First Look Poster
-
లేడీ ఓరియంటెడ్ పవర్ఫుల్ చిత్రం.. ఆసక్తిగా ఫస్ట్ లుక్ పోస్టర్
ఆనంది, వరలక్ష్మిశరత్కుమార్ ప్రధాన పాత్రల్లో వస్తోన్న చిత్రం శివంగి. ఈ చిత్రాన్ని దేవరాజ్ భరణి ధరణ్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. ఫస్ట్ కాపీ మూవీస్ బ్యానర్పై నరేష్ బాబు నిర్మిస్తున్నారు. పవర్ ఫుల్ విమెన్ సెంట్రిక్ ఫిల్మ్గా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్ను విడుదల చేశారు.సంక్రాంతికి వస్తున్నాం మూవీతో సూపర్ హిట్ కొట్టిన అనిల్ రావిపూడి చేతుల మీదుగా శివంగి ఫస్ట్ లుక్ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చిత్ర బృందానికి అభినందనలు తెలిపారు. ఈ సినిమా గ్రాండ్ సక్సెస్ అవ్వాలని కోరారు. ఫస్ట్ లుక్ పోస్టర్ చూస్తుంటే పవర్ ఫుల్, సెన్సేషనల్ కథతో రూపొందించినట్లు తెలుస్తోంది. ఫస్ట్ లుక్ పోస్టర్ ఈ సినిమాపై మరింత క్యురియాసిటీని పెంచింది. సోఫాలో డైనమిక్ గా కూర్చున్న ఆనంది స్టన్నింగ్ లుక్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ చిత్రంలో జాన్ విజయ్, డాక్టర్ కోయ కిషోర్ కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని మార్చి 7న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఈ చిత్రానికి ఏహెచ్ కాషిఫ్, ఎబినేజర్ పాల్ మ్యూజిక్ అందిస్తున్నారు. Happy to Unveil the Title & First look Poster of #Shivangi Movie.Congratulating the entire team for the grand success of the film.@anandhiActress @varusarath5 @Bharanidp #NareshBabuP #AHKaashif #SamjithMohammed #RaghuKulakarni @Teju_PRO @RainbowMedia_ @firstcopymovies pic.twitter.com/z5bXujUECT— Anil Ravipudi (@AnilRavipudi) February 19, 2025 -
‘కర్మ స్థలం’లో నటించడంతో చాలా సంతృప్తి కలిగింది: హీరోయిన్ అర్చన
అర్చన శాస్త్రి, మితాలి చౌహాన్, వినోద్ అల్వా, కలకేయ ప్రభాకర్, బాలగం సంజయ్, నాగ మహేష్, దిల్ రమేష్, చిత్రం శ్రీను ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం ‘కర్మ స్థలం’(Karmasthalam).రాయ్ ఫిల్మ్స్ బ్యానర్పై శ్రీనివాస్ సుబ్రహ్మణ్య నిర్మాణంలో రాకీ షెర్మన్ తెరకెక్కించిన చిత్రం ఫస్ట్లుక్ పోస్టర్ని తాజాగా రిలీజ్ చేశారు.కర్మస్థలం అంటూ రిలీజ్ చేసిన ఈ పోస్టర్లో కనిపించిన పాత్రలు, ఆ పోస్టర్ను డిజైన్ చేసిన తీరు ఆకట్టుకునేలా ఉంది. ఇక అర్చనా లుక్, గెటప్ ఈ పోస్టర్లో హైలెట్ అవుతోంది. బ్యాక్ గ్రౌండ్లో అమ్మవారి షాడో కనిపించడం చూస్తుంటే.. ఈ చిత్రానికి ఏ రేంజ్లో వీఎఫ్ఎక్స్ను వాడారో అర్థం చేసుకోవచ్చు. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్తో సినిమా మీద అంచనాలు పెంచేశారు. ఫస్ట్ లుక్ లాంచ్ చేసిన అనంతరం..హీరోయిన్ అర్చన మాట్లాడుతూ.. ‘మహిషాసుర మర్దిని కాన్సెప్ట్తో ఈ మూవీని తెరకెక్కించారు. ఇంత మంచి సబ్జెక్ట్ని, కర్మ స్థలం వంటి అద్భుతమైన టైటిల్తో సినిమాను తెరకెక్కించిన రాకీ గారికి థాంక్స్. కథను చెప్పేందుకు వచ్చినప్పుడు రాకీని చూసి కొత్త వాడు కదా.. ఎలా తీస్తారో అని అనుకున్నాను. కానీ కథను అద్భుతంగా నెరేట్ చేశారు. కథను చాలా మంది అద్భుతంగా చెబుతారు. కానీ దాన్ని తెరపైకి తీసుకురావడంలో తడబడుతుంటారు. కానీ నిర్మాత శ్రీనివాస్ గారి సహకారంతో దర్శకుడు సినిమాను అద్భుతంగా తెరకెక్కించారు. క్వాలిటీ పరంగా ఈ మూవీ పాన్ ఇండియ స్థాయిలో ఉంటుంది. ఈ సినిమా పట్ల చాలా సంతోషంగా, సంతృప్తిగా ఉన్నాను. ఈ మూవీ నాకు చాలా ప్రత్యేకం. నా హృదయానికి ఎంతో దగ్గరైన చిత్రమిది. ఫస్ట్ లుక్ అద్భుతంగా ఉంది. ఆ రోజు జరిగిన షూటింగ్ నాకు ఇంకా గుర్తుంది. ఫైట్ సీక్వెన్స్ అద్భుతంగా వచ్చాయి. పోస్టర్ ఎంత ప్రభావం చూపిస్తోందో.. సినిమా కూడా అంతే ప్రభావం చూపించబోతోంది. ఈ సినిమాకు పని చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్’ అని అన్నారు.దర్శకుడు రాకీ షెర్మన్ మాట్లాడుతూ.. ‘‘కర్మ స్థలం’ సినిమాకి మేం అంతా ప్రాణం పెట్టి, ఎంతో ఇష్టంతో పని చేశాం. వీఎఫ్ఎక్స్ పనుల వల్ల ఈ చిత్రం ఆలస్యం అవుతూ వచ్చింది. పాన్ ఇండియా రేంజ్లో ఆకట్టుకునేలా ఈ సినిమా ఉంటుంది. నిర్మాత శ్రీనివాస్ గారు నా వెన్నంటి ఉండి నడిపించారు. అర్చన గారు ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డారు. ఆమె అందించిన సహకారం ఎప్పటికీ మర్చిపోలేను. ఎం.ఎల్ రాజా మంచి సంగీతాన్ని అందించారు. ఈ చిత్రానికి పని చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్’ అని అన్నారు.నిర్మాత శ్రీనివాస్ సుబ్రహ్మణ్య మాట్లాడుతూ.. ‘‘కర్మ స్థలం’ సినిమాను ఎంతో కష్టపడి చేశాం. మా దర్శకుడు ఈ మూవీని పాన్ ఇండియా రేంజ్లో అందరినీ ఆకట్టుకునేలా చేశారు. అర్చన గారు అద్భుతంగా నటించారు. మా సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు. -
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్.. ప్రభాస్ ఫస్ట్ లుక్ అప్డేట్ వచ్చేసింది
టాలీవుడ్ హీరో మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్గా తెరకెక్కిస్తోన్న చిత్రం కన్నప్ప. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ దాదాపు పూర్తయినట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో బాలీవుడ్ అక్షయ్కుమార్, మోహన్ లాల్, కాజల్ అగర్వాల్ లాంటి పలువురు స్టార్స్ నటిస్తున్నారు. అంతేకాదు మన రెబల్ స్టార్ ప్రభాస్ సైతం ఇందులో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని అవా ఎంటర్ టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై సంయుక్తంగా నిర్మిస్తున్నారు.ఈ సందర్భంగా కన్నప్ప మూవీకి సంబంధించి క్రేజీ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. రెబల్ స్టార్ ప్రభాస్ లుక్ను రివీల్ చేయనున్నట్లు ప్రకటించారు. ఫిబ్రవరి 3న తేదీన ప్రభాస్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేస్తామని సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు. ఈ సినిమాకు ముకేశ్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు.టీజర్కు ఊహించని రెస్పాన్స్..ఇప్పటికే కన్నప్ప టీజర్ విడుదలైన సంగతి తెలిసిందే. ఇందులో విష్ణు మంచు యాక్షన్ సీన్స్, యుద్ధ సన్నివేశాలు, అక్షయ్ కుమార్, ప్రభాస్ క్లోజప్ షాట్స్, హై ప్రొడక్షన్ వ్యాల్యూస్, స్టన్నింగ్ విజువల్స్, అదిరిపోయే పర్ఫార్మెన్స్తో కన్నప్ప టీజర్ ప్రేక్షకులని ఆకట్టుకుంది. యూట్యూబ్లో ఇప్పటివరకు అన్ని భాషల్లో కలిపి 30 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించింది. Here’s a glimpse of the Darling-Rebel Star '𝐏𝐫𝐚𝐛𝐡𝐚𝐬' in #Kannappa!🌟 🎬Experience the beginning of an epic journey, and don’t miss the full reveal on 3rd February. Stay tuned for more updates! 🙌 #Prabhas #HarHarMahadevॐ@themohanbabu @iVishnuManchu @Mohanlal #Prabhas… pic.twitter.com/ujJMFf93W8— Kannappa The Movie (@kannappamovie) January 27, 2025 -
బ్యాడ్ బాయ్గా వస్తోన్న నాగ శౌర్య.. ఆసక్తిగా ది డెవిల్స్ ఛైర్ పోస్టర్!
టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య నటిస్తోన్న తాజా చిత్రం 'బ్యాడ్ బాయ్ కార్తీక్'. ఈ మూవీ విధి హీరోయిన్గా కనిపించనుంది. ఈ చిత్రానికి రామ్ దేశినా (రమేష్) దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ వైష్ణవి ఫిల్మ్స్ బ్యానర్పై శ్రీనివాసరావు చింతలపూడి నిర్మిస్తున్నారు. ఇవాళ నాగశౌర్య పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీ టైటిల్, ఫస్ట్ లుక్ను మేకర్స్ రిలీజ్ చేశారు.ఈ చిత్రానికి 'బ్యాడ్ బాయ్ కార్తీక్' అనే పవర్ ఫుల్ టైటిల్ ఖరారు చేశారు. ఫస్ట్ లుక్ పోస్టర్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ పోస్టర్ చూస్తే హీరో నుదిటిపై రక్తంతో కూడిన "మూడు గోవింద నామాలు", చేతులపై రక్తపు మరకలు కనిపిస్తున్నాయి. ఈ మూవీ ఫుల్ యాక్షన్ థ్రిల్లర్గానే తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో సముద్రఖని, సీనియర్ నరేష్, సాయికుమార్, వెన్నెల కిషోర్, మైమ్ గోపి, శ్రీదేవి విజయ్ కుమార్, వెన్నెల కిషోర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకు హారిస్ జయరాజ్ సంగీతమందిస్తున్నారు.ది డెవిల్స్ ఛైర్ ఫస్ట్ లుక్ పోస్టర్..జబర్దస్త్ అభి, ఛత్రపతి శేఖర్, స్వాతి మందల్ ప్రధాన పాత్రల్లో వస్తోన్న చిత్రం ది డెవిల్స్ చైర్ (The Devils chair). ఈ సినిమాను గంగ సప్త శిఖర దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీని బాబీ ఫిలిమ్స్, ఓం సాయి ఆర్ట్స్, సీఆర్ఎస్ క్రియేషన్స్ బ్యానర్లపై కేకే చైతన్య, వెంకట్ దుగ్గి రెడ్డి, చంద్ర సుబ్బగారి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం మొదటి పోస్టర్ను మేకర్స్ విడుదల చేశారు.ఈ సందర్భంగా దర్శకుడు గంగ సప్త శిఖర మాట్లాడుతూ..'సరైన హారర్ చిత్రం వచ్చి చాలా రోజులు అయింది. తెలుగు ప్రేక్షకులు కూడా మంచి హారర్ చిత్రం కోసం ఎదురు చూస్తున్నారు. హారర్ చిత్రాలు ఇష్టపడే ప్రేక్షకులకు ది డెవిల్స్ చైర్ పర్ఫెక్ట్ సినిమా. సరికొత్త పాయింట్తో అద్భుతంగా ఉండే చిత్రాన్ని రూపొందిస్తున్నాం. మా చిత్రం మంచి హిట్ అవ్వాలి" అని కోరుకుంటున్నట్లు తెలిపారు.అనంతరం చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ..'ది డెవిల్స్ చైర్ చిత్రం మంచి కంటెంట్ ఉన్న చిత్రం. అద్భుతమైన ఏఐ టెక్నాలజీతో సరికొత్త కథతో నిర్మిస్తున్నాం. ప్రతి సీన్ అద్భుతంగా రిచ్ విజువల్స్ తో రూపొందిస్తున్నాం. షూటింగ్ అంతా పూర్తయింది. మా చిత్రాన్ని ఫిబ్రవరి చివరి వారంలో విడుదల చేస్తాం" అని తెలిపారు. -
సంతాన ప్రాప్తిరస్తు మూవీ.. ఆసక్తిగా సంక్రాంతి పోస్టర్
విక్రాంత్, చాందినీ చౌదరి హీరో హీరోయిన్లుగా నటిస్తోన్న తాజా చిత్రం "సంతాన ప్రాప్తిరస్తు". ఈ సినిమాను మధుర ఎంటర్టైన్మెంట్స్, నిర్వి ఆర్ట్స్ బ్యానర్స్పై మధుర శ్రీధర్ రెడ్డి, నిర్వి హరిప్రసాద్ రెడ్డి నిర్మిస్తున్నారు. అల్లు శిరీష్ హీరోగా "ఏబీసీడీ" సినిమా, రాజ్ తరుణ్తో "అహ నా పెళ్లంట" అనే వెబ్ సిరీస్ రూపొందించిన దర్శకుడు సంజీవ్ రెడ్డి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. వెంకటాద్రి ఎక్స్ ప్రెస్, ఎక్స్ ప్రెస్ రాజా, ఏక్ మినీ కథ లాంటి చిత్రాలకు స్క్రీన్ ప్లే అందించిన రచయిత షేక్ దావూద్ జి ఈ సినిమాకు స్క్రీన్ ప్లే రాస్తున్నారు. మ్యూజికల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్గా ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు.ఈ ఏడాది సంక్రాంతి పర్వదినం సందర్భంగా ప్రేక్షకులకు అప్డేట్ ఇచ్చారు మేకర్స్. "సంతాన ప్రాప్తిరస్తు" సినిమా నుంచి స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్లో హీరో విక్రాంత్, హీరోయిన్ చాందినీ లుక్ అభిమానులను ఆకట్టుకునేలా ఉంది. పోస్టర్లో ప్రెగ్నెన్సీ కిట్ ఉండటం మరింత ఆసక్తికరంగా మారింది. ఒక కాంటెంపరరీ ఇష్యూను కథలో చూపిస్తూ వినోదాత్మకంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు దర్శకుడు సంజీవ్ రెడ్డి. పోస్టర్ చూస్తేనే ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెంచుతోంది. ఈ సినిమా త్వరలోనే గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్కు రెడీ అవుతోంది. ఈ చిత్రంలో వెన్నెల కిషోర్, అభినవ్ గోమటం, మురళీధర్ గౌడ్, జీవన్ కుమార్, తాగుబోతు రమేష్, రచ్చ రవి కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్గా సునీల్ కశ్యప్ పని చేస్తున్నారు. -
పెదకాపు హీరో మూవీ.. ఫస్ట్ లుక్ పోస్ట్ రిలీజ్ చేసిన రానా
పెదకాపు మూవీ ఫేమ్ విరాట్ కర్ణ(Virat Karrna) హీరోగా నటిస్తోన్న చిత్రం 'నాగబంధం– ది సీక్రెట్ ట్రెజర్'(Nagabandham Movie). డెవిల్: ది బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ సినిమాతో దర్శకుడిగా మారిన నిర్మాత అభిషేక్ నామా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీలో నభా నటేష్, ఐశ్వర్యా మీనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. గతేడాది అక్టోబర్లో ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాకు మెగాస్టార్ చిరంజీవి క్లాప్ కొట్టి షూటింగ్ ప్రారంభించిన సంగతి తెలిసిందే.ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్..తాజాగా ఈ మూవీకి సంబంధించిన అప్డేట్ ఇచ్చారు మేకర్స్. భోగి పండుగ సందర్భంగా హీరో ఫస్ట్ లుక్ పోస్టర్ను విడుదల చేశారు. టాలీవుడ్ హీరో రానా దగ్గుబాటి (Rana Daggubati) చేతుల మీదుగా విరాట్ కర్ణ పోస్టర్ను రివీల్ చేశారు. తాజాగా రిలీజైన ఫస్ట్ లుక్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఇందులో హీరో విరాట్ సముద్రపు యాక్షన్ సన్నివేశంలో మొసలితో ఫైట్ చేస్తున్నట్లుగా కనిపించారు. ఈ మూవీలో రుద్ర పాత్రలో విరాట్ కర్ణ కనిపించనున్నారు.కాగా.. ఈ సినిమాను పాన్ ఇండియా రేంజ్లో తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేస్తామని ఇప్పటికే నిర్మాతలు ప్రకటించారు. భారతదేశంలోని 108 విష్ణు దేవాలయాలు నాగబంధం ద్వారా రక్షించబడుతున్నాయనే కథాంశంతో ఈ మూవీని తెరకెక్కిస్తున్నట్లు డైరెక్టర్ అభిషేక్ నామా తెలిపారు. ఈ చిత్రాన్ని ఎలక్ష్మీ ఐరా, దేవాన్ష్ నామా సమర్పణలో ఎన్ఐకే స్టూడియోస్, అభిషేక్ పిక్చర్స్పై కిషోర్ అన్నపురెడ్డి నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో జగపతి బాబు, జయప్రకాష్, మురళీ శర్మ, బీఎస్ అవినాష్ కీలక పాత్రలు పోషించనున్నారు. ఈ మూవీకి అభే సంగీతమందిస్తున్నారు. ఈ ఏడాదిలోనే నాగబంధంలో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. So happy to present the first look of @ViratKarrna from #Nagabandham.Already feels like an exhilarating ride :)Best wishes to my dearest #AbhishekNama garu, @nikstudiosindia and the entire team!!!@AbhishekPicture #KishoreAnnapureddy@ViratKarrna @NabhaNatesh @Ishmenon… pic.twitter.com/GXSSNYdlcg— Rana Daggubati (@RanaDaggubati) January 13, 2025 -
కన్నప్ప మూవీ.. కాజల్ అగర్వాల్ ఏ పాత్ర చేయనుందంటే?
