rajyasabha
-
‘పెద్దల’ సభలో మల్లికార్జున్ ఖర్గే క్షమాపణలు
న్యూఢిల్లీ: ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున్ ఖర్గే రాజ్యసభలో ఈరోజు(మంగళవారం) చేసిన వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున దుమారం చెలరేగడంతో ఆయన ఎట్టకేలకు దిగిచ్చారు. తాను చేసినవ్యా ఖ్యలను వెనక్కి తీసుకుంటున్నానని, అందుకు క్షమాపణలు తెలుపుతున్నానని అన్నారు. దీనిలో భాగంగా డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్కఉ క్షమాపణలు చెప్పారు.జాతీయ ఎడ్యుకేషన్ పాలసీపై తాము చర్చ చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నామని, మంత్రి ధర్మంద్ర ప్రదాన్ ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు. ఆ క్రమంలోనే ప్రభుత్వాని తోసి వేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని వ్యాఖ్యానించారు. దీనిపై బీజేపీ మండిపడింది. ఆయన వ్యాఖ్యలు అవమానకంగా ఉన్నాయని, అసభ్య పదజాలాన్ని వాడారని, అది క్షమించరానిదని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆరోపించారు.ఆ వ్యాఖ్యలకు కచ్చితంగా ఖర్గే క్షమాపణలు చెప్పాల్సిందేనని డిమాండ్ చేశారు అదే సమయంలో ఆయన వాడిన పదాన్ని కూడా రికార్డులనుండి తొలగించాలన్నారు. దాంతో దిగి వచ్చిన ఖర్గే.. రాజ్యసభ చైర్మన్ కు క్షమాపణలు తెలియజేశారు. ‘నేను ఇక్కడ సభను ఉద్దేశించో, లేక మిమ్మల్ని( రాజ్యసభ చైర్మన్ చైర్)ను ఉద్దేశించో ఆ వ్యాఖ్యలు చేయలేదు. కేవలం ప్రభుత్వ విధానాలపైనే ఆ వ్యాఖ్యలను చేశాను. ఆ వ్యాఖ్యలు మీకు అభ్యంతరకరంగా ఉంటే వెనక్కి తీసుకుంటాను. అందుకు క్షమాపణలు తెలియజేస్తున్నాను’ అని ఖర్గే పేర్కొన్నారు.ఇదిలా ఉంటే, తమిళుల మనోభావాలు దెబ్బతీశారంటూ కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్పై డీఎంకే పార్టీ.. ఆయనపై ప్రివిలేజ్ మోషన్ ఇచ్చింది. ఆయన చట్ట సభను తప్పుదోవ పట్టించారని డీఎంకే ఎంపీ కనిమొళి లోక్సభలో ఈ తీర్మానం దాఖలు చేశారు.తమిళనాడు.. అక్కడి ప్రజలు అనాగరికులు(Uncivilized) అంటూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చేసిన వ్యాఖ్యలను నేను తీవ్రంగా ఖండిస్తున్నా. ఆయన తమిళిలకు వెంటనే క్షమాపణలు చెప్పాలని డీఎంకే, 8 కోట్ల మంది మా ప్రజల తరఫున నేను డిమాండ్ చేస్తున్నాను’ అని ఆమె పేర్కొన్నారు. -
పోలవరం ఎత్తు తగ్గింపు వద్దు: రాజ్యసభలో వైవీ సుబ్బారెడ్డి
సాక్షి,న్యూఢిల్లీ:పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గింపును వ్యతిరేకిస్తున్నామని,ఈ నిర్ణయం రాష్ట్రానికి పట్టిన చంద్ర గ్రహణమని రాజ్యసభ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై వైవీ సుబ్బారెడ్డి సోమవారం(ఫిబ్రవరి3) రాజ్యసభలో మాట్లాడారు. ‘పోలవరం ప్రాజెక్టును 45.72 మీటర్ల ఎత్తుతో నిర్మించేందుకు గోదావరి ట్రిబ్యునల్ అనుమతి ఇచ్చింది. 150 ఫీట్ల ఎత్తుతో 194 టీఎంసీల నీటిని నిలువ చేసుకునే అవకాశం ఇచ్చారు. 41.15 మీటర్లకు ప్రాజెక్టు ఎత్తును తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం టీవల నిర్ణయం తీసుకుంది. 135 ఫీట్లకే ప్రాజెక్టు ఎత్తు పరిమితం చేశారు.ఇది ప్రజల ఆకాంక్షలకు,ట్రిబ్యునల్ ఇచ్చిన నిర్ణయానికి విరుద్ధం. ఈ విషయంపై టీడీపీ ప్రభుత్వం మౌనంగా మద్దతు తెలిపింది.ఈ నిర్ణయాన్ని వైఎస్సార్సీపీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈ నిర్ణయం రాష్ట్రానికి పట్టిన చంద్రగ్రహణం. 55 వేల కోట్ల రూపాయల అంచనాలకి ఆమోదం తెలపాలి.పోలవరం ఎత్తు తగ్గించడం వల్ల ఆయకట్టుకు పూర్తిగా నీరు ఉండదు, విశాఖపట్నానికి నీరు అందించే అవకాశం కోల్పోతాం. ఉత్తరాంధ్ర జిల్లాలకు సుజన స్రవంతి నీరు అందదు.పోలవరం కెనాల్స్కు సరిపడా నీరు అందదు. ఈ విషయంలో ప్రధాని జోక్యం చేసుకుని పోలవరం ఎత్తును యథాతథంగా ఉంచాలిసూపర్సిక్స్ పేరు చెప్పి చంద్రబాబు మోసం చేశారు..ఏపీలో వైఎస్సార్సీపీ సోషల్ మీడియా కార్యకర్తలపైన తీవ్ర వేధింపులకు పాల్పడుతున్నారని,గుడ్ గవర్నెన్స్ అంటే ఇదేనా అని రాజ్యసభ ఎంపీ వైవీసుబ్బారెడ్డి ప్రశ్నించారు. ‘ఏకంగా సోషల్ మీడియా కార్యకర్తలపై ఆర్గనైజ్డ్ క్రైమ్ కింద కేసులు పెడుతున్నారు. ఏపీలో అంబేద్కర్ రాజ్యాంగం నడవడం లేదు.రెడ్బుక్ రాజ్యాంగం నడుపుతున్నారు.ప్రధాని,హోంమంత్రి ఈ విషయంలో జోక్యం చేసుకోవాలి.చంద్రబాబు ఏపీలో మేనిఫెస్టో అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తున్నారు. సూపర్సిక్స్ పేరుతో మేనిఫెస్టో ఇచ్చారు.20 లక్షల ఉద్యోగాలు,ఫ్రీ బస్సు ఇస్తామన్నారు. రైతులకు 20వేలు ఇస్తానన్నారు. మేనిఫెస్టో అమలు చేయకపోతే ఎన్నికల సంఘం,సుప్రీంకోర్టు ఈ విషయాన్ని సీరియస్గా తీసుకోవాలి. ఆ పార్టీపై చర్యలు తీసుకోవాలి.వక్ఫ్ సవరణ బిల్లును మేం వ్యతిరేకిస్తున్నాం. ఈ బిల్లుపై తొందరపాటు తగదు.ఏపీలో ఇప్పటివరకు జనాభా లెక్కలు జరగలేదు.ఏపీలో ప్రత్యేకంగా జనాభా లెక్కల కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలి.వైఎస్సార్సీపీ కృషివల్లే కేంద్ర ప్రభుత్వం వైజాగ్ స్టీల్ ప్లాంట్ మూడో బ్లాస్ట్ ఫర్నేస్లో ఉత్పత్తి ప్రారంభించబోతోంది. ఉద్యోగుల జీతాలను సైతం చెల్లించలేకపోతున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కాపాడడానికి దీర్ఘకాలిక ప్రణాళిక అవసరం.సెయిల్లో విలీనం చేయడంలో విఫలమయ్యారు.వైజాగ్ స్టీల్ ప్లాంట్కు సొంతగనులు కేటాయించాలి’అని వైవీసుబ్బారెడ్డి డిమాండ్ చేశారు.ఏపీలో రైతులు సంక్షోభంలో ఉన్నారు: రాజ్యసభలో ఎంపీ పిల్లి సుభాష్చంద్రబోస్ఏపీలో రైతులు సంక్షోభంలో ఉన్నారుకేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వరి పండించే రైతులను ఆదుకోవాలిరైతులను ఆదుకునేందుకు నాడు వైఎస్ జగన్ 11 పథకాలు అమలు చేశారుఆ పథకాలన్నిటినీ ప్రస్తుత ప్రభుత్వం రద్దు చేసిందిరైతులను ఆదుకోవడంలో ప్రస్తుత ప్రభుత్వం విఫలమైందిఆదాయాలు ఉన్నా రైతులను ఎందుకు ఆదుకోవడం లేదునా ప్రసంగానికి అడ్డుపడి, రాజకీయాలకే పరిమితం కాకండిరైతుల సంక్షేమం కోసం రైతు భరోసా సున్నా వడ్డీ, ఉచిత పంట బీమా , జల కళ పథకాలను వైఎస్ జగన్ అమలు చేశారుచంద్రబోస్ ప్రసంగానికి పదేపదే అడ్డుపడ్డ టీడీపీ ఎంపీలు, మంత్రి పెమ్మసాని -
అమిత్ షాకు ‘టీఎంసీ’ షాక్.. రాజ్యసభలో ప్రివిలేజ్ మోషన్
న్యూఢిల్లీ: కేంద్ర హోం మంత్రి అమిత్షాకు తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) షాకిచ్చింది. రాజ్యాంగంపై చర్చ సందర్భంగా మంగళవారం రాజ్యసభలో అంబేద్కర్పై చేసిన వ్యాఖ్యలకుగాను టీఎంసీ ఎంపీ డెరెక్ ఒబ్రియెన్ షాపై రాజ్యసభలో సభా హక్కుల ఉల్లంఘన (ప్రివిలేజ్ మోషన్) నోటీసు ఇచ్చారు. నోటీసు ఇచ్చిన అనంతరం డెరెక్ ఒబ్రియెన్ మాట్లాడుతూ అమిత్ షా వ్యాఖ్యలు అంబేద్కర్ను తక్కువ చేయడమే కాకుండా సభా మర్యాదను తగ్గించాయన్నారు. సభా మర్యాదను కించపరిచినందుకు షా పై చర్య తీసుకోవాలని ఒబ్రియెన్ కోరారు.అమిత్ షా రాజీనామా చేయాలి:కాంగ్రెస్అంబేద్కర్పై చేసినవ్యాఖ్యలకు గాను అమిత్ షా తన పదవికి రాజీనామా చేయాలని ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే డిమాండ్ చేశారు. ఈ విషయమై ఆయన బుధవారం(డిసెంబర్ 18) పార్లమెంట్ ఆవరణలో మీడియాతో మాట్లాడారు. రాజీనామా చేయడమే కాకుండా దేశ ప్రజలకు షా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. -
రాజ్యాంగంపై చర్చ.. వైఎస్సార్సీపీ ఎంపీ నిరంజన్రెడ్డి కీలక ప్రసంగం
సాక్షి,న్యూఢిల్లీ: రాజ్యాంగంలోని ఆర్టికల్ 81,82 ప్రకారం నియోజకవర్గాల పునర్విభజన జరగాలని వైఎస్సార్సీపీ ఎంపీ నిరంజన్రెడ్డి అన్నారు. సోమవారం(డిసెంబర్16) రాజ్యసభలో రాజ్యాంగంపై జరిగిన చర్చలో నిరంజన్రెడ్డి పాల్గొని మాట్లాడారు. ‘దేశ అభివృద్ధిలో కీలకపాత్ర పోషించిన రాష్ట్రాలకు నియోజకవర్గాల పునర్విభజనలో తగిన ప్రోత్సాహం ఉండాలి. నియోజకవర్గాల పునర్విభజన సమయంలో మా రాష్ట్రాల అభిప్రాయాలను కచ్చితంగా పరిగణలోకి తీసుకోవాలి. ఎన్నికల సంస్కరణలను తీసుకురావాల్సిన అవసరం ఉంది. రోజురోజుకి ఎన్నికల ఖర్చు భారీగా పెరిగిపోతోంది. ఎన్నికల్లో పోటీకి దిగాలంటే ఖర్చును చూసి భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ విషయంలో తగిన చట్టాలు రావాలి. ప్రజా ప్రాతినిధ్య చట్టాలలో తగిన మార్పులు రావాలి. నాణ్యమైన విద్య,వైద్యం తమ పిల్లలకు అందించే క్రమంలో తల్లిదండ్రులు పేదరికంలోకి జారుకుంటున్నారు. పేదరికానికి ప్రధాన కారణాలు విద్య,వైద్యం ఖర్చు పెరగడమే. దేశంలో ఆర్థిక అసమానతలు,ఆదాయ వ్యత్యాసాలు పెరుగుతున్నాయి.రాజ్యాంగ ఉద్దేశాలు ఇంకా పరిపూర్ణంగా సాధించలేదు. రాజ్యసభ కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ కనుక రాష్ట్రాల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకోవాలి.సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు పని భారం పెరుగుతోంది.141 కోట్ల జనాభాకు కేవలం 35 మంది సుప్రీంకోర్టు న్యాయమూర్తులున్నారు. ట్రిబ్యునల్స్ నుంచి నేరుగా సుప్రీంకోర్టుకే అప్పీల్కు వెళ్లకుండా, హైకోర్టులకు తగిన ప్రాధాన్యత కల్పించాలి’అని నిరంజన్రెడ్డి పేర్కొన్నారు.ఇదీ చదవండి: ఏపీలో రాజ్యాంగ విరుద్ధ పాలన జరుగుతోంది: ఎంపీ విజయసాయిరెడ్డి -
రాజ్యసభలో నోట్ల కలకలం
సాక్షి, న్యూఢిల్లీ: కరెన్సీ నోట్ల వ్యవహారం శుక్రవారం రాజ్యసభను కుదిపేసింది. అధికార, విపక్ష సభ్యుల వాగ్వాదం, మాటల యుద్ధంతో దుమారం రేగింది. పరస్పర విమర్శలతో వాతావరణం వేడెక్కింది. ఉదయం సభ సమావేశమవగానే చైర్మన్ జగ్దీప్ ధన్ఖడ్ ఈ అంశాన్ని ప్రస్తావించారు. కాంగ్రెస్కు చెందిన రాజ్యసభ సభ్యుడు అభిõÙక్ మను సంఘ్వీ సీటు నుంచి రూ.500, రూ.100 నోట్ల కట్ట దొరికినట్టు ప్రకటించారు. ‘‘గురువారం సభ వాయిదా పడ్డాక భద్రతా సిబ్బంది రోజువారీ తనిఖీలో 222 నంబర్ సీటు వద్ద నోట్ల కట్ట దొరికింది. అది తెలంగాణ నుంచి ఎంపికైన సంíఘ్వీకి కేటాయించిన స్థానం. అవి అసలైనవో, నకిలీవో తెలియదు. నిబంధనల ప్రకారం దీనిపై విచారణకు ఆదేశించా. దీన్ని సభ ముందుంచడం నా బాధ్యత. కనుక మీ దృష్టికీ తీసుకొస్తున్నా’’ అని వివరించారు. ‘‘అవి తమవేనని ఎవరైనా చెబుతారేమోనని చూశా. కానీ ఇప్పటికైతే ఎవరూ ముందుకు రాలేదు. ఇలా నోట్ల కట్టలను కూడా ఎక్కడో పెట్టి మర్చిపోయేన్ని డబ్బులున్నాయేమో మరి!’’ అన్నారు. చైర్మన్ ప్రకటన సభలో తీవ్ర గందరగోళానికి దారితీసింది. కాంగ్రెస్ సభ్యులు ఏకంగా సభలోకే నోట్ల కట్టలు తెస్తున్నారంటూ బీజేపీ ఎంపీలు విమర్శలకు దిగారు. దీనిపై సమగ్ర విచారణ జరగాలని డిమాండ్ చేశారు. పెద్దపెట్టున నినాదాలు చేస్తూ సభా కార్యకలాపాలను అడ్డుకున్నారు. చైర్మన్ సింఘ్వీ పేరు చెప్పడాన్ని విపక్ష నేత మల్లికార్జున ఖర్గే తీవ్రంగా తప్పుబట్టారు. విచారణ జరగకుండానే నేరుగా సభ్యుని పేరు బయట పెట్టి ఆయన గౌరవం తగ్గిస్తారా అంటూ ఆక్షేపించారు. అందులో తప్పేముందని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెణ్ రిజిజు ప్రశ్నించారు. ఏ సభ్యుని సీట్లో నోట్లు దొరికాయో చెబితే అభ్యంతరపెట్టడం ఎందుకన్నారు. ‘‘ఇలా సభలోకి నోట్ల కట్టలు తేవడం సరికాదు. దీనిపై సమగ్ర విచారణ జరగాల్సిందే’’ అన్నారు. పార్లమెంటులోకి రసాయనాలు వెంట పెట్టుకుని వచి్చన ఉదంతాలను ధన్ఖడ్ గుర్తు చేశారు. ‘‘అందుకే విద్రోహ నివారణ తనిఖీలు కఠినంగా జరగాలన్నది నా ఉద్దేశం. భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంది. ఆ కోణంలోనే పకడ్బందీగా రోజువారీ తనిఖీలు జరుగుతున్నాయి’’ అని వివరించారు. ‘‘సదరు సభ్యుడు గురువారం సభకు హాజరయ్యారు. ఆయన పేరు ప్రస్తావించినంత మాత్రాన విచారణపై ప్రభావమేమీ చూపదు’’ అని చెప్పారు. ఇది సభ గౌరవ మర్యాదలకు సంబంధించిన విషయమని సభా నాయకుడు జేపీ నడ్డా అభిప్రాయపడ్డారు. ‘‘దీనిపై విపక్ష సభ్యులు తలో అభిప్రాయం వెలిబుచ్చడం సరికాదు. అంతా ఒక్కతాటిపైకి వచ్చి దీన్ని ఖండిస్తూ తీర్మానం చేద్దాం’’ అని సూచించారు. ‘‘కొన్ని అంశాలపై చర్చ కోసం అత్యుత్సాహం చూపిస్తారు. ఇలాంటి కొన్ని అంశాలనేమో దాచేసే ప్రయత్నం చేస్తారు’’ అంటూ విపక్షాలపై విమర్శలు గుప్పించారు. వాటిని ఖర్గే తీవ్రంగా ఖండించారు. ఆ అలవాటు అధికార పక్షానిదే తప్ప తమది కాదన్నారు. అధికార పక్ష ఎంపీలను కేంద్ర మంత్రులే తమపైకి ఉసిగొల్పుతున్నారని తిరుచ్చి శివ (డీఎంకే) ఆరోపించారు. ‘‘వాటిని నేను కళ్లారా చూశాను. ఇది ఎంతవరకు సమంజసం?’’ అని ప్రశ్నించారు. దాంతో సభలో మరింత గందరగోళం నెలకొంది. దర్యాప్తుకు తాము అడ్డుచెప్పడం లేదని ఖర్గే స్పష్టం చేశారు. సభలో ప్రత్యేకంగా చర్చ అవసరం లేదని మాత్రమే చెబుతున్నామన్నారు. ‘‘ఈ రోజు నోట్లు దొరికాయి. రేపు ఇంకేమీ దొరుకుతాయో తెలియడం లేదు’’ అని వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. దీనిపై లోతైన విచారణ జరగాల్సిందేనన్నారు. పరిస్థితి సద్దుమణిగాక జీరో అవర్ కొనసాగింది.గ్లాస్ సీలింగ్ వేయాలేమో: సింఘ్వీ నోట్ల వ్యవహారంపై బీజేపీ చిల్లర రాజకీయాలు చేస్తోందని సింఘ్వీ మండిపడ్డారు. గురువారం రాజ్యసభకు వచి్చనప్పుడు తన వద్ద కేవలం ఒకే ఒక్క రూ.500 నోటుందని ఆయన స్పష్టం చేశారు. ‘‘నేను మూడు నిమిషాలే సభలో ఉన్నా! మధ్యాహ్నం 12.57 గంటలకు సభలో ప్రవేశించా. ఒంటిగంటకే సభ వాయిదా పడింది. 1:30 దాకా క్యాంటీన్లో ఉండి వెళ్లిపోయా’’ అంటూ ఎక్స్లో పోస్ట్ చేశారు. ‘‘ఇంకొకరి సీటు వద్ద నోట్ల కట్ట ఎలా వేస్తారు? ఇకపై గంజాయి వంటివి కూడా పెడతారేమో. ఇకపై సభ్యులు ఎవరి సీటుకు వారు వైర్ ఫెన్సింగో, గ్లాస్ సీలింగో ఏర్పాటు చేసి, దానికి తాళం వేసి కీస్ తమతో పాటు ఇంటికి తీసుకెళ్లాలేమో!’’ అంటూ విమర్శలు గుప్పించారు. ‘‘దీనిపై విచారణ జరగాలి. భద్రతా వైఫల్యముంటే ఆ విషయాలూ వెలుగులోకి రావాలి’’ అని సింఘ్వీ డిమాండ్ చేశారు. -
మరోసారి పార్లమెంట్ ను కుదిపేసిన అదానీ వ్యవహారం
-
రాజ్యసభ ఎంపీ పదవికి ఆర్.కృష్ణయ్య రాజీనామా
సాక్షి,న్యూఢిల్లీ:రాజ్యసభ ఎంపీ పదవికి ఆర్.కృష్ణయ్య రాజీనామా చేశారు.కృష్ణయ్య రాజీనామాను రాజ్యసభ చైర్మన్ ఆమోదించారు. కృష్ణయ్య రాజీనామాతో రాజ్యసభలో ఆయన స్థానం ఖాళీ అయినట్లు రాజ్యసభ స్రెటేరియట్ మంగళవారం(సెప్టెంబర్24) నోటిఫై చేసింది. బీసీ సంఘం జాతీయ నేతగా ఉన్న ఆర్.కృష్ణయ్య ఆంధ్రప్రదేశ్ నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున రాజ్యసభకు ప్రాతినిథ్యం వహించారు. రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామాపై కృష్ణయ్య స్పందించలేదు. -
మెడికల్ కౌన్సిలింగ్లో ఓబీసీ కోటా అమలు చేయాలి: ఎంపీ బీదమస్తాన్రావు
సాక్షి,న్యూఢిల్లీ: మెడికల్ కౌన్సిలింగ్లో 27శాతం ఓబీసీ రిజర్వేషన్లను నూటికి నూరు శాతం అమలు చేయాలని వైఎస్ఆర్సీపీ ఎంపీ బీద మస్తాన్రావు డిమాండ్ చేశారు. రాజ్యసభలో మంగళవారం(ఆగస్టు 6) జీరో అవర్లో మస్తాన్రావు మాట్లాడారు. మెరిట్ కోటా కింద సీట్లు పొందిన ఓబీసీ విద్యార్థులను రిజర్వేషన్ కోటా కింద లెక్కించడంపై మస్తాన్రావు అభ్యంతరం తెలిపారు. అభ్యర్థుల స్లైడింగ్ సందర్భంగా ఓబీసీలు ఖాళీ చేసిన ఓపెన్ కాంపిటీషన్ సీటును అదే రిజర్వ్డ్ కేటగిరీకి చెందిన అభ్యర్థి తో భర్తీ చేయాలన్నారు. ఓబీసీ విద్యార్థులకు సంవత్సరాల తరబడి జరుగుతున్న అన్యాయాన్ని సరిదిద్దాలని డిమాండ్ చేశారు. -
ఈ చిన్నారిని గుర్తుపట్టారా? ఇపుడు రాజ్యసభ ఎంపీ!
రాజ్యసభ, ఎంపీ, రచయిత సుధానారాయణమూర్తి సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారు. అనేక సామాజిక అంశాలపై తన అభిప్రాయాలను పంచుకుంటూ ఉంటారు. ఒక్కోసారి తన వ్యక్తిగత విషయాలను జోడిస్తూ, మరికొన్ని అవగాహన కల్పించే అంశాలను తన అభిమానులతో కూడా షేర్ చేస్తూ ఉంటారు. తాజాగా తన చిన్నప్పటి ఫోటో ఒకటి ఎక్స్లో పోస్ట్ చేశారు. దీంతో ఇది అభిమానులను ఆకట్టుకుంటోంది.‘‘ఈ ఫోటో నాకు సంవత్సరం వయస్సులో ఉన్నప్పుడు హుబ్లీలోని ఒక స్టూడియోలో తీసింది. ఆ సమయంలో, మేము షిగ్గావ్లో ఉండేవాళ్లం, కానీ అక్కడ స్టూడియోలు లేనందున, మేము ఈ ఫోటో కోసం హుబ్లీకి వెళ్లాం’’ అంటూ సుధామూర్తి తన బాల్య స్మృతులను నెమరు వేసుకున్నారు.This picture was taken in a studio in Hubli when I was around 1 year old. At the time, we were living in Shiggaon, but since there were no studios there, we travelled to Hubli for this photograph. pic.twitter.com/YjhjJ3Aw5L— Smt. Sudha Murty (@SmtSudhaMurty) July 30, 2024 -
‘తల్లీ నిర్మల’.. ఖర్గే మాటలతో రాజ్యసభలో నవ్వులు
న్యూఢిల్లీ: రాజ్యసభలో బుధవారం(జులై 24) బడ్జెట్పై చర్చ సందర్భంగా నవ్వులు పూశాయి. ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్ను ప్రతిపక్షనేత మల్లికార్జున్ ఖర్గే ‘మాతాజీ’ అని సంబోధించారు.వెంటనే చైర్మన్ జగదీప్ ధన్ఖడ్ జోక్యం చేసుకుని ఆమె మీకు కూతురులాంటిది అని ఖర్గేను ఉద్దేశించి అన్నారు. దీంతో సభ్యులంతా ఒక్కసారిగా విరగబడినవ్వారు. కేంద్ర బడ్జెట్లో ఈసారి కేవలం బిహార్, ఏపీల ప్లేట్లలోనే జిలేబి, పకోడి వడ్డించారని, మిగతా రాష్ట్రాల ప్లేట్లన్నీ ఖాళీగానే ఉన్నాయని ఖర్గే అన్నారు. ఇంతలో ఆర్థిక మంత్రి నిర్మల మాట్లాడతారని చైర్మన్ ఖర్గేతో అన్నారు. మాతాజీ నిర్మల మాట్లాడడంలో మంచి నేర్పరి..నేను మాట్లాడడం అయిన తర్వాత ఆమెను మాట్లాడమనండి అని ఖర్గే చైర్మన్ను కోరారు. దీనికి స్పందించిన చైర్మన్ ఆమె మీకు కూతురులాంటిది అనడంతో సభలో నవ్వులు పూశాయి. -
ఏపీలో హింస పెరిగింది: ఎంపీ మేడా రఘునాథ్రెడ్డి
సాక్షి,ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల అనంతరం హింస పెచ్చరిల్లుతోందని, టీడీపీ శ్రేణులు ప్రణాళికబద్ధంగా దాడులకు పాల్పడుతున్నాయని వైఎస్ఆర్సీపీ రాజ్యసభ ఎంపీ మేడా రఘునాథ్రెడ్డి అన్నారు. సోమవారం(జులై1) రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చలో వైఎస్ఆర్సీపీ తరపున రఘునాథ్రెడ్డి మాట్లాడారు. ‘వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ కార్యకర్తలను టార్గెట్ చేసుకుని దాడులు చేస్తున్నారు. వైఎస్ఆర్సీపీ అభిమానులు, సానుభూతిపరులపై హింసకు తెగబడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే ఈ అంశంలో జోక్యం చేసుకోవాలి. ఏపీలో ప్రజలందరి భద్రతకు తగిన చర్యలు తీసుకోవాలి. ప్రజల ప్రాథమిక హక్కులను పరిరక్షించాలి. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలి. ప్రత్యేక హోదా నిరాకరించడం మా రాజ్యాంగ హక్కులను ఉల్లంఘించడమే. పార్లమెంటులో ఇచ్చిన ప్రత్యేక హోదా వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలి. ప్రత్యేక హోదా కోసం వైఎస్జగన్ అనేకసార్లు ప్రధానికి విజ్ఞప్తి చేశారు.ప్రత్యేక హోదా వల్ల రాయితీలు, నిధులు ఏపీకి వస్తాయి. ఏపీలో మీడియా ఛానల్స్ ను అణిచి వేస్తున్నారు. వైఎస్ జగన్ హయాంలో ఏపీ మారిటైమ్ రంగం చాలా అభివృద్ధి చెందింది. అనేక ఫిషింగ్ హార్బర్లు ఏర్పాటు చేశారు’అని వివరించారు. -
రాజ్యసభ ఎంపీగా 'సుధామూర్తి' ప్రమాణ స్వీకారం
ఇంజనీర్ నుంచి పరోపకారిగా మారి ఎంతోమందికి సహాయం చేస్తున్న'సుధామూర్తి' ఈ రోజు (గురువారం) తన భర్త ఎన్ఆర్ నారాయణ మూర్తి సమక్షంలో రాజ్యసభ ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారు. పార్లమెంట్ హౌస్లోని తన ఛాంబర్లో రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ఖర్ ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో పీయూష్ గోయల్ కూడా పాల్గొన్నారు. ఇన్ఫోసిస్ ఫౌండేషన్ మాజీ చైర్పర్సన్, రచయిత్రి సుధామూర్తి పిల్లల కోసం అనేక పుస్తకాలను రచించింది. కన్నడ, ఇంగ్లీష్ సాహిత్యానికి ఆమె చేసిన కృషికి సాహిత్య అకాడమీ బాల సాహిత్య పురస్కారంలభించింది. అంతే కాకుండా ఈమెను 2006లో పద్మశ్రీ, 2023లో పద్మ భూషణ్ అవార్డులు వరించాయి. గత శుక్రవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సుధామూర్తి రాజ్యసభకు నామినేట్ అయ్యారు. ఈ రోజు ప్రమాణస్వీకారం చేశారు. TELCOతో పనిచేసిన మొదటి మహిళా ఇంజనీర్ అయిన సుధామూర్తి.. నేడు వేలకోట్ల సామ్రాజ్యంగా మారిన ఇన్ఫోసిస్ ప్రారంభానికి ప్రధాన కారకురాలు కూడా. #WATCH | Author and philanthropist Sudha Murty, nominated to the Rajya Sabha by President Droupadi Murmu, takes oath as a member of the Upper House of Parliament, in the presence of House Chairman Jagdeep Dhankhar Infosys founder Narayan Murty and Union Minister Piyush Goyal… pic.twitter.com/vN8wqXCleB — ANI (@ANI) March 14, 2024 -
ముగిసిన 17వ లోక్సభ.. పార్లమెంట్ నిరవధిక వాయిదా
న్యూఢిల్లీ: పదిహేడవ లోక్సభ చివరి సమావేశాలు శనివారం ముగిశాయి. దీంతో పార్లమెంట్ ఉభయ సభలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. బడ్జెట్ సమావేశాలు ముగియడంతో లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ దన్ఖడ్ సభలను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.త్వరలో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. 17వ లోక్సభలో ఈ ఐదేళ్లలో మొత్తం 222 బిల్లులు ఆమోదం పొందినట్లు స్పీకర్ ఓంబిర్లా తెలిపారు. సమావేశాల చివరిరోజున రామమందిరం నిర్మాణంపై చర్చించారు. దీనిపై ప్రధాని మోదీతో పాటు హోం మంత్రి అమిత్షా సభనుద్దేశించి ప్రసంగించారు. ఈ ఐదేళ్లలో సాధించిన విజయాలను ఇరువరు వివరించారు. స్పీకర్ ఓంబిర్లా మాట్లాడుతూ అధికార,విపక్ష బెంచ్లను సమానంగా చూశానని, సభా గౌరవం కాపాడేందుకు కొన్నిసార్లు కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చిందని తెలిపారు. ఇదీ చదవండి.. నాథుడు లేని పార్టీకి అందలమెలా..? -
NDA: ఉపరాష్ట్రపతికి సంఘీభావంగా..
సాక్షి, ఢిల్లీ: దేశ ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కడ్ను హేళన చేస్తూ టీఎంసీ ఎంపీ ఒకరు చేసిన చేష్టలు రాజకీయంగా తీవ్ర దుమారం రేపింది. చైర్మన్ ధన్కడ్ ఈ చర్యను ఖండించగా.. ప్రధాని మోదీ ఈ ఉదయం ఉపరాష్ట్రపతికి ఫోన్ చేసి సంఘీభావం తెలిపారు కూడా. ఈ క్రమంలో.. బుధవారం పెద్దల సభలో ఎన్డీయే ఎంపీలు, ధన్కడ్కు సంఘీభావం ప్రకటించారు. ‘‘ఈ చర్యను మేం తీవ్రంగా ఖండిస్తున్నాం. వాళ్లు రాజ్యాంగ బద్ధమైన స్థానాల్లో ఉన్నవాళ్లను పదే పదే అవమానిస్తున్నారు. అన్నివిధాలుగా పరిధి దాటి ప్రవర్తించారు. ఓబీసీ కమ్యూనిటీ నుంచి వచ్చిన ఓ ప్రధానిని అవమానిస్తూ వస్తున్నారు. గిరిజన మహిళ అయిన రాష్ట్రపతిని అవమానించారు. జాట్ కమ్యూనిటీ నుంచి ఉపరాష్ట్రపతి అయిన తొలి వ్యక్తి మీరు. ఓ సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చారు. అలాంటి మిమ్మల్ని ఇప్పుడు అవమానించారు. మీరు ఉన్న ఉన్నతస్థానం పట్ల వాళ్లకు గౌరవం లేదు. రాజ్యాంగాన్ని, ఉపరాష్ట్రపతిని అవమానించడం మేం సహించలేం అని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి రాజ్యసభలో తెలిపారు. వాళ్లకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతూ.. మీకు గౌరవసూచికంగా ప్రశ్నోత్తరాల సమయం మొత్తం మేం నిలబడాలని నిర్ణయించుకున్నాం అని తెలిపారాయన. ఏం జరిగిందంటే.. ఎంపీల సస్పెన్షన్ పరిణామం అనంతరం.. పార్లమెంటు వెలుపల మంగళవారం ఓ ఘటన చోటుచేసుకుంది. ఎంపీలను మూకుమ్మడిగా సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ పార్లమెంట్ వెలుపల విపక్ష ఎంపీలు ఆందోళన నిర్వహించారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్కడ్ను ఉద్దేశించేలా.. తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ కల్యాణ్ బెనర్జీ అనుకరణ చేశారు. ఆయన గొంతును అనుకరిస్తూ.. విచిత్రంగా ప్రవర్తించారు. ఆ సమయంలో విపక్ష సభ్యులు నవ్వులు కురిపిస్తుండగా.. రాహుల్ గాంధీ ఆ దృశ్యాలను తన ఫోన్లో చిత్రీకరించారు. దీనిపై ధన్కడ్ మండిపడుతూ.. ఎంపీ స్థానంలో ఉండి ఛైర్మన్ని హేళన చేయడం సిగ్గుచేటన్నారు. ఇది ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదని అన్నారు. If the country was wondering why Opposition MPs were suspended, here is the reason… TMC MP Kalyan Banerjee mocked the Honourable Vice President, while Rahul Gandhi lustily cheered him on. One can imagine how reckless and violative they have been of the House! pic.twitter.com/5o6VTTyF9C — BJP (@BJP4India) December 19, 2023 మరోవైపు రాజకీయంగా ఈ ఘటన దుమారం రేపుతోంది. అధికార-విపక్ష ఎంపీలు తమ తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో టీఎంసీ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సైతం స్పందించారు. రాహుల్ జీ(రాహుల్ గాంధీ) వీడియో తీసి ఉండకపోతే.. ఈ వ్యవహారంపై ఇంత రాద్దాంతం జరిగి ఉండి కాదేమో అనేలా ఆమె ప్రకటన ఇచ్చారు. మరోవైపు టీఎంసీ ఎంపీ కల్యాణ్ బెనర్జీ, ధన్కడ్కు క్షమాపణలు చెప్పాలనే డిమాండ్ బలంగా వినిపిస్తోంది. జాట్ కమ్యూనిటీ సైతం ఈ డిమాండ్తో నిరసనలకు దిగింది. #WATCH | On TMC MP mimicry row, West Bengal CM Mamata Banerjee says, "...You wouldn't have come to know if Rahul ji had not recorded a video..." pic.twitter.com/t1gNmnI69p — ANI (@ANI) December 20, 2023 -
డీప్ ఫేక్ వీడియోలపై కేంద్రం సీరియస్
సాక్షి, న్యూఢిల్లీ: డీప్ ఫేక్ అంశాన్ని కేంద్ర ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. ముఖ్యమైన సోషల్ మీడియా ఫ్లాట్ఫామ్స్కు కేంద్ర ఎల్రక్టానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ సూచనలు చేసింది. ఈ వివరాలను కేంద్ర సహయమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ రాజ్యసభకు తెలిపారు. ‘డీఫ్ ఫేక్’ ఫొటోలు, వీడియోల సృష్టికర్తల ఆగడాలను ఊపేక్షించేదిలేదని, భారీ జరిమానాలను వి«ధిస్తామని ఇటీవల కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ సోషల్ మీడియా ఫ్లాట్ఫామ్స్ సంస్థల సమావేశంలో హెచ్చరించిన విషయం తెల్సిందే. సంబంధిత మార్గదర్శకాలను, త్వరలో తీసుకురాబోయే చట్టాలను, నిబంధనలను రాజ్యసభ దృష్టికి తీసికెళ్లినట్లు మంత్రి పేర్కొన్నారు. సెక్షన్ 66డీ కింద కంప్యూటర్ ఆధారిత సాంకేతికతతో ఇలాంటి చర్యలకు పాల్పడితే మూడేళ్ల జైలు శిక్ష, రూ.1 లక్ష జరిమానా విధిస్తామని మంత్రి చంద్రశేఖర్ రాజ్యసభకు తెలిపారు. -
బీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీలకు ప్రివిలేజ్ నోటీసులు
-
రాజ్యసభ నుంచి టీఎంసీ ఎంపీ సస్పెన్షన్
న్యూఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో భాగంగా రాజ్యసభ నుంచి టీఎంసీ ఎంపీ డెరెక్ ఒబ్రెయిన్ సస్పెండ్ చేస్తున్నట్లు సభ చైర్మన్ జగదీప్ ధన్కర్ మంగళవారం వెల్లడించారు. ఈ సస్పెన్షన్ వేటు వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు పూర్తయ్యే వరకు కొనసాగుతుందని చెప్పారు. మంగళవారం రాజ్యసభ సమావేశాలు మొదలవుతూనే ఢిల్లీ అధికారాలు గురించిన వాడి వేడి చర్చ మొదలైంది. ఇదే క్రమ్మలో టీఎంసీ ఎంపీ డెరెక్ ఒబ్రెయిన్ స్పీకర్ పోడియం వద్దకు వెళ్లి అదేపనిగా నినాదాలు చేశారు. స్పీకర్ పలు మార్లు వారించే ప్రయత్నం చేసినా కూడా ఆయన వినిపించుకోకుండా ఆందోళన కొనసాగిస్తూనే ఉన్నారు. దీంతో విసుగు చెందిన స్పీకర్ ఒబ్రెయిన్ పై ససపెన్షన్ వేటు విధించారు. సభలో అనుచితంగా వ్యవహరించి సభా కార్యకలాపాలకు అడ్డంకిగా నిలిచినందుకు ఆయనపై సస్పెన్షన్ విధిస్తున్నట్లు తెలిపారు. ఈ సస్పెన్షన్ వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు ముగిసే వరకు వర్తిస్తుందని అన్నారు. స్పీకర్ మాట్లాడుతూ.. ఇది మీకు అలవాటుగా మారిపోయింది. ఇదంతా మీ ప్రణాళికలో భాగమేనని మాకు అర్ధమవుతుంది. ఇలా చేస్తే మీకు బయట పబ్లిసిటీ వస్తుందన్నది మీ ఉద్దేశ్యం. మీ హోదాని దిగజార్చుకుంటూ చాలా అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. సభా గౌరవాన్ని కించపరచడం భావ్యం కాదని చెబుతూ డెరెక్ ఒబ్రెయిన్ పై సస్పెన్షన్ వేటు వేస్తున్నట్లు తెలిపారు. అనంతరం సభను మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. గతంలో ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ పైన కూడా స్పీకర్ ఇదే విధంగా సస్పెన్షన్ వేటు వేసిన విషయం తెలిసిందే. ఇది కూడా చదవండి: ఉత్తరాఖండ్లో చిక్కుకున్న యాత్రికులు -
రాజ్యసభలో ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లు.. వైఎస్సార్సీపీ మద్దతు..!
