్రాన్ (41 బంతుల్లో 50; 4 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీలు చేశారు. శతక భాగస్వామ్యం... ఫరీద్ వేసిన మూడో బంతిని భారీ షాట్ ఆడబోయి వెనుదిరిగిన యశస్వి... కోహ్లి తొలి బంతికి డకౌట్... అంతా నిశ్శబ్దం... ఫామ్లో ఉన్న శివమ్ దూబే కూడా కీపర్కు క్యాచ్ ఇవ్వగా, తర్వాతి ఓవర్లో తన తొలి బంతికే సామ్సన్ కూడా సున్నాకే అవుట్! ఐదో ఓవర్ మూడో బంతి ముగిసేసరికి టీమిండియా స్కోరు 21/4... అయితే రోహిత్, రింకూ భాగస్వామ్యం జట్టుకు భారీ స్కోరు అందించింది. 15 ఓవర్లు ముగిసేసరికి 109/4తో స్కోరు మరీ గొప్పగా ఏమీ లేదు. అయితే చివరి ఐదు ఓవర్లలో 22, 13, 10, 22, 36 స్కోర్లతో భారత్ ఏకంగా 103 పరుగులు సాధించింది. 6 ఫోర్లు, 5 సిక్సర్లతో రోహిత్ వీర విధ్వంసం ప్రదర్శించగా... 1 సిక్స్, 4 ఫోర్లతో రింకూ చెలరేగిపోయాడు. 64 బంతుల్లోనే శతకం అందుకొని అంతర్జాతీయ టి20ల్లో ఐదో సెంచరీ సాధించిన తొలి ఆటగాడిగా రోహిత్ నిలవగా... రింకూ ఖాతాలో రెండో అర్ధ సెంచరీ చేరింది. వీరిద్దరి దెబ్బకు అఫ్గాన్ కుదేలైంది. రోహిత్ తన శైలికి భిన్నంగా ఈసారి కొన్ని వైవిధ్యమైన షాట్లతో అలరించడం విశేషం. కరీమ్ వేసిన చివరి ఓవర్లో తొలి మూడు బంతుల్లో రోహిత్ 4, 6 (నోబాల్), 6 కొట్టగా... చివరి మూడు బంతుల్లో రింకూ 6, 6, 6 బాదాడు. అనంతరం అఫ్గాన్ ఓపెనర్లు గుర్బాజ్, ఇబ్రహీమ్ 66 బంతుల్లోనే 93 పరుగులు జోడించి తమ జట్టుకు శుభారంభం అందించారు. వీరు వెనుదిరగడంతో పరిస్థితి మారిపోయింది. ఆ తర్వాత గుల్బదిన్, నబీ (16 బంతుల్లో 34; 2 ఫోర్లు, 3 సిక్స్లు) కలిసి జట్టుకు విజయానికి చేరువగా తెచ్చారు. విజయం కోసం చివరి ఓవర్లో 19 పరుగులు అవసరం కాగా, అఫ్గాన్ 18 పరుగులు చేయడంతో స్కోరు సమమైంది. రిలీఫ్..! ‘ఏంటి వీరూ... లెగ్బై ఇచ్చావా, బ్యాట్కు అంత బలంగా బంతి తగిలింది... అసలే ఇక్కడ రెండు సున్నాలు ఉన్నాయి’... తను ఆడిన తొలి బంతి లెగ్సైడ్ దిశగా ఆడి బౌండరీని తాకగా, అంపైర్ లెగ్బై ఇవ్వడంతో అంపైర్ వీరేందర్ శర్మతో రోహిత్ అన్న మాట ఇది! అతని దృష్టిలో ఆ పరుగులు ఎంత విలువైనవో ఇది చెబుతుంది. నిజంగానే టి20ల్లో చాలా కాలంగా రోహిత్ ఫామ్ బాగా లేదు. వన్డేల్లో అద్భుతంగా ఆడుతున్నా 2022 నుంచి అంతర్జాతీయ టి20ల్లో ఈ మ్యాచ్కు ముందు 31 ఇన్నింగ్స్లలో అతను 3 అర్ధ సెంచరీలే చేశాడు. ఐపీఎల్లో కూడా అంతంతమాత్రంగానే ఆడాడు. ఇటీవలి పరిణామాలు సహజంగానే అతడిని ఇబ్బంది పెట్టాయి. ముంబై ఇండియన్స్ కెపె్టన్సీ పోవడంతో పాటు టీమిండియా కెపె్టన్సీపై కూడా సందేహాలు వచ్చాయి. అసలు వచ్చే టి20 వరల్డ్ కప్లో అతను ఆడతాడా అన్నట్లుగా కూడా చర్చ సాగింది. దానికి తోడు తొలి రెండు మ్యాచ్లలో డకౌట్. ఇలాంటి స్థితిలో ఈ ఇన్నింగ్స్ అతని స్థాయిని చూపించింది. అఫ్గాన్ మరీ బలమైన ప్రత్యర్థి కాకపోయినా... ఇక్కడా విఫలమైతే పరిస్థితి ఇంకా జఠిలంగా మారేంది. ఈ నేపథ్యంలో సరైన లెక్కలతో చేసిన సెంచరీ రోహిత్కు ఊరటనిచి్చందనడంలో సందేహం లేదు. స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్: యశస్వి (సి) నబీ (బి) ఫరీద్ 4; రోహిత్ (నాటౌట్) 121; కోహ్లి (సి) ఇబ్రహీమ్ (బి) ఫరీద్ 0; దూబే (సి) గుర్బాజ్ (బి) అజ్మతుల్లా 1; సామ్సన్ (సి) నబీ (బి) ఫరీద్ 0; రింకూ (నాటౌట్) 69; ఎక్స్ట్రాలు 17; మొత్తం (20 ఓవర్లలో 4 వికెట్లకు) 212. వికెట్ల పతనం: 1–18, 2–18, 3–21, 4–22. బౌలింగ్: ఫరీద్ 4–0–20–3, అజ్మతుల్లా 4–0–33–1, ఖైస్ 4–0–28–0, సలీమ్ 3–0–43–0, షరాఫుద్దీన్ 2–0–25–0, కరీమ్ 3–0–54–0. అఫ్గానిస్తాన్ ఇన్నింగ్స్: గుర్బాజ్ (సి) సుందర్ (బి) కుల్దీప్ 50; ఇబ్రహీమ్ (స్టంప్డ్) సామ్సన్ (బి) సుందర్ 50; గుల్బదిన్ (నాటౌట్) 55; అజ్మతుల్లా (సి) రవి బిష్ణోయ్ (బి) సుందర్ 0; నబీ (సి) అవేశ్ (బి) సుందర్ 34; కరీమ్ (రనౌట్) 2; నజీబుల్లా (సి) కోహ్లి (బి) అవేశ్ 5; షరాఫుద్దీన్ (నాటౌట్) 5; ఎక్స్ట్రాలు 11; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 212. వికెట్ల పతనం: 1–93, 2–107, 3–107, 4–163, 5–167, 6–182. బౌలింగ్: ముకేశ్ 4–0–44–0, అవేశ్ 4–0–55–1, బిష్ణోయ్ 4–0–38–0, సుందర్ 3–0–18–3, దూబే 2–0–25–0, కుల్దీప్ 3–0–31–1. సూపర్ ఓవర్లలో ఇలా... ముకేశ్ వేసిన తొలి సూపర్ ఓవర్లో అఫ్గానిస్తాన్ 1 సిక్స్, 1 ఫోర్తో 16 పరుగులు చేసింది. ఛేదన లో రోహిత్ 2 సిక్స్లు కొట్టినా చివరకు భారత్ కూడా 16 పరుగులకే పరిమితమైంది. అవసరమైతే చివరి బంతికి వేగంగా పరుగు తీయాల్సి వస్తుందనే ఆలోచనతో రోహిత్ ఐదో బంతి తర్వాత రిటైర్డ్హర్ట్గా వెనుదిరిగి రింకూను పంపించాడు. అయితే ఆఖరి బంతికి యశస్వి 2 పరుగులు రాబట్టలేకపోయాడు. ఫరీద్ వేసిన రెండో సూపర్ ఓవర్లో రోహిత్ 4, 6తో భారత్ 11 పరుగులు చేసింది. అయితే బిష్ణోయ్ వేసిన ఈ ఓవర్ తొలి 3 బంతుల్లోనే అఫ్గాన్ 2 వికెట్లు కోల్పోవడంతో భారత్ గెలుపు ఖాయమైంది. -
అఫ్గన్ బౌలింగ్ను చీల్చి చెండాడిన రోహిత్, రింకూ.. ఆల్టైమ్ రికార్డు
అఫ్గనిస్తాన్తో మూడో టీ20లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, నయా ఫినిషర్ రింకూ సింగ్ అద్భుతమైన ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నారు. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఇద్దరూ కలిసి పరుగుల వరద పారించారు. పవర్ ప్లేలో 30 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి జట్టులో కష్టాల్లో కూరుకుపోయిన వేళ.. రోహిత్ శర్మ, రింకూ సింగ్ పట్టుదలగా నిలబడ్డారు. ఆకాశమే హద్దుగా చెలరేగుతూ అఫ్గన్ ఆటగాళ్ల బౌలింగ్ను చీల్చి చెండాడారు. మొత్తంగా.. 69 బంతుల్లో.. 11 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో 121 పరుగులు బాదిన రోహిత్ హిట్మ్యాన్ అనే బిరుదును సార్థకం చేసుకున్నాడు. మరో ఎండ్ నుంచి కెప్టెన్ రోహిత్కు అన్ని విధాలా అండగా నిలిచిన రింకూ సైతం బ్యాట్ ఝులిపించాడు. ఆరో స్థానంలో బ్యాటింగ్కు దిగిన ఈ యూపీ కుర్రాడు.. 39 బంతుల్లో 69 పరుగులు చేసి విధ్వంసం సృష్టించాడు. రింకూ ఇన్నింగ్స్లో 2 ఫోర్లు, 6 సిక్స్లు ఉండటం విశేషం. ఇక రోహిత్- రింకూ పటిష్ట భాగస్వామ్యం కారణంగా టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసింది.మరి ఈ మ్యాచ్ సందర్భంగా.. రోహిత్ శర్మ- రింకూ సింగ్ నమోదు చేసిన రికార్డులు గమనిద్దాం! Rohit Sharma 🤝 Rinku Singh OuR’RR’ 😎 💪#TeamIndia | #INDvAFG | @IDFCFIRSTBank | @ImRo45 | @rinkusingh235 pic.twitter.com/SfKSl07JoE — BCCI (@BCCI) January 17, 2024 అంతర్జాతీయ టీ20లలో ఏ వికెట్కైనా అత్యధిక భాగస్వామ్యం నమోదు చేసింది వీళ్లే ►రోహిత్ శర్మ- రింకూ సింగ్- అఫ్గనిస్తాన్ మీద- 190 నాటౌట్- 2024లో ►సంజూ శాంసన్- దీపక్ హుడా- ఐర్లాండ్ మీద- 176 రన్స్- 2022లో ►రోహిత్ శర్మ- కేఎల్ రాహుల్- శ్రీలంక మీద- 165 రన్స్- 2017లో ►యశస్వి జైశ్వాల్- శుబ్మన్ గిల్- వెస్టిండీస్ మీద- 165 రన్స్- 2023లో. అంతర్జాతీయ టీ20లలో ఒక ఓవర్లో అత్యధిక పరుగులు సాధించిన క్రికెటర్లు ►36- స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్లో యువరాజ్ సింగ్-డర్బన్- 2007లో ►36- అకిల ధనంజయ బౌలింగ్లో- కీరన్ పొలార్డ్- కూలిడ్జ్- 2021లో ►36- కరీం జనత్ బౌలింగ్లో- రోహిత్ శర్మ, రింకూ సింగ్- బెంగళూరుల- 2024లో. చదవండి: రోహిత్ విధ్వంసకర ఇన్నింగ్స్.. దెబ్బకు రికార్డులన్నీ బద్దలు! ఇది కదా ఊచకోత -
Rishabh Pant: టీమిండియాతో పంత్.. కోహ్లి, రింకూలతో ముచ్చట (ఫొటోలు)
-
రింకూ సింగ్ను మించినోడే లేడు.. ఈ గణంకాలు చూడండి..!
పొట్టి క్రికెట్లో టీమిండియా విధ్వంసకర బ్యాటర్ రింకూ సింగ్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నాడు. ఆడింది తక్కువ మ్యాచ్లే అయినా ఎవరికీ సాధ్యంకాని రికార్డులతో దూసుకుపోతున్నాడు. తాజాగా రింకూ ఖాతాలో మరో రికార్డు వచ్చి చేరింది. ఐసీసీ పుల్ మెంబర్ జట్లలో 10 టీ20 ఇన్నింగ్స్ల తర్వాత అత్యధిక స్ట్రయిక్రేట్, సగటు కలిగిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. Rinku Singh is here to rule!🔥 pic.twitter.com/4ro8aF6DWN — CricTracker (@Cricketracker) January 16, 2024 రింకూ తన 10 ఇన్నింగ్స్ల్లో 176.07 స్ట్రయిక్రేట్తో 71.75 సగటున ఓ హాఫ్ సెంచరీ సాయంతో 287 పరుగులు చేశాడు. రింకూ 10 ఇన్నింగ్స్ల్లో ఆరింట నాటౌట్గా నిలిచాడు. రింకూ ఖాతాలో 29 ఫోర్లు, 14 సిక్సర్లు ఉన్నాయి. ఈ గణాంకాలు చూసి పొట్టి క్రికెట్లో రింకూను మించినోడే లేడని భారత క్రికెట్ అభిమానులు అంటున్నారు. 10 టీ20 ఇన్నింగ్స్ల అనంతరం అత్యధిక సగటు, స్ట్రయిక్రేట్ కలిగిన ఆటగాళ్ల జాబితా ఇలా ఉంది. రింకూ సింగ్-176.07 స్ట్రయిక్రేట్తో 71.75 సగటు మిస్బా ఉల్ హాక్- 135 స్ట్రయిక్రేట్తో 67.60 సగటు డెవాన్ కాన్వే- 151 స్ట్రయిక్రేట్తో 65.43 సగటు కేఎల్ రాహుల్- 151 స్ట్రయిక్రేట్తో 56.75 సగటు ఆండ్రూ సైమండ్స్- 170 స్ట్రయిక్రేట్తో 56.17 సగటు బాబర్ ఆజమ్- 123 స్ట్రయిక్రేట్తో 54.86 సగటు అంతర్జాతీయ టీ20ల్లో రింకూ సింగ్ స్కోర్లు.. ఆఫ్ఘనిస్తాన్తో రెండో టీ20 9 నాటౌట్ ఆఫ్ఘనిస్తాన్తో తొలి టీ20 16 నాటౌట్ సౌతాఫ్రికాతో మూడో టీ20 14 సౌతాఫ్రికాతో రెండో టీ20 68 నాటౌట్ ఆస్ట్రేలియాతో ఐదో టీ20 6 ఆస్ట్రేలియాతో నాలుగో టీ20 46 ఆస్ట్రేలియాతో రెండో టీ20 31 నాటౌట్ ఆస్ట్రేలియాతో తొలి టీ20 22 నాటౌట్ నేపాల్తో టీ20 (ఆసియా క్రీడలు) 37 నాటౌట్ ఐర్లాండ్తో రెండో టీ20 38 -
రోహిత్, కోహ్లిల రీఎంట్రీపై గరం గరం చర్చ!