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్గా వస్తోన్న చిత్రం 'కన్నప్ప'. అవా ఎంటర్ టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ పాన్ ఇండియా మూవీలో బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్, ప్రభాస్, మోహన్ లాల్, శరత్ కుమార్, మోహన్ బాబు, బ్రహ్మానందం, కాజల్ అగర్వాల్ వంటి స్టార్స్ కనిపించనున్నారు.ఇప్పటికే రిలీజైన కన్నప్ప టీజర్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. టీజర్ చూస్తే ప్రేక్షకులకు విజువల్ ఫీస్ట్లా ఉంది. విష్ణు మంచు యాక్షన్ సీన్స్, యుద్ధ సన్నివేశాలు, అక్షయ్ కుమార్, ప్రభాస్ క్లోజప్ షాట్స్, హై ప్రొడక్షన్ వ్యాల్యూస్, స్టన్నింగ్ విజువల్స్, అదిరిపోయే పర్ఫార్మెన్స్ లతో కన్నప్ప టీజర్ ప్రేక్షకులను అలరించింది. యూట్యూబ్లోనూ ఇప్పటివరకు అన్ని భాషల్లో కలిపి 30 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించింది.తాజాగా ఈ మూవీ నుంచి కాజల్ అగర్వాల్ ఫస్ట్ లుక్ పోస్టర్ను రివీల్ చేశారు మేకర్స్. ఈ చిత్రంలో పార్వతి దేవి పాత్రలో కాజల్ కనిపించనుంది. ఈ మేరకు నాలుగు భాషల్లో కాజల్ ఫస్ట్ లుక్ పోస్టర్తో పాటు క్యారెక్టర్ను పరిచయం చేశారు. పార్వతి దేవి లుక్లో కాజల్ అభిమానులను ఆకట్టుకుంటోంది. మీరు కూడా పోస్టర్ను చూసేయండి.కాగా.. ఇప్పటికే ఈ చిత్రం నుంచి మధుబాల,శరత్కుమార్, దేవరాజ్ వంటి ప్రముఖ నటులు పోషిస్తున్న పాత్రలకు పరిచయం చేస్తూ.. వారి పాత్రలకు సంబంధించిన పోస్టర్లతో సినిమాపై అంచనాలను పెంచేశారు. ఇందులో కంపడు పాత్రలో ముఖేష్ రిషి, గవ్వరాజుగా బ్రహ్మాజీ కనిపించనున్నారు. వారు అత్యంత పురాతన పుళిందుల జాతికి చెందిన అత్యంత భయంకరమైన తెగకు చెందినవారు. సదాశివ కొండలలో జన్మించిన వీరిని భద్రగణం అని కూడా అంటారు. వారు 'వాయులింగానికి వంశపారంపర్య సేవకులు మరియు రక్షకులు. కంపడు నాయకుడిగా ఉంటూనే భద్రగణాన్ని నడిపిస్తాడు. ఈ వంశం త్రిశూలాలను ఉపయోగించడంలో ప్రత్యేకత కలిగి వున్నవారు. ఈ సినిమాలోని కిరాట పాత్రలో మోహన్లాల్ నటిస్తున్నారు. గతంలోనే ఆయన ఫస్ట్ లుక్ను రిలీజ్ చేశారు.కన్నప్ప కథేంటంటే..పాన్ ఇండియా ప్రాజెక్ట్ కన్నప్ప సినిమా ఈ తరం ప్రేక్షకులకైనా కొత్తగానే ఉంటుంది. భక్తి భావం, ధూర్జటి మహాకవి ఎలా రాశారు? శ్రీకాళహస్తి మహత్మ్యం ఏంటి? అన్నది ఈ చిత్రంలో చూపించనున్నాం. ఇది కేవలం భక్తి చిత్రమే కాదు. అన్ని రకాల అంశాలు ఈ సినిమాలో ఉన్నాయి. ఆ పరమేశ్వరుడి ఆజ్ఞతోనే ఈ సినిమా తీస్తున్నాం అన్నారు మోహన్బాబు.విజువల్ వండర్గా కన్నప్ప..ఈ చిత్రంలో డా.మోహన్ బాబు, మోహన్ లాల్, ప్రభాస్, బ్రహ్మానందం, బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ సినిమాకు కీలకమైన పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్పీరియెన్స్ ఇచ్చే విజువల్ వండర్గా రాబోతోందని ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు కూడా. సినిమాను చూసిన ప్రేక్షకులు సరికొత్త అనుభూతిని ఇస్తుందని వెల్లడించారు. ఆడియన్స్ను మరో ప్రపంచంలోకి వెళ్లిన ఎక్స్పీరియన్స్ ఇచ్చే విధంగా మేకర్స్ చిత్రాన్ని రెడీ చేస్తున్నట్లు ప్రకటించారు. విష్ణు మంచు కన్నప్ప పాత్రను ఈ చిత్రంలో పోషిస్తున్నారు. మోహన్ బాబు నిర్మిస్తున్న ఈ విజువల్ వండర్ను పాన్ ఇండియాలో ఈ ఏడాది ఏప్రిల్ 25న విడుదల చేయనున్నారు. 🌟 Divine Grace Personified 🌟Here is the glorious full look of @MsKajalAggarwal as '𝐌𝐀𝐀 𝐏𝐚𝐫𝐯𝐚𝐭𝐢 𝐃𝐞𝐯𝐢'🪷 the divine union with '𝐋𝐨𝐫𝐝 𝐒𝐡𝐢𝐯𝐚'🔱, in #Kannappa🏹. Witness her ethereal beauty and the divine presence, she brings to life in this epic tale of… pic.twitter.com/EvEgx3GDWY— Kannappa The Movie (@kannappamovie) January 6, 2025 -
రాజ్ తరుణ్ కొత్త చిత్రం.. ఆసక్తిగా టైటిల్
గతేడాది వరుస సినిమాలతో మెప్పించిన టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్. తిరగబడరా స్వామీ, భలే ఉన్నాడే లాంటి చిత్రాలతో అలరించారు. కొత్త ఏడాదిలో అభిమానులకు అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు హీరో. తన కొత్త సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ వీడియోను విడుదల చేశారు.ఈ చిత్రానికి పాంచ్ మినార్ అనే టైటిల్ను ఫిక్స్ చేశారు. ఈ చిత్రంలో రాశి సింగ్ హీరోయిన్గా నటిస్తోంది. రామ్ కడుముల దర్శకత్వంలో ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. పోస్టర్ చూస్తే ఫుల్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమా థియేటర్లలో సందడి చేయనుంది. తాజాగా విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ ఫ్యాన్స్ను విపరీతంగా ఆకట్టుకుంటోంది.కాగా.. ఈ చిత్రంలో అజయ్ గోష్, బ్రహ్మాజీ, శ్రీనివాస్ రెడ్డి కీలక పాత్రలు పోషిస్తున్నారు. కనెక్ట్ మూవీస్ బ్యానర్పై గోవింద రాజు సమర్పణలో మాధవి, ఎంఎస్ఎం రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ మూవీకి శేఖర్ చంద్ర సంగీతమందిస్తున్నారు.వివాదంలో రాజ్ తరుణ్..అయితే సినిమాలతో పాటు అలరించిన రాజ్.. గతేడాదిలో ఓ వివాదంలోనూ చిక్కుకున్న సంగతి తెలిసిందే. తనను పెళ్లి చేసుకున్నాడని ఆరోపిస్తూ లావణ్య అనే యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు. ఆ వివాదం నడుస్తుండగానే తిరగబడరాసామీ మూవీ విడుదలైంది. ఈ వ్యవహారంలో మరో హీరోయిన్ మాల్వీ మల్హోత్రా పేరును కూడా లావణ్య ప్రస్తావించింది. తన వల్లే రాజ్ తరుణ్ దూరమయ్యాడని ఆరోపించింది. ప్రస్తుతం ఈ వివాదం కోర్టులో నడుస్తోంది. 🎉 Happy New Year 2025 🎉This New Year, the craziness knows no limits with Extra Minar🔥Here’s the fascinating first-look motion poster of #PaanchMinar 🤩-- https://t.co/VbfZtKmgf0Gear up for the kickass crime comedy entertainer in theatres soon⌛️@RashiReal_ pic.twitter.com/ci2ehyUYSW— Raj Tarun (@itsRajTarun) January 1, 2025 -
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్.. హీరోయిన్ ఎవరో తెలుసా?
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్గా తెరకెక్కిస్తోన్న చిత్రం కన్నప్ప. ఈ చిత్రానికి బాలీవుడ్ డైరెక్టర్ ముకేశ్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రభాస్తో పాటు మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్, అక్షయ్ కుమార్, శరత్ కుమార్ లాంటి ప్రముఖులంతా కనిపించనున్నారు. ఇప్పటికే వీరికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్లతో పాటు క్యారెక్టర్లను రివీల్ చేశారు మేకర్స్. తాజాగా ఈ మూవీ హీరోయిన్ ఫస్ట్ లుక్ పోస్టర్ను రిలీజ్ చేశారు.మంచు విష్ణు హీరోగా నటిస్తోన్న ఈ చిత్రంలో ప్రీతి ముకుందన్ హీరోయిన్గా నటిస్తున్నారు. ఈ సినిమాలో ఆమె నెమలి అనే రాకుమార్తెగా కనిపించనున్నారు. తాజాగా విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ అభిమానులను తెగ ఆకట్టుకుంటోంది. ప్రీతి ముకుందన్ తన గ్లామర్కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. కాగా.. అంతకుముందు ప్రీతి టాలీవుడ్ చిత్రం ఓం భీమ్ బుష్లో నటించింది. ఈ మూవీలో జలజ అనే పాత్రలో మెరిసింది.(ఇది చదవండి: 'కన్నప్ప' టీజర్... మూడు కోట్ల మంది చూశారు!) పాన్ ఇండియా ప్రాజెక్ట్గా తెరకెక్కుతోన్న కన్నప్ప చిత్రాన్ని అవా ఎంటర్ టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన'కన్నప్ప' టీజర్ ప్రేక్షకులకు ఆకట్టుకుంది. విష్ణు మంచు యాక్షన్ సీన్స్, యుద్ధ సన్నివేశాలతో కన్నప్ప టీజర్ ప్రేక్షకులను మెప్పించింది. అంతేకాకుండా యూట్యూబ్లో ఇప్పటివరకు అన్ని భాషల్లో కలిపి 30 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించింది. ఈ సినిమాతో మంచు విష్ణు తనయుడు అవ్రామ్ అరంగేట్రం చేస్తున్నాడు. ఆయన కుమార్తెలు కూడా కన్నప్పలో నటిస్తున్నారు. ఇటీవల వారిద్దరి పోస్టర్లను కూడా సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు. ఈ చిత్రం వచ్చే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు రానుంది.✨ Behold the mesmerizing look of Preity Mukhundhan as Princess 𝐍𝐞𝐦𝐚𝐥𝐢 in #Kannappa 🏹✨ Sharing the screen with @iVishnuManchu, she adds grace and charm to this divine tale. 🌺Experience the magic and splendor of divinity! 🙏 #HarHarMahadevॐ@themohanbabu @Mohanlal… pic.twitter.com/UVgiPVwL4K— Kannappa The Movie (@kannappamovie) December 30, 2024 -
సుమ తనయుడి కొత్త చిత్రం.. ఫస్ట్ లుక్ పోస్టర్ చూశారా?
టాలీవుడ్ స్టార్ యాంకర్ సుమ కనకాల తనయుడు రోషన్ కనకాల హీరోగా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. గతేడాది బబుల్గమ్ మూవీతో టాలీవుడ్ హీరోగా అరంగేట్రం చేశారు. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమాకు మిక్స్డ్ టాక్ను సొంతం చేసుకుంది.అయితే తాజాగా మరో చిత్రానికి రెడీ అయ్యారు రోషన్. కలర్ ఫోటో ఫేమ్ సందీప్ రాజ్ డైరెక్షన్లో నటించనున్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ను మేకర్స్ రిలీజ్ చేశారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై నిర్మిస్తున్న ఈ చిత్రానికి మోగ్లీ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. తాజాగా విడుదలైన పోస్టర్ చూస్తే రోషల్ వైల్డ్ లుక్ను తలపిస్తోంది. ఈ మూవీలో బాలీవుడ్ భామ సాక్షిసాగర్ హీరోయిన్గా కనిపించనుంది. ఈ మూవీని లవ్ స్టోరీగానే తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. 𝐓𝐇𝐄 𝐋𝐎𝐔𝐃𝐄𝐒𝐓 𝐖𝐀𝐑 𝐎𝐅 𝐀 𝐒𝐈𝐋𝐄𝐍𝐓 𝐋𝐎𝐕𝐄 𝐒𝐓𝐎𝐑𝐘 ❤🔥#Mowgli ’s Wild Adventure Begins 💥💥Stay tuned for more exciting updates!#Mowgli2025A @SandeepRaaaj directorial.🌟ing @RoshanKanakala & #SakshiMhadolkarA @Kaalabhairava7 musical 🎵… pic.twitter.com/vxtDMvAqU4— People Media Factory (@peoplemediafcy) December 19, 2024 -
మంచు విష్ణు కన్నప్ప మూవీ.. మోహన్ లాల్ క్యారెక్టర్ రివీల్!
టాలీవుడ్ హీరో మంచు విష్ణు తన డ్రీమ్ ప్రాజెక్ట్గా తెరకెక్కిస్తోన్న చిత్రం కన్నప్ప. ఈ మూవీకి ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. భారీ తారాగణంతో రూపొందిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ మూవీకి సంబంధించి అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ చిత్రంలో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ఫస్ట్ లుక్ను రివీల్ చేశారు.ఈ చిత్రంలో మోహన్ లాల్ కిరాటా పాత్రలో కనిపించనున్నారు. తాజాగా విడుదలైన మోహన్ లాల్ ఫస్ట్ లుక్ పోస్టర్ అభిమానులను తెగ ఆకట్టుకుంటోంది. ఈ విషయాన్ని మంచు విష్ణు తన ట్విటర్ ద్వారా వెల్లడించారు. భారీ బడ్జెట్తో తెరకెక్కిస్తోన్న ఈ చిత్రంలో ప్రభాస్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్ లాంటి స్టార్స్ సైతం నటిస్తున్నారు. ఓ యదార్థ కథ ఆధారంగా రూపొందుతోన్న ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 25,2025లో థియేటర్లలో సందడి చేయనుంది. ‘KIRATA’! The legend Sri. Mohanlal in #Kannappa. I had the honor of sharing the screen space with one of the greatest Actor of our time. This entire sequence will be 💣💣💣💣💣 ! @Mohanlal pic.twitter.com/q9imkDZIxz— Vishnu Manchu (@iVishnuManchu) December 16, 2024 -
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్.. మోహన్ బాబు మనవరాళ్లను చూశారా?
టాలీవుడ్ హీరో మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్గా వస్తోన్న చిత్రం 'కన్నప్ప'. ఈ మూవీ భారీ బడ్జెట్తో అవా ఎంటర్ టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్, ప్రభాస్, మోహన్ లాల్, శరత్ కుమార్, మోహన్ బాబు, బ్రహ్మానందం, కాజల్ అగర్వాల్ వంటి స్టార్స్ ఇందులో నటిస్తున్నారు. ఇటీవలే మోహన్ బాబు ఫస్ట్ లుక్ పోస్టర్ను కూడా రిలీజ్ చేశారు మేకర్స్.తాజాగా మరో అప్డేట్తో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఈ మూవీలో మోహన్ బాబు మనవరాళ్లు అరియానా, వివియానా కూడా నటిస్తున్నారు. వీరిద్దరికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్స్ను కన్నప్ప టీమ్ రివీల్ చేసింది. ఈ మూవీ ద్వారా మోహన్ బాబు మనవరాళ్లు సినిమాల్లో ఎంట్రీ ఇస్తున్నారు. వీరి ఫస్ట్ లుక్ పోస్టర్ సినీ ప్రియులను తెగ ఆకట్టుకుంటోంది.కాగా.. ఇప్పటికే రిలీజైన కన్నప్ప టీజర్కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. టీజర్ ప్రేక్షకులకు విజువల్ ఫీస్ట్లా ఉంది. విష్ణు మంచు యాక్షన్ సీన్స్, యుద్ధ సన్నివేశాలు, స్టన్నింగ్ విజువల్స్తో కన్నప్ప టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. యూట్యూబ్లో ఇప్పటివరకు అన్ని భాషల్లో కలిపి 30 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించింది. Immerse yourself in the spirit of devotion with #Ariaana & #Viviana Manchu, and witness their full-look in #Kannappa🏹 — A perfect blend of talent and spirituality dedicated to Lord Shiva.🎬✨#HarHarMahadevॐ @themohanbabu @iVishnuManchu @Mohanlal #Prabhas @akshaykumar… pic.twitter.com/vquzPB6b6s— Kannappa The Movie (@kannappamovie) December 2, 2024 -
కిల్లర్తో వస్తోన్న టాలీవుడ్ డైరెక్టర్.. ఆసక్తిగా పోస్టర్స్!
శుక్ర, మాటరాని మౌనమిది, ఏ మాస్టర్ పీస్ లాంటి డిఫరెంట్ సినిమాలతో అలరించిన డైరెక్టర్ సుక్కు పూర్వాజ్. తాజాగా మరో డిఫరెంట్ మూవీతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. ప్రస్తుతం ఆయన డైరెక్షన్లో కిల్లర్ అనే యాక్షన్ థ్రిల్లర్ మూవీని రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో ఆయన కీలక పాత్రలో నటిస్తుండటం విశేషం. బుల్లితెర బ్యూటీ జ్యోతి పూర్వాజ్ కీలక పాత్రలో కనిపించనుంది.తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్స్ను విడుదల చేశారు. ఈ పోస్టర్స్ చూస్తుంటే కిల్లర్ మూవీపై అంచనాలు పెంచేస్తున్నాయి. పూర్వాజ్ క్యారెక్టర్ ఫస్ట్ లుక్ ఫ్యాన్స్ను విపరీతంగా ఆకట్టుకుంటోంది. చేతిలో రివాల్వర్తో కనిపిస్తోన్న ఈ పోస్టర్స్ మూవీ ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ క్రియేట్ చేస్తోంది. ఈ సినిమానుఏయు అండ్ఐ, మెర్జ్ ఎక్స్ ఆర్ సంస్థతో థింక్ సినిమా బ్యానర్పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. View this post on Instagram A post shared by Venkata Suresh Kumar Kuppili (@poorvaaj) -
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్.. మోహన్ బాబు లుక్ చూశారా?
టాలీవుడ్ హీరో మంచు విష్ణు తన డ్రీమ్ ప్రాజెక్ట్గా తెరకెక్కిస్తోన్న చిత్రం కన్నప్ప. ఈ మూవీలో పలువురు సూపర్ స్టార్స్ నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్కు అభిమానుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ మూవీకి సంబంధించిన బిగ్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ చిత్రంలో మోహన్ బాబు ఫస్ట్ లుక్ పోస్టర్ను రివీల్ చేశారు. ఇందులో మహదేవ శాస్త్రి పాత్రలో మోహన్ బాబు కనిపించనున్నారు. పాన్ ఇండియా ప్రాజెక్ట్గా తెరకెక్కిస్తోన్న ఈ మూవీని డిసెంబర్లో ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నారు.ఇప్పటికే ఈ చిత్రం నుంచి మధుబాల,శరత్కుమార్, దేవరాజ్ వంటి ప్రముఖ నటుల పోస్టర్లను విడుదల చేశారు. కన్నప్పలో ప్రభాస్ లాంటి అగ్రహీరో కూడా కనిపించనున్నారు. అంతేకాకుండా మోహన్ లాల్, బ్రహ్మానందం, బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇందులో కన్నప్ప పాత్రను మంచు విష్ణు పోషిస్తున్నారు. కాగా.. మోహన్ బాబు నిర్మిస్తున్న ఈ చిత్రానికి బాలీవుడ్ డైరెక్టర్ ముఖేష్ కుమార్ తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ దాదాపు చివరి దశకు చేరుకుంది. త్వరలోనే కన్నప్ప థియేటర్లలో సందడి చేయనుంది. Unveiling the divine look of @themohanbabu garu as 'Mahadeva Shastri' in #Kannappa🏹. Witness the devotion and grandeur as they come to life! 🌟✨ #HarHarMahadevॐ#MohanBabu @ivishnumanchu @Mohanlal #Prabhas @akshaykumar @realsarathkumar #MukeshRishi @mukeshvachan… pic.twitter.com/Z8XbIV3ccd— Kannappa The Movie (@kannappamovie) November 22, 2024 -
అలా అయితేనే సినిమాలు చేసేందుకు ముందుకు రండి: ఆర్పీ పట్నాయక్
కిట్టు తాటికొండ, కష్మీరా,రోహిత్, వైశాలి, సునీల్ రావినూతల, శ్రీ గోపి చంద్ కొండ ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న చిత్రం 'కరణం గారి వీధి'. ఈ చిత్రాన్ని సౌత్ బ్లాక్ బస్టర్ క్రియేషన్స్ బ్యానర్పై అడవి అశోక్ నిర్మిస్తున్నారు. దర్శక ద్వయం హేమంత్, ప్రశాంత్ తెరకెక్కిస్తున్నారు. విలేజ్ బ్యాక్ డ్రాప్లో కంప్లీట్ లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్గా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ మూవీ త్వరలోనే గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్కు రెడీ అవుతోంది. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ను ప్రముఖ సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ చేతుల మీదుగా రిలీజ్ చేశారు.ఆర్పీ పట్నాయక్ మాట్లాడుతూ - 'కరణం గారి వీధి సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ నా చేతుల మీదుగా రిలీజ్ చేయడం సంతోషంగా ఉంది. పోస్టర్, టైటిల్ డిజైన్ చాలా కొత్తగా అనిపించింది. కొత్త టాలెంట్ ఎంత ఎక్కువగా వస్తే ఇండస్ట్రీకి అంత మంచిది. ఈ టీమ్ కూడా మంచి ప్రయత్నం చేసి ఉంటారని ఆశిస్తున్నా. ఈ సినిమా టీమ్కు మంచి పేరు రావాలి. కొత్త ఫిలిం మేకర్స్కు నాదొక చిన్న సలహా. సినిమా మీద కనీస అవగాహన, ప్యాషన్ ఉనప్పుడే సినిమాలు చేసేందుకు ముందుకు రండి. అప్పుడే మీరు చేసే సినిమా బాగుంటుంది'అని అన్నారు.నిర్మాత అడవి అశోక్ మాట్లాడుతూ..' మా కరణం గారి వీధి సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ లాంఛ్ చేసిన ఆర్పీ పట్నాయక్కు థ్యాంక్స్. ఆయన మ్యూజిక్తో పాటు ఆయన తెరకెక్కించిన సినిమాలంటే మాకు ఇష్టం. ప్రేక్షకులు కోరుకునే అన్ని ఎలిమెంట్స్ ఉన్న చిత్రమిది. త్వరలోనే సినిమాను థియేటర్స్లోకి తీసుకొస్తాం' అని అన్నారు.దర్శకుడు హేమంత్ మాట్లాడుతూ - 'పల్లెటూరి నేపథ్యంగా సాగే కంప్లీట్ ఎంటర్ టైనింగ్ మూవీ ఇది. మనం నిజ జీవితంలో చూసే వాస్తవిక ఘటనలు ఉంటాయి. కరణం గారి వీధి సినిమాను అందరికీ నచ్చేలా రూపొందిస్తున్నాం. త్వరలోనే రిలీజ్ డేట్ ప్లాన్ చేసి మీ ముందుకు చిత్రాన్ని తీసుకొస్తాం' అని అన్నారు.దర్శకుడు ప్రశాంత్ మాట్లాడుతూ..' లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్గా కరణం గారి వీధి సినిమాను రూపొందిస్తున్నాం. విలేజ్ బ్యాక్ డ్రాప్లో ఉంటూ మంచి కామెడీతో మీరంతా ఎంజాయ్ చేసేలా సినిమా ఉంటుంది. ఆర్పీ సార్ తమ టైమ్ కేటాయించి మమ్మల్ని సపోర్ట్ చేసినందుకు ఆయనకు థ్యాంక్స్ చెబుతున్నాం' అని అన్నారు. -
ఫ్యామిలీ ఎంటర్టైనర్గా 'లగ్గం టైమ్'.. ఫస్ట్ లుక్ పోస్టర్ వచ్చేసింది!
