ST
-
ఎస్సీ ,ఎస్టీ ప్రత్యేక కోర్టులో వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్
సాక్షి, విజయవాడ : తనకు బెయిల్ ఇవ్వాలంటూ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ విజయవాడ ఎస్సీ ,ఎస్టీ స్పెషల్ కోర్టును ఆశ్రయించారు. ఎస్సీ ఎస్టీ స్పెషల్ కోర్టులో వంశీ తరుపు న్యాయవాది బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. దీంతో కౌంటర్ దాఖలు చేయాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్(పీపీ)కు కోర్టు ఆదేశించింది. అయితే, వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్పై కౌంటర్ దాఖలు చేసేందుకు మూడు రోజులు సమయం కావాలని పీపీ కోరారు. దీంతో కోర్టు తదుపరి విచారణ ఈనెల 28కి వాయిదా వేసింది. -
మహారాష్ట్రలో ధంగర్లకు ఎస్టీ హోదాపై నిరసన.. సెక్రటేరియట్ భవనం నుంచి దూకిన నేతలు
ముంబై: మహారాష్ట్రలోని ధంగర్ కులస్తులను ఎస్టీ జాబితాలో చేర్చినందుకు నిరసనగా రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ నరహరి జిర్వాల్ సహా గిరిజన నేతలు సెక్రటేరియట్ భవనం మంత్రాలయం మూడో అంతస్తు నుంచి దూకారు. అయితే, పోలీసులు ముందు జాగ్రత్తగా దిగువన రెండో అంతస్తులో నెట్లో పడటంతో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. అయితే, ఈ ఘటన మంత్రాలయం సముదాయంలో శుక్రవారం మధ్యాహ్నం 12.40 గంటల సమయంలో ఉద్రిక్తతకు దారి తీసింది.దూకిన వారిలో జిర్వాల్తోపాటు ఎన్సీపీకే చెందిన ఎమ్మెల్యే కిరణ్ లహమతే, బీజేపీ గిరిజన ఎంపీ హేమంత్ సవర తదితరులున్నారు. వీరిని పోలీసులు నెట్ నుంచి బయటకు తీశారు. అనంతరం ఈ నేతలంతా గ్రౌండ్ ఫ్లోర్లో బైఠాయించారు. కోటా విషయమై సీఎం షిండే వెంటనే తమతో సమావేశం ఏర్పాటు చేసి చర్చించాలని వారు డిమాండ్ చేశారు. మంత్రాలయం భవనం పైనుంచి గతంలో ఆత్మహత్యకు యత్నించిన ఘటనలున్నాయి. దీంతో, అక్కడ పోలీసులు నెట్ను ఏర్పాటు చేసి ఉంచారు. కాగా, గిరిజనులకు సంబంధించిన నిర్ణయాలపై అధికార కూటమిలోని అంతర్గత విభేదాలను ఈ ఘటన మరోసారి బహిర్గతం చేసింది. -
ఇల్లు కూల్చి.. శిథిలాలు వాగులో కలిపి..
చిలకలూరిపేట: వైఎస్సార్సీపీకి ఓటు వేశారని కక్షకట్టి.. ఏకంగా ఇల్లు కూల్చి వేయడమే కాక.. ఆ శిథిలాలను వాగులో కలిపి టీడీపీ నేతలు పైశాచిక ఆనందం పొందారు. ఈ ఘటన పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం యడవల్లి ఎస్టీ కాలనీలో ఆదివారం చోటు చేసుకుంది. బాధితులు ఉయ్యాల ఏడుకొండలు, కోటమ్మ దంపతుల కథనం మేరకు వివరాలు వారి మాటల్లోనే.. ‘మాది కూలీ నాలీ చేసుకుని బతికే కుటుంబం. ముగ్గురు సంతానం. అందరికీ వివాహాలు చేశాం. గ్రామంలో 2019లో ఖాళీ స్థలం కొనుగోలు చేసి రెండేళ్ల కిందట రేకులతో ఇల్లు నిర్మించుకుని ఉంటున్నాం.మీరు వైఎస్సార్సీపీ మద్దతుదారులు అంటూ టీడీపీ వర్గీయులైన తన్నీరు గోవిందు, తన్నీరు వెంకట్రావు, తన్నీరు నారాయణ, తన్నీరు రాజు, కుంచెపు ప్రసన్న, శ్రీను, మరికొందరు జేసీబీ, ట్రాక్టర్పై ఎక్కి మా ఇంటిపై దాడికి వచ్చారు. కట్టుబట్టలతో ఇంట్లో ఉన్న మమ్మల్ని, మా మూడో కుమారుడు వెంకటేశ్వర్లును బయటకు తోశారు. ప్రభుత్వం మాది.. ఎవడు అడ్డం వస్తాడో చూస్తాం.. దిక్కున్న చోట చెప్పుకోండి.. అంటూ కులం పేరుతో దూషిస్తూ దాడికి పాల్పడ్డారు.వారిని ఇంట్లో నుంచి బయటకు గెంటి జేసీబీతో ఇల్లు కూల్చారు. అనంతరం ఆ శిథిలాలను ట్రాక్టర్లో తీసుకెళ్లి వాగులో పడేశారు. కాళ్లవేళ్లా బతిమిలాడుకున్నా కనికరించలేదు. అనంతరం ఆ స్థలాన్ని స్వాధీనం చేసుకున్నారు. బాధితులు రూరల్ పోలీసుస్టేషన్కు వెళితే అక్కడ ఎస్ఐ పట్టించుకోలేదు. దీంతో సోమవారం నరసరావుపేట డీఎస్పీ ఆఫీసులో ఫిర్యాదు చేశారు. -
మేడ్చల్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి మల్లారెడ్డిపై కేసు
-
Bihar Caste Reservation: రిజర్వేషన్లపై బిహార్ ప్రభుత్వం కీలక నిర్ణయం..
పాట్నా: రిజర్వేషన్ల విషయంలో సీఎం నితీష్ కుమార్ నేతృత్వంలోని బిహార్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో రిజర్వేషన్లు 65శాతానికి పెంచాలని ప్రాతిపాదించింది. ప్రస్తుతం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈబీసీ వర్గాల వారి రిజర్వేషన్లు 55 శాతం ఉండగా తాజాగా వాటిని 65 శాతానికి పెంచాలని నిర్ణయించింది. ఇది ఆర్థికంగా బలహీన వర్గాలకు(ఈడబ్ల్యూఎస్) కేంద్రం నిర్దేశించిన 10శాతం రిజర్వేషన్లకు మినహయింపు. బిహార్ ప్రభుత్వం, కేంద్రం కల్పిస్తున్న రిజర్వేషన్లు కలిపి రాష్ట్రంలో మొత్తం రిజర్వేషన్లు 75శాతానికి చేరుకోనుంది. దీనిపై నిపుణులతో సంప్రదింపుల తర్వాత అవసరమైన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తెలిపారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఈ మార్పులు అమలు చేయాలనేది తమ ఉద్ధేశ్యమని తెలిపారు. అయితే ఓబీసీ మహిళలకు కేటాయించిన మూడు శాతం కోటాను రద్దు చేయాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. తాజా ప్రతిపాదనల ప్రకారం.. షెడ్యూల్డ్ కులాల వారికి 20శాతం రిజర్వేషన్ లభిస్తుంది. ఓబీసీ, ఈబీసీలకు 43 శాతం ఉన్న రిజర్వేషన్ దక్కనుంది. ప్రస్తుతం ఓబీసీ, ఈబీసీలకు కలిపి 30 శాతం రిజర్వేషన్ ఉండగా.. తాజాగా మరో 13 శాతం పెరగనుంది. షెడ్యూల్డ్ తెగలు(ఎస్టీ) వారికి రెండు శాతం రిజర్వేషన్లను ప్రతిపాదించారు. దీంతో రాష్ట్రంలో రిజర్వేషన్లు 65 శాతానికి చేరుకుంటాయి. ప్రస్తుత ఈబీసీలకు 18 శాతం, ఓబీసీలకు 12 శాతం, ఎస్సీలకు 16 శాతం, ఎస్టీలకు ఒకశాతం రిజర్వేషన్లు ఉన్నాయి. చదవండి: బీహార్ కులగణన: 34 శాతం మంది పేదలే.. నెలకు రూ. 6 వేల కంటే తక్కువ ఆదాయం కాగా కులగణనకు సంబంధించిన నివేదికను బిహార్ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన కొన్ని గంటల్లోనే నితీష్ కుమార్ ప్రభుత్వం ఈ రిజర్వేషన్ల పెంపు నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఇక ఓబీసీ వర్గం వారిలో యాదవులు అత్యధిక సంఖ్యలలో ఉన్నారు. రాష్ట్ర జనాభాలో వారు 14. 27 శాతం ఉన్నారు. కులగణన ప్రకారం.. బిహార్ 13 కోట్ల జనాభాలో 36 శాతం మంది ఈబీసీలు, 27.1 శాతం మంది వెనకబడిన తరగతులు, 19.7 శాతం మంది ఎస్సీలు, 1.7 శాతం ఎస్టీ జనాభా, జనరల్ కేటగిరీలో 15.5 శాతం ఉన్నారు. దీని ప్రకారం రాష్ట్రంలో 60 శాతానికి పైగా ప్రజలు వెనకబడిన, అత్యంత వెనకబడిన తరగతులకు చెందిన వారే ఉన్నారు. -
లక్ష్యంతో సాగితే విజయం తథ్యం
సాక్షి, హైదరాబాద్: ప్రతి వ్యక్తీ లక్ష్యాన్ని నిర్దేశించుకొని కష్టపడితే విజయం తప్పకుండా వరిస్తుందని మంత్రి కె.తారక రామారావు అన్నారు. అందుకు ప్రత్యక్ష ఉదాహరణ మన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు అని వివరించారు. కేసీఆర్ రాజకీయాల్లోకి వచ్చాక సింగిల్ విండో ఎన్నికల్లో నిరుత్సాహపడినా ఆ తర్వాత పట్టుదలతో కష్టపడ్డారన్నారు. తెలంగాణ లక్ష్యసాధనలో ఎన్ని అవాంతరాలు ఎదురైనా తట్టుకొని నిలబడ్డారని.. ఆ తర్వాత వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదని చెప్పారు. గురువారం ఓ హోటల్లో ఎస్టీ ఆంట్రప్రెన్యూర్స్ సక్సెస్ మీట్లో మంత్రి సత్యవతి రాథోడ్తో కలసి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజన యువత ఉన్నత శిఖరాలకు ఎదగాలని కలలు కనాలని, అలాంటి వారికి ప్రభుత్వం అండగా నిలుస్తుందన్నారు. గిరిజన పారిశ్రామికవేత్తలను చూస్తుంటే ఎంతో సంతోషంగా ఉందని, రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న రాయితీ పథకాలతో గిరిజన యువత అత్యున్నత స్థాయికి ఎదుగుతున్నారని పేర్కొన్నారు. ఏ కులంలో పుట్టామనేది ముఖ్యం కాదని, అవకాశాలను అందిపుచ్చుకోవడం అత్యంత కీలకమని చెప్పారు. ఆంట్రప్రెన్యూర్స్గా ఎదిగిన గిరిజన యువత భవిష్యత్ తరాలకు మార్గదర్శకులు కావాలని కేటీఆర్ ఆకాంక్షించారు. ఈ సందర్భంగా కేటీఆర్ గతంలో జరిగిన ఆసక్తికరమైన ఘటనను తెలియజేశారు. గతంలో సీఎం కేసీఆర్ను కలిసేందుకు షాపూర్జీ–పల్లోంజీ గ్రూప్కు చెందిన దివంగత బిజినెస్ టైకూన్ సైరస్ మిస్త్రీ వచ్చారని చెప్పారు. అప్పుడు తన తండ్రి షాపూర్జీ పల్లోంజీ గ్రూప్లో సబ్కాంట్రాక్టర్గా పనిచేసినట్లు కేసీఆర్ గుర్తుచేసుకోగా మిస్త్రీ ఆశ్చర్యపోయారని కేటీఆర్ పేర్కొన్నారు. సైరస్ మిస్త్రీ ఇంటికి వెళ్లిన తర్వాత రికార్డులు తిరగేసి ఫోన్ చేశారని, 1950–60 మధ్య కాలంలో పనిచేసినట్లు వివరించారన్నారు. ఎన్నికల్లో గెలిచేది మళ్లీ మేమే.. త్వరలో ఎస్టీ ఆంట్రప్రెన్యూర్స్ కోసం ఉత్పత్తుల పార్కు పెడతామని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఎల్లారెడ్డి మండలంలో ముగ్గురు దళితబంధు లబ్ధిదారులు రైస్మిల్లు పెట్టుకున్నారని చెప్పారు. అదేవిధంగా వాటర్ వర్క్స్ విభాగానికి దళితబంధు పథకం కింద 150 వాహనాలు పంపిణీ చేశామన్నారు. వచ్చే నెల 3న మరోసారి బీఆర్ఎస్ విజయం సాధించడం ఖాయమని, అప్పుడు మళ్లీ సక్సెస్ మీట్ జరుపుకుందామని చెప్పారు. సీఎం వల్లే ఎస్టీల ఎదుగుదల: సత్యవతి రాథోడ్ రాష్ట్రంలో గిరిజనులు పారిశ్రామికవేత్తలుగా ఎదుగుతున్నారని, సీఎం కేసీఆర్ విజన్ వల్లే ఇది సాధ్యమైందని మంత్రి సత్యవతి రాథోడ్ చెప్పారు. గతంలో అనేక పార్టీలు, ప్రభుత్వాలను చూశామని, కానీ గిరిజనులను ఎవరూ పట్టించుకోలేదన్నారు. గిరిజనులు చదువు తర్వాత ఉద్యోగం చేసే స్థాయి నుంచి ఉద్యోగ అవ కాశా లు కల్పించే స్థాయికి ఎదిగారని, గిరిజనులపై సీఎం కేసీఆర్కు ప్రేమ ఉందన్నారు. బీఆర్ఎస్ పాలన లోనే గిరిజన రిజర్వేషన్ పెంచుకోవడంతోపాటు మెడికల్, ఇంజనీరింగ్ కాలేజీల్లో ఎస్టీలకు మరిన్ని అవకాశాలు కల్పించామని, గిరిపుత్రులకు పోడు పట్టాలు అందించామని గుర్తుచేశారు. ప్రజలు ఆశీర్వదిస్తే మరింత అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తామని, ప్రతిపక్షాలకు అవకాశం ఇస్తే మనం నష్టపోతామని వ్యాఖ్యానించారు. -
మంత్రి ఈశ్వర్ వ్యాఖ్యలు హాస్యాస్పదం ఎమ్మెల్సీ జీవన్రెడ్డి
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్పై రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని, కాంగ్రెస్ పార్టీ దళితులకు ఏం చేసిందని ప్రశ్నించడం విడ్డూరంగా ఉందని ఎమ్మెల్సీ జీవన్రెడ్డి వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ హయాంలోనే దళితుల సంక్షేమం అమలైందన్న విషయాన్ని ఈశ్వర్ గుర్తుంచుకోవాలని అన్నారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వంలో దళితులకు ఎన్ని ఇళ్లు ఇచ్చారో, గత మూడేళ్లలో ఎంతమందికి దళిత, బీసీ, మైనార్టీ బంధు పథకాలు అమలు చేశారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఇందిరమ్మ ఇళ్లు కట్టిన ప్రాంతాల్లో తాము ఓట్లు అడుగుతామని, బీఆర్ఎస్కు దమ్ముంటే డబుల్బెడ్రూం ఇళ్లు కట్టిన చోట్ల ఓట్లు అడగాలన్నారు. గత నాలుగేళ్లుగా ఏమీ పట్టించుకోకుండా ఎన్నికల ముందు హడావుడి చేస్తున్న కేసీఆర్ ప్రభుత్వం పేదలకు ఒక్క రేషన్కార్డు కూడా ఇవ్వలేకపోయిందని విమర్శించారు. దళితుల జనాభా ఆధారంగా రిజర్వేషన్లు అమలు చేస్తామని కేసీఆర్ మాట తప్పారని, వాటిని తాము అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించడంతో ఆయన ఉలిక్కిపడుతున్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీని కాకుండా దళితులకు అన్యాయం చేసిన కేసీఆర్ను ఈశ్వర్ ప్రశ్నించాలని జీవన్రెడ్డి సూచించారు. -
ఇంఫాల్ లోయ ప్రశాంతం
ఇంఫాల్: మణిపూర్లో ప్రశాంతత నెలకొంటోంది. బుధవారం నుంచి మొదలైన హింసాత్మక ఘటనలు శుక్రవారం రాత్రి కూడా కొనసాగాయి. అయితే, శనివారం ఉదయం ఇంఫాల్ లోయలో దుకాణాలు, మార్కెట్లు తిరిగి తెరుచుకున్నాయి. రోడ్లపై వాహనాల రాకపోకలు మొదలయ్యాయని అధికారులు తెలిపారు. మైతి వర్గం ప్రజలకు ఎస్టీ హోదా ఇవ్వరాదంటూ బుధవారం చేపట్టిన ర్యాలీ సందర్భంగా మొదలైన హింసాత్మక ఘటనలు రాష్ట్రంలోని మిగతా ప్రాంతాలకూ వేగంగా వ్యాపించాయి. హింసాత్మక ఘటనల్లో చనిపోయిన వారి సంఖ్య శనివారానికి 54కు చేరుకోగా, క్షతగాత్రులు 200కు పైనేనని అధికారులు చెబుతున్నారు. వాస్తవానికి మరణాలు వందకు పైగానే ఉంటాయని అనధికార వర్గాల సమాచారం. ప్రభుత్వం, ఆర్మీ ఏర్పాటు చేసిన తాత్కాలిక షెల్టర్లలో సుమారు 13 వేల మంది తలదాచుకోగా కొందరు పొరుగునే ఉన్న మిజోరం, మేఘాలయ, నాగాలాండ్లకు తరలివెళ్లారు. రాష్ట్రంలోని ప్రధాన రహదారులు, కీలక ప్రాంతాల వద్ద పెద్ద సంఖ్యలో ఆర్మీ జవాన్లు, కేంద్ర బలగాల గస్తీ కొనసాగుతోంది. -
చదువు లేని భవిత పెద్ద సున్నా.. మీ జీవితాన్ని మార్చుకునే చక్కటి అవకాశం..
-
‘పరిశ్రమల స్థాపన’లో స్టాండ్–అప్ ఇండియా స్కీమ్ చేయూత
న్యూఢిల్లీ: క్షేత్ర స్థాయిలో పరిశ్రమల స్థాపనను ప్రోత్సహించడంలో స్టాండ్–అప్ ఇండియా పథకం కీలక పాత్ర పోషిస్తోంది. గడచిన నాలుగు సంవత్సరాల్లో ఈ పథకం కింద 1.80 లక్షల మంది లబ్ధిదారులకు బ్యాంకులు రూ.40,700 కోట్లకు పైగా మంజూరు చేశాయి. ఆర్థిక సాధికారత, ఉద్యోగ కల్పనపై దృష్టి సారించి 2016 ఏప్రిల్ 5, స్టాండ్ అప్ ఇండియా పథకం ప్రారంభమైంది. 2025 వరకూ దీనిని పొడిగించడం జరిగింది. ఎస్సీ, ఎస్టీలతో పాటు మహిళలు పరిశ్రమల స్థాపనకు రుణాలను ఇవ్వడానికి అన్ని బ్యాంకు శాఖలను ప్రోత్సహించడం ఈ పథకం లక్ష్యం. ఔత్సాహిక ఎస్సీ, ఎస్టీ వర్గాలు, మహిళలు పరిశ్రమలు సాధించాలన్న తమ కలను సాకారం చేసుకోవడంలో ఎదుర్కొనే సవాళ్లను గుర్తించడం, లక్ష్యాన్ని సాకారం చేయడానికి తగిన ప్రోత్సాహం అందించడం వంటి పలు అంశాలు ఈ పథకంలో ఇమిడి ఉన్నాయి. వ్యాపార రంగం, వ్యవసాయం, తయారీ వంటి రంగాల్లో ఆయా వర్గాలు ముందడుగు వేయడానికి ఈ పథకం ఎంతో దోహదపడుతున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. గర్వకారణం... 1.8 లక్షలకు పైగా మహిళలు, ఎస్సీ, ఎస్టీలు పారిశ్రామికవేత్తలుగా మారడానికి రూ. 40,600 కోట్లు మంజూరు చేయడం నాకు గర్వకారణం. సంతృప్తి కలిగించే విషయం. అన్ని షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకు శాఖల నుండి రుణాలను పొందడం ద్వారా కీలక వర్గాలు పారిశ్రామిక రంగంలోకి అడుగుపెట్టడానికి ఈ పథకం తగిన సహాయ సహకారాలను అందిస్తోంది. ఈ దిశలో ఒక సులభతర వాతావరణాన్ని ఏర్పాటు చేస్తోంది. – నిర్మలా సీతారామన్, ఆర్థికమంత్రి ఫైనాన్షియల్ ఇన్క్లూజన్ మూడవ స్తంభం స్టాండ్–అప్ ఇండియా పథకం.. నేషనల్ మిషన్ ఫర్ ఫైనాన్షియల్ ఇన్క్లూజన్ (అందరికీ ఆర్థిక ఫలాలు అందడం, వృద్ధి అన్ని వర్గాలకూ చేరడం) మూడవ స్తంభం. నిధులు లేని వారికి వాటిని అందించడం లక్ష్యంగా ఈ పథక రూపకల్పన జరిగింది. – భగవత్ కిసన్రావ్ కరాద్, ఆర్థిక శాఖ సహాయ మంత్రి -
ఉట్నూర్ ఐటీడీఏకి ‘తుడుందెబ్బ’
సాక్షి,ఆదిలాబాద్: ఎస్టీల్లో నుంచి లంబాడాలను తొలగించాలని ఇప్పటివరకు నిరసన కార్యక్రమాలు నిర్వహించిన ఆదివాసీలు తాజాగా ప్రభుత్వం వివిధ కులాలను ఎస్టీల్లో చేర్చడంపై ఆగ్రహావేశాలతో ఆందోళన ఉధృతం చేశారు. ఇటీవల జరిగిన శాసనసభ సమావేశాల్లో వాల్మీకిబోయ, ఖైతి లంబాడాతో పాటు మొత్తంగా 11 కులాలను షెడ్యూల్డ్ తెగల (ఎస్టీ) జాబితాలో చేరుస్తూ తీర్మానాన్ని ప్రవేశపెట్టడాన్ని ఆదివాసీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ ఐటీడీఏను ముట్టడించాలని ఆదివాసీ హక్కుల పోరాట సమితి (తుడుందెబ్బ) ముందుగా నిర్ణయించింది. రాష్ట్ర అధ్యక్షుడు బుర్సా పోచయ్య ఆధ్వర్యంలో సోమవారం ఆదివాసీలు మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఉట్నూర్ ఐటీడీఏ కార్యాలయం ఎదుట బైఠాయించారు. ఆ తర్వాత కార్యాలయంలోనికి చొచ్చుకెళ్లేందుకు యత్నించగా, పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య తోపులాట చోటుచేసుకుంది. సమీపంలో ఏర్పాటుచేసిన బారికేడ్లను తోసేసి ఆదివాసీలులోనికి దూసుకెళ్లారు. కార్యాలయం పైకి ఆందోళనకారులు రాళ్లు రువ్వారు. దీంతో కిటికీ అద్దాలు ధ్వంసం అయ్యాయి. ఆవరణలో ఉన్న ఏటీడబ్ల్యూఏసీ చైర్మన్ వాహన అద్దాలను ధ్వంసం చేశారు. అదనపు బలగాలతో చేరుకున్న ఎస్పీ పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఎస్పీ డి.ఉదయ్కుమార్ రెడ్డి అదనపు బలగాలతో ఉట్నూర్ చేరుకున్నారు. సమస్యలను కలెక్టర్కు విన్నవించాలని కోరారు. అయితే ఆందోళనకారులు ఐటీడీఏ పీవో రావాలని పట్టుబట్టారు. ప్రస్తుతం నిర్మల్ కలెక్టర్గా వ్యవహరిస్తున్న వరుణ్రెడ్డి ఉట్నూర్ ఐటీడీఏకు ఇన్చార్జి పీవోగా కొనసాగుతున్నారు. ఓ గంట తర్వాత ఆయన అక్కడికి చేరుకోవడంతో ఆదివాసీలు తమ సమస్యలను విన్నవించారు. ఎస్టీల్లో అదనంగా కులాలను చేర్చడాన్ని వెనక్కి తీసుకోవాలని డి మాండ్ చేశారు. పోడు భూములకు పట్టాల జారీలో షరతులు విదించడం సరికాదన్నారు. దీనిపై వినతి పత్రాన్ని అందజేశారు. ఆయన స్పందిస్తూ ప్రభు త్వం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. -
గుజ్జర్, బకర్వాల్, పహాడీ వర్గాలకు ఎస్టీ హోదా
రాజౌరీ(జమ్మూకశ్మీర్): జమ్మూకశ్మీర్లో వెనక బడిన వర్గాలైన గుజ్జర్, బకర్వాల్, పహాడీలకు ఎస్టీ హోదా కల్పిస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా హామీ ఇచ్చారు. జమ్మూకశ్మీర్ పర్యటనలో ఉన్న అమిత్ మంగళవారం రాజౌరీలో ఏర్పాటుచేసిన ఒక ర్యాలీలో ప్రసంగించారు. ‘ జస్టిస్ వర్మ కమిషన్ సిఫార్సుల మేరకు ఈ మూడు వర్గాల ప్రజలకు ఎస్టీ రిజర్వేషన్ ఫలాలు దక్కుతాయి. వీరికి కొత్తగా రిజర్వేషన్ ఇవ్వడం వల్ల ఇప్పటికే ఎస్టీ కోటా లబ్ధి పొందుతున్న వర్గాలకు ఎలాంటి నష్టం జరగబోదు. మూడేళ్ల క్రితం ఆర్టికల్ 370, ఆర్టికల్ 35–ఏ రద్దుచేశాక నేడు ఈ వర్గాలకు రిజర్వేషన్ కల్పించే అవకాశం వచ్చింది’ అని షా అన్నారు. ‘ఒక్క పహాడీలకే ఎస్టీ హోదా దక్కుతుందని కొందరు విష ప్రచారం చేసి గుజ్జర్, బకర్వాల్లను నిరసనలకు రెచ్చగొట్టారు. కానీ ఆ పాచికలు పారలేదు. గతంలో కేవలం మూడు కుటుంబాలే కశ్మీర్ను దశాబ్దాలపాటు ఏలాయి. ఇప్పుడు పంచాయతీ, జిల్లా మండళ్లకు జరిగిన పారదర్శకమైన ఎన్నికల ద్వారా 30 వేల మందికి తమ రాష్ట్రాన్ని ముందుకు నడిపించే అధికారమొచ్చింది’ అని రాష్ట్ర ప్రతిపక్ష పార్టీలను అమిత్ దుయ్యబట్టారు. ‘పునర్వ్యవస్థీకరణ తర్వాత రాజౌరీ, పూంచ్, దోడా, కిష్ట్వార్లలో సీట్లు పెరుగుతాయి. తర్వాతే రాష్ట్ర ఎన్నికలు ఉంటాయి. గతంలో రాష్ట్రానికొచ్చే కేంద్ర నిధులతో కొన్ని వర్గాలే లబ్ధి పొందేవి. ఇప్పుడా పరిస్థితి లేదు. శాంతి భద్రతల పరిస్థితి మెరుగుపడింది’ అని షా అన్నారు. సరిహద్దు జిల్లాలైన రాజౌరీ, పూంచ్లలో జనాభాలో 40 శాతం మంది బకర్వాల్, గుజ్జర్లే. పహాడీల జనాభా అతి స్వల్పం. 1991 ఏప్రిల్ నుంచి కశ్మీరీలు, డోగ్రాలకు 10 శాతం ఎస్టీ రిజర్వేషన్ ఫలాలు దక్కుతున్నాయి. తమకు రిజర్వేషన్ కల్పించాలని చాన్నాళ్లుగా పహాడీలు డిమాండ్ చేస్తుండగా గుజ్జర్, బకర్వాల్లు వ్యతిరేకిస్తున్నారు. 2020 జనవరి నుంచి ఉద్యోగాలు, విద్యా సంస్థల్లో పహాడీలకు 4 శాతం కోటా కల్పించారు. -
ఎస్టీ హోదా కోసం దేశవ్యాప్తంగా కుర్మీల ఆందోళన!
కోల్కతా/బరిపడ/రాంచీ: తమకు షెడ్యూల్ తెగ(ఎస్టీ) హోదా కల్పించాలని, కుర్మాలి భాషను రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లో చేర్చాలంటూ మంగళవారం కుర్మీలు చేపట్టిన ఆందోళనలతో బెంగాల్, బిహార్, జార్ఖండ్ రాష్ట్రాల్లో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ప్రజలు రైలు పట్టాలపై బైఠాయించడంతో ఆగ్నేయ రైల్వే 18 రైళ్లను రద్దు చేసింది. మరో 13 రైళ్లను వేరే మార్గాల్లోకి మళ్లించి, 11 రైళ్ల గమ్యస్థానాన్ని కుదించింది. ఆందోళన కారులు పురులియా వద్ద జాతీయ రహదారిని దిగ్బంధించారు. పొరుగునే ఉన్న ఒడిశాలోని మయూర్భంజ్ జిల్లాలో కూడా కుర్మీలు రైల్ రోకోలో పాల్గొన్నారు. ఇదీ చదవండి: జనరల్ కోటా నుంచే ఈడబ్ల్యూఎస్: కేంద్రం -
జీఎస్టీకి ఐదేళ్లు పూర్తి
న్యూఢిల్లీ: వాణిజ్య పన్నుల ఎగవేతలకు నివారించడం, దేశవ్యాప్తంగా ఒకటే పన్ను విధానం ఉండాలన్న లక్ష్యాలతో వచ్చిందే వస్తు సేవల పన్ను (జీఎస్టీ)చట్టం. దేశ చరిత్రలో అతిపెద్ద పన్ను సంస్కరణ అయిన జీఎస్టీ 2017 జూలై 1న అమల్లోకి రాగా, ఈ ఏడాది జూన్ 30తో ఐదేళ్లు పూర్తి చేసుకుంది. ఈ కాలంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్న నూతన పన్ను వ్యవస్థ అనుకున్న లక్ష్యం దిశగా నిదానంగా అడుగులు వేస్తోంది. గతంతో పోలిస్తే పన్ను ఎగవేతలు తగ్గాయి. టెక్నాలజీ సాయంతో ఎగవేతలను గుర్తించడం యంత్రాంగానికి సాధ్యపడుతోంది. ప్రతీ నెలా పన్నుల రూపంలో వచ్చే ఆదాయం సగటున రూ.1.3 లక్షల కోట్లపైనే ఉంటోంది. 17 రకాల పన్నులు, పలు సెస్సుల స్థానంలో వచ్చిందే జీఎస్టీ. ఇందులో 5, 12, 18, 28 రేట్ల శ్లాబులు ప్రస్తుతం అమల్లో ఉన్నాయి. వీటికి భిన్నంగా బంగారం ఒక్కదానిపై 3 శాతం రేటు అమలవుతోంది. గతంలో అయితే అన్నింటిపైనా వినియోగదారుల చెల్లించే సగటు పన్ను సుమారు 31 శాతంగా ఉండేది. లగర్జీ వస్తువులు, ఆరోగ్యానికి, పర్యావరణానికి హాని కలిగించే వాటిపై జీఎస్టీ కింద అదనంగా సెస్సు అమల్లో ఉంది. ఈ రూపంలో వచ్చిన మొత్తాన్ని ప్రత్యేకంగా పరిహార నిధి పేరుతో కేంద్రం నిర్వహిస్తోంది. జీఎస్టీ కారణంగా పన్ను ఆదాయాన్ని కోల్పోయిన రాష్ట్రాలకు ఈ సెస్సు నిధి నుంచి పరిహారాన్ని కేంద్రం చెల్లిస్తోంది. 2022 ఏప్రిల్ నెలకు వసూలైన రూ.1.68 లక్షల కోట్లు.. జీఎస్టీ చరిత్రలో గరిష్ట నెలవారీ పన్నుల ఆదాయంగా ఉంది. జీఎస్టీ కింద మొదటిసారి రూ.లక్ష కోట్ల పన్ను ఆదాయం 2018 ఏప్రిల్ నెలకు నమోదైంది. కరోనా కారణంగా 2020 ఏప్రిల్, మే నెలలకు పన్ను ఆదాయం గణనీయంగా పడిపోవడం గమనార్హం. శ్లాబుల క్రమబద్ధీకరణ మరోవైపు జీఎస్టీ శ్లాబులను క్రమబద్ధీకరించే ప్రతిపాదన కూడా ఉంది. 5 శాతం రేటును ఎత్తివేసి అందులోని వస్తు, సేవలను 8 శాతం శ్లాబులోకి తీసుకెళ్లాలన్నది ఒకటి. 12, 18 శాతం పన్ను రేట్లలో ఒకదాన్ని ఎత్తివేయడం కూడా పరిశీలనలో ఉంది. అలాగే, పెట్రోల్, డీజిల్, ఏటీఎఫ్, లిక్కర్లను కూడా జీఎస్టీ కిందకు తీసుకురావాలన్న డిమాండ్ సైతం ఉంది. కాకపోతే రాష్ట్రాలకు అధిక ఆదాయం వీటి రూపంలో వస్తున్నందున ఈ ప్రతిపాదనకు అవి సుముఖంగా లేవు. జీఎస్టీ వ్యవస్థ అమలును చూడడం, పన్ను రేట్ల సమీక్ష, ఇతర అంశాలను జీఎస్టీ కౌన్సిల్ చూస్తుంటుంది. ఇప్పటి వరకు జీఎస్టీ కౌన్సిల్ 47 విడతలుగా భేటీ అయింది. ఎన్నో ఉత్పత్తులు ఇప్పటి వరకు రేట్ల సవరణకు గురయ్యాయి. టెక్నాలజీతో లీకులకు చెక్ జీఎస్టీ యంత్రాగానికి కావాల్సిన సాంకేతిక సహకారాన్ని జీఎస్టీ నెట్వర్క్ అందిస్తోంది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), మెషిన్ లెర్నింగ్, తదితర ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం సాయంతో డేటాను విశ్లేషించడం ద్వారా, ఎగవేతలు, లీకేజీలకు అడ్డుకట్ట వేస్తోంది. మరింత సులభంగా ఉండాలి.. ఈ ఐదేళ్లలో జీఎస్టీ చట్టం కొంత పురోగతి సాధించినప్పటికీ.. పన్ను అంశాల పరంగా మరింత సరళంగా మారాలని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ (ఐటీసీ) అన్నది మొత్తం సరఫరా చైన్లో ఎటువంటి నష్టాల్లేకుండా, సాఫీగా సాగేందుకు జీఎస్టీ నిర్మాణం మరింత సరళంగా మారాలన్నది పన్ను నిపుణుల నుంచి వినిపిస్తున్న మాట. ‘‘గత ఐదేళ్లలో పన్ను చెల్లింపుదారులు ఎదుర్కొంటున్న ఎన్నో సమస్యలకు సకాలంలో వివరణలు, సవరణల చేయడం ద్వారా జీఎస్టీ చట్టం అభివృద్ధి చెందింది. అయినప్పటికీ అవాంఛనీయ షోకాజు నోటీసులను నివారించే దిశగా జీఎస్టీ కౌన్సిల్, ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. బలమైన, టెక్నాలజీతో కూడిన ఏకీకృత అసెస్మెంట్ కార్యక్రమం ఉండాలి’’అని బీడీవో ఇండియా పార్టనర్ జీ ప్రభాకరన్ పేర్కొన్నారు. ‘‘వివాదాలను తగ్గించాల్సి ఉంది. ఇందుకు అస్పష్టమైన నిబంధనలను మార్చాలి. బీపీవో/కేపీవో ఇంటర్మీడియరీకి అర్హత సాధిస్తాయా, భవనాలకు సంబంధించి చేసే మూలధన నిధులపై పన్ను జమ, ఎక్స్ట్రా న్యూట్రల్ ఆల్కహాల్ పై జీఎస్టీ లెవీ ఇలా వివిధ రంగాలకు సంబంధించిన అంశాలను పరిష్కరించాలని వ్యాపారులు కోరుకుంటున్నారు’’అని ఏఎంఆర్జీ అండ్ అసోసియేట్స్ సీనియర్ పార్ట్నర్ రజత్ మోహన్ తెలిపారు. అలాగే, పెట్రోల్, డీజిల్, ఏటీఎఫ్ లను కూడా జీఎస్టీ కిందకు తీసుకొస్తే కంపెనీలకు వ్యయాలు తగ్గుతాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. -
మార్చి 26న ఎన్హెచ్ఆర్సీ బహిరంగ విచారణ
సాక్షి, హైదరాబాద్: జాతీయ మానవ హక్కుల కమిషన్ మార్చి 26న హైదరాబాద్లో బహిరంగ విచారణ నిర్వహించనున్నట్లు బుధవారం ఓ ప్రకటనలో తెలిపింది. షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలకు చెందిన వారెవరైనా ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యా నికి గురైనా, వివక్షకు గురికాబడిన వారి నుంచి ఫిర్యాదులు, వినతులు స్వీకరించనున్నట్లు పేర్కొంది. బాధితులు రిజిస్టర్ పోస్టు లేదా ఈ మెయిల్/ ఫ్యాక్స్ ద్వారా వినతులు సమర్పించవచ్చని ఎన్హెచ్ఆర్సీ సూచించింది. ఫిర్యాదు చేయదలచిన వారు మార్చి 13వ తేదీలోపు registrar & nhrc@nic.in, jrlawnhrc@nic.in మెయిల్ చేయాలని 011–24651332, 34 నంబర్లకు ఫ్యాక్స్ చేయవచ్చన్నారు. రిజిస్టర్ పోస్టు చేయాలనుకునేవారు టు రిజిస్ట్రార్, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్, మానవ్ అధికార్ భవన్ బ్లాక్, జీపీఓ కాంప్లెక్స్, ఐఎన్ఏ, న్యూఢిల్లీ, 110023 చిరునామా కు పంపాలని సూచించింది. -
సబ్సిడీల కోసం వ్యాపారాలు చేయొద్దు
సాక్షి, హైదరాబాద్: సబ్సిడీల కోసం కాకుండా ఆసక్తి, పట్టుదలతో వ్యాపారాలు చేస్తే రాణిస్తారని, అలాంటి వారి కోసం రాష్ట్రంలోని ఇండస్ట్రీయల్ పార్కుల్లో అవకాశాలు ఎదురు చూస్తున్నాయని పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కె.తారక రామారావు అన్నారు. రాష్ట్రంలో ఏర్పాటు చేసిన ఇండస్ట్రియల్ పార్కుల్లో గ్రామీణ యువత, మహిళలు, దళితులు, గిరిజనులకు ప్రత్యేకంగా రిజర్వేషన్లు అమలు చేస్తున్నామని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. గురువారం ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ)లో గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సీఎం ఎస్టీ ఎంట్రప్రెన్యూర్ అండ్ ఇన్నోవేషన్ పథకం కింద 2019 బ్యాచ్ కోసం ఎంపిక చేసిన 100 మంది గిరిజన ఔత్సాహిక పారిశ్రామికవేత్తల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రి కేటీఆర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. విద్య, తెలివి, వ్యాపారం ఎవరి సొత్తూ కాదని, పట్టుదల ఉంటే అందరూ పారిశ్రామికవేత్తలు కాగలరని, ఇప్పటికే కొందరు ఔత్సాహిక యువ గిరిజన పారిశ్రామికవేత్తలు దీనిని నిరూపించారన్నారు. గిరిజన ఔత్సాహిక పారిశ్రామికవేత్తల కార్యక్రమంలో పాల్గొన్న తృప్తి ఎప్పుడూ కలగలేదని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఐఎస్బీలో శిక్షణ పొంది, ప్రభుత్వ సాయంతో ఏర్పాటయ్యే పరిశ్రమల ప్రారంభోత్సవానికి తనతోపాటు సెలబ్రిటీలనూ వెంట తీసుకొస్తానని అన్నారు. చిన్న, మధ్య తరహా పరిశ్రమల వల్లే 70 శాతం ఉపాధి, ఉద్యోగాలు లభిస్తున్నాయని, ఈ పరిశ్రమలను కాపాడేందుకు ప్రభుత్వం అండగా ఉంటుందని అన్నారు. ఐఎస్బీలో నిలబడే అవకాశమిచ్చారు: సత్యవతి రాథోడ్ గిరిజనులను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రారంభించిన ‘సీఎం ఎస్టీ ఎంట్రప్రెన్యూర్ అండ్ ఇన్నొవేషన్ స్కీం’ద్వారా ఐఎస్బీలో నిలబడి మాట్లాడే అవకాశం గిరిజనులకు దక్కిందని గిరిజన శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. సమావేశంలో గిరిజన సంక్షేమ కార్యదర్శి బెన్హర్ మహేశ్దత్ ఎక్కా, కమిషనర్ డాక్టర్ క్రిస్టినా చోంగ్తు, ఎస్బీఐ డీజీఎం దేబాశిష్ మిశ్రా, ఐఎస్బీ డీన్ రాజేంద్ర శ్రీవాస్తవ పాల్గొన్నారు. -
కలవరపెట్టిన పాక్ సబ్మెరైన్
న్యూఢిల్లీ: పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్తాన్లోని బాలాకోట్లో ఉన్న జైషే మొహమ్మద్ ఉగ్రస్థావరంపై భారత్ ఫిబ్రవరి 26న వైమానికదాడులు చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా పాకిస్తాన్కు చెందిన అత్యాధునిక సబ్మెరైన్ ఒకటి భారత అధికారులను తీవ్రంగా కలవరపెట్టింది. చాలాకాలం నుంచి భారత్ పాక్ నేవీ కదలికలపై నిఘా ఉంచుతోంది. ఈ క్రమంలో బాలాకోట్ దాడుల తర్వాత పాక్ ఎలాంటి దుస్సాహసానికి పాల్పడకుండా 60కిపైగా యుద్ధనౌకలు, విమానవాహక యుద్ధనౌక ఐఎన్ఎస్ విక్రమాదిత్యను అంతర్జాతీయ సముద్ర జలాల్లో మోహరించింది. ఈ నేపథ్యంలో పాక్ నేవీకి చెందిన అగొస్టా క్లాస్ సబ్మెరైన్ ‘పీఎన్ఎస్ సాద్’ కరాచీకి సమీపంలో అదృశ్యమైపోయింది. ‘ఎయిర్ ఇండిపెండెంట్ ప్రపల్షన్’ సాంకేతికత ఉన్న ఈ పీఎన్ఎస్ సాద్ మిగతా సబ్మెరైన్ల కంటే ఎక్కువరోజులు సముద్రగర్భంలో ఉండిపోగలదు. దీంతో భారత్పై దాడికి పాక్ పీఎన్ఎస్ సాద్ ను పంపిందన్న అనుమానం భారత అధికారుల్లో బలపడింది. పీఎన్ఎస్ సాద్ గుజరాత్ తీరానికి 3 రోజుల్లో, ముంబైకి 4 రోజుల్లో చేరుకోగలదని నేవీ నిపుణులు అంచనా వేశారు. దాన్ని అడ్డుకునేందుకు అణు సబ్మెరైన్ ఐఎన్ఎస్ చక్ర, ఐఎన్ఎస్ కల్వరితో పాటు పీ–8ఐ విమానాలను రంగంలోకి దించారు. వీటితోపాటు ఉపగ్రహాల సాయంతో 21 రోజుల పాటు గాలించారు. భారత జలాల్లో ప్రవేశించి లొంగిపోకుంటే సాద్ను పేల్చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. చివరికి 21 రోజుల తర్వాత పాక్కు పశ్చిమాన ఉన్న సముద్రజలాల్లో పీఎన్ఎస్ సాద్ను భారత నేవీ గుర్తించింది. ఈ విషయమై నేవీ అధికార ప్రతినిధి కెప్టెన్ డీకే శర్మ మాట్లాడుతూ.. భారత్తో యుద్ధం తలెత్తితే రహస్యంగా దాడి చేసేందుకు పాక్ సాద్ను వ్యూహాత్మకంగా అక్కడ మోహరించిందని తెలిపారు. కానీ భారత దూకుడు, అంతర్జాతీయ ఒత్తిడిలతో పాక్ తోకముడిచిందని వెల్లడించారు. దీంతో మక్రాన్ తీరంలోనే ïసాద్ అగిపోయిందని పేర్కొన్నారు. -
గిరిపుత్రుల గుండెల్లో వైఎస్
సాక్షి, బుట్టాయగూడెం: పేదరిక నిర్మూలనే ధ్యేయంగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి చిత్తశుద్ధితో ఎనలేని కృషి చేశారు. ఎస్సీ, ఎస్టీల అభివృద్ధికి వైఎస్సార్ చేసిన కృషి ఎన్నటికీ మరువలేనిది. కూలీలుగా ఉన్న వారికి భూములు ఇచ్చి ఆ భూముల్లో మోటార్లు వేయించడంతో పాటు వాటికి విద్యుత్ కనెక్షన్లు ఏర్పాటు చేసి, ఉచిత కరెంట్ ఇచ్చారు. దీంతో కూలీలు రైతులుగా మారారు. జిల్లాలో అర్హులైన నిరుపేదలకు 30 వేల ఎకరాల భూపంపిణీ చేశారు. ఇందిరప్రభ పథకం ద్వారా బోర్లు వేసి విద్యుత్ సౌకర్యం కల్పించి ఇచ్చారు. దీంతో బీడు భూములు సైతం సాగుకు యోగ్యంగా మారి పచ్చని పంటలతో కళకళలాడుతూ సస్యశ్యామలంగా కనిపిస్తున్నాయి. ఏజెన్సీలో 15 వేల ఎకరాల పంపిణీ గిరిజన ప్రాంతంలో తరతరాలుగా భూములు లేక కూలీలుగానే జీవిస్తున్న వారికి వైఎస్ రాజశేఖర్రెడ్డి పోలవరం నియోజకవర్గంలో సుమారు 15 వేల ఎకరాల వరకు భూములు పంచి వాటికి పట్టాలు ఇచ్చారు. ఆ భూముల్లో పంటలు పండించుకుని దినదినాభివృద్ధి చెందుతున్న గిరిజన చిన్న, సన్నకారు రైతులు వైఎస్సార్ను దేవుడుగా కొలుస్తున్నారు. సెంటు భూమి ఇవ్వని చంద్రబాబు రాజన్న అకాల మరణం తరవాత పేదోడికి సెంటు భూమి పంచి ఇచ్చే నాథుడే లేరంటూ ఆదివాసీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రాంతంలో సుమారు 2 వేల మందికి పైగా అటవీ హక్కుల చట్టంలో భూముల పట్టాల కోసం దరఖాస్తులు చేసుకున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడంటూ గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ ప్రభుత్వ ఐదేళ్ల పాలనలో జానెడు భూమి పంచలేదని గిరిపుత్రులు విమర్శిస్తున్నారు. పేదల బతుకుల్లో వెలుగులు నిండాలంటే రాజన్న బిడ్డ జగన్మోహన్ రెడ్డి రావాలని, ముఖ్యమంత్రి కావాలని వారు కోరుకుంటున్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి పాదయాత్రలో భాగంగా గోపాలపురం నియోజకవర్గంలోని ప్రకాశరావుపాలెం సమీపంలో గిరిజన ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గిరిజనులకు అండగా ఉంటానని గిరిజన ప్రాంత సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు. దీంతో జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయితే తమ బతుకులు మరింత మారతాయని ఆదివాసీలు ఆశిస్తున్నారు. వైఎస్ చలవతోనే భూమి దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి నాకు 5 ఎకరాల భూమిని పంచి ఇవ్వడంతో పాటు ఆ భూముల్లో బోర్లు వేసి ఉచిత విద్యుత్ సౌకర్యం కల్పించడం వల్ల ఆ భూముల్లో ప్రత్తి, మొక్కజొన్న, బెండ, కంది వంటి పంటలు పండిస్తున్నాను. వ్యవసాయ కూలీగా ఉన్న నేను రైతుగా మారతానని కలలో కూడా అనుకోలేదు. వైఎస్ కుటుంబానికి ఎప్పటికీ రుణపడి ఉంటాను. – ముచ్చిక బేబి, గిరిజన మహిళా రైతు, మర్లగూడెం ఇందిర ప్రభలో నీటి సదుపాయం రాజశేఖరరెడ్డి పాలనలో మాకు వ్యవసాయ పోడు భూములకు రెండెకరాలకు పట్టా ఇచ్చి హక్కు కల్పించారు. అదేవిధంగా సాగునీటి ఇబ్బందులు రాకుండా ఇందిర ప్రభ పథకంలో నీటి సదుపాయం కూడా కల్పించారు. ఆ భూముల్లో వరి, మొక్కజొన్న, ప్రత్తి పంటలు వేసుకుంటూ ఆదాయ వనరులను పెంచుకుంటున్నాం. భూమికి హక్కు పత్రం ఇవ్వడం వల్ల వ్యవసాయ రుణం పొందేందుకు కూడా అవకాశం కలిగింది. – మడకం రాజు, గిరిజన రైతు, లంకాలపల్లి, బుట్టాయగూడెం మండలం ఐదేళ్లుగా పట్టాలు రాలేదు మా గ్రామంలోని భూమిలేని 24 మంది గిరిజనులకు కుటుంబానికి 2 ఎకరాల చొప్పున వైఎస్ రాజశేఖరరెడ్డి భూములిచ్చారు. ఆ సమయంలో 12 మంది దరఖాస్తులు చేసుకోగా పట్టాలు వచ్చాయి. వైఎస్సార్ మరణం తర్వాత మిగిలిన 12 మంది దరఖాస్తులు పెట్టుకున్నా ఇంతవరకూ పట్టాలు రాలేదు. వైఎస్సార్ ఉంటే ఎప్పుడో పట్టాలొచ్చేవి. జగన్ ముఖ్యమంత్రి అయితేనే పోడు భూములకు పట్టాలొస్తాయని నమ్ముతున్నాం. – పెనువెల్లి సోమరాజు, రైతు, బండార్లగూడెం, బుట్టాయగూడెం మండలం -
అట్టుడుకుతున్న అరుణాచల్
ఇటానగర్: అరుణాచల్ప్రదేశ్లో ఎస్టీలు కాని ఆరు సామాజికవర్గాలకు శాశ్వత నివాస పత్రాలు(పీఆర్సీ) జారీచేయాలన్న హైపర్ కమిటీ సిఫార్సుతో ఆ రాష్ట్రం అట్టుడుకుతోంది. ఈ ప్రతిపాదనలను వ్యతిరేకిస్తూ ఆందోళనకారులు ఆదివారం చేపట్టిన ర్యాలీ హింసాత్మకంగా మారింది. ఆందోళనకారులు ముఖ్యమంత్రి పెమా ఖండూ ప్రైవేటు నివాసంలోకి దూసుకెళ్లేందుకు యత్నించగా, పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అల్లరిమూకలు అధికారులపై రాళ్లవర్షం కురిపించాయి. దీంతో పోలీసులు కాల్పులు జరపగా, ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురు గాయపడ్డారు. అంతకుముందు డిప్యూటీ సీఎం చౌనా మైన్ ఇంటిపై దాడిచేసి భవనానికి నిప్పుపెట్టారు. అనంతరం డిప్యూటీ కమిషనర్ ఆఫీసుపై దాడిచేసి విలువైన వస్తువులను ఎత్తుకెళ్లారు. డిప్యూటీ కమిషనర్ ఆఫీసు ప్రాంగణంలోని వాహనాలకు నిప్పంటించారు. ఇటానగర్ పోలీస్స్టేషన్పై సైతం దాడిచేశారు. నహర్లగున్ జిల్లాలో మార్కెట్ కాంప్లెక్స్కు నిప్పుపెట్టడంతో పాటు ఓ షాపింగ్మాల్ను లూటీ చేశారు. రాష్ట్రంలోని నమ్సాయి, చాంగ్లాంగ్ జిల్లాల్లో ఉంటున్న ఆరు ఎస్టీయేతర సామాజికవర్గాలకు పీఆర్సీ ఇవ్వాలని ప్రభుత్వం ఏర్పాటుచేసిన కమిటీ సిఫార్సు చేసింది. కాగా, ఆందోళనల నేపథ్యంలో పీఆర్సీ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోబోమని సీఎస్ సత్యగోపాల్ తెలిపారు. -
వరించి వచ్చింది.. సర్పంచ్ కానుంది..
గోవిందరావుపేట : ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఆ గ్రామం ఏజన్సీ పరిధిలో ఉంది.. కానీ గ్రామంలో ఒక్క ఎస్టీ కుటుంబం కూడా లేదు.. కొద్దినెలల క్రితం గ్రామానికి చెందిన యువకుడు ఎస్టీ యువతి బానోతు లల్లిని ప్రేమించి పెళ్లి చేసుకుని గ్రామంలో కాపురానికి తీసుకురాగా ప్రియుడిని వరించి వచ్చిన ఆ యువతి నేడు సర్పంచ్ పీఠం ఎక్కనుంది. గోవిందరావుపేటలోని కోటగడ్డ గ్రామాన్ని ప్రభుత్వం నూతన గ్రామపంచాయతీగా గుర్తించింది. గతంలో లక్నవరం(దుంపెల్లిగూడెం) గ్రామపంచాయతీలో భాగమైన కోటగడ్డకు సంబంధించిన వార్డు సభ్యులలో ఎస్టీ రిజర్వేషన్ వస్తే దుంపెల్లిగూడెంకు చెందిన వారే పోటీ చేసేవారు. గ్రామాన్ని కొత్తగా ఏర్పాటు చేయగా ఇక్కడ ఒక్క ఎస్టీ కుటుంబం కూడా లేకపోవడం గమనార్హం. ప్రేమించి ప్రియుడితో వచ్చిన ఎస్టీ యువతి జనగామ జిల్లా తరిగొప్పుల మండలం అంక్షాపూర్ గ్రామానికి బానోతు సోమ్లా, లక్ష్మిల ఏడుగురు సంతానంలో ఐదో సంతానమైన లల్లి గతేడాది వేములవాడకు వచ్చిన క్రమంలో కోటగడ్డ గ్రామానికి చెందిన ననుబోతుల రాజ్కుమార్ దైవదర్శనానికి వచ్చి పరిచయమయ్యాడు. ఇరువురి మనసులు కలిసి వివాహం చేసుకునేందుకు నిర్ణయించుకుని గతేడాది మార్చి 23న పెళ్లి చేసుకున్నారు. తల్లి పూర్తిగా అంగీకారం తెలుపకపోయినా ప్రియుడిని నమ్మి అతడి వెంట కోటగడ్డకు వచ్చి పూరిగుడిసెలో కాపురముంటుంది. ఈ క్రమంలో కొత్తగా గ్రామపంచాయతీ ఏర్పడడం, గ్రామంలో ఆమె ఒక్కతే ఎస్టీ మహిళ ఉండడంతో త్వరలో జరుగనున్న ఎన్నికల్లో ఆమె ఏకగ్రీవంగా ఎన్నిక కానుంది. వార్డు సభ్యులకు తిప్పలే.. ఏజన్సీ గ్రామపంచాయతీ కావడంతో గ్రామంలో మొత్తం ఆరు వార్డులకు గాను మూడు వార్డులను ఎస్టీలకు కేటాయించారు. అయితే గ్రామంలో మరో ఎస్టీ లేకపోవడంతో ఏం చేయాలో పాలుపోని పరిస్థితి నెలకొంది. దీనికి సంబంధించి అధికారుల నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నట్లు గ్రామస్థులు తెలిపారు. అదృష్టం కలిసి వచ్చింది.. మా ఇద్దరి మధ్య ప్రేమతో పెళ్లి చేసుకుని కోటగడ్డకు అత్తగారింటికి వచ్చాను. ఎస్సెస్సీ వరకు చదువుకున్నాను. ఇక్కడ రిజర్వేషన్ వల్ల అదృష్టం కలిసి వచ్చింది. గ్రామ పెద్దలు వచ్చి విషయం చెప్పారు. సర్పంచ్గా ఎన్నికైతే గ్రామ పెద్దలతో కలిసి గ్రామ అభివృద్ధికి పనిచేస్తాం. – బానోతు లల్లి, కోటగడ్డ -
ఉద్యోగుల పిల్లలకూ రిజర్వేషన్లా?