Someone like Rinku Singh will miss out: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి అంతర్జాతీయ టీ20 పునరాగమనంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఇద్దరు బ్యాటింగ్ దిగ్గజాల రాకతో భారత జట్టు మరింత పరిపుష్టమైందని.. మాజీ కెప్టెన్లు సునిల్ గావస్కర్, సౌరవ్ గంగూలీ హర్షం వ్యక్తం చేశారు. వెస్టిండీస్- అమెరికా సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్న టీ20 ప్రపంచకప్-2024 జట్టులోనూ వీరిద్దరిని తప్పక ఆడించాలని మేనేజ్మెంట్కు సూచించారు. అప్పుడే గత చేదు అనుభవాలను మరపిస్తూ ఈసారి టీమిండియా టైటిల్ గెలిచే అవకాశాలు ఉంటాయని అభిప్రాయపడ్డారు. ఎందుకు తిరిగి రప్పించారు? అయితే, ఒకప్పటి టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ దీప్దాస్ గుప్తా మాత్రం ఇందుకు భిన్నంగా స్పందించాడు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలను తిరిగి రప్పించడం వెనుక సెలక్టర్ల ఉద్దేశం ఏమిటో అర్థం కావడం లేదన్నాడు. గత వరల్డ్కప్ టోర్నీలో వైఫల్యం తర్వాత దాదాపు 14 నెలలుగా అంతర్జాతీయ టీ20లకు దూరంగా ఉన్న ఈ ఇద్దరు సీనియర్లను మళ్లీ ఇప్పుడు ఆడిస్తే ఫలితం ఏముంటుందని ప్రశ్నించాడు. తుదిజట్టు కూర్పు ఎలా? ‘విరాహిత్’ ద్వయం రీఎంట్రీ కారణంగా ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న రింకూ సింగ్, యశస్వి జైస్వాల్ వంటి యువ ఆటగాళ్లపై వేటు పడే అవకాశం ఉందని దీప్దాస్ గుప్తా ఆవేదన వ్యక్తం చేశాడు. హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్ గాయాల నుంచి కోలుకుని తిరిగి వస్తే రింకూతో పాటు తిలక్ వర్మ పరిస్థితి ఏమిటని ప్రశ్నించాడు. తుదిజట్టు కూర్పు విషయంలో కచ్చితంగా గందరగోళం నెలకొంటుందని స్టార్ స్పోర్ట్స్ షోలో దీప్దాస్ గుప్తా వ్యాఖ్యానించాడు. కోహ్లి, రోహిత్ రీఎంట్రీ అవసరమా? ‘‘టీ20లలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలను పక్కనపెట్టాలని మేనేజ్మెంట్ భావిస్తోందని అనుకున్నాను. కానీ సెలక్టర్ల నిర్ణయం నన్ను ఆశ్చర్యపరిచింది. టీ20 వరల్డ్కప్-2022లో సీనియర్ ప్లేయర్లు ఉన్నా అనుకున్న ఫలితాలు రాబట్టలేకపోయాం కదా! కానీ మళ్లీ మరోసారి అదే పునరావృతం చేస్తున్నారు. వెస్టిండీస్ పిచ్ల మీద 160, 180, 200 పరుగుల స్కోరు ఆశిస్తున్నారా? గతేడాదితో పోలిస్తే ఇప్పటి జట్టును చూస్తుంటే టీమిండియా మళ్లీ తిరోగమిస్తోందనిపిస్తోంది. రోహిత్, కోహ్లిలను మళ్లీ తీసుకురావడంలో ఇంతకంటే గొప్ప అర్థమేముంది? రింకూలాంటి వాళ్ల పరిస్థితి ఏంటి? ఇలాంటి నిర్ణయాల వల్ల రింకూ సింగ్ వంటి యువ సంచలనాలకు జట్టులో చోటే కష్టమవుతుంది. కేవలం అఫ్గనిస్తాన్తో టీ20 సిరీస్ గురించి కాకుండా వరల్డ్కప్ టోర్నీని దృష్టిలో పెట్టుకుని సమాలోచనలు చేయాలి. ప్రస్తుతం రింకూ, యశస్వి తమను తాము నిరూపించుకుని పెద్ద మ్యాచ్లలో ఆడే అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు. బ్యాటింగ్ ఆర్డర్ మొత్తం రోహిత్, కోహ్లి, పాండ్యా, సూర్యలతో నిండిపోతే రింకూ, తిలక్ వర్మ లాంటి వాళ్ల పరిస్థితి ఏమిటి?’’ అని దీప్దాస్ గుప్తా ఈ సందర్భంగా ప్రశ్నలు లేవనెత్తాడు. కాగా బెంగాల్కు చెందిన దీప్దాస్ టీమిండియా తరఫున 8 టెస్టుల్లో 344, 5 వన్డేల్లో 51 పరుగులు సాధించాడు. ఇదిలా ఉంటే.. అఫ్గనిస్తాన్తో జనవరి 11 నుంచి మొదలుకానున్న టీ20 సిరీస్ సందర్భంగా కోహ్లి- రోహిత్ రీఎంట్రీకి సిద్ధమయ్యారు. చదవండి: Ind Vs Afg: అఫ్గన్తో టీమిండియా సిరీస్: షెడ్యూల్, జట్లు, లైవ్ స్ట్రీమింగ్.. పూర్తి వివరాలు -
అదరగొట్టిన రింకూ సింగ్.. సెంచరీ జస్ట్ మిస్
రంజీట్రోఫీ-2024 సీజన్లో భాగంగా కేరళతో జరుగుతున్న మ్యాచ్లో ఉత్తరప్రదేశ్ ఆటగాడు, టీమిండియా నయా ఫినిషర్ రింకూ సింగ్ అద్భుత ప్రదర్శన కనబరిచాడు. రింకూ తృటిలో సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో 136 బంతులు ఎదుర్కొన్న రింకూ.. 8 ఫోర్లు, 2 సిక్స్లతో 92 పరుగులు చేశాడు. అతడితో పాటు దృవ్ జురల్(63) హాఫ్ సెంచరీతో రాణించాడు. 124 పరుగులకు సగం వికెట్లు కోల్పోయిన దశలో దృవ్ జురెల్తో జతకట్టిన రింకూ 100 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించి జట్టుకు మెరుగైన స్కోర్ను అందించాడు. తొలి ఇన్నింగ్స్లో యూపీ 302 పరుగులకు ఆలౌటైంది. కేరళ బౌలర్లలో నిదేష్ మూడు వికెట్లు పడగొట్టగా.. బసిల్ థంపీ,సక్సేనా తలా రెండు వికెట్లు పడగొట్టారు. కాగా రెండో ఇన్నింగ్స్ను ప్రారంభించిన కేరళ 43 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. చదవండి: PAK vs AUS: కెరీర్లో చివరి మ్యాచ్.. కన్నీరు పెట్టుకున్న డేవిడ్ వార్నర్! వీడియో వైరల్ -
రాణించిన రింకూ.. టెస్ట్లకు సైతం 'సై' అనేలా..!
విధ్వంసకర బ్యాటింగ్తో పరిమిత ఓవర్ల ఆటగాడిగా ముద్ర వేసుకున్న టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్ రింకూ సింగ్.. టెస్ట్ క్రికెట్కు సైతం సై అనేలా కనిపిస్తున్నాడు. రంజీ ట్రోఫీ 2024 సీజన్లో భాగంగా కేరళతో ఇవాళ (జనవరి 5) మొదలైన మ్యాచ్లో రింకూ (ఉత్తర్ప్రదేశ్) ఎంతో బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడుతూ 71 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఈ ఇన్నింగ్స్లో 103 బంతులు ఎదుర్కొన్న రింకూ 7 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో తన ఇన్నింగ్స్ను అద్భుతంగా మలచుకోవడమే కాకుండా జట్టు గౌరవప్రదమైన స్కోర్ సాధించడంలో కీలకపాత్ర పోషించాడు. 124 పరుగులకు సగం వికెట్లు కోల్పోయిన దశలో దృవ్ జురెల్తో (54 నాటౌట్) జతకట్టిన రింకూ 100 పరుగుల అజేయమైన భాగస్వామ్యాన్ని జోడించి జట్టును భారీ స్కోర్ దిశగా నడిపిస్తున్నాడు. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న ఉత్తర్ప్రదేశ్.. తొలి రోజు ఆట ముగిసే సమయానికి 64 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 244 పరుగులు చేసింది. రింకూ సింగ్, దృవ్ జురెల్తో పాటు ప్రియం గార్గ్ (44), కెప్టెన్ ఆర్యన్ జుయల్ (28), సమీర్ రిజ్వి (26) ఓ మోస్తరు స్కోర్లు చేయగా.. ఓపెనర్ సమర్థ్ సింగ్ (10), ఆక్ష్దీప్ నాథ్ (9) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. కేరళ బౌలర్లలో బాసిల్ థంపి, నిధీష్, వైశాక్ చంద్రన్, జలజ్ సక్సేనా, శ్రేయాస్ గోపాల్ తలో వికెట్ పడగొట్టారు. -
సౌతాఫ్రికాతో తొలి టెస్టు.. ఫీల్డ్లో కన్పించిన రింకూ సింగ్! అదేంటి జట్టులో లేడుగా?
సెంచూరియన్ వేదికగా భారత్-సౌతాఫ్రికా మధ్య జరగుతున్న బ్యాక్సింగ్ డే టెస్టు ఆసక్తికరంగా మారింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి దక్షిణాఫ్రికా తమ తొలి ఇన్నింగ్స్లో 5 వికెట్ల నష్టానికి 256 పరుగులు చేసింది. క్రీజులో ఆఖరి టెస్టు సిరీస్ ఆడుతున్న డీన్ ఎల్గర్(140), మార్కో జానెసన్ ఉన్నాడు. భారత బౌలర్లలో బుమ్రా, సిరాజ్ రెండు వికెట్లు పడగొట్టగా.. ప్రసిద్ద్ కృష్ణ ఒక్క వికెట్ పడగొట్టారు. అంతకముందు టీమిండియా 245 పరుగులకు ఆలౌటైంది. భారత ఇన్నింగ్స్లో కేఎల్ రాహుల్(101) అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. ఇక ఇది ఇలా ఉండగా.. రెండో రోజు ఆట సందర్భంగా భారత ఆటగాడు రింకూ సింగ్ సబ్స్ట్యూట్ ఫీల్డర్గా వచ్చి అందరని ఆశ్చర్యపరిచాడు. ఈ టెస్టు సిరీస్ ప్రధాన జట్టులోని రింకూ ఫీల్డింగ్కు ఎలా వచ్చాడని అందరూ తెగ చర్చించుకున్నారు. రింకూను సెలక్టర్లు దక్షిణాఫ్రికాతో టీ20, వన్డే సిరీస్లకు మాత్రమే ఎంపికచేశారు. అయితే టెస్టు సిరీస్కు ఎంపికైన యువ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ గాయం కారణంగా ఆఖరి నిమిషంలో దూరమయ్యాడు. దీంతో అతడి స్ధానంలో అభిమన్యు ఈశ్వరన్ను సెలక్టర్లు ఎంపిక చేశారు. అయితే దక్షిణాఫ్రికా-ఏతో సిరీస్కు అభిమన్యు ఈశ్వరన్ను భారత- ఏ జట్టులో భాగం చేశారు. ఈ క్రమంలోనే రింకూ సింగ్ టీమిండియా సీనియర్ జట్టుతో పాటు దక్షిణాఫ్రికాలో ఉన్నాడు. దీంతో రోహిత్ స్ధానంలో సబ్స్ట్యూట్ ఫీల్డర్గా రింకూ కన్పించాడు. దక్షిణాఫ్రికా సిరీస్తో వన్డేల్లో అరంగేట్రం చేసిన రింకూ అకట్టుకున్నాడు. అంతకుముందు ప్రోటీస్తో టీ20 సిరీస్లోనూ దుమ్మురేపాడు. చదవండి: IND vs AFG: అఫ్గానిస్తాన్తో టీ20 సిరీస్.. టీమిండియా కొత్త కెప్టెన్ అతడే!? రోహిత్ డౌటే? Rinkuu💥#AmiKKR | #RinkuSingh pic.twitter.com/n52BKQ3zrK — Rokte Amar KKR 🟣🟡 (@Rokte_Amarr_KKR) December 27, 2023 -
IPL 2024: 5 సిక్సర్లు బాదించుకున్న వ్యక్తికి 5 కోట్లు, కొట్టిన వ్యక్తికి 50 లక్షలు
ఐపీఎల్ 2024లో విచిత్ర పరిస్థితి నెలకొంది. ఒకే ఓవర్లో ఐదు సిక్సర్లు బాధించుకున్న బౌలర్కు 5 కోట్ల భారీ మొత్తం దక్కనుండగా.. ఆ ఐదు సిక్సర్లు బాదిన బ్యాటర్కు మాత్రం కేవలం 50 లక్షలే లభించనున్నాయి. ఈపాటికి విషయం అర్థమయ్యే ఉంటుంది. 2023 సీజన్లో గుజరాత్ టైటాన్స్ బౌలర్ యశ్ దయాల్ బౌలింగ్లో కేకేఆర్ తురుపుముక్క రింకూ సింగ్ ఆఖరి ఓవర్లో చివరి ఐదు బంతులకు ఐదు భారీ సిక్సర్లు బాది తన జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించిన విషయం తెలిసిందే. ఇది జరిగి ఏడు నెలల కాలం అయిపోయింది. ఈ విషయాన్ని దాదాపుగా అందరూ మర్చిపోయారు. అయితే నిన్న జరిగిన ఐపీఎల్ వేలం తర్వాత ఈ టాపిక్ మళ్లీ నెట్టింట హల్చల్ చేస్తుంది. pic.twitter.com/wCHjXTmZ2S — Out Of Context Cricket (@GemsOfCricket) December 20, 2023 ఎందుకుంటే.. నిన్న జరిగిన వేలంలో గుజరాత్ విడిచపెట్టిన యశ్ దయాల్ను ఆర్సీబీ 5 కోట్ల ఊహించని ధరకు కొనుగోలు చేసింది. యశ దయాల్ ఇంత భారీ మొత్తానికి అమ్ముడుపోతాడని అతనితో సహా ఎవరూ ఊహించి ఉండరు. అయితే ఆర్సీబీ మాత్రం యశ్పై భారీ విశ్వాసం ఉంచి, ఇతర ఫ్రాంచైజీలతో పోటీపడి మరీ అతన్ని దక్కించుకుంది. ఇక్కడి వరకు బాగానే ఉంది. సిక్సర్లు బాదించుకున్నవ్యక్తికే ఇంత భారీ మొత్తం లభిస్తున్నప్పుడు, ఆ సిక్సర్లు కొట్టిన రింకూ సింగ్కు మాత్రం ఎందుకు అంత తక్కువ మొత్తమని అతని అభిమానులు సోషల్మీడియాలో గగ్గోలుపెడుతున్నారు. కేకేఆర్.. రింకూని కేవలం 50 లక్షలకే దక్కించుకుని, అతన్ని తిరిగి రీటెయిన్ చేసుకుని, అతన్ని ఆర్ధికంగా ఎదగకుండా కట్టిపడేసిందని అతని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. మనమన్నా, ఐపీఎల్ అన్నా గిట్టని ఆస్ట్రేలియన్లకు కోట్లకు కోట్లు కుమ్మరించిన ఫ్రాంచైజీలు, అత్యంత ప్రతిభావంతుడైన రింకూ సింగ్ విషయంలో ఒక్కసారి పునరాలోచన చేసి అతని ప్రతిభకు తగ్గ మొత్తాన్ని ఫిక్స్ చేయాలని సగటు భారత క్రికెట్ అభిమాని ఆకాంక్షిస్తున్నాడు. ఇదే సమయంలో కొందరు హర్షల్ పటేల్ (11.75 కోట్లు), శార్దూల్ ఠాకూర్ (4 కోట్లు), షారుక్ ఖాన్ (7.4 కోట్లు), శివమ్ మావీ (6.4 కోట్లు) లాంటి ఆటగాళ్ల పేర్లను ప్రస్తావిస్తూ జస్టిస్ ఫర్ రింకూ అంటూ ట్రోల్స్ చేస్తున్నారు. -
శతక్కొట్టిన సౌతాఫ్రికా ఓపెనర్.. రెండో వన్డేలో టీమిండియా ఓటమి
