First Look Poster
-
విద్రోహి చాలా మంచి కథ: శ్రీకాంత్
రవి ప్రకాశ్, శివకుమార్, చరిష్మా శ్రీకర్, సాయికి ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘విద్రోహి’. వీఎస్వీ దర్శకత్వంలో విజ్జన వెంకట సుబ్రహ్మణ్యం, పప్పుల కనకదుర్గా రావు నిర్మించిన ఈ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ త్వరలోనే రిలీజ్ కానుంది. ఈ సినిమా ఫస్ట్ లుక్ పొస్టర్ను రిలీజ్ చేసిన నటుడు శ్రీకాంత్ మాట్లాడుతూ– ‘‘ఈ సినిమా స్టోరీ నాకు తెలుసు. చాలా మంచి మూవీ అవుతుంది.రవిప్రకాశ్ మంచి టాలెంట్ ఉన్న ఆర్టిస్టు. ‘విద్రోహి’ పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను’’ అన్నారు. ‘‘ఇందులో నేను పొలీసాఫీసర్ పాత్ర చేశాను. ఓ డిఫరెంట్ సస్పెన్స్ థ్రిల్లర్ ఫిల్మ్ ఇది’’ అని తెలిపారు రవిప్రకాశ్. ‘‘ఓ సరికొత్త పాయింట్తో మేం తీసిన ఈ సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ మూవీని ఏప్రిల్లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాం’’ అని పేర్కొన్నారు వీఎస్వీ. ‘‘విద్రోహి’ సినిమా ఆడియన్స్ను ఆకట్టుకుంటుంది’’ అనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు పప్పుల కనకదుర్గా రావు. నటుడు శివకుమార్ మాట్లాడారు. -
లేడీ ఓరియంటెడ్ పవర్ఫుల్ చిత్రం.. ఆసక్తిగా ఫస్ట్ లుక్ పోస్టర్
ఆనంది, వరలక్ష్మిశరత్కుమార్ ప్రధాన పాత్రల్లో వస్తోన్న చిత్రం శివంగి. ఈ చిత్రాన్ని దేవరాజ్ భరణి ధరణ్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. ఫస్ట్ కాపీ మూవీస్ బ్యానర్పై నరేష్ బాబు నిర్మిస్తున్నారు. పవర్ ఫుల్ విమెన్ సెంట్రిక్ ఫిల్మ్గా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్ను విడుదల చేశారు.సంక్రాంతికి వస్తున్నాం మూవీతో సూపర్ హిట్ కొట్టిన అనిల్ రావిపూడి చేతుల మీదుగా శివంగి ఫస్ట్ లుక్ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చిత్ర బృందానికి అభినందనలు తెలిపారు. ఈ సినిమా గ్రాండ్ సక్సెస్ అవ్వాలని కోరారు. ఫస్ట్ లుక్ పోస్టర్ చూస్తుంటే పవర్ ఫుల్, సెన్సేషనల్ కథతో రూపొందించినట్లు తెలుస్తోంది. ఫస్ట్ లుక్ పోస్టర్ ఈ సినిమాపై మరింత క్యురియాసిటీని పెంచింది. సోఫాలో డైనమిక్ గా కూర్చున్న ఆనంది స్టన్నింగ్ లుక్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ చిత్రంలో జాన్ విజయ్, డాక్టర్ కోయ కిషోర్ కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని మార్చి 7న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఈ చిత్రానికి ఏహెచ్ కాషిఫ్, ఎబినేజర్ పాల్ మ్యూజిక్ అందిస్తున్నారు. Happy to Unveil the Title & First look Poster of #Shivangi Movie.Congratulating the entire team for the grand success of the film.@anandhiActress @varusarath5 @Bharanidp #NareshBabuP #AHKaashif #SamjithMohammed #RaghuKulakarni @Teju_PRO @RainbowMedia_ @firstcopymovies pic.twitter.com/z5bXujUECT— Anil Ravipudi (@AnilRavipudi) February 19, 2025 -
‘కర్మ స్థలం’లో నటించడంతో చాలా సంతృప్తి కలిగింది: హీరోయిన్ అర్చన
అర్చన శాస్త్రి, మితాలి చౌహాన్, వినోద్ అల్వా, కలకేయ ప్రభాకర్, బాలగం సంజయ్, నాగ మహేష్, దిల్ రమేష్, చిత్రం శ్రీను ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం ‘కర్మ స్థలం’(Karmasthalam).రాయ్ ఫిల్మ్స్ బ్యానర్పై శ్రీనివాస్ సుబ్రహ్మణ్య నిర్మాణంలో రాకీ షెర్మన్ తెరకెక్కించిన చిత్రం ఫస్ట్లుక్ పోస్టర్ని తాజాగా రిలీజ్ చేశారు.కర్మస్థలం అంటూ రిలీజ్ చేసిన ఈ పోస్టర్లో కనిపించిన పాత్రలు, ఆ పోస్టర్ను డిజైన్ చేసిన తీరు ఆకట్టుకునేలా ఉంది. ఇక అర్చనా లుక్, గెటప్ ఈ పోస్టర్లో హైలెట్ అవుతోంది. బ్యాక్ గ్రౌండ్లో అమ్మవారి షాడో కనిపించడం చూస్తుంటే.. ఈ చిత్రానికి ఏ రేంజ్లో వీఎఫ్ఎక్స్ను వాడారో అర్థం చేసుకోవచ్చు. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్తో సినిమా మీద అంచనాలు పెంచేశారు. ఫస్ట్ లుక్ లాంచ్ చేసిన అనంతరం..హీరోయిన్ అర్చన మాట్లాడుతూ.. ‘మహిషాసుర మర్దిని కాన్సెప్ట్తో ఈ మూవీని తెరకెక్కించారు. ఇంత మంచి సబ్జెక్ట్ని, కర్మ స్థలం వంటి అద్భుతమైన టైటిల్తో సినిమాను తెరకెక్కించిన రాకీ గారికి థాంక్స్. కథను చెప్పేందుకు వచ్చినప్పుడు రాకీని చూసి కొత్త వాడు కదా.. ఎలా తీస్తారో అని అనుకున్నాను. కానీ కథను అద్భుతంగా నెరేట్ చేశారు. కథను చాలా మంది అద్భుతంగా చెబుతారు. కానీ దాన్ని తెరపైకి తీసుకురావడంలో తడబడుతుంటారు. కానీ నిర్మాత శ్రీనివాస్ గారి సహకారంతో దర్శకుడు సినిమాను అద్భుతంగా తెరకెక్కించారు. క్వాలిటీ పరంగా ఈ మూవీ పాన్ ఇండియ స్థాయిలో ఉంటుంది. ఈ సినిమా పట్ల చాలా సంతోషంగా, సంతృప్తిగా ఉన్నాను. ఈ మూవీ నాకు చాలా ప్రత్యేకం. నా హృదయానికి ఎంతో దగ్గరైన చిత్రమిది. ఫస్ట్ లుక్ అద్భుతంగా ఉంది. ఆ రోజు జరిగిన షూటింగ్ నాకు ఇంకా గుర్తుంది. ఫైట్ సీక్వెన్స్ అద్భుతంగా వచ్చాయి. పోస్టర్ ఎంత ప్రభావం చూపిస్తోందో.. సినిమా కూడా అంతే ప్రభావం చూపించబోతోంది. ఈ సినిమాకు పని చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్’ అని అన్నారు.దర్శకుడు రాకీ షెర్మన్ మాట్లాడుతూ.. ‘‘కర్మ స్థలం’ సినిమాకి మేం అంతా ప్రాణం పెట్టి, ఎంతో ఇష్టంతో పని చేశాం. వీఎఫ్ఎక్స్ పనుల వల్ల ఈ చిత్రం ఆలస్యం అవుతూ వచ్చింది. పాన్ ఇండియా రేంజ్లో ఆకట్టుకునేలా ఈ సినిమా ఉంటుంది. నిర్మాత శ్రీనివాస్ గారు నా వెన్నంటి ఉండి నడిపించారు. అర్చన గారు ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డారు. ఆమె అందించిన సహకారం ఎప్పటికీ మర్చిపోలేను. ఎం.ఎల్ రాజా మంచి సంగీతాన్ని అందించారు. ఈ చిత్రానికి పని చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్’ అని అన్నారు.నిర్మాత శ్రీనివాస్ సుబ్రహ్మణ్య మాట్లాడుతూ.. ‘‘కర్మ స్థలం’ సినిమాను ఎంతో కష్టపడి చేశాం. మా దర్శకుడు ఈ మూవీని పాన్ ఇండియా రేంజ్లో అందరినీ ఆకట్టుకునేలా చేశారు. అర్చన గారు అద్భుతంగా నటించారు. మా సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు. -
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్.. ప్రభాస్ ఫస్ట్ లుక్ అప్డేట్ వచ్చేసింది
టాలీవుడ్ హీరో మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్గా తెరకెక్కిస్తోన్న చిత్రం కన్నప్ప. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ దాదాపు పూర్తయినట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో బాలీవుడ్ అక్షయ్కుమార్, మోహన్ లాల్, కాజల్ అగర్వాల్ లాంటి పలువురు స్టార్స్ నటిస్తున్నారు. అంతేకాదు మన రెబల్ స్టార్ ప్రభాస్ సైతం ఇందులో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని అవా ఎంటర్ టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై సంయుక్తంగా నిర్మిస్తున్నారు.ఈ సందర్భంగా కన్నప్ప మూవీకి సంబంధించి క్రేజీ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. రెబల్ స్టార్ ప్రభాస్ లుక్ను రివీల్ చేయనున్నట్లు ప్రకటించారు. ఫిబ్రవరి 3న తేదీన ప్రభాస్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేస్తామని సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు. ఈ సినిమాకు ముకేశ్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు.టీజర్కు ఊహించని రెస్పాన్స్..ఇప్పటికే కన్నప్ప టీజర్ విడుదలైన సంగతి తెలిసిందే. ఇందులో విష్ణు మంచు యాక్షన్ సీన్స్, యుద్ధ సన్నివేశాలు, అక్షయ్ కుమార్, ప్రభాస్ క్లోజప్ షాట్స్, హై ప్రొడక్షన్ వ్యాల్యూస్, స్టన్నింగ్ విజువల్స్, అదిరిపోయే పర్ఫార్మెన్స్తో కన్నప్ప టీజర్ ప్రేక్షకులని ఆకట్టుకుంది. యూట్యూబ్లో ఇప్పటివరకు అన్ని భాషల్లో కలిపి 30 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించింది. Here’s a glimpse of the Darling-Rebel Star '𝐏𝐫𝐚𝐛𝐡𝐚𝐬' in #Kannappa!🌟 🎬Experience the beginning of an epic journey, and don’t miss the full reveal on 3rd February. Stay tuned for more updates! 🙌 #Prabhas #HarHarMahadevॐ@themohanbabu @iVishnuManchu @Mohanlal #Prabhas… pic.twitter.com/ujJMFf93W8— Kannappa The Movie (@kannappamovie) January 27, 2025 -
బ్యాడ్ బాయ్గా వస్తోన్న నాగ శౌర్య.. ఆసక్తిగా ది డెవిల్స్ ఛైర్ పోస్టర్!
టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య నటిస్తోన్న తాజా చిత్రం 'బ్యాడ్ బాయ్ కార్తీక్'. ఈ మూవీ విధి హీరోయిన్గా కనిపించనుంది. ఈ చిత్రానికి రామ్ దేశినా (రమేష్) దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ వైష్ణవి ఫిల్మ్స్ బ్యానర్పై శ్రీనివాసరావు చింతలపూడి నిర్మిస్తున్నారు. ఇవాళ నాగశౌర్య పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీ టైటిల్, ఫస్ట్ లుక్ను మేకర్స్ రిలీజ్ చేశారు.ఈ చిత్రానికి 'బ్యాడ్ బాయ్ కార్తీక్' అనే పవర్ ఫుల్ టైటిల్ ఖరారు చేశారు. ఫస్ట్ లుక్ పోస్టర్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ పోస్టర్ చూస్తే హీరో నుదిటిపై రక్తంతో కూడిన "మూడు గోవింద నామాలు", చేతులపై రక్తపు మరకలు కనిపిస్తున్నాయి. ఈ మూవీ ఫుల్ యాక్షన్ థ్రిల్లర్గానే తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో సముద్రఖని, సీనియర్ నరేష్, సాయికుమార్, వెన్నెల కిషోర్, మైమ్ గోపి, శ్రీదేవి విజయ్ కుమార్, వెన్నెల కిషోర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకు హారిస్ జయరాజ్ సంగీతమందిస్తున్నారు.ది డెవిల్స్ ఛైర్ ఫస్ట్ లుక్ పోస్టర్..జబర్దస్త్ అభి, ఛత్రపతి శేఖర్, స్వాతి మందల్ ప్రధాన పాత్రల్లో వస్తోన్న చిత్రం ది డెవిల్స్ చైర్ (The Devils chair). ఈ సినిమాను గంగ సప్త శిఖర దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీని బాబీ ఫిలిమ్స్, ఓం సాయి ఆర్ట్స్, సీఆర్ఎస్ క్రియేషన్స్ బ్యానర్లపై కేకే చైతన్య, వెంకట్ దుగ్గి రెడ్డి, చంద్ర సుబ్బగారి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం మొదటి పోస్టర్ను మేకర్స్ విడుదల చేశారు.ఈ సందర్భంగా దర్శకుడు గంగ సప్త శిఖర మాట్లాడుతూ..'సరైన హారర్ చిత్రం వచ్చి చాలా రోజులు అయింది. తెలుగు ప్రేక్షకులు కూడా మంచి హారర్ చిత్రం కోసం ఎదురు చూస్తున్నారు. హారర్ చిత్రాలు ఇష్టపడే ప్రేక్షకులకు ది డెవిల్స్ చైర్ పర్ఫెక్ట్ సినిమా. సరికొత్త పాయింట్తో అద్భుతంగా ఉండే చిత్రాన్ని రూపొందిస్తున్నాం. మా చిత్రం మంచి హిట్ అవ్వాలి" అని కోరుకుంటున్నట్లు తెలిపారు.అనంతరం చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ..'ది డెవిల్స్ చైర్ చిత్రం మంచి కంటెంట్ ఉన్న చిత్రం. అద్భుతమైన ఏఐ టెక్నాలజీతో సరికొత్త కథతో నిర్మిస్తున్నాం. ప్రతి సీన్ అద్భుతంగా రిచ్ విజువల్స్ తో రూపొందిస్తున్నాం. షూటింగ్ అంతా పూర్తయింది. మా చిత్రాన్ని ఫిబ్రవరి చివరి వారంలో విడుదల చేస్తాం" అని తెలిపారు. -
సంతాన ప్రాప్తిరస్తు మూవీ.. ఆసక్తిగా సంక్రాంతి పోస్టర్
విక్రాంత్, చాందినీ చౌదరి హీరో హీరోయిన్లుగా నటిస్తోన్న తాజా చిత్రం "సంతాన ప్రాప్తిరస్తు". ఈ సినిమాను మధుర ఎంటర్టైన్మెంట్స్, నిర్వి ఆర్ట్స్ బ్యానర్స్పై మధుర శ్రీధర్ రెడ్డి, నిర్వి హరిప్రసాద్ రెడ్డి నిర్మిస్తున్నారు. అల్లు శిరీష్ హీరోగా "ఏబీసీడీ" సినిమా, రాజ్ తరుణ్తో "అహ నా పెళ్లంట" అనే వెబ్ సిరీస్ రూపొందించిన దర్శకుడు సంజీవ్ రెడ్డి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. వెంకటాద్రి ఎక్స్ ప్రెస్, ఎక్స్ ప్రెస్ రాజా, ఏక్ మినీ కథ లాంటి చిత్రాలకు స్క్రీన్ ప్లే అందించిన రచయిత షేక్ దావూద్ జి ఈ సినిమాకు స్క్రీన్ ప్లే రాస్తున్నారు. మ్యూజికల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్గా ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు.ఈ ఏడాది సంక్రాంతి పర్వదినం సందర్భంగా ప్రేక్షకులకు అప్డేట్ ఇచ్చారు మేకర్స్. "సంతాన ప్రాప్తిరస్తు" సినిమా నుంచి స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్లో హీరో విక్రాంత్, హీరోయిన్ చాందినీ లుక్ అభిమానులను ఆకట్టుకునేలా ఉంది. పోస్టర్లో ప్రెగ్నెన్సీ కిట్ ఉండటం మరింత ఆసక్తికరంగా మారింది. ఒక కాంటెంపరరీ ఇష్యూను కథలో చూపిస్తూ వినోదాత్మకంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు దర్శకుడు సంజీవ్ రెడ్డి. పోస్టర్ చూస్తేనే ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెంచుతోంది. ఈ సినిమా త్వరలోనే గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్కు రెడీ అవుతోంది. ఈ చిత్రంలో వెన్నెల కిషోర్, అభినవ్ గోమటం, మురళీధర్ గౌడ్, జీవన్ కుమార్, తాగుబోతు రమేష్, రచ్చ రవి కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్గా సునీల్ కశ్యప్ పని చేస్తున్నారు. -
పెదకాపు హీరో మూవీ.. ఫస్ట్ లుక్ పోస్ట్ రిలీజ్ చేసిన రానా
పెదకాపు మూవీ ఫేమ్ విరాట్ కర్ణ(Virat Karrna) హీరోగా నటిస్తోన్న చిత్రం 'నాగబంధం– ది సీక్రెట్ ట్రెజర్'(Nagabandham Movie). డెవిల్: ది బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ సినిమాతో దర్శకుడిగా మారిన నిర్మాత అభిషేక్ నామా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీలో నభా నటేష్, ఐశ్వర్యా మీనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. గతేడాది అక్టోబర్లో ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాకు మెగాస్టార్ చిరంజీవి క్లాప్ కొట్టి షూటింగ్ ప్రారంభించిన సంగతి తెలిసిందే.ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్..తాజాగా ఈ మూవీకి సంబంధించిన అప్డేట్ ఇచ్చారు మేకర్స్. భోగి పండుగ సందర్భంగా హీరో ఫస్ట్ లుక్ పోస్టర్ను విడుదల చేశారు. టాలీవుడ్ హీరో రానా దగ్గుబాటి (Rana Daggubati) చేతుల మీదుగా విరాట్ కర్ణ పోస్టర్ను రివీల్ చేశారు. తాజాగా రిలీజైన ఫస్ట్ లుక్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఇందులో హీరో విరాట్ సముద్రపు యాక్షన్ సన్నివేశంలో మొసలితో ఫైట్ చేస్తున్నట్లుగా కనిపించారు. ఈ మూవీలో రుద్ర పాత్రలో విరాట్ కర్ణ కనిపించనున్నారు.కాగా.. ఈ సినిమాను పాన్ ఇండియా రేంజ్లో తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేస్తామని ఇప్పటికే నిర్మాతలు ప్రకటించారు. భారతదేశంలోని 108 విష్ణు దేవాలయాలు నాగబంధం ద్వారా రక్షించబడుతున్నాయనే కథాంశంతో ఈ మూవీని తెరకెక్కిస్తున్నట్లు డైరెక్టర్ అభిషేక్ నామా తెలిపారు. ఈ చిత్రాన్ని ఎలక్ష్మీ ఐరా, దేవాన్ష్ నామా సమర్పణలో ఎన్ఐకే స్టూడియోస్, అభిషేక్ పిక్చర్స్పై కిషోర్ అన్నపురెడ్డి నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో జగపతి బాబు, జయప్రకాష్, మురళీ శర్మ, బీఎస్ అవినాష్ కీలక పాత్రలు పోషించనున్నారు. ఈ మూవీకి అభే సంగీతమందిస్తున్నారు. ఈ ఏడాదిలోనే నాగబంధంలో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. So happy to present the first look of @ViratKarrna from #Nagabandham.Already feels like an exhilarating ride :)Best wishes to my dearest #AbhishekNama garu, @nikstudiosindia and the entire team!!!@AbhishekPicture #KishoreAnnapureddy@ViratKarrna @NabhaNatesh @Ishmenon… pic.twitter.com/GXSSNYdlcg— Rana Daggubati (@RanaDaggubati) January 13, 2025 -
కన్నప్ప మూవీ.. కాజల్ అగర్వాల్ ఏ పాత్ర చేయనుందంటే?
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్గా వస్తోన్న చిత్రం 'కన్నప్ప'. అవా ఎంటర్ టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ పాన్ ఇండియా మూవీలో బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్, ప్రభాస్, మోహన్ లాల్, శరత్ కుమార్, మోహన్ బాబు, బ్రహ్మానందం, కాజల్ అగర్వాల్ వంటి స్టార్స్ కనిపించనున్నారు.ఇప్పటికే రిలీజైన కన్నప్ప టీజర్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. టీజర్ చూస్తే ప్రేక్షకులకు విజువల్ ఫీస్ట్లా ఉంది. విష్ణు మంచు యాక్షన్ సీన్స్, యుద్ధ సన్నివేశాలు, అక్షయ్ కుమార్, ప్రభాస్ క్లోజప్ షాట్స్, హై ప్రొడక్షన్ వ్యాల్యూస్, స్టన్నింగ్ విజువల్స్, అదిరిపోయే పర్ఫార్మెన్స్ లతో కన్నప్ప టీజర్ ప్రేక్షకులను అలరించింది. యూట్యూబ్లోనూ ఇప్పటివరకు అన్ని భాషల్లో కలిపి 30 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించింది.తాజాగా ఈ మూవీ నుంచి కాజల్ అగర్వాల్ ఫస్ట్ లుక్ పోస్టర్ను రివీల్ చేశారు మేకర్స్. ఈ చిత్రంలో పార్వతి దేవి పాత్రలో కాజల్ కనిపించనుంది. ఈ మేరకు నాలుగు భాషల్లో కాజల్ ఫస్ట్ లుక్ పోస్టర్తో పాటు క్యారెక్టర్ను పరిచయం చేశారు. పార్వతి దేవి లుక్లో కాజల్ అభిమానులను ఆకట్టుకుంటోంది. మీరు కూడా పోస్టర్ను చూసేయండి.కాగా.. ఇప్పటికే ఈ చిత్రం నుంచి మధుబాల,శరత్కుమార్, దేవరాజ్ వంటి ప్రముఖ నటులు పోషిస్తున్న పాత్రలకు పరిచయం చేస్తూ.. వారి పాత్రలకు సంబంధించిన పోస్టర్లతో సినిమాపై అంచనాలను పెంచేశారు. ఇందులో కంపడు పాత్రలో ముఖేష్ రిషి, గవ్వరాజుగా బ్రహ్మాజీ కనిపించనున్నారు. వారు అత్యంత పురాతన పుళిందుల జాతికి చెందిన అత్యంత భయంకరమైన తెగకు చెందినవారు. సదాశివ కొండలలో జన్మించిన వీరిని భద్రగణం అని కూడా అంటారు. వారు 'వాయులింగానికి వంశపారంపర్య సేవకులు మరియు రక్షకులు. కంపడు నాయకుడిగా ఉంటూనే భద్రగణాన్ని నడిపిస్తాడు. ఈ వంశం త్రిశూలాలను ఉపయోగించడంలో ప్రత్యేకత కలిగి వున్నవారు. ఈ సినిమాలోని కిరాట పాత్రలో మోహన్లాల్ నటిస్తున్నారు. గతంలోనే ఆయన ఫస్ట్ లుక్ను రిలీజ్ చేశారు.కన్నప్ప కథేంటంటే..పాన్ ఇండియా ప్రాజెక్ట్ కన్నప్ప సినిమా ఈ తరం ప్రేక్షకులకైనా కొత్తగానే ఉంటుంది. భక్తి భావం, ధూర్జటి మహాకవి ఎలా రాశారు? శ్రీకాళహస్తి మహత్మ్యం ఏంటి? అన్నది ఈ చిత్రంలో చూపించనున్నాం. ఇది కేవలం భక్తి చిత్రమే కాదు. అన్ని రకాల అంశాలు ఈ సినిమాలో ఉన్నాయి. ఆ పరమేశ్వరుడి ఆజ్ఞతోనే ఈ సినిమా తీస్తున్నాం అన్నారు మోహన్బాబు.విజువల్ వండర్గా కన్నప్ప..ఈ చిత్రంలో డా.మోహన్ బాబు, మోహన్ లాల్, ప్రభాస్, బ్రహ్మానందం, బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ సినిమాకు కీలకమైన పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్పీరియెన్స్ ఇచ్చే విజువల్ వండర్గా రాబోతోందని ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు కూడా. సినిమాను చూసిన ప్రేక్షకులు సరికొత్త అనుభూతిని ఇస్తుందని వెల్లడించారు. ఆడియన్స్ను మరో ప్రపంచంలోకి వెళ్లిన ఎక్స్పీరియన్స్ ఇచ్చే విధంగా మేకర్స్ చిత్రాన్ని రెడీ చేస్తున్నట్లు ప్రకటించారు. విష్ణు మంచు కన్నప్ప పాత్రను ఈ చిత్రంలో పోషిస్తున్నారు. మోహన్ బాబు నిర్మిస్తున్న ఈ విజువల్ వండర్ను పాన్ ఇండియాలో ఈ ఏడాది ఏప్రిల్ 25న విడుదల చేయనున్నారు. 🌟 Divine Grace Personified 🌟Here is the glorious full look of @MsKajalAggarwal as '𝐌𝐀𝐀 𝐏𝐚𝐫𝐯𝐚𝐭𝐢 𝐃𝐞𝐯𝐢'🪷 the divine union with '𝐋𝐨𝐫𝐝 𝐒𝐡𝐢𝐯𝐚'🔱, in #Kannappa🏹. Witness her ethereal beauty and the divine presence, she brings to life in this epic tale of… pic.twitter.com/EvEgx3GDWY— Kannappa The Movie (@kannappamovie) January 6, 2025 -
రాజ్ తరుణ్ కొత్త చిత్రం.. ఆసక్తిగా టైటిల్
గతేడాది వరుస సినిమాలతో మెప్పించిన టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్. తిరగబడరా స్వామీ, భలే ఉన్నాడే లాంటి చిత్రాలతో అలరించారు. కొత్త ఏడాదిలో అభిమానులకు అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు హీరో. తన కొత్త సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ వీడియోను విడుదల చేశారు.ఈ చిత్రానికి పాంచ్ మినార్ అనే టైటిల్ను ఫిక్స్ చేశారు. ఈ చిత్రంలో రాశి సింగ్ హీరోయిన్గా నటిస్తోంది. రామ్ కడుముల దర్శకత్వంలో ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. పోస్టర్ చూస్తే ఫుల్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమా థియేటర్లలో సందడి చేయనుంది. తాజాగా విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ ఫ్యాన్స్ను విపరీతంగా ఆకట్టుకుంటోంది.కాగా.. ఈ చిత్రంలో అజయ్ గోష్, బ్రహ్మాజీ, శ్రీనివాస్ రెడ్డి కీలక పాత్రలు పోషిస్తున్నారు. కనెక్ట్ మూవీస్ బ్యానర్పై గోవింద రాజు సమర్పణలో మాధవి, ఎంఎస్ఎం రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ మూవీకి శేఖర్ చంద్ర సంగీతమందిస్తున్నారు.వివాదంలో రాజ్ తరుణ్..అయితే సినిమాలతో పాటు అలరించిన రాజ్.. గతేడాదిలో ఓ వివాదంలోనూ చిక్కుకున్న సంగతి తెలిసిందే. తనను పెళ్లి చేసుకున్నాడని ఆరోపిస్తూ లావణ్య అనే యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు. ఆ వివాదం నడుస్తుండగానే తిరగబడరాసామీ మూవీ విడుదలైంది. ఈ వ్యవహారంలో మరో హీరోయిన్ మాల్వీ మల్హోత్రా పేరును కూడా లావణ్య ప్రస్తావించింది. తన వల్లే రాజ్ తరుణ్ దూరమయ్యాడని ఆరోపించింది. ప్రస్తుతం ఈ వివాదం కోర్టులో నడుస్తోంది. 🎉 Happy New Year 2025 🎉This New Year, the craziness knows no limits with Extra Minar🔥Here’s the fascinating first-look motion poster of #PaanchMinar 🤩-- https://t.co/VbfZtKmgf0Gear up for the kickass crime comedy entertainer in theatres soon⌛️@RashiReal_ pic.twitter.com/ci2ehyUYSW— Raj Tarun (@itsRajTarun) January 1, 2025 -
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్.. హీరోయిన్ ఎవరో తెలుసా?
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్గా తెరకెక్కిస్తోన్న చిత్రం కన్నప్ప. ఈ చిత్రానికి బాలీవుడ్ డైరెక్టర్ ముకేశ్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రభాస్తో పాటు మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్, అక్షయ్ కుమార్, శరత్ కుమార్ లాంటి ప్రముఖులంతా కనిపించనున్నారు. ఇప్పటికే వీరికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్లతో పాటు క్యారెక్టర్లను రివీల్ చేశారు మేకర్స్. తాజాగా ఈ మూవీ హీరోయిన్ ఫస్ట్ లుక్ పోస్టర్ను రిలీజ్ చేశారు.మంచు విష్ణు హీరోగా నటిస్తోన్న ఈ చిత్రంలో ప్రీతి ముకుందన్ హీరోయిన్గా నటిస్తున్నారు. ఈ సినిమాలో ఆమె నెమలి అనే రాకుమార్తెగా కనిపించనున్నారు. తాజాగా విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ అభిమానులను తెగ ఆకట్టుకుంటోంది. ప్రీతి ముకుందన్ తన గ్లామర్కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. కాగా.. అంతకుముందు ప్రీతి టాలీవుడ్ చిత్రం ఓం భీమ్ బుష్లో నటించింది. ఈ మూవీలో జలజ అనే పాత్రలో మెరిసింది.(ఇది చదవండి: 'కన్నప్ప' టీజర్... మూడు కోట్ల మంది చూశారు!) పాన్ ఇండియా ప్రాజెక్ట్గా తెరకెక్కుతోన్న కన్నప్ప చిత్రాన్ని అవా ఎంటర్ టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన'కన్నప్ప' టీజర్ ప్రేక్షకులకు ఆకట్టుకుంది. విష్ణు మంచు యాక్షన్ సీన్స్, యుద్ధ సన్నివేశాలతో కన్నప్ప టీజర్ ప్రేక్షకులను మెప్పించింది. అంతేకాకుండా యూట్యూబ్లో ఇప్పటివరకు అన్ని భాషల్లో కలిపి 30 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించింది. ఈ సినిమాతో మంచు విష్ణు తనయుడు అవ్రామ్ అరంగేట్రం చేస్తున్నాడు. ఆయన కుమార్తెలు కూడా కన్నప్పలో నటిస్తున్నారు. ఇటీవల వారిద్దరి పోస్టర్లను కూడా సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు. ఈ చిత్రం వచ్చే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు రానుంది.✨ Behold the mesmerizing look of Preity Mukhundhan as Princess 𝐍𝐞𝐦𝐚𝐥𝐢 in #Kannappa 🏹✨ Sharing the screen with @iVishnuManchu, she adds grace and charm to this divine tale. 🌺Experience the magic and splendor of divinity! 🙏 #HarHarMahadevॐ@themohanbabu @Mohanlal… pic.twitter.com/UVgiPVwL4K— Kannappa The Movie (@kannappamovie) December 30, 2024 -
సుమ తనయుడి కొత్త చిత్రం.. ఫస్ట్ లుక్ పోస్టర్ చూశారా?
టాలీవుడ్ స్టార్ యాంకర్ సుమ కనకాల తనయుడు రోషన్ కనకాల హీరోగా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. గతేడాది బబుల్గమ్ మూవీతో టాలీవుడ్ హీరోగా అరంగేట్రం చేశారు. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమాకు మిక్స్డ్ టాక్ను సొంతం చేసుకుంది.అయితే తాజాగా మరో చిత్రానికి రెడీ అయ్యారు రోషన్. కలర్ ఫోటో ఫేమ్ సందీప్ రాజ్ డైరెక్షన్లో నటించనున్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ను మేకర్స్ రిలీజ్ చేశారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై నిర్మిస్తున్న ఈ చిత్రానికి మోగ్లీ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. తాజాగా విడుదలైన పోస్టర్ చూస్తే రోషల్ వైల్డ్ లుక్ను తలపిస్తోంది. ఈ మూవీలో బాలీవుడ్ భామ సాక్షిసాగర్ హీరోయిన్గా కనిపించనుంది. ఈ మూవీని లవ్ స్టోరీగానే తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. 𝐓𝐇𝐄 𝐋𝐎𝐔𝐃𝐄𝐒𝐓 𝐖𝐀𝐑 𝐎𝐅 𝐀 𝐒𝐈𝐋𝐄𝐍𝐓 𝐋𝐎𝐕𝐄 𝐒𝐓𝐎𝐑𝐘 ❤🔥#Mowgli ’s Wild Adventure Begins 💥💥Stay tuned for more exciting updates!#Mowgli2025A @SandeepRaaaj directorial.🌟ing @RoshanKanakala & #SakshiMhadolkarA @Kaalabhairava7 musical 🎵… pic.twitter.com/vxtDMvAqU4— People Media Factory (@peoplemediafcy) December 19, 2024 -
మంచు విష్ణు కన్నప్ప మూవీ.. మోహన్ లాల్ క్యారెక్టర్ రివీల్!
టాలీవుడ్ హీరో మంచు విష్ణు తన డ్రీమ్ ప్రాజెక్ట్గా తెరకెక్కిస్తోన్న చిత్రం కన్నప్ప. ఈ మూవీకి ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. భారీ తారాగణంతో రూపొందిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ మూవీకి సంబంధించి అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ చిత్రంలో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ఫస్ట్ లుక్ను రివీల్ చేశారు.ఈ చిత్రంలో మోహన్ లాల్ కిరాటా పాత్రలో కనిపించనున్నారు. తాజాగా విడుదలైన మోహన్ లాల్ ఫస్ట్ లుక్ పోస్టర్ అభిమానులను తెగ ఆకట్టుకుంటోంది. ఈ విషయాన్ని మంచు విష్ణు తన ట్విటర్ ద్వారా వెల్లడించారు. భారీ బడ్జెట్తో తెరకెక్కిస్తోన్న ఈ చిత్రంలో ప్రభాస్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్ లాంటి స్టార్స్ సైతం నటిస్తున్నారు. ఓ యదార్థ కథ ఆధారంగా రూపొందుతోన్న ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 25,2025లో థియేటర్లలో సందడి చేయనుంది. ‘KIRATA’! The legend Sri. Mohanlal in #Kannappa. I had the honor of sharing the screen space with one of the greatest Actor of our time. This entire sequence will be 💣💣💣💣💣 ! @Mohanlal pic.twitter.com/q9imkDZIxz— Vishnu Manchu (@iVishnuManchu) December 16, 2024 -
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్.. మోహన్ బాబు మనవరాళ్లను చూశారా?
టాలీవుడ్ హీరో మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్గా వస్తోన్న చిత్రం 'కన్నప్ప'. ఈ మూవీ భారీ బడ్జెట్తో అవా ఎంటర్ టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్, ప్రభాస్, మోహన్ లాల్, శరత్ కుమార్, మోహన్ బాబు, బ్రహ్మానందం, కాజల్ అగర్వాల్ వంటి స్టార్స్ ఇందులో నటిస్తున్నారు. ఇటీవలే మోహన్ బాబు ఫస్ట్ లుక్ పోస్టర్ను కూడా రిలీజ్ చేశారు మేకర్స్.తాజాగా మరో అప్డేట్తో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఈ మూవీలో మోహన్ బాబు మనవరాళ్లు అరియానా, వివియానా కూడా నటిస్తున్నారు. వీరిద్దరికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్స్ను కన్నప్ప టీమ్ రివీల్ చేసింది. ఈ మూవీ ద్వారా మోహన్ బాబు మనవరాళ్లు సినిమాల్లో ఎంట్రీ ఇస్తున్నారు. వీరి ఫస్ట్ లుక్ పోస్టర్ సినీ ప్రియులను తెగ ఆకట్టుకుంటోంది.కాగా.. ఇప్పటికే రిలీజైన కన్నప్ప టీజర్కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. టీజర్ ప్రేక్షకులకు విజువల్ ఫీస్ట్లా ఉంది. విష్ణు మంచు యాక్షన్ సీన్స్, యుద్ధ సన్నివేశాలు, స్టన్నింగ్ విజువల్స్తో కన్నప్ప టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. యూట్యూబ్లో ఇప్పటివరకు అన్ని భాషల్లో కలిపి 30 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించింది. Immerse yourself in the spirit of devotion with #Ariaana & #Viviana Manchu, and witness their full-look in #Kannappa🏹 — A perfect blend of talent and spirituality dedicated to Lord Shiva.🎬✨#HarHarMahadevॐ @themohanbabu @iVishnuManchu @Mohanlal #Prabhas @akshaykumar… pic.twitter.com/vquzPB6b6s— Kannappa The Movie (@kannappamovie) December 2, 2024 -
కిల్లర్తో వస్తోన్న టాలీవుడ్ డైరెక్టర్.. ఆసక్తిగా పోస్టర్స్!
శుక్ర, మాటరాని మౌనమిది, ఏ మాస్టర్ పీస్ లాంటి డిఫరెంట్ సినిమాలతో అలరించిన డైరెక్టర్ సుక్కు పూర్వాజ్. తాజాగా మరో డిఫరెంట్ మూవీతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. ప్రస్తుతం ఆయన డైరెక్షన్లో కిల్లర్ అనే యాక్షన్ థ్రిల్లర్ మూవీని రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో ఆయన కీలక పాత్రలో నటిస్తుండటం విశేషం. బుల్లితెర బ్యూటీ జ్యోతి పూర్వాజ్ కీలక పాత్రలో కనిపించనుంది.తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్స్ను విడుదల చేశారు. ఈ పోస్టర్స్ చూస్తుంటే కిల్లర్ మూవీపై అంచనాలు పెంచేస్తున్నాయి. పూర్వాజ్ క్యారెక్టర్ ఫస్ట్ లుక్ ఫ్యాన్స్ను విపరీతంగా ఆకట్టుకుంటోంది. చేతిలో రివాల్వర్తో కనిపిస్తోన్న ఈ పోస్టర్స్ మూవీ ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ క్రియేట్ చేస్తోంది. ఈ సినిమానుఏయు అండ్ఐ, మెర్జ్ ఎక్స్ ఆర్ సంస్థతో థింక్ సినిమా బ్యానర్పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. View this post on Instagram A post shared by Venkata Suresh Kumar Kuppili (@poorvaaj) -
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్.. మోహన్ బాబు లుక్ చూశారా?