-
కొత్త పార్లమెంట్ ఇన్సైడ్ ఫస్ట్ లుక్.. వీడియో అదుర్స్
ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభానికి ముస్తాబైంది. అధికార బీజేపీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఆధునిక హంగులతో పార్లమెంట్ భవనాన్ని నిర్మించింది. ఇక, కొత్త పార్లమెంట్ భవన ప్రారంభోత్సవం మే 28న ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా జరగనుంది. ఈ నేపథ్యంలో కొత్త భవనం ఫస్ట్ లుక్ వీడియో రిలీజ్ చేసింది. ఈ వీడియోలో పార్లమెంట్ లోపలి, బయటి దృశ్యాలు ఉన్నాయి. లోక్సభ, రాజ్యసభ.. ఆ రెండు సభల్లో సీటింగ్ అమరికకు సంబంధించిన దృశ్యాలు వీడియోలో కనిపిస్తున్నాయి. కాగా, కొత్త పార్లమెంట్కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. - పార్లమెంట్ లోపలి భాగంలో మూడు జాతీయ చిహ్నాలు ఉన్నాయి. - కమలం, నెమలి, మర్రి చెట్టు - దాని ఇతివృత్తాలు. - త్రిభుజాకారంలో నాలుగు అంతస్తుల పార్లమెంటు భవనం 64,500 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉంది. - ఈ భవనంలో మూడు ప్రధాన ద్వారాలు ఉన్నాయి - జ్ఞాన్ ద్వార్, శక్తి ద్వార్ మరియు కర్మ ద్వార్. - స్పీకర్ కుర్చీకి సమీపంలో సెంగోల్ను ఏర్పాటు చేస్తారు. #WATCH | Delhi: First look at the New Parliament building that will be inaugurated by Prime Minister Narendra Modi on May 28.#NewParliamentBuilding pic.twitter.com/ouZoz6dLgu — ANI (@ANI) May 26, 2023 ఇది కూడా చదవండి: రెగ్యులర్ పాస్పోర్టు కోసం రాహుల్ గాంధీ.. లైన్ క్లియర్ -
రాజ్యసభ పబ్లిక్ అండర్ టేకింగ్స్ కమిటీ సభ్యుడిగా ఎంపీ విజయసాయిరెడ్డి
సాక్షి, న్యూఢిల్లీ: వైఎస్సార్సీపీ ఎంపీ వి. విజయసాయిరెడ్డికి మరో గౌరవం దక్కింది. రాజ్యసభ పబ్లిక్ అండర్ టేకింగ్స్ కమిటీలో ఆయన చోటు దక్కించుకున్నారు. అయితే, రాజ్యసభ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ, పబ్లిక్ అండర్ టేకింగ్స్ కమిటీ ఎన్నిక మంగళవారం జరిగింది. ఈ ఏడాది మే 1వ తేదీ నుంచి వచ్చే ఏడాది ఏప్రిల్ 30వ తేదీ వరకు ఉండే ఈ రెండు కమిటీల్లో ఇద్దరు తెలుగు ఎంపీలకు అవకాశం దక్కింది. పబ్లిక్ అండర్ టేకింగ్స్ కమిటీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు వి.విజయసాయిరెడ్డి, పబ్లిక్ అకౌంట్స్ కమిటీలో డాక్టర్ కె.లక్ష్మణ్ చోటు దక్కించుకున్నారు. -
ఖర్గే వ్యాఖ్యలపై ఛైర్మన్ జగ్దీప్ ధన్కడ్ సీరియస్
-
'దేశ ప్రజలను కాంగ్రెస్ వంచించింది.. పాపాలకు శిక్ష అనుభవిస్తోంది'
న్యూఢిల్లీ: బుధవారం లోకసభ్లో విపక్షాలను ఏకిపారేసిన ప్రధాని మోదీ.. గురువారం కూడా రాజ్యసభలో మరోసారి విరుచుకుపడ్డారు. దేశ ప్రజలను కాంగ్రెస్ వంచిస్తోందని ధ్వజమెత్తారు. గతంలో చేసిన పాపాలను శిక్ష అనుభవిస్తోందని విమర్శించారు. కొందరు ఎంపీల ప్రవర్తన బాధ కలిగిస్తోందన్నారు. బీజేపీ తన పాలన ద్వారా ప్రజల నమ్మకాన్ని పొందిందని చెప్పుకొచ్చారు. ఆరు దశాబ్దాల కాంగ్రెస్ పాలన అంతా శుద్ధ దండగ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పాలనలో జనం డబ్బు మధ్యవర్తలు చేతుల్లోకి వెళ్లిందని ఆరోపించారు. గరీబీ హఠావో అనేది కాంగ్రెస్ నినాదం మాత్రమేనని ఆచరణకు నోచుకోలేదని మోదీ ఫైర్ అయ్యారు. వారు సమస్యలకు పైపూత మాత్రమే పూశార,ని తాము దీర్ఘకాల సమస్యలను శాశ్వతంగా పరిష్కరించామని పేర్కొన్నారు. విపక్షాలు విసిరే బురదలో కూడా కమలం వికసిస్తుందని వ్యాఖ్యానించారు. తాను రాజకీయ లబ్ధి కోసం ఆలోచించనని, తాము నిజమైన లౌకికవాదాన్ని అనుసరిస్తున్నామని మోదీ అన్నారు. తాము వికాసాన్ని నమ్ముతాం, విపక్షాన్ని కాదని పేర్కొన్నారు. విపక్షాలను చూస్తుంటే జాలేస్తోందన్నారు. ప్రభుత్వాల కూల్చివేతలపై.. ప్రభుత్వాల కూల్చివేతలపై కాంగ్రెస్కు మోదీ కౌంటర్ ఇచ్చారు. ఇంధిరా గాంధీ 50 సార్లకుపైగా ఆర్టికల్ 356తో ప్రభుత్వాలను పడగొట్టారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పాలకులు ఆర్టికల్ 356ను దుర్వినియోగం చేశారని మండిపడ్డారు. ఏంజీఆర్ వంటి దిగ్గజాల ప్రభుత్వాలను కాంగ్రెస్ అక్రమంగా పడగొట్టిందని విరుచుకుపడ్డారు. ఎన్టీఆర్ చికిత్స కోసం అమెరికా వెళ్తే ఆయన ప్రభుత్వాన్ని కూడా పడగొట్టారని విమర్శలు గుప్పించారు. మరోవైపు మోదీ ప్రసంగానికి ముందు విపక్షాలు ఆందోళన చేపట్టాయి. అదానీ వ్యవహారంపై మాట్లాడాలని డిమాండ్ చేశాయి. దీంతో విపక్ష సభ్యుల నిరసనల మధ్యే ప్రధాని తన ప్రసంగాన్ని కొనసాగించారు. చదవండి: మోదీ ప్రసంగంపై రాహుల్ విమర్శలు.. అదానీ ఊసే లేదని సెటైర్లు.. -
సెయిల్ లేదా ఎన్ఎండీసీలో వైజాగ్ స్టీల్ విలీన ప్రతిపాదనలు
న్యూఢిల్లీ: వైజాగ్ స్టీల్ను (ఆర్ఐఎన్ఎల్) సెయిల్, ఎన్ఎండీసీలో విలీనం చేయాలంటూ కేంద్ర ప్రభుత్వానికి పలు ప్రతిపాదనలు వచ్చాయి. కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి ఫగన్ సింగ్ కులస్తే ఈ విషయం తెలిపారు. ప్రస్తుతం ఆర్ఐఎన్ఎల్లో 4,875 మంది ఎగ్జిక్యూటివ్లు, 10,005 మంది నాన్–ఎగ్జిక్యూటివ్ ఉద్యోగులు ఉన్నారని రాజ్యసభకు రాతపూర్వక సమాధానంలో ఆయన వివరించారు. కంపెనీ ఆర్థిక పరిస్థితి అంతగా బాగా లేనందున రిక్రూట్మెంట్ను క్రమబద్ధీకరించినట్లు కులస్తే పేర్కొన్నారు. పబ్లిక్ ఇష్యూ లేదా బాండ్ల జారీ ద్వారా ఆర్ఐఎన్ఎల్ నిధులు సమీకరించే యోచనేదీ లేదని తెలిపారు. -
554 మంది జడ్జీల్లో 430 మంది జనరల్ కేటగిరీయే
న్యూఢిల్లీ: 2018 నుంచి హైకోర్టు జడ్జీలుగా నియమితులైన 554 మందిలో 430 మంది జనరల్ కేటగిరీకి చెందిన వారేనని న్యాయ శాఖ మంత్రి కిరెన్ రిజిజు రాజ్యసభలో తెలిపారు. మిగిలిన వారిలో 58 మంది ఇతర వెనుకబడిన కులాలకు, 19 మంది షెడ్యూల్ కులాలకు చెందిన వారు కాగా, కేవలం ఆరుగురు షెడ్యూల్ తెగలకు, 27 మంది మైనారిటీలని వివరించారు. మొత్తమ్మీద 84 మంది మహిళా జడ్జీలున్నారని చెప్పారు. మొత్తం జడ్జీల్లో జనరల్ కేటగిరీకి చెందిన వారే 77% పైగా ఉన్నారన్నారు. సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జీల నియామకాలకు రిజర్వేషన్లు లేవని మంత్రి పేర్కొన్నారు. అత్యున్నత న్యాయ వ్యవస్థలోనూ సామాజిక వైవిధ్యం సాధించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. జడ్జీల నియామకాలకు ప్రతిపాదనలు పంపే సమయంలో అర్హులైన ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, మహిళా జడ్జీల పేర్లను కూడా పరిశీలించాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులను కోరుతోందని వెల్లడించారు. 2018 నుంచి ఇప్పటి వరకు సుప్రీంకోర్టులో 30 మంది జడ్జీలు నియమితులయ్యారని చెప్పారు. దేశవ్యాప్తంగా ఉన్న జిల్లా జడ్జీల్లో 612 మంది ఎస్సీలు, 204 మంది ఎస్టీలు, 1,329 మంది ఓబీసీలు, 1,406 మంది మహిళలు ఉన్నారని ఒక ప్రశ్నకు సమాధానంగా పేర్కొన్నారు. -
త్వరలో రూ.2,000 నోట్లు రద్దు! బీజేపీ ఎంపీ కీలక వ్యాఖ్యలు..
న్యూఢిల్లీ: బీజేపీ ఎంపీ సుశీల్ కుమార్ మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. సోమవారం రాజ్యసభలో మాట్లాడిన ఆయన.. రూ.2000 నోట్లను దశల వారీగా రద్దు చేయాలని కేంద్రాన్ని కోరారు. ఈ పెద్ద నోట్లు ఉన్న వారు వాటిని బ్యాంకుల్లో మార్చుకునేందుకు రెండేళ్ల గడువు ఇవ్వాలని సూచించారు. దేశంలోని ఏటీఎంలలో రూ.2వేల నోట్లన్నీ ఖాళీ అయ్యాయని సుశీల్ మోదీ పేర్కొన్నారు. త్వరలోనే ఈ నోట్లను రద్దు చేస్తారనే వదంతులు కూడా మొదలయ్యాయని చెప్పారు. కేంద్రం దీనిపై స్పష్టత ఇవ్వాలని కోరారు. రూ.2వేల నోట్ల ముద్రణను ఆర్బీఐ మూడేళ్ల కిందటే నిలిపివేసిందని చెప్పుకొచ్చారు. 2016లో ప్రధాని మోదీ నోట్ల రద్దును ప్రకటించారు. రూ.1000, రూ.500 నోట్లను బ్యాన్ చేశారు. వాటి స్థానంలో కొత్తగా రూ.2000, రూ.500 నోట్లను చలామణిలోకి తెచ్చారు. అయితే రూ.1000 నోట్లనే రద్దు చేసినప్పుడు రూ.2000 నోట్లను చలామణిలోకి తేవడంలో అర్థం లేదని సుశీల్ మోదీ పేర్కొన్నారు. అభివృద్ధి చెందిన దేశాల్లో పెద్ద నోట్లు చలామణిలో లేవని వివరించారు. భారత్లో రూ.2వేల నోట్లను డ్రగ్స్, మనీ లాండరింగ్ వంటి అక్రమ లావాదేవీలకు ఉపయోగిస్తున్నారని బీజేపీ ఎంపీ చెప్పుకొచ్చారు. ఈ పెద్ద నోటు నల్ల ధనానికి పర్యాయపదంగా మారిందని చెప్పారు. అందుకే కేంద్రం దశల వారీగా రూ.2వేల నోట్లను రద్దు చేసి, వాటిని బ్యాంకుల్లో మార్చుకునేందుకు ప్రజలకు రెండేళ్ల సమయం ఇవ్వాలని పేర్కొన్నారు. చదవండి: రాజ్యాంగాన్ని కాపాడాలంటే మోదీని లేకుండా చేయాలి: కాంగ్రెస్ నేత -
బీసీలకు రాజ్యసభ సభ్యుల వరకు పదవులు దక్కాయి : మంత్రి బొత్స సత్యనారాయణ
-
కృష్ణా మిగులు జలాల్లో వాటాలు తేలుస్తాం
సాక్షి, న్యూఢిల్లీ: కృష్ణా మిగులు జలాల్లో ఏపీ, తెలంగాణ మధ్య వాటాలను నిర్ధారించే అంశం కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ) పరిశీలనలో ఉందని కేంద్ర జలశక్తి శాఖ సహాయమంత్రి బిశ్వేశ్వర్ తుడు చెప్పారు. రాజ్యసభలో సోమవారం వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ.. కృష్ణా బేసిన్లోని ప్రాజెక్టుల్లో 75 శాతం నికర జలాలకు మించి ప్రవహించే మిగులు జలాలను రెండు రాష్ట్రాల మధ్య పంపిణీ చేసేందుకు నిర్దిష్టమైన విధానం రూపకల్పన బాధ్యతను కేఆర్ఎంబీ రివర్ మేనేజ్మెంట్ కమిటీకి అప్పగించినట్లు తెలిపారు. మిగులు జలాలను ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు నియంత్రిత పద్ధతిలో పంపిణీ చేసేందుకు కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ)కు చెందిన సాంకేతిక సంఘాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఉభయ రాష్ట్రాలు దీనికి సంబంధించి అవసరమైన సమాచారం ఇవ్వకపోవడంతో సాంకేతిక సంఘం తన బాధ్యతను పూర్తిచేయలేకపోయిందన్నారు. కృష్ణా జలాలను రెండు రాష్ట్రాల మధ్య ప్రాజెక్టుల వారీగా కేటాయించేందుకు వివాద పరిష్కార ట్రిబ్యునల్ కాల పరిమితి పొడిగించామన్నారు. ప్రధానమంత్రి స్వానిధి పథకం కింద రుణాల కోసం దరఖాస్తు చేసుకున్న వీధి వ్యాపారుల్లో 25 శాతం మందికి రుణాలు మంజూరు చేయకుండా బ్యాంకు అధికారులు తిరస్కరించారని, పెండింగ్లో ఉన్న ఫైళ్ళతో కలిపితే ఈ సంఖ్య ఇంకా ఎక్కువగానే ఉందన్న విజయసాయిరెడ్డి వ్యాఖ్యలను అంగీకరించిన కేంద్ర పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి హర్దీప్సింగ్ పురి ఈ అంశం కేంద్రం పరిధిలోనిది కాదన్నారు. రుణాల మంజూరుపై ఆయా బ్యాంకులు నిర్ణయం తీసుకుంటాయని, సంబంధిత శాఖల మంత్రులు ఈ విషయమై బ్యాంకు అధికారులతో చర్చిస్తున్నారని తెలిపారు. బీచ్శాండ్ తవ్వకాలపై నిషేధం తొలగించే ప్రతిపాదన బీచ్శాండ్తో సహా మరికొన్ని అణు ఖనిజాల తవ్వకాలపై నిషేధాన్ని తొలగించే ప్రతిపాదనపై ప్రభుత్వం అందరి సలహాలు, సూచనలు కోరినట్లు కేంద్ర గనులశాఖ మంత్రి ప్రహ్లాద్జోషి తెలిపారు. గనులు, ఖనిజాల నియంత్రణ, అభివృద్ధి చట్టం మొదటి షెడ్యూలులోని పార్ట్–బి కింద చేర్చిన బీచ్శాండ్ మినరల్స్తోపాటు మరికొన్ని అటామిక్ మినరల్స్ను తొలగించే ప్రతిపాదనపై వివిధ శాఖలు, విభాగాలు, రాష్ట్ర ప్రభుత్వాలు, మైనింగ్ పరిశ్రమకు చెందిన భాగస్వాములు, పారిశ్రామిక సంఘాలతోపాటు ప్రజల నుంచి సలహాలు, సూచనలు కోరినట్లు ఎంపీ విజయసాయిరెడ్డి ప్రశ్నకు మంత్రి జవాబిచ్చారు. ఇండియన్ అంటార్కిటిక్ బిల్లుకి వైఎస్సార్సీపీ మద్దతు రాజ్యసభలో ఇండియన్ అంటార్కిటిక్ బిల్లుకి వైఎస్సార్సీపీ మద్దతు తెలిపింది. రాజ్యసభలో సోమవారం బిల్లుపై జరిగిన చర్చలో పాల్గొన్న ఎంపీ నిరంజన్రెడ్డి.. దేశాన్ని సంప్రదింపుల భాగస్వామిగా చూపే ఈ బిల్లుకు మద్దతు ఇస్తున్నామని చెప్పారు. ఈ సందర్భంగా కేంద్రానికి కొన్ని సూచనలు చేశారు. -
పార్లమెంటు ప్రాంగణంలో ధర్నాలు, దీక్షలు బంద్! విపక్షాలు ధ్వజం
సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంట్లో సభ్యులు నిషేధిత పదాలు వాడరాదంటూ గురువారం జారీ చేసిన సర్క్యులర్పై వివాదం సమసిపోక మునుపే..శుక్రవారం జారీ చేసిన మరో బులెటిన్పై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ‘పార్లమెంటు ప్రాంగణాన్ని సభ్యులు ‘ధర్నా, సమ్మె, నిరాహార దీక్ష, ప్రదర్శన, ఏదైనా మతపరమైన కార్యక్రమాల నిమిత్తం వినియోగించుకోరాదు’ అంటూ రాజ్యసభ సెక్రటరీ జనరల్ పీసీ మోదీ శుక్రవారం విడుదల చేసిన బులెటిన్లో పేర్కొన్నారు. సమావేశాలు సవ్యంగా సాగేందుకు సభ్యులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై ప్రతిపక్షాలు మండిపడ్డాయి. పనికిమాలిన, పిరికిపంద ప్రభుత్వం ప్రజాస్వామ్యం గొంతు నొక్కేందుకు ప్రయత్నిస్తోందని సీపీఎం నేత సీతారాం ఏచూరి విమర్శించారు. ‘విశ్వ గురు నుంచి మరో కొత్త ఆయుధం వచ్చింది. ఇక ధర్నాలపైనా నిషేధం’ అని కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ స్పందించారు. చదవండి: Presidential election 2022: ముర్ముకు 61% ఓట్లు -
బీజేపీలో రాజ్యసభ ఆశలు.. కుష్బుకు బెర్తు దక్కేనా?
సాక్షి, చెన్నై: రాజ్యసభ నామినేటెడ్ ఎంపీ పదవి కోసం రాష్ట్రానికి చెందిన పలువురు బీజేపీ నేతలు ఎదురుచూస్తున్నారు. ఇందులో సినీ నటి కుష్భు పేరు ప్రథమంగా వినిపిస్తున్నా, తెర మీదకు మరి కొందరు నేతల పేర్లు రావడంతో ఎవరిని అదృష్టం వరిస్తుందోననే చర్చ ప్రారంభమైంది. రాజ్యసభలో ప్రస్తుతం నామినేటెడ్ ఎంపీలుగా వ్యవహరిస్తున్న సుబ్రహ్మణ్య స్వామి, సురేష్ గోపి, మేరికోం, రూపా గంగూలీ, నరేంద్ర జాదవ్ తదితర ఆరుగురి పదవీకాలం ఈనెల 24వ తేదీతో ముగియనుంది. దీంతో వీరి స్థానాల్లో కొత్త వారికి అవకాశం కల్పించేందుకు తగ్గ కసరత్తుల్లో కేంద్రం పెద్దలు ఉన్నట్టు తెలుస్తోంది. సుబ్రహ్మణ్య స్వామికి ఇది వరకు తమిళనాడు నుంచి నామినేటెడ్ ఎంపీ పదవిని కేటాయించారు. ఈసారి ఆయనకు పదవి మళ్లీ దక్కేది అనుమానంగా మారింది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై ఆయన ఇటీవల కాలంలో చేస్తున్న విమర్శలే ఇందుకు కారణమని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నా యి. దీంతో తమిళనాడు నుంచి ఈ పదవి సినీనటి, పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యురాలుగా ఉన్న కుష్బుకు దక్కవచ్చు అనే చర్చ నడుస్తోంది. పార్టీ కోసం ఆమె తీవ్రంగానే శ్రమిస్తున్నా, సరైన గుర్తింపు రావడం లేదని మద్దతుదారులు వ్యాఖ్యానిస్తూ వస్తున్నారు. అదే సమయంలో గత కొద్దిరోజులుగా మోదీకి మద్దతుగా సంగీత దర్శకుడు ఇలయరాజా వ్యాఖ్యలు చేస్తున్న నేపథ్యంలో ఆయన పేరు కూడా పరిశీలనలో ఉన్నట్టు సమాచారం. ఇక, రాష్ట్ర బీజేపీలో సీనియర్లు ఉంటూ, ఎలాంటి పదవులు లేకుండా ఉన్న పొన్ రాధాకృష్ణన్, సీపీ రాధాకృష్ణన్ కూడా రేసులో ఉండటం గమనార్హం. అయితే, కళా రంగం కేటగిరిలో కుష్భుకు లేదా ఇలయరాజాకు పదవీ గ్యారంటీ అన్న ప్రస్తుతం ఊపందుకుంది. -
EPF వడ్డీ రేట్లు తగ్గించడం సరికాదు :విజయసాయిరెడ్డి
-
ఈ నెల 14 నుంచి పార్లమెంట్ సమావేశాలు
Parliament Budget Session: బడ్జెట్ పార్లమెంట్ సమావేశాలు ఈనెల 14వ తేదీ ఉదయం 11 గంటల నుంచి ప్రారంభం కానున్నాయి. మొదటి విడత మాదిరిగానే ఈసారి కూడా రాజ్యసభ, లోక్సభలు సమావేశాలు ఒకదాని తర్వాత మరొకటి జరుగుతాయని అధికార వర్గాలు తెలిపాయి. ఇందుకు అవసరమైన సీటింగ్, ఇతర ఏర్పాట్లపై మంగళవారం రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా సమావేశమై చర్చించారు. బడ్జెట్ మొదటి విడత సమావేశాల్లో రాజ్యసభ ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు, లోక్సభ సాయం త్రం 4 నుంచి రాత్రి 9 గంటల వరకు కొనసాగిన విషయం తెలిసిందే. ఉభయ సభల సెక్రటరీ జనరళ్లు సమావేశమై దేశంలో కోవిడ్ కేసులు గణనీయంగా తగ్గినందున తీసుకోవాల్సిన చర్యల ను చర్చించారు. బడ్జెట్ తొలి విడత సమావేశాల్లో మాదిరిగానే చాంబర్లు, గ్యాలరీల్లో సభ్యులకు స్థానం కల్పించనున్నారు. బడ్జెట్ సమావేశాలు ఉభయ సభల సంయుక్త సమావేశంతో జనవరి 31న మొదలైన విషయం తెలిసిందే. (చదవండి: ఈ నెల 27 నుంచి అంతర్జాతీయ విమాన సేవలు) -
8 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలి: ఎంపీ విజయసాయిరెడ్డి
-
కనీస మద్దతు ధరపై కమిటీ
న్యూఢిల్లీ: పంటలకు కనీస మద్దతు ధర(ఎంఎస్పీ)పై కమిటీని ఏర్పాటు చేసే విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరిస్తోందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ శుక్రవారం రాజ్యసభలో ప్రకటించారు. కమిటీ విషయంలో అనుమతి కోసం ఎన్నికల సంఘానికి లేఖ రాశామని, ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు పూర్తయిన తర్వాతే ఈ కమిటీని తీసుకురావాలని ఎన్నికల సంఘం సూచించిందని అన్నారు. రాజ్యసభలో ప్రశ్నోత్తరాల సమయంలో అడిగిన అనుబంధ ప్రశ్నకు తోమర్ సమాధానమిచ్చారు. ఎంఎస్పీకి రూ.2.37 లక్షల కోట్లు గత ఏడేళ్లలో మద్దతు ధరతో పంటల కొనుగోలు రెండింతలు పెరిగిందన్నారు. ప్రస్తుత బడ్జెట్లో ఇందుకోసం రూ.2.37 లక్షల కోట్లు కేటాయించామన్నారు. రైతుల సంక్షేమం కోసం కేంద్రం కృషి చేస్తోందని, పీఎం–కిసాన్ పథకంతోపాటు ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్లు ఏర్పాటు చేస్తోందని వివరించారు. రైతుల నుంచి వరి, గోధుమలను కనీస మద్దతు ధరతో మరింత అధికంగా కొనుగోలు చేస్తామని అన్నారు. తృణధాన్యాలు, నూనె గింజలు సైతం కనీస మద్దతు ధరతో సేకరిస్తామని పేర్కొన్నారు. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పప్పుగింజలను ప్రజలకు సరఫరా చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలు కోరితే అందుకు అనుమతి మంజూరు చేస్తామని నరేంద్రసింగ్ తోమర్ వెల్లడించారు. కనీస మద్దతు ధర విషయంలో ప్రభుత్వం హామీని నిలబెట్టుకోవడం లేదని సంయుక్త కిసాన్ మోర్చా ఆరోపించింది. యూపీ ఎన్నికల్లో బీజేపీని ఓడించాలని రైతులకు పిలుపునిచ్చింది. -
టీటీడీ ఎఫ్సీఆర్ఏ రిజిస్ట్రేషన్ పునరుద్ధరించాలి
సాక్షి, న్యూఢిల్లీ: తిరుమల తిరుపతి దేవస్థానాల (టీటీడీ)కు సంబంధించిన ఎఫ్సీఆర్ఏ (విదేశీ విరాళాల నియంత్రణ చట్టం) రిజిస్ట్రేషన్ను తక్షణమే పునరుద్ధరించాలని వైఎస్సార్సీపీ ఎంపీ వి.విజయసాయిరెడ్డి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రాజ్యసభ జీరో అవర్లో బుధవారం ఆయన ఈ అంశాన్ని ప్రస్తావించారు. టీటీడీ చేపట్టే వివిధ సామాజిక, విద్య, ధార్మిక, సాంస్కృతిక కార్యకలాపాల నిర్వహణకు పెద్ద ఎత్తున నిధులు ఖర్చు చేయవలసి వస్తుందని, శ్రీవారి ఆలయాన్ని సందర్శించే భక్తులతోపాటు విదేశాల్లోని భక్తులు ఇచ్చే విరాళాల సాయంతో టీటీడీ ఈ కార్యక్రమాలను చేపడుతోందని వివరించారు. సాంకేతిక కారణాలను సాకుగా చూపుతూ టీటీడీ ఎఫ్సీఆర్ఏ రిజిస్ట్రేషన్ను పునరుద్ధరించడానికి ఇటీవల కేంద్ర హోంశాఖ నిరాకరించిందని చెప్పారు. రిజిస్ట్రేషన్ పునరుద్ధరణ కోసం టీటీడీ చట్టపరమైన అన్ని నిబంధనలను పాటించినా హోంశాఖ తిరస్కరించడం విచారకరమన్నారు. గత డిసెంబర్ 31 నాటికి టీటీడీ సమర్పించిన వార్షిక రిటర్న్ల ప్రకారం టీటీడీ విదేశీ విరాళాల బ్యాంకు ఖాతాలో రూ.13.4 కోట్లు ఉన్నట్లు తెలిపారు. డిసెంబర్ 2021 తర్వాత టీటీడీ ఎఫ్సీఆర్ఏ రిజిస్ట్రేషన్ పునరుద్ధరణ చేయనందున టీటీడీ ఈ నిధులను వినియోగించుకోలేని నిస్సహాయ స్థితిలో ఉందని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా హిందువుల్లో టీటీడీకి ఉన్న ప్రాధాన్యత దృష్ట్యా ప్రభుత్వం తక్షణమే ఈ సమస్యపై దృష్టి సారించి ఎఫ్సీఆర్ఏ రిజిస్ట్రేషన్ను పునరుద్ధరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. రెండేళ్లలో బంగారుపాలెం–గుడిపాల హైవే.. బెంగళూరు–చెన్నై ఎక్స్ప్రెస్ వేలో భాగంగా ఆంధ్రప్రదేశ్లో సుమారు 30 కిలోమీటర్ల మేర విస్తరించే రహదారిని రెండేళ్లలో పూర్తిచేయాలని గడవు పెట్టినట్లు రోడ్డు రవాణా, జాతీయ రహదారులశాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. రాజ్యసభలో వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. భారత్మాల పరియోజనలో భాగమైన ఈ రహదారిని రూ.1,138 కోట్లతో నిర్మించడానికి 2020 ఆగస్టు 8న ఆమోదం తెలపగా 2021 సెప్టెంబర్ 15న కాంట్రాక్టును జారీచేసినట్లు తెలిపారు. ఈ ప్రాజెక్ట్లో అంచనాకు మించి వ్యయం అయ్యే అవకాశం లేదన్నారు. పనులు పూర్తిచేయడానికి నిర్దేశించిన కాలపరిమితి అతిక్రమించడం జరగదని చెప్పారు. సహకార రంగంపై కోవిడ్ ప్రభావాన్ని అంచనా వేయలేదు దేశంలో సహకార రంగంపై కోవిడ్ మహమ్మారి ప్రభావాన్ని అంచనా వేయడానికి ఎలాంటి అధ్యయనం జరపలేదని వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రశ్నకు జవాబుగా కేంద్ర హోం, సహకారశాఖ మంత్రి అమిత్ షా తెలిపారు. కోవిడ్ మహమ్మారి కారణంగా అన్ని రంగాల మాదిరిగానే సహకార రంగంపైన కూడా తీవ్ర ప్రభావం పడిందని చెప్పారు. కోవిడ్ కారణంగా ఎదురైన సవాళ్లను దీటుగా ఎదుర్కొనేందుకు వివిధ రంగాలకు ప్రభుత్వం ప్యాకేజీలు ప్రకటించిందని తెలిపారు. సెప్టెంబర్ కల్లా విశాఖ ఐఐఎం క్యాంపస్ పూర్తి విశాఖపట్నంలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం) క్యాంపస్ పనులు సెప్టెంబర్ కల్లా పూర్తవుతాయని కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి సుభాష్ సర్కార్ తెలిపారు. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో ప్రాజెక్టు నాలుగు నెలలు ఆలస్యం అయిందని వైఎస్సార్సీపీ ఎంపీ మోపిదేవి వెంకటరమణారావు ప్రశ్నకు మంత్రి జవాబుగా చెప్పారు. రాయ్పూర్–వైజాగ్ కారిడార్కు నిధులు భారతమాల పరియోజనలో భాగంగా నిర్మించనున్న రాయ్పూర్–వైజాగ్ కారిడార్కు సంబంధించి ఆంధ్రప్రదేశ్లోని నాలుగు ప్యాకేజీలకు రూ.3,183.09 కోట్లకు అనుమతి ఇచ్చినట్లు కేంద్ర జాతీయ రహదారులశాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ఈ ప్రాజెక్టులో ఇప్పటికే 356 కిలోమీటర్ల అవార్డు పూర్తయిందని, దీంట్లో ఏపీలో 99.6 కిలోమీటర్లు ఉందని వైఎస్సార్సీపీ ఎంపీ మోపిదేవి వెంకటరమణారావు ప్రశ్నకు సమాధానంగా తెలిపారు. సెంట్రల్ వర్సిటీకి రూ.450 కోట్లు ఆంధ్రప్రదేశ్లోని సెంట్రల్ వర్సిటీ ఏర్పాటుకు సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) మేరకు రూ.450 కోట్లకు అనుమతి ఇచ్చినట్లు కేంద్ర విద్యాశాఖ సహాయమంత్రి సుభాష్ సర్కార్ చెప్పారు. వైఎస్సార్సీపీ ఎంపీలు ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, మోపిదేవి వెంకటరమణారావు అడిగిన ప్రశ్నకు ఆయన జవాబిస్తూ.. 2019–20 నుంచే అనంతపురం జిల్లాలో కేంద్రీయ వర్సిటీ కార్యకలాపాలు ప్రారంభించిందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని సెంట్రల్ వర్సిటీ, గిరిజన వర్సిటీలకు గత అక్టోబర్ 1వ తేదీ నాటికి ఎలాంటి పోస్టులు మంజూరు చేయలేదని పేర్కొన్నారు. 21 హైవే పనులు మంజూరు ఆంధ్రప్రదేశ్లో 2014 తర్వాత రూ.64,684 కోట్లతో ఆల్–వెదర్ రోడ్లుగా ఉండే 149 జాతీయ రహదారుల పనులు చేపట్టామని జాతీయ రహదారులశాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ఈ 66 పనుల్లో రూ.22,556 కోట్లతో 62 పూర్తయ్యాయని, రూ.27,800 కోట్లతో పనులు పురోగతిలో ఉన్నాయని బీజేపీ సభ్యుడు టి.జి.వెంకటేశ్ ప్రశ్నకు జవాబుగా చెప్పారు. ఇటీవల రూ.14,328 కోట్లతో 21 పనులు మంజూరు చేసినట్లు తెలిపారు. తామర తెగులుపై దృష్టిపెట్టాలి త్రిప్స్ పర్విస్పినస్ (తామర తెలుగు) వ్యాపించడంతో ఆంధ్రప్రదేశ్లో 80 శాతం మిర్చి పంట తీవ్రంగా దెబ్బతిందని బీజేపీ సభ్యుడు జి.వి.ఎల్.నరసింహారావు చెప్పారు. ఆయన ప్రత్యేక ప్రస్తావన కింద మాట్లాడుతూ మామిడి వంటి అనేక ఉద్యాన పంటల్లో కూడా ఈ తెగులు కనిపించిందని తెలిపారు. ఈ తెగులును తక్షణమే ఎదుర్కోవడంపై దృష్టి సారించాలని కోరారు. -
మార్షల్స్పై దాడి: అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం
సాక్షి, న్యూఢిల్లీ: బుధవారం రాజ్యసభలో చెలరేగిన రగడపై అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. పార్లమెంట్ సమావేశాలు అనుకున్న గడువు కంటే ముందే ముగియడానికి మీరంటే మీరే కారణమని అధికార, విపక్షాలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నాయి. ఇక బుధవారం రాజ్యసభలో మార్షల్స్పై జరిగిన దాడికి సంబంధించి విపక్ష నేతలు.. మోదీ ప్రభుత్వంపై విమర్శల వర్షం కురిపించారు. బయట సిబ్బందిని తీసుకొచ్చి ఎంపీలపై దాడి చేయించారని కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆరోపించారు. మహిళా ఎంపీలపై దాడి పార్లమెంట్ ప్రతిష్టను దిగజార్చడమేనని వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని రాహుల్ మండిపడ్డారు. ఈ క్రమంలో15 ప్రతిపక్ష పార్టీలతో కలిసి రాహుల్ గాంధీ నిరసన తెలిపారు. తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఇలాంటి పరిణామాలు చూడలేదన్నారు శరద్ పవార్. విపక్ష నేతల ఆరోపణలకు ఎనిమిది మంది కేంద్ర మంత్రులతో మోదీ ప్రభుత్వం కౌంటర్ ఇచ్చింది. -
మార్షల్స్పై దాడి వీడియోలు విడుదల చేసిన కేంద్రం
సాక్షి, న్యూఢిల్లీ: నిన్న రాజ్యసభలో పెనుదుమారమే చెలరేగింది. పెగాసస్ నిఘా, కొత్త వ్యవసాయ సాగు చట్టాలపై చర్చించాలంటూ ఆందోళన చేపట్టిన విపక్ష సభ్యులపై కేంద్రం బయటి వ్యక్తులను తీసుకువచ్చి.. దాడి చేయించిందంటూ ప్రతిపక్ష సభ్యులు ఆరోపణలు చేశారు. విపక్షాల ఆరోపణలకు కేంద్రం ధీటుగా బదులిచ్చింది. బుధవారం నాటి రగడకు సంబంధించిన వీడియోని విడుదల చేసింది. దీనిలో విపక్ష నేతలు మార్షల్స్పై దాడి చేస్తున్న దృశ్యాలున్నాయి. దారుణమైన విషయం ఏంటంటే.. మహిళా మార్షల్స్పై విపక్ష సభ్యులు దాడి చేయడం వీడియోలో చూడవచ్చు. రాజ్యసభలో విపక్ష సభ్యుల అనుచిత ప్రవర్తనపై కేంద్ర మంత్రులు మండిపడ్డారు. తమ ప్రవర్తనకు చింతిస్తూ విపక్ష సభ్యులు తక్షణమే క్షమాపణ చెప్పాలని కేంద్ర మంత్రులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా కేంద్ర సమాచార ప్రసార, క్రీడా శాఖమంత్రి అనురాగ్ ఠాకూర్ మాట్లాడుతూ.. ‘‘ప్రజలు తమ సమస్యల గురించి పార్లమెంటులో చర్చిస్తారని ఎదురుచూస్తారు.. కానీ ఈ పార్లమెంట్ సమావేశాలలో విపక్షాలు అరాచకం సృష్టించాయి. ప్రతిపక్ష పార్టీల ఎంపీలు… దేశంలోని వ్యక్తులు, పన్ను చెల్లింపుదారుల డబ్బు వృధా అవుతున్నా దాని గురించి పట్టించుకోలేదు. నిన్న రాజ్యసభలో జరిగిన సంఘటన ఖండించదగినది. మొసలి కన్నీళ్లు కార్చే బదులు, వారు తమ ప్రవర్తన పట్ల క్షమాపణ చెప్పాలి’’ అని డిమాండ్ చేశారు. విపక్ష సభ్యుల ప్రవర్తన దారుణం: ప్రహ్లాద్ జోషి పార్లమెంటులో విపక్ష సభ్యుల ప్రవర్తన దారుణం అన్నారు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి. నిన్నటి రగడపై విపక్ష సభ్యులు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యాన్ని హత్య చేశామని రాహుల్ అంటున్నారు.. పార్లమెంటులో ఏం జరిగిందో అందరూ చూశారు. సభ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని చైర్మన్ను కోరతాం అన్నారు ప్రహ్లాద్ జోషి. రాజ్యసభలో విపక్షాల రగడ.. బుధవారం రాజ్యసభలో ప్రతిపక్షాలు నిరసన తెలుపుతూ చైర్మన్ వెల్లోకి వెళ్లిన సందర్భంగా వారిని కంట్రోల్ చేసేందుకు మార్షల్స్ లోపలికి వచ్చారు. ఈ సందర్భంగా ప్రతిపక్ష ఎంపీలకు, మార్షల్స్కు మధ్య తోపులాట జరిగింది. అయితే మగ మార్షల్స్ తమపై చేయిచేసుకున్నారని కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు మహిళా ఎంపీలు ఆరోపిస్తున్నారు. పార్లమెంట్లో ఎంపీలపై దాడి చేయడం ఇదే తొలిసారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీలపై దాడి చేయడానికి బయటి వాళ్లను సభలోకి తీసుకొచ్చారని ఆరోపించారు. ఇది ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయడమేనని రాహుల్ అన్నారు. -
టాక్సేషన్ చట్ట సవరణ బిల్లుపై చర్చలో పాల్గొన్న విజయసాయిరెడ్డి
సాక్షి, న్యూఢిల్లీ: టాక్సేషన్ చట్టాల సవరణ బిల్లుపై సోమవారం రాజ్యసభలో జరిగిన చర్చలో వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘‘రెట్రాస్పెక్టివ్ ట్సాక్ తొలగింపు మంచి పరిణామం. వెనుకటి తేదీ నుంచి పన్ను చెల్లించాలన్న నిబంధన తొలగి పోతుంది.. తద్వారా అంతర్జాతీయ లిటిగేషన్లకు ఆస్కారం ఉండదు. విదేశీ కంపెనీల విశ్వాసం పెరగడంతో పాటు.. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మరింత సులభతరం అవుతుంది. ఈ బిల్లుకు వైఎస్ఆర్సీపీ సంపూర్ణ మద్దతు ఇస్తుంది’’ అన్నారు విజయసాయిరెడ్డి. -
పార్లమెంటు ముగిశాక ‘పోలవరం’ వస్తా
సాక్షి, న్యూఢిల్లీ: ప్రస్తుత పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ముగిసిన వెంటనే పోలవరం ప్రాజెక్టు సందర్శించి పనులు పరిశీలించనున్నట్టు కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తెలిపారు. రాజ్యసభ ప్రశ్నోత్తరాల సమయంలో సోమవారం బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా మంత్రి ఈ విషయం వెల్లడించారు. టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్, ఒడిశా ఎంపీ ప్రసన్న ఆచార్య అడిగిన ప్రశ్నలకూ ఆయన సమాధానమిచ్చారు. పోలవరం ప్రాజెక్టులో నిర్వాసితులైన దళితులు, ఆదివాసీలకు పునరావాసం, పునర్నిర్మాణం ప్యాకేజీలో ప్రత్యేకంగా కేటాయిస్తున్న అదనపు ప్యాకేజీ ఏదైనా ఉందా? కేంద్ర ప్రభుత్వం నుంచి ఎవరైనా అధికారి పునరావాస ప్రక్రియను పర్యవేక్షిస్తున్నారా? అంటూ కనకమేడల ప్రశ్నించారు. దీనికి షెకావత్ సమాధానమిస్తూ.. అర్ అండ్ ఆర్ ప్యాకేజీని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తోందని.. దళితులు, ఆదివాసీలకు అదనపు ప్యాకేజీ అందిస్తోందని వివరించారు. అదనంగా రూ.50 వేల చొప్పున గ్రాంటు ఇస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ కింద రూ.10 లక్షల సాయం అన్ని నిర్వాసిత కుటుంబాలకు ఇస్తున్నట్లు తెలిపారు. పునరావాస ప్రక్రియ పరిశీలనకు కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ కార్యదర్శి అధ్యక్షతన కమిటీ ఏర్పాటైందన్నారు. పునరావాస ప్రక్రియలో దళితులకు, ఆదివాసీలకు తగినంత ఉపశమనం ఇవ్వలేదని కనకమేడల అనుబంధ ప్రశ్న వేస్తూ ఈ ప్రక్రియ కోసం కేంద్రం ఎంత సాయం చేసిందని ప్రశ్నించారు. మంత్రి సమాధానమిస్తూ.. పునరావాస ప్రక్రియలో సమకూర్చే వసతుల విషయంలో పెద్ద జాబితా ఉందని, వాటన్నింటినీ ప్రస్తావించారు. ఈ సమయంలో.. ఒడిశా నిర్వాసితులకు ప్రత్యేక ప్యాకేజీ ఇస్తున్నారా? అని ఒడిశా ఎంపీ ప్రసన్న ఆచార్య ప్రశ్నించారు. దీనిపై మంత్రి మాట్లాడుతూ.. సుప్రీంలో ఈ అంశం విచారణలో ఉన్నందున దీనిపై ప్రకటన చేయడం సముచితం కాదన్నారు. బీజేపీ ఎంపీ జీవీఎల్ ఇదే ప్రశ్నకు స్పందిస్తూ.. ‘పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు కొన్ని నివేదనలు ఉన్నాయి.. కేంద్రమంత్రి పోలవరం ప్రాజెక్టును సందర్శించాలి. పోలవరం ప్రాజెక్టు అథారిటీ కార్యాలయాన్ని హైదరాబాద్ నుంచి రాజమండ్రికి తరలించాలి. దీనివల్ల నిర్వాసితులు పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ)ని సంప్రదించేందుకు వీలవుతుంది..’ అని ప్రస్తావించారు. మంత్రి బదులిస్తూ.. ‘కార్యాలయ తరలింపు పరిశీలనలో ఉంది. పార్లమెంటు సమావేశాలు పూర్తయిన వెంటనే పోలవరం ప్రాజెక్టు సందర్శించి పనులను పరిశీలిస్తాం..’ అని సమాధానమిచ్చారు. -
చట్టసభలను అధ్యయనం చేయాలనుకుంటున్నారా?