శతక్కొట్టిన సౌతాఫ్రికా ఓపెనర్.. రెండో వన్డేలో టీమిండియా ఓటమి దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో వన్డేలో టీమిండియా 8 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. పోర్ట్ ఎలిజబెత్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 46.2 ఓవర్లలో 211 పరుగులకు ఆలౌట్ కాగా.. సౌతాఫ్రికా కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 42.3 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. భారత ఇన్నింగ్స్లో సాయి సుదర్శన్ (62), కేఎల్ రాహుల్ (56) అర్ధసెంచరీలతో రాణించగా.. సౌతాఫ్రికాను యువ ఓపెనర్ టోనీ జోర్జీ (119) అజేయమైన శతకంతో విజయతీరాలకు చేర్చాడు. ఈ సిరీస్లో తొలి వన్డేలో భారత్ గెలవగా.. రెండో వన్డేలో సౌతాఫ్రికా విజయం సాధించింది. నిర్ణయాత్మకమైన మూడో వన్డే డిసెంబర్ 21న జరుగనుంది. శతక్కొట్టిన టోనీ జోర్జీ దక్షిణాఫ్రికా యువ ఓపెనర్ టోనీ జోర్జీ 109 బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు. టోనీకి కెరీర్లో ఇది తొలి సెంచరీ. 37 ఓవర్ల తర్వాత సౌతాఫ్రికా స్కోర్ 187/1. ఎట్టకేలకు తొలి వికెట్ పడింది.. 212 పరుగుల లక్ష్య ఛేదనలో సౌతాఫ్రికా 130 పరుగుల వద్ద (27.5వ ఓవర్) తొలి వికెట్ కోల్పోయింది. అర్ష్దీప్ సింగ్ బౌలింగ్లో రీజా హెండ్రిక్స్ (52) ఔటయ్యాడు. టోనీ జోర్జీ (75), డస్సెన్ క్రీజ్లో ఉన్నారు. హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న జోర్జీ సౌతాఫ్రికా ఓపెనర్ టోనీ జోర్జీ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అతనికి జతగా మరో ఓపెనర్ రీజా హెండ్రిక్స్ 25 పరుగులతో క్రీజ్లో ఉన్నాడు. 18 ఓవర్ల తర్వాత సౌతాఫ్రికా స్కోర్ 77/0గా ఉంది. టార్గెట్ 212.. ఆచితూచి ఆడుతున్న సౌతాఫ్రికా 212 పరుగుల లక్ష్య ఛేదనలో సౌతాఫ్రికా ఆచితూచి ఆడుతుంది. 7 ఓవర్ల తర్వాత ఆ జట్టు స్కోర్ 29/0గా ఉంది. టోనీ డి జర్జీ (21), రీజా హెండ్రిక్స్ (7) క్రీజ్లో ఉన్నారు. 211 పరుగులకు ఆలౌటైన టీమిండియా తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 46.2 ఓవర్లలో 211 పరుగులకు ఆలౌటైంది. ఆవేశ్ ఖాన్ (9) ఆఖరి వికెట్గా వెనుదిరిగాడు. భారత ఇన్నింగ్స్లో సాయి సుదర్శన్ (62), కేఎల్ రాహుల్ (56) మాత్రమే అర్ధసెంచరీలతో రాణించారు. సఫారీ బౌలర్లలో నంబ్రే బర్గర్ 3, హెండ్రిక్స్, కేశవ్ మహారాజ్ చెరో 2, లిజాడ్ విలియమ్స్, ఎయిడెన్ మార్క్రమ్ తలో వికెట్ పడగొట్టారు. ఎనిమిదో వికెట్ కోల్పోయిన టీమిండియా 186 పరుగుల వద్ద టీమిండియా ఎనిమిదో వికెట్ కోల్పోయింది. మార్క్రమ్ బౌలింగ్లో అక్షర్ పటేల్ (7) ఔటయ్యాడు. పేక మేడలా కూలుతున్న టీమిండియా ఇన్నింగ్స్ ఆరంభంలో కాస్త మెరుగ్గా ఆడిన టీమిండియా, ఆతర్వాత వరుసగా వికెట్లు కోల్పోతుంది. 172 పరుగుల వద్ద భారత జట్టు ఏడో వికెట్ కోల్పోయింది. కేశవ్ మహారాజ్ బౌలింగ్లో కుల్దీప్ యాదవ్ (1) ఔటయ్యాడు. ఆరో వికెట్ కోల్పోయిన టీమిండియా 169 పరుగుల వద్ద టీమిండియా ఆరో వికెట్ కోల్పోయింది. కేశవ్ మహారాజ్ బౌలింగ్లో రింకూ సింగ్ (17) స్టంపౌటయ్యాడు. 167 పరుగులకే సగం వికెట్లు కోల్పోయిన టీమిండియా టీమిండియా 167 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. హాఫ్ సెంచరీ అనంతరం కేఎల్ రాహుల్ (56) ఔటయ్యాడు. నండ్రే బర్గర్ బౌలింగ్లో మిల్లర్కు క్యాచ్ ఇచ్చి రాహుల్ పెవిలియన్ బాట పట్టాడు. సంజూ శాంసన్ క్లీన్ బౌల్డ్ 136 పరుగుల వద్ద టీమిండియా నాలుగో వికెట్ కోల్పోయింది. హెండ్రిక్స్ బౌలింగ్లో సంజూ శాంసన్ (12) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. మూడో వికెట్ కోల్పోయిన టీమిండియా.. సాయి సుదర్శన్ ఔట్ 114 పరుగుల వద్ద టీమిండియా మూడో వికెట్ కోల్పోయింది. 62 పరుగులు చేసి సాయి సుదర్శన్ ఔటయ్యాడు. లిజాడ్ విలియమ్స్ బౌలింగ్లో క్లాసెన్కు క్యాచ్ ఇచ్చి సుదర్శన్ పెవిలియన్కు చేరాడు. హాఫ్ సెంచరీ పూర్తి చేసిన సాయి సుదర్శన్ టీమిండియా ఓపెనర్ సాయి సుదర్శన్ తన వన్డే కెరీర్లో వరుసగా రెండో హాఫ్ సెంచరీ సాధించాడు. సౌతాఫ్రికాతో సిరీస్లో భాగంగా జరిగిన తొలి వన్డేలో అజేయమైన అర్ధశతకం సాధించిన సుదర్శన్.. రెండో వన్డేలోనూ హాఫ్ సెంచరీ మార్కును దాటాడు. 20 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 84/2గా ఉంది. సుదర్శన్తో పాటు కేఎల్ రాహుల్ (15) క్రీజ్లో ఉన్నాడు. నత్త నడకన సాగుతున్న టీమిండియా బ్యాటింగ్ టీమిండియా బ్యాటింగ్ నత్త నడకను తలపిస్తుంది. 15 ఓవర్ల తర్వాత జట్టు స్కోర్ 54/2గా ఉంది. సాయి సుదర్శన్ (36), కేఎల్ రాహుల్ (1) క్రీజ్లో ఉన్నారు. రెండో వికెట్ కోల్పోయిన టీమిండియా.. 46 పరుగుల వద్ద టీమిండియా రెండో వికెట్ కోల్పోయింది. 10 పరుగులు చేసిన తిలక్ వర్మ.. బర్గర్ బౌలింగ్లో పెవిలియన్కు చేరాడు. క్రీజులోకి కెప్టెన్ రాహుల్ వచ్చాడు. రెండో బంతికే వికెట్ కోల్పోయిన టీమిండియా టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన టీమిండియా రెండో బంతికే వికెట్ కోల్పోయింది. నంబ్రే బర్గర్ బౌలింగ్లో తొలి బంతికి బౌండరీ బాదిన రుతురాజ్ ఆతర్వాతి బంతికే ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. రుతురాజ్ రివ్యూకి వెళ్లడంతో భారత్ ఓ రివ్యూ కోల్పోయింది. పోర్ట్ ఎలిజబెత్ వేదికగా టీమిండియాతో జరుగుతున్న రెండో వన్డేలో సౌతాఫ్రికా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ కోసం టీమిండియా ఒకటి, సౌతాఫ్రికా రెండు మార్పులు చేసింది. భారత్ తరఫున శ్రేయస్ అయ్యర్ స్థానాన్ని రింకూ సింగ్ భర్తీ చేశాడు. ఈ మ్యాచ్తో రింకూ వన్డే అరంగట్రేం చేయనున్నాడు. మరోవైపు సౌతాఫ్రికా రెండు మార్పులు చేసింది. ఆండిలే ఫెహ్లుక్వాయో, తబ్రేజ్ షంషి స్థానాల్లో బ్యూరాన్ హెండ్రిక్స్, లిజాడ్ విలియమ్స్ తుది జట్టులోకి వచ్చారు. తుది జట్లు: భారత్: సాయి సుదర్శన్, రుతురాజ్ గైక్వాడ్, తిలక్ వర్మ, కేఎల్ రాహుల్ (కెప్టెన్), రింకూ సింగ్, సంజు శాంసన్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, అర్ష్దీప్ సింగ్, అవేష్ ఖాన్, ముఖేష్ కుమార్ దక్షిణాఫ్రికా: టోనీ డి జోర్జి, రీజా హెండ్రిక్స్, రాస్సీ వాన్ డెర్ డస్సెన్, ఎయిడెన్ మార్క్రమ్ (కెప్టెన్), హెన్రిచ్ క్లాసెన్ (వికెట్ కీపర్), డేవిడ్ మిల్లర్, వియాన్ ముల్డర్, కేశవ్ మహరాజ్, నండ్రే బర్గర్, బ్యూరాన్ హెండ్రిక్స్, లిజాడ్ విలియమ్స్ -
‘సిక్సర్ల’ కింగ్ రింకూ.. 26 ఫోర్లు, 14 సిక్స్లు! తనకు తానే పోటీ
India vs South Africa ODI Series 2023: సౌతాఫ్రికా గడ్డపై టీ20లలో అదరగొట్టిన టీమిండియా ‘నయా ఫినిషర్’ రింకూ సింగ్ అంతర్జాతీయ వన్డేల్లో అరంగేట్రానికి సిద్ధమయ్యాడు. స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ స్థానంలో రెండో వన్డే సందర్భంగా ఈ యూపీ కుర్రాడు ఎంట్రీ ఇవ్వడం దాదాపుగా ఖాయమైపోయింది. టెస్టు సిరీస్కు సన్నద్ధమయ్యే క్రమంలో అయ్యర్ సౌతాఫ్రికాతో రెండు, మూడు వన్డేలకు దూరం కానున్నట్లు బీసీసీఐ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అతడి స్థానాన్ని రింకూతో భర్తీ చేయాలని మేనేజ్మెంట్ ఫిక్సైపోయినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ప్రొటిస్తో తొలి వన్డే సందర్భంగా తమిళనాడు బ్యాటర్ సాయి సుదర్శన్ అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. ఆడిన తొలి మ్యాచ్లోనే అజేయ అర్ద శతకంతో రాణించి తన ఆగమనాన్ని ఘనంగా చాటాడు. కాబట్టి రెండో వన్డేలోనూ ఓపెనర్గా సాయి తన స్థానం సుస్థిరం చేసుకోగా.. శ్రేయస్ అయ్యర్ కారణంగా రింకూకు కూడా మార్గం సుగమైనట్లు తెలుస్తోంది. రింకూకు తెలిసిందిదే ఈ నేపథ్యంలో రింకూ సింగ్ గురించి ఆసక్తికర అంశాలు తెలుసుకుందాం. పేద కుటుంబం నుంచి వచ్చిన రింకూ 2013లో తొలిసారి యూపీ అండర్–16 జట్టులో చోటు దక్కించుకున్నాడు. బాల్ను చూడటం, బలంగా బాదడం.. రింకూకు తెలిసిందిదే. ఇలాంటి దూకుడైన ఆటతో దేశవాళీ క్రికెట్లో ఉత్తరప్రదేశ్కు ఎన్నో విజయాలు అందించాడు. అంచెలంచెలుగా ఎదుగుతూ.. అండర్–19 జట్టులోనూ చోటు సంపాదించాడు. అప్పటి నుంచి తన కెరీర్ మరో మలుపు తిరిగింది. క్లిష్ట పరిస్థితుల్లోనూ భారీ షాట్లు కొట్టడం, ప్రత్యర్థి బౌలర్ ఏ స్థాయి వాడైనా.. అతడిపై ఆధిపత్యాన్ని ప్రదర్శించడం రింకూ బలాలు. ఇలాంటి అద్భుత నైపుణ్యాలున్న బ్యాటర్ను వదులుకోవడానికి ఏ జట్టు మాత్రం ఇష్టపడుతుంది? యూపీ జట్టులో కీలక ఆటగాడిగా ఎదిగిన రింకూ సింగ్ 17 ఏళ్ల వయసులోనే సీనియర్ వన్డే, టీ20 టీమ్లో చోటు సంపాదించాడు. దేశవాళీ క్రికెట్లో సత్తా చాటి ఈ క్రమంలో త్రిపురతో జరిగిన వన్డేలో 44 బంతుల్లోనే 91 పరుగులు సాధించడం అతడి ప్రతిభకు మరో నిదర్శనంగా నిలిచింది. ఈ మ్యాచ్ జరిగిన రెండేళ్ల తర్వాత రంజీ ట్రోఫీలో ఆడే అవకాశం దక్కింది రింకూకు! ఆ తర్వాత వెనుదిరిగి చూడాల్సిన అవసరమే రాలేదు.. దేశవాళీ వన్డే, టీ20, ఫస్ట్క్లాస్ ఫార్మాట్లలో ఈ లెఫ్టాండర్ ప్రధాన ప్లేయర్గా మారిపోయాడు. దేశవాళీ క్రికెట్లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న రింకూ సింగ్పై ఐపీఎల్ ఫ్రాంఛైజీల దృష్టి పడింది. సెలక్షన్ క్యాంపులలో తన టాలెంట్ నిరూపించుకున్న రింకూను తొలుత 2017లో పంజాబ్ జట్టు సొంతం చేసుకుంది. రూ. 10 లక్షలు వెచ్చించి అతడిని కొనుగోలు చేసింది. అయితే ఆడే అవకాశం మాత్రం ఇవ్వలేదు. ఈ క్రమంలో 2018 ఐపీఎల్ వేలంలో రూ. 20 లక్షల కనీస ధరతో బరిలో దిగిన రింకూను కోల్కతా నైట్రైడర్స్ ఎవరూ ఊహించని రీతిలో రూ. 80 లక్షలకు కొనుగోలు చేసింది. రింకూ కెరీర్ను మార్చివేసే ఘట్టానికి పునాది అక్కడే పడింది. అప్పటి నుంచి సిక్సర్ల కింగ్గా కేకేఆర్ కొనుగోలు చేసిన తర్వాత మూడు ఎడిషన్ల పాటు రింకూ అవకాశాల కోసం ఎదురుచూడాల్సి వచ్చింది. అడపాదడపా అవకాశాలు వచ్చినా వాటిని పూర్తిగా సద్వినియోగం చేసుకున్న రింకూ.. గతేడాది నుంచి ఫినిషర్గా రాటుదేలాడు. లక్నో సూపర్జెయింట్స్తో మ్యాచ్లో 15 బంతుల్లో 40 పరుగులు సాధించడం అందరి దృష్టిని ఆకర్షించింది. అయితే, గుజరాత్ టైటాన్స్తో మ్యాచ్లో ఆఖరి ఓవర్లో వరుసగా ఆరు సిక్సర్లు బాది కేకేఆర్ను గెలిపించడం రింకూ కెరీర్లో హైలైట్గా నిలిచింది. ఈ సంచలన ప్రదర్శన రింకూను సిక్సర్ల కింగ్గా మార్చడమే గాకుండా.. టీమిండియాలో టీ20 జట్టులో అడుగుపెట్టే సువర్ణావకాశాన్నీ ఇచ్చింది. ఐర్లాండ్ పర్యటనలో టీ20 సిరీస్ సందర్భంగా 2023లో టీమిండియా తరఫున అరంగేట్రం చేసిన రింకూ.. 8 ఇన్నింగ్స్ ఆడాడు. మొత్తంగా 262 పరుగులు సాధించాడు. ఇందులో ఓ హాఫ్ సెంచరీ ఉంది. అత్యధిక స్కోరు: 68. మొత్తం 26 ఫోర్లు, 14 సిక్సర్లు ఇక రింకూ ఇప్పటి వరకు సాధించిన మొత్తం పరుగుల్లో 26 ఫోర్లు, 14 సిక్సర్లు ఉండటం విశేషం. ప్రస్తుతం టీమిండియాతో కలిసి సౌతాఫ్రికా పర్యటనలో ఉన్న రింకూ టీ20లలో తనను తాను నిరూపించుకున్నాడు. కఠిన సవాళ్లు విసిరే సఫారీ గడ్డపై తన తొలి హాఫ్ సెంచరీని నమోదు చేశాడు. ఇక ప్రొటిస్ జట్టుతో మంగళవారం రెండో మ్యాచ్ ద్వారా వన్డేల్లోనూ రింకూ ఎంట్రీ ఇవ్వడం లాంఛనమే అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చదవండి: IPL 2024: నిన్న రోహిత్... తాజాగా సచిన్ గుడ్బై... ముంబై ఇండియన్స్లో ఏమవుతోంది? -
సౌతాఫ్రికాతో రెండో వన్డే.. శ్రేయస్ దూరం! సిక్సర్ల రింకూ ఎంట్రీ
దక్షిణాఫ్రితో తొలి వన్డేలో విజయం సాధించిన భారత జట్టు.. ఇప్పుడు మరో కీలక పోరుకు సిద్దమైంది. మంగళవారం సెయింట్ జార్జ్ పార్క్ వేదికగా సఫారీలతో రెండో వన్డేలో టీమిండియా తలపడనుంది. ఈ మ్యాచ్లో ఎలాగైనా గెలిచి ప్రోటీస్ గడ్డపై మరో వన్డే సిరీస్ను సొంతం చేసుకోవాలని రాహుల్ సేన వ్యూహాలు రచిస్తోంది. అయితే ఆఖరి రెండు మ్యాచ్లకు భారత మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ దూరమయ్యాడు. ప్రోటీస్తో టెస్టు సిరీస్కు సన్నద్దమయ్యేందుకు వన్డే సిరీస్ను నుంచి తప్పుకున్నాడు. ఈ క్రమంలో రెండో వన్డేలో పలు మార్పులతో భారత జట్టు బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. అయ్యర్ స్ధానంలో రింకూ సింగ్ వన్డేల్లో అరంగేట్రం చేయనున్నట్లు సమాచారం. అదే విధంగా వెటరన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్కు కూడా జట్టు మేనెజ్మెంట్ విశ్రాంతి ఇవ్వాలని భావిస్తున్నట్లు వినికిడి. ఒక కుల్దీప్కు రెస్ట్ ఇస్తే.. యుజువేంద్ర చాహల్ తుది జట్టులోకి వచ్చే ఛాన్స్ ఉంది. మరోవైపు దక్షిణాఫ్రికా ఒక మార్పుతో బరిలోకి దిగనున్నట్లు పలు రిపోర్టులు పేర్కొంటున్నాయి. పేసర్ బర్గర్ స్ధానంలో లిజాడ్ విలియమ్స్ ప్లేయింగ్ ఎలెవన్లోకి వచ్చే సూచనలు కన్పిస్తున్నాయి. తుది జట్లు(అంచనా) భారత్: సాయి సుదర్శన్, రుతురాజ్ గైక్వాడ్, తిలక్ వర్మ, లోకేష్ రాహుల్ (కెప్టెన్), రింకూ సింగ్, సంజు శాంసన్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, అర్ష్దీప్ సింగ్, అవేష్ ఖాన్, ముఖేష్ కుమార్ దక్షిణాఫ్రికా : టోనీ డి జోర్జి, రీజా హెండ్రిక్స్, రాస్సీ వాన్ డెర్ డుసెన్, ఐడెన్ మార్క్రామ్ (కెప్టెన్), హెన్రిచ్ క్లాసెన్ (వికెట్ కీపర్), డేవిడ్ మిల్లర్, వియాన్ ముల్డర్, ఆండిలే ఫెహ్లుక్వాయో, కేశవ్ మహరాజ్, విలియమ్స్, తబ్రైజ్ షమ్సీ -
రింకూ సిక్సర్ సింగ్
