Flights cancelled
-
ఉక్రెయిన్ భీకర దాడులు.. రష్యాలో విమానాల నిలిపివేత
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మరోసారి ఉధృతమైంది. తాజా దాడుల నేపథ్యంతో కీవ్ సైన్యం రష్యా భూభాగాల్లో విరుచుకుపడుతోంది. అక్కడి ఇంధన స్థావరాల నాశనమే లక్ష్యంగా ముందుకు పోతోంది. దీంతో అప్రమత్తమైనట్లు మాస్కో వర్గాలు ప్రకటించుకున్నాయి. అస్ట్రాఖాన్ రీజియన్లోని ఇంధన స్థావరం ఉక్రెయిన్ డ్రోన్ దాడుల్ని జరిపిందని అక్కడి గవర్నర్ ఇగోర్ బాబుష్కిన్ టెలిగ్రామ్ ద్వారా ప్రకటించారు. ఈ ఆ దాడిలో ఎటు వంటి ప్రాణ నష్టం వాటిల్లలేదని తెలిపారాయన. అదే రీజియన్లోని గ్లాస్ ప్లాంట్పైనా, మరో ఎనర్జీ సెంటర్పై దాడి జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ దాడులను కీవ్ వర్గాలు ధృవీకరించాయి. ఉక్రెయిన్ డ్రోన్ దాడుల నేపథ్యంలో.. అస్ట్రాఖాన్తో పాటు పలు రీజియన్లకు విమానాల సర్వీసులను రద్దు చేసినట్లు ఆ దేశ పౌరవిమానాయాన విభాగం రోసావయాట్షియా ప్రకటించింది. 2022 ఫిబ్రవరిలో ఇరుదేశాల మధ్య యుద్ధం మొదలైనప్పటి నుంచి.. రష్యాలోని ఎనర్జీ, రవాణా, సైన్య సంబంధిత ఉత్పత్తుల కేంద్రాలపై ఉక్రెయిన్ దాడులు చేస్తూనే ఉంది.ఇదీ చదవండి: స్కూల్పై క్షిపణి దాడి.. పుతిన్దే బాధ్యత! -
ఇజ్రాయెల్-ఇరాన్ దాడి.. పలు విమానాలు రద్దు
ఇజ్రాయెల్-ఇరాన్ దాడి కారణంగా ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని గల్ఫ్ ఎయిర్లైన్స్ చర్యలు చేపట్టాయి. ఈమేరకు పలు విమాన సర్వీసుల సమయంలో మార్పలు, మరికొన్నింటిని రద్దు చేస్తున్నట్లు ప్రకటించాయి. ఎతిహాద్, ఎమిరేట్స్, ఖతార్ ఎయిర్వేస్, ఫ్లైదుబాయ్, కువైట్ ఎయిర్వేస్ వంటి ప్రముఖ విమానయాన సంస్థలు ఈమేరకు ప్రకటన విడుదల చేశాయి.మిడిల్ ఈస్ట్లోని కొన్ని ప్రాంతాల్లో గగనతల పరిమితుల కారణంగా బుధవారం విమానాలను దారి మళ్లిస్తున్నట్లు ఎతిహాద్ ఎయిర్వేస్ తెలిపింది. ఎమిరేట్స్ ఎయిర్లైన్స్ అక్టోబర్ 2, 3 తేదీల్లో ఇరాక్ (బాస్రా, బాగ్దాద్), ఇరాన్, జోర్డాన్లకు వెళ్లే అన్ని విమానాలను రద్దు చేసింది. ఇరాక్, ఇరాన్లకు ప్రయాణించే విమానాలను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు ఖతార్ ఎయిర్వేస్ ప్రకటించింది. జోర్డాన్, ఇరాక్, ఇజ్రాయెల్, ఇరాన్లకు అక్టోబర్ 2, 3 తేదీలకు ప్రయాణాలు సాగించే ఎయిర్క్రాఫ్ట్లను నిలిపేస్తున్నట్లు ఫ్లైదుబాయ్ పేర్కొంది. కువైట్ ఎయిర్వేస్ విమాన సమయాల్లోనూ మార్పులు చేసినట్లు కంపెనీ ప్రతినిధులు స్పష్టం చేశారు.ఇదీ చదవండి: పెట్రోల్ అప్.. డీజిల్ డౌన్!ఇజ్రాయెల్పై ఇరాన్ మంగళవారం సుమారు 400 బాలిస్టిక్ మిసైల్స్తో భీకరంగా దాడులు చేసింది. అయితే వెంటనే అప్రమత్తమైన ఇజ్రాయెల్ తమ ఐరన్ డోమ్ వ్యవస్థతో ఇరాన్ మిసైల్స్ను అడ్డుకున్నట్లు ప్రకటించింది. -
ఎయిరిండియాలో ఆకస్మిక సమ్మె
న్యూఢిల్లీ: టాటా గ్రూప్ యాజమాన్యంలోని విమానయాన సంస్థ ఎయిరిండియా ఎక్స్ప్రెస్ సిబ్బంది మూకుమ్మడిగా సెలవు పెట్టడం తీవ్ర గందరగోళానికి దారి తీసింది. యాజమాన్యం వైఖరికి నిరసనగా క్యాబిన్ క్రూలోని 200 మందికి పైగా సిబ్బంది మంగళవారం రాత్రి సిక్ లీవ్ పెట్టారు. హఠాత్తుగా చోటుచేసుకున్న పరిణామంతో ఎయిరిండియా 100 వరకు దేశీయ, అంతర్జాతీయ సరీ్వసులను రద్దు చేసుకోవాల్సి వచ్చింది. ఫలితంగా, కోచి, కాలికట్, ఢిల్లీ, బెంగళూరు తదితర విమానాశ్రయాల్లో సుమారు 15 వేల మంది ప్రయాణికులు చిక్కుకుపోయారు. సరీ్వసుల రద్దు విషయం కొందరికి సెక్యూరిటీ తనిఖీలు కూడా పూర్తయ్యాక ఆఖరి నిమిషంలో తెలిపారు. దీంతో, వారు ఎయిరిండియా తీరును నిరసిస్తూ ఆందోళనకు దిగారు. గల్ఫ్ దేశాలకు వెళ్లాల్సిన కొన్ని సర్వీసులు ఆలస్యంగా నడిచాయి. వేసవి రద్దీ దృష్ట్యా మార్చి చివరి వారం నుంచి రోజూ 360 సరీ్వసులను నడుపుతోంది. టాటా గ్రూప్నకే చెందిన విస్తారాను ఎయిరిండియాతో, అదేవిధంగా ఎయిరిండియా ఎక్స్ప్రెస్ను ఏఐఎక్స్ కనెక్ట్తో విలీనం చేయాలన్న నిర్ణయం క్యాబిన్ క్రూలోని సీనియర్ల అసంతృప్తికి కారణమైందని భావిస్తున్నారు. నిర్వహణ లోపం సీనియర్ ఉద్యోగుల నైతికతను దెబ్బతీసిందని ఎయిరిండియా ఎక్స్ప్రెస్ ఎంప్లాయీస్ యూనియన్ తెలిపింది. విమాన సర్వీసుల రద్దుపై బుధవారం కేంద్ర పౌరవిమాన యాన శాఖ ఎయిరిండియా ఎక్స్ప్రెస్ నుంచి వివరణ కోరింది. సిబ్బంది సమస్యలను పరిష్కరించేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నట్లు ఎయిరిండియా ప్రతినిధి తెలిపారు. రద్దయిన సరీ్వసులకు టిక్కెట్ చార్జీలను వాపసు చేస్తామని, కోరిన పక్షంలో మరో తేదీకి ప్రయాణాన్ని రీషెడ్యూల్ చేస్తామని వివరించారు. -
దుబాయ్లో మళ్లీ దంచికొడుతున్న వాన.. పలు విమానాలు రద్దు
రెండు వారాలకు ముందు దుబాయ్లో కుండపోత వర్షాలు కురిశాయి. ఆ ఘటన మరువకముందే మరోసారి ఎడారి దేశంలో వర్షాలు దంచికొడుతున్నాయి. భారీ వర్షం, ఉరుములు కారణంగా అనేక అంతర్జాతీయ విమానాలు తాత్కాలికంగా రద్దయ్యాయి. దీంతో ప్రయాణికులు తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వచ్చింది.గత నెలలో కురిసిన వర్షాలతో పోలిస్తే ఈసారి కురుస్తున్న వర్షాలు తక్కువగా ఉంటాయని.. నేషనల్ ఎమర్జెన్సీ క్రైసిస్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ (NCEMA) అంచనా వేసింది. అయినప్పటికీ ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. గురువారం ఉదయం నుంచి వర్షం భారీగా పడుతూనే ఉందని స్థానిక మీడియా వెల్లడించింది. రేపు (మే 3) వర్షం మరింత బలంగా ఉండే అవకాశం ఉంటుందని సంబంధిత శాఖ అంచనా వేసింది.ఇప్పటికే అబుదాబిలోని పలు ప్రాంతాల్లో వర్షపు నీరు నిలిచిపోయింది. వాహనాలు కూడా ఎక్కడికక్కడ ఆగిపోయాయి. బలమైన గాలుల వల్ల చెట్లు మాత్రమే కాకుండా విద్యుత్ స్తంభాలు కూడా నేలకొరిగాయి. దీంతో ప్రజలు ఇక్కట్లు పడుతున్నట్లు తెలుస్తోంది. అత్యవసర సమయంలో బయటకు వచ్చే ప్రజలు కూడా తప్పకుండా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.1949 తరువాత భారీ వర్షం ఏప్రిల్ 14, 15వ తేదీలలో పడినట్లు అధికారులు పేర్కొన్నారు. గత నెలలో పడ్డ వర్షాల కారణంగా పలువురు మృత్యువాత పడ్డారు. వాహనాలు కూడా నీటిలో చిక్కుకున్నాయి. మళ్ళీ అలాంటి పరిస్థితి వస్తుందా అని ప్రజలు భయపడుతున్నారు. -
యూఏఈలో అనూహ్య వర్షాలు
దుబాయ్: మాడ పగిలిపోయే ఎండ వేడికి, ఎడారులకు నిలయమైన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ను భారీ వర్షాలు పలకరించాయి. బుధవారం కుండపోత వర్షాలతో యూఏఈ తడిసి ముద్దయింది. భారీ వర్షాలను తట్టుకునే ఏర్పాట్లేవీ పెద్దగా లేకపోవడంతో దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం రన్వే మొత్తం నీట మునిగింది. దీంతో ప్రపంచంలోనే అత్యంత రద్దీ ఎయిర్పోర్ట్గా ఖ్యాతికెక్కిన దుబాయ్ ఎయిర్పోర్ట్ నుంచి విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఎయిర్పోర్ట్ పార్కింగ్ ప్రాంతంలోని కార్లు మునిగిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఒకటిన్నర సంవత్సరంలో పడాల్సిన వర్షపాతం బుధవారం ఒక్కరోజే నమోదైందని సిటీ వాతావరణ శాఖ వెల్లడించిన గణాంకాల్లో తేలింది. 14.2 సెంటీమీటర్లమేర వర్షపాత నమోదైందని అధికారులు తెలిపారు. దేశవ్యాప్తంగా స్కూళ్లు మూసేశారు. సమీప బహ్రెయిన్, ఒమన్, ఖతార్, సౌదీ అరేబియాల్లోనూ వర్షాలు కురిశాయి. భారీ వర్షాల కారణంగా జరిగిన ఆస్తినష్టాల వివరాలను ప్రభుత్వం బయటపెట్టలేదు. వర్షాల కారణంగా భారత్ నుంచి దుబాయ్కు విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అయితే మేఘమథనం వల్లే ఈ వర్షాలు కురిశాయని నిపుణుల అంచనా. -
Dubai Floods: భారీ వర్షాల ఎఫెక్ట్.. 28 విమానాల రద్దు
పశ్చిమాసియాలో ప్రధాన ఆర్థిక కేంద్రమైన దుబాయ్ను భారీ వర్షాలు ముంచెత్తాయి. మంగళవారం కురిసిన కుండపోత వర్షాలతో నగరం అల్లకల్లోలంగా మారింది. భారీ వర్షానికి రోడ్లన్నీ జలమయంగా మారాయి. నివాస స్థలాలు, రోడ్లు, రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాలు.. ఇలా ప్రతి చోట వరద బీభత్సం సృష్టించింది. ఆ దేశ చరిత్రలో ఇదే అతిపెద్ద కుంభవృష్టి అని అధికారిక వర్గాలు చెబుతున్నాయి. వరద నీరు భారీగా చేరడంతో రోడ్లపై కార్లు ఎక్కడికక్కడా నిలిచిపోయాయి. కార్లు సగం నీటితో మునిగిపోయిన దృశ్యాలు సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి. ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులో వరద చేరి విమానాలరాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రన్వేపై మోకాలిలోతు నీరు ఉండటంతో ఇక్కడికి వచ్చే విమానాలనుని దారిమళ్లిస్తున్నారు. వర్షాల కారణంగా దుబాయ్ నుంచి వచ్చేవి, వేళ్లే విమానాలు మిఒత్తం 500కి పైగా రద్దయ్యాయి. మరికొన్నింటిని దారి మళ్లీంచారు. అత్యవసరమైతే తప్ప విమానాశ్రయానికి రావద్దని ప్రయాణికులను అధికారులు హెచ్చరించారు కఠిన సవాళ్లను ఎదుర్కొంటూ వీలైనంత త్వరగా ఎయిర్పోర్టులో కార్యకలాపాలను పునరుద్ధరించడానికి తాము ప్రయత్నిస్తున్నట్లు దుబాయ్ విమానాశ్రయ అధికార ప్రతినిధి పేర్కొన్నారు. భారత్-దుబాయ్ మధ్య 28 విమానాలు రద్దయ్యాయి. ఈ మేరకు భార పౌర విమానాయనశాఖ తెలిపింది.వీటిలో భారత్ నుంచి దుబాయ్ వెళ్లేవి 15 కాగా, అక్కడి నుంచి వచ్చే 13 విమానాలను రద్దు చేసినట్లు తెలిపారు. మరికొన్ని విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయని వెల్లడించారు. దీనిపై ఎప్పటికప్పుడు ప్రయాణికులకు సమాచారం ఇస్తున్నట్లు పేర్కొన్నారు. -
ఢిల్లీని వణికిస్తున్న చలిగాలులు
ఢిల్లీ: దేశ రాజధానిని చలి, పొగమంచు వణికిస్తున్నాయి. కనిష్ట ఉష్ణోగ్రతలు 8 డిగ్రీలకు పడిపోయాయి. చలిగాలులు వీస్తుండటంతో గురువారం ఢిల్లీ, పరిసర రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు అలుముకుంది. దీంతో విమానాలు, రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. మరో కొన్ని రోజుల పాటు ఇదే పరిస్థితులు కొనసాగే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) తెలిపింది. భారత వాతావరణ శాఖ ప్రకారం.. ఈ రోజు ఉదయం 5.30 గంటలకు పంజాబ్, హర్యానా, పశ్చిమ రాజస్థాన్, బిహార్లోని పలు ప్రాంతాల్లో చాలా దట్టమైన పొగమంచు కనిపించింది. దేశ రాజధాని గత నెల రోజులుగా తీవ్రమైన చలిగాలులతో అల్లాడిపోతోంది. కనిష్ట ఉష్ణోగ్రతలు దాదాపు సింగిల్ డిజిట్కు పడిపోతున్నాయి. పొగమంచు దట్టంగా కమ్ముకోవడంతో దృశ్యమానత(విజిబిలిటీ) 50 మీటర్లకు పడిపోయింది. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, ఒడిశా, అస్సాంలోని పలు ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు కమ్ముకుంది. సబ్-హిమాలయన్ పశ్చిమ బెంగాల్లోని పలు ప్రాంతాల్లో మోస్తరు పొగమంచు కనిపించిందని ఐఎండీ తెలిపింది. ఇదీ చదవండి: ఆ రోజు కోర్టులకు సెలవు ఇవ్వండి.. సీజేఐకి లేఖ -
Vishaka: విమానాలు రద్దు.. ప్రయాణికుల ఆందోళన
సాక్షి, విశాఖపట్నం: ప్రతికూల వాతావరణం కారణంగా విశాఖ విమానాశ్రయంలో ఆదివారం ఉదయం నుంచి పలు విమాన సర్వీసులు రద్దయ్యాయి. విశాఖకు వచ్చేవి, విశాఖ నుంచి వెళ్లే సర్వీసులు రద్దు కావడంతో పండగపూట గమ్యస్థానానికి చేరుకోలేక ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. విశాఖ నుంచి ఢిల్లీ వెళ్లే ఇండిగో, ఢిల్లీ ఎయిర్ఇండియా, విజయవాడ ముంబయి,హైదరాబాద్, చెన్నై,ఇండిగో, ఎయిర్ఇండియా,విమానాలు రద్దయ్యాయి. ఒక్కసారిగా వాతావరణం మారి పొగ మంచు ఏర్పడటం వల్లే విమానాలు రద్దు చేసినట్లు అధికారులు చెబుతున్నారు. పండగ రోజు తమను గమ్యస్థానాలకు వెళ్లకుండా చేశారని ప్రయాణికులు ఇండిగో, ఎయిర్ఇండియా విమాన సంస్థల అధికారులతో ప్రయాణికులు వాగ్వాదానికి దిగారు. తమకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. ఇదీచదవండి.. చెన్నై వెళ్లే విమానాల దారి మళ్లింపు -
London: లూటన్ ఎయిర్పోర్టులో భారీ అగ్ని ప్రమాదం
లండన్: లండన్లోని ఎయిర్పోర్టులో భారీ అగ్ని ప్రమాద ఘటన చోటుచేసుకుంది. లండన్లోని లూటన్ విమానాశ్రయంలో ఉన్న కారు పార్కింగ్ ఏరియాలో మంటలు పెద్ద ఎత్తున మంటలు వ్యాప్తించాయి. దీంతో, అప్రమత్తమైన అధికారులు.. విమానాశ్రయంలో రాకపోకలను నిలివేశారు. ఈ మేరకు ప్రయాణికులకు సమాచారం అందించినట్టు అధికారులు తెలిపారు. వివరాల ప్రకారం.. లండన్లోని లూటన్ విమానాశ్రయంలో మంగళవారం అర్ధరాత్రి భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఎయిర్పోర్టులోని కారు పార్కింగ్ ఏరియాలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అర్ధరాత్రి వేళ మంటల కారణంగా విమానాశ్రయ పరిసర ప్రాంతాల్లో దట్టమైన పొగ వ్యాపించింది. అగ్ని ప్రమాదం సమాచారం అందుకున్న వెంటనే ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. అయితే, దట్టమైన పొగను పీల్చుకున్న కొందరు ప్రయాణికులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో, వారిని వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. Flight operations suspended at London Luton Airport due to fire, passengers asked to stay away. All flights have been suspended until Wednesday afternoon. #khaleejtimes #fire #london #lutonairport https://t.co/XChyrDTHhZ pic.twitter.com/AqgDUlBdMv — Khaleej Times (@khaleejtimes) October 11, 2023 ఇక, అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో పార్కింగ్ ఏరియాలో దాదాపు 1200 వాహనాలు నిలిచి ఉన్నాయి. వీటిలో ఎక్కువగా ఈవీ కార్లు ఉన్నట్టు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో పార్కింగ్ భవనం దెబ్బతిన్నట్టు అధికారులు తెలిపారు. ఈ ప్రమాదం కారణంగా ప్రయాణికులు, సిబ్బంది భద్రత మేరకు నేటి (అక్టోబరు 11) నుంచి రేపు(అక్టోబర్ 12) మధ్యాహ్నం వరకు విమానాల రాకపోకలను నిలిపివేస్తున్నట్లు ఎయిర్పోర్టు అధికారులు వెల్లడించారు. కాగా, విమానాలను నిలిపివేయడంతో ప్రయాణికులంతా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ❗️Massive fire breaks out at London’s Luton Airport, dozens of cars destroyed. pic.twitter.com/qtBrKOQjJT — Action And Laughs 🚀 (@Drawingart111) October 11, 2023 ఇది కూడా చదవండి: ఇజ్రాయెల్ వార్ వేళ పుతిన్ షాకింగ్ కామెంట్స్.. యూఎస్ను టార్గెట్ చేసి.. -
కర్ణాటక బంద్ ఎఫెక్ట్: స్కూల్స్ మూసివేత.. 44 విమానాలు రద్దు
సాక్షి, చెన్నై: కావేరి జలాల సమస్య కారణంగా కర్ణాటక రాష్ట్రంలో శుక్రవారం బంద్ కొనసాగుతోది. పొరుగున్న ఉన్న తమిళనాడుకు కావేరి నీటి విడుదల చేయాలని కావేరీ వాటర్ మేనేజ్ మెంట్ అధారిటీ (CWMA) కర్ణాటక ప్రభుత్వాన్ని ఆదేశించడాన్ని వ్యతిరేకిస్తూ కన్నడ ఒక్కూట రాష్ట్ర బంద్కు పిలుపునిచ్చింది. ఇందుకు దాదాపు 1900 కన్నడ సంఘాలు మద్దతు తెలిపాయి. వీటిలో హోటళ్లు, సినీరంగం, ప్రైవేటు క్యాబ్లు, ఆటో సంఘాలు, ప్రైవేటు విద్యాసంఘాలు ఉన్నాయి. బంద్లో భాగంగా నిరసనల్లో పాల్గొన్న వివిధ సంఘాలకు చెందిన 60 మంది ఆందోళనకారులను కర్ణాటక పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బంద్ ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు చేపట్టామని బెంగళూరు రూరల్ ఏఎస్పీ మల్లికారంరోజున బాలదండి పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగుకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కర్ణాటక బంద్ ఎఫెక్ట్ కెంపేగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుపై పడింది. బంద్ కారణంగా రవాణా సౌకర్యాలు దెబ్బతినడంతో శుక్రవారం ప్రయాణించాల్సిన ఏకంగా 44 విమానాలు రద్దు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. వీటిలో 22 విమానాలు బెంగుళూరులో ల్యాండ్ అయ్యేవి కాగా మరో 22 విమానాలు ఇక్కడి నుంచి టేకాఫ్ కావాల్సినవి ఉన్నాయి. ప్రయాణికులకు సకాలంలో సమాచారం అందించడం ద్వారా వారు తమ టికెట్లను రద్దు చేసుకున్నట్లు పేర్కొన్నారు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు బంద్ ప్రభావం కొనసాగనుంది. బెంగళూరు నగరంలో పోలీసులు సెక్షన్ 144 విధించారు. ప్రజలు గుంపులుగా బయటకు వచ్చి ర్యాలీలు, నిరసనలు చేపట్టకూడదని, అయిదుగురు కంటే ఎక్కువ మంది సమావేశాలు నిర్వహించరాదని తెలిపారు. 1,900కు పైగా సంఘాలు బంద్కు మద్దతు తెలిపాయి. బెంగళూరుతో సహా రాష్ట్రంలో కిరాణా దుకాణాలు, ఇతర షాప్లను మూసేశారు. అయితే ఆసుపత్రులు, అంబులెన్స్లు, ఫార్మసీలు వంటి అత్యవసర సేవలు కొనసాగుతున్నాయి. Karnataka Bandh: Section 144 Imposed in Mandya District; Schools, Colleges Closed#BNN #Newsupdate #Dailynews #Breakingnews #India #KarnatakaBandh #CauveryIssue #Bengaluru #Cauveryrow #Karnataka #WATCH pic.twitter.com/XxoBNFwLni — Rafia Tasleem (@rafia_tasleem) September 29, 2023 బెంగళూరులో మెట్రో సర్వీసులు యథావిధిగా నడవనున్నాయి. మెట్రో స్టేషన్ల వద్ద ఎలాంటి అల్లర్లు జరగకుండా అధికారులు భద్రతను కట్టుదిట్టం చేశారు. కర్ణాటక బంద్ దృష్ట్యా బెంగళూరులోని అన్ని పాఠశాలలు, కళాశాలలకు బెంగళూరు డిప్యూటీ కమిషనర్ దయానంద కేఏ సెలవు ప్రకటించారు. అనేక విశ్వవిద్యాలయాల్లో పరీక్షలను వాయిదా వేశారు. కాగా బంద్తో సంబంధం లేకుండా రాష్ట్ర రవాణ బస్సులు, బీఎంటీసీ బస్సులు నడవనున్నాయి. అయితే తమిళనాడు వైపు వెళ్లే బస్సులు నడవకపోవచ్చని, పరిస్థితిని బట్టి మారుతుంటాయని అధికారులు పేర్కొన్నారు. బెంగళూరులోని ప్రధాన రహదారులపై, ముఖ్యంగా సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్లో భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పాడే అవకాశం ఉందన్నారు. Actor #Siddharth was forced to leave a press conference he was attending of #Tamil movie "#Chiththa" on #September 28, due to angry #protestors over the #Cauverywater dispute. pic.twitter.com/qviXRWcgLM — Madhuri Adnal (@madhuriadnal) September 28, 2023 ఓలా ఉబర్ వంట క్యాబ్ యాజమాన్యాలు బంద్కు మద్దతునిచ్చాయి. ర్యాలీలో పాల్గొనాలని భావించాయి. ఆటో, రక్షా సంఘాలు కూడా సంఘీభావం తెలిపాయి. 32 ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ యూనియన్లకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఫెడరేషన్ ఆఫ్ కర్ణాటక స్టేట్ ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ కర్ణాటక బంద్కు మద్దతు ఇవ్వాలని నిర్ణయించింది. కర్ణాటక హోటల్ ఓనర్స్ అసోసియేషన్ రాష్ట్రవ్యాప్తంగా తన కార్యకలాపాలను మూసివేయాలని నిర్ణయించింది. ఇక శుక్రవారం సాయంత్రం 6 గంటల వరకు ఎలాంటి సినిమాలను ప్రదర్శించబోమని కర్ణాటక ఫిల్మ్ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. -
2,600లకు పైగా విమానాలు రద్దు.. ప్రయాణికులకు ఎయిర్లైన్స్ విజ్ఞప్తులు
అమెరికాలో భారీ వర్షాలు, పిడుగుల కారణంగా ఆదివారం(జులై 16) 2,600లకు పైగా విమానాలు రద్దయ్యాయి. సుమారు 8 వేల విమానాలు ఆలస్యంగా నడిచాయి. ఈ మేరకు ఏబీసీ న్యూస్ వార్తా సంస్థ పేర్కొంది. ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్ఏఏ) ప్రకారం అత్యధికంగా ఈశాన్య ప్రాంతంలోనే రద్దయ్యాయి. ఒక్క న్యూజెర్సీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచే 350 కిపైగా విమానాలు రద్దయినట్లు ఎన్బీసీ న్యూస్ నివేదించింది. తీవ్ర ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా న్యూయార్క్లోని జాన్ ఎఫ్ కెన్నడీ ఎయిర్పోర్ట్, లా గార్డియన్ విమానాశ్రయాలు కూడా స్తంభించినట్లు పేర్కొంది. ఇదీ చదవండి ➤ ఆకాశంలో ఉండగా.. ఎయిరిండియా విమానంలో కలకలం ప్రతికూల వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ఎయిర్పోర్ట్కు వచ్చే ముందే ఫ్లయిట్ టైమింగ్, వాతావరణ పరిస్థితులను సరిచూసుకోవాలని ఎయిర్లైన్స్ సంస్థలు ప్రయాణికులకు ట్విటర్ ద్వారా విజ్ఞప్తులు చేశాయి. కాగా ఆ దేశంలోని ఈశాన్య రాష్ట్రాలను భారీ వర్షాలు, వరదలు ముంచెత్తుతున్నాయి. న్యూయార్క్, న్యూజెర్సీ, కనెక్టికట్, పెన్సిల్వేనియా, మసాచుసెట్స్, వెర్మాంట్ ప్రాంతాల్లో వరద హెచ్చరికలు జారీ అయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో ప్రాణాంతక వరదలు సైతం నమోదైనట్లు నేషనల్ వెదర్ సర్వీస్ పేర్కొంది. ఇది ఇలా ఉంటే, రికార్డు స్థాయి ఉష్ణోగ్రతల కారణంగా ఆ దేశంలోని కొన్ని పశ్చిమ, దక్షిణ ప్రాంతాల్లో వడ గాల్పుల హెచ్చరికలు జారీ చేశారు. నైరుతి, పశ్చిమ గల్ఫ్ కోస్ట్, దక్షిణ ఫ్లోరిడాలోని కొన్ని ప్రాంతాలలో తీవ్ర ఉష్ణోగ్రతలు బెంబేలెత్తిస్తున్నాయి. రాబోయే వారంలో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని ఎన్డబ్ల్యూఎస్ హెచ్చరించింది. -
అమెరికాలో మంచు వడగండ్ల వాన
