Jogu Ramanna
-
ప్రచారంపై ఫోకస్ పెంచిన ప్రధాన పార్టీలు..
సాక్షి,ఆదిలాబాద్: పార్లమెంట్ ఎన్నికల సంగ్రామంలో ఆయాపార్టీలు వ్యూహాలకు పదును పెడుతున్నా యి. సీఎం రేవంత్రెడ్డి ఈ సెగ్మెంట్ పరిధిలో ఆది లాబాద్, ఆసిఫాబాద్లలో జరిగిన సభల్లో వ్యూహా త్మకంగా బీజేపీ, బీఆర్ఎస్ అభ్యర్థులు గొడం నగేశ్, ఆత్రం సక్కును విమర్శించడం ద్వారా ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది.ఎంపీ సోయం బాపూరావు ప్రస్తావన కూ డా ఇందులో భాగమేనని చర్చించుకుంటున్నారు. మరోపక్క బీజేపీలో ఇటీవల ఎమ్మెల్యేలకు ఆయా పార్లమెంట్ ఇన్చార్జి బాధ్యతలు తొలగించిన తర్వాత వారంతా తమ నియోజకవర్గాల్లో ప్రచారంలో దూకుడు పెంచారు. ఒక విధంగా ఈ నిర్ణయం విభేదాలకు చెక్తో పాటు ప్రచారంలో స్పీడ్ పెంచేందుకు ఉపయోగపడిందన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఇదిలా ఉంటే బీఆర్ఎస్ మైనార్టీ ఓట్లపై దృష్టి సారించిందన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది.సీఎం ప్రసంగంలో ఎంపీ సోయం ప్రస్తావన..సీఎం రేవంత్రెడ్డి ఆసిఫాబాద్ బహిరంగ సభలో ఎంపీ సోయం బాపూరావు ప్రస్తావన తీసుకురావడం వ్యూహాత్మకమేనన్న చర్చ సాగుతుంది. సిట్టింగ్ ఎంపీ సోయంకు టికెట్ ఇవ్వకుండా బీజేపీ ఆయనను అవమానించిందన్నారు. అంతేకాకుండా పార్లమెంట్ నియోజకవర్గంలోని సమస్యలు పరిష్కరించాలని కేంద్ర మంత్రుల చుట్టూ సోయం తిరిగినా వారు పట్టించుకోలేదని చెప్పారు. ప్రధానంగా సోయంకు ఆదివాసీ ఓటర్లలో పట్టు ఉంది.ఈ నేపథ్యంలో సీఎం వ్యూహాత్మకంగానే సోయం ప్రస్తావన తీసుకువచ్చారనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. అంతేకాకుండా బీజేపీ అభ్యర్థి నగేశ్, బీఆర్ఎస్ అభ్యర్థి సక్కు ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నప్పటికీ జిల్లా అభివృద్ధికి పాటుపడింది లేదని చెప్పడం ద్వారా విమర్శలు ఎక్కుపెట్టారు. ఇదిలా ఉంటే ఇటీవల మంత్రి సీతక్క, ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణ నార్నూర్ మండలం కొత్తపల్లి–హెచ్లో బంజారా దీక్షభూమి వేదిక వద్ద ప్రసంగిస్తూ తాము లంబాడాలకు వ్యతిరేకం కాదని చెప్పడం ద్వారా ఆ ఓటర్లను ఆకట్టునే ప్రయత్నం చేశారు.అంతే కాకుండా ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి పార్టీ పరంగా కో ఇన్చార్జీలను నియమించారు. మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్తో పాటు ఏఐసీసీ సభ్యుడు నరేశ్ జాదవ్ నియామకం ఇందులో భాగమేనని తెలుస్తోంది. తద్వారా ఆ సామాజిక వర్గ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నమే ఈ చర్య అన్న అభిప్రాయం పార్టీలో వ్యక్తమవుతుంది.బీజేపీలో విభేదాలు సమసినట్టేనా..బీజేపీలో ఎంపీ అభ్యర్థిగా నగేశ్ను ప్రకటించిన త ర్వాత పార్టీ ఎమ్మెల్యేల మధ్య సఖ్యత లేదన్న విమర్శలు జోరుగా సాగాయి. ఎమ్మెల్యేలకు పార్లమెంట్ ఇన్చార్జి బాధ్యతలు ఇచ్చిన తర్వాత వారి నియోజకవర్గాల్లో ఇతర నేతల జోక్యం పెరిగిందన్న భావం వ్యక్తమైందన్న ప్రచారం జరిగింది. పార్టీ అధిష్టానం దృష్టికి కూడా వెళ్లడంతో నష్ట నివారణ చర్యలకు దిగింది.ఇందులో భాగంగానే పార్టీ ఎమ్మెల్యేలందరికీ ఆయా పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి బా ధ్యతల నుంచి తొలగించారు. ఈ పరిణామం తర్వా త ఆయా ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో ప్రచార స్పీడ్ పెంచారు. ఒకవిధంగా ఇది పార్టీకి మంచి జరిగిందేనన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. అంతేకాకుండా నగేశ్ ఇటీవల ఖానాపూర్ నియోజకవర్గంలో పర్యటించినప్పుడు మాజీ ఎంపీ రాథోడ్ రమేశ్తో కలిసి విస్తృతంగా తిరిగారు. ఇది లంబాడా ఓటర్లను ఆకర్షించేందుకు వ్యూహాత్మక చర్య అన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది.ఎంఐఎం నేతను కలిసిన బీఆర్ఎస్ నాయకులు..బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సక్కుకు సంబంధించి ఈ పార్లమెంట్ సెగ్మెంట్లోని నియోజకవర్గాల్లో ఆయా నేతలు, కార్యకర్తలు విస్తృతంగా తిరుగుతూ ప్రచారం నిర్వహిస్తున్నారు.ఇటీవల మాజీ మంత్రి జోగు రామన్న, ఎమ్మెల్సీ దండే విఠల్తో కలిసి భైంసాలో ఎంఐఎం జిల్లా అధ్యక్షుడు, మున్సిపల్ వైస్ చైర్మన్ జాబిర్ అహ్మద్ను కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రధానంగా మైనార్టీ ఓటర్లను రాబట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. నియోజకవర్గంలో ఆదివాసీ, లంబాడా ఓటర్లతో పాటు గిరిజనేతర ఓటర్లను ఆకట్టుకునేందుకు బీఆర్ఎస్ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. -
ఔరంగజేబులంతా ఏకమైనా కానీ ఆ నలుగురినే.. : బండి సంజయ్
ఆదిలాబాద్: అసెంబ్లీ ఎన్నికల్లో ఔరంగజేబులంతా ఏకమై బీజేపీ అభ్యర్థులను ఓడించేందుకు యత్నించినా ధీటుగా ఎదుర్కొని ఉమ్మడి జిల్లాలో నలుగురు ఎమ్మెల్యేలను గెలిపించిన చరిత్ర ఆదిలాబాద్ ప్రజలదని కరీంనగర్ ఎంపీ, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ అన్నారు. ఆపార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన విజయ సంకల్పయాత్రలో భాగంగా బుధవారం జిల్లాలోని నేరడిగొండ, ఇచ్చోడతోపాటు ఆదిలాబాద్లో నిర్వహించిన కార్నర్ మీటింగ్లో ఆయన మాట్లాడారు. ఆదిలాబాద్ జిల్లా ప్రజలందరికీ శిరస్సు వంచి వందనాలు చెబుతున్నానన్నారు. జిల్లా ప్రజలదెబ్బకు బీఆర్ఎసోళ్లు ఫామ్ హౌస్కే పరిమితం అయ్యారన్నారు. రాంమందిర్ నిర్మాణం కోసం తపించిన కరసేవకులను కాల్చి చంపిన ములాయం సింగ్ గతేమైందో, బతుకేమైందే ప్రజలు గ్రహించాలన్నారు. అయోధ్యలోనే రాముడు పుట్టారా అనిప్రశ్నించే నాకొడుకులా భవిష్యత్తును ఖతం చేస్తామని, అలాంటి పార్టీలకు భవిష్యత్తే లేకుండా చేస్తామన్నారు. నిర్మల్ జిల్లాలో రాంజీగోండ్ చరిత్రను తెరమరుగు చేసేందుకు వెయ్యి ఊడలమర్రి వద్ద సమాధి చేసిన బీఆర్ఎస్ను ప్రజలు సమాధి చేశారన్నారు. కాంగ్రెస్ మే ల్కొని దిద్దుబాటు చర్యలు చేపట్టకపోతే బీఆర్ఎస్ కు పట్టిన గతే పడుతుందన్నారు. వెయ్యి ఊడల మ ర్రి వద్ద రాంజీగోండ్ స్మృతి వనాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. దేశం కోసం పాటుపడుతున్న నరేంద్ర మోదీకి ఆదిలాబాద్ పార్లమెంట్ స్థానం బహుమతి గా అందించాలన్నారు. ఎంపీ సీటును గెలిపిస్తే ఆది లాబాద్ జిల్లా అభివృద్ధికి ప్రత్యేక కృషి చేస్తామన్నా రు. మరోసారి కేంద్రంలో నరేంద్ర మోదీ సర్కారు ఏర్పడబోతుందని, అధికారం చేపట్టిన వెంటనే ఆది లాబాద్–ఆర్మూర్ రైల్వేలైన్కు మోదీతో శంకుస్థాప న చేయిస్తామన్నారు. కేంద్రం ఇచ్చిన నిధులను దారి మళ్లించి కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారన్నారు. రాష్ట్రంలో ఖజానా లేదని చెబుతున్న కాంగ్రెస్ నాయకులు ఆరు గ్యారంటీలను ఏ విధంగా అమలు చేస్తారో ప్రజలకు చెప్పాలన్నారు. కేసీఆర్ ఢిల్లీ వెళ్లేది కొత్త స్క్రాచ్ రుచి చూసేందుకే తప్పా.. ఎలాంటి పొత్తుల కోసం కాదన్నారు. కేసీఆర్కు ఢిల్లీలో ఎవరు అపాయింట్మెంట్ ఇస్తారని ప్రశ్నించా రు. ఎన్నికలకు ముందు సొంత వాహనాలు లేని చంద్రశేఖర్రావుకు లక్షల కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. హిందువులు ఓటు బ్యాంక్గా మారకపోవడంతోనే రాష్ట్రంలో అధికారంలోకి రాలేకపోయామని, దేశానికి కావాల్సింది రామ రాజ్య మా.. రజాకార్ల రాజ్యమా అనేది ప్రజలు ఆలోచించాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ తరఫున పోటీ చేసేందుకు అభ్యర్థులే కరువయ్యారని, అలాంటి పార్టీతో పొత్తు పెట్టుకోవాలా అని ఎద్దేవా చేశారు. కార్యక్రమంలో యాత్ర ఇన్చార్జి పల్లె గంగారెడ్డి, జెడ్పీచైర్మన్ రాథోడ్ జనార్దన్, జిల్లా అధ్యక్షుడు ప తంగే బ్రహ్మానంద్, మాజీఎంపీ రమేశ్ రాథోడ్, మా జీ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావు, పార్లమెంట్ కన్వీ నర్ బోయర్ విజయ్, లోక ప్రవీణ్రెడ్డి, పట్టణ అధ్యక్షుడు లాలామున్నా, వేదవ్యాస్, నాయకులు రాజేశ్బాబు, అభినవ్ సర్దార్, సుహాసినిరెడ్డి పాల్గొన్నారు. అధికారం పోయినా.. తీరుమారలే.. ఆదిలాబాద్ మాజీ ఎమ్మెల్యే జోగు రామన్నను ప్రజలు ఓడించి ఆ పార్టీని అధికారం లేకుండా చేసినా ఇంకా అధికారంలో ఉన్నట్లే మాట్లాడుతుండటం హాస్యాస్పదంగా ఉందని ఆదిలాబా ద్ ఎంపీ సోయం బాపూరావు అన్నారు. వంద మంది రామన్నలు వచ్చినా ఆదిలాబాద్ ఎంపీగా బీజేపీ గెలవడం ఖాయమన్నారు. ఆదిలాబా ద్–ఆర్మూర్, ఆర్మూర్–పఠాన్చెరు వరకు 316 కిలో మీటర్ల దూరం ఫైనల్ లొకేషన్ సర్వే పూర్తయిందని, ఇందు కోసం రూ.7,313 కోట్లు కేంద్రం కేటాయించిందని పేర్కొన్నారు. ఆదిలాబాద్–గడ్చందూర్ రైల్వే లైన్ ఫైనల్ లొకేషన్ సర్వే కూడా పూర్తయిందని, రూ.1.75 కోట్లు కేటాయించడం జరిగిందన్నారు. ఈ విషయం తెలియని జోగు రామన్న రాజకీయ లబ్ధి కోసం రైల్వే సాధన సమితి పేరిట డ్రామా ఆడుతున్నారని మండిపడ్డారు. గతంలో పనిచేసిన ఎంపీలకు పిట్లైన్ అంటే తెలియదని, ఆదివాసీ బిడ్డగా దాన్ని తీసుకురావడం జరిగిందన్నారు. ఢిల్లీలో మోదీ ఉండాల్సిందే.. ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ.. తొమ్మిదిన్నరేళ్లలో ప్రధాని మోదీ ప్ర పంచానికే నాయకత్వం వహించే దిశగా దేశాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్లారన్నారు. గల్లీ లో ఎవరున్నా ఢిల్లీలో మోదీ ఉండాలని ప్రజ లంతా కోరుకుంటున్నారన్నారు. తెలంగాణ లోనూ బీజేపీ గెలవడం ఖాయమన్నారు. అధికారం కోల్పోవడంతో బీఆర్ఎస్ నేతలు గిలగిలా కొట్టుకుంటున్నారన్నారు. మోసపూరిత హామీలతో అధికారం చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏ వర్గానికై నా న్యాయం చేసిందా అని ఆయన ప్రశ్నించారు. ‘బండి’కి ఘన స్వాగతం.. బీజేపీ పార్టీ విజయ సంకల్ప యాత్రలో భాగంగా నిర్మల్ జిల్లా నుంచి ఆదిలాబాద్ జిల్లాలో ప్రవేశించిన బండి సంజయ్కు నేరడిగొండ మండలం రోల్మామడ వద్ద పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. క్రేన్ సాయంతో గజ మాల వేశారు. నేరడిగొండలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. అక్కడినుంచి ఇచ్చోడకు చేరుకోగా పార్టీ శ్రేణుల స్వాగతం అనంతరం ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. గుడిహత్నూర్లో ఓ స్వామిజీ నివాసంలో భోజనం చేసి జిల్లా కేంద్రానికి చేరుకున్నారు. మావల బైపాస్ వద్ద బండి సంజయ్కు పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. అక్కడినుంచి 5కిలోమీట ర్ల మేర బైక్ ర్యాలీగా జిల్లా కేంద్రానికి చేరుకున్నారు. ప్రధానవీధులగుండా అంబేద్కర్ చౌక్ కు యాత్ర చేరుకోగా, పార్టీ శ్రేణులు ఆయన ను భుజాలపై ఎత్తుకొని స్వాగతం పలికారు. ఇవి చదవండి: మేడారంలో నేడు అసలు ఘట్టం ఆవిష్కరణ! -
కారు పార్టీ ఎమ్మెల్యేలను ఆ బ్రిడ్జీలు ముంచేస్తాయా? విపక్షాలకు సంబరమెందుకు!
నియోజకవర్గాల్లో అభివృద్ధి బాగానే చేశారు. అయినా ఆ ఎమ్మెల్యేలను భయం వెంటాడుతోంది. ఈసారి ఎన్నికల్లో గెలుస్తామా? లేదా? అని సందేహిస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆ నలుగురు ఎమ్మెల్యేల భయానికి కారణం ఏంటి? ఎమ్మెల్యేలకు ఓడిపోతామనే భయం ఎందుకు పీడిస్తోంది? కారణాలేంటో చూద్దాం.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నిర్మాణం పూర్తికాని అసంపూర్తి బ్రిడ్జీలు నలుగురు అధికార పార్టీ ఎమ్మెల్యేలకు గుబులు పుట్టిస్తున్నాయి. వారంతా తమ నియోజకవర్గాల్లో ప్రగతిని పరుగులు పెట్టించారు. కాని అసంపూర్తిగా ఆగిపోయిన బ్రిడ్జీల్ని పూర్తి చేయడంలో విఫలం అయ్యారు. మూడోసారి కోనప్ప ఆ వైఫల్యమే వారిపట్ల ప్రజల్లో వ్యతిరేకతను పెంచుతోంది. కుమ్రంబీమ్ జిల్లా సిర్పూర్ టి నియోజకవర్గానికి రెండుదఫాలుగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు కోనేరు కోనప్ప. ముచ్చటగా మూడోసారి అసెంబ్లీలో అడుగు పెట్టాలన్న ఆయన కోరిక పెద్దవాగుపై కూలిపోయిన వంతెన వల్ల నెరవేరదేమోనని భయపడుతున్నారు. కాగజ్నగర్-దహేగామ్ మండలాలను కలిపే ఆ వారధి గత ఏడాది భారీ వర్షాలకు దెబ్బ తిని కూలిపోయింది. బ్రిడ్జి కూలిపోవడంతో దహేగామ్ మండలంలోని పద్దేనిమిది గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఏడాదిగా అక్కడి ప్రజలు పడరాని పాట్లు పడుతున్నారు. బ్రిడ్జి నిర్మాణానికి టెండర్లు పిలిచినా పనులు మాత్రం సాగడంలేదు. కూలిపోయిన వంతెన స్థానంలో కొత్తదాని నిర్మాణం ప్రారంభం కాకపోవడానికి ఎమ్మెల్యే కోనప్ప వైఫల్యమే కారణమని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇప్పుడు ఆ వంతెన తన పుట్టి ముంచుతుందేమోనని కోనప్ప ఆందోళన చెందుతున్నారు. (చదవండి: మాజీ మంత్రి జూపల్లికి షాక్..!) రేఖ నాయక్కు షాకిచ్చేందుకు సిద్ధం? నిర్మల్ జిల్లా ఖానాపూర్ నియోజకవర్గ ప్రజలకు గంగాపూర్ బ్రిడ్జి కలగా మిగిలిపోయింది. కడెం నదిపై బ్రిడ్జి లేక గంగాపూర్ పరిసర ప్రాంతాల్లోని పది గ్రామాల ప్రజలు వర్షకాలంలో తెప్పలపై ప్రయాణం సాగిస్తున్నారు. అనేకసార్లు ప్రమాదాలు జరిగి ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. ఇక్కడ వంతెన నిర్మాణానికి పనులు ప్రారంభించారు. కాని ఆ పనులు పిల్లర్ల దశ దాటలేదు. అసంపూర్తిగా ఉన్న బ్రిడ్జి ఎప్పుడు పూర్తవుతుందో తెలియకుండా ఉంది. రాకపోకలకు ప్రజలు ఇంత కష్టపడుతున్నా ఎమ్మెల్యే రేఖనాయక్ పట్టించుకోవడం లేదనే ఆరోపణలున్నాయి. దీంతో ఎమ్మెల్యే తీరుపై ప్రజల్లో వ్యతిరేకత తీవ్రంగా ఉందట. వంతెన నిర్మిస్తామని చెప్పి మాట తప్పిన ఎమ్మెల్యేకు ఎన్నికలలో బుద్ది చెప్పాలని ప్రజలు నిర్ణయించుకున్నారట. ఆత్రం సక్కు తీరుపై ఆగ్రహం.. కుమ్రంబీమ్ జిల్లా ఆసిఫాబాద్ నియోజకవర్గంలో గుండేగామ్ గ్రామానికి పక్కనే ఉన్న వాగుపై దశాబ్దం క్రితం వంతెన నిర్మాణం ప్రారంభించారు. ఇన్నేళ్ళయినా ఆ వంతెన పనులు పిల్లర్ల దశ దాటలేదు. వంతెన లేకపోవడంతో గ్రామస్థులు పుట్టి, తెప్పలపై ప్రయాణం సాగిస్తున్నారు. వాగుకు వరద వచ్చినపుడు ప్రమాదాల బారినపడుతున్నారు. అదేవిధంగా కెరమెరి మండలం కరంజీవాడ వాగుపై కూడా వంతెన లేదు. వంతెన కోసం పునాదులు తవ్వి వదిలేశారు. ఈ ప్రాంతంలో పది గ్రామాల ప్రజలు దశాబ్దాలుగా తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. వర్షాలు పడినపుడు రోజుల తరబడి ఈ గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలుండవు. ప్రజల కష్టాలు తెలిసినప్పటికీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు పట్టించుకోవడంలేదని ఆ ప్రాంత ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. వంతెన కోసం అవసరమైతే ఎన్నికలు బహిష్కరించాలన్న ఆలోచనతో ఉన్నారని టాక్ నడుస్తోంది. (చదవండి: మంత్రి శ్రీనివాస్ గౌడ్పై రేవంత్ సంచలన ఆరోపణలు) కష్టాలకు బదులివ్వడం ఖాయమా.. ఇక ఆదిలాబాద్ నియోజకవర్గంలోని జైనథ్ మండలం తరోడాలో అంతరాష్ట్ర రహదారిపై ఉన్న వాగుపై ఓ వంతెన ఉంది. పగుళ్లుబారి ప్రమాదకరమైన స్థితికి చేరడంతో దానిపై రాకపోకలు నిలిపివేశారు. దీంతో ఈ మార్గంలో ప్రయాణించేవారు నానా కష్టాలు పడుతున్నారు. నియోజకవర్గంలోని జైనథ్, బేల మండలాల ప్రజలకు ఈ వంతెన ఎంతో ముఖ్యమైనది. వంతెన నిర్మాణానికి నిధులు మంజూరైనా పనులు చేయించడంతో ఎమ్మెల్యే జోగు రామన్న విఫలమయ్యారని అక్కడి ప్రజలు, విపక్షాలు ఆయనపై నిప్పులు చెరుగుతున్నారు. ప్రజలకు అవసరమైన పనులు చేయించలేని ఎమ్మెల్యేకు బుద్ధి చెప్పాలని ప్రతిపక్షాలు పిలుపునిస్తున్నాయి. ఈ వంతెనే అధికార పార్టీని ఓడించబోతోందని, తమను గెలిపించబోతోందని విపక్ష నేతలు సంబరపడుతున్నారు. ఇదిలా ఉంటే విపక్షాల విమర్శలను అధికార పార్టీ నేతలు కొట్టిపారేస్తున్నారు. వంతెనలు నిర్మించడం అంటే నిచ్చెనలు వేసినంత సులువుకాదంటున్నారు. బ్రిడ్జిల నిర్మాణానికి నిధులు మంజూరు చేయించినా తమ మీద అనవసరంగా విమర్శలు చేస్తున్నారని, నియోజకవర్గాల్లో తాము సాధించిన అభివృద్ధి పనులే మరోసారి తమను గెలిపిస్తాయని గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. - పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్ -
రైతు సంక్షేమమే సీఎం కేసీఆర్ ధ్యేయం!
ఆదిలాబాద్రూరల్: రైతు సంక్షేమమే సీఎం కేసీఆర్ ధ్యేయమని ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి వ్యాఖ్యలకు నిరసనగా మా వల మండల కేంద్రంలో సోమవారం నిర్వహించిన కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ముందుగా ట్రాక్టర్లతో చేపట్టిన భారీలో పాల్గొన్నారు. అనంత రం ఆయన మాట్లాడారు. రైతు బాగుపడితే సమాజం బాగుపడుతుందన్న ఉద్దేశంతో సీఎం కేసీఆర్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం అన్నదాతకు అన్నివిధాలా అండగా నిలుస్తోందన్నారు. నాడు కాంగ్రెస్ హయాంలో రైతు ల సమస్యలు పరిష్కరించడంలో ఆ పార్టీ పూర్తిగా విఫలమయిందన్నారు. మూడు గంటల విద్యుత్ ఇస్తామంటున్న కాంగ్రెస్, మోటార్లకు మీటర్లు పెడతామన్న బీజేపీ అన్నదాతపై కక్ష సాధించేలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఇందులో డీసీసీబీ చైర్మన్ అడ్డి భో జారెడ్డి, గ్రంథాలయ చైర్మన్ మనోహర్, జెడ్పీటీసీ వనిత రాజేశ్వర్, సర్పంచ్ ప్రమీల రాజేశ్వర్, ఎంపీపీ సంగీత, నాయకులు ప్రహ్లాద్, నారాయణ పాల్గొన్నారు. రేవంత్ క్షమాపణలు చెప్పకపోవడం సిగ్గుచేటు జైనథ్: సాగుకు కేవలం మూడు గంటల విద్యుత్ మా త్రమే చాలంటూ రైతాంగాన్ని కించపర్చిన రేవంత్ రెడ్డి ఇంకా రైతులకు క్షమాపణలు చెప్పకపోవడం సి గ్గుచేటని ఎమ్మెల్యే రామన్న అన్నారు. మండలంలోని సిర్సన్న గ్రామంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రైతులకు మళ్లీ కష్టాలు తప్పవన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ గోవర్ధన్, నాయకులు వెంకట్రెడ్డి, లింగారెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
ఒకవేళ ఎన్నికల్లో ఓడితే..రేవంత్ కు జోగు రామన్న సవాల్
-
బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు తృటిలో తప్పిన ప్రమాదం
సాక్షి, ముంబై: బీఆర్ఎస్ ఎమ్మెల్యే జోగు రామన్నకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఎమ్మెల్యే ప్రయాణిస్తున్న కారు ఎన్హెచ్-44పై ఎద్దులను తప్పించబోయి డివైడర్ను ఢీకొట్టింది. ఈ క్రమంలో జోగు రామన్న స్వల్పంగా గాయపడ్డారు. దీంతో, అందరూ ఊపిరి పీల్చుకున్నారు. వివరాల ప్రకారం.. మహారాష్ట్రలోని పండ్రకవడలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే జోగు రామన్నకు తృటిలో ప్రమాదం తప్పింది. ఎన్హెచ్-44పై ఎద్దులను తప్పించబోయి కారు డివైడర్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎమ్మెల్యే రామన్నకు స్వల్పగాయాలయ్యాయి. కాగా, ప్రమాదం జరిగిన సమయంలో వాహనంలో ఎమ్మెల్యే రామన్న, మాజీ ఎంపీ నగేష్ ఉన్నారు. అయితే, వీరు నాగపూర్ వెళ్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదం అనంతరం, ఎమ్మెల్యే జోగు రామన్న మరొక వాహనంలో నాగపూర్ వెళ్లిపోయారు. ఇది కూడా చదవండి: లిఖితది ఆత్మహత్య కాదు.. ప్రమాదం: వీసీ వెంకట రమణ -
ఆదిలాబాద్: అప్పుడే మొదలైన ఎన్నికల పోరు..
సాక్షి, ఆదిలాబాద్: ఆదిలాబాద్ నియోజకవర్గంలో అప్పుడే ఎన్నికల పోరు మొదలైంది. ఎమ్మెల్యే రామన్న ఇక్కడినుంచి నాలుగుసార్లు విజయం సాధించారు. ఐదోసారి పోటీచేసి విజయం సాధించాలనుకుంటున్నారు. మరోసారి మంత్రి పదవి కోసం తహతహలాడుతున్నారు. ఎమ్మెల్యే రామన్న కొంతకాలంగా ప్రజల మధ్యనే తిరుగుతున్నారు. ఎన్నికల ప్రచారాన్ని మరిపిస్తున్నారు. తెలంగాణ తొలి క్యాబినెట్లో మంత్రిగా పనిచేసిన రామన్న.. నియోజకవర్గంలో మారుమూల ప్రాంతాలకు కూడా రవాణా సౌకర్యం కల్పించారు. పట్టణంలో సుందరీకరణ సహా అభివృద్ధి పనులు చేపట్టారు. పట్టణాన్ని అభివృద్ధి చేసినా.. కొన్ని పనులు జరగకపోవడం రామన్నకు మైనస్గా చెబుతున్నారు. పార్టీ నాయకుల భూ కబ్జాలు ఎమ్మెల్యేకు తలనొప్పిగా మారాయంటున్నారు. దీనికి తోడు.. డైరీ కార్పొరేషన్ చైర్మన్ లోకభూమారెడ్డి మరికొందరు రామన్నకు వ్యతిరేకంగా పావులు కదుపుతున్నారు. అయితే మున్నూరు కాపులే నియోజకవర్గంలో గెలుపు ఓటములను నిర్ణయించే సామాజికవర్గం. ఎవరు ఎన్ని కుట్రలు చేసిన టిక్కెట్ తనకే దక్కుతుందని రామన్న భావిస్తున్నారట. ఇక రామన్నను ఓడిస్తానంటూ ప్రచారం చేసుకుంటున్నారు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉన్న బీజేపీ నాయకుడు పాయల శంకర్. రామన్నను ఉక్కిరిబిక్కిరి చేసేలా వ్యూహాలను రచించినప్పటికీ ఆయన చేతిలో పాయల శంకర్ రెండుసార్లు ఓటమి చెందారు. ఈసారి బీజేపీలో టిక్కెట్ పోరు తారాస్థాయికి చేరింది. పాయల్ శంకర్కు టిక్కెట్ ఇవ్వవద్దని జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ సుహసిని రెడ్డి, ఎన్అర్ఐ కంది శ్రీనివాస్ రెడ్డి లాబీయింగ్ చేస్తున్నారట. ఈ ఇద్దరు తమకే టిక్కెట్ దక్కుతుందని ప్రచారం చేసుకుంటున్నారు. దీనితో బీజేపీలో టిక్కెట్ పోరు అసక్తికరంగా మారింది. చదవండి: మునుగోడులో సర్వేల జోరు.. ఎవరైతే బెటర్! కాంగ్రెస్ జిల్లా ఇంచార్జ్ అధ్యక్షుడు షాజిద్ ఖాన్ తానే పార్టీ అభ్యర్థిని అంటూ ప్రచారం చేసుకుంటున్నారు. గత అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసి ఓడిన గండ్రత్ సుజాత మళ్లీ పోటీకి సై అంటున్నారు. అయితే ఈ ఇద్దరికీ టీఆర్ఎస్, బీజేపీలను ఓడించే సత్తా లేదని భావించి మరో సమర్థుడైన అభ్యర్థి కోసం కాంగ్రెస్ నాయకత్వం వెతుకుతోందని తెలుస్తోంది. షెడ్యూల్డు తెగలకు రిజర్వైన బోథ్ నుంచి రాథోడ్ బాపురావు టీఆర్ఎస్ తరపున రెండుసార్లు విజయం సాధించారు. మూడోసారి కూడా పోటీ చేయడానికి ఆయన రెడీ అవుతున్నారు. రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిపించినా నియోజకవర్గానికి ఏమీ చేయలేదని బాపురావు మీద ప్రజలకు తీవ్ర అసంతృప్తిగా ఉంది. అత్యంత మారుమూల ప్రాంతమైన బోథ్లోని అనేక గ్రామాలకు సరైన రవాణా సౌకర్యం లేదు. వెంటనే నిర్మాణపనులు ప్రారంభిస్తామన్న కుఫ్టీ ప్రాజెక్టు ఇంకా కాగితాలకే పరిమితమైంది. ఎమ్మెల్యే అసమర్థత వల్లనే స్థానిక సంస్థల్లో ప్రతికూల ఫలితాలు వచ్చాయని పార్టీ నాయకత్వం భావిస్తోంది. బాపురావు గ్రామాల్లోకి వెళితే అడ్డుకుంటూ తమ వ్యతిరేకతను ప్రజలు తెలియచేస్తున్నారు. పైగా సర్వేల్లో కూడా బోథ్ ఎమ్మెల్యే బాగా వెనుకబడినట్లు సమాచారం. నియోజకవర్గంలో ఇంతటి ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటున్న రాథోడ్ బాపురావుకు వచ్చేసారి టిక్కెట్ రాదని పార్టీలోనే ప్రచారం జరుగుతోంది. ఎంపీ సోయం బాపురావు గనుక కమలం పార్టీ తరపున ఎమ్మెల్యేగా బరిలోకి దిగితే.. టీఆర్ఎస్ బాస్ ఇక్కడి ఎమ్మెల్యే టిక్కెట్ తనకే ఇస్తారని మాజీ ఎంపీ నగేష్ అంటున్నారు. పార్టీలో తనకు పోటీ పెరగడం, ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకతతో బాపురావు తీవ్ర ఆందోళన చెందుతున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే బీజేపీ తరపున ఎంపీ సోయం బాపూరావు బరిలోకి దిగడం ఖాయం అంటున్నారు. పార్టీ నాయకత్వం కూడా సోయంకు ఓకే చెప్పిందని తెలుస్తోంది. పార్టీ అధికారంలోకి వస్తే...తాను ఎమ్మెల్యేగా నెగ్గితే మంత్రి పదవి ఖాయమని సోయం భావిస్తున్నారు. సోయంకు లోక్సభ ఎన్నికల్లో ఆదివాసీలు అండగా నిలిచారు. అందుకే ఆయన ఎంపీ అయ్యారు. ఎంపీ కాగానే తుండదెబ్బ బాధ్యతల నుంచి తప్పుకున్నారు సోయం బాపురావు. దీంతో ఆయనకు ఆదివాసీలు వ్యతిరేకంగా మారారనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇక కాంగ్రెస్కు బోథ్లో అభ్యర్థే కనిపించడంలేదు. టీఆర్ఎస్లో టిక్కెట్ కోసం ప్రయత్నిస్తున్న ఎంపీటీసీ అనిల్ జాదవ్...అక్కడ ఫలితం లేకపోతే కాంగ్రెస్లోకి జంప్ చేస్తారని ఆశిస్తున్నారు. -
ఎమ్యెల్యే VS రిమ్స్ డైరెక్టర్
-
‘ఎమ్మెల్యే క్షమాపణ చెప్పాలి’
ఉట్నూర్రూరల్: ఆదిలాబాద్ ఎంపీపై చేసిన వ్యాఖ్యలకు ఎమ్మెల్యే జోగు రామన్న క్షమాపణ చెప్పాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. బుధవారం మండల కేంద్రంలోని బీజేపీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలను నిర్వహించారు. ఎంపీపై చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో రాజశేఖర్, రమేశ్, దేవి దాస్, భాగ్యలక్ష్మీ, రాజమణి, హరిప్రసాద్, రాజేందర్, మోహన్, వెంకటేశ్, శ్రీకాంత్ పాల్గొన్నారు. ఎంపీ జోలికోస్తే సహించేది లేదు ఇంద్రవెల్లి: ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ సోయం బాపురావు జోలికి వస్తే సహించేది లేదని బీజేపీ నాయకులు హెచ్చరించారు. ఎమ్మెల్యే జోగు రామన్న ఎంపీపై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా బుధవారం మండల కేంద్రంలోని ప్రధాన రహదారిపై బీజేపీ నాయకులు రాస్తారోకో నిర్వహించారు. వారు మాట్లాడుతూ.. ఎమ్మెల్యేపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో దీపక్సింగ్షెకవత్, మరప రాజు, వైస్ ఎంపీపీ పడ్వాల్ గోపాల్సింగ్, మడావి భీంరావు, ఆడవ్ చంపత్రావ్, ఆరెల్లి రాజలింగు, గేడం భరత్ పాల్గొన్నారు. -
మున్సిపల్ చైర్మన్గా ఎమ్మెల్యే కొడుకు
సాక్షి,ఆదిలాబాద్: ఆదిలాబాద్ బల్దియాపై సంపూర్ణంగా గులాబీ జెండా ఎగిరింది. చైర్మన్, వైస్ చైర్మన్ రెండూ పదవులను టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. గత పాలకవర్గంలో ఎంఐఎం, స్వతంత్ర అభ్యర్థుల మద్దతుతో కారు పార్టీ గద్దెనెక్కింది. అయితే ఈమారు మాత్రం టీఆర్ఎస్ ఒంటరిగా అధికారం దక్కించుకుంది. చైర్మన్గా ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగురామన్న తనయుడు జోగు ప్రేమేందర్, వైస్ చైర్మన్గా టీఆర్ఎస్ పార్టీకే చెందిన మహ్మద్ జహీర్ రంజానిలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. చైర్మన్, వైస్ చైర్మన్లు ఏకగ్రీవం.. మున్సిపల్ ఎన్నికల్లో వార్డు సభ్యులుగా ఎన్నికైన వారికి ఆదిలాబాద్ మున్సిపల్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ఉదయం 11 గంటలకు ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నిర్వహించారు. జేసీ సంధ్యారాణి అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది. తెలుగు అక్షరమాల ప్రకారం సభ్యులు ప్రమాణస్వీకారం చేశారు. కొంత మంది తెలుగులో, కొంత మంది హిందీలో, ఒకరు ఇంగ్లీషులో ప్రమాణస్వీకారం చేశారు. 11.53 గంటలకు ప్రమాణస్వీకారం ముగిసింది. అనంతరం మధ్యాహ్నం 12.30 గంటలకు ప్రత్యేక సమావేశంలో చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నిక నిర్వహిస్తామని జేసీ పేర్కొనడం జరిగింది. ఇదిలా ఉంటే టీఆర్ఎస్ నుంచి గెలిచిన 24 మంది సభ్యులకు తోడు స్వతంత్ర అభ్యర్థులుగా గెలిచిన ఇద్దరు పార్టీలో చేరడంతో బలం 26కు చేరుకుంది. బీజేపీ 11 మంది సభ్యులు, కాంగ్రెస్ ఐదుగురు, ఎంఐఎం ఐదుగురు, మరో ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు ప్రత్యేక సమావేశానికి హాజరయ్యారు. కాగా బీజేపీ తరఫున ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు, టీఆర్ఎస్ తరఫున ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగురామన్న మున్సిపాలిటీలో ఎక్స్అఫీషియో సభ్యులుగా నమోదు చేసుకున్నారు. అయితే ఎంపీ సోయం బాపురావు గైర్హాజరు కాగా ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగురామన్న హాజరయ్యారు. ఇకపోతే కౌన్సిలర్లు 49 మంది, ఎక్స్అఫీషియో మెంబర్ ఎమ్మెల్యేను కలుపుకొని 50 మంది ఉండగా, మెజార్టీ 25 వస్తే ఆ పార్టీ ప్రతిపాదించిన అభ్యర్థి చైర్మన్ అవుతారని జేసీ వివరించారు. అయితే కేవలం టీఆర్ఎస్ నుంచే విప్ నోటీస్ అందినట్లు తెలిపారు. ఇతర పార్టీలు విప్ నోటీస్ అందించలేదని స్పష్టం చేశారు. అనంతరం టీఆర్ఎస్ నుంచి 34వ వార్డు కౌన్సిలర్ జోగు ప్రేమేందర్ పేరును చైర్మన్ అభ్యర్థిగా, 45వ వార్డు కౌన్సిలర్ బండారి సతీష్ ప్రతిపాదించగా, 12వ వార్డు కౌన్సిలర్ జాదవ్ పవన్నాయక్ బలపర్చారు. ఇతర పార్టీల నుంచి చైర్మన్ అభ్యర్థిత్వానికి ఎవరూ పోటీ పడలేదు. దీంతో జోగు ప్రేమేందర్ ఏకగ్రీవంగా చైర్మన్గా ఎన్నికైనట్లు జేసీ ప్రకటించారు. అనంతరం టీఆర్ఎస్కే చెందిన 29వ వార్డు కౌన్సిలర్ మహ్మద్ జహీర్ రంజాని పేరును వైస్ చైర్మన్ అభ్యర్థిత్వానికి ఆ పార్టీకి చెందిన 33వ వార్డు కౌన్సిలర్ అలాల అజయ్ ప్రతిపాదించగా, 9వ వార్డు కౌన్సిలర్ ఉష్కం రఘుపతి బలపర్చారు. ఇక్కడ కూడా ఇతర పార్టీల నుంచి ఎవరూ వైస్ చైర్మన్ అభ్యర్థిత్వానికి పోటీకి రాకపోవడంతో మహ్మద్ జహీర్ రంజాని కూడా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు జేసీ ప్రకటించారు. తండ్రికి పాదాభివందనం.. నూతన చైర్మన్, వైస్ చైర్మన్తో జాయింట్ కలెక్టర్ సంధ్యారాణి ప్రమాణస్వీకారం చేయించడంతో ప్రత్యేక సమావేశం ముగిసింది. అనంతరం నూతన చైర్మన్, వైస్ చైర్మన్లతో కలిసి ఎమ్మెల్యే జోగురామన్న పట్టణంలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. టీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అంతకుముందు ప్రమాణస్వీకారం అనంతరం చైర్మన్ చాంబర్లో జోగు రామన్న కుటుంబ సభ్యులు అందరు కలిసి జోగు ప్రేమేందర్కు శుభాకాంక్షలు తెలిపారు. జోగు ప్రేమేందర్ తండ్రి జోగురామన్నకు పాదాభివందనం చేసి ఆశీస్సులు తీసుకున్నారు. ఎంఐఎంకు చెక్.. వైస్ చైర్మన్ ఎన్నికలో టీఆర్ఎస్ వ్యూహాత్మకంగా వ్యవహరించింది. మున్సిపల్ ఎన్నికల్లో పార్టీకి అవసరమైన మెజార్టీ లభించడంతో సొంతగానే పాలకవర్గం ఏర్పాటుకు ఆసక్తి చూపిందనేది స్పష్టమవుతుంది. గత పాలకవర్గంలో ఎంఐఎంకు వైస్ చైర్మన్ పదవిని కట్టబెట్టారు. ఈమారు టీఆర్ఎస్ నుంచి గెలిచిన ముస్లిం నాయకుడు మహ్మద్ జహీర్ రంజానికి పదవి కల్పించారు. తద్వారా ఎంఐఎంకు చెక్ పెట్టారన్న చర్చ సాగుతుంది. కాగా మున్సిపోల్స్లో ఆది నుంచి ఎమ్మెల్యే జోగురామన్న వ్యూహాత్మకంగా పావులు కదిపారన్న ప్రచారం జరుగుతోంది. చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక ఘట్టంలోనూ తన రాజకీయ చతురతను చాటి నియోజకవర్గంలో బలమైన నేతగా మరోసారి నిరూపించుకున్నారన్న భావన అందరిలో వ్యక్తమవుతోంది. -
రెండేళ్లలో కొత్త రైళ్లు..