అహ్మదాబాద్లో కోల్కతా నైట్రైడర్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య మ్యాచ్.. గుజరాత్ 204 పరుగులు చేయగా.. భారీ లక్ష్యంతో కేకేఆర్ బరిలోకి దిగింది. మ్యాచ్ ముగింపు దశకు వచ్చే సరికి కోల్కతా ఓటమి దాదాపు ఖాయమైంది. విజయంపై ఎవరికీ ఎలాంటి అంచనాల్లేవు. ఆట ఆఖరి ఓవర్కు చేరింది. చివరి 5 బంతుల్లో 28 పరుగులు కావాలి. అంటే కచ్చితంగా ప్రతి బంతికీ సిక్సర్ రావాల్సిందే. ఐపీఎల్ చరిత్రలో గానీ అంతర్జాతీయ టి20ల్లో గానీ ఇది ఎప్పుడూ సాధ్యం కాలేదు. దాంతో గుజరాత్ ఆటగాళ్లు తమ గెలుపు ఖాయమైందని భావించి నిశ్చింతగా ఉన్నారు. అయితే బ్యాటింగ్ చేస్తున్న ఆ యువకుడు అందరికంటే భిన్నంగా ఆలోచించాడు. తన ఆటపై అచంచల విశ్వాసం ఉన్న అతను ఆ పరుగులు ఎందుకు సాధ్యం కావు అనుకున్నాడు. మానసికంగా కూడా ఎంతో దృఢమైన అతను బయటకు ఎలాంటి భావోద్వేగాలు చూపించలేదు. సిక్సర్ల కోసం సిద్ధమైపోయాడు. గుజరాత్ బౌలర్ యశ్ దయాల్ ఒక్కో బంతిని వేస్తూ వచ్చాడు. ఒకటి, రెండు, మూడు, నాలుగు, ఐదు.. ఇలా బంతి స్టాండ్స్లోకి వెళుతూనే ఉంది. అనూహ్యం, అద్భుతం, అసాధారణం..లాంటి ఏ విశ్లేషణలకూ సరిపోని రీతిలో ఆ వీరంగం సాగింది. 6, 6, 6, 6, 6 .. ఐదు సిక్సర్లతో 30 పరుగులు రాబట్టి ఆ బ్యాటర్ జట్టును గెలిపించాడు. తన సత్తాతో ప్రపంచం దృష్టిని ఆకర్షించిన ఆ యువకుడే 26 ఏళ్ల రింకూ సింగ్. అతను ఒక్క రోజులో స్టార్గా మారేందుకు ఆ ఐపీఎల్ మ్యాచ్ ఒక వేదిక అయింది. అయితే ఈ ఐదు సిక్సర్లతో మాత్రమే రింకూ గొప్ప ఆటగాడిగా మారిపోలేదు. ఈ మ్యాచ్కంటే ముందు కూడా అతను ఈ స్థాయికి ఎదిగేందుకు కష్టపడిన తీరు, పోరాటం, పట్టుదల అతనిని ప్రత్యేకంగా నిలబెట్టాయి. ఇక్కడి వరకు సాగిన అతని ప్రయాణం ఆసక్తికరం, స్ఫూర్తిదాయకం. -మొహమ్మద్ అబ్దుల్ హాది కొంతకాలం కిందటి వరకూ క్రికెట్ అందరి ఆట. సామాన్యుడు కూడా తన ఆటతో ఉన్నత స్థాయికి చేరేందుకు మంచి అవకాశాలు మెండుగా ఉండేవి. అయితే ఐపీఎల్ కారణంగా క్రికెట్లో బాగా డబ్బు చేరడంతో అందులో అడుగుపెట్టి పైస్థాయికి చేరడం కష్టంగా మారిపోయిన పరిస్థితి. మంచి నేపథ్యం లేదా డబ్బు ఉండటం లేదా పెద్ద పరిచయాలు.. ఇలాంటివేవీ లేకుండా క్రికెట్ ప్రపంచంలో మనుగడ కష్టం. ఇది స్కూల్ క్రికెట్, అండర్ –13 స్థాయి నుంచే కనిపిస్తుంది. ఆటలో సత్తా ఉన్నా జట్టులో చోటు దక్కించుకోవడం, ప్రాథమిక దశలో ఎక్కువ మ్యాచ్లు ఆడే అవకాశాలు రావడం అంత సులువు కాదు. ఉత్తరప్రదేశ్లాంటి రాష్ట్ర సంఘాల్లో ఇది చాలా చాలా ఎక్కువ. అలాంటి చోట నెగ్గాలంటే అసాధారణ ప్రతిభ ఉండాలి. ఆ ప్లేయర్ ఆటను చూసి ఇక అతనిని ఆపలేమని, అవకాశం కల్పించక తప్పదనే పరిస్థితి కల్పించాలి. ఇక్కడే రింకూ సింగ్లాంటి కుర్రాడు అందరికీ ఆదర్శంగా నిలుస్తాడు. తనలోని ఆట, ఆత్మవిశ్వాసమే అతడిని పైస్థాయి వరకు చేర్చింది. ఏ రకంగా చూసినా రింకూది కనీసం మధ్య తరగతి కూడా కాదు. అతని తండ్రి గ్యాస్ ఏజెన్సీలో సిలిండర్లు సరఫరా చేసే ఉద్యోగి. అది తప్ప మరో ఆదాయవనరు లేదు. అలాంటి నేపథ్యంలో అతను క్రికెట్ను ఎంచుకోవడం పెద్ద సాహసమే. తండ్రి కూడా ఫలానాది చేయమని, వద్దని వారించే స్థితిలో లేడు. దాంతో చిన్న వయసులోనే అన్నీ తానై రింకూ సొంత నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చింది. కొందరు మిత్రుల కారణంగా క్రికెట్ వైపు ఆకర్షితుడైన రింకూ కొద్ది రోజుల్లోనే అద్భుత ఆటగాడు అనే దశకు చేరాడు. తన నేపథ్యం కారణంగా స్కూల్ క్రికెట్ ఆడే అవకాశం అతనికి రాలేదు. కానీ క్లబ్ క్రికెట్లో రింకూ అనే ఒక కుర్రాడు ఉన్నాడని, భారీ షాట్లతో విరుచుకుపడతాడనే గుర్తింపు వచ్చింది. మరోవైపు సహజంగానే రోజూవారీ ఖర్చులకు సంబంధించి సమస్యలు వద్దనుకున్నా తోడొచ్చాయి. తనూ ఏదైనా పని చేస్తే తప్ప తనకూ, ఇంటికీ ఉపయోగపడలేడని అర్థమైంది. క్రికెట్ ఆడే టైమ్ మినహా తతిమా సమయాల్లో ఎలాంటి పని దొరికినా చేయడానికి సిద్ధపడ్డాడు. ఒక కోచింగ్ సెంటర్లో చిన్న చిన్న పనులతో పాటు స్వీపర్గా ఆఫీస్ను శుభ్రం చేసే పని కూడా చేశాడు. అయితే ఏనాడూ అతను ఈ విషయంలో చింతించలేదు. ఎట్టి పరిస్థితుల్లో తన క్రికెట్ ఆట మాత్రం ఆగకూడదని ఆశించాడు. తన భవిష్యత్తుపై గట్టి నమ్మకం ఉంచాడు. అలా మొదలైన ఆట.. రింకూ దూకుడైన ఆట గురించి యూపీ క్రికెట్ వర్గాల్లో బాగా చర్చకు వచ్చింది. దాంతో 2013లో తొలిసారి యూపీ అండర్–16 జట్టులో చోటు లభించింది. ఆ ఎంపికతో అధికారికంగా అతని ఆటకు ఆమోద ముద్ర పడింది. ఆ తొలి అవకాశాన్ని అతను వృథా చేసుకోలేదు. బంతిని చూడటం, బలంగా బాదడం.. తనకు తెలిసిన విద్యనే అంతటా ప్రదర్శించి యూపీ విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. ఫలితంగా యూపీ అండర్–19 టీమ్లోకి రావడానికి ఎక్కువ సమయం పట్టలేదు. దేశవ్యాప్తంగా అందరి దృష్టీ ఉండే అండర్–19 స్థాయికి వచ్చాక రింకూ ప్రదర్శనలే అతని విలువేంటో చూపించాయి. ఆపై వెనుదిరిగి చూడాల్సిన అవసరం లేని రీతిలో రింకూ ఆట సాగింది. మరోవైపు అండర్–16 స్థాయి నుంచే తనకు డైలీ అలవెన్స్ల రూపంలో వచ్చే చిన్న చిన్న మొత్తాలను కూడా పొదుపు చేసుకుంటూ.. ఇంటి ఖర్చుల కోసం దాచుకునే విషయంలో సగటు దిగువ మధ్య తరగతి మనస్తత్వాన్నే అనుసరించాడు. భారీ షాట్లు కొట్టడం, ఏ బౌలర్నైనా లెక్క చేయకుండా ఆధిపత్యాన్ని ప్రదర్శించడం, కీలక సమయాల్లో కూడా ఒత్తిడి లేకుండా ఆడటం వంటి అర్హతలు రింకూ స్థానాన్ని సుస్థిరం చేశాయి. ఈ క్రమంలో 17 ఏళ్ల వయసులోనే యూపీ సీనియర్ వన్డే జట్టులో, టి20 టీమ్లో చోటు సంపాదించుకున్నాడు. త్రిపురతో జరిగిన వన్డేలో 44 బంతుల్లోనే 91 పరుగులు బాదడంతో అతను నిలబడగలడనే నమ్మకం కలిగింది. రెండేళ్ల తర్వాత రంజీ ట్రోఫీలో ఆడే అవకాశం రావడంతో దేశవాళీ క్రికెట్లో మూడు ఫార్మాట్లలో రింకూ ప్రధాన ఆటగాడిగా మారిపోయాడు. ఐపీఎల్ ప్రస్థానం.. తమ టీమ్లోకి తీసుకునేందుకు ఐపీఎల్ జట్లు టాలెంట్ సెర్చ్ క్యాంప్లు నిర్వహిస్తుంటాయి. అందులో భాగంగా ముంబై ఇండియన్స్ కూడా సెలక్షన్స్ ఏర్పాటు చేసింది. ఒక మ్యాచ్లో 18 ఏళ్ల రింకూ 31 బంతుల్లోనే 95 పరుగులు బాది సంచలనం సృష్టించాడు. చివరకు వేర్వేరు కారణాలతో ముంబై అవకాశం ఇవ్వకపోయినా కొద్దిరోజులకే అతని ప్రతిభ గురించి తెలిసిన పంజాబ్ జట్టు రూ. 10 లక్షలకు రింకూను సొంతం చేసుకుంది. తర్వాతి సీజన్లోనే 2018లో జరిగిన ఐపీఎల్ వేలంలో రూ. 20 లక్షల కనీస విలువతో అతను బరిలో నిలవగా, నాలుగు రెట్లు ఎక్కువగా రూ. 80 లక్షలకు కోల్కతా ఎంచుకుంది. ఇదే అతని కెరీర్లో మేలి మలుపు. తొలి మూడు సీజన్లలో తగినన్ని అవకాశాలు రాకపోయినా 2022లో ఫినిషర్గా ఇచ్చిన పాత్రలో అతను చెలరేగిపోయాడు. ముఖ్యంగా లక్నోతో జరిగిన మ్యాచ్లో 15 బంతుల్లో 40 పరుగులు చేయడంతో అతని విలువ తెలిసింది. ఈ సీజన్లోనైతే తన మెరుపు బ్యాటింగ్తో ప్రత్యేక ముద్ర వేసిన రింకూ కేకేఆర్ తరఫున టాప్స్కోరర్గా నిలవడం విశేషం. ఇదే ఆట రింకూకు భారత టి20 జట్టులో చోటు కల్పించగా అక్కడ చెలరేగిపోయిన ఈ యూపీ బ్యాటర్ 2024 టి20 వరల్డ్ కప్ కోసం తన అవకాశాలు మెరుగుపరచుకున్నాడు. ఇప్పటి వరకు భారత్ తరఫున 6 ఇన్నింగ్సే ఆడిన రింకూ 96 బంతుల్లోనే 180 పరుగులు సాధించాడు. ఇందులో 134 పరుగులు ఫోర్లు, సిక్సర్ల ద్వారానే వచ్చాయి. హాస్టల్ సౌకర్యం కల్పించి.. భారత జట్టు క్రికెటర్గా ఎదిగినా రింకూ తన మూలాలను మర్చిపోలేదు. డబ్బు విలువ బాగా తెలిసినవాడిగా దానిని సమర్థంగా వాడుకోవడం కూడా ముఖ్యమని భావించాడు. ముందుగా తన ఇంటి ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దిన అనంతరం అతను చేసిన పని రింకూపై మరింత గౌరవాన్ని పెంచింది. తన స్వస్థలమైన అలీగఢ్లో.. తాను ఓనమాలు నేర్చుకున్న కోచింగ్ సెంటర్లో క్రికెట్ నేర్చుకునేందుకు వచ్చే పేద ఆటగాళ్ల కోసం రూ. 50 లక్షలు వెచ్చించి.. హాస్టల్ బిల్డింగ్ కట్టించాడు. ఆట కోసం వచ్చి.. భారీ అద్దెలు కడుతున్నవారి కోసమే ఈ సౌకర్యం ఏర్పాటు చేసినట్లు అతను చెప్పాడు. -
అతడి అరంగేట్రం ఖాయం.. నేనే వికెట్ కీపర్.. ఇక సంజూ: రాహుల్
సౌతాఫ్రికాతో వన్డే సిరీస్ నేపథ్యంలో టీమిండియా తాత్కాలిక కెప్టెన్ కేఎల్ రాహుల్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ప్రొటిస్తో తొలి మ్యాచ్లో తలపడే తుదిజట్టు కూర్పుపై సంకేతాలు ఇచ్చాడు. ముఖ్యంగా బ్యాటింగ్ ఆర్డర్లో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ స్థానమేమిటి? టీ20 స్టార్ రింకూ సింగ్ వన్డే అరంగేట్రం తదితర కీలకాంశాల గురించి అప్డేట్ ఇచ్చాడు. కాగా సౌతాఫ్రికా పర్యటనలో భాగంగా టీమిండియా టీ20 జట్టుకు సూర్యకుమార్ యాదవ్ సారథ్యం వహించిన విషయం తెలిసిందే. సూర్య సారథ్యంలో మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ ట్రోఫీని భారత్.. సౌతాఫ్రికాతో పంచుకుంది. తొలి మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కాగా.. రెండో టీ20లో టీమిండియా ఓడిపోయింది. అయితే, నిర్ణయాత్మక మూడో మ్యాచ్లో సూర్య సుడిగాలి శతకంతో జట్టును గెలిపించి సిరీస్ను సమం చేశాడు. ఈ క్రమంలో కేఎల్ రాహుల్ నాయకత్వంలో ఆదివారం (డిసెంబరు 17) నుంచి టీమిండియా వన్డే సిరీస్ను ఆరంభించనుంది. ఈ క్రమంలో జొహన్నస్బర్గ్ వేదికగా మొదలుకానున్న సిరీస్కు ముందు మీడియాతో మాట్లాడాడు కేఎల్ రాహుల్. ఈ సందర్భంగా.. ‘‘సంజూ మిడిలార్డర్లో బ్యాటింగ్ చేస్తాడు. వన్డే క్రికెట్లో ఎప్పటిలాగే తన పాత్రను పోషిస్తాడు. ఐదు లేదంటే ఆరో స్థానంలో బ్యాటింగ్ చేస్తాడు. వికెట్ కీపర్గా నేనే వ్యవహరిస్తా. అయితే, ఒకవేళ ఏదైనా అవకాశం ఉంటే మాత్రం సిరీస్లో ఏదో ఒక మ్యాచ్లో సంజూ కీపర్గా బాధ్యతలు చేపడతాడు’’ అని రాహుల్ వెల్లడించాడు. అదే విధంగా రింకూ సింగ్ గురించి మాట్లాడుతూ.. ‘‘అతడు అద్భుతమైన ప్లేయర్. ఐపీఎల్లో తన ప్రదర్శన ఎలా ఉందో అందరం చూశాం. అయితే, అంతకంటే ముఖ్యంగా సౌతాఫ్రికాలో టీ20 సిరీస్లో అతడు రాణించిన తీరు అద్భుతం. ఒత్తిడిలోనూ కూల్గా ఎలా ఆడాలో తనకు తెలుసు. దేశవాళీ క్రికెట్లో అన్ని ఫార్మాట్లలో ఆడిన అనుభవం తనకు ఉంది. కాబట్టి తనకు కచ్చితంగా ఈ వన్డే సిరీస్లో ఆడే అవకాశం ఉంటుంది’’ అని రింకూ వన్డే అరంగేట్రం గురించి రాహుల్ స్పష్టతనిచ్చాడు. -
దక్షిణాఫ్రికాతో తొలి వన్డే.. సిక్సర్ల కింగ్ అరంగేట్రం! తిలక్పై వేటు?
దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్ను సమం చేసిన భారత జట్టు.. ఇప్పుడు వన్డే సిరీస్కు సిద్దమైంది. మూడు వన్డేల సిరీస్లో భాగంగా డిసెంబర్ 17న జోహన్నెస్బర్గ్ వేదికగా ఇరు జట్లు మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. ఈ వన్డే సిరీస్కు కేఎల్ రాహుల్, సంజూ శాంసన్, యజువేంద్ర చాహల్ వంటి భారత స్టార్ ఆటగాళ్లు అందుబాటులోకి వచ్చారు. అదే విధంగా యువ సంచలనాలు సాయిసుదర్శన్, రింకూ సింగ్లకు తొలిసారి భారత వన్డే జట్టులో చోటు దక్కింది. ప్రోటీస్తో వన్డే సిరీస్లో భారత జట్టును కేఎల్ రాహుల్ నడిపించనున్నాడు. ఇక ఇది ఇలా ఉండగా.. దక్షిణాఫ్రికాతో తొలి వన్డేలో భారత ప్లేయింగ్ ఎలెవన్ ఎలా అభిమానులు అతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో భారత తుది జట్టు ఎలా ఉండబోతుందో ఓ సారి పరిశీలిద్దాం. సాయిసుదర్శన్, రింకూ సింగ్కు ఛాన్స్.. ఇక ఈ సిరీస్కు భారత రెగ్యూలర్ ఓపెనర్ శుబ్మన్ గిల్కు సెలక్టర్లు సెలక్టర్లు విశ్రాంతి ఇచ్చారు. ఈ నేపథ్యంలో తమిళనాడు యువ సంచలనం సాయిసుదర్శన్కు సెలక్టర్లు అవకాశం ఇవ్వాలని భావిస్తున్నట్లు సమాచారం. ఒక వేళ సాయి సుదర్శన్ జట్టులోకి వస్తే రుత్రాజ్ గైక్వాడ్తో కలిసి భారత ఇన్నింగ్స్ను ప్రారంభించే ఛాన్స్ ఉంది. అదే విధంగా టీ20ల్లో దుమ్మురేపుతున్న సిక్సర్ల కింగ్ రింకూ సింగ్ కూడా వన్డేల్లో అరంగేట్రం చేసే ఛాన్స్ కన్పిస్తోంది. అదే విధంగా గత కొంత కాలంగా జట్టుకు దూరంగా ఉంటున్న సంజూ శాంసన్కు కూడా తుది జట్టులో ఛాన్స్ ఇవ్వనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవేళ శాంసన్ జట్టులోకి వస్తే తిలక్ వర్మ బెంచ్కే పరిమితమయ్యే ఛాన్స్ ఉంది. ఆల్రౌండర్ల జాబితాలో అక్షర్ పటేల్కు చోటు దక్కనున్నట్లు తెలుస్తోంది. అదే విధంగా పేస్ బౌలర్ల కోటాలో ముఖేష్ కుమార్, అర్ష్దీప్ సింగ్, అవేష్ ఖాన్ వైపు జట్టు మేనెజ్మెంట్ మొగ్గు చూపుతోంది. భారత తుది జట్టు(అంచనా) రుతురాజ్ గైక్వాడ్, సాయి సుదర్శన్, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్(కెప్టెన్), సంజు శాంసన్, రింకూ సింగ్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, ముఖేష్ కుమార్, అర్ష్దీప్ సింగ్, అవేష్ ఖాన్ -
వరల్డ్కప్లో కుదరలేదు.. ఈసారి సిరాజ్దే! ట్విస్ట్ ఏంటంటే..