టాలీవుడ్ హీరో మంచు విష్ణు తన డ్రీమ్ ప్రాజెక్ట్గా తెరకెక్కిస్తోన్న చిత్రం కన్నప్ప. ఈ మూవీలో పలువురు సూపర్ స్టార్స్ నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్కు అభిమానుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ మూవీకి సంబంధించిన బిగ్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ చిత్రంలో మోహన్ బాబు ఫస్ట్ లుక్ పోస్టర్ను రివీల్ చేశారు. ఇందులో మహదేవ శాస్త్రి పాత్రలో మోహన్ బాబు కనిపించనున్నారు. పాన్ ఇండియా ప్రాజెక్ట్గా తెరకెక్కిస్తోన్న ఈ మూవీని డిసెంబర్లో ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నారు.ఇప్పటికే ఈ చిత్రం నుంచి మధుబాల,శరత్కుమార్, దేవరాజ్ వంటి ప్రముఖ నటుల పోస్టర్లను విడుదల చేశారు. కన్నప్పలో ప్రభాస్ లాంటి అగ్రహీరో కూడా కనిపించనున్నారు. అంతేకాకుండా మోహన్ లాల్, బ్రహ్మానందం, బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇందులో కన్నప్ప పాత్రను మంచు విష్ణు పోషిస్తున్నారు. కాగా.. మోహన్ బాబు నిర్మిస్తున్న ఈ చిత్రానికి బాలీవుడ్ డైరెక్టర్ ముఖేష్ కుమార్ తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ దాదాపు చివరి దశకు చేరుకుంది. త్వరలోనే కన్నప్ప థియేటర్లలో సందడి చేయనుంది. Unveiling the divine look of @themohanbabu garu as 'Mahadeva Shastri' in #Kannappa🏹. Witness the devotion and grandeur as they come to life! 🌟✨ #HarHarMahadevॐ#MohanBabu @ivishnumanchu @Mohanlal #Prabhas @akshaykumar @realsarathkumar #MukeshRishi @mukeshvachan… pic.twitter.com/Z8XbIV3ccd— Kannappa The Movie (@kannappamovie) November 22, 2024 -
అలా అయితేనే సినిమాలు చేసేందుకు ముందుకు రండి: ఆర్పీ పట్నాయక్
కిట్టు తాటికొండ, కష్మీరా,రోహిత్, వైశాలి, సునీల్ రావినూతల, శ్రీ గోపి చంద్ కొండ ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న చిత్రం 'కరణం గారి వీధి'. ఈ చిత్రాన్ని సౌత్ బ్లాక్ బస్టర్ క్రియేషన్స్ బ్యానర్పై అడవి అశోక్ నిర్మిస్తున్నారు. దర్శక ద్వయం హేమంత్, ప్రశాంత్ తెరకెక్కిస్తున్నారు. విలేజ్ బ్యాక్ డ్రాప్లో కంప్లీట్ లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్గా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ మూవీ త్వరలోనే గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్కు రెడీ అవుతోంది. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ను ప్రముఖ సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ చేతుల మీదుగా రిలీజ్ చేశారు.ఆర్పీ పట్నాయక్ మాట్లాడుతూ - 'కరణం గారి వీధి సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ నా చేతుల మీదుగా రిలీజ్ చేయడం సంతోషంగా ఉంది. పోస్టర్, టైటిల్ డిజైన్ చాలా కొత్తగా అనిపించింది. కొత్త టాలెంట్ ఎంత ఎక్కువగా వస్తే ఇండస్ట్రీకి అంత మంచిది. ఈ టీమ్ కూడా మంచి ప్రయత్నం చేసి ఉంటారని ఆశిస్తున్నా. ఈ సినిమా టీమ్కు మంచి పేరు రావాలి. కొత్త ఫిలిం మేకర్స్కు నాదొక చిన్న సలహా. సినిమా మీద కనీస అవగాహన, ప్యాషన్ ఉనప్పుడే సినిమాలు చేసేందుకు ముందుకు రండి. అప్పుడే మీరు చేసే సినిమా బాగుంటుంది'అని అన్నారు.నిర్మాత అడవి అశోక్ మాట్లాడుతూ..' మా కరణం గారి వీధి సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ లాంఛ్ చేసిన ఆర్పీ పట్నాయక్కు థ్యాంక్స్. ఆయన మ్యూజిక్తో పాటు ఆయన తెరకెక్కించిన సినిమాలంటే మాకు ఇష్టం. ప్రేక్షకులు కోరుకునే అన్ని ఎలిమెంట్స్ ఉన్న చిత్రమిది. త్వరలోనే సినిమాను థియేటర్స్లోకి తీసుకొస్తాం' అని అన్నారు.దర్శకుడు హేమంత్ మాట్లాడుతూ - 'పల్లెటూరి నేపథ్యంగా సాగే కంప్లీట్ ఎంటర్ టైనింగ్ మూవీ ఇది. మనం నిజ జీవితంలో చూసే వాస్తవిక ఘటనలు ఉంటాయి. కరణం గారి వీధి సినిమాను అందరికీ నచ్చేలా రూపొందిస్తున్నాం. త్వరలోనే రిలీజ్ డేట్ ప్లాన్ చేసి మీ ముందుకు చిత్రాన్ని తీసుకొస్తాం' అని అన్నారు.దర్శకుడు ప్రశాంత్ మాట్లాడుతూ..' లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్గా కరణం గారి వీధి సినిమాను రూపొందిస్తున్నాం. విలేజ్ బ్యాక్ డ్రాప్లో ఉంటూ మంచి కామెడీతో మీరంతా ఎంజాయ్ చేసేలా సినిమా ఉంటుంది. ఆర్పీ సార్ తమ టైమ్ కేటాయించి మమ్మల్ని సపోర్ట్ చేసినందుకు ఆయనకు థ్యాంక్స్ చెబుతున్నాం' అని అన్నారు. -
ఫ్యామిలీ ఎంటర్టైనర్గా 'లగ్గం టైమ్'.. ఫస్ట్ లుక్ పోస్టర్ వచ్చేసింది!
రాజేష్ మేరు, నవ్య చిట్యాల జంటగా నటిస్తోన్న చిత్రం లగ్గం టైమ్. ఈ చిత్రానికి ప్రజోత్ కె వెన్నం దర్శకత్వం వహిస్తున్నారు. 20th సెంచరీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై కె.హిమ బిందు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ను మేకర్స్ రిలీజ్ చేశారు. ప్రముఖ దర్శకుడు సాగర్ కె చంద్ర చేతుల మీదుగా పోస్టర్ను విడుదల చేశారు.పోస్టర్ చూస్తుంటే లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గానే ఈ మూవీని తెరకెక్కిస్తున్నట్లు అర్థమవుతోంది. ఈ సందర్భంగా చిత్ర బృందానికి ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని ఆకాంక్షించారు. ప్రేమ, వివాహం నేపథ్యంలో సాగే ఈ మూవీ ప్రేక్షకుల హృదయాలను హత్తుకునే ఓ మంచి కథతో రానుందని మేకర్స్ అంటున్నారు. ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేసే సినిమాగా తెరకెక్కిస్తున్నట్లు మూవీ మేకర్స్ వెల్లడించారు. కాగా.. ఈ చిత్రంలో నెల్లూరు సుధర్శన్, ప్రీతి సుందర్, ప్రణీత్ రెడ్డి కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి పవన్ సంగీతమందిస్తున్నారు. త్వరలోనే లగ్గంటైమ్కు సంబంధించిన మరిన్నీ వివరాలు తెలియజేస్తామని ప్రకటించారు. -
జై హనుమాన్ ఫస్ట్ లుక్.. సర్ప్రైజ్ అదిరిపోయిందిగా!
హనుమాన్తో సూపర్ హిట్ కొట్టిన టాలీవుడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. తేజ సజ్జా ప్రధాన పాత్రలో తెరకెక్కించిన ఈ చిత్రం సంక్రాంతి బాక్సాఫీస్ను షేక్ చేసింది. పెద్ద సినిమాలను వెనక్కి నెట్టిన ఈ సినిమా కళ్లు చెదిరే కలెక్షన్స్ రాబట్టింది. ఈ మూవీ సూపర్ హిట్ కావడంతో సీక్వెల్ తెరకెక్కించే పనిలో బిజీగా ఉన్నారు యంగ్ డైరెక్టర్.ఇప్పటికే ప్రాజెక్ట్ను అనౌన్స్ చేయగా.. దీపావళికి అదిరిపోయే అప్డేట్ ఇచ్చాడు. జైహనుమాన్ పేరుతో తెరకెక్కిస్తోన్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ను రిలీజ్ చేశారు. ఇందులో కన్నడ స్టార్, కాంతార ఫేమ్ రిషబ్ శెట్టి హనుమంతుని పాత్రలో కనిపించనున్నారు. తాజాగా రిలీజైన పోస్టర్లో శ్రీరాముడి విగ్రహాన్ని చేతిలో పట్టుకుని కనిపించారు రిషబ్ శెట్టి.అందరూ ఊహించినట్లుగానే'కాంతార' ఫేమ్ రిషభ్ శెట్టి ఈ పోస్టర్లో హనుమంతుడిగా కనిపించారు. ఈ అద్భుతమైన పోస్టర్ రిషబ్ శెట్టిని హైలైట్ చేయడమే కాకుండా హనుమంతుని భక్తి, శక్తి స్పష్టంగా కనిపిస్తోంది. ఈ పాత్రలో లెజెండరీ యాక్టర్ అద్భుతంగా సెట్ అయినట్లుగా కనిపిస్తోంది. ఈ పాత్రలో రిషబ్ శెట్టిని తెరపై చూడడానికి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఉన్నారు. ఈ సీక్వెల్లో ప్రశాంత్ వర్మ మరింత గొప్ప కథను ఆవిష్కరించడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ అద్భుతమైన ఫస్ట్ లుక్ పోస్టర్లో అది స్పష్టంగా అర్థమవుతోంది. ఈ సినిమాను ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్లో భాగంగా మైత్రి మూవీ మేకర్స్ నవీన్ యెర్నేని, వై రవిశంకర్ అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో నిర్మిస్తున్నారు In the spirit of Diwali and the guiding light of the divine ✨Honoured to be teaming up with the National Award-winning actor @shetty_rishab sir and the prestigious @MythriOfficial to bring our grand vision #JaiHanuman 🙏🏽Let’s begin this DIWALI with the holy chant JAI HANUMAN… pic.twitter.com/i2ExPsflt2— Prasanth Varma (@PrasanthVarma) October 30, 2024 -
రవితేజ 'మాస్ జాతర'.. ఈ సారి మోత మోగిపోవడం పక్కా!
టాలీవుడ్ హీరో మాస్ మహారాజ్ మరో యాక్షన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. మిస్టర్ బచ్చన్ తర్వాత ఆర్టీ75 వర్కింగ్ టైటిల్తో తెరకెక్కిస్తోన్న మూవీలో నటిస్తున్నారు. తాజాగా దీపావళీ సందర్భంగా ఫ్యాన్స్కు అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు మేకర్స్. టైటిల్ రివీల్ చేయడంతో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్ను విడుదల చేశారు.రవితేజ నటిస్తోన్న 75వ చిత్రానికి మాస్ జాతర అనే టైటిల్ ఖరారు చేశారు. మనదే ఇదంతా అనే ట్యాగ్లైన్ కూడా ఇచ్చారు. తాజాగా రిలీజైన రవితేజ ఫస్ట్ లుక్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. చేతిలో గంట పట్టుకుని కనిపిస్తోన్న మాస్ మహారాజాను చూస్తుంటే.. ఈ సినిమాలో మోత మోగిపోవడం ఖాయం అనిపిస్తోంది. రవితేజ ఫ్యాన్స్కు మరోసారి మాస్ ఎంటర్టైనర్ పక్కా అని అర్థమవుతోంది. టైటిల్కు తగ్గట్టుగానే ఈ సినిమా థియేటర్లలో మాస్ జాతరను తలపిస్తుందని నిర్మాతలు అభిప్రాయం వ్యక్తం చేశారు.ఆ సూపర్ హిట్ జోడీ రిపీట్కాగా.. సామజవరగమన వంటి హిట్ సినిమాకు ఓ రచయితగా చేసిన భాను బోగవరపు ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం కానున్నారు. శ్రీలీల హీరోయిన్గా నటిస్తోంది. గతంలో వీరిద్దరు జోడి ధమాకా మూవీతో సూపర్ హిట్ అందుకున్నారు. దీంతో మరో బ్లాక్ బస్టర్ రావడం ఖాయమని చిత్ర బృందం భావిస్తోంది. ఈచిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఈ సినిమాను వచ్చే ఏడాది సమ్మర్లో మే 9న విడుదల చేయనున్నారు. ఈ మూవీకి భీమ్స్ సిసిరోలియో సంగీతాన్ని సమకూరుస్తున్నారు. ఈ మాస్ ఎంటర్టైనర్ మే 9, 2025న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. Get ready for a Re-Sounding Entertainer 💥Presenting our 𝐌𝐀𝐒𝐒 𝐌𝐀𝐇𝐀𝐑𝐀𝐀𝐉 @RaviTeja_offl in an out-and-out ‘MASS JATHARA’ 🧨🧨🎇BLASTING the screens with highly MASSIVE & EXPLOSIVE entertainment from MAY 9th, 2025 😎 💣 Wishing you all a very #HappyDiwali 🧨🪔… pic.twitter.com/k2CTLGdKMV— Sithara Entertainments (@SitharaEnts) October 30, 2024 -
ఈ దీపావళికి మోత మోగిపోద్ది.. మాస్ అప్డేట్ వచ్చేసింది!
ఇటీవల మిస్టర్ బచ్చన్ సినిమాతో మెప్పించిన టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ. ప్రస్తుతం మరో చిత్రంతో బిజీగా ఉన్నారు. ఇప్పటికే వర్కింగ్ టైటిల్తో తెరకెక్కిస్తోన్న మూవీకి సంబంధించిన లేటేస్ట్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. దీపావళీ సందర్భంగా ఫ్యాన్స్కు అదిరిపోయే అప్డేట్ ఇవ్వనున్నారు.రవితేజ నటిస్తోన్న 75వ చిత్రానికి సంబంధించిన టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ను రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ విషయాన్ని పోస్టర్ ద్వారా వెల్లడించారు. బుధవారం సాయంత్రం 04:05 గంటలకు విడుదల చేస్తామని నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ పోస్ట్ చేసింది. ఈ దీపావళికి మోత మోగిపోద్ది.. మనదే ఇదంతా అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చారు.కాగా.. సామజవరగమన వంటి హిట్ సినిమాకు ఓ రచయితగా చేసిన భాను బోగవరపు ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం కానున్నారు. శ్రీలీల హీరోయిన్గా నటిస్తోన్న ఈ మూవీని సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించి కోహినూర్ అనే టైటిల్ను పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. 𝐌𝐀𝐒𝐒 𝐌𝐀𝐇𝐀𝐑𝐀𝐀𝐉 @RaviTeja_offl is gearing up to bring you a Special Cracker of a Surprise TOMORROW at 04:05 PM 🧨🧨🧨🎇Ee saari Deepavali ki Motha Mogipoddi... "Manade Idantha" 😎🔥Keep watching this space 🔥 #RT75FirstLook #RT75 🤩@sreeleela14 @BhanuBogavarapu… pic.twitter.com/udYz4c70EM— Sithara Entertainments (@SitharaEnts) October 29, 2024 -
రాజ్ తరుణ్ హీరోగా పాన్ ఇండియా చిత్రం.. ఆకట్టుకుంటున్న ఫస్ట్లుక్
రాజ్ తరుణ్ , సందీప్ మాధవ్ హీరోలుగా నటిస్తున్న తాజా చిత్రం రామ్ భజరంగ్. సన్ రైజ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నిర్మాత స్వాతిసుధీర్ నిర్మిస్తున్న ఈ సినిమాకు సి.హెచ్.సుధీర్ రాజు దర్శకత్వం వహిస్తున్నారు.మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. దసరా సందర్భంగా రామ్ భజరంగ్ ఫస్ట్ లుక్ను విడుదల చేశారు మేకర్స్. ఫస్ట్ లుక్ పోస్టర్ చాలా ఆసక్తికరంగా మాసీగా ఉందని, ఇద్దరు హీరోలు రాజ్ తరుణ్, సందీప్ మాధవ్ చాలా డిఫరెంట్ లుక్లో కనిపిస్తున్నారు. 1980 బ్యాక్ డ్రాప్ లో రాబోతున్న ఈ సినిమాలో యాక్షన్ తో పాటు ఫ్యామిలీ ఎలిమెంట్స్ ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఐదు భాషల్లో (తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ) ఈ సినిమాను విడుదల చెయ్యడానికి చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. గదర్ 2 హీరోయిన్ సిమ్రత్ కౌర్, బిచ్చగాడు ఫేమ్ సట్న టీటస్, ఛాయా దేవి, మనసా రాధాకృష్ణన్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాలో రాజా రవీంద్ర, రవి శంకర్, షఫీ, శివరామరాజు వెంకట్, సత్యం రాజేష్, ధనరాజ్, రచ్చ రవి, ఐశ్వర్య ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. -
ఫ్యాన్స్కు హీరో నిఖిల్ సర్ప్రైజ్.. ఇలా ట్విస్ట్ ఇచ్చాడేంటి?
టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ ప్రస్తుతం స్వయంభూ చిత్రంలో నటిస్తున్నారు. ఈ మూవీ సంయుక్త మీనన్ హీరోయిన్గా నటిస్తోంది. పాన్ ఇండియా రేంజ్లో తెరకెక్కుతున్న ఈ భారీ చిత్రానికి భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ శరవేగంగా షూటింగ్ జరుగుతోంది.అయితే ఈ సినిమా లైన్లో ఉండగానే ఫ్యాన్స్కు సర్ప్రైజ్ ఇచ్చాడు హీరో నిఖిల్. ఈ దీపావళికి థియేటర్లలో సందడి చేసేందుకు వచ్చేస్తున్నాడు. సుధీర్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిస్తోన్న మూవీ టైటిల్ను మేకర్స్ రివీల్ చేశారు. ఎలాంటి ప్రకటన లేకుండానే డైరెక్ట్గా టైటిల్, ఫస్ట్లుక్ పోస్టర్ను రిలీజ్ చేయడంతో ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. అసలు ఈ సినిమా ఎప్పుడు మొదలైందంటూ చర్చించుకుంటున్నారు. ఏదేమైనా దీపావళికి థియేటర్లలో అలరించేందుకు యంగ్ హీరో నిఖిల్ రానుండడంతో అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.(ఇది చదవండి: స్వయంభూ సెట్లో నిఖిల్ బర్త్డే సెలబ్రేషన్స్..)అప్పుడో ఇప్పుడో ఎప్పుడో అంటూ అనే టైటిల్ను ఫిక్స్ చేశారు. ఈ మూవీలో రుక్మిణి వసంత్, దివ్యాంశ హీరోయిన్లుగా నటిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్పై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. Into the World of #AppudoIppudoEppudo ❤️This'll thrill you, tickle you & breeze you 🤗@actor_Nikhil @rukminitweets @divyanshak @harshachemudu @dvlns @BvsnP @SunnyMROfficial @singer_karthik @NavinNooli @SVCCofficial pic.twitter.com/elyKT8ESJC— sudheer varma (@sudheerkvarma) October 6, 2024 -
కన్నప్ప: పీడించే మారెమ్మగా ఐశ్వర్య.. ఫస్ట్ లుక్ చూశారా?
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ నుంచి ఎప్పటికప్పుడు అప్డేట్లు వస్తూనే ఉన్నాయి. విష్ణు చెప్పినట్టుగా ప్రతి సోమవారం క్యారెక్టర్లు రివీల్ చేస్తూ, ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తూ ఇలా ఏదో ఒక అప్డేట్ ఇస్తూనే ఉన్నారు. ఇప్పటి వరకు శరత్ కుమార్, మధుబాల, దేవరాజ్, ముఖేష్ రిషి, మంచు అవ్రామ్, అర్పిత్ రంకా, అక్షయ్ కుమార్ పాత్రలకు సంబంధించి లుక్ విడుదల చేశారు.గత వారం కన్నప్ప నుంచి విధేయుడు, స్నేహితుడు అంటూ తిన్నడు ఉపయోగించే గుర్రం టిక్కి లుక్ను రిలీజ్ చేశారు. ఈ రోజు కన్నప్ప నుంచి మారెమ్మ పాత్రకు సంబంధించిన లుక్ విడుదల చేశారు. నటి ఐశ్వర్య ఈ మారెమ్మ లుక్లో అందరినీ భయపెట్టేలా ఉన్నారు. అడవిని పీడించే అరాచకం మారెమ్మ.. కుతంత్రమే ఆమె మంత్రం అంటూ రిలీజ్ చేసిన పోస్టర్ అందరినీ ఆకట్టుకునేలా ఉంది.ఇప్పటికే కన్నప్ప టీజర్తో సినిమా మీద మంచి హైప్ ఏర్పడింది. విష్ణు మంచు టైటిల్ రోల్లో కనిపించనున్న ఈ మూవీని అవా ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై మోహన్ బాబు నిర్మిస్తున్నారు. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం డిసెంబర్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. Introducing #Aishwarya as #Maremma who is set to unleash wildness in the forests; get ready to experience the force chaos in #Kannappa🏹#HarHarMahadevॐ@themohanbabu @ivishnumanchu @Mohanlal #Prabhas @akshaykumar @realsarathkumar #MukeshRishi @mukeshvachan @MsKajalAggarwal… pic.twitter.com/gpkgux8s6f— Kannappa The Movie (@kannappamovie) September 23, 2024 -
టాలీవుడ్ యూత్ఫుల్ ఎంటర్టైనర్.. ఈ సారి డబుల్ మ్యాడ్!
టాలీవుడ్లో యూత్ఫుల్ బ్లాక్బస్టర్ హిట్గా నిలిచిన చిత్రం మ్యాడ్. ఈ కామెడీ ఎంటర్టైనర్ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలిచింది. గతేడాది అక్టోబర్లో రిలీజైన ఈ సినిమాను కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కించారు. ఈ మూవీతోనే ఆయన డైరెక్టర్గా ఎంట్రీ ఇచ్చారు. మ్యాడ్ సూపర్ హిట్ కావడంతో మేకర్స్ మరోసారి ఆడియన్స్ను నవ్వించేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే మ్యాడ్ స్వ్కేర్ తెరకెక్కించనున్నట్లు ప్రకటించిన మేకర్స్ తాజాగా ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు.(ఇది చదవండి: మొన్న టిల్లు స్వ్కేర్.. ఇప్పుడు మ్యాడ్ స్వ్కేర్)ఈ చిత్రంలోనూ నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా రిలీజైన ఫస్ట్ లుక్ పోస్టర్లో ముగ్గురు కూడా పంచెకట్టులో కనిపించారు. పోస్టర్ చూస్తుంటే మ్యాడ్ను తలదన్నేలా కనిపిస్తోంది. అంతే కాకుండా ఈ సినిమా ఫస్ట్ సింగిల్ను సెప్టెంబర్ 20న విడుదల చేస్తామని ప్రకటించారు. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో రానున్న ఈ మూవీకి బీమ్స్ సిసిరోలియో సంగీతమందిస్తున్నారు. This time it’ll be MAD MAXX!! 😎🤘🏻Here’s the First Look of #MADSquare 🕺First single coming out on 20th September 🤩🔥#ThisTimeItsMADMAXX 💥@kalyanshankar23 @vamsi84 #HarikaSuryadevara #SaiSoujanya @NarneNithiin @SangeethShobhan #RamNitin #BheemsCeciroleo @NavinNooli… pic.twitter.com/Bzod0AzKLo— Sithara Entertainments (@SitharaEnts) September 18, 2024 -
భయం ఎందుకు?
హీరోయిన్ వేదిక ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘ఫియర్’. ఈట హరిత గోగినేని దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నటుడు అరవింద్ కృష్ణ ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు. దత్తాత్రేయ మీడియా బ్యానర్పై ఏఆర్ అభి నిర్మించిన ఈ సినిమా త్వరలో విడుదల కానుంది. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ను నటుడు, డైరెక్టర్, కొరియోగ్రాఫర్ ప్రభుదేవా సోషల్ మీడియా వేదికగా రిలీజ్ చేసి, ‘‘పోస్టర్ ఆసక్తికరంగా ఉంది.. సినిమా విజయం సాధించాలి’’ అని ఆకాంక్షించారు.‘‘వైవిధ్యమైన సస్పెన్స్ థ్రిల్లర్ కథతో రూపొందిన చిత్రం ‘ఫియర్’. చీకటి గదిలో భయపడుతూ చూస్తున్న వేదిక స్టిల్తో డిజైన్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమాపై ఆసక్తి పెంచుతోంది. ఈ చిత్రం విడుదలకు ముందే వివిధ అంతర్జాతీయ ప్రతిష్టాత్మక ఫిలిం ఫెస్టివల్స్లో ప్రదర్శితమై 60కి పైగా అవార్డులను సొంతం చేసుకుని రికార్డ్ సృష్టించింది. ఈ సినిమాని త్వరలోనే రిలీజ్ చేయనున్నాం’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ సినిమాకి సంగీతం: అనూప్ రూబెన్స్, కెమెరా: ఐ ఆండ్రూ. -
బాలయ్య వారసుడి గ్రాండ్ ఎంట్రీ.. డైరెక్టర్గా ఎవరంటే?
నందమూరి ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న తరుణం వచ్చేసింది. బాలయ్య వారసుడు నందమూరి మోక్షజ్ఞ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. హనుమాన్తో సూపర్ హిట్ కొట్టిన ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో మోక్షజ్ఞ తొలి సినిమా చేయబోతున్నారు. ఇవాళ మోక్షజ్ఞ బర్త్ డే కావడంతో ఫస్ట్ లుక్ పోస్టర్ను రివీల్ చేశారు. దీంతో నందమూరి ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. కాగా.. ఈ ఏడాది హనుమాన్ మూవీతో బ్లాక్బస్టర్ హిట్ను తన ఖాతాలో వేసుకున్నారు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. ఈ చిత్రాన్ని ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ బ్యానర్పై తెరకెక్కించనున్నారు. అంతకుముందు సింబా ఇజ్ కమింగ్ అంటూ ప్రశాంత్ వర్మ చాలాసార్లు హింట్ ఇస్తూ వచ్చారు. తాజాగా నందమూరి వారసుడిని హీరోగా పరిచయం చేస్తున్నట్లు ప్రకటించారు. మొదటి సినిమా కావడంతో నందమూరి ఫ్యాన్స్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. With great joy & privilege, Introducing you…“NANDAMURI TARAKA RAMA MOKSHAGNYA TEJA” 🦁Happy birthday Mokshu 🥳 Welcome to @ThePVCU 🤗Let’s do it 🤞Thanks to #NandamuriBalakrishna Garu for all the trust & blessings 🙏 Hoping to make this one much more special &… pic.twitter.com/gm9jnhOvYx— Prasanth Varma (@PrasanthVarma) September 6, 2024 -
తుపాకులతో బంధించడం కొత్తగా ఉంది: హీరో శ్రీకాంత్
ఎవరినైనా తాళ్ళతోనో , సంకెళ్ళతోనో కట్టి బంధిస్తారు..కానీ ‘పోలీస్ వారి హెచ్చరిక’ పోస్టర్లో పోలీసునే తుపాకులతో కట్టి బంధించడం కొత్తగా ఉంది. సినిమా కూడా అంతే కొత్తగా ఉండి..అందరికి ఆకట్టుకుంటుందని భావిస్తున్నాను’అని అన్నారు హీరో శ్రీకాంత్. అభ్యుదయ దర్శకుడు బాబ్జీ దర్శకత్వం వహించిన చిత్రం ‘పోలీసు వారి హెచ్చరిక’. తూలిక తనిష్క్ క్రియేషన్స్ పతాకంపై బెల్లి జనార్థన్ నిర్మించిన ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ని హీరో శ్రీకాంత్ రిలీజ్ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఎప్పుడూ కొత్త కథల తో , కొత్త ఆలోచనలతో అడుగులేసే దర్శకుడు బాబ్జీ ఈ సినిమాతో మంచి సక్సెస్ సాధిస్తాడని నాకు గట్టి నమ్మకం ఉందని అన్నారు.మంచి మనసున్న శ్రీకాంత్ గారి చేతులమీదుగా ఫస్ట్ లుక్ ను విడుదల గావించుకున్న మా "పోలీస్ వారి హెచ్చరిక” చిత్రాన్ని మంచి మనసున్న ప్రేక్షక మహాశయులు గొప్పగా ఆదరిస్తారనే నమ్మకం మాకుందని" దర్శకుడు బాబ్జీ అన్నారు. నా సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ని శ్రీకాంత్ ఆవిష్కరించడం నేను చేసుకున్న అదృష్టం అని నిర్మాత బెల్లి జనార్ధన్ అన్నారు. ఈ కార్యక్రమం లో యీ చిత్ర కథానాయకుడు సన్నీ అఖిల్, నటి జయ వాహిని, ప్రాజెక్టు కో ఆర్డినేటర్ యస్, హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. -
జాతకాలు చెబుతానంటోన్న టాలీవుడ్ హీరో..!
ఇటీవలే డార్లింగ్ మూవీతో ప్రేక్షకులను మెప్పించిన యంగ్ హీరో ప్రియదర్శి పులికొండ. నభా నటేశ్ హీరోయిన్గా నటించిన ఈ చిత్రం పాజిటివ్ టాక్ను సొంతం చేసుకుంది. తాజాగా మరో కొత్త సినిమాకు రెడీ అయిపోయాడు. టాలీవుడ్లో వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ప్రియదర్శి, రూప కొడువాయూర్ జంటగా నటిస్తోన్న తాజా చిత్రం 'సారంగపాణి జాతకం'. ఈ మూవీని ఫుల్ కామెడీ ఎంటర్టైనర్గా మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. శ్రీదేవి మూవీస్ బ్యానర్పై శివలెంక కృష్ణప్రసాద్ నిర్మిస్తున్నారు.ఇవాళ ప్రియదర్శి బర్త్డే కావడంతో సారంగపాణి జాతకం ఫస్ట్ లుక్ పోస్టర్తో పాటు టైటిల్ రివీల్ చేశారు. తాజాగా విడుదలైన పోస్టర్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. పోస్టర్ చూస్తుంటే థియేటర్లలో నవ్వులు పూయిచండం ఖాయంగా కనిపిస్తోంది.ఈ సందర్భంగా దర్శకుడు ఇంద్రగంటి మాట్లాడుతూ… 'నమ్మకం మనిషికి బలాన్ని ఇస్తుంది. కానీ మూఢ నమ్మకం బుద్ధిమంతుడిని కూడా బలహీనుడిని చేసి నవ్వుల పాలు చేస్తుంది. అలా నవ్వుల పాలైన ఓ మధ్య తరగతి మంచి అబ్బాయి కథే సారంగపాణి జాతకం. తన నమ్మకం, తను ఇష్టపడిన అమ్మాయి ప్రేమ మధ్య కొట్టుమిట్టాడిపోయాడా? లేదా బయట పడ్డాడా? అనే కథాంశంతో ఉత్కంఠభరితంగా పొట్ట చెక్కలయ్యేలా నవ్వించే హాస్య చిత్రమని' అన్నారు.ఇప్పుడే మొదలైంది, త్వరలో మీకే తెలుస్తుంది 🤩😉Taking you on a jam-packed comedy ride with our #SarangapaniJathakam 🖐🏻🔍@krishnasivalenk #MohanKrishnaIndraganti @PriyadarshiPN @RoopaKoduvayur @ItsActorNaresh @TanikellaBharni #Vennelakishore #AvasaralaSrinivas @harshachemudu… https://t.co/80Zwnf84Fv— Priyadarshi Pulikonda (@PriyadarshiPN) August 25, 2024 -
సస్పెన్స్ థ్రిల్లర్గా ‘ది డీల్’
రంగస్థలం నటుడు హనుకోట్ల హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన చిత్రం ‘ది డీల్’. సస్పెన్స్ థ్రిల్లర్ గా వస్తున్న ఈ చిత్రం పోస్టర్ని రిటైర్డ్ ఐఏఎస్ డాక్టర్ కేవి రమణాచారి విడుదల చేశారు. ఆనంతరం ఆయన మాట్లాడుతూ.. నటన, దర్శకత్వంపై మంచి అవగాహన ఉన్న హను కోట్ల ది డీల్ సినిమాతో మన ముందుకు రావడం సంతోషకరమని అన్నారు. సస్పెన్స్ థ్రిల్లర్ గా వస్తున్న ఈ సినిమా మంచి విజయం సాధించాలని ఆకాంక్షించారు. తెలుగు సినీ రంగంలో అడుగు పెడుతున్న దర్శకుడు హను కోట్లకు అభినందనలు తెలిపారు. ‘ఒక డిఫరంట్ స్టోరీతో వస్తున్న నన్న ప్రేక్షకులు ఆశ్వీరదించాలని కోరుతున్నాను’ అని హనుకోట్ల అన్నారు. ఈ కార్యక్రమంలో టీఎఫ్పీసీ అధ్యక్షుడు కేఎల్ దామోదర్ ప్రసాద్, ప్రముఖ సినీ రచయిత బుర్రా సాయిమాధవ్ తదితరులు పాల్గొన్నారు. -
చారులత ఆన్ డ్యూటీ
నాని హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘సరిపోదా శనివారం’. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్నారు. ‘గ్యాంగ్ లీడర్’ మూవీ తర్వాత నాని, ప్రియాంక మోహన్ జోడీగా నటిస్తున్న రెండో చిత్రం ‘సరిపోదా శనివారం’. ఎస్జే సూర్య, సాయికుమార్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. డీవీవీ ఎంటర్టైన్ మెంట్ పతాకంపై డీవీవీ దానయ్య, కల్యాణ్ దాసరి నిర్మిస్తున్నారు.ఈ సినిమా నుంచి ప్రియాంక మోహన్ ఫస్ట్ లుక్ను విడుదల చేశారు మేకర్స్. ‘‘యాక్షన్ అడ్వెంచర్గా రూపొందుతోన్న పాన్ ఇండియా చిత్రం ‘సరిపోదా శనివారం’. ఈ మూవీలో చారులత అనే పోలీస్ కానిస్టేబుల్ పాత్రలో నటిస్తున్నారు ప్రియాంక మోహన్. ఆమె పాత్ర చాలా కీలకంగా ఉంటుంది. భారీ బడ్జెట్, ఉన్నత ప్రమాణాలతో నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ చివరి దశలో ఉంది. ఆగస్టు 29న ఈ మూవీ పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది’’ అని చిత్రబృందం పేర్కొంది. -
పట్టు వదలకుండా..!
అజిత్, త్రిష జంటగా రూపొందుతున్న చిత్రం ‘విడా ముయర్చి’ (పట్టు వదలకుండా ప్రయత్నించడం). లైకా ప్రోడక్షన్స్పై మగిళ్ తిరుమేని దర్శకత్వంలో సుభాస్కరన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం నుంచి అజిత్ ఫస్ట్ లుక్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా లైకాప్రోడక్షన్స్ హెడ్ జీకేఎం తమిళ్ కుమరన్ మాట్లాడుతూ – ‘‘మా బేనర్లో అజిత్తో సినిమా ప్రకటించినప్పట్నుంచి అభిమానులు, ప్రేక్షకులు ఈ మూవీ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వారి అంచనాలను చేరుకునేలా మంచి కథా కథనాలతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. ఆగస్ట్లో సినిమా చిత్రీకరణ పూర్తవుతుంది. విడుదల ఎప్పుడనేది త్వరలో చెబుతాం’’ అన్నారు. ఇక ప్రచారంలో ఉన్న ప్రకారం ఈ చిత్రకథ ఏంటంటే... ఓ భార్యాభర్త విహార యాత్రకు వెళతారు. అకస్మాత్తుగా భార్య కనిపించకుండా పోతుంది. ఆమెను కనుగొనే క్రమంలో కనిపించని శత్రువులతో పట్టు వదలకుండా హీరో చేసే పోరాటం నేపథ్యంలో ఈ చిత్రం ఉంటుందని తెలిసింది. ఆరవ్, రెజీనా కసాండ్ర, నిఖిల్, అర్జున్ నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: అనిరుధ్, కెమెరా: ఓం ప్రకాశ్. -
మాస్ మల్లి
సిగరెట్ కాల్చుతూ రిక్షాలో మాస్గా కూర్చొన్న అతని పేరు మల్లి. ఇంటిపేరు బచ్చల. చేసేది ట్రాక్టర్ డ్రైవర్గా... ఇంకా అతని పూర్తి వివరాలు తెలుసుకోవాలనుకునేవారు థియేటర్స్కు వెళ్లాల్సి ఉంటుంది. ‘అల్లరి’ నరేశ్ టైటిల్ రోల్ చేస్తున్న తాజా చిత్రం ‘బచ్చల మల్లి’. 1990 నేపథ్యంలో సాగే ఈ సినిమాకు ‘సోలో బ్రతుకే సో బెటర్’ ఫేమ్ సుబ్బు మంగాదేవి దర్శకత్వం వహిస్తున్నారు. హాస్య మూవీస్ బ్యానర్పై రాజేశ్ దండా, బాలాజీ గుత్తా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.మంగళవారం ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ను విడుదల చేశారు మేకర్స్. ఈ పోస్టర్లో సీరియస్ లుక్లో కనిపిస్తున్నారు ‘అల్లరి’ నరేశ్. ‘‘ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్లో జరుగుతోంది. ఈ బచ్చల మల్లి చాలా రోజులు గుర్తిండిపోతాడు. నిర్మాణం పనులు తుది దశకు చేరుకున్నాయి’’ అని చిత్రబృందం పేర్కొంది. అమృతా అయ్యర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో రోహిణి, రావు రమేశ్, అచ్యుత్ కుమార్, బలగం జయరామ్, హరితేజ, ప్రవీణ్, వైవా హర్ష ముఖ్య పాత్రధారులు. ఈ సినిమాకు సంగీతం: విశాల్ చంద్రశేఖర్, కెమెరా: రిచర్డ్ ఎం. నాథన్. -
కామెడీ ఎంటర్టైనర్గా వస్తోన్న నమో.. ఆకట్టుకుంటోన్న ఫస్ట్ లుక్ పోస్టర్!