న్యూఢిల్లీ: ఉన్నతోద్యోగాల్లో ఉన్న ఎస్సీ, ఎస్టీల పిల్లలు, కుటుంబీకులకు ప్రభుత్వ ఉద్యోగాల పదోన్నతుల్లో రిజర్వేషన్లు కల్పించడం వెనక హేతుబద్ధత ఏంటని సుప్రీంకోర్టు కేంద్రాన్ని ప్రశ్నించింది. క్రీమీలేయర్ను ఎస్సీ, ఎస్టీలకు ఎందుకు వర్తింపజేయరని నిలదీసింది. ‘ పదోన్నతుల్లో రిజర్వేషన్ల వల్ల ఫలానా వ్యక్తి ఓ రాష్ట్రానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అయ్యాడునుకోండి. ఆయన కుటుంబ సభ్యులను దళితులుగా భావించి వారికీ పదోన్నతుల్లో రిజర్వేషన్లు కల్పించడం సహేతుకమేనా? దాని వల్ల వారి సీనియారిటీ సైతం త్వరగా పెరుగుతుందిగా’ అని కోర్టు సందేహం వ్యక్తం చేసింది. గురువారం రోజంతా జరిగిన విచారణకు హాజరైన అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్, అడిషనల్ సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, పలువురు సీనియర్ లాయర్లు పదోన్నతుల్లో ఎస్సీ, ఎస్టీలకు కోటా అమలును సమర్థించారు. ఈ రిజర్వేషన్లు దాదాపుగా నిలిచిపోవడానికి కారణమైన 2006 నాటి ఎం.నాగరాజ్ కేసు తీర్పును సమీక్షించాలని కోరారు. కానీ, సీనియర్ లాయర్ శాంతిభూషణ్, మరో సీనియర్ లాయర్ రాజీవ్ ధావన్ ఈ కోటాను వ్యతిరేకించారు. రిజర్వేషన్ల వల్ల ఉద్యోగ అవకాశాల్లో సమానత్వపు హక్కు ఉల్లంఘనకు గురవుతోందని ఆరోపించారు. ‘ఒక వ్యక్తి క్లాస్–1 అధికారి అయితే, ఇక అతను ఎంతమాత్రం వెనకబడిన తరగతికి చెందడు. కానీ రాజకీయ పార్టీలు దళితులను ఓటుబ్యాంకుగానే పరిగణిస్తున్నాయి’ అని శాంతి భూషణ్ అన్నారు. త్రిపుర, బిహార్, మధ్యప్రదేశ్ లాయర్లు కోటాకు మద్దతుగా వాదించారు. -
లంబాడాలను ఎస్టీల్లో చేర్చడాన్ని వ్యతిరేకిస్తూ సుప్రీంలో పిటిషన్
-
దళితవాడల దరహాసం
కొత్త కోణం పదవీ విరమణ చేసి 24 ఏళ్లు పూర్తయ్యాయి. 84 ఏళ్ల వయసులో కూడా ఈ వర్గాల కోసం ఆయన నిరంతరం తపిస్తూనే ఉన్నారు. దేశంలోనే అణచివేతకు గురౌతున్న వర్గాలకు సమస్యలు ఎదురైనప్పుడల్లా గొంతులేని వారి పక్షాన ప్రతిస్పందించే తొలి స్వరం పి.ఎస్. కృష్ణన్దే. ముఖ్యంగా గత నాలుగు సంవత్సరాలుగా బీజేపీ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీల సంక్షేమం పట్ల చూపుతోన్న నిర్లక్ష్యాన్నీ, దళితులపై, ఆదివాసీలపై జరుగుతున్న దాడులనూ ఎలుగెత్తి చాటుతూ తన ఉత్తరాల ద్వారా, ప్రభుత్వాన్ని తట్టిలేపుతున్నవారు కృష్ణన్. దళితులను తాకిన తెమ్మెరలు సైతం మలినమౌతాయని వారి నివాసాల జాడలను ఊరవతలికి తరమికొట్టిన కుత్సితపు కుల వ్యవస్థ మనది. అటు పాలకుల నిర్లక్ష్యానికీ, ఇటు సామాజిక వెలివేతకు గురై నిచ్చెనమెట్ల కులవ్యవస్థలో ఆఖరిమెట్టు నుంచి కూడా అగాథాల్లోకి జారిపోతోన్న దళితులను అప్పుడప్పుడూ ఓ ఆపన్నహస్తం ఆదుకుంటూ ఉంటుంది. మలినపడిన జాతుల వేలి కొసలను పట్టుకొని పైకి లాగేందుకు మరపురాని సాహసాలు చేసిన ముగ్గురిని తెలుగు సమాజం ఎప్పటికీ స్మరించుకుంటుంది. నిరాడంబరుడూ, నిత్య దళిత విముక్తి కాముకుడూ ఎస్.ఆర్. శంకరన్ అటువంటి వారిలో ఒకరు. మరొకరు కె. ఆర్. వేణుగోపాల్. ఆ కోవకే చెందిన వారు మాజీ ఐఏఎస్ అధికారి పి.ఎస్. కృష్ణన్. ‘బడుగు బలహీన వర్గాల పట్ల అమిత పక్షపాతం, కులాంతర వివాహాలు జరగాలంటూ పట్టుదలగా వాదించటం, మత మౌఢ్యాలను తిప్పి కొట్టేందుకు తన సంస్కృత పరిజ్ఞానాన్ని వినియోగించడం, గ్రామాధికారులకన్నా గ్రామస్తుల మాటలను విశ్వసించడం, అన్యాయాలను ధిక్కరించే శక్తులకు చేయూతనివ్వడం..’ కృష్ణన్ గురించి ఆయన ఉద్యోగ జీవితపు ఆరంభదశలో పై అధికారి రాసిన రహస్య నివేదికలో మాటలివి. ఎవరీ కృష్ణన్? 1932 డిసెంబర్ 30వ తేదీన కేరళలోని తిరువనంతపురంలో ఆయన జన్మించారు. పి.ఎల్. సుబ్రహ్మణ్యన్, ఈతల్లి అన్నపూర్ణల కుమారుడు. అక్కడే హైస్కూల్ చదువు కొనసాగించారు. ట్రావెన్కోర్ విశ్వవిద్యాలయం నుంచి తత్వశాస్త్రంలో బీఏ పట్టా, మద్రాసు క్రిస్టియన్ కాలేజీ (మద్రాసు యూనివర్సిటీ) నుంచి ఇంగ్లిష్ సాహిత్యంలో ఎంఏ పట్టా తీసుకున్నారు. ఐఏఎస్కు ఎంపిక కావడానికి ముందు తమిళనాడులోని కాంచీపురంలో పచియప్ప కళాశాలలో ఇంగ్లిష్ అధ్యాపకునిగా పనిచేశారు. తెలుగు నేలకు సుపరిచితులు భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు ముందు హైదరాబాద్ కేడర్ ఐఏఎస్ అధికారిగా ఎంపికైన కృష్ణన్, 1956లో ఆంధ్రప్రదేశ్ అవతరించినప్పుడు తెలుగుగడ్డపై తొలిసారి అడుగుపెట్టారు. వివిధ హోదాల్లో పనిచేసిన అనంతరం కృష్ణన్ భారత ప్రభుత్వ కార్యదర్శిగా నియమితులయ్యారు. సివిల్ సర్వీసెస్లోకి అడుగుపెట్టిన కృష్ణన్కి కుల వ్యవస్థను అర్థం చేసుకోవడానికి ఎంతో కాలం పట్టలేదు. ఆయన కుల వ్యతిరేక భావాల మూలాలు కేరళ సామాజిక ఉద్యమాలవే. ఆయన తండ్రి సుబ్రహ్మణ్యన్ నుంచే ఎన్నో విషయాలను నేర్చుకున్నారు. 1942లో ౖ‘టెమ్స్ ఆఫ్ ఇండియా’ పత్రిక చదివి అస్పృశ్యుల గురించి తెలుసుకున్నట్టు ఆయన ఒక సందర్భంగా చెప్పారు. అప్పుడాయన వయసు పదేళ్లు. అప్పుడే డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ గురించి కూడా తెలుసుకున్నారు. అంబేడ్కర్ సామాజిక నేపథ్యం, ఆయన పోరాటాలను గురించి తండ్రిని అడిగి తెలుసుకునేవారు కృష్ణన్. తండ్రి భావాలే తనను అస్పృశ్యతా వ్యతిరేకిగా మార్చినట్టు కూడా ప్రకటించుకున్నారు. కేరళలో సాగిన నారాయణ గురు సాంస్కృతిక ఉద్యమం, అయ్యంకాళి నడిపిన సామాజిక ప్రతిఘటనోద్యమం కృష్ణన్ను సామాజిక మార్పు వైపు నడిపించేందుకు ఉపయోగపడ్డాయి. ఆ స్ఫూర్తే భారత ప్రభుత్వ అధికారిగా ఎటువంటి అడ్డంకులనైనా ఎదుర్కొనే శక్తిని కృష్ణన్కు అందించింది. అది మొదలు సమాజంలో అణచివేతకూ, వివక్షకూ గురౌతోన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల సంక్షేమం కోసం నిరంతరం తపించారు. ఐఏఎస్ శిక్షణ పూర్తయిన తరువాత కృష్ణన్ మొట్టమొదట ఉద్యోగ బాధ్యతలు నిర్వహించినది అనంతపురం జిల్లా రాయదుర్గం తాలూకాలోనే. అక్కడ తహసీల్దారుగా నియమితులయ్యారు. అప్పుడే ఆ తాలూకాలో దళితులు సాగుచేసుకుంటున్న భూములకు పట్టాలు అందజేశారు. తాటిచర్ల అనే గ్రామంలో దళితవాడలో మూడురోజులు గడిపారు. దేవాలయం ముందర ఖాళీ స్థలంలో ఒక టెంట్ వేసుకొని దళితులతోనే కలసి తింటూ, వారి సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకున్నారు. రెక్కాడితేగానీ డొక్కాడని ఆ దళిత కుటుంబాలు ఈయనకు అన్నం పెడితే ఆ ఇళ్లలో ఒకరికి భోజనం ఉండదు. అది గమనించిన కృష్ణన్ భోజనానికి డబ్బులు చెల్లించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నక్సలైట్ ఉద్యమాలు ఊపిరి పోసుకుంటున్న సమయంలో (1964– 69 మధ్యకాలం) ఖమ్మం, తూర్పుగోదావరి జిల్లాల్లో కలెక్టర్గా పనిచేశారు. అదే సమయంలో ఆదివాసీ భూముల రక్షణ కోసం, అన్యాక్రాంతమైన భూములను ఆదివాసీలకే అప్పగించడం కోసం ఉనికిలో ఉన్న చట్టాలను కఠినంగా అమలుచేసిన అధికారిగా ఆయనకు పేరుంది. చట్టాలలోని లోపాలను సరిచేసే ప్రయత్నం కూడా చేశారు. దళిత వాడల్లోనే బస అప్పటివరకు అధికారులు దళిత వాడలకెళ్లడమే విచిత్రం. కానీ కృష్ణన్ దళిత వాడల్లోనే బసచేసి, వారి తిండే తిని ప్రభుత్వాధికారులకు ఆనాడే మార్గదర్శకంగా నిలిచారు. ఈ అనుభవం కేంద్ర ప్రభుత్వంలో బాధ్యతలు తీసుకున్న తరువాత ఎంతగానో ఉపయోగపడింది. ముఖ్యంగా ఎస్సీ కుటుంబాలు, వాడలు అభివృద్ధికి నోచుకోకపోవడానికి కుల అసమానతలతో పాటు ప్రభుత్వం కేటాయిస్తున్న నిధులు ఆ వాడల దరిదాపుల్లోకి చేరడం లేదనే విషయాన్ని ఆయన గ్రహించారు. అందువల్లనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ ప్రణాళికా బడ్జెట్లో జనాభా దామాషా ప్రకారం ఎస్సీ, ఎస్టీల అభివృద్ధికి ఖర్చు చేయాలనే విషయాన్ని అర్థం చేసుకున్నారు. అందుకు గాను ఎస్సీల కోసం స్పెషల్ కాంపోనెంట్ ప్లాన్ రూపకల్పన చేసి, దాన్ని ప్రభుత్వ విధానంగా మార్చడానికి కృషి చేసిన దార్శనికుడు కృష్ణన్. మొరార్జీ దేశాయ్ ప్రధానిగా ఉన్నప్పుడు 1978లో ఈ పథకానికి శ్రీకారం చుట్టినట్టు కృష్ణన్ చెప్పారు. అదేకాలంలో వివిధ రాష్ట్రాల ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన షెడ్యూల్డ్ కులాల, తెగల ఆర్థిక సహకార సంస్థలకు అదనపు నిధులను కేంద్ర ప్రభుత్వం నుంచి అందించాలనే విధానాన్ని కూడా ఆయన ఆరోజే రూపొందించారు. దాన్నే మనం ఇప్పుడు స్పెషల్ సెంట్రల్ అసిస్టెన్స్ అని పిలుస్తున్నాం. ఆ రోజు కృష్ణన్ అంకురార్పణ చేసిన స్పెషల్ కాంపోనెంట్ ప్లాన్ చాలా కాలం తగినంత ఫలితాన్ని అందించలేకపోయింది. కానీ 2001 తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రగులుకున్న ఉద్యమంతో 2012 నాటికి చట్ట రూపం ధరించింది. అదే ఈరోజు దళిత ఉద్యమానికి ఒక ఆయుధమైంది. దళితుల అభివృద్ధికి స్పెషల్ కాంపోనెంట్ ప్లాన్ (2006 నుంచి దాన్ని షెడ్యూల్డ్ కాస్ట్ సబ్ప్లాన్గా పిలుస్తున్నారు) ఒక ప్రధాన వనరుగా ఉందనేది దేశంలోని దళితులందరూ గుర్తిం చారు. అందుకే ఈరోజు ఎస్సీ సబ్ప్లాన్ ఉద్యమం దళిత ఉద్యమ ప్రధాన ఎజెండాగా మారింది. అత్యాచార నిరోధక చట్టం ఆవిష్కరణకు.... ఎస్సీలు, ఎస్టీలపైన జరుగుతున్న అత్యాచారాలనూ దమనకాండనూ అరికట్టేందుకు రూపొందించిన ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం రూపకల్పనలో కూడా పిఎస్.కృష్ణన్ భాగస్వామి. ఆయన పదవీ విరమణ చేసిన తరువాత కూడా ఆ చట్టంలో చేయాల్సిన సవరణల కోసం జరిగిన ప్రయత్నంలో కూడా సైనికుడిలా పాటుపడ్డారు. ఆయనతో పాటు ఎంతోమంది కృషి వలన ఆ చట్టంలో రావాల్సిన సవరణలలో కొన్నైనా రాబట్టుకోగలిగాం. అయితే అదే చట్టానికి మరో ప్రమాదం పొంచి ఉన్న ప్రస్తుత సమయంలో కూడా సుప్రీంకోర్టు తీర్పు కారణంగా రాబోయే ప్రమాదాన్ని ఆయన పసిగట్టి దేశవ్యాప్తంగా ఐదువందల సంఘాలతో ఏర్పడిన జాతీయ దళిత సంఘాల ఐక్య కూటమికి ప్రధాన సలహాదారుగా ఉన్నారు. దళితులపై జరుగుతున్న దాడులను నిరోధించడానికి ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలు, అమలులో ఉన్న చట్టాల గురించి ఆమూలాగ్రం తెలిసిన కృష్ణన్ అనుభవం ఉద్యమానికి ఎంతో ఉపయుక్తం. దేశ రాజకీయాలను మలుపు తిప్పిన మండల్ రిజర్వేషన్ల రూపకల్ప నకు కూడా కృష్ణన్ చేసిన కృషి మరువలేనిది. నాటి ప్రధాని వీపీ సింగ్ తీసుకున్న మండల్ అనుకూల నిర్ణయాన్ని రాజ్యాంగబద్ధం చేయడానికి, చట్ట రూపంలోనికి తేవడానికి ఆయన అనుసరించిన ఎత్తుగడలు ఆనాటి నాయకత్వాన్ని విస్మయానికి గురిచేశాయి. కృష్ణన్ లేనట్లయితే మండల్ రిజర్వేషన్లు చట్టపరంగా నిలబడేవి కావని ఎంతో మంది నాయకులు కొనియాడారు. మైనారిటీలకు రిజర్వేషన్లు.... అదేకాలంలో ఎస్సీల నుంచి బౌద్ధులుగా మారిన వారికి కూడా రిజర్వేషన్లు వర్తిస్తాయనే ఆలోచనను ప్రభుత్వానికి తెలియజేసి, ఒప్పించి మెప్పించిన ఘనత కృష్ణన్దే. ఎస్సీ, ఎస్టీ, బీసీలతో పాటు ముస్లింలలో ఉన్న పేదరికం, నిరక్షరాస్యత, నిరుద్యోగం లాంటి సమస్యల పట్ల ఎంతో లోతుగా ఆలోచిం చిన వ్యక్తి కృష్ణన్. అందుకుగాను న్యాయపరమైన, చట్టపరమైన అడ్డంకులను అధిగమించేందుకు పదవీ విరమణానంతరం కూడా ప్రభుత్వాలకు సహాయసహకారాలను అందించడం మనకు తెలుసు. 2004లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వైఎస్.రాజశేఖరరెడ్డి తన ఎన్నికల ప్రణాళికలో పేర్కొన్న విధంగా ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించాలనే అంశం చర్చకు వచ్చినప్పుడు వైఎస్కి గుర్తుకొచ్చిన ఏకైక వ్యక్తి కృష్ణన్. ఆ విషయంలో వై.ఎస్. ప్రభుత్వానికి సలహా దారుగా ఉండి, ముస్లిం రిజర్వేషన్ల రూపకల్పనలో కీలక భూమిక పోషించినవారు కృష్ణన్. పదవీ విరమణ అనంతరమూ... పదవీ విరమణ చేసి 24 ఏళ్లు పూర్తయ్యాయి. 84 ఏళ్ల వయసులో కూడా ఈ వర్గాల కోసం ఆయన నిరంతరం తపిస్తూనే ఉన్నారు. దేశంలోనే అణచివేతకు గురౌతున్న వర్గాలకు సమస్యలు ఎదురైనప్పుడల్లా గొంతులేని వారి పక్షాన ప్రతిస్పందించే తొలి స్వరం పి.ఎస్. కృష్ణన్దే. ముఖ్యంగా గత నాలుగు సంవత్సరాలుగా బీజేపీ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీల సంక్షేమం పట్ల చూపుతోన్న నిర్లక్ష్యాన్నీ, దళితులపై, ఆదివాసీలపై జరుగుతున్న దాడులనూ ఎలుగెత్తి చాటుతూ తన ఉత్తరాల ద్వారా, ప్రభుత్వాన్ని తట్టిలేపుతున్నవారు కృష్ణన్. పి.ఎస్.కృష్ణన్ స్వాతంత్య్రానంతరం తొలితరం అధికారయంత్రాంగంలో ఒక నమూనాగా చెప్పుకోవచ్చు. మనందరం ఎంతో భక్తిభావంతో గుండెల్లో దాచుకున్న ఎస్.ఆర్. శంకరన్కు పిఎస్.కృష్ణన్ సీనియర్ మాత్రమే కాదు. ఆయనకు గురువుకూడా. ఆ తరం మానవతా విలువలకు ప్రతీకగా నిలిచిన కృష్ణన్ జీవితం నేటి తరం అధికారులకు కొంతైనా ఆదర్శం కాగలిగితే అట్టడుగు వర్గాలకు కాస్త అయినా మేలు జరుగుతుంది. మల్లెపల్లి లక్ష్మయ్య వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు ‘ 97055 66213 -
ఏం తమాషా చేస్తున్నారా..!
విజయనగరం పూల్బాగ్/ అర్బన్: ఎస్సీ,ఎస్టీ కేసులంటే లెక్కలేదా.. అధికారులు తమాషా చేస్తున్నారా.. అని ఎస్సీ,ఎస్టీ కమిషన్ చైర్మన్ కారెం శివాజీ మండిపడ్డారు. బుధవారం స్థానిక జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎవరైనా ఎస్సీ, ఎస్టీల హక్కులకు భంగం కలిగించినా.. ఎస్సీ, ఎస్టీ నిధులు సక్రమంగా ఖర్చు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించినా చర్యలు తప్పవన్నారు. ఎస్సీ,ఎస్టీ అత్యాచార బాధితులకు న్యాయం చేయడానికి సత్వర చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ముఖ్యంగా పూసపాటిరేగ మండలం ఎరుకొండలో సాంఘిక బహిష్కరణకు గురైన కుటుంబాలకు రూ.లక్ష చొప్పున నష్టపరిహారం అందించనున్నట్లు చెప్పారు. జిల్లాలో అన్ని ప్రభుత్వ శాఖల్లో ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్ నిధులు ఈ నెలాఖరునాటికి ఖర్చుచేసి వారి అభివృద్ధికి కృషి చేయాలన్నారు. ఔట్సోర్సింగ్, కాంట్రాక్ట్ నియామకాల్లో తప్పనిసరిగా రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించాలని ఆదేశించారు. జిల్లాలో ఇంకా కుల వివక్ష కొనసాగడం దారుణమన్నారు. పోలీసు యంత్రాంగం, ఎస్సీ,ఎస్టీ బాధితులకు అండగా నిలబడకపోగా వారిపైనే కేసులు పెట్టడం శోచనీయమని తెలిపారు. అనంతరం జిల్లాలో వివిధ ప్రభుత్వ శాఖలు అమలుపరుస్తున్న కార్యక్రమాలను శాఖల వారీగా సమీక్షించారు. ఈ సందర్భంగా పోలీసు, సాంఘిక సంక్షేమశాఖ, అటవీ, వ్యవసాయ, మత్య్స, పశుసంవర్థక , విద్యుత్, ఉద్యానవన, పంచాయతీరాజ్శాఖ, సర్వశిక్షాభియాన్ అధికారులు తమ శాఖల ప్రగతి వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వివేక్యాదవ్ మాట్లాడుతూ, జిల్లాలో ఖాళీగా ఉన్న బ్యాక్లాగ్ ఉద్యోగాల భర్తీకీ చర్యలు చేపట్టామన్నారు. దళిత, గిరిజన విద్యార్థులకు సకాలంలో పోస్టుమెట్రిక్, ప్రీ మెట్రిక్ ఉపకారవేతనాలు మంజూరు చేస్తున్నామని తెలిపారు. కులాంతర వివాహాలు చేసుకున్న 126 మందికి రూ.60 లక్షల వివాహ ప్రోత్సాహకాన్ని అందించామని వివరించారు. ఎస్సీలకు 17 శాతం, ఎస్టీలకు 6.6 శాతం నిధులు ఖర్చు చేస్తున్నామన్నారు. సమావేశంలో జెడ్పీ చైర్పర్సన్ శోభ స్వాతిరాణి, ఎస్సీ,ఎస్టీ కమిషన్ సభ్యులు కె రాజారావు, సిరివేలు సోమ, సుధారాణి, రవీంద్ర, నరహరి వరప్రసాద్, ఎస్టీ కమిషన్ ఓఎస్డీ సుబ్బారావు, జేసీ–2 కె. నాగేశ్వరరావు, డీఆర్ఓ ఆర్ఎస్ రాజ్కుమార్, అడిషనల్ ఎస్పీ, జిల్లా అధికారులు పాల్గొన్నారు. అంతకుముందు జెడ్పీ కార్యాలయ ఆవరణలో ఉన్న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహానికి కారెం శివాజీ, జెడ్పీ చైర్పర్సన్ శోభా స్వాతిరాణి పూలమాలలు వేసి నివాaళులర్పించారు. -
‘గిరి’ పుత్రికకు అభయం!
సాక్షి, హైదరాబాద్ : తండాల్లో ఆడపిల్లల విక్రయాలను అరికట్టేందుకు గిరిజన సంక్షేమ శాఖ సరికొత్త పథకానికి శ్రీకారం చుడుతోంది. ఆడ శిశువుకు అభయం ఇచ్చేందుకు ఆర్థిక సహకార పథకాన్ని అమల్లోకి తేవాలని యోచిస్తోంది. ప్రస్తుతం కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పేరిట ఆడపిల్ల పెళ్లికి సాయం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ తరహాలో గిరిజన తండాల్లోని పేదింట్లో పుట్టిన ఆడశిశువుకు అభయంగా ఫిక్స్డ్ డిపాజిట్ పథకాన్ని అమలు చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. మగపిల్లాడు కావాలనే ఆరాటంతో వరుసగా ఆడపిల్లలు పుట్టడం, పేదరికం కారణంగా వారిని సాకలేమంటూ దూరం చేసుకుంటున్నారు. ఇలా శిశువుల్ని విక్రయించడం, విషయం బయటకు పొక్కితే శిశువిహార్ తరలించడం వంటి సంఘటనలు ఇప్పటికీ తండాలు, గిరిజన ప్రాంతాల్లో నిత్యం జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో వీటికి అడ్డుకట్ట వేసే దిశగా గిరిజన సంక్షేమ శాఖ ముందుకు సాగుతోంది. 18 ఏళ్ల వరకూ.. తండాలు, ఏజెన్సీల్లో లింగ నిష్పత్తిలో భారీ వ్యత్యాసం ఉంది. సగటున వెయ్యి మంది పురుషులకు 945 మహిళలున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఈ సంఖ్య మరింత తక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో పేదింట్లో ఆడపిల్ల పుడితే శిశువు పేరిట రూ.లక్ష వరకు సమీప బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తారు. ఇలా డిపాజిట్ చేసిన మొత్తాన్ని 18 ఏళ్ల వరకు విత్డ్రా చేసే వీలుండదు. అలా అమ్మాయి పెళ్లి నాటికి డిపాజిట్ మొత్తం రూ.10 లక్షల వరకు పెరుగుతుందని గిరిజన సంక్షేమ శాఖ భావిస్తోంది. దీంతో అమ్మాయి పెళ్లికి కుటుంబం ఎలాంటి ఇబ్బందులు పడదని యోచిస్తోంది. ఈ మేరకు బడ్జెట్ అంచనాలకు ఉపక్రమించింది. ప్రస్తుతం కల్యాణలక్ష్మి పథకం కింద ఏటా రూ.200 కోట్లు ఖర్చు చేస్తోంది. తాజాగా కొత్త పథకాన్ని అమలు చేస్తే ఖజానాపై ఎంత భారం పడుతుందనే అంశంపై అధికారులు అంచనాలు రూపొందిస్తున్నారు. 2018–19 బడ్జెట్ ఖరారయ్యే నాటికి ఈ పథకానికి సంబంధించి ప్రతిపాదనలను సమర్పిస్తామని, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు ఆదేశానుసారం తదుపరి చర్యలు తీసుకుంటామని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అజ్మీరా చందూలాల్ ‘సాక్షి’కి తెలిపారు. -
అగ్రవర్ణాల లబ్ధి కోసమే వర్గీకరణ డ్రామా
సాక్షి, హైదరాబాద్: అగ్రవర్ణాలు లబ్ధి పొందేందుకే ఎస్సీ, ఎస్టీ వర్గీకరణ డ్రామా ఆడుతున్నాయని మాలమహానాడు జాతీయ అధ్యక్షుడు జి.చెన్నయ్య ఆరోపించారు. వర్గీకరణ అంశానికి కాలం చెల్లిందని, దళితులు ఈ డిమాండ్ కోరుకోవడం లేదన్నారు. బుధవారం హైదరాబాద్లో జరిగిన మాలమహానాడు ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఎస్సీల్లో మాల, మాదిగలు, ఎస్టీల్లో లంబాడ, ఆదివాసీల మధ్య గొడవలు సృష్టించి అగ్రవర్ణ రాజకీయ పార్టీలు లబ్ధి పొందుతున్నాయని చెన్నయ్య విమర్శించారు. ఎస్సీ వర్గీకరణకు మద్దతు పలికిన రాజకీయ పార్టీల వైఖరిని మాలమహానాడు ఖండిస్తోందన్నారు. అఖిల పక్షాన్ని డిల్లీకి తీసుకెళ్లాలన్న ఆలోచనను రాజకీయ పార్టీలు విరమించుకోవాలని, లేకుంటే అడ్డుకుంటామని హెచ్చరించారు. ఎస్సీ వర్గీకరణ బిల్లును దళితులు వ్యతిరేకిస్తున్న అంశాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు. ఈ సమావేశంలో మాలమహానాడు ప్రతినిధులు జంగా, భగవాన్ దాస్, బి.సాయి తదితరులు పాల్గొన్నారు. -
‘పవన్ కళ్యాణ్ ఇంటిని ముట్టడిస్తాం..’
సాక్షి, అనంతరపురం: మత్స్యకారులను ఎస్టీ జాబితాలో చేర్చాలంటూ ఇటీవల జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. కానీ పవన్ వ్యాఖ్యలపై గిరిజన జేఏసీ నాయకులు అసహనం వ్యక్తం చేశారు. ఈ విషయంలో పవన్ కళ్యాణ్ ఇంటిని ముట్టడించడానికి కూడా తాము వెనుకాడబోమని వారు హెచ్చరించారు. మంగళవారం స్థానిక నాగులకట్ట వద్ద విలేకరుల సమావేశంలో గిరిజన జేఏసీ పుట్టపర్తి కన్వీనర్ కే. రవీంద్ర నాయక్, కో కన్వీనర్ కుళ్లాయి నాయక్, జిల్లా యువజన విభాగం కన్వీనర్ ఎస్. నారాయణస్వామి నాయక్ మాట్లాడారు. మత్స్యకారులను ఎస్టీ జాబితాలో చేర్చాలని.. ఇందుకు తాను మద్దతిస్తానని, ప్రభుత్వంతో కూడా మాట్లాడతానని పవన్ చెప్పడం గర్హనీయమన్నారు. గిరిజనుల పట్ల ఆయనకు ఉన్న చిత్తశుద్ధి ఏంటో దీన్నిబట్టి అర్ధమవుతోందన్నారు. వాల్మీకి, బోయలను ఎస్టీ జాబితాలో చేర్చాలని చంద్రబాబు నేతృత్వంలోని మంత్రివర్గం నిర్ణయిస్తే ఆ అడుగుజాడల్లోనే పవన్ నడవటం విచారకరమని గిరిజన నాయకులు అన్నారు. పవన్ తన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేశారు. లేనిపక్షంలో వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీ గిరిజనుల ఆగ్రహం చవిచూడక తప్పదన్నారు. -
మన్యం కదిలింది!
మన్యం కదిలింది. బోయ, వాల్మీకులను ఎస్టీల జాబితాల్లో చేర్చొద్దంటూ వేలాది మంది గిరిజనం కదం తొక్కారు. శ్రీకాకుళంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల రోడ్డు నుంచి కలెక్టర్ వరకూ భారీ ర్యాలీ నిర్వహించి అక్కడ ధర్నా చేశారు. తమకు చంద్రబాబు సర్కార్ అన్యాయం చేస్తోందని నినదించారు. కలెక్టరేట్ను ముట్టడించి నిరసన తెలియజేశారు. ఇదే సమయంలో ఎస్టీల జాబితాలో చేర్చాలంటూ 57 రోజులుగా కలెక్టరేట్ వద్ద రిలే నిరాహార దీక్షలు చేస్తున్న మత్స్యకారుల శిబిరాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేయడంతోపాటు నిప్పటించడంతో కలకలం రేగింది. కలెక్టర్, ఎస్పీ తదితరులు సంఘటన స్థలాన్ని సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. శ్రీకాకుళం పాతబస్టాండ్, శ్రీకాకుళం (పీఎన్కాలనీ): గిరిజనం గళమెత్తింది. తమకు అన్యాయం చేయవద్దంటూ నినదించింది. బోయ, వాల్మీకులను ఎస్టీల జాబితాల్లో చేర్చుతూ తెలుగుదేశం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆదివాసీ సంఘాల జేఏసీ పిలుపుమేరకు సోమవారం చలో కలెక్టరేట్కు పిలుపునివ్వడంతో గిరిజనలు భారీగా తరలివచ్చారు. దీంతో కలెక్టరేట్ ప్రధాన ద్వారం నుంచి వాంబే కాలనీ, వృద్ధాశ్రమం ప్రాంతాలు గిరిపుత్రులతో నిండిపోయాయి. ఆదివాసీ ఉద్యోగ, విద్యార్ధి, మహిళా సంఘాలు, హక్కుల పోరాట సమితిలు భాగస్వాములయ్యాయి. తరలివచ్చిన జనం కంచిలి, సోంపేట, మందస, పలాస, నందిగాం, టెక్కలి, మెళియాపుట్టి, పాతపట్నం, సారవకోట మండలాల నుంచి వివిధ వాహనాల్లో సుమారు పది వేల మంది జిల్లా కేంద్రానికి చేరుకున్నారు. కలెక్టరేట్కు ర్యాలీ గా వచ్చారు. జనం భారీగా ఉండడంతో పో లీసులు సైతం వీరిని అడ్డుకోలేదు. కలెక్టరేట్ను ముట్టడించిన గిరిజనులు తమ డి మాండ్లను పరిష్కరించాలని నినదించారు. టీడీపీ ప్రభుత్వం తమపై కక్షకట్టిందని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే ఎస్టీ జాబితాలో మరిన్ని జాతులను కలిపి ఎస్టీలను మరింత వెనుకబాటు చేసేందుకు కుట్ర పన్నిందన్నారు. ఈ కారణంతోనే బోయ, వాల్మీక కులాలను ఎస్టీ జాబితాలో చేర్పించేందుకు అ సెంబ్లీ తీర్మానం చేసి, కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసిందని జేఏసీ నేతలు దుయ్యబట్టారు. బోయ, వాల్మీకులను ఎస్టీల జాబితాలో చేర్పించాలని చేసిన సిఫార్సును వెనక్కి తీసుకోవాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ప్రస్తుతం ఉన్న ఆరు శాతం రిజర్వేషన్ను పెంచాలని డిమాండ్ చేశారు. 1952 నాటి గిరిజన జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ కల్పిం చారని, అయితే ప్రస్తుత జనాభా పెరిగినందున దీనికి అనుగుణంగా రిజర్వేషన్ పది శాతానికి పెంచాలని నినాదాలు చేశారు. జిల్లాలో గిరిజనుల పేరుతో వందలాది మంది నకిలీ కుల ధ్రువ పత్రాలతో ఉద్యోగాలు చేస్తున్నారని, అటువంటి వారిని వెంటనే తొలగించాని, ఆ ధ్రువపత్రాలు మంజూరు చేసిన వారిని, వారికి కొమ్ముకాస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని, బీసీ సంక్షేమ శాఖలో వసతి గృహ అధికారిగా పనిచేస్తున్న నకిలీ గిరిజన ఉద్యోగి కుమార్ నాయక్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. టీడీపీకి వ్యతిరేకంగా నినాదాలు గిరిజనులకు అన్యాయం చేసేం దుకే బోయ, వాల్మీకులను ఎస్టీల జాబితాల్లో చేర్చేలా రాష్ట్ర ప్రభుత్వం సిఫార్సులు చేయడం తగదని గిరిజన జేఏసీ ప్రతినిధులు నినదించారు. ముఖ్య మంత్రి, టీడీపీ నాయకులు కలిసి ఎస్టీలపట్ల కుట్రపన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా టీడీపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇక నుంచి ఏ ఒక్క ఇతర కులాన్ని ఎస్టీ జాబితాలో చేర్చుతామంటూ.. ఏ రాజకీయ పార్టీ కూడా వారి ఎన్నిక మ్యానిఫెస్టోలో పెట్టరాదన్నారు. అలా వాగ్దానాలు చేస్తే పార్టీలకు తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. గడిచిన 60 రోజులుగా మన్యంలో దీక్షలు చేస్తు న్నా ముఖ్యమంత్రి, మంత్రుల్లో చలనం లేదన్నారు. దీంతో ఉద్యమాన్ని జిల్లా స్థాయికి తీసుకురావాల్సి వచ్చిందని ఆదివాసీ జేఏసీ నాయకులు వాబ యోగేశ్వరరావు, సవర రాంబాబు తదితరులు అన్నారు. రాష్ట్రంలో ఎస్టీ జాబితాలో 32 తెగలు ఉన్నాయని, రాష్ట్రంలో 28 లక్షల మంది, జిల్లాలో 1.82 లక్షల మంది గిరిజన జనాభా ఉందన్నారు. ప్రభుత్వం తీరుతో సవర, కాపుసవర, జాతాపు, మలే సవర, చెంచులు, కొండదొరలు, కొండ రెడ్లకు అన్యాయం జరుగుతోందన్నారు. ఉద్యమంలో పాల్గొన్న నాయకులు ఉద్యమంలో ఆదివాసీల సంక్షేమ పరిషత్, వికాస్ పరిషత్, ఉద్యోగుల సంఘం, విద్యార్థి సంఘం, మహిళా సంఘం, హక్కుల పోరాట సమితి, పీడీఎస్యుల ప్రతినిధులు, ఆదివాసీ సంఘాల జాయింట్ ఎక్షన్ కమిటీ (జేఏసీ) జిల్లా అధ్యక్షుడు వాబ యోగి, సంఘాల ప్రతినిధులు గూడ ఎండయ్య, సవర జగన్నాథం, వి.భానుచందర్, ఎం.భాగ్యలక్ష్మి, కె.శ్రీను, ఎస్.చిరంజీవులు, ఎ.రామారావు, కృష్ణారావు, గణ్వేరరావు, బి.సింహాచలం, దుర్యోధన, సిద్ధేశ్వరరావు, మాధవయ్య, ఎస్.షణ్ముఖరావు, జి. మోహనరావు, జి.అప్ప న్న, ఆర్.పోతయ్య, ఎస్.నారాయణరావు పాల్గొన్నారు. 200 మందిపై కేసు నమోదు శ్రీకాకుళం సిటీ: కలెక్టరేట్ వద్ద మత్స్యకారుల శిబిరంపై సోమవారం కొంతమంది దాడి చేసిన ఘటనలో 200 మంది ఆదివాసీలపై కేసులు నమోదయ్యాయి. ఈ విషయాన్ని ఒకటో పట్టణ ఎస్సై ఈ. చిన్నంనాయుడు తెలిపారు. మత్స్యకారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు. కలెక్టర్, ఎస్పీల సందర్శన భారీగా గిరిజనులు తరలి రావడం.. ముఖ్యమంత్రికి, టీడీపీకి వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో కలెక్టర్ ధనంజయరెడ్డి, ఎస్టీ త్రివిక్రమవర్మ స్పందించారు. గిరిజనులు ధర్నా చేస్తున్న ప్రాంతానికి వచ్చి వారితో మాట్లాడారు. తొలుత జాయింట్ కలెక్టర్–2 పి.రజనీకాంతరావు గిరిజనులతో మాట్లాడారు. ఈ సందర్భంగా డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని నాయకుల నుంచి తీసుకున్నారు. అయితే గిరిజనులు శాంతించలేదు. కలెక్టర్ రావాలని పట్టుపట్టారు. దీంతో జిల్లా కలెక్టర్ కె.ధనంజయరెడ్డి వచ్చారు. గిరిజన సమస్యల పరిష్కారం తన పరిధిలో లేదని, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. ఎస్పీ సీఎం త్రివిక్రమ వర్మ కూడా వచ్చి మత్స్యకారులు నిరసన దీక్షలు చేస్తున్నారని.. వారికి ఇబ్బంది లేకుండా మెలగాలని సూచించారు. ఏఎస్పీ పనసారెడ్డి, డీఎస్పీలు పెంటారావు, భీమారావు, సీఐలు నవీన్ కుమార్, ప్రదసాద్, తిరుపతిరావు బందోబస్తును పర్యవేక్షించారు. గిరిజన ఉద్యమం ముసుగులోమత్య్సకార శిబిరం ధ్వంసం గిరిజన ఉద్యమం ముసుగులో ఉన్న కొంతమంది అధికార పార్టీకి చెందిన వారు మత్స్యకారుల రిలే నిరాహారదీక్షా శిబిరాన్ని ధ్వంసం చేసి నిప్పంటించారు. ఎస్టీలో జాబితాలో చేర్చాలంటూ కలెక్టరేట్ వద్ద మత్య్స కారులు రిలే నిరాహారదీక్ష శిబిరాన్ని కొనసాగిస్తున్నారు. దీన్ని చూసిన అధికార పార్టీకి చెందిన కొంతమంది గిరిజన ముసుగులో రెచ్చిపోయారనే ఆరోపణలు వస్తున్నాయి.. మంత్రులు, ముఖ్యమంత్రి చెప్పినా శిబి రాన్ని ఎత్తివేయడం లేదని, మత్స్యకారులపై చర్యలు తీసుకోలేక, గిరిజన ఉద్యమం నేపథ్యంలో మత్స్యకారుల దీక్షకు భంగం కలిగించేందుకు కొంతమంది అధికార పా ర్టీకి చెందిన వారు శిబిరానికి నిప్పంటించినట్టు తెలిసింది. శిబిరానికి కట్టిన పోస్టర్లు, కర్టన్లను పీకేశారు. టెంట్ను కూల్చివేసి.. నిప్పంటించారు. ఈ క్రమంలో రిలే నిరా హార దీక్షలో ఉన్న సోంపేట మండలం ఇసకలపాలెం గ్రామానికి చెందిన మత్స్యకారుడు నిట్ట లక్ష్మీనారాయణ గాయపడ్డాడు. ఈ ఘటనలో మరో పది మంది స్వల్పం గా గాయపడ్డారు. ఈ సంఘటనతో కొద్దిసేపు కలకలం రేగింది. అగ్నిమాపక దళం వచ్చి మంటలను అదుపు చేసింది. -
ఎస్టీల్లో చేర్చాలంటూ మత్స్యకారులు దర్నా
-
ప్రత్యేక ఓటింగ్తోనే దళితుల అభివృద్ధి
సాక్షి, హైదరాబాద్: దేశంలో రాజ్యాంగం ప్రకారం అమలవుతున్న ఎస్సీ, ఎస్టీ రాజకీయ రిజర్వేషన్లు ఆశించిన ఫలితాలను అందించడం లేదని, రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్ ప్రతిపాదించిన ప్రత్యేక ఓటింగ్ ద్వారా మాత్రమే దళితులకు నిజమైన రాజకీయ ప్రాతినిధ్యం లభిస్తుందని దళిత, మానవ హక్కుల ఉద్యమ నాయకుడు, రాబర్ట్ కెనడీ అవార్డు గ్రహీత మార్టీన్ మెక్వాన్ అభిప్రాయపడ్డారు. శుక్రవారం నగరంలోని రవీంద్రభారతిలో జరిగిన మాజీ ఐఏఎస్ అధికారి ఎస్ఆర్ శంకరన్ 7వ స్మారకోపన్యాస కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మెక్వాన్ స్మారకోపన్యాసం చేస్తూ.. ప్రస్తుత ఎన్నికల విధానంలో నిజమైన దళిత ప్రతినిధులు ఎన్నిక కావడం లేదని, అత్య«ధిక ఓట్లు దళితేతరులవే కావడంతో దళితుల సమస్యలను పరిష్కరించడంలో రిజర్వుడ్ నియోజకవర్గాల నుంచి ఎన్నికైన ప్రజాప్రతినిధులు విఫలమవుతున్నారని చెప్పారు. దళిత ప్రతినిధులకు దళితులు మాత్రమే ఓటు వేసుకునే విధానాన్ని సపరేట్ ఎలక్టోరేట్ అంటారని, 1932లో అప్పటి బ్రిటన్ ప్రధాని రామ్సే మెక్డొనాల్డ్ ఇచ్చిన కమ్యూనల్ అవార్డును మహాత్మా గాంధీ వ్యతిరేకించడం వల్ల ఇప్పుడు అమలులో ఉన్న రాజకీయ రిజర్వేషన్ల విధానం వచ్చిందని తెలిపారు. అప్పటికే ముస్లింలకు, ఆంగ్లోఇండియన్లకు ఇటువంటి ప్రత్యేక ఓటింగ్ విధానం అమలులో ఉన్న విషయాన్ని ఆయన గుర్తుచేశారు. గుజరాత్లో దయనీయం.. ఎంతో అభివృద్ధి చెందిందని చెప్పుకుంటున్న గుజరాత్లో దళితుల పరిస్థితి దయనీయంగా ఉన్నదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. చాలా గ్రామాల్లో ఉమ్మడి నీటి వనరులను వినియోగించుకునే స్వేచ్ఛ దళితులకు లేదని, వేలాది గ్రామాల్లో ఆలయ ప్రవేశం నిషిద్ధమని చెప్పారు. దళిత ప్రజాప్రతినిధులు వారి పార్టీ, నాయకత్వానికే విశ్వసనీయంగా ఉంటున్నార ని, దీనికి ఇప్పుడున్న ఓటింగ్ విధానమే కారణమని అభిప్రాయపడ్డారు. ఎస్ఆర్ శంకరన్ లాంటి అధికారులు దళితుల కోసం చేసిన సేవలను భవిష్యత్ తరాలు, ప్రస్తుత అధికార యంత్రాంగం మార్గదర్శకంగా తీసుకోవాలని మెక్వాన్ సూచించారు. సాక్షి ఎడిటోరియల్ డైరెక్టర్ కె.రామచంద్రమూర్తి మాట్లాడుతూ.. శంకరన్ లాంటి నిబద్ధత కలిగిన అధికారి పాలనా సమయంలో తాము ఉండటం, ఆయనతో సన్నిహితంగా ఉండటం ఒక చక్కటి అనుభూతిగా భావిస్తున్నామని చెప్పారు. ఆయన లాంటి వ్యక్తులు సమాజానికి ఎంతో అవసరమని, శంకరన్ ఒక్క ఏడాదిలోనే 120కిపైగా జీవోలపై సంతకాలు చేయడం, అవన్నీ దళితుల అభ్యున్నతికి సంబంధించినవే కావడం ప్రపంచంలోనే అరుదైన దృశ్యంగా భావించాల్సి ఉంటుందని చెప్పారు. దళితుల కోసమే ఆయన జీవితం సభకు అధ్యక్షత వహించిన సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ చైర్మన్ మల్లెపల్లి లక్ష్మయ్య మాట్లాడుతూ.. పేదలు, ఆదివాసీల కోసం, దళితేతర సమాజంలోని చాలా మంది వ్యక్తులు పనిచేసారని, కానీ దళితుల కోసం జీవితమంతా ధారబోసిన ఏకైక వ్యక్తి శంకరన్ అని కొనియాడారు. మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కాకి మాధవరావు మాట్లాడుతూ శంకరన్ గారి స్ఫూర్తి వల్లనే ఐఏఎస్ అధికారిగా నిబద్ధతతో కూడిన కార్యాచరణను కొనసాగించానని, అటువంటి వ్యక్తితో చివరికంటా స్ఫూర్తిని పొందుతూ వచ్చానని చెప్పారు. సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ డైరెక్టర్ వైవీ సత్యనారాయణ స్వాగతోపన్యాసం చేస్తూ.. శంకరన్తో తనకున్న సాన్నిహిత్యాన్ని నెమరువేసుకున్నారు. ఎస్సీ హాస్టల్లో చదువుతూ అత్యధిక మార్కులు సాధించిన పేద దళిత బాలికకు ఏటా ఇచ్చే లక్ష్మీవేణుగోపాల్ అవార్డును అన్వేషి కార్యదర్శి డాక్టర్ కె.లలిత వనపర్తి జిల్లాకు చెందిన సి.ఆశకు అందజేశారు. -
"కుల"కలం
ఒకప్పుడు వారు గిరిజనులు. ఇప్పుడు కారు. ఒకప్పుడు ప్రభుత్వం గుర్తించింది. ఇప్పుడు గుర్తించం పొమ్మంటోంది. అర్హత ఉన్నా గిరిజనులుగా గుర్తింపు పొందలేకపోతున్నారు. ప్రభుత్వ పథకాలకు దూరమవుతున్నారు. గిరిజనులుగా గుర్తించమని ప్రాధేయపడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. కొన్నేళ్ల క్రితం వరకూ గిరిజనులుగా గుర్తించిన ప్రభుత్వం ఇప్పుడు ససేమిరా అంటోంది. ఏనేటికోండ్రు కులం గిరిజనుల గోడును నిర్లక్ష్యం చేస్తోంది. విజయనగరం, బలిజిపేట (పార్వతీపురం): నారాయణపురం గ్రామంలో నివసిస్తున్న ఏనేటి కోండ్రు కులస్తులను ప్రభుత్వం గిరిజనులుగా గుర్తించకపోవడంతో ప్రభుత్వ రాయితీలు, ఉద్యోగాలకు దూరమవుతున్నారు. గ్రామంలో 15 కుటుం బాలు వందేళ్లకు పైగా నివసిస్తున్నాయి. ఎస్టీలైన వీరంతా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో నివసిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలో వీరిని ఎస్టీలుగా గుర్తిస్తున్నారు. విజయనగరం జిల్లా గుమ్మలక్ష్మీపురం, కురుపాం, జియ్యమ్మవలసలోనూ గుర్తిస్తుండటం విశేషం. 1990 వరకు తమను ఎస్టీలుగా గుర్తించి కుల ధ్రువపత్రాలు ఇచ్చారని.. ఆ తర్వాతే నిలిపివేశారని కుల పెద్దలు నాగభూషణరావు, నీలకంఠం తెలిపారు. తమ కులస్తులు కొందరు చదువుకునేటప్పుడు ఎస్టీలుగానే గుర్తించి కులధ్రువీకరణ మంజూరు చేశారని, పాఠశాల టీసీల్లో కూడా ఎస్టీలుగా ధ్రువీకరించి ప్రస్తుతం కాదనడం సమంజసంగా లేదని తెలిపారు. ఎందుకు గుర్తించరు? నారాయణపురం గ్రామంలో నివసిస్తున్న తమ కుటుంబాలు శ్రీకాకుళం జిల్లాలోని తమ కులస్తులతోనే పెళ్లి సంబంధాలు కుదుర్చుకుంటున్నాయని ఎం.వెంకటరమణ, ఆర్.ఫకీరు, ఎం.గణపతి, మురళి తెలిపారు. కులపరంగా ఆచార సంప్రదాయాలు, వివాహాది శుభ కార్యక్రమాలు నిర్వహిస్తున్న తాము ఎస్టీలం ఎలా కాకుండా పోతామని ప్రశ్నిస్తున్నారు. అంధకారంలో పిల్లల భవిత కుల ధ్రువపత్రాలకు నిరాకరిస్తుండటంతో 1990 అనంతరం పిల్లల చదువుల కోసం ఓసీలుగానే బడిలో చేర్పించి చదివిస్తున్నామని తెలిపారు. ఉద్యోగావకాశాలు, ప్రభుత్వ పథకాలకు దూరమవుతున్నామన్నారు. నిరుపేదలమైన తమకు జీవనాధారం కష్టమై పిల్లలను చదివించడం భారంగా ఉందని తెలిపారు. వేలకు వేలు చెల్లించలేక తక్కువ చదువులతో మాన్పించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగం కోల్పోయా నాకు 2005లో ఏపీఎస్పీ కానిస్టేబుల్గా ఉద్యోగం వచ్చింది. కుల ధ్రువీకరణ పత్రం లేనందున వచ్చిన ఉద్యోగం పోయింది. అప్పటి నుంచి నిరుత్సాహానికి గురయ్యాను. నేటికీ మేము ఏ కులస్తులమో అర్థం కావటం లేదు. – ఎం.గణపతి, నారాయణపురం పదోన్నతి రాలేదు అంగన్వాడీ కార్యకర్తగా చేస్తున్న నాకు 2011లో సూపర్వైజర్గా పదోన్నతి లభించింది. కానీ కుల ధ్రువపత్రం లేనందున పదోన్నతి నిలిచిపోయింది. మా పరిస్థితులు ఎలా ఉన్నా పిల్లల పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. – ఎం.సరోజిని, నారాయణపురం పరిశీలిస్తా మీసేవలో కుల ధ్రువీకరణ నిమిత్తం దరఖాస్తు చేస్తే వాటిని పరిశీలించి అవకాశం ఉంటే సహకరిస్తాం. అన్నీ పరిశీలించి వారికి తగిన న్యాయం చేస్తాం.– బీవీ లక్ష్మి, తహసీల్దార్, బలిజిపేట -
ఎస్సీ, ఎస్టీల్లోనే పౌష్టికాహారలోపం అధికం
సాక్షి, హైదరాబాద్: ఎస్సీ, ఎస్టీల్లోనే పౌష్టికాహారలోపం అధికంగా ఉందని తాజాగా ఓ పరిశోధనలో వెల్లడైంది. ‘డైట్ అండ్ న్యూట్రిషనల్ స్టేటస్ ఆఫ్ అర్బన్ పాపులేషన్ ఇన్ ఇండియా’అనే అంశంపై నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ (ఎన్ఐఎన్) ఇటీవల పరిశోధన జరిపింది. కేరళ రాష్ట్రంలోని త్రివేండ్రం, కొచ్చి, కర్ణాటకలోని మైసూర్, బెంగళూరుతోపాటు తెలంగాణలోని హైదరాబాద్ సహా మొత్తం 16 రాష్ట్రాల్లోని పలు పట్టణాల్లో నిర్వహించిన ఈ పరిశోధనలో అట్టడుగు వర్గాలైన ఎస్సీ, ఎస్టీల్లోనే పౌష్టికాహార లోపం అధికమని తేలింది. ఆహార వినియోగం, హెచ్చుతగ్గుల వల్ల సంక్రమించే వ్యాధులు, శరీరంలో ఏర్పడే మార్పులను ఈ పరిశోధనలో కనుగొన్నారు. షెడ్యూల్డ్ కులాల బాలురలో 32.4, బాలికలు 25.2 శాతం మంది పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నారని స్పష్టమైంది. ఆదివాసీ బాలురలో 32.6 శాతం, బాలికల్లో 31.7 శాతం, వెనుకబడిన కులాల్లోని బాలురలో 25.8 శాతం, బాలికల్లో 25.8 శాతం మంది పౌష్టికాహారలోపంతో ఉన్నట్టు ఈ నివేదిక తెలిపింది. తండ్రి నిరక్షరాస్యుడై తక్కువ తలసరి ఆదాయం కలిగి ఉన్న కుటుంబాల్లో ఈ పరిణామం తీవ్రంగా ఉన్నట్టు వెల్లడైంది. అయితే, దీనికి పేదరికంతోపాటు, నిరక్షరాస్యత, అవగాహనాలోపం, వివక్షలే కారణమని పౌష్టికాహార నిపుణులు, వైద్యులు అభిప్రాయపడుతున్నారు. నిజాయితీగా అమలు చేయాలి పేదరికం, ఆకలి, అవమానాలతోపాటు పిల్లల ఆరోగ్యంపై అసమానతలు బలమైన ప్రభావాన్ని కలిగిస్తాయి. దాని నివారణకు మధ్యాహ్నం భోజనం లాంటి పథకాలను నిజాయితీగా అమలు చేయాలి. – డాక్టర్ కనకరాజు, వైద్యులు అసమానతలే కారణం దేశంలో నెల కొన్న సామాజిక అసమానతలు ప్రజల జీవితాల్లో ప్రతిబింబిస్తున్నాయి. ఆర్థిక విషయాలతోపాటు ఆహారం, ఆరోగ్యాలపై సామాజిక అసమానతలు, వివక్ష తీవ్రమైన ప్రభావాన్ని కలిగిస్తాయి. అందుకు నిదర్శనమే ఎన్ఐఎన్ సర్వే నివేదిక. – ప్రొఫెసర్ రమామేల్కొటే, భారత ఆహార కమిషన్ మాజీ సలహాదారు ఎదుగుదలపై తీవ్రభావం ఆర్థిక అసమానతలైనా, సామాజిక వివక్షలైనా, బాలలు, మహిళల పైనే ఎక్కువ ప్రభాన్ని చూపుతాయి. ఎన్ఐఎన్ నివేదిక దానికి నిదర్శనం. ఎస్సీ, ఎస్టీల్లో నెలకొని ఉన్న పేదరికం ఆ వర్గాల పిల్లల పెరుగుదలపై, మానసిక వికాసంపై దుష్ప్రభావాన్ని కలిగిస్తోందనడానికి ఇదొక్క ఉదాహరణ చాలు. –లలిత, స్త్రీవాద రచయిత్రి, సామాజిక కార్యకర్త -
ఎస్సీ, ఎస్టీ ఎస్డీఎఫ్ మార్గదర్శకాలు ఖరారు
- ఫైలుపై సంతకం చేసిన సీఎం కేసీఆర్ - ఒకట్రెండు రోజుల్లో వెలువడనున్న ఉత్తర్వులు.. సాక్షి, హైదరాబాద్: షెడ్యూల్డ్ కులాల ప్రత్యేక అభివృద్ధి నిధి (ఎస్సీ ఎస్డీఎఫ్), షెడ్యూల్డ్ తెగల ప్రత్యేక అభివృద్ధి నిధి (ఎస్టీ ఎస్డీఎఫ్) మార్గదర్శకాలు ఖరారయ్యాయి. రెండున్నర నెలలుగా పెండింగ్లో ఉన్న ఈ ఫైలుకు మోక్షం కలిగింది. ప్రత్యేక అభివృద్ధి నిధి అమలుకు సంబంధించి మంత్రుల సంఘం రూపొందించిన మార్గదర్శకాలను సీఎం కె.చంద్రశేఖర్రావు ఆమోదించారు. ఒకట్రెండు రోజుల్లో ఇందుకు సంబంధించి ఉత్తర్వులు వెలువడనున్నాయి. దీంతో ప్రత్యేక అభివృద్ధి నిధి కార్యక్రమం అమలుతో పాటు నిఘాపైనా స్పష్టత రానుంది. ఎస్సీ, ఎస్టీలకోసం గతంలో ఉన్న ఉప ప్రణాళికను రద్దు చేస్తూ.. 2017– 18 వార్షిక సంవత్సరం నుంచి కొత్తగా ఎస్సీ ఎస్డీఎఫ్, ఎస్టీ ఎస్డీఎఫ్ను అమల్లోకి తీసుకొచ్చారు. ఈ నిధి కింద చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలు, వినియోగం తదితర అంశాలపై కార్యాచరణ సిద్ధం చేసేందుకు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, గిరిజన అభిృవృద్ధి శాఖ మంత్రి అజ్మీరా చందూలాల్, ఎస్సీ అభివృద్ధి శాఖ మంత్రి జగదీశ్రెడ్డి ఆధ్వర్యంలో కమిటీలు ఏర్పాటు చేసింది. దీంతో పలుమార్లు చర్చలు జరిపిన ఈ కమిటీలు కార్యాచరణ ప్రణాళికను రూపొందించాయి. నిధుల వినియోగంపైనా కఠిన నిబంధనలు తీసుకొచ్చి ప్రభుత్వానికి నివేదించాయి. తాజాగా రూల్స్ ఫైలును సీఎం ఆమోదించడంతో ఒకట్రెండు రోజుల్లో ఉత్తర్వు లు వెలువర్చే అవకాశం ఉందని ఎస్సీ అభివృద్ధి శాఖ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. త్వరలో రాష్ట్రస్థాయి సమన్వయ సమావేశం ప్రత్యేక అభివృద్ధి నిధి మార్గదర్శకాలు వచ్చిన వెంటనే రాష్ట్ర స్థాయిలో సమన్వయ కమిటీ ఏర్పాటు కానుంది. వాస్తవానికి ఈ కమిటీ ప్రతి మూడు నెలలకోసారి సమావేశమై క్షేత్రస్థాయిలో ఎస్డీఎఫ్ అమలు తీరును పర్యవేక్షించాలి. కానీ ఆర్థిక సంవత్సరం ప్రారంభమై ఆర్నెల్లు కావస్తున్నా మార్గదర్శకాలు రూపొందించకపోవడంతో కమిటీ ఏర్పాటు కాలేదు. త్వరలో మార్గదర్శకాలు వెలువడనుండటంతో కమిటీ ఏర్పాటుతో పాటు సమావేశం కూడా జరగనుందని అధికారులు చెబుతున్నారు. -
కేసీఆర్కు ఉత్తమ్ బహిరంగ లేఖ
హైదరాబాద్: తెలంగాణ సీఎం కే చంద్రశేఖర్ రావుకు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక దళితులు, గిరిజనులపై నిరంతరం కొనసాగుతున్న దాడులు, వేధింపులు, అక్రమాల గురించి అందులో పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలుస్తుదనుకున్నాము. కానీ మీరు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి అనగారిన వర్గాల వారిపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. తెలంగాణలో అణగారిన వర్గాలపైన జరుగుతున్న దాడులతోనే గుర్తింపు పొందేలా తయారైందని స్పష్టం చేశారు. ఎన్నికల ముందు దళితుల కుటుంబానికి మూడెకరాల భూమి ఇస్తామని ఇవ్వవపోవడమో కాకుండా కనీసం వారికి ఎలాంటి రక్షణ కల్పించడం లేదు. రాష్ట్రంలో రోజు ఎక్కడో ఒక చోట అనగారిన వర్గాల వారిపై ఎదో ఒక అఘాయిత్యం జరుగుతూనే ఉంది. అధికార పార్టీ నాయకులు చేస్తున్న దురగాతాలతో రాష్ట్రంలో రక్షణ లేకుండా పోయింది. రాష్ట్రంలో గత మూడున్నర ఏళ్లుగా ఆత్మహత్యలు చేసుకున్న రైతులలో ఎక్కువగా గిరిజనులే ఉన్నారు. 2014 నుంచి 2016 డిసెంబర్ నాటికి సెకరించిన వివరాల ప్రకారం రాష్ట్రంలో 1592 ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోదక చట్టం కింద కేసులు నమోదయ్యాయి. 502 మంది మహిళలపైన అత్యాచారాలు జరిగాయి. 120 హత్యలు జరిగాయి. మొత్తంగా అన్ని రకాల ఎస్సీ, ఎస్టీ కేసులను పరిశీలస్తే 2016 డిసెంబర్ నాటికే 5210 కేసులు నమోదు అయ్యాయంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. రాష్ట్రంలో దళితులు ఆత్మస్థైర్యం కోల్పోయి బతుకీడుస్తున్నారు. వారి రక్షణ కోసం ఏర్పాటు చేసిన చట్టాలు వారికి ఎలాంటి రక్షణ కల్పించడం లేదు. ఈ విషయంలో తగిన చర్యలు తీసుకొని దోషులను కఠినంగా శిక్షించి అనగారిన వర్గాలకు బతుకు భరోసా ఇవ్వాలని ఆకాంక్షిస్తున్నాము. -
మంత్రిపై అ్రట్రాసిటీ కేసుకు డిమాండ్
నెల్లిమర్ల: దళితులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన రాష్ట్ర మంత్రి ఆదినారాయణరెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని సామాజిక న్యాయ ఉద్యమ వేదిక జిల్లా కన్వీనర్ గంటాన అప్పారావు పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ ఐక్యవేదిక మండలశాఖ అధ్యక్షురాలు భోగాపురపు మంగమ్మతో కలిసి సోమవారం నెల్లిమర్ల తహసీల్దారు చిన్నారావుకు వినతిపత్రం అందించారు. అనంతరం అప్పారావు మాట్లాడుతూ నంద్యాల ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహించిన సభలో దళితులను కించపరుస్తూ మంత్రి తీవ్రమైన వ్యాఖ్యలు చేశారని ధ్వజమెత్తారు. ఎంతకాలం గడిచినా, ఎన్ని రిజర్వేషన్లు కల్పించినా దళితులు అభివృద్ధి సాధించలేరని మంత్రి మాట్లాడటాన్ని ఖండించారు. దళితులు అన్నివిధాలా అభివృద్ధి చెందారని, ఇప్పటికే 450 మంది దేశంలోనే అత్యున్నతమైన ఐఏఎస్ క్యాడర్లో ఉన్నారని అప్పారావు పేర్కొన్నారు. వెంటనే మంత్రి తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వ వెంటనే ఆయనపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని కోరారు. కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు. -
'ఏపీ మంత్రి మూల్యం చెల్లించక తప్పదు'
-
'ఏపీ మంత్రి మూల్యం చెల్లించక తప్పదు'
నంద్యాల వ్యవసాయం: రాష్ట్ర మంత్రి ఆదినారాయణరెడ్డి అహంకారంతో చేసిన వ్యాఖ్యలతో నంద్యాల ఉప ఎన్నికల్లో టీడీపీని ఎస్సీ, ఎస్టీలు అసహ్యించుకుంటారని అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త జొన్నలగడ్డ పద్మావతి అన్నారు. గురువారం నంద్యాల పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ మంత్రి హోదాలో ఉండి కనీస పరిజ్ఞానం లేకుండా ఎస్సీలు చదువుకోరని, శుభ్రంగా ఉండరని చెప్పిన మంత్రి, క్షమాపణలు చెప్పకుండా, అలా అనలేదని తప్పించుకోవడం సిగ్గు చేటరన్నారు. సీఎంకు, మంత్రులకు సలహాదారులుగా ఉన్న ఐఏఎస్ ఆఫీసర్లలో ఎస్సీలు కూడా ఉన్నారని గుర్తుంచుకోవాలన్నారు. మంత్రి ఆదినారాయణ రెడ్డి భవిష్యత్లో తగిన మూల్యం చెల్లించక తప్పదని పేర్కొన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్.. ఎస్సీ, ఎస్టీలపైన అభిమానం, ప్రేమానురాగాలు చూపించేవారన్నారు. నంద్యాల వైఎస్సార్సీపీ అభ్యర్థి శిల్పా మోహన్రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలి పించి జననేతకు కానుకగా ఇవ్వాలని నంద్యాల ఓటర్లను కోరారు. సమావేశంలో సింగనమల నాయకురాలు బండి లలితా కల్యాణి, బ్యాళ్ల శీను పాల్గొన్నారు. -
నేడు ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక గ్రీవెన్స్
అనంతపురం అర్బన్ (అనంతపురం): ఎస్సీ, ఎస్టీ వర్గాల సమస్యల పరిష్కారం కోసం కలెక్టర్ జి.వీరపాండియన్ ఆధ్వర్యంలో గురువారం ప్రత్యేక గ్రీవెన్స్ నిర్వహిస్తున్నట్లు సాంఘిక సంక్షేమ శాఖ డీడీ రోశన్న బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 గంటలకు కలెక్టరేట్లోని రెవెన్యూ భవన్లో గ్రీవెన్స్ ప్రారంభమవుతుందన్నారు. దళిత, గిరిజన సంఘాల నాయకులు, ప్రజలు తమ ఫిర్యాదులను, సమస్యలను అర్జీ రూపంలో సమర్పించుకోవాలని ఆయన వెల్లడించారు. -
ఎస్టీలకు తెలివి ఉండదు: సీఎం
కుప్పం నియోజకవర్గంలోని సభలో చంద్రబాబు వ్యాఖ్య చిత్తూరు, సాక్షి: సీఎం చంద్రబాబు నాయుడు గిరిజనులపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. దళితులు, గిరిజనులంటేæ సీఎం చంద్రబాబుకు చులకన అని చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం గుడుపల్లెలో గురువారం ఆయన అన్న మాటలే నిదర్శనమని కుల సంఘాలు విరుచుకుపడుతున్నాయి. విమర్శలకు తావిచ్చిన సీఎం చంద్రబాబు గుడుపల్లెలో చేసిన ప్రసంగం ఆయన మాటల్లోనే..‘ ఎస్టీలు అడవుల్లో ఉంటారు. ఎక్కడెక్కడోతిరుగుతుంటారు. వారికి తెలివి ఉండదు. వారిని కూడా అభివృద్ధి చేస్తాం. పేదరికాన్ని పారదోలేందుకు యజ్ఞంలా పని చేస్తున్నా. పేదరికంలో ఉన్న వారికి ప్రత్యేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్నాం. బడుగుబలహీన వర్గాల కోసం రూ. 10 వేలకోట్లు కేటాయించి అన్ని విధాలా ఆదుకుంటాం. అభివృద్ధి పనుల్లో ఏదైనా పొరపాటు జరిగితే అది కార్యకర్తలదే. వారి అవకతవకలకు నాపై కొపం చూపొద్దు. అలా చూపితే రాష్ట్రంలో అభివృద్ధి ఆగిపోతుంది. 90 శాతం ప్రజలందరూ టీడీపీకే ఓట్లేసి మరోసారి గెలిపించండి. దేశ చరిత్రలో నదుల అనుసంధానం చేసిన ఘనత నాదే.. గోదావరి, కృష్ణా నదులను కలిపి హంద్రీనీవా ద్వారా సెప్టెంబర్లోగా కుప్పం నియోజకవర్గంలోని ప్రతి చెరువుకూ నీరు అందించే బాధ్యత ప్రభుత్వానిది. పట్టిసీమ నిర్మించడం వల్లే ఇది సాధ్యం అవుతోంది. గోదావరి నీరు ప్రతి సంవత్సరం వేల క్యూసెక్కులు సముద్రంలో కలుస్తోంది. ఈ సంవత్సరం ఇప్పటి వరకు 3 వేల క్యూసెక్కుల నీరు వృథా అయ్యింది. కృష్ణలో నీరు ఈ స్థాయిలో లేదు. పెద్ద వర్షాలు వస్తేనే కృష్ణపై నిర్మించిన డ్యాంలు నిండుతాయి. దీంతో కరువు పరిస్థితుల్లో నీటికి కటకట ఏర్పడుతోంది. దీన్ని మార్చాంటే వర్షపు నీటిని సద్వినియోగం చేసుకోవాలి. పంట కుంటలు, చెక్డ్యాంలు నిర్మించి ప్రతి బొట్టూ భూమిలో ఇంకిపోయేలా చూస్తే.. చేను కిందే చెరువు ఉంటుంది. దీంతో పాటు ప్రతి మహిళకూ నెలకు రూ.10 వేల ఆదాయం వచ్చేలా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇందు కోసం కంపోస్టు యార్డులు, తదితర పనులు అçప్పజెప్పుతున్నాం. కరువులో రైతులు ఇబ్బందులు పడకుండా.. వారి ఆదాయం పడిపోకుండా పచ్చగడ్డి, గడ్డి విత్తనాలు 50 శాతం సబ్సిడీతో పంపిణీ చేస్తున్నాం. డ్వాక్రా మహిళలు ఉత్పత్తి చేసిన వస్తువులకు మంచి గిరాకీ ఉండేలా వారికి మార్కెటింగ్ మెళకువలు నేర్పిస్తాం. పరిశ్రమలు ఏర్పాటు చేయాలనుకునే మహిళలకు చేయూతనిస్తాం’ అని సీఎం పేర్కొన్నారు. -
ఎస్సీ, ఎస్టీ నిధుల ముసాయిదా సిద్ధం
- రూపొందించిన మంత్రుల కమిటీ - ఒకట్రెండు రోజుల్లో సీఎం వద్దకు ఫైలు - ఆమోదముద్ర పడగానే అమల్లోకి.. - అభివృద్ధి నిధి పర్యవేక్షణకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు - మంత్రుల బృందంతో ప్రత్యేక కౌన్సిల్ సాక్షి, హైదరాబాద్: ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్ స్థానంలో కొత్తగా అమల్లోకి తెచ్చిన ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి నిధి మార్గదర్శకాల అంశం కొలిక్కి వచ్చింది. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, గిరిజన శాఖ మంత్రి చందూలాల్ ఆధ్వర్యంలో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మేధావులు, అధికారులతో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిటీలు ఇప్పటికే పలు దఫాలుగా సమావేÔశమయ్యాయి. సుదీర్ఘ చర్చలు జరిపిన ఈ కమిటీలు తాజాగా నిబంధనలు ఖరారు చేశాయి. ఏడు అంశాలతో రూపొందించిన ముసాయిదాను ఒకట్రెండు రోజుల్లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావుకు పంపేందుకు రంగం సిద్ధమైంది. సీఎం ఆమోదం పొందగానే ప్రత్యేక అభివృద్ధి నిధి పూర్తిస్థాయిలో అమల్లోకి రానుంది. ఎస్సీ ప్రత్యేక అభివృద్ధి నిధి, ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి నిధిని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. గతంలో ఉన్న సబ్ప్లాన్ కంటే మెరుగైన రీతిలో కార్యక్రమాలు అమలు చేయాలని సీఎం ఇప్పటికే పలుమార్లు స్పష్టంచేశారు. నిధి కింద చేసే ఖర్చుకు తగిన ఫలితాలు రావాలనే లక్ష్యంతో మంత్రుల కమిటీ కార్యచరణ రూపొం దించింది. జనాభా ప్రాతిపదికన నిధులు కేటాయిస్తూ.. పలు పథకాలను నిర్దేశించింది. ఇందులో విద్య, వైద్యం, ఆర్థిక స్థితి, ఉపాధి తదితర అంశాలను ప్రధానంగా ప్రస్తావించింది. అలాగే ఖర్చు కాని నిధులను వచ్చే ఏడాదికి క్యారీ ఫార్వర్డ్ చేయాలని నిబంధనల్లో పేర్కొంది. ఆరు నెలలకోసారి కౌన్సిల్ భేటీ.. ఎస్సీ ప్రత్యేక అభివృద్ధి నిధి, ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి నిధి పర్యవేక్షణకు ప్రభుత్వం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. ఇందుకు రాష్ట్రస్థాయిలో మంత్రుల బృందంతో ప్రత్యేక కౌన్సిల్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది. ఈ కమిటీ ఆర్నెళ్లకోసారి సమావేశం కావాల్సి ఉంటుంది. వీటితోపాటు ఎస్సీ అభివృద్ధి శాఖ, గిరిజన సంక్షేమ శాఖలు నోడల్ ఏజెన్సీలుగా వ్యవహరిస్తాయి. మంత్రుల కమిటీ సూచించిన ఏడు అంశాలివే.. ► ఇతర వర్గాలు–ఎస్సీ, ఎస్టీ వర్గాల మధ్య అంతరాన్ని తగ్గించేలా ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలి ► జనాభా ప్రాతిపదికన నిధులు కేటాయించి ఖర్చు చేయాలి ► ఎస్సీ, ఎస్టీల అభివృద్ధికి వారి సామాజిక పరిస్థితుల ఆధారంగా ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలి ► బడ్జెట్ తయారీ ప్రణాళికబద్ధంగా జరగాలి ► సకాలంలో ఖర్చు కాని నిధులను వచ్చే ఏడాదికి క్యారీ ఫార్వర్డ్ చేయాలి ► రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక కౌన్సిల్ ఏర్పాటు చేసి పర్యవేక్షణ చేపట్టాలి ► జిల్లా స్థాయిలో నిఘా, పర్యవేక్షణకు కమిటీలు ఏర్పాటు చేయాలి -
త్వరలో ఎస్సీ, ఎస్టీ నిధి నిబంధనలు
వివిధ శాఖల అధికారులతో సీఎస్ సమీక్ష సాక్షి, హైదరాబాద్: ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి నిధికి సంబంధించి నిబంధనల రూపకల్పనకు సూచనలు చేయాలని వివిధ శాఖల ఉన్నతాధికారులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్ కోరారు. మంగళవారం సచివాలయంలో నిర్వహిం చిన సమీక్షలో సీఎస్ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ సూచనలకు అనుగుణంగా ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి నిధిపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టాల న్నారు. పథకాల అమలు పర్యవేక్షణకు సీఎం చైర్మన్గా కౌన్సిల్ ఏర్పడుతుందన్నారు. పది రోజుల్లోగా డ్రాప్ రూల్స్ సమర్పించాలని అజయ్ మిశ్రా కోరారు. ఈ సందర్భం గా ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు ప్రగతి పద్దులో వివిధ శాఖలకు కేటాయించిన నిధుల వివరాలు చెప్పారు. కేంద్ర ప్రాయోజిత పథకాలకు సంబంధిం చి కేంద్రం నుంచి రూ.3 వేల కోట్ల నుంచి రూ.4 వేల కోట్లు అదనంగా పొందేలా వివిధ శాఖలు కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకోవాలని సీఎస్ సూచించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు రంజీవ్ ఆర్.ఆచార్య, ఎస్కే జోషి, రాజేశ్వర్ తివారి, బీపీ ఆచార్య, సురేశ్ చందా తదితరులు పాల్గొన్నారు. -
‘జానా’ తీరుపై సంపత్ నిరసన
నల్ల కండువాతో అసెంబ్లీకి హాజరు ♦ ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక నిధి బిల్లుపై మాట్లాడే అవకాశం ఇవ్వలేదని అసంతృప్తి ♦ తాను మాట్లాడతానన్నా జానారెడ్డి పట్టించుకోలేదని కినుక ♦ వంశీకే మైక్ ఇప్పించడానికి ప్రయత్నించారని ఆరోపణ ♦ ప్రభుత్వం కూడా అవకాశం రాకుండా కుట్ర పన్నిందని ధ్వజం ♦ కాంగ్రెస్ శాసనసభాపక్షం అండగా నిలవకపోవడంపై ఆవేదన సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ శాసనసభ్యుడు సంపత్కుమార్ శనివారం నల్లకండువాతో శాసనసభకుహాజరవడం చర్చనీయాంశమైంది. ఎస్సీ, ఎస్టీ ప్రత్యేకనిధి బిల్లుపై చర్చ సం దర్భంగా శుక్రవారం శాసనసభలో తనకు మాట్లాడే అవకాశం ఇవ్వనందుకు నిరసనగా నల్లకండువాతో సభకు హాజరైనట్లు సంపత్ మీడియా ప్రతినిధులతో అన్నారు. తాను మాట్లాడతానన్నా సీఎల్పీ నేత జానారెడ్డి తనకు అవకాశం కల్పించలేదని పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్ను కాంగ్రెస్ పార్టీ తెచ్చిందని, దానిలోని లోతుపాతులపై అధ్యయనం చేశానని, తనకు అవగాహన ఉందని, అయినా మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడం అన్యా య మని అన్నారు. కాంగ్రెస్కే చెందిన వంశీచంద్ రెడ్డికి మైక్ ఇప్పించడానికి జానారెడ్డి పదేపదే ప్రయత్నం చేశారని సంపత్కుమార్ తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. సంక్షేమ పద్దులపై చర్చలో ప్రభుత్వ విధానాన్ని, ముఖ్యమంత్రి కేసీఆర్ అనుసరిస్తున్న వైఖరిని ఎత్తి చూపానని, దాంతో ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక నిధి బిల్లుపై మాట్లాడే అవకాశం రాకూడదని ప్రభుత్వం కుట్ర చేసిందని, ప్రభుత్వ ఒత్తిడికి స్పీకర్ తలొగ్గారని ఆరోపించారు. అభివృద్ధి నిధిపై సబ్కమిటీలో సభ్యునిగా ఉన్న తనకు అవకాశం రాకపోతే కాంగ్రెస్ శాసనసభాపక్షం కూడా తనకు మద్దతుగా నిలవకపోవడం తీవ్ర ఆవేదనకు గురిచేసిందని సంపత్ అన్నారు. అన్ని పక్షాలు దళితుల విషయంలో సభను తప్పుదారి పట్టించాయన్నారు. కాంగ్రెస్పార్టీ హయాం లోనే దళితులకు మేలు జరిగిం దన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు జరిగిన మేలును శాసనసభలో మాట్లాడే అవకాశం వచ్చిన తమ పార్టీ సభ్యులు కూడా సరిగా చెప్పలేకపోయారని అసంతృప్తి వ్యక్తం చేశారు. తనకు అవకాశం ఇవ్వకుండా ప్రభుత్వం కుట్రచేస్తే, దళిత బిడ్డగా తనకు కాంగ్రెస్ సభ్యులు అండగా ఉండకపోవడంతో రాత్రంతా తీవ్ర ఆవేదన చెందినట్టుగా సంపత్కుమార్ వెల్లడించారు. సీనియర్ల బుజ్జగింపులు నల్లకండువాతో అసెంబ్లీకి వచ్చిన సంపత్ కుమార్ను కాంగ్రెస్పార్టీ సీనియర్ ఎమ్మె ల్యేలు పలువురు బుజ్జగించే ప్రయత్నం చేశారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జి.చిన్నారెడ్డి, రామ్మోహన్రెడ్డి తదితరులు ఆయనకు నచ్చ జెప్పారు. సంపత్కుమార్తో మాట్లాడటానికి జానారెడ్డి కూడా సీఎల్పీ కార్యాలయం వైపు వచ్చారు. సంపత్ కోసం సీఎల్పీ కార్యాలయం ఎదుట జానారెడ్డి కొంతసేపు వేచిచూశారు. ఈ విషయాన్ని ఎమ్మెల్యే రామ్మోహన్రెడ్డి చెప్పినా సంపత్ పట్టించుకోలేదు. ఇప్పుడు జానారెడ్డితో మాట్లాడేదీ ఏమీ లేదని, ఆయన ఇంటికి వెళ్లి మాట్లాడతానని బెట్టు చేశారు. దీంతో జానారెడ్డి కూడా అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆ తరువాత మరోసారి మీడియా ప్రతినిధులతో మాట్లాడిన సంపత్ శాసనసభలో జరిగిన అంశాలపై తనకు ఆవేదన ఉందని. అన్ని విషయాలను అంత ర్గతంగానే చెప్పుకునేందుకు సీఎల్పీ సమా వేశం నిర్వహించాలని డిమాండ్ చేశారు. టీఆర్ఎస్లో చేరుతారా? టీఆర్ఎస్లోని ఓ ప్రముఖ నేతతో సంపత్ టచ్లో ఉన్నారని, ఆ పార్టీలో చేరడానికి వ్యూహంలో భాగంగానే నల్లకండువాతో సభకు వచ్చి ఉంటారని కాంగ్రెస్ వర్గాలు చెప్పాయి. సంపత్కుమార్ టీఆర్ఎస్లో చేరడానికి సదరు ప్రముఖ నేతతో ఇప్పటికే చాలా సార్లు సంప్రదింపులు జరిపినట్లు తమ దృష్టికి వచ్చిందని సీనియర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఒకరు చెప్పారు. కాంగ్రెస్ దళి తులకు వ్యతిరేకం అన్న అపవాదు కలిగించే ప్రయత్నంలోనే సంపత్ కుమార్ ఇలా చేసి ఉంటారని కాంగ్రెస్ వర్గాలు అనుమానిస్తున్నాయి. అయితే తాను ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ను వీడబోనని సంపత్కుమార్ చెప్పారు. తన కుటుంబం యావత్తు మొదటి నుంచి కాంగ్రెస్తోనే ఉన్నదని, భవిష్యత్లో కూడా తాను కాంగ్రెస్తోనే ఉంటానని ఆయన విస్పష్టంగా చెప్పారు. -
‘సబ్ ప్లాన్’ చట్ట సవరణకే కాంగ్రెస్ పట్టు!