సాక్షి, ఆదిలాబాద్ : ఆదిలాబాద్లో రైల్వే అభివృద్ధికి కృషి చేస్తానని, రెండేళ్లలో కొత్త రైళ్లు వేస్తామని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మాల్యా అన్నారు. వార్షిక తనిఖీలో భాగంగా శుక్రవారం ఆదిలాబాద్ రైల్వేస్టేషన్ను సందర్శించారు. పలు అభివృద్ధి పనులతోపాటు కొత్తగా నిర్మించిన భవనాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ భద్రతపైనే ప్రధాన దృష్టి సారిస్తున్నట్లు పేర్కొన్నారు. రైల్వే ఇంజిన్ కండీషన్, కొత్త రైళ్ల పొడిగింపు, రైల్వేస్టేషన్లో సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు చేపడతామన్నారు. ప్రయాణికుల డిమాండ్ మేరకు ప్రభుత్వానికి బడ్జెట్ కోసం నివేదికను పంపించామని, నిధులు విడుదలైతే రెండేళ్లలో కొత్త రైళ్లతోపాటు ఆయా పనులు చేపడుతామన్నారు. కలకత్తా, బెంగళూరు, తిరుపతి, తదితర ప్రాంతాలకు ఇక్కడి నుంచి రైళ్ల రాకపోకలు సాగించాలని ప్రయాణికుల నుంచి విజ్ఞప్తి ఉందని తెలిపారు. ఎలక్ట్రిసిటీ రైళ్ల కోసం టెండర్ పనులు ప్రారంభించామని, త్వరలోనే టెండర్లు పూర్తయితే పనులు ప్రారంభిస్తామన్నారు. గతంలో మీటర్గేజ్ రైలు, ప్రస్తుతం బ్రాడ్గేజ్ రైళ్లు నడుస్తున్నాయని, ప్రయాణికుల సౌకర్యార్థం మరింత నాణ్యత ప్రమాణాలు పాటిస్తున్నామని చెప్పారు. వివిధ ప్రాంతాల నుంచి నాందేడ్ వరకు వచ్చే రైళ్లను ఆదిలాబాద్ వరకు పొడిగించాలని పలువురు విన్నవించారని, ఈ విషయంపై పరిశీలించి నిర్ణయం తీసుకుంటామన్నారు. పిప్పల్కోటి, ముత్ఖేడ్ ఎలక్ట్రేషన్ పనులు పూర్తయ్యాయని, వచ్చే ఏడాది డబ్లింగ్ పనులు మొదలు పెడుతున్నట్లు తెలిపారు. చిల్ర్డన్ పార్క్, సోలార్ ప్లాంట్, టీటీఈ రెస్ట్రూమ్లను ప్రారంభించారు. రైల్వే క్వార్టర్స్ను పరిశీలించి అక్కడ ఉంటున్న వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రహరీ పనులను పరిశీలించారు. రోడ్డు సౌకర్యం, బోరు వేయించాలని అందులో ఉంటున్న వారు విన్నవించడంతో సమస్య పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు. ఈ సందర్భంగా రైల్వేస్టేషన్ ఆవరణలో మొక్కలు నాటి వాటికి నీరు పోశారు. రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రాకనే ఆటంకాలు రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతోనే రైల్వే పనుల్లో ఆటంకాలు ఎదురవుతున్నాయని దక్షిణ మధ్య రైల్వే జీఎం గజానన్ మాల్యా అన్నారు. ప్లైఓవర్, అండర్బ్రిడ్జి కోసం రూ.78 కోట్లు అవసరం ఉండగా, రాష్ట్ర ప్రభుత్వం 50 శాతం చెల్లించాల్సి ఉంటుందని, నిధులు విడుదల చేయకపోవడంతో ఈ పనులు చేపట్టడం లేదన్నారు. అలాగే ఆదిలాబాద్–ఆర్మూర్ రైల్వే లైన్ జాయింట్ వెంచర్కు సంబంధించిందని, ఈ విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావడం లేదన్నారు. ఈ విషయమై పలుసార్లు ప్రభుత్వ ముఖ్య కార్యదర్శిని కలిశామని, మరోసారి కలిసి ఈ పనుల విషయమై చర్చిస్తామన్నారు. వినతుల వెల్లువ.. జిల్లా కేంద్రంలోని రైల్వేస్టేషన్కు వచ్చిన దక్షిణ మధ్య రైల్వే జీఎం గజానన్ మాల్యాకు పలువురు వినతులు సమర్పించారు. ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న రైల్వే జీఎంను కలిసి పెండింగ్లో ఉన్న పనులను పరిష్కరించాలని విన్నవించారు. చిల్ర్డన్ పార్కు, సోలార్ విద్యుత్, రైల్వే సిబ్బంది క్వార్టర్ను పరిశీలించారు. ఇతర ప్రాంతాల నుంచి నాందేడ్కు వచ్చే వివిధ రైళ్లను ఆదిలాబాద్ వరకు పొడిగించాలని కోరారు. ఆయన వెంట జెడ్పీ వైస్చైర్మన్ రాజన్న, మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రహ్లాద్, టీఆర్ఎస్ నాయకులు ఉన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్, సీపీఎం జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్రెడ్డి, జిల్లా నాయకులు విలాస్, సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లేశ్, రాష్ట్ర నాయకులు బండి దత్తాత్రితోపాటు పలువురు రైల్వే జీఎంను కలిసి వినతిపత్రాలు అందజేశారు. రైల్వేఓవర్, అండర్బ్రిడ్జిల నిర్మాణాలు చేపట్టాలని, ఆదిలాబాద్–ఆర్మూర్ రైల్వేలైన్ పనులను చేపట్టాలని కోరారు. ఆదిలాబాద్–ఢిల్లీ రైలు వేయాలని, ఆదిలాబాద్–ముత్ఖేడ్ వరకు డబుల్ రైల్వే లైన్ పనులు చేపట్టాలని, నిజామాబాద్ వరకు వస్తున్న విశాఖ ఎక్స్ప్రెస్, రాయలసీమ ఎక్స్ప్రెస్ రైళ్లను ఆదిలాబాద్ వరకు పొడిగించాలని, ఆదిలాబాద్–హైదరాబాద్ వరకు ఉద యం పూట రైలు నడిపించాలని, ఆదిలాబాద్–నాగ్పూర్ రైలు సాయంత్రం వేళల్లో నడిపించాలని విన్నవించారు. కృష్ణ ఎక్స్ప్రెస్లో రెండు స్వీపర్ బోగీలను పెంచాలని కోరారు. -
బాల మేధావులు భళా !
సాక్షి, ఆదిలాబాద్ : విద్యార్థులు తయారు చేసిన ప్రదర్శనలు చూసి నివ్వరపోయేలా చేసింది. పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నివారణ, రోడ్డు ప్రమాదాల నివారణ, వ్యర్థాలతో అర్థాలు, విద్యుత్, నీటి ఆదా, తదితర ప్రదర్శనలు తయారు చేశారు. భావితర శాస్త్రవేత్తలుగా నమూనాలను తయారు చేసి ఆలోచింపజేశారు. ఆదిలాబాద్ పట్టణంలోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలలో జిల్లా వైజ్ఞానిక సైన్స్ ప్రదర్శన నిర్వహించారు. జిల్లాలోని 700లకు పైగా పాఠశాలలకు చెందిన విద్యార్థులు పాల్గొని ప్రయోగాలను ప్రదర్శించారు.కలెక్టర్ దివ్యదేవరాజన్, ఆదిలాబాద్, బోథ్ ఎమ్మెల్యేలు జోగురామన్న, రాథోడ్ బాపురావు, జిల్లా విద్య శాఖాధికారి డాక్టర్ ఎ.రవీందర్రెడ్డి తిలకించారు. వీరితో పాటు మార్కెట్ కమిటీ మెట్టు ప్రహ్లాద్, తదితరులు విద్యార్థులను అభినందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సైన్స్ అధికారి రఘురమణ, అకాడమిక్ కోఆర్డినేటర్ నారాయణ, ఎంఈఓ జయశీల, శ్రీహరిబాబు, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు అడ్డి భోజారెడ్డి, ఓపెన్స్కూల్ కోఆర్డినేటర్ అశోక్, సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల ప్రిన్సిపల్ ఆనంద్రెడ్డి పాల్గొన్నారు. పర్యావరణాన్ని కాపాడేందుకు.. పర్యావరణ కాలుష్యంతో గ్లోబల్ వార్మింగ్ ఏర్పడుతుంది. ఫ్యాక్టరీలతో వాయు కాలుష్యం, నీటి కాలుష్యమై రోగాలు ప్రబలుతున్నాయి. సెల్ టవర్ల కారణంగా పిచ్చుకలు చనిపోతున్నాయి. పర్యావరణాన్ని కాపాడేందుకు మొక్కలు నాటడడంతో పాటు ప్లాస్టిక్ వినియోగాన్ని అరికట్టాలి. భూగర్భ జలాలు పెంపొందించేందుకు ఇంకుడుగుంతలను ఏర్పాటు చేసుకోవాలి. – నవీన, ప్రతిభ, కేజీబీవీ, ఆదిలాబాద్ గాలి ద్వారా వంట.. గాలిద్వారా వంట చేసుకోవచ్చు. ఇందుకోసం పెట్రోల్, నీరు అవసరం ఉంటుంది. రెండు వేర్వేరు బాటిళ్లలో నీళ్లు, పెట్రోల్ పోసి పైపులను అమర్చుకోవాలి. పెట్రోల్ బాటిల్కు ఒక పైపును ఏర్పాటు చేసి గాలిని పంపాలి. ఆ గాలి పెట్రోల్లోకి వెళ్లి గ్యాస్లీన్ వాయువు తయారవుతుంది. దానిద్వారా వంట చేసుకోవచ్చు. పెట్రోల్ అలాగే ఉంటుంది. ఎలాంటి ఖర్చు లేకుండా వంట చేసుకోవచ్చు. పర్యావరణాన్ని కూడా కాపాడుకోవచ్చు. – తృప్తి, ఝాన్సీరాణి, జెడ్పీఎస్ఎస్, ఇచ్చోడ విషజ్వరాలు సోకకుండా.. ప్రస్తుతం దోమలతో జ్వరాలు ప్రబలుతున్నాయి. ప్రజలు డెంగీ, మలేరియా, విషజ్వరాలు సోకుతున్నాయి. దోమల నివారణ కోసం తులసీ, బంతి, సజ్జల మొక్కలను ఇంట్లో పెంచితే దోమలు వృద్ధి చెందవు. గడ్డి చామంతి, వేప ఆకులను ఎండబెట్టి పొగపెడితే దోమలు ఉండవు. వేప నూనె, కొబ్బరి నూనె చర్మానికి రాసుకుంటే కుట్టవు. బ్యాక్టీరియా దరిచేరదు. – వర్ష, కృష్ణవేణి, జెడ్పీఎస్ఎస్, మావల సహజ వనరుల వినియోగం సహజ వనరుల వినియోగంతో అనేక లాభాలు పొందవచ్చు. వర్షాకాలంలో ట్యాంకుల్లో నీరు నిల్వ ఉంచుకొని వర్షాలు లేనప్పుడు వాటిని డ్రిప్ ద్వారా వినియోగించుకుంటే పంటలు పండుతాయి. పశువుల పెంపకంతో గోబర్ గ్యాస్ తయారు చేసుకోవచ్చు. సౌర శక్తితో విద్యుత్ను తయారు చేసుకోవచ్చు. ఎలాంటి రసాయనిక ఎరువులు, క్రిమిసంహారక మందులను వినియోగించకుండా సహజసిద్ధమైన ఎరువులను తయారు చేసి వాడాలి. – యశశ్విని, దుర్గా, అరుణోదయ పాఠశాల, ఆదిలాబాద్ దోమలు వృద్ధి చెందకుండా.. దోమలు మురికి కాల్వలు, నిల్వ నీటిలో గుడ్లు పెట్టి వృద్ధి చెందుతాయి. దోమలను లార్వ దశలోనే నివారించేందుకు ఇంట్లో వాడిన మంచినూనె, రంపం పొట్టు, గుడ్డలను తీసుకోవాలి. రంపం పొట్టును గుడ్డలో కట్టి నూనెలో ముంచి మురికి కాల్వల్లో పారవేయాలి. ఆయిల్ పైకివచ్చి దోమల లార్వలకు ఆక్సిజన్ అందకుండా నూనె పైకితేలుతూ అవి నశించేలా చేస్తాయి. – దీపాలి, మారుతి, జెడ్పీఎస్ఎస్, మన్నూర్ సైన్స్ ప్రదర్శనలను తిలకిస్తున్న కలెక్టర్, ఎమ్మెల్యేలు చల్లని, వేడి గాలిచ్చే కూలర్.. తక్కువ ఖర్చుతో వేడి, చల్లని గాలినిచ్చే కూలర్ను తయారు చేసుకోవచ్చు. ఇందుకోసం బ్యాటరీ, ఫ్యాన్, స్విచ్, బెండ్ పైపు, వైర్ అవసరం ఉంటుంది. బ్యాటరీతో పనిచేస్తుంది. వేసవి కాలంలో చల్లని నీటిని అందులో పోస్తే చల్లని గాలి వస్తుంది. చలికాలంలో వేడి నీళ్లు పోస్తే వేడి గాలిలో గది వెచ్చగా ఉంటుంది. కాలానికి అనుగుణంగా దీనిని వినియోగించుకునే అవకాశం ఉంటుంది. – అవంతిక, ఆర్యభట్ట పాఠశాల, ఆదిలాబాద్ ద్రియ సాగు.. బహుబాగుసేం ప్రస్తుతం రసాయనిక ఎరువులు, క్రిమిసంహారక మందులతో పంటలు పండించడంతో ఆహార పదార్థాలు విషహారంగా మారుతున్నాయి. దీంతో అనేక రోగాలు వస్తున్నాయి. సేంద్రియ వ్యవసాయ వల్ల సహజమైన పంటలు లభిస్తాయి. ఆవులు, గేదెల ద్వారా స్వచ్ఛమైన పాలు లభించడంతోపాటు వాటి పేడతో ఎరువులు, గోబర్గ్యాస్ తయారు చేసుకోవచ్చు. – కె.అంకిత, విశ్వశాంతి పాఠశాల, ఆదిలాబాద్ -
ఈ ఇద్దరి మధ్య అసలేం జరిగింది ?
సాక్షి, ఆదిలాబాద్ : ఈ ఇరువురు ప్రజాప్రతినిధుల మధ్య ప్రస్తుత వైరం రాజకీయంగా వేడి పుట్టిస్తోంది. భిన్న సిద్ధాంతాలు ఉన్న వేర్వేరు పార్టీలకు చెందిన నేతలు కావడంతో సహజంగానే పార్టీల పరంగా చోటుచేసుకున్న విభేదాలా అన్న అనుమానాలు ఉన్నా అటువంటిది కాదనేది వారి మాటలను బట్టే స్పష్టమైంది. ఇరువురు నేతలు ఇటీవల ఐటీడీఏ పాలకవర్గ సమావేశం సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ.. తమకు వ్యక్తిగతంగా ఎలాంటి పొరపొచ్చాలు లేవని స్పష్టం చేశారు. అయినా మాటల యుద్ధం మాత్రం ఆగడం లేదు. దీంతో ఈ రచ్చకు ఆజ్యం ఏమై ఉంటుందోనని అందరిని తొలుస్తుంది. కొనసాగుతున్న పర్వం.. గత నెల వివిధ వేదికల ద్వారా ఈ ఇరువురు నేతలు ఒకరిపై మరొకరు విమర్శలు గుప్పించుకోవడం ద్వారా మొదలైన పర్వం ఇప్పటికీ కొనసాగుతోంది. ప్రస్తుతం టీఆర్ఎస్, బీజేపీ పార్టీలు వేర్వేరుగా ప్రెస్మీట్లు పెట్టి మరీ ఒకరి వ్యాఖ్యలను మరొకరు ఖండిస్తూ నిరంతరంగా వ్యవహారం సాగుతోంది. అయితే ఇరువురు నేతల ఆరోపణలు తారాస్థాయికి చేరాయి. బీసీ సంక్షేమశాఖ మంత్రిగా జోగు రామన్న ఉన్న సమయంలో ఆ శాఖకు రూ.వెయ్యి కోట్లు కేటాయింపులు ఉండగా, పూర్తిస్థాయిలో ఖర్చు చేసినట్లు నిరూపిస్తే తాను ముక్కు నేలకు రాస్తానని సోయం బాపురావు సవాల్ విసిరారు. సోయం బాపురావు తాను గెలిచిన వెంటనే ఢిల్లీకి వెళ్లి సంతకం పెడితే ఎస్టీ జాబితా నుంచి లంబాడీలను తొలగించడం జరుగుతుందని చెప్పడం జరిగిందని, ఇప్పుడు నెలలు దాటినా తాను ఎందుకు ఆ పని చేయలేకపోతున్నారంటూ ఎమ్మెల్యే జోగు రామన్న ప్రతిసవాల్ విసిరారు. ఇలా ఈ ఇద్దరు నేతలు ఒకరిపై మరొకరు ఆరోపణలు సంధించుకోవడం గమనార్హం. ఆజ్యం ఎక్కడ? ఆదివాసీలను తెలంగాణ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఎంపీ సోయం బాపురావు తీవ్రస్థాయిలో ఆరోపణలు చేస్తుండగా, ఎస్టీ జాబితా నుంచి లంబాడీల తొలగింపు విషయంలో బీజేపీ రాష్ట్ర నేతలతో చెప్పిస్తే తన పదవికి రాజీనామా చేస్తానంటూ రామన్న పేర్కొనడం గమనార్హం. అయితే ఈ ఇరువురు నేతల మధ్య ఇంతటి రగడకు ఆజ్యం ఎక్కడ పడిందన్న సందేహం ఇరు పార్టీల నాయకులు, కార్యకర్తలను తొలుస్తుంది. తొలుత ఆగస్టు చివరిలో జరిగిన జెడ్పీ సర్వసభ్య సమావేశంలో వీరిద్దరి మధ్య మాటల యుద్ధం కనబడింది. అయితే అది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న కిసాన్ సమ్మాన్, రైతుబంధు విషయంలో కొనసాగడంతో అది ప్రభుత్వాల పరంగా సమావేశంలో వాడివేడిగా చర్చ జరిగిందన్న అభిప్రాయం వ్యక్తమైంది. అక్కడ విభేదాల స్థాయి అంతగా కనిపించలేదు. అంతకు ముందు స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత టీఆర్ఎస్ 9 జెడ్పీటీసీలను గెలవడం, బీజేపీ 5, కాంగ్రెస్ 3 స్థానాల్లో గెలవడం అప్పట్లో ప్రాధాన్యం సంతరించుకుంది. ఆ క్రమంలో 17 జెడ్పీటీసీల్లో 9 మంది మెజార్టీ ఉన్న టీఆర్ఎస్ జెడ్పీ చైర్మన్ పదవిని కైవసం చేసుకోవడం ఖాయమే అయినా అనూహ్యంగా బీజేపీ, కాంగ్రెస్ సభ్యులు జత కట్టడం ఆసక్తి కలిగించింది. దీనికి ఎంపీ సోయం బాపురావు నేతృత్వం వహించారు. ఇక టీఆర్ఎస్ నుంచి ఎవరినైన ఒకరిని ఇటువైపు తిప్పుకుంటే పరిణామాలు వేరుగా ఉంటాయన్న రాజకీయ వేడి జెడ్పీచైర్మన్ ఎన్నిక రోజు కనిపించింది. అయితే ఈ వ్యవహారంలో ముందు జాగ్రత్త పడ్డ టీఆర్ఎస్ ముఖ్యంగా ఎమ్మెల్యే జోగు రామన్న, బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావులు ఉట్నూర్ కాంగ్రెస్ జెడ్పీటీసీ చారులతను టీఆర్ఎస్ వైపు తిప్పుకున్నారు. జెడ్పీచైర్మన్ ఎన్నికలో చారులత టీఆర్ఎస్కు మద్దతిచ్చారు. బీజేపీ నుంచి ఆదివాసీ అభ్యర్థిని జెడ్పీచైర్మన్ పదవి కోసం పేరు ప్రతిపాదించాక ఈ వ్యవహారం చోటుచేసుకుంది. ఎంపీ సోయం బాపురావు, ఎమ్మెల్యే జోగు రామన్నకు విభేదాలు అప్పటి నుంచే పొడసూపాయా అన్న అభిప్రాయం వ్యక్తమైనా ఆ సమావేశం చివరిలో ఇరువురు నేతలు కలిసి నవ్వుతూ మాట్లాడుకోవడం ఆసక్తి కలిగించింది. పట్టున్న నేతలే.. ఈ నేతల రాజకీయ అనుభవాన్ని పరిశీలించినా ఇరువురు పట్టున్న నేతలే. ఎంపీ సోయం బాపురావు ఆదివాసీ ఉద్యమం పరంగా తన జాతి కోసం పోరాటం చేస్తూ ఎస్టీ జాబితా నుంచి లంబాడీలను తొలగించాలనే డిమాండ్కు కట్టుబడి ఉన్నారు. అదేవిధంగా గతంలో బోథ్ ఎమ్మెల్యేగా ఆయన వ్యవహరించారు. రాజకీయాల్లో ఎత్తుపల్లాలను చూశారు. ఇక ఎమ్మెల్యే జోగు రామన్న బీసీల ఆదరణతో ఆదిలాబాద్ నియోజకవర్గంలో పట్టు కలిగి ఉన్నారు. గత ప్రభుత్వ హయాంలో పూర్తిస్థాయిలో మంత్రిగా పనిచేశారు. రాజకీయ అడుగులకు విరోధం కావడంతో ఇరువురి మధ్య ఈ విభేదాలు తలెత్తాయా.. లేదంటే మరేమైనా అయి ఉంటుందా? అన్న సందేహం వ్యక్తమవుతోంది. అదే సమయంలో కేంద్రం నక్సల్ బాధిత జిల్లాలకు ఇచ్చే నిధులను మళ్లించారని జోగు రామన్నతోపాటు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్పై కూడా సోయం బాపురావు విమర్శలు సంధించారు. అలాంటప్పుడు నిధుల మళ్లింపు విషయంలో ఈ విభేదాలా.. లేనిపక్షంలో సామాజిక కోణంలో హక్కులు, నిధుల విషయంలో ఒకరిపై మరొకరి ఆరోపణలు అగ్నికి ఆజ్యం పోసిందా? అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఏదేమైనా మున్సిపల్ ఎన్నికల ముందు టీఆర్ఎస్, బీజేపీ పార్టీల్లో ఇది రాజకీయ వేడి పుట్టిస్తోంది. -
సోయం పారిపోయే లీడర్ కాదు
సాక్షి, ఆదిలాబాద్ : ఇటీవల ఉట్నూర్లో జరిగిన ఐటీడీఏ గవర్నింగ్ బాడీ సమావేశంలో ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావ్ సమస్యలపై చర్చించకుండా మధ్యలో నుంచి పారిపోయాడని ఎమ్మెల్యే జోగు రామన్న చేసిన వ్యాఖ్యలను భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు శంకర్ తీవ్రంగా ఖండించారు. సోయం బాపురావ్ పారిపోయే లీడర్ కాదని, ఇతరులను పారిపోయేలా చేసే లీడర్ అన్నారు. ఎంపీపై ఇకనైనా వ్యక్తిగత విమర్శలు చేయడం మానుకోవాలన్నారు. శుక్రవారం ఆదిలాబాద్ పట్టణంలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఎమ్మెల్యే జోగు రామన్న పదవుల కోసం రాజకీయం చేస్తే, ఎంపీ సోయం బాపురావ్ అన్ని రంగాల్లో వెనుకబడి ఉన్న ఆదివాసీ జాతి కోసం ఆయన ప్రాణాన్ని పణంగా పెట్టి పోరాటం చేస్తున్నాడన్నారు. జోగు రామన్న ఎంపీపై చేసిన వ్యాఖ్యలు అధికార దురహంకారానికి నిదర్శమని విమర్శించారు. విమర్శలు చేసేముందు ఎమ్మెల్యే సోయం బాపురావ్ చరిత్రను తెలుసుకోవాలని అన్నారు. ఎమ్మెల్యే వెంటనే ఎంపీకి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. జిల్లాలోని అన్ని గ్రామాలకు రోడ్డు సౌకర్యం కల్పించమని చెబుతున్న ఎమ్మెల్యే జోగు రామన్న, జిల్లాలో 243 ఆదివాసీ గ్రామాలు ఉంటే కేవలం 143 గ్రామాలకు మాత్రమే రోడ్డు సౌకర్యాలు కల్పించారని అన్నారు. ఐఏపీ నిధులు దుర్వినియోగం చర్చపై మా ఎంపీ అవసరం లేదని పార్టీ జిల్లా అధ్యక్షునిగా తనే వస్తానని స్థలం ఎక్కడ ఎంచుకుంటారో ఎంచుకోవాలని ఆధారాలతో రుజువు చేసేందుకు సిద్ధంగా ఉన్నానని సవాల్ విసిరారు. సమావేశంలో బీజేపీ నాయకులు సునంద రెడ్డి, జ్యోతి, రవి, ప్రవీణ్, సతీష్, ప్రవీణ్ పాల్గొన్నారు. సోయం అంటే టీఆర్ఎస్కు వణుకు బోథ్: ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావ్ అంటే టీఆర్ఎస్ నేతలకు వెన్నులో వణుకు పుడుతుందని, ఆయన భయపడి పారిపోయే వ్యక్తి కాదని ఆత్మరాష్ట్ర మాజీ డైరెక్టర్ రాజుయాదవ్ ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్నను ఉద్దేశించి అన్నారు. శుక్రవారం బోథ్ మండల కేంద్రంలో ఆయన మాట్లాడుతూ... ఉట్నూర్లో జరిగిన ఐటీడీఏ పాలకవర్గం సమావేశంలో ఎంపీ సోయం బాపూరావ్ సమావేశం నుంచి పారిపోయాడని ఎమ్మెల్యే జోగురామన్న గురువారం చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టారు. (చదవండి : సభలోంచి ఎందుకు పారిపోయావ్) జోగురామన్నకు ఆదివాసీలంటే ఏమిటో చూపెడతాం ఎమ్మెల్యే జోగురామన్న ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యుడు సోయం బాపురావుపై అవాకులు చవాకులు పేలితే ఆదివాసీల సత్తా ఏమిటో చూపెడతామని తుడుందెబ్బ బోథ్ డివిజన్ అధ్యక్షుడు శంకర్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో వివిధ గ్రామాల నుంచి వచ్చిన ఆదివాసీలు ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగురామన్నకు వ్యతిరేకంగా నినాదాలు చేసి చేశారు. వారు మాట్లాడుతూ.. ఎమ్మెల్యే వెంటనే ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావుకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో అట్రాసిటీ కేసు నమోదు చేయిస్తామని అన్నారు. సుప్రీం కోర్టు ఇచ్చిన నోటీసులపై తెలంగాణ ప్రభుత్వం వివరణ ఇచ్చే విధంగా చూడాలన్నారు. స్వార్థ రాజకీయాలు కాకుండా లంబాడీలు ఎస్టీ కాదనే విషయంపై స్పష్టమైన వైఖరి తెలపాలన్నారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు సాంబన్న, సోనేరావు, కోటేశ్వర్, నాయక్పోడ్ సంఘం మండల అధ్యక్షుడు గంగాధర్, వివిధ గ్రామాల పటేళ్లు, యువకులు తదితరులు పాల్గొన్నారు. -
సభలోంచి ఎందుకు పారిపోయావ్
ఆదిలాబాద్టౌన్: ఐటీడీఏ గవర్నింగ్ బాడీ సమావేశంలో గిరిజనుల సమస్యలను చర్చించకుండానే మధ్యలో నుంచి ఎందుకు పారిపోయావని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగురామన్న ఎంపీ సోయం బాపురావును ప్రశ్నించారు. గురువారం జిల్లా కేంద్రంలోని జెడ్పీ క్యాంప్ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గిరిజనుల అభివృద్ధికి తమ ప్రభుత్వం ఎక్కడా అడ్డుపడటం లేదన్నారు. ఆదివాసీలకు ఒక పిలుపునిస్తే కలెక్టర్, ఎస్పీ కార్యాలయాలే ఉండవన్నావు.. నక్సలైట్, ఉగ్రవాదుల మాట్లాడిన ఆ మాటలను వెంటనే వెనక్కి తీసుకోవాలని కోరితే సభ మధ్యలో నుంచే పారిపోయావని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఎంపీ వ్యాఖ్యలపై లీగల్ ఒపీనియన్ తీసుకొని చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తమకు చెప్పినట్లు వివరించారు. బీజేపీ నాయకులైన కిషన్రెడ్డి, లక్ష్మణ్ను పిలిచి ఆదిలాబాద్లో బహిరంగ సభ ఏర్పాటు చేసి లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగిస్తామని చెప్పిస్తే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని స్పష్టం చేశారు. లేకుంటే ఎంపీ పదవికి రాజీనామా చేస్తావా? అని బాపురావుకు సవాలు విసిరారు. ఎవరు అవినీతికి పాల్పడ్డారో బహిరంగ చర్చకు సిద్ధమా అని అన్నారు. నాగోబా, జంగుబాయి జాతరలకు, జోడెఘాట్ ఉత్సవాలకు ప్రభుత్వం నిధులు కేటాయించిందని గుర్తు చేశారు. హైదరాబాద్, ఆదిలాబాద్లో ఆదివాసీ భవన్లు నిర్మించామన్నారు. తనను గెలిపిస్తే లంబాడీలను తొలగించే అంశం ఒక సంతకంతో అయిపోతుందన్న బాపురావు.. ఎంపీగా గెలిచిన తర్వాత కూడా ఎందుకు సంతకం పెట్టడం లేదని ఎద్దేవా చేశారు. అనంతరం సీఎం సహాయనిధి చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. సమావేశంలో ఏఎంసీ చైర్మన్ మెట్లు ప్రహ్లాద్, మున్సిపల్ మాజీ చైర్పర్సన్ మనిషా, నాయకులు గోవర్ధన్రెడ్డి, రాజేశ్వర్, సాజిదొద్దీన్, ఆశమ్మ, సతీష్, ఖయ్యుం పాల్గొన్నారు. -
రసాభాసగా ఐటీడీఏ సమావేశం
ఆదిలాబాద్: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఐటీడీఏ పాలకవర్గ సమావేశం బుధవారం రసాభాసగా జరిగింది. ఈ సమావేశంలో ఎంపీ సోయం బాపూరావు తనపై చేసిన వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పాలని మాజీ మంత్రి జోగు రామన్న పట్టుబట్టారు. దీంతో చేసేదేమిలేక సోయం బాపురావు వ్యాఖ్యలపై ఆత్రం సక్కు క్షమాపణ కోరారు. దీంతో ఐటీడీఏ సమావేశంలో రాజకీయాలు ఎలా ప్రస్తావిస్తారని బాపురావు ప్రశ్నించారు. తాను క్షమాపణ చెప్పేది లేదంటూ సమావేశం నుంచి బాపూరావు వెళ్లిపోయారు. మరోవైపు ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్లో కూడా బుధవారం ఐటీడీఏ పాలకవర్గ సమావేశం జరిగింది. అయితే ఈ సమావేశంలో ‘తుడుం దెబ్బ’ ఆందోళనకారులు బయటకు వచ్చి లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. అదే విధంగా ఆదివాసి తుడుందెబ్బ నాయకులు కొమరం భీం కాంప్లెక్స్ గేట్ ముందు ధర్నా చేశారు. ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించాలని నినాదాలు చేశారు. -
మాజీ మంత్రికి క్షమాపణలు చెప్పిన అనసూయ
సాక్షి, హైదరాబాద్ : ప్రస్తుతం టాలీవుడ్లో సేవ్ నల్లమల ఫారెస్ట్ అని ట్రెండ్ అవుతోంది. హీరోలు, హీరోయిన్లు అందరూ దీనిపై స్పందిస్తున్నారు. పనిలో పనిగా అన్నట్లు అనసూయ భరద్వాజ్ కూడా ఓ ట్వీట్ చేసింది. అయితే అంతవరకు బాగానే ఉన్నా.. తనకు కరెంట్ అఫైర్స్ పట్టు లేనందున ఓ తప్పు దొర్లింది. ఆ ట్వీట్ను అటవీ శాఖమంత్రి జోగు రామన్న అంటూ ట్యాగ్ చేసింది. అయితే అది గత ప్రభుత్వంలో అన్న విషయం ఆమెకు కాస్త లేట్గా తెలిసి వచ్చింది. దీంతో మరో ట్వీట్ను చేసింది. టీఆర్ఎస్ ఎమ్మెల్యే జోగు రామన్నకు క్షమాపణలు తెలిపింది. తనకు కరెంట్ అఫైర్స్ మీద అంత అవగాహన లేకపోవడం వల్లే ఇలా జరిగిందని చెప్పి ప్రస్తుత అటవీ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డికి ట్యాగ్ చేసింది. ఇక తెలుగు రాష్ట్రాల్లో సేవ్ నల్లమల ఫారెస్ట్ అనే ఉద్యమం మంచి ఊపందుకుంటోంది. నల్లమల అడవిలో యురేనియం వెలికితీతకు వ్యతిరేకంగా ఇప్పటికే విజయ్ దేవరకొండ, సమంతలాంటి ప్రముఖులు స్పందిస్తూ.. ప్రజల్లోకి తీసుకెళ్లేలా కృషి చేస్తున్నారు. Apologies for wrong tag Shri @JoguRamannaTRS .. Never thought I would one day feel the need so forgive my lack of knowledge on current affairs..Sir .. this is to address you Shri @IKReddyAllola Please consider my intention and not any other diversion🙏🏻🙏🏻 https://t.co/n8YFsd8lKS — Anasuya Bharadwaj (@anusuyakhasba) September 12, 2019 -
కేసీఆరే మా నేత..