ఆస్టిన్/న్యూయార్క్: అమెరికాలోని దక్షిణాది రాష్ట్రాల్లో మూడు రోజులుగా అతిశీతల పరిస్థితులు కొనసాగుతున్నాయి. టెక్సాస్ మొదలుకొని వెస్ట్ వర్జీనియా వరకు భారీగా కురిసిన మంచు వడగండ్ల వానతో జనజీవనానికి తీవ్ర అంతరాయం ఏర్పడింది. రహదారులపై వాహనాల రాకపోకలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. మంచు వాన కారణంగా జరిగిన ప్రమాదాల్లో ఆరుగురు చనిపోయారు. వాహనదారులు రోడ్లపైకి వెళ్లవద్దంటూ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. బుధవారం ఉదయం 1,400 విమాన సర్వీసులు రద్దయ్యాయి. డల్లాస్, ఆస్టిస్, టెక్సాస్, నాష్విల్లె, టెన్నెస్సీ విమానాశ్రయాల్లో విమానాలు నిలిచిపోయాయి. ప్రమాదకర అతిశీతల వాతావరణంతో డల్లాస్, మెంఫిస్, టెన్నెస్సీల్లో స్కూళ్లు మూతబడ్డాయి. లక్షలాది మంది విద్యార్థులు ఇళ్లకే పరిమితమయ్యారు. అర్కాన్సస్లో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. న్యూయార్క్లో అసాధారణం న్యూయార్క్ వాసులు ఏటా డిసెంబర్– జనవరి ఆఖరు వరకు కురిసే మంచులో స్లెడ్జిలపై తిరుగుతూ, స్నోబాల్స్తో కొట్లాడుతూ ఎంజాయ్ చేసేవారు. కానీ, ఈసారి.. దాదాపు 50 ఏళ్ల తర్వాత అలాంటి పరిస్థితులు కనిపించకుండా పోయాయి. గడిచిన 325 రోజుల్లో నగరంలో ఒక్కసారైనా అరంగుళం మంచు కూడా పడలేదని స్థానికులు విచారం వ్యక్తం చేస్తున్నారు. 1973 తర్వాత ఇలాంటి పరిస్థితులు ఏర్పడటం ఇదే మొదటిసారని వాతావరణ శాస్త్రవేత్తలు అన్నారు. వరుసగా 332 రోజులు అతి తక్కువ మంచుకురిసిన 2020 నాటి రికార్డు త్వరలో బద్దలు కానుందని కూడా చెప్పారు. ఏడాదికి సరాసరిన 120 అంగుళాల మంచు కురిసే సిరాక్యూస్లో ఈసారి 25 అంగుళాలు మాత్రమే నమోదైంది. రొచెస్టర్, బఫెల్లోలోనూ దాదాపు ఇవే పరిస్థితులున్నాయి. ఉటాహ్లోని వెల్స్విల్లెలో మంచును తొలగిస్తున్న ఓ వ్యక్తి -
మంచు గుప్పెట్లోనే అమెరికా.. ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో పతనం
బఫెలో: అమెరికాలో మంచు తుఫాను బీభత్సం కొనసాగుతూనే ఉంది. ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో పతనమవుతున్నాయి. అత్యంత ప్రతికూల వాతావరణ పరిస్థితుల మధ్యే పౌరులు క్రిస్మస్ సంబరాలు జరుపుకుంటున్నారు. న్యూయార్క్ తదితర రాష్ట్రాల్లో పరిస్థితి దారుణంగా ఉంది. ఇంత దారుణమైన వాతావరణ పరిస్థితులను రాష్ట్ర చరిత్రలోనే ఎన్నడూ చూడలేదని న్యూయార్క్వాసులు చెబుతున్నారు. బఫెలో తదితర చోట్ల హరికేన్లను తలపించే గాలులు ప్రజల కష్టాలను రెట్టింపు చేస్తున్నాయి. రోడ్లు, రన్వేలపై ఏకంగా 50 అంగుళాలకు పైగా మంచు పేరుకుపోయింది. దాంతో పలు విమానాశ్రయాలను రెండు రోజుల పాటు మూసేశారు. శని, ఆదివారాల్లో కూడా వేలాది విమానాలు రద్దయ్యాయి. దేశవ్యాప్తంగా కరెంటు సరఫరాలో అంతరాయాలు వరుసగా మూడో రోజూ కొనసాగాయి. అయితే పలుచోట్ల పరిస్థితిని అధికారులు క్రమంగా చక్కదిద్దుతున్నారు. బహుశా ఒకట్రెండు రోజుల్లో పరిస్థితులు కాస్త మెరుగు పడొచ్చని భావిస్తున్నారు. -
చెన్నైలో భారీ వర్షాలు.. హైదారాబాద్, కర్నూల్ సహా 8 విమానాలు రద్దు
చెన్నై: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తమిళనాడు రాజధాని చెన్నై సహా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండటంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. చెన్నై వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఈ క్రమంలో వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోవటంతో మదురై, హైదరాబాద్, కర్నూలు సహా వివిధ ప్రాంతాలకు వెళ్లాల్సిన 8 విమానాలు రద్దయ్యాయి. మరోవైపు.. చెన్నై డొమెస్టిక్ టెర్మినల్ నుంచి వెళ్లాల్సిన పలు సర్వీసులు నిలిపివేశారు. చెన్నై నుంచి ఫ్రాంక్ఫర్ట్, శ్రీలంక, పారిస్, దోహా, షార్జా, దుబాయ్, అండమాన్లకు వెళ్లే విమానాలు కూడా ఒక గంట ఆలస్యంగా నడిచాయి. వర్షం కారణంగా విమాన సర్వీసులను రీషెడ్యూల్ చేయడంతో ఎలాంటి ప్రభావం లేదని అధికారులు తెలిపారు. ప్రయాణికులకు ఆలస్యంగా సమాచారం అందించామని వెల్లడించారు. ఇదీ చదవండి: తమిళనాడులో కుండపోత.. నిండుకుండలా చెన్నై.. సెలవు ప్రకటన.. హెచ్చరికలు -
కుక్కకాటుకి చెప్పు దెబ్బ.. చైనాకి అమెరికా సమాధానం ఇది
America Vs China Flight Fight: బయటి దేశాల పౌరులు తమ దేశంలోకి అడుగుపెట్టే విషయంపై చైనా కఠినమైన నియంత్రణల్ని అవలంభిస్తోంది. విమానాల సర్వీసుల్ని తగ్గించడంతో పాటు ‘‘సర్క్యూట్ బ్రేకర్’’ విధానం ప్రవేశపెట్టింది. ఈ విధానం ప్రకారం.. ఎక్కువ ఇన్ఫెక్షన్ కేసులు వస్తాయని భావించే రూట్లో విమానాల్ని నిలిపివేస్తోంది. తద్వారా అమెరికాను టార్గెట్ చేయగా.. ఇప్పుడు చైనాకి కుక్కకాటుకి చెప్పు దెబ్బ పడింది. అమెరికా నుంచి ఎక్కువ కేసులు వస్తున్నాయని ప్రకటించిన చైనా పౌర విమానయాన సంస్థ ఈ మేరకు.. అమెరికన్, డెల్టా, యునైటెడ్ ఎయిర్లైన్స్ విమానాల్ని రద్దు చేసింది. టేకాఫ్కు ముందు ఈ విమానాల్లో ప్రయాణించిన వాళ్లకు నెగెటివ్ ఉందని, తీరా చైనాకి చేరుకున్నాక పాజిటివ్ వచ్చిందని చైనా ఏవియేషన్ ప్రకటించడంపై దుమారం రేగింది. ఈ మేరకు కొవిడ్ ప్రొటోకాల్స్లో అమెరికన్లను చేర్చిన నిర్ణయం వెలువడ్డాక.. అమెరికా ప్రభుత్వం నుంచి వెంటనే కౌంటర్ వస్తుందని అంతా భావించారు. కానీ, రోజులు గడిచినా అలా జరగలేదు. ఈ క్రమంలో శుక్రవారం అమెరికా నుంచి బీజింగ్కు వెళ్లాల్సిన 44 విమానాల్ని రద్దు చేస్తున్నట్లు ఆఘమేఘాల మీద ఉత్తర్వులు జారీ చేసి ఆశ్చర్యపర్చింది. ఎయిర్ చైనా, చైనా ఈస్ట్రన్ ఎయిర్లైన్స్, చైనా సదరన్ ఎయిర్లైన్స్, గ్జియామెన్ ఎయిర్లైన్స్.. విమానాల్ని కొంతకాలం పాటు రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ‘‘డెల్టా, అమెరికన్, యునైటెడ్ ఎయిర్లైన్స్ కార్యకలాపాలను దెబ్బతీసే చర్యలు ప్రజా ప్రయోజనాలకు ప్రతికూలమైనవి. అస్థిరమైన చర్యల్ని చూస్తూ ఊరుకోబోం’ అని ప్రకటనలో పేర్కొంది The US Department of Transportation. అంతేకాదు చైనీస్ రెగ్యులేషన్స్ పాటిస్తూ.. పాజిటివ్ బారిన పడ్డ US క్యారియర్లకు ఎలాంటి జరిమానా విధించబడదని ప్రకటిస్తూ.. చైనా ఆదేశాలకు గట్టికౌంటర్ ఇచ్చింది. ఈ మేరకు విమానాల నిషేధం జనవరి 30 నుంచి మార్చి 29 వరకు వర్తిస్తుందని పేర్కొంది. మరోవైపు చైనా ఏవియేషన్.. డిసెంబర్ 31 నుంచి అమెరికాకు చెందిన విమాన సర్వీసులపై నిషేధం విధించగా.. ఇప్పుడు అమెరికా కౌంటర్కు దిగింది. అమెరికా తాజా చర్యపై చైనా రాయబారి ప్రతినిధి Liu Pengyu వాషింగ్టన్లో మాట్లాడుతూ.. అసంతృప్తి వ్యక్తం చేశారు. మిగతా దేశాలకు ఒకలా.. చైనాకు ఒకలా నిర్ణయం తీసుకోవడంపై అసహనం వ్యక్తం చేశారు. అయితే చైనా విషయంలోనే కాదు.. జర్మనీ, ఫ్రాన్స్ విషయంలో అమెరికా రవాణా విభాగం ఇదే పంథా పాటిస్తోందని ఎయిర్లైన్స్ ఫర్ అమెరికా చెబోతోంది. వింటర్ ఒలింపిక్స్ మూడు వారాల ముందుగా చోటు చేసుకున్న ఫ్లైట్ ఫైట్ పరిణామం ఆసక్తికర చర్చకు దారితీసింది. ఇదిలా ఉంటే చైనాలో కరోనా విజృంభణతో బీజింగ్ నుంచి వేల కొద్దీ విమానాలు రద్దైన సంగతి తెలిసిందే. చదవండి: చైనాలో కొవిడ్ నిబంధనల పైశాచికం.. ఎంత దారుణమో తెలుసా? -
అమెరికాను వణికిస్తున్న ఇజ్జీ.. 1,200 విమానాలు రద్దు
అట్లాంటా: అమెరికా ఆగ్నేయ ప్రాంతాన్ని చలి తుఫాను, పెనుగాలులు, హిమపాతం వణికిస్తున్నాయి. వీటి ప్రభావంతో చాలాచోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయాలు, వృక్షాలు నేలకూలడం, రోడ్లన్నీ మంచుతో నిండిపోవడం జరుగుతోంది. జార్జియా, ఉత్తర కరోలినా, దక్షిణ కరోలినా, ఫ్లోరిడా తదితర ప్రాంతాలన్నీ ఆదివారం నుంచి చలిపులి చేతికి చిక్కి వణుకుతున్నాయి. పలు ప్రాంతాల్లో రోడ్డు ప్రమాదాలు జరిగినట్లు హైవే పెట్రోల్ అధికారులు తెలిపారు. (చదవండి: లైన్లో నిలబడితే డబ్బులే డబ్బులు.. గంటకు రూ.2 వేలు పక్కా!) కారును మంచు కప్పేసిన దృశ్యం ఫ్లోరిడాలో గంటకు 190 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులతో విరుచుకుపడ్డ టోర్నడో బీభత్సంతో ఒక ట్రైలర్ పార్క్ నాశనమైంది. చార్లట్ డగ్లస్ విమానాశ్రయం నుంచి 1,200కు పైగా విమానాలను రద్దు చేశారు. కరోలినాలో దాదాపు 1.5 లక్షల మంది ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. న్యూయార్క్ పై ప్రభావం ఉండకపోయినా, లాంగ్ ఐలాండ్, కనెక్టికట్ తీరప్రాంతాల్లో ప్రభావం ఉంటుందని అంచనా. ఒహాయో, పెన్సిల్వేనియాల్లో 6– 13 అంగుళాల మేర హిమపాతం ఉండొచ్చని వాతావరణ శాఖ తెలిపింది. (చదవండి: అఫ్గనిస్తాన్లో భారీ భూకంపం.. 26 మంది మృతి) -
జూన్ 21 వరకు భారత విమానాలపై నిషేధం
ఒట్టావా: భారత్, పాకిస్తాన్ల నుంచి వచ్చే ప్రయాణికుల విమానాలపై నిషేధాన్ని నెల రోజుల పాటు పొడిగిస్తున్నట్లు కెనడా ప్రభుత్వం ప్రకటించింది. జూన్ 21 వరకూ ఈ నిషేధం కొనసాగుతుందని, అప్పటి వరకూ భారత్, పాక్ల నుంచి డైరెక్టు విమానాలు ఉండవంది. కరోనా వ్యాప్తిని అరికట్టే చర్యల్లో భాగంగానే నిషేధం పొడిగించినట్లు పేర్కొంది. అయితే ఈ ఇరు దేశాల ప్రజలు ఏదైనా మూడో దేశం మీదుగా తమ దేశంలోకి చేరుకోవడానికి మాత్రం అనుమతి ఇచ్చింది. ఇందుకుగానూ కోవిడ్ నెగెటివ్ సర్టిఫికెట్ను చూపించాల్సి ఉంటుంది. అత్యవసర వస్తువులు, వ్యాక్సిన్లు, ఇతర మెడికల్ సంబంధమైన వాటిని రవాణా చేసేందుకుగానూ కార్గో ఫ్లైట్లు తిరుగుతాయని స్పష్టం చేసింది. ప్రజల ప్రాణాలను కాపాడటం ప్రభుత్వం బాధ్యత అని అందుకే నిషేధం పొడిగించినట్లు ఆ దేశ రవాణా శాఖ మంత్రి ఒమర్ అల్ఘాబ్రా చెప్పారు. వాస్తవానికి ఏప్రిల్ 22న విధించిన 30 రోజుల నిషేధం ఈ నెల 22తో ముగియనున్న నేపథ్యంలో కెనడా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. -
శంషాబాద్లో 30 విమాన సర్వీసులు రద్దు
సాక్షి, శంషాబాద్ రూరల్: శంషాబాద్లోని రాజీవ్గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి వివిధ నగరాలకు వెళ్లాల్సిన పలు దేశీయ విమాన సర్వీసులు శుక్రవారం అర్ధరాత్రి నుంచి రద్దయ్యాయి. కోవిడ్ సెకండ్ వేవ్ ఉధృతి నేపథ్యంలో వివిధ నగరాల్లో ప్రయాణికులపై ఆంక్షలు ఉన్నం దున ఈ నిర్ణయం తీసుకున్నట్లు విమానాశ్రయ వర్గాలు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి వచ్చే వారు 14 రోజుల పాటు క్వారంటైన్లో ఉండాలని ఇతర రాష్ట్రాలు షరతులు విధిస్తున్న నేపథ్యంలో ప్రయాణికులు తమ షెడ్యూల్ను వాయిదా వేసుకుంటున్నారు. నైట్ కర్ఫ్యూ సందర్భంగా రాకపోకలకూ ఇబ్బందులు తలెత్తుతున్న నేపథ్యంలో ఎయిర్పోర్ట్లకు ప్రయాణికులు తగ్గిపోయారు. ఈ కారణాలతో హైదరాబాద్ నుంచి ఢిల్లీ, ముంబై, గోవా, çపుణే, చెన్నై తదితర నగరాలకు వెళ్లే సుమారు 30 విమాన సర్వీసులు నిలిచిపోయినట్లు పేర్కొన్నారు. చదవండి: (తెలంగాణలో రెండు వారాల్లో లక్ష కేసులు) -
ప్రపంచ అథ్లెటిక్స్ రిలే టోర్నీకి భారత్ దూరం
న్యూఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్ క్వాలిఫయింగ్ ఈవెంట్ అయిన ప్రపంచ అథ్లెటిక్స్ రిలే టోర్నమెంట్ నుంచి భారత అథ్లెటిక్స్ జట్టు వైదొలిగింది. పోలాండ్లోని సిలెసియా నగరంలో మే 1, 2 తేదీల్లో ఈ టోర్నీ జరుగుతుంది. భారత మహిళల 4గీ100 మీటర్ల రిలే, పురుషుల 4గీ400 మీటర్ల రిలే జట్టు సభ్యుల కోసం భారత అథ్లెటిక్స్ సమాఖ్య (ఏఎఫ్ఐ) నెదర్లాండ్స్కు చెందిన కేఎల్ఎమ్ రాయల్ డచ్ ఎయిర్లైన్స్ ద్వారా గురువారం ఉదయం న్యూఢిల్లీ నుంచి అమ్స్టర్డామ్ వరకు విమానం టికెట్లను బుక్ చేసింది. అమ్స్టర్డామ్ నుంచి కనెక్టింగ్ ఫ్లయిట్లో భారత జట్లు పోలాండ్కు వెళ్లాల్సింది. అయితే కరోనా కల్లోల పరిస్థితుల నేపథ్యంలో భారత్ నుంచి తమ దేశానికి వచ్చే విమానాలను నెదర్లాండ్స్ ప్రభుత్వం సోమవారం రాత్రి నుంచి రద్దు చేసింది. భారత్ నుంచి నేరుగా పోలాండ్కు విమానాలు లేకపోవడంతో ఏఎఫ్ఐ ముందుగా అమ్స్టర్డామ్కు టికెట్లు బుక్ చేసి అక్కడి నుంచి పోలాండ్కు పంపించే ఏర్పాట్లు చేసింది. ‘యూరప్లోని ఇతర నగరాల నుంచి పోలాండ్కు వెళ్లేందుకు ఏమైనా ఫ్లయిట్స్ ఉన్నాయా అని తీవ్రంగా ప్రయత్నించాం. కానీ ఎలాంటి ఫలితం కనిపించలేదు. దాంతో ఈ టోర్నీ నుంచి భారత జట్లు వైదొలగక తప్పలేదు’ అని ఏఎఫ్ఐ అధ్యక్షుడు అదిలె సుమరివల్లా తెలిపారు. భారత మహిళల 4గీ100 రిలే జట్టులో హిమ దాస్, ద్యుతీ చంద్, ధనలక్ష్మీ, అర్చన, ధనేశ్వరి, హిమశ్రీ రాయ్ సభ్యులుగా ఉన్నారు. వరల్డ్ రిలే టోర్నీలో టాప్–8 లో నిలిచిన జట్లు ఒలింపిక్స్కు అర్హత సాధిస్తాయి. -
30కి పైగా దేశాల్లో కొత్త స్ట్రెయిన్
న్యూఢిల్లీ: 2020 చివర్లో యూకేలో గుర్తించిన కరోనా కొత్త స్ట్రెయిన్ వేగంగా ప్రపంచ దేశాలకు విస్తరిస్తోంది. తాజాగా శనివారం వియత్నాంలో ఈ స్ట్రెయిన్ను గుర్తించారు. దాంతో తక్షణమే అంతర్జాతీయ విమాన రాకపోకలపై ఆ దేశం నిషేధం విధించింది. ఇప్పటివరకు దాదాపు 30కి పైగా దేశాల్లో ఈ కొత్త వైరస్ ప్రకంపనలను సృష్టిస్తోంది. వేగంగా వ్యాప్తి చెందే లక్షణం కారణంగా.. ఈ వైరస్పై అత్యంత అప్రమత్తత అవసరమని వైద్యులు సూచిస్తున్నారు. ఈ స్ట్రెయిన్ కారణంగా యూకేలో కేసుల సంఖ్య గణనీయంగా పెరగడం, దాంతో, అక్కడ కఠిన ఆంక్షలను అమలు చేయడం తెలిసిందే. అమెరికాలోనూ దాదాపు 3 రాష్ట్రాల్లో ఈ స్ట్రెయిన్ను గుర్తించారు. అది మరిన్ని రాష్ట్రాలకు విస్తరించి ఉండవచ్చని భావిస్తున్నారు. ఈ వైరస్ స్ట్రెయిన్ వేగంగా వ్యాప్తి చెందుతుందే కానీ, గత వైరస్ కన్నా ఎక్కువ ప్రాణాంతకం కాదని వైద్యులు చెబుతున్నారు. అలాగే, ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన, త్వరలో మార్కెట్లోకి రానున్న టీకాలు ఈ వైరస్పై కూడా సమర్ధవంతంగా పనిచేస్తాయని చెబుతున్నారు. వైరస్లో జన్యు పరివర్తనాలు సహజమేనని వివరిస్తున్నారు. -
ఫ్రాన్స్కు పాకిన కొత్త కరోనా
పారిస్: ఫ్రాన్స్లో తొలిసారి కొత్తరకం కరోనా వైరస్ బయటపడినట్లు ఫ్రెంచ్ వైద్యాధికారులు నిర్ధారించారు. దీంతో బ్రిటన్ నుంచి వచ్చే విమానాల రాకపోకలపై కఠిన లాక్డౌన్ ఆంక్షలు విధించారు. ఇంగ్లండులో నివసించే ఫ్రాన్స్కి చెందిన వ్యక్తి 19న ఫ్రాన్స్కి తిరిగి వచ్చారు. ఈయనకు పరీక్షలు జరపగా కొత్తరకం కరోనా వైరస్ సోకినట్లు తేలింది. ఇతర యూరోపియన్ దేశాల్లో సైతం ఈ కొత్తరకం కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. ఈ వైరస్కి అత్యంత వేగంగా విస్తరించే లక్షణం ఉన్నట్టు బ్రిటన్ అధికారులు వెల్లడించారు. బ్రిటన్లో ఈ కొత్త కరోనా వైరస్ బయటపడినట్టు 19న, ప్రకటించిన వెంటనే 40 వరకు దేశాలు బ్రిటన్ నుంచి వచ్చే విమానాలపై నిషేధం విధించాయి. ఫ్రాన్స్ సైతం బ్రిటన్నుంచి వచ్చే ప్రయాణీకులపై, కార్గోలపై రెండు రోజులు నిషేధం విధించింది. దీంతో తీవ్రమైన ట్రాఫిక్ సమస్యలు తలెత్తడంతో ఫ్రాన్స్ రాకపోకలకు అనుమతిచ్చింది. అయితే, బ్రిటన్ నుంచి వచ్చే వారికి కరోనా పరీక్షలు తప్పనిసరి చేసింది. మోడెర్నా టీకాతో వైద్యుడికి తీవ్ర అలర్జీ వాషింగ్టన్: మోడెర్నా కరోనా టీకా తీసుకున్న ఓ వైద్యుడికి తీవ్ర అలర్జీ లక్షణాలు కనిపించినట్లు న్యూయార్క్ టైమ్స్ వెల్లడించింది. బోస్టన్కు చెందిన వైద్యుడు హొస్సీన్ సదర్జాదేహ్కు అంతకు ముందే షెల్ఫిష్ అలర్జీ ఉంది. టీకా వేయించుకున్న వెంటనే మైకం కమ్మేసినట్లు, గుండె వేగంగా కొట్టుకున్నట్లు అనిపించిందని వైద్యుడు తెలిపారు. -
బ్రిటన్ విమానాలపై నిషేధం
లండన్/న్యూఢిల్లీ/వాషింగ్టన్: కొత్త రకం కరోనా వైరస్ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. మహమ్మారి ముప్పు త్వరలో తొలగిపోనుందన్న ఆశలపై నీళ్లు చల్లుతూ.. అత్యంత వేగంగా వ్యాప్తి చెందే ప్రమాదకర వైరస్గా గుర్తింపు పొంది, ప్రపంచ దేశాలను ఉలిక్కిపడేలా చేసింది. బ్రిటన్లో మొదట గుర్తించిన ఈ ‘వీయూఐ 202012/1’ వైరస్ ఇప్పటివరకు డెన్మార్క్, ఆస్ట్రేలియా, నెదర్లాండ్స్, బెల్జియం, ఇటలీ దేశాల్లోనూ అడుగుపెట్టింది. కొత్త తరహా వైరస్ అదుపు చేయలేని స్థాయిలో వ్యాపిస్తోందని ఆందోళన వ్యక్తం చేసిన బ్రిటన్.. ఆదివారం నుంచి పౌరులపై అత్యంత కఠినమైన లాక్డౌన్ ఆంక్షలను విధించింది. పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉందని బ్రిటన్ ఆరోగ్య శాఖ మంత్రి మేట్ హన్కాక్ పేర్కొన్నారు. ‘ప్రజలంతా, ముఖ్యంగా టయర్ –4 ఆంక్షలు అమల్లో ఉన్న ప్రాంతాలవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. వైరస్ తమకు కూడా సోకిందన్నట్లుగానే జాగ్రత్తలు పాటించాలి. అప్పుడే దీన్ని నియంత్రించగలం’ అని విజ్ఞప్తి చేశారు. కొత్త రకం వైరస్ 70% వేగంగా వ్యాప్తి చెందుతోందని శాస్త్రవేత్తలు తెలిపారు. అది ఎక్కువ ప్రాణాంతకం అనేందుకు ఆధారాలేవీ లభ్యం కాలేదని, టీకాకు కూడా.. గత వైరస్తో పోలిస్తే వేరుగా స్పందిస్తుందనేందుకూ ఆధారాల్లేవని వివరించారు. ఉత్తర ఐర్లాండ్ మినహా బ్రిటన్ అంతటా ఈ వైరస్ను గుర్తించారు. ముఖ్యంగా లండన్, తూర్పు ఇంగ్లండ్, ఆగ్నేయ ఇంగ్లండ్ ప్రాంతాల్లో దీని వ్యాప్తి ఎక్కువగా ఉంది. అప్రమత్తంగా ఉన్నాం కొత్త తరహా వైరస్పై ప్రభుత్వం పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉందని, దీని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ పేర్కొన్నారు. కొత్త రకం వైరస్ ముప్పుపై సోమ వారం ఆరోగ్య శాఖ అత్యవసర సమావేశం నిర్వహించింది. అనంతరం వైరస్ ముప్పుపై విలేకరులు ప్రశ్నించగా.. ‘ఇదంతా ఊహాజనితం. ఎక్కువగా ఊహించి భయాందోళనలకు గురికావద్దు. ప్రభుత్వం పూర్తి అప్రమత్తతతో ఉంది. ఆందోళన అవసరం లేదు’ అని హర్షవర్ధన్ వివరించారు. రాలేకపోతున్నారు.. బ్రిటన్ నుంచి విమానాల రాకపోకలను నిషేధిస్తూ ప్రభుత్వం తీసుకున్న ఆకస్మిక నిర్ణయంతో అక్కడి నుంచి భారత్ రావాలనుకున్న పలువురు విద్యార్థులు, ఉద్యోగులు అక్కడే చిక్కుకుపోనున్నారు. క్రిస్ట్మస్, నూతన సంవత్సర వేడుకల్లో కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొనేందుకు భారత్ రావాలని యూకేలో చదువుకుంటున్న పలువురు విద్యార్థులు ఏర్పాట్లు చేసుకున్నారు. కొందరు విద్యార్థులు టికెట్స్ కూడా బుక్ చేసుకున్నారు. ప్రభుత్వ నిర్ణయంతో భారత్కు రాలేని పరిస్థితి ఏర్పడటంతో వారు ఆవేదన చెందుతున్నారు. మరోవైపు జనవరిలో ప్రారంభమయ్యే అకడమిక్ సెషన్లో జాయిన్ అయ్యేందుకు భారత్ నుంచి బ్రిటన్ రావాలనుకుంటున్న వారికి కూడా ఏం చేయాలో తోచని పరిస్థితి ఏర్పడింది. విమానాలు రద్దు కావడంతో విమానయాన సంస్థలు కూడా టికెట్స్ను బుక్ చేసుకున్న వారికి డబ్బులు తిరిగివ్వడం కానీ, ప్రయాణ తేదీని మార్చుకోవడానికి అవకాశమివ్వడం కానీ చేస్తున్నాయి. ప్రాణాంతకం అనేందుకు ఆధారాల్లేవు కరోనా కొత్త వేరియంట్ మరింత ప్రాణాంతకం అనేందుకు ఆధారాలు లభించలేదని భారతీయ అమెరికన్ ఆరోగ్య నిపుణుడు వివేక్ మూర్తి తెలిపారు. అమెరికా కాబోయే అధ్యక్షుడు జో బైడెన్ టీమ్లో వివేక్ మూర్తి సర్జన్ జనరల్గా బాధ్యతలు తీసుకోబోతున్న విషయం తెలిసిందే. మహారాష్ట్రలో కర్ఫ్యూ కొత్త రకం కరోనా వైరస్తో మహారాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ముందు జాగ్రత్త గా రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ కార్పొరేషన్లలో రాత్రి కర్ఫ్యూ విధించాలని నిర్ణయించింది. ఈ కర్ఫ్యూ డిసెంబర్ 22 నుంచి జనవరి 5వ తేదీ దాకా అమల్లో ఉంటుంది. ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే సోమవారం అధికారులతో సమావేశమయ్యారు. తాజా పరిస్థితిపై చర్చించారు. భారత్ సహా ప్రపంచ దేశాల ఆంక్షలు తాజా వైరస్ ముప్పుపై స్పందించిన దేశాలు బ్రిటన్ నుంచి రాకపోకలను నిషేధిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. భారత్ కూడా బుధవారం నుంచి డిసెంబర్ 31 అర్ధరాత్రి వరకు యూకే నుంచి అన్ని విమానాల రాకపోకలపై నిషేధం విధించింది. బ్రిటన్ నుంచి మంగళవారం అర్ధరాత్రి లోపు భారత్ వచ్చిన విమాన ప్రయాణికులకు ఆరీ్టపీసీఆర్ పరీక్ష చేస్తామని, ఆ టెస్ట్లో ఎవరైనా కోవిడ్ పాజిటివ్గా తేలితే క్వారంటైన్కు పంపిస్తామని విమానయాన శాఖ సోమవారం ప్రకటించింది. నెగటివ్గా నిర్ధారణ అయినవారు కూడా వారం పాటు హోం క్వారంటైన్లో ఉండా లంది. ప్రయాణానికి ముందు 72 గంటల లోపు పరీక్ష చేయించుకుని, నెగెటివ్ రిపోర్ట్తో వచ్చిన ప్రయాణికులకు ఇప్పటివరకు ఎలాంటి పరీక్షలు, క్వారంటైన్లు లేకుండానే ఇంటికి పంపించేవారు. ఈ మధ్యకాలంలో బ్రిటన్ నుంచి వేరే దేశం వచ్చి, అక్కడి నుంచి భారత్ రావాలనుకుంటున్న ప్రయాణికులను కూడా అడ్డుకోవాలని అన్ని అంతర్జాతీయ విమానయాన సంస్థలను డీజీసీఏ ఆదేశించింది. లాక్డౌన్ అనంతరం కొన్ని నెలలుగా బ్రిటిష్ ఎయిర్వేస్, విస్టారా, ఎయిరిండియా, వర్జిన్ అట్లాంటిక్ సంస్థలు భారత్, బ్రిటన్ మధ్య విమాన సేవలను అందిస్తున్న విషయం తెలిసిందే. కెనడా, టర్కీ, బెల్జియం, ఇటలీ, ఇజ్రాయెల్, ఆస్ట్రియా, ఫ్రాన్స్, జర్మనీ, నెదర్లాండ్స్, బల్గేరియా దేశాలు కూడా యూకే నుంచి విమానాల రాకపోకలపై తాత్కాలిక నిషేధం విధించాయి. ఫ్రాన్స్ సహా పలు యూరోప్ దేశాలు బ్రిటన్తో సరిహద్దులను మూసేశాయి. హాంకాంగ్, ఇరాన్, క్రొయేషియా, అర్జెంటీనా, చిలీ, మొరాకో, కువైట్ బ్రిటన్ ప్రయాణాలపై ఆంక్షలు విధించాయి. కొత్త ముప్పుపై చర్చించేందుకు యూరోపియన్ యూనియన్ దేశాలు ప్రత్యేకంగా భేటీ కానున్నాయి. -
ప్రయాణికులకు రీఫండ్ వోచర్లు..?