భారత పార్లమెంట్.. ముఖ్యంగా రాజ్యసభ కార్యకలాపాలను అధ్యయనం చేయాలని, అవగాహన పెంచుకోవాలని కోరుకునే అభ్యర్థులకు మంచి అవకాశం. రాజ్యసభలో ఫెలోషిప్, ఇంటర్న్షిప్ చేసే అవకాశం కల్పించేందుకు రాజ్యసభ దరఖాస్తులు ఆహ్వా నిస్తోంది. ఈ నేపథ్యంలో.. రాజ్యసభ ఫెలోషిప్, ఇంటర్న్షిప్ల పూర్తి సమాచారం... ఆర్ఎస్ఆర్ఎస్ అంటే భారత పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలోని వివిధ అంశాలపై పరిశోధనలను ప్రోత్సహించాలనే లక్ష్యంతో.. 2009లో డాక్టర్ ఎస్.రాధాకృష్ణన్ చైర్ అండ్ రాజ్యసభ ఫెలోషిప్స్ పథకాన్ని రాజ్యసభ ఏర్పాటు చేసింది. దీనికి ‘రాజ్యసభ రీసెర్చ్ అండ్ స్టడీ’ (ఆర్ఎస్ఆర్ఎస్) స్కీమ్గా పేరుపెట్టారు. ఇందులో రాజ్యసభ ఫెలోషిప్లు నాలుగు, రాజ్యసభ స్టూడెంట్ ఎంగేజ్మెంట్ ఇంటర్న్షిప్లు పది అందిస్తున్నారు. వీటికి గ్రాడ్యుయేషన్, పోస్టు గ్రాడ్యుయేషన్ అర్హత గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. రాజ్యసభ ఇంటర్న్షిప్– అర్హతలు ► భారత పార్లమెంటులోని వివిధ విధానపరమైన అంశాలను..ముఖ్యంగా రాజ్యసభ కార్యకలాపాలను విద్యార్థులకు పరిచయం చేయడమే ఈ ఇంటర్న్షిప్ లక్ష్యం. ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులు చదువుతున్న విద్యార్థులు రాజ్యసభ ఇంటర్న్షిప్కు అర్హులు. గ్రాడ్యుయేట్స్ ఐదుగురు, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఐదుగురికి(మొత్తం 10 మంది) ఇంటర్న్స్గా అవకాశం కల్పిస్తారు. రాజ్యసభ సెక్రటేరియట్ ద్వారా సెక్రటరీ జనరల్ ఆధ్వర్యంలో ఇంటర్న్స్ ఎంపిక జరుగుతుంది. వేసవి సెలవుల్లో ఈ ఇంటర్న్షిప్ ఉంటుంది. ► ఇంటర్న్షిప్కు ఎంపికైన విద్యార్థులను సచివాలయంలోని కీలకమైన లెజిస్లేటివ్ సెక్షన్, బిల్ ఆఫీస్, టేబుల్ ఆఫీస్, కమిటీ సెక్షన్స్ మొదలైన వాటిలో సంబంధిత బ్రాంచ్ సూపర్విజన్/మెంటారింగ్ కింద నియమిస్తారు. ఎంపికైన తేదీ నుంచి రెండు నెలలపాటు ఈ ఇంటర్న్షిప్ ఉంటుంది. వీరికి నెలకు రూ.10వేల చొప్పున స్టయిఫండ్ చెల్లిస్తారు. ► ఇంటర్న్షిప్ గడువు నాటికి ఇంటర్న్లు తాము చేసిన పని, నేర్చుకున్న అంశాలతో నివేదికను తమకు కేటాయించిన సూపర్వైజర్/మెంటార్కు సమర్పించాల్సి ఉంటుంది. విజయవంతంగా ప్రోగ్రామ్ పూర్తి చేసినవారికి రాజ్యసభ నుంచి సర్టిఫికెట్ ప్రదానం చేస్తారు. రాజ్యసభ ఫెలోషిప్– అర్హతలు ► మొత్తం నాలుగు ఫెలోషిప్స్ అందిస్తున్నారు. ఈ ఫెలోషిప్ స్కీమ్ ద్వారా అభ్యర్థులు పార్లమెంటరీ సంస్థల పనితీరు, ఆయా సంస్థలు ఎదుర్కొంటున్న సమస్యలు, సవాళ్లపై అధ్యయనం చేస్తారు. సంబంధిత విద్యార్హత, సోషల్ సైన్స్, లా ఇతర సంబంధిత అంశాల్లో కనీసం మాస్టర్స్ డిగ్రీ ఉన్న అభ్యర్థులు/అనుభవం గల వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంఫిల్, పీహెచ్డీ అర్హత ఉన్న వారికి ప్రాధాన్యం ఇస్తారు. వీటికి మాజీ పార్లమెంటు సభ్యులు/రాష్ట్ర శాసనసభ సభ్యులు, పార్లమెంటు/రాష్ట్ర శాసనసభ సచివాలయాల మాజీ అధికారులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ► ఫెలోషిప్కు దరఖాస్తు చేసుకునేందుకు అభ్యర్థులు 25ఏళ్ల నుంచి 65ఏళ్ల మధ్య వయసు ఉండాలి. ► కాలవ్యవధి: ఫెలోషిప్ 18 నెలల పాటు ఉంటుంది. అవసరాన్ని బట్టి మరో ఆరు నెలల వరకు పొడిగించే అవకాశం ఉంది. ► అధ్యయనం చేయాల్సిన అంశాలు: ప్రధాన చట్టాల మదింపు, పార్లమెంటరీ కమిటీల పనితీరు, ప్రధాన పార్లమెంటరీ కమిటీల సమర్థత, భారతీయ పార్లమెంట్లో సంస్థాగత/విధానపరమైన సంస్కరణలు, ఇతర కామన్వెల్త్ పార్లమెంట్ల ప్రత్యేకతలపై అధ్యయనం చేయాలి. రాజ్యసభ సెక్రటేరియట్ సూచించిన అంశాలపై కూడా పరిశోధన చేయాల్సి ఉంటుంది. ► రీసెర్చ్ గ్రాంట్: రాజ్యసభ ఫెలోషిప్స్ కేవలం నలుగురు మాత్రమే పొందగలరు. ప్రతి ఫెలోషిప్కు రీసెర్చ్ గ్రాంట్గా రూ.8లక్షలను పలు దఫాలుగా అందిస్తారు. దీంతోపాటు మరో రూ.50 వేలు కంటిజెన్సీ ఫండ్గా ఇస్తారు. ముఖ్య సమాచారం ► దరఖాస్తు విధానం: ఈమెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ► రాజ్యసభ ఫెలోషిప్కు దరఖాస్తు చేసుకోవాలనుకునేవారు: rksahoo.rs@sansad.nic.in ► రాజ్యసభ ఇంటర్న్షిప్కు దరఖాస్తు చేసుకోవాలనుకునేవారు: rssei.rsrs@sansad.nic.in ► దరఖాస్తులకు చివరి తేది: 31.03.2021 ► వెబ్సైట్: https://rajyasabha.nic.in/rsnew/ fellowship/felloship_main.asp -
వుమెన్స్ డే: మెన్స్ డే కావాలని బీజేపీ మహిళా ఎంపీ డిమాండ్
న్యూఢిల్లీ: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకొంటున్న నేపథ్యంలో పురుషుల కోసం కూడా ఓ రోజు ఉండాలని బీజేపీ మహిళా ఎంపీ సోనాల్ మాన్సింగ్ అన్నారు. పురుషులకు ‘మెన్స్ డే’ నిర్వహించాలని ఆమె డిమాండ్ చేశారు. సోమవారం రాజ్యసభలో ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మహిళా దినోత్సవాన్ని ఇద్దరు జర్మన్ దేశానికి చెందిన మహిళలు ప్రారంభించారని తెలిపారు. ప్రపంచంలోనే ఎక్కడాలేని విధంగా తొలిసారి ఓ భారీ సముద్ర నౌకను మహిళలే పూర్తి స్థాయిలో సారథ్యం వహించటం మనదేశానికి గర్వకారణమని తెలిపారు. మహిళలు పోటీతత్వాన్ని పెంచుకోవాలని, అన్నిరంగాల్లో పురుషులతో సమానంగా రాణించాలని పేర్కొన్నారు. కాగా, మహిళలను పురుషుల్లో సగభాగమని చెబుతున్నప్పటికీ కొన్నిచోట్ల మహిళలు తీవ్రమైన వివక్షతను ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. కరోనా సంక్షోభంలో పురుషులతో సమానంగా మహిళలు సేవలకు గుర్తింపుగా ఐక్యరాజ్య సమితి 2021వ ఏడాదిని ‘‘మహిళా నాయకత్వం, కోవిడ్–19 ప్రపంచంలో స్త్రీ, పురుషులు సమానంగా భవిష్యత్ నిర్మించుకోవడం’’అన్న థీమ్తో ఉత్సవాలను నిర్వహిస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. చదవండి: పాకిస్తాన్లో హిందూ కుటుంబం దారుణ హత్య! -
గొప్ప స్నేహితుడు : రాజ్యసభలో మోదీ భావోద్వేగం
సాక్షి న్యూఢిల్లీ: రాజ్యసభ ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ సీనియర్ నేత గులాంనబీ ఆజాద్ పదవీ విమరణ చేయనున్న సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ భావోద్వేగానికి లోనయ్యారు. రాజ్యసభలో పదవీకాలం ముగుస్తున్న నేతలనుద్దేశించి ప్రసంగించిన మోదీ కాంగ్రెస్ నేత ఆజాద్పై అనూహ్యంగా ప్రశంసల వర్షం కురిపించారు. గులాం నబీ తనకు నిజమైన స్నేహితుడని అభివర్ణించిన ప్రధాని, జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి సంఘటనలను గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆజాద్ సేవలను కొనియాడుతూ కన్నీరు పెట్టారు. ఉన్నత పదవులు వస్తాయి... పోతాయి కానీ ఆయన స్పందించిన తీరు తలుచుకుంటే కన్నీళ్లు ఆగవంటూ ఆజాద్కు సెల్యూట్ చేశారు ఈ సందర్భంగా మోదీ తన దుంఖాన్ని ఆపుకునే ప్రయత్నంలో మంచినీళ్లు తాగడం కోసం ఆగడంతో సభ చప్పట్లో మారుమోగింది. ఆజాద్ తన సొంత పార్టీ గురించి మాత్రమే కాకుండా దేశం, సభ గురించి కూడా ఆజాద్ ఆందోళన చెందే వారన్నారు. 2007లో కశ్మీర్ ఉగ్రదాడి సమయంలో గుజరాతీ పర్యాటకులు చిక్కుకున్నారని, ఆ సమయంలో ఆయన చేసిన మేలును మరిచిపోలేనని మోదీ వ్యాఖ్యానించారు. అనుక్షణం గుజరాతీ పర్యాటకులను యోగ క్షేమాలపై తనకు అప్డేట్ ఇచ్చారంటూ కన్నీరు పెట్టుకున్నారు. సొంత కుటుంబ సభ్యులకన్నా మిన్నగా స్పందించారంటూ ఆయన సహాయానికి సెల్యూట్ చేశారు. గులాం నబీ తనకు చాన్నాళ్ల నుంచి తెలుసు అని, ఒకే సారి సీఎంలుగా పనిచేశామని, గార్డెనింగ్లో ఆయనకు మంచి పట్టుందన్నారు. అలాగే ఆ సమయంలో దివంగత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రయత్నాలను కూడా తాను ఎప్పటికీ మరచిపోలేనన్నారు. ‘మీ పదవీ విరమణను అంగీకరించను. మీ సలహాలు తీసుకుంటూనే ఉంటాను. మా తలుపులు మీ కోసం ఎల్లప్పుడూ తెరిచి ఉంటాయి’ అని ఈ ఫిబ్రవరి 15 తో రాజ్యసభ పదవీకాలం ముగియనున్న ఆజాద్ నుద్దేశించి మోదీ అన్నారు. గులాం నబీ జీ ఎప్పుడూ మర్యాదగా మాట్లాడతారు. ఎప్పుడూ అసభ్యకరమైన భాషను ఉపయోగించరు. ఈ విషయంలో ఆయన్నుంచి నేర్చుకోవాలన్నారు. అలాగే కశ్మీర్ ఎన్నికలను ఆజాద్ స్వాగతించారంటూనే కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేశారు. మరోవైపు దీనిపై ఆజాద్ స్పందిస్తూ పార్టీ పరంగా విభేదాలున్నా..పలు విషయాలపై ఇరువురం పరస్పరం వాదించుకున్నా, విమర్శించుకున్నా, వ్యక్తిగత సంబంధాలను దెబ్బతీయలేదని వ్యాఖ్యానించారు. పండుగల సందర్భంగా తప్పనిసరిగా పలకరించే వారిలో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ప్రధాని మోదీ ఉంటారని గుర్తు చేసుకున్నారు. #WATCH: PM Modi gets emotional while reminiscing an incident involving Congress leader Ghulam Nabi Azad, during farewell to retiring members in Rajya Sabha. pic.twitter.com/vXqzqAVXFT — ANI (@ANI) February 9, 2021 -
‘ఏపీలో ఫోరెన్సిక్ వర్శిటీ ఏర్పాటు పరిశీలించాలి’
న్యూఢిల్లీ : గుజరాత్లో మాదిరిగానే ఆంధ్రప్రదేశ్లో కూడా ఫోరెన్సిక్ యూనివర్శిటీ ఏర్పాటు చేసే అవకాశాన్ని పరిశీలించాలని వైఎస్సార్ కాంగ్రెస్ రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షాను విజ్ఞప్తి చేశారు. మంగళవారం రాజ్యసభలో నేషనల్ ఫోరెన్సిక్ సైన్సెస్ యూనివర్శిటీ బిల్లుపై జరిగిన చర్చలో విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. ప్రపంచంలోనే తొలిసారిగా గుజరాత్లో నేషనల్ ఫోరెన్సిక్ సైన్సెస్ యూనివర్శిటీ ఏర్పాటును వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఆయన స్వాగతించారు. దేశంలో నేరాలు జరిగే తీరు, నేర దర్యాప్తు, నేరాల వెనుక కారణాలను విశ్లేషించడంలో ఇలాంటి యూనివర్శిటీ ప్రముఖ పాత్ర పోషించగలవని అన్నారు. (విశాఖలో ట్రైబ్యునల్ బెంచ్ ఏర్పాటు చేయండి) అయితే నేరాలు కేవలం ఒక రాష్ట్రానికే పరిమితం కానందున పోలీసుల నేర పరిశోధనలో సహకరించేందుకు దేశంలోని ప్రతి రాష్ట్రంలో ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత ఉందని అన్నారు. ఇలాంటి వర్శీటీ వలన ఫోరెన్సిక్ సైన్సెస్లో స్పెషలిస్టులు తయారవుతారని చెప్పారు. హైదరాబాద్లో అత్యంత అధునాతనమైన ఫోరెన్సిక్ లేబరేటరీ ఉన్నందున ఆంధ్రప్రదేశ్లో కూడా ఫోరెన్సిక్ యూనివర్శిటీ ఏర్పాటు చేసే ప్రతిపాదనను పరిశీలించాలని ఆయన కేంద్ర హోం మంత్రికి విజ్ఞప్తి చేశారు. (‘రైతుల కోసమే సీఎం జగన్ నిర్ణయం’) -
రాజ్యసభ రగడ : క్షమాపణ కోరితే సస్పెన్షన్పై పునరాలోచన
సాక్షి, న్యూఢిల్లీ : వ్యవసాయ బిల్లుల ఆమోదం సందర్భంగా రాజ్యసభలో సస్పెన్షన్కు గురైన ఎనిమిది మంది సభ్యులు క్షమాపణ కోరితే వారిపై సస్పెన్షన్ వేటును ఉపసంహరించే ప్రతిపాదనను ప్రభుత్వం పరిశీలిస్తుందని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ పేర్కొన్నారు. ఎనిమిది మంది సభ్యులపై విధించిన సస్పెన్షన్ను ఎత్తివేయాలని కోరుతూ కాంగ్రెస్ నేతృత్వంలో విపక్షాలు రాజ్యసభ నుంచి మంగళవారం వాకౌట్ చేసిన నేపథ్యంలో మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. విపక్ష సభ్యుల సస్పెన్షన్ను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ తొలుత సభ నుంచి వాకౌట్ చేయడా ఆపై ఆమ్ ఆద్మీ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్, వామపక్షాలు వాకౌట్ చేశాయి. రాజ్యసభలో తమ ప్రవర్తనపై సస్పెన్షన్కు గురైన సభ్యులు క్షమాపణ కోరితే ప్రభుత్వం వారిపై సానుకూల నిర్ణయం తీసుకుంటుందని రవిశంకర్ ప్రసాద్ వెల్లడించారు. రాజ్యసభలో విపక్షాల అనుచిత ప్రవర్తనను కాంగ్రెస్ వ్యతిరేకిస్తుందని తాము భావించామని చెప్పారు. విదేశాల నుంచి వచ్చిన ట్వీట్కు అనుగుణంగా ఎంపీలు ఇలా ప్రవర్తించడం ఏ తరహా రాజకీయమని ఆయన రాహుల్ ట్వీట్ను ఉద్దేశించి పరోక్షంగా వ్యాఖ్యానించారు. తన తల్లి సోనియా గాంధీ ఆరోగ్య పరీక్షల కోసం రాహుల్ ఆమె వెంట విదేశీ పర్యటనలో పాల్గొన్న విషయం తెలిసిందే. రాజ్యసభ టేబుల్పైకి ఎక్కి నృత్యం చేస్తూ కాగితాలను చించివేసిన కాంగ్రెస్ ఎంపీని తాము ఇంతవరకూ చూడలేదని కేంద్ర మంత్రి ఆక్షేపించారు. రాజ్యసభలో వ్యవసాయ బిల్లులు ఆమోదం పొందేందుకు ప్రభుత్వానికి స్పష్టమైన మెజారిటీ ఉందని చెప్పారు. కాగా, వ్యవసాయ బిల్లుల ఆమోదం సందర్భంగా ఆదివారం రాజ్యసభలో విపక్షాలు ఆందోళనకు దిగడంతో తీవ్ర గందరగోళం నెలకొంది. చదవండి : ఎంపీల నిరసన : పోలీసుల ఓవర్ యాక్షన్ -
ఎంపీల నిరసన : పోలీసుల ఓవర్ యాక్షన్
సాక్షి, న్యూఢిల్లీ : రైతులకు మేలు చేస్తాయనే పేరుతో తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులపై దేశవ్యాప్తంగా ఒకవైపు తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. మరోవైపు ఈ బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపించాలనే తీర్మానానికి రాజ్యసభ ఎంపీలు పట్టుబడుతున్నారు. ఈ సందర్భంగా సభలో పోడియంలోకి దూసుకెళ్లి, ఆందోళనకు దిగారు. ఇది 8మంది ఎంపీల సస్పెన్షన్ కు దారితీసింది. అయితే పట్టువదలకుండా పార్లమెంట్ ఆవరణలో ఎంపీలు తమ నిరసనను కొనసాగించారు. ప్రధానంగా పార్లమెంటు సమీపంలో సోమవారం మౌనంగా నిరసన చేపట్టిన పంజాబ్కు చెందిన నలుగురు పార్లమెంటు సభ్యుల పట్ల ఢిల్లీ పోలీసులు అనుచితంగా ప్రవర్తించారు. ఎంపీలపై దాడికి దిగారు. కాళ్లపై లాఠీలతో కొడుతూ, వారిని అక్కడినుంచి తొలగించేందుకు ప్రయత్నించారు. (8 మంది ఎంపీల సస్పెన్షన్) అయితే పార్లమెంటు షెడ్యూల్ కంటే ముందే బయలుదేరిన ప్రధానమంత్రి నరేంద్రమోదీకి దారి క్లియర్ చేసేందుకు ప్రయత్నించామని ఢిల్లీ పోలీసులు తెలిపారు. అంతేకాదు ఎంపీలు తమ నిరసనకు ఎటువంటి అనుమతి తీసుకోలేదని, ప్రధానికి దారి క్లియర్ చేయడం తప్పనిసరి అని పేర్కొన్నారు. మరోవైపు మంగళవారం ఉదయం రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నిరసన చేస్తున్న ఎంపీల వద్దకు వెళ్లి, వారిని పరామర్శించారు. టీ తాగాలని కోరారు. దీనికి ససేమిరా అన్న ఎంపీలు ఆయన్ను రైతు వ్యతిరేకి అంటూ విమర్శించారు. ఇది ఇలావుంటే హరివంశ్పై ప్రశంసలు కురిపించిన ప్రధాని మోదీ ఆయన తీరు ఆదర్శ ప్రాయమని వ్యాఖ్యానించడం గమనార్హం. (‘ఆ బిల్లులను అడ్డుకోండి’) కాగా కేంద్రం తీసుకొచ్చిన ఈ బిల్లులును వ్యతిరేకిస్తూ సెప్టెంబరు 25న దేశవ్యాప్త సమ్మెకు దిగనున్నారు. ప్రభుత్వ తీసుకొచ్చిన ప్రస్తుత బిల్లుతో దేశంలోని చిన్న, సన్నకారు రైతులు మరింత నష్టాల్లోకి జారిపోతారని రైతు సంఘాలు వాదిస్తున్నాయి. ఈ బిల్లులు కార్పొరేట్లకు కొమ్ము కాసేవే తప్ప, రైతులకు మేలు చేసేవి ఎంతమాత్రం కాదనివాదిస్తున్నాయి. అటు సస్పెన్షన్ కి గురైన ఎంపీలు, రాత్రంతా పార్లమెంట్ ఎదుట తమ నిరసనను కొనసాగించారు. నిబంధనలకు పూర్తిగా విరుద్ధంగా బిల్లులును సభలో ఆమోదించారని మండిపడ్డారు. రైతుల పక్షాన తమ పోరాటం కొనసాగుతుందంటూ నిరసనను కొనసాగిస్తున్నారు. -
మార్చి నాటికి కడప విమానాశ్రయం విస్తరణ పనులు పూర్తి
సాక్షి, న్యూఢిల్లీ : వచ్చే ఏడాది మార్చి నాటికి కడప విమానాశ్రయం విస్తరణ పనులు పూర్తవుతాయని పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి హర్దీప్ సింగ్ పూరి తెలిపారు. రాజ్యసభలో సోమవారం వైఎస్సార్సీపీ సభ్యులు వి.విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు ఆయన బదులిస్తూ కడప విమానాశ్రయంలో ప్రస్తుతం ఉన్న రన్వే, టాక్సీ వే, ఆప్రాన్ వంటి విస్తరణ పనులు ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) పర్యవేక్షణలో నిర్వహిస్తున్నట్టు తెలిపారు. 94 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో 2017లో కడప ఎయిర్పోర్ట్ విస్తరణ పనులు ప్రారంభించినట్టు ఆయన చెప్పారు. రూ .4860 కోట్ల పీఎఫ్ చెల్లింపులు కరోనా వైరస్ కట్టడికి విధించిన లాక్డౌన్తో ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న సంస్థలు, సిబ్బందిని ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం పలు చర్యలు చేపట్టిందని కార్మిక శాఖ సహాయమంత్రి సంతోష్ గంగ్వార్ తెలిపారు. కరోనాతో సమస్యలు ఎదురైన సంస్ధలు, ఉద్యోగులకు ఆసరాగా ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్) చెల్లింపుల్లో ఊరట కలిగించేందుకు ప్రభుత్వం ఈ ఏడాది మార్చి నుంచి ఆగస్ట్ వరకూ రూ 4860 కోట్లు చెల్లించిందని ఆయన వెల్లడించారు. రాజ్యసభలో సోమవారం వైఎస్సార్సీపీ సభ్యులు వి.విజయసాయిరెడ్డి ప్రశ్నకు బదులిస్తూ మంత్రి ఈ వివరాలు తెలిపారు. 100 మంది లోపు ఉద్యోగులు ఉండి, వారిలో 90 శాతం సిబ్బంది 15,000లోపు వేతనం ఉన్న సంస్ధల్లో ఉద్యోగి, యజమాని పీఎఫ్ వాటాను తొలుత మూడు నెలల పాటు ప్రభుత్వమే చెల్లించిందని లిఖితపూర్వక సమాధానంలో మంత్రి పేర్కొన్నారు. ఆ తర్వాత ఈ పథకాన్ని మరో మూడు నెలలు పొడిగించినట్టు వెల్లడించారు. ఈ పథకం పొడిగింపుపై వస్తున్న డిమాండ్లను ఆర్థిక మంత్రిత్వ శాఖతో సంప్రదించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఇక దేశ వ్యాప్తంగా అమలు చేసిన ఈ పథకంతో సెప్టెంబర్ 16 నాటికి ఆంధ్రప్రదేశ్లో 11,196 సంస్థలు, ఒక లక్షా 92 వేల 431 మంది ఉద్యోగులకు మేలు చేకూరిందని మంత్రి తెలిపారు. చదవండి : అంతర్వేది ఘటన వెనుక చంద్రబాబు హస్తం.. విదేశీ విద్యా రుణ పథకానికి రూ. 19 కోట్లు మంజూరు వెనుకబడిన తరగతులు, ఆర్థికంగా వెనుకబడిన తరగతులకు చెందిన ప్రతిభావంతులైన విద్యార్ధుల్లో ఉన్నత విద్యను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం డాక్టర్ అంబేడ్కర్ పేరిట వడ్డీ రాయితీతో కూడిన విదేశీ విద్యా రుణాలను సమకూర్చే పథకానికి శ్రీకారం చుట్టినట్లు సామాజిక న్యాయ శాఖ సహాయ మంత్రి శ్రీ కృష్ణపాల్ గుర్జర్ వెల్లడించారు. -
రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్పై అవిశ్వాసం
సాక్షి, న్యూఢిల్లీ : రాజ్యసభలో విపక్షాల ఆందోళన మధ్య వ్యవసాయ బిల్లులకు ఆమోదం లభించిన నేపథ్యంలో పెద్దల సభలో రేగిన దుమారం కొనసాగుతోంది. విపక్ష పార్టీలు రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాయి. హరివంశ్పై అవిశ్వాస తీర్మానానికి ఆదివారం 12 విపక్ష పార్టీలు నోటీసు ఇచ్చాయి. ప్రజాస్వామిక విలువలను, సంప్రదాయాలను పరిరక్షించాల్సిన హరివంశ్ ప్రజాస్వామిక విలువలకు తూట్లుపొడిచారాని, ఆయనకు వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని తాము నిర్ణయించామని రాజ్యసభ ఎంపీ, కాంగ్రెస్ నేత అహ్మద్ పటేల్ వెల్లడించారు. విపక్షాల ఆందోళనలను విస్మరిస్తూ రైతు వ్యతిరేక వ్యవసాయ బిల్లులను ఆమోదించడం ద్వారా పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని ప్రభుత్వం ఖూనీ చేసిందని తృణమూల్ ఎంపీ డెరెక్ ఓబ్రెన్ ఆరోపించారు.విపక్ష ఆందోళనలను కప్పిపుచ్చేందుకు ప్రత్యక్ష ప్రసారాన్ని నిలిపివేసి ప్రభుత్వం బిల్లులను ఆమోదింపచేసుకుందని విమర్శించారు. ఇక గురువారం లోక్సభ ఆమోదించిన వ్యవసాయ బిల్లులను విపక్షాల ఆందోళన మధ్య ఆదివారం రాజ్యసభ ఆమోదించింది. -
రాజ్యసభ ముందుకు వ్యవసాయ బిల్లులు
సాక్షి, న్యూఢిల్లీ: విపక్షాల నిరసలన మధ్యే వ్యవసాయ బిల్లులు రాజ్యసభ ముందుకు వచ్చాయి. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ఆదివారం ఉదయం రెండు వ్యవసాయ బిల్లులను రాజ్యసభలో ప్రవేశపెట్టారు. వ్యవసాయ బిల్లులు చారిత్రాత్మకమని, రైతుల జీవితాల్లో విప్లవాత్మక మార్పులకు పునాది పడతాయని ఆయన పేర్కొన్నారు. ఎంఎస్పీతో ఈ బిల్లులకు ఎలాంటి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. రైతులు తమ పంటలను ఎక్కడైనా అమ్ముకోవచ్చని తోమర్ తెలిపారు. (కేంద్రమంత్రి హర్సిమ్రత్ కౌర్ రాజీనామా) అయితే వ్యవసాయ బిల్లును సెలక్ట్ కమిటీకి పంపాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. కేంద్రం తీసుకొచ్చిన బిల్లు వ్యవసాయ రంగానికి తీవ్ర నష్టం కలిగించే విధంగా, రైతుల ప్రయోజనాలను దెబ్బ తీసే విధంగా ఉందని విమర్శించింది. కాగా వ్యవసాయ రంగానికి సంబంధించిన బిల్లులను రాజ్యసభలో ఆమోదం పొందించేందుకు మోదీ సర్కార్ పట్టుదలతో ఉంది. రైతులకు నష్టం కలిగించేలా బిల్లులు ఉన్నాయంటూ విపక్షాలతో పాటు స్వపక్షంలోనూ అభ్యంతరాలు వెల్లువెత్తుతున్నాయి. అయినా నరేంద్ర మోదీ ప్రభుత్వం మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఇప్పటికే ఆ బిల్లులకు లోక్సభలో ఆమోదం లభించింది. కాగా కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ రంగానికి సంబంధించిన బిల్లులకు వ్యతిరేకంగా బీజేపీ చిరకాల భాగస్వామి అయిన శిరోమణి అకాలీదళ్ఎంపీ హర్ సిమ్రత్ కౌర్ బాదల్ కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేసిన విషయం విదితమే. (ఆ బిల్లు తేనె పూసిన కత్తి లాంటిది : సీఎం కేసీఆర్) -
2024 నాటికి 63 లక్షల ఇళ్ళకు కుళాయి కనెక్షన్లు
న్యూఢిల్లీ: జలజీవన్ మిషన్ (జేజేఎం) కింద 2024 నాటికి గ్రామీణ ఆంధ్రప్రదేశ్లోని అన్ని ఇళ్ళకు కుళాయి నీటి కనెక్షన్లు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు జల శక్తి శాఖ సహాయ మంత్రి రతన్ లాల్ కటారియా వెల్లడించారు. రాజ్యసభలో సోమవారం వైఎస్సార్సీపీ సభ్యులు విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు జవాబిస్తూ మంత్రి ఈ విషయం తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లోని 63 లక్షల 72 వేల ఇళ్ళకు 2024 నాటికి కుళాయి కనెక్షన్ కల్పించే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వార్షిక ప్రణాళికను రూపొందించినట్లు ఆయన చెప్పారు. ఈ ప్రణాళిక కింద ఈ ఏడాది ఏప్రిల్ 1నాటికి రాష్ట్రంలో 31 లక్షల 93 వేల ఇళ్ళకు కుళాయి నీటి సదుపాయం కల్పించినట్లు తెలిపారు. (హరివంశ్ నారాయణ్కు అభినందనలు) కోవిడ్-19 మహమ్మారి కారణంగా జలజీవన్ మిషన్ పనులకు కూడా ఆటంకం ఏర్పడింది. అయితే అన్లాక్లో భాగంగా నిర్మాణ పనుల పునఃప్రారంభానికి కేంద్ర హోంమంత్రిత్వ శాఖ అనుమతించిన నేపథ్యంలో జల జీవన్ మిషన్ పనులను తిరిగి ప్రారంభించినట్లు మంత్రి చెప్పారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా కోటి 32 లక్షల ఇళ్ళకు కుళాయి కనెక్షన్ సదుపాయం కల్పించినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమం నిరాటంకంగా కొనసాగించడానికి అన్ని రాష్ట్రాలకు తగినన్ని నిధులు కూడా అందుబాటులో ఉంచినట్లు మంత్రి చెప్పారు. కాలుష్యం కోరల్లో 13 నగరాలు ఆంధ్రప్రదేశ్లో 13 నగరాలు వాయు కాలుష్యం బారినపడినట్లు కేంద్ర పర్యావరణ శాఖ సహాయ మంత్రి బాబుల్ సుప్రియో రాజ్యసభలో వెల్లడించారు. వైఎస్సార్సీపీ సభ్యులు విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు ఆయన రాతపూర్వకంగా జవాబిస్తూ 2014 నుంచి 2018 మధ్య దేశంలోని వివిధ నగరాలలో గాలి నాణ్యతపై జరిపిన అధ్యయనంలో రాష్ట్రంలోని అనంతపురం, చిత్తూరు, ఏలూరు, గుంటూరు, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, శ్రీకాకుళం, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో స్వచ్ఛమైన గాలి నాణ్యత అత్యల్పంగా ఉన్నట్లు గుర్తించనట్లు మంత్రి తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ (ఎన్కాప్) కింద కాలుష్యం బారిన పడిన నగరాలల్లో గాలి నాణ్యతను మెరుగుపరచేందుకు దీర్ఘకాలిక ప్రణాళికను రూపొందించినట్లు తెలిపారు. ఎన్కాప్లో భాగంగా వాయు కాలుష్యం బారినపడిన నగరాల్లో కాలష్యానికి ప్రధాన కారణాలను గుర్తించడానికి పలు అధ్యయనాలు నిర్వహించినట్లు ఆయన తెలిపారు. రోడ్లపై ఆవరించే ధూళి కణాలు, వాహన కాలుష్యం, చెత్త తగులబెట్టడం, నిర్మాణ, కూల్చివేత పనులు, పారిశ్రామిక కాలుష్యం వంటివి నగరాలలో వాయు కాలుష్యానికి ప్రధాన కారణాలుగా గుర్తించినట్లు ఆయన వెల్లడించారు. వాయుకాలుష్యం నుంచి నగరాలను కాపాడి గాలి నాణ్యతను మెరుగుపరచేందుకు నగరాల వారీగా ప్రణాళికలు సిద్దం చేసినట్లు చెప్పారు. -
రాజ్యసభ డిప్యూటీ చైర్మన్గా హరివంశ్ ఎన్నిక
సాక్షి, న్యూఢిల్లీ : రాజ్యసభ డిప్యూటీ చైర్మన్గా ఎన్డీయే అభ్యర్థి జేడీ(యూ)కి చెందిన హరివంశ్ నారాయణ్ సింగ్ సోమవారం ఎన్నికయ్యారు. హరివంశ్ సింగ్ డిప్యూటీ చైర్మన్గా ఎన్నికైనట్టు రాజ్యసభ చీఫ్ ఎం వెంకయ్యనాయుడు ప్రకటించారు. వాయిస్ఓట్ ద్వారా రాజ్యసభ ఛైర్మన్ ఎన్నిక నిర్వహించారు. ఆర్జేడీ అభ్యర్థి మనోజ్ ఝాపై హరివంశ్ నారాయణ్ సింగ్ విజయం సాధించారు. హరివంశ్ సింగ్ అట్టడుగు వర్గం నుంచి వచ్చిన మేథావి అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. పెద్దల సభ డిప్యూటీ చైర్మన్గా ఎన్నికైన హరివంశ్ సింగ్ను ఆయన అభినందించారు. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్గా హరివంశ్ వరుసగా రెండోసారి ఎన్నికయ్యారు. విపక్ష నేతలు సైతం హరివంశ్ను అభినందించారు. ఇక అంతకుముందు హరివంశ్కు మద్దతుగా బీజేపీ చీఫ్ జేపీ నడ్డా తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. విపక్షాల ఉమ్మడి అభ్యర్థి మనోజ్ ఝాను బలపరుస్తూ విపక్ష నేత గులాం నబీ ఆజాద్ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. గత రెండేళ్లుగా పెద్దల సభను హరివంశ్ నడిపించిన తీరుతో పార్టీలకు అతీతంగా పలువురు సభ్యుల నుంచి ఆయనకు ప్రశంసలు లభించాయి. మరోవైపు 245 మంది సభ్యులు కలిగిన రాజ్యసభలో ఎన్డీయేకు 113 మంది సభ్యులుండగా, హరివంశ్ ఎన్నికకు అనుకూలంగా విపక్ష ఎంపీల మద్దతు కూడగట్టడంలో బీజేపీ విజయవంతమైంది. చదవండి : పెద్దల సభ : ఎథిక్స్ కమిటీ బలోపేతం -
పెద్దల సభ : ఎథిక్స్ కమిటీ బలోపేతం
సాక్షి, న్యూఢిల్లీ : పెద్దల సభను హుందాతనానికి ప్రతీకగా మలిచే క్రమంలో రాజ్యసభ ఎథిక్స్ కమిటీని మరింత బలోపేతం చేశారు. ఎంపీల ప్రవర్తనపై వచ్చే ఫిర్యాదులను నేరుగా స్వీకరించేందుకు ఇద్దరు ఉన్నతాధికారులకు అధికారాలను కట్టబెట్టారు. ఎథిక్స్ కమిటీ మరింత బాగా పనిచేసేలా పలు చర్యలు చేపట్టాలని రాజ్యసభ ఛైర్మన్, ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు నిర్ణయించారు. పెద్దల సభలో ఎంపీలపై నేరుగా ఫిర్యాదులు స్వీకరించే వ్యవస్థను ఏర్పాటు చేయడం 16 ఏళ్లలో ఇదే తొలిసారి కావడం గమనార్హం. రాజ్యసభ సభ్యులకు 14 సూత్రాల ప్రవర్తనా నియమావళిని నిర్ధేశిస్తూ పార్లమెంటు గౌరవాన్ని భంగం కలిగించేలా ఎంపీలు వ్యవహరించరాదని నియమావళిలో పొందుపరిచారు. ప్రశ్నోత్తరాల సమయం, ఎంపీ ల్యాడ్స్ నిధులు, బ్యాంకు రుణాల ఎగవేత అంశాలపై ఎంపీలపై ఫిర్యాదులను ఎథిక్స్ కమిటీ విచారించింది. కాగా, బీజేపీ ఎంపీ శివప్రతాప్ శుక్లాను రాజ్యసభ ఎథిక్స కమిటీ చీఫ్గా ఇటీవల నియమితులయ్యారు. శుక్లాతో పాటు మరో ముగ్గురు ఎంపీలను ఎథిక్స్ కమిటీలో రాజ్యసభ ఛైర్మన్ ఎం. వెంకయ్య నాయుడు నియమించిన సంగతి తెలిసిందే. వీరిలో వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీ వి. విజయసాయిరెడ్డి, డీఎంకేకు చెందిన తిరుచి శివ, టీఆర్ఎస్ ఎంపీ కే. కేశవరావులు ఉన్నారు. దీంతో రాజ్యసభ ఎథిక్స్ కమిటీలో మొత్తం సభ్యుల సంఖ్య చైర్మన్ సహా 11 మందికి చేరింది. చదవండి : ఏ న్యాయానికి ఈ మూల్యం! -
రాజ్యసభ బరిలోకి మాజీ ప్రధాని దేవెగౌడ
-
రాజ్యసభను తాకిన కరోనా ప్రకంపనలు
సాక్షి, న్యూఢిల్లీ : భారత పార్లమెంటును మరోసారి కరోనా వైరస్ ప్రకంపనలు ఆందోళన రేపాయి. రాజ్యసభ సచివాలయ అధికారి ఒకరికి నిర్వహించిన పరీక్షల్లో కోవిడ్ -19 పాజిటివ్ వచ్చింది. దీంతో పార్లమెంటు భవనంలోని రెండు అంతస్తులకు సీల్ వేసినట్టు అధికారులు వెల్లడించారు. అధికారి భార్య, పిల్లలు కూడా ఈ వ్యాధి బారిన పడ్డారని వారు తెలిపారు. శానిటైజేషన్ ప్రక్రియ కొనసాగుతోందనీ, మిగిలిన ఉద్యోగులకు కూడా కరోనా పరీక్షలు చేయించి హోంక్వారంటైన్ చేయనున్నామని చెప్పారు. అలాగే సంబంధిత అధికారితో సన్నిహితంగా మెలిగిన వారు కూడా ఆరోగ్య అధికారులను సంప్రదించాల్సిందిగా కోరినట్టు అధికారులు చెప్పారు. గతవారం పార్లమెంటుకు చెందిన ఒక సీనియర్ అధికారి కరోనా వైరస్ బారిన పడ్డారు. కాగా కరోనా ఉధృతి, హౌస్ కీపింగ్ ఉద్యోగికి వైరస్ సోకడంతో మార్చి 23న బడ్జెట్ సమావేశాలను అర్ధాంతరంగా వాయిదా వేశారు. అయితే 2వ దశ లాక్ డౌన్ ముగిసిన అనతరం మూడవ వంతు సిబ్బందితో పార్లమెంట్ లో కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. -
ఏ న్యాయానికి ఈ మూల్యం!