సాక్షి, ఆదిలాబాద్: తాను పార్టీని వీడేది లేదని, కేసీఆరే మా నాయకుడని ఎమ్మెల్యే జోగు రామన్న స్పష్టం చేశారు. బుధవారం ఆదిలాబాద్లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘నేను అజ్ఞాతంలోకి వెళ్లలేదు.. ఆరోగ్యం బాగా లేకపోవడంతో హైదరాబాద్లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందిన.. హైబీపీ ఉండటంతో వైద్యుల సూచన మేరకు ఎవరితో మాట్లాడలేదు. గ్రామస్థాయి నుంచి మంత్రి వరకు పని చేసిన. ఎలాంటి మచ్చ లేకుండా ప్రజలకు నిస్వార్థమైన సేవలు అందించిన. మంత్రి పదవి వస్తుందని కార్యకర్తలు, నాయకులకు భరోసా ఇచ్చిన. పదవి రాకపోవడం నిరుత్సాహానికి గురి చేసింది. ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీ ఆదేశాల మేరకు పనిచేసిన. పార్టీ పటిష్టతకు కృషి చేసిన..’అని జోగరామన్న పేర్కొన్నారు. పార్టీ వ్యతిరేక కార్యక్ర మాలు ఏ రోజూ చేయలేదన్నారు. కార్యకర్తలు తనకు ఆక్సిజన్లాంటి వారని.. మంత్రి పదవి ఆశించడంలో తప్పులేదని అన్నారు. మంత్రి పదవి రాలేదని కార్యకర్తలు, నాయకులు నిరుత్సాహానికి లోనయ్యారని పేర్కొన్నారు. ఎమ్మెల్యే ఆవేదన తనకు అమాత్య పదవి దక్కకపోవడంతో అసంతృప్తికి గురైన ఎమ్మెల్యే జోగురామన్న సోమవారం ఉదయం నుంచి ఎవరికీ అందుబాటులో లేకుండా పోయిన విషయం తెలిసిందే. దీంతో కార్యకర్తల్లో ఆందోళన వ్యక్తమైంది. మంగళవారం హైదరాబాద్లో అజ్ఞాతం వీడి అందరి మధ్యలోకి వచ్చారు. ఈ సందర్భంగా ఉద్వేగానికి లోనయ్యారు. కంటతడి పెడుతూనే.. ముఖం కిందకు వాల్చారు. పక్కనే ఉన్న ఆదిలాబాద్ జెడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ జోగు రామన్న వైపు చూస్తూ ఉండిపోయారు. మొత్తంగా ఎమ్మెల్యే మాటల్లో ఆవేదన కనిపించింది. కార్యకర్తలు ఎవరూ ఎలాంటి అఘాయిత్యానికి పాల్పడవద్దని సూచించారు. మీ అండదండలతోనే తాను ఈ స్థాయికి ఎదిగానని పేర్కొన్నారు. -
కారణం చెప్పి.. రామన్న కంటతడి
సాక్షి, హైదరాబాద్ : అజ్ఞాతంలోకి వెళ్లి కలకలం సృష్టించిన ఆదిలాబాద్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి జోగు రామన్న ఎట్టకేలకు మీడియా ముందుకు వచ్చారు. రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో రామన్నకు చోటు దక్కకపోవడంతో అలకబూనిన ఆయన సోమవారం అందుబాటులో లేకపోవడం తెలిసిందే. ఈ క్రమంలోనే బుధవారం మీడియా ముందుకు వచ్చిన రామన్న.. తాను అనారోగ్య కారణంగానే అందుబాటులో లేనని చెప్పుకొచ్చారు. మంత్రి పదవి ఇస్తారనే ఆశ ఉండేనని, అది దక్కకపోవడంతో మనస్థాపానికి గురయ్యానన్నారు. బీపీ పెరిగి ఆస్పత్రిలో చేరానే తప్ప అజ్ఞాతంలోకి వేళ్లే అవసరం తనకు లేదన్నారు. సర్పంచ్ స్థాయి నుంచి మచ్చలేని వ్యక్తిగా ఉన్న తనకు మంత్రి పదవి రాకపోవడం బాధ కలిగించిందంటూ మీడియా ముందు కంటతడి పెట్టారు. తనకు మంత్రి పదవి రాకున్నా టీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతానని, కేసీఆరే తమ నాయకుడు అని రామన్న అన్నారు. (చదవండి : గులాబీ పుష్పక విమానం.. ఓవర్ లోడ్!) కేసీఆర్ గత ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన జోగు రామన్న.. ఈ ప్రభుత్వంలోనూ అవకాశం వస్తుందని భావించారు. కాని మంత్రివర్గ కూర్పులో ఉమ్మడి ఆదిలాబాద్ నుంచి నిర్మల్ ఎమ్మెల్యే ఇంద్రకరణ్రెడ్డికి మాత్రమే చాన్స్ దక్కింది. తొలిదఫా రాకున్నా.. విస్తరణలో కచ్చితంగా అవకాశం ఉంటుందనే నమ్మకంతో ఉండగా.. ఇటీవల ఆ అవకాశమూ చేజారింది. దీంతో అలకబూనిన రామన్న సోమవారం నుంచి ఎవరికీ అందుబాటులోకి రాకుండా పోయారు. రామన్న అజ్ఞాతంలోకి వెళ్లడంతో ఆయన సొంత నియోజకవర్గమైన ఆదిలాబాద్ జిల్లాకేంద్రంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తమ నాయకుడు జోగు రామన్నకు మంత్రి పదవి రాలేదన్న బాధతో ఆయన అభిమాని జిల్లా కేంద్రంలో కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. దీంతో పోలీసులు, కార్యకర్తలు అప్రమత్తమై అడ్డుకున్నారు. మంత్రివర్గ విస్తరణ టీఆర్ఎస్లో పెద్ద చిచ్చేపెట్టింది. ఇప్పటికే పలువురు నేతలు పార్టీ అధిష్టానంపై అసంతృప్తిని వెళ్లబుచ్చారు. -
కారు పార్టీలో ఏం జరుగుతోంది..?!
సాక్షి, మంచిర్యాల: అజ్ఞాతంలోకి వెళ్లి కలకలం సృష్టించిన ఆదిలాబాద్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి జోగు రామన్న వ్యవహారంపై టీఆర్ఎస్ అధిష్టానం ఆరా తీస్తోంది. రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో రామన్నకు చోటు దక్కకపోవడంతో అలకబూనిన ఆయన సోమవారం అందుబాటులో లేకపోవడం తెలిసిందే. ఈ క్రమంలోనే మంగళవారం హైదరాబాద్లోనే ప్రత్యక్షమైన రామన్న.. తాను అనారోగ్య కారణంగానే అందుబాటులో లేనని చెప్పుకొచ్చారు. కాగా టీఆర్ఎస్లో మంత్రులు, మాజీమంత్రులు అసంతృప్తి రాగం వినిపిస్తున్న క్రమంలో.. జోగు రామన్న వ్యవహారంపై పార్టీ అధిష్టానం దృష్టిపెట్టింది. పరిస్థితిని చక్కదిద్దేందుకు టీఆర్ఎస్ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ రంగంలోకి దిగారు. జోగు రామన్నకు స్వయంగా ఫోన్ చేసి ఏం జరిగిందని తెలుసుకున్నట్లు సమాచారం. జోగు రామన్న అజ్ఞాతంలోకి వెళ్లిన అనంతరం ఆదిలాబాద్ జిల్లాలో నెలకొన్న పరిణామాలపై నిఘావర్గాలు ప్రభుత్వానికి నివేదిక అందించాయి. అలకతో కూడిన అనారోగ్యం మాజీమంత్రి జోగు రామన్న వ్యవహారం ప్రస్తుతం హాట్టాపిక్గా మారింది. కేసీఆర్ గత ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన జోగు రామన్న.. ఈ ప్రభుత్వంలోనూ అవకాశం వస్తుందని భావించారు. కాని మంత్రివర్గ కూర్పులో ఉమ్మడి ఆదిలాబాద్ నుంచి నిర్మల్ ఎమ్మెల్యే ఇంద్రకరణ్రెడ్డికి మాత్రమే చాన్స్ దక్కింది. తొలిదఫా రాకున్నా.. విస్తరణలో కచ్చితంగా అవకాశం ఉంటుందనే నమ్మకంతో ఉండగా.. రెండు రోజుల క్రితం ఆ అవకాశమూ చేజారింది. దీంతో అలకబూనిన రామన్న సోమవారం నుంచి ఎవరికీ అందుబాటులోకి రాకుండా పోయారు. రామన్న అజ్ఞాతంలోకి వెళ్లడంతో ఆయన సొంత నియోజకవర్గమైన ఆదిలాబాద్ జిల్లాకేంద్రంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆయన నివాసం వద్ద ఓ కార్యకర్త కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. రామన్నకు మంత్రి పదవి రాకపోవడానికి కారణమంటూ.. టీఆర్ఎస్ మైనార్టీ నాయకులు ఇద్దరు కొట్టుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలో మంగళవారం ఫోన్ ఆన్ చేసిన రామన్న.. అనారోగ్యం కారణంగానే ‘దూరంగా’ ఉన్నానంటూ వివరణ ఇచ్చారు. ఇక రామన్న కుటుంబ సభ్యులు మాత్రం మంత్రి పదవి రాకపోవడంతోనే రక్తపోటు (బీపీ) పెరిగి అనారోగ్యానికి గురయ్యాడని చెప్పారు. నిఘావర్గాల నివేదిక మాజీమంత్రి రామన్న అజ్ఞాతంలోకి వెళ్లిన అనంతరం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో జరుగుతున్న పరిణామాలపై నిఘావర్గాలు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చినట్లు సమాచారం. పార్టీ అంతర్గత పరిస్థితి, ఓ కార్యకర్త ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించడం, పార్టీ నాయకులు కొట్టుకోవడంతో పాటు, ఇతర నియోజకవర్గాల్లో తాజా పరిస్థితులను ఎప్పటికప్పుడు నివేదించినట్లు తెలిసింది. కేటీఆర్ ఫోన్..? మంత్రి పదవి దక్కకపోవడంతో జోగు రామన్న అజ్ఞాతంలోకి వెళ్లాడనే వార్తల నేపథ్యంలో టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఐటీశాఖ మంత్రి కేటీఆర్ రంగంలోకి దిగారు. స్వయంగా జోగు రామన్నకు ఫోన్ చేసినట్లు సమాచారం. తాము కూడా గులాబీ ఓనర్లమేనంటూ ఇటీవల వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేయడం తెలిసిందే. ఇదే క్రమంలో సాంస్కృతిక సారథి మాజీ చైర్మన్ రసమయి బాలకిషన్ కూడా ఈటల వ్యాఖ్యలను సమర్థించడం.. మంత్రివర్గ విస్తరణ తరువాత మాజీ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, డిప్యూటీ మాజీ సీఎం రాజయ్య ధిక్కార స్వరాన్ని వినిపించడం సంచలనం సృష్టించింది. ఈ క్రమంలోనే మాజీ మంత్రి జోగు రామన్న కూడా అలకబూని అజ్ఞాతంలోకి వెళ్లడంతో కేటీఆర్ ఆయనకు ఫోన్ చేసి భవిష్యత్పై భరోసా ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. -
అజ్ఞాతం వీడిన రామన్న.. పార్టీ మార్పుపై క్లారిటీ
సాక్షి, ఆదిలాబాద్: రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో చోటు దక్కకపోవడంతో అసంతృప్తి గురైన మాజీ మంత్రి.. ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అజ్ఞాతం వీడారు. ఆదివారం మంత్రివర్గ విస్తరణ అనంతరం కనిపించకుండాపోయిన ఆయన మంగళవారం నాడు మీడియా ముందుకు వచ్చారు. ‘నేను అజ్ఞాతంలోకి వెళ్లలేదు. మంత్రిపదవి రాకపోవడంతో మినిస్టర్ క్వార్టర్స్ ఖాళీ చేస్తున్నాం. రెండు రోజులుగా నా పిల్లలు ఆ పనిలో ఉన్నారు. నాకు కొంత ఆరోగ్యం బాగాలేక, లోబీపీ వల్ల రెస్ట్ తీసుకుందాం అని స్నేహితుడు ఇంటికి వెళ్ళాను. మంత్రి పదవి దక్కలేదని అలగలేదు. పార్టీ మరే ప్రసక్తే లేదు. చివరి వరకూ టీఆర్ఎస్లోనే ఉంటా. మా నాయకుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ నాకు మంచి గౌరవం కల్పించారు. గత ప్రభుత్వంలో మంతత్రిగా ప్రజలకు సేవ చేసే అవకాశం లభించింది. కేసీఆర్కు ఎప్పటికీ రుణపడి ఉంటా’ అని వ్యాఖ్యానించారు. కాగా ఆదివారం ఉదయం హైదరాబాద్ వెళ్లిన ఆయన.. కేబినెట్ విస్తరణ అనంతరం అదేరాత్రి మినిస్టర్ క్వార్టర్స్లో ఉన్నారు. సోమవారం ఉదయం నుంచి ఎవరికీ అందుబాటులో లేకుండాపోయిన విషయం తెలిసిందే. గన్మెన్లను, డ్రైవర్ను, చివరికి వాహనాన్ని కూడా క్వార్టర్స్ వద్దే ఉంచి ఆయన చెప్పా పెట్టకుండా అజ్ఞాతంలోకి వెళ్లారు. ఆయన మొబైల్ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుండడంతో సమాచారం తెలియలేదు. కుటుంబ సభ్యులు కూడా ఎటువెళ్లారో తెలీదని చెప్పడంతో రామన్న అనుచరుల్లో గతరెండు రోజులు ఆందోళనకు గురయ్యారు. తాజాగా ఆయన బయటకు రావడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. మనస్తాపం.. టీఆర్ఎస్ సర్కార్ తొలిసారి అధికారంలోకి వచ్చిన తర్వాత జోగు రామన్నకు రాష్ట్ర అటవీ, పర్యావరణ, బీసీ సంక్షేమ శాఖ అమాత్య పదవిని కట్టబెట్టారు. ముందస్తు ఎన్నికల్లో భాగంగా సర్కార్ను రద్దుచేసే వరకూ ఆయన మంత్రిగా కొనసాగారు. ఆ సమయంలో ఉమ్మడి జిల్లా నుంచి జోగు రామన్నతోపాటు ఇంద్రకరణ్రెడ్డి కూడా మంత్రిగా ఉన్నారు. రెండోసారి అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ మొదటి మంత్రివర్గ విస్తరణలోనే అమాత్య పదవి వస్తుందని జోగు రామన్న గంపెడాశలు పెట్టుకున్నారు. కానీ.. ఉమ్మడి జిల్లా నుంచి నిర్మల్ ఎమ్మెల్యే అల్లోల ఇంద్రకరణ్రెడ్డిని మాత్రమే మంత్రి పదవి వరించింది. ఈ క్రమంలో మలివిడతలో తనకు తప్పకుండా మంత్రి పదవి వస్తుందని రామన్న ఆశించారు. ఆ మేరకు అధినేత కూడా తనకు భరోసా ఇచ్చారని తన అనుచరుల వద్ద వ్యక్తం చేశారు. మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన ఈయన మంత్రివర్గ కూర్పులో పేరుంటుందని భరోసా పెట్టుకున్నారు. అదే సామాజిక వర్గానికి చెందిన కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్కు మంత్రి పదవి రావడం, రామన్నకు చుక్కెదురు కావడంతో ఆయన తీవ్ర మనస్తాపం చెందినట్లు సమాచారం. -
అఙ్ఞాతంలోకి మాజీ మంత్రి జోగు రామన్న
-
పదవుల పందేరంపై టీఆర్ఎస్లో కలకలం
సాక్షి, హైదరాబాద్ : మంత్రివర్గ విస్తరణతోపాటు చీఫ్ విప్, విప్ తదితర పదవుల పందేరం టీఆర్ఎస్లో కొత్త సమస్యలు సృష్టి స్తోంది. అసమ్మతి గళాలకు చెక్ పెట్టేందుకు సీఎం కేసీఆర్ అనుసరించిన వ్యూహం మరిన్ని అసంతృప్త గళాలకు ఊపిరి పోస్తోంది. మంత్రి ఈటల రాజేందర్ వ్యాఖ్యలతో పార్టీలో మొదలైన కలకలం మంత్రివర్గం విస్తరణ తర్వాత కూడా సద్దుమణగడం లేదు. ఆదివారం మొదలైన అసెంబ్లీ సమా వేశాల సందర్భంగా తనకు ఎదురైన మీడియా ప్రతినిధు లతో మాజీ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి చేసిన వ్యాఖ్యలు పార్టీ నాయకత్వాన్ని సమాధానం చెప్పుకునే స్థితిలోకి నెట్టినట్లు కనిపిస్తోంది. తనను ఎమ్మెల్యేగా పోటీ చేయకుండా వారించిన సీఎం కేసీఆర్.. మంత్రి పదవి ఇస్తానని మాట తప్పారు అని నాయిని ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘నాకు మంత్రి పదవి ఇస్తానని చెప్పి సీఎం కేసీఆర్ మాట తప్పారు. ఎమ్మెల్యేగా పోటీ చేస్తా అంటే వద్దన్నారు. కౌన్సిల్లో ఉండు. నీకు మంత్రి పదవి ఇస్తా అని అన్నాడు. మా అల్లుడికి కూడా ఎమ్మెల్సీ పదవి ఇస్తానని కేసీఆర్ చెప్పారు. నాకు ఆర్టీసీ చైర్మన్ పదవి వద్దు. అందులో రసం లేదు. కేసీఆర్ మా ఇంటికి పెద్ద. మేమంతా ఓనర్లమే. కిరాయిదార్లు ఎంత కాలం ఉంటారో, ఎప్పుడు దిగిపోతారో వాళ్లిష్టం’’ అంటూ నాయిని వ్యాఖ్యానించారు. మరోవైపు మాజీ ఉప ముఖ్యమంత్రి తాడికొండ రాజయ్య కూడా తనకు ఏ పదవీ దక్కే పరిస్థితి లేదని వాపోయారు. అదే సమయంలో మాదిగ సామాజిక వర్గానికి కేబినెట్లో స్థానం కల్పించక పోవడాన్ని మీడియా వద్ద ప్రస్తావించడంతోపాటు మాదిగ కుల సంఘాలు ప్రశ్నించాలనే రీతిలో సంకేతాలు ఇచ్చారు. మంత్రివర్గ విస్తరణతో ఆశావహుల్లో నిరాశ మంత్రివర్గ విస్తరణలో అవకాశం దక్కుతుందని భావించిన కొందరు ఎమ్మెల్యేలు.. సీఎం తమను కనీసం పిలిచి మాట్లాడక పోవడంపై అవేదన చెందుతున్నారు. మంత్రివర్గ విస్తరణలో చోటు ఆశించిన మాజీ మంత్రి జోగు రామన్న ఆదివారం ఉదయం నుంచి అజ్ఞాతంలోకి వెళ్లారు. ఫోన్ స్విఛాఫ్ చేయడంతోపాటు గన్మెన్లను కూడా వదిలి వెళ్లడంపై చర్చ జరుగుతోంది. తనకు తిరిగి మంత్రి పదవి లభిస్తుందనే ధీమాతో ఉన్న జోగు రామన్న మినిస్టర్ క్వార్టర్స్లోనే ఉంటున్నట్లు తెలిసింది. మంత్రి పదవిపై సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీతోనే మినిస్టర్ క్వార్టర్స్లో కొనసాగుతున్నట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. మరోవైపు మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు అసెంబ్లీ సమావేశాలకు గైర్హాజరు కావడం వెనుక కూడా అసంతృప్తే కారణమని సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరుగుతోంది. ఈటల వ్యాఖ్యలు సద్దుమణుగుతున్న వేళ తాజాగా అసెంబ్లీ బిజినెస్ అడ్వైజరీ కమిటీ (బీఏసీ) నుంచి ఆయన్ను తొలగించినట్లు సమాచారం. ఈటల స్థానంలో కొత్త మంత్రి గంగుల కమలాకర్ హాజరు కావడంతో ఈటలకు చెక్ పెడుతున్నారని ప్రచారం జరుగుతోంది. కొందరు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమతో టచ్లో ఉన్నారంటూ ఓవైపు బీజేపీ పదేపదే ప్రచారం చేస్తున్న నేపథ్యంలో టీఆర్ఎస్ నేతల అసమ్మతి రాగం ఎటు దారి తీస్తుందోననే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. -
అజ్ఞాతంలోకి జోగు రామన్న
సాక్షి, హైదరాబాద్ : మాజీ మంత్రి, ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అజ్ఞాతంలోకి వెళ్లారు. మంత్రివర్గ విస్తరణలో తనకు అవకాశం లభించకపోవడంతో.. అలక వహించిన జోగు రామన్న ఇంటి నుంచి ఎక్కడికో వెళ్లిపోయినట్టుగా సమాచారం. ఆదివారం మధ్యాహ్నం నుంచి హైదరాబాద్లోని తన నివాసంలోనే ఉన్న జోగు రామన్న.. సోమవారం సాయంత్రం గన్మెన్లను వదిలి, కుటుంబ సభ్యులకు ఎవరికీ చెప్పకుండా ఇంటి నుంచి వెళ్లిపోయారు. దీంతో జోగు రామన్న కుటుంబ సభ్యులు ఆయన ఆచూకీ కోసం వెతుకుతున్నారు. ఆయన ఫోన్లు కూడా అందుబాటులో లేనట్టుగా తెలుస్తోంది. కాగా, గత ప్రభుత్వంలో పర్యావరణ, అటవీ శాఖ మంత్రిగా జోగు రామన్న బాధ్యతలు నిర్వర్తించారు. అయితే ఈ సారి కేబినెట్ బెర్త్పై ఆశలు పెట్టుకున్న ఆయనకు నిరాశే మిగిలింది. ఆదివారం జరిగిన మంత్రివర్గ విస్తరణలో తనకు చోటు దక్కుతుందని భావించిన జోగు రామన్న.. తనకు అవకాశం లభించకపోవడంతో అసంతృప్తికి గురైనట్టుగా తెలుస్తోంది. -
గజం వందనే..!