విశ్వంత్ దుద్దంపూడి, అనురూప్ కటారి, విస్మయ ప్రధాన పాత్రల్లో వస్తోన్న చిత్రం నమో. శ్రీ నేత్ర క్రియేషన్స్, ఆర్మ్స్ ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్ల మీద ప్రశాంత్ ఈ మూవీని నిర్మించారు. ఈ చిత్రం ద్వారా ఆదిత్య రెడ్డి కుందూరు దర్శకులుగా పరిచయం కాబోతున్నారు. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ అందరినీ ఆకట్టుకుంటోంది.విశ్వంత్- అనురూప్ కాంబోలో వస్తోన్న ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ పోస్టర్, టీజర్ ఆడియెన్స్ను ఆకట్టుకుంటున్నాయి. అయితే ఇప్పుడు ఈ చిత్రానికి సంబంధించిన రిలీజ్ డేట్ను ప్రకటించారు. జూన్ 7న సినిమా థియేటర్లలో సందడి చేయనుంది. ఈ చిత్రానికి కెమెరామెన్గా రాహుల్ శ్రీవాత్సవ్.. మ్యూజిక్ డైరెక్టర్గా క్రాంతి ఆచార్య వడ్లూరి.. ఎడిటర్గా సనల్ అనిరుధన్ పని చేశారు. -
యాక్షన్ ఎంటర్టైనర్గా లారీ చాప్టర్-1.. ఆసక్తిగా ఫస్ట్ లుక్ పోస్టర్!
శ్రీకాంత్ రెడ్డి ఆసం హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన చిత్రం "లారి చాప్టర్ -1". యూట్యూబ్లో తన వీడియోలతో కోట్ల మంది అభిమానులను సొంతం చేసుకుని మంచి పాపులారిటీ సంపాదించుకున్న శ్రీకాంత్ రెడ్డి హీరోగా వెండి తెరకు పరిచయమవుతున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్గా చంధ్ర శిఖ నటించనుండగా.. రాఖీ సింగ్ ప్రధాన పాత్రలో నటించారు. కింగ్ మేకర్ పిక్చర్స్ పతాకంపై ఆసం వెంకట లక్ష్మి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసారు.ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి ఆసం మాట్లాడుతూ..'చెన్నై లయోల కాలేజీలో డైరెక్షన్ కోర్స్ చేసిన మొదట యూట్యూబ్లో నా కెరీర్ ప్రారంభించాను. మంచి పాపులారిటీ వచ్చింది. అలాగే చాలా సినిమాలకు వివిధ శాఖలలో పని చేశాను. ఇప్పుడు "లారి చాప్టర్ -1" అనే సినిమాతో మీ ముందుకు వస్తున్నా. ఇది ఒక యాక్షన్ ఎంటర్టైనర్. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, హిందీ, బెంగాలీ భాషలో ఒకేసారి విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నా. నా మొదటి సినిమా అందరికీ నచ్చుతుంది"' అని తెలిపారు. -
హనుమాన్ హీరో కొత్త మూవీ.. గ్లింప్స్ చూస్తే గూస్బంప్సే!
హనుమాన్ మూవీతో బ్లాక్బస్టర్ హిట్ కొట్టిన యంగ్ హీరో తేజ సజ్జా. ఈ సినిమాతో ఒక్కసారిగా క్రేజ్ దక్కించుకున్నారు. తేజ మరో హిస్టారికల్ మూవీ చేసేందుకు రెడీ అయిపోయారు. తేజ సజ్జాకు జంటగా రితికా నాయక్ నటిస్తోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్లో టీజీ విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాకు కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తున్నారు. గతంలో ఆయన రవితేజతో ఈగల్ మూవీని తెరకెక్కించారు. తాజాగా ఈ మూవీ టైటిల్తో పాటు గ్లింప్స్, ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. హైదరాబాగ్లోని రామానాయుడు స్టూడియోలో జరిగిన కార్యక్రమంలో టైటిల్ రివీల్ చేశారు. తేజ సజ్జా తాజా చిత్రానికి మిరాయి అనే టైటిల్ ఖరారు చేశారు. ఈ చిత్రంలో తేజ సూపర్యోధ పాత్రలో కనిపించనున్నారు. తాజాగా రిలీజైన ఫస్ట్ లుక్ పోస్టర్లో తేజ సజ్జ సూపర్ యోధా లుక్లో కనిపించారు. బద్దలయ్యే అగ్నిపర్వతం పైన నిలబడి ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాను అశోకుని కాలంలో జరిగిన కళింగ యుద్ధం ఆధారంగా తెరకెక్కిస్తున్నట్లు గ్లింప్ల్ చూస్తే అర్థమవుతోంది. మిరాయి సినిమాను తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, బెంగాలీ, మరాఠీతో పాటు చైనీస్ భాషల్లోనూ వచ్చే ఏడాది ఏప్రిల్ 18న విడుదల చేయనున్నారు. From the hush of ancient narratives📜 Comes a thrilling adventurous saga of a #SuperYodha 🥷⚔️#PMF36 x #TejaSajja6 Titled as #𝐌𝐈𝐑𝐀𝐈 ⚔️#MIRAITitleGlimpse out now💥 -- https://t.co/k4tycunRkA In Cinemas on 18th APRIL 2025 ~ 2D & 3D🔥 SuperHero @tejasajja123… pic.twitter.com/WN2MB2EPlE — People Media Factory (@peoplemediafcy) April 18, 2024 -
కుటుంబ కథాచిత్రం
రాజేంద్ర ప్రసాద్, బ్రహ్మానందం, ‘శుభలేఖ’ సుధాకర్ కీలక పాత్రల్లో రామ్ కిరణ్, మేఘా ఆకాష్ జంటగా నటిస్తున్న చిత్రం ‘సఃకుటుంబానాం’. ఉదయ్ శర్మ దర్శకత్వం వహిస్తున్నారు. హెచ్ఎన్జీ సినిమాస్పై హెచ్ మహాదేవ గౌడ్ నిర్మిస్తున్న ఈ మూవీ ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సందర్భంగా ఉదయ్ శర్మ మాట్లాడుతూ–‘‘రేషన్ కార్డులాగా ఉన్న ఫస్ట్ లుక్కి చాలా మంచి స్పందన వచ్చింది. మా సినిమాలో చాలా మంచి కంటెంట్ ఉంది. ఎంతో మంది సీనియర్స్ నటిస్తున్నారు. ఈ సినిమాకి మణిశర్మగారి మ్యూజిక్ హైలెట్’’ అన్నారు. ‘‘సఃకుటుంబానాం’ మంచి క్రియేటివిటీతో కూడిన కుటుంబ కథా చిత్రం అవుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు మహాదేవ గౌడ్. ఈ చిత్రానికి కెమెరా: మధు దాసరి. -
కుటుంబ కథాంశంతో ‘సఃకుటుంబానాం’
రామ్ కిరణ్, మేఘ ఆకాష్ హీరోహీరోయిన్లుగా నటించిన తాజా చిత్రం ‘సఃకుటుంబానాం’. ఉదయ్ శర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రాజేంద్ర ప్రసాద్, బ్రహ్మానందం, సత్య తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. హెచ్.మహదేవ గౌడ్ నిర్మాత. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ ,మోషన్ పోస్టర్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు ఉదయ్ మాట్లాడుతూ.. ‘ఈ మధ్య కాలంలో ఇంత మంది ఆరిస్టులు, ఇంత మంచి కాంబినేషన్స్తో ఏ సినిమా రాలేదు. ఇందులో చాలా మంచి కథ ఉంది. ఎవరూ ఊహించని రీతిలో ఈ చిత్రం ఉంటుంది. నిర్మాత మహదేవ్ మాట్లాడుతూ.. అచ్చమైన తెలుగు టైటిల్తో వస్తున్న ఈ సినిమాను ప్రేక్షకులు కచ్చితంగా ఆదరిస్తారనే నమ్మకం ఉంది. అందరు మెచ్చేలా కుటుంబ కథాంశంతో రూపొందుతున్న చిత్రమిది’ అన్నారు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. -
టాలీవుడ్ హీరోయిన్ బర్త్ డే.. ఫస్ట్ లుక్ అదిరిపోయింది!
అలా మొదలైంది సినిమాతో టాలీవుడ్కు ఎంట్రీ ఇచ్చిన నటి నిత్యామీనన్. ఆ తర్వాత నితిన్ సరసన ఇష్క్ సినిమాతో గుర్తింపు దక్కించుకుంది. ఆ తర్వాత తెలుగు, కన్నడ, తమిళం, మలయాళంలో దాదాపు 50కి పైగా చిత్రాల్లో నటించింది. తెలుగులో గుండెజారి గల్లంతయ్యిందే, జనతా గ్యారేజ్, 100 డేస్ ఆఫ్ లవ్, ఒక్క అమ్మాయి తప్ప, ఇంకొక్కడు లాంటి చిత్రాల్లో నటించింది. ఇటీవల వెబ్ సిరీస్లతో అలరించిన మలయాళీ భామ 36వ పుట్టినరోజును జరుపుకుంటోంది. ఇవాళ నిత్యా మీనన్ బర్త్ డే కావడంతో మరో కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. తాజాగా నిత్యా నటిస్తోన్న 'డియర్ ఎక్సెస్' మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ చిత్రం ద్వారా కామిని డైరెక్టర్గా పరిచయవుతున్నారు. రిలీజైన పోస్టర్లో నిత్యా ఒక చేతిలో మొబైల్.. మరో చేతిలో గ్లాస్ పట్టుకుని కనిపించింది. ఈ సినిమాను బాస్క్ టైమ్ థియేటర్, పోప్టర్ మీడియా నెట్వర్క్ బ్యానర్లపై బీజీఎన్, ఆదిత్య అజయ్ సింగ్, రామ్కి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. పోస్టర్ చూస్తే ఫుల్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో వినయ్ రాయ్, నవదీప్, ప్రతీక్ బబ్బర్, దీపక్ పరంబోల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. View this post on Instagram A post shared by Nithya Menen (@nithyamenen) -
'ఇలాంటి టైటిల్ పెట్టకపోవడం ఆశ్చర్యంగా ఉంది'
మిర్చి విజయ్, అంజలి నాయర్ హీరో హీరోయిన్లుగా నటిస్తోన్న తాజా చిత్రం వైఫ్. ఈ చిత్రం ద్వారా హేమంత్ నాదం దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఒలింపియ మూవీస్ సంస్థ అధినేత ఎస్.అంబేడ్కర్ నిర్మిస్తున్నారు. గతంలో జిప్సీ, డాడా, కలిగేత్తి మూర్కన్ వంటి వైవిధ్యభరిత కథా చిత్రాలను ఆయన నిర్మించారు. తాజాగా ఈ మూవీకి సంబంధించి టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ను మేకర్స్ రిలీజ్ చేశారు. దంపతుల మధ్య నవీన అనుబంధాలను ఆవిష్కరించే కథాచిత్రంగా ఇది ఉంటుందని డైరెక్టర్ హేమంత్ నాదం అన్నారు. అందుకే ఈ చిత్రానికి వైఫ్ అని పేరు పెట్టామని తెలిపారు. ఇలాంటి టైటిల్ను ఇప్పటివరకు ఎవరూ పెట్టకపోవడం ఆశ్చర్యాన్ని కలిగించిందన్నారు. చదరంగంలో రాణికి అపార శక్తి ఉంటుందన్నారు. అదేవిధంగా ఒక ఇంటిని చక్కదిద్దడంలో భార్య పాత్ర ముఖ్యమన్నారు. వివాహానంతరం భార్యాభర్తల మధ్య పెరిగే ప్రేమానుబంధాన్ని ఎమోషనల్గా ఆవిష్కరించే చిత్రమని చెప్పారు. ఈ చిత్రం ద్వారా మిర్చి విజయ్ను కథానాయకుడిగా పరిచయం చేస్తున్నట్లు చెప్పారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు దర్శకుడు పేర్కొన్నారు. ఈ చిత్రానికి కేఏ శక్తివేల్ చాయాగ్రహణం, జెన్ మార్టిన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సినిమాలో మైత్రేయన్, రెడిన్ కింగ్స్ లీ, కల్యాణి నటరాజన్, విజయ్బాబు, విల్లు, కదిర్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. Super happy to present the First Look of my next Romcom #Wife with @RJVijayOfficial 👰🏻♀️🤵🏻 Directed by @dir_hemanathan Produced by @ambethkumarmla @olympiaMovis@Abishek_jg @shakthi_dop @JenMartinmusic @PMohan93 @gayathribala21@sharmaseenu11@VishnuEdavan1 @DoneChannel1 pic.twitter.com/fqnzgwDBaZ — Anjali (@ianjalinair) March 23, 2024 -
కన్నప్ప గురి
విష్ణు మంచు హీరోగా రూపొందుతోన్న చిత్రం ‘కన్నప్ప’. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, అవా ఎంటర్టైన్మెంట్స్పై మోహన్బాబు నిర్మిస్తున్నారు.పాన్ ఇండియా ప్రాజెక్ట్గా రూపొందుతున్న ఈ మూవీలో మోహన్బాబు, ప్రభాస్, మోహన్ లాల్, శరత్ కుమార్ కీలకపాత్రల్లో నటిస్తున్నారు. కాగా శుక్రవారం మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ‘కన్నప్ప‘ ఫస్ట్ లుక్ను విడుదల చేశారు. విల్లు గురిపెట్టిన కన్నప్పగా విష్ణు మంచు లుక్ విడుదలైంది. ‘‘ఒక ధైర్యవంతుడైన యోధుడు, శివుని భక్తుడైన కన్నప్ప కథను ‘కన్నప్ప’గా తెరపైకి తీసుకొస్తున్నాం. ఇంత గొప్ప పాత్రను అంతే గొప్పగా పోషిస్తున్నారు విష్ణు మంచు. ఫస్ట్ లుక్ పోస్టర్ కన్నప్ప క్యారెక్టర్లోని డెప్త్, ఇంటెన్సిటీ చూపిస్తోంది. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ, ఇంగ్లిష్ భాషల్లో ఈ మూవీ రూపొందుతుండగా అన్ని భాషల్లో రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్కి మంచి స్పందన వస్తోంది. ‘కన్నప్ప’ చిత్రం రెండో షెడ్యూల్ ప్రస్తుతం న్యూజిల్యాండ్లో జరుగుతోంది. అద్భుతమైన దృశ్య కావ్యంగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. -
ఫర్ఫెక్ట్ యూత్ ఫుల్ ఎంటర్టైనర్.. 'వి లవ్ బ్యాడ్ బాయ్స్'!
రాజు రాజేంద్ర ప్రసాద్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న యూత్ ఫుల్ ఎంటర్టైనర్ 'వి లవ్ బ్యాడ్ బాయ్స్". ఫుల్ కామెడీ చిత్రంగా వస్తోన్న ఈ చిత్రాన్ని నూతన నిర్మాణ సంస్ధ బీఎమ్ క్రియేషన్స్ పతాకంపై పప్పుల కనక దుర్గారావు నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఇటీవలే సెన్సార్ కూడా పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి యూ/ఏ సర్టిఫికెట్ లభించింది. ఇవాళ వాలెంటైన్ డే సందర్భంగా ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సినిమాలో అజయ్, వంశీ ఏకశిరి, ఆదిత్య శశాంక్ నేతి, రోమిక శర్మ, రోషిణి సహోట, ప్రగ్యా నయన్, సన్యు దవలగర్, వంశీకృష్ణ, సింధు విజయ్, విహారిక చౌదరి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సందర్భంగా డెరెక్టర్ రాజు రాజేంద్ర ప్రసాద్ మాట్లాడారు. ప్రస్తుత ట్రెండ్కు తగినట్లుగానే కామెడీ ఎంటర్టైనర్గా ఈ చిత్రాన్ని తెరకెక్కించామని తెలిపారు. ఈ చిత్రం తమకు శుభారంభం ఇస్తుందనే నమ్మకం ఉందని నిర్మాత పప్పుల కనక దుర్గారావు అన్నారు. అతి త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తామని పేర్కొన్నారు. కాగా.. పోసాని కష్ణమురళి, కాశి విశ్వనాథ్, అలి, సప్తగిరి, పృథ్వి, శివారెడ్డి, భద్రం, గీతాసింగ్ ముఖ్య పాత్రలు పోషించారు. -
'వేదా'గా వచ్చేస్తున్న జాన్ అబ్రహాం
బాలీవుడ్ నటుడు జాన్ అబ్రహాం నటించిన తాజా యాక్షన్ మూవీ ‘వేదా’. ‘సలామ్ ఏ ఇష్క్’ (2007) వంటి హిట్ మూవీ తర్వాత హీరో జాన్ అబ్రహాం, డైరెక్టర్ నిఖిల్ అద్వానీ కాంబినేషన్లో ఈ మూవీ రూపొందింది. ఈ చిత్రంలో శార్వరీ వాఘ్ హీరోయిన్గా నటించారు. మోనీషా అద్వానీ, మధు భోజ్వాని, జాన్ అబ్రహాం నిర్మించారు. పోస్ట్ ప్రోడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని జూలై 12న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్. ఈ సందర్భంగా జాన్ అబ్రహాం, శార్వరీ వాఘ్ల ఫస్ట్ లుక్ పోస్టర్ను విడుదల చేశారు. ‘‘యాక్షన్ డ్రామాగా ‘వేదా’ రూపొందింది. వాస్తవ ఘటనల స్ఫూర్తితో ఈ చిత్రం తీశాను. ఈ మూవీ మన సమాజంలోని పరిస్థితులను ప్రతిబింబిస్తుంది’’ అని నిఖిల్ అద్వానీ పేర్కొన్నారు. -
అఘోర పాత్రలో టాలీవుడ్ యంగ్ హీరో.. భయపెడుతోన్న పోస్టర్!
టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ నటిస్తోన్న తాజా చిత్రం 'గామి'. ఈ సినిమాలో చాందినీ చౌదరి హీరోయిన్గా కనిపించనుంది. ఈ చిత్రం ద్వారా విద్యాధర్ డైరెక్టర్గా పరిచయం అవుతున్నారు. తాజాగా ఈ చిత్రం ఫస్ట్లుక్ పోస్టర్ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ ట్వీట్ చేసింది. నిర్మాణ సంస్థ ట్వీట్లో రాస్తూయ..'అతని అతిపెద్ద భయం మానవ స్పర్శ. అతని లోతైన కోరిక కూడా మానవ స్పర్శే. ఒక వ్యక్తి ప్రత్యేకమైన కథ.. అతని అతిపెద్ద భయాన్ని జయించటానికి ప్రయాణం' అంటూ క్యాప్షన్ ఇచ్చారు. కాగా.. ఫస్ట్ లుక్ పోస్టర్ చూస్తే అఘోర పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలోనే థియేటర్లకు రానుంది. కాగా.. ఈ సినిమాను ఉద్దేశించి ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో విశ్వక్ సేన్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఈ సినిమా కోసం దాదాపు నాలుగున్నర ఏళ్లుగా కష్టపడుతున్నానని తెలిపారు. తన పాత్ర చాలా విభిన్నంగా ఉంటుందని.. ఈ చిత్రాన్ని హిమాలయాలు, వారణాసి లాంటి ప్రాంతాల్లో తెరకెక్కించినట్లు వివరించారు. కథ విషయంలో డైరెక్టర్ ఫుల్ క్లారిటీతో ఉన్నారని విశ్వక్ సేన్ తెలిపారు. #Gaami - 𝗛𝗶𝘀 𝗯𝗶𝗴𝗴𝗲𝘀𝘁 𝗳𝗲𝗮𝗿 𝗶𝘀 𝗵𝘂𝗺𝗮𝗻 𝘁𝗼𝘂𝗰𝗵. 𝗛𝗶𝘀 𝗱𝗲𝗲𝗽𝗲𝘀𝘁 𝗱𝗲𝘀𝗶𝗿𝗲 𝗶𝘀 𝗮𝗹𝘀𝗼, 𝗵𝘂𝗺𝗮𝗻 𝘁𝗼𝘂𝗰𝗵 ☯️ A unique tale of one man and his journey to conquer his biggest fear 🧿 In cinemas soon!@VishwakSenActor @iChandiniC @mgabhinaya… pic.twitter.com/zSSUxI0Fqv — UV Creations (@UV_Creations) January 28, 2024 -
భారత్-చైనా సంబంధాల ఇతివృత్తంతొ ‘చైనా పీస్’
నిహాల్ కోదాటి, సూర్య శ్రీనివాస్ ప్రధాన పాత్రలలో అక్కి విశ్వనాధ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం "చైనా పీస్". రిపబ్లిక్ డే సందర్భంగా పాన్ ఇండియా స్టార్ హీరో నిఖిల్ సిద్ధార్థ ఈ చిత్రం ఫస్ట్ లుక్, హై కాన్సెప్ట్ పోస్టర్ను లాంచ్ చేశారు. లిప్స్టిక్ , యుఎస్ బీ డ్రైవ్ ఇమేజ్ కాంబినేషన్ ని మిక్స్ చేస్తూ ఆసక్తికరంగా చూపిస్తూ ఒక మిసైల్ ని పోలివున్న ఈ పోస్టర్ చాలా క్యురియాసిటీని పెంచింది. దేశభక్తి, భారతదేశం-చైనా సంబంధాల ఇతివృత్తంతో ఈ కథ ఉండబోతుందని పోస్టర్ సూచిస్తోంది. ఫస్ట్ లుక్ పోస్టర్ ఒక డిఫరెంట్ సినిమాటిక్ జర్నీని ప్రామిస్ చేస్తోంది. మూన్ లైట్ డ్రీమ్స్ నిర్మిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో హర్షిత, శ్రీషా నూలు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ప్రముఖ సాంకేతిక నిపుణులు ఈ చిత్రానికి పని చేస్తున్నారు. -
దర్శకుడిగా టాలీవుడ్ నటుడి తొలి సినిమా.. ఆసక్తిగా ఫస్ట్ లుక్ పోస్టర్!
టాలీవుడ్ నటుడు ధనరాజ్ హీరోగా నటిస్తూ.. దర్శకత్వం వహిస్తోన్న చిత్రం "రామం రాఘవం". ఈ చిత్రంలో కోలీవుడ్ నటుడు సముద్రఖని ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఇవాళ అయోధ్య బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ను మేకర్స్ ఆవిష్కరించారు. అయోధ్య రాముని ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా 22 మంది సినీ ప్రముఖుల చేతుల మీదుగా పోస్టర్ విడుదల చేశారు. ఈ చిత్రం ద్వారా ధన్రాజ్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ చిత్రాన్ని స్లేట్ పెన్సిల్ స్టోరీస్ బ్యానర్పై ప్రభాకర్ ఆరిపాక సమర్పణలో పృథ్వి పొలవరపు నిర్మిస్తున్నారు. మేకర్స్ రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ సినీ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ చిత్రంలో సముద్రఖని , ధనరాజ్ తండ్రీ, కొడుకులుగా కనిపించనున్నారు. ఇప్పటివరకు ఎప్పుడూ చూడని ఒక తండ్రి కొడుకుల కథను అద్భుతంగా తెరమీద ఆవిష్కరిస్తున్నామని దర్శకుడు ధనరాజ్ తెలిపారు. కాగా.. ఈ చిత్రంలో మోక్ష, హరీష్ ఉత్తమన్, సత్య పృద్వి, శ్రీనివాసరెడ్డి, చిత్రం శ్రీను, ప్రమోదిని, రాకెట్ రాఘవ, రచ్చ రవి, ఇంటూరి వాసు నటిస్తున్నారు. ఈ సినిమాకు విమానం చిత్ర దర్శకుడు శివ ప్రసాద్ యానా కథను సమకూర్చగా.. అరుణ్ చిలువేరు సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోన్న ఈ చిత్రం తమిళ, తెలుగు భాషలలో ఒకేసారి విడుదల కానుంది. జగమంతా రామమయం 🙏🏻 ఇలాంటి అద్భుతమైన రోజు నా సినిమా టైటిల్ రిలీజ్ చేయడం నా పూర్వజన్మ సుకృతం 🙏🏻Presenting the first look poster of Love that knows no boundaries 💞 A tale of a father and son!🧡🧡@thondankani @DhanrajOffl @Prudhvi_dir @DirPrabhakar #RR #RamamRaghavam pic.twitter.com/zbQ4u8PXJ7 — Dhanraj koranani (@DhanrajOffl) January 22, 2024 -
‘కేరింత’ఫేమ్ పార్వతీశం హీరోగా 'మార్కెట్ మహాలక్ష్మి'
‘కేరింత’ఫేమ్ పార్వతీశం హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘మార్కెట్ మహాలక్ష్మి’. వియస్ ముఖేష్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ద్వారా ప్రణీకాన్వికా హీరోయిన్గా పరిచయం అవుతున్నారు. హర్ష వర్ధన్, మహబూబ్ బాషా, ముక్కు అవినాష్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.ఈ మూవీ 'టైటిల్ పోస్టర్'ని బిగ్ బాస్ ఫెమ్ హీరో 'శివాజీ' చేతుల మీదగా ఈ రోజు ఆవిష్కరణ జరగగా, ప్రొడ్యూజర్ బెక్కెం వేణుగోపాల్ అతిధి గా వచ్చి టీం ని విష్ చేశారు. ఈ సందర్భంగా శివాజీ మాట్లాడుతూ.. ‘నేను 27 ఏళ్ళ వయసులో యాక్టింగ్ మొదలు పెడితే దాదాపు 50 యేళ్ళకి నాకు గుర్తింపు వచ్చింది. ఏదో, ఒక రోజు గుర్తింపు అనేది వస్తుంది. కాకపోతే క్యారెక్టర్, హార్డ్ వర్క్, ఓపిక ఇంపార్టెంట్. 'కేరింత' మూవీతో కేరీర్ స్టార్ట్ చేసిన హీరో 'పార్వతీశం' కి తప్పకుండా ఈ సినిమా ద్వారా మంచి గుర్తింపు వస్తుంది అని నాకు బలమైన నమ్మకం ఉంది. ప్రొడ్యూసర్ 'అఖిలేష్ కలారు'కి మంచి లాభాలు చేకుర్చాలి. డైరెక్టర్ ' వియస్ ముఖేష్' కథ బాగా తీసి ఉంటారని నమ్ముతున్నాను’అన్నారు. 'మార్కెట్ మహాలక్ష్మి'చూసినప్పుడు నాకు శేఖర్ కమ్ముల గారి సినిమాలు గుర్తొచ్చాయి’అని బెక్కం వేణుగోపాల్ అన్నారు. -
ప్రభాస్-మారుతి క్రేజీ కాంబో.. టైటిల్ అదిరిపోయిందిగా!
టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. క్రేజీ డైరెక్టర్ మారుతితో జతకడుతోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్పై అభిమానుల్లో విపరీతమైన ఆసక్తి నెలకొంది. ఇటీవలే సలార్తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన రెబల్ స్టార్ మరో చిత్రానికి రెడీ అయిపోయారు. తాజాగా వీరిద్దరి కాంబోలో వస్తోన్న మూవీ టైటిల్ రివీల్ చేశారు. సంక్రాంతి కానుకగా ఈ చిత్ర నిర్మాణ సంస్థ ది పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ట్వీట్ చేసింది. ప్రభాస్- మారుతి కొత్త చిత్రానికి 'ది రాజాసాబ్' అనే టైటిల్ను ఖరారు చేశారు. టైటిల్తో పాటు ఫస్ట్లుక్ పోస్టర్ను కూడా రిలీజ్ చేశారు. రెబల్ స్టార్ కొత్త లుక్లో కనిపించడంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ప్రభాస్ ఇప్పటిదాకా చేయని రొమాంటిక్ హారర్ జానర్లో "రాజా సాబ్" సినిమాను రూపొందిస్తుండటంతో అందరిలో క్యూరియాసిటీ మరింత పెరుగుతోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్పై తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. కాగా.. ఈ సినిమాకు ఎస్ఎస్ తమన్ సంగీతమందిస్తున్నారు. కాగా.. ప్రభాస్ మరోవైపు కల్కి అనే చిత్రంలోనూ నటిస్తున్నారు. కాగా.. దర్శకుడు మారుతి గతంలో "భలే భలే మగాడివోయ్", "మహానుభావుడు", "ప్రతి రోజు పండగే" వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ అందించారు. మారుతి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ను కొత్తగా సిల్వర్ స్క్రీన్ మీద ప్రెజెంట్ చేస్తాడనే నమ్మకం అందరిలో ఏర్పడుతోంది. డార్లింగ్ ఫ్యాన్స్ ప్రభాస్ను ఎలా స్క్రీన్ మీద చూడాలనుకుంటున్నారో అలా "రాజా సాబ్" మూవీని మారుతి తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. కాగా.. ది "రాజా సాబ్" పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు తమిళ,మలయాళ, కన్నడ, హిందీలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. #TheRajaSaab It is… 👑 Wishing you all a very Happy and Joyous Sankranthi! ❤️ 𝐀 𝐑𝐞𝐛𝐞𝐥’𝐬 𝐄𝐧𝐭𝐞𝐫𝐭𝐚𝐢𝐧𝐦𝐞𝐧𝐭 𝐄𝐱𝐩𝐥𝐨𝐝𝐞𝐬 𝐖𝐨𝐫𝐥𝐝𝐰𝐢𝐝𝐞 𝐒𝐨𝐨𝐧 🌋#PrabhasPongalFeast #Prabhas A @DirectorMaruthi film Produced by @Vishwaprasadtg A @MusicThaman Musical… pic.twitter.com/kvmUxIcXFC — People Media Factory (@peoplemediafcy) January 15, 2024 -
గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్టైమ్
విజయ్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమాకు ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్టైమ్’ అనే టైటిల్ ఖరారైంది. విజయ్ కెరీర్లో 68వ సినిమాగా వస్తున్న ఈ చిత్రానికి వెంకట్ ప్రభు దర్శకత్వం వహిస్తున్నారు. ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది. న్యూ ఇయర్ (2024) సందర్భంగా ఈసినిమా టైటిల్, ఫస్ట్లుక్ పోస్టర్ను ఆదివారం విడుదల చేశారు మేకర్స్. అలాగే ఈ సినిమాకు సంబంధించిన మరో లుక్ నేడు రానుందని కోలీవుడ్ సమాచారం. ఫస్ట్లుక్ని చూస్తే ఈ చిత్రంలో విజయ్ ద్విపాత్రాభినయం చేస్తున్నారని స్పష్టమవుతోంది. మీనాక్షీ చౌదరి హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో ప్రశాంత్, లైలా, స్నేహ, జయరాం, యోగిబాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా ఈ ఏడాది దీపావళి కానుకగా విడుదలకానుందనే టాక్ కోలీవుడ్లో వినిపిస్తోంది. ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు. -
సరికొత్తగా...
నిహారిక కొణిదెల లీడ్ రోల్లో నటిస్తున్న చిత్రం ‘వాట్ ది ఫిష్’. ‘వెన్ ది క్రేజీ బికమ్స్ క్రేజియర్’ అనేది ఉపశీర్షిక. ఈ చిత్రంతో వరుణ్ కోరుకొండ దర్శకునిగా పరిచయమవుతున్నారు. 6 ఐఎక్స్ సినిమాస్పై విశాల్ బెజవాడ, సూర్య బెజవాడ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ఫస్ట్లుక్ పోస్టర్ను విడుదల చేశారు మేకర్స్. ‘‘ఈ సినిమాలో అష్టలక్ష్మిపాత్రలో కనిపిస్తారు నిహారిక. ఆమెపాత్ర సరికొత్తగా, ప్రేక్షకులను అలరించేలా ఉంటుంది’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ సినిమాకు సంగీతం: శక్తికాంత్ కార్తీక్, సహ నిర్మాత: వరుణ్ కోరుకొండ. కాగా 2019లో వచ్చిన ‘సూర్యకాంతం’ చిత్రం తర్వాత మళ్లీ నిహారిక నటిస్తున్న సినిమా ‘వాట్ ది ఫిష్’ కావడం విశేషం. -
కామెడీ ఎక్స్ప్రెస్
చైతన్యారావు, హెబ్బా పటేల్ జంటగా నటిస్తున్న రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ ‘హనీమూన్ ఎక్స్ప్రెస్’. ఎన్ఆర్ఐ ఎంటర్టైన్మెంట్స్, న్యూ రీల్ ఇండియా ఎంటర్టైన్మెంట్స్ పతాకాలపై బాల రాజశేఖరుని దర్శకత్వంలో కేకేఆర్, బాల రాజ్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్లుక్ పోస్టర్ను హీరో నాగార్జున విడుదల చేసి, మాట్లాడుతూ–‘‘వినోదాత్మకంగా సందేశంతో కూడిన ఈ చిత్రం విజయం సాధించాలి’’ అన్నారు. ‘‘లాస్ ఏంజెల్స్లో ఉంటూ ఎన్నో హాలీవుడ్ చిత్రాలకు పని చేశాను. కానీ తెలుగు సినిమా చేయాలనేది నా కల. నాగార్జున, అమలగార్ల ్రపోత్సాహంతో టాలీవుడ్లో అరంగేట్రం చేశాను. మా సినిమా ఫస్ట్లుక్ పోస్టర్ను విడుదల చేసిన నాగార్జునగారికి ధన్యవాదాలు’’ అన్నారు బాల రాజశేఖరుని. తనికెళ్ల భరణి, సుహాసిని కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు సంగీతం: కళ్యాణీ మాలిక్, నేపథ్యసంగీతం: ఆర్పీ పట్నాయక్. -
రాజ్ కందకూరి చేతుల మీదుగా ‘రాధా మాధవం’ ఫస్ట్ లుక్ పోస్టర్ లాంచ్
విలేజ్ లవ్ డ్రామాలకు సిల్వర్ స్క్రీన్ మీద ఎప్పుడూ ఆదరణ ఉంటుంది. తాజాగా మరో గ్రామీణ ప్రేమ కథా చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. వినాయక్ దేశాయ్, అపర్ణా దేవీ హీరో హీరోయిన్లుగా గోనల్ వెంకటేష్ నిర్మిస్తున్న అందమైన ప్రేమ కథా చిత్రం ‘రాధా మాధవం’. ఈ మూవీకి దాసరి ఇస్సాకు దర్శకత్వం వహిస్తున్నారు. వసంత్ వెంకట్ బాలా ఈ చిత్రానికి కథ, మాటలు, పాటలను అందించారు. ప్రస్తుతం షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను ప్రారంభించింది. ఈ క్రమంలో మూవీ ఫస్ట్ లుక్ను నిర్మాత రాజ్ కందుకూరి చేతుల మీదుగా రిలీజ్ చేయించింది. ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన అనంతరం రాజ్ కందకూరి మాట్లాడుతూ.. ‘ఈ సినిమాకు దాసరి ఇస్సాకు దర్శకత్వం వహించారు. గోనాల్ వెంకటేష్ నిర్మించారు. వినాయక్కు లీడ్గా ఇది రెండో చిత్రం. పోస్టర్ చాలా ఇంటెన్స్గా ఉంది. కంటెంట్ బాగుంటే చిన్న చిత్రాలను కూడా ప్రేక్షకులు ఎంకరేజ్ చేస్తారు. పోస్టర్ మాత్రం నాకు చాలా నచ్చింది. ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరిస్తార’ని నమ్ముతున్నాను.' అని అన్నారు. హీరో వినాయక్ మాట్లాడుతూ.. ‘మా చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ను రిలీజ్ చేసిన రాజ్ కందుకూరి గారికి థాంక్స్. వారి సపోర్ట్ మాకు ఎప్పుడూ ఉండాలి. ప్రేక్షకులు మమ్మల్ని ఆశీర్వదించాలి. అందరూ మా సినిమాను చూడండి.’ అని అన్నారు. నిర్మాత వెంకటేష్ మాట్లాడుతూ.. ‘రాధా మాధవం పోస్టర్ లాంచ్ చేసిన రాజ్ కందుకూరికి థాంక్స్. మా టీం ఎంతో సహకరించారు’ అని అన్నారు. -
యాత్రలో జర్మనీ నటి సుజానే
‘యాత్ర’ ఫేమ్ మహి వి. రాఘవ్ దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం ‘యాత్ర 2’. ఇందులో దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి పాత్రలో మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాత్రలో హీరో జీవా నటిస్తున్నారు. త్రీ ఆటమ్ లీవ్స్, వీ సెల్యూలాయిడ్, శివ మేక నిర్మిస్తున్న ‘యాత్ర 2’ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. కాగా ఈ సినిమాలో సోనియా గాంధీ పాత్రని జర్మనీ నటి సుజానే బెర్నెర్ట్ పోషిస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ మేరకు ఆమె పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ను మంగళవారం రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా మహి వి. రాఘవ్ మాట్లాడుతూ–‘‘యాత్ర’కి కొనసాగింపుగా ‘యాత్ర 2’ రూపొందుతోంది. వైఎస్ జగన్గారు ప్రజా నాయకుడిగా ఎదిగిన తీరుని, 2009 నుంచి 2019 వరకు ఆంధ్రప్రదేశ్లో జరిగిన రాజకీయ ఘటనలను ఈ చిత్రంలో చూపిస్తున్నాం. ‘యాత్ర 2’ని 2024 ఫిబ్రవరి 8న రిలీజ్ చేస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: మధి, సంగీతం: సంతోష్ నారాయణన్. -
'కొన్ని ప్రేమ కథలు జీవితకాలం వెంటాడుతాయి'.. బేబీ డైరెక్టర్ మరో సంచలన కథ!