ఒకటో ఎస్టేట్ దయతో మూడో ఎస్టేట్ నుంచి రెండో ఎస్టేట్కు ప్రమోట్ అయ్యారు మాజీ భారత ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్. ఈయనగారొక్కరే కాదు ఇదివరకు 44 మంది మాజీ ప్రధాన న్యాయమూర్తులు పదవి దిగిపోయిన తరువాత సర్కారు ఇచ్చిన హోదాలు అందుకుని న్యాయదేవతను సమర్చించారు. రిటైర్ మెంట్ తరువాత పదవులకోసం ఉవ్విళ్లూరే విధంగా అనేక పదవులను లెజిస్లేచర్ సృష్టించింది. లోక్పాల్, లోకాయుక్త, జాతీయ, రాష్ట్ర స్థాయి మానవ హక్కుల కమిషన్లు, లాకమిషన్ ఆఫ్ ఇండియా వంటి అనేక పదవులను మాజీ న్యాయ మూర్తులకే ఇవ్వాలనే చట్టాలున్నాయి. ఒక అధ్యయనం ప్రకారం, ఇటీవలి కాలంలో రిటైరయిన నూరుమందిలో 70 మంది జడ్జీలు ఆ తరువాత అనేక పదవులు తీసుకున్నారని తేలింది. ఇటీవలే కేరళ గవర్నర్గా సకల అధికార సౌఖ్యాలు అనుభవించిన మాజీ ప్రధాన న్యాయమూర్తి సదాశివం గుర్తుండే ఉంటారు. అంతకుముందు రంగనాథ్ మిశ్రా గారు సీజేఐ పదవి వదిలిన ఏడేళ్ల తరువాత ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం రాజ్యసభకు పోటీ చేయడానికి టికెట్ ఇచ్చి, గెలిపించిన విషయం కూడా గుర్తుండే ఉంటుంది. 1984 సిక్కు వ్యతిరేక హింసాకాండలో కాంగ్రెస్ ప్రమేయం ఏదీ లేదని వారంతా సచ్చీలురని రంగనాథ్ మిశ్రా న్యాయవిచారణ కమిషన్ నివేదిక ఇచ్చింది. అంత మేలు చేసిన న్యాయమూర్తికి ఆలస్యంగానైనా ధన్యవాదాలు చెప్పుకున్నారు. జస్టిస్ బహరుల్ ఇస్లాం అనే సుప్రీంకోర్టు జడ్జిగారు సుప్రీంకోర్టుకు రాజీనామా చేసి రాజ్యసభకు పోటీ చేసి 1983లో కాంగ్రెస్ టికెట్ పైన గెలిచారు. ఆయన చేసిన మేలు కూడా ఇంతాఅంతా కాదు. ఆనాటి బిహార్ సీఎం జగన్నాథ్ మిశ్రాపై వచ్చిన అవినీతి ఆరోపణల్లో అబద్ధాలను వెతికి పట్టుకున్నారు. ఇటీవలే మరణించిన పద్మభూషణ్ అరుణ్ జైట్లీ రాజ్యసభలో ప్రతిపక్ష నాయ కుడిగా ఉన్న 2012 కాలంలో న్యాయమూర్తుల పదవీ విరమణ తరువాత రెండేళ్ల దాకా ఏ పదవులను అంగీకరించకూడదనీ, వారికి ప్రభుత్వాలు ఏ పదవులూ ఇవ్వకూడదని వక్కాణించారు. చేసిన సేవలు రెండేళ్ల తరువాత గుర్తుపెట్టుకుని పదవులిచ్చే కృతజ్ఞత ఉంటుందా. ఎన్ని పనులు ఉంటాయి? మరిచిపోకముందే రుణం తీర్చుకోవడం ఉత్తమపురుషుల లక్షణం. రంజన్ గొగోయ్ చాలా సంచలన తీర్పులు ఇచ్చిన ప్రధాన న్యాయమూర్తి. సీబీఐ అలోక్ వర్మ తొలగింపు కేసులో న్యాయంచెప్పారు. తరువాత సీబీఐ డైరెక్టర్ నియామక కమిటీలో ప్రధానితో పాటు కూర్చున్నారు. ఏదో తప్పనిపించి కమిటీ నుంచి తప్పుకున్నారు. రఫేల్ కుంభకోణంలో ప్రభుత్వం తప్పే చేయలేదని గొగోయ్ గారికి అని పించింది. ఎలక్టోరల్ బాండ్స్ అనే పేరుతో కార్పొరేట్ ల నుంచి వందల కోట్ల రూపాయల విరాళాలు వసూలు చేయడానికి వీలు కల్పించే పథకంలో ఆయనకు ఏ దోషమూ కనిపించలేదు. కశ్మీర్లో అక్రమ బందీల హెబియస్ కార్పస్ కేసులు వినకుండా ఉంటేనే మేలనుకున్నారు. అయోధ్య వివాదంపైన రాజ్యాంగం కూడా ఊహించని కోత్త కోణం గొగోయ్ గారికి కనిపించింది. అయోధ్యలో రామాలయం వస్తుందా లేదా అన్నదే పాయింట్. మిగతా గోల ఎందుకంట. అస్సాంలో ఎన్నార్సీ తయారీలో సుప్రీంకోర్టు పర్యవేక్షణ చాలా ముఖ్యం. అందులో రంజన్ గొగోయ్ గారిది కీలకపాత్ర. ఎన్నార్సీని దేశం మొత్తానికి విస్తరించే ఊపునిచ్చిన పాత్ర. తనపైన లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన మహిళను డిసెంబర్ 2018లో ఉద్యోగం నుంచి బర్తరఫ్ చేసారు. తన కేసులో తానే తీర్పు చెప్పు కున్నంత స్థాయిలో తానే బెంచ్ పై ఉండడం. తానే జడ్జిలను ఎంపికచేయడం, తను నిర్దోషిగా బయటపడటానికి అన్ని ఏర్పాట్లు చేసుకోవడం మామూలు విషయాలు. ఈయన గారు సీజేఐ పదవి వదిలి పెట్టిన కొన్నాళ్ళకు ఆ ఆరోపణలు చేసిన మహిళకు జనవరి 23, 2020 నాడు ఉద్యోగం మళ్లీ ఇచ్చారు. అయితే తప్పెవరిది అని తల బద్దలు కొట్టుకునే వారు చాలా మంది. న్యాయవ్యవస్థ పట్ల ప్రజలకుండే విశ్వాసాన్ని గౌరవాన్ని, ప్రేమను, నమ్మకాన్ని భారీ ఎత్తున తగ్గించే చర్య ఈ నియామకం. ఎవరినైనా కొనేస్తాం అనే ధైర్యాన్ని ప్రభుత్వాలు ప్రదర్శిస్తున్నాయి. ఎవ రైనా అమ్ముడుపోతారేమోననే అనుమానాన్ని కొందరు పెద్దలు కలిగిస్తున్నారు. వ్యాసకర్త : మాడభూషి శ్రీధర్ కేంద్ర సమాచార మాజీ కమిషనర్ madabhushi.sridhar@gmail.com -
టీఆర్ఎస్ రాజ్యసభ అభ్యర్థులు
-
బోస్కు సముచిత స్థానం
సాక్షి, రాజమహేంద్రవరం: నైతిక విలువలు కోల్పోయి కలుషితమైన రాజకీయాలు నడుస్తున్న ప్రస్తుత తరుణంలో ముఖ్య మంత్రి జగన్మోహన్రెడ్డి మరోసారి విశ్వసనీయతకు పెద్ద పీట వేశారు. మహానేత వైఎస్ రాజశేఖర్రెడ్డి హఠాన్మరణం తరువాత నమ్మిన సిద్ధాంతం కోసం మంత్రి పదవినే తృణప్రాయంగా విడిచిపెట్టేసిన ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్చంద్రబోస్కు సీఎం పెద్దల సభకు పంపించేందుకు నిర్ణయించారు. అధిష్టానం అంటే వైఎస్సేనంటూ పదవులపై వ్యామోహం లేదంటూ రాజశేఖరరెడ్డి వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చిన జగన్మోహన్రెడ్డి వెన్నంటి నిలిచిన బోస్కు సముచిత స్థానం లభించింది. రాజకీయాలలో తొలినాళ్ల నుంచి మహానేత రాజశేఖర్రెడ్డి నమ్మిన వారిలో ఒకరిగా బోస్ గుర్తింపుపొందారు. (కీలక ఘట్టం; సగం బీసీలకే) వైఎస్ మరణానంతరం కూడా ఆయన కుటుంబానికి వెన్నుదన్నుగా నిలిస్తూవచ్చారు. 2010లో మారిన రాజకీయ పరిణామాల్లో బోస్ వైఎస్సార్ కుటుంబానికి అండగా నిలిచి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియానే ధిక్కరించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ స్ధాపించినప్పటి నుంచీ జగన్మోహన్రెడ్డి వెంట నడిచారు. 2012లో జరిగిన ఉప ఎన్నికల్లోను 2014లో జరిగిన సాధారణ ఎన్నికల్లోను బోస్ రామచంద్రపురంనుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. గెలుపు ఓటములతో సంబంధం లేకుండా నాటి ఎన్నికల్లోనే సముచిత స్థానం కల్పిస్తానని జగన్ ప్రకటించారు. ఆ తరువాత 2016లో వచ్చిన ఏకైక ఎమ్మెల్సీ పదవిని ఆశించిన వారందరినీ పక్కనబెట్టి బోస్కే కేటాయించి రాజకీయాల్లో చాలా అరుదుగా వినిపించే విశ్వసనీయత, విలువలు, ఇచ్చిన మాటకు కట్టుబడటమనే పదాలకు జగన్ నిదర్శనంగా నిలిచారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో మండపేట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పార్టీ టిక్కెట్ను కేటాయించి పోటీ చేయించారు. ఆ ఎన్నికల్లో బోస్ ఓటమి చెందినప్పటికీ జగన్ సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన తొలి కేబినెట్లోనే స్ధానం కల్పించడమే కాకుండా ఉప ముఖ్యమంత్రి పదవిని అప్పగించారు. అంతటితోనే ఆగకుండా కీలకమైన రెవెన్యూశాఖను కూడా కేటాయించి మండలి నేతగా కూడా ప్రాతినిధ్యం కల్పించారు. వికేంద్రీకరణ, మూడు రాజధానులను అడ్డుకునే ప్రయత్నాల్లో తెలుగుదేశం పార్టీ శాసన మండలిని అడ్డుపెట్టుకునే ప్రయత్నం చేయగా డిప్యూటీ సీఎం పదవిలో ఉన్న బోస్ తన పదవి పోతుందనే ఆలోచన కూడా లేకుండా శాసన మండలిని రద్దు చేయాలనే తీర్మానాన్ని ప్రవేశపెట్టి సంచలన నిర్ణయాన్ని తీసుకుని జగన్మోహన్రెడ్డికి విధేయుడిగా నిలిచారు. శెట్టిబలిజలకు సముచిత స్థానం రాష్ట్ర విభజనకు ముందు విభజన తరువాత ఏపీలో బీసీలలో శెట్టిబలిజ సామాజిక వర్గానికి తొలిసారి పెద్దల సభకు అవకాశం ఇచ్చిన సీఎంగా జగన్ చరిత్రలో నిలిచిపోనున్నారు. జిల్లాలో బీసీలను ఓటుబ్యాంక్గానే పరిగణించిన టీడీపీ ఈ స్థాయి ఆ సామాజిక వర్గానికి ఎప్పుడూ కల్పించలేకపోయింది. జిల్లా నుంచి తొలిసారి రాజ్యసభకు కాపు సామాజిక వర్గం నుంచి ప్రస్తుత కాకినాడ ఎంపీ వంగా గీత ప్రాతినిధ్యం వహించారు. తిరిగి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో శెట్టి బలిజ సామాజిక వర్గానికి చెందిన సుభాష్చంద్రబోస్ పెద్దల సభలో అడుగుపెట్టబోతున్నారు. గతంలో ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా రాజ్యసభకు నామినేట్ చేయటంలో బీసీ వర్గాలకు అంత ప్రాధాన్యత ఉండేది కాదు. కానీ జగన్మోహన్ రెడ్డి బీసీలకు సముచిత స్ధానం కల్పిస్తామని చెప్పటమే కాకుండా ఏకంగా రాజ్యసభకు బోస్ను పంపించేందుకు నిర్ణయించడంపై ఆ సామాజికవర్గంలో సంబరాలు మిన్నంటుతున్నాయి. విశ్వసనీయతకు విలువనిచ్చిన సీఎం ముఖ్యమంత్రి విశ్వసనీయతకు విలువ ఇచ్చారు. చాలా సంతోషంగా ఉంది. అసలు ఇంతటి స్థాయి కల్పిస్తారని ఎప్పుడూ ఊహించ లేదు. బీసీలకు సముచిత స్థానం కల్పిస్తామని ఎప్పుడూ చెబుతుండే సీఎం దానిని కార్యచరణలో చూపించారు. (వైఎస్సార్సీపీలోకి డొక్కా, రెహమాన్) -
‘ఏపీలో 5 వేల అంగన్వాడీ పోస్టులు ఖాళీ’
సాక్షి, న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్లో 5 వేల అంగన్వాడీ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి స్మృతి ఇరానీ వెల్లడించారు. రాజ్యసభలో గురువారం వైఎస్సార్సీపీ సభ్యుడు విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా సమాధానమిచ్చారు. 2019 డిసెంబర్ 31 నాటికి ఆంధ్రప్రదేశ్లో 1665 అంగన్వాడీ వర్కర్లు, 3347 అంగన్వాడి హెల్పర్ల పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలతో ఉత్తర ప్రత్యుత్తరాల ద్వారా సంప్రదింపులు జరుపుతూ ఖాళీలను భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటోందన్నారు. అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్ల ఖాళీలను జిల్లా కలెక్టర్లు భర్తీ చేయడానికి వీలుగా తగిన ఆదేశాలు ఇవ్వవలసిందిగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతున్నట్లు మంత్రి చెప్పారు. (జేసీ ట్రావెల్స్ రిజిస్టేషన్ల రద్దుకు చర్యలు) కేంద్ర ప్రభుత్వం 2018 అక్టోబర్ 1 నుంచి అంగన్వాడీ వర్కర్ల గౌరవ వేతనాన్ని నెలకు 3 వేల నుంచి 4 వేల రూపాయలకు, హెల్పర్ల గౌరవ వేతనాన్ని నెలకు 1500 నుంచి 2250 రూపాయలకు పెంచిందిని మంత్రి తెలిపారు. అలాగే పనితీరు ప్రాతిపదికన హెల్పర్లకు ప్రోత్సాహకం కింద నెలకు 250 రూపాయలు చెల్లించడం జరుగుతోందన్నారు. ఐసీడీఎస్-సీఏఎస్ వినియోగించే అంగన్వాడీ వర్కర్లకు పోషణ్ అభియాన్ ప్రోత్సాహకం కింద నెలకు 500 రూపాయలు చెల్లిస్తున్నట్లు తెలిపారు. కేంద్రం ఇచ్చే గౌరవ వేతనానికి అదనంగా అనేక రాష్ట్రాలు తమ సొంత వనరుల నుంచి అంగన్వాడీలకు అదనంగా ప్రోత్సాహక నగదును చెల్లిస్తున్నాయన్నారు ఇవి కాకుండా అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్ల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక సౌకర్యాలను ప్రవేశపెట్టిందని పేర్కొన్నారు. (అధిక బరువుతో బాధపడుతున్నారా..) అదే విధంగా 180 రోజుల వేతనంతో కూడిన మెటర్నిటీ సెలవులు, పనితీరును గుర్తిస్తూ వారికి ప్రేరణ కలిగించేందుకు కేంద్ర ప్రభుత్వం స్థాయిలో రూ.50 వేల నగదు అవార్డుతోపాటు ప్రశంసాపత్రం, రాష్ట్ర స్థాయిలో 10 వేల నగదు అవార్డుతోపాటు ప్రశంసాపత్రం అందచేస్తున్నట్లు మంత్రి తెలిపారు. అలాగే అంగన్వాడీలకు ఏడాదికి 400 రూపాయల విలువైన చీర కలిగిన రెండు యూనిఫారాలు, 18-50 ఏళ్ళ మధ్య వయస్సు కలిగిన వర్కర్లు, హెల్పర్లకు ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన పథకం కింద జీవిత బీమా, 51 నుంచి 59 ఏళ్ళ మధ్య వయస్సు కలిగిన వారికి ప్రధాన మంత్రి సురక్ష బీమా పథకం అమలు చేస్తున్నట్లు చెప్పారు. తీవ్ర అనారోగ్య బారిన పడినట్లుగా గుర్తించిన అంగన్వాడీలకు 20 వేల రూపాయల వరకు చికిత్స ఖర్చులు, 9 నుంచి 12వ తరగతి చుదువుతున్న అంగన్వాడీల సంతానానికి స్కాలర్షిప్లు, సూపర్వైజర్ల నియామకంలో వారికి 50 శాతం రిజర్వేషన్ వంటి పలు సౌకర్యాలను అంగన్వాడీలకు కేంద్ర ప్రభుత్వం కల్పిస్తోందని మంత్రి వివరించారు.(‘మాలోకాన్ని కరోనా క్వారంటైన్ వార్డులో పెట్టాలి’) చదవండి: ‘కడపలో బ్యాంక్ శాఖలను తగ్గించలేదు’ -
ఆంధ్రప్రదేశ్కు 32 రోడ్డు, 21 రైల్ ప్రాజెక్ట్లు
సాక్షి, న్యూఢిల్లీ: సాగరమాల కార్యక్రమం కింద దేశంలో కొత్తగా అభివృద్ధి చేయడానికి తలపెట్టిన 91 రోడ్డు, 83 రైల్ ప్రాజెక్ట్లలో ఆంధ్రప్రదేశ్కు 32 రోడ్డు, 21 రైల్ ప్రాజెక్ట్లు కేటాయించినట్లు నౌకాయాన శాఖ సహాయ మంత్రి మన్సుఖ్ మాండవీయ తెలిపారు. రాజ్యసభలో విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ, ఆంధ్రప్రదేశ్లో వివిధ పోర్టులకు సరకుల రవాణాను వేగవంతం, సులభతరం చేసే ప్రక్రియలో భాగంగా రోడ్డు, రైల్ ప్రాజెక్ట్లు చేపట్టినట్లు మంత్రి చెప్పారు. రోడ్డు ప్రాజెక్ట్లలో కొన్ని పూర్తయ్యాయి. మరికొన్ని పనులు కొనసాగుతున్నాయి. మరికొన్ని డీపీఆర్ రూపకల్పన దశలో ఉన్నాయని ఆయన వివరించారు. రైల్ ప్రాజెక్ట్లలో కూడా ఇదే పరిస్థితి ఉన్నట్లు చెప్పారు. ఏపీలోని 9 జిల్లాల్లో సాంప్రదాయ పారిశ్రామిక క్లస్టర్లు సాంప్రదాయ పరిశ్రమలను ప్రోత్సహించే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక నిధితో ఒక పథకాన్ని ప్రారంభించినట్లు సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమల మంత్రి నితిన్ గడ్కరీ రాజ్యసభలో చెప్పారు. సభలో విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు ఆయన జవాబిస్తూ ఈ పథకంలో భాగంగా ఖాదీ, కాయర్, విలేజ్ ఇండస్ట్రీస్ ఆధ్వర్యంలో సాంప్రదాయక పరిశ్రమల క్లస్టర్లను ఏర్పాటు చేసి అందుకు తగిన ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు (కలంకారీ ఉత్పాదనలు), విజయనగరం (కాయర్ పరుపుల తయారీ), చిత్తూరు (కాయర్ ఉత్పాతదనలు), కృష్ణా (కొండపల్లి బొమ్మలు), తూర్పు గోదావరి (జొన్నాడ ఫుడ్ ప్రాసెసింగ్), చిత్తూరు (చింతపండు ఉత్పాతదనలు), గుంటూరు (మంగళగిరి బంగారు ఆభరణాల తయారీ), తూర్పు గోదావరి (కొబ్బరి నార ఉత్పాదనలు), తూర్పు గోదావరి (కడియపులంక కొబ్బరి పీచు ఉత్పాదనలు) జిల్లాల్లో మొత్తం 9 సాంప్రదాయ పరిశ్రమల క్లస్టర్లను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. గోదావరి కృష్ణా నదుల అనుసంధానంపై డీపీఆర్ సిద్ధం గోదావరి నుంచి కృష్ణ, కృష్ణ నుంచి పెన్నా, పెన్నా నుంచి కావేరీ నదులకు నీటి మళ్ళింపు కోసం నేషనల్ వాటర్ డెవలప్మెంట్ ఏజెన్సీ (ఎన్డబ్ల్యుడీఏ) ముసాయిదా ప్రణాళికను రూపొందించినట్లు కేంద్ర జల శక్తి మంత్రి గజేంద్ర సింగ్షెకావత్ సోమవారం రాజ్యసభలో వెల్లడించారు. వైఎస్సార్సీ సభ్యులు విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ ఈ విషయం తెలిపారు. దుర్భిక్ష పరిస్థితులను ఎదుర్కొంటున్న రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాలను ఆదుకునేందుకు గోదావరి నది బేసిన్నుంచి కృష్ణా నది బేసిన్కు నీరు మళ్ళించే అవకాశాలను పరిశీలించివలసిందిగా కోరుతూ గత ఏడాది ఆగస్టులో ఆంధ్రప్రదేశ్ముఖ్యమంత్రి కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాస్తూ గోదావరి కృష్ణా నదుల అనుంసంధానం ప్రాజెక్ట్కు ఆర్థికంగా సహాయ సహకారాలు అందించవలసిందిగా కోరినట్లు మంత్రి చెప్పారు. గోదావరి, కృష్ణా, పెన్నా, కావేరీ నదుల అనుసంధానంపై సవివరమైన ప్రాజెక్ట్నివేదికను రూపొందించే బాధ్యతను ఎన్డబ్ల్యుడీఏకు అప్పగించినట్లు మంత్రి తెలిపారు. ఆ సంస్థ సిద్ధం చేసిన ముసాయిదా డీపీఆర్పై తమ అభిప్రాయాలను తెలపవలసిందిగా కోరుతూ సంబంధిత రాష్ట్రాలకు పంపించినట్లు షెకావత్ చెప్పారు. గోదావరి కావేరీ లింక్ప్రాజెక్ట్లో ప్రధానంగా మూడు లింక్లు ఉంటాయి. అవి గోదావరి (ఇంచంపల్లి లేదా జానంపేట), కృష్ణా (నాగార్జున సాగర్) లింక్, కృష్ణా (నాగార్జున సాగర్) పెన్నా (సోమశిల) లింక్, పెన్నా (సోమశిల), కావేరీ (గ్రాండ్ఆనకట్ట) లింక్అని చెప్పారు. ఈ లింక్ప్రాజెక్ట్ల ద్వారా నిరుపయోగంగా పోతున్న 247 టీఎంసీల నీటిని సద్వినియోగం చేసుకునే వీలు కలుగుతుందని మంత్రి తెలిపారు. గోదావరి కృష్ణా లింక్ ప్రాజెక్ట్ ద్వారా ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా, గుంటూరు, ప్రకాశం, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో 3.45 లక్షల నుంచి 5.04 లక్షల హెక్టార్ల భూములకు ఏటా సాగునీటి వసతి కల్పించవచ్చని చెప్పారు. అలాగే నాగార్జున సాగర్ కుడి, ఎడమ కాల్వల కింద ఉన్న ఆయకట్టును స్థిరీకరించవచ్చు. నదుల లింకింగ్ప్రాజెక్ట్పై సంబంధిత రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం సాధించిన అనంతరం తుది డీపీఆర్ను రూపొందించి, చట్టపరమైన అన్ని అనుమతులు పొందిన తర్వాత ప్రాజెక్ట్ పనులు మొదలవుతాయని ఆయన తెలిపారు. -
ఎట్టిపరిస్థితుల్లోనూ రాజ్యసభకు పోటీ చేయను
సాక్షి బెంగళూరు: ఎట్టిపరిస్థితుల్లోనూ తాను రాజ్యసభకు పోటీ చేయనని జేడీఎస్ జాతీయాధ్యక్షుడు, మాజీ ప్రధాని హెచ్డీ దేవెగౌడ వెల్లడించారు. జూన్లో రాష్ట్రంలోని నాలుగు రాజ్యసభ స్థానాలు ఖాళీ కానున్నాయి. అందులో ఒక స్థానానికి కాంగ్రెస్ సహాయంతో దేవెగౌడ పోటీ చేస్తారని ఊహాగానాలు ఊపందుకున్న నేపథ్యంలో వాటన్నింటికి ఆయన స్పష్టత నిచ్చారు. శనివారం జేపీ భవన్లో మీడియాతో ఆయన మాట్లాడుతూ... తాను రాజ్యసభకు వెళ్లనని తెలిపారు. తాను రైతుల కోసం పోరాడేందుకు రాజ్యసభకు వెళ్లాల్సిన అవసరం లేదని, ఎక్కడున్నా రైతుల తరపున పోరాటం చేస్తానని తెలిపారు. చదవండి: మేమే కర్ణాటక వస్తాం..అన్నీ తేలుస్తాం తన జీవితమే ఒక పోరాటం అని, తనకు అధికార దాహం లేదని వెల్లడించారు. అంతకుముందు దాసరహళ్లిలో జరిగిన సీఏఏకు వ్యతిరేకంగా జరిగిన ఆందోళనలో దేవెగౌడ పాల్గొని మాట్లాడారు. తాను ఎన్నికల్లో ఓడిపోయాయని, ఇక ఇంటికే పరిమితం అవుతానని ఎవరూ భావించొద్దని తెలిపారు. తాను పూర్తి ఆరోగ్యంగా ఉన్నానని, తన పోరాటం ఎప్పటికి ఆగదని స్పష్టం చేశారు. ఇటీవలే కేరళలో చికిత్స తీసుకుని వచ్చానని, నెల రోజులు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించినట్లు, కానీ ప్రస్తుతం వ్యవస్థకు విరుద్ధంగా పోరాటం చేయాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. ఈ నేపథ్యంలో నిమిషం కూడా ఆలస్యం చేయకుండా ప్రజల పక్షాన పోరాటం చేసేందుకు వచ్చినట్లు తెలిపారు. -
పౌరసత్వ చట్టంపై అప్పట్లో రాజ్యసభలో మన్మోహన్
-
పౌరసత్వ చట్టం తేవాలి : అప్పట్లో రాజ్యసభలో మన్మోహన్
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టాన్ని కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో అధికార బీజేపీ గురువారం కీలక వీడియో విడుదల చేసింది. 2003లో రాజ్యసభలో కాంగ్రెస్ తరపున సభాపక్షనేతగా ఉన్న మన్మోహన్ సింగ్ పౌరసత్వ బిల్లు ఆవశ్యకత గురించి మాట్లాడారు. ఈ చట్టంపై పార్లమెంటులో కేంద్ర హోం మంత్రి అమిత్షా చెప్పిన మాటలనే అప్పట్లో మన్మోహన్ సింగ్ వెల్లడించారు. ఆ వీడియోలో పాకిస్తాన్, బంగ్లాదేశ్లలో హింసకు గురవుతున్న మైనార్టీలకు ఉదారభావంతో భారత పౌరసత్వం ఇవ్వాలని ఆయన ఎన్డీఏ ప్రభుత్వాన్ని కోరారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో బీజేపీ వీడియోను విడుదల చేయడం వ్యూహాత్మక ఎత్తుగడగా భావిస్తున్నారు. ఒకరకంగా కాంగ్రెస్ పార్టీ ద్వంద వైఖరిని, ఓటు బ్యాంకు రాజకీయాలను దేశ ప్రజల ముందు ఆవిష్కరించినట్లైంది. ఈ వీడియోతో బంతి కాంగ్రెస్ కోర్టులో పడింది. మరి ఈ వీడియోపై ఆ పార్టీ ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాలి. చదవండి : (షాహి ఇమామ్ సంచలన వ్యాఖ్యలు) -
రాజ్యసభ సభ్యుడిగా మన్మోహన్ ప్రమాణం
న్యూఢిల్లీ: మాజీ ప్రధానమంత్రి మన్మోహన్సింగ్ మరోసారి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు శుక్రవారం ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. రాజస్తాన్ నుంచి మన్మోహన్సింగ్ తిరిగి రాజ్యసభకు ఎన్నికయ్యారు. పెద్దల సభకు మన్మోహన్ ఎన్నికవడం ఇది ఆరవసారి. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, థావర్ చంద్ గెహ్లోత్, గులాంనబీ ఆజాద్, ఆనంద్ శర్మ, అహ్మద్ పటేల్, రాజస్తాన్ సీఎం అశోక్ గెహ్లోత్, సచిన్ పైలట్తో పాటు కొంతమంది బీజేపీ నాయకులు కూడా హాజరయ్యారు. -
రాజస్ధాన్ నుంచి రాజ్యసభ బరిలో మన్మోహన్
జైపూర్ : మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ రాజ్యసభ ఎన్నికలకు మంగళవారం జైపూర్లో నామినేషన్ దాఖలు చేశారు. రాజస్ధాన్ నుంచి పెద్దల సభకు పోటీపడుతున్న మన్మోహన్ సింగ్కు విమానాశ్రయంలో రాజస్దాన్ సీఎం, సీనియర్ కాంగ్రెస్ నేత అశోక్ గెహ్లోత్ స్వాగతం పలికారు. ఎయిర్పోర్ట్ నుంచి మారియట్ హోటల్కు చేరుకున్న మన్హోహన్, గెహ్లోత్లతో డిప్యూటీ సీఎం సచిన్ పైలట్లు కొద్దిసేపు చర్చలు జరిపారు. అక్కడినుంచి ప్రదర్శనగా రాజస్ధాన్ అసెంబ్లీకి చేరుకున్న మన్మోహన్ సింగ్ రాజ్యసభ ఎన్నికలకు నామినేషన్ పత్రాలను సమర్పించారు. మన్మోహన్ సింగ్ గత మూడు దశాబ్ధాలుగా అసోం నుంచి పెద్దల సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రాజస్ధాన్ బీజేపీ చీఫ్ మదన్ లాల్ సైనీ మరణంతో ఖాళీ అయిన రాజ్యసభ స్ధానానికి మన్మోహన్ సింగ్ పోటీపడుతున్నారు. రాజస్ధాన్లో కాంగ్రెస్కు మెజారిటీ ఉండటంతో మన్మోహన్ రాజ్యసభకు సునాయాసంగా ఎన్నికవనున్నారు. -
టీఆర్ఎస్ నేతలకు చెంప చెళ్లుమంది: బీజేపీ ఎంపీ
సాక్షి, న్యూఢిల్లీ : జమ్మూకశ్మీర్ విషయంలో బీజేపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చరిత్రాత్మకమని ఆ పార్టీ నిజామాబాద్ ఎంపీ అరవింద్ ధర్మపురి పేర్కొన్నారు. కశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తున్న 370 ఆర్టికల్ను రద్దు చేస్తున్నట్లు సోమవారం రాజ్యసభలో హోంశాఖ మంత్రి అమిత్షా ప్రకటన విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా అరవింద్ మాట్లాడుతూ.. ఆర్టికల్ 370ని రద్దు చేయటం తన చిన్నప్పటి కల అని, దీన్ని రద్దు చేస్తూ తీసుకొచ్చిన బిల్లుపై ఓటు వేసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. 370 ఆర్టికల్ రద్దుతో జమ్మూకశ్మీర్ అభివృద్ధి వేగవంతం అవుతుందని, అనేక కొత్త పరిశ్రమలు వచ్చే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. శ్రావణమాస సోమవారం కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు పండగ వాతావరణం నెలకొందని అన్నారు. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ, వేలమంది సైనికుల ఆత్మలకు ఈ రోజు శాంతి కలుగుతుందన్నారు. అసలు జమ్మూ కశ్మీర్ భారతదేశంలో లేకుండా ఉండే అన్న టీఆర్ఎస్ నాయకులు, ఎంఐఎం నాయకులకు చెంప చెళ్లుమన్నట్లు అయ్యిందని మండిపడ్డారు. ఎంపీ బండి సంజయ్ మాట్లాడుతూ.. ఈ రోజు దేశ ప్రజలందరూ సంతోషంగా విజయోత్సవాలు జరుపుకుంటున్నారని, ఒకే దేశం ఒకే రాజ్యాంగం అనే భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకుడు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ కల నెరవేరిందని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలోనే భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టోలో 370 ఆర్టికల్ను రద్దు చేస్తామని మోదీ, అమిత్షా ఇచ్చిన వాగ్దానాన్ని నేడు నెరవేర్చిందని స్పష్టం చేశారు. జమ్మూకశ్మీర్ దేశంలో అంతర్భాగమని, అది ఎవరి జాగీరు కాదని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరిని అవలంబిస్తోందని, కశ్మీర్ భారతదేశంలో అంతర్భాగమో కాదో కాంగ్రెస్, ఇతర పార్టీలు స్పష్టం చేయాలన్నారు. 370 ఆర్టికల్ రద్దుకు వ్యతిరేకించిన పార్టీలు సిగ్గుతో తలవంచుకోవాలన్నారు. -
రాజ్యసభలో ట్రిపుల్ రగడ
న్యూఢిల్లీ: రాజ్యసభలో కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ మంగళవారం ట్రిపుల్ తలాక్ బిల్లును ప్రవేశపెట్టారు. బిల్లుపై చర్చ సందర్భంగా బీజేపీ భాగస్వామ్య పక్షం జేడీ(యూ) సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. బిల్లుపై చర్చను ప్రారంభించిన మంత్రి ఇస్లామిక్ దేశాలు సైతం త్రిపుల్ తలాక్ ను నిషేధించాయని గుర్తు చేశారు.చిన్న చిన్న కారణాలతో ట్రిపుల్ తలాక్ చెబుతున్న ఉదంతాలు సుప్రీంకోర్టు దృష్టికి వచ్చాయని తెలిపారు.బాధితురాలు, ఆమె రక్త సంబంధీకులకు మాత్రమే ట్రిపుల్ తలాక్ పై కేసు పెట్టే అధికారం ఇచ్చామని,ఈ బిల్లు మానవత్వానికి, న్యాయానికి సంబంధించినది మాత్రమేనని, మతంతో ముడిపడి లేదని స్పష్టం చేశారు. మహిళల అభ్యున్నతి కోసమే తమ ప్రభుత్వం ఈబిల్లు తీసుకొచ్చిందని మంత్రి పేర్కొన్నారు. ఇక పెద్దల సభలో అధికార సభ్యుల కంటే విపక్ష సభ్యులు అధికంగా ఉండటంతో ట్రిపుల్ తలాక్ బిల్లును రాజ్యసభలో గట్టెక్కించడం మోదీ సర్కార్కు సవాల్గా మారింది. ప్రధాన విపక్ష పార్టీలన్నీ బిల్లును వ్యతిరేకిస్తుండటం ప్రభుత్వానికి మింగుడుపడటం లేదు. లోక్సభలో ట్రిపుల్ తలాక్ బిల్లు ఓటింగ్కు వచ్చినప్పుడు కాంగ్రెస్, ఎస్పీ, తృణమూల్ కాంగ్రెస్, డీఎంకే సహా పలు విపక్ష పార్టీలు సభ నుంచి వాకౌట్ చేశాయి. బిజేపీ మిత్ర పక్షం జేడీ(యూ) సైతం ట్రిపుల్ తలాక్ బిల్లుపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తుండటం గమనార్హం. పార్లమెంట్ ఉభయసభల్లో ఆమోదం కంటే ముందు ఈ బిల్లును పరిశీలన కోసం సెలెక్ట్ కమిటీకి నివేదించాలని కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, డీఎంకేలు డిమాండ్ చేశాయి. -
నేడు పెద్దల సభ ముందుకు ట్రిపుల్ తలాక్ బిల్లు
