Compensation
-
ఈ వేదనకు జడ్జి గారి గుండె నీరయ్యింది
‘ఆమె తండ్రి పరిహారం పెంచమని అడుగుతున్నాడు. ఆ అమ్మాయి వేదనను చేస్తే మనకే గుండె తరుక్కుపోతోంది. కన్నవారికి ఎలా ఉంటుంది?’ అని ఆవేదన చెందారు ముంబై హైకోర్టు బెంచ్ మీదున్న ఇద్దరు జడ్జ్లు. 2017లో రైల్వే వారి కారు ఢీకొనగా కోమాలోకి వెళ్లిన 17 ఏళ్ల నిధి జత్మలాని కేసుకు ముగింపు పలుకుతూ రైల్వే మంత్రిని 5 కోట్ల పరిహారం ఇవ్వడం గురించి సానుభూతితో ఆలోచించమని కోరింది కోర్టు. వివరాలు...ఒక జీవితానికి పరిహారం ఎంత? ఒక తూనీగకు రెక్కలు విరిగిపడితే నష్ట పరిహారం ఎంత? కోయిల గొంతును నులిమి పాట రాకుండా చేస్తే ఆ నష్టాన్ని ఏమి ఇచ్చి భర్తీ చేయగలం? ఒక ఎగిరి దుమికే జలపాతాన్ని ఎండపెట్టేశాక ఎన్ని డబ్బులు ధారబోస్తే జల ఊరుతుంది?నష్టపరిహారం ఏ నష్టాన్ని పూర్తిగా పూడ్చలేదు. కాకపోతే కొంత సాయం చేయగలదు అంతే. అందుకే ముంబై హైకోర్టుకు చెందిన జడ్జీలు గిరిష్ కులకర్ణి, అద్వైత్ సెత్నా ఒక అమ్మాయికి వచ్చిన కష్టాన్ని లెక్కలతో కాకుండా హృదయంతో చూడమని రైల్వే మినిష్టర్ని కోరారు. పరిహారం పెంచే అవకాశాన్ని పరిశీలించమన్నారు. జడ్జీలను కదిలించిన ఆ కేస్ ఏమిటి?రెక్కలు తెగిన పిట్ట2017, మే 28. ముంబై మెరైన్ డ్రైవ్లో 17 ఏళ్ల నిధి జెత్మలాని రోడ్డు దాటుతోంది. ఆ రోడ్డులోనే ఉన్న కేసీ కాలేజ్లో ఆ అమ్మాయి ఇంటర్ చదువుతోంది. ఆమె రోడ్డు దాటడం మొదలుపెట్టగానే అతివేగంతో వచ్చిన ఇన్నోవా ఆమెను ఢీకొట్టింది. నిధి ఎగిరి దూరం పడింది. తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఆమెను ఢీకొట్టాక ఇన్నోవా రోడ్డు డివైడర్ను కూడా ఢీకొట్టి ఆగింది. అప్పటి వరకూ ఎగురుతూ తుళ్లుతూ చదువుకుంటూ ఉన్న నిధి ఆ రోజు నుంచి మళ్లీ మాట్లాడలేదు. నవ్వలేదు. నడవలేదు. నిలబడలేదు. జీవచ్ఛవంలా మారింది. కొన్నాళ్లు కోమాలో ఉండి ఆ తర్వాత పడక్కుర్చీకి పరిమితమైంది. ఇంత పెద్ద నష్టం చేకూర్చిన ఈ కేసులో నష్టపరిహారం కోసం పోరాటం మొదలైంది.నిధి వెర్సస్ వెస్ట్రన్ రైల్వేస్నిధిని ఢీకొట్టిన ఇన్నోవా వెస్ట్రన్ రైల్వేస్ వారి సిగ్నలింగ్ సర్వీసెస్ విభాగానికి చెందినది. కనుక దీనిలో ప్రతివాది ఆ సెక్షన్కు చెందిన సీనియర్ ఇంజనీర్ అయ్యాడు. కేసు నమోదయ్యాక ‘మోటార్ యాక్సిడెంట్స్ క్లైమ్స్ ట్రైబ్యునల్’ 2021లో 69,92,156 రూపాయల (సుమారు 70 లక్షలు) పరిహారం వడ్డీతో సహా నిధి తల్లిదండ్రులకు ఇవ్వాలని, కోర్టుకు ఒకటిన్నర కోటి రూపాయలు డిపాజిట్ చేసి ఆ వచ్చే వడ్డీని నెల నెలా నిధి వైద్య అవసరాలకు ఇవ్వాలని రైల్వేశాఖను ఆదేశించింది. రైల్వే శాఖ ఒకటిన్నర కోటి డిపాజిట్ చేసింది. అయితే ఈ పరిహారం చాలదని నిధి తండ్రి హైకోర్టుకు వెళ్లాడు.ఆమె తప్పు ఉంటే?హైకోర్టులో నష్టపరిహారానికి సంబంధించి వాదనలు మొదలైనప్పుడు రైల్వే శాఖ తరఫు అడ్వకేటు రోడ్డు దాటే సమయంలో నిధి పెడస్ట్రియన్ క్రాసింగ్లో నడవలేదని, పైగా ఆ సమయంలో సెల్ఫోన్ మాట్లాడుతోందని వాదనలు వినిపించాడు. అయితే కోర్టు పట్టించుకోలేదు. నిధి తరఫు లాయర్లు ఇప్పుడు నిధికి 25 సంవత్సరాలని జీవితాంతం ఆమె వీల్చైర్ మీద మాటా పలుకూ లేకుండా జీవచ్ఛవంలా బతకాలని అందుకు చాలా డబ్బు అవసరమవుతుందని అందువల్ల నష్టపరిహారం కనీసం 7 కోట్లు ఇవ్వాలని కోరారు. ప్రతివాదులు ‘ఇది చాలా ఎక్కువ’ అని అభ్యంతరం చెప్పారు. ఇదంతా పరిశీలించిన న్యాయమూర్తులు ‘మేము ఆ అమ్మాయివి యాక్సిడెంట్కు ముందు ఫొటోలు ఇప్పటి ఫొటోలు చూశాం. మా గుండె తరుక్కుపోయింది. ఒక ఆడేపాడే అమ్మాయి ఈ వ్యథను ఎలా భరించగలదు? మాకే ఇలా ఉంటే తల్లిదండ్రులు ఈ బాధను ఎలా తట్టుకుంటారు. వారు ఇప్పటికే చేయవలసిందల్లా చేశారు. ఇకపైనా చేయాలి. ఇది ఎంతో వ్యథ. ఇది అరుదైన కేసుల్లోకెల్లా అరుదైనది. అందుకే సహానుభూతిని చూపాలి. అందుకే మేము రైల్వే మంత్రిని ఇప్పటి వరకూ ఇచ్చిన దానితో సహా అంతా కలిపి ఐదు కోట్ల రూపాయల పరిహారంతో కేసును సెటిల్ చేసుకునే అవకాశం పరిశీలించమని కోరుతున్నాం’ అన్నారు.బహుశా రైల్వే మంత్రి స్పందించవచ్చు. స్పందించకపోవచ్చు. కాని రోడ్డు సెఫ్టీ గురించి మన దేశంలో ఎంత చైతన్యం రావాలో మాత్రం ఈ కేసు తెలియచేస్తూ ఉంది. పిల్లలకు తల్లిదండ్రులు జాగ్రత్త చెప్పాలి. రోడ్డు మీద నడిచినా, వారికి వాహనాలు కొనిచ్చి పంపినా ఎంత భద్రం చెప్పాలో అంతా చెప్పాలి. జర భద్రం. -
ఇన్నాళ్ళ బాధలు చాలు, రూ.5 కోట్ల సంగతి తేల్చండి : బాంబే హైకోర్టు
ఏనిమిదేళ్ల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన యువతికి నష్ట పరిరహారం చెల్లింపు విషయంలో నిర్ణయాన్ని ప్రకటించాల్సిందిగా హైకోర్టు రైల్వే మంత్రిని కోరింది. బాధిత మహిళకు రూ.5 కోట్ల తుది సెటిల్మెంట్ క్లెయిమ్ను సానుభూతితో పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని బాంబే హైకోర్టు రైల్వే మంత్రిని కోరింది. ఇన్నేళ్లుగా బాధితురాలు నిధి, ఆమె కుటుంబం పడిన బాధను, ఏ విధంగానూ భర్తీ చేయలేం. అందుకే మానవతా దృక్పథంలో ఆలోచించి ఇక దీనికి ముగింపు పలకడం సముచితమని కోర్టు పేర్కొంది. అసలేంటి కేసు? వివరాలు తెలుసుకుందాం ఈ కథనంలో.2017, మే 28 నిధి రాజేష్ జెఠ్మలానీ (వయసు అప్పటికి 17) మెరైన్ ప్లాజా హోటల్ ఎదురుగా ఉన్న నేతాజీ సుభాష్ చంద్రబోస్ రోడ్ దాటుతుండగా రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. 12వ తరగతిలో అడ్మిషన్ కోసం కేసీ కాలేజీకి వెళుతుండగా, పశ్చిమ రైల్వేకు చెందిన కారు ఆమెను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నిధి మెదడు తీవ్రంగా దెబ్బతింది. దాదాపు కోమా(vegetative state) లాంటి పరిస్థితిలో మంచానికే పరిమితమై పోయింది. ఈ కేసు ముంబైలోని మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్స్ ట్రిబ్యునల్ (MACT) ఫిబ్రవరి 2021లో ఆమెకు రూ.69.92 లక్షలు వడ్డీతో పాటు రూ.1.5 కోట్ల కార్పస్ను మంజూరు చేసింది. వడ్డీని ఆమె భవిష్యత్తు వైద్య , ఇతర ఖర్చులకు ఉపయోగించాలి తీర్పుచెప్పింది. అయితే దీనిపై రైల్వే శాఖ అప్పీలుకు వెళ్లింది. ఈ అప్పీల్ పెండింగ్లో ఉన్న నేపథ్యంలో2022లో పశ్చిమ రైల్వే కోర్టులో డిపాజిట్ చేసిన రూ. 1.15 కోట్లను ఉపసంహరించుకోవడానికి హైకోర్టు తండ్రికి అనుమతి ఇచ్చింది. తాజాగా రూ. 5 కోట్ల క్లెయిమ్ సెటిల్మెంట్ కింద బాదిత ఇవ్వాలని హైకోర్టు భావిస్తోంది. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న నిధి జెఠ్మలానీకి రూ.5 కోట్ల పరిహారం చెల్లించాలని బాంబే హైకోర్టు రైల్వే మంత్రిని కోరింది. ఆమె పరిస్థితి తీవ్రత దృష్ట్యా కోర్టు దీనిని 'చాలా అరుదైన' కేసుగా పేర్కొంది. తాజాగా రూ. 5 కోట్ల క్లెయిమ్ సెటిల్మెంట్ కింద ఇవ్వాలని హైకోర్టు భావిస్తోంది. మార్చి6న దీనిని అరుదైన కేసుగా పేర్కొంటూ, న్యాయమూర్తులు గిరీష్ కులకర్ణి , అద్వైత్ సేథ్నా మాట్లాడుతూ, "ఈ ప్రభావం చాలా భయంకరమైనది. సంతోషంగా, ఎన్నో ఆశలతో ఉన్న అమ్మాయి ఫోటోలు, ప్రస్తుత స్థితి ఎవరికైనా చాలా దుఃఖాన్ని, బాధను కలిగిస్తాయి. ఇక తల్లిదండ్రులు/కుటుంబ సభ్యుల మానసిక స్థితి ఏమిటి? అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. నిధి బాధ, తల్లిదండ్రుల కష్టాలను డబ్బు తీర్చలేదు. నిజానికి వారి ఆవేదనను పరిగణనలోకి తీసుకుంటే, ఇది ఖచ్చితంగా సరిపోదు అని వ్యాఖ్యానించారు. అంతేకాదు నిధి పరిస్థితిని దివంగత అరుణ షాన్బాగ్ పరిస్థితితో పోల్చారు. చదవండి: మా కష్టాలు మాకే తెలుసు.. చివరికిలా శాశ్వతంగా! పిక్స్ వైరల్బాధితురాలు మాత్రమే కాకుండా ఆమె కుటుంబం మొత్తం అనుభవించిన బాధ ఊహించుకుంటేనే బాధగా ఉంది. ఈ విషయంలో ప్రతివాది (WR) సంబంధిత అధికారులు మంత్రిత్వ శాఖ (రైల్వే మంత్రి) అత్యున్నత స్థాయిలో ఆలోచించి చర్యలు తీసుకోవాలని న్యాయమూర్తులు అభ్యర్థించారు. తదుపరి విచారణను మార్చి 20కి వాయిదా వేశారు. మరోవైపు నిధి తండ్రి గతంలో చెల్లించిన మొత్తాలను మినహాయించి రూ. 5 కోట్లకు సెటిల్మెంట్ చేసుకునేందుకు అంగీకారం తెలిపారు.చదవండి: 60లో 20లా మారిపోయాడుగా : హీరోలకే పోటీ, ఫ్యాన్స్ కమెంట్లు వైరల్ -
మీ ఊరు కాదంటున్నారు!
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ఆ ఊరికి 150 ఏళ్ల చరిత్ర ఉంది. నాలుగు తరాలుగా గిరిజనులు నివాసం ఉంటున్నారు. ఇళ్లు.. ప్రభుత్వ పాఠశాల.. చెరువు.. ఆయకట్టు కింద పొలాలూ ఉన్నాయి. అయినా, సరే ఇప్పుడిది మీ ఊరు కాదంటున్నారు అటవీ శాఖ అధికారులు. చెట్టు.. పుట్ట, ఇళ్లు, పొలాలన్నీ మీవి కావు. దీనిమీద మీకు హక్కులు లేవు. ఇది అటవీ శాఖకు చెందిన సంపద అని అధికారులు ఆంక్షలు పెడుతున్నారు. జాతీయ రహదారి నిర్మాణంతో కోల్పోయిన భూములకు వచ్చిన నష్ట పరిహారాన్ని కూడా వారి ఖాతాలో వేసుకున్నారు. అడుగు తీసి అడుగేయాలన్నా అనుమతి తీసుకోవాలంటున్నారు. ఇలా ప్రకాశం జిల్లా పుల్లలచెరువు మండలం నరజాముల తండా వాసులపై కొంతకాలంగా జులుం ప్రదర్శిస్తున్నారు. నియోజకవర్గ కేంద్రమైన యర్రగొండపాలెంకు 20 కిలోమీటర్ల దూరంలో.. జాతీయ రహదారి పక్కనే ఉండడం ఈ తండాకు తంటాలు తెచ్చిపెడుతోంది. మారుమూల అటవీ ప్రాంతంలోని నరజాముల తండాలో 290 కుటుంబాలకు పైగా జీవిస్తున్నాయి. అందరూ సుగాలీలే. పశువులను మేపుతూ, కట్టెలు కొడుతూ యర్రగొండపాలెంలో అమ్ముతూ పొట్ట పోసుకుంటుంటారు. కొందరు ఉద్యోగాలు కూడా సాధించారు. అయితే, ఆదివాసీలకు జరిగే అన్యాయాన్ని సరిచేసే పేరుతో తెచ్చిన అటవీ హక్కుల చట్టం–2006 ఇప్పుడు వీరి నెత్తిన కత్తిలా వేలాడుతోంది. వేసవిలో మంచినీటి బోర్లు వేసుకోవడానికి లేదు.. పొలాలకు వెళ్లనీయరు.. జీవాలను మేపుకొనేందుకు అడవిలోకి వెళ్తే కేసులు పెడుతున్నారు.. పాములు, క్రూర జంతువుల నుంచి ఆత్మరక్షణకు గొడ్డలి తీసుకెళ్తే లాక్కుంటున్నారు. ఆఖరికి పశువులనూ స్వాధీనం చేసుకుంటున్నారు. మరోవైపు గ్రామంలోని మౌలిక సమస్యలను ఉద్దేశపూర్వకంగానే అధికార యంత్రాంగం పట్టించుకోవడం లేదనే ఆరోపణలున్నాయి. రెండెకరాల పరిహారం అటవీ శాఖ ఖాతాలోకి.. గతంలో ప్రభుత్వం ఇచ్చిన పట్టా భూమిలో రెండు ఎకరాలు హైవే నిర్మాణంలో పోయింది. పరిహారం కోరితే అటవీ శాఖ భూమి అని అంటున్నారు. మా భూమికి వారు డబ్బులు తీసుకోవడం ఏం న్యాయం? – నరసింహనాయక్, నరజాములతండా గిరిజనులపై ఆంక్షలు పెరిగిపోయాయి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నల్లమల అడవుల్లో జీవించే గిరిజనులపై ఆంక్షలు, దాడులు పెరిగిపోయాయి. వారిపై అక్రమ కేసులు బనాయించడం, ఇళ్ల నిర్మాణాన్ని అర్ధంతరంగా నిలిపివేయడం చేస్తున్నారు. కాయ కష్టంతో పండించిన పంటను అమ్ముకోనీయకుండా కూటమి ప్రభుత్వం పాశవిక చర్యలకు పాల్పడుతోంది. గిరిజనుల బాధలను గుర్తించిన వైఎస్ అటవీ హక్కుల చట్టం తెచ్చి ఆదుకున్నారు. ఆయన తనయుడు వైఎస్ జగన్ సీఎంగా బాధ్యతలు తీసుకున్నాక ఆ చట్టాలను పకడ్బందీగా అమలు చేస్తూ పక్కా ఇళ్లు మంజూరు చేశారు. కూటమి ప్రభుత్వం మాత్రం గిరిజనులపై అటవీ అధికారులను ఉసిగొల్పుతోంది. అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్కు ఈ దారుణాలు కనిపించడం లేదు. మొద్దు నిద్ర వీడి గిరిజన ప్రాంతాలను సందర్శించి స్థానికుల బాధలు తెలుసుకుని పరిష్కరించాలి. – తాటిపర్తి చంద్రశేఖర్, వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే, యర్రగొండపాలెంహైవేతో పెరిగిన సమస్యలు నాలుగేళ్ల క్రితం యర్రగొండపాలెం–హైదరాబాద్ రహదారి నేషనల్ హైవే 565 అయింది. మల్లాపాలం దాటాక 5 కిలోమీటర్ల నుంచి దావపల్లి వరకు 20.09 కిలోమీటర్ల మేర దండకారణ్యం ఉంది. అటవీ ప్రాంతానికి అవతల వరకు హైవే నిర్మాణమైంది. అనుమతులు రావడంతో ఇటీవల అడవిలోనూ పనులు మొదలుపెట్టారు. నరజాముల తండా రోడ్డుకు ఇరువైపులా ఉన్న ఇళ్లు, పొలాలు హైవేలో పోయాయి. స్థానికులతో చర్చించకుండా, చిల్లిగవ్వ కూడా ఇవ్వకుండా తండాలో రోడ్డుకు ఇరువైపులా ఉన్న చెట్లను కూడా అటవీ శాఖ కొట్టుకుని తీసుకుపోయింది. ఈ మేరకు నష్ట పరిహారం చెల్లించాలని గిరిజనులు కోరుతున్నా పట్టించుకోవడం లేదు. ప్రభుత్వాలు సౌకర్యాలు కల్పిస్తున్నప్పుడు ఏమయ్యారు?నరజాముల తండాలో 400 ఎకరాల రెవెన్యూ స్థలం ఉంది. సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఒక్కొక్కరికి 47 సెంట్ల నుంచి 10 ఎకరాల వరకు పొలాలకు పట్టాలు ఇచ్చారు. పాస్ పుస్తకాల ద్వారా గిరిజనులు బ్యాంకు రుణాలు తీసుకున్నారు. 1972లో 250 ఎకరాలలో చెరువు నిర్మించగా ఆయకట్టు కింద 800 ఎకరాలు సాగవుతున్నాయి. 50 ఏళ్ల కిందటే ప్రభుత్వ పాఠశాల, అనుబంధంగా హాస్టల్ కూడా ఏర్పాటు చేశారు. గత ప్రభుత్వ హయాంలో సచివాలయం నిరి్మంచారు. ఇలా అన్ని సౌకర్యాలను కల్పిoచినపుడు అటవీ అధికారులు ఎక్కడకు పోయారని గిరిపుత్రులు నిలదీస్తున్నారు. ఉద్యమానికి సిద్ధమవుతున్న గిరిజనులు కన్నతల్లిలాంటి ఊరిని కాపాడుకునేందుకు సుగాలీలు సిద్ధమవుతున్నారు. గ్రామంతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుని కన్నీరుమున్నీరవుతున్నారు. వదిలి వెళ్లేది లేదని తెగేసి చెబుతూ.. ఉద్యమానికి సిద్ధమవుతున్నారు. తమ ఇళ్లు, పొలాలను రెవెన్యూ పరిధిలోకి తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నారు. -
థియేటర్లో ప్రకటనలపై కోర్టు కీలక తీర్పు
బెంగళూరు: సరదాగా సినిమా చూద్దామని వెళితే తన విలువైన సమయం వృథా చేశారని ఓ యువ న్యాయవాది థియేటర్పై కేసు వేశారు. ఈ కేసులో వినియోగదారుల కోర్టు న్యాయవాదికి అనుకూలంగా తీర్పిచ్చింది. అతనికి రూ.65వేల నష్టపరిహారం చెల్లించాలని థియేటర్ యాజమాన్యాన్ని కోర్టు ఆదేశించింది. 2023లో బెంగళూరులో అభిషేక్ అనే న్యాయవాది బుక్మైషో ప్లాట్ఫాంలో టికెట్లు బుక్ చేసుకొని పివిఆర్ ఐనాక్స్ థియేటర్లో సినిమాకు వెళ్లారు.సినిమా ప్రదర్శించే ముందు థియేటర్లో 25 నిమిషాల పాటు ప్రకటనలు వేశారు. దీంతో యువ న్యాయవాదికి చిర్రెత్తుకొచ్చి థియేటర్పై కేసు వేసి విజయం సాధించారు.ఈ కేసులో తీర్పిచ్చే సందర్భంగా వినియోగదారుల కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. సమయం డబ్బులతో సమానమని, అభిషేక్ విలువైన టైమ్ వేస్ట్ చేసినందుకు అతడికి నష్టపరిహారం చెల్లించాల్సిందేనని స్పష్టం చేసింది. అయితే ప్రకటనలు వేయడాన్ని థియేటర్ యాజమాన్యం సమర్థించుకుంది. తాము కొన్ని ప్రకటనలు తప్పనిసరిగా వేయాల్సిన అవసరం ఉంటుందని పేర్కొన్నాయి. -
మస్క్... ట్రంప్కు కోటి డాలర్లు ఎందుకు ఇస్తానన్నాడు?
వాషింగ్టన్: అమెరికాలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. గతంలో ఎక్స్(ట్విట్టర్)పై ట్రంప్ దావా వేసిన కారణంగా తాజాగా ఎలాన్ మస్క్ ఆయనకు దాదాపు 10 మిలియన్ డాలర్లు చెల్లించడానికి సిద్ధమైనట్టు తెలుస్తోంది. 2021లో యూఎస్ క్యాపిటల్ భవనంపై దాడి అనంతరం ట్రంప్ ఈ దావా వేశారు.వివరాల ప్రకారం.. 2020లో జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ (Donald Trump) పరాజయం పాలయ్యారు. తర్వాత 2021 జనవరి 6న అమెరికా అధ్యక్షుడిగా బైడెన్ (Joe Biden) విజయాన్ని ధ్రువీకరించేందుకు వాషింగ్టన్ క్యాపిటల్ భవనంలో కాంగ్రెస్ సమావేశమైంది. అయితే ఆ సమావేశం జరగడానికి కొన్ని గంటల ముందు ట్రంప్ తన మద్దతుదారులను ఉద్దేశిస్తూ ప్రసంగించారు. అనంతరం ట్రంప్ మద్దతుదారులు వేలాదిగా క్యాపిటల్ భవనంలోకి చొచ్చుకెళ్లి విధ్వంసం సృష్టించారు. ఈ క్రమంలో అధ్యక్ష ఎన్నికల ఫలితాలను తారుమారు చేసేందుకు ప్రయత్నించారని, బైడెన్ విజయాన్ని ధ్రువీకరించకుండా కాంగ్రెస్ను ఆపేందుకే క్యాపిటల్ భవనంపై ట్రంప్ మద్దతుదారులు దాడికి పాల్పడ్డారని వాషింగ్టన్ ఫెడరల్ కోర్టులో అభియోగాలు నమోదయ్యాయి. ఆ ఛార్జ్షీట్లో ట్రంప్ పేరు కూడా ఉంది.ఈ నేపథ్యంలో ట్రంప్ సోషల్ మీడియా అకౌంట్స్ను ఎక్స్(ట్విట్టర్), ఫేస్బుక్.. ట్రంప్ అకౌంట్స్ను సస్పెండ్ చేసింది. దీంతో, వారి చర్యలను ఆయా సంస్థలపై ట్రంప్ దావా వేశారు. ఈ దావాను పరిష్కరించుకునేందుకు 25 మిలియన్ డాలర్లు చెల్లిస్తామని గత నెలలో మెటా ప్రకటించింది. ఇక, తాజాగా మస్క్(Elon Musk) కూడా ట్రంప్కు 10 మిలియన్ డాలర్లు చెల్లించడానికి సిద్ధమైనట్టు వాల్ స్ట్రీట్ జర్నల్ చెప్పుకొచ్చింది.*Elon Musk’s company X settles Trump lawsuit over account suspension*• Social media company X has agreed to pay about $10 million to settle a lawsuit by President Donald Trump, The Wall Street Journal reported.• Elon Musk, X’s billionaire owner, is overseeing DOGE, pic.twitter.com/nw7n2HbUwF— AS ♠️🍌✡︎🪬חי🎗️🤟🫶🧡👑❰̶̶͟͞🍓꙰꙰❱̶𖠧̙̞͢▹͍►͍👑 (@AdelBadel7) February 13, 2025ఇదిలా ఉండగా.. అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి ట్రంప్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత పలు కీలక నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే. యూఎస్ క్యాపిటల్పై దాడి చేసిన తన మద్దతుదారులకు ఉపశమనం కల్పించారు. ఈమేరకు ఆయన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లపై సంతకాలు చేశారు. ఈ ఘటనలో దాదాపు 1500 మందికి ట్రంప్ క్షమాభిక్ష కల్పించారు. వారిపై పెండింగ్లో ఉన్న కేసులు కొట్టివేయాలని అటార్నీ జర్నల్కు ఆదేశాలు జారీ చేశారు. -
ఆర్బీఐ కీలక నిర్ణయం.. ఆలస్యమైతే రోజుకు రూ.100
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) బ్యాంకులు కస్టమర్లకు త్వరితగతిన సేవలు అందించాలని కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. వినియోగదారులకు అందించాల్సిన సేవలలో ఏ మాత్రం ఆలస్యం జరిగిన జరిమానా తప్పదని వెల్లడించింది.బ్యాంకులు లేదా క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీలు కస్టమర్లకు అందించే సేవలలో ఎక్కువ ఆలస్యం చేస్తున్నాయని ఆర్బీఐ ఫిర్యాదులు అందుకుంది. దీంతో కొత్త ఆదేశాలను జారీ చేస్తూ.. నెల రోజులు లేదా 30 రోజుల లోపల వినియోగదారుల సమస్యలు పరిష్కారం కాకపోతే, రోజుకు 100 రూపాయలు జరిమానా విధిస్తామని వెల్లడించింది. ఈ డబ్బు వినియోగదారునికే పరిహారం రూపంలో అందించడం జరుగుతుంది.వినియోగదారుల క్రెడిట్ సమాచారాన్ని బ్యాంక్ లేదా ఆర్ధిక సంస్థ పొందినట్లయితే.. దానిని వారికి ఈమెయిల్ లేదా ఎస్ఎమ్ఎస్ రూపంలో తెలియజేయాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెల్లడించింది. అంతే కాకుండా ఖాతాదారుడు డిఫాల్ట్గా లోన్ చెల్లించకుండా ఉంటే ఆ విషయాన్ని కూడా బ్యాంకులు తెలియజేయాలి. ఈ విషయాన్ని 21 రోజులలోపు తెలియజేయకపోతే.. వినియోగదారునికి రోజుకి 100 రూపాయల చొప్పున పరిహారం ఇవ్వాల్సి ఉంటుందని పేర్కొంది. ఈ నియమం ఆర్ధిక సంస్థలకు కూడా వర్తిస్తుంది.ప్రస్తుతం భారతదేశంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాచే అధికారం పొందిన నాలుగు సీఐసీలు ఉన్నాయి. అవి సిబిల్, సీఆర్ఐఎఫ్, ఈక్విఫాక్స్, ఎక్స్పీరియన్. ఇవి కూడా వినియోగదారుల సమస్యలను 30 రోజుల్లో పరిష్కరించాలి లేదా ఫిర్యాదుకు సంబంధించిన అప్డేట్ కస్టమర్కు తెలియజేయాలి. ఇచ్చిన ఫిర్యాదును తిరస్కరించినట్లయితే.. దానికి కారణం కూడా చెప్పాలని ఆర్బీఐ ఆదేశించింది.ఆర్బీఐ నిర్ణయం వెనుక ఉద్దేశ్యంవినియోగదారులు లేదా ఖాతాదారులు ఏదైనా సమస్యను పరిష్కరించాలనుకుంటే.. రోజుల తరబడి బ్యాంకులు లేదా ఆర్ధిక సంస్థల చుట్టూ పదే పదే తిరగాల్సి ఉండేది. దీనిని దృష్టిలో ఉంచుకుని, దేశంలోని అన్ని బ్యాంకులు, ఆర్ధిక సంస్థలు వినియోగదారులకు వేగవంతమైన సేవలను అందించాలని.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ నిర్ణయం తీసుకుంది. ఆర్బీఐ తీసుకున్న ఈ నిర్ణయం వినియోగదారులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది.ఏటీఎంల గురించి ఆర్బీఐనగదు సర్క్యులేషన్ రికార్డు స్థాయిలో పెరిగినప్పటికీ.. భారతీయ బ్యాంకులు ఏటీఎంలను, క్యాష్ రీసైక్లర్లను క్రమంగా తగ్గించనున్నట్లు సమాచారం. చాలామంది ప్రజలు యూపీఐ, డిజిటల్ చెల్లింపులకు అలవాటు పడటం వల్ల ఏటీఎంల వినియోగం కూడా భారీగా తగ్గిపోయిందని ఆర్బీఐ స్పష్టం చేసింది.రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకారం.. భారతదేశంలో ఏటీఎంల సంఖ్య సెప్టెంబర్ 2023లో 2,19,000 ఉండేవి. కానీ వీటి సంఖ్య సెప్టెంబర్ 2024 నాటికి 2,15,000కు తగ్గిపోయింది. అదే సమయంలో ఆఫ్-సైట్ ఏటీఎంల సంఖ్య కూడా 97,072 నుంచి 87,638కి తగ్గాయి. సాధారణంగా ఏటీఎంలను ఏర్పాటు చేయడానికి, అద్దె, సెక్యూరిటీ వంటి వాటికి.. సంబంధిత బ్యాంకులు భారీగా ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. అయితే వినియోగం తగ్గినప్పుడు ఈ ఖర్చు మొత్తం వృధా. దీనిని దృష్టిలో ఉంచుకుని ఏటీఎంల సంఖ్యను గణనీయంగా తగ్గించడానికి సన్నద్ధమవుతున్నాయి. -
ఆస్తి హక్కు రాజ్యాంగ హక్కు
న్యూఢిల్లీ: పౌరులు ఆస్తిని కలిగి ఉండే హక్కు రాజ్యాంగబద్ధమైన హక్కు అని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. ప్రజల నుంచి భూమిని సేకరిస్తే చట్టప్రకారం వారికి సరైన పరిహారం చెల్లించాలని ఆదేశించింది. తగిన పరిహారం చెల్లించకుండా వారికి ఆస్తిని దూరం చేయడానికి వీల్లేదని స్పష్టంచేసింది. బెంగళూరు–మైసూరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కారిడార్ ప్రాజెక్టు నిర్మాణానికి చేపట్టిన భూసేకరణ విషయంలో 2022 నవంబర్లో కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టు ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. తీర్పు వెలువరించింది. రాజ్యాంగ(44 సవరణ) చట్టం–1978 ద్వారా ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుల నుంచి తొలగించారని ధర్మాసనం వెల్లడించింది. అయినప్పటికీ సంక్షేమ రాజ్యంలో అది మానవీయ హక్కు అని ఉద్ఘాటించింది. ఆస్తి హక్కు అనేది రాజ్యాంగంలోని ఆర్టికల్ 300ఏ కింద రాజ్యాంగ హక్కేనని వెల్లడించింది. ఆర్టికల్ 300ఏ ప్రకారం.. ప్రజలను వారి ఆస్తి నుంచి దూరం చేయడం చట్టవిరుద్ధమని పేర్కొంది. చట్ట ప్రకారం పరిహారం ఇవ్వాల్సిందేనని ప్రభుత్వాలను ఆదేశించింది. -
పరిహారం తేల్చకుండానే టెండర్లా?
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: రీజనల్ రింగ్ రోడ్ నిర్మాణంతో భూములు కోల్పోతున్న రైతుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. తమకు ఇచ్చే పరిహారం ఎంతనేది తేల్చకుండానే.. రహదారి నిర్మాణానికి టెండర్లు పిలవడం ఏమిటని నిర్వాసితులు ప్రశ్నిస్తున్నారు. తరతరాలుగా తమ జీవనాధారమైన భూములను కోల్పోతే ఎలా బతకాలని నిలదీస్తున్నారు. ఎంతో విలువైన ఈ భూములకు కనీసం ఎకరాకు రూ.కోటిపైగా చెల్లించాల్సిందేనని, లేకుంటే భూములు ఇచ్చేదే లేదని పేర్కొంటున్నారు. త్వరలో భూసేకరణ అవార్డు.. ‘రీజనల్’ఉత్తర భాగం కింద 161.581 కిలోమీటర్ల మేర ఎక్స్ప్రెస్ వే నిర్మాణానికి కేంద్ర జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్హెచ్ఏఐ) ఇటీవల టెండర్లు పిలిచిన సంగతి తెలిసిందే. తొలివిడతలో సంగారెడ్డి జిల్లా గిర్మాపూర్ నుంచి యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ వరకు.. మొత్తం ఐదు ప్యాకేజీలుగా ఈ రహదారిని నిర్మించనున్నారు. దీని కోసం సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల పరిధిలో 3,429 ఎకరాల భూమిని సేకరించాలని నిర్ణయించారు. ఈ మేరకు భూములు కోల్పోతున్న రైతుల వివరాలతో ప్రిలిమినరీ నోటిఫికేషన్ జారీ చేశారు. సర్వే ప్రక్రియ కూడా పూర్తయింది. పరిహారం నిర్ణయించేందుకు... ఆయా గ్రామాల్లో ఇటీవల జరిగిన భూముల క్రయవిక్రయాల వివరాలను అధికారులు సేకరించి ప్రభుత్వానికి పంపారు. కానీ ఎకరానికి ఎంత మొత్తం చెల్లిస్తారనేది తేలలేదు. రెవెన్యూ అధికారుల తీరుపై విమర్శలు ఈ భూసేకరణ ప్రక్రియలో రెవెన్యూ ఉన్నతాధికారుల ధోరణిని రైతులు తప్పుపడుతున్నారు. నిర్వాసితులకు కనీస సమాచారం ఇవ్వకుండా, కేవలం చట్టప్రకారం వ్యవహరిస్తామంటున్నారే తప్ప ఎలాంటి స్పష్టత ఇవ్వడం లేదని మండిపడుతున్నారు. భూముల విలువలు కొన్నేళ్లుగా భారీగా పెరిగాయని, దానికితోడు తాము జీవనాధారమూ కోల్పోతున్నామని... ఇలాంటి పరిస్థితుల్లో తగిన పరిహారం ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. ప్రాజెక్టు కార్యాలయానికి నిర్వాసితులు.. తమ భూములకు ఇచ్చే పరిహారం తేల్చకుండానే టెండర్ల ప్రక్రియ ప్రారంభమైనా కూడా స్థానిక రెవెన్యూ అధికారులు దాటవేత ధోరణితో వ్యవహరిస్తున్నారంటూ.. నిర్వాసితులు ఎన్హెచ్ఏఐ అధికారుల వద్దకు వెళ్లి నిలదీస్తున్నారు. ఈ మేరకు సిద్దిపేట జిల్లా గజ్వేల్లో ఉన్న ఎన్హెచ్ఏఐ ప్రాజెక్టు యూనిట్ కార్యాలయానికి పీడీని కలసి తమ గోడు వెళ్లబోసుకుంటున్నారు. పరిహారంపై నిర్ణయం రెవెన్యూ అధికారులే తీసుకుంటారని వారు చెప్పడంతో నిరాశగా వెనుదిరుగుతున్నారు.వాళ్లు చెప్పడం లేదు.. వీళ్లు తేల్చడం లేదు.. మా భూముల నుంచి రోడ్డు వేస్తామంటున్నారు. ఈ రోడ్డుకు టెండర్లు కూడా మొదలయ్యాయట. కానీ మా భూములకు ఎంత ఇస్తారో తేల్చడం లేదు. రెవెన్యూ అధికారులను అడిగితే పట్టించుకోవడం లేదు. నేషనల్ హైవే అధికారులను అడిగితే వారు రెవెన్యూ వారే చెబుతారంటున్నారు. ఏం చేయాలో తెలియడం లేదు. – గొల్ల కృష్ణ, నిర్వాసితరైతు, గిర్మాపూర్, సంగారెడ్డి జిల్లా చట్ట ప్రకారం చెల్లిస్తాం రీజనల్ రోడ్డు భూసేకరణ ప్రక్రియపై త్వరలో అవార్డు ప్రకటిస్తాం. నిర్వాసితులకు చట్టప్రకారం పరిహారం చెల్లిస్తాం. ఎకరానికి ఎంత చొప్పున ఇస్తారని లెక్కించేందుకు ఓ విధానం ఉంటుంది. ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. – రవీందర్రెడ్డి, భూసేకరణఅధికారి, రీజనల్ రింగ్ రోడ్డు -
ఓఎన్జీసీ పరిహారంపై దాగుడుమూతలు
సాక్షి, అమలాపురం: చమురు సంస్థల కార్యకలాపాల కారణంగా నష్టపోయే అగ్నికుల క్షత్రియులకు క్రమం తప్పకుండా ఇవ్వాల్సిన పరిహారం.. అలాగే, ఏటా అందించే మత్స్యకార భరోసా ఈ ఏడాది ఇప్పటివరకూ ఇవ్వకుండా కూటమి ప్రభుత్వం లబ్ధిదారులను ముప్పుతిప్పలు పెడుతోంది. కూటమి ప్రభుత్వం కొలువుదీరి ఆర్నెలలైనా పరిహారం పంపిణీపై ఇప్పటికీ స్పష్టమైన ప్రకటన చేయలేదు. గత నవంబరు 21న మత్స్యకార దినోత్సవం సందర్భంగా ఓఎన్జీసీ పరిహారంతో పాటు మత్స్యకార భరోసా అందజేస్తారని లబ్ధిదారులు ఎదురుచూశారు. కానీ, ఇప్పటికీ ఆ ఊసేలేదు. అయ్యవారు వచ్చేవరకూ అమావాస్య ఆగాల్సిందే అన్నట్లుగా ఉంది ఈ వ్యవహారం చూస్తుంటే!ఓఎన్జీసీ పనులతో వేటకు అంతరాయం..కోనసీమ జిల్లాలో కాట్రేనికోన మండలం బ్రహ్మసమేథ్యం పంచాయతీ పరిధి గోదావరి పాయపై ఓఎన్జీసీ చమురు సంస్థ చేపట్టిన పైపులై¯న్ పనులతో స్థానిక మత్స్యకారులకు వేట లేకుండాపోయింది. సముద్రం లోపల ఉన్న రిగ్గు (ఆఫ్షోర్ బావి) నుంచి గాడిమొగ సైట్ వరకు బ్రహ్మసమేథ్యం పరిధిలోని గోదావరి పాయల వెంబడి ఓఎన్జీసీ సంస్థ పైపులై¯న్ పనులు చేపట్టింది. ఇందుకు అనువుగా నదీపాయల్లో పెద్దఎత్తున డ్రెడ్జింగ్ నిర్వహించింది. దీనివల్ల నెలలపాటు వేటకు అంతరాయం ఏర్పడింది. కాట్రేనికోన మండలంతో పాటు ఐ.పోలవరం, ముమ్మిడివరం, అయినవిల్లి, కె.గంగవరం.. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలానికి చెందిన గోదావరి నదీపాయలను ఆనుకుని జీవిస్తున్న మత్స్యకారుల వేటకు బ్రేక్ పడింది. తమ కార్యకలాపాలు ముగిసే వరకూ నష్టపోయిన మత్స్యకారులకు పరిహారం అందించేందుకు ఓఎన్జీసీ సంస్థ ముందుకొచ్చింది. దీంతో జిల్లాలో 23,458 మంది మత్స్యకారులకు పరిహారం అందించాలి. ఒక్కో మత్స్యకారునికి రోజుకు రూ.460 చొప్పున నెలలో 25 రోజులకు రూ.11,500 ఇచ్చేందుకు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఓఎన్జీసీ అంగీకరించింది. ముమ్మిడివరం మాజీ ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్కుమార్, పుదుచ్చేరి రాష్ట్ర ప్రత్యేక ప్రధినిధి మల్లాడి కృష్ణారావు, మత్స్యకార నాయకులతో జిల్లా కలెక్టరు సమక్షంలో బాధిత లబ్ధిదారులకు నష్టపరిహారం చెల్లించేందుకు ఓఎన్జీసీ ఒప్పందం కుదుర్చుకుంది. దీనికి కోనసీమ జిల్లా పరిధిలో 16,408 మందికి, కాకినాడ జిల్లా, పుదుచ్చేరి యానాం పరిధిలో 7,050 మంది లబ్ధిదారులను అధికారులు గుర్తించారు. జగన్ హయాంలో రూ.647.44 కోట్లు చెల్లింపు..గత ప్రభుత్వంలో మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఐదు విడతలుగా ఒకొక్కరికి రూ.2,76,000 చొప్పున రూ.647.44 కోట్లను 8 వేల మంది లబ్ధిదారుల ఖాతాలో జమచేశారు. ఇంకా సంస్థ నుంచి సుమారుగా తొమ్మిది నెలలకు పైబడి నష్ట పరిహారం లబ్ధిదారులకు రావాల్సి ఉందని బాధితులు చెబుతున్నారు. కానీ, సంస్థ మాత్రం కేవలం 5 నెలల 21 రోజుల పరిహారం మాత్రమే పెండింగ్ ఉందని.. అది జిల్లా కలెక్టర్ వద్ద ఉందని, ముఖ్యమంత్రి చేతుల మీదుగా లబ్ధిదారులకు చెల్లిస్తామని చెబుతోంది. ఇలా చూసినా వేట నష్టపోయిన మత్స్యకారులకు రూ.157.54 కోట్ల పరిహారం అందించాల్సి ఉంది. అయితే, ఎప్పటికప్పుడు తేదీలు మారుస్తూ కూటమి ప్రభుత్వం దాగుడుమూతలు ఆడుతోంది. అసలు నష్టపరిహారం తమకు వస్తుందో లేదో తెలీక లబ్ధిదారులు లబోదిబోమంటున్నారు.ఉపాధి కోల్పోయిన మత్స్యకారులు..మరోవైపు.. చమురు సంస్థలు సముద్ర జలాలు, గోదావరి పాయల్లో చేపడుతున్న చమురు నిక్షేపాల వెలికితీత పనులు, చమురు వ్యర్థాలను విడుదల చేయడం, ఓడల రాకపోకలవల్ల జరుగుతున్న శబ్ధ కాలుష్యంతో గోదావరి సహజత్వం కోల్పోయి మత్స్య సంపద తగ్గిపోతోంది. దీంతో చేపల వేటలేక జీవనోపాధి కోల్పోతున్నామని మత్స్యకారులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.పైగా.. వేట నిషేధ సమయంలో ప్రభుత్వం చెల్లించే మత్స్యకార భరోసా, ఓఎన్జీసీ నష్టపరిహారం సకాలంలో చెల్లించకపోవడంతో ఉపాధి కోసం ఇతర మార్గాలను అన్వేషిస్తున్నారు. సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి తమకు రావాల్సిన ఓఎన్జీసీ నష్టపరిహారం చెల్లించాలని మత్స్యకారులు కోరుతున్నారు. నిజానికి.. ఎన్నికల సమయంలో మత్స్యకార భరోసాను రూ.20 వేలకు పెంచుతానని చంద్రబాబు హామీ ఇచ్చారు. దీంతో ఈ ఏడాది మత్స్యకార భరోసా కింద రూ.22.61 కోట్లు అందించాల్సి ఉంది. కానీ ఇప్పటివరకూ ప్రభుత్వం ఈ ఊసే ఎత్తడంలేదు.వేట లేక ఉపాధి కోల్పోతున్నాం..గోదావరిలో పైపులైన్ పనులతో ఏర్పడిన ఇసుక మేటలు తొలగించకపోవడంతో మత్య్స సంపద తగ్గిపోతోంది. పైపులు వేసిన తరువాత పూడ్చివేత పనులు చేపట్టడంలేదు. మత్య్స సంపదపై ఇది కూడా ప్రభావం చూపుతుంది. వేట లేకపోవడంతో ఉపాధి లేకుండా పోయింది. – సంగాని చిన్న కన్నయ్య, బ్రహ్మసమేథ్యం, కాట్రేనికోన మండలంనష్టపరిహారం చెల్లించండి..మాకు ఓఎన్జీసీ సంస్థ నుంచి రావాల్సిన నష్ట పరిహారాన్ని ప్రభుత్వం చెల్లించాలి. ఆ పరిహారం చెల్లించకుండా.. చేపల వేట నిషేధ సమయంలో ప్రభుత్వం ఇవ్వాల్సిన మత్స్యకార భరోసా సకాలంలో ఇవ్వకపోతే మేం ఎలా బతికేది? అప్పులుచేసి కుటుంబాన్ని పోషించుకోవాల్సి వస్తోంది.– ఓలేటి తేజ, బలుసుతిప్ప, కాట్రేనికోన మండలం -
మరణించిన టీనేజర్ కుటుంబానికి రూ. 2,624 కోట్ల పరిహారం
న్యూయార్క్: అమెరికాలో అమ్యూజ్మెంట్ పార్క్లో నిట్టనిలువుగా కిందకు దూసుకొచ్చే ‘ఫ్రీ ఫాల్ టవర్ డ్రాప్ రైడ్’లో ప్రమాదవశాత్తు పైనుంచి పడిపోయి ప్రాణాలు కోల్పోయిన ఒక టీనేజర్ కుటుంబానికి రూ.2,624 కోట్ల భారీ నష్టపరిహారం ఇవ్వాలని న్యాయస్థానం తీర్పు చెప్పింది. ఫ్లోరిడా రాష్ట్రంలోని ఐకాన్ పార్క్లో ఫన్టైమ్ హ్యాండిల్స్ అనే సంస్థ ఈ రైడ్ను నిర్వహించింది. 400 అడుగుల ఎత్తుకు తీసుకెళ్లి గంటకు 112 కిలోమీటర్లవేగంతో కిందకు దూసుకొస్తుంది. 2022 మార్చిలో 14 ఏళ్ల టైర్ శాంప్సన్ తన తోటి ఫుట్బాల్ టీమ్తో ఈ రైడ్ ఎక్కాడు. ఆరు అడుగుల ఎత్తు 173 కేజీల బరువున్న శాంప్సన్ను నిబంధనలకు విరుద్ధంగా రైడ్కు అనుమతించారు. వ్యక్తి 129 కేజీలకు మించి బరువుంటే ఈ రైడ్కు అనుమతించకూడదు. రెండుసార్లు పైకీ కిందకు సురక్షితంగా వెళ్లొచ్చిన శాంప్సన్ మూడోసారి పట్టుతప్పి 70 అడుగుల ఎత్తులో టవర్ నుంచి వేగంగా కిందకు పడటంతో అక్కడికక్కడే చనిపోయాడు. ‘అధిక బరువు’, సేఫ్టీ సీట్ లాక్ నిబంధనలను ఉల్లంఘించినందుకు శిక్షగా ఫన్టైమ్ హ్యాండిల్స్ సంస్థకు 310 మిలియన్ డాలర్ల జరిమానా విధించింది. ఈ మొత్తం నుంచి శాంప్సన్ తల్లిదండ్రులకు తలో 155 మిలియన్ డాలర్లు నష్టపరిహారంగా అందజేయాలని కోర్టు ఆదేశించింది. -
చాక్లెట్పై ఆ గుర్తులు లేవన్న వ్యక్తి.. పరిహారం చెల్లించిన కంపెనీ
ఏ వస్తువుకైనా దాని బ్రాండ్ గుర్తు చేసే కొన్ని గుర్తులు ఉంటాయి. ఆ గుర్తులే లేకపోతే.. దానిని ఎవరు తయారు చేసారో చెప్పడం కష్టం. కాబట్టి ప్రతి కంపెనీ తమ వస్తువులకు తప్పకుండా కొన్ని గుర్తులను ముద్రిస్తుంది. ఇటీవల ఒక మార్స్ చాక్లెట్ బార్.. సాధారణ చాక్లెట్ మాదిరిగా కాకుండా, స్మూత్గా ఉన్నట్లు ఓ వ్యక్తి కనిపెట్టాడు.బకింగ్హామ్ షైర్లోని ఐల్స్బరీకి చెందిన 32 ఏళ్ల హ్యారీ సీగర్.. తన ఫేస్బుక్లో స్మూత్ చాక్లెట్ బార్ ఫోటో షేర్ చేశారు. ఇది నెట్టింట్లో వైరల్ అయింది. అంతే కాకుండా దీనిని కంపెనీకి కూడా మెయిల్ ద్వారా పెంపించాడు. కంపెనీ దీనికి చింతిస్తూ.. క్షమాపణ చెప్పడమే కాకుండా అతనికి పరిహారంగా రూ. 215 చెల్లించింది.నిజానికి సీగర్ స్నేహితులతో కలిసి బర్మింగ్హామ్లోని ఒక క్లాసిక్ కార్ షోకు వెళుతుండగా.. ఆక్స్ఫర్డ్షైర్లోని సర్వీస్ స్టేషన్లో ఆగి చాక్లెట్ బార్ను కొనుగోలు చేశాడు. అయితే ఆ చాక్లెట్ మీద అలలు లాంటి గుర్తులు ఏమి లేకుండా మృదువుగా కనిపించింది. ఇది అతన్ని చాలా ఆకర్శించింది. దానినే సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు. అంతే కాకుండా కంపెనీకి మెయిల్ కూడా చేసాడు.కంపెనీ స్పందించి అతని పరిహారం అందించిన తరువాత, అతడు స్పందిస్తూ.. నేను పరిహారం కోసం కంపెనీకి మెయిల్ చేయలేదు. ఇలాంటి చాక్లెట్ ఎందుకు తయారు చేసారు? కారణం ఏమిటి అనే విషయాన్ని కనుక్కోవడానికి ఇలా చేసాను అని అన్నాడు. అయితే నాకు పరిహారం లభించింది. దీంతో నేను రెండు మార్స్ బార్లు కొనేయొచ్చు అని పేర్కొన్నాడు. -
ట్రాన్స్ విమెన్కి రికార్డు స్థాయిలో రూ. 6 లక్షల నష్టపరిహారం..!
ట్రాన్స్జెండర్లు హక్కులను గౌరవించమని, తాము మనుషులమే అని ఎన్నో సార్లు మొరపెట్టుకున్నారు, పోరాటాలు చేశారు. సుప్రీంకోర్టు సైతం వాళ్లకు కూడా కొన్ని హక్కులను ప్రసాదించింది. వారికి సమాజంలో సుమచిత స్థానం, గుర్తింపు ఇవ్వాలని స్పష్టం చేసింది కూడా. కానీ ఎక్కడో ఒక చోట వారిపై దాడులు, లింగ వివక్షత వంటి సమస్యలను ఎదుర్కొంటూనే ఉన్నారు. చెప్పాలంటే వారి విషయంలో సమాజం తీరు చాలావరకు మారాల్సి ఉంది. అయితే ఇలాంటి పరిస్థితి వివిధ దేశాల్లో కూడా ఉండటం బాధకరం. కొన్ని దేశాలు వారిపట్ల చాలా అమానుషంగా ప్రవర్తిస్తాయి. కనీసం వారి హక్కులకు కూడా ప్రాధాన్యత ఇవ్వదు. అలాంటి ఓ దేశం ఓ ట్రాన్స్ విమెన్ కేసుకి ప్రాధాన్యత ఇవ్వడమే సత్వరమే ఆమెకు న్యాయం జరిగేలా చేసింది. ఈ ఘటనను చరిత్రలో ఒక గొప్ప మైలురాయిగా అభివర్ణించవచ్చు. ఈ సంఘటన ఏ దేశంలో చోటు చేసుకుందంటే..చైనాకు చెందిన ట్రాన్స్ విమెన్ మగవాడిగా జన్మించి.. స్త్రీగా మారింది. ఇలా ట్రాన్సవిమెన్గా మారడాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన తల్లిదండ్రులు ఆమెను కిన్హువాంగ్డావో సిటీ ఫిఫ్త్ అనే మెంటల్ ఆస్పత్రికి తరలించారు. ఏదో మానసిక సమస్య వల్ల ఇలా చేసిందంటూ ఇదివరకటి వ్యక్తిలీ మార్చేలా ట్రీట్మెంట్ ఇవ్వమని చెప్పారు. అక్కడ నుంచి ఆమెకు మొదలైన కష్టాలు అన్నీ ఇన్నీ కావు. అక్కడ సిబ్బందితో సహా వైద్యులంతా తన ధోరణిని తప్పుపడుతూ బలవంతంగా మార్చే ప్రయత్నం చేశారు. అక్కడ ఎవ్వరూ ఆమెను విభిన్న లింగానికి చెందినదిగా అంగీకరించపోగా, హేళనలు, చిత్కారాలతో ఆమె మనసు మార్చే ప్రయత్నం చేశారు. ఆ నిమిత్తమైన సుమారు 97 రోజుల పాటు ఏడు సెషన్ల ఎలక్ట్రోషాక్ థెరపీ అందించారు. దీని కారణంగా మూర్చ(ఫిట్స్) వంటి సమస్యలు వచ్చాయి. ఆ ఆస్పత్రి బయట సమాజం అంగీకరించే విధంగా మార్చే ప్రయత్నంలో భాగంగా తనను శారీరకంగా మానసికంగా ఇబ్బందికి గురిచేసేలా వైద్యం చేశారు. దీని కారణంగా అనారోగ్యం పాలయ్యానంటూ కోర్టుని ఆశ్రయించింది. ట్రాన్స్ జెండర్లకి ప్రాధాన్యత ఇవ్వని చైనా దేశం ఆమె కేసుని టేకప్ చేయడమే కాకుండా సత్వరమే న్యాయం జరిగేలా చూసింది. చైనా మెంటల్ హెల్త్ చట్టాల ప్రకారం..వ్యక్తి ఇష్టానికి లోబడే చికిత్స చేయాలి. అలా కాకుండా వారి ఇష్టంతో సంబంధం లేకుండా ప్రమాదం కలిగించేలా చికిత్స చేస్తే దాన్ని తీవ్రమైన నేరంగా పరిగణిస్తుంది చైనా కోర్టు. ఈ మేరకు చాంగ్లీ కౌంటీ పీపుల్స్ కోర్ట్ స్వలింగ సంపర్కులు లేదా ట్రాన్స్ వ్యక్తులను "మార్చడానికి" హానికరమైన మందులు లేదా ఎలక్ట్రోషాక్ పద్ధతులను ఉపయోగించడం నేరం అని స్పష్టం చేసింది. ఆమెను అనారోగ్యం పాలు చేసినందుకు గానూ సదరు హాస్పిటల్ దాదాపు రూ. 6 లక్షలు పైనే నష్టపరిహారం ఇవ్వాల్సిందిగా పేర్కొంది. (చదవండి: ఫ్యాషన్కి వయసు అడ్డంకి కాదంటే ఇదే..! లెజండరీ గ్రానీ స్టిల్స్ అదుర్స్..) -
దక్షిణ రింగు భూనిర్వాసితులకు అధిక పరిహారం
సాక్షి, హైదరాబాద్: రీజినల్ రింగురోడ్డులోని దక్షిణ భాగం పరిధిలో సేకరించే భూములకు పరిహారం భారీగా పెంచే దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. రింగురోడ్డు ఉత్తర భాగాన్ని కేంద్ర ప్రభుత్వం చేపడుతుండగా, దక్షిణ భాగాన్ని రాష్ట్ర ప్రభుత్వమే సొంతంగా చేపడుతున్న సంగతి తెలిసిందే. భూసేకరణ ప్రక్రియలో భాగంగా అవార్డులు పాస్ చేసి పరిహారం చెల్లించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. దక్షిణ భాగంలో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం రింగురోడ్డు అలైన్మెంటును ఖరారు చేసే కసరత్తు మొదలుపెట్టింది. ఆమేరకు భూసేకరణ జరగాల్సి ఉంది. పరిహారం మొత్తం పెంచి ఇవ్వాలని నిర్ణయించింది. ఇందులోభాగంగా భూముల మార్కెట్ విలువను పెంచాలని నిర్ణయించింది. మార్కెట్ విలువ పెంచి పరిహారాన్ని భూసేకరణ, పునరావాస చట్టం–2013 ప్రకారం చెల్లించనుంది. మార్కెట్ విలువలు పెంచేందుకు వీలుగా చర్యలు తీసుకోవాలంటూ రవాణా, రోడ్లు, భవనాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్రాజ్ రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, నల్లగొండ, మహబూబ్నగర్, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. భూ యజమానులకు చట్టబద్ధంగా పరిహారం అందాలని, నష్టపోయామనే భావన వారిలో ఎక్కువగా కనిపించొద్దన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.ప్రాజెక్టు నిర్వహణ విభాగం ఏర్పాటుభారీ రోడ్డు ప్రాజెక్టులు నిర్వహించే ఎన్హెచ్ఏఐలో మాదిరి దక్షిణ రింగు కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టు నిర్వహణ విభాగాన్ని ఏర్పాటు చేసింది. ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఓఆర్ఆర్తో రేడియల్ రోడ్ల ద్వారా అనుసంధానాన్ని ఈ విభాగం ఖరారు చేస్తుంది. ఇందులో పర్యావరణ విభాగానికి సంబంధించి జిల్లా అటవీ అధికారి, సాంకేతిక విభాగంలో ఒక చీఫ్ ఇంజనీర్, ఇద్దరు అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, పరిపాలన విభాగానికి సంబంధించి అకౌంటెంట్ ఉండనున్నారు. అటవీ, రోడ్లు, భవనాలు, ఆర్థిక శాఖల నుంచి ఈ అధికారులు డిప్యుటేషన్పై పనిచేయనున్నారు. అలాగే, రీజినల్ రింగురోడ్డు పురోగతి పరిశీలనకు ప్రాజెక్టు డైరెక్టర్గా ఐఏఎస్ అధికారి దాసరి హరిచందనను నియమించారు. ఇక దక్షిణ రింగుకు సంబంధించి డీపీఆర్ తయారీ, టెండర్ల వ్యవహారం పర్యవేక్షించేందుకు కన్సల్టెన్సీ సేవలు తీసుకోనుంది. కన్సల్టెన్సీ సంస్థ ఖరారుకు వీలుగా ఆర్ఎఫ్పీ బిడ్లు ఆహ్వానించాలంటూ రోడ్లు, భవనాల శాఖ ఈఎన్సీని ఆదేశించింది. -
పరిహారమిచ్చాకే కూలుస్తున్నారా?
సాక్షి, హైదరాబాద్: ‘మూసీ నదీ గర్భం (రివర్ బెడ్)లో నిర్మాణం చేపట్టారంటూ మార్కింగ్ చేసిన ఇళ్లను పరిహారమిచ్చాకే కూలుస్తున్నారా? నోటీ సులు జారీ సహా చట్టప్రకారం అనుసరించాల్సిన ప్రక్రియను పాటిస్తున్నారా?’ అని రాష్ట్ర ప్రభుత్వా న్ని హైకోర్టు ప్రశ్నించింది. దీనిపై ప్రభుత్వం తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) ఇమ్రాన్ఖాన్ సమాధానమిచ్చారు. పరిహారంపై నిర్వాసితులతో మాట్లాడి, వారు సమ్మతించిన తర్వాతే ఇళ్ల కూల్చివేత చేపడుతున్నామని కోర్టుకు వివరించారు. ఏఏజీ చెప్పిన అంశాలను నమోదు చేసుకుంటున్నట్టు పేర్కొన్న ధర్మాసనం.. తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది. ఆలోగా కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వంతోపాటు హైడ్రాను ఆదేశించింది.కేఏ పాల్ పిటిషన్ మేరకు..‘‘మూసీకి సంబంధించి సరైన సర్వే నిర్వహించి, ఆక్రమణలను గుర్తించే వరకు భవనాలను కూల్చివేయకుండా హైడ్రాను ఆదేశించాలని.. బాధితులకు నోటీసులు ఇచ్చి, ఇళ్లు ఖాళీ చేయడానికి లేదా న్యాయస్థానాన్ని ఆశ్రయించడానికి నెల రోజుల సమయం ఇవ్వాలని కోరుతూ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ జె.శ్రీనివాస్రావుల ధర్మాసనం బుధవారం మరోసారి విచారణ చేపట్టింది.పారదర్శకంగా చర్యలు: ఏఏజీవిచారణ సందర్భంగా ఏఏజీ ఎక్కడ అని ధర్మాసనం ప్రశ్నించింది. ప్రభుత్వ న్యాయ వాదులు హాజరుకాకుంటే ఎలాగని, పిటిషనర్ల వాదనలకు సమాధానం ఇవ్వాల్సిన బాధ్యత వారిపై ఉంటుందని పేర్కొంది. దీనితో ఏఏజీ విచారణకు హాజరై వాదనలు వినిపించారు. ‘‘చట్టప్రకారం చర్యలు తీసుకుంటూనే ప్రభుత్వం ముందుకెళ్తోంది. నోటీసు లిచ్చి సమయం ఇచ్చిన తర్వాతే కూల్చివేతలు చేప డుతున్నాం. ప్రజలందరి విషయంలో ఒకేలా వ్యవ హరిస్తున్నాం. తారతమ్యాలు లేవు. పారదర్శకంగా, నిష్పక్ష పాతంగా చర్యలు చేపడుతున్నాం’’ అని వివరించారు. చెరువులు, కుంటల పరిరక్షణ కోసం కోర్టు ఆదేశాల మేరకు హైడ్రా ఏర్పాటైందని.. రివర్ బెడ్లోని ఇళ్లకు మార్కింగ్ మాత్రమే చేసిందని, ఇంకా కూల్చివేతలు చేపట్టలేదని తెలిపారు. హైడ్రాకు చట్టబద్ధత ఇస్తూ ఇటీవల ప్రభుత్వం ఆర్డినెన్స్ కూడా జారీ చేసిందని వివరించారు. వాదనలు విన్న ధర్మాసనం.. ఏఏజీ వాదనలను రికార్డు చేశామని, ఈ పిటిషన్లో మధ్యంతర ఉత్తర్వులు అవసరం లేదని పేర్కొంటూ విచారణను వాయిదా వేసింది. బాధితుల్లో ఎక్కువ మంది పేదలే..: పాల్విచారణ సందర్భంగా పార్టీ ఇన్ పర్సన్గా కేఏ పాల్ తానే వాదనలు వినిపించారు. ‘‘ఆక్రమణదారులు, బిల్డర్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, రిజిస్ట్రేషన్, విద్యుత్, నిర్మాణ, నల్లా అనుమతులు ఇచ్చిన అధికారులు అందరూ ఆనందంగానే ఉన్నారు. అనుమతులు ఉన్నాయి కదా అని కొనుగోలు చేసిన పేద, మధ్యతరగతి వారే రోడ్డున పడుతున్నారు. ‘హైడ్రా’ బాధితుల్లో ఎక్కువ మంది వారే. 462 నిర్మాణాలను, భవనాలను ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చారు. ఎన్ కన్వెన్షన్ను ఒక్కరోజులో కూల్చిన అధికారులు.. దాదాపు 250 మంది పెద్దలకు మాత్రం నోటీసులు జారీ చేసి వదిలేశారు. పేద, మధ్యతరగతికి సమయం ఇవ్వకుండా ప్రతాపం చూపిస్తున్నారు. కూల్చడానికి నేను వ్యతిరేకం కాదు.. కానీ, చట్టాన్ని పాటించాలి. న్యాయవాదులను పెట్టుకోలేని స్థితిలో చాలా మంది ఉన్నారు. లక్షల మంది హైడ్రా తమ ఇంటి మీదకు ఎప్పుడో వస్తుందో అని భయంతో బతుకుతున్నారు. అలాంటి వారి కోసమే పిల్ వేశాను. ఇళ్లు కూల్చే వారికి ముందే పరిహారం ఇవ్వాలి. నోటీసులిచ్చి ఖాళీ చేసే సమయం ఇవ్వాలి. తెలంగాణ మరో ఉత్తరప్రదేశ్లా మారకముందే చర్యలు తీసుకోవాలి. ఇళ్ల కూల్చివేతపై సుప్రీంకోర్టు ఆదేశాలు పాటించాలి’’ అని పాల్ వాదనలు వినిపించారు. -
ప్రతి అర్జీని పరిశీలించి నష్ట పరిహారం అందిస్తాం
సాక్షి ప్రతినిధి, విజయవాడ: బుడమేరు వరద ముంపు ప్రభావంతో నష్టపోయిన ప్రతి కుటుంబానికీ నష్ట పరిహారం అందిస్తామని ఎన్టీఆర్ జిల్లా ఇన్చార్జ్ కలెక్టర్ డాక్టర్ నిధి మీనా స్పష్టం చేశారు. సాక్షి పత్రిక మెయిన్ ఎడిషన్లో మంగళవారం ‘అర్జీలు బుట్టదాఖలు ’ శీర్షికన ప్రచురితమైన కథనంపై ఇన్ఛార్జి కలెక్టర్ స్పందించారు. మంగళవారం నగరంలోని పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో ఆమె మాట్లాడుతూ.. ఇప్పటి వరకు బుడమేరు వరద నష్టంలో భాగంగా గృహ, ఎంఎస్ఎంఈ, వాహనాలు తదితర విభాగాలకు సంబంధించి 1,44,672 మంది వరద ప్రభావిత బాధితుల బ్యాంకు ఖాతాల్లో రూ.235.72 కోట్లను జమ చేశామని వివరించారు. 179 గ్రామ వార్డు సచివాలయాల్లో వరద గణన జాబితాల ప్రచురణతో పాటు అదనంగా వచ్చిన దరఖాస్తులను పిజిఆర్ఎస్ ఫ్లడ్ మాడ్యూల్లో నమోదు చేశారన్నారు. ఆధార్తో బ్యాంకు ఖాతా అనుసంధానించబడిన బ్యాంకు ఖాతాలకు నేరుగా పరిహారం జమ చేశారన్నారు. బ్యాంకు ఖాతాలు అనుసంధానం కాని 476 ఖాతాలను అనుసంధానం చేసి చెల్లింపుల ప్రక్రియ జరిపేలా చర్యలు తీసుకున్నారని వివరించారు. ప్రస్తుతం పెండింగ్లో ఉన్న 2,478 దరఖాస్తులను పరిశీలించి నష్ట పరిహారం చెల్లించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈనెల 24వ తేదీలోగా అర్హులైన బాధితుల ఖాతాల్లో నష్ట పరిహారం జమ చేస్తామన్నారు. నష్టపోయిన ప్రతి బాధితునికి పరిహారం చెల్లించాలని ముఖ్యమంత్రి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు.కాగా.. సాయం కోసం కలెక్టరేట్కు ఎన్ని దరఖాస్తులొచ్చాయనే విషయాన్ని స్పష్టంగా చెప్పలేదు. -
కుటుంబానికి బీమా ధీమా..