బెస్ట్ ఫీల్డర్ మెడల్ ప్రదానం చేసే సంప్రదాయాన్ని తిరిగి ప్రవేశపెట్టింది టీమిండియా శిక్షణా సిబ్బంది. అయితే, ఈసారి కాస్త పేరు మార్చి అమల్లోకి తెచ్చింది. సొంతగడ్డపై వన్డే ప్రపంచకప్-2023 సందర్భంగా.. ఫీల్డింగ్ కోచ్ టి.దిలీప్ వినూత్న సంప్రదాయానికి తెరతీసిన విషయం తెలిసిందే. ఐసీసీ టోర్నీ మ్యాచ్లలో అద్భుతమైన ఫీల్డింగ్తో మ్యాచ్ను మలుపు తిప్పిన ఆటగాళ్లకు డ్రెస్సింగ్రూంలో మెడల్ ఇవ్వడం ఆనవాయితీ చేశాడు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్ తదితరులు బెస్ట్ ఫీల్డర్ మెడల్ గెలుచుకోగా.. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి ఏకంగా రెండుసార్లు పతకం అందుకున్నాడు. ఇక వరల్డ్కప్ సందర్భంగా ఇలా పతకాలు ప్రదానం చేయడం ఆటగాళ్లలో సరికొత్త ఉత్సాహాన్ని నింపిందని.. అందుకే ద్వైపాక్షిక సిరీస్ల సందర్భంగా కూడా ఈ సంప్రదాయాన్ని కొనసాగించాలనుకుంటున్నట్లు టి.దిలీప్ తెలిపాడు. ఈ నేపథ్యంలో ఇకపై ‘ఇంపాక్ట్ ఫీల్డర్ ఆఫ్ ది సిరీస్’ పేరిట మెడల్ అందించనున్నారు. ఈ క్రమంలో సౌతాఫ్రికా పర్యటన నుంచే దీనిని అమలు చేయడం మొదలుపెట్టారు. ఇందులో భాగంగా.. టీ20 సిరీస్లో ఫీల్డింగ్ మెడల్ కోసం రింకూ సింగ్, యశస్వి జైశ్వాల్, మహ్మద్ సిరాజ్ నామినేషన్లలో నిలవగా.. హైదరాబాదీ పేసర్ సిరాజ్నే పతకం వరించింది. ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇక ఇంపాక్ట్ ఫీల్డర్ ఆఫ్ ది సిరీస్ తొలి మెడల్ అందుకున్న సిరాజ్.. ఒలింపియన్స్ మాదిరి దానిని పంటితో కొరుకుతూ సెలబ్రేట్ చేసుకున్నాడు. వరల్డ్కప్ ఈవెంట్ నుంచి ఈ పతకం సాధించాలని తాపత్రయపడ్డానని.. ఇప్పటికీ తన కోరిక తీరిందని హర్షం వ్యక్తం చేశాడు. పట్టుదలగా ప్రయత్నిస్తే తప్పక ఫలితం లభిస్తుందనే మాట మరోసారి నిరూపితమైందని సిరాజ్ ఈ సందర్భంగా పేర్కొన్నాడు. కాగా సౌతాఫ్రికాతో టీ20 సిరీస్తో రీఎంట్రీ ఇచ్చాడు సిరాజ్. ఈ క్రమంలో మూడో మ్యాచ్లో అద్భుతరీతిలో ప్రొటిస్ ఓపెనర్, రెండో టీ20 హీరో రీజా హెన్రిక్స్ను రనౌట్ చేసి మ్యాచ్ను మలుపుతిప్పాడు. అయితే, ఈ మ్యాచ్లో సిరాజ్కు ఒక్క వికెట్ కూడా దక్కలేదు. View this post on Instagram A post shared by Team India (@indiancricketteam) -
Ind Vs SA: క్షమాపణలు చెప్పిన రింకూ సింగ్! వీడియో వైరల్
South Africa vs India, 2nd T20I- Rinku Singh: టీమిండియా తరఫున టీ20లలో అదరగొడుతూ తనదైన ముద్ర వేస్తున్నాడు యువ బ్యాటర్ రింకూ సింగ్. కీలక సమయంలో విలువైన ఇన్నింగ్స్ ఆడుతూ నయా ఫినిషర్గా నీరాజనాలు అందుకుంటున్నాడు. ఇటీవల ఆస్ట్రేలియాతో స్వదేశంలో టీ20 సిరీస్లో అద్భుత ప్రదర్శన కనబరిచిన ఈ యూపీ బ్యాటర్.. తాజాగా సౌతాఫ్రికా గడ్డ మీద కూడా సత్తా చాటాడు. రింకూ ధనాధన్ ఇన్నింగ్స్ ప్రొటిస్ జట్టుతో రెండో టీ20లో ఓపెనర్లు విఫలమైన వేళ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్(56)తో కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దాడు. కేవలం 39 బంతుల్లోనే 68 పరుగులతో అజేయంగా నిలిచాడు. అతడి ఇన్నింగ్స్లో 9 ఫోర్లు, 2 సిక్సర్లు ఉన్నాయి. అయితే, వర్షం కారణంగా సౌతాఫ్రికా ఇన్నింగ్స్ను 15 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్లో భారత్కు ఓటమి తప్పలేదు. ప్రొటిస్ ఓపెనర్ రీజా హెండ్రిక్స్ 27 బంతుల్లోనే 49 పరుగులతో చెలరేగగా.. కెప్టెన్ ఎయిడెన్ మార్క్రమ్ 30 పరుగులతో రాణించాడు. ఈ క్రమంలో డక్వర్త్ లూయీస్ పద్ధతి ప్రకారం సౌతాఫ్రికా ఐదు వికెట్ల తేడాతో టీమిండియాపై గెలుపొందింది. ఇదిలా ఉంటే.. పోర్ట్ ఎలిజబెత్ వేదికగా మంగళవారం జరిగిన ఈ మ్యాచ్లో రింకూ సింగ్ బాదిన సిక్సర్ కారణంగా మీడియా గ్లాస్ బాక్స్ బద్దలైన విషయం తెలిసిందే. సిక్సర్ దెబ్బకు అద్దం పగిలింది పందొమ్మిదవ ఓవర్లో మార్క్రమ్ బౌలింగ్లో రింకూ స్ట్రెయిట్ హిట్ కారణంగా సైట్స్క్రీన్ బ్రేక్ అయిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. సారీ చెప్పిన రింకూ.. సో క్యూట్ అంటున్న నెటిజన్లు ఇక ఈ విషయం గురించి మ్యాచ్ అనంతరం స్పందించిన రింకూ సింగ్.. స్టేడియం నిర్వాహకులకు క్షమాపణలు చెప్పడం విశేషం. ఈ మేరకు బీసీసీఐ విడుదల చేసిన వీడియోలో తన ప్రదర్శన గురించి మాట్లాడుతున్న సమయంలో.. ‘‘ఆ బంతిని సిక్సర్గా మలచాలని మాత్రమే భావించాను. నా షాట్ కారణంగా అద్దం పగిలిపోయిందని నాకు తెలియదు. ఆ విషయం గురించి ఇప్పుడే తెలిసింది. గ్లాస్ బ్రేక్ చేసినందుకు సారీ చెబుతున్నా’’ అని రింకూ సింగ్ పేర్కొన్నాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. ‘‘సో క్యూట్ రింకూ.. నీ ఆటతోనే కాదు అమాయకత్వపు, హుందాతనపు మాటలతోనూ మా మనసులు దోచుకున్నావు’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. Maiden international FIFTY 👌 Chat with captain @surya_14kumar 💬 ... and that glass-breaking SIX 😉@rinkusingh235 sums up his thoughts post the 2⃣nd #SAvIND T20I 🎥🔽 #TeamIndia pic.twitter.com/Ee8GY7eObW — BCCI (@BCCI) December 13, 2023 కాగా ఇప్పటి వరకు పలు మ్యాచ్లలో ధనాధన్ ఇన్నింగ్స్ ఆడినప్పటికీ రింకూ అంతర్జాతీయ క్రికెట్లో ఒక్కసారి కూడా యాభై పరుగుల మార్కు అందుకోలేకపోయాడు. అయితే, తాజా టీ20 సందర్భంగా కఠినమైన సఫారీ పిచ్లపై తన తొలి ఇంటర్నేషనల్ హాఫ్ సెంచరీ నమోదు చేయడం విశేషం. అంతా సూర్య భాయ్ వల్లే ఈ నేపథ్యంలో రింకూ మాట్లాడుతూ.. ‘‘మ్యాచ్ జరుగుతున్న సమయంలో సూర్య భాయ్ నాకు సూచనలు ఇచ్చారు. ఒత్తిడికి లోనుకాకుండా నీ సహజమైన ఆటనే ఆడమని చెప్పారు. తొందరపాటు తగదు.. భారీ షాట్ల కోసం కాస్త ఓపికగా ఎదురు చూడాలని చెప్పారు. నిజానికి ఆరంభంలో వికెట్ కాస్త కఠినంగా అనిపించింది. అయితే, కాసేపటి తర్వాత షాట్లు ఆడేందుకు వీలు కలిగింది’’ అని తెలిపాడు. కాగా సౌతాఫ్రికా పర్యటనలో భాగంగా మూడు మ్యాచ్ల సిరీస్లో తొలి టీ20 వర్షం కారణంగా రద్దు కాగా.. రెండో మ్యాచ్లో సూర్య సేనకు ఓటమి ఎదురైంది. ఇక నిర్ణయాత్మక మూడో టీ20 జొహన్నస్బర్గ్ వేదికగా గురువారం జరుగనుంది. #AidenMarkram brought himself on in the penultimate over, and #RinkuSingh made him pay with back-to-back maximums 🔥 Rinku has brought his A-game to South Africa! Tune-in to the 2nd #SAvIND T20I LIVE NOW | Star Sports Network#Cricket pic.twitter.com/HiibVjyuZH — Star Sports (@StarSportsIndia) December 12, 2023 చదవండి: Ind vs SA: అందుకే ఓడిపోయాం.. మాకు ఇదొక గుణపాఠం: సూర్యకుమార్ -
Ind vs SA: అందుకే ఓడిపోయాం.. మాకు ఇదొక గుణపాఠం: సూర్యకుమార్
South Africa vs India, 2nd T20I: సౌతాఫ్రికాతో టీ20 సిరీస్ను టీమిండియా ఓటమితో ఆరంభించింది. మొదటి మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కాగా.. రెండో మ్యాచ్లో సూర్య సేనను పరాజయం పలకరించింది. పోర్ట్ ఎలిజబెత్ వేదికగా జరిగిన టీ20లో భారత జట్టు 5 వికెట్ల తేడాతో ఆతిథ్య జట్టు చేతిలో ఓడిపోయింది. తద్వారా మూడు మ్యాచ్ల సిరీస్లో 0-1తో వెనుకబడింది. దీంతో నిర్ణయాత్మక ఆఖరి టీ20లో తప్పక గెలవాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ.. ఓటమిపై తీవ్ర విచారం వ్యక్తం చేశాడు. మెరుగైన స్కోరు సాధించినా లక్ష్యాన్ని కాపాడుకోలేకపోయామన్నాడు. ఓపెనర్లు పూర్తిగా విఫలం కాగా సౌతాఫ్రికాతో మంగళవారం నాటి మ్యాచ్లో టాస్ ఓడిన టీమిండియా తొలుత బ్యాటింగ్ చేసింది. ఓపెనర్లు యశస్వి జైశ్వాల్, శుబ్మన్ గిల్ డకౌట్ కాగా.. సూర్యకుమార్ యాదవ్ 56 పరుగులతో అదరగొట్టాడు. మరోవైపు.. రింకూ సింగ్ 68 పరుగులతో ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు. #AidenMarkram brought himself on in the penultimate over, and #RinkuSingh made him pay with back-to-back maximums 🔥 Rinku has brought his A-game to South Africa! Tune-in to the 2nd #SAvIND T20I LIVE NOW | Star Sports Network#Cricket pic.twitter.com/HiibVjyuZH — Star Sports (@StarSportsIndia) December 12, 2023 ఆటంకం కలిగించిన వరణుడు అయితే, 19.3 ఓవర్ల వద్ద మ్యాచ్కు వర్షం అంతరాయం కలిగించడంతో భారత ఇన్నింగ్స్ను అక్కడితో ఆపేశారు. అప్పటికి టీమిండియా ఏడు వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. ఈ క్రమంలో డక్వర్త్ లూయీస్ ప్రకారం.. సౌతాఫ్రికా ఇన్నింగ్స్ను 15 ఓవర్లకు కుదించి.. విజయ లక్ష్యాన్ని 152 పరుగులుగా నిర్దేశించారు. ఈ క్రమంలో 13.5 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 154 పరుగులు సాధించిన ప్రొటిస్ జట్టు జయకేతనం ఎగురవేసింది. డీఎల్ఎస్ పద్ధతి ప్రకారం ఐదు వికెట్ల తేడాతో సఫారీలు టీమిండియాపై గెలుపొందారు. ఈ నేపథ్యంలో భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ స్పందిస్తూ.. ‘‘సగం ఇన్నింగ్స్ పూర్తయ్యే వరకు.. మేము మెరుగైన స్కోరే చేశామని భావించాం. అందుకే ఓడిపోయాం అయితే, వాళ్లు మాకంటే అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. ముఖ్యంగా మొదటి 5-6 ఓవర్లలోనే మ్యాచ్ను మా నుంచి లాగేసుకునే ప్రయత్నం చేశారు. ఏదేమైనా బెరుకు లేకుండా మమ్మల్ని మేము నిరూపించుకోవాలన్న తపనతోనే మైదానంలో దిగాం. A positive start for South Africa in their chase of 152 in 15 overs 😮 Can #TeamIndia find the early breakthrough? Tune-in to the 2nd #SAvIND T20I LIVE NOW | Star Sports Network#Cricket pic.twitter.com/q7lV4PEGHU — Star Sports (@StarSportsIndia) December 12, 2023 అందుకు తగ్గట్లుగానే మా ప్రణాళికలను అమలు చేశాం. వికెట్ పచ్చిగా ఉండటంతో ఆరంభంలో బ్యాటింగ్ చేయడం కాస్త కష్టంగా తోచింది. భవిష్యత్ మ్యాచ్లలోనూ ఇలాంటి కఠిన పరిస్థితులే ఎదురయ్యే అవకాశం ఉంది. మాకు ఇదొక గుణపాఠం’’ అని పేర్కొన్నాడు. పాఠాలు నేర్చుకుంటాం ఇక ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుంటామన్న సూర్య.. ప్రస్తుతం దృష్టి మొత్తం తదుపరి మ్యాచ్పైనే కేంద్రీకృతం చేశామని వెల్లడించాడు. కాగా ఈ సిరీస్కు ముందు స్వదేశంలో టీమిండియా ఆస్ట్రేలియాతో టీ20లలో తలపడిన విషయం తెలిసిందే. ఐదు మ్యాచ్ల సిరీస్ను ఏకంగా 4-1 తేడాతో సొంతం చేసుకుంది. ఇక ఈ సిరీస్కు కూడా సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్గా వ్యవహరించాడు. -
Ind vs SA: రింకూ, సూర్య మెరుపులు వృథా .. దక్షిణాఫ్రికాదే రెండో టి20
పోర్ట్ ఎలిజబెత్: భారత్తో టి20 సిరీస్లో దక్షిణాఫ్రికా పైచేయి సాధించింది. మంగళవారం జరిగిన రెండో మ్యాచ్లో దక్షిణాఫ్రికా 5 వికెట్ల తేడాతో భారత్ను ఓడించింది. టాస్ ఓడిన టీమిండియా బ్యాటింగ్కు అనుకూలమైన పిచ్పై ముందుగా 19.3 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. రింకూ సింగ్ (39 బంతుల్లో 68 నాటౌట్; 9 ఫోర్లు, 2 సిక్స్లు), సూర్యకుమార్ యాదవ్ (36 బంతుల్లో 56; 5 ఫోర్లు, 3 సిక్స్లు) అర్ధ సెంచరీలతో చెలరేగారు. సఫారీ బౌలర్లలో గెరార్డ్ కొయెట్జీకి 3 వికెట్లు దక్కాయి. భారత్ ఇన్నింగ్స్లో మరో 3 బంతులు మిగిలి ఉండగానే వర్షం రావడంతో ఆట ఆగిపోగా... వాన తగ్గిన తర్వాత భారత ఇన్నింగ్స్ను కొనసాగించకుండా అక్కడితో ముగించారు. అనంతరం దక్షిణాఫ్రికా విజయలక్ష్యాన్ని (డక్వర్త్ లూయిస్ ప్రకారం) 15 ఓవర్లలో 152 పరుగులుగా నిర్దేశించారు. చివరకు సఫారీ టీమ్ 13.5 ఓవర్లలో 5 వికెట్లకు 154 పరుగులు సాధించి గెలిచింది. రీజా హెన్డ్రిక్స్ (27 బంతుల్లో 49; 8 ఫోర్లు, 1 సిక్స్), మార్క్రమ్ (17 బంతుల్లో 30; 4 ఫోర్లు, 1 సిక్స్) కీలక ఇన్నింగ్స్లు ఆడారు. తొలి టి20 వర్షంతో రద్దు కాగా, తాజా ఫలితంతో సఫారీ 1–0తో పైచేయి సాధించింది. చివరిదైన మూడో టి20 రేపు జొహన్నెస్బర్గ్లో జరుగుతుంది. కీలక భాగస్వామ్యాలు... ఫామ్లో ఉన్న రుతురాజ్ అనారోగ్యం కారణంగా ఈ మ్యాచ్కు దూరం కాగా... ఓపెనర్లు యశస్వి జైస్వాల్ (0), శుబ్మన్ గిల్ (0) డకౌట్ కావడంతో 6 పరుగులకే భారత్ 2 వికెట్లు కోల్పోయింది. అయితే మూడో స్థానంలో వచ్చిన తిలక్ వర్మ (20 బంతుల్లో 29; 4 ఫోర్లు, 1 సిక్స్) దూకుడుగా ఆడి స్కోరుబోర్డును పరుగెత్తించాడు. సూర్య కూడా తనదైన శైలిలో జోరు ప్రదర్శించాడు. వీరిద్దరు మూడో వికెట్కు 24 బంతుల్లోనే 49 పరుగులు జోడించారు. 10 ఓవర్లలో స్కోరు 84 పరుగులకు చేరగా, 29 బంతుల్లో సూర్య అర్ధ సెంచరీ పూర్తయింది. తన తొలి 20 బంతుల్లో 6 ఫోర్లు బాది రింకూ కూడా ధాటిని కొనసాగించాడు. సూర్య, రింకూ నాలుగో వికెట్కు 48 బంతుల్లో 70 పరుగులు జత చేశారు. సూర్య వెనుదిరిగిన తర్వాత జితేశ్ శర్మ (1) విఫలం కాగా, 30 బంతుల్లో రింకూ కెరీర్లో తన తొలి హాఫ్ సెంచరీని అందుకున్నాడు. స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్: యశస్వి (సి) మిల్లర్ (బి) జాన్సెన్ 0; గిల్ (ఎల్బీ) (బి) విలియమ్స్ 0; తిలక్ (సి) జాన్సెన్ (బి) కొయెట్జీ 29; సూర్యకుమార్ (సి) జాన్సెన్ (బి) షమ్సీ 56; రింకూ (నాటౌట్) 68; జితేశ్ (సి) స్టబ్స్ (బి) మార్క్రమ్ 1; జడేజా (ఎల్బీ) (బి) కొయెట్జీ 19; అర్‡్షదీప్ (సి) ఫెలుక్వాయో (బి) కొయెట్జీ 0; ఎక్స్ట్రాలు 7; మొత్తం (19.3 ఓవర్లలో 7 వికెట్లకు) 180. వికెట్ల పతనం: 1–0, 2–6, 3–55, 4–125, 5–142, 6–180, 7–180. బౌలింగ్: జాన్సెన్ 3–0–39–1; విలియమ్స్ 3–0–32–1; కొయెట్జీ 3.3–0–32–3; ఫెలుక్వాయో 3–0–29–0; షమ్సీ 4–0–18–1; మార్క్రమ్ 3–0–29–1. దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్: బ్రీట్జె (రనౌట్) 16; హెన్డ్రిక్స్ (సి) సూర్యకుమార్ (బి) కుల్దీప్ 49; మార్క్రమ్ (సి) సిరాజ్ (బి) ముకేశ్ 30; క్లాసెన్ (సి) యశస్వి (బి) సిరాజ్ 7; మిల్లర్ (సి) సిరాజ్ (బి) ముకేశ్ 17; స్టబ్స్ (నాటౌట్) 14; ఫెలుక్వాయో (నాటౌట్) 10; ఎక్స్ట్రాలు 11; మొత్తం (13.5 ఓవర్లలో 5 వికెట్లకు) 154. వికెట్ల పతనం: 1–42, 2–96, 3–108, 4–108, 5–139. బౌలింగ్: సిరాజ్ 3–0–27–1, అర్‡్షదీప్ 2–0–31–0, జడేజా 2.5–0–28–0, ముకేశ్ 3–0–34–2, కుల్దీప్ 3–0–26–1. -
IND VS SA 2nd T20: రింకూ సింగ్ భారీ సిక్సర్.. బాక్సులు బద్దలు
సెయింట్ జార్జ్స్ పార్క్ వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో టీ20లో టీమిండియా యంగ్ డైనమైట్ రింకూ సింగ్ పూనకం వచ్చినట్లు ఊగిపోయాడు. ఈ మ్యాచ్లో 39 బంతులు ఎదుర్కొన్న రింకూ 9 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 68 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. మార్క్రమ్ వేసిన ఇన్నింగ్స్ 19 ఓవర్లో ఒక్కసారిగా పేట్రేగిపోయిన రింకూ.. ఆ ఓవర్ చివరి రెండు బంతులను భారీ సిక్సర్లుగా మలిచి భారత ఇన్నింగ్స్కు ఊపుతెచ్చాడు. మార్క్రమ్ బౌలింగ్లో రెండో సిక్సర్ ఏకంగా మీడియా బాక్స్ అద్దాలను ధ్వంసం చేసింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతుంది. Rinku Singh's six broke media box glass. 🔥- Rinku is insane...!!!!pic.twitter.com/hJazne80PU— Mufaddal Vohra (@mufaddal_vohra) December 12, 2023 అనంతరం భారత ఇన్నింగ్స్ మరో 3 బంతుల్లో ముగుస్తుందనగా వర్షం ఆటకు అంతరాయం కలిగించింది. 19.3 ఓవర్ల తర్వాత భారత స్కోర్ 180/7గా ఉంది. గెరాల్డ్ కొయెట్జీ బౌలింగ్లో చివరి ఓవర్ రెండు, మూడు బంతుల్లో రవీంద్ర జడేజా (19), అర్షదీప్ సింగ్(0) ఔటయ్యారు. రింకూ సింగ్ (68)తో పాటు సిరాజ్ క్రీజ్లో ఉన్నాడు. Rinku Singh's six broke the glass of the media box. (Rajal Arora). pic.twitter.com/juEYkJV5Lk— Mufaddal Vohra (@mufaddal_vohra) December 12, 2023 భారత ఇన్నింగ్స్లో రింకూతో పాటు సూర్యకుమార్ యాదవ్ (56) విధ్వంసం సృష్టించగా.. శుభ్మన్ గిల్, యశస్వి జైస్వాల్, అర్షదీప్ సింగ్ డకౌట్లు అయ్యారు. తిలక్ వర్మ (29), రవీంద్ర జడేజా (19) క్రీజ్లో ఉన్నంతసేపు మెరుపులు మెరిపించారు. ఈ మ్యాచ్లో టాస్ ఓడిన భారత్.. సౌతాఫ్రికా ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్కు దిగింది. -
టీమిండియా నయా సంచలనం.. వరల్డ్కప్ జట్టులో చోటు ఖాయం!