న్యూఢిల్లీ: లాక్డౌన్ సమయంలో ప్రయాణాలకు ముందుగా రిజర్వేషన్లు చేసుకున్న ప్రయాణికులకు రిఫండ్స్ ఎలా జరగాలన్న అంశంపై తీర్పును సుప్రీంకోర్టు శుక్రవారం రిజర్వ్ చేసుకుంది. బదలాయింపులకు వీలయిన రిఫండ్ వోచర్లు జారీ ద్వారా సమస్యకు సానుకూల పరిష్కారం చూపవచ్చన్న కేంద్రం ప్రతిపాదనను పరిశీలిస్తామని న్యాయమూర్తులు అశోక్ భూషన్, ఆర్ సుభాషన్ రెడ్డి, ఎంఆర్ షాలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం తెలిపింది. కేంద్ర ప్రతిపాదనలోని కొన్ని ముఖ్యాంశాలను పరిశీలిస్తే... లాక్డౌన్ సమయంలో రద్దయిన సర్వీసులకు సంబంధించి ప్రయాణి కులకు డబ్బు వాపసు చేస్తే, ఇప్పటికే తీవ్ర కష్టాల్లో ఉన్న విమానయాన సంస్థలపై ఆర్థికంగా మరింత ప్రతికూల ప్రభావం పడుతుంది. అయితే ఈ సమస్య పరిష్కారానికి ‘బదలాయింపునకు వీలయిన రిఫండ్ వోచర్లను’ ప్రయాణి కులకు జారీ చేస్తే అటు ప్రయాణికులు, ఇటు విమానయాన సంస్థల ప్రయోజనాలకు విఘాతం కలుగదు. వోచర్స్ను ప్రయాణికులు టికెట్లు బుక్ చేసిన తమ ఏజెంట్లకు సమర్పించి, డబ్బు వాపసు తీసుకోవచ్చు. లేదా తదుపరి తమ ప్రయాణాల టికెట్ బుకింగ్లకు వినియోగించుకోవచ్చు. డబ్బు వాపసు ఇచ్చిన పక్షంలో ఆయా వోచర్లను వేరొకరి ప్రయాణాలకు వినియోగించే సౌలభ్యతను ఏజెంట్లకు కల్పించడం జరుగుతుంది. ఎన్జీఓలు, ప్యాసింజర్ల అసోసియేషన్స్సహా పలువురు దాఖలు చేసిన పిటిషన్లపై కోర్టు రెండు వర్గాల వాదనలు విన్న సంగతి తెలిసిందే. కేంద్రం, డీజీసీఏ (డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్) తరఫున తుషార్ మెహతా చేసిన ‘బదలాయింపులకు వీలయిన రిఫండ్స్ వోచర్ల’ ప్రతిపాదనకు ట్రావెల్ ఏజెంట్ల సంస్థ తరఫున వాదలను వినిపించిన సీనియర్ అడ్వకేట్ పల్లవ్ సిసోడియా సానుకూల స్పందన వ్యక్తం చేయడం శుక్రవారంనాటి మరో కీలకాంశం. ఇండిగో ఎయిర్లైన్ తరఫున సీనియర్ అడ్వకేట్ ముకుల్ రోహత్గీ కూడా సంబంధిత ప్రతిపాదనకు అంగీకారం తెలిపారు. విదేశీ విమాన సర్వీసులకు వర్తించదు! కాగా వాదనల సమయంలో ‘ప్రవాసీ లీగల్ సెల్’ ఎన్జీఏ సంస్థ తరఫు సీనియర్ న్యాయవాది సంజయ్ హెగ్గే విదేశాల నుంచి టికెట్ బుక్ చేసుకున్న వారికి రిఫండ్ పరిస్థితిని ప్రస్తావించారు. దీనికి అత్యున్నత న్యాయస్థానం స్పందిస్తూ, విదేశీ విమాన సర్వీసుల అంశంలోకి వెళ్లలేమని పేర్కొంది. సంబంధిత టికెట్లకు రిఫండ్ను భారత్ ప్రభుత్వం ఆదేశించలేదని సుప్రీంకోర్టు ఈ సందర్భంగా పేర్కొంది. -
ఆ నగరాల నుంచి కోల్కతాకు విమానాల్లేవ్
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తోంది. భారీ సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ప్రయాణాల ద్వారా ఒక నగరం నుంచి మరో నగరానికి వైరస్ వ్యాప్తి జరుగుతున్నట్లు తేలడంతో ఈ నెల 6 నుంచి 19వ తేదీ వరకు పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాకు విమానాల రాకపోకలను నిలిపివేస్తూ అధికార వర్గాలు నిర్ణయం తీసుకున్నాయి. ఢిల్లీ, ముంబై, చెన్నై, పుణే, నాగపూర్, అహ్మదాబాద్ నుంచి కోల్కతాకు ప్యాసింజర్ ఫ్లైట్లు ఉండబోవని కోల్కతా ఎయిర్పోర్టు వర్గాలు తెలిపాయి. -
అక్కడ మళ్లీ వైరస్.. దీంతో 1255 విమానాలు..
బీజింగ్ : చైనాలోని బీజింగ్లో మరలా కరోనా పాజిటివ్ కేసులు బయటపడుతున్న విషయం తెలిసిందే. కొంతకాలంగా తగ్గుతూ వస్తున్న కరోనా కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతూ వస్తుంది. బీజింగ్ నగరంలో బుధవారం కొత్తగా 31 కరోనా కేసులు వెలుగుచూడడంతో అక్కడి అధికారులు అప్రమత్తమయ్యారు. ముందస్తుగా సుమారు 1255 విమానాలను రద్దు చేస్తున్నట్లు నగరంలోని రెండు విమానాశ్రయాలు ప్రకటించాయి. దీంతో బీజింగ్లో దాదాపు 70 శాతం విమాన రాకపోకలు నిలిచిపోనున్నాయి. బీజింగ్లో తాజాగా ఓ మార్కెట్ నుంచి వైరస్ వ్యాప్తి చెందుతున్నట్లు అధికారులు ద్రువీకరించారు. దీంతో పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీని మూడవ స్థాయి నుంచి రెండవ స్థాయికి ప్రకటించారు.(అమరులైన భారత సైనికులకు అమెరికా సంతాపం) గత 5 రోజుల్లోనే బీజింగ్లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య వంద దాటింది. ఒకవేళ అత్యవసం అనుకుంటే తప్ప, బీజింగ్ ప్రజలు ఎవరూ తమ ఇండ్లు దాటి బయటకు వెళ్లకూడదని ఆ నగర మున్సిపల్ అధికారి చెన్ బీయి తెలిపారు. ఫెంగ్టాయి జిల్లాలో ఉన్న జిన్ఫాడి మార్కెట్ నుంచి అత్యధిక సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు తెలుస్తోంది. ప్రైమరీ, హైయర్ స్కూళ్ల విద్యార్థులు క్యాంపస్కు రావద్దు అని ఆదేశించింది. కాలేజీ విద్యార్థులు కూడా క్యాంపస్కు రావాల్సిన అవసరం లేదన్నారు. నగరంలోని ప్రజలంతా అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దంటూ హెచ్చరికలు జారీ చేసింది.(వైరల్ : భలే గమ్మత్తుగా పోలీస్ ట్రైనింగ్) -
ముంచుకొస్తున్న తుపాను : పలు విమానాలు రద్దు
సాక్షి, ముంబై: నిసర్గ తుపాను పెనువేగంతో ముంబై తీరంవైపు దూసుకొస్తోందన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో దేశీయ విమానయాన సంస్థలు అప్రమత్తమయ్యాయి. బుధవారం దేశ ఆర్థిక రాజధాని ముంబైకి రాకపోకలను సాగించే విమానాలను రద్దు చేశాయి. ఇండిగో, విస్తారా, స్పైస్జెట్ సంస్థలు పలు విమానాలను రద్దు చేస్తున్నట్టు ప్రకటించాయి. ఈ సమాచారాన్ని సంబంధిత ప్రయాణీకులకు అందించామనీ, దీన్ని దృష్టిలో ఉంచుకుని వారు అప్రమత్తంగా కావాలని సూచించాయి. (తీవ్ర తుఫానుగా ‘నిసర్గ’) ఇండిగో 17 విమానాలను రద్దు చేసింది. . ముంబై నుండి చండీగఢ్, రాంచీ పాట్నాకు కేవలం మూడు విమానాలను మాత్రమే నడుపుతున్నట్టు ఇండిగో పేర్కొంది. ప్రత్యామ్నాయ విమానంలో తిరిగి బుక్ చేసుకునే అవకాశం లేదా క్రెడిట్ సౌకర్యాన్ని అందివ్వనున్నామని ఇండిగో మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. తుపాను కారణంగా తమ సేవలు ప్రభావితమయ్యే అవకాశం ఉందని విస్తారా ప్రకటించింది. ప్రధానంగా ముంబై, గోవా మధ్య విమానాలను రద్దు చేసినట్టు తెలిపింది. మరిన్ని వివరాలకు విస్తారా అధికారిక వెబ్ సైట్ ను గానీ, 9289228888 నంబరుగానీ సంప్రదించాలని ట్వీట్ చేసింది. అలాగే ముంబై నుంచి , ఢిల్లీ కోల్కతాకు వెళ్లే విమానాలను కూడా బుధవారం రద్దు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఎయిరిండియా ఉదయం విమానాలను రీషెడ్యూల్ చేస్తోంది. అలాగే విమాన షెడ్యూల్లో ఏదైనా రద్దు, మార్పులను ఇ-మెయిల్స్ లేదా ఎస్ఎంఎస్ ద్వారా తెలియజేస్తామని స్పైస్జెట్ తెలిపింది. కాగా కరోనా వైరస్ , లాక్ డౌన్ కారణంగా పూర్తిగా నిలిచిపోయిన దేశీయ విమాన ప్రయాణాలకు ఆంక్షల సడలింపుల నేపథ్యంలో ఇటీవల అనుమతి లభించించి. మళ్లీ ఇంతలోనే నిసర్గ తుపాను రూపంలో అంతరాయం ఏర్పడింది. #6ETravelAdvisory : To know your flight status, click here https://t.co/Z25uUH5PWw #StaySafe #NisargaAlert pic.twitter.com/tkvwHX0OoA — IndiGo (@IndiGo6E) June 2, 2020 #TravelAdvisory : To check your flight status, please visit https://t.co/VkU7yLB2ny. pic.twitter.com/JYIW9ftpW3 — SpiceJet (@flyspicejet) June 2, 2020 #TravelUpdate Due to the movement of cyclonic storm "NISARGA" flights to/from Mumbai and Goa are likely to be impacted. Please visit https://t.co/IZ9taT0TOv or SMS UK to 9289228888 to check updated flight status before booking and leaving for the airport. Thank you. — Vistara (@airvistara) June 2, 2020 -
ఎయిర్పోర్ట్లో ప్రయాణికుల కష్టాలు..
-
తొలి రోజే ప్రయాణికుల కష్టాలు..
న్యూఢిల్లీ : దాదాపు రెండు నెలల తర్వాత పలు దేశీయ విమాన సర్వీసులు నేటి నుంచి ప్రారంభమయిన సంగతి తెలిసిందే. దీంతో పెద్ద ఎత్తున ఎయిర్పోర్ట్లకు చేరకున్న ప్రయాణికుల్లో కొందరికి నిరాశే మిగిలింది. దేశవ్యాప్తంగా పలు విమాన సర్వీసులను ప్రారంభించనున్నట్టుగా కేంద్రం ప్రకటించిగానే పలువురు ప్రయాణికులు టికెట్లు బుక్ చేసుకున్నారు. ఈ క్రమంలో సోమవారం తెల్లవారుజాము నుంచే పెద్ద ఎత్తున ప్రయాణికులు ఎయిర్పోర్ట్లకు క్యూ కట్టారు. అయితే ముందుగా ప్రకటించిన పలు సర్వీసులు రద్దు కావడంతో.. ప్రయాణికులు ఎయిర్పోర్ట్లలోనే నిరీక్షిస్తున్నారు. చాలా ప్రయాణికులకు ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా సర్వీసులు రద్దు కావడంతో.. గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో ఢిల్లీ, ముంబై, హైదరాబాద్తో సహా దేశంలోని పలు ఎయిర్పోర్ట్లలో పెద్ద సంఖ్యలో ప్రయాణికులు నిలిచిపోయారు. విమాన సర్వీసులు పునరుద్దరించబడ్డ తొలి రోజే ఢిల్లీ ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి సంబంధించి 80 సర్వీసులను రద్దు చేసినట్టుగా సమాచారం. మరోవైపు హైదరాబాద్ నుంచి ముంబై, ఛండీగఢ్, విశాఖపట్నం, తిరుపతి, నాందేడ్, బెంగళూరు, కడప, పుణె, త్రివేండ్రం, గోవా, కోయంబత్తూరులకు వెళ్లే విమానాలను రద్దు చేశారు. కాగా, పలు రాష్ట్రాలు పరిమిత సంఖ్యలో మాత్రమే విమాన సర్వీసులకు అనుమతించడం, 14 రోజులపాటు క్వారంటైన్కు సంబంధించి పూర్తి స్థాయిలో స్పష్టత లేకపోవడం ఇందుకు కారణంగా తెలుస్తోంది. మరోవైపు విమాన సర్వీసులు పున: ప్రారంభం కావడంతో ఎయిర్పోర్ట్ల వద్ద ప్రయాణికులు సందడి నెలకొంది. ఇప్పటికే పలువురు ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు చేరుకున్నారు. పలు చోట్ల ఎయిర్పోర్ట్లకు చేరకున్న ప్రయాణికుల చేతుల మీద హోం క్వారంటైన్ ముద్ర వేస్తున్నారు. తెలంగాణ విషయానికి వస్తే.. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి. ఇప్పటికే బెంగళూరు నుంచి ఎయిర్ ఇండియా విమానం హైదరాబాద్కు చేరుకుంది. -
నా కుటుంబాన్ని కలవాలి... ఆర్థిక సహాయం చేయండి!
క్రైస్ట్చర్చ్: ‘యూకే వెళ్లేందుకు విమాన టికెట్లకు కొంత డబ్బు కావాలి. నా దగ్గర ఒక ఆలోచన ఉంది. స్కైప్/ వీడియో కాల్ ద్వారా నాతో ఎవరైనా 20 నిమిషాలు మాట్లాడవచ్చు. క్రికెట్, రాజకీయాలు, వంటలు, మానసిక ఒత్తిడి, సచిన్ టెండూల్కర్ ఏదైనా సరే...మీకు నచ్చితే కొన్ని డాలర్లు/పౌండ్లు నాకు పంపండి’... ఒక మాజీ క్రికెటర్ ఆవేదన ఇది. న్యూజిలాండ్కు చెందిన పేస్ బౌలర్ ఇయాన్ ఓబ్రైన్ జాతీయ జట్టు తరఫున 22 టెస్టులు, 10 వన్డేలు, 4 టి20 మ్యాచ్లు ఆడాడు. అతని స్వదేశం న్యూజిలాండే అయినా భార్య, ఇద్దరు పిల్లలతో ఇంగ్లండ్లో స్థిరపడ్డాడు. తన తల్లిదండ్రులను కలిసేందుకు అతను స్వస్థలం వచ్చాడు. అయితే కరోనా కారణంగా దాదాపు అన్ని విమాన సర్వీసులు రద్దయ్యాయి. ఏదోలా వెళ్దామనుకొని అందుబాటులో ఉన్న మూడు ఫ్లయిట్లలో అతను బుకింగ్ చేశాడు. అయితే ఆ మూడు చివరి నిమిషంలో రద్దు కాగా, డబ్బులు కూడా తిరిగివ్వలేదు. ఇప్పుడు ఎంత ఎక్కువ మొత్తమైనా ఇచ్చి వెళ్లాలనుకుంటున్నానని, దాంతో ఇలా చేయక తప్పడం లేదని అతను వాపోయాడు (2009 హామిల్టన్ టెస్టులో అతను సచిన్ను అవుట్ చేశాడు. అందుకే దాని గురించి కూడా ఎవరైనా అడగవచ్చని సచిన్ పేరు కూడా జత చేశాడు). ఇంగ్లండ్లో ఉన్న తన కుటుంబం గురించి అతను తీవ్రంగా ఆందోళన చెందుతున్నాడు. ‘నా భార్య ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడుతోంది. ఇప్పుడు ఛాతీకి ఇన్ఫెక్షన్లాంటిదేమైనా వస్తే కరోనా కారణంగా ఆమె ప్రాణాలకే ప్రమాదం. పైగా ఇద్దరు చిన్నపిల్లలు, 80 ఏళ్ల తల్లి కూడా ఉన్నారు. అక్కడికి వెళ్లి ఆమె బాధను కొంత పంచుకోవాలని భావిస్తుంటే ఇప్పుడు నా కారణంగా అది మరింత పెరిగేటట్లు అనిపిస్తోంది’ అని ఓబ్రైన్ బాధపడుతున్నాడు. -
పూర్తి లాక్డౌన్లో భారత్
న్యూఢిల్లీ: కరోనా వైరస్ రోజురోజుకూ విస్తరిస్తూ ప్రమాదకరంగా మారుతున్న నేపథ్యంలో దాన్ని కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలోని 30 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతా (యూటీ)ల్లోని 548 జిల్లాల్లో లాక్డౌన్ ప్రకటించింది. చండీగఢ్, ఢిల్లీ, గోవా, జమ్మూకశ్మీర్. నాగాలాండ్ కూడా ఇందులో ఉన్నాయి. అంతేగాక వాయు, జల, భూ మార్గాల ద్వారా భారత్లోకి ప్రవేశించగల 107 ఇమిగ్రేషన్ పోస్టులను మూసేస్తూ రాత్రి నిర్ణయం తీసుకుంది. దేశీ విమానాలన్నీ రద్దు రానున్న బుధవారం నుంచి దేశవ్యాప్తంగా అన్నిరకాల దేశీ విమానయాన సర్వీసులను రద్దు చేస్తున్నట్లు, కరోనా వైరస్ కట్టడి చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పౌర విమానాయాన శాఖ మంత్రి తెలిపింది. అంతర్జాతీయ సర్వీసుల్ని ఆపేయడం తెల్సిందే. దేశీ విమానాలపై నిషేధం మార్చి 24వ తేదీ అర్ధరాత్రి 12 గంటల నుంచి అమల్లోకి వస్తుందని విమానయాన శాఖ అధికార ప్రతినిధి తెలిపారు. సరుకుల రవాణా చేసే విమానాలకు మాత్రం ఈ నిషేధం వర్తించదు. దేశీ, అంతర్జాతీయ సరుకు రవాణా విమానాల రాకపోకలు ఉంటాయి. కార్గో విమానాలకు మాత్రమే అనుమతి శంషాబాద్: కేంద్ర పౌరవిమానయాన మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు మంగళవారం అర్ధరాత్రి నుంచి శంషాబాద్ నుంచి వెళ్లే విమానాలు సహా అన్ని దేశీయ విమానాల రాకపోకలు నిలిచిపోనున్నాయి. శంషాబాద్ ఎయిర్పోర్టు నుంచి ప్రతిరోజూ 380కి పైగా దేశీయ సర్వీసులు రాకపోకలు సాగిస్తుంటాయి. ఇప్పటికే ఆదివారం అర్ధరాత్రి నుంచి అంతర్జాతీయ విమానసర్వీసులు నిలిచిపోయాయి. ఆదివారం రాత్రి 8.38 గంటలకు చికాగో నుంచి వచ్చిన ఎయిర్ ఇండియా విమానం తిరిగి రాత్రి 10 గంటలకు శంషాబాద్ నుంచి బయలుదేరింది. ఇది మినహా మిగతా అన్నీ ఆదివారం అర్థరాత్రి నుంచి పూర్తిగా టేకాఫ్, ల్యాండింగ్ నిలిపివేశాయి. అంతర్జాతీయంగా మొత్తం 37 ప్రాంతాలకు శంషాబాద్ నుంచి రాకపోకలు సాగించే విమాన సర్వీసులు నిలిచిపోవడంతో ఎయిర్పోర్టులో ప్రయాణికుల రద్దీ పూర్తిగా తగ్గిపోయింది. -
కరోనా : ఇండిగో వేతనాల కోత
సాక్షి, ముంబై : కోవిడ్-19 (కరోనా వైరస్) ప్రకంపనలు పలు రంగాలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. ముఖ్యంగా గ్లోబల్గా విమానయానరంగం మరింత కుదేలవుతోంది. దేశీయ, అంతర్జాతీయ మార్గాల్లో డిమాండ్ పడిపోయి దాదాపు సగం విమానాలను ఖాళీగా ఎగురుతున్నాయి. ఈ నేపథ్యంలో దేశీయ విమాన యాన సంస్థ ఇండిగో కీలక నిర్ణయం తీసుకుంది. విమాన సర్వీసులను నిలిపివేయడంతోపాటు, ఉద్యోగుల వేతనాల్లో కోత విధించనుంది. వివిధ స్థాయిలలో జీతం కోతలను ప్రకటిస్తూ ఉద్యోగులకు ఈ మెయిల్ సమాచారాన్ని అందించింది. ఇండిగో సీఈవో రణుంజోయ్ దత్తా తన వేతనంలో 25 శాతం , సీనియర్ వైస్ ప్రెసిడెంట్లు, ఆపైన ఉద్యోగుల్లో 20 శాతం వేతన కోత వుంటుందని ఉద్యోగులకు రాసిన మెయిల్లో పేర్కొన్నారు. జీతాలలో అన్ని మార్పులు 2020 ఏప్రిల్ 1 నుండి అమల్లోకి వస్తాయి. భారతదేశపు అతిపెద్ద క్యారియర్ ఇండిగో మొత్తం 260 విమానాలలో 16 విమానాలను నిలిపివేసింది. దేశీయ, అంతర్జాతీయ విమానాలపై కరోనావైరస్ ప్రభావంతో 10-20 శాతం జీతం కోత విధించుకోవాలని ఎయిర్లైన్స్ తన ఉద్యోగులను కోరుతోంది. స్వయంగా ఇండిగో సీఈవో రణుంజోయ్ దత్తా తన వేతనంలో 25 శాతం తగ్గించుకున్నట్టు ప్రకటించారు. ఆదాయాలు భారీగా క్షీణించాయి. విమానయాన పరిశ్రమ మనుగడ ఇప్పుడు ప్రమాదంలో ఉందని దత్తా వెల్లడించారు. కరోనా ప్రభావంతో విమానయాన రంగంలో ఆర్థిక వాతావరణం గణనీయంగా ప్రభావితమవుతోంది. ఈ నేపథ్యంలో కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవలసిన అవసరం ఏర్పడిందని వ్యాఖ్యానించారు. తాజా పరిణామంతో ఇండిగో ఉద్యోగులు సంక్షోభంలో పడిపోయారు. ఏవియేషన్ కన్సల్టెన్సీ సంస్థ సీఏపీఏ సమాచారం ప్రకారం ఇండిగో మొదట్లో 150 విమానాలను నిలిపి వేయనుంది. రాబోయే వారాల్లో ఈ సంఖ్య పెరుగుతుందని భావిస్తున్నారు. ట్రాఫిక్ క్షీణత తీవ్రంగా కొనసాగితే, ఏప్రిల్ నాటికి మెజారిటీ విమానాలను నిలిపివేయవచ్చు. ఈ ప్రభావంవిమానయాన సిబ్బందిపై 30శాతం, 50 శాతం వరకు గ్రౌండ్ స్టాఫ్ మీద పడనుందని భావిస్తున్నారు. -
కువైట్కు విమానాలు రద్దు
తిరువనంతపురం : కోవిడ్ -19 ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తున్న భయాల నేపథ్యంలో కువైట్ కీలక నిర్ణయం తీసుకుంది. భారతదేశంతో సహా ఏడు దేశాల నుంచి విమాన సర్వీసులను నిలిపివేసింది. ఈ ఆదేశాలు ఒక వారం పాటు అమల్లో వుంటాయని కువైట్ అధికారులు ప్రకటించారు. శనివారం కువైట్ ఆరోగ్య అధికారులు తీసుకున్న ఈ ఆకస్మిక ప్రయాణ నిషేధంతో కోజికోడ్ కరీపూర్ విమానాశ్రయంలో 170 మంది ప్రయాణికులు విమానాశ్రయంలో చిక్కుకు పోయారు. భారతదేశంతో పాటు ఫిలిప్పీన్స్, బంగ్లాదేశ్, శ్రీలంక, ఈజిప్ట్, సిరియా, లెబనాన్ నుండి కువైట్కు వెళ్లే అన్ని విమానయాన సంస్థలకు ఈ నిషేధం వర్తిస్తుంది. -
విదేశీయుల తరలింపునకు రెడీ!