సాక్షి, న్యూఢిల్లీ : లోక్సభలో విపక్షాల నిరసనల నడుమ ఆమోదం పొందిన ట్రిపుల్ తలాక్ బిల్లు మంగళవారం రాజ్యసభ ముందుకొచ్చే అవకాశం ఉంది. రాజ్యసభలో ట్రిపుల్ తలాక్ బిల్లును ఎట్టిపరిస్థితుల్లో గట్టెక్కించాలని భావిస్తున్న బీజేపీ ఆ దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేసింది. సభకు విధిగా హాజరు కావాలని పార్టీ రాజ్యసభ ఎంపీలందరికీ బీజేపీ విప్ జారీ చేసింది. లోక్సభలో బిల్లు ఆమోదం పొందినా రాజ్యసభలో ఈబిల్లు ఆమోదం ప్రభుత్వానికి అంత సులభం కాదు. పెద్దల సభలో అధికార సభ్యుల కంటే విపక్ష సభ్యులు అధికంగా ఉండటంతో ట్రిపుల్ తలాక్ బిల్లును రాజ్యసభలో గట్టెక్కించడం మోదీ సర్కార్కు సవాల్గా మారింది. ప్రధాన విపక్ష పార్టీలన్నీ బిల్లును వ్యతిరేకిస్తుండటం ప్రభుత్వానికి మింగుడుపడటం లేదు. లోక్సభలో ట్రిపుల్ తలాక్ బిల్లు ఓటింగ్కు వచ్చినప్పుడు కాంగ్రెస్, ఎస్పీ, తృణమూల్ కాంగ్రెస్, డీఎంకే సహా పలు విపక్ష పార్టీలు సభ నుంచి వాకౌట్ చేశాయి. బిజేపీ మిత్ర పక్షం జేడీ(యూ) సైతం ట్రిపుల్ తలాక్ బిల్లుపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తుండటం గమనార్హం. పార్లమెంట్ ఉభయసభల్లో ఆమోదం కంటే ముందు ఈ బిల్లును పరిశీలన కోసం సెలెక్ట్ కమిటీకి నివేదించాలని కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, డీఎంకేలు డిమాండ్ చేశాయి. మరోవైపు విపక్షాలు బిల్లును వ్యతిరేకిస్తున్నా లింగ సమానత్వం, న్యాయం దిశగా ఈ బిల్లును రూపొందించామని బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కార్ చెబుతోంది. -
‘హర్నాథ్ జీ.. పద్ధతిగా మాట్లాడండి’
న్యూఢిల్లీ : పోక్సో చట్టం-2019 బిల్లును గురువారం రాజ్యసభలో ప్రవేశపెట్టే సమయంలో కాస్త ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ బిల్లును ప్రవేశపెట్టిన సమయంలో బీజేపీకి చెందిన ఉత్తర్ ప్రదేశ్ ఎంపీ హర్నాథ్సింగ్ యాదవ్ అభ్యంతరకరంగా మాట్లాడారు. ‘లైంగిక దాడులు ఎక్కడ జరుగుతున్నాయి.. ఈ లైంగిక నేరస్తులు ఎక్కడి నుంచి వస్తున్నారు అని ప్రశ్నించుకుంటే సమాధానం తేలిగ్గానే దొరుకుతుంది. మనం సమాజానికి ఏం అందిస్తున్నామో.. దాన్నే తిరిగి పొందుతున్నాం’ అన్నారు. ‘ఓసారి నా స్నేహితుడు నా వద్దకు వచ్చి పోర్నోగ్రపీ గురించి మాట్లాడటం మొదలు పెట్టాడు. నేను పాప్కార్న్ గురించి విన్నాను. కానీ పోర్న్ గురించి ఎప్పుడూ వినలేద’న్నారు హర్నాథ్ సింగ్. ఇక సోషల్ మీడియా, మీడియా ప్రభావం పిల్లల మీద ఎలా ఉంటుందో ఆయన ఓ ఉదాహరణ ద్వారా చెప్పారు. ‘పిల్లలకు సత్య హరిశ్చంద్రుడి సినిమా చూపిస్తే.. మంచి మనిషిగా మారడం ఎలాగో వాళ్లకి తెలుస్తుంది. కానీ ఇప్పటి పిల్లలకు ‘మున్నీ బద్నాం హూయి’, ‘చిక్నీ ఛమేలీ’ వంటి పాటలు చూపిస్తున్నాం. దీని ప్రభావం ఎలా ఉంటుందో ఆలోచించండి. పిల్లల మనసు చాలా సున్నితంగా ఉంటుంది. కాబట్టి సత్యహరిశ్చంద్ర, ఈ సినిమా పాటల్లో ఏవి ఎక్కువగా ప్రభావం చూపుతాయి’ అంటూ హరినాథ్ కాసేపు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనిపై స్పందించిన కేంద్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖా మంత్రి స్మృతి ఇరానీ ఆయనకు స్ట్రాంగ్ క్లాస్ తీసుకున్నారు. హర్నాథ్ మాట్లాడుతుండగా మధ్యలో అడ్డుకున్న స్మృతి.. సభలో మాట్లాడే పద్దతి ఇది కాదన్నారు. ఆమె మాట్లాడుతూ.. ‘హర్నాథ్ జీ.. మీరు నాకంటే వయసులో పెద్దవారు. నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. మీరు ఆందోళన వ్యక్తం చేయాలనకున్నప్పుడు కాస్త జాగ్రత్తగా.. పద్ధతిగా మాట్లాడండి. ఈ సభను దేశం మొత్తం చూస్తోంది. ఇక్కడ సభలో ఎంతో మంది మహిళలు కూర్చొని ఉన్నారు. వారంతా చాలా ఇబ్బందికి గురవుతారు. మీరు మీ సమస్యను చెప్పాలనుకున్నప్పుడు పద్ధతిగా మాట్లాడండి’ అంటూ స్మృతి ఆగ్రహం వ్యక్తం చేశారు. -
ఆ ఆరు ఎయిర్పోర్టుల ప్రైవేటీకరణ
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో ఆరు విమానాశ్రయాలను ప్రైవేటీకరిస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. బుధవారం రాజ్యసభలో పౌర విమానయానమంత్రి హర్దీప్ పూరి ఈ విషయం వెల్లడించారు. దేశంలోని ఆరు ఎయిర్పోర్టుల నిర్వహణ కోసం ప్రైవేట్ సంస్ధలను ఆహ్వానిస్తామని చెప్పారు. ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యం పద్ధతిలో లక్నో, అహ్మదాబాద్, జైపూర్, మంగళూర్, తిరువనంతపురం, గువహటి విమానాశ్రయాల ప్రైవేటీకరణ చేపడతామని తెలిపారు. ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ)తో పాటు విమాన ప్రయాణీకులకూ ఇది ఉపకరిస్తుందని అన్నారు. ప్రైవేట్ సంస్థలు నిర్వహిస్తున్న ఢిల్లీ, ముంబై విమానాశ్రయాలను కేంద్ర మంత్రి ఉదాహరణగా చూపారు. దేశవ్యాప్తంగా లాభాల బాటలో నడుస్తున్న ఆరు విమానాశ్రయాలను ప్రైవేటకరించాలన్న ప్రతిపాదనను ఏఏఐ ఉద్యోగుల సమాఖ్య వ్యతిరేకిస్తున్న క్రమంలో కేంద్ర మంత్రి ఈ ప్రకటన చేయడం గమనార్హం. -
ఏపీలో విదేశీ రుణంతో ఐదు ప్రాజెక్టులు
సాక్షి, న్యూఢిల్లీ : గత మూడేళ్లలో ఆంధ్రప్రదేశ్లో అయిదు ప్రాజెక్టులు ప్రపంచ బ్యాంకు రుణాలతో అమలవుతుండగా, మరో నాలుగు ప్రాజెక్టులకు రుణ ప్రతిపాదనలు ప్రపంచ బ్యాంక్, న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ (ఎన్డీబీ) పరిశీలనలో ఉన్నాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. ఏపీ ప్రభుత్వం పంపిన మరో 12 ప్రాజెక్టు ప్రతిపాదనలను ప్రపంచ బ్యాంకు, ఎన్డీబీ, ఏఐఐబీ పరిశీలనలో ఉన్నాయని చెప్పారు. రాజ్యసభలో డా. కేవిపి రామచంద్రరావు, మహ్మద్ అలీ ఖాన్ అడిగిన ప్రశ్నలకు కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇచ్చిన లిఖిత పూర్వక సమాధానంలో ఈ వివరాలు తెలిపారు. ఇక తెలంగాణ నుంచి హైదరాబాద్ మెట్రో రైలు, నగర వీధుల పునరుద్ధరణ కోసం రూ 960 కోట్ల ప్రాజెక్టు ప్రతిపాదనలను గత ఏడాది సెప్టెంబర్లో జర్మన్ రుణ సంస్థల పరిశీలనకు కేంద్ర ప్రభుత్వం పంపిందని చెప్పారు. అమరావతిలో మౌలిక వసతుల ఏర్పాటు కోసం రూ 1242 కోట్లతో కూడిన ప్రాజెక్టు ప్రతిపాదనలను జపాన్ ఆర్థిక సాయం కోసం పంపామని తెలిపారు. విశాఖ మెట్రో రైలు కోసం 9988 కోట్ల రూపాయల ప్రతిపాదనలతో కూడిన ప్రాజెక్టుకు రుణ సహాయం చేయలేమని కెగ్జిమ్ ( ఎక్సపోర్ట్ ఇంపోర్ట్ బ్యాంకు ఆఫ్ కొరియా) నిస్సహాయతను వ్యక్తం చేసిందని వెల్లడించారు. కాగా ఈ ప్రాజెక్టులన్నీ గ్రామీణ రహదారులకు సంబంధించినవేనని మంత్రి తెలిపారు. -
కీలక బిల్లు ప్రవేశపెట్టిన విజయసాయి రెడ్డి
-
వారం క్రితమే చంద్రబాబును కలిశా...
సాక్షి, న్యూఢిల్లీ: తెలుగుదేశం పార్టీని వీడుతున్నట్లు ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేశ్ ధ్రువీకరించారు. తాను బీజేపీలో చేరబోతున్నట్లు ఆయన అధికారికంగా వెల్లడించారు. గతంలో తాను బీజేపీ యూత్ వింగ్లో సభ్యుడినని టీజీ వెంకటేశ్ తెలిపారు. అప్పటి నుంచే తనకు బీజేపీతో అనుబంధం ఉందని చెప్పుకొచ్చారు. పార్టీ మార్పుపై ఇప్పటికే ఎంపీలు సంతకాలు చేసి తాము రాజ్యసభ చైర్మన్కు అందచేశామన్నారు. తమను బీజేపీలో విలీనం చేయాలని లేదా ప్రత్యేక గ్రూపుగా పరిగణించాలని విజ్ఞప్తి చేశామన్నారు. వారం క్రితమే చంద్రబాబు నాయుడుని కలిశానని, అయితే పార్టీని వీడొద్దని ఆయన చెప్పారన్నారు. ప్రజా నిర్ణయంలో పాటు, తమ ప్రాంత అభివృద్ధి మేరకే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. కాగా బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా సమక్షంలో టీడీపీ ఎంపీలు సుజనా చౌదరి, సీఎం రమేష్, గరికపాటి మోహన్ రావు, టీజీ వెంకటేశ్ కాషాయ కండువా కప్పుకున్నారు. దీంతో రాజ్యసభలో టీడీపీ ఎంపీలు ఆరుగురు ఉండగా...నలుగురు బీజేపీలో చేరనుండటంతో ఇక ఇద్దరే మిగిలారు. చదవండి: టీడీపీలో భారీ సంక్షోభం! -
17 నుంచి కొలువు తీరనున్న 17వ లోక్సభ
సాక్షి, న్యూఢిల్లీ : ఈనెల 17 నుంచి 26 వరకూ పార్లమెంట్ సమావేశాలు జరగనున్నాయి. రాజ్యసభలో సభానాయకుడిగా కేంద్ర మంత్రి థావర్చంద్ గెహ్లోట్ నియమితులయ్యారు. బీజేపీ సీనియర్నేత, కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీ స్ధానంలో గెహ్లాట్ ఈ బాధ్యతలు చేపట్టనున్నారు. రాజ్యసభలో ఉపనాయకుడిగా పీయూష్ గోయల్ వ్యవహరిస్తారు. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ రాజ్యసభ నేతను నియమిస్తుంది. లోక్సభలో సభా నాయకుడిగా ప్రధాని నరేంద్ర మోదీ, ఉపనాయకుడిగా రాజ్నాథ్ సింగ్ వ్యవహరించనున్నారు. ఈనెల 17 నుంచి లోక్సభ సమావేశాలు ప్రారంభం కానుండగా 20 నుంచి రాజ్యసభ సమావేశాలు జరగనున్నాయి. లోక్సభ ఎన్నికల్లో విజయం సాధించిన ఎంపీలు 17, 18 తేదీల్లో ప్రమాణ స్వీకారం చేస్తారు. ఈనెల 19న స్పీకర్ ఎన్నిక జరగనుండగా, 20న పార్లమెంట్ ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి రామ్నాధ్ కోవింద్ ప్రసంగిస్తారు. -
పౌరసత్వ బిల్లుపై భగ్గుమన్న ఈశాన్యం
సాక్షి, న్యూఢిల్లీ : లోక్సభ ఆమోదం పొందిన వివాదాస్పద పౌరసత్వ సవరణ బిల్లు 2016ను కేంద్ర ప్రభుత్వం మంగళవారం రాజ్యసభలో ప్రవేశపెడుతుండటంతో ఈశాన్య రాష్ట్రాలు తీవ్ర నిరసన తెలుపుతున్నాయి. ఆప్ఘనిస్థాన్, బంగ్లాదేశ్, పాకిస్తాన్ల నుంచి ముస్లిమేతర వలసదారులకు పౌరసత్వం కల్పించేలా చేపట్టిన ఈ సవరణ బిల్లును అసోం సహా ఈశాన్య రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నాయి. బీజేపీకి చెందిన అరుణాచల్ప్రదేశ్ సీఎం పెమా ఖండూ, మణిపూర్ సీఎం బీరేన్ సింగ్లు సైతం బిల్లుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కాగా, 2014, డిసెంబర్ 31లోగా భారత్లో ప్రవేశించిన పొరుగు దేశాలకు చెందిన ముస్లింలు కాకుండా హిందువులు, పార్శీలు, సిక్కులు, బౌద్ధులు, క్రైస్తవులు, జైన్లకు భారత పౌరసత్వం ఇచ్చేలా ఈ బిల్లును సవరించారు. వలసదారుల పట్ల వివక్ష తగదని, దేశంలోకి తరలిచ్చిన ప్రతిఒక్కరికీ వారి మతంతో సంబంధం లేకుండా పౌరసత్వ హక్కు కల్పించాలని ఈశాన్య రాష్ట్రాలు డిమాండ్ చేస్తున్నాయి. బంగ్లాదేశ్ నుంచి 1971 మార్చి తర్వాత దేశంలోకి అక్రమంగా ప్రవేశించిన హిందూ వలసదారులకు పౌరసత్వం కల్పించేలా రూపొందిన ఈ బిల్లు 1985 అసోం ఒప్పందానికి విరుద్ధమని నిరసనకారులు పేర్కొంటున్నారు. కాగా ఈ బిల్లును వ్యతిరేకిస్తూ భారతరత్నను వెనక్కిఇవ్వాలని అస్సామీ గాయకుడు భూపేన్ హజారికా కుటుంబం యోచిస్తోంది. మరోవైపు పౌరసత్వ బిల్లుకు నిరసనగా ఇటీవల ప్రధాని మోదీ గౌహతి పర్యటనలో నిరసనకారులు నల్లజెండాలు ప్రదర్శించారు. -
కర్నూలుకు సీఎఫ్టీఆర్ఐ సెంటర్ లేదు
సాక్షి, న్యూఢిల్లీ: కర్నూలులో సెంట్రల్ ఫుడ్ టెక్నలాజికల్ రీసెర్చి ఇనిస్టిట్యూట్ (సీఎఫ్టీఆర్ఐ) రిసోర్స్ సెంటర్ ఏర్పాటు చేసే ప్రతిపాదన ఏదీ లేదని ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ సహాయ మంత్రి సాధ్వీ నిరంజన్ జ్యోతి శుక్రవారం రాజ్య సభలో వెల్లడించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి జవాబు చెబుతూ, కర్నూలులో సీఎఫ్టీఆర్ఐ రిసోర్స్ సెంటర్ నెలకొల్పే ఆలోచన లేదని సీఎస్ఐఆర్-సీఎఫ్టీఆర్ఐ తమకు సమాచారం ఇచ్చినట్లు చెప్పారు. అమెరికా, బ్రిటన్, చైనా, ఫ్రాన్స్ తదితర దేశాలతో పోల్చుకుంటే ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో మన దేశం వెనుకబడిపోవడానికి కారణాలు ఏమిటన్న మరో ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ ఉత్పత్తి, ప్రాసెసింగ్కు మధ్య తగినంత అనుసంధానం లేకపోవడం, ఉత్పత్తి అభివృద్ధి, నవీకరణ లోపించడం, సప్లై చైన్లో సంస్థాగతమైన లోపాలు, మౌలిక సదుపాయాల లేమి తదితర సమస్యలు ఉన్నట్లు మంత్రి చెప్పారు. అలాగే అమెరికన్ డాలర్ మారకం విలువలో వస్తున్న మార్పులు, ఎగుమతి చేసే వస్తువుల ధరల్లో మార్పులు, ఎగుమతుల పరిమాణంలో హెచ్చు తగ్గులు ఆయా సమయంలో విదేశీ మారక ద్రవ్య విలువల్లో సంభవించే మార్పులు ఎగుమతుల విలువపై ప్రభావం చూపుతున్నట్లు మంత్రి చెప్పారు. వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ చేపడుతున్న చర్యల కారణంగా 2016-17లో ఆహోరోత్పత్తుల ఎగుమతుల విలువ 30.87 బిలియన్ డాలర్లు ఉండగా 2017-18 నాటికి అది 35.47 బిలియన్ డాలర్లకు చేరుకున్నట్లు మంత్రి తెలిపారు. రెండేళ్ళలో విశాఖలో ఎలక్ట్రో మాగ్నటిక్ లేబొరేటరీ విశాఖపట్నంలో కేంద్ర ప్రభుత్వం నెలకొల్పుతున్న ఎలక్ట్రోమాగ్నటిక్ ఎన్విరాన్మెంటల్ ఎఫెక్ట్స్ (ఈ3) లేబరేటరీ పూర్తి కావడానికి గడువును మరో రెండేళ్ళపాటు పొడిగించినట్లు ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ సహాయ మంత్రి ఎస్.ఎస్. అహ్లూవాలియా తెలిపారు. రాజ్య సభలో వి.విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిస్తూ, రక్షణ విభాగం, ఎలక్ట్రోమాగ్నటిక్ ఇంటర్ఫియరెన్స్, ఎలక్ట్రోమాగ్నటిక్ కంపాటబులిటీ, ఎలక్ట్రోమాగ్నటిక్ పల్స్ వంటి కీలక రంగాలలో కన్సల్టెన్సీ సేవలు అందించడమే ఈ ప్రాజెక్ట్ ప్రధాన ఉద్దేశమని తెలిపారు. -
కర్నూలుకు సీఎఫ్టీఆర్ఐ సెంటర్ లేదు
-
కోటా బిల్లుపై పెద్దల సభలో వాడివేడి చర్చ
సాక్షి, న్యూఢిల్లీ : అగ్ర వర్ణాల పేదలకు పదిశాతం రిజర్వేషన్ కల్పించే బిల్లుపై బుధవారం రాజ్యసభలో వాడివేడి చర్చ జరిగింది. ఈ బిల్లును లోతుగా పరిశీలించేందుకు సెలెక్ట్ కమిటీకి పంపాలని కాంగ్రెస్ సహా విపక్షాలు డిమాండ్ చేశాయి. బిల్లుపై జరిగిన చర్చలో కాంగ్రెస్ సభ్యుడు ఆనంద్ శర్మ మాట్లాడుతూ కేంద్రం కోటా రాజకీయాలకు పాల్పడుతోందని, రిజర్వేషన్ల మూల సిద్ధాంతాన్ని పరిశీలించాలని పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ చెబుతున్న అచ్ఛేదిన్ కోసం దేశం వేచిచూస్తోందని చెప్పారు. అగ్రవర్ణాలపై బీజేపీకి ఎలాంటి ప్రేమ లేదని, కేవలం కోటా అంశాన్ని రాజకీయం చేస్తోందన్నారు. విపక్షాల అభ్యంతరం అగ్రవర్ణాల పేదలకు పది శాతం రిజర్వేషన్ కల్పించే రాజ్యాంగ సవరణ బిల్లును తొలుత సెలెక్ట్ కమిటీకి పంపాలని డీఎంకే ఎంపీ కనిమొళి తీర్మానం ప్రవేశపెట్టగా పలు విపక్ష పార్టీలు మద్దతు పలికాయి. రాజ్యసభలో సంఖ్యా బలం కలిగిన కాంగ్రెస్, ఆర్జేడీ సహా పలు ప్రాంతాయ పార్టీలు కోటా బిల్లుపై అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు ఉద్దేశించిన రిజర్వేషన్ల వ్యవస్థకు ఈ బిల్లుతో విఘాతం కలుగుతుందని ఆర్జేడీ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. న్యాయస్ధానంలో బిల్లు నిలబడదని విపక్షాలు సందేహం వ్యక్తం చేశాయి. మరోవైపు లోక్సభలో బిల్లును ఆమోదించిన విపక్షాలు రాజ్యసభలో మోకాలడ్డుతూ ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్నాయని బీజేపీ మండిపడింది. 95 శాతం మందికి ప్రయోజనం : బీజేపీ ప్రతి రాజకీయ పార్టీ జనరల్ కేటగిరిలోకి పేదలకు రిజర్వేషన్లు కల్పిస్తామని మేనిఫెస్టోల్లో చెబుతుంటే కేవలం నరేంద్ర మోదీ సర్కార్ మాత్రమే దీన్ని నెరవేర్చిందని బీజేపీ సభ్యుడు ప్రభాత్ ఝా పేర్కొన్నారు. మండల్ కమిషన్ నివేదికతో పాటు అప్పటి ప్రధాని పీవీ నరసింహారావు సైతం జనరల్ కేటగిరిలోని పేదలకు రిజర్వేషన్లు వర్తింపచేయాలని కోరుకున్నారన్నారు. ఈ బిల్లు ద్వారా 95 శాతం మందికి ప్రయోజనం చేకూరుతుందన్నారు. -
మరో 21 మంది ఎంపీలపై వేటు
సాక్షి, న్యూఢిల్లీ: సభా కార్యకలాపాలను అడ్డుకుంటున్న సభ్యులపై లోక్సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ వరుసగా రెండో రోజు కొరడా ఝుళిపించారు. బుధవారం 24 మందిని సస్పెండ్ చేసిన ఆమె..గురువారం మరో 21 మందిని నాలుగు రోజుల పాటు సస్పెండ్ చేశారు. ఈ 45 మంది ఇక ఈ సెషన్లో సభకు హాజరుకావొద్దని ఆదేశించారు. జనవరి 8న పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ముగియనున్నాయి. గురువారం సభ నుంచి ఉద్వాసనకు గురైన వారిలో 13 మంది టీడీపీ ఎంపీలు, ఏడుగురు ఏఐఏడీఎంకే సభ్యులు, వైఎస్సార్సీపీ టికెట్పై గెలిచి టీడీపీలో చేరిన సభ్యురాలు ఉన్నారు. ఇంతమంది సభ్యులపై స్పీకర్ ఒకేసారి చర్యలు తీసుకోవడం పార్లమెంట్ చరిత్రలో అసాధారణ పరిణామమని భావిస్తున్నారు. డిసెంబర్ 11న పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి కావేరి అంశంపై ఏఐఏడీఎంకే సభ్యులు తరచూ కార్యకలాపాలకు అంతరాయం కలిగిస్తున్న సంగతి తెలిసిందే. గురువారం జీరో అవర్ ప్రారంభమైన వెంటనే ఏఐఏడీఎంకే, టీడీపీ సభ్యులు వెల్లోకి దూసుకెళ్లి నినాదాలు చేశారు. ఏఐఏడీఎంకే సభ్యులు స్పీకర్ కుర్చీ వైపు కాగితాలు విసిరారు. ఆగ్రహించిన స్పీకర్..గొడవ సృష్టిస్తున్న సభ్యులపై చర్యలు తప్పవని హెచ్చరించినా పరిస్థితిలో మార్పు రాకపోవడంతో వారిని సభ నుంచి సస్పెండ్ చేశారు. రాజ్యసభ నుంచి ఏఐఏడీఎంకే వాకౌట్ కావేరి జలాల వివాదంపై మాట్లాడేందుకు అనుమతి లభించనందుకు నిరసనగా ఏఐఏడీఎంకే సభ్యులు రాజ్యసభ నుంచి వాకౌట్ చేశారు. లోక్సభలో తమ సభ్యులు సస్పెండైన అంశాన్ని ఏఐఏడీఎంకే సభ్యుడు నవనీత్ క్రిష్ణన్ లేవనెత్తగా, చైర్మన్ వెంకయ్యనాయుడు అభ్యంతరం వ్యక్తం చేశారు. లోక్సభలో సభ్యుల ప్రవర్తనను రాజ్యసభలో చర్చించలేమన్నారు. -
తమిళ ఎంపీలను బయటికి పంపిన వెంకయ్య
న్యూఢిల్లీ: కావేరి నదీ జలాల పంపణీపై రాజ్యసభలో ఆందోళనకు దిగిన ఏఐఏడీఎంకే, డీఎంకే సభ్యులను చైర్మన్ వెంకయ్యనాయుడు బయటకు పంపించారు. ఇదే అంశంపై గందరగోళం తలెత్తడంతో సభ తొలుత రెండుసార్లు, ఆ తరువాత రోజంతటికీ వాయిదా పడింది. నిబంధన 255ని అనుసరించి..తమిళనాడుకు చెందిన డజనుకుపైగా ఎంపీలు రోజంతా సభ కు దూరంగా ఉండాలని వెంకయ్య ఆదేశించారు. మధ్యాహ్నం సభ ప్రారంభం కాగానే ఏఐఏడీఎంకే సభ్యులు వెల్లోకి దూసుకెళ్లి కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వారికి డీఎంకే సభ్యులు మద్దతు పలికారు. జల వనరుల మంత్రి గడ్కరీ బదులిస్తారని పార్లమెంటరీ వ్యవహారాల సహాయ మంత్రి విజయ్ గోయల్ చెప్పినా వారు వినిపించుకోలేదు. -
చర్చకు నోచుకోని ‘ట్రిపుల్ తలాక్’
న్యూఢిల్లీ: ఊహించినట్లుగానే విపక్షాలు పట్టు విడవకపోవడంతో ట్రిపుల్ తలాక్ బిల్లుపై రాజ్యసభలో చర్చ ప్రారంభం కాలేదు. బిల్లును జాయింట్ సెలక్ట్ కమిటీకి పంపాలన్న తమ డిమాండ్ను ప్రతిపక్షాలు పునరుద్ఘాటించాయి. సోమవారం న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టారు. దీనిపై చర్చ జరగాలని ప్రభుత్వం కోరినా, విపక్షాలు సహకరించకపోవడంతో కార్యకలాపాలు జరగకుండానే సభ వాయిదా పడింది. అంతకుముందు కావేరి నదీ జలాల పంపిణీ వివాదంపై ఏఐఏడీఎంకే ఎంపీలు నిరసనకు దిగడంతో సభ వాయిదా పడింది. ట్రిపుల్ తలాక్ బిల్లును ప్రవేశపెట్టాక మరో 15 నిమిషాలు అంతరాయం ఏర్పడింది. తర్వాతా పరిస్థితి మారకపోవడంతో డిప్యూటీ చైర్మన్ హరివంశ్ సభను బుధవారానికి వాయిదా వేశారు. తక్షణ ట్రిపుల్ తలాక్ను నేరంగా పరిగణిస్తూ రూపొందించిన తాజా బిల్లు గురువారం లోక్సభలో ఆమోదం పొందింది. సంప్రదాయాన్ని ఉల్లంఘిస్తున్న కేంద్రం రాజ్యసభలో కాంగ్రెస్ పక్ష నేత గులాం నబీ ఆజాద్ మాట్లాడుతూ..బిల్లు తాజా రూపం చాలా క్రూరంగా ఉందని, దాన్ని మరింత అధ్యయనం చేసేందుకు జాయింట్ సెలక్ట్ కమిటీకి పంపాలని సగం కన్నా ఎక్కువ మంది ఎంపీలు డిమాండ్ చేస్తున్నారని అన్నారు. ఏదైనా బిల్లును చట్టం చేసే ముందు జాయింట్ సెలక్ట్ కమిటీకి పంపాలన్న సంప్రదాయాన్ని ప్రభుత్వం ఉల్లంఘిస్తోందని ఆరోపించారు. పార్లమెంటరీ వ్యవహారాల సహాయ మంత్రి విజయ్ గోయల్ స్పందిస్తూ.. బిల్లుపై చర్చకు ప్రభుత్వం సిద్ధమేనని, అది ఆమోదం పొందడంలో కాంగ్రెస్ అడ్డంకులు సృష్టిస్తోందని ఆరోపించారు. ప్రభుత్వమే ట్రిపుల్ తలాక్ బిల్లుపై రాజకీయాలు చేస్తోందని మరో కాంగ్రెస్ నాయకుడు ఆనంద్ శర్మ తిప్పికొట్టారు. ఆర్డినెన్స్ తెచ్చినా కూడా ఈరోజు వరకు ట్రిపుల్ తలాక్ కేసులు నమోదయ్యాయని, లింగ సమానత్వంతో ముడిపడిన ఈ బిల్లుపై చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని న్యాయ మంత్రి రవిశంకర్ అన్నారు. రఫేల్పై చర్చకు సిద్ధం: ఖర్గే రఫేల్ ఒప్పందంపై లోక్సభలో చర్చకు రావాలన్న కేంద్ర ప్రభుత్వ సవాలును కాంగ్రెస్ స్వీకరించింది. జనవరి 2న చర్చలో పాల్గొంటామని, సమయాన్ని నిర్ణయించాలని లోక్సభలో కాంగ్రెస్ పక్ష నేత మల్లికార్జున ఖర్గే స్పీకర్ సుమిత్రా మహాజన్ను కోరారు. రఫేల్ ఒప్పందంపై సంయుక్త పార్లమెంట్ కమిటీతో విచారణ జరిపించాలని పునరుద్ఘాటించారు. దీనికి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ స్పందిస్తూ..ఈ అంశంపై ఖర్గే చర్చను ప్రారంభించాలని, బదులిచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. కానీ ఖర్గే చర్చ నుంచి పారిపోతున్నారని అన్నారు. కొత్త ఏడాది నుంచి వెల్లోకి రాకండి కొత్త ఏడాది నుంచైనా సభ్యులు నిబంధనల మేరకు నడుచుకోవాలని, వెల్లోకి దూసుకురావద్దని లోక్సభ స్పీకర్ సుమిత్ర విజ్ఞప్తి చేశారు. రఫేల్పై కాంగ్రెస్, కావేరిపై ఏఐఏడీఎంకే సభ్యులు ఆందోళనకు దిగిన సమయంలో ఆమె స్పందిస్తూ..వారంతా తన కోసమైనా మీమీ స్థానాల్లోకి వెళ్లాలన్నారు. ఆమె మాటను గౌరవిస్తూ రెండు పార్టీల సభ్యులు వెనక్కువెళ్లారు. ‘ ఈ ఏడాదిలో ఇదే ఆఖరి రోజు. మీరు వెల్లోకి వచ్చిన ఆఖరి రోజు కూడా ఇదే కావాలని కోరుకుంటున్నా’ అని సుమిత్రా అన్న మాటల్ని సభ్యులంతా ఓపికగా వినడం గమనార్హం. -
జనవరి నుంచి విశాఖ-యశ్వంతపుర వీక్లీ రైలు
ఢిల్లీ: విశాఖపట్నం-యశ్వంతపుర వీక్లీ స్పెషల్ రైలు సర్వీసును జనవరి నుంచి ఏప్రిల్ 2019 వరకు పునఃప్రారంభించాలని రైల్వే మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. ఈ వీక్లీ స్పెషల్ రైలుకు విపరీతమైన రద్దీ ఉన్న విషయం వాస్తవమేనా? అలాంటప్పుడు ఈ సర్వీసును గతంలో రైల్వే నిలిపివేయడానికి కారణాలేంటి? అంటూ శుక్రవారం రాజ్యసభలో వైఎస్సార్సీపీ ఎంపీ వి.విజయసాయి రెడ్డి ప్రశ్న లేవనెత్తారు. ఈ ప్రశ్నకు రైల్వే మంత్రి పీయూష్ గోయల్ జవాబిస్తూ ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని వారి సౌకర్యం కోసమే ప్రత్యేక రైళ్లు నడపడం రైల్వే విధానమని చెప్పారు. నిలిపేసిన విశాఖపట్నం- యశ్వంతపురా స్పెషల్ ట్రైన్ను తిరిగి జనవరి నుంచి ఏప్రిల్ వరకు పునరుద్ధరించాలని కూడా నిర్ణయించినట్లు ఆయన వెల్లడించారు. నిర్వహణా సాధ్యాసాధ్యాలు, ప్రయాణీకుల రద్దీ, వనరుల అందుబాటు వంటి అంశాల ప్రాతిపదిక ఆధారంగా సెలవుల సీజన్, ప్రత్యేక కార్యక్రమాలు ఉన్నప్పుడు మాత్రమే రైల్వే ప్రత్యేకంగా ట్రైన్లను నడుపుతుందని వివరించారు. విశాఖపట్నం-యశ్వంతపుర సెక్టర్లో ఇప్పటికే అందుబాటులో ఉన్న 16 జతల రైలు సర్వీసులకు అదనంగా రద్దీని నివారించేందుకు విశాఖ-యశ్వంతపుర స్పెషల్ రైలును నడపడం జరుగుతుందని మంత్రి చెప్పారు. -
‘ఏపీలో పెరిగిన అత్యాచారాలు’
ఢిల్లీ: ఏపీలో మహిళలపై అత్యాచారాలు స్వల్పంగా పెరిగాయని, రాజ్యసభలో వైఎస్సార్సీపీ ఎంపీ వి.విజయసాయి రెడ్డి ప్రశ్నకు హోం మంత్రి జవాబిచ్చారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందించిన సమాచారం ప్రకారం రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అత్యాచార ఘటనలలో స్వల్ప పెరుగుదల ఉన్నట్లు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి హన్సరాజ్ అహిర్ వెల్లడించారు. బుధవారం రాజ్యసభలో విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు రాతపూర్వకంగా జవాబిస్తూ ఈ విషయం తెలిపారు. నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో(ఎన్సీఆర్బీ) తాజా సమాచారం ప్రకారం 2015తో పోల్చుకుంటే 2016లో ఆంధ్రప్రదేశ్లో మహిళలపై రేప్లు, అత్యాచారాలు, దాడులు పెరిగిన విషయం వాస్తవమేనా? వీటికి కారణాలేమిటి? నివారణ కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఏమిటి? అంటూ విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం చెప్పారు. ఎన్సీఆర్బీ సమాచారం ప్రకారం 2015తో పోల్చుకుంటే 2016లో ఆంధ్రప్రదేశ్లో రేప్ కేసులు, అలాగే మహిళా హత్యలు తగ్గాయని అయితే మొత్తంగా చూస్తే మహిళల పట్ల జరుగుతున్న అత్యాచారాల సంఖ్య మాత్రం స్వల్పంగా పెరిగింది. మొత్తం మీద రేప్లు, హత్యలు, అత్యాచాల ఘటనలు పరిగణలోకి తీసుకుంటే 2015లో రాష్ట్రంలో 6071 కేసులు నమోదైతే 2016లో వాటి సంఖ్య 6234కు పెరిగినట్లు మంత్రి తెలిపారు. మహిళలపై జరిగే నేరాలను అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం మహిళా రక్షక్, మహిళా మిత్రా, ఐ-క్లిక్, అభయం, డయల్ 100, కారవాన్, సాక్షి, శక్తి వంటి కార్యక్రమాల ద్వారా చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి చెప్పారు. దేశవ్యాప్తంగా లైంగిక నేరాలకు పాల్పడే వ్యక్తుల సమాచారంతో డేటాబేస్ను రూపొందించి 112 హెల్ప్ లైన్ నంబర్ ద్వారా 24 గంటలూ పనిచేసే ఎమర్జెన్సీ రెస్పాన్స్ విధానాన్ని ప్రవేశపెట్టడానికి కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నట్లు మంత్రి వివరించారు. -
ఎన్డీఏ అభ్యర్థికే సేన మద్దతు
సాక్షి, న్యూఢిల్లీ : రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పదవికి ఈనెల 9న జరిగే ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థికి మద్దతిస్తామని శివసేన బుధవారం ప్రకటించింది. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ అభ్యర్థిగా జేడీ(యూ)కు చెందిన హరివంశ్ నారాయణ్ సింగ్ను ఎన్డీఏ బరిలో నిలిపింది.కాగా ఎన్డీఏ అభ్యర్థికే తాము మద్దతిస్తామని శివసేన ఎంపీ అనిల్ దేశాయ్ స్పష్టం చేశారు. మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గత నెలలో విపక్షం లోక్సభలో ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్కు శివసేన దూరంగా ఉన్న విషయం తెలిసిందే. గత కొన్నేళ్లుగా బీజేపీపై పలు సందర్భాల్లో అంశాల ప్రాతిపదికన విరుచుకుపడుతున్న శివసేన రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్ధికి మద్దతిస్తామని ప్రకటించడంతో బీజేపీ వర్గాలు ఊపిరిపీల్చుకున్నాయి. మరోవైపు రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ విపక్ష అభ్యర్ధిగా కాంగ్రెస్కు చెందిన బీకే హరిప్రసాద్ రంగంలో నిలిచారు. వీరిరువురూ నామినేషన్ పత్రాలను అధికారులకు సమర్పించారు. ఎన్డీఏ అభ్యర్థి హరివంశ్ను ఏకగ్రీవంగా ఎన్నుకునేందుకు కాంగ్రెస్ సహా ఇతర పార్టీలతో ఎన్డీఏ సంప్రదింపులు జరుపుతోంది. -
అసోం నూతన పౌరసత్వ జాబితాపై అపోహలొద్దు..