రాజేష్ మేరు, నవ్య చిట్యాల జంటగా నటిస్తోన్న చిత్రం లగ్గం టైమ్. ఈ చిత్రానికి ప్రజోత్ కె వెన్నం దర్శకత్వం వహిస్తున్నారు. 20th సెంచరీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై కె.హిమ బిందు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ను మేకర్స్ రిలీజ్ చేశారు. ప్రముఖ దర్శకుడు సాగర్ కె చంద్ర చేతుల మీదుగా పోస్టర్ను విడుదల చేశారు.పోస్టర్ చూస్తుంటే లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గానే ఈ మూవీని తెరకెక్కిస్తున్నట్లు అర్థమవుతోంది. ఈ సందర్భంగా చిత్ర బృందానికి ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని ఆకాంక్షించారు. ప్రేమ, వివాహం నేపథ్యంలో సాగే ఈ మూవీ ప్రేక్షకుల హృదయాలను హత్తుకునే ఓ మంచి కథతో రానుందని మేకర్స్ అంటున్నారు. ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేసే సినిమాగా తెరకెక్కిస్తున్నట్లు మూవీ మేకర్స్ వెల్లడించారు. కాగా.. ఈ చిత్రంలో నెల్లూరు సుధర్శన్, ప్రీతి సుందర్, ప్రణీత్ రెడ్డి కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి పవన్ సంగీతమందిస్తున్నారు. త్వరలోనే లగ్గంటైమ్కు సంబంధించిన మరిన్నీ వివరాలు తెలియజేస్తామని ప్రకటించారు. -
జై హనుమాన్ ఫస్ట్ లుక్.. సర్ప్రైజ్ అదిరిపోయిందిగా!
హనుమాన్తో సూపర్ హిట్ కొట్టిన టాలీవుడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. తేజ సజ్జా ప్రధాన పాత్రలో తెరకెక్కించిన ఈ చిత్రం సంక్రాంతి బాక్సాఫీస్ను షేక్ చేసింది. పెద్ద సినిమాలను వెనక్కి నెట్టిన ఈ సినిమా కళ్లు చెదిరే కలెక్షన్స్ రాబట్టింది. ఈ మూవీ సూపర్ హిట్ కావడంతో సీక్వెల్ తెరకెక్కించే పనిలో బిజీగా ఉన్నారు యంగ్ డైరెక్టర్.ఇప్పటికే ప్రాజెక్ట్ను అనౌన్స్ చేయగా.. దీపావళికి అదిరిపోయే అప్డేట్ ఇచ్చాడు. జైహనుమాన్ పేరుతో తెరకెక్కిస్తోన్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ను రిలీజ్ చేశారు. ఇందులో కన్నడ స్టార్, కాంతార ఫేమ్ రిషబ్ శెట్టి హనుమంతుని పాత్రలో కనిపించనున్నారు. తాజాగా రిలీజైన పోస్టర్లో శ్రీరాముడి విగ్రహాన్ని చేతిలో పట్టుకుని కనిపించారు రిషబ్ శెట్టి.అందరూ ఊహించినట్లుగానే'కాంతార' ఫేమ్ రిషభ్ శెట్టి ఈ పోస్టర్లో హనుమంతుడిగా కనిపించారు. ఈ అద్భుతమైన పోస్టర్ రిషబ్ శెట్టిని హైలైట్ చేయడమే కాకుండా హనుమంతుని భక్తి, శక్తి స్పష్టంగా కనిపిస్తోంది. ఈ పాత్రలో లెజెండరీ యాక్టర్ అద్భుతంగా సెట్ అయినట్లుగా కనిపిస్తోంది. ఈ పాత్రలో రిషబ్ శెట్టిని తెరపై చూడడానికి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఉన్నారు. ఈ సీక్వెల్లో ప్రశాంత్ వర్మ మరింత గొప్ప కథను ఆవిష్కరించడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ అద్భుతమైన ఫస్ట్ లుక్ పోస్టర్లో అది స్పష్టంగా అర్థమవుతోంది. ఈ సినిమాను ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్లో భాగంగా మైత్రి మూవీ మేకర్స్ నవీన్ యెర్నేని, వై రవిశంకర్ అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో నిర్మిస్తున్నారు In the spirit of Diwali and the guiding light of the divine ✨Honoured to be teaming up with the National Award-winning actor @shetty_rishab sir and the prestigious @MythriOfficial to bring our grand vision #JaiHanuman 🙏🏽Let’s begin this DIWALI with the holy chant JAI HANUMAN… pic.twitter.com/i2ExPsflt2— Prasanth Varma (@PrasanthVarma) October 30, 2024 -
రవితేజ 'మాస్ జాతర'.. ఈ సారి మోత మోగిపోవడం పక్కా!
టాలీవుడ్ హీరో మాస్ మహారాజ్ మరో యాక్షన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. మిస్టర్ బచ్చన్ తర్వాత ఆర్టీ75 వర్కింగ్ టైటిల్తో తెరకెక్కిస్తోన్న మూవీలో నటిస్తున్నారు. తాజాగా దీపావళీ సందర్భంగా ఫ్యాన్స్కు అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు మేకర్స్. టైటిల్ రివీల్ చేయడంతో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్ను విడుదల చేశారు.రవితేజ నటిస్తోన్న 75వ చిత్రానికి మాస్ జాతర అనే టైటిల్ ఖరారు చేశారు. మనదే ఇదంతా అనే ట్యాగ్లైన్ కూడా ఇచ్చారు. తాజాగా రిలీజైన రవితేజ ఫస్ట్ లుక్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. చేతిలో గంట పట్టుకుని కనిపిస్తోన్న మాస్ మహారాజాను చూస్తుంటే.. ఈ సినిమాలో మోత మోగిపోవడం ఖాయం అనిపిస్తోంది. రవితేజ ఫ్యాన్స్కు మరోసారి మాస్ ఎంటర్టైనర్ పక్కా అని అర్థమవుతోంది. టైటిల్కు తగ్గట్టుగానే ఈ సినిమా థియేటర్లలో మాస్ జాతరను తలపిస్తుందని నిర్మాతలు అభిప్రాయం వ్యక్తం చేశారు.ఆ సూపర్ హిట్ జోడీ రిపీట్కాగా.. సామజవరగమన వంటి హిట్ సినిమాకు ఓ రచయితగా చేసిన భాను బోగవరపు ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం కానున్నారు. శ్రీలీల హీరోయిన్గా నటిస్తోంది. గతంలో వీరిద్దరు జోడి ధమాకా మూవీతో సూపర్ హిట్ అందుకున్నారు. దీంతో మరో బ్లాక్ బస్టర్ రావడం ఖాయమని చిత్ర బృందం భావిస్తోంది. ఈచిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఈ సినిమాను వచ్చే ఏడాది సమ్మర్లో మే 9న విడుదల చేయనున్నారు. ఈ మూవీకి భీమ్స్ సిసిరోలియో సంగీతాన్ని సమకూరుస్తున్నారు. ఈ మాస్ ఎంటర్టైనర్ మే 9, 2025న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. Get ready for a Re-Sounding Entertainer 💥Presenting our 𝐌𝐀𝐒𝐒 𝐌𝐀𝐇𝐀𝐑𝐀𝐀𝐉 @RaviTeja_offl in an out-and-out ‘MASS JATHARA’ 🧨🧨🎇BLASTING the screens with highly MASSIVE & EXPLOSIVE entertainment from MAY 9th, 2025 😎 💣 Wishing you all a very #HappyDiwali 🧨🪔… pic.twitter.com/k2CTLGdKMV— Sithara Entertainments (@SitharaEnts) October 30, 2024 -
ఈ దీపావళికి మోత మోగిపోద్ది.. మాస్ అప్డేట్ వచ్చేసింది!
ఇటీవల మిస్టర్ బచ్చన్ సినిమాతో మెప్పించిన టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ. ప్రస్తుతం మరో చిత్రంతో బిజీగా ఉన్నారు. ఇప్పటికే వర్కింగ్ టైటిల్తో తెరకెక్కిస్తోన్న మూవీకి సంబంధించిన లేటేస్ట్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. దీపావళీ సందర్భంగా ఫ్యాన్స్కు అదిరిపోయే అప్డేట్ ఇవ్వనున్నారు.రవితేజ నటిస్తోన్న 75వ చిత్రానికి సంబంధించిన టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ను రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ విషయాన్ని పోస్టర్ ద్వారా వెల్లడించారు. బుధవారం సాయంత్రం 04:05 గంటలకు విడుదల చేస్తామని నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ పోస్ట్ చేసింది. ఈ దీపావళికి మోత మోగిపోద్ది.. మనదే ఇదంతా అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చారు.కాగా.. సామజవరగమన వంటి హిట్ సినిమాకు ఓ రచయితగా చేసిన భాను బోగవరపు ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం కానున్నారు. శ్రీలీల హీరోయిన్గా నటిస్తోన్న ఈ మూవీని సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించి కోహినూర్ అనే టైటిల్ను పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. 𝐌𝐀𝐒𝐒 𝐌𝐀𝐇𝐀𝐑𝐀𝐀𝐉 @RaviTeja_offl is gearing up to bring you a Special Cracker of a Surprise TOMORROW at 04:05 PM 🧨🧨🧨🎇Ee saari Deepavali ki Motha Mogipoddi... "Manade Idantha" 😎🔥Keep watching this space 🔥 #RT75FirstLook #RT75 🤩@sreeleela14 @BhanuBogavarapu… pic.twitter.com/udYz4c70EM— Sithara Entertainments (@SitharaEnts) October 29, 2024 -
రాజ్ తరుణ్ హీరోగా పాన్ ఇండియా చిత్రం.. ఆకట్టుకుంటున్న ఫస్ట్లుక్
రాజ్ తరుణ్ , సందీప్ మాధవ్ హీరోలుగా నటిస్తున్న తాజా చిత్రం రామ్ భజరంగ్. సన్ రైజ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నిర్మాత స్వాతిసుధీర్ నిర్మిస్తున్న ఈ సినిమాకు సి.హెచ్.సుధీర్ రాజు దర్శకత్వం వహిస్తున్నారు.మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. దసరా సందర్భంగా రామ్ భజరంగ్ ఫస్ట్ లుక్ను విడుదల చేశారు మేకర్స్. ఫస్ట్ లుక్ పోస్టర్ చాలా ఆసక్తికరంగా మాసీగా ఉందని, ఇద్దరు హీరోలు రాజ్ తరుణ్, సందీప్ మాధవ్ చాలా డిఫరెంట్ లుక్లో కనిపిస్తున్నారు. 1980 బ్యాక్ డ్రాప్ లో రాబోతున్న ఈ సినిమాలో యాక్షన్ తో పాటు ఫ్యామిలీ ఎలిమెంట్స్ ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఐదు భాషల్లో (తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ) ఈ సినిమాను విడుదల చెయ్యడానికి చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. గదర్ 2 హీరోయిన్ సిమ్రత్ కౌర్, బిచ్చగాడు ఫేమ్ సట్న టీటస్, ఛాయా దేవి, మనసా రాధాకృష్ణన్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాలో రాజా రవీంద్ర, రవి శంకర్, షఫీ, శివరామరాజు వెంకట్, సత్యం రాజేష్, ధనరాజ్, రచ్చ రవి, ఐశ్వర్య ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. -
ఫ్యాన్స్కు హీరో నిఖిల్ సర్ప్రైజ్.. ఇలా ట్విస్ట్ ఇచ్చాడేంటి?
టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ ప్రస్తుతం స్వయంభూ చిత్రంలో నటిస్తున్నారు. ఈ మూవీ సంయుక్త మీనన్ హీరోయిన్గా నటిస్తోంది. పాన్ ఇండియా రేంజ్లో తెరకెక్కుతున్న ఈ భారీ చిత్రానికి భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ శరవేగంగా షూటింగ్ జరుగుతోంది.అయితే ఈ సినిమా లైన్లో ఉండగానే ఫ్యాన్స్కు సర్ప్రైజ్ ఇచ్చాడు హీరో నిఖిల్. ఈ దీపావళికి థియేటర్లలో సందడి చేసేందుకు వచ్చేస్తున్నాడు. సుధీర్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిస్తోన్న మూవీ టైటిల్ను మేకర్స్ రివీల్ చేశారు. ఎలాంటి ప్రకటన లేకుండానే డైరెక్ట్గా టైటిల్, ఫస్ట్లుక్ పోస్టర్ను రిలీజ్ చేయడంతో ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. అసలు ఈ సినిమా ఎప్పుడు మొదలైందంటూ చర్చించుకుంటున్నారు. ఏదేమైనా దీపావళికి థియేటర్లలో అలరించేందుకు యంగ్ హీరో నిఖిల్ రానుండడంతో అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.(ఇది చదవండి: స్వయంభూ సెట్లో నిఖిల్ బర్త్డే సెలబ్రేషన్స్..)అప్పుడో ఇప్పుడో ఎప్పుడో అంటూ అనే టైటిల్ను ఫిక్స్ చేశారు. ఈ మూవీలో రుక్మిణి వసంత్, దివ్యాంశ హీరోయిన్లుగా నటిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్పై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. Into the World of #AppudoIppudoEppudo ❤️This'll thrill you, tickle you & breeze you 🤗@actor_Nikhil @rukminitweets @divyanshak @harshachemudu @dvlns @BvsnP @SunnyMROfficial @singer_karthik @NavinNooli @SVCCofficial pic.twitter.com/elyKT8ESJC— sudheer varma (@sudheerkvarma) October 6, 2024 -
కన్నప్ప: పీడించే మారెమ్మగా ఐశ్వర్య.. ఫస్ట్ లుక్ చూశారా?
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ నుంచి ఎప్పటికప్పుడు అప్డేట్లు వస్తూనే ఉన్నాయి. విష్ణు చెప్పినట్టుగా ప్రతి సోమవారం క్యారెక్టర్లు రివీల్ చేస్తూ, ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తూ ఇలా ఏదో ఒక అప్డేట్ ఇస్తూనే ఉన్నారు. ఇప్పటి వరకు శరత్ కుమార్, మధుబాల, దేవరాజ్, ముఖేష్ రిషి, మంచు అవ్రామ్, అర్పిత్ రంకా, అక్షయ్ కుమార్ పాత్రలకు సంబంధించి లుక్ విడుదల చేశారు.గత వారం కన్నప్ప నుంచి విధేయుడు, స్నేహితుడు అంటూ తిన్నడు ఉపయోగించే గుర్రం టిక్కి లుక్ను రిలీజ్ చేశారు. ఈ రోజు కన్నప్ప నుంచి మారెమ్మ పాత్రకు సంబంధించిన లుక్ విడుదల చేశారు. నటి ఐశ్వర్య ఈ మారెమ్మ లుక్లో అందరినీ భయపెట్టేలా ఉన్నారు. అడవిని పీడించే అరాచకం మారెమ్మ.. కుతంత్రమే ఆమె మంత్రం అంటూ రిలీజ్ చేసిన పోస్టర్ అందరినీ ఆకట్టుకునేలా ఉంది.ఇప్పటికే కన్నప్ప టీజర్తో సినిమా మీద మంచి హైప్ ఏర్పడింది. విష్ణు మంచు టైటిల్ రోల్లో కనిపించనున్న ఈ మూవీని అవా ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై మోహన్ బాబు నిర్మిస్తున్నారు. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం డిసెంబర్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. Introducing #Aishwarya as #Maremma who is set to unleash wildness in the forests; get ready to experience the force chaos in #Kannappa🏹#HarHarMahadevॐ@themohanbabu @ivishnumanchu @Mohanlal #Prabhas @akshaykumar @realsarathkumar #MukeshRishi @mukeshvachan @MsKajalAggarwal… pic.twitter.com/gpkgux8s6f— Kannappa The Movie (@kannappamovie) September 23, 2024 -
టాలీవుడ్ యూత్ఫుల్ ఎంటర్టైనర్.. ఈ సారి డబుల్ మ్యాడ్!
టాలీవుడ్లో యూత్ఫుల్ బ్లాక్బస్టర్ హిట్గా నిలిచిన చిత్రం మ్యాడ్. ఈ కామెడీ ఎంటర్టైనర్ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలిచింది. గతేడాది అక్టోబర్లో రిలీజైన ఈ సినిమాను కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కించారు. ఈ మూవీతోనే ఆయన డైరెక్టర్గా ఎంట్రీ ఇచ్చారు. మ్యాడ్ సూపర్ హిట్ కావడంతో మేకర్స్ మరోసారి ఆడియన్స్ను నవ్వించేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే మ్యాడ్ స్వ్కేర్ తెరకెక్కించనున్నట్లు ప్రకటించిన మేకర్స్ తాజాగా ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు.(ఇది చదవండి: మొన్న టిల్లు స్వ్కేర్.. ఇప్పుడు మ్యాడ్ స్వ్కేర్)ఈ చిత్రంలోనూ నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా రిలీజైన ఫస్ట్ లుక్ పోస్టర్లో ముగ్గురు కూడా పంచెకట్టులో కనిపించారు. పోస్టర్ చూస్తుంటే మ్యాడ్ను తలదన్నేలా కనిపిస్తోంది. అంతే కాకుండా ఈ సినిమా ఫస్ట్ సింగిల్ను సెప్టెంబర్ 20న విడుదల చేస్తామని ప్రకటించారు. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో రానున్న ఈ మూవీకి బీమ్స్ సిసిరోలియో సంగీతమందిస్తున్నారు. This time it’ll be MAD MAXX!! 😎🤘🏻Here’s the First Look of #MADSquare 🕺First single coming out on 20th September 🤩🔥#ThisTimeItsMADMAXX 💥@kalyanshankar23 @vamsi84 #HarikaSuryadevara #SaiSoujanya @NarneNithiin @SangeethShobhan #RamNitin #BheemsCeciroleo @NavinNooli… pic.twitter.com/Bzod0AzKLo— Sithara Entertainments (@SitharaEnts) September 18, 2024 -
భయం ఎందుకు?
హీరోయిన్ వేదిక ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘ఫియర్’. ఈట హరిత గోగినేని దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నటుడు అరవింద్ కృష్ణ ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు. దత్తాత్రేయ మీడియా బ్యానర్పై ఏఆర్ అభి నిర్మించిన ఈ సినిమా త్వరలో విడుదల కానుంది. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ను నటుడు, డైరెక్టర్, కొరియోగ్రాఫర్ ప్రభుదేవా సోషల్ మీడియా వేదికగా రిలీజ్ చేసి, ‘‘పోస్టర్ ఆసక్తికరంగా ఉంది.. సినిమా విజయం సాధించాలి’’ అని ఆకాంక్షించారు.‘‘వైవిధ్యమైన సస్పెన్స్ థ్రిల్లర్ కథతో రూపొందిన చిత్రం ‘ఫియర్’. చీకటి గదిలో భయపడుతూ చూస్తున్న వేదిక స్టిల్తో డిజైన్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమాపై ఆసక్తి పెంచుతోంది. ఈ చిత్రం విడుదలకు ముందే వివిధ అంతర్జాతీయ ప్రతిష్టాత్మక ఫిలిం ఫెస్టివల్స్లో ప్రదర్శితమై 60కి పైగా అవార్డులను సొంతం చేసుకుని రికార్డ్ సృష్టించింది. ఈ సినిమాని త్వరలోనే రిలీజ్ చేయనున్నాం’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ సినిమాకి సంగీతం: అనూప్ రూబెన్స్, కెమెరా: ఐ ఆండ్రూ. -
బాలయ్య వారసుడి గ్రాండ్ ఎంట్రీ.. డైరెక్టర్గా ఎవరంటే?