బేబీ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన దర్శకుడు సాయి రాజేశ్. తాజాగా మరో కొత్త ప్రేమకథతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. ఈ సినిమాకు సాయి రాజేశ్ కథను అందించడంతో పాటు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ మూవీలో యువ నటుడు సంతోశ్ శోభన్, బిగ్ బాస్ బ్యూటీ అలేఖ్య హారిక జంటగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి సుమన్ పాతూరి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని మాస్ మూవీ మేకర్స్ పతాకంపై శ్రీనివాస కుమార్, సాయిరాజేశ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన పూజా కార్యక్రమాన్ని హైదరాబాద్లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అక్కినేని నాగ చైతన్య ముఖ్య అతిథిగా హాజరై హీరో, హీరోయిన్లపై క్లాప్ కొట్టారు. కాగా.. ఈ చిత్రం ద్వారా హారిక హీరోయిన్గా పరిచయమవుతున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ను సాయి రాజేశ్ రిలీజ్ చేశారు. హీరో, హీరోయిన్ లిప్లాక్తో ఉన్న ఫోటో చూస్తే ఫుల్ రొమాంటిక్ లవ్ స్టోరీగానే తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. బేబీ సినిమాతో ఒక్కసారిగా సెన్సేషన్ క్రియేట్ చేసిన డైరెక్టర్ కథకు మరో సూపర్ హిట్ ఖాయంగా కనిపిస్తోంది. బేబీ తరహాలోనే మరో ప్రేమకథా చిత్రంతో టాలీవుడ్ అభిమానులను అలరించేందుకు సిద్ధమయ్యారు. కాగా.. ఈ చిత్రానికి విజయ్ బుల్గానిన్ సంగీతమందిస్తున్నారు. View this post on Instagram A post shared by Sai Rajesh (@sairazesh) -
'షరతులు వర్తిస్తాయి' లాంటి సినిమాలను ఆదరించాలి: త్రివిక్రమ్
చైతన్య రావు, భూమి శెట్టి జంటగా నటించిన చిత్రం 'షరతులు వర్తిస్తాయి'. కుమార స్వామి ( అక్షర ) దర్శకత్వం దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని స్టార్ లైట్ స్టూడియోస్ బ్యానర్ పై నాగార్జున్ సామల,శ్రీష్ కుమార్ గుండా,డా. కృష్ణకాంత్ చిత్తజల్లు నిర్మించారు. ఈ మూవీ ఫస్ట్లుక్, మోషన్ పోస్టర్ని ప్రముఖ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా త్రివిక్రమ్ మాట్లాడుతూ...మనుషులు ఉన్నంత కాలం కుటుంబాలు ఉంటాయని.. కుటుంబాలు ఉన్నంతకాలం సమస్యలు ఉంటాయని.. అందుకే చాలా కుటుంబాలు కొన్ని షరతుల మధ్యన జీవిస్తూ ఆనందంగా ఉంటున్నాయి తెలిపారు. కుటుంబ విలువలను తెలియజేసే ఇలాంటి సినిమాలను ప్రేక్షకులు థియేటర్లలో చూసి ప్రోత్సహించాలని కోరారు. మంచి కథతో ముందుకు వచ్చిన దర్శకుడు కుమార స్వామి (అక్షర) అలాగే చిత్ర యూనిట్ సభ్యులను అభినందించారు. ప్రస్తుతం మధ్య తరగతి కుటుంబాలలో ఉంటున్న సమస్యను దర్శకుడు కళ్ళకు కట్టినట్టు చిత్రీకరించారు’అని అన్నారు తెలంగాణ సాంస్కృతిక శాఖ సంచాలకులు డాక్టర్ మామిడి హరికృష్ణ. ఒక మంచి ఉద్దేశంతో ఈ సినిమా తీశాం. ప్రేక్షకులను కచ్చితంగా నచ్చుతుందని ఆశిస్తున్నాం’అని దర్శకుడు కుమార స్వామి అన్నారు. -
భయానక చిత్రం
శ్రీకాంత్ శ్రీరామ్, ఖుషీ రవి జంటగా సాయికిరణ్ దైదా దర్శకత్వం వహించిన చిత్రం ‘పిండం’. ‘ది స్కేరియస్ట్ ఫిల్మ్’ (భయానక చిత్రం) అనేది ఉపశీర్షిక. యశ్వంత్ దగ్గుమాటి నిర్మించిన ఈ సినిమా నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఈ చిత్రం టైటిల్ ఫస్ట్ లుక్ పోస్టర్ని హీరో శ్రీ విష్ణు ఆవిష్కరించి, సినిమా విజయం సాధించాలని ఆకాంక్షించారు. సాయికిరణ్ దైదా మాట్లాడుతూ–‘‘పూర్తి స్థాయి హారర్ నేపథ్యంలో ‘పిండం’ ఉంటుంది. ఈ చిత్ర కథ ప్రస్తుతం, 1990, 1930.. ఇలా మూడు కాలాల్లో జరుగుతుంది. స్క్రీన్ ప్లే హైలైట్గా ఉంటుంది’’ అన్నారు. ‘‘మా సినిమా టీజర్ను ఈ నెల 30న రిలీజ్ చేస్తాం. నవంబర్లో సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు యశ్వంత్ దగ్గుమాటి. ఈశ్వరీ రావు, అవసరాల శ్రీనివాస్, రవివర్మ తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: సతీష్ మనోహర్, సంగీతం: కృష్ణ సౌరభ్ సూరంపల్లి. -
జితేందర్ రెడ్డిగా వస్తోన్న రాకేశ్.. ఆసక్తిగా పోస్టర్!
బాహుబలి, ఎవ్వరికీ చెప్పొద్దు సినిమాలతో ప్రేక్షకులకు పరిచయమైన నటుడు రాకేశ్ వర్రే. ఎప్పుడూ ప్రయోగాత్మక పాత్రలనే ఎంచుకుంటున్నారు. కొద్దిరోజుల క్రితం జితేందర్ రెడ్డి అనే పేరుతో హీరో ఎవరో తెలియకుండా పోస్టర్లు రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే అందులో ఉన్న కథానాయకుడు ఎవరు?, అసలు టైటిల్ పేరులో ఉన్న ఈ జితేందర్ రెడ్డి ఎవరు? అనే విషయాలపై ఆసక్తి నెలకొంది. తాజాగా ఆ సస్పెన్స్ మేకర్స్ తెరదించారు. హీరో పేరును రివీల్ చేస్తూ పోస్టర్ విడుదల చేశారు. జితేందర్ రెడ్డి పాత్రలో రాకేశ్ వర్రే గన్ పట్టుకుని ఎంతో డైనమిక్గా కనిపించారు.ఈ పోస్టర్లో అతను యంగ్ పోలీస్లా కనిపించాడు. హీరోగా ఒక సినిమా చేసి హిట్ అందుకున్న రాకేశ్ చాలా గ్యాప్ తర్వాత జితేందర్ రెడ్డి మూవీతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. అయితే అసలు జితేందర్ రెడ్డి సినిమా గురించి మరిన్ని విషయాలు కొద్దిరోజులు వేచి చూడాల్సిందే. ఈ చిత్రానికి విరించి వర్మ దర్శకత్వం వహిస్తుండగా.. జితేందర్ రెడ్డి క్యారెక్టర్ నటుడు ఎంపిక కోసం దాదాపు 6 నెలల పాటు సమయం పట్టిందట. చాలా మందిని రిజెక్ట్ చేసి చివరికి రాకేష్ వర్రేను ఎంచుకున్నారు. ఈ మూవీని ముదుగంటి రవీందర్ రెడ్డి నిర్మిస్తుండగా.. గోపీ సుందర్ సంగీతమందిస్తున్నారు. -
సూపర్ హిట్ మూవీ.. తెలుగులోనూ వస్తోంది!
తమిళంలో బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచిన మూవీ 'దా...దా..'. ఈ చిత్రాన్ని ఒలింపియా మూవీస్ సంస్థ ఎస్ అంబేత్ కుమార్ సమర్పించారు. తెలుగులో ఈ చిత్రాన్ని నీరజ సమర్పణలో పాన్ ఇండియా మూవీస్, జేకే ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా ఎమ్మెస్ రెడ్డి నిర్మాతగా తీసుకొస్తున్నారు. ఈ సినిమాకు శ్రీకాంత్ నూనెపల్లి, శశాంక్ చెన్నూరు సహనిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. (ఇది చదవండి: ఒక్క ఫైట్ సీన్.. ఆ హీరో జీవితాన్నే ముగించింది!) ఈ సందర్బంగా నిర్మాత ఎంఎస్ రెడ్డి మాట్లాడుతూ.. 'తమిళంలో మంచి యూత్ఫుల్, లవ్, ఫ్యామిలీ ఎంటర్టైనర్గా నిలిచి కొన్ని కోట్ల రూపాయలు వసూళ్లు చేసిన చిత్రం దా...దా... తెలుగువారి కోసం పా...పా..పేరుతో తీసు కొస్తున్నాం. ఎన్నో పెద్ద సంస్థలు పోటీ పడినా.. తెలుగులో ఇలాంటి సినిమాని మా సంస్థ తీసుకురావాలని రెడీ అయ్యాము. ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేశాం. అతి త్వరలో గ్రాండ్గా ట్రైలర్ లాంఛ్ ఉంటుంది. తెలుగు ప్రేక్షకులు కొత్తదనాన్ని ప్రోత్సహించడంలో ముందుంటారు. అలానే పా...పా... చిత్రాన్ని తెలుగులో మంచి బ్లాక్ బస్టర్ చెయ్యాలని చేస్తారని ఆశిస్తున్నాం.' అని అన్నారు. ఈ చిత్రంలో కవిన్, అపర్ణా దాస్, మోనికా చిన్నకోట్ల, ఐశ్వర్య, భాగ్యరాజ, వి టి వి గణేష్ ప్రధాన పాత్రల్లో నటించారు. -
డెవిల్స్ ఏంజిల్
కల్యాణ్ రామ్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘డెవిల్’. దేవాన్ష్ నామా సమర్పణలో అభిషేక్ పిక్చర్స్ బ్యానర్పై అభిషేక్ నామా స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో సంయుక్తా మీనన్ హీరోయిన్. సోమవారం (సెప్టెంబర్ 11) ఆమె పుట్టినరోజు. ఈ సందర్భంగా ‘డెవిల్’ చిత్రంలో సంయుక్త పోషించిన నైషధ పాత్ర ఫస్ట్ లుక్పోస్టర్ను ‘డెవిల్స్ ఏంజిల్’ అంటూ మేకర్స్ విడుదల చేశారు. ‘‘తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ సినిమాను నవంబర్ 24న విడుదల చేస్తాం’’ అన్నారు అభిషేక్ నామా. -
SKY:ఒక వ్యక్తి అన్నీ కోల్పోయి ఒంటరిగా బ్రతకాల్సి వస్తే?
ఆనంద్, మురళీ కృష్ణంరాజు, శృతిశెట్టి, మెహబూబ్ షేక్ (ఎమ్.ఎస్) ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘స్కై’. ‘అగాధమంత బాధ నుంచి ఆకాశమంత ప్రేమ పుడితే" అన్నది ట్యాగ్ లైన్. పృథ్వి పేరిచర్ల దర్శకత్వం దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని వేలర్ ఎంటర్టైన్మెంట్ స్టూడియోస్"పై నాగిరెడ్డి గుంటక - మురళీ కృష్ణంరాజు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా పోస్టర్ని విడుదల చేశారు మేకర్స్. ‘ఒక వ్యక్తి అన్నీ కోల్పోయి ఒంటరిగా బ్రతకాల్సి వస్తే, ఏళ్ల తరబడి అనుభవిస్తున్న బాధ, ఆనందంతో తన ఒంటరితనాన్ని జయించాడా, లేదా? లేక ఏకాకి జీవితమే కదా అని రోజు గడవడం కోసం పక్కవాడ్ని మోసం చేస్తూ బ్రతికేస్తున్నాడా? అసలు ఒంటరితనం మనిషికి ఏం నేర్పుతుంది? మనిషిని ఎలా మలుస్తుంది? అనేది క్లుప్తంగా "స్కై" చిత్రం కథాంశమని, రసూల్ ఎల్లోర్ సినిమాటోగ్రఫీ, సురేష్ ఆర్స్ ఎడిటింగ్ "స్కై" చిత్రానికి మెయిన్ పిల్లర్స్ అని దర్శకుడు పృథ్వి పేరిచర్ల తెలిపారు. -
క్రైమ్ థ్రిల్లర్గా వస్తోన్న ద్రోహి.. ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్!
సందీప్ కుమార్ బొడ్డపాటి, దీప్తి వర్మ జంటగా తెరకెక్కుతోన్న చిత్రం ‘ద్రోహి’. ది క్రిమినల్ అన్నది ఉపశీర్షిక. గుడ్ ఫెల్లోస్ మీడియా ప్రొడక్షన్స్, సఫైరస్ మీడియా, వెడ్నెస్డే ఎంటర్టైన్మెంట్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. క్రైమ్ థ్రిల్లర్గా రూపొందుతున్న ఈ చిత్రానికి విజయ్ పెందుర్తి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీకాంత్ రెడ్డి, విజయ్ పెందుర్తి, రాజ శేఖర్ అర్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని ఈ నెలలోనే విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. తాజాగా ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ను దర్శకుడు క్రిష్ జాగర్లమూడి విడుదల చేశారు. ఈ సందర్భంగా క్రిష్ మాట్లాడుతూ.. 'సినిమాకు సంబంధించిన లుక్, గ్లింప్స్ చూశా. చాలా బాగుంది. ఈ సినిమాకు చక్కని విజయాన్ని సాధించి సినిమాకు పని చేసిన నటీనటులు, సాంకేతికి నిపుణులు అందరూ మంచి పేరు రావాలి. ఈ సినిమా టీమ్ అందరికీ శుభాకాంక్షలు' అని అన్నారు. దర్శకనిర్మాతలు మాట్లాడుతూ.. 'చక్కని థ్రిల్లర్ కథాంశంతో రూపొందుతున్న చిత్రమిది. ప్రేక్షకులు మెచ్చే అన్ని అంశాలు చిత్రంలో ఉంటాయి. నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తయ్యాక ఈ నెలలో సినిమాను విడుదల చేస్తాం' అని తెలిపారు. కాగా.. ఈ చిత్రంలో సందీప్ కుమార్ బొడ్డపాటి, దీప్తి వర్మ, డెబి, షకలక శంకర్, నిరోజ్, శివ, మహేష్ విట్ట, మెహ్బూబ్, చాందినీ గొల్లపూడి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. -
కొత్త కాన్సెప్ట్తో వస్తోన్న ‘సికాడా’.. ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్!
రజిత్ సీఆర్, గాయత్రి మయూర, జైస్ జోస్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతోన్న చిత్రం సికాడా. ఈ చిత్రం ద్వారా శ్రీజిత్ ఎడవనా దర్శకుడిగా పరిచయం కాబోతోన్నారు. తీర్నా ఫిల్మ్స్ అండ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై వందనా మీనన్, గోపకుమార్ పి నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ను రిలీజ్ చేశారు మేకర్స్. డైరెక్టర్ చందూ మొండేటి, యంగ్ హీరో బిగ్ బాస్ ఫేమ్ సోహెల్ చేతుల మీదుగా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. రోటీన్గా కాకుండా ఓ కొత్త కాన్సెప్ట్తో పలకరించేందుకు ‘సికాడా’ అనే చిత్రం రాబోతోంది. ఒకే టైటిల్, ఒకే కథ, 4 విభిన్న భాషలు, 24 విభిన్న ట్యూన్స్తో రాబోతోన్న ఈ మూవీ విడుదలకు ముందే అంచనాలు పెరుగుతున్నాయి. తాజాగా రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ అందరినీ ఆకట్టుకుంటోంది. సికాడా చిత్రంలో అందరూ కొత్తవారే నటించడం విశేషం. తెలుగుతో పాటు కన్నడ, తమిళం, మలయాళ భాషల్లో కూడా ఈ చిత్రాన్ని రూపొందించారు. శ్రీజిత్ గతంలో మ్యూజిక్ డైరెక్టర్గా "కాదల్ ఎన్ కవియే", "నెంజోడు చేరు" వంటి తమిళ, మలయాళ సినిమాలకు పని చేశారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను ప్రకటించనున్నట్లు తెలిపారు. ఈ సినిమా పాటలకు రవితేజ అమరనారాయణ అద్భుతమైన సాహిత్యం అందించారు. -
క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో వస్తోన్న 'క్రిమినల్' !
తమిళ నటుడు శరత్కుమార్, గౌతమ్ కార్తీక్ కలిసి నటిస్తున్న తాజా చిత్రం 'క్రిమినల్'. దక్షిణామూర్తి ఈ చిత్రాన్ని పర్సా పిక్చర్స్, పీఆర్.మీనాక్షీసుందరం, బిగ్ ప్రింట్ పిక్చర్స్, ఐబీ.కార్తీకేయన్ కలిసి నిర్మిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ ఇప్పటికే పూర్తిచేసుకుంది. ఈ చిత్రం ఫస్ట్లుక్ పోస్టర్ను మేకర్స్ విడుదల చేశారు. ఫస్ట్లుక్ పోస్టర్కు మంచి స్పందన వస్తోందని చిత్ర దర్శకుడు ఆనందాన్ని వ్యక్తం చేశారు. తాను దర్శకుడిగా ప్రయత్నాలు చేస్తున్నప్పుడు కథలు రాసుకున్నానని వాటిని తెరకెక్కించడానికి పలు ఆటంకాలను ఎదుర్కోవాల్సి వచ్చిందని అన్నారు. (ఇది చదవండి: Neha Shetty: టాలీవుడ్ని షేక్ చేస్తున్న ‘రాధిక’) అలాంటి సమయంలో తనకు టీకొట్టు వద్ద ఒక ఆలోచన వచ్చిందని అదే క్రిమినల్ చిత్ర ప్రారంభానికి శ్రీకారం చుట్టిందని పేర్కొన్నారు. నటుడు శరత్కుమార్, గౌతమ్ కార్తిక్ ఈ కథలోకి రావడంతో చిత్రానికి ఇంకా భారీ క్రేజ్ వచ్చిందన్నారు. చిత్ర షూటింగ్లో నిర్మాతలు తనకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చారని పేర్కొన్నారు. ఈ చిత్రం మాదిరి మదురై నేపథ్యంలో ఇంతకుముందు పలు ప్రేమ కథా చిత్రాలు వచ్చాయని.. అయితే వాటికి క్రిమినల్ చిత్రం పూర్తి భిన్నంగా ఉంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. నగరంలో జరిగే క్రైమ్, థ్రిల్లర్ సంఘటనలే ఈ చిత్రమని అన్నారు. కాగా దీనికి శ్యామ్ సీఎస్ సంగీతాన్ని, ప్రసన్న ఎస్ కుమార్ ఛాయాగ్రహణం అందించారని తెలిపారు. త్వరలోనే చిత్ర ఆడియో, ట్రైలర్, విడుదల తేదీలను వెల్లడించనున్నట్లు దర్శకుడు తెలిపారు. Thanks @SilambarasanTR_ for releasing our #Criminal movie First Look poster and for your wishes. https://t.co/U3ggy655Og — Parsa Pictures Pvt Ltd (@ParsaPictures) August 25, 2023 -
మరో హిట్కు సిద్ధమైన ఆదాశర్మ.. ఆసక్తిగా ఫస్ట్ లుక్ పోస్టర్!
ది కేరళ స్టోరీ సినిమాతో సూపర్ హిట్ కొట్టిన హీరోయిన్ ఆదాశర్మ. ప్రస్తుతం మరో ఇంట్రెస్టింగ్ కథలో ప్రేక్షకుల ముందుకు రానుంది. క్లాస్, మాస్ అనే తేడా లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులు ఆదరించే హారర్ జానర్తో అలరించేందు సిద్ధమైంది. సరికొత్త సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ మూవీ సీడీతో ఆదాశర్మ మన ముందుకు రాబోతోంది. డిఫరెంట్ ఫీలింగ్ కలిగింగ్ సరికొత్త స్టోరీతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇటీవలే సూపర్ హిట్ ఖాతాలో వేసుకున్న అదా శర్మ మరో లీడ్ రోల్ సినిమాలో ఆసక్తి పెంచుతోంది. (ఇది చదవండి: ‘స్టార్ మా’లో సరికొత్త సీరియల్) సీడీ (క్రిమినల్ ఆర్ డెవిల్) చిత్రాన్ని కృష్ణ అన్నం దర్శకత్వంలో తెరకెక్కిస్కున్నారు. ఎస్ఎస్సీఎమ్ ప్రొడక్షన్స్ బ్యానర్పై.. గిరిధర్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ఆర్ఆర్ ధృవన్ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. మూవీ ప్రమోషన్స్లో భాగంగా తాజాగా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. దెయ్యాల చేతుల మధ్యన ఆదాశర్మ లుక్ సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేస్తోంది. పోస్టర్ చూస్తే అదా శర్మ సీరియస్ లుక్, ఆ చుట్టూ డెవిల్స్ హ్యాండ్స్ కనిపిస్తుండటం చిత్రంలోని వైవిధ్యాన్ని తెలుపుతున్నాయి. ఫస్ట్ లుక్ పోస్టర్ చూడగానే ఆడియన్స్లో మరింత ఆసక్తిని పెంచేశారు. ఈ చిత్రంలో విశ్వంత్, జబర్దస్త్ రోహిణి, భరణి శంకర్, రమణ భార్గవ్, మహేష్ విట్టా ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. అతి త్వరలో ఈ సినిమా రిలీజ్ డేట్ ప్రకటిస్తామని మేకర్స్ ప్రకటించారు. (ఇది చదవండి: ఆ హీరోతో నటించాలని కోరిక.. కానీ ఆ పాత్ర చేయను: రాశి) -
'లాక్ డౌన్ నైట్స్'.. ఆసక్తిగా ఫస్ట్ లుక్ పోస్టర్!
జీవీ, 8 తోట్టాగల్ లాంటి సూపర్ హిట్ చిత్రాల ఫేమ్ వెట్రి హీరోగా.. పూచ్చాండి చిత్రం ఫేమ్ హంశినీ హీరోయిన్గా నటించిన తాజా చిత్రం లాక్డౌన్ నైట్స్. ఈ చిత్రానికి ఎస్ ఎస్.స్టాన్లీ దర్శకత్వం వహిస్తున్నారు. కోలీవుడ్ నిర్మాత వినోద్ శబరీస్ తాజాగా తమిళంలో నిర్మిస్తున్న చిత్రం లాక్డౌన్ నైట్స్. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి క్రేజీ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. చిత్ర టైటిల్ పోస్టర్ను సంగీత దర్శకుడు, నటుడు విజయ్ ఆంటోని చేతుల మీదుగా ఆవిష్కరించారు. కాగా.. ఇటీవల కన్నడలో కిశోర్, పూజా గాంధీ జంటగా సంహారిణి అనే భారీ చిత్రాన్ని వినోద్ శబరీస్ నిర్మించారు. ఈ చిత్రం త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. (ఇది చదవండి: 'అతనికి ఏ మహిళతోనూ రిలేషన్ లేదు'.. స్టార్ హీరోపై కంగనా ప్రశంసలు!) ఎస్ ఎస్.స్టాన్లీ ఇంతకు ముందు ఏప్రిల్ మాదత్తిల్, పుదుకోట్టైయిలిరుందు సరవణన్, వంటి సక్సెస్ఫుల్ చిత్రాలను తెరకెక్కించారు. ఈ చిత్రంలో సంగీత దర్శకుడు గంగై అమరన్, మదియళగన్, లోగన్ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. సాలై సహదేవన్ ఛాయాగ్రహణం, జస్టిస్ ప్రభాకరన్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రం షూటింగ్ను పూర్తిగా మలేషియాలో చిత్రీకరించినట్లు మేకర్స్ తెలిపారు. (ఇది చదవండి: ఈమెని గుర్తుపట్టారా? మీకు బాగా తెలిసిన స్టార్ యాంకర్) -
భార్యాభర్తల మధ్య ఆత్మ ప్రవేశిస్తే 'తంతిరం' చూడాల్సిందే
శ్రీమతి కాండ్రగుల లావణ్య రాణి సమర్పణలో 'సినిమా బండి ప్రొడక్షన్స్' పతాకంపై శ్రీకాంత్ గుర్రం, ప్రియాంక శర్మ జంటగా నటించిన చిత్రం 'తంతిరం'. ముత్యాల మెహర్ దీపక్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి శ్రీకాంత్ కాండ్రగుల (SK) నిర్మాత. షూటింగ్ పూర్తి చేసుకుని నిర్మాణాంతర కార్యక్రమాలలో బిజీగా ఉంది. అయితే ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ను మేకర్స్ విడుదల చేశారు. (ఇదీ చదవండి: Jailer Review: రజినీకాంత్ 'జైలర్' ట్విటర్ రివ్యూ) ఈ సందర్భంగా నిర్మాత శ్రీకాంత్ కాండ్రగుల మాట్లాడుతూ ' ఈ సినిమా చాలా కొత్తగా ఉంటుంది. ఇది హారర్ అంశాలతో కూడిన కుటుంబ కథ చిత్రం. భార్య భర్తల మధ్య ఒక ఆత్మ ప్రవేశిస్తే వారి దాంపత్య జీవితం ఎలా ఉంటుందో తెలుసుకోవాలి అంటే మా 'తంతిరం' చిత్రం చూడాల్సిందే. మా చిత్రం కేరళ ప్రాంతాల్లో అందమైన లొకేషన్స్ లో షూటింగ్ జరుపుకున్నాము, షూటింగ్ అంతా పూర్తి అయ్యింది. ప్రస్తుతానికి నిర్మాణాంతర పనుల్లో బిజీగా ఉంది. ఈరోజు మా చిత్రం యొక్క ఫస్ట్ లుక్ పోస్టర్ను విడుదల చేశాం. త్వరలోనే టీజర్, ట్రైలర్తో మీ ముందుకు వస్తాం' అని నిర్మాత శ్రీకాంత్ తెలిపారు. -
ధీమహి చిత్రం ఫస్ట్ లుక్ విడుదల
కెప్టెన్ కుక్ ఫిలిమ్స్ పతాకంపై 7:11PM చిత్రం ఫేమ్ సాహస్ పగడాల హీరోగా నటించిన సినిమా 'ధీమహి'. విరాట్ కపూర్, సాహస్ పగడాల సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సాహస్ పగడాల, నవీన్ కంటె దర్శకులు. ఇందులో నిఖిత చోప్రా హీరోయిన్. షారోన్ రవి సంగీతం అందించారు. షూటింగ్, నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన మొదటి పోస్టర్ను మేకర్స్ విడుదల చేశారు. (ఇదీ చదవండి: కుమారుడి కోసం ఏడ్చేవాడు.. రఘువరన్ మృతిపై తొలిసారి మాట్లాడిన సోదరుడు) అనంతరం చిత్ర యూనిట్ మాట్లాడుతూ 'ధీమహి చిత్రం చాలా కొత్తగా ఉంటుంది. 7:11 చిత్రంలో నటించిన సాహస్ పగడాల ఈ చిత్రంలో నటిస్తూ, స్వీయ దర్శకత్వం వహించారు. ఇది ఒక థ్రిల్లర్ చిత్రం. షూటింగ్, నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తి అయ్యాయి. మా చిత్రంలోని పాటలను త్వరలో జీ మ్యూజిక్ కంపెనీ ద్వారా విడుదల చేస్తాము. ప్రస్తుతం సెన్సార్ పనుల్లో ఉన్నాము. సినిమా చాలా కొత్తగా ఉంటుంది, త్వరలోనే ట్రైలర్తో మీముందుకు వస్తాం. ఆపై రిలీజ్ డేట్ను కూడా ప్రకటిస్తాం.' అని తెలిపారు. -
రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్గా వస్తోన్న 'రసవతి'..!
అర్జున్దాస్, తాన్యా రవిచంద్రన్ జంటగా నటిస్తోన్న తాజా చిత్రం 'రసవాది'. మౌనగురు, మహాముని వంటి విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు శాంతకుమార్. కథలను నమ్మి చిత్రాలు చేసే ఈయన పాత్రలకు తగ్గ నటీనటులను ఎంపిక చేసుకుంటారు. అలా శాంతకుమార్ తెరకెక్కిస్తున్న మూడో చిత్రం 'రసవాది'. డీఎన్ఏ మెకానిక్ కంపెనీ సరస్వతి సినీ క్రియేషన్న్స్ సంస్థతో కలిసి నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో నటి రమ్య సుబ్రమణియన్, జీఎం సుందర్, సుజిత్ శంకర్, రేష్మ, సుజాత, రిషీకాంత్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఎస్ఎస్ తమన్ సంగీతమందిస్తుండగా.. వరవణన్ ఇళవరసు, శివకుమార్ల ద్వయం ఛాయాగ్రహణం అందిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర ఫస్ట్లుక్ పోస్టర్ను శుక్రవారం విడుదల చేశారు. (ఇది చదవండి: రజనీకాంత్ రెమ్యునరేషన్ అన్ని కోట్లా? బడ్జెట్లో సగం సూపర్స్టార్కే! ) దర్శకుడు శాంతకుమార్ మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో క్రైమ్, రొమాంటిక్, యాక్షన్, థ్రిల్లర్ కథా చిత్రంగా ఇది ఉంటుందని చెప్పారు. తాను గత చిత్రాల తరహాలోనే ఈ చిత్రం ప్రేక్షకులకు సరికొత్త థియేటర్ ఎక్స్పీరియన్న్స్ ఇస్తుందన్నారు. చిత్ర షూటింగ్ను కొడైకనాల్, మదురై, కడలూర్, పళని ప్రాంతాల్లో చిత్రీకరించినట్లు చెప్పారు. చిత్ర ఆడియో, విడుదల తేదీ వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు చెప్పారు. చిత్ర ఫస్ట్లుక్ పోస్టర్ సినీ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. (ఇది చదవండి: శ్రీరామ్ కార్తీక్ హీరోగా కొత్త ప్రేమ కథా చిత్రం!) A movie I’ve been super excited about! Can’t wait for you all to watch what @Santhakumar_Dir has made#Rasavathi 🔥💥 A @MusicThaman Musical 💥@actortanya @ReshmaVenkates1 @actorramya @GMSundar_ @SPremChandra1 @saranelavarasu @EditorSabu @minu_jayebal @dancersatz… pic.twitter.com/NshqoLmP5J — Arjun Das (@iam_arjundas) August 5, 2023 -
త్వరలోనే మరో ప్రేమకథా చిత్రం ‘మదిలో మది’
టాలీవుడ్లో ప్రేమ కథా చిత్రాలకు ఎప్పుడూ మంచి ఆదరణ ఉంటుంది. లవ్స్టోరీలో వైవిద్యం ఉంటే చాలు ఆ చిత్రాన్ని కచ్చితంగా హిట్ చేస్తారు. అందుకు మంచి ఉదాహరణ ఇటీవల విడుదలైన ‘బేబీ’ మూవీ. యువతను ఆకట్టుకునే కథ, కథనాలతో సాయి రాజేష్ తీసిన బేబి సినిమా బ్లాక్ బస్టర్గా నిలిచింది. అలాంటి కోవలోకి చెందే మరో బ్యూటీఫుల్ లవ్ స్టోరీగా మదిలో మది అనే చిత్రం రాబోతోంది. జై, శీను, స్వీటీ, సిరి రావుల చారి, సునీతలు ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు ప్రకాష్ పల్ల దర్శకత్వం వహించారు. ఎస్ కే ఎల్ ఎమ్ క్రియేషన్స్ మీద నేముకూరి జయకుమార్ నిర్మాతగా ఈ చిత్రం రూపొందుతోంది. ఈ మూవీ రిలీజ్ డేట్ అండ్ ఫస్ట్ లుక్ పోస్టర్ను బేబి మూవీ డైరెక్టర్ సాయి రాజేష్ విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘మదిలో మది సినిమా ఆగస్ట్ 18న విడుదల కాబోతోంది. నేను ట్రైలర్ను చూశాను అద్భుతంగా ఉంది. ఈ చిత్రం పెద్ద విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నాను. యూనిట్కు ఆల్ ది బెస్ట్ ’ అని అన్నారు. -
Yamudu Movie: ‘యముడి’పై కొత్త చిత్రం
తెలుగు తెరపై యముడి కేరెక్టర్ ఓ సక్సెస్ ఫార్ములా. ఇప్పటికే యముని వేషాలతో వచ్చిన సినిమాలు ఆడియన్స్ ఆదరించారు. కొన్ని చిత్రాలు అయితే బాక్సాఫీస్ని షేక్ చేశాయి. అయితే ఈ మధ్య కాలంలో యముని కాన్సెప్ట్తో కొత్త చిత్రమేది రాలేదు. కానీ త్వరలోనే తెలుగు ప్రేక్షకులకు మరోసారి యమలోకాన్ని చూపించేందుకు సిద్ధమయ్యారు జగదీష్ ఆమంచి. జగన్నాధ పిక్చర్స్ పతకం పై స్వీయదర్శకత్వంలో నూతన నటీనటులతో ‘యముడు’అనే చిత్రాన్ని రూపొందించబోతున్నారు. ధర్మో రక్షతి రక్షితః ఉప శీర్చిక. తాజాగా ఈ చిత్రం ఫస్ట్ లుక్తో పాటు టైటిల్ మోషన్ పోస్టర్ని విడుదల చేశారు. ‘ఇదొక ఒక థ్రిల్లర్ చిత్రం. కథ తో పాటు మంచి మెసేజ్ ఉన్న చిత్రమిది. ఆగష్టు మొదటి వారం లో షూటింగ్ ప్రారంభం అవుతుంది’అని దర్శకనిర్మాత జగదీష్ తెలిపారు. ఈ చిత్రానికిష్ణు కెమెరా మాన్ గా వ్యవహారిస్తుండగా భవాని రాకేష్ సంగీతం అందిస్తున్నారు.త్వరలోనే పూర్తి వివరాలు తెలియజేయనున్నారు. -
ఘోరంగా హర్ట్ అయిన ప్రభాస్ ఫ్యాన్స్
-
ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టిన రుహానీ శర్మ
రుహాణీ శర్మ పోలీసాఫీసర్గా నటించిన చిత్రం ‘హర్’. శ్రీధర్ స్వరాఘవ్ దర్శకత్వంలో రఘు సంకురాత్రి, దీపాసంకురాత్రి నిర్మించారు. సురేష్ ప్రొడక్షన్స్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ద్వారా ఈ సినిమా జూలై 21న విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్మాత డి. సురేష్బాబు ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ను విడుదల చేశారు. పోలీస్ ఇన్వెస్టిగేషన్ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం ఇది. వికాస్ వశిష్ట, ప్రదీప్ రుద్ర, జీవన్ కుమార్, అభిగ్న్య, సంజయ్ స్వరూప్, బెనర్జీ, రవివర్మ కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రానికి సంగీతం: పవన్. -
హీరో విజయ్ ఇలా చేస్తారనుకోలేదు.. పోస్టర్పై తీవ్ర విమర్శలు!
నటుడు విజయ్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం 'లియో'. లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఎస్ఎస్ లలిత్కుమార్ భారీ ఎత్తున నిర్మిస్తున్న విషయం తెలిసిందే. నటి త్రిష , ప్రియా ఆనంద్ హీరోయిన్లుగా నటిస్తున్న ఇందులో బాలీవుడ్ స్టార్ సంజయ్దత్, నటుడు అర్జున్, మన్సూర్ అలీఖాన్ దర్శకుడు మిష్కిన్, గౌతమ్ వాసుదేవన్, శాండీ మాస్టర్, మాథ్యూథామస్ ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. (ఇది చదవండి: జీవితంలో ఏదీ అంతా ఈజీ కాదు: హీరోయిన్) మాస్టర్ చిత్రం తర్వాత విజయ్, దర్శకుడు లోకేష్ కనకరాజ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం కావడంతో లియోపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కాగా చిత్రం చివరి దశకు చేరుకుంది. దీంతో చిత్రం గురించి దర్శకుడు లోకేష్ కనకరాజ్ అప్డేట్స్ ఇస్తున్నారు. ఈ చిత్రం విడుదలకు ముందే ఆడియో హక్కులు, ఓటీటీ హక్కును అంటూ ఇప్పటికే రూ.350 కోట్లకు పైగా వ్యాపారం జరిగినట్లు టాక్ వైరల్ అవుతోంది. తాజాగా మరో అప్డేట్ వెల్లడించారు. ఈనెల 22న నటుడు విజయ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా చిత్రంలోని అలర్ట్ ఈగో నా రెడీ అనే పల్లవితో సాగే తొలి పాటను విడుదలైనట్లు పోస్టర్ ద్వారా వెల్లడించారు. ఈ పోస్టర్లో విజయ్ చేతుల్లో గన్ను, నోట్లో సిగరెట్ పెట్టుకుని ఫోర్స్గా కనిపించడంతో ఆయన అభిమానులు ఖుషీ అవుతున్నారు. అయితే దీనిపై కొన్ని విమర్శలు కూడా వస్తున్నాయి. ముఖ్యంగా పీఎంకే పార్టీ నేత రామదాసు విజయ్పై విమర్శలు గుప్పించారు. ఆయన ఒక ప్రకటనలో పేర్కొంటూ విజయ్ తన వాగ్దానాన్ని నిలబెట్టుకోలేకపోయారని అన్నారు. చాలా కాలం క్రితం తన చిత్రాల్లో సిగరెట్లు కాల్చే సన్నివేశాలను, మద్యం తాగే సన్నివేశాలను చోటు చేసుకోవడాన్ని తాను అనుమతించనని వాగ్దానం చేశారన్నారు. అలాంటిది ఇప్పుడు ఆ మాట తప్పి ఇప్పుడు లియో చిత్రంలో అలా రెండు అంశాలు చోటు చేసుకోవడం ఆయన అభిమానులను చెడు త్రోవ పట్టించడం కాదా అని ప్రశ్నించారు. (ఇది చదవండి: తమిళనాడులో ఆస్తులు ఉండేవి.. అన్నీ అమ్మేశా: సుధాకర్) First Single #NaaReady on @actorvijay Anna's Birthday #Leo 🔥🧊 pic.twitter.com/xG5T46GWyR — Lokesh Kanagaraj (@Dir_Lokesh) June 16, 2023 -
తిరగబడరా...
రాజ్ తరుణ్ హీరోగా, మాల్వీ మల్హోత్రా, మన్నారా చోప్రా కథానాయికలుగా నటిస్తున్న చిత్రం ‘తిరగబడరా సామీ’. ఎస్. రవికుమార్ చౌదరి దర్శకత్వంలో సురక్ష్ ఎంటర్టైన్మెంట్ మీడియా బ్యానర్పై మల్కాపురం శివకుమార్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ని డైరెక్టర్ వీవీ వినాయక్ విడుదల చేసి, సినిమా మంచి విజయం సాధించాలని అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: జేబీ, కెమెరా: జవహర్ రెడ్డి. -
'గుంటూరు కారం' శ్రీలీల ఫస్ట్ లుక్.. ఇది గమనించారా?