సాక్షి,ఆదిలాబాద్: టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ఏర్పాటు కోసం అప్పట్లో రెవన్యూ అధికారులు నిర్ధారించిన ధర కోట్ల నుంచి లక్షల రూపాయలకు దిగొచ్చింది. గుర్తింపు కలిగిన రాజకీయ పార్టీలు అన్నీ జిల్లా కేంద్రాల్లో పార్టీ కార్యాలయాలు నిర్మించుకోవడానికి చదరపు గజానికి రూ.100 చొప్పున ఎకరంలోపు స్థలం కేటాయించేందుకు ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త పాలసీ కారణంగా ఈ ధర దిగి వచ్చింది. ఎకరంలోపు.. అధికార పార్టీ టీఆర్ఎస్ అన్ని జిల్లాల్లో సొంత పార్టీ కార్యాలయం ఏర్పాటు చేసుకోవాలని గతేడాదే నిర్ణయించింది. జిల్లా కేంద్రాల్లో ఖాళీగా ఉన్న ప్రభుత్వ స్థలాలను మార్కెట్ ధర ప్రకారం కొనుగోలు చేసి కనీసం ఎకరం స్థలంలో పార్టీ కార్యాలయం నిర్మించుకోవాలని గతేడాది పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించారు. ఇందుకు అనుగుణంగా టీఆర్ఎస్ నుంచి వచ్చిన విజ్ఞప్తి మేరకు జీఓ నెం.571 ప్రకారం ఆదిలాబాద్ జిల్లా రెవెన్యూ యంత్రాంగం స్పందించింది. గుర్తించిన భూమి... ఆదిలాబాద్ అర్బన్ పరిధిలోకి వచ్చే సర్వే నెం.346లో 36 గుంటల స్థలాన్ని గుర్తించారు. ఇది ఎకరానికి నాలుగు గుంటల స్థలం తక్కువగా ఉంది. పట్టణంలోని గాంధీ పార్కు, పాలశీతలీకరణ కేంద్రానికి ఎదురుగా కైలాస్నగర్లో వైట్ క్వార్టర్స్లో ప్రభుత్వ స్థలాన్ని ఎంపిక చేశారు. ఇది వరకు ఈ స్థలంలో దూరదర్శన్ రిలే కేంద్రం ఈ స్థలంలో ఉండేది. ప్రస్తుతం న్యాక్ శిక్షణ కేంద్రం కొనసాగుతోంది. శిథిలావస్థలో చిన్న భవనం మాత్రమే ఉంది. దీనిని ఆనుకొని వైట్ క్వార్టర్స్ ఉన్న స్థలం కలుపుకొని మొత్తం 36 గుంటల స్థలాన్ని గతేడాది గుర్తించారు. జెడ్పీ చైర్మన్ క్యాంప్ కార్యాలయం తర్వాత ప్రస్తుతం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం కూడా ఇదే దారిలో కడుతున్నారు. కలెక్టర్, ఎస్పీ, జేసీ, న్యాయమూర్తుల క్వార్టర్స్, డీఆర్వో, ఇతరత్ర ముఖ్యమైన ఉన్నతాధికారుల భవనాలు ఈ ప్రాంతంలోనే ఉన్నాయి. పార్టీ కార్యాలయం కోసం అనువుగా ఉంటుందని టీఆర్ఎస్ పార్టీ వర్గాలు ఈ స్థలాన్ని ప్రభుత్వాన్ని అడగడం జరిగింది. అప్పుడు రాష్ట్ర అటవీ శాఖ మంత్రి, ప్రస్తుత ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగురామన్న, పార్టీ రాష్ట్ర కార్యదర్శి, డెయిరీ డెవలప్మెంట్ రాష్ట్ర చైర్మన్ లోక భూమారెడ్డిలు ఈ స్థలాన్ని ఎంపిక చేశారు. అప్పట్లో ఆదిలాబాద్అర్బన్ తహసీల్దార్ నుంచి ఆర్డీఓ ద్వారా కలెక్టర్ కార్యాలయానికి దీనికి సంబంధించిన పత్రాలను పంపించారు. కలెక్టర్ నుంచి సీసీఎల్ఏకు వెళ్లిన ఫైల్ చివరిగా ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు రావడంతో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయ భూమి కేటాయింపు జరిగింది. అప్పట్లో ధర వివాదం.. టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం కోసం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో గుర్తించిన స్థలం కేటాయింపునకు సంబంధించి రెవెన్యూ యంత్రాంగం 2018లో ప్రభుత్వానికి పంపించిన ఓపెన్ మార్కెట్ ధర అప్పట్లో చర్చనీయాంశమైంది. అప్పట్లో గుంటకు రూ.10లక్షల చొప్పున మొత్తం 36గుంటలకు రూ.3.65 కోట్లు నిర్ధారించి పంపడం వివాదానికి కారణమైంది. ధర విషయంలో రెవెన్యూ అధికారులపై టీఆర్ఎస్ వర్గాలు భగ్గుమన్నాయి. అయితే ప్రభుత్వ బేసిక్ విలువపై ఎన్నో స్థాయిల రెట్టింపులో ఈ ధరను నిర్ధారించినట్లు పార్టీ వర్గాలు మండిపడ్డాయి. అంత ధరనా.. అని టీఆర్ఎస్ ముఖ్యనేతలు రెవెన్యూ అధికారులపై ఫైర్ అయ్యారు. కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. పట్టణంలో ముఖ్యమైన కూడలిలోని ఈ స్థలం అంశం అప్పట్లో ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇదిలా ఉంటే అప్పట్లో జేసీగా ఉన్న కృష్ణారెడ్డి బదిలీ అయ్యే ముందు ధర విషయంలో ఓపెన్ మార్కెట్ ధరను ప్రభుత్వానికి పంపించారు. దీంతో ఈ వివాదానికి అప్పట్లో కారణమైంది. ఆ తర్వాత ఆయన బదిలీపై వెళ్లిపోయిన విషయం విధితమే. తాజాగా ఉత్తర్వులు.. జిల్లా కేంద్రాల్లో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాల ఏర్పాటుకు ఒక్కో ఎకరం చొప్పున స్థలాలు కేటాయిస్తూ రాష్ట్ర రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజేష్ తివారి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు చేసిన విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. గుర్తింపు కలిగిన రాజకీయ పార్టీలు అన్ని జిల్లాకేంద్రాల్లో పార్టీ కార్యాలయాలు నిర్మించుకోవడానికి చదరపు గజానికి రూ.100 చొప్పున ఎకరంలోపు స్థలం కేటాయించేందుకు ప్రభుత్వం ఈ కొత్త పాలసీ తీసుకొచ్చింది. దాని ప్రకారం తాజాగా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో 36 గుంటల స్థలాన్ని రూ.4,35,600 లకు టీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి కేటాయించారు. నేడు భూమిపూజ.. టీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి గుర్తించిన స్థలంలో సోమవారం భూమిపూజ నిర్వహిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాలకు కేటాయించిన స్థలంలో భూమిపూజ జరగనుండడం విశేషం. ఆదిలాబాద్లో జెడ్పీ చైర్మన్ జనార్దన్ రాథోడ్ ఆధ్వర్యంలో భూమిపూజ నిర్వహించనున్నారు. ఎమ్మెల్యే జోగురామన్న, బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు, రాష్ట్ర డెయిరీ డెవలప్మెంట్ చైర్మన్ లోక భూమారెడ్డిలతో పాటు ఇటీవల ఎన్నికైన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు హాజరు కానున్నారు. -
మా ఆవిడే నా బలం
మాది సామాన్య వ్యవసాయ కుటుంబం. నాగలిపట్టి అరక దున్నేవాడిని. రాత్రివేళ పొలం వద్దకు వెళ్లి నీళ్లుపెట్టేవాడిని. పెళ్లయిన తర్వాత మా ఆవిడే నా బలమైంది. అన్ని పనులూ ఆమె చూసుకునేది. పిల్లల పెంపకం.. వారి చదువులు.. బాగోగులు అన్నీ ఆమె. ఇద్దరం కలిసి వ్యవసాయ పనులకు వెళ్లేవాళ్లం. అన్ని పనులూ మేమే చేసుకునేటోళ్లం. ఇప్పుడు యోగాతోనే ఉదయం ప్రారంభిస్తా.. పొద్దంతా ప్రజాసేవ.. సాయంత్రమైందంటే చాలు మనవళ్లతో ఆడుకుంటా. కబడ్డీ, వాలీబాల్ అంటే ప్రాణం. ఇప్పటికీ ఆడాలని ఉంటుంది.. అని అంటున్నారు ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న. ‘సాక్షి’ పర్సనల్ టైం ఇంటర్వ్యూలో ఆయన తన మనోగతాన్ని ఆవిష్కరించారు. ఆదిలాబాద్టౌన్ : మాది జైనథ్ మండలం దీపాయిగూడ గ్రామం. మా నాన్న జోగు ఆశన్న, అమ్మ భోజమ్మ. ముగ్గురం అన్నదమ్ములం. ఒక అక్క. అన్న పోతారెడ్డి, తమ్ముడు వెంకన్న, అక్క పెంటక్క. మాది సాధారణ వ్యవసాయ కుటుంబం. ఉమ్మడి కుటుంబంగా 34 ఎకరాల వ్యవసాయ భూమి ఉండేది. ఒకటి నుంచి 5వ తరగతి వరకు దీపాయిగూడలో చదివి. 6 నుంచి 10వ తరగతి వరకు జైనథ్కు నడుచుకుంటూ వెళ్లేవాడిని. ఇంటర్ బోథ్లో అడ్మిషన్ తీసుకున్న తర్వాత అక్కడినుంచి ఆదిలాబాద్కు మారాను. ఇంటర్ ద్వితీయ సంవత్సరం భైంసాలో పూర్తిచేసిన. ఆదిలాబాద్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చేరి.. తృతీయ సంవత్సరంలో మానేసిన. మనువడితో రామన్న దంపతులు మా గ్రామమైన దీపాయిగూడకు చెందిన రమతో 1983 మే 21న పెళ్లయ్యింది. నా భార్య రమతో కలిసి వ్యవసాయ పనులు చేసిన. చేనులో దుక్కిదున్నడం, మందు పిచికారీ చేయడంతోపాటు అన్ని పనులు చేశాను. అలాగే బాల గణేశ్ మండల అధ్యక్షుడిగా ఉన్నాను. అప్పటి నుంచి నాయకత్వ లక్షణాలు మొదలయ్యాయి. పెళ్లి కాకముందే పాఠశాల కమిటీ చైర్మన్ అయ్యా. బడికి డుమ్మా కొట్టి మానాన్నతో కలిసి ఆవులు, గేదెలు మేపేవాడిని. గ్రామంలో స్నేహితులతో సరదాగా గిల్లిదండా ఆడేవాన్ని. మాకు ఇద్దరు కుమారులు. ప్రేమేందర్, మహేందర్. పెద్ద కుమారుడు మహేందర్కు ఓ కుమారుడు అద్వైత్, చిన్న కుమారుడు ప్రేమేందర్కు ఒక కుమారుడు రిదాజ్ ఉన్నారు. నేను శివభక్తుడిని. గుడికి వెళ్లకపోయినా మా ఆవిడ మాత్రం తప్పకుండా ఆలయానికి వెళ్లి పూజలు చేసేది. పిల్లల పెంపకం.. వారి చదువులు.. బాగోగులు.. బంధువులు.. ఇలా అన్నీ ఆమెనే చూసుకుంటుంది. ఆమె సహకారంతోనే ప్రస్తుతం నేను ఈ స్థాయికి చేరి. కుటుంబసభ్యులకు సమయాన్ని ఇవ్వకపోయినా వారు నన్ను అర్థం చేసుకుంటారు. ప్రజాసేవే నాకు సర్వస్వం. జోగు ఫౌండేషన్ ద్వారా ప్రజలకు సేవ చేయడం తృప్తినిస్తోంది. విద్య, వైద్యం, చావు, పెళ్లిళ్లు, ఇతర కార్యాలకు నాకు తోచిన సహాయం చేస్తుంటా. వ్యవసాయ పనుల్లో.. వ్యవసాయ పనులన్నీ చేసేవాడిని. రాత్రివేళల్లో పంటకు నీరు పెట్టేందుకు వెళ్లేవాడిని. వరి తప్ప అన్ని పంటలు పండించాం. మా చేనులో పత్తి, సోయా, చెరుకు, బెండ, టమాటా, సన్ఫ్లవర్, పసుపు, అరటి, నిమ్మ, తర్బూజా, మోసంబి, పట్టుపురుగుల పెంపకం, తదితర పంటలు సాగు చేశాం. 1994 సంవత్సరంలో సుకుమార్ జిల్లా కలెక్టర్గా ఉన్న సమయంలో సోయాబీన్ను జిల్లాకు పరిచయం చేశారు. 30ఎకరాల సోయాబీన్ పంట వేశాను. నా భార్యతో కలిసి వ్యవసాయ పనులు చేపట్టాను. యోగా చేస్తూ.. యోగాతో ఉదయం ప్రారంభం రోజంతా బిజీగా ఉంటా. ఆరోగ్య రీత్యా యోగా జీవితంలో భాగమైంది. ఉదయం 5 గంటలకు లేవగా>నే కాలకృత్యాలు తీర్చుకుని గంట యోగా చేస్తా. ఆ తర్వాత రెడీ కావడం.. ఏదో గ్రామానికి వెళ్లడం.. నిత్యకృత్యం. సాయంత్రం ఇంటికొచ్చాక ఇద్దరు మనువళ్లతో సరదాగా గడుపుతా. నేను స్వతహాగా వాలీబాల్, కబడ్డీ ప్లేయర్ను. ఆదిలాబాద్లోనే మా అడ్డా.. నా చిన్ననాటి స్నేహితులు మోహన్రెడ్డి, పోతారెడ్డి, వసంత్రెడ్డి, భీంరెడ్డి తదితరులు 40 మంది ఉండేవాళ్లం. ఇప్పటికీ సంవత్సరానికి రెండుమూడు సార్లైనా కలిసి గెట్టుగెదర్ ఏర్పాటు చేసుకుంటాం. మా ఊరిలో యువకుడిగా ఉన్నప్పుడు ఎవరైన శుభకార్యాలు ఉంటే అందరి ఇళ్లకు వెళ్లి గంజులు, తదితర సామగ్రి జమచేసి సహాయం అందించే వాళ్లం. ఆ తర్వాత ఆదిలాబాద్ పట్టణంలోని మా స్నేహితుడికి ఎస్ఆర్ఎంటీ ట్రాన్స్పోర్ట్ ఉండేది. అక్కడే మా అడ్డా ఉండేది. ఏ పనిలేకపోయినా దీపాయిగూడ నుంచి వచ్చి కాలక్షేపం చేసి వెళ్లేవాడిని. తరోడ దగ్గర వాగు ఉండేది. ఆదిలాబాద్ నుంచి తరోడ వరకు ఒక బస్సు, అక్కడి నుంచి జైనథ్ వరకు మరో బస్సు ఉండేది. వర్షాకాలం తరోడా వాగు వద్ద పడవలో దాటేవాళ్లం. ఒక్కోరోజు వాగు వస్తే ఆదిలాబాద్లోనే ఉండిపోయేవాడిని. జైనథ్ నుంచి మా ఊరికి ఎంత రాత్రయినా కాలినడకతోనే వెళ్లేవాడిని. ఎలాంటి భయం ఉండేది కాదు. మా గ్రామంలో 1986లో డయేరియా వచ్చింది. ఆదిలాబాద్ నుంచి డాక్టర్ను తీసుకెళ్లి ఐదురోజులు వైద్య పరీక్షలు చేయించాం. యువకుడిగా ఉన్న సమయంలో ఎన్నో స్వచ్ఛంద సేవ కార్యక్రమాలు చేసేవాన్ని. ఆ అనుభూతే వేరు. ఇప్పటికీ ప్రజాసేవ చేసేందుకే ఎక్కువ సమయాన్ని కేటాయిస్తాను. -
రామయ్యా.. వస్తావయ్యా..!
ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. తెలంగాణ ఉద్యమ సారథి, ఆపద్ధర్మ మంత్రి జోగు రామన్న ఇక్కడి నుంచి మరోసారి పోటీ చేస్తున్నారు. ఈ సెగ్మెంట్కు టీఆర్ఎస్ పోటీ చేయడం ఇది మూడోసారి. టీఆర్ఎస్ నుంచి రెండోసారి పోటీ చేసిన జోగు రామన్న 2014 ఎన్నికల్లో విజయకేతనం ఎగురవేశారు. రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. గడిచిన నాలుగున్నరేళ్లలో నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రభుత్వం కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. 2014లో తెలంగాణ ఉద్యమ సెంటిమెంట్, కొత్త రాష్ట్రం జోష్ ఊపందుకోవడంతో జోగు రామన్నకు ఓటర్లు బ్రహ్మరథం పట్టారు. గడిచిన నాలుగున్నరేళ్లలో రూ.5,333 కోట్లు ఖర్చు చేసి నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్లారు. అభివృద్ధి మంత్రం ఆధారంగా గెలుస్తామనే ధీమాతో ఉన్నారు. తెలంగాణ ఉద్యమ సమయానికి ముందు ఈ నియోజకవర్గంలో టీఆర్ఎస్కు బలమైన క్యాడర్ లేదు. 2012లో జోగు రామన్న ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి టీఆర్ఎస్లో చేరడంతో పార్టీకి ఊపు వచ్చింది. 2014 ఎన్నికల్లో జోగు రామన్న తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి పాయల్ శంకర్పై 14,711 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఈసారి రామన్నపై కూటమి తరపున కాంగ్రెస్ అభ్యర్థి గండ్రత్ సుజాత బరిలో ఉన్నారు. తాంసి మండలానికి చెందిన సుజాత గతంలో 1999లో ఒకసారి అసెంబ్లీకి పోటీ చేసి ఓడిపోయారు. మళ్లీ ఇన్నాళ్ల తర్వాత ఆమె బరిలోకి దిగారు. ప్రధాన సమస్యలు - పట్టణంలోని తాంసి బస్టాండ్ వద్ద రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణం - మూతపడిన సిమెంట్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) పునరుద్ధరణ - డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణంలో వెనుకబాటు - నిరుద్యోగం ప్రధాన సమస్య. చదువుకున్న యువతీ యువకులు ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం ఎదురుచూస్తున్నారు. ప్రత్యేకతలు - ఆదిలాబాద్లో నాలుగున్నరేళ్లలో అభివృద్ధి పనుల కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. - దళితబస్తీ పథకంలో రాష్ట్రంలోనే ఆదిలాబాద్ నియోజకవర్గం మొదటి స్థానంలో నిలిచింది. ఇక్కడ ఈ పథకం కింద రూ.52.11 కోట్లు ఖర్చు చేసి 482 మంది మహిళలకు మూడెకరాల భూమి ఇప్పించారు. - జైనథ్లోని కోరటలో ఓంకారేశ్వర మందిరం నిర్మాణం కోసం రూ.5.45 కోట్లు ఖర్చు చేశారు. - నియోజకవర్గంలోని సీహెచ్సీ, పీహెచ్సీల అభివృద్ధికి రూ.24.81 కోట్లు మంజూరు చేశారు. - చనాఖ–కొరటా బ్యారేజీ నిర్మాణం. - రిమ్స్ను సూపర్స్పెషాలిటీ ఆసుపత్రిగా అభివృద్ధి పర్చేందుకు రూ.150 కోట్లు కేటాయించారు. - సాత్నాల ప్రాజెక్టు పనులకు రూ.69 కోట్లు, మార్కెట్ గోదాంలకు రూ.23 కోట్లు, సీసీ, బీటీ రోడ్లు, చెక్డ్యాంల నిర్మాణానికి రూ.118 కోట్లు ఖర్చు చేశారు. - జిల్లా కేంద్రమైన ఆదిలాబాద్లో ఎయిర్స్ట్రిఫ్ ఏర్పాటు తెరపైకి.. - రూ.80 కోట్లతో మిషన్ భగీరథ పనులు - రూ.6 కోట్లతో యాపల్గూడలో పోలీస్ బెటాలియన్ - 3,970 మందికి జీవో 58 ద్వారా ఉచిత పట్టాలు. సిట్టింగ్ ప్రొఫైల్ జోగు రామన్న 1984లో టీడీపీలో చేరి 1985–86 వరకు జైనథ్ మండల ప్రధాన కార్యదర్శిగా పని చేశారు. 1987–88 వరకు మండల పార్టీ అధ్యక్షుడిగా, 1988–95 వరకు దీపాయిగూడ సర్పంచ్గా, 1995 నుంచి 2001 వరకు జైనథ్ ఎంపీపీగా పని చేశారు. 2001 నుంచి 2005 వరకు టీడీపీ జెడ్పీ విప్గా చేశారు. అనంతరం 2005లో జైనథ్ జెడ్పీటీసీగా గెలుపొందారు. 2004లో టీడీపీ తరుపున ఆదిలాబాద్ ఎమ్మెల్యేగా పోటీ చేశారు. 2009లో టీడీపీ అభ్యర్థిగా పోటీచేసి విజయం సాధించారు. 2011లో తెలంగాణ ఉద్యమ సమయంలో పార్టీకీ, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి టీఆర్ఎస్లో చేరారు. అనంతరం 2012 ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా విజయం సాధించారు. ఇక కొత్త రాష్ట్రం ఏర్పడ్డాక 2014 ఎన్నికల్లోనూ విజయ కేతనం ఎగరవేశారు. సీఎం కేసీఆర్ మంత్రి వర్గంలో రాష్ట్ర అటవీ, పర్యావరణ, బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా పని చేశారు. .:: ఇన్పుట్స్: నిమ్మల స్వామి, ఆదిలాబాద్ అర్బన్ -
ఎన్నికల్లో టీఆర్ఎస్దే గెలుపు
ఆదిలాబాద్ టౌన్: రానున్న ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని ఆపద్ధర్మ మంత్రి జోగు రామన్న తెలిపారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, చేపట్టిన అభివృద్ధిని మళ్లీ గెలిపిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. అభివృద్ధిని చూసే నాయకులు, కార్యకర్తలు స్వచ్ఛందంగా టీఆర్ఎస్లో చేరుతున్నారని పేర్కొన్నారు. పట్టణంలోని భాగ్యనగర్లో ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో వివిధ పార్టీల నాయకులు టీఆర్ఎస్లో చేరారు. వారికి రామన్న కండువాలు కప్పి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పట్టణంలో రైల్వే బ్రిడ్జితో పాటు సీసీఐ పునరుద్ధరణపై బీజేపీ నాయకులు ద్వంద వైఖరిని అవలంభిస్తున్నారని ఆరోపించారు. 2016లోనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాటాతో రైల్వే బ్రిడ్జి మంజూరైందని బీజేపీ నాయకులు సంబరాలు చేసుకున్నారని గుర్తు చేశారు. తాము అధికారంలోకి వస్తే మూడు నెలల్లో మంజూరు చేస్తామని అబద్ధపు మాటలు మాట్లాడుతున్నారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రూ.50 కోట్లు, కేంద్ర ప్రభుత్వం రూ.20కోట్లు కేటాయించాయని, సర్వేల పేరుతో కాలయాపన చేస్తున్నారని పేర్కొన్నారు. షాదీముబారక్, కల్యాణలక్ష్మీ, కేసీఆర్ కిట్ వంటి పథకాలను ప్రవేశపెట్టిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిదేనన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ మనిషా, నాయకులు సాజిదొద్దీన్, కౌన్సిలర్లు ప్రకాష్, కోఆప్షన్ సభ్యుడు ఉరుజ్ఖాన్, అంజద్ఖాన్, బాబుఖాన్, విఠల్, శ్రీనివాస్, సురేష్, జీవన్, తదితరులు పాల్గొన్నారు. -
రుణాలు లేనట్టే..!
సాక్షి, ఆదిలాబాద్టౌన్: రైతుబంధు పథకం రెండో విడత చెక్కుల పంపిణీ కార్యక్రమంపై అయోమయం నెలకొంది. శనివారం నుంచి జిల్లాలో ప్రారంభం కావాల్సిన చెక్కుల పంపిణీపై సందిగ్ధత ఏర్పడింది. అధికారులు చెక్కులు పంపిణీ చేయాలా లేదా అనే అయోమయంలో ఉన్నారు. వ్యవసాయ శాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినప్పటికీ ఎన్నికల సంఘం నిబంధనలు విధించడంతో పంపిణీ కార్యక్రమం ముందుకు సాగుతుందోలేదోనని సందేహం వ్యక్తం అవుతోంది. రైతులు శనివారం నుంచి చెక్కులు పంపిణీ చేస్తారనే సంతోషంలో ఉన్నప్పటికీ శుక్రవారం ఎన్నికల సంఘం పలు నిబంధనలు విధించింది. జాబితాలో కొత్త రైతుల పేర్లు చేర్చవద్దని, ప్రచారం ఆర్భాటాలు, బహిరంగ సభలు నిర్వహించి చెక్కులను పంపిణీ వివిధ కార్పొరేషన్ల ద్వారా స్వయం ఉపాధి పథకం కింద సబ్సిడీపై రుణాలు అందజేస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఐటీడీఏ నుంచి స్వయం ఉపాధి రుణాల కోసం ఎలాంటి ప్రకటన విడుదల కాకపోవడంతో గిరిజన నిరుద్యోగ యువతీ, యువకులు ఆందోళన చెందుతున్నారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లోకి రావడంతో ఈ ఏడాది రుణాలు రావడం కష్టమేనని లబ్ధిదారులు పేర్కొంటున్నారు. ఉన్నత చదువులు చదువుకొని ఉద్యోగాల భర్తీ కోసం ప్రభుత్వం అంతంత మాత్రంగానే నోటిఫికేషన్ను విడుదల చేయడంతో కనీసం స్వయం ఉపాధి రుణాలను పొంది కుటుంబాన్ని పోషించుకుందామని ఆశలు పెట్టుకున్న గిరిజన నిరుద్యోగులకు ఈ ఏడాది నిరాశనే మిగిలిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2017–18లో 300 మందికే.. 2017–18 ఆర్థిక సంవత్సరంలో వివిధ కేటగిరీల్లో 1,274 మంది నిరుద్యోగులు వివిధ స్వయం ఉపాధి రుణాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. వారికి రుణాలు మంజూరు కాగా వీరికి రూ.13.75 కోట్లు అవసరమవుతుందని అధికారులు పేర్కొంటున్నారు. ఇందులో కేటగిరి 1లో 506 మంది లబ్ధిదారులు, కేటగిరిలో 2లో 621 మంది దరఖాస్తు చేసుకున్నారు. కేటగిరి 3లో 147 మంది లబ్ధిదారులకు రుణాలు మంజూరైనట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఇదిలా ఉండగా ఇప్పటి వరకు కేవలం 300 మందికి రూ.3కోట్ల వరకు సబ్సిడీని వారి ఖాతాల్లో జమ చేసినట్లు అధికారులు పేర్కొంటున్నారు. మిగతా 974 మంది లబ్ధిదారులు సబ్సిడీ కోసం ఎదురు చూస్తున్నారు. 2018–19లో నిరాశే..? 2018–19 ఆర్థిక సంవత్సరంలో స్వయం ఉపాధి పథకం కింద రుణాలను అందించేందుకు వార్షిక ప్రణాళికను తయారు చేసి కమిషనరేట్కు పంపించినట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో 1915 మంది లబ్ధిదారులకు రూ.18.44 కోట్లు అందించేందుకు ప్రణాళికను రూపొందించారు. కానీ ఇటీవల ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో కొత్త వారికి ఈ ఆర్థిక సంవత్సరంలో రుణాలు మంజూరు కావడం కష్టమేనని పలువురు గిరిజనులు పేర్కొంటున్నారు. అధికారులు సంబంధిత వార్షిక ప్రణాళికలను ముందస్తుగా ప్రభుత్వానికి పంపించి ఉంటే కోడ్ అమలు కంటే ముందుగానే గిరిజన నిరుద్యోగులు రుణాల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం కలిగేదని పలువురు నిరుద్యోగులు పేర్కొంటున్నారు. తప్పని నిరీక్షణ.. 2018–19 ఆర్థిక సంవత్సరంలో ఐటీడీఏలో స్వయం ఉపాధి రుణాల కోసం గిరిజన నిరుద్యోగులు దరఖాస్తు చేసుకునేందుకు సర్టిఫికేట్లను సిద్ధంగా చేసుకున్న వారికి నిరీక్షణ తప్పడం లేదు. తీర ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో నిరాశ చెందుతున్నారు. 2017–18 ఆర్థిక సంవత్సరంలో రుణం మంజూరైన వారికి సబ్సిడీ ఖాతాల్లో జమ కాకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి సకాలంలో సబ్సిడీ రుణాలను జమా అయ్యేలా చూడాలని కోరుతున్నారు. దరఖాస్తులు స్వీకరిచాలి ఎస్సీ కార్పొరేషన్లో ప్రభుత్వం స్వయం ఉపాధి రుణాలను అందించేందుకు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఐటీడీఏలో స్వయం ఉపాధి రుణాలను అందించేందుకు కనీసం దరఖాస్తుల స్వీకరణ కోసం కనీసం నోటిఫికేషన్ కూడా జారీ కాలేదు. దీంతో జిల్లాలోని గిరిజన నిరుద్యోగులు నష్టపోయే అవకాశం ఉంది. – కుమ్ర రాజు, కుంమ్రంసూరు యువసేన జిల్లా ప్రధాన కార్యదర్శి, ఆదిలాబాద్ రుణాల కోసం ఎదురుచూపు ఉమ్మడి జిల్లాలో ఉద్యోగాలు రాక చాలామంది ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కనీసం స్వయం ఉపాధి పథకం కింద రుణాలకు దరఖాస్తు చేసుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందుదామంటే 2018–19 ఆర్థిక సంవత్సరంలో స్వయం ఉపాధి రుణాల కోసం ఇంకా ఎలాంటి నోటిఫికేషన్ రాలేదు. 2017–18 ఆర్థిక సంవత్సరంలో వివిధ రుణాల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి ఇంకా సబ్సిడీ జమ కాలేదు. అధికారులు స్పందించి సకాలంలో సబ్సిడీ నగదు జమ అయ్యేలా చూడాలి. – ఆత్రం వెంకటేశ్, ఆదివాసీ యువజన సంఘం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు -
లక్ష జనం లక్ష్యంగా..