నందమూరి ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న తరుణం వచ్చేసింది. బాలయ్య వారసుడు నందమూరి మోక్షజ్ఞ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. హనుమాన్తో సూపర్ హిట్ కొట్టిన ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో మోక్షజ్ఞ తొలి సినిమా చేయబోతున్నారు. ఇవాళ మోక్షజ్ఞ బర్త్ డే కావడంతో ఫస్ట్ లుక్ పోస్టర్ను రివీల్ చేశారు. దీంతో నందమూరి ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. కాగా.. ఈ ఏడాది హనుమాన్ మూవీతో బ్లాక్బస్టర్ హిట్ను తన ఖాతాలో వేసుకున్నారు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. ఈ చిత్రాన్ని ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ బ్యానర్పై తెరకెక్కించనున్నారు. అంతకుముందు సింబా ఇజ్ కమింగ్ అంటూ ప్రశాంత్ వర్మ చాలాసార్లు హింట్ ఇస్తూ వచ్చారు. తాజాగా నందమూరి వారసుడిని హీరోగా పరిచయం చేస్తున్నట్లు ప్రకటించారు. మొదటి సినిమా కావడంతో నందమూరి ఫ్యాన్స్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. With great joy & privilege, Introducing you…“NANDAMURI TARAKA RAMA MOKSHAGNYA TEJA” 🦁Happy birthday Mokshu 🥳 Welcome to @ThePVCU 🤗Let’s do it 🤞Thanks to #NandamuriBalakrishna Garu for all the trust & blessings 🙏 Hoping to make this one much more special &… pic.twitter.com/gm9jnhOvYx— Prasanth Varma (@PrasanthVarma) September 6, 2024 -
తుపాకులతో బంధించడం కొత్తగా ఉంది: హీరో శ్రీకాంత్
ఎవరినైనా తాళ్ళతోనో , సంకెళ్ళతోనో కట్టి బంధిస్తారు..కానీ ‘పోలీస్ వారి హెచ్చరిక’ పోస్టర్లో పోలీసునే తుపాకులతో కట్టి బంధించడం కొత్తగా ఉంది. సినిమా కూడా అంతే కొత్తగా ఉండి..అందరికి ఆకట్టుకుంటుందని భావిస్తున్నాను’అని అన్నారు హీరో శ్రీకాంత్. అభ్యుదయ దర్శకుడు బాబ్జీ దర్శకత్వం వహించిన చిత్రం ‘పోలీసు వారి హెచ్చరిక’. తూలిక తనిష్క్ క్రియేషన్స్ పతాకంపై బెల్లి జనార్థన్ నిర్మించిన ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ని హీరో శ్రీకాంత్ రిలీజ్ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఎప్పుడూ కొత్త కథల తో , కొత్త ఆలోచనలతో అడుగులేసే దర్శకుడు బాబ్జీ ఈ సినిమాతో మంచి సక్సెస్ సాధిస్తాడని నాకు గట్టి నమ్మకం ఉందని అన్నారు.మంచి మనసున్న శ్రీకాంత్ గారి చేతులమీదుగా ఫస్ట్ లుక్ ను విడుదల గావించుకున్న మా "పోలీస్ వారి హెచ్చరిక” చిత్రాన్ని మంచి మనసున్న ప్రేక్షక మహాశయులు గొప్పగా ఆదరిస్తారనే నమ్మకం మాకుందని" దర్శకుడు బాబ్జీ అన్నారు. నా సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ని శ్రీకాంత్ ఆవిష్కరించడం నేను చేసుకున్న అదృష్టం అని నిర్మాత బెల్లి జనార్ధన్ అన్నారు. ఈ కార్యక్రమం లో యీ చిత్ర కథానాయకుడు సన్నీ అఖిల్, నటి జయ వాహిని, ప్రాజెక్టు కో ఆర్డినేటర్ యస్, హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. -
జాతకాలు చెబుతానంటోన్న టాలీవుడ్ హీరో..!
ఇటీవలే డార్లింగ్ మూవీతో ప్రేక్షకులను మెప్పించిన యంగ్ హీరో ప్రియదర్శి పులికొండ. నభా నటేశ్ హీరోయిన్గా నటించిన ఈ చిత్రం పాజిటివ్ టాక్ను సొంతం చేసుకుంది. తాజాగా మరో కొత్త సినిమాకు రెడీ అయిపోయాడు. టాలీవుడ్లో వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ప్రియదర్శి, రూప కొడువాయూర్ జంటగా నటిస్తోన్న తాజా చిత్రం 'సారంగపాణి జాతకం'. ఈ మూవీని ఫుల్ కామెడీ ఎంటర్టైనర్గా మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. శ్రీదేవి మూవీస్ బ్యానర్పై శివలెంక కృష్ణప్రసాద్ నిర్మిస్తున్నారు.ఇవాళ ప్రియదర్శి బర్త్డే కావడంతో సారంగపాణి జాతకం ఫస్ట్ లుక్ పోస్టర్తో పాటు టైటిల్ రివీల్ చేశారు. తాజాగా విడుదలైన పోస్టర్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. పోస్టర్ చూస్తుంటే థియేటర్లలో నవ్వులు పూయిచండం ఖాయంగా కనిపిస్తోంది.ఈ సందర్భంగా దర్శకుడు ఇంద్రగంటి మాట్లాడుతూ… 'నమ్మకం మనిషికి బలాన్ని ఇస్తుంది. కానీ మూఢ నమ్మకం బుద్ధిమంతుడిని కూడా బలహీనుడిని చేసి నవ్వుల పాలు చేస్తుంది. అలా నవ్వుల పాలైన ఓ మధ్య తరగతి మంచి అబ్బాయి కథే సారంగపాణి జాతకం. తన నమ్మకం, తను ఇష్టపడిన అమ్మాయి ప్రేమ మధ్య కొట్టుమిట్టాడిపోయాడా? లేదా బయట పడ్డాడా? అనే కథాంశంతో ఉత్కంఠభరితంగా పొట్ట చెక్కలయ్యేలా నవ్వించే హాస్య చిత్రమని' అన్నారు.ఇప్పుడే మొదలైంది, త్వరలో మీకే తెలుస్తుంది 🤩😉Taking you on a jam-packed comedy ride with our #SarangapaniJathakam 🖐🏻🔍@krishnasivalenk #MohanKrishnaIndraganti @PriyadarshiPN @RoopaKoduvayur @ItsActorNaresh @TanikellaBharni #Vennelakishore #AvasaralaSrinivas @harshachemudu… https://t.co/80Zwnf84Fv— Priyadarshi Pulikonda (@PriyadarshiPN) August 25, 2024 -
సస్పెన్స్ థ్రిల్లర్గా ‘ది డీల్’
రంగస్థలం నటుడు హనుకోట్ల హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన చిత్రం ‘ది డీల్’. సస్పెన్స్ థ్రిల్లర్ గా వస్తున్న ఈ చిత్రం పోస్టర్ని రిటైర్డ్ ఐఏఎస్ డాక్టర్ కేవి రమణాచారి విడుదల చేశారు. ఆనంతరం ఆయన మాట్లాడుతూ.. నటన, దర్శకత్వంపై మంచి అవగాహన ఉన్న హను కోట్ల ది డీల్ సినిమాతో మన ముందుకు రావడం సంతోషకరమని అన్నారు. సస్పెన్స్ థ్రిల్లర్ గా వస్తున్న ఈ సినిమా మంచి విజయం సాధించాలని ఆకాంక్షించారు. తెలుగు సినీ రంగంలో అడుగు పెడుతున్న దర్శకుడు హను కోట్లకు అభినందనలు తెలిపారు. ‘ఒక డిఫరంట్ స్టోరీతో వస్తున్న నన్న ప్రేక్షకులు ఆశ్వీరదించాలని కోరుతున్నాను’ అని హనుకోట్ల అన్నారు. ఈ కార్యక్రమంలో టీఎఫ్పీసీ అధ్యక్షుడు కేఎల్ దామోదర్ ప్రసాద్, ప్రముఖ సినీ రచయిత బుర్రా సాయిమాధవ్ తదితరులు పాల్గొన్నారు. -
చారులత ఆన్ డ్యూటీ
నాని హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘సరిపోదా శనివారం’. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్నారు. ‘గ్యాంగ్ లీడర్’ మూవీ తర్వాత నాని, ప్రియాంక మోహన్ జోడీగా నటిస్తున్న రెండో చిత్రం ‘సరిపోదా శనివారం’. ఎస్జే సూర్య, సాయికుమార్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. డీవీవీ ఎంటర్టైన్ మెంట్ పతాకంపై డీవీవీ దానయ్య, కల్యాణ్ దాసరి నిర్మిస్తున్నారు.ఈ సినిమా నుంచి ప్రియాంక మోహన్ ఫస్ట్ లుక్ను విడుదల చేశారు మేకర్స్. ‘‘యాక్షన్ అడ్వెంచర్గా రూపొందుతోన్న పాన్ ఇండియా చిత్రం ‘సరిపోదా శనివారం’. ఈ మూవీలో చారులత అనే పోలీస్ కానిస్టేబుల్ పాత్రలో నటిస్తున్నారు ప్రియాంక మోహన్. ఆమె పాత్ర చాలా కీలకంగా ఉంటుంది. భారీ బడ్జెట్, ఉన్నత ప్రమాణాలతో నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ చివరి దశలో ఉంది. ఆగస్టు 29న ఈ మూవీ పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది’’ అని చిత్రబృందం పేర్కొంది. -
పట్టు వదలకుండా..!
అజిత్, త్రిష జంటగా రూపొందుతున్న చిత్రం ‘విడా ముయర్చి’ (పట్టు వదలకుండా ప్రయత్నించడం). లైకా ప్రోడక్షన్స్పై మగిళ్ తిరుమేని దర్శకత్వంలో సుభాస్కరన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం నుంచి అజిత్ ఫస్ట్ లుక్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా లైకాప్రోడక్షన్స్ హెడ్ జీకేఎం తమిళ్ కుమరన్ మాట్లాడుతూ – ‘‘మా బేనర్లో అజిత్తో సినిమా ప్రకటించినప్పట్నుంచి అభిమానులు, ప్రేక్షకులు ఈ మూవీ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వారి అంచనాలను చేరుకునేలా మంచి కథా కథనాలతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. ఆగస్ట్లో సినిమా చిత్రీకరణ పూర్తవుతుంది. విడుదల ఎప్పుడనేది త్వరలో చెబుతాం’’ అన్నారు. ఇక ప్రచారంలో ఉన్న ప్రకారం ఈ చిత్రకథ ఏంటంటే... ఓ భార్యాభర్త విహార యాత్రకు వెళతారు. అకస్మాత్తుగా భార్య కనిపించకుండా పోతుంది. ఆమెను కనుగొనే క్రమంలో కనిపించని శత్రువులతో పట్టు వదలకుండా హీరో చేసే పోరాటం నేపథ్యంలో ఈ చిత్రం ఉంటుందని తెలిసింది. ఆరవ్, రెజీనా కసాండ్ర, నిఖిల్, అర్జున్ నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: అనిరుధ్, కెమెరా: ఓం ప్రకాశ్. -
మాస్ మల్లి
సిగరెట్ కాల్చుతూ రిక్షాలో మాస్గా కూర్చొన్న అతని పేరు మల్లి. ఇంటిపేరు బచ్చల. చేసేది ట్రాక్టర్ డ్రైవర్గా... ఇంకా అతని పూర్తి వివరాలు తెలుసుకోవాలనుకునేవారు థియేటర్స్కు వెళ్లాల్సి ఉంటుంది. ‘అల్లరి’ నరేశ్ టైటిల్ రోల్ చేస్తున్న తాజా చిత్రం ‘బచ్చల మల్లి’. 1990 నేపథ్యంలో సాగే ఈ సినిమాకు ‘సోలో బ్రతుకే సో బెటర్’ ఫేమ్ సుబ్బు మంగాదేవి దర్శకత్వం వహిస్తున్నారు. హాస్య మూవీస్ బ్యానర్పై రాజేశ్ దండా, బాలాజీ గుత్తా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.మంగళవారం ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ను విడుదల చేశారు మేకర్స్. ఈ పోస్టర్లో సీరియస్ లుక్లో కనిపిస్తున్నారు ‘అల్లరి’ నరేశ్. ‘‘ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్లో జరుగుతోంది. ఈ బచ్చల మల్లి చాలా రోజులు గుర్తిండిపోతాడు. నిర్మాణం పనులు తుది దశకు చేరుకున్నాయి’’ అని చిత్రబృందం పేర్కొంది. అమృతా అయ్యర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో రోహిణి, రావు రమేశ్, అచ్యుత్ కుమార్, బలగం జయరామ్, హరితేజ, ప్రవీణ్, వైవా హర్ష ముఖ్య పాత్రధారులు. ఈ సినిమాకు సంగీతం: విశాల్ చంద్రశేఖర్, కెమెరా: రిచర్డ్ ఎం. నాథన్. -
కామెడీ ఎంటర్టైనర్గా వస్తోన్న నమో.. ఆకట్టుకుంటోన్న ఫస్ట్ లుక్ పోస్టర్!
విశ్వంత్ దుద్దంపూడి, అనురూప్ కటారి, విస్మయ ప్రధాన పాత్రల్లో వస్తోన్న చిత్రం నమో. శ్రీ నేత్ర క్రియేషన్స్, ఆర్మ్స్ ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్ల మీద ప్రశాంత్ ఈ మూవీని నిర్మించారు. ఈ చిత్రం ద్వారా ఆదిత్య రెడ్డి కుందూరు దర్శకులుగా పరిచయం కాబోతున్నారు. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ అందరినీ ఆకట్టుకుంటోంది.విశ్వంత్- అనురూప్ కాంబోలో వస్తోన్న ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ పోస్టర్, టీజర్ ఆడియెన్స్ను ఆకట్టుకుంటున్నాయి. అయితే ఇప్పుడు ఈ చిత్రానికి సంబంధించిన రిలీజ్ డేట్ను ప్రకటించారు. జూన్ 7న సినిమా థియేటర్లలో సందడి చేయనుంది. ఈ చిత్రానికి కెమెరామెన్గా రాహుల్ శ్రీవాత్సవ్.. మ్యూజిక్ డైరెక్టర్గా క్రాంతి ఆచార్య వడ్లూరి.. ఎడిటర్గా సనల్ అనిరుధన్ పని చేశారు. -
యాక్షన్ ఎంటర్టైనర్గా లారీ చాప్టర్-1.. ఆసక్తిగా ఫస్ట్ లుక్ పోస్టర్!
శ్రీకాంత్ రెడ్డి ఆసం హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన చిత్రం "లారి చాప్టర్ -1". యూట్యూబ్లో తన వీడియోలతో కోట్ల మంది అభిమానులను సొంతం చేసుకుని మంచి పాపులారిటీ సంపాదించుకున్న శ్రీకాంత్ రెడ్డి హీరోగా వెండి తెరకు పరిచయమవుతున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్గా చంధ్ర శిఖ నటించనుండగా.. రాఖీ సింగ్ ప్రధాన పాత్రలో నటించారు. కింగ్ మేకర్ పిక్చర్స్ పతాకంపై ఆసం వెంకట లక్ష్మి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసారు.ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి ఆసం మాట్లాడుతూ..'చెన్నై లయోల కాలేజీలో డైరెక్షన్ కోర్స్ చేసిన మొదట యూట్యూబ్లో నా కెరీర్ ప్రారంభించాను. మంచి పాపులారిటీ వచ్చింది. అలాగే చాలా సినిమాలకు వివిధ శాఖలలో పని చేశాను. ఇప్పుడు "లారి చాప్టర్ -1" అనే సినిమాతో మీ ముందుకు వస్తున్నా. ఇది ఒక యాక్షన్ ఎంటర్టైనర్. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, హిందీ, బెంగాలీ భాషలో ఒకేసారి విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నా. నా మొదటి సినిమా అందరికీ నచ్చుతుంది"' అని తెలిపారు. -
హనుమాన్ హీరో కొత్త మూవీ.. గ్లింప్స్ చూస్తే గూస్బంప్సే!
హనుమాన్ మూవీతో బ్లాక్బస్టర్ హిట్ కొట్టిన యంగ్ హీరో తేజ సజ్జా. ఈ సినిమాతో ఒక్కసారిగా క్రేజ్ దక్కించుకున్నారు. తేజ మరో హిస్టారికల్ మూవీ చేసేందుకు రెడీ అయిపోయారు. తేజ సజ్జాకు జంటగా రితికా నాయక్ నటిస్తోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్లో టీజీ విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాకు కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తున్నారు. గతంలో ఆయన రవితేజతో ఈగల్ మూవీని తెరకెక్కించారు. తాజాగా ఈ మూవీ టైటిల్తో పాటు గ్లింప్స్, ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. హైదరాబాగ్లోని రామానాయుడు స్టూడియోలో జరిగిన కార్యక్రమంలో టైటిల్ రివీల్ చేశారు. తేజ సజ్జా తాజా చిత్రానికి మిరాయి అనే టైటిల్ ఖరారు చేశారు. ఈ చిత్రంలో తేజ సూపర్యోధ పాత్రలో కనిపించనున్నారు. తాజాగా రిలీజైన ఫస్ట్ లుక్ పోస్టర్లో తేజ సజ్జ సూపర్ యోధా లుక్లో కనిపించారు. బద్దలయ్యే అగ్నిపర్వతం పైన నిలబడి ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాను అశోకుని కాలంలో జరిగిన కళింగ యుద్ధం ఆధారంగా తెరకెక్కిస్తున్నట్లు గ్లింప్ల్ చూస్తే అర్థమవుతోంది. మిరాయి సినిమాను తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, బెంగాలీ, మరాఠీతో పాటు చైనీస్ భాషల్లోనూ వచ్చే ఏడాది ఏప్రిల్ 18న విడుదల చేయనున్నారు. From the hush of ancient narratives📜 Comes a thrilling adventurous saga of a #SuperYodha 🥷⚔️#PMF36 x #TejaSajja6 Titled as #𝐌𝐈𝐑𝐀𝐈 ⚔️#MIRAITitleGlimpse out now💥 -- https://t.co/k4tycunRkA In Cinemas on 18th APRIL 2025 ~ 2D & 3D🔥 SuperHero @tejasajja123… pic.twitter.com/WN2MB2EPlE — People Media Factory (@peoplemediafcy) April 18, 2024 -
కుటుంబ కథాచిత్రం
రాజేంద్ర ప్రసాద్, బ్రహ్మానందం, ‘శుభలేఖ’ సుధాకర్ కీలక పాత్రల్లో రామ్ కిరణ్, మేఘా ఆకాష్ జంటగా నటిస్తున్న చిత్రం ‘సఃకుటుంబానాం’. ఉదయ్ శర్మ దర్శకత్వం వహిస్తున్నారు. హెచ్ఎన్జీ సినిమాస్పై హెచ్ మహాదేవ గౌడ్ నిర్మిస్తున్న ఈ మూవీ ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సందర్భంగా ఉదయ్ శర్మ మాట్లాడుతూ–‘‘రేషన్ కార్డులాగా ఉన్న ఫస్ట్ లుక్కి చాలా మంచి స్పందన వచ్చింది. మా సినిమాలో చాలా మంచి కంటెంట్ ఉంది. ఎంతో మంది సీనియర్స్ నటిస్తున్నారు. ఈ సినిమాకి మణిశర్మగారి మ్యూజిక్ హైలెట్’’ అన్నారు. ‘‘సఃకుటుంబానాం’ మంచి క్రియేటివిటీతో కూడిన కుటుంబ కథా చిత్రం అవుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు మహాదేవ గౌడ్. ఈ చిత్రానికి కెమెరా: మధు దాసరి. -
కుటుంబ కథాంశంతో ‘సఃకుటుంబానాం’
రామ్ కిరణ్, మేఘ ఆకాష్ హీరోహీరోయిన్లుగా నటించిన తాజా చిత్రం ‘సఃకుటుంబానాం’. ఉదయ్ శర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రాజేంద్ర ప్రసాద్, బ్రహ్మానందం, సత్య తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. హెచ్.మహదేవ గౌడ్ నిర్మాత. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ ,మోషన్ పోస్టర్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు ఉదయ్ మాట్లాడుతూ.. ‘ఈ మధ్య కాలంలో ఇంత మంది ఆరిస్టులు, ఇంత మంచి కాంబినేషన్స్తో ఏ సినిమా రాలేదు. ఇందులో చాలా మంచి కథ ఉంది. ఎవరూ ఊహించని రీతిలో ఈ చిత్రం ఉంటుంది. నిర్మాత మహదేవ్ మాట్లాడుతూ.. అచ్చమైన తెలుగు టైటిల్తో వస్తున్న ఈ సినిమాను ప్రేక్షకులు కచ్చితంగా ఆదరిస్తారనే నమ్మకం ఉంది. అందరు మెచ్చేలా కుటుంబ కథాంశంతో రూపొందుతున్న చిత్రమిది’ అన్నారు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. -
టాలీవుడ్ హీరోయిన్ బర్త్ డే.. ఫస్ట్ లుక్ అదిరిపోయింది!