బీజింగ్: కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో తమ దేశం నుంచి విదేశీయులను సురక్షితంగా పంపించేందుకు సిద్ధమని చైనా బుధవారం పేర్కొంది. కరోనా వైరస్ తీవ్రంగా ఉన్న వుహాన్ నుంచి భారతీయులను తరలించేందుకు భారత్ ప్రయత్నాలు ప్రారంభించింది. హ్యుబయి రాష్ట్రంలో దాదాపు 250 మంది భారతీయులున్నారు. వారిలో విద్యార్థులే అత్యధికం. అయితే, భారత్ వచ్చిన తరువాత వారంతా 14 రోజుల పాటు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఒక ఆసుపత్రిలో వైద్యుల పర్యవేక్షణలో ఉండాల్సి ఉంటుంది. చైనాకు విమాన సర్వీసుల రద్దు చైనాకు తమ సర్వీసులను నిలిపివేస్తున్నట్లు విమానయాన సంస్థలు ఇండిగో, ఎయిర్ ఇండియా ప్రకటించాయి. జనవరి 31 నుంచి ఫిబ్రవరి 14 వరకు ఢిల్లీ – షాంఘై సర్వీస్ను నిలిపేస్తున్నట్లు ఎయిర్ ఇండియా ప్రకటించగా, బెంగళూరు– హాంకాంగ్ రూట్లో ఫిబ్రవరి 1 నుంచి, ఢిల్లీ–చెంగ్డూ రూట్లో 14వరకు సర్వీస్లను రద్దు చేశామని ఇండిగో పేర్కొంది. ‘కరోనా’కు హోమియోపతి, యునానీ భేష్ శ్వాస సమస్యలు వస్తే ఫోన్ చేయాలని కోరుతూ ఆరోగ్య శాఖ బుధవారం హెల్ప్లైన్ నంబర్ 011–23978046ను ప్రకటించింది. కరోనా వైరస్ సోకినవారిని గుర్తించేందుకు విశాఖపట్టణం సహా దేశంలోని 21 విమానాశ్రయాల్లో థర్మల్ స్క్రీనింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. వైరస్ వ్యాప్తిని హోమియోపతి, యునానీ మందులు సమర్ధవంతంగా అడ్డుకోగలవని ఆయుష్ శాఖ ప్రకటించింది. ఈ దిశగా పనిచేసే కొన్ని ఔషధాలను పేర్కొంది. చైనాలోని హ్యుబయి రాష్ట్రంలో ఈ వైరస్ బారిన పడి మరో 25 మంది మృతి చెందారు. మొత్తంగా చైనావ్యాప్తంగా మృతుల సంఖ్య 132కి చేరింది. అలాగే, దాదాపు 6 వేల మందికి ఈ వైరస్ సోకినట్లు ధ్రువీకరించారు. ‘కరోనా’ను తయారు చేసినశాస్త్రవేత్తలు నోవల్ కరోనా రకం వైరస్ను ప్రయోగశాలలో ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు విజయవంతంగా తయారు చేశారు. చైనా బయట వైరస్ను తయారు చేయడం ఇదే మొదటిసారని, దీని సాయంతో కరోనా వైరస్పై పరిశోధనలు చేయవచ్చని వారు భావిస్తున్నారు. భారత్కు కరోనా సోకే ప్రమాదం న్యూఢిల్లీ: కరోనా వైరస్ వ్యాప్తి చెందే అత్యంత అధిక అవకాశాలు ఉన్న 30 దేశాల్లో భారత్ ఉందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. చైనాలో కరోనా వైరస్ బారిన పడ్డ నగరాల నుంచి ఎక్కువ సంఖ్యలో విమాన ప్రయాణికులు ఈ 30 దేశాలకు ప్రయాణిస్తున్నారని తెలిపారు. దీని వల్ల ఈ 30 దేశాలకు కరోనా వైరస్ సోకే ప్రమాదం అత్యంత అధికంగా ఉందని తాజా అధ్యయనంలో గుర్తించారు. ఈ అధ్యయనాన్ని బ్రిటన్లోని సౌతాంప్టన్ యూనివర్సిటీ పరిశోధకులు నిర్వహించారు. అత్యంత ప్రమాదకర దేశాల్లో తొలి 3స్థానాల్లో థాయిలాండ్, జపాన్, హాంకాంగ్ ఉండగా.. అమెరికా(6), ఆస్ట్రేలియా(7), బ్రిటన్(17), భారత్(23) స్థానాల్లో ఉన్నాయి. -
హాంకాంగ్ విమానాశ్రయంలో నిరసనలు
హాంకాంగ్: నిరసనకారుల సెగ హాంకాంగ్ విమానాశ్రయాన్ని తాకింది. విమానాశ్రయంలోకి ప్రవేశించిన నిరసనకారులు ఆ దేశ పోలీసులకు వ్యతిరేకంగా గళం విప్పారు. నల్లటి దుస్తులు ధరించి ఫ్లకార్డులు ప్రదర్శించారు. విమానాశ్రయం లోపల ఇంత పెద్ద స్థాయిలో ఆందోళనలు జరపడం ఇదే తొలిసారి. నిరసన తెలుపుతోన్న ఓ మహిళపై ఆదివారం పోలీసులు దాడి చేయడాన్ని ఖండిస్తూ వారు ఆందోళన నిర్వహించారు. పోలీసుల దాడిలో రక్తమోడుతున్న మహిళ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ దాడిలో మహిళ కంటిచూపు కోల్పోయిందని వారు ఆరోపించారు. ఆమెకు మద్దతుగా కంటికి బ్యాండేజీలు కట్టుకుని నిరసన తెలిపారు. హాంకాంగ్ పోలీసులకు మతి భ్రమించిందని, వారు తమ పరిధిని దాటి ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. ‘హాంకాంగ్ పోలీసులు మమ్మల్ని చంపేస్తున్నారు’, ‘హాంకాంగ్ సురక్షిత స్థలం కాదు’, ‘హాంకాంగ్ ప్రజలారా మేల్కోండి.. భయపడాల్సిన అవసరం లేదు’ అని ఫ్లకార్డులు ప్రదర్శించారు. నల్లటి దుస్తులు ధరించిన వేలాది మంది నిరసనకారులతో విమానాశ్రయ ప్రాంగణ మంతా నలుపు రంగును పులముకున్నట్లు అయింది. నిరసనకారుల దెబ్బకు హాంకాంగ్ నుంచి బయలుదేరాల్సిన, అక్కడికి రావాల్సిన అన్ని విమానాలను రద్దు చేశారు. నిరసనకారులు ఉగ్రవాదులే: చైనా పోలీసుల హెచ్చరికలను బేఖాతరు చేస్తున్న హాంకాంగ్ నిరసనకారులపై చైనా మండిపడింది. నిరసనకారుల చర్యలు ఉగ్రవాద చర్యల్లాగే ఉన్నాయని, ఇప్పుడిప్పుడే ఉగ్రవాదం పురుడు పోసుకుంటోందని వ్యాఖ్యానించింది. -
ముంబై అతలాకుతలం
సాక్షి, ముంబై: ముంబైను కుండపోత వర్షాలు మంగళవారమూ స్తంభింపజేశాయి. మలద్లోని పింప్రిపద ప్రాంతంలో మంగళవారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో ఓ గోడ కూలి, పక్కన గుడిసెల్లో నివసిస్తున్న 21 మంది మరణించారు. మరో 78 మంది క్షతగాత్రులయ్యారు. గత రెండ్రోజుల్లో వర్షం సంబంధిత కారణాలతో మహారాష్ట్రలో మొత్తంగా 39 మంది మరణించారని అధికారులు చెప్పారు. ఆదివారం నుంచి ముంబైలో భారీ వర్షాలు కురుస్తుండటంతో రోడ్డు, రైలు, విమాన రవాణా సేవలు ప్రభావితమయ్యాయి. భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ విభాగం ముందుగానే హెచ్చరించడంతో ప్రభుత్వం ముంబై, చుట్టుపక్కల ప్రాంతాల్లో మంగళవారం సాధారణ సెలవుగా ప్రకటించింది. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని సూచించింది. మలద్ ప్రాంతంలో గోడ కూలిన ఘటనలో 15 ఏళ్ల బాలిక శిథిలాల కింద చిక్కుకోగా, ఆమెను రక్షించే ప్రయత్నం విఫలమైంది. శిథిలాల నుంచి బయటకు తీసుకొచ్చే సమయానికే బాలిక మృతి చెందింది. మలద్ ప్రాంతంలోనే వరద రావడంతో మరో ఇద్దరు వ్యక్తులు కారులో చిక్కుకుని చనిపోయారు. విలే పార్లే ప్రాంతంలో ఓ వ్యక్తి విద్యుదాఘాతానికి గురై మరణించగా, ముంబై శివారు ప్రాంతమైన ములంద్లోనూ గోడ కూలి ఓ సెక్యూరిటీ గార్డు ప్రాణాలు కోల్పోయారు. ముంబైలోనే 25 మంది వర్షాల కారణంగా మృత్యువాత పడ్డారు. ముంబైలోని ఎయిర్పోర్ట్ కాలనీ, వకోలా జంక్షన్, పోస్టల్ కాలనీ తదితర ప్రాంతాల్లో రోడ్లన్నీ నీటితో నిండిపోయాయి. మిఠీ నది ఉధృతంగా ప్రవహిస్తుండటంతో అవాంఛనీయ సంఘటనలను నివారించేందుకు పరివాహక ప్రాంతాల నుంచి వెయ్యి మందిని సురక్షిత ప్రదేశాలకు తరలించారు. బీఎస్సీ విద్యార్థులకు నిర్వహించాల్సిన ఓ పరీక్షను కూడా ముంబై విశ్వవిద్యాలయం వాయిదా వేసింది. మహారాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుత పరిస్థితులపై ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. వచ్చే రెండ్రోజులపాటు అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సోమవారం ఉదయం 8.30 నుంచి మంగళవారం ఉదయం 8.30 గంటల మధ్యన ఉన్న 24 గంటల్లో ముంబైలో 16.3 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది. ముంబైకి తూర్పున ఉన్న శివారు ప్రాంతాల్లో 32.9 సెంటీ మీటర్లు, పడమరన ఉన్న శివారు ప్రాంతాల్లో 30.9 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది. 203 విమానాల రద్దు.. మరో 55 దారి మళ్లింపు మూడ్రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ముంబైలో ప్రజా రవాణా సేవలు కూడా తీవ్రంగా ప్రభావితమయ్యాయి. వాతావరణం సహకరించని కారణంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు సాగించాల్సిన విమానాల్లో 203 పూర్తిగా రద్దవ్వగా, మరో 55 దారి మళ్లాయి. మరో 350 విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. గురువారం వరకు విమానాశ్రయంలో ప్రధాన రన్వే మూసి ఉంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. మధ్య, పశ్చిమ రైల్వే జోన్లకు సంబంధించిన అనేక దూరప్రాంతపు రైళ్లను కూడా రద్దు చేశారు. మరిన్ని రైళ్లు గమ్యస్థానం చేరకుండానే మధ్యలో నిలిచిపోయాయి. పట్టాలపైకి నీరు రావడం తో లోకల్ రైళ్లు కూడా కొన్ని చోట్ల దారి మధ్యలోనే నిలిచిపోయాయి. రైళ్లలో చిక్కుకున్న వేలాదిమంది ప్రయాణికులను ఆర్పీఎఫ్ జవాన్ల సాయంతో మధ్య రైల్వే సిబ్బంది రక్షించి, వారికి తేనీరు, ఆహార పదార్థాలు అందించారు. పశ్చిమ రైల్వే అధికారి ఒకరు మాట్లాడుతూ తమ సబర్బన్ రైలు సేవలు చర్చిగేట్, విరార్ల మధ్య సాధారణం కన్నా తక్కువ సంఖ్యలో తిరుగుతున్నాయని చెప్పారు. రోడ్లన్నీ నీళ్లతో నిండటంతో వాహనాల రాకపోకలకు కూడా తీవ్ర ఆటంకం కలిగింది. పుణేలోనూ ఆరుగురు.. ఇక మహారాష్ట్రలోని రెండో అతిపెద్ద నగరం పుణేలోని అంబేగావ్లో సోమవారం రాత్రి పొద్దుపోయాక గోడ కూలడంతో ఆరుగురు కార్మికులు చనిపోయారు. మరో ముగ్గురు గాయపడ్డారు. ఠాణే జిల్లాలోని కల్యాణ్ ప్రాంతంలోనూ మంగళవారం ఉదయం గోడ కూలి ముగ్గురు మరణించారు. బుల్ధానా జిల్లాలో పిడుగు పడటంతో 52 ఏళ్ల మహిళ చనిపోయింది. నాసిక్ జిల్లాలో మంగళవారం నీళ్ల ట్యాంకు కూలి నలుగురు కూలీలు మరణించారు. మరో ఇద్దరు గాయపడ్డారు. ఉత్తర కొంకణ్ ప్రాంతం మొత్తం రుతుపవనాల కారణంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. బుధవారం కొన్ని ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు, చాలా ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ విభాగం తెలిపింది. కాగా, ప్రభుత్వాల అవినీతి కారణంగానే ముంబై, పుణేల్లో గోడలు కూలి ప్రజలు చనిపోయారని ప్రతిపక్ష పార్టీలు మంగళవారం అధికార బీజేపీ, శివసేన పార్టీలపై విరుచుకుపడ్డాయి. నగరాన్ని నీళ్లతో ముంచేసినందుకు ప్రభుత్వం ప్రజలకు క్షమాపణ చెప్పాలని మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు అశోక్ చవాన్ డిమాండ్ చేశారు. శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే నివాసం ఉండే ప్రాంతమైన బాంద్రాలోని కళా నగర్ కూడా నీట మునిగిందని, లోక్సభ ఎన్నికలకు ముందు ఠాక్రే తమ ఎంపీలతో గుళ్లు, గోపురాలకు తిరగకుండా తమ ప్రాంతంలో జరుగుతున్న పనులను పరిశీలించి ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి ఉండేది కాదని ఎద్దేవా చేశారు. అదే స్ఫూర్తి.. భారీ వర్షాలతో కష్టాల్లో చిక్కుకున్న వారికి నగర ప్రజలు ఆపన్నహస్తం అందించారు. దారి మధ్యలో చిక్కుకున్న వారిని వీలైతే గమ్యస్థానాలకు చేర్చడం, సమీప ఇళ్లలో ఆశ్రయం కల్పించడం తదితర చర్యలతో సాయం చేశారు. రవాణా సౌకర్యాలు లేకపోవడంతో దగ్గర్లో ఎవరైనా చిక్కుకుపోతే తమ ఇళ్లకు వచ్చి ఆతిథ్యాన్ని స్వీకరించాల్సిందిగా పలువురు వ్యక్తులు సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. ‘నేనే చేసేది చాలా చిన్న సాయమే. వీర దేశాయ్ రోడ్ లేదా అంబోలీ ప్రాంతంలో ఎవరైనా చిక్కుకుపోయి ఉంటే వర్షం, వరద తగ్గే వరకు మా ఇంటికి వచ్చి ఉండటానికి మొహమాట పడకండి. ఎవరైనా ఉంటే నాకు నేరుగా మెసేజ్ పంపండి’ అని బిభాష్ చటర్జీ అనే వ్యక్తి ట్వీట్ చేశారు. విధుల్లో ఉన్న పోలీసులు అవెంజర్స్ సూపర్ హీరోలు అని జేఎస్డబ్ల్యూ గ్రూప్ చైర్మన్ సజ్జన్ జిందాల్ అన్నారు. ముంబైని భద్రంగా ఉంచేందుకు వారెంతో శ్రమిస్తున్నారని పేర్కొన్నారు. మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా ఓ ట్వీట్ చేస్తూ ‘ముంబై విమానాశ్రయం మూతపడింది. పాఠశాలలను మూసేశారు. రైల్వే స్టేషన్లలోకి నీరు చేరింది. అయినా నా ఇంటికి వార్తా పత్రికలు సరైన సమయానికి, తడవకుండా వచ్చాయి. ఎవరికీ కనిపించని విధంగా గొప్ప గొప్ప పనులు చేస్తున్న వాళ్లందరికీ నేను అభివాదం చేస్తున్నా’ అని పేర్కొన్నారు. వర్షాలు, వరదలను తట్టుకునేలా సరైన మౌలిక వసతులు లేకపోవడం, పరిస్థితిని ఎదుర్కొనేందుకు యంత్రాంగం ముందుగా సిద్ధం కాకపోవడం తదితర సమస్యలపై వ్యాపారవేత్తలెవరూ ఒక్క మాటా మాట్లాడకపోవడం గమనార్హం. ముంబై విమానాశ్రయంలో ల్యాండ్ అవుతూ భారీ వర్షం ధాటికి రన్వే నుంచి పక్కకు వెళ్లిన విమానం ఘట్కోపర్లో వరదతో నిండిన రోడ్డు ముంబైలో చిన్నారిని సురక్షితంగా తీసుకెళ్తున్న స్థానికుడు -
అమెరికా @ 12" మంచు
షికాగో: భారీ మంచు తుపాను, చలిగాలుల కారణంగా అమెరికాలో ఏడుగురు మృతి చెందగా రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో శుక్రవారం ఒక్కరోజే 500 పైగా విమాన సర్వీసులు రద్దు కాగా 5,700 విమానాలు ఆలస్యంగా నడిచాయి. మంచు తుపాను కారణంగా చాలా చోట్ల 12 అంగుళాల మేర మంచు పేరుకుపోయింది. ఈ తీవ్రత రానున్న రోజుల్లో న్యూమెక్సికోతోపాటు దక్షిణ, తూర్పు రాష్ట్రాల్లో మరింత ఎక్కువవుతుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దక్షిణాది రాష్ట్రాల్లో చలితోపాటు భారీ వర్షాలతో పాటు వరదలు సంభవించే అవకాశం ఉందని పేర్కొంది. లూసియానా, కెన్సాస్, నార్త్ డకోటా, టెన్నిస్సీ, మిన్నెసొట్టా ప్రాంతాల్లో జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో ఏడుగురు ప్రాణాలు కోల్పోగా, తొమ్మిది మంది గాయపడ్డారని అధికారులు తెలిపారు. గురువారం కూడా దేశవ్యాప్తంగా 6,500 విమానాలు ఆలస్యంగా నడవగా మరో 800పైగా సర్వీసులు రద్దయినట్లు వివరించారు. మంచు కారణంగా చాలా చోట్ల రహదారులను కూడా మూసి వేశారు. మరికొద్ది రోజులు ఇవే పరిస్థితులు కొనసాగుతాయని అధికారులు తెలిపారు. ఈ పరిస్థితుల్లో చాలా మంది ప్రయాణికులు ఎయిర్పోర్టుల్లోనే పడిగాపులు కాస్తున్నారు. నూతన సంవత్సర వేడుకలకు దూరం కావాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
పలు విమానాలు రద్దు :కంపెనీ వివరణ
సాక్షి,ముంబై: అప్పుల ఊబిలో కూరుకుపోయిన దేశీయ రెండవ అతిపెద్ద విమానయాన సంస్థ జెట్ ఎయిర్వేస్కు మరిన్ని కష్టాలు తప్పడంలేదు. అనూహ్యంగా విమానాలను రద్దు చేసిన విమర్శల పాలైన జెట్ ఎయిర్వేస్ మరోసాకి 14 విమానాలను రద్దు చేసింది. పైలట్ సెలవు కారణంగా దేశీయంగా వివిధ ప్రదేశాలకు ఈ విమానాలను రద్దు చేయడం కలకలం రేపింది. గత కొన్నినెలలుగా సిబ్బందికి ముఖ్యంగా పైలట్లకు వేతనాలను సక్రమంగా చెల్లించకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు లోనవుతున్నారు. ఈ నేపథ్యంలోనే అనారోగ్యంతో విధులకు హాజరు కాలేకపోతున్నామంటూ వారు యాజమాన్యానికి సమాచారం అందించారు. దీంతో సుమారు 14 సర్వీసులను సంస్థ ఆదివారం రద్దు చేసింది. అనూహ్యంగా విమానాలను రద్దు చేయడంతో టికెట్లను బుక్ చేసుకున్న ప్రయాణికులు విమానాశ్రయంలో చిక్కుకుపోయారు. దీంతో వారి అవస్థలు అన్నీ ఇన్నీ కావు. జీతం, ఇతర బకాయిలు చెల్లింపుల వ్యవహారంలో జెట్ ఎయిర్వేస్ వైఖరిపై జాతీయ ఏవియేటర్స్ గిల్డ్ (నాగ్)కు ఫైలట్లు ఫిర్యాదు చేశారు. అనారోగ్యం సాకుగా చూపిన పైలట్లు భారీ సంఖ్యలో విధులకు గైర్హాజయ్యారు. అలాగే ఈ పరిస్థితుల్లో పనిచేయలేమంటూ సంస్థ ఛైర్మన్ నరేష్గోయల్కు లేఖ రాసినట్టు కూడా తెలుస్తోంది. జెట్ ఎయిర్వేస్ వివరణ మరోవైపు దీనిపై స్పందించిన జెట్ ఎయిర్వేస్ విమానాల రద్దుకు పైలట్ల నిరసన కారణం కాదని వివరణ ఇచ్చింది. ఊహించని కార్యాచరణ పరిస్థితి మూలంగా విమానాలను రద్దు చేశామని పేర్కొంది. ప్రయాణికులకు ముందస్తు సమాచారం ఇవ్వడంతోపాటు, ప్రత్యామ్నాయ ఏర్పాటు చేసినట్టు వెల్లడించింది. అయితే ఎన్ని సర్వీసులను రద్దు చేసిందీ స్పష్టత ఇవ్వలేదు. కాగా అక్టోబరు, నవంబరు నెలల్లో సిబ్బందికి పూర్తి జీతాలు చెల్లించకపోయినా, సెప్టెంబర్లో పాక్షికంగా చెల్లించింది జెట్. అంతర్జాతీయ సర్వీసుల్లో కోత ఇది ఇలా వుంటే ఖర్చులను తగ్గించునే క్రమంలో అంతర్జాతీయంగా నిర్వహిస్తున్న సర్వీసుల్లో వారానికి కొన్నింటిపై కోత పెట్టనుంది. ముఖ్యంగా తొమ్మిది గల్ఫ్ మార్గాల్లో నడిపే విమాన సర్వీసులను తగ్గించనుంది. దేశీయంగా వివిధ నగరాలనుంచి మస్కట్, దోహా, అబుదాభి, దుబాయ్కి వెళ్లే విమానాల్లో వారానికి దాదాపు 40విమానాలను రద్దు చేయనుంది. అయితే వివిధ నగరాలనుంచి సింగపూర్, ఖట్మాండు, బ్యాంకాక్ సహా ఇతర గ్లోబల్ రూట్లలో డిసెంబరు 1నుంచి డైరెక్టు విమానాలను పరిచయం చేసినట్టు కంపెనీ ప్రతినిధి ఒకరు తెలిపారు. -
ఒక్క రోజులో 14 ‘జెట్’ విమానాల రద్దు
ముంబై: పీకల్లోతు ఆర్థిక కష్టాల్లో ఉన్న జెట్ ఎయిర్వేస్కు పైలట్లు సహకరించకపోవడంతో ఆదివారం ఆ సంస్థకు చెందిన 14 విమానాలు రద్దయ్యాయి. పైలట్లు సహా పై స్థాయి ఉద్యోగులకు సెప్టెంబర్ నెల వేతనాలను పాక్షికంగా చెల్లించిన జెట్ ఎయిర్వేస్.. అక్టోబర్, నవంబర్ నెల జీతాలను మాత్రం ఇప్పటివరకు పూర్తిగా చెల్లించలేదు. దీంతో కొందరు పైలట్లు తమకు అనారోగ్యంగా ఉందనే సాకు చూపుతూ ఆదివారం అకస్మాత్తుగా విధులకు గైర్హాజరయ్యారు. ఈ నేపథ్యంలో 14 విమానాలను జెట్ ఎయిర్వేస్ రద్దు చేయాల్సి వచ్చింది. అయితే అనూహ్యంగా ఎదురైన నిర్వహణ పరిస్థితుల కారణంగా విమానాలను రద్దు చేయాల్సి వచ్చిందనీ, పైలట్లు సహకరించకపోవడం వల్ల కాదని జెట్ ఎయిర్వేస్ ఓ ప్రకటనలో తెలిపింది. ప్రయాణికులకు విషయాన్ని ఎస్ఎంఎస్ల ద్వారా తెలియజేశామనీ, వీలైనంత మందిని ఇతర విమానాల్లో పంపి, మిగతా వారికి పరిహారం చెల్లించామంది. -
26 వరకు కొచ్చికి విమానాలు డౌటే!
సాక్షి, హైదరాబాద్: కేరళలో వర్షాలు, వరదలు విలయతాండవం చేస్తున్న నేపథ్యంలో విమాన రాకపోకలపై తీవ్ర ప్రభావం పడుతోంది. రన్ వేపై ఇంకా నీళ్లు నిలిచి ఉండటంతో ఆదివారం కూడా కొచ్చి వెళ్లాల్సిన విమానాలు రద్దయ్యాయి. శనివారం మధ్యాహ్నానికి రన్వేపై నీటిని తోడేయగలమని విమానాశ్రయ అధికారులు భావించినా, ప్రతికూల వాతావరణం కారణంగా సాధ్యపడలేదు. ఈ నెల 26 వరకు రన్వే అందు బాటులోకి వచ్చే అవకాశం లేదని తెలిసింది. -
‘ప్రయాణం’పై వర్షం దెబ్బ!
సాక్షి, హైదరాబాద్: కేరళ, ఇతర ప్రాంతాల్లోని వరదలు, భారీ వర్షాల ప్రభావం ఇంకా తగ్గలేదు. ఫలితంగా ఈ ప్రభావం నగరం నుంచి కేరళకు వెళ్లే.. వివిధ రైళ్లు, విమాన సర్వీసులపై పడింది. శుక్రవారం కూడా పలు రైళ్లు, విమానాలు రద్దయ్యాయి. మరికొన్నింటిని పాక్షికంగా రద్దు చేయగా, ఇంకొన్నింటిని దారి మళ్లించారు. పాక్షికంగా రద్దయిన రైళ్లివే.. సేలం– త్రివేండ్రం రాకపోకలకు అంతరాయం కలగడంతో హైదరాబాద్–త్రివేండ్రం సెంట్రల్ శబరి ఎక్స్ప్రెస్ను సేలం వరకు పరిమితం చేశారు. కోయంబత్తూరు– ఎర్నాకుళం మధ్య రాకపోకలు నిలిచిపోవడంతో పట్నా–ఎర్నాకుళం ఎక్స్ప్రెస్లను కొయంబత్తూరు వరకు పరిమితం చేశారు.తిరువనంతపురం– పాలక్కడ్ల మధ్య వరదల కారణంగా హైదరాబాద్ నుంచి శుక్రవారం బయల్దేరాల్సిన హైదరాబాద్– త్రివేండ్రం ఎక్స్ప్రెస్ను తిరుపతి వరకే పరిమితం చేశారు.మంగళూరు–కాచిగూడ మెయిల్ ఎక్స్ప్రెస్ను శనివారం తాత్కాలికంగా రద్దు చేశారు.కొల్లాం– విశాఖ మెయిల్ ఎక్స్ప్రెస్ను కొల్లాం–కోయంబత్తూరు మధ్య తాత్కాలికంగా రద్దు చేశారు.బనస్వాడి– సంబల్పూర్ ఎక్స్ప్రెస్ (ఈస్ట్కోస్ట్ రైల్వే) శుక్రవారం తాత్కాలికంగా రద్దు చేశారు. వీటిని దారి మళ్లించారు.. ముంబై సీఎస్ఎంటీ – కన్యాకుమారి ఎక్స్ప్రెస్, న్యూఢిల్లీ– త్రివేండ్రం సెంట్రల్ ఎక్స్ప్రెస్, కొబ్రా– త్రివేండ్రం సెంట్రల్ ఎక్స్ప్రెస్, త్రివేండ్రం సెంట్రల్ – న్యూఢిల్లీ ఎక్స్ప్రెస్, కన్యాకుమారి– ముంబై సీఎస్ఎంటీ ఎక్స్ప్రెస్లను ఈరోడ్, దిండిగల్, మదురై, తిరునల్వేలి, నాగర్కోయిల్టౌన్, త్రివేండ్రం సెంట్రల్ మీదుగా దారి మళ్లించారు.శ్రీగంగానగర్ –హజుర్ సాహిబ్ ఎక్స్ప్రెస్ నాందేడ్ ఎక్స్ప్రెస్ను(ఈస్ట్కోస్ట్ రైల్వే) శనివారం కొదియార్, చండ్లోడియా, సబర్మతీ మీదుగా దారి మళ్లించారు. సమయ వేళల్లో మార్పులు.. లోకమాన్య తిలక్ – కోయంబత్తూరు ఎక్స్ప్రెస్ (ఈస్ట్కోస్ట్ రైల్వే) శుక్రవారం 1.10 గంటలు ఆలస్యంగా బయల్దేరింది. వాతావరణ మార్పుల కారణంగా ఈ మార్పులు జరిగాయని, అసౌకర్యానికి చింతిస్తున్నామని దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో ఉమామహేశ్వరరావు ఒక ప్రకటనలో తెలిపారు. కొచ్చికి రద్దయిన విమానాలు..! కేరళలో కొచ్చి ఎయిర్పోర్టు రన్వే పూర్తిగా మునిగిపోవడంతో పలు విమాన సర్వీసులు ప్రభావితమయ్యాయి. శంషాబాద్ విమానాశ్రయం నుంచి కొచ్చికి వెళ్లాల్సిన 4 విమానాలు నేడు కూడా రద్దయ్యాయి. వరుసగా రెండోరోజూ కొచ్చి వెళ్లాల్సిన విమానాలు రద్దు కావడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. కొచ్చి విమానాశ్రయంలో రన్వే శనివారం మధ్యాహ్నం తర్వాత అందుబాటులోకి వచ్చే అవకాశముందని సమాచారం. -
విలవిల్లాడుతున్న కేరళ
తిరువనంతపురం: కేరళను ప్రకృతి బీభత్సం మరింత కుదిపేస్తోంది. అనేక జిల్లాల్లో ప్రజల పరిస్థితి అస్తవ్యస్తంగా తయారైంది. భారీ వర్షాలు, వరదల్లో గత మే నెల నుంచి ఇప్పటివరకూ 324మంది చనిపోయారని ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రకటించారు. దాదాపు రెండు లక్షలమందిని సహాయక శిబరాలకు తరలించినట్టు తెలిపారు. కేరళకు విరివిగావిరాళాలివ్వాల్సిందిగా మరోసారి ఆయన విజ్ఞప్తి చేశారు. దీనికి సంబంధించిన లింక్ను సీఎంఓ కేరళ ట్విటర్ లో పోస్ట్ చేసింది. కేరళకు మద్దతు ఇవ్వండంటూ ఒక ఆన్లైన్ డొనేషన్ క్యాంపెయిన్ ప్రారంభించింది. 14 జిల్లాల్లో రెడ్ అలర్ట్ కొనసాగుతోంది. రాష్ట్రంలో పలుచోట్ల విద్యుత్ లేక అల్లాడిపోతున్నారు. కేరళ విద్యుత్ బోర్డు పవర్కట్ చేయడంతో దాదాపు 80శాతం రాష్ట్రం చీకట్లో మగ్గుతోంది. కొబ్బరి, కాఫీ, నల్ల మిరియాలు లాంటి ఇతర ముఖ్య పంటల ఉత్పత్తి కూడా తీవ్రంగా దెబ్బతింది. వరదలు, కొండచరియలు కారణంగా కొజీకోడ్, ఎర్నాకులం, తిరువనంతపురం, పాలక్కాడ్, త్రిశూర్, పతనమిత్తిట్ట, ఇడుక్కి జిల్లాల్లో రోడ్లు, రైలు మార్గాలు దెబ్బతిన్నాయి. దీంతో అనేక రైళ్లను రద్దు చేశారు. మరికొన్నింటికి దారి మళ్లించారు. అలాగే ఆగస్టు 26 వరకు కొచ్చి అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి విమాన సర్వీసులను రద్దు చేశారు.14 జిల్లాల్లో సుమారు 2లక్షలకు పైగా ప్రజలు నిరాశ్రయులయ్యారు. 32,500పైగా ఎకరాల్లో పంట దెబ్బతిందని నేషనల్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ సెంటర్ ప్రకటించింది. కేరళ పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించాలని నేషనల్ క్రైసిస్ మేనేజ్మెంట్ కమిటీని సుప్రీంకోర్టు కోరింది. మరోవైపు కేరళలోని వరద పరిస్థితిని సమీక్షించేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ సాయంత్రం అక్కడ పర్యటించనున్నారని తెలుస్తోంది. Kerala is facing its worst flood in 100 years. 80 dams opened, 324 lives lost and 223139 people are in about 1500+ relief camps. Your help can rebuild the lives of the affected. Donate to https://t.co/FjYFEdOsyl #StandWithKerala. — CMO Kerala (@CMOKerala) August 17, 2018 -
ఎయిర్ ఏషియా బంపర్ సేల్
సాక్షి,ముంబై: ప్రైవేటు విమానయాన సంస్థ ఎయిర్ ఏషియా ఇండియా బంపర్ ఆఫర్ ప్రకటించింది. బై మోర్, సేవ్ మోర్ ఆఫర్లో భాగంగా దేశీయ,అంతర్జాతీయ ప్రయాణాలపై 40 శాతం (వన్ వే)రాయితీ ఇవ్వనున్నట్టు తెలిపింది. ఇందులో భాగంగా బుక్ చేసుకున్న టికెట్లపై రేపటి నుంచి (31 జూలై)నవంబరు 30 మధ్య ప్రయాణించవచ్చు. ఆగస్టు 5 వరకు ఆఫర్ అందుబాటులో ఉంటుంది. అంతర్జాతీయ రూట్లలోనూ 40 శాతం డిస్కౌంట్ అందించనుంది. ఎయిర్ ఏషియా అధికారిక వెబ్సైట్ ద్వారా కొనుగోలు చేసే టికెట్లకు మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది. క్రిడిట్, డెబిట్, చార్జ్కార్డ్ ద్వారా జరిగే పేమెంట్స్ ప్రాసెసింగ్ ఫీ నాన్-రిఫండబుల్. సీట్లు పరిమితంగా ఉంటాయి. ఎంపిక చేసిన విమానాలకు ఆఫర్ టికెట్లు వర్తించనున్నాయి. టికెట్లన్నీ సింగిల్ జర్నీకి ఉద్దేశించినవనీ, ఆఫర్లో భాగంగా జరిగే ఫేమెంట్స్ రిఫండ్ చేయనమని ఎయిర్ ఏషియా వెల్లడించింది. -
ఇక ఎగిరే రైళ్లు వస్తున్నాయ్!