సాక్షి, హైదరాబాద్: ఎస్సీ, ఎస్టీ నిధుల వెచ్చింపుకు కొత్త చట్టం అవసరం లేదని ప్రస్తుత సబ్ ప్లాన్కే చట్ట సవరణ చేస్తే సరిపోతుందని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. ఇందుకోసం ‘ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి నిధి చట్టం’ పేరుతో కొత్త చట్టం అవసరం లేదని, దానికి బదులు సబ్ ప్లాన్ చట్టానికే సవరణ తేవాలని అసెంబ్లీలో పట్టుబ ట్టాలని నిర్ణయించింది. సభలో అనుసరించాల్సిన వ్యూహంపై పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి, కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టి విక్రమార్క, మండలిలో కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ, సీఎల్పీ ఉప నేతలు టి.జీవన్రెడ్డి, పొంగులేటి సుధాకర్రెడ్డి తదితరులు గురువారం చర్చించారు. సబ్ప్లాన్ చట్టం తెచ్చిన ఘనత కాంగ్రెస్దేనని వారన్నారు. కాంగ్రెస్ చేసిన చట్టంలో ఇంతకంటే మెరుగైన అంశాలు చాలా ఉన్నాయన్నది వారి వాదన. సబ్ ప్లాన్ నిధులను ఖర్చు చేయకుంటే బాధ్యులపై కేసులు పెట్టే ఆస్కారం కూడా పాత చట్టంలో ఉందని సభ్యులంటున్నారు. కొత్త చట్టంలో దాన్ని లేకుండా చేశారన్నారు. ఎస్సీ, ఎస్టీలకు నష్టం చేసేలా ఉన్న కొత్త చట్టంపై సీఎల్పీ నేత జానారెడ్డితో పాటు పార్టీ ముఖ్యనేతంతా సభలో గట్టిగా ఉండాలని కాంగ్రెస్ భావిస్తోంది. -
నిధులు, పథకాలు తేల్చేద్దాం!
నేడు ఎస్సీ, ఎస్టీ కమిటీల మూడో భేటీ సాక్షి, హైదరాబాద్: ఎస్సీ, ఎస్టీల ప్రత్యేక అభివృద్ధి నిధిపై నేడు కీలక భేటీ జరగనుంది. శుక్రవారం సర్వశిక్షా అభియాన్ కాన్ఫరెన్స్ హాల్లో ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్ చట్ట సవరణల కోసం ఏర్పాటు చేసిన ఎస్సీ, ఎస్టీ కమిటీలు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అధ్యక్ష తన భేటీ కానున్నాయి. గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అజ్మీరా చందూలాల్, సాంఘిక సంక్షేమ మంత్రి జగదీశ్రెడ్డి, కమిటీ సభ్యులు, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శులు, శాఖాధి పతులు ఇందులో పాల్గొననున్నారు. ఇప్పటికే రెండుసార్లు ఈ కమిటీలు సమావేశమై నిధుల వినియోగం గురించి చర్చించి పలు నిర్ణయాలు తీసుకున్నాయి. తాజాగా జరిగే సమావేశంలో నిధుల కేటాయింపుపై సుదీర్ఘం గా చర్చించనున్నాయి. అంతేకాకుండా శాఖల వారీగా పథకాల రూపకల్పనపై సమీక్ష నిర్వహించనున్నాయి. ఈ క్రమంలో శుక్రవారం జరిగే సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది. కాగా, గత రెండు సమావేశాలకు కాంగ్రెస్ సభ్యులు గైర్హాజరయ్యారు. తొలి సమావేశానికి టీడీపీ సభ్యుడొకరు, వామపక్ష సభ్యుడు హాజరు కాగా.. ఆ తరువాతి సమావేశానికి మాత్రం అధికార పార్టీ సభ్యులు మినహా మిగిలిన పార్టీల సభ్యులు హాజరు కాలేదు. దీంతో నేటి సమావేశానికి విపక్ష సభ్యులు హాజరవుతారా, లేదా వేచి చూడాలి. ఈ సమావేశంలో ప్రత్యేక అభివృద్ధి నిధి నుంచి ఆయా పథకాలకు కేటాయింపులు ఎలా చేయాలనే అంశంపై చర్చిచనున్నారు. -
ప్రత్యేక అధికారులు విధిగా పర్యటించాలి..
నల్లగొండ : ప్రత్యేక అధికారులు వారంలో ఒక రోజు విధిగా మండలాలను పర్యటించి ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాలను తనిఖీ చేసి నివేదికలు ఇవ్వాలని కలెక్టర్ గౌవర్ ఉప్పల్ ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన సమన్వయ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజల సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరించే విధంగా.. వారి జీవన ప్రమాణాలు మెరుగు పర్చేవిధంగా ప్రభుత్వ పథకాలు అమలు చేయాలని సూచించారు. పాఠశాలలు, ఆస్పత్రులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వసతి గృహాలు, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణ ప్రగతి, హరితహారం, అంగన్వాడీ కేంద్రాల పనితీరు వంటి తదితర అంశాలపై తనిఖీ చేయాలన్నారు. యాదవులకు చేయూతనిచ్చేందుకు గొర్రెల పెంపకాన్ని ప్రోత్సోహించేలా ఎక్కువ మొత్తంలో యూనిట్లను మంజూరు చేయాలన్నారు. జిల్లాలోని మిషన్ కాకతీయ చెరువులు, మధ్యతరహా, చిన్నతరహా చెరువులు, ప్రాజెక్టుల ప్రాంతాల్లో భారీగా చేప పిల్లలను పెంచేందుకు ప్రణాళికలు రూపొందించానల్నారు. ప్రతి కుటుంబం జీవన స్థితిగతులను అధ్యయనం చేసి వివిధ ప్రభుత్వ పథకాలు అందించాలని సూచించారు. దళిత, గిరిజన ప్రాంతాల్లో పర్యటించి మౌలిక వసతుల కల్పనకు చేపట్టాల్సిన కార్యక్రమాలను రూపొందించాలన్నారు. ‘క్లీన్ ఏ విలేజ్’ కింద గ్రామాల్లో కార్యక్రమాలు నిర్వహించాలని, ప్రజా ప్రతినిధులందరినీ భాగస్వాములను చేయాలన్నారు. క్లీన్ ఏ ఏవిలేజ్ కార్యక్రమంలో ఉత్తమ గ్రామ పంచాయతీలకు అవార్డులు ఇవ్వనున్నట్లు వెల్లడించారు. జిల్లా అభివృద్ధి ప్రణాళిక, జిల్లా రిసోర్స్ మ్యాప్లను వివిధ కార్యక్రమాల ద్వారా రూపొందించాలన్నారు. ఉత్తమ సేవలు అందించిన అధికారులను ప్రోత్సహించడంతో పాటు వారిని సన్మానించనున్నట్లు తెలిపారు. చేనేత, బీడీ కార్మికులకు గృహ నిర్మాణ పథకం కింద కేంద్ర ప్రభుత్వం నుంచి నేరుగా నిధులు మంజూరు చేస్తారని, ఈ మేరకు వారి డేటాను సేకరించి ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వసతి గృహాల అభివృద్ధికి, మౌలిక వసతుల కల్పనకు ఎన్ని నిధులు అవసరమవుతాయో అంచనాలు రూపొందించాలని సూచించారు. సమావేశంలో జేసీ నారాయణరెడ్డి, ఏఎస్పీ వెంకటేశ్వర్లు, డీఆర్వో కీమ్యానాయక్, డీఆర్డీఓ ఆర్.అంజయ్య తదితరులు పాల్గొన్నారు. ఎయిడ్స్ నియంత్రణ కేంద్రాల్లో సదుపాయాలు కల్పిస్తాం : కలెక్టర్ నల్లగొండ : జిల్లాలోని ఎయిడ్స్ నియంత్రణ కేంద్రాల్లో అవసరమైన అన్ని సదుపాయాలను కల్పిస్తామని కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ తెలిపారు. తన క్యాంపు కార్యాలయంలో సోమవారం ఆయన రాష్ట్ర స్థాయి ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ మేరకు సంస్థ ప్రతినిధులు జిల్లాలోని ఎయిడ్స్ కేంద్రాల్లో లోటుపాట్ల వివరాలను కలెక్టర్ దృష్టికి తీసుతెచ్చారు. ఈ సందర్భంగా ఉప్పల్ మాట్లాడుతూ జిల్లాలోని 52 ఎయిడ్స్ నియంత్రణ కేంద్రాల్లో ఉన్నవారికి ప్రభుత్వ పరంగా అందాల్సిన పెన్షన్లు, మందులు, పౌష్టికాహారంతోపాటు ఇతర సదుపాయాలు కల్పిస్తామన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి కూడా భర్తీకి చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. సమావేశంలో సంస్థ ప్రతినిధులు ప్రాజెక్టు డైరక్టర్ జాన్బాబు, ఏపీడీ రాంమోహన్, పాల్గొన్నారు. -
రేపు కేబినెట్ భేటీ
సాక్షి, హైదరాబాద్: వచ్చే బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో గురువారం రాష్ట్ర మంత్రివర్గం సమావేశం అవుతోంది. సీఎం కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన సచివాలయంలో మధ్యా హ్నం 2 గంటలకు ఈ భేటీ జరుగుతుంది. ప్రధానంగా ఎస్టీ, మైనారిటీ రిజర్వేషన్ల శాతా న్ని పెంచే అంశంపై ఈ సమావేశంలో చర్చించ నున్నారు. మైనారిటీల సామాజిక ఆర్థిక స్థితి గతులపై అధ్యయనం చేసిన సుధీర్ కమిషన్, ఎస్టీల జీవన స్థితిగతులపై అధ్యయనం చేసిన జస్టిస్ చెల్లప్ప కమిషన్ ఇప్పటికేæ తమ నివేదిక లను ప్రభుత్వానికి సమర్పించిన విషయం తెలి సిందే. రిజర్వేషన్ల పెంపునకు కట్టుబడి ఉన్నట్లు ఇటీవల అసెంబ్లీలో సీఎం ప్రకటించారు. ఈ నేపథ్యంలో రిజర్వేషన్ల పెంపు, అవసరమైన చట్టసవరణ కోరుతూ కేంద్రానికి పంపే ప్రతి పాదనలపై చర్చిస్తారు. మరో 15 అంశాలతో ఎజెండాను అధికారులు సిద్ధం చేస్తున్నారు. బడ్జెట్ తయారీపై పరిశీలన.. 2017–18 బడ్జెట్ తయారీతో పాటు బడ్జెట్ సమావేశాలను ఎప్పుడు నిర్వహించాలి, బడ్జెట్ను ఎప్పుడు ప్రవేశపెట్టాలనే అంశాలపై సమావేశంలో చర్చించనున్నారు. బడ్జెట్ రూప కల్పనలో నూతన నిబంధనలకు అనుగుణం గా ఈసారి ప్రణాళికా, ప్రణాళికేతర వ్యయాన్ని విలీనం చేయనున్న విషయం తెలిసిందే. అంతే గాకుండా కేంద్రం ఈసారి నెల రోజుల ముం దుగా బుధవారమే పార్లమెంట్లో బడ్జెట్ను ప్రవేశపెడుతోంది. కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చే గ్రాంట్లు, పన్నుల వాటా, కేంద్ర ప్రాయో జిత పథకాల నిధులపై స్పష్టత వస్తుంది. దీని ఆధారంగా రాష్ట్ర బడ్జెట్ను పక్కాగా రూపొం దించుకునే వీలు కలుగనుంది. ఫిబ్రవరి మూడో వారంలో లేదా మార్చి మొదటి వారం లో రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు ప్రారంభించా లని ప్రభుత్వం యోచిస్తోంది. గురువారం జరుగనున్న భేటీలో బడ్జెట్ సమావేశాల తేదీల ను ఖరారుతో పాటు కొత్తగా ప్రవేశపెట్టే ఆకర్షణీయ పథకాలు, వాటి ప్రయోజనాలపై చర్చించే అవకాశముంది. ఇప్పటికే వివిధ శాఖలు సమర్పించిన బడ్జెట్ ప్రతిపాదనలను ఈ సందర్భంగా సీఎం సమీక్షించనున్నారు. భవనాల అప్పగింతపై చర్చ! హైదరాబాద్లో ఏపీ ప్రభుత్వం ఆధీనంలో ఉన్న భవనాలపై గవర్నర్ సమక్షంలో బుధవా రం ఇరు రాష్ట్రాలకు చెందిన మంత్రులు, అధికారులు సమావేశంకానున్నారు. సచివాల యంతో పాటు అసెంబ్లీ, కౌన్సిల్, వివిధ కార్యాలయాలు తమకు అప్పగించాలని తెలం గాణ మంత్రివర్గం ఇప్పటికే తీర్మానం చేసి గవర్నర్కు లేఖ రాసింది. అందులో తీసుకునే నిర్ణయాలు, తీర్మానాలు సైతం గురువారం జరిగే కేబినెట్ భేటీలో చర్చకు వచ్చే అవకాశముంది. వీటితోపాటు గత అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టాలనుకున్న ప్రైవేటు వర్సిటీల బిల్లు, మూసీ రివర్ అథారిటీ, కొత్త నియామకాలు, హోంగార్డుల జీతాల పెంపు, పురపాలక, హోంశాఖలకు సంబంధించిన పలు చట్ట సవరణలు తదితర అంశాలు చర్చకు రానున్నాయి. సబ్ప్లాన్ నిధుల బదిలీకి చట్ట సవరణ ఎస్సీ, ఎస్టీలకు సబ్ప్లాన్ నిధులు, సబ్ప్లాన్ చట్ట సవరణపై ఇటీవల అఖిలపక్ష ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో సమీక్షిం చిన సీఎం ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేశా రు. బడ్జెట్లో సబ్ప్లాన్కు కేటాయించే నిధులు ఖర్చు కాకపోతే వచ్చే ఏడాదికి బదిలీ అయ్యే పద్ధతి అమలు చేయాలని, సబ్ప్లాన్ పేరు మార్చాలనే ప్రతిపాదనలు చర్చకు వచ్చాయి. ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్ నిధులను ‘క్యారీఫార్వర్డ్ (తర్వాతి ఏడాదికి బదిలీ)’ చేయాలా, వద్దా.. దీనికి చట్టసవరణ చేయాల్సి ఉంటుందా.. అనే అంశాలపై కేబినెట్ భేటీలో చర్చ జరుగనుంది. కమిటీలు ఇచ్చే సిఫారసులు ఈ సందర్భంగా కీలకం కానున్నాయి. -
ఎస్టీలకు ప్రత్యేక కమిషన్
- గిరిజన ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బాలాజినాయక్ అనంతపురం సప్తగిరి సర్కిల్ : రాష్ట్రంలో ఎస్టీలకు ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలని గిరిజన ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బాలాజినాయక్ డిమాండ్ చేశారు. స్థానిక ఎన్జీఓ భవన్లో ఆదివారం గిరిజన ఉద్యోగుల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. అందులో ఆయన మాట్లాడుతూ గిరిజనులు, గిరిజన ఉద్యోగులు దీర్ఘకాలంగా అనేక రకాల సమస్యలను ఎదుర్కొంటున్నారని విచారం వ్యక్తం చేశారు. వాటిపై గిరిజనులకు అవగాహన కల్పించేందుకు కృషి చేస్తామన్నారు. ఎస్టీలకు అందాల్సిన ఫలాలు సకాలంలో అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. ఉద్యోగాల భర్తీ విషయంలో రోస్టర్ పాటించడం లేదన్నారు. రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించేలా చర్యలు తీసుకోవాలన్నారు. నకిలీ కుల ధృవీకరణ పత్రాల వల్ల అనేకమంది గిరిజనులు నష్టపోతున్నారన్నారు. వెనుకబడిన కులాలను ఎస్టీ జాబితాలో చేర్చాలనే ప్రయత్నాలను వెంటనే విరమించుకోవాలన్నారు. ప్రతి జిల్లాకు ఎస్టీ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలన్నారు. జిల్లా కేంద్రాల్లో ఎస్టీల కోసం స్టడీ సెంటర్లను ఏర్పాటు చేయాలన్నారు. అనంతరం ఎస్టీ ఉద్యోగుల సంఘం నూతన క్యాలెండర్లను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో నగర ఉప మేయర్ గంపన్న, ఉద్యోగుల సంఘం చైర్మన్ ఠాగూర్నాయక్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భాస్కరరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి రామాంజినేయులు, రంగానాయక్, జీవీఎస్ఎస్ నాయకులు శివశంకర్నాయక్, మల్లికార్జున నాయక్ తదితరులు పాల్గొన్నారు. -
ఎస్సీ, ఎస్టీల సంక్షేమానికి రూ.15 వేల కోట్లు ఇవ్వాలి
వైఎస్సార్ కాంగ్రెస్ తెలంగాణ డిమాండ్ సాక్షి, హైదరాబాద్: వచ్చే బడ్జెట్లో ఎస్సీ, ఎస్టీ వర్గాల సంక్షేమానికి రూ.15 వేల కోట్లు కేటాయించి, ఈ నిధులు పక్కదారి పట్టకుండా పూర్తిగా ఖర్చు చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ తెలంగాణ డిమాండ్ చేసింది. రాష్ట్రంలో సబ్ప్లాన్ అమలు అధ్వానంగా ఉందని కేంద్ర మంత్రి రాందాస్ అథవాలే ఇటీవల అసంతృప్తి వ్యక్తం చేసిన నేపథ్యంలో.. కంటి తుడుపు చర్యగా టీఆర్ఎస్ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్ అమలుకు కమిటీలు వేసిందని పేర్కొంది. తెలం గాణ ఏర్పడి 31 నెలలు గడుస్తున్నా ఎస్సీ, ఎస్టీ వర్గాలకు న్యాయం జరగలేదని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోయినిపల్లి శ్రీనివాస్రావు శనివారం ఒక ప్రకటనలో విమర్శించారు. మూడేళ్లుగా ఈ వర్గాలకు కేటాయించిన బడ్జెట్లో సగం కూడా ఖర్చు చేయలేదన్నారు. హక్కుల కోసం పోరాడిన దళితులు, గిరిజనులు.. వాటి అమలు కోసం మరో పోరాటం చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా భూమి లేని దళిత కుటుంబాలు 1.5 లక్షల వరకు ఉండగా, రెండున్న రేళ్లలో కేవలం 3,671 కుటుంబాలకు 9,663 ఎకరాల భూపంపిణీ మాత్రమే జరిగిందన్నారు. ఈ ఏడాది నిధులు ఖర్చు కాకపోతే వాటిని క్యారీ ఫార్వర్డ్ చేసి వచ్చే బడ్జెట్లో మిగులుగా చూపించాలని.. అయితే ఈ ప్రభుత్వం ఆ నిధులను ఇతర పథకాలకు తరలిస్తోందని చెప్పారు. అసెంబ్లీలో అన్ని అంశాలను స్వయంగా వివరించిన సీఎం కేసీఆర్ సబ్ప్లాన్పై చర్చలో మాత్రం పాల్గొనకపోవడాన్ని బట్టి ఎస్సీ, ఎస్టీల విషయంలో ఆయన వైఖరి ఏమిటో స్పష్టమవుతోందని విమర్శించారు. -
ఎస్సీ, ఎస్టీల అభివృద్ధికి ఏం కావాలో నిర్ణయించండి
-
సారథులు మీరే
ఎస్సీ, ఎస్టీల అభివృద్ధికి ఏం కావాలో నిర్ణయించండి - అఖిలపక్ష ఎస్సీ, ఎస్టీ ప్రజాప్రతినిధులతో సీఎం - ఎన్ని కార్యక్రమాలు అమలు చేస్తున్నా దళిత వర్గాల్లో పేదరికం పోవడం లేదు - రాజకీయాలకు అతీతంగా అంతా ఒక్కటవ్వాలి - వందశాతం మార్పు తేవాలి.. అందుకు నేను చిత్తశుద్ధితో ఉన్నానిధుల ఖర్చుపై విధానానికి కమిటీలు - కడియం సారథ్యంలో ఎస్సీ కమిటీ.. చందూలాల్ అధ్యక్షతన ఎస్టీ కమిటీ సాక్షి, హైదరాబాద్: రాజకీయాలకతీతంగా రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ వర్గాల అభివృద్ధి, సంక్షేమానికి కలిసికట్టుగా ఆలోచించి ఒక విధానం రూపొందించుకోవాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు పిలుపునిచ్చారు. స్వాతంత్య్రం వచ్చినప్పట్నుంచి ఎన్నో కార్యక్రమాలు, పథకాలు అమలు చేసినప్పటికీ... ఎస్సీ, ఎస్టీ వర్గాల్లో పేదరికం పోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్సీ, ఎస్టీ వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా ప్రభుత్వం పని చేయాల్సి ఉందన్నారు. శుక్రవారం అన్ని పార్టీలకు చెందిన ఎస్సీ, ఎస్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సీఎం ప్రగతిభవన్లో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఎస్సీ వర్గీకరణ చేయాలని కేంద్రాన్ని కోరేందుకు అఖిల పక్షాన్ని ఢిల్లీకి పంపుతామని ఈ సందర్భంగా సీఎం చెప్పారు. "ఇంతకాలం ఎస్సీ, ఎస్టీలకు ఏం కావాలో ఇతరులు నిర్ణయించే వారు. కానీ తెలంగాణలో మార్పు రావాలి. ఎస్సీ, ఎస్టీలకు ఏం కావాలో ఆ వర్గాల నుంచి వచ్చిన ప్రజా ప్రతినిధులే నిర్ణయించాలి. వారితో ఏర్పాటు చేసే కమిటీ ఇచ్చే సిఫారసులను ప్రభుత్వం అమలు చేస్తుంది" అని అన్నారు. "బడ్జెట్ రూపకల్పనకు కేంద్రం చేసిన మార్పులకు అనుగుణంగా మన రాష్ట్రంలో కూడా బడ్జెట్ రూపకల్పన జరగాలి. మొత్తం బడ్జెట్లో ఎస్సీ, ఎస్టీలకు జనాభా ప్రాతిపదికన వారి నిష్పత్తికి అనుగుణంగా నిధులు కేటాయించాలి. వారి జనాభా శాతం కంటే కొంచెం అధికంగానే ఖర్చు పెట్టాలి. ఆయా వర్గాలకు నిధులు కేటాయించడం, ఖర్చు చేయడానికి అవసరమైన విధానం ఎస్సీ, ఎస్టీ కమిటీలు రూపొందించాలి. ఎస్సీ, ఎస్టీ వర్గాల్లో పేదరికం పోవాలి. అదే లక్ష్యం కావాలి" అని సీఎం పేర్కొన్నారు. ఎస్టీ కమిటీ ఇదే.. మంత్రి చందూలాల్ సారథ్యంలో సీఎం ఎస్టీ కమిటీని ప్రకటించారు. ఇందులో రెడ్యానాయక్, సీతారాం నాయక్, నగేశ్, రాము నాయక్, కోవ లక్ష్మి, సున్నం రాజయ్య, తాటి వెంకటేశ్వర్లు సభ్యులుగా ఉన్నారు. కడియం ఆధ్వర్యంలో ఎస్సీ కమిటీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అధ్యక్షతన ఎస్సీ కమిటీని ఏర్పాటు చేశారు. నంది ఎల్లయ్య, బాల్క సుమన్, ఎం.ఎస్.ప్రభాకర్, సండ్ర వెంకటవీరయ్య, భట్టి విక్రమార్క, గీతారెడ్డి, సంపత్ కుమార్, నల్లాల ఓదేలు, రసమయి బాలకిషన్, ఆరూరి రమేశ్, కిశోర్, సంజీవ రావు కమిటీ సభ్యులుగా ఉన్నారు. కొప్పుల ఈశ్వర్ను ప్రత్యేక ఆహ్వానితులుగా నియమించారు. ఎస్సీ, ఎస్టీ శాఖల ద్వారానే ఖర్చు "ఎస్సీ, ఎస్టీల కోసం కేటాయించిన నిధులు వేర్వేరు శాఖల ద్వారా కాకుండా ఆయా శాఖల ద్వారానే ఖర్చు చేయాలి. నిధుల ఖర్చు, కార్యక్రమాల రూపకల్పనపై కమిటీæ సూచనలు చేయాలి. ఒక్కో ప్రాంతంలో ఒక్కో అవసరం ఉంటుంది. దానికి అనుగుణంగా విధానాలుండాలి. ఎస్సీ, ఎస్టీ వర్గాలకు కేటాయించిన నిధులు ఆ సంవత్సరంలో ఖర్చు కాకుంటే.. మరుసటి ఏడాదికి బదలాయించే పద్ధతి అవలంబించాలి. సబ్ ప్లాన్కు సవరణలు చేయాలి. అభివృద్ధికి గ్రోత్ ఇంజిన్ రూపొందించాలి. కమిటీ క్షేత్రస్థాయి పర్యటన చేయాలి. ఎప్పటికప్పుడు సమావేశాలు నిర్వహించుకోవాలి" అని సీఎం చెప్పారు. "వృద్ధులు, యువకులు, విద్యార్థులు... 10–25, 25–50, 50–75 వయసుల వారీగా అనుసరించాల్సిన వ్యూహాన్ని రూపొందించుకోవాలి. పట్టణ ప్రాంతాల్లో ఉండే ఎస్సీ, ఎస్టీలకు ఒక ప్రణాళిక, సెమీ అర్బన్, గ్రామాల్లో ఉండే వారికొక వ్యూహం అనుసరించాలి. మూడు ప్రాంతాల్లో నివసించే వారి జీవన స్థితిగతులు వేర్వేరుగా ఉంటాయి. రెసిడెన్షియల్ స్కూళ్లు, కాలేజీలతోపాటు పట్టణాల్లో చదివే అమ్మాయిలకు అన్ని వసతులు కల్పించాలి" అని సీఎం సూచించారు. "దళితులకు భూ పంపిణీ నిరంతర కార్యక్రమం. ఎస్సీ, ఎస్టీలకు పంపిణీ చేసిన అసైన్డ్ భూములు ఉపయోగంలోకి రావాలి. కమతాల ఏకీకరణ జరగాలి. ఏ ఊరిలో ఎవరి పేరిట భూమి ఉంది? సాగులో ఉందా? లేదా? సాగులోకి రావాలంటే ఏం చేయాలి? అనే అంశాలపై ప్రజా ప్రతినిధులు దృష్టి సారించాలి" అని పేర్కొన్నారు. చిత్తశుద్ధితో ఉన్నా వంద శాతం ఎస్సీ, ఎస్టీ వర్గాల్లో గుణాత్మకమైన మార్పు రావాలని, అందుకు తాను చిత్తశుద్ధితో ఉన్నానని సీఎం చెప్పారు. "మనం తలుచుకుంటే తప్పకుండా వీరి జీవన ప్రమాణాల్లో మార్పు వస్తుంది. విమర్శలు, ప్రతి విమర్శలు కాకుండా ఎస్సీ వర్గాలకేం అవసరమో, ప్రభుత్వం ఏం చేయాలో నిర్ణయించుకోవాలి. ఇప్పుడున్న చట్టాన్ని బలోపేతం చేద్దాం. అంకితభావంతో పనిచేసి ఆ వర్గాల్లో మార్పు తెద్దాం. అప్పుడే ప్రజా ప్రతినిధులుగా, అధికారులుగా మనకు సంతృప్తి" అని అన్నారు. అప్పుడే అభినందనలు వద్దు రాష్ట్రంలో సబ్ప్లాన్పై కార్యాచరణకు సీఎం చూపిన చొరవను తాము అభినందిస్తున్నట్లు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఎస్సీ, ఎస్టీల అభివృద్ధికి సీఎం చిత్తశుద్ధితో పని చేస్తున్నారని ఎమ్మెల్యే రెడ్యా నాయక్ అన్నారు. రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు మంచి నిర్ణయమని టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య అభినందించారు. ఎస్సీ, ఎస్టీ వర్గాల అభివృద్ధికి సమావేశం నిర్వహించడం విప్లవాత్మక చర్య అని కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్ అన్నారు. అందుకు స్పందించిన సీఎం.. అప్పుడే ప్రభుత్వాన్ని అభినందించవద్దని, ఎంతో కొంత మార్పు వచ్చాక అభినందించాలన్నారు. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మంత్రులు అజ్మీరా చందూలాల్, జగదీశ్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారులు రాజీవ్ శర్మ, జీఆర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్, రసమయి బాలకిషన్, పిడమర్తి రవి, నల్లాల ఓదేలు, గీతారెడ్డి, నంది ఎల్లయ్య, ఎస్.నిరంజన్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, బాల్కసుమన్, సీతారాం నాయక్, పసునూరి దయాకర్, నగేశ్ తదితరులు పాల్గొన్నారు. అందరితో కలిసి ముఖ్యమంత్రి భోజనం చేశారు. ప్లాన్ రూపకల్పనలో పాలుపంచుకున్న ఎమ్మెల్యే భట్టి, సీనియర్ ఐఏఎస్ సోమేశ్ కుమార్ అభిప్రాయాలను ఈ సమావేశంలో వెల్లడించారు. -
ఎస్టీ జాబితాలోకి ఇతరులను చేర్చితే ఊరుకోం
– 48 గంటల దీక్షను విరమించిన గిరిజన నేతలు – సంక్రాంతికి దూరమైన గిరిజన సంఘాలు – సంఘీభావం వ్యక్తం చేసిన ప్రజా సంఘాలు కర్నూలు(అర్బన్): ఎస్టీ జాబితాలోకి ఇతర కులాలను చేరిస్తే తాము ఊరుకోమని, ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని ఐక్య గిరిజన సంఘాల నేతలు హెచ్చరించారు. స్థానిక శ్రీ కృష్ణదేవరాయల సర్కిల్లో ఐక్య గిరిజన సంఘాల ఆధ్వర్యంలో ఈ నెల 13వ తేది ఉదయం 10 గంటల నుంచి చేపట్టిన 48 గంటల దీక్షలు 15వ తేది ఉదయం 10 గంటల వరకు కొనసాగాయి. దీక్షల విరమణ సందర్భంగా ఎల్హెచ్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్. కైలాస్నాయక్, ఏఐబీఎస్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం. వెంకటరమణనాయక్, ఏపీ గిరిజన సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి. గోవింద్, టీఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఆర్. చంద్రప్ప, వైహెచ్పీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి వై. రాజు మాట్లాడుతు రాష్ట్ర ప్రజలందరు సంతోషంగా సంక్రాంతి పండగను జరుపుకుంటుంటే తమ సామాజిక వర్గాల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని 48 గంటల దీక్ష చేపట్టామన్నారు. పాలక ప్రభుత్వాలు ఎన్ని మారినా, గిరిజనులు మాత్రం విద్య, ఉపాధి తదితర రంగాల్లో వెనుకబడి ఉన్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇతర కులాలను ఎస్టీ జాబితాలో చేరిస్తే ఇక తమ బతుకులు అడవుల పాలు కావాల్సిందేనని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం పునరాలోచించి నిర్ణయం తీసుకోవాలని, లేని పక్షంలో తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. దీక్షల్లో పాల్గొన్న వారికి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ డి. తిప్పేనాయక్, విభిన్న ప్రతిభావంతుల ఉద్యోగుల సంఘం కార్యదర్శి డాక్టర్ బి. రమేష్ , మార్కెట్యార్డు డైరక్టర్ కరివేపాకు నారాయణ తదితరులు నిమ్మరసం ఇచ్చి దీక్షలను విరమింపజేశారు. దీక్షల్లో పాల్గొన్న నేతలు.. ఎం వెంకటరమణనాయక్, కైలాస్నాయక్, పీ గోవింద్, రాగుల రాముడు, శ్రీరాములు, ఆర్ చంద్రప్ప, వై రాజు, రాజారామ్నాయక్, యోగేష్నాయక్, ఎం రాముడు, పీ వెంకటేష్, శంకర్నాయక్, పరశురాముడు, గిడ్డయ్య, రమేష్, నాగరాజు, వెంకటరాముడు నాయక్ తదితరులు పాల్గొన్నారు. సంఘీభావం వ్యక్తం చేసిన సంఘాలు, నేతలు .... ఆల్ ఇండియా ఎంప్లాయీస్ అసోసియేషన్ గౌరవాధ్యక్షుడు వై. నారాయణ, బద్దునాయక్, జిల్లా అధ్యక్షుడు మద్దిలేటి, కార్యదర్శి రాముడు నాయక్, దళిత సమాఖ్య కన్వీనర్ కొమ్ముపాలెం శ్రీనివాస్, ఎంఆర్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి సోమసుందరం, దళిత సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు బాలసుందరం, ఏపీ ఎస్సీ,ఎస్టీ ఐక్య సమితి రాష్ట్ర అధ్యక్షుడు రాజ్కుమార్, కేవీపీఎస్ జిల్లా అధ్యక్షుడు ఆనంద్బాబు, సఫాయి కర్మచారి సంఘం ప్రధాన కార్యదర్శి గుర్రాల శ్రీనివాసులు, నాయీబ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు నర్సయ్య, వివిధ సంఘాలకు చెందిన నాయకులు వెంకటస్వామినాయక్, అంజనప్ప, ఈశ్వరప్ప తదితరులు దీక్షా శిబిరం వద్దకు వచ్చి సంఘీభావం తెలిపారు. -
ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు
పెద్దవడుగూరు (తాడిపత్రి) : మండల పరిధిలోని దిమ్మగుడి గ్రామానికి చెందిన ఎంపీటీసీ మోహన్రెడ్డితో పాటు భాస్కర్రెడ్డి, సతీష్రెడ్డిపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ.రమణారెడ్డి తెలిపారు. తనను కులంపేరుతో దూషించాడని ఓబులేసు అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు. ఇదిలా ఉండగా తాను ఎవరినీ కులం పేరుతో దూషించలేదని ఎంపీటీసీ మోహన్రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. గ్రామ సమస్యలపై జన్మభూమి సభలో అధికారులను ప్రశ్నించగా తనపై కక్ష కట్టి ఇలా ఓబులేసుతో ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టించారన్నారు. -
ఎస్సీ, ఎస్టీల అభివృద్ధికి కృషి: జగదీష్రెడ్డి
హైదరాబాద్: రాష్ట్ర బడ్జెట్లో సింహ భాగం సంక్షేమ రంగానికే కేటాయించామని, ఎస్సీ, ఎస్టీలకు కేటాయించిన ప్రతి పైసా వారి అభివృద్ధికే ఖర్చు చేస్తున్నామని మంత్రి జగదీష్రెడ్డి చెప్పారు. అసెంబ్లీలో ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్పై స్వల్పకాలిక చర్చను మంత్రి ప్రారంభించారు. నిరుపేద దళితులకు మూడెకరాలు పంపిణీ చేశామని, 3,671 మంది దళితులకు వ్యవసాయ యోగ్యమైన భూమిని పంపిణీ చేశామని తెలిపారు. ఈ భూముల్లో బోర్లు వేయించి పంటకు పెట్టుబడి అందించామన్నారు. -
ఎస్సీ, ఎస్టీ నిధులను మళ్లించిన కేసీఆర్
జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు శంకర్ జగిత్యాల రూరల్ : రాష్ట్రంలో సీఎం కేసీఆర్ దళిత వ్యతిరేక విధానాన్ని అవలంభిస్తూ ఎస్సీ, ఎస్టీ నిధులను మిషన్ కాకతీయ, మిషన్ భగీరథకు మళ్లించి ఎస్సీ సబ్ప్లాన్ను నిర్వీర్యం చేస్తున్నారని జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు బండ శంకర్ అన్నారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎస్సీ, ఎస్టీలకు అండగా నిలిచి సబ్ప్లాన్ చట్టం చేసి నిధులు కేటాయిస్తే మూడేళ్ల క్రితం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన సీఎం కేసీఆర్ సబ్ప్లాన్ను నిర్వీర్యం చేస్తున్నారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు తిరుపతిగౌడ్, శ్రీనివాస్గౌడ్, నక్క జీవన్గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
సీజీజీ పోర్టల్లో ‘స్వయం ఉపాధి’ వివరాలు
పొందుపరచాలని సీఎస్ ఆదేశం సాక్షి,, హైదరాబాద్: ఎస్సీ, ఎస్టీ, బీసీ, మై నారిటీ సంక్షేమ శాఖల ద్వారా లబ్ధిదారు లకు మంజూరైన పథకాల వివరాలను సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ (సీజీజీ) పోర్టల్లో పొందుపరచాలని అధికారులను సీఎస్ ప్రదీప్చంద్ర ఆదేశించారు. మంజూరైన స్వయంఉపాధి, లబ్ధిదారుల ఎంపిక పూర్తయిన పథకాల యుటిలైజేషన్ సర్టిఫికెట్లు సమర్పించాలన్నారు. మంగళ వారం సచివాలయంలో సంక్షేమ శాఖల్లో స్వయం ఉపాధి పథకాల అమలు తీరును సీఎస్ సమీక్షించారు. గుడుంబా బాధిత కుటుంబాలకు స్వయంఉపాధి కల్పన కోసం నిధులు మంజూరు చేయాలని ఆదే శించారు. సంక్షేమానికి సంబంధించి ప్రతి శాఖ ద్వారా హాబిటేషన్లు, లబ్ధిదారుల వారీగా వివరాల సేకరణ, శాఖల వారీగా స్వయం ఉపాధి పథకాల మంజూరీని సమీక్షిస్తూ నెలవారీ కార్యాచరణ రూపొం దించుకోవాలన్నారు. అధికారులు అజయ్ మిశ్రా, సోమేశ్కుమార్,జలీల్, సందీప్ కుమార్, అరుణ, లక్ష్మణ్ పాల్గొన్నారు. -
గురుకులాలన్నింటికీ శాశ్వత భవనాలు
శాసనసభలో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి సాక్షి, హైదరాబాద్: ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ శాఖలకు చెందిన అన్ని గురుకుల పాఠశాలలకు ఒకే తరహా శాశ్వత భవనాలను నిర్మించేలా ప్రణాళికలు తయారు చేస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ భవనాల నిర్మాణానికిగాను డిజైన్లు తయారు చేస్తున్నామని, ఫిబ్రవరిలోపు అన్ని చోట్లా స్థలాలను సేకరించి మార్చిలో భవనాల నిర్మాణానికి టెండర్లు పిలుస్తామని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి గురువారం శాసనసభలో వెల్లడించారు. సంక్షేమ గురుకులాలపై ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు హన్మంత్ షిండే, శంకర్నాయక్, శోభ అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ ఇప్పటివరకు అన్ని సంక్షేమ శాఖలకు సంబంధించి మొత్తం 299 గురుకుల పాఠశాలలుంటే, తెలంగాణ ఏర్పాటైన తర్వాత రెండున్నరేళ్లలోనే 487 గురుకుల పాఠశాలలను అదనంగా ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. ఒక్కో గురుకుల పాఠశాల భవనాల నిర్మాణానికి రూ.23 కోట్ల చొప్పున రూ.11,200 కోట్లను ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన వెల్లడించారు. -
పరిశీలనలో బీసీ సబ్ప్లాన్: జోగురామన్న
సాక్షి, హైదరాబాద్: ఎస్సీ, ఎస్టీల తరహాలోనే బీసీలకు కూడా సబ్ప్లాన్ ఏర్పాటు చేసే అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న చెప్పారు. ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు దాస్యం వినయ్ భాస్కర్, పుట్టా మధు, శ్రీనివాస్గౌడ్ బీసీల సంక్షేమంపై అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. రజక, నాయీబ్రాహ్మణ కులాల కోసం ఆధునికమైన లాండ్రీలు, సెలూన్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. చర్చలో పాల్గొన్న ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య బీసీ కమిషన్ అధికారాలను విస్తృతపర్చాలని కోరారు. సంక్షేమ పథకాల అమలు, బీసీలకు సామాజిక భద్రతపై కమిషనర్కు బాధ్యతలు, అధికారాలు, విధులు ఇచ్చేలా నిబంధనలు రూపొందించాలని ప్రభుత్వాన్ని కోరారు. -
ఐక్య ఉద్యమాలతోనే ఎస్టీ రిజర్వేషన్ సాధన
– సిరుగుప్ప ఎమ్మెల్యే బీఎం నాగరాజు కర్నూలు(అర్బన్): రాజకీయ పార్టీలకు అతీతంగా వాల్మీకులు ఐక్యంగా ఉద్యమాలను నిర్వహిస్తే ఎస్టీ రిజర్వేషన్ సాధ్యమవుతుందని బళ్లారి జిల్లా సిరుగుప్ప ఎమ్మెల్యే బీఎం నాగరాజు అన్నారు. ఈ నెల 16వ తేది నుంచి స్థానిక శ్రీ కృష్ణ దేవరాయల సర్కిల్లో వీఆర్పీఎస్ ఆధ్వర్యంలో చేపట్టిన నిరవధిక సత్యాగ్రహ దీక్షా శిబిరం వద్దకు ఆయన ఆదివారం చేరుకుని సంఘీభావం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో మూడు రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న వీఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం. సుభాష్ చంద్రబోస్కు నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ కర్ణాటక రాష్ట్రంలో వాల్మీకులు ఎస్టీ జాబితాలో ఉన్న కారణంగా 18 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలు, మంత్రులు ఉన్నారని చెప్పారు. వెనుకబడిన కులాలకు రాజ్యాధికారంలో వాటా ఉంటేనే ఆయా కులాలు అభివృద్ధి చెందుతాయని ఆయన చెపా్పరు. అంతకు ముందు జిల్లా నలుమూలల నుంచి వచ్చిన వాల్మీకులు జిల్లా పరిషత్ నుంచి దీక్షా వేదిక వద్దకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఆరు నెలల్లో వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చి చట్టబద్ధత కల్పించకుంటే ఉద్యమాలను మరింత ఉద్ధృతం చేస్తామని సుభాష్ చంద్రబోస్ ప్రభుత్వానికి హెచ్చరించారు కార్యక్రమంలో వీఆర్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.రాంబీంనాయుడు, గూడురు గిడ్డయ్య, నాగరాజు, నరసింహులు, జిల్లా అధ్యక్షుడు డి. రామాంజనేయులు, వీజీఆర్ కొండయ్య తదితరులు పాల్గొన్నారు. -
కొనసాగుతున్న వీఆర్పీఎస్ దీక్షలు
కర్నూలు(అర్బన్): వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేరుస్తూ ఆరు నెలల్లోగా చట్టబద్దత కల్పించాలనే డిమాండ్పై ఈ నెల 16వ తేదీ నుంచి స్థానిక శ్రీ కృష్ణదేవరాయల సర్కిల్లో వీఆర్పీఎస్ చేపట్టిన నిరవధిక సత్యాగ్రహ దీక్షలు శనివారానికి రెండో రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా వీఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం సుభాష్ చంద్రబోస్ మాట్లాడుతూ.. ప్రాణాలు పోయినా ఉద్యమాన్ని ఆపేది లేదన్నారు. జిల్లాలోని వాల్మీకులందరూ వీఆర్పీఎస్ చేస్తున్న ఉద్యమానికి మద్దతు పలకాలన్నారు. ఈ నెల 18వ తేదీన దీక్షల ముగింపు సందర్భంగా జెడ్పీ నుంచి భారీ ర్యాలీని నిర్వహిస్తున్నామన్నారు. దీక్షల్లో ప్యాపిలి ఎంపీపీ సరస్వతమ్మ, మాజీ ఎంపీపీ శ్రీనివాసులు, వీఆర్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గూడురు గిడ్డయ్య తదితరులు పాల్గొన్నారు. కర్నూలు బార్ అసోసియేషన్ నాయకులు వాసు, దేవపాల్, శ్రీవాస్తవ తదితరులు..దీక్షలకు మద్దతు ప్రకటించారు. -
వాల్మీకి బిడ్డల భవిష్యత్తు కోసమే పోరాటం
– ఆరు నెలల్లో ఎస్టీ రిజర్వేషన్కు చట్టబద్ధత కల్పించాలి – లేదంటే రాయలసీమ వ్యాప్తంగా ఉద్యమాలు ఉద్ధృతం –స్పందించకపోతే టీడీపీని పాతరేస్తాం – వీఆర్పీఎస్ సత్యాగ్రహ దీక్షలు ప్రారంభంలో సుభాష్ చంద్రబోస్ కర్నూలు(అర్బన్): దశాబ్దాలుగా అణచివేతకు గురవుతున్న వాల్మీకి బిడ్డల బంగారు భవిష్యత్తుకు తాము అలుపెరగని పోరాటం చేస్తున్నామని వాల్మీకి రిజర్వేషన్ పోరాట సమితి (వీఆర్పీఎస్) రాష్ట్ర అధ్యక్షుడు ఎం. సుభాష్ చంద్రబోస్ అన్నారు. వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేరుస్తూ ఆరు నెలల్లోగా చట్టబద్ధత కల్పన, వాల్మీకి ఫెడరేషన్కు రూ.1000 కోట్లు బడ్జెట్ కేటాయించాలనే డిమాండ్లపై శుక్రవారం స్థానిక శ్రీ కృష్ణదేవరాయల సర్కిల్లో ఆ సమితి మూడు రోజుల నిరవధిక సత్యాగ్రహ దీక్షలను ప్రారంభించింది. ముందుగా వందలాది మంది వాల్మీకులు కలెక్టరేట్ గాంధీ విగ్రహం వద్ద నుంచి దీక్ష వేదిక వద్దకు ర్యాలీగా వచ్చారు. ఈ సందర్భంగా సుభాష్ మాట్లాడుతు సత్యాగ్రహ దీక్షలు ముగిసేలోగా ముఖ్యమంత్రి చంద్రబాబు వాల్మీకులకు స్పష్టమైన హామీ ఇవ్వాలన్నారు. లేకపోతే జూన్లో రాయలసీమ బంద్కు కూడా వెనుకాడమన్నారు. సీమలోని నాలుగు జిల్లాల్లో ఉద్యమాలను ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. తమ ఆందోళనలను చిన్నచూపు చూస్తే వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. వాల్మీకుల ఆర్థికాభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన వాల్మీకి ఫెడరేషన్కు వెంటనే పాలకవర్గాన్ని ఏర్పాటు చేయాలన్నారు. రాజకీయ పార్టీలకు అతీతంగా తమ హక్కుల సాధన కోసం మరో స్వాతంత్య్ర పోరాటానికి సిద్ధం కావాలని వాల్మీకులకు పిలుపునిచ్చారు. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో వాల్మీకులు ఎస్టీ రిజర్వేషన్లో కొనసాగుతుండగా, ఆంధ్రప్రదేశ్లో మాత్రం ప్రాంతీయ వ్యత్యాసానికి గురవుతున్నారన్నారు. హింసాయుత ఉద్యమాలకే ముఖ్యమంత్రి చంద్రబాబు న్యాయం చేస్తున్నట్లు ఆయన చర్యలను బట్టి అర్థమవుతుందన్నారు. తాము ఆగ్రహిస్తే రాయలసీమ అగ్నిగుండంగా మారుతుందని చెప్పారు. కార్యక్రమంలో వీఆర్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గూడురు గిడ్డయ్య, ఉపాధ్యక్షుడు జి. రాంభీంనాయుడు, ఉద్యోగ, మేధావుల విభాగం రాష్ట్ర అధ్యక్షుడు డా.మధుసూదన్, రాష్ట్ర కార్యదర్శి పరమటూరు శేఖర్, ప్రచార కార్యదర్శి డాక్టర్ రాఘవేంద్ర, జిల్లా నాయకులు మురళీ, రాముడు, వీజీఆర్ కొండయ్య, మహిళా నాయకురాలు ఎం. వాణిశ్రీ, న్యాయవాది తిమ్మప్ప, విద్యార్థి నాయకులు మహేంద్ర, బాబు, శివ, ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రపంచానికి సర్కస్ నేర్పింది దొమ్మరులే
పాములపాడు: ప్రపంచానికి సర్కస్ నేర్పింది దొంబర కులస్తులేనని దొంబర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గోపాల్ అన్నారు. ఆదివారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన జిల్లాస్థాయి దొంబర కులస్తుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తమ కులాన్ని ఎస్టీ జాబితాలో చేర్చాలని డిమాండ్ చేశారు. 1969కి ముందు విముక్తి జాతుల్లో ఉండేదన్నారు. సంచార జాతులకు ప్రత్యేకంగా రూ.100 కోట్ల బడ్జెట్ కేటాయిస్తామని ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విస్మరించాయన్నారు. గ్రామ స్థాయిలో కుల సమీకరణలు చేసి ఉద్యమాన్ని బలోపేతం చేయాలని కుల పెద్దలకు సూచించారు. ఐకమత్యంతో ఉండి సమస్యలు పరిష్కరించుకుంటూ దొంబరుల సత్తా ప్రభుత్వానికి చాటాలన్నారు. విద్యా, ఉద్యోగ రంగాల్లో తమ వాటా తమకు కేటాయిండం కూడా పక్కనపెట్టేశారన్నారు. సంచార జాతులన్నింటిని సమీకరించి ఉద్యమం ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. ప్రత్యేక కార్పోరేషన్, రెసిడెన్సియల్ పాఠశాలల ఏర్పాటు, ఈ కార్యక్రమంలో ఆసంఘం రాష్ట్ర నాయకులు గుర్రప్ప, నాగన్న, మురళి, రవి, సుబ్బరాయుడు, లక్ష్మణ్, ఆంజనేయులు, రామసుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు. -
కటాక్షం.. ఎవరికో..!