అలా మొదలైంది సినిమాతో టాలీవుడ్కు ఎంట్రీ ఇచ్చిన నటి నిత్యామీనన్. ఆ తర్వాత నితిన్ సరసన ఇష్క్ సినిమాతో గుర్తింపు దక్కించుకుంది. ఆ తర్వాత తెలుగు, కన్నడ, తమిళం, మలయాళంలో దాదాపు 50కి పైగా చిత్రాల్లో నటించింది. తెలుగులో గుండెజారి గల్లంతయ్యిందే, జనతా గ్యారేజ్, 100 డేస్ ఆఫ్ లవ్, ఒక్క అమ్మాయి తప్ప, ఇంకొక్కడు లాంటి చిత్రాల్లో నటించింది. ఇటీవల వెబ్ సిరీస్లతో అలరించిన మలయాళీ భామ 36వ పుట్టినరోజును జరుపుకుంటోంది. ఇవాళ నిత్యా మీనన్ బర్త్ డే కావడంతో మరో కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. తాజాగా నిత్యా నటిస్తోన్న 'డియర్ ఎక్సెస్' మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ చిత్రం ద్వారా కామిని డైరెక్టర్గా పరిచయవుతున్నారు. రిలీజైన పోస్టర్లో నిత్యా ఒక చేతిలో మొబైల్.. మరో చేతిలో గ్లాస్ పట్టుకుని కనిపించింది. ఈ సినిమాను బాస్క్ టైమ్ థియేటర్, పోప్టర్ మీడియా నెట్వర్క్ బ్యానర్లపై బీజీఎన్, ఆదిత్య అజయ్ సింగ్, రామ్కి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. పోస్టర్ చూస్తే ఫుల్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో వినయ్ రాయ్, నవదీప్, ప్రతీక్ బబ్బర్, దీపక్ పరంబోల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. View this post on Instagram A post shared by Nithya Menen (@nithyamenen) -
'ఇలాంటి టైటిల్ పెట్టకపోవడం ఆశ్చర్యంగా ఉంది'
మిర్చి విజయ్, అంజలి నాయర్ హీరో హీరోయిన్లుగా నటిస్తోన్న తాజా చిత్రం వైఫ్. ఈ చిత్రం ద్వారా హేమంత్ నాదం దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఒలింపియ మూవీస్ సంస్థ అధినేత ఎస్.అంబేడ్కర్ నిర్మిస్తున్నారు. గతంలో జిప్సీ, డాడా, కలిగేత్తి మూర్కన్ వంటి వైవిధ్యభరిత కథా చిత్రాలను ఆయన నిర్మించారు. తాజాగా ఈ మూవీకి సంబంధించి టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ను మేకర్స్ రిలీజ్ చేశారు. దంపతుల మధ్య నవీన అనుబంధాలను ఆవిష్కరించే కథాచిత్రంగా ఇది ఉంటుందని డైరెక్టర్ హేమంత్ నాదం అన్నారు. అందుకే ఈ చిత్రానికి వైఫ్ అని పేరు పెట్టామని తెలిపారు. ఇలాంటి టైటిల్ను ఇప్పటివరకు ఎవరూ పెట్టకపోవడం ఆశ్చర్యాన్ని కలిగించిందన్నారు. చదరంగంలో రాణికి అపార శక్తి ఉంటుందన్నారు. అదేవిధంగా ఒక ఇంటిని చక్కదిద్దడంలో భార్య పాత్ర ముఖ్యమన్నారు. వివాహానంతరం భార్యాభర్తల మధ్య పెరిగే ప్రేమానుబంధాన్ని ఎమోషనల్గా ఆవిష్కరించే చిత్రమని చెప్పారు. ఈ చిత్రం ద్వారా మిర్చి విజయ్ను కథానాయకుడిగా పరిచయం చేస్తున్నట్లు చెప్పారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు దర్శకుడు పేర్కొన్నారు. ఈ చిత్రానికి కేఏ శక్తివేల్ చాయాగ్రహణం, జెన్ మార్టిన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సినిమాలో మైత్రేయన్, రెడిన్ కింగ్స్ లీ, కల్యాణి నటరాజన్, విజయ్బాబు, విల్లు, కదిర్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. Super happy to present the First Look of my next Romcom #Wife with @RJVijayOfficial 👰🏻♀️🤵🏻 Directed by @dir_hemanathan Produced by @ambethkumarmla @olympiaMovis@Abishek_jg @shakthi_dop @JenMartinmusic @PMohan93 @gayathribala21@sharmaseenu11@VishnuEdavan1 @DoneChannel1 pic.twitter.com/fqnzgwDBaZ — Anjali (@ianjalinair) March 23, 2024 -
కన్నప్ప గురి
విష్ణు మంచు హీరోగా రూపొందుతోన్న చిత్రం ‘కన్నప్ప’. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, అవా ఎంటర్టైన్మెంట్స్పై మోహన్బాబు నిర్మిస్తున్నారు.పాన్ ఇండియా ప్రాజెక్ట్గా రూపొందుతున్న ఈ మూవీలో మోహన్బాబు, ప్రభాస్, మోహన్ లాల్, శరత్ కుమార్ కీలకపాత్రల్లో నటిస్తున్నారు. కాగా శుక్రవారం మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ‘కన్నప్ప‘ ఫస్ట్ లుక్ను విడుదల చేశారు. విల్లు గురిపెట్టిన కన్నప్పగా విష్ణు మంచు లుక్ విడుదలైంది. ‘‘ఒక ధైర్యవంతుడైన యోధుడు, శివుని భక్తుడైన కన్నప్ప కథను ‘కన్నప్ప’గా తెరపైకి తీసుకొస్తున్నాం. ఇంత గొప్ప పాత్రను అంతే గొప్పగా పోషిస్తున్నారు విష్ణు మంచు. ఫస్ట్ లుక్ పోస్టర్ కన్నప్ప క్యారెక్టర్లోని డెప్త్, ఇంటెన్సిటీ చూపిస్తోంది. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ, ఇంగ్లిష్ భాషల్లో ఈ మూవీ రూపొందుతుండగా అన్ని భాషల్లో రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్కి మంచి స్పందన వస్తోంది. ‘కన్నప్ప’ చిత్రం రెండో షెడ్యూల్ ప్రస్తుతం న్యూజిల్యాండ్లో జరుగుతోంది. అద్భుతమైన దృశ్య కావ్యంగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. -
ఫర్ఫెక్ట్ యూత్ ఫుల్ ఎంటర్టైనర్.. 'వి లవ్ బ్యాడ్ బాయ్స్'!
రాజు రాజేంద్ర ప్రసాద్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న యూత్ ఫుల్ ఎంటర్టైనర్ 'వి లవ్ బ్యాడ్ బాయ్స్". ఫుల్ కామెడీ చిత్రంగా వస్తోన్న ఈ చిత్రాన్ని నూతన నిర్మాణ సంస్ధ బీఎమ్ క్రియేషన్స్ పతాకంపై పప్పుల కనక దుర్గారావు నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఇటీవలే సెన్సార్ కూడా పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి యూ/ఏ సర్టిఫికెట్ లభించింది. ఇవాళ వాలెంటైన్ డే సందర్భంగా ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సినిమాలో అజయ్, వంశీ ఏకశిరి, ఆదిత్య శశాంక్ నేతి, రోమిక శర్మ, రోషిణి సహోట, ప్రగ్యా నయన్, సన్యు దవలగర్, వంశీకృష్ణ, సింధు విజయ్, విహారిక చౌదరి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సందర్భంగా డెరెక్టర్ రాజు రాజేంద్ర ప్రసాద్ మాట్లాడారు. ప్రస్తుత ట్రెండ్కు తగినట్లుగానే కామెడీ ఎంటర్టైనర్గా ఈ చిత్రాన్ని తెరకెక్కించామని తెలిపారు. ఈ చిత్రం తమకు శుభారంభం ఇస్తుందనే నమ్మకం ఉందని నిర్మాత పప్పుల కనక దుర్గారావు అన్నారు. అతి త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తామని పేర్కొన్నారు. కాగా.. పోసాని కష్ణమురళి, కాశి విశ్వనాథ్, అలి, సప్తగిరి, పృథ్వి, శివారెడ్డి, భద్రం, గీతాసింగ్ ముఖ్య పాత్రలు పోషించారు. -
'వేదా'గా వచ్చేస్తున్న జాన్ అబ్రహాం
బాలీవుడ్ నటుడు జాన్ అబ్రహాం నటించిన తాజా యాక్షన్ మూవీ ‘వేదా’. ‘సలామ్ ఏ ఇష్క్’ (2007) వంటి హిట్ మూవీ తర్వాత హీరో జాన్ అబ్రహాం, డైరెక్టర్ నిఖిల్ అద్వానీ కాంబినేషన్లో ఈ మూవీ రూపొందింది. ఈ చిత్రంలో శార్వరీ వాఘ్ హీరోయిన్గా నటించారు. మోనీషా అద్వానీ, మధు భోజ్వాని, జాన్ అబ్రహాం నిర్మించారు. పోస్ట్ ప్రోడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని జూలై 12న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్. ఈ సందర్భంగా జాన్ అబ్రహాం, శార్వరీ వాఘ్ల ఫస్ట్ లుక్ పోస్టర్ను విడుదల చేశారు. ‘‘యాక్షన్ డ్రామాగా ‘వేదా’ రూపొందింది. వాస్తవ ఘటనల స్ఫూర్తితో ఈ చిత్రం తీశాను. ఈ మూవీ మన సమాజంలోని పరిస్థితులను ప్రతిబింబిస్తుంది’’ అని నిఖిల్ అద్వానీ పేర్కొన్నారు. -
అఘోర పాత్రలో టాలీవుడ్ యంగ్ హీరో.. భయపెడుతోన్న పోస్టర్!
టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ నటిస్తోన్న తాజా చిత్రం 'గామి'. ఈ సినిమాలో చాందినీ చౌదరి హీరోయిన్గా కనిపించనుంది. ఈ చిత్రం ద్వారా విద్యాధర్ డైరెక్టర్గా పరిచయం అవుతున్నారు. తాజాగా ఈ చిత్రం ఫస్ట్లుక్ పోస్టర్ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ ట్వీట్ చేసింది. నిర్మాణ సంస్థ ట్వీట్లో రాస్తూయ..'అతని అతిపెద్ద భయం మానవ స్పర్శ. అతని లోతైన కోరిక కూడా మానవ స్పర్శే. ఒక వ్యక్తి ప్రత్యేకమైన కథ.. అతని అతిపెద్ద భయాన్ని జయించటానికి ప్రయాణం' అంటూ క్యాప్షన్ ఇచ్చారు. కాగా.. ఫస్ట్ లుక్ పోస్టర్ చూస్తే అఘోర పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలోనే థియేటర్లకు రానుంది. కాగా.. ఈ సినిమాను ఉద్దేశించి ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో విశ్వక్ సేన్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఈ సినిమా కోసం దాదాపు నాలుగున్నర ఏళ్లుగా కష్టపడుతున్నానని తెలిపారు. తన పాత్ర చాలా విభిన్నంగా ఉంటుందని.. ఈ చిత్రాన్ని హిమాలయాలు, వారణాసి లాంటి ప్రాంతాల్లో తెరకెక్కించినట్లు వివరించారు. కథ విషయంలో డైరెక్టర్ ఫుల్ క్లారిటీతో ఉన్నారని విశ్వక్ సేన్ తెలిపారు. #Gaami - 𝗛𝗶𝘀 𝗯𝗶𝗴𝗴𝗲𝘀𝘁 𝗳𝗲𝗮𝗿 𝗶𝘀 𝗵𝘂𝗺𝗮𝗻 𝘁𝗼𝘂𝗰𝗵. 𝗛𝗶𝘀 𝗱𝗲𝗲𝗽𝗲𝘀𝘁 𝗱𝗲𝘀𝗶𝗿𝗲 𝗶𝘀 𝗮𝗹𝘀𝗼, 𝗵𝘂𝗺𝗮𝗻 𝘁𝗼𝘂𝗰𝗵 ☯️ A unique tale of one man and his journey to conquer his biggest fear 🧿 In cinemas soon!@VishwakSenActor @iChandiniC @mgabhinaya… pic.twitter.com/zSSUxI0Fqv — UV Creations (@UV_Creations) January 28, 2024 -
భారత్-చైనా సంబంధాల ఇతివృత్తంతొ ‘చైనా పీస్’
నిహాల్ కోదాటి, సూర్య శ్రీనివాస్ ప్రధాన పాత్రలలో అక్కి విశ్వనాధ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం "చైనా పీస్". రిపబ్లిక్ డే సందర్భంగా పాన్ ఇండియా స్టార్ హీరో నిఖిల్ సిద్ధార్థ ఈ చిత్రం ఫస్ట్ లుక్, హై కాన్సెప్ట్ పోస్టర్ను లాంచ్ చేశారు. లిప్స్టిక్ , యుఎస్ బీ డ్రైవ్ ఇమేజ్ కాంబినేషన్ ని మిక్స్ చేస్తూ ఆసక్తికరంగా చూపిస్తూ ఒక మిసైల్ ని పోలివున్న ఈ పోస్టర్ చాలా క్యురియాసిటీని పెంచింది. దేశభక్తి, భారతదేశం-చైనా సంబంధాల ఇతివృత్తంతో ఈ కథ ఉండబోతుందని పోస్టర్ సూచిస్తోంది. ఫస్ట్ లుక్ పోస్టర్ ఒక డిఫరెంట్ సినిమాటిక్ జర్నీని ప్రామిస్ చేస్తోంది. మూన్ లైట్ డ్రీమ్స్ నిర్మిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో హర్షిత, శ్రీషా నూలు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ప్రముఖ సాంకేతిక నిపుణులు ఈ చిత్రానికి పని చేస్తున్నారు. -
దర్శకుడిగా టాలీవుడ్ నటుడి తొలి సినిమా.. ఆసక్తిగా ఫస్ట్ లుక్ పోస్టర్!
టాలీవుడ్ నటుడు ధనరాజ్ హీరోగా నటిస్తూ.. దర్శకత్వం వహిస్తోన్న చిత్రం "రామం రాఘవం". ఈ చిత్రంలో కోలీవుడ్ నటుడు సముద్రఖని ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఇవాళ అయోధ్య బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ను మేకర్స్ ఆవిష్కరించారు. అయోధ్య రాముని ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా 22 మంది సినీ ప్రముఖుల చేతుల మీదుగా పోస్టర్ విడుదల చేశారు. ఈ చిత్రం ద్వారా ధన్రాజ్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ చిత్రాన్ని స్లేట్ పెన్సిల్ స్టోరీస్ బ్యానర్పై ప్రభాకర్ ఆరిపాక సమర్పణలో పృథ్వి పొలవరపు నిర్మిస్తున్నారు. మేకర్స్ రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ సినీ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ చిత్రంలో సముద్రఖని , ధనరాజ్ తండ్రీ, కొడుకులుగా కనిపించనున్నారు. ఇప్పటివరకు ఎప్పుడూ చూడని ఒక తండ్రి కొడుకుల కథను అద్భుతంగా తెరమీద ఆవిష్కరిస్తున్నామని దర్శకుడు ధనరాజ్ తెలిపారు. కాగా.. ఈ చిత్రంలో మోక్ష, హరీష్ ఉత్తమన్, సత్య పృద్వి, శ్రీనివాసరెడ్డి, చిత్రం శ్రీను, ప్రమోదిని, రాకెట్ రాఘవ, రచ్చ రవి, ఇంటూరి వాసు నటిస్తున్నారు. ఈ సినిమాకు విమానం చిత్ర దర్శకుడు శివ ప్రసాద్ యానా కథను సమకూర్చగా.. అరుణ్ చిలువేరు సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోన్న ఈ చిత్రం తమిళ, తెలుగు భాషలలో ఒకేసారి విడుదల కానుంది. జగమంతా రామమయం 🙏🏻 ఇలాంటి అద్భుతమైన రోజు నా సినిమా టైటిల్ రిలీజ్ చేయడం నా పూర్వజన్మ సుకృతం 🙏🏻Presenting the first look poster of Love that knows no boundaries 💞 A tale of a father and son!🧡🧡@thondankani @DhanrajOffl @Prudhvi_dir @DirPrabhakar #RR #RamamRaghavam pic.twitter.com/zbQ4u8PXJ7 — Dhanraj koranani (@DhanrajOffl) January 22, 2024 -
‘కేరింత’ఫేమ్ పార్వతీశం హీరోగా 'మార్కెట్ మహాలక్ష్మి'
‘కేరింత’ఫేమ్ పార్వతీశం హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘మార్కెట్ మహాలక్ష్మి’. వియస్ ముఖేష్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ద్వారా ప్రణీకాన్వికా హీరోయిన్గా పరిచయం అవుతున్నారు. హర్ష వర్ధన్, మహబూబ్ బాషా, ముక్కు అవినాష్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.ఈ మూవీ 'టైటిల్ పోస్టర్'ని బిగ్ బాస్ ఫెమ్ హీరో 'శివాజీ' చేతుల మీదగా ఈ రోజు ఆవిష్కరణ జరగగా, ప్రొడ్యూజర్ బెక్కెం వేణుగోపాల్ అతిధి గా వచ్చి టీం ని విష్ చేశారు. ఈ సందర్భంగా శివాజీ మాట్లాడుతూ.. ‘నేను 27 ఏళ్ళ వయసులో యాక్టింగ్ మొదలు పెడితే దాదాపు 50 యేళ్ళకి నాకు గుర్తింపు వచ్చింది. ఏదో, ఒక రోజు గుర్తింపు అనేది వస్తుంది. కాకపోతే క్యారెక్టర్, హార్డ్ వర్క్, ఓపిక ఇంపార్టెంట్. 'కేరింత' మూవీతో కేరీర్ స్టార్ట్ చేసిన హీరో 'పార్వతీశం' కి తప్పకుండా ఈ సినిమా ద్వారా మంచి గుర్తింపు వస్తుంది అని నాకు బలమైన నమ్మకం ఉంది. ప్రొడ్యూసర్ 'అఖిలేష్ కలారు'కి మంచి లాభాలు చేకుర్చాలి. డైరెక్టర్ ' వియస్ ముఖేష్' కథ బాగా తీసి ఉంటారని నమ్ముతున్నాను’అన్నారు. 'మార్కెట్ మహాలక్ష్మి'చూసినప్పుడు నాకు శేఖర్ కమ్ముల గారి సినిమాలు గుర్తొచ్చాయి’అని బెక్కం వేణుగోపాల్ అన్నారు. -
ప్రభాస్-మారుతి క్రేజీ కాంబో.. టైటిల్ అదిరిపోయిందిగా!
టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. క్రేజీ డైరెక్టర్ మారుతితో జతకడుతోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్పై అభిమానుల్లో విపరీతమైన ఆసక్తి నెలకొంది. ఇటీవలే సలార్తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన రెబల్ స్టార్ మరో చిత్రానికి రెడీ అయిపోయారు. తాజాగా వీరిద్దరి కాంబోలో వస్తోన్న మూవీ టైటిల్ రివీల్ చేశారు. సంక్రాంతి కానుకగా ఈ చిత్ర నిర్మాణ సంస్థ ది పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ట్వీట్ చేసింది. ప్రభాస్- మారుతి కొత్త చిత్రానికి 'ది రాజాసాబ్' అనే టైటిల్ను ఖరారు చేశారు. టైటిల్తో పాటు ఫస్ట్లుక్ పోస్టర్ను కూడా రిలీజ్ చేశారు. రెబల్ స్టార్ కొత్త లుక్లో కనిపించడంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ప్రభాస్ ఇప్పటిదాకా చేయని రొమాంటిక్ హారర్ జానర్లో "రాజా సాబ్" సినిమాను రూపొందిస్తుండటంతో అందరిలో క్యూరియాసిటీ మరింత పెరుగుతోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్పై తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. కాగా.. ఈ సినిమాకు ఎస్ఎస్ తమన్ సంగీతమందిస్తున్నారు. కాగా.. ప్రభాస్ మరోవైపు కల్కి అనే చిత్రంలోనూ నటిస్తున్నారు. కాగా.. దర్శకుడు మారుతి గతంలో "భలే భలే మగాడివోయ్", "మహానుభావుడు", "ప్రతి రోజు పండగే" వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ అందించారు. మారుతి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ను కొత్తగా సిల్వర్ స్క్రీన్ మీద ప్రెజెంట్ చేస్తాడనే నమ్మకం అందరిలో ఏర్పడుతోంది. డార్లింగ్ ఫ్యాన్స్ ప్రభాస్ను ఎలా స్క్రీన్ మీద చూడాలనుకుంటున్నారో అలా "రాజా సాబ్" మూవీని మారుతి తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. కాగా.. ది "రాజా సాబ్" పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు తమిళ,మలయాళ, కన్నడ, హిందీలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. #TheRajaSaab It is… 👑 Wishing you all a very Happy and Joyous Sankranthi! ❤️ 𝐀 𝐑𝐞𝐛𝐞𝐥’𝐬 𝐄𝐧𝐭𝐞𝐫𝐭𝐚𝐢𝐧𝐦𝐞𝐧𝐭 𝐄𝐱𝐩𝐥𝐨𝐝𝐞𝐬 𝐖𝐨𝐫𝐥𝐝𝐰𝐢𝐝𝐞 𝐒𝐨𝐨𝐧 🌋#PrabhasPongalFeast #Prabhas A @DirectorMaruthi film Produced by @Vishwaprasadtg A @MusicThaman Musical… pic.twitter.com/kvmUxIcXFC — People Media Factory (@peoplemediafcy) January 15, 2024 -
గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్టైమ్
విజయ్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమాకు ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్టైమ్’ అనే టైటిల్ ఖరారైంది. విజయ్ కెరీర్లో 68వ సినిమాగా వస్తున్న ఈ చిత్రానికి వెంకట్ ప్రభు దర్శకత్వం వహిస్తున్నారు. ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది. న్యూ ఇయర్ (2024) సందర్భంగా ఈసినిమా టైటిల్, ఫస్ట్లుక్ పోస్టర్ను ఆదివారం విడుదల చేశారు మేకర్స్. అలాగే ఈ సినిమాకు సంబంధించిన మరో లుక్ నేడు రానుందని కోలీవుడ్ సమాచారం. ఫస్ట్లుక్ని చూస్తే ఈ చిత్రంలో విజయ్ ద్విపాత్రాభినయం చేస్తున్నారని స్పష్టమవుతోంది. మీనాక్షీ చౌదరి హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో ప్రశాంత్, లైలా, స్నేహ, జయరాం, యోగిబాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా ఈ ఏడాది దీపావళి కానుకగా విడుదలకానుందనే టాక్ కోలీవుడ్లో వినిపిస్తోంది. ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు. -
సరికొత్తగా...