సాక్షి, న్యూఢిల్లీ : దశాబ్దం క్రితం కలలుగన్న ఎగిరే కార్లు, హైపర్లూప్ రైళ్లు త్వరలో సాకారం కానున్న విషయం తెల్సిందే. ఇదే కలల్లోకి మరో కొత్త కల వచ్చి చేరింది. అదే ఎగిరే రైళ్లు. ఫ్రాన్స్ ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న అక్కా టెక్నాలజీస్ సంస్థ ఈ ప్రాజెక్ట్ ప్రతిపాదనను తీసుకొచ్చింది. ఇందులో గుండ్రని రైలు ఆకారంలో ప్రయాణికులు కూర్చునే ఓ ట్యూబ్ ఉంటుంది. దాన్ని ఓ చక్రాల వాహనం రన్వేలో గద్దలా ఆగిన విమానం కిందకు తీసుకొస్తుంది. ఆ విమానానికి రెక్కలు తప్ప బాడీ ఉండదు. చక్రాల బండి మీద తీసుకొచ్చిన రైలును విమానానికి అటాచ్ చేస్తారు. అది దాన్ని మోసుకొని గమ్యస్థానానికి బయల్దేరి వెళుతుంది. ఈ ప్రాజెక్ట్ కాన్సెప్ట్ను కంపెనీ త్రీడీ వీడియోగా రూపొందించింది. ఈ కొత్త ప్రాజెక్టులో పెట్టుబడుల కోసం ప్రపంచ ప్రసిద్ధ చెందిన కంపెనీలను ఆహ్వానించగా ఇప్పటికే పలు కంపెనీలు ఉత్సాహం చూపించినట్లు కంపెనీ సీఈవో మారిస్ రిక్కీ తెలిపారు. 170 కోట్ల డాలర్ల విలువ కలిగిన అక్కా టెక్నాలజీస్తో ఇప్పటికే పలు ప్రముఖ కంపెనీలు వివిధ ప్రాజెక్టుల్లో కలిసి పోతున్నాయి. ఈ ఎగిరే రైళ్లు ప్రాజెక్ట్ పూర్తయితే రైల్వే వ్యవస్థలోనే పిప్లవాత్మక మార్పులు వస్తాయని, వివిధ ప్రాంతాలకు వెళ్లే ట్యూబ్ లాంటి రైళ్లు రైల్వే స్టేషన్ల వద్ద ఉంటాయని, వాటిని ఎగిరే విమానాలు వచ్చి తీసుకెళతాయని కంపెనీ వర్గాలు తెలిపాయి. తద్వారా, రైల్వేలకు ఓ వైమానిక వ్యవస్థ ఏర్పడుతుందని, ప్రయాణికుడు తన ఇంటికి సమీపంలో ఉన్న రైల్వే స్టేషన్లో దిగే సౌకర్యం వస్తుందని ఆ వర్గాలు వివరించాయి. -
స్పైస్జెట్ ‘థ్రిల్లింగ్ థర్స్డే’ ఆఫర్
చవక ధరల విమానయాన సంస్థ స్పైస్జెట్ స్పెషల్ ‘థ్రిల్లింగ్ థర్స్డే’ ఆఫర్ను ప్రకటించింది. ఈ ఆఫర్ కింద విమాన టిక్కెట్లపై వెయ్యి రూపాయల వరకు డిస్కౌంట్ను అందిస్తోంది. డిస్కౌంట్ ఆఫర్తో పాటు, ప్రియారిటీ చెక్-ఇన్ను కూడా తన కస్టమర్లకు ఆఫర్ చేస్తోంది. నేడు అంటే గురువారం ఈ ఆఫర్ వాలిడ్లో ఉంది. అంతేకాక వచ్చే గురువారం జూలై 26న కూడా ఈ ఆఫర్ వాలిడ్లో ఉంటుంది. ఈ ఆఫర్ టిక్కెట్లు స్పైస్జెట్ వెబ్సైట్, స్పైస్జెట్.కామ్, మొబైల్ యాప్లో అందుబాటులో ఉంటాయి. స్పైస్జెట్ థ్రిల్లింగ్ థర్స్డే ఆఫర్ పొందడానికి కస్టమర్లు ప్రోమో కోడ్ ఎస్సీబీ1000ను వాడాల్సి ఉందని ఎయిర్లైన్ తన వెబ్సైట్లో తెలిపింది. స్పైస్జెట్ థ్రిల్లింగ్ థర్స్డే ఆఫర్ పొందడమెలా... స్పైస్జెట్ థ్రిల్లింగ్ థర్స్డే ఆఫర్ విమాన టిక్కెట్లను 2018 జూలై 26 వరకు వచ్చే గురువారాల్లో బుక్ చేసుకోవాలి. www.spicejet.com, స్పైస్జెట్ మొబైల్ యాప్లపై విమానాన్ని ఎంపిక చేసుకోవాలి. బుక్ చేసుకునేటప్పుడే ప్రియారిటీ చెక్-ఇన్ను పొందాలి. ప్రమోకోడ్ ఎస్సీబీ1000ను అప్లయి చేసుకోవాలి. పేమెంట్ పేజీపై ఉన్న ప్రమోషన్ కోడ్ సెక్షన్లో స్టాండర్డ్ ఛార్టడ్ క్రెడిట్ లేదా డెబిట్ కార్డు నెంబర్ నమోదు చేయాలి. రౌండ్ ట్రిప్ బుకింగ్కు వెంటనే రూ.1000 డిస్కౌంట్ పొందుతారు. వన్ వే బుకింగ్కు రూ.500 డిస్కౌంట్ లభిస్తుంది. -
విశాఖ-కౌలాలంపూర్ టిక్కెట్ రూ.3,399!
న్యూఢిల్లీ : మలేషియాకు చెందిన బడ్జెట్ విమానయాన సంస్థ ఎయిర్ఏషియా ఇండియా బంపర్ ఆఫర్ ప్రకటించింది. ప్రముఖ స్థానిక నగరాల నుంచి ఎంపిక చేసిన అంతర్జాతీయ ప్రాంతాలకు విమాన టిక్కెట్లను కేవలం రూ.3,399కే అందించనున్నట్టు తెలిపింది. ఈ ఆఫర్ ఇప్పటికే ప్రారంభమైంది. జూలై 15 వరకు ఈ టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు. ఎయిర్ఏషియా ప్రకటించిన ఎంపిక చేసిన అంతర్జాతీయ మార్గాల సేల్ ప్రయాణ కాలం 2019 ఫిబ్రవరి 13 నుంచి ప్రారంభమై 2019 ఆగస్టు 13 వరకు ముగియనుందని ఎయిర్ఏషియా.కామ్లో వెల్లడించింది. న్యూఢిల్లీ, అమృత్సర్, జైపూర్ వంటి నగరాల నుంచి వీటి విమానాలు బయలుదేరతాయి. కౌలాలంపూర్, క్రాబీ, హనోయి, ఆక్లాండ్ వంటి దేశాలకు ఈ విమానాలు అందుబాటులో ఉంటాయి. ఎంబార్గో కాలాల్లో ఈ ధరలు అందుబాటులో ఉండవు. తక్కువ ధరకే ఎయిర్ఏషియా విమాన టిక్కెట్ ఆఫర్.. విశాఖపట్నం నుంచి కౌలాలంపూర్ వరకు అంతర్జాతీయ విమాన టిక్కెట్లను ఎయిర్ఏషియా తన సేల్ కింద అత్యంత తక్కువగా రూ.3,999కే అందిస్తోంది. క్రెడిట, డెబిట్, ఛార్జ్ కార్డుల ద్వారా పేమెంట్లు జరిపే వాటికి నాన్-రీఫండబుల్ ప్రాసెసింగ్ ఫీజు వర్తిస్తుంది. ఈ ధరలోనే ఎయిర్పోర్టు పన్నులు కలిసి ఉంటాయి. అయితే డిపార్ట్చర్ సమయంలో సేకరించే ఎయిర్పోర్టు పన్నులు దీనిలో ఉండవు. సీట్లు కూడా పరిమితమే. అన్ని ఎయిర్ఏషియా విమానాలకు ఈ ఆఫర్ వర్తించదు. ఈ సేల్ కింద అమృత్సర్ నుంచి కౌలాలంపూర్ వెళ్లాలంటే విమాన టిక్కెట్ను రూ.4,490కు అందిస్తుంది. భువనేశ్వర్ నుంచి కౌలాలంపూర్కు, సింగపూర్కు వెళ్లాలంటే టిక్కెట్ ధర రూ.6,436కు ప్రారంభమవుతుంది. కోల్కతా నుంచి కౌలాలంపూర్, పెర్త్లకు వెళ్లాలంటే టిక్కెట్ ధర రూ.11,355 నుంచి ఉంది. హైదరాబాద్ నుంచి కౌలాలంపూర్, సిడ్నీలకు రూ.3,497, న్యూఢిల్లీ నుంచి కౌలాలంపూర్, బ్యాండంగ్కు రూ.8,730, బెంగళూరు నుంచి కౌలాలంపూర్, మెల్బోర్న్కు రూ.14,999కు విమాన టిక్కెట్లను ఎయిర్ఏషియా విక్రయిస్తోంది. -
స్పైస్జెట్ మాన్సూన్ బొనాంజ
న్యూఢిల్లీ : విమానయాన సంస్థలు మాన్సూన్ ఆఫర్లతో హోర్రెత్తిస్తున్నాయి. తాజాగా స్పైస్జెట్ ‘మెగా మాన్సూన్ సేల్’ను ప్రకటించింది. దీని కింద దేశీయ విమాన టిక్కెట్లను రూ.999కే అందిస్తున్నట్టు పేర్కొంది. స్పైస్జెట్ తీసుకొచ్చిన ఈ కొత్త ప్రమోషనల్ సేల్ 2018 జూలై 8 వరకే వాలిడ్లో ఉంటుందని స్పైస్జెట్ తన వెబ్సైట్లో ప్రకటించింది. 2018 అక్టోబర్ 8వ తేదీకి ఈ ఆఫర్ ప్రయాణ కాలం ముగియనుంది. తక్కువ ధరకు టిక్కెట్లను అందించడమే కాకుండా.. ఎయిర్లైన్ అధికారిక వెబ్సైట్లో టిక్కెట్లు బుక్ చేసుకున్న వారికి అదనపు ప్రయోజనాలను కూడా అందిస్తున్నట్టు పేర్కొంది. సీట్లు, మీల్స్, స్పైస్మ్యాక్స్, ఇతర యాడ్-ఆన్స్పై 20 శాతం డిస్కౌంట్ను ఈ క్యారియర్ అందిస్తున్నట్టు తెలిపింది. అదనపు డిస్కౌంట్ ఆఫర్ ప్రోమో కోడ్ ఏడీడీ0ఎన్20గా స్పైస్జెట్ వెల్లడించింది. స్పైస్జెట్ ‘మెగా మాన్సూన్ సేల్’ నియమ, నిబంధనలు... వన్-వే ధరలకు మాత్రమే ఈ మెగా సేల్ వర్తిస్తోంది. ఈ ఆఫర్ను మిగతా ఏ ఆఫర్తో కలుపరు. గ్రూప్ బుకింగ్స్కు ఇది వర్తించదు. ఒకవేళ అవసరమైతే స్వల్ప రద్దు ఛార్జీలతో టిక్కెట్ ధర మొత్తాన్ని రీఫండ్ చేయనుంది. ఫస్ట్-కమ్, ఫస్ట్-సర్వ్డ్ బేసిస్లోనే ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. విమానం బయలుదేరే సమయం, ఇతర షెడ్యూల్స్ రెగ్యులేటరీ ఆమోదం మేరకే ఉంటాయి. ఈ ఆఫర్కు బ్లాక్-అవుట్ డేట్స్ వర్తిస్తాయి. స్పైస్జెట్ అదనపు 20 డిస్కౌంట్ ఆఫర్... స్పైస్జెట్.కామ్ ద్వారా బుకింగ్స్ చేసుకునే యాడ్-ఆన్ ప్రొడక్ట్లకు మాత్రమే 20 శాతం అదనపు డిస్కౌంట్ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. స్పైస్మ్యాక్స్, సీట్, హాట్ మీల్, ప్రియారిటీ చెక్ఇన్, ప్రిఫర్డ్ బ్యాగ్ అవుట్ వంటి వాటికి ఈ ఆఫర్ వర్తిస్తుంది. అన్ని ఇతర ఛార్జీలు, ఫీజులు, పన్నులను ప్రయాణికులే చెల్లించాల్సి ఉంటుంది. దేశీయ, అంతర్జాతీయ విమానాల రౌండ్-ట్రిప్, వన్వే బుకింగ్స్ రెండింటికీ ఈ ఆఫర్ వాలిడ్లో ఉంటుంది. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా ఈ ఆఫర్ను సవరించుకోవడం, రద్దు చేసుకోవడం చేయొచ్చు. -
విమానం ఎగిరితే చాలు హడలెత్తిపోతున్నారు!
సాక్షి, ముంబై: దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ఉంటున్న పౌరులకు విమానాల రాకపోకలు హడలెత్తిస్తున్నాయి. ఎప్పుడు ఏ విమానం వచ్చి కూలుతుందోనని బెంబేలెత్తిపోతున్నారు. అందుకు ప్రధాన కారణం ముంబైలో ఉన్న దేశీయ, అంతర్జాతీయ విమానాశ్రయాల రన్వేలు నిత్యం బిజీగా ఉండటమే. దీంతో సకాలంలో ల్యాండింగ్కు అవకాశం దొరక్క అనేక సందర్భాలలో విమానాలు ఆకాశంలోనే చక్కర్లు కొట్టాల్సిన పరిస్థితి ఎదురవుతోందని రవాణ శాఖ సాంకేతిక నిపుణులు గుర్తించారు. ఈ నేపథ్యంలో విమానంలో ఏదైన సాంకేతిక లోపం తలెత్తిన లేదా పక్షులు ఢీ కొడితే విమానం జనవాసాల మ«ధ్య కూలడం ఖాయం. జనవాసాల మధ్య చక్కర్లు.. 1978లో బాంద్రాలో ఎయిర్ ఇండియా విమానం–855, 1982లో ముంబైలో ఎయిర్ ఇండియా విమానం–403, అంతేకాకుండా 1993, ఏప్రిల్ 26న ఔరంగాబాద్లో ఇండియన్ ఎయిర్లైన్స్కి చెందిన విమానం, ఇటీవల ఘాట్కోపర్లో 12 సీట్ల సామర్థ్యమున్న చార్టర్డ్ విమానం కూలిన సంగతి తెలిసిందే. ఈ ఘటనల్లో చాలా మంది దుర్మరణం చెందారు. కాగా, గత పదేళ్లతో పోలిస్తే ప్రస్తుతం విమానాశ్రయం ఉన్న పరిసర ప్రాంతాల్లో ప్రజలు ఎక్కువగా నివసిస్తున్నారు. దీంతో ఒకవేళ విమానాలు కూలితే నష్టం ఊహించలేనంతగా ఉండే అవకాశం ఉంది. ఘాట్కోపర్లో అదృష్టవశాత్తు విమానం నిర్మాణంలో ఉన్న భవనంపై కూలడంతో ప్రాణ నష్టం ఎక్కువ జరగలేదు. ఈ తాజా ఘటనతో విమానాల రాకపోకల వల్ల ముంబైకర్లకు పెను ప్రమాదం పొంచి ఉందన్న విషయం వెలుగులోకి వచ్చింది. రన్వేపై ఇప్పటికే చాలా విమానాలు ఉండటంతో ఇక ల్యాండిండ్ కావాల్సిన విమానాలు జనావాసాల్లోనే చక్కర్లు కొడుతున్నాయి. ఇంధనం ఖాళీ అయితే.. నగరంలో దేశీయ, అంతర్జాతీయ ఇలా రెండు విమానాశ్రయాలున్నాయి. ట్రాఫిక్ వల్ల విమానాశ్రయంలోని రన్ వే పై విపరీతమైన భారం పడుతోంది. దీంతో వివిధ దేశాలు, రాష్ట్రాల నుంచి ముంబైకి వచ్చే విమానాలు గాలిలోనే చక్కర్లు కొడుతుంటాయి. వివిధ ప్రాంతాల నుంచి ముంబైకి వచ్చే విమానంలో అర గంటకు సరిపడా ఇంధనం అదనంగా నిల్వ ఉంటుంది. ముంబై జనవాసాల మీదుగా చక్కర్లు కొట్టే విమానంలో ఏదైన సాంకేతిక సమస్య తలెత్తితే లేదా రన్వే బిజీ కారణంగా ల్యాండింగ్కు అనుకున్నదానికంటే ఎక్కువ సమయం తీసుకుంటుంది. కాగా, అదే సమయంలో ఇంధనం ట్యాంక్ ఖాళీ అయితే అప్పుడు పరిస్థితి ఏంటనే అంశం తెరమీదకు వచ్చింది. నిబంధనల మేరకే.. అంతర్జాతీయ ఎయిర్ పోర్టు అథారిటీ నియమాల ప్రకారం విమానాశ్రయం నగరం బయట ఉండాలి. ఎదైనా ప్రమాదం జరిగితే ప్రాణ హాని ఎక్కువ శాతం జరగదని దీని వెనక ముఖ్యోద్దేశం. కానీ, నాలుగైదు దశాబ్ధాల కిందట ముంబైలో దేశీయ, అంతర్జాతీయ విమానాశ్రయాలు నిర్మించినప్పుడు చుట్టుపక్కల జనవాసాలు అంతగా లేవు. కాలక్రమేణా విమానాశ్రయం చుట్టూ నక్షత్రాల హోటళ్లు, బహుళ అంతస్తుల భవనాలు, మధ్య తరగతి, పేదలు ఇలా అనేక రకాల జనవాసాల బస్తీ పెరిగిపోయింది. ఫలితంగా విమానాశ్రయాలు నగరం నడిబొడ్డున ఉన్నట్లే ఉన్నాయి. మరోపక్క విమానాల రాకపోకలు పెరగడంతో ఇక్కడ పడుతున్న భారాన్ని తగ్గించేందుకు నవీముంబైలో కొత్తగా అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మించాల్సిన అవసరం ఉందని విమానాశ్రయం వర్గాలు అభిప్రాయపడ్డాయి. అందుకు స్థల సేకరణ పనులు పూర్తయ్యాయి. రన్వేకు అడ్డు వస్తున్న భారీ ఉలవే కొండను నేల మట్టంచేసే పనులు ఇదివరకే ప్రారంభమైన విషయం విదితమే. ప్రస్తుతం ఈ విమానాశ్రయం నిర్మాణం కూడా అడవిలో జరుగుతోంది. కొన్ని దశాబ్ధాల తరువాత ఈ ప్రాంతంలో కూడా జనవాసాల బస్తీలు వెలుస్తాయని చెప్పడంలో సంశయం లేదు. అప్పుడూ ఇదే పరిస్థితి ఎదురుకావడం ఖాయం. రోజుకు 950 విమానాలు.. ముంబై విమానాశ్రయంలో రోజుకు 950 విమానాలు రాకపోకలు సాగిస్తాయి. గంటకు 45 విమనాలు ల్యాండింగ్, టేకాప్ అవుతుంటాయి. విమానాశ్రయానికి ఆనుకుని ఉన్న కుర్లా ప్రాంతంలో 1.20 లక్షల జనాలు, ఘాట్కోపర్, శాంతాకృజ్లో 90 వేల చొప్పున, విలేపార్లేలో 80 వేల మంది జనాలు ఉంటారు. విమానాశ్రయం పరిసరాల్లో కుర్లా, ఘాట్కోపర్లో చిన్న, చిన్న కొండలున్నాయి. కొండపై అనేక పేదల గుడిసెలున్నాయి. అవి రన్ వేకు చాలా దగ్గరగా ఉండటం వల్ల ఇంటి పైకప్పు పై నిలబడి చేయి పైకెత్తితే విమానం తగులుతుందా అనే అనుమానం వస్తుంది. దీన్ని బట్టి ఆ గుడిసెలు విమానాశ్రయానికి ఎంత దగ్గరున్నాయో ఇట్టే అర్ధమవుతోంది. -
సింగపూర్కు బాబు బంపర్ ఆఫర్
-
రూ.1,177కే విమాన టిక్కెట్
న్యూఢిల్లీ : ఉడాన్ స్కీమ్ కింద జెట్ ఎయిర్వేస్ కంపెనీ విమాన టిక్కెట్లను చౌక ధరలో అందిస్తోంది. ఎంపిక చేసిన దేశీయ మార్గాల్లో విమాన టిక్కెట్లను రూ.1,177కే అందించనున్నట్టు పేర్కొంది. ప్రస్తుతం జెట్ ఎయిర్వేస్, విమానాలను ఇతర పెద్ద గమ్యస్థానాలతో పాటు ప్రాంతీయ ప్రాంతాలకు కనెక్ట్ చేస్తోంది. తాజాగా లాంచ్ చేసిన మార్గాలను జెట్ ఎయిర్వేస్ ప్రభుత్వ రీజనల్ కనెక్టివిటీ స్కీమ్ లేదా ఆర్సీఎస్ కింద ప్రారంభించింది. సాధారణ వ్యక్తులకు కూడా విమాన ప్రయాణాన్ని చౌక ధరకు అందించే లక్ష్యంగా ప్రభుత్వం ఈ ఉడాన్-ఆర్సీఎస్ స్కీమ్ను తీసుకొచ్చింది. ఆర్సీఎస్ రూట్లలో తన నెట్వర్క్పై పలు ఇతర మార్గాలతో అలహాబాద్ను కనెక్ట్ చేస్తోందని జెట్ ఎయిర్వేస్ తెలిపింది. కొత్త విమానాలను అలహాబాద్ నుంచి ముంబైకు టూ-వే కనెక్షన్లలో వయా నాగ్పూర్, ఇండోర్, లక్నో మార్గాల ద్వారా ఆఫర్ చేయనున్నాయని కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. అదేవిధంగా టూ-వే కనెక్షన్లలోనే వయా ఇండోర్, పాట్నా ద్వారా అలహాబాద్ నుంచి బెంగళూరుకు విమానాలను ఆఫర్ చేస్తోంది. వయా ఇండోర్ మార్గాన అలహాబాద్ నుంచి పుణేను కనెక్ట్ చేసుకునే అవకాశం కూడా సందర్శకులకు కల్పిస్తోంది. అదేవిధంగా వయా లక్నో రూట్లో అలహాబాద్ నుంచి ముంబై, ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, పుణే, జైపూర్, అబుదాబిలకు విమానాలను జెట్ ఎయిర్వేస్ కనెక్ట్ చేస్తోంది. -
హింసకు ప్రగతే పరిష్కారం
భిలాయ్: అన్ని రకాల హింస, కుట్రలకు అభివృద్ధి మాత్రమే ఏకైక పరిష్కారమని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో గురువారం రూ. 22 వేల కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టుల్ని ప్రారంభించిన అనంతరం ఆయన బహిరంగ సభలో ప్రసంగించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో హింసకు పాల్పడుతున్న నక్సల్స్కు స్పష్టమైన సందేశమిచ్చే ప్రయత్నం చేశారు. ప్రజల్లో నమ్మకం కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం కృషిచేస్తోందని, అభివృద్ధే ధ్యేయంగా కేంద్ర ప్రభుత్వం, ఛత్తీస్గఢ్ ప్రభుత్వాలు అనేక పథకాల్ని ప్రారంభించాయని అన్నారు. యూపీఏ హయాంలో ఛత్తీస్గఢ్ అభివృద్ధిని పట్టించుకోలేదని, కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక భిలాయ్లో ఐఐటీ ఏర్పాటు చేశామని, మౌలిక వసతులు కల్పిస్తున్నామని ప్రధాని వెల్లడించారు. అంతకుముందు భిలాయ్ ఉక్కు కర్మాగారం ఆధునిక విస్తరణ ప్లాంటును ఆయన ప్రారంభించారు. ఈ కర్మాగారం ఆధునిక భారతదేశ పునాదులను బలోపేతం చేస్తుందని చెప్పారు. అలాగే జగదల్పూర్–రాయ్పూర్ మధ్య విమాన సేవల్ని, నయా రాయ్పూర్లో కమాండ్ కంట్రోల్ కేంద్రాన్ని ప్రధాని ప్రారంభించారు. ఈ ఏడాది చివర్లో ఎన్నికలు జరగనున్న ఛత్తీస్గఢ్లో నెలరోజుల వ్యవధిలో ప్రధాని మోదీ పర్యటించడం ఇది రెండోసారి కావడం గమనార్హం. ‘సహజ వనరుల నుంచి వచ్చే ఆదాయంలో కొంత స్థానిక గిరిజనుల కోసం ఖర్చుపెట్టాలని మా ప్రభుత్వం నిర్ణయించింది. ఛత్తీస్గఢ్కు అదనంగా రూ. 3 వేల కోట్లు అందాయి. వాటిని ఆస్పత్రులు, పాఠశాలలు, రహదారులు, మరుగుదొడ్ల నిర్మాణానికి ఖర్చు చేస్తారు. గిరిజనులు, వెనకబడ్డ ప్రాంతాల్లో నివసించేవారి ఆదాయం పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తుంది’ అని ప్రధాని పేర్కొన్నారు. జగదల్పూర్–రాయ్పూర్ మధ్య విమాన సేవల ప్రారంభాన్ని ప్రస్తావిస్తూ.. ‘హవాయ్ జహజ్(విమానం)లో హవాయి చెప్పులు వేసుకుని ఎవరైనా ప్రయాణిస్తే చూడాలనేది నా కల. చిన్న నగరాలు, పట్టణాలకు కూడా విమాన సేవలు అందించడమే మేం ప్రారంభించిన ఉడాన్ పథకం లక్ష్యం. గత ప్రభుత్వం రోడ్లు కూడా నిర్మించని ప్రాంతాల్లో.. ఎన్డీఏ ప్రభుత్వం రోడ్లు, విమానాశ్రయాల్ని నిర్మిస్తోంది. ఇంతకముందు రాయ్పూర్ విమానాశ్రయంలో రోజుకు కేవలం ఆరు విమానాలు ఎగిరేందుకు అవకాశముందేది. ఇప్పుడు 50 విమానాల రాకపోకలకు సామర్థ్యం కల్పించాం’ అని మోదీ చెప్పారు. భిలాయ్ ఐఐటీని సాకారం చేశాం ఎప్పటి నుంచో చత్తీస్గఢ్ రాష్ట్రానికి ఐఐటీ కేటాయించమని సీఎం రమణ్ సింగ్ డిమాండ్ చేసినా యూపీఏ ప్రభుత్వం పట్టించుకోలేదని.. ఎన్డీఏ అధికారంలోకి వచ్చాక దానిని సాకారం చేశామని చెప్పారు. గతంలో చత్తీస్గఢ్ అంటే అడవులు, గిరిజనులే గుర్తుకు వచ్చే వారని, ఇప్పుడు స్మార్ట్ సిటీ(నయా రాయ్పూర్)కి పేరుగాంచిందన్నారు. బస్తర్ అనగానే బాంబులు, తుపాకీల పేర్లు మాత్రమే వినిపించేదని, ఇప్పుడు జగదల్పూర్లో నిర్మించిన విమానాశ్రయం అందరికీ గుర్తుండిపోతుందని పేర్కొన్నారు. నవ భారతానికి పునాదులు ఛత్తీస్గఢ్ పర్యటనలో భాగంగా ఆధునికీకరించిన భిలాయ్ స్టీల్ ప్లాంట్ను ప్రధాని మోదీ జాతికి అంకితం చేశారు. అనంతరం మోదీ మాట్లాడుతూ.. నవ భారతానికి ఈ స్టీట్ ప్లాంట్ పునాదులు వేస్తుందని అన్నారు. దాదాపు రూ. 18,800 కోట్లతో విస్తరించిన ఈ స్టీల్ ప్లాంట్ సామర్థ్యం ఏడాదికి 4.7 మిలియన్ టన్నుల నుంచి 7.5 మిలియన్ టన్నులకు పెరుగుతుంది. ఉక్కు శాఖ మంత్రి బీరేంద్ర సింగ్ మాట్లాడుతూ.. నాలుగేళ్ల క్రితం వరకూ ఉక్కు పరిశ్రమ ఇబ్బందుల్ని ఎదుర్కొందని, ఇప్పుడు ప్రపంచంలో భారత్ రెండో అతిపెద్ద ఉక్కు ఉత్పత్తి దేశంగా నిలిచిందన్నారు. రూ. 72 వేల కోట్లతో స్టీల్ ప్లాంట్ల ఆధునీకరణ, విస్తరణ కార్యక్రమంలో భిలాయ్ ప్లాంట్ అభివృద్ధిని స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా(సెయిల్) చేపట్టింది. ఈ కార్యక్రమం ద్వారా దేశంలో ఉక్కు ఉత్పత్తి ఏడాదికి 13 మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యం 21 మిలియన్ టన్నులకు చేరుతుంది. బస్తర్ జిల్లాకు తొలిసారి విమాన సేవలు భిలాయ్ నుంచే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జగదల్పూర్ నుంచి రాయ్పూర్కు మొదటి విమానాన్ని మోదీ ప్రారంభించారు. దీంతో మావోయిస్టులకు పేరుపడ్డ బస్తర్ జిల్లాకు తొలిసారి విమాన సేవలు అందుబాటులోకి వచ్చాయి. -