షణ్ముఖ్, నిత్య దంపతులకు ఇద్దరు పిల్లలు. షణ్ముఖ్ ప్రైవేటు సంస్థలో ఉద్యోగి. నిత్య గృహిణి. ఎలాంటి ఆర్థిక ఇబ్బందుల్లేవు. సంతోషంగా ఉన్న ఆ కుటుంబంలో రోడ్డు ప్రమాదం చిచ్చు పెట్టింది. షణ్ముఖ్ పేరిట లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలు రెండున్నాయి. ఆ రెండింటి నుంచి వచ్చిన మొత్తం కేవలం రూ.15 లక్షలు. కుటుంబ జీవన అవసరాలకు ఈ మొత్తం చాలదని తెలియడంతో.. బాధను దిగమింగుకుని నిత్య ప్రైవేటు ఉద్యోగంలో చేరాల్సి వచ్చింది. జీవిత బీమా రక్షణ లేని వారు కొందరు అయితే.. ఉన్నా తగినంత కవరేజీతో సరైన ప్లాన్ తీసుకోని వారే ఎక్కువ. ఇలాంటి వారికి షణ్ముఖ్ కేసు కనువిప్పు కలిగిస్తుంది. సరైన బీమా పథకాన్ని, తగినంత కవరేజీతో తీసుకున్నప్పుడే దాని లక్ష్యం, ఉద్దేశం నెరవేరుతుంది. ఈ దిశగా అవగాహన కలి్పంచే కథనమే ఇది...తమపై ఎవరైనా ఆరి్థకంగా ఆధారపడి ఉంటే, అలాంటి ప్రతి ఒక్కరూ జీవిత బీమా రక్షణను (పాలసీ) తప్పకుండా తీసుకోవాలి. ఆర్జించే వ్యక్తి దురదృష్టవశాత్తూ మరణించిన సందర్భాల్లో వారి కుటుంబం జీవన అవసరాల కోసం ఆరి్థకంగా ఇబ్బందులు పడకుండా జీవిత బీమా పరిహారం సాయంగా నిలుస్తుంది. కానీ, ఇదంతా సరైన, సరిపడా రక్షణ తీసుకున్నప్పుడే అని తప్పకుండా దృష్టిలో పెట్టుకోవాలి. తమ విలువైన జీవితంపై చేస్తున్న అసలైన పెట్టుబడిగా అర్థం చేసుకోవాలి.కవరేజీ ఎంత?ఏజెంట్ లేదా బ్రోకర్ చెప్పిన మేరకు లేదా ప్రీమియం తమకు సౌకర్యంగా అనిపించిన మేరకు జీవిత బీమా కవరేజీని ఎక్కువ మంది తీసుకుంటుంటారు. కానీ, ఇది సరైన విధానం కాదు. ఎంత లేదన్నా వార్షిక ఆదాయానికి కనీసం 10 రెట్ల మొత్తం జీవిత బీమా రక్షణగా తీసుకోవాలన్నది ప్రాథమిక సూత్రం. అలాగే, వార్షిక ఆదాయానికి 25 రెట్ల వరకు కవరేజీని ఎంపిక చేసుకోవచ్చు. 20 రెట్లు మధ్యస్థంగా ఉంటుంది. ఒకవేళ రుణాలు తీసుకుని ఉంటే ఆ మేరకు కవరేజీని అదనంగా ఎంపిక చేసుకోవాలి. ఉదాహరణకు వార్షికాదాయం రూ.12 లక్షలు ఉంటే, కనీసం రూ.1.2 కోట్ల సమ్ అష్యూర్డ్తో టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. ఇల్లు, కారు లేదా వ్యక్తిగత రుణాలు రూ.10 లక్షలు ఉన్నాయనుకుంటే.. అప్పుడు రూ.1.2 కోట్లకు బదులు రూ.1.3 కోట్లను ఎంపిక చేసుకోవాలి. దురదృష్టవశాత్తు పాలసీదారు మరణించినట్టయితే బీమా సంస్థ చెల్లించే పరిహారంతో అప్పులు తీర్చి, మిగిలిన మొత్తంతో కుటుంబం సాఫీగా జీవించడానికి అవకాశం ఉంటుంది.సరిపోతుందా..?ఇంతకు ముందు ఉదాహరణలో వార్షిక ఆదాయం రూ. 12 లక్షలకు పది రెట్లు అంటే రూ.1.2 కోట్లకు టర్మ్ లైఫ్ ప్లాన్ తీసుకున్న తర్వాత.. పాలసీదారు మరణించినట్టయితే వచ్చే పరిహారం కుటుంబానికి సరిపోతుందా..? ఇక్కడ రూ.1.2 కోట్ల డిపాజిట్పై 6 శాతం వార్షిక రేటు ఆధారంగా వచ్చే మొత్తం రూ.7.2 లక్షలు మించదు. అంటే అప్పటి వరకు వచ్చిన వార్షికాదాయం కంటే తక్కువ. తమకు ఏదైనా జరిగినా.. ఎప్పటి మాదిరే కుటుంబ జీవనం సాఫీగా సాగిపోవాలంటే ఇక్కడ రూ. 2.4 కోట్లకు బీమా రక్షణను (సమ్ అష్యూర్డ్) తీసుకోవాలి. ఉదాహరణకు షణ్ముఖ్ వయసు 30 ఏళ్లు. ప్రస్తుత వార్షికాదాయం రూ.12 లక్షలకు 20 రెట్ల చొప్పున రూ.2.4 కోట్లకు టర్మ్ లైఫ్ కవరేజీ తీసుకున్నాడని అనుకుందాం. 40 ఏళ్లకు వచ్చే సరికి షణ్ముఖ్ వార్షికాదాయం రూ.24 లక్షలకు పెరిగింది. ఈ ప్రకారం చూస్తే పదేళ్ల క్రితం తీసుకున్న టర్మ్ ప్లాన్లో రక్షణ వార్షిక ఆదాయానికి పది రెట్లకు తగ్గిపోయిందని తెలుస్తోంది. వయసు పెరిగే కొద్దీ జీవితంలో బాధ్యతలు, ఖర్చులు పెరుగుతాయని తెలిసిందే. కనుక పెరుగుతున్న ఆదాయానికి, జీవన వ్యయాలకు అనుగుణంగా బీమా కవరేజీ కూడా పెరిగేలా చూసుకోవాలి. సొంతిల్లు, పిల్లలకు మెరుగైన విద్య అన్నవి తల్లిదండ్రులకు ఎంతో ముఖ్యమైన లక్ష్యాలు. ఇంటికి ఆధారమైన వ్యక్తి మరణించినప్పుడు వచ్చే పరిహారం కేవలం ఆ కుటుంబ జీవన అవసరాలే కాదు, ముఖ్యమైన జీవిత లక్ష్యాల సాకారానికీ తోడ్పాటునివ్వాలి. అందుకుని వాటికయ్యే వ్యయాలను కూడా కవరేజీని నిర్ణయించుకునే విషయంలో పరిగణనలోకి తీసుకోవాలి. ఎప్పుడు తీసుకోవాలి..? ‘‘వివాహం అయిన తర్వాత లేదా పిల్లలు కలిగిన తర్వాత టర్మ్ ప్లాన్ తీసుకోవాలనే ధోరణి సరికాదు. ఎంత వీలైతే అంత ముందుగా టర్మ్ ప్లాన్ కొనుగోలు చేయడం మంచిది. దీనివల్ల ప్రీమియం తక్కువగా ఉంటుంది. అంతేకాదు పాలసీ పూర్తి కాలానికి అదే కొనసాగుతుంది’’ అని ఆనంద్రాఠి ఇన్సూరెన్స్ బ్రోకర్స్కు చెందిన దినేష్ దిలీప్ భోయ్ సూచించారు. వీలైనంత ముందుగా అంటే.. సంపాదన మొదలు పెట్టిన వెంటనే అని అర్థం చేసుకోవచ్చు. జీవితంలో స్థిరపడడంలో ఆలస్యమైన వారు.. కనీసం తమ సంపాదన మొదలైన మొదటి 30 రోజుల్లో అయినా టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ తీసుకోవడం మరిచిపోవద్దు. సాధారణంగా 18 సంవత్సరాల నుంచి 65 ఏళ్ల వయసు వారు టర్మ్ ప్లాన్ తీసుకోవచ్చు. ఆలస్యం చేసిన కొద్దీ వయసుతోపాటు ప్రీమియం పెరుగుతుంది. పైగా నేటి రోజుల్లో చిన్న వయసులోనే జీవనశైలి వ్యాధులైన మధుమేహం, రక్తపోటు, థైరాయిడ్ తదితర సమస్యలు కనిపిస్తున్నాయి. ఆరోగ్యంగా ఉన్నప్పుడు జీవిత బీమా తీసుకోవడాన్ని నిర్లక్ష్యం చేసి, అనారోగ్య సమస్యలు పలకరించిన తర్వాత తీసుకోవాలంటే అధిక ప్రీమియం చెల్లించాల్సి వస్తుంది. ఆరోగ్య వంతులతో పోలి్చతే ప్రీమియం 20–50 శాతం అధికంగా పడుతుంది. కొన్ని సందర్భాల్లో రిస్క్ మరీ ఎక్కువ ఉంటుందని బీమా సంస్థలు భావిస్తే బీమా కవరేజీని తిరస్కరించే అవకాశం కూడా లేకపోలేదు.ఎంత కాలానికి? జీవిత బీమా తీసుకోవడం ఎంత ముఖ్యమో, ఎంత వయసు వచ్చే వరకు ఈ రక్షణ ఉండాలన్నది కూడా ముఖ్యమైన అంశమే అవుతుంది. మనలో చాలా మంది ఇక్కడే తప్పు చేస్తుంటారు. ఎక్కువ మంది 20–25 ఏళ్ల కాలానికే రక్షణను ఎంపిక చేసుకుంటుంటారు. ఉదాహరణకు 25 ఏళ్ల వ్యక్తి 25 ఏళ్ల కాలానికి జీవిత బీమా కవరేజీ తీసుకున్నారని అనుకుంటే.. అతడికి/ఆమెకు 50 ఏళ్లు వచ్చే సరికి ఆ రక్షణ ముగిసిపోతుంది. దీంతో అక్కడి నుంచి మళ్లీ కొంత కాలానికి మరో పాలసీ కొనుగోలు చేయాల్సి వస్తుంది. దీనివల్ల ప్రీమియం భారంగా మారుతుంది. ప్లాన్ తీసుకునే నాటికి తమ వయసు ఎంతన్నది పరిగణనలోకి తీసుకోవాలి. ఎంతలేదన్నా రిటైర్మెంట్ వరకు (60 ఏళ్లు) జీవిత బీమా కవరేజీ ఉండాలి. కొందరికి ఆలస్యంగా వివాహం కావచ్చు. అంటే 30–45 ఏళ్ల మధ్యలో వివాహం చేసుంటే.. 60 ఏళ్లు వచ్చినా పిల్లలకు సంబంధించి, కుటుంబ బాధ్యతలు ఇంకా మిగిలి ఉంటాయి. పిల్లలకు కనీసం 23–25 ఏళ్ల వయసు వచ్చే వరకు అయినా తమకు టర్మ్ కవరేజీ ఉండేలా చూసుకోవడం సరైనది. రిటైర్మెంట్ నాటికి లేదా జీవితంలో అన్ని ముఖ్యమైన బాధ్యతలు తీరే నాటికి బీమా కవరేజీ ఉంటే సరిపోతుంది.ఎలాంటి టర్మ్ ప్లాన్? టర్మ్ ప్లాన్ అంటే అచ్చమైన బీమా రక్షణతో కూడిన పాలసీ కదా? అన్న సందేహం రావచ్చు. అవును టర్మ్ ప్లాన్ ఉద్దేశంఅదే. కానీ, వినియోగదారుల ధోరణి, అంచనాలు, అవసరాలకు అనుగుణంగా ఇందులోనూ పలు రకాలు వచ్చాయి. సంప్రదాయ ఎండోమెంట్ ప్లాన్లలో బీమా రక్షణతోపాటు, పాలసీ గడువు ముగిసే వరకు పాలసీదారు జీవించి ఉన్నా కానీ రాబడి ప్రయోజనం లభిస్తుంది. అంటే అది బీమా, పెట్టుబడి కలిసిన సాధనం. టర్మ్ ప్లాన్ ఎలాంటి రాబడి ఇవ్వని.. కేవలం మరణించిన సందర్భాల్లోనే (పాలసీ కాల వ్యవధిలో) పరిహారం చెల్లించేది. కానీ, పాలసీ గడువు ముగిసే వరకు పాలసీదారు జీవించి ఉంటే అప్పటి వరకు చెల్లించిన ప్రీమియం నుంచి జీఎస్టీ మినహాయించి మిగిలిన మొత్తాన్ని వెనక్కిచ్చే టర్మ్ ప్లాన్లు మార్కెట్లోకి ప్రవేశించాయి. టర్మ్ ఇన్సూరెన్స్ విత్ రిటర్న్ ఆఫ్ ప్రీమియం (టీఆర్వోపీ)గా దీన్ని పిలుస్తారు. లెవల్ టర్మ్ ఇన్సూరెన్స్: ఇది అందరికీ తెలిసిన ప్లాన్. కాల వ్యవధి పూర్తయ్యే వరకు కవరేజీ స్థిరంగా ఉంటుంది. ఉదాహరణకు 30 ఏళ్ల కాలానికి రూ.50 లక్షల కవరేజీతో ప్లాన్ తీసుకుంటే, కాల వ్యవధి ముగిసే వరకు రూ.50 లక్షల కవరేజీయే కొనసాగుతుంది. ఇంక్రీజింగ్ టర్మ్ ఇన్సూరెన్స్: ఇందులో సమ్ అష్యూర్డ్ స్థిరంగా ఉండదు. నిరీ్ణత కాలానికోసారి పెరుగుతూ పోతుంది. దీనివల్ల ద్రవ్యోల్బణం నుంచి పరిహారానికి హెడ్జింగ్ లభిస్తుంది. అంతేకాదు పెరిగే వయసుకు తగ్గట్టు బాధ్యతలు కూడా అధికమవుతుంటాయి. ఈ విధంగానూ అదనపు రక్షణ అక్కరకు వస్తుంది. డిక్రీజింగ్ టర్మ్ ఇన్సూరెన్స్: ఇంక్రీజింగ్ ప్లాన్కు వ్యతిరేకంగా ఇది పనిచేస్తుంది. నిరీ్ణత కాలానికోసారి కవరేజీ తగ్గుతూ వెళుతుంది. ఉదాహరణకు ఏదైనా లోన్ తీసుకుని, దానికి రక్షణ కోసం టర్మ్ ప్లాన్ తీసుకున్నారని అనుకుందాం. కొంత కాలానికి రుణ భారం తగ్గిపోతుంది. దీనికి అనుగుణంగా బీమా రక్షణ తగ్గేలా ఈ ప్లాన్ ఉపయోగపడుతుంది. కన్వర్టబుల్ టర్మ్ ఇన్సూరెన్స్: ఇందులో టర్మ్ ప్లాన్ను ఎండోమెంట్ లేదా హోల్లైఫ్ పాలసీగా మార్చుకోవచ్చు. హోల్ లైఫ్ ఇన్సూరెన్స్: నూరేళ్ల కాలానికి ఈ ప్లాన్లో రక్షణ లభిస్తుంది. నోట్: టర్మ్ ప్లాన్లో ఎన్ని రకాలున్నా.. అచ్చమైన టర్మ్ ప్లాన్ (లెవల్ టర్మ్ఇన్సూరెన్స్) సులభమైనది. మిగిలిన వాటిల్లో తమకు ఏదైనా మరింత ప్రయోజనం అనిపిస్తే దాన్ని ఎంపిక చేసుకోవచ్చు. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే.. లెవల్ టర్మ్ ప్లాన్లో కాల వ్యవధి ముగిసే వరకు ప్రీమియం మారదు. ఇంక్రీజింగ్ టర్మ్ ప్లాన్లో, కన్వర్టబుల్, హోల్లైఫ్ ప్లాన్లలో ప్రీమియం అధికంగా ఉంటుంది. సాధారణ లెవల్ టర్మ్ ప్లాన్తో పోల్చితే రిటర్న్ ఆఫ్ ప్రీమియం ప్లాన్లోనూ ప్రీమియం చాలా ఎక్కువగా ఉంటుంది. రైడర్లు..టర్మ్ ప్లాన్కు అనుబంధంగా పలు రైడర్లను బీమా సంస్థలు ఆఫర్ చేస్తున్నాయి. క్రిటికల్ ఇల్నెస్ రైడర్: కేన్సర్, కాలేయ వైఫల్యం తదితర 20 నుంచి 64 వరకు తీవ్ర అనారోగ్య సమస్యల బారిన పడినప్పుడు ఈ రైడర్ నుంచి ఏక మొత్తంలో పరిహారం లభిస్తుంది. ఈ రైడర్లో ఎన్నింటికి కవరేజీ అన్నది బీమా సంస్థలను బట్టి మారుతూ ఉంటుంది. వేవర్ ఆఫ్ ప్రీమియం: ప్రమాదంలో అంగవైకల్యం పాలైనా లేక తీవ్ర వ్యాధుల బారిన పడినా ఇక అక్కడి నుంచి పాలసీదారు ప్రీమియం చెల్లించే అవసరాన్ని ఇది తప్పిస్తుంది. బీమా సంస్థే మిగిలి ఉన్న కాలానికి ప్రీమియం చెల్లిస్తుంది. యాక్సిడెంటల్ డెత్, టోటల్, పర్మనెంట్ డిజేబిలిటీ రైడర్: ప్రమాదంలో మరణించినా లేదా అంగవైకల్యం పాలైనా ఈ రైడర్లో ఎంపిక చేసుకున్న మేర పరిహారం పొందొచ్చు. పరిహారం చెల్లింపు ఎలా..? పాలసీదారు మరణించినప్పుడు పరిహారం చెల్లింపులో పలు ఆప్షన్లను టర్మ్ ప్లాన్లు ఆఫర్ చేస్తుంటాయి. → ఎంపిక చేసుకున్న సమ్ అష్యూర్డ్ మొత్తాన్ని ఒకే విడత చెల్లించడం ఇందులో ఒకటి. → సమ్ అష్యూర్డ్లో 50 శాతాన్ని ఏకమొత్తంగా చెల్లించి, మిగిలిన 50 శాతాన్ని సమాన వాయిదాల్లో కొన్ని సంవత్సరాల పాటు చెల్లించడం మరో ఆప్షన్. → సమ్ అష్యూర్డ్లో కొంత మొత్తాన్ని ఒకే విడత చెల్లించి, మిగిలిన మొత్తాన్ని నెలవారీగా పెంచుతూ చెల్లించడం మూడో ఆప్షన్.చిట్కాలు→ తగినంత కవరేజీ ఎంపిక చేసుకున్న తర్వాత.. అందుకు ఏటా చెల్లించే ప్రీమియం తమ సామర్థ్యం మేరకే ఉండేలా చూసుకోవాలి. ప్రీమియం చెల్లించలేనంత భారంగా మారకూడదు. ప్రీమియం చెల్లించలేక పాలసీ మధ్య లో లాప్స్ అయ్యే రిస్క్ ఉంటుంది. అందుకని తగినంత బీమా రక్షణ ఒక్కటే కాదు, తమ చెల్లింపుల సామర్థ్యాన్నీ పరిగణనలోకి తీసుకోవాలి. → ఏదో ఒక కంపెనీ నుంచి పాలసీ తీసుకోవడం కాకుండా, వివిధ కంపెనీల మధ్య ఫీచర్లు, ప్రీమియం రేట్లను పరిశీలించి చూసుకోవాలి. → టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్కు అనుబంధంగా వచ్చే రైడర్లు, యాడాన్లను తప్పకుండా పరిశీలించాలి. ముఖ్యంగా యాక్సిడెంటల్ డిజేబిలిటీ రైడర్ను తీసుకోవడం ఎంతో అవసరం. → ఆఫ్లైన్ కంటే ఆన్లైన్లో పాలసీ తీసుకుంటే ప్రీమియంలో కొంత తగ్గింపు లభిస్తుంది. → పెరుగుతున్న జీవన అవసరాలకు అనుగుణంగా, అదనపు రుణం తీసుకున్న ప్రతి సందర్భంలో ఆ మేరకు బీమా కవరేజీని పెంచుకోవాలి. → ఎంపిక చేసుకునే బీమా సంస్థ, క్లెయిమ్లను ఏ మేరకు ఆమోదిస్తుందో తప్పకుండా పరిశీలించాలి. దీర్ఘకాలంలో మెరుగైన చెల్లింపుల చరిత్ర ఉన్న సంస్థను ఎంపిక చేసుకోవాలి.– సాక్షి, బిజినెస్ డెస్క్ -
Group of ministers: జీఎస్టీ రేట్లలో సెస్సు విలీనం!
న్యూఢిల్లీ: జీఎస్టీ కాంపెన్సేషన్ (పరిహారం) సెస్సును జీఎస్టీ రేట్లలో విలీనం చేసే ప్రతిపాదనపై మంత్రుల బృందం (జీవోఎం) చర్చించింది. జీఎస్టీ ఆరంభంలో రాష్ట్రాలు కోల్పోయే పన్నును భర్తీ చేసేందుకు వీలుగా సెస్సును ప్రవేశపెట్టడం తెలిసిందే. ఒక్కసారి విలీనంపై నిర్ణయం తీసుకున్న తర్వాత, ఈ సెస్సు నుంచి మళ్లే క్రమంలో మరే వస్తువును లగ్జరీ లేదా సిన్ విభాగం కిందకు చేర్చకూడదని రాష్ట్రాలు సూచించాయి. 2026 మార్చిలో కాంపెన్సేషన్ సెస్సు ముగిసిన అనంతరం దాన్ని జీఎస్టీ రేట్లలో కలిపేయాలని.. అప్పటి వరకు ఏ వస్తువులకు సెస్సు అమలు చేశారో వాటికి సంబంధించి ప్రత్యేక రేటును జీఎస్టీలో ప్రవేశపెట్టాలన్నది రాష్ట్రాల అభిప్రాయంగా ఉంది. ‘‘జీఎస్టీ కాంపెన్సేషన్ సెస్సు ముగింపునకు వస్తోంది. దీని భవిష్యత్ ఏంటన్న దానిపై చర్చించాల్సిన అవసరం ఉంది. ప్రతి రాష్ట్రం తమ అభిప్రాయాలను తెలియజేసింది. ఇందుకు సంబంధించి ఇది తొలి సమావేశం’’అని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి ప్రకటించారు. మంత్రుల బృందానికి ఆయనే నేతృత్వం వహిస్తున్నారు. సెస్సును కొనసాగించాలా లేదంటే దాన్ని పన్ను కిందకు మార్చాలా? లగ్జరీ విభాగంలో మార్పులు చేయాలా? అన్న దానిపై చర్చలు కొనసాగుతున్నట్టు చెప్పారు. జీఎస్టీ కాంపెన్సేషన్ సెస్సుపై నవంబర్ రెండో వారంలో జీవోఎం మరోసారి సమావేశమై చర్చించనుంది. అసోం, ఛత్తీస్గఢ్, గుజరాత్, కర్ణాటక, మధ్యప్రదేశ్, పంజాబ్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశి్చమబెంగాల్ రాష్ట్రాల మంత్రులు జీవోఎంలో సభ్యులుగా ఉన్నారు. -
వరద బాధితులందరికీ పరిహారం అందించాలి
సాక్షి ప్రతినిధి, విజయవాడ: వరద బాధితులందరికీ తక్షణమే నష్ట పరిహారం అందించాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్సీపీ గురువారం విజయవాడలోని ధర్నాచౌక్లో నిరాహార దీక్ష చేపట్టింది. వైఎస్సార్సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ దీక్షకు పెద్ద సంఖ్యలో ప్రజలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తరలి వచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.ప్రభుత్వం ముందస్తు సమాచారం ఇవ్వకపోవటంవల్లే బుడమేరు వరదలో ప్రజలు నిండా మునిగారని, పెద్ద ఎత్తున నష్టపోయారని దీక్షలో పాల్గొన్న నేతలు తెలిపారు. బాధితుల్లో ఒక్కరికీ పూర్తి నష్ట పరిహారం అందలేదని, ఆదుకోవాలంటూ సచివాలయాలు, కలెక్టరేట్ చుట్టూ తిరిగినా కనీసం పట్టించుకోవటంలేదని ధ్వజమెత్తారు. బుడమేరు గేట్లు ఎత్తిన ప్రభుత్వం, నష్టపరిహారం కోసం అర్జీలు తీసుకోకుండా కలెక్టరేట్ గేట్లు మూసేసిందని మండిపడ్డారు. వరద సహాయక చర్యల పేరుతో అవినీతి బురద పారిందని దుయ్యబట్టారు. సాయం చేయాల్సింది పోయి, బాధితులపై లాఠిఛార్జి చేసిన ఘనత ఈ ప్రభుత్వానికే దక్కిందన్నారు. బాధితుల్లో చివరి వ్యక్తికి కూడా పరిహారం అందేవరకు పోరాటం చేస్తామని వైఎస్సార్సీపీ నేతలు భరోసా ఇచ్చారు. బాబు వల్లే బుడమేరుకు వరద సీఎం చంద్రబాబు వల్లే బుడమేరు వరద విజయవాడను ముంచేసిందని వైఎస్సార్సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ చెప్పారు. వరదతో నగరంలో 32 డివిజన్లలో 2.69 లక్షల కుటుంబాలు నీట మునిగాయన్నారు. సర్వస్వం కోల్పోయిన వరద బాధితులకు నష్ట పరిహారం ఇవ్వాలని అడుగుతుంటే అధికార పార్టీ నేతలు వైఎస్సార్సీపీ మీద పడి ఏడుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రూ.534 కోట్ల విరాళాలు కూటమి ప్రభుత్వం ఏమి చేసిందో చెప్పాలని నిలదీశారు. కూటమి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పోరాటం ప్రారంభించామని, ఈ ప్రభుత్వం పడిపోవడానికి ఇదే నాంది అని చెప్పారు. మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ వైఎస్సార్సీపీ రూ.1.50 కోట్లు ఖర్చుపెట్టి 50 వేల కుటుంబాలకు సరుకులు పంపిణీ చేసిందని చెప్పారు. వరద బాధితుల కోసం చేసిన ఖర్చుపై తమ లెక్కలు ఇస్తామని, ప్రభుత్వం లెక్కలు ఇవ్వాలని, వాటిపై దమ్ముంటే చర్చకు రావాలని సవాల్ చేశారు. సీఎం చంద్రబాబు ఇల్లు, అమరావతి మునిగిపోకుండా బుడమేరు గేట్లు ఎత్తేసి విజయవాడను ముంచేశారని ఎమ్మెల్సీ రుహూల్లా చెప్పారు. ఈ కూటమి ప్రభుత్వానికి మానవత్వం లేదని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మండిపడ్డారు. ప్రతి దేవస్థానం నుంచి ఆహారాన్ని తీసుకొచ్చారని, దానిని బాధితులకు అందించకుండా బయట పడేసి వెళ్లిపోయారని ధ్వజమెత్తారు. నష్ట పరిహారం కోసం బాధితులు రోడ్ల మీద ఆందోళన చేసే దుస్థితి నెలకొందన్నారు. కంచికచర్లలో ముంపునకు గురైన ప్రాంతాల వారికి ప్రభుత్వం నష్ట పరిహారం అందించలేదని నందిగామ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్మోహనరావు చెప్పారు. ఈ కార్యక్రమంలో జగ్గయ్యపేట నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇన్ఛార్జి తన్నీరు నాగేశ్వరరావు, విజయవాడ మేయర్ రాయన భాగలక్షి్మ, వైఎస్సార్సీపీ నాయకుడు పోతిన మహేష్, విజయవాడ డిప్యూటీ మేయర్లు బెల్లం దుర్గ, అవుతు శైలజారెడ్డి, పార్టీ నేత గౌతమ్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
‘ఆటో’ బతుకులు అస్తవ్యస్థం
సాక్షి, అమరావతి: ‘అటో డ్రైవర్ కె.శివారెడ్డి ఊర్మిళనగర్ రెండో లైనులో అద్దె ఇంటిలో నివసిస్తున్నాడు. ఇటీవల వచ్చిన బుడమేరు వరదలకు ఆ ఇల్లు మునిగిపోయింది. జీవనాధారమైన ఆటోతో పాటు ద్విచక్రవాహనం పూర్తిగా పాడైపోయాయి. సచివాలయ సిబ్బంది వచ్చి వివరాలు నమోదు చేసుకుని వెళ్లారు. కానీ ఇంత వరకూ ఒక్క రూపాయి కూడా పరిహారం రాలేదు. అప్పు చేసి ఆటోకు మరమ్మతులు చేయించుకుంటే రూ.45 వేలు ఖర్చయింది. ఇంటికిగానీ, వాహనాలకు గానీ పరిహారం ఇప్పించాలంటూ కలెక్టరేట్ చుట్టూ తిరుగుతున్నాడు.పదహారేళ్లుగా ఇదే ప్రాంతంలో ఆటో నడుపుతున్న నా పేరు ఎందుకు జాబితాలో లేదని ఎవరిని అడిగినా సమాధానం చెప్పడంలేదని వాపోతున్నాడు.’’...ఇది బుడమేరు వరదల్లో ఆటోలను కోల్పోయిన వేలాది మంది డ్రైవర్ల ఆవేదన. నగరంలో తిరిగే ఆటోలలో అతకధికం సింగ్ నగర్, ఇందిరానాయక్ నగర్, పాయకాపురం, కండ్రిగ, వాంబేకాలనీ, మిల్క్ ప్రాజెక్ట్, డాబా కోట్లు సెంటర్, రాజరాజేశ్వరిపేట, నందమూరి కాలనీ, భరతమాత కాలనీ, ఊరి్మళనగర్ల నుంచే వస్తున్నాయి. అక్కడి నిరుద్యోగులు డ్రైవర్లుగా మారి జీవనం సాగిస్తున్నారు. ఇప్పుడు వారందరి జీవితాలు అస్తవ్యస్ధంగా మారాయి. ఈ నేపధ్యంలో ఆ ప్రాంతాల్లో పర్యటించి బాధితుల బతుకు చిత్రంపై సాక్షి గ్రౌండ్ రిపోర్ట్ ఇది.మరమ్మతులకు కొత్త అప్పులురోజుల తరబడి ముంపులోనే ఉండటంతో ఆటోలు పూర్తిగా దెబ్బతిన్నాయి. బయట మెకానిక్ దగ్గర నుంచి కంపెనీ షోరూమ్ వరకూ ఒక్కో దాని మరమ్మతులకే రూ.12 వేల నుంచి రూ.75 వేల వరకూ వ్యయం అవుతోంది. రేడియేటర్, ఇంజిన్, బ్యాటరీతో పాటు బీఎస్ 6 వాహనాల్లో సెన్సార్లు పాడవ్వడంతో ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తోంది. ఇన్ని వాహనాలకు మరమ్మతులు చేసేందుకు మెకానిక్ల కొరత ఉండటంతో రోజుల తరబడి మోటార్ షెడ్ల వద్దే ఆటోలు పడి ఉంటున్నాయి. ఒకసారి మరమ్మతు చేసినా మళ్లీ మళ్లీ కొత్త లోపాలు బయటపడుతున్నాయి. దీంతో కొత్త అప్పులు చేసి మరమ్మతులకు వెచి్చస్తున్నారు. ఉపాధి లేక, కుటుంబాలను పోషించుకోలేక, వాయిదాలు కట్టలేక అవస్థలు పడుతున్నామని డ్రైవర్లు నిస్సహాయతను వ్యక్తం చేస్తున్నారు. ఓట్లేయించుకున్న రాష్ట్ర ప్రభుత్వంగానీ, స్థానిక ప్రజాప్రతినిధులుగానీ తమను అసలు పట్టించుకోవడం లేదని కన్నీరుమున్నీరవుతున్నారు.బీమా సంస్థల కొర్రీలువరద నీటిలో మునిగిన ఆటోలకు క్లెయిమ్లు ఎగవేసేందుకు బీమా సంస్థలు ఉన్న అన్ని అవకాశాలనూ వాడుకుంటున్నాయి. బీమా చేసే సమయంలో డ్రైవర్ల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని వారికి తెలియని షరతులను పొందుపరిచి వాటిని ఇప్పుడు సాకుగా చూపిస్తున్నాయి. ఒక ఆటోకి బీమా రావాలంటే సుమారు రెండు నెలలు సమయం పడుతుందని తప్పించుకుంటున్నాయి. అదికూడా వరద వచి్చనప్పటి నుంచి ప్రతి దశలోనూ తీసిన ఫొటోలు, వీడియోలు ఉంటేనే బీమా వర్తిస్తుందని మెలికపెడుతున్నాయి.ప్రాణాలే కాపాడుకుంటామా, ఫొటోలు తీస్తామా అంటూ బాధితులు అడుగుతుంటే బీమా సంస్థలు సమాధానం చెప్పడం లేదు. రెండు వారాల్లోనే క్లెయిమ్లు పూర్తి చేసేలా బీమా సంస్థలతో మాట్లాడామని ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంది. ఆచరణలో మాత్రం అది శూన్యం. బీమా సంస్థలు కనీసం 45 రోజుల పాటు ఆటోను ఉన్న చోటు నుంచి కదపకుండా ఉంచాలని చెప్పాయి. అప్పటి వరకూ మరమ్మతు చేయకపోతే మొత్తానికే పనికిరాదని, ప్రభుత్వం ఈ విషయంలో పట్టించుకోవడం లేదని డ్రైవర్లు ఆవేదన చెందుతున్నారు.పరిహారం లేదురాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా సెప్టెంబర్ 1న విజయవాడలో వదర విలయం సృష్టించింది. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. వారి జీవనాధారాలైన ఆటోలు, మోటార్ సైకిళ్లు వరద నీటిలో పూర్తిగా మునిపోయాయి. రోజుల తరబడి బురద నీటిలోనే నానిపోవడంతో ఇంజిన్, సెన్సార్లు,కార్బొరేటర్ వంటి ముఖ్యమైన భాగాలు దెబ్బతిన్నాయి. ఆటోకి రూ.10 వేలు, ద్విచక్ర వాహనానికి రూ.3 వేలు చొప్పున పరిహారం ఇస్తామన్న ప్రభుత్వం రకరకాల కొర్రీలతో మూడొంతుల మందిని మోసం చేసింది. ఆటో నడిపితేగానీ పూటగడవని నిరుపేదలు వాటిని బాగు చేసుకోలేక, కుటుంబాన్ని పోషించుకోలేక ప్రభుత్వ కార్యాలయాలు,అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. బుడమేరు వరదల వల్ల దాదాపు 15 వేలకుపైగా అటోలు నీట మునిగితే ప్రభుత్వ రికార్డుల్లో మాత్రం కేవలం 6,515 మాత్రమే ఉన్నట్టు రవాణా శాఖ అధికారులు వెల్లడించారు. వీటిలో 4,348 ఆటోలకు పరిహారం అందించినట్లు ప్రభుత్వ రికార్డుల్లో నమోదు చేశారు. కానీ వాస్తవానికి మొత్తం బాధితుల్లో దాదాపు 80 శాతం మంది ఆటోవాలాలకు నష్టం పరిహారం అందలేదని బాధితులు చెబుతున్నారు. చాలా మంది పేర్లు బాధితుల జాబితాలోనే లేవు..కొందరి పేర్లు ఉన్నా వారికి డబ్బులు పడలేదు.ఎవరూ పట్టించుకోవట్లేదు‘‘వరదల్లో ఇల్లు మునిగిపోయింది. ఆటో బాగా బెబ్బతింది. ప్రస్తుతానికి నడిచేలా చేయడానికి రూ.8 వేలు ఖర్చయ్యింది. ప్రభుత్వం రూ.10 వేల ఇస్తామని చెప్పింది. కానీ మా వివరాలను నమోదు చేయడానికి కూడా ఎవరూ రాలేదు. సచివాలయంలో అడిగితే కలెక్టరేట్కు వెళ్లమని చెప్పారు. అక్కడికి వెళితే ఎవరూ పట్టించుకోవడం లేదు.’’ –లింగయ్య, ఆటో డ్రైవర్, రాజీవ్నగర్ కాలనీజీవనాధారం పోతే పరిహారం రాదా?‘‘ఆటో నడిపితేగానీ మా కుటుంబం నడవదు. వరదల వల్ల ఆటో మునిగిపోయి జీవనాధారాన్ని కోల్పోయాం. బీమా రావాలంటే 45 రోజులు ఆటోను వాడకూడదంటున్నారు. బాగు చేయించుకునే స్తోమత కూడా లేదు. అయినా జాబితాలో మా పేరు లేదంటున్నారు. సచివాలయానికి వెళ్లి అడిగితే తమకేమీ తెలియని చెబుతున్నారు. మా గోడును ఎవరికి చెప్పుకోవాలి. మమ్మల్ని ఆదుకునేవారెవరు.’’ –బాబ్జి, ఆటో డ్రైవర్, రాజరాజేశ్వరిపేటఅద్దె ఆటోనే ఆధారం‘‘నేను ఆటోను అద్దెకు తీసుకుని నడుపుతున్నాను. వరదకు ఆటో మునిగిపోయింది. ఎలాంటి పరిహారం రాలేదు. ఎవరిని అడిగినా ఎలాంటి ఉపయోగం లేదు.ఏం చేయాలో తెలియడం లేదు.’’ –దుర్గారావు, ఆటో డ్రైవర్, వాంబేకాలనీ.చాలా ఖర్చవుతోంది‘ఇంటర్ చదివి ఆటో నడుపుతున్నాను. మా నాన్న కూడా ఆటో డ్రైవరే. రెండు ఆటోలూ వరదలో మునిగిపోయాయి.ఒక సారి రిపేరుకి రూ.12 వేలు ఖర్చయ్యింది. కానీ మళ్లీ రేడియేటర్ పాడయ్యింది. నాలుగు రోజులుగా మెకానిక్ దగ్గరే పెట్టి బాగుచేయిస్తున్నాం.’’ –వై.సాయి, ఆటో డ్రైవర్, పాయకాపురం. -
అందని పరిహారం.. ఆగని దరఖాస్తులు
గాంధీనగర్ (విజయవాడ సెంట్రల్): బుడమేరు వరద బాధితులు నెల రోజులుగా పడుతున్న కష్టాలు వర్ణనాతీతం. వరదకు సర్వం కోల్పోయి, కట్టుబట్టలతో మిగిలిన తమకు ప్రభుత్వం సహాయం చేస్తుందేమోనన్న ఆశతో వేలాది బాధితులు నిత్యం విజయవాడలోని కలెక్టర్ కార్యాలయానికి వస్తున్నారు. కార్యాలయం గేట్లు మూసేసి పోలీసులు దూరంగా తోసేస్తున్నా, అధికారులు ఛీత్కరించుకుంటున్నా ‘వరదకు బలైపోయాం.. సాయం చేయండయ్యా’ అని వేడుకొంటున్న తీరు అందరినీ కదిలిస్తోంది తప్ప చంద్రబాబు ప్రభుత్వంలో మాత్రం చలనం రావడంలేదు. బాధితులకు ఏదో చేసేశామంటూ సీఎం చంద్రబాబు చేస్తున్న ప్రకటనలే తప్ప.. వాస్తవంగా ఒరిగిందేమీ లేదు. ఈ విషయాన్ని కలెక్టరేట్ వద్దకు వస్తున్న బాధితుల సంఖ్యే చెబుతోంది. నిత్యం వందలాది బాధితులు న్యాయం చేయాలంటూ కలెక్టరేట్కు క్యూ కడుతూనే ఉన్నారు. బాధితుల నుంచి గుట్టలుగుట్టలుగా దరఖాస్తులు వస్తూనే ఉన్నాయి. శనివారం నాడు కూడా కండ్రిక, వైఎస్సార్ కాలనీ, ఉడా కాలనీ, భవానీపురం ప్రాంతాల నుంచి బాధితులు పెద్ద సంఖ్యలో వచ్చారు. వారిని కలెక్టర్ కార్యాలయం లోపలికి అనుమతించకపోవడంతో బందరు రోడ్డుపై ఎండలోనే చంటి పిల్లలతో సహా పడిగాపులుకాశారు. చాలా సేపటి తర్వాత అధికారులు వచ్చి దరఖాస్తులు స్వీకరించారు. అయితే, దరఖాస్తులో సచివాలయ నంబర్ తప్పనిసరిగా రాయాల్సి రావడంతో బాధితులు ఇబ్బందులు పడ్డారు. తమ ప్రాంత సచివాలయ కోడ్ తెలియక ఒకటికి రెండు సార్లు ఇంటికి, కలెక్టరేట్కు తిరిగారు. నెల రోజులుగా పరిహారం కోసం ఎదురు చూస్తున్నామని, ఇప్పటికీ రూపాయి సాయం అందలేదని బాధితులు వాపోతున్నారు. పరిహారం ఎందుకు జమ కాలేదో ఏ ఒక్కరూ చెప్పడంలేదని మండిపడుతున్నారు. వరదల్లో అన్నీ కోల్పోయిన తమకు పరిహారం ఇవ్వకుండా కార్యాలయాల చుట్టూ తిప్పడం సరికాదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సచివాలయ సిబ్బంది, స్థానిక వీఆర్వోలు కలెక్టరేట్కు వెళ్లమని చెబుతున్నారే తప్ప సరైన కారణాలు చెప్పడం లేదని మండిపడుతున్నారు. రీ సర్వే చేయాలి ఎఫ్సీఐలో క్వాలిటీ కంట్రోల్ విభాగంలో పనిచేసి రిటైర్ అయ్యాను. హెచ్ఐజీ–2లో 235 ఫ్లాట్లో ఉంటున్నా. వరదలకు ఇల్లు మునిగిపోయింది. ఫ్రిజ్, వాషింగ్ మెషీన్, మోటార్, కారు, స్కూటర్ మొత్తం దెబ్బతిన్నాయి. రూ. 2 లక్షలకు పైగా నష్టం వచి్చంది. సర్వే టీం రెండు మూడు సార్లు వచ్చి రాసుకున్నారు. వాళ్లేమి రాశారో తెలీదు. ఈ రోజుకు కూడా నాకు పరిహారం అందలేదు. స్థానిక ఎమ్మెల్యేను కలిసి విన్నవించాను. కలెక్టర్ను కలిసేందుకు వస్తే అందుబాటులో లేరు. మా ప్రాంతంలో రీ సర్వే చేసి నష్టం వివరాలు సమగ్రంగా నమోదు చేయాలి. – వీవీ సూర్యనారాయణ రావు, హౌసింగ్ బోర్డు కాలనీ, భవానీపురం -
నాడు ఇంటింటికీ వలంటీర్లు.. నేడు పేదల బతుకులు నడిరోడ్డు పాలు
గత ఐదేళ్లు ఏ విపత్తు వచ్చినా... బాధితులు కాలు బయట పెట్టకుండానే ప్రభుత్వ సాయం అందింది. ప్రజలకు ఏ కష్టం వచ్చినా మేమున్నామంటూ... వలంటీర్లు వెంటనే వచ్చి భరోసా కల్పించేవారు. కానీ... నేడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ‘రెడ్బుక్’ పాలనలో కనీసం బాధితుల నుంచి అర్జీలు కూడా స్వీకరించే నాథుడే కరువయ్యాడు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో బుడమేరు వరద బాధితులు పరిహారం కోసం వార్డు సచివాలయం... తహసీల్దార్ కార్యాలయం... కలెక్టరేట్ చుట్టూ మండుటెండలో కాళ్లరిగేలా తిరుగుతుండటమే ఇందుకు నిదర్శనం. చివరికి గురువారం విజయవాడలోని కలెక్టర్ కార్యాలయంలో అర్జీలు ఇచ్చేందుకు కూడా అనుమతించలేదు. ఏకంగా కలెక్టరేట్ గేట్లు మూసేశారు. గేటు బయటే బాధితుల నుంచి సిబ్బంది, పోలీసులు అర్జీలు స్వీకరించారు. వృద్ధులు, గర్భిణులు, చంటి పిల్లలతో వచి్చన బాధితులు విధిలేక మురుగు కాలువల పక్కన, ఫుట్పాత్లపైన కూర్చుని నరకయాతన అనుభవించారు. పనులు మానుకుని పరిహారం కోసం తిరుగుతున్నాం.. దయచేసి మా గోడు వినండి.. అంటూ బాధితులు వాపోతున్నారు. గత ఐదేళ్లు కాలు కదపకుండానే వలంటీర్లు తమ ఇంటికి వచ్చి ప్రభుత్వ సేవలు అందించారని గుర్తు చేసుకుంటూ... కోరి తెచ్చుకున్న ప్రభుత్వం కొరివిలా మారి అల్లాడిస్తోందని విచారం వ్యక్తంచేస్తున్నారు. – గాందీనగర్ (విజయవాడ సెంట్రల్) -
సాయం అందక.. నిస్సహాయంగా
గాంధీనగర్ (విజయవాడ సెంట్రల్) / విజయవాడ స్పోర్ట్స్: ‘‘ఇప్పటికి ఎనిమిది సార్లు అర్జీలు ఇచ్చా.. సచివాలయాల చుట్టూ తిరుగుతున్నాం.. ఇంకెక్కడికని తిరగాలి..? ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని నీళ్ల నుంచి బయటపడ్డాం. సర్వం కోల్పోయాం. మాకు నష్ట పరిహారం రాలేదు. ఒకరికి ఇచ్చి మరొకరికి ఇవ్వక పోవడం ఏమిటి..? ఈ వయసులో పడుతూలేస్తూ కలెక్టరేట్కు వచ్చాం. ఇదేం ఖర్మ..? రోగాలతో ఆసుపత్రుల పాలవుతున్నాం. ఆయన (సీఎం చంద్రబాబు) వచ్చి న్యాయం చేయాలి కదా..?’’ విజయవాడ న్యూ రాజరాజేశ్వరిపేటకు చెందిన వరద బాధితురాలు నక్కా రమాదేవి కన్నీటి వేదన ఇదీ! సరిగ్గా నెల క్రితం బుడమేరు వరద నగరంపై విరుచుకుపడింది. జీవిత కాలం కష్టార్జితం అంతా నీటి పాలైంది. పది రోజులకుపైగా వరద, బురదలోనే బాధితులు మగ్గారు. కట్టుబట్టలతో ప్రాణాలతో బయటపడ్డారు. కానీ ప్రభుత్వం ప్రకటించిన జాబితాల్లో తమ పేర్లు లేకపోవడంతో నివ్వెరపోతున్నారు. పొంతన లేని విధంగా సర్వే వివరాలున్నాయి. కొందరి పేర్లు జాబితాలో ఉన్నా పరిహారం అందలేదు. సచివాలయాలకు వెళ్లి అడిగితే సరైన సమాధానం చెప్పడం లేదు. మళ్లీ మళ్లీ దరఖాస్తు చేయమంటున్నారని, ఎమ్మెల్యే కార్యాలయంలోనూ అర్జీలు అందచేసినా కనీస స్పందన లేదని నిర్వేదం వ్యక్తం చేస్తున్నారు. పరిహారం విషయంలో ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై మండిపడ్డ బాధితులు సోమవారం విజయవాడ కలెక్టరేట్కు పోటెత్తారు. వృద్ధులు, దివ్యాంగులు, గర్భిణులు, ఒంటరి మహిళలు, బాలింతలు చంటి బిడ్డలను చంకనేసుకుని వేల సంఖ్యలో కలెక్టరేట్కు చేరుకున్నారు. వరద నీటిలో చంటి బిడ్డలను పెట్టుకుని పది రోజులు గడిపామని.. కనీసం పిల్లల ముఖాలు చూసైనా పరిహారం ఇవ్వాలని వేడుకుంటున్నారు.చివరి రోజు కావడంతో..బాధితుల ఖాతాల్లో పరిహారం జమ చేస్తామని సెప్టెంబర్ 25న ప్రభుత్వం ప్రకటించింది. 30వతేదీ లోగా బాధితులందరి ఖాతాల్లో నగదు జమ అవుతుందని పేర్కొంది. అయితే గడువు ముగుస్తున్నా తమ ఖాతాల్లో డబ్బులు పడకపోవడం.. సీఎం చంద్రబాబు ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్కు వస్తున్నారని ప్రచారం జరగడంతో బాధితులంతా కలెక్టరేట్కు పోటెత్తారు. ఉదయం 9 గంటలకు పెద్ద ఎత్తున చేరుకుని పడిగాపులు కాసినా సీఎం చంద్రబాబు రాలేదు. చివరి రోజు కావడంతో దరఖాస్తుల కోసం బాధితులు పరుగులు తీశారు. ఓవైపు మండే ఎండ.. మరోవైపు కనీస సౌకర్యాల లేక వృద్ధులు, బాలింతలు, దివ్యాంగులు, గర్భిణులు నానా ఆగచాట్లు పడ్డారు.జాబితాలో చిత్ర విచిత్రాలు..‘‘ప్రియమైన పైడి సాయిదీపక్...! మీ బ్యాంకు ఖాతా ఆధార్ నంబరుతో లింక్ కాకపోవడం వల్ల వరద నష్ట పరిహారం ఖాతాలో జమ కాలేదు. వెంటనే మీ బ్యాంకు అధికారులను సంప్రదించి ఖాతాను ఆధార్తో లింకు చేసుకోవాలి..!’’ ఓ బాధితుడి మొబైల్కు ప్రభుత్వం పంపిన సందేశం ఇదీ! చిత్రమేమిటంటే సాయిదీపక్ వయసు 8 ఏళ్లు. ఆ చిన్నారికి బ్యాంకులో ఖాతా లేదు. ఇక ఆధార్ లింక్ అయ్యే అవకాశమే లేదు. నష్ట పరిహారం జాబితాలో తప్పులు దొర్లాయనేందుకు ఇదే ప్రత్యక్ష నిదర్శనమని దీపక్ తండ్రి వాపోయాడు. ఇలాంటి సందేశమే ఐదేళ్ల మరో బాలికకు కూడా వచ్చింది.పొంతన లేని లెక్కలు..ప్రభుత్వం 90 శాతం మందికి నష్ట పరిహారం అందజేసినట్లు ప్రకటించింది. మిగిలిన 10 శాతం మంది లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో సమస్యలున్నట్లు తేల్చింది. అయితే ప్రభుత్వం చెబుతున్న వివరాలు కాకి లెక్కలేనని స్పష్టమవుతోంది. కలెక్టరేట్కు వచ్చిన బాధితుల్లో ఏ ఒక్కరినీ కదిలించినా తమకు పరిహారం అందలేదని.. ప్రభుత్వం నిండా ముంచిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జాబితాలో పేర్లు ఉన్నా.. బ్యాంకు ఖాతా వివరాలు సరిగానే ఉన్నా.. పరిహారం అందలేదని చెబుతున్నారు.జగన్ ప్రభుత్వమే ఉంటే..కలెక్టరేట్కు వచ్చిన పలువురు బాధితులు గత ప్రభుత్వ పాలన, వలంటీర్ల సేవలను గుర్తు చేసుకుని చర్చించుకోవడం కనిపించింది. ‘‘కరోనా లాంటి విపత్తులోనూ ఇంటింటికీ తిరిగి సేవలందించారు. ఏరోజూ మాకు ప్రభుత్వ సాయం అందలేదని రోడ్డెక్కలేదు. ఇప్పుడు వరదల్లో సర్వం కోల్పోయి పరిహారం కోసం కాళ్లు అరిగేలా తిరగాల్సి వస్తోంది. అదే వైఎస్ జగన్ ప్రభుత్వమే ఉండి ఉంటే మాకీ దుస్థితి వచ్చేది కాదు. పారదర్శకంగా అందరికీ సాయం అందేది..’’ అంటూ మహిళలు పెద్ద ఎత్తున చర్చించుకోవడం గమనార్హం.అమ్మకు రిక్త హస్తం..వాంబే కాలనీ హెచ్ బ్లాక్లో ఉంటున్నాం. నా భర్త కూలీ. వరద నష్టం అంచనా వేసేందుకు వచ్చిన అధికారులకు అన్ని వివరాలు ఇచ్చాం. జాబితాలో నా పేరుకు బదులు మా ఐదేళ్ల పాప ఉషశ్రీ పేరు వచ్చింది. పాప పేరుతో బ్యాంకు ఖాతా లేనందున డబ్బులు రాలేదు. కలెక్టరేట్లో అడుగుతుంటే ఎవరూ సమాధానం చెప్పడం లేదు. – కురిటి సుజాత, వాంబే కాలనీగతంలో ప్రతిదీ ఇంటి వద్దే..జగన్ ప్రభుత్వమే ఉంటే కష్ట కాలంలో మాకు అండగా నిలిచేది. ఆఫీసుల చుట్టూ తిరగకుండా గతంలో ప్రతిదీ ఇంటి వద్దే అందజేశారు. కరోనా లాంటి కష్టంలోనూ ఇబ్బందులు పడనివ్వలేదు. వలంటీర్ల ద్వారా అన్నీ అందించారు. ఇవాళ ఈ ప్రభుత్వం ముప్పుతిప్పలు పెడుతోంది. కాళ్లు అరిగేలా సచివాలయాలు, కలెక్టరేట్ చుట్టూ తిరుగుతున్నాం. ఈ ప్రభుత్వం పెడుతున్న కష్టాలు చూస్తుంటే.. జగనన్న ప్రభుత్వం ఉంటే బాగుండేదని అనిపిస్తోంది. – పాముల పద్మ, వాంబే కాలనీఇదిగో.. అదిగో అంటున్నారుప్రకాష్ నగర్లో అద్దెకు ఉంటున్నా. వరదతో ఇంట్లో సామాన్లు మొత్తం పోయాయి. అధికారులు ఇంటికి వచ్చి రాసుకుని ఫోటోలు తీసుకున్నా డబ్బులు పడలేదు. సచివాలయం చుట్టూ ఇప్పటికి పది సార్లు తిరిగాను. ఇదిగో పడతాయి.. అదిగో పడతాయని ఆశ పెట్టి రోజూ తిప్పుకుంటున్నారు. కలెక్టరేట్లో అర్జీ ఇద్దామని వచ్చా. – షేక్ ఫాతిమా, ప్రకాష్నగర్ఏ ఒక్కరూ పట్టించుకోలేదు..కూలీ పనులు చేసుకుని బతికే వాళ్లం. కనీసం సొంత ఇల్లు లేదు. వాంబే కాలనీలో అద్దెకు ఉంటున్నాం. వరద వల్ల చాలా నష్టపోయాం. అపరిశుభ్రతతో పిల్లలు జ్వరాల బారిన పడ్డారు. పూట గడవని పరిస్థితిలో ఉన్నాం. ఆదుకోవాలని నాయకుల చుట్టూ తిరిగినా ఏ ఒక్కరూ పట్టించుకోలేదు. మాలాంటి వాళ్లకు సాయం అందకుండా చేశారు. కాస్తయినా కనికరించాలని ఈ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం. – ఏల్చూరు సతీష్, మల్లీశ్వరి దంపతులుకాళ్లు అరిగేలా తిరిగా..పరిహారం కోసం సచివాలయం చుట్టూ కాళ్లు అరిగేలా తిరిగా. ఇదిగో అదిగో అంటూ రోజుకు నాలుగైదు సార్లు తిప్పారు. ఈ రోజు ఆఖరు తేదీ కావడంతో కలెక్టరేట్లో అర్జీ ఇచ్చేందుకు వచ్చా. సచివాలయంలో ఇప్పటికి పది అర్జీలు ఇచ్చా. ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. – వెంకాయమ్మ, పైపుల రోడ్డుఈ ఫొటోలో కనిపిస్తున్న వై.సీతకు కళ్లు కనిపించవు. ఆమె భర్త కూడా అంధుడే. గత ఆగస్టు 25న ఇందిరా నాయక్నగర్ కాలనీలోని కొత్త ఇంట్లో గృహ ప్రవేశం చేశారు. 30వతేదీన ఆ ఇంటిని వరద ముంచెత్తింది. ఇద్దరు పిల్లలతో కలసి మూడు రోజుల పిల్లలతో పాటు నీళ్లలోనే గడిపారు. చుట్టుపక్కల వారి సాయంతో ఎట్టకేలకు బయట పడ్డారు. పది రోజులు నీళ్లలో నానడంతో ఇంట్లో వస్తువులన్నీ పాడయ్యాయి. కొత్త ఇంటికి డోర్ నెంబర్ లేదని పరిహారం ఇవ్వలేదు. సచివాలయానికి వెళ్లి ఇంటి డాక్యుమెంట్స్ సమర్పించినా పట్టించుకునే నాథుడు లేకపోవడంతో అర్జీ ఇచ్చేందుకు భర్తతో కలిసి కలెక్టరేట్కు వచ్చారు. -
వరద నష్టపరిహారంపై గందరగోళం
వన్టౌన్ (విజయవాడ పశ్చిమ): విజయవాడ బుడమేరు వరద నష్టపరిహారంపై గందరగోళ పరిస్థితులు చోటుచేసుకుంటున్నాయి. బాధితులకు వారి బ్యాంకు ఖాతాల్లో నష్టపరిహారాన్ని జమచేస్తామని ప్రకటించినప్పటికీ అలా కాకపోవడంతో వారు రోడ్డెక్కి లబోదిబోమంటున్నారు. ఇస్తామన్న కొద్దిపాటి పరిహారంలోనూ కోతలు, దానికితోడు సాంకేతిక కారణాలను చూపి నిలిపివేస్తున్నారని వారు మండిపడుతున్నారు. కేవైసీ కాలేదని.. నీ ఖాతా వాడుకలో లేదనే బ్యాంకు సిబ్బంది సమాధానాలతో వరద బాధితులకు దిక్కుతోచడంలేదు.ప్రభుత్వం నష్టపరిహారాన్ని ఎగ్గొట్టడానికే ఈ విధమైన ఎత్తుగడలను అనుసరిస్తోందంటున్నారు. తమకు జరిగిన అన్యాయం.. రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాన్ని నిరసిస్తూ నగరంలోని పలు సచివాలయాల వద్ద వరద బాధితులు సోమవారం ధర్నాలు నిర్వహించారు. కలెక్టర్ కార్యాలయానికి కూడా అనేకమంది తరలివెళ్లారు.బ్యాంకుల్లో బారులుతీరిన బాధితులు.. నిజానికి.. వరద నష్టపరిహారాన్ని ఈనెల 30 నాటికి బాధితుల ఖాతాల్లో జమచేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. దీంతో బాధితులు బ్యాంకులకు పోటెత్తారు. అయితే, మీ ఖాతా వాడుకలో లేదని.. కేవైసీ చేయించుకోవాలని బ్యాంకు సిబ్బంది సూచించటంతో ఇళ్లకు వెళ్లి ఆధార్, పాన్కార్డుల జిరాక్స్లను తీసుకుని మళ్లీ వచ్చారు. ఆ తర్వాత క్యూలైన్లలో గంటల తరబడి నిరీక్షించినప్పటికీ మళ్లీ ఎన్పీసీఐ (నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) లింక్ అంటూ మెలికపెట్టారు. ప్రభుత్వ పథకాల నగదు బ్యాంకు ఖాతాల్లో పడాలంటే ఎన్పీసీఐతో ఖాతాలు లింక్ అయి ఉండాలని అధికారులు చెప్పడంతో బాధితులు అయోమయానికి గురవుతున్నారు. ఇదిలా ఉంటే.. చాలా కుటుంబాల్లో నాలుగైదు ఏళ్ల క్రితం చనిపోయిన వారి ఖాతాల్లో నగదు జమకావడంతో వారేమి చేయాలో దిక్కుతోచక కొట్టుమిట్టాడుతున్నారు. -
పరిహారం..పరిహాసం
కంకిపాడు: ఎకరా వరి పంటకు పెట్టుబడి కనీసం రూ.25 వేలు. పసుపు పంటకు రూ.1.50 లక్షలు. కందకు రూ.1.70 లక్షలు, తమలపాకుకు రూ.2 లక్షలు. ఇలా ఏ పంట వేసినా రైతు భారీ మొత్తంలో పెట్టుబడి పెట్టాలి. ఇటీవలి భారీ వర్షాలు, వరదలకు చంద్రబాబు కూటమి ప్రభుత్వం ఇచ్చిన సాయం ఎకరాకు రూ.10 వేలు మాత్రమే. అదీ.. కొంతమందికే వచ్చింది. వారికీ పంట వేసిన విస్తీర్ణంలో కొంత మొత్తానికే ఇస్తున్నారు. ఇందుకు ఈడే సాంబశివరావే ఉదాహరణ. ఆయన 3.70 ఎకరాల్లో వరి వేస్తే ఇచ్చిన పరిహారం ఎకరాకు రూ.10 వేలే. అంటే దాదాపు లక్ష రూపాయలు పెట్టుబడి వరదలో కొట్టుకుపోతే బాబు సర్కారు విదిల్చింది రూ.20 వేలే. ఇటీవలి కృష్ణా, బుడమేరు వరదలు, భారీ వర్షాలతో పంట నాశనమైపోయిన అనేక గ్రామాల్లో రైతుల పరిస్థితి ఇదే. చేతికి దిగుబడి అందే తరుణంలో పంటలు దెబ్బతినడం, ప్రభుత్వమూ పూర్తిస్థాయిలో ఆదుకోకపోవడంతో అన్నదాత తల్లడిల్లిపోతున్నాడు.కౌలు రైతుకు మొండిచేయివాస్తవంగా రైతులకంటే కౌలుదారుల చేతుల్లోనే సాగు అధికంగా ఉంది. చంద్రబాబు ప్రభుత్వం కౌలు రైతులకూ మొండి చేయి చూపింది. కొన్ని చోట్ల కౌలుకు తీసుకున్న భూముల్లో కౌలుదారుకు కాకుండా భూ యజమాని ఖాతాలో ప్రభుత్వం పరిహారాన్ని జమ చేసింది. దీంతో కౌలుదారులు పూర్తిగా దెబ్బతిన్నారు. పలువురు రైతులకు బ్యాంకు ఖాతాతో ఆధార్ అనుసంధానం జరగకపోవటంతో పరిహారం విడుదలైనా చేతికి అందే పరిస్థితి లేదు.దయలేని సర్కారువైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రకృతి విపత్తులకు పంట నష్టపోయిన ప్రతి రైతునీ ఆదుకుని, అండగా నిలిచేది. పెట్టుబడి సాయం, బీమా వర్తింపజేసి అన్నదాతను ఆదుకొనేది. కానీ కూటమి సర్కారు మాత్రం అన్నదాత పట్ల దయలేకుండా వ్యవహరిస్తోంది. ఉదాహరణకు కృష్ణా జిల్లావ్యాప్తంగా 48,641 హెక్టార్లలో పంటలకు నష్టం వాటిల్లినట్లు అధికారులు కేంద్ర బృందానికి నివేదిక ఇచ్చారు. ఇందులో 44,521 హెక్టార్లలో వరి, వేరుశనగ, మినుములు, చెరకు, ఇతర పంటలు, 4,700 హెక్టార్లలో ఉద్యాన పంటలు, 50 హెక్టార్లలో పట్టు పంట దెబ్బతిందని ఆ నివేదికలో పేర్కొన్నారు. కానీ ప్రభుత్వం మాత్రం నిబంధనల పేరుతో నష్టం అంచనాల్లో భారీగా కోత వేసింది. కృష్ణా జిల్లాలో 21,661.02 హెక్టార్లలోనే పంట నష్టం వాటిల్లిందని సగానికిపైగా కోత వేసింది. ఇవే లెక్కలతో రైతులు వాస్తవంగా నష్టపోయినదానికంటే అతి తక్కువ పరిహారం అందించి రైతులను నట్టేట ముంచింది.కౌలు రైతుల పరిస్థితి దారుణం గ్రామంలో 20 ఎకరాలు కౌలు తీసుకుని వరి సాగు చేస్తున్నా. బుడమేరు వరదతో పంట అంతా నీటి పాలైంది. ఎకరాకు రూ 25 వేలు వరకూ పెట్టుబడి అయ్యింది. తిరిగి మళ్లీ పంట సాగు చేసుకోవటానికి చేతిలో డబ్బు లేదు. ప్రభుత్వం పరిహారం కూడా మాకు ఇవ్వలేదు. అప్పులు చేసి సాగుకు వెళ్లాల్సిన పరిస్థితి. కౌలు రైతుగా నా పరిస్థితి దారుణంగా ఉంది. – కొలకలూరి కోటయ్య, కౌలురైతు, మంతెనబ్యాంకు ఖాతా లింక్ అవ్వలేదు అంటున్నారు నా పొలం మూడెకరాలు కౌలుకి ఇచ్చాం. బుడమేరు ముంపుతో దెబ్బతింది. దాని తాలూకా డబ్బులు వచ్చాయి. ఎకరం నిమ్మతోట వేశాను. వరదకి పంట కుళ్లిపోయింది. పంట ఆనవాళ్లు కూడా లేవు. ప్రభుత్వం నుంచి మెసేజ్ ఫోన్కి వచ్చింది. బ్యాంకు ఖాతాకు ఆధార్ లింక్ కాలేదని. మిగిలిన డబ్బులు వస్తున్నాయి. ఇది మాత్రం కొర్రీ పెట్టారు. అధికారులు స్పందించి పరిహారం అందేలా చూడాలి. – బద్దల శ్రీనివాసరావు, రైతు, మంతెనరైతు పేరు ఈడే సాంబశివరావు. మంతెన గ్రామం. కేసరపల్లి గ్రామం పరిధిలో 3.70 ఎకరాల పొలం ఉంది. బుడమేరు వరదతో ఈ పొలాల్లో వేసిన వరి పూర్తిగా నీటి మునిగి కుళ్లిపోయింది. అధికారులు నష్టం నమోదు చేశారు. కానీ రెండెకరాలకు మాత్రమే ఎకరాకు రూ 10 వేలు చొప్పున బ్యాంకు ఖాతాలో పడ్డాయి. నష్టం భారీగా జరిగితే.. పరిహారం ఇంత తక్కువ వచ్చిందని సాంబశివరావు ఆవేదన చెందుతున్నారు. -
రైతు కష్టం వరదపాలు
-
సహాయక చర్యలపై ప్రజలు సంతృప్తి
సాక్షి, అమరావతి: వరద నష్టం ఎన్యూమరేషన్ పక్కాగా జరగాలని, నష్టపోయిన ప్రతి బాధితునికి ప్రభుత్వ సాయం అందేలా చూడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. వరద నష్టం ఎన్యూమరేషన్, బాధితులకు పరిహారంపై సీఎం చంద్రబాబు శుక్రవారం సచివాలయంలో మంత్రులు, అధికారులతో సమీక్ష నిర్వహించారు. వరదల కారణంగా 2,13,456 ఇళ్లు నీట మునిగాయని, ఇప్పటి వరకు 84,505 ఇళ్లలో నష్టం అంచనా లెక్కలు పూర్తయ్యాయని అధికారులు వివరించారు. వేలాది ద్విచక్ర వాహనాలు, కార్లు, ఆటోలు పాడైపోయాయని, 2,14,698 హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయని, ఎన్యూమరేషన్లో రీ వెరిఫికేషన్ చేసి ప్రతి బాధితుడికి జరిగిన నష్టాన్ని సేకరిస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ సహాయక చర్యలపై ప్రజలు సంతృప్తితో ఉన్నారని, పరిహారం విషయంలో కూడా శాస్త్రీయంగా ఆలోచన చేసి జాబితా రూపొందించాలని సూచించారు. నష్టం అంచనాలు పూర్తి చేస్తే ఈ నెల 17వ తేదీన బాధితులకు సాయం అందజేద్దామని పేర్కొన్నారు. రుణాలు రీషెడ్యూల్ చేయండి: సీఎం వరద బాధితులకు వివిధ ఏజెన్సీలు అందించే సర్వీసులపై శుక్రవారం సాయంత్రం విజయవాడలోని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎంఎస్ఎంఈలు నడుపుతున్న వ్యాపారులు తీవ్రంగా దెబ్బతిన్నారని, వారి బ్యాంక్ రుణాలు రీ షెడ్యూల్ చేయాలని, ఈఎంఐల చెల్లింపునకు గడువు ఇవ్వాలని బ్యాంకర్లకు సూచించారు. ఢిల్లీ వెళ్లిన సీఎం చంద్రబాబు సీఎం చంద్రబాబు శుక్రవారం సాయంత్రం ఢిల్లీ వెళ్లారు. విజయవాడలోని కలెక్టర్ కార్యాలయంలో సమీక్ష అనంతరం ఆయన బయలుదేరి గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకుని అక్కడి నుంచి ఢిల్లీ వెళ్లారు. -
మాది చేతల ప్రభుత్వం
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: విపత్తుల సమయాన గత ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చినా అమలు చేయలేదని.. తమది చేతల ప్రభుత్వం కావడంతో గత హామీలను అమలు చేశామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. రాష్ట్రంలో వరదలతో రూ.5,438 కోట్లు నష్టం జరిగినందున తక్షణమే సాయం చేయాలని ప్రధాని మోదీకి లేఖ రాసినా ఇప్పటివరకు స్పందన రాలేదని తెలిపారు. కేంద్రం స్పందించకున్నా ప్రజలను ఆదుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉంటుందని చెప్పారు.మృతుల కుటుంబాలకు రూ.50 లక్షలు ఇవ్వాలని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ డిమాండ్ చేస్తున్నారని.. తమతో పాటు ఆ పారీ్టకీ రాష్ట్రంలో ప్రజలు 8 ఎంపీ సీట్లు ఇచి్చనందున వారు కేంద్రం తరఫున రూ.25 లక్షలు పరిహారం ఇప్పించాలని సూచించారు. మంగళవారం ఉదయం ఖమ్మంలోని మంత్రి పొంగులేటి నివాసంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, మానుకోట ఎంపీ పోరిక బలరాంనాయక్లతో కలిసి సీఎం మీడియాతో పిచ్చాపాటిగా మాట్లాడారు. మేం ఇళ్లలో కూర్చోలేదు.. ‘వరదలు, వర్షాలు వచ్చిన సమయంలో మేము ఇళ్లలో కూర్చోలేదు. మా మంత్రులు ఆయా ప్రాంతాల్లో సహాయక చర్యలను పర్యవేక్షించారు. మేం పర్యటించినప్పుడు ప్రజలు కోపగించుకున్నా ఫర్వాలేదు.. ఓటు వేసిన వారు మమ్మల్ని కాకపోతే ఎవరిని అడుగుతారు.. ఫామ్హౌస్లో కూర్చున్న వారిని అడగలేరు కదా.. ప్రభుత్వానికి ఉన్న పరిమితుల దృష్ట్యా నష్టంపై అంచనా వేసి శాశ్వత సాయం అందజేస్తాం. కల్వకుంట్ల కుటుంబం దోచుకున్న రూ.లక్ష కోట్లలో రూ.2 వేల కోట్లు సీఎం రిలీఫ్ ఫండ్కు ఇస్తే బాధితులకు ఇంకా ఎక్కువ సాయం చేయొచ్చు..’అని సీఎం వ్యాఖ్యానించారు. ఆక్రమణలతోనే అనర్థాలు ‘నీళ్లలోకి మనం వెళ్లి ఇళ్లు కట్టుకుంటే నీళ్లు ఇళ్లలోకి వస్తాయి. ఖమ్మంలో అనేక ఆక్రమణలు ఉన్నాయి. హైదరాబాద్లో పాత చెరువులు ఆక్రమించుకున్న వారిని వదిలేసి కొత్తగా చెరువులను నిర్మించడం ఎందుకు? కొత్త చెరువులకు భూసేకరణ చేయాల్సి ఉంటుంది. అది కమీషన్ కాకతీయ మిషన్ కాకతీయ ద్వారా చెరువులను బలోపేతం చేసినట్లు గత ప్రభుత్వం చెప్పింది నిజమే అయితే ఇప్పుడు చెరువులు ఎందుకు తెగుతున్నాయి? మిషన్ కాకతీయ అనేది కమీషన్ కాకతీయ అని గతంలో నాయిని నర్సింహారెడ్డి అసెంబ్లీలోనే చెప్పారు. నాటి ఆ శాఖ మంత్రి హరీశ్రావు దీన్ని కమీషన్ కాకతీయగా మార్చారు..’అని సీఎం ఆరోపించారు. రిటైనింగ్ వాల్పై ఇంజనీర్లతో చర్చిస్తాం ‘మున్నేరుపై రిటైనింగ్ వాల్ ఎత్తు పెంపు అంశంపై ఇంజనీరింగ్ అధికారులతో చర్చిస్తాం. మా ప్రభుత్వం ఏర్పడ్డాక రిటైనింగ్ వాల్ నిర్మాణానికి టెండర్లు ఆహా్వనించాం. కానీ ఇంతలోనే ఉపద్రవం ముంచుకొచి్చంది. ఇప్పుడు జరిగిన పరిణామాల ఆధారంగా సాంకేతికంగా పరిశీలించి నిర్ణయం తీసుకుంటాం..’అని రేవంత్ తెలిపారు. వెంటనే స్పందించాం.. ‘రాష్ట్రంలో వర్షాలతో ఉపద్రవం సంభవించినప్పుడు వెంటనే బాధ్యతగా స్పందించాం. 42 సెం.మీ. వర్షం గత 75 ఏళ్లలో ఎన్నడూ కురవలేదు. ఆ స్థాయిలో వర్షం పడినా తక్కువ ప్రాణ నష్టం, ఆస్తి నష్టంతో బయటపడ్డామంటే ప్రభుత్వం తీసుకున్న ముందు జాగ్రత్త చర్యలే కారణం. మా మంత్రులు నిరంతరం ప్రజల మధ్యనే ఉన్నారు. ఖమ్మం జిల్లా కాంగ్రెస్కు ఎప్పుడూ అండగా నిలిచింది. జిల్లాపై తమకు ఉన్న బాధ్యతతోనే ప్రభుత్వ యంత్రాంగం మొత్తం తనతో సహా ఇక్కడికి తరలి వచి్చంది. ఈ జిల్లాకు నష్టం జరగనివ్వం. పూర్తి నష్టాన్ని అంచనా వేయాల్సి ఉంది కాలనీల్లో బురద శుభ్రం చేయడానికి ట్యాంకర్లను పంపాం. పారిశుధ్య పనులు చేయిస్తున్నాం. ప్రజలను ఆదుకోవడానికి పూర్తి నష్టాన్ని అంచనా వేయాల్సి ఉంది..’అని సీఎం చెప్పారు. తమ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం రూ.18 వేల కోట్ల రుణమాఫీ చేసిందని రేవంత్ అన్నారు. సైంటిస్ట్ అశ్విని కుటుంబానికి న్యాయం చేస్తా కారేపల్లి: వ్యవసాయ శాస్త్రవేత్త అశ్విని, ఆమె తండ్రి మోతీలాల్ వరదలో కొట్టుకుపోయి చనిపోవడం బాధాకరమని.. వారి కుటుంబానికి న్యాయం చేస్తామని సీఎం రేవంత్రెడ్డి భరోసా ఇచ్చారు. ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం గంగారం తండాలో అశ్విని, మోతీలాల్ కుటుంబాన్ని ముఖ్యమంత్రి, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పరామర్శించారు. వారి చిత్రపటాల వద్ద నివాళులర్పించారు. అశ్విని తల్లి నేజీతో మాట్లాడారు. బిడ్డ కొత్త జీతంతో ఇల్లు కట్టుకుందామని మొదలుపెడితే ఇప్పుడు ఇలా జరిగిందంటూ ఆమె రోదించారు. సీఎం స్పందిస్తూ.. హైదరాబాద్లో తమ కార్యాలయానికి వస్తే చర్చించి అన్నివిధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు.రూ.10 వేలు దేనికి సరిపోతాయి? సాక్షి ప్రతినిధి, ఖమ్మం: వరద ముంపు ప్రాంతాల్లో ఇళ్లు దెబ్బతిని, సామగ్రి కొట్టుకుపోయిన వారికి తక్షణ సా యంగా రూ.10 వేలు ఇస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఇవి దేనికి సరిపోతాయంటూ బాధితుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. కొందరి ఇళ్లు కొట్టుకుపోగా, మరికొందరి ఇళ్లు కూలిపోయాయి.మరికొన్ని దెబ్బతిన్నాయి. ఇవికాకుండా ఒక్కో కుటుంబం సగటున రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు ఇంట్లో ఉన్న సామగ్రి కోల్పోయారు. ప్రభుత్వం అందించే రూ.10 వేల తక్షణ సాయం ఈ నష్టాన్ని పూడుస్తుందా? అని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సర్వే పూర్తయ్యాక నష్టాన్ని అంచనా వేసి సాయంపై నిర్ణయం తీసుకుంటామని సీఎం చెబుతున్నారని, సర్వే ఎప్పుడు పూర్తవుతుంది?, పరిహారం ఎప్పుడు అందుతుందని ప్రశ్నిస్తున్నారు. -