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: ముందస్తు ఎన్నికల ఊహాగానాల మధ్య తెలంగాణ రాష్ట్ర సమితి సెప్టెంబర్ 2న హైదరాబాద్ శివారులో నిర్వహించే ప్రగతి నివేదన సభకు ఉమ్మడి ఆదిలాబాద్ నుంచి లక్ష మందిని తరలించాలని నేతలు నిర్ణయించారు. నియోజకవర్గానికి 10వేల మంది చొప్పున ప్రజానీకాన్ని తీసుకెళ్లేందుకు అవసరమైన ప్రణాళిక రూపొందించుకుంటున్నారు. ఇప్పటికే హైదరాబాద్లో మంత్రులు జోగు రామన్న, ఇంద్రకరణ్రెడ్డి, ప్రభుత్వ విప్ నల్లాల ఓదెలు మిగతా ఎమ్మెల్యేలు సమావేశమై కొంగర కలాన్లో గతంలో ఎన్నడూ లేని విధంగా నిర్వహి స్తున్న బహిరంగసభకు జనాన్ని తరలించే విషయమై చర్చించారు. ఈ మేరకు సోమవారం ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు సమావేశమై ఏయే మండలాలు, గ్రామాల నుంచి జనాన్ని ఎంత మేర తరలించాలనే విషయమై ప్రణాళికల రూపొందించనున్నారు. ప్రగతి నివేదన సభలో ఆదిలాబాద్ సత్తా చూపుతామని ఎమ్మెల్యేలు, మంత్రులు చెబుతున్నారు. నియోజకవర్గానికి 10వేల మంది టార్గెట్ ఇటీవల హైదరాబాద్లో మంత్రి జోగు రామన్న కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యేలకు లక్ష్యాలను నిర్ధేశించారు. ప్రతి నియోజకవర్గం నుంచి 10వేల మంది లక్ష్యంగా చేసుకొని జన సమీకరణ జరపాలని, కనీసం 8వేల మందిని తప్పనిసరిగా హైదరాబాద్కు తీసుకెళ్లాలని ఏకాభిప్రాయానికి వచ్చారు. జనం తరలించేందుకు అవసరమైన వాహనాలు, రవాణా తదితర అంశాలపై నియోజకవర్గాల్లో ఏర్పాటు చేసే సమావేశాల అనంతరం స్పష్టత రానుంది. అయితే జిల్లాలో మూడు ఎస్టీ రిజర్వుడ్, 2 ఎస్సీ రిజర్వుడు సీట్లు ఉండగా, దూర ప్రాంతాల నుంచి హైదరాబాద్కు తరలివెళ్లడమే పెద్ద సమస్యగా మారిందని నాయకులు పేర్కొంటున్నారు. రైలు మార్గాలు... ఆర్టీసీ హైర్ బస్సులు సిర్పూరు, ఆసిఫాబాద్ నియోజకవర్గాల నుంచి హైదరాబాద్కు రోడ్డు మార్గంలో వెళ్లాలంటే కనీసం 8 నుంచి 10 గంటల సమయం పడుతుంది. కండీషన్లో ఉండని ప్రైవేటు బస్సుల్లో ప్రయాణం నరకమే. ఈ పరిస్థితుల్లో సిర్పూరు, ఆసిఫాబాద్ నియోజకవర్గాలతోపాటు బెల్లంపల్లి, చెన్నూరు, మంచిర్యాల నియోజకవర్గాల నుంచి సాధ్యమైనంత ఎక్కువ మందిని రైళ్లల్లో ప్రగతి నివేదన సభకు తరలించాలని మంత్రులు, ఎమ్మెల్యేలు భావిస్తున్నారు. కాగజ్నగర్ నుంచి ప్రారంభమయ్యే రైళ్లతోపాటు పైనుంచి వచ్చే ఎక్స్ప్రెస్ రైళ్లను కూడా వినియోగించుకోవాలని భావిస్తున్నారు. ఆర్టీసీ బస్సులను టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర శాఖ ఇప్పటికే అద్దెకు తీసుకోగా, స్థానికంగా ఉండే మినీ బస్సులు, ఇతర రవాణా వాహనాలను సోమవారం బుక్ చేసే ఆలోచనలో ఎమ్మెల్యేలు ఉన్నారు. ఉమ్మడి జిల్లాలో ఉన్న అన్ని ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలకు చెందిన బస్సులను కూడా ఇందుకోసం వినియోగిస్తున్నారు. గ్రామాల్లో లారీలను కూడా జనసమీకరణకు వినియోగించుకోవాలని టీఆర్ఎస్ నాయకులు యోచిస్తున్నారు. కనీసం 2వేల వాహనాలను ప్రత్యేకంగా ఇందుకోసం వినియోగించాలని నిర్ణయించారు. కోల్బెల్ట్ నుంచి కనీసం ఐదువేలు ఉమ్మడి జిల్లాలో సింగరేణి కోల్బెల్ట్ ప్రధానమైనది. నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో విస్తరించి ఉన్న కోల్బెల్ట్ నుంచి ప్రగతి నివేదన సభకు కనీసం 5వేల మంది కార్మికులను తరలించే ఆలోచనలో నాయకులున్నారు. మంచిర్యాల పరిధిలోని శ్రీరాంపూర్, చెన్నూరులోని జైపూర్, ఇందారం, మందమర్రి , బెల్లంపల్లిలోని కాసిపేట, బెల్లంపల్లి, ఆసిఫాబాద్లోని రెబ్బన మండలంలోని ఓపెన్కాస్ట్లలో పనిచేస్తున్న 20వేల పై చిలుకు కార్మికుల నుంచి కనీసం 5వేల మందిని తీసుకెళ్లే ఆలోచనలో ఉన్నారు. లాభాల బోనస్ 27 శాతం ఇవ్వడంతోపాటు వారసత్వ ఉద్యోగాలు, ఇతర సౌకర్యాల విషయంలో తీసుకున్న నిర్ణయాలతో కార్మికుల్లో హర్షం వ్యక్తమవుతుందని నేతలు భావిస్తున్నారు. ఈ మేరకు టీబీజీకేఎస్ నాయకులు కార్మికులను తరలించే బాధ్యత అప్పగించారు. ఎంపీలు కవిత, బాల్క సుమన్ ఈ విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నట్లు సమాచారం. లక్ష మందిని తరలిస్తాం: మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తరువాత ఏర్పాటైన టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు ఎన్నో సంక్షేమ, అభివృద్ధి ఫలాలను తీసుకొచ్చింది. ప్రజలకు ‘ఓటు రాజకీయాలు కాదు... దీర్ఘకాలిక అభివృద్ధి కావాలి’ అని నమ్మిన కేసీఆర్ అందుకు అనుగుణంగా నిరంతరం కృషి చేశారు. నిరంతర విద్యుత్, కోటి ఎకరాలకు సాగునీరు వంటి కలలను సాకారం చేసుకునే దిశగా సాగుతున్నారు. అన్ని వర్గాల ప్రజలకు నేనున్నాను అనే ధీమా కల్పించారు. నాలుగేళ్లకు పైబడిన పాలనలో చేసిన అభివృద్ధిని, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించేందుకు ‘ప్రగతి నివేదన’ సభ జరగబోతుంది. ఈ సభను విజయం చేసేందుకు ఆదిలాబాద్ పూర్వ జిల్లా నుంచి లక్ష మందిని తీసుకెళ్తాం. ప్రతి నియోజకవర్గం నుంచి 10వేల మందికి తక్కువ కాకుండా జనసమీకరణ చేస్తాం. నభూతో.. నభవిష్యతి అనే తరహాలో ఆదిలాబాద్ నంంచి లక్ష జనం కదలబోతున్నారు. సభ విజయవంతం చేయాలి నిర్మల్టౌన్: ప్రగతి నివేదిక సభ విజయవంతం చేయాలని రాష్ట్ర గృహనిర్మాణ, దేవాదాయ, న్యాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రం నిర్మల్లోని మంత్రి నివాసంలో ఆదివారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. హైదరాబాద్లో కొంగరకలాన్లో భారీ బహిరంగసభ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. టీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున సభకు తరలిరావాలని కోరారు. ఇందులో టీఆర్ఎస్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు లోక భూమారెడ్డి, నాయకులు వెంకట్రాంరెడ్డి, ముత్యం, తదితరులు పాల్గొన్నారు. -
ప్రజావసరాలకు ట్రస్టు నిధుల వినియోగం
ఆదిలాబాద్, అర్బన్ : విద్యార్థులు, ప్రజల అత్యవసర చిన్న పనులకు జిల్లా ఖనిజ ట్రస్టు నిధులను వినియోగించాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి జోగు రామన్న స్పష్టం చేశారు. గురువారం సాయంత్రం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా ఖనిజ ట్రస్టు కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి రామన్న మాట్లాడుతూ జిల్లాలో మైనింగ్ వల్ల ప్రభావితమైన ప్రాంతాల్లో వివిధ పనులు చేపట్టడం, అత్యవసరమైన పనులకు మాత్రమే వినియోగించాలని సూచించారు. జిల్లాలో సుమారు రూ.కోటి రూపాయలు ఉన్నాయని, ఆ నిధులకు శాఖల వారీగా ప్రతిపాదనలు స్వీకరించాలని పేర్కొన్నారు. ప్రజల ఆరోగ్యం, విద్య, రహదారులు వంటి పనులు చేపట్టాలని సూచించారు. అనంతరం కలెక్టర్ దివ్యదేవరాజన్ మాట్లాడుతూ రాష్ట్ర జిల్లాల ఖనిజ ట్రస్ట్ నియామావళి 2015ను ఏర్పాటు చేశారని తెలిపారు. జిల్లాలో 249 గ్రామాల్లో ఖనిజ ప్రాంతాల ప్రభావితం ఉందన్నారు. మైనింగ్ ద్వారా వసూలైన రాయల్టీ, సీనరేజీ చార్జీలను మైనింగ్ వల్ల ప్రభావితం అయిన ప్రాంతాల అభివృద్ధికి చర్యలు చేపట్టడానికి ఖనిజ ట్రస్టు అకౌంట్లో నిధులు జమ చేస్తున్నట్లు తెలిపారు. 15 శాతం నిధుల నుంచి వివిధ ఖర్చులు పోనూ 85 శాతం నిధులతో అభివృద్ధి పనులు చేపడుతామని తెలిపారు. ఇందులో నుంచి 85 శాతం తాగునీటి సరఫరా, పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నియంత్రణ చర్యలు, విద్య, స్త్రీ శిశు సంక్షేమం, నైపుణ్యాభివృద్ధి, పారిశుధ్యం కోసం 60 శాతం, ప్రభావిత ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలకు వినియోగిస్తామని తెలిపారు. ప్రజల ఆరోగ్యం కోసం రిమ్స్, పీహెచ్సీలకు కావాల్సినవి ప్రతిపాదించాలని రిమ్స్ పర్యవేక్షకుడు అనంత్రావు, డీఎంహెచ్వో రాజీవ్రాజ్ను ఆదేశించారు. అంగన్వాడీల్లో కావాల్సినవి, పాఠశాలలు, కళాశాలల్లో మరుగుదొడ్లు, వసతి గృహాలు, కేజీబీవీలో ఇన్వర్టర్లు, ఆర్వో ప్లాంట్ ప్రతిపాదించాలని అన్నారు. అనంతరం ఇంటింటికీ అంగన్వాడీ కౌన్సెలింగ్ పుస్తకాలను మంత్రి, కలెక్టర్, ఎమ్మెల్యే ఆవిష్కరించారు. బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావు, డీఎఫ్వో ప్రభాకర్రావు, డీఆర్డీవో రాజేశ్వర్, జెడ్పీ సీఈవో జితేందర్రెడ్డి పాల్గొన్నారు. -
లక్ష మొక్కలు పీకేశారు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ‘తెలంగాణకు హరితహారం’ అటవీప్రాంత జిల్లాల్లో అభాసుపాలవుతోంది. అటవీ భూముల కబ్జాదారుల ప్రతాపానికి పచ్చదనం ఆదిలోనే అంతమవుతోంది. కబ్జాదారులకు అధికార పార్టీ ప్రజాప్రతినిధులే అండగా నిలుస్తుండటంతో అడవుల పునరుద్ధరణ లక్ష్యం ‘మొక్క’ దశలోనే ముగిసిపోతోంది. హరితహారం కార్యక్రమంలో భాగంగా అటవీ భూముల్లో నాటిన మొక్కల్లో 1,05,618 మొక్కలను జూలైలో కబ్జాదారులు పీకేశారు. 2014 నాటికి కబ్జాకు గురైన అటవీ భూముల జోలికి వెళ్లవద్దని స్వయంగా అటవీశాఖ మంత్రి జోగు రామన్న ఆదేశించడంతో ఈ ప్రాంతాల్లో హరితహారం నిలిచిపోయింది. కొందరు రాష్ట్ర మంత్రులు, అధికార పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు సైతం క్షేత్రస్థాయిలో ఇలాంటి ప్రకటనలే చేస్తుండటంతో ఆయా ప్రాంతాల్లో ఈ కార్యక్రమానికి బ్రేక్ పడింది. ఈ పరిస్థితులను వివరిస్తూ రాష్ట్ర అటవీ విభాగాధిపతి, ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ (పీసీసీఎఫ్) స్వయంగా గత నెల 20న ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి లేఖ రాశారు. కబ్జాకు గురైన అటవీ భూములను ప్రభుత్వం క్రమబద్ధీకరించనుందనే అభిప్రాయాన్ని ప్రజల్లో కలిగించడంతో కొత్తగా ఆక్రమణలు చోటుచేసుకుంటున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో స్వాధీనం చేసుకున్న అటవీ భూములను మళ్లీ ఆక్రమించుకుంటున్నారని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. గత మూడేళ్లలో నాటిన మొక్కలు, చెట్లను పీకేసి మరీ స్థానికులు కబ్జాలకు పాల్పడుతున్నారని నివేదించారు. క్షేత్రస్థాయిలో అడుగడుగునా అడ్డంకులు... రాష్ట్రంలో పచ్చదనాన్ని 24 శాతం నుంచి 33 శాతానికి పెంచాలనే లక్ష్యంతో ప్రభుత్వం హరితహారాన్ని నిర్వహిస్తోంది. 2015–19 మధ్య మొత్తం 230 కోట్ల మొక్కలను నాటాలనే లక్ష్యం నిర్దేశించుకోగా అందులో 80 కోట్ల మొక్కలను అటవీ ప్రాంతాల పునరుద్ధరణకు, మరో 20 కోట్ల మొక్కలను దట్టమైన అడవుల్లో నాటాలని నిర్ణయించింది. మిగిలిన 130 కోట్ల మొక్కలను మైదాన ప్రాంతాల్లో నాటుతోంది. వేల ఎకరాల్లో కబ్జాకు గురైన భూముల్లో మొక్కలు నాటి అడవులను పునరుద్ధరించాల్సి ఉండగా క్షేత్రస్థాయిలో అటవీ అధికారులకు అడుగడుగునా అడ్డంకులు ఎదురవుతున్నాయి. ఇప్పటివరకు ఈ కార్యక్రమానికి రూ. 2,535.7 కోట్ల ప్రజాధనాన్ని ప్రభుత్వం వెచ్చింది. నాటిన మొక్కలను ఎక్కడికక్కడ పీకేస్తుండటంతో ప్రభుత్వ లక్ష్యం దెబ్బతింటోందని, మానవ శ్రమ, ప్రజాధనం భారీగా వృథా అవుతోందని పీసీసీఎఫ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో అటవీ భూముల క్రమబద్ధీకరణ హామీలపై ప్రభుత్వం స్పష్టతనివ్వాలని పీసీసీఎఫ్ విజ్ఞప్తి చేశారు. ఆయన రాసిన లేఖలోని ముఖ్యాంశాలు... ఏడేళ్లలో 50 వేల ఎకరాల అడవులు అన్యాక్రాంతం... తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి ముందు అటవీ భూములను ఆక్రమించిన గ్రామస్తులను వేధించరాదంటూ గత జూన్ 22న అటవీశాఖ ఉన్నతాధికారులు, అటవీ సెక్షన్ అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో మంత్రి జోగు రామన్న ఆదేశాలు జారీ చేశారు. కానీ 2014 జూన్కు ముందు కబ్జాకు గురైన అటవీ భూములను క్రమబద్ధీకరించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు అటవీశాఖ వద్ద ఎలాంటి సమాచారం లేదు. 2005 డిసెంబర్ 13 నాటికి అటవీ భూములను సాగు చేసుకుంటున్న గిరిజనులకే అటవీ హక్కుల గుర్తింపు చట్టం (ఆర్ఓఎఫ్ఆర్–2006) హక్కులు కల్పించింది. ఈ చట్టం కింద 1,86,534 దరఖాస్తులు రాగా అందులో అర్హతగల 93,494 దరఖాస్తులను ఆమోదించి 3,00,092 ఎకరాల భూములను సాగు చేసుకోవడానికి గిరిజనులకు సర్టిఫికెట్లు జారీ చేశారు. ఆ తర్వాత జరిగిన అటవీ భూముల కబ్జాలను క్రమబద్ధీకరించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు అటవీశాఖ వద్ద సమాచారం లేదు. 2008–09లో సైతం అప్పటి ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం నాటి ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రజల్లో ఇలాంటి అభిప్రాయాన్ని కలిగించడంతో పెద్ద ఎత్తున అడవులను నరికేసి భూములను కబ్జా చేయడంతో తీవ్ర నష్టం వాటిల్లింది. అధికారిక లెక్కల ప్రకారం 2007 నుంచి 2014 నాటికి కొత్తగా 58,032 ఎకరాల అటవీ భూములు కబ్జాకు గురయ్యాయి. ఈ భూముల్లో మొక్కలు నాటేందుకు చేస్తున్న ప్రయత్నాలను స్థానిక ప్రజాప్రతినిధులు అడ్డుకుంటూ సిబ్బందిపై భౌతిక దాడులు చేసేలా స్థానికులను ప్రోత్సహిస్తున్నారు. ఇటీవల చోటుచేసుకున్న కొన్ని ఘటనలు... ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య తన గన్మెన్లతో కలసి గత నెల 18న కొత్తగూడెం పరిధిలోని చాటకొండ రిజర్వ్ ఫారెస్ట్లో 100 ఎకరాల అటవీ భూముల్లో హరితహారాన్ని అడ్డుకున్నారు. అటవీ సిబ్బందిని బెదిరించి బలవంతంగా అక్కడ్నుంచి వెళ్లగొట్టారు. అవి అటవీ భూములంటూ కలెక్టర్ ఫోన్లో ధ్రువీకరించినా లాభం లేకపోయింది. జూలై 7న బెల్లంపల్లి డివిజన్లో గిరెపల్లి రిజర్వ్ ఫారెస్ట్లో రాజారాం, వెమనపల్లి గ్రామస్తులు పెద్ద సంఖ్యలో చెట్లను నరికి మూడోసారి అటవీ భూముల కబ్జాకు ప్రయత్నించారు. పాఖాల్ వన్యప్రాణి సంరక్షణ ప్రాంతంలో అటవీ భూమిని ట్రాక్టర్తో చదును చేసే యత్నాన్ని అడ్డుకునేందుకు వెళ్లిన డిప్యూటీ ఫారెస్ట్ రేంజ్ అధికారి డి. నాగరాజుపై అశోక్నగర్ గ్రామ సర్పంచ్ సాయిలు, గ్రామస్తులు దాడికి పాల్పడ్డారు. నిజామాబాద్ జిల్లా హాజీపూర్ రిజర్వు అటవీ ప్రాంతంలోని 10 హెక్టార్లలో నాటిన మొక్కలను గత నెల 5న బెల్యానాయక్ తండావాసులు పీకేశారు. ఏటూరునాగారం అటవీ సంరంక్షణ ప్రాంతంలో గత నెల 5న ఐదు ట్రాక్టర్లతో భూములను చదును చేసేందుకు జరిగిన ప్రయత్నాలను అడ్డుకునేందుకు వెళ్లిన వరంగల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్తోపాటు మరో ఇద్దరు ఐఎఫ్ఎస్ అధికారులను గ్రామస్తులు రెండు గంటలపాటు నిర్బంధించారు. ఈ ప్రాంతంలో ఐదు గ్రామాల ప్రజలు దాదాపు 13 వేల ఎకరాల అటవీ భూములను ఆక్రమించారు. పెద్దపల్లి అటవీ ప్రాంతంలోని 75 ఎకరాల్లో మొక్కలు నాటేందుకు ప్రయత్నించిన అటవీ సిబ్బందిపై గత నెల 5న కబ్జాదారులు దాడికి పాల్పడ్డారు. మామిడిగూడ అటవీ ప్రాంతంలోని 25 ఎకరాల్లో మొక్కలు నాటేందుకు వెళ్లిన అటవీ సిబ్బందిపై గత నెల 2న టడ్వాల్ మండలం బోటిలింగాల గ్రామస్తులు దాడికి పాల్పడ్డారు. -
మంత్రి జోగురామన్నకు తప్పిన ప్రమాదం
సాక్షి, మంచిర్యాల : తెలంగాణ రాష్ట్ర అటవీశాఖ మంత్రి జోగు రామన్నకు తృటిలో ప్రమాదం తప్పింది. ఓ ప్రైవేటు ఆస్పత్రి ప్రారంభోత్సవానికి జోగు రామన్న సోమవారం ఉదయం మంచిర్యాలకు వచ్చారు. ఆసుపత్రిని ప్రారంభించిన తర్వాత ఇతర విభాగాలను పరిశీలించేందుకు లిఫ్ట్లో వెళ్తుండగా లిఫ్ట్ వైర్ తెగిపడింది. ఈ ప్రమాదంలో జోగు రామన్నకు ఎలాంటి గాయాలు అవ్వలేదు. లిఫ్ట్ నుంచి బయటకు వచ్చిన మంత్రి, మిగతా కార్యక్రమాల్లో యథావిధిగా పాల్గొన్నారు. సామర్ధ్యానికి మించి ఎక్కువ మంది లిఫ్ట్లో ఎక్కడంతో ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. -
పోడు రైతుల జోలికి వెళ్లొద్దు
కొల్లాపూర్: పోడు భూములు సాగుచేసుకుంటున్న రైతులను ఇబ్బంది పెట్టొద్దని అటవీ శాఖ మంత్రి జోగు రామన్న ఆ శాఖ అధికారులకు సూచించారు. పోడు భూముల్లో పంటలు వేసుకున్న రైతుల జోలికి వెళ్లొద్దని స్పష్టం చేశారు. శనివారం ఆయన పంచాయతీరాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలసి నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్లో పర్యటించారు. ఈ నియోజకవర్గంలో అటవీ సరిహద్దుల పేరిట అధికారులు తవ్వుతున్న కందకాలను అడ్డుకుంటున్న రామాపురం, ముక్కిడిగుండం, నార్లాపూర్, కల్వకోల్, వరిదేల గ్రామాల రైతులతో మంత్రులు సమావేశమయ్యారు. పోడు భూముల సాగుకు తమ ప్రభుత్వం వ్యతిరేకం కాకున్నా.. అడవులను నరుక్కుంటూ పోతే జీవరాశి ఎలా బతుకుతుందని ప్రశ్నించారు. ఇప్పటివరకూ అటవీ భూములు సాగుచేసుకుంటున్న రైతుల జోలికి అధికారులు రారని, పంటలకు నష్టం చేయరని తెలిపారు. కందకాల తవ్వకాల వల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదని పేర్కొన్నారు. అయితే, పంటలు సాగుచేయని భూముల్లో మాత్రం చెట్లు నాటుతామని స్పష్టం చేశారు. 1960లో చాలామంది రైతులకు అటవీ భూముల్లో రెవెన్యూ పట్టాలు ఇచ్చారని చెప్పిన ఆయన, రెవెన్యూ, అటవీ భూముల సరిహద్దులు గుర్తించేందుకు సర్వేఆఫ్ ఇండియాకు సీఎం కేసీఆర్ లేఖ రాశారని తెలిపారు. అక్కడి అధికారులు సర్వే చేశాక భూముల హద్దులు తేలుతాయన్నారు. ఆ విషయాలను తాము చూసుకుంటామని, అప్పటివరకు రైతులను ఇబ్బంది పెట్టొద్దని అధికారులకు మంత్రి జోగు రామన్న సూచించారు. -
‘ఎల్డబ్ల్యూఈ’పై ఆశలు
సాక్షి, ఆదిలాబాద్: మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో రోడ్డు కనెక్టివిటి కోసం ఉమ్మడి జిల్లా నుంచి పంపించిన ప్రతిపాదనలకు మంజూరు లభిస్తే మహారాష్ట్రకు సరిహద్దు గ్రామాలు, మారుమూల గిరిజన ప్రాంతాలకు మహర్దశ కలగనుంది. రోడ్డు సదుపాయం ఏర్పడి ఆయా గ్రామాలకు వివిధ సౌకర్యాలు మెరుగుపడతాయి. తాజాగా భద్రాద్రి జిల్లాకు నిధులు మంజూరు కావడం గమనార్హం. మన జిల్లాల నుంచి పంపించిన ప్రతిపాదనలకు కేంద్రం నుంచి ఆమోదం లభించిన పక్షంలో అనేక గ్రామాలకు వంతెనలు, రోడ్లు నిర్మించే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం నిధులు.. లెఫ్ట్ వింగ్ ఎక్సిట్రిమిజం (ఎల్డబ్ల్యూఈ) కింద రోడ్ల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తుంది. ఇంటిలిజెన్స్ నివేదిక ఆధారంగా ఆయా ప్రాంతాలను కేంద్ర హోం మంత్రిత్వశాఖ ఎంపిక చేస్తుంది. దాని ఆధారంగా కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ నుంచి నిధులు మంజూరు అవుతాయి. ఇంటెలిజెన్స్ సూచించిన చోటనే సరిహద్దు, మారుమూల ప్రాంతాల్లో రోడ్లు, బ్రిడ్జిలు, కల్వర్టుల నిర్మాణాలు చేపడుతారు. రహదారులు, భవనాల శాఖ ఈ పనులను పర్యవేక్షిస్తుంది. ప్రధానంగా మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలను పరిగణలోకి తీసుకుంటుంది. జిల్లాల విభజన తర్వాత 2017–18 సంవత్సరం కోసం మంచిర్యాల, కుమురంభీం జిల్లాలకు ఎల్డబ్ల్యూఈ కింద ఎంపిక చేయడం జరిగింది. రూ.153 కోట్లు మంజూరయ్యాయి. తాజాగా వాటికి సంబంధించి ఇటీవలే పలు పనులకు శంకుస్థాపన కూడా పూర్తయింది. ప్రాణహిత సరిహద్దులో ఈ పనులను చేపడుతున్నారు. రెండు జిల్లాల్లో నాలుగు బ్రిడ్జిలు, ఏడు రోడ్లు నిర్మిస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా కూడా.. ఎల్డబ్ల్యూఈ మొదటి విడతలో ఉమ్మడి ఖమ్మం, వరంగల్ జిల్లాలు ఉండగా, అందులో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలనే పరిగణలోకి తీసుకునేవారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాగా చూస్తే ప్రస్తుతం కొత్త జిల్లాగా ఏర్పడిన భద్రాద్రి జిల్లా మాత్రమే ఉండేదని ఆర్అండ్బీ శాఖ అధికారులు చెబుతున్నారు. కొత్త జిల్లాల విభజన తర్వాత రెండో విడతలో మంచిర్యాల, కుమురంభీం జిల్లాలను తీసుకోవడం జరిగిందని పేర్కొంటున్నారు. ఆదిలాబాద్ జిల్లాను మొదట్లో పరిగణలోకి తీసుకోలేదు. కాగా ఇటీవల జిల్లాలో ఆదివాసీ ఉద్యమం విస్తృతంగా సాగుతుండటం, అదే సమయంలో మారుమూల గిరిజన గ్రామాలకు ఇప్పటికి సరైన రోడ్డు సంబంధాలు లేకపోవడాన్ని పోలీసు శాఖతో పాటు ఇంటిలిజెన్స్ వర్గాలు కేంద్ర ప్రభుత్వానికి నివేదిక పంపింది. ప్రధానంగా ఆదిలాబాద్ జిల్లాలోని పలు ఏజెన్సీ మండలాల్లో సరైన రోడ్డు మార్గాలు లేక దుర్భరమైన పరిస్థితులు ఉన్నాయి. కల్వర్టులు, బ్రిడ్జిలు లేకపోవడంతో వర్షాకాలంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటీవల నార్నూర్లో వంతెన లేని కారణంగా వరద ప్రవాహంలో గర్భిణిని ప్రసవానికి తరలించడంలో ఆటంకాలు ఎదురయ్యాయి. సరైన సమయంలో ఆస్పత్రికి తీసుకెళ్లకపోవడంతో గర్భిణి అక్కడే ప్రసవించడం, శిశువు మృతిచెందడం సంఘటన జిల్లా పరిస్థితికి అద్దం పట్టింది. ఈ నేపథ్యంలో ఇంటిలిజెన్స్ వర్గాలు 22 పాయింట్లలో రోడ్డు కనెక్టివిటి పెంచాలని సూచిస్తూ నివేదిక పంపడం జరిగింది. ఆదిలాబాద్ జిల్లాను కూడా ఎల్డబ్ల్యూఈ కింద ఎంపిక చేయడంతో అభివృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయి. మూడు జిల్లాలకు రూ.900 కోట్లు.. ఎల్డబ్ల్యూఈ రెండో విడతలో మంచిర్యాల, కుమురంభీం, ఆదిలాబాద్ జిల్లాలకు కలిపి 2018–19 కోసం రూ.900 కోట్లతో మూడు నెలల కిందట ప్రతిపాదనలు పంపడం జరిగింది. ఇందులో ఆదిలాబాద్ జిల్లాకు రూ.250 కోట్లతో, మిగతా మంచిర్యాల, కుమురంభీం జిల్లాలకు ప్రతిపాదనలు రూపొందించారు. ఈ ప్రతిపాదనలోంచి ఎన్నింటికి మోక్షం కలుగుతుందో, ఎన్ని నిధులు మంజూరవుతాయో వేచి చూడాల్సిందేనని అధికారులు చెబుతున్నారు. ఒకవేళ పంపిన ప్రతిపాదన ఆధారంగా నిధులు మంజూరైన పక్షంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని అనేక మారుమూల, సరిహద్దు గ్రామాల్లో రోడ్డు కనెక్టివిటి పెరిగి ప్రజా సంబంధాలు పెంపొందుతాయని చెబుతున్నారు. సరైన మార్గం లేకపోవడం, గిరిజన గ్రామాల్లో తాత్కాళిక కల్వర్టులు, వంతెనలు ఏర్పాటు చేసుకొని రాకపోకలు సాగించడం కనిపిస్తుంది. వరద ప్రవాహం కారణంగా అవి కొట్టుకుపోవడంతో బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోతాయి. -
కలప దోషులపై చర్యలు తీసుకోవాలి
ఆదిలాబాద్: కోట్ల రూపాయల విలువ చేసే కలప పట్టుకున్నా దోషులను పట్టుకోవడంలో వెనుకంజ వేస్తున్నారని, వెంటనే నిందితులను గుర్తించి చర్యలు తీసుకోవాలని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గం డ్రత్ సుజాత డిమాండ్ చేశారు. మంగళవారం ఆ దిలాబాద్ పట్టణంలోని అటవీశాఖ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ముందుగా ఆమె ఇంటి నుంచి ర్యాలీగా వచ్చిన కార్యకర్తలను లోపలికి వెళ్లుకుండా పోలీసులు అడ్డుకోవడంతో గేటు బయటే బైఠాయించారు. డీఎఫ్ఓ రావాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో కోట్లు విలువ చేసే కలపను పట్టుకున్న అధికారులు, దానికి సంబంధించిన సరైన వివరాలు వెల్లడించకుండా దాచే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. దీనిపై సమాధానం చెప్పాల్సిన మంత్రి సమాధానం దాటవేస్తూ కాంగ్రెస్పై విమర్శలు చేయడం సరైంది కాదని అన్నారు. మంత్రులు ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉందన్నారు. కాగా, డీఎఫ్ఓ వచ్చే వరకు వెళ్లేది లేదని బైఠాయించడంతో గంట తర్వాత డీఎఫ్ఓ ప్రభాకర్ వచ్చి వినతిపత్రం తీసుకున్నారు. తమకు కలప వివరాలు తెలియజేయాలని, పట్టుకున్న విలువ, దానికి వెనుక ఉన్న దోషులను బయట పెట్టాలని డీఎఫ్ఓతో తెలిపారు. పూర్తి వివరాలు అందిస్తామని ఆయన హామీ ఇవ్వడంతో వారు వెనుదిరిగారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు రాందాస్ నాట్లే, సైదుల్లాఖాన్, వామన్వాంక్డే, రూప్రావు, గన్శ్యాం, సంజయ్గుండావార్, గిమ్మ సంతోష్, నగేష్, పొచ్చన్న, తదితరులు పాల్గొన్నారు. -
అధికారులు సమన్వయంతో పని చేయాలి
జైనథ్: గ్రామ స్థాయిలో పని చేసే అధికారులంతా సమన్వయంతో పని చేస్తూ, గ్రామాభివృద్ధికి కృషి చేయాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న అన్నారు. మంగళవారం మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సర్వసభ్య సమావేశానికి ఆయన హాజరై శాఖలవారీగా సమీక్షా నిర్వహించారు. విద్యుత్, ఆరోగ్యశాఖ, పంచాయతీరాజ్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మొదటి సర్వసభ్య సమావేశంలో సర్పంచులు చెప్పిన గ్రామాల్లోని విద్యుత్ సమస్యలు ఇంకా తీరకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమని తెలిపారు. ఇందిర జలప్రభ కింద కనెక్షన్ల మంజూరు, గ్రామాల్లో లూస్లైన్స్, విద్యుత్ స్తంభాలు, డీటీఆర్లు ఏర్పాటు చేయడం, ట్రాన్స్ఫార్మర్ల చుట్టూ కంచె ఏర్పాటు చేయడం వంటి కనీసమైన చర్యలు తీసుకోకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. ప్రస్తుతం సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున ఆరోగ్యశాఖ సిబ్బంది వారికి కేటాయించిన గ్రామాల్లోనే నివాసముండాలని ఆదేశించారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న అమ్మఒడి, కేసీఆర్ కిట్ల పంపిణీలో ఆలస్యం కాకుండా చూడాలని ఆదేశించారు. పంచాయతీరాజ్ సిబ్బంది, పంచాయతీ కార్యదర్శులు, ఈజీఎస్ సిబ్బంది గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణకు ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. వ్యక్తిగత మరుగుదొడ్లు, గ్రా మాల్లో డంపింగ్ యార్డుల నిర్మాణం, చెత్త రిక్షాల వాడకం పెంచాలన్నారు. ప్రతిఒక్కరూ హరితహారంలో స్వచ్ఛందంగా పాల్గొని మొక్కలు పెంచే లా ప్రజలను ప్రోత్సహించాలన్నారు. ప్రభుత్వం ఎన్ని సంక్షేమ పథకాలు అమలు చేసినా క్షేత్రస్థాయిలో పని చేసే అధికారులు నిర్లక్ష్యంగా వ్యవ హరిస్తే లబ్ధిదారులకు అందకుండా పోతాయన్నా రు. ప్రజాప్రతినిధులకు, ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందన్నారు. 2013లో ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్లో భాగంగా గ్రామాల్లో చేపట్టిన పనులకు సంబంధించి కూలీ బిల్లులు ఒక్కో పంచాయతీకి రూ. 50–55 వేలు పెండింగ్ ఉన్నట్లు సర్పంచులు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. దీంతో ఈ బిల్లులను వెంటనే విడుదల చేయాలని పీఆర్ అధికారులను ఆదేశించారు. ఎంపీపీ తల్లెల శోభ, జెడ్పీటీసీ పెందూర్ ఆశారాణి, తహసీల్దార్ బొల్లెం ప్రభాకర్, ఎంపీడీవో రామకృష్ణ, ఈవోపీఆర్డీ సం జీవ్రావ్, వివిధశాఖల అధికారులు పాల్గొన్నారు. -
అటవీ మంత్రి ఇలాఖాలో వెలుగు జూసిన కలప కుంభకోణం
-
కలప దొంగలను పట్టుకోవాలి
తిర్యాణి: మండలంలోని పంగిడిమాదర గ్రామ శివారులో గురువారం రాత్రి రెండు లారీలలో అక్రమంగా కలప తరలిస్తూ పట్టుబడిన సంఘటనలో అధికారులు దోషులను పట్టుకోవాలని మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు డిమాండ్ చేశారు. మండల కేంద్రంలో శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కలప రవాణాలో అధికార పార్టీకి చెందిన నాయకుల హస్తం ఉందని ఆయన ఆరోపించారు. కలప లారీలు పట్టుబడి రెండు రోజులు గడుస్తున్నా కలప ఎక్కడికి పోతుంది, అది ఎవరిది, అని అధికారులు నిర్ధారించలేకపోతున్నారన్నారు. కలప రవాణా చేస్తున్న లారీ డ్రైవర్లపై కేసులు నమోదు చేసి కేసును నీరు గార్చే ప్రయత్నం చేస్తున్నారన్నారు. అసలు దోషులను పట్టుకునే వరకు తాము ఊరుకునేది లేదని ఈ సంఘటనపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామన్నారు. ప్రభుత్వం ఒక వైపు హరితహారం కార్యక్రమం పెట్టి అడవులను అభవృద్ధి చేయాలని చెపుతున్నా అధికార పార్టీ నాయకులు మాత్రం అడవులను కొల్లగొట్టి సొమ్ము చేసుకుంటున్నారన్నారు. అధికార పార్టీ నాయకుల అవినీతిలో అధికారులు భాగస్వాములు కాకుండా నిష్పక్షపాతంగా వ్యవహించాలన్నారు. అటవీ సంపద బాహాటంగా తరలిపోతున్నా, అటవీ అధికారులు. పోలీసులు ఏమి చేస్తున్నారని ప్రశ్నించారు. అడవిలోని వంట చెరుకును తీసుకొస్తేనే అటవీ అధికారులు అమాయకులపై కేసులు పెడుతూ భయభ్రాంతులకు గురి చేస్తారు. అలాంటిది ఇంత పెద్ద మొత్తంలో కలప అక్రమంగా తరలిపోతుంటే వారు ఏమి చేస్తున్నట్లన్నారు. గ్రామాలలో ప్రతి గ్రామానికి గ్రామ పొలీస్ అధికారిని నియమించారు. చట్ట వ్యతిరేక కార్యక్రమాలు జరుగుతున్నా పోలీసులు ఏమి చేస్తున్నట్లన్నారు. అటవీ శాఖామంత్రి ఇలాఖాలోనే కోట్లాది రూపాయల కలప దందా కొనసాగడం శోచనీయమన్నారు. అక్రమంగా అటవీ సంపదను దోచుకుంటున్న వారు ఎంతటి వారైనా అధికారులు పట్టుకోవాలన్నారు. పక్షపాతం లేకుండా చూడాలని అన్నారు. కార్యక్రమలో పీసీసీ సభ్యులు విశ్వప్రసాదరావు, డీసీసీ ప్రధాన కార్యదర్శి అనిల్గౌడ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు బొల్లం వెంకటేశం, కిసాన్సెల్ జిల్లా అధ్యక్షులు బాలేశ్వర్గౌడ్, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు మంగ, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అంకంగౌరయ్య, సింగిల్విండో చైర్మన్ శ్రీనివాస్, మాజీ సర్పంచ్ బాదిరావు, నాయకులు బ్రహ్మం, మొగిలి తదితరులు పాల్గొన్నారు. -
కలప స్మగ్లింగ్లో మంత్రి నైతిక బాధ్యత వహించాలి
ఆదిలాబాద్టౌన్: ఇటీవల జరిగిన ఆక్రమ కలప వ్యవహారంలో రాష్ట్ర అటవీ, పర్యావరణ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న నైతిక బాధ్యత వహించాలని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గండ్రత్ సుజాత్ డిమాండ్ చేశారు. శుక్రవారం ఆదిలాబాద్ పట్టణంలోని ఆమె నివాసంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అటవీ శాఖ మంత్రి స్వంత జిల్లాలో లక్షల రూపాయల్లో కలప స్మగ్లింగ్ జరుగుతున్నా పట్టించుకోవడం లేదని విమర్శించారు. సంఘటన జరిగి 20 రోజులు గడుస్తున్నా నోరు విప్పకపోవడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించా రు. దీని వెనుక మంత్రి హస్తం ఉందని అనుమానం వ్యక్తం చేశారు. హరితహారం పేరిట దోచుకుంటూ టీఆర్ఎస్ నాయకులు, మరో వైపు కశ్మీర్ లాంటి ఆదిలాబాద్ జిల్లాలను ఏడారి ప్రాంతంగా మరుస్తున్నారని ఆరోపించారు. కలప స్మగ్లింగ్పై ప్రత్యేక కమిటీ వేసి విచారణ చేపట్టి, దోషులను శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు నగేష్, సంతోష్రావు, పోచ్చన్న, రఫిక్, భూమారెడ్డి, సంతోష్, రాజేశ్వర్, బాబాసాహెబ్, లింగన్న, వెంకటి, రూపేష్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
జంతువులు ఎందుకు చనిపోతున్నాయి?