తెలుగులోకి ఎప్పటికప్పుడు కొత్త హీరోయిన్లు వస్తూనే ఉంటారు. కానీ హిట్ కొట్టి నిలబడేవాళ్లు మాత్రం చాలా తక్కువ. ప్రస్తుతం టాలీవుడ్ లో టాక్ ఆఫ్ ది టౌన్ అయిపోయిన బ్యూటీ అనగానే అందరికీ గుర్తొచ్చే పేరు శ్రీలీల. తెలుగులో చేసిన ఫస్ట్ మూవీ అంతంతమాత్రంగా ఆడినప్పటికీ.. అవకాశాల మాత్రం వెల్లువలా వచ్చేశాయి. (ఇదీ చదవండి: శ్రీలీలను కొట్టిన బాలకృష్ణ! అసలేం జరిగిందంటే?) గతేడాది 'ధమాకా'తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన శ్రీలీల.. ప్రస్తుతం అరడజనుకి పైగా సినిమాల్లో హీరోయిన్ గా చేస్తూ మోస్ట్ బిజీయెస్ట్ బ్యూటీ అయిపోయింది. మహేష్-త్రివిక్రమ్ కాంబోలో తీస్తున్న 'గుంటూరు కారం'లోనూ శ్రీలీల వన్ ఆఫ్ ది హీరోయిన్. బుధవారం ఈమె బర్త్ డే సందర్భంగా ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేశారు. ఈ లుక్ ప్రకారం విలేజీ బ్యూటీగా శ్రీలీల కనిపించనుంది. లంగా ఓణీలో కాలికి నెయిల్ పాలిష్ పెడుతున్న లుక్ ని రిలీజ్ చేశారు. ఇలా శ్రీలీలని చూస్తుంటే.. 'గుంటూరు కారం'లో హీరో మహేష్ బాబునే డామినేట్ చేస్తుందా అనిపించేలా ఉంది. త్రివిక్రమ్ తీస్తున్న ఈ సినిమాను వచ్చే సంక్రాంతి కానుకగా జనవరి 13న రిలీజ్ చేయనున్నారు. అలానే రామ్-బోయపాటి మూవీలో శ్రీలీల ఫస్ట్ లుక్ ని కూడా రిలీజ్ చేశారు. ఇందులో మోడ్రన్ గా కనిపిస్తూ ఆకట్టుకుంటోంది. (ఇదీ చదవండి: కోపమొస్తే తల్లి అని కూడా చూడను, తిట్టేస్తా: శ్రీలీల) Here’s wishing the extremely talented & gorgeous @sreeleela14 a very Happy Birthday! 🤩 - Team #GunturKaaram 🔥🌶️#HBDSreeLeela ✨ Super 🌟 @urstrulyMahesh #Trivikram @hegdepooja @MusicThaman @vamsi84 #PSVinod @NavinNooli #ASPrakash @haarikahassine pic.twitter.com/pPFBZ9EQUf — Haarika & Hassine Creations (@haarikahassine) June 14, 2023 -
విజయ్ ఆంటోనీ లేటెస్ట్ మూవీ.. ఫస్ట్ లుక్ పోస్టర్ వచ్చేసింది!
విజయ్ ఆంటోనీ టాలీవుడ్ అభిమానులకు పరిచయం చేయాల్సిన పనిలేదు. ఇటీవలే బిచ్చగాడు -2 సినిమాతో సూపర్ సక్సెస్ అందుకున్నారు. తాజాగా ఇప్పుడు మరో డిఫరెంట్ కాన్సెప్ట్తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. విజయ్ ఆంటోనీ హీరోగా 'విక్రమ్ రాథోడ్' సినిమా తెలుగులోనూ రాబోతోంది. (ఇది చదవండి: ప్రభాస్ 'ఆదిపురుష్'.. వెండితెరపై మెప్పించిన టాలీవుడ్ రాముళ్లు వీరే!) అపోలో ప్రొడక్షన్స్, ఎస్ఎన్ఎస్ మూవీస్ సంయుక్త సమర్పణలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు బాబు యోగేశ్వరన్ దర్శకత్వం వహిస్తున్నారు. రావూరి వెంకటస్వామి, కౌసల్య రాణి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజా సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్ర ప్రమోషన్స్లో భాగంగా తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ పోస్టర్లో ముఖంపై గాయాలతో కనిపిస్తున్నారు విజయ్ ఆంటోనీ. అతి త్వరలో ఈ మూవీ రిలీజ్ డేట్ ప్రకటించనున్నారు మేకర్స్. ఈ చిత్రంలో సురేష్ గోపి, రమ్య నంబీశన్, సోను సూద్, సంగీత ముఖ్య పాత్రలు పోషిస్తుండగా.. ఛాయా సింగ్, యోగి బాబు, రాధ రవి, కస్తూరి శంకర్, రోబో శంకర్, మనీష్ కాంత్ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. (ఇది చదవండి: అచ్చిరాని సమ్మర్.. ఈసారి తెలుగు సినిమాలన్నీ కూడా!?) -
ద్రవిడభూమి గొప్పతనంతో...
ప్రముఖ రచయిత సౌద అరుణ్ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘కోడ్ రామాయణ’. ఈ చిత్రంలో సుమారు 50 మంది నూతన నటీనటులు యాక్ట్ చేశారు. సౌద అరుణ్ స్టూడియోస్ పతాకంపై రూపొందిన ఈ చిత్రం టైటిల్ అనౌ¯Œ ్సమెంట్ హైదరాబాద్లో జరిగింది. ముఖ్య అతిథులుగా వచ్చిన బౌద్ధ భిక్షువు బంతె షీల్ రక్షిత్, ప్రముఖ రచయిత్రి లలిత. పి. చేతుల మీదుగా ‘కోడ్ రామాయణ’ ఫస్ట్ లుక్ పోస్టర్ను రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా దర్శక–నిర్మాత సౌద అరుణ్ మాట్లాడుతూ–‘‘ద్రవిడ భూమి గొప్పతనాన్ని ప్రపంచం మరింత అర్థం చేసుకోవాలనే ఈ సినిమా చేస్తున్నాం. ఈ చిత్రం మొత్తం మూడు భాగాలుగా(కోడ్ రామాయణ, రావణ చరిత్ర, ఉత్తర రామాయణం) ప్రేక్షకుల ముందుకు వస్తుంది’’ అన్నారు. ఈ చిత్రంలో దుర్వాసుడు పాత్రలో నటించిన భరద్వాజ మాట్లాడుతూ–‘‘కోడ్ రామాయణ’ అంటే రామాయణ అంతరార్థం అని అర్థం. ఈ సినిమాని చిరంజీవిగారికి చూపించి, రెండో భాగంలో రావణాసుర పాత్ర చేయమని కోరతాం’’ అన్నారు. నటులు శ్రీశైల్ రెడ్డి, పి.జగదీశ్ పాల్గొన్నారు. -
ఆసక్తి పెంచుతున్న శివ కోన కొత్త సినిమా పోస్టర్
శివా కోన దర్శకత్వంలో ఓ కొత్త చిత్రం తెరకెక్కుతుంది. ఏఎమ్ఎఫ్, కోన సినిమా బ్యానర్లపై అనిల్ మోదుగ, శివ కోనా సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఇంకా టైటిల్ ఖరారు చేయలేదు కానీ పోస్టర్ని మాత్రం వదిలారు. ఆ పోస్టర్లోక్యారెక్టర్ల ముఖాలు కనిపించకపోవడం అందరికి ఆసక్తిని పెంచుతోంది. ఈ పోస్టర్ ను చూస్తే మొత్తం ముగ్గురు అబ్బాయిలు, ముగ్గురు అమ్మాయిలు పక్కనే ఒక మిడిల్ ఏజ్ డ్ క్యారెక్టర్ ఉన్నట్లు కనిపిస్తుంది. ఈ సినిమా పోస్టర్ ను బట్టి ఈ సినిమా ఓ క్రైమ్ థ్రిల్లర్ ఎంటర్టైనర్ గా తెరక్కబోతుందని అర్థం అవుతుంది. కాలేజీకి వెళ్లే కుర్రాళ్ల చేతుల్లో గన్ను ఉంది. వాళ్ల పక్కనే ముగ్గురు అందమైన అమ్మాయిలు ఉన్నారు. వీరికి ముందు ఒక సూటు వేసుకున్న గ్రే షేడ్ క్యారెక్టర్, తన పక్కనే ఓ గ్లామర్ బ్యూటీ ఉంది. వీరే కాకుండా రేయ్ ఎవర్రా మీరంతా అంటే నోట్లో సిగర్ పెట్టుకుని కొని, చేతిలో కోడిని పట్టుకొని ఒక ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ కుర్చీలో కూర్చున్న పోస్టర్ ఆలరిస్తోంది. -
NTR30: ఎన్టీఆర్30 ఫస్ట్లుక్ పోస్టర్.. టైటిల్ అదిరిపోయింది!
జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న తాజా చిత్రం 'ఎన్టీఆర్30'. ప్రస్తుతం వర్కింగ్ టైటిల్తో రూపొందుతున్న ఈ చిత్రంలో బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. ఆర్ఆర్ఆర్ తర్వాత యంగ్ టైగర్ నటిస్తున్న సినిమా కావడంతో ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. (ఇది చదవండి: గ్లోబల్ స్టార్ NTR గురించి మీకు తెలియని విషయాలు!) అయితే ఈనెల 20న ఎన్టీఆర్ బర్త్ డే కావడంతో ఫ్యాన్స్కు అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఎన్టీఆర్ 30 టైటిల్తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్ను చిత్రబృందం విడుదల చేసింది. ఈ చిత్రానికి అందరూ ఊహించినట్లుగానే దేవర అనే టైటిల్ ఫిక్స్ చేశారు. కత్తి చేతిలో పట్టుకుని సముద్రం పక్కన నిలబడి ఉన్న ఎన్టీఆర్ పోస్టర్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. (ఇది చదవండి: ఎన్టీఆర్30 టైటిల్ నాదే.. బండ్ల గణేష్ ట్వీట్ వైరల్) జనతా గ్యారేజ్ తర్వాత కొరటాల, తారక్ కలిసి చేస్తున్న ప్రాజెక్ట్ ఇదే కావడంతో అభిమానుల్లోనూ క్యూరియాసిటీ పెరిగిపోయింది. ఈ సినిమాలో ఇప్పటికే జాన్వీ లుక్ని రివీల్ చేయగా.. ఇంతవరకు ఎన్టీఆర్ లుక్ని రిలీజ్ చేయలేదు. తారక్ బర్త్డేకు ఒకరోజు ముందుగానే ఫ్యాన్స్కు బిగ్ సర్ప్రైజ్ ఇచ్చారు మేకర్స్. ఈ చిత్రాన్ని 2024 ఏప్రిల్ 5న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయనున్నారు. ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతమందించనుండగా.. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. #Devara pic.twitter.com/bUrmfh46sR — Jr NTR (@tarak9999) May 19, 2023 -
NTR30: ఫ్యాన్స్కి గుడ్న్యూస్.. ఎన్టీఆర్ ఫస్ట్లుక్ కోసం బీ రెడీ
జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్30 అనే వర్కింగ్లో టైటిల్తో రూపొందుతున్న ఈ చిత్రంలో జాన్వీ కపూర్ తారక్కి జోడీగా నటిస్తుంది. ఇప్పటికే పట్టాలెక్కిన ఈ సినిమా షూటింగ్ ఇప్పుడు శరవేగంగా కొనసాగుతుంది. ఆర్ఆర్ఆర్ తర్వాత యంగ్ టైగర్ నటిస్తున్న సినిమా కావడంతో ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. జనతా గ్యారేజ్ తర్వాత కొరటాల, తారక్ కలిసి చేస్తున్న ప్రాజెక్ట్ ఇదే కావడంతో అభిమానుల్లోనూ క్యూరియాసిటీ పెరిగిపోయింది. ఇదిలా ఉంటే తాజాగా తారక్ ఫ్యాన్స్ కోసం మేకర్స్ అదిరిపోయే అప్డేట్ను అందించారు. ఈ సినిమా నుంచి ఎన్టీఆర్ ఫస్ట్లుక్ పోస్టర్ను ఈరోజు(శుక్రవారం)రాత్రి 7.02 నిమిషాలకు విడుదల చేయనున్నారు. ఈమేరకు అధికారికంగా ప్రకటించారు. ఇప్పటికే జాన్వీ లుక్ని రివీల్ చేయగా ఇంతవరకు ఎన్టీఆర్ లుక్ని రిలీజ్ చేయలేదు. దీంతో ఈ అప్డేట్ కోసం ఫ్యాన్స్ ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. తారక్ బర్త్డేకు ఒకరోజు ముందుగానే సర్ప్రైజ్ లభిస్తుండటంతో అభిమానులు పండగ చేసుకుంటున్నారు. -
యదార్థ సంఘటన ఆధారంగా 'గూడు'.. ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్
కోలీవుడ్లో వైవిధ్యభరిత కథ, కథనాలతో కూడిన ప్రయోగాత్మక చిత్రాలకు ఎప్పుడూ మంచి ఆదరణ ఉంటుంది. ఆ కోవకు చెందిన చిత్రమే గూడు. స్కైమూన్ ఎంటర్టైన్మెంట్, ఏ ఎంటర్టైన్మెంట్ సంస్థల అధినేతలు ఎం.గణేశ్, పి.కన్నన్ కలిసి నిర్మిస్తున్న ఈజ్ చిత్రం ద్వారా జోయల్ విజయ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. కాగా చిత్ర టైటిల్ను, ఫస్ట్ పోస్టర్ను శుక్రవారం విడుదల చేశారు. విశేషం ఏంటంటే ఈ పోస్టర్లో నటీనటులు ఎవరు లేరు. చిత్రం టైటిల్కు అద్దం పట్టేలా గూడు ఫొటోను మాత్రమే పోస్టర్ పొందుపరిచారు. చిత్ర చిత్ర వివరాలను దర్శకుడు తెలుపుతూ యదార్థ సంఘటన ఇతివృత్తంగా రూపొందిస్తున్న కథా చిత్రం ఇదని చెప్పారు. ఇందులో నటించే నటీనటులు, సాంకేతిక వర్గం వివరాలను త్వరలోనే అధికారికంగా వెల్లడించనున్నట్లు పేర్కొన్నారు. ఈ చిత్రం వైవిద్యంగా ఉంటుందని చెప్పారు. చిత్ర ఫస్ట్లుక్ పోస్టర్కు సినీ వర్గాలు, ప్రేక్షకుల నుంచి విశేష స్పందన వస్తోందన్న ఆనందాన్ని వ్యక్తం చేశారు. Here is the first look of #Koodu 🪺 A heartwarming tale based on a true story, Releasing in Tamil, Telugu, Hindi, Kannada and Malayalam languages. #KooduFirstLook #SkyMoonEntertainment #AEntertainment #MGanesh #KannanP @joyalvijay_dir @arunprajeethm @proyuvraaj pic.twitter.com/JyDsCWfH7m — Sreedhar Pillai (@sri50) May 5, 2023 -
సస్పెన్స్ థ్రిల్లర్గా హీట్.. ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్
వర్దన్ గుర్రాల, స్నేహా ఖుషి జంటగా నటించిన చిత్రం 'హీట్'. ఈ చిత్రానికి ఎం.ఎన్.అర్జున్, శరత్ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను ర్యాన్ స్టూడియోస్, కౌముది సినిమాస్ బ్యానర్ల మీద ఎం.ఆర్.వర్మ, సంజోష్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సస్పెన్స్ థ్రిల్లర్ జానర్లో తెరకెక్కించిన ఈ మూవీని తెరకెక్కించారు. తాజాగా ఈ చిత్ర టైటిల్ పోస్టర్, హీరో ఫస్ట్ లుక్ పోస్టర్ను దర్శకుడు శైలేష్ కొలను చేతుల మీదుగా రిలీజ్ చేశారు. ఈ టైటిల్ పోస్టర్తోనే సినిమా థీమ్ ఏంటన్నది చెప్పేశారు. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ను చూస్తుంటే కారు, నడిచి వస్తున్నట్టుగా మనిషి, భూతద్దం వంటివి చూస్తుంటే..ఇది ఒక ఇన్వెస్టిగేషన్ సస్పెన్స్ థ్రిల్లర్ అని అర్థమవుతోంది. పోస్టర్తో ప్రేక్షకుల్లో మరింత ఆసక్తిని పెంచింది చిత్రబృందం. ఈ సినిమాకు గౌతమ్ రవిరామ్ సంగీతాన్ని అందించగా.. రోహిత్ బాచు కెమెరామెన్గా పని చేశారు. శివన్ కుమార్ కందుల, శ్రీధర్ వెజండ్ల సహ నిర్మాతలుగా వ్యవహరించారు. ఈ చిత్రంలో వర్దన్ గుర్రాల, స్నేహా ఖుషి, మోహన్ సాయి, అంబికా వాణి, వంశీ రాజ్, పుల్కిత్, అప్పాజీ అంబరీష, జయ శ్రీ రాచకొండ, ప్రభావతి వర్మ ప్రధాన పాత్రల్లో నటించారు. -
పోస్టర్ బాగుంది – నాగార్జున
‘‘ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ అందర్నీ ఆకట్టుకునేలా బాగుంది. ఈ సినిమా హిట్ అయి, యూనిట్కి మంచి పేరు రావాలి’’ అన్నారు అక్కినేని నాగార్జున. బొమ్మ దేవర శ్రీదేవి సమర్పణలో తేజ బొమ్మదేవర, రిషికా లోక్రే జంటగా బొమ్మదేవర రామచంద్ర రావు దర్శక–నిర్మాణ సారథ్యంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ ను నాగార్జున రిలీజ్ చేశారు. ‘‘ప్రేమకథ నేపథ్యంలో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం’’ అని యూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: వికాస్ బాడిస, కెమెరా: వాసు. -
'రామబాణం'తో వస్తున్న గోపీచంద్.. ఆకట్టుకుంటున్న ఫస్ట్ లుక్
మాచో స్టార్ గోపీచంద్, హీరోయిన్ డింపుల్ హయాతి జంటగా తెరకెక్కుతోన్న చిత్రం 'రామబాణం'. 'లక్ష్యం', 'లౌక్యం' చిత్రాల తర్వాత శ్రీవాస్ డైరెక్షన్లో తెరకెక్కిస్తున్న హ్యాట్రిక్ సినిమా. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్పై ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో జగపతి బాబు, కుష్బూ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన క్రేజీ అప్డేట్ వచ్చేసింది. మహాశివరాత్రి సందర్బంగా గోపీచంద్ ఫస్ట్లుక్ను రిలీజ్ చేశారు మేకర్స్. విక్కీ అనే పవర్ఫుల్ పాత్రలో గోపీచంద్ లుక్ ఆకట్టుకుంటోంది. 'విక్కీస్ ఫస్ట్ యారో' పేరుతో విడుదల చేసిన ప్రత్యేక వీడియో అభిమానులను విపరీతంగా ఆకర్షిస్తోంది. రామబాణంలో విక్కీ అనే పవర్ ఫుల్ పాత్రలో గోపీచంద్ కనిపించనున్నారు. ఈ వీడియో చూస్తే ఫుల్ యాక్షన్ సినిమాగా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఫైట్స్ చూస్తే పూర్తి యాక్షన్ను తలపిస్తున్నాయి. ఫ్యామిలీ ఎమోషన్స్తో పాటు బలమైన కథాంశంగా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. గత చిత్రాలతో పోలిస్తే ఈ సినిమాలో సరికొత్త గోపీచంద్ను చూడబోతున్నామని అర్థమవుతోంది. విక్కీస్ ఫస్ట్ యారో వీడియో ప్రేక్షకుల్లో అంచనాలను భారీ అంచనాలను పెంచుతోంది. ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్ సంగీతమందిస్తున్నారు. ఈ సినిమాలో సచిన్ ఖేడ్ ఖర్, నాజర్, ఆలీ, రాజా రవీంద్ర, వెన్నెల కిషోర్, సప్తగిరి, కాశీ విశ్వనాథ్, సత్య, గెటప్ శ్రీను, సమీర్, తరుణ్ అరోరా ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని 2023 వేసవి కానుకగా విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. -
వేసవిలో సామజవరగమన
శ్రీవిష్ణు, రెబా మోనికా జాన్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న తాజా చిత్రం ‘సామజవరగమన’. రామ్ అబ్బరాజు డైరెక్టర్. అనిల్ సుంకర సమర్పణలో ఏకే ఎంటర్టైన్మెంట్స్, హాస్య మూవీస్ బ్యానర్పై రాజేష్ దండా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ‘సామజవరగమన’ అనే టైటిల్ ప్రకటించి, ఫస్ట్ లుక్ పోస్టర్ను రిలీజ్ చేశారు. ‘‘ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందు తున్న చిత్రం ఇది. షూటింగ్ చివరి దశలో ఉంది. ఈ ఏడాది వేసవిలో మా సినిమాని విడుదల చేస్తాం’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సహనిర్మాత: బాలాజీ గుత్తా, సంగీతం: గోపీ సుందర్, కెమెరా: రాంరెడ్డి. -
మాస్ మహారాజా బర్త్డే సర్ప్రైజ్.. రావణాసుర ఫస్ట్ గ్లింప్స్ వచ్చేసింది
మాస్ మహారాజ రవితేజ పుట్టిన నేడు. జనవరి 26 ఆయన బర్త్డే సందర్భంగా మాస్ మాహారాజా తదుపరి చిత్రం రావణాసుర నుంచి ఫ్యాన్స్కి సర్ప్రైజ్ వదిలారు మేకర్స్. రవితేజ నటించిన ధమాకా, వాల్తేరు వీరయ్య చిత్రాలు మంచి విజయం సాధించాయి. అదే జోష్లో తన తదుపరి చిత్రాలను లైన్లో పెడుతున్నాడు. ఇప్పటికే దర్శకుడు సుధీర్ వర్మతో రావణాసుర మూవీని ప్రకటించిన సంగతి తెలిసిందే. రవితేజ బర్త్డే కానుకగా ఈ రోజు రావణాసుర మూవీ తాజా పోస్టర్, ఫస్ట్ గ్లింప్స్ను విడుదల చేసింది చిత్ర బృందం. వీడియో చూస్తుంటే సినిమా సస్పెన్స్ థ్రిల్లర్ అని తెలుస్తోంది. చదవండి: కాబోయే భార్యను పరిచయం చేసిన శర్వానంద్.. ఫోటోలు వైరల్ ఓ భవంతిలో యువతిని చంపగా.. బ్లాక్ సూట్ ధరించిన రవితేజ లోపలి నుంచి బయటకు వచ్చి సిగార్ వెలిగించి వీడియో ఆసక్తికరంగా ఉంది. సుశాంత్ ప్రతినాయక పాత్ర పోషిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ చిత్రంలో అనూ ఎమ్మాన్యుయేల్, పూజిత పొన్నాడ, దక్షా నగార్కర్, ఫరియా అబ్దుల్లా, మేఘా ఆకాశ్ నటిస్తున్నారు. రావు రమేశ్, మురళీ శర్మ, సంపత్ రాజ్, నితిన్ మెహతా కీలక పాత్రలు పోషిస్తున్నారు. అభిషేక్ పిక్చర్స్, రవితేజ టీమ్ వర్క్స్ బ్యానర్లపై తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 7న విడుదల కానుంది. హర్షవర్దన్ రామేశ్వర్- భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. -
'నేనిక్కడే ఉంటానురా.. ఎక్కడికెళ్లను .. రమ్మను'.. అదిరిపోయిన గ్లింప్స్
విక్టరీ వెంకటేశ్ అభిమానులకు అదిరిపోయే గుడ్ న్యూస్. ఆయన అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ప్రకటన వచ్చేసింది. హిట్ సినిమా దర్శకుడు శైలేష్ కొలను తెరకెక్కిస్తున్న మూవీకి సైంధవ్ టైటిల్ ఖరారు చేశారు మేకర్స్. అంతే కాకుండా వెంకటేశ్ ఫస్ట్ గ్లింప్స్ కూడా విడుదల చేశారు. దీంతో విక్టరీ వెంకటేశ్ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ఈ చిత్రాన్ని నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్నారు. సౌత్ ఇండియా భాషలతో పాటు హీందీలోనూ నిర్మిస్తున్నారు. 'నేనిక్కడే ఉంటానురా.. ఎక్కడికెళ్లను .. రమ్మను' అనే డైలాగ్ వెంకీ ఫ్యాన్స్కు గూస్బంప్స్ తెప్పిస్తోంది. ఇవాళ విడుదలైన టైటిల్ పోస్టర్ చూస్తే పక్కా మాస్ ఎంటర్టైనర్ను తలపిస్తోంది. టైటిల్ పోస్టర్లో వెంకటేష్ చేతిలో తుపాకీ పట్టుకుని పవర్ఫుల్గా కనిపించారు. టైటిల్ పోస్టర్లో యాక్షన్ సీన్ల్ భారీగానే ఉండనున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే షూటింగ్ను ప్రారంభిస్తామని మేకర్స్ కూడా ప్రకటించారు. వీడియోకి అద్భుతమైన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించిన సంతోష్ నారాయణన్ ఈ చిత్రానికి సంగీతం అందించనున్నారు. వెంకటేశ్ కెరీర్లో అత్యంత భారీ బడ్జెట్ సినిమాగా తెరకెక్కించనున్నట్లు టాక్. ఈ సినిమాలో నటీనటుల వివరాలను త్వరలో ప్రకటించనున్నారు. -
రివాల్వర్ రీటాగా కీర్తి సురేశ్, ఆసక్తి పెంచుతున్న ఫస్ట్లుక్!
నటి కీర్తి సురేష్ అనే పేరు వినగానే గుర్తొచ్చే చిత్రం మహానటి. సావిత్రినే మళ్లీ పుట్టిందా అనేంతగా ఆ చిత్రంలో అద్భుతంగా అభినయించారు ఆమె. అదేవిధంగా తమిళంలోనూ సాని కాగితం అనే చిత్రంలో మగజాతి వంచితురాలిగా, ప్రతీకారం తీర్చుకునే ఆడపులిగా నటించి నటిగా మరోసారి నిరూపించుకున్నారు. అయితే గ్లామర్ పాత్రల వైపు దృష్టి మళ్లించిన కీర్తి సురేశ్కు ఆ తరువాత చెప్పుకోదగ్గ పాత్రలు రాలేదనే చెప్పాలి. కెరీర్ ఆరంభంలో మంచి విజయాలను అందుకున్న ఈ బ్యూటీ ఇటీవల వాటికి దూరమయ్యారని చెప్పక తప్పదు. చదవండి: అది నా అదృష్టం: రష్మిక ఆసక్తికర వ్యాఖ్యలు గత ఏడాది తెలుగులో మహేష్ బాబుతో జతకట్టిన సర్కారి వారి పాట, తమిళంలో సాని కాగితం చిత్రాలు విడుదల అయ్యాయి. ఇక 2023 ఆమె చేతి నిండా ప్రజెక్ట్స్ బిజీగా ఉంది. నానికి జంటగా నటించిన తెలుగు చిత్రం ‘దసరా’ విడుదలకు సిద్ధమవుతోంది. మెగాస్టార్ చిరంజీవికి చెల్లెలిగా నటిస్తున్న ‘భోళాశంకర్’ చిత్రం షూటింగ్ దశలో ఉంది. ఇక తమిళంలో ఉదయనిధి స్టాలిన్ సరసన నటించిన ‘మామన్నన్’ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. జయంరవితో జత కట్టిన ‘సైరన్’ నిర్మాణంలో ఉంది. ఈ నేపథ్యంలో తాజాగా మరో నూతన చిత్రంలో నటించడానికి సిద్ధమయ్యారు. చదవండి: విజయ్ వారసుడు ఓటీటీ స్ట్రీమింగ్ ఇక్కడే! అంతకు ముందే రిలీజ్? దీనికి ‘రివాల్వర్ రీటా’ అనే టైటిల్ను ఖరారు చేశారు. ఈ చిత్రాన్ని ఫ్యాషన్ స్టూడియోస్, ది రూట్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. చంద్రు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ను పొంగల్ సందర్భంగా విడుదల చేశారు. రెండు చేతుల్లో రివాల్వర్లు పట్టుకున్న కీర్తి సురేష్ ఫొటోతో కూడిన పోస్టర్ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ చూస్తుంటే ఇది యాక్షన్ నేపథ్యంలో సాగే లేడీ ఓరియంటెడ్ కథాచిత్రంగా ఉంటుందనిపిస్తోంది. కాగా కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి సంప్రదాయబద్ధంగా కీర్తి సురేష్ పొంగల్ వేడుకలను జరుపుకుంది. ఆ ఫొటోలను ఆమె తన ఇన్స్ట్రాగామ్లో పోస్ట్ చేశారు. Wishing some of my favourite people the very best ♥️@KeerthyOfficial @Jagadishbliss #RevolverRita Looking forward to this !! 🤗@dirchandru @dineshkrishnanb @Cinemainmygenes @Aiish_suresh @TheRoute @PassionStudios_ pic.twitter.com/1pqdOutCE8 — Samantha (@Samanthaprabhu2) January 14, 2023 -
కొత్తవారిని ప్రోత్సహించాలి
‘‘తెలుగు సినిమా పరిశ్రమకు కొత్త తరం అవసరం చాలా ఉంది. కొత్తవారు చేస్తున్న ఈ ‘అష్టదిగ్బంధనం’ సినిమా ఘనవిజయం సాధించాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే కొత్తవారు చేస్తున్న ప్రయత్నాన్ని ప్రోత్సహించినప్పుడే మరిన్ని కొత్త సినిమాలు వస్తాయి’’ అని తెలంగాణ సినిమాటోగ్రఫీ మినిస్టర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సూర్య భరత్ చంద్ర, ఇషికా ముఖ్య తారలుగా బాబా పీఆర్ దర్శకత్వంలో మనోజ్ కుమార్ అగర్వాల్ నిర్మిస్తున్న చిత్రం ‘అష్టదిగ్బంధనం’. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విడుదల చేశారు. మనోజ్ కుమార్ అగర్వాల్ మాట్లాడుతూ – ‘‘ఈ చిత్రం ద్వారా ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచనున్నాం. ఒక వినూత్న కథాంశంతో బాబా పీఆర్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే 80 శాతం షూటింగ్ పూర్తయింది’’ అన్నారు. ‘‘హైదరాబాద్ నేపథ్యంలో సాగే హై వోల్టేజ్ యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ ఇది’’ అని బాబా పీఆర్ అన్నారు. ‘‘నటనకు అవకాశం ఉన్న పాత్ర చేస్తున్నాను’’ అన్నారు సూర్య భరత్ చంద్ర. ‘‘తెలుగులో నాకు ఇది మూడో సినిమా’’ అన్నారు ఇషికా. -
రుహాణి శర్మ ప్రధాన పాత్రలో హర్(HER).. ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్
చిలసౌ ఫేం రుహాణి శర్మ ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న లేటెస్ట్ మూవీ హర్(HER). సస్పెన్స్ థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాకు శ్రీధర్ స్వరగావ్ రచయితగా, దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. డబుల్ అప్ మీడియాస్ సంస్థ ఫస్ట్ ప్రొడక్షన్గా ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నారు. తాజాగా చిత్రం నుంచి ఫస్ట్లుక్ పోస్టర్ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ పోస్టర్లో లీడ్ రోల్ పోషిస్తున్న రుహాణి శర్మ లుక్ను రిలీజ్ చేశారు. పోలీస్ ఇన్వెస్టిగేషన్ నేపథ్యంలో ఈ చిత్రం సాగనుందని ఈ పోస్టర్ చూస్తే అర్థమవుతోంది. ఇక ఈ పోస్టర్లో రుహాణి శర్మ కంటతడి పెడుతూ కనిపిండం, ఆమె వెనకాల హైవే, సిటీ పరిసరాలు చూస్తుంటే సినిమాలో అంచనాలు పెంచేస్తున్నాయి. ఇక పోస్టర్పై HER Chapter 1 అనే టైటిల్ వేయడం చూస్తుంటే ఈ చిత్రానికి సీక్వెల్ కూడా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అతి త్వరలో ఈ సినిమా టీజర్ను కూడా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. -
జపాన్ : మేడ్ ఇన్ ఇండియా!
బంగారు చొక్కా, మెడలో బంగారు గొలుసు, ఒక చేతిలో బంగారు తుపాకీ, మరో చేతిలో గోల్డెన్ గ్లోబ్... ఇదీ హీరో కార్తీ కొత్త గెటప్. ఇదంతా ‘జపాన్’ సినిమా కోసమే. కార్తీ కెరీర్లో 25వ సినిమాగా రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ ఇటీవలే ప్రారంభమైంది. రాజు మురుగన్ దర్శకత్వంలో డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకంపై ఎస్ఆర్ ప్రకాష్బాబు, ఎస్ఆర్ ప్రభు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అనూ ఇమ్మాన్యుయేల్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో సునీల్, విజయ్ మిల్టన్ నటిస్తున్నారు. సోమవారం ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ను రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. అయితే ఫస్ట్ లుక్ పోస్టర్లో కార్తీ రెండు గెటప్లతో కనిపిస్తుండటం విశేషం. ‘‘ఓ చమత్కారమైన వ్యక్తి పాత్రలో నటిస్తూ ఓ కొత్త సినిమా జర్నీని స్టార్ట్ చేయడం ఆసక్తికరంగా ఉంది. జపాన్: మేడ్ ఇన్ ఇండియా’’ అని పేర్కొన్నారు కార్తీ. ఈ సినిమాకు సంగీతం: జీవీ ప్రకాష్కుమార్, డీవోపీ: రవివర్మన్. -
ప్రియమణి లేటెస్ట్ మూవీ.. ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్
ప్రియమణి ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం 'డాక్టర్ 56.' ఈ చిత్రాన్ని శ్రీ లక్ష్మీ జ్యోతి క్రియేషన్స్ బ్యానర్పై నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన కీలక అప్డేట్ వచ్చింది. ప్రముఖ నటుడు విజయ్ సేతుపతి చేతుల మీదుగా ప్రియమణి ఫస్ట్ లుక్ పోస్టర్ను రిలీజ్ చేశారు ఈ సినిమాను సౌత్లోని అన్ని భాషల్లో రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమాకు కథ, కథనాలను ప్రవీణ్ అందిస్తుండగా.. రాజేష్ ఆనందలీల దర్శకత్వం వహిస్తున్నారు. హరిహర పిక్చర్స్పై ఈ సినిమాను ప్రవీణ్ రెడ్డి తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి నోబిన్ పాల్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. ఈ చిత్రంలో ప్రియమణితో పాటు ఇతర ముఖ్య పాత్రల్లో ప్రవీణ్, దీపక్ రాజ్శెట్టి, రమేష్ భట్, యతిరాజ్, వీణా పొన్నప్ప, మంజునాథ్ హెగ్డే, స్వాతి తదితరులు నటిస్తున్నారు. -
‘సలార్’ విలన్ని చూస్తే గూస్ బంప్సే..