-
ఆ జాబితాపై అపోహలొద్దు..
సాక్షి,న్యూఢిల్లీ : అసోం నూతన పౌరసత్వ జాబితా (ఎన్ఆర్సీ)లో 40 లక్షల మంది లేకపోవడంపై వివాదం నెలకొన్న నేపథ్యంలో హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ స్పందించారు. ఇది కేవలం ముసాయిదా జాబితా మాత్రమేనని, ఏ ఒక్క పౌరుడి పట్ల వివక్ష చూపే ప్రసక్తే లేదని, అనవసర వేధింపులు ఉండవని రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. జాతీయ పౌరసత్వ జాబితా నిజాయితీ, పారదర్శకతతో కూడిన ప్రక్రియ అన్నారు. సుప్రీం కోర్టు రూపొందించిన మార్గదర్శకాలకు అనుగుణంగానే తాము చర్యలు చేపడుతున్నామని మంత్రి శుక్రవారం రాజ్యసభలో చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. ఏ ఒక్క భారతీయుడని తాము విస్మరించమని తాను హామీ ఇస్తున్నానని, ఈ జాబితాపై ఎలాంటి భయాందోళనలు అవసరం లేదని స్పష్టం చేశారు. అసోంలో జాతీయ పౌరసత్వ జాబితాలో చోటు దక్కని వారిపై ఎలాంటి తీవ్ర చర్యలు ఉండవని తేల్చిచెప్పారు. ఎన్ఆర్సీ తుది జాబితాలో పేరు లేని వారు విదేశీ ట్రిబ్యునల్ను ఆశ్రయించవచ్చని పేర్కొన్నారు. కొందరు ఉద్దేశపూర్వకంగా భయాందోళనలు రేకేత్తించి, మత సామరస్యాన్ని దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఎన్ఆర్సీ జాబితాపై తృణమూల్ అధినేత్రి, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తీవ్రస్ధాయిలో మండిపడుతున్న విషయం తెలిసిందే. ఈ జాబితాలో 40 లక్షల మంది పేర్లు లేకపోవడంపై ఆమె అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. -
పదేళ్ల తర్వాత మహిళ అధ్యక్షతన రాజ్యసభ
న్యూఢిల్లీ: రాజ్యసభకు గత పదేళ్లలో తొలిసారి ఓ మహిళ అధ్యక్షత వహించారు. తొలిసారి ఎంపీగా సభలో కాలుపెట్టిన వ్యక్తి కావడం అధ్యక్షతవహించడం విశేషం. తొలిసారి సభ్యురాలైన జేడీయూ ఎంపీ కహక్శాన్ పర్వీన్ గురువారం ప్రశ్నోత్తరాల సందర్భంగా సభను నడిపించారు. జీరో అవర్ తర్వాత సభా కార్యక్రమాలను పర్వీన్ నడిపిస్తారంటూ రాజ్యసభ చైర్మన్ వెంకయ్య చెప్పారు. సభ ప్రారంభం కాగానే పర్వీన్ అధ్యక్ష స్థానంలో కూర్చున్నారు. దీంతో సభ్యులంతా బల్లలు చరిచి అభినందించారు. తర్వాత వెంకయ్య పర్వీన్ను ‘బాధ్యతను సమర్థవంతంగా నిర్వహించారం’టూ అభినందించారు. కొందరు మహిళా సభ్యులు మార్చి 8 (మహిళా దినోత్సవం సందర్భంగా)న చేసిన డిమాండ్ ఆధారంగా వెంకయ్య పర్వీన్ను వైస్ చైర్పర్సన్గా నియమించారు. వైస్ చైర్పర్సన్స్ ప్యానెల్లో పర్వీన్ ఏకైక మహిళా అభ్యర్థి. -
అట్టుడికిన పెద్దలసభ.. వెంకయ్య ఆగ్రహం
సాక్షి, న్యూఢిల్లీ: పెద్దల సభలో అసోం ఎన్ఆర్సీ అంశంపై చర్చ అట్టుడికిపోయేలా చేసింది. రాజ్యసభ సభ్యుడు అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ భగ్గుమంది. ‘అసలు ఎన్ఆర్సీని తీసుకొచ్చిందే కాంగ్రెస్’ అంటూ షా పేర్కొనటంతో సభలో గందరగోళం నెలకొంది. ఒకానోక దశలో సహనం కోల్పోయిన చైర్మన్ వెంకయ్య నాయుడు సభ్యులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఎన్ఆర్సీ మేం తీసుకొచ్చిన కార్యక్రమం కాదు. 1985లో రాజీవ్ గాంధీ అసోం ఒప్పందంపై సంతకం చేశారు. నాడు అమలు చేయడానికి వాళ్లు ధైర్యం చేయలేదు. నేడు మేం ధైర్యంగా ముందుకొచ్చాం. దీనిపై విపక్షాలు చేస్తున్న రాద్ధాంతం అర్థం లేనిది’ అంటూ అమిత్ షా ప్రసంగించారు. ఆ వ్యాఖ్యలపై విపక్షాలు భగ్గుమన్నాయి. కాంగ్రెస్తోపాటు ఇతర పక్షాల సభ్యులు కూడా స్పీకర్ పోడియంలోకి దూసుకొచ్చారు. నిరసనలు, గందరగోళం నడుమ పెద్దల సభను చైర్మన్ వెంకయ్య నాయుడు వాయిదా వేశారు. వెంకయ్య ఆగ్రహం.. ఇదిలా ఉంటే సభలో నేడు జరిగిన పరిణామాలపై వెంకయ్య నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ సభ్యుల తీరుపై అసంతృప్తిని వెల్లగక్కిన ఆయన.. కాంగ్రెస్ సీనియర్ నేత గులాంనబీ ఆజాద్ను తన ఛాంబర్లోకి పిలిపించుకుని మాట్లాడారు. ఇదిలా ఉంటే పార్లమెంట్ ఆవరణలో సైతం బీజేపీ-కాంగ్రెస్ సభ్యుల మధ్య వాగ్వాదం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. కేంద్ర మంత్రి అశ్విన్ దుబే, కాంగ్రెస్ ఎంపీ ప్రదీప్ ఇద్దరూ మీడియా ముందే ఇష్టానురీతిలో దూషించుకున్నారు. సుప్రీం కీలక ఆదేశాలు... మరోవైపు ఎన్ఆర్సీ డ్రాఫ్ట్పై సుప్రీం కోర్టు మంగళవారం కీలక ఆదేశాలు చేసింది. ‘ప్రస్తుతం రూపొందించింది డ్రాఫ్ట్ మాత్రమే. ఎవరిపై ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వానికి హక్కు లేదు. ఈ విషయంలో కేంద్రం కూడా చొరవ చూపాలి. స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రోసీడర్(ఎస్ఓపీ)ని ఏర్పాటు చేసి అభ్యంతరాలపై చర్చించాలి. ఆగష్టు 16లోపు ఎస్ఓపీ వివరాలను ధృవీకరణ కోసం బెంచ్ ముందు ఉంచాలి’ అని జస్టిస్ రంజన్ గగోయ్ పేర్కొన్నారు. సున్నితమైన అంశం కావటంతో శాంతి భద్రతలు దెబ్బ తినకుండా ముందుకెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వాలకు ధర్మాసనం సూచించింది. -
బీజేపీతో చర్చించే హోదా హామీ : మన్మోహన్
సాక్షి, న్యూఢిల్లీ : ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామన్న యూపీఏ హామీని ప్రస్తుత ప్రభుత్వం నెరవేరుస్తుందని ఆశించానని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పేర్కొన్నారు. బీజేపీ నేతలతో సంప్రదించిన అనంతరం ఏపీకి యూపీఏ ప్రభుత్వం ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చిందని గుర్తుచేశారు. ఏపీ విభజన హామీలపై మంగళవారం రాజ్యసభలో జరిగిన చర్చలో మన్మోహన్ సింగ్ మాట్లాడుతూ భారత ప్రధానిగా 2014లో ఏపీ పునర్వ్యవస్థీకరణ బిల్లులో తమ ప్రభుత్వం ఇచ్చిన హామీలపై చర్చ జరుగుతున్నదని అన్నారు. ప్రధాని హోదాలో ఏపీకి ప్రత్యేక హోదాను నిండు సభలో తాను హామీ ఇచ్చానని చెప్పారు. అప్పటి విపక్ష నేత అరుణ్ జైట్లీ సహా పలువురు సీనియర్ బీజేపీ నేతలతో చర్చించిన అనంతరం తాను ప్రత్యేక హోదా హామీ ఇచ్చానని అన్నారు. సభలో ఇచ్చిన హామీలను ప్రభుత్వం గౌరవించాల్సిన అవసరం ఉందన్నారు. -
ప్రత్యేక హోదా సంజీవని కాదన్నది చంద్రబాబే
-
హోదా సంజీవని కాదన్నది చంద్రబాబే : రాజ్నాథ్
సాక్షి, న్యూఢిల్లీ : ప్రత్యేక హోదా సంజీవని కాదన్నది చంద్రబాబేనని కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. ప్రత్యేక ప్యాకేజీని చంద్రబాబు, సుజనా చౌదరి స్వాగతించారని, అసెంబ్లీలో ధన్యవాద తీర్మానం చేశారని గుర్తు చేశారు. ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలకు ఇచ్చే నిధులతో సమానంగా ఏపీకి నిధులు మంజూరు చేస్తున్నామని, దీనికి ముఖ్యమంత్రి కూడా అంగీకారం తెలిపారన్నారు. ప్రత్యేక హోదాకు 14వ ఆర్థిక సంఘం సిఫార్సులు వ్యతిరేకంగా ఉన్నాయని చెప్పారు. ఏపీ విభజన హామీలపై మంగళవారం రాజ్యసభలో జరిగిన స్వల్పకాలిక చర్చకు హోంమంత్రి బదులిచ్చారు. ఏపీకి విభజన చట్టంలో ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామన్నారు. బిల్లులో పేర్కొన్న హామీల్లో 90 శాతం హామీలను ఇప్పటికే నెరవేర్చామన్నారు. రైల్వే జోన్పై ప్రతికూలంగా నివేదిక వచ్చినా జోన్ను ఏర్పాటు చేస్తామన్నారు. పోలవరం ప్రాజెక్టును తామే కడతామని ఏపీ సర్కార్ కోరితే అంగీకరించామని, పోలవరానికి ఇప్పటివరకూ రూ 6754 కోట్లు మంజూరు చేశామన్నారు. రికార్డు సమయంలో పోలవరం ప్రాజెక్టు పూర్తిచేస్తామన్నారు. తొలి కేబినెట్ భేటీలోనే 7 ముంపు మండలాలను ఏపీలో కలిపామన్నారు. ఈ క్రమంలో రాష్ట్రానికి హోదా ఇస్తారా లేదా స్పష్టం చేయాలని కాంగ్రెస్ నేతలు జైరాం రమేష్, గులాం నబీ ఆజాద్ నిలదీశారు. 14వ ఆర్థిక సంఘం పేరుతో హోదా నిరాకరించడం సరైందికాదని విమర్శించారు.మరోవైపు టీడీపీ ఎంపీ సుజనా చౌదరిపై రాజ్నాథ్ సెటైర్లు వేశారు. చర్చలో తాము చెబుతున్న అంశాలపై సుజనా చౌదరి మారుమాట్లాడలేక తలదించుకున్నారని ఎద్దేవా చేశారు. -
వెల్లో విజయసాయిరెడ్డి నిరసన
సాక్షి, న్యూఢిల్లీ : ఏపీ విభజన హామీలపై మంగళవారం రాజ్యసభలో జరిగిన చర్చలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి సరైన సమయం ఇవ్వలేదని పార్టీ ఎంపీ వి. విజయసాయి రెడ్డి వెల్లోకి వెళ్లి నిరసన తెలిపారు. తమకు అతితక్కువ సమయం కేటాయించడం పట్ల చైర్మన్ తీరును నిరసిస్తూ సభ నుంచి వాకౌట్ చేశారు. రాష్ట్రానికి సంబంధించి కీలక అంశంపై తమకు అతితక్కువ సమయం కేటాయించడంపై మండిపడ్డారు. అంతకుముందు ఏపీకి ప్రత్యేక హోదా ఎంత అవసరమనే అంశంతో పాటు పూర్వాపరాలను వివరించే క్రమంలోనే కేటాయించిన సమయం అయిపోయిందని, ప్రసంగం ముగించాలని రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు విజయసాయి రెడ్డిపై ఒత్తిడి చేశారు. కీలక అంశంపై తనకు మరింత సమయం ఇవ్వాలని, కనీసం 15 నిమిషాలు మాట్లాడేందుకు అనుమతించాలని విజయసాయి రెడ్డి కోరారు. టీడీపీకి 27 నిమిషాలు సమయం ఇచ్చారని తనకు మరింత సమయం ఇవ్వాలని కోరినా వెంకయ్యనాయుడు నిరాకరించారు. -
టీడీపీ, బీజేపీలే ముద్దాయిలు : విజయసాయిరెడ్డి
సాక్షి, న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గత నాలుగేళ్లుగా పోరాడుతోందని రాజ్యసభ సభ్యుడు, పార్టీ పార్లమెంటరీ నేత వీ విజయసాయి రెడ్డి స్పష్టం చేశారు. హోదా రాష్ట్రానికి సంజీవని అని వైఎస్సార్ సీపీ నమ్ముతోందని, హోదా సంజీవని కాదని టీడీపీ బాహాటంగా చెప్పిందని అన్నారు. రాష్ట్రానికి హోదా సంజీవని అని వైఎస్సార్ సీపీ, జనసేన, వామపక్షాలు బలంగా నమ్ముతున్నాయన్నారు. ఏపీ విభజన చట్టంపై రాజ్యసభలో మంగళవారం జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ ఏపీకి హోదా రాకపోవడానికి తొలి ముద్దాయి బీజేపీ, రెండో ముద్దాయి టీడీపీ, మూడో ముద్దాయి కాంగ్రెస్ అని వ్యాఖ్యానించారు. హోదా నిందితులను 2019 ఎన్నికల్లో ఏపీ ప్రజలు తగు రీతిలో శిక్షిస్తారని హెచ్చరించారు. 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చేనాటికే కేబినెట్ తీర్మానం అమల్లో ఉందని, గత ప్రభుత్వ తీర్మానాన్ని రద్దు చేసే అధికారం బీజేపీ ప్రభుత్వానికి ఎవరిచ్చారని ప్రశ్నించారు. ఏ పార్టీ అధికారంలో ఉన్నా గత ప్రభుత్వ నిర్ణయాలను గౌరవించాలన్నారు. 14వ ఆర్థిక సంఘం పేరుతో బీజేపీ ప్రభుత్వం ఏపీకి హోదా ఇవ్వకపోవడం సరైంది కాదన్నారు. ప్రసంగం పూర్తికాకుండానే.. ఏపీకి ప్రత్యేక హోదా ఎంత అవసరమనే అంశంతో పాటు పూర్వాపరాలను వివరించే క్రమంలోనే కేటాయించిన సమయం అయిపోయిందని, ప్రసంగం ముగించాలని రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు ఒత్తిడి చేశారు. కీలక అంశంపై తనకు మరింత సమయం ఇవ్వాలని, కనీసం 15 నిమిషాలు మాట్లాడేందుకు అనుమతించాలని విజయసాయిరెడ్డి కోరారు. టీడీపీకి 27 నిమిషాలు సమయం ఇచ్చారని తనకు మరింత సమయం ఇవ్వాలని కోరినా వెంకయ్యనాయుడు నిరాకరించారు. -
రాజ్యసభ డిప్యూటీ చైర్మన్గా టీఆర్ఎస్ ఎంపీ?
-
ఎంపీ ల్యాడ్స్ కమిటీలో సంతోష్ కుమార్
సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంటు సభ్యుల స్థానిక ప్రాంత అభివృద్ధి (ఎంపీల్యాడ్) పథకం అమలును పర్యవేక్షించే రాజ్యసభ ఎంపీ ల్యాడ్స్ కమిటీలో టీఆర్ఎస్ ఎంపీ జోగినిపల్లి సంతోష్కుమార్కు చోటు దక్కింది. ఈ మేరకు రాజ్యసభ చైర్మన్ ఎం.వెంకయ్యనాయుడు ఎంపీ ల్యాడ్స్ కమిటీని పునర్ వ్యవస్థీకరిస్తూ నిర్ణయం తీసుకున్నట్టు రాజ్యసభ సచివాలయం వెల్లడించింది. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఈ కమిటీకి చైర్మన్గా వ్యవహరిస్తారు. 12 మంది సభ్యులు ఉన్న ఈ కమిటీలో ఏపీ నుంచి టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ కూడా ఉన్నారు. ఎంపీ ల్యాడ్ పథకం కింద అభివృద్ధి పనులు వేగంగా సాగేం దుకు ఈ కమిటీ చర్యలు తీసుకుంటుంది. -
ముందస్తు ప్రచారం నిబంధనలకు విరుద్ధం
న్యూఢిల్లీ: రాజ్యసభాధ్యక్షుడికి అందజేసిన నోటీసులోని విషయాలకు ముందస్తు ప్రచారం ఇవ్వడం నిబంధనల ఉల్లంఘనే అవుతుందని పార్లమెంట్ అధికారులు తెలిపారు. ప్రతిపక్షాలు సీజేఐ జస్టిస్ మిశ్రాపై పలు ఆరోపణలు చేస్తూ అభిశంసన తీర్మానం నోటీసులను రాజ్యసభాధ్యక్షుడు వెంకయ్యకి అందజేయడం తెల్సిందే. ఈ నోటీసులోని వివరాలన్నీ శనివారం మీడియాలో రావటంపై అధికారులు స్పందించారు. సభలో ప్రస్తావించదలచిన నోటీసు చైర్మన్ అంగీకారం పొంది, దాని ప్రతులను సభ్యులకు పంపిణీ చేసేవరకు ఎవరూ దానిని వెల్లడి చేయరాదని పార్లమెంటరీ విధివిధానాలు చెబుతున్నాయన్నారు. -
ఏపీలో భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం గాలికి
సాక్షి, న్యూఢిల్లీ : ఆంధ్ర ప్రదేశ్లో భవన నిర్మాణ కార్మికుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు నామమాత్రమేనని కార్మిక శాఖ మంత్రి సంతోష్ కుమార్ గంగ్వార్ వెల్లడించారు. రాజ్య సభలో బుధవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ, భవన నిర్మాణ కార్మికుల సంక్షేమానికి ఉద్దేశించిన పథకాలు చాలా మందికి దక్కడం లేదని చెప్పారు. ఈ కారణంగానే కార్మికుల రిజిస్ట్రేషన్ కూడా చెప్పుకొదగ్గంతగా లేదు. ఫలితంగా వారి సంక్షేమం కోసం శిస్తు రూపంలో వసూలు చేసిన వందలాది కోట్ల రూపాయల నిధులు ఖర్చు చేయకుండా మిగిలిపోతున్నట్లుగా మంత్రి చెప్పారు. భవన ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ శిస్తు చట్టం కింద ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం 1543 కోట్ల రూపాయలు వసూలు కాగా 2017 డిసెంబర్ 3 నాటికి కేవలం 412 కోట్ల రూపాయలను మాత్రమే కార్మికుల సంక్షేమానికి ఖర్చు చేసిందని గంగ్వార్ వెల్లడించారు. భవన నిర్మాణ రంగంతోపాటు ఇతర నిర్మాణ రంగాల్లో పని చేస్తున్న కార్మికుల రిజిస్ట్రేషన్ ప్రక్రియను వేగవంతం చేసి, వారందరినీ సంక్షేమ పథకాల పరిధిలోకి తీసుకురావలంటూ కార్మిక మంత్రిత్వ శాఖ పదే పదే ఆంధ్రప్రదేశ్తో సహా ఇతర రాష్ట్రాలకు ఆదేశాలిస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఆయా రాష్ట్రాలలోని బిల్డింగ్ ఇతర నిర్మాణ రంగ కార్మికుల సంక్షేమ బోర్డులు కార్మికుల సంక్షేమం కోసం అమలు చేస్తున్న పథకాలను తమ మంత్రిత్వ శాఖ జారీ చేసే ఆదేశాలకు అనుగుణంగా పని చేస్తున్నవో లేదో పర్యవేక్షించడానికి కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ కార్యదర్శి అధ్యక్షతన ఒక మోనిటరింగ్ కమిటీని కూడా కేంద్ర ప్రభుత్వం నియమించినట్లు మంత్రి తెలిపారు. ఈ-కామర్స్తో స్టోర్స్కు ముప్పు లేదు ఆన్లైన్ మార్కెటింగ్ సైట్లతో బ్రిక్ అండ్ మోర్టార్ స్టోర్లకు వచ్చిన ముప్పేమీ లేదని వాణిజ్య శాఖ సహాయ మంత్రి సీఆర్ చౌధరి చెప్పారు. ఈ-కామర్స్ డిస్కౌంట్ రేట్లకు జరుపుతున్న విక్రయాలు స్టోర్స్ అమ్మకాలను ప్రభావితం చేస్తున్న అంశం నీతి ఆయోగ్, ఆర్థిక మంత్రిత్వ శాఖ, వాణిజ్య మంత్రిత్వ శాఖల మధ్య భిన్నాభిప్రాయలకు దారితీస్తోందా అంటూ బుధవారం రాజ్య సభలో విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ, ఆర్థిక రంగం పురోగమించాలన్న ఏకైక లక్ష్యంతోనే ప్రభుత్వ విభాగాలన్నీ సమన్వయంతో పని చేస్తుంటాయని అన్నారు. అమలులో ఉన్న నియమ నిబంధనలు, నియంత్రణలకు లోబడే ఆన్లైన్ మార్కెటింగ్ సైట్లు, బ్రిక్ అండ్ మోర్టార్ స్టోర్లు తమ బిజినెస్ మోడల్స్ను రూపొందించుకుంటాయని ఆయన చెప్పారు. అయితే ఈ-కామర్స్ సైట్లు తమ సైట్ ద్వారా విక్రయించే వస్తువులు లేదా సేవలకు సంబంధించిన ధరలను ప్రత్యక్షంగాను లేదా పరోక్షంగాను ప్రభావితం చేయకూడదని మంత్రి చెప్పారు. దీని వలన ఆన్లైన్ సైట్లకు స్టోర్ బిజినెస్ మధ్య లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఏర్పడుతుందని అన్నారు -
నిమిషాల్లోనే.. గందరగోళం.. వాయిదా!
సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న తీరు ఏమాత్రం మారడం లేదు. ఇరుసభల్లోనూ వాయిదాల పర్వం యథేచ్ఛగా కొనసాగుతోంది. సభలు ప్రారంభమైన క్షణాల్లోనే వాయిదా పడుతుండటం గమనార్హం. దీంతో పలు విపక్ష పార్టీలు సభలో తమ గొంతు వినాలని ఎంతగా అభ్యర్థించినా.. పట్టించుకునే పరిస్థితి లేకుండా పోతోంది. ముఖ్యంగా విభజన హామీల అమలు విషయంలో ఆంధ్రప్రదేశ్కు జరిగిన తీరని అన్యాయంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు పార్లమెంటు లోపల, బయటా పోరాడుతున్న సంగతి తెలిసిందే. ప్రత్యేక హోదా విషయంలో కేంద్రం అన్యాయాన్ని తప్పుబడుతూ.. వైఎస్ఆర్సీపీ లోక్సభలో అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. ఈ అవిశ్వాసానికి పలు విపక్ష పార్టీలు మద్దతు తెలిపినా.. సభ ఆర్డర్లో లేకపోవడంతో వరుసగా వాయిదా పడుతూ వచ్చింది. బుధవారం కూడా లోక్సభ నిమిషాలలోపే వాయిదా పడింది. దీంతో అవిశ్వాసంపై చర్చకు వీలులేకుండా పోయింది. అటు రాజ్యసభలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. పెద్దలసభ బుధవారం అలా ప్రారంభమై.. అలా నిమిషాల్లో గురువారానికి వాయిదా పడింది. సభ ప్రారంభం కాగానే.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్, టీడీపీ ఎంపీలు పోడియం వద్దకు వెళ్లి ఆందోళన నిర్వహించారు. ప్రత్యేక హోదా ఏపీ ప్రజల హక్కు అంటూ నినదించారు. దీంతో చైర్మన్ వెంకయ్యనాయుడు సభను రేపటికి వాయిదా వేశారు. ఎలాంటి కార్యకలాపాలు సాగకుండానే పెద్దలసభ వాయిదాపడటంపై ప్రతిపక్ష సభ్యులు మండిపడుతున్నారు. సభను ఆర్డర్లోకి తీసుకొచ్చి.. సజావుగా నడిపించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుందని గుర్తుచేస్తున్నారు. అధికారపక్షం చొరవ తీసుకొని.. ఆందోళన చేస్తున్న ప్రతిపక్ష సభ్యులను సముదాయించి.. సభను సజావుగా నడిపించాల్సి ఉంటుందని, కానీ అధికారపక్షం నుంచి అలాంటి చొరవ కనిపించడం లేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. -
యూపీ రాజ్యసభ సీట్లపై అమిత్షా కొత్త వ్యూహం?
-
నా మాటలకు పశ్చాత్తాపం వ్యక్తం చేస్తున్నా..
-
నేను ఆ మాటలు అనకుండా ఉండాల్సింది..