సాక్షి, హైదరాబాద్: నెహ్రూ జూలాజికల్ పార్క్లో తరచుగా జంతువులు మృత్యువాత పడుతుండటంపై అటవీ, పర్యావరణ శాఖ మంత్రి జోగు రామన్న అటవీ అధికారుల నుంచి వివరణ కోరారు. ఈమేరకు ‘జూపై రోగాల దాడిì ’అనే శీర్షికతో ఈనెల 6న జంతువులు మరణిస్తున్న తీరును వివరిస్తూ ‘సాక్షి’కథనాన్ని ప్రచురించింది. దీనిపై మంత్రి స్పందించారు. గురువారం సచివాలయంలో అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. జంతువుల మృతిపై వైల్డ్ లైఫ్ చీఫ్ వార్డెన్ మునీంద్ర, జూపార్క్ డైరెక్టర్ సిద్ధాంత్ కుక్రేటీల నుంచి వివరణ కోరారు. వార్ధక్యం, తీవ్రమైన అనారోగ్య సమస్యలు రావడం వల్లనే అరుణ అనే సింహం, జమున అనే ఏనుగు, దీప అనే చిరుత మృతి చెందాయని అధికారులు మంత్రికి వివరించారు. జూపార్క్లో ఉన్న మిగతా జంతువుల ఆరోగ్య పరిస్థితిపై మంత్రి ఆరా తీశారు. జంతువుల సంరక్షణ విషయంలో అప్రమత్తంగా ఉండాలని, మెరుగైన వైద్యాన్ని అందించాలని, భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలని అధికారులను హెచ్చరించారు. -
వేల కోట్లతో అభివృద్ధి పనులు
జైనథ్: రాష్ట్ర అటవీ, పర్యావరణ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగురామన్న సహకారంతో ఆదిలాబాద్ నియోజకవర్గంలో వేల కోట్లతో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని ఏఎంసీ మాజీ చైర్మన్ తల్లెల చంద్రయ్య అన్నారు. బుధవారం మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదిలాబాద్కు వచ్చిన సందర్భంగా నియోజకవర్గ అభివృద్ధికి రూ.250 కోట్లు మంజూరు చేయాలని మంత్రి జోగురామన్న కోరగా, స్పందించిన ముఖ్యమంత్రి నిధుల మంజూరుకు జీఓ జారీ చేశారన్నారు. ఈ నిధులతో గ్రామాల్లో మౌలిక వసతులైన సీసీ రోడ్లు, మురికి కాల్వలు, లింక్ రోడ్లు, గ్రావెల్ రోడ్లు, ఇతరత్ర అభివృద్ధి పనులు చేపట్టేందుకు అవకాశం ఏర్పడిందన్నారు. నిధులు విడుదల చేసినందుకు సీఎం కేసీఆర్, మంత్రి జోగు రామన్నకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. నియోజకవర్గంలో 51వేల ఎకరాలకు సాగునీరు అందించే కోరటా–చనాఖా బ్యారేజీ పనులు కూడా వేగంగా కొనసాగుతున్నా యని తెలిపారు. ఎన్నికల్లోగా సాగునీరు అందిం చడం జరుగుతుందన్నారు. ఇవే కాకుండా వందల కోట్లతో గ్రామాల్లో బీటీ రోడ్లు నిర్మించడం జరిగిందని పేర్కొన్నారు. 70 ఏళ్లుగా జరగని అభివృద్ధిని నాలుగేళ్లలో చేసి చూపించిన ఘనత మంత్రి జోగు రామన్నకే దక్కుతుందన్నారు. ప్రజలంతా అభివృద్ధికి పట్టం కట్టి రానున్న అన్నిఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీనే భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు. సమావేశంలో ఐటీడీఏ డైరెక్టర్ పెందూర్ దేవన్న, జైనథ్ ఏఎంసీ వైస్ చైర్మన్ ఎల్టీ భూమారెడ్డి, ఎంపీటీసీల సంఘం మండల గౌరవ అధ్యక్షుడు మద్దెల ఊశన్న, ఆలయ కమిటీ వైస్ చైర్మన్ లక్ష్మన్న, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు తుమ్మల వెంకట్రెడ్డి, నాయకులు అల్లకొండ అశోక్, తమ్మడి భగవాండ్లు, కోల భోజన్న, భట్టు ఊశన్న, వెంకట్రెడ్డి, కిష్టారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ప్రజాక్షేత్రంలో బీజేపీకి పరాభవమే
సాక్షి, హైదరాబాద్: ప్రజాక్షేత్రంలో బీజేపీకి పరాభవం తప్పదని, మునిగిపోయే పడవ బీజేపీదేనని మంత్రి జోగు రామన్న అన్నారు. బీజేపీ నేతల మాటలు మాయల ఫకీర్ను తలపిస్తున్నాయని ఎద్దేవా చేశారు. బుధవారం సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారన్నారు. ఈ మాటలను తెలంగాణ ప్రజలు సహించబోరని హెచ్చరించారు. టీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి రాకుంటే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని, అధికారంలోకి వస్తే మీరు రాజకీయ సన్యాసం తీసుకుంటారా అని లక్ష్మణ్కు సవాల్ విసిరారు. బీజేపీ ప్రభుత్వ హయాంలో వేలాది కోట్ల రూపాయల ప్రజాధనాన్ని కొల్లగొట్టిన నీరవ్ మోదీ, విజయ్మాల్యా దర్జాగా విదేశాల్లో తిరుగుతున్నారని చెప్పారు. లక్ష్మణ్ ఇప్పటికైనా పగటి కలలు కనడం మానేసి, వాస్తవ పరిస్థితుల్లో జీవించాలని సూచించారు. టీఆర్ఎస్ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను బీజేపీ పాలిత రాష్ట్రాలు, కేంద్ర మంత్రులు అభినందిస్తున్న విషయాన్ని గమనించాలని చెప్పారు. -
ఘనంగా మంత్రి ‘జోగు’ జన్మదిన వేడుకలు
ఆదిలాబాద్టౌన్: రాష్ట్ర అటవీ, పర్యావరణ, బీసీ సంక్షేమశాఖ మంత్రి జోగు రామన్న జన్మదిన వేడుకలను బుధవారం ఆయన నివాసంలో కార్యకర్తలు, నాయకుల మధ్య కేక్ కట్చేసి ఘనంగా జరుపుకున్నారు. అంతకు ముందు పట్టణంలోని శాంతినగర్ సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. మంత్రి జోగు రామన్నకు రాష్ట్ర గవర్నర్ ఈఎస్ఐ నర్సింహన్, ముఖ్యమంత్రి చంద్రశేఖర్రావు శుభాకాంక్షలు తెలుపుతూ ప్రకటన విడుదల చేశారు. రాష్ట్ర మంత్రులు పలువురు ఫోన్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. టీఆర్ఎస్ నాయకులు రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. స్వీ ట్లు, పండ్లు పంచిపెట్టారు. టపాసులు పేల్చి సం బరాలు జరుపుకున్నారు. ఆ ప్రాంతమంతా సం దడి సందడిగా కనిపించింది. మంత్రికి శుభాకాంక్షలు తెలిపిన వారిలో బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావ్, డీసీసీబీ చైర్మన్ ముడుపు దామోదర్రెడ్డి, ఆదిలాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ రంగినేని మనీషా, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు అడ్డి భోజారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ ఆరె రాజన్న, మావల సర్పంచ్ రఘుపతి, పార్టీ మా వల మండల అధ్యక్షుడు నల్ల రాజేశ్వర్, ఐసీడీఎస్ ఆర్గనైజర్ కస్తాల ప్రేమల, పద్మశాలి సంఘం జి ల్లా అధ్యక్షురాలు మంచికట్ల ఆశమ్మ, జాగృతి జి ల్లా అధ్యక్షుడు రంగినేనీ శ్రీనివాస్, పీఆర్టీయూ జి ల్లా అధ్యక్షుడు కొమ్ము కృష్ణకుమార్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు రామకృష్ణ, మాజీ జెడ్పీ చైర్పర్సన్ జట్టు అ శోక్, బోథ్ మాజీ మార్కెట్ చైర్మన్ తులశ్రీనివాస్, మాల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కా ర్యదర్శులు మెట్టు ప్రహ్లాద్, సూరం భగవాండ్లు, జిల్లా అధికారులు, వివిధ సంఘాల నాయకులు, తరలివచ్చి మంత్రికి శుభాకాంక్షలు తెలిపారు. -
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
ఎదులాపురం(ఆదిలాబాద్) : బీసీ స్టడీ సర్కిల్ ద్వారా అందిస్తున్న ఉచిత శిక్షణను నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని మంత్రి జోగు రామన్న అన్నారు. మంగళవారం బీసీ సంఘ భవనంలో బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో నిరుద్యోగులకు నిర్వహిస్తున్న ఉచిత శిక్షణ ప్రారంభ, స్టడీ మెటీరియల్ పంపిణీకి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విద్యార్థులకు గ్రూప్–4, వీఆర్వో స్టడీ మెటీరియల్ను పంపిణీ చేశారు. బీసీ శాఖ ఆధ్వర్యంలో అందిస్తున్న ఉచిత కార్ డ్రైవింగ్ శిక్షణను ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాకే ఉద్యోగాల భర్తీ పరంపర మొదలైందన్నారు. ఇప్పటి వరకు 82 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసినట్లు తెలిపారు. బీసీ స్టడీ సర్కిల్ ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకుని ఉద్యోగస్తులుగా మారాలని ఆకాంక్షించారు. ఒక ఉద్యోగంతో ఒక కుటుంబ ఆర్థిక వ్యవస్థ మారిపోతోందని అన్నారు. వెనుకబడిన అన్ని వర్గాల వారికి సేవ చేయడానికి బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా కొనసాగుతున్నందుకు సంతోషంగా ఉందన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో రూ.5 కోట్లతో 4 ఎకరాల్లో బీసీ భవనం నిర్మించ తలపెట్టామని, అందులో బీసీలే కాకుండా అన్ని పేదల వర్గాల వారికి అవకాశం కల్పిస్తామన్నారు. అభ్యర్థులు నమ్మకం, ఆత్మ విశ్వాసంతో ముందుకెళ్లాలని, అప్పుడే అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. బీసీ స్టడీ సర్కిల్ ద్వారా శిక్షణ తరగతులకు ఎంపిక కానీ అభ్యర్థులు నిరాశ చెందవద్దన్నారు. జోగు ఫౌండేషన్ ఆధ్వర్యంలో రూ.5 లక్షలు వెచ్చించి మరో 200 మందికి శిక్షణ ఇíప్పిస్తామని హామీ ఇచ్చారు. మున్సిపల్ చైర్మన్ పర్సన్ రంగినేని మనీషా, బీసీ సంఘం జిల్లా అధ్యక్షుడు ఈర్ల సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి పార్థ సారిథి, సభ్యులు వెండి బద్రేశ్వర్రావు, ప్రమోద్, బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ ప్రవీణ్ కుమార్, కౌన్సిలర్లు బండారు సతీశ్, సత్యనారాయణ పాల్గొన్నారు. -
పోటీ పరీక్షలకు నిరంతర శిక్షణ: జోగు
సాక్షి, హైదరాబాద్: సివిల్స్, గ్రూప్స్ తదితర పోటీ పరీక్షలకు బీసీ స్టడీ సర్కిల్స్ ద్వారా నిరంతరంగా శిక్షణా కార్యక్రమాలు నిర్వహించాలని మంత్రి జోగు రామన్న అధికారులకు సూచించారు. గురువారం సచివాలయంలోని తన చాంబర్లో బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, కమిషనర్ అనితా రాజేందర్, బీసీ స్టడీ సర్కిల్ రాష్ట్ర సంచాలకులు గొట్టిపాటి సుజాత, ఇతర అధికారులతో మంత్రి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ, బీసీ అభ్యర్థులు పోటీ పరీక్షల్లో రాణించే విధంగా శిక్షణ కార్యక్రమాలు కొనసాగేలా చర్యలు తీసుకోవాలన్నారు. అందుకు అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలను కల్పించాలని, లైబ్రరీ, శిక్షణకు అవసరమైన స్టడీ మెటీరియల్ అందుబాటులో ఉంచాలన్నారు. ఆదిలాబాద్, మెదక్, ఖమ్మం, నిజామాబాద్, కరీంనగర్లో నిర్మాణాల్లో ఉన్న స్టడీ సర్కిల్ భవనాలు సత్వరమే పూర్తి చేయాలని ఆదేశించారు. -
పచ్చదనాన్ని పెంచడమే లక్ష్యం: జోగు
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో పచ్చదనాన్ని 23 నుంచి 33 శాతానికి పెంచడమే లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు మంత్రి జోగు రామన్న తెలిపారు. పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం ఢిల్లీలో కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి హర్షవర్ధన్ అధ్యక్షతన అన్ని రాష్ట్రాల అటవీ శాఖ మంత్రుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ప్రధానంగా పర్యావరణ కాలుష్య నియంత్రణలో రాష్ట్రాల పాత్ర, వ్యర్థాల నిర్వహణ, పచ్చదనం పెంపు అంశాలపై చర్చించారు. ఈ సమావేశానికి హాజరైన జోగు రామన్న తెలంగాణలో కాలుష్య నివారణకు తీసుకుంటున్న చర్యలను వివరించారు. రాష్ట్రంలో పచ్చదనాన్ని పెంచేందుకు హరితహారం కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు పేర్కొన్నారు. ఘన వ్యర్థాల నిర్వహణలో హైదరాబాద్ ఉత్తమ రాజధాని నగరంగా ఇటీవల స్వచ్ఛ సర్వేక్షణ్ పురస్కారాన్ని అందుకుందని మంత్రి గుర్తు చేశారు. తెలంగాణలో పర్యావరణానికి హాని కలిగిస్తున్న సంస్థలపై చర్యలు తీసుకుంటున్నామని, ప్రమాదకర స్థాయిలో వ్యర్థాలను విడుదల చేస్తున్న పరిశ్రమలను మూసేయిస్తున్నామని తెలిపారు. ప్లాస్టిక్ నిషేధాన్ని ప్రభుత్వం సవాల్గా స్వీకరించిందని, 2022 నాటికి తెలంగాణను ప్లాస్టిక్ రహిత రాష్ట్రంగా నిలపడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. సింగరేణి స్టాల్ను సందర్శించిన మంత్రులు.. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఇక్కడ ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్లో సింగరేణి స్టాల్ను మంత్రి జోగు రామన్న సందర్శించారు. పర్యావరణ పరిరక్షణకు సింగరేణి కాలరీస్ తీసుకుంటున్న చర్యలను వివరిస్తూ ఆ సంస్థ ప్రత్యేక స్టాల్ను ఏర్పాటు చేసింది. ఢిల్లీ పర్యటనలో ఉన్న మంత్రి ఈటల రాజేందర్, ఎంపీలు వినోద్ కుమార్, కొండా విశ్వేశ్వరరెడ్డి కూడా ఈ స్టాల్ను సందర్శించారు. -
సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి
ఆదిలాబాద్రూరల్ : ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకొని పశు పోషకులు ఆర్థికాభివృద్ధి సాధించాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న అన్నారు. మండలంలోని అంకోలి గ్రామంలో వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ (ఆత్మ) సౌజన్యంతో పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో బుధవారం మెగా ఉచిత పశు వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన హాజరై పశువులకు టీకా వేసి శిబిరాన్ని ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడారు. గ్రామాల్లో నిర్వహిస్తున్న పశు వైద్య శిబిరాలను కాపరులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. గొల్ల కుర్మలకు అందించిన సబ్సిడీ గొర్రెలను విక్రయించకుండా వాటిని పోషించుకుంటూ ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్నారు. కార్యక్రమంలో ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఆరె రాజన్న, జెడ్పీటీసీ సభ్యుడు ఇజ్జగిరి అశోక్, రైతు సమన్వయ సమితి జిల్లా కన్వీనర్ అడ్డి భోజారెడ్డి, వైస్ ఎంపీపీ గంగారెడ్డి, ఏఎంసీ వైస్చైర్మన్ అప్కం గంగయ్యయాదవ్, అంకోలి ఎంపీటీసీ కనక రమణ, జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారి డాక్టర్ సురేష్, ఏడీ రామారావు, మండల పశు వైద్యాధికారి గోపీ కిషన్, తదితరులు పాల్గొన్నారు. -
ప్రజల సౌకర్యం కోసమే క్యాంపు కార్యాలయం
బెల్లంపల్లి : అసెంబ్లీ నియోజకవర్గ ప్రజల సౌలభ్యం కోసమే ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం, నివాస గృహాలను రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తోందని మంత్రులు అల్లోల ఇంద్రకరణ్రెడ్డి, జోగు రామన్న తెలిపారు. బుధవారం బెల్లంపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ ఏరియాలో రూ.కోటి అంచనాతో నిర్మించిన ఎమ్మెల్యే క్యాంపు, నివాస గృహానికి ప్రారంభోత్సవం చేశారు. అంతకుముందు ఎమ్మెల్యే దంపతులు, టీఆర్ఎస్ శ్రేణులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న ఇతర నియోజకవర్గాల్లో కూడా ఎమ్మెల్యేల క్యాంపు, నివాస గృహాల నిర్మాణాలు జరుగుతున్నాయని వివరించారు. దశలవారీగా వాటిని ప్రారంభోత్సవం చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని ప్రకటించారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు జి.వివేక్, ఎమ్మెల్సీ పురాణం సతీష్, ఎమ్మెల్యేలు దుర్గం చిన్నయ్య, నడిపెల్లి దివాకర్రావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రేణికుంట్ల ప్రవీణ్, మహిళా శిశు సంక్షేమ శాఖ రీజినల్ కో ఆర్డినేటర్ అత్తి సరోజ, వ్యవసామ మార్కెట్ కమిటీటి చైర్మ సిలువేరి నర్సింగం, కలెక్టర్ ఆర్వీ.కర్ణన్, సబ్ కలెక్టర్ పీఎస్.రాహుల్రాజ్, మున్సిపల్ చైర్పర్సన్ పసుల సునీతారాణి, టీఆర్ఎస్ పార్టీ ఇన్చార్జి అరిగెల నాగేశ్వర్రావు, అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని ఎంపీపీలు, జెడ్పీటీసీలు, సర్పంచ్లు, ఎంపీటీసీ సభ్యులు, టీఆర్ఎస్ నాయకులు, ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. -
కుల వృత్తులకు కళ తెచ్చేందుకు..
సాక్షి, హైదరాబాద్: మట్టి పాత్రలు, వెదురు వస్తువులకు దేశవ్యాప్తంగా డిమాండ్ పెరుగుతుండటంతో వాటిని భారీ స్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తోంది. కుల వృత్తులకు మరింత ఆదరణ తీసుకొచ్చేందుకు ఇప్పటికే అడుగులేస్తున్న సర్కారు.. మట్టి, వెదురు ఉత్పత్తులకు సాంకేతికతను జోడించి పారిశ్రామిక ఉత్పత్తులుగా మార్కెటింగ్ చేయాలని భావిస్తోంది. కాస్త పెట్టుబడి పెడితే అధిక సంఖ్యలో ఉపాధి కల్పనతో పాటు ఆర్థిక అభివృద్ధికి ఆస్కారం ఉంటుందని ఆ మేరకు కార్యాచరణ సిద్ధం చేస్తోంది. బీసీ కార్పొరేషన్ ద్వారా పెద్ద సంఖ్యలో లబ్ధిదారులను ఎంపిక చేసేందుకుగాను దరఖాస్తులు స్వీకరిస్తోంది. రూ.100 కోట్ల నిధి మట్టి, వెదురుతో తయారు చేసే వస్తువులకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. గృహోపకరణాల్లో వాడటంతో పాటు కార్పొరేట్ సంస్థలూ వీటికి ప్రాధాన్యం ఇస్తున్నాయి. ప్లాస్టిక్ ఉత్పత్తులతో పోల్చితే వీటి ధరలు తక్కువగా ఉండటమూ మరో కారణం. పొరుగు రాష్ట్రాలు ఈ ఉత్పత్తులతో భారీ స్థాయిలో వ్యాపారం చేస్తున్నాయి. మట్టి పాత్రల తయారీలో గుజరాత్.. వెదురు ఉత్పత్తుల్లో త్రిపుర ప్రథమ స్థానంలో ఉన్నాయి. దీంతో ఈ పరిశ్రమలపై ప్రభుత్వం దృష్టి సారించింది. బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న నేతృత్వంలో అధికారుల బృందం ఇటీవల ఈ రెండు రాష్ట్రాల్లో పర్యటించి వస్తువుల తయారీ పరిశ్రమలను పరిశీలించింది. తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు ఆర్జిస్తుండటాన్ని గమనించింది. దీంతో ఈ పరిశ్రమలపై రూ.100 కోట్లు ఖర్చు చేయాలని ఆ శాఖ ప్రణాళికలు రూపొందిస్తోంది. రూ.లక్షతో యూనిట్ మట్టి పాత్రల తయారీ యూనిట్ను రూ.లక్షతోనే ఏర్పాటు చేయొచ్చు. ముడి ‘క్లే’మిక్స్ చేసేందుకు, వస్తురూపంలో మార్చేందుకు ఉపయోగించే రెండు మెషీన్లను రూ.లక్షలోపు ఖరీదుతోనే కొనుగోలు చేయొచ్చని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం మన ప్రాంతంలో మట్టి కలపడం, తయారీకి ఎక్కువ శ్రమ పడుతుండటంతో కార్మికులు త్వరగా అలసిపోతున్నారు. ఈ అధునాతన యంత్రాలతో శ్రమ తగ్గుతుంది. కుర్చీలో కూర్చొని పనిచేసే వీలుంటుంది. మట్టితో నమూనాలు చేసిన తర్వాత ఫినిషింగ్ ఇచ్చేందుకు సహజసిద్ధ రంగులు వాడుతారు. దీంతో పాత్రలు సరికొత్త అందాలతో కనిపిస్తాయి. ఇక వెదురు పరిశ్రమల ఏర్పాటులో ఎక్కువ యంత్రాలు అవసరమవుతాయి. సగటున రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షలు పెట్టుబడి పెట్టాలి. వ్యక్తిగతంగా కాకుండా 10 నుంచి 20 మంది కలసి సొసైటీగా ఏర్పాటై యూనిట్ స్థాపించవచ్చు. యూనిట్లో సగటున 100 మందికి ఉపాధి లభిస్తుంది. ఈ పరిశ్రమలో ప్రధానంగా వెదురు క్లీనింగ్ అండ్ కట్టింగ్, సన్నని పుల్లల్లా కటింగ్ చేసే యంత్రం, అతికించి చెక్కలుగా ప్రెస్ చేసే యంత్రాలుంటాయి. అలా వుడ్ రూపంలోకి వచ్చిన సరుకును ఫర్నిచర్గా తయారు చేయొచ్చు. జిల్లా, తాలూకా కేంద్రాల్లో.. ‘మట్టి, వెదురు పరిశ్రమలను జిల్లా, తాలూకా కేంద్రాల్లో ఏర్పాటు చేస్తే సత్ఫలితాలుంటాయి. ఔత్సాహికులు వ్యక్తిగతంగా కాకుండా 10 నుంచి 20 మందితో సొసైటీ రూపంలో ఏర్పాటవ్వాలి. దీంతో పరిశ్రమలకు స్థలం కేటాయించడమో.. లీజుకివ్వడమో జరుగుతుంది. ప్రస్తుతం రాష్ట్రంలో దొరికే బంకమట్టిని పరీక్షలకు పంపించనున్నాం. పాత్రల తయారీకి ఏ మేరకు సహకరిస్తుందో, లేదంటే మరిన్ని మిశ్రమాలేమైనా కలపాలో పరీక్షలో తెలుస్తుంది. వెదురు సాగుకు ఏటా సగటున 1,500 ఎంఎం వర్షపాతం కావాలి. కానీ రాష్ట్ర సగటు 800 ఎంఎం. ఆదిలాబాద్ లాంటి జిల్లాలో 1,100 పైగా ఉంటుంది. కాబట్టి ప్రత్యేకంగా నీటి వనరులు అందించడంపై పరిశీలన చేస్తున్నాం. రెండు మూడు నెలల్లో కార్యాచరణ పూర్తవుతుంది. ఈ పరిశ్రమలతో 2 లక్షల మందికి ఉపాధి దొరుకుతుంది. ఔత్సాహికులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి, తర్వాత యూనిట్ మంజూరు చేస్తాం’ అని జోగు రామన్న తెలిపారు. -
పీటీజీ ఉపకులాల సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్తా
ఆదిలాబాద్ రూరల్: ఆదిమ గిరిజనుల్లోని పీటీజీ ఉప కులాల సమస్యలను ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని రాష్ట్ర అటవీ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని రాంలీలా మైదానంలో ఆదిమ గిరిజన కొలాం సేవా సంఘం ఆధ్వర్యంలో పీటీజీ ఉపకులాల బహిరంగ సభ నిర్వహించారు. సభకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. అటవీ ఉత్పత్తులపై ఆధారపడి జీవనం సాగిస్తున్న వారి సమస్యలను పలు దఫాలుగా సీఎంతో చర్చించినట్లు పేర్కొన్నారు. ఆర్ఎఫ్ఆర్వో ద్వారా పట్టాలు పొందిన గిరిజనులందరికీ పెట్టుబడి సాయం కింద రూ.4వేలు అందించనున్నట్లు తెలిపారు. పోడు భూములను సాగు చేస్తున్న వారి విషయం ప్రభుత్వ పరిశీలనలో ఉందన్నారు. స్వాతంత్య్రం వచ్చి ఏళ్లు గడుస్తున్నా ఆదివాసీ గిరిజనులు ఇంకా సమస్యలతో సతమతమవుతున్నారని హైకోర్టు రిటైర్డ్ జస్టిస్ చంద్రకుమార్ తెలిపారు. ఆదివాసీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు సోయం బాపూరావ్ మాట్లాడుతూ...లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని కొన్ని నెలలుగా ఉద్యమం చేస్తున్నా ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసేందుకు మే 29న హన్మకొండలో మిలియన్ మార్చ్ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో కొలాం సేవా సంఘం జిల్లా అధ్యక్షుడు కొడప సొనేరావు, ఆదివాసీ సంఘాల నేతలు పాల్గొన్నారు. -
మార్గదర్శి.. మహాత్మా పూలే: జోగు
సాక్షి, హైదరాబాద్: మహాత్మా జ్యోతిరావుపూలే దేశానికి మార్గదర్శనం చేసిన మహనీయుడని బీసీ సంక్షేమ మంత్రి జోగు రామన్న అన్నారు. పూలే జయంతి ఉత్సవ కమిటీ చైర్మన్ గడ్డం సాయికిరణ్ అధ్యక్షతన బుధవారం ఇక్కడ రవీంద్రభారతిలో పూలే 192వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. జోగు రామన్న మాట్లాడుతూ సమాజంలో విలువలతో బతకాలన్నా, సంస్కారంతో ఉండాలన్నా విద్యతోనే సాధ్యపడుతుందన్నారు. అణగారిన వర్గాల ఉన్నతికి కృషి చేస్తున్న సీఎం కేసీఆర్ మరొక పూలే అని కొనియాడారు. బీసీ, ఎస్సీ, ఎస్టీల ప్రగతికి రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో రూ.33 వేల కోట్లను కేటాయించిందన్నారు. కేసీఆర్ నిర్ణయం మేరకు వచ్చే జయంతికల్లా పూలే విగ్రహాన్ని ట్యాంక్బండ్పై నెలకొల్పుతామని హామీనిచ్చారు. డిప్యూటీ సీఎం మహమూద్ అలీ మాట్లాడుతూ మైనార్టీలకు ఎక్కువ సంఖ్యలో రెసిడెన్షియల్ స్కూళ్లు ప్రారంభించడం గొప్ప విషయమన్నారు. అన్ని వర్గాల ప్రజలకు కేసీఆర్ అండగా ఉంటూ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా చేసే ప్రయత్నంలో ఉన్నారని పేర్కొన్నారు. పశు సంవర్ధక మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ పూలే బడుగు, బలహీన వర్గాల కోసం పోరాటం చేసిన యోధుడని, అందరికీ సమానహక్కులు ఉండాలని ఆకాంక్షించిన మహనీయుడని అన్నారు. ఒకప్పుడు దొరలకు, భూస్వాములకు మాత్రమే భూములెక్కువగా ఉండేవని, ప్రస్తుతం గ్రామాల్లోని రికార్డుల ప్రకారం అధికశాతం భూములు బీసీలకే ఉన్నాయని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం బీసీల పక్షపాతి అని పేర్కొన్నారు. ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు ప్రవేశ పెడితేనే దేశం అభివృద్ధి చెందుతుందన్నారు. బీసీలకు చట్టసభల్లో వాటా తెచ్చే విధంగా పోరాడితేనే పూలేకు ఘనమైన నివాళి అని అన్నారు. కార్యక్రమంలో బీసీ కమిషన్ చైర్మన్ బీఎస్ రాములు, సభ్యుడు వకుళాభరణం కృష్ణమోహన్రావు, రాజ్యసభ సభ్యుడు బండా ప్రకాశ్ ముదిరాజ్, ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ తాడూరి శ్రీనివాస్, బీసీ సంక్షేమశాఖ కమిషనర్ అనితారాజేంద్ర, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్, ఉత్సవ కమిటీ కోఆర్డినేటర్లు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు. -
కులవృత్తిదారులకు ప్రత్యేక శిక్షణ కేంద్రం
సాక్షి, హైదరాబాద్: కులవృత్తిదారులను అభివృద్ధిబాట పట్టించేందుకు రాష్ట్ర ప్రభు త్వం ప్రత్యేక కార్యక్రమాలకు శ్రీకారం చుడుతోందని బీసీ సంక్షేమ మంత్రి జోగు రామన్న తెలిపారు. కులవృత్తిదారుల నైపుణ్యాభివృద్ధి కోసం హైదరాబాద్లో ప్రత్యేక శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ఆదివారం సచివాలయంలో ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ తాడూరి శ్రీనివాస్తో కలసి ఆయన మీడియాతో మాట్లాడారు. గతవారం గుజరాత్లో పర్యటించిన సందర్భంగా అక్కడి అనుభవాలు, రాష్ట్రంలో బీసీ కులాల కోసం కొత్తగా చేపట్టే కార్యక్రమాలను వివరించారు. కుల వృత్తులకు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు సీఎం కేసీఆర్ సరికొత్త ఆలోచనలు చేస్తున్నట్లు చెప్పారు. అన్నిరాష్ట్రాల్లో ఉన్న కులవృత్తులకు సంబంధించిన భారీ ఎగ్జీబిషన్ను త్వరలో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. మట్టి గణపతులు, కొబ్బరినార గణపతులను మాత్రమే ఇక నుంచి ప్రోత్సహిస్తామని, దీనికి గుజరాత్లోని మాటికామ్ కళాకారి, మిట్టికూల్ సంస్థలతో ఎంవో యూ కుదుర్చుకుంటామని తెలిపారు. మిట్టికూల్ సంస్థ లాంతర్లు, కూలర్లు వంటి దాదాపు వంద రకాల మట్టి ఉత్పత్తులు చేస్తోందన్నారు. తాడూరి శ్రీనివాస్ మాట్లాడుతూ కుమ్మర వృత్తిదారులు ఆత్మగౌరవంతో జీవించేందుకు ప్రభుత్వం ప్రణాళిక రచించిందన్నారు. గుజరాత్ తరహా మట్టిపాత్రల తయారీని తెలంగాణలో ప్రోత్సహించనున్నట్లు తెలిపారు. సమావేశంలో కుమ్మరి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జయంత్రావు తదితరులు పాల్గొన్నారు. -
విదేశాలతో పోటీపడి మొక్కలు నాటుతున్నాం
మేడ్చల్ : చైనా, బ్రెజిల్ వంటి దేశాలతో సమానంగా, మనదేశంలో ఎక్కడా లేని విధం గా తెలంగాణలో సీఎం కేసీఆర్ హరితçహారం కార్య క్రమాన్ని చేపట్టారని అటవీ శాఖ మంత్రి జోగు రామన్న అన్నారు. మార్చి 21 ప్రపంచ అటవీ దినోత్స వాన్ని పురస్కరించుకుని మేడ్చల్ మండలం కండ్లకోయ ఔటర్రింగు రోడ్డు జంక్షన్ వద్ద 70 ఎకరాల్లో ఏర్పాటు చేసిన ఆక్సిజన్ పార్క్ను మంత్రి బుధవారం ప్రారంభించారు. పార్క్లో ఏవియర్(పక్షుల సందర్శన కేంద్రం)కు శంకుస్ధాపన చేశారు. గత పాలకుల నిర్లక్ష్యం వల్ల తెలంగాణలో పచ్చదనం లేకుండా పోయిందని, అటవీ సంపద నాశనమైందని మంత్రి అన్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక 4 నెలల్లోనే హరితహారం చేపట్టి రాష్ట్రంలో 230 కోట్ల మొక్కలు నాటే విధంగా కార్యాచరణ ప్రణాళిక రూపొందించారని తెలిపారు. దీని వల్ల రాష్ట్రంలో 33 శాతం పచ్చదనం పెరుగు తుందని అన్నారు. హైదరాబాద్ చుట్టూ 134 ప్రాంతాల్లో 180 అటవీ సైట్లు ఉన్నాయని, వాటిని గతంలో ఏ పాలకుడూ పట్టించుకో లేదని, నగర ప్రజల క్షేమం కోసం ప్రభుత్వం రూ.70 కోట్లు ఖర్చు చేసి 12 పార్క్లను అభివృద్ధి చేసిందని పేర్కొన్నారు. దశల వారీ గా 186 ఫారెస్ట్ బ్లాక్ల్లో అర్బన్ పార్కుల ఏర్పాటుకు సీఎం కేసీఆర్ ఆదేశించారని, త్వరలో కీసర, శామీర్ పేటల్లో కూడా పార్కులను అభివృద్ధి చేస్తామని తెలిపారు. దేశంలో ప్రతిమనిషికి సగటున 107 చెట్లు మాత్రమే ఉన్నాయని చెప్పారు. పార్క్లో క్యాంటీన్ ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే సుధీర్రెడ్డి కోరడంతో మంత్రి సానుకూలంగా స్పందించారు. -
దేశం దశ మార్చేందుకే..