నిహారిక కొణిదెల లీడ్ రోల్లో నటిస్తున్న చిత్రం ‘వాట్ ది ఫిష్’. ‘వెన్ ది క్రేజీ బికమ్స్ క్రేజియర్’ అనేది ఉపశీర్షిక. ఈ చిత్రంతో వరుణ్ కోరుకొండ దర్శకునిగా పరిచయమవుతున్నారు. 6 ఐఎక్స్ సినిమాస్పై విశాల్ బెజవాడ, సూర్య బెజవాడ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ఫస్ట్లుక్ పోస్టర్ను విడుదల చేశారు మేకర్స్. ‘‘ఈ సినిమాలో అష్టలక్ష్మిపాత్రలో కనిపిస్తారు నిహారిక. ఆమెపాత్ర సరికొత్తగా, ప్రేక్షకులను అలరించేలా ఉంటుంది’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ సినిమాకు సంగీతం: శక్తికాంత్ కార్తీక్, సహ నిర్మాత: వరుణ్ కోరుకొండ. కాగా 2019లో వచ్చిన ‘సూర్యకాంతం’ చిత్రం తర్వాత మళ్లీ నిహారిక నటిస్తున్న సినిమా ‘వాట్ ది ఫిష్’ కావడం విశేషం. -
కామెడీ ఎక్స్ప్రెస్
చైతన్యారావు, హెబ్బా పటేల్ జంటగా నటిస్తున్న రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ ‘హనీమూన్ ఎక్స్ప్రెస్’. ఎన్ఆర్ఐ ఎంటర్టైన్మెంట్స్, న్యూ రీల్ ఇండియా ఎంటర్టైన్మెంట్స్ పతాకాలపై బాల రాజశేఖరుని దర్శకత్వంలో కేకేఆర్, బాల రాజ్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్లుక్ పోస్టర్ను హీరో నాగార్జున విడుదల చేసి, మాట్లాడుతూ–‘‘వినోదాత్మకంగా సందేశంతో కూడిన ఈ చిత్రం విజయం సాధించాలి’’ అన్నారు. ‘‘లాస్ ఏంజెల్స్లో ఉంటూ ఎన్నో హాలీవుడ్ చిత్రాలకు పని చేశాను. కానీ తెలుగు సినిమా చేయాలనేది నా కల. నాగార్జున, అమలగార్ల ్రపోత్సాహంతో టాలీవుడ్లో అరంగేట్రం చేశాను. మా సినిమా ఫస్ట్లుక్ పోస్టర్ను విడుదల చేసిన నాగార్జునగారికి ధన్యవాదాలు’’ అన్నారు బాల రాజశేఖరుని. తనికెళ్ల భరణి, సుహాసిని కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు సంగీతం: కళ్యాణీ మాలిక్, నేపథ్యసంగీతం: ఆర్పీ పట్నాయక్. -
రాజ్ కందకూరి చేతుల మీదుగా ‘రాధా మాధవం’ ఫస్ట్ లుక్ పోస్టర్ లాంచ్
విలేజ్ లవ్ డ్రామాలకు సిల్వర్ స్క్రీన్ మీద ఎప్పుడూ ఆదరణ ఉంటుంది. తాజాగా మరో గ్రామీణ ప్రేమ కథా చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. వినాయక్ దేశాయ్, అపర్ణా దేవీ హీరో హీరోయిన్లుగా గోనల్ వెంకటేష్ నిర్మిస్తున్న అందమైన ప్రేమ కథా చిత్రం ‘రాధా మాధవం’. ఈ మూవీకి దాసరి ఇస్సాకు దర్శకత్వం వహిస్తున్నారు. వసంత్ వెంకట్ బాలా ఈ చిత్రానికి కథ, మాటలు, పాటలను అందించారు. ప్రస్తుతం షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను ప్రారంభించింది. ఈ క్రమంలో మూవీ ఫస్ట్ లుక్ను నిర్మాత రాజ్ కందుకూరి చేతుల మీదుగా రిలీజ్ చేయించింది. ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన అనంతరం రాజ్ కందకూరి మాట్లాడుతూ.. ‘ఈ సినిమాకు దాసరి ఇస్సాకు దర్శకత్వం వహించారు. గోనాల్ వెంకటేష్ నిర్మించారు. వినాయక్కు లీడ్గా ఇది రెండో చిత్రం. పోస్టర్ చాలా ఇంటెన్స్గా ఉంది. కంటెంట్ బాగుంటే చిన్న చిత్రాలను కూడా ప్రేక్షకులు ఎంకరేజ్ చేస్తారు. పోస్టర్ మాత్రం నాకు చాలా నచ్చింది. ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరిస్తార’ని నమ్ముతున్నాను.' అని అన్నారు. హీరో వినాయక్ మాట్లాడుతూ.. ‘మా చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ను రిలీజ్ చేసిన రాజ్ కందుకూరి గారికి థాంక్స్. వారి సపోర్ట్ మాకు ఎప్పుడూ ఉండాలి. ప్రేక్షకులు మమ్మల్ని ఆశీర్వదించాలి. అందరూ మా సినిమాను చూడండి.’ అని అన్నారు. నిర్మాత వెంకటేష్ మాట్లాడుతూ.. ‘రాధా మాధవం పోస్టర్ లాంచ్ చేసిన రాజ్ కందుకూరికి థాంక్స్. మా టీం ఎంతో సహకరించారు’ అని అన్నారు. -
యాత్రలో జర్మనీ నటి సుజానే
‘యాత్ర’ ఫేమ్ మహి వి. రాఘవ్ దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం ‘యాత్ర 2’. ఇందులో దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి పాత్రలో మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాత్రలో హీరో జీవా నటిస్తున్నారు. త్రీ ఆటమ్ లీవ్స్, వీ సెల్యూలాయిడ్, శివ మేక నిర్మిస్తున్న ‘యాత్ర 2’ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. కాగా ఈ సినిమాలో సోనియా గాంధీ పాత్రని జర్మనీ నటి సుజానే బెర్నెర్ట్ పోషిస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ మేరకు ఆమె పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ను మంగళవారం రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా మహి వి. రాఘవ్ మాట్లాడుతూ–‘‘యాత్ర’కి కొనసాగింపుగా ‘యాత్ర 2’ రూపొందుతోంది. వైఎస్ జగన్గారు ప్రజా నాయకుడిగా ఎదిగిన తీరుని, 2009 నుంచి 2019 వరకు ఆంధ్రప్రదేశ్లో జరిగిన రాజకీయ ఘటనలను ఈ చిత్రంలో చూపిస్తున్నాం. ‘యాత్ర 2’ని 2024 ఫిబ్రవరి 8న రిలీజ్ చేస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: మధి, సంగీతం: సంతోష్ నారాయణన్. -
'కొన్ని ప్రేమ కథలు జీవితకాలం వెంటాడుతాయి'.. బేబీ డైరెక్టర్ మరో సంచలన కథ!
బేబీ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన దర్శకుడు సాయి రాజేశ్. తాజాగా మరో కొత్త ప్రేమకథతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. ఈ సినిమాకు సాయి రాజేశ్ కథను అందించడంతో పాటు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ మూవీలో యువ నటుడు సంతోశ్ శోభన్, బిగ్ బాస్ బ్యూటీ అలేఖ్య హారిక జంటగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి సుమన్ పాతూరి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని మాస్ మూవీ మేకర్స్ పతాకంపై శ్రీనివాస కుమార్, సాయిరాజేశ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన పూజా కార్యక్రమాన్ని హైదరాబాద్లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అక్కినేని నాగ చైతన్య ముఖ్య అతిథిగా హాజరై హీరో, హీరోయిన్లపై క్లాప్ కొట్టారు. కాగా.. ఈ చిత్రం ద్వారా హారిక హీరోయిన్గా పరిచయమవుతున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ను సాయి రాజేశ్ రిలీజ్ చేశారు. హీరో, హీరోయిన్ లిప్లాక్తో ఉన్న ఫోటో చూస్తే ఫుల్ రొమాంటిక్ లవ్ స్టోరీగానే తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. బేబీ సినిమాతో ఒక్కసారిగా సెన్సేషన్ క్రియేట్ చేసిన డైరెక్టర్ కథకు మరో సూపర్ హిట్ ఖాయంగా కనిపిస్తోంది. బేబీ తరహాలోనే మరో ప్రేమకథా చిత్రంతో టాలీవుడ్ అభిమానులను అలరించేందుకు సిద్ధమయ్యారు. కాగా.. ఈ చిత్రానికి విజయ్ బుల్గానిన్ సంగీతమందిస్తున్నారు. View this post on Instagram A post shared by Sai Rajesh (@sairazesh) -
'షరతులు వర్తిస్తాయి' లాంటి సినిమాలను ఆదరించాలి: త్రివిక్రమ్
చైతన్య రావు, భూమి శెట్టి జంటగా నటించిన చిత్రం 'షరతులు వర్తిస్తాయి'. కుమార స్వామి ( అక్షర ) దర్శకత్వం దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని స్టార్ లైట్ స్టూడియోస్ బ్యానర్ పై నాగార్జున్ సామల,శ్రీష్ కుమార్ గుండా,డా. కృష్ణకాంత్ చిత్తజల్లు నిర్మించారు. ఈ మూవీ ఫస్ట్లుక్, మోషన్ పోస్టర్ని ప్రముఖ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా త్రివిక్రమ్ మాట్లాడుతూ...మనుషులు ఉన్నంత కాలం కుటుంబాలు ఉంటాయని.. కుటుంబాలు ఉన్నంతకాలం సమస్యలు ఉంటాయని.. అందుకే చాలా కుటుంబాలు కొన్ని షరతుల మధ్యన జీవిస్తూ ఆనందంగా ఉంటున్నాయి తెలిపారు. కుటుంబ విలువలను తెలియజేసే ఇలాంటి సినిమాలను ప్రేక్షకులు థియేటర్లలో చూసి ప్రోత్సహించాలని కోరారు. మంచి కథతో ముందుకు వచ్చిన దర్శకుడు కుమార స్వామి (అక్షర) అలాగే చిత్ర యూనిట్ సభ్యులను అభినందించారు. ప్రస్తుతం మధ్య తరగతి కుటుంబాలలో ఉంటున్న సమస్యను దర్శకుడు కళ్ళకు కట్టినట్టు చిత్రీకరించారు’అని అన్నారు తెలంగాణ సాంస్కృతిక శాఖ సంచాలకులు డాక్టర్ మామిడి హరికృష్ణ. ఒక మంచి ఉద్దేశంతో ఈ సినిమా తీశాం. ప్రేక్షకులను కచ్చితంగా నచ్చుతుందని ఆశిస్తున్నాం’అని దర్శకుడు కుమార స్వామి అన్నారు. -
భయానక చిత్రం
శ్రీకాంత్ శ్రీరామ్, ఖుషీ రవి జంటగా సాయికిరణ్ దైదా దర్శకత్వం వహించిన చిత్రం ‘పిండం’. ‘ది స్కేరియస్ట్ ఫిల్మ్’ (భయానక చిత్రం) అనేది ఉపశీర్షిక. యశ్వంత్ దగ్గుమాటి నిర్మించిన ఈ సినిమా నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఈ చిత్రం టైటిల్ ఫస్ట్ లుక్ పోస్టర్ని హీరో శ్రీ విష్ణు ఆవిష్కరించి, సినిమా విజయం సాధించాలని ఆకాంక్షించారు. సాయికిరణ్ దైదా మాట్లాడుతూ–‘‘పూర్తి స్థాయి హారర్ నేపథ్యంలో ‘పిండం’ ఉంటుంది. ఈ చిత్ర కథ ప్రస్తుతం, 1990, 1930.. ఇలా మూడు కాలాల్లో జరుగుతుంది. స్క్రీన్ ప్లే హైలైట్గా ఉంటుంది’’ అన్నారు. ‘‘మా సినిమా టీజర్ను ఈ నెల 30న రిలీజ్ చేస్తాం. నవంబర్లో సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు యశ్వంత్ దగ్గుమాటి. ఈశ్వరీ రావు, అవసరాల శ్రీనివాస్, రవివర్మ తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: సతీష్ మనోహర్, సంగీతం: కృష్ణ సౌరభ్ సూరంపల్లి. -
జితేందర్ రెడ్డిగా వస్తోన్న రాకేశ్.. ఆసక్తిగా పోస్టర్!
బాహుబలి, ఎవ్వరికీ చెప్పొద్దు సినిమాలతో ప్రేక్షకులకు పరిచయమైన నటుడు రాకేశ్ వర్రే. ఎప్పుడూ ప్రయోగాత్మక పాత్రలనే ఎంచుకుంటున్నారు. కొద్దిరోజుల క్రితం జితేందర్ రెడ్డి అనే పేరుతో హీరో ఎవరో తెలియకుండా పోస్టర్లు రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే అందులో ఉన్న కథానాయకుడు ఎవరు?, అసలు టైటిల్ పేరులో ఉన్న ఈ జితేందర్ రెడ్డి ఎవరు? అనే విషయాలపై ఆసక్తి నెలకొంది. తాజాగా ఆ సస్పెన్స్ మేకర్స్ తెరదించారు. హీరో పేరును రివీల్ చేస్తూ పోస్టర్ విడుదల చేశారు. జితేందర్ రెడ్డి పాత్రలో రాకేశ్ వర్రే గన్ పట్టుకుని ఎంతో డైనమిక్గా కనిపించారు.ఈ పోస్టర్లో అతను యంగ్ పోలీస్లా కనిపించాడు. హీరోగా ఒక సినిమా చేసి హిట్ అందుకున్న రాకేశ్ చాలా గ్యాప్ తర్వాత జితేందర్ రెడ్డి మూవీతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. అయితే అసలు జితేందర్ రెడ్డి సినిమా గురించి మరిన్ని విషయాలు కొద్దిరోజులు వేచి చూడాల్సిందే. ఈ చిత్రానికి విరించి వర్మ దర్శకత్వం వహిస్తుండగా.. జితేందర్ రెడ్డి క్యారెక్టర్ నటుడు ఎంపిక కోసం దాదాపు 6 నెలల పాటు సమయం పట్టిందట. చాలా మందిని రిజెక్ట్ చేసి చివరికి రాకేష్ వర్రేను ఎంచుకున్నారు. ఈ మూవీని ముదుగంటి రవీందర్ రెడ్డి నిర్మిస్తుండగా.. గోపీ సుందర్ సంగీతమందిస్తున్నారు. -
సూపర్ హిట్ మూవీ.. తెలుగులోనూ వస్తోంది!
తమిళంలో బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచిన మూవీ 'దా...దా..'. ఈ చిత్రాన్ని ఒలింపియా మూవీస్ సంస్థ ఎస్ అంబేత్ కుమార్ సమర్పించారు. తెలుగులో ఈ చిత్రాన్ని నీరజ సమర్పణలో పాన్ ఇండియా మూవీస్, జేకే ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా ఎమ్మెస్ రెడ్డి నిర్మాతగా తీసుకొస్తున్నారు. ఈ సినిమాకు శ్రీకాంత్ నూనెపల్లి, శశాంక్ చెన్నూరు సహనిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. (ఇది చదవండి: ఒక్క ఫైట్ సీన్.. ఆ హీరో జీవితాన్నే ముగించింది!) ఈ సందర్బంగా నిర్మాత ఎంఎస్ రెడ్డి మాట్లాడుతూ.. 'తమిళంలో మంచి యూత్ఫుల్, లవ్, ఫ్యామిలీ ఎంటర్టైనర్గా నిలిచి కొన్ని కోట్ల రూపాయలు వసూళ్లు చేసిన చిత్రం దా...దా... తెలుగువారి కోసం పా...పా..పేరుతో తీసు కొస్తున్నాం. ఎన్నో పెద్ద సంస్థలు పోటీ పడినా.. తెలుగులో ఇలాంటి సినిమాని మా సంస్థ తీసుకురావాలని రెడీ అయ్యాము. ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేశాం. అతి త్వరలో గ్రాండ్గా ట్రైలర్ లాంఛ్ ఉంటుంది. తెలుగు ప్రేక్షకులు కొత్తదనాన్ని ప్రోత్సహించడంలో ముందుంటారు. అలానే పా...పా... చిత్రాన్ని తెలుగులో మంచి బ్లాక్ బస్టర్ చెయ్యాలని చేస్తారని ఆశిస్తున్నాం.' అని అన్నారు. ఈ చిత్రంలో కవిన్, అపర్ణా దాస్, మోనికా చిన్నకోట్ల, ఐశ్వర్య, భాగ్యరాజ, వి టి వి గణేష్ ప్రధాన పాత్రల్లో నటించారు. -
డెవిల్స్ ఏంజిల్
కల్యాణ్ రామ్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘డెవిల్’. దేవాన్ష్ నామా సమర్పణలో అభిషేక్ పిక్చర్స్ బ్యానర్పై అభిషేక్ నామా స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో సంయుక్తా మీనన్ హీరోయిన్. సోమవారం (సెప్టెంబర్ 11) ఆమె పుట్టినరోజు. ఈ సందర్భంగా ‘డెవిల్’ చిత్రంలో సంయుక్త పోషించిన నైషధ పాత్ర ఫస్ట్ లుక్పోస్టర్ను ‘డెవిల్స్ ఏంజిల్’ అంటూ మేకర్స్ విడుదల చేశారు. ‘‘తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ సినిమాను నవంబర్ 24న విడుదల చేస్తాం’’ అన్నారు అభిషేక్ నామా. -
SKY:ఒక వ్యక్తి అన్నీ కోల్పోయి ఒంటరిగా బ్రతకాల్సి వస్తే?
ఆనంద్, మురళీ కృష్ణంరాజు, శృతిశెట్టి, మెహబూబ్ షేక్ (ఎమ్.ఎస్) ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘స్కై’. ‘అగాధమంత బాధ నుంచి ఆకాశమంత ప్రేమ పుడితే" అన్నది ట్యాగ్ లైన్. పృథ్వి పేరిచర్ల దర్శకత్వం దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని వేలర్ ఎంటర్టైన్మెంట్ స్టూడియోస్"పై నాగిరెడ్డి గుంటక - మురళీ కృష్ణంరాజు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా పోస్టర్ని విడుదల చేశారు మేకర్స్. ‘ఒక వ్యక్తి అన్నీ కోల్పోయి ఒంటరిగా బ్రతకాల్సి వస్తే, ఏళ్ల తరబడి అనుభవిస్తున్న బాధ, ఆనందంతో తన ఒంటరితనాన్ని జయించాడా, లేదా? లేక ఏకాకి జీవితమే కదా అని రోజు గడవడం కోసం పక్కవాడ్ని మోసం చేస్తూ బ్రతికేస్తున్నాడా? అసలు ఒంటరితనం మనిషికి ఏం నేర్పుతుంది? మనిషిని ఎలా మలుస్తుంది? అనేది క్లుప్తంగా "స్కై" చిత్రం కథాంశమని, రసూల్ ఎల్లోర్ సినిమాటోగ్రఫీ, సురేష్ ఆర్స్ ఎడిటింగ్ "స్కై" చిత్రానికి మెయిన్ పిల్లర్స్ అని దర్శకుడు పృథ్వి పేరిచర్ల తెలిపారు. -
క్రైమ్ థ్రిల్లర్గా వస్తోన్న ద్రోహి.. ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్!
సందీప్ కుమార్ బొడ్డపాటి, దీప్తి వర్మ జంటగా తెరకెక్కుతోన్న చిత్రం ‘ద్రోహి’. ది క్రిమినల్ అన్నది ఉపశీర్షిక. గుడ్ ఫెల్లోస్ మీడియా ప్రొడక్షన్స్, సఫైరస్ మీడియా, వెడ్నెస్డే ఎంటర్టైన్మెంట్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. క్రైమ్ థ్రిల్లర్గా రూపొందుతున్న ఈ చిత్రానికి విజయ్ పెందుర్తి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీకాంత్ రెడ్డి, విజయ్ పెందుర్తి, రాజ శేఖర్ అర్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని ఈ నెలలోనే విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. తాజాగా ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ను దర్శకుడు క్రిష్ జాగర్లమూడి విడుదల చేశారు. ఈ సందర్భంగా క్రిష్ మాట్లాడుతూ.. 'సినిమాకు సంబంధించిన లుక్, గ్లింప్స్ చూశా. చాలా బాగుంది. ఈ సినిమాకు చక్కని విజయాన్ని సాధించి సినిమాకు పని చేసిన నటీనటులు, సాంకేతికి నిపుణులు అందరూ మంచి పేరు రావాలి. ఈ సినిమా టీమ్ అందరికీ శుభాకాంక్షలు' అని అన్నారు. దర్శకనిర్మాతలు మాట్లాడుతూ.. 'చక్కని థ్రిల్లర్ కథాంశంతో రూపొందుతున్న చిత్రమిది. ప్రేక్షకులు మెచ్చే అన్ని అంశాలు చిత్రంలో ఉంటాయి. నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తయ్యాక ఈ నెలలో సినిమాను విడుదల చేస్తాం' అని తెలిపారు. కాగా.. ఈ చిత్రంలో సందీప్ కుమార్ బొడ్డపాటి, దీప్తి వర్మ, డెబి, షకలక శంకర్, నిరోజ్, శివ, మహేష్ విట్ట, మెహ్బూబ్, చాందినీ గొల్లపూడి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. -
కొత్త కాన్సెప్ట్తో వస్తోన్న ‘సికాడా’.. ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్!