రింకూ సింగ్.. టీమిండియా యువ సంచలనం.. ఇప్పటివరకు 10 అంతర్జాతీయ టీ20లలో భాగమయ్యాడు.. బ్యాటింగ్ చేసింది కేవలం ఆరుసార్లే.. అయితేనేం తనదైన ముద్రవేయగలిగాడు. ఐదో స్థానంలో బ్యాటింగ్కు వచ్చి తన వంతు పాత్ర చక్కగా పోషిస్తూ ‘నయా ఫినిషర్’గా పేరు తెచ్చుకుంటున్నాడు. మహేంద్ర సింగ్ ధోని వారసుడిగా ప్రశంసలు అందుకుంటున్నాడు 26 ఏళ్ల ఈ లెఫ్టాండ్ బ్యాటర్. ధనాధన్ ఇన్నింగ్స్తో ప్రత్యర్థి జట్టు బౌలర్లపై విరుచుకుపడే రింకూ సింగ్ ఇప్పటి వరకు టీమిండియా తరఫున 187.5 స్ట్రైక్రేటుతో సగటు 60తో 180 పరుగులు సాధించాడు. అతడి అత్యధిక స్కోరు 46. ఒత్తిడిలోనూ దూకుడుగా ఆడగలగడం రింకూ బలం. మిగతా ఆటగాళ్ల కంటే ఈ లక్షణమే ఈ యూపీ బ్యాటర్ను ప్రత్యేకంగా నిలుపుతోంది. భవిష్యత్తులో జట్టుకు ఉపయోగపడతాడనే నమ్మకాన్ని సెలక్టర్లకు ఇస్తోంది. అందుకే పొట్టి ఫార్మాట్లో సత్తా చాటిన రింకూకు వన్డేల్లోనూ మార్గం చేసేందుకు మేనేజ్మెంట్ సిద్ధమవుతోంది. ఐర్లాండ్తో సిరీస్ సందర్భంగా అరంగేట్రం ఈ ఏడాది ఆగష్టులో ఐర్లాండ్తో టీ20 సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన రింకూ సింగ్.. టీమిండియా సౌతాఫ్రికా పర్యటనలో భాగంగా వన్డే జట్టుకు ఎంపికయ్యాడు. యాభై ఓవర్ల ఫార్మాట్లోనూ తనను తాను నిరూపించుకుంటే పరిమిత ఓవర్ల క్రికెట్లో భారత జట్టులో అతడి స్థానం పదిలమవుతుంది. రింకూ ఆట తీరు చూస్తే అదే ఇదేమీ అతడికి కష్టం కాబోదంటున్నారు విశ్లేషకులు. అయితే, దక్షిణాఫ్రికా టూర్ రూపంలో రింకూకు అతిపెద్ద సవాల్ ఎదురుకాబోతోంది. టీ20, వన్డే జట్లలో భాగమైన అతడు.. పేస్కు అనుకూలించే సఫారీ పిచ్లపై ఎలా రాణిస్తాడన్నది ఆసక్తికరంగా మారింది. సఫారీ గడ్డపై అసలైన సవాలు ఒకవేళ ఇక్కడ గనుక రింకూ హిట్ అయితే.. జట్టు సెలక్షన్ సమయంలో మిగతా యువ ఆటగాళ్ల కంటే అతడి పేరు కచ్చితంగా ముందు వరుసలో ఉంటుందనడంలో సందేహం లేదు. ఇక క్లిష్ట పరిస్థితుల్లో బ్యాటింగ్ ఆర్డర్లో కీలకమైన ఐదు- ఆరు స్థానాల్లో గనుక రాణిస్తే కొన్నేళ్ల పాటు టీమిండియాలో కొనసాగగలడు. ఆల్రౌండర్లు రవీంద్ర జడేజా, హార్దిక్ పాండ్యాలకు బ్యాకప్ ఫినిషర్గా పనిచేయగలడు. కేకేఆర్ ఇచ్చిన డైనమైట్ ఐపీఎల్లో కోల్కతా నైట్ రైడర్స్ తరఫున అద్భుత ప్రదర్శనతో రింకూ సింగ్ వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. వన్డేలలో భవిష్యత్తు గురించి పక్కనపెడితే.. పొట్టి ఫార్మాట్లో మాత్రం రింకూ దూసుకుపోతున్నాడు. టీ20 వరల్డ్కప్-2024లో చోటే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాడు. ఈ మెగా టోర్నీకి ముందు సౌతాఫ్రికా, అఫ్గనిస్తాన్లతో టీమిండియా మూడేసి టీ20లు ఆడనుంది. ఈ రెండు సిరీస్లలో గనుక సత్తా చాటితే వరల్డ్కప్ కోసం అతడి టికెట్ ఖరారైనట్లే భావించవచ్చంటున్నారు విశ్లేషకులు. వరల్డ్కప్-2024 జట్టులో చోటు ఖాయం ఇక టీమిండియా మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా సైతం.. ‘‘ప్రస్తుతం లోయర్ మిడిల్ ఆర్డర్లో టీమిండియా తరఫున అద్భుతంగా ఆడుతున్న వాళ్లు కొంతమందే ఉన్నారు. కాబట్టి ఈ విషయంలో రింకూకు పెద్దగా పోటీ ఉండకపోవచ్చు. నిజానికి రింకూ గొప్పగా ఆడగలడు. మంచి ఫినిషర్ కూడా! కచ్చితంగా అతడు వరల్డ్కప్ జట్టు సన్నాహకాల్లో భాగంగా మేనేజ్మెంట్ దృష్టిలో ఉంటాడు. ఎడమచేతి వాటం గల బ్యాటర్ కావడం అదనపు అర్హత. ప్రపంచకప్ లాంటి మెగా ఈవెంట్లలో ఇలాంటి బ్యాటర్ల అవసరం ఎంతగానో ఉంటుంది. అతడు కచ్చితంగా ప్రపంచకప్-2024లో చోటు దక్కించుకుంటాడు’’ అని అంచనా వేశాడు. చదవండి: సెంచరీతో చెలరేగిన సంజూ శాంసన్.. సెలక్టర్లకు స్ట్రాంగ్ మెసేజ్! -
అనవాయితీని కొనసాగించిన సూర్యకుమార్.. రింకూ, జితేశ్లకు..!
స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరిగిన ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ను టీమిండియా 4-1 తేడాతో కైవసం చేసుకుంది. సూర్యకుమార్ యాదవ్ టీమిండియా కెప్టెన్గా తన తొలి సిరీస్లోనే విజయం సాధించి, దిగ్గజ కెప్టెన్ల సరసన చేరాడు. ట్రోఫీ గెలిచిన అనంతరం స్కై భారత కెప్టెన్లు ఆచరించిన ఆనవాయితీని కొనసాగించాడు. ఇటీవలికాలంలో భారత్ సిరీస్ నెగ్గిన ప్రతిసారి కెప్టెన్లు కొత్త ఆటగాళ్లకు ట్రోఫీని అందించడం ఆనవాయితీగా వస్తుంది. అదే ఆనవాయితీని స్కై కూడా కొనసాగిస్తూ.. జట్టులోకి కొత్తగా ఎంట్రీ ఇచ్చిన రింకూ సింగ్, జితేశ్ శర్మలకు ట్రోఫీని అందించాడు. టీమిండియాలో ఈ ఆనవాయితీని మహేంద్ర సింగ్ ధోని 2007లో ప్రవేశపెట్టాడు. నాటి నుంచి భారత్ ట్రోఫీ నెగ్గిన ప్రతిసారి కెప్టెన్ ఎవరైనా ఈ ట్రెడిషన్ కొనసాగుతూనే ఉంది. Suryakumar Yadav with the T20I series Trophy. - A memorable start for Captain SKY. pic.twitter.com/zo3elColpN — Johns. (@CricCrazyJohns) December 3, 2023 ఇదిలా ఉంటే, ఐదు మ్యాచ్ల సిరీస్లో భాగంగా బెంగళూరు వేదికగా ఆస్ట్రేలియాతో నిన్న (డిసెంబర్ 3) జరిగిన నామమాత్రపు ఐదో టీ20లో టీమిండియా 6 పరుగుల స్వల్ప తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్లో టీమిండియా స్వల్ప లక్ష్యాన్ని విజయవంతంగా డిఫెండ్ చేసుకుని అద్భుత విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసి 160 పరుగులు చేసిన భారత్.. బౌలర్లు మూకుమ్మడిగా రాణించడంతో ఆసీస్ను నిలువరించగలిగింది. Suryakumar Yadav handed over the Trophy to Rinku & Jitesh. - A lovely gesture by the leader. pic.twitter.com/gwHdVxZRlA — Johns. (@CricCrazyJohns) December 3, 2023 ఆఖరి ఓవర్లో ఆసీస్ గెలుపుకు 10 పరుగుల చేయాల్సిన తరుణంలో అర్షదీప్ సింగ్ మ్యాజిక్ చేశాడు. 6 బంతుల్లో వికెట్ తీసి కేవలం మూడు పరుగులు మాత్రమే ఇచ్చి టీమిండియాను గెలిపించాడు. ఈ సిరీస్లో ఆసీస్ కేవలం మూడో టీ20లో మాత్రమే విజయం సాధించగా.. భారత్ మిగిలిన మ్యాచ్లన్నిటిలో గెలుపొంది సిరీస్ కైవసం చేసుకుంది. -
ఆసీస్తో 100 మీటర్ల భారీ సిక్సర్.. సీక్రెట్ చెప్పేసిన రింకూ
టీమిండియా నయా బ్యాటింగ్ సంచలనం రింకూ సింగ్ మరోసారి దుమ్మురేపాడు. రాయ్పూర్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగో టీ20లో రింకూ అదరగొట్టాడు. ఈ మ్యాచ్లో 29 బంతులు ఎదుర్కొన్న రింకూ 4 ఫోర్లు, రెండు సిక్స్లతో 46 పరుగులు చేశాడు. కాగా శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్ వంటి కీలక వికెట్లు కోల్పోయిన సమయంలో క్రీజులోకి వచ్చిన రింకూ తన అద్భుత ఇన్నింగ్స్తో జట్టును అదుకున్నాడు. టీమిండియా 174 పరుగులు సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. అయితే ఈ మ్యాచ్లో రింకూ కొట్టిన సింగ్ ఓ సిక్సర్ ఏకంగా 100 మీటర్ల దూరం వెళ్లింది. దీంతో ఈ సిరీస్లో భారీ సిక్సర్ కొట్టిన ఆటగాడిగా రింకూ నిలిచాడు. కాగా మ్యాచ్ అనంతరం తన పవర్ హిట్టింగ్కు గల సీక్రెట్ను రింకూ బయటపెట్టాడు. రోజూ వ్యాయామం చేయడం, మంచి ఆహారాన్ని తీసుకోవడమే తన బలానికి కారణమని రింకూ తెలిపాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత బీసీసీఐ టీవీతో రింకూ సింగ్, జితేష్ శర్మ మాట్లాడారు. ఈ క్రమంలో జితేష్.. నీ పవర్ హిట్టింగ్కు గల కారణమెంటి అని ప్రశ్నించాడు. "నేను నీతో(జితేష్ శర్మ) కలిసి జిమ్ చేస్తున్నాను. మంచి ఫుడ్ తీసుకుంటున్నాను. బరువులు ఎత్తడం కూడా నాకిష్టం. అందుకే సహజంగా నాలో అంత పవర్ ఉంది" అని నవ్వుతూ రింకూ సమాధనమిచ్చాడు. చదవండి: IPL 2024 Mini Auction: ఐపీఎల్ వేలంలోకి 1166 మంది ప్లేయర్స్.. వారి కోసం తీవ్ర పోటీ! SINGH IS KING.#RinkuSinghpic.twitter.com/B4Bbikmz0F — KnightRidersXtra (@KRxtra) December 1, 2023 Secret behind the giant six 😎 Roaring Raipur crowd 🔥 Adding calmness to the partnership 👏 On the mic with Rinku Singh & Jitesh Sharma 👌👌 - By @28anand Watch the full Video 🎥🔽 #TeamIndia | #INDvAUS https://t.co/lc8Dfk7hI7 pic.twitter.com/RHaXeFnsmP — BCCI (@BCCI) December 2, 2023 -
అదొక్కటే కలిసి రాలేదు.. అతడిని ఒత్తిడిలోకి నెట్టడం ఇష్టం: సూర్య
టీమిండియా టీ20 కెప్టెన్గా వ్యవహరించిన తొలి సిరీస్లోనే సూర్యకుమార్ యాదవ్ అదరగొట్టాడు. ఆస్ట్రేలియాతో సిరీస్లో అటు బ్యాటర్గా.. ఇటు సారథిగా తన పాత్రను సమర్థవంతంగా పోషించి.. భారత జట్టుకు ట్రోఫీని అందించాడు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి సహా కీలక ఆటగాళ్లు ఎవరూ లేకుండానే యువ జట్టుతో ఆసీస్పై పైచేయి సాధించగలిగాడు. కాగా ఆస్ట్రేలియాతో నాలుగో టీ20లో గెలుపొందడం ద్వారా టీమిండియా ఓ మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ను కైవసం చేసుకుంది. రాయ్పూర్ వేదికగా శుక్రవారం జరిగిన మ్యాచ్లో 20 పరుగుల తేడాతో విజయం సాధించి 3-1తో సత్తా చాటింది. ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 174 పరుగులు సాధించింది. రింకూ సింగ్ 29 బంతుల్లో 46 పరుగులు చేసి టాప్ స్కోరర్గా నిలిచాడు. వికెట్ కీపర్ బ్యాటర్ జితేశ్ శర్మ 19 బంతుల్లోనే 35 పరుగులతో రాణించాడు. ఇక లక్ష్య ఛేదనకు దిగిన ఆస్ట్రేలియాను టీమిండియా స్పిన్నర్లు అక్షర్ పటేల్, రవి బిష్ణోయి దెబ్బకొట్టారు. అక్షర్ అత్యధికంగా మూడు వికెట్లు తీయగా.. రవి ఒక వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు. మరోవైపు చాలా రోజుల తర్వాత భారత జట్టులో పునరాగమనం చేసిన పేసర్ దీపక్ చహర్ రెండు వికెట్లు పడగొట్టగా.. ఆవేశ్ ఖాన్ కూడా ఒక వికెట్ తీయగలిగాడు. ఈ క్రమంలో.. నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లు నష్టపోయిన మాథ్యూ వేడ్ బృందం 154 పరుగులకే ఆట ముగించి.. భారత్కు సిరీస్ను సమర్పించుకుంది. ఈ నేపథ్యంలో సిరీస్ విజయంపై టీమిండియా తాత్కాలిక కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ హర్షం వ్యక్తం చేశాడు. ‘‘ఈరోజు టాస్ తప్ప అన్నీ మాకు అనుకూలంగా జరిగాయి. మా కుర్రాళ్లు పట్టుదలగా నిలబడి మ్యాచ్ గెలిపించారు. వాళ్లు ఇలా బాధ్యతగా ఆడటమే మాకు అన్నిటికన్నా ముఖ్యం. మ్యాచ్కు ముందే మేమంతా సమావేశమైన సమయంలో.. ‘మిమ్మల్ని మీరు నిరూపించుకునే అద్భుత అవకాశం. ప్రతి ఒక్కరు భయం లేకుండా ఆడాలి’ అని చెప్పాం. నిజానికి అక్షర్ పటేల్ను ఒత్తిడిలోకి నెట్టడం నాకెంతో ఇష్టం. ఎందుకంటే.. ఎంత ప్రెజర్ పెడితే అతడు అంత గొప్ప స్పెల్స్ వేస్తాడు. ఇక డెత్ ఓవర్లలో యార్కర్లు వేయాలని ముందుగానే నిర్ణయించుకున్నాం’’ ప్రణాళికను సరిగ్గానే అమలు చేశాం’’ అని సూర్య పేర్కొన్నాడు. కాగా ఆసీస్తో మ్యాచ్లో 4 ఓవర్ల బౌలింగ్లో 16 పరుగులు మాత్రమే ఇచ్చి మూడు వికెట్లు తీసిన అక్షర్ పటేల్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. ఇక టీమిండియా- ఆస్ట్రేలియా మధ్య మిగిలిన నామమాత్రపు మ్యాచ్ ఆదివారం బెంగళూరులో జరుగనుంది. చదవండి: టీమిండియా హెడ్కోచ్ అయితేనేం! కుమారుల కోసం అలా.. The moment #TeamIndia recorded their third win of the series 👌 Celebrations and smiles all around in Raipur 😃#INDvAUS | @IDFCFIRSTBank pic.twitter.com/BxRiBbSzCz — BCCI (@BCCI) December 1, 2023 -
ఆస్ట్రేలియాపై భారత్ విజయం.. టీ20 సిరీస్ కైవసం (ఫొటోలు)
-
అతడి బ్యాటింగ్ కోసమే భారత్-ఆసీస్ టీ20 మ్యాచ్లు చూస్తున్నాను: రస్సెల్
టీమిండియా నయా బ్యాటింగ్ సంచలనం రింకూ సింగ్పై వెస్టిండీస్ స్టార్ ఆండ్రీ రస్సెల్ ప్రశంసల వర్షం కురిపించాడు. రింకూ అద్భుతమైన ఆటగాడని, అతడి సత్తా ఎంటో తనకు బాగా తెలుసు అని రస్సెల్ అన్నాడు. స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న టీ20 సిరీస్లో ఇప్పటివరకు ఆడిన మూడు ఇన్నింగ్స్లోనూ రింకూ దుమ్మురేపాడు. ఆసీస్తో జరిగిన తొలి టీ20లో 14 బంతుల్లో 22 పరుగులు చేసిన రింకూ.. రెండో టీ20లో అయితే కేవలం 9 బంతుల్లోనే 31 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. నాలుగో టీ20లో 46 పరుగులతో అద్బుత ఇన్నింగ్స్ ఈ నేపథ్యంలో రస్సెల్ హిందూస్తాన్ టైమ్స్తో రస్సెల్ మాట్లాడూతూ.. "నేను ఆస్ట్రేలియా-భారత్ టీ20 మ్యాచ్లను చూస్తున్నాను. ఒకవేళ ఏ మ్యాచ్ అయినా మిస్ అయితే హైలెట్స్ కచ్చితంగా చూస్తాను. ఎందుకంటే రింకూ సింగ జట్టులో ఉన్నాడు. అతడి బ్యాటింగ్ అంటే నాకు ఎంతో ఇష్టం. ఈ సిరీస్లో రింకూ బ్యాటింగ్ నన్ను ఏమి ఆశ్చర్యపరచడం లేదు. అతడు కొన్నేళ్ల క్రితం కేకేఆర్తో జతకట్టాడు. అతడు ప్రాక్టీస్ గేమ్లలో లేదా నెట్స్లో భారీ షాట్లు ఆడేవాడు. అప్పుడే అతడు టాలెంట్ ఎంటో మాకు అర్ధమైపోయింది. అతడొక టీమ్ మ్యాన్. ఆట పట్ల అతడికి చాల మక్కువ ఎక్కువ. జాతీయ జట్టు అద్బుతంగా రాణిస్తుండడంతో అతడు చాలా సంతోషంగా ఉంటాడు. అతడు భవిష్యత్తులో మరింత మెరుగుపడతాడని నేను భావిస్తున్నాను అని చెప్పుకొచ్చాడు. కాగా ఐపీఎల్లో గత కొన్ని సీజన్ల నుంచి కేకేఆర్ తరపున ఆడుతున్నారు. చదవండి: IND vs SA: గొప్ప నాయకుడు.. అప్పటిదాకా అతడే టీమిండియా కెప్టెన్గా ఉండాలి: గంగూలీ -
సచిన్ అంతటి వాడవుతాడు.. పోలికలే కొంపముంచుతున్నాయి! ఇప్పుడు..