జెట్ ఎయిర్వేస్ బిగ్ సేవింగ్స్ ఆఫర్
సాక్షి, ముంబై: ప్రముఖ విమానయాన సంస్థ దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లలో డిస్కౌంట్ను ఆఫర్ చేస్తోంది. బిగ్ సేవింగ్స్ పథకం కింద జెట్ ఎయిర్వేస్ దేశీయ, అంతర్జాతీయ విమానాల్లో టికెట్లపై తగ్గింపును అందిస్తోంది. జెట్ ఎయిర్వేస్ వెబ్సైట్, లేదా మొబైల్ యాప్ ద్వారా చేసిన బుకింగ్స్కు మాత్రమే ఈ ఆఫర్ అందుబాటులో వుంటుందని కంపెనీ తెలిపింది. దేశీయ మార్గంలో టికెపై 400 రూపాయలదాకా డిస్కౌంట్ను అందిస్తోంది. అంతర్జాతీయ విమాన టికెట్లపై 600 రూపాయల దాకా తగ్గింపురేట్లను వర్తింప చేస్తోంది. వన్ వే టికెట్లపై 200 రూపాయల దాకా, రిటర్న్ జర్నీపై రూ.600 దాకా డిస్కౌంట్ అందుబాటులో ఉంది. దేశీయ మార్గంలో కూడా ఇదే ఆఫర్ను అందిస్తోంది. ప్రీమియర్, ఎకానమీ క్లాసు టికెట్లపై ఈ డిస్కౌంట్ ఆఫర్ను అందిస్తున్నట్టు జెట్ ఎయిర్వేస్ ప్రకటించింది. ఈ డిస్కౌంట్ ఆఫర్ ప్రయాణానికి కనీసం పదిహేను రోజులముందుగా బుక్ చేసుకున్న, ఇండియన్ రూపీ కరెన్సీ ద్వారా కొనుగోలు చేసిన టికెట్లకు మాత్రమే వర్తిస్తుంది. -
విమానం 6 గంటల ఆలస్యం.. రచ్చరచ్చ
ముంబై : ఎయిరిండియా విమానయాన సంస్థ మరోసారి ప్రయాణికుల ఆగ్రహనికి బలైంది. ఎయిరిండియాకు చెందిన ఏఐ 625 విమానం సుమారు ఆరు గంటల పాటు ఆలస్యం కావడంతో, ముంబై అంతర్జాతీయ విమానశ్రయంలో తీవ్ర గందరగోళ పరిస్థితి ఏర్పడింది. దీంతో లక్నోలో ఉదయం 10.30 గంటలకు దిగాల్సిన ప్రయాణికులు, సాయంత్రం 5 గంటలకు చేరుకున్నారు. విమాన రాకకు ఆలస్యంపై ఎయిరిండియా అధికారులు సరిగ్గా స్పందించకపోవడంతో, బోర్డింగ్కు వేచిచూసిన ప్రయాణికులు తీవ్ర అసహనం పాలయ్యారు. మరోవైపు వారికి ఆహారం కానీ, మంచి నీళ్లు కానీ ఎలాంటి సౌకర్యాలను ఎయిరిండియా అధికారులు కల్పించలేదు. ఎందుకు విమానం ఆలస్యం అవుతుందో కూడా సమాధానం చెప్పకపోవడంతో ప్రయాణికుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఎయిరిండియాకు చెందిన ఏఐ 625 అసలు ఉదయం 8 గంటలకు బయలుదేరాల్సి ఉంది. ముంబై అంతర్జాతీయ విమానశ్రయం నుంచి 8 గంటలకు బయలుదేరి, లక్నోకు ఉదయం 10.30కు చేరుకోవాలి. కానీ మధ్యాహ్నం 2.30 అయినా విమానం టేకాఫ్ కాలేక పోయింది. విమానం కోసం వేచిచూస్తున్న ప్రయాణికులకు ఏమైందో కూడా తెలియలేదు. ఎయిరిండియా అధికారులను అడిగినా వారు కూడా సరిగ్గా స్పందించలేదు. సమాధానం చెప్పకపోగా.. తమల్ని తప్పించుకుంటూ తిరిగారని ప్రయాణికుడు వివేక్ భల్లా చెప్పాడు. ఇక గ్రౌండ్ స్టాఫ్ అయితే తమతో చాలా అమర్యాదగా వ్యవహరించినట్టు పేర్కొన్నాడు. తమల్ని బెదిరించినట్టు కూడా తెలిపాడు. సీఐఎస్ఎఫ్ అధికారులు మధ్యలో కల్పించుకుని, తమల్ని వారి బారి నుంచి కాపాడినట్టు పేర్కొన్నాడు. ఎయిరిండియా అధికారులు ఎప్పుడూ ప్రయాణికులతో అమర్యాదగానే వ్యవహరిస్తారని భల్లా చెప్పాడు. ప్రతి ఒక్కరూ నరకయాతన అనుభవించినట్టు చెప్పాడు. లక్నోలో తమ బంధువు చనిపోతే, కడసారి చూపుకు వెళ్తున్న ఓ ప్రయాణికులకు అది నెరవేరకుండా చేశారని మండిపడ్డాడు. విమాన టిక్కెట్లపై తాము భారీ మొత్తంలో వెచ్చిస్తామని, కానీ వారు తీరిగ్గా గంటల కొద్దీ విమానాన్ని ఆలస్యం చేస్తారని ఎద్దేవా చేశాడు. విమానం ఆలస్యం, సరిగ్గా స్పందించలేకపోవడంపై పైలెట్, విమానంలో ప్రయాణికులను క్షమాపణ కోరాడు. సిబ్బందితో హైదరాబాద్ నుంచి వస్తున్న విమానం టెక్నికల్ సమస్యతో ఆలస్యమైందని, తమ మొత్తం ప్రొగ్రామ్లను రీషెడ్యూల్ చేసి, కొత్త విమానం, సిబ్బందిని నియమించినట్టు పేర్కొన్నాడు. -
సుష్మా విమానం సేఫ్
న్యూఢిల్లీ: విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ ప్రయాణిస్తున్న విమానం ఆదివారం కాసేపు ఏటీసీ (ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్)తో సంబంధాలు కోల్పోవడంతో ఆందోళన నెలకొంది. 14 నిమిషాల తర్వాత మళ్లీ విమానం జాడ దొరకడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. దక్షిణాఫ్రికాలో జరగనున్న బ్రిక్స్ (బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌతాఫ్రికా), ఐబీఎస్ఏ (ఇండియా, బ్రెజిల్, సౌతాఫ్రికా) సదస్సుల్లో పాల్గొనేందుకు సుష్మ శనివారం ఢిల్లీ నుంచి వాయుసేనకు చెందిన ఐఎఫ్సీ 31 ఎంబ్రాయర్ (మేఘదూత్) విమానంలో బయల్దేరి దక్షిణాఫ్రికా వెళ్లారు. ఏకధాటిగా దక్షిణాఫ్రికా వరకు ప్రయాణించడానికి సరిపోయేంత ఇంధనాన్ని నింపుకునే సదుపాయం మేఘదూత్కు లేదు. దీంతో తిరువనంతపురం, మారిషస్లో విమానం ఆగి ఇంధనాన్ని నింపుకోవాల్సి ఉంది. తిరువనంతపురం నుంచి మధ్యాహ్నం 2.08 గంటలకు బయల్దేరి మాల్దీవుల గగనతలంలో ప్రయాణిస్తున్నంత వరకు కూడా అంతా సవ్యంగా ఉంది. అయితే మేఘదూత్ మారిషస్ గగనతలంలోకి ప్రవేశించగానే అక్కడి ఏటీసీతో సంబంధాలు తెగిపోయాయి. సాధారణంగా ఏటీసీతో విమానాలకు సంబంధాల విషయంలో తొలి 10, 20, 30 నిమిషాల్లోపు వివిధ దశల్లో హెచ్చరికలు జారీచేస్తారు. 30 నిమిషాల తర్వాత కూడా ఏటీసీతో సంబంధాలు పునరుద్ధరణ కాకపోతే విమానం జాడ తెలియడం లేదని ప్రకటిస్తారు. 4.44 గంటలకు సుష్మ ప్రయాణిస్తున్న విమానం జాడ మిస్సయింది. దీంతో 12 నిమిషాల తర్వాత కూడా జాడ దొరకకపోవడంతో తొలి హెచ్చరిక జారీ అయింది. దీంతో ఆందోళన మొదలైంది. అయితే 4.58 గంటలకు విమానం రాడార్ పరిధిలోకి వచ్చినట్లు తెలియడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. రాడార్లలో సాంకేతిక లోపం కారణంగా ఈ సమస్య తలెత్తి ఉండొచ్చని భారత వినాశ్రయాల ప్రాధికార సంస్థ (ఏఏఐ) అధికారి ఒకరు తెలిపారు. మారిషస్ ప్రధానితో భేటీ మారిషస్లో ఇంధనం నింపుకోవడానికి ఆగినసమయంలో ఆ దేశ ప్రధాని ప్రవీంద్ జగన్నాథంతో సుష్మ భేటీ అయ్యారు. ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం దిశగా చర్చలు జరిపిన అనంతరం ఆమె దక్షిణాఫ్రికా వెళ్లారు. -
ఇండిగో చార్జీలు ప్రియం..
న్యూఢిల్లీ: విమాన ఇంధన ధరలు పెరుగుదలతో టికెట్ల రేట్లకూ రెక్కలొస్తున్నాయి. అన్నింటికన్నా ముం దుగా.. ఇండిగో ఎయిర్లైన్స్ ఇందుకు తెరతీసింది. దేశీ రూట్లలో టికెట్లపై రూ.400 దాకా ఇంధన సర్చార్జీ విధించాలని నిర్ణయించింది. 1,000 కిలోమీటర్ల లోపు ప్రయాణాలకు సంబంధించిన టికెట్లపై రూ.200, అంతకు మించిన దూరాలపై రూ.400 సర్చార్జీ ఉంటుందని ఇండిగో తెలిపింది. మే 30 నుంచి ఇది అమల్లోకి వస్తుందని వివరించింది. అటు ఇంధన (ఏటీఎఫ్) రేటు పెరగడానికి ఇటు రూపాయి విలువ క్షీణించడం కూడా తోడవడంతో ఎయిర్లైన్స్పై అదనపు భారం పడుతోందని ఇండిగో చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ సంజయ్ కుమార్ తెలిపారు. -
ఊపందుకున్న విమాన ప్రయాణాలు
వేసవి సెలవులకు ఎక్కడెక్కడికో టూర్లు వెళ్లే వారు కొందరైతే.. వచ్చే వారు మరి కొందరు.. ఆ ప్రయాణికులను ఆకర్షించడానికి విమాన సంస్థల మధ్య పోటీ.. తగ్గింపు ధరలకే ఆఫర్ల్లో ముందస్తు టికెట్లు.. అందులో టికెట్ దొరక్కపోయినా ఎక్కువైనా ఫరావాలేదు సుఖ మయ ప్రయాణమే బెస్టని ప్రయాణికులు ఎక్కువగా విమానాలను ఆశ్రయిస్తున్నారు. దీంతో విశాఖ విమానాశ్రయం దేశీయ, అంతర్జాతీయ ప్రయాణికులతో కోలాహలంగా కనిపిస్తోంది. ఈ సర్వీసులకూ డిమాండ్ ఆకాశమంత ఎత్తున పెరిగిపోతోంది. గోపాలపట్నం(విశాఖ పశ్చిమ): విశాఖ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి దాదాపు 42 విమాన సర్వీసులు దేశీయ, అంతర్జాతీయంగా అందుబాటులో ఉన్నాయి. హైదరాబాద్, బెంగళూరు, ముంబై, కోల్కతా, భువనేశ్వర్, విజయవాడ, చెన్నై, తిరుపతి, పోర్ట్బ్లెయిర్, అహ్మదాబాద్, కోయంబత్తూర్, ఢిల్లీతో పాటు శ్రీలంక, దుబాయ్, సింగపూర్, కౌలాలంపూర్లకు సర్వీసులు ఉన్నాయి. విశాఖ నుంచి అంతర్జాతీయ పట్టణాలను సైతం చేరుకోడానికి ఎయిర్ కనెక్టివిటీ ఉండడంతో జనం ఇలా వెళ్లడానికే ఆసక్తి చూపుతున్నారు. టికెట్ ధరలకు రెక్కలు.. ప్రయాణాల డిమాండ్ను చూసి ప్రైవేటు బస్ ఏసీ సర్వీసులు విపరీతమైన గిరాకీ చూపుతున్నాయి. ఏసీ రైళ్లలో ప్రయాణాలకూ వేలకు వేలు వెచ్చించాల్సి వస్తోంది. ఈదశలో గంటలు, రోజుల ప్రయాణాలకు వేలు రూపాయలు వెచ్చించే కంటే గంటో, గంటన్నరలోనో హైదరాబాద్, బెంగళూరు తదితర పట్టణాలకు వెళ్లడం మంచిదన్న భావన ప్రయాణికుల్లో కనిపిస్తోంది. ఇలా కొందరు వేసవికి ముందే రూ.999, రూ.2000 టికెట్ల ఆఫర్లు పొంది పిల్లాపాపలతో హాయిగా ప్రయాణాలు సాగిస్తున్నారు. ఆఫర్లలో టికెట్ దొరక్కపోయినా డబ్బుకు వెనకాడని ప్రయాణికులు మాత్రం విమాన ప్రయాణంకే మొగ్గు చూపుతున్నారు. దీంతో విమానాలన్నీ ఫుల్గా నడుస్తున్నాయి. ఒడిశా వారూ ఇక్కడి నుంచే.. ఒడిశా భువనేశ్వర్లో విమానాశ్రయం ఉన్నా అక్కడి నుంచి బెంగళూరు వెళ్లే ప్రయాణికులు విశాఖ నుంచే అధికంగా ప్రయాణాలు సాగిస్తున్నారు. ఒడిశా నుంచి ఉన్నత చదువులకు, ఉన్నత ఉద్యోగాల కోసం బెంగళూరుకు వెళ్లే వారు ఎక్కవగా కనిపిస్తున్నారు. వారు అక్కడి నుంచి రైల్లో సింహాచలం రైల్వేస్టేషన్కో, విశాఖ స్టేషన్కో వచ్చి విశాఖ విమానాశ్రయం నుంచి సర్వీసులు పట్టుకుంటున్నారు. ఇలా ప్రయాణించడం వల్ల సమయం ఆదాతో పాటు ప్రయాణ ఖర్చుల భారం బాగా తగ్గుతున్నట్లు వారు చెబుతున్నారు. రాజమండ్రిలో విమానాశ్రయం ఉన్నా అక్కడి నుంచి ఎక్కడికీ సర్వీసులు లేక పోవడంతో అక్కడి ప్రయాణికులూ విశాఖకు వచ్చి ప్రయాణాలు చేస్తున్నారు.ఇలా విశాఖ విమానాశ్రయం నుంచి ప్రయాణికుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. మొత్తంమ్మీద ప్రయాణాల్లో మొదటి స్థానం హైదరాబాద్ కాగా తర్వాత బెంగళూరుకే ఎక్కువగా ప్రయాణిస్తున్నారు. -
ఉచిత టిక్కెట్లు : జెట్ ఎయిర్వేస్ క్లారిటీ
న్యూఢిల్లీ : సామాజిక మాధ్యమాల్లో వచ్చే సందేశాల్లో నిజాలెంత ఉంటాయో? అబద్ధాలు కూడా అంతే. ఇటీవల జెట్ ఎయిర్వేస్ తన 25వ వార్షికోత్సవం సందర్భంగా ఉచిత విమాన టిక్కెట్లు ఇస్తుందంటూ మెసేజ్లు తెగ చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఈ మెసేజ్లో నిజమెంత ఉందో, అబద్ధమెంతో జెట్ ఎయిర్వేస్ తేల్చేసింది. తాము ఎటువంటి ఉచిత టిక్కెట్లు ఇవ్వడం లేదని, సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్న సందేశాలన్నీ పూర్తిగా అవాస్తవమేనని జెట్ ఎయిర్వేస్ బుధవారం స్పష్టంచేసింది. ఇది 100 శాతం పూర్తిగా అవాస్తవమని తెలిపింది. అధికారిక ఖాతాలను నుంచి వచ్చిన సమాచారాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలని కస్టమర్లకు సూచించింది. ‘25 వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని జెట్ ఎయిర్వేస్లో ప్రయాణించే ప్రతి ఒక్కరికీ రెండు టికెట్లు ఉచితంగా ఇస్తున్నట్లు వస్తోన్న సందేశాలన్నీ పూర్తిగా అవాస్తవం. అది అధికారిక సమాచారం కాదు. అలాంటి సమాచారం ఏదైనా ఉంటే ఎయిర్వేస్ అధికారిక ఖాతాల్లోనే ఉంచుతాం. దానికి బ్లూ టిక్ మార్క్ ఉంటుంది’ అని జెట్ ఎయిర్వేస్ ట్వీట్ చేసింది. 25వ వార్షికోత్సవ సందర్భంగా జెట్ఎయిర్వేస్ ప్రతి ఒక్కరికీ రెండు ఉచిత టిక్కెట్లు ఇస్తోందని, ఆ లింక్ను మరో 20 మందికి షేర్ చెయ్యాలని, దాంతో 48 గంటల్లో యూజర్ మెయిల్ ఐడీకి టికెట్లు అందుతాయని ఆ మెసేజ్లో ఉంది. అయితే అదంతా పూర్తిగా అవాస్తవమని జెట్ ఎయిర్వేస్ తేల్చేసింది. ఈ వైరల్ మెసేజ్పై బుధవారం క్లారిటీ ఇచ్చింది. ఎయిర్లైన్ ప్రకటనపై స్పందించిన చాలామంది ట్విటర్ యూజర్లు తాము ఈ మెసేజ్ను పొందామని, క్లిక్ కూడా చేసినట్టు పేర్కొన్నారు. #FakeAlert There's a fake link being circulated regarding ticket giveaways for our 25th Anniversary. This is not an official contest/giveaway and we advise caution. Genuine contests & giveaways are hosted only on our verified social media accounts, indicated with a blue tick. pic.twitter.com/NvJrFaq3aL — Jet Airways (@jetairways) May 23, 2018 -
ఎయిర్ ఏసియా బిగ్ సేల్: రూ.999కే సింగపూర్
సాక్షి, ముంబై: బడ్జెట్ క్యారియర్ ఎయిర్ ఏసియా ఇండియా విమాన టికెట్లపై మరోసారి డిస్కౌంట్ ధరలను ప్రారంభించింది. అదీ అంతర్జాతీయ మార్గంలో ‘బిగ్సేల్’ పేరుతో తక్కువ ధరలకే విమాన టికెట్లను ఆఫర్ చేస్తోంది. అదీ అంతర్జాతీయంగా 999 రూపాయలకే విమాన టికెట్లను ఆఫర్ చేస్తోంది. మే21- 27తేదీల మధ్య ఈ ఆఫర్లో టికెట్ల బుకింగ్ సౌకర్యం లభ్యం. ఇలా బుక్ చేసుకున్న టికెట్ల ద్వారా నవంబర్ 1, 2018నుంచి ఆగస్టు13, 2019 వరకు ప్రయాణించే అవకాశం. అంతర్జాతీయంగా కౌలాలంపూర్, బ్యాంకాక్, క్రబీ, సిడ్నీ, ఆక్లాండ్, మెల్బోర్న్, సింగపూర్, బాలి లాంటి అన్ని ప్రాంతాల నుంచి రూ. 999 (వన్ వే) ప్రారంభ ధరకే టికెట్లను అందిస్తోంది. బెంగళూరు, కొచ్చి, గోవా, జైపూర్, చండీగఢ్, పుణె, న్యూఢిల్లీ, గువహతి, ఇంఫాల్, విశాఖపట్నం, హైదరాబాద్, శ్రీనగర్, బాగ్డోగ్ర, రాంచి, కోలకతా, నాగ్పూర్ ఇండోర్, చెన్నై, సూరత్ , భువనేశ్వర్ నుంచి ఈ విదేశీ టికెట్లను ఎంపిక చేసుకోవచ్చు. ఎయిర్ ఏసియా ప్రకటించిన ఈ కొత్త ప్రమోషనల్ ఆఫర్ కింద ఎయిర్ ఆసియా, ఆసియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ విమానాల్లో డిస్కౌంట్ టిక్కెట్లు అందిస్తోంది. ఈ రాయితీ ధరల టిక్కెట్లు www.airasia.com, మొబైల్ యాప్ ద్వారా ఆన్లైన్ బుకింగ్స్కు మాత్రమే లభిస్తాయి. ఎయిర్ ఏసియా గ్రూప్ నెట్వర్క్లోని ఎయిర్ ఏసియా ఇండియా, ఎయిర్ ఏసియా బెర్హాడ్, థాయ్ ఎయిర్ ఏసియా తదితర ఆపరేటింగ్ సర్వీసుల ద్వారా ఈ ఆఫర్ లభ్యమవుతుంది. ఎయిర్ ఏసియా వెబ్సైట్ లో పొందుపర్చిన సమాచారం ప్రకారం గోవా నుండి కౌలాలంపూర్ టికెట్ 1999నుంచి ప్రారంభం. కోచి నుండి కౌలాలంపూర్కు 3,399 రూపాయలు, విశాఖపట్నం-కౌలాలంపూర్ , గోవా-కౌలాలంపూర్ రూ.5514 , హైదరాబాద్- కౌలాలంపూర్ 4,999 రూపాయలు, జైపూర్-కౌలాలంపూర్ 3,590 రూపాయలు న్యూఢిల్లీ నుంచి కౌలాలంపూర్ రూ.4,290 ప్రారంభ ధరలుగా ఉన్నాయి. భారతదేశం నుండి కౌలాలంపూర్ ద్వారా పయనించే విమానాల్లో కూడా తక్కువ ధరలను ప్రకటించింది. భువనేశ్వర్-కౌలాలంపూర్-జకార్తా రూ .2,255, భువనేశ్వర్-కౌలాలంపూర్-యోగ్యకార్తా రూ.3,341, కొచ్చి-కౌలాలంపూర్-బ్రూనే 4,649 రూపాయలు, కోలకతా-బ్యాంకాక్ - డాన్ మెయంగ్-ఫుకెట్ రూ .5405, హైదరాబాద్-కౌలాలంపూర్-పెనాంగ్ 6,613 రూపాయలు, జైపూర్-కౌలాలంపూర్ -క్రిబి 5,701 రూపాయలు ప్రారంభ ధరలుగా ఉన్నాయి. పూర్తి వివరాలు ఎయిర్ ఏసియా అధికారిక వెబ్సైట్లో లభ్యం. -
విమాన ఆలస్యం.. వామ్మో అంత జరిమానా!