సాక్షి, హైదరాబాద్: దేశం దశ మార్చేందుకే సీఎం కేసీఆర్ మూడో రాజకీయ ఫ్రంట్ ఆలోచన తెరపైకి తెచ్చారని బీసీ సంక్షేమశాఖ మంత్రి జోగు రామన్న అన్నారు. కాంగ్రెస్, బీజేపీలు అన్నింటా విఫలమయ్యాయని దుయ్యబట్టారు. బుధవారం టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో మంత్రి జోగు రామన్న, ఎమ్మెల్సీ గంగాధర్ కలిసి మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్సీ గంగాధర్ మాట్లాడుతూ.. కేసీఆర్ దేశానికి నాయకత్వం వహిస్తే అగ్రరాజ్యాలతో పోటీపడి భారత్ అభివృద్ధి సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. -
బీసీ పదోన్నతుల్లో రిజర్వేషన్లకు కేంద్రంపై ఒత్తిడి
సాక్షి, హైదరాబాద్: బీసీ ఉద్యోగులకు పదోన్నతుల్లో రిజర్వేషన్ల కోసం కేంద్రంపై ఒత్తిడి తెస్తామని, అవసరమైతే అఖిలపక్ష పార్టీలను ఢిల్లీ తీసుకెళ్తామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగురామన్న అన్నారు. ఆదివారం హైదరాబాద్లోని ఫ్యాప్సీ ఆడిటోరియంలో జరిగిన బీసీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర మహాసభకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. బీసీ పదోన్నతుల్లో రిజర్వేషన్ల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందన్నారు. బీసీ ఉద్యోగ సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలకు ప్రభుత్వ గుర్తింపు కల్పిస్తామని హామీనిచ్చారు. బీసీలకు విద్య, సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాల్లో సమాన వాటా దక్కాలనే ఆలోచనతో ప్రభుత్వం ఉందన్నారు. బీసీలకు ఆర్థికంగా చేయూతనివ్వడానికి బిక్కి అనే సంస్థను ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. క్రీమీలేయర్ను తాను వ్యక్తిగతంగా వ్యతిరేకిస్తున్నానని తెలిపారు. బీసీ ఉపాధ్యాయుల సమస్యలను ప్రభుత్వం సానుకూలంగా స్పందించి పరిష్కరిస్తుందని హామీనిచ్చారు. ఈ బడ్జెట్ సమావేశాల్లో బీసీ కమిషన్ బిల్లు ఆమోదించి చట్టం తీసుకొస్తామని మాజీ కేంద్రమంత్రి దత్తాత్రేయ అన్నారు. పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించే విషయంలో వచ్చే నెలలో కేంద్రమంత్రితో సమావేశమవుతానని తెలిపారు. బీసీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి మాజీ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, టీటీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ, జస్టిస్ వంగాల ఈశ్వరయ్య, బీసీ కమిషన్ చైర్మన్ రాములు, సభ్యులు కృష్ణమోహన్రావు, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ హాజరయ్యారు. -
కులవృత్తులకు పూర్వవైభవం
సాక్షి, హైదరాబాద్: కుల వృత్తులకు పూర్వ వైభవం కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వినూత్న కార్యక్రమాలు చేపడుతోందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న పేర్కొన్నారు. నాయీబ్రాహ్మణ యువతీ యువకులకు వృత్తినైపుణ్యంలో శిక్షణ అనంతరం సోమవారం సచివాలయంలో వారికి కిట్లు, సర్టిఫికెట్లు అందించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ సమయంలో సీఎం కేసీఆర్ కులవృత్తులకు ప్రాధాన్యత ఇస్తానని చెప్పారని, అందులో భాగంగా ప్రతికులానికి భారీ నిధులు కేటాయించి అభివృద్ధి చేస్తున్నారన్నారు. అందులో భాగంగానే నాయీబ్రాహ్మణుల సంక్షేమం కోసం రూ.250 కోట్లు కేటాయించారన్నారు. తొలివిడత కింద 138 మంది యువతీ యువకులకు శిక్షణ ఇచ్చామన్నారు. ప్రస్తుత బడ్జెట్లో నాయీ బ్రాహ్మణుల వృత్తి నైపుణ్యంకోసం రూ.20 కోట్లు కేటాయించామన్నారు. శిక్షణ పొందిన 138 మంది నాయీ బ్రాహ్మణ యువతీ, యువకులు భవిష్యత్తులో ఆత్మగౌరవంతో తమ కాళ్లపై నిలబడేలా తయారు చేశామన్నారు. రానున్న బడ్జెట్లో బీసీ వర్గాల బడ్జెట్ రెట్టింపు కానుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం బీసీ సంక్షేమానికి రూ.5,070 కోట్లు కేటాయిస్తే కేంద్ర ప్రభుత్వం మాత్రం రూ.1,250 కోట్లు మాత్రమే కేటాయించిందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్, ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ తాడూరి శ్రీనివాస్, నాయీ బ్రాహ్మణ ఫెడరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వసతిగృహ సంక్షేమాధికారుల సంఘం క్యాలెండర్ను మంత్రి జోగు రామన్న ఆవిష్కరించారు. -
మహిళల అభ్యున్నతే ధ్యేయం
జైనథ్(ఆదిలాబాద్): మహిళల అభ్యున్నతి, సంక్షేమమే ధ్యేయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని ప్రభుత్వం పని చేస్తోందని రాష్ట్ర అటవీ, పర్యావరణ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న అన్నారు. గురువారం మండల కేంద్రంలోని మార్కెట్యార్డులో ఆదిలాబాద్, జైనథ్, బేల మండలాల్లోని 260 మంది మహిళలకు దళితబస్తీ పెట్టుబడి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరుపేద దళితులను రైతులుగా మార్చడమే లక్ష్యంగా దళితబస్తీ పథకాన్ని ప్రవేశపెట్టినట్లు తెలిపారు. మొదటి సంవత్సరం పెట్టుబడి ఖర్చుతోపాటు భూమి అభివృద్ధి, సాగునీటి సౌకర్యాల కల్పనకు నిధులు అందిస్తున్నామని అన్నారు. ఆదిలాబాద్ నియోజకవర్గంలో ఇప్పటివరకు 1500 ఎకరాలు అందించామని, త్వరలో మరో వెయ్యి ఎకరాల భూమిని లబ్ధిదారులకు అందిస్తామని తెలిపారు. వచ్చే ఖరీఫ్ కంటే ముందు మే 15 వరకు ఖరీఫ్ కోసం ఎకరానికి రూ.4వేలు రూపాయల పెట్టుబడి ఖర్చును ప్రభుత్వం చెక్కుల రూపంలో అందిస్తుందని తెలిపారు. రబీలో పంటలు వేసుకున్న రైతులకు సైతం ఎకరానికి రూ.4 వేల చొప్పున అందిస్తామని పేర్కొన్నారు. రైతులు వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడం కోసం ప్రతి 5 వేల ఎకరాలకు ఒక ఏఈవోను నియమించామని, గ్రామాల్లో క్లస్టర్ వారీగా మట్టి పరీక్షలు చేసే మినీ ల్యాబ్లను అందుబాటులోకి తెచ్చామని అన్నారు. త్వరలో క్లస్టర్కు ఒక రైతు భవనం నిర్మించి, రైతులకు సలహాలు, సూచనలు అందించేందుకు శాశ్వత వేదికలను గ్రామాల్లో ఏర్పాటు చేస్తామని అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ మరో ఇరవై ఏళ్లు కొనసాగుతారని మంత్రి ధీమా వ్యక్తం చేశారు. అనంతరం దళితబస్తీ లబ్ధిదారులకు పెట్టుబడి ఖర్చు చెక్కులను మంత్రి అందజేశారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కృష్ణారెడ్డి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ రౌతు మనోహర్, బేల ఎంపీపీ రఘుకుల్రెడ్డి, ఏఎంసీ మాజీ చైర్మన్లు అడ్డి భోజారెడ్డి, తల్లెల చంద్రయ్య, రైతు సమన్వయ సమితి మండల కోఆర్డినేటర్ సర్సన్ లింగారెడ్డి, మార్కెట్కమిటీ వైస్ చైర్మన్ ఎల్టి భూమారెడ్డి, వైస్ ఎంపీపీ రోకండ్ల సురేశ్రావు, నాయకులు గంబీర్ ఠాక్రే, గడ్డ పోతరెడ్డి, వివిధ గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. ఎడ్లబండెక్కిన మంత్రి మంత్రి జోగు రామన్న గురువారం ఎడ్లబండిపై మార్కుట్యార్డుకు చేరుకున్నారు. ఎప్పుడూ కారులో తిరిగే మంత్రి బండెక్కి నడపడంతో ప్రజలు ఆసక్తిగా తిలకించారు. తాను ఒకప్పుడు స్వయంగా తన భార్యతో కలిసి చేనులో పని చేసిన రైతు బిడ్డనని, చాలా రోజుల తర్వాత ఎడ్లబండి నడపడం సంతోషంగా ఉందని మంత్రి ఆనందం వ్యక్తం చేశారు. ఘనంగా సన్మానం మంత్రి రామన్నను ఆయా మండలాల్లోని దళితబస్తీ లబ్ధిదారులు, మహిళలు ఘనంగా సన్మానించారు. తమ భూముల్లో బోర్లు, బావులు వేసుకునేందుకు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా నిధులు మంజూరు చేయాలని కోరారు. భూమి చదును చేసుకోవడానికి డబ్బులు ఇప్పించాలని వేడుకున్నారు. -
బ్యాంకుతో లింకు లేకుండా రాయితీ రుణాలు
సాక్షి, హైదరాబాద్: బ్యాంకర్ల సహకారం లేకపోవడంతో ఫైనాన్స్ కార్పొరేషన్ల ద్వారా ఇచ్చే రాయితీ రుణ లక్ష్యాల పురోగతి అంతంతమాత్రంగానే ఉండేదని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ అభిప్రాయపడ్డారు. ఇకపై బ్యాంకర్ల గొడవ లేకుండా లబ్ధిదారులకు రుణాలు అందేలా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతోందన్నారు. శుక్రవారం బీసీ నివేదికపై కేబినెట్ సబ్ కమిటీ సమావేశమైంది. బీసీ సంక్షేమ మంత్రి జోగు రామన్న అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో స్వయం ఉపాధి, ఆర్థిక చేకూర్పు పథకాలపై చర్చించారు. 2018–19 సంవత్సరం సంక్షేమ కార్యక్రమాలకు కేంద్రంగా మారుతుందని ఈ సందర్భంగా ఈటల అన్నారు. గొల్ల, కురుమలు, మత్స్యకారుల ఉపాధికి ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టామన్నారు. బీసీల సంక్షేమం కోసం కమిటీ పలుమార్లు చర్చించిందని, అన్ని వర్గాల అభిప్రాయాలు సేకరించిందన్నారు. నివేదిక తుది దశకు వచ్చిందని, మరోమారు సమీక్షించి ïసీఎంకు సమర్పిస్తామన్నారు. -
బీసీల అభివృద్ధికి ప్రత్యేక చొరవ
సాక్షి, హైదరాబాద్: బీసీల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుంటోం దని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న పేర్కొన్నారు. మెజీషియన్ కోర్సు పూర్తి చేసుకున్న 25 మంది విద్యార్థులకు సచివాలయంలోని డీ బ్లాక్లో కిట్లు, సర్టిఫికెట్లను గురువారం అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి జోగు రామన్న మాట్లాడుతూ.. బీసీల అభ్యున్నతికి సీఎం కేసీఆర్ కృషి చేస్తు న్నారని, త్వరలో సరికొత్త ప్రణాళికను తీసుకురానున్నట్లు చెప్పారు. కులవృత్తుల ఆదరణకు ప్రభుత్వం సరికొత్త ప్యాకేజీలు ఇవ్వబోతోందన్నారు. బీసీ యువతను ప్రోత్సహించేందుకు పలురకాల కోర్సుల్లో శిక్షణ ఇస్తున్నామన్నారు. దీనిలో భాగంగా 25 మంది బీసీ విద్యార్థులు మెజీషియన్ కోర్సు పూర్తి చేశారన్నారు. మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ మాట్లాడుతూ.. విపక్షాలు నిరుద్యోగులను రెచ్చగొడుతున్నాయని, వారి మాటల్ని ప్రజలు నమ్మబోరన్నారు. కార్యక్రమంలో బీసీ శాఖ ముఖ్య కార్యదర్శి అశోక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
రెండు రోజుల్లో సీఎంకు ‘బీసీ’ నివేదిక
సాక్షి, హైదరాబాద్: వెనకబడిన కులాల అభివృద్ధి, సంక్షేమానికి చేపట్టాల్సిన పథకాలు, కార్యక్రమాలపై మూడు రోజుల పాటు చర్చించామని, అనేక ప్రతిపాదనలు వచ్చాయని, వీటిని నివేదిక రూపంలో రెండు రోజుల్లో సీఎం కేసీఆర్కు అందిస్తామని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ చెప్పారు. ప్రధానంగా ఆర్థిక మద్దతు, సర్వీస్ సెక్టార్, సంచార జాతుల సంక్షేమంపై చర్చించినట్లు తెలిపారు. అసెంబ్లీ కమిటీ హాల్లో మంగళవారం మూడో రోజు సమావేశం ముగిశాక బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్నతో కలసి ఆయన మాట్లాడారు. బీసీల కోసం ఇప్పటికే ఉన్న 123 బీసీ రెసిడెన్షియల్ స్కూళ్లకు అదనంగా వచ్చే విద్యా సంవత్సరం నుంచి మరో 119 రెసిడెన్షియల్ స్కూళ్లను నడపాలని ప్రతిపాదించినట్లు చెప్పారు. బీసీల్లోని సంచార జాతులు ఇప్పటి వరకు బ్యాంకు మెట్లు కూడా ఎక్కలేదని, వీరికోసం ఓ కార్పొరేషన్ ఏర్పాటు చేసి బ్యాంకులతో నిమిత్తం లేకుండా రుణాలిచ్చే ఏర్పాటు చేయాలని ప్రతిపాదన ఉందని చెప్పారు. బీసీలు రాజకీయ శక్తిగా ఎదిగేం దుకు చర్యలు తీసుకోవాలని, స్థానిక సంస్థల్లో ఉన్న 34 శాతం రిజర్వేషన్ను మరింత పెంచాలని కోరుతామని పేర్కొన్నారు. బీసీల్లో మొత్తం 113 కులాలు ఉంటే చట్ట సభల్లోకి ఐదారు కులాల వారే అవకాశాలు పొందారని, మిగిలిన వారు అసెంబ్లీ మెట్లు కూడా ఎక్కలేదని పేర్కొన్నారు. చట్టసభల్లో బీసీల రిజర్వేషన్ కోసం తీర్మానం చేశామని, ప్రధాని వద్దకు అఖిలపక్షాన్ని తీసుకెళ్తామని చెప్పారు. బీసీల సమస్యలపై మూడు రోజులపాటు విస్తృతంగా సమీక్షించామని, పార్టీలకు అతీతంగా నిర్వహించడం అభినందనీయమని ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య పేర్కొన్నారు. సమావేశంలో ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, శ్రీనివాస్గౌడ్, మండలిలో ప్రభుత్వ విప్ బోడకుంటి వెంకటేశ్వర్లు, ఎమ్మెల్సీ వి.గంగాధర్ గౌడ్ పాల్గొన్నారు. రైతు సమితులు పెత్తనానికి కాదు..వ్యవసాయ మంత్రి పోచారం సాక్షి, హైదరాబాద్: రైతు సమన్వయ సమితులు వ్యవసాయాధికారులపై పెత్తనాని కి కాదని వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ప్రపంచ భూసార దినోత్సవంలో భాగంగా వ్యవసాయ కమిషనర్ డాక్టర్ జగన్మోహన్ అధ్యక్షతన మంగళవారం సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వ్యవసాయ కార్యదర్శి సి.పార్థసారథి, వ్యవసాయ పరిశోధనా సంచాలకులు ప్రదీప్కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోచారం మాట్లాడారు. రైతులు భవిష్యత్తులో ప్రతి సీజన్లో ఎకరాకు రూ.50 వేలు లాభం పొందే విధంగా రైతు సమన్వయ సమితి సభ్యులు, వ్యవసాయ శాఖ అధికారులు పనిచేయాలని అన్నారు. భూసార కార్డుల ఆధారంగా ఎరువులు వాడితే సాగు ఖర్చు గణనీయంగా తగ్గనుందన్నారు. ఏఏ ఎరువులు ఎంత మోతాదులో అవసరమో తెలియక రైతులు రసాయన ఎరువులను విచక్షణారహితంగా వాడుతున్నారని, దీంతో భూసారం దెబ్బతింటున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మొత్తం 2,630 వ్యవసాయ విస్తరణాధికారుల క్లస్టర్లలో మినీ భూసార పరీక్ష కేంద్రాలను నెలకొల్పుతున్నామన్నారు. వీటిని క్లస్టర్ కేంద్రంలో రూ.15 లక్షలతో నిర్మించే రైతు వేదికలలో నెలకొల్పుతామన్నారు. గతంలో మెట్ట ప్రాంతమైతే 25 ఎకరాలకు, తడి భూములయితే 6.25 ఎకరాలకు ఒక నమూనా సేకరించేవారని, ఇకనుంచి ప్రతి రైతు భూమిని భూసార పరీక్ష చేయిస్తామన్నారు. ప్రతీ రైతుకు భూసార కార్డులను పంపిణీ చేస్తామన్నారు. రైతులు కోరితే వచ్చే జనవరి నుంచి 24 గంటల కరెంటు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. రాష్ట్రంలో రైతులు పంటలు వేసే విధానాన్ని మార్చుకోవాలన్నారు. ఈ సందర్భంగా మంత్రి 2017–18కి సంబంధించిన భూసార కార్డులను రైతులకు అందించారు. భూసార పరీక్షలపై అవగాహన కరపత్రాన్ని విడుదల చేశారు. పంటల యాజమాన్యంపై సమాచారం కోసం ప్రత్యేక యాప్ ‘‘పంటల యాజమాన్యం’ను ఆవిష్కరించారు. -
జనవరి 3నుంచి ‘భారత సైన్స్ కాంగ్రెస్’
సాక్షి, హైదరాబాద్: జనవరి 3 నుంచి 7 వరకు ఉస్మానియా వర్సిటీలో భారత సైన్స్ కాంగ్రెస్ 105వ సమావేశాన్ని నిర్వహించనున్నట్లు అటవీ శాఖ మంత్రి జోగు రామన్న తెలిపారు. ఈ కార్యక్రమానికి 30 మంది నోబెల్ బహుమతి గ్రహీతలు హాజరుకానున్నారన్నారు. సోమవారం సచివాల యంలో మంత్రి మాట్లాడుతూ ఉమ్మడి 9 జిల్లా కేంద్రాల్లో రూ.166.40 కోట్ల వ్యయంతో సైన్స్ సెంటర్లు, వరంగల్, కరీంనగర్ జిల్లా కేంద్రాల్లో స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్ కింద రేడియేషన్ టెక్నాలజీ ప్లాంట్స్ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో సైన్స్ వ్యాప్తికోసం ముమ్మరంగా ప్రచార కార్యక్రమాలను నిర్వహించాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా రూ.8.56 లక్షల వ్యయంతో బీసీ గురుకుల పాఠశాలల్లో 20 కిచెన్ వేస్ట్ ఆధారిత బయోగ్యాస్ ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. సమావేశంలో అటవీ శాఖ ముఖ్య కార్యదర్శి రజత్కుమార్, ఆర్థిక శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా పాల్గొన్నారు. -
పార్కుల అభివృద్ధికి 100 కోట్లు: జోగు రామన్న
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని అర్బన్ పార్కుల అభివృద్ధి కోసం రూ.100 కోట్లు ఖర్చు చేయడానికి సీఎం సిద్ధంగా ఉన్నట్లు అటవీ శాఖ మంత్రి జోగురామన్న వెల్లడించారు. శనివారం మంత్రి జోగురామన్న, మేయర్ బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్, జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, అటవీశాఖ ఉన్నతాధికారులు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోని పార్క్ల్లో పర్యటించారు. నగరం చుట్టుపక్కల సుమారు 99 పార్కులున్నాయని, గత పాలకుల నిర్లక్ష్యంతో వాటి అభివృద్ధి జరగలేదన్నారు. నగరం చుట్టూ పచ్చదనాన్ని పెంచి, అటవీ బ్లాక్లను మరింత అభివృద్ధి చేయాలన్న సంకల్పంతో తమ ప్రభుత్వం ఉందన్నారు. హైదరా బాద్ను ఆరోగ్యకర రాజధానిగా తీర్చిదిద్దడానికి తొలి ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏల సమన్వయంతో ఈ కార్యక్రమాలు పూర్తి చేస్తామన్నారు. -
అడవిలో దారితప్పిన అటవీశాఖ మంత్రి!
నర్సాపూర్ రూరల్: మెదక్ జిల్లా నర్సాపూర్లో మొక్కలు నాటేందుకు వచ్చిన అటవీశాఖ మంత్రి జోగు రామన్న తదితరులు అడవిలో దారితప్పారు. నర్సాపూర్– హైదరాబాద్ రహదారిలో పందివాగు నుంచి మొక్కలు నాటే స్థలం వరకు మూడు కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఆ అటవీ ప్రాంతానికి మంత్రి జోగు రామన్న, డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ రాజమణీ మురళీధర్యాదవ్, ఎమ్మెల్యే మదన్రెడ్డి, కలెక్టర్ భారతీహోలికేరి కాలినడకన చేరుకున్నారు. మొక్కలు నాటాక.. నాలుగు కిలోమీటర్ల దూరంలో దట్టమైన అడవిలో పరుపు బండ వద్ద భోజ నాల కోసం కాలినడకనే బయలుదేరారు. మంత్రి జోగు రామన్న, ఎమ్మెల్యే మదన్రెడ్డి ఇత రులు కలసి ముచ్చటించుకుంటూ వస్తుండగా దారి తప్పి మరో మూడు కిలోమీటర్ల దూరం వెళ్లారు. ఇది గమనించిన పోలీసులు వారిని తిరిగి భోజనాల స్థలం వద్దకు క్షేమంగా తీసుకొచ్చారు. -
హరితహారం.. ఓ ఉద్యమం
ఈ సారి 40 కోట్ల మొక్కలు నాటుతాం: జోగు రామన్న సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం హరితహారం కార్యక్రమాన్ని ఓ ఉద్యమంలా చేపడుతోందని, ప్రత్యేక తెలంగాణ ఉద్యమం తరహాలోనే ప్రజలంతా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని అటవీ శాఖ మంత్రి జోగు రామన్న పిలుపునిచ్చారు. బుధవారం మూడో విడత హరితహారం కార్యక్రమాన్ని సీఎం కేసీఆర్ కరీంనగర్లో ప్రారంభిస్తారని చెప్పారు. సోమవారం సచివాలయంలో తన చాంబర్లో మంత్రి విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా గత రెండేళ్లలో 49 కోట్ల మొక్కలను నాటామని, మూడో విడతలో 40 కోట్ల మొక్కలు నాటాలని నిర్ణయించామన్నారు. వచ్చే నాలుగేళ్లలో రాష్ట్రంలో 230 కోట్ల మొక్కలు నాటాలని సంకల్పించామని, ఇందులో 120 కోట్ల మొక్కలు ప్రభుత్వ, ప్రైవేటు స్థలాల్లో, 100 కోట్ల మొక్కలు అటవీ ప్రాంతం (డీ గ్రేడ్ ఫారెస్ట్)లో, మరో 10 కోట్ల మొక్కలు జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ పరిధిలో నాటాలని నిర్ణయించామని మంత్రి వివరించారు. -
ప్రజా సంక్షేమమే ధ్యేయం
⇒ రాష్ట్ర అటవీ, పర్యావరణ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న ⇒ కామాయిలో గ్రామ పంచాయతీ భవనం ప్రారంభం జైనథ్(ఆదిలాబాద్): కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ నాయకత్వంలో, అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం ముందుకుసాగుతోందని రాష్ట్ర అటవీ, పర్యావరణ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న అన్నారు. మండలంలోని కామాయి గ్రామ పంచాయతీ భవనాన్ని ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ.. యావత్ భారతదేశంలోనే అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణ రాష్ట్రం మొదటి స్థానంలో ఉందన్నారు. పేదల కోసం ఆహార భద్రత, ఆసరా పింఛన్లు, కల్యాణలక్ష్మీ, షాదీముబారక్, దళితులకు మూడెకరాల భూమి, విద్యార్థులకు సన్నబియ్యం, ఆరోగ్యలక్ష్మి, అమ్మఒడి, డబుల్ బెడ్ రూం, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థుల కోసం రెసిడెన్షియల్ విద్య వంటి ఎన్నో సంక్షేమ పథకాలు తెలంగాణ రాష్ట్రంలో తప్ప మరెక్కడా లేవన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రూ.లక్ష లోపు ప్రతీ రైతు వ్యవసాయ రుణాన్ని మాఫీ చేసామని పేర్కొన్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి రైతులకు ఖరీఫ్, రబీ సాగుల కోసం ఎకరానికి ఎరువుల ఖర్చుల కోసం రూ. 4వేలు ఇచ్చే కార్యక్రమం కూడా చేపట్టనున్న ట్లు స్పష్టం చేశారు. రాష్ట్రంలో 1.08లక్షల ఉద్యోగ ఖాళీ లున్నాయని, ఇందులో వివిధ సుమారు 50వేల పోస్టులను టీఎస్పీఎస్సీ ద్వారా భర్తీ చేసేందుకు ఆర్థిక శాఖ సైతం ఆమోదం తెలిపిందన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలు రాని వారి కోసం ప్రైవేట్ రంగంలో కూడా అవకాశాలు కల్పిస్తున్నామన్నారు. యువత స్వయం ఉపాధి వైపు కూడా ఆలోచన చేయాలని, సొంతంగా చిన్న చిన్న పరి శ్రమల స్థాపనకు ముందుకు వస్తే అవసరమైన అవకాశాలు కల్పిస్తామని అన్నారు. రాష్ట్ర ఏర్పాటు అనంతరం కేవలం మూడేళ్లలో ఇన్ని కార్యక్రమాలు చేపడితే, కళ్లు లేని ప్రతిపక్షాలు పసలేని ఆరోపణలతో తమ ఉనికిని చాటుకునేందుకు ప్రయత్నిస్తున్నాయన్నారు. ఇకనైనా వి మర్శలు మాని, అభివృద్ధికి సహకరించాలన్నారు. ప్రజ లు కూడా విజ్ఞతతో ఆలోచించి, రానున్న ఎన్నికల్లో ప్రజల కోసం అహర్నిశలు పరితపిస్తున్న టీఆర్ఎస్కే పట్టం కట్టాలని ఆయన కోరారు. కార్యక్రమంలో ఆది లాబాద్ ఏఎంసీ చైర్మన్ ఆరే రాజన్న, ఐటీడీఏ డైరెక్ఖర్ పెందూర్ దేవన్న, లక్ష్మీనారాయణ స్వామి ఆలయ చైర్మన్ సర్సన్ లింగారెడ్డి, ఏఎంసీ మాజీ చైర్మన్ తల్లెల చంద్రయ్య, జైనథ్ ఏఎంసీ వైస్ చైర్మన్ ఎల్టి భూమారెడ్డి, గ్రామ సర్పంచ్ వైద్య శాలిని, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు తుమ్మల వెంకట్రెడ్డి, సర్పంచుల సంఘం మండ ల అధ్యక్షుడు కుంచెట్టి కేశవ్, ఎంపీటీసీల సంఘం మం డల గౌరవ అధ్యక్షుడుఊషన్న, గ్రామస్తులుపాల్గొన్నారు. -
ప్రతీ మొక్కను బతికించాలి..
► పక్కా ప్రణాళికతో హరితహారం ► మొక్కల సంరక్షణపై ప్రత్యేక దృష్టి ► గతానుభవాలు పునరావృతం కాకూడదు ► 50 శాతం బతికితే మొక్కకు 5 రూపాయలు ► నిధుల విషయంలో రాజీలేదు.. ► అటవీశాఖదే పెద్దన్న పాత్ర ► 12న లక్ష మొక్కలతో హరితహారం ప్రారంభం ► అధికారులతో సమీక్షించిన మంత్రులు జోగురామన్న, ఈటల రాజేందర్ రెండేళ్లలో పట్టణాల్లో మినహా గ్రామీణ ప్రాంతాల్లో రాష్ట్రవ్యాప్తంగా 67 శాతం మొక్కలు బతికాయి.. అందుకే ముఖ్యమంత్రి పట్టణాలపై ప్రత్యేక దృష్టి సారించారు. మండలస్థాయిలోనూ మొక్కల లెక్కలు పక్కాగా రావడం లేదు. పచ్చదనాన్ని పెంచాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి హరితహారాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.. పక్కా ప్రణాళికలు రూపొందించుకుని అధికారులు సమన్వయంతో విజయవంతం చేయాలి. మొక్కలు నాటడమే కాకుండా వాటి ని సంరక్షించేందుకు బాధ్యతగా వ్యవహరించాలి. – జోగురామన్న, అటవీశాఖ మంత్రి గతానుభవాలను దృష్టిలో ఉంచుకుని ముందుకెళ్లాలి. ఈ ఏడాది వంద శాతం లక్ష్య సాధనకు కృషి చేయాలి. జిల్లాలో ఎన్ని మొక్కలు పెట్టామని కాదు.. ఎన్ని బతికాయన్నదే ముఖ్యం. మొక్కుబడిగా కాకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. సంఖ్య కో సం, ఫొటోలకు ఫోజుల కోసం కాకుండా మొక్కలు బతికేలా చర్యలు తీసుకోవాలి. ముఖ్యమంత్రి పర్యటనకు ముందే అంతా సిద్ధం కావాలి. – ఈటల రాజేందర్, రాష్ట్ర ఆర్థిక మంత్రి సాక్షి, కరీంనగర్/కరీంనగర్సిటీ: ముఖ్యమంత్రి మానసపుత్రికగా ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన మూడో విడత హరితహారం కార్యక్రమాన్ని పక్కా ప్రణాళికతో విజ యవంతం చేయాలని మంత్రులు పిలుపునిచ్చారు. సో మవారం కరీంనగర్ కలెక్టరేట్లో మూడో విడత హరితహారం అమలుపై ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్తో కలిసి అటవీశాఖ మంత్రి జోగు రామన్న అధికారులతో సమీక్షించారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని మొక్కల నాటడమే కాకుండా వాటిని సంరక్షించేందుకు బాధ్యతగా వ్యవహరించాలని అధికారులను ఆదేశించా రు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఈనెల 12న కరీంనగర్కు రానున్నట్లు వెల్లడించారు. ఆ రోజు కరీంనగర్ పట్టణంలో లక్ష మొక్కలు నాటే కార్యక్రమంతో హరితహారాన్ని ప్రారంభిస్తారని తెలిపారు. కరీంనగర్ జిల్లాలో మూడో విడతగా 1.10 కోట్ల మొక్కలు నాటే లక్ష్యంతోపాటు కరీంనగర్ పట్టణంలో లక్ష మొక్కలు నాటే ప్రణాళికలు, పనుల ప్రగతిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. రెం డేళ్లుగా రాష్ట్రంలో తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో మొదటి సంవత్సరంలో 16 కోట్లు, రెండో సం వత్సరంలో 32 కోట్లు మొక్కలు నాటామని తెలిపారు. అందులో 67 శాతమే రక్షించుకున్నామని వివరించారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని మూడో విడత పకడ్బందీగా ప్రణాళికలు రూపొందించామని తెలిపా రు. పాఠశాలలో మొక్కల నిర్వహణకు ఉపాధిహామీ నిధులిస్తామని స్పష్టం చేసినప్పటికీ విద్యాశాఖ విని యోగించడం లేదన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థల్లో మొక్కల నిర్వహణకు బాధ్యతలు అప్పగించాలన్నారు. ప్రతీ శాఖ ద్వారా నాటే మొక్కల నిర్వహణకు నిధులున్నాయని తెలిపారు. మండల స్థాయి నుంచే మొక్కల లెక్కలు పక్కాగా తెలియడం లేదని, అది పునరావృతం కాకుండా సమగ్ర నివేదికలు ఎప్పటికప్పుడు సిద్ధం చేసుకోవాలన్నారు. ఎన్ని ఇళ్లున్నాయి? ఎన్ని కిలోమీటర్ల రోడ్లు? సంస్థలు? అందులో ఆర్అండ్బీ, పంచాయతీరాజ్ రోడ్లు? గతంలో తీసుకున్నదెంత? ఇప్పుడెంత? అనే సమగ్ర వివరాలతో ముందుకుపోవాలన్నారు. ఎంపీడీవోలు మండలస్థాయిలో ఎంపీడీవోలు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఆమ్లెట్ గ్రామాలకు కూడా హరితరక్షణ కమిటీ బాధ్యతలు అప్పగించాలన్నారు. రోడ్డు వెడల్పు, పైపులైన్ల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించి పనులు పూర్తయిన రోడ్ల వద్దనే మొక్కలు నాటాలన్నారు. పట్టణాల్లో కూడా హరితరక్షణ కమిటీలను బలోపేతం చేస్తున్నామని, అందుకు తగిన నిధులను, నీటి వసతులను కల్పిస్తున్నామని తెలిపారు. రాబోయే తరాలకు ఆకుపచ్చని పరిసరాలను అందించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. నాటిన మొక్కల రక్షణకు నిధుల కొరత లేదని, మొక్కల రక్షణ బాధ్యతలను అప్పగించాలన్నారు. మండలస్థాయిలోనే ఎప్పటికప్పుడు సమీక్షలు జరుపుతూ సమన్వయంతో విజయవంతం చేయాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో 50 శాతం మొక్కలు బతికితే ఉపాధిహామీ కింద ప్రతీ మొక్కకు నెలకు రూ.5 చొప్పున అందజేస్తామన్నారు. జిల్లాలో గుట్టలు, ప్రభుత్వ స్థలంలో నీటి కోసం బోర్లతో నీటి సరఫరాకు నిధులు విడుదల చేస్తామన్నారు. హరితహారంలో అటవీశాఖ పెద్దన్న పాత్ర పోషించాలన్నారు. రాష్ట్రంలో 230 కోట్ల మొక్కలు నాటితే 100 కోట్ల మొక్కలు అటవీశాఖ ద్వారా నాటామని తెలిపారు. అన్ని శాఖల సమన్వయంతో ప్రజల భాగస్వామ్యంతో హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. హరితహారం ప్రతిష్టాత్మకం..: ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. తెలంగాణకు హరితహారం కార్యక్రమాన్ని ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చే పట్టిందన్నారు. ఈ ఏడాది హరితహారం గొప్పగా ఉం టుందన్నారు. హరితహారానికి వందల కోట్లు ఖర్చు పెడుతున్నామని, నిధుల విషయంలో రాజీలేదని స్ప ష్టం చేశారు. ఫెన్సింగ్ ఏర్పాటు చేసి ప్రతి మొక్కనూ కాపాడుకునేలా ముందుకు పోవాలని సూచించారు. ఎల్ఎండీ డ్యాం, శ్మశానవాటికలు, రోడ్లు, దేవాలయాలు, ప్రభుత్వ భూములు, ఖాళీ స్థలాల వద్ద విరివిగా మొక్కలు నాటవచ్చన్నారు. రెండేళ్ల క్రితమున్న భూములు ఇప్పుడూ ఉన్నాయన్నారు. నగరంలోని గిద్దెపెరుమాండ్ల ఆలయంలోని ఖాళీస్థలంలో ట్రీగార్డుల బదులు ట్రీగార్డుల బదులు ప్రహరీ నిర్మిస్తే కొన్ని వేల మొక్కలు బతికించే అవకాశముందని, అందుకు తగిన నిధులు మంజూరు చేస్తామని తెలిపారు. ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్రావు మాట్లాడుతూ.. లెక్కలే ఉన్నాయి గాని మొ క్కలు లేని అనుభవాలు ఎదురయ్యాయన్నారు. రెండేళ్లలో ఆశించినంత సాధించలేకపోయామన్నారు. గత ప్ర భుత్వాలకు భిన్నంగా సం క్షేమంతో పాటు హరితహారా న్ని ప్రాధాన్యతగా తీసుకున్న ఘనత సీఎం కేసీఆర్దేనన్నారు. నిరంతర సమీక్షలతో బాధ్యతాయుతంగా కృషి చేయాలని, కార్పొరేషన్ అధికారులు బాధ్యతగా వ్యవహరించి లక్ష మొక్కలు నాటే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. నగర మేయర్ సర్దార్ రవీందర్సింగ్ మాట్లాడుతూ.. కరీంనగర్ను ఆకుపచ్చ నగరంగా తీర్చిదిద్దుతామన్నా రు. హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్బాబు మాట్లాడుతూ.. ప్రజాప్రతినిధులు, అధి కారుల సమన్వయంతో ప్రజల భాగస్వామ్యంతో హ రితహారం విజయవంతం కావాలన్నారు. అటవీశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ పీకే ఝా, కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మ ద్, నగర పాలక సంస్థ కమిషనర్ శశాంక, హరితహారం స్పెషలాఫీసర్ ఆంజనేయులు, ఏసీపీ జె.రామారావు, డీఆర్డీవో వెంకటేశ్వర్రావు, డీఈవో రాజీవ్, డీపీవో నారాయణరావు, జైలు సూపరింటెండెంట్ శివకుమార్, బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ సరోజన, ఎక్సైజ్ ఈఎస్ శంకర య్య, ఎంపీడీవోలు, వివిధ శాఖల అధికారులున్నారు. -
అధికారులు తీరు మార్చుకోవాలి
♦ కాగితంపై కాదు.. చేతల్లో చూపించాలి ♦ అటవీశాఖ మంత్రి జోగు రామన్న ♦ విద్యార్థులు తక్కువ సంఖ్యలో హాజరు కావడంతో ఉపాధ్యాయులపై ఆగ్రహం ♦ నీటిట్యాంకుల నిర్మాణానికి భూమిపూజ ఆదిలాబాద్రూరల్: సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయిలో అమలు చేయడంలో అధికారులు విఫలం అవుతున్నారని, వారు పని తీరు మార్చుకోవాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న హెచ్చరించారు. వాటర్గ్రిడ్ పనుల్లో భాగంగా శుక్రవారం మండలంలోని లోకారి, రాములుగూడ, యాపల్గూడ గ్రామాల్లో వాటర్ ట్యాంకుల నిర్మాణానికి భూమి పూజ చేశారు. లోకారి పాఠశాలను సందర్శించిన ఆయన ప్రార్థనలో పాల్గొన్నారు. పాఠశాల ఆవరణలో హరితహారం కింద నాటిన మొక్కలను పరిశీలించారు. పాఠశాల ఆవరణలో పిచ్చి మొక్కలు, అపరిశుభ్రత, విద్యార్థుల హాజరు శాతం తక్కువగా ఉండడంతో ఉపాధ్యాయులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తరగతి గదిల్లోకి వెళ్లి విద్యార్థులకు పలు ప్రశ్నలు అడుగగా.. వారు సమాధానాలు చెప్పకపోవడంతో విద్యాబోధన ఇలా ఉంటే ఎలా అని ఉపాధ్యాయులను ప్రశ్నించారు. ప్రభుత్వ పాఠశాల్లో ఇంగ్లిషు మీడియం బోధించాలని పలుమార్లు డీఈవోలకు ఆదేశాలను జారీ చేసినా అమలుకు నోచుకోవడం లేదని అన్నారు. భూగర్భ జలాల పెంపుదల కోసం ప్రభుత్వం ఇంకుడుగుంతల నిర్మాణాల కార్యక్రమం చేపడితే అధికారుల పర్యవేక్షణ లోపంతో తూతూమంత్రంగా ఇంకుడుగుంతలు నిర్మించడం సరికాదని అన్నారు. కాగితాల్లో వందలాది ఇంకుడుగుంతలను నిర్మించామని చెబుతున్న అధికారులు క్షేత్రస్థాయిలో వాటిని పరిశీలిస్తే నిరుపయోగంగా కనిపిస్తున్నాయని తెలిపారు. అందుక లోకారిలోని పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన ఇంకుడు గుంతనే అందుకు ఉదాహరణగా పేర్కొన్నారు. అక్కడి నుంచి చిన్న లోకారి గ్రామానికి వెళ్లిన మంత్రి పాఠశాలలో ఉపాధ్యాయురాలు లేకపోవడంపై అక్కడి నుంచి సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడారు. వెంటనే సస్పెండ్ చేయాలని సూచించారు. రాములుగూడకు వెళ్లిన మంత్రి గ్రామంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రూ.4 వేల కోట్లతో వాటర్గ్రిడ్ పనులు జిల్లాలో రూ.4వేల కోట్లతో వాటర్గ్రిడ్ పనులు చేపట్టినట్లు మంత్రి రామన్న తెలిపారు. ఆయా కార్యక్రమాల్లో మాట్లాడుతూ వచ్చే ఖరీఫ్ సీజన్ నుంచి రైతులకు ఎకరానికి రూ.4వేల చొప్పున రెండు పంటలకు రూ.8వేలు అందిస్తామని అన్నారు. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా తప్పనిసరిగా అమలు చేసేలా చట్టాన్ని తీసుకు వస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఆరె రాజన్న, ఎంపీపీ నైతం లక్ష్మీశుక్లాల్, మండల పరిషత్ ఉపాధ్యక్షుడు గంగారెడ్డి, జెడ్పీటీసీ సభ్యుడు ఇజ్జగిరి అశోక్, సర్పంచ్లు మడావి స్వప్నతుకారాం, ఇస్రూబాయి, ఉష్కం రఘుపతి, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు బక్కీ స్వామి, ఆర్డీవో సూర్యనారాయణ, ఎంపీడీవో రవీందర్, తహసీల్దార్ మధుకర్, ఆర్డబ్ల్యూఎస్ డీఈ రమణ, ఏఈ సతీష్ కుమార్, తదితరులు పాల్గొన్నారు. -
రజక, నాయి బ్రాహ్మణుల ఉపాధి పథకాలకు..