రజిత్ సీఆర్, గాయత్రి మయూర, జైస్ జోస్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతోన్న చిత్రం సికాడా. ఈ చిత్రం ద్వారా శ్రీజిత్ ఎడవనా దర్శకుడిగా పరిచయం కాబోతోన్నారు. తీర్నా ఫిల్మ్స్ అండ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై వందనా మీనన్, గోపకుమార్ పి నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ను రిలీజ్ చేశారు మేకర్స్. డైరెక్టర్ చందూ మొండేటి, యంగ్ హీరో బిగ్ బాస్ ఫేమ్ సోహెల్ చేతుల మీదుగా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. రోటీన్గా కాకుండా ఓ కొత్త కాన్సెప్ట్తో పలకరించేందుకు ‘సికాడా’ అనే చిత్రం రాబోతోంది. ఒకే టైటిల్, ఒకే కథ, 4 విభిన్న భాషలు, 24 విభిన్న ట్యూన్స్తో రాబోతోన్న ఈ మూవీ విడుదలకు ముందే అంచనాలు పెరుగుతున్నాయి. తాజాగా రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ అందరినీ ఆకట్టుకుంటోంది. సికాడా చిత్రంలో అందరూ కొత్తవారే నటించడం విశేషం. తెలుగుతో పాటు కన్నడ, తమిళం, మలయాళ భాషల్లో కూడా ఈ చిత్రాన్ని రూపొందించారు. శ్రీజిత్ గతంలో మ్యూజిక్ డైరెక్టర్గా "కాదల్ ఎన్ కవియే", "నెంజోడు చేరు" వంటి తమిళ, మలయాళ సినిమాలకు పని చేశారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను ప్రకటించనున్నట్లు తెలిపారు. ఈ సినిమా పాటలకు రవితేజ అమరనారాయణ అద్భుతమైన సాహిత్యం అందించారు. -
క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో వస్తోన్న 'క్రిమినల్' !
తమిళ నటుడు శరత్కుమార్, గౌతమ్ కార్తీక్ కలిసి నటిస్తున్న తాజా చిత్రం 'క్రిమినల్'. దక్షిణామూర్తి ఈ చిత్రాన్ని పర్సా పిక్చర్స్, పీఆర్.మీనాక్షీసుందరం, బిగ్ ప్రింట్ పిక్చర్స్, ఐబీ.కార్తీకేయన్ కలిసి నిర్మిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ ఇప్పటికే పూర్తిచేసుకుంది. ఈ చిత్రం ఫస్ట్లుక్ పోస్టర్ను మేకర్స్ విడుదల చేశారు. ఫస్ట్లుక్ పోస్టర్కు మంచి స్పందన వస్తోందని చిత్ర దర్శకుడు ఆనందాన్ని వ్యక్తం చేశారు. తాను దర్శకుడిగా ప్రయత్నాలు చేస్తున్నప్పుడు కథలు రాసుకున్నానని వాటిని తెరకెక్కించడానికి పలు ఆటంకాలను ఎదుర్కోవాల్సి వచ్చిందని అన్నారు. (ఇది చదవండి: Neha Shetty: టాలీవుడ్ని షేక్ చేస్తున్న ‘రాధిక’) అలాంటి సమయంలో తనకు టీకొట్టు వద్ద ఒక ఆలోచన వచ్చిందని అదే క్రిమినల్ చిత్ర ప్రారంభానికి శ్రీకారం చుట్టిందని పేర్కొన్నారు. నటుడు శరత్కుమార్, గౌతమ్ కార్తిక్ ఈ కథలోకి రావడంతో చిత్రానికి ఇంకా భారీ క్రేజ్ వచ్చిందన్నారు. చిత్ర షూటింగ్లో నిర్మాతలు తనకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చారని పేర్కొన్నారు. ఈ చిత్రం మాదిరి మదురై నేపథ్యంలో ఇంతకుముందు పలు ప్రేమ కథా చిత్రాలు వచ్చాయని.. అయితే వాటికి క్రిమినల్ చిత్రం పూర్తి భిన్నంగా ఉంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. నగరంలో జరిగే క్రైమ్, థ్రిల్లర్ సంఘటనలే ఈ చిత్రమని అన్నారు. కాగా దీనికి శ్యామ్ సీఎస్ సంగీతాన్ని, ప్రసన్న ఎస్ కుమార్ ఛాయాగ్రహణం అందించారని తెలిపారు. త్వరలోనే చిత్ర ఆడియో, ట్రైలర్, విడుదల తేదీలను వెల్లడించనున్నట్లు దర్శకుడు తెలిపారు. Thanks @SilambarasanTR_ for releasing our #Criminal movie First Look poster and for your wishes. https://t.co/U3ggy655Og — Parsa Pictures Pvt Ltd (@ParsaPictures) August 25, 2023 -
మరో హిట్కు సిద్ధమైన ఆదాశర్మ.. ఆసక్తిగా ఫస్ట్ లుక్ పోస్టర్!
ది కేరళ స్టోరీ సినిమాతో సూపర్ హిట్ కొట్టిన హీరోయిన్ ఆదాశర్మ. ప్రస్తుతం మరో ఇంట్రెస్టింగ్ కథలో ప్రేక్షకుల ముందుకు రానుంది. క్లాస్, మాస్ అనే తేడా లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులు ఆదరించే హారర్ జానర్తో అలరించేందు సిద్ధమైంది. సరికొత్త సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ మూవీ సీడీతో ఆదాశర్మ మన ముందుకు రాబోతోంది. డిఫరెంట్ ఫీలింగ్ కలిగింగ్ సరికొత్త స్టోరీతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇటీవలే సూపర్ హిట్ ఖాతాలో వేసుకున్న అదా శర్మ మరో లీడ్ రోల్ సినిమాలో ఆసక్తి పెంచుతోంది. (ఇది చదవండి: ‘స్టార్ మా’లో సరికొత్త సీరియల్) సీడీ (క్రిమినల్ ఆర్ డెవిల్) చిత్రాన్ని కృష్ణ అన్నం దర్శకత్వంలో తెరకెక్కిస్కున్నారు. ఎస్ఎస్సీఎమ్ ప్రొడక్షన్స్ బ్యానర్పై.. గిరిధర్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ఆర్ఆర్ ధృవన్ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. మూవీ ప్రమోషన్స్లో భాగంగా తాజాగా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. దెయ్యాల చేతుల మధ్యన ఆదాశర్మ లుక్ సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేస్తోంది. పోస్టర్ చూస్తే అదా శర్మ సీరియస్ లుక్, ఆ చుట్టూ డెవిల్స్ హ్యాండ్స్ కనిపిస్తుండటం చిత్రంలోని వైవిధ్యాన్ని తెలుపుతున్నాయి. ఫస్ట్ లుక్ పోస్టర్ చూడగానే ఆడియన్స్లో మరింత ఆసక్తిని పెంచేశారు. ఈ చిత్రంలో విశ్వంత్, జబర్దస్త్ రోహిణి, భరణి శంకర్, రమణ భార్గవ్, మహేష్ విట్టా ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. అతి త్వరలో ఈ సినిమా రిలీజ్ డేట్ ప్రకటిస్తామని మేకర్స్ ప్రకటించారు. (ఇది చదవండి: ఆ హీరోతో నటించాలని కోరిక.. కానీ ఆ పాత్ర చేయను: రాశి) -
'లాక్ డౌన్ నైట్స్'.. ఆసక్తిగా ఫస్ట్ లుక్ పోస్టర్!
జీవీ, 8 తోట్టాగల్ లాంటి సూపర్ హిట్ చిత్రాల ఫేమ్ వెట్రి హీరోగా.. పూచ్చాండి చిత్రం ఫేమ్ హంశినీ హీరోయిన్గా నటించిన తాజా చిత్రం లాక్డౌన్ నైట్స్. ఈ చిత్రానికి ఎస్ ఎస్.స్టాన్లీ దర్శకత్వం వహిస్తున్నారు. కోలీవుడ్ నిర్మాత వినోద్ శబరీస్ తాజాగా తమిళంలో నిర్మిస్తున్న చిత్రం లాక్డౌన్ నైట్స్. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి క్రేజీ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. చిత్ర టైటిల్ పోస్టర్ను సంగీత దర్శకుడు, నటుడు విజయ్ ఆంటోని చేతుల మీదుగా ఆవిష్కరించారు. కాగా.. ఇటీవల కన్నడలో కిశోర్, పూజా గాంధీ జంటగా సంహారిణి అనే భారీ చిత్రాన్ని వినోద్ శబరీస్ నిర్మించారు. ఈ చిత్రం త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. (ఇది చదవండి: 'అతనికి ఏ మహిళతోనూ రిలేషన్ లేదు'.. స్టార్ హీరోపై కంగనా ప్రశంసలు!) ఎస్ ఎస్.స్టాన్లీ ఇంతకు ముందు ఏప్రిల్ మాదత్తిల్, పుదుకోట్టైయిలిరుందు సరవణన్, వంటి సక్సెస్ఫుల్ చిత్రాలను తెరకెక్కించారు. ఈ చిత్రంలో సంగీత దర్శకుడు గంగై అమరన్, మదియళగన్, లోగన్ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. సాలై సహదేవన్ ఛాయాగ్రహణం, జస్టిస్ ప్రభాకరన్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రం షూటింగ్ను పూర్తిగా మలేషియాలో చిత్రీకరించినట్లు మేకర్స్ తెలిపారు. (ఇది చదవండి: ఈమెని గుర్తుపట్టారా? మీకు బాగా తెలిసిన స్టార్ యాంకర్) -
భార్యాభర్తల మధ్య ఆత్మ ప్రవేశిస్తే 'తంతిరం' చూడాల్సిందే
శ్రీమతి కాండ్రగుల లావణ్య రాణి సమర్పణలో 'సినిమా బండి ప్రొడక్షన్స్' పతాకంపై శ్రీకాంత్ గుర్రం, ప్రియాంక శర్మ జంటగా నటించిన చిత్రం 'తంతిరం'. ముత్యాల మెహర్ దీపక్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి శ్రీకాంత్ కాండ్రగుల (SK) నిర్మాత. షూటింగ్ పూర్తి చేసుకుని నిర్మాణాంతర కార్యక్రమాలలో బిజీగా ఉంది. అయితే ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ను మేకర్స్ విడుదల చేశారు. (ఇదీ చదవండి: Jailer Review: రజినీకాంత్ 'జైలర్' ట్విటర్ రివ్యూ) ఈ సందర్భంగా నిర్మాత శ్రీకాంత్ కాండ్రగుల మాట్లాడుతూ ' ఈ సినిమా చాలా కొత్తగా ఉంటుంది. ఇది హారర్ అంశాలతో కూడిన కుటుంబ కథ చిత్రం. భార్య భర్తల మధ్య ఒక ఆత్మ ప్రవేశిస్తే వారి దాంపత్య జీవితం ఎలా ఉంటుందో తెలుసుకోవాలి అంటే మా 'తంతిరం' చిత్రం చూడాల్సిందే. మా చిత్రం కేరళ ప్రాంతాల్లో అందమైన లొకేషన్స్ లో షూటింగ్ జరుపుకున్నాము, షూటింగ్ అంతా పూర్తి అయ్యింది. ప్రస్తుతానికి నిర్మాణాంతర పనుల్లో బిజీగా ఉంది. ఈరోజు మా చిత్రం యొక్క ఫస్ట్ లుక్ పోస్టర్ను విడుదల చేశాం. త్వరలోనే టీజర్, ట్రైలర్తో మీ ముందుకు వస్తాం' అని నిర్మాత శ్రీకాంత్ తెలిపారు. -
ధీమహి చిత్రం ఫస్ట్ లుక్ విడుదల
కెప్టెన్ కుక్ ఫిలిమ్స్ పతాకంపై 7:11PM చిత్రం ఫేమ్ సాహస్ పగడాల హీరోగా నటించిన సినిమా 'ధీమహి'. విరాట్ కపూర్, సాహస్ పగడాల సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సాహస్ పగడాల, నవీన్ కంటె దర్శకులు. ఇందులో నిఖిత చోప్రా హీరోయిన్. షారోన్ రవి సంగీతం అందించారు. షూటింగ్, నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన మొదటి పోస్టర్ను మేకర్స్ విడుదల చేశారు. (ఇదీ చదవండి: కుమారుడి కోసం ఏడ్చేవాడు.. రఘువరన్ మృతిపై తొలిసారి మాట్లాడిన సోదరుడు) అనంతరం చిత్ర యూనిట్ మాట్లాడుతూ 'ధీమహి చిత్రం చాలా కొత్తగా ఉంటుంది. 7:11 చిత్రంలో నటించిన సాహస్ పగడాల ఈ చిత్రంలో నటిస్తూ, స్వీయ దర్శకత్వం వహించారు. ఇది ఒక థ్రిల్లర్ చిత్రం. షూటింగ్, నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తి అయ్యాయి. మా చిత్రంలోని పాటలను త్వరలో జీ మ్యూజిక్ కంపెనీ ద్వారా విడుదల చేస్తాము. ప్రస్తుతం సెన్సార్ పనుల్లో ఉన్నాము. సినిమా చాలా కొత్తగా ఉంటుంది, త్వరలోనే ట్రైలర్తో మీముందుకు వస్తాం. ఆపై రిలీజ్ డేట్ను కూడా ప్రకటిస్తాం.' అని తెలిపారు. -
రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్గా వస్తోన్న 'రసవతి'..!
అర్జున్దాస్, తాన్యా రవిచంద్రన్ జంటగా నటిస్తోన్న తాజా చిత్రం 'రసవాది'. మౌనగురు, మహాముని వంటి విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు శాంతకుమార్. కథలను నమ్మి చిత్రాలు చేసే ఈయన పాత్రలకు తగ్గ నటీనటులను ఎంపిక చేసుకుంటారు. అలా శాంతకుమార్ తెరకెక్కిస్తున్న మూడో చిత్రం 'రసవాది'. డీఎన్ఏ మెకానిక్ కంపెనీ సరస్వతి సినీ క్రియేషన్న్స్ సంస్థతో కలిసి నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో నటి రమ్య సుబ్రమణియన్, జీఎం సుందర్, సుజిత్ శంకర్, రేష్మ, సుజాత, రిషీకాంత్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఎస్ఎస్ తమన్ సంగీతమందిస్తుండగా.. వరవణన్ ఇళవరసు, శివకుమార్ల ద్వయం ఛాయాగ్రహణం అందిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర ఫస్ట్లుక్ పోస్టర్ను శుక్రవారం విడుదల చేశారు. (ఇది చదవండి: రజనీకాంత్ రెమ్యునరేషన్ అన్ని కోట్లా? బడ్జెట్లో సగం సూపర్స్టార్కే! ) దర్శకుడు శాంతకుమార్ మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో క్రైమ్, రొమాంటిక్, యాక్షన్, థ్రిల్లర్ కథా చిత్రంగా ఇది ఉంటుందని చెప్పారు. తాను గత చిత్రాల తరహాలోనే ఈ చిత్రం ప్రేక్షకులకు సరికొత్త థియేటర్ ఎక్స్పీరియన్న్స్ ఇస్తుందన్నారు. చిత్ర షూటింగ్ను కొడైకనాల్, మదురై, కడలూర్, పళని ప్రాంతాల్లో చిత్రీకరించినట్లు చెప్పారు. చిత్ర ఆడియో, విడుదల తేదీ వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు చెప్పారు. చిత్ర ఫస్ట్లుక్ పోస్టర్ సినీ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. (ఇది చదవండి: శ్రీరామ్ కార్తీక్ హీరోగా కొత్త ప్రేమ కథా చిత్రం!) A movie I’ve been super excited about! Can’t wait for you all to watch what @Santhakumar_Dir has made#Rasavathi 🔥💥 A @MusicThaman Musical 💥@actortanya @ReshmaVenkates1 @actorramya @GMSundar_ @SPremChandra1 @saranelavarasu @EditorSabu @minu_jayebal @dancersatz… pic.twitter.com/NshqoLmP5J — Arjun Das (@iam_arjundas) August 5, 2023 -
త్వరలోనే మరో ప్రేమకథా చిత్రం ‘మదిలో మది’
టాలీవుడ్లో ప్రేమ కథా చిత్రాలకు ఎప్పుడూ మంచి ఆదరణ ఉంటుంది. లవ్స్టోరీలో వైవిద్యం ఉంటే చాలు ఆ చిత్రాన్ని కచ్చితంగా హిట్ చేస్తారు. అందుకు మంచి ఉదాహరణ ఇటీవల విడుదలైన ‘బేబీ’ మూవీ. యువతను ఆకట్టుకునే కథ, కథనాలతో సాయి రాజేష్ తీసిన బేబి సినిమా బ్లాక్ బస్టర్గా నిలిచింది. అలాంటి కోవలోకి చెందే మరో బ్యూటీఫుల్ లవ్ స్టోరీగా మదిలో మది అనే చిత్రం రాబోతోంది. జై, శీను, స్వీటీ, సిరి రావుల చారి, సునీతలు ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు ప్రకాష్ పల్ల దర్శకత్వం వహించారు. ఎస్ కే ఎల్ ఎమ్ క్రియేషన్స్ మీద నేముకూరి జయకుమార్ నిర్మాతగా ఈ చిత్రం రూపొందుతోంది. ఈ మూవీ రిలీజ్ డేట్ అండ్ ఫస్ట్ లుక్ పోస్టర్ను బేబి మూవీ డైరెక్టర్ సాయి రాజేష్ విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘మదిలో మది సినిమా ఆగస్ట్ 18న విడుదల కాబోతోంది. నేను ట్రైలర్ను చూశాను అద్భుతంగా ఉంది. ఈ చిత్రం పెద్ద విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నాను. యూనిట్కు ఆల్ ది బెస్ట్ ’ అని అన్నారు. -
Yamudu Movie: ‘యముడి’పై కొత్త చిత్రం
తెలుగు తెరపై యముడి కేరెక్టర్ ఓ సక్సెస్ ఫార్ములా. ఇప్పటికే యముని వేషాలతో వచ్చిన సినిమాలు ఆడియన్స్ ఆదరించారు. కొన్ని చిత్రాలు అయితే బాక్సాఫీస్ని షేక్ చేశాయి. అయితే ఈ మధ్య కాలంలో యముని కాన్సెప్ట్తో కొత్త చిత్రమేది రాలేదు. కానీ త్వరలోనే తెలుగు ప్రేక్షకులకు మరోసారి యమలోకాన్ని చూపించేందుకు సిద్ధమయ్యారు జగదీష్ ఆమంచి. జగన్నాధ పిక్చర్స్ పతకం పై స్వీయదర్శకత్వంలో నూతన నటీనటులతో ‘యముడు’అనే చిత్రాన్ని రూపొందించబోతున్నారు. ధర్మో రక్షతి రక్షితః ఉప శీర్చిక. తాజాగా ఈ చిత్రం ఫస్ట్ లుక్తో పాటు టైటిల్ మోషన్ పోస్టర్ని విడుదల చేశారు. ‘ఇదొక ఒక థ్రిల్లర్ చిత్రం. కథ తో పాటు మంచి మెసేజ్ ఉన్న చిత్రమిది. ఆగష్టు మొదటి వారం లో షూటింగ్ ప్రారంభం అవుతుంది’అని దర్శకనిర్మాత జగదీష్ తెలిపారు. ఈ చిత్రానికిష్ణు కెమెరా మాన్ గా వ్యవహారిస్తుండగా భవాని రాకేష్ సంగీతం అందిస్తున్నారు.త్వరలోనే పూర్తి వివరాలు తెలియజేయనున్నారు. -
ఘోరంగా హర్ట్ అయిన ప్రభాస్ ఫ్యాన్స్
-
ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టిన రుహానీ శర్మ
రుహాణీ శర్మ పోలీసాఫీసర్గా నటించిన చిత్రం ‘హర్’. శ్రీధర్ స్వరాఘవ్ దర్శకత్వంలో రఘు సంకురాత్రి, దీపాసంకురాత్రి నిర్మించారు. సురేష్ ప్రొడక్షన్స్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ద్వారా ఈ సినిమా జూలై 21న విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్మాత డి. సురేష్బాబు ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ను విడుదల చేశారు. పోలీస్ ఇన్వెస్టిగేషన్ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం ఇది. వికాస్ వశిష్ట, ప్రదీప్ రుద్ర, జీవన్ కుమార్, అభిగ్న్య, సంజయ్ స్వరూప్, బెనర్జీ, రవివర్మ కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రానికి సంగీతం: పవన్. -
హీరో విజయ్ ఇలా చేస్తారనుకోలేదు.. పోస్టర్పై తీవ్ర విమర్శలు!