• 6,973 యూనిట్లు - 60,991 దరఖాస్తులు • జిల్లాలో రుణాలకు వేలాదిగా అర్హులు • నామమాత్రంగా యూనిట్ల కేటారుుంపులు • అయోమయంలో నిరుపేద • ఎస్సీ, ఎస్టీ,బీసీ, మైనార్టీ, క్రిస్టియన్, కాపులు • లబ్ధిదారుల ఎంపికలో కమిటీ సభ్యులు, ఎంపీడీఓల కీలక పాత్ర భాగ్యలక్ష్యి బంపర్ డ్రా..రండయ్యా రండి, ,రండమ్మా రండి..టికెట్ ధర కేవలం ఒక రూపాయే..ఆ అదృష్టవంతుడు ఎవరో తెల్లవారితే డ్రా.. సంచి తెచ్చుకోండి.. ఒక లక్ష తీసుకుపోండి అని ఒక వ్యక్తి వచ్చీ రాని తెలుగులో చెప్పేవాడు. చాలా సంవత్సరాల క్రితం జిల్లాలోని పలు ప్రధాన కూడలి ప్రాంతాలలో ఒక జట్కా బండి నుంచి మైక్లో వినిపించే మాటలు అవి. ఇప్పుడు నిరుపేదలకు ప్రభుత్వం మంజూరు చేసే రుణాల పరిస్థితి కూడా లాటరీ టికెట్ లాగే మారింది, కాకపోతే అప్పుడు అదృష్టం ఉండాలి. ఇప్పుడు పాలక నేతలైన కమిటీ సభ్యుల కటాక్షం ఉండాలి. కాగా యూనిట్ల కేటారుుంపులు తక్కువగా, అర్హుల నుంచి అందిన దరఖాస్తులు కుప్పలు తెప్పలుగా ఉన్నారుు. దీంతో ప్రస్తుతం ఈ రుణ భాగ్యలక్ష్మి ఎవరిని వరిస్తుందనేది ఆయా వర్గాల్లో ప్రశ్నార్ధకంగా మారింది. కడప రూరల్: జిల్లాలో 2016-2017 ఆ ర్ధిక సంవత్సరానికి నిరుపేదలైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, కాపు వర్గాలకు రాష్ట్ర ప్రభుత్వం బ్యాం కుల అనుసంధానంతో సబ్సిడీ రుణాలను అందించాలి. ఆ మేరకు ఆయా వర్గాలకు చెందిన కార్పొరేషన్లకు లక్ష్యాలను నిర్దేశించారు. అరుుతే పాలకులు నామమాత్రంగా యూనిట్లను కేటారుుస్తున్నారు. ఫలితంగా అర్హులు రుణాలు పొందలేక, ఆర్థికంగా ఎదగడానికి ఆస్కారం లేక నిరాశకు లోనవుతున్నారు. బీసీల పరిస్థితి దారుణం... ఈ ఏడాది ప్రభుత్వ సబ్సిడీతో పాటు బ్యాంకర్లు తమ వాటాగా ఎస్సీలకు రూ. 47 కోట్లు, ఎస్టీలకు రూ. 27.30 కోట్లు, బీసీలకు రూ. 23.04 కోట్లు, 10 బీసీ ఫెడరేషన్లకు రూ. 27.30 కోట్లు, కాపులకు రూ. 32 కోట్లు, మైనార్టీలకు రూ. 30.84 కోట్లు, క్రిస్టియన్లకు రూ. 41 లక్షలు అందించాలి. కాగా మొత్తం 6,973 యూనిట్లకు గాను గత ఏడాదిలో రుణాలు పొందగా మిగిలినవి, ఇప్పుడు వచ్చిన దరఖాస్తులనే కలుపుకుంటే ఆన్లైన్లో 60,991 దరఖాస్తులు ఉన్నారుు. వారంతా రుణాలకు అన్ని విధాలా అర్హత గలవారే. కాగా జనాభాలో అత్యధిక శాతం ఉన్న బీసీలకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలి. అరుుతే బీసీలకు కేవలం 1170 యూనిట్లను కేటారుుంచగా 18,000 దరఖాస్తులు వచ్చారుు. అలాగే బీసీ ఫెడరేషన్లు, ఎస్సీలు, మైనార్టీ వర్గాలకు తీవ్ర అన్యాయం జరుగుతోంది. ఏటా నామమాత్రంగా యూనిట్ల కేటారుుంపులు జరుగుతున్నారుు. దీంతో ఎక్కువ మంది అర్హులు లబ్ధి పొందలేక పోతున్నారు. లబ్ధిదారులకు 111 గండాలు... తాజాగా రాష్ట్ర ప్రభుత్వం గత నెలలో అర్హుల ఎంపికకు సంబంధించి 111 జీఓను జారీ చేసింది. దీని ప్రకారం ఆయా ఎంపీడీఓలు నాన్ అఫిషియల్ బోర్డును ఏర్పాటు చేసి, అందులో 10 మంది సభ్యులను నియమించాలి. మొన్నటి వరకు ఉన్న జన్మభూమి కమిటీల తరహాలోనే ఈ కొత్త బోర్డు కూడా ఉండబోతోందనే ఆరోపణలు వస్తున్నారుు. అరుుతే ఈ జీఓ ప్రకారం ఎంపీడీఓలు కీలకంగా మారనున్నారు. అన్ని వ్యవహారాలను ఆ అధికారి చూసుకోవడంతోపాటు ఆయా కార్పొరేషన్లకు నివేదికలను కూడా ఆయనే పంపాల్సి ఉంది. కాగా, ఈనెల 15వ తేదీ నుంచి జరిగే ఇంటర్వ్యూల ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేయాలి. అనంతరం జనవరి 1వ తేదీ నుంచి రుణాలను ఎంపికై న అర్హులకు పంపిణీ చేయాల్సి ఉంది. కాగా, ప్రస్తుతం పెద్దనోట్ల రద్దు కారణంగా బ్యాంకర్లు బిజీబిజీగా ఉన్నారు. అందువల్ల రుణాల మంజూరుపై ఆ ప్రభావం పడే అవకాశం లేకపోలేదు. అలాగే కొత్త కమిటీలను కూడా నియమించాల్సి ఉంది. మొత్తం మీద ఈ ఏడాది అర్హులు 111 గండాలను దాటాల్సిన పరిస్థితి ఏర్పడింది. -
బయో గ్యాస్ ప్లాంట్ నిర్మించుకోవాలి
టేక్మాల్ : పాడిపశువులు ఉన్న ప్రతి ఒక్కరూ బయోగ్యాస్ ప్లాంట్లను నిర్మించుకోవాలని బయోగ్యాస్ సంయుక్త జిల్లాల మేనేజర్ రామేశ్వర్ తెలిపారు. మండల పరిధిలోని ఎల్లంపల్లి మధిర గ్రామమైన సర్మోనికుంట తండాలో మంగళవారం బయోగ్యాస్పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎక్కువ పశువులు ఉన్న రైతులు బయోగ్యాస్ ప్లాంట్లను నిర్మించుకుంటే ఇంధనవనరులను కాపాడిన వారవుతారన్నారు. వీటి నిర్మాణానికి రూ.20,100 ఖర్చవుతుందని తెలిపారు. ఎస్సీ, ఎస్టీలకు రూ.11వేల సబ్సిడీ ఉందని, ఉపాధిహామీ నుంచి మరో రూ.5వేలు ఇస్తుందని చెప్పారు. నిర్మించుకునే రైతు రూ.1500లను ముందుగా ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉందన్నారు. ఈ సమావేశంలో ఎంపీడీఓ విష్ణువర్దన్, తహసీల్దార్ ముజాఫర్ హుస్సేన్, సర్పంచ్ రామయ్య, నాయకులు రమేశ్నాయక్, నరేందర్, ఉపాధిహామీ సిబ్బంది తదితరులు ఉన్నారు. -
ఎస్సీ, ఎస్టీ చైర్మెన్ ఎన్నికపై హైకోర్టులో వాదనలు
-
గిరిజనుల సంక్షేమాన్ని మరచిన ప్రభుత్వం
– సొంత పూచికత్తుపై రుణాలు అందించాలని ఏపీజీఎస్ దీక్షలు కర్నూలు(అర్బన్): రాష్ట్ర ప్రభుత్వం గిరిజనుల సంక్షేమాన్ని మరచిందని ఆంధ్రప్రదేశ్ గిరిజన సమాఖ్య (ఏపీజీఎస్) నేతలు ధ్వజమెత్తారు. బ్యాంకులతో ప్రమేయం లేకుండా సొంత పూచికత్తుపై రుణాలు అందించాలని డిమాండ్ చేస్తూ ఏపీజీఎస్ ఆధ్వర్యంలో సోమవారం స్థానిక సంక్షేమభవన్ ఎదుట రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఏపీజీఎస్ జిల్లా అధ్యక్షుడు జి. జయరామ్నాయక్ అధ్యక్షతన చేపట్టిన దీక్షలను బీకేఎంయు రాష్ట్ర అధ్యక్షుడు ఎ. శేఖర్, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్. మునెప్ప, ఏపీజీఎస్ జిల్లా కార్యదర్శి వెంకటరాముడు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అదిగో గిరిజనుల అభివృద్ధి అంటూ ప్రభుత్వం ప్రచారం చేస్తుందే తప్ప ఎలాంటి నిధులను విడుదల చేయడం లేదన్నారు. ఎస్టీ కార్పొరేషన్ ద్వారా నిజమైన గిరిజనులకు రుణాలు అందడం లేదని, మధ్య దళారులు, రాజకీయ నాయకులు, బ్యాంకర్లు కుమ్మక్కై సబ్సిడీని పంచుకుంటున్నారని ఆరోపించారు. దీక్షా కార్యక్రమంలో ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి కారుమంచి, ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు, ఏపీజీఎస్ నాయకులు బనగానపల్లె రాముడు, జిల్లా గౌరవాధ్యక్షుడు మారెన్న, ఆటో యూనియన్ నాయకులు రామ్నాయక్, కె. శ్రీనివాసులు, మహేష్ తదితరులు పాల్గొన్నారు. -
సైనికుల్లా ఉద్యమిద్దాం
- ఎస్టీ రిజర్వేషన్ సాధనపై వాల్మీకి నేతల పిలుపు - గుడేకల్ గ్రామంలో వాల్మీకి మహర్షి విగ్రహావిష్కరణ ఎమ్మిగనూరురూరల్: ఎస్టీ రిజర్వేషన్ సాధనకు వాల్మీకులంతా సైనికుల్లా పోరాడాలని ఆలూరు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం, వీఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు సుభాష్చంద్రబోస్ పిలుపునిచ్చారు. మండల పరిధిలోని గుడేకల్ గ్రామంలో ఆదివారం శ్రీ వాల్మీకి మహర్షి విగ్రహవిష్కరణ కార్యక్రమానికి వారు హాజరయ్యారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం మాట్లాడుతూ ఎస్టీ రిజర్వేషన్పై అసెంబ్లీలో గవర్నర్తో ప్రసంగం చేయించిన సీఎం చంద్రబాబు ప్రస్తుతం ఆ ఊసెత్తడం లేదన్నారు. వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేరిస్తే సీఎం చంద్రబాబుకు పాదాభివందనం చేస్తామని ప్రకటించారు. ప్రాణ త్యాగానికైనా సిద్ధం.. వాల్మీకులకు ఎస్టీ రిజర్వేషన్ సాధన కోసం ప్రాణ త్యాగానికైనా సిద్ధమేనని వాల్మీకి రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు సుభాష్చంద్రబో‹స్ అన్నారు. రిజర్వేషన్కోసం కుప్పం నుంచి 11వందల కిలో మీటర్లు పాదయాత్ర ద్వారా హైదరాబాద్ వెళ్లి సీఎం చంద్రబాబుకు విన్నవించామన్నారు. డిశంబర్ 14న కర్నూలు శ్రీకృష్ణదేవరాయుల సర్కిల్లో 99 గంటల నిరవధిక నిరాహర దీక్ష తలపెట్టినట్లు తెలిపారు. దశలవారీగా ఉద్యమాన్ని ఉద్ధృతం చేసి ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని తెలిపారు. ఎవరి పార్టీలో వారు ఉండండి రిజర్వేషన్కు మాత్రం పార్టీలకతీతంగా పోరాడండి అంటూ నాయకులకు పిలుపునిచ్చారు. ఎస్టీ రిజర్వేషన్ సాధనకు వాల్మీకులంతా చేతులు కలపాలని వీఆర్పీఎస్ మహిళ విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ కోరారు. రూరల్ ఎస్ఐ వేణుగోపాల్ ఆధ్వర్యంలో కార్యక్రమానికి పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. వీఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు రాంభీంనాయుడు, గూడూరు గిడ్డయ్య, రవి, డాక్టర్ మధుసూదన్, మాధవరం రామిరెడ్డి, కౌతాళం సురేష్, తాలుకా అధ్యక్షులు వీజీఆర్ కొండయ్య, జగ్గాపురం ఈరన్న, గిడ్డయ్య, రఘు, లైన్మెన్ రాణి, స్థానిక నాయకులు పాల్గొన్నారు. -
ప్రభుత్వంపై వీఆర్పీఎస్ పోరు
– వీఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం. సుభాష్ చంద్రబోస్ కర్నూలు(అర్బన్): వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చాలనే ప్రధాన డిమాండ్పై ప్రభుత్వం వీర్పీఎస్ పోరాటం చేస్తోందని వాల్మీకి రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఎం. సుభాష్ చంద్రబోస్ తెలిపారు. సోమవారం స్థానిక కార్యాలయంలో జరిగిన ముఖ్య నేతల సమావేశంలో ఆయన మాట్లాడారు. వాల్మీకులను ఆరు నెలల వ్యవధిలో ఎస్టీ రిజర్వేషన్ వర్తింపజేస్తు చర్యలు తీసుకోవాలని, వాల్మీకి ఫెడరేషన్కు రూ.1000 కోట్లు నిధులు కేటాయించాలన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంకా కాలయాపన చేస్తూపోతే వాల్మీకులు చూస్తూ ఊరుకోరన్నారు. డిసెంబర్ 14వ తేది నుంచి 18 వరకు 99 గంటల పాటు శ్రీ కృష్ణ దేవరాయల సర్కిల్లో నిరవధిక నిరాహార దీక్షలు చేపడుతున్నట్లు వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాల్మీకులను సమీకరించి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి తీసుకువస్తామన్నారు. సమావేశంలో వీఆర్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గూడురు గిడ్డయ్య, జిల్లా నాయకులు లోకేష్, మల్లేష్, రంగన్న, మహేష్, శివన్న, వీరేష్, విద్యార్థి నాయకులు శివ, ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు. బోయ ఓబులేసుపై దాడి అమానుషం ... అనంతపురం జిల్లా రాప్తాడులో బోయ ఓబులేసుపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని వీఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు సుభాష్ చంద్రబోస్ తెలిపారు. పోలీసులు పక్కనే ఉన్నా, దాడిని నియంత్రించకపోవడం దారుణమన్నారు. దాడికి పాల్పడిన వారిని వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలన్నారు. ఈ ఘటనను ఖండిస్తూ అనంతపురం కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహిస్తామన్నారు. -
పౌరసేవల అమలులో మార్పు రావాలి
మంత్రి చందూలాల్ ఆకాంక్ష సాక్షి, హైదరాబాద్: పౌరసేవలు, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్న తీరులో మార్పు రావాలని రాష్ర్ట గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అజ్మీరా చందూలాల్ ఆకాంక్షించారు. మంగళవారం ఎంసీఆర్హెచ్ఆర్డీలో ఎస్టీ, బీసీ శాఖల అధికారుల శిక్షణా తరగతుల ముగింపు కార్యక్రమంలో మం త్రులు చందూలాల్, జోగు రామన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధికారులకు ట్యాబ్ లు అందజేశారు. చందూలాల్ మాట్లాడుతూ గతంలో జిల్లాల విస్తీర్ణం, జనాభా అధికంగా ఉండడం వల్ల అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై నిఘా, పర్యవేక్షణ కొరవడిందన్నారు. జిల్లాల పునర్వ్యవస్థీకరణ ద్వారా ప్రభుత్వ లక్ష్యాలు ఆశించిన స్థాయిలో విజయవంతం అవుతాయని భావిస్తున్నామన్నారు. ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాలు, కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో లబ్ధిదారులకు అందించే బాధ్యత అధికారులదేనని బీసీ సంక్షేమశాఖ మంత్రి జోగు రామన్న చెప్పారు. కొత్తగా నియమితులైన జిల్లా అధికారులు సమర్థవంతంగా పనిచేయాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్టీ,బీసీ శాఖల ముఖ్యకార్యదర్శి సోమేశ్కుమార్, ఎస్టీశాఖ కమిషనర్ లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. -
బోగస్ ధ్రువీకరణ పత్రాలపై జేసీ విచారణ
కర్నూలు(అగ్రికల్చర్): బోగస్ ఎస్టీ కుల ధ్రువీకరణ పత్రాలతో ఉద్యోగాలు చేస్తున్నారనే ఆరోపణపై జేసీ హరికిరణ్ శుక్రవారం విచారణ నిర్వహించారు. జేసీ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి స్క్రూటినీ కమిటీ సమావేశం జరిగింది. రైల్వేలో ఎస్టీ సర్టిఫికెట్పై ఉద్యోగం చేస్తున్న తిమ్మప్ప ఇప్పటికే రెండు, మూడు సార్లు విచారణకు రాకపోవడంతో.. ఈ విచారణకు విధిగా హజరు కావాలని ఆదేశించినా గైర్హాజరయ్యారు. కాగా ప్రభుత్వ ప్రింటింగ్ ప్రెస్లో బైండర్గా పనిచేస్తున్న రాముడు యాదవ్ అయితే సుగాలి సర్టిఫికెట్తో ఉద్యోగం చేస్తున్నట్లు ఫిర్యాదు ఉంది. దీనిపై రాముడు కులాన్ని నిరూపించుకునేందుకు భార్య తరపు వారిని విచారణకు తీసుకొచ్చారు. అయితే దీనిపై జేసీ సంతృప్తి చెందలేదు. వీటిపై తగిన నిర్ణయం తీసుకునేందుకు జిల్లా కలెక్టర్కు నివేదించనున్నారు. విచారణలో డీఎల్ఎస్సీ కమిటీ సభ్యులు, సి సెక్షన్ సూపరింటెండెంట్ రామాంజనమ్మ, జిల్లా గిరిజన ఉద్యోగుల సంఘం నేతలు బద్దూనాయక్, మద్దయ్య తదితరులు పాల్గొన్నారు. -
ఎసీ్టల్లో చేర్చేందుకు క్యాబినేట్ చర్యలు
ప్యాపిలి: వాల్మీకులను ఎసీ్ట జాబితాలో చేర్చేందుకు క్యాబినేట్ చర్యలు తీసుకుంటుందని ప్రభుత్వ చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులు అన్నారు. ఆదివారం ప్యాపిలిలో నిర్వహించిన వాల్మీకి జయంతి వేడుకల్లో ఆయన మాట్లాడుతూ ఆరు నెలల్లో వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చాలని క్యాబినేట్ ద్వారా కేంద్రానికి సిఫారస్ చేస్తామన్నారు. వాల్మీకులు తమ హక్కుల కోసం పార్టీలకతీతంగా పోరాడాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీవై రామయ్య మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎన్నికల్లో వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చుతామనే హామీపై కాలయాపన చేయడం తగదన్నారు. వాల్మీకి జయంతిని అధికారికంగా జరపాలని కేవలం ఒక రోజు ముందు జీవో విడుదల చేసి చేతులు దులుపుకోవడం సమంజసం కాదన్నారు. అంతకు ముందు పట్టణంలోని స్థానిక కొత్త బస్టాండ్ ఎదురుగా వాల్మీకి విగ్రహాన్ని ప్రతిష్టించారు. కార్యక్రమంలో రిటైర్డు మైనింగ్ ఎండీ రాజగోపాల్, కర్నూలు సీఐడీ డీఎస్పీ వెంకటరామయ్య, ఆలూరు, మంత్రాలయం జెడ్పీటీసీ సభ్యులు రాంభీం నాయుడు, లక్ష్మయ్య, ప్యాపిలి ఎంపీపీ సరస్వతి, మాజీ ఎంపీపీ శ్రీనివాసులు పత్తికొండ ఎంపీపీ గోవిందు, పామిడి మార్కెట్యార్డు చైర్మన్ సుంకిరెడ్డి, వీఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు సుభాష్ చంద్రబోస్, డోన్ మాజీ జెడ్పీటీసీ వలసల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
దొంగ అరెస్టు
మధిర : ఇటీవల పలు మండలాల్లో వరుస చోరీలకు పాల్పడిన కంభంపాటి ఏసోబును బుధవారం మధిర రూరల్ ఎస్సై బండారి కిషోర్ అరెస్టు చేశారు. ఈ సందర్భంగా స్థానిక రూరల్ పోలీస్ స్టేష¯ŒSలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ నూనె వెంకటేశ్వర్లు మాట్లాడారు. ఆత్కూరు గ్రామానికి చెందిన ఏసోబు ఇటీవల మధిర మండలంలోని మాటూరు, వంగవీడు, నాగవరప్పాడు, వైరా మండలంలోని పాలడుగుతోపాటు బోనకల్, ఎర్రుపాలెం, కొణిజర్లలో వరుస చోరీలకు పాల్పడ్డాడు. మాటూరు క్రాస్ రోడ్డు వద్ద రూరల్ ఎస్సై కిషోర్ వాహనాలను తనిఖీ చేస్తుండగా గమనించిన ఏసోబు గంపలగూడెంవైపు తన బైక్ను ఆపకుండా పరారయ్యేందుకు ప్రయత్నించాడు. వెంటనే పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా చోరీల విషయం తెలిసింది. అతడి నుంచి మోటారు సైకిల్, వెండి పట్టీలు, బంగారపు ఉంగరాలు, రూ.17,600 నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. మొత్తం రూ.లక్ష విలువ చేసే సొత్తును స్వాధీనం చేసుకుని నిందితుడిని అరెస్టు చేశామని సీఐ పేర్కొన్నారు. సమావేశంలో రూరల్ ఎస్సై బండారి కిషోర్ పాల్గొన్నారు. -
ఎస్సీ, ఎస్టీ కేసులపై సత్వర చర్యలు
– జిల్లా కలెక్టర్ సిద్ధార్థ్జైన్ చిత్తూరు (కలెక్టరేట్) : ఎస్సీ, ఎస్టీలపై దాడులకు సంబంధించిన కేసులపై చట్టపరంగా సత్వర చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్, జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ చైర్మన్ సిద్ధార్థ్జైన్ పోలీసులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశమందిరంలో జిల్లా స్థాయి ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఎస్సీ, ఎస్టీలపై దాడులు జరిగిన వెంటనే చర్యలు తీసుకుని దోషులకు శిక్ష పడేలా పోలీసులు వ్యవహరించాలన్నారు. అట్రాసిటీ యాక్టును అమెండ్ చేస్తూ ఇన్విస్టిగేషన్ కాలపరిమితి 30 నుంచి 60 రోజులకు పెంచారని, ఈ లోగా చర్యలు తీసుకుని చార్జీషీటు ఫైల్ చేయాలని చెప్పారు. ఎస్సీ, ఎస్టీల పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనించేందుకు సబ్ డివిజనల్ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించాలని, వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని చెప్పారు. డీఐజీ స్థాయిలో కేసులు పెండింగ్లో ఉంటే సత్వర చర్యల కోసం లేఖ రాయాలని రెవెన్యూ డివిజనల్ అధికారులను ఆదేశించారు. ఎస్సీ, ఎస్టీల కేసుల విషయంలో పూర్తి అవగాహన కల్పించేందుకు ఈ నెల 26వ తేది మధ్యాహ్నం స్థానిక పోలీసు శిక్షణ కళాశాలలో వర్క్షాపు నిర్వహిస్తారని చెప్పారు. జిల్లా స్థాయి విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశం 15 రోజులకు ముందే డివిజన్, మండల స్థాయి కమిటీలను నిర్వహించాలన్నారు. నారాయణవనంలో 30 ఏళ్ల పాటు సాగు చేసుకుంటున్న ఎస్టీలకు పట్టాలివ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారనే ఫిర్యాదుపై కోర్టు నుంచి జడ్జిమెంట్ వచ్చిందన్నారు. వారి క్లైయిమ్లకు ఆధారాలు పొంది పట్టాలివ్వాలన్నారు. కార్వేటినగరం చాకలివానిగుంటలో గిరిజనులకు పట్టాలు అందకపోవడంపై జిల్లా గిరిజన సంక్షేమ అధికారులు తగు చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. పట్టాలు అందని గిరిజనులుంటే వారి క్లైయిములు పరిశీలించి వారికి పట్టాలిస్తారని చెప్పారు. ఈ సమావేశంలో చంద్రగిరి, జీడీనెల్లూరు, పూతలపట్టు, తిరుపతి ఎమ్మెల్యేలు చెవిరెడ్డి భాస్కర్రెడ్డి, నారాయణస్వామి, సునీల్కుమార్, సుగుణమ్మ, చిత్తూరు, తిరుపతి ఎస్పీలు శ్రీనివాస్, జయలక్ష్మి, జేసీ–2 వెంకటసుబ్బారెడ్డి, సాంఘిక సంక్షేమ శాఖ, రెవెన్యూ, గిరిజన సంక్షేమ, అటవీశాఖల అధికారులు, ఎస్సీ,ఎస్టీల నాయకులు పాల్గొన్నారు. -
ఎస్సీ, ఎస్టీల అభ్యున్నతే లక్ష్యం
తిరుపతి మంగళం: ఎస్సీ, ఎస్టీల అభ్యున్నతే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ కారెం శివాజీ తెలిపారు. మంగళవారం తిరుపతి సబ్ కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ సిద్ధార్థ్జైన్, పోలీస్, అటవీ శాఖ, విజిలెన్స్ ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. శివాజీ మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీలను విద్య, సామాజిక, ఆర్థిక, రాజకీయంగా అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. దళితులపై దాడులకు సంబంధించిన కేసులను సత్వరం పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కులధ్రువీకరణ, ఇతర సర్టిఫికెట్ల జారీలో జాప్యం ఉండరాదన్నారు. చంద్రన్న బీమా పథకంలో కార్మికులు కేవలం రూ.15 ప్రీమియం చెల్లిస్తే రూ.5లక్షల బీమా సౌకర్యం పొందవచ్చునని పేర్కొన్నారు. జిల్లాలో ఇంటి పట్టాల సమస్య ఉందని, స్పెషల్ డ్రైవ్ పెట్టి స్థలాల మంజూరుకు కృషి చేయాలని కలెక్టర్ను ఆదేశించారు. అటవీ ప్రాంతంలో ఎస్సీ, ఎస్టీలకు చట్ట ప్రకారం భూములను కేటాయించేందుకు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అటవీ శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పాపవినాశనం వద్ద నక్కల జాతుల వారిని ఇబ్బంది పెట్టడం మానుకోవాలన్నారు. తిరుపతి అర్బన్ జిల్లా ఎస్పీ జయలక్ష్మి ఎస్సీ, ఎస్టీలకు సంబంధించిన కేసుల్లో పురోగతిని వివరించారు. -
యాక్షనే.. ప్లానేదీ!
ఆకివీడు : ‘వెనుకబడిన వర్గాలు ఆర్థికంగా స్థిరపడేందుకు అన్నివిధాలా చర్యలు తీసుకుంటున్నాం. వారి స్వయం సమృద్ధికి రుణాలు అందజేస్తున్నాం’ అని గొప్పలు చెబుతున్న రాష్ట్ర ప్రభుత్వానిది కపట నాటకమని తేలిపోయింది. ఈ ఏడాది ఇప్పటివరకూ బీసీ, ఎస్సీ, ఎస్టీల రుణాల కోసం సర్కారు యాక్షన్ ప్లాన్ రూపొందించలేదు. కాపుల రుణాల మంజూరుకు ప్రకటన చేసినా.. ఇప్పటివరకూ ఒక్కరికి కూడా మంజూరు చేయలేదు. సర్కారు ఏటా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ కార్పొరేషన్ల ద్వారా రుణాల మంజూరుకు ప్రణాళిక రూపొందిం చేంది. ఈ ప్రక్రియ ఆగస్టు నాటికి పూర్తయ్యేది. సెప్టెంబర్లో దరఖాస్తుల స్వీకరించేది. ఈ ఏడాది ఇప్పటివరకూ రుణ ప్రణాళిక ఖరారు చేయలేదు. దీంతో ఆ వర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. రుణ ప్రణాళికపై స్పష్టత లేకపోవడంతో ఆన్లైన్లో ఆ వర్గాల సర్వర్లు తెరుచుకోవవడం లేదు. ఫలితంగా ప్రజలు మండల స్థాయి అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఇప్పటివరకూ రుణాల ప్రకటన చేయకపోవడమేమిటని నిలదీస్తున్నారు. వారికి సమాధానం చెప్పలేక మండలస్థాయి అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఆన్లైన్లో సర్వర్ ఓపెన్ కానప్పటికీ దరఖాస్తు చేసుకోవచ్చని కంటితుడుపు సమాధానం చెబుతున్నారు. కాపుల ఆందోళన నేపథ్యంలో.. ఇదిలా ఉంటే కాపుల ఆందోళన నేపథ్యంలో 20 రోజుల క్రితం సర్కారు హడావుడిగా రుణాలు ఇస్తున్నట్టు ప్రకటించింది. దరఖాస్తులూ స్వీకరించింది. గత ఏడాది కాపు కార్పొరేషన్ ద్వారా రుణాల కోసం జిల్లాలో 43 వేల దరఖాస్తులు అందగా, వీరిలో కేవలం కొందరికి మాత్రమే రుణాలు అందజేసింది. ఈ ఏడాది రూ.70 కోట్లు విడుదల చేశామని చెప్పిన ప్రభుత్వం ఇప్పటివరకూ రుణాల మంజూరు ప్రారంభించలేదు. ఈ ఏడాది జిల్లాలో 11,776 దరఖాస్తులు వచ్చాయి. ఇవి కాకుండా కాపు కార్పొరేషన్ వద్ద గత ఏడాది వచ్చిన 41 వేల దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. మొత్తం 52వేల దరఖాస్తులు కాపు కార్పొరేషన్ వద్ద ఉన్నాయి. విడుదల చేసిన రూ.70 కోట్లు వీరందరికీ సరిపోతాయా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పైగా నిబంధనలు రుణాల మంజూరుకు అడ్డంకిగా ఉన్నాయి. కేవలం కాపుల కన్నీరు తుడవడానికే ప్రభుత్వం రుణాలిస్తామని ప్రకటన చేసిందనే వాదన వినబడుతోంది. ముస్లిం, మైనార్టీలదీ అదే దుస్థితి ఈ ఏడాది ముస్లిం, మైనార్టీ వర్గాల వారికిచ్చే రుణాలకూ కార్యాచరణ ప్రణాళిక విడుదల కాలేదు. దీంతో ముస్లింలు తీవ్ర ఆందోళనతో ఉన్నారు. గతంలో దరఖాస్తు చేసుకున్న వారికి బ్యాంకుల్లో రుణాలు ఇవ్వలేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈసారైనా న్యాయం చేయాలని కోరుతున్నారు. చిచ్చుపెట్టేందుకే... కులాల మధ్య తెలుగుదేశం ప్రభుత్వం చిచ్చుపెడుతోంది. బీసీ, ఎస్సీ, ఎస్టీ యాక్షన్ ప్లాన్ విడుదల చేయకుండా జాప్యం చేస్తోంది. ఏటా విడుదల చేసే యాక్షన్ ప్లాన్ ఇవ్వకపోవడంలో ఆంతర్యమేమిటి. కాపులకు రెండవ విడత రుణాలు ఇస్తున్నట్టు ప్రకటించినా.. మంజూరులో విధించిన నిబంధనలతో ఎవరికీ రుణాలు దక్కే అవకాశం లేదు. ఇప్పటికే 50 వేలకుపైగా దరఖాస్తులు కాపు రుణాల కోసం కార్పొరేషన్కు అందాయి. – నంద్యాల సీతారామయ్య, కాపు సంఘ నాయకుడు పట్టించుకోరే.. మైనార్టీల శ్రేయస్సును ప్రభుత్వం విస్మరించింది. ముస్లిం, మైనార్టీలకు రుణాల మంజూరులో వివక్ష∙చూపుతోంది. నిరుపేద ముస్లింలు ఎంతోమంది రుణాల కోసం నిరీక్షిస్తున్నారు. పలావు బండ్లు, ఇతర చిరు వ్యాపారాలు చేసుకునేందుకు కొటేషన్లు, అంచనాలు ఇవ్వమంటే ఎలా తెస్తారు. మైనార్టీలకు నాలుగు శాతం రిజర్వేషన్లు అమలు చేయాలి. – మహ్మద్ జక్కీ, వైఎస్సార్ సీపీ నాయకుడు, ఆకివీడు బీసీ యాక్షన్ ప్లాన్ ఖరారు కాలేదు బీసీ కార్పొరేషన్ ద్వారా రుణాల మంజూరుకు యాక్షన్ ప్లాన్ ఇవ్వలేదు. ప్రభుత్వం నుంచి నిధులు విడుదల కాలేదు. గత ఏడాది 4200 మందికి రూ.21 కోట్లు రుణాలుగా అందజేశాం. కాపు కార్పొరేషన్ ద్వారా రెండో విడత రుణాల కోసం 11,776 మంది దరఖాస్తు చేసుకున్నారు. గతంలో వచ్చిన దరఖాస్తులనూ పరిశీలిస్తాం. ఈ ఏడాది కాపు రుణాల కోసం రూ.70 కోట్లు మంజూరయ్యాయి. – పెంటోజీరావు, ఈడీ, బీసీ కార్పొరేషన్, ఏలూరు. -
సెయింట్ లూయిస్లో వైఎస్ఆర్ 7వ వర్థంతి
సెయింట్ లూయిస్: మహానేత వైఎస్. రాజశేఖర్ రెడ్డి ఏడవ వర్థంతి కార్యక్రమాన్ని అమెరికాలోని సెయింట్ లూయీస్లో ఘనంగా నిర్వహించారు. శనివారం మయూరీ రెస్టారెంట్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ మిథున్ రెడ్డి, వైఎస్ఆర్ సీపీ యూఎస్ఏ కన్వినర్ రత్నాకర్ వీడియో కాన్ఫిరెన్స్ ద్వారా మాట్లాడుతూ.. వైఎస్ఆర్ సేవలను గుర్తుచేసుకున్నారు. ఆరోగ్య శ్రీ, జలయజ్ఞం, ఉచిత విద్యుత్ లాంటి పథకాలతో పేదలు, రైతులకు వైఎస్ఆర్ అందించిన సేవలను ఈ కార్యక్రమంలో కొనియాడారు. మహానేత ఆశించిన విధంగా రాష్ట్రం అభివృద్ధి సాధించాలంటే వైఎస్ఆర్ సీపీ అధికారంలోకి రావాలన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ సీపీ సెంయింట్ లూయిస్ కన్వినర్ శేఖర్ రెడ్డి దండు, భార్గవ రెడ్డి, అశోక్ రెడ్డి, సురేష్ రెడ్డి, అజయ్ తదితరులు పాల్గొన్నారు. -
జనగామ ఆర్డీఓపై జేసీకి ఫిర్యాదు
హన్మకొండ అర్బన్ : దళితులకు భూమి కొనుగోలు పథకం కింద కొడకండ్ల మండలం పెద్దవంగరలో అనర్హులకు భూములు కేటాయించారని గ్రామస్తులు ఆరోపించారు. ఈ మేరకు గురువారం ఆధ్వర్యంలో కలెక్టరేట్కు వచ్చి జేసీ ప్రశాంత్ జీవన్పాటిల్కు వినతిపత్రం అందజేశారు. గ్రామసభ తీర్మానం లేకుండా లబ్ధిదారులను ఎంపికచేశారని ఈ విషయంలో జనగామ ఆర్డీఓ పూర్తిగా ఏకపక్షంగా వ్యవహరించారని ఆరోపించారు. గ్రామస్తులు తీవ్ర ఆగ్రహంతో ఆర్డీఓపై మాటల దాడితో విరుచుకుపడ్డారు. దీంతో జేసీ, ఎమ్మెల్యే కలుగజేసుకుని శాంతిం పజేశారు. ఈ విషయంలో పూర్తి స్థాయిలో విచారణ జరిపి తగు చర్యలు తీసుకుంటామని జేసీ హామీ ఇచ్చారు. గ్రామంలో 33 ఎకరాలు కొనుగోలు చేసి ఎలాంటి తీర్మానం లేకుండా 11 మందికి కేటాయించారన్నారు. -
దళితులపై దాడులు అమానుషం
హిమాయత్నగర్ : నిజమాబాద్ జిల్లా బాల్కొండ మండలంలోని నాగాపూర్ గ్రామంలో దళితులపై అగ్రకులాలు వారు చేసిన దాడి అమానుషమని తెలంగాణ మాల మహాసభ రాష్ట్ర అధ్యక్షులు మాస్త దయానంద్ అన్నారు. గురువారం ఈ ఘటనపై మస్త దయానంద్ మాట్లాడుతూ ఉమ్మెడ లక్ష్మి, చిన్న గంగు, పోశన్న, గంగారాంలకు ప్రభుత్వం 42 ఎకరాల భూమి ఇచ్చిందన్నారు. ఈ భూమిలో రెండు ఎకరాలు మీది కాదంటూ అగ్రకులానికి చెందిన ఎంబారి పెద్దనారాయణ, ఎంబారి చిన్ననర్సయ్య, ముండలి పెద్దరాజన్న, రొడ్డ రాజేశ్వర్, నల్లూరు చెన్నయ్య, ఎంబరి చిన్ననర్సయ్యలు లాక్కున్నారన్నారు. దీనిపై వారు పోరాటం చేయగా గతంలో జిల్లా జాయింట్ కలెక్టర్ స్పందించి ఆ రెండెకరాల భూమి కూడా దళితులదేనని స్పష్టం చేశారు. ఈ క్రమంలో దళితులు తమ భూమిలో పశువులను ఉంచడంతో ఎందుకు ఉంచారంటూ అగ్రకులాల నాయకులు దళిత మహిళలని కూడా చూడకుండా దాడి చేశారన్నారు. దాడి చేసిన అగ్రకులాల నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసును నమోదు చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమం తప్పదని దయానంద్ హెచ్చరించారు. -
గిరిజన అభ్యర్థులకు ఉచిత శిక్షణ
ఏటూరునాగారం : గిరిజన సంక్షేమ శాఖ ద్వారా ఎస్టీ అభ్యర్థులకు అందించనున్న శిక్షణ తరగతులను సద్వినియోగం చేసుకోవాలని ఐటీడీఏ పీఓ అమయ్కుమార్ ఒక ప్రకటనలో తెలి పారు. ఎస్టీ అభ్యర్థులకు ఐఏఎస్(ప్రిలిమ్స్), సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ (మెయిన్స్), పోలీస్ కానిస్టేబుల్(మెయిన్స్) పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు చెప్పారు. గ్రామీణులైతే వార్షిక ఆదాయం రూ. 1.5 లక్షలు, పట్టణ ప్రాంతంలో వార్షిక ఆదాయం రూ.2 లక్షలు దాటని వారు ఉచిత శిక్షణకు అర్హులని తెలిపారు. ఆసక్తి ఉన్న వారు ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. వివరాల కు 94910 34198 ఫోన్ నంబర్లో సంప్రదించాలని సూచించారు. -
ముస్లింలు, ఎస్టీలను ఆదుకోవాలి
తమ నివేదికల్లో చెల్లప్ప, సుధీర్ కమిషన్ల సూచన సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ముస్లింలలోని పేద వర్గాలు, షెడ్యూల్డ్ తెగల పరిస్థితి దారుణంగా ఉందని.. వారిని ఆదుకోవడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టాలని చెల్లప్ప, సుధీర్ కమిషన్లను తమ నివేదికల్లో సూచించినట్లు సమాచారం. ఆయా వర్గాల సామాజిక ఆర్థిక పరిస్థితులను మెరుగుపర్చేందుకు రిజర్వేషన్ల పెంపుతోపాటు విద్య, ఉపాధి, ఉద్యోగావకాశాలు లభించేలా చర్యలు చేపట్టాలని పేర్కొన్నట్లు తెలుస్తోంది. వారిలో సొంతంగా వ్యాపారాలు చేసుకునేవారికి రుణాలు ఇప్పించాలని, సబ్సిడీలు అందజేయాలని కమిషన్లు ప్రతిపాదించాయి. రాష్ట్రంలో ఎస్టీలకు 6 శాతం, ముస్లింలకు 4 శాతం (బీసీ ఈ కేటగిరీలో) రిజర్వేషన్లు కొనసాగుతుండగా.. వాటిని 12 శాతానికి చొప్పున పెంచుతామని టీఆర్ఎస్ తమ ఎన్నికల ప్రణాళికలో ప్రకటించింది. రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాక... ఆయా వర్గాల సామాజిక, ఆర్థిక పరిస్థితిని చూపేందుకు, వెనుకబాటుతనాన్ని నిర్ధారించేందుకు గణాంకాలు, సమాచారం అవసరమైంది. గతంలో సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించినా.. దాని ద్వారా సేకరించిన సమాచారాన్ని రిజర్వేషన్ల పెంపునకు పరిగణనలోకి తీసుకోవడంలో న్యాయమైన చిక్కులు ఎదురవుతాయని ప్రభుత్వం గుర్తించింది. ఈ నేపథ్యంలో ఆ వర్గాలపై అధ్యయనం చేసేందుకు ఎస్టీ, మైనారిటీ కమిషన్లను ఏర్పాటు చేసింది. కాయతీ లంబాడాలు, వాల్మీకి బోయలను కలిపితే.. రాష్ట్రంలో ఎస్టీ జనాభా శాతం, వారి పరిస్థితులతోపాటు కాయతీ లంబాడాలు, వాల్మీకి బోయలను ఎస్టీల్లో కలిపితే పరిస్థితి ఏమిటనే అంశంపై చెల్లప్ప కమిషన్ పరిశీలన జరిపింది. ఈ వర్గాలను ఎస్టీల్లో కలిపితే పెరిగే జనాభాకు అనుగుణంగా ఎస్టీల రిజర్వేషన్ల శాతాన్ని పెంచాలన్నది ప్రభుత్వ యోచన. దీంతో జిల్లాల్లో కాయతీ లంబాడాలు, వాల్మీకి బోయలు నివసించే ప్రాంతాలతో పాటు, ఇతర సమాచారాన్ని సేకరించేందుకు కమిషన్ ప్రయత్నించింది. జిల్లాల్లో ఈ రెండింటిని ఎస్టీల్లో కలపాలన్న ప్రతిపాదనను వివిధ ఎస్టీ సంఘాలు, నాయకులు వ్యతిరేకించారు. దేశవ్యాప్తంగా ఆయా తెగలు ఏయే జాబితాల్లో ఉన్నాయన్న అంశాన్ని కమిషన్ పరిశీలించింది. ఇతర ఎస్టీ తెగలతో పోల్చితే.. ఈ కులాల సామాజిక, ఆర్థిక వెనుకబాటుతనం, సాంస్కృతికంగా, సంప్రదాయాలు, పండుగలు ప్రత్యేకంగా ఉన్నాయా లేదా అన్న అంశాలపై అధ్యయనం చేసింది. కాయతీ లంబాడాలు, వాల్మీకి బోయలకు సంబంధించి చారిత్రక ఆధారాలు, కచ్చితమైన సమాచారం, గణాంకాలు పూర్తిగా అందుబాటులో లేకపోవడం కొంత సమస్యగా మారినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఎస్టీలను విద్య, ఉపాధి, ఆర్థికపరంగా ఆదుకోవాలని కమిషన్ తన నివేదికలో సూచించింది. ఎస్టీల జనాభాకు అనుగుణంగా 9 % వరకు రిజర్వేషన్లను కల్పించవచ్చునని ప్రతిపాదించింది. ముస్లింల స్థితిగతులు ఘోరం రాష్ట్రంలో ముస్లింల స్థితిగతులు దారుణంగా ఉన్నాయని సుధీర్ కమిషన్ తమ నివేదికలో పేర్కొన్నట్లు సమాచారం. రాష్ట్రవ్యాప్తంగా 9 వేల మంది నుంచి 46 అంశాలపై శాంపిల్ సర్వే ద్వారా తమకు అవసరమైన సమాచారాన్ని కమిషన్ సేకరించింది. ఈ నేపథ్యంలో మిగతా వర్గాలతో పోలిస్తే ముస్లింలలో వెనుకబాటు ఎక్కువగా ఉందనే అంచనాకు కమిషన్ వచ్చినట్లు తెలుస్తోంది. పేద ముస్లింలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు వివిధ చర్యలు చేపట్టాల్సి ఉందని నివేదికలో సూచించినట్లు సమాచారం. ముస్లిం పిల్లలకు అన్ని స్థాయిల్లో గురుకుల విద్యను అందించాలని ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. ముస్లింలలో బాగా వెనుకబడిన వర్గాలకు బ్యాంకుల నుంచి తక్కువ వడ్డీకి రుణాలు ఇప్పించాలని, సబ్సిడీ అందించాలని సిఫారసు చేసినట్లు సమాచారం. చదువుకున్న వారికి ఉద్యోగాలు లభించే ఏర్పాటు చేయాలని.. బలహీనవర్గాల గృహాలు కేటాయించేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నట్లు తెలుస్తోంది. -
ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు: కేసీఆర్
హైదరాబాద్ : తమిళనాడు తరహాలో ప్రత్యేక చట్టం తీసుకు వచ్చి ముస్లింలకు జనాభా నిష్పత్రి ప్రకారం 12 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. తెలంగాణలో ముస్లింలు అత్యంత పేదరికంలో ఉన్నారని, వారికి విద్య, ఉపాధి అవకాశాలు కల్పించడానికి రిజర్వేషన్లు తప్పనిసరి అని ఆయన శుక్రవారమిక్కడ పేర్కొన్నారు. కేబినెట్ ఆమోదం తర్వాత అసెంబ్లీలో చట్టం తెస్తామని కేసీఆర్ తెలిపారు. సమైక్య రాష్ట్రంలో ఎస్టీలు తీవ్రంగా నష్టపోయారని, ఎస్టీలకు జనాభా ప్రకారం రిజర్వేషన్లు కల్పిస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. ముస్లింలు, ఎస్టీల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. ఎస్టీలు, ముస్లింల సామాజిక, ఆర్థిక స్థితిగతులపై అధ్యయనం జరిపిన సుధీర్, చెల్లప్ప కమిషన్లు ఇవాళ ముఖ్యమంత్రి కేసీఆర్ను నివేదిక అందచేశాయి. కాగా తెలంగాణలోని పది జిల్లాలో ఎస్టీల స్థితిగతులపై అధ్యయనం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం జస్టిస్ చెల్లప్ప, సుధీర్ కమిషన్లను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. -
ఎస్టీ బాలికల గురుకుల పాఠశాల ప్రారంభం
కాగజ్నగర్ రూరల్ : కాగజ్నగర్లోని త్రిశూల్పహాడ్పై ఎస్కేఈ డిగ్రీ కళాశాల సమీపంలోని ఒక భవనంలో శుక్రవారం ఎస్టీ బాలికల గురుకుల రెసిడెన్షియల్ పాఠశాలను సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ప్రారంభించారు. ఈ రెసిడెన్షియల్ పాఠశాలకు భవన నిర్మాణానికై రూ. 4.25లక్షల నిధులు ప్రభుత్వం మంజూరు చేసిందని, అయితే స్థల సేకరణకై అధికారులు ప్రయత్నిస్తున్నారన్నారు. అనంతరం ఈ పాఠశాల ఇన్చార్జి ప్రిన్సిపాల్ శ్రీనివాస్రెడ్డి మాట్లాడుతూ ఈ సంవత్సరం 5, 6వ తరగతులు బోధిస్తారని, రాబోయే కాలంలో 5నుంచి ఇంటర్మీడియేట్ వరకు బోధిస్తారని తెలిపారు. ప్రస్తుతం 5, 6వ తరగతులల్లో 120 మంది ఎస్టీ బాలికలకు ప్రవేశం కల్పిస్తారన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ సీపీ విద్యావతి, డిస్టిక్ కో ఆర్డినేట్ ఆఫీసర్ రమేశ్, ఎస్కేఈ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పి.మారుతి కుమార్, నవోదయ పాఠశాల ప్రిన్సిపాల్ చక్రపాణి, ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ రవీందర్, ఏటీడబ్ల్యూవో శ్రీనివాస్రెడ్డి, ఎసై ్స ప్రభాకర్, తదితరులు పాల్గొన్నారు. -
బాధిత కుటుంబాలకు అన్ని విధాలా న్యాయం
ఎస్సీ,ఎస్టీ కమిషన్ చైర్మన్ కారెం శివాజీ బిఉప్పులూరు(కొలిమిగుండ్ల): పాణ్యం మండల కేంద్రంలోని రైల్వేస్టేషన్ సమీపంలో దారుణ హత్యకు గురైన ధారా ఓబులేసు, లక్ష్మయ్య కుటుంబాలకు అన్ని విధాలా న్యాయం జరిగేలా చూస్తానని ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ కారెం శివాజీ హామీ ఇచ్చారు. కోర్టు వాయిదాకు వచ్చి వెళుతుండగా మంగళవారం అన్నదమ్ములిద్దరు హత్యకు గురైన విషయం తెలిసిందే. పోస్ట్మార్టం అనంతరం బుధవారం మృతదేహాలను స్వగ్రామం బి.ఉప్పులూరుకు తీసుకొచ్చారు. కలెక్టర్ సీహెచ్ విజయ్మోహన్,ఎస్పీ ఆకే రవికృష్ణతో కలిసి చైర్మన్ గ్రామానికి చేరుకుని బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. దోషులను ఎప్పటిలోగా పట్టుకుంటురో చెప్పాలని ఎస్పీని చైర్మన్ కోరారు. పథకం ప్రకారం జరిగిన ఈ హత్యను పోలీసులు ముందుగానే పసిగట్టలేకపోయారా అని అసహనం వ్యక్తం చేశారు. ఎస్సీ కాలనీ వాసులకు గట్టి భద్రత కల్పించాలని పోలీస్ అధికారులకు సూచించారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి తక్షణ సాయంగా రూ.6.50 లక్షలు అందించాలని కలెక్టర్ను కోరారు. ఓబులేసు, లక్ష్మయ్య భార్యలకు ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని హామీ ఇచ్చారు. జంట హత్యను జిల్లా యంత్రాంగం తీవ్రంగా పరిగణిస్తోందని కలెక్టర్ విజయ్మోహన్ చెప్పారు. ఇలాంటి సంఘటనలు జరగకుండా గట్టిగా వ్యవహరిస్తామని తెలిపారు. హత్యకు పాల్పడిన నిందితులను నాలుగు రోజుల్లో అదుపులోకి తీసుకుంటామని ఎస్పీ అన్నారు. కార్యక్రమంలో నంద్యాల ఆర్డీఓ సుధాకరరెడ్డి, ఎస్సీ, ఎస్టీ సెల్ డీఎస్పీ వినోద్కుమార్, ఆళ్లగడ్డ డీఎస్పీ ఈశ్వరరెడ్డి, కోవెలకుంట్ల, శిరివెళ్ల, ఆళ్లగడ్డ సీఐలు పీటీ కేశవరెడ్డి, ప్రభాకరరెడ్డి, ఓబులేసుతో పాటు సర్కిల్ పరిధిలోని ఎస్ఐలు, ఎస్సీ, ఎస్టీ సెల్ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. -
వర్క్ షాపులను సద్వినియోగం చేసుకోవాలి
కడప అర్బన్ : పోలీసు శాఖ నిర్వహించే వర్క్ షాప్లను పోలీసు అధికారులు, సిబ్బంది సద్వినియోగం చేసుకుని నైపుణ్యాన్ని మరింత పెంచుకునేందుకు కృషి చేయాలని జిల్లా అదనపుఎస్పీ పీవీజీ విజయకుమార్ పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం పై వర్క్షాపు రెండవ రోజు బుధవారం కడపలోని జెడ్పీ ఆవరణంలో గల వైఎస్ఆర్ స్మారక సమావేశ మందిరంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భవిష్యత్తులో మరిన్ని వర్క్ షాపులు నిర్వహిస్తామని తెలిపారు. సంబంధిత విషయ నిపుణులచే వర్క్షాపు నిర్వహించడం వలన సిబ్బందికి విషయ పరిజ్ఞానం పెరిగేందుకు దోహద పడుతుందన్నారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ టి. జయలక్ష్మి వివిధ చట్టాలు, సెక్షన్ల వారీగా ఏఏ కేసుల్లో పోలీసు అధికారులు ఎఫ్ఐఆర్ ఎలా పొందు పరచాలో వివరించారు. ఫోక్సో తదితర చట్టాల గురించి తెలిపారు. సమాజంలో పోలీసుల పాత్ర కీలకమని, ఒకవైపు నేరాలు జరగకుండా చూస్తూనే మరోవైపు నేరాలకు పాల్పడ్డ వారికి శిక్షపడేలా కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సెషన్స్ జడ్జి అన్వర్ బాషాను ఘనంగా సన్మానించారు. ఈ వర్క్ షాపులో అంబేడ్కర్ మిషన్ కార్యదర్శి సంపత్ కుమార్, సాంఘిక సంక్షేమ శాఖ డీడీ సరస్వతి, డీటీసీ డీఎస్పీ జయచంద్రుడు, ఎస్సీ, ఎస్టీ సెల్ డీఎస్పీలు షౌకత్ ఆలీ, లోసారి సుధాకర్, ప్రొద్దుటూరు డీఎస్పీ పూజిత నీలం, రాజంపేట డీఎస్పీ రాజేంద్ర, మహిళా డీఎస్పీ వాసుదేవన్, జిల్లాలోని సీఐలు, ఎస్ఐలు తదితరులు పాల్గొన్నారు. -
ఎస్సీ, ఎస్టీ కేసుల విచారణలో నిర్లక్ష్యం తగదు
క్రిమినల్ కేసుల దర్యాప్తులో పోలీసు అధికారులకు కలెక్టర్ క్లాస్ సివిల్ కేసుల్లో రెవిన్యూ అధికారుల తీరుపై ఎమ్మెల్యేల అసంతృప్తి గుంటూరు ఎడ్యుకేషన్: ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద నమోదైన కేసుల విచారణలో పోలీసు యంత్రాంగం అవలంబిస్తున్న వైఖరిపై జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే అసంతృప్తి వ్యక్తం చేశారు. క్రిమినల్ కేసుల విచారణలోనూ నిర్లిప్తంగా విధులు నిర్వహిస్తున్న పలువురు డీఎస్పీలకు ఆయన క్లాస్ తీసుకున్నారు. కలెక్టరేట్లోని డీఆర్సీ సమావేశ మందిరంలో సోమవారం ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం అమలు తీరుతెన్నులపై జిల్లా స్థాయి విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా సమావేశానికి అధ్యక్షత వహించిన కలెక్టర్ కాంతిలాల్ దండే మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ వర్గాలపై హత్యలు, అత్యాచారాలకు సంబంధించిన కేసుల విచారణలో పోలీసు శాఖ వేగవంతంగా స్పందించాల్సి ఉండగా, విచారణ పేరుతో వివిధ కేసులను సంవత్సరాల తరబడి సాగదీస్తుండటం సరికాదన్నారు. 2012లో నమోదైన ఓ కేసుకు సంబంధించిన సమగ్ర వివరాలను కమిటీ ముందు ఉంచని కారణంగా డీఎస్పీల తీరును తప్పుబట్టారు. 4 సంవత్సరాలుగా కేసు విచారణ కొనసాగిస్తూనే ఉంటే, ఇక బాధితులకు ఏ విధంగా న్యాయం చేస్తారని ప్రశ్నించారు. సమావేశం దృష్టికి పలు కేసులు... పెదనందిపాడులో ఐలా మాణిక్యరావు ఇందిరమ్మ ప«థకం కింద నిర్మించిన ఇంటిని రెవిన్యూ అధికారులు కూల్చేశారని కమిటీ సభ్యుడు అంకం శ్యాం ప్రసాద్ సమావేశం దృష్టికి తెచ్చారు. దీనిపై బాధితుడు హైకోర్టును ఆశ్రయించగా, గుంటూరు ఆర్డీవోదే తప్పిదమని నిర్ధారించిన హైకోర్టు తిరిగి ఇంటిని నిర్మించాలని ఆదేశించినా అధికారులు పట్టించుకోలేదని అన్నారు. దీనిపై తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్కుమార్ అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే విధంగా గుంటూరులోని ఏటీ అగ్రహారానికి చెందిన 12 ఏళ్ల యాదిద్యరాజును డబ్బు కోసం అపహరించి దారుణంగా హత్యచేసిన కేసులో పోలీసులు మరింత వేగవంతంగా స్పందించి ఉంటే బాలుడి ప్రాణాలు కాపాడి ఉండే వారని వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనంద బాబు అన్నారు. గుంటూరు విద్యానగర్లో నివశిస్తున్న దళితుడైన యరమాల విజయ్ కుమార్పై అక్కడి అగ్ర వర్ణాలు దాడి చేసిన సంఘటనపై గుంటూరు ఆర్డీవో ఎటువంటి చర్యలు చేపట్టకపోవడంపై కమిటీ సభ్యుడు కొర్కపాటి చెన్న కేశవులు కలెక్టర్ దృష్టికి తెచ్చారు. బాపట్లలో మోడల్ స్కూల్స్ పేరుతో ఎస్సీ, ఎస్టీ కాలనీలోని పాఠశాలలను విద్యాశాఖాధికారులు విలీనం చేస్తున్న విషయమై కలెక్టర్ దృష్టికి తీసుకురాగా, ఆయా పాఠశాలలను విలీనం చేయరాదని విద్యాశాఖాధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులకు సంబంధించి కోర్టు ఆదేశాలు అమలయ్యేలా చూడాలని పోలీసు, రెవిన్యూ శాఖాధికారులను ఆదేశించారు. గుంటూరు నగర పరిధిలో 2012 నుంచి నమోదైన 44 కేసులతో పాటు మిగిలిన ప్రాంతాల్లో 2010 నుంచి నమోదైన 143 కేసులపై సమీక్షించారు. సమావేశంలో డీఆర్వో కె. నాగబాబు, సాంఘిక సంక్షేమ శాఖ జేడీ మల్లిఖార్జునరావు, అదనపు ఎస్పీలు బీపీ తిరుపాల్, రామాంజనేయులు, డీఎస్పీలు, ఆర్డీవోలు, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
సమన్వయమే సమస్య
ఓవైపు విద్యార్థులు లేక హాస్టళ్లు మూసివేత మరోవైపు సీట్ల కోసం వందలాది మంది పడిగాపులు సర్దుబాటు చేయలేకపోతున్న అధికారులు సంక్షేమ హాస్టళ్ల మనుగడకు ప్రమాదం కరీంనగర్ సిటీ : జిల్లా కేంద్రంలోని బీసీ బాలుర కళాశాల వసతిగృహంలో వంద సీట్లున్నాయి. ఈ విద్యాసంవత్సరం 105 రెన్యువల్స్ (ఇప్పటికే ఉన్న విద్యార్థుల సంఖ్య) చేయగా కొత్తగా 175 దరఖాస్తులు వచ్చాయి. ఇవి పెండింగ్లో ఉండగానే మరో వంద మంది విద్యార్థులు హాస్టల్లో ప్రవేశానికి ఎదురుచూస్తున్నారు. ముత్తారం మండల కేంద్రంలో బీసీ బాలుర కళాశాల వసతిగహం ఏర్పాటు చేసినప్పటి నుంచి విద్యార్థులు చేరకపోవడంతో దానిని మూసివేశారు. వార్డెన్కు గోదావరిఖని హాస్టల్ ఇన్చార్జిగా బాధ్యతలు అప్పగించారు. సదరు హాస్టల్ను ఈ సంవత్సరం మంథనిలో ప్రారంభించారు. అక్కడా అడ్మిషన్లు లేవు. విద్యార్థులను చేర్పించేందుకు వార్డెన్ నానా పాట్లు పడుతున్నారు. ఇది జిల్లాలో బీసీ సంక్షేమ హాస్టళ్ల పరిస్థితి. విద్యార్థులు లేరంటూ ఓ చోట హాస్టళ్లను మూసివేస్తుండగా, మరో చోట హాస్టల్లో ప్రవేశానికి వందలాది మంది విద్యార్థులు పడిగాపులు కాస్తున్నారు. ప్రీమెట్రిక్, కళాశాల స్థాయి వసతిగహాల్లో సీట్ల కోసం పట్టణ ప్రాంతాల్లో విపరీతంగా డిమాండ్ ఉండగా, గ్రామీణ ప్రాంతాల్లో కనీస స్థాయిలో విద్యార్థులు లేక హాస్టళ్లు మూతపడుతున్నాయి. జిల్లాలో కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి ప్రాంతాల్లోని హాస్టళ్లలో చేరేందుకు విద్యార్థులు క్యూ కడుతున్నా.. సీట్లు లేకపోవడంతో నిరాశ చెందుతున్నారు. ఒక్కో హాస్టల్లో సుమారు వంద సీట్లు ఉండగా.. అంతకు రెండుమూడు రెట్లు విద్యార్థుల నుంచి డిమాండ్ వస్తోంది. కానీ ప్రతి సంవత్సరం చాలా హాస్టళ్లలో సీట్లు లేవని విద్యార్థులను వెనక్కి పంపిస్తున్నారు. మరో పక్క విద్యార్థుల నుంచి ఆదరణ లేని హాస్టళ్లను మూసివేస్తున్నారు. కరీంనగర్లో బీసీ కళాశాల స్థాయి బాలికల వసతిగృహాలు రెండున్నాయి. ఒక్కో హాస్టల్కు వంద సీట్ల చొప్పున 200 సీట్లున్నాయి. కాని మరో వంద మంది విద్యార్థినులు హాస్టల్లో ప్రవేశానికి దరఖాస్తు చేసుకున్నారు. ఒక్కో హాస్టల్లో 25 మంది చొప్పున రెండింటిలో కలిపి 50 మంది విద్యార్థులకు అవకాశం కల్పించారు. మరో 50 మంది విద్యార్థులు సీట్ల కోసం ఎదురుచూస్తున్నారు. ఫార్మసీ, బీటెక్, ఎడ్సెట్, పీజీ కౌన్సెలింగ్లు పూర్తి కాగానే మరింత మంది విద్యార్థులు హాస్టళ్లలో ప్రవేశం కోసం క్యూకట్టే పరిస్థితి ఉంది. కరీంనగర్లోని ఒక బీసీ హాస్టల్, రెండు ఎస్సీ హాస్టళ్లను విలీనం చేసి ఇంటిగ్రేటెడ్ హాస్టల్ను ప్రారంభించారు. ఇందులో బీసీలకు వంద సీట్లకు మాత్రమే మంజూరు ఉండగా, అదనంగా మరో వంద మంది విద్యార్థులు ప్రవేశం కోసం నిరీక్షిస్తున్నారు. పురాతన ఉన్నత పాఠశాలలో ఇంగ్లిష్ మీడియం ఉండడం, అదే ఆవరణలో ఇంటిగ్రేటెడ్ హాస్టల్ ఉండడంతో డిమాండ్ అధికంగా ఏర్పడింది. మరోపక్క వేములవాడలోని బీసీ బాలిక కళాశాల వసతిగృహంలో అసలు విద్యార్థులే లేకపోవడం గమనార్హం. సమన్వయం చేస్తేనే మనుగడ విద్యార్థులు లేరంటూ హాస్టళ్ల మూసివేతకు ఉత్సాహం చూపిస్తున్న అధికారులు, అదే సమయంలో విద్యార్థుల నుంచి ఆదరణ ఉన్న హాస్టళ్లను పట్టించుకున్న పాపానపోవడం లేదు. మండల స్థాయిలో విద్యార్థులు అంతగా హాస్టళ్ల పట్ల ఆసక్తి చూపడం లేదు. మోడల్ స్కూళ్లు, కస్తూరిబా, గురుకుల విద్యాలయాలు నెలకొల్పడం, కరువుతో ప్రజలు గ్రామాలను విడిచిపెట్టి పట్టణాలకు వలస రావడం తదితర కారణాలతో హాస్టళ్లలో సీట్లు భర్తీ కావడం లేదు. అలాంటి హాస్టళ్లను మూసివేస్తున్నారు. అదే సమయంలో డిమాండ్ ఉన్న హాస్టళ్లను ప్రోత్సహించలేకపోతున్నారు. ఒక అంచనా ప్రకారం కరీంనగర్లో ప్రస్తుతం ఉన్న హాస్టళ్లకు అదనంగా ఒక ప్రీమెట్రిక్ బాలుర, ఒక కళాశాల స్థాయి బాలుర, ఒక కళాశాల స్థాయి బాలికల హాస్టళ్లను ఏర్పాటు చేయాల్సిన అవసరముంది. విద్యార్థుల ఆదరణ అంతగా లేని హాస్టళ్ల నుంచి సీట్లను కోత పెట్టి, డిమాండ్ ఉన్న హాస్టళ్లలో సీట్లు పెంచితే ఈ సమస్యను అధిగమించే అవకాశముంది. అప్పుడే సంక్షేమ హాస్టళ్ల మనుగడ సాధ్యమవుతుంది. ఉన్నతాధికారులు ఆ దిశగా సమన్వయం చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. సీట్లు పెంచడానికి ప్రయత్నిస్తున్నాం –బీసీ సంక్షేమ శాఖ డీడీ ఎంబీకే.మంజుల డిమాండ్ అధికంగా ఉన్న హాస్టళ్లలో సీట్లను పెంచడానికి ప్రయత్నిస్తున్నాం. ప్రై వేట్ భవనాల్లో కళాశాల స్థాయి హాస్టళ్లు ఉండడం వల్ల పూర్తిస్థాయిలో వీలు పడడం లేదు. ఇప్పటికే వంద ఉన్న సంఖ్యను అవసరమున్న చోట 120, 150కు పెంచాం. విద్యార్థులు చేరకపోవడంతో దామెరకుంట, ఎలిగేడు, ముల్కనూరు, బొమ్మనపల్లి హాస్టళ్లను ఈ సంవత్సరం మూసివేశాం. సమన్వయం చేయడానికి ప్రయత్నిస్తున్నాం. -
మొదటి వారంలో సబ్సిడీ విడుదల
నల్లగొండ : ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కా ర్పొరేషన్ లబ్ధిదారులకు సంబంధించిన ఈ నెల మొదటి వారంలో ప్రభుత్వం సబ్సిడీ (బడ్జెట్) విడుదల చేయనున్నుట్ల ఏజేసీ వెంకట్రావు తెలిపారు. శుక్రవారం తన చాంబర్లో వివిధ బ్యాంక్ల జిల్లా మేనేజర్లతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, క్రిస్టియన్ మైనార్టీ వర్గాలకు చెందిన లబ్ధిదారుల రుణాల విషయంలో జాప్యం చేయొద్దని, వారి ద రఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని సూ చించారు. బ్యాంకర్లు లబ్ధిదారులకు ఇబ్బందులు కలిగించకుండా రుణాలు మంజూరు చేయూలని సూచించారు. అర్బన్ మున్సిపాలిటీ స్వయం ఉపా ధి పకం ద్వారా రుణాల విషయంలో లబ్ధిదారులు సంబంధిత ధ్రువపత్రాలు ఖచ్చితంగా సమర్పిస్తే లోన్లు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని బ్యాంకు అధికారులు తెలిపారు. సమభావన సంఘాల రుణాలలో అవకతవకలు జరుగుతున్నాయని బ్యాంకర్లు డీఆర్డీఏ పీడీ దృష్టికి తీసుకొచ్చారు. సమావేశంలో డీఆర్డీఏ పీడీ అంజయ్య, ఎల్.డి.యం శ్రీధర్, బీసీ కార్పొరేషన్ ఈడీ వేణుగోపాల్రావు, గ్రౌండ్ వాటర్ డీడీ జితేందర్, వివిధ బ్యాంకుల మేనేజర్లు పాల్గొన్నారు. -
నాణ్యమైన విద్యనందించడమే ప్రభుత్వ లక్ష్యం
రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి జడ్చర్ల : తెలంగాణలోని పేద విద్యార్థులందరికీ కార్పొరేట్ స్థాయిలో నాణ్యమైన విద్యనందించడమే ప్రభుత్వ లక్ష్యమని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి అన్నారు. సోమవారం జడ్చర్లలో మైనారిటీ గురుకుల పాఠశాలను ప్రారంభించిన అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడారు. జిల్లాలో ఈ విద్యా సంవత్సరం 8 మైనారిటీ గురుకులాలను ఏర్పాటు చేశామన్నారు. ఈ పాఠశాలల్లో విద్యార్థులకు కార్పొరేట్ స్థాయిలో వసతులు కల్పించి ఉత్తమమైన అధ్యాపకులను నియమించామన్నారు. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకులాలను సైతం త్వరలోనే ఏర్పాటు చేస్తామన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన వారే ఉన్నత స్థాయిలో రానిస్తున్నారన్నారు. వచ్చే సంవత్సరం నాటికి దాదాపు 5 నుంచి 10 ఎకరాల స్థలంలో అన్ని హంగులతో సొంత భవనాన్ని నిర్మిస్తామని మంత్రి పేర్కొన్నారు. ఇదే హాస్టల్లో ఉండి చదివా.. తాను జడ్చర్లలో ప్రస్తుతం ఏర్పాటు చేసిన మైనారిటీ గురుకుల పాఠశాల భవనంలో కొనసాగిన హాస్టల్లో ఉండి చదువుకున్నానని నాగర్కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి అన్నారు. మైనారిటీ గురుకుల పాఠశాల ప్రారంభోత్సవానికి హాజరైన ఆయన మాట్లాడుతూ ప్రైవేట్కు ధీటుగా ఏర్పాటు చేసిన మైనారిటీ గురుకులాలను వినియోగించుకోవాలన్నారు. పేదల కలలను ముఖ్యమంత్రి కేసీఆర్ సాకారం చేస్తున్నారని కొనియాడారు. కార్యక్రమంలో ఏజేసీ బాలాజీ రంజిత్ప్రసాద్, డిప్యూటీ కలెక్టర్ మాసుమాబేగం, జెడ్పీటీసీ సభ్యురాలు జయప్రద, ఎంపీపీ లక్ష్మి, కోఆప్షన్ సభ్యుడు ఇమ్ము, తహసీల్దార్ జగదీశ్వర్రెడ్డి, ఎంపీడీఓ మున్నీ, ప్రిన్సిపాల్ నయీమొద్దీన్ తదితరులు పాల్గొన్నారు. -
మహిళలకు వడ్డీ లేని రుణాలందించాలి
మహిళా సమాఖ్య రాష్ట్ర కార్యదర్శి సృజన ఆదిలాబాద్ అగ్రికల్చర్ : గతంలో స్త్రీనిధి ద్వారా మహిళలకు వడ్డీ లేని రుణాలు ఉండేవని, ప్రస్తుతం వడ్డీ వసూలు చేస్తున్నారని, గతంలో మాదిరిగా వడ్డీ లేని రుణాలను పునరుద్ధరించాలని మహిళా సమాఖ్య రాష్ట్ర కార్యదర్శి వి.సృజన అన్నారు. శుక్రవారం పట్టణంలోని బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ సంఘ భవనంలో ఏర్పాటు చేసిన మహిళా సమాఖ్య సదుస్సులో ఆమె మాట్లాడారు. ఎన్నికల ముందు మహిళా గ్రూపులకు రూ.10 లక్షల చొప్పున వడ్డీ లేని రుణాలు అందిస్తామని ఇప్పుడా ఊసే ఎత్తడం లేదని విమర్శించారు. రైతులకు రుణమాఫీ చేస్తున్నట్లుగానే డ్వాక్రా మహిళ రుణాలను మాఫీ చేయాలని పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల పిల్లలకు స్కాలర్షిప్ను రూ.1500 అందించాలని, అభయహస్తం పింఛన్లను కొనసాగించాలని డిమాండ్ చేశారు. మహిళలపై దాడులు, అఘారుుత్యాలు అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అన్నారు. షీ టీంలను పట్టణ ప్రాంతాలకే పరిమితం చేయకుండా మండల, గ్రామ స్థాయిలో కూడా నియమించాలని పేర్కొన్నారు. ఈ సదస్సులో జిల్లా కార్యదర్శి ముడుపు నళినిరెడ్డి, అధ్యక్షురాలు చంద్రకళ, ప్రభావతి, టీ.రాజకుమారి, కవిత, బోథ్ మండల కార్యాదర్శి గోదావరి, వై.కాంతమ్మ తదితరులు పాల్గొన్నారు. -
ఎస్సీ, ఎస్టీల గరిష్ట వయోపరిమితి సడలింపు పొడిగింపు
2021 మే 31 వరకు పొడిగిస్తూ సర్కారు ఉత్తర్వులు సాక్షి, హైదరాబాద్: డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేసే ఉద్యోగాల్లో ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితిలో కల్పిస్తున్న ఐదేళ్ల సడలింపును ప్రభుత్వం మరో ఐదేళ్ల వరకు పొడిగించింది. ఇందుకు సంబంధించి గతంలో జారీ అయిన ఉత్తర్వుల కాలపరిమితి 2016 మే 31తో ముగియడంతో దాన్ని 2021 మే 31 వరకు పొడిగిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎస్సీ, ఎస్టీలకు తగినంత ప్రాతినిధ్యం కల్పించాల్సిన అవసరమున్న నేపథ్యంలో గరిష్ట వయోపరిమితి సడలింపును మరో ఐదేళ్లు పొడిగించాలని నిర్ణయించినట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇందుకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్ర సబార్డినేట్ సర్వీస్ రూల్స్లో సాధారణ పరిపాలన (సర్వీసెస్) శాఖ అవసరమైన సవరణలు చేస్తుందని ఎస్సీశాఖ కార్యదర్శి బి.మహేశ్దత్ ఎక్కా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. -
బాలికల గురుకులాల్లో ఇక అందరూ మహిళా ఉద్యోగులే!