► రూ.500 కోట్లు కేటాయింపు ► మంత్రులు ఈటల, జోగు రామన్న సాక్షి, హైదరాబాద్: రజకులు, నాయిబ్రాహ్మణుల ఉపాధి పథకాల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది రూ.500 కోట్లు కేటాయించిందని ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్, బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న పేర్కొన్నారు. ఆదివారం సచివాలయంలో రజక, నాయి బ్రాహ్మణ సంఘాల ప్రతినిధులతో వేరువేరుగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారి సమస్యలను అడిగి తెలుసుకున్న మంత్రులు... వచ్చే నెలలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో ప్రగతి భవన్లో ఉపాధి పథకాలను ప్రారంభిస్తామ న్నారు. కులవృత్తులపై ఆధారపడ్డ వర్గాలను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుంటుందన్నారు. రాయితీ రుణ పథకాలకు సంబంధించి లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ ఆయా సంఘాలకే అప్పగిస్తున్నట్లు మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. ఇందుకోసం ఒక్కో సంఘం నుంచి 10 మంది సభ్యులతో కమిటీ ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పారదర్శకంగా ఉండాలని, ఎలాంటి సమస్యలొచ్చినా సంఘాలే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. -
గుడుంబా బాధితులకు రూ.72.60 కోట్లు
మంత్రి జోగు రామన్న సాక్షి, హైదరాబాద్: గుడుంబా బాధితుల పునరావాసానికి సీఎం కేసీఆర్ రూ.72.60 కోట్లు మంజూరు చేశారని బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న తెలిపారు. శుక్రవారం సచివాలయంలో శాఖాపరౖ అంశాలపై ఉన్నతాధికారులతో సమీక్షించా రు. 3,600 గుడుంబా బాధిత కుటుంబాల కు అబ్కారీ శాఖ పర్యవేక్షణలో కలెక్టర్లు ఒక్కో కుటుంబానికి రూ.2లక్షలు ఆర్థిక సాయం అందజేస్తారని మంత్రి తెలిపారు. విదేశాల్లో ఉన్నత చదువుల నిమిత్తం బీసీ విద్యార్థులకు రూ.17కోట్లు విడుదల చేశా మన్నారు. మహాత్మా జ్యోతిబాపూలే గురు కుల పాఠశాలల నిర్వహణకు మరో విడ తగా రూ.30కోట్లు విడుదల చేస్తామన్నా రు. వచ్చే నెల 15కల్లా బీసీ గురుకుల పాఠ శాలలతోపాటు వసతిగృహాల్లోని విద్యార్థు లకు యూనిఫారాలు అందజేయాలని అధికారులను ఆదేశించారు. శాఖ ముఖ్య కార్యదర్శి అశోక్ కుమార్ పాల్గొన్నారు. -
ముస్లింల అభ్యున్నతికి కృషి
► అటవీ శాఖ మంత్రి జోగు రామన్న ► 3 వేల మందికి గిఫ్ట్ ప్యాకెట్లు అందజేత ఆదిలాబాద్: రాష్ట్రంలో ముస్లింల అభ్యున్నతి కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతూ కృషి చేస్తోందని రాష్ట్ర అటవీ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న అన్నారు. శుక్రవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని 3 వేల మంది ముస్లిం మహిళలకు గిఫ్ట్ ప్యాకెట్లు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కులమతాలకు అతీతంగా అన్ని పండుగలు కలిసి మెలిసి సోదరభావంతో జరుపుకోవాలని అన్నారు. గత పాలకుల హయాంలో ఎన్నడూ లేనివిధంగా రాష్ట్రంలో సీఎం కేసీఆర్ మైనార్టీల అభివృద్ధికి ప్రత్యేక పథకాలు అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. మైనార్టీలకు షాదీముబారక్ కింద రూ.75 వేలు అందిస్తున్నామని తెలిపారు. మైనార్టీలకు గురుకులాలు ఏర్పాటు చేశామని అన్నారు. అనేక సంక్షేమ పథకాలు పవేశపెడుతూ దేశంలోనే రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచిందన్నారు. మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ కేసీఆర్ నిర్ణయం తీసుకోవడం హర్షణీయమన్నారు. జేసీ కృష్ణారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ రాజన్న, మైనార్టీ నాయకులు సిరాజ్ఖాద్రి, సాజిదొద్దీన్, యూనుస్అక్బానీ తదితరులు పాల్గొన్నారు. -
12న బీసీ గురుకులాలు ప్రారంభం
మంత్రి జోగు రామన్న వెల్లడిl సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 12న 119 మహాత్మా జ్యోతిబా ఫూలే బీసీ గురుకులాలను లాంఛ నంగా ప్రారంభించనున్నట్లు బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న తెలిపారు. సీఎం కేసీఆర్తోపాటు అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు వీటిని ప్రారంభి స్తారని చెప్పారు. అన్ని హంగులతో అట్టహాసంగా ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు భాగస్వాములు కావాలని కోరారు. కేసీఆర్ ప్రకటించిన మేరకు తొలిసారిగా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక్కటి చొప్పున గురుకులాలను మంజూరు చేశారన్నా రు. మంగళవారం సచివాలయం నుంచి 31 జిల్లాల అధికారులతో వీడియో కాన్ఫ రెన్స్ ద్వారా గురుకులాల ఏర్పాట్లను ఆయన సమీక్షించారు. బీసీ గురుకులాలకు పక్కా భవనాల నిర్మాణానికి పది ఎకరాల చొప్పున భూమిని సేకరించినట్లు, వీటి నిర్మాణాలు పూర్తయ్యే వరకు అద్దె భవనాల్లో తరగతులను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 2017–18లో 5, 6 తరగతులతో ప్రారంభించనున్న ఈ గురుకులాలతో 41,863 మంది విద్యార్థులు లబ్ధిపొందుతారని వివరించారు. నాలుగేళ్లలో ఇంటర్ స్థాయికి ఈ గురుకులాలను అప్గ్రేడ్ చేస్తామన్నారు. సమావేశంలో బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి అశోక్ కుమార్, కమిషనర్ జీడీ అరుణ, బీసీ గురుకులాల సొసైటీ కార్యదర్శి మల్లయ్య భట్టు, జేడీ కె.అలోక్కుమార్ పాల్గొన్నారు. -
రాజ్యాధికారం కావాలి
2019 ఎన్నికల్లోపే రాజ్యాధికారంలో బీసీల వాటా తేల్చాలి - బీసీల సమర శంఖారావం సభలో నేతల హెచ్చరిక సాక్షి, హైదరాబాద్/మన్సూరాబాద్: ‘మాకు రాయితీ లొద్దు.. రాజ్యాధికారం కావాలి. 2019 ఎన్నికలకు ముందే తెలంగాణలోని అన్ని రాజకీయ పార్టీలు చట్టసభల్లో బీసీల వాటాను ప్రకటించాలి. లేదంటే ఆయా పార్టీలను శంకరగిరి మాన్యాలు పట్టించడం ఖాయం’అని బీసీల సమర శంఖారావం సభ హెచ్చరించింది. బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీని వాస్ గౌడ్ అధ్య«క్షతన ఆదివారం హైదరాబాద్లో జరి గిన బీసీల సమరశంఖారావం సభకు కేంద్రమంత్రి దత్తాత్రేయ, బీసీ సంక్షేమశాఖ మంత్రి జోగురామన్న, ఎంపీ బూర నర్సయ్యగౌడ్, జాతీయ బీసీ కమిషన్ మాజీ చైర్మన్ జస్టిస్ ఈశ్వరయ్య, ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య, మాజీ ఎమ్మెల్యేలు జైపాల్ యాదవ్, భిక్షమయ్య మాట్లాడారు. 119 నియోజకవర్గాల్లో పూలే విగ్రహాలు బీసీల సమర శంఖారావం సభ జనాభా ప్రాతి పాదికన బీసీ రిజర్వేషన్లను 50శాతానికి పెంచాలని డిమాండ్ చేసింది. సమగ్ర కుటుంబ సర్వే లెక్కలను అధికారికంగా ప్రకటించాలని, మండల కమిషన్ మురళీధర్రావు, అనంతరామ కమిషన్ సిఫార్సులను విధిగా అమలు చేయాలని కోరింది. జాతీయస్థాయిలో బీసీ కమిషన్ ఏర్పాటు చేసి, ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని.. దానికి రాజ్యంగబద్ధమైన చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేసింది.119 నియోజకవర్గాల్లో మహత్మా పూలే విగ్రహాలను ప్రతిష్టించాలని ప్రకటించింది. త్వరలోనే బీసీ కమిషన్: దత్తాత్రేయ ఈ సందర్భంగా కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ త్వరలోనే జాతీయ స్థాయిలో బీసీ కమిషన్కు చట్టబద్ధత రాబోతోందని, దీనికి సంబంధించిన విధివిధానాలు ఇప్పటికే రూపొందించినట్లు తెలిపారు. మంత్రి జోగు రామన్న మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా బడ్జెట్లో బీసీలకు అధిక ప్రాధాన్యం ఇచ్చామన్నారు. 2019 ఎన్నికల్లోపే బీసీ సబ్ప్లాన్ను, తమిళనాడు తరహాలో బీసీ రిజర్వేషన్లు అమలు చేస్తామని చెప్పారు. -
మొక్కల సరఫరాకు ఏర్పాట్లు
► రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి జోగు రామన్న ► హరితహారం అమలుపై సమీక్ష ఆదిలాబాద్అర్బన్: ఈ యేడాది వర్షాకాలం ప్రారంభంలో గ్రామ పంచాయతీలు, నియోజకవర్గాల వారీగా మొక్కల సరఫరాకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి జోగు రామన్న సూచించారు. గురువారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో హరితహారం అమలు తీరుపై కలెక్టర్ ఎం.జ్యోతిబుద్ధప్రకాష్తో కలిసి అధికారులతో సమీక్షించారు. జిల్లాలో ఈ యేడాది వర్షకాలంలో మొక్కల పెంపకం, వచ్చే యేడాది మొక్కల పెంపకానికి సంబంధించిన విత్తన సేకరణపై చర్చించారు. హరితహారం పథకం ద్వారా అడవులు పూర్వ వైభవం సాధించే దిశగా చర్యలు తీసుకోవాలని రెవెన్యూ, అటవీ అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజలు కోరిన మొక్కలు అందించే దిశగా చర్యలు చేపట్టాలని, అప్పుడే హరితహారం జిల్లాలో విజయవంతం అవుతుందని చెప్పారు. జిల్లాలోని నర్సరీల ద్వారా పెంచిన మొక్కలు, గతేడాదిలో నాటిన మొక్కల సంరక్షణపై అధికారులతో చర్చించారు. జిల్లాలో గత రెండేళ్లలో నాటిన మొక్కల సంరక్షణ ఏవిధంగా ఉందో అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రజల కోరిక మేరకు ఎక్కువ మొత్తంలో మొక్కలు సరఫరా చేసే విధంగా చూడాలని అన్నారు. నర్సరీల్లో పెంచుతున్న మొక్కలు, ఏయే రకాల మొక్కలు పెంచుతున్నారో అధికారులను అడిగి తెలుసుకున్నారు. అధికారులు నర్సరీలను తనిఖీలు చేసి మొక్కల గురించి తెలుసుకోవాలని పేర్కొన్నారు. రానున్న యేడాదిలో నర్సరీల ద్వారా మొక్కల పెంపునకు ఇప్పటి నుంచే విత్తనాల సేరకణ చేయాలని తెలిపారు. ఈ సమావేశంలో డీఆర్వో శంకర్, ఆర్డీవో సూర్యనారాయణ, జెడ్పీ సీఈవో జితేందర్రెడ్డి, అటవీ శాఖ అధికారులు పాల్గొన్నారు. -
ఖర్చు తగ్గిద్దాం..కలసి పెళ్లి చేసుకుందాం..
కరంజిలో సామూహిక వివాహాలు తలమడుగు(బోథ్): ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలం కరంజి గ్రామంలో ఆదివారం అంగరంగ వైభవంగా సామూహిక వివాహాలు జరిపించారు. పెళ్లిళ్లకు ఆడంబరాలను, వృథా ఖర్చులను అరికట్టాలనే ఉద్దేశంతో గ్రామస్తులు 25 ఏళ్ల క్రితం సామూహిక వివాహాలకు శ్రీకారం చుట్టారు. ఇప్పటికీ ఆ ఆనవాయితీ కొనసాగిస్తున్నారు. ఆదివారం 11 జంటలకు వివాహం జరిపించారు. వీరిలో కరంజి గ్రామానికి చెందిన ఐదు జంటలు, చుట్టుపక్కల గ్రామాలతోపాటు మహారాష్ట్రకు చెందిన వారూ ఉన్నారు. వధూవరులను రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి జోగు రామన్న, బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్ తదితరులు ఆశీర్వదించారు. -
పంటల సాగుకు భరోసా
► ఎకరానికి రూ.4వేలు అందజేస్తాం ► గోదాముల నిర్మాణానికి రూ.కోట్లు ఖర్చు చేస్తున్నాం ► అటవీశాఖ మంత్రి జోగు రామన్న ► ‘మన తెలంగాణ–మన వ్యవసాయం’ ప్రారంభం ఆదిలాబాద్రూరల్: రైతులు బాగుండాలని పంటల సాగుకు ప్రభుత్వం భరోసా కల్పిస్తోందని, ఆర్థికంగా బలోపేతం కావడానికి వచ్చే సంవత్సరం ఖరీఫ్, రబీ సీజన్లలో ఎకరానికి రూ.4 వేల చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేయనుందని రాష్ట్ర అటవీ, పర్యావరణ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న అన్నారు. శుక్రవారం ఆయన మండలంలోని యాపల్గూడ గ్రామంలో ‘మన తెలంగాణ–మన వ్యవసాయం’ ప్రచార రథాన్ని జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక కార్యక్రమాలు అమలు చేస్తోందని అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతులకు రూ.17 వేల కోట్ల రుణాలు మాఫీ చేశామని చెప్పారు. రైతులు పండించిన పంటలు గోదాముల్లో నిల్వ చేసుకోవడానికి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రూ.150 కోట్ల వ్యయంతో 2.50 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన 45 గోదాములు నిర్మించామని తెలిపారు. పశువులకు నాణ్యమైన వైద్య చికిత్స సకాంలో అందించాలనే ఉద్దేశంతో ఆస్పత్రుల్లో అవసరమైన మందులు సమకూరుస్తోందని వివరించారు. రైతులకు సకాలంలో ఎరువులు, విత్తనాలు సరఫరా చేస్తున్నామని, గీత, బీడీ, చేనేత కార్మికల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నామని తెలిపారు. కులవృత్తుల పరిరక్షణ కోసం సబ్సిడీపై రుణాలు అందజేసి ఆదుకుంటున్నామని అన్నారు. హరితహారం కార్యక్రమంలో నాటిన మొక్కలు సంరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. పట్టు పరిశ్రమ ద్వారా 40 రోజుల్లోనే రూ.1.50 లక్షల ఆదాయం పొందవచ్చని సూచించారు. రైతులకు సబ్సిడీపై డ్రిప్, స్ప్రింక్లర్లను అందజేస్తున్నామని, పాలిహౌస్ ద్వారా పంటలు సాగు చేసి అధిక లాభాలు పొందాలని తెలిపారు. గ్రామాల అభివృద్ధిలో భాగంగా యాపల్గూడలో రూ.కోటితో సీసీ రోడ్లు, రూ.20 లక్షల వ్యయంతో మురికి కాలువలను నిర్మించినట్లు తెలిపారు. ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఆరె రాజన్న, జెడ్పీటీసీ సభ్యుడు ఇజ్జగిరి అశోక్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఆశకుమారి, ఎంపీపీ ఉపాధ్యక్షుడు గంగారెడ్డి, యాపల్గూడ, మావల సర్పంచ్లు కొడప ఇస్రూబాయి, ఉష్కం రఘుపతి, రైతులు పాల్గొన్నారు. -
అభివృద్ధి వేగవంతం చేయండి
రాష్ట్ర అటవీ శాఖ మంత్రి జోగు రామన్న ఆదిలాబాద్: ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వేగవంతం చేయాలని రాష్ట్ర అటవీ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న అన్నారు. శుక్రవార రాత్రి కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో పంచాయతీరాజ్, రోడ్లు భవనాలు, ఆర్డబ్ల్యూఎస్, మున్సిపాలీటీ, ఎస్సీ సంక్షేమ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న డబుల్ బెడ్రూం పథకం కింద గ్రామాల్లో, పట్టణాల్లో భూములను గుర్తించి వెంటనే నిర్మాణాలు ప్రారంభించాలని తెలిపారు. జీ ప్లస్ టు ఇళ్ల నిర్మాణాలను చేపట్టడం ద్వారా పూర్తి చేస్తామని అన్నారు. పశువుల కోసం షెడ్ల నిర్మాణాలు చేపట్టాలని, పట్టణ ప్రాంతాల్లో కూడా జీప్లస్ టు ఇళ్ల నిర్మాణాలకు ప్రతిపాదనలు చేయాలని పేర్కొన్నారు. తాగునీటి సమస్య తీవ్రంగా ఉన్నందున కేఆర్కే కాలనీ, ఖండాలలో తాగునీటి సౌకర్యం కల్పించాలన్నారు. పట్టణ ప్రాంతాల్లో 11 ట్రాక్టర్ల ద్వారా తాగునీరు ప్రజలకు అందిస్తున్నామని మున్సిపల్ కమిషనర్ మంగతాయారు తెలిపారు. పట్టణంలోని మున్సిపల్ ఆధీనంలో ఉన్న భూములలో స్మృతి వనం, చిన్నపిల్లల పార్కు ఏర్పాటు చేయాలని కలెక్టర్ జ్యోతి బుద్ధప్రకాశ్ సూచించారు. ఈ సమావేశంలో జేసీ కృష్ణారెడ్డి, ఆర్డీఓ సూర్యనారాయణ, పంచాయతీరాజ్ ఈఈ మారుతి, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ మూర్తి, ఎస్సీ సంక్షేమ అధికారి కిషన్, కార్పోరేషన్ ఈడీ శంకర్, ఆర్అండ్బీ ఈఈ వెంకట్రెడ్డి పాల్గొన్నారు. -
ఏం జరుగుతోంది..?
► ఉపాధిహామీ సిబ్బంది పనితీరుపై మంత్రి రామన్న అసహనం ► మొక్కలు తక్కువ ఉన్నా కాపాడలేకపోతున్నాం ► నాన్ సీఆర్ఎఫ్ బిల్లుల పెండింగ్పై అసంతృప్తి ► పథకాల అమలు తీరుపై మంత్రి సమీక్ష ఆదిలాబాద్ అర్బన్: రైతులు కంపోస్టు ఎరువు కోసం ఉపయోగించే గుంతలకు ఇంతవరకు బిల్లులు ఇవ్వలేదని, ఉపాధి హామీ పథకంలో ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదని రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి జోగు రామన్న అసహనం వ్యక్తం చేశారు. పని చేయని ఫీల్డ్, టెక్నికల్ అసిస్టెంట్లను తొలగించాలని ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో వేసవిలో ఎదురవుతున్న తాగునీటి ఇబ్బందులు, ఉపాధి హామీ పనులు, హరితహారంపై సమీక్షించారు. కలెక్టర్ జ్యోతిబ్ధు ప్రకాశ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఉపాధి హామీ, ఆర్డబ్ల్యూఎస్, అటవీశాఖ, అధికారులు పాల్గొన్నారు. ఉపాధి హామీపై సమీక్ష సందర్భంగా మంత్రి రామన్న మాట్లాడుతూ జిల్లాలో ఉపాధి హామీ పనుల్లో ఆదిలాబాద్ వెనుకబడి ఉందని అన్నారు. రెండు వేల మంది మాత్రమే పనులు చేస్తున్నారని అధికారులు తెలుపగా.. అవగాహన కల్పించి మరిన్ని పనులు కల్పించాలని సూచించారు. వేసవిలో పనులు చేస్తున్న కూలీలకు అదనంగా డబ్బులు వస్తాయన్న విషయం తెలుపాలని, గ్రామాల్లోని వీఆర్ఏల సహకారం తీసుకోవాలని అన్నారు. మొక్కలు కాపాడలేకపోతున్నాం.. జిల్లాలో గత రెండేళ్ల క్రితం రోడ్డుకు ఇరువైపులా నాటిన మొక్కలు తక్కువగా ఉన్న కూడా వాటిని కాపాడలేకపోతున్నామని మంత్రి రామన్న అన్నారు. వేసవి దృష్ట్యా అగ్గి తగిలి అనేక చెట్లు కాలిపోయాయని పేర్కొన్నారు. ఈ విషయం సంబంధిత అధికారులకు ఇంత వరకు కూడా తెలియదని అన్నారు. అటవీ ప్రాంతంలో అగ్గి తగిలి చెట్లు కాలిపోతున్నాయని, ఇందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గ్రామస్థాయిలో పని చేసే అధికారులు, సిబ్బంది పైస్థాయి అధికారులకు ఎలా, ఏం తెలియజేస్తున్నారో అర్థం కావడం లేదని అన్నారు. ఎంపీడీవోలకు వారి కింది స్థాయి సిబ్బంది రోజువారీ నివేదికలు ఇవ్వరా.. అని ప్రశ్నించారు. జైనథ్ మండలంలో రోడ్డు గుండా నాటిన మొక్కలు కాలిపోయాయని మంత్రి ప్రస్తావించారు. జిల్లాలో తక్కువ కిలోమీటర్ల మేర చెట్లు నాటిన వాటిని కాపాడలేకపోతున్నామని, వేసవి కాలంలో జరిగే అగ్ని ప్రమాదాల వల్ల చెట్లు కాలిపోకుండా చూడాలని అధికారులకు సూచించారు. ఫారెస్ట్ నర్సరీల్లో పనులు చేస్తున్న కూలీలకు ఇంకా వేతనాలు రాలేదని మంత్రి దృష్టికి తీసుకురాగా, అక్కడ కమిషనరేట్లో పంపామని చెబుతారు.. ఇక్కడికేమో రాలేదు.. ఆ విషయం ఓసారి పరిశీలించి తెలుపాలని చెప్పారు. తాగునీటి ఇబ్బందులు రావొద్దు తాగునీటి సరఫరాపై మంత్రి అధికారులతో సమీక్షించారు. ఆదిలాబాద్, బోథ్ నియోజకవర్గాల్లో ఎక్కడెక్కడ రవాణా ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారో తెలుసుకున్నారు. వీఆర్ఏలు, మండల అధికారులు గ్రామాలకు వెళ్లి ఉపాధి హామీ, తాగునీరు, హరితహారంపై ప్రజలకు అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. పెన్గంగ నుంచి జైనథ్, బేల మండలాలకు తాగునీరు అందించే పైప్లైన్కు విద్యుత్ కనెక్షన్ ఇవ్వకపోవడంపై మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. సాత్నాల పైప్లైన్ను ఎందుకు ప్రారంభించడం లేదని సంబంధిత అధికారులను ప్రశ్నించారు. జిల్లాలో వేసవిలో తాగునీటి ఇబ్బందుల రావొద్దని ఆదేశింంచారు. గతేడాదిలో జరిగిన నాన్ సీఆర్ఎఫ్ పనులు పూర్తయ్యాయి, కానీ ఇంత వరకు బిల్లులు ఇవ్వకపోవడంపై మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జేసీ కృష్ణారెడ్డి, ఐఎఫ్ఎస్ ఎస్కె.గుప్తా, డీఆర్డీవో రాజేశ్వర్, తహశీల్దార్లు, ఎంపీడీఓలు, అధికారులు పాల్గొన్నారు. -
భూపాలపల్లి కలెక్టర్పై చర్యలు: జోగురామన్న
శాసనమండలిలో మంత్రి ప్రకటన సాక్షి, హైదరాబాద్: వన్యప్రాణుల చట్టం ప్రకారం భూపాలపల్లి కలెక్టర్ మురళిపై చర్యలు తీసుకుంటామని అటవీ శాఖ మంత్రి జోగురామన్న ప్రకటించారు. శనివారం శాసనమండలి ప్రశ్నోత్తరాల సమయంలో బీజేపీ సభ్యుడు రామచందర్రావు మాట్లాడుతూ.. అడవి పందులను పట్టుకొని తినమంటూ స్థానిక ప్రజలకు కలెక్టర్ మురళి పిలుపునివ్వడాన్ని ప్రస్తావించారు. దీనికి జోగురామన్న స్పందిస్తూ.. వన్యప్రాణుల చట్టం ప్రకారం మురళిపై చర్యలు తీసుకోవాలని అటవీ శాఖ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ను ఆదేశించినట్లు వెల్లడించారు. సంక్షేమ పథకాలపై జరిగిన చర్చలోనూ మంత్రి మాట్లాడుతూ.. ఈ ఏడాది ఫీజు రీయింబర్స్మెంట్కు రూ.1,954 కోట్లు కేటాయించగా రూ.1,579 కోట్లు విడుదల చేశామని, నెలాఖరులోగా మొత్తం విడుదల చేస్తామన్నారు. 4 బీసీ స్టడీ సర్కిళ్లకు భవనాలు నిర్మిస్తున్నామని తెలి పారు. మంత్రి జగదీశ్రెడ్డి మాట్లాడుతూ.. దళితు లకు ఈ ఏడాది 10 వేల ఎకరాలు భూమి పంపిణీ చేస్తామని స్పష్టం చేశారు. మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. వచ్చే ఆర్థిక సంవత్సరంలో మహిళాశిశు సంక్షేమ శాఖ పరిధిలోని అంగన్వాడీలు, స్టేట్హోంలకు సన్న బియ్యం సరఫరా చేస్తామని ప్రకటించారు. కాగా,ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, మహిళలకు 2016–17 బడ్జెట్ నిధుల్లో 70 శాతమే ఖర్చు చేశారని మండలిలో కా>ంగ్రెస్పక్ష నేత షబ్బీర్అలీ విమర్శించారు. గిరిజన సంక్షేమానికి రూ. 2,273 కోట్లు కేటాయించి రూ.935 కోట్లే విడుదల చేశారని దుయ్యబట్టారు. ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్ స్థానంలో ప్రత్యేక అభివృద్ధి నిధి తీసుకురావడం మంచిదేనని చెప్పారు. భూపాలపల్లి కలెక్టర్పై చర్యలు తీసుకోవాలి వన్యప్రాణులను చంపి తినమనడం నేరం: రాంచంద్రరావు సాక్షి, హైదరాబాద్: ఒకవైపు బ్రాహ్మణ కులాల్లోని పేదల సంక్షేమానికి ప్రత్యేక కార్పొరేషన్ ద్వారా ప్రభుత్వం కృషి చేస్తుండగా, మరోవైపు భూపాలపల్లి కలెక్టర్ బ్రాహ్మణ సమాజాన్ని అగౌరవపరుస్తూ మాట్లాడటం బాధాకరమని బీజేపీ ఎమ్మెల్సీ రాంచంద్రరావు ఆవేదన వ్యక్తం చేశారు. అడవి పందులను చంపి తినండంటూ.. వన్యప్రాణుల చట్టాన్ని ఉల్లంఘించిన కలెక్టర్ మురళిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం శాసన మండలిలో బలహీన వర్గాల సంక్షేమంపై జరిగిన చర్చలో రాంచంద్రరావు మాట్లాడుతూ.. షాదీ ముబారక్ పథకాన్ని వినియోగించుకునేందుకు లబ్ధిదారులు ముందుకు రావడంలేదని, ఫలి™ èlంగా ప్రభుత్వం కేటాయించిన నిధులు నిరుపయోగం అవుతున్నాయన్నారు. శాశ్వత ప్రాతిపదికన కాకుండా తక్కువ వేతనాలతో కాంట్రాక్ట్ టీచర్లను నియమిం చ డంతో గురుకులాల్లో నాణ్యమైన విద్య ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు. ఉస్మా నియా వర్సిటీ హాస్టళ్లలో విద్యార్థులకు సరైన మౌలికవసతులను కల్పించడం లేదన్నారు. అడవి పంది, గొడ్డు మాంసం తినండి -
అన్ని వర్గాల అభివృద్ధే ధ్యేయం
► మంత్రులు రామన్న, ఐకే రెడ్డి ► అభివృద్ధి పనులకు శంకుస్థాపన బోథ్ : అన్ని వర్గాల అభివృద్ధే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం పని చేస్తోందని అటవీశాఖ మంత్రి జోగు రామన్న, గృహ నిర్మాణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. ఆదివారం బోథ్ మండలం సొనాల గ్రామంలోని రామాలయంలో రూ.38లక్షలతో నిర్మించతలపెట్టిన ధ్యాన మందిరం, రూ.96 లక్షలతో చేపట్టనునన్న బైపాస్ రోడ్డు నిర్మాణానికి వారు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్రంలోని 106 సంచార కులాలను ఎంబీసీలో కలుపుతూ వారికి బ్యాంకులకు సంబంధం లేకుండా నేరుగా రూ.వెయ్యి కోట్ల రుణాలు ఇవ్వనున్నట్లు తెలిపారు. బీసీలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం బడ్జెట్లో అధిక ప్రధాన్యత ఇచ్చిందన్నారు. బీసీ కులాలకు చెందిన విద్యార్థులకు విదేశీ చదువుల ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందన్నారు. త్వరలోనే 500 జనాభా కలిగిన తండాలు, గూడేలను పంచాయతీలుగా ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. ప్రతిపక్షాలు అభివృద్ధిని ఓర్వలేకే విమర్శలు చేస్తున్నాయన్నారు. ఈ సందర్భంగా గ్రామ కుర్మ సంఘానికి రూ.5లక్షలు, మున్నూరు కాపు సంఘానికి రూ.10లక్షలు మంజూరు చేశారు. ఎంపీ నగేశ్ మాట్లాడుతూ మండలంలోని పొచ్చర క్రాస్ రోడ్డు నుంచి ఘన్ పూర్ వరకు రూ.36 కోట్ల కేంద్రం నిధులతో రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్నట్లు తెలిపారు. జాతర్ల నుంచి సొనాల గ్రామం వరకు త్వరలోనే డబుల్ రోడ్డు నిర్మాణం ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావ్ మాట్లాడుతూ నియోజకవర్గంలో ఇప్పటికే రూ.వెయ్యి కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నట్లు తెలిపారు. సొనాల పాఠశాలకు రూ.30లక్షల నిధులతో ప్రత్యేక గదులు, ప్రహరీ నిర్మాణం చేపడతామన్నారు. పాడి పరిశ్రమ చైర్మన్ లోక భూమారెడ్డి, బీసీసీబీ చైర్మన్ దామోదర్ రెడ్డి, డీసీఎంఎస్ చైర్మన్ రాంకిషన్ రెడ్డి, నిర్మల్ మున్సిపల్ చైర్మన్ అప్పాల గణేశ్చక్రవర్తి, ఆదిలాబాద్, బోథ్ మార్కెట్ కమిటీల చైర్మన్లు అరె రాజన్న, నల్ల శారద, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ తుల శ్రీనివాస్, టీఆర్ఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు రమణ, ఎంపీపీ గంగుల లక్ష్మి తదితరులున్నారు.