ఓ ప్లేయర్ అద్భుతంగా ఆడుతూ ఉంటే.. ఆ క్రీడలో దిగ్గజాలతో పోలిక పెట్టి మాట్లాడుతూ విశ్లేషణలు సహజం. అయితే, కొన్నిసార్లు ఆ పోలిక వాళ్లకు చేకూర్చే మేలు కంటే.. నష్టమే ఎక్కువగా ఉంటుందని చెప్పవచ్చు. కొంతమంది టీమిండియా యువ క్రికెటర్ల విషయంలో ఇలాగే జరిగింది. ప్రస్తుతం.. అంతర్జాతీయ టీ20లలో రింకూ సింగ్ అదరగొడుతున్న తరుణంలో దిగ్గజ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనితో అతడి ఆట తీరును పోలుస్తున్నారు విశ్లేషకులు. ధోని స్టైల్లో మ్యాచ్ ముగిస్తున్న తీరుకు ఫిదా అవుతూ నయా ఫినిషర్ వచ్చేశాడంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే, మరికొందరు మాత్రం ఇప్పుడే ధోని వారసుడిగా ట్యాగ్ వేసి రింకూపై ఒత్తిడి పెంచొద్దనే అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. విధ్వంసకర బ్యాటింగ్తో ప్రత్యర్థి జట్టు బౌలర్లపై విరుచుకుపడుతున్న రింకూపై ఇలాంటి ప్రశంసలు ఒత్తిడి పెంచే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. హార్దిక్ వారసుడంటూ.. గతంలో వెంకటేశ్ అయ్యర్, పృథ్వీ షా విషయంలో ఇలాంటి పోలికలు కొంపముంచాయంటూ వారి పేర్లను ఉదాహరిస్తున్నారు. కాగా ఐపీఎల్లో కోల్కతా నైట్రైడర్స్కు ప్రాతినిథ్యం వహిస్తున్న వెంకటేశ్ అయ్యర్.. ఐపీఎల్ 2021లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో టీమిండియా తరఫున అరంగేట్రం చేసిన ఈ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా స్థానాన్ని భర్తీ చేయగలడంటూ ప్రశంసల వర్షం కురిసింది. గాయాల బెడదతో సతమతమవుతున్న పాండ్యా కెరీర్ సందిగ్దంలో పడిన సమయంలో వెంకటేశ్ అతడి వారసుడిగా భారత జట్టులో చోటు ఖాయం చేసుకోవడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. జట్టులో చోటే కరువు కానీ.. పాండ్యా రీఎంట్రీ ఇచ్చి.. వైస్ కెప్టెన్ స్థాయికి ఎదిగిన తర్వాత వెంకటేశ్ అయ్యర్కు జట్టులో స్థానమే కరువైంది. గతేడాది ఫిబ్రవరిలో చివరగా వెంకటేశ్ టీమిండియా తరఫున ఆడాడు. సచిన్ అంతటి వాడవుతాడు ఇక పృథ్వీ షా.. ఈ ముంబై బ్యాటర్ దేశవాళీ క్రికెట్లో రాణిస్తున్న సమయంలోనే దిగ్గజ బ్యాటర్ సచిన్ టెండుల్కర్తో పోలిక తెచ్చారు విశ్లేషకులు. భవిష్యత్తులో కచ్చితంగా టీమిండియా ఓపెనర్గా అద్భుతాలు చేస్తాడని ఈ అండర్-19 వరల్డ్కప్ విన్నింగ్ కెప్టెన్ను కొనియాడారు. తన కెప్టెన్సీలో ఆడిన వాళ్లు స్టార్లు.. అతడేమో ఇలా కానీ.. సీన్ రివర్స్ అయింది.. పృథ్వీ కెప్టెన్సీలో ఆడిన శుబ్మన్ గిల్, ఇషాన్ కిషన్ భారత జట్టులో తమ స్థానం సుస్థిరం చేసుకున్నారు. ముఖ్యంగా శుబ్మన్ ఇప్పటికే మూడు ఫార్మాట్లలో ఓపెనర్గా పాతుకుపోయి.. భావి భారత జట్టు కెప్టెన్గా, తదుపరి సూపర్స్టార్గా నీరాజనాలు అందుకుంటున్నాడు. అయితే, పృథ్వీ షాకు టీమిండియాలో ఎంట్రీ కాదు.. కనీసం ఐపీఎల్లో అయినా స్టార్ బ్యాటర్గా గుర్తింపు దక్కడం లేదు. వరుస వైఫల్యాలతో చతికిలపడ్డ పృథ్వీని గాయాలు వేధిస్తుండటంతో దెబ్బమీద దెబ్బ పడుతోంది. అతడు మళ్లీ భారత జట్టులో పునరాగమనం చేయడం దాదాపు అసాధ్యంగా కనిపిస్తోంది. ఇప్పుడు రింకూ విషయంలో ఇలా.. ఉత్తరప్రదేశ్కు చెందిన లెఫ్టాండ్ బ్యాటర్ రింకూ సింగ్. అనేక కష్టనష్టాలకోర్చి క్రికెటర్గా తన ప్రయాణం మొదలుపెట్టాడు. కోల్కతా నైట్రైడర్స్ మేనేజ్మెంట్ దృష్టిలో పడటంతో అతడి దశ తిరిగింది. అంచెలంచెలుగా ఎదిగి టీమిండియా స్థాయికి ఇంటింటికీ సిలిండర్లు మోస్తూ తండ్రి సంపాదిస్తే.. తాను స్వీపర్గా పనిచేసేందుకు కూడా సిద్ధపడి కుటుంబాన్ని ఆదుకోవాలని నిర్ణయించుకున్న రింకూ.. ఎన్ని ఆటంకాలు ఎదురైనా ఆటను మాత్రం వీడలేదు. అంచెలంచెలుగా ఎదిగి తాజా ఐపీఎల్ సీజన్లో గుజరాత్ టైటాన్స్తో మ్యాచ్లో వరుసగా ఆరు సిక్సర్లు బాది కేకేఆర్ను గెలపించిన తీరు నభూతో అనిపించింది. ఈ క్రమంలో.. 2023, ఆగష్టులో ఐర్లాండ్తో టీ20 సందర్భంగా అతడు టీమిండియా తరఫున అరంగేట్రం చేశాడు. నయా ఫినిషర్గా కితాబులు ప్రస్తుతం స్వదేశంలో ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్తో బిజీగా ఉన్న రింకూ.. మొత్తంగా 7 మ్యాచ్లు ఆడి 216.95 స్ట్రైక్రేటుతో 128 పరుగులు సాధించాడు. ఆరో స్థానంలో బ్యాటింగ్ చేస్తూ తనదైన శైలిలో ఫినిషింగ్ టచ్ ఇస్తూ జట్టుకు విజయాలు అందిస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే ధోనితో పోలిక తెస్తూ రింకూ ఆట తీరును కొనియాడుతూ తాత్కాలిక కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ సహా పలువురు మాజీ క్రికెటర్లు కామెంట్లు చేస్తున్నారు. త్వరలోనే వన్డే క్రికెట్లోనూ అతడు అడుగుపెడతాడని జోస్యం చెబుతున్నారు. పోలికలు వద్దు.. మద్దతు ముఖ్యం అయితే, మరికొంత మంది మాత్రం.. రింకూను ఇప్పుడు ప్రశంసిస్తున్న వాళ్లు కష్టకాలంలో అతడికి అండగా నిలబడితే చాలని.. పోలికలకు బదులు నైతికంగా మద్దతునివ్వడం అతి ముఖ్యమని పేర్కొంటున్నారు. రింకూ ధోని స్థాయికి ఎదిగే సత్తా ఉన్నవాడే అయినా కెరీర్ ఆరంభంలోనే పోలికలు తెచ్చి అతడిపై అనవసరపు ఒత్తిడి పెంచొద్దని హితవు పలుకుతున్నారు. కాగా పటిష్ట ఆసీస్తో ఇప్పటి వరకు ఆడిన రెండు టీ20లలో రింకూ ధనాధన్ ఇన్నింగ్స్ ఆడాడు. వరుసగా.. 22(14 బంతుల్లో), 31(9 బంతుల్లో) పరుగులు సాధించాడు. చదవండి: క్రికెటర్లు అలా ఎందుకు మాట్లాడతారో అర్థం కాదు.. నేనైతే 2011లో: గంభీర్ -
గెలవడానికే వచ్చారా? పరుగుల వరద ఖాయం.. డేంజర్ జోన్లో తిలక్
India vs Australia, 3rd T20I: ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్ ఫలితాన్ని మూడో మ్యాచ్తోనే తేల్చేయాలని టీమిండియా పట్టుదలగా ఉంది. ఇందుకోసం ఇప్పటికే సన్నద్ధమైన సూర్యసేన.. మంగళవారం కంగారూ జట్టుతో గువాహటి వేదికగా పోటీపడనుంది. తొలి రెండు టీ20ల మాదిరే ఇక్కడ కూడా గెలుపొంది.. సిరీస్ను 3-0తో కైవసం చేసుకోవాలని భావిస్తోంది. గత చేదు అనుభవం మరిపించేలా ఇక భారత్- ఆసీస్ పోరుకు వేదిక కానున్న బర్సపరా వికెట్ సాధారణంగా బ్యాటింగ్కు అనుకూలం. అయితే గతంలో ఇక్కడే ఆస్ట్రేలియా చేతిలో ఓడిన చేదు అనుభవం టీమిండియాకు ఉంది. కానీ.. పటిష్టమైన దక్షిణాఫ్రికాపై భారీ స్కోరు చేసి గెలవడం సానుకూలాంశం. ఇక.. ప్రస్తుత టీమిండియా ఫామ్ను చూస్తుంటే.. మరోసారి పరుగుల విందు గ్యారంటీగా కనిపిస్తోంది. టాస్ గెలిస్తే.. తొలుత బ్యాటింగే బర్సపరా స్టేడియంలో టాస్ గెలిచిన జట్టు తొలుత బ్యాటింగ్ ఎంచుకోవడానికి మొగ్గుచూపే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ ఓపెనర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా మూడో టీ20లో టాస్ ప్రాధాన్యం, పిచ్ గురించి తన అభిప్రాయాలు పంచుకున్నాడు. ‘‘ఇక్కడ టీమిండియా గెలిచి సిరీస్ను గెలిచే అవకాశం ఉంది. 3-0తో ప్రత్యర్థిని చిత్తు చేస్తే చాలా బాగుంటుంది. పిచ్పై తేమ ఎక్కువగా ఉంటుంది కాబట్టి అయితే, బర్సపరాలో టాస్ అత్యంత కీలకం కానుంది. తిరునవంతపురం మాదిరే ఇక్కడ కూడా పిచ్పై తేమ ఉండనుంది. అక్కడితో పోలిస్తే ఇంకాస్త ఎక్కువగానే డ్యూ ఉండొచ్చు’’ అని ఆకాశ్ చోప్రా పేర్కొన్నాడు. ఇక టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్ గురించి ప్రస్తావిస్తూ.. ‘‘యశస్వి జైశ్వాల్, రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్లతో టాపార్డర్ అద్భుతంగా కనిపిస్తోంది. డేంజర్ జోన్లో తిలక్ వర్మ అయితే, శ్రేయస్ అయ్యర్ వచ్చిన తర్వాత బయటకు ఎవరు వెళ్తారన్నది ఆసక్తికరం. ప్రస్తుత ఫామ్ను బట్టి చూస్తే తిలక్ వర్మ డేంజర్ జోన్లో ఉన్నాడు. ఒకవేళ అతడికి తుదిజట్టులో చోటు దక్కకపోతే సూర్యకుమార్ యాదవ్ ఐదో స్థానంలో ఆడతాడో చూడాలి!’’ అని ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు. అదే విధంగ.. కీలక ఆటగాళ్లను ఆస్ట్రేలియా మేనేజ్మెంట్ స్వదేశానికి పంపుతున్న తరుణంలో అసలు వాళ్లు ఇక్కడికి గెలవడానికే వచ్చారా అంటూ ఆకాశ్ వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. యువ ఆటగాళ్ల విజృంభణ కాగా వన్డే వరల్డ్కప్-2023 ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓటమి తర్వాత టీమిండియా ద్వితీయ శ్రేణి జట్టు.. కంగారూలతో టీ20 సిరీస్ ఆడుతోంది. రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ సహా విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్, జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్ తదితరులు విశ్రాంతి తీసుకుంటుండగా.. యువ ఆటగాళ్లకు జట్టులో స్థానం దక్కింది. సూర్యకుమార్ సారథ్యంలో సాగుతున్న ఈ సిరీస్లో.. యశస్వి జైశ్వాల్, రింకూ సింగ్ అదరగొడుతున్నారు. ఇక ఈ జట్టుకు వైస్ కెప్టెన్గా ఉన్న శ్రేయస్ అయ్యర్ నాలుగో మ్యాచ్ నుంచి బరిలో దిగనున్నాడు. ఇక మాథ్యూ వేడ్ ఆసీస్ జట్టును ముందుండి నడిపిస్తున్నాడు. ఆస్ట్రేలియాతో మూడో టీ20కి భారత తుదిజట్టు(అంచనా) రుతురాజ్ గైక్వాడ్, యశస్వి జైస్వాల్, ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), తిలక్ వర్మ, రింకు సింగ్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, అర్ష్దీప్ సింగ్, ముఖేష్ కుమార్, ప్రసిద్ కృష్ణ. చదవండి: మనుషులు దూరంగా ఉన్నా.. విరాట్ కోహ్లి తోబుట్టువు, వ్యాపారవేత్త భార్య! -
IND VS AUS: విరాట్ సరసన చేరిన రింకూ
టీమిండియా యంగ్ డైనమైట్ రింకూ సింగ్ మరో అరుదైన రికార్డు సాధించాడు. ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టీ20లో 9 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో అజేయమైన 31 పరుగులు (344.44 స్ట్రయిక్ రేట్) చేసిన రింకూ.. ఓ టీ20 ఇన్నింగ్స్లో 30 అంతకంటే ఎక్కువ పరుగులు (19 లేదా 20 ఓవర్లలో) చేసిన రెండో భారత ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. గతంలో భారత్ తరఫున విరాట్ కోహ్లి మాత్రమే ఈ ఫీట్ను సాధించాడు. విరాట్, రింకూ సింగ్ ఇద్దరూ రెండ్రెండు సార్లు ఈ ఘనత సాధించడం విశేషం. ఇదిలా ఉంటే, స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో భారత్ 2-0 ఆధిక్యంలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. విశాఖ, తిరువనంతపురం వేదికలుగా జరిగిన తొలి రెండు మ్యాచ్ల్లో భారత్ ఘన విజయాలు సాధించింది. భారీ స్కోర్లు నమోదైన ఈ రెండు మ్యాచ్ల్లో భారత బ్యాటర్లు పేట్రేగిపోయారు. తొలి మ్యాచ్లో ఇషాన్ కిషన్ (58), సూర్యకుమార్ యాదవ్ (80) మెరుపులు మెరిపించగా.. రెండో టీ20లో యశిస్వి (53), రుతురాజ్ (58), ఇషాన్ (52), రింకూ సింగ్ (31 నాటౌట్) విధ్వంసం సృష్టించారు. గౌహతి వేదికగా ఇవాళ (నవంబర్ 28) జరుగబోయే మూడో టీ20లో భారత బ్యాటర్లు ఇదే జోరును కొనసాగించి సిరీస్ను కైవసం చేసుకోవాలని పట్టుదలగా ఉన్నారు. ఈ మ్యాచ్ రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతుంది. -
రింకూ సింగ్ అరుదైన రికార్డు.. యువరాజ్ సింగ్, హార్దిక్ సరసన