♦ కొత్త గురుకులాలతో పాటు పాత వాటిలోనూ భర్తీకి ప్రభుత్వం మొగ్గు ♦ రెండు మూడు రోజుల్లో వెలువడనున్న ఉత్తర్వులు సాక్షి, హైదరాబాద్: కొత్తగా ప్రారంభించనున్న ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల బాలికల గురుకులాల్లో మొత్తం మహిళా ఉద్యోగులనే నియమించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. బాలికల అక్షరాస్యతను పెంచడంతో పాటు, వారిని ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దడం గురుకులాల ద్వారానే సాధ్యమని ప్రభుత్వం అంచనాకు వచ్చింది. ఈ నేపథ్యంలో అధిక సంఖ్యలో కొత్తగా బాలికల గురుకులాలను ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. కొత్తగా ఏర్పాటుకానున్న బాలికల గురుకులాలతోపాటు ఇప్పటికే కొనసాగుతున్న బాలికల గురుకులాల్లో టీచర్లు, వార్డెన్లు మొదలుకుని అన్ని విధుల్లోనూ మహిళా ఉద్యోగులనే నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటివ రకూ 50 ఏళ్లకు పైబడిన పురుషులను బాలికల గురుకులాల్లో నియమించేందుకు మినహాయింపు ఉండేది. ప్రస్తుతం అటువంటి మిన హాయింపు లేకుండా అధికారులు చర్యలు తీసుకోనున్నారు. ఈ విషయంలో సాంకేతికంగా, చట్టపరంగా ఇబ్బందులు ఎదురవుతాయేమోనన్న కోణంలోనూ అధికారులు పరిశీలిస్తున్నారు. ఇప్పటికే ఆయా అంశాలపై వివిధ సంక్షేమ శాఖలకు ఈ ఫైల్ను పంపించారు. ఆ తర్వాత సాధారణ పరిపాలన శాఖ ఆమోదముద్రకు పంపనున్నారు. ఇందుకు సంబంధించి రోజుల్లోనే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయవచ్చునని అధికార వర్గాల సమాచారం. బీసీ వర్గాల్లో అసంతృప్తి కొత్తగా 100 ఎస్సీ, 71 మైనారిటీ, 50 ఎస్టీ గురుకులాలను, 30 రెసిడెన్షియల్ కాలేజీలను ఏర్పాటుచేయనున్నారు. తమను మినహాయించి మిగతా అన్నివర్గాలకు గురుకులాలను ప్రారంభిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించడం పట్ల బీసీ వర్గాల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. కొత్తగా 20 బీసీ గురుకులాలను ఏర్పాటు చేయాలని, ప్రస్తుతమున్న 16 స్కూళ్లను జూనియర్ కాలేజీలుగా అప్గ్రేడ్ చేయాలనే ప్రతిపాదనలు ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయి. ఈ ప్రతిపాదనలపై వెంటనే స్పందించి రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలనే డిమాండ్ ఈ వర్గాల్లో పెరుగుతోంది. -
ఎస్సీ, ఎస్టీ రైతులకు ట్రాక్టర్లు ఉచితం
సీఎం వద్దకు ఫైలు... ఆమోదం తర్వాత జీవో విడుదల హైదరాబాద్: తెలంగాణ సర్కారు ఎస్సీ, ఎస్టీ రైతులకు ఉచితంగా వ్యవసాయ ట్రాక్టర్లు అందజేయాలని నిర్ణయించింది. వ్యవసాయ యాంత్రీకరణలో భాగంగా ట్రాక్టర్ల సబ్సిడీని మరింత పెంచింది. ప్రస్తుతం అన్ని వర్గాల రైతులకు 50% సబ్సిడీపై వ్యవసాయ ట్రాక్టర్లను ఇస్తుండగా... ఇకనుంచి ఎస్సీ, ఎస్టీ రైతులకు 100% సబ్సిడీ ఇవ్వాలని నిర్ణయించింది. 95% వ్యవసాయశాఖ ద్వారా, మిగిలిన 5% ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్ల ద్వారా సబ్సిడీ సొమ్ము అందజేయాలని నిర్ణయించింది. ఇప్పటికే గ్రీన్హౌస్ సబ్సిడీని ఎస్సీ, ఎస్టీ రైతులకు 100% చేయగా... దాంతోపాటు ట్రాక్టర్లకూ అమలు చేయాలని నిర్ణయించడం గమనార్హం. సీఎం ఆమోదించాక రెండింటికీ కలిపి త్వరలో జీవోలు విడుదల కానున్నాయి. ఎస్సీ, ఎస్టీ రైతులకు 100% సబ్సిడీని వ్యక్తిగతంగా ఇవ్వడంతోపాటు ట్రాక్టర్లను అద్దెకు ఇచ్చుకునేట్లయితే దానికీ 100% సబ్సిడీ ఇస్తారు. ఇతర వ్యవసాయ యంత్రాలతోపాటు వీటినీ సరఫరా చేస్తారు. ఇతర వ్యవసాయ యంత్రాలకు మాత్రం అందరికీ ఉన్న సబ్సిడీ ఎస్సీ, ఎస్టీలకూ కొనసాగుతుంది. -
ఎస్టీల్లో కలపాలా.. వద్దా!
♦ వాల్మికిబోయ, కైతిలంబాడాలను ఎస్టీలో చేర్చే అంశంపై ♦ కేంద్ర బృందం అభిప్రాయసేకరణ ♦ కలెక్టరేట్లో వివిధ వర్గాలతో ♦ సమావేశమైన కమిషన్ చైర్మన్ ఎస్.చెల్లప్ప ♦ నతులు స్వీకరించిన బృందం సభ్యులు సాక్షి, రంగారెడ్డి జిల్లా: వాల్మికిబోయ, కైతిలంబాడాలను ఎస్టీల్లో చేర్చే అంశంపై కేంద్రం నియమించిన చెల్లప్ప బృందం గురువారం కలెక్టరేట్లో సమావేశమైంది. కుల సంఘాల ప్రతినిధుల నుంచి బృందం సభ్యులు అభిప్రాయాలు తీసుకున్నారు. వాల్మికిబోయలు తమ ఆర్థిక, సామాజిక పరిస్థితిని వివరిస్తూ బీసీ-ఏ కేటగిరీలో చేర్చడంతో తీవ్ర అన్యాయం జరిగిందని, ఎస్టీ జాబితాలో చేర్చి రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. ఈ అంశంపై గిరిజన సంఘ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆర్థికంగా దయనీయ స్థితిలో ఉంటేనే మార్పు చేయాలని, ప్రస్తుతం వాల్మికి బోయల పరిస్థితి మెరుగ్గా ఉందన్నారు. కమిషన్ చైర్మన్ చెల్లప్ప, సభ్యు లు హెచ్.కె.వాగు, వీరమల్లు సమావేశానికి వచ్చిన సంఘ ప్రతినిధుల నుంచి వినతులు స్వీకరించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 32 ప్రజా విచారణ కార్యక్రమాలు నిర్వహించినట్లు చైర్మన్ తెలిపారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమశాఖ అధికారి విద్య తదితరులు పాల్గొన్నారు. -
లక్ష్మీ.. రావే మా ఇంటికి!
♦ బీసీలకు కల్యాణలక్ష్మి పథకం వర్తింపు ♦ ఉత్తర్వులు జారీ చేసిన సర్కార్ ♦ సంబురాల్లో వెనుకబడిన వర్గాలు ♦ జిల్లాలో బీసీ జనాభా 18.54లక్షలు ♦ దరఖాస్తుల పరిశీలన బాధ్యత బీసీ సంక్షేమ శాఖకే ♦ పారదర్శకంగా అమలు చేయాలంటున్న ప్రజాప్రతినిధులు, నేతలు జోగిపేట : బీసీలకూ కల్యాణలక్ష్మి పథకం వర్తింపజేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో వెనుకబడిన వర్గాల్లో సంతోషం వ్యక్తమవుతోంది. ఏప్రిల్ 1 నుంచి బీసీలు, ఓబీసీలకు కల్యాణలక్ష్మి పథకం అమలు చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఈ మేరకు జీఓ ఎంఎస్ నం. 5ను జారీ చేసింది. పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్లు తల్లిదండ్రులకు భారం కాకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం కల్యాణలక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం కింద రూ.51 వేల ఆర్థిక సాయం అందుతుంది. ప్రారంభంలో ఎస్సీ, ఎస్టీలకే ఈ పథకాన్ని వర్తింపజేసిన ప్రభుత్వం తాజాగా బీసీలకు వర్తింపజేయాలని నిర్ణయం తీసుకోవడంతో ఇక నుంచి బీసీలు, ఓబీసీలు, తెల్ల రేషన్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరికీ ఈ పథకం వర్తిస్తుంది. జిల్లాలో బీసీ జనాభా 18.54 లక్షలు జిల్లాలో ఎస్సీ, ఎస్టీ మైనార్టీల కంటే బీసీలే అధికంగా ఉన్నారు. జిల్లాలో మొత్తం బీసీ జనాభా 18,54,073 లక్షలు. వీరిలో 70 శాతానికిై పెగా నిరుపేద వర్గాలకు చెందిన వారే ఉన్నారు. వీరిలో చాలామంది ఆడబిడ్డల పెళ్లిళ్లు చేయలే క సతమత మవుతున్నారు. బీసీలకు, ఓబీసీలకు కల్యాణలక్ష్మి పథకం వర్తించేలా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో చాలా మంది తల్లిదండ్రులకు ఇది వరంగా మారింది. కల్యాణ లక్ష్మి పథకాన్ని అమలు చేయడంతో బీసీలంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. పరిశీలన బాధ్యత ఆ శాఖ అధికారులకే.. దరఖాస్తుల పరిశీలన బాధ్యతలను ప్రభుత్వం బీసీ సంక్షేమ శాఖ అధికారులకు అప్పగించింది. సహయ బీసీ సంక్షేమ అధికారులు (ఏబీసీడబ్ల్యూఓ) వసతి గృహ వార్డెన్లకు ఈ బాధ్యతలను కట్టబెట్టింది. దరఖాస్తులు చేసుకునే వారు ఆయా మండల ప్రాంతాల వార్డెన్లకు దరఖాస్తులు అందజేస్తే సరిపోతుంది. దరఖాస్తు చేసే విధానం.. ♦ సమీపంలోని మీ-సేవ కార్యాలయంలో గాని, ఏదైనా ఇంటర్నెట్ సెంటర్లో దరఖాస్తు చేసుకోవచ్చు. సంబంధిత తహసీల్దార్ కార్యాలయంలో, హాస్టల్ వార్డెన్లకూ దరఖాస్తులు సమర్పించవచ్చు. ♦ వధూవరుల వయస్సు ధ్రువీకరణ పత్రం లేదా టెన్త్ మెమో, బోనఫైడ్, టీసీ ♦ వధూవరుల కుల ధ్రువీకరణ పత్రం ♦ వధూవరుల ఆధార్ కార్డులు ♦ వధువు బ్యాంకు ఖాతా పుస్తకం జిరాక్స్ ♦ వివాహ ప్రతిక, మొదటి వివాహ ధ్రువపత్రం (గెజిటెడ్ అధికారి సంతకం చేసినది) ♦ సంబంధిత గ్రామ పంచాయతీ నుంచి వివాహ ధ్రువపత్రం. పథకం పక్కదారి పట్ట కుండా చూడాలి ♦ పేద బీసీ వర్గాల కోసం ప్రవేశ పెట్టిన పథకం అర్హులైన ప్రతి ఒక్కరికి అందేలా చూడాల్సిన బాధ్యత అధికారులదే. పేద బీసీ ఆడపడుచుల వివాహానికి ప్రభుత్వం మంజూరు చేసే రూ.51వేలు కొంత మేరకు ఉపయోగపడతాయి. ♦ నిబంధనల పేరిట పేదలను ఇబ్బంది పెట్టొద్దు. బీసీలు పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి. - కవిత, చైర్పర్సన్, జోగిపేట నగర పంచాయతీ వివాహ రిజిస్ట్రేషన్ పత్రం.. ఏప్రిల్ 1నుంచి పెళ్లిళ్లు చేసుకున్న బీసీ యువతులు, కల్యాణలక్ష్మి పథకం కింద దరఖాస్తు చేసుకోవాలి. అర్హత కల్గిన వారు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న అనంతరం ఏబీసీడబ్ల్యూవోలు, వార్డెన్లు వాటిని పరిశీలిస్తారు. ఆ వెంటనేవధువు ఖాతాల్లోకి ట్రెజరీ ద్వారా నిధులు జమ అవుతాయి. ఆశన్న, - బీసీ సంక్షేమ శాఖ అధికారి సంగారెడ్డి పథకం కింద అర్హత పొందాలంటే .. ♦ వివాహం కానివారై ఉండాలి, వధూవరులు ఒకే కులానికి చెందిన వారై ఉండాలి. ♦ పెళ్లి నాటికి వధువుకి 18, వరుడికి 21 సంవత్సరాలు నిండి ఉండాలి. ♦ తల్లిదండ్రుల వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాల వారికి రూ.1.50 లక్షలు, పట్టణ ప్రాంతాల వారికి రూ.2 లక్షలకు మించరాదు. ♦ {పతి వధువుకు ఒకసారి మాత్రమే వర్తిస్తుంది. ♦ ఏప్రిల్ 1 తర్వాత వివాహం చేసుకున్న బీసీ యువతులందరూ అర్హులే. -
‘ఎస్సీ, ఎస్టీ సంక్షేమంపై ప్రభుత్వ నిర్లక్ష్యం’
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో బలహీనవర్గాలు, ఎస్సీ, ఎస్టీలపట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ విమర్శించారు. మహాత్మా జ్యోతిరావుపూలే జయంతి వేడుకలను సోమవారం ఇక్కడ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించారు. తెలంగాణ ఏర్పాటైతే అభివృద్ధి, సంక్షేమ ఫలాలు దక్కుతాయని పోరాడితే, సీఎం కేసీఆర్ తీరు ఆందోళనకరంగా ఉందని లక్ష్మణ్ అన్నారు. ఎస్సీ, ఎస్టీ సంక్షేమానికి అరకొర నిధులు కేటాయించడమేకాకుండా వాటిని కూడా ఖర్చు చేయడంలేదని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను పూర్తిగా విస్మరించారని లక్ష్మణ్ విమర్శించారు. రాష్ట్రంలో 17 ఫెడరేషన్లను 11కు కుదించారని, వాటికి కూడా అతితక్కువ బడ్జెట్ను కేటాయించారని ఆరోపించారు. కార్యక్రమంలో కిషన్రెడ్డి, పార్టీ ముఖ్యనేతలు పాల్గొన్నారు. -
సమస్యలివీ...పరిష్కరించండి
ఎస్సీ,ఎస్టీ ప్రజావాణిలో అర్జీదారులు చిత్తూరు (అగ్రికల్చర్): జిల్లాలోని ఎస్సీ,ఎస్టీలు శని వారం ప్రత్యేక ప్రజావాణిలో వివిధ సమస్యలపై అర్జీలు సమర్పించారు. కలెక్టరేట్ సమావేశమందిరంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ఎస్సీ, ఎస్టీ ప్రజావాణిలో జాయింట్ కలెక్టర్ -2 వెంకటసుబ్బారెడ్డి అర్జీదారుల నుంచి వినతులు స్వీకరించారు. ఖాళీగా ఉన్న బ్యాక్ లాగ్పోస్టులు జిల్లాలో అన్ని ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేయాలని ఆలిండియా ఎస్సీ,ఎస్టీ ఐక్యవేదిక నాయకులు కోరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాల్లో ఎస్సీ,ఎస్టీల బ్యాక్లాగ్ పోస్టులు ఏళ్ల తరబడి ఖాళీగా ఉన్నాయని పేర్కొన్నారు. జేసీ-2కు వినతి చేసిన వారిలో ఎస్సీ, ఎస్టీ ఐక్యవేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.మునస్వామి తదితరులు ఉన్నారు. స్కాలర్షిప్పుల పెండింగ్ జిల్లాలో 4 నుంచి 8వతరగతి వరకు చదువుతున్న యానాది(ఎస్టీలు) విద్యా ర్థులకు ఉపకార వేతనాలను అందించాలని ఆంధ్రప్రదేశ్ యానాది సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కోటయ్య కోరారు. ఇంటిపట్టాలిప్పించండి ఇంటి పట్టాలు ఇప్పించాలని చంద్రగిరి మండలం ముంగిలిపట్టు దళితవాడకు చెందిన కే.నారాయణస్వామి, చిరంజీవమ్మ వినతి చేశారు. ఇటీవల తహశీల్దార్ తమపై దుర్భాషలాడుతూ ఇంటిపట్టాలు అడిగితే క్రిమినల్ కేసులు పెడతామని బెదిరించారని, ఒక రోజు రాత్రిపూట చంద్రగిరి పోలీస్స్టేషన్లో పెట్టించారని తెలిపారు. నిష్కారణంగా తహశీల్దార్ తమపట్ల దురుసుగా ప్రవర్తిస్తున్నారని, అతనిపై చర్యలు తీసుకుని ఇళ్లపట్టాలిప్పించాలని వినతి చేశారు. -
50 యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్
హైదరాబాద్: రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు గృహాలకు వినియోగించే విద్యుత్ను 50 యూనిట్ల వరకూ ఉచితంగా అందించే పథకంలో మార్పులు చేసి.. మరింత మందికి లబ్ధి చేకూర్చుతామని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిశోర్బాబు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం నెలకు 51 యూనిట్ల విద్యుత్ను వినియోగించిన ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు ఉచిత విద్యుత్ పథకం వర్తించడం లేదన్నారు. ఇకపై 50 యూనిట్ల వరకూ విద్యుత్ను ఉచితంగానూ.. ఆ పైన వినియోగించే విద్యుత్కు మాత్రమే ఛార్జీలు వసూలు చేసేలా పథకంలో మార్పులు చేశామని వివరించారు. దీని వల్ల ఆరు లక్షల ఎస్సీ, 90 వేల ఎస్టీ కుటుంబాలు లబ్ధి పొందుతాయన్నారు. గృహాలకు ఉచితంగా విద్యుత్ అందించే పథకానికి రూ.76 కోట్లను ఖర్చు చేస్తున్నామని కిషోర్ బాబు చెప్పారు. ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు నాలుగు ఎల్ఈడీ బల్బుల చొప్పున పంపిణీ చేస్తామని.. తద్వారా వారు నెలకు 50 యూనిట్ల లోపే విద్యుత్ను వినియోగించే అవకాశం ఉంటుందన్నారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 125వ జయంతిని ఘనంగా నిర్వహించే అంశంపై సీఎం చంద్రబాబునాయుడు సోమవారం శాసనసభలో ఒక ప్రకటన చేస్తారని రావెల చెప్పారు. -
ఎస్టీ, బీసీలకు డ్రైవింగ్లో శిక్షణ
* మారుతీ సంస్థ సహకారం * స్వతంత్ర సంస్థ ద్వారా శిక్షణపై పర్యవేక్షణ సాక్షి, హైదరాబాద్: స్వయం ఉపాధి పథకాల్లో భాగంగా శిక్షణ, నైపుణ్యాల మెరుగుదలకు సంక్షేమ శాఖలు చర్యలు చేపట్టాయి. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలపై రాష్ర్ట ప్రభుత్వ ఆమోదముద్ర పడిన వెంటనే ఈ పథకాలు అమలులోకి రానున్నాయి. షెడ్యూల్డ్ తెగలు, వెనుకబడిన తరగతులకు చెందినవారికి మారుతీ మోటార్స్ సంస్థ ద్వారా డ్రైవింగ్లో ప్రొఫెషనల్ శిక్షణను అందించనున్నారు. డ్రైవింగ్ లెసైన్స్ ఉండి, అనుభవమున్నవారికి మరింత మెరుగైన శిక్షణతోపాటు వృత్తిపరంగా ఆయా బాధ్యతల నిర్వహణలో భాగంగా ఇతరులతో ఏ విధంగా వ్యవహరించాలన్న దానిపై కూడా ప్రత్యేక అవగాహనను ఇచ్చేలా అధికారులు ప్రతిపాదనలను సిద్ధం చేశారు. ఇంగ్లిష్లో ప్రవేశమున్నవారిని గుర్తించి వారికి ప్రత్యేకమైన శిక్షణను అందించనున్నారు. ఎస్టీ కార్పొరేషన్ (ట్రైకార్), బీసీ కార్పొరేషన్ ద్వారా ఆయా శిక్షణా కార్యక్రమాలను అమలుచేస్తారు. వెబ్సైట్ ద్వారా ఔత్సాహికుల వివరాలు సేకరణ ఎస్టీ, బీసీ వర్గాలకు చెందిన ఔత్సాహిక యువకులు, నిరుద్యోగుల నుంచి (డ్రైవింగ్ లెసైన్స్, వృత్తి అనుభవమున్నవారు) వారి వివరాలు సమాచారాన్ని సేకరించి వారి ఆలోచనలు, అభిలాషలను విశ్లేషిస్తారు. సొంతంగా ట్యాక్సీలు, ఆటోలు నడుపుకోవాలని ఆలోచనతో ఉన్నవారికి ఆయా కార్పొరేషన్ల ద్వారా డ్రైవర్ కమ్ ఓనర్ పథకం కింద అందుకు అవసరమైన రుణాలు అందజేస్తారు. డ్రైవర్లుగా పనిచేయాలని అనుకుంటున్నవారి విద్యార్హతలు, ఇంగ్లిష్లో ప్రవేశాన్ని బట్టి ఆయా కంపెనీలు, సంస్థల అవసరాల మేరకు డ్రైవర్లుగా పంపిస్తారు. సరుకు రవాణాను ఇష్టపడేవారికి అందుకు అవసరమైన టిప్పర్లు, ఇతర వాహనాలను సమకూరుస్తారు. అద్దెపై ప్రైవేట్ ట్యాక్సీలు, ఆటోలు నడుపుకోవాలనేవారికి ఆ మేరకు అవకాశాలను కల్పిస్తారు. స్వయం ఉపాధి పథకాల లబ్ధిదారులకు ఆయా ప్రయోజనాలు అందాక వారు వాటిని ఏ విధంగా నిర్వహిస్తున్నారా లేదా అన్న దానిని స్వతంత్ర సంస్థ ద్వారా ఎస్టీ, బీసీ శాఖలు పర్యవేక్షించనున్నాయి. క్షేత్రస్థాయిలో ఎప్పటికప్పుడు లబ్ధిదారుల పనీతీరును బేరీజు వేసి, అధికారులకు నివేదికలను పంపించనున్నారు. -
యువతిపై యువకుడి దాడి
కరీంనగర్ క్రైం : నగరంలోని ఓ హాస్టల్ వద్ద యువతిపై యువకుడు దాడి చేయగా.. స్థానికులు అతడిని చితకబాదారు. నగరంలోని సెవెన్హిల్స్ వద్ద ఎస్టీ బాలిక హాస్టల్ ఉంది. శనివారం రాత్రి ఇద్దరు యువకులు అక్కడి రావడంతో హాస్టల్లో ఉంటున్న ముగ్గురు యువతులు వారిని కలిసేందుకొచ్చారు. ఓ యువకుడు, యువతి మధ్య వివాహానికి సంబంధించి మాటమాట పెరిగింది. కోపోద్రిక్తుడైన యువకుడు ఆ యువతిపై చేరుుచేసుకోవడంతో గమనించిన స్థానికులు అతన్ని పట్టుకుని ఠాణాకు తరలించారు. ఈ విషయమై టూటౌన్ పోలీసులను వివరణ కోరగా ఫిర్యాదు రాలేదని తెలిపారు. -
మరింత పదును...
మంగళవారం నుంచే కొత్త చట్టం అమల్లోకి.. సాగు నీటి సౌకర్యం, అటవీ హక్కులను తిరస్కరించినా ప్రాసిక్యూట్ చేసే అవకాశం ఏర్పాటుకానున్న ప్రత్యేక కోర్టులు చార్జిషీట్ ఫైల్ అయిన 2 నెలల్లో ట్రయల్ పూర్తి జిల్లాలో పెండింగ్ కేసుల సంఖ్య 139 సాక్షి ప్రతినిధి, నల్లగొండ : ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం-1989 మరింత పదునెక్కింది. అణగారిన వర్గాలకు చెందిన దళితులు, గిరిజనులకు సమాజంలో సముచిత రక్షణ కల్పించేందుకు ఉద్దేశించిన ఈ చట్టంలో తాజాగా చేసిన సవరణలు అమల్లోకి వచ్చాయి. మంగళవారం నుంచి ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధ క చట్టం-2015 అమల్లోకి రానుందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలియజేశాయి. ఈ సవరణల ప్రకారం సమాజంలోని దళితులు, గిరిజనుల పట్ల ఎలాంటి వివక్ష చూపినా చట్టప్రకారం ప్రాసిక్యూట్ చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా అటు సమాజంతోపాటు ఇటు ప్రభుత్వ వర్గాలు కూడా వారి ఆత్మగౌరవం దెబ్బతినకుండా అమలు చేయాల్సిన అవసరాన్ని ఈ చట్టం నొక్కి చెబుతోంది. ఈ చట్ట సవరణలను గత ఏడాది ఆగస్టు 4న లోక్సభలో, డిసెంబర్ 2న రాజ్యసభలో ఆమోదించిన విషయం తెలిసిందే. కొత్త సవరణ ప్రతిపాదనలు ఇవే... సవరించిన చట్టం ప్రకారం దళిత, గిరిజన వర్గాలకు ఎలాంటి అగౌరవం కలిగించినా కేసు నమోదు చేసి ప్రాసిక్యూట్ చేయవచ్చు. ఈ చట్టం అమల్లోకి వచ్చిన నాటి నుంచి ఎస్సీ, ఎస్టీలపై ఎలాంటి అత్యాచారాలు జరిపినా.. పకడ్బందీ విచారణ జరపనున్నారు. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన వ్యక్తుల జుత్తు లేదా గడ్డం అవమానకరంగా తొలగించినా, ఆ కోవలోనికి వచ్చే ఎలాంటి అగౌరవ ఘటనలకు పాల్పడినా.. ప్రాసిక్యూషన్కు అవకాశం కల్పిస్తోంది ఈ చట్టం. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన వ్యక్తులకు చెప్పుల దండలు వేయడం, మనుషులు లేదా జంతువుల మృతదేహాలను మోసేందుకు ఆయా వర్గాల వ్యక్తులు వస్తే నిరాకరించడం, సమాధులు తవ్వకుండా అడ్డుకోవడం, ఆర్థిక లేదా సామాజిక బహిష్కరణలకు గురిచేయడం, వారి చేత మరుగుదొడ్లు కడిగించడం, ఎస్సీ, ఎస్టీ మహిళలను సామాజిక దురాచారమైన దేవదాసీలుగా సమాజానికి అంకితం చేయడం వంటి వాటిని కూడా నేరాలుగానే పరిగణించాలని చట్టం చెబుతోంది. దీంతో పాటు వారిని కులం పేరుతో దూషించడం, మంత్రగాళ్లన్న నెపంతో దాడులు చేయడం, ఎన్నికల సందర్భంలో ఆయా వర్గాల వారిని నామినేషన్లు వేయకుండా అడ్డుకోవడం, ఎస్సీ, ఎస్టీ మహిళల ఒంటిపైనున్న ఆభరణాలు తొలగించడం, ఈ వర్గాలకు చెందిన వ్యక్తులను లేదా వ్యక్తిని ఇల్లు లేదా గ్రామం విడిచివెళ్లాలని ఒత్తిడి చేయడం, వారు పవిత్రంగా భావించే వస్తువులకు అగౌరవం కలిగించడం, మాటలతో నొప్పించడం వంటి చర్యలు కూడా నేరాల కిందకే వస్తాయి. అదే విధంగా సమాజంలో వారు సాఫీగా జీవించేందుకు కూడా ఈ చట్టం అవకాశం కల్పిస్తోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయా వర్గాలకు చెందిన సమూహాలు లేదా వ్యక్తులకు సాగునీటి సౌకర్యం కల్పించేందుకు తిరస్కరిస్తే, అటవీ హక్కులు కల్పించే విషయంలో కూడా అన్యాయం జరిగితే ప్రాసిక్యూషన్ చేయవచ్చని చట్టం చెపుతోంది. ప్రత్యేక కోర్టులు కూడా తాజా సవరణలతో అమల్లోకి వచ్చిన ఈ చట్టం ద్వారా ఎస్సీ, ఎస్టీ అత్యాచార కేసులను పరిష్కరించేందుకు ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే ఉన్న కోర్టులకు తోడు జిల్లా స్థాయిలో ఈ ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఈ ప్రత్యేక కోర్టుల్లో ఎస్సీ, ఎస్టీ అత్యాచార కేసులు తప్ప ఇతర కేసులు విచారించరు. దీంతో పాటు ఈ చట్టం కల్పిస్తోన్న మరో వెసులుబాటు ఏమిటంటే... ఫలానా కేసులో పోలీసులు చార్జిషీటు ఫైల్ చేసిన రెండు నెలల్లో ట్రయల్ కూడా పూర్తి చేయాల్సి ఉంటుంది. జిల్లాలో 139 పెండింగ్ కేసులు ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం ప్రకారం పరిష్కరించాల్సిన కేసులకు జిల్లాలో త్వరగతిన మోక్షం లభించడం లేదు. పోలీస్, రెవెన్యూ, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖల మధ్య సమన్వయం లోపించడంతోపాటు కేసుల పరిష్కారంలో జరుగుతున్న జాప్యమే ఇందుకు కారణం. వాస్తవానికి ఈ కేసుల పరిష్కారానికి జిల్లాలో ప్రత్యేక కోర్టు ఉన్నప్పటికీ.. ఆ కోర్టులో చాలా కాలంగా రెగ్యులర్ న్యాయమూర్తి లేకపోవడంతో కేసులన్నీ పెండింగ్లో పడిపోతున్నాయని ఎస్సీ, ఎస్టీ సంఘాల ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేసినప్పటికీ అందులో మోటారు వాహనాల చట్టం కింద వచ్చే కేసులు, భూవివాదాలు తదితర కేసుల అదనపు బాధ్యతలను అప్పగించడం వల్ల ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక కేసులు పెండింగ్లో పడిపోతున్నాయన్నది మరికొందరి వాదన. మొత్తంమీద జిల్లాలో నాలుగేళ్లుగా ఎస్సీ, ఎస్టీలు పెట్టిన 139 కేసులు విచారణ దశలో ఉన్నాయని పోలీసు లెక్కలు చెబుతున్నాయి. ప్రత్యేకంగా ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద 18 కేసులు పెండింగ్లో ఉన్నాయి. తాజా సవరణల చట్టం ప్రకారం ఈ కేసుల విచారణకు ప్రత్యేక డీఎస్పీని నియమించాలి. చిత్తశుద్ధి లోపించింది దళిత, గిరిజనులకు రక్షణ కల్పించే చట్టాలు ఇప్పటికే అనేకం వచ్చాయి. చట్టాలను అమలు చేయాల్సిన యంత్రాగంలో చిత్తశుద్ధి లోపించడంతో తగిన న్యాయం జరగడం లేదు. ఈ చట్టం అమలుకు కలెక్టర్, ఎస్పీ, సాంఘిక, గిరిజన సంక్షేమ శాఖలు సమన్వయంతో ముందుకెళ్లాలి. ఈ కేసుల్లో ఫిర్యాదు దారులకు కావాల్సిన రక్షణ, ఆర్థిక సహకారం అందడం లేదు. ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం దుర్వినియోగమవుతోందని ప్రచారం చేయడంపై ఉన్న శ్రద్ధ.. ఈ చట్టాన్ని అమలు చేయడంలో కనిపించకపోవడం దురదృష్టకరం. - రవినాయక్, ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం విజిలెన్స్, మానిటరింగ్ కమిటీ సభ్యుడు జిల్లాలో పెండింగ్లో ఉన్న ఎస్సీ, ఎస్టీ కేసులు (2012 నుంచి) దహనం 01 గాయపర్చినవి 11 హత్య 04 ఇతర కేసులు 86 అవమానపర్చడం 12 అత్యాచారం 07 ఎస్సీ, ఎస్టీ కింద 18 మొత్తం 139 -
ఎస్టీల్లో అనైక్యత కాదనలేని వాస్తవం
‘ట్రైబ్స్ ఇన్ కాంటెంపరరీ ఇండియా’ సదస్సులో ప్రొ.సరిత్ చౌదరి సాక్షి, హైదరాబాద్: గిరిజనుల అభ్యున్నతికి కొన్ని దశాబ్దాలుగా దేశంలో అమలుచేసిన విధానాల ద్వారా ఆర్థిక, విద్య, ఆరోగ్య రంగాల్లో కొంత మార్పు వచ్చినా వివిధ రాష్ట్రాల్లోని ఎస్టీల మధ్య అనైక్యత పెరగడం కాదనలేని వాస్తవమని ఇందిరాగాంధీ రాష్ట్రీయ మానవ సంగ్రహాలయ (భోపాల్) డెరైక్టర్ ప్రొ. సరిత్ చౌదరి వ్యాఖ్యానించారు. ఇప్పటివరకు చేపట్టిన పథకాల ద్వారా ఆదిమ గిరిజన తెగలు (పీవీటీజీలు) నివాసముంటున్న గ్రామాల సంఖ్య తగ్గాల్సి ఉండగా, అందుకు భిన్నంగా గతంలో 55 వేలు ఉన్న ఈ సంఖ్య 75 వేలకు పెరిగిందన్నారు. దేశంలోని అనేక ప్రాంతాల్లో ఆదివాసీలు, గిరిజనుల మధ్యే ఇంకా అంతరాలున్నాయని, ఒక తెగను మరో తెగ గుర్తించే పరిస్థితి లేదన్నారు. గురువారం రామాంతపూర్లోని ఆర్నాల్డ్ భవన్లో ఇన్స్టిట్యూట్ ఆఫ్ ద్రావిడియన్ కల్చర్, రిసెర్చ్ (సంస్కృతి) ఆధ్వర్యంలో ‘‘ట్రైబ్స్ ఇన్ కాంటెంపరరీ ఇండియా.. కాన్సెప్ట్స్ అండ్ కాంటెక్స్ట్’’ అనే అంశంపై మూడో జాతీయ సదస్సు ప్రారంభమైంది. ఈ సదస్సులో సరిత్ చౌదరి కీలకోపన్యాసం చేస్తూ ఒక రాష్ర్టంలో ఎస్టీలుగా గుర్తింపు పొందిన వారిని పొరుగునే ఉన్న మరో రాష్ట్రంలో ఎస్టీలుగా పరిగణించడం లేదన్నారు. అసోంలో మిషన్ తెగ వారు ఎస్టీలైతే అరుణాచల్ ప్రదేశ్లో కాదని, ద్వంద్వత్వమనేది దేశంలో ఇంకా కొనసాగుతోందన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సొసైటీ ఆఫ్ డివైన్ వర్డ్ (ఎస్వీడీ) కన్సల్టర్స్ జనరల్ (రోమ్) మజోలా మిడో ఘి మాట్లాడుతూ దేశంలో ఉండే ప్రజలంతా తమకు మిగతావారితో సమానంగా హక్కులు కలిగి ఉండాలని, గుర్తింపును పొందాలని, వివక్షకు గురికాకూడదని కోరుకుంటారన్నారు. ఎస్సీలకు అన్యాయం: కంచ ఐలయ్య గిరిజనుల పట్ల క్రైస్తవమిషనరీలకు నిజంగా సానుభూతి ఉంటే గిరిజన ప్రాంతాల్లో ఇంగ్లిష్ను బోధించాలని కంచ ఐలయ్య వ్యాఖ్యానించారు. దేశంలో దళితులు, మహిళలకు గౌరవమనేదే లేదన్నారు. ఎస్సీలకు అన్యాయం జరుగుతోందని, వివక్షకు గురవుతున్నారని చెబుతూ రీసెర్చ్ స్కాలర్ రోహిత్ ఆత్మహత్య ఉదంతాన్ని వివరించారు. ఈ సదస్సుకు సంస్కృతి డెరైక్టర్ డా. జి.లాజర్ అధ్యక్షత వహించగా.. సంస్కృతి చైర్పర్సన్ రెవరెండ్ ఫాదర్ ఆంథోని జోసెఫ్ సందేశమిచ్చారు. కార్యక్రమంలో డా. త్రినాథరావు, జీవన్కుమార్ (హ్యూమన్ రైట్స్ ఫోరమ్), థామస్ కావుమ్ కట్టియాల్ పాల్గొన్నారు. -
చెయ్యి తడపాల్సిందే
- టీడీపీ సర్కారులో ఏ పని కావాలన్నా డబ్బివ్వాల్సిందే - అవినీతి నిరోధక విభాగం నివేదిక స్పష్టీకరణ - లంచాలు ఇవ్వనిదే సామాన్య ప్రజానీకానికి పని జరగడం లేదు - రెవెన్యూ, మున్సిపల్, రిజిస్ట్రేషన్లు.. అన్ని శాఖల్లోనూ అవినీతి - ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమంలోనూ సమర్పించుకోవాల్సిందే... సాక్షి, హైదరాబాద్: ‘ఇందుగలదు.. అందులేదన్న సందేహంబు వలదు..’.. టీడీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో అవినీతి, అక్రమాలు, లంచాల దందా యధేచ్చగా కొనసాగుతోంది. ఒకవైపు ప్రభుత్వ పెద్దలు, ఇదే అదనుగా మరోవైపు అధికార యంత్రాంగం అడ్డగోలుగా వ్యవహరిస్తూ అందినకాడికి దోచుకుంటున్నారు. లంచాల వ్యవహారం సామాన్య ప్రజానీకాన్ని ఎలా పట్టిపీడిస్తోందో ఈ ఏడాది అవినీతి నిరోధక విభాగం (ఏసీబీ) నిర్వహించిన ఆకస్మిక తనిఖీలు స్పష్టం చేస్తున్నాయి. రెవెన్యూ, రిజిస్ట్రేషన్లు.. స్టాంపులు, మున్సిపల్, పంచాయతీరాజ్, హోం, గృహ నిర్మాణం, వాణిజ్యం.. తదితర అనేక శాఖల్లో అవినీతి రాజ్యమేలుతోంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమంలో సైతం అవినీతి, అక్రమాలు చోటు చేసుకుంటున్నట్లు ఏసీబీ ఆకస్మిక తనిఖీల్లో వెల్లడైంది. పేదల ఇళ్ల బిల్లుల మంజూరుకు, పాస్ బుక్కులు ఇవ్వడానికి, ఎన్కంబరెన్స్ సర్టిఫికెట్ జారీకి, భవన నిర్మాణ ప్లాన్ ఆమోదానికి.. ఇలా ఆయా శాఖల్లో పనులు కావాలంటే లంచాలు తప్పనిసరై పోయాయని ఏసీబీ ఆకస్మిక తనిఖీల నివేదిక పేర్కొంది. చివరకు విద్యుత్ కనెక్షన్ ఇవ్వాలన్నా ఎంతోకొంత సమర్పించుకోవాల్సిందేనని.. లంచాలు లేనిదే ఏ విభాగంలోనూ ఎలాంటి పనీ జరగడం లేదని ఇటీవల ఏసీబీ ముఖ్యమంత్రికి సమర్పించిన నివేదిక స్పష్టం చేసింది. నివేదికలోని ముఖ్యాంశాలు.. - రెవెన్యూ శాఖలో పట్టాదారు పాస్బుక్ జారీకి లంచం తీసుకుంటున్నారు. పహాని జారీకి, పహానీలో, రికార్డ్ ఆఫ్ రైట్స్లో, పట్టాదారు పాసుపుస్తకంలో పేర్లు మార్చాలంటే లంచం లేనిదే పని జరగడం లేదు. - గృహ నిర్మాణ శాఖలో ఇందిరా ఆవాస్ యోజన పథకం కింద ఇళ్ల మంజూరుకు, బిల్లుల వాయిదాల విడుదలకు, అలాగే ఇళ్ల డాక్యుమెంట్లు ఇవ్వడానికి డబ్బులు తీసుకుంటున్నారు. - రిజిస్ట్రేషన్లు, స్టాంపుల శాఖలో ఎన్కంబరెన్స్ సర్టిఫికెట్ (ఈసీ) జారీకి, డాక్యుమెంట్లు ఇవ్వడానికి లంచం తీసుకుంటున్నారు. భూ క్రయవిక్రయాల రిజిస్ట్రేషన్కు డబ్బులు ఇవ్వడం తప్పనిసరి ప్రక్రియగా మారింది. - మున్సిపల్ శాఖలో భవన నిర్మాణాల ప్లాన్ ఆమోదానికి, మంచినీటి కనెక్షన్ మంజూరు, తదితర పనులకు లంచం తీసుకుంటున్నారు. - పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల్లో ఇళ్ల స్థలాల పట్టాలు ఇవ్వడానికి, పట్టాదారు పాసుపుస్తకం, టైటిల్ డీడ్స్కు లంచం తీసుకుంటున్నారు. - హోంశాఖలో ఆధారాలతో సహా ఫిర్యాదును ఫైలు చేయడానికి, చార్జిషీటు నమోదుకు, ఎఫ్ఐఆర్ జారీ చేయడానికి, స్వాధీనం చేసుకున్న ఆభరణాలు, వస్తువులు తిరిగి ఇవ్వడానకి, నిందితులకు సహాయం చేయడానికి, కేసు నమోదు చేయకుండా ఉండేందుకు డబ్బులు తీసుకుంటున్నారు. - విద్యుత్ మీటర్లు, కనెక్షన్ల మంజూరుకు, ట్రాన్స్ఫార్మర్లు తదితరాల ఏర్పాటునకు లంచాలు ఇవ్వడం ఇంధన శాఖలో సర్వసాధారణమైపోయింది. - ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ శాఖల్లోనూ అవినీతి రాజ్యమేలుతోంది. వసతి గృహాల్లో ఉండే విద్యార్థుల సంఖ్యను పెంచి చూపిస్తూ నిధులు దండుకుంటున్నారు. సరుకుల కొనుగోలు అనధికారంగా చేస్తున్నారు. పేద పిల్లలకు చేరాల్సిన నిధులను చేతివాటంతో కాజేస్తున్నారు. - వాణిజ్య పన్నుల శాఖలో చెక్పోస్టుల వద్ద ప్రైవేట్ వ్యక్తులను ఏర్పాటు చేసి వారిద్వారా డ్రైవర్లనుంచి మామూళ్లు వసూలు చేస్తున్నారు. వ్యక్తిగత నగదు రిజిస్టర్, మూమెంట్ రిజిస్టర్ను సక్రమంగా నిర్వహించడం లేదు. దీంతో పన్నుల ఎగవేతకు ఆస్కారం కల్పిస్తున్నారు. ఈ ఏడాది జనవరి నుంచి గత నెల 25వ తేదీ వరకు ఏసీబీ నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో వెల్లడైన అవినీతి, అక్రమాల కేసుల్లో ప్రధానమైన కొన్ని కేసుల వివరాలు.. చెక్పోస్టులు/ప్రభుత్వ కార్యాలయాల్లో ఆకస్మిక తనిఖీలు.. ఆఫీసులో/ అధికారి వద్ద పట్టుబడిన నగదు (రూ.లలో) 1. కె. శివశంకరరావు, ప్రాజెక్టు డెరైక్టర్, ఏలూరు, పశ్చిమగోదావరి 20,00,000 2. ఆర్.టీ.ఓ గాజువాక, విశాఖపట్నం జిల్లా 4,13,149 3. జి. సతీష్, ఎఫ్ఆర్ఓ -ఎం. నాగేశ్వరరావు, అటవీ సెక్షన్ ఆఫీసర్, ఎల్,ఎన్.డి. పేట, పశ్చిమగోదావరి జిల్లా 2,39,000 4. ఆర్.సుబ్బారాయుడు, జాయింట్ సబ్ రిజిస్ట్రార్-1, జి. వెంకటేశ్వర్లు, జాయింట్ సబ్ రిజిస్ట్రార్-2, గూడూరు, నెల్లూరు 1,92,000 5. సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్-పుల్లంపేట, కడప జిల్లా 1,90,815 6. శ్రీరామమూర్తి, సబ్ రిజిస్ట్రార్, ఉదయగిరి, నెల్లూరు జిల్లా 1,82,100 7. కె.నాగేశ్వరరావు, సాంఘిక సంక్షేమ హాస్టల్ అధికారి, విశాఖపట్నం 1,08,978 8. లాల లజపతిరావు, జిల్లా బీసీ వెల్ఫేర్ ఆఫీసర్, ఏలూరు 1,08,400 -
సమతకు సరైన బాట ‘కోటా’
రైల్వేలో ఎస్సీ, ఎస్టీలు కీలక స్థానాల్లో ఉన్న విభాగాలు, జోన్ల పనితీరులో మెరుగుదల ఉన్నట్టు 2005 నాటి అధ్యయనం నిర్ధారించింది. ఎస్సీ, ఎస్టీల నుంచి వచ్చిన వారు తమ శక్తి సామర్థ్యాలను చాటడానికి కృషి చేయడం వల్లే మంచి ప్రగతిని, ఫలితాలను సాధించారని తేలింది. ప్రవేశ పరీక్షల్లో క్వాలిఫై కాలేక కోట్లు గుమ్మరించి సీట్లు కొనుక్కున్న వాళ్లకు ప్రతిభ ఉన్నట్టా? లేనట్టా? కోటాలతో ఎస్సీ, ఎస్టీ, బీసీలు విద్యాలయాల్లో ప్రవేశిస్తూ ప్రతిభను దెబ్బ తీస్తున్నారని వాదించే వాళ్ళకు కోట్లు పోసి సీట్లు కొనుక్కునే వారి ‘ప్రతిభ’ కనిపించదేం? నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా జోరున కురుస్తున్న వాన... అయి నా గ్యాంగ్మన్ చంద్రయ్య ఆగలేకపోయాడు. క్షణం తటపటాయిస్తే పది హేను వందల ప్రాణాలకు ముప్పు. వరంగల్ జిల్లా స్టేషన్ఘన్పూర్ రైల్వే ట్రాక్ కొట్టుకుపోయి, పట్టాలు గాలిలో వేళ్ళాడుతున్నాయి. రాబోయే గోదా వరి ఎక్స్ప్రెస్ని నిలిపేయకపోతే... ఏమవుతుందో ఊహించలేకపోయాడు. ఆ వానలో, వరదలో తానే పోతే తన కుటుంబం ఏమౌతుందని క్షణమైనా ఆలోచించలేదు. గోదావరి ఎక్స్ప్రెస్ను ఆపి, వందల ప్రాణాలు కాపాడాడు. కానీ... ఆ పట్టాలపైనే చంద్రయ్య ప్రాణాలు వదిలాడు. 2005లో పదిహేను వందల మందికి ప్రాణభిక్ష పెట్టిన గ్యాంగ్మన్ చంద్రయ్య దళితుడు. అంకిత భావంతో రైల్వేలో పనిచేస్తున్న లక్షలాది మంది అణగారిన వర్గాల ప్రతినిధి. ఆరేళ్ల క్రితం ఢిల్లీ విశ్వవిద్యాలయం అర్థశాస్త్ర విభాగం ప్రొఫెసర్ అశ్వని దేశ్పాండే, అమెరికాకు చెందిన మిచిగాన్ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ థామస్ వెస్సికాఫ్లు ‘రైల్వే పనితీరుపై రిజర్వేషన్ల ప్రభావం’ అనే అంశంపై అధ్యయనం చేశారు. రైల్వేలోని అన్ని డివిజన్లలోని వివిధ విభాగాలలో పని చేస్తున్న ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల పనితీరుపై, రైల్వేల పురోగతిపై... రిజర్వేషన్ల వ్యతిరే కుల వాదనలను కూడా పరిగణనలోకి తీసుకుంటూ వారీ అధ్యయ నాన్ని సాగించారు. ఆ అధ్యయనం 1952- 2002 మధ్య కాలానికి చెందినది. రిజర్వేషన్లు దేశాభివృద్ధిని, ప్రతిభను దిగజారుస్తున్నాయనే విమర్శలు చాలా బలంగా వినిపిస్తున్న నేపథ్యంలో జరిగినది. ఎస్సీ, ఎస్టీలు కీలక స్థానాల్లో ఉంటే... రైల్వే ఉద్యోగులను వారు ఏ, బీ, సీ, డీ అనే నాలుగు కేటగిరీలుగా విభజిం చారు. ఉన్నతస్థాయి అధికారులది ఏ కేటగిరీ. అందులో ఎస్సీలు 12.12%, ఎస్టీలు 7.40%, ఇతరులు 80.42% ఉన్నారు. బీ కేటగిరీలో ఎస్సీలు 12.4%, ఎస్టీలు 7.21%, ఇతరులు 75.65% ఉండగా, సీ కేటగిరీలో ఎస్సీలు 13.77%, ఎస్టీలు 6.21%, ఇతరులు 80.02% ఉన్నారు. అట్టడుగు డీ కేటగిరీలో ఎస్సీలు 42.39%, ఎస్టీలు 13.44%, ఇతరులు 44.17% ఉన్నట్టు 2012 నాటి సమాచా రం. దాదాపు 10,40,000 రైల్వే ఉద్యోగులలో ఎస్సీలు 21.35%, ఎస్టీలు 8.58%, ఇతరులు 70.30%. నియామకాల్లోనే తప్ప ప్రమోషన్లలో రిజర్వేషన్లు లేవు. కాబట్టి ఈ అధ్యయనం ఏ, బీ కేటగిరీలలోని ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల పని తీరుపైనే దృష్టిని కేంద్రీకరించింది. ఎంతో వివక్షను ఎదుర్కొంటున్నప్పటికీ ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులు ఈ స్థాయికి ఎలా చేరుకోగలిగారు? ఆ తర్వాత వారు విధి నిర్వహణలో ఎటువంటి ప్రతిభను కనబరిచారు? అనే అంశంపై వారు దృష్టిని సారించారు. ‘‘వరల్డ్ డెవలప్మెంట్ జర్నల్’’ ఈ అధ్యయన నివేది కను ప్రచురించింది. ఏఏ జోన్లలో, ఏఏ విభాగాల్లో ఎస్సీ, ఎస్టీలు నిర్ణయాత్మక స్థానాల్లో ఉన్నారో ఆ జోన్ల పనితీరును ప్రత్యేకించి అధ్యయనం చేశారు. ఎస్సీ, ఎస్టీలు కీలక స్థానాల్లో ఉన్న విభాగాలు, జోన్ల పనితీరుపై ఎలాంటి వ్యతిరేక ప్రభావం కనబడకపోగా, మెరుగుదల ఉన్నట్టు వాళ్ళు తేల్చారు. కింది వర్గాలైన ఎస్సీ, ఎస్టీల నుంచి ఎదిగివచ్చిన వారు తమ శక్తిసామ ర్థ్యాలను చాటడానికి కృషి చేయడం వల్లే వారు, మంచి ప్రగతిని, ఫలితాలను సాధించారని ఆ అధ్యయనం తేల్చింది. ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులను, అధికారు లను ఆధిపత్య కులాల ఉన్నతాధికారులు కొందరు వేధింపులకు గురిచే స్తున్నా, వాటిని తట్టుకొని మరీ వారు మంచి ప్రతిభను కనబరచడం వారి కఠోరశ్రమకు, పనిపట్ల శ్రద్ధకు, విధినిర్వహణలోని నిబద్ధతకు నిదర్శనమని అఖిల భారత రైల్వే ఎస్సీ, ఎస్టీ ఎంప్లాయీస్ అసోసియేషన్ నాయకులు బి.ఎల్.భైరవ అన్న మాటలను ఈ అధ్యయనంలో పొందుపరచడం విశేషం. రిజర్వేషన్లు రెల్వేల ప్రగతికి తోడ్పడ్డాయే తప్ప, ఎలాంటి నష్టం కలిగించలే దని రుజువైంది. విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు సమాజానికి ఎంతో మేలు చేశాయనడానికి ఇలాంటి ఉదాహరణలు కోకొల్లలు. పేదలకు వైద్యం చేస్తున్నది ఎవరు? అలాగే ప్రభుత్వ వైద్య రంగాన్ని పరిశీలిద్దాం. పాలకుల ఘోర నిర్లక్ష్యానికి తోడు నిర్వహణలో ఎన్ని లోపాలు, పరిమితులు ఉన్నా... నేటికీ నిరుపేదల ప్రాణాలను నిలుపుతున్నవి ప్రభుత్వాసుపత్రులేనంటే అతిశయోక్తి కాదు. ప్రభుత్వ వైద్యశాలలే లేకుంటే పేదల ప్రాణాలు ఏమౌతాయనే ఆలోచనే భయం కలిగిస్తోంది. ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రులకు వెళ్తే ఇల్లు ఎలా గుల్ల వుతుందో అందరికీ తెలుసు. ఇటీవల ఒక చిన్నపిల్లాడి కిడ్నీ మార్పిడి కోసం ఒక ప్రైవేటు ఆసుపత్రి రూ.30 లక్షల అంచనా ఇవ్వగా, ప్రభుత్వ అధీనంలోని మరో ఆసుపత్రి వైద్యుడు రూ.10 లక్షలు మాత్రమే ఖర్చవుతుందన్నారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో వైద్యం పేరిట ఎంత విచ్చలవిడిగా దోపిడీ సాగుతోం దో అర్థం చేసుకోవచ్చు. తెలంగాణనే ఉదాహరణగా తీసుకుంటే... ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న వైద్యుల్లో 90% ఎస్సీ, ఎస్టీ, బీసీలేనన్నది వెలుగు లోకి రాని సత్యం. ముఖ్యంగా గ్రామీణ, చిన్న, మధ్యతరహా పట్టణాల్లో, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఎస్సీ, ఎస్టీలే పనిచేస్తున్నారు. ఆధిపత్య కులాల వాళ్ళు తప్పనిసరై గ్రామాలకో, చిన్న పట్టణాలకో వెళ్ళాల్సివస్తే.. ఏడాదో, ఆరునెలలో పనిచేసి, ఏదో వంకతో నగరాలకు చేరుకుంటున్నారు. కార్పొరేట్ ఆసుపత్రుల్లో చేరడమో, తామే ప్రైవేట్ నర్సింగ్హోంలు స్థాపించుకోవడమో చేస్తున్నారు. మెడికల్ ఎంట్రన్స్లో పీజీ సీట్లు రాకపోయినా కోట్లు గుమ్మరించి కొనుక్కొని, అటునుంచి అటే కార్పొరేట్ ఆసుపత్రులకో, విదేశాలకు ఎగిరిపో తారు. గత పదేళ్లలో ఇలా విదేశాలకు పోయిన వాళ్ళు దాదాపు 2,500 మంది అని అంచనా. ఇందులో అత్యధిక శాతం ఓపెన్ కేటగిరీ వారే. ప్రవేశ పరీక్షలో క్వాలిఫై కాలేక కోట్లు గుమ్మరించి సీట్లు కొనుక్కున్న వాళ్లకు ప్రతిభ ఉన్నట్టా? లేనట్టా? తక్కువ మార్కులతో ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు విద్యాలయాల్లో ప్రవేశిస్తూ ప్రతిభను దెబ్బతీస్తున్నారని వాదించే వాళ్ళకు కోట్లు పోసి మేనేజ్ మెంట్ కోటాల్లో, ప్రైవేట్ కళాశాలల్లో సీట్లు కొనుక్కునే వారి ‘ప్రతిభ’ కనిపిం చడం లేదా? లేక వారా విషయాన్ని కావాలనే విస్మరిస్తున్నారా? తెలంగాణలో ప్రస్తుతం 6,400 మంది వైద్యులున్నారు. ఇందులో బోధనారంగంలో 2,100 మంది, వైద్య ఆరోగ్యసేవలు అంటే, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, డిస్పెన్స రీలు, చిన్నస్థాయి ఆసుపత్రుల్లో పనిచేసే వాళ్ళు 2,600 మంది, ఏరియా, జిల్లా ఇతర ప్రధాన వైద్యశాలల్లో పనిచేస్తున్న వైద్యులు 1,700 మంది ఉన్నట్టు తెలుస్తోంది. బోధనలో ఎక్కువగా ఓపెన్ కేటగిరీ వైద్యులు, గ్రామ, పట్టణ, జ్లిలా స్థాయి ప్రభుత్వ వైద్య శాలల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలే అధికంగా ఉన్నారు. వరంగల్ జిల్లా నర్సంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో 9 మంది డాక్టర్లుండగా అందులో నలుగురు ఎస్టీలు, ఒకరు ఎస్సీ, ఒకరు బీసీ, ముగ్గురు ఓపెన్ కేట గిరీ వైద్యులున్నట్టు తెలుస్తున్నది. ఓపెన్ కేటగిరీలోని ముగ్గురిలో ఇద్దరు కాంట్రాక్టు ప్రాతిపదికపై పనిచేస్తున్నారు. మహబూబాబాద్ ప్రభుత్వాసుప త్రిలో మొత్తం 17 మంది వైద్యులుంటే ఐదుగురు ఎస్టీలు, ముగ్గురు ఎస్సీలు, నలుగురు బీసీలు, ఐదుగురు ఓపెన్ కేటగిరీ వారు. సూర్యాపేట పట్టణంలోని ప్రభుత్వాసుపత్రిలో 12 మంది డాక్టర్లుండగా ఆరుగురు బీసీలు, ఇద్దరు ఎస్సీలు, ఇద్దరు ఎస్టీలు, ఇద్దరు ఓపెన్ కేటగిరీకి చెందిన వాళ్ళు ఉన్నారు. దీన్ని బట్టి ఎస్సీ, ఎస్టీ, బీసీ వైద్యులే అత్యధికంగా ప్రభుత్వాసుపత్రుల్లో పనిచేస్తూ, ప్రజారోగ్య వ్యవస్థను కాపాడుతున్నారనేది స్పష్టమే. ఎస్సీ, ఎస్టీ, బీసీలందరి రిజర్వేషన్లు 50% మించిలేవు. మిగతా 50% సీట్లు ఓపెన్ కేటగిరీ లోనే ఉన్నాయి. వాటిలో అత్యధికంగా ఆధిపత్య కులాలకే దక్కుతున్నాయి. కానీ వారిలో ప్రభుత్వ వైద్య, ఆరోగ్య వ్యవస్థల్లో పనిచేస్తున్న వారు స్వల్పం. ప్రభుత్వ సహాయంతో వైద్య విద్యనభ్యసించే వారు ఎవరైనాగానీ ప్రభుత్వా సుపత్రుల్లో పనిచేయకపోతే... పేదలకు ప్రాణ ప్రదమైన ప్రజారోగ్య వ్యవస్థ పూర్తిగా పతనమవుతుంది. అదే జరిగితే పేదలు, బడుగు బలహీన వర్గాల సంక్షేమానికే కట్టుబడ్డామనే ప్రభుత్వాల ప్రాథమిక లక్ష్యం దెబ్బతినిపోదా? కోటాల రద్దు వాదన అర్థరహితం వేలయేళ్ళుగా అక్షరానికి దూరం చేసి, తీవ్ర వివక్షకు గురిచేసిన ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు మిగతా వర్గాలతో పోటీపడటం సహజంగానే సాధ్యం కాదు. అందుకే వీరికి ప్రత్యేక సౌకర్యాలు, అవకాశాలు కల్పించాలని రాజ్యాంగ కర్తలు భావించారు. అంతేకాదు, కులం, జాతి, తెగ, మతం భేదాలు తీవ్రం గా ఉన్న మన దేశంలో ప్రజాస్వామ్యం బతికి బట్టకట్టాలంటే అన్ని వర్గాలకు, కులాలకు తగిన ప్రాతినిధ్యం ఉండాలి. ప్రాతినిథ్య ప్రజాస్వామ్యవ్యవస్థలో పాలనలో, విద్య, ఉద్యోగ అవకాశాలలో నిజమైన భాగస్వామ్యమే ప్రాథమి కమైన అంశం. కానీ ఈనాటికీ విద్య, ఉద్యోగ, రాజకీయరంగాల్లో ఆధిపత్యం అగ్రకులాలదే. ప్రధాన కులాల జనాభా నిష్పత్తిని, వారి ఉద్యోగ ప్రాతినిధ్యా న్ని పోల్చిచూస్తే అది తెలుస్తుంది. జాతీయస్థాయిలో క్లాస్ వన్ కేటగిరీ ఉద్యో గాల్లో నేటికీ ఆధిపత్య కులాలదే అగ్రస్థానమనేది నిస్సందేహం. బ్రాహ్మ ణులు, రాజ్పుత్లు, కాయస్తులు, బనియాలు జనాభాలో 11.3% కాగా, క్లాస్ వన్ ఉద్యోగాలలో 70% కైవసం చేసుకుంటున్నారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలు 68.05% ఉన్నా 20%కే ఆ ఉద్యోగావకాశాలు వచ్చాయి. ఇక ముస్లింల జనా భా 11% కాగా 3.2% మాత్రమే ఉద్యోగాల్లో ఉన్నారు. రిజర్వేషన్లు రద్దు చేయాలనే వాదనకు అర్థంలేదని స్పష్టమౌతూనే ఉంది. రిజర్వేషన్ల పట్ల గుడ్డి వ్యతిరేకతను ప్రదర్శిస్తున్న వాళ్ళు ఈ అంశాలను గమనిస్తే రాజ్యాంగ నిర్మా తలు ఆకాంక్షించినట్టుగా ప్రజాస్వామ్య వ్యవస్థ పటిష్టం అవుతుంది. (వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు) మొబైల్: 97055 66213 - మల్లెపల్లి లక్ష్మయ్య -
విద్యార్థిని అదృశ్యం..