వరదలతో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం ఇవ్వాలి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వరదల కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు కేవలం రూ.5 లక్షలు నష్టపరిహారం ప్రకటించటం అన్యాయమని..రూ.25లక్షలు పరిహారం ప్రకటించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. గతంలో పీసీసీ అధ్యక్షుడి హోదాలో రేవంత్ వరదల్లో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు రూ. 25 లక్షలు పరిహారం అందిస్తామని చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. వరదల కారణంగా ఇళ్లు కోల్పోయిన వారికి రూ.2.5లక్షల నుంచి రూ.5లక్షల వరకు పరిహారం ఇవ్వాలన్నారు. భారీ వర్ష సూచన ఉన్నా కుంభకర్ణ నిద్రలో ప్రభుత్వం రేవంత్రెడ్డి ప్రభుత్వం నేరపూరిత నిర్లక్ష్యం ఫలితంగా ఓ యువ శాస్త్రవేత్తతో పాటు సుమారు 20 మంది వరదల్లో ప్రాణాలు కోల్పోయారని కేటీఆర్ ధ్వజమెత్తారు. తెలంగాణ జిల్లాలకు భారీ వర్ష సూచన ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఆగస్టు 27న ప్రకటించినా కాంగ్రెస్ ప్రభుత్వం కుంభకర్ణ నిద్రలో ఉందన్నారు. ‘ఒక మంత్రి హెలికాప్టర్లు దొరకలేదంటాడు. మరొక మంత్రి, ఈ రాష్ట్రానికి సీఎం లేనట్టు పక్క రాష్ట్ర సీఎంకు ఫోన్ చేస్తాడు. మూడో మంత్రి ఫొటోలకు పోజులకే పరిమితమవుతా డు. జరగాల్సిన నష్టమంతా జరిగాక పూల డెకరేషన్ స్టేజీ మీద కూర్చొని వరదల మీద సమీక్ష చేసే ‘చీఫ్ మినిస్టర్’ఉల్టా చోర్ కొత్వాల్కో డాంటే అన్నట్టు వరదలొస్తే సాయం చేయకుండా ప్రతిపక్షం ఏం చేస్తుందని ప్రశి్నస్తాడు’అని కేటీఆర్ మండిపడ్డారు. ఎస్ఎన్డీపీతోనే హైదరాబాద్కు వరద ముప్పు తప్పింది విజన్ ఉంటే విపత్తులను కూడా సమర్థంగా ఎదుర్కోవచ్చని బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అమలు చేసిన ‘ఎస్ఎన్డీపీ’నిరూపించిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కొద్దిరోజులుగా హైదరాబాద్లో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తున్నా..లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురికాకుండా కాపాడటంలో ఎస్ఎన్డీపీ (స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రాం) కీలకపాత్ర పోషించిందని ఒక ప్రకటనలో పేర్కొన్నారు.రాహుల్గాంధీ ట్వీట్పై కేటీఆర్ ఆగ్రహం భారీవర్షాలు, వరదల కారణంగా తెలంగాణలో ఏర్పడిన పరిస్థితులు తనను ఆవేదనకు గురిచేశాయని, ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా తెలంగాణ ప్రభుత్వం అవిశ్రాంతంగా చర్యలు చేపట్టిందంటూ రాహుల్గాంధీ చేసిన ట్వీట్పై కేటీఆర్ ఒక ప్రకటనలో విచారం వ్యక్తం చేశారు. బాధపడుతున్నట్టుగా ప్రకటనలు చేస్తే సరిపోదని రాహుల్కు సూచించారు. తెలంగాణలో సహాయక కార్యక్రమాలను ఎంత చిత్తశుద్ధితో చేస్తున్నారో లేదో తెలుసుకుంటే ప్రభుత్వ నిర్వాకం తెలిసేదని వ్యాఖ్యానించారు. -
‘హోర్డింగ్ ప్రమాదాలకు కంపెనీలదే బాధ్యత’
ఇటీవలికాలంలో దేశంలోని పలు నగరాల్లో హోర్డింగ్లు కూలిపోయి, ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. వీటిని అరికట్టేందుకు, ప్రభుత్వం త్వరలో అవుట్డోర్ అడ్వర్టైజ్మెంట్ పాలసీ-2024ను తీసుకురాబోతోంది. దీని ప్రకారం రోడ్లు లేదా ఇంటి పైకప్పులపై అమర్చిన హోర్డింగ్లు పడిపోవడం వల్ల ఎవరైనా చనిపోతే లేదా వికలాంగులైతే ఈ ప్రకటనలు ఏర్పాటుచేసే కంపెనీలు పరిహారం చెల్లించాల్సి ఉంటుంది.ఇదేవిధంగా ఇటువంటి ప్రమాదాల్లో ఆస్తులకు నష్టం జరిగినప్పుడు కూడా అడ్వర్టైజింగ్ ఏజెన్సీలు పరిహారం చెల్లించాలి. ఈ పరిహారం ఎంత అనేది తర్వాత నిర్ణయిస్తారు. ఇప్పటివరకూ అడ్వర్టైజింగ్ పాలసీలో ప్రమాదాల్లో పరిహారం ఇచ్చే పరిస్థితి లేదు. ఉత్తరప్రదేశ్లో తొలిసారిగా ఈ పాలసీని అమలుచేయనున్నారు. పట్టణాభివృద్ధి శాఖ రూపొందించిన ఈ ప్రతిపాదిత విధానానికి ఉన్నత స్థాయిలో అంగీకారం లభించింది. అవసరమైన కొన్ని సవరణలు చేసిన తర్వాత కేబినెట్లోనూ ఆమోదం పొందింది.ప్రతిపాదిత విధానం ప్రకారం ఇళ్లు లేదా పైకప్పులపై హోర్డింగ్లు పెట్టే ముందు సంబంధిత మున్సిపల్ కార్పొరేషన్ల నుంచి అనుమతి పొందాల్సి ఉంటుంది. పురపాలక సంస్థలు నగరాల్లో ఏర్పాటు చేసిన అన్ని హోర్డింగ్లను జియో ట్యాగింగ్ చేసి 90 రోజుల్లోగా పౌర సంస్థల వెబ్సైట్లో అప్లోడ్ చేయాలి. అలాగే చట్టవిరుద్ధమైన ప్రకటనలను ఏర్పాటు చేస్తే భారీ జరిమానా విధించనున్నారు. -
పరిహారం.. పరిహాసం
సాక్షి, అమరావతి: రైతు సంక్షేమమే తమ ప్రభుత్వ ధ్యేయమని గొప్పలు చెప్పుకునే సీఎం చంద్ర బాబు ప్రభుత్వం ఈ ఖరీఫ్ ఆరంభంలో కురిసిన వర్షాలు, వరదలతో నష్టపోయిన రైతులను ఆదుకునే విషయంలో తీవ్ర నిర్లక్ష్యం కనబరుస్తోంది. గతనెల కృష్ణా, గోదావరి పరీవాహక ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలు, వరదలతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. ప్రాథమిక అంచనాల ప్రకారం.. ఉభయ గోదావరి, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, కాకినాడ, ఏలూరు జిల్లాలతో పాటు 16 జిల్లాల పరిధిలో 70 వేల మంది రైతులకు సంబంధించిన 1.65 లక్షల ఎకరాల్లో పంటలు పూర్తిగా దెబ్బతిన్నట్లు గుర్తించారు. ముఖ్యంగా 5 వేల ఎకరాల్లో వరినారు మడులు, 1.25 లక్షల ఎకరాల్లో వరినాట్లు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాయి. నారుమళ్లున్న చోట ఎకరాకు రూ. 6వేలు, నాట్లుపడిన చోట ఎకరాకు రూ.10వేల వరకు రైతులు పెట్టిన పెట్టుబడులు కోల్పోయారు. ఇతర పంటలు సాగుచేసిన రైతులైతే ఎకరాకు రూ.20 వేలకు పైగా నష్టపోయారు. పైగా సీజన్లో విలువైన పంటకాలాన్ని కోల్పోయారు. వరదలు, వర్షాలు తగ్గుముఖం పట్టిన తర్వాత అధికారులు పంటనష్టం అంచనాలు రూపొందించారు. పంట నష్టం కుదింపు.. తొలుత.. ప్రాథమిక అంచనాల్లో 1.65 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్లు గుర్తించగా.. తుది అంచనాల్లో అది 55 వేల ఎకరాలకు కుదించేశారు. అలాగే, 16 జిల్లాల్లో పంట నష్టం వాటిల్లినట్లు ముందు అంచనా వేయగా, చివరికొచ్చేసరికి ఉభయ గోదావరి, ఏలూరు, అల్లూరి సీతారామరాజు జిల్లాలకే పరిమితం చేశారు. ఈ నాలుగు జిల్లాల్లో 30 వేల మంది రైతులకు చెందిన 55 వేల ఎకరాల్లో మాత్రమే పంట నష్టం వాటిల్లినట్లు లెక్కతేల్చారు. అదే విధంగా.. వరదల కారణంగా ఇసుక మేటలు వేయడంతో తూర్పు గోదావరి, ఏలూరు జిల్లాల పరిధిలో మరో 914 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్లు గుర్తించారు. ప్రాథమిక అంచనాల్లో లక్షా 25 వేల ఎకరాల్లో వరి పంట దెబ్బతిన్నట్లు గుర్తించిన అధికారులు చివరకు 40వేల ఎకరాలకు పరిమితం చేశారు. ఇలా మొత్తమ్మీద వరదలు, వర్షాలవల్ల పంటలు నష్టపోయిన 30వేల మంది రైతులకు రూ.37.33 కోట్ల ఇన్పుట్ సబ్సిడీ (పంట నష్ట పరిహారం) లెక్కతేల్చి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. ఫలించని రైతుల ఆశలు.. ఇక తుది నివేదిక రాగానే వారం పదిరోజుల్లోనే పరిహారం జమచేస్తామని క్షేత్రస్థాయి పర్యటనల్లో మంత్రులు ఊదరగొట్టారు. అలాగే, రైతులు తిరిగి పంటలు వేసుకునేందుకు పంట నష్టపరిహారం (ఇన్పుట్ సబ్సిడీ) వెంటనే విడుదల చేయాలంటూ ఆగస్టు మొదటి వారంలో సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఇంకేముంది.. తమ ఖాతాల్లో ఇన్పుట్ సబ్సిడీ జమవుతుందని రైతులు సంబరపడ్డారు. పెట్టుబడి సాయం ఎలాగూ జమచేయలేదు.. ఇన్పుట్ సబ్సిడీ అయినా చేతికొస్తే కొంతమేర ఆసరాగా ఉంటుందని ఆశపడ్డారు. కానీ, వారి ఆశలు ఫలించలేదు. నెలరోజులు కావస్తున్నా ఆర్థికశాఖ నుంచి ఇన్పుట్ సబ్సిడీ ఫైల్కు మోక్షం కలగకపోవడంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. సీజన్ ముగిసేలోగా వస్తుందిలే కంగారెందుకు అంటూ మండలస్థాయి అధికారుల నుంచి వస్తున్న పరిహాసపు సమాధానాలతో తీవ్ర నిరుత్సాహానికి గురవుతున్నారు. -
మృతుల కుటుంబాలకు పరిహారం ప్రకటించని ప్రభుత్వం
-
న్యాయం జరగకుంటే ధర్నా చేస్తాం
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: అచ్యుతాపురం సెజ్లోని ఎసైన్షియా ఫార్మా ప్రమాద బాధితులందరికీ న్యాయం చేయాలని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మృతులతోపాటు క్షతగాత్రుల్లో ప్రతి ఒక్కరికీ పరిహారం అందించే వరకు బాధితుల తరపున తాము పోరాడతామని ప్రకటించారు. ప్రభుత్వానికి 2–3 వారాల సమయం ఇస్తున్నామని, బాధితులందరికీ నష్ట పరిహారం అందించే విషయంలో ప్రభుత్వం నుంచి సరైన స్పందన రాకుంటే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ధర్నాకు దిగుతుందని, అవసరమైతే తాను కూడా స్వయంగా వచ్చి ధర్నాలో పాల్గొంటానని స్పష్టం చేశారు. దుర్ఘటనలు జరిగినప్పుడు బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం వేగంగా స్పందించాలని, నష్ట పరిహారం అందించే విషయంలో సానుభూతితో, మానవత్వంతో వ్యవహరించాలని సూచించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు అమలు చేసిన సేఫ్టీ ప్రొటోకాల్స్ను పక్కాగా పర్యవేక్షిస్తూ అమలు చేయాలని డిమాండ్ చేశారు. ‘ఎవరెవరు ఏం చేయాలి? ప్రొటోకాల్ ప్రకారం జరుగుతోందా? లేదా? అని పర్యవేక్షిస్తే ఫ్యాక్టరీల పరిస్థితి ఇలా ఉండేది కాదు. ఈ రోజు ఇంతమంది ఇలా చనిపోయి ఉండేవారు కాదు’ అని ఆవేదన వ్యక్తం చేశారు. ఎసైన్షియా ఫార్మా కంపెనీలో జరిగిన దుర్ఘటనలో గాయపడి ఉషా ప్రైమ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను వైఎస్ జగన్ శుక్రవారం పరామర్శించారు. ప్రతి ఒక్కరి వద్దకు వెళ్లి దుర్ఘటన ఎలా జరిగింది? ఆరోగ్యం ఎలా ఉంది? బాగా చూసుకుంటున్నారా? అని వాకబు చేశారు. ఎవరూ అధైర్యపడొద్దని, అందరికీ న్యాయం జరిగే వరకు పోరాడతామని, తాము అండగా ఉంటామని బాధిత కుటుంబాలకు భరోసానిచ్చారు. అనంతరం జగన్ మీడియాతో మాట్లాడారు. స్పందించకూడదన్న ధోరణిలో సర్కారు.. అచ్యుతాపురం ఘటనలో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరు, స్పందన ఏమాత్రం సరిగా లేదు. మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగితే దీనిపై స్పందించకూడదన్న ఉద్దేశమే ప్రభుత్వంలో ఎక్కువగా కనిపిస్తోంది. 17 మంది చనిపోతే.. సాయంత్రం 4 గంటలకు హోంమంత్రి నిర్వహించిన ప్రెస్మీట్లో బాధితులకు భరోసా కల్పించేందుకు అనకాపల్లి వెళుతున్నానన్న మాటే నోటి నుంచి రాలేదు. సాయంత్రం 5 గంటల ప్రాంతంలో డైరెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ను పర్యవేక్షించే కార్మికశాఖ మంత్రి కూడా ప్రెస్మీట్లో ఎంత మంది చనిపోయారో వివరాలు లేవని మాట్లాడారు. ఆయన కూడా హుటాహుటిన అక్కడకు వెళ్లాలనే ఉద్దేశం చూపించలేదు. ఘటన జరిగిన తర్వాత ఆ స్థలానికి కలెక్టర్ ఎప్పుడు వెళ్లారు? అధికారులు, కమిషనర్ ఎప్పుడు వెళ్లారనే అంశాలను గమనిస్తే బాధ కలుగుతోంది. ఇక అధికారపార్టీ నాయకులు ఎప్పుడు వెళ్లారని గమనిస్తే ఎంతో బాధ కలిగిస్తోంది. ఘటన జరిగితే కనీసం అంబులెన్సులు కూడా సమీకరించలేని పరిస్థితి నెలకొంది. బాధితులను కంపెనీ బస్సుల్లోనే తరలించాల్సిన దుస్థితి. అప్పటికి... ఇప్పటికి తేడా ఇదీ.. ఇలాంటి ఘటనే మా ప్రభుత్వ హయాంలో కూడా ఒకసారి జరిగింది. కోవిడ్ మహమ్మారి సమయంలో మే 2020లో ఎల్జీ పాలిమర్స్లో ప్రమాదం చోటు చేసుకుంది. కానీ కోవిడ్ ఉన్నా కూడా గత ప్రభుత్వం ఎలా స్పందించిందన్నది తేడా ఒకసారి గమనించాలి. ఆ ఘటన తెల్లవారుజామున 3.40 గంటల సమయంలో జరిగితే 5 గంటల కల్లా కలెక్టర్, కమిషనర్ ఘటనా స్థలానికి వెళ్లారు. అప్పటికే అంబులెన్సులన్నీ పెద్ద ఎత్తున మోహరించాయి. ప్రతి బాధితుడికి తోడుగా నిలుస్తూ ఉదయం 6 గంటలకల్లా వైఎస్సార్ సీపీకి చెందిన సీనియర్ నాయకులందరూ ఘటనా స్థలానికి వెళ్లారు. అదే రోజు 11 గంటల కల్లా ఏకంగా ముఖ్యమంత్రి అంటే నేనే స్పాటు వద్దకు వెళ్లా. బాధితులకు 24 గంటల్లోనే ఏకంగా కోటి రూపాయల నష్టపరిహారం ప్రకటించిన పరిస్థితులు గతంలో ఎన్నడూ జరగలేదు. ఇటువంటి ఘటనలు జరిగినప్పుడు ప్రభుత్వం బాధ్యత తీసుకుని బాధితుల పట్ల ఇంతగా సానుభూతితో వ్యవహరించిన సంఘటనలు గతంలో లేవు. మొట్టమొదటిసారిగా నష్ట పరిహారం కోటి రూపాయలు ఇచ్చింది వైఎస్సార్సీపీ ప్రభుత్వమే.. మన ప్రభుత్వమే.. జగన్ ప్రభుత్వమే ఇచ్చిందని గర్వంగా చెప్పగలుగుతున్నా. 24 గంటల్లోనే ఏకంగా రూ.30 కోట్లు అక్కడకు పంపించి బాధితులకు తోడుగా నిలిచాం. బాధితులను వెంటనే ఆస్పత్రిలో చేర్పించడంతోపాటు 3 రోజులు ఆస్పత్రిలో ఉంటే రూ.10 లక్షలు, ఒక రోజు ఉంటే రూ.3 లక్షలు, చిన్న చిన్న గాయాలైన వారికి రూ.25 వేలు చొప్పున ఇప్పించాం. అంతేకాకుండా చుట్టుపక్కల ఉన్న ఐదు గ్రామాల్లో 15 వేల జనాభా ఉండగా ప్రతి ఒక్కరికీ రూ.10 వేలు ఇచ్చి తోడుగా నిలిచిన పరిస్థితులు వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో జరిగాయి. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెబుతున్నానంటే.. ఒక సంఘటన జరిగినప్పుడు ప్రభుత్వం స్పందించే తీరు ఎలా ఉండాలనేది చాలా ముఖ్యం. సానుభూతి చూపాలి.. బాధ్యత తీసుకోవాలి చంద్రబాబు ఇక్కడకు వచ్చినప్పుడు నిర్వహించిన ప్రెస్మీట్ చూసి ఆశ్చర్యపోయా. జగన్ హయాంలోనూ ఘటనలు జరిగాయంటూ విషయాన్ని పక్కదారి పట్టించే ప్రయత్నం చేశాడు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న 2014–19 మధ్యలో ప్రమాదాలు జరగలేదా? ఎవరున్నా ఇటువంటి ఘటనలు జరుగుతాయి. కానీ అలా జరిగినప్పుడు ప్రభుత్వం ఎలా స్పందిస్తుందన్నది ముఖ్యమైన విషయం. ప్రభుత్వం ఇటువంటి ఘటనల సమయంలో ప్రజల పట్ల, బాధితుల పట్ల సానుభూతి చూపించాలి. రెండోది ఏమిటంటే.. ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి. ఈ రెండు కూడా ఆ రోజు వైఎస్సార్సీపీ ప్రభుత్వం తీసుకుంది.ఇవాళ చీఫ్ సెక్రటరీగా ఉన్న నీరబ్కుమార్ ప్రసాద్ ఆధ్వర్యంలోనే ఒక హై లెవల్ కమిటీని నియమించి ఫ్యాక్టరీ సెక్యూరిటీ, పొల్యూషన్ కంట్రోల్ అంశాలను జోడించి ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా తేవాల్సిన సంస్కరణలపై సిఫారసులు చేయాలని కమిటీని నాడు మా ప్రభుత్వం కోరింది. ఆ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఆగస్టు 2020లో ఒక జీవో కూడా జారీ చేశాం. దీనిపై పక్కాగా ప్రొటోకాల్ కూడా తీసుకొచ్చాం. ఫ్యాక్టరీ భద్రత ప్రొటోకాల్, కాలుష్య నియంత్రణ ప్రొటోకాల్.. అన్నింటినీ కలిపి ఒకే ప్రొటోకాల్ తెచ్చాం. ఇందులో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. ప్రతి కంపెనీ సెల్ఫ్ కంప్లయిన్స్ రిపోర్టు ఇవ్వాలి. తయారు చేసే నైపుణ్యం ఆ కంపెనీకి సొంతంగా లేకపోతే గుర్తింపు పొందిన థర్డ్ పార్టీ ద్వారా తీసుకుని కచ్చితంగా ఇవ్వాలి. ఆ నివేదిక ఆధారంగా నిజంగానే అన్నీ సరిగ్గా ఉన్నాయా? ఇంకా ఏమైనా చేయాల్సిన అవసరం ఉందా? అనే విషయాన్ని అన్ని విభాగాల అధికారులతో కూడిన కమిటీ పరిశీలించి నెల రోజుల తర్వాత తనిఖీలు నిర్వహిస్తుంది. ఒకవేళ ఏవైనా సమస్యలు ఉంటే సరిదిద్దుకునేందుకు కంపెనీకి 15 రోజుల సమయం ఇస్తుంది. గడువులోగా అది పూర్తయ్యేలా జాయింట్ కలెక్టర్ పర్యవేక్షించాలని ప్రొటోకాల్లో ఉంది. ఇది ఇప్పటికే అమల్లో ఉంది. అదొక సంస్కరణ కింద తెచ్చాం. ఇవాళ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు వీటిని తు.చ. తప్పకుండా అమలు చేసేలా పర్యవేక్షించి ఉంటే ఇటువంటి ఘటనలు పునరావృతమయ్యేవి కాదు. లోతైన విచారణ జరగాల్సిందే.. ఇవాళ చంద్రబాబుకు ఒకటే మాట చెబుతున్నా. నష్టపరిహారం అన్నది సానుభూతితో ఇవ్వాలి. ఇవ్వాల్సిన సమయంలో ఇవ్వాలి. ఇంత మంది ఆస్పత్రిలో ఉన్నారు. వారికి ఇస్తామన్న డబ్బులు వెంటనే ఇప్పించే ఏర్పాట్లు చేయండి. ఫ్యాక్టరీలలో భద్రతా చర్యలపై తెచ్చిన ప్రొటోకాల్ను కనీసం ఇప్పటి నుంచైనా పర్యవేక్షించే దిశగా అడుగులు వేయాలి. ఇటువంటివి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోండి. ఆ ఫ్యాక్టరీకి సంబంధించి వాస్తవంగా ఏం జరిగిందో విచారణ చేయండి. యాజమాన్యం ఎవరైనా కానీ.. ఎందుకు తప్పు జరిగిందో విచారణ జరగాలి. సేఫ్టీ పారామీటర్స్ అమలైతే ఇటువంటి ఘటనలు నివారించవచ్చు. ఇవన్నీ కచ్చితంగా అమలు చేసేందుకు 2–3 వారాల సమయం ఇస్తాం. చనిపోయిన వారందరికీ నష్టపరిహారం అందించే విషయంలో ప్రభుత్వం నుంచి సరైన స్పందన రాకుంటే బాధితుల తరపున వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ధర్నాకు దిగుతుంది. అవసరమైతే నేను కూడా స్వయంగా వచ్చి ధర్నాలో పాల్గొంటా. ఈ కార్యక్రమంలో మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ, ఎంపీ తనూజ రాణి, మాజీ మంత్రులు బూడి ముత్యాలనాయుడు, గుడివాడ అమర్నాథ్, పేర్ని నాని, కృష్ణదాస్, ఎమ్మెల్యేలు మత్స్యలింగం, విశ్వేశ్వరరాజు, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి, మేయర్ హరి వెంకటకుమారి, జడ్పీ చైర్పర్సన్ సుభద్ర తదితరులు పాల్గొన్నారు.పాలన ఇలాగేనా? వైఎస్సార్సీపీ అధికారంలో ఉన్నప్పుడు ఫీజు రీయింబర్స్మెంట్ ఏ రకంగా అమలు జరిగిందో మీరంతా చూశారు. ప్రతి త్రైమాసికం ముగిసిన వెంటనే విద్యాదీవెన డబ్బులు ఆ తల్లుల ఖాతాల్లోకి జమ అయ్యేవి. ఇప్పటికే రెండు త్రైమాసికాలు అయిపోయాయి. మూడోది కూడా ముగిసేందుకు దగ్గర పడుతున్నా ఇంతవరకు పిల్లలకు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ఇవ్వలేదు. ఎప్పుడిస్తారో, అసలు ఇస్తుందో లేదో కూడా తెలియదు. ఒకవైపు పిల్లలను ఫీజులు కట్టాలని యాజమాన్యాలు డిమాండ్ చేస్తున్నాయి. ఫీజులు చెల్లించకుంటే సర్టిఫికెట్లు ఇవ్వబోమంటూ పిల్లలపై ఒత్తిడి తెస్తున్నాయి. మరోవైపు వ్యవసాయ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. మరి పెట్టుబడి సాయం కింద ఇస్తామన్న రూ.20 వేలు ఎప్పుడిస్తారని రైతులు అడుగుతున్నారు. గతంలో రైతు భరోసా కింద వారికి ఏటా రూ.13 వేలు చొప్పున అందించాం. ఇప్పుడు ఇంతవరకు రూపాయి రాలేదు. ఇక ఉచిత పంటల బీమా గాలికి ఎగిరిపోయింది. బీమా సొమ్ము అందని పరిస్థితుల్లో రైతన్న ఉన్నాడు. ఇవాళ విత్తనాలు, ఎరువులు కోసం క్యూలో నిలబడాల్సిన పరిస్థితి. గడప వద్దకు వచ్చే పింఛను, రేషన్ ఆగిపోయింది. ఈ రోజు ప్రతి వ్యవస్థలో అవినీతి, వివక్ష పెరిగిపోయింది. టీడీపీ నాయకుల చుట్టూ తిరిగితే కానీ ఏవీ రావనే సందేశాన్ని పంపిస్తున్నారు. వీళ్ల ధ్యాసంతా రెడ్ బుక్పైనే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత 3 నెలలుగా ఏం జరుగుతోంది? వీరికి పాలన మీద ధ్యాస లేదు. ప్రజలకు ఇచ్చిన సూపర్ సిక్స్, సూపర్ సెవెన్, సూపర్ టెన్ల మీద ధ్యాస లేదు. వీళ్ల ధ్యాసంతా రెడ్ బుక్ తెరవడం.. ఎవరెవరిపై కక్షలు ఉన్నాయో వాటిని తీర్చుకునేందుకు గ్రీన్సిగ్నల్ ఇవ్వడంపైనే! కక్షలు తీర్చుకోవడానికి రోజూ కొట్టడం, చంపడం, ఆస్తులను ధ్వంసం చేస్తున్న ఘటనలే కనిపిస్తున్నాయి. కూటమి పాలనలో ప్రజలకు మంచి చేయాలన్న ఆలోచన, తాపత్రయం కనిపించని అధ్వాన పరిస్థితి రాష్ట్రంలో నెలకొంది. వీళ్లు పరిపాలన మీద దృష్టి పెట్టి ఉంటే ఇంగ్లిష్ మీడియంతో మన స్కూల్స్ బాగుపడి ఉండేవి. 3వ తరగతిలోనే టోఫెల్ క్లాసులు, నాడు–నేడు కొనసాగి ఉండేవి. గోరుముద్ద కార్యక్రమం బాగా జరుగుతూ ఉండేది. ఇప్పుడు ప్రభుత్వ స్కూల్స్ నాశనమైపోయాయి. ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రులకు బిల్లులు ఇవ్వకపోవడంతో పేదలకు వైద్యం అందని దుస్థితి నెలకొంది. -
నష్టపరిహారం చెల్లించే బాధ్యత కంపెనీదే
సాక్షి, అనకాపల్లి: అచ్యుతాపురం సెజ్లోని ఎసైన్షియా ఫార్మాలో జరిగిన ప్రమాదంలో మృతుల కుటుంబాలకు, క్షతగాత్రులకు చెల్లించే నష్ట పరిహారం మొత్తం కంపెనీయే భరిస్తుందని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ.కోటి చొప్పున, తీవ్రంగా గాయపడిన వారికి రూ.50 లక్షలు, స్వల్పంగా గాయపడిన వారికి రూ. 25 లక్షలు పరిహారం అందించనున్నట్లు వెల్లడించారు. గురువారం మధ్యాహ్నం 2.34 గంటలకు హెలికాప్టర్ ద్వారా ప్రమాదం జరిగిన ఫార్మా కంపెనీ వద్దకు చేరుకుని, పేలుడు జరిగిన బ్లాకులను సందర్శించారు. ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. ప్రమాదంపై రాష్ట్ర మంత్రులు, స్థానిక ప్రజా ప్రతినిధులు, జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం ఇక్కడి లారెస్ట్ ఫార్మా కంపెనీలో మీడియాతో మాట్లాడుతూ.. అచ్యుతాపురం సెజ్లో ఎసైన్షియా ఫార్మా రెడ్ కేటగిరీ పరిశ్రమ అని, అలాంటి పరిశ్రమల విషయంలో మరింత కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని అన్నారు. వేపర్ క్లౌడ్ ఎక్స్ప్లోజన్ కారణంగా ప్రమాదం జరిగిందని, ఎస్వోపీ ఫాలో అవ్వలేదని స్పష్టంగా అర్థమవుతోందని చెప్పారు. పేలుడు ఘటనలో 17 మంది చనిపోగా, క్షతగాత్రుల్లో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారని తెలిపారు. వారు మినహా మిగతా అందరూ స్వల్ప గాయాలతోనే ఉన్నారని పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు ఆర్థిక సహాయం కింద చెక్కులు ఇవాళే పంపిణీ చేయాలని ఆదేశించినట్లు తెలిపారు. హైలెవెల్ విచారణ కమిటీ ఏర్పాటు..సెజ్లో ప్రమాదంపై హైలెవల్ విచారణ కమిటీ ఏర్పాటు చేస్తున్నామని, ఆ కమిటీ నివేదిక ఆధారంగా బాధ్యులందరిపైనా కఠిన చర్యలు ఉంటాయన్నారు. ఎల్జీ పాలీమర్స్ ప్రమాదంపై హైపవర్ కమిటీ ఏర్పాటు చేసినా కఠిన చర్యలు లేని పరిస్థితులు చూశామని చంద్రబాబు అన్నారు. అధికారులు అలసత్వంపై కఠినంగా వ్యవహరిస్తామన్నారు. ప్రమాద ఘటన సమయంలో ఫార్మా కంపెనీ యాజమాన్యం అందుబాటులో లేదన్నారు. నూతన పరిశ్రమలు ఏర్పాటుకు సహకరిస్తూనే.. భద్రతా చర్యలు పాటించని కంపెనీలపై చర్యలు తీసుకుంటామన్నారు. ఫార్మాకంపెనీల్లో ప్రతీ మూడునెలలకొకసారి ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలన్నింటితో తనిఖీలు చేయిస్తే, నిర్లక్ష్యంగా ఉండే కంపెనీలపై చర్యలు తీసుకోవడానికి ఆస్కారం ఉంటుందన్నారు. ఎప్పటికప్పుడు వారు ఇచ్చే నివేదికలు ఆన్లైన్లో అప్లోడ్ చేస్తామన్నారు. దీంతో ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా పూర్తి బాధ్యత పరిశ్రమల యాజమాన్యాలదే అవుతుందన్నారు. భద్రత విషయంలో పరిశ్రమలు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం సమకూర్చుకోవాలన్నారు. గత ఐదేళ్లలో పరిశ్రమలను లూటీ చేశారని, ఆ కారణంగానే ప్రమాదాలు ఎక్కువయ్యాయని సీఎం అన్నారు. అచ్యుతాపురం–పరవాడ పరిధిలో ఎస్ఈజెడ్, నాన్ ఎస్ఈజెడ్ ప్రాంతాల్లో 119 ప్రమాదాలు జరిగితే 120 మంది మరణించారని వెల్లడించారు. గత పాలకుల పొరపాట్లే ఈ ప్రమాదాలకు కారణమన్నారు. కార్యక్రమంలో కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్, హోం మంత్రి అనిత, ఎంపీ రమేశ్, స్థానిక ఎమ్మెల్యే విజయకుమార్, అధికారులు పాల్గొన్నారు. అండగా ఉంటాం.. ధైర్యంగా ఉండండిబీచ్రోడ్డు (విశాఖ): అచ్యుతాపురం సెజ్లో ఫార్మా కంపెనీ దుర్ఘటనలో గాయపడిన వారిని సీఎం చంద్రబాబు గురువారం పరామర్శించారు. ప్రభుత్వం అండగా ఉంటుందని.. ధైర్యంగా ఉండాలని వారిని కోరారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడి విశాఖపట్నం వెంకోజీపాలెం మెడికవర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను, వారి కుటుంబ సభ్యులను చంద్రబాబు పరామర్శించారు. వైద్య ఖర్చులను పూర్తిగా ప్రభుత్వమే భరిస్తుందని తెలిపారు. అవసరమైన వారికి ప్లాస్టిక్ సర్జరీ కూడా చేయిస్తామన్నారు. ఐసీయూలో చికిత్స పొందుతున్న ఏడుగురు క్షతగాత్రుల వద్దకు వెళ్లి వారితో మాట్లాడారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించారు. కలుషితాహార బాధిత చిన్నారులకు సీఎం పరామర్శమహారాణిపేట: అనకాపల్లి జిల్లా కోటవురట్ల మండలం కైలాసపట్నం ట్రస్టులో కలుషితాహారం తిని కేజీహెచ్లో చికిత్స పొందుతున్న చిన్నారులను కూడా చంద్రబాబు పరామర్శించారు. విశాఖ పర్యటనలో భాగంగా గురువారం కేజీహెచ్కు వచ్చిన ఆయన చిన్నపిల్లల వార్డును సందర్శించారు. -
కస్టమర్లకు భారీ పరిహారం చెల్లిస్తున్న యాపిల్.. ఎందుకంటే..
ప్రీమియం మొబైల్స్, ల్యాప్టాప్ల తయారీ సంస్థ యాపిల్ తమ మ్యాక్బుక్ కస్టమర్లకు భారీగా పరిహారం చెల్లిస్తోంది. మ్యాక్బుక్ ల్యాప్టాప్లలో బటర్ఫ్లై కీబోర్డ్లతో సమస్యలను ఎదుర్కొన్న కస్టమర్లకు పరిహారం చెల్లించే ప్రక్రియను ప్రారంభించింది.ఈ చర్య 2018లో దాఖలు చేసిన క్లాస్ యాక్షన్ దావా తర్వాత 2022లో టెక్ దిగ్గజం అంగీకరించిన 50 మిలియన్ డాలర్ల సెటిల్మెంట్లో భాగం. మ్యాక్బుక్లలో ఈ బటర్ఫ్లై కీబోర్డు పనిచేయడం లేదంటూ కొంత కస్టమర్లు ఈ దావా వేశారు.బటర్ఫ్లై కీబోర్డ్ను యాపిల్ మొదటిసారిగా 2015లో కొత్త 12-అంగుళాల మ్యాక్బుక్లో పరిచయం చేసింది. తర్వాత 2016లో మ్యాక్బుక్ ప్రో, 2018లో మ్యాక్బుక్ ఎయిర్లకు దీన్ని విస్తరించింది. అయితే, స్టిక్కీ కీలు, డూప్లికేట్ క్యారెక్టర్స్, కొన్ని అక్షరాలు పూర్తిగా టైప్ కాకపోవడం వంటి సమస్యలు తలెత్తడంతో ఈ డిజైన్ విమర్శలను ఎదుర్కొంది. దీంతో యాపిల్ 2019 చివరిలో ఈ బటర్ఫ్లై కీబోర్డ్ డిజైన్ను దశలవారీగా నిలిపివేయడం ప్రారంభించింది.సెటిల్మెంట్ కోసం దావా ప్రక్రియ 2022 చివరిలో ప్రారంభమైంది గతేడాది మేలో తుది ఆమోదం పొందింది. అయితే, కాలిఫోర్నియా , ఇల్లినాయిస్, ఫ్లోరిడా, మిచిగాన్, న్యూజెర్సీ, న్యూయార్క్, వాషింగ్టన్ నివాసితులు మాత్రమే ఈ సెటిల్మెంట్ను క్లెయిమ్ చేయడానికి అర్హులు.కీబోర్డ్ సమస్యల తీవ్రతను బట్టి పరిహారం మొత్తం మారుతుంది. రెండు లేదా అంతకంటే ఎక్కువ టాప్ కేస్ రీప్లేస్మెంట్లు ఉంటే 395 డాలర్లు (రూ.33,000) వరకు పరిహారం పొందగలరు. అదే ఒక టాప్ కేస్ రీప్లేస్మెంట్ ఉన్నవారు 125 డాలర్లు (10,000) వరకు పొందవచ్చు. కీక్యాప్ రీప్లేస్మెంట్లు మాత్రమే అవసరమయ్యే వారు గరిష్టంగా 50 డాలర్లు పొందడానికి అర్హులు. జూన్ 27న కోర్టు ద్వారా చెల్లింపు ఆర్డర్ జారీ అయంది. ఆగస్టు 3 నుంచి చెల్లింపులు ప్రారంభమయ్యాయి. -
Hit And Run Case: రూ. 1.98 కోట్ల పరిహారం చెల్లించాలని ఆదేశం
న్యూఢిల్లీ: గత ఎనిమిదేళ్ల క్రితం జరిగిన ఓ రోడ్డు ప్రమాదం కేసులో దాదాపు రెండు కోట్ల నష్ట పరిహారం చెల్లించాలంటూ ఇన్సూరెన్స్ కంపెనీని ట్రిబ్యూనల్ ఆదేశించింది. రూ.1.21 కోట్లను పరిహారంగా, 77.61 లక్షలను వడ్డీ రూపంలో.. మొత్తం రూ. 1.98 కోట్లను మృతుడి తల్లిదండ్రులకు 30 రోజుల్లోగా ఇవ్వాలని ఆదేశించింది.వివరాలు 2016 ఏప్రిల్ 4న ఢిల్లీలో హిట్ అండ్ రన్ ఘటన జరిగింది. సివిల్స్ లైన్ ప్రాంతంలో ఓ మైనర్ బాలుడు నిర్లక్ష్యంగా మెర్సిడెస్ బెంజ్ కారు నడపడంతో రోడ్డు దాటుతున్న 32 ఏళ్ల సిద్ధార్థ్ శర్మ అనే వ్యక్తి మరణించాడు. ఈ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు స్థానిక సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యాయి. సిద్ధార్థ్ను ఢీకొట్టిన తర్వాత కారు ముందు టైర్ పగిలిపోవడంతో దూరంగా వెళ్లి ఆగిపోయింది. ఘటన అనంతరం నిందితుడైన మైనర్ కారును అక్కడే వదిలి తన స్నేహితులతో కలిసి పారిపోయాడు.దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మైనర్ అతివేగమే ప్రమాదానికి కారణంగా పోలీసులు తేల్చారు. కారు ఢీకొన్న సమయంలో సిద్ధార్థ్ 20 అడుగుల దూరంలో ఎగిరిపడినట్లు సీసీటీవీ ఫుటేజీ ద్వారా గుర్తించారు. తాజాగా ఈ ఘటనపై విచారణ చేపట్టిన మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్ ట్రిబ్యూనల్ బాధతుడైన సిద్ధార్థ శర్మ తల్లిదండ్రులకు రూ.1.21 కోట్లను పరిహారంగా, 77.61 లక్షలను వడ్డీ రూపంలో.. మొత్తం రూ. 1.98 కోట్లను 30 రోజుల్లోగా ఇవ్వాలని ఇన్సూరెన్స్ కంపెనీని ఆదేశించింది. అంతేగాక కారు రిజిస్ట్రేషన్ చేసిన మైనర్ తండ్రి నుంచి పరిహారం మొత్తాన్ని రికవరీ చేసుకునేదుకు బీమా కంపెనీకి కోర్టు అనుమతినిచ్చింది. మైనర్ కుమారుడిని మెర్సిడెస్ కారు నడుపడం అడ్డుకోవడంలో తండ్రి విఫలమైనట్లు చెబుతూ అతన్ని కూడా బాధ్యులుగా ట్రిబ్యునల్ పేర్కొంది. -
పసుపు రైతులకు ఇచ్చేది రూ.7 వేలే!
తెనాలి: గుంటూరు జిల్లా దుగ్గిరాల శుభం మహేశ్వరి కోల్డ్ స్టోరేజీలో సంభవించిన అగ్ని ప్రమాదంలో పసుపు నిల్వలను నష్టపోయిన రైతులకు క్వింటాల్కు రూ.7 వేల చొప్పున మాత్రమే చెల్లిస్తామని రాష్ట్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది. ప్రస్తుత మార్కెట్లో ధరను దృష్టిలో పెట్టుకుని క్వింటాల్కు కనీసం రూ.10 వేలైనా ఇప్పించాలని పసుపు రైతుల సంఘం కోరింది.బీమా పరిహారం కలిపి క్వింటాల్కు రూ.7 వేలకు మించి ఇవ్వలేమని సర్కారు చేతులెత్తేసింది. అగ్ని ప్రమాదంలో నష్టపోయిన పసుపు రైతులకు క్వింటాల్కు రూ.7 వేల చొప్పున చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత తీసుకుందని పసుపు రైతుల సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు ములకా శివసాంబిరెడ్డి తెలిపారు. గురువారం తెనాలిలో సబ్ కలెక్టర్ ప్రఖర్జైన్ను పసుపు శివసాంబిరెడ్డి, పలువురు రైతులు కలిశారు. శివసాంబిరెడ్డి విలేకరులతో మాట్లాడుతూ.. బుధవారం విజయవాడ మార్క్ఫెడ్ కార్యాలయంలో వ్యవసాయ శాఖ మంత్రి కె.అచ్చెన్నాయుడు సమక్షంలో రైతులు, అధికారులు కోల్డ్ స్టోరేజీ యజమానితో చర్చలు జరిపి అంగీకార ఒప్పందం సంతకాలు చేసినట్టు తెలిపారు. ప్రస్తుత మార్కెట్ను దృష్టిలో ఉంచుకుని క్వింటాల్కు కనీసం రూ.10 వేలైనా ఇప్పించాలని కోరినట్టు చెప్పారు.బీమా పరిహారంతో కలిపి రూ.7 వేలకు మించి ఇవ్వలేమని మంత్రి వెల్లడించగా.. రైతులు అయిష్టంగానే అంగీకరించారని తెలిపారు. దీనివల్ల పసుపు రైతులు రూ.20 కోట్లు నష్టపోయినట్టు శివసాంబిరెడ్డి, చందు సత్యనారాయణ తెలియజేశారు. చర్చల్లో బాధిత పసుపు రైతుల సంఘం కన్వీనర్ వేములపల్లి వెంకటరామయ్య, దేవభక్తుని నాగ వీరబసవయ్య, నాదెండ్ల చంద్రశేఖరరావు, గద్దె శ్రీహరి, భీమవరపు సీతారామిరెడ్డి, బొల్లిమంత రామారావు, తుంగల వీరరాఘవులు పాల్గొన్నట్టు వివరించారు. -
గరిష్ట పరిహారం దక్కేలా చూడాలి
సాక్షి, హైదరాబాద్: జాతీయ రహదారులకు భూములిచ్చిన రైతుల విషయంలో మానవీయకోణంలో వ్యవహరించాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కలెక్టర్లకు సూచించారు. నిబంధనల ప్రకారం వచ్చే గరిష్ట పరిహారం రైతులకు దక్కేలా చూడాలన్నారు. తెలంగాణలో రహదారుల నిర్మాణానికి ఎదురవుతున్న సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఢిల్లీ నుంచి వచ్చిన ఎన్హెచ్ఏఐ(నేషనల్హైవే అథారిటీ ఆఫ్ ఇండియా) అధికారులు మంగళవారం ముఖ్యమంత్రిని ఆయన నివాసంలో కలిసి విన్నవించిన విషయం తెలిసిందే. ఆయా అంశాలను కొలిక్కి తెచ్చేందుకు, సంబంధిత జిల్లాల కలెక్టర్లు, విభాగాల ఉన్నతాధికారులతో బుధవారం సచివాలయంలో సీఎం రేవంత్రెడ్డి సమీక్షించారు. భూసేకరణ ఎందుకు ఆలస్యమవుతోందని అధికారులను సీఎం ప్రశ్నించారు. భూములకు ప్రభుత్వ రిజిస్ట్రేషన్ ధరలు తక్కువ ఉండటం, మార్కెట్ ధరలు ఎక్కువగా ఉండటంతో భూములు ఇచ్చేందుకు రైతులు ముందుకురావడం లేదని కలెక్టర్లు ఆయన దృష్టికి తెచ్చారు. తరతరాలుగా సాగుచేసుకుంటున్న భూములను శాశ్వతంగా కోల్పోతున్నప్పుడు రైతుల్లో ఆవేదన ఉంటుందని, దానిని అధికారులు గుర్తించాలన్నారు. రైతులను పిలిచి మాట్లాడి వారిని ఒప్పించాలని సూచించారు. రీజినల్రింగురోడ్డు దక్షిణభాగం, ఉత్తరభాగం వేర్వేరుగా చూడొద్దని, ఆ రెండింటికి కలిపి ఒకే ఎన్హెచ్ నంబర్ కేటాయించాలని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని కోరగా, ఆయన సూత్రప్రాయంగా ఆమోదం తెలిపినట్టు ముఖ్యమంత్రి పేర్కొన్నారు.ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, ఎన్హెచ్ఏఐ మధ్య త్రైపాక్షిక ఒప్పందం (ట్రైపారి్టయేట్ అగ్రిమెంట్) కుదుర్చుకోవాల్సి ఉంటుందని అధికారులు చెప్పారు. వెంటనే దానిని పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. ఆర్ఆర్ఆర్ ఉత్తరభాగం భూసేకరణలో ఉన్న ఆటంకాలపై ఆయన ప్రశ్నించారు. అలైన్మెంట్ విషయంలో పొరపడి కొందరు రైతులు కోర్టును ఆశ్రయించారని, దీంతో హైకోర్టు స్టే ఇచ్చిందని యాదాద్రి భువనగిరి కలెక్టర్ హన్మంత్ కె.జెండగే తెలిపారు. స్టే తొలగింపునకు వచ్చే శుక్రవారం నాటికి కౌంటర్ దాఖలు చేయాలని సూచించారు. అలాగే ఆర్మూర్–జగిత్యాల–మంచిర్యాల, విజయవాడ–నాగ్పూర్ కారిడార్లకు సంబంధించి అటవీశాఖ భూములకు ప్రత్యామ్నాయంగా ప్రభుత్వ భూములు కేటాయించాలని నిజామాబాద్, మంచిర్యాల, మహబూబాబాద్ జిల్లాల కలెక్టర్లకు సూచించారు. హైదరాబాద్–మన్నెగూడ రహదారి పనులు త్వరగా ప్రారంభించాలని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.రెండునెలల్లో హైదరాబాద్–విజయవాడ విస్తరణ పనులు హైదరాబాద్–విజయవాడ జాతీయరహదారిని ఆరు లేన్లుగా విస్తరించే పనులను వెంటనే చేపట్టాలని రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఎన్హెæచ్ఏఐ ప్రాజెక్టు మెంబర్ అనిల్చౌదరిని కోరారు. రెండునెలల్లో పనులు ప్రారంభిస్తామని ఆయన బదులిచ్చారు. సమీక్షలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ముఖ్యమంత్రి ఓఎస్డీలు శేషాద్రి, మాణిక్ రాజ్, చంద్రశేఖర్రెడ్డి, షానవాజ్ ఖాసిం, మౌలిక వసతుల సలహాదారు శ్రీనివాసరాజు, ఎన్హెచ్ఏఐ ప్రాంతీయ అధికారి రజాక్, పీసీసీఎఫ్ డోబ్రియల్, ఆర్అండ్బీ స్పెషల్ సెక్రటరీ దాసరి హరిచందన, జాయింట్ సెక్రటరీ హరీ‹Ù, మెదక్, యాదాద్రి భువనగిరి, సంగారెడ్డి, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, హనుమకొండ, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, నిజామాబాద్ కలెక్టర్లు పాల్గొన్నారు. సర్వీస్ రోడ్లు ఏర్పాటు చేయాలి: భట్టి సాక్షిప్రతినిధి, ఖమ్మం: నాగపూర్–అమరావతి జాతీయ రహదారి నిర్మాణంలో ట్రాఫిక్ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో సర్వీస్ రోడ్లు ఏర్పాటు చేయాలని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క అన్నారు. జాతీయ రహదారుల భూసేకరణ పురోగతిపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సచివాలయం నుంచి సమీక్షించగా, ఖమ్మం కలెక్టరేట్ నుంచి వీడియోకాన్ఫరెన్స్ ద్వారా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, పోలీస్ కమిషనర్ సునీల్దత్ పాల్గొన్నారు. జాతీయ రహదారుల వెంట వ్యవసాయ వాహనాలు, రైతులు వినియోగించుకునేలా గ్రావెల్ రోడ్లు నిర్మించాలనే ప్రతిపాదన సమీక్షలో చర్చకు వచ్చి0ది. ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకుంటామని ఎన్హెæచ్ఏఐ ప్రాజెక్టు మెంబర్ అనిల్చౌదరి తెలిపారు. గ్రావెల్ రహదారి నిర్మించడం వల్ల రైతులకు ఉపయోగపడడంతో పాటు భవిష్యత్లో రహదారి విస్తరణకు ఇబ్బందులు ఉండవని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. ఆ తర్వాత భట్టి మాట్లాడుతూ రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో అండర్పాస్లు ఏర్పాటు చేయాలని తెలిపారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ నాగపూర్–అమరావతి రహదారిలో భాగంగా ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో భూములు కోల్పోతున్న వారికి పరిహారం అందించాలని, ధంసలాపురం వద్ద ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లు ఇవ్వాలని కోరారు. తల్లాడ–దేవరపల్లి గ్రీన్ఫీల్డ్ రహదారి పనులు సాగుతున్నందున, ప్రస్తుతం ఖమ్మం నుంచి అశ్వారావుపేట వరకు ఉన్న జాతీయ రహదారిని రాష్ట్ర రహదారిగా మార్చుకోవాలని ఎన్హెచ్ఏఐ అధికారులు సూచిస్తున్నారని, దానికి ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించవద్దని, జాతీయ రహదారిగానే దానిని కొనసాగించాలని మంత్రి తుమ్మల పేర్కొన్నారు. -
‘తాగుబోతులేమైనా స్వాతంత్ర్య సమరయోధులా?’
చెన్నై: అరవై మందికిపైగా పొట్టనబెట్టుకుని కళ్లకురిచ్చి కల్తీ సారా ఉదంతం దేశవ్యాప్తంగా సంచలన చర్చకు దారి తీసింది. ఒకవైపు తమిళనాట రాజకీయ దుమారం కొనసాగుతుండగా.. మరోవైపు ఈ కేసుపై మద్రాస్ హైకోర్టులో తాజాగా ప్రజా ప్రయోజన వ్యాజ్యం నమోదైంది.కళ్లకురిచ్చి కల్తీసారా ఘటనలో మృతి చెందిన వాళ్ల కుటుంబాలకు నష్టపరిహారంగా రూ.10 లక్షలు ప్రకటించింది తమిళనాడు ప్రభుత్వం. అయితే ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మహమ్మద్ గౌస్ అనే వ్యక్తి మద్రాస్ హైకోర్టులో పిల్ వేశారు. ‘‘కల్తీసారా తాగి చనిపోయినవాళ్లు స్వాతంత్ర్య సమరయోధులేం కాదు. సామాజిక ఉద్యమకారులు అంతకన్నా కాదు. పోనీ సమాజం కోసం.. ప్రజల కోసం ప్రాణాలు వదిలారా? అంటే అదీ కాదు. కల్తీసారా తయారీ చట్టవిరుద్ధమైన చర్య అని, అలాంటప్పుడు అది తాగి చనిపోయిన వాళ్ల విషయంలో ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరించాల్సిన అవసరమే లేదు’’ అని వ్యాజ్యంలో ఆయన పేర్కొన్నారు.ఇదీ చదవండి: కల్తీసారా ఘటన.. ఆ భార్యాభర్తల మృతి తర్వాతే..!తమ సరదా కోసమే కల్తీసారా తాగిన చనిపోయిన వాళ్లను బాధితులుగా ప్రభుత్వం పరిగణించడంపైనా ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. పైగా అగ్ని, రోడ్డు ప్రమాదాలు, ప్రకృతి విపత్తుల్లో మరణించిన వాళ్లకు పరిహారం తక్కువగా ఇచ్చిన సందర్భాల్ని ఆయన ప్రస్తావించారు. ప్రభుత్వం ఈ విషయంలో పునరాలోచన చేయాలని, లేకుంటే న్యాయస్థానమే ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని కోరారాయన.ఈ పిల్ను విచారణకు స్వీకరించిన చీఫ్ జస్టిస్(తాత్కాలిక) ఆర్ మహదేవన్, జస్టిస్ మహమ్మద్ షాఫిక్ నేతృత్వంలోని డివిజన్ బెంచ్.. రెండు వారాలకు విచారణ వాయిదా వేసింది. -
‘అగ్నివీర్’ల పరిహారంపై అసత్యాలు.. ఖండించిన ఇండియన్ ఆర్మీ
సాక్షి,న్యూఢిల్లీ : విధి నిర్వహణలో మరణించిన అగ్నివీర్ అజయ్ కుమార్ కుటుంబానికి చెల్లించిన నష్ట పరిహారంపై సోషల్ మీడియాలో అసత్య ప్రచారం జరుగుతోంది. ఆ ప్రచారాన్ని ఇండియన్ ఆర్మీ ఖండించింది. ఇప్పటికే అగ్నివీర్ అజయ్ కుటుంబానికి ఇప్పటి వరకు మొత్తం రూ.98.39 లక్షలు అందించినట్లు ఆర్మీ స్పష్టం చేసింది. అగ్నివీర్ పథకంలోని నిబంధనల మేరకు అగ్నివీర్లో మరణించిన వారి తరుపున కుటుంబానికి రూ.1.65 కోట్లు పరిహారంగా అందిస్తున్నట్లు తెలిపింది. ప్రస్తుతం అగ్నివీర్ అజయ్ కుమార్ కుటుంబానికి రూ.98.39 లక్షలు ఇచ్చామని, పోలిస్ వెరిఫికేషన్ అనంతరం రూ.67 లక్షల వరకు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ మొత్తం రూ.1.65కోట్లు అవుతుందని ఎక్స్ వేదికగా ట్వీట్ చేసింది. *CLARIFICATION ON EMOLUMENTS TO AGNIVEER AJAY KUMAR* Certain posts on Social Media have brought out that compensation hasn't been paid to the Next of Kin of Agniveer Ajay Kumar who lost his life in the line of duty.It is emphasised that the Indian Army salutes the supreme… pic.twitter.com/yMl9QhIbGM— ADG PI - INDIAN ARMY (@adgpi) July 3, 2024దేశం కోసం విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన అగ్నివీర్ అజయ్ కుమార్ త్యాగానికి సెల్యూట్ అంటూ ఆయనకు ప్రగాఢ సంతాపం తెలిపింది. అజయ్ కుమార్ లేని లోటు తీర్చ లేనిదిఅంతకుముందు అగ్నివీర్ అజయ్ కుమార్ మరణంపై ఆయన కుటుంబ సభ్యులు స్పందించారు. విధి నిర్వహణలో మరణించిన అజయ్ కుమార్ సేవలకు గాను ఇండియన్ ఆర్మీ ‘హీరో’ గుర్తింపు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఇచ్చే పరిహారం అజయ్ కుమార్ లేని లోటును తీర్చలేదని తండ్రి, అక్క విచారం వ్యక్తం చేశారు.అగ్నివీర్ను రద్దు చేయాలి.. ఈ సందర్భంగా అజయ్ కుమార్ అక్క జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. ‘నా తమ్ముడు అజయ్ కుమార్ అగ్నివీర్గా నాలుగేళ్లు విధులు నిర్వహించారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయారు. ప్రభుత్వం హామీ ఇచ్చినట్లుగా రూ.కోటి పరిహారం నా తమ్ముడు లేని లోటును తీరుస్తుందా? ఆయన లేకుండా నా కుటుంబం ఎలా జీవిస్తుంది’అని ప్రశ్నించారు. ప్రభుత్వం పరిహారం చెల్లించింది. కానీ అగ్నివీర్ పథకాన్ని రద్దు చేయాలనేది మా డిమాండ్ అని తెలిపారు. सत्य की रक्षा हर धर्म का आधार है!लेकिन रक्षा मंत्री राजनाथ सिंह ने शहीद अग्निवीर के परिवार को सहायता मिलने के बारे में संसद में झूठ बोला।उनके झूठ पर शहीद अग्निवीर अजय सिंह के पिता जी ने खुद सच्चाई बताई है।रक्षा मंत्री को संसद, देश, सेना और शहीद अग्निवीर अजय सिंह जी के… pic.twitter.com/H2odxpfyOO— Rahul Gandhi (@RahulGandhi) July 3, 2024స్పందించిన రాహుల్ గాంధీఅజయ్ కుమార్ తండ్రి మాత్రం అగ్నివీర్ మరణం అనంతరం ప్రభుత్వం అందించే పరిహారం రూ.1.65కోట్లు అందలేదని చెప్పారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. పరిహారం చెల్లించే విషయంలో రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అబద్ధాలాడారని రాహుల్ గాంధీ మండి పడ్డారు. వెంటనే ఆయన క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ ఓ వీడియోను షేర్ చేశారు. తాజాగా పరిణామాల నేపథ్యంలో పరిహారంపై ప్రచారం అవుతున్న అసత్యాల్ని ఇండియన్ ఆర్మీ ఖండించింది. -
‘అగ్నివీర్ మహేష్ కుమార్ ఫ్యామిలీకి రూ.98 లక్షలు’
ఢిల్లీ: ప్రధాని మోదీ ప్రభుత్వం చేపట్టిన అగ్నివీర్ పథకంపై ఇటీవల లోక్సభలో ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు చేశారు. మందుపాతర పేలి అగ్నివీరుడు అమరుడు అయితే.. అమరుడని పిలువరు. అగ్నివీర్ అంటారు. వారికి రావాల్సిన పెన్షన్ రాదు. పరిహారం ఇంటికి అందదని మండిపడ్డారు. అదేవిధంగా అజయ్ కుమార్ అనే అగ్నివీర్ కుటుంబానికి నష్టపరిహారాన్ని ప్రభుత్వం అందించలేదని నిన్న( బుధవారం) ‘ఎక్స్’లో విమర్శలు చేశారు. మహేష్ కుమార్ మాట్లాడిని వీడియోను షేర్ చేశారు. అయితే రాహుల్ గాంధీ విమర్శలపై ఇండియన్ ఆర్మీ స్పందించింది. ‘అమరుడైన అగ్నివీర్ కుటుంబానికి నష్టపరిహారం అందిచలేదని సోషల్మీడియాలో పోస్టులు వెలిశాయి. అయితే అమరుడై మహేష్ కుమార్ కుటుంబానికి 98. 39 లక్షలు అందించాం. ఎక్స్ గ్రేషియాతో పాటు ఇతర చెల్లింపుల కింద మొత్తం 67 లక్షలు ఇవ్వాల్సి ఉంది. అగ్నివీర్ పథకం ప్రకారం పోలీసుల వెరిఫికేషన్ ప్రక్రియ ముగిసిన వెంటనే ఈ డబ్బును కూడా అందిస్తాం. దీంతో మొత్తం రూ. 1.65 కోట్లు మహేష్కుమార్ కుటుంబానికి అందించినట్లు అవుతుంది’అని ఇండియన్ ఆర్మీ వెల్లడించింది. ఈ మేరకు రాహుల్ గాంధీ ఎక్స్ పోస్ట్కు స్పష్టత ఇచ్చింది భారత ఆర్మీ.‘రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అమరులైన అగ్నివీరుల కుటుంబాలకు అందించే ఆర్థిక సాయవ విషయంలో పార్లమెంట్లో అబద్ధాలు చెప్పారు. అమరులైన అగ్నివీర్ కుటుంబానికి రూ. కోటి ఇస్తున్నామని మంత్రి చెప్పారు. ఆయన చెప్పినవన్నీ అబద్ధాలు. అమరుడైన అగ్నివీర్ అజయ్ కుమార్ తండ్రి నాతో మీరు(ప్రభుత్వం) చెప్పిన అబద్దాలు గురించి తెలిపారు. వారి కుటుంబానికి పరిహారం అందలేదని చెప్పారు. రక్షణ మంత్రి పార్లమెంట్, దేశానికి, భారత ఆర్మీకి , అమరుడైన అగ్నివీర్ కుటుంబానికి క్షమాపణ చెప్పాలి’అని ‘ఎక్స్’లో రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు.सत्य की रक्षा हर धर्म का आधार है!लेकिन रक्षा मंत्री राजनाथ सिंह ने शहीद अग्निवीर के परिवार को सहायता मिलने के बारे में संसद में झूठ बोला।उनके झूठ पर शहीद अग्निवीर अजय सिंह के पिता जी ने खुद सच्चाई बताई है।रक्षा मंत्री को संसद, देश, सेना और शहीद अग्निवीर अजय सिंह जी के… pic.twitter.com/H2odxpfyOO— Rahul Gandhi (@RahulGandhi) July 3, 2024ఇటీవల లోక్సభలో ప్రతిపక్ష రాహల్ గాంధీ.. మోదీ ప్రభుత్వం తీసుకువచ్చిన అగ్నిపథ్ పథకంపై విమర్శలు చేశారు. అగ్నివీర్లను వాడకొని వదిలేస్తున్నారని మండిపపడ్డారు. రాహుల్ గాంధీ విమర్శలపై లోక్సభలో రక్షణ మంత్రి రాజ్నాథ్ అభ్యంతరం తెలిపారు. అమరులైన అగ్నివీర్ కుటుంబాలకు రూ.కోటి నష్టపరిహారం చేల్లిస్తున్నామని తెలిపారు. దీనిపై ప్రధాని మోదీ సైతం స్పందించారు. రక్షణ, భద్రత వ్యవస్థల్లో భారత్ను పటిష్టం చేసే సంస్కరణలను కాంగ్రెస్ వ్యతిరేకిస్తోందని చురకలంటించారు. -
రోడ్డు ప్రమాదం ఎలా జరిగింది?
ఆర్టీసీ బస్సు ఢీకొని చనిపోయిన సందర్భాల్లో పోలీసులు కేసు దర్యాప్తు చేయటం సహజం. వారి దర్యాప్తు నివేదిక ఆధారంగానే కోర్టులు తీర్పులు చెబుతాయి . అయితే ఆ ప్రమాదానికి గల కారణాలపై స్వయంగా ఆర్టీసీ కూడా ఆధారాలు సేకరించి కోర్టులకు సమర్పించాలని నిర్ణయించింది. ప్రమాదానికి కారణాలేంటి, అందులో ఆర్టీసీ డ్రైవర్ తప్పు లేనప్పుడు.. ప్రమాదానికి ఎదుటివారు ఎలా కారణమయ్యారు? రెండు వైపులా తప్పు ఉంటే.. ప్రమాద తీవ్రతలో ఆర్టీసీ డ్రైవర్ తప్పిదం ఎంత.. తదితర వివరాలను శాస్త్రీయంగా సేకరించబోతోంది. దీనికోసం పుణె కేంద్రంగా పనిచేస్తున్న సంస్థ ఆర్టీసీ ఉద్యోగులకు శిక్షణ ప్రారంభించింది.కొన్ని నెలల క్రితం నగరంలో ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆర్టీసీ బస్సు ఢీకొని చనిపోయాడు. అమెరికాలో ఉద్యోగం చేస్తున్నందున అతని సంపాదన పెద్దదే. దీంతో అతని కుటుంబానికి ఆర్టీసీ రూ.కోటిన్నర వరకు పరిహారం చెల్లించాల్సి వచ్చింది. సంపాదనతో ప్రమేయం లేకున్నా, ఓ మనిషి చనిపోతే కనిష్టంగా రూ.20 లక్షల వరకు పరిహారం చెల్లించాల్సిన పరిస్థితి ఉంది.సాక్షి, హైదరాబాద్: రోడ్లు నెత్తురోడుతున్నాయి. పెరిగిన ట్రాఫిక్, అధునాతన వాహనాల వినియోగం, రోడ్డుభద్రత నియమాల ఉల్లంఘన.. వెరసి ప్రమాదాలకు కారణమవుతోంది. ఈ ప్రమాదాల్లో ఆర్టీసీ బస్సుల వాటా కూడా ఉంటోంది. తెలంగాణ ఆర్టీసీ బస్సులు ఢీకొని సంవత్సరానికి సగటున 250 మంది నుంచి 300 మంది వరకు చనిపోతున్నారు. ప్రమాదం జరగ్గానే బస్సు డ్రైవర్దే తప్పు అన్న భావన సగటు వ్యక్తిలో కలుగుతుంది. పోలీసు విభాగంలో కూడా ఇదే తరహా ముందస్తు భావన కలుగుతోంది. దీన్నే ‘బిగ్ వెహికిల్ సిండ్రోమ్’గా పరిగణిస్తారు. ద్విచక్రవాహనదారు తప్పిదం వల్లనే ప్రమాదం చోటు చేసుకున్నా.. ఆర్టీసీ బస్సు డ్రైవర్పై కేసు నమోదవుతోంది. సరైన ఆధారాలు లేని సందర్భాల్లో ఆర్టీసీ డ్రైవర్కు శిక్ష పడటంతోపాటు, చనిపోయిన వ్యక్తి కుటుంబానికి సంస్థ భారీగా పరిహారం చెల్లించాల్సి వస్తోంది. ఏడాదికి రూ.100 కోట్లు పరిహారంనాలుగేళ్ల క్రితం నాటి ప్రమాదాల తాలూకు పరిహారాలు ఇప్పుడు (కోర్టు కేసులు ముగిసిన తర్వాత) చెల్లిస్తున్నారు. ప్రస్తుతం ఆ మొత్తం సగటున ఏడాదికి రూ.100 కోట్ల వరకు ఉంటోంది.. ప్రస్తుతం జరుగుతున్న ప్రమాదాల్లో మృతి చెందిన వారికి పరిహారం చెల్లించేనాటికి ఆ మొత్తాం రూ.150 కోట్ల వరకు చేరుకుంటుందని అంచనా. అసలే నష్టాల్లో కుదేలవుతున్న ఆర్టీసీకి ఇది పెద్ద భారంగా మారబోతోంది. దానిని భారీగా తగ్గించుకోవాలని సంస్థ భావిస్తోంది.డ్రైవర్లకు శిక్షణ ఇస్తున్నా... రోడ్డు ప్రమాదాలను నిరోధించేందుకు డ్రైవర్లకు ఆర్టీసీ ప్రత్యేకంగా శిక్షణ ఇస్తోంది. ఎప్పటికప్పుడు వారిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది, డిపో స్థాయిలో గేట్ మీటింగ్స్ ద్వారా డ్రైవర్లు నిరంతరం అప్రమత్తంగా ఉండేందుకు అవగాహన కల్పిస్తోంది. అయినా.. ప్రమాదాలు తప్పటం లేదు. ప్రమాదాలకు ఆధారాలు సేకరించడంపైనే..హైదరాబాద్లోని అన్ని ప్రాంతాల్లో సీసీటీవీ కెమెరాలు ఉన్నందున.. ప్రమాదానికి కారణాలేంటో స్పష్టంగా తెలుస్తుంది. ఆర్టీసీ బస్సు డ్రైవర్ తప్పులేనప్పుడు సీసీటీవీ ఫుటేజీని కోర్టుల్లో ప్రవేశపెట్టి పరిహారం నుంచి బయటపడొచ్చు. కానీ సీసీటీవీ కెమెరాలు లేని ప్రాంతాల్లో జరిగిన ప్రమాదాల్లో, బస్సు డ్రైవర్ తప్పు లేకున్నా, పెద్ద వాహనం అన్న భావనతో కారణం బస్సు డ్రైవర్ మీదకే వస్తోందని ఆర్టీసీ అధికారులు పేర్కొంటున్నారు. ఇలాంటి సందర్భాల్లో ఎదుటి వాహనదారులు/పాదచారుల తప్పిదంతో ప్రమాదం జరిగి వారు చనిపోతున్నా ఆర్టీసీ డ్రైవర్కు శిక్ష పడుతోంది, ఆర్టీసీ పరిహారం చెల్లించాల్సి వస్తోంది. ఇలాంటి సందర్భాల్లో ప్రమాదానికి కారణాల ఆధారాలను శాస్త్రీయంగా సేకరించాలని ఆర్టీసీ నిర్ణయించింది. ఈ విషయంలో మంచి అనుభవం ఉన్న జేపీ రీసెర్చ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్తో ఆర్టీసీ అవగాహన కుదుర్చుకుంది. కోయంబత్తూరు, పూణె కేంద్రాలుగా ఈ సంస్థ నడుస్తోంది. పుణె కేంద్రంగా పనిచేస్తున్న సంస్థ నిపుణులు తాజాగా ఆర్టీసీ అధికారులకు ఈ విషయంలో శిక్షణ మొదలుపెట్టారు. సీసీటీవీ కెమెరాలు లాంటివి లేని ప్రాంతాల్లో రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు.. ప్రమాదానికి కారణాలను శాస్త్రీయపద్ధతిలో ఎలా గుర్తించాలి అన్న విషయంలో నిపుణులు శిక్షణ కార్యక్రమాల ద్వారా వెల్లడిస్తున్నారు. దాదాపు 500 అంశాల ఆధారంగా ప్రమాదానికి కారణాలను కచ్చితంగా గుర్తించే వీలుంటుందని, ఆయా అంశాలు ఐదు భాగాలుగా పరిగణించాల్సి ఉంటుందని పేర్కొంటూ వాటిల్లో ముఖ్యమైన అంశాల వారీగా అధికారులకు శిక్షణ ఇస్తున్నారు. డిపో మేనేజర్లు, ట్రాఫిక్ సీఐలను మూడు జట్లుగా విభజించి శిక్షణ ఇస్తున్నారు. ఇందులో తొలిదఫా శిక్షణ మూడు రోజులు కొనసాగింది. శిక్షణలో పాల్గొన్న అధికారులు వారివారి డిపోల్లోని ఇతర సిబ్బంది వాటిపై అవగాహన కల్పించనున్నారు. -
మస్క్కు జాక్పాట్ తగలింది.. రూ.4.5 లక్షల కోట్ల వేతనం ఇచ్చేందుకు గ్రీన్ సిగ్నల్!
న్యూయార్క్: టెస్లా సీఈవో ఎలోన్ మస్క్ జాక్ పాట్ కొట్టేశారు. రూ.4.5లక్షల కోట్లు (56 బిలియన్ డాలర్లు) పారితోషికం ఇచ్చేందుకు ఆ సంస్థ వాటా దారులు మస్క్కు అనుకూలంగా ఓటు వేశారు. దీంతో ఆనందానికి అవదుల్లేని మస్క్ తన డ్యాన్స్తో సందడి చేశారు. టెక్సాస్లోని ఆస్టిన్లో జరిగిన టెస్లా వార్షిక సమావేశంలో వాటా దారులు మస్క్కు 56 బిలియన్ డాలర్ల భారీ వేతనం ఇవ్వాలా? వద్ద అన్న అంశంపై ఓటింగ్ జరిగింది. ప్రాథమిక ఓట్ల ఫలితాల ఆధారంగా మస్క్కు 56 బిలియన్ డాలర్ల పారితోషికం ఇచ్చేలా పెట్టుబడి దారులు మద్దతు ఇచ్చారని కార్పొరేట్ సెక్రటరీ బ్రాండన్ ఎర్హార్ట్ తెలిపారు.ఎలోన్ మస్క్ 2018లో అన్ని రకాల ప్రయోజనాలు కలిపి 55 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.4.5 లక్షల కోట్లు) వార్షిక వేతనం అందుకున్నారు. కార్పొరేట్ చరిత్రలో ఇదే అత్యధిక పారితోషికం. దీంతో ఆయన ప్రపంచ కుబేరుల్లో ఒకడిగా నిలిచారు. అయితే, మస్క్కు అధికంగా చెల్లించారంటూ వాటాదారుల్లో ఒకరైన రిచర్డ్ టోర్నెట్టా.. డెలావర్ కోర్టును ఆశ్రయించారు. విచారణ చేపట్టిన డెలావర్ కోర్టు ఈ ఏడాది ప్రారంభంలో టెస్లా సీఈవోకి భారీ వేతనాన్ని రద్దు చేస్తూ తీర్పిచ్చారు. తాజాగా, టెస్లా వాటాదారులు మస్క్కు అనుకూలంగా ఓటు వేయడంతో ప్రపంచంలో అత్యధిక వేతనం తీసుకుంటున్న సీఈవోల్లో నెంబర్ వన్గా కొనసాగుతున్నారు. Elon Musk dance is 🔥. Tesla shareholders have spoken. pic.twitter.com/GiLWOtt8ZI— Tesla Owners Silicon Valley (@teslaownersSV) June 13, 2024 -
రష్యా చేసిన నష్టానికి రష్యా నిధులే వాడతారట.!