నటుడు విజయ్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం 'లియో'. లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఎస్ఎస్ లలిత్కుమార్ భారీ ఎత్తున నిర్మిస్తున్న విషయం తెలిసిందే. నటి త్రిష , ప్రియా ఆనంద్ హీరోయిన్లుగా నటిస్తున్న ఇందులో బాలీవుడ్ స్టార్ సంజయ్దత్, నటుడు అర్జున్, మన్సూర్ అలీఖాన్ దర్శకుడు మిష్కిన్, గౌతమ్ వాసుదేవన్, శాండీ మాస్టర్, మాథ్యూథామస్ ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. (ఇది చదవండి: జీవితంలో ఏదీ అంతా ఈజీ కాదు: హీరోయిన్) మాస్టర్ చిత్రం తర్వాత విజయ్, దర్శకుడు లోకేష్ కనకరాజ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం కావడంతో లియోపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కాగా చిత్రం చివరి దశకు చేరుకుంది. దీంతో చిత్రం గురించి దర్శకుడు లోకేష్ కనకరాజ్ అప్డేట్స్ ఇస్తున్నారు. ఈ చిత్రం విడుదలకు ముందే ఆడియో హక్కులు, ఓటీటీ హక్కును అంటూ ఇప్పటికే రూ.350 కోట్లకు పైగా వ్యాపారం జరిగినట్లు టాక్ వైరల్ అవుతోంది. తాజాగా మరో అప్డేట్ వెల్లడించారు. ఈనెల 22న నటుడు విజయ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా చిత్రంలోని అలర్ట్ ఈగో నా రెడీ అనే పల్లవితో సాగే తొలి పాటను విడుదలైనట్లు పోస్టర్ ద్వారా వెల్లడించారు. ఈ పోస్టర్లో విజయ్ చేతుల్లో గన్ను, నోట్లో సిగరెట్ పెట్టుకుని ఫోర్స్గా కనిపించడంతో ఆయన అభిమానులు ఖుషీ అవుతున్నారు. అయితే దీనిపై కొన్ని విమర్శలు కూడా వస్తున్నాయి. ముఖ్యంగా పీఎంకే పార్టీ నేత రామదాసు విజయ్పై విమర్శలు గుప్పించారు. ఆయన ఒక ప్రకటనలో పేర్కొంటూ విజయ్ తన వాగ్దానాన్ని నిలబెట్టుకోలేకపోయారని అన్నారు. చాలా కాలం క్రితం తన చిత్రాల్లో సిగరెట్లు కాల్చే సన్నివేశాలను, మద్యం తాగే సన్నివేశాలను చోటు చేసుకోవడాన్ని తాను అనుమతించనని వాగ్దానం చేశారన్నారు. అలాంటిది ఇప్పుడు ఆ మాట తప్పి ఇప్పుడు లియో చిత్రంలో అలా రెండు అంశాలు చోటు చేసుకోవడం ఆయన అభిమానులను చెడు త్రోవ పట్టించడం కాదా అని ప్రశ్నించారు. (ఇది చదవండి: తమిళనాడులో ఆస్తులు ఉండేవి.. అన్నీ అమ్మేశా: సుధాకర్) First Single #NaaReady on @actorvijay Anna's Birthday #Leo 🔥🧊 pic.twitter.com/xG5T46GWyR — Lokesh Kanagaraj (@Dir_Lokesh) June 16, 2023 -
తిరగబడరా...
రాజ్ తరుణ్ హీరోగా, మాల్వీ మల్హోత్రా, మన్నారా చోప్రా కథానాయికలుగా నటిస్తున్న చిత్రం ‘తిరగబడరా సామీ’. ఎస్. రవికుమార్ చౌదరి దర్శకత్వంలో సురక్ష్ ఎంటర్టైన్మెంట్ మీడియా బ్యానర్పై మల్కాపురం శివకుమార్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ని డైరెక్టర్ వీవీ వినాయక్ విడుదల చేసి, సినిమా మంచి విజయం సాధించాలని అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: జేబీ, కెమెరా: జవహర్ రెడ్డి. -
'గుంటూరు కారం' శ్రీలీల ఫస్ట్ లుక్.. ఇది గమనించారా?
తెలుగులోకి ఎప్పటికప్పుడు కొత్త హీరోయిన్లు వస్తూనే ఉంటారు. కానీ హిట్ కొట్టి నిలబడేవాళ్లు మాత్రం చాలా తక్కువ. ప్రస్తుతం టాలీవుడ్ లో టాక్ ఆఫ్ ది టౌన్ అయిపోయిన బ్యూటీ అనగానే అందరికీ గుర్తొచ్చే పేరు శ్రీలీల. తెలుగులో చేసిన ఫస్ట్ మూవీ అంతంతమాత్రంగా ఆడినప్పటికీ.. అవకాశాల మాత్రం వెల్లువలా వచ్చేశాయి. (ఇదీ చదవండి: శ్రీలీలను కొట్టిన బాలకృష్ణ! అసలేం జరిగిందంటే?) గతేడాది 'ధమాకా'తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన శ్రీలీల.. ప్రస్తుతం అరడజనుకి పైగా సినిమాల్లో హీరోయిన్ గా చేస్తూ మోస్ట్ బిజీయెస్ట్ బ్యూటీ అయిపోయింది. మహేష్-త్రివిక్రమ్ కాంబోలో తీస్తున్న 'గుంటూరు కారం'లోనూ శ్రీలీల వన్ ఆఫ్ ది హీరోయిన్. బుధవారం ఈమె బర్త్ డే సందర్భంగా ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేశారు. ఈ లుక్ ప్రకారం విలేజీ బ్యూటీగా శ్రీలీల కనిపించనుంది. లంగా ఓణీలో కాలికి నెయిల్ పాలిష్ పెడుతున్న లుక్ ని రిలీజ్ చేశారు. ఇలా శ్రీలీలని చూస్తుంటే.. 'గుంటూరు కారం'లో హీరో మహేష్ బాబునే డామినేట్ చేస్తుందా అనిపించేలా ఉంది. త్రివిక్రమ్ తీస్తున్న ఈ సినిమాను వచ్చే సంక్రాంతి కానుకగా జనవరి 13న రిలీజ్ చేయనున్నారు. అలానే రామ్-బోయపాటి మూవీలో శ్రీలీల ఫస్ట్ లుక్ ని కూడా రిలీజ్ చేశారు. ఇందులో మోడ్రన్ గా కనిపిస్తూ ఆకట్టుకుంటోంది. (ఇదీ చదవండి: కోపమొస్తే తల్లి అని కూడా చూడను, తిట్టేస్తా: శ్రీలీల) Here’s wishing the extremely talented & gorgeous @sreeleela14 a very Happy Birthday! 🤩 - Team #GunturKaaram 🔥🌶️#HBDSreeLeela ✨ Super 🌟 @urstrulyMahesh #Trivikram @hegdepooja @MusicThaman @vamsi84 #PSVinod @NavinNooli #ASPrakash @haarikahassine pic.twitter.com/pPFBZ9EQUf — Haarika & Hassine Creations (@haarikahassine) June 14, 2023 -
విజయ్ ఆంటోనీ లేటెస్ట్ మూవీ.. ఫస్ట్ లుక్ పోస్టర్ వచ్చేసింది!
విజయ్ ఆంటోనీ టాలీవుడ్ అభిమానులకు పరిచయం చేయాల్సిన పనిలేదు. ఇటీవలే బిచ్చగాడు -2 సినిమాతో సూపర్ సక్సెస్ అందుకున్నారు. తాజాగా ఇప్పుడు మరో డిఫరెంట్ కాన్సెప్ట్తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. విజయ్ ఆంటోనీ హీరోగా 'విక్రమ్ రాథోడ్' సినిమా తెలుగులోనూ రాబోతోంది. (ఇది చదవండి: ప్రభాస్ 'ఆదిపురుష్'.. వెండితెరపై మెప్పించిన టాలీవుడ్ రాముళ్లు వీరే!) అపోలో ప్రొడక్షన్స్, ఎస్ఎన్ఎస్ మూవీస్ సంయుక్త సమర్పణలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు బాబు యోగేశ్వరన్ దర్శకత్వం వహిస్తున్నారు. రావూరి వెంకటస్వామి, కౌసల్య రాణి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజా సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్ర ప్రమోషన్స్లో భాగంగా తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ పోస్టర్లో ముఖంపై గాయాలతో కనిపిస్తున్నారు విజయ్ ఆంటోనీ. అతి త్వరలో ఈ మూవీ రిలీజ్ డేట్ ప్రకటించనున్నారు మేకర్స్. ఈ చిత్రంలో సురేష్ గోపి, రమ్య నంబీశన్, సోను సూద్, సంగీత ముఖ్య పాత్రలు పోషిస్తుండగా.. ఛాయా సింగ్, యోగి బాబు, రాధ రవి, కస్తూరి శంకర్, రోబో శంకర్, మనీష్ కాంత్ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. (ఇది చదవండి: అచ్చిరాని సమ్మర్.. ఈసారి తెలుగు సినిమాలన్నీ కూడా!?) -
ద్రవిడభూమి గొప్పతనంతో...
ప్రముఖ రచయిత సౌద అరుణ్ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘కోడ్ రామాయణ’. ఈ చిత్రంలో సుమారు 50 మంది నూతన నటీనటులు యాక్ట్ చేశారు. సౌద అరుణ్ స్టూడియోస్ పతాకంపై రూపొందిన ఈ చిత్రం టైటిల్ అనౌ¯Œ ్సమెంట్ హైదరాబాద్లో జరిగింది. ముఖ్య అతిథులుగా వచ్చిన బౌద్ధ భిక్షువు బంతె షీల్ రక్షిత్, ప్రముఖ రచయిత్రి లలిత. పి. చేతుల మీదుగా ‘కోడ్ రామాయణ’ ఫస్ట్ లుక్ పోస్టర్ను రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా దర్శక–నిర్మాత సౌద అరుణ్ మాట్లాడుతూ–‘‘ద్రవిడ భూమి గొప్పతనాన్ని ప్రపంచం మరింత అర్థం చేసుకోవాలనే ఈ సినిమా చేస్తున్నాం. ఈ చిత్రం మొత్తం మూడు భాగాలుగా(కోడ్ రామాయణ, రావణ చరిత్ర, ఉత్తర రామాయణం) ప్రేక్షకుల ముందుకు వస్తుంది’’ అన్నారు. ఈ చిత్రంలో దుర్వాసుడు పాత్రలో నటించిన భరద్వాజ మాట్లాడుతూ–‘‘కోడ్ రామాయణ’ అంటే రామాయణ అంతరార్థం అని అర్థం. ఈ సినిమాని చిరంజీవిగారికి చూపించి, రెండో భాగంలో రావణాసుర పాత్ర చేయమని కోరతాం’’ అన్నారు. నటులు శ్రీశైల్ రెడ్డి, పి.జగదీశ్ పాల్గొన్నారు. -
ఆసక్తి పెంచుతున్న శివ కోన కొత్త సినిమా పోస్టర్
శివా కోన దర్శకత్వంలో ఓ కొత్త చిత్రం తెరకెక్కుతుంది. ఏఎమ్ఎఫ్, కోన సినిమా బ్యానర్లపై అనిల్ మోదుగ, శివ కోనా సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఇంకా టైటిల్ ఖరారు చేయలేదు కానీ పోస్టర్ని మాత్రం వదిలారు. ఆ పోస్టర్లోక్యారెక్టర్ల ముఖాలు కనిపించకపోవడం అందరికి ఆసక్తిని పెంచుతోంది. ఈ పోస్టర్ ను చూస్తే మొత్తం ముగ్గురు అబ్బాయిలు, ముగ్గురు అమ్మాయిలు పక్కనే ఒక మిడిల్ ఏజ్ డ్ క్యారెక్టర్ ఉన్నట్లు కనిపిస్తుంది. ఈ సినిమా పోస్టర్ ను బట్టి ఈ సినిమా ఓ క్రైమ్ థ్రిల్లర్ ఎంటర్టైనర్ గా తెరక్కబోతుందని అర్థం అవుతుంది. కాలేజీకి వెళ్లే కుర్రాళ్ల చేతుల్లో గన్ను ఉంది. వాళ్ల పక్కనే ముగ్గురు అందమైన అమ్మాయిలు ఉన్నారు. వీరికి ముందు ఒక సూటు వేసుకున్న గ్రే షేడ్ క్యారెక్టర్, తన పక్కనే ఓ గ్లామర్ బ్యూటీ ఉంది. వీరే కాకుండా రేయ్ ఎవర్రా మీరంతా అంటే నోట్లో సిగర్ పెట్టుకుని కొని, చేతిలో కోడిని పట్టుకొని ఒక ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ కుర్చీలో కూర్చున్న పోస్టర్ ఆలరిస్తోంది. -
NTR30: ఎన్టీఆర్30 ఫస్ట్లుక్ పోస్టర్.. టైటిల్ అదిరిపోయింది!
జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న తాజా చిత్రం 'ఎన్టీఆర్30'. ప్రస్తుతం వర్కింగ్ టైటిల్తో రూపొందుతున్న ఈ చిత్రంలో బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. ఆర్ఆర్ఆర్ తర్వాత యంగ్ టైగర్ నటిస్తున్న సినిమా కావడంతో ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. (ఇది చదవండి: గ్లోబల్ స్టార్ NTR గురించి మీకు తెలియని విషయాలు!) అయితే ఈనెల 20న ఎన్టీఆర్ బర్త్ డే కావడంతో ఫ్యాన్స్కు అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఎన్టీఆర్ 30 టైటిల్తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్ను చిత్రబృందం విడుదల చేసింది. ఈ చిత్రానికి అందరూ ఊహించినట్లుగానే దేవర అనే టైటిల్ ఫిక్స్ చేశారు. కత్తి చేతిలో పట్టుకుని సముద్రం పక్కన నిలబడి ఉన్న ఎన్టీఆర్ పోస్టర్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. (ఇది చదవండి: ఎన్టీఆర్30 టైటిల్ నాదే.. బండ్ల గణేష్ ట్వీట్ వైరల్) జనతా గ్యారేజ్ తర్వాత కొరటాల, తారక్ కలిసి చేస్తున్న ప్రాజెక్ట్ ఇదే కావడంతో అభిమానుల్లోనూ క్యూరియాసిటీ పెరిగిపోయింది. ఈ సినిమాలో ఇప్పటికే జాన్వీ లుక్ని రివీల్ చేయగా.. ఇంతవరకు ఎన్టీఆర్ లుక్ని రిలీజ్ చేయలేదు. తారక్ బర్త్డేకు ఒకరోజు ముందుగానే ఫ్యాన్స్కు బిగ్ సర్ప్రైజ్ ఇచ్చారు మేకర్స్. ఈ చిత్రాన్ని 2024 ఏప్రిల్ 5న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయనున్నారు. ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతమందించనుండగా.. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. #Devara pic.twitter.com/bUrmfh46sR — Jr NTR (@tarak9999) May 19, 2023 -
NTR30: ఫ్యాన్స్కి గుడ్న్యూస్.. ఎన్టీఆర్ ఫస్ట్లుక్ కోసం బీ రెడీ
జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్30 అనే వర్కింగ్లో టైటిల్తో రూపొందుతున్న ఈ చిత్రంలో జాన్వీ కపూర్ తారక్కి జోడీగా నటిస్తుంది. ఇప్పటికే పట్టాలెక్కిన ఈ సినిమా షూటింగ్ ఇప్పుడు శరవేగంగా కొనసాగుతుంది. ఆర్ఆర్ఆర్ తర్వాత యంగ్ టైగర్ నటిస్తున్న సినిమా కావడంతో ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. జనతా గ్యారేజ్ తర్వాత కొరటాల, తారక్ కలిసి చేస్తున్న ప్రాజెక్ట్ ఇదే కావడంతో అభిమానుల్లోనూ క్యూరియాసిటీ పెరిగిపోయింది. ఇదిలా ఉంటే తాజాగా తారక్ ఫ్యాన్స్ కోసం మేకర్స్ అదిరిపోయే అప్డేట్ను అందించారు. ఈ సినిమా నుంచి ఎన్టీఆర్ ఫస్ట్లుక్ పోస్టర్ను ఈరోజు(శుక్రవారం)రాత్రి 7.02 నిమిషాలకు విడుదల చేయనున్నారు. ఈమేరకు అధికారికంగా ప్రకటించారు. ఇప్పటికే జాన్వీ లుక్ని రివీల్ చేయగా ఇంతవరకు ఎన్టీఆర్ లుక్ని రిలీజ్ చేయలేదు. దీంతో ఈ అప్డేట్ కోసం ఫ్యాన్స్ ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. తారక్ బర్త్డేకు ఒకరోజు ముందుగానే సర్ప్రైజ్ లభిస్తుండటంతో అభిమానులు పండగ చేసుకుంటున్నారు. -
యదార్థ సంఘటన ఆధారంగా 'గూడు'.. ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్
కోలీవుడ్లో వైవిధ్యభరిత కథ, కథనాలతో కూడిన ప్రయోగాత్మక చిత్రాలకు ఎప్పుడూ మంచి ఆదరణ ఉంటుంది. ఆ కోవకు చెందిన చిత్రమే గూడు. స్కైమూన్ ఎంటర్టైన్మెంట్, ఏ ఎంటర్టైన్మెంట్ సంస్థల అధినేతలు ఎం.గణేశ్, పి.కన్నన్ కలిసి నిర్మిస్తున్న ఈజ్ చిత్రం ద్వారా జోయల్ విజయ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. కాగా చిత్ర టైటిల్ను, ఫస్ట్ పోస్టర్ను శుక్రవారం విడుదల చేశారు. విశేషం ఏంటంటే ఈ పోస్టర్లో నటీనటులు ఎవరు లేరు. చిత్రం టైటిల్కు అద్దం పట్టేలా గూడు ఫొటోను మాత్రమే పోస్టర్ పొందుపరిచారు. చిత్ర చిత్ర వివరాలను దర్శకుడు తెలుపుతూ యదార్థ సంఘటన ఇతివృత్తంగా రూపొందిస్తున్న కథా చిత్రం ఇదని చెప్పారు. ఇందులో నటించే నటీనటులు, సాంకేతిక వర్గం వివరాలను త్వరలోనే అధికారికంగా వెల్లడించనున్నట్లు పేర్కొన్నారు. ఈ చిత్రం వైవిద్యంగా ఉంటుందని చెప్పారు. చిత్ర ఫస్ట్లుక్ పోస్టర్కు సినీ వర్గాలు, ప్రేక్షకుల నుంచి విశేష స్పందన వస్తోందన్న ఆనందాన్ని వ్యక్తం చేశారు. Here is the first look of #Koodu 🪺 A heartwarming tale based on a true story, Releasing in Tamil, Telugu, Hindi, Kannada and Malayalam languages. #KooduFirstLook #SkyMoonEntertainment #AEntertainment #MGanesh #KannanP @joyalvijay_dir @arunprajeethm @proyuvraaj pic.twitter.com/JyDsCWfH7m — Sreedhar Pillai (@sri50) May 5, 2023 -
సస్పెన్స్ థ్రిల్లర్గా హీట్.. ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్
వర్దన్ గుర్రాల, స్నేహా ఖుషి జంటగా నటించిన చిత్రం 'హీట్'. ఈ చిత్రానికి ఎం.ఎన్.అర్జున్, శరత్ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను ర్యాన్ స్టూడియోస్, కౌముది సినిమాస్ బ్యానర్ల మీద ఎం.ఆర్.వర్మ, సంజోష్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సస్పెన్స్ థ్రిల్లర్ జానర్లో తెరకెక్కించిన ఈ మూవీని తెరకెక్కించారు. తాజాగా ఈ చిత్ర టైటిల్ పోస్టర్, హీరో ఫస్ట్ లుక్ పోస్టర్ను దర్శకుడు శైలేష్ కొలను చేతుల మీదుగా రిలీజ్ చేశారు. ఈ టైటిల్ పోస్టర్తోనే సినిమా థీమ్ ఏంటన్నది చెప్పేశారు. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ను చూస్తుంటే కారు, నడిచి వస్తున్నట్టుగా మనిషి, భూతద్దం వంటివి చూస్తుంటే..ఇది ఒక ఇన్వెస్టిగేషన్ సస్పెన్స్ థ్రిల్లర్ అని అర్థమవుతోంది. పోస్టర్తో ప్రేక్షకుల్లో మరింత ఆసక్తిని పెంచింది చిత్రబృందం. ఈ సినిమాకు గౌతమ్ రవిరామ్ సంగీతాన్ని అందించగా.. రోహిత్ బాచు కెమెరామెన్గా పని చేశారు. శివన్ కుమార్ కందుల, శ్రీధర్ వెజండ్ల సహ నిర్మాతలుగా వ్యవహరించారు. ఈ చిత్రంలో వర్దన్ గుర్రాల, స్నేహా ఖుషి, మోహన్ సాయి, అంబికా వాణి, వంశీ రాజ్, పుల్కిత్, అప్పాజీ అంబరీష, జయ శ్రీ రాచకొండ, ప్రభావతి వర్మ ప్రధాన పాత్రల్లో నటించారు.