రింకూ సింగ్.. ఈ పేరు ప్రస్తుతం ఇండియన్ క్రికెట్లో మారుమ్రోగిపోతుంది. స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరగుతున్న టీ20 సిరీస్లో రింకూ సింగ్ తన ఆటతీరుతో అందరిని అకట్టుకున్నాడు. ఐపీఎల్లో కనబరిచిన దూకుడునే అంతర్జాతీయ క్రికెట్లోనూ కొనసాగిస్తున్నాడు. తొలి మ్యాచ్లో 22 పరుగులతో భారత విజయంలో కీలక పాత్ర పోషించిన రింకూ.. రెండో టీ20లో కేవలం 9 బంతుల్లోనే 31 పరుగులు చేసి దుమ్మురేపాడు. అతడి ఇన్నింగ్స్లో 4 ఫోర్లు, 2 సిక్స్లు ఉన్నాయి. దీంతో అతడిని టీమిండియా నయా ఫినిషర్ అని, మరో ధోని దొరికాడని సర్వాత్ర ప్రశంసల వర్షం కురుస్తోంది. రింకూ అరుదైన రికార్డు.. కాగా రెండో టీ20లో దుమ్మురేపిన రింకూ సింగ్ ఓ అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. అంతర్జాతీయ టీ20ల్లొ ఒకే మ్యాచ్లో అత్యధిక స్ట్రైక్-రేట్(25 కంటే ఎక్కువ పరుగులు)తో బ్యాటింగ్ చేసిన నాలుగో భారత ఆటగాడిగా రింకూ నిలిచాడు. ఈ మ్యాచ్లో రింకూ 344.44 స్ట్రైక్-రేట్తో 31 పరుగులు చేశాడు. ఈ అరుదైన ఫీట్ సాధించిన జాబితాలో టీమిండియా మాజీ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ ఉన్నాడు. 2007 టీ20 వరల్డ్కప్లో ఇంగ్లండ్పై 362.50 స్ట్రైక్-రేట్తో కేవలం 16 బంతుల్లోనే 58 పరుగులు చేశాడు. యువీ తర్వాతి స్ధానాల్లో దినేష్ కార్తీక్(362.50) ఉన్నాడు. 2018 నిదాదాస్ ట్రోఫీలో బంగ్లాదేశ్పై ఫైనల్లో కార్తీక్ కేవలం 8 బంతుల్లోనే 29 పరుగులు చేశాడు. మూడో స్ధానంలో టీమిండియా స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా(355.55) ఉన్నాడు. చదవండి: సచిన్కే అన్నేళ్లు పట్టింది.. టీ20 వరల్డ్కప్ టీమిండియాదే: రవిశాస్త్రి Rinku Singh providing the finishing touch once again 😎 25 runs off the penultimate over as 200 comes 🆙 for #TeamIndia 👌👌#INDvAUS | @IDFCFIRSTBank pic.twitter.com/hA92F2zy3W — BCCI (@BCCI) November 26, 2023 -
నాపై ఒత్తిడి లేకుండా చేస్తున్నారు.. రింకూ వల్ల: సూర్య
India vs Australia, 2nd T20I- Suryakumar Yadav Comments: యువ ఆటగాళ్లపై టీమిండియా తాత్కాలిక కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ప్రశంసలు కురిపించాడు. ప్రతి ఒక్కరు బాధ్యతగా వ్యవహరిస్తూ నాయకుడిగా తన పనిని మరింత సులువు చేస్తున్నారంటూ కొనియాడాడు. కాగా ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్లో భారత యువ జట్టు అదరగొడుతున్న విషయం తెలిసిందే. వన్డే వరల్డ్కప్-2023 తర్వాత సీనియర్ల గైర్హాజరీతో దక్కిన అవకాశాలను యువ క్రికెటర్లు సద్వినియోగం చేసుకుంటున్నారు. వరల్డ్ నంబర్ 1 టీ20 స్టార్ సూర్యకుమార్ సారథ్యంలో అద్భుత ప్రదర్శన కనబరుస్తూ ముందుకు సాగుతున్నారు. వరుసగా రెండో విజయం ఇందులో భాగంగా ఆఖరి బంతి వరకు ఉత్కంఠ రేపిన తొలి టీ20లో రింకూ సింగ్ టీమిండియా విజయాన్ని ఖరారు చేయగా.. రెండో మ్యాచ్లో ప్రతి ఒక్కరు తమ వంతు పాత్ర పోషించి జట్టుకు గెలుపు అందించారు. ఈ క్రమంలో టీమిండియా ప్రస్తుతం ఈ ఐదు మ్యాచ్ల సిరీస్లో 2-0తో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఈ రెండు మ్యాచ్లలోనూ రింకూ సింగ్ ధనాధన్ ఇన్నింగ్స్తో మెరవడం విశేషం. ముఖ్యంగా ఆదివారం నాటి రెండో టీ20లో కేవలం 9 బంతుల్లోనే 31 పరుగులతో అజేయంగా నిలిచి.. జట్టు భారీ స్కోరు సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. మూడు అర్ధ శతకాలు.. రింకూ ధనాధన్ బాదుడు మిగతా వాళ్లలో ఓపెనర్లు యశస్వి జైశ్వాల్(25 బంతుల్లో 53), రుతురాజ్ గైక్వాడ్ (43 బంతుల్లో 58), ఇషాన్ కిషన్(32 బంతుల్లో 52) అర్ధ శతకాలు సాధించారు. కెప్టెన్ సూర్య 19 పరుగులకే పరిమితం కాగా.. తిలక్ 7 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 235 పరుగులు చేసిన టీమిండియా... ఆసీస్ను 191 పరుగులకే పరిమితం చేసింది. తద్వారా 44 పరుగుల తేడాతో తిరువనంతపురంలో గెలుపొంది సిరీస్లో మరో ముందడుగు వేసింది. మ్యాచ్కు ముందే చెప్పాను.. మా బాయ్స్ అద్భుతం ఈ నేపథ్యంలో విజయానంతరం సూర్యకుమార్ మాట్లాడుతూ.. ‘‘నాపై ఒత్తిడి పడకుండా మా యువ ఆటగాళ్లంతా బాధ్యత తీసుకుంటున్నారు. ప్రతి ఒక్కరు తమ పనిని చక్కగా నెరవేరుస్తున్నారు. మ్యాచ్ ఆరంభానికి ముందే.. మా వాళ్లకు తొలుత బ్యాటింగ్ చేయడానికి సిద్ధంగా ఉండాలని చెప్పాను. రింకూను చూస్తే ధోని గుర్తుకొస్తాడు పిచ్ తేమగా ఉంది. కాబట్టి వీలైనన్ని ఎక్కువ పరుగులు రాబట్టి స్కోరును డిఫెంగ్ చేసుకోవాలని మా వాళ్లకు చెప్పాను’’ అని పేర్కొన్నాడు. ఇక రింకూ సింగ్ గురించి ప్రస్తావనకు రాగా.. ‘‘గత మ్యాచ్లో రింకూ క్రీజులోకి వచ్చినపుడు తన ఆత్మవిశ్వాసాన్ని చూస్తే నాకు ముచ్చటేసింది. అద్భుత ఇన్నింగ్స్తో జట్టును గెలిపించాడు. అతడిని చూస్తే నాకొక వ్యక్తి గుర్తుకొస్తారు(నవ్వులు). ఆయన ఎవరో మీ అందరికీ తెలుసు కదా’’ అంటూ సూర్యకుమార్ నవ్వులు చిందించాడు. మిస్టర్ కూల్ కెప్టెన్, ఫినిషర్ మహేంద్ర సింగ్ ధోనిని ఉద్దేశించి సూర్య ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు. పరోక్షంగా రింకూను నయా ఫినిషర్గా పేర్కొన్నాడు. చదవండి: IPL 2024: ఆర్సీబీలో భారీ ప్రక్షాళన.. స్టార్ ఆటగాళ్లకు షాక్.. లక్కీ డీకే View this post on Instagram A post shared by Team India (@indiancricketteam) -
విధ్వంసానికి పరాకాష్టగా నిలిచిన రింకూ.. నయా మ్యాచ్ ఫినిషర్ అంటూ జేజేలు
టీమిండియా యువ సంచలనం రింకూ సింగ్ పొట్టి ఫార్మాట్లో పేట్రేగిపోతున్నాడు. భారత జట్టుకు ఆడే అవకాశం వచ్చిన ప్రతిసారి తన మార్కు ఊచకోతతో విరుచుకుపడుతున్నాడు. ఐపీఎల్ 2023 సీజన్లో ఐదు బంతుల్లో 5 సిక్సర్ల ఫీట్తో రాత్రికిరాత్రి హీరో అయిపోయిన ఈ కేకేఆర్ బ్యాటర్.. టీమిండియాలోకి వచ్చిన అనతి కాలంలోనే మ్యాచ్ ఫినిషర్గా గుర్తింపు తెచ్చుకున్నాడు. తిరువనంతపురం వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టీ20లో ఆడిన ఇన్నింగ్స్తో (9 బంతుల్లో 31 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) భారత క్రికెట్ అభిమానులందరూ రింకూని ధోనితో పోలుస్తున్నారు. టీమిండియాకు నయా మ్యాచ్ ఫినిషర్ దొరికాడని కొనియాడుతున్నారు. చివరి ఓవర్లలో రింకూ ఆడే షాట్లు చూస్తే మతి పోతుందని జేజేలు కొడుతున్నారు. నిన్నటి మ్యాచ్లో రింకూ స్ట్రయిక్రేట్ (344.44) చూసి విధ్వంసానికి ఇది పరాకాష్ట అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ మ్యాచ్ 19వ ఓవర్లో సీన్ అబాట్ బౌలింగ్ను తుత్తినియలు (4, 0, 6, 4, 4, 6) చేసిన వైనాన్ని కొనియాడుతున్నారు. రింకూ భవిష్యత్తులో ధోని అంతటి వాడవుతాడని జోస్యం చెబుతున్నారు. రింకూ.. లోయర్ మిడిలార్డర్లో టీమిండియాకు దొరికిన తురుపుముక్క అంటూ ఆకాశానికెత్తుతున్నారు. తాజాగా ఆసీస్తో జరిగిన తొలి టీ20ని ఉదహరిస్తూ (ఆఖరి బంతికి సిక్సర్) నయా మ్యాచ్ విన్నర్ అంటూ కితాబునిస్తున్నారు. రింకూ ఆడిన నాలుగు టీ20 ఇన్నింగ్స్లను ప్రస్తావిస్తూ భారత క్రికెట్ భవిష్యత్తు స్టార్ అంటూ జేజేలు పలుకుతున్నారు. ఈ యువ కెరటం ఐపీఎల్తో పాటు అంతర్జాతీయ స్థాయిలోనూ రాణిస్తుండటం శుభపరిణామమని అంటున్నారు. రింకూ తన టీ20 కెరీర్లో చేసిన స్కోర్లు.. 38 (21) 37* (15) 22* (14) 31* (9) ఇదిలా ఉంటే, నిన్నటి మ్యాచ్లో రింకూ విధ్వంసానికి ముందు భారత టాపార్డర్ బ్యాటర్లు సైతం ఆసీస్ బౌలర్లను ఊచకోత కోశారు. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. యశస్వి (25 బంతుల్లో 53; 9 ఫోర్లు, 2 సిక్సర్లు), రుతురాజ్ (43 బంతుల్లో 58; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), ఇషాన్ కిషన్ (32 బంతుల్లో 52; 3 ఫోర్లు, 4 సిక్సర్లు), సూర్యకుమార్ (10 బంతుల్లో 19; 2 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్లతో విరుచుకుపడటంతో నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 235 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఛేదనలో ఆసీస్ ఆదిలో కాస్త పోటీనిచ్చినప్పటికీ.. ఆతర్వాత చేతులెత్తేసింది. భారత బౌలర్ల ధాటికి ఆ జట్టు నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 191 పరుగులకే పరిమితమైంది. ఫలితంగా భారత్ 44 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. భారత బౌలర్లలో భిష్ణోయ్, ప్రసిద్ద్ కృష్ణ తలో 3 వికెట్లు పడగొట్టగా.. ముకేశ్ కుమార్, అక్షర్ పటేల్, అర్షదీప్ తలో వికెట్ దక్కించుకున్నారు. -
Ind vs Aus: కేరళలో అడుగుపెట్టిన టీమిండియా.. వీడియో
ఆస్ట్రేలియాతో టీ20 నేపథ్యంలో టీమిండియా కేరళలో అడుగుపెట్టింది. ఐదు మ్యాచ్ల సిరీస్లో భాగంగా రెండో టీ20 ఆడేందుకు తిరువనంతపురం చేరుకుంది. గ్రీన్ఫీల్డ్ స్టేడియంలో ఆదివారం నాటి మ్యాచ్కు సూర్యసేన సన్నద్ధం కానుంది. ఇందులో భాగంగా కార్యవట్టంలోని స్పోర్ట్స్ హబ్లో టీమిండియా శనివారం ప్రాక్టీస్ మొదలుపెట్టనుంది. మరోవైపు.. ఆస్ట్రేలియా కూడా ఇక్కడే నెట్ సెషన్లో పాల్గొననున్నట్లు కేరళ క్రికెట్ అసోసియేషన్ వర్గాలు తెలిపాయి. కాగా వన్డే వరల్డ్కప్-2023 ఓటమి నుంచి కోలుకోకముందే భారత జట్టు ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్కు సిద్ధమైన విషయం తెలిసిందే. సీనియర్లకు విశ్రాంతినిచ్చిన నేపథ్యంలో టీ20 స్టార్ సూర్యకుమార్ యాదవ్ తొలిసారి టీమిండియా పగ్గాలు చేపట్టాడు. ఈ క్రమంలో విశాఖపట్నం వేదికగా జరిగిన తొలి టీ20లో విజయం సాధించి గెలుపుతో సిరీస్ను మొదలుపెట్టాడు. ఆఖరి బంతి వరకు ఉత్కంఠ రేపిన ఈ మ్యాచ్లో సూర్య సునామీ ఇన్నింగ్స్కు తోడు రింకూ సింగ్ అద్బుత ఆట కారణంగా రెండు వికెట్ల తేడాతో టీమిండియా గెలుపొందింది. తద్వారా ఈ సిరీస్లో ప్రస్తుతం 1-0తో ఆస్ట్రేలియాపై ఆధిపత్యం కొనసాగిస్తోంది. రెండో మ్యాచ్లోనూ విజయం సాధించి మరో ముందడుగు వేయాలని పట్టుదలగా ఉంది. ఇక ఆసీస్తో సిరీస్కు రాహుల్ ద్రవిడ్ గైర్హాజరీ నేపథ్యంలో వీవీఎస్ లక్ష్మణ్ హెడ్కోచ్గా వ్యవహరిస్తున్నాడు. ఇదిలా ఉంటే.. టీమిండియా తిరునవంతపురం చేరుకున్న వీడియోను బీసీసీఐ సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్గా మారింది. చదవండి: IPL 2024: సన్రైజర్స్ హైదరాబాద్కు భారీ షాక్?! ✈️ Touchdown Trivandrum!#TeamIndia are here for the 2⃣nd #INDvAUS T20I 👌👌@IDFCFIRSTBank pic.twitter.com/dQT4scn38w — BCCI (@BCCI) November 24, 2023 -
‘ధోని నుంచి నేర్చుకున్నాను’
విశాఖపట్నం: ఆ్రస్టేలియాతో జరిగిన తొలి టి20 మ్యాచ్లో భారత జట్టు విజయంలో రింకూ సింగ్ కీలక పాత్ర పోషించాడు. చివర్లో దూకుడుగా ఆడాల్సిన స్థితిలో ఎలాంటి ఒత్తిడికి లోను కాకుండా ప్రశాంతంగా నిలబడి అతను ఫినిషర్గా మ్యాచ్ పూర్తి చేశాడు. ఈ లక్షణాన్ని తాను మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని నుంచి నేర్చుకున్నట్లు రింకూ సింగ్ చెప్పాడు. ‘నేను ఇంత ప్రశాంతంగా ఉండగలిగానంటే అందుకు ప్రత్యేక కారణం ఉంది. ఇలాంటి స్థితిలో ఎలా ఆడాలని నేను మహి భాయ్ (ధోని)తో మాట్లాడాను. ముఖ్యంగా ఆఖరి ఓవర్లో ఒత్తిడికి లోను కాకపోవడానికి ఆయన ఇచ్చిన సూచనలే కారణం. సాధ్యమైనంత ప్రశాంతంగా ఉండటంతో పాటు నేరుగా బౌలర్పైనే పూర్తి దృష్టి పెట్టాలని ఆయన చెప్పారు’ అని రింకూ సింగ్ వెల్లడించాడు. చివరి బంతికి ఒక పరుగు కావాల్సి ఉండగా రింకూ ఆత్మవిశ్వాసంతో దానిని చక్కటి సిక్సర్గా మలిచాడు. అయితే అబాట్ వేసిన ఆ బంతి నోబాల్ కావడంతో సిక్స్ లెక్కలోకి రాలేదు. ‘డ్రెస్సింగ్ రూమ్కు వెళ్లాక అక్షర్ చెప్పే వరకు ఈ విషయం నాకు తెలీదు. అయితే సిక్స్ కాలేకపోవడం పెద్ద అంశం కాదు. మ్యాచ్ గెలవడమే మనకు ముఖ్యం. అది జరిగింది చాలు’ అని రింకూ సింగ్ వ్యాఖ్యానించాడు.