యుద్ధంతో అతలాకుతలమైన ఉక్రెయిన్ ఆదుకునేందుకు G7 దేశాలు కొత్త వ్యూహం అనుసరిస్తున్నాయి. వేర్వేరు దేశాల్లో స్తంభింపజేసిన రష్యా నిధులను ఉక్రెయిన్కు కేటాయించాలని ఏకాభిప్రాయానికి వచ్చాయి. ఈ ఏడాది చివరి నాటికి 50 బిలియన్ డాలర్లు సాయం చేయాలని నిర్ణయించాయి. ఉక్రెయిన్పై రష్యా దాడి ప్రారంభించిన తర్వాత.. 300 బిలియన్ యూరోల రష్యన్ సెంట్రల్ బ్యాంక్ ఆస్తులను G7 దేశాలు స్తంభింపజేశాయి. దీనిపై వచ్చిన వడ్డీలో 50 బిలియన్ డాలర్లను రుణం కింద అందించాలని ఈయూ ప్రతిపాదించింది.యుద్ధంలో ధ్వంసమైన ఉక్రెయిన్ను పునర్ నిర్మించాలంటే 486 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ ఖర్చు అవుతుందని ప్రపంచ బ్యాంక్ అంచనా వేసింది. రష్యన్ సెంట్రల్ బ్యాంక్ ఆస్తులనే కాకుండా.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సన్నిహితులైన ఒలిగార్చ్ ఆస్తులను కూడా EU, G7 దేశాలు స్తంభింపజేశాయి. పడవలు, రియల్ ఎస్టేట్ వెంచర్లు, ఇతర ఆస్తులను స్వాధీనం చేసుకున్నాయి. ఈ ఆస్తుల మొత్తం విలువ 397 బిలియన్ డాలర్లుగా యుక్రేనియన్ థింక్ ట్యాంక్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ లెజిస్లేటివ్ ఐడియాస్ అంచనా వేసింది.ఇక రష్యాకు చెందిన మెజార్టీ ఆస్తులను ఈయూ దేశాలు స్తంభింపచేశాయి. దాదాపు 185 బిలియన్ యూరోలు బెల్జియంలోని అంతర్జాతీయ డిపాజిట్ సంస్థ అయిన యూరోక్లియర్ జప్తు చేయగా.. మిగతా ఆస్తులను బ్రిటన్, ఆస్ట్రియా, జపాన్, స్విట్జర్లాండ్, యూఎస్ దేశాలు సీజ్ చేశాయి. ఇప్పుడు వీటిని ఎలా ఉపయోగించాలనే విషయంలో ఈయూ దేశాలు కీలక పాత్ర పోషించనున్నాయి. నిజానికి.. రష్యన్ సెంట్రల్ బ్యాంక్ డబ్బును పశ్చిమ దేశాలు జప్తు చేయకుండా అంతర్జాతీయ చట్టం నిషేధిం విధించింది. ఇప్పుడు దీని నుంచి తప్పించుకునేందుకు సీజ్ చేసిన రష్యా ఆస్తుల నుంచి వచ్చే వడ్డీని ఉక్రెయిన్కు రుణం కింద అందించాలని భావిస్తున్నాయి.ఉక్రెయిన్కు రుణం అందించే విషయంలో పలు ఇబ్బందులు ఎదురుకానున్నాయి. ఇంతకుముందు యూఎస్ రుణాలు అందిస్తుందని భావించగా.. ఇప్పుడు G7 దేశాలు కూడా ఇందులో భాగస్వామ్యమయ్యాయి. ఈ దేశాల నుంచి ఎవరు రుణాన్ని అందిస్తారనే విషయంపై క్లారిటీ లేకుండా పోయింది. రుణం మంజూరు చేయాలంటే ఈయూ సభ్య దేశాలన్నింటి నుంచి అనుమతి పొందాల్సి ఉంటుంది. ఒకవేళ యుద్ధం నుంచి రష్యా విరమించుకొని ఆస్తులను తిరిగి ఇవ్వాల్సి వస్తే ఏం జరుగుతుందనే దానిపై కూడా ఆయా దేశాల మధ్య స్పష్టత లేన్నట్లు తెలుస్తోంది. చైనా వంటి దేశాలు పశ్చిమ దేశాల్లో పెట్టుబడులు పెట్టాలంటే ఆలోచించుకోవాల్సిన పరిస్థితి వస్తుందని హెచ్చరిస్తున్నారు నిపుణులు. -
అన్యాయంగా 37 ఏళ్లు ఖైదు : రూ. 116 కోట్లు పరిహారం
వంద మంది దోషులు తప్పించుకున్నా ఒక్క నిర్దోషికి కూడా శిక్ష పడకూడదు అనేది ఒక ధర్మ సూత్రం. కానీ ఫ్లోరిడాకు చెందిన ఒక వ్యక్తి చేయని నేరానికి ఏకంగా 37 సంవత్సరాలు శిక్ష అనుభవించాడు. తాను తప్పు చేయలేదని ఎంత మొత్తుకున్నా ఎవరూ అతని మాటలు పట్టించుకోలేదు. ఫలితంగా విలువైన జీవితంలో విలువైన సమయంలో జైలులో మగ్గిపోవాల్సి వచ్చింది. చివరికి న్యాయమే గెలచింది. ఒక కేసులో దొరికిన ఓ సాక్ష్యం ఆధారంగా అతణిని నిర్దోషిగా తేల్చింది. ఈ తప్పిందం దొర్లినందుకు గాను అతనికి రూ. 116 కోట్ల రూపాయలు భారీ పరిహారాన్ని చెల్లించాలని కోర్టు ఆదేశించింది.అసలేమైందంటే..లైంగికదాడి, హత్య వంటి ఆరోపణలపై ఫ్లోరిడాకు చెందిన రాబర్ట్ డుబోయిస్ను 1982లో పోలీసులు అరెస్ట్ చేశారు. అప్పటికి అతని వయసు 18 ఏళ్లు మాత్రమే. 19 ఏళ్ల బార్బరా గ్రామ్ను అత్యాచారం చేసి, చంపేశాడంటూ అభియోగాలు నమోదైనాయి. ఈ కేసులో విచారణ అనంతరం అమెరికాలోని ఒక కోర్టు తొలుత అతడికి కోర్టు మరణశిక్ష విధించింది. ఇన్నోసెన్స్ ప్రాజెక్ట్ ఆర్గనైజేషన్ సహాయంతో అతని శిక్షను 2018లో దాన్ని యావజ్జీవ శిక్షగా మార్చింది. చివరకు తప్పుడు నేరారోపణ కేసులను వాదించడంలో అపారమైన అనుభవం ఉన్న చికాగోకు చెందిన పౌర హక్కుల సంస్థ లోవీ & లోవీ ఈ కేసులో జోక్యం చేసుకుని, ఈ కేసులో బాధితుడి ప్రమేయం లేదని నిరూపించడంలో అతినికి విముక్తి లభించింది. 1980లలో అందబాటులోని, ఆధునిక కాలంలో అందుబాటులోకి వచ్చిన డీఎన్ఏ టెస్ట్ద్వారా నిర్దోషిగా తేలాడు. 2020 ఆగష్టులో ఫ్లోరిడా జైలు నుండి విడుదలయ్యాడు.కొంతకాలం తర్వాత, రాబర్ట్ డుబోయిస్ తనకు జరిగిన నష్టానికి న్యాయం కావాలంటూ పోరాటానికి దిగాడు. టంపా నగరం అధికారులు, విచారణలో పాల్గొన్న పోలీసు అధికారులు , ఫోరెన్సిక్ దంతవైద్యుడిపై (బార్బరా మృతదేహంపై ఉన్న పంటి గాట్లను సరిపోలాయని సర్టిఫై చేసిన) కోర్టును ఆశ్రయించాడు. దీన్ని విచారించిన అమెరికా కోర్టు అతని వాదనను సమర్ధించింది. బాధితుడికి 1.4 మిలియన్ డాలర్ల (రూ. 116 కోట్లు) పరిహారాన్ని చెల్లించాలని ఆదేశించింది. విడతలవారీగా డుబోయిస్ను ఈ మొత్తాన్ని చెల్లిస్తారు. ఈ సంవత్సరం 90 లక్షల డాలర్లు, వచ్చే ఏడాది 30 లక్షల డాలర్లు, చివరిగా 2026లో 20 లక్షల డాలర్లు డుబోయిస్ అందుకుంటాడు. -
వరికి ని‘బంధనాలు’
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా అమలు చేయాలని నిర్ణయించిన పంటల బీమా పథకంలోని నిబంధనలు వరి రైతుల పాలిట శాపంగా మారుతున్నాయి. ఒక జిల్లాలో మొత్తం సాగువిస్తీర్ణంలో 25 శాతానికి మించి విస్తీర్ణమున్న పంటలను మాత్రమే గ్రామం యూనిట్గా పంటల బీమా పథకం అమలు చేయాలనే నిబంధన ఉంది. ఈ నిబంధన ప్రకారం సంగారెడ్డితోపాటు, వికారాబాద్, జోగుళాంబ గద్వాల, ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాల్లో ఏ ఒక్క పంట కూడా 25 శాతానికి మించి సాగు కావడం లేదు. దీంతో ఈ జిల్లాల్లో గ్రామం యూనిట్గా అమలు చేసే అవకాశం లేకుండాపోతోంది. ఈ వానాకాలం నుంచే కొత్త పథకం అమలు అధిక వర్షాలు, వడగండ్ల వానలు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలతో పంట నష్టపోయిన రైతులకు పరిహారం అందేలా పంటల బీమా పథకం అమలు చేస్తారు. ఐదేళ్ల క్రితం నిలిపివేసిన ఈ పథకాన్ని పునరుద్ధరించాలని రాష్ట్రంలో కొత్తగా కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. ప్రధానమంత్రి ఫసల్ బీమా పథకంలో భాగంగా ఈ వానాకాలం నుంచే రాష్ట్రంలో ఈ పథకాన్ని అమలు చేసేందుకు చర్యలు చేపట్టింది. నిర్మల్లో వరితోపాటు, సోయా కూడా.. రాష్ట్రవ్యాప్తంగా 32 జిల్లాల్లో ఈ పంటల బీమా పథకం అమలు చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం అన్ని జిల్లాల్లో వరి పంటను గ్రామం యూనిట్గా అమలు చేసేందుకు నిబంధనలు కలిసొస్తున్నాయి. నిర్మల్ జిల్లా వరితోపాటు, సోయా పంట కూడా గ్రామం యూనిట్గా అమలు చేసేందుకు వీలు కలుగుతోంది. మండలం యూనిట్ అయితే వరి రైతుకు నష్టం పంటల బీమా పథకం గ్రామం యూనిట్గా అమలు చేస్తేనే ప్రకృతి వైపరీత్యాల కారణంగా నష్టపోయిన రైతులకు క్లెయిమ్ (పరిహా రం) అందుతుంది. మండలం యూనిట్గా అమలు చేస్తే చాలామంది రైతులకు ఈ క్లె యిమ్ అందదు. ఎలాగంటే.. మండలం యూనిట్గా తీసుకుంటే అధిక వర్షాలుగానీ, వడగండ్ల వానగానీ, ఈదురుగాలుల వర్షం కారణంగా మండలవ్యాప్తంగా అన్ని గ్రామా ల్లో మొత్తం వరి పంట నష్టపోతే మాత్రమే రైతులకు పరిహారం అందుతుంది.మండలంలో కొన్ని గ్రామాల్లో పంట నష్టం జరిగి, మరికొన్ని గ్రామాల పరిధిలో నష్టం జరగకపోతే పంట నష్టపోయిన గ్రామాల రైతులకు కూడా పరిహారం అందదు. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయే పరిస్థితులు ఎదురుకానున్నాయి. ఈ నిబంధనపై రైతు సంఘాలు పెదవి విరుస్తున్నాయి. రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని అన్ని జిల్లాలకు ఒకే విధంగా నిబంధనలను సరళీకృతం చేయాలని కోరుతున్నారు. -
దిగిపోనున్న బోయింగ్ సీఈవోకి రూ.366 కోట్లు!
బోయింగ్ సీఈవో డేవిడ్ కాల్హౌన్ భారీ మొత్తంలో రిటైర్మెంట్ చెల్లింపులు పొందనున్నారు. ఈ ఏడాది చివరి నాటికి పదవి నుంచి వైదొలగనున్న ఆయన రిటైర్మెంట్ చెల్లింపుల కింద 44 మిలియన్ డాలర్లు (సుమారు రూ.366 కోట్లు) అందుకునే అవకాశం ఉందని రాయిటర్స్ నివేదించింది. డేవిడ్ కాల్హౌన్ 2023 సంవత్సరానికి 33 మిలియన్ డాలర్ల (సుమారు రూ.274 కోట్లు) వేతన పరిహారాన్ని అందుకున్నారు. దాదాపుగా అదంతా స్టాక్ అవార్డ్స్లో ఉంది. అయితే జనవరిలో గాల్లో ఉన్న బోయింగ్ విమానం డోర్ ప్యానెల్ ఊడిపడిన ఘటన తర్వాత బోయింగ్ షేర్ ధర తగ్గిపోయింది. దీంతో ఈ సంవత్సరం ఆయన స్టాక్ చెల్లింపు దాదాపు నాలుగింట ఒక వంతు తగ్గుతుంది. ఈ ఘటన తర్వాత 2023 సంవత్సరానికి సీఈవో డేవిడ్ కాల్హౌన్ బోనస్ను (దాదాపు రూ.24 కోట్లు) తిరస్కరించినట్లు కంపెనీ తెలిపింది. ఘటనకు సంబంధించి బోయింగ్ దాని తయారీ నాణ్యత, భద్రతపై పలు విచారణలు ఎదుర్కొన్న నేపథ్యంలో ఈ సంవత్సరం చివరిలో తాను పదవి నుంచి వైదొలుగుతానని కాల్హౌన్ ఈ నెలలో ప్రకటించారు. కంపెనీ రెగ్యులేటరీ ఫైలింగ్లో కాల్హౌన్ గత సంవత్సరం 1.4 మిలియన్ డాలర్ల జీతం, 30.2 మిలియన్ డాలర్ల విలువైన స్టాక్ అవార్డులను పొందినట్లు పేర్కొంది. ఇతర చెల్లింపులతో సహా కాల్హౌన్ 2023 పరిహారం మొత్తం 32.8 మిలియన్ డాలర్లు. కాగా 2022లో ఆయన 22.6 మిలియన్ డాలర్ల పరిహారం అందుకున్నారు. -
భార్యను సెకండ్ హ్యాండ్ అన్నందుకు.. రూ 3 కోట్లు జరిమానా విధించిన కోర్టు
కొన్ని భార్యభర్తల కేసులు కనువిప్పు కలిగిస్తాయి. ఎందుకంటే భార్యను తేలికగా చేస్తూ ఎలా పడితే అలా కించపరుస్తూ మాట్లాడే భర్తల ఆగడాలను ఎలా కట్టడి చేయాలో చెబుతాయి. అలాంటి గమ్మత్తైన ట్విస్టింగ్ కేసు ఇది! ఆ దంపతులిరువురిది సంపన్న కుటుంబ నేపథ్యం. ఇద్దరు ఉన్నత విద్యావంతులే. ఆ జంట వివాహం 1994 జనవరి 3వ తేదీన పెద్దల సమక్షంలో జరిగింది. ఆ తర్వాత ఇద్దరు అమెరికా వెళ్లి అక్కడే ఉద్యోగాలు చేశారు. అయితే అక్కడ చట్టాల ప్రకారం సెక్యూరిటీ కోసం అమెరికాలో మళ్లీ పెళ్లి చేసుకుంది ఆ జంట. అంతా సవ్యంగా సాగుతున్న తరుణంలో వారి కాపురంలో కలతలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో 2005లో ఈ దంపతులు ముంబై తిరిగి వచ్చేశారు. ముంబైలోనే భార్య ఉద్యోగం సంపాదించింది. అయితే భర్తతో గొడవలు కారణంగా తల్లి ఇంట్లోనే ఉంటుంది. 2014లో భర్త తిరిగి అమెరికా వెళ్లిపోయాడు. 2017లో భార్యకు అమెరికా నుంచే విడాకుల నోటీసులు పంపాడు. అదే ఏడాది భార్య ఇండియాలోని ముంబై కోర్టులో గృహ హింస చట్టం కింద కేసు ఫైల్ చేసింది. ఏడాది తర్వాత అంటే 2018లో అమెరికా కోర్టు వారికి విడాకులు కూడా మంజూరు చేసింది. అసలు కథ ఇక్కడే మొదలైంది..ముంబై కోర్టులో భార్య దాఖలు చేసిన పిటీషన్ ఆసక్తికరంగా మారింది. సుదీర్ఘ విచారణకు దారితీసింది. దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. పెళ్లి తర్వాత హనీమూన్కని నేపాల్ వెళ్లిన తర్వాతే ఈ ఇరువురి మద్య గొడవలు ప్రారంభమయ్యాయి. భార్యను సెకండ్ హ్యాండ్ అంటూ పదేపదే కించపరిచే వాడు భర్త. అందుకు కారణం..అప్పటికే తన భార్యకు.. తన పెళ్లి కంటే ముందే నిశ్చితార్థం అయ్యి క్యాన్సిల్ కావటం. ఆ తర్వాత అతడితో పెళ్లి జరిగింది. దీంతో భర్త ఆమెను పదేపదే సెకండ్ హ్యాండ్ అని కించపరిచేవాడు. అలాగే అమెరికా వచ్చిన ఆమె తల్లిదండ్రును అత్యంత నీచంగా చూసేవాడు. పైగా ఆమె తండ్రికి గుండె ఆపరేషన్ జరిగితే మరో ఇంట్లో ఉంచమని గొడవ చేసేవాడని భార్య పిటిషన్లో స్పష్టం చేసింది. గృహ హింస తీవ్ర స్థాయిలో ఉందని.. అనేక మానసిక వేధింపులు, హింసకు గురైనట్లు భార్య తన పిటీషన్లో పేర్కొంది. భార్య వాదనలతో ఏకీభవించిన ముంబై కోర్టు.. 2017లో తీర్పు వెళ్లడించింది. భార్యకు ప్రతినెలా లక్షా 50 వేల రూపాయల భరణం, సెకండ్ హ్యాండ్ అంటూ కించపరిచినందుకు 3 కోట్ల రూపాయల పరిహారం, కోర్టు ఖర్చుల కింద 50 వేల రూపాయలు చెల్లించాలని భర్తను ఆదేశించింది. ఈ తీర్పును సవాలు చేస్తూ..భర్త సెషన్స్ కోర్టుకు వెళ్లాడు. అక్కడ కూడా భార్యకు అనుకూలంగానే తీర్పు వచ్చింద. ఇక లాభం లేదని ఈ తీర్పులపై ముంబై హైకోర్టులో రివ్యూ పిటీషన్ దాఖలు చేశాడు భర్త. సుదీర్ఘ విచారణ తర్వాత.. ముంబై హైకోర్టు కింది రెండు కోర్టుల తీర్పుని సమర్థిస్తూ సంచలన తీర్పు వెల్లడించింది. భార్యను సెకండ్ హ్యాండ్ అంటూ కించపరిచి.. మానసిక వేదనకు గురి చేసిన భర్త.. 3 కోట్ల రూపాయల పరిహారం చెల్లించాల్సిందే అని ముంబై హైకోర్టు తీర్పు వెల్లడించింది. భార్య ఆత్మగౌరవాన్ని దెబ్బతిసే అధికారం భర్తకు లేదని స్పష్టం చేసింది. ఇరువురు ఉన్నత చదువులు చదువులు, మంచి ఉద్యగాల్లో స్థిరపడినవారు, పైగా సమాజంలో తమకంటూ ఓ గుర్తింపు ఉన్నవారు.. అలాంటివారు మరోకరి ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడ సబబు కాదని పేర్కొంది. ముఖ్యంగా భార్యను సెకండ్ హ్యాండ్ అంటూ.. ఓ మహిళ ఆత్మగౌరవాన్ని దెబ్బతీయటం అనేది సామాజిక రుగ్మతగా పరిగణించాలని స్పష్టం చేసింది. ఇలాంటి వాటిని ఉపేక్షించటం అనేది సహించరాని నేరం అని పేర్కొంది. ఉన్నత పదవుల్లో ఉండేవారు.. మరొకరికి మార్గదర్శకంగా ఉండాలని వక్కాణించింది. అస్సలు ఒక మహిళ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఉండకూడదు అంటూ మండిపడింది ముంబై హైకోర్టు. అందుకుగానూ భార్యకు రూ. 3 కోట్ల రూపాయలు చెల్లించాల్సిందేనని భర్తను ఆదేశిస్తూ ధర్మాసనం తీర్పు వెల్లడించింది. ఈ తీర్పు నిజంగా ఎందరో భర్తలకు కనువిప్పు అనే చెప్పాలి. ఎప్పుడూ భార్యను చులకన చేసి ఆమె ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా భర్తలకు ఈ తీర్పు పెద్ద చెంపదెబ్బ అని చెప్పొచ్చు. (చదవండి: అందం కోసం పాము రక్తమా? ఎక్కడో తెలుసా!) -
దెబ్బతిన్న పంటలకు నష్టపరిహారం ఇవ్వాలి
ముస్తాబాద్/గంభీరావుపేట(సిరిసిల్ల): వడగళ్లు, ఇతర ప్రకృతి వైపరీత్యాలతో దెబ్బతిన్న పంటలకు రాష్ట్ర ప్రభుత్వం నష్ట పరిహారం చెల్లించాలని, ఎకరానికి రూ.25 వేలు ఇవ్వాలని కరీంనగర్ ఎంపీ, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ డిమాండ్ చేశారు. ఈ విషయంలో సర్వేలు, సమీక్షలు, నివేదికల పేరుతో కాలయాపన చేయొద్దన్నారు. రాజన్నసిరిసిల్ల జిల్లా గంభీరావుపేట, ముస్తాబాద్, పోతుగల్, గన్నెవారిపల్లెల్లో ఇటీవల వడగళ్లు, అకాల వర్షాలతో దెబ్బతిన్న పంటలను బండి సంజయ్ బుధవారం పరిశీలించి, రైతులను ఓదార్చారు. గత ప్రభుత్వం ఫసల్ బీమా పథకాన్ని అమలుచేసి ఉంటే ఇప్పుడు అకాల వర్షాలతో రైతులు ఇబ్బందులు పడేవారు కాదని అభిప్రాయపడ్డారు. పంటల బీమా పేరుతో బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులను నట్టేట ముంచిందన్నారు. ఎకరానికి రూ.10 వేలు ఇస్తామని మోసం చేసిందని ఆరోపించారు. ఇప్పుడయినా కాంగ్రెస్ ప్రభుత్వం కాలయాపన చేయకుండా నష్టపోయిన ప్రతి రైతుకు ఎకరానికి రూ.25 వేల పరిహారం చెల్లించాలని కోరారు. ఎన్నికల కోడ్ వచ్చిందన్న కారణం చెప్పకుండా.. రైతులను ఆదుకునేందుకు ఎన్నికల కమిషన్తో మాట్లాడి సాయం చేయాలని సూచించారు. కాగా, ఈ ప్రభుత్వమైనా ఫసల్బీమాను అమలు చేస్తుందో.. లేదో చెప్పాలని కోరారు. కౌలు రైతులకు రూ.12 వేల సాయంపై స్పష్టత ఇవ్వాలన్నారు. ఉపాధిహామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని, ధాన్యానికి క్వింటాల్కు రూ.500 బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. విద్యుత్ స్తంభం కూలి మృతిచెందిన ముస్తాబాద్కు చెందిన రైతు ఎల్సాని ఎల్లయ్య కుటుంబాన్ని పరామర్శించి, వారికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. సిరిసిల్ల బీజేపీ ఇన్చార్జి రాణిరుద్రమ, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మట్ట వెంకటేశ్వర్రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి గోపి, పలువురు స్థానిక నేతలు బండి సంజయ్ వెంట ఉన్నారు. -
అన్నింటికీ చాట్బాట్ అంటే ఇలాగే ఉంటుంది.. తిక్క కుదిరిందిగా!
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని ఇప్పుడు చాలా కంపెనీలు విస్తృతంగా వినియోగిస్తున్నాయి. ముఖ్యంగా కస్టమర్లతో సంభాషించడానికి మానవ ప్రమేయం లేకుండా చాట్బాట్లను ( chatbot )ఉపయోగిస్తున్నాయి. అంటే కస్టమర్లు ఆయా కంపెనీలతో తమ సందేహాలను నివృత్తి చేసుకునేందుకు ప్రయత్నించినప్పుడు చాట్బాట్లు సమాధానమిస్తాయి. ఇక్కడే చిక్కంతా వస్తోంది. చాట్బాట్ చేసిన తప్పునకు కెనడాకు ( Air Canada ) చెందిన ప్రముఖ ఎయిర్లైన్ సంస్థ ఎయిర్ కెనడా పరిహారం చెల్లించాల్సి వచ్చింది. సీబీసీ న్యూస్ కథనం ప్రకారం.. 2022లో జేక్ మోఫాట్ అనే వ్యక్తి టొరంటోలో తన అమ్మమ్మ మరణించినప్పుడు అంత్య క్రియలకు వెళ్లేందుకు విమోచన ఛార్జీలకు తనకు అర్హత ఉందో లేదో తెలుసుకోవడానికి ఎయిర్ కెనడా విమానయాన సంస్థను సంప్రదించాడు. ఎయిర్ కెనడా సపోర్ట్ చాట్బాట్తో సంప్రదిస్తున్నప్పుడు, మోఫాట్ కూడా బీవ్మెంట్ ఛార్జీలను ముందస్తుగా మంజూరు చేస్తారా అని అడిగారు. ఆన్లైన్ ఫారమ్ను పూరించడం ద్వారా "మీ టిక్కెట్ను జారీ చేసిన తేదీ నుంచి 90 రోజులలోపు" వాపసు కోసం దరఖాస్తు చేసుకోవచ్చని చాట్బాట్ మోఫాట్కి తెలిపింది. దీంతో బ్రిటిష్ కొలంబియా నివాసి అయిన మోఫాట్ టొరంటోలో తన అమ్మమ్మ అంత్యక్రియలకు హాజరు కావడానికి ఆన్లైన్లో టిక్కెట్లను బుక్ చేశాడు. అయితే ఆ తర్వాత అతను బీవ్మెంట్ ఛార్జీ, సాధారణ ఛార్జీల మధ్య వ్యత్యాసం వాపసు కోసం దరఖాస్తు చేసినప్పుడు, ఎయిర్ కెనడా అతనికి పూర్తి ప్రయాణానికి బీవ్మెంట్ రేట్లు వర్తించవని తెలియజేసింది. దీనికి తాను తీసుకున్న చాట్బాట్ సంభాషణ స్క్రీన్షాట్ను మోఫాట్ ఎయిర్ కెనడాకు షేర్ చేశారు. దీంతో నాలుక కరుచుకున్న ఎయిర్ కెనడా తమ చాట్బాట్ "తప్పుదోవ పట్టించే పదాలను" ఉపయోగించినట్లు అంగీకరించింది. సరైన సమాచారంతో బాట్ను అప్డేట్ చేస్తామని చెప్పింది. దీంతో మోఫాట్ ఎయిర్ కెనడాపై దావా వేశారు. దీంతో బాధితుడికి రావాల్సిన ఛార్జీల వ్యత్యాసం 650.88 కెనేడియన్ డాలర్లు (సుమారు రూ.40 వేలు)తోపాటు వడ్డీ 36.14 కెనేడియన్ డాలర్లు, ఫీజు 125 కెనేడియన్ డాలర్లు చెల్లించాలని ఎయిర్ కెనడాను సివిల్ రిజల్యూషన్ ట్రిబ్యునల్ ఆదేశించింది. అయితే చాట్బాట్ ప్రత్యేక చట్టపరమైన సంస్థ అని, దాని చర్యలతో తమకు సంబంధం లేదని ఎయిర్ కెనడా వాదిస్తోంది. -
అతని కుటుంబానికి రూ. 2.45 కోట్ల పరిహారం.. ఇన్సూరెన్స్ కంపెనీకి షాక్!
ఓ కార్ యాక్సిడెంట్లో మృతుడి కుటుంబానికి పరిహారం విషయంలో ఇన్సూరెన్స్ కంపెనీకి కోర్టు భారీ షాక్ ఇచ్చింది. ప్రమాదంలో చనిపోయిన వ్యక్తి కుటుంబానికి రూ. 2.45 కోట్ల పరిహారం చెల్లించాలని కార్ ఓనర్, డ్రైవర్తో సహా బీమా కంపెనీని ఆదేశించింది. పది సంవత్సరాల క్రితం కార్ యాక్సిడెంట్లో మరణించిన బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ (బార్క్) ఉద్యోగి కుటుంబానికి వడ్డీతో సహా రూ. 2.45 కోట్లు చెల్లించాలని కారు యజమాని, డ్రైవర్, బీమా సంస్థ న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీని మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్స్ ట్రిబ్యునల్ ఆదేశించింది. ఇటీవల ఆదేశించిన అత్యధిక పరిహారాల్లో ఇది ఒకటి. బార్క్లో పనిచేసే ప్రియనాథ్ పాఠక్ అనే వ్యక్తి పదేళ్ల క్రితం ముంబై అనుశక్తి నగర్ వద్ద బైక్ వెళ్తుండగా కార్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అతను మరణించాడు. మృతుడికి భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. ఈ కేసులో కారు యజమాని నోబుల్ జాకబ్ నిందితుడు కాగా 2014 డిసెంబరు 19న జాకబ్, న్యూ ఇండియా అస్స్యూరెన్స్ కంపెనీకి వ్యతిరేకంగా ట్రిబ్యునల్ను ఆశ్రయించారు. మృతుడు ప్రియనాథ్ పాఠక్ నెల జీతం రూ.1.26 లక్షలు కావడంతో కోర్టు భారీ పరిహారాన్ని నిర్ణయించింది. -
AP: ఎమ్మార్వో రమణయ్య ఫ్యామిలీకి రూ.50 లక్షల సాయం
సాక్షి, విశాఖ: హత్యకు గురైన ఎమ్మార్వో రమణయ్య కుటుంబానికి ప్రభుత్వం రూ.50 లక్షల పరిహారం ప్రకటించింది. రమణయ్య కుటుంబంలో ఒకరికి కారుణ్య నియామకం కింద ఉద్యోగం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. కాగా, ఎమ్మార్వో రమణయ్య హత్య కేసులో నిందితుడు మురారీ సుబ్రమణ్యంను విశాఖ పోలీసులు ఇప్పటికే అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఓ భూ వివాదంలో కంబైన్డ్ డీడ్ చేయడంలో రమణయ్య జాప్యం చేయడం వల్లే ఈ హత్య జరిగినట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఇదీచదవండి.. బరి తెగించిన ఎర్ర చందనం స్మగ్లర్లు -
ఇక ‘రింగు’ కోసం నిరంతర భూపరిహారం
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ రీజినల్ రింగురోడ్డు (ఆర్ఆర్ఆర్)లో నిరంతరాయ భూ పరిహారం పంపిణీకి మార్గం సుగమమైంది. ఇందుకు వీలుగా ఆ మార్గంలో అడ్డుగా ఉన్న విద్యుత్ టవర్లు, స్తంభాల తరలింపు, నీటి కాలువల మళ్లింపు, అందుకు తగ్గ నిర్మాణాల (యుటిలిటీ షిఫ్టింగ్) కోసం రూ.364 కోట్ల మొత్తాన్ని డిపాజిట్ చేసేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్హెచ్ఏఐ)కి లేఖ ఇచ్చింది. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య త్రైపాక్షిక ఆర్థిక ఒప్పందం కుదరనుంది. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ, ఎన్హెచ్ఏఐతో త్రైపాక్షిక ఒప్పందం త్వరలో జరగనుంది. ఇక రీజినల్ రింగురోడ్డు నిర్మాణంలో భూపరిహారంలో రాష్ట్ర ప్రభుత్వం తన వంతు వాటాతోపాటు యుటిలిటీ షిఫ్టింగ్కు అవసరమయ్యే మొత్తాన్ని చెల్లించేందుకు అంగీకరిస్తున్నట్టుగా ఇందులో సంతకాలు చేస్తారు. దీంతో ఈ ప్రాజెక్టు తదుపరి ప్రక్రియ నిరంతరాయంగా కొనసాగేందుకు మార్గం సుగమమవుతుంది. ఇక అవార్డ్ జారీకి శ్రీకారం: ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగానికి సంబంధించి 158.645 కి.మీ. నిడివిలో భూసేకరణను మూడు నెలల్లో పూర్తి చేయాలంటూ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మంగళవారం అధికారులను ఆదేశించిన విషయం తెలిసిందే. బుధవారం యుటిలిటీ షిఫ్టింగ్ కోసం రూ.364 కోట్లను చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సమ్మతించడంతో భూపరిహారం పంపిణీకి సంబంధించిన అవార్డ్ జారీచేసే కసరత్తుకు ఎన్హెచ్ఏఐ అధికారులు శ్రీకారం చుట్టనున్నారు. అందుకు సంబంధించి, సేకరిస్తున్న భూముల్లోని నిర్మాణాలు, తోటలకు విలువ కట్టే ప్రక్రియ కొనసాగిస్తున్నారు. ఇది పూర్తి కాగానే గ్రామాల వారీగా అవార్డు పాస్ చేస్తారు. ఆయా గ్రామాలకు సంబంధించిన భూ పరిహారంలో 50 శాతం వాటాను రాష్ట్ర ప్రభుత్వం డిపాజిట్ చేస్తుంది. ఇలా రూ.2,600 కోట్ల వరకు రాష్ట్ర ప్రభుత్వం పరిహారంలో తన వంతు వాటాగా భరించాల్సి ఉంది. ఆ వెంటనే రోడ్డు నిర్మాణానికి టెండర్ల ప్రక్రియ ప్రారంభం అవుతుంది. గతంలో రాష్ట్ర ప్రభుత్వం–ఎన్హెచ్ఏఐ మధ్య ఏర్పడ్డ పేచీ కారణంగా దాదాపు 10 నెలలుగా రీజినల్ రింగ్రోడ్డు ప్రక్రియ నిలిచిపోయింది. ఇప్పుడు మళ్లీ ప్రారంభం కావటంతో రోడ్డు నిర్మాణ పనులు కూడా త్వరలోనే మొదలయ్యే సూచనలు కనపిస్తున్నాయి. దీంతోపాటు దక్షిణభాగానికి సంబంధించిన ప్రక్రియను కూడా ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. భారత్మాల పరియోజన–1లో ఉత్తర భాగం ఉన్న విషయం తెలిసిందే. దక్షిణ భాగాన్ని జాతీయ రహదారిగా గుర్తిస్తూ కేంద్రం ఉత్తర్వు జారీ చేయాల్సి ఉంది. దాన్ని భారత్మాల పరియోజన తదుపరి ఫేజ్లో చేర్చాల్సి ఉంది. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాయాలని నిర్ణయించింది. పార్లమెంటు ఎన్నికల తర్వాత ఈ ప్రక్రియ జరుగుతుందని భావిస్తున్నారు. ఇప్పటి వరకు రూ.100 కోట్ల జమ.. భూసేకరణకు రాష్ట్ర ప్రభుత్వ వాటా డబ్బును డిపాజిట్ చే సిన తర్వాత భూపరిహారం ప్రక్రియ ప్రారంభిస్తామని గ తంలో ఎన్హెచ్ఏఐ పేర్కొంది. కానీ దీనికి రాష్ట్ర ప్ర భుత్వం సమ్మతించలేదు. మొత్తం డబ్బులు ఒకేసారి డిపాజిట్ చేయటం సరికాదని స్పష్టం చేసింది. దీంతో ఆ ప్రక్రియ నిలిచిపోయింది. ఎన్హెచ్ఐఏ ఐదు సార్లు లేఖ లు రాసినా ఫలితం లేకపోయింది. మరోవైపు గెజిట్ నో టిఫికేషన్ గడువు ముగియబోతుండటంతో ప్రాజెక్టు పెండింగులో పడిపోతుందని ఎన్హెచ్ఏఐ పేర్కొనటంతో ప్ర భుత్వం ఎట్టకేలకు రూ.100 కోట్లు జమ చేసింది. దీంతో గెజిట్లు ‘సజీవంగా’ఉండి ప్రాజెక్టు మనుగడలో ఉన్నట్టు గా పరిగణించారు. -
రాష్ట్రంలోనూ పంటల బీమా!
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా రాష్ట్ర ప్రభుత్వమే పంటల బీమా పథకాన్ని అమలు చేసే యోచనలో ఉంది. రైతు యూని ట్గా దీని రూపకల్పనకు వ్యవసాయశాఖ కసరత్తు చేస్తోంది. సీఎం రేవంత్రెడ్డి దృష్టికి తీసుకొచ్చాక పంటల బీమా పథకంపై ఒక నిర్ణయానికి వస్తామని అధికారులు చెబుతున్నారు. వచ్చే వానాకాలం సీజన్ నుంచి ఈ పథకం అమలు జరిగేలా కార్యా చరణ ఉంటుందన్నారు. పంటల బీమా అమలు లోకి వస్తే ప్రకృతి విపత్తులతో పంట నష్టం జరిగే రైతులకు ఆర్థికసాయం చేసేందుకు వీలుంటుంది. పంటల బీమాలో రైతులు కొంత ప్రీమియం భరిస్తే, ప్రభుత్వం ఎక్కువ మొత్తంలో తన వాటాగా చెల్లి స్తుంది. పంటల బీమాను అమలు చేసే కంపెనీలతో ఒప్పందం చేసుకుంటారు. ఆ ప్రకారం కంపెనీలు పంట నష్టం జరిగితే రైతులకు పరిహారం ఇవ్వాలి. అయితే రైతులపై ఏమాత్రం ప్రీమియం భారం పడకుండా ప్రభుత్వమే అంతా చెల్లిస్తేనే ప్రయోజన ముంటుందని అధికారులు అంటున్నారు. పంటల బీమా లేక రైతుల అవస్థ: కేంద్రం ఆధ్వర్యంలో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం ఉంది. ఇది 2016–17 రబీ నుంచి ప్రారంభమైంది. పంట నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు దీనిని ఏర్పాటు చేశారు. 2019–20 వరకు ఈ పథకంలో తెలంగాణ రాష్ట్రంలో కొనసాగింది. అయితే ఈ పథకం కంపెనీలనే బాగుపర్చుతుందన్న భావనతో రాష్ట్ర ప్రభుత్వం 2020లో ఫసల్ బీమా నుంచి తప్పుకుంది. అప్పటి నుంచి విపత్తులకు పంట నష్టపోయిన రైతులు ఆర్థిక సాయం అందే అవకాశమే లేకుండా పోయింది. 2020–21 వానాకాలం, యాసంగి సీజన్లు కలిపి 9 లక్షల ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లింది. 2021–22లోనూ 12 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. కానీ రైతులకు ఒక్కపైసా నష్టపరిహారం అందలేదు. ఈ ఏడాది మార్చి, ఏప్రిల్ నెలలో వడగళ్లు, భారీ వర్షాలకు జరిగిన పంట నష్టం జరిగింది. దాదాపు 10 లక్షల ఎకరాల్లో నష్టం వాటిల్లిందని ప్రాథమికంగా అంచనా వేయగా, చివరకు వ్యవసాయశాఖ 2.30 లక్షల ఎకరాల్లో నష్టం వాటిల్లినట్టు తేల్చింది. ఎకరాకు ప్రభుత్వం రూ.10 వేల చొప్పున రైతులకు రూ. 230 కోట్లు పరిహారంగా ప్రకటించింది. ఇక మొన్నటికి మొన్న ఈ నెల మొదటివారంలో రాష్ట్రంలో తుపాను కారణంగా వివిధ రకాల పంటలకు దాదాపు 5 లక్షల ఎకరాల్లో నష్టం జరిగింది. కానీ రైతులకు ఎలాంటి ఆర్థిక చేయూత అందలేదు. వ్యవసాయశాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించడంలోనూ విఫలమైంది. ఇలా ప్రతీ ఏడాది రైతులకు తీవ్రమైన నష్టం వాటిల్లుతోంది. పంటల బీమాతోనే రైతులకు మేలు ఫసల్ బీమాకు ప్రత్యామ్నాయంగా రాష్ట్రంలో ప్రత్యేకంగా ఒక పంటల బీమా పథకం ప్రవేశపెడితే ఎలా ఉంటుందన్న దానిపై గత ప్రభుత్వ హయాంలోనే కసరత్తు జరిగింది. గ్రామం యూనిట్గా కాకుండా రైతు యూనిట్గా దీనిని ప్రవేశపెట్టాలని అనుకున్నారు. కానీ అమలుకు నోచుకోలేదు. ఇప్పటికే రెండు మూడు రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వ బీమా పథకాలతో విసిగివేసారి బయటకు వచ్చి, సొంత పథకాలను రూపొందించుకున్నాయి. బెంగాల్ ప్రభుత్వం విజయవంతంగా సొంత పథకాన్ని అమలు చేస్తుంది. అక్కడ అధ్యయనం చేసి, ఆ ప్రకారం ముందుకు సాగాలని అధికారులు అనుకున్నారు. కానీ ఏదీ ముందుకు పడలేదు. కేంద్ర ఫసల్ బీమా పథకం వల్ల కంపెనీలకు లాభం జరిగిందనేది వాస్తవమే కావొచ్చు. కానీ ఎంతో కొంత రైతులకు ప్రయోజనం జరిగిందని కూడా రైతు సంఘాలు అంటున్నాయి. ► 2016–17లో తెలంగాణలో వివిధ కారణాలతో 1.58 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. దీంతో 2.35 లక్షల మంది రైతులు రూ. 178 కోట్లు నష్టపరిహారం పొందారు. ► 2017–18లో వివిధ కారణాలతో 3.18 లక్షల ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లింది. దీంతో 4.42 లక్షల మంది రైతులు రూ. 639 కోట్లు పరిహారం పొందారు. ► 2018–19లో 1.2 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరగ్గా, 2.2 లక్షల మంది రైతులు రూ. 570 కోట్ల పరిహారం పొందారు. ► 2019–20లో 2.1 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరగ్గా, 3.24 లక్షల మంది రైతులు రూ. 480 కోట్ల పరిహారం పొందారు. ►ఫసల్ బీమా పథకం నుంచి తప్పుకున్న తర్వాత వ్యవసాయశాఖ నష్టం అంచనాలు వేయడం కూడా నిలిపివేసింది. దీంతో రైతులు నష్టపోతూనే ఉన్నారు. -
సాయం చేస్తున్నా గిట్టదా?
సాక్షి, అమరావతి: పంట నష్టం అంచనాలతో పనిలేదు.. కరువొచ్చిన మర్నాడే సాయం అంది తీరాలి! తుపాన్ తీవ్రత తగ్గక ముందే పరిహారం ఇచ్చి తీరాలి అన్నట్లుగా ఉంది ఎల్లో మీడియా ధోరణి! కరువు రావడం, తుపాన్ వల్ల భారీ వర్షాలు కురవడం కూడా ప్రభుత్వ వైఫల్యమే అన్నట్లుగా ఉన్నాయి రామోజీ రాతలు! విపత్తుల వేళ అప్రమత్తతోపాటు రైతన్నలు నష్ట పోయిన ప్రతీ ఎకరాకు, దెబ్బతిన్న ప్రతీ గింజకు ఇన్పుట్ సబ్సిడీ అందిస్తూ దేశంలోనే ఆదర్శంగా నిలుస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. పంట నష్టం లెక్కింపులో జాప్యం లేకుండా, పరిహారం చెల్లించి ఆదుకోవడంలో వేగాన్ని ప్రదర్శిస్తోంది. సంక్రాంతి లోపు ఇన్పుట్ సబ్సిడీ అందించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇదంతా తనకు పట్టనట్లుగా యథాప్రకారం బురదలో కూరుకుపోయి దుష్ప్రచారానికి దిగే పెద్ద మనిషిని ఏమనుకోవాలి? ఎలా లెక్కిస్తారో తెలియదా? తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నప్పుడు ఏదైనా ప్రాంతాన్ని కరువు ప్రాంతంగా గుర్తించాలంటే ఆరు ప్రామాణికాలు (వర్షపాతం, సాగు విస్తీర్ణం, ఉపగ్రహ ఆధారిత పంటల పరిస్థితి, వాగు ప్రవాహం, భూగర్భ జలాలు, జలాశయాల స్థాయిలు) పరిగణనలోకి తీసుకుంటారు. ఇక తుపాన్లు, వరదలు, అకాల వర్షాల సమయంలో తొలుత ప్రాథమిక నష్టాన్ని అంచనా వేస్తారు. తర్వాత క్షేత్ర స్థాయి పరిశీలన అనంతరం నిబంధనల మేరకు 33 శాతానికి పైగా మునిగిపోయి దెబ్బతిన్న పంటలను పరిగణనలోకి తీసుకొని పంట నష్టం తుది అంచనాలను రూపొందిస్తారు. ఆ మేరకు పంటలవారీగా లెక్కించిన పంట నష్టపరిహారాన్ని (ఇన్పుట్ సబ్సిడీ) అందిస్తారు. ఆదుకోలేదనడానికి మనసెలా వచ్చింది? ఖరీఫ్ 2023–24లో బెట్ట పరిస్థితులను ముందుగానే అంచనా వేసిన రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు రైతులను ఆదుకునేందుకు అన్ని చర్యలు తీసుకుంది. సీఎం జగన్ సీజన్ ప్రారంభం నుంచి 15 రోజులకోసారి అధికారులతో సమీక్షించారు. శాస్త్రవేత్తల సిఫార్సుల మేరకు ప్రత్యామ్నాయ పంటల ప్రణాళికకు అనుగుణంగా 80 శాతం రాయితీపై విత్తనం పంపిణీ చేశారు. 80 శాతం సబ్సిడీతో (రూ.26.46 కోట్ల విలువ) 30,977 క్వింటాళ్ల విత్తనాలను 1.16 లక్షల మంది రైతులకు అందజేశారు. ముందస్తు రబీలో 89 వేల మంది రైతులకు రూ.40.45 కోట్ల విలువైన 1.23 లక్షల క్వింటాళ్ల శనగ విత్తనాలను 40 శాతం సబ్సిడీపై ఆర్బీకేల ద్వారా సరఫరా చేశారు. కరువు సాయం కోసమే కేంద్ర బృందాలు ఖరీఫ్ 2023కి సంబంధించి ఏడు జిల్లాలలో 103 కరువు మండలాలను గుర్తించారు. 7.14 లక్షల మంది రైతులు 6 లక్షల హెక్టార్లలో పంట నష్టపోయినట్లు లెక్కించి జాబితాలను సామాజిక తనిఖీ కోసం ఆర్బీకేల్లో ప్రదర్శించారు ఎన్డీఆర్ఎఫ్ నిబంధనల మేరకు రూ. 534 కోట్ల పెట్టుబడి రాయితీ కోరుతూ కేంద్రానికి నివేదిక సమర్పించారు. ఈ నెల 12 నుంచి 15 వరకు కేంద్ర బృందం రాష్ట్రంలో కరువు ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించింది. ఎస్డీఆర్ఎఫ్ నిబంధనల మేరకు 6.39 లక్షల మంది రైతులు 5.33 లక్షల హెక్టార్లలో పంటలు నష్టపోయినట్లు లెక్క తేల్చి రూ. రూ.784.61 కోట్ల పెట్టుబడి రాయితీ ఇవ్వాలని అంచనా వేశారు. ఈ మొత్తాన్ని వారి ఖాతాలో జమ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు ఖరీఫ్ 2023లో 21, రబీ 2023 –24లో 17 పంటలకు వైఎస్సార్ ఉచిత పంటల బీమా ప«థకాన్ని వర్తింప చేస్తూ నోటిఫికేషన్ జారీ చేశారు. ఖరీఫ్ 2023 నోటిఫైడ్ పంటలకు సంబంధించి 34.7 లక్షల మంది రైతులకు ఉచిత పంటల బీమా పథకం వర్తింప చేశారు ఈ జాబితాలను కేంద్రంతో పాటు బీమా కంపెనీలకు సైతం పంపించారు. ఉదారంగా ధాన్యం కొనుగోళ్లు సీఎం జగన్ ఆదేశాల మేరకు ఉదారంగా వ్యవహరిస్తూ తేమ శాతం నిబంధనలను సడలించి రంగుమారిన, పాడైపోయిన «6.52 లక్షల క్వింటాళ్ల ధాన్యాన్ని ఆర్బీకేల ద్వారా కళ్లాల వద్ద నుంచే సేకరించారు. గత సర్కారు ఎగ్గొట్టిన బకాయిలతో సహా గత నాలుగున్నరేళ్లలో విపత్తులతో నష్టపోయిన 22.85 లక్షల మంది రైతులకు రూ.1,976.44 కోట్ల పెట్టుబడి రాయితీ సొమ్మును అదే పంట కాలం చివరిలో బ్యాంకు ఖాతాలకు నేరుగా జమ చేశారు. సాయం పెంపు కనపడదా? వైపరీత్యాల వేళ కేంద్రం నిర్ణయించిన దానికంటే ఎక్కువగా ఇవ్వాలనే సంకల్పంతో 2023 నవంబర్ 14 నుంచి పెట్టుబడి రాయితీని పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. విపత్తుల వల్ల వ్యవసాయ భూముల్లో మట్టి, ఇసుక మేట వేస్తే తొలగించేందుకు గతంలో హెక్టారుకి రూ.12 వేలు ఇవ్వగా సీఎం జగన్ ప్రభుత్వం రూ.18 వేలకు పెంచింది. దెబ్బతిన్న వర్షాధార పంటలకు హెక్టారుకి గతంలో రూ.6,800 మాత్రమే ఉన్న పరిహారాన్ని రూ.8500కి పెంచింది. నీటిపారుదల భూములైతే ఇన్పుట్ సబ్సిడీ గతంలో రూ.13,500 ఇచ్చే పరిస్థితి ఉండగా ఇప్పుడు రూ.17 వేలు ఇస్తున్నారు. ప్రధానంగా వరి, వేరుశనగ, పత్తి, చెరకు తదితర పంటలకు గతంలో హెక్టార్కు రూ.15 వేలు ఇవ్వగా ప్రస్తుతం రూ.17 వేలకు పెంచారు. ఉద్యాన పంటలకు రూ.7,500 నుంచి రూ.17 వేలకు పెంచగా మామిడి, నిమ్మ జాతి పంటలకు రూ.20 వేల నుంచి రూ.22,500లకు, మల్బరీకి రూ.4,800 నుంచి రూ.6 వేలు చొప్పున పెంచి ఇస్తున్నారు. -
ఉదారంగా సిఫార్సులు చేయండి
సాక్షి, అమరావతి : తుపాను, వర్షాభావ ప్రాంతాల్లో రాష్ట్రానికి ఉదారంగా సహాయం చేసేలా కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సులు చేయాల్సిందిగా కేంద్ర అధికారుల బృందాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కోరారు. తుపాను, కరువు పరిస్థితులపై కేంద్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన బృందాలు క్షేత్రస్థాయి పర్యటనల అనంతరం శుక్రవారం సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి, ఉన్నతాధికారులతో సమావేశమయ్యాయి. తుపాను బాధిత ప్రాంతాల్లో తాము చూసిన పరిస్థితులను, గుర్తించిన అంశాలను సమావేశంలో వివరించాయి. ఈ సందర్భంగా సీఎం జగన్ ఏమన్నారంటే.. విస్తృత వర్షాలతో పంటలు దెబ్బతిన్నాయి.. తుపాను ప్రభావిత ప్రాంతాల ప్రజలను సహాయక శిబిరాలకు తరలించడమే కాకుండా వారికి తక్షణ సహాయాన్ని కూడా అందించాం. సహజంగా.. తుపాను ఏదో ఒక ప్రాంతంలో తీరం దాటుతుంది. కానీ, ఈ తుపాను తీరం వెంబడి కదులుతూ కోస్తా ప్రాంతంలో విస్తృతంగా వర్షాలకు కారణమైంది. దీనివల్ల పంటలు దెబ్బతిన్నాయి. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం తుపాను బాధిత ప్రాంతాల్లో తిరుగుతూ నష్టాన్ని అంచనా వేస్తోంది. ఏపీలో ఈ–క్రాపింగ్ లాంటి సమర్థవంతమైన వ్యవస్థ ఉంది. నష్టపోయిన రైతుల జాబితాలను గ్రామ సచివాలయాల్లో సోషల్ ఆడిట్ కోసం పెడతాం. ఎవరైనా నష్టపోయిన రైతు పేరు లేకుంటే వెంటనే దాన్ని సరిదిద్దేలా అత్యంత పారదర్శకత వ్యవస్థను అమలుచేస్తున్నాం. రైతులను తుదివరకూ ఆదుకునేలా వ్యవస్థలు రాష్ట్రంలో ఉన్నాయి. దీనివల్ల రైతులకు అందించే సహాయం, పరిహారం అత్యంత పారదర్శకంగా వారికి చేరుతుంది. క్షేత్రస్థాయిలో పర్యటనలు చేసి స్వయంగా చూసినందున ఆ మేరకు రాష్ట్రానికి ఉదారంగా సహాయం చేసేలా కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సులు చేయండి. ఆర్బీకేలు, ఉచిత పంటల బీమా,డీబీటీ పథకాలు బాగున్నాయి.. రాష్ట్రంలో ఆర్బీకేలు, ఉచిత పంటల బీమా, డీబీటీ పథకాలు, ఇన్పుట్ సబ్సిడీ, కంటింజెన్సీ కింద విత్తనాల పంపిణీ, అమూల్ పాలవెల్లువ కార్యక్రమంలో భాగంగా మిల్క్ కలెక్షన్ సెంటర్ల ఏర్పాటూ బాగున్నాయి. అలాగే, గ్రామ సచివాలయాల వ్యవస్థ పనితీరును తాము స్వయంగా చూశామని.. ఈ కార్యక్రమాలు చాలా బాగున్నాయని కేంద్ర బృందం కితాబి చ్చింది. కౌలు రైతులకూ రైతుభరోసా భేష్.. అంతేకాక.. కౌలు రైతులకూ ఎక్కడాలేని విధంగా రైతుభరోసా అందించడం అభినందనీయమని కేంద్ర బృందం పేర్కొంది. వరి కాకుండా పెసలు, మినుములు, మిల్లెట్స్ లాంటి ఇతర పంటల వైపు మళ్లేలా చూడాలని సూచించింది. ఇదే అంశంపై ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను అధికారులు వివరించారు. ‘ఉపాధి’ పెండింగ్ నిధులు వెంటనే ఇప్పించండి.. మరోవైపు.. ఉపాధి హామీ పథకం కింద విస్తారంగా కల్పిస్తున్న పనిదినాలపైన కేంద్ర బృందానికి రాష్ట్ర అధికారులు వివరించారు. పెండింగులో ఉన్న ఉపాధి హామీ పథకం బిల్లులను రాష్ట్రానికి వెంటనే వచ్చేలా చూడాలని వారు కోరారు. అలాగే, తుపాను కారణంగా రంగుమారిన, తడిసిన ధాన్యం కొనుగోలు చేస్తున్నామని.. ఈ విషయంలో కొన్ని సడలింపులు కావాలంటూ ఇప్పటికే కేంద్రాన్ని అభ్యర్థించామని, వీలైనంత త్వరగా అవి కూడా వచ్చేలా చూడాలన్నారు. ఈ సమావేశంలో కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఎన్ఐడీఎం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాజేంద్ర రత్నూ, వ్యవసాయ శాఖ జేడీ విక్రాంత్సింగ్, డీఏఎఫ్డబ్ల్యూ జాయింట్ సెక్రటరీ పంకజ్ యాదవ్ సహా రాష్ట్ర ప్రభుత్వ సీఎస్ జవహర్రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ రెవెన్యూ, విపత్తు నిర్వహణ శాఖ స్పెషల్ సీఎస్ జి. సాయిప్రసాద్, వ్యవసాయశాఖ స్పెషల్ సీఎస్ గోపాలకృష్ణ ద్వివేది, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ స్పెషల్ సీఎస్ వై. శ్రీలక్ష్మి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ స్పెషల్ సీఎస్ బుడితి రాజశేఖర్, జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్కుమార్, రవాణా శాఖ కార్యదర్శి ప్రద్యుమ్న, వ్యవసాయశాఖ స్పెషల్ కమిషనర్ కమిషనర్ సీహెచ్ హరికిరణ్, విపత్తు నిర్వహణ శాఖ డైరెక్టర్ అంబేద్కర్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ముందుజాగ్రత్తతో నష్టాలనునివారించారు : కేంద్ర బృందం అనంతరం.. కేంద్ర బృందం స్పందిస్తూ.. అనంతపురం జిల్లా నుంచి పర్యటన ప్రారంభమై కర్నూలు, నంద్యాల, సత్యసాయి, చిత్తూరు, అన్నమయ్య, ఎన్టీఆర్ జిల్లాల్లో పర్యటించామని వివరించింది. మూడు బృందాలుగా జిల్లాల్లో పర్యటించి వర్షాభావ పరిస్థితులను పరిశీలించామని అందులోని సభ్యులు తెలిపారు. వర్షాభావం కారణంగా దెబ్బతిన్న పంటలను పరిశీలించామని, స్థానిక రైతులతో మాట్లాడి వారి కష్టసుఖాలు తెలుసుకున్నామన్నారు. అలాగే, జలవనరులు, రిజర్వాయర్లలో నీటిమట్టాల పరిస్థితిని చూడడంతోపాటు ఉపాధి పథకాన్ని పరిశీలించినట్లు కేంద్ర బృందం తెలిపింది. తుపానుకు రాష్ట్ర ప్రభుత్వం ముందస్తుగానే అప్రమత్తం కావడంవల్ల ప్రాణ, ఆస్తి నష్టాలను నివారించగలిగిందని పేర్కొంది. సచివాలయాల రూపంలో ఇక్కడ గ్రామస్థాయిలో బలమైన వ్యవస్థ ఉందని, విపత్తు వచ్చిన సందర్భాల్లో క్షేత్రస్థాయిలో అనుసరిస్తున్న మార్గాలు బాగున్నాయని ప్రశంసించింది. ఈ–క్రాపింగ్ లాంటి విధానం దేశంలో ఎక్కడాలేదని, ఇవి ఇతర రాష్ట్రాలూ అనుసరించదగ్గవని, ఆయా ప్రభుత్వాలకు వీటిని తెలియజేస్తామని తెలిపింది. అలాగే, తుపాను కారణంగా జరిగిన పంట నష్టం, మౌలిక సదుపాయాలకు ఏర్పడ్డ నష్టాలపై కేంద్ర ప్రభుత్వానికి సమగ్ర నివేదిక సమర్పిస్తామని బృందం వెల్లడించింది. రాష్ట్రంలో కరువు పరిస్థితులనూ బృందం అధికారులు వివరించారు. -
అబద్ధాల బాబు.. నిజం చెప్పరుగా!
సాక్షి, అమరావతి: అబద్ధాల్లో మహా దిట్టగా పేరొందిన చంద్రబాబు ఎప్పడూ నిజాలు మాట్లాడరు. ఏది చెప్పినా అబద్ధమే. అదే తీరులో తుపాను సాయంపైనా అడ్డగోలు వాదనలతో ప్రజలను మభ్య పెట్టాలని ప్రయత్నిస్తున్నారు. మిచాంగ్ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో గతంలో ఎప్పుడూ లేని విధంగా ముమ్మరంగా సహాయక చర్యలు జరుగుతుంటే.. కళ్లుండి కూడా చంద్రబాబు వాటిని చూడలేకపోతున్నారు. తుపాను బాధితులకు భోజనం కూడా పెట్టడంలేదంటూ అవలీలగా అబద్ధాలాడేస్తున్నారు. బాబు అధికారంలో ఉన్నప్పుడు వచ్చిన హుదూద్, తిత్లీ తుఫాను సమయంలో చేయని సాయాన్ని కూడా చేసినట్లు, ఇచ్చిన అరకొర పరిహారాలను కూడా భారీగా ఇచ్చినట్లు ప్రచారం చేసుకుంటున్నారు. ప్రస్తుతం వచ్చిన మిచాంగ్ తుపాను నుంచి ప్రజలను, ఆస్తులను రక్షించడానికి వైఎస్ జగన్ ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది. తుపాను ప్రభావిత ప్రాంతాల ప్రజలను ముందస్తుగానే అప్రమత్తం చేసింది. ఎక్కడా ఆస్తి, ప్రాణ నష్టం లేకుండా చర్యలు చేపట్టింది. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి, వారికి అవసరమైన సకల ఏర్పాట్లు చేసింది. పునరావాస కేంద్రాల్లో మంచి వాతావరణం కల్పించి, పౌష్టికాహారాన్ని అందించింది. అయినా ప్రజలకు ఏమీ చేయడంలేదంటూ చంద్రబాబు ప్రచారం చేస్తున్న తీరుపై ప్రజల్లోనే అసహనం వ్యక్తమవుతోంది. ఉదారంగా సీఎం జగన్ సాయం తుపాను ముందు జాగ్రత్త చర్యలతోపాటు దెబ్బతిన్న ప్రాంతాల పునర్నిర్మాణానికి సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం ఎంతో ఉదారంగా నిధులిస్తోంది. ప్రమాదవశాత్తూ ఎవరైనా చనిపోతే ఇచ్చే ఎక్స్గ్రేషియా నుంచి కూలిపోయిన ఇళ్లు, దెబ్బతిన్న పంటలు వంటి అన్నింటికీ చంద్రబాబు కంటే ఎంతో మెరుగ్గా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సాయం అందిస్తున్నారు. విపత్తుల సమయంలో తీసుకోవాల్సిన చర్యలు, ఇవ్వాల్సిన పరిహారానికి సంబంధించి 2022–23 నుంచి 2025–26 సంవత్సరాల కోసం నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ (ఎన్డీఆర్ఎఫ్) మార్గదర్శకాలకు అనుగు ణంగా స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ (ఎస్డీఆర్ఎఫ్) నిబంధనలను సవరిస్తూ జీవో ఎంఎస్ నెంబర్ 5 విడుదల చేసింది. అందుకనుగుణంగా పరిహారం ఇస్తోంది. ఇళ్లకిచ్చే పరిహారంపైనా వక్రీకరణలు టీడీపీ ప్రభుత్వం ఇళ్లు కూలిపోయిన వారికి రూ.95 వేలతో కొత్త ఇల్లు కట్టించి, రూ.4 లక్షలతో కట్టించి ఇచ్చినట్లు అబద్ధాలు చెప్పుకుంటోంది. సీఎం జగన్ మైదాన ప్రాంతాల్లో ఇళ్లు కూలిపోతే రూ.1.20 లక్షలు, కొండ ప్రాంతాల ఇళ్లకు రూ.1.30 లక్షలు పరిహారం ఇస్తున్నారు. అలాగే దెబ్బతిన్న ఇళ్లకు ఇచ్చే పరిహారాన్ని రూ.8 వేల నుంచి రూ.10 వేలకు పెంచి ఇస్తున్నారు. దెబ్బ తిన్న ఇళ్లకు రూ.8 వేలు ఇచ్చిన టీడీపీ.. రూ.10 వేల ఆర్థిక సాయం చేసినట్లు అబద్ధాలాడుతోంది. దెబ్బతిన్న పశువుల షెడ్ల మరమ్మతులకు ఈ ప్రభుత్వంలో రూ.30 వేలు ఇస్తుంటే, దాన్ని రూ.2100 ఇచ్చినట్లు ప్రజలను ఏమార్చే ప్రయత్నం చేస్తున్నారు. ప్రకృతి విపత్తుల కారణంగా వ్యవసాయ భూముల్లో చేరిన మట్టి, ఇసుక మేట తొలగించేందుకు చంద్రబాబు హయాంలో హెక్టారుకి రూ.12 వేలు ఉండగా, వైఎస్ జగన్ ప్రభుత్వం దాన్ని రూ.18 వేలకు పెంచి ఆ సీజన్ చివరలో ఇస్తోంది. దెబ్బతిన్న వరి, వేరుశెనగ, పత్తి, చెరకు పంటలకు హెక్టారుకి రూ.15 వేల పరిహారాన్ని ఈ ప్రభుత్వం ఇస్తోంది. చంద్రబాబు హయాంలో ఇదే రూ.15 వేలు.. అదీ ఎప్పుడు ఇస్తారో కూడా తెలియక రైతులు అల్లాడేవారు. కానీ చంద్రబాబు రూ.20 వేలు ఇచ్చినట్లు చెప్పుకుంటున్నారు. దెబ్బతిన్న వర్షాధార పంటలకు హెక్టారుకి గతంలో రూ.6,800 ఉన్న పరిహారాన్ని ఈ ప్రభుత్వం రూ.8,500కి పెంచి ఇస్తోంది. నీటి సదుపాయం ఉన్న భూములైతే ఇన్పుట్ సబ్సిడీ గతంలో రూ.13,500 ఇవ్వగా, సీఎం జగన్ రూ.17 వేలు ఇస్తున్నారు. చంద్రబాబు చెప్పేవన్నీ అబద్ధాలే.. ఇవిగో నిజాలు చంద్రబాబు హయాంలో తిత్లి, హుదూద్ తుపాన్లకు వరి పంట దెబ్బతింటే హెక్టారుకి రూ.15 వేలు ఇచ్చి రూ.20 వేలు ఇచ్చినట్లు దొంగ ప్రచారం చేసుకున్నారు. ఇప్పుడు వైఎస్ జగన్ ప్రభుత్వంలో హెక్టారుకు రూ.17 వేల పరిహారం ఇస్తున్నారు. ఆక్వాకు హెక్టారుకి రూ.30 వేలు పరిహారం ఇచ్చినట్లు చెబుతున్న చంద్రబాబు.. వాస్తవానికి ఇచ్చింది రూ.12,200 మాత్రమే. ఇదే ఆక్వా సాగుకు సీఎం వైఎస్ జగన్ హెక్టారుకి రూ.18 వేల పరిహారం ఇస్తుంటే.. రూ.8,200 ఇస్తున్నట్లు బాబు మాయ మాటలు చెబుతున్నారు. గాయపడిన వ్యక్తులకు రూ.59 వేలు ఇచ్చి చేతులు దులుపుకున్న చంద్రబాబు.. రూ. లక్ష ఇచ్చినట్లు చెప్పుకుంటున్నారు. ఇప్పుడు గాయాలైన వారికి రూ.74 వేలు ఇస్తున్న విషయాన్ని వక్రీకరిస్తున్నారు. తీవ్రంగా గాయపడిన వారికి టీడీపీ హయాంలో రూ.2 లక్షలున్న పరిహారాన్ని వైఎస్ జగన్ ప్రభుత్వం రూ.2.5 లక్షలకు పెంచి ఇస్తోంది. దెబ్బతిన్న బోట్లకిచ్చే పరిహారంపెంపు అయినా బాబు ఏడుపు మత్స్యకారుల బోట్లకు ఇచ్చే పరిహారాన్ని కూడా సీఎం జగన్ ప్రభుత్వం పెంచింది. బోట్లు పాక్షికంగా దెబ్బతింటే చంద్రబాబు హయాంలో రూ.5 వేలు ఇవ్వగా ఇప్పుడు రూ.6 వేలు ఇస్తున్నారు. బోట్ల మరమ్మతులకు చంద్రబాబు రూ.2100 ఇవ్వగా, జగన్ ప్రభుత్వంలో రూ.3 వేలు ఇస్తున్నారు. పూర్తిగా దెబ్బతిన్న బోట్ల స్థానంలో కొత్త బోట్ల కొనుగోలుకు చంద్రబాబు హయాంలో రూ.10 వేలు ఉండగా ఇప్పుడు రూ.15 వేలు ఇస్తున్నారు. మోటార్ బోటు దెబ్బతింటే ఇప్పుడు రూ.20 వేలు ఇస్తుండగా.., అప్పట్లో రూ. 8,200 ఇచ్చిన చంద్రబాబు రూ.30 వేలు ఇచ్చినట్లు అబద్ధాలు చెప్పుకుంటున్నారు. తుపాను కారణంగా నిరాశ్రయులైన కుటుంబాలకు దుస్తుల కోసం టీడీపీ హయాంలో రూ.2 వేలు ఉన్న పరిహారాన్ని జగన్ ప్రభుత్వం రూ. 2,500కి పెంచి ఇస్తోంది. ఇంట్లో వస్తువులు కోల్పోయిన వారికివ్వాల్సిన సాయాన్ని కూడా జగన్ ప్రభుత్వం రూ.2 వేల నుంచి రూ.2500కి పెంచింది. గతంలో లేని విధంగా రూ.1,000 నుంచి రూ.2,500 ఆర్థిక సాయం పునరావాస కేంద్రాల్లో ఉన్న తుపాను బాధితులు తిరిగి ఇళ్లకు వెళ్లే ముందు చంద్రబాబు ప్రభుత్వం వారికి ఆర్థిక సాయం అందించేది కాదు. తొలిసారిగా వైఎస్ జగన్ ప్రభుత్వం పునరావాస కేంద్రాల నుంచి బాధితులు ఇళ్లకు తిరిగి వెళ్లే ముందు ప్రతి కుటుంబానికి రూ.1000 నుంచి రూ.2,500 వరకు ఇస్తోంది. ఈ నాలుగున్నరేళ్లలో ఏ విపత్తు వచ్చినా బాధిత కుటుంబాలకు ఆ సొమ్ము అందించింది. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు బాధిత కుటుంబాలను పట్టించుకున్న పాపాన పోలేదు. -
అధైర్య పడొద్దు అండగా ఉంటాం
సాక్షి, అమరావతి: తుపాను కారణంగా పంటలు నష్టపోయిన రైతులు అధైర్య పడొద్దని, ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి భరోసా ఇచ్చారు. తుపాను బాధితుల పట్ల ఉదారంగా ఉండాలని, పరిహారం అందించే విషయంలో సానుభూతితో వ్యవహరించాలని జిల్లా కలెక్టర్లు, అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. ఆయా ప్రాంతాల్లో సాధారణ పరిస్థితులను తీసకురావడంపై అధికార యంత్రాంగం దృష్టిపెట్టాలని చెప్పారు. బాధితులకు రేషన్ పరిహారం పంపిణీలో ఎలాంటి లోపం ఉండకూడదని స్పష్టం చేశారు. తుపాను ప్రభావిత జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర ఉన్నతాధికారులతో బుధవారం ఆయన తన క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా తుపాను సహాయ, పునరుద్ధరణ చర్యలు, రైతుల నుంచి ధాన్యం కొనుగోళ్లపై వారికి మార్గ నిర్దేశం చేశారు. ‘వర్షాలకు తెరిపి వచ్చింది. ప్రస్తుతం తుపాను బలహీనపడి అల్పపీడనంగా మారింది. తుపాను వల్ల వర్షాలు విస్తృతంగా పడ్డాయి. కలెక్టర్లు, సీనియర్ ఐఏఎస్ అధికారులు స్పెషల్ ఆఫీసర్లుగా క్షేత్ర స్థాయిలో బాగా పని చేశారు. అధికారులంతా మీ ప్రాంతాల్లో సాధారణ పరిస్థితులను తీసుకురావడంపై దృష్టి పెట్టాలి. చిన్న చిన్న విషయాలు కూడా మిస్ కాకుండా చూసుకోవాలి’ అని చెప్పారు. ఈ సందర్భంగా సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. సాయంలో లోటు రాకూడదు ♦ వర్షాల వల్ల ఇళ్లు దెబ్బ తిన్న వారికి రూ.10 వేలు ఇచ్చే విషయంలో, వర్షాల కారణంగా ముంపునకు గురైన లోతట్టు ప్రాంతాల వారిని క్యాంపులకు తీసుకొచ్చి వారిని చూసుకునే విషయంలో, క్యాంపుల నుంచి తిరిగి ఇళ్లకు వెళ్తున్న సందర్భంలో వారికి ఇవ్వాల్సిన ఆర్థిక సాయం తప్పకుండా ఇవ్వాలి. రేషన్ పరిహారం పంపిణీలో కూడా ఎలాంటి లోపం ఉండకూడదు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. పంట పొలాల్లో ఉన్న వరద నీటిని పూర్తిగా తొలగించడంపై దృష్టి పెట్టాలి. అన్ని రకాల మానవ వనరులను ఉపయోగించుకోవాలి. ఇది అత్యంత ప్రాధాన్య అంశం. పంటల సంరక్షణకు ప్రతి ఆర్బీకే పరిధిలో ఇప్పటికే ఎస్ఓపీ (స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్) జారీ చేశారు. ౮౦ శాతం సబ్సిడీపై విత్తనాల సరఫరాకు కార్యాచరణ రూపొందించాలి. ♦దురదృష్టవశాత్తు విధి నిర్వహణలో ఉండగా చెట్టుకూలి ఓ కానిస్టేబుల్ చనిపోయాడు. ఆ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకుంటుంది. ఆ కుటుంబానికి రూ.30 లక్షలు సాయం అందిస్తాం. విధి నిర్వహణలో ఉన్న ఉద్యోగుల స్థైర్యం నిలబడేలా ప్రభుత్వం తోడుగా నిలుస్తుంది. గ్రామాల్లో ఉన్న వలంటీర్ దగ్గర నుంచి సచివాలయ సిబ్బంది మొదలుకుని, ప్రభుత్వంలో పై స్థాయిలో ఉన్న ఉద్యోగి వరకు ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలిగినా.. ప్రభుత్వం అన్ని రకాలుగా తోడుగా ఉంటుంది. వారిలో ఆత్మస్థైర్యాన్ని నిలబెట్టేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ♦ ఈ సమీక్షలో సీఎం క్యాంపు కార్యాలయం నుంచి హోం, విపత్తు నిర్వహణ శాఖ మంత్రి తానేటి వనిత, సీఎస్ డాక్టర్ కె ఎస్ జవహర్ రెడ్డి, డీజీపీ కే వీ రాజేంద్రనాథ్ రెడ్డి, రెవెన్యూ, విపత్తు నిర్వహణ శాఖ స్పెషల్ సీఎస్ జి సాయి ప్రసాద్, పురపాలక పట్టణాభివృద్ధి శాఖ స్పెషల్ సీఎస్ వై శ్రీలక్ష్మి, ఇంధన శాఖ స్పెషల్ సీఎస్ కె విజయానంద్, వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ సీఎస్ ఎం టీ కృష్ణబాబు, హోం శాఖ ముఖ్య కార్యదర్శి హరీష్ కుమార్ గుప్తా, పౌర సరఫరాల శాఖ కమిషనర్ హెచ్ అరుణ్ కుమార్, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ ఏ.సూర్యకుమారి, ఏపీ స్టేట్ సివిల్ సఫ్లైస్ కార్పొరేషన్ వీసీ అండ్ ఎండీ జి వీరపాండియన్, గృహ నిర్మాణ శాఖ స్పెషల్ సెక్రటరీ బి మహమ్మద్ దీవాన్, విపత్తు నిర్వహణ శాఖ డైరెక్టర్ డాక్టర్ బీ ఆర్ అంబేడ్కర్ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ♦ యుద్ధ ప్రాతిపదికన అత్యధిక ప్రాధాన్యతతో విద్యుత్ను పునరుద్ధరించాలి. రోడ్లు దెబ్బతిన్న ప్రాంతాల్లో రవాణా పునరుద్ధరణకు వెంటనే చర్యలు తీసుకోవాలి. దీనిని కూడా ప్రాధాన్యత కార్యక్రమంగా తీసుకోండి. వర్షాలు తగ్గు ముఖం పట్టిన ప్రాంతాల్లో వ్యాధులు ప్రబలకుండా పారిశుద్ధ్యంపై కూడా దృష్టి పెట్టండి. అధికారులంతా బాగా పని చేస్తున్నారు. మేమందరం మీకు తోడుగా ఉన్నాం. ఒక్క ఫోన్ కాల్ దూరంలో ఉన్నాం. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి. -
మనసున్న ప్రభుత్వం మనది
సాక్షి, విశాఖపట్నం: మనసున్న ప్రభుత్వం మనదని, బాధితులను తక్షణమే ఆదుకునే స్వభావం సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిదని మత్స్యశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు. ఈ నెల 19 అర్ధరాత్రి విశాఖ ఫిషింగ్ హార్బర్లో జరిగిన అగ్ని ప్రమాదంలో దగ్ధమైన 49 బోట్ల యజమానులకు ప్రభుత్వం విడుదల చేసిన రూ.7 కోట్ల 11 లక్షల 76 వేల నష్ట పరిహారాన్ని గురువారం జిల్లా పరిషత్ హాల్లో వైఎస్సార్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డితో కలిసి మంత్రి పంపిణీ చేశారు. మంత్రి మాట్లాడుతూ అగ్ని ప్రమాదం జరిగిన మూడు రోజుల్లోనే నష్టంలో 80 శాతం సొమ్మును పరిహారంగా అందజేసిన ఘనత సీఎం జగన్కే దక్కిందన్నారు. ప్రమాదంలో కాలిపోయిన బోట్లలో పనిచేస్తున్న సుమారు 400 కలాసీ కుటుంబాలకు రూ.10 వేల చొప్పున చెల్లిస్తున్నట్టు తెలిపారు. బాధిత మత్స్యకారుల్లో సీఎం జగన్ ఆత్మస్థైర్యాన్ని పెంపొందించారని, ఇలాంటి నేత దేశంలోనే లేరని ప్రశంసించారు. రూ.80 లక్షల నుంచి కోటి వరకు వ్యయం అయ్యే లాంగ్లైనర్(పెద్ద) బోటు కొనుగోలుకు ఇప్పుడున్న 60 శాతం సబ్సిడీని 75కి పెంచుతూ త్వరలో జీవో జారీ చేస్తున్నట్టు తెలిపారు. మత్స్యకారులు ఈ పరిహారం సొమ్మును లాంగ్లైనర్ బోట్ల పెట్టుబడి సొమ్ముగా వినియోగించాలని సూచించారు. ఇచ్చిన మాట తప్పడం చంద్రబాబు నైజమన్నారు. గతంలో హుద్హుద్, తిత్లీ తుపానులకు దెబ్బతిన్న బోట్లకు ఏళ్ల తరబడి పరిహారం ఇవ్వకుండా కాలయాపన చేశారని, దీంతో ఆయన హామీలన్నీ నీటిమీద రాతలేనన్న భావనలో మత్స్యకారులున్నారని చెప్పారు. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో మత్స్యకారులకు పాత డీజిల్ సబ్సిడీ బకాయి సుమారు రూ.5.50 కోట్లను రెండు వారాల్లో చెల్లిస్తామని ప్రకటించారు. మత్స్యకారుల కోరిక మేరకు బయో డీగ్రేడబుల్ ఆయిల్కు కూడా సబ్సిడీ ఇస్తామని, సంబంధిత బంకుల్లో ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని మంత్రి సూచించారు. సీఎం జగన్ చలించిపోయారు: వైవీ సుబ్బారెడ్డి వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ విశాఖ ఫిషింగ్ హార్బర్లో అగ్నిప్రమాదంపై సీఎం జగన్ చలించిపోయారని, దగ్ధమైన బోట్లకు బీమా ఉందా లేదా అన్నది చూడకుండా మత్స్యకారులు నిలదొక్కుకునేలా ఆదుకోవడం మన బాధ్యత అని, అందుకు 80 శాతం పరిహారం ఇవ్వాలని చెప్పారని తెలిపారు. ఈ సాయంతో వారు కొత్త బోట్లు కొనుగోలుకు వీలవుతుందన్నారు. చిన్న బోట్లతో పాటు పెద్ద బోట్ల యజమానులు బోట్ల కొనుగోలుకు ప్రభుత్వం నుంచి సాయం అందించాలని మరపడవల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వాసుపల్లి జానకీరామ్ తన దృష్టికి తెచ్చారని, ఆ మేరకు తాను కృషి చేస్తానని, బ్యాంకుల నుంచి రుణం ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. గత తుపాన్లకు దెబ్బతిన్న బోట్ల మరమ్మతులకు రూ.6 లక్షలు ఇస్తామని అప్పటి ప్రభుత్వం హామీ ఇచ్చి అమలు చేయలేదని, వారికీ న్యాయం జరిగేలా ఈ విషయాన్ని సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్తామన్నారు. 2019 మే నుంచి సెప్టెంబర్ వరకు డీజిల్ సబ్సిడీ చెల్లించేలా చూస్తామని చెప్పారు. ఇంతలా స్పందించిన ముఖ్యమంత్రి మరెవరూ లేరు..: మోపిదేవి రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ మాట్లాడుతూ బాధిత మత్స్యకారులు ఊహించిన దానికంటే ఎక్కువ పరిహారాన్ని అందించిన ఘనత సీఎం జగన్దేనన్నారు. ఇంతలా పెద్ద మనసుతో స్పందించిన ముఖ్యమంత్రి మరెవరూ లేరన్నారు. విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్కుమార్ మాట్లాడుతూ హుద్హుద్ తుపానుకు దెబ్బతిన్న 34 బోట్లకు పరిహారం కోసం అప్పటి సీఎం చంద్రబాబు చుట్టూ తాను ఎన్ని సార్లు తిరిగినా పట్టించుకోలేదన్నారు. అనంతరం మంత్రి అప్పలరాజు, రీజనల్ కోఆర్డినేటర్ సుబ్బారెడ్డిలు బోట్ల యజమానులకు చెక్కులను అందజేశారు. సభలో మత్స్యకారులు జై జగన్ అంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. కార్యక్రమంలో మంత్రి గుడివాడ అమర్నాథ్, విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, ఎమ్మెల్యేలు ముత్తంశెట్టి శ్రీనివాసరావు, తిప్పల నాగిరెడ్డి, నెల్లిమర్ల ఎమ్మెల్యే బి.అప్పలనాయుడు, వైఎస్సార్సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కోలా గురువులు, మత్స్యకార కార్పొరేషన్ చైర్మన్ పేర్ల విజయచందర్, మరపడవల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వాసుపల్లి జానకీరామ్, జాయింట్ కలెక్టర్ విశ్వనాథన్ తదితరులు పాల్గొన్నారు. -
విశాఖ బోటు ప్రమాద బాధితులకు పరిహారం చెల్లింపు
సాక్షి, విశాఖపట్నం: ఫిషింగ్ హార్బర్లో అగ్ని ప్రమాదం వల్ల నష్టపోయిన మత్స్యకారులను ఏపీ ప్రభుత్వం సత్వరమే ఆదుకుంది. ప్రమాదం జరిగిన రెండు రోజుల్లోనే బాధితులకు పరిహారం చెక్కులను అందజేసింది. ఈ నెల 19వ తేదీ రాత్రి విశాఖ ఫిషింగ్ హార్బర్లో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 30 బోట్లు పూర్తిగా దగ్ధమవగా, మరో 18 బోట్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. ప్రమాదం గురించి తెలుసుకున్న సీఎం వైఎస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తంచేసి మత్స్యకారులకు నేనున్నానంటూ... భరోసానిచ్చారు. బాధిత మత్స్యకారులకు 80శాతం పరిహారం ఇస్తామని ప్రకటించారు. సీఎం వైఎస్ జగన్ చెప్పినట్లుగానే ప్రమాదం జరిగిన 48గంటలు గడవక ముందే జిల్లా కలెక్టర్ డాక్టర్ అకౌంట్కు పరిహారం డబ్బులను సీఎం కార్యాలయం జమ చేసింది. పూర్తిగా కాలిపోయిన 30 బోట్లకు 80 శాతం పరిహారంలో భాగంగా రూ.6,44,80,000, పాక్షికంగా దగ్ధమైన 18 బోట్లు, ఒక వలకు రూ.66.96 లక్షలు పరిహారాన్ని అందించింది. బోట్లు దగ్ధమవడంతో వాటిపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్న హమాలీలు, చిరువ్యాపారులను కూడా ప్రభుత్వం గుర్తించింది. ఒక్కో బోటుకు 10మంది చొప్పున పరిగణనలోకి తీసుకుని మొత్తం 490 మందికి ఒక్కొక్కరికీ వన్టైమ్ సెటిల్మెంట్ కింద రూ.10వేలు చొప్పున అందించారు. ఈ సందర్భంగా మంత్రి సీదిరి అప్పలరాజు మాట్లాడుతూ, మత్స్యకారులను ప్రభుత్వం అన్నివిధాల ఆదుకుంటోందని ప్రతీ ఏడాది క్రమం తప్పకుండా సాయం అందిస్తోందన్నారు. గత ప్రభుత్వ హయాంలో చెల్లించాల్సిన మత్సకారుల డీజిల్ బకాయిలు కూడా చెల్లిస్తామని, త్వరలో ఆ బకాయిలు రూ.4 కోట్లు 15 రోజుల్లో విడుదల చేయాలని సీఎం ఆదేశించారన్నారు. ‘‘విశాఖ ఫిషింగ్ హార్బర్ ప్రమాదాన్ని కొందరు రాజకీయం చేయడానికి ప్రయత్నించారు. పరిహారం ఇస్తున్న దశలో సీఎంకు వ్యతిరేకంగా నినాదాలు చేయించారు. సీఎం ఇవేం పట్టించుకోకుండా అర్హులకు పరిహారం ఇవ్వాలని ఆదేశించారు. రాజకీయాలకు అతీతంగా విలువలో 80 శాతం చెల్లింపు చేయాలని చెప్పారు కలాసీలకు పరిహారం ఇవ్వాలని చెబితే వెంటనే పది వేలు చొప్పున ఇవ్వాలని సీఎం చెప్పారు. ఫిషింగ్ హార్బర్ ఆధునీకరణకు ప్రభుత్వం 150 కోట్లు మంజూరు చేసింది. స్టీల్ బోట్లు తయారీకి ఇప్పుడు 60 శాతం సబ్సిడీ ఇస్తోంది.ఇప్పుడు దరఖాస్తు చేస్తే లాంగ్ లైనర్ల కోసం 75 శాతం వరకు ఇస్తామని’’ మంత్రి పేర్కొన్నారు. సీఎం గొప్ప మానవత్వాన్ని చాటుకున్నారు: ఎంపీ మోపిదేవి విశాఖ హార్బర్ ప్రమాదం మానవ తప్పిదం.. కానీ సీఎం జగన్ తన ఉదారత చాటుకున్నారని వైఎస్సార్సీపీ ఎంపీ మోపిదేవి వెంకటరమణ అన్నారు. పరిహారం ఇవ్వడంలో సీఎం గొప్ప మానవత్వాన్ని చాటుకున్నారన్నారు. 150 కోట్లతో హార్బర్ ఆధునీకరణ గొప్ప నిర్ణయం. ఇన్ని జట్టీలు ఎప్పుడు కూడా ఏ రాష్ట్రంలో జరగలేదు. ఫిషింగ్ జట్టీల ఏర్పాటు తో ఆర్థిక ప్రగతి వుంటుంది. ఈ రోజు ఇచ్చిన పరిహారం అంచనాలకు తగ్గట్టు అధికారులు ఇచ్చారు. ఈ పరిహారం వృధా చేయకుండా లాంగ్ లైనర్ బోట్లను కొనుగోలు చేయాలన్నారు. బోట్ల కొనుగోలుకు బ్యాంకులు సహకరించేలా ప్రభుత్వం చొరవ చూపిస్తుందని, రాజకీయ పబ్బం గడుపుకునే నాయకులు వస్తారు.. వారికి నమ్మకండి’’ అంటూ మోపిదేవి సూచించారు. మత్స్యకారులకు అండగా ఉంటాం: వైవీ సుబ్బారెడ్డి మత్స్యకారులకు సీఎం అండగా నిలిచారని, విపత్తుల సహాయం చేయడం సహజం.. కానీ ఇది విపత్తు కాదు.. ప్రమాదంలో బోట్లు తగలబడినా ప్రభుత్వం పరిహారం ప్రకటించిందని వైవీ సుబ్బారెడ్డి అన్నారు. ప్రమాదం జరిగిన గంటల్లోనే విలువలో 80 శాతం పరిహారం సీఎం ఇవ్వడం గొప్ప విషయం. కలాసీలకు 10 వేలు పరిహారం ఇవ్వడం చారిత్రక నిర్ణయం. ఈ పరిహారం ఇచ్చి చేతులు దులుపుకోవడం లేదు.. బోట్లు తిరిగి నడిపే వరకు అండగా వుంటాం. గత ప్రభుత్వం బోట్ల మరమ్మత్తులకు 6 లక్షలు ఇస్తామన్నారు.. కానీ ఇవ్వలేదు. గత ప్రభుత్వం హామీ అమలు జరిగేలా ప్రయత్నిస్తాం’’ అని సుబ్బారెడ్డి అన్నారు. -
రైలు ప్రమాద బాధితులకు చెక్కులు అందించిన మంత్రి బొత్స
సాక్షి, విజయనగరం: కంటకాపల్లి రైలు ప్రమాద బాధితులను మంత్రి బొత్స సత్యనారాయణ పరామర్శించారు. వారికి నష్ట పరిహారం చెక్కులను మంత్రి అందజేశారు. ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారి వద్దకు వెళ్లి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఆరోగ్యం కుదుట పడే వరకు ఆసుపత్రిలోనే చికిత్స పొందాలని సూచించారు. బాధితులను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందన్నారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ, రైలు ప్రమాద ఘటనలో మృతి చెందిన 13 మందికి, 30 మంది గాయపడిన వారికి కలసి మొత్తం 43 మందికి రాష్ట్ర ప్రభుత్వం రూ.2.59 కోట్లు పరిహారంగా అందజేస్తోందని మంత్రి బొత్స తెలిపారు. మంగళవారం 8 మందికి పరిహారం అందించామని, ఈ రోజు 12 మందికి పరిహారం అందజేశామని, రేపటిలోగా అందరికీ పరిహారం అందిస్తామని మంత్రి వెల్లడించారు. గాయాలపాలైన వారు జీవితాంతం బాధపడకుండా వారికి తోడ్పాటు అందించేందుకు ముఖ్యమంత్రి.. శాశ్వత అంగవైకల్యం పాలైన వారికి రూ.10 లక్షల సహాయం ప్రకటించారు. నెల రోజులకు మించి ఆసుపత్రిలో చికిత్స అవసరమయిన వారికి రూ.5 లక్షలు, నెల రోజుల్లోపు చికిత్స పూర్తయి ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయిన వారికి రూ.2 లక్షలు సహాయం అందిస్తున్నామని మంత్రి బొత్స తెలిపారు. చదవండి: వేమూరి రాధాకృష్ణకు లక్ష్మీ పార్వతి చురకలు -
సఫాయి కార్మికుల కుటుంబాలకు రూ.30 లక్షల పరిహారమివ్వాలి
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సఫాయి కార్మికులు విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోతున్న ఘటనలపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. మృతుల కుటుంబాలకు రూ.30 లక్షల పరిహారం చెల్లించాలని ప్రభుత్వ యంత్రాంగాన్ని ఆదేశించింది. అదేవిధంగా, డ్రెయినేజీలను శుభ్రం చేస్తూ శాశ్వత వైకల్యానికి గురయ్యే వారికి కనీసంగా రూ.20 లక్షల పరిహారం చెల్లించాలని కూడా పేర్కొంది. మాన్యువల్ స్కావెంజింగ్ విధానాన్ని పూర్తిగా లేకుండా చేయాలని జస్టిస్ ఎస్.రవీంద్ర భట్, జస్టిస్ అరవింద్ కుమార్లతో కూడిన ధర్మాసనం శుక్రవారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. ఒకవేళ సఫాయి కార్మికులు విధుల్లో ఇతర అవకరాలకు గురయిన సందర్భాల్లో రూ.10 లక్షలను పరిహారంగా చెల్లించాలని కూడా ఈ సందర్భంగా జస్టిస్ భట్ పేర్కొన్నారు. -
మెనోపాజ్పై బాస్ ఛీప్ కామెంట్లు..!