న్యూఢిల్లీ : దేశీయ విమానయాన సంస్థ ఎయిరిండియాకు కష్టాలు వెన్నంటే ఉన్నట్టు ఉన్నాయి. విమాన ఆలస్యమైనందున ఈ విమానయాన సంస్థ భారీ మొత్తంలో నష్టపరిహారాన్ని చెల్లించాల్సి వస్తోంది. మే 9న ఢిల్లీ నుంచి చికాగో బయలుదేరిన విమానం ఆలస్యమైనందుకు 323 మంది ప్రయాణికులకు 8.8మిలియన్ డాలర్లు అంటే దాదాపు రూ.59కోట్లు చెల్లించాల్సి వస్తోంది. విమాన సిబ్బందికి సంబంధించిన ఫ్లైట్ డ్యూటీ టైం లిమిటేషన్స్ వల్ల ఈ ఆలస్యం ఏర్పడింది. మే 9న ఢిల్లీ నుంచి చికాగో బయలుదేరిన ఏఐ 127 విమానం 16 గంటల్లో చికాగో చేరుకోవాల్సి ఉంది. కానీ వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడం వల్ల విమానాన్ని చికాగోకు సమీపంలోని మిల్వాకీ ప్రాంతానికి తరలించారు. మిల్వాకీ నుంచి చికాగోకు విమానంలో వెళ్లడానికి 19 నిమిషాలే సమయం పడుతుంది. ఆ సమయానికే ఆ విమానం 16 గంటలు ప్రయాణించింది. డీజీసీఏ నిబంధలన ప్రకారం విమానంలోని సిబ్బంది డ్యూటీ గంటల కంటే ఎక్కువ పనిచేయకూడదు. దీంతో విమానంలోని సిబ్బంది డ్యూటీ గంటలు అయిపోయాయి. మరోవైపు నిబంధనలనుసరించి వారికి ఆ రోజుకు ఒక్కసారి మాత్రమే ల్యాండింగ్కు అనుమతి ఉంది. ఈ కారణాలతో మరో మార్గం లేక ఎయిరిండియా ఆ విమానం కోసం కొత్త సిబ్బందిని రోడ్డుమార్గంలో మిల్వాకీకి తరలించింది. ఈ మొత్తం ప్రక్రియ వల్ల ఆ విమానం చికాగో చేరుకోవడానికి దాదాపు ఆరు గంటలు ఆలస్యమైంది. ఇన్ని గంటల పాటు కూడా ప్రయాణికులు విమానంలోనే ఉండిపోయారు. ఆరు గంటల ఆలస్యంగా ప్రయాణికులను గమ్యస్థానానికి చేర్చింది. అంతటితో సమస్య ముగిసిపోయిందనుకున్న ఎయిరిండియా మరో పెద్ద సమస్యే ఎదురైంది. అమెరికా నిబంధనల ప్రకారం ప్రయాణికులు విమానంలో ఉండగా నాలుగు గంటల కంటే ఎక్కువ సమయం నిలిపి ఉంచితే విమాన ఆలస్యంపై ఆ విమానయాన సంస్థ పరిహారం చెల్లించాల్సి ఉంటుంది. దీని ప్రకారం ఒక్కో ప్రయాణికుడికి 27,500డాలర్ల పరిహారం చెల్లించాలి. అంటే ఆ విమానంలో 323 మంది ప్రయాణికులు ఉన్నందున మొత్తం కలిపి 8.8మిలియన్ డాలర్ల పరిహారం చెల్లించాల్సి వస్తుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. భారీ మొత్తంలో పెనాల్టీ చెల్లించాల్సి వస్తున్నందున డీజీసీఏ నిబంధనల్లో కొన్ని మార్పులు కోరుతూ ఎయిరిండియా, ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎయిర్లైన్స్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించాయి. ఈ ఫిర్యాదు మే 15న ఢిల్లీ హైకోర్టులో విచారణకు వచ్చింది. ఈ విచారణలో తాము వాతావరణ ప్రతికూలతతోనే విమానాన్ని దారి మరలించాల్సి వచ్చిందని ఎయిరిండియా తెలిపింది. -
ఐఆర్సీటీసీలో విమాన టికెట్లు
సాక్షి, ముంబై: భారత రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ) విమాన ప్రయాణికులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. అవును మీరు చదివింది నిజమే.. దేశీయ, అంతర్జాతీయ విమానాల్లో ప్రయాణించే వారికి చల్లని కబురు చెప్పింది. డొమెస్టిక్, ఇంటర్నేషనల్ విమాన టికెట్ల బుకింగ్పై నామమాత్రపు ఫీజును వసూలు చేయనున్నామని ప్రకటించింది. ఐఆర్సీటీసీ అధికారిక ట్విటర్ ద్వారా ఈ తీపి వార్తను వినియోగదారులకు అందించింది. వినియోగదారుడు నేరుగా ఐఆర్సీటీసీ ఎయిర్ వెబ్సైట్ (air.irctc.co.in) ద్వారా గానీ ఐఆర్సీటీసీ ఎయిర్ యాప్ ద్వారా విమాన టిక్లెకు బుక్ చేసుకోవచ్చని ఐఆర్సీటీసీ వెల్లడించింది. ఇందుకు కేవలం 59 రూపాయల నామమాత్రపు ఫీజును వసూలు చేయనున్నామని తెలిపింది. ఎలాంటి హిడ్డెన్ చార్జీలు వుండవని స్పష్టం చేసింది. ప్రతి విభాగంలోనూ విమాన టికెట్ల బుకింగ్పై భారీ సేవింగ్స్ను అందిస్తున్నట్టు తెలిపింది . వినియోగదారుల సౌలభ్యంకోసం 24గంటలు తమ సేవలు అందుబాటులో ఉంటాయని పేర్కొంది. అంతేకాదు కస్టమర్ల సమస్యలు, సందేహాల నివారణకోసం 1800110139 అనే టోల్ ఫ్రీ నెంబర్ను కూడా అందుబాటులో ఉంది. అలాగే flights@irctc.co.in. అనే మెయిల్ ద్వారా కూడా తమను సంప్రదించవచ్చని ఐఆర్సీటీసీ ప్రకటించింది. ఆన్లైన్ టికెట్ టిక్కెట్లను బుకింగ్ కోసం 50కిపైగా పేమెంట్ ఆప్షన్లను అందుబాటులో ఉన్నాయనీ, దాదాపు అన్ని ప్రధాన బ్యాంకుల నెట్ బ్యాంకింగ్తో సహా అన్ని ప్రధాన కార్డుల చెల్లింపుల సౌలభ్యం వెబ్సైట్, యాప్లో లభ్యమవుతాయని తెలిపింది. విమాన టికెట్ల బుకింగ్లో ఎల్టీసీ (ప్రయాణ రాయితీ) ధరల సదుపాయం కూడా అందుబాటులో ఉంచింది. దీంతోపాటు టికెట్ కాన్సిలేషన్,బుకింగ్ సదుపాయం సరళీకరణతో యూజర్లకు ఫ్రెండ్లీ అనుభవాన్ని అందిస్తున్నామని పేర్కొంది. Get the #best #deals on #flight #tickets when you #travel both within #India and #Abroad! Take your family in full-fledged comfort via the #IRCTCAir app, available for both #iOS & #Android! Log on to https://t.co/3j431pWZPj pic.twitter.com/lO2jMh9ZtM — IRCTC (@IRCTCofficial) May 11, 2018 -
ఎయిర్ఏసియా ‘మిడ్ సమ్మర్ సేల్’
ఎయిర్ఏసియా ఇండియా ‘మిడ్ సమ్మర్ సేల్’ ఆఫర్ను ప్రకటించింది. ఈ ఆఫర్ కింద ఎంపిక చేసిన రూట్లలో విమాన టిక్కెట్లను రూ.1500 కంటే తక్కువకే అందించనున్నట్టు పేర్కొంది. ఢిల్లీ, కోల్కత్తా, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, రాంచి మార్గాలకు ఈ ఆఫర్ అందుబాటులో ఉండనున్నట్టు విమానయాన సంస్థ తన వెబ్సైట్ ఎయిర్ఏసియా.కామ్లో వెల్లడించింది. మిడ్-సమ్మర్ సేల్ కింద భువనేశ్వర్-కోల్కత్తా, రాంచి-కోల్కత్తా, కొచ్చి-బెంగళూరు, కోల్కత్తా-భువనేశ్వర్, హైదరాబాద్-బెంగళూరు, బెంగళూరు-చెన్నై మార్గాలకు విమాన టిక్కెట్లు రూ.1399కే ప్రారంభమవనున్నట్టు ఎయిర్ఏసియా ఇండియా తెలిపింది. ఎయిర్లైన్ సంస్థల మధ్య తీవ్ర పోటీ ఏర్పడిన సమయంలో ఎయిర్ఏసియా ఇండియా ఈ సమ్మర్ సేల్ను ప్రారంభించింది. మిడ్ సమ్మర్ సేల్ కింద టిక్కెట్లను అడ్వాన్స్గా బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఆఫర్ కేవలం www.airasia.com వద్ద ఆన్లైన్ బుకింగ్స్కే అందుబాటులో ఉంది. 2018 మే 13 వరకు ఈ సేల్ కింద టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు. 2018 అక్టోబర్ 31 వరకు ఈ టిక్కెట్ల బుకింగ్పై ప్రయాణించవచ్చు. ఈ ఆఫర్ కింద సీట్లు పరిమిత సంఖ్యలో అందుబాటులో ఉన్నాయి. అన్ని విమానాలకు ఈ ఆఫర్ వర్తించదు. ఈ ధరలన్నీ కేవలం సింగిల్ జర్నీకి మాత్రమే. క్రెడిట్, డెబిట్, ఛార్జ్ కార్డు ద్వారా పేమెంట్లను ఎయిర్ఏసియా అంగీకరించనుంది. టిక్కెట్లను కొనుగోలు చేసేటప్పుడే అన్ని పన్నులను చెల్లించాల్సి ఉంటుందని ఎయిర్ఏసియా ఇండియా తెలిపింది. అదేవిధంగా మిడ్ సమ్మర్ సేల్ కింద ఆసియన్, ఆస్ట్రేలియన్ మార్గాల విదేశీ విమానాలకు టిక్కెట్లు రూ.3999కే ప్రారంభమవ్వనున్నట్టు తెలిసింది. ఈ టిక్కెట్లను కూడా 2018 మే 13 వరకే బుక్చేసుకోవాలి. -
సాగర్లో విమానాల హోరు!
నాగార్జునసాగర్: రాబోయే రోజుల్లో నాగార్జునసాగర్ జలాశయంలో విమానాల హోరు వినిపించనుంది. చిన్న పట్టణాలను రవాణాపరంగా అనుసంధానించేందుకు జల విమానాలను వాణిజ్య సేవలకు వినియోగించనున్నారు. ఈ నేపథ్యంలో పోర్టుకు అనువుగా ఉన్న నాగార్జునసాగర్ను ఎంపిక చేశారు. ఏప్రిల్ తొలి వారంలో పౌర విమానయాన శాఖ అధికారి కెప్టెన్ ఇల్షాద్ అహ్మద్ నేతృత్వంలో నిపుణుల బృందం హెడ్రోపోర్టు ఏర్పాటుకు సాగర్ జలాశయాన్ని పరిశీలించింది. రవాణాపరంగా జలాశయాలను వినియోగించేందుకు సాధ్యమేనని, త్వరలోనే ఇది కార్యరూపం దాల్చేందుకు డీజీసీఏ నిబంధనలు సిద్ధం చేస్తున్నట్లు ప్రకటించారు. తెలంగాణ, ఏపీలో రిజర్వాయర్ కనెక్టింగ్ సర్వీస్ 9, 12, 20 సీట్ల సామర్థ్యం కలిగిన విమాన సర్వీసులను నడపనున్నారు. సాగర్తోపాటు శ్రీశైలం, హైదరాబాద్లోని హుస్సేన్సాగర్ అనుకూలమేనని సర్వేలో తేలింది. కేంద్ర ప్రభుత్వ ‘ఉడాన్’పథకం విమాన సర్వీసులను సామాన్యులకు చేరువ చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. విమాన సర్వీసులు ప్రారంభమైతే నాగార్జునసాగర్కు పలు దేశాల నుంచి వచ్చే పర్యాటకుల సంఖ్య గణనీయంగా పెరిగే అవకాశాలున్నాయి. జలాశయంలో ఏర్పాటు చేసే హైడ్రో పోర్టును తెలంగాణ వైపు ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు. -
గన్నవరం విమానాశ్రయంలో ప్రయాణికుల ఆందోళన
సాక్షి, గన్నవరం : గన్నవరం విమానాశ్రయంలో ప్రయాణికులు ఆందోళనకు దిగారు. ఉదయం గన్నవరం నుంచి ముంబయి వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానం రాలేదు. దీంతో ప్రయాణికులు ఎయిర్పోర్టు అధికారులను సంప్రదించగా ఉదయం 9.30 నిమిషాలకు రావాల్సిన విమానం సాంకేతిక లోపం కారణంగా సాయంత్రం 5 గంటలకు రానుందని వారు తెలిపారు. తమకు ప్రత్యామ్నయ ఏర్పాట్లు చేయాల్సిందిగా ప్రయాణికులు ఆందోళనకు దిగారు. 10 గంటలకే ముంబయి చేరుకోవాల్సిన తమకు ఇంత అసౌకర్యం కలుగుతున్నా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయలేదంటూ అధికారులపై ప్రయాణికులు మండిపడ్డారు. -
విమానం రద్దయితే రూ.20 వేల పరిహారం
న్యూఢిల్లీ: విమానాలు ఆలస్యమైనా లేదా రద్దయినా ఇకపై విమానయాన సంస్థలు భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి రావొచ్చు. వినియోగదారులకు సౌకర్యంగా ఉండేలా పలు కొత్త నిబంధనలను పౌరవిమానయాన శాఖ తీసుకురానుంది. సంబంధించిన ముసాయిదాకు ప్రస్తుతం అధికారులు తుదిమెరుగులు దిద్దుతున్నారు. విమానం 6 గంటలకుపైగా ఆలస్యమైతే మొత్తం చార్జీని తిరిగి చెల్లించడం, అనుసంధాన విమానాల ద్వారా ప్రయాణించేవారికి తొలి విమానం రద్దయ్యి, ఆ కారణంగా మరో సిటీలో ఎక్కాల్సిన రెండో విమానాన్ని వారు అందుకోలేని పరిస్థితుల్లో అలాంటి ప్రయాణికులకు రూ. 20వేల వరకు నష్టపరిహారంగా చెల్లించడం తదితర కొత్త నిబంధనలను ప్రవేశపెట్టబోతున్నారు. టికెట్ కొన్నాక విమానంలోకి ఎక్కడానికి అనుమతివ్వకపోతే రూ.5 వేలు పరిహారం చెల్లించాలని ప్రతిపాదించారు. -
అమెరికాలో తుపాను.. ముగ్గురి మృతి
మిన్నియపోలిస్: తుపాను ప్రభావంతో మధ్య అమెరికా ప్రాంతంలో వడగళ్ల వానలు కురుస్తున్నాయి. తుపాను ధాటికి శనివారం రెండేళ్ల చిన్నారి సహా ముగ్గురు మరణించారు. వందల విమానాలు రద్దయ్యాయి. రోడ్లపై 35 సెంటీ మీటర్ల ఎత్తుమేర మంచు పేరుకుపోయింది. మిషిగన్, విస్కాన్సిన్, ఇల్లినాయిస్, లూసియానా, ఆర్కాన్సస్, టెక్సస్ తదితర రాష్ట్రాల్లో తుపాను ప్రభావం తీవ్రంగా ఉంది. -
బాబోయ్.. విమానం!
- మార్చి 14వ తేదీన హైదరాబాద్ నుంచి రాయ్పూర్ వెళ్తున్న ఇండిగో (6ఈ334) విమానం ఉదయం 10.40 గంటలకు టేకాఫ్ అయింది. కొద్దిసేపటికే సాంకేతిక కారణాల వల్ల వెనుదిరిగి వచ్చింది. - ఇదే నెలలో బ్యాంకాక్ నుంచి దుబాయ్ వెళ్లే ఏ–380 విమానాన్ని సాంకేతిక కారణాల వల్ల తెల్లవారు జామున 3.45 గంటల సమయంలో అకస్మాత్తుగా నిలిపేయాల్సి వచ్చింది. - ఇక గత వారం తిరుపతి నుంచి హైదరాబాద్కు వచ్చిన ఇండిగో(7117) విమానం టైర్లు పేలిపోయి రన్వేపై నిలిచిపోయింది. దీంతో బుధవారం రాత్రి 10 గంటల నుంచి గురువారం తెల్లవారు జామున 2.30 గంటల వరకు రన్వే మూసేశారు. ..ఇలా ఏదో ఒక కారణంతో ప్రతి నెలా రెండు నుంచి మూడు విమానాలు శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆగిపోతున్నాయి. హైదరాబాద్ విమానాశ్రయంలో ఆగిపోతున్న ఫ్లైట్ల వల్ల దేశవ్యాప్తంగా విమానాల రాకపోకలపై ప్రభావం పడుతోంది. దీంతో దేశీయ, అంతర్జాతీయ ప్రయాణికులు గంటల తరబడి ఎయిర్పోర్టుల్లోనే పడిగాపులు కాయాల్సి వస్తోంది. విమానప్రయాణంలో అనిశ్చితి.. ఆకస్మాత్తుగా ఆగిపోతున్న విమానాలు.. తరచూ నిలిచిపోతున్న రన్వే సేవల కారణంగా విమానం ఎక్కాలంటేనే ప్రయాణికులు బెంబేలెత్తిపోతున్నారు. అయితే కొన్ని విమాన సంస్థలకు చెందిన ఫ్లైట్లు పాతవి కావడం వల్లే ఈ తరహా సాంకేతిక సమస్యలు చోటు చేసుకుంటున్నట్లు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. రెండో రన్వే తెరుచుకొనేదెప్పుడో..! శంషాబాద్ విమానాశ్రయంలో ప్రస్తుతం 4.26 కిలోమీటర్ల పొడవైన ప్రైమ్ రన్వే నుంచే అన్ని విమానాల రాకపోకలు సాగిస్తున్నాయి. దీంతో రాత్రింబవళ్లు రన్వేపై తీవ్ర ఒత్తిడి నెలకొంటోంది. నిత్యం రాకపోకలు సాగించే విమానాల్లో నైట్ ఫ్లైట్సే ఎక్కువ. దీంతో రాత్రి పూట అకస్మాత్తుగా తలెత్తే సాంకేతిక కారణాల వల్ల ఏ ఒక్క విమానం రన్వేపై నిలిచిపోయినా.. మొత్తం సర్వీసులపై దాని ప్రభావం ఉంటోంది. ఈ ఇబ్బందుల దృష్ట్యా విమానాశ్రయ విస్తరణలో భాగంగా 3.7 కిలోమీటర్ల పొడవైన రెండో రన్వే నిర్మించారు. సాంకేతికంగా దీనికి అన్ని అనుమతులూ వచ్చాయి. కానీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) అనుమతి లభిస్తే తప్ప ఈ రన్వే వినియోగంలోకి వచ్చే పరిస్థితి లేదు. గతేడాది నవంబర్లోనే డీజీసీఏ ఆమోదం లభిస్తుందని భావించినా.. ఇప్పటికీ ఎదురు చూపులు తప్పడం లేదు. డీజీసీఏ అనుమతి లభిస్తే నైట్ ఫ్లైట్స్కు ఈ రన్వేను వినియోగించాలని జీఎంఆర్ భావిస్తోంది. ప్రైమ్ రన్వేపై ఓ విమానం ఆగిపోయినా మిగతా వాటి రాకపోకలకు రెండో దానిని వినియోగించుకునే అవకాశం ఉంటుంది. ‘డీజీసీఏ నుంచి ఎంత త్వరగా అనుమతి లభిస్తే అంత త్వరగా రెండో రన్వే సేవలను ప్రారంభిస్తాం. అందుకోసం అన్ని విధాలుగా సిద్ధంగా ఉన్నాం’అని శంషాబాద్ విమానాశ్రయ ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’తో చెప్పారు. వీలైనంత త్వరలోనే అనుమతి లభించవచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు. – సాక్షి, హైదరాబాద్ ఒక రన్వే..470 విమానాలు.. శంషాబాద్ విమానాశ్రయంలో ప్రస్తుతం ఉన్న ఒక్క రన్వే నుంచే ప్రతి రోజూ సుమారు 470 విమానాలు రాకపోకలు సాగిస్తున్నాయి. దీంతో ఏ చిన్న సాంకేతిక కారణంతోనైనా ఒక విమానం రన్వేపై నిలిచిపోతే శంషాబాద్ రావలసిన మొత్తం విమానాలకు బ్రేక్ పడుతోంది. ఇటీవల ఇండిగో విమానం టైర్ పేలిన ఉదంతంతో హైదరాబాద్తో పాటు ఢిల్లీ, ముంబై, బెంగళూరు, కోల్కతా, చెన్నై విమానాశ్రయాల్లోనూ సర్వీసులకు అంతరాయం కలిగింది. మొత్తం 31 సర్వీసులకు బ్రేక్ పడింది. ఇందులో 10 అంతర్జాతీయ విమానాలు ఉన్నాయి. మరికొన్ని సర్వీసులను మళ్లించారు. ఇలాంటి సంఘటనలు చోటు చేసుకున్న ప్రతిసారీ దేశవ్యాప్తంగా వేలాది మంది ప్రయాణికులు ఇబ్బందులకు గురికావాల్సి వస్తోంది. విమానాల్లో సాధారణంగా తలెత్తే సాంకేతిక సమస్యల వల్ల పెద్దగా ఇబ్బంది ఉండదు. కానీ రన్వేపై అకస్మాత్తుగా నిలిచిపోయే వాటితోనే ఇతర సర్వీసులకు బ్రేక్ పడుతోంది. -
శంషాబాద్లో విమాన రాకపోకలు బంద్
సాక్షి, హైదరాబాద్: శంషాబాద్లోని రాజీవ్ గాంధీ విమానాశ్రయంలో గురువారం విమాన రాకపోకలు నిలిచిపోయాయి. బుధవారం రాత్రి తిరుపతి నుంచి హైదరాబాద్ వచ్చిన ఇండిగో విమానం ల్యాండింగ్ సమయంలో టైర్ పేలి మంటలు వ్యాపించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రమాదానికి గురైన విమానం రన్వే పైన నిలిచిపోవడంతో విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో అధికారులు పలు విమానాలను వేరే విమానాశ్రయాలకు దారి మళ్లించడంతో పాటు కొన్నింటిని రద్దు చేశారు. త్వరంలో రన్వేను క్లియర్ చేసి సర్వీసులు పునరుద్ధరిస్తామని వెల్లడించారు. గన్నవరంలో ప్రయాణికుల ఆందోళన విజయవాడ గన్నవరం విమానాశ్రయంలో ప్రయాణికులు ఆందోళన చేపట్టారు. గన్నవరం నుంచి బెంగళూరు వెళ్లాల్సిన ఇండిగో విమానాన్ని అధికారులు క్యాన్సిల్ చేశారు. దీంతో ప్రయాణికులు విమానాశ్రయంలోనే పడిగాపులు కాస్తున్నారు. ప్రయాణికుల తెలిపిన వివరాల ప్రకారం.. ఈ రోజు ఉదయం 8 గంటలకు 70 మంది ప్రమాణికులతో బయలుదేరాల్సిన విమానాన్ని రద్దు చేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. ఈ విషయాన్ని తెల్లవారుజాము సదరు ప్రయాణికులకు మేసేజ్ పంపించారు. అయితే అకస్మాత్తుగా మెసేజ్లు పంపడమేంటని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విమానాన్ని క్యాన్సిల్ చేసినా, మరో ప్రత్యామ్నాయం చూపలేదంటూ అధికారుల తీరుపై అసహనం వ్యకం చేస్తూ ఆందోళన చేశారు. -
ఎయిర్ ఏషియా సమ్మర్ ఆఫర్
సాక్షి, ముంబై: ఎయిర్ ఏషియా విదేశీటికెట్లపై సమ్మర్ ఆఫర్ ప్రకటించింది. ఎంపిక చేసిన రూట్లలో విదేశీ విమాన టిక్కెట్లపై తగ్గింపును రేటును ప్రకటించింది. అన్నీ కలుపుకొని రూ.1,999 టికెట్ ప్రారంభ ధరలో టికెట్ను ఆఫర్చేస్తోంది. కౌలాలంపూర్, బ్యాంకాంక్,లాంగ్కవి బాలి, ఫూకట్, సింగపూర్ రూట్లలో ఈ డిస్కౌంట్ ఆఫర్. ఈనెల 25వరకు బుకింగ్స్ అందుబాటులో ఉంటాయని తెలిపింది. ఈ ప్రమోషనల్ ద్వారా టికెట్లను అడ్వాన్స్ బుకింగ్ చేసుకోవాలని ఎయిర్లైన్స్ పేర్కొంది. అలాగే ఇలా బుక్ చేసుకున్న టికెట్ల ద్వారా ప్రయాణ అనుమతి సెప్టెంబర్ 30,2018 న ముగుస్తుంది. భారతదేశంలోని అనేక ప్రదేశాల నుంచి కౌలాలంపూర్, సింగపూర్, జకార్తా, సిడ్నీ, బాలి, ఎయిర్ ఆసియా విమాన సర్వీసులను అందిస్తోంది. ఎయిర్లైన్స్ వెబ్సైట్ ప్రకారం దేశంలోని కొచ్చి లాంటి వివిధ ప్రదేశాల నుంచి కోలాలంపూర్, సియోల్, పెర్త్, ఆక్లాండ్ వంటి ఇతర ప్రదేశాల నుంచి ఎయిర్ ఏషియా డిస్కౌంట్ టికెట్లు అందిస్తోంది. ముఖ్యంగా జైపూర్-కౌలాలంపూర్-ఫుకెట్ (రూ .6,818), జైపూర్-కౌలాలంపూర్-హనోయి (రూ .7,556), జైపూర్-కౌలాలంపూర్-లాంబోక్ (రూ .7,738), న్యూఢిల్లీ-కౌలాలంపూర్ (రూ .8,999), తిరుచిరాపల్లి-కౌలాలంపూర్-హనోయి (రూ.7,401). దీంతోపాటు ప్రీమియం ఫ్లాట్బెడ్ విమానాల్లో న్యూఢిల్లీ- కౌలాలంపూర్-ఫుకెట్ మధ్య టికెట్ రూ .20,157 ప్రారంభ ధరగా ఉంది. మిగిలిన వివరాలకు ఎయిర్ ఏషియా వెబ్సైట్ను పరిశీలించగలరు. -
బికినీ ఎయిర్లైన్స్ సేవలు ఇక ఢిల్లీకి
సాక్షి, న్యూఢిల్లీ: ప్రముఖ బడ్జెట్ ఎయిర్లైన్ వియత్నాంకు చెందిన వియట్జెట్ ఢిల్లీనుంచి డైరెక్ట్ విమాన సర్వీసులను ప్రకటించింది. బికినీ ఎయిర్లైన్స్గా పేరు తెచ్చుకున్న వియట్ జెట్ ఢిల్లీ నుంచి వియత్నాంలోని హోచిమిన్ నగరానికి నడపనున్నట్లు ప్రకటించింది. ఇండియా-వియత్నాం దౌత్య సంబంధాల 45వ వార్షికోత్సవం సందర్భంగా వియత్నాం-ఇండియా బిజినెస్ ఫోరమ్లో ఈ విషయాన్ని ప్రకటించింది. ఆసియన్ ఏజ్ నివేదించిన ప్రకారం బికినీ ఎయిర్లైన్స్గా పేరొందిన వియట్జెట్ ఎయిర్లైన్స్ జులై- ఆగస్టు లో భారత్కు డైరెక్ట్ ఫ్లైట్స్ సేవలు అందించనున్నామని వెల్లడించింది. ఈ రెండు నగరాలమధ్య వారానికి నాలుగు సార్లు విమానాలను నిర్వహిస్తుంది. పైలట్లు, ఎయిర్హోస్టెస్లు సహా ఇతర క్యాబిన్ క్రూ అంతా బికినీ ధరించి సేవలు అందించడమే ఈ బికినీ ఎయిర్లైన్స్ ప్రత్యేకత. అలా బికినీ ఎయిర్లైన్స్గా ప్రఖ్యాతి పొందింది. 2007లో మహిళా బిలియనీర్ గుయేన్ థీ ఫుంగ్ థావో స్థాపించిన వైమానిక సంస్థ వియత్నాం దేశంలోనే రెండవ అత్యుత్తమ సేవలు అందిస్తున్న అతిపెద్ద సంస్థగా పాపులారిటీ సాధించింది. పైలట్లు, ఫ్లైట్ అటెండెంట్లతో బికినీలు ధరింపజేసి 2011లో ఈ సంస్థ చేసిన ప్రచారం అప్పట్లో వివాదాస్పదమైంది. అ క్కడి ప్రభుత్వంనుంచి జరిమాను కూడా ఎదుర్కొంది.అయితే కొన్ని ప్రత్యేక విమానాల్లో మాత్రమే ప్రయాణీకులను ఆకర్షించడానికి బికినీల్లో ఉన్నమహిళా సిబ్బందిని ఉపయోగిస్తుంది. అయితే ఇంత ప్రతికూల ప్రచారం ఉన్నప్పటికీ, ప్రారంభించినప్పటి నుంచీ సంస్థ పెరుగుదల గణనీయంగా ఉంది. తాజా త్రైమాసికంలో లాభాల్లో 75.9 శాతం వృద్ధిని నమోదు చేయడం విశేషం. దీనికి తోడు కంపెనీకి 55 ఏ320, ఏ321 విమానాల విమానాలను కలిగి ఉంది. దేశీయ, అంతర్జాతీయ మార్గాల్లో 385 విమానాలు నడుపుతోంది. -
600కి పైగా దేశీయ విమానాలు రద్దు