సాక్షి, న్యూఢిల్లీ : రాజ్యసభ సభ్యురాలు, సమాజ్వాది పార్టీ నేత జయా బచ్చన్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ నేత నరేశ్ అగర్వాల్ పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలతో బాధపెట్టినందుకు విచారం వ్యక్తం చేస్తున్నానని అన్నారు. సినిమాల్లో డ్యాన్స్లు చేసే వారితో తనకు పోలికా అంటూ జయా బచ్చన్పై నరేశ్ అగర్వాల్ అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ మాటలు బీజేపీని తీవ్ర ఇరకాటంలో పెట్టాయి. కేంద్ర మంత్రులు సుష్మాస్వరాజ్, స్మృతి ఇరానీ కూడా తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మొన్నటి వరకు సమాజ్ వాది పార్టీలో ఉన్న నరేశ్ అగర్వాల్ తాజాగా బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. ఆ సందర్భంగా మాట్లాడుతూ తనను సినిమా వాళ్లతో, డ్యాన్సులు చేసేవారితో పోల్చేస్థాయికి సమాజ్ వాది పార్టీ తనను దిగజార్చిందని అన్నారు. జయా వల్లనే తనకు ఎస్పీ రాజ్యసభ సీటు ఇవ్వలేదని పరోక్షంగా వ్యాఖ్యానించారు. అయితే, ఈ మాటలకు తమకు సంబంధం లేదని బీజేపీ దూరం జరిగింది. కేంద్ర మంత్రులు సుష్మా, స్మృతి కూడా ఆయన వ్యాఖ్యలు ఖండించిన నేపథ్యంలో 'నా వ్యాఖ్యలతో ఎవరైనా బాధపడి ఉంటే అందుకు పశ్చాత్తాపం వ్యక్తం చేస్తున్నాను' అని ఆయన అన్నారు. అయితే, మీరు చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెబుతున్నట్లే అని తాము అనుకోవచ్చా అని మీడియా ప్రతినిధి ప్రశ్నించగా.. రిగ్రీట్ అంటే ఏమిటో నీకు అర్ధమవుతుందా అంటూ ఎదురు ప్రశ్నించారు. -
12 వరకు రాజ్యసభ నామినేషన్ల గడువు
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో ఖాళీగా ఉన్న మూడు రాజ్యసభ సీట్లకు ఎన్నికల నోటిఫికేషన్ను కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం విడుదల చేసింది. నామినేషన్ల దాఖలుకు ఈ నెల 12 వరకు గడువు ఇచ్చింది. 16 రాష్ట్రాల్లోని ఖాళీల కోసం విడుదలైన నోటిఫికేషన్ ప్రకారం అభ్యర్థులు ఆయా రాష్ట్రాల్లోని శాసనసభ కార్యదర్శికి నామినేషన్లను సమర్పించాలి. 13న నామినేషన్ల పరిశీలన జరగనుంది. ఈ నెల 15 వరకు నామినేషన్లను ఉపసంహరించుకోవచ్చు. తెలంగాణలో మూడు ఖాళీలకు మూడు నామినేషన్లే దాఖలైతే ఎన్నిక ఏకగ్రీవం కానుంది. ఒకవేళ ఎన్నికలు అనివార్యమైతే అధికారులు ఈ నెల 23న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల దాకా పోలింగ్ నిర్వహించి అదే రోజు సాయంత్రం 5 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభిస్తారు. లెక్కింపు పూర్తవగానే ఫలితాలను ప్రకటిస్తారు. 11న టీఆర్ఎస్ అభ్యర్థుల ప్రకటన? రాష్ట్రంలోని ఎమ్మెల్యేల సంఖ్యాబలం ప్రకారం మూడు స్థానాలూ టీఆర్ఎస్ ఖాతాలోనే పడే అవకాశాలున్నాయి. వాస్తవానికి టీఆర్ఎస్ బీ ఫారాలపై 63 మంది ఎమ్మెల్యేలే గెలవగా ఆ తరువాత జరిగిన పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్, టీడీపీ, బీఎస్పీ, వైఎస్సార్ కాంగ్రెస్, సీపీఐ నుంచి గెలిచిన 28 మంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లో చేరారు. దీంతో టీఆర్ఎస్కు 90 మందికిపైగా ఎమ్మెల్యేల బలం పెరిగింది. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ ముగ్గురు అభ్యర్థులను ప్రకటించనుంది. ఈ నెల 12 దాకా నామినేషన్ల దాఖలుకు గడువు ఉండటంతో అభ్యర్థులు ఎవరనే దానిపై పార్టీ నేతలు, ఆశావహుల్లో ఉత్కంఠ నెలకొంది. రాజ్యసభ అభ్యర్థుల విషయంలో సీఎం, పార్టీ అధినేత కేసీఆర్ ఇప్పటిదాకా సన్నిహితులతోనూ చర్చించలేదని తెలుస్తోంది. అభ్యర్థుల ఎంపికపై కేసీఆర్ మనోగతాన్ని పార్టీ ముఖ్యనేతలు, సన్నిహితులు కూడా అంచనా వేయలేకపోతున్నారు. సాధారణ ఎన్నికలకు కేవలం ఏడాది ముందు జరుగుతున్న రాజ్యసభ ఎన్నికల వ్యవహారంపై రాజకీయంగా లబ్ధి పొందేలా టీఆర్ఎస్ ఆచితూచి వ్యవహరించనున్నట్లు చెబుతున్నారు. సామాజిక సమీకరణాలు అత్యంత కీలకమైన ప్రాతిపదికగా ఈ ఎంపిక జరుగుతుందని చెబుతున్నారు. సంతోష్ కుమార్ పేరు ఖరారు..! యాదవ సామాజిక వర్గానికి ఒక రాజ్యసభ స్థానం ఇస్తామని సీఎం గతంలో ప్రకటించిన నేపథ్యంలో కార్పొరేషన్ చైర్మన్ రాజయ్య యాదవ్, మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ మధ్య పోటీ ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రెండో సీటు కోసం కేసీఆర్ అత్యంత సన్నిహితుడు జోగినపల్లి సంతోష్ కుమార్ పేరు వినిపిస్తోంది. సంతోష్ పేరు దాదాపుగా ఖరారైనట్లు పార్టీ నేతలు చెబుతున్నారు. మిగిలిన ఒక సీటును దళితులు లేదా మైనారిటీలకు ఇచ్చే అవకాశమున్నట్లు తెలుస్తోంది. సామాజిక వర్గాలకు ప్రాతినిధ్యంపై పార్టీ నేతల్లో భిన్నాభిప్రాయాలు కూడా ఉన్నట్లు సమాచారం. కాగా, 11న సాయంత్రం అభ్యర్థులను ప్రకటించే అవకాశముందని కేసీఆర్ సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. -
డుమ్మా మాస్టర్లు సచిన్, రేఖ
సాక్షి, హైదరాబాద్ : ఒకరు క్రికెట్ రంగానికే దేవుడు.. మరొకరు బాలీవుడ్ ఎవర్గ్రీన్.. తమ రంగాల్లో అత్యంత ప్రతిభావంతులు. ప్రజల మనసు దోచుకున్న వారు.. కోట్లాదిమంది అభిమానుల్ని సొంతం చేసుకున్నారు. కానీ, ప్రజాప్రతినిధులుగా వారి పనితీరు మాత్రం అధ్వానంగా ఉంది. వాళ్ల ప్రోగ్రెస్ రిపోర్ట్ చూస్తే ఎవరైనా నోరు వెళ్లబెట్టాల్సిందే! సచిన్ టెండూల్కర్, రేఖ ఇద్దరూ 2012 మార్చిలో పెద్దల సభలో అడుగు పెట్టారు. ఈ నెలాఖరుకి పదవీ విరమణ చేయబోతున్నారు. రాజ్యసభ అందించిన వివరాల ప్రకారం ఈ ఆరేళ్లలో సచిన్ హాజరు 7.3 శాతం మాత్రమే.. 22 ప్రశ్నలు అడిగారు. ఒక్క బిల్లు కూడా ప్రవేశపెట్టలేదు. ఇక రేఖ విషయానికొస్తే ఆమె హాజరు మరీ అన్యాయంగా 4.5 శాతం ఉంది..పెద్దల సభలో అడుగు పెట్టిన దగ్గర్నుంచి ఏ ఒక్క సెషన్ని తీసుకున్నా ఒక్క రోజుకు మించి రేఖ హాజరు కాలేదు. అంతే కాదు సభలో అసలు నోరు విప్పలేదు. వీరిద్దరి పనితీరుపై విమర్శలు రావడం ఇది కొత్తేమీ కాదు. గత ఏడాది సమాజ్ వాదీ పార్టీ ఎంపీ నరేష్ అగర్వాల్ సెలబ్రిటీ ఎంపీల హాజరు అంశాన్ని సభలోనే ప్రశ్నించారు. అప్పుడే సెలెబ్రిటీలకు ఈ రాజకీయ పదవులెందుకన్న చర్చ విస్తతంగా జరిగింది. ఎంపీ పదవులు చేపట్టిన మొదటి రెండేళ్లలో సచిన్, రేఖ ఇద్దరూ ఎంపీ లాడ్స్ ని«ధులు ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టలేదన్న విషయమూ బయటపడింది.. ప్రతీ రాజ్యసభ సభ్యుడికి ఏడాదికి ఎంపీ ల్యాడ్స్ కింద రూ.5 కోట్ల నిధులు ఇస్తారు.. ఆ నిధుల్ని మురగబెట్టారే తప్ప ఖర్చు చేయలేదు. విమర్శలు వెల్లువెత్తాక వాళ్లలో కదలిక వచ్చింది. సచిన్ టెండూల్కర్ నెల్లూరు జిల్లాలోని పుట్టంరాజు కండ్రిగ, మహారాష్ట్రలోని డోంజా అనే గ్రామాలను దత్తత తీసుకున్నారు. రేఖ కూడా ఎంపీ ల్యాడ్స్ నిధుల నుంచి పుణెలోని కసర్వాడి దగ్గర ఛత్రపతి సాహు మహరాజ్ స్కూల్ నిర్మాణానికి రూ.3.03 కోట్లు కేటాయించారు. రాయ్బరేలిలో ఒక స్కూలు నిర్మాణానికి కూడా రూ.2.5 కోట్లు ఇచ్చారు.. కానీ, ఆ ప్రాజెక్టుల అతీగతీ ఇప్పటికీ తెలీదు. సచిన్ టెండూల్కర్, రేఖలను 2012లో అప్పటి యూపీఏ ప్రభుత్వం నామినేట్ చేసింది. ఇలా వివిధ రంగాలకు చెందిన నామినేటెడ్ ఎంపీల వల్ల ఒరిగేదేమిటన్న విమర్శలు ఘాటుగానే వినిపిస్తున్నాయి. సచిన్ రిపోర్ట్ కార్డు (2012 ఏప్రిల్ నుంచి) సభ జరిగిన రోజులు: 397 సచిన్ హాజరైన రోజులు: 29 ఆరేళ్లలో అందుకున్న జీతభత్యాలు: రూ.86,23,266 అడిగిన ప్రశ్నలు: 22 ప్రవేశపెట్టిన బిల్లులు: 0 రేఖ రిపోర్ట్ కార్డు (2012 ఏప్రిల్ నుంచి) సభ జరిగిన రోజులు : 397 రేఖ హాజరైన రోజులు : 18 అందుకున్న జీత భత్యాలు : రూ.99,59,178 అడిగిన ప్రశ్నలు: 0 ప్రవేశపెట్టిన బిల్లులు: 0 – సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
హోదాపై మళ్లీ పాత పాటే పాడిన అరుణ్ జైట్లీ
-
టీడీపీ డ్రామాను రక్తికట్టిస్తున్న సుజనా చౌదరి!
-
ప్రత్యేక ప్యాకేజీ చట్టబద్దత బిల్లు తిరస్కరణ
సాక్షి, న్యూఢిల్లీ : ప్రత్యేక హోదాకు బదులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజీ అందజేస్తామంటూ ఎన్డీఏ ప్రభుత్వం చేసిన ప్రకటనకు చట్టబద్దత కల్పించాలంటూ కాంగ్రెస్ పార్టీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు గతేడాది ప్రైవేటు బిల్లును ప్రవేశపెట్టారు. ప్రత్యేక హోదా వల్ల ఏపీకి లభించే మూడు ముఖ్య ప్రయోజనాలకు చట్టబద్దత కల్పించాలని ఆయన బిల్లులో పేర్కొన్నారు. మూడు ముఖ్య ప్రయోజనాలు.. 1. 2015 -2020 మధ్యకాలంలో అన్ని కేంద్ర ప్రాయోజిత పథకాలలో కేంద్ర-రాష్ట్రాల మధ్య వాటాల నిష్పత్తి 90:10 ఉండాలి. కేంద్రం వాటాగా అందించే 90 శాతం నిధులను ఆర్ధిక సంవత్సరం చివరిలో ప్రతి ఏటా రాష్ట్రానికి అందజేయాలి. 2. 2015-2020ల మధ్యకాలంలో ఏపీలో విదేశీ సాయంతో చేపట్టే ప్రాజెక్టులకు కేంద్ర ఇచ్చే 90 శాతం రుణాన్ని గ్రాంటుగా ఇవ్వడం. 3. ఐదు సంవత్సరాల కాలంలో ఏపీలో ప్రారంభమయ్యే అన్ని రకాల పరిశ్రమలకు ప్రత్యేక ప్రోత్సాహకాలను, పన్ను మినహాయింపులను ఇవ్వడం. కాగా, ఎంపీ రామచంద్రరావు పంపిన బిల్లును పరిశీలించిన రాజ్యసభ సెక్రటరియేట్.. ఆర్టికల్ 110 ప్రకారం మనీ బిల్లుకు కిందకు వస్తుందని పేర్కొంది. రాజ్యసభలో ఈ బిల్లును ప్రవేశపెట్టలేమని బిల్లును వెనక్కుపంపింది. -
ప్రారంభమైన 10 నిమిషాల్లోనే వాయిదా
-
ప్రారంభమైన 10 నిమిషాల్లోనే వాయిదా
న్యూఢిల్లీ : పార్లమెంట్ ఉభయ సభలు ప్రారంభమైన 10 నిమిషాల్లోనే వాయిదా పడ్డాయి. రాజ్యసభ ఈ రోజు మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా పడగా... లోక్సభ రేపటికి వాయిదా పడింది. ఏపీకి ప్రత్యేక హోదా , బడ్జెట్ విషయాలపై రాజ్యసభ దద్దరిల్లింది. బడ్జెట్లో ఏపీకి కేటాయింపులు సరిగా జరుగలేదని.. ఏపీ ప్రత్యేక హోదాపై సభలో చర్చ జరుగాలంటూ విపక్షాలు పట్టుబట్టాయి. రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు పోడియం వద్దకు వెళ్లి కాంగ్రెస్, వైసీపీలు నిరసన వ్యక్తంచేశారు. బడ్జెట్లో ఏపీకి తీవ్రమైన అన్యాయం జరిగిందని కాంగ్రెస్ ఎంపీ కేవీపీ ఆందోళన వ్యక్తంచేశారు. కాంగ్రెస్ ఎంపీ కేవీపీ రామచంద్రరావును పలుమార్లు తన సీటు వద్దకు వెళ్లి కూర్చోవాలని వెంకయ్యనాయుడు కోరారు. అయినప్పటికీ కేవీపీ తన నిరసనను ఆపకపోవడంతో, వెంకయ్యనాయుడు కాస్త అసహనం వ్యక్తం చేశారు. టీఎంసీ ఎంపీలు కూడా పెరిగిన పెట్రోల్ ధరలపై ఆందోళన చేశారు. ''నోయిడా నకిలీ ఎన్కౌంటర్' విషయంపై సమాజ్వాద్ పార్టీ నిరసన వ్యక్తంచేసింది. ఉత్తరప్రదేశ్లో నకిలీ ఎన్కౌంటర్లపై చర్చ జరుగాలని పార్టీ సభ్యులు పట్టుబట్టారు. పార్టీకి చెందిన నరేష్ అగర్వాల్ ఈ విషయంపై నోటీసు కూడా అందజేశారు. అయితే ఈ నోటీసును వెంకయ్యనాయుడు తిరస్కరించారు. దీంతో ఎస్పీ సభ్యులు కూడా నిరసన చేపట్టారు. ఈ నిరసనల మధ్య రాజ్యసభను వెంకయ్యనాయుడు రెండు గంటల వరకు వాయిదా వేశారు. లోక్సభ వాయిదా శనివారం మరణించిన బీజేపీ సభ్యుడు హుకుమ్ సింగ్కు సంతాపం వ్యక్తం చేసిన లోక్సభ కూడా రేపటికి వాయిదా పడింది. వాటర్ రిసోర్సస్ స్టాండింగ్ కమిటీకి చైర్పర్సన్గా, లోకసభ సాధారణ ప్రయోజనాల కమిటీకి సభ్యుడిగా సింగ్ ఉండేవారు. గాంధీ విగ్రహం వద్ద టీడీపీ ఆందోళన విభజన చట్టం ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ... అటు టీడీపీ ఎంపీలు కూడా పార్లమెంట్ ఆవరణలో నిరసన చేపట్టారు. ఫ్లకార్డులతో ప్రదర్శన కూడా చేపట్టారు. అయితే టీడీపీ ఎంపీలు చేసిన ఈ నిరసనకు కేంద్ర మంత్రులు ఆశోక్ గణపతి రాజు, సుజనా చౌదరి దూరంగా ఉన్నారు. -
ఏపీలో 804మంది రైతుల ఆత్మహత్యలు
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్లో 2016లో 804 మంది రైతులు, రైతు కూలీలు ఆత్మహత్యలకు పాల్పడినట్లు వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ సహాయ మంత్రి పరషోత్తమ రూపాలా వెల్లడించారు. రాజ్య సభలో శుక్రవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు విజయసాయి రెడ్డి అడిగిన ఒక ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిస్తూ ఈ విషయం తెలిపారు. కేంద్ర హోం మంత్రిశ్వ శాఖ ఆధ్వర్యంలోని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) రైతుల ఆత్మహత్యలకు సంబంధించిన సమాచారాన్ని పొందుపరుస్తూ ప్రతి ఏటా నివేదకలను సమర్పిస్తుందని ఆయన తెలిపారు. 2014-15లో ఎన్సీఆర్బీ సమర్పించిన నివేదిక ప్రకారం రాష్ట్రంలో 632 మంది రైతులు, 916 మంది రైతు కూలీలు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఎన్సీఆర్బీ ప్రతి ఏటా సమర్పించే ఈ నివేదికలు 2015 సంవత్సరం వరకు మాత్రమే ఆ సంస్థ వెబ్ సైట్లో అందుబాటులో ఉన్నాయి. 2016 తర్వాత నివేదికలు ఇంకా వెబ్ సైట్లో ప్రచురించలేదు. అయితే ఎన్సీఆర్బీ 2016 సంవత్సరానికి పొందుపరచి ఇంకా ప్రచురించని సమాచారం ప్రకారం రాష్ట్రంలో 806 మంది రైతులు, రైతు కూలీలు ఆత్మహత్యలకు పాల్పడినట్లు తెలుస్తోందని మంత్రి తన సమాధానంలో వివరించారు. 2015లో ఎన్సీఆర్బీ ప్రచురించిన నివేదిక ప్రకారం దివాలా, అప్పుల ఊబిలో కూరుకుపోవడం, వ్యవసాయంలో సంభవించే నష్టాలు రైతుల ఆత్మహత్యలకు ప్రధాన కారణాలలో కొన్నిగా పేర్కొనడం జరిగింది. రైతులలో అత్యధిక శాతం దారిద్ర్యరేఖకు దిగువన ఉన్న వారే. వ్యవసాయ రంగంలో సంక్షోభం తలెత్తిన ప్రతిసారి ఆత్మహత్యలకు పాల్పడుతున్న రైతుల సంఖ్య పెరిగిపోతోంది. ఈ ధోరణిని సమర్థవంతంగా నిలువరించాలంటే రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడం ఒక్కటే మార్గమని మంత్రి వివరించారు. వ్యవసాయం రాష్ట్రానికి సంబంధించిన అంశం. అయినప్పటికీ 2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెండింతలు చేయాలన్నది కేంద్ర ప్రభుత్వ లక్ష్యం. ఈ లక్ష్య సాధన కోసం వ్యవసాయ, సహకారం రైతు సంక్షేమ విభాగాలు ఒక అంతర్ మంత్రిత్వ శాఖ బృందాన్ని ఏర్పాటు చేసి రైతుల ఆదాయానికి సంబంధించిన వివిధ ధృక్కోణాలను పరిశీలించి సముచితమైన వ్యూహాన్ని సిఫార్సు చేస్తుంది. అలాగే ప్రభుత్వం కూడా వ్యవసాయ ఉత్పాదకత నుంచి రైతుల ఆదాయాన్ని పెంచే దిశగా చొరవ తీసుకునేలా తన ప్రాధామ్యాలను మలుచుకుంటుందని మంత్రి తెలిపారు. ఆహార ధాన్యాల సేకరణ కోసం కొత్త పథకం రైతులు పండించిన ఆహార ధాన్యాల సేకరణ కోసం కేంద్ర ప్రభఉత్వం మార్కెట్ హామీ పథకం (ఎమ్ఏఎస్) పేరిట ఒక కొత్త పథకాన్ని తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నట్లు ఆహార, ప్రజా పంపిణీ శాఖల మంత్రి శ్రీ రామ్ విలాస్ పాశ్వాన్ శుక్రవారం రాజ్య సభలో ప్రకటించారు. విజయసాయి రెడ్డి అడగిన ఒక ప్రశ్నకు రాతపూర్వకంగా జవాబిస్తూ మంత్రి ఈ విషయం వెల్లడించారు. ఈ కొత్త పథకానికి సంబంధించిన కాన్సెప్ట్ పేపర్ను ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల పరిశీలనకు పంపించినట్లు మంత్రి తెలిపారు. ఆయా రాష్ట్ర ప్రభుత్వాల ప్రతినిధులతో కేంద్ర బృందాలు రెండు దఫాలుగా జరిపిన చర్చల ద్వారా సేకరించిన అభిప్రాయాలను క్రోడీకరిస్తూ వ్యవసాయ, సహకార, రైతు సంక్షేమ విభాగాలు సవరించిన కాన్సెప్ట్ పేపర్ను రూపొందించినట్లు మంత్రి చెప్పారు. దక్షిణ మధ్య రైల్వే భద్రతా విభాగంలో 10 వేల పోస్టులు ఖాళీ దక్షిణ మధ్య రైల్వేలోని రక్షణ, భద్రతా విభాగాలలో దాదాపుగా 10 వేలకు పైగా పోస్టులు ఖాళీగా ఉన్నట్లు రైల్వే శాఖ సహాయ మంత్రి శ్రీ రంజన్ గోహెయిన్ తెలిపారు. శుక్రవారం రాజ్యసభలో విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ, దక్షిణ మధ్య రైల్వేలోని రక్షణ, భద్రత విభాగాలకు మొత్తం 3,309, 58,622 పోస్టులు మంజూరు కాగా అందులో రక్షణ విభాగంలో 784, భద్రత విభాగంలో 9.372 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తెలిపారు. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్లో ఖాళీలు ఏర్పడటం నిరంతరం సాగే ప్రక్రియ. రిటైర్మెట్లు, ప్రమోషన్లు, మరణాలు, రాజీనామాల వంటి కారణాలతో ఏర్పడే ఈ ఖాళీలను, డిపార్ట్మెంటల్ ప్రమోషన్లను నిబంధనల ప్రకారం బహిరంగ నియామకాల ద్వారా చేపడుతున్నట్లు మంత్రి తెలిపారు. రక్షణ, భద్రత విభాగాలలో ఖాళీల భర్తీ కోసం స్పెషల్ డ్రైవ్ వంటివి ఏవీ నిర్వహించడం లేదని చెప్పారు. పోస్టల్ శాఖ ఏపీ సర్కిల్లో 1922 పోస్టులు ఖాళీ పోస్టల్ శాఖ ఆంధ్రప్రదేశ్ సర్కిల్లో మల్టీ టాస్కింగ్ సిబ్బంది, పోస్ట్మాన్, పోస్టల్ అసిస్టెంట్, సార్టింగ్ అసిస్టెంట్, పోస్ట్ మాస్టర్ గ్రేడ్, ఇన్స్పెక్టర్ పోస్టులు మొత్తం కలిపి 1922 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి శ్రీ మనోజ్ సిన్హా శుక్రవారం రాజ్య సభలో విజయసాయి రెడ్డి అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. విశాఖలో వ్యాగన్ వర్క్షాప్కు 150 కోట్లు విశాఖపట్నంలో రైల్వే పీరియాడికల్ ఓవర్హాలింగ్ వర్క్ షాప్ (వ్యాగన్ వర్క్షాప్) నిర్మాణానికి ప్రస్తుత ఈ ఏడాది బడ్జెట్లో 150 కోట్ల రూపాయలు కేటాయించినట్లు రైల్వే శాఖ సహాయ మంత్రి శ్రీ రంజన్ గొహెయిన్ వెల్లడించారు. వ్యాగన్ వర్క్షాప్ నిర్మాణ పనులలో ఎలాంటి జాప్యం జరగడం లేదని 2015-16 ఆర్థిక సంవత్సరం నుంచి ఇప్పటి వరకు దీని నిర్మాణం కోసం మొత్తం 265 కోట్ల రూపాయలను కేటాయించినట్లు మంత్రి తెలిపారు. -
ఆధార్ డేటా కొనొచ్చా.. కేంద్రమంత్రి ఏమన్నారంటే..!
సాక్షి, న్యూఢిల్లీ: కొన్ని వందల రూపాయలు చెల్లించి ఇతరుల ఆధార్ సమాచారం సులువుగా సేకరించవచ్చునంటూ ప్రతిపక్ష నేతలు చేసిన ఆరోపణల్ని కేంద్ర సమాచార సాంకేతికశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఖండించారు. ఆధార్ డేటా ఎప్పుడూ భద్రంతగానే ఉంటుందని, ఇతరుల చేతుల్లోకి వ్యక్తిగత సమాచారం వెళ్లే పరిస్థితులు లేవని ఆయన స్పష్టం చేశారు. ఆధార్ డేటాకు గోపత్య లేదని, దీనిపై వివరణ ఇవ్వాలంటూ రాజ్యసభలో సమాజ్వాదీ పార్టీ నేత నీరజ్ శేఖర్ అని ప్రశ్నకు మంత్రి రవిశంకర్ ఈ విధంగా వివరణ ఇచ్చారు. ఈ ఏడాది జనవరి 4న యూఐడీఏఐ (ఆధార్ సంస్థ) ఓ వ్యక్తిపై ఫిర్యాదు చేయగా ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్, సైబర్ విభాగం పోలీసులు ఆధార్ చట్టం, ఐటీ చట్టాల కింద కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు తెలిపారు. 'విపక్ష నేతలు ఆధార్ పై అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారు. కానీ ఇప్పటివరకూ డబ్బు చెల్లించి ఆధార్ సమాచారాన్ని చోరీ చేసినట్లు దేశంలో ఎక్కడా కేసులు నమోదు కాలేదు. దీన్ని బట్టి చూస్తే ఆధార్ వివరాలపై గోప్యత ఉంటుందని అర్థమవుతోంది. ఆధార్ సంస్థ స్వయంగా ఓ వ్యక్తిపై డేటా దుర్వినియోగం చేశాడని ఫిర్యాదు చేయగా ఢిల్లీ సైబర్ విభాగం విచారణ చేపట్టింది. ఆధార్ డేటాపై అభద్రత భావాన్ని దూరం చేసుకోవాలి. రూ.500 చెల్లించి ఇతరుల ఆధార్ డేటా వ్యక్తిగత సమాచారాన్ని పొందడం తేలికంటూ ప్రతిపక్ష పార్టీల నేతలు చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదు. ఆధార్పై పుట్టకొస్తున్న వదంతులను నమ్మవద్దని' మంత్రి రవిశంకర్ ప్రసాద్ చెప్పారు. ఒకవైపు ఆధార్ డేటాను ఎవరూ హ్యాక్ చేయలేరని యూఐడీఏఐ పదే పదే స్పష్టం చేస్తున్నప్పటికీ.. ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్పై అమెరికా పెట్టిన నిఘా గుట్టును రట్టుచేసిన ఎడ్వర్డ్ స్నోడెన్ ఆధార్ గోప్యతపై ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. వంద కోట్ల భారతీయుల ఆధార్ డేటాను హ్యాక్ చేయడం చాలా సులువని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ప్రతిక్షాల వాదనకు, ఆరోపణలకు బలం చేకూర్చినట్లయింది. కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం ఆధార్ వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయని చెబుతుండటం గమనార్హం. -
రాజ్యసభలో ప్రతిపక్షాల ఉడుంపట్టు
సాక్షి, న్యూఢిల్లీ : పెద్దల సభలో ట్రిపుల్ తలాక్ బిల్లు క్లియరెన్స్కు తొలిరోజు అవాంతరం ఏర్పడింది. ప్రతిపక్ష పార్టీల గందరగోళంతో అధికార పక్షం బిల్లును ముందుకు తీసుకెళ్లలేకపోయింది. సభలో గందరగోళ పరిస్థితులు నెలకొనడంతో రాజ్యసభను స్పీకర్ వాయిదా వేశారు. బిల్లుపై గురువారం తిరిగి చర్చ జరగనున్నట్లు తెలిపారు. ఇది వరకే లోక్సభలో ట్రిపుల్ తలాక్ బిల్లు ఆమోదం పొందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బిల్లు ఇప్పుడు రాజ్యసభలోకి చర్చకు వచ్చింది. ప్రతిపక్షాల ఆందోళనల మధ్య కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టారు. పలు ప్రతిపక్ష పార్టీలు, ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ సభలో బిల్లును సెలక్ట్ కమిటీకి పంపించాల్సిందేనని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశాయి. దీంతో సభ డిప్యూటీ చైర్మన్ కురియన్ జోక్యం చేసుకొంటూ కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ను సభలో మాట్లాడనివ్వాలని కోరారు. తన మాట వినకుంటే సభను వాయిదా వేస్తానని కూడా హెచ్చరించారు. ట్రిపుల్ తలాక్ బిల్లును సెలక్ట్ కమిటీకి పంపించాలని కాంగ్రెస్ పార్టీ నేత ఆనంద్శర్మ రాజ్యసభలో మోషన్ ఇచ్చారు. అయితే, ఈ బిల్లును ఎందుకు సెలక్ట్ కమిటీకి ఇవ్వకూడదనే విషయంపై కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ వివరణ ఇచ్చారు. సెలక్ట్ కమిటీకి బిల్లు ఇవ్వడంతో సమయం వృధా అవుతుందని, కనీసం ఆరు నెలలు గడిపోతాయని అన్నారు. ఈ బిల్లు ప్రస్తుతం అత్యవసరంగా ఆమోదించాల్సిన బిల్లు అని, సుప్రీంకోర్టు ఆందోళన కూడా ఇదే విషయాన్ని తెలియజేస్తుందన్నారు. అత్యవసర పరిస్థితుల నేపథ్యంలోనే బిల్లును సెలక్ట్ కమిటీకి పంపించడం సాధ్యం కాదని స్పష్టం చేశారు. ఈ బిల్లుకు ఎవరు మద్దతు ఇస్తున్నారో ఎవరూ ఇవ్వడం లేదో మొత్తం భారతదేశం చూస్తోందని చెప్పారు. కాగా, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కపిల్ సిబల్ మాట్లాడుతూ ట్రిపుల్ తలాక్ బిల్లు విషయంలో కేంద్రం అనుసరిస్తున్న తీరు సరిగా లేదన్నారు. సుప్రీంకోర్టు తీర్పు గురించి సభలో న్యాయశాఖ మంత్రి చెప్పిందంతా కూడా సరికాదన్నారు. ఈ బిల్లు కచ్చితంగా సెలక్ట్ కమిటీకి పంపించాల్సిందేనని డిమాండ్ చేశారు. దీంతో డిప్యూటీ చైర్మన్ సభను రేపటికి (గురువారానికి) వాయిదా వేశారు. -
రాజ్యసభకు అభ్యర్థులను ప్రకటించిన ఆప్
న్యూఢిల్లీ: ఎట్టకేలకు ఆమ్ఆద్మీ పార్టీ రాజ్యసభకు అభ్యర్థులను ప్రకటించింది. పార్టీ సీనియర్ నేత సంజయ్ సింగ్, సుశీల్ గుప్తా, నవీన్ గుప్తా పేర్లను ఆప్ ఖరారు చేసింది. బుధవారం కేజ్రీవాల్ నివాసంలో జరిగిన రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో ఆప్ ఈ ముగ్గురి పేర్లను రాజ్యసభ సభ్యత్వం కోసం ఖరారు చేసినట్లు ప్రకటించింది. కాగా సుశీల్ గుప్తా ఢిల్లీలో పేరున్న వాణిజ్య వేత్త అగ్రసేన్ హాస్పిటల్, అగ్రసేన్ చారిటబుల్ ట్రస్ట్ పేరిట ఆయనకు నగరంలో ఆసుపత్రులు, కాలేజీలు ఉన్నాయి. సుశీల్ గుప్తా నెల రోజుల క్రితం వరకు కాంగ్రెస్లో ఉన్నారు. అలాగే ఎన్డీ గుప్తా పేరున్న చార్టెడ్ అకౌంటెంట్. ఆయన ప్రస్తుతం ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా(ఐసీఏఐ) ఉపాధ్యక్షునిగా ఉన్నారు. కుమార్ విశ్వాస్కు మొండిచేయి పార్టీ సీనియర్ నేత కుమార్ విశ్వాస్కు తీవ్ర ఆశాభంగం కలిగింది. కుమార్ విశ్వాస్ను రాజ్యసభకు పంపాలని ఆయన మద్దతుదారులు పార్టీపై ఒత్తిడి తేవడానికి ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. కుమార్ విశ్వాస్ మద్దతుదారులు రజాయిలు, పరుపులతో పార్టీ కార్యాలయంలో తిష్ట వేసి తమపై ఒత్తిడి తేవడానికి ప్రయత్నించడం పార్టీ నేతలకు రుచించలేదు కేజ్రీవాల్, కుమార్ విశ్వాస్ల మధ్య పెరిగిపోయిన విబేధాల దృష్ట్యా కూడా ఆయనకు రాజ్యసభ సీటు దక్కలేదు. మరోవైపు అశితోష్మిశ్రా పేరును కూడా పార్టీ పక్కన పెట్టేసింది. కాగా రాజ్యసభలో మూడు ఢిల్లీ సీట్లకోసం జనవరి 16న ఎన్నిక జరుగనుంది. నామినేషన్లు దాఖలుచేసే తేదీ జనవరి 5న ముగియనుంది. -
వర్సిటీల్లో ఆందోళనలపై చర్యలేం లేవు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా వివిధ విశ్వవిద్యాలయాల్లో విద్యార్థుల ఆందోళనలతో పాటు చెలరేగిన హింసపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని కేంద్రం పార్లమెంటుకు తెలిపింది. ‘విశ్వవిద్యాలయాలు స్వతంత్ర సంస్థలు. ధర్నాలు, ఆందోళనలు చెలరేగినప్పుడు వాటి నియంత్రణకు స్థానిక అధికారుల సాయంతో చర్యలు తీసుకునే పూర్తి అధికారం వారికుంది’ అని కేంద్ర మానవవనరుల అభివృద్ధి శాఖ సహాయమంత్రి సత్యపాల్ సింగ్ లోక్సభకు రాతపూర్వకంగా తెలియజేశారు. ఈ విషయాన్ని లోక్సభ అధికారిక వెబ్సైట్లో సోమవారం అప్లోడ్ చేశారు. నేడు రాజ్యసభకు ట్రిపుల్ తలాక్ బిల్లు: ఉన్నపళంగా ముమ్మారు తలాక్ చెప్పి ముస్లిం భర్తలు తమ భార్యలకు విడాకులిచ్చే పద్ధతిని నేరంగా పరిగణిస్తూ కేంద్రం తీసుకొచ్చిన బిల్లును మంగళవారం రాజ్యసభలో ప్రవేశపెట్టనున్నారు. -
తల్లి, భార్యను వితంతువుల్లా మార్చారు
న్యూఢిల్లీ : బిడ్డతో ఓ తల్లి, భర్తతో ఓ భార్య సమావేశాన్ని పాకిస్తాన్ విష ప్రచారానికి వినియోగించుకుందని భారత విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ కుల్భూషణ్ జాధవ్ విషయంలో దాయాది దేశంపై విరుచుకుపడ్డారు. పాకిస్తాన్లో జాధవ్ తల్లి, భార్య సమావేశంపై రాజ్యసభ వేదికగా ప్రకటన చేశారు. సమావేశానికి వెళ్లే ముందు జాధవ్ భార్యతో మాత్రమే కాకుండా, ఆయన తల్లితో కూడా గాజులు, మంగళసూత్రం, బొట్టులను తీయించినట్లు చెప్పారు. జాధవ్ తల్లి అవంతితో తాను మాట్లాడినట్లు వెల్లడించారు. తొలిమాటగా నాన్న ఎలా ఉన్నారని? జాధవ్ అడిగినట్లు చెప్పారు. మంగళసూత్రం మెడలో లేకపోవడం చూసి జాధవ్ అలా అడిగినట్లు వెల్లడించారు. జాధవ్ భార్యతో తన బూట్లు తిరిగి ఇవ్వాలని ఎన్నిసార్లు కోరినా పాక్ అధికారులు ఇవ్వలేదని వెల్లడించారు. ఆ బూట్లలో కెమెరా ఉందంటూ పాకిస్తాన్ ప్రకటన చేయడం మరింత నీచానికి దిగజారడమేనని అన్నారు. పాకిస్తాన్కు చేరుకునేందుకు జాధవ్ భార్య రెండు సార్లు విమానం ఎక్కారని చెప్పారు. బూట్లలో ఏదైనా ఉంటే ఎయిర్పోర్టులో పట్టుకునేవారని అన్నారు. మావవతా దృష్టితో జాధవ్ను కలవడానికి అంగీకరించామని చెబుతూ పాకిస్తాన్ ఇలాంటి నీచకార్యాలకు పాల్పడటం అమానుషమని అన్నారు. జాధవ్ కుటుంబసభ్యుల మానవ హక్కులు పాకిస్తాన్లో పదే పదే ఉల్లంఘనకు గురయ్యాయని చెప్పారు. ఓ భీతావాహ వాతావరణంలో జాధవ్ను కుటుంబ సభ్యులు కలిశారని ఆవేదన వ్యక్తం చేశారు. జాధవ్ తల్లి చీర మాత్రమే కట్టుకుంటారని ఆమెతో సాల్వార్ కుర్తా వేయించారని తెలిపారు. జాధవ్తో ఆయన తల్లిని మరాఠీలో సంభాషించనివ్వలేదని వెల్లడించారు. అయినా ఆమె మరాఠీలో మాట్లాడేందుకు యత్నించడంతో ఇంటర్కామ్ను పాకిస్తాన్ అధికారులు ఆపివేసినట్లు తెలిపారు. జాధవ్ను సురక్షితంగా విడిపించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. జాధవ్ తల్లి, భార్యలతో అమర్యాదగా ప్రవర్తించడాన్ని ప్రతి భారతీయుడితో అమర్యాదగా ప్రవర్తించడంగా భావిస్తున్నట్లు రాజ్యసభ ప్రతిపక్ష నాయకుడు మల్లిఖార్జున ఖర్గే పేర్కొన్నారు. రాజకీయ భేధాలతో సంబంధం లేకుండా దేశ ప్రజల పట్ల అగౌరవంగా నడుచుకుంటే సహించబోమని చెప్పారు. -
జైట్లీ ప్రకటనపై రాహుల్ సాలిడ్ కౌంటర్
సాక్షి, న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మరోసారి మోదీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పై వ్యాఖ్యల అంశంపై జైట్లీ ప్రకటనను ఆయన తప్పుబట్టారు. జైట్లీ.. జైట్-లై(అబద్ధాలకోరు) అని అభివర్ణిస్తూ ట్విట్టర్లో రాహుల్ ట్వీట్లు చేశారు. జైట్లీ గారూ మీకు ధన్యవాదాలు. మన ప్రధానిగారు చెప్పిన పనులు అస్సలు చేయరని మీరు ఒప్పుకున్నందుకు సంతోషం, బీజేపీ అబద్ధాలకోరుల పార్టీ అని బుధవారం సాయంత్రం ట్వీట్ చేశారు. అంతేకాదు ప్రచార సమయంలో మోదీ ప్రసంగాన్ని.. జైట్లీ రాజ్యసభలో మాట్లాడిన మాటల వీడియోలను పక్కపక్కనే ఉంచి మరో సందేశాన్ని ఉంచారు. ప్రధాని లాంటి స్థాయి ఉన్న వ్యక్తిని కించపరిస్తే తమ పార్టీ ఉపేక్షించలేదన్న విషయాన్ని(మణిశంకర్ అయ్యర్ వేటు) గుర్తు చేస్తున్న కాంగ్రెస్ పార్టీ.. మన్మోహన్, హమీద్ అన్సారీ(మాజీ ఉపరాష్ట్రపతి) లపై వ్యాఖ్యలు చేసిన ప్రధాని నుంచి కనీసం క్షమాపణ కూడా చెప్పించకపోవటం దారుణమని బీజేపీపై మండిపడుతోంది. కాగా, మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ దేశభక్తిని, అంకిత భావాన్ని తాము ప్రశ్నించలేదని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ బుధవారం స్పష్టం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన ప్రసంగాల్లో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ను, మాజీ ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీలను ఎక్కడా ప్రశ్నించలేదు. అదేవిధంగా వారికి దేశంపట్ల ఉన్న నిబద్ధతపై అనుమానాలు లేవు. మన్మోహన్, అన్సారీలకున్న దేశభక్తి పట్ల మాకు నమ్మకం, విశ్వాసం ఉన్నాయని’ అరుణ్ జైట్లీ పేర్కొన్నారు. Dear Mr Jaitlie - thank you for reminding India that our PM never means what he says or says what he means. #BJPLies pic.twitter.com/I7n1f07GaX — Office of RG (@OfficeOfRG) December 27, 2017 -
విశాఖ ఐటీఐఆర్లో ముందడుగు లేదు
సాక్షి, న్యూఢిల్లీ : విశాఖపట్నంలో ఏర్పాటుచేయాలనుకున్న ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్టిమెంట్ రీజియన్(ఐటీఐఆర్) ప్రతిపాదన( ఆగస్టు 26, 2014)ను ఇంకా ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీకి పంపించలేదని కేంద్రం స్పష్టం చేసింది. ఈ మేరకు కేంద్ర ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సహాయమంత్రి ఆల్ఫోన్స్ కన్నాంతనమ్ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్రం తరుపున లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. గతంలో భువనేశ్వర్లో కూడా ఐటీఐఆర్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదన కూడా వచ్చిందని అయితే దీని ఏర్పాటులో సమగ్రంగా పున: పరిశీలించాలని ఆదేశించామని, ఆ ఆదేశాల అనంతరం అందులో సవరణలు చేయాల్సిన అవసరం ఉన్నట్లు గుర్తించామన్నారు. ఈ సవరణ మేరకు కేబినెట్ కమిటీకి ఒక నోట్ కూడా సమర్పించామని, అది జరిగితే ఏపీ ప్రతిపాదనను పంపిస్తామన్నారు. అలాగే జీఎస్టీ తర్వాత రైల్వే కాంట్రాక్ట్ పనుల విషయంలో కోరిన వివరణకు కూడా కేంద్రం సమాధానం చెప్పింది. జీఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత దక్షిణ మధ్య రైల్వేలోని ఓపెన్ లైన్, కన్స్ట్రక్షన్ ఆర్గనైజేషన్లో కాంట్రాక్టర్లు తాత్కాలికంగా పనులు నిలిపేసిన విషయం వాస్తవమేనని రైల్వే శాఖ సహాయ మంత్రి రాజేన్ గోహైన్ తెలిపారు. అయితే, శాఖ పరమైన వనరులను తరలించి ఎక్కడ అవసరం అయితే అక్కడ ట్రాక్ భద్రత పనులు కొనసాగేలా చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు. విజయసాయిరెడ్డి ప్రశ్నల వివరాల పూర్తి పాఠం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. -
పెద్దల సభకు రాలేనంటున్న రాజన్
న్యూఢిల్లీ : ఆమ్ ఆద్మీ పార్టీ ఆఫర్ చేసిన రాజ్యసభ సీటును ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ సున్నితంగా తిరస్కరించారు. ప్రస్తుతమున్న పరిస్థితుల్లో తనకు ఎంతో ఇష్టమైన అధ్యాపక వృత్తిని వదిలిపెట్టి రాజ్యసభ సభ్యుడిగా పనిచేయలేనని రాజన్ పేర్కొన్నారు. ఆప్ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ చేసిన ఆఫర్పై రాజన్ కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుతం రఘురామ్ రాజన్ అధ్యాపక వృత్తిలో మమేకమై ఉన్నారని, భారత్లో కూడా విభిన్న విద్యా కార్యకలాపాలు చేపట్టేందుకు ప్రణాళికలు రూపొందించుకున్నారని కార్యాలయం ప్రకటించింది. యూనివర్సిటీ ఆఫ్ చికాగోలో పూర్తిస్థాయి అధ్యాపకుడిగా కొనసాగేందుకే రాజన్ ఇష్టపడుతున్నట్లు ఆయన కార్యాలయం స్పష్టం చేసింది. కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ ముగ్గురు సభ్యులను జనవరిలో రాజ్యసభకు పంపనుంది. ఈ మూడు స్థానాలను ఆప్ పార్టీ నేతలను కాకుండా.. ఆయా రంగాల్లో నిష్ణాతులను పంపాలని అరవింద్ కేజ్రీవాల్ ఆలోచిస్తున్నట్లు తెలిసింది. అందులో భాగంగానే రఘురామ్ రాజన్ను రాజ్యసభకు పంపాలని నిర్ణయం తీసుకుంది. ఇదే విషయాన్ని ఆప్ పార్టీ నేత ఆశిష్ ఖేతన్ ట్విటర్లో వెల్లడించారు. See the contrast. @narendramodi recently sent @AmitShah to Rajya Sabha. While @ArvindKejriwal wants to send Mr. Raghuram Rajan to the upper house. — Ashish Khetan (@AashishKhetan) 8 November 2017 -
పెద్దల సభలో ఎన్డీయే సెంచరీ
సాక్షి, న్యూఢిల్లీ : జేడీ(యూ) చేరిక, ఏఐఏడీఎంకే మద్దతుతో రాజ్యసభలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి బలం 100 దాటింది. అయితే ఎన్డీఏ వ్యతిరేక కూటమి సంఖ్యాపరంగా 117 సీట్లతో ఇప్పటికీ పైచేయిగా ఉంది. ఎస్పీ, జేడీయూ, ఎన్సీపీల మధ్య విభేదాలతో ఇవి ఐక్యంగా ముందుకుపోలేని పరిస్థితి. రాజ్యసభలో మెజారిటీ సాధించాలంటే బీజేపీకి 123 సీట్లు అవసరం. యూపీ, ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించడంతో వచ్చే ఏడాది బీజేపీ 12కు పైగా స్ధానాలను గెలుపొందే వీలుంది. మరోవైపు గత రెండేళ్లలో పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం ఎదురవడంతో రాజ్యసభలో కాంగ్రెస్ బలం 65 సీట్ల నుంచి 57 సీట్లకు పడిపోయింది.పాలక బీజేపీ బలం పుంజుకుంటూ రాజ్యసభలో మెజార్టీ సాధించే దిశగా ముందుకెళుతున్నది. కొద్దినెలల్లో పీజే కురియన్ రిటైర్ అవుతున్న క్రమంలో కూటమి నేతను ఆ స్ధానంలో కూర్చుండబెట్టాలని ఎన్డీఏ భావిస్తోంది. ఇక ఏఐఏడీఎంకే వర్గాలు సైతం విలీనమై బీజేపీకి మద్దతు తెలిపే సంకేతాలతో ఆ పార్టీ ఎంపీలకు కేంద్ర క్యాబినెట్లో చోటు దక్కుతుందని సమాచారం. ఏఐఏడీఎంకే మద్దతు పొందితే రాజ్యసభలో ఎన్డీఏ బలం 102కు పెరుగుతుంది. వీరిలో 57 మంది బీజేపీ సభ్యులుకాగా, జేడీయూ(10), ఏఐఏడీఎంకే(13), టీడీపీ (6), శివసేన, అకాలీదళ్ల నుంచి ముగ్గురేసి సభ్యులు, ఇద్దరు పీడీపీ సభ్యులు, ఇతరులు నలుగురు సభ్యులున్నారు.వీరే కాక ఎన్డీఏకు రాజ్యసభలో కీలక సమయాల్లో అంశాల వారీగా టీఆర్ఎస్, వైసీపీ, ఐఎన్ఎల్డీ సభ్యుల మద్దతు కూడా లభిస్తున్నది. -
దేశంలో ఇదే అతిపెద్ద స్కాం...