లండన్: మెనోపాజ్ను సాకుగా చూపుతూ సరిగా పని చేయడం లేదని కించపరిచే వ్యాఖ్యలు చేసిన బాస్ మీద కేసు పెట్టి రూ.37 లక్షల పరిహారం పొందిందో మహిళ. ఈ ఉదంతం స్కాట్లాండ్లో జరిగింది. కరెన్ ఫర్కార్సన్ అనే 49 ఏళ్ల మహిళ ఒక స్థానిక ఇంజనీరింగ్ సంస్థలో 1995 నుంచీ పని చేస్తోంది. మెనోపాజ్ దశ కారణంగా ఆందోళన, మెదడు ఉన్నట్టుండి మొద్దుబారడం వంటివాటి లక్షణాలతో బాధ పడుతున్నట్టు బాస్కు చెప్పింది. విపరీతంగా బహిష్టు స్రావం అవుతుండటం, బయట విపరీతంగా మంచు కురుస్తుండటంతో రెండు రోజులు ఇంటి నుంచి పని చేసింది. మర్నాడు ఆఫీస్కు వెళ్లగానే, ’పర్లేదే, వచ్చావు’ అంటూ బాస్ వ్యంగ్యంగా అన్నాడు. తన సమస్య గురించి మరోసారి వివరించినా, ’నొప్పులు, బాధలు అందరికీ ఉండేవే’అంటూ కొట్టిపారేశాడు. దాంతో ఆమె రాజీనామా చేసి కంపెనీపై కేసు పెట్టింది. తన వ్యాఖ్యల వెనుక దురుద్దేశం లేదన్న బాస్ వాదనను ట్రిబ్యునల్ కొట్టిపారేసింది. అతనిలో ఏ మాత్రమూ పశ్చాత్తాపం కనిపించడం లేదంటూ ఆక్షేపించి పరిహారం చెల్లించాలని కంపెనీని ఆదేశించింది. -
డాక్యుమెంట్లు తిరిగి ఇవ్వకపోతే రోజుకు రూ. 5 వేల పరిహారం
న్యూఢిల్లీ: రుణం పూర్తి చెల్లింపుల తర్వాత రుణానికి సంబంధించి తనఖాగా ఉంచిన ఒరిజినల్ స్థిర లేదా చర ఆస్తి పత్రాలు అన్నింటినీ రుణగ్రహీతకు 30 రోజుల లోపు తిరిగి ఇవ్వాలని రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) బ్యాంకులకు, ఫైనాన్స్ సంస్థలకు స్పష్టం చేసింది. ఏదైనా ఆలస్యం జరిగితే రోజుకు రూ. 5 వేలు పరిహారంగా చెల్లించాలని స్పష్టం చేసింది. అదేవిధంగా ఏదైనా రిజిస్ట్రీలో నమోదైన చార్జీలను అన్నింటినీ నిర్దేశిత 30 రోజుల్లో తీసివేయాలని కూడా ఒక నోటిఫికేషన్లో ఆర్బీఐ స్పష్టం చేసింది. ఈ తరహా పలు ఫిర్యాదుల నమోదు నేపథ్యంలో బ్యాంకింగ్ రెగ్యులేటర్ తాజా ఆదేశాలు ఇచి్చంది. డాక్యుమెంట్లు తిరిగి ఇవ్వడంలో నెల రోజులు దాటితే ఈ జాప్యానికి స్పష్టమైన కారణాలను రుణగ్రహీతకు తెలియజేయాల్సి ఉంటుందని ఆర్బీఐ బ్యాంకులను ఆదేశించింది. డాక్యుమెంట్లను తిరిగి ఇవ్వడానికి సంబంధించిన విధివిధానాల వివరాలను బ్యాంకింగ్ లేదా ఆర్థిక సంస్థలు తమ తమ వెబ్సైట్లో ఉంచాలని సూచించింది. నష్టం జరిగితే.. మరో 30 రోజులు ఒరిజినల్ చర లేదా స్థిర ఆస్తి పత్రాలు కనబడకుండా పోవడం లేదా ఏదైనా నష్టం జరిగితే అటువంటి పత్రాల డూప్లికేట్ లేదా సరి్టఫైడ్ కాపీలను పొందడంలో రుణగ్రహీతకు బ్యాంకులు, ఆర్థిక సంస్థలు పూర్తిగా సహాయపడాలని కూడా ఆర్బీఐ నిర్దేశించింది. ఇందుకు మరో 30 రోజుల సమయాన్ని తీసుకోవచ్చని పేర్కొంది. ఆ తర్వాతే (60 రోజుల తర్వాత) జాప్యానికి రోజుకు రూ.5 వేల పరిహారం నిబంధన వర్తిస్తుందని పేర్కొంది. కాగా, ఈ పరిహారం... ఇతర ఏదైనా (వర్తించే) చట్టం ప్రకారం ఏదైనా ఇతర పరిహారం పొందేందుకు రుణగ్రహీత కు ఉండే హక్కులకు ఎటువంటి భంగం కలిగించబోదని ఆర్బీఐ స్పష్టం చేయడం గమనార్హం. 2023 డిసెంబరు 1 తర్వాత ఒరిజినల్ చర లేదా స్థిరాస్తి పత్రాలను విడుదల చేసే అన్ని కేసులకు ఈ తాజా ఆదేశాలు వర్తిస్తాయని ఆర్బీఐ తెలిపింది. -
జంట హత్యల కేసు.. మాజీ ఎంపీకి జీవిత ఖైదు
న్యూఢిల్లీ: 1995లో జరిగిన జంట హత్యల కేసుల్లో లోక్సభ మాజీ ఎంపీ ప్రభునాథ్ సింగ్(70)కు సుప్రీంకోర్టు జీవిత ఖైదు విధించింది. రెండు బాధిత కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున, క్షతగాత్రులకు రూ.5 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని ఆదేశించింది. బిహార్ ప్రభుత్వం కూడా బాధితులకు ఇంతే మొత్తం చెల్లించాలని జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ సారథ్యంలోని ధర్మాసనం శుక్రవారం తీర్పు వెలువరించింది. ఇలాంటి కేసును గతంలో ఎన్నడూ చూడలేదన్న ధర్మాసనం.. ఈ కేసులో నిందితుడు ప్రభునాథ్ సింగ్ను నిర్దోషిగా ప్రకటిస్తూ దిగువ కోర్టు, పట్నా హైకోర్టు ఇచ్చిన తీర్పులను కొట్టివేసింది. సాక్ష్యాలన్నిటినీ మాయం చేసేందుకు ప్రభునాథ్ సింగ్ ప్రయత్నాలు చేశాడని పేర్కొంది. దర్యాప్తు అధికారి, పబ్లిక్ ప్రాసిక్యూటర్, న్యాయవ్యవస్థ తమ విధులను నిర్వర్తించడంలో పూర్తిగా విఫలమయ్యాయంది. ఇద్దరి హత్యతోపాటు మరో మహిళపై హత్యాయత్నం కేసుల్లో ఆగస్ట్ 18వ తేదీన ప్రభునాథ్ సింగ్ను సుప్రీంకోర్టు దోషిగా నిర్థారించింది. 1995 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభునాథ్ సింగ్ బిహార్ పీపుల్స్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశాడు. ఓటింగ్ రోజు చప్రాలోని పోలింగ్ స్టేషన్ నుంచి వస్తున్న కొందరు స్థానికులను ఎవరికి ఓటేశారంటూ కారులో వచ్చిన సింగ్ ఆరా తీశాడు. వేరే పార్టీకి ఓటేశామంటూ రాజేంద్ర రాయ్, దరోగా రాయ్ మరికొందరు సమాధానమిచ్చారు. ఆగ్రహంతో సింగ్ తన వద్ద ఉన్న రైఫిల్తో వారిపైకి కాల్పులు జరపగా ముగ్గురు గాయపడ్డారు. వీరిలో రాజేంద్ర రాయ్, దరోగా రాయ్ అనంతరం చికిత్స పొందుతూ చనిపోయారు. ఘటనపై చప్రా పోలీస్స్టేషన్లో 1995 మార్చి 25న కేసు నమోదైంది. 1995లోనే జనతాదళ్ ఎమ్మెల్యే అశోక్ సింగ్ సొంతింట్లో హత్యకు గురైన కేసులో సింగ్ ప్రస్తుతం హజారీబాగ్ జైలులో ఉన్నాడు. -
జీహెచ్ఎంసీ ఆఫీసులోకి కాంగ్రెస్ నేతలు.. లోపల కూర్చుని నిరసన
Updates.. ► జీహెచ్ఎంసీ కార్యాలయంలో కాంగ్రెస్ నేతలు ధర్నాకు దిగారు. ఆఫీసు లోపల బైఠాయించి నేతలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. వినతి పత్రం ఇస్తే జీహెచ్ఎంసీ కమిషనర్ అమర్యాదగా ప్రవర్తించారంటూ నిరసనలు తెలిపారు. ► జీహెచ్ఎంసీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఆఫీసు వద్దకు కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. ► జీహెచ్ఎంసీ ఆఫీసు ముట్టడికి కాంగ్రెస్ నేతలు ప్రయత్నించారు. ► దీంతో, వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ నేతలు, పోలీసులు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ► ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతలు మాట్లాడుతూ.. వరదల నేపథ్యంలో జీహెచ్ఎంసీ పూర్తిగా విఫలమైంది. మంత్రి కేటీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. జీహెచ్ఎంసీ గేట్లు ఎక్కే ప్రయత్నం చేశారు. సాక్షి, హైదరాబాద్: తెలంగాణవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. పలుచోట్ల రికార్ఢు స్థాయిలో వర్షం కురువడంతో జనజీవనం అస్తవ్యస్థమైంది. ఇటు, భారీ వరదల కారణంగా చెరువులు, వాగులు ఉప్పొంగి ప్రవహించడంతో పలువురు గల్లంతు కాగా, కొంతమంది మృత్యువాతపడ్డారు. మరోవైపు.. హైదరాబాద్లో కూడా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఈ నేపథ్యంలో వర్షాలపై అప్రమత్తం కానందుకు అధికార బీఆర్ఎస్ పార్టీపై కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో నేడు(శుక్రవారం) జీహెచ్ఎంసీ ముట్టడికి కాంగ్రెస్ పిలుపునిచ్చింది. వరద బాధితులకు రూ.10వేల చొప్పున పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో, తెలంగాణ పోలీసులు శుక్రవారం ఉదయం నుంచే జీహెచ్ఎంసీ ఎదుట భారీగా మోహరించారు. జీహెచ్ఎంసీకి ఉన్న మూడు గేట్ల దగ్గర పోలీసులు భారీగా మోహరించారు. ఇది కూడా చదవండి: గోదావరి ఉగ్రరూపం.. అధికారులు అలర్ట్ -
మైనర్పై అఘాయిత్యం.. బాధిత కుటుంబానికి అండగా ఏపీ ప్రభుత్వం
సాక్షి, కృష్ణా జిల్లా: పామర్రు మండలం నిభానుపూడికి చెందిన మైనర్ బాలిక కుటుంబానికి ఏపీ ప్రభుత్వం అండగా నిలిచింది. అత్యాచారానికి గురై బలన్మరణానికి పాల్పడ్డ బాలిక కుటుంబానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రూ.10 లక్షల ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. ఈ మేరకు హోంమంత్రి తానేటి వనిత, మంత్రి జోగి రమేష్, పామర్రు ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ సోమవారం బాలిక కుటుంబాన్ని పరామర్శించి.. ప్రభుత్వం తరపున ఆమె తల్లిదండ్రులకు పదిలక్షల రూపాయల చెక్కును అందజేశారు. బాధాకరమైన ఘటనలు రాజకీయం చేయొద్దు! హోంమత్రి తానేటి వనిత మాట్లాడుతూ.. మైనర్ బాలిక అత్యాచారానికి గురవ్వడం, ఆమె చనిపోవడం చాలా బాధాకరమన్నారు. ఇలాంటి పరిస్థితులు మరెవరికీ రాకూడదని విచారం వ్యక్తం చేశారు. ఈ కేసును పోలీసులు వేగంగా దర్యాప్తు చేసి నిందితులను అరెస్ట్ చేశారని తెలిపారు. బాలిక కుటుంబానికి ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని, విచారణ పూర్తయ్యాక నిందితులను కఠినంగా శిక్షిస్తామని చెప్పారు. ఇలాంటి బాధాకరమైన ఘటనలను అనవసరంగా రాజకీయం చేయొద్దని కోరారు. వేగంగా స్పందించిన సీఎం ఏ కుటుంబంలో ఇలాంటి దురృష్టకర సంఘటన జరగకూడదని మంత్రి జోగి రమేష్ పేర్కొన్నారు. త్వరతగతిన విచారణ పూర్తిచేసి నిందితులకు శిక్ష పడేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. బాలిక మృతి విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లగానే వెంటనే స్పందించారని పామర్రు ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ పేర్కొన్నారు. వెంటనే పదిలక్షల రూపాయలు సహాయం ప్రకటించడంతో పాటు హోంమంత్రిని పంపించారని చెప్పారు. నిందితులను కఠినంగా శిక్షించాలంటూ సీఎం జగన్ ఆదేశాలిచ్చారని ఎమ్మెల్యే పేర్కొన్నారు, మైనర్ బాలిక కుటుంబానికి ప్రభుత్వం తరపున, స్థానిక ఎమ్మెల్యేగా తాను అండగా ఉంటామని.. నేరం చేసిన వారు ఎంతటివారైనా సరే కఠినంగా శిక్ష పడేలా చేస్తామని తెలిపారు,. బాలిక మృతిపై సమగ్ర దర్యాప్తు పామర్రుకు బాలిక ఘటనపై సమగ్ర దర్యాప్తు చేయాలని కృష్ణా జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ను ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ ఆదేశించారు. ఈ మేరకు జిల్లా ఎస్పీకి మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ ఆదేశాలు జారీ చేశారు. ఈ ఘటనపై వార్తా పత్రికలలో వెలువడిన కథనాలను సుమోటోగా స్వీకరించినట్టు ఆమె తెలిపారు. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేట్టాలని కోరారు. ఈ సందర్భంగా కేసు విచారణా వివరాలను ఎస్పీ మహిళా కమిషన్ చైర్ పర్సన్కు వివరించారు. సీసీటీవీ ఫుటేజ్ వివరాలను వెల్లడించారు. అన్ని కోణాల్లో కేసును దర్యాప్తు చేస్తున్నామని 15 రోజులలో చార్జ్ షీట్ కూడా దాఖలు చేస్తామని వాసిరెడ్డి పద్మకు సీపీ తెలిపారు. నిందితులకు కరిన శిక్ష పడే వరకు విచారణ వేగవంతంగా పూర్తిచేయాలని వాసిరెడ్డి పద్మ కోరారు. కేసును చేధించిన పోలీసులు పామర్రు మండలంలో మైనర్ బాలిక మృతి కేసును పోలీసులు చేధించారు. అత్యాచారం చేయడం వల్లే అవమానంతో బాలిక ఆత్మహత్య చేసుకున్నట్లు నిర్ధారించారు. నిమ్మకూరు హైస్కూల్లో తొమ్మిదవ తరగతి చదువుతున్న నిభానుపూడి గ్రామానికి చెందిన బాలిక (14)ను.. ప్రేమపేరుతో లోకేష్ (20) అనే యువకుడు దగ్గరయ్యాడు. ఈనెల 20వ తేదీన స్కూల్కు వెళుతున్నానని చెప్పి ఇంటి నుంచి బాలిక బయటకు వచ్చింది. అయితే స్కూల్కు వెళ్లకుండా లోకేష్తో ఉయ్యూరు వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. ఉయ్యూరులోని ఓ లాడ్జిలో తన బంధువైన నరేంద్రతో కలిసి బాలికపై బలవంతంగా అత్యాచారానికి పాల్పడ్డాడు లోకేష్. అత్యాచారం తర్వాత బాలికను నిభానుపూడి సమీపంలో వదిలిపెట్టాడు. అయితే అవమానం భరించలేక కాలువలో దూకి ఆత్మహత్య చేసుకుంది బాలిక. అదే రోజు తమ కుమార్తె కనిపించడం లేదని బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుల అరెస్ట్ నిందితులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ శ్రీకాంత్ తెలిపారు. బాలిక మిస్సింగ్ కేసు నమోదైన వెంటనే 8 బృందాలతో దర్యాప్తు చేపట్టామన్నారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్న క్రమంలో కాలువలో మైనర్ బాలిక మృతదేహం లభ్యమైంది. నిందితులు లోకేష్, నరేంద్ర, రాజేష్లను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల పై 376(B),376(VA),342, ఐపీసీ సెక్షన్,13 పోక్సో, ఎస్సీ ఎస్టీ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. నిందితుల పై రౌడీ షీట్లు తెరుస్తామని ఎస్పీ జాషువా తెలిపారు. అతి త్వరలో ఛార్జిషీట్ నమోదు చేసి నిందితులకు కఠిన శిక్ష పడే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. -
ఆర్బీకేల్లో పంటల బీమా జాబితాలు
సాక్షి, అమరావతి: ఖరీఫ్–2022 సీజన్లో పంటల్ని నష్టపోయిన రైతులకు వైఎస్సార్ ఉచిత పంటల బీమా అందజేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా జూలై 8వ తేదీన నిర్వహించే రైతు దినోత్సవం రోజున ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బటన్ నొక్కి నేరుగా రైతుల ఖాతాల్లోకి నష్టపరిహారాలను జమ చేయనున్నారు. పంట నష్టపోయిన రైతుల జాబితాలను ఆర్బీకేల్లో గురువారం నుంచి ప్రదర్శిస్తున్నారు. జూలై 3వ తేదీ వరకు అభ్యంతరాలను స్వీకరించి.. అనంతరం తుది జాబితాలను ప్రకటిస్తారు. 10.20 లక్షల మంది రైతులకు పరిహారం ఖరీఫ్–2022 సీజన్లో దిగుబడి ఆధారిత పంటలకు ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజనతో కలిపి ఉచిత పంటల బీమా పథకాన్ని అమలు చేస్తుండగా.. వాతావరణ ఆధారిత పంటలకు మాత్రం రాష్ట్ర ప్రభుత్వమే వైఎస్సార్ ఉచిత పంటల బీమా అమలు చేస్తోంది. నోటిఫై చేసిన దిగుబడి ఆధారిత పంటలకు సంబంధించి రైతుల వాటాతోపాటు రాష్ట్ర ప్రభుత్వం తన వాటాను బీమా కంపెనీలకు చెల్లించింది. ఖరీఫ్–2022 సీజన్లో పంటలు నష్టపోయిన వారిలో 10.20 లక్షల మంది అర్హత పొందగా.. వీరికి రూ.1,117.21 కోట్ల పరిహారం చెల్లించాలని లెక్క తేల్చారు. దిగుబడి ఆధారిత పంటలకు సంబంధించి రూ.572.59 కోట్లు, వాతావరణ ఆధారిత పంటలకు సంబంధించి రూ.544.62 కోట్లు చెల్లించాలని లెక్కతేల్చారు. అర్హుల జాబితాలను సామాజిక తనిఖీ నిమిత్తం ఆర్బీకేల్లో ప్రదర్శిస్తున్నారు. పంట విస్తీర్ణం తదితర అంశాలపై ఏదైనా అభ్యంతరాలుంటే సంబంధిత ఆర్బీకేలో జూలై 3వ తేదీ వరకు లిఖిత పూర్వకంగా దరఖాస్తు చేసుకోవచ్చు. -
క్షతగాత్రులకు లక్ష...మృతుడి కుటుంబానికి 10 లక్షలు
-
మణిపూర్లో అమిత్ షా పర్యటన.. వారికి రూ.10 లక్షల నష్టపరిహారం
మణిపూర్ ఇటీవల చెలరేగిన అల్లర్లలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం సంయుక్తంగా రూ. 10 లక్షలు నష్టపరిహారం ప్రకటించింది. అదే విధంగా మరణించిన వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగాన్ని ఇవ్వనున్నట్లు వెల్లడించింది. కాగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా నేడు (మంగళవారం) మణిపూర్లో పర్యటించారు. అల్లర్లు జరిగిన చురాచంద్ పూర్ జిల్లాలోని స్థితిగతులను పరిశీలించారు. తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి బైరెన్ సింగ్తో భేటీ అయ్యి జరిగిన ఆస్తి నష్టానికి, ప్రాణ నష్టానికి ఏ విధమైన పరిహారం అందించాలన్న విషయంపై చర్చించారు. ఈ సందర్బంగా కేంద్రమంత్రి మాట్లాడుతూ మణిపూర్లో ఇటువంటి సంఘటన జరగడం దురదృష్టకరమని, ప్రాణనష్టం జరిగిన కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా వెంటనే అందిస్తామని తెలిపారు. పెట్రోల్, గ్యాస్, రైస్, నిత్యావసర వస్తువులకు కొదవ రానీయకుండా జాగ్రత్తలు తీసుకుంటామని తెలిపారు. ఇదిలా ఉండగా ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్లో మే 3న ఉన్నట్టుండి అల్లర్లు చెలరేగి మారణహోమం జరగడంతో యావత్ భారతదేశం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. Had a fruitful discussion with the members of the different Civil Society Organizations today in Imphal. They expressed their commitment to peace and assured that we would together contribute to paving the way to restore normalcy in Manipur. pic.twitter.com/ao9b7pinGf — Amit Shah (@AmitShah) May 30, 2023 రాష్ట్రంలో ఎప్పటి నుంచో ఆశ్రయముంటున్న మెయితేయి వారికి కుకి తెగల మధ్య రగిలిన చిచ్చు చిన్న గాలివానలా మొదలై పెనుమంటలను రాజేసింది. భారీగా ఆస్తి నష్టానికి, ప్రాణనష్టానికి దారితీసింది. ఈ అల్లర్లలో సుమారుగా 70 మంది ప్రాణాలను కోల్పోగా 230 మంది గాయపడ్డారు. సుమారుగా 1700 ఇళ్ళు అగ్నికి ఆహుతయ్యాయి. చదవండి: రోడ్డుపై లవర్స్ రొమాంటిక్ వీడియో.. కేసుపై పోలీసుల తంట..! -
దిగిపోతున్న ఈ సీఈవో అందుకున్న పరిహారం రూ. 22 కోట్లు!
త్వరగా అమ్ముడయ్యే వినియోగ వస్తువుల (ఎఫ్ఎంసీజీ) వ్యాపార దిగ్గజం హిందూస్థాన్ యూనిలివర్ లిమిటెడ్ (హెచ్యూఎల్) సీఈవో, ఎండీ భారీ పరిహారాన్ని అందుకున్నారు. వచ్చే నెలలో దిగిపోతున్న సంజీవ్ మెహతా 2022 - 23 ఆర్థిక సంవత్సరానికి గానూ రూ. 22 కోట్లకు పైగా పరిహారాన్ని అందుకున్నారు. ఇందులో రూ. 6.3 కోట్ల బోనస్కూడా ఉంది. బోనస్ దాదాపు 50 శాతం పెరగడంతో సరాసరిగా మొత్తం పరిహారం గత ఆర్థిక సంవత్సరంతో పోల్చితే భారీగా పెరిగింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో 5 శాతం అంతర్గత వ్యాల్యూమ్ వృద్ధిని సాధించిన హెచ్యూఎల్ 16 శాతం వృద్ధితో రూ. 58,154 కోట్ల టర్నోవర్ సాధించింది. దాదాపు దశాబ్దం పాటు కొనసాగిన సంజీవ్ మెహతా పదవీకాలంలో జూన్ నెలలో ముగియనుంది. ఇన్పుట్ కాస్ట్ ద్రవ్యోల్బణం కారణంగా తలెత్తిన కఠినమైన పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొని కంపెనీ పోర్ట్ఫోలియో అత్యధిక మార్కెట్ వాటా పొందేలా చేసిన ఘనత సంజీవ్ మెహతాకు దక్కుతుంది. జూన్ 27న పదవి నుంచి దిగిపోతున్న సంజీవ్ మెహతా కొత్త సీఈవో రోహిత్ జావాకు బాధ్యతలు అప్పగించనున్నారు. సింగపూర్ పౌరుడైన రోహిత్ జావా కూడా రూ. 21 కోట్లకు పైగా రెమ్యునరేషన్ అందుకుంటారు. ఇందులో రూ. 7 కోట్ల టార్గెట్ బోనస్కూడా ఉంటుంది. ఇదీ చదవండి: Ritesh Agarwal: ఆ పని చేసినందుకు రూ.20 టిప్పు ఇచ్చారు: తొలినాళ్లను గుర్తు చేసుకున్న ఓయో ఫౌండర్ -
గన్నవరం: భానురేఖ కుటుంబానికి సీఎం సిద్ధరామయ్య పరిహారం ప్రకటన
సాక్షి, బెంగళూరు/గన్నవరం: కర్ణాటకలో ఊహించని రీతిలో వరద ప్రమాదంలో మృతి చెందింది ఏపీ యువతి భానురేఖా రెడ్డి(23). కుటుంబంతో సరదాగా బయటకు వెళ్లగా.. అండర్ పాస్లో భారీగా నిలిచిన నీటిలో ట్యాక్సీ చిక్కుకుని ఆమె కన్నుమూసింది. ఈ ఘటన గురించి తెలియగానే సీఎం సిద్ధరామయ్య వెంటనే సెయింట్ మార్తా ఆస్పత్రికి వెళ్లారు. భానురేఖ మృతదేహాన్ని పరిశీలించి.. ఆమె కుటుంబ సభ్యులను ఓదార్చారు. బాధిత కుటుంబానికి ఐదు లక్షల పరిహారం ప్రకటించడంతో పాటు ఆస్పత్రిలో చేరిన నలుగురు కుటుంబ సభ్యులకు ఉచిత చికిత్స అందించనున్నట్లు ప్రకటించారు. కృష్ణా జిల్లా(ఏపీ) ఉంగుటూరు మండలం తేలప్రోలు గ్రామానికి చెందిన భానురేఖ ఎలక్ట్రానిక్ సిటీలోని ఇన్ఫోసిస్ క్యాంపస్లో పని చేస్తున్నారు. కుటుంబంతో సహా బెంగళూరు చూడాలని ఆదివారం సాయంత్రం ఓ క్యాబ్ను బుక్ చేసుకుని బయల్దేరింది. అండర్పాస్లోని బారికేడ్ పడిపోవడం, అది గమనించకుండా రిస్క్ చేసి ఆ నీళ్లలోంచి వెళ్లాలని డ్రైవర్ ప్రయత్నించడం వల్లే ఈ ఘోరం జరిగిందని సీఎం సిద్ధరామయ్య మీడియాకు ఘటన గురించి వివరించారు. దర్యాప్తు చేస్తాం! ఇదిలా ఉంటే.. భానురేఖను ఆస్పత్రికి తీసుకొచ్చే సమయానికి ఆమె కొన ఊపిరితో ఉందని, ఆమెకు చికిత్స అందించేందుకు వైద్యులు నిరాకరించారని, దానికి తామే సాక్షులమని కొందరు రిపోర్టర్లు సీఎం సిద్ధరామయ్య వద్ద ఆరోపించారు. ఈ ఆరోపణలపై సీఎం సిద్ధరామయ్య స్పందిస్తూ.. దర్యాప్తు జరిపి రుజువైతే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అయితే ఆస్పత్రి వర్గాలు మాత్రం భానురేఖ ఆస్పత్రికి చేరుకునేలోపే చనిపోయిందని అంటున్నాయి. Karnataka CM Siddaramaiah met the family members of 23-year-old woman Bhanurekha who died after drowning in the waterlogged underpass in KR Circle area in Bengaluru. pic.twitter.com/aqQW3yG0Qy — ANI (@ANI) May 21, 2023 డ్రైవర్ దూకుడు వల్లే.. ఆదివారం సాయంత్రం తన కుటుంబంతో కలిసి సరదాగా బయటకు వెళ్తామని క్యాబ్ బుక్ చేసుకుంది భానురేఖ. భానురేఖ, ఐదుగురు కుటుంబ సభ్యులు క్యాబ్లో బయల్దేరారు. అయితే కేఆర్ సర్కిల్ అండర్ పాస్ వద్ద భారీగా వరద నీరు చేరి ఉంది. ఆ సమయంలో అవతలి ఎండ్లో ఎదురుగా కొన్ని వాహనాలు నిలిచి ఉండడం గమనించిన క్యాబ్ డ్రైవర్.. వెళ్లిపోవచ్చనే ఉద్దేశంతో కారును వేగంగా ముందుకు పోనిచ్చే యత్నం చేశాడు. కారు అండర్పాస్ మధ్యలోకి రాగానే.. ఒక్కసారిగా మునిగిపోయింది. దీంతో క్యాబ్లోని భానురేఖ కుటుంబ సభ్యులు కేకలు వేస్తూ సాయం కోసం ఆర్తనాదాలు చేశారు. బయటకు వచ్చి తమ ప్రాణాలు కాపాడుకునే ప్రయత్నం చేశారు. ఈలోపు అక్కడ గుమిగూడిన కొందరు వాళ్లను రక్షించే యత్నం చేశారు. చీరలు, తాడులు విసిరి వాళ్లను బయటకు లాగేందుకు ప్రయత్నించారు. నీరు క్రమక్రమంగా వేగంగా అండర్పాస్ను ముంచెత్తడంతో అది సాధ్యపడలేదు. ఈలోపు అక్కడికి చేరుకున్న సహాయక సిబ్బంది ఈదుకుంటూ వెళ్లిన ఇద్దరిని రక్షించారు. ఆపై నిచ్చెన ద్వారా అందరినీ బయటకు లాగి ఆస్పత్రికి తరలించారు. అయితే ఆస్పత్రికి చేరుకున్నాక భానురేఖ మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. అదే కేఆర్ సర్కిల్లోని అదే పాస్ వద్ద మరో మహిళా ప్యాసింజర్ ఆటోతో సహా చిక్కుకుపోగా.. పైకి ఎక్కి ఆమె తన ప్రాణాలను రక్షించుకుంది. రెస్క్యూ సిబ్బందిని ఆమెను బయటకు తీసుకొచ్చారు. కేవలం గంట పాటు కురిసిన భారీ వర్షానికి.. ఇలా ఆ లోతట్టు ప్రాంతం మునిగిపోవడంతోనే ఈ విషాదం నెలకొంది. స్వగ్రామంలో విషాద ఛాయలు సాక్షి, కృష్ణా: బెంగుళూరులో సాఫ్ట్ వేర్ ఉద్యోగిని బత్తుల భాను రేఖ మృతితో స్వగ్రామం తేలప్రోలులో విషాదఛాయలు అలుముకున్నాయి. ఆమె తండ్రిది వీరపనేనిగూడెం. అయితే.. భాను రేఖ మాత్రం తల్లితో కలిసి అమ్మమ్మ ఇంట్లోనే పెరిగింది. బెంగళూరుకు వెళ్లకముందు ఆమె హైదరాబాద్లో ఉంది. ఆదివారం జరిగిన ఘటనలో ఆమె కన్నుమూసింది. ఉంగుటూరు మండలం తేలప్రోలులోని ఇంటివద్ద భాను రేఖ పార్థివదేహం కోసం కుటుంబ సభ్యులు ఎదురు చూస్తున్నారు. అయితే.. పోస్టుమార్టం అనంతరం బెంగుళూరు నుండి తేలప్రోలుకి భాను భౌతిక కాయం చేరుకోనుంది. -
రూ.2 కోట్ల భారీ నష్టపరిహారం
న్యూఢిల్లీ: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఒక ప్రభుత్వ ఉద్యోగి కుటుంబానికి రూ.2 కోట్లకు పైగా నష్టపరిహారం ఇవ్వాలని నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీకి ట్రిబ్యునల్ ఆదేశాలు జారీ చేసింది. మనీష్ గౌతమ్ అనే ప్రభుత్వ ఉద్యోగి ఢిల్లీలోని రోహిణి మార్గ్లో 2019 మే 31న రోడ్డు పక్కన నడుస్తుండగా వేగంగా వచ్చిన కారు ఢీ కొంది. ఆ ప్రమాదంలో తీవ్రంగా గాయాలపాలైన గౌతమ్ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటూ ఆ మర్నాడు జూన్ 1న మరణించారు. అయితే బాధితుడు నిర్లక్ష్యంగా ఉండడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని, అందుకే నష్టపరిహారం ఇవ్వాల్సిన పని లేదని ఇన్సూరెన్స్ కంపెనీ చేసిన వాదనలను ట్రిబ్యునల్ న్యాయమూర్తి తోసిపుచ్చారు. గౌతమ్ కుటుంబ సభ్యులకు 2 కోట్ల 50 వేల రూపాయలు చెల్లించాల్సిందేనని ఆదేశించారు. -
వర్షాలకు దెబ్బతిన్న ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ వేగవంతం
-
సుందర్ పిచాయ్పై సొంత ఉద్యోగులే ఆగ్రహం.. జీతం తిరిగి వెనక్కి ఇచ్చేస్తారా?
ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ తీరుపట్ల ఆ సంస్థ ఉద్యోగులు అసహనం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. కంపెనీలోని ఉద్యోగులకు కాస్ట్ కటింగ్ నిబంధనలు అమలు చేస్తున్న సమయంలో సీఈవో భారీ ఎత్తున వేతనాలు ఇవ్వడం చర్చాంశనీయంగా మారింది. ఇప్పుడు ఇదే విషయాన్ని ఉద్యోగులు సైతం ఇంట్రర్నల్ ఫోరమ్లో సంస్థను ప్రశ్నిస్తున్నారంటూ పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో గూగుల్ సెక్యూరిటీస్ ఫైలింగ్లో సుందర్ పిచాయ్కు ఎంత వేతనం చెల్లిస్తుందనే విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నారు. వ్యయ నియంత్రణ అంటూ ఉద్యోగులకు భారీగా కోతపెడుతున్న గూగుల్.. సీఈవోకు మాత్రం 2022 సంవత్సరానికి రూ.1,850 (226 మిలియన్ డాలర్లు) కోట్ల పారితోషికం ఇచ్చింది. గూగుల్లో సగటు ఉద్యోగి వేతనంతో పోల్చితే.. ఇది 800 రెట్లు ఎక్కువ అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో గూగుల్ మాతృసంస్థ అయిన ఆల్ఫాబెట్ జనవరిలో గ్లోబుల్ వర్క్ ఫోర్స్లో 6 శాతంతో సుమారు 12 వేల మందిని విధుల నుంచి తొలగించడాన్ని తప్పుబడుతున్నారు. చదవండి👉 'AI'తో 30కోట్ల ఉద్యోగాలు ఉఫ్!.. గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ ఏమన్నారంటే? సుందర్ పిచాయ్ వర్సెస్ టిమ్కుక్ సుందర్ పిచాయ్ కాంపన్సేషన్ కింద భారీ మొత్తాన్ని చెల్లిస్తున్నట్లు గూగుల్ తెలిపింది. దీంతో సీఈవోకి చెల్లించే వేతనాల విషయంలో గూగుల్ ఉద్యోగులు పిచాయ్ వేతనాన్ని, యాపిల్ సీఈవో టిమ్కుక్ వేతనంతో పోల్చుతూ మీమ్స్ను షేర్ చేస్తున్నారు. టిమ్కుక్ గత ఏడాదిలో సుమారు 40 శాతం వేతనంలో కోత విధించుకున్న విషయాన్ని గుర్తు చేస్తూ మీమ్స్ వేస్తున్నారు. కంపెనీ ఖర్చులను తగ్గించుకున్నప్పటికీ సుందర్ పిచాయ్ వేతనాల పెంపుపై గూగుల్ ఇంట్రర్నల్ ఫోరమ్లో ఉద్యోగులు సంస్థకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. వీపీఎస్, సీఈవో మినహా అందరికీ వర్తిస్తుంది మార్చి నెలలో గూగుల్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ రూత్ పోరట్ ఉద్యోగులకు మెమో పంపారు. సంస్థ ఖర్చుల్ని తగ్గించుకునే పనిలో భాగంగా స్నాక్స్, లంచ్లు, లాండ్రీ, మసాజ్ సర్వీసులు ఆఫీసులో ఉండవని ప్రకటించింది. ఇలా ఆదా చేసిన డబ్బుల్ని మరిన్ని కీలకమైన పరిశోధనలకు ఖర్చు పెడతామని పేర్కొన్నారు. అందులో ఖర్చు ఆదా అందరికీ వర్తిస్తుంది. సంస్థ కోసం కష్టపడే వైస్ ప్రెసిడెంట్ సీఈవోకి మినహాయింపు ఉంటుందని గూగుల్ ఎంప్లాయిస్ ఫోరమ్లో పోరట్ స్పష్టం చేశారు. కాగా, ఉద్యోగుల నుంచి వస్తున్న విమర్శలపై గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ స్పందన ఎలా ఉంటుందోనని నెటిజన్లు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. విమర్శలకు చెక్ పెట్టేలా జీతాన్ని తిరిగి వెనక్కి ఇచ్చేస్తారా? లేదంటే నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న ఉద్యోగులపై చర్యలు తీసుకుంటారా? అని చర్చించుకుంటున్నారు. చదవండి👉 ఆ ఇద్దరు ఉద్యోగుల కోసం.. రెండు కంపెనీల సీఈవోలు పోటీ..రేసులో చివరికి ఎవరు గెలిచారంటే? -
మృతుడి కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థిక సాయం
సాక్షి, రాజమహేంద్రవరం(తూర్పుగోదావరి): నగరంలోని తిలక్ రోడ్డు షిరిడీ సాయి మార్గ్ జంక్షన్లో నిర్మాణ దశలో ఉన్న డ్రెయినేజీలో గత వారం రోజుల కిందట దురదృష్టవశాత్తు కాలు జారి పడి మృతిచెందిన ఏరుకొండ నాగేశ్వరరావు కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ చీఫ్ విప్, రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రామ్ తెలిపారు. మృతుడు నాగేశ్వరరావు కుటుంబానికి నగర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున రూ.10 లక్షలు ఆర్థిక సహాయాన్ని ఎంపీ భరత్ గురువారం అందజేశారు. అలాగే డ్రెయినేజీ కాంట్రాక్టర్ తరపున మరో రూ.5 లక్షలు నష్టపరిహారాన్ని ఎంపీ భరత్ చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీ భరత్ మీడియాతో మాట్లాడుతూ ఇటువంటి సహాయ సహకారాలను బహిర్గతం చేయకూడదని, కానీ ప్రతిపక్ష నేతలు, ముఖ్యంగా టీడీపీ నాయకులు కొంతమంది శవ రాజకీయాలు చేయడం వల్ల చెప్పక తప్పడం లేదన్నారు. చదవండి: చంద్రబాబు నోరు.. రామోజీ రాతలు ఒక్కటే: మంత్రి బొత్స జరిగిన సంఘటన దురదృష్టకరం.. మానవతా దృక్పథంతో ఆదుకోవాలి.. తప్పిస్తే ఇటువంటి విషాదకర సంఘటనలను తమ స్వప్రయోజనాలకు వాడుకోవడం మంచిది కాదన్నారు. ఇంటి పెద్దను కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న ఆ కుటుంబానికి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. జరిగిన ఈ సంఘటనను సీఎం జగన్ దృష్టికి కూడా తీసుకువెళ్లామని.. ఆయన చాలా బాధపడ్డారన్నారు. మృతుని ఇంట్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇప్పించే విధంగా చర్యలు తీసుకుంటామని ఎంపీ భరత్ హామీ ఇచ్చారు. ఎంపీ వెంట నగర పార్టీ అధ్యక్షుడు అడపా శ్రీహరి, బొమ్మన జయ్ కుమార్, కొత్త బలమురళి, కంతారం పాటిల్,సీరపు నగేష్ చంద్రరెడ్డి, దుంగ సురేష్, తదితరులు ఉన్నారు. చదవండి: హోంశాఖపై సమీక్ష.. సీఎం జగన్ కీలక ఆదేశాలు -
AP: ‘రైతులు అపోహలు నమ్మొద్దు.. అండగా ఉంటాం’
సాక్షి, అమరావతి: రైతులకు ఏ ఇబ్బంది లేకుండా చూడాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారని వ్యవసాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. వర్షాలు, రైతుల సమస్యలపై సీఎం సమీక్ష నిన్న, నేడు నిర్వహించారని.. ఈ మేరకు వ్యవసాయశాఖ, సివిల్ సప్లై, మార్కెటింగ్శాఖలకు పలు సూచలను, ఆదేశాలు జారీ చేశారని పేర్కొన్నారు. ఫీల్డ్కు ఎవరూ వెళ్లడం లేదు, సర్వే చేయడం లేదనడం సరికాదని అన్నారు వర్షాలు పడుతున్నప్పుడు సర్వే చేయడం కుదరదని.. వర్షాలు తగ్గిన తర్వాత సర్వే చేసి ప్రతీ రైతు నుంచి నష్టం అంచనాలు సేకరిస్తామని చెప్పారు. ఒక్క రైతు కూడా ఇబ్బంది ఉండదు ‘సోషల్ ఆడిట్ కోసం లిస్ట్ను ఆర్బీకేల్లో డిస్ప్లే చేస్తాం. వాతావరణశాఖ సమాచారం మేరకు 8వ తేదీ వరకూ వర్షాలు పడే అవకాశం ఉంది. ఒక్క రైతు కూడా ఇబ్బంది పడకుండా నష్టం అంచనాలు రూపొందిస్తాం. రైతుకు ఏ సమస్య వచ్చినా ఆర్బీకే కేంద్రాల్లో సిబ్బంది సిద్ధంగా ఉన్నారు. ఆర్బీకే కేంద్రాల్లో ఎవరైనా సిబ్బంది స్పందించకపోతే టోల్ ఫ్రీ నెంబర్ -155251 ఫిర్యాదు చేయొచ్చు. రైతులకు వ్యవసాయశాఖ పూర్తిగా అండగా ఉంటుంది’ అని గోపాల కృష్ణ ద్వివేది తెలిపారు. చదవండి: చంద్రబాబు నోరు.. రామోజీ రాతలు ఒక్కటే: మంత్రి బొత్స ఏ సీజన్లో దెబ్బతిన్న పంటలకు ఆ సీజన్లోనే పరిహారం: హరికిరణ్ మార్చి నెలలో కూడా ఇదే మాదిరి అకాల వర్షాలకు పంట నష్టం ఏర్పడిందని వ్యవసాయశాఖ స్పెషల్ కమిషనర్ హరికిరణ్ తెలిపారు. వ్యవసాయ పంటలు 17,820 హెక్టార్లు దెబ్బతిన్నాయని, ఉద్యానపంటలు 5652 హెక్టార్లు దెబ్బతిన్నాయన్నారు. మార్చి నెలలో వర్షాలకు దెబ్బతిన్న పంటలకు 34కోట్ల 22లక్షలు నష్టం వాటిల్లినట్లు అంచనా వేసినట్లు తెలిపారు. ఏ సీజన్ లో దెబ్బతిన్న పంటలకు ఆ సీజన్లోనే పరిహారం అందిస్తున్నామన్నారు. నష్టం వాటిల్లిన ప్రతీ రైతును గుర్తిస్తాం ప్రస్తుత వర్షాలకు జొన్న, మొక్కజొన్న, వరి పంటలకు ఎక్కువ నష్టం వాటిల్లినట్లు తెలుస్తోందని, వర్షాలు తగ్గిన తర్వాత నష్టం వాటిల్లిన ప్రతీ రైతును గుర్తిస్తామని చెప్పారు. 2023 ఖరీఫ్ సీజన్ మొదలయ్యేలోపే మార్చి నెల , ప్రస్తుత వర్షాల వల్ల నష్టపోయిన రైతులకు పరిహారం అందిస్తామని పేర్కొన్నారు. చదవండి: మృతుడి కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థిక సాయం రూ.7208 కోట్లను రైతుల ఖాతాల్లో జమ: అరుణ్కుమార్ మార్చి 31తో ఖరీఫ్ ప్రొక్యూర్మెంట్ ముగిసిందని, 6లక్షల 45వేల మంది రైతుల నుంచి 35లక్షల 41వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని పౌరసరఫరాలశాఖ కమిషనర్ అరుణ్ కుమార్ వెల్లడించారు. రూ.7208 కోట్ల నిధులను రైతుల ఖాతాల్లో జమచేశామని, ఎన్.పీసీతో ఉన్న సమస్య కారణంగా 25 కోట్లు బకాయిలు పెండింగ్లో ఉన్నాయన్నారు. ఏప్రిల్ 1వ తేదీ నుంచి రబీ ప్రారంభమైందని.. ఇప్పటి వరకూ 55576 మంది రైతుల నుంచి 5లక్షల 22వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామన్నారు. 43427 రైతుల ఖాతాల్లో 803కోట్ల నిధులను జమచేశామని చెప్పారు. ‘ధాన్యం కొనుగోలు చేసిన నాలుగైదు రోజుల్లోనే నిధులు జమ చేస్తున్నాం. ఏ ఒక్క రైతూ మద్దతు ధర కోల్పోకూడదని సీఎం ఆదేశాలు జారీ చేశారు. వారం రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల ధాన్యం కొనుగోలుకు ఆటంకం ఏర్పడింది. గత సీజన్లో బాయిల్డ్ వెరైటీకి (జయ) రైతులు ఎక్కువగా మొగ్గు చూపారు. తూర్పుగోదావరి, కోనసీమ, కాకినాడ జిల్లాల్లో సాగు చేశారు. కేంద్రప్రభుత్వంతో మాట్లాడి జయ వెరైటీని కొనుగోలు చేసేందుకు లక్ష్యం సిద్ధం చేసుకున్నాం. అవసరం మేరకు ప్రతీ రైతు భరోసా కేంద్రంలో గన్నీ బ్యాగ్స్ సిద్ధం చేశాం. రైతులు అపోహలను నమ్మొద్దు. మధ్యవర్తులను ఆశ్రయించవద్దని కోరుతున్నాం. మిల్లర్లపై కూడా కొన్ని చోట్ల మాకు ఫిర్యాదులొచ్చాయి. మిల్లర్లు రైతులను మోసం చేయాలని చూస్తే కఠిన చర్యలు తీసుకుంటాం’ అని తెలిపారు రైతులు అపోహలను నమ్మొద్దు: పౌర సరఫరాల శాఖ ఎండీ వీర పాండ్యన్ రాష్ట్రవ్యాప్తంగా కమాండ్ కంట్రోల్కు 472 ఫిర్యాదులొచ్చాయి. 472 ఫిర్యాదులను పరిష్కరించాం. 20 లక్షల గన్నీ బ్యాగ్ లను సేకరించి గోదావరి జిల్లాలకు పంపించాం. ఈ సీజన్ లో 39 మిల్లులు , 25 మంది అధికారుల పై చర్యలు తీసుకున్నాం. ఖరీఫ్ సీజన్ లో మాదిరిగానే రబీ సీజన్ లోనూ ధాన్యం సేకరిస్తాం. -
రాష్ట్రంలో వర్షాలు అనంతరం పరిస్థితులపై సీఎం జగన్ సమీక్ష
-
జగన్ ప్రభుత్వంపై కక్ష కట్టిన ఈనాడు
-
రైతులెవరో తెలియదా రామోజీ?.. ఇంకెన్నాళ్లు ఈ మొద్దునిద్ర?
సాక్షి, అమరావతి: నిన్న వర్షం కురిస్తే.. ఈ రోజుకల్లా నష్ట పరిహారం ఇవ్వాలంటూ గగ్గోలు పెడుతోంది ఈనాడు! పంట నష్టం అంచనాలతో పనిలేకుండా క్షణాల్లో పరిహారం ఇవ్వాలంటూ తప్పుడు కథనాలు ప్రచురించటాన్ని... అసలు వర్షం కురవడమే ఈ ప్రభుత్వ వైఫల్యం అన్నట్లుగా బురద జల్లటాన్ని ఏమనుకోవాలి? వర్షాలు, వరదలు, తుపాన్లు.. విపత్తు ఏదైనా ఆగమేఘాలపై స్పందిస్తూ నష్ట పోయిన ప్రతి ఎకరాకు, దెబ్బతిన్న ప్రతీ రైతన్నకూ సీజన్ ముగియకుండానే పరిహారం (ఇన్పుట్ సబ్సిడీ) అందిస్తూ దేశంలోనే ఆదర్శంగా నిలుస్తోంది వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం. పైసా కూడా బకాయి పెట్టకుండా అర్హులెవరైనా మిగిలిపోతే వెతికి మరీ లబ్ధి చేకూరుస్తోంది. లెక్క తెలియదా రామోజీ?.. 37,371 మందికి రూ.34.25 కోట్లు.. పంట నష్ట పరిహారాన్ని (ఇన్పుట్ సబ్సిడీ) కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి నిర్ణయాన్ని బట్టి పంటల వారీగా నిర్ణయిస్తారు. ఏదైనా వైపరీత్యం సంభవిస్తే తొలుత పంటల వారీగా ప్రాథమిక అంచనా వేస్తారు. తర్వాత క్షేత్ర స్థాయి పరిశీలన అనంతరం నిబంధనల మేరకు 33 శాతానికి పైగా మునిగిపోయి దెబ్బతిన్న పంటలను పరిగణనలోకి తీసుకొని తుది అంచనాలను రూపొందిస్తారు. అదే కరువు కాటకాల వేళ.. వర్షపాతం, డ్రై స్పెల్స్, భూగర్భ జలాలు, రిజర్వాయర్ల నీటి నిల్వల సూచిక, పంట దిగుబడి, పంట నష్టం లాంటి ప్రామాణికాల ఆధారంగా కరువు మండలాలను ప్రకటించి తదనుగుణంగా పరిహారాన్ని లెక్కిస్తారు. ఇప్పుడు రబీ పంటలు చేతికొచ్చే వేళ అకాల వర్షాలు కురుస్తున్నాయి. ఇది ఎవరూ ఆపలేని వాస్తవం! గత నెలలో వర్షాల వల్ల నష్టపోయిన 37,371 మంది రైతులకు మే నెలలో రూ.34.25 కోట్లు చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో పంట నష్టాన్ని అంచనా వేసేందుకు బృందాలు రంగంలోకి దిగాయి. బాబు ఎగ్గొట్టిన బకాయిలు రూ.5,942 కోట్లు చంద్రబాబు హయాంలో కరువొచ్చినా.. వరదలొచ్చినా.. అకాల వర్షాలతో రైతులు పంట నష్టపోతే రెండేళ్ల తర్వాత కానీ పరిహారానికి దిక్కులేని దుస్థితి. 2014–15లో కర్నూలు జిల్లాలో అక్టోబర్, డిసెంబర్లో వర్షాలు కురిస్తే 2016 జూలైలో అంటే దాదాపు రెండేళ్ల తర్వాతగానీ కరుణించలేదు. అది కూడా అరకొరగానే పంట నష్టపరిహారం అందించారు. 2014లోనే కర్నూలు జిల్లాలో కరువు వస్తే 2017లో కరువు భృతినిచ్చారు. 2015 ఏప్రిల్లో అకాల వర్షాలు పడితే ఏడాది తర్వాత అంటే 2016 ఆగస్టులో పరిహారాన్నిచ్చారు. 2015లో కరువు వస్తే నవంబర్ 2016లో భృతినందించారు. అనంతపురం జిల్లాలో 2018 ఖరీఫ్లో భారీగా పంట నష్టం జరిగితే పూర్తిగా ఎగ్గొట్టారు. ఐదేళ్లలో 24.80 లక్షల మందికి రూ.2,558.07 కోట్ల ఇన్పుట్ సబ్సిడీని ఎగ్గొట్టిన ఘన చరిత్ర చంద్రబాబుది. ఒక్క ఇన్పుట్ సబ్సిడీనే కాకుండా బాబు ఐదేళ్ల పాలనలో సబ్సిడీ విత్తనాలకు సంబంధించి రూ.282.71 కోట్లు, సున్నా వడ్డీ పంట రుణ రాయితీ రూ.1,180.66 కోట్లు, పంటల బీమా పరిహారం రూ.715.84 కోట్లు, ఆత్మహత్యలకు పాల్పడిన రైతు కుటుంబాలకు ఎక్స్గ్రేíÙయా రూ.23.70 కోట్లు, యాంత్రీకరణ కోసం రూ.221.07 కోట్లు, ధాన్యం కొనుగోలు బకాయిలు రూ.960 కోట్లు కలిపి ఏకంగా రూ.5,942.05 కోట్లు ఎగ్గొడితే ఈనాడు సింగిల్ కాలం వార్త రాసిన పాపాన పోలేదు. ఈ బకాయిల్లో ఇప్పటికే 46.17 లక్షల మంది రైతులకు వైఎస్సార్ సీపీ ప్రభుత్వం రూ.2,890.85 కోట్లు చెల్లించింది. వీటితో పాటు చంద్రబాబు ఎగ్గొట్టిన వ్యవసాయ విద్యుత్ బకాయిలు రూ.8,845 కోట్లు కూడా ఈ ప్రభుత్వం వచ్చాకే చెల్లించింది. టమాటా క్వింటాల్ రూ.530 పైమాటే టమాటాలకు ధర లేక రైతులు గగ్గోలు పెడుతున్నారంటూ ఈనాడు కుళ్లు రాతలు రాస్తోంది. రాష్ట్రంలో ప్రధాన మార్కెట్లైన కలికిరి, వాలీ్మకిపురం, ములకలచెరువు, మదనపల్లి, పలమనేరు, వి.కోట, పుంగనూరు మార్కెట్లలో తాజాగా టమాటా కనిష్ట ధర క్వింటా రూ.530 – రూ.540 ఉండగా గరిష్టంగా రూ.670 – రూ.700 పలుకుతోంది. ఉల్లిపాయలు కూడా కనిష్టంగా క్వింటాల్ రూ.540 ఉండగా గరిష్టంగా రూ.780 పలుకుతోంది. గత నెల రోజులుగా ఏ మార్కెట్లోనూ ఫైన్ క్వాలిటీ టమాటాను కిలో రూ.2 చొప్పున అమ్ముకున్న దాఖలాలు లేవు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం వచ్చాక ధరలు పతనమైన ప్రతీసారి మార్కెట్లో జోక్యం చేసుకుంటూ రూ.1.28 కోట్ల విలువైన 1,425 టన్నుల టమాటాను సేకరించింది. మొక్కజొన్న గత మూడేళ్లుగా ఎమ్మెస్పీకి మించి ధర పలుకుతోంది. క్వింటా ఎమ్మెస్పీ రూ.1,962 కాగా ప్రస్తుతం మార్కెట్లో ఫైన్ క్వాలిటీ మొక్కజొన్న గరిష్టంగా రూ.2,500 పలుకుతోంది. మార్కెటింగ్ శాఖ నిత్యం సీఎం యాప్ ద్వారా ధరలను పర్యవేక్షిస్తోంది. ఈ ఏడాది 16.63లక్షల టన్నుల దిగుబడులు అంచనా వేయగా ఇప్పటికే 60 శాతానికి పైగా మార్కెట్లోకి వచి్చంది. టీడీపీ హయాంలో రూ.427.10 కోట్ల విలువైన 3.19 లక్షల టన్నుల మొక్కజొన్న మాత్రమే సేకరించగా, గత నాలుగేళ్లలో ఏకంగా రూ.2,020.52 కోట్ల విలువైన 9.13 లక్షల టన్నులు సేకరించడం గమనార్హం. ఇప్పటికే ఎమ్మెస్పీ కంటే తక్కువగా ఉన్న శనగలు కొనుగోలు చేస్తుండగా పసుపు కొనుగోలుకు కూడా సన్నాహాలు జరుగుతున్నాయి. జగన్ పాలనలో ఏ సీజన్ లో పరిహారం.. ఆ సీజన్లోనే.. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం వచ్చాక ఏ సీజన్లో జరిగిన పంట నష్టానికి పరిహారాన్ని అదే సీజన్ ముగిసేలోగా అంటే రెండు నెలల వ్యవధిలోనే అందిస్తున్నారు. 2019లో వరదలొస్తే ఏప్రిల్ 2020లో రైతులకు పరిహారం అందించారు. 2020 ఏప్రిల్–సెపె్టంబర్ మధ్య కురిసిన అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు అదే ఏడాది అక్టోబర్లో పరిహారాన్ని జమ చేశారు. అక్టోబర్ 2020లో కురిసిన వర్షాలకు సంబంధించి నవంబర్లో చెల్లించారు. 2020 నవంబర్లో నివర్ తుపాన్ వల్ల దెబ్బతిన్న రైతులకు డిసెంబర్లో పరిహారం అందించారు. తిత్లీ తుపాన్ సమయంలో సంభవించిన నష్టపరిహారాన్ని చంద్రబాబు ఎగ్గొడితే సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి వచ్చాక ఇన్సూరెన్స్ కంపెనీలతో మాట్లాడి ప్రభుత్వ పరంగా రూ.182 కోట్లు రైతులకు పంపిణీ చేశారు. 2022 డిసెంబర్లో మాండూస్ తుపాన్ బాధిత రైతులకు 2023 ఫిబ్రవరిలో పరిహారం అందించారు. టీడీపీ సర్కారు ఎగ్గొట్టిన బకాయిలతో కలిపి ఈ నాలుగేళ్లలో వైపరీత్యాల వల్ల దెబ్బతిన్న 30.86 లక్షల ఎకరాలకు సంబంధించి 22.22 లక్షల మంది రైతులకు రూ.1,911.81 కోట్లు చెల్లించింది. రైతులపై పైసా భారం పడకుండా వైఎస్సార్ ఉచిత పంటల బీమా కింద రూ.6,684.84 కోట్ల పరిహారం అందించిన ఘనత ఈ ప్రభుత్వానిదే. ‘రైతుల నుంచి అంకూర్ సోనం రకం 400 బస్తాల ధాన్యాన్ని రెండు నెలల క్రితం కొన్నా. రైసు మిల్లు ఆవరణలో ఆరబెట్టుకుంటే ఫొటోలు తీసి రైతులవి అంటూ ఈనాడు పత్రికలో వేయటాన్ని చూసి ఆశ్చర్యపోయాం. వర్షాలకు పైపొర మాత్రమే తడిసింది. బస్తాల్లోకి ఎక్కించి సురక్షిత ప్రాంతాలకు పంపించాం. డ్రయ్యర్లో వేస్తాం. మాకు ఇబ్బందేమీ లేదు. ఉందని ఎవరితోనూ చెప్పలేదు కూడా!’ – బొడ్డు మహేష్రెడ్డి, ధాన్యం వ్యాపారి ‘100 బస్తాలు కొని రైసు మిల్లు ఆవరణలోని డ్రెయింగ్ ప్లాట్ఫారమ్ వద్ద కూలీల సాయంతో ఆరబెట్టాం. ఆరబెట్టేందుకు బస్తాకు రూ.15 చొప్పున అద్దె చెల్లించాం. 10 శాతమే తడిసింది. డ్రయ్యర్లో వేస్తాం. ఇందుకోసం బస్తాకి రూ.100 ఖర్చవుతుంది. మేం నష్టపోయే పరిస్థితులైతే లేవు’ – మైలవరపు సాంబయ్య, ధాన్యం వ్యాపారి. ఇది కూడా చదవండి: సీఎం జగన్తో యూఏఈ రాయబారి సమావేశం.. -
కారణం లేకుండానే.. బ్రియాన్ హంఫ్రీస్ను తొలగించిన కాగ్నిజెంట్!