ముంబై : ఇండిగో, గోఎయిర్ కలిసి ఈ నెలలో 600కి పైగా దేశీయ విమానాలను రద్దు చేస్తున్నట్టు తెలిసింది. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్కు గురువారం ఈ ఎయిర్లైన్స్ సమర్పించిన షెడ్యూల్లో ఈ వివరాలు వెల్లడయ్యాయి. ఇండిగో 488 విమానాలను రద్దు చేస్తున్నట్టు ప్రకటించగా.. గోఎయిర్ 138 విమానాలను రద్దు చేయబోతున్నట్టు తెలిసింది. రద్దు అయిన విమానాల జాబితాలను ఈ విమానయాన సంస్థలు తమ సంబంధిత వెబ్సైట్లలో పొందుపరిచాయి. ఈ రెండు విమానయాన సంస్థలు ప్రయాణికులకు ప్రత్యామ్నాయ విమానాలను ఆఫర్ చేస్తుండటంతో పాటు, మొత్తం నగదును రీఫండ్ చేస్తున్నాయి. ఈ రద్దుతో దాదాపు లక్ష మంది ప్రయాణికులు ప్రభావితం కానున్నారని తెలిసింది. వచ్చే నెల నుంచి వేసవి సెలవుల షెడ్యూల్ ప్రారంభం కాబోతుండటంతో, ఈ రద్దు ప్రభావం అప్పుడు కూడా ఉండబోతోంది. ఏప్రిల్లో విమానయాన సంస్థలకు ఎంతో డిమాండ్ ఉన్న ట్రావెల్ సీజన్. డిమాండ్ ఎక్కువగా ఉండి, విమానాల రద్దు ఉండటంతో, వచ్చే నెలలో విమానాల ధరలు పెరుగనున్నాయి. ఇండిగో, గోఎయిర్ కలిసి రోజూ 1200 విమానాలను నడుపుతున్నాయి. ఫ్రాట్, విట్నీ తయారు చేసిన ఇంజిన్లలో తలెత్తిన సమస్యల కారణంగా ఇరు సంస్థలు విమానాలను రద్దు చేసే నిర్ణయం తీసుకున్నాయి. మార్చి 15 నుంచి 31 మధ్యలో ఇండిగో 488 విమానాలను క్యాన్సిల్ చేయగా.. గోఎయిర్ మార్చి 15 నుంచి 22 వరకు 138 విమానాలను రద్దు చేసింది. -
ఎయిరిండియా అకౌంట్ హ్యాక్, విమానాలన్నీ రద్దు
ముంబై : ఎయిరిండియా అధికారిక ట్విటర్ అకౌంట్ హ్యాక్ అయింది. ఉదయం చాలా గంటల పాటు ఎయిరిండియా ట్విటర్ అకౌంట్ హ్యాకింగ్ బారిన పడినట్టు ఈ విమానయాన సంస్థ తెలిపింది. హ్యాక్ అయిన తమ ట్విటర్ అకౌంట్ @airindiain లో టర్కిష్ భాషలో మెసేజ్లు పోస్టు అవుతున్నాయని ఎయిరిండియా అధికార ప్రతినిధి చెప్పారు. తమ అకౌంట్లో పోస్టు అయిన హానికరమైన కంటెంట్ అంతటిన్నీ తాము తొలగించనట్టు పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ ట్విటర్ అకౌంట్ రిస్టోర్ అయిందని వెల్లడించారు. హ్యాకింగ్కు గురైన ఎయిరిండియా అకౌంట్లో పోస్టు అయిన ఒక మెసేజ్ ఈ విధంగా ఉంది. ''చివరి నిమిషంలో ఎంతో ముఖ్యమైన ప్రకటన. మా అన్ని విమానాలను రద్దు చేశాం. ఇప్పటి నుంచి, టర్కిష్ ఎయిర్లైన్స్తో మేము ఎగరాలనుకుంటున్నాం'' అని పోస్టు అయింది. ఈ మెసేజ్ చూసిన ఎయిరిండియా ట్విటర్ ఫాలోవర్స్ అందరూ ఒక్కసారిగా షాకింగ్కు గురయ్యారు. తీవ్ర అప్పుల్లో కూరుకుపోయిన ఎయిరిండియాను ఇటీవల ప్రైవేటీకరణ చేయాలనుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎయిరిండియా అధికారిక అకౌంట్లో ఈ మెసేజ్ కనిపించడం తీవ్ర గందరగోళానికి తెరతీసింది. ప్రస్తుతం ఎయిరిండియా ట్విటర్ అకౌంట్కు 1,46,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు. -
బిజినెస్ జెట్.. రయ్ రయ్!!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశీయ విమానయానంలో బిజినెస్ జెట్లు దూసుకెళ్తున్నాయి. ఒకప్పుడు బడా కార్పొరేట్లకే పరిమితమైన ప్రైవేటు విమానాలు... ఇప్పుడు చిన్న వ్యాపారవేత్తలకూ అందుబాటులోకి వచ్చేశాయి. దీంతో నాన్– షెడ్యూల్డ్, ప్రైవేట్ ఆపరేటర్ల హవా నడుస్తోంది. బిజినెస్/జనరల్ ఏవియేషన్లో ఉన్న నాన్–షెడ్యూల్డ్, ప్రైవేట్ ఆపరేటర్లు ఏకంగా 200 ఎయిర్పోర్టుల్లో అడుగుపెట్టడం వీటి జోరుకు నిదర్శనం. ప్రధానంగా వ్యాపారవేత్తల కారణంగానే ఈ స్థాయిలో కొత్త కొత్త ఎయిర్స్ట్రిప్స్లో చిన్న ఫ్లయిట్స్ ల్యాండ్ అవుతున్నాయి. వ్యాపారులు తమ అవసరాలకు విమానాలను అద్దెకు తీసుకోవడం లేదా సొంత విమానాల్లో ప్రయాణించడం గణనీయంగా పెరుగుతోందని బిజినెస్ ఎయిర్క్రాఫ్ట్ ఆపరేటర్స్ అసోసియేషన్ (బీఏఓఏ) చెబుతోంది. మౌలిక వసతులు మెరుగైతే దేశం లో ఉన్న 420 విమానాశ్రయాలు, హెలిపోర్టులు బిజీగా ఉం డటం ఖాయమని అసోసియేషన్ ధీమా వ్యక్తం చేస్తోంది. ఇవీ గణాంకాలు.. ప్రస్తుతం దేశంలో బిజినెస్/జనరల్ ఏవియేషన్ రంగంలో నాన్–షెడ్యూల్డ్ ఆపరేటర్లు 120, ప్రైవేటు ఆపరేటర్లు 60 మంది ఉన్నారు. వీరి వద్ద 275 హెలికాప్టర్లు, 125 బిజినెస్ జెట్లు, 100 దాకా టర్బో ప్రాప్ ఎయిర్క్రాఫ్టులు ఉన్నాయి. 2018లో మరో 20 విమానాలు కొత్తగా అడుగు పెట్టనున్నాయి. పరిశ్రమ ఏటా 8 శాతం వృద్ధి చెందుతోందని బీఏఓఏ ప్రెసిడెంట్ రోహిత్ కపూర్ సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. ఈ రంగం లగ్జరీ అన్న భావన నుంచి ప్రభుత్వం బయటకు వస్తే మెరుగైన ఫలితాలు ఉంటాయని చెప్పారు. ‘విమానాలపై దిగుమతి సుంకం 3% వసూలు చేస్తున్నారు. నాన్ షెడ్యూల్డ్ ఆపరేటర్లకు జీఎస్టీ 5 శాతంగా ఉంది. ప్రైవేటు వినియోగానికి కొనుగోలు చేస్తే 28 శాతం జీఎస్టీ, 3 శాతం సెస్ అమలవుతోంది. ఈ పన్నులు తగ్గితే మరింత మంది విమానాల కొనుగోలుకు ముందుకు వస్తారు’ అని పేర్కొన్నారు. కాగా, టికెట్లు విక్రయించి సర్వీసులు అందించే సంస్థలను షెడ్యూల్డ్ ఎయిర్లైన్స్ అంటారు. వ్యాపార విస్తరణకు..: అనుకూలమైన సమయంలో, కోరుకున్న విమానాశ్రయానికి వెళ్లే అవకాశంతోపాటు భద్రత, ప్రైవసీ ఉండటంతో వ్యాపారులు బిజినెస్ ఎయిర్క్రాఫ్ట్ ఆపరేటర్లను ఆశ్రయిస్తున్నారు. ప్రధానంగా షెడ్యూల్డ్ ఎయిర్లైన్స్ దేశంలో కేవలం 75 విమానాశ్రయాలకే సర్వీసులు అందిస్తున్నాయి. నాన్–షెడ్యూల్డ్, ప్రైవేట్ ఆపరేటర్లు 200ల విమానాశ్రయాలకు సేవలను విస్తరించారు. బిజినెస్ వర్గాలకు తాము ప్రత్యక్షంగానే సాయపడుతున్నామని రోహిత్కపూర్ అన్నారు. ‘విదేశాల్లోనూ వ్యాపార అవకాశా లను భారతీయులు వెతుక్కుంటున్నారు. అనుకూల ప్రాం తాలకు వెళ్లేందుకు బిజినెస్ ఎయిర్క్రాఫ్ట్లపై ఆధారపడుతున్నారు. వ్యాపారులు భారత ఎకానమీకి వెన్నెముక’ అని చెప్పారు. ప్రైవేట్ జెట్స్లో ప్రయాణం చేస్తున్న నగరాల్లో హైదరాబాద్ నాల్గవ స్థానంలో ఉందని ‘జెట్ సెట్ గో’ ఫౌండర్ కనిక టేక్రివాల్ తెలిపారు. ఏడాదిన్నరలో టాప్–1 స్థానానికి భాగ్యనగరం చేరుతుందనేది ఆమె అంచనా. అడ్డంకులు తొలగితే... దేశంలో ఉన్న 420 విమానాశ్రయాలు, హెలిపోర్టులు అన్నీ మౌలిక వసతుల పరంగా మెరుగైతే విమానయాన రంగం అనూహ్యంగా వృద్ధి చెందడం ఖాయం. న్యూయార్క్, పారిస్, సింగపూర్ మాదిరిగా భారత్లోని ప్రధాన నగరాల్లో బిజినెస్ ఎయిర్క్రాఫ్ట్స్ కోసం ప్రత్యేక రన్వే ఉండాలని పరిశ్రమ డిమాండ్ చేస్తోంది. ముంబై, ఢిల్లీ విమానాశ్రయాలు షెడ్యూల్డ్ ఆపరేటర్ల ఫ్లయిట్స్తో బిజీగా ఉంటున్నాయి. బిజినెస్ ఎయిర్క్రాఫ్ట్ల కోసం స్లాట్స్ పరిమితంగా ఉంటున్నాయి. దీనిని అధిగమించాలంటే ఇక్కడా ప్రత్యేక రన్వేలు ఉండాలని పరిశ్రమ కోరుతోంది. అన్ని జిల్లాల్లోనూ హెలిపోర్టులు ఏర్పాటు కావాలి. ఇదే జరిగితే కొత్త విమానాలు వస్తాయి. చార్జీలు తగ్గుతాయి. ఒక్కో విమానంతో ప్రత్యక్షంగా, పరోక్షంగా 60 మందికి ఉపాధి లభిస్తుందని బీఏఓఏ చెబుతోంది. -
పలు విమానాలు రద్దు
శంషాబాద్ : డైరెక్టర్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) ఆదేశాల మేరకు ఇండిగో, గోఎయిర్ ఎయిర్లైన్స్ సంస్థలకు సంబంధించిన పలు దేశీయ విమాన సర్వీసులు మంగళవారం రద్దయ్యాయి. ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, త్రివేండ్రం నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి రాకపోకలు సాగించే ఏడు ఇండిగో విమానాలతోపాటు ఢిల్లీ నుంచి హైదరాబాద్ రావాల్సిన గోఎయిర్లైన్స్కు సంబంధించిన విమానం కూడా రద్దయింది. దీంతో ముందుగా ఆయా విమానాల్లో బుకింగ్ చేసుకున్న ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. ఆయా నగరాల నుంచి రాకపోకలు సాగించే ఇండిగో, గోఎయిర్లైన్స్కు చెందిన మిగతా విమానాలు యథాతథంగా నడవటంతో ప్రయాణికులను వాటిలో సర్దుబాటు చేసినట్లు విమానాశ్రయ వర్గాలు వెల్లడించాయి. -
వణికిపోతున్న అగ్రరాజ్యం
అమెరికాను మంచు తుపాను వణికిస్తోంది. న్యూయార్క్, న్యూజెర్సీల్లో ఉష్ట్రోగ్రతలు విపరీతంగా పడిపోవడం, తీవ్రంగా మంచు కురుస్తుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎక్కడ చూసినా మంచు కుప్పలు తెప్పలుగా పేరుకుపోయింది. న్యూయార్క్లో 6 నుంచి 10 అంగుళాలు, న్యూజెర్సీ, కనెక్టికట్లలో 20 అంగుళాల మేర మంచు పేరుకుపోయి ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. మరో వైపు తుపానుతో పాటు బలమైన గాలులు కూడా వీస్తుండటంతో అధికారులు సహాయక చర్యలు ముమ్మరం చేశారు. గాలుల నేపథ్యంలో పలు ప్రాంతాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దాదాపు లక్ష ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. విమానాల రద్దు మంచు తుపాను కారణంగా విమానాల రాకపోకలకు కూడా తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇప్పటికే న్యూయార్క్, న్యూజెర్సీ ఎయిర్ పోర్టుల్లో వేల సంఖ్యలో విమానాల రాకపోకలను అధికారులు నిలిపివేశారు. దాదాపు 2600 విమానాలు రద్దు అయినట్టు అధికారులు తెలిపారు. దీంతో ఆయా ప్రయాణికులంతా ఎయిర్పోర్టుల్లోనే వేచి ఉండాల్సి వచ్చింది. ప్రయాణికుల అవసరాల కోసం ముందస్తు ఏర్పాట్లు చేసినట్లు ఎయిర్పోర్టు అధికారులు తెలిపారు. -
బెజవాడను కమ్మేసిన పొగమంచు
సాక్షి, విజయవాడ : విజయవాడను మంచు దుప్పటి కప్పేసింది. తెల్లవారుజాము నుంచి దట్టమైన పొగమంచు విజయవాడతో పాటు పరిసర ప్రాంతాలను ముంచేసింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. వేకువజామునే రోజు వారి కార్యక్రమాలు, జాగింగ్ చేసే పాదచారులు సైతం ఇబ్బందులు పడ్డారు. కొన్ని ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పొగమంచు తీవ్రంగా అలముకోవడంతో కొన్ని చోట్ల వాహనదారులు ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించక జారి కింద పడ్డారు. విమానాల రాకపోక ఆలస్యం : గన్నవరం విమానాశ్రయంలో పొగమంచు దట్టంగా అలముకుంది. దీంతో పలు విమానాల రాకపోకలు ఆలస్యం అవుతున్నాయి. హైదరాబాద్, బెంగుళూరు నుంచి రావాల్సిన స్పైస్జెట్, ఇండిగో, హైదరాబాద్ నుంచి రావాల్సిన ట్రూజెట్ విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. (మరిన్ని చిత్రాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
ఎయిర్ ఏషియా నుంచి రూ.799కే విమాన టికెట్
బెంగళూరు: ఎయిర్ ఏషియా విమానయాన సంస్థ రూ.799 నుంచే దేశీయ ప్రయాణ టికెట్లను, రూ.999 నుంచి అంతర్జాతీయ ప్రయాణ టికెట్లను అందిస్తోంది. ఈ నెల 5 నుంచి 11వ తేదీ వరకు ఆఫర్ అమల్లో ఉంటుంది. ఈ ఏడాది సెప్టెంబర్ 3 నుంచి వచ్చే ఏడాది మే 29 మధ్య ప్రయాణాల కోసం ఆఫర్ కింద టికెట్లను బుక్ చేసుకోవచ్చు. కార్పొబ్రీఫ్స్ ఆల్ట్రాటెక్ సిమెంట్: ఆదిత్య బిర్లా గ్రూప్కు చెందిన ఈ కంపెనీలో విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్(ఎఫ్పీఐ) పరిమితిని 30 శాతం నుంచి 40 శాతానికి పెంచింది. భారత్లో అతి పెద్ద సిమెంట్ కంపెనీ ఇది. ఈ కంపెనీ వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 6.8 కోట్ల టన్నులు. టాటా మోటార్స్: ఆర్థిక ఫలితాలు అధికారికంగా వెల్లడికాకముందే వాట్సాప్ ద్వారా లీకైన విషయంలో దర్యాప్తు జరపాలని టాటా మోటార్స్ను మార్కెట్ నియంత్రణ సంస్థ, సెబీ ఆదేశించింది. సంబంధిత నివేదికను మూడు నెలల్లోగా అందజేయాలని పేర్కొంది. -
రూ.999కే ఇంటర్నేషనల్ ఫ్లైట్ టిక్కెట్
ముంబై : ఎయిర్ఏషియా అంతర్జాతీయ విమాన టిక్కెట్లపై బంపర్ ఆఫర్ ప్రకటించింది. ''బిగ్ సేల్'' ఆఫర్ కింద ఎంపిక చేసిన మార్గాలలో రూ.999కే విమాన టిక్కెట్ను అందించనున్నట్టు ఎయిర్ఏసియా తన వెబ్సైట్లో పేర్కొంది. ఈ డిస్కౌంట్ ఆఫర్ కింద ఎంపిక చేసిన రూట్లలో అంతర్జాతీయ టిక్కెట్లు 2018 మార్చి 11 వరకు అందించనున్నామని ఈ ఎయిర్లైన్స్ తెలిపింది. ట్రావెల్ పిరియడ్ 2018 సెప్టెంబర్ 3 నుంచి ప్రారంభమై, 2019 మే 28 వరకు అందుబాటులో ఉంటుంది. ప్రస్తుతం ఎయిర్ఏషియా ఇండియా దేశీయ విమాన టిక్కెట్ల ధరలు రూ.799 నుంచి ప్రారంభమవుతున్నాయి. ''బిగ్ సేల్కు ఇది సరియైన సమయం. బీట్దిబడ్జెట్పై తమ అంతర్జాతీయ నెట్వర్క్ రూ.999 నుంచి ప్రారంభమవుతుంది'' అని ఎయిర్లైన్స్ తెలిపింది. భువనేశ్వర్ నుంచి కౌలాలంపూర్ వరకు వన్-వే విమానాలకు రూ.999కి విమాన టిక్కెట్ను ఆఫర్ చేస్తోంది. బిగ్ సేల్ కింద ఇతర రూట్లు కొచ్చి నుంచి కౌలాలంపూర్కు టిక్కెట్ ధర రూ.2,999కు, చెన్నై నుంచి కౌలాలంపూర్కు టిక్కెట్ ధర రూ.3,399కు, విశాఖపట్నం నుంచి కౌలాలంపూర్కు టిక్కెట్ ధర రూ.1,399కు, జైపూర్ నుంచి కౌలాలంపూర్కు టిక్కెట్ ధర రూ.3,690కు ఎయిర్ఏషియా ఆఫర్ చేస్తోంది. www.airasia.comలో ఆన్లైన్గా మాత్రమే ఈ డిస్కౌంట్ టిక్కెట్లను బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. క్రెడిట్, డెబిట్, ఛార్జ్ కార్డుల ద్వారా జరిపే పేమెంట్లకు నాన్-రిఫండబుల్ ప్రాసెసింగ్ ఫీజు వర్తిస్తోంది. పరిమిత సంఖ్యలో సీట్లు, అన్ని విమానాలకు ఇది వర్తించదు వన్-వే జర్నీకే ఈ ఆఫర్ అందుబాటు -
వణుకుతున్న ఐరోపా
-
గల్ఫ్ కార్మికులకు టీఆర్ఎస్ మొండిచెయ్యి
హైదరాబాద్: కువైట్లో ఇబ్బంది పడుతున్న పేద ప్రవాసీ కార్మికులకు ఉచితంగా విమాన టికెట్లు ఇప్పిస్తానని ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం వారికి మొండిచెయ్యి చూపిందని రాష్ట్ర కాంగ్రెస్ ఎన్నారై విభాగం ఆరోపించింది. శుక్రవారం సోమాజిగూడ ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ ఎన్నారై విభాగం చైర్మన్ బి.ఎం.వినోద్కుమార్, కాంగ్రెస్ గల్ఫ్ ఎన్నారై విభాగం కన్వీనర్ దేవేందర్ రెడ్డి, ప్రవాసీ సంక్షేమ వేదిక అధ్యక్షుడు భీంరెడ్డి మాట్లాడారు. గల్ఫ్ కార్మికుల కోసం రూ.500 కోట్లు కేటాయిస్తామని మేనిఫెస్టోలో పెట్టిన టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత దానిని మరిచిపోయిందని ఆరోపించారు. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి ఆర్.సి.కుంతియా నేతృత్వంలో ఎన్నారై బృందం గత నెల 16న కువైట్లో భారత రాయబార కార్యాలయ అధికారులతో మాట్లాడి బాధితులకు న్యాయం జరిగేలా చేసిందని చెప్పారు. ఇమ్మిగ్రేషన్ చట్టాలను ఉల్లంఘించిన కార్మికులు తమ దేశాలకు వెళ్లిపోయే అవకాశం కల్పిస్తూ కువైట్ ప్రభుత్వం జనవరి 29 నుంచి ఫిబ్రవరి 22 వరకు క్షమాభిక్ష అవకాశం కల్పించిందన్నారు. తమ బృందం అక్కడి అధికారులతో మాట్లాడి క్షమాభిక్ష గడువును ఏప్రిల్ 22 వరకు పొడిగించినట్లు తెలిపారు. చాలామంది పేదలకు చార్జీలూ తామే చెల్లించామని వెల్లడించారు. -
‘క్షమాభిక్ష’ కార్మికులకు టికెట్ల భారం
మోర్తాడ్(బాల్కొండ): మూలిగే నక్కపై తాటికాయ పడిందన్న చందంగా తయారైంది కువైట్ లోని మన కార్మికుల పరిస్థితి. ఆ దేశంలో ఖల్లివెల్లి (నిబంధనలకు విరుద్ధంగా) కార్మికులుగా ఉంటున్న వారు కువైట్ విడిచి వెళ్లేందుకు అక్కడి ప్రభుత్వం క్షమాభిక్ష ద్వారా అవకాశం కల్పించింది. దీంతో భారత కార్మికులు పెద్ద సంఖ్యలో స్వదేశానికి వస్తున్నారు. ఫలితంగా విమాన టికెట్లకు డిమాండ్ పెరగడంతో విమానయాన సంస్థలు ఇష్టారాజ్యంగా ధరలు పెంచేస్తున్నాయి. సాధారణంగా రూ.8 వేలు ఉన్న విమాన చార్జీ ఇప్పుడు ఏకంగా రూ.18 వేలకు పెంచడంతో కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కువైట్ ప్రభుత్వ క్షమాభిక్షలో భాగంగా నిబంధనలకు విరుద్ధంగా ఉంటున్న కార్మికులు ఈ నెల 22 లోపు ఆ దేశాన్ని వదలి వెళ్లాలి. జనవరి 29 నుంచి ఇది అమల్లోకి వచ్చింది. క్షమాభిక్షను వినియోగించుకునే వారిలో తెలుగు రాష్ట్రాల కార్మికులు వేల సంఖ్యలో ఉన్నారు. గడువు నాలుగు రోజులే ఉండటం, ప్రయాణికులు ఎక్కువగా ఉండటంతో విమానయాన సంస్థలు టికెట్ల ధరలను భారీగా పెంచాయి. ప్రత్యేక విమానాల ఊసే లేదు.. కువైట్లో ఆమ్నెస్టీ కారణంగా మన దేశం నుంచి ఎక్కువ విమానాలను నడపాలి. అయితే, కువైట్ నుంచి మన దేశానికి ప్రధానంగా శంషాబాద్ విమానాశ్రయానికి రావడానికి ప్రత్యేక విమానాలను నడపడం లేదు. దీనివల్ల అందుబాటులో ఉన్న విమానాల టికెట్లను కార్మికులు కొనుగోలు చేయాల్సి వస్తోంది. కాగా, అనేకమందికి విమాన చార్జీలకు సరిపడా చేతిలో డబ్బులు లేవు. దీంతో ప్రభుత్వం లేదా స్వచ్ఛంద సంస్థల సహకారం కోసం వారు ఎదురు చూస్తున్నారు. విమాన చార్జీల పెంపుపై కేంద్రం దృష్టి సారించాలని, క్షమాభిక్షపై తిరిగి వస్తున్న కార్మికులకు టికెట్ రాయితీ సౌకర్యం కల్పించాలని కార్మికులు కోరుతున్నారు. కువైట్లో పరిస్థితి దారుణం కువైట్లో క్షమాభిక్ష వల్ల స్వదేశానికి వచ్చే కార్మికులకు సహకారం అందించడానికి ఏఐసీసీ నేత రామచంద్ర కుంతి యా బృందంలో సభ్యుడిగా నేను కువైట్లో పర్యటిస్తున్నాను. ఇక్కడ పరిస్థితి దారుణంగా ఉంది. దీనికి తోడు విమాన సంస్థలు చార్జీలను పెంచడం వల్ల కార్మికులపై మరింత భారం పడుతోంది. ప్రభుత్వం దీనిపై దృష్టి సారించాలి. – డాక్టర్ జేఎన్ వెంకట్,కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి -
డిసెంబర్లోపు లీప్ విమాన ఇంజిన్ల తయారీ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: హైదరాబాద్లోని ఆదిభట్లలో టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్ లిమిటెడ్ (టీఏఎస్ఎల్) కేంద్రంలో లీప్ విమాన ఇంజిన్ అభివృద్ధి పనులు మొదలయ్యాయి. ఈ ఏడాది డిసెంబర్ ముగింపులోగా తయారీ పూర్తయి విపణిలోకి విడుదల కానుంది. గతేడాది అమెరికాకు చెందిన జనరల్ ఎలక్ట్రిక్ (జీఈ), టీఏఎస్ఎల్ మధ్య వ్యూహాత్మక ఒప్పందం జరిగిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా సోమవారమిక్కడ ఇరు కంపెనీలు సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ (సీఓఈ) కేంద్రానికి భూమి పూజ చేశాయి. ఈ కేంద్రంలో ప్రపంచవ్యాప్తంగా అత్యంత వేగంగా అమ్ముడవుతున్న జెట్, సీఎఫ్ఎం లీప్ ఇంజిన్లను అభివృద్ధి చేస్తామని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. ఈ కేంద్రంలో జీఈ, టీఏఎస్ఎల్తో పాటూ తెలంగాణ ప్రభుత్వం కూడా ప్రధాన పెట్టుబడి వాటాదారుగా ఉన్నట్లు తెలిసింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి కేటీ రామారావు మాట్లాడుతూ.. ‘‘దేశార్థికాభివృద్ధిలో తయారీ రంగం కీలకమైంది. అందులోనూ వైమానిక రంగంలో తయారీ అనేది అత్యంతకీలకమైందని.. అలాంటి కీలక కేంద్రం తెలంగాణలో ఉండటం రాష్ట్ర అభివృద్ధి సూచికని’’ వివరించారు. హైదరాబాద్లోని ప్రముఖ కంపెనీల్లో టాటా ఒకటని.. ఇందులో జీఈ జత కట్టడం ముదావహమన్నారు. ‘గతంలో ఢిల్లీలో జీఈ సీఈఓ, చైర్మన్ జాన్ ఫ్లానెర్రీ కలిశానని.. వచ్చే ఐదేళ్ల వరకూ జీఈ ఆర్డర్ బుక్ ఫుల్గా ఉందని ఈ విషయాన్ని చెప్పారని’’ కేటీఆర్ గుర్తుచేశారు. వైమానిక రంగంలో నైపుణ్య శిక్షణ నిమిత్తం అకడమిక్స్తో ఒప్పందం చేసుకున్నామని తెలిపారు. భవిష్యత్తులో వాణిజ్య, మిలిటరీ ఇంజిన్లు.. జీఈకి ప్రస్తుతం హైదరాబాద్, బెంగళూరులో పరిశోధన మరియు అభివృద్ధి (ఆర్అండ్డీ), సాంకేతికత కేంద్రాలున్నాయి. ఇందులో హైదరాబాద్ కేంద్రంలో 700 మంది ఇంజనీర్లు పనిచేస్తున్నారని జీఈ సౌత్ ఏషియా సీఈఓ, ప్రెసిడెంట్ విశాల్ వాన్చూ తెలిపారు. సాంకేతికత విభాగంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతున్నామన్నారు. ‘‘జీఈ మిలిటరీ ఇంజిన్లకు పెద్ద చరిత్రే ఉంది. ఇప్పటికే ఎయిర్ ఫోర్స్, ఇండియన్ నేవీ వంటి రక్షణ విభాగానికి జెట్ ఇంజిన్స్, మెరైన్ గ్యాస్ టర్బైన్స్ అభివృద్ధి చేశాం. అలాగే భవిష్యత్తులో టీఏఎస్ఎల్ కేంద్రంలో వాణిజ్య, మిలిటరీ ఇంజిన్లను కూడా తయారు చేస్తామని’’ వాన్చూ వివరించారు. ప్రస్తుతం ఎగుమతులకే.. జీఈ భాగస్వామ్యంతో దేశీయంగా తయారీ నైపుణ్యం మెరుగవ్వడంతో పాటూ అంతర్జాతీయ విమానయాన రంగంలో టాటా సామర్థ్యం మరింత వృద్ధి చెందుతుందని ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డిఫెన్స్ అండ్ ఎయిరోస్పేస్ ప్రెసిడెంట్ బాన్మాలీ అగర్వాల్ అన్నారు. ప్రస్తుతానికైతే దేశీయం గా ఎలాంటి లీప్ ఇంజిన్ల అర్డర్లు లేవని, అభివృద్ధి చేస్తున్నవాటిని ఎగుమతి చేస్తామని ఆయన పేర్కొన్నారు. లీప్ ఇంజిన్లతో పాటు, ఇంజిన్లోని విడిభాగాలను కూడా తయారు చేస్తామన్నారు. ప్రపంచవ్యాప్తంగా లీప్ ఇంజిన్లకు డిమాండ్ పెరుగుతుంది. ప్రస్తుతం ఏడాదికి వెయ్యి ఇంజిన్ల డిమాండ్ ఉందని.. 2020 నాటికి ఏటా 2 వేల ఇంజిన్లకు చేరుతుందని వాన్చూ తెలిపారు. సీఎఫ్ఎం ఇంటర్నేషనల్ ఉత్పత్తే లీప్ ఇంజిన్. ఇది జీఈ, సాఫ్రాన్ ఎయిర్క్రాఫ్ట్ ఇంజిన్స్ 50:50 జాయింట్ వెంచర్. 18 నెలల్లో 5 దేశాలకు చెందిన 35 ఎయిర్లైన్స్కు 200 లీప్ ఇంజిన్లు అభివృద్ధి చేశామని ఆయన వివరించారు.