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా రూపొందుతున్న సినిమా ‘సలార్’. ఈ చిత్రంలో శ్రుతీహాసన్ హీరోయిన్గా నటిస్తుండగా, జగపతిబాబు, పృథ్వీరాజ్ కీ రోల్ చేస్తున్నారు. నేడు( సెప్టెంబర్ 16) పృథ్వీరాజ్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా సలార్ నుంచి ఆయన లుక్ని విడుదల చేశారు మేకర్స్. ఇందులో ఆయన వరదరాజు మన్నారర్ పాత్రలో నటిస్తున్నాడు. (చదవండి: ‘కాంతారా’ ప్రభంజనం.. నిర్మాత పంట పండింది!) లుక్ని బట్టి చూస్తే..సలార్ లో పృథ్వీ క్రూరమైన విలన్ గా నటించే అవకాశం ఉందని తెలుస్తోంది. ముఖం నిండా మసి పూసి.. ముక్కుకి పుడక, మెడలో వెండి కడియాలు కనిపిస్తున్నాయి. ఇందులో జగపతిబాబు కూడా విలన్ పాత్రలో పోషించినా పృథ్వీరాజు సుకుమారే మెయిన్ విలన్ అని తెలుస్తోంది. హోంబలే ఫిల్మ్స్ బ్యానర్పై విజయ్ కిరగందూర్ నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సెప్టెంబర్ 28న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. Birthday Wishes to the most versatile @PrithviOfficial, Presenting ‘𝐕𝐚𝐫𝐝𝐡𝐚𝐫𝐚𝐣𝐚 𝐌𝐚𝐧𝐧𝐚𝐚𝐫’ from #Salaar.#Prabhas @VKiragandur @hombalefilms @shrutihaasan @IamJagguBhai @bhuvangowda84 @RaviBasrur @anbariv @shivakumarart @SalaarTheSaga #HBDPrithvirajSukumaran pic.twitter.com/GKDlwSqsv2 — Prashanth Neel (@prashanth_neel) October 16, 2022 -
హీరోగా బిగ్బాస్ శ్రీహాన్.. ఫస్ట్లుక్ పోస్టర్ రిలీజ్
బిగ్బాస్ ఫేం శ్రీహాన్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న సినిమా ఆవారా జిందగి. దేప శ్రీకాంత్ రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా, విభా ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నంద్యాల మధుసూదన్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఫన్ ఓరియెంటెడ్ మూవీగా యూత్ ఫుల్ కథాంశంతో రాబోతున్న ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఫస్ట్లుక్ పోస్టర్ను వదిలారు. సినిమా కథను రిప్రెజెంట్ చేసేలా నలుగురు కుర్రాళ్లతో ఈ పోస్టర్ డిజైన్ చేశారు. నలుగురు కుర్రోళ్ళ నడుమ నడిచే ఫుల్ లెంగ్త్ కామెడీతో ఈ సినిమాను గ్రాండ్ గా రూపొందిస్తున్నారు. జీరో లాజిక్ 100% ఫన్ అన్నది ట్యాగ్లైన్. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. త్వరలోనే సినిమా విడుదల తేదీని ప్రకటించనున్నారు చిత్ర యూనిట్. -
యదార్థ సంఘటనతో ‘వీకెండ్ పార్టీ’
కరోనా తర్వాత ప్రేక్షకులు సినిమాలు చూసే ధోరణి మారిపోయింది. రియాలిటీ చిత్రాలను, రియలిస్టిక్ సినిమాలను ఎక్కువగా ఇష్టపడుతున్నారు. నిజ జీవితంలోని ఘటనలు, యథార్థ సంఘటనల ఆధారంగా తీసే చిత్రాలకు మంచి ఆదరణ దక్కుతోంది. అలాంటి నేపథ్యంతో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘వీకెండ్ పార్టీ’. నాగార్జున సాగర్ ఏరియాలో జరిగిన నిజ ఘటనల ఆధారంగా ఈ చిత్రం రాబోతుంది. కథారచయిత అమరుడు డాక్టర్ బోయ జంగయ్య గారి 80వ జయంతి సందర్భంగా సినిమాకు సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు. ఈ సినిమా నిర్మాత బోయ చేతన్ బాబు, సినిమా దర్శకులు అమరేందర్ ప్రోమో విడుదల చేశారు. నాగార్జునసాగర్ లో జరిగినటువంటి ఒక యదార్థ సంఘటన ఆధారంగా, ఈ సినిమా కొనసాగుతూ ఉంటుందని మేకర్లు తెలిపారు. బాహుబలి ప్రభాకర్, గీతా సింగ్, గుంటూరు విజయ్, అక్షిత్ అంగరీష్, రమ్య నాని, రమ్య రాజ్, సిరి, గీతిక, ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రానికి సదా చంద్ర సంగీతం అందిస్తున్నారు. -
అజిత్ 61 మూవీ టైటిల్ ఇదే.. ఆకట్టుకుంటున్న ఫస్ట్లుక్ పోస్టర్
నటుడు అజిత్ చిత్రానికి సంబంధించిన ఎలాంటి విషయం వెలువడినా ఆయన అభిమానుల్లో పండుగ వాతావరణం కనిపిస్తుంది. ఇంతకీ కారణం చెప్పలేదు కదూ! నటుడు అజిత్ కథానాయకుడిగా నటిస్తున్న 61వ చిత్రం పేరేమిటి? అది ఎలా ఉండబోతోంది, ఎప్పుడు తెరపైకి రాబోతోంది అన్న విషయాల గురించి తెలుసుకోవడానికి అభిమానులు చాలా ఆత్రుత గా ఎదురుచూస్తున్నారు. హెచ్ వినోద్ దర్శకత్వంలో అజిత్ తన 61వ చిత్రాన్ని చేస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దీనిని బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్, జీ సీనిమాతో కలిసి నిర్మిస్తున్నారు. ప్రముఖ మలయాళం నటి మంజు వారియర్ నాయకిగా నటిస్తున్న ఈ చిత్రానికి జిబ్రాన్ సంగీతాన్ని అందిస్తున్నారు. షూటింగ్ చివరి దశకు చేరుకున్న ఈ చిత్ర టైటిల్, పస్ట్ లుక్ పోస్టర్లను బుధ, గురువారాల్లో వరుసగా విడుదల చేసి సర్ప్రైజ్ ఇచ్చారు. ఇక ఈ చిత్రానికి ‘తునివు’ అనే టైటిల్ను ఖరారు చేశారు. దీనికి నో గట్స్ నో గ్లోరి అనే ట్యాగ్ లైన్ జోడించారు. #THUNIVU first look #Ajith #ajithkumarfans #Ajithkumar𓃵 pic.twitter.com/Dpl3b2n13B — Narinder Saini (@Narinder75) September 21, 2022 -
ఆకట్టుకుంటున్న'థగ్స్' క్యారక్టర్ ఇంట్రడక్షన్ వీడియో
ప్రముఖ డాన్స్ మాస్టర్ బృంద గోపాల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘థగ్స్'. పులి, ఇంకొకడు, సామి 2 తో పాటు పలు హిందీ చిత్రాలను నిర్మించిన షిబు తమీన్స్ కుమార్తె రియా షిబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇంటెన్స్ యాక్షన్ ఫిల్మ్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం ద్వారా షిబు కుమారుడు హృదు హరూన్ హీరోగా పరిచయం అవుతుండగా సింహ, ఆర్ కె సురేష్, మునిష్కాంత్, అనస్వర రాజన్ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. శామ్ సి ఎస్ సంగీతాన్ని అందిస్తుండగా, ప్రియేష్ గురుస్వామి సినిమాటోగ్రాఫర్ గా పని చేస్తున్నారు. ప్రవీణ్ అంతోనీ ఎడిటర్ గా, జోసెఫ్, నెల్లికల్ ప్రొడక్షన్ డిజైనర్ గా థగ్స్ రూపొందుతోంది. ఈ చిత్రానికి సంబంధించి క్యారక్టర్ ఇంట్రడక్షన్ వీడియో ను చెన్నై లో ఆర్య, భగ్యరాజ్, గౌతమ్ మీనన్, పార్థిబన్, ఖుష్బూ, దేసింగ్, పూర్ణిమ భాగ్యరాజ్, కళా మాస్టర్ వంటి ప్రముఖుల సమక్షంలో భారీ వేడుకలో విడుదల చేశారు. అందరూ థగ్స్ భారీ విజయం సాధించాలని ఆకాంక్షించారు. క్యారక్టర్ ఫ్రమ్ ద వరల్డ్ ఆఫ్ థగ్స్ గా విడుదల అయిన ఈ వీడియో లో సినిమాలోని ప్రధాన పాత్రలను పరిచయం చేశారు. 'మాస్టర్ మైండ్' సేతు గా హృదు, 'రోగ్' దురై గా సింహ, 'బ్రూట్' ఆరాకియా దాస్ గా ఆర్ కె సురేష్, 'క్రుకెడ్' మరుదు గా మునిష్కాంత్ కనిపించిన ఈ వీడియో సినిమా మీద అంచనాలను పెంచే విధంగా ఉంది. వీడియో ఆద్యంతం శామ్ సి ఎస్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మూడ్ ని ఎలివేట్ చేసేలా సాగింది. దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి వీడియో బైట్ లో హీరో హృదు కి, దర్శకురాలు బృంద కి తన బెస్ట్ విషెస్ చెబుతూ థగ్స్ చిత్రం విడుదలయ్యే అన్ని భాషల్లో పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. నవంబర్ లో థియోటర్స్ లో తమిళ్, తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో విడుదల కానుంది. -
‘గాడ్ ఫాదర్’లో నయన్ రోల్ ఇదే.. ఆసక్తిగా ఫస్ట్లుక్ పోస్టర్
మెగాస్టార్ చిరంజీవి హీరోగా మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘గాడ్ఫాదర్’. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ మూవీ నుంచి మేకర్స్ తరచూ ఏదోక అప్డేట్ వదులుతూ సినిమాపై హైప్ క్రియేట్ చేస్తున్నారు. ఇటీవల చిరు బర్త్డే సందర్భంగా విడుదలైన సినిమా టీజర్కు మంచి స్పందన వచ్చింది. ఇక ఇప్పటికే విడుదలై ఫస్ట్లుక్ పోస్టర్లకు కూడా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక ఈసినిమాలో సౌత్ లేడీ సూపర్ స్టార్ నయనతార కీ రోల్ పోషిస్తున్న సంగతి తెలిసిందే. చదవండి: బాలీవుడ్ లవ్బర్డ్స్ పెళ్లి ఏర్పాట్లు షురూ? సౌత్ ముంబైలో రాయల్ వెడ్డింగ్! తాజాగా ఈ సినిమాలోని నయన్ లుక్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సందర్భంగా నయన్ రోల్ను కూడా పరిచయం చేసింది మూవీ యూనిట్. ఇందులో ఆమె సత్యప్రియ జయదేవ్గా కనిపించనుంది. ఈ పోస్టర్లో నయన్ సీరియస్గా టైపింగ్ చేస్తూ కనిపిస్తున్న నయన్ లుక్ ప్రేక్షకుల్లో ఆసక్తిని నింపుతుంది. దీంతో గాడ్ ఫాదర్ ఆమె రోల్ కీలకంగా ఉండనుందని తెలుస్తోంది. అయితే ఈ సినిమాలో నయనతార, చిరు చెల్లెలిగా నటిస్తుందనే విషయం తెలిసిందే. -
ఆసక్తి పెంచుతున్న సంతోష్ శోభన్ కొత్త మూవీ టైటిల్, ఫస్ట్లుక్
విభిన్న కథలను ఎంచుకుంటూ నటనతో ప్రేక్షకులను మెప్పిస్తు వస్తున్నాడు యంగ్ హీరో సంతోష్ శోభన్. గోల్కొండ హై స్కూల్ చిత్రంలో వెండితెర ఎంట్రీ ఇచ్చిన సంతోష్ తను నేను చిత్రంలో హీరోగా మారాడు. ‘ఏక్ మినీ కథ’ చిత్రంతో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకు సంతోష్ శోభన్ తాజాగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. తాజాగా ఈ చిత్రం అప్డేట్ వదిలారుమ మేకర్స్. ఈ సినిమాకు ‘లైక్ షేర్ అండ్ సబ్స్రైబ్’ అనే టైటిల్ను ఖరారు చేస్తూ ఫస్ట్లుక్ పోస్టర్ను విడుదల చేసింది చిత్ర బృందం. కొత్తగా ఉన్న ఈ టైటిల్ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. ప్రస్తుతం ఈ మూవీ ఫస్ట్లుక్, టైటిల్కు మంచి రెస్పాన్స్ వస్తోంది. చదవండి: జూ.ఎన్టీఆర్-కొరటాల చిత్రంలో అలనాటి లేడీ సూపర్ స్టార్? కాగా ఈ చిత్రంలో సంతోష్ శోభన్ సరసన జాతీ రత్నాలు బ్యూటీ ఫరియా అబ్దుల్లా నటిస్తోంది. ఇక టైటిల్తో పాటు విడుదల చేసిన ఈ ఫస్ట్లుక్ పోస్టర్లో సంతోష్ శోభన్, ఫరియా, సుదర్శన్ ముగ్గురు పైకి చూస్తూ కనిపించారు. ఇక సంతోష్కు బ్లాక్బస్టర్ హిట్ అందించిన ‘ఏక్ మినీ కథ’ చిత్రాన్ని కథ అందించిన మేర్లపాక గాంధీ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండటంతో సినిమాపై మరిన్ని అంచనాలు నెలకొన్నాయి. అడ్వేంచరస్ ట్రావెల్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ప్రవీణ్ లక్కరాజు సంగీతం అందిస్తున్నాడు. నిహారిక ఎంటర్టైనమెంట్స్ బ్యానర్పై వెంకట్ బోయనపల్లి ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. An Adventurous Travel Tale filled with Joy, Thrill & Entertainment 💯😃🤞 Presenting the First Look of 𝗟𝗜𝗞𝗘👍 𝐒𝐇𝐀𝐑𝐄 🔁 & 𝑺𝑼𝑩𝑺𝑪𝑹𝑰𝑩𝑬🔔#LSS ❤️🔥@santoshshobhan @fariaabdullah2 @MerlapakaG @vboyanapalli @Plakkaraju @Ram_Miriyala #AamukthaCreations @saregamasouth pic.twitter.com/DxX0yHaDvT — Niharika Entertainment (@NiharikaEnt) September 5, 2022 -
‘గుడ్బై’ రిలీజ్ ఎప్పుడో చెప్పిన రష్మిక
నేషనల్ క్రష్ రష్మిక మందన్నా భాషతో సంబంధం లేకుండా అన్ని ఇండస్ట్రీలో అవకాశాలు అందుకుంటుంది. కన్నడ నుంచి తెలుగు వచ్చిన రష్మిక ఇటీవల బాలీవుడ్లో అడుగుపెట్టింది. అక్కడ తన తొలి చిత్రం విడుదల కాకముందే వరుసగా రెండు సినిమాలకు సంతకం చేసింది. ఏకంగా బిగ్బి అమితాబ్ బచ్చన్తో నటించే చాన్స్ కొట్టేసింది. అమితాబ్తో గుడ్బై, రణ్బీర్ కపూర్ సరసన ఎనిమల్ చిత్రాలు చేస్తుంది. తాజా గుడ్బై చిత్రం నుంచి అప్డేట్ ఇచ్చారు మేకర్స్. రష్మిక మందన్నా శనివారం ఈ మూవీ ఫస్ట్లుక్ పోస్టర్ను రిలీజ్ చేస్తూ రిలీజ్ డేట్ను ప్రకటించింది. అక్టోబర్ 7న ఈ చిత్రం విడుదల చేస్తున్న చెప్పింది. ఈ ఫస్ట్లుక్ పోస్టర్ను రిలీజ్ చేస్తూ.. ‘మీ కుటుంబాన్ని కలిసేందుకు మా నాన్న-నేను అక్టోబర్ 7న వస్తున్నాం’ అంటూ రాసుకొచ్చింది. ఈ పోస్టర్లో అమితాబ్-రష్మికలు కలిసి పతంగులు ఎగురవేస్తూ కనిపించారు. ఈ సినిమాలో రష్మిక అమితాబ్ కూతురిగా కనిపించనుందని తెలుస్తోంది. కాగా వికాస్ బహల్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని ఏక్తా కపూర్ నిర్మించింది. నీనా గుప్తా, సాహిల్ మెహతా, శివిన్ నారంగ్లు కీలక పాత్రలు పోషిస్తున్నారు. View this post on Instagram A post shared by Amitabh Bachchan (@amitabhbachchan) -
యూత్ఫుల్ ఎంటర్టైనర్ ‘హ్యాపీ వీకెండ్’ ఫస్ట్లుక్ అవుట్
వినాయక చవితి పండగ సందర్భంగా తాజా చిత్రం ‘హ్యాపీ వీకెండ్’ ఫస్ట్లుక్ విడుదల చేశారు మేకర్స్. యూత్ఫుల్ నటీనటులతో శ్రీసారిక మూవీస్ పతాకంపై కారాడి వెంకటేశ్వర్లు స్వీయ నిర్మాణ-దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. ఈ సినిమాకు రాధాకృష్ణ మరో నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. హారర్ కామెడీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పటికే రెండు షెడ్యూల్ పూర్తి చేసుకుంది. తాజా మూడవ షెడ్యూల్ కోసం చిత్రం బృందం గోవా పయనమైంది. ఈ క్రమంంలో బుధవారం వినాయక చవితి సందర్భంగా ఈ మూవీ ఫస్ట్లుక్ పోస్టర్ను రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా దర్శక నిర్మాతలు మాట్లాడుతూ.. ‘‘ఒక హారర్ కామెడీ చిత్రంగా హ్యీపీ వీకెండ్ను తెరకెక్కిస్తున్నాం. చింతా పృద్వి చరణ్, చంద్రదిత్య, భాస్కర శర్మ, హర్ష నల్లబెల్లి, యాష్, రూప, కావ్య కీర్తి, గౌతమి లాంటి యూత్ ఫుల్ నటీనటులతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాము. కథ కథనం చాలా కొత్తగా ఉంటుంది. యూత్ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని వారి మంచి వినోదం అందించేందుకు ఈ చిత్రాన్ని మంచి హారర్ కామెడీగా నిర్మిస్తున్నాం. త్వరలో అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని మూవీ విడుదల తేదీని ప్రకటిస్తాం’’అని తెలిపారు. -
Vidya Vasula Aham First Look: ఇగో వెనుక ఇంత చరిత్ర ఉందా?
రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్ జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘విద్య వాసుల అహం’. ‘తెల్లవారితే గురువారం’ఫేం మణికాంత్ గెల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఏటర్నిటీ ఎంటర్టైన్మెంట్ ప్రొడక్షన్ నెంబర్ 2 గా తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్, టైటిల్ యానిమేషన్ కాన్సెప్ట్ వీడియోని వినాయక చవితి సందర్భంగా గురువారం విడుదల చేశారు. (చదవండి: డైరెక్టర్లపై చిరంజీవి సంచలన వ్యాఖ్యలు) టైటిల్ చాలా ఢిఫరెంట్గా, యూత్ని అట్రాక్ట్ చేసేలా ఉంది. అహం వెనుక ఉన్న చరిత్రను యానిమేషన్ రూపంలో చెబుతూ వినూత్నంగా ఫస్ట్లుక్ అందరిని ఆకట్టుకుంటుంది. పెళ్లైన ఓ నూతన జంట మధ్య ఉన్న ఇగోలలో నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమా కోసం హైదరాబాద్లో ఓ ఇల్లు సెట్ వేశామని, ప్రస్తుతం అక్కడే షూటింగ్ జరుగుతోందని చిత్ర యూనిట్ పేర్కొంది.శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న విద్య వాసుల అహం త్వరలో థియేటర్స్ లో విడుదల కానుంది. -
పాన్ ఇండియా చిత్రంగా రాజేంద్ర ప్రసాద్ 'శాసన సభ'
Rajendra Prasad First Look Released From Sasana Sabha: వైవిధ్యమైన పాత్రలతో ఎప్పటికప్పుడు ప్రేక్షకులను అలరించే అతికొద్ది నటుల్లో డా. రాజేంద్ర ప్రసాద్ ఒకరు. ఆయన తాజాగా నటించిన చిత్రం 'శాసన సభ'. ఇందులో ఇంద్రసేన, ఐశ్వర్య రాజ్ జంటగా నటించగా, సోనియా అగర్వాల్, పృథ్వీరాజ్ ముఖ్య పాత్రలు పోషించారు. వేణు మడికంటి దర్శకత్వం వహించిన ఈ సినిమా పాన్ ఇండియాగా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో తెరకెక్కుతోంది. ప్రముఖ పారిశ్రామిక వేత్తలైన తులసీ రామ్ సాప్పని, షణ్ముగం సాప్పని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తిర అప్డేట్ను ఇచ్చింది చిత్రబృందం. ఆగస్ట్ 15 స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రాజేంద్ర ప్రసాద్ ఫస్ట్ లుక్ పోస్టర్ను సోమవారం విడుదల చేసింది మూవీ యూనిట్. ఈ సినిమాలో ఎమ్మెల్యే నారాయణ స్వామిగా రాజేంద్ర ప్రసాద్ కనిపించనున్నారు. ''ఈ మూవీ పాన్ ఇండియా చిత్రంగా రూపొందిన పొలిటికల్ థ్రిల్లర్. యూనివర్శల్ కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమాలో సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ ఎమ్మెల్యే నారాయణ స్వామిగా నటిస్తున్నారు. చదవండి: బిగ్బాస్ బ్యూటీకి లైంగిక వేధింపులు.. ఆవేదనతో పోస్ట్ 1947లో పుట్టుక.. స్వాతంత్య్ర దినోత్సవం రోజునే మరణించిన నటి విలువలు, నిజాయితీ కలిగిన జాతీయ నాయకుడుగా ఆయన రోల్ ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఇప్పటివరకు ఆయన కెరీర్లో చేయనటువంటి విభిన్నమైన పాత్ర ిది. ఈ సినిమాకు ఆయన పాత్రే హైలెట్గా నిలుస్తుంది. అలాగే మా సినిమాకు కేజీఎఫ్ ఫేమ్ రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. ఇటీవల రిలీజైన మోషన్ పోస్టర్కు మంచి స్పందన లభించింది. అన్ని వర్గాల ప్రేక్షకులను మా చిత్రం ఆకట్టుకుంటుందనే నమ్మకం ఉంది'' అని నిర్మాతలు తెలిపారు. చదవండి: థియేటర్లలో 4 చిత్రాలు, ఓటీటీలో ఎన్నో.. Wishing all a very happy Independence Day #IndiaAt75 - Team #Sasanasabha #IndraSena #RajendraPrasad #VenuMadikanti #ShanmugamSappani #Thulasiramsappani @RaviBasrur #AishwaryaRaj @soniya_agg @sapbrofilms @kaanistudio #HappyIndependenceDay pic.twitter.com/D9FVJxuxTs — Ramesh Bala (@rameshlaus) August 15, 2022 -
ఓ కంక్లూజన్తో మోహన్ లాల్ 'దృశ్యం 3'.. ఆసక్తిగా ఫస్ట్ లుక్
Mohanlal Drishyam 3 First Look Poster Released: మలయాళ సూపర్ స్టార్ మోహన్లాల్, సీనియర్ హీరోయిన్ మీనా ప్రధాన పాత్రల్లో నటించి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన చిత్రాలు దృశ్యం, దృశ్యం 2. మొదటగా వచ్చిన 'దృశ్యం' మూవీ ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై మాసీవ్ హిట్ను సొంతం చేసుకుంది. దీంతో తెలుగు, తమిళంలో కూడా రీమేక్ కాగా అక్కడ కూడా మంచి విజయం సాధించింది. తెలుగులో విక్టరీ వెంకటేష్, మీనా నటించిన విషయం తెలిసిందే. ఇక దీనికి సీక్వెల్గా తెరకెక్కిన 'దృశ్యం 2' కూడా ఎంతపెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కన్న కూతురును, కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఓ తండ్రి చేస్తున్న యుద్ధమే ఈ సిరీస్ల కథగా చెప్పుకోవచ్చు. అయితే తాజాగా ఈ సిరీస్లో మూడో చిత్రం రానుంది. ఈ రెండు పార్ట్లకు కొనసాగింపుగా 'దృశ్యం 3' రానుంది. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. 'దృశ్యం 3: ది కంక్లూజన్' పేరుతో ఈ సినిమా తెరకెక్కనుంది. దీనికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ను విడుదల చేశారు. ఈ పోస్టర్లో మోహన్ లాల్ సంకెళ్లతో ధీర్ఘంగా ఆలోచిస్తూ కనిపించడం ఆకట్టుకునేలా ఉంది. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సినిమా పోస్టర్పై ఒక్కొక్కరు ఒక్కోలా రియాక్ట్ అవుతున్నారు. కాగా మొదటి రెండు భాగాలకు దర్శకత్వం వహించిన జీతూ జేసేఫ్ ఈ సినిమాను డైరెక్ట్ చేయనున్నారు. మరీ ఈ మూడో చిత్రంలో ఎన్ని ట్విస్టులు ఉంటాయో వేచి చూడాల్సేందే. అలాగే ఈ మూడో భాగంతో ఓ కంక్లూజన్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. #Drishyam3 The Conclusion offical announcement soon#Mohanlal @Mohanlal pic.twitter.com/X8dVERlaTR — Shivani Singh (@lastshivani) August 13, 2022 #Drishyam3 George Kutty & Family are coming back! pic.twitter.com/VUoT6m0gLF — Christopher Kanagaraj (@Chrissuccess) August 13, 2022 -
రేణుక ఫస్ట్ లుక్ పోస్టర్.. స్టయిలిష్ లుక్లో సన్నీ లియోన్
మంచు విష్ణు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘జిన్నా’. ఇషాన్ సూర్య దర్శకత్వంలో ఈ చిత్రాన్ని అవా ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ నిర్మిస్తున్నాయి. ఈ చిత్రంలో సన్నీ లియోన్, పాయల్ రాజ్పుత్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. రేణుక పాత్రలో సన్నీ కనిపిస్తారు. బుధవారం స్టయిలిష్గా ఉన్న రేణుక ఫస్ట్ లుక్ పోస్టర్ను విడుదల చేసింది చిత్రబృందం. ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లేను రచయిత కోన వెంకట్ అందించారు. ‘‘కమర్షి యల్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న చిత్రమిది. తెలుగు తమిళ, మలయాళం, హిందీ భాషల్లో ‘జిన్నా’ విడుదల కానుంది. ‘నాటు నాటు’ ఫేమ్ ప్రేమ్ రక్షిత్ మాస్టర్ ఈ చిత్రానికి నృత్యాలు అందిస్తున్నారు. అనూప్ రూబెన్స్ ఉర్రూతలూగించే సంగీతం అందించగా, ఛోటా కె. నాయుడు సినిమాటోగ్రఫీని నిర్వహిస్తున్నారు’’ అని చిత్రబృందం పేర్కొంది. -
రవితేజ ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తున్న కొత్త హీరో
ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన హీరోల్లో రవితేజ ఒకరు. కెరీర్ ఆరంభంలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా అలరించిన రవితేజ ఆ తర్వాత హీరోగా సక్సెస్ అయ్యాడు. ఇప్పుడు వరుస సినిమాలతో ఫుల్ బిజీగా మారిపోయాడు. ఇదిలా ఉండగా ఇప్పుడు రవితేజ ఫ్యామిలీ నుంచి ఒకరు ఇండస్ట్రీలోకి పరిచయం కానున్నారు. రవితేజ తమ్ముడి కొడుకు మాధవ్ భూపతిరాజు 'ఏయ్పిల్లా' సినిమాతో హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ చిత్రానికి రమేశ్ వర్మ కథ అందిస్తుండగా,లుధీర్ బైరెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. మిస్ ఇండియా ఫస్ట్ రన్నరప్ రుబుల్ షెకావత్ హీరోయిన్గా నటిస్తుంది.తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్లుక్ పోస్టర్ను రిలీజ్ చేశారు మేకర్స్. వచ్చేనెల నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. Hi everyone, Here is the first look of my debut film #EyPilla Produced by bujji garu @LNPOfficial Directed by ludheer 🎬 Music by @mickeyjmeyer 🎶🎻 Super excited 🎉🎉🎉 pic.twitter.com/kZlfiv2eQK — maadhav bhupathiraju (@maadhav_9999) August 9, 2022 View this post on Instagram A post shared by MB (@maadhav._.bhupathiraju) -
హీరోయిన్ పాయల్ ఇలా మారిపోయిందేంటి?
మంచు విష్ణు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం జిన్నా. గాలి నాగేశ్వరరావు పాత్రలో విష్ణు కనిపించనున్నాడు. ఈ సినిమా ద్వారా ఇషాన్ సూర్య దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఇక ఈ సినిమాలో మంచు విష్ణుకు జోడీగా పాయల్ రాజ్పుత్ నటించనుంది. ఈ సినిమాలో ఆమె పచ్చళ్ల స్వాత్రి అనే పాత్రలో కనిపించనుంది. ఈ విషయాన్ని స్వయంగా పాయల్ తన ఇన్స్టాగ్రామ్ ద్వారా వెల్లడించింది. దీనికి సంబంధించి ఫస్ట్లుక్ పోస్టర్ను షేర్ చేసుకుంది. ప్రస్తుతం తిరుపతిలో ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది. ఏవీఏ ఎంటర్టైన్ మెంట్స్ పతాకంపై మంచు విష్ణు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.అనూప్ రూబెన్స్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. View this post on Instagram A post shared by Payal Rajput (@rajputpaayal) -
నందిని రెడ్డి చేతుల మీదుగా ‘అలిపిరికి అల్లంత దూరంలో’ ఫస్ట్లుక్
నూతన నటుడు రావణ్ నిట్టూరు హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘అలిపిరికి అల్లంత దూరంలో’. కాస్కేడ్ పిక్చర్స్ పతాకంపై రమేష్ డబ్బుగొట్టు, రెడ్డి రాజేంద్ర పి నిర్మిస్తున్న ఈ చిత్రానికి ప్రముఖ డైరెక్టర్ నందిని రెడ్డి దగ్గర సహాయ దర్శకుడిగా పనిచేసిన ఆనంద్ జె దర్శకత్వం వహిస్తున్నాడు. రాబరీ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ ని తాజాగా దర్శకురాలు నందిని రెడ్డి లాంచ్ చేసి యూనిట్ కు బెస్ట్ విశేష్ అందించారు. ఫస్ట్ లుక్ లో ఒక హొటల్ టెర్రస్ పై హీరో సీరియస్ గా నిలుచుని చూడటం, బ్యాగ్రౌండ్ లో తిరుమల సప్తగిరులు కనిపించడం ఆసక్తికరంగా ఉంది. నూతన నటీనటులతో నిర్మిస్తున్న ఈ చిత్రంలో శ్రీ నికిత, అలంకృత షా, బొమ్మకంటి రవీందర్, అమృత వర్షిణి సోమిశెట్టి లహరి గుడివాడ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఫణి కళ్యాణ్ సంగీతం అందిస్తున్నాడు. -
మరో విభిన్నపాత్రలో సునీల్.. పోస్టర్ రిలీజ్..
Sunil First Look Poster From Tees Maar Khan Movie: కమెడియన్గా, హీరోగా, విలన్గా తెలుగు ప్రేక్షకులను మెప్పిస్తూ వస్తోన్న సునీల్.. మరోసారి వినూత్న పాత్రతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. లవ్లీ హీరో ఆది సాయికుమార్ హీరోగా, పాయల్ రాజ్పుత్ హీరోయిన్గా 'తీస్ మార్ ఖాన్' అనే చిత్రం రానున్న విషయం తెలిసిందే. ప్రొడక్షన్ నెంబర్ 3 గా విజన్ సినిమాస్ బ్యానర్ పై ప్రముఖ వ్యాపారవేత్త డా.నాగం తిరుపతి రెడ్డి ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. 'నాటకం' వంటి విభిన్న కథాంశంతో కూడుకున్న చిత్రాన్ని తెరకెక్కించి ప్రేక్షకులను అలరించిన దర్శకుడు కళ్యాణ్ జి గోగణ దర్శకత్వంలో ఈ మూవీ రూపొందింది. ఈ చిత్రం ఆగస్ట్ 19న విడుదల కానుంది. సినిమా ప్రమోషన్స్లో భాగంగా ఇది వరకు విడుదల చేసిన పోస్టర్లు, టీజర్లు, పాటలు అందరినీ మెప్పించాయి. వాటికి అన్ని వైపుల నుంచి పాజిటివ్ వైబ్స్ రావడంతో సినిమా మీద అంచనాలు పెరిగాయి. ఇక ఇప్పుడు ఈ చిత్రం నుంచి మరొక అప్డేట్ వచ్చింది. సునీల్ పాత్రకు సంబంధించిన కారెక్టర్ పోస్టర్ను మేకర్లు విడుదల చేశారు. సునీల్ ఈ చిత్రంలో 'చక్రి' అనే పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రంలో సునీల్ ఓ కీలక రోల్ పోషిస్తున్నారు. తాజాగా రిలీజ్ చేసిన పోస్టర్లో సునీల్ సీరియస్గా ఏదో తీవ్రంగా ఆలోచిస్తున్నట్టు కనిపిస్తున్నారు. చదవండి: దుస్తులు లేకుండా రణ్వీర్ సింగ్.. అది సరైన పద్ధతి కాదన్న జాన్వీ కపూర్ ఆది సాయి కుమార్ పవర్ ఫుల్ పాత్రలో నటించిన ఈ సినిమాను హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఎక్కడా ఖర్చుకు వెనక్కు తగ్గకుండా భారీ బడ్జెట్ కేటాయించి ఈ సినిమాను రూపొందించారు నిర్మాతలు. స్టూడెంట్, రౌడీ, పోలీస్ గా మూడు వేరియేషన్స్ ఉన్న పాత్రలో ఆది సాయికుమార్ నటించడం ఈ సినిమాకు మేజర్ అసెట్. ఈ చిత్రానికి సంగీతం సాయి కార్తీక్ అందించగా.. బాల్ రెడ్డి సినిమాటోగ్రఫీ చేశారు. మణికాంత్ ఎడిటర్ గా వర్క్ చేసి స్మార్ట్ అవుట్ పుట్ తీసుకొచ్చారు. -
'బ్యూటిఫుల్ గర్ల్'ను పరిచయం చేసిన అనుపమ పరమేశ్వరన్..
Anupama Parameswaran Launch First Look Of The Story Of A Beautiful Girl: చార్మీతో ‘మంత్ర’, అనుపమ పరమేశ్వరన్తో ‘బటర్ ఫ్లై’ చిత్రాలు నిర్మించిన జెన్ నెక్ట్స్ మూవీస్ బ్యానర్ పై రానున్న తాజా చిత్రం ‘ది స్టోరీ అఫ్ ఎ బ్యూటిఫుల్ గర్ల్’. నిహాల్ కొదాటి, దృషికా చందర్ జంటగా రవిప్రకాష్ బోడపాటి దర్శకత్వంలో ప్రసాద్ తిరువల్లూరి, పుష్యమి ధవళేశ్వరపు నిర్మించారు. ఈ చిత్రం ఫస్ట్ లుక్ను అనుపమా పరమేశ్వరన్ విడుదల చేశారు. ‘‘మా బ్యానర్లో ప్రొడక్షన్ నెంబర్ 1గా 2007లో ‘మంత్ర’ సినిమా చేశాం. అది ఎంత బ్లాక్ బస్టర్ హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ఆ తర్వాత కొంత గ్యాప్ తీసుకొని, ‘బటర్ ఫ్లై’ సినిమా చేశాం. ఈ సినిమా డిస్నీ ప్లస్ హాట్ స్టార్లో త్వరలో స్ట్రీమింగ్ కానుంది. ఇక ‘ది స్టోరీ అఫ్ ఎ బ్యూటిఫుల్ గర్ల్’కి నేను స్టోరీ, డైలాగ్స్, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ కూడా చేశాను. మా సంస్థ నుంచి మరిన్ని మంచి చిత్రాలు అందిస్తాం’’ అని రవిప్రకాష్ బోడపాటి అన్నారు. త్వరలో ‘ది స్టోరీ అఫ్ ఎ బ్యూటిఫుల్ గర్ల్’ చిత్రాన్ని విడుదల చేస్తాం’’ అని ప్రసాద్ తిరువల్లూరి అన్నారు. -
ఆర్జీవీ చేతుల మీదుగా ‘ఆదిత్య T 20 లవ్ స్టోరీ’ ఫస్ట్లుక్
శ్రీ ఆదిత్య హీరోగా, రమ్య, పవిత్ర, మాధురి హీరోయిన్లుగా తెరకెక్కుతున్న తాజా చిత్రం‘ఆదిత్య T 20 లవ్ స్టోరీ’.ఎంజే క్రియేషన్స్ బ్యానర్ లో బేబీ మన్వితా చరణ్ అడపా సమర్పణలో చిన్నబాబు అడపా నిర్మిస్తున్న ఈ చిత్రానికి కి చిన్ని చరణ్ అడపా దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ను సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ విడుదల చేశారు. ఆదిత్య T 20 లవ్ స్టోరీ ఫస్ట్ లుక్ పోస్టర్ చాలా కొత్తగా ఉంది. హీరో శ్రీ ఆదిత్య స్టైలీష్గా కనిపిస్తున్నాడు. కళ్లజోడు లుక్ కూడా కొత్తగా అనిపిస్తుంది. ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన విడుదల తేదీని ప్రకటించనున్నట్లు మేకర్స్ వెల్లడించారు.ఈ చిత్రానికి సంగీతం చిన్ని చరణ్ అడపా అందిస్తుండగా, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ను అభిషేక్ రూఫస్ సమకూరుస్తున్నారు. -
బిజినెస్ మ్యాన్గా కిరణ్ అబ్బవరం !
Rules Ranjan First Look Poster Released: 'యస్ఆర్ కల్యాణ మండపం' సినిమాతో హీరోగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు కిరణ్ అబ్బవరం. ఇటీవలే "సమ్మతమే" చిత్రంతో ప్రేక్షకులను అలరించాడు. ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇంతకుముందు 'నేను మీకు బాగా కావాల్సినవాడిని' టీజర్తో అలరించిన కిరణ్ అబ్బవరం తాజాగా 'రూల్స్ రంజన్' ఫస్ట్ లుక్ పోస్టర్తో ఆకట్టుకున్నాడు. రత్నం కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ నుంచి కిరణ్ అబ్బవరం ఫస్ట్ లుక్ పోస్టర్ను ఆయన బర్త్డే సందర్భంగా శుక్రవారం (జులై 15) రిలీజ్ చేశారు. బిజినెస్ మ్యాన్ సూట్లో చాలా డిఫరెంట్గా కనువిందు చేశాడు కిరణ్ అబ్బవరం. ఏ.ఎం రత్నం సమర్పణలో శ్రీ సాయి సూర్య మూవీస్, స్టార్ లైట్ ఏంటర్ టైన్మెంట్ పతాకంపై ఈ మూవీ తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో ‘డి.జె.టిల్లు’ సినిమాతో ఎంతో క్రేజ్ తెచ్చుకున్న హీరోయిన్ నేహా శెట్టి కథానాయికగా నటిస్తోంది. వెన్నెల కిషోర్,హిమాని, వైశాలి, జయవాణి, ముంతాజ్, సత్య, అన్ను కపూర్ (బాలీవుడ్), సిద్ధార్థ సేన్ (బాలీవుడ్), అతుల్ పర్చురే (బాలీవుడ్), ఆశిష్ విద్యార్థి, అజయ్ వంటి టాలీవుడ్, బాలీవుడ్ కి చెందిన నటీనటులతో రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్గా ఈ మూవీ రూపొందనుంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని దివ్యాంగ్ లవానియా, వి.మురళీకృష్ణ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కాగా కిరణ్ అబ్బవరం బర్త్డే సందర్భంగా శుక్రవారం 'మీటర్' మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ను కూడా విడుదల చేశారు. చదవండి: అన్నదమ్ములతో డేటింగ్ చేసిన హీరోయిన్లు.. ఫొటోలు వైరల్ మొన్న ఆర్జీవీ.. ఇప్పుడు సుశాంత్.. యాంకర్పై ఆగ్రహం దిల్ రాజు కొడుకు పేరేంటో తెలుసా ? Rules Ranjan ❤️ Let’s all follow the rules 💫#RulesRanjannFirstlook @iamnehashetty @rathinamkrish @vennelakishore@divyanglavania @muralikvemuri @rinkukukreja #AmreshGanesh #DulipKumar #atulparchure #SriSuryaMovies #StarLightEntertainment pic.twitter.com/jUC8Ugw3IR — Kiran Abbavaram (@Kiran_Abbavaram) July 15, 2022 Nenu eppati nuncho cheyalanukuntuna mass bomma 🔥🔥https://t.co/quULz23tne#Metermovie #Meter pic.twitter.com/lwu10T4u5a — Kiran Abbavaram (@Kiran_Abbavaram) July 15, 2022 -
‘ఘోస్ట్’గా శివరాజ్ కుమార్.. ఫస్ట్లుక్ అదిరింది!
కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ నటిస్తున్న తాజా చిత్రం ‘ఘోస్ట్’. హైయెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ చిత్రం తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో విడుదల కానుంది. ‘బీర్బల్’ ఫేమ్ శ్రీని దర్వకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత సందేశ్ నాగరాజ్ తన సందేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్పై ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. నేడు(జులై 12) శివరాజ్ కుమార్ బర్త్డే. ఈ సందర్భంగా ‘ఘోస్ట్’ ఫస్ట్లుక్ పోస్టర్ని కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ విడుదల చేశారు. గన్ పట్టుకుని తీక్షణంగా చూస్తున్న శివరాజ్ కుమార్ లుక్ అందరిని ఆకట్టుకుంటుంది.సెర్చ్ లైట్, బైకర్స్, కార్స్, గన్స్... వీటితో డిజైన్ చేసిన పోస్టర్ చూస్తే.. ఇది భారీ యాక్షన్ చిత్రమని తెలిసిపోతుంది. ఈ చిత్రానికి టాప్ టెక్నీషియన్స్ పని చేస్తున్నారు. తగరు, సలగ చిత్రాలకు మాటలందించిన మస్తీ, కన్నడ చిత్రాల్లో అత్యుత్తమ థ్రిల్లర్స్ లో ఒకటిగా చెప్పుకునే బీర్బల్ కి సంభాషణలు రాసిన ప్రసన్న వి ఎం 'ఘోస్ట్' కి డైలాగ్స్ రాస్తున్నారు. కేజీయఫ్తో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఆర్ట్ డైరెక్టర్ శివ కుమార్ ఈ సినిమాకి పనిచేస్తున్నారు. పాపులర్ మ్యూజిక్ డైరెక్టర్ అర్జున్ జన్య సంగీతాన్ని అందిస్తున్నారు.ఆగస్ట్ చివరి వారంలో 'ఘోస్ట్' చిత్రీకరణ ప్రారంభం కానుందని చిత్ర యూనిట్ పేర్కొంది. -
Suriya 41: ‘అచలుడు’గా వస్తున్న సూర్య, ఫస్ట్లుక్ రిలీజ్
సూర్య హీరోగా బాల దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. సూర్య 41(Suriya 41) అనే వర్కింగ్ టైటిల్తో ప్రారంభమైన ఈ చిత్రంలో కృతిశెట్టి హీరోయిన్. 2డి ప్రొడక్షన్లో భార్య జ్యోతికతో కలిసి సూర్య స్యయంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ను జరుపుకుంటోంది. ఈ నేపథ్యంలో మూవీ ఫస్ట్లుక్ పోస్టర్, టైటిల్ను డైరెక్టర్ బాల పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ రిలీజ్ చేశారు. సోమవారం(జూలై 11న) డైరెక్టర్ బాల బర్త్డే. ఈ సందర్భంగా మూవీ టైటిల్ను వణంగన్(తెలుగలో అచలుడు)గా ఖరారు చేశారు. ‘అచలుడు’ అంటే.. దేనికి చలించనివాడు అని అర్థం. ఈ ఫస్ట్లుక్ పోస్టర్లో సూర్య చిరిగిన గుడ్డలోంచి గంభీరంగా చూస్తు కనిపించాడు. చదవండి: నా వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకోవడం బాధగా ఉంది: సాయి పల్లవి ఈ సినిమాలో సూర్య మత్స్యకారునిగా కనిపిస్తాడని మూవీ వర్గాలు అంటున్నాయి. కాగా దాదాపు 20 ఏళ్ల తర్వాత సూర్య- డైరెక్టర్ బాలా కలిసి పనిచేయబోతున్నారు. వీరిద్దరూ గతంలో నందా (2001), పితామగన్ (2003) సినిమాల్లో కలిసి పనిచేశారు. 2003లో రిలీజ్ అయిన యాక్షన్-డ్రామా మూవీ పితామగన్లో చియాన్ విక్రమ్ కూడా నటించాడు. ఈ సినిమాలో విక్రమ్ తన అద్భుతమైన నటనకు ఉత్తమ నటుడిగా జాతీయ చలనచిత్ర అవార్డు కూడా గెలుచుకున్నాడు. పితామగన్ మూవీ ఆరు ఫిల్మ్ ఫేర్ అవార్డులను గెలుచుకుంది. అందులో సూర్య ఉత్తమ సహాయ నటుడిగా, బాలకు ఉత్తమ దర్శకుడు, విక్రమ్కు ఉత్తమ నటుడుగా, లైలాకు ఉత్తమ నటి, సంగీతకు ఉత్తమ సహాయ నటిగా పురస్కారం దక్కింది. చదవండి: ఈ దసరాకు బరిలో దిగే చిత్రాలివే.. తలపడనున్న చిరు-నాగ్ -
ముగింపు మన చేతుల్లో ఉండదు.. ఆసక్తిగా సుమంత్ ఫస్ట్ లుక్..
Sumanth First Look Poster From Sita Ramam Movie: మలయాళ యంగ్ హీరో దుల్కర్ సల్మాన్, మృణాళినీ ఠాకూర్ హీరో హీరోయిన్లుగా, రష్మికా మందన్నా, సుమంత్ కీలక పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘సీతారామం’. ఈ చిత్రానికి హను రాఘవపూడి దర్శకత్వం వహించారు. వైజయంతి మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా పతాకంపై అశ్వనీదత్ నిర్మించిన చిత్రం ఇది. ఈ చిత్రంలో లెఫ్టినెంట్ రామ్ పాత్రలో దుల్కర్ సల్మాన్, సీతగా మృణాళినీ ఠాకూర్, అఫ్రిన్ పాత్రలో రష్మికా మందన్నా కనిపించనున్నారు. ఇదివరకు ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, ఫస్ట్ లుక్ పోస్టర్లు ఆకట్టుకున్నాయి. తాజాగా ఇందులో సుమంత్ క్యారెక్టర్ను పరిచయం చేస్తూ ఫస్ట్ లుక్ పోస్టర్ను వీడియో ద్వారా రిలీజ్ చేశారు. ఈ మూవీలో బ్రిగేడియర్ విష్ణు శర్మ పాత్రలో సుమంత్ నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఆర్మీ అధికారిగా కొత్త లుక్లో సుమంత్ అట్రాక్ట్ చేస్తున్నాడు. 'కొన్ని యుద్ధాలు మొదలు పెట్టడం మాత్రమే మన చేతుల్లో ఉంటుంది. ముగింపు కాదు' అని సుమంత్ చెప్పే డైలాగ్ ఎఫెక్టివ్గా ఉంది. ఈ చిత్రం తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో ఆగస్టు 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నారు. Unveiling the first look of yours truly as 𝐁𝐫𝐢𝐠𝐚𝐝𝐢𝐞𝐫 𝐕𝐢𝐬𝐡𝐧𝐮 𝐒𝐡𝐚𝐫𝐦𝐚 from #SitaRamam! 🔗https://t.co/Zu0USKQfq6@dulQuer @mrunal0801 @hanurpudi @iamRashmika @Composer_Vishal @VyjayanthiFilms @SwapnaCinema @SonyMusicSouth #SitaRamamOnAug5 pic.twitter.com/kqXbcfflM9 — Sumanth (@iSumanth) July 9, 2022 -
షార్ట్ ఫిలిమ్కు డైరెక్టర్గా యంగ్ హీరో..
Aditya Om Pavithra Short Film: 'లాహిరి లాహిరి లాహిరిలో' సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసిన ఆదిత్య ఓం.. ఆ తర్వాత పలు తెలుగు, తమిళ, హిందీ సినిమాల్లో నటించి సిల్వర్ స్క్రీన్పై హీరోగా, విలన్గా తన మార్క్ చూపించారు. 2018లో 'మాసాబ్' అనే హిందీ చిత్రానికి దర్శకత్వం వహించి మరో టాలెంట్ బయటపెట్టారు. ఇలా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్న ఆయన ఇప్పుడు 'పవిత్ర' అనే ఓ ప్రయోగాత్మక షార్ట్ ఫిలిమ్తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. థ్రిల్లింగ్ జానర్గా తెరకెక్కిన ఈ షార్ట్ ఫిలింలో జ్యోతి, గాయత్రి గుప్త, ఐశ్వర్య ఇతర ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. మోడర్న్ సినిమా బ్యానర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందనుంది. దీనికి వీరల్, లవన్ సంగీతం అందించగా.. మధుసూదన్ కోట సినిమాటోగ్రాఫర్గా, ప్రకాష్ ఝా ఎడిటర్గా పని చేస్తున్నారు. ఈ షార్ట్ ఫిలిమ్ని యూట్యూబ్తో పాటు ఓటీటీలో విడుదల చేయబోతున్నారు. తాజాగా దీనికి సంబంధించిన ఫస్ట్ లుక్ను రిలీజ్ చేసి ఆసక్తి పెంచారు. ఆదిత్య ఓం చేతిలో మొబైల్ ఫోన్స్, ఆ వెనకాల జ్యోతి, గాయత్రీ గుప్త లుక్స్ ఆసక్తికరంగా ఉన్నాయి. మిస్ అయిన తన భార్య కోసం ఓ బ్లైండ్ డాక్టర్ వెతికే పాయింట్తో ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా ఈ షార్ట్ఫిలిమ్ తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. చదవండి: స్టార్ నటుడి భార్యపై కేసు.. రూ. 31 లక్షలు తిరిగి ఇవ్వట్లేదని ఫిర్యాదు టైటిల్ రోల్ జ్యోతి పోషిస్తుండగా.. గాయత్రి గుప్త మరో స్పెషల్ క్యారెక్టర్ చేస్తోంది. గాయత్రీ రోల్ సినిమాలో కీలకం కానుందట. జాకిర్ హుస్సేన్, ఐశ్వర్య, వెంకట్ ఇతర ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. పెరుగుతున్న టెక్నాలజీలో షార్ట్ ఫిలిమ్స్ కీలక భూమిక పోషిస్తున్నాయని, ఇలాంటి షార్ట్ ఫిలిమ్స్ కెమెరా ముందు సరికొత్త ప్రయోగాలు చేసేందుకు అనువుగా ఉండటమే గాక ఎక్కువ మంది ప్రేక్షకులకు రీచ్ అవుతుంటాయని ఆదిత్య ఓం అన్నారు. అలాంటి కోవలోనే ఈ 'పవిత్ర' మూవీ ఉంటుందని చెప్పారు. చదవండి: విక్రమ్ ఆరోగ్య పరిస్థితిపై హెల్త్ బులిటెన్ విడుదల.. నమ్మట్లేదా ? ఆధార్ కార్డు చూపించనా ?: యంగ్ హీరో -
ప్రతీకారానికి అందమైన రూపం.. ఐశ్వర్య రాయ్ లుక్
Aishwarya Rai Ponniyin Selvan First Look Poster: ప్రముఖ దర్శకుడు మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ చిత్రం 'పొన్నియన్ సెల్వన్: పార్ట్ 1'. మద్రాస్ టాకీస్తో కలిసి లైకా ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్తో నిర్మిస్తున్న ఈ చిత్రంలో విక్రమ్, జయం రవి, కార్తీ, ఐశ్వర్య రాయ్, త్రిష ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. 1955లో కల్కి కృష్ణమూర్తి రచించిన నవల ఆధారంగా ఈ మూవీని తెరకెక్కిస్తున్నాడా మణిరత్నం. భారీ తారాగణంతో రూపొందుతున్న ఈ చిత్రం సెప్టెంబర్ 30న విడుదల చేయనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఇటీవల ఈ సినిమాలోని నటీనటుల ఫస్ట్ లుక్ పోస్టర్లను విడుదల చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన విక్రమ్, కార్తీ పోస్టర్లు సినిమాపై అంచనాలను పెంచేలా ఉన్నాయి. తాజాగా ఐశ్వర్య రాయ్ ఫస్ట్ లుక్ను బుధవారం (జులై 6) రివీల్ చేసింది చిత్రబృందం. 'ప్రతీకారానికి అందమైన రూపం. నందిని.. పళవూరు రాణి' అంటూ సోషల్ మీడియా వేదికగా ఐశ్వర్య రాయ్ క్యారెక్టర్ను ప్రకటించారు. ఇందులో మనోహరమైన రూపంతో పగ, ప్రతీకారం కోసం ఎదురుచూస్తున్న పళవూరు రాణి నందినిగా ఐశ్వర్య రాయ్ పోస్టర్ ఉంది. ఈ పోస్టర్లో ఐశ్వర్య రాయ్ లుక్ అదిరిపోయింది. ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట వైరల్గా మారింది. చదవండి: ప్రపంచంలోనే ఖరీదైన వజ్రం తమన్నా సొంతం.. కోట్లలో ఆస్తులు.. ఏ దేశపు మహారాణి.. గొడుగు కొనుక్కోడానికి డబ్బులు లేవా ? Vengeance has a beautiful face! Meet Nandini, the Queen of Pazhuvoor! #PS1 releasing in theatres on 30th September in Tamil, Hindi, Telugu, Malayalam and Kannada. 🗡@madrastalkies_ #ManiRatnam @arrahman pic.twitter.com/HUD6c2DHiv — Lyca Productions (@LycaProductions) July 6, 2022 -
ఇంటెన్స్ యాక్షన్ డ్రామాగా సత్యదేవ్ కొత్త చిత్రం..
Satya Dev Krishnamma First Look Release On His Birthday: వైవిధ్యమైన పాత్రలు, సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సత్యదేవ్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘కృష్ణమ్మ’. వీవీ గోపాల కృష్ణ దర్శకత్వం వహించారు. దర్శకుడు కొరటాల శివ సమర్పణలో అరుణాచల క్రియేషన్స్ పతాకంపై కృష్ణ కొమ్మలపాటి నిర్మించారు. కాగా సోమవారం (జూలై 4) సత్యదేవ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఫస్ట్ లుక్ని రిలీజ్ చేసింది చిత్రయూనిట్. దర్శక-నిర్మాతలు మాట్లాడుతూ.. ‘‘ఇంటెన్స్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన చిత్రమిది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. సెప్టెంబర్లో సినిమాని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అని తెలిపారు. సత్యదేవ్తోపాటు లక్ష్మణ్, కృష్ణ, అథిరా రాజ్, అర్చన, నంద గోపాల్, రఘు కుంచె నటించిన ఈ చిత్రానికి కాళ భైరవ సంగీతం అందిస్తున్నారు. చదవండి: హీరో విశాల్కు మరోసారి గాయాలు.. షూటింగ్ నిలిపివేత.. కమల్ హాసన్కు ప్రభుత్వం నోటీసులు ! కారణం ? బాధాకరమైన పెళ్లిళ్లకు మీరే కారణం.. సమంత కామెంట్స్ వైరల్ #Krishnamma is my next with director VV Gopalakrishna under the production of @ArunachalaCOffl. Super happy and blessed that blockbuster director #KoratalaSiva Garu is presenting it. pic.twitter.com/QbOLnzbHFU — Satya Dev (@ActorSatyaDev) July 3, 2022 -
Vadu Evadu: సస్పెన్స్.. థ్రిల్
‘‘వాడు ఎవడు’ టీజర్ చాలా బాగుంది. వాస్తవ ఘటనలతో నిర్మించిన ఈ చిత్రం ఘనవిజయం సాధించాలి. నటీనటులకు, సాంకేతిక నిపుణులకు మంచి పేరు రావాలి’’ అని తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. కార్తికేయ, అఖిలా నాయర్ జంటగా నటించిన చిత్రం ‘వాడు ఎవడు’. మాధురి, పూజిత సమర్పణలో రాజేశ్వరి సినీ క్రియేషన్స్పై ఎన్. శ్రీనివాసరావు స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్ని తలసాని శ్రీనివాస్ యాదవ్ విడుదల చేశారు. ఎన్. శ్రీనివాసరావు మాట్లాడుతూ– ‘‘సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రమిది. మంచి సందేశం ఇస్తున్నాం. మా సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది’’ అన్నారు. ‘‘వైజాగ్లో జరిగిన కొన్ని వాస్తవ ఘటనల ఆధారంగా తీసిన సినిమా ఇది’’ అని ఈ చిత్రానికి కథ, మాటలు, స్క్రీన్ప్లే అందించిన రాజేశ్వరి పాణిగ్రహి అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: విజయ్ గండ్రకోటి, సంగీతం: ప్రమోద్ కుమార్, నేపథ్య సంగీతం: రాజేష్. -
‘మై డియర్ భూతం’ అంటున్న ప్రభుదేవా
‘మై డియర్ భూతం’ అంటున్నారు ప్రభుదేవా. ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం టైటిల్ ఇది. ఎన్. రాఘవన్ దర్శకత్వంలో రమేష్ పి. పిళ్లయ్ నిర్మించిన ఈ తమిళ చిత్రాన్ని తెలుగులో శ్రీలక్ష్మి జ్యోతి క్రియేషన్స్ అధినేత ఏఎన్ బాలాజీ విడుదల చేస్తున్నారు. శనివారం ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ను రిలీజ్ చేశారు. ‘‘ఈ ఫ్యాంటసీ సినిమాలో ప్రభుదేవా జీనీ పాత్ర చేశారు. ఈ పాత్ర కోసం ఆయన ప్రత్యేకంగా మేకోవర్ అయ్యారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్వరలో విడుదల తేదీనీ ప్రకటిస్తాం’’ అని చిత్రబృందం పేర్కొంది. రమ్యా నంబీశన్ కీలక పాత్ర చేసిన ఈ చిత్రానికి సంగీతం: డి. ఇమాన్, కెమెరా: యూకే సెంథిల్ కుమార్. -
గోదావరి నేపథ్యంలో లవ్ అండ్ యాక్షన్ డ్రామాగా 'శశివదనే'
యంగ్ హీరో రక్షిత్ అట్లూరి హీరోగా నటిస్తున్న తాజా చిత్రం‘శశివదనే’.గౌరీ నాయుడు సమర్పణలో ఎస్వీఎస్ కన్స్ట్రక్షన్స్ ప్రై.లి. భాగస్వామ్యంతో ఏజీ ఫిల్మ్ కంపెనీ పతాకంపై అహితేజ బెల్లంకొండ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సాయి మోహన్ ఉబ్బన దర్శకత్వం వహిస్తున్నారు. .ఈ రోజు చిత్ర హీరో రక్షిత్ అట్లూరి బర్త్ డే ను పురస్కరించుకొని చిత్ర యూనిట్ హీరో ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేసింది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత అహితేజ బెల్లంకొండ మాట్లాడుతూ..గోదావరి నేపథ్యంలో తీస్తున్న లవ్ అండ్ యాక్షన్ డ్రామా ఈ ‘శశివదనే’ చిత్రంలో లవ్ సీన్స్ చాలా కొత్తగా ఉంటాయి. దర్శకుడు సాయి మోహన్ ఉబ్బన ఈ సినిమాను చాలా గ్రాండియర్గా, హై స్టాండర్డ్స్లో తెరకెక్కిస్తున్నారు. అలాగే ఈ చిత్రానికి మ్యూజిక్, విజువల్స్ హైలైట్ గా నిలుస్తాయి. ప్రస్తుతం ఫైనల్ షెడ్యూల్ జరుపుకుంటున్న ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని దసరాకు ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడానికి ప్రయత్నం చేస్తున్నాం’ అన్నారు రఘు కుంచె, వ్రీమాన్, కోమలి ప్రసాద్, రంగస్థలం మహేశ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి శరవణ వాసుదేవన్ సంగీతం అందిస్తున్నారు. -
ఒక్క ఏడాదిలో ఏకంగా 20 సినిమాలు ఒప్పుకున్న స్టార్ హీరో !
Prithviraj Sukumaran Nayanthara Gold First Look Poster Released: మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ గురించి ఎంత చెప్పిన తక్కువే. నటుడిగా, నిర్మాతగా, డైరెక్టర్గా విభిన్నమైన కథలతో అభిమానులను, సినీ ప్రేక్షకులను అలరిస్తుంటాడు. చేసే ప్రతి సినిమాలో ఎంతో కొంత వైవిధ్యం తప్పకుండా ఉంటుంది. అయ్యప్పనుమ్ కోషీయమ్, బ్రో డాడీ, జన గణ మన సినిమాలతో ఆకట్టుకున్నాడు. ఇప్పుడు ఏకంగా ఒక్క ఏడాదిలోనే 20 సినిమాలు ఒప్పుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. అందులో వెబ్ సిరీస్లు, సినిమాలు ఉండగా ఒక్కొక్కటి ఒక్కో ఫార్మాట్లో ఉండనుందని సమాచారం. ఇందులో భాగంగానే తాజాగా తన కొత్త చిత్రం 'గోల్డ్' ఫస్ట్ లుక్ పోస్టర్ను విడుదల చేశాడు పృథ్వీరాజ్ సుకుమారన్. ఈ సినిమాలో హీరోయిన్గా లేడీ సూపర్ స్టార్ నయనతార నటిస్తోంది. ఈ పోస్టర్లో చుట్టూ మనుషులతో మధ్యలో నయనతార అయోమయంగా చూస్తుంటే పృథ్వీరాజ్ సుకుమారన్ నవ్వుతూ ఫోన్ మాట్లాడుతూ కనిపిస్తున్నాడు. ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట వైరల్ అవుతోంది. చదవండి: పెళ్లి కాకుండానే బిడ్డకు జన్మనిచ్చిన హీరోయిన్.. ఇప్పుడు మరో నటుడితో ప్రేమాయణం #GOLD An #AlphonsPuthran Film! 😊❤️ @puthrenalphonse @PrithvirajProd @magicframes2011 pic.twitter.com/6fROJlPkQD — Prithviraj Sukumaran (@PrithviOfficial) June 6, 2022 ఈ మూవీని పృథ్వీరాజ్ ప్రొడక్షన్స్, మ్యూజిక్ ఫ్రేమ్స్ బ్యానర్లపై సుప్రియా మీనన్, లిజిన్ స్టీఫెన్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు 'ప్రేమమ్' మూవీ ఫేమ్ అల్ఫోన్స్ పుత్రెన్ దర్శకత్వం వహిస్తున్నారు. సుమారు ఏడేళ్ల తర్వాత అల్ఫోన్స్ డైరెక్టర్గా తన మార్క్ చూపించనున్నారు. ఈ సినిమాను ఆగస్టు 19న విడుదల చేయనున్నారు. చదవండి: భూమిక ఇంగ్లీషులో భయంకరంగా తిట్టింది: నిర్మాత ఎంఎస్ రాజు -
సందీప్ కిషన్ 'మైఖేల్' ఫస్ట్లుక్ చూశారా?
టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ నటిస్తున్న తాజా చిత్రం మైఖేల్. రంజిత్ జేయకొడి దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని శ్రీ వేంకటేశ్వర సినిమాస్ మరియు కరణ్ సి ప్రొడక్షన్స్ పతాకాలపై సంయుక్తంగా నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కతున్న ఈ సినిమాలో విజయ్ సేతపతి, గౌతమ్ మీనన్లు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. తాజాగా శనివారం(మే7)న సందీప్ కిషన్ బర్త్డే సందర్భంగా ఈ సినిమా ఫస్ట్లుక్ పోస్టర్ను విడుదల చేశారు. ఇందులో సిక్స్ప్యాక్ బాడీతో చేతిలో గన్ పట్టుకొని పవర్ఫుల్గా కనిస్తున్నాడు.తమిళం, తెలుగు, మలయాళం, కన్నడం, హిందీ తదితర భాషల్లో ఈ సినిమా రిలీజ్ కానుంది. సందీప్ సరసన దివ్యాంశ కౌశిక్ హీరోయిన్గా నటిస్తుంది. వరలక్ష్మి శరత్కుమార్, వరుణ్ సందేశ్లు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. Happy to share the Fiery 1st Look of my Dear most director @jeranjit ‘s #Michael 👊🏽@Dir_Lokesh presents 🌟#HBDSundeepKishan ❤️@sundeepkishan @menongautham @varusarath5 @itsdivyanshak @SVCLLP @KaranCoffl @SamCSmusic @adityamusic @sivacherry9 @proyuvraaj pic.twitter.com/N6qZc498Jz — VijaySethupathi (@VijaySethuOffl) May 7, 2022 -
మిర్చి శివ హీరోగా మూవీ.. ఆసక్తిగా లుంగీ కట్టిన హల్క్ పోస్టర్
చెన్నై సినిమా: మిర్చి శివ హీరో గా నటిస్తున్న తాజా చిత్రం 'సింగిల్ శంకరుమ్.. స్మార్ట్ ఫోన్ సిమ్రానుమ్'. నటి మేఘా ఆకాష్, అంజు కురియన్ కథానాయికలుగా, గాయకు డు మనో ముఖ్య పాత్రను పోషిస్తున్నారు. పి.ఎస్.విఘ్నేష్ షా దర్శకుడిగా పరిచయమవు తున్న ఈ చిత్రాన్ని లార్క్ స్టూడియోస్ పతాకంపై కె.కుమార్ నిర్మిస్తున్నారు. ఆర్థర్ ఎ.విల్సన్ చాయాగ్రహణం, లియోస్ జేమ్స్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది. ఈచిత్రం చిత్ర ఫస్ట్లుక్ పోస్టర్ను గురువా రం విడుదల చేసినట్లు దర్శకుడు చెప్పారు. ఈ ఫస్ట్లుక్ పోస్టర్లో శివ మోకాళ్లపై వంగి ఉండటం, అతన్ని పట్టుకుని హాలీవుడ్ సూపర్ హీరోస్ హల్క్, ఐరన్ మ్యాన్లు ఉండటం మనం చూడొచ్చు. ఇందులో హల్క్ లుంగీ ధరించి ఉండటమే కాకుండా చెంపై పుట్టుమచ్చ, నుదిటిపై విబూదితో చాలా ఆసక్తిగా ఉంది. ఇక ఐరన్ మ్యాన్ క్యారెక్టర్ వండర్ వుమెన్ వంటి కేప్ ధరించి, అతని వెనుక కత్తి ఉండటాన్ని మనం గమనించవచ్చు. చదవండి: సల్మాన్కు నటి ముద్దులు, హగ్గులు.. మందు కొట్టావా? అంటూ ట్రోలింగ్ Feeling extremely happy to release the first look of #singleshankarumsmartphonesimranum 😍 @actorshiva @akash_megha @AnjuKurian10 @vignesh_sha @larkstudios_chn @makapa_anand @kumarkarupannan @leon_james @ArthurWisonA @Gdurairaj10 @editorBoopathi @dineshashok_13 @proyuvraaj pic.twitter.com/CgaOmgMBrX — vignesh sha (@vignesh_sha) May 4, 2022 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4331451957.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
ఫస్ట్లుక్ పోస్టర్ కోసం ఏడాదిన్నర సమయం పట్టిందట!
తమిళసినిమా: కెప్టెన్ చిత్ర ఫస్ట్లుక్ పోస్టర్ను సోమవారం చిత్ర వర్గాలు విడుదల చేశారు. ఆర్య కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ఇది. టెడీ వంటి విజయవంతమైన చిత్రం తరువాత ఆర్య దర్శకుడు శక్తి సౌందర్ రాజన్ల కాంబినేషన్లో రూపొందుతోంది. దీంతో చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. థింక్ స్టూడియోస్, ది షో పీపుల్ సంస్థలు కలిసి నిర్మిస్తున్న ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ ఇప్పుడు ట్రెండీగా మారింది. విశేషం ఏమిటంటే ఈ ఫస్ట్లుక్ పోస్టర్ కోసం చిత్ర యూనిట్ ఏడాదిన్నరగా శ్రమించారట. కారణం ప్రేక్షకులకు ఇంతకు ముందెప్పుడూ చూడనటువంటి వినూత్న అనుభూతిని కల్పించాలన్నదే అని దర్శకుడు తెలిపారు. చిత్రం ఒక థ్రిల్లర్ పయనంగా ఉంటుందన్నారు. చిత్రం కోసం ఆర్య చూపించిన అంకితభావం, శ్రమ మాటల్లో చెప్పలేదని నిర్మాతలు పేర్కొన్నారు. షూటింగ్ పూర్తి చేసుకుని నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రంలో నటి సిమ్రాన్, ఐశ్వర్య లక్ష్మి, హరీష్ ఉత్తమన్, కావ్యశెట్టి తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. యువ ఛాయాగ్రహణం, డి.ఇమాన్ సంగీతాన్ని అందిస్తున్నారు. చదవండి: Palasa 1978 Movie: 'పలాస'కు అరుదైన గౌరవం.. ఆ ఫెస్టివల్కు ఎంపిక -
యూత్ ని ఆకట్టుకునేలా ఉదయ్ శంకర్ కొత్త సినిమా ఫస్ట్ లుక్!
Uday Shankar New Movie First Look Poster: వైవిధ్యమైన కథల్లో నటిస్తూ ప్రత్యేక గుర్తింపు సంసాదించుకున్నాడు యంగ్ హీరో ఉదయ్ శంకర్ . ఇప్పుడు ఆయన హీరోగా గురు పపవన్ దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్నాడు. శ్రీరామ్ ఆర్ట్స్ బ్యానర్ పై అట్లూరి నారాయణ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ వైజాగ్లో శరవేగంగా జరుగుతుంది. కాగా, మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని మంగళవారం ఈ చిత్రం నుంచి ఫస్ట్లుక్ని విడుదల చేశారు మేకర్స్. ఈ పోస్టర్లో ఉదయ్ శంకర్ యూత్ని ఆకట్టుకునేలా చాలా స్టైలీష్గా కనిపిస్తున్నాడు. మధునందన్ , హీరోయిన్ జన్నీ ఫర్ లుక్స్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. కమర్షియల్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మధునందన్, పృధ్వీరాజ్ , శ్రీకాంత్ అయ్యాంగార్ కీలక పాత్రల పోషిస్తున్నారు. యూత్ ని ఆకట్టుకునే కథా, కథనాలతో సాగే ఈ మూవీ ఒక కొత్త ఎక్స్ పీరియన్స్ ని ప్రేక్షకులకు అందించబోతుందని చిత్ర యూనిట్ పేర్కొంది. -
1134 ఫస్ట్ లుక్ పోస్టర్ చూశారా?
ప్రేక్షకుల అభిరుచికి తగిన కంటెంట్తో వచ్చే సినిమాలు గొప్ప విజయం సాధిస్తున్నాయి. స్టార్ నటీనటులు నటించకపోయినా కథలో బలం ఉండాలే గానీ ఆ సినిమాకు నీరాజనం పలుకుతున్నారు ఆడియన్స్. కొత్త దర్శకనిర్మాతలు సైతం అలాంటి కథలతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. ఈ క్రమంలోనే 1134 అనే డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం కాబోతున్నారు డైరెక్టర్ శరత్ చంద్ర తడిమేటి. రాబరీ థ్రిల్లర్గా మునుపెన్నడూ చూడని వైవిద్యభరితమైన కథాంశాన్ని ఈ 1134 రూపంలో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు శరత్ చంద్ర. తనే కథ రాసుకొని హై టెక్నికల్ వాల్యూస్తో అన్ని వర్గాల ఆడియన్స్ అట్రాక్ట్ అయ్యేలా ఈ సినిమాను తెరకెక్కించారు. ప్రతి సన్నివేశం కూడా ఎంతో థ్రిల్ చేసేలా షూట్ చేశారు. తాజాగా ఈ చిత్ర ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. 1134 అనే డిఫరెంట్ టైటిల్కి తగ్గట్టుగా డిజైన్ చేసిన ఈ పోస్టర్ సినిమాపై ఆసక్తి పెంచేస్తోంది. నడిరోడ్డుపై డబ్బుల బ్యాగ్, ఆ వెనుక ముగ్గురు వ్యక్తుల షాడోతో కూడిన ఈ పోస్టర్ చూస్తుంటే సినిమాలో థ్రిల్లింగ్ అంశాలు బోలెడన్ని ఉంటాయని స్పష్టమవుతోంది. రాంధుని క్రియేషన్స్ బ్యానర్పై తెరకెక్కుతున్న ఈ 1134 చిత్రానికి శరత్ చంద్ర తడిమేటి దర్శకత్వం వహిస్తున్నారు. గంగాధర్ రెడ్డి, ఫణి శర్మ, మదుపు ఫణి భార్గవ్, కృష్ణ మదుపు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. శివతేజ్ బైపల్లి, శరత్ కూతాడి సంగీతం అందిస్తున్నారు. నజీబ్ షేక్, జితేందర్ తలకంటి సినిమాటోగ్రఫీ బాధ్యతలు చేపట్టారు. -
"వీకెండ్ పార్టీ" ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్
బి.జె క్రియేషన్స్, ఫోర్త్ ఆల్ థియేటర్ సంస్థలు సంయుక్తంగా బోయ చేతన్ బాబు నిర్మాణ సారథ్యంలో అమరేందర్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న చిత్రం "వీకెండ్ పార్టీ". పాశం నరసింహారెడ్డి, పాశం కిరణ్ రెడ్డి, ఎన్ రేఖ సహనిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. 1990వ దశకంలో జరిగినటువంటి ఒక యదార్థ సంఘటన ఆధారంగా చేసుకుని అమరుడు బోయ జంగయ్య రాసిన "అడ్డదారులు" రచనను తీసుకుని 'వీకెండ్ పార్టీ" తెరకెక్కించారు. సదా చంద్ర సంగీతం సమకూర్చిన ఈ సినిమా కు చంద్ర బోస్, కాసర్ల శ్యామ్, సదా చంద్రలు సాహిత్యం సమకూర్చారు. అద్దంకి రాము సినిమాటోగ్రఫీ అందించగా సుచిత్రా చంద్రబోస్ కొరియోగ్రాఫర్గా చేశారు. వేముల వెంకట్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించారు. నలుగురు అమ్మాయిలు చిన్నప్పటి నుంచి ఉన్న స్నేహంతో ఒక వీకెండ్ సాగర్కు వెళ్లగా అక్కడ ఏ విధమైన పరిస్థితులను ఎదుర్కొన్నారనేది సినిమా కథ. ప్రముఖ నిర్మాత, దర్శకుడు రాజ్ కందుకూరి వీకెండ్ పార్టీ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్మాత, దర్శకుడు రాజ్ కందుకూరి మాట్లాడుతూ.. వీకెండ్ పార్టీ కథ అద్భుతంగా ఉంది. దర్శకుడు మంచి కథను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. తప్పకుండా ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పిస్తుంది. ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేసినందుకు ఎంతో గొప్పగా ఉంది. అన్నారు. దర్శకుడు డైరెక్టర్ అమరేందర్ మాట్లాడుతూ.. ఈ సినిమాపై, నాపై నమ్మకం పెట్టుకుని తెరకెక్కించిన నిర్మాతకు ధన్యవాదాలు. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేయడానికి వచ్చిన నిర్మాత రాజ్ కందుకూరి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ సినిమాలో మంచి నటీనటులు నటించారు. తప్పకుండా అందరిని మెప్పిస్తుంది. త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తాం.. అన్నారు. -
Naga Shaurya:బర్త్డే గిఫ్ట్ అదిరిందిగా
సాక్షి, హైదరాబాద్: యంగ్ హీరో నాగశౌర్య పుట్టినరోజు కానుకగా తనకొత్త సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసింది చిత్రబృందం. వరుస ఆఫర్లు దక్కించుకుంటూ. నటుడుగా తన ప్రత్యేకతను చాటుకుంటున్న నాగ శౌర్య ప్రస్తుతం నాలుగు మూవీలతో బిజీబిజీగా ఉన్నాడు. 'కృష్ణ వ్రింద విహారి' సరికొత్త మూవీలో వెరైటీ లుక్తో ప్రేక్షకులను అలరించనున్నాడు. తాజాగా విడుదల చేసిన ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ లో శౌర్య ట్రెడిషనల్ లుక్లో అదరగొడుతున్నాడు. కృష్ణ వృంద ప్రేమ కథగా ఈ మూవీతెరకెక్కనుంది.(Naga Shaurya: టాలెంటెడ్ హీరో కెరియర్ అండ్ గ్రోత్ ఎలా ఉందంటే!) అనీష్ ఆర్ కృష్ణ దర్శకత్వంలో వస్తున్న మూవీలో షిర్లీ సేతియా హీరోయిన్గా నటిస్తున్నారు. అలాగే ఈ మూవీలో సినియర్ నటి రాధిక ఒక ప్రత్యేక పాత్రలో అలరించనున్నారు. వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ, సత్య, బ్రహ్మాజీ ఇతర కీలక పాత్రల్లో నటించనున్నారు. కాగా నాగశౌర్య తన లేటెస్ట్ ‘లక్ష్య, వరుడు కావలెను’ మూవీలను ఓటీటీలో విడుదల చేసిన సంగతి తెలిసిందే. It's a Crazy experience & #Krishna will be Loved by all! ❤️ Here's the First Look Poster of #NS22 #IRA4 😍 ✨ #𝐊𝐫𝐢𝐬𝐡𝐧𝐚𝐕𝐫𝐢𝐧𝐝𝐚𝐕𝐢𝐡𝐚𝐫𝐢 ✨@ShirleySetia #AneeshKrishna #SaiSriram @realradikaa @mahathi_sagar @YEMYENES @ira_creations @UrsVamsiShekar pic.twitter.com/VHbemaEPFv — Naga Shaurya (@IamNagashaurya) January 22, 2022 -
సముద్రఖని ఇన్ పబ్లిక్ ఫస్ట్ లుక్ చూశారా?