బ్రియాన్ హంఫ్రీస్ను సీఈవో పదవి నుంచి తొలగించినట్లు అమెరికాకు చెందిన ప్రముఖ దిగ్గజ టెక్ కంపెనీ కాగ్నిజెంట్ ప్రకటించింది. స్టాక్ ఎక్సేంజీ ఫైల్స్లో ఈ విషయాన్ని వెల్లడించిన కంపెనీ.. హంఫ్రీన్ తొలగింపుకు గల స్పష్టమైన కారణాలు వెల్లడించలేదు. ఈ ఏడాది కాగ్నిజెంట్ బోర్డ్ సభ్యులు సంస్థ వేగంగా పురోగమించడం, వ్యాపార కార్యకలాపాల్ని వేగవంతం చేయడం, ఆదాయ వృద్ధి వంటి అంశాలపై దృష్టిసారించింది. కాబట్టే సీఈవో పదవీ బాధ్యతల్లో మార్పులు అవసరమని తాము విశ్వసిస్తున్నట్లు ఆ సంస్థ బోర్డ్ ఛైర్మన్ స్టీఫెన్ జె రోహ్లెడర్ తెలిపారు. సీఈవో పదవి నుంచి తొలగించడంతో జనవరి 12 నుంచి మార్చి 15 వరకు కాంగ్నిజెంట్లో సలహాదారులుగా పనిశారు. హంఫ్రీస్ సీఈవో పదవి నుంచి తొలగించడంతో ఆయన స్థానాన్ని భారత్కు చెందిన టెక్ జెయింట్ ఇన్ఫోసిస్కు ప్రెసిడెంట్గా పనిచేసిన రవికుమార్ భర్తీ చేసిన విషయం తెలిసిందే. తొలగింపులకు కారణాలు హంఫ్రిస్ను ఫైర్ చేయడానికి అనేక కారణాలు ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఆదాయం పడిపోవడం, వైస్ ప్రెసిడెంట్, సీనియర్ వైస్ ప్రెసిడెంట్లు సంస్థను విడిచిపెట్టడం, వార్షిక ప్రాతిపదికన అట్రిషన్ రేటు పెరిగిపోవడం వంటి అంశాలు వెలుగులోకి వచ్చాయి. తగ్గిన పరిహారం సీఈవోగా బాధ్యతలు నిర్వహించే సమయంలో హంఫ్రీస్కు చెల్లించే పరిహారం భారీగా తగ్గినట్లు పలు నివేదికలు పేర్కొన్నాయి. 2021తో పోలిస్తే 2022లో హంఫ్రీస్ పరిహారం 9 శాతం తగ్గిందని ప్రకటన హైలైట్ చేసింది. నాన్ ఈక్విటీ ఆధారిత ప్రోత్సాహకాలు సైతం 4 మిలియన్ల నుండి 1.7 మిలియన్లకు తగ్గాయి. చదవండి👉 భారత్లో తయారైన ఆ దగ్గుమందు కలుషితం.. డబ్ల్యూహెచ్ఓ హెచ్చరికలు జారీ -
Dubai: భారతీయుడికి రూ.11 కోట్ల పరిహారం
అబుదాబీ: దుబాయ్లో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో గాయపడిన భారతీయుడికి భారీ పరిహారం చెల్లించాలని ఇన్సూరెన్స్ కంపెనీని యూఏఈ సుప్రీం కోర్టు ఆదేశించింది. స్టూడెంట్గా ఉన్న సమయంలో ఆ యువకుడు యాక్సిడెంట్కు గురికాగా, దాని వల్ల అతని జీవితం నాశనం అయ్యిందని.. కాబట్టి భారీగానే పరిహారం చెల్లించాలని ఇన్సూరెన్స్ కంపెనీకి కోర్టు తెలిపింది. 2019లో ఓ బస్సు ఘోర ప్రమాదానికి గురైంది. మెట్రో స్టేషన్ పార్కింగ్లోకి ప్రవేశించే చోట బస్సు డ్రైవర్ ఓవర్హెడ్ హైట్ బారియర్ను ఢీకొట్టడంతో.. బస్సు ఎడమ పైభాగం ధ్వంసమైంది. ఈ ప్రమాదంలో 17 మంది మరణించగా.. అందులో 12 మంది భారతీయులే కావడం గమనార్హం. ఈ ప్రమాదంలో అప్పుడు ఇంజినీరింగ్ చదువుతున్న ముహమ్మద్ బైగ్ మీర్జా సైతం గాయపడ్డాడు. తన చివరి సెమీస్టర్ ఎగ్జామ్కు ప్రిపేర్ అవుతున్న అతను.. సెలవుల్లో బంధువుల ఇంటికి నుంచి తిరిగి వెళ్లే క్రమంలో ప్రమాదానికి గురయ్యాడు. యాక్సిడెంట్కు కారణమైన డ్రైవర్కు (ఒమన్కు చెందిన వ్యక్తి) 7 సంవత్సరాల జైలు శిక్ష విధించింది అక్కడి చట్టం. అంతేకాదు.. బాధిత కుటుంబాలకు 3.4 మిలియన్ దిర్హామ్ ‘బ్లడ్ మనీ’(పరిహారపు నగదు) చెల్లించాలని కోర్టు ఆదేశించింది. అప్పట్లో.. ఈ ప్రమాదంలో గాయపడిన మీర్జాకు 1 మిలియన్ దిర్హామ్ చెల్లించాలని యూఏఈ ఇన్సూరెన్స్ అథారిటీ చెప్పింది. అయితే ఆ పరిహారం సరిపోదని బాధితుడి బంధువులు కోర్టుకి ఎక్కారు. తన క్లయింట్ ఆ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడని, సుదీర్ఘకాలంగా మంచానికే పరిమితం కావాల్సి వచ్చిందని, ప్రమాదంలో అతని బ్రెయిన్ సగ భాగం దెబ్బతిందని, ప్రధాన అవయవాలన్నీ పూర్తిగా దెబ్బ తిన్నాయని, పైగా చదువు కూడా పూర్తి చేయలేకపోయాడని, అతని జీవితమే నాశనం అయ్యిందిని.. మీర్జా తరపు న్యాయవాది వాదనలు వినిపించాడు. ఇంతకాలం వాదనలు జరగ్గా.. బుధవారం యూఏఈ సుప్రీం కోర్టు ఐదు మిలియన్ల దిర్హామ్(మన కర్సెనీలో రూ. 11 కోట్లు) మీర్జాకు చెల్లించాలంటూ ఇన్సూరెన్స్ కంపెనీని ఆదేశించింది. -
వాకపల్లి అత్యాచార కేసు కొట్టివేత
సాక్షి, పాడేరు(అల్లూరి సీతారామరాజు జిల్లా)/ విశాఖ లీగల్: వాకపల్లి గిరిజన మహిళలపై అత్యాచారం కేసులో గురువారం తీర్పు వెలువడింది. విచారణ అధికారుల వైఫల్యం కారణంగా ఈ కేసును కొట్టివేస్తున్నట్లు విశాఖలోని ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టు జడ్జి ఎల్.శ్రీధర్ ప్రకటించారు. బాధితులకు నష్టపరిహారం ఇచ్చేందుకు విశాఖ జిల్లా న్యా య సేవా ప్రాధికార సంస్థ చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. విచారణాధికారి శివానందరెడ్డి సరిగ్గా విచారణ చేయనందున శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని న్యాయమూర్తి సిఫార్సు చేశారు. వివరాలు.. 2007 ఆగస్టు 20వ తేదీన అప్పటి విశాఖ జిల్లాలోని వాకపల్లిలో 11 మంది గిరిజన మహిళలు తమపై ప్రత్యేక పోలీస్ దళం(గ్రేహౌండ్స్) సిబ్బంది సామూహిక అత్యాచారానికి పాల్ప డ్డారని ఫిర్యాదు చేశారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఆదివాసీ సంఘాలు ఉద్యమించాయి. అప్పటి ప్రభుత్వం 21 మంది పోలీసులపై ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసింది. బి.ఆనందరావును విచారణాధికారిగా నియమించగా కొంతకాలానికి ఆయన మరణించారు. ఆ తర్వాత శివానందరెడ్డి విచారణాధికారిగా వ్యవహరించారు. మొ త్తం 13 మందిని నిందితులుగా గుర్తించారు. ప్రాసిక్యూషన్ 38 మంది సాక్షులను విచారించింది. సుదీర్ఘ విచారణ తర్వాత కేసును కొట్టివేస్తూ కోర్టు గురువారం తీర్పు వెలువరించింది. కాగా, 11 మంది మహిళల్లో ఇద్దరు అనారో గ్య సమస్యలతో మరణించారు. అప్పటి ప్రభుత్వం నష్ట పరిహారం మంజూరు చేయగా.. బాధితులు నిరాకరించారు. -
ఖమ్మంలో కేసీఆర్.. పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.10వేలు..
సాక్షి, ఖమ్మం: సీఎం కేసీఆర్ ఖమ్మంలో పర్యటించారు. బోనకల్ మండలంలోని రామపురంలో అకాల వర్షాల కారణంగా దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. అనంతంర సమావేశం నిర్వహించి మాట్లాడారు. రైతులు నిరాశకు గురికావొద్దని భరోసా ఇచ్చారు. పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.10వేలు ఇస్తామని ప్రకటించారు. కౌలు రైతులను కూడా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. కేసీఆర్తో పాటు సీపీఎం, సీపీఐ నేతలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రైతుల సమావేశంలో ప్రసింగిస్తూ.. దేశంలో ఇప్పుడు డ్రామా జరుగుతోందని కేంద్రంలోని బీజేపీని టార్గెట్ చేస్తూ కేసీఆర్ విమర్శలు గుప్పించారు. కేంద్రానికి చెప్పినా గోడకు చెప్పినా ఒకటే అని ఎద్దేవా చేశారు. దేశంలో వ్యవసాయానికి లాభం చేకూర్చే పాలసీలు లేవని పేర్కొన్నారు. వ్యవసాయం దండగనే మూర్ఖులు ఉన్నట్లు విమర్శలు గుప్పించారు. కేంద్ర బృందం వచ్చి పరిశీలించినా రూపాయి కూడా రాదన్నారు. వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం కానివ్వమని స్పష్టం చేశారు. రైతులకు తమ ప్రభుత్వం అండగా ఉంటుందని, ఎవరు నిరాశకు గురికావద్దని సూచించారు. 'కేంద్రానికి రాజకీయాలు తప్పితే రైతుల మీద ప్రేమ లేదు. కేంద్రానికి ఏం చెప్పినా దున్నపోతు మీద వర్షం పడినట్టే. పంట నష్టపరిహారంపై కేంద్రానికి నివేదికలు పంపవలసిన అవసరం లేదు. గతంలో పంపిన పరిహారమే ఇంతవరకు రాలేదు. ఇప్పుడు పంపాల్సిన అవసరమే లేదు.' అని కేసీఆర్ ఫైర్ అయ్యారు. అనంతరం రామపురం నుంచి మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలం రెడ్డికుంట బయల్దేరారు సీఎం. అక్కడ పరిస్థితిని పరిశీలిస్తారు. రైతులకు భరోసా కల్పిస్తారు. తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు సూచనలు ఇస్తారు. ఆ తర్వాత రెడ్డికుంట నుంచి వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం అడవి రంగాపురానికి, అక్కడి నుంచి కరీంనగర్ జిల్లా రామడుగు మండలం లక్ష్మీపురం వెళ్లి పంటల నష్టం వివరాలు తెలుకుంటారు. రైతులతో మాట్లాడతారు. ఈ పర్యటనలో మంత్రులు, శాసనసభ్యులు, అధికార యంత్రాంగం పాల్గొంటారు. కాగా.. ఇటీవల కురిసిన వడగంట్ల వానల కారణంగా నాలుగు జిల్లాల్లోని పంటలు తీవ్రంగా దెబ్బతిన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేసీఆర్ ఈ ప్రాంతాలను స్వయంగా పరిశీలిస్తున్నారు. చదవండి: నడుచుకుంటూ సిట్ ఆఫీస్కు రేవంత్.. తీవ్ర ఉద్రిక్తత -
భోపాల్ గ్యాస్ దుర్ఘటన.. సుప్రీంకోర్టులో కేంద్రానికి ఎదురుదెబ్బ
న్యూఢిల్లీ: దాదాపు 40 ఏళ్లనాటి భోపాల్ గ్యాస్ లీక్ దుర్ఘటన కేసులోని బాధితులకు పరిహారం విషయంలో సుప్రీంకోర్టులో కేంద్రానికి ఎదురుదెబ్బ తగిలింది. 1984 భోపాల్ గ్యాస్ లీక్ ప్రమాదానికి కారణమైన యూనియన్ కార్బైడ్ నుంచి అదనపు నష్టపరిహారం చెల్లించాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు మంగళవారం కొట్టివేసింది. గ్యాస్ లీక్ బాధితులకు అదనపు పరిహారంగా రూ. 7,844 కోట్లు ఇప్పటించాలని అమెరికాకు చెందిన యూనియన్ కార్భైడ్ కార్పొరేషన్ కంపెనీలను ఆదేశించాలని కోరుతూ కేంద్రం 2010లో క్యూరేటివ్ పిటిషిన్ దాఖలు చేసింది. 1989లో సెటిల్మెంట్ సమయంలో ప్రజల జీవితాలకు, పర్యావరణానికి జరిగిన వాస్తవ నష్టాలను సరిగా అంచనా వేయలేమని చెబుతూ.. ఈ కేసును రీ ఓపెన్ చేయాలని కేంద్రం కోరింది. దీనిపై జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ నేతృత్వంలోని సంజీవ్ ఖన్నా, అభయ్ ఓకా, విక్రమ్నాథ్, జేకే మహేశ్వరిలతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం విచారించింది. కేవలం మోసం కారణంగా మాత్రమే సెటిల్మెట్ను పక్కన పెట్టవచ్చని.. అయితే ఈ అశంపై కేంద్రం వాదించలేదని పేర్కొంది. అంతేగాక రెండు దశాబ్దాల తర్వాత ఈ సమస్యను లేవనెత్తడానికి ఎలాంటి హేతుబద్ధత అందించనందుకు కేంద్ర ప్రభుత్వంతో తాము సంతృప్తి చెందలేదు కోర్టు పేర్కొంది. యునియన్ కార్బైడ్ సంస్థపై అదనపు భారాన్ని విధించడం సరికాదని, ఆ కేసును రీఓపెన్ చేయడం వల్ల మరిన్ని సమస్యల్ని సృష్టించడమే అవుతుందని ధర్మాసనం తెలిపింది. భోపాల్ గ్యాస్ బాధితులకు ఇప్పటికే ఆరుసార్లు నష్టపరిహారాన్ని ఇచ్చారని.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వద్ద ఉన్న రూ. 50 కోట్ల మొత్తాన్ని పెండింగ్లో ఉన్న పరిహారం క్లెయిమ్లను క్లియర్ చేయడానికి ఉపయోగించాలని కేంద్రాన్ని ఆదేశించింది. కేంద్రం వేసిన క్యూరేటివ్ పిటిషన్పై జనవరి 12వ తేదీన సుప్రీం తన తీర్పును రిజర్వ్ చేయగా.. నేడు తిరస్కరించింది. కాగా డిసెంబర్ 2,1984న భోపాల్లోని యూనియన్ కార్బైడ్ ఫ్యాక్టరీ నుంచి విషపూరితమైన మిథైల్ ఐసోసైనేట్ వాయువు లీకైన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో 3,000 మందికి పైగా మరణించారు. లక్ష మందికి పైగా ప్రభావితమయ్యారు. ప్రపంచంలోని అతి దారుణమైన పారిశ్రామిక విపత్తులలో ఒకటిగా దీనిని పరిగణించారు. యూనియన్ కార్బైడ్ను సొంతం చేసుకున్న ప్రస్తుతం డౌ కెమికల్స్ 1989లో సెటిల్మెంట్ కింద రూ. 715 కోట్ల హరిహారం చెల్లించింది. అప్పటి యూనియన్ కార్బైడ్ చైర్మన్ వారెన్ ఆండర్సన్ ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నప్పటికీ విచారణకు హాజరు కాలేదు. 1992లో భోపాల్ కోర్టు అతను పరారీలో ఉన్నట్లు ప్రకటించింది. 2014లో ఆయన మరణానికి ముందు రెండు నాన్-బెయిలబుల్ వారెంట్లు కూడా జారీ అయ్యాయి. అయితే జూన్ 7, 2010న భోపాల్ కోర్టు యూనియన్ కార్బైడ్ ఇండియా లిమిటెట్కు చెందిన ఏడుగురు ఎగ్జిక్యూటివ్లకు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. చదవండి: 'ఎన్నిసార్లు ఇలానే చేస్తారు.. స్క్రిప్ట్ రైటర్, డైలాగ్ రైటర్ను మార్చుకోండి' -
టైర్ పేలడం యాక్ట్ ఆఫ్ గాడ్ కాదు..
ముంబై: కారు టైర్ పేలిపోయి ఒక వ్యక్తి మరణానికి దారితీసిన ఘటనలో ఇన్సూరెన్స్ కంపెనీ నష్టపరిహారం ఎగ్గొట్టడానికి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. టైర్ పేలిపోవడం యాక్ట్ ఆఫ్ గాడ్ తప్ప, డ్రైవర్ నిర్లక్ష్యం కాదంటూ చేసిన వాదనని బాంబే హైకోర్టు తోసిపుచ్చింది. కారు ప్రమాదంలో మరణించిన మకరంద్ పట్వర్థన్ కుటుంబానికి రూ.1.25 కోట్ల నష్టపరిహారం చెల్లించాల్సిందేనని తీర్పు చెప్పింది. 2010 అక్టోబర్ 25న పట్వర్ధన్ (38) తన ఇద్దరు సహోద్యోగులతో కలిసి కారులో పుణె నుంచి ముంబై వెళుతున్నారు. వారిలో కారుని తెచ్చిన ఒక కొలీగ్ చాలా ర్యాష్గా డ్రైవ్ చేయడంతో కారు ముందు టైర్ పేలిపోయి పక్కనే ఉన్న మురుగు కాలువలో పడిపోయింది. ఈ ప్రమాదంలో పట్వర్థన్ అక్కడికక్కడే మృతి చెందారు. కుటుంబంలో ఆయన ఒక్కరే సంపాదనపరుడు కావడంతో ట్రబ్యునల్ అతని కుటుంబానికి న్యూ ఇండియా ఎష్యూరెన్స్ కంపెనీ 1.25 కోట్ల నష్టపరిహారం చెల్లించాలని ఆదేశించింది. అయితే కారు పేలిపోవడం యాక్ట్ ఆఫ్ గాడ్ అంటూ ఇన్సూరెన్స్ కంపెనీ డబ్బులు ఎగ్గొట్టడానికి ప్రయత్నించింది. బాంబే హైకోర్టులో పిటిషన్ వేసింది. దానిని విచారించిన కోర్టు టైర్ పేలిపోవడం యాక్ట్ ఆఫ్ గాడ్ కాదని, ఇన్సూరెన్స్ డబ్బులు చెల్లించాల్సిందేనని తీర్పు చెప్పింది. -
పరిహారం చెల్లించాల్సిందే
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్లో టీడీపీ హయాంలో నిర్మాణమైన పట్టిసీమ, పురుషోత్తపట్నం ప్రాజెక్టులకు సంబంధించి జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) సంయుక్త కమిటీ సిఫార్సు చేసిన నష్టపరిహారాన్ని చెల్లించాలని ఏపీ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ఎన్జీటీ ఆదేశించిన రూ.120 కోట్ల పరిహారం చెల్లింపుపై తరువాత విచారిస్తామని తెలిపింది. పోలవరం, పురుషోత్తపట్నం, పట్టిసీమ ప్రాజెక్టుల పర్యావరణ ఉల్లంఘనలపై జమ్ముల చౌదరయ్య, పెంటపాటి పుల్లారావు తదితరులు దాఖలు చేసిన పిటిషన్ను విచారించిన ఎన్జీటీ ప్రాజెక్టు వ్యయం ఆధారంగా పర్యావరణ నష్టపరిహారం చెల్లించాలని ఆదేశించింది. మరోవైపు సంయుక్త కమిటీ పోలవరం ప్రాజెక్టును మినహాయించి పురుషోత్తపట్నం ప్రాజెక్టుకు రూ.2.48 కోట్లు పట్టిసీమ ప్రాజెక్టుకు రూ.1.90 కోట్లు నష్టపరిహారంగా ఏపీ కాలుష్య నియంత్రణ మండలికి చెల్లించాలని సిఫార్సు చేసింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వంపై రూ.4.38 కోట్లు భారం పడింది. ఎన్జీటీ ఆదేశాలు సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన వేర్వేరు పిటిషన్లను జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సుందరేశ్లతో కూడిన ధర్మాసనం మంగళవారం విచారించింది. ప్రతివాదుల న్యాయవాది శ్రావణ్కుమార్ గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు అమలు చేయలేదని, పురుషోత్తపట్నం రైతులకు పరిహారం ఇవ్వలేదని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. రెండువారాల సమయం ఇవ్వాలని ఏపీ న్యాయవాది కోరారు. రెండువారాల్లో జరిమానా చెల్లించారా లేదా అనే అంశంపై నివేదిక అందజేయాలని, లేకుంటే చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని ధర్మాసనం పేర్కొంది. తదుపరి విచారణ మూడువారాల తర్వాత చేపడతామని తెలిపింది. -
కేంద్రం తీపికబురు: రూ. 16,982 కోట్ల జీఎస్టీ బకాయిలు చెల్లింపు
న్యూఢిల్లీ: జీఎస్టీ పెండింగ్ బకాలను రాష్ట్రాలకు వెంటనే క్లియర్ చేయనున్నామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. జీఎస్టీ కౌన్సిల్ సమావేశం తర్వాత మీడియాతో మాట్లాడిన కేంద్ర మంత్రి జీఎస్టీ బకాయిలు రూ. 16,982 కోట్లను ఈ రోజునుంచి చెల్లిస్తామని శనివారం వెల్లడించారు. జూలై 2017 నుండి ఐదేళ్ల బకాయిలను ఆయా రాష్ట్రాలకు కేంద్రం చెల్లించనుంది. ఈ మొత్తం నిజంగా నష్టపరిహార నిధిలో అందుబాటులో లేనప్పటికీ, తమ సొంంత వనరుల నుండి విడుదల చేయాలని నిర్ణయించుకున్నామని నిర్మలా సీతారామన్ వెల్లడించారు. అలాగే ఈ మొత్తాన్ని ఫ్యూచర్ కాంపెన్సేషన్ నుంచి తిరిగి పొందుతామన్నారు. అలాగే పలు వస్తువులపై వస్తు సేవల పన్ను (జీఎస్టీ) తగ్గిస్తున్నట్లు ఈసందర్భంగా ప్రకటించారు. నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరిగిన 49వ జీఎస్టీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. జీఎస్టీ కౌన్సిల్ తీసుకున్న ఇతర నిర్ణయాలు: ట్యాగ్లు, ట్రాకింగ్ పరికరాలు లేదా డేటా లాగర్స్పై జీఎస్టీ తొలగింపు. అంతకుముందు 18 శాతం బొగ్గు వాషరీకి లేదా వాటి ద్వారా సరఫరా చేయబడిన కోల్డ్ రిజెక్ట్స్ పై కూడా జీఎస్టీ లేదు. పెన్సిల్ షార్పనర్లపై జీఎస్టీని 18 శాతం నుంచి 12 శాతానికి తగ్గించారు. ద్రవ బెల్లంపై జీఎస్టీని తొలగింపు. అంతకుముందు 18 శాతంగా ఉంది. ప్యాక్ చేసిన ,లేబుల్డ్ లిక్విడ్ బెల్లంపై జీఎస్టీ18 శాతం నుండి 5 శాతానికి తగ్గింపు. పాన్ మసాలా, గుట్కాపై సామర్థ్య ఆధారిత పన్ను విధింపుపై మంత్రుల బృందం (GoM) సిఫార్సును GST కౌన్సిల్ ఆమోదించింది. Centre will also clear the admissible final GST Compensation to those states who've provided revenue figures certified by the Accountant General which amounts to Rs 16,524 crores. - Smt @nsitharaman. pic.twitter.com/p7iAuRUMSc — NSitharamanOffice (@nsitharamanoffc) February 18, 2023 -
అటవీ పరిహారం పెంపు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వన్యప్రాణుల దాడుల్లో (పులులతో సహా) మరణాలు, పంట నష్టాలకు పరిహారం పెంచాలని రాష్ట్ర వైల్డ్ లైఫ్ బోర్డు నిర్ణయించింది. ప్రస్తుతం రూ.ఐదు లక్షలు ఉన్న పరిహారాన్ని పది లక్షలకు పెంచుతూ ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపనున్నారు. సాధారణ గాయాలైతే వాస్తవ వైద్యం ఖర్చు (లక్షకు మించకుండా), తీవ్రంగా గాయపడితే వైద్యానికి అయ్యే ఖర్చు (మూడు లక్షలకు మించకుండా), అంగవైకల్యం ఏర్పడితే లక్ష పరిహారం, పెంపుడు జంతువులు చనిపోతే వాస్తవ అంచనా, పంట నష్టానికి ప్రస్తుతం ఎకరాకు ఆరువేలు ఉన్న పరిహారాన్ని రూ.7,500కు పెంచాలని, పండ్ల తోటలకు నష్టపరిహారం కూడా రూ.7,500కు (గరిష్టంగా యాభై వేల దాకా) పెంచాలని కమిటీ ప్రతిపాదించింది. సోమవారం అరణ్య భవన్లో అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర వన్యప్రాణి మండలి (వైల్డ్ లైఫ్ బోర్డు), మనుషులు – జంతువుల మధ్య ఘర్షణ వాతావరణం తగ్గించే చర్యల సూచనల కమిటీ సమావేశాలు జరిగాయి. ►అటవీశాఖ నేతృత్వంలో అడవుల రక్షణ, వన్యప్రాణి సంరక్షణ కోసం తీసుకుంటున్న చర్యలను పీసీసీఎఫ్ ఆర్.ఎం.డోబ్రియాల్ వివరించారు. రాష్ట్రంలో మొదటి సారి చేపట్టిన పులుల ఆవాసాల్లో ఉన్న మానవ ఆవాసాల తరలింపు (కవ్వాల్ లో రెండు గ్రామాలు) ప్రక్రియ సజావుగా కొనసాగుతోందని తెలిపారు. వైల్డ్ లైఫ్ బోర్డు సమావేశంలో కీలక నిర్ణయాలు ►హైదరాబాద్ వనస్థలిపురంలో బస్ టెర్మినల్ నిర్మాణానికి వన్యప్రాణి మండలి ఆమోదం తెలిపింది. ►హరిణి వసస్థలికి చెందిన 1.354 హెక్టార్ల అటవీ భూమి నిబంధనలకు అనుగుణంగా మళ్లింపును అనుమతిని ఇచ్చారు. జాతీయ రహదారిలో విపరీతంగా పెరిగిన రద్దీ, ప్రయాణీకుల సౌకర్యం కోసం ఈ టెర్మినల్ నిర్మాణం కానుంది. ►శ్రీశైలం రహదారి విస్తరణ కోసం వచ్చిన ప్రతిపాదనను అమ్రాబాద్ లో ఉన్న వన్యప్రాణి సంరక్షణ దృష్టిలో పెట్టుకుని బోర్డు తిరస్కరించింది. ఇతర రోడ్డు, ఇరిగేషన్, (కడెం పరిధిలో లక్ష్మీపూర్ లిప్ట్, నాగార్జున సాగర్ పరిధిలో పెద్ద గుట్ట లిప్ట్) కేబుల్ పనులకు బోర్డు ఆమోదం తెలిపింది. వన్యప్రాణులు ప్రమాదంలో పడ్డప్పుడు కాపాడేందుకు అవసరమైన రెస్క్యూ టీమ్ల సంఖ్యను పెంచాలని నిర్ణయించారు. సమావేశంలో ఎమ్మెల్యేలు కోనేరు కోనప్ప, దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, వనమా వెంకటేశ్వరరావు, సభ్యులు కోవ లక్ష్మి, రాఘవ, బానోతు రవి కుమార్, అనిల్ కుమార్, పీసీసీఎఫ్ (ఎఫ్ఏసీ) ఎం.సీ.పర్గెయిన్, అటవీశాఖ అడిషనల్ సెక్రటరీ ప్రశాంతి, ఓఎస్డీ శంకరన్ పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో మరణించిన వ్యక్తి.. ఫ్యామిలీకి రూ.3.11కోట్ల పరిహారం..
ముంబై: రోడ్డు ప్రమాదంలో మరణించిన వ్యక్తి కుటుంబానికి రూ.3.11 కోట్లు చెల్లించాలని ట్యాంక్ ఓనర్, ఇన్సూరెన్స్ కంపెనీని ఆదేశించింది మోటార్ యాక్సిడెంట్స్ క్లెయిమ్స్ ట్రైబ్యునల్. ఈ మొత్తాన్ని మృతుడి తల్లి, భార్య, ఇద్దరు కుమార్తెలకు(మైనర్లు) అందించాలని సూచించింది. అత్యధిక నష్టపరిహానికి సంబంధించిన ఘటనల్లో ఇదీ ఒకటి కావటం గమనార్హం. ఏంటీ కేసు..? మహారాష్ట్ర ముంబైలో 2018 డిసెంబర్ 6న ప్రశాంత్ విశ్వాస్ర(37) స్కూటీని ఓ జంక్షన్ వద్ద ట్యాంకర్ వెనుకనుంచి ఢీకొట్టింది. స్కూటీపైనుంచి కిందపడిన అతనికి తీవ్ర గాయాలయ్యాయి. ఆస్పత్రికి తరలించగా.. అదే రోజు మరణించాడు. ఈ ఘటనపై కేసు నమోదైంది. ట్యాంకర్ డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రశాంత్ చనిపోయాడని కుటుంబసభ్యులు క్లెయిమ్స్ ట్రైబ్యునల్లో ఫిర్యాదు చేశారు. ట్యాంకర్ ఓనర్ దీనా బీ గవాడే, ఇన్సూరెన్స్ కంపెనీ పరిహారం చెల్లించాలని కోరారు. అయితే ట్రైబ్యునల్ నోటీసులు పంపినా దీనా హాజరుకాలేదు. మరోవైపు ఇన్సూరెన్స్ కంపెనీ ఈ ఫిర్యాదును వ్యతిరేకించింది. యాక్సిడెంట్ సమయంలో ట్యాంకర్ డ్రైవర్ మద్యంలో ఉన్నాడని చెప్పింది. డ్రైవర్ మద్యం సేవించాడని డాక్టర్లు నిర్ధరించినప్పటికీ అతను సాధారణ స్థితిలోనే ఉన్నాడని రిపోర్టులో ఉందని ట్రైబ్యునల్ పేర్కొంది. అతను సాధారణ వ్యక్తిలాగే ఎలాంటి తడబాటు లేకుండా మాట్లాడాడని, తూగకుండా సరిగ్గానే నడిచాడని పేర్కొంది. ట్యాంకర్ డ్రైవర్ నిర్లక్ష్యంగా, వేగంగా వాహనాన్ని నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని స్పష్టం చేసింది. పోలీసులు నమోదు చేసిన ఎఐఆర్ను పరిశీలించి సెక్యూరిటీ సంస్థలో జోనల్ హెడ్గా పనిచేస్తున్న ప్రశాంత్ ఏడాదికి రూ.17లక్షల జీతం పొందుతున్నాడని గుర్తించిన ట్రైబ్యునల్.. అన్ని లెక్కలు వేసి అతని కుటుంబానికి రూ.3.11 కోట్లు పరిహారంగా ఇవ్వాలని ట్యాంకర్ ఓనర్, ఇన్సూరెన్స్ కంపెనీని ఆదేశించింది. చదవండి: గర్ల్ఫ్రెండ్తో గొడవ.. 20వ అంతస్తు నుంచి దూకిన సాఫ్ట్వేర్ ఇంజినీర్.. -
గూడు చెదిరి.. గుండె పగిలె.. ఎటు వెళ్లాలో తెలియని అయోమయం, ఆందోళన
సాక్షి, యాదాద్రి: బస్వాపూర్ రిజర్వాయర్ నిర్మాణంలో భాగంగా ముంపునకు గురవుతున్న భూములు, ఇళ్లకు పూర్తి పరిహారం ఇవ్వకుండానే అధికార యంత్రాంగం అక్కడి ప్రజలను ఖాళీ చేయిస్తోంది. దీంతో ఎటు వెళ్లాలో తెలియని అయోమయం, ఆందోళన కారణంగా మనస్తాపం చెందిన నిర్వాసితుల ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లా బీఎన్ తిమ్మాపూర్ గ్రామంలో నెలకొన్న దయనీయపరిస్థితి ఇది. వ్యవసాయ భూములు, ఇళ్లు పోయి.. పరిహారం రాక భవిష్యత్తుపై భయంతో పాటు రకరకాల కారణాలతో దాదాపు ఐదేళ్లలో గ్రామంలో 50 మందికి పైగా చనిపోయారు. ఆడపిల్లల పెళ్లిళ్లు చేయలేకపోతున్నామని తల్లిదండ్రులు.., తమకు పిల్లను ఇవ్వడంలేదని మనోవేదనతో కొందరు యువకులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. మరికొందరు అనారోగ్యంతో మంచంపట్టారు. తమ డిమాండ్లపై ప్రభుత్వం స్పందించకపోవడంతో గత 57 రోజులుగా బస్వాపూర్ ప్రాజెక్టు కట్టపై నిర్వాసితులు వివిధ రూపాల్లో ఆందోళన చేస్తున్నారు. బుధవారం కూడా ఓ నిర్వాసితుడు బెంగతో చనిపోయాడు. ఇళ్లు ఖాళీ చేయాలని నోటీసులు.. కాళేశ్వరం ప్రాజెక్టులో చివరిదైన నృసింహసాగర్ రిజర్వాయర్ (బస్వాపూర్ రిజర్వాయర్)ను 11.39 టీఎంసీల సామర్థ్యంతో ప్రతిపాదించారు. ఈ ప్రాజెక్టుకు 1,724 ఎకరాల భూసేకరణ కోసం నోటిఫికేషన్ జారీచేశారు. ఇందులో 700 ఎకరాలు ప్రభుత్వ భూమి ఉంది. కాగా ఈ ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా బీఎన్ తిమ్మాపూర్, లక్ష్మీనాయకుని తండా, చోకల్నాయకుని తండాలు పూర్తిగా మునిగిపోతున్నాయి. ప్రభుత్వం ఆర్అండ్ఆర్ ప్యాకేజీ కింద ముంపు గ్రామాల వాసులకు ఇళ్లు నిర్మించి ఇవ్వడంలో జాప్యం అవుతోంది. బీఎన్ తిమ్మాపూర్ గ్రామస్తుల వ్యవసాయ భూములకు పరిహారం, ఆర్అండ్ఆర్ ప్యాకేజీలు అందరికీ ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో ఈ నెల 23న గ్రామంలోని 655 నివాస గృహాలను ఖాళీ చేయాలని రెవెన్యూ అధికారులు నోటీసులు జారీ చేశారు. అయితే ముంపు భూములకు పరిహారం, ఆర్అండ్ఆర్ ప్యాకేజీ డబ్బులను మరింత పెంచి ఇవ్వాలని గ్రామస్తులు తీర్మానం చేసి నోటీసులు తీసుకోకుండా అధికారులను తిప్పిపంపారు. 655 మందికే పరిహారం.. బీఎన్ తిమ్మాపూర్లో గ్రామకంఠంతోపాటు పరిసరాల్లోని 36.11 ఎకరాల భూమి మునుగుతోంది. ఇంతవరకు ఈ భూమికి సంబంధించి అవార్డు ప్రక్రియ మొదలుకాలేదు. దీంతో ఎంత పరిహారం వస్తుందో తెలియని పరిస్థితి. అలాగే భువనగిరి మున్సిపాలిటీ పరిధిలో 90 ఎకరాల్లో లేఅవుట్ను అభివృద్ధి చేస్తున్నారు. ఆర్అండ్ఆర్ ప్యాకేజీ కింద గ్రామంలో 1,086 మంది నిర్వాసితులు తేలారు. వీరిలో 655 మందికి పరిహారం చెల్లించారు. ఒక్కొక్కరికి రూ.7.61 లక్షల చొప్పున రూ.50 కోట్లు పంపిణీ చేశారు. మిగతా వారికి రూ.34 కోట్లు రావాల్సి ఉంది. డబ్బులు ఒకేసారి ఇవ్వకపోవడంతో విడతలుగా వచ్చిన డబ్బులు వృథాగా ఖర్చవుతున్నాయని గ్రామస్తులు వాపోతున్నారు. డబ్బులు చేతికి వచ్చిన వారిలో సగం మందికిపైగా చేతిలో చిల్లిగవ్వకూడా లేకుండా ఖర్చు అయ్యాయని చెపుతున్నారు. పరిహారం రాని వారు ఎప్పుడిస్తారో.. అని ఎదురుచూస్తున్నారు. గ్రామస్తుల ప్రధాన డిమాండ్లు.. ►2013 భూసేకరణ చట్టం ప్రకారం నష్టపరిహారం చెల్లించాలి. ►2019లో ప్రకటించిన అవార్డును రద్దు చేసి కొత్తగా భూసేకరణ అవార్డును ప్రకటించాలి. ►ప్రాజెక్టు ముంపులో కోల్పోతున్న వ్యవసాయ భూములు, ఇళ్లకు పరిహారం ఒకేసారి చెల్లించాలి. ►గ్రామంలో 18 సంవత్సరాలు నిండిన వారికి ఆర్అండ్ఆర్ ప్యాకేజీని ప్రకటించాలి ►భువనగిరి మున్సిపాలిటీ పరిధిలోని హుస్నాబాద్ వద్ద 107 సర్వే నంబర్లో చేపట్టిన లేఅవుట్ ప్లాట్లను వెంటనే బీఎన్ తిమ్మాపూర్ గ్రామస్తులకు కేటాయించాలి. ఒక్కో ఇంటినిర్మాణానికి రూ.10 లక్షలు మంజూరు చేయాలి. పరిహారం డబ్బులన్నీ పప్పు పుట్నాలకే.. ప్రభుత్వం తీసుకున్న భూములకు పరిహారం డబ్బులన్నీ ఒకేసారి ఇవ్వకపోవడంతో నిర్వాసితులకు ఇంతవరకు ఇచ్చిన డబ్బులన్నీ ఇతర అవసరాలకే ఖర్చయ్యాయి. అప్పుడప్పుడు ఇచ్చిన పరిహారం డబ్బులు ఇలా ఖర్చు కావడంతో రైతుల చేతులు ఖాళీ అయ్యాయి. ప్రాజెక్టు నిర్మాణం చేపట్టినప్పుడు తొలుత ఎకరానికి రూ.6 లక్షల చొప్పున పరిహారం ఇచ్చారు. బస్వాపూర్ రిజర్వాయర్ ప్రాజెక్టు ఆ తర్వాత రిజర్వాయర్ సామర్థ్యాన్ని 0.87 టీఎంసీలనుంచి 11.39 టీఎంసీలకు పెంచిన ప్రభుత్వం.. నిర్వాసితులకు 123 జీవో ప్రకారం పరస్పర అంగీకారం ద్వారా ఎకరానికి రూ.15.60 లక్షల చొప్పున 400 ఎకరాలకు పరిహారం ఇచ్చింది. కానీ, ఆ తర్వాత 2019 డిసెంబర్ 11న జారీచేసిన అవార్డు ప్రకారం దానిని సవరించి ఎకరానికి రూ.15.30 లక్షలు నిర్ణయించింది. అయితే, పరిహారం మరింత ఎక్కువగా ఇవ్వాలని రైతులు కోరుతూ వస్తుండగా.. రూ.30 వేలు తగ్గడంతో తీవ్ర నిరాశకు గురయ్యారు. ఎక్కువ పరిహారం వస్తుందని భావించిన రైతులకు పరిహారం ఇలా తక్కువగా రావడంతో తీవ్ర మనో వేదన చెందుతున్నారు. మా భూమికి డబ్బులు రాలేదు బస్వాపురం రిజర్వాయర్లో మా భూమి 12 ఎకరాలు పోయింది. ఇందులో 5 గుంటల భూమి పైసలు మాత్రమే పడ్డాయి. మిగతా డబ్బులు నేటికీ ఇవ్వలేదు. పునరావాసం కల్పిస్తామని అధికారులు చెబుతున్నారు కానీ నేటికీ లేదు. రెవెన్యూ అధికారులు ఆర్అండ్ఆర్ ప్యాకేజీలో భాగంగా గ్రామంలో ఉన్న ఇళ్లకు నోటీసులు ఇవ్వడానికి వచ్చారు. ముంపు భూములు, ఆర్అండ్ఆర్ ప్యాకేజీ డబ్బులు మొత్తం అందరికీ ఇస్తే తప్ప నోటీసులు తీసుకోబోమని చెప్పాం. – ఎండీ సాబేర్, బీఎన్ తిమ్మాపురం అనారోగ్యం పాలవుతున్నాం ప్రభుత్వం ఇచ్చే పరిహారం కోసం ఎదురుచూస్తూ, ఎంత వస్తుందో.. ఎప్పుడు ఇస్తా రో అని ఆలోచిస్తూ అనారోగ్యం పాలు అవుతున్నాం. గ్రామంలో ఇలా ఆలోచించి కొందరు చనిపోగా, మరికొందరు ఆస్పత్రుల పాలయ్యారు. నాకున్న అర ఎకరం వ్యవసాయ భూమి బస్వాపురం రిజర్వాయర్ కట్ట కోసం పోయింది. అప్పుడు ఎకరానికి రూ.6 లక్షలు మాత్రమే ఇచ్చారు. ఆ డబ్బులతో ఎక్కడా భూమి కొనుగోలు చేయలేకపోయాం. ఇంటి కోసం ఇచ్చే ఆర్అండ్ఆర్ ప్యాకెజీ కోసం ఎదురు చూస్తున్నాం. – జంగిటి సుగుణ, బీఎన్ తిమ్మాపూర్ రూ. 46.35 కోట్లు విడుదల బస్వాపూర్ ప్రాజెక్టు ముంపు బాధిత కుటుంబాల పరిహారం, లే అవుట్ అభివృద్ధికి ప్రభుత్వం బుధవారం రూ.46.35 కోట్లను విడుదల చేసింది. ప్రగతిభవన్లో సీఎం కేసీఆర్ను కలసి బా«ధితులకు పరిహారం ఇవ్వాలని కోరడంతో వెంటనే స్పందించి నిధులు విడుదల చేయాలని ఆర్థిక శాఖకు ఆదేశాలు ఇచ్చారు. ఇందులో ఆర్అండ్ఆర్ ప్యాకేజీ కోసం రూ.33.45 కోట్లు, పునరావాస లేఅవుట్ అభివృద్ధికి రూ.12.90 కోట్లు ఉన్నాయి. రెండురోజుల్లో బాధితులకు పరిహారం అందుతుంది. – ఫైళ్ల శేఖర్రెడ్డి, ఎమ్మెల్యే, భువనగిరి -
పరిహారం కోసం పాదయాత్ర
సాక్షి, యాదాద్రి: పరిహారం కోసం వెయ్యి మంది రైతులు రోడ్డెక్కారు. పాదయాత్రగా వచ్చి అధికారులకు మొర పెట్టుకున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని బస్వా పూర్ రిజర్వాయర్ ముంపు గ్రామమైన బీఎన్ తిమ్మాపూర్ రైతులు, ప్రజలు 52 రోజులుగా ఆందోళన చేస్తున్నారు. అధికారుల్లో చలనం లేకపోవడంతో శుక్రవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. ప్రాజెక్టులో మునిగిపోతున్న భూములకు, ఇళ్లకు పరిహారం, పునరావాసం, రిహాబిలిటే షన్ అండ్ రీసెటిల్మెంట్(ఆర్ అండ్ ఆర్) ప్యాకేజీ డబ్బు లను ఒకేసారి చెల్లించాలని డిమాండ్ చేశారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం తమకు నష్టపరిహారం చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. -
కారుతో ఈడ్చుకెళ్లిన ఘటన.. యువతి కుటుంబానికి రూ.10 లక్షలు..
న్యూఢిల్లీ: ఢిల్లీలో కారుతో ఈడ్చుకెళ్లిన ఘటనలో మృతిచెందిన యువతి కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామన్నారు సీఎం అరవింద్ కేజ్రీవాల్. బాధితురాలి కుటుంబసభ్యులకు రూ.10లక్షలు ఆర్థిక సాయంగా అందించనున్నట్లు తెలిపారు. అలాగే ఈ ఘటనలో మృతురాలి కుటుంబానికి న్యాయం జరిగేలా చూస్తామని కేజ్రీవాల్ హామీ ఇచ్చారు. ఈ కేసు వాదించేందుకు ప్రముఖ న్యాయవాదిని నియమిస్తామని ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పటికే ప్రకటించింది. ఢిల్లీలోని కంజవాలా ప్రాంతంలో జనవరి 1న ఓ యువతి మృతదేహం నగ్నంగా లభ్యమవ్వడం కలకలం రేపింది. ఐదుగురు యువకులు తాగిన మత్తులో కారు నడుపుతూ ఆమె స్కూటీని ఢీకొట్టారు. యువతి కారు చక్రాల మధ్య ఇరుక్కున్న విషయాన్ని గుర్తించుకుండా కిలోమీటర్లు తిప్పారు. దీంతో ఆమె చనిపోయింది. శరీర భాగాలు తెగిపోయాయి. ఈ ఘటనకు సంబధించి ఐదుగురు నిందితులను పోలీసులు మరునాడే అరెస్టు చేశారు. బాధితురాలిపై అత్యాచారం కూడా జరిగిఉంటుందని మొదట అనుమానాలు వ్యక్తమైనప్పటికీ.. కారు ఈడ్చుకెళ్లడం వల్లే ఆమె మరణించిందని, ఆమెపై లైంగిక దాడి జరగలేదని పోస్టుమార్టం నివేదికలో వెల్లడైంది. చదవండి: 'అంబానీ, అదానీ రాహుల్ను కొనలేరు.. నా అన్న వారియర్..' -
ఫార్మాసిటీ మృతులకు.. రూ.25 లక్షలు చొప్పున పరిహారం
మధురవాడ (భీమిలి)/పరవాడ (పెందుర్తి)/మహారాణిపేట : అనకాపల్లి జిల్లా పరవాడ సమీపంలో ఫార్మాసిటీ లారస్ ల్యాబ్ పరిశ్రమలో సోమవారం రాత్రి సంభవించిన ప్రమాదంలో మృతులు నలుగురికీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రూ.25 లక్షలు చొప్పున పరిహారం ప్రకటించారని పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలిపారు. ఇంతకుముందు కూడా ఇటువంటి ప్రమాదాలు జరిగినా తక్షణమే చర్యలు తీసుకున్నామన్నారు. బహుళ జాతి కంపెనీలు కూడా అప్రమత్తంగా ఉండాలన్నారు. గతంలో బ్రాండిక్స్ లాంటి పరిశ్రమల్లో ప్రమాదం జరిగినప్పుడు సైతం అప్రమత్తంగా వ్యవహరించామన్నారు. రాష్ట్ర, జిల్లా స్థాయిలో కూడా కమిటీలు ఏర్పాటుచేశామని, సేఫ్టీ ఆడిట్స్ చేయాలని ఆదేశించామని మంత్రి గుర్తుచేశారు. రాష్ట్రంలో 80–90 వరకు ప్రమాదకర పరిశ్రమలున్నట్లు గుర్తించామన్నారు. వాటిలో భద్రతాపరమెన ఆడిట్స్ చేయాలని ఆదేశించినట్లు అమర్నాథ్ చెప్పారు. పరవాడ ఫార్మాలో ప్రమాద ఘటన ఎందువల్ల జరిగింది? అందులో ఎవరి తప్పిదం ఉందో సమగ్రంగా విచారణ జరిపించాలని అనకాపల్లి కలెక్టర్, ఎస్పీలను ఆదేశించామన్నారు. మృతదేహాలకు పోస్టుమార్టం ఇక ఈ ప్రమాదంలో మృతులు బి. రాంబాబు, రాజేష్బాబు, రాపేటి రామకృష్ణ, మజ్జి వెంకట్రావు మృతదేహాలకు కేజీహెచ్లో పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం వారి బంధువులకు అప్పగించినట్లు పరవాడ సీఐ పి.ఈశ్వరరావు చెప్పారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఎడ్ల సతీష్ షీలానగర్ కిమ్స్ ఐకాన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. మృతుల కుటుంబాలకు రూ.2.24 కోట్ల పరిహారం మరోవైపు.. దుర్ఘటనలో మరణించిన నలుగురు కార్మికులకుటుంబాలకు రూ.2.24 కోట్ల పరిహారం చెల్లించడానికి యాజమాన్యం అంగీకరించిందని సీఐటీయూ నాయకులు గనిశెట్టి సత్యనారాయణ చెప్పారు. విశాఖ కేజీహెచ్లో ఇరువర్గాల మధ్య మంగళవారం జరిగిన చర్చల్లో ఈ మేరకు అంగీకారం కుదిరిందన్నారు. ఈ ప్రమాదంలో మృతిచెందిన పర్మినెంట్ ఉద్యోగులు ఇద్దరికి ఒక్కొక్కరికి రూ.70 లక్షలు చొప్పున రూ.1.40 కోట్లు, అలాగే.. కాంట్రాక్టు కార్మికులకు ఒక్కొక్కరికి రూ.42 లక్షల చొప్పున రూ.84 లక్షలు పరిహారం ఇవ్వడంతోపాటు బాధిత కుటుంబంలో ఒకరికి పరిశ్రమలో ఉపాధి కల్పించనున్నట్లు చెప్పారు. -
వైద్యుల పొరపాటు.. యువకుడి మర్మాంగం తొలగింపు.. పరిహారంగా..
వైద్యులు చికిత్స అందించే సమయంలో చేసిన పొరపాటు ఓ యువకుడికి శాపంగా మారింది. అతని మర్మాంగాన్ని పూర్తిగా తొలిగించాల్సి వచ్చింది. దీంతో అతడు న్యాయస్థానాన్ని ఆశ్రయించగా కోర్టు నుంచి అనుకులంగా తీర్పు వచ్చింది. ఫలితంగా ఆస్పత్రి యాజమాన్యం అతనికి భారీ పరిహారం చెల్లించింది. ఫ్రాన్స్ నాంటెస్ యూనివర్సిటీలో 2014లో ఈ ఘటన జరిగింది. అప్పుడు యువకుడి వయసు 30 ఏళ్లు. పెళ్లి కూడా అయింది. అయితే అనారోగ్యంతో ఆస్పత్రికి వెళ్లిన అతనికి వైద్య పరీక్షలు నిర్వహించగా కార్సినోమా క్యాన్సర్ అని తేలింది. అంటే చర్మ ఎపిథీలియల్ కణజాలం లేదా అంతర్గత అవయవాల టిష్యూలకు క్యాన్సర్ సోకింది. పొరపాటుతో తలకిందులు.. అయితే వైద్యులు అతనికి చికిత్స అందించారు. టిష్యూల నుంచి క్యాన్సర్ను పూర్తిగా తొలగించేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో చేసిన పొరపాట్లు అతనికి మరిన్ని ఇబ్బందులు తెచ్చిపెట్టాయి. క్యాన్సర్ మర్మాంగానికి కూడా సోకింది. దీంతో భరించలేని నొప్పితో అతను నరకయాతన అనుభవించాడు. ఒకానొక సమయంలో కట్టర్తో స్వయంగా తానే మర్మంగాన్ని తొలగించుకునేందుకు ప్రయత్నించాడు. కానీ భార్య వద్దని చెప్పడంతో ఆగిపోయాడు. కానీ రానురాను అతని క్యాన్సర్ తీవ్రత పెరిగింది. మొత్తం మర్మాంగానికి అది సోకింది. ఇక గత్యంతరం లేదని భావించిన వైద్యులు యువకుడి మర్మాంగాన్ని పూర్తిగా తొలగించారు. అలా చేయకపోతే అతని ప్రాణాలు పోయేవని చెప్పారు. అయితే తనకు జరిగిన అన్యాయంపై యువకుడు న్యాయపరంగా పోరాడాడు. వైద్యులు పొరపాటు వల్లే మర్మాంగాన్ని తొలగించుకోవాల్సి వచ్చిందని, ఆ బాధ వర్ణనాతీతం అని వాపోయాడు. ఆస్పత్రి యాజమాన్యం తమ తప్పును అంగీకరించి యువకుడికి రూ.54 లక్షలు పరిహారంగా ఇచ్చింది. చదవండి: అఫ్గాన్లో విద్యార్థినుల నిరసన గళం -
నిర్వాసితులకు ఇచ్చేందుకు నిధుల్లేవా?
భువనగిరి: బస్వాపూర్ రిజర్వాయర్ ముంపు గ్రామాల నిర్వాసితులకు వెంటనే నష్ట పరిహారం చెల్లించాలని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. యాదాద్రి జిల్లా భువనగిరి మండలంలోని బస్వాపూర్ రిజర్వాయర్లో ముంపునకు గురవుతున్న బీఎన్ తిమ్మాపురం గ్రామస్తులు పరిహారం కోసం ప్రాజెక్టు కట్టపై చేస్తున్న రిలే నిరాహార దీక్షలు శనివారం 26వ రోజుకు చేరాయి. ఈ సందర్భంగా వారి దీక్షాశిబిరాన్ని ఎంపీ వెంకట్రెడ్డి సందర్శించి సంఘీభావం తెలిపారు. మల్లన్నసాగర్, కొండపోచమ్మసాగర్ భూ నిర్వాసితులకు ఎంత పరిహారం ఇచ్చారు..? బస్వాపూర్ నిర్వాసితులకు ఎంత చెల్లిస్తున్నారో చె ప్పాలన్నారు. వాస్తు బాగోలేదని రూ.650 కోట్లు ఖ ర్చు చేసి సచివాలయం నిర్మిస్తున్న ప్రభుత్వం వద్ద నిర్వాసితులకు ఇవ్వడానికి డబ్బులు లేవా? అని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ మంచి మనసుతో నిర్వాసితులకు రూ.350 కోట్లు వెంటనే చెల్లించాలని కోరారు. బస్వాపూర్ ప్రాజెక్టు పేరుతో తుంగతుర్తి నియోజకవర్గ పరిధిలోని మూసీ నుంచి పెద్ద ఎత్తున ఇసుక తరలిస్తూ మంత్రి జగదీశ్రెడ్డి, ఎమ్మెల్యే గ్యాదరి కిషోర్ కోట్లు సంపాదిస్తున్నారని ఆరోపించారు. బస్వాపూర్ నిర్వాసితులకు కొత్త అవార్డు ప్రకటించాలని, వారికి న్యాయం చేసే వరకు పోరాటం కొనసాగిస్తామని అన్నారు. పరిహారంపై హామీ ఇవ్వని పక్షంలో ఈ నెల 27న రిజర్వాయర్ కట్టపై వంటావార్పు చేపడతామని, అందులో తాను పాల్గొంటానని చెప్పారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్, పలువురు నిర్వాసితులు కంటతడి పెట్టడంతో వారిని ఆయన ఓదార్చారు. -
టికెట్ డౌన్గ్రేడ్ చేస్తే పరిహారం చెల్లించాలి
న్యూఢిల్లీ: విమానయాన సంస్థలు ఇకపై ప్రయాణికుల టికెట్లను ఇష్టానుసారంగా డౌన్గ్రేడ్ చేస్తే పరిహారం చెల్లించుకోవాల్సి రానుంది. పన్నులు సహా టికెట్ పూర్తి విలువను ప్యాసింజర్కి తిరిగి ఇవ్వడంతో పాటు సదరు ప్రయాణికులను తదుపరి అందుబాటులో ఉన్న తరగతిలో ఉచితంగా తీసుకెళ్లాల్సి రానుంది. ఇందుకు సంబంధించి ప్రయాణికుల ఫిర్యాదులను పరిష్కరించేందుకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ప్రస్తుత నిబంధనలను సవరించే పనిలో ఉంది. సంబంధిత వర్గాలతో సంప్రదింపులు ముగిశాక తుది నిబంధనలను జారీ చేయనుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి ఇవి అమల్లోకి వచ్చే అవకాశం ఉందని డీజీసీఏ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఒక తరగతిలో బుక్ చేసుకున్న టికెట్లను విమానయాన సంస్థలు ఇష్టారీతిగా కింది తరగతికి డౌన్గ్రేడ్ చేస్తున్నాయంటూ తరచుగా ప్రయాణికుల నుంచి ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో డీజీసీఏ ఈ మేరకు చర్యలు చేపట్టింది. విమాన సేవలను వేగవంతంగా విస్తరించాల్సి వస్తుండటం, ప్యాసింజర్ ట్రాఫిక్ భారీగా పెరిగిపోవడం వంటి అంశాల వల్ల కొన్ని సందర్భాల్లో ఎయిర్లైన్స్ ఇలా చేయాల్సి వస్తోంది. ‘ఉదాహరణకు ప్రయాణికులు .. ఫస్ట్ క్లాస్, బిజినెస్ క్లాస్ లేదా ప్రీమియం ఎకానమీలో టికెట్ బుక్ చేసుకుని ఉండవచ్చు. అయితే, సీట్లు అందుబాటులో లేకపోవడం లేదా విమానాన్ని మార్చాల్సి రావడం వంటి కారణాల వల్ల చెకిన్ సమయంలో వారి టికెట్లను దిగువ తరగతికి డౌన్గ్రేడ్ చేసే పరిస్థితి ఉంటోంది. అయితే, ఇలా డౌన్గ్రేడ్ చేస్తే ప్రయాణికులకు ఎయిర్లైన్ టికెట్ పూర్తి విలువ రీఫండ్ చేయడంతో పాటు తదుపరి అందుబాటులో ఉన్న తరగతిలో ఉచితంగా తీసుకెళ్లేలా ప్రతిపాదిత సవరణ ఉపయోగపడుతుంది‘ అని డీజీసీఏ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రస్తుత నిబంధనలు ఇలా.. బోర్డింగ్ను నిరాకరించినా, ఫ్లయిట్ రద్దయినా విమాన ప్రయాణికులకు పరిహారం లభించేలా ప్రస్తుతం నిబంధనలు ఉన్నాయి. బుకింగ్ కన్ఫర్మ్ అయినా బోర్డింగ్ను నిరాకరిస్తే, ప్రత్యామ్నాయంగా సదరు విమానం బైల్దేరే షెడ్యూల్ తర్వాత గంట వ్యవధిలోగా మరో ఫ్లయిట్లో సీటు కల్పించగలిగితే ఎలాంటి పరిహారం చెల్లించనక్కర్లేదు. అదే 24 గంటల వరకూ పడితే వన్ వే ఛార్జీ, ఇంధన చార్జీలకు 200 శాతం అధికంగా పరిహారం చెల్లించాలి. గరిష్టంగా రూ. 10,000 పరిమితి ఉంటుంది. ఒకవేళ 24 గంటలు దాటేశాక సీటు కల్పిస్తే రూ. 20,000 గరిష్ట పరిమితికి లోబడి 400 శాతం వరకూ పరిహారం చెల్లించాలి. వీటితో పాటు ఫ్లయిట్ రద్దవడం తదితర అంశాలకు సంబంధించి వివిధ మార్గదర్శకాలు ఉన్నాయి. -
యాసిడ్ దాడి బాధితురాలికి రూ.35 లక్షలు ఇవ్వాలి.. హైకోర్టు ఆదేశం
దెహ్రాదూన్: ఉత్తరాఖండ్ హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. యాసిడ్ దాడి బాధితురాలికి రూ.35 లక్షలు పరిహారంగా అందించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈమెకు అయ్యే మొత్తం వైద్య ఖర్చులను ప్రభుత్వమే భరించాలని 2017లోనే చెప్పింది న్యాయస్థానం. యూఎస్ నగర్ జిల్లాకు చెందిన ఈ యువతిపై 2014లో ఓ ప్రేమోన్మాది యాసిడ్ దాడి చేశాడు. అప్పడు ఆమె 12వ తరగతి చదువుతోంది. ఈ ఘటనలో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. ఓ చెవి పూర్తిగా కాలిపోయింది. మరో చెవి 50 శాతం దెబ్బతింది. మొహం కూడా కాలిపోయింది. అయితే ప్రభుత్వం ఈమెకు సరైన పరిహారం అందించలేదు. అయితే బాధితురాలు పూర్తిగా కోలుకునే వరకు వైద్య ఖర్చులు ఎంతైనా, దేశంలో ఎక్కడ చికిత్స అందించినా ప్రభుత్వమే భరించాలని 2017లోనే కోర్టు ఆదేశించింది. కానీ ఈమెకు పరిహారం కూడా అందించాలని 2019లో ఓ న్యాయవాది పిటిషన్ దాఖలు చేసింది. యువతికి ప్రభుత్వం భద్రత కల్పించలేకపోయిందని, సాయం అందించాలని కోరింది. రాజకీయాల కోసం కోట్లు ఖర్చు పెడుతున్న ప్రభుత్వం యాసిడ్ దాడి బాధితురాలికి రూ.లక్షలు సాయంగా సమకూర్చలేదా? అని పిటిషన్లో పేర్కొంది. వాదనలు విన్న న్యాయస్థానం యాసిడ్ దాడి బాధితురాలికి ప్రభుత్వం రూ.35 లక్షలు సాయంగా అందించాలని చెప్పింది. ఆమెకు అయిన వైద్య ఖర్చులతో దీనికి సంబంధం లేదని స్పష్టం చేసింది. దేశంలో యాసిడ్ దాడులకు గురవుతున్న ఇతర మహిళలకు కూడా ఇదే విధంగా పరిహారం అందించాలని బాధితురాలి తరఫు న్యాయవాది స్నిగ్ధ తివారి డిమాండ్ చేశారు. చదవండి: వయసులో మూడేళ్లు చిన్నోడితో సహజీవనం.. పెళ్లి చేసుకోమని అడిగితే.. -
తాగి చనిపోతే పరిహారం ఇవ్వాలా?: సీఎం నితీశ్
పాట్నా: బిహార్ సరన్ జిల్లాలో కల్తీ మద్యం తాగి మరణించిన వారి సంఖ్య 60కి పెరిగింది. ఈ విషయంపై అసెంబ్లీలో అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం జరిగింది. కల్తీ మద్యం తాగి చనిపోయిన వారికి ఎలాంటి పరిహారం ఇచ్చే ప్రసక్తే లేదని సీఎం నితీశ్ కుమార్ తేల్చిచెప్పారు. అలాంటి వారిపట్ల సానుభూతి చూపాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. మద్యం తాగితే చనిపోతారని, తాగాలని ప్రోత్సాహించే వారు మీకు ఎలాంటి మేలు చేయరని సీఎం సభలో అన్నారు. #WATCH | "No compensation will be given to people who died after drinking...We have been appealing- if you drink, you will die...those who talk in favour of drinking will not bring any good to you...", said CM Nitish Kumar in assembly earlier today. (Source: Bihar Assembly) pic.twitter.com/zquukNtRIA — ANI (@ANI) December 16, 2022 అయితే నితీశ్ కుమార్ వ్యాఖ్యలపై బీజేపీ సభ్యులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఆయన తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బిహార్లో కల్తీ మద్యం కారణంగా పదుల సంఖ్యలో చనిపోతున్నారు. రాష్ట్రంలో మద్య నిషేధం 2016 నుంచి అమలు అవుతున్నప్పటికీ.. అక్రమంగా కొందరు సారా విక్రయిస్తున్నారు. ఇది తాగి అమాయకులు ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే మద్యం తాగితే చస్తారని సీఎం వ్యాఖ్యానించారు. చదవండి: షాకింగ్..12 ఏళ్లకే గుండెపోటు..స్కూల్ బస్సులోనే కుప్పకూలిన విద్యార్థి.. -
ఖతర్లో అంతేనా.. కార్మికుల ప్రాణాలకు లెక్క లేదా
మోర్తాడ్ (బాల్కొండ): ప్రపంచ కప్ ఫుట్బాల్ పోటీలకు ఆతిథ్యమిచ్చిన ఖతర్ అన్ని దేశాల దృష్టిని ఆకర్షించింది. గత నెల 20న ప్రారంభమైన ఫుట్బాల్ పోటీలు ఈనెల 18తో ముగియనున్నాయి. ఫిఫా క్రీడా సంగ్రామంతో దాదాపు రూ.1.40 లక్షల కోట్ల వ్యాపారం చేస్తున్న ఖతర్.. తన గుర్తింపు కోసం రక్తం చిందించిన వివిధ దేశాల వలస కార్మికులను మాత్రం మరచిపోయిందనే ఆరోపణలు ఎదుర్కొంటోంది. ఫిఫా కోసం చేపట్టిన వివిధ నిర్మాణాల్లో భాగస్వాములైన వలస కార్మికులు ప్రమాదాల వల్ల, పని ఒత్తిడితో అనారోగ్యానికి గురై మరణించిన ఘటనలు ఉన్నాయి. మరణించిన వలస కార్మికుల్లో తెలంగాణకు చెందిన వాళ్లే సుమారు వంద మంది వరకు ఉంటారని గల్ఫ్ జేఏసీ అంచనాల్లో తేలింది. ‘చనిపోయిన వారిని స్మరించుకుందాం–బతికి ఉన్నవారి కోసం పోరాడుదాం’ అనే నినాదంతో గల్ఫ్ జేఏసీ ఆధ్వర్యంలో ఖతర్ ఫిఫా అమరులను స్మరిస్తూ నిజామాబాద్లో ఇటీవల సమావేశం నిర్వహించారు. ఖతర్లో ఫిఫా పనులు చేస్తూ మరణించిన వారి కుటుంబాలను ఐక్యం చేసి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు ఖతర్ సర్కార్కు బాధితుల గోడును వినిపించేందుకు ప్రయత్నిస్తున్నారు. గల్ఫ్ జేఏసీ చైర్మన్ గుగ్గిల్ల రవిగౌడ్, కాంగ్రెస్ ఎన్ఆర్ఐ సెల్ రాష్ట్ర కన్వీనర్ సింగిరెడ్డి నరేష్రెడ్డి, ప్రవాసి మిత్ర లేబర్ యూనియన్ అధ్యక్షుడు స్వదేశ్ పరికిపండ్ల, గల్ఫ్ తెలంగాణ సాంస్కృతిక సంఘం అధ్యక్షుడు బసంత్రెడ్డి, న్యాయవాది బాస రాజేశ్వర్లు బాధిత కుటుంబాలతో సమావేశమై వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. నిరాశపరిచిన విదేశాంగ శాఖ.. పార్లమెంట్ సమావేశాల్లో ఖతర్ మృతుల ఆంశంపై ఎంపీలు వెంకటేశ్ నేత బొర్లకుంట, డాక్టర్ రంజిత్రెడ్డి, మాలోవత్ కవిత ప్రస్తావించారు. ఇందుకు విదేశాంగ శాఖ సహాయ మంత్రి వి మురళీధరన్ సమాధానం ఇస్తూ ఖతర్ కార్మిక చట్టాల ప్రకారం మృతుల కుటుంబాలకు పరిహారం అందుతుందని తెలిపారు. కానీ మృతుల సంఖ్యను వెల్లడించలేదు. కనీసం ఎంత మందికి పరిహారం అందించారనే విషయంలోనూ స్పష్టత లేదు. ఎంపీలు అడిగిన ప్రశ్నలకు విదేశాంగ శాఖ సమాధానం అస్పష్టంగా ఉండటం బాధిత కుటుంబాలను నిరాశపరిచిందనే అభిప్రాయ వ్యక్తమవుతోంది. (క్లిక్ చేయండి: కొండగట్టు ఆంజనేయుని ‘వెనకనున్న’ ఆ దంపతులు ఎవరో తెలుసా!) -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. పరిహారంగా రూ.65.62లక్షలు
సాక్షి, ముంబై: రోడ్డు ప్రమాదంలో మరణించిన ఓ వ్యక్తి కుటుంబానికి నష్టపరిహారంగా రూ.65.62 లక్షలు చెల్లించాలని థానె జిల్లా మోటారు ప్రమాదాల క్లెయిమ్ ట్రిబ్యునల్ (ఎంఏసీటీ) బీమా సంస్థ నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ను, ప్రమాదానికి కారణమైన మరో వాహనదారుడిని ఆదేశించింది. ఈ మొత్తాన్ని ఏడాదికి 8శాతం వడ్డీతో సహా సదరు బాధిత కుటుంబానికి అందజేయాలని ఎంఏసీటీ స్పష్టం చేసింది. ఈమేరకు ఎంఏసీటీ సభ్యుడు హెచ్.ఎం భోశాలే ఆదేశాలిచ్చారు. అయితే ఈ ఆదేశాలను గతనెల 16న ఇవ్వగా సోమవారం లిఖితపూర్వకంగా బీమా సంస్థకు, సదరు వాహన యజమానికి అందజేశారు. పిటిషనర్తరఫున ఎస్టీ కదమ్ ట్రిబ్యునల్ వాదనలు వినిపించారు. సందేశ్ షిండే (35) అనేవ్యక్తి తన స్నేహితుడితో కలసి మోటార్ సైకిల్పై కోపార్టైన్కు 2020 మార్చి 18 రాత్రి బయల్దేరి వెళ్తుండగా.. ఒక ట్రాలర్ వచ్చి వారిని వేగంగా ఢీకొట్టండంతో వాళ్లిద్దరూ పడిపోయారు. అయితే సందేశ్ షిండే అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యాడు. షిండే చనిపోయేనాటికి ఓ ప్రైవేటు కంపెనీలో నెలకు రూ.32.655 జీతాన్ని సంపాదిస్తున్నాడు. ఆ కుటుంబానికి షిండేనే ఆధారం కావడంతో అతని మృతితో కుటుంబం రోడ్డున పడిపోయింది. అతడికి భార్య, ఇద్దరు కొడుకులు, తల్లి ఉన్నారు. షిండే మృతి అనంతరం ప్రమాదానికి కారణమైన ట్రాలర్ యజమానితోపాటు బీమా సంస్థ నేష నల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ కూడా వీరికి నష్టపరిహారం ఇచ్చేందుకు ఒప్పుకోకుండా వివి« ద రకాల కారణాలను చూపి అడ్డుకున్నారు. అయితే ఎంఏసీటీలో వాదనల అనంతరం బాధిత కుటుంబానికి రూ.63.96లక్షలు నష్టపరిహారంగా, రూ.16,500 మట్టి ఖర్చులకుగా ను, భార్యకు రూ.44000, తల్లికి రూ.88,000 చెల్లించాలని ఆదేశాల్లో స్పష్టం చేసింది. చదవండి: కల్తీ మద్యం తాగి ఆరుగురు మృతి.. పలువురికి అస్వస్థత -
కరోనా టీకా వల్ల మరణిస్తే పరిహారం ఇవ్వలేం: కేంద్రం
న్యూఢిల్లీ: కోవిడ్–19 టీకా తీసుకున్నాక దుష్ప్రభావాల వల్ల మరణిస్తే బాధ్యత వహించబోమని కేంద్రం పేర్కొంది. బాధిత కుటుంబానికి పరిహారమివ్వలేమని తేల్చిచెప్పింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. కోవిడ్ వ్యాక్సినేషన్ వల్ల మరణించినట్లు అనుమానిస్తున్న ఇద్దరు యువతుల తల్లిదండ్రులు ప్రభుత్వం నుంచి పరిహారం కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై వివరణ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. దీంతో ప్రభుత్వం తాజాగా అఫిడవిట్ దాఖలు చేసింది. ప్రస్తుతం ప్రజలకు అందజేస్తున్న కరోనా టీకాలను థర్డ్ పార్టీలు (ప్రైవేట్ కంపెనీలు) తయారు చేస్తున్నాయని, అన్ని రకాల పరీక్ష తర్వాత నియంత్రణ సంస్థల ఆమోదంతోనే అవి మార్కెట్లోకి వస్తున్నాయని అఫిడవిట్లో పేర్కొంది. కరోనా టీకాలు సురక్షితమేనని, ప్రభావవంతంగా పనిచేస్తున్నట్లు ప్రపంచవ్యాప్తంగా దాదాపు అన్ని దేశాలు గుర్తించాయని వెల్లడించింది. -
ఎఫ్ఆర్వో కుటుంబానికి పరిహారం అందజేత
రఘునాథపాలెం/సాక్షి, హైదరాబాద్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎర్రబోడులో ఇటీవల గొత్తి కోయల చేతిలో హత్యకు గురైన ఎఫ్ఆర్ఓ శ్రీనివాసరావు కుటుంబానికి ప్రభుత్వం ప్రకటించిన రూ.50 లక్షల పరిహారం చెక్కును ఆయన భార్య భాగ్యలక్ష్మి, కూతురు, కుమారుడికి ఖమ్మం జిల్లా ఈర్ల పూడిలో అటవీ శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు సోమవారం అందజే శారు. ఈ సందర్భంగా అటవీ శాఖ చీఫ్ కన్జర్వే టర్ (సీసీఎఫ్) భీమా నాయక్, ఖమ్మం, భద్రా ద్రి జిల్లాల డీఎఫ్ఓలు సిద్దార్థ విక్రమ్ సింగ్, రంజిత్ నాయక్, డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం మాట్లాడుతూ.. మంత్రి పువ్వా డ అజయ్కుమార్, శ్రీనివాసరావు కుటుంబానికి ఆర్థిక సహాయం వెంటనే అందేలా చొర వ తీసుకున్నారని చెప్పారు. శ్రీనివాసరావు కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలా ఆదు కుంటుందని భరోసా ఇచ్చారు. ఇంటి స్థలం, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కూ డా త్వరగా వచ్చేలా చర్యలు చేపడతామని హా మీ ఇచ్చారు. అనంతరం ఎఫ్ఆర్వో చిత్రపటా నికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం మేయర్ పునుకొల్లు నీరజ, సుడా చైర్మన్ బచ్చు విజయ్కుమార్, ఎంపీపీ గౌరి, తహసీల్దార్ నర్సింహారావు, ఎఫ్ఆర్ఓ రాధిక తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రికి ఉద్యోగ సంఘాల కృతజ్ఞతలు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలు, పీసీసీఎఫ్ ఆర్ఎం డోబ్రియాల్ సూచనలకు అనుగుణంగా తమ రోజువారి విధుల్లో నిమగ్నమైనట్టు తెలంగాణ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్ అసోసియేషన్, తెలంగాణ జూనియర్ అటవీ అధికారుల సంఘం ఒక ప్రకటనలో వెల్లడించాయి. శ్రీనివాసరావు హత్య కేసులో దోషులను కఠినంగా శిక్షిస్తామని భరోసా ఇచ్చిన సీఎం కేసీఆర్కు సంఘాలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశాయి. అలాగే విధి నిర్వహణలో ఉన్న అటవీ ఉద్యోగుల రక్షణకు ముందుకు వచ్చి, క్షేత్ర స్థాయిలో సహకరిస్తున్న పోలీస్ శాఖకు, డీజీపీకి కూడా ధన్యవాదాలు తెలిపాయి. గొత్తికోయల చేతిలో హత్యకు గురైన ఎఫ్ఆర్వో శ్రీనివాసరావు కుటుంబానికి ప్రకటించిన మిగతా హామీలను కూడా సకాలంలో నెరవేర్చి ఆ కుటుంబానికి ఊరట కలిగించాలని విజ్ఞప్తి చేశాయి. ఎఫ్ఆర్వో భార్యకు డిప్యూటీ తహసీల్దార్ హోదా ఉద్యోగంతో పాటు, ఖమ్మం జిల్లా కేంద్రంలో ఇంటి స్థలం ఇచ్చే విషయాన్ని పరిశీలించాలని కోరాయి. శ్రీనివాసరావు కుటుంబానికి రూ.50 లక్షల పరిహారం చెక్కును అందించిన స్థానిక ప్రజా ప్రతినిధులు, అటవీ అధికారులు, ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపాయి. -