ఆదోని: కర్నూలు జిల్లా ఆదోని మండల కేంద్రంలోని సెయింట్ ఆంథోని స్కూల్లో ఆరోతరగతి చదువుతున్న సున్మిత అనే బాలిక కనిపించకుండా పోయింది. శనివారం రాత్రి 9 గంటల సమయంలో స్కూల్ హాస్టల్ నుంచి బయటకు వెళ్లిన సున్మిత తిరిగి రాలేదు. ఆదివారం పాప ఆచూకీ తెలియకపోవడంతో స్కూల్ యాజమాన్యం తల్లిదండ్రులకు సమాచారం అందించారు. తల్లిదండ్రులు, స్కూల్ యాజమాన్యం సంయుక్తంగా స్థానిక పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు బాలిక ఆచూకీ కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. కాగా, శనివారం రాత్రి బాలిక హాస్టల్ వెనుక గేటు నుంచి వెళ్లిపోయిందని తోటి స్నేహితులు పోలీసులకు సమాచారం అందించారు. ఎవరైనా కిడ్నాప్ చేశారా? లేక బాలిక ఎవరికీ సమాచారం ఇవ్వకుండా వెళ్లిపోయిందా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. -
బోయలను ఎస్టీల్లో చేరుస్తాం : వైఎస్ జగన్
-
వసతి గృహాల నిర్వహణలో నిర్లక్ష్యం
కర్నూలు(అర్బన్): సంక్షేమ వసతి గృహాల నిర్వహణలో నిర్లక్ష్యంపై ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో గురువారం విద్యార్థులు ఆందోళన చేపట్టారు. సంక్షేమ భవన్ వద్ద భారీ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భం గా ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి జి చంద్రశేఖర్, ఆర్గనైజింగ్ కార్యదర్శి జి రంగన్న మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ వసతి గృహాల్లో చాలా వరకు కనీస వసతులు కూడా లేవన్నారు. డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడం, కిటికీలకు తలుపులు లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందు లు పడుతున్నారన్నారు. హెచ్డబ్ల్యూఓలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. 66 వసతి గృహాల్లో వంట మనుషులు కూడా లేకపోవడంతో విద్యార్థులే వంట చేసుకోవాల్సి వస్తోందన్నారు. ఖాళీగా ఉన్న హెచ్డబ్ల్యూఓ, వర్కర్ల పోస్టులను వెంటనే భర్తీ చేయాలన్నారు. అన్ని ప్రభుత్వ వసతి గృహాలకు సొంత భవనాలు నిర్మించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నాయకులు సోమన్న, మహేంద్ర, నాగరాజు, సంపత్, హనుమంతు, విద్యార్థులు పాల్గొన్నారు. -
10 వేల ర్యాంకు వరకు రీయింబర్స్మెంట్ సవరణ
* ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం * ఎస్సీ, ఎస్టీలకు ర్యాంకుతో సంబంధం లేకుండా పూర్తి ఫీజు * 5వేల ర్యాంకు వరకే పరిమితం చేస్తూ జూన్ 30న జారీ చేసిన మెమో రద్దు * పాత విధానాన్నే కొనసాగించాలని సీఎంను కోరిన మంత్రులు, ఎమ్మెల్యేలు * పథకాన్ని కుదిస్తే విపక్షాలు వ్యతిరేక ప్రచారం చేస్తాయని వెల్లడి * అంగీకరించిన సీఎం .. సవరణ ఉత్తర్వులు జారీ చేయాలని ఆదేశం సాక్షి, హైదరాబాద్: ఈ ఏడాది ఇంజనీరింగ్ కాలేజీల్లో కన్వీనర్ కోటాలో చేరే విద్యార్థుల్లో 10 వేల ర్యాంకు వరకు వచ్చిన వారికి పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ వర్తించనుంది. ఎస్సీ, ఎస్టీలకు ర్యాంకుతో సంబంధం లేకుండా మొత్తం ఫీజులను ప్రభుత్వమే భరించనుంది. ఈ మేరకు ప్రభుత్వం తాజాగా సవరణ ఉత్తర్వులు (మెమో నంబర్: 568-3/ఎస్సీడీ. ఎడ్యుకేషన్/2014-6)ను జారీ చేసింది. ఫీజు రీయింబర్స్మెంట్ను 5 వేల ర్యాంకు వచ్చిన విద్యార్థుల వరకే పరిమితం చేస్తూ జూన్ 30న ఎస్సీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి మెమో జారీ చేశారు. దీనిపై ‘సాక్షి’ ఇటీవల కథనం ప్రచురించిన సంగతి తెలిసిందే. ఫీజుల పథకాన్ని కుదించడంపై వివిధ రాజకీయ పార్టీలు, బీసీ సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. దీంతో ఈ అంశాన్ని కొందరు మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఇతర నాయకులు సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లారు. నిర్ణయాన్ని మార్చాలని కోరారు. గతంలో మాదిరి 10 వేల ర్యాంకు వరకు పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ కొనసాగించినా రూ.200 కోట్లు మాత్రమే అదనపు భారం పడుతుందని, అందువల్ల పాతవిధానాన్నే కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు. 5 వేల ర్యాంకు వరకే పరిమితం చేస్తే బీసీ, ఈబీసీ, మైనారిటీ, వికలాంగ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ ఫలాలు అందడం లేదని ప్రతిపక్షాలు ప్రచారం చేసే అవకాశాలున్నాయని కేసీఆర్కు వివరించినట్టు తెలిసింది. దీంతో 10 వేల ర్యాంకు వరకు వచ్చిన విద్యార్థులకు కూడా పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చేలా సవరణ ఉత్తర్వులు జారీ చేయాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. మంగళవారం రాత్రి ఉత్తర్వులు వెలువడ్డాయి. స్థానిక తెలంగాణ విద్యార్థులకే రాష్ట్రపతి ఉత్తర్వులకు లోబడి 371(డి) ప్రకారం తెలంగాణకు చెందిన స్థానిక విద్యార్థులకే పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్లు చెల్లించనున్నట్లు ఉత్తర్వుల్లో ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రస్తుతం క్వాలిఫై అయిన కోర్సుకు ముందు విద్యార్థులు గత ఏడేళ్ల విద్యాభ్యాసానికి సంబంధించిన రికార్డులను సమర్పించాలని, అప్పుడే స్కాలర్షిప్లకు అర్హులవుతారని పేర్కొంది. స్కాలర్షిప్లకు అర్హులైన విద్యార్థుల అలాట్మెంట్ లెటర్లపై ఎంసెట్ కన్వీనర్ ఎండార్స్మెంట్ ఇవ్వాలని తెలిపింది. సీట్ల కేటాయింపు సందర్భంగా ఈ నిబంధనను పాటించాలని ఎంసెట్ కన్వీనర్ను ఆదేశించింది. ఫీజు రీయింబర్స్మెంట్ వర్తింపు ఇలా... - ఎస్సీ, ఎస్టీ విద్యార్థులందరికీ ర్యాంకుతో సంబం ధం లేకుండా పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్. - కార్పొరేట్ కాలేజీ స్కీమ్లో భాగంగా ప్రభుత్వం స్పాన్సర్ చేసిన విద్యార్థులతోపాటు ప్రభుత్వ, రెసిడెన్షియల్ కాలేజీల్లో చదువుకున్న విద్యార్థులందరూ పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ పొందేందుకు అర్హులు. - ఎస్సీ, ఎస్టీలు, 10 వేల ర్యాంకు వరకు వచ్చిన విద్యార్థులు కాకుండా మిగతా విద్యార్థులకు.. ఆయా కాలేజీల్లో వసూలు చేసే ఫీజుతో నిమిత్తం లేకుండా గరిష్టంగా రూ.35 వేల ఫీజు లేదా కాలేజీ ఫీజు (ఏది తక్కువ అయితే అది) రీయింబర్స్మెంట్ కింద ప్రభుత్వం చెల్లిస్తుంది. - ఈసెట్ ద్వారా ఇంజనీరింగ్ సెకండియర్ అడ్మిషన్లు పొందే వారిలో వెయ్యిమంది విద్యార్థులకు పూర్తిగా ఫీజు రీయింబర్స్ చేస్తారు. -
దయనీయం.. పల్లె భారతం
-
దయనీయం.. పల్లె భారతం
మూడింట ఒకవంతు గ్రామీణ కుటుంబాలకు సాగుభూమి లేదు సగానికి పైగా కుటుంబాలకు కూలిపనే జీవనాధారం ♦ మూడింట ఒక వంతు నిరక్షరాస్యులే ♦ 75% కుటుంబాల్లోని అత్యధిక సంపాదన పరుడి ఆదాయం ఐదువేలే ♦ 2011 జనగణనలో వెల్లడైన వాస్తవాలు ♦ ఈ వివరాలను ప్రభుత్వ పథకాల అమలుకు ఉపయోగిస్తామన్న ప్రభుత్వం ♦ కులగణన వివరాలను వెల్లడించని వైనం న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం శుక్రవారం విడుదల చేసిన ‘2011 సామాజిక, ఆర్థిక , కుల జనగణన(ఎస్ఈసీసీ)’ వివరాలు గ్రామీణ భారత దయనీయ ముఖచిత్రాన్ని కళ్లకు గట్టాయి. గ్రామాల్లోని ప్రతీ మూడు కుటుంబాల్లో ఒకటి కూలి పనిని జీవనోపాధిగా చేసుకున్న సాగుభూమి లేని నిరుపేద కుటుంబమేనని ఎస్ఈసీసీలో తేలింది. 23.52% గ్రామీణ కుటుంబాల్లో చదువుకున్న పెద్దలెవరూ(25 ఏళ్లు పైబడినవారు) లేరని వెల్లడైంది. దేశవ్యాప్తంగా 640 జిల్లాల్లో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ నిర్వహించిన జనగణన-2011 వివరాలను శుక్రవారం ఆ శాఖ మంత్రి చౌధరి బీరేంద్ర సింగ్తో కలిసి కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ విడుదల చేశారు. ఈ సెన్సస్లో వివరాల నమోదుకు పేపర్ను ఉపయోగించకపోవడం విశేషం. చేతిలో ఇమిడే 6.4 లక్షల ఎలక్ట్రానిక్ యంత్రాల సాయంతో పౌరుల వివరాలను నమోదు చేశారు. 1932 తరువాత కులాల వారీగా వివరాలను నమోదు చేసిన సెన్సస్ ఇదేనని జైట్లీ పేర్కొన్నారు. అయితే, ఈ సెన్సస్లో సామాజిక, ఆర్థికాంశాలకే ప్రాధాన్యత ఇచ్చామన్నారు. కేంద్ర, రాష్ట్ర స్థాయిల్లో విధాన రూపకర్తలకు ఈ నివేదిక అత్యంత విలువైనదన్నారు. ‘ఈ నివేదికలో ప్రాంతం, వర్గం, కులం, ఆర్థిక స్థితి.. మొదలైన విభాగాల వారీగా గణాంకాలున్నాయి. ఏ ప్రాంతం, ఏ సామాజిక వర్గం ప్రజలు ఆర్థికంగా, జీవన ప్రమాణాల పరంగా ఉన్నత స్థాయికి వెళ్లారనే వివరాలున్నాయి. వీటి ద్వారా భవిష్యత్ ప్రణాళిక లక్ష్యాలను నిర్ధారించుకోవచ్చు’ అని జైట్లీ వివరించారు. వీటి ద్వారా గ్రామ పంచాయతీని యూనిట్గా తీసుకుని పేదరిక నిర్మూలనకు శాస్త్రీయంగా ప్రణాళికలు సిద్ధం చేసుకోవచ్చని బీరేంద్ర సింగ్ పేర్కొన్నారు. ప్రభుత్వ పథకాల వాస్తవ లబ్ధిదారుల ఎంపికకు ఇవి ఉపయోగపడ్తాయన్నారు. ఈ నివేదిక పేరు(ఎసీఈసీసీ)లో కుల గణన అని ఉన్నప్పటికీ.. ఆ గణాంకాలను వెల్లడించడం లేదన్నారు. ఎస్ఈసీసీ గణాంకాలు అందరికీ ఇళ్లు, విద్య, నైపుణ్యాభివృద్ధి, ఉపాధి హామీ తదితర పథకాల్లో ఉపయోగపడ్తాయన్నారు. పేదరికాన్ని నిర్ధారించే ‘బీపీఎల్’ విధానం ఆధారంగా కాకుండా ఈ గణాంకాల ఆధారంగానే పథకాల అమలు ఉంటుందన్నారు. 30 శాతం గ్రామీణ కుటుంబాలు ఎస్సీ, ఎస్టీలే గ్రామీణ కుటుంబాల్లో 29.43% షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలకు చెందినవేనని తాజా ఎస్ఈసీసీ గణాంకాల్లో తేలింది. రాష్ట్రాల వారీగా చూస్తే ఎస్సీ జనాభా పంజాబ్లో అత్యధికంగా(36.74%) ఉండగా, తదుపరి స్థానాల్లో పశ్చిమబెంగాల్(28.45%), తమిళనాడు(25.55%) ఉన్నాయి. ఎస్టీల జనాభా మిజోరంలో అత్యధికంగా(98.79%) ఉండగా, లక్షద్వీప్(96.59%), నాగాలాండ్(93.91%) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఎస్సీ, ఎస్టీల సగటు దేశవ్యాప్తంగా 18.46%, 10.97%. నిరక్షరాస్యతలో 4వ స్థానంలో తెలంగాణ మూడింట ఒక వంతు పల్లె దేశీయులు నిరక్షరాస్యలు. వారిలో అక్షరాస్యత శాతం 64%. వీరు అధికంగా ఉన్న రాష్ట్రాల్లో రాజస్తాన్(47.58%), మధ్యప్రదేశ్(44.19%) తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. తెలంగాణ 40.42% పల్లె నిరక్షరాస్యులతో 4వ స్థానంలో ఉంది. కేరళ 11.38% నిరక్షరాస్యులతో ఆఖర్న ఉంది. ఎస్ఈసీసీ - 2011 ముఖ్యాంశాలు.. ♦ దేశంలో మొత్త 24.39 కోట్ల కుటుంబాలున్నాయి. పల్లెల్లోని కుటుంబాలు 17.91 కోట్లు. ఈ పల్లె కుటుంబాల్లో 10.69 కోట్లు నిరుపేద కుటుంబాలు. ♦ 2.37 కోట్ల(13.25%) గ్రామీణ కుటుంబాలు కచ్చా గోడలు, కచ్చా పైకప్పు ఉన్న ఒకే ఒక్క గదిలో నివసిస్తున్నాయి. ♦ 51.14% పల్లె కుటుంబాలు(9.16కోట్లు) కూలిపనిపై, 30.10% కుటుంబాలు వ్యవసాయంపై ఆధారపడి ఉన్నాయి. 14.01%(2.5 కోట్లు) ప్రభుత్వ, ప్రైవేట్ కొలువుల్లాంటి వాటిపై ఆధారపడి ఉన్నాయి. ♦ 4.08 లక్షల మంది చెత్త ఏరుకోవడం ద్వారా, 6.68 లక్షల మంది భిక్షాటన, ఎన్జీవోల సాయం ద్వారా జీవనం గడుపుతున్నారు. ♦ గ్రామాల్లో మాన్యువల్ స్కావెంజర్స్ అధికంగా ఉన్న రాష్ట్రాల్లో త్రిపుర(2.5%)తొలి స్థానంలో ఉంది. ఈ విషయంలో దేశ సగటు 0.10%(18.06 లక్షలు)గా ఉంది. గుజరాత్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, మణిపూర్, అస్సాం తదితర 9 రాష్ట్రాలతో పాటు కేంద్ర పాలిత ప్రాంతం ఢిల్లీ మాన్యువల్ స్కావెంజర్స్ వ్యవస్థను నిర్మూలించాయి. ♦ పల్లెల్లో ఎక్కువ మొత్తం సంపాదించే కుటుంబ సభ్యుడి సంపాదన నెలకు సగటున రూ.5 వేల లోపే ఉన్న కుటుంబాలు74.49%(13.34 కోట్ల కుటుంబాలు). 1.48 కోట్ల కుటుంబాల్లోని (8.29%) అత్యధిక సంపాదనాపరుడైన వ్యక్తి నెలవారీ సంపాదన మాత్రం రూ. 10 వేలుగా ఉంది. ♦ గ్రామాల్లో నెలవారీ జీతాలొచ్చే ఉద్యోగస్తుల కుటుంబాలు 9.68%. ఈ కుటుంబాల్లో ఆదాయపన్ను చెల్లిస్తోంది 4.6% కులాలవారీ వివరాలు లేవు కులాధారిత గణాంకాలను ఈ నివేదికలో ప్రభుత్వం వెల్లడించలేదు. ప్రభుత్వ పథకాల అమలుకు అవసరమైన సామాజిక, ఆర్థిక వివరాలకే ప్రాధాన్యమిచ్చామని పేర్కొంది. బిహార్ అసెంబ్లీ ఎన్నికలు ఉన్నందువల్లనే కులాలవారీ వివరాలను వెల్లడించడం లేదన్న విమర్శలపై కేంద్ర మంత్రి బీరేంద్ర సింగ్ స్పందిస్తూ.. దీనికి, ఎన్నికలకు సంబంధం లేదన్నారు. ఏయే వివరాలను వెల్లడించాలన్నది సెన్సస్ డీజీ పరిధిలోని అంశమన్నారు. 2011లో ఈ జనగణన ప్రక్రియ ప్రారంభమైన సమయంలో.. కులాలవారీ గణన చేపట్టాలన్న డిమాండ్ భారీగా వచ్చింది. ఎస్పీ నేత ములాయం, ఆర్జేడీ చీఫ్ లాలూ తదితరులు గట్టిగా పట్టుపట్టారు. -
కేంద్ర ఉద్యోగాల్లో వయో పరిమితి సడలింపు పెంపు
-
కేంద్ర ఉద్యోగాల్లో వయో పరిమితి సడలింపు పెంపు
వికలాంగులకు 10 ఏళ్లు * ఎస్సీ, ఎస్టీలకు 15 ఏళ్లు * ఓబీసీ వర్గాలకు 13 ఏళ్లు న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో నేరుగా నియామకాలు జరిపే అన్ని పోస్టుల్లోనూ.. అంధులు, బధిరులు సహా ఇతరత్రా శారీరక వైకల్యం గల వ్యక్తులకు గరిష్ట వయో పరిమితిలో పదేళ్లు సడలింపు ఇవ్వనున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. అలాగే.. షెడ్యూల్డు కులాలు (ఎస్సీ), షెడ్యూల్డు తెగలు (ఎస్టీ) వర్గాల వారికి గరిష్ట వయోపరిమితిలో 15 ఏళ్ల సడలింపు, ఇతర వెనుకబడిన తరగతులు (ఓబీసీ) వారికి 13 ఏళ్ల సడిలింపు ఇస్తామని పేర్కొంది. ఈ మేరకు కేంద్ర శిబ్బంది, శిక్షణ శాఖ (డీఓపీటీ) సోమవారం కొత్త నిబంధనలను రూపొందించింది. అయితే.. దరఖాస్తుదారు వయసు గరిష్టంగా 56 సంవత్సరాలకు మించరాదన్న నిబంధనకు లోబడి పై సడలింపులు వర్తిస్తాయని పేర్కొన్నారు. ఇంతకుముందు.. గ్రూప్ ఎ, గ్రూప్ బి పోస్టుల నియామకాల్లో వికలాంగులకు గరిష్ట వయో పరిమితిలో ఐదు సంవత్సరాలు, ఎస్సీ, ఎస్టీ వర్గాల వారికి 10 సంవత్సరాలు, ఓబీసీలకు 8 సంవత్సరాలు సడలింపు ఉంది. -
ఎస్సీ, ఎస్టీలకు మెడికల్ సీట్లు వద్దా?
ఎమ్మెల్యే సంపత్కుమార్ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మెడికల్ సీట్ల ఫీజులను పెంచడం వల్ల ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులకు అన్యాయం జరుగుతున్నదని కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్కుమార్ విమర్శించారు. బీ-కేటగిరీ సీట్లను ప్రైవేటు మెడికల్ కాలేజీల యాజమాన్యాలకు అప్పగించడం వల్ల వాటికి విపరీతంగా ఫీజులు పెరిగాయన్నారు. ఒక్కొక్క సీటుకు రూ.1.3 కోట్లు అడుగుతున్నారని ఆయన ఆరోపించారు. రిజర్వేషన్ల ప్రకారం మెడికల్ సీట్లను ఇవ్వాలని సంపత్ సోమవారం డిమాండ్ చేశారు. ఈ విషయంలో కోర్టుకు వెళ్తామన్నారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా ఆందోళన చేపడతామని చెప్పారు. -
సబ్సిడీ రుణాలను సకాలంలో గ్రౌండింగ్ చే యాలి
సూర్యాపేట రూరల్ : ఎస్సీ, ఎస్టీ, బీసీ కార్పొరేషన్ల ద్వారా లబ్ధిదారులకు అందజేసే సబ్సిడీ రుణాలు సకాలంలో గ్రౌండింగ్ చేయాలని లీడ్బ్యాంక్ మేనేజర్ శ్రీధర్ బ్యాంకర్లను ఆదేశించారు. సోమవారం సూర్యాపేట మండల పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో జరిగిన జాయింట్మండల్ లెవల్ బ్యాంకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. యూనిట్ నెలకొల్పే లబ్ధిదారులకు మాత్రమే రుణం మంజూరు చేయాలన్నారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైనందున జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే రైతులకు 15 శాతం రుణాలు అందజేయడం జరిగిందని వెల్లడించారు. ఈ సీజన్కు గాను రైతులకు రూ.1400 కోట్ల రుణాలు అందజేసే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామన్నారు. రాష్ట్రప్రభుత్వం అమలు చేస్తున్న రుణమాఫీ పథకం ద్వారా రెండో విడత 2015-16 సంవత్సరానికి గాను 25 శాతం నగదులో సగాన్ని జూన్ నెలలో, సగం జూలై నెలలో రైతుల ఖాతాల్లో జమ చేయడం జరుగుతుందన్నారు. 2014-15 సంవత్సరంలో ఐకేపీ ద్వారా సమభావన సంఘాలకు ఇప్పటివరకు రూ.493 కోట్టు అందజేయడం జరిగిందని తెలిపారు. సమభావ సంఘాల సభ్యులు తీసుకున్న రుణాలు సకాలంలో చెల్లించడం లేదని, మండలస్థాయిలో రికవరీ టీంలు ఏర్పాటు చేసుకోనిన రుణాలు రికవరీ చేయాలన్నారు. ఈ సందర్భంగా వివిధ శాఖల అధికారులు, బ్యాంకర్లతో సమీక్షించారు. సమావేశంలో ఎస్సీ కార్పొరేషన్ ఈఓ జే.కృష్ణమూర్తి, డీపీఎంయూ యాంకర్పర్సన్ రమణ, సూర్యాపేట ఎంపీడీఓ నాగిరెడ్డితో పాటు వివిధ మండలాల ఎంపీడీఓలు, తహశీల్దార్లు, ఏఓలు, ఏపీఎంలు, బ్యాంకర్లు పాల్గొన్నారు. -
వాల్మీకులను ఎస్టీలుగా గుర్తించాలి
కేంద్ర హోంశాఖ మాజీ మంత్రి బూటాసింగ్ హైదరాబాద్: చంద్రబాబు ప్రభుత్వం వాల్మీకులను ఎస్టీలుగా గుర్తించి ఎన్నికల హామీని నిలబెట్టుకోవాలని, లేదంటే లక్షలాదిమందితో ప్రభుత్వంపై దండయాత్ర చేపడతామని వాల్మీకి రిజర్వేషన్ పోరాట సమితి ఏపీ రాష్ట్ర కమిటి హెచ్చరించింది. వాల్మీకులకు ఎస్టీ రిజర్వేషన్ సాధన కోసం వాల్మీకి రిజర్వేషన్ పోరాట సమితి (వీఆర్పీఎస్) అధ్యక్షులు ఎం సుభాష్ చంద్రబోస్ ఆధ్వర్యంలో కుప్పం నుంచి హైదరాబాదుకు చేపట్టిన 11 వందల కిలోమీటర్ల పాదయాత్ర ముగింపు సందర్భంగా శనివారం ఇందిరాపార్కు వద్ద భారీ ధర్నా నిర్వహించారు. ధర్నానుద్దేశించి కేంద్ర హోంశాఖ మాజీ మంత్రి బూటాసింగ్ మాట్లాడుతూ.. ఏపీలోని 5 జిల్లాల్లో వాల్మీకి, బోయలను ఎస్టీలుగా గుర్తిస్తున్నా.. మిగతా 8 జిల్లాల్లో బీసీలుగానే గుర్తిస్తున్నారని అన్నారు. పక్క రాష్ట్రమైన తెలంగాణలో వాల్మీకులను ఎస్టీలుగా గుర్తిస్తామంటూ ప్రకటించిన సీఎం కేసిఆర్ చెల్లప్ప కమిటీని నియమించారని, వాల్మీకులను ఎస్టీలుగా గుర్తిస్తామన్న ఏపీ సీఎం చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన హామీని ఏడాది గడిచినా అమలు చేయక పోవడం శోచనీయమన్నారు. ఆలూరు ఎమ్మెల్యే జయరాం మాట్లాడుతూ వాల్మీకులను ఎస్టీల్లో చేర్చే అంశంపై ఏపీ ప్రభుత్వం స్పందించకుంటే వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు. వీఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు ఎం సుభాష్ చంద్రబోస్ మాట్లాడుతూ రాజకీయ లక్ష్యం కోసం కాకుండా అణిచివేతకు గురవుతున్న వాల్మీకులకు రిజర్వేషన్లు సాధించేందుకే పాదయాత్ర చేపట్టానని అన్నారు. వీఆర్పీఎస్ గౌరవాధ్యక్షులు డాక్టరు పార్థసారథి, ప్రధానకార్యదర్శి ఎల్ భాస్కర్, ఉపాధ్యక్షులు అద్దాల నారాయణ, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
ఎస్సీ, ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టుల భర్తీకి చర్యలు
జిల్లా కలెక్టర్ లక్ష్మీనరసింహం శ్రీకాకుళం అర్బన్: ఎస్సీ, ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను కలెక్టర్ పి.లక్ష్మీనరసింహం ఆదేశించారు. డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమం అనంతరం వివిధ అంశాలపై కలెక్టర్ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్యాక్లాగ్ ఖాళీలను భర్తీ చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసిందన్నారు. అన్ని శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టుల వివరాలను సేకరించాలన్నారు. జూన్ 30 నాటికి నోటిఫికేషన్ విడుదలకు సిద్ధం చేయాలని ఆదేశించారు. అలాగే, వికలాంగ అభ్యర్థుల ఖాళీల భర్తీకి తగు చర్యలు చేపట్టాలన్నారు. డీఆర్డీఏ- వెలుగులో బ్యాంకులకు తిరిగి చెల్లింపులు చేయని స్వయం సహాయక సంఘాల వివరాలు తదితర అంశాలపై నివేదిక అందజేయాలని ఏపీడీ వై.వి.రమణమూర్తిని ఆదేశించారు. సీఎంఆర్ బియ్యంను గిడ్డంగిలకు తరలించే అంశంపై ప్రత్యేకశ్రద్ధ వహించాలని పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ జె.సీతారామారావును ఆదేశించారు. రెండవ పంటలో ఇప్పటి వరకూ 25,387 మెట్రిక్ టన్నుల బియ్యం వచ్చిందని జిల్లా మేనేజర్ తెలియజేయగా వాటిని సక్రమంగా నిల్వచేసేందుకు చర్యలు చేపట్టాలన్నారు. విద్యార్థులకు వైద్యపరీక్షలు నిర్వహించేందుకు, రైతులకు విత్తనాలు, ఎరువులు పంపిణీకి ప్రణాళిక రూపొందించాలని ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. -
ఇంటిగ్రేటెడ్ స్టడీ సెంటర్ల ఏర్పాటుకు విముఖత
సొంత గుర్తింపును కోల్పోతామని ఎస్సీ, ఎస్టీ, మైనారిటీశాఖల వ్యతిరేకత సాక్షి, హైదరాబాద్: అన్ని సంక్షేమశాఖలకు సంబంధించి సమీకృత అధ్యయన కేంద్రాలను (ఇంటిగ్రేటెడ్ స్టడీ సెంటర్లు) ఏర్పాటుచేయాలనే రాష్ర్ట ప్రభుత్వ ఆలోచనకు ప్రతిపాదన దశలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులందరికీ ఒకే చోట శిక్షణనివ్వాలనే కొత్త ఆలోచనపై ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ శాఖల నుంచి సానుకూల స్పందన వ్యక్తం కావడం లేదు. ఈ నెల 8న ‘మీటింగ్ ఆఫ్ ది గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఆన్ స్ట్రీమ్లైనింగ్ వెల్పేర్ డిపార్ట్మెంట్’ పేరిట నిర్వహించిన మంత్రుల బృందం భేటీలో అన్ని వర్గాల విద్యార్థులకు కలిపి ఒకే స్టడీ సెంటర్ ఏర్పాటు చేయాలనే సూచన వచ్చింది. ముందుగా హైదరాబాద్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన 400 మంది విద్యార్థులకు ప్రయోగాత్మకంగా స్టడీ సెంటర్ను మొదలుపెట్టి, ఆ తర్వాత వాటిని అన్ని జిల్లాలకు విస్తరించాలని నిర్ణయించారు. అయితే ఇప్పటికే తమ శాఖల ఆధ్వర్యంలో నడుస్తున్న స్టడీసెంటర్లకు మంచి గుర్తింపు ఉన్నందున, తమ ప్రత్యేక ముద్ర పోతుందని ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ శాఖలు వెనుకాడుతున్నట్లు తెలుస్తోంది. అదీగాకుండా తమకు వస్తున్న కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాల నిధులపై ఆధిపత్యం పోతుందనే భావనతో ఈ అధికారులున్నట్లు చెబుతున్నారు. -
ఎస్సీ, ఎస్టీలకు పరిహారం పెంపు
* అత్యాచారాల నిరోధక చట్టం కింద సవరించిన పరిహారాలు.. * ఆదేశాలు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం * గత ఏడాది జూన్ 23 నుంచి వర్తింపు సాక్షి, హైదరాబాద్: షెడ్యూల్ కులాలు, తెగలకు చెందిన వారు అత్యాచారాలు, దాడులకు గురైన సందర్భం లో ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం,1989 కిం ద ఇచ్చే నష్టపరిహారాన్ని పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం సవరించిన ఉత్తర్వులను జారీచేసింది. ఈ ఉత్వర్వులు గత ఏడాది 23 జూన్ నుంచి అమల్లోకి వస్తాయని బుధవారం రాత్రి ఎస్సీ అభివృద్ధిశాఖ ముఖ్యకార్యదర్శి (ఎఫ్ఏసీ) జె.రేమండ్పీటర్ ఆదేశాలు జారీచేశారు. ఆయా కేసులకు సంబంధించి ప్రభుత్వం ఇచ్చే సవరించిన పరిహారాలు ఇలా... - ఎస్సీ, ఎస్టీలు వినియోగించే నీటి వనరులను ఎవరైనా కలుషితం చేస్తే రూ.3.75 లక్షల వరకు పరిహారం. లేదా మొత్తం నీటిని శుద్ధి చేస్తారు. - తప్పుడు పద్ధతుల్లో ఎవరైనా ఎస్సీ, ఎస్టీల భూమిని ఆక్రమించి, సాగు చేసుకుంటుంటే నేర తీవ్రతను బట్టి కనిష్టంగా రూ.90 వేలు అంత కంటే ఎక్కువ చెల్లిస్తారు. - మహిళలపై అత్యాచారం, లైంగికంగా వేధించడం వంటి వాటికి రూ. 1.8 లక్షల మొత్తం బాధితురాలికి చెల్లింపు. - హత్యకు గురైతే సంపాదన ఉన్న వ్యక్తి విషయంలో రూ.7.5 లక్షలు.. సంపాదన లేనివారికి రూ.3.75 లక్షలు. - దాడుల్లో వంద శాతం అంగవైకల్యానికి గురైతే కుటుంబ సంపాదన చేసేవారికి రూ.7.5 లక్షలు.. సంపాదన లేనివారికి రూ.3.75 లక్షలు. - ఇళ్లు పూర్తిగా తగలబడడం లేదా ధ్వంసమైతే ఇటుకలతో ఇంటి నిర్మాణం లేదా దానికయ్యే ఖర్చును ప్రభుత్వ లెక్కల ప్రకారం చెల్లించడం. - హత్య, అత్యాచారం, గ్యాంగ్రేప్, పూర్తి అంగవైకల్యం, దోపిడీ వంటి కేసుల్లో ప్రభుత్వపరంగా స హాయంతో పాటు చనిపోయిన ఎస్సీ, ఎస్టీల భార్యలు లేదా వారిపై ఆధారపడినవారికి నెలకు రూ.4,500 చొప్పున పెన్షన్, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం లేదా వ్యవసాయ భూమి, లేదా ఒక ఇల్లు ఇస్తారు. - అవమాన ం, అడ్డుకోవడం వంటి వాటికి ఒక్కొక్కరికి రూ.90 వేల వరకు. - భూమికి లేదా ఇతరత్రా దారి ఇవ్వకపోవడం.. రూ.3.75 లక్షల వరకు. - ఇంటిని వదిలిపెట్టి వెళ్లేలా చేసినందుకు ఒక్కో బాధితుడికి రూ.90 వేల చొప్పున చెల్లిస్తారు. - ఎస్సీ, ఎస్టీలకు వ్యతిరేకంగా ఎవరైనా తప్పుడు సాక్ష్యం ఇచ్చిన కేసులో కనిష్టంగా రూ.3.75 లక్షలు లేదా పూర్తి నష్టపరిహారం - ఓటు హక్కును వినియోగించుకోకుండా ఎవరైనా నిరోధించిన కేసుల్లో రూ.75 వేల వరకు. -
బకాయి ఫీజులు వచ్చాయోచ్!
2013-14 సంవత్సరానికి లైన్ క్లియర్ - బీసీ, ఈబీసీ విద్యార్థులకు శుభవార్త - రూ. 28.31 కోట్లు విడుదల చేసిన సర్కారు - ఎస్టీ, మైనారిటీ శాఖలకు కూడా త్వరలోనే - ఉపకార వేతనాలకూ కలిగిన మోక్షం ఇందూరు: 2013-14 సంవత్సరానికి సంబంధించిన ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను ప్రభుత్వం ఎట్టకేలకు విడుదల చేసింది. ఈ మేరకు బీసీ సంక్షేమ శాఖకు రూ.28.31 కోట్లు కేటాయిస్తూ ఉత్తర్వు లు జారీ చేసింది. దీంతో విద్యార్థులు ఊపిరి పీల్చుకున్నారు. ఎస్సీ విద్యార్థులకు రెండు నెలల క్రితమే నిధులు విడుదల చేసింది. ఎస్టీ, మై నారిటీ విద్యార్థుల ఫీజులను కూడా విడుదల చేసినట్లు ప్రకటించినప్పటికీ ఉత్తర్వులు ఇంకా అందలేదు. మరో రెండు మూడు రోజులలో వచ్చే అవకాశాలున్నాయని ఆయా శాఖల అధికారులు పేర్కొంటున్నారు. అత్యధికంగా బీసీ విద్యార్థుల బకాయిలు చాల రోజులుగా పెడింగ్లో ఉన్నాయి. మైనారిటీ, ఎస్టీ సంక్షేమ శాఖలో కొద్ది బకాయిలున్నాయి. ప్రభుత్వం ఫీజులు ఇవ్వడం ఆలస్యం చేయడంతో కళాశాలల యాజమాన్యాలు విద్యార్థుల నుంచి వసూ లు చేశాయి. ప్రభుత్వం పరీక్షలకు ముందు స్పందించి ఉంటే విద్యార్థులకు ఫీజుల స మస్య ఉండేది కాదు. ఇపుడు ఫీజులను కళాశాలల యాజమాన్యాలు తిరిగి విద్యార్థులకు చెల్లించాల్సి ఉంటుంది. నిధుల విడుదల ఇలా బీసీ విద్యార్థులకు రీయింబర్స్మెంట్ కింద రూ.17.91 కోట్లు, ఉపకారవేతనాలకు రూ. 8.01కోట్లు నిధులు విడుదలయ్యూరుు, ఈ బీసీ విద్యార్థులకు రీయింబర్స్మెంట్ కింద రూ.2.39 కోట్లు వచ్చారుు. ట్రెజరీలో బిల్ పాస్ కాగానే, నేరుగా విద్యార్థుల బ్యాంక్ ఖాతాలో నిధులు జమవుతాయి. ఈ పక్రియ మొత్తం జరిగేందుకు 10 నుంచి 15 రోజుల సమయం పడుతుందని అధికారులు పే ర్కొం టున్నారు. ఎస్టీ, మైనారిటీ విద్యార్థులకు కూడా పూర్తి స్థాయిలో బకాయిలను విడుదల చేసినట్లు ప్రకటించిన ప్రభుత్వం ఇంకా ఈ రెండు శాఖలకు అధికారికంగా ఉత్తర్వులను జారీచేయలేదు. రెండు మూడు రోజులలో వచ్చే అవకాశాలున్నాయని అం టున్నారు. ఎస్టీ విద్యార్థుల కు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ కలిపి మొత్తం రూ.1.20 కోట్ల అవసరం ఉంది. మైనారిటీ విద్యార్థులకు రూ.4 కోట్ల వరకు కావాలి. ఈ రెండు శాఖలకు కూడా నిధులు విడుదలైతే 2013-14 సంవత్సరానికి సంబంధించిన బకాయిలకు తెరపడుతుంది. ‘కొత్త’ దరఖాస్తుల తేదీనే ఆలస్యం దాదాపు జిల్లాలో గత సంవత్సరానికి సంబంధించిన ఫీజు బకాయిలు ప్రభుత్వం చెల్లించినట్లే. ఇక 2014-15 సంవత్సరానికి ఫ్రెష్, రెన్యూవల్ విద్యార్థుల నుంచి దర ఖాస్తులు స్వీకరించాల్సి ఉంది. నిజానికి దరఖాస్తులను ప్రభుత్వం ఆగస్టు, సెప్టెంబర్ నెలలో తేదీని ప్రకటించి స్వీకరించాలి. కాని ఫాస్ట్ పథకం పేరిట ఆలస్యం చేయడం తో తేదీని సకాలంలో ప్రకటించలేదు. ప్రస్తుత విద్యా సంవత్సరం మార్చి నెలతో ముగియనుంది. ఈ నెలాఖరులోగా తేదీని ప్రకటిస్తేనే దరఖాస్తులు లెక్కలోకి వస్తాయి. ఆలస్యం జరిగితే ఆ ప్రభావం సంక్షేమ శాఖలపై పడుతుందని అధికారులు చెబుతున్నారు. వెంటనే తేదీని ప్రకటించి దరఖాస్తులు స్వీకరించాలని విద్యార్థులు, విద్యార్థి సంఘాల నాయకులు కోరుతున్నారు. -
నిరుద్యోగుల ఆశలపై నీళ్లు!
ఎస్సీ, ఎస్టీ, బీసీ నిరుద్యోగ యువతను ఆదుకునేందుకు ప్రభుత్వం అందజేస్తున్న రుణాలు పక్కదారి పడుతున్నాయి. స్వయంశక్తితో ఎదగాలనుకున్న నిరుద్యోగుల ఆశలపై నీళ్లుజల్లుతూ అధికార పార్టీ నాయకులు తమ బంధు గణానికే రుణాలందజేస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. నిబంధనల ప్రకారం వ్యవహరించాల్సిన అధికారులు ఏమీ చేయలేకపోతున్నారు. కేవలం కమిటీల ముసుగులో తమ వారికే టీడీపీ నాయకులు రుణాలందిస్తున్నారంటూ అర్హులైన లబ్ధిదారులు ఆవేదన చెందుతున్నారు. ఇంటర్వ్యూలు సైతం మొక్కుబడిగానే ముగిస్తున్నారని వాపోతున్నారు. శ్రీకాకుళం పాతబస్టాండ్ : అర్హులైన నిరుద్యోగులకు రుణాలిచ్చి ఆదుకోవాలనే ఉద్దేశంతో ఇటీవలజిల్లా యంత్రాంగం దరఖాస్తుల్ని ఆహ్వానించింది. దీంతో రుణాలు పొంది స్వయంశక్తితో ఎదగాలనే లక్ష్యంతో వేలాది మంది దరఖాస్తు చేసుకున్నారు. జిల్లాలో ఈ ఏడాది బీసీ నిరుద్యోగ యువతకు రూ.51.78 కోట్లుతో 9,426 యూనిట్లు, ఎస్సీలకు రూ.14.51 కోట్లుతో 1250 యూనిట్లు, ఎస్టీలకు(ైటైకార్ పథకం)రూ.11.64 కోట్లుతో 1194 యూనిట్లు ప్రభుత్వం మంజూరు చేసింది. వీటి కోసం అందిన దరఖాస్తులను నాలుగు రోజులుగా మండలాల్లో అధికారులు పరిశీలించి ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు. వాస్తవానికి ఈ ప్రక్రియ ఈ నెల 28వ తేదీతోనే ముగియాల్సి ఉండగా జిల్లా యంత్రాంగం మరో రెండు రోజులు పొడిగించింది. అది కూడా మంత్రి సొంత నియోజకవర్గం పరిధిలోని నందిగామ, టెక్కలి మండలాల నుంచి పూర్తిస్థాయిలో దరఖాస్తులు రాకపోవడంతోనే గడువును అధికారులు పొడిగించారనే విమర్శలున్నాయి. ఫిబ్రవరి 10వ తేదీ నాటికి గ్రౌండ్ వర్క్ పూర్తి చేసి రుణాల జారీకి సిద్ధం కావాలని జిల్లా యంత్రాంగం ఆదేశించడంతో టీడీపీ నాయకుల్లో ఉత్సాహం నెలకొంది. మొక్కుబడిగానే ఇంటర్వ్యూలు ఇంటర్వ్యూలు జరుగుతున్న తీరును పరిశీలిస్తే అధికార పార్టీ నాయకుల హవా ఇట్టే అర్థమవుతోంది. కమిటీల పేరుతో నలుగురు సభ్యులు ఇంటర్వ్యూల్లో ఉంటున్నారు. వీరు గ్రామస్థాయిలో ఆ పార్టీ నాయకులు ప్రతిపాదించిన జాబితాను ముందుగానే గుర్తించి పెట్టుకుంటున్నారు. ఇంటర్వ్యూకు వచ్చిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు తీసుకొని పంపిస్తున్నారు. అనంతరం వీరి అనునాయులకే తుది జాబితాల్లో చోటు కల్పిస్తున్నారు. మున్సిపాలిటీ, నగర పంచాయతీ, మండల స్థాయిలోనూ ఇదే స్థాయిలో ఎంపికలు సాగుతుండడంతో నిజమైన లబ్ధిదారులకు అన్యాయం జరుగుతోంది. జన్మభూమి కమిటీల పేరిట ప్రభుత్వం ఓ జీవో జారీ చేయడం.. అన్ని ఎంపికలకూ వీరి ఆమోదం తప్పనిసరి చేయడంతో వీరు ఆడింది ఆట..పాడింది పాటగా మారుతోంది. ఆది నుంచీ అంతే.. నిరుద్యోగ యువకులు ఇంటర్వ్యూల ఎంపిక ప్రక్రియను ముందస్తుగానే గ్రహించి తొలుత దరఖాస్తులు చేసుకోవడానికి ఆసక్తి చూపలేదు. అయితే పదే పదే 50 శాతం సబ్సిడీ అంటూ గ్రామస్థాయిలో అధికారులు ప్రచారం చేసి వారిలో ఆశలు రేకెత్తించారు. దీంతో పొడిగించిన సమయంలోనే ఎక్కువ మంది దరఖాస్తులు చేసుకున్నారు. ఒక్కో దరఖాస్తుకు సుమారు రూ.300 వరకు ఖర్చు చేసి మరీ బ్యాంకులు, ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగారు. అరుుతే ఎంపిక ప్రక్రియ చూసి ఆందోళన చెందుతున్నారు. బ్యాంకర్లదీ అదే దారి రుణలు పొందేందుకు అనుమతి పత్రాలపై సంతకాలు చేయాల్సిన బ్యాంకర్లు కూడా అధికార పార్టీకే కొమ్ము కాస్తున్నారనే విమర్శలు వస్తున్నారుు. స్వతాహాగా అనుమతులు ఇవ్వకుండా కమిటీ ఎంపిక చేసిన వారికే రుణాలు పొందేందుకు అనుమతులు మంజూరు చేస్తున్నారు. వాస్తవానికి రుణం పొందేందుకు అర్హత సాధించిన అభ్యర్థులకు బ్యాంకు అనుమతి తప్పనిసరి. ఈ నిబంధనను ఎక్కడా పాటించడం లేదు. దీంతో పాటు పలుకుబడి ఉన్నవారికే బ్యాంకర్లు సహకారమందిస్తూ రుణాల ఎంపికలో కీలకపాత్ర పోషిస్తున్నారు. మీకింత..నాకెంత? మరోవైపు కమిటీలు ప్రత్యక్ష అవినీతికి తెరతీశాయి. మీకు రుణం మంజూరు చేయిస్తాం..సబ్సిడీలో మాకెంత ఇస్తారంటూ పలువురితో బేరసారాలు కుదుర్చుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. రుణాల పేరిట జాతర జరుగుతుండడంతో లబ్ధిదారులు కూడా నాయకులకు డబ్బులిచ్చేందుకు సిద్ధమవుతున్నట్టు తెలిసింది. యూనిట్లు నెలకొల్పకుండానే రుణం పొందేందుకు, లేకుంటే పాత యూనిట్లను చూపించే రుణాలు పొందేందుకు కూడా ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం. నామమాత్రంగానే అధికారులు ఇంత జరుగుతున్నా అధికారుల్లో కదలిక లేదు. రుణాల ఎంపిక ప్రక్రియలో వీరే తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. గతంలో జరిగిన ఎంపికల్లో ఇదే ప్రామాణికంగా ఉండేది. ప్రస్తుతం ఈ విధానం కనిపించడం లేదు. అధికారులు ఉత్సవ విగ్రహాలుగా మారిపోయారని రుణాల మంజూరీలో కీలకంగా వ్యవహరిస్తున్న ఓ అధికారి వాపోయూరు. -
ఒక్క రోజే 48 జీవోలు!
సాక్షి, హైదరాబాద్: వివిధ ప్రభుత్వశాఖలకు సంబంధించిన ఉత్వర్వులు, బడ్జెట్ విడుదల ఆదేశాలు, ఆయా పథకాలకు నిధుల కేటాయింపులతో శుక్రవారం ఒక్కరోజే జీవోల జాతర జరిగింది. మరో రెండున్నర నెలల్లో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగుస్తుండటంతో బడ్జెట్లో చేసిన ప్రతిపాదనలకు సంబంధించి ఆయా శాఖలవారీగా నిధులను మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. ఆర్థికశాఖ నుంచి 48 జీవోలు (సంక్షేమంతోపాటు మిగతా శాఖలకు సంబంధించిన నిధుల విడుదల, బడ్జెట్ మంజూరు ఉత్తర్వులు) జారీ అవగా, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా శిశు సంక్షేమ శాఖలు, ఇతర శాఖలకు సంబంధించి వందలాది కోట్ల రూపాయల నిధులను మంజూరు చేస్తూ ఆదేశాలు వెలువడ్డాయి. -
కల్యాణ ‘లక్షి’ ఏదీ
నల్లగొండ :నిరుపేద ఎస్సీ, ఎస్టీ, ముస్లిం, మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం ‘కల్యాణలక్ష్మి’, ‘షాదీ ముబారక్’ పథకాలను ప్రవేశపెట్టింది. ప్రభుత్వం అత్యంత ఆర్భాటంగా ప్రవేశపెట్టిన ఈ పథకాల ద్వారా ఇప్పటి వరకు ఒక్కరికి కూడా ఆర్థిక సాయం అందలేదు. దరఖాస్తులు మాత్రం రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. వచ్చిన దరఖాస్తులను తహసీల్దార్లు పరిశీలించి సంబంధిత శాఖలకు పంపించాల్సి ఉంది. కానీ ఆ ప్రక్రియ ఇంకా ప్రారంభదశలోనే ఉంది. ఇదీ పథకం ఉద్దేశం ప్రభుత్వం షాదీముబాకర్ పథకాన్ని అక్టోబర్ 2న, కల్యాణలక్ష్మిని అదే నెలలో 21న ప్రవేశపెట్టింది. అక్టోబర్ 2వ తేదీన తర్వాత వివాహ ం చేసుకున్న అమ్మాయిలకు ఈ పథకాల ద్వా రా ఆర్థికసాయం అందించాల్సి ఉంది. ఇందుకుగాను అమ్మాయిలు వయస్సు 18 ఏళ్లు నిండి ఉండాలి. అమ్మాయి, అబ్బా యి తల్లిదండ్రుల ఆదాయం ఏడాదికి రూ.2 లక్షలు మించరాదు. ఆన్లైన్ ద్వారానే దరఖాస్తులు చేసుకోవాల్సి ఉం టుంది. అన్ని అర్హతలు ఉంటే ప్రభుత్వం ప్రకటించిన మేరకు వివాహం చేసుకున్న కుటుంబాలకు రూ. 51 వేల ఆర్థిక సాయం అందుతుంది. కానీ ఈ పథకం కింద వచ్చిన దరఖాస్తుదారులకు ఒక్కరికి కూడా ఆర్థిక సాయం అందలేదు. తప్పని ఎదురుచూపులు.. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలకు దరఖాస్తు చేసుకున్న కుటుంబాలు ప్రభుత్వం నుంచి ఆర్థికసాయం కోసం ఎదురు చూస్తున్నాయి. ఈ పథకాలకు వచ్చిన దరఖాస్తులను ఆయా మండలాల తహసీల్దార్లు పరిశీలించి ఆమోదముద్ర వేసి సంబంధిత శాఖలకు పంపించాల్సి ఉంది. కానీ నేటికీ ఆపని పూర్తి కాలేదు. ఎస్సీలకు మాత్రం ప్రభుత్వం కోటి రూపాయల నిధులు మంజూరు చేసింది. తహసీల్దార్ల నుంచి వచ్చిన దరఖాస్తులను పరిశీలించి సీనియారిటీ ప్రాతిపదికన నిధులు మంజూరు చేస్తామని షెడ్యూలు కులాల అభివృద్ధి శాఖ డిప్యూటీ డైరక్టర్ వెంకటనర్సయ్య తెలిపారు. ఎస్టీ, ముస్లిం, మైనార్టీ శాఖలకు ఇంకా నిధులు విడుదల కాకపోగా, దరఖాస్తుల పరిశీలన కూడా పూర్తిచేయకపోవడంతో లబ్ధిదారుల్లో ఆందోళన నెలకొంది. కల్యాణ లక్ష్మి పథకానికి వచ్చిన దరఖాస్తులు ఎస్సీల నుంచి 52 తహసీల్దార్ల పరిశీలన పూర్తయినవి 4 ఎస్టీ 18 పరిశీలన పూర్తయినవి 4 షాదీముబారక్కు వచ్చిన దరఖాస్తులు 51 తహసీల్దార్లు పరిశీలించాల్సి ఉంది. -
ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారుల ఎంపికకు ఓసీలతో కమిటీయా?