దర్శకుడు, నటుడు సముద్రఖని ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం 'సముద్రఖనియిన్ పబ్లిక్'. నటుడు కాళి వెంకట్, నటి రిత్విక తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా ఆర్.పరమన్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. కేకేఆర్ సినిమాస్ పతాకంపై కేకే రమేష్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి డి.ఇమాన్ సంగీతాన్ని, రాజేష్ యాదవ్, వెట్రిల ద్వయం ఛాయాగ్రహణను అందిస్తున్నారు. చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ను శనివారం విజయ్సేతుపతి, దర్శకుడు వెంకట్ ప్రభు ఆన్లైన్ ద్వారా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దర్శకుడు పేర్కొంటూ ఇంతకుముందు రాజకీయ నేపథ్యంలో చాలా చిత్రాలు వచ్చాయన్నారు. కానీ తమిళ సినీ చరిత్రలోనే తొలిసారిగా రాజకీయ పార్టీల కార్యకర్తల ఇతివృత్తంతో తెరకెక్కిస్తున్న చిత్రం ఇదని తెలిపారు. చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్కు పరిశ్రమ వర్గాల నుంచి మంచి స్పందన రావడం సంతోషంగా ఉందని అన్నారు. -
సినిమా ఏంటో పోస్టరే చెబుతోంది: వీవీ వినాయక్
‘‘పంచనామ’ ఫస్ట్ లుక్ పోస్టర్ చూడగానే ఒక పాజిటివ్ వైబ్రేషన్ కలుగుతోంది. ఈ సినిమాని ఎంత కసిగా చేశారో పోస్టరే చెబుతోంది. ఈ మూవీ మంచి విజయం సాధించాలి’’ అని డైరెక్టర్ వీవీ వినాయక్ అన్నారు. త్రిపుర నిమ్మగడ్డ, వెంప కాశీ లీడ్ రోల్స్లో సిగటాపు రమేష్ నాయుడు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘పంచనామ’. గద్దె శివకృష్ణ, వెలగ రాము నిర్మించారు. వెంప కాశీ పుట్టినరోజు సందర్భంగా ‘పంచనామ’ ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్ను వీవీ వినాయక్ విడుదల చేశారు. ‘‘మా సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటోంది’’ అన్నారు సిగటాపు రమేష్ నాయుడు. వెంప కాశీ, వినాయక్ -
పుష్ప నుంచి దాక్షాయని ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్
-
శరణ్ కుమార్ హీరో లుక్ పోస్టర్ విడుదల చేసిన సూపర్ స్టార్
సూపర్స్టార్ కృష్ణ, విజయనిర్మల ఫ్యామిలీ నుంచి శరణ్ కుమార్ను హీరోగా పరిచయం చేస్తూ ఓ మూవీ వస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీలో శరణ్ హీరోగా ఫస్ట్లుక్ పోస్టర్ను సూపర్స్టార్ కృష్ణ విడుదల చేశారు. శివ కేశన కుర్తి దర్శకత్వంలో శ్రీ వెన్నెల క్రియేషన్స్ బ్యానర్పై ప్రొడక్షన్ నెం.3గా ఎం.సుధాకర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మహేశ్ పుట్టినరోజు(ఆగస్ట్9) సందర్భంగా ఈ సినిమాలో హీరో లుక్ను సూపర్స్టార్ కృష్ణ రిలీజ్ చేశారు. హీరో తలకి చిన్నగాయమైనట్లు బ్యాండేజ్ వేసుకుని నిలడి ఉంటే పోస్టర్లో జనాలు, రెండు వాహనాలు వెళ్లడం .. ఇవన్నీ సినిమాపై ఆసక్తిని కలిగిస్తున్నాయి. ఈ సందర్భంగా సూపర్స్టార్ కృష్ణ మాట్లాడుతూ.. ‘శరణ్ హీరోగా చేస్తోన్న సినిమా హీరో లుక్ పోస్టర్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఇది తనకు హీరోగా పర్ఫెక్ట్ ల్యాండింగ్ అవుతుంది. శరణ్ యాక్టర్గా చాలా మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను’ అన్నారు. నిర్మాత ఎం.సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ.. ‘శరణ్కుమార్ హీరోగా చేస్తున్న ఈ సినిమా హీరో లుక్ పోస్టర్ను మహేశ్ పుట్టినరోజు సందర్భంగా సూపర్ స్టార్ కృష్ణగారు విడుదల చేయడం ఆనందంగా ఉంది. సూపర్స్టార్ ఫ్యామిలీ నుండి హీరోగా ఎంట్రీ ఇస్తోన్న శరణ్కు ఈ సినిమా కచ్చితంగా మంచి బ్రేక్ ఇస్తుంది. అలాగే నరేశ్, జయసుధగారు, సుధీర్బాబు మా టీంను ప్రత్యేకంగా అభినందించడం హ్యపీగా ఉంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి మరిన్ని విషయాలను తెలియజేస్తాం’ అని ఆయన అన్నారు. -
నా కెరీర్లో ఈ చిత్రం సూపర్ స్పెషల్.. గుర్తుండిపోతుంది: జాక్వలైన్ ఫెర్నాండెజ్
‘‘విక్రాంత్ రోణ’ సినిమాలో భాగమైన ప్రతి క్షణం చాలా ఎగ్జయిట్మెంట్ వేసింది. నా కెరీర్లో ఈ చిత్రం సూపర్ స్పెషల్.. గుర్తుండిపోయే చిత్రమవుతుంది’’ అని హీరోయిన్ జాక్వలైన్ ఫెర్నాండెజ్ అన్నారు. ‘ఈగ’ ఫేమ్ కిచ్చా సుదీప్ హీరోగా నటిస్తోన్న చిత్రం ‘విక్రాంత్ రోణ’. అనూప్ భండారీ దర్శకత్వంలో జాక్ మంజునాథ్– షాలిని మంజునాథ్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో కీలకపాత్రలో నటిస్తున్న జాక్వలైన్ పాత్ర ఫస్ట్ లుక్ను విడుదల చేశారు. రాక్వెల్ డీ కోస్టా అలియాస్ గదంగ్ రాక్కమ్మగా ఆమె నటిస్తున్నారు. ముంబై బిల్బోర్డ్స్ సహా ఇతర నగరాల్లో ఈ ఫస్ట్లుక్ను ప్రదర్శించనున్నారు. ‘‘రాబోయే తరాలు గుర్తు పెట్టుకునేలా ఓ సినీ అద్భుతాన్ని సృష్టించే దారిలో ప్రయాణిస్తున్నాం’’ అన్నారు జాక్ మంజునాథ్. ‘‘మా సినిమా ప్రతి అనౌన్స్మెంట్లో ఓ సర్ప్రైజ్ను పరిచయం చేస్తుండటం అద్భుతంగా అనిపిస్తోంది’’ అన్నారు అనూప్ భండారి. ఈ చిత్రానికి సహ నిర్మాత: అలంకార్ పాండియన్, సంగీతం: బి.అజనీశ్ లోక్నాథ్, కెమెరా: విలియమ్ డేవిడ్. -
పవర్ఫుల్ లాయర్గా సూర్య
సూర్య హీరోగా నటిస్తున్న 39వ చిత్రానికి ‘జై భీమ్’ అనే టైటిల్ని ప్రకటించారు. శుక్రవారం ఆయన పుట్టినరోజు సందర్భంగా టైటిల్, ఫస్ట్ లుక్ని రిలీజ్ చేశారు. జె. జ్ఞానవేల్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని 2డి ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై సూర్యా శివకుమార్ నిర్మిస్తున్నారు. పోస్టర్లో సూర్య లాయర్గా కనిపిస్తున్నారు. భూముల కోసం పోరాడే పేదలకు అండగా నిలబడే పవర్ఫుల్ లాయర్గా ఆయన కనిపించనున్నారు. రజీషా విజయన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో ప్రకాశ్ రాజ్, రావు రమేష్, మణికందన్, జయప్రకాశ్ తదితరులు కీలకపాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సహనిర్మాత: రాజశేఖర్ కర్పూర సుందర పాండియన్. -
సుహాస్ ‘ఫ్యామిలీ డ్రామా’ ఫస్ట్లుక్ విడుదల
‘కలర్ ఫోటో’ఫేమ్ సుహాస్ హీరోగా నటిస్తున్న తాజాగా చిత్రం ‘ఫ్యామిలీ డ్రామా’.మ్యాంగో మాస్ మీడియా సమర్పణలో ఛష్మా ఫిలింస్, నూతన భారతి ఫిల్మ్స్ ఎల్ ఎల్ పి బ్యానర్లతో కలిసి తేజా కాసరపు నిర్మిస్తున్న ఈ చిత్రానికి మెహెర్ తేజ్ దర్శకత్వం వహిస్తున్నాడు. క్రైమ్ థ్రిల్లర్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ మంగళవారం విడుదలైంది. ఫ్యామిలీ డ్రామా’ అనే టైటిల్ కి భిన్నంగా ఈ పోస్టర్ ఉండటంతో అన్ని వర్గాల ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచడంతో పాటు, సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. -
రోహిత్ ‘కళాకార్’కు హీరో శ్రీకాంత్ సాయం
`6 టీన్స్, జానకి వెడ్స్ శ్రీరామ్, నేను సీతామాలక్ష్మి, శంకర్దాదా ఎంబీబీఎస్, నవ వసంతం`వంటి సినిమాలతో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు హీరో రోహిత్. ప్రస్తుతం ఆయన హీరోగా శ్రీను బందెల దర్శకత్వంలో రూపొందుతోన్న యాక్షన్ ఎంటర్టైనర్ `కళాకార్`. ఏజీ అండ్ ఏజీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నిర్మాత వెంకటరెడ్డి జాజాపురం నిర్మిస్తున్న ఈ చిత్రంలో షాయాజీ షిండే, పృథ్విరాజ్, రాజీవ్ కనకాల, శివశంకర్, రవికాలే, గగన్, కరాటే కళ్యాణి, జయలలిత, అశోక్కుమార్ వంటి ప్రముఖ నటులు కీలకపాత్రల్లో నటించారు. ఈ మూవీ ఫస్ట్లుక్ పోస్టర్ ను హీరో శ్రీకాంత్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ ‘ఫస్ట్ కళాకార్ టైటిల్ బాగుంది. అలాగే పోలీస్ ఇన్స్పెక్టర్గా రోహిత్ లుక్ కూడా చాలా బాగుంది. ఫస్ట్ టైమ్ రోహిత్ను పోలీస్ ఆఫీసర్ గెటప్లో చూస్తున్నాను. చాలా ఫిట్గా కనిపిస్తున్నారు. వెంకటరెడ్డిగారు నిర్మాతగా శ్రీను బందెల డైరెక్షన్లో రూపొందిన ఈ సినిమా డెఫినెట్గా సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. రోహిత్ నేను కలిసి ఎప్పటినుండో ఇండస్ట్రీలో ట్రావెల్ చేస్తున్నాము. ఆయన మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేయడం చాలా సంతోషంగా ఉంది. ఆల్ ది బెస్ట్ టు రోహిత్ అండ్ టీమ్`` అన్నారు. హీరో రోహిత్ మాట్లాడుతూ..‘కళాకార్ మూవీ ఫస్ట్లుక్ పోస్టర్ హీరో శ్రీకాంత్ గారు రిలీజ్ చేయడం చాలా సంతోషంగా ఉంది. ఆయనతో ఎప్పటినుంచో నాకు మంచి అనుభందం ఉంది. నేను ఫస్ట్ టైమ్ యాక్షన్ అండ్ సస్పెన్స్ సబ్జెక్ట్తో చేస్తోన్న చిత్రమిది. పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్. సినిమా చాలా బాగా వచ్చింది. తప్పకుండా మీ అందరికి నచ్చుతుంది’అన్నారు. చిత్ర నిర్మాత వెంకటరెడ్డి జాజాపురం మాట్లాడుతూ..‘మా 'కళాకార్`ఫస్ట్లుక్ పోస్టర్ను విడుదలచేసిన హీరో శ్రీకాంత్గారికి ధన్యవాదాలు. హీరో రోహిత్కు పర్ఫెక్ట్ రీ ఏంట్రీ సబ్జెక్ట్ ఇది. మంచి కథ-కథనం, భారీ తారాగణంతో శ్రీను ఈ మూవీని తెరకెక్కించారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ ముగింపు దశలో ఉన్నాయి. త్వరలో విడుదలతేదిని ప్రకటిస్తాం’అన్నారు. దర్శకుడు శ్రీను బందెల మాట్లాడుతూ..‘ఈ మూవీతో రోహిత్ ఒక డిఫరెంట్ లుక్లో కనిపిస్తారు. మా నిర్మాత వెంకటరెడ్డిగారు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా చిత్రాన్ని నిర్మించారు. సినిమా ఔట్పుట్ చాలా బాగా వచ్చింది’అన్నారు. -
‘సమ్మతమే’ ఫస్ట్లుక్ పోస్టర్ విడుదల
యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో కిరణ్ అబ్బవరం, చాందినీ చౌదరి హీరోహీరోయిన్లుగా రూపొందుతున్న మ్యూజికల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘సమ్మతమే’. గోపీనాథ్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని యూజీ ప్రొడక్షన్స్ పతాకంపై కె. ప్రవీణ నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ 80 శాతం పూర్తయింది. ఇటీవల విడుదల చేసిన ఈ సినిమా టైటిల్ పోస్టర్కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా గురువారం (జూలై 15) కిరణ్ అబ్బవరం బర్త్ డే సందర్భంగా ‘సమ్మతమే’ సినిమా ఫస్ట్లుక్ పోస్టర్ను విడుదల చేశారు మేకర్స్. ఓ గ్రామంలోని ఇంటి వరండాలో కూర్చుని అద్దంలో తనను తాను చూసుకుంటూ నవ్వుతున్న యవకుడిగా కిరణ్ అబ్బవరం, అతన్ని చూస్తూ ఎఫెక్షన్ ఫీల్ అవుతూ చాందినీ చౌదరి కనిపిస్తున్నారు.గడ్డంతో కిరణ్ హ్యాండ్సమ్ కనిపిస్తుంటే, చీరకట్టులో చాందినీ చౌదరి అందంగా కనిపిస్తున్నారు. ఈ చిత్రానికి శేఖర్ చంద్ర సంగీతం అందిస్తున్నాడు. -
టైటిల్కి తగ్గట్టే ‘అద్భుతం’ గా శివాని, తేజ సజ్జల ఫస్ట్ లుక్
హీరో రాజశేఖర్, నటి జీవితల కుమార్తె శివాని హీరోయిన్గా నటిస్తున్న చిత్రం ‘అద్భుతం’. తేజ సజ్జ హీరో. మల్లిక్ రామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని చంద్రశేఖర్ మొగుళ్ల నిర్మిస్తున్నారు. గురువారం (జూలై 1న) శివాని పుట్టినరోజు సందర్భంగా ‘అద్భుతం’ మూవీ ఫస్ట్ లుక్ని హీరో నాని సోషల్ మీడియా ద్వారా విడుదల చేసి, చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ‘అ, కల్కి, జాంబిరెడ్డి’ వంటి చిత్రాలకు దర్శకత్వం వహించిన ప్రశాంత్ వర్మ ఈ సినిమాకు కథ అందించడం విశేషం.‘‘అద్భుతం’ టైటిల్కి తగ్గట్లుగానే ఈ ఫస్ట్ లుక్ని వినూత్నంగా సిద్ధం చేశారు మల్లిక్ రామ్’’ అన్నారు చంద్రశేఖర్ మొగుళ్ల. ఈ చిత్రానికి సహనిర్మాత: సృజన్ యార్లభోలు, సంగీతం: రాదన్, కెమెరా: చింతా విద్యాసాగర్. -
రికార్డులకెక్కిన విజయ్ ‘లైగర్’ ఫస్ట్ లుక్
విజయ్ దేవరకొండ తాజా చిత్రం ‘లైగర్’ ఫస్ట్ లుక్ అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. సోషల్ మీడియాలో అత్యధిక లైక్లు రాబట్టుకుని దక్షిణాది చిత్రాల్లో తొలి ఫస్ట్లుక్ పోస్టర్గా నిలిచింది. ఈ ఫస్ట్లుక్ పోస్టర్ ఇన్స్టాగ్రామ్లో దాదాపు 2 మిలియన్లకు పైగా లైక్స్ను సాధించి రికార్డు సృష్టించింది. కాగా ఇప్పటికే ఈ మూవీలో విజయ్ సరికొత్త లుక్కు సూపర్ రెస్పాన్స్ వస్తోన్న సంగతి తెలిసిందే. ‘లైగర్’ కోసం విజయ్ పూర్తిగా తన లుక్ను మేకోవర్ చేసుకున్నాడు. మాస్ కమర్షియల్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీని బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహర్ ధర్మ ప్రొడక్షన్, పూరి కనెక్ట్స్ బ్యానర్లపై కరణ్ జోహార్, పూరీ జగన్నాథ్, ఛార్మిలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం చివరి షూటింగ్ షెడ్యూల్ను జరుపుకుంటున్న ‘లైగర్’ మూవీ సెప్టెంబర్ 9న దేశవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమాతో అనన్య టాలీవుడ్కు పరిచయం కానుంది. #LIGER 🥊 Is Now The Most Liked First Look Poster From SOUTH INDIA in Instagram @TheDeverakonda | #PuriJagannadh #LigerSouthMostLikedFLOnInsta@PuriConnects pic.twitter.com/ulZwDsXXA0 — BARaju's Team (@baraju_SuperHit) June 19, 2021 చదవండి: Liger Movie: ఆసక్తిరేపుతున్న క్లైమాక్స్ సీన్ అప్డేట్! -
Noel Sean: పెళ్లి గురించి కాదు.. నోయల్ శుభవార్త ఇదే
సింగర్, ‘బిగ్బాస్’ఫేమ్ నోయల్ రెండు రోజుల క్రితం ‘ఓ ఎగ్జైటింగ్ న్యూస్ మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను’అని ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. ఎగ్జైట్ న్యూస్ అని చెప్పడంతో అది కచ్చితంగా పెళ్లి గురించి అయి ఉంటుందని నెటిజన్లు భావించారు. అయితే నోయల్ తాజాగా అసలు విషయాన్ని చెప్పాడు. తన జీవితంలోని కొత్త ఆరంభం గురించి ప్రకటించేశారు. తాను హీరోగా రాబోతోన్న కొత్త సినిమా అప్డేట్ను ఇస్తూ ఫస్ట్లుక్ని రివీల్ చేశాడు. మనీషి అనే సినిమాతో హీరోగా నోయల్ ఎంట్రీ ఇవ్వబోతోన్నారు. పూజిత పొన్నాడ హీరోయిన్గా రాబోతోన్న ఈ మూవీ ఫస్ట్ లుక్ అదిరిపోయింది. స్పార్క్ ఓటీటీలో ఈ మూవీ జూన్ 18 నుంచి అందుబాటులోకి రానుందని ప్రకటించారు. ఈ మూవీకి వినోద్ నాగుల దర్శకత్వం వహించగా.. సత్యనారాయణ నాగుల నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. Here's the First Look of my upcoming movie #MoneyShe🎭 Very happy to share that it's Releasing Exclusively in @sparkottin on June 18th! 📝 Thank you @VinodNagula bhayya & team for making me a part this project!#మనిషి @pujita_ponnada pic.twitter.com/Uphoij6mEZ — Noel (@mrnoelsean) June 9, 2021 చదవండి: PSPK28: ఫ్యాన్ మేడ్ పోస్టర్ వైరల్.. స్పందించిన నిర్మాణ సంస్థ సమంతకు కొడుకుగా నటించేది ఈ స్టార్ హీరో తనయుడే! -
PSPK28: ఫ్యాన్ మేడ్ పోస్టర్ వైరల్.. స్పందించిన నిర్మాణ సంస్థ
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా హరీశ్ శంకర్ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. పవన్ కెరీర్ లో 28 చిత్రమిది. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యర్నేని, వై.రవిశంకర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. కాగా, ఇటీవల ఈ చిత్రానికి సంబంధించిన ఓ ఫ్యాన్ మేడ్ పోస్టర్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వింటేజ్ బైక్పై బ్లాక్ షర్ట్ ధరించి, చేతిలో ఓ సూట్కేసు పట్టుకొని స్టైలీష్గా కూర్చొని ఉన్నాడు. ఈ పోస్టర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇదే అఫిషియల్ లుక్ అని ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారం బాగా ముదరడంతో చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ స్పందించింది. ఏ విషయం అయినా తాము అధికారికంగా చెప్పే వరకు నమ్మొద్దని అభిమానులకు విజ్ఞప్తి చేసింది. పవన్ కల్యాణ్ 28వ సినిమాకి సంబంధించిన ఫస్ట్లుక్, టైటిల్ని ఈ ఏడాది ఉగాది రోజున విడుదల చేయాలని భావించాం. అయితే, కరోనా కారణంగా ఆ నిర్ణయాన్ని వాయిదా వేశాం. ప్రస్తుతం సోషల్ మీడియాలో అనేక వార్తలు, ఫొటోలు చక్కర్లు కొడుతున్నాయి. అభిమానులు ఒక్క విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. సినిమాకు సంబంధించిన ఏ విషయమైనా అధికారిక ఖాతాల ద్వారా సరైన సమయంలో వెల్లడిస్తాం’మైత్రీ మూవీ మేకర్స్ ట్వీట్ చేసింది. #PSPK28 😊 pic.twitter.com/BhpRrBZkw3 — Mythri Movie Makers (@MythriOfficial) June 8, 2021 చదవండి : ఈ స్టార్ హీరోలు ఒక్కో సినిమాకు ఎంత తీసుకుంటున్నారో తెలుసా? రామ్చరణ్తో సినిమా..ఆ డైరెక్టర్కు భారీ రెమ్యునరేషన్ ఆఫర్ చేసిన 'మైత్రీ' -
OTTలో విద్యాబాలన్ మూవీ: అప్పటి నుంచే ప్రసారం
విద్యాబాలన్ ప్రధాన పాత్రలో నటించిన హిందీ చిత్రం ‘షేర్నీ’. ‘న్యూటన్’ ఫేమ్ అమిత్ మసుర్కర్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ను విద్యాబాలన్ విడుదల చేసి, ఓటీటీ ప్లాట్ఫామ్లో విడుదల కానున్నట్లు తెలిపారు. జూన్లో ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ కానుంది. ఇందులో విద్యాబాలన్ నిజాయతీ గల అటవీ శాఖాధికారి షేర్నీ పాత్ర చేశారు. ఈ సంగతి ఇలా ఉంచితే.... విద్యాబాలన్ నటించిన గత చిత్రం ‘శకుంతలా దేవి’ కూడా ఓటీటీ ప్లాట్ఫామ్లోనే విడుదలైన సంగతి గుర్తుండే ఉంటుంది. She is ready to leave a mark! Meet the #SherniOnPrime in June. @vidya_balan #AmitMasurkar @vikramix @ShikhaaSharma03 @AasthaTiku @Abundantia_Ent @TSeries pic.twitter.com/4Wx7jEsvgS — amazon prime video IN (@PrimeVideoIN) May 17, 2021 -
Raj Tarun: రాహుల్.. కూర్చుంది చాలు!
రాజ్ తరుణ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘స్టాండప్ రాహుల్’. ‘కూర్చుంది చాలు’ అనేది ఉపశీర్షిక. సాంటో మోహన్ వీరంకి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో వర్ష బొల్లమ్మ హీరోయిన్. సిద్ధు ముద్ద సమర్పణలో నంద్ కుమార్ అబ్బినేని, భరత్ మగులూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మంగళవారం (మే 11) రాజ్ తరుణ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఈ సినిమాలోని కొత్త పోస్టర్ను విడుదల చేశారు. ‘వెన్నెల’ కిశోర్, ఇంద్రజ, మురళీ శర్మ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి స్వీకర్ ఆగస్తి సంగీతం అందిస్తున్నారు. చదవండి : TNR 'ప్లే బ్యాక్', ఆహాలో ఎప్పటినుంచంటే? మా ఇంట్లో ఆరుగురికి కరోనా: నటుడు -
కాళికాదేవి అవతారమెత్తిన సాయి పల్లవి.. ఫోటో వైరల్
నేచురల్ బ్యూటీ సాయి పల్లవి 29వ పుట్టిన రోజు నేడు(మే 09). ఈ సందర్భంగా ‘శ్యామ్ సింగ రాయ్’ చిత్రం నుంచి సాయి పల్లవి లుక్ విడుదల చేసింది చిత్ర బృందం. కాళికాదేవి అవతారంలో ఉగ్రరూపం దాల్చినట్లుగా ఉన్న ఈ పోస్టర్ అభిమానులను తెగ ఆకట్టుకుంటుంది. పోస్టర్ అదిరిపోయిందంటూ సాయి పల్లవి అభిమానులను కొనియాడుతున్నారు. ‘టాక్సీవాలా’ డైరెక్టర్ రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో ‘శ్యామ్ సింగ రాయ్’ తెరకెక్కుతుంది. నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో కృతిశెట్టి, మడోన్నా సెబాస్టియన్ ముఖ్య పాత్రలు పోషిస్తుండగా, నిహారిక ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై వెంకట్ ఎస్. బోయనపల్లి నిర్మిస్తున్నారు. కోల్కత్తా బ్యాక్డ్రాప్లో రూపొందుతున్న ఈ సినిమాను ఈ ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇక సాయి పల్లవికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపాడు హీరో నాని. శ్యామ్ సింగరాయ్ పోస్టర్ని ట్వీటర్లో షేర్ చేస్తూ.. ‘హ్యాపీ బర్త్డే చిన్ని గారు’ అని ట్వీట్ చేశాడు. ఇదిలా ఉండగా సాయిపల్లవి వరుస సినిమాలతో బిజీగా ఉంది. ఆమె నటించిన ’లవ్ స్టోరీ‘, ’విరాట పర్వం‘ సినిమాలు ఇప్పటికే విడుదల కవాల్సి ఉంది. అయితే కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఆ సినిమాల విడుదల వాయిదా పడింది. His ❤️#ShyamSinghaRoy Happy birthday Chinni gaaru @Sai_Pallavi92 🤗 pic.twitter.com/kW0UBVIugb — Nani (@NameisNani) May 9, 2021 -
‘మహాసముద్రం’ నుంచి సిద్ధార్థ్ ఫస్ట్లుక్ విడుదల
‘బొమ్మరిల్లు’ ఫేమ్ సిద్ధార్థ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘మహాసముద్రం’. ఈ చిత్రంలో శర్వానంద్ మరో హీరోగా నటిస్తున్నారు. అదితీరావ్ హైదరీ, అనూ ఇమ్మాన్యుయేల్ కథానాయికలు. ‘ఆర్ఎక్స్ 100’ ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వంలో సుంకర రామబ్రహ్మం నిర్మిస్తున్నారు. శనివారం సిద్ధార్థ్ పుట్టినరోజు సందర్భంగా ‘మహాసముద్రం’ లోని ఆయన ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు. పోస్టర్లో క్యూలో నిలబడి ఎవర్నో చూస్తున్నారు సిద్ధార్థ్. ‘‘ఇంటెన్స్ లవ్ అండ్ యాక్షన్ డ్రామాగా రూపొందుతోన్న చిత్రమిది. తెలుగులో తన కమ్బ్యాక్ మూవీకి సరైన స్క్రిప్ట్ కోసం చాలాకాలం ఎదురుచూసిన సిద్ధార్థ్కి ‘మహాసముద్రం’ కథ నచ్చి, నటిస్తున్నారు. ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్లో శర్వానంద్ కొంచెం అగ్రెసివ్ లుక్లో కనిపించగా, సిద్ధార్థ్ ప్రశాంతంగా కనిపిస్తున్నారు. ప్రస్తుతం వైజాగ్లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని ఆగస్ట్ 19న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి సహనిర్మాత: అజయ్ సుంకర, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కిశోర్ గరికిపాటి, సంగీతం: చేతన్ భరద్వాజ్, కెమెరా: రాజ్ తోట. Here is my First Look from #Mahasamudram Waited a long time for this. Happy to be back! Thank you for your love for me and expectations from me. I'll see you soon in cinemas. ❤️Vastunna, Vachesthunna, Vachesa❤️@ImSharwanand @aditiraohydari @AnuEmmanuell @DirAjayBhupathi pic.twitter.com/cOH4hIxJCz — Siddharth (@Actor_Siddharth) April 17, 2021 -
అవసరాల శ్రీనివాస్ బట్టతల వీడియో.. అసలు విషయం ఇదే!
రెండు రోజుల నుంచి నటుడు, దర్శకుడు అవసరాల శ్రీనివాస్కు సంబంధించిన ఓ షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతున్న విషయం తెలిసిందే. అతని దగ్గర మూడేళ్లుగా పనిచేస్తున్న కోడైరెక్టర్ మహేశ్ ఓ వీడియో బయటపెట్టడం చర్చనీయాంశంగా మారింది. అవసరాల శ్రీనివాస్కు మహేశ్ మధ్య గొడవలు రావడంతో అతన్ని తిట్టి ఆఫీస్ నుంచి బయటకు పంపించేశాడు. దీంతో శ్రీనివాస్పై కక్ష పెంచుకున్న మహేశ్.. అతని ఆఫీస్కి వెళ్లి నానా హంగామా చేశాడు. అవసరాల నిజస్వరూపాన్ని అందరికీ చూపిస్తానంటూ.. ఫొటో షూట్ చేయించుకుంటున్న అవసరాల దగ్గరకు వెళ్లి, నన్నెందుకు తిట్టావ్ అని ప్రశ్నిస్తూ వీడియో రికార్డింగ్ చేశాడు. వీడియో బయటకెళ్తే ఇండస్ట్రీలో లేకుండా చేస్తానని అవసరాల శ్రీనివాస్, మహేష్ కు వార్నింగ్ ఇచ్చాడు. ఈ క్రమంలోనే మహేష్ ఫొటో షూట్ చేయించుకుంటున్న అవసరాల శ్రీనివాస్ క్యాప్ను తీసేయగా.. అతను బట్టతలతో కనిపించడం నెటిజన్లకు షాక్ ఇచ్చింది. అయితే ఈ వీడియో చూసి ఎంతో మంది షాక్కు గురవ్వగా.. కొంతమంది సందేహం వ్యక్తం చేశారు. ఇది నిజంగానే జరిగిందా లేక సినిమా ప్రమోషన్ కోసమా అనే కన్ఫ్యూజన్లో ఉండిపోయారు. తాజాగా, ఆ సందేహాలే నిజమనేలా అవసరాలకు సంబంధించిన ఓ అప్డేట్ వచ్చింది. అవసరాల శ్రీనివాస్ హీరోగా నటిస్తున్న చిత్రం.. ‘నూటొక్క జిల్లాల అందగాడు’. ఈ సినిమా పోస్టర్ను తాజాగా విడుదల చేసింది చిత్రయూనిట్. త్వరలో టీజర్ రిలీజ్ చేస్తున్నట్లు పేర్కొన్న ఈ పోస్టర్ను చూసిన ఎవరికైనా బట్టతల వీడియోపై స్పష్టత వచ్చేస్తుంది. ఇందులో రెండు విభన్నగెటప్లో ఉన్న అవసరాల శ్రీనివాస్.. ఒక ఫ్రేమ్లో పూర్తి జుట్టుతో చేతిలో బట్టతలతో ఉన్న బొమ్మను పట్టుకొని ఉండగా. మరోపక్క బట్టతలతో ఉండి చేతిలో జుట్టున్న బొమ్మను పట్టుకొని కనిపిస్తున్నాడు. దీంతో బట్టతల వీడియో సినిమా ప్రమోషన్కు అని తెలుస్తోంది. కాగా ఈ సినిమాలో అవసరాల గొత్తి సూర్యనారాయణగా అలరించనున్నాడు. వైవిధ్యమైన కథాంశంతో ఫన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు తానే స్వయంగా కథ రాసుకున్నాడు. చి.ల.సౌ ఫేమ్ రుహనీ శర్మ హీరోయిన్గా నటిస్తుండగా.. దిల్ రాజు నిర్మిస్తున్నాడు. రామ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రానికి స్వీకార్ అగస్తి సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సినిమాను త్వరలోనే విడుదల చేసేందుకు నిర్మాత దిల్ రాజు ప్రయత్నాలు చేస్తున్నారు. చదవండి: షాకింగ్ వీడియో.. అవసరాల శ్రీనివాస్ గుట్టు రట్టు! తను నాతో ఎక్కువ టైం ఉండట్లేదు..: కాజల్ Introducing GSN - గొత్తి సూర్యనారాయణ! #101JAFirstLook#GottiSuryaNarayana from #NootokkaJillalaAndagadu. Teaser Coming Soon!#SrinivasAvasarala @iRuhaniSharma #SagarRachakonda #DilRaju @DirKrish #Shirish @YRajeevReddy1 #JSaiBabu @SVC_official @FirstFrame_Ent @MangoMusicLabel pic.twitter.com/eZKSGjccnU — BARaju (@baraju_SuperHit) March 25, 2021 -
...అంత హిట్టవ్వాలి
‘‘మిత్ర శర్మ ‘బాయ్స్’ మూవీలో హీరోయిన్ గా నటించడంతో పాటు నిర్మిస్తున్నారని విని షాక్ అయ్యాను. ఆమె ఎంతో ధైర్యంగా ప్రొడక్షన్ వైపు అడుగులు వేశారు. ఈ ‘బాయ్స్’ సినిమా శంకర్గారి ‘బాయ్స్’ అంత పెద్ద హిట్ అవ్వాలి’’ అని హీరో కార్తికేయ అన్నారు. మిత్ర శర్మ హీరోయిన్ గా నటిస్తూ, నిర్మిస్తున్న చిత్రం ‘బాయ్స్’. గీతానంద్ హీరోగా దయానంద్ దర్శకత్వంలో శ్రీ పిక్చర్స్ పతాకంపై రూపొందుతోంది. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ను కార్తికేయ విడుదల చేయగా, ‘సుచిర్ ఇండియా’ కిరణ్, ‘కళామందిర్’ కళ్యాణ్లు శ్రీ పిక్చర్స్ పోస్టర్స్, లోగోలను రిలీజ్ చేశారు. మిత్ర శర్మ మాట్లాడుతూ– ‘‘2014లో ఇండస్ట్రీకి వచ్చిన నేను చాలా సినిమాల్లో నటించాను. దయానంద్ ఎంతో కాన్ఫిడెంట్గా కథ చెప్పిన విధానం నచ్చి తన కోసమే ఈ సినిమా చేస్తున్నాను’’ అన్నారు. ‘‘మిత్ర శర్మగారు నాపై పెట్టుకొన్న నమ్మకాన్ని నిలబెట్టేలా ఈ సినిమా ఉంటుంది’’ అన్నారు దయానంద్. ఈ చిత్రానికి సహనిర్మాత: పడవల బాలచంద్ర, సంగీతం: స్మరన్, కెమెరా: వెంకట ప్రసాద్. -
పూర్ణ ‘బ్యాక్ డోర్’ ఫస్ట్ లుక్ రిలీజ్
‘‘బ్యాక్ డోర్’ సినిమా ఫస్ట్ లుక్ చూస్తే విభిన్నమైన కాన్సెప్ట్తో రూపొందినట్లు తెలుస్తోంది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వాలి’’ అని హీరో ఆది సాయికుమార్ అన్నారు. పూర్ణ ప్రధాన పాత్రలో, యువ కథానాయకుడు తేజ ముఖ్యపాత్రలో కర్రి బాలాజీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘బ్యాక్ డోర్’. సెవెన్ హిల్స్ సతీష్ కుమార్ సమర్పణలో బి.శ్రీనివాస్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ని ఆది సాయికుమార్ విడుదల చేశారు. ‘‘ఈ సినిమాతో దర్శకుడిగా బాలాజీకి మంచి పేరు రావాలి’’ అన్నారు దర్శకుడు వీరభద్రం చౌదరి. బి.శ్రీనివాసరెడ్డి, కర్రి బాలాజీ, సెవెన్ హిల్స్ సతీష్ రెడ్డి, తేజ, నిర్మాత తిరుపతిరెడ్డి, పబ్లిసిటీ డిజైనర్ విక్రమ్ రమేష్ తదితరులు ఫస్ట్ లుక్ రిలీజులో పాల్గొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: ప్రణవ్, నేపథ్య సంగీతం: రవిశంకర్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: రేఖ, కో–ప్రొడ్యూసర్: ఊట శ్రీను. -
ఉన్నికృష్ణన్ ప్రయాణం
‘క్షణం’, ‘గూఢచారి’, ‘ఎవరు’ వంటి విలక్షణమైన హిట్ చిత్రాల్లో నటించి, హీరోగా అడివి శేష్ చక్కని గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన టైటిల్ రోల్లో మేజర్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న తాజా ప్యాన్ ఇండియా మూవీ ‘మేజర్’. శేష్ బర్త్డే సందర్భంగా గురువారం ఫస్ట్ లుక్ పోస్టర్ను విడుదల చేసింది చిత్రబృందం. 26/11 ముంబై దాడుల్లో దేశం కోసం ప్రాణాలను అర్పించిన ఆర్మీ ఆఫీసర్ సందీప్ ఉన్నికష్ణన్ జర్నీని, ఆయన జీవన శైలిని తెరకెక్కిస్తున్నారు దర్శకుడు శశికిరణ్ తిక్క. ఇప్పటివరకు 70 శాతం షూటింగ్ పూర్తయింది. ఈ చిత్రాన్ని మహేశ్బాబు జీఎంబీ ఎంటర్టైన్మెంట్, ఏ ప్లస్ ఎస్ మూవీస్ సహకారంతో సోనీ పిక్చర్స్ ఇండియా నిర్మిస్తోంది. వచ్చే సమ్మర్ స్పెషల్గా విడుదల కానుంది. శోభితా దూళిపాళ్ల, ప్రకాశ్ రాజ్, సయీ మంజ్రేకర్, రేవతి, మురళీ శర్మ తదితరులు నటిస్తున్నారు. -
అడవి శేష్ ‘మేజర్’ ఫస్ట్ లుక్ పోస్టర్..!
26/11 ముంబై దాడుల్లో దేశం కోసం ప్రాణాలర్పించిన యంగ్ ఆర్మీ ఆఫీసర్ సందీప్ ఉన్ని కృష్షన్ జీవితం ఆధారంగా ‘మేజర్’ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అడవి శేష్ ఈ చిత్రంలో హీరోగా నటిస్తున్నారు. ఇక ఈ రోజు తన బర్త్డే సందర్భంగా మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ ధైర్య సాహసాలు ప్రతిబింబించేలా `మేజర్` ఫస్ట్ లుక్ పోస్టర్ను ఆవిష్కరించింది చిత్ర యూనిట్. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ లుక్లో అడివి శేష్ను ప్రదర్శిస్తూ ఈ రోజు ఉదయం 10 గంటలకు `మేజర్` ఫస్ట్లుక్ పోస్టర్ను విడుదలచేసింది చిత్ర యూనిట్. Happy to present the first look of #Major!! Wishing you a very happy birthday @AdiviSesh. I'm sure Major will go down as one of your best performances. Good luck and happiness always! 😊 pic.twitter.com/q5BLRj8ewn — Mahesh Babu (@urstrulyMahesh) December 17, 2020 26/11 ముంబై దాడుల్లో దేశం కోసం ప్రాణాలను అర్పించిన యంగ్ ఆర్మీ ఆఫీసర్ సందీప్ ఉన్నికృష్ణన్ జర్నీని ప్రేక్షకులకుకి అందించడమే ఈ చిత్రం ముఖ్య ఉద్ధేశ్యం అని తెలిపారు దర్శకుడు. అతడు వీర మరణం పొందిన విధానం మాత్రమే కాకుండా, అతను జీవించిన విధానం ఆత్మను సంగ్రహించే సన్నివేశాలను ఈ చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తోంది చిత్ర యూనిట్. 27/11న మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ వర్ధంతి సందర్భంగా హీరో అడివి శేష్ లుక్ టెస్ట్ పోస్టర్తో పాటు, అమరవీరుల జ్ఞాపకాలకు నివాళులు అర్పిస్తూ సినిమా తీసే ప్రయాణాన్ని గురించి వెల్లడించే వీడియోను రిలీజ్ చేసిన విషయం తెలిసిందే.(ఆయన కళ్లల్లో ప్యాషన్ కనిపించింది– అడివి శేష్) మేజర్ టీమ్ ఆగష్టులో కోవిడ్ సమయంలో అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఇప్పటి వరకు 70శాతం షూట్ పూర్తి చేసింది. పాన్ ఇండియా మూవీగా తెలుగు, హిందీ భాషలలో రూపొందుతోన్న ఈ సినిమాకి శశి కిరణ్ తిక్కా దర్శకత్వం వహిస్తుండగా.. తెలుగమ్మాయి శోభితా దూళిపాళ్ల, బాలీవుడ్ బ్యూటీ సైఈ మంజ్రేకర్, ప్రకాష్ రాజ్, రేవతి, మురళి శర్మ తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఇక మహేష్ బాబు జీఎంబీ ఎంటర్టైన్మెంట్, ఏ ప్లస్ ఎస్ మూవీస్ సహకారంతో సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా నిర్మిస్తోన్న మేజర్ చిత్రాన్ని 2021 సమ్మర్ స్పెషల్గా రిలీజ్ చేయనున్నారు.