మహిళపై పెంపుడు కుక్క దాడి.. యజమానికి షాకిచ్చిన కోర్టు
ఇటీవల కాలంలో కుక్కలు మనుషులపై దాడి చేసిన ఘటనలు ఎక్కువ అవుతున్నాయి. రోడ్డు మీద వెళ్తున్న వారిపై విచక్షణ రహితంగా దాడి చేసి గాయపరుస్తున్నాయి. అయితే ఈ జాబితాలోకి పెంపుడు కుక్కలు కూడా చేరాయి. ఈ మధ్య పెంపుడు శనుకాలు కూడా ఉన్నట్టుండి యజమానులు, బయట వారిపై దాడి చేస్తున్నాయి. అయితే కుక్కలు గాయపరిచిన ఘటనలో బాధితులకు పరిహారం అందడం చాలా అరుదు. కానీ తాజాగా ఓ పెంపుడు కుక్క కరిచిన ఘటనలో గాయపడిన మహిళకు ఉపశమనం లభించింది. పెంపుడు కుక్క దాడిలో గాయపడ్డ బాదితురాలికి 2 లక్షల పరిహారం చెల్లించాలని జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార వేదిక.. గురుగ్రామ్ మున్సిపల్ కార్పొరేషన్ను(ఎంసీజీ) మంగళవారం ఆదేశించింది. కావాలంటే చెల్లించిన పరిహారం మొత్తాన్నికుక్క యజమాని నుంచి తిరిగి పొందవచ్చని పేర్కొంది. కాగా ఇళ్లల్లో పనులు చేసుకుంటూ జీవించే మున్ని అనే మహిళ, తన కోడలుతోపాటు రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా వినిత్ చికారా పెంచుకుంటున్న కుక్క ఆగష్టు 11 న దాడి చేసింది. ఈ ప్రమాదంలో మహిళ తల, ముఖానికి తీవ్ర గాయాలవ్వడంతో ఆమెను గురుగ్రామ్లోని ఆసుపత్రికి తరువాత ఢిల్లీలోని సఫ్దర్గంజ్ హాస్పిటల్కు తరలించారు. కుక్క దాడిపై సివిల్ లైన్ పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే మహిళను కరిచిన శునకం ‘డోగో అర్జెంటీనో’ జాతికి చెందినదిగా యజమాని తెలిపారు. చదవండి: అరే! ఏం మనుషుల్రా ఇంత రాక్షసత్వమా! శునకానికి ఉరి వేసి... కుక్కను స్వాధీనం చేసుకోవాలని, దాని లైసెన్స్ అనుమతిని వెంటనే రద్దు చేయాలని ఫోరమ్ మున్సిపల్ కార్పొరేషన్ను ఆదేశించింది. అదే విధంగాపెంపుడు కుక్కల పాలసీని మూడు నెలల్లో రూపొందించాలని ఆదేశించింది. వీధి జంతువులను అదుపులోకి తీసుకున్న తర్వాత వాటిని పౌండ్లలో ఉంచాలని, అలాగే హనికరమైన 11 అన్యదేశ జాతులను నిషేధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ జాతి కుక్కులను ఎవరైనా పెంచుకుంటే వెంటనే కస్టడీలోకి తీసుకోవాలని తెలిపింది. డోగో అర్జెంటీనో వంటి క్రూర జాతికి చెందిన శునకం పెంపుడు విషయంలో యజమాని చట్టాన్ని, నిబంధనలు ఉల్లించాడని స్పష్టంగా అర్థం అవుతోందని కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కాగా అమెరికన్ పిట్-బుల్ టెర్రియర్స్, డోగో అర్జెంటీనో, రోట్వీలర్ వంటి క్రూర జాతి కుక్కులపై భారత ప్రభుత్వం నిషేధం విధించింది. -
తాడేపల్లిగూడెం పేలుడు ఘటనపై సీఎం జగన్ దిగ్భ్రాంతి
సాక్షి, అమరావతి: తాడేపల్లిగూడెంలో బాణసంచా తయారీ కేంద్రంలో అగ్ని ప్రమాద ఘటనపై సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ఘటనా ప్రాంతంలో తగిన సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ ఘటనలో గాయపడ్డవారికి మెరుగైన వైద్యం అందించేలా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ఈ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు రూ.10లక్షల చొప్పున సహాయం అందించాలని, బాధిత కుటుంబాలకు తోడుగా నిలవాలని సీఎం జగన్ ఆదేశించారు. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం కడియద్ద గ్రామంలో అన్నవరం అనే వ్యక్తికి చెందిన బాణసంచా కర్మాగారంలో పేలుడు సంభవించిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ముగ్గురు సజీవదహనమయ్యారు. చదవండి: పశ్చిమగోదావరి జిల్లాలో భారీ పేలుడు.. ముగ్గురు సజీవదహనం! -
ఇక వేగంగా ప్రమాద పరిహారం చెల్లింపు
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ బస్సులతో జరిగిన ప్రమాదాల్లో చనిపోయిన, గాయపడిన వారికి పరిహారం రూపంలో ఇచ్చే మొత్తాన్ని వీలైనంత మేర తగ్గించుకోవడంతో పాటు వేగంగా చెల్లింపునకు ఆర్టీసీ ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. కోర్టుల ద్వారా కేసులు పరిష్కారం అయిన తర్వాత భారీ మొత్తంలో పరిహారం చెల్లించాల్సి వస్తోంది. అది సంవత్సరానికి సగటున రూ.50 కోట్లకు పైనే ఉంటోంది. ఇది ఆర్టీసీకి పెను భారంగా పరిణమించింది. కొన్ని సందర్భాల్లో బస్సు డ్రైవర్ తప్పిదం లేకున్నా.. పరిహారం చెల్లించాల్సిన పరిస్థితులు తలెత్తుతున్నాయి. కేసులు పరిష్కారం అయ్యే విషయంలో తీవ్ర జాప్యం జరుగుతుండటంతో వడ్డీ కలుపుకొని పరిహారం చెల్లించాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో లోక్ అదాలత్ ద్వారా రాజీధోరణితో కేసులను వీలైనంత తొందరలో పరిష్కరించుకోవటం ద్వారా పరిహారాన్ని తగ్గించుకోవటంతో పాటు, బాధితులకు కూడా వేగంగా పరిహారం చెల్లించినట్టవుతుందని భావిస్తున్న ఆర్టీసీ ఈ మేరకు తాజాగా కొన్ని ఆదేశాలు జారీ చేసింది. ఈడీ, ఆర్ఎం పరిహారస్థాయి పెంపు.. లోక్ అదాలత్ల ద్వారా కేసులు పరిష్కరించుకునే విధానాన్ని గతంలోనే ప్రారంభించింది. తాజాగా ఆర్టీసీ అధికారాల డెలిగేషన్లో ఫైనాన్షియల్ పవర్ను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. కోర్టు కేసులకు సంబంధించి ఎండీకి ఆర్థిక పరమైన అధికారం పూర్తి స్థాయిలో ఉండగా, సంబంధిత ఈడీకి రూ.10 లక్షలుగా ఉంది, ఇప్పుడు దాన్ని రూ.20 లక్షలకు పెంచారు. ఆర్ఎంకు రూ.5 లక్షలుగా ఉండగా, దాన్ని రూ.10 లక్షలకు పెంచారు. లోక్ అదాలత్ ద్వారా పరిష్కారమయ్యే కేసుల్లో ఎండీ పరిహారం చెల్లించే అధికార పరిధి రూ.10 లక్షలుగా ఉంది, దాన్ని రూ.30 లక్షలకు, ఈడీ లిమిట్ను రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు , ఆర్ఎం లిమిట్ను రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచారు. ఈమేరకు గతంలో జరిగిన బోర్డు సమావేశంలో ఆమోదం తీసుకున్న నేపథ్యంలో తాజాగా ఆర్టీసీ ఎండీ నోటిఫికేషన్ జారీ చేశారు. -
ఉల్లి,పత్తి రైతులకు సముచిత పరిహారం
కడప సెవెన్రోడ్స్: ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల జిల్లాలో ఉల్లి, పత్తి పంటలు కోల్పొయిన రైతులకు సముచిత పరిహారం అందించి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతూ శుక్రవారం జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో తీర్మానించారు. ఎన్యుమరేషన్ నిర్వహించి రైతులకు పరిహారం అందించాలని ప్రభుత్వానికి నివేదించనున్నట్లు జెడ్పీ చైర్మన్ ఆకేపాటి అమర్నాథరెడ్డి తెలిపారు. వేసవిలో గ్రామాలకు తాగునీరు రవాణా చేసినందుకు రూ. 7.57 కోట్ల నిధులు విడుదల చేయాలనితీర్మానించినట్లు వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమంపై జెడ్పీ సభ్యులకు అవగాహన కల్పిస్తామన్నారు. ప్రతి సచివాలయాన్ని మొబైల్ యూనిట్లు నెలలో రెండుసార్లు సందర్శిస్తాయని తెలిపారు. పెండింగ్లో ఉన్న జగనన్న ఇళ్లు, గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలను పూర్తి చేసేందుకు ప్రత్యేక శ్రద్ధ వహించనున్నట్లు తెలిపారు. గ్రామీణ రహదారుల ఏర్పాటు, మరమ్మతులపై చర్యలు చేపడతామన్నారు. జిల్లా పరిధిలోని సమస్యలను అధికారులు పరిష్కరిస్తారని, అలా కాని వాటిని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు చర్యలు చేపడతామన్నారు. సీఎం సొంత జిల్లా గనుక అందరి దృష్టి ఇక్కడే ఉంటుందన్నారు. కనుక అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి ముఖ్యమంత్రి వైఎస్జగన్మోహన్రెడ్డికి మంచి పేరు తీసుకు రావాలని కోరారు. వ్యవసాయరంగంపై జరిగిన చర్చలో వీఎన్ పల్లె ఎంపీపీ రఘునాథ్ మాట్లాడుతూ తమ మండలంలో రైతులు ఉల్లిసాగు చేయగా, భారీ వర్షాలకు మొలకలు వచ్చాయన్నారు. చెన్నైకి తీసుకెళ్లి విక్రయిద్దామనుకుంటే క్వింటా కేవలం రూ. 400లకే అడుగుతున్నారని పేర్కొన్నారు. వేంపల్లె జెడ్పీటీసీ రవికుమార్రెడ్డి మాట్లాడుతూ తమ మండలంలోని నాలుగు పంచాయతీల్లో ఉల్లికి భారీ నష్టం వాటిల్లిందన్నారు. ∙జెడ్పీ కో ఆప్షన్ సభ్యుడు అచ్చుకట్ల కరీముల్లా మాట్లాడుతూ ఎరువుల కొరత తీవ్రంగా ఉందని సమావేశం దృష్టికి తీసుకు వచ్చారు. రైతులకు మినీ కిట్స్ పంపిణీ చేయాలని కోరారు. ∙చక్రాయపేట జెడ్పీటీసీ శివప్రసాద్రెడ్డి మాట్లాడుతూ తమ మండలంలో కొన్ని గ్రామాల్లో డీకేటీ పట్టాలు ఆన్లైన్లో నమోదు కానందున రైతులు పంట రుణాలు పొందలేకపోతున్నారని చెప్పారు. ∙తాళ్లపల్లి పీహెచ్సీ నుంచి వైద్యులను డిప్యుటేషన్పై పంపవద్దని వేంపల్లె జెడ్పీటీసీ కోరారు. వేంపల్లెలో 60 వేల జనాభా ఉన్నప్పటికీ గైనకాలజిస్టు లేరన్నారు. పోరుమామిళ్ల జెడ్పీటీసీ మాట్లాడుతూ తమ మండలంలో గైనకాలజిస్టులను నియమించడంతోపాటు బద్వేలులో డయాబెటిక్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలన్నారు. గాలివీడు ఎంపీపీ మాట్లాడుతూ హెడ్ క్వార్టర్లో మరో వైద్యుడిని నియమించాలన్నారు. మెరుగైన వైద్యసేవలందేలా చర్యలు:కలెక్టర్ విజయరామరాజు వైఎస్సార్ కలెక్టర్ విజయరామరాజు మాట్లాడుతూ ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఇద్దరు డాక్టర్లు అందుబాటులో ఉంటారని తెలిపారు. అలాగే విలేజ్ హెల్త్ క్లినిక్లలో కూడా సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలు అందించేందుకు చర్యలు చేపడతామన్నారు.జేసీ సాయికాంత్వర్మ మాట్లాడుతూ పీహెచ్సీలలో గైనకాలజిస్టుల కొరత ఉన్న మాట నిజమేనన్నారు. ఎవరైనా వైద్యులు ముందుకు వస్తే వెంటనే అపాయ్మెంట్ ఆర్డర్స్ ఇస్తామన్నారు. జిల్లాలోని అన్ని మండలాల్లో ప్రభుత్వ జూనియర్ కళాశాల ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే రవీంద్రనాథ్రెడ్డి కోరారు. కొత్త అంగన్వాడీ కేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు. సగంలో ఆగిపోయిన అంగన్వాడీ భవనాలను నాడు–నేడు కార్యక్రమంలో చేర్చాలని సూచించారు. వీఎన్ పల్లెను పాడా కిందికి చేర్చాలని మండల సమావేశంలో తీర్మానించామని, జెడ్పీలో కూడా ఆ మేరకు తీర్మానం ఆమోదించాలని కోరారు. యంత్రాల సాయంతో చెరువుల్లో మట్టి తవ్వి పొలాలకు తీసుకు వెళ్లేందుకు రైతులకు అనుమతి ఇవ్వాలన్నారు. ∙బ్రహ్మంగారిమఠం ఎంపీపీ వీర నారాయణరెడ్డి మాట్లాడుతూ తమ అంగన్వాడీ కేంద్రంలో వంట గ్యాస్ లేనందువల్ల కట్టెల పొయ్యినే ఉపయోగిస్తున్నారని తెలిపారు. ∙జెడ్పీటీసీ గోవిందరెడ్డి, ఎంపీపీ వీర నారాయణరెడ్డిలు మాట్లాడుతూ తమ మండలంలోని 40 గ్రామాలకు సీపీడబ్ల్యూఎస్ స్కీమ్ ద్వారా తాగునీరు అందిస్తున్నట్లు ఆర్డబ్ల్యూఎస్ అధికారులు చెబుతున్న మాటల్లో ఏమాత్రం నిజం లేదన్నారు. ఒక్క గ్రామానికి తాగునీరు ఇస్తున్నట్లు అధికారులు నిరూపిస్తే తాము రాజీనామాకు సిద్దమని ప్రకటించారు. ∙మొయిళ్ల కాల్వ–రంపతాడు కల్వర్టు ఏర్పాటు చేయాలని జెడ్పీ వైస్ చైర్మన్ బాలయ్య కోరారు. ∙తాగునీటి రవాణా బిల్లులు చాలాకాలంగా పెండింగ్లో ఉన్నాయని, వాటిని వెంటనే చెల్లించి ఆదుకోవాలని గాలివీడు ఎంపీపీ కోరారు. వారం, పది రోజుల్లో ఈ దిశగా చర్యలు తీసుకుంటామని అన్నమయ్య జిల్లా కలెక్టర్ పీఎస్ గిరీషా తెలిపారు. ∙హైవేలో ఇళ్లు కోల్పొయిన వారికి స్థలాలు ఇవ్వాలని, సచివాలయాలకు విద్యుత్ సమస్య తీర్చాలని చెన్నూరు ఎంపీపీ చీర్ల సురేష్యాదవ్ కోరారు. ∙తెలుగుదేశం పార్టీ నేతలు ఒక్కొక్కరు 150 ఎకరాల భూములను ఆక్రమించారని, దీనిపై విచారణ జరిపి భూములను స్వాధీనం చేసుకోవాలని పుల్లంపేట జెడ్పీటీసీ కోరారు. ఆ భూములను అర్హులైన ఎస్సీ ఎస్టీలకు ఇవ్వాలని కోరారు. భూ ఆక్రమణపై ఆర్డీఓతో విచారణ: అన్నమయ్య జిల్లా కలెక్టర్ గిరీషా కలెక్టర్ గిరీషా స్పందిస్తూ ప్రభుత్వ భూమి దురాక్రమణపై ఆర్డీఓతో విచారణ చేయిస్తామని తెలిపారు. కబ్జాదారులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయిస్తామన్నారు. భూములను అర్హులైన పేదలకు పంపిణీ చేసేందుకు చర్యలు చేపడతామని హామి ఇచ్చారు. సోలార్ ప్రాజెక్టు కింద భూములు కోల్పొయిన వారికి పరిహారం ఇవ్వాలని, ఇందులో చుక్కల భూముల సమస్యను పరిష్కరించాలి గాలివీడు ఎంపీపీ కోరారు. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి ఎస్బీ అంజద్బాషా, ఎమ్మెల్సీలు సి.రామచంద్రయ్య, రమేష్ యాదవ్, ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి, రాష్ట్ర సగర కార్పొరేషన్ చైర్మన్ గానుగపెంట రమణమ్మ, జెడ్పీ సీఈఓ ఎం.సుధాకర్రెడ్డి, వివిధ శాఖల అ«ధికారులు పాల్గొన్నారు. 104 వాహనాలు హెడ్ క్వార్టర్స్లో ఉంచాలి: ఎమ్మెల్యే రవీంద్రనాథ్రెడ్డి వైద్య, ఆరోగ్యంపై జరిగిన చర్చలో ఎమ్మెల్యే రవీంద్రనాథ్రెడ్డి మాట్లాడుతూ 104 వాహనాలు సచివాలయాల హెడ్ క్వార్టర్స్లో ఉంచాలని కోరారు. గ్రామ పంచాయతీల పరిధిలో ఉన్న మారుమూల గ్రామాలకు వైద్య సేవలు అందేలా చూడాలన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఎక్స్రే ప్లాంటు వంటి వైద్య పరికరాలు ఉన్నప్పటికీ వాటిని వినియోగించే సిబ్బంది లేకపోవడంతో రోగులు ఇబ్బందులు పడాల్సి వస్తోందన్నారు. చాలా పీహెచ్సీల్లో గైనకాలజిస్టులు, ఇతర స్పెషలిస్టుల కొరత వేధిస్తోందని, వైద్యుల నియామకానికి చర్యలు చేపట్టాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమంపై సభ్యులకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. వైద్య సిబ్బంది తరుచూ పీహెచ్సీలను సందర్శించి అక్కడ అమలవుతున్న వైద్య సేవలు, ఆరోగ్యశ్రీ సేవలను పరిశీలించాలన్నారు. 24 గంటలు గ్రామీణ హెల్త్ క్లినిక్స్ ద్వారా వైద్య సేవలు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. హెల్త్ క్లినిక్స్లలో ఏఎన్ఎంలు, ఎంఎల్హెచ్పీలు, ఆశాలను అందుబాటులో ఉంచాలని కోరారు. సబ్సిడీ స్టోరేజీ యూనిట్లు మంజూరుకు చర్యలు: ఇన్చార్జి మంత్రి ఇన్ఛార్జి మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ జిల్లాలో 16 వేల ఎకరాల్లో ఉల్లి సాగు చేశారని పేర్కొన్నారు. భారీ వర్షాల వల్ల చాలామంది రైతులు నష్టపోయినట్లు తెలుస్తోందన్నారు. కనుక ఎన్యుమరేషన్ నిర్వహించి పరిహారం అందించేందుకు కృషి చేస్తామన్నారు. వ్యవసాయ ఉత్పత్తులను నిల్వ చేసుకోవడానికి వీలుగా సబ్సిడీ స్టోరేజీ యూనిట్లు మంజూరుకు చర్యలు చేపడతామన్నారు. కమలాపురం ఎమ్మెల్యే పి.రవీంద్రనాథ్రెడ్డి మాట్లాడుతూ నష్టపోయిన ఉల్లి, పత్తి పంటలను ఎన్యుమరేషన్ చేయించి రైతులకు పరిహారం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ తీర్మానం ఆమోదించాలని సూచించారు. ఆయన సూచనకు జెడ్పీ చైర్మన్ అంగీకరించారు. -
అంకిత కుటుంబానికి రూ.25లక్షల ఆర్థిక సాయం.. ప్రకటించిన సీఎం
దెహ్రాదూన్: ఉత్తరాఖండ్లో హత్యకు గురైన రిసెప్షనిస్ట్ అంకిత భండారీ కుటుంబానికి ఆర్థిక సాయం ప్రకటించారు సీఎం పుష్కర్ సింగ్ ధామీ. ఆమె తల్లిదండ్రులకు రూ.25లక్షలు అందించాలని ఆదేశించారు. ఉత్తరాఖండ్ సీఎం కార్యాలయం ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా వెల్లడించింది. అలాగే అంకిత కుటుంభానికి త్వరగా న్యాయం జరిగేందుకు ఆమె హత్య కేసును ఫాస్ట్ ట్రాక్ కోర్టుతో విచారణ జరిపించాలని ధామీ న్యాయస్థానాన్ని కోరినట్లు సీఎంఓ తెలిపింది. అంకిత తండ్రితో సీఎం మంగళవారం ఫోన్లో మాట్లాడారు. ఈ కేసు విచారణను వేగంగా జరిపించి నిందితులకు కఠినశిక్ష పడేలా చేస్తామని హామీ ఇచ్చారు. ఆ మరునాడే పరిహారం ప్రకటించారు. मुख्यमंत्री श्री @pushkardhami ने अधिकारियों को दिवंगत अंकिता भंडारी के परिजनों को ₹25 लाख की आर्थिक सहायता देने के निर्देश दिए हैं। उन्होंने कहा कि पीड़ित परिवार को त्वरित न्याय मिल सके, इसके लिये फास्ट ट्रैक कोर्ट में सुनवाई के लिए माननीय न्यायालय से अनुरोध किया गया है। — CM Office Uttarakhand (@ukcmo) September 28, 2022 మరోవైపు అంకిత హత్య కేసును విచారిస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) నిందితులకు చెందిన గ్రే యాక్టివా, బ్లాక్ పల్సర్ బైక్లను స్వాధీనం చేసుకుంది. వీటిని ఉపయోగించే అంకితను కాలువ దగ్గరకు తీసుకెళ్లి ఆ తర్వాత అందులోకి తోసేసి ఉంటారని అధికారులు అనుమానిస్తున్నారు. బీజేపీ నుంచి సస్పెండైన వినోద్ ఆర్య కుమారుడు అంకిత్ ఆర్య ఈ హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. తన రిసార్డులో రిసెప్షనిస్ట్గా పనిచేసే ఆమెను మరో ఇద్దరు సిబ్బందితో కలిసి హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇప్పటికే ముగ్గురినీ అరెస్టు చేశారు. ఈ హత్య ఉత్తరాఖండ్లో తీవ్ర దుమారం రేపింది. మరోవైపు ఈ రిసార్టులో వ్యభిచారం నిర్వహించేవారని, ఆ కూపంలోకి దిగేందుకు నిరాకరించడం వల్లే అంకితను హత్య చేశారని సిట్ దర్యాప్తులో తేలింది. చదవండి: అది రిసార్ట్ కాదు.. వ్యభిచార కూపం! -
అదృశ్యమైన బాలిక సెల్లార్ గుంతలో శవమై తేలింది
గచ్చిబౌలి: అదృశ్యమైన బాలిక సెల్లార్ గుంతలో శవమై తేలిన సంఘటన గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ గోనె సురేష్ కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. నాగర్ కర్నూల్ జిల్లాకు చెందిన నాణు, హీరాబాయి దంపతులు నగరానికి వలస వచ్చి గోపన్పల్లిలోని ఎన్టీఆర్నగర్లో ఉంటున్నారు. నాణు ఆటో డ్రైవర్గా, హీరాబాయి హౌస్మేడ్గా పని చేస్తున్నారు. వీరికి ముగ్గురు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. చిన్న కూతురు రమావతి రాణి(17) యూసూఫ్గూడలోని ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి చదువుతోంది. ఆదివారం తల్లిదండ్రులు పనికి వెళ్లారు. ఉదయం ఇంటికి తాళం వేసి బయటికి వెళ్లిన రాణి తిరిగి రాలేదు. కుటుంబసభ్యులు ఆమె కోసం గాలించినా ఆచూకీ లభ్యం కాలేదు. సోమవారం తెల్లవారు జామున ఎన్టీఆర్నగర్లోని సిరీస్ సంస్థకు సంబంధించిన సెల్లార్ గుంతలో ఆమె మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహన్ని బయటికి తీసి స్థానికులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. బాధితులను ఎమ్మెల్సీ రాములు నాయక్, స్థానిక కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి పరామర్శించారు. పరిహారం చెల్లించాలని ఆందోళన 14 ఏళ్ల క్రితం సెల్లార్ గుంతను తవ్వి వదిలేశారని, రక్షణ చర్యలు చేపట్టకపోవడంతో ఇప్పటి వరకు ఏడుగురు మృతి చెందారని స్థానికులు తెలిపారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన యాజమాన్యంపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నిరసన వ్యక్తం చేశారు. సాయంత్రం 5 గంటల వరకు మృతదేహంతో సెల్లార్ గుంత వద్ద ఆందోళన చేపట్టారు. పోలీసులు ఇటు బాధితులు అటు సైట్ యాజమాన్యంతో చేసిన చర్చలు ఫలించ లేదు. దీంతో ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. సాయంత్రం 7 గంటల వరకు ఆందోళన కొనసాగించడంతో దిగివచి్చన యాజమాన్యం బాధిత కుటుంబానికి న్యాయం చేసేందుకు అంగీకరించడంతో వారు ఆందోళనను విరమించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమ్తిత్తం ఆస్పత్రికి తరలించేందుకు అంగీకరించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. (చదవండి: లిఫ్ట్ అడిగి ఇంజక్షన్ గుచ్చి) -
కు.ని. మృతుల కుటుంబాలకు రూ.కోటి పరిహారమివ్వాలి: సంజయ్
సాక్షి, హైదరాబాద్: కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు విఫలమై చనిపోయిన నలుగురు మహిళల కుటుంబాలకు రూ.కోటి చొప్పున పరిహారం, ఇల్లు, పిల్లల చదువుకయ్యే ఖర్చును ప్రభుత్వమే భరించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు. నలుగురు మహిళలు చనిపోయిన ఘటనకు బాధ్యుడైన ఆ శాఖ మంత్రి హరీశ్రావును వెంటనే బర్తరఫ్ చేయాలని సీఎం కేసీఆర్ను డిమాండ్ చేశారు. హరీశ్ తమ కుటుంబసభ్యుడు కాబట్టే ఆయనపై సీఎం చర్యలు తీసుకోవడం లేదన్నారు. బుధవారం బాధితులను పరామర్శించిన అనంతరం సంజయ్ మీడియాతో మాట్లాడుతూ ఈ ఆపరేషన్లు వికటించి నలుగురు మహిళలు మృతిచెందినా, మరో 30 మంది ఆసుపత్రులపాలైన కేసీఆర్ వారిని కనీసం పరామర్శించలేదని దుయ్యబట్టారు. కేసీఆర్ ప్రభుత్వ ఘోర వైఫల్యానికి ఇది నిదర్శనమని, ఇవి సర్కారీ హత్యలేనని ఆరోపించారు. ‘ఆపరేషన్ చేసేటప్పుడు కనీసం మత్తు ఇంజక్షన్ ఇయ్యలేదు. సర్జరీ చేస్తుంటే ఏడ్చినం. ఆపరేషన్ అయినంక ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నం’అని బాధిత మహిళలు కన్నీటిపర్యంతమయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంత ఘోరం జరిగినా పట్టించుకోకుండా ఏమి ఉద్ధరించడానికి కేసీఆర్ బీహార్ వెళ్లారని ప్రశ్నించారు. ‘ఇక్కడి పైసలు తీసుకుపోయి బీహార్ల పెడతరా?’అని నిలదీశారు. ‘రోజులో 24 గంటలూ ఎవరి కొంపలు ముంచాలనే రాజకీయాలు చేయడమే తప్ప పేదల గురించి ఆలోచనే లేని దుర్మార్గుడు కేసీఆర్’అని మండిపడ్డారు. ‘హరీష్ రావు అబద్దాల మంత్రి. మంత్రులు, టీఆర్ఎస్ నేతల పనంతా నిత్యం లిక్కర్, ల్యాండ్, డ్రగ్స్, సాండ్ దందాలే’నని ఆరోపించారు. రికార్డు కోసం గంటలో 34 మందికి కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయటాన్ని ఖండిస్తున్నామని అన్నారు. -
ప్యారీ సుగర్స్ మృతులకు రూ.60 లక్షల చొప్పున పరిహారం
కాకినాడ రూరల్: కాకినాడ జిల్లా వాకలపూడి పారిశ్రామికవాడలోని ప్యారీ సుగర్స్ రిఫైనరీలో సోమవారం జరిగిన ప్రమాదంలో మృతుల కుటుంబాలకు రూ.60 లక్షల చొప్పున పరిహారాన్ని అందించనున్నట్టు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా ప్రకటించారు. ఆ పరిశ్రమలో సీ పాన్(ట్యాంకు)లో వాక్యూమ్ ప్రెజర్ (అధిక పీడన ఒత్తిడి) ఎక్కువైంది. దీంతో ట్యాంక్ దెబ్బతిని ఒక్కసారిగా లోపలికి కుంగిపోగా.. ప్లాట్ఫామ్ దెబ్బతిని ఐరన్ గడ్డర్లు అత్యంత వేగంగా దూసుకువచ్చి పేరూరు సుబ్రహ్మణ్యేశ్వరరావు (33), రాగం ప్రసాద్ (37)పై పడ్డాయి. తీవ్రంగా గాయపడిన వారిద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. మృతదేహాలను కాకినాడ ప్రభుత్వాస్పత్రిలో ఉంచగా కార్మిక సంఘాల నాయకులు, ప్రజాప్రతినిధుల డిమాండ్ మేరకు అధికారులు యాజమాన్యంతో జరిపిన చర్చలు మంగళవారం తెల్లవారుజాముకు కొలిక్కి వచ్చాయి. పరిహారం వివరాలను మంగళవారం జిల్లా కలెక్టర్ మీడియాకు తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ.40 లక్షల చొప్పున, ఉద్యోగుల కాంట్రీబ్యూషన్ ద్వారా మరో రూ.5 లక్షల చొప్పున చెల్లించేందుకు సంస్థ యాజమాన్యం అంగీకారం తెలిపింది. దీంతోపాటు వరŠుక్సమెన్ కాంపన్సేషన్ చట్టం కింద రూ.10 లక్షలు, వైఎస్సార్ బీమా పథకం కింద రూ.5 లక్షలు చొప్పున పరిహారం అందిస్తామని కలెక్టర్ తెలిపారు. మృతుల కుటుంబాలలో ఒకరికి శాశ్వత ఉద్యోగం కల్పించేందుకు సంస్థ అంగీకారం తెలియజేసిందని కలెక్టర్ వివరించారు. తాత్కాలికంగా పరిశ్రమ మూసివేత ప్యారీ సుగర్స్లో ఈ నెల 19న పేలుడు వాటిల్లి ఇద్దరు మృతి చెందగా.. సోమవారం జరిగిన ప్రమాదంలో మరో ఇద్దరు మృతి చెందారు. కార్మికుల భద్రతకు ముప్పు ఉండటంతో ఫ్యాక్టరీల చట్టం–1948, ఏపీ ఫ్యాక్టరీ రూల్స్–1950లోని సెక్షన్ 40(2)ప్రకారం థర్డ్ పార్టీ పరిశీలన ద్వారా సంస్థలోని భద్రతా వ్యవస్థ అమలును ధ్రువీకరించే వరకు ప్యారీ సుగర్స్ కార్యకలాపాలను నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేశామని కలెక్టర్ తెలిపారు. మంగళవారం డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ రాధాకృష్ణ, కాకినాడ ఆర్డీవో బీవీ రమణ, తహశీల్దార్ మురార్జీ తదితర అధికారుల బృందం పరిశ్రమలోని కంట్రోల్ రూమ్, బయట గేట్కు తాళాలు వేసి సీజ్ చేశారు. -
నాసిరకం సర్వీస్, ఓవర్ ఛార్జింగ్: ఓలాకు కోర్టులో ఎదురుదెబ్బ
సాక్షి, హైదరాబాద్: క్యాబ్ సేవల సంస్థ ఓలాకు ఎదురు దెబ్బ తగిలింది. ఒక కస్టమర్ నుంచి ఎక్కువ చార్జీ వసూలు చేసినందుకు పరిహారం చెల్లించాలని వినియోగదారుల కోర్టు ఆదేశించింది. హైదరాబాద్కు చెందిన బాధితుడు జబేజ్ శామ్యూల్ ఫిర్యాదు మేరకు విచారణ జరిపిన కోర్టు నాసిరకం సర్వీస్, ఓవర్ ఛార్జింగ్ కారణంగా మొత్తం రూ. 95,000 పరిహారం చెల్లించాలని స్పష్టం చేసింది. (లక్ అంటే టెకీలదే: అట్లుంటది ఐటీ కొలువంటే!) వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్లోని ఓలా క్యాబ్స్ నుండి పరిహారం కోరుతూ ఫిర్యాదు దారు జబేజ్ శామ్యూల్ 2021, అక్టోబరు 19న నాలుగు గంటలకు ఓలా క్యాప్ బుక్ చేసుకున్నాడు. భార్య, మరొకరితో కలిసి క్యాబ్ ఎక్కినపుడు అంతా డర్టీగా కనిపించింది. ఏసీ ఆన్ చేయమన్నా, డ్రైవర్ అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపించారు. అంతేకాదు నాలుగైదు కిలోమీటర్లు ప్రయాణించిన తర్వాత శామ్యూల్ని మధ్యలోనే దింపేశాడు. దీనిపై ఓలాను సంప్రదించినప్పటికీ ఫలితం కనబడలేదు. పైగా రూ. 861 ఫీజు చెల్లించాల్సిందిగా పదేపదే కోరడంతో విసిగిపోయిన కస్టమరు దాన్ని చెల్లించారు. (భారీ నష్టాలు: సెన్సెక్స్ 650 పాయింట్లు పతనం) దీంతో హతాశుడైన శామ్యూల్ వినియోగదారుల చట్టం సెక్షన్ 35 కింద హైదరాబాద్ జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ - III ను ఆశ్రయించారు. దాదాపు రూ.5 లక్షల పరిహారం ఇప్పించాల్సిందిగా కోరారు. దీన్ని విచారించిన కోర్టు 5 లక్షల అంటే, చాలా పెద్ద మొత్తం అని అభిప్రాయపడినకోర్టు, ట్రిప్ చార్జీ, రూ. 861 వడ్డీతో (సంవత్సరానికి 12శాతం చొప్పున), అలాగే మానసిక వేదనకుగాను రూ. 88వేలు, ప్రొసీడింగ్స్ ఖర్చుల నిమిత్తం రూ. 7 వేలు కలిపి మొత్తం 95 వేల రూపాయలు చెల్లించాలని కమిషన్ ఓలా క్యాబ్ను ఆదేశించింది. -
రైతులకు నష్ట పరిహారం ఇవ్వాలి
సాక్షి, హైదరాబాద్: ఇటీవల కురిసిన భారీ వర్షాలతో దెబ్బతిన్న రైతులకు నష్ట పరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని తెలంగాణ రైతు సంఘం డిమాండ్ చేసింది. బుధవారం హైదరాబాద్లో జరిగిన తెలంగాణ రైతు సంఘం సమావేశంలో ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పోతినేని సుదర్శన్రావు పలు తీర్మానాలు చేశారు. ఈ సందర్భంగా సంఘం నేతలు మాట్లాడుతూ..తుఫాన్ వల్ల రాష్ట్రంలో లక్షల ఎకరాల్లో పంటలు నీటమునిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. విత్తనాలు, ఎరువులు ఇవ్వాలని, బ్యాంకులు రుణ సహాయం చేయాలని కోరారు. సమావేశంలో అఖిల భారత కిసాన్ సభ జాతీయ ఉపాధ్యక్షుడు మల్లారెడ్డి, తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.సాగర్ పాల్గొన్నారు. -
సామూహిక లైంగిక దాడి చేసి.. ఆమెకు వెల కట్టారు
దేశంలో ఎన్ని చట్టాలు తీసుకువచ్చాని కొందరు మృగాలు మాత్రం మారడంలేదు. మహిళలు, మైనర్లపై లైంగిక దాడులకు పాల్పడుతూనే ఉన్నారు. జరిగిన అవమానం భరించలేక బాధితులు.. ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. తాజాగా ఓ మైనర్(16)పై నలుగురు వ్యక్తులు సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ దారుణ ఘటన ఛత్తీస్గఢ్లో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. బాధితురాలు ఈ నెల 9వ తేదీన తన తండ్రితో కలిసి బయటకు వెళ్తోంది. ఇంతలో ఒద్దరు వ్యక్తులు వారిని అడ్డుకున్నారు. అనంతరం ఆమె తండ్రిపై దాడి చేసి.. మైనర్ను సమీప అటవీ ప్రాంతంలోకి ఎత్తుకెళ్లారు. కాగా, అటవీ ప్రాంతంలో అంతకుముందే ఉన్న మరో ఇద్దరు వారితో కలిసి.. నలుగురు వ్యక్తులు మైనర్పై లైంగిక దాడికి పాల్పడ్డారు. తర్వాత ఆమెను అటవీ ప్రాంతంలోనే వదిలి వెళ్లిపోయారు. జరిగిన విషయాన్ని బాధితురాలు తండ్రి గ్రామ పంచాయతీ పెద్దల దృష్టికి తీసుకెళ్లాడు. ఈ క్రమంలో ఊరి పెద్దలు పంచాయితీ పెట్టారు. జరిగిన విషయం ఎంతో బాధాకరం. జరిగిందేదో జరిగిపోయింది.. బాధిత కుటుంబానికి నష్ట పరిహారం కింద నిందితులు రూ.లక్ష ఇవ్వాలని తీర్మానించారు. ఈ విషయం పోలీసుల దాకా పోవద్దు.. ఇక్కడితోనే ముగిసిపోవాలని ఇరు వర్గాలను కోరారు. కాగా, జరిగిన ఘటన గురించి పోలీసులకు తెలియడంతో నిందితులపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. అనంతరం, బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్టు జిల్లా అడిషనల్ ఎస్పీ ప్రతిభా పాండే చెప్పారు. Jashpur, Chhattisgarh | 16-year-old minor was allegedly gang-raped. Incident is of July 9, but a transaction of Rs 1 lakh was being done to silence things. We reached family & conducted medical of victim. Accused in custody, further investigation is ongoing: Pratibha Pandey, ASP pic.twitter.com/Sb5QzRZM52 — ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) July 11, 2022 ఇది కూడా చదవండి: నడిరోడ్డుపై నాగిని డ్యాన్స్తో రచ్చ రచ్చ.. వీడియోపై ట్రోలింగ్స్ -
10 నెలల చిన్నారికి ఉద్యోగమిచ్చిన రైల్వే
న్యూఢిల్లీ: తల్లిదండ్రులను కోల్పోయిన ఛత్తీస్గఢ్ చిన్నారికి రైల్వే శాఖ కారుణ్య నియామకం కింద పోస్టింగ్ ఇచ్చింది. 18 ఏళ్లు వచ్చాక ఆమె ఉద్యోగ బాధ్యతల్లో చేరుతుందని రైల్వే శాఖ తెలిపింది. ఛత్తీస్గఢ్ రాష్ట్ర చరిత్రలో ఇంత చిన్న వయస్సులో జరిపిన కారుణ్య నియామకం ఇదేనని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ‘చిన్నారి తండ్రి రాజేంద్ర కుమార్, భిలాయ్లోని రైల్వే యార్డులో అసిస్టెంట్గా పనిచేస్తున్నారు. జూన్ ఒకటో తేదీన జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన, భార్య కూడా చనిపోయారు. వారి 10 నెలల చిన్నారి క్షేమంగా బయటపడింది. కుమార్ కుటుంబానికి అన్ని రకాల సాయాన్ని నిబంధనల ప్రకారం రాయ్పూర్ రైల్వే డివిజన్ అందిస్తుంది’అని రైల్వే శాఖ తెలిపింది. ‘రికార్డుల్లో నమోదు కోసం జూన్ 4వ తేదీన చిన్నారిని ఆమె కుటుంబీకులు తీసుకువచ్చారు. వేలి ముద్రలు తీసుకునే సమయంలో ఆ చిన్నారి ఏడ్వడం చూసి మా హృదయం ద్రవించింది. ఆ పసిగుడ్డు వేలి ముద్రలు తీసుకోవడం కష్టతరమైంది’అని రైల్వే అధికారులు గుర్తు చేసుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు మరణించిన సందర్భాల్లో వారి కుటుంబీకులకు తక్షణమే సాయం అందించేందుకు కారుణ్య నియామకాలు చేపడతారు. -
తల్లిదండ్రులు.. దత్త పుత్రుడు.. సొంత కొడుకు !
సాక్షి, హైదరాబాద్: కష్టపడి పెంచి పెద్ద చేసిన దత్తపుత్రుడు తల్లిదండ్రులను పట్టించుకోకపోవడంతో అతనికి ఆదివారం లోక్అదాలత్లో కౌన్సెలింగ్ నిర్వహించి వివాదాన్ని పరిష్కరించారు. నగరానికి చెందిన భార్యభర్తలకు పిల్లలు కలగకపోవటంతో ఒక అనాథ బాలుడిని దత్తత తీసుకున్నారు. సొంత కొడుకులా అప్యాయంగా చూసుకున్నారు. ప్రయోజకుడ్ని చేయాలని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చేర్చించారు. కొన్నేళ్ల తర్వాత ఆ జంటకు కుమారుడు కలిగాడు. దత్త పుత్రుడితో పాటు సొంత కొడుకును కూడా అల్లారుముద్దుగానే చూసుకున్నారు. కాలం గడుస్తున్న కొద్దీ కుటుంబ పెద్దకు ఆరోగ్యం సహకరించకపోవటం, ఆర్ధిక ఇబ్బందులు మొదలవ్వడంతో సొంత కొడుకును ప్రభుత్వ పాఠశాలలో చేర్చించారు. ఇదే సమయంలో దత్త పుత్రుడి ప్రవర్తనలో మార్పు వచ్చింది. పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులను చూసుకోవటం మానేశాడు. వారింటిని ఆక్రమించేశారు. మరోవైపు సొంత కొడుకు ఆర్థిక పరిస్థితి అధ్వానంగా మారింది. తల్లిదండ్రుల పోషణే గగనమైపోయింది. సొంత కొడుకు కంటే ఎక్కువగా పెంచి పెద్దచేసిన దత్త పుత్రుడ ప్రవర్తన చూసి కుంగిపోయిన వృద్ధ జంట.. అదనపు జిల్లా న్యాయమూర్తి ఉమాదేవి చొరవతో న్యాయ సేవాధికార సంస్థను ఆశ్రయించారు. ఆదివారం జరిగిన జాతీయ లోక్ అదాలత్లో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సిటీ సివిల్ కోర్టు కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జి కే.మురళీమోహన్ సమక్షంలో వృద్ధ జంట, దత్తపుత్రుడు, ఆయన భార్య, సొంత కొడుకును పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చారు. తల్లిదండ్రుల బాధ్యత విషయంలో దత్త కుమారుడు, సొంత పిల్లలకు మధ్య నెలకొన్న వివాదాలను పరిష్కరించి, కుటుంబ సభ్యుల మధ్య రాజీ కుదిర్చారు. దత్త పుత్రుడు, కోడలికి మనవరాళ్లకు ప్రేమాభిమానాలతో తల్లిదండ్రులు కొంత ఆస్తి, డబ్బు అప్పగించారు. పిల్లలందరూ న్యాయమూర్తి ఉమాదేవి సమక్షంలో మాట ఇచ్చి కుటుంబ వివాదాన్ని పరిష్కరించుకున్నారు. అనంతరం ఖలీల్ అనే వ్యక్తిపై స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దాఖలు చేసిన అప్పు వసూలు కేసును ఉభయ పార్టీలు రాజీ పద్ధతిలో పరిష్కరించుకున్నాయి. తన తల్లి చేసిన బ్యాంకు అప్పును , తన తల్లి మరణానంతరం ఆమె కుమారుడు చెల్లించడానికి ముందుకు రాగా, ఎస్బీఐ కొంత అప్పును మినహాయించి కొడుకుతో రాజీకి ముందుకొచ్చింది. ప్రాథమిక దశలోనే ఈ వివాదాన్ని పరిష్కరించుకున్న ఉభయ పక్షాలను సిటీ సివిల్ కోర్టు ప్రధాన న్యాయమూర్తి రేణుక యారా అభినందించి వారికి అవార్డు కాపీలను అందజేశారు. (చదవండి: 1,518 సివిల్ కేసుల పరిష్కారం) -
తిథిలీ తుఫాన్ బాధిత రైతులకు సీఎం జగన్ శుభవార్త
-
రాకేశ్ కుటుంబానికి రూ.25లక్షల ఎక్స్ గ్రేషియా
సాక్షి, హైదరాబాద్: అగ్నిపథ్ నియామక ప్రక్రియను వ్యతిరేకిస్తూ శుక్రవారం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో నిరుద్యోగులు నిర్వహించిన నిరసన కార్యక్రమంలో రైల్వే పోలీసులు జరిపిన కాల్పుల్లో వరంగల్ జిల్లాకు చెందిన రాకేశ్ మృతిచెందడం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు తీవ్ర దిగ్భ్రాంతిని, సంతాపాన్ని వ్యక్తంచేశారు. కేంద్ర ప్రభుత్వ దుర్మార్గ విధానాలకు బలైపోయిన బీసీ బిడ్డ రాకేశ్ కుటుంబానికి రూ.25 లక్షల ఎక్స్గ్రేషియాతోపాటు, ఆ కుటుంబంలో అర్హులైన వారికి ప్రభుత్వ ఉద్యోగాన్ని ఇవ్వనున్నట్లు ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తప్పుడు విధానాల వల్లనే రాకేశ్ బలయ్యాడని విచారం వ్యక్తంచేశారు. -
పాడిరైతుకు అభయం
కడప అగ్రిక్చర్: రైతన్నకు రాష్ట్ర ప్రభుత్వం అడుగడుగునా అండగా నిలుస్తోంది. వ్యవసాయ రంగంతోపాటు పాడి పరిశ్రమ అభివృద్ధికి చేయూతనిస్తోంది.పాడి పశువులు, ఆవులు, గొర్రెలు, మేకలు ప్రమాదవశాత్తుగానీ, అకస్మాత్తుగా గానీ మృతి చెందింతే రైతులు అర్థికంగా నష్టపోకుండా ఉండేందుకు డాక్టర్ వైస్సార్ పశు నష్టపరిహార పథకం కింద పరిహారం అందిస్తూ రైతన్నలను ఆదుకుంటోంది. ఇటీవలే వైఎస్సార్ పశు ఆరోగ్య సేవ అంబులెన్స్లను అందుబాటులోకి తెచ్చి గ్రామీణ పశువైద్యానికి పెద్దపీట వేసింది. పశువులకు అత్యవసర వైద్యం అవసరమైతే 1962కు ఫోన్ కొడితే చాలు ఇంటి ముంగిటకే పశువైద్య సేవలందుతున్నాయి. దీంతో అన్నదాతలు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. పాడి పశువులైతేనే నష్టపరిహారం రైతులకు సంబంధించి పాడి గేదెలు, ఆవులు, గొర్రెలు మేకలు ప్రమాదవశాత్తు లేదా అకస్మాత్తుగా చనిపోతే డాక్టర్ వైస్సార్ పశు నష్టపరిహారం పథకం కింద నగదు అందించి బాధితులను ప్రభుత్వం ఆదుకుంటోంది. పశువుగానీ, ఆవులు కానీ ఒక ఈత ఈనినవై ఉండాలి. ఇందులో నాటు పశువు(నాటు రకం గేదె) మృతి చెందితే రూ. 15 వేలు, చుక్క, ముర్రా జాతికి చెందిన పశువు చనిపోతే రూ. 30 వేలు ఇస్తారు. ఇది కూడా ఒక కుటుంబానికి ఒకటి నుంచి ఆరు పశువుల వరకు నష్టపరిహారం వర్తిస్తుంది. తర్వాత ఎన్ని చనిపోయినా ఈ పథకం వర్తించదు. గొర్రెలకు సంబంధించి ఇలా... ఒకే సారి మూడు గొర్రెలు చనిపోతే ఒక్కోదానికి రూ. 6 వేల చొప్పున 18 వేల రూపాయలు ఇస్తారు. ఒకటి, రెండు గొర్రెలు, మేకలు చనిపోతే మాత్రం డబ్బులు రావు. ఇందులో కూడా ఒక కుటుంబానికి 20 గెర్రెల వరకు నష్టపరిహారం వస్తుంది. తరువాత ఎన్ని చనిపోయినా ఈ పథకం వర్తించదు. ఇందులో పిడుగు, విద్యుత్ షాక్లతో చనిపోతే మాత్రం కచ్చితంగా పంచనామా చేయాలి. ప్రమాదంలో చనిపోతే మాత్రం ఎఫ్ఐఆర్ ఉండాలి. దీంతోపాటు పాడి గేదెలు,ఆవులు, గొర్రెలు, మేకలు చనిపోతే కచ్చితంగా ఆ గ్రామల పరిధిలోని గ్రామీణ పశువైద్యాధికారి పోస్టుమార్టం చేయాలి.అందుకు సంబంధించిన రిపోర్టు ఉండాలి. దీంతోపాటు పోస్టుమార్టం చేసిన పశువుతోగానీ, గొర్రెతో గాని డాక్డర్ ఫొటో ఉంటేనే డబ్బులు వస్తాయి. లేకుంటే రావు. సంబంధిత డబ్బులు నేరుగా బాధితుడి ఖాతాకు జమ అవుతాయి. పశు వైద్యులకు సమాచారం ఇవ్వాలి... పశువులు, ఆవులు గొర్రెలు ప్రమాదవశాత్తు లేదా అకస్మాత్తుగా చనిపోతే సంబంధిత విషయాన్ని పశుశైద్యాధికారికి తెలియజేయాలి. అయన అక్కడి నుంచే వివరాలను జియోట్యాగ్ చేయాలి. దీంతోపాటు పోస్టుమార్టం చేసి మూగజీవాల ఫొటోలు తీయాలి. పోస్టుమార్టం రిపోర్టు కూడా ఉండాలి. ఇవేవీ లేకపోతే నష్టపరిహారం రాదు. ఇది కూడా పాడిగేదెలు, ఆవులు, గొర్రెలు, మేకలకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. – డాక్టర్. తెలుగు. వెంకటరమణయ్య, జిల్లా పశు వైద్యాధికారి. -
కుక్క కరిచిందా.. అయితే రూ.10వేలు తీసుకోవడం మరచిపోకండి!
బనశంకరి(బెంగళూరు): కుక్క కాటుకు అదేదో దెబ్బ అని ఒక నానుడి ఉంది. కుక్క కరిస్తే యాంటి రేబీస్ టీకాలు వేసుకుంటే ఎలాంటి సమస్యా ఉండదు. ఆపై బెంగళూరు పాలికెలో దరఖాస్తు చేసుకుంటే పరిహారం కూడా లభిస్తుంది. వీధి కుక్క కరిస్తే బీబీఎంపీ పరిహారం అందించే విషయం చాలామందికి తెలియదు. దీంతో గత ఏడేళ్లలో 32 వేలమందికి పైగా కుక్కకాట్లుకు గురైనప్పటికీ అక్షరాలా 25 మంది మాత్రమే పరిహారం తీసుకున్నారు. గాయాన్ని బట్టి పరిహారం ► హైకోర్టు ఆదేశాలతో గత 8 ఏళ్ల నుంచి వీధి కుక్కల బాధితులకు బీబీఎంపీ పరిహారం అందిస్తోంది ► పరిహారాన్ని ఎలా లెక్కిస్తారంటే ప్రతి గాయానికి రూ.2 వేలు, లోతైన గాయమైతే రూ.3 వేలు, గాయాలు సంఖ్య ఎక్కువగా ఉంటే రూ.10 వేలు పరిహారం లభిస్తుంది. అలాగే చికిత్స వ్యయాన్ని కూడా బీబీఎంపీ భరిస్తుంది. ► ఒకవేళ కుక్క కరిచి పిల్లలు చనిపోతే రూ.50 వేలు, పెద్దలు చనిపోతే లక్ష రూపాయలు సదరు కుటుంబానికి అందించాలి. ► 2016 నుంచి ఏప్రిల్ 2022 వరకు బీబీఎంపీ పరిధిలో 32,161 మంది వీధి కుక్కల బారినపడ్డారు. వీరిలో కేవలం 25 మంది దరఖాస్తు చేసుకుని పరిహారం పొందారు. 25 మందికి.. రూ.15 లక్షలు ► 2016–17లో ఒక వ్యక్తిపై వీధి కుక్కలు దాడి చేశాయి, పరిహారం, చికిత్స వ్యయంతో కలిపి రూ.70,430ను పాలికె అందజేసింది. ► 2017–18 లో ముగ్గురికి కలిపి రూ.60,645 ఇచ్చింది. 2018–19లో విభూతిపురలో ప్రవీణ్ అనే బాలుడు వీధికుక్కల దాడిలో మృతిచెందాడు. ఆ కుటుంబానికి పరిహారం, ఆసుపత్రి వ్యయం తో కలిపి రూ.8,42,963 ముట్టజెప్పింది. ► 2019–20 లో 9 మందికి రూ.2,07,292, 2020–21 లో 7 మందికి రూ.2,22,540, 2021–22 లో నలుగురి కి రూ.85,431 పరిహారం ఇచ్చింది. ► ఇప్పటివరకు ఇచ్చిన మొత్తం పరిహారం రూ.15 లక్షలకు చేరింది. చాలామందికి తెలియదు బీబీఎంపీ పరిహారం గురించి నగరవాసులకు తెలియదు. దీంతో కుక్క కొరికితే సొంత ఖర్చుతో చికిత్స తీసుకుని మరిచిపోతున్నారు. ఇటీవల పాలికె కమిషనర్ తుషార్ గిరినాథ్ మాట్లాడుతూ ఈ విషయం తెలిపారు. ఇంత ముఖ్యమైన సంగతిని పాలికె ప్రజలకు చేరవేయడం లేదు. చదవండి: అదిరింది.. అంబానీ కాబోయే కోడలి అరంగేట్రం -
అసైన్డ్ భూమికీ పరిహారం చెల్లించాలి
సాక్షి, అమరావతి: ప్రజోపయోగం కోసం వెనక్కి తీసుకున్న అసైన్డ్ భూమికి కూడా పట్టా భూములతో సమానంగా పరిహారం చెల్లించాల్సిందేనని హైకోర్టు స్పష్టం చేసింది. అసైన్డ్దారులు 2013 భూ సేకరణ చట్టం లేదా రాష్ట్రంలో అమల్లో ఉన్న ఇతర చట్టం కింద పరిహారానికి అర్హులని చెప్పింది. ప్రభుత్వం 2016లో జారీ చేసిన జీవో 259 ఆధారంగా ఈ ఆదేశాలు ఇస్తున్నట్లు స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఎం.సత్యనారాయణమూర్తి ఇటీవల తీర్పు ఇచ్చారు. ఇండస్ట్రియల్ పార్క్ కోసం అధికారులు వెనక్కి తీసుకున్న తమ అసైన్డ్ భూములకు ఎలాంటి పరిహారం ఇవ్వడంలేదని, చట్ట ప్రకారం పరిహారం చెల్లించేలా ఆదేశాలివ్వాలంటూ చిత్తూరు జిల్లా రేణిగుంట మండలం మంగళం గ్రామానికి చెందిన కె.నాగవేణి మరో ఇద్దరు 2018లో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన హైకోర్టు, భూ సేకరణ ప్రొసీడింగ్స్పై స్టే విధించింది. ఇటీవల ఈ వ్యాజ్యంపై జస్టిస్ సత్యనారాయణమూర్తి తుది విచారణ జరిపారు. పిటిషనర్ల తరఫు న్యాయవాది కాలవ సురేష్ కుమార్రెడ్డి వాదనలు వినిపిస్తూ.. పిటిషనర్లు 2013 భూ సేకరణ చట్టం ప్రకారం పరిహారానికి అర్హులని వివరించారు. 2016లో జారీ చేసిన జీవో 259 ప్రకారం అసైన్డ్ భూమికి పట్టా భూమితో సమానంగా పరిహారం చెల్లించాల్సి ఉంటుందన్నారు. ప్రభుత్వ సహాయ న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. మేకల పాండు కేసులో హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీం కోర్టు స్టే విధించిందని తెలిపారు. ఆ స్టే ఎత్తివేసేంత వరకు జీవో 259 ప్రకారం పిటిషనర్లు కోరిన విధంగా ఉత్తర్వులు ఇవ్వొద్దని కోరారు. ప్రభుత్వ సహాయ న్యాయవాది వాదనలను న్యాయమూర్తి తోసిపుచ్చారు. 2016లో జారీ చేసిన జీవో 259 ప్రకారం అసైన్డ్ భూమిని ప్రజోపయోగం కోసం వెనక్కి తీసుకున్నప్పటికీ పట్టా భూమితో సమానంగా పరిహారం చెల్లించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని తేల్చి చెప్పారు. ప్రస్తుత కేసులో కూడా పిటిషనర్లకు ఆరు నెలల్లో పరిహారం చెల్లించాలని ఆదేశించారు. -
కొడుకు మీదే కోర్టుకు.. ఆ తల్లిదండ్రుల డిమాండ్ మీదే చర్చంతా!
డెహ్రాడూన్: పిల్లలను కనడంతోనే తల్లిదండ్రుల బాధ్యత ముగిసిపోదు. వాళ్లను పెంచి.. విద్యాబుద్ధులు నేర్పించి.. ఉన్నతస్థానానికి చేర్చే దాకా సాగుతూనే ఉంటుంది వాళ్ల ప్రయాణం. మరి ఆ తర్వాత.. తల్లిదండ్రుల పట్ల బిడ్డలు కూడా అంతే బాధ్యతతో వ్యవహరిస్తుంటారా?. ఇక్కడ వయసుపైబడ్డ ఓ పెద్దాయన, ఆయన భార్య.. సొంత కొడుకు, కోడలి మీద కోర్టుకు ఎక్కారు. ఎందుకో తెలుసా? తమకు ఓ మనవడినో, మనవరాలినో ఇవ్వమని! ఆశ్చర్యంగా అనిపించే ఈ కేసు ఉత్తరాఖండ్లో ఇవాళ(బుధవారం) చోటు చేసుకుంది. ఏడాదిలోగా మనవడో, మనవరాలినో తమ చేతుల్లో పెట్టాలని.. లేకుంటే ఐదుకోట్ల రూపాయల పరిహారం చెల్లించాలని కోర్టుకెక్కారు హరిద్వార్కు చెందిన ఆ జంట. 2016లో మా అబ్బాయికి వివాహం చేశాం. ఇప్పటిదాకా పిల్లల్ని కనలేదు. ఆడామగా అనే తేడా లేదు. ఎవరో ఒకరిని కనిస్తే చాలు.. అని అంటోంది ఆ జంట. మరి ఇక్కడ డబ్బు ప్రస్తావన ఎందుకు వచ్చింది అంటారా?. తల్లిదండ్రుల పట్ల ఆ కొడుకు ఎంత బాధ్యతారాహిత్యంగా ఉన్నాడో సమాజానికి తెలియజేయడానికే అలా చేశారట!. మా దగ్గర ఉన్నదంతా మా అబ్బాయి కోసమే ఖర్చు చేశాం. అమెరికాలో చదివించాం. ఘనంగా పెళ్లి చేశాం. ఆపై బ్యాంక్ లోన్ తీసుకుని ఇల్లు కట్టాం. ఇప్పుడు మా దగ్గర పైసా లేదు. ఆర్థికంగా చితికిపోయి ఉన్నాం. అందుకే కొడుకు కోడలు నుంచి చెరో రెండున్నర కోట్ల రూపాయలు డిమాండ్ చేస్తూ పిటిషన్ వేశాం అంటున్నారు ఎస్ఆర్ ప్రసాద్. ‘‘మనం పిల్లల కోసం లెక్కలేసుకోం. మంచి ఉద్యోగాలకు తోడ్పాడు అందిస్తాం. తల్లిదండ్రులుగా అది బాధ్యత. కానీ, పిల్లలు మాత్రం బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారు. కష్టకాలంలో కనీస అవసరాలకు కూడా డబ్బులివ్వడం లేదు. మనవడో మనవరాలో కావాలని కేసు వేయడం వెనుక వాళ్ల ప్రధాన ఉద్దేశం.. అందరి దృష్టిని ఆకర్షించడమే’’ అంటున్నారు ప్రసాద్ తరపు లాయర్ శ్రీవాస్తవ. -
అయ్యో రాములు.. గిట్లయితే ఎట్ల! కొమ్మ విరగాల్నా? కాయ రాలాల్నా?
ఈ రైతు రాములు. కోహెడలో 6 ఎకరాల మామిడి తోట ఉండగా మరో ఐదున్నర ఎకరాల తోట లీజుకు తీసుకున్నాడు. లక్షా70వేలు లీజు కాగా అతని తోటకు 2లక్షల వరకు లీజు వస్తుంది. ఈ లెక్కన 3.70లక్షలు లీజుకే ఖర్చు కాగా 5టన్నులు మాత్రమే దిగుబడి వచ్చింది. అంటే కిలో రూ.45 లెక్క కట్టగా రూ.2.25లక్షలే వచ్చింది. అంటే లీజు ఖర్చే రాలేదు. మరో టన్ను వరకు వస్తుందనుకున్నా కాత ఈదురుగాలులతో నేలరాలింది. ముందే మంచు తేనె రోగం ముంచగా నష్టం తీవ్రంగా ఉందని ఉద్యానఅధికారులను కలిస్తే వారు చెప్పిన నిబంధనలతో నిరాశగా వెనుదిరిగాడు. కరీంనగర్ అర్బన్: ఇది కేవలం రాములు సమస్యే కాదు జిల్లాలో వేలమంది రైతులది ఇదే పరిస్థితి. మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్లుంది నష్టపరిహారం పరిస్థితి. అసలే మంచు తేనే నిండా ముంచగా వచ్చిన అరకొర మామిడి కాయలను ఈదురుగాలులు నేలపాలుచేశాయి. ఎన్నడూ లేనివిధంగా పూత తగ్గగా దిగుబడిపై దిగులు పడ్డ రైతన్నకు అకాల వర్షాలు తీరని నష్టాన్ని మిగిల్చాయి. కనీసం ప్రభుత్వం నుంచి నష్టపరిహారమైనా వస్తుందని ఆశిస్తే నిబంధనలు కొరకరాని కొయ్యగా మారాయి. 33శాతం నష్టం నిబంధన వారి ఆశలపై నీళ్లు చల్లుతోంది. 33శాతం నష్టం జరగాలంటే కొమ్మలు విరగాలట.. కాయలు రాలాలట. అరకొర కాత రాలితే నష్టం జరిగినట్లు కాదట. గతంలో 50శాతం పంట నష్టం జరిగితే పరిహారానికి అర్హులుగా పరిగణించేవారు. ఒక రైతుకు ఎకరం మామిడి తోట ఉంటే అందులో 50శాతం నష్టపోయి ఉండాలి. అంటే కూకటి వేళ్లతో చెట్లు కూలడం, కొమ్మలు విరగడం, కాయలు సగానికి పైగా రాలితే పరిహారం దక్కేది. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం 50శాతం నుంచి 33శాతానికి తగ్గించింది. అరకొర పండిన పంటను విక్రయించాలంటే ధర కిలో రూ.40–50మాత్రమే పలుకుతోంది. వేయి హెక్టార్లలో దెబ్బతిన్న తోటలు ఇటీవల పలుమార్లు వీచిన బలమైన ఈదురుగాలులు, వడగళ్ల వాన మామిడితోటలను కోలుకోని దెబ్బతీశాయి. జిల్లాలో 2600 హెక్టార్లలో మామిడి తోటలున్నాయి. ఈ సారి అరకొరగా 8,200 టన్నుల దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు. మంచు తేనె తెగులుతో పాటు పూత లేకపోవడం, దిగుబడి చేతికందే సమయంలో ప్రకృతిలో మార్పుల కారణంగా ఈదురుగాలులతో వానతో తోటలు ధ్వంసమయ్యాయి. మంగళవారం అర్ధరాత్రి వీచిన బలమైన గాలులతో వేయి హెక్టార్లలో మామిడి తోటలు దెబ్బతిన్నాయి. అత్యధికంగా గన్నేరువరం, చిగురుమామిడి, మానకొండూర్ మండలాల్లో మామిడి తోటలు దెబ్బతిన్నాయి. అలాగే చొప్పదండి, రామడుగు, తిమ్మాపూర్, కొత్తపల్లి, గంగాధర, వీణవంక మండలాల్లో తోటలు దెబ్బతిన్నట్లు ఉద్యాన అధికారులు గుర్తించినప్పటికి నిబంధనలు గుదిబండగా మారాయి. ధర అంతంతే కరోనా వైరస్ ప్రభావంతో గత 2020 నుంచి రైతులకు నష్టాలే. 2020కి ముందు కిలో రూ.50–60 పలికిన ధర ప్రస్తుతం రూ.40–50కి మించడం లేదు. కరోనా క్రమంలో కరీంనగర్ వ్యవసాయ మార్కెట్లో పండ్ల వ్యాపారాన్ని నిలిపివేయగా బొమ్మకల్ బైపాస్లో ఏర్పాటు చేశారు. ఈ సారి నుంచే మార్కెట్లో కొనుగోలు చేస్తున్నారు. కాగా ఇతర రాష్ట్రాల వ్యాపారులు కొనుగోలుకు ఆసక్తి చూపడం లేదు. నాగ్పూర్, మహరాష్ట్ర, కర్నాటక రాష్ట్రాల వ్యాపారులు ఇక్కడి ఏజెంట్ల ద్వారా కొనుగోలు చేసి తరలించడం జరిగే ప్రక్రియ. కానీ కాత తక్కువగా ఉండటంతో అరకొర వ్యాపారులు వస్తుండగా ధర సగానికే పరిమితమైంది. రైతులకు నష్టం ఎన్నడూ లేనంతగా ఈ సారి మామిడి రైతులకు నష్టం జరిగింది. గతంలో మామిడి కాయలతో మార్కెట్ కళకళలాడేది. గతానికి పోల్చితే పావు వంతు కూడ మార్కెట్ లేదు. ధర ఉన్నా కాయ లేకపోవడం తీరని నష్టం. – నిమ్మకాయల పాషా, వ్యాపారి ప్రభుత్వం ఆదుకోవాలి ఎపుడైనా పూతను బట్టి తోటలను పడుతాం. కానీ ఈ సారి నష్టాలే తప్ప లాభం లేదు. ఇందుర్తిలో రూ.2లక్షలు పెట్టి 6ఎకరాల తోట పట్టిన. 2 టన్నులు కూడ రాలే. రూ.80వేలు వచ్చినయి. ప్రభుత్వమే ఆదుకోవాలి. – గంట సమ్మయ్య, కౌలుదారు, ఇందుర్తి -
పోరస్ ఫ్యాక్టరీ బాధిత కుటుంబాలకు పరిహారం
ముసునూరు: ఏలూరు జిల్లా ముసునూరు మండలం అక్కిరెడ్డిగూడెంలోని పోరస్ ఫ్యాక్టరీ ప్రమాద ఘటనలో మృతి చెందిన, తీవ్రంగా గాయాలపాలైన బాధిత కుటుంబాలకు జిల్లా రెవెన్యూ అధికారి ఏవీ సత్యనారాయణమూర్తి, నూజివీడు ఆర్డీవో కంభంపాటి రాజ్యలక్ష్మి శనివారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో పరిహారం చెక్కులను అందజేశారు. జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ ఆదేశాల మేరకు ప్రమాదంలో మృతి చెందిన బిహార్కు చెందిన మనోజ్ మోచి, అవదేశ్ రవిదాస్, కారు రవిదాస్, సుభాష్ రవిదాస్లకు సంబంధించి పరిహారం చెక్కులను వారి భార్యలైన కాజల్ కుమారి, అసర్ఫి దేవి, రుమాదేవి, శాంతిదేవిలకు రూ.50 లక్షల చొప్పున రూ.2 కోట్లను అందజేశారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రౌషన్ మోచి, వరుణ్ దాస్, సుధీర్ రవిదాస్, సుధీర్ కుమార్ అలియాస్ సుధీర్ రవిదాస్ కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం చెక్కులను వారి భార్యలైన రేణుదేవి, కంచన దేవి, రింకు దేవిలకు రూ.15 లక్షలను డీఆర్వో సత్యనారాయణమూర్తి అందజేశారు. కార్యక్రమంలో నూజివీడు రెవెన్యూ డివిజనల్ అధికారి కె.రాజ్యలక్ష్మి, ముసునూరు తహశీల్దార్ ఎస్.జోజి, కలెక్టరేట్ సిబ్బంది రాజ్కుమార్ పాల్గొన్నారు. -
24 గంటలలోపే.. మృతుడి కుటుంబానికి రూ.50 లక్షలు
అక్కిరెడ్డిగూడెం (ముసునూరు)/నూజివీడు: ప్రమాదాలు, విపత్తుల వేళ తమ ప్రభుత్వం తక్షణం స్పందిస్తూ.. పరిహారం ప్రకటించిన 24 గంటలలోపే బాధిత కుటుంబాలకు అండగా నిలబడి ఆదుకుంటోందని నూజివీడు ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు పేర్కొన్నారు. బుధవారం రాత్రి ఏలూరు జిల్లా ముసునూరు మండలం అక్కిరెడ్డిగూడెంలోని పోరస్ కెమికల్ కంపెనీలో సంభవించిన అగ్ని ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందిన బొప్పూడి కిరణ్ కుటుంబ సభ్యులను శుక్రవారం సాయంత్రం జాయింట్ కలెక్టర్ అరుణ్బాబు, అసిస్టెంట్ కలెక్టర్ రాహుల్కుమార్రెడ్డి, ఇతర అధికారులతో కలసి ఎమ్మెల్యే పరామర్శించారు. మృతుని భార్య బొప్పూడి సుధారాణికి రూ.50 లక్షల చెక్కును అందజేశారు. ఈ ప్రమాదంలో ఆరుగురు మృత్యువాత పడగా.. వారిలో ఒకరు ఎన్టీఆర్ జిల్లా రెడ్డిగూడెం మండలం కుదపకు చెందిన ఉదరుపాటి కృష్ణయ్య. మృతుడి భార్యకు, కుటుంబ సభ్యులకు వివాదం ఉండటంతో ఎక్స్గ్రేషియాను భార్యకు ఇవ్వాలా, మృతుడి తల్లిదండ్రులకు ఇవ్వాలా అనే దానిపై స్పష్టత రాకపోవడంతో ప్రస్తుతానికి పెండింగ్లో ఉంచారు. బీహార్కు చెందిన నలుగురు మృతులకు సంబంధించిన లీగల్ హెయిర్ కోసం ఏలూరు జిల్లా కలెక్టర్ వి.ప్రసన్న వెంకటేష్ బీహార్లోని నలంద జిల్లా కలెక్టర్కు లేఖ పంపారు. అక్కడి నుంచి లీగల్ హెయిర్ వచ్చిన తరువాత వారికి నష్టపరిహారం చెల్లిస్తామని ఆర్డీవో కంభంపాటి రాజ్యలక్ష్మి తెలిపారు. ఇదిలాఉండగా.. ఆరుగురి మృతికి కారణమైన పోరస్ కెమికల్స్ కంపెనీపై ముసునూరు పోలీస్ స్టేషన్లో ఐపీసీ 337, 338, 304 (జీజీ) సెక్షన్ల కింద శుక్రవారం కేసు నమోదైంది. తాత్కాలికంగా మూసివేసిన పోరస్ కంపెనీ వద్ద పోలీస్ పహారా నిర్వహిస్తున్నారు. ఫ్యాక్టరీని డ్రగ్ కంట్రోల్ ఏడీ పాండురంగ వరప్రసాద్ సందర్శించి లైసెన్స్ ఉందా, లేదా అని తనిఖీ చేశారు. క్షతగాత్రులకు రూ.5 లక్షల ఎక్స్గ్రేషియా అందజేత కాగా, ప్రమాదంలో తీవ్ర గాయాలపాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారికి ప్రభుత్వం ప్రకటించిన రూ.5 లక్షల ఎక్స్గ్రేషియాను శుక్రవారం నూజివీడులో అందజేశారు. ప్రమాదంలో రమణక్కపేటకు చెందిన సాయిల నాగేశ్వరరావు, సూరేపల్లికి చెందిన షేక్ సుభాని, చాట్రాయి మండలం తుమ్మగూడేనికి చెందిన కంచర్ల జోసెఫ్, నూజివీడు పట్టణానికి చెందిన చందోలు రాజీవ్ గాయపడగా.. ఒక్కొక్కరికీ రూ.5 లక్షల చొప్పున పరిహారాన్ని ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు, జాయింట్ కలెక్టర్ పి.అరుణ్బాబు చెక్కుల రూపంలో అందజేశారు. కార్యక్రమాల్లో జెడ్పీటీసీ వరికూటి ప్రతాప్, ఆర్డీవో కె.రాజ్యలక్ష్మి, డీఎస్పీ బుక్కాపురం శ్రీనివాసులు, తహసీల్దార్ కేఎస్ జోజి పాల్గొన్నారు. -
పోరస్ బాధితులకు సీఎం జగన్ రూ. 25 లక్షల పరిహారం..
-
ఆర్ఆర్ఆర్: పక్కా ప్లాన్తో అధికారులు.. వ్యవహారం మొత్తం జరిగేది ఇలాగే...