ప్రభుత్వాన్ని నిలదీసిన విపక్ష నేత జగన్మోహన్రెడ్డి సాక్షి, హైదరాబాద్: షెడ్యూల్డ్ కులాలు, తెగల (ఎస్సీ, ఎస్టీ) స్వయం ఉపాధి పథకాలకు లబ్ధిదారుల ఎంపిక తీరుపై శనివారం రాష్ట్ర శాసనసభలో ఆగ్రహావేశాలతో కూడిన చర్చ జరిగింది. కిరణ్ సర్కారు తెచ్చిన జీవో 101ను చంద్రబాబు జమానా అమలు చేస్తోందంటూ విపక్షనేత, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి దుయ్యబట్టారు. ‘‘జీవో 101 ప్రకారం లబ్ధిదారుల ఎంపిక కమిటీలో సామాజిక కార్యకర్తలను పెడుతున్నామంటున్నారు. ఈ జీవో అన్యాయమైంది. ఓసీలతో కూడిన ఈ కమిటీకి ఎస్సీ లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు ఏ అధికారం ఉంది? ప్రభుత్వ అధికారులు, ఎస్సీ, ఎస్టీ విభాగాల అధికారులు, బ్యాంకర్లు, ఆ వర్గాలకు చెందినవారుంటే సరిపోతుంది గానీ సామాజిక కార్యకర్తలు ఎందుకు? పాత విధానాన్నే అమలు చేయాలి’’ అని డిమాండ్ చేశారు. అంతకుముందు వైఎస్సార్సీపీ సభ్యులు ఆదిమూలపు సురేష్, గొట్టిపాటి రవికుమార్, పోతుల రామారావు అడిగిన లిఖిత పూర్వక ప్రశ్నకు సంబంధిత శాఖ మంత్రి రావెల కిషోర్ బాబు ప్రశ్నోత్తరాల సమయంలో సుదీర్ఘ జవాబు ఇచ్చారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ వర్గాలకు రూ.580 కోట్ల మేర రుణాలు ఇవ్వాలని ప్రతిపాదించామని చెప్పారు. అయితే మంత్రి కిషోర్ బాబు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రస్తావన తేవడం, లేనిపోనివి ఆపాదించడంతో పలువురు అభ్యంతరం తెలిపారు. అనంతరం ఏ.సురేష్ మాట్లాడుతూ... ఎస్సీ లబ్ధిదారుల ఎంపికకు ఉద్దేశించిన 135, 101 జీవోలను తప్పుబట్టారు. సాంఘిక సంక్షేమ శాఖ పేరును సామాజిక సాధికారత సంస్థగా మారుస్తామంటూ ఎస్సీ, ఎస్టీలకు చెందిన నిరుద్యోగ యువతకు అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. మళ్లీ గొడవ చెలరేగింది. అప్పుడు ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి జోక్యం చేసుకున్నారు. ‘‘సామాజిక కార్యకర్తలు దళారులుగా మారి వ్యవస్థను భ్రష్టుపట్టిస్తున్నారు. పెన్షన్లు, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రుణాలు ఇచ్చేందుకు దళారులు ఎందుకు? వాళ్లను పెట్టి గబ్బులేపొద్దు. దీనికో ప్రత్యక్ష ఉదాహరణ కూడా చెప్పగలను. సలగాల సురేష్ అనే వ్యక్తి రుణానికి దరఖాస్తు చేసుకుంటే పైనుంచి కింది దాక అన్ని టిక్కులు (సరైనవేనని) పెట్టి చివర్లో తిరస్కరించారు. కారణమేమిటా? అని ఆరా తీస్తే ఆ వ్యక్తి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అని తిరస్కరించారు. దయచేసి వారి జీవితాలతో చెలగాటమాడవద్దు. అన్యాయమైన 101 జీవోను రద్దు చేయండి’’ అని డిమాండ్ చేశారు. -
ఇందిర జలప్రభకు మంగళం?
సీతంపేట:ఎస్సీ, ఎస్టీల అభ్యున్నతికి ఉద్దేశించిన పలు పథకాలకు తెలుగుదేశం ప్రభుత్వం చాప కింద నీరులా కోత పెడుతోంది. ఫలితంగా గిరిజనాభివృద్ధి నేతిబీరకాయ చందంగా తయారైంది. తాజాగా ఇందిర జలప్రభ పథకానికి క్రమంగా మంగళం పాడేందుకు చర్యలు ప్రారంభమయ్యాయి. గిరిజన ప్రాంతాల్లో ఎస్సీ,ఎస్టీ భూములను అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో గత ప్రభుత్వం 2011లో ఇందిర జలప్రభ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఎస్సీ, ఎస్టీలు అధికంగా ఉన్న ప్రాంతాల్లో అందుబాటులో ఉన్న బంజరు భూములను అభివృద్ధి చేసి సాగులోకి తేవడం ద్వారా ఆయా వర్గాల లబ్ధిదారులకు ఉపాధి కల్పించాలన్నది ఈ పథకం ప్రధాన ఉద్దేశం. అయితే ప్రవేశపెట్టిన నాటి నుంచీ ఈ పథకం నత్తనడకనే సాగుతోంది. సీతంపేట ఐటీడీఏ పరిధిలో సీతంపేట, కొత్తూరు, భామిని, మెళియాపుట్టి, మందస, హిరమండలం, పాతపట్నం మండలాల్లోని 5180 బ్లాకులను అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నా 4,147 బ్లాకుల్లోని బీడు భూముల అభివృద్ధికే నిర్ణయం తీసుకున్నారు. ఎంపిక చేసిన బ్లాకుల్లో రైతులకు చెందిన భూములను అభివృద్ధి చేసి అవసరమైన చోట చేతి పంపులు, విద్యుత్ బోర్లు వేయడానికి చర్యలు తీసుకున్నారు. అయితే ఇప్పటివరకు 3,372 బ్లాకుల్లో 157 బోర్లకు మాత్రమే డ్రిల్లింగ్ చేశారు. వీటిలో 56 బోర్ల ఏర్పాటు పూర్తి అయ్యింది. మిగతా వాటి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఈ తరుణంలో ప్రభుత్వం నుంచి అందిన ఆదేశాలు వీటిపై ఆశలు వదిలేసుకునే పరిస్థితి కల్పించాయి. ఇప్పటివరకు ప్రారంభించని వాటికి ఎటువంటి డ్రిల్లింగ్ చేయవద్దని, బోర్లు వేయవద్దని, డ్రిల్లింగ్ పూర్తి అయిన వాటికి మాత్రమే కనెక్షన్లు ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో డ్రిల్లింగ్ ప్రక్రియ నిలిచిపోయింది. మూడు మండలాల్లోనే అధికం... సీతంపేట, భామిని, కొత్తూరు మండలాల్లోనే అధిక శాతం బీడు భూములను అభివృద్ధి చేయడానికి చర్యలు తీసుకోగా వీటి పరిధిలో 553 బ్లాకుల ను ఎంపిక చేశారు. భామిని మండలంలో 87 బ్లాకుల్లో 1537 ఎకరాలు, సీతంపేట మండలంలో 438 బ్లాకుల పరిధిలో 6,431 ఎకరాలు, కొత్తూరులో 28 బ్లాకుల పరిధిలో 280 ఎకరాల భూమిని వినియోగంలోకి తేవాలని ప్రణాళికలు రూపొందించారు. పలు చోట్ల బోర్లు తవ్వినా మోటారు బిగించకపోవడం, విద్యుత్ కనెక్షన్ ఇవ్వకపోవడం వంటి కారణాలతో గోతులు మాత్రమే మిగిలాయి. కొత్తగా డ్రిల్లింగ్ చేపట్టవద్దని ప్రభుత్వం ఆదేశించడంతో ఈ పథకం కంచికి చేరినట్లేనని తెలుస్తోంది. ఈ విషయమై ఇందిర జలప్రభ కన్సల్టెంట్ శ్రీహరి వద్ద ప్రస్తావించగా పాత వాటి కి డ్రిల్లింగ్ చేయవద్దని ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాయన్నారు. మిగతా వాటి ప్రక్రియ కొనసాగుతుందన్నారు. -
ఎస్సీ,ఎస్టీలకు ‘ఉచిత’షాక్ !
బొబ్బిలి : ఎస్సీ, ఎస్టీలకు ఉచిత విద్యుత్తు ఇస్తాం.. ఎవరూ బిల్లులు చెల్లించక్కరలేదని గత ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డి ఇచ్చిన హామీ ఇప్పుడు లబ్ధిదారుల కొంపముంచుతోంది. అప్పటి సీఎం హామీతో బిల్లులు చెల్లించని వారికి ఇప్పుడు వేలాది రూపాయల బిల్లులు అందుతున్నాయి. వాటిని చూసిన వినియోగదారులకు కళ్లు బైర్లు కమ్ముతున్నాయి. ఇంత డబ్బు ఇప్పుడు ఎలా కట్టాలా అని వారు ఆందోళన చెందుతున్నారు. బొబ్బిలి డివిజన్లోని పది మండలాల్లో ఎస్సీ వినియోగదారులు 11,814 మంది ఉండగా, ఎస్టీ వినియోగదారులు 5,141 మంది ఉన్నారు. జిల్లా వాప్తంగా వీరి సంఖ్య భారీగా ఉంది. వీరిలో చాలా మందికి ఇప్పుడు ఉచిత విద్యుత్ షాక్ ఇస్తోంది. ఎస్సీ, ఎస్టీలు నెలకు 50 యూనిట్ల విద్యుత్తును ఉచితంగా వినియోగించుకోవచ్చని కిరణ్కుమార్ రెడ్డి ప్రకటించడంతో రంగంలోకి దిగిన ట్రాన్స్కో అధికారులు గ్రామాల్లోని ఎస్సీ,ఎస్టీ కాలనీలపై దృష్టి సారించి, వినియోగదారులను గుర్తించారు. వారందరికీ ‘ఉచితం’ పథకంలోకి తీసుకువచ్చారు. కుల ధ్రువీకరణపత్రాన్ని అందజేసిన వారికి ఉచిత విద్యుత్ను అమలు చేస్తామని ప్రకటించడంతో తహశీల్దార్ల చుట్టూ తిరిగి సర్టిపికేట్లు చేయించుకున్నారు. ధ్రువీకరణ పత్రాలు పొందిన వారి పేర్లను మొదటి లిస్టుల్లో నమోదు చేశారు. పత్రాలు లేనివారిని పక్కన పెట్టి రెండో లిస్టుకు సిద్ధం చేశారు. అయితే వీటిని ఈ ఏడాది ఫ్రిబవరి నుంచి పూర్తి స్థాయిలో అమలులోనికి తెచ్చారు. 50 యూనిట్ల లోపు వినియోగించిన వారి నుంచి విద్యుత్ అధికారులు డబ్బులు కట్టించుకోవడం లేదు గానీ, బిల్లులు మాత్రం పంపుతున్నారు. అయితే ప్రభుత్వం నుంచి ఈ రాయితీకి సంబంధించిన డబ్బులు ఇప్పటివరకూ పైసా కూడా ట్రాన్స్కోకు జమ కాాలేదు. దీంతో ట్రాన్స్కో అధికారులు ఆ సొమ్మును వినియోగదారుల నుంచి వసూలు చేసేందుకు చర్యలు చేపట్టారు. వినియోగదారులకు పంపుతున్న బిల్లుల్లోనే ఉచిత విద్యుత్ బిల్లుల మొత్తాలను కూడా వేసి చూపిస్తున్నారు. బిల్లులు చెల్లించమని ఒత్తిడి తెస్తున్నారు. బిల్లులు చెల్లించని వారి కనెక్షన్లను తొలగిస్తుండడంతో వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. దీంతో చాలా మంది అప్పులు చేసి వేలాది రూపాయలను కట్టవలసిన పరిస్థితి ఏర్పడింది. బొబ్బిలి మండలంలోని పణుకువలస గ్రామంలోని ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులకు ఇప్పుడు వేలాది రూపాయలు బిల్లులు అందుతుండడంతో వారంతా గగ్గోలు పెడుతున్నారు. రూ. 1,314 బిల్లు వచ్చింది మేము, మా కొడుకులం కలిసి ఉంటున్నాం. ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీలకు ఉచితంగా కరంటు ఇస్తారంటే మేమెవ్వరమూ బిల్లులు కట్టలేదు. ఇప్పుడు 1,314 రూపాయలు వచ్చింది. పేదోళ్లం ఇంత డబ్బు ఇప్పుడు ఎలా కడతాం. - జలుమూరు వెంకన్నదొర, చిన్నమ్మి, ఎం పణుకువలస -
పదవులే సామాజిక న్యాయమా?
పౌరుల సమస్యలను ఓట్లతో కొలుస్తుండటం వల్లనే సామాజిక న్యాయంలోని ఆర్థిక, సామాజిక అంశాలు తరచుగా మరుగున పడుతున్నాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీలను, మైనారిటీలను ఉద్ధరిస్తామంటున్న నాయకులంతా మాట్లాడేది పదవుల పంపకం గురించే. ఆయా వర్గాలు ఎదుర్కొంటున్న ఆర్థిక, సామాజిక సమస్యలు వారికి పట్టడం లేదు. అణగారిన వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించామని చెప్పుకుంటున్న నేతలు ఆ వర్గాల ప్రజలను దుర్భర పరిస్థితుల నుంచి బయటపడేసే చర్యల పట్ల ఉపేక్ష చూపుతున్నారు. అణగారిన వర్గాల నుంచి ఎదిగి వచ్చిన నాయకులు పదవులను, హోదాలను తమ సామాజిక వర్గాలను దుర్భర దారిద్య్రం నుంచి, సామాజిక అణచివేత నుంచి విముక్తి చేసే సాధనాలుగా ఉపయోగించాలి. అది వారి కనీస బాధ్యత. సామాజిక న్యాయం పేరిట తమ కులానికి, మతానికి, తెగకు, ప్రాంతానికి, జిల్లాకు పదవులు దక్కాలనే నినాదాలు, వివాదాలు పదేపదే వినపడుతుంటాయి. ప్రభుత్వాలు, పార్టీలు కూడా పదవులను ఆ ప్రాతిపదికపైనే పంపిణీ చేశామని, అదే సామాజిక న్యాయమని చెబుతుంటాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత సామాజిక తెలంగాణ, సామాజిక ఆంధ్ర ఏర్పడాలనే చర్చ కూడా ఇటీవల సాగుతోంది. సామాజిక న్యాయం గురించి ఇప్పుడు ఎక్కువగానే మాట్లాడుతున్నాం. కానీ, సామాజిక న్యాయం విస్తృతిని గురించి మాత్రం తక్కువగా ఆలోచిస్తున్నాం. ఇంగ్లిష్ సోషల్ జస్టిస్కు సమానార్థకంగా సామాజిక న్యాయం వాడుతున్నాం. రోమన్ న్యాయదేవత పేరు ‘జస్టిటియా’ నుంచే జస్టిస్ పదం వాడుకలోకి వచ్చింది. క్యాథలిక్ ఆలోచనాపరులతో 1840 నుంచి సోషల్ జస్టిస్ అనే భావన వాడుకలోకి వచ్చినట్టు చరిత్ర చెబుతున్నది. ప్రముఖ రాజనీతి శాస్త్రవేత్త జాన్ స్టువర్ట్ మిల్ దీనిని విస్తృతంగా ఉపయోగించారు. ఆయన తన ‘యుటిలిటేరియనిజం’లో ‘‘సమా జంలోని ప్రతి వారిని సమానత్వ దృక్పథంతో చూడాలి. వనరులతో సహా సమా జంలోని అవకాశాలన్నీ సమాన ప్రాతిపదిక పైనే పంపిణీ జరగాలి’’ అని ప్రతిపాదించారు. ఆ విధంగా చూస్తే అరిస్టాటిల్ నుంచి అంబేద్కర్ వరకు సామాజిక, రాజనీతి శాస్త్రవేత్తలు, తత్వవేత్తలు చాలా మందే సామాజిక న్యాయం గురించి లోతైన వ్యాఖలు చేశారు. ‘‘సమాజంలో మానవుడు సంపూర్ణ వ్యక్తిగా రూపొందాలి. న్యాయం, చట్టం లేకుండా మనిషి బతికితే ఆ పరిస్థితులు భయానకంగా ఉంటాయి’’ అని అరిస్టాటిల్ అన్నాడు. 19, 20 శతాబ్దాలలో సోషల్ జస్టిస్పై విస్తృతంగా చర్చ సాగింది. బాబా సాహెబ్ అంబేద్కర్కు ఆచార్యులైన జాన్ డ్యూయి లాంటి వారు దీనిని బాగా ప్రచారంలోకి తీసుకొని వచ్చారు. అమెరికా మానవ హక్కుల ఉద్యమ నేత, నల్ల జాతి రత్నం మార్టిన్ లూథర్కింగ్ ‘‘అన్యాయం తాండవిస్తున్న ప్రతి చోటా న్యాయం లేచి నిలబడు తుంది’’ అని పలికి ఎందరికో ఉత్తేజాన్ని కలిగించారు. అంబేద్కర్ మాటల్లో చెప్పాలంటే ‘‘సామాజిక న్యాయానికి సమానత్వం, స్వేచ్ఛ, సౌభ్రాతృత్వం పునాదిగా ఉండాలి’’. అంటే సామాజిక న్యాయం... కులం, వర్ణం, అధికారం, హోదా, లింగ విభేదాలు సమసిపోయేట్టు చేసే ఆయుధం కావాలని ఆయన ఆకాంక్ష. సమాజంలోని ఆర్థిక వనరులు, సామాజిక రాజకీయ అవకాశాలు సమంగా పంపిణీ జరగాలనేదే ఆయన దృక్పథం. ఆ వెలుగులోనే సామాజిక న్యాయం అనే అంశాన్ని విశ్లేషించాల్సి ఉంటుంది. ఓట్ల కొలబద్ధపై సామాజిక న్యాయం నేటి సామాజిక న్యాయం చర్చంతా రాజకీయరంగంపైనే కేంద్రీకరించి ఉంది. కులాలు, మతాలు, తెగలు, ప్రాంతాలు తమ రాజకీయ వాటాల గురించే ఎక్కు వగా మాట్లాడుతున్నాయి. ఆయా సమూహాల్లోని అభివృద్ధి చెందిన లేదా ఎదిగి వచ్చిన శక్తులే ఈ చర్చ ఎక్కువగా చేస్తున్నాయి. రాజకీయ ప్రయోజనాల కోసం పార్టీలు, ప్రభుత్వాలు సామాజిక న్యాయంపై చర్చను పూర్తిగా పదవులు పంపకం వ్యవహారంగా మార్చేస్తున్నాయి. రాజకీయ పార్టీలకు, ప్రభుత్వాలు నడిపే వారికి అంతిమంగా కావాల్సింది ఓట్లే. అందువల్ల సమాజంలోని మెజార్టీ జనాభాగా లేదా నిర్ణయాత్మక జనాభాగా ఉన్న కులాలకు ఎక్కువ ప్రాధాన్య తనిస్తూ, తక్కువ జనాభా కలిగిన, సంఖ్యాపరంగా ప్రాధాన్యంలేని వారిని లెక్కలోకి తీసుకోవడమే లేదు. దీంతో వారికి రాజకీయ రంగంలో కూడా సరైన ప్రాతినిధ్యం లభించడం లేదు. అందుకే రాజకీయపరమైన సామాజిక న్యాయం చాలా సమూహాలకు అందడం లేదన్నది నిర్వివాదాంశం. పౌరుల సమస్యలను ఓట్లతో కొలుస్తుండటం వల్లనే సామాజిక న్యాయం లోని విడదీయరాని అంశాలైన ఆర్థిక, సామాజిక అంశాలు తరచుగా మరుగున పడుతున్నాయి. మనదేశంలో కులాలు, తెగలు, మతాలు ఎన్నో ఏళ్లుగా ఉనికిలో ఉన్నాయి. వాటిలో కొన్ని తరతరాలుగా సర్వసౌకర్యాలూ అనుభ విస్తూ, ఆధిపత్యంలో కొనసాగుతుంటే, మరికొన్ని అభివృద్ధి ఫలాలను అందు కోలేకపోతున్నాయి. నిజానికి సామాజిక న్యాయం అవసరమయ్యేది ఇక్కడే. పార్టీలు, ప్రభుత్వాలు కొన్ని కులాలకు, తెగలకు, మతాలకు ప్రాతినిధ్యం కల్పించడం ద్వారా ఆచరణలో ఆయా వర్గాలలో ఎదిగి వచ్చిన నాయకులకు మాత్రమే ప్రయోజనం చేకూరడం సర్వసాధారణంగా మారింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ వగైరాలను ఉద్ధరిస్తామంటున్న నాయకులంతా మాట్లాడేది పదవుల పంపకం గురించే. ఆయా వర్గాలు ఎదుర్కొంటున్న ఆర్థిక, సామాజిక సమస్యలు వారికి పట్టడం లేదు. ముస్లింలకు, క్రైస్తవులకు ప్రాతినిధ్యం కల్పించామని గొప్ప లు చెప్పుకుంటున్న నేతలు ఆ వర్గాలలోని ప్రజానీకాన్ని వారు అనుభవిస్తున్న దుర్భర పరిస్థితుల నుంచి బయటపడేసే చర్యల పట్ల ఉపేక్ష చూపుతున్నారు. పదవులు సామాజిక న్యాయ సాధనాలు కావాలి ఒకవైపు అధికార వర్గాలు తమ రాజకీయ ప్రయోజనం కోసం సామాజిక న్యాయాన్ని వాడుకుంటుంటే, రెండో వైపు ‘సామాజిక న్యాయం’ పేరిట పదవులు పొందిన నాయకులు, పొందాలనుకుంటున్న నాయకులు అదే తమ ఎజెండాగా చెప్పుకుంటున్నారు. ఒక రకంగా చెప్పాలంటే సామాజిక న్యాయం అనే పదం నేడు అపభ్రంశానికి గురైంది. నిజమైన అర్థంలో దాన్ని ఆచరింపబ డటం లేదు. అలా అని రాజకీయ రంగంలో సామాజిక న్యాయం అమలు కానవసరం లేదని కాదు. ఆయా వర్గాలకు ఆ భాగస్వామ్యం, ప్రాతినిధ్యం దక్కాల్సిందే. కానీ అది అంత వరకే పరిమితం కారాదు. అదే పరమావధి కాకూ డదు. అది ఒక ఆరంభంగా భావించి అణగారిన వర్గాల నుంచి ఎదిగి వచ్చిన నాయకులు పదవులను, హోదాలను తమ సామాజిక వర్గాలను దుర్భర దారి ద్య్రం నుంచి, సామాజిక అణచివేత నుంచి విముక్తి చేసే సాధనాలుగా ఉపయో గించాలి. సామాజిక న్యాయ సూత్రాన్ని ఆసరాగా చేసుకొని పదవులు పొందిన వారు నిర్వర్తించాల్సిన కనీస బాధ్యత ఇది. దేశంలోని కుల వ్యవస్థ సామాజిక న్యాయ సూత్రానికి విరుద్ధమైన భావ జాలాన్ని మన మెదళ్లలో నింపింది. మనిషి కులాన్ని బట్టి ఆర్థిక, సామాజిక స్థితిగతులు నిర్ణయమవుతున్నాయి. నేటి ఆధునిక ప్రజాస్వామ్య యుగంలో సైతం కుల వ్యవస్థ నిచ్చెన ఎగువ మెట్ల పైన ఉన్న శక్తులు కింద ఉన్న వారిని పైకి రానీయకుండా అడ్డుకోవడం ఆనవాయితీగానే ఉంది. దీంతో ఆ వర్గాలు సామాజిక, ఆర్థిక ఫలితాలను అందుకోలేకపోతున్నాయి. తరతరాలుగా జరుగు తున్న ఈ దుర్మార్గమైన వివక్షను పాలక వర్గాలు మరింత పెంచి పోషిస్తున్నాయి. ఆ వివక్షను రూపుమాపడానికి కృషి చేయాల్సిన అణగారిన వర్గాల రాజకీయ నాయకత్వం తమ ఉనికిని కాపాడుకోవడం కోసం ఆధిపత్య వర్గాలతో మిలా ఖత్ అవుతున్నది. ఫలితంగా అణగారిన వర్గాలు ఇంకా అణచివేతకు గురవు తున్నాయి. ఇది తీవ్ర సంక్షోభానికి దారి తీస్తున్నది. దీనిపై విస్తృతంగా చర్చ జరగాలి. అంతరాలు కూలితేనే... భూమి, ఉపాధి, విద్య, వైద్యం, ఉద్యోగాలు తదితర అంశాల్లో అణగారిన వర్గాలకు దక్కాల్సిన సమభాగం ఇంకా అందడంలేదు. భూమిలేని పేదలు రోజు రోజుకీ పెరుగుతున్నారు. ఆర్థిక రంగంలో వచ్చిన పెనుమార్పులు కాస్తో, కూస్తో భూములున్న పేదలను భూమిలేని వ్యవసాయ కూలీలుగా మార్చి, బజారున పడేశాయి. ప్రైవేటు విద్యా సంస్థల ప్రయోజనం కోసం ప్రభుత్వ పాఠశాలలను ప్రభుత్వాలే ధ్వంసం చేశాయి. కార్పొరేట్ వైద్య రంగం కోసం ప్రభుత్వ వైద్య వ్యవస్థకు కూడా అదే గతి పట్టించాయి. ఫలితంగా నిరుపేదలు జీవించే హక్కునే కోల్పోతున్నారు. ఆదివాసులు, దళితులు సాధారణ జ్వరాల కు సైతం చనిపోవాల్సి వస్తోంది. సంప్రదాయక వృత్తులు దెబ్బతినడం వల్ల వెనుకబడిన కులాల వారు ఉపాధిని కోల్పోయి, ఆకలిచావులకు, ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఎస్సీ, ఎస్టీలపై అఘాయిత్యాలు కూడా రోజురోజుకీ పెరుగు తున్నాయి. నిత్యం దేశంలో ఏదో ఒక మూల దళిత మహిళలపై అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. ఆత్మగౌరవంతో తలెత్తి నిలిచిన యువ కుల తలలు తెగి పడుతూనే ఉన్నాయి. ఇలాంటి దురన్యాయాలు అంతం అయినప్పుడే న్యాయం జరుగుతుంది. సామాజిక న్యాయం మూల సిద్ధాంతానికి సరైన అర్థం దొరుకుతుంది. ఇటీవలే తుదిశ్వాస విడిచిన ప్రముఖ మానవ హక్కుల నేత జస్టిస్ కృష్ణయ్యర్ ‘‘సమాజంలో ఎవరైనా అవస్థల పాలవు తున్నారంటే మనం సిగ్గుతో తల వంచుకోవాలి’’ అని అన్నారు. అందుకే ఇటువంటి అన్ని రుగ్మతల కు విరుగుడుగా అంబేద్కర్ నాయకత్వంలో రూపొందిన భారత రాజ్యాంగం, 38వ అధికరణం ద్వారా సామాజిక న్యాయానికి చట్టబద్ధ పరిష్కారాన్ని చూపిం ది. ‘‘జాతీయ జీవన రంగాలన్నిటిలో, సామాజిక, రాజకీయ, ఆర్థిక న్యాయం పెంపొందించు సామాజిక వ్యవస్థను వీలైనంత సమర్థవంతంగా సమకూర్చి దానిని కాపాడటం ద్వారా దేశ ప్రజల క్షేమాన్ని పెంపొందించడానికి ప్రభు త్వాలు కృషి చేయాలి’’ అని నిర్దేశించింది. దానిని తు.చ. తప్పక అమలు చేయగలిగితేనే సామాజిక న్యాయం సమకూరుతుంది. - మల్లేపల్లి లక్ష్మయ్య (వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు మొబైల్ నం: 9705566213) -
పేదల రుణాలకు ప‘రేషన్’
వీరయ్య రేషన్కార్డులో భార్య, ఇద్దరు పిల్లలతోపాటు మరో ఇద్దరు తమ్ముళ్ల పేర్లు కూడా ఉన్నాయి. వీరయ్య ప్రభుత్వం మంజూరు చేసిన భూమికి ట్రాన్స్ఫార్మర్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. అంతవరకు బాగానే ఉంది. వీరయ్య తమ్ముడు నిరుద్యోగి. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రుణం తీసుకుని స్వయం ఉపాధి పొందాలని భావించాడు. దరఖాస్తు చేసుకోగా అది తిరస్కరణకు గురైంది. ఇదేమిటని జిల్లా ఎస్సీ కార్పొరేషన్లో విచారించగా విషయం తెలిసి అవాక్కయ్యూడు. తెల్లరేషన్కార్డులో ఉన్న సభ్యుల్లో ఒక్కరు మాత్రమే రుణం పొందడానికి అర్హులని అధికారులు తేల్చారు. 101 జీఓ నిబంధనలు కఠినతరం కావడంతో చాలామంది రుణాలు దక్కక ఇబ్బందుల పాలవుతున్నారు. ► రేషన్కార్డులో పేరున్న ఒక్కరికే రుణం ►ఐదేళ్లకు ఒకసారి మాత్రమే అవకాశం ►నిబంధనలు కఠినతరం ►తప్పని 101 జీవో కష్టాలు ►నిరుపేద ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు రుణం ఇక గగనమే కడప రూరల్ : రాష్ట్ర ప్రభుత్వం గుదిబండ లాంటి జీఓ 101ను తీసుకొచ్చింది. దీంతో జిల్లా వ్యాప్తంగా ఉన్న నిరుపేదలైన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు చెందిన వారు తీవ్ర ఇబ్బందుల పాలవుతున్నారు. స్వయం ఉపాధి కోసం రుణం తీసుకుందామన్నా రేషన్ విధించడం (పరిమితం చేయడం) నిరుపేదల పాలిట శాపంగా మారుతోంది. కుటుంబానికి ఒక్కరికే రుణమాఫీ అంటే సరే అనుకున్నారు. ఇప్పుడు రుణం కూడా తెల్ల రేషన్ కార్డు ఆధారంగా అందులో ఒక్కరికి మాత్రమే అవకాశం అని పరిమితులు విధించడం హతాశులను చేస్తోంది. 101 జీఓతో అష్టకష్టాలు 2013-14లో నాటి ప్రభుత్వం బడుగు, బలహీన వర్గాల రుణాల మంజూరుకు సంబంధించి 101 జీఓను తీసుకొచ్చింది. ఈ జీఓపై నాడు పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఆయా వర్గాలకు చెందిన వారు ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. అనంతరం టీడీపీ అధికారంలోకి వచ్చింది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు బాధ్యతలు స్వీకరించారు. కొత్త ప్రభుత్వంలో 101 జీఓ పీడ ఉండదని ఆయా వర్గాలకు చెందిన వారు ఆశించారు. అయితే వారి ఆశలపై నీళ్లు చల్లుతూ పాలకులు ఆ జీఓను ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో యధాతథం చేశారు. దీంతో పేదలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. నిబంధనల ఉరి! ఈ జీఓ ప్రకారం రుణాలు పొందాలనుకుంటే తెల్లరేషన్కార్డు తప్పనిసరి, అలాగే ఆధార్కార్డు ఉండాలి. ఇటీవల మీ-సేవ కేంద్రాల నుంచి పొందిన ఆదాయ, కుల, నివాస ధ్రువీకరణ పత్రాలను పొంది ఉండాలి. అభ్యర్థుల వయస్సు 21 నుంచి 45 సంవత్సరాలలోపు ఉండాలి. ముఖ్యంగా తెల్లరేషన్కార్డుతోనే అసలు చిక్కు ఎదురవుతోంది. కార్డులో ఎంతమంది పేర్లు ఉన్నా ఒక్కరు మాత్రమే రుణం పొందడానికి అర్హులు. ఒకవేళ ఆ రేషన్కార్డులో ఉన్న మరొకరు రుణం పొందాలంటే మరో ఐదు సంవత్సరాల వరకు ఆగాల్సిందే! ఈ నిబంధనల కారణంగా బడుగు, బలహీన వర్గాలకు చెందిన నిరుపేదలు తీవ్ర ఇబ్బందులకు లోనవుతున్నారు. చాలామందికి ఒక్కరికే రేషన్కార్డు పెద్ద కుటుంబాలకు తెల్లరేషన్కార్డు ఒక్కటే ఉండడంతో రుణాలు పొందడానికి చాలా ఇబ్బందుల పాలవుతున్నారు. ఉదాహరణకు తల్లీదండ్రులు లేని వారు తమ్ముళ్లు, చెల్లెళ్లు, అన్నా లేక అక్క సంరక్షణలోనే ఉంటున్నారు. వివిధ కారణాల వల్ల వారికి వివాహాలు కాకపోవడంతో ఉమ్మడి కుటుంబంలా జీవిస్తూ ఒకే తెల్లరేషన్కార్డులో సభ్యులై ఉంటున్నారు. ఆ రేషన్కార్డులో ఉన్న సభ్యులు ఒకరు వ్యవసాయంపై ఆధారపడగా, మరొకరు చదువుకొని ఉద్యోగం రాక నిరుద్యోగిగా ఉంటున్నారు. అలాంటి వారు రుణం పొందాలంటే కష్టతరంగా మారింది. ముఖ్యంగా ఆన్లైన్ దరఖాస్తు విధానంలో పొరపాటున తెల్లరేషన్కార్డులోగల మరో వ్యక్తి దరఖాస్తు చేసినప్పటికీ ఆ దరఖాస్తును వెబ్సైట్ స్వీకరించడం లేదు. ఎస్సీల పరిస్థితి దారుణం గతంలో రుణాలకు సంబంధించి ఎలాంటి నిబంధనలు ఉండేవి కావు. అర్హులు ఎంతమంది ఉన్నా లక్ష్యాలు, నిబంధనల ప్రకారం వారందరికీ ఆయా కార్పొరేషన్లు రుణాలు మంజూరు చేసేవి. కొత్త నిబంధనల కారణంగా ఎస్సీ వర్గాలకు చెందిన వారి పరిస్థితి దారుణంగా తయారైంది. విద్యుత్ సౌకర్యం కింద గతంలో విద్యుత్ లైన్, ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు కోసం దరఖాస్తు చేసుకుని అవి మంజూరైనా ఆ వ్యక్తి లేదా ఆ కుటుంబంలోని మరొక వ్యక్తి రుణం పొందేవారు. ప్రస్తుతం రేషన్కార్డులోగల వ్యక్తి వ్యవసాయానికి సంబంధించి విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ కోసం దరఖాస్తు చేసుకుంటే అతను లేదా అతని కుటుంబంలోని వ్యక్తి ఏ యూనిట్కైనా సరే రుణం కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం లేకుండా పోయింది. ప్రస్తుతం ఎస్సీ కార్పొరేషన్ రుణ దరఖాస్తు ప్రక్రియ ముగిసింది. ఎస్టీ, బీసీల రుణ దరఖాస్తుల ప్రక్రియ మొదలు కానుంది. బడుగు, బలహీన వర్గాల రుణాల విషయంలో ఆంక్షలు సంకెళ్లు విధించడం తగదని నిరుద్యోగులు వాపోతున్నారు. -
గిరిజనుడిపై సీఆర్పీఎఫ్ జవాన్ల కాల్పులు
-
అరుకు ఎంపీ గీత ఎస్టీ కాదు
విజయనగరం మున్సిపాలిటీ :అరుకు లోక్సభ స్థానం నుంచి ఎంపీగా ఎన్నికైన కొత్తపల్లి గీత గిరిజన కులానికి చెందిన వ్యక్తి కారని, అమె ఎన్నికను రద్దు చేసి మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని గిరిజన ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర న్యాయ సలహదారుడు రేగు మహేశ్వరరావు డిమాండ్ చేశారు. కొత్లపల్లి గీత తప్పుడు కుల ధ్రువీకరణపత్రంతో ఎన్నికల్లో పోటీ చేశారని , ఈ విషయంపై పోరాటం చేస్తున్నామని చెప్పారు. ఈమేరకు హైకోర్టులో రిటిపిటీషన్ దాఖలు చేసినట్టు ఆయన తెలిపారు. రెండు, మూడు రోజుల్లో పిటీషన్ విచారణకు వస్తుందన్నారు. సోమవారం పట్టణంలోని ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు . అరుకు ఎంపీగా ఎన్నికైన కొత్లపల్లి గీత... ఆదిఆంధ్రా మాల కులానికి చెందిన వ్యక్తి అని, ఆమె క్రిస్టియన్గా మారడంతో, బీసీ ‘సీ’ కేటగిరీలోకి వెళతారని చెప్పారు. ఈ ఏడాది మార్చిలో తూర్పుగోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ జరిపిన విచారణలో ఈ విషయం తేటతెల్లమైందన్నారు. కొత్తపల్లి గీత గిరిజన తెగకు చెందిన వారు కాదని 2013 సంవత్సరంలో అడ్డతీగల తహశీల్దార్ .... రంపచోడవరం సబ్కలెక్టర్కు నివేదించారని, తరువాత, అదే తహశీల్దార్ డబ్బులుకు లొంగిపోయి గిరిజన కుల ధ్రువీకరణ పత్రం జారీ చేశారని ఆరోపించారు. తప్పుడు ధ్రువీకరణ పత్రాలు సృష్టించి, గిరిజనులకు అన్యాయం చేసిన గీత ఎంపీ పదవిని రద్దు చేసిన తక్షణమే ఎన్నికలు నిర్వహించాలన్నారు. -
ఇందిర జల‘భ్రమ’
ఏలూరు :పేరు గొప్ప.. తీరు దిబ్బ.. పథకాల జాబితాలోకి ఇందిర జలప్రభ కూడా చేరిపోయింది. ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయ లోపంతో జిల్లాలో ఈ పథకం నీరుగారుతోంది. నీటి వనరులు లేనిచోట గొట్టపు బావులు.. లేకుంటే బోర్లు తవ్వి విద్యుత్ సౌకర్యం కల్పించి ఎస్సీ, ఎస్టీ రైతుల బీడు భూములను సాగులోకి తేవాలన్న ఈ పథకం లక్ష్యం డ్వామా, విద్యుత్ శాఖల నిర్వాకం వల్ల నెరవేరడం లేదు. జిల్లా ఎస్సీ, ఎస్టీ రైతుల బీడు భూములను సాగు యోగ్యం చేసేందుకు ఉద్దేశించిన ఇందిర జలప్రభ పథకం ఆచరణలో ఓ భ్రమలాగా మారింది. 2012 నుంచి పథకం లక్ష్యాన్ని ప్రభుత్వాలు నీరుగారుస్తూ వచ్చాయి. గడచిన రెండేళ్ల పురోగతిని పరిశీలిస్తే ఈ పథకం ఎండమావిగా మారిందన్న విమర్శలున్నాయి. దీంతో రైతులు పూర్తిస్థాయి ప్రయోజనం పొందలేక భూములను సాగు చేయలేక అవస్థలు పడుతున్నారు. భూములకు చేరువలో ఎలాంటి నీటి వనరు లేకపోతే గొట్టపు బావులు లేదా బోర్లు తవ్వి.. వాటికి విద్యుత్ సౌకర్యం కల్పించి, మోటార్లు అమర్చాల్సి ఉంది. అయితే అధికారులు మాత్రం బోర్లు తవ్వి వదిలేస్తున్నారు. వ్యవసాయ భూములకు బోర్లు వేయడం జోరందుకున్న సమయంలో కరెంట్ కనెక్షన్ ఇవ్వడంలో విద్యుత్, డ్వామా శాఖల మధ్య సమన్వయ లోపం వల్ల పథకం అడుగడుగునా నీరు గారిపోతోందన్న విమర్శలున్నాయి. బోర్లకు విద్యుత్ సదుపాయాన్ని కల్పించకపోవడంతో ఐజేపీ పథకం కోసం నిధులు ఖర్చు చేసినా ఫలితం కనిపించటం లేదు. విద్యుత్ అధికారులు మాత్రం కనెక్షన్ల ఏర్పాటుకు తమకు సొమ్ములు జమ పడితే గాని చేయలేమని చేతులెత్తేస్తున్నారు. దీంతో భూములు సాగు చేయడంలో జాప్యం చోటు చేసుకుంటోంది. నాలుగు క్లస్టర్ల కింద 18 మండలాల్లో జిల్లాలోని నాలుగు క్లస్టర్లలో బుట్టాయగూడెం, పోలవరం, జీలుగుమిల్లి, దేవరపల్లి, గోపాలపురం, జంగారెడ్డిగూడెం, కొయ్యలగూడె ం, నల్లజర్ల, తాళ్లైపూడి, చింతలపూడి, ద్వారకాతిరువృుల, కామవరపుకోట, లింగపాలెం, పెదవేగి, టి. నర్సాపురం, భీమడోలు, దెందులూరు, ఉంగుటూరు మండలాల్లో 1572 బ్లాకుల కింద ఎస్సీలు 6,153 మందికి 9,167 ఎకరాలు, ఎస్టీలు 2377 మందికి 6676 ఎకరాల్లో మొత్తం 15,843 ఎకరాలు సాగు యోగ్యం చేయాలనేది లక్ష్యంగా నిర్ణయించారు. ఇప్పటి వరకు 937 బ్లాకుల్లో 9,885 ఎకరాల్లో సాగుకు ఏర్పాట్లు చే శారు. 926 బోర్లును ఏర్పాటు చేయాలని నిర్ణయించగా, ఇప్పటి వరకు 683 బోర్లను మాత్రమే తవ్వారు. విద్యుత్ సౌకర్యం కల్పించడానికి 573 దరఖాస్తులను రైతుల నుంచి స్వీకరించిన అధికారులు విద్యుద్దీకరణను కేవలం 269 మందికే పూర్తిచేశారు. సగానికి పైగా విద్యుత్ సౌకర్యం కల్పించలేదు. దీంతో బడుగు రైతుల భూములు పూర్తిస్థాయిలో సాగుయోగ్యం కావడం లేద న్న విమర్శలు వస్తున్నాయి. ఇప్పటి వరకు రూ.17 కోట్ల మేర ఖర్చు చేశారు. నీరందటం లేదని రైతులు గగ్గోలు విద్యుత్ కనెక్షన్ల ఏర్పాటులో తీవ్ర అలసత్వం కారణంగా నీరు అందడం లేదని రైతులు వాపోతున్నారు. ప్రతి పది ఎకరాలకు ఒక బోరు చొప్పున ఇందిర జలప్రభ పథకంలో అసైన్డ్ భూముల రైతులకు విద్యుత్ కనెక్షన్లు ఏర్పాటు చేయూలి. ఉద్యానవన పంటలైన మామిడి, జీడిమామిడి, నిమ్మ, పామాయిల్ వంటి పంటలు మాత్రమే సాగుచేయాలి. అరుుతే చింతలపూడి, గోపాలపురం మండలాల్లో ఒక్క బోరు వల్ల పది ఎకరాలకు సాగునీరు అందక మొక్కలు ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇందిర జలప్రభ కింద 2, 3 ఎకరాలు ఉన్న లబ్ధిదారులకు కూడా బోరు వేయాలన్న డిమాండ్ ఉన్నా ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. దీన్ని ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్ ద్వారా అమలు చేయాలని పలువురు రైతులు కోరుతున్నారు. మంజూరైన 7.5 హార్స్పవర్ మోటారు వల్ల ఉపయోగం లేదని 12.5 హార్స్ పవర్ మోటారు అందజేయాలని రైతులు కోరుతున్నా ప్రభుత్వం పెడచెవిన పెడుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కామవరపుకోట మండలంలో ఇదీ పరిస్థితి... కామవరపుకోట మండలానికి 160 బోర్లు మంజూరు కాగా 140 బోర్లకు డ్రిల్లింగ్ పూర్తయింది. వీటిలో 54 బోర్లకు మాత్రమే విద్యుత్ కనెక్షన్లను ఇచ్చారు. ఇంకా 86 బోర్లకు విద్యుత్ కనెక్షన్లు ఇవ్వాల్సి ఉంది. విద్యుత్ లేకపోవడం వల్ల లబ్ధిదారులు పక్క రైతుల నుంచి నీటిని కొనుగోలు చేస్తున్నారు. సాధారణంగా సీజన్ కు ఇంతని నీటికి సొమ్ములు వసూలు చేయడం ఆనవాయితీ. అయితే కామవరపుకోట మండలంలోని కొన్ని ప్రాంతాలలో పంటపై వచ్చే ఆదాయానికి నూటికి మూడు రూపాయల చొప్పున నీటి పన్ను చెల్లించాల్సి వస్తోందని కొందరు లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కరెంట్ ఇవ్వలేదు 2013లో ఇందిర జలప్రభ పథకం కింద బోరు వేశారు. ఇప్పటివరకు కరెంట్ కనెక్షన్ ఇవ్వలేదు. నాలుగు ఎకరాలలో మొక్కజొన్న చేను వేశాను. పక్క రైతు వద్ద నుంచి నీటిని వాడుకుంటున్నాను. ఇందుకుగాను రైతుకు పంట ఆదాయంపై నూటికి మూడు రూపాయలు చెల్లించాల్సి వుంది. - వై.రఫాయేలు, లబ్ధిదారుడు, పాతూరు (కామవరపుకోట). -
'బడ్జెట్'లో కళ్యాణలక్ష్మీకి ప్రత్యేక నిధులు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ లో కళ్యాణలక్ష్మీ పథకానికి ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు ప్రత్యేకంగా నిధులను కేటాయించారు. కళ్యాణ లక్ష్మీ పథకంలో ఎస్సీలకు 150 కోట్లు, ఎస్టీలకు 80 కోట్లు కేటాయించారు. 2014-19 వరకు ఎస్సీల అభివృద్ధి కోసం 50 కోట్ల రూపాయలు ఖర్చు చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకెళ్తుందని ఈటెల తన ప్రసంగంలో తెలిపారు. ఎస్సీల సబ్ ప్లాన్ కు 7579 కోట్లు, ఎస్టీల సబ్ ప్లాన్ కు 4559 కోట్లు, బీసీల సంక్షేమానికి 2022 కోట్లు, మైనారిటీ సంక్షేమానికి 1030 కోట్ల కేటాయింపు జరిగింది. -
కొత్తపల్లి గీత కులంపై వివాదం: హైకోర్టు విచారణ
హైదరాబాద్ : అరకు ఎంపీ కొత్తపల్లి గీత ఎస్టీ కాదంటూ దాఖలైన పిటిషన్పై గురువారం హైకోర్టు విచారణ జరపనుంది. అరకు లోక్సభ నియోజక వర్గం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున కొత్తపల్లి గీత పోటీ చేసి విజయం సాధించిన సంగతి తెలిసిందే. కాగా ఎన్నికల సందర్భంగా గీత నామినేషన్ వేసేటపుడు తప్పుడు కుల ధ్రువీకరణ పత్రాలు పొందుపరిచారంటూ ఎన్నికల సమయంలోనే అరకు నుంచి టీడీపీ తరపున లోక్సభ స్థానానికి పోటీ చేసిన గుమ్మడి సంధ్యారాణి పిటిషన్ దాఖలు చేశారు. ఆ కేసులో తదుపరి విచారణను కోర్టు గురువారం చేపట్టనుంది. ఇదే విషయంపై గుమ్మడి సంధ్యారాణి మాట్లాడుతూ కొత్తపల్లి గీతపై తాను ఎన్నికల పిటిషన్ దాఖలు చేయడం వాస్తవమేనన్నారు. ఆమె ఎస్టీ కాదని తాము ఫిర్యాదు చేశామని, కొత్తపల్లి గీత లేదా ఆమె తరపు న్యాయవాది గురువారం కోర్టుకు హాజరు కావాలని నోటీసులు పంపినట్లు చెప్పారు. -
నిరుపేద యువతులకు వరం.. ‘కల్యాణ లక్ష్మి’
వరకట్న దురాచారం రాజ్యమేలుతున్న ప్రస్తుత సమాజంలో ఆడపిల్ల పెళ్లిళ్లు చేసిన కుటుంబం అప్పులపాలవుతున్న పరిస్థితి ఉంది. ఉన్నత చదువులు చదివిస్తే కట్నం ఇచ్చుకోలేమని తల్లిదండ్రులు తమ కూతుళ్లను మైనార్టీ తీరకముందే వివాహాలు చేస్తున్నారు. ఆడపిల్లలకు అండగా ఉండాలన్న ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం 18 ఏళ్లు నిండిన నిరుపేద ఎస్సీ, ఎస్టీ యువతుల కోసం ‘కల్యాణ లక్ష్మి’ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఆర్థికంగా వెనకబడిన నిరుపేద ఎస్సీ, ఎస్టీ యువతులకు ‘కల్యాణ లక్ష్మి’ పథకం వరం కానుంది. ఆడపిల్లలకు పెళ్లి భారంగా మారిన ప్రస్తుత తరుణంలో, వారి పెళ్లికి ఆర్థికంగా చేయూతనివ్వాలని ప్రారంభించిన ఈ పథకం నిరుపేద తల్లిదండ్రులకు ఎంతో ఊరట కలిగించనుంది. కల్యాణలక్ష్మి పథకానికి సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం తహసీల్దార్, ఎంపీడీఓలకు నూతన మార్గదర్శకాలను జారీ చేసింది. మరో రెండు మూడు రోజుల్లో పూర్తి స్థాయిలో మార్గదర్శకాలు రానున్నాయని అధికారులు పేర్కొంటున్నారు. ఈ పథకం కేవలం ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు చెందిన పెళ్లికాని యువతులకు మాత్రమే వర్తిస్తుంది. రెండు విడతలుగా ఆర్థికసాయం.. కల్యాణలక్ష్మి పథకానికి అర్హులైన వారు స్థానిక తమసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తుతో పాటు స్టడీ సర్టిఫికెట్లు, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రా లు, బ్యాంక్ ఖాతా బుక్ జతచేయాలి. దరఖాస్తులను తహసీల్దార్, ఎంపీడీఓలు పరి శీలించి అర్హులను ఎంపిక చేస్తారు. పథకానికి ఎంపికైన వారికి ప్రభుత్వ ప్రోత్సాహకం గా రూ.53వేలను పెళ్లి రోజు సగం, తర్వాత సంగం పెళ్లి కూతురు ఖాతాలో జమ చేస్తారు. ఇందు కోసం జిల్లాకు సుమారు రూ.25 కోట్లు మంజూరయ్యాయి. -
సంక్షేమం చిరునామా ఏది?
సబ్సిడీ రుణాల్లో వడపోత తెలుగు తమ్ముళ్లకే కమిటీ బాధ్యతలు ఎస్సీ, బీసీల సంక్షేమానికి తూట్లు గుడ్లవల్లేరు : రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏ లబ్ధి పొందాలన్నా తెలుగు తమ్ముళ్ల కనికరం పైనే‘ఆధార’పడి ఉంది. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు సంక్షేమ ఫలాలు అందాలన్నా వారిదయ తప్పనిసరి అవుతోంది. సంక్షేమ కార్పొరేషన్లలో సబ్సిడీ రుణాల్ని పొందాలనుకునే ఈ వర్గాల వారు ప్రభుత్వం విధించిన అర్థంపర్థంలేని నిబంధనలతో నానాఇబ్బందులకు గురవుతున్నారు. గతంలో లోను మంజూరైనప్పటికీ... పంచాయతీల స్థాయిలో ఇటీవల ప్రభుత్వ పింఛన్లను వడపోసిన కమిటీల వారే ఈ సంక్షేమ రుణాల జాబితాను పరిశీలించి అర్హులను ఎంపిక చేస్తున్నారు. పచ్చ చొక్కాలు వేసుకొచ్చే కార్యకర్తలు పాత జాబితాలో ఉంటేనే సబ్సిడీ రుణాలు మంజూరవుతున్నాయని గగ్గోలు పెడుతున్నారు. జిల్లాకు చేరని రూ.23కోట్ల సబ్సిడీలు... జిల్లాలో 2013-14 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రుణాలు పొందాలని గత అక్టోబరులో వేలాది మంది దరఖాస్తు చేసుకున్నారు. ఎస్సీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఇంటర్వ్యూలు చేసి జిల్లాలో 2,108మందికి రుణాలు మంజూరు చేశారు. అయితే యూనిట్లను గ్రౌండ్ చేసేందుకు కావాల్సిన రూ.11కోట్ల సబ్సిడీలు జిల్లాకు చేరలేదు. బీసీ కార్పొరేషన్కు సబ్సిడీలుగా రూ.12కోట్లు ఇవ్వాలి. వీటి కోసం 1,800మంది బీసీలు ఎదురు చూస్తూ... దిక్కు తోచని స్థితిలో ఉన్నారు. డీడీలు, డాక్యుమెంట్ల పేరిట వారు వేలాది రూపాయల చేతిచమురు వదిలించుకున్నారు. అయితే రుణాలు చేతికి రాకపోగా... కొత్తగా వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం మంజూరైన అర్హుల జాబితాల వడబోత కార్యక్రమాన్ని చేపట్టిందని బాధితులు ఆరోపిస్తున్నారు. ఈ విషయమై జిల్లా ఎస్సీ కార్పొరేషన్ ఈడీ ఎన్.వి.వి.సత్యనారాయణను వివరణ కోరగా మంజూరైన జాబితాల్లో వున్నవారు అర్హులైతే గ్రామస్థాయి కమిటీల వారు గుర్తించి, తమకు పంపుతారన్నారు. వడ్డీ చెల్లించమంటున్నారు... గతేడాది రూ.80వేల రుణం బీసీ కార్పొరేషన్ ద్వారా మంజూరైంది. అందులో రూ.40వేలను బ్యాంకు వాటా కింద నా ఖాతాలో బ్యాంకు వారు వేశారు. సబ్సిడీ రూ.40వేలు ఈ రోజు వరకూ రాలేదు. బ్యాంకు మేనేజరు మాత్రం నా ఖాతాలో వేసిన రూ.40వేలకు వేలల్లో వడ్డీ చెల్లించమంటున్నారు. అసలు రుణమే చేతికి రాలేదు. సబ్సిడీని నిలిపేయడం వలన ఈ తిప్పలన్నీ వచ్చాయి. - నందం నాగేశ్వరరావు, గుడ్లవల్లేరు అర్హులకు ఎగవేసేందుకే.. అర్హులకు సంక్షేమ రుణాలు ఇవ్వకుండా ఎగవేసేందుకే ప్రభుత్వం ఈ అర్థం లేని నిబంధనలను ప్రవేశ పెట్టింది. పాత జాబితాల్లో తెలుగు తమ్ముళ్లకు రుణాలు ఇచ్చుకునేందుకే తెలుగు తమ్ముళ్ల గ్రామస్థాయి కమిటీలకు ఈ బాధ్యతను అప్పగించింది. దీని వలన అర్హులు అన్యాయమవుతున్నారు. - డి.కనకరత్నారావు, గుడ్లవల్లేరు దళిత నేత -
నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు : మంత్రి రవీంద్ర
మచిలీపట్నం టౌన్ : వసతి గృహాల్లో అధికారులు, సిబ్బంది లేని తీరు, నీళ్ల చారు.. కూర వండి వడ్డించని వైనం.. పురుగులతో కూడిన సుద్దన్నం.. మరుగుదొడ్లలో లైట్లు వెలగని స్థితి.. కాలం చెల్లిన మందులు.. అస్తవ్యస్తంగా హాజరు పట్టీల నిర్వహణ.. పిచ్చిమొక్కలు, గడ్డి దట్టంగా పెరిగిన ఆవరణలతో కూడిన వసతి గృహాలు సాక్షాత్తూ రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి కొల్లు రవీంద్రకు దర్శనమిచ్చిన దృశ్యాలు. మంత్రి రవీంద్ర ఆదివారం స్ధానిక పోతేపల్లి రోడ్లో ఉన్న బీసీ, ఎస్టీ సంక్షేమ బాలికల వసతి గృహాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన సందర్భంలో కన్పించిన సం ఘటనలు. స్వయంగా తానే ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలోని వసతి గృహాల పరిస్థితి చూసి మంత్రి ఆశ్చర్యపోయారు. తొలుత ఆయన బీసీ సంక్షేమ బాలికల వసతి గృహాన్ని తనిఖీ చేశారు. ఈ సమయంలో వసతిగృహంలో వార్డెన్తో పాటు మరో ముగ్గురు సిబ్బంది లేరు. విద్యార్థులకు వడ్డించేందుకు అన్నం, నీళ్లచారును అక్కడి సిబ్బంది సిద్ధం చేశారు. కూర మాత్రం వండలేదు. బాలికల వసతి గృహంలో ఉద్యోగులు బాధ్యతగా ఉండకుండా వసతి గృహానికే రాకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పక్కనే ఉన్న ఎస్టీ బాలికల వసతి గృహాన్ని ఆయన పరి శీలిస్తుండగా బీసీ వసతి గృహ వార్డెన్ టీ అనితకుమారి అక్కడకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆమె తీరుపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీ వసతి గృహ బాలికలతో కొద్దిసేపు మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. వార్డెన్ గదిలోకాలం చెల్లిన మందులు ఉంచడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వసతి గృహాల నిర్వహణకు ప్రభుత్వం కోట్లాది రూపాయల నిధులు ఖర్చు చేస్తున్నా అధికారుల నిర్లక్ష్యంతో లక్ష్యం నీరుగారుతోందన్నారు. ఎస్టీ బాలికల వసతి గృహంలో ఉన్న 19మంది విద్యార్థినులకు కూర లేకుండా నీళ్లచారు.. పురుగులతో కూడిన అన్నాన్ని వడ్డించిన వైనంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వసతి గృహంలోని మరుగుదొడ్లకు లైట్లు వెలగకున్నా ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు. హాజరుపట్టీల నిర్వహణ కూడా అస్తవ్యస్తంగా ఉం దని, విద్యార్థినుల మూమెంట్ రిజిస్టర్ను నిర్వహించకపోవడాన్ని మంత్రి పశ్నించారు. త్వరలో బయోమెట్రిక్ విధానం విధుల నిర్వహణలో వసతిగృహాల అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు. వసతి గృహాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఆయన విలేకరులతో మాట్లాడారు. బందరులోని వసతి గృహాలలో సిబ్బంది నిర్లక్ష్యంగా పనిచేస్తున్నారన్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించే వారితీరును ఉపేక్షించేది లేదన్నారు. ప్రతి నెలా పేరెంట్స్ మీటింగ్లు పెట్టాలని సూచించారు. త్వరలో అన్ని వసతి గృహాలలో విద్యార్థులు, సిబ్బందికి బయోమెట్రిక్ విధానం ద్వారా హాజరు వేసే పద్ధతిని అమలు చేస్తామన్నారు. మునిసిపల్ చైర్మన్ మోట మర్రి బాబా ప్రసాద్, వైస్ చైర్మన్ పంచపర్వాల కాళీవిశ్వనాథం, బీసీ సంక్షేమశాఖ డీడీ సీహెచ్ చినబాబు పాల్గొన్నారు. -
ఎస్టీ. ఎస్టీ, మైనార్టీల సంక్షేమమిదేనా?
బడ్జెట్లో పూర్తి అన్యాయం చేశారని ధ్వజమెత్తిన వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు సాక్షి, హైదరాబాద్: ఏపీ ఏర్పడ్డాక ప్రవేశపెట్టిన మొదటి బడ్జెట్లోనే ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు పూర్తి అన్యాయం జరిగిందని, ఈ అంశాన్ని సభ దృష్టికి తీసుకొస్తుంటే గత ప్రభుత్వాలు, అప్పటి సీఎం వైఎస్ ఇందుకు కారణమని నిస్సిగ్గుగా అధికార పక్షం ఎదురుదాడికి దిగుతుందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు దుయ్యబట్టారు. గురువారం అసెంబ్లీ మీడియా పాయింట్లో ఎమ్మెల్యేలు పాలపర్తి డేవిడ్రాజు, అంజాద్ బాషా, జలీల్ఖాన్, వై.విశ్వేశ్వరరెడ్డి మాట్లాడారు. డేవిడ్రాజు మాట్లాడుతూ... దళితులకు వైఎస్ హయాంలో అన్యాయం జరిగిందని, ఎస్సీలు వివక్షతకు గురయ్యారని మంత్రి రావెల సభలో చెప్పడాన్ని ఆక్షేపించారు. మంత్రికి చిత్తశుద్ధి ఉంటే ఎవరి హయాంలో దళితులకు మేలు జరిగిందో బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. దళిత బంధువెవరో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసన్నారు. ఎస్సీల సంక్షేమానికి చంద్రబాబు ఏదో చేస్తున్నారని చెప్పేందుకు రావెల నానా తంటాలు పడుతున్నారని ఎద్దేవా చేశారు. ప్రభుత్వ ఉద్యోగాల వివరాలు ప్రకటించేటప్పు డు ఎస్సీ, ఎస్టీ ఖాళీలను పేర్కొనట్లేదని సభ దృష్టికి తెస్తే మంత్రి దారుణంగా మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అంజాద్ బాషా మాట్లాడుతూ... మైనార్టీ సంక్షేమానికి కట్టుబడాల్సిన ప్రభుత్వం గతంలో అది చేశాం.. ఇది చేశామంటూ ఊకదంపుడు ఉపన్యాసాలు చెబుతోందని విమర్శించారు. వాస్తవానికి బడ్జెట్లో మైనార్టీలకు రూ.371కోట్లు కేటాయించినట్లు చూపుతోందని, కానీ మైనార్టీ విద్యార్థులకు ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్మెంటు అన్నీ పోనూ కేవలం కేటాయించింది రూ.మూడున్నర కోట్లు మాత్రమేనన్నారు. ఈ కేటాయింపులపై సీఎం జవాబు చెప్పాలన్నారు. మైనార్టీల పట్ల చంద్రబాబుకు ప్రేమ ఉంటే మంత్రి నారాయణను ఎలా ప్రమోట్ చేశారో.. అలా ఒక మైనార్టీకి మంత్రి పదవి ఇవ్వొచ్చు కదా అని ప్రశ్నిం చారు. మైనార్టీ ఎమ్మెల్యేలు మాట్లాడుతుంటే మైక్ కట్ చేసి అమానుషంగా వ్యవహరించారంటూ జలీల్ఖాన్ అన్నారు. మైనార్టీలకు కేటాయింపుల్లో జరిగిన అవమానాన్ని ఎలుగెత్తి చెప్పేందుకు అడుగడుగునా అడ్డుకుంటున్న అధికార పార్టీ సభాసంప్రదాయాల గురించి పదేపదే పేర్కొనడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుం దన్నారు. విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ కొత్తగా ఏర్పాటైన ఏపీ వికేంద్రీకరణ దిశగా అభివృద్ధి చేయాలన్నారు. వెనుకబడిన రాయలసీమను విస్మరిస్తే ఉద్యమాలు మొదలవుతాయన్నారు. ఎస్సీ, ఎస్టీ పోస్టుల భర్తీ ఎప్పుడు? ఎమ్మెల్యే పాలపర్తి డిమాండ్ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న ఎస్సీ, ఎస్టీ పోస్టులను ఎప్పటిలోగా భర్తీ చేస్తారో చెప్పాలని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే పాలపర్తి డేవిడ్రాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం అసెంబ్లీ జీరోఅవర్లో ఆయన ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ రాష్ట్ర విభజన జరిగి కొత్త ప్రభుత్వం వచ్చినా ఉద్యోగుల ఖాళీల వివరాలు ప్రకటించలేదని తప్పుపట్టారు. రాష్ట్రంలో 4,300 ఎస్సీ, ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులు ఖాళీగా ఉన్నట్టు మంత్రి చెప్పారని, వాస్తవానికి ఈ సంఖ్య ఇంకా అధికంగా ఉన్నట్టు తమకు సమాచారముందన్నారు. రాష్ట్ర విభజన సమయంలో ఉద్యోగుల పంపిణీకోసం నియమించిన కమలనాథన్ కమిటీ లెక్కప్రకారం రాష్ట్రంలో, సచివాలయం స్థాయి లో 20,600 పోస్టులు ఖాళీగా ఉన్నట్టు తేలిం దని, ఈ నెల 21న ఉద్యోగుల్ని పంపిణీ చేసినా ఖాళీగా ఉన్న పోస్టుల్లో ఎస్సీ,ఎస్టీలవెన్నో తెలుపలేదన్నారు. తమకున్న సమాచారం ప్రకారం ఖాళీ పోస్టుల్లో 15 వేలకుపైగా ఎస్సీ,ఎస్టీలకు చెందినవన్నారు. ఇది నిజమో కాదో చెప్పాలని, ఎస్సీ,ఎస్టీల బ్యాక్లాగ్ పోస్టులు ఎప్పటిలోగా భర్తీ చేస్తారో చెప్పాలని కోరారు. మంత్రి రావెల కిషోర్బాబు స్పందిస్తూ.. త్వరలో పరిశీలించి సమాధానం చెబుతామన్నారు. -
ప్లాన్ ప్రకారమే...