సాక్షి, హైదరాబాద్: రీజినల్ రింగ్ రోడ్డు భూసేకరణ ప్రక్రియలో పక్కా విధానాన్ని అధికారులు అవలంభించనున్నారు. భూసేకరణ ప్రక్రియ ప్రారంభం నుంచి పరిహారమిచ్చే వరకు.. అనుసరించాల్సిన తీరుపై అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో నాలుగు గెజిట్లు.. రెండు పత్రికా ముఖ ప్రచురణలు వెలువడనున్నాయి. ఇటీవలే భూసేకరణ అధికారుల వ్యవస్థ ఏర్పాటైన విషయం తెలిసిందే. ఇలా ఉంటుంది... 3ఎ: భూసేకరణ కోసం ఒక అదనపు కలెక్టర్, ఏడుగురు ఆర్డీఓలతో కాంపిటెంట్ అథారిటీని ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసి వివరాలను ఎన్హెచ్ ఏఐకి పంపింది. మరోవారంలోపు తొలి గెజిట్ విడుదల కానుంది. దాన్నే 3ఏ (స్మాల్ ఆల్ఫా బెట్)గా పిలుస్తారు. ప్రాజెక్టు పేరు, ఆ రోడ్డు ఏయే మండలాల నుంచి నిర్మాణం కానుంది.. గ్రామాల పేర్లు, సర్వే నంబర్లు.. ఆ ప్రాంతాల భూసేకరణ అధికారులుగా వ్యవహరించేవారి వివరాలను తెలుపుతూ తొలి గెజిట్ విడుదల కానుంది. 3ఏ (కేపిటల్ ఆల్ఫాబెట్): ఇది రెండో గెజిట్. ఇందులో ఆ గ్రామాలు, సర్వే నంబర్లతోపాటు సేకరించాల్సిన భూ విస్తీర్ణం వివరాలను పొందుపరిచి విడుదల చేస్తారు. దీనిపై అభ్యంతరాలకు 21 రోజుల గడువిస్తారు. 3సీ: పై గెజిట్లోని అభ్యంతరాలపై ప్రజాభిప్రాయ సేకరణ కోసం సభ ఏర్పాటుకు ఈ గెజిట్ విడుదల చేస్తారు. ఈ సభలో ఆ అభ్యంతరాలను చదివి సమాధానాలిస్తారు. సానుకూలమైన వాటిని పరిష్కరించి.. వ్యతిరేకంగా ఉన్నవాటిని తోసిపుచ్చుతారు. అనంతరం రెవెన్యూ అధికారులు సేకరించే భూమికి హద్దులు ఏర్పాటు చేయాలి. దీనికీ ఈ సభలోనే రైతుల నుంచి అనుమతి పొందుతారు. తదుపరి అధికారుల క్షేత్ర పర్యటనలో ఎవరైనా అడ్డుకుంటే పోలీసు శాఖ ద్వారా చర్య తీసుకుంటారు. 3డీ: ఇది కీలక గెజిట్. గ్రామాలు, సర్వే నంబర్లు, వాటి యజమానులు, ఒక్కొక్కరికి ఉన్న భూ విస్తీర్ణం తదితర సమస్త వివరాలు ఇందులో పొందుపరిచి విడుదల చేస్తారు. 3జీ: ఇది పత్రికాముఖంగా వెలువడే ప్రకటన. సమీకరించాల్సిన భూమిలోని నిర్మాణాలు, చెట్లు, ఇతర ఆస్తుల వివరాలను ఈ ప్రకటన ద్వారా వెలువరిస్తారు. వాటికీ పరిహారం అందుతుంది. దీనిపై కూడా అభ్యంతరాలుంటే చెప్పుకునేందుకు వెసులుబాటు ఉంటుంది. తమ స్థలంలో పరిహారం పొందాల్సిన అంశాలను తక్కువగా చూపారనే తరహా అభ్యంతరాలు ఎక్కువగా వ్యక్తమవుతాయి. 3హెచ్: ఇది కూడా పత్రికా ముఖంగా వెలువడే ప్రకటన. ఇందులో భూ యజమానులు పొందే పరిహారం ఎంతో వెల్లడిస్తారు. యజమానుల నుంచి ధ్రువీకరణ పత్రాలను సేకరిస్తారు. వారికి వారి బ్యాంకుల్లో ఆ మొత్తాన్ని జమచేస్తారు. పరిహారం విషయంలో సంతృప్తి లేనివారు దాన్ని తీసుకోని పక్షంలో, కోర్టుతో రెవెన్యూ విభాగం ప్రత్యేకంగా తెరిచే జాయింట్ ఖాతాలో ఆ మొత్తాన్ని ఉంచుతారు. పరిహారంపై అభ్యంతరాలను అధికారులు, కోర్టు ద్వారా తేల్చుకున్న తర్వాత ఆ మొత్తాన్ని వారు తీసుకుంటారు. పరిహారం ఇలా నిర్ధారిస్తారు మూడేళ్లుగా ఆయా ప్రాంతాల్లో రిజిస్ట్రార్ కార్యాలయాల్లో నమోదైన మూడు గరిష్ట మొత్తాలను (సంవత్సరానికి ఒకటి చొప్పున) తీసుకుంటారు. వీటి సగటును లెక్కిస్తారు. దీనికి నిర్ధారిత మల్టీపుల్ ఫ్యాక్టర్తో గుణిస్తారు. ఇది ఆయా పరిస్థితుల ఆధారంగా గుర్తించి ఉంటుంది. అది 1.5గా ఉంటుంది. ఆ వచ్చే మొత్తాన్ని సొలీషియమ్ పేరుతో రెట్టింపు చేస్తారు. ఆ వచ్చిన మొత్తాన్ని.. గెజిట్ విడుదలైనప్పటి నుంచి 12% వడ్డీ లెక్కించి జత చేసి ఇస్తారు. -
ఆ కుటుంబాలకు పరిహారం ఎప్పుడిస్తారు?
సాక్షి, హైదరాబాద్: కోవిడ్ సోకి మృత్యువాతపడిన వారి కుటుంబాలకు ఎప్పటిలోగా పరిహారం అందిస్తారో చెప్పాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీశ్చంద్ర శర్మ, జస్టిస్ అభినంద్కుమార్ షావలిలతో కూడిన ధర్మాసనం సోమవారం మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. కరోనా నియంత్రణకు తగినచర్యలు తీసుకునేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ దాఖలైన పలు ప్రజాహిత వ్యాజ్యాలను ధర్మాసనం మరోసారి విచారించింది. రాష్ట్రవ్యాప్తం గా కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయని, పరిస్థితి అదుపులోనే ఉందని అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ నివేదించారు. ఈ నేపథ్యంలో ఈ వ్యాజ్యాలపై విచారణ ముగించాలని కోరారు. ‘‘కరోనాతో మృతి చెందిన వారి కుటుంబసభ్యులకు పరిహారం పంపిణీ చేశారా.. ఇప్పటివరకు ఎంత మందికిచ్చారు.. ఇంకా ఎన్ని కుటుంబాలకు ఇవ్వాల్సి ఉంది.. తదితర వివరాలతో స్థాయీ నివేదికను ఆరువారాల్లోగా సమర్పించాలని ధర్మాసనం ఆదేశిస్తూ విచారణను ఏప్రిల్ రెండోవారానికి వాయిదా వేసింది. కాగా, కరోనా నియంత్రణలో రాష్ట్రప్రభుత్వం సమర్థవంతంగా పనిచేసిందని ధర్మాసనం అభినందించింది. కరోనా నియంత్రణకు తగినచర్యలు తీసుకుంటూనే ఎప్పటికప్పుడు తమకు పరిస్థితిని వివరించిన ప్రజా ఆరోగ్యవిభాగం డైరెక్టర్ డాక్టర్ జి.శ్రీనివాసరావు పనితీరును ప్రశంసించింది. 1–22వ తేదీల మధ్య 23,526 కేసులు ‘‘జనవరిలో 3.40 శాతం పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఫిబ్రవరి 1 నుంచి 22 తేదీల మధ్య 12,41,660 కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా, 23,526 పాజిటివ్ కేసులు(1.89 శాతం) వచ్చాయి. రాష్ట్రవ్యాప్తంగా 5.78 కోట్ల(105 శాతం) మందికి మొదటిడోసు ఇచ్చాం. 15–17 ఏళ్ల మధ్య యువకుల్లో మొదటి డోసు 15.40(84 శాతం) లక్షల మందికి, 8.18(44 శాతం) లక్షల మందికి రెండోడోసు ఇచ్చాం. రాష్ట్రవ్యాప్తంగా ఆసుపత్రుల్లో 56,265 బెడ్లు అందుబాటులో ఉండగా, 971 మంది రోగులు మాత్రమే చికిత్స పొందుతున్నారు. 55,294 (98.30 శాతం) బెడ్లు ఖాళీగా ఉన్నాయి. 6 వేల బెడ్లు చిన్నారుల చికిత్స కోసం ఏర్పాటు చేయగా, ఇందులో 4,125 ఆక్సిజన్, 1,875 ఐసీయూ బెడ్లు ఉన్నాయి’’అని డాక్టర్ శ్రీనివాసరావు నివేదికలో పేర్కొన్నారు. ఆన్లైన్ తరగతులు నిర్వహిస్తున్నాం ‘‘హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో భౌతిక తరగతులకు హాజరుకాలేని విద్యార్థుల కోసం ఆన్లైన్ తరగతులు నిర్వహిస్తున్నాం. క్షేత్రస్థాయిలో ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నాం. నిరంతరం పర్యవేక్షిస్తూ పరిస్థితులకు అనుగుణంగా అన్ని చర్యలు తీసుకుంటున్నాం’’అని పాఠశాల విద్యాశాఖ సంచాలకులు శ్రీదేవసేన హైకోర్టుకు సమర్పించిన నివేదికలో పేర్కొన్నారు. -
చేనేత మృతుల కుటుంబాలను ఆదుకోండి
ఖైరతాబాద్: ఆర్థిక ఇబ్బందులతో మూకుమ్మడిగా ఆత్మ హత్యలకు పాల్పడ్డ కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం కాట్నాపల్లికి చెందిన చేనేత కుటుంబాలకు రూ.10 లక్షల పరిహారం చెల్లించాలని బీఎస్పీ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కోరారు. మృతుల కుటుంబసభ్యుల్లో ఒకరికి ప్రభుత్వోద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సోమవారం సోమాజిగూడ ప్రెస్క్లబ్లో జాతీయ చేనేతన్నల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో రౌండ్టేబుల్ సమావేశం నిర్వహించారు. కమిటీ చైర్మన్ దాసు సురేష్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ప్రవీణ్కుమార్, ఆమ్ ఆద్మీ పార్టీ నాయకురాలు ఇందిరా శోభన్, మాజీ ఎమ్మెల్యే శ్రీరాములు మాట్లాడారు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు సామూహిక ఆత్మహత్యలకు పాల్పడినా ముఖ్యమంత్రి పట్టించుకోకపోవడం దారుణమన్నారు. కార్యక్రమంలో సీపీఐ నేత పాశికంటి లక్ష్మినర్సయ్య, బీసీ మహిళానేత శారద గౌడ్, సాజిదా సికిందర్, బోనం ఊర్మిళ, వీరస్వామి పాల్గొన్నారు. -
కీలక విషయాలు వెల్లడి.. రాష్ట్రాల కోవిడ్ మృతుల సంఖ్యలో భారీ తేడా?
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రాలకు సంబంధించిన కోవిడ్ మరణాల లెక్కల్లో కొన్ని విస్తుపోయే విషయాలు వెలుగుచూశాయి. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు నమోదు చేసిన మృతుల సంఖ్యకు, కోవిడ్ పరిహారం పొందేందుకు వచ్చిన వినతులకు మధ్య భారీ తేడా ఉన్నట్టు తేలింది. కోవిడ్ మృతుల కుటుంబాలకు రూ.50 వేలు పరిహారం ఇవ్వాలని గతంలో సుప్రీం కోర్టు రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసింది. అయితే, ఎన్ని కుటుంబాలకు పరిహారం చెల్లించారో వివరాలు ఇవ్వాలని సుప్రీం కోర్టు మరోసారి ఆదేశాలివ్వగా రాష్ట్రాలు ఆ మేరకు వివరాలు సమర్పించాయి. అత్యధికంగా మహారాష్ట్రలో 2,13,890 కుటుంబాలు పరిహారం కోరాయి. వారిలో 92,275 మందికి పరిహారం అందించారు. రాష్ట్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం 1,41,737 మరణాలు సంభవించాయి. (చదవండి: 2.2కు తగ్గిన ఆర్–వ్యాల్యూ.. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే?) గుజరాత్లో 9, తెలంగాణలో 7 రెట్లు తేడా అదే సమయంలో గుజరాత్, తెలంగాణ రాష్ట్రాల్లో భారీ తేడా కనిపిస్తోంది. గుజరాత్ ప్రభుత్వ లెక్కల ప్రకారం అక్కడ 10,094 మంది కోవిడ్తో మృతి చెందారు. 89,633 మంది పరిహారం కోసం దరఖాస్తు చేసుకున్నారు. వారిలో 58,843 కుటుంబాలకు చెల్లింపులు జరిగాయి. తెలంగాణ ప్రభుత్వ లెక్కల ప్రకారం అక్కడ కేవలం 3,993 కోవిడ్ మరణాలు నమోదవగా.. పరిహారం కోసం 28,969 మంది దరఖాస్తు చేసుకున్నారు. వారిలో 12,148 కుటుంబాలకు సాయం అందించారు. అంటే గుజరాత్లో నమోదైన మృతుల సంఖ్యకు 9 రెట్లు అదనంగా.. తెలంగాణలో నమోదైన మృతుల సంఖ్యకు 7 రెట్లు అదనంగా పరిహారం కోసం దరఖాస్తులు వచ్చాయి. ఇక మరణాల సంఖ్య తక్కువ, పరిహారాలు కోరుతున్నవారి సంఖ్య ఎక్కువ ఉండటంపట్ల సుప్రీం కోర్టు స్పందించింది. మృతుల సంఖ్యలో వ్యత్యాసంపై తాము దృష్టి పెట్టడం లేదని, పరిహారం కోరినవారికి సాయం అందిస్తే చాలని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ఇదిలాఉండగా.. కరోనా సోకిన 30 రోజుల్లో అనారోగ్య కారణాలతో ఆ వ్యక్తులు మరణించినా, ఆత్మహత్యకు పాల్పడినా వాటిని కోవిడ్ మరణాలుగా పరిగణించాలని సుప్రీం కోర్టు గతంలో మార్గదర్శకాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. అలాగే దరఖాస్తు చేసుకునేందుకు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా బాధిత కుటుంబాల్లో అవగాహన కల్పించాలని చెప్పింది. (చదవండి: ముంచుకొస్తున్న ముప్పు.. 248 రోజుల తర్వాత అత్యధిక కేసులు) -
జీఎస్టీ పరిహారం మరో ఐదేళ్లు పొడిగించండి
న్యూఢిల్లీ: వస్తు సేవల పన్ను (జీఎస్టీ) పరిహారానికి మరో ఐదు సంవత్సరాలు పొడిగించాలని పలు రాష్ట్రాల ఆర్థికమంత్రులు కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 1వ తేదీన కొత్త ఆర్థిక సంవత్సరం (2022–23) బడ్జెట్ను పార్లమెంటులో ప్రవేశపెట్టే అవకాశం ఉన్న నేపథ్యంలో గురువారం రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో బడ్జెట్ ముందస్తు సమావేశం నిర్వహించి, వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. జీఎస్టీ వ్యవస్థను ప్రవేశపెట్టిన తర్వాత వ్యాట్ వంటి స్థానిక పన్నులను ఉపసంహరించుకోవడం జరిగింది. దీనివల్ల ఏర్పడే ఆదాయ లోటు కోసం రాష్ట్రాలకు జీఎస్టీ పరిహారం చెల్లిస్తోంది. ఈ చెల్లింపుల గడువు వచ్చే ఏడాది జూన్తో ముగుస్తుంది. కరోనా కష్టకాలంలో మరో ఐదేళ్లు పరిహార కాలాన్ని పొడిగించాలని పలు రాష్ట్రాలు తాజాగా డిమాండ్ చేశాయి. పలు వర్గాలతో భేటీ... 2022–23 వార్షిక బడ్జెట్పై ఆర్థికమంత్రి పలు వర్గాలతో ఈ నెల ప్రారంభం నుంచి సమావేశాలు నిర్వహిస్తూ, వారి అభిప్రాయాలను తీసుకుంటున్న సంగతి తెలిసిందే. పారిశ్రామికవేత్తలు, ఫైనాన్షియల్ రంగానికి చెందిన నిపుణులు, కార్మిక సంఘాలు, వ్యవసాయ రంగ ప్రతినిధులు వీరిలో ఉన్నారు. డిసెంబర్ 15 నుంచి డిసెంబర్ 22 వరకూ ఎనిమిది దఫాల్లో వర్చువల్గా ఈ సమావేశాలు జరిగాయి. దాదాపు 120 మంది ప్రతినిధులు చర్చల్లో పాల్గొన్నారు. ఆదాయపు పన్ను శ్లాబ్ల హేతుబద్దీకరణ, డిజిటల్ సేవలకు మౌలిక రంగం హోదా, హైడ్రోజన్ స్టోరేజ్కి ప్రోత్సాహకాలు వంటి ప్రతిపాదనలు వారి నుంచి కేంద్రానికి అందాయి.మోడీ 2.0 ప్రభుత్వానికి, ఆర్థికమంత్రికి ఇది నాల్గవ వార్షిక బడ్జెట్. ఇక్కడి విజ్ఞాన్ భవల్లో జరిగిన సమావేశంలో పాల్గొన్న అనంతరం రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల మంత్రులు తమ డిమాండ్లు ఏమిటన్నది మీడియాకు వెల్లడించారు. ఆయా అంశాలు పరిశీలిస్తే... బంగారం దిగుమతి సుంకాలు తగ్గాలి 2027 వరకూ పరిహారం పొడిగించాలన్న రాష్ట్రాల డిమాండ్ సరైందే. దీనిని కేంద్రం పరిశీలించాలి. దీనికితోడు బంగారం, వెండిపై దిగుమతి సుంకాన్ని 10 శాతం నుంచి 4 శాతానికి తగ్గించాలి. కేంద్ర పథకాల్లో కేంద్రం వాటా క్రమంగా తగ్గుతూ, రాష్ట్రాల వాటా పెరగాలనేది మా అత్యంత ముఖ్యమైన డిమాండ్. ఇంతకుముందు షేరు 90–10గా ఉండేది. మరియు ఇప్పుడు అది 50–50 లేదా 60–40గా ఉంది. అది 90–10కి తిరిగి వెళ్లాలని మా అభ్యర్థన. కోవిడ్ మహమ్మారి సవాళ్ల నేపథ్యంలో ఇది అత్యవసరం. నీటిపారుదల, నీటి పనుల ప్రాజెక్టులన్నింటినీ కేంద్రం పరిధిలోకి తీసుకురావాలని అలాగే కేంద్ర పథకాలుగా ప్రకటించాలని కూడా కోరుతున్నాం. – సుభాష్ గార్గ్, రాజస్తాన్ విద్యాశాఖ మంత్రి లేకపోతే కష్టమే... పలు రాష్ట్రాలు పరిహారం కొనసాగింపును కోరాయి. మేము కూడా పొడిగించమని కోరాము. పొడిగించకపోతే, అనేక రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి అధ్వాన్నంగా ఉంటుంది. మనీష్ సిసోడియా, ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి భారీ ఆదాయాన్ని కోల్పోతున్నాం జీఎస్టీ పన్ను విధానం వల్ల రాష్ట్రాలకు ఆదాయానికి గండి పడింది. వచ్చే ఏడాదిలో రాష్ట్రం దాదాపు రూ. 5 వేల కోట్ల మేర ఆదాయాన్ని కోల్పోయే పరిస్థితి ఉంది. దీనిని భర్తీ చేసేందుకు కేంద్రం ఏర్పాట్లు చేయలేదు. కాబట్టి జీఎస్టీ పరిహారం మంజూరును కొనసాగించాలని కోరుతున్నాం. మూడే ళ్లలో కేంద్ర బడ్జెట్లో ఛత్తీస్గఢ్కు రూ.13,089 కోట్ల తక్కువ కేంద్ర పన్నుల వాటా వచ్చింది. వచ్చే ఏడాదిలో రాష్ట్రానికి కేంద్ర పన్నుల వాటా పూర్తిగా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. కోల్ బ్లాక్ కంపెనీల నుంచి బొగ్గు తవ్వకాలకు సంబంధించి టన్నుకు రూ.294 చొప్పున కేంద్రం వద్ద జమ అయ్యింది. దీనికి సంబంధించి రూ.4,140 కోట్లను కూడా వెంటనే ఛత్తీస్గఢ్కు బదలాయించాలి. భూపేష్ బఘేల్, ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి అదనపు రుణ సౌలభ్యత కావాలి కరోనా సవాళ్లతో రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. దీనితో జీఎస్టీ పరిహారాన్ని మరో ఐదేళ్లు పెంచకతప్పదు. దీనితోపాటు రాష్ట్ర రుణాలకు సంబంధించి, ఎలాంటి ఆంక్షలు, పరిమితి లేకుండా అదనపు రుణాల సౌలభ్యతను కల్పించాలి. – చంద్రిమా భట్టాచార్య, పశ్చిమ బెంగాల్ పట్టణాభివృద్ధి, మున్సిపల్ వ్యవహారాల మంత్రి -
మిర్చి రైతులకు పరిహారం ఇవ్వండి: తమ్మినేని
కొణిజర్ల: రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో అంతుబట్టని వైరస్తో మిరప తోటలు నష్టపోయిన రైతులకు వెంటనే పరిహారం ప్రకటించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం కోరారు. ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం లక్ష్మీపురంలో ఆదివారం ఆయన భద్రాచలం మాజీ ఎంపీ మిడియం బాబూరావు, స్థానిక సీపీఎం, రైతు సంఘం నాయకులతో కలిసి వైరస్తో దెబ్బతిన్న మిరప తోటలను పరిశీలించారు. ఈ సందర్భంగా తమ్మినేని మాట్లాడుతూ మిర్చి పంట గులాబీ, తామర పురుగులతో దెబ్బతిన్నదని, 80 వేల ఎకరాల్లో పంట నష్టపోయి రైతులు అప్పుల్లో కూరుకుపోయారని తెలిపారు. మిర్చి రైతులకు సలహాలు, సూచనలు అందించడంలో వ్యవసాయ, ఉద్యానవన శాఖ అధికారులు పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. వ్యవసాయ, కీటక శాస్త్రవేత్తలు కూడా పరిశీలించి ఏమీ తేల్చకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. పంటలు పూర్తిగా నష్టపోవడంతో కౌలురైతుల పరిస్థితి దయనీయంగా మారిందని వాపోయారు. రైతులు ఆత్మస్థైర్యాన్ని కోల్పోవద్దని, పరిహారం ఇప్పించే వరకు పోరాటం చేస్తామని తమ్మినేని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గసభ్యుడు సుదర్శన్, జిల్లా కార్యదర్శి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. స్థానికతకు ప్రాధాన్యమిచ్చేలా సవరణలుండాలి సాక్షి, హైదరాబాద్: అసంబద్ధ, లోపభూయిష్టమైన 317 జీవోను సమీక్షించి ఉద్యోగుల స్థానికతకు ప్రాధాన్యమిచ్చేలా సవరణలు చేయాలని సీఎం కేసీఆర్కు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆదివారం లేఖ రాశారు. ఆ లేఖను ఆయన మీడియాకు విడుదల చేశారు. రాష్ట్రంలో నూతన జోనల్ వ్యవస్థ అమల్లో భాగంగా ఉద్యోగుల సర్దుబాటు కోసం ప్రభుత్వం విడుదల చేసిన జీవో 317 లోపభూయిష్టంగా ఉందన్నారు. ఒక పెద్ద మార్పు జరిగే సందర్భంలో ఆ మార్పు వల్ల ప్రభావితమయ్యే వర్గాల ప్రతినిధులతో మాట్లాడి వారి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యలను వెంటనే సానుకూలంగా పరిశీలించి, జోక్యం చేసుకుని పరిష్కరించాలని తమ్మినేని కోరారు. ప్రభుత్వం ఇచ్చిన అసంబద్ధ ఉత్తర్వుల కారణంగా ఉద్యోగులు ప్రధానంగా ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో ఉన్న ఊరును, సొంత జిల్లాను వదిలి పెట్టి మరొక జిల్లాకు శాశ్వతంగా వెళ్లాల్సిన దుస్థితి కల్పించారని విమర్శించారు. స్థానికత ఆధారంగా తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమానికి నాయకత్వం వహించిన మీరే స్థానికత పునాదులను ధ్వంసం చేయబూనుకోవటం అత్యంత బాధాకరమని ఆవేదన వ్యక్తంచేశారు. ఇతర జిల్లాలకు బలవంతంగా బదిలీ అయిన ఉపాధ్యాయులు 10 వేల మంది ఉంటారని, అవసరమైతే సూపర్ న్యూమరరీ పోస్టులను కేటాయించి వారి సొంత జిల్లాలకు తీసుకురావాలని కోరారు. -
నూడుల్స్ ఫ్యాక్టరీలో పేలిన బాయిలర్: ఆరుగురు మృతి
Bihar Boiler Explosion: బిహార్లో ముజఫర్పూర్లోని నూడుల్స్ ఫ్యాక్టరీలో భారీ శబ్దంతో బాయిలర్ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఆరుగురు మృత్యువాత పడ్డారని మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారని బిహార్ పోలీసులు తెలిపారు. ఈ మేరకు నూడుల్స్ ఫ్యాక్టరీలో ఉదయం 10 గంటల ప్రాంతంలో పేలుడు సంభవించిందని జిల్లా మేజిస్ట్రేట్ ప్రవణ్ కుమార్ తెలిపారు. (చదవండి: సారీ! రిపోర్టులు మారిపోయాయి.. నీకు కరోనా లేదు!) అయితే ఈ భారీ పేలుడు శబ్దం కిలోమీటరు దూరం వరకు వినిపించిందని స్థానికులు చెబుతున్నారు. స్థానికులు సమాచారంతో. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు, అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. పైగా దెబ్బతిన్న బాయిలర్ నుండి పొగ ఇప్పటికి వస్తునే ఉందని అధికారులు అన్నారు. అంతేకాదు ఈ పారిశ్రామిక ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఒక్కొక్కరికి ₹ 4 లక్షల చొప్పున పరిహారం కూడా ప్రకటించారు. (చదవండి: ఖరీదైన గిఫ్ట్ల స్థానంలో కుక్క బిస్కెట్లు, షేవింగ్ క్రీమ్లు) -
స్మార్ట్వాచ్ బదులు రాయి.. నటుడికి చేదు అనుభవం
ఈ-కామర్స్ పోర్టల్స్, సంబంధిత వెబ్సైట్స్ అలసత్వం అయితేనేం.. డెలివరీ సిబ్బంది నిర్లక్క్ష్యం అయితేనేం కొన్నిసార్లు కస్టమర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్న మాట వాస్తవం. ఒక్కోసారి ప్రొడక్టు ఒకటి అయితే.. డెలివరీ మరొకటి వస్తుండడం చూస్తుంటాం కూడా. సరిగ్గా ఇక్కడ అలాంటి ఘటనే జరిగింది. కాకపోతే అది ఒక ఫేమస్ నటుడి విషయంలో.. బ్రెజిల్ టాప్ యాక్టర్ మురిలో బెనిసియో(50).. ఈ మధ్య యాపిల్ సిరీస్ 6 స్మార్ట్వాచ్ను ఆర్డర్ చేశాడు. అందుకోసం 530 డాలర్లు(40 వేల రూపాయలపైనే) చెల్లించాడు. అదికాస్త 12 రోజుల లేట్ డెలివరీతో ఆయన దగ్గరికి చేరింది. తీరా ఓపెన్ చేసి చూస్తే.. అందులో వాచ్కు బదులు బండరాయి ఉంది. దీంతో రిటైల్ కంపెనీ కర్రెఫోర్ను ఆశ్రయించాడు ఆ నటుడు. అయితే కంపెనీ వాళ్లు స్పందించేందుకు నిరాకరించారట!. దీంతో కస్టమర్ల సేవలకు అభ్యంతరం తెలిపిందంటూ కర్రెఫోర్ మీద నటుడు బెనిసియో కోర్టులో దావా వేశాడు. ఒక స్టార్ హీరో, పలు బ్రాండ్లకు అంబాసిడర్గా ఉన్న సెలబ్రిటీని ఇలా ఇబ్బందిపెట్టడం సరికాదని ఆయన తరపున న్యాయవాది వాదించాడు. అంతేకాదు తాను చెల్లించిన డబ్బును వెనక్కి ఇవ్వాలంటూ దావాలో కోరాడు. అయితే ఆయన చెల్లించిన డబ్బుతో పాటు పరిహారం కింద మరో 1,500 డాలర్లు చెల్లించేందుకు కర్రెఫోర్ అంగీకరించింది. దీంతో వివాదం ముగిసింది. సెలబ్రిటీల విషయంలోనే కాదు.. సామాన్యుల విషయంలోనూ ఇంకోసారి ఇలా జరగకుండా చూడాలంటూ కోర్టు సదరు రిటైల్ కంపెనీని మందలించింది. ఇదిలా ఉంటే యాపిల్ 6ను కిందటి ఏడాది లాంఛ్ చేసిన యాపిల్.. ఆ తర్వాత యాపిల్ 7 రాకతో ఉత్పత్తిని ఆపేసింది. ప్రస్తుతం 7s సిరీస్తో పాటు, యాపిల్ వాచ్ ఎస్ఈ, యాపిల్ వాచ్ సిరీస్ 3లతో అలరించేందుకు యాపిల్ సిద్ధమైంది. చదవండి: వావ్.. క్లోజప్ షాట్లో సూర్యుడు -
కరోనా చావులు.. కాకి లెక్కలు!
సాక్షి, సిటీబ్యూరో: ఇప్పటి వరకు ప్రభుత్వ వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించిన కరోనా చావులు..కాకి లెక్కలను తలపిస్తున్నాయి. అధికారికంగా ప్రకటించిన ఈ గణాంకాలకు కోవిడ్ ఆర్థిక సహాయం కోసం ఆన్లైన్లో అందుతున్న దరఖాస్తులకు అసలు పొంతన కుదరడం లేదు. ఇబ్బడిముబ్బడిగా అర్జీలు వస్తుండటంతో దిక్కుతోచని పరిస్థితుల్లో వైద్య ఆరోగ్యశాఖ అధికారులు తలపట్టుకుంటున్నారు. (చదవండి: వర్క్ ఫ్రం హోం చేసినా బీమా చెల్లించాల్సిందే!) బాధితులు కోవిడ్తో చనిపోయినప్పటికీ వ్యాధి నిర్ధారణ పరీక్షలకు సంబంధించిన రిపోర్ట్లు, చికిత్స పొందిన ఆస్పత్రి జారీ చేసిన మెడికల్ బిల్లులను ఆన్లైన్లో అప్లోడ్ చేయకపోవడంతో వీటిలో కొన్ని తిరస్కరణకు గురవుతుండగా 90శా తానికి పైగా దరఖాస్తులు సాయానికి అర్హమైనవిగా తేలినట్లు తెలిసింది. ఆర్టీపీసీఆర్, ర్యాపిడ్ టెస్టు రిపోర్ట్, ఇన్పేషెంట్ మెడికల్ బిల్లులు, ఛాతి ఎక్సరే, సిటీస్కాన్ రిపోర్టులు, వైద్యులు సిఫార్సు చేసిన మందులు, మరణ ధ్రువీకరణ పత్రం, ఆధార్ నెంబర్ వంటి అంశాలను సమగ్రంగా పరిశీలించి, అర్హత పొందిన దరఖాస్తులను కలెక్టర్లకు ప్రతిపాదిస్తుండడం విశేషం. దాచినా..దాగని లెక్కలు కోవిడ్ మరణాలను కూడా విపత్తుల జాబితాలో చేర్చి మృతుల కుటుంబాలకు తగిన నష్టపరిహారం అందజేయాలని ఇటీవల సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. కరోనా మృతుల కుటుంబాలకు ఆర్థిక సాయంగా రూ.50,000 చెల్లించేందుకు కేంద్రం అంగీకరించింది. ఆ మేరకు బాధిత కుటుంబాలు ఆన్లైన్లో ఆర్థిక సహాయం కోసం దరఖాస్తు చేసుకోవాలని ప్రకటించిన విషయం తెలిసిందే. హైదరాబాద్ జిల్లాలో ఇప్పటి వరకు 2,300పైగా దరఖాస్తులు అందగా, రంగారెడ్డిలో 750పైగా, మేడ్చల్లో 550 దరఖాస్తులు అందాయి. దరఖాస్తుకు తుది గడువు లేకపోవడంతో అర్జీదారుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ప్రభుత్వం ప్రకటించిన కోవిడ్ మరణాలతో పోలిస్తే ఆన్లైన్లో కలెక్టర్లకు అందుతున్న అర్జీల సంఖ్య ఎక్కువగా ఉండటం ఆశ్చర్యం కలిగిస్తోంది. వచ్చిన దరఖాస్తులను జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు పరిశీలించి, ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి నివేదిస్తున్నారు. ఇదిలా ఉంటే వైరస్ సోకినట్లు బయటికి తెలిస్తే ఇంటిని కంటోన్మెంట్ జోన్గా ప్రకటించి, కుటుంబసభ్యులను వైద్య పరీక్షలు, హోం ఐసోలేషన్ పేరుతో ఆస్పత్రికి తరలించే ప్రమాదం ఉందని భావించి మొదట్లో చాలా మంది కుటుంబ సభ్యుల మరణాలను సాధారణ మరణాలుగా చెప్పుకున్నారు. వాస్తవానికి కోవిడ్తో చనిపోయినప్పటికీ..కుటుంబసభ్యులు చేసిన పొరపాటుతో ప్రస్తుతం వారంతా ప్రభుత్వ ఆర్థిక సహాయాన్ని పొందలేకపోతున్నారు. (చదవండి: గ్రహాంతరవాసులను చూసేందకు వెళ్తున్నా!... అంటూ హాస్యగాడిలా ఎయిర్పోర్ట్కి వెళ్తే చివరికి!! -
జీఎస్టీ పరిహారం కింద ఏపీకి 543 కోట్లు విడుదల: కేంద్ర మంత్రి
సాక్షి, న్యూఢిల్లీ: జీఎస్టీ నష్టపరిహారం కింద గత నవంబర్ 3న రాష్ట్రాలకు 17 వేల కోట్లు విడుదల చేయగా అందులో ఆంధ్రప్రదేశ్ వాటా కింద 543 కోట్ల రూపాయలు ఇచ్చినట్లు ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌధరి వెల్లడించారు. రాజ్యసభలో మంగళవారం వైఎస్సార్సీపీ సభ్యులు వి. విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిచ్చారు. ఏప్రిల్ 20 నుంచి మార్చి 21 మధ్య కాలంలో జీఎస్టీ పరిహారం కింద రాష్ట్రలకు విడుదల చేసిన 1,13,464 కోట్ల రూపాయలకు ఇది అదనం అని తెలిపారు. 2017లో జీఎస్టీ చట్టం అమలులోనికి వచ్చినప్పటి నుంచి 2017-18, 2018-19, 2019-20 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి ఆయా రాష్ట్రాలకు జీఎస్టీ పరిహారం కింద చెల్లించాల్సిన మొత్తాలను పూర్తిగా విడుదల చేయడం జరిగిందని చెప్పారు. కరోనా మహమ్మారి విజృంభించిన నేపధ్యంలో జీఎస్టీ వసూళ్ళు గణనీయంగా తగ్గాయని మంత్రి అన్నారు. అయితే రాష్ట్రాలకు చెల్లించాల్సిన జీఎస్టీ పరిహారం వాటా పెరిగింది. కానీ ఆ మేరకు చెల్లింపులు చేయడానికి జీఎస్టీ కాంపెన్సేషన్ ఫండ్లో చాలినంత నిధులు లేవని అన్నారు. చదవండి: ‘2021 రబీలో తెలంగాణాలో పంటల సాగుపై ఎలాంటి నిబంధనలు లేవు’ జీఎస్టీ వసూళ్ళలో ఏర్పడిన భారీ లోటు, రాష్ట్రాలకు చెల్లించాల్సిన బకాయిలపై జీఎస్టీ కౌన్సిల్లో పలుమార్లు జరిపిన చర్చల అనంతరం 2020-21, 2021-22 ఆర్థిక సంవత్సరాలలో రాష్ట్రాలకు 1 లక్షా 10 వేల కోట్లు, 1 లక్షా 59 వేల కోట్లు విడుదల చేసినట్లు మంత్రి తెలిపారు. జీఎస్టీ రెవెన్యూలో తరుగుదలను పూడ్చేందుకు కేంద్రం క్రమం తప్పకుండా జీఎస్టీ పరిహారాన్ని రాష్ట్రాలకు విడుదల చేస్తున్నట్లు చెప్పారు. జీఎస్టీ కంపెన్సేషన్ ఫండ్ నుంచే కాకుండా రుణాల రూపంలో రాష్ట్రాలకు నిధులు విడుదల చేసినప్పటికి కూడా 2020-21, 2021-22 ఆర్థిక సంవత్సరాలగాను జీఎస్టీ కాంపెన్సేషన్ కింద కేంద్రం చెల్లించాల్సిన బకాయిలు ఇంకా 51 వేల 798 కోట్ల రూపాయలు ఉన్నట్లు మంత్రి వెల్లడించారు. జీఎస్టీ అమలులోనికి వచ్చినప్పటి నుంచి అయిదేళ్ళపాటు రాష్ట్ర పన్నుల రాబడిలో ఏర్పడే లోటును ఏటా 14 శాతం వరకు జీఎస్టీ నష్టపరిహారం కింద చెల్లించేలా జీఎస్టీ చట్టంలో పొందుపరచినట్లు ఆయన తెలిపారు. -
కోవిడ్ మృతుల కుటుంబాలకు రూ.4 లక్షలివ్వాలి
న్యూఢిల్లీ: కోవిడ్తో మృతి చెందిన వారి కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం రూ.4 లక్షలు పరిహారంగా ఇవ్వాలనే డిమాండ్తో కాంగ్రెస్ పార్టీ ఆన్లైన్ ప్రచార కార్యక్రమం ‘కోవిడ్ న్యాయ్’ను ప్రారంభించింది. దేశ ప్రజలు కరోనా మహమ్మారితో తల్లడిల్లుతుండగా పట్టించుకోకుండా ప్రభుత్వం నిద్రపోతోందని దుయ్యబట్టింది. దేశంలో కరోనాతో మృతి చెందిన వారి వాస్తవ వివరాలు బహిర్గతం చేయాలని ప్రభుత్వాన్ని కోరింది. శనివారం ‘కోవిడ్ న్యాయ్’ను కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ట్విట్టర్లో.. ‘కోవిడ్తో ప్రజలు కష్టనష్టాలకు గురవుతుండగా కేంద్ర ప్రభుత్వం మాత్రం నిద్ర పోతోంది. ప్రభుత్వ పెద్దలను మేల్కొలుపుదాం’ అని పేర్కొన్నారు. -
న్యాయవాది కేసు ఓడిపోతే సేవాలోపం అనలేం
సాక్షి, న్యూఢిల్లీ: న్యాయ సేవల్లో లోపం ఉందని ఆరోపిస్తూ ఎవరైనా పరిహారం నిమిత్తం వినియోగదారుల ఫోరాన్ని ఆశ్రయించొచ్చని, అయితే అది అన్ని వేళలా సమంజసం కాదని సుప్రీంకోర్టు పేర్కొంది. జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ ఉత్తర్వులు సవాల్ చేస్తూ ఓ వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్ను జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ బీవీ నాగరత్నలతో కూడిన ధర్మాసనం ఈ నెల 8న విచారించింది. ఓ కేసు విషయంలో ముగ్గురు న్యాయవాదుల వల్ల నష్టపోయానంటూ వినియోగదారుల ఫోరాన్ని ఓ వ్యక్తి సంప్రదించారు. జాతీయ వినియోగదారుల ఫోరం కూడా సదరు వ్యక్తి అభ్యర్థన తిరస్కరించడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ‘‘జిల్లా, రాష్ట్ర, జాతీయ వినియోగదారుల ఫోరాలు పిటిషనర్ అభ్యర్థన తిరస్కరించడం సబబే. ప్రతి కేసులోనూ ఎవరో ఒకరు ఓడిపోవడం జరుగుతుంది. అంతమాత్రాన వినియోగదారుల ఫోరానికి వెళ్లి న్యాయవాది నుంచి పరిహారం ఇప్పించాలనడం సమంజసం కాదు. జరిమానా విధించకుండా పిటిషన్పై విచారణ ముగిస్తున్నాం’’ అని ధర్మాసనం పేర్కొంది. న్యాయవాది నిర్లక్ష్యం ఉందని బలమైన ఆధారాలుంటే తప్ప సేవాలోపంగా పేర్కొనలేమని స్పష్టం చేసింది. -
దళిత రైతులకు నష్టపరిహారం అందజేసిన ఎమ్మెల్యే రజని
-
ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు
-
ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు
సాక్షి, విజయవాడ: కోవిడ్ మృతుల కుటుంబాలకు రూ.50 వేల పరిహారం చెల్లింపుపై ఏపీ వైద్య ఆరోగ్య శాఖ ఉత్తర్వులను జారీ చేసింది. విపత్తు నిర్వహణ నిధి నుంచి చెల్లించాలని కలెక్టర్లను ఆదేశించింది. డీఆర్వో నేతృత్వంలో ప్రత్యేక సెల్ ఏర్పాటు ద్వారా బాధిత కుటుంబాలకు రెండు వారాల్లో చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. కుటుంబ సుభ్యుల నుంచి దరఖాస్తులు స్వీకరించాలని ప్రభుత్వం సూచించింది. చదవండి: గెస్ట్ ‘హౌస్’ బాబు.. కుప్పంపై చంద్రబాబు కపటప్రేమ -
కేశవాపూర్ ప్రాజెక్టుకు ‘అసైన్డ్’ చిక్కులు
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ సిగలో భారీ జల భాండాగారం ఏర్పాటు చేసే పనులకు అడుగడుగునా ఆటంకాలు ఎదురవుతున్నాయి. శామీర్పేట్ మండలం కేశవాపూర్ లో 5 టీఎంసీల గోదావరి జలాల నిల్వ సామర్థ్యంతో నిర్మించతలపెట్టిన రిజర్వాయర్కు అసైన్డ్ భూములు, అటవీ భూముల సేకరణ ప్రక్రియ కత్తిమీద సాములా మారింది. ప్రధానంగా అసైన్డ్ భూములకు.. ఎకరాకు రూ.37 లక్షలు పరిహారంగా చెల్లిస్తామని ప్రభుత్వం గతంలో ప్రకటించింది. కానీ ఎకరానికి రూ. కోటి పరిహారంగా అందించాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. భూసేకరణ విషయమై రెవెన్యూ అధికారులు పలుమార్లు నిర్వాసితులయ్యే రైతులతో చర్చించినప్పటికీ వారు మెట్టుదిగడంలేదని సమాచారం. తాము కోరిన పరిహారాన్ని చెల్లించకుండా బలవంతంగా తమ భూములు లాక్కుంటే పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని స్పష్టంచేసినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు నిర్మాణం పూర్తి అవుతుందా లేదా అన్న అంశం సస్పెన్స్గా మారింది. కాగా.. సుమారు అరవై నాలుగు ఎకరాలకు సంబంధించిన అసైన్డ్ భూములకు 200 మంది యజమానులు ఉన్నారు. వీరంతా తమకు న్యాయం చేయాలని పట్టుబడుతున్నారు. ఈ వివాదాన్ని ప్రభుత్వం ఎలా పరిష్కరిస్తుందన్న అంశం హాట్ టాపిక్ గా మారింది. అటవీ భూములు సైతం.. కేశవాపూర్ భారీ స్టోరేజి రిజర్వాయర్ నిర్మాణానికి సుమారు 1245 ఎకరాల అటవీ భూములను సేకరించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఆ శాఖకు అంతే మొత్తంలో భూములను కేటాయించాల్సి ఉంది. ఇందుకోసం జగిత్యాల్, సూర్యాపేట్, భూపాలపల్లి తదితర జిల్లాల్లో అటవీశాఖ సూచనల మేరకు ఫారెస్ట్ రిజర్వ్ల ఏర్పాటుకు అనుమతించాలని ప్రభుత్వం కేంద్ర అటవీశాఖను కోరింది. ఇక ఈ ప్రాజెక్టుకు పర్యావరణ, అటవీ, పర్యావరణ మంత్రిత్వశాఖలు సైతం ప్రాథమిక అనుమతులు మంజూరు చేసినా.. తుది అనుమతులు జారీచేయాల్సి ఉంది. (చదవండి: మనీ గురించి ఆలోచించకు.. లగ్జరీగా ఉంటే చూడు) -
వైరల్: అరటి గెల మీద పడిందని రూ.4 కోట్లు రాబట్టాడు
బెర్న్: ప్రమాదవశాత్తు సంస్థలో పనిచేసే కార్మికులకు గాయాలైతే లేదా చనిపోతే సదరు సంస్థే నష్టపరిహారం చెల్లిస్తుంది. ప్రమాద తీవ్రదతను బట్టి కొంత మొత్తాన్ని వారికి అప్పజెప్పుతుంది. అయితే తాజాగా ఓ అరటి తోటలో పనిచేసే కార్మికుడిపై అరటి చెట్టు పడటంతో యాజమానిపై దావా వేసి ఏకంగా 4 కోట్లు రాబట్టాడు. ఈ ఆశ్యర్యకర ఘటన ఆస్ట్రేలియాలో చోటుచేసుకుంది. చదవండి: Viral: కళ్లు పోతేనేం.. అతని పట్టుదలముందు ఏ కష్టమైనా దిగదుడుపే! క్వీన్స్ల్యాండ్లో సమీపంలోని ఎల్ అండ్ ఆర్ కాలిన్స్కు చెందిన అరటి తోటలో జైర్ లాంగ్ బాటమ్ అనే వ్యక్తి పని చేస్తున్నాడు. కాపుకు వచ్చిన చెట్లనుంచి అరటి పండ్ల గెలలను నరుకుతుండగా ప్రమాదవశాత్తు అరిటి పండ్ల గెలతో పాటు అరటి చెట్టుకూడా అతనిపై పడింది. దాంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. దెబ్బలు తీవ్రంగా తగలటంతో లాంగ్ బాటమ్ వికలాంగుడైపోయాడు. ప్రమాదం కారణంగా పనిచేయలేక ఉపాధి కోల్పోయాడు. దీంతో బాధితుడు తనకు పరిహారం కోరుతూ అరటితోట యజమానిపై క్వీన్స్ల్యాండ్ సుప్రీంకోర్టులో పిటీషన్ వేశాడు. ఇది 2016లో జరిగింది. చదవండి: డ్యాన్స్ ఇరగదీసిన వధువు.. అంతా ఫిదా, అయితే వరుడు మాత్రం..! ఈ పిటీషన్పై కోర్టు విచారణ ఇప్పటి వరకు కొసాగింది. తాజాగా మరోసారి ఈ కేసుపై కోర్టులో వాదనలు జరిగాయి. ఈ సందర్భంగా అరటి పండ్ల గెల మీద పడటం కారణంగానే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడని, ఆ ఘటన వల్లనే అతను జీవితాంతం ఉపాధిని కోల్పోవాల్సి వచ్చిందని కోర్టు అభిప్రాయపడింది.. కాబట్టి ఆ కూలీకి యజమాని 502,740 డాలర్ల పరిహారాన్ని అంటే భారత కరెన్సీలో 3,77,15,630 రూపాయలను చెల్లించాలని అరటి తోట యజమానిని కోర్టు ఆదేశించింది. ఇలా క్వీన్స్లాండ్ సుప్రీంకోర్టు అతనికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. దీంతో చేసేందేంలేక సదరు యజమాని కూలీకి పూర్తి నష్టపరిహారం చెల్లించాడు. -
ఆ ఒక్క కారణంతో కోవిడ్ పరిహారాన్ని ఆపొద్దు
న్యూఢిల్లీ: కోవిడ్ మృతుల కుటుంబాలకు పరిహారం ఇచ్చే విషయంలో జాతీయ విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ (ఎన్డీఎంఏ) ప్రతిపాదనలకు సుప్రీంకోర్టు ఆమోదం తెలిపింది. కోవిడ్ మృతుల కుటుంబాలకు రూ.50 వేల పరిహారం అందజేసే విషయంలో రాష్ట్రాలకు సుప్రీంకోర్టు మరింత స్పష్టతనిచ్చింది. ఓ వ్యక్తి కోవిడ్ వల్లనే మృతి చెందినట్లు డెత్ సర్టిఫికెట్లో స్పష్టంగా పొందుపరచలేదనే కారణంతో అతని కుటుంబానికి పరిహారం నిరాకరించరాదని రాష్ట్రాలను కోరింది. సదరు వ్యక్తి కోవిడ్–19 కారణంగానే మృతి చెందినట్లు ధ్రువీకరించే పత్రంతోపాటు దరఖాస్తు అందిన 30 రోజుల్లోగా సాయాన్ని అందించాలని కోరింది. మహమ్మారిని ఎదుర్కొనే సన్నద్ధత చర్యల్లో పాలుపంచుకున్న కోవిడ్ బాధిత మృతుల సమీప బంధువుకు కూడా పరిహారం ఇవ్వవచ్చని పేర్కొంది. -
పరిహారం సరే.. ముందు లెక్కలు తేల్చండి
సాక్షి, హైదరాబాద్: భారీ వర్షాలతో రాష్ట్ర వ్యాప్తంగా రైతులు తీవ్రంగా నష్ట పో యారని మంథని ఎమ్మెల్యే శ్రీధర్బాబు ఆందోళన వ్యక్తం చేశారు. అసెంబ్లీలో శుక్రవారం జీరో అవర్లో పంటనష్టం, పరిహారం అంశాలను లేవనెత్తారు. రాష్ట్రంలో లక్షలాది ఎకరా ల్లో పంటలు నీట ముని గాయని, వరదలతో తీవ్రనష్టం జరిగిందని ఆవేదన వ్యక్తంచేశారు. పరి హారం చెల్లింపు అంశాన్ని పక్కనపెడితే కనీసం అంచనాలు రూపొందించాలని, ఈ వివరాలను కేం ద్రానికి సమర్పిస్తే కొంతైనా మేలు జరిగే అవకాశం ఉంటుందని సూచించారు. వర్షా కాలం ముగుస్తోం దని, తక్షణమే స్పందించకుంటే అంచనాలు కూడా రూపొందించే వీలుండదని గుర్తుచేశారు. -
TS Transco: పొలాల్లో జబర్దస్తీ.. పరిహారం నాస్తి
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ టవర్లు, లైన్ల ఏర్పాటుతో రాష్ట్రంలో భూములు నష్టపోయిన బాధిత రైతులకు పరిహారం అందని ద్రాక్షగా మారింది. జిల్లా కలెక్టర్లు పరిహారం చెల్లింపు ఊసే ఎత్తడం లేదు. కలెక్టర్ల నిర్లక్ష్యం, ట్రాన్స్కో నిర్లిప్తతతో.. పరిహారం కోసం ఎదురుచూస్తున్న వేలాది మంది రైతులు తమ గోడును ఎవరికి చెప్పుకోవాలో తెలియని దిక్కుతోచని పరిస్థితిలో పడిపోయారు. ఈ మేరకు బాధిత రైతు ఒకరు చేసిన ఫిర్యాదును విచారించిన రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ).. పరిహారం ఇప్పించే అధికారం తమకు లేదని పేర్కొంది. జిల్లా కలెక్టర్లు మాత్రమే ఈ విషయంలో నిర్ణయం తీసుకోవాల్సి ఉందని అప్పట్లో స్పష్టం చేసింది. అయితే తాజాగా అదే కేసులో చిత్రమైన ఆదేశాలు జారీ చేయడంతో బాధిత రైతులను పట్టించుకునేవారే లేకుండా పోయారు. పరిహారం కోసం జిల్లా కలెక్టర్ వద్దకు వెళ్లండి.. రైతు పిటిషన్పై విచారణ జరిపిన కమిషన్ 2017 ఆగస్టు 7న ఆదేశాలు జారీ చేసింది. విద్యుత్ చట్టం 2003 సెక్షన్ 67(4)లోని నిబంధనల మేరకే కమిషన్ పాత్ర పరిమితమని, పరిహారం ఇప్పించలేమని స్పష్టం చేసింది. విద్యుత్ లైన్ల ఏర్పాటుతో భూములు నష్టపోతున్న రైతులు, ఇతర భూ యజమానులకు పరిహారం చెల్లింపునకు మార్గదర్శకాల రూపకల్పన కోసం అత్యవసరంగా జిల్లా కలెక్టర్లను సంప్రదించాలని ట్రాన్స్కోను ఆదేశించింది. ‘నిర్ణయాలన్నింటినీ జిల్లా కలెక్టర్ ముందు ఉంచి తగిన పరిహారం కోరే హక్కు పిటిషనర్కు ఉంది..’ అని స్పష్టం చేసింది. విద్యుత్ చట్టం 2003 సెక్షన్ 67(4)లోని నిబంధనల మేరకే కమిషన్ పాత్ర పరిమితమని, పరిహారం ఇప్పించలేమని స్పష్టం చేసింది. విద్యుత్ లైన్ల ఏర్పాటుతో భూములు నష్టపోతున్న రైతులు, ఇతర భూ యజమానులకు పరిహారం చెల్లింపునకు మార్గదర్శకాల రూపకల్పన కోసం అత్యవసరంగా జిల్లా కలెక్టర్లను సంప్రదించాలని ట్రాన్స్కోను ఆదేశించింది. ‘నిర్ణయాలన్నింటినీ జిల్లా కలెక్టర్ ముందు ఉంచి తగిన పరిహారం కోరే హక్కు పిటిషనర్కు ఉంది..’అని స్పష్టం చేసింది. విద్యుత్ చట్టం 2003 కింద పరిహారాన్ని ప్రకటించేందుకు జిల్లా కలెక్టర్లు సహజ న్యాయ సూత్రాలు, భూసేకరణ చట్టాలను అనుసరించాలి. కేంద్రం జారీ చేసిన ‘రైట్ ఆఫ్ వే’నిబంధనలను దృష్టిలో పెట్టుకుని పరిహారం నిర్ణయించాలి. పిటిషనర్ ఈ అంశాలను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి సరైన పరిహారం కోరవచ్చు. ’అని కమిషన్ ఆదేశించింది. రైతులకు పరిహారం అందకపోవడం పట్ల ఈ ఉత్తర్వుల్లో కమిషన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. కలెక్టర్లు జారీ చేసిన పరిహారం ఉత్తర్వులను సమీక్షించించే అధికారం కమిషన్కు ఉందని కూడా స్పష్టం చేసింది. కలెక్టర్లదే అధికారం: కేంద్ర విద్యుత్ నిబంధనలు–2006 ప్రకారం టవర్ల నిర్మాణానికి తప్పనిసరిగా రైతులు/భూయజమానుల సమ్మతి తీసుకోవాలి. జిల్లా కలెక్టర్ నుంచి కూడా అనుమతి తీసుకోవాలి. కాగా టవర్ల ఏర్పాటుతో భూములు నష్టపోయిన వారికి పరిహారాన్ని నిర్ణయించి ఇప్పించే అధికారాన్ని జిల్లా కలెక్టర్లకు కట్టబెడుతూ ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం 2007 ఫిబ్రవరి 27న ‘వర్క్స్ ఆఫ్ లైసెన్స్ రూల్స్’పేరుతో జీవో ఎంఎస్ నం.24 జారీ చేసింది. కేంద్రం జారీ చేసిన నిబంధనల ప్రకారం కూడా పరిహారం ఇప్పించే బాధ్యత కలెక్టర్లదే. ఈఆర్సీ ఆదేశాలు బేఖాతరు: ఈఆర్సీ 2017లో జారీ చేసిన ఉత్తర్వుల మేరకు పరిహారం చెల్లింపునకు చర్యలు తీసుకోవాలని కోరుతూ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా కలెక్టర్, ఆ తర్వా త వికారాబాద్ జిల్లా కలెక్టర్కు వెంకట్రెడ్డి మూడుసార్లు అర్జీ పెట్టుకున్నారు. కానీ కలెక్టర్లు ఎలాంటి చర్యలు తీసుకోలేదంటూ ఆయన 2020లో మళ్లీ ఈఆర్సీని ఆశ్రయించారు. విద్యుత్ చట్టంలోని నిబంధనలు ఉటంకిస్తూ.. ఈఆర్సీ ఉత్తర్వులు అమలు చేయని కలెక్టర్లు, ట్రాన్స్కోపై చర్యలు తీసుకోవాలని, జరిమానా విధించాలని కోరారు. తాజాగా ఈఆర్సీ విచిత్ర ఆదేశాలు భూ సేకరణకు మార్గదర్శకాలు రూపకల్పన చేయా లని జిల్లా కలెక్టర్ను గత ఉత్తర్వుల్లో ఆదేశించినప్పటికీ, అందులో పిటిషన్దారుడైన బాధిత రైతు కేసు ను నిర్దిష్టంగా ప్రస్తావించలేదని ఈఆర్సీ తన తాజా ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. జిల్లా కలెక్టర్ను సంప్ర దించడానికి రైతుకు కమిషన్ స్వేచ్ఛ ఇవ్వలేదని పేర్కొంది. జిల్లా కలెక్టర్ను సంప్రదించాలని ట్రాన్స్ కోను కూడా ఆదేశించలేదని పేర్కొంది. కాబ ట్టి ఈఆర్సీ ఆదేశాలను జిల్లా కలెక్టర్, ట్రాన్స్కో అధికారులు బేఖాతరు చేశారన్న అంశం ఉత్పన్నం కాదని, వీరిపై చర్యలు తీసుకోలేమంటూ స్పష్టం చేసింది. కొత్త లైన్లకు సైతం లభించని పరిహారం నల్లగొండ జిల్లా దామరచర్లలో నిర్మిస్తున్న 4,000 మెగావాట్ల యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం నుంచి ఉత్పత్తి అయ్యే విద్యుత్ను సరఫరా చేయడానికి దామరచర్ల–డిండి, దామరచర్ల–చౌటుప్పల్ వరకు 400 కేవీ ట్రాన్స్మిషన్ లైన్ను ఏర్పాటు చేస్తున్నారు. ఈ క్రమంలో వందల మంది రైతుల పొలాల్లో టవర్లు వేసినప్పటికీ పరిహారం చెల్లించలేదు. కల్లెపల్లికి చెందిన మాతృ నాయక్కు ఎకరంన్నర పొలం ఉండగా, పరిహారం ఇస్తామని హామీ ఇచ్చి 4 నెలల కిందట టవర్ వేశారు. కానీ ఇంకా ఇవ్వలేదు. ఇదే గ్రామానికి చెందిన మరో రైతు ఠాగూర్కు 3 ఎకరాల పొలం ఉండగా 4 నెలల కిందట టవర్ వేశారు. పరిహారం ఇవ్వలేదని, అధికారులను అడిగితే రేపు, మాపు అంటూ సమాధానం చెబుతున్నారని ఆయన వాపోతున్నారు. -
ఇంట్లో మృతిచెందినా పరిహారం
సాక్షి, హైదరాబాద్: కరోనాతో ఇంట్లో చనిపోయినా పరిహారం దక్కుతుందని కేంద్రం స్పష్టం చేసింది. కోవిడ్తో చనిపోయిన కుటుంబాలకు రూ. 50 వేలు పరిహారంగా ఇవ్వాలని కేంద్రం ప్రకటించిన సంగతి విదితమే. ఈ మేరకు ప్రాథమిక మార్గదర్శకాలు రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖకు అందాయి. కొందరు కోవిడ్తో ఆసుపత్రుల్లో కాకుండా ఇంట్లో చనిపోయినట్లు మరణ ధ్రువీకరణ పత్రం ఇస్తే, బాధిత కుటుంబసభ్యులకు పరిహారం అందుతుందని వైద్య, ఆరోగ్యశాఖ వర్గాలు తెలిపాయి. కరోనా మృతుల కుటుంబసభ్యులు అధికారిక డాక్యుమెంట్ కోసం జిల్లా కలెక్టర్కు వినతిపత్రం సమర్పించాలని మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. ఆర్టీపీసీఆర్ లేదా యాంటిజెన్ టెస్టులు, ఆసుపత్రుల్లో కోవిడ్తో చనిపోయినట్లు ధ్రువీకరణ ఉంటే ఆయా కుటుంబ సభ్యులకు పరిహారం ఇవ్వొచ్చని పొందుపరిచారు. విష ప్రయోగం, ఆత్మహత్య, హత్య, ప్రమాదాల కారణంగా సంభవించే మరణాలను కోవిడ్ మరణాలుగా పరిగణించకూడదని స్పష్టం చేశారు. 95 శాతం మరణాలు 25 రోజుల్లోనే... కోవిడ్తో మరణించిన కుటుంబాలకు కేంద్ర విపత్తు నిర్వహణశాఖ ఆధ్వర్యంలో పరిహారమిచ్చే ఏర్పాట్లు జరుగుతున్నాయి. రాష్ట్రంలో వైద్య, ఆరోగ్యశాఖ లెక్కల ప్రకారం కరోనాతో ఇప్పటివరకు 3,911 మంది మృతి చెందారు. అయితే ప్రభుత్వం దృష్టికి రాని కరోనా మరణాలు కూడా ఉండొచ్చని అంటున్నారు. ఇది సున్నితమైన వ్యవహారం కాబట్టి, ఈ లెక్కల ప్రకారమే కాకుండా బాధిత కుటుంబ సభ్యులందరి నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తారు. అందువల్ల మరిన్ని దరఖాస్తులు కూడా వచ్చే అవకాశముందని అంటున్నారు. సాధారణంగా కోవిడ్ మరణాల్లో 95 శాతం 25 రోజుల్లోనే సంభవిస్తాయి. దాన్ని మరింత విస్తృతపరిచి వైరస్ నిర్ధారణ అయిన తేదీ నుంచి 30 రోజుల్లోపు మరణాలు సంభవించినా వాటిని కూడా కరోనా మరణాలుగా పరిగణించాలని కేంద్రం స్పష్టం చేసింది. కొన్ని సందర్భాల్లో ఆసుపత్రిలో ఇన్పేషెంట్గా ఉన్నప్పుడు, అది కూడా 30 రోజుల తర్వాత మరణం సంభవించినా దాన్ని కూడా కరోనా మరణంగా పరిగణిస్తారు. ఆయా మరణాలను ధ్రువీకరించేందుకు జిల్లాస్థాయిలో కమిటీ ఏర్పాటు చేస్తారు. అడిషనల్ కలెక్టర్, చీఫ్ మెడికల్ ఆఫీసర్, మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్, ఒక వైద్య నిపుణుడు కరోనా మరణ ధ్రువీకరణ పత్రం ఇస్తారు. అయితే ఎప్పటినుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తారన్న విషయంపై వైద్య శాఖ వర్గాలు స్పష్టత ఇవ్వలేదు. త్వరలో అన్ని అంశాలపై స్పష్టమైన మార్గదర్శకాలు వచ్చే అవకాశం ఉందని చెప్పాయి. -
కరోనా మృతుల కుటుంబాలకు రూ.50 వేల ఎక్స్గ్రేషియా
న్యూఢిల్లీ: కోవిడ్ బారిన పడి మరణించిన వారి కుటుంబాలకు రూ.50 వేల చొప్పున ఎక్స్ గ్రేషియా సహాయాన్ని చెల్లించాలని నిర్ణయించినట్లు కేంద్రం బుధవారం సుప్రీంకోర్టుకు వెల్లడించింది. ఈ మొత్తాన్ని స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్(రాష్ట్రాల విపత్తు సహాయ నిధి) ద్వారా ఎక్స్గ్రేషియా ఇస్తామని పేర్కొంది. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారమే కోవిడ్ మృతుల కుటుంబాలకు కేంద్రం పరిహారం ఇవ్వనుంది. ఈ మేరకు జాతీయ విపత్తుల నిర్వహణ అథారిటీ గైడ్లైన్స్ విడుదల చేసింది. కాగా ఇప్పటి వరకు దేశంలో 4.45 లక్షలమంది మహమ్మారి బారిన పడి మరణించారు. అయితే ఇప్పటి వరకు మరణించిన వారితోపాటు భవిష్యత్తులోనూ కోవిడ్తో ప్రాణాలు విడిచిన వారందరికి ఇది వర్తిస్తుందని పేర్కొంది. అయితే సదరు వ్యక్తి కోవిడ్ మరణించినట్లు ఆరోగ్య మంత్రిత్వ మార్గదర్శకాల ప్రకారం సర్టిఫికెట్ సమర్పించాల్సి ఉంటుందని తెలిపింది. ఇదిలా ఉండగా ఇప్పటికే బిహార్ కోవిడ్తో మరణించిన వారికి లక్షలు, మధ్యప్రదేశ్ లక్ష రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించిన విషయం తెలిసిందే. చదవండి: Susmita Basak: వారి కోసం ప్రత్యేకంగా లోదుస్తులు, అవయవాలు.. -
అప్పటికి మూడో వేవ్ ముగుస్తుంది: సుప్రీం కోర్టు
న్యూఢిల్లీ: కోవిడ్–19 మహమ్మారితో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించడం, మరణ ధ్రువీకరణ పత్రాల మంజూరుకు మార్గదర్శకాలు రూపొందించడంలో జరుగుతున్న జాప్యంపై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ‘కరోనా మరణాలకు సంబంధించిన మార్గదర్శకాలు రూపొందించాలని మేము గతంలోనే ఆదేశించాం. ఆ తర్వాత గడువును పొడిగించాం కూడా. మీరు మార్గదర్శకాలు రూపొందించే సమయానికి మూడో వేవ్ కూడా ముగిసిపోతుంది’’ అని జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ అనిరుధ్ బోస్లతో కూడిన సుప్రీం డివిజన్ బెంచ్ వ్యాఖ్యానించింది. శుక్రవారం ఈ కేసుని విచారిస్తూ మార్గదర్శకాలను ఈ నెల 11లోగా రూపొందించాలని కేంద్రాన్ని ఆదేశించింది. కరోనాతో మృతి చెందిన వారి కుటుంబాలకు రూ.4 లక్షలు ఎక్స్గ్రేషియా ఇస్తామని కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ నష్టపరిహారం అసలైన వారికి చేరాలంటే కోవిడ్–19 డెత్ సర్టిఫికెట్ జారీకి కూడా కేంద్రం మార్గదర్శకాలను రూపొందించాల్సిన అవసరం ఉందంటూ కొందరు అడ్వకేట్లు గతంలోనే వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశారు. వాటిని విచారించిన సుప్రీం కోర్టు ఇప్పటికే మార్గదర్శకాల రూపకల్పనకు రెండు సార్లు గడువు పొడిగించింది. ఇక మృతుల కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించడంలోనూ తీవ్ర జాప్యం జరుగుతోంది. దీనిపై అత్యున్నత న్యాయస్థానం అసహనం వ్యక్తం చేసింది. మరణ ధ్రువీకరణ పత్రం జారీకి సంబంధించి మార్గదర్శకాలను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించింది. కేంద్రం తరఫున కోర్టుకు హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కేంద్ర ప్రభుత్వం పరిశీలనలో ఈ అంశం ఉందని సుప్రీం దృష్టికి తీసుకువెళ్లారు. -
ఎక్స్ప్రెస్ రైలు ఆలస్యం.. ప్రయాణికులకు గుడ్న్యూస్
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలోనే తొలి ప్రైవేటు రైలు తేజస్ ఎక్స్ప్రెస్. విమానంలో ఉన్న మాదిరి సౌకర్యాలు ఉండే ఈ రైలు ఢిల్లీ నుంచి లక్నోకు రాకపోకలు సాగిస్తుంది. అయితే ఈ రైలు కచ్చితత్వం విషయంలో ప్రయోగాత్మకంగా ఓ నిబంధన విధించారు. రైలు నిర్దేశించిన సమయానికి వెళ్లకపోతే ఎంత ఆలస్యమైతే అంత పరిహారం చెల్లిస్తామని భారతీయ రైల్వే క్యాటరింగ్, పర్యాటక కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ) ప్రకటించింది. ఈ క్రమంలో తాజాగా ఆ రైలు రెండు గంటలు ఆలస్యంగా ప్రయాణించడంతో దానికి సంబంధించిన పరిహారం ప్రయాణికులకు అందిస్తున్నట్లు ఐఆర్సీటీసీ తెలిపింది. ఎప్పుడూ చార్జీల వసూళ్లు చేయడమే తప్పా పరిహారం ఇవ్వడం ఆసక్తికరంగా మారింది. తేజస్ ఎక్స్ప్రెస్ రైలు ఈ శని, ఆదివారం (ఆగస్ట్ 21, 22)లో రెండు గంటలు ఆలస్యంగా ప్రయాణించింది. ఆలస్యంగా ప్రయాణించడంతో రైలులో ప్రయాణించిన వారికి రూ.నాలుగున్నర లక్షలు పరిహారంగా చెల్లించాలని నిర్ణయించింది. మొత్తం 2,035 మంది ప్రయాణికులకు పరిహారం అందించనుంది. భారీ వర్షాల నేపథ్యంలో శనివారం సిగ్నల్ ఫెయిల్ కారణంగా న్యూఢిల్లీ రైల్వే స్టేషన్కు రెండున్నర గంటలు ఆలస్యంగా రైలు చేరింది. ఆదివారం కూడా గంట ఆలస్యమైంది. చదవండి: అచ్చం సినిమాలా? వ్యాపారి కుమారుడు కిడ్నాప్.. దీంతో గంట ఆలస్యమైన వారికి రూ.100 చొప్పున, రెండున్నర గంటలు ఆలస్యమైన వారికి రూ.250 చెల్లించనుంది. మొత్తం రూ.4,49,600 పరిహారం ప్రయాణికులకు ఐఆర్సీటీసీ అందించనుంది. ఈ విషయాన్ని ఐఆర్సీటీసీ చీఫ్ రీజనల్ మేనేజర్ అజిత్ కుమార్ సిన్హా తెలిపారు. నిబంధనల మేరకు రైలు గంట ఆలస్యమైతే రూ.వంద చెల్లించాలనే నిబంధన ఉందని, ఆ మేరకు తాజాగా ఆలస్యమైన వారికి అంతే చొప్పున పరిహారం అందిస్తున్నట్లు వివరించారు. చదవండి: ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టాలి.. సీఎం కేసీఆర్ -
ఆర్బీఐ ‘లాకర్’ షాక్!
ముంబై: బ్యాంకు లాకర్ సేవలను వినియోగించుకుంటున్నారా? అయితే ఆర్బీఐ సవరిత నిబంధనల గురించి తప్పక తెలుసుకోవాల్సిందే. చోరీ, అగ్నిప్రమాదం, భవనం కుప్పకూలిపోవడం, బ్యాంకు ఉద్యోగుల మోసం.. ఇలాంటి కారణాలతో లాకర్లలో ఉంచిన వాటికి నష్టం వాటిల్లితే, వార్షిక లాకర్ అద్దెకు గరిష్టంగా 100 రెట్ల వరకే పరిహారం లభిస్తుంది. ఉదాహరణకు ఏటా రూ.500 చొప్పున లాకర్ చార్జీలు చెల్లిస్తారనుకోండి.. లాకర్లో ఉంచిన వాటికి నష్టం వాటిల్లితే గరిష్ట పరిహారం రూ.50,000కు మించి రాదు. ఈ విషయంలో బ్యాంకుల బాధ్యతను ఆర్బీఐ పరిమితం చేసింది. అంతేకాదు.. లాకర్లలో చట్టవిరుద్ధమైనవి, ప్రమాదకరమైన వాటిని ఉంచకూడదు. అలాగే, ‘‘ప్రకృతి విపత్తులైన భూకంపాలు, వరదలు, పిడుగులు పడడం కారణంగా లాకర్లలోని వాటికి నష్టం వాటిల్లితే ఆ బాధ్యత బ్యాంకులపై ఉండదు’’ అని ఆర్బీఐ స్పష్టం చేసింది. ఈ మేరకు సవరించిన నిబంధనలు 2022 జనవరి 1 నుంచి అమల్లోకి రానున్నట్టు ఆర్బీఐ ప్రకటించింది. బ్యాంకులు ఈ మేరకు లాకర్ ఒప్పందంలో సవరణలు చేసుకోవాల్సి ఉంటుంది. బ్యాంకులు అందిస్తున్న డిపాజిట్ లాకర్/సేఫ్ కస్టడీ ఆర్టికల్ సేవలను సమీక్షించిన అనంతరం.. వివిధ వర్గాల సూచనలను పరిగణనలోకి తీసుకుని నిబంధనల్లో సవరణలు చేసినట్టు ఆర్బీఐ ప్రకటించింది. ప్రస్తుత, నూతన కస్టమర్లకు ఇవి వర్తిస్తాయని స్పష్టం చేసింది. శాఖలవారీగా ఎన్ని లాకర్లు ఖాళీగా ఉన్నాయనే జాబితాను నిర్వహించడమే కాకుండా.. లాకర్లు ఖాళీగా లేకపోతే ప్రతీ దరఖాస్తును విధిగా స్వీకరించి వేచి ఉండే జాబితాను నిర్వహించాల్సి ఉంటుందని నిర్దేశించింది. తగిన జాగ్రత్తలు: లాకర్లు/సేఫ్ డిపాజిట్ వాల్ట్ల భద్రత విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, విపత్తుల నుంచి భవనాలకు రక్షణ కల్పించుకోవాలని ఆర్బీఐ సూచించింది. ‘‘లాకర్లో ఉంచిన వాటి విషయంలో తమకు ఎటువంటి బాధ్యత లేదని బ్యాంకులు చెప్పడానికి వీల్లేదు. అగ్నిప్రమాదం, చోరీ, దోపిడీ, మోసం ఘటనల వల్ల కస్టమర్కు నష్టం వాటిల్లితే క్రితం సంవత్సరం వార్షిక లాకర్ అద్దెకు 100 రెట్ల వరకు పరిహారం చెల్లించాల్సిన బాధ్యత ఉంటుంది’’ అని ఆర్బీఐ పేర్కొంది. ఇకమీదట లాకర్ ప్రారంభంలోనే మూడేళ్ల అద్దెకు సరిపడా డిపాజిట్ను బ్యాంకులు తీసుకోవచ్చు. అయితే సరైన చెల్లింపు చరిత్ర ఉన్న ప్రస్తుత ఖాతాదారుల నుంచి డిపాజిట్ కోసం ఒత్తిడి చేయకూడదని ఆర్బీఐ స్పష్టం చేసింది. వరుసగా మూడేళ్ల పాటు లాకర్ అద్దె చెల్లించకపోతే.. లాకర్లను తెరిచే అధికారం బ్యాంకులకు కల్పించింది. ఎస్బీఐ ఒక లాకర్కు రూ.2,000–8,000 వరకు వార్షిక అద్దెను వసూలు చేస్తుండడం గమనార్హం. సుప్రీంకోర్టు తీర్పు ఫలితం ఆరు నెలల్లో లాకర్లకు సంబంధించి నిబంధనలను తీసుకురావాలంటూ సుప్రీంకోర్టు ఈ ఏడాది ఫిబ్రవరిలో ఒక కేసు విచారణ సందర్భంగా ఆర్బీఐని కోరింది. టెక్నాలజీల సాయంతో చొరబాటుదారులు కస్టమర్ల ప్రమేయం లేకుండా లాకర్లను యాక్సెస్ చేసుకోగలరని.. ఇటువంటి సందర్భాల్లో కస్టమర్లు బ్యాంకుల దయపై ఆధారపడాల్సిన పరిస్థితి ఉండకూడదని కోర్టు స్పష్టం చేసింది. ఇటువంటి సందర్భాల్లో బ్యాంకులు బాధ్యత నుంచి తప్పించుకోవడం కుదరదని స్పష్టం చేసింది.