అమలాపురం :ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్కు ప్రభుత్వం తూట్లు పొడుస్తోంది. గత ప్రభుత్వ హయాంలో దళిత కాలనీల్లో చేపట్టిన రహదారుల నిర్మాణాన్ని నిలుపుదల చేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం జీఓ జారీ చేసింది. తద్వారా ఎస్సీ, ఎస్టీల ప్రాంతాల్లో నిధులు కచ్చితంగా ఖర్చు పెట్టాలనే చట్టాన్ని బాబు సర్కారు అపహాస్యం చేసినట్టయింది.దళితులు నివసించే ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కేటాయించే 15 శాతం నిధులను మిగిలిన ప్రాంతాల్లో ఖర్చు చేస్తున్నారని, దీనివల్ల దళితులు నివసించే ప్రాంతాలు అభివృద్ధికి నోచుకోవడం లేదని విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో కిరణ్కుమార్రెడ్డి సర్కార్ ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్ చట్టం చేసింది. ఈ క్రమంలో తమ ప్రాంతాల అభివృద్ధికి ఢోకా ఉండదని దళితులు భావించారు. సబ్ప్లాన్, ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో గత ప్రభుత్వం జిల్లాలోని అనేక గ్రామాల్లో రూ.21.20 కోట్లతో సుమారు 415 సీసీ రోడ్లు నిర్మించేందుకు అనుమతి ఇచ్చింది. రూ.5 లక్షలతో చేపట్టే సీసీ రోడ్లను ఎంపీడీఓ సమక్షంలో గ్రామసభలు పెట్టి పనులను గుర్తించారు. నిధులు కేటాయించిన అనంతరం మున్సిపల్, స్థానిక, సాధారణ ఎన్నికలు రావడంతో ‘కోడ్’ కారణంగా చాలా చోట్ల పనులు చేపట్టలేకపోయారు. జిల్లాలో ఇప్పటివరకు కేవలం పదిశాతం మాత్రమే పనులు పూర్తయ్యాయి. నిధుల వినియోగానికి గడువు పెట్టకపోవడం కూడా పనులు మందకొడిగా సాగడానికి కారణమైంది. కొత్త ప్రభుత్వం ఏర్పాటుతో పనులు కొనసాగించాలని పంచాయతీరాజ్ శాఖ భావించింది. అయితే ఇటీవల పగ్గాలు చేపట్టిన చంద్రబాబు ప్రభుత్వం నిధులు లేవనే సాకుతో సబ్ప్లాన్ పనులు నిలిపివేయాలని జీఓ ఎంఎస్ నంబరు 389 జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఎస్సీ, ఎస్టీ గ్రామాల్లో వివిధ దశల్లో ఉన్న రహదారుల నిర్మాణాలు స్తంభించాయి. అసంపూర్తిగా ఉన్న పనులు పూర్తి చేసినా బిల్లులు వస్తాయన్న నమ్మకం లేక కాంట్రాక్టర్లు వెనకడుగు వేస్తున్నారు. కేటాయించిన నిధులను ప్రభుత్వం నిలిపివేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై సర్పంచ్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తుండగా, దళిత సంఘాలు మండిపడుతున్నాయి. సబ్ప్లాన్ చట్టం ద్వారా తమకు మేలు జరుగుతుందనుకుంటే.. చంద్రబాబు ప్రభుత్వం దానిని అపహాస్యం చేస్తూ జీఓ జారీ చేయడం సమంజసంగా లేదని దళిత సంఘాల నేతలు విమర్శిస్తున్నారు. తక్షణం ప్రభుత్వం జీఓ 389ను ఉపసంహరించుకుని, సబ్ప్లాన్ నిధులతో పనులు చేపట్టాలని డిమాండ్ చేశారు. -
ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్ పక్కాగా అమలు..
-
అయ్యవార్ల రాజకీయం!
అనంతపురం ఎడ్యుకేషన్ : జిల్లా విద్యాశాఖ అధికారి మధుసూదన్రావుపై కేసు నమోదైన విషయం జిల్లాలో కలకలం రేపుతోంది. తనను, సమాచార హక్కు చట్టాన్ని అవమానపరిచారంటూ ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం నాయకుడు పెద్దన్న ఇచ్చిన ఫిర్యాదు నేపథ్యం ఈ పరిస్థితికి దారితీసింది. జిల్లా చరిత్రలో మొట్ట మొదటిసారిగా ఒక జిల్లా విద్యా శాఖ అధికారిపై కేసు నమోదు కావడం విశేషం. గతం నుంచి కూడా జిల్లాలో పని చేసిన డీఈఓల పనితీరును పరిశీలిస్తే మాత్రం ఇక్కడ పని చేయడం కత్తిమీద సాములాగానే అనిపిస్తుంది. చూసీచూడనట్లుగా పోతుంటే ఓకే.. లేదంటే ఇబ్బందులకు గురి చేయడం పరిపాటిగా మారింది. ఈ క్రమంలో కొందరు చేతగాని అధికారులుగా ముద్ర వేసుకున్నారు. ఇదే సందర్భంలో పని చేసినంత కాలం తనదైన ముద్ర ఉండాలనే తాపత్రయంతో నిక్కచ్చిగా పని చేసిన అధికారులు ఇబ్బందులు పడిన సందర్భాలూ ఉన్నాయి. రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా మన జిల్లాలో ఉపాధ్యాయ సంఘాలు ఉన్నాయి. ఒకప్పుడు నాలుగైదు ఉన్న సంఘాలు అనతి కాలంలో పదుల సంఖ్యకు చేరుకున్నాయి. చాలా మంది సంఘాల నాయకులు తమ పంతం నెగ్గించుకునే క్రమంలో అధికారులను ఇబ్బందులకు గురి చేశారు. ముఖ్యంగా ప్రేమానందం డీఈఓగా వచ్చిన తర్వాత ఇలాంటి పరిస్థితులు మరీ ఎక్కువయ్యాయి. గతాన్ని పరిశీలిస్తే.. 2000లో డీఈఓగా పని చేసిన ప్రభాకర్రెడ్డి ముక్కు సూటిగా పని చేశారు. పదోన్నతులు, బదిలీల్లో కౌన్సెలింగ్ పద్ధతి అమలయింది ఈయన హాయంలోనే. ఈ నేపథ్యంలో ఉపాధ్యాయ సంఘాల నాయకులు, డీఈఓ మధ్య పచ్చిగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు నెలకొన్నాయి. చివరకు గుర్తింపు పొందిన సంఘంగా ఉన్న యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు రంగారెడ్డిని సస్పెండ్ చేయడం అప్పట్లో సంచలనం అయింది. ఈ క్రమంలో డీఈఓను ఇబ్బంది పెట్టేందుకు కొందరు నానా రకాలుగా ప్రయత్నాలు చేశారు. అప్పటికి కేవలం ఐదారు ఉపాధ్యాయ సంఘాలు మాత్రమే ఉండేవి. ఆతర్వాత వచ్చిన లక్ష్మీనారాయణ హాయాంలో ప్రశాంతంగా నడిచింది. ఆనందమూర్తి హయాంలో విపరీతమైన అక్రమాలు జరిగాయి. కొందరు ఉపాధ్యాయ సంఘాల నాయకుల పంట పండింది. ‘సింగిల్ ఆర్డర్’ ట్రాన్స్ఫర్ల అంశం రాష్ట్ర వ్యాప్తంగా మారు మోగింది. కొందరు నాయకుల నిర్వాకంతో చివరకు ఆయన్ను బలవంతంగా ఇక్కడి నుంచి తప్పించారు. తర్వాత వచ్చిన భార్గవ్ హాయాం ప్రశాంతంగా నడిచింది. ఆతర్వాత వచ్చిన అబ్దుల్హమీద్ నిబంధనలు అంటూ గట్టిగా స్పందించడంతో అంతే స్థాయిలో ఇబ్బందుల్లో ఇరుక్కుపోయారు. ప్రేమానందం వచ్చిన తర్వాత ఉపాధ్యాయ సంఘాలు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి. నాయకుడిగా ఉంటే ఏదైనా పని చేయించుకోవచ్చనే భావనతో 6-7 సంఘాల నుంచి సుమారు 20కి పైగా తయారయ్యాయి. కొన్ని సంఘాల నాయకులు ప్రేమానందంను ‘ఆట’ ఆడించారు. బెదిరించి మరీ పనులు చేయించుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం డీఈగా పని చేస్తున్న మధుసూదన్రావు పైకి మెత్తగా కనిపించినా ఉపాధ్యాయుల విషయంలో కాస్త కటువుగానే వ్యవహరించారు. ‘టీచరు అంటే బడిలో ఉండాలి’ అనే ధోరణిలో వ్యవహరించి గాడిన పెట్టే చర్యలకు పూనుకున్నారు. ఈ క్రమంలో కొందరు సంఘాల నాయకులు ఈయన్ను ఇబ్బంది పెట్టిన సందర్భాలూ చాలా ఉన్నాయి. ఇక్కడ పనిచేసినంత కాలం తనదైన ముద్ర వేసుకోవాలనే తపనతో కాస్త నోరు జారి చివరకు కేసులో ఇరుక్కునే పరిస్థితి వచ్చింది. -
మాఫీ అన్నారు..‘చేయి’చ్చారు
యాచారం: ప్రతీ నెల 50 యూనిట్లలోపు గృహ వినియోగానికి ఎస్సీ, ఎస్టీలకు బిల్లులు మాఫీ అని కిరణ్ సర్కార్ హయాంలో ఆర్భాటంగా ప్రకటించారు. దీంతో ఆయా వర్గాల్లో హర్షాతిరేఖాలు వ్యక్తమయ్యాయి. వారి ఆనందం నిలవడానికి ఎన్నో రోజులు పట్టలేదు. అప్పటి ప్రభుత్వం సబ్ప్లాన్ కింద నిధులు విడుదల చేయకపోవడంతో పైసా కూడా మాఫీ కాలేదు. మరోవైపు బకాయిలు చెల్లించాలని విద్యుత్ అధికారుల నుంచి ఒత్తిళ్లు తీవ్రమయ్యాయి. దీంతో ఏం చేయాలో పాలుపోక లబ్ధిదారులు లబోదిబోమంటున్నారు. అప్పట్లో మండలంలోని 20 గ్రామాల్లో గృహ వినియోగానికి విద్యుత్ వాడుకునే ఎస్సీ,ఎస్టీలను 2,500 మంది వరకు గుర్తించారు. అందులో 900 మందికిపైగా ప్రతి నెల 50 యూనిట్ల లోపు విద్యుత్ ఖర్చు చేస్తున్నారని గుర్తించి వారికి సబ్ప్లాన్ మాఫీ వర్తించేలా అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ఆయా గ్రామాల్లోని రాజకీయపక్షాల నాయకులు సైతం విద్యుత్ వినియోగంపై చైతన్యం తెచ్చి అధిక శాతం మందికి మాఫీ వర్తింపజేసేలా కృషి చేశారు. మండల పరిధిలోని మంతన్గౌరెల్లి, నందివనపర్తి, మొండిగౌరెల్లి, చింతుల్ల, నల్లవెల్లితండా, తక్కళ్లపల్లి తండా, గునుగల్ తదితర గ్రామాల్లో వందలాది మంది ప్రతి నెల 50 యూనిట్ల లోపు విద్యుత్ ఖర్చు చేసే లబ్ధిదారులున్నారు. బకాయిలు చెల్లించాలని ఒత్తిడి మండలంలోని 2,500 మంది ఎస్సీ, ఎస్టీలకు సంబంధించి బకాయిలు రూ.40 లక్షలకు పైగా ఉండడం, సబ్ప్లాన్ కింద అర్హులైన 900 మంది లబ్ధిదారులకు సంబంధించి ఏడాది కాలంగా రూ.20 లక్షలకు పైగా బకాయిలు పేరుకుపోయాయి. అప్పట్లో ప్రభుత్వ హామీతో లబ్ధిదారులు మాఫీ అవుతుందిలే అని బిల్లులు చెల్లించడమే మానేశారు. రూ. లక్షల్లో బకాయిలు పేరుకుపోయాయి. వాటిని ఎలాగైనా వసూలు చేయాల్సిందేనని అధికారులు పట్టుదలతో ఉన్నారు. దీంతో లబ్ధిదారుల్లో ఆందోళన తీవ్రమైంది. నెలకు రూ.వందల్లో చెల్లిస్తే నేడు బకాయిలు ఉండేవి కావని, ఇప్పుడు రూ. వేలల్లో ఉన్న బకాయిలను ఎలా చెల్లించాలని దిగులు చెందుతున్నారు. కిరణ్ సర్కార్ను నమ్మి నిండా మోసపోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత కేసీఆర్ ప్రభుత్వమైనా తమపై జాలి చూపి విద్యుత్ బకాయిలు మాఫీ చేసేలా కృషి చేయాలని కోరుతున్నారు. -
దళిత యువతుల పెళ్లి మేమే చేస్తాం
-
మూడేళ్లు పూర్తి ప్రయోజలం నాస్తి
పార్వతీపురం : వివిధ శాఖలకు చెందిన అధికారుల మధ్య నెలకొన్న సమన్వయ లోపం, నిర్లక్ష్యం వెరశి ‘ఇందిర జల ప్రభ’ పథకం నత్తనడకన సాగుతోంది. జిల్లాలోని ఎస్సీ, ఎస్టీలకు చెందిన భూములను సాగుకు అనువుగా అభివృద్ధి చేసి, వాటికి పూర్తి స్థాయిలో సాగునీటిని అందించి తద్వారా ఆయా కుటుంబాల ఆర్థికాభివృద్ధికి తోడ్పడాలన్న ఉద్దేశంతో 2011లో ప్రారంభించిన ‘ఇందిర జలప్రభ’ జిల్లాలో కునుకుపాట్లు పడుతోంది. జిల్లాలో 378 బ్లాకులను గుర్తించి, 6,629 ఎకరాలను సాగులోకి తెచ్చి 3,592 మందికి లబ్ధి చేకూర్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. అయితే మూడేళ్లు పూర్తి కావస్తున్నా అధికారుల గణంకాలు కాగితాలకే పరిమితం అయ్యాయి తప్ప, నిర్లక్ష్యంతో నీరుగారుతున్న పథకంఇందిర జలప్రభను విజయవంతం చేసేందుకు గాను డ్వామా, విద్యుత్, వ్యవసాయ, ఇరిగేషన్ తదితర శాఖాధికారులు పనిచేయాల్సి ఉంది. అయితే ఆయా శాఖాధికారుల మధ్య సమన్వయం లోపించడంతో ఈ పథకం లబ్ధిదారులకు ఇప్పటికీ ఫలాలు అందివ్వలేకపోయింది. ఎస్సీ, ఎస్టీల వద్ద ఉన్న భూములు గుర్తించడం, వాటిలో బోర్ వెల్లు వేయడం, ఆ భూమికి 100 శాతం నీటి వసతి కల్పించి వినియోగంలోకి తీసుకురావడం దీని ప్రధాన ఉద్దేశం. అయితే ఆ లక్ష్యం పార్వతీపురం సబ్-ప్లాన్లోని ఎనిమిది మండలాలలో ఎక్కడా నెరవేరలేదు. 100 శాతం సబ్సిడీతో బోరు వెల్కు మోటారు బిగించాలి, అయితే దాదాపు 249 బోర్లు తవ్వినప్పటికీ ఇప్పటి వరకు కేవలం 51 మోటార్లు మాత్రమే ఏర్పాటు చేశారు. లబ్ధిదారుల ఎంపిక నుంచి పథకం అమలు వరకు అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. నీటి వసతి లేని చోట్ల పెద్ద పెద్ద మోటార్లు బిగించడం, అవసరమైన చోట రిగ్ బోరు వేయకపోవడం తదితర లోపాలు అధికంగా ఉన్నట్లు, బోర్లు తవ్వకాలలో, మోటార్లు కొనుగోళ్లలో నాణ్యతా ప్రమాణాలు పాటించలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికి ఏర్పాటు చేసిన ఏడు సోలార్ పంపుసెట్లలో దాదాపు ఆరు మూలకు చేరాయి. పీఓ ఆదేశించినా.. ఐటీడీఏ పరిధిలో వ్యవసాయ వినియోగానికి పనికొచ్చే భూములు దాదాపు 20వేల ఎకరాల వరకు ఉన్నట్లు అంచనా. వీటిలో భాగంగానే 16 వేల ఎకరాలలో ఐటీడీఏ పీఓ రజిత్ కుమార్ సైనీ జీడి మొక్కల పెంపకానికి చర్యలు చేపట్టారు. గత నెల 20న జరిగిన సమావేశంలో ఇందిర జలప్రభపై దృష్టి సారించాలని సంబంధిత అధికారులను పీఓ ఆదేశించినా ఇప్పటికీ ఇందిర జలప్రభ అడుగు ముందుకు పడలేదని సబ్-ప్లాన్లోని ప్రజలంటున్నారు. తమ మధ్య ఉన్న సమన్వయ లో పం, నిర్లక్ష్యాన్ని కప్పి పుచ్చుకునేందుకు, ఆయా శాఖ లకు చెందిన అధికారులు ఉన్నతాధికారులకు తప్పుడు సమాచారం ఇవ్వడం ద్వారా ఇందిర జలప్రభను పక్కదారి పట్టించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఉన్నతాధికారులు నిజనిర్ధారణ ద్వారా మాత్రమే మళ్లీ దీనికి జీవం రాగలదని ప్రజలంటున్నారు. -
రాయితీ రుణాలేవీ?
గతేడాదీ అరకొరే ఈ ఏడాది ఆ ఊసే లేదు లక్ష్యం మేరకు మంజూరుకాని యూనిట్లు స్వయం ఉపాధి కోల్పోతున్న నిరుద్యోగులు ఇంటికో ఉద్యోగమంటూ ఊదరగొట్టారు. నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తామంటూ బీరాలు పలికారు. ఎన్నికలకు ముందు యువతపై చంద్రబాబు వరాల జల్లు కురిపించారు. తీరా అధికారం చేపట్టాక ఆవిషయాన్నే విస్మరించారు. కొత్తగా ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేటు సంస్థలు ఇప్పట్లో వచ్చే అవకాశాలు లేవు. కనీసం స్వయం ఉపాధి ద్వారా నిరుద్యోగులకు సాయమందించాల్సిన సర్కారు ఇప్పటి వరకు ఆ దిశగా దృష్టి సారించలేదు. నిరుద్యోగ యువత జీవితాలతో సర్కారు ఆటలాడుకుంటోంది. విశాఖ రూరల్: ఆర్థిక సంవత్సరం సగానికి చేరుకున్నా.. వివిధ శాఖల ద్వారా అందించే రాయితీ రుణాలు ఇప్పటి వరకు ఒక్కరికి కూడా దక్కలేదు. గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రుణాల రాయితీ నిధులు ఇప్పటి వరకు మంజూరు కాకపోవడం గమనార్హం. అవి వస్తేనే గాని కొత్తవాటికి అవకాశం ఉండదని అధికారులు చెబుతున్నారు. అంటే ఈ ఆర్థిక సంవత్సరంలో నిరుద్యోగులకు ప్రభుత్వం మొండి చెయ్యి చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. సబ్సిడీ రుణాల విషయంలో ప్రభుత్వం గతేడాది తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరించింది. రాయితీ పెంపుపై గత డిసెంబర్ వరకు ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. ఫలితంగా ఎస్సీ, ఎస్టీ నిరుద్యోగులకు అన్యాయం జరిగింది. ఆ ఏడాది ఎస్సీలకు సంబంధించి 1425 యూనిట్లు లక్ష్యంగా అధికారులు ప్రతిపాదించారు. సబ్సిడీ ఎంతన్న విషయాన్ని తేల్చకపోవడంతో జనవరి వరకు ఒక్కటీ మంజూరు కాలేదు. మైనార్టీల విషయంలోనూ అదే పరిస్థితి. బీసీ కార్పొరేషన్ ద్వారా వెనుకబడిన తరగతుల నిరుద్యోగుల కోసం 5750 యూనిట్లను లక్ష్యాంగా నిర్దేశించారు. బ్యాంకు రుణం, లబ్ధిదారుని వాటా, సబ్సిడీ ఇలా మొత్తంగా వీటికి రూ.34.49 కోట్లు కేటాయించారు. వీటిలో మంజూరైన యూనిట్లకు సబ్సిడీ ఇప్పటికీ పూర్తి స్థాయిలో రాలేదు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా రుణ లక్ష్యాలు, మంజూరులో భారీ వ్యత్యాసముంటోంది. ఈ ఏడాది లేనట్టేనా! వాస్తవానికి ఏటా ఏప్రిల్, మేలో యూనిట్ల మంజూరు, నిధుల లక్ష్యం నిర్దేశించి మూడు నెలల్లో రుణాలను మంజూరు చేస్తుంటారు. కానీ ఈ ఆర్థిక సంవత్సరంలో నాలుగు నెలలవుతున్నా.. ఇప్పటి వరకు ఏ శాఖకు రాయితీ రుణ లక్ష్యాలను నిర్దేశించలేదు. ప్రస్తుత పరిస్థితుల్లో సబ్సిడీ రుణాలు అందించే పరిస్థితులు లేవని అధికారులు సైతం చెబుతున్నారు. గతేడాదికి సంబంధించిన రుణాల రాయితీ నిధులు మంజూరైతేనే గాని కొత్తవి ఇచ్చే అవకాశం కనిపించడం లేదు. అయితే రుణాల కోసం నిరుద్యోగులు సంక్షేమ కార్యాలయాల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. అయితే ప్రభుత్వం నుంచి ఎటువంటి ఉత్తర్వులు రాకపోవడంతో అధికారులు వారికి ఎటువంటి భరోసా ఇవ్వలేకపోతున్నారు. యూనిట్ల ఏర్పాటుకు రుణాలిచ్చేందుకు బ్యాంకులు సిద్ధంగా ఉన్నా.. ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా నిరుద్యోగులు స్వయం ఉపాధిని కల్పించుకోలేకపోతున్నారు. -
రుణం.. గగనం
కడప రూరల్: గడిచిన 2013-14 ఆర్థిక సంవత్సరం అస్తవ్యస్తంగా సాగింది. అలాంటి తరుణంలోనే నాటి ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కార్పొరేషన్లకు లక్ష్యాలను, బడ్జెట్ (సబ్సిడీ)ను ఘనంగా కేటాయించింది. దీంతో ఆయా వర్గాలు ఎంతో సంతోషం వ్యక్తం చేశాయి. సబ్సిడీ రుణాలతో లబ్ధి పొందవచ్చని అందరూ భావించారు. అయితే, అనుకున్నదొకటి... జరిగింది మరొకటి. జిల్లా వ్యాప్తంగా ఉన్న అర్హులైన లబ్ధిదారులు రుణాలు అందక తీవ్ర ఇబ్బందుల పాలవుతున్నారు. అన్నీ కష్టాలే! గడిచిన ఆర్థిక సంవత్సరంలో రుణాల ప్రక్రియ కష్టాలతో ప్రారంభమైంది. రుణ మంజూరుకు కొత్త విధానాన్ని ప్రభుత్వం ప్రవేశ పెట్టింది. బ్యాంకు లింకేజీ కింద రుణాల మంజూరుకు ప్రభుత్వమే నేరుగా లబ్ధిదారుల ఖాతాలో సబ్సిడీని జమ చేసేలా చర్యలు చేపట్టింది. ఈ విధానంతో తమకు సబ్సిడీ నేరుగా బ్యాంకులలో పడుతుందని, తద్వారా రుణ మొత్తాన్ని పొందవచ్చని ఆశపడ్డారు. అనంతరం గడిచిన డిసెంబరు 31వ తేదీన రుణాల మంజూరు ప్రక్రియకు సంబంధించి 101 జీఓను ప్రభుత్వం జారీ చేసింది. ఆ జీఓ ప్రకారం వయస్సు నిబంధనను విధించారు. రేషన్కార్డును తప్పనిసరి చేశారు. దీంతో రుణాలకు దరఖాస్తు చేసుకున్న అర్హులైన ఎంతోమంది ఆ జీఓ కారణంగా అనర్హులుగా మారారు. మిగిలిన కొంతమంది నిబంధనల ప్రకారం రుణ అర్హతను పొందారు. అర్హతను పొందిన వారు తమకు రుణాలు వస్తాయని ఆశపడ్డారు. అయితే, వారి ఆశ నిరాశగా మారింది. ప్రభుత్వం లక్ష్యాలను ఆలస్యంగా ప్రకటించింది. అంతలోనే ఎన్నికలు వచ్చి పడ్డాయి. ఫలితంగా ఎన్నికల కోడ్ అడ్డంకిగా మారింది. ఈ తరుణంలో ప్రభుత్వం సకాలంలో స్పందించక పోవడం వల్ల అతికొద్ది మంది మాత్రమే రుణాలు పొందగలిగారు. ఈ నేపథ్యంలో కోడ్ ముగిసింది...తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. నెలలు గడుస్తున్నప్పటికీ రుణాల ఊసే లేకపోవడం, సబ్సిడీ నిధుల ప్రస్తావనే వినిపించకపోవడంతో లబ్ధిదారుల్లో ఆందోళన మొదలైంది. వారు అసలు రుణాలు వస్తాయా? రావా? అనే సందిగ్ధంలో పడ్డారు. ఎందుకంటే గతంలో కూడా రుణానికి అర్హత పొందినప్పటికీ ఆయా శాఖలకు ప్రభుత్వం సబ్సిడీ నిధులను కేటాయించకపోవడం వల్ల రుణాలు పొందలేక పోయారు. ఈసారి కూడా అదే పరిస్థితి పునరావృతమవుతుందనే అనుమానం అర్హుల్లో గూడు కట్టుకుంది. ఎస్టీ బీసీల పరిస్థితి దారుణం కాగా, ఎస్టీలకు 194 యూనిట్లు, అందుకోసం రూ. 1.38 కోట్ల సబ్సిడీని కేటాయించారు. అలాగే బీసీ వర్గాలకు 3134 యూనిట్ల కోసం రూ. 9.40 కోట్ల సబ్సిడీని కేటాయించగా, ఆయా వర్గాలకు ఒక్క రూపాయి కూడా మంజూరు కాకపోవడం, ఒక్కరు కూడా రుణాలు పొందలేకపోయారు. దీంతో ఆయా వర్గాలు తమకు రుణాలు ఎప్పుడొస్తాయని ఎదురు చూస్తున్నారు. 2014-15 రుణాలకు మోక్షం ఎప్పుడో? సాధారణంగా ప్రతి యేటా జూలైలో ఆయా శాఖలకు రుణ లక్ష్యాలను, బడ్జెట్ కేటాయింపులను నిర్దేశిస్తారు. గడిచిన ఆర్థిక సంవత్సరంలో 2013-14కు సంబంధించిన రుణాలే పూర్తి కాలేదు. ఇక ప్రస్తుత 2014-15 ఆర్థిక సంవత్సరానికి రుణాలను ప్రభుత్వం ఎప్పుడు కేటాయిస్తుందో అంతుచిక్కడం లేదు. ఆయా కార్పొరేషన్ల ద్వారా ఆయా వర్గాలకు చెందిన వారు రుణాల ద్వారా లబ్ధి పొందాలని భావించారు. అయితే రుణాలు మంజూరయ్యే పరిస్థితి కనుచూపు మేర కనిపించకపోవడంతో నిరాశ, నిస్పృహలకు లోనవుతున్నారు. -
నిరుద్యోగ యువతకు చేయూత ఏదీ ?
బడ్జెట్ కేటాయింపుల నిధుల విడుదలలో జాప్యం హామీలే గానీ చేతల్లో కొరవడిన సహకారం చిలకపూడి (మచిలీపట్నం) : నిరుద్యోగ యువతకు ప్రభుత్వం చేయూతనిచ్చే అంశం ప్రహసనంగా మారింది. వారి సంక్షేమానికి బడ్జెట్లో నిధుల కేటాయింపు కాగితాలకే పరిమితమవుతోంది. ఉపాధి అవకాశాలు కల్పిస్తామని పాలకపక్ష ప్రజాప్రతినిధులు ఎన్నికల ప్రచారంలో హామీలు గుప్పించారని, వాటి అమలు విషయంలో వారినుంచి సహకారం కొరవడుతోందని పలువురు వాపోతున్నారు. 2013- 14 ఆర్థిక సంవత్సరంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలకు ఉపాధి అవకాశాలు కల్పిం చేం దుకు ప్రభుత్వం బడ్జెట్లో నిధులు కేటాయించింది. బడ్జెట్ ప్రవేశపెట్టి 15 నెలలు కావస్తున్నా నిధులు నేటికీ విడుదల కాలేదని సంబంధిత అధికారులు చెబుతున్నారు. తా ము అధికారంలోకి వస్తే ఇంటికో ఉద్యోగం ఇప్పిస్తామని ప్రస్తుత అధికార పార్టీ నేతలు ఎన్నికల సందర్భంగా హామీలు ఇచ్చిన విష యం తెలిసిందే. అధికారంలోకి వచ్చిన తరువాత ఆ విధంగా ఆలోచన చేయకపోగా.. సంక్షేమ పథకాలకు కేటాయించిన బడ్జెట్ నిధులు విడుదల చేయించడంలో కూడా సహకారం అందించటం లేదని నిరుద్యోగ యువత వాపోతున్నారు. 2013 నుంచి ఎదురు చూపులు 2013 జూన్ నెలలో బీసీ, ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్లు నోటిఫికేషన్లు జారీ చేయటంతో అర్హులైన వారు రుణాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఇందుకోసం బ్యాంకుల అధికారుల నుంచి హామీ పత్రాలను పొంది, దరఖాస్తులతోపాటు సమర్పించారు. వీటితో పాటు ఆయా కార్పొరేషన్లకు సంబంధించి ప్రాజెక్టు రిపోర్టును కూడా అందజేశారు. నిధుల విడుదల గురించి సం బంధిత అధికారులను ప్రశ్నిస్తే.. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఖా తాలను తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు విడదీయాల్సి ఉందని కుంటిసాకులు చెబుతున్నారని యువత ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో దరఖాస్తుదారులు తమకు నిధులు మంజూరవుతాయా? లేదా? అనే సందేహంతో కొట్టుమిట్టాడుతున్నారు. లబ్ధిదారుల వివరాలు.. ఎస్సీ సొసైటీ ద్వారా 3,567, వెనుకబడిన తరగతుల సంక్షేమశాఖ ద్వారా 4,398, గిరిజన సంక్షేమశాఖ ద్వారా 822, వికలాంగ సంక్షేమశాఖ ద్వారా 51 యూనిట్లు మంజూరు చేయడానికి నిర్ణయించారు. వీటిలో మొత్తం 5,307 యూనిట్లు మాత్రమే మంజూరు చేశారు. అ యితే 2013-14 ఆర్థిక సంవత్సరానికి బీసీ సొసైటీ ఆధ్వర్యంలో మొత్తం 1782 మంది లబ్ధిదారులకు రూ. 6.37 కోట్లు మంజూరు చేయాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు కూడా పంపారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి రావడానికి ముందు 851 మంది లబ్ధిదారుల వివరాలు ఆన్లైన్లో ఉంచారు. ప్రవర్తనా నియమావళి అమలులోకి రావటంతో ఆన్లైన్ నిలుపుదల చేశారు. 542 మం ది ఖాతాల వివరాలు ఆన్లైన్లో పొందుపరచాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు. అ యితే ఇంకా 389 మంది లబ్ధిదారులు బ్యాంకు ఖాతాలు, ఇతర ధ్రువపత్రాలు సమర్పించాల్సి ఉందన్నారు. ఎస్సీ సొసైటీ ద్వారా 3,500 యూనిట్ల మంజూరుకు బడ్జెట్లో మొత్తం రూ. 39.46 కోట్ల కేటాయింపు జరిగింది. వీటిలో 3,816 యూనిట్ల మంజూరుకు అనుమతి ఇవ్వటంతో బ్యాంకింగ్ ప్లాన్ కింద 3,710, నాన్ బ్యాకింగ్ ప్లాన్ కింద 106 యూనిట్లు కేటాయించి, రూ. 33.34 కోట్లు చెల్లించడానికి ప్ర ణాళిక రూపొందించారు. గిరిజన సంక్షేమశాఖకు సంబంధించి మొత్తం 822 యూనిట్లు లక్ష్యంగా నిర్ణయిం చగా, 346 యూనిట్లు మాత్రమే మం జూరు చేశారు. వికలాంగుల సంక్షేమశాఖకు సంబంధించి 51 యూనిట్లు మంజూరు చేయాల్సి ఉం డగా, 21 యూనిట్లు మాత్రమే మంజూరు చేశా రు. ఈ లబ్ధిదారులకు ఆయా శాఖల్లో కేటాయింపులు, నిధుల విడుదలలో భారీ వ్య త్యా సం ఉండటంతో రుణాలు మంజూరవుతా యా? లేదా? అన్నది ప్రశ్నార్థకంగా మారింది. కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం సంక్షేమ పథకాల ద్వారా నిరుద్యోగ యువతకు ఎంత మేర చేయూత అందిస్తుందో వేచిచూడాల్సి ఉంది. -
ఏపీ ఎస్సీ, ఎస్టీ హాస్టళ్లపై ఏసీబీ దాడులు
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో ఎస్సీ, ఎస్టీ ప్రభుత్వ అతిథి గృహాలపై ఏసీబీ గురువారం ఉదయం ఏకకాలంలో దాడులు నిర్వహించింది. అనంతపురం, వైఎస్ఆర్ జిల్లా, గుంటూరు, పశ్చిమ గోదావరి, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లోని హాస్టళ్లపై ఏసీబీ అధికారులు దాడులు చేసి రికార్డులు పరిశీలిస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమడోలు , కోట రామచంద్రాపురం, గుంటూరు జిల్లా రెంటచింతల, నెల్లూరు జిల్లా కలవాయి మండలం కుల్లూరు, అనంతపురం జిల్లా అనంతసాగరం మండలం రేవూరు, వైఎస్ఆర్ జిల్లా బద్వేలు, తూర్పు గోదావరి జిల్లా అడ్డతీగల, అన్నవరం, చిత్తూరు జిల్లా తొట్టెంబేడు, రొంపిచర్ల మండలం నడింపల్లి, ఎస్సీ, ఎస్టీ హాస్టళ్లలో ఈ సోదాలు కొనసాగుతున్నాయి. నిధులు దుర్వినియోగం అయినట్లు ఆరోపణల నేపథ్యంలో ఏసీబీ ఈ తనిఖీలు జరుపుతోంది. -
కరెంటు వాడాలంటే ‘కులం’ తేలాలి
విజయవాడ : ఎస్సీ, ఎస్టీ విద్యుత్ వినియోగదారులకు 50 యూనిట్ల విద్యుత్ పథకం కష్టాల్లో పడింది. సబ్సిడీ విద్యుత్ను వినియోగించుకుంటున్న వినియోగదారులు తాము ఎస్సీ, ఎస్టీ వర్గానికి చెందిన వారమంటూ కులధ్రువీకరణ పత్రాన్ని సమర్పించాలని సర్కారు మెలిక పెట్టింది. దీంతో వివిధ జిల్లాల్లోని విద్యుత్ అధికారులు ఎస్సీ, ఎస్టీ వినియోగదారుల నుంచి ధ్రువీకరణ పత్రాలు తీసుకునే పనిలో పడ్డారు. కృష్ణా జిల్లా అధికారులు 30 వేల మందివి, ప్రకాశం జిల్లా అధికారులు 15 వేల మంది, గుంటూరు, నెల్లూరు జిల్లాల అధికారులు మరో 30 వేల మంది నుంచి సర్టిఫికెట్లు తీసుకుని బిల్లులతో జత చేసి సర్కారుకు పంపారు. మిగతా జిల్లాల్లోనూ దాదాపు ఇదే పరిస్థితి. అయినా ప్రభుత్వం తరఫున నిధులు కేటాయించాల్సిన జిల్లా సాంఘిక, గిరిజన సంక్షేమశాఖల అధికారులు బిల్లులు విడుదల చేయడం లేదు. దీంతో సహనం కోల్పోతున్న విద్యుత్ డిస్కంలు దశలవారీగా సరఫరాను నిలిపివేస్తున్నారు. ఫలితంగా దళితవాడల్లో కారుచీకట్లు కమ్ముకుంటున్నాయి. రాష్ట్రంలో దారిద్య్రరేఖకు దిగువనున్న ఎస్సీ, ఎస్టీ విద్యుత్ వినియోగదారులు నెలకు 50 యూనిట్ల వరకూ విద్యుత్ను వినియోగించుకునే వె సులుబాటు కల్పిస్తూ 2013 ఏప్రిల్ ఒకటో తేదీన అప్పటి ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్ పథకాన్ని ప్రకటించారు. 22 జిల్లాల్లోని 17.6 లక్షల ఎస్సీ, ఎస్టీ విద్యుత్ వినియోగదారులకు ప్రయోజనకరంగా ఉండేలా నెలకు 50 యూనిట్లకు విద్యుత్ బిల్లుల చెల్లింపును ప్రభుత్వమే భరిస్తుందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర విభజన జరిగాక ఆంధ్రప్రదేశ్లోని 13 జిల్లాల్లోనూ ఈ విధంగా విద్యుత్ను వాడుకుంటున్న ఎస్సీ, ఎస్టీ వినియోగదారులు సుమారు 8.5 లక్షల మందికి పైగానే ఉన్నారు. గడచిన 14 నెలలుగా వీరికి సంబంధించిన విద్యుత్ సబ్సిడీ బకాయిలు ప్రభుత్వం నుంచి విద్యుత్ డిస్కంలకు విడుదల కావడంలేదు. మూడు నెలల కిందటే బిల్లులు సిద్ధం చేసిన ట్రాన్స్కో అధికారులు బకాయిల్ని జమ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. అంతలోగానే ఎన్నికలు, రాష్ట్ర విభజన జరిగాయి. దీంతో నిధులు విడుదలలో జాప్యం జరిగింది. కృష్ణా జిల్లాలో మొత్తం 1.42 లక్షల మంది ఎస్సీ, ఎస్టీలు ఈ సదుపాయాన్ని పొందుతుండగా, వీరు వినియోగించుకున్న విద్యుత్ సబ్సిడీ కింద ప్రభుత్వం నుంచి రూ. 6 కోట్లకు పైగానే విడుదల కావాల్సి ఉంది. అలాగే ప్రకాశం జిల్లాకు రూ.6.40 కోట్లు, గుంటూరు జిల్లాకు రూ. 7.20 కోట్లు, అనంతపురం జిల్లాకు రూ.13 కోట్లు విడుదల కావాల్సి ఉంది. మిగతా జిల్లాల్లోనూ సగటున 5 నుంచి రూ. 8 కోట్ల వరకూ బకాయిలు జమ కావాల్సి ఉంది. ఈ మొత్తం బకాయిలు సుమారు రూ. 80 కోట్లకు పైగానే ఉందని అధికారులు చెబుతున్నారు. దీనిలో ఎంతో కొంత జమ చేస్తేనే నష్టాల నుంచి గట్టెక్కుతామని విద్యుత్ సంస్థలు ప్రభుత్వానికి విన్నవించినా ఫలితం కనిపించడంలేదు. పరిస్థితి ఇలాగే కొనసాగితే విద్యుత్ సరఫరా నిలిపివేయడం తప్ప తమకు మరో మార్గాంతరం లేదని విద్యుత్ సంస్థలు తేల్చిచెప్తున్నాయి. -
ఎస్సీ, ఎస్టీ పేదలకు చార్జీల షాక్
‘ఉప ప్రణాళిక’ ఆర్భాటమే అమలుకు నోచుకోని పథకం 1.90 లక్షల కుటుంబాలకు ఆశాభంగం బిల్లుల వసూలుకు అధికారులు సిద్ధం ఎస్సీ, ఎస్టీ పేదలపై విద్యుత్ బిల్లుల భారం పడనుంది. 50 యూనిట్లలోపు విద్యుత్ వినియోగించేవారిని ఆదుకుంటామంటూ కిరణ్కుమార్రెడ్డి ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించడంతో ఆయా వర్గాల వారు బిల్లులు చెల్లించలేదు. నేడు వాటికి సంబంధించి ప్రభుత్వం నుంచి ఎలాంటి నిధులూ రాకపోవడంతో అధికారులు బకాయిల వసూలుకు సిద్ధమవుతున్నారు. దీంతో ఇప్పుడు ఆ బకాయిలన్నీ చెల్లించేదెలా అని ఎస్సీ, ఎస్టీ పేదలు గగ్గోలు పెడుతున్నారు. తిరువూరు : గత ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి ఆర్భాటంగా ప్రకటించిన ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళికపై ఎన్నో ఆశలు పెట్టుకున్న పేదలకు ఆశాభంగమే ఎదురవుతోంది. 2013 ఏప్రిల్లో ప్రకటించిన ఈ పథకంలో 50 యూనిట్ల లోపు నెలవారీ కరెంటు వినియోగం ఉన్న కుటుంబాల విద్యుత్ బిల్లులను ప్రభుత్వమే చెల్లిస్తుందని పేర్కొన్నారు. ఈ పథకంపై బుర్రకథ దళాలతో, కళాజాతాలతో ఊరూరా విస్తృత ప్రచారం చేయించారు. గ్రామసభలు నిర్వహించి ఎస్సీ, ఎస్టీల నుంచి దరఖాస్తులు, కులధృవీకరణ పత్రాలు తీసుకున్నారు. జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో లక్షా 90 వేల కనెక్షన్లకు ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక ద్వారా లబ్ధి చేకూరుతుందని అధికారులు అంచనా వేశారు. నెలలు గడుస్తున్నా ప్రభుత్వం నుంచి ఈ ప్రణాళిక ప్రకారం 50 యూనిట్ల లోపు విద్యుత్ బిల్లుల సొమ్ము అందకపోవడంతో విద్యుత్ అధికారులు బకాయిల వసూలుకు రంగంలోకి దిగారు. గ్రామీణ ప్రాంతాలకే ఈ పథకం పరిమితమవుతుందని, పట్టణాల్లోని ఎస్సీ, ఎస్టీ వినియోగదారులు పాత పద్ధతిలో కరెంటు బిల్లులు చెల్లించక తప్పదని అధికారులు చెబుతున్నారు. నెలవారీ 50 కంటే ఒక్క యూనిట్ అధికంగా నమోదైనా మొత్తం బిల్లు చెల్లించవలసి ఉంటుందని కూడా పేర్కొన్నారు. గత మూడు రోజులుగా జిల్లాలో ఏపీఎస్పీడీసీఎల్ అధికారులు, విద్యుత్, రెవెన్యూ అధికారులు బకాయిలున్న వినియోగదారుల సర్వీసులను నిలిపివేస్తున్నారు. గత పాలకులు చెప్పిన మాటలు నమ్మి కరెంటు బిల్లులు చెల్లించలేదని, ఇప్పుడు పెద్ద మొత్తంలో బకాయి చెల్లించడం తమకు సాధ్యపడదని పలువురు ఎస్సీ, ఎస్టీ కుటుంబాల వారు వాపోతున్నారు. జిల్లాలో ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక కింద ప్రభుత్వం నుంచి ఇంతవరకు రూ.5 కోట్ల బకాయిలు రావలసి ఉందని విజయవాడ సర్కిల్ గణాంకాధికారి సత్యనారాయణ తెలిపారు. -
బాలల హక్కులపై విస్తృత ప్రచారం చేయాలి
విజయవాడ సిటీ : బాలల హక్కుల పరిరక్షణపై విస్తృత ప్రచారం కల్పించాలని బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు పేర్కొన్నారు. జిల్లాలో బాలల హక్కుల పరిరక్షణకు తీసుకుంటున్న చర్యలపై సబ్కలెక్టర్ కార్యాలయంలో బుధవారం ఉదయం కమిషన్ సభ్యులు విద్య, వైద్య, ఎస్సీ, ఎస్టీ, బీసీ, పోలీసు, కార్మిక, వికలాంగ శాఖలు, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనా సంస్థ, స్వచ్ఛంద సంస్థలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. కమిషన్ సభ్యులు ఎం.డి. రహిముద్దీన్ , ఎం. సుమిత్ర, ఎస్.మురళీధర్రెడ్డి, డాక్టర్ మమత, రఘువీర్, ఎస్.బాలరాజు సమీక్షా సమావేశంలో పాల్గొని బాలల హక్కుల పరిరక్షణపై సమీక్ష నిర్వహించారు. వారు మాట్లాడుతూ బాలల పరిరక్షణలో భాగంగా విముక్తి కల్పించిన బాలలు తమ స్వశక్తితో నిలబడే వరకూ సంరక్షణా బాధ్యతలను తప్పక తీసుకోవాలన్నారు. దేశ జనాభాలో 40 శాతం ఉన్న బాలల హక్కులను కాపాడాల్సిన బృహత్తర బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందన్నారు. బాలలకు విద్యా హక్కు, పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన, బాల్యవివాహాల నిర్మూలన, బాలల లైంగిక వేధింపులు, తదితర అంశాలపై సంబంధిత అధికారులు దృష్టి కేంద్రీకరించాలన్నారు. మరుగదొడ్లు లేని పాఠశాలల్లో వెంటనే నిర్మించాలని సూచించారు. ప్రతీ నెల సంబంధిత శాఖల అధికారులు సమావేశాలు నిర్వహించి బాలల హక్కుల పరిరక్షణకు చర్యలు చేపట్టాలని వారు సూచించారు. వసతి గృహాలలో తప్పనిసరిగా బాలల హక్కులను తెలిపే విధంగా బోర్డులను ఏర్పాటు చేయాలని, వారికి కలిగే ఇబ్బందులపై ఎవరికి ఫిర్యాదు చేయాలో ఆ బోర్డులపై సూచించాలని చెప్పారు. సమీక్షా సమావేశానికి హాజరైన విజయవాడ సబ్కలెక్టర్ డి. హరిచందన మాట్లాడుతూ బాలల హక్కులపై అందిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించడంతోపాటు కమిషనర్ సూచనలను దృష్టిలో ఉంచుకుని చర్యలు చేపడుతున్నామన్నారు. బాలల హక్కుల పరిరక్షణలో జిల్లా అధికారులు, సిబ్బంది నిర్లక్ష ధోరణి ప్రదర్శిస్తే పరిపాలనాపరమైన చర్యలకు వెనుకాడబోమని కమిషన్ సభ్యులకు సబ్కలెక్టర్ వెల్లడించారు. జిల్లా విద్యాశాఖాధికారి డి. దేవానందరెడ్డి మాట్లాడతూ పాఠశాలల్లో కల్పిస్తున్న వసతులను వివరించారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖాదికారిణి జె. సరసజాక్షి పాఠశాలల్లో విద్యార్థులకు అందిస్తున్న వైద్య సహాయాన్ని, భ్రూణ హత్యల నివారణకు జిల్లాలో 14 క్లస్టర్ అధికారులను నియమించి స్కానింగ్ సెంటర్ల తనిఖీకి తీసుకున్న చర్యలు వివరించారు. నేషనల్ చైల్డ్ లేబర్ ప్రాజెక్టు డైరక్టర్ డి. ఆంజనేయరెడ్డి, జిల్లాలో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు తీసుకుంటున్న చర్యలను వివరించారు. జిల్లా బాలల సంక్షేమ కమిటీ చైర్మన్ నగేష్ మాట్లాడుతూ స్త్రీ, శిశు సంక్షేమ శాఖ, బాల కార్మిక నిర్మూలన సంస్థల ఆధ్వర్యంలో 121 బాల్య వివాహాలను నిరోధించటంతోపాటు, బాల కార్మికులను రక్షించి యజమానుల నుంచి జరిమానాలు వసూలు చేశామన్నారు. జిల్లా అదనపు ఎస్పీ బి.డి.వి. సాగర్ మాట్లాడుతూ బాలల హక్కుల సంరక్షణకు తమ శాఖ అన్ని వేళలా సహాయ సహకారాలు అందించటానికి సిద్ధంగా ఉందన్నారు. సమావేశంలో ఏలూరు రీజియన్ స్త్రీ,శిశు సంక్షేమ శాఖ ప్రాంతీయ సంయుక్త సంచాలకులు సూయిజ్, వాసవ్య మహిళామండలి చైర్పర్సన్ డాక్టర్ రష్మి, జిల్లా స్త్రీ, శిశు సంక్షేమ అధికారిణి కె. కృష్ణకుమారి, వికలాం గుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు కె.వి.వి.ఎస్.నారాయణ, తదితరులు పాల్గొన్నారు. -
‘ఫీజు’కు బూజు
ఏలూరు సిటీ, న్యూస్లైన్ : ఫీజు రీయింబర్స్మెంట్ పథకానికి బూజు పట్టింది. 2013-14 విద్యా సంవత్సరంలో ఆన్లైన్ దరఖాస్తుల గడువును పొడిగిస్తూ వచ్చిన ప్రభుత్వం చివరకు చేతులెత్తేసింది. జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనార్టీ వర్గాల్లోని పేద విద్యార్థులకు చదువుల నిమిత్తం చెల్లించాల్సిన ఫీజుల్లో రూ.38 కోట్ల బకాయిలు ఉన్నాయి. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఈ సొమ్ము విడుదల అవుతుందో లేదోననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో సంబంధిత విద్యార్థులు అప్పులు చేసి మరీ కాలేజీల్లో ఫీజులు కట్టాల్సిన దుస్థితి నెలకొంది. 2014-15 విద్యా సంవత్సరంలో ఫీజు రీయింబర్స్మెంట్ పథకం అమల్లో ఉంటుందా లేదోనని అధికారులు సందేహిస్తుండగా.. విద్యార్థుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. భారీగా బకాయిలు : ఫీజు రీయింబర్స్మెంట్ పథకానికి సంబంధించి జిల్లాలో భారీగా బకాయిలు పేరుకుపోయాయి. జిల్లాలో సాంఘిక సంక్షేమ శాఖ 12వేల మంది ఎస్సీ విద్యార్థులకు ఇంకా రూ.6కోట్లు మేర ఫీజులను చెల్లించాల్సి ఉంది. మరోవైపు బీసీ సంక్షేమ శాఖ 35 వేల మంది బీసీ విద్యార్థులకు రూ.17 కోట్లు, 8వేల మంది ఈబీసీ విద్యార్థులకు రూ.15 కోట్ల మేర ఫీజు బకాయిలు చెల్లించాల్సి ఉంది. వాస్తవానికి జిల్లాలోని లక్ష మందికి పైగా విద్యార్థులకు ఏటా ఫీజు రీయింబర్స్మెంట్ పథకంలో బాగంగా సుమారు రూ.90 కోట్ల నుంచి రూ.వంద కోట్ల వరకూ నిధులు మంజూరు చేయాల్సి ఉంది. 2013-14 విద్యా సంవత్సరంలో అప్పటి ప్రభుత్వం రూ.52 కోట్లు విడుదల చేసినా ఆ సొమ్ములు ఇంకా పూర్తిస్థాయిలో విద్యార్థుల ఖాతాల్లోకి చేరలేదు. దీంతో బకాయిలు భారీగా పేరుకుపోయాయి. కష్టాల్లో విద్యార్థులు ఫీజుల కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసేందుకు ఆధార్ యూఐడీ కావాల్సి ఉండటంతో దరఖాస్తుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. ఆధార్ నమోదు చేయించుకునేందుకు ఈఐడీ(ఎన్రోల్మెంట్ ఐడెంటిటీ) నంబర్ ఉంటే సరిపోదని యూనిక్ ఐడెంటిటీ నంబర్ కూడా కావాలని చెప్పటంతో ఆధార్ కార్డులు లేని విద్యార్థులు తంటాలు పడ్డారు. 2013-14 విద్యాసంవత్సరంలో కొత్తగా కాలేజీల్లో చేరిన విద్యార్థులు దరఖాస్తు చేయలేకపోయారు. సాంఘిక సంక్షేమ శాఖకు సంబంధించి ఎస్సీ విద్యార్థులు 10వేల మంది, బీసీ విద్యార్థులు 22 వేలమంది, ఈబీసీ విద్యార్థులు 12,828 మంది మాత్రమే ఎన్రోల్ చేయించుకోగలిగారు. వీరితోపాటు రెన్యువల్ విద్యార్థుల్లో ఎస్సీలు 16,595మంది, బీసీ విద్యార్థులు 29 వేల మంది, ఈబీసీ విద్యార్థులు 13,990 మందికి దరఖాస్తుల పరిశీలన సందర్భంలో సమస్యలు తలెత్తాయి. ఇలాంటి కారణాల వల్ల వేలాదిమంది విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ పథకం వర్తించలేదు. వర్తించిన వారిలోనూ చాలామందికి బకాయిలు పేరుకుపోయూయి. -
రూ.కోటి స్కాలర్షిప్లు వెనక్కి!
నిధులున్నా ఇవ్వలేని దుస్థితి శాఖల మధ్య సమన్వయలోపం మచిలీపట్నం, న్యూస్లైన్ : బీసీ, ఎస్సీ, ఎస్టీ సంక్షేమశాఖల, ట్రెజరీ అధికారుల మధ్య సమన్వయలోపం విద్యార్థుల పాలిట శాపంగా మారింది. ట్రెజరీ, సంక్షేమశాఖల అధికారుల మధ్య నెలకొన్న సమన్వయలోపం విద్యార్థులను ఇబ్బందులపాలు చేస్తోంది. 2010-11, 2011-12 విద్యాసంవత్సరంలో బ్యాంకు ఖాతా నంబర్లు, పేర్లు తప్పుగా నమోదైన వారికి అప్పట్లో స్కాలర్షిప్ మంజూరు కాలేదు. బీసీ, ఎస్సీ, ఎస్టీ సంక్షేమశాఖల్లో దాదాపుగా వేలాది మంది విద్యార్థులకు స్కాలర్షిప్లు అందాల్సి ఉంది. పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లను విద్యార్థులకు అందజేయాలని ఈ ఏడాది జనవరిలో ప్రభుత్వం కోటి రూపాయలను విడుదల చేసింది. అయితే విద్యార్థులకు సంబంధించిన బ్యాంకు ఖాతా నంబర్లు, పేర్లు సరిచేసే పనిని మూడు సంక్షేమశాఖల అధికారులు గానీ, ట్రెజరీ అధికారులు గానీ చేయడం లేదు. దీంతో విద్యార్థులకు స్కాలర్షిప్ల నిమిత్తం మంజూరైన కోటి రూపాయల నిధులు వెనక్కి మళ్లే ప్రమాదం ముంచుకొస్తోంది. ఇంతా జరుగుతున్నా అధికారులు ఎవ్వరూ విద్యార్థులకు స్కాలర్షిప్లను అందజేసేందుకు సరైన చర్యలు చేపట్టకపోవటం గమనార్హం. రాష్ట్ర విభజన జూన్ 2వ తేదీన జరగనుండటంతో పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్పుల మొత్తం విద్యార్థులకు అందుతాయా, లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మంజూరు ఇలా .... ఇంటర్మీడియట్ నుంచి డిగ్రీ వరకు కళాశాలల్లో చదివే విద్యార్థులకు స్కాలర్షిప్పులు మంజూరు కావాలంటే వారు చదివే యూనివర్సిటీ, కళాశాల అక్కడ నిర్ణయించిన ఫీజుల వివరాలను పరిగణనలోకి తీసుకుంటారు. ఒక్కొక్క యూనివర్సిటీకి, ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలలు వసూలు చేసే ఫీజులు వేర్వేరుగా ఉండడంతో స్కాలర్షిప్ కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థి చదివే కళాశాలను బట్టి స్కాలర్షిప్ మంజూరవుతుంది. ఆయా కళాశాలల యాజమాన్యాలు స్కాలర్షిప్ పొందేందుకు అర్హత ఉన్న విద్యార్థుల జాబితాలను రూపొందించి బీసీ, ఎస్సీ, ఎస్టీ సంక్షేమశాఖలకు అందజేయాల్సి ఉంది. వీటిని సరిచూసిన ఈ శాఖల అధికారులు ఈ జాబితాలను ట్రెజరీకి పంపుతారు. ప్రభుత్వం స్కాలర్షిప్ నిధులు విడుదల చేసి సంబంధిత మొత్తానికి సంబంధించి వివరాలను ఆయాశాఖలకు, ట్రెజరీకి తెలియజేస్తుంది. సంక్షేమశాఖల నుంచి వచ్చిన జాబితాలు, అందుబాటులోని నిధులను బట్టి ట్రెజరీ అధికారులు కార్పొరేట్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ పద్ధతిలో విద్యార్థులకు ఆన్లైన్ ద్వారా వారి ఖాతాల్లో నగదు జమ చేస్తారు. ఇక్కడే అసలు సమస్య ప్రారంభమవుతోంది. బీసీ, ఎస్సీ, ఎస్టీ సంక్షేమశాఖల నుంచి వచ్చిన జాబితాల్లో విద్యార్థి పేరు, బ్యాంకు ఖాతా నంబరు, ఐఎఫ్సీ కోడ్ వివరాలు సక్రమంగా లేని వారి ఖాతాల్లోకి నగదు జమ కావడం లేదు. దీనికి తోడు విద్యార్థి జీరో బ్యాలెన్స్తో ప్రారంభించిన బ్యాంకు ఖాతా వాడుకలో లేకపోవటంతో అలాంటి ఖాతాల్లో నగదు జమకావడం లేదు. ఈ విషయాన్ని ట్రెజరీ అధికారులు ఆయాశాఖల వారీగా వివరాలు తెలియజేయడం లేదు. ఇది మా పని కాదేనది ట్రెజరీ అధికారుల వాదన. అయితే బీసీ, ఎస్సీ, ఎస్టీ సంక్షేమశాఖాధికారుల వాదన మరో విధంగా ఉంది. ఎంత మంది విద్యార్థులకు నగదు బ్యాంకు ఖాతాలో జమైందో, జమ కాలేదో ఆ వివరాలు ట్రెజరీ అధికారులే చెప్పాలనేది . వీరిద్దరి మధ్య సమన్వయం లేకపోవటంతో విద్యార్థులకు స్కాలర్షిప్పులు అందని పరిస్థితి నెలకొంది. ఈ ఏడాది జనవరిలో స్కాలర్షిప్పులు ఇచ్చేందుకు ప్రభుత్వం పాత బకాయిగా విడుదల చేసిన కోటి రూపాయలు నిధులు ఏమవుతాయనే సందిగ్ధత నెలకొంది. కొన్ని కళాశాలల యాజమాన్యాల ప్రతినిధులు హైదరాబాద్లోని ట్రెజరీ అధికారులను సంప్రదిస్తే ఏ జిల్లాకు సంబంధించి ఆ జిల్లా ట్రెజరీ అధికారులే దీనిపై చర్య తీసుకోవాలని చెబుతున్నారు. ఇటీవల కలెక్టర్ ట్రెజరీ అధికారులకు రెండుమార్లు లేఖ రాసినట్లు సమాచారం. దీంతో స్పందించిన ట్రెజరీ అధికారులు 2009-10 విద్యాసంవత్సరానికి సంబంధించి కొంత మొత్తాన్ని విడుదల చేశారు. 2010-11, 2011-12 విద్యాసంవత్సరాలకు సంబంధించి పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్పుల మొత్తాన్ని విద్యార్థుల ఖాతాలో జమ చేసేందుకు ట్రెజరీ అధికారులు స్పందించడం లేదని సంక్షేమశాఖాధికారులు చెబుతున్నారు. -
హాస్టళ్లలో అక్రమాలపై తీసుకున్న చర్యలేంటి?
ఆయా శాఖలకు గవర్నర్ సలహాదారు రాయ్ ఆదేశాలు సాక్షి, హైదరాబాద్: పేదలకు అందాల్సిన ఉపకారాలను కాజేస్తున్న ఉద్యోగులు, అధికారులపై గవర్నర్ సలహాదారు ఎఎన్. రాయ్ చర్యలు చేపట్టడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. జూన్ 1తో ఆయన అధికారాలు ముగుస్తున్న నేపథ్యంలో.. ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టళ్లలో విద్యార్థులకు అందాల్సిన ప్రభుత్వ ప్రయోజనాలను కాజేసిన అక్రమార్కులపై చర్యలు తీసుకోనున్నారు. అవినీతి నిరోధక శాఖ ఈ ఏడాది ఫిబ్రవరిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టళ్లలో తనిఖీలు నిర్వహించి అక్రమాలను వెలికితీసింది. దానికి బాధ్యులైన అధికారులు, ఉద్యోగులపై చర్యలు తీసుకోవాల్సిందిగా సూచిస్తూ ప్రభుత్వ సీఎస్కు నివేదిక సమర్పించింది. అయినా ఇప్పటి వరకు వారిపై ఎటువంటి చర్యలను తీసుకోలేదని రాయ్ గుర్తించి... హాస్టళ్లలో అక్రమాలపై తీసుకున్న చర్యలేమిటో తెలియజేయాల్సిందిగా ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ శాఖ ముఖ్యకార్యదర్శులకు గురువారం ప్రత్యేకంగా నోట్ పంపించారు.