న్యూఢిల్లీ : రూ 500 నోట్ల డిజైన్లు రెండు రకాలుగా ఉండటంపై రాజ్యసభలో మంగళవారం ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ నిలదీసింది. ఆర్బీఐ రెండు డిజైన్లు, సైజ్లతో రూ 500 నోట్లను ముద్రించడం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇది దేశంలోనే అతిపెద్ద కుంభకోణమని పేర్కొంది. కేంద్రం నోట్ల రద్దు ఎందుకు చేపట్టిందో తమకు ఇప్పుడు అర్ధమైందని, ఆర్బీఐ రెండు డిజైన్లలో రూ 500 నోట్లను ముద్రించడం దారుణమని సభలో ఆయా డిజైన్లను ప్రదర్శిస్తూ సీనియర్ కాంగ్రెస్ నేత కపిల్ సిబల్ ఆరోపించారు. పార్టీ కోసం ఒకటి, ప్రభుత్వం కోసం మరొకటి అంటూ తాము రెండు రకాల నోట్లను ఎన్నడూ ముద్రించలేదని మరో నేత గులాం నబీ ఆజాద్ విమర్శించారు. కాంగ్రెస్ లేవనెత్తిన అంశానికి తృణమూల్, జేడీయూ సభ్యులు మద్దతుగా నిలిచారు.కాంగ్రెస్ సభ్యుల వాదనను ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తోసిపుచ్చారు. కరెన్సీపై బాధ్యతారాహిత్యంగా వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. భారీస్ధాయిలో నోట్లు ముద్రించే క్రమంలో ఒకటీ అరా నోట్లు డిజైన్, సైజ్లో చిన్నపాటి వ్యత్యాసాలు ఉండటం సహజమేనన్నారు. -
ఏపీలో ఎంవోయూలు ఫుల్.. ప్రాజెక్టులు నిల్
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2016, 17లో నిర్వహించిన భాగస్వామ్య సదస్సుల్లో దేశ విదేశాలకు చెందిన వివిధ సంస్థలతో 996 ఒప్పందాలు(ఎంవోయూ) చేసుకుందని, మొత్తం రూ.15,33,219కోట్ల పెట్టుబడులతో రాష్ట్రంలో 1,629 ప్రాజెక్టులు నెలకొల్పడానికి ఒప్పందాలు జరిగిందని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. దీనికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి మంగళవారం రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక వ్యవహారాల శాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ సమాధానం ఇచ్చారు. 2016లో నిర్వహించిన భాగస్వామ్య సదస్సులో మొత్తం రూ.4,78,788 కోట్ల పెట్టుబడులతో 331 ఎంవోయూలపై రాష్ట్ర ప్రభుత్వం సంతకాలు చేసిందని, వీటిలో రూ.2,83,943 కోట్ల పెట్టుబడుల అంచనాతో కుదుర్చుకున్న 99 ఎంవోయూలకు సంబంధించి ఆయా సంస్థలు ఇప్పటి వరకు డీపీఆర్లు సమర్పించలేదని పేర్కొన్నారు. అలాగే, రూ.31,000కోట్ల పెట్టుబడుల అంచనాలతో కుదుర్చుకున్న 6 ఎంవోయూలపై ఎలాంటి పురోగతి లేకపోవడంతో వాటిని వదులుకోవాల్సి వచ్చిందన్నారు. 2017 భాగస్వామ్య సదస్సులో మొత్తం రూ.10,54,431కోట్ల పెట్టుబడుల అంచనాలతో వివిధ సంస్థలతో రాష్ట్ర ప్రభుత్వం 665 ఎంవోయూలను కుదుర్చుకుందన్నారు. అయితే, వీటిలో 6,33,892కోట్ల పెట్టుబడులతో కుదుర్చుకున్న 335 ఎంవోయూలకు సంబంధించి ఆయా సంస్థలు ఇంకా డీపీఆర్లు సమర్పించలేదన్నారు. రూ.1,75,000 కోట్లు రూపాయలు పెట్టుబడులు అంచనాతో కుదుర్చుకున్న 12 ఎంవోయూల విషయంలో ఆయా సంస్థలతో ఎలాంటి పురోగతి లేకపోవడంతో వాటిని రద్దయినట్లు చెప్పారు. వైజాగ్ ఎయిర్పోర్ట్లో సదుపాయాలకు వినతులు విశాఖపట్నం విమానాశ్రయంలో ప్రయాణీకులకు మెరుగైన సదుపాయాలు కల్పించాల్సిందిగా కోరుతూ ఆంధ్రప్రదేశ్ ఎయిర్ ట్రావెలర్స్ అసోసియేషన్ నుంచి ఈ ఏడాది తమకు రెండుసార్లు విజ్ఞప్తులు వచ్చినట్లు పౌర విమానాయాన శాఖ సహాయ మంత్రి జయంత్ సిన్హా తెలిపారు. ఈ మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పారు. -
రాజ్యసభకు చేరిన చాపరాయి ఘటన
గిరిజనుల మృతిపై కేంద్రం జోక్యం చేసుకోవాలి పెద్దలసభలో ఎంపీ విజయసాయిరెడ్డి న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ను కుదిపేసిన చాపరాయిలో గిరిజనుల మృతి ఘటనను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి బుధవారం రాజ్యసభలో లేవనెత్తారు. గిరిజనుల మృతికి ఫుడ్పాయిజనే కాదు, ఇతర కారణాలు ఉన్నాయని ఆయన సభ దృష్టికి తీసుకొచ్చారు. చాపరాయి ఏజెన్సీ ప్రాంతంలో రక్షిత తాగునీరు, రోడ్డుసౌకర్యం వంటివి అందుబాటులో లేవని తెలిపారు. గత ఏడాది కూడా ఆంధ్రప్రదేశ్లో గిరిజనులు మృత్యువాత పడ్డారని ఆందోళన వ్యక్తం చేశారు. చాపరాయి ఘటనపై కేంద్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఏపీలో గిరిజన సలహా మండలి ఏర్పాటు చేయకపోవడం రాజ్యాంగ ఉల్లంఘనేనని ఆయన స్పష్టం చేశారు. కేంద్రమంత్రి సలహా ఇచ్చి మూడేళ్లైనా గిరిజన మండలిని ఏర్పాటు చేయలేదని విజయసాయిరెడ్డి తెలిపారు. ఈ అంశంపై కేంద్ర గిరిజనశాఖ మంత్రి జుయల్ ఓరం సమాధానమిస్తూ.. గిరిజన సలహా మండలి ఏర్పాటుచేయడం ముఖ్యమంత్రి బాధ్యత అని స్పష్టం చేశారు. సీఎం చంద్రబాబే చైర్మన్గా సలహా మండలి తర్వగా ఏర్పాటుచేయాలని తాము సూచించామని చెప్పారు. తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరం ఏజెన్సీ ప్రాంతంలోని చాపరాయి గ్రామంలో 16 మంది గిరిజనులు ఆకస్మికంగా మృత్యువాత పడిన సంగతి తెలిసిందే. -
ప్రైవేట్ మెంబర్ బిల్లు ప్రవేశపెట్టిన విజయసాయిరెడ్డి
న్యూఢిల్లీ: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయసాయి రెడ్డి శుక్రవారం రాజ్యసభలో రెండు ప్రయివేట్ బిల్లులు ప్రవేశపెట్టారు. పరువు హత్యల నివారణ చట్టాన్ని తీసుకురావాలని, స్విస్ ఛాలెంజ్ను నియంత్రించాలంటూ ఆయన ప్రయివేట్ మెంబర్ బిల్లు పెట్టారు. పరువు హత్యల నిరోధం, భాగస్వామిని ఎంచుకునే స్వేచ్ఛ ఉండేలా చట్టం తేవాలంటూ విజయసాయిరెడ్డి ప్రయివేటు బిల్లు ప్రతిపాదించారు. ‘పరువు పేరుతో నేరాల నిరోధం–భాగస్వామిని ఎంచుకునే స్వేచ్ఛలో జోక్యం నిరోధం బిల్లు–2017’ను విజయసాయిరెడ్డి ప్రయివేటు మెంబర్ బిల్లుగా ప్రతిపాదించారు. ఈ బిల్లు ప్రవేశపెట్టడానికి గల ఉద్దేశాలు, కారణాలను వివరిస్తూ.. యువత వివాహం చేసుకునేందుకు భాగస్వామిని ఎంచుకున్నప్పుడు కుటుంబం, కులం, మతం చూపుతూ పరువు పేరుతో వాటిని నిరాకరించడమే కాకుండా నేరాలకు పాల్పడటం ఇటీవల కాలంలో పెరిగిపోయిందని పేర్కొన్నారు. ఈ నేరాలు పౌరుల ప్రాథమిక హక్కులను ఉల్లంఘిస్తున్నాయని పేర్కొన్నారు. పరువు పేరుతో యువతీ యువకుల వివాహ భాగస్వామి ఎంపిక స్వేచ్ఛను హరిస్తున్నారని, ఈ తరహా నేరాలు ఆర్టికల్ 16(1)(బి)ని ఉల్లంఘిస్తున్నాయని వివరించారు. ప్రస్తుతం ఉన్న చట్టాలు ఈ తరహా ఇబ్బందులు ఎదుర్కొంటున్న జంటలకు రక్షణ కల్పించలేకపోతున్నాయని తెలిపారు. ప్రస్తుత బిల్లు ఇలా ఇబ్బందులు ఎదుర్కొనే వారికి జీవించే హక్కును కల్పించడంతోపాటు వేధింపులు, హింస, స్వేచ్ఛాయుత ఎంపికలో జోక్యాన్ని నిరోధిస్తుందని పేర్కొన్నారు. స్విస్ ఛాలెంజ్ విధాన నియంత్రణ బిల్లు.. స్విస్ ఛాలెంజ్ విధానంలో ఇచ్చే కాంట్రాక్టులలో అయాచిత ప్రతిపాదనలు ఆమోదించడాన్ని నియంత్రించేందుకు గాను రాజ్యసభలో విజయసాయిరెడ్డి బిల్లును ప్రతిపాదించారు. మౌలిక వసరుల ప్రాజెక్టుల అభివృద్ధిలో ప్రయివేటు రంగం పాత్ర ఇటీవల బాగా పెరిగిపోయిందని, కాంట్రాక్టులు ఇవ్వడంలో పారదర్శకతను ఇది సవాలు చేస్తోందని బిల్లు ప్రతిపాదనకు గల కారణాలు, ఉద్దేశాలు శీర్షికన వివరించారు. స్విస్ ఛాలెంజ్ విధానంలో ప్రాజెక్టు ప్రతిపాదిత సంస్థకు ఎలాంటి అదనపు ప్రయోజనం ఒనగూరకుండా రాష్ట్రాలు తగిన అధ్యయనం ద్వారా పరామితులు విధించాలన్నది ఈ బిల్లు ముఖ్య ఉద్దేశంగా వివరించారు. మౌలిక వసతుల ప్రాజెక్టులను కాంట్రాక్టుగా ఇచ్చినప్పుడు వాటిలో పారదర్శకతో ఉండేలా ఈ స్విస్ ఛాలెంజ్ విధానాన్ని నియంత్రించాలని పేర్కొన్నారు. -
రాజ్యసభను కుదిపేసిన వివాదస్పద వ్యాఖ్యలు
న్యూఢిల్లీ : పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తలనరికి తెచ్చినవాళ్లకు రూ. 11 లక్షలు రివార్డ్ ఇస్తానని బీజేపీ యువమోర్చా నాయకుడు యోగేష్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు రాజ్యసభను కుదిపేశాయి. ఓ మహిళా ముఖ్యమంత్రిపై బీజేపీ నేత నోటికొచ్చినట్టు మాట్లాడడంపై విపక్షాలు మండిపడ్డాయి. కేంద్రం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశాయి. పార్టీ నాయకుడు చేసిన ప్రకటనను బీజేపీ కనీసం ఖండించకపోవడంపై మహిళా ఎంపీలు అభ్యంతరం వ్యక్తం చేశారు. వివాదాస్పద వ్యాఖ్యల చేసిన యోగేష్పై చర్యలు తీసుకోవాలని టీఎంసీ డిమాండ్ చేశారు ఈ అంశంపై చర్చ చేపట్టాలని విపక్ష సభ్యులు డిమాండ్ చేయడంతో... సభలో కాసేపు గందరగోళం నెలకొంది. మరోవైపు గో సంరక్షణకు పెద్దపీట వేస్తున్న మోదీ సర్కార్ మహిళలను మాత్రం పట్టించుకోదా అంటూ సమాజ్వాదీ పార్టీ ఎంపీ జయాబచ్చన్ కేంద్రంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మరోవైపు లోక్సభలోనూ ఇదే అంశంపై గందరగోళం నెలకొంది. అనంతరం లోక్సభ సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. -
‘గిరిజన సలహామండలి ఏర్పాటు చేయాలి’
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్లో గిరిజన సలహామండలి ఏర్పాటులో జాప్యంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి బుధవారం రాజ్యసభలో ప్రశ్నించారు. రాజ్యసభలో ఇవాళ ప్రశ్నోత్తరాల సందర్భంగా వనబంధు కల్యాణ్ యోజనపై లేవనెత్తిన ప్రశ్నపై విజయసాయిరెడ్డి అనుబంధ ప్రశ్న వేస్తూ గిరిజన సలహా మండలి ఏర్పాటు రాజ్యాంగంలోని అయిదవ షెడ్యూలు కింద విధిగా జరగాల్సి ఉందన్నారు. కానీ ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్ళు గడచిపోయిందని, అయినప్పటికీ గిరిజన సలహా మండలి ఏర్పాటు చేయకుండా ప్రభుత్వం తీవ్రమైన తాత్సారం చేస్తోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరిపై కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకుంటుందని ఆయన ఈ సందర్భంగా కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి జుయల్ ఓరామ్ ప్రశ్నించారు. దీనికి మంత్రి సమాధానం చెబుతూ ఏ రాష్ట్రంలోనైనా గిరిజన సలహా మండలి ఏర్పాటు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నేతృత్వంలో జరుగుతుంది. సలహా మండలిలో ఏజెన్సీ ప్రాంత ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా సభ్యులుగా ఉంటారని, దీనిపై కేంద్రం ఆయా రాష్ట్రాలతో ప్రతి ఏడాదీ రెండుసార్లు సంప్రదింపులు జరగాల్సి ఉంది. ఆ విధంగా ఆయా రాష్ట్రాలతో సంప్రదింపులు కచ్చితంగా జరిగేలా చర్యలు తీసుకుంటామని సమాధానం ఇచ్చారు. కాగా ఏపీలో గిరిజనుల సంక్షేమం, వారి అభివృద్ధి గురించి సలహాలు, సూచనలు ఇవ్వడానికి.. రాజ్యాంగంలోని 5వ షెడ్యూల్లోని 4వ పేరా ప్రకారం గిరిజన సలహా మండలి ఏర్పాటు అనేది తప్పనిసరి అంశం. ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేళ్లు అయినా ఆ ఊసేలేదు. కాగా వైఎస్ఆర్ సీపీ నుంచి ఆరుగురు గిరిజన ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే గిరిజన సలహా మండలిని నియమిస్తే అందులో ఎక్కువమంది వైఎస్సార్సీపీ సభ్యులు ఉంటారనే ప్రభుత్వం తాత్సారం చేస్తోంది. -
భవనం నిర్మిస్తే హైకోర్టు ఏర్పాటుకు చర్యలు
న్యూఢిల్లీః ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తగిన భవనం నిర్మిస్తే హైకోర్టు ఏర్పాటు చేసేందుకు వేగవంతంగా చర్యలు తీసుకుంటామని కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ తెలిపారు. బుధవారం ఉదయం ప్రశ్నోత్తరాల సమయంలో టీడీపీ లోక్సభాపక్ష నేత తోట నరసింహం అడిగిన ఓ ఉప ప్రశ్నకు రవిశంకర్ప్రసాద్ జవాబు ఇచ్చారు. ‘కొత్త రాష్ట్రం ఏర్పడినప్పుడు అక్కడ ఒక హైకోర్టు కూడా ఉండాలి. తెలంగాణ కొత్త రాష్ట్రం. పునర్ వ్యవస్థీకరణ చట్టం ప్రకారం హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా పదేళ్లపాటు కొనసాగుతుంది. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సంప్రదింపులు జరుపుతున్నాను. ఆంధ్రప్రదేశ్లో త్వరితగతిన భవనాన్ని నిర్మిస్తే హైకోర్టు ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేస్తాం..’ అని పేర్కొన్నారు. -
10 జిల్లాల్లో కరువు : విజయసాయిరెడ్డి
ఢిల్లీ : ఏపీలో తీవ్రకరువు ఏర్పడిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, రాజ్యసభ సభ్యుడు వీ విజయసాయిరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. 13 జిల్లాలకు 10 జిల్లాలు కరువు బారిన పడ్డాయని రాజ్యసభలో వివరించారు. కరువుతో వందలమంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని చెప్పారు. వేలమంది కార్మికులుగా వలసపోతున్నారని పేర్కొన్నారు. పశుగ్రాసం లేక రైతులు పశువులను కబేళాలకు అమ్ముతున్నారని తెలిపారు. కేంద్రం స్పందించి ఏపీని ఆదుకోవాలని రాజ్యసభలో విజయసాయిరెడ్డి కోరారు. -
శెనగ రైతులకు బీమా ఎందుకివ్వట్లేదు?
న్యూఢిల్లీ: రాయలసీమ ప్రాంతంలోని పలు జిల్లాల వేరు శెనగ పంట రైతులకు బీమా ఇచ్చేందుకు అగ్రికల్చర్ ఇన్సురెన్స్ కంపెనీ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఏఐసీఐ) నిరాకరించిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, రాజ్యసభ సభ్యుడు వీ విజయసాయిరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నిసార్లు రైతులు విజ్ఞప్తి చేసుకున్నప్పటికీ ఏఐసీసీ బీమా కల్పించేందుకు నిరాకరించిందని, అందుకుగల కారణాలేమిటో తెలియజేయాలని ఆయన రాజ్యసభలో వ్యవసాయం, రైతుల సంక్షేమశాఖను డిమాండ్ చేశారు. ఇదే సమయంలో ప్రధాన్ మంత్రి ఫసల్ బీమా యోజన(పీఎంఎఫ్బీవై) లక్ష్యాలు, ఉద్దేశం ఏమిటని, దీనికింద ఏయే రకాల పంటలు కవర్ అవుతున్నాయని ప్రశ్నించారు. దీనికి సంబంధితశాఖ సహాయమంత్రి పర్శోత్తమ్ రుపాల లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఖరీఫ్ 2016లో వేరుశెనగలాంటి పంటలకు బీమా కల్పించేందుకు బజాజ్ అలియాంజ్ జనరల్ ఇన్సురెన్స్ కంపెనీతో బిడ్డింగ్ ద్వారా ఒప్పందం కుదుర్చుకుందని అందులో తెలియజేశారు. అలాగే, పీఎంఎఫ్బీవై ఉద్దేశం, లక్ష్యాలు తెలియజేస్తూ వ్యవసాయరంగంలో నిరంతర ఉత్పత్తిని ప్రోత్సాహించేందుకు ఈ పథకం తీసుకొచ్చామని వివరణ ఇచ్చారు. పంట విరామం, పంట నష్టం, ప్రకృతి విపత్తువంటి సమయాల్లో రైతులకు ఆర్థిక భరోసా కల్పిస్తామని పేర్కొన్నారు. వ్యవసాయంలో ఆధునిక పోకడలను మరింత అనుసరించేలా నవీన కల్పనలను ప్రోత్సహిస్తామని చెప్పారు. -
ఏపీలో 8,662 ఏకోపాధ్యాయ పాఠశాలలు
న్యూఢిల్లీ: ఒకే ఉపాధ్యాయుడు ఉన్న పాఠశాలలు(ఏకోపాధ్యాయ పాఠశాలలు) ప్రాథమిక స్థాయిలో దేశంలో 97,923 ఉన్నాయని, మాధ్యమిక స్థాయిలో 11.05 లక్షల పాఠశాలలు ఉన్నాయని కేంద్రం స్పష్టం చేసింది. గురువారం రాజ్యసభలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు సంబంధిత మానవ వనరుల శాఖ(ఎంహెచ్ఆర్డీ) లిఖిత పూర్వక సమాధానం ఇచ్చింది. అలాగే, ఈ పాఠశాలల్లో శాతంవారిగా చూస్తే ఏపీకి చెందినవి 8.84శాతం ఉన్నాయని, సంఖ్యవారీగా 8662 పాఠశాలలు ఒకే ఉపాధ్యాయుడితో నడుస్తున్నాయని కూడా ఎంహెచ్ఆర్డీ తెలిపింది. అయితే ఇలాంటి పాఠశాలల్లో మరింతమంది విద్యార్థులను పెంపొందించేందుకు ఆర్థిక సహాయాన్ని సర్వశిక్ష అభియాన్, రాష్ట్రీయ మాధ్యమిక్ శిక్ష అభియాన్ (ఆర్ఎంఎస్ఏ) కింద అందిస్తామని తెలిపారు. ఈ సంస్థల సహాయంతో విద్యార్థులు టీచర్ల నిష్పత్తి సమానంగా ఉండేలా చూస్తామని అందులో పేర్కొన్నారు. మరోపక్క, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సర్కారీ బడులను కార్పొరేట్ సంస్థలకు, కార్పొరేట్ స్కూళ్లకు, ప్రైవేట్ సంస్థలకు కేటాయించే అనుమతులు కోరిందా అన్న ప్రశ్నకు అలాంటిదేం లేదని, తమ వద్దకు ఇంకా ఆ విషయం రాలేదని మానవ వనరుల శాఖ తెలిపింది. మరోపక్క, ఏపీలోని నెల్లూరు జిల్లా కావలిలో అణువిద్యుత్ ప్లాంట్ ఏర్పాటుచేయనున్నారా అన్న ప్రశ్నకు అదేం లేదని కూడా కేంద్రం విజయసాయిరెడ్డికి ఇచ్చిన లిఖితపూర్వక వివరణలో బదులిచ్చింది. -
చర్చలు లేకుండానే నిరవధిక వాయిదా
ఎలాంటి చర్చలు లేకుండానే రాజ్యసభ శీతాకాల సమావేశాలు నిరవధిక వాయిదా పడ్డాయి. ప్రధాని మోదీ సభకు వచ్చిన కొద్ది సేపటికీ సమావేశాలు నిరవధిక వాయిదా వేస్తున్నట్టు రాజ్యసభ చైర్మన్ హమ్మీద్ అన్సారీ ప్రకటించారు. నవంబర్ 15 నుంచి ఈ శీతాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. ప్రారంభమైనప్పటి నుంచి పెద్దనోట్ల రద్దు, అగస్టా వెస్ట్ ల్యాండ్ కుంభకోణంతో పాటు ఇతర అంశాలు రాజ్యసభను కుదిపేశాయి. అధికార, ప్రతిపక్షాల మధ్య వాగ్వాదం, పట్టువిడుపులు విడవకపోవటంతో ఒక్క రోజు కూడా ఎలాంటి చర్చలేకుండానే రాజ్యసభ సమావేశాలు నిరవధిక వాయిదా పడ్డాయి. కేవలం రెండు బిల్లులను మాత్రమే ఈసారి పార్లమెంట్ సమావేశాల్లో ఆమోదించారు. ఒకటి పెద్ద నోట్ల రద్దు తర్వాత తేలే నల్లధనంపై కొరడా ఝళిపించేందుకు కేంద్ర ప్రభుత్వం కఠిన సవరణలతో తీసుకొచ్చిన ఆదాయపు పన్ను చట్టం. ఆ బిల్లు లోక్సభలో ఎలాంటి చర్చ లేకుండానే ఆమోదం పొందింది. రెండోది గత యూపీఏ ప్రభుత్వం చివరి రోజుల్లో తీసుకొచ్చిన దివ్యాంగుల చట్ట సవరణ బిల్లు. 119 సవరణలతో తీసుకొచ్చిన ఈ బిల్లును ఎట్టకేలకు రాజ్యసభ ఆమోదించింది. అసమ్మతి, అంతరాయం, ఆందోళనల మధ్య వ్యత్యాసాన్ని అన్ని సెక్షన్ల వారు తమను తాము పరిశీలించుకోవాల్సినవసరం ఉందని వైస్ ప్రెసిడెంట్ హమ్మీద్ అన్సారీ అన్నారు. -
యూనెస్కో రిపోర్టులు నిజమేనా?
న్యూఢిల్లీ: యూనివర్సల్ ఎడ్యుకేషన్ లక్ష్యాలను భారత్ 50 ఏళ్లు ఆలస్యంగా అందుకుంటుందని యూనెస్కో పేర్కొన్నట్లు కేంద్ర మానవవనరుల అభివద్ధి శాఖ సహాయమంత్రి ఉపేంద్ర కుష్వాహా వెల్లడించారు. రాజ్యసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా యూనెస్కో రిపోర్టులపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి గురువారం రాజ్యసభలో ప్రశ్నించారు. ఎంపీ ప్రశ్నలకు స్పందించిన కేంద్రమంత్రి లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. యూనెస్కో రిపోర్టులపై ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నలు ఇలా ఉన్నాయి. 1. ఈ ఏడాది విడుదల చేసిన యూనెస్కో రిపోర్టుల్లో యూనివర్సల్ ఎడ్యుకేషన్ లక్ష్యాలను భారత్ యాభై ఏళ్లు ఆలస్యంగా అందుకుంటుందనే మాట నిజమేనా? జవాబు: యూనివర్సల్ ఎడ్యుకేషన్ లక్ష్యాలను భారత్ 50ఏళ్లు ఆలస్యంగా అందుకుంటుందని యూనెస్కో ఇచ్చిన రిపోర్టు వాస్తవమే. 2. ప్రాథమిక విద్యను 2050కు, యూనివర్సల్ లోయర్ సెకండరీ ఎడ్యుకేషన్ ను 2060కు, యూనివర్సల్ అప్పర్ సెకండరీ ఎడ్యుకేషన్ ను 2085కు భారత్ అందుకుంటుందని యూనెస్కో పేర్కొందా? జవాబు: ప్రాథమిక విద్యను 2050కు, సెకండరీ ఎడ్యుకేషన్(ఆరు నుంచి ఎనిమిదో తరగతి వరకూ)ను 2060కు, అప్పర్ సెకండరీ ఎడ్యుకేషన్(తొమ్మిది, పది తరగతులు)ను 2085కు అందుకుంటుందని యూనెస్కో పేర్కొన్నట్లు అంగీకరించారు. 3. 2030లోగా విద్యారంగంలో ప్రాథమిక మార్పులు చేస్తేనే విద్యారంగం స్ధిరత్వానికి వస్తుందనే రిపోర్టు కూడా నిజమేనా? జవాబు: విద్యారంగంలో ప్రాథమిక మార్పులు కారణంగా స్ధిరత్వం ఏర్పడుతుందని గతంలో చేసిన సర్వేల ఆధారంగా యూనెస్కో చేసిన సూచన. ఇందులో మానవ వనరుల అభివృద్ధి శాఖ ప్రమేయం లేదు. 2009లో అమల్లోకి వచ్చిన ఉచిత, నిర్భంద విద్య చట్టం కింద కేంద్ర ప్రభుత్వం సర్వశిక్షా అభియాన్ పేరిట ప్రాథమిక, అప్పర్ ప్రైమరీ లెవల్స్ లో పిల్లలకు విద్యను అందిస్తోంది. యూనివర్సల్ ఎడ్యుకేషన్ గుర్తింపుకు తగినంత మంది విద్యార్థులకు ఈ చట్టం కింద విద్య అందుతోంది. యూనెస్కో రిపోర్టు పాత ట్రెండ్స్ ఆధారంగా చేసింది. ప్రస్తుతం పరిస్ధితుల్లో యూనివర్సల్ ఎడ్యుకేషన్ లక్ష్యాలను యూనెస్కో రిపోర్టుల కంటే ముందే భారత్ అందుకుంటుందనే భరోసా ఉంది. -
ప్రధాని ఎప్పుడూ ఇక్కడే ఉండాలంటే ఎలా?
పెద్దనోట్ల రద్దుపై రాజ్యసభలో చర్చ పదే పదే వాయిదాలతో సరిపోయింది. పార్లమెంటు శీతాకాల సమావేశాల సందర్భంగా మొదటి రెండు మూడు రోజులు అసలు సభా కార్యకలాపాలే సక్రమంగా సాగలేదు. గురువారం రాజ్యసభలో చర్చకు అనుమతించడంతో.. అది మొదలైనా, అధికార.. ప్రతిపక్షాల వాగ్వాదంతో వాయిదాల పర్వం కొనసాగింది. మధ్యాహ్నం 2 గంటల సమయంలో సభ ప్రారంభమైనప్పుడు ప్రతిపక్ష నేతలు సీతారాం ఏచూరి, గులాం నబీ ఆజాద్ ప్రధానమంత్రి సభలో ఎందుకు లేరని ప్రశ్నించారు. సమయం చాలా అయ్యిందని, అందువల్ల ఆయన వస్తే చర్చ విని దానికి సమాధానం ఇస్తే బాగుంటుందని సీతారాం ఏచూరి సూచించారు. ప్రధాని కేవలం ప్రశ్నోత్తరాల సమయం కోసమే వచ్చారా.. అలాగైతే చర్చ జరగదని, చర్చకోసం వస్తే ఇప్పుడు కూడా ఉండాలని గులాం నబీ ఆజాద్ అన్నారు. చర్చ మొదలైనప్పుడు వచ్చి, తర్వాత వెళ్లిపోయారని.. ఆయన వస్తే తప్ప సభను నడవనిచ్చేది లేదని ఆయన స్పష్టం చేశారు. ఈ సమయంలో జోక్యం చేసుకున్న రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పీజీ కురియన్.. ప్రధానమంత్రి ఎప్పుడూ ఇక్కడే ఉండాలంటే కుదరదని చెప్పారు. ఆయన వస్తారని ప్రభుత్వం చెబుతోందని, అందువల్ల సభను సజావుగా నడవనివ్వాలని కోరారు. ఇప్పటికిప్పుడే ఆయన రావాలని మీరు అడగడం సరికాదని అన్నారు. అయినా ప్రతిపక్ష సభ్యులు వినలేదు. దాంతో సభాధ్యక్షుడు అరుణ్ జైట్లీని స్పష్టత ఇవ్వాల్సిందిగా కురియన్ కోరారు. దానికి ఆయన సమాధానం ఇస్తూ... ''ప్రధానమంత్రి చర్చకు వస్తారా రారా అని ప్రతిపక్షం అడిగింది, ఆయన పాల్గొంటారని చెప్పాం. మాకు ఒక అనుమానం ఉంది.. అది నిజమని ఇప్పుడు అనిపిస్తోంది. ప్రతిపక్షం చర్చ నుంచి పారిపోవాలనుకుంటోంది. అందుకు కారణాలు వెతుక్కుంటోంది. ఇది ఓ కొత్త పద్ధతి. చర్చ మొదలైంది, కొనసాగుతోంది.. కొనసాగించండి. ప్రధానమంత్రి కూడా చర్చలో పాల్గొంటారు. అందులో అనుమానం ఏమీ లేదు. చర్చ కొనసాగినంత సేపూ ప్రధానమంత్రి పూర్తిగా సభలోనే ఉండటం ఇప్పటివరకు ఎప్పుడూ లేదు. మేం మాత్రం చర్చను ఆపాలని అనుకోవడం లేదు. వాళ్లు అనుకుంటే వాళ్ల ఇష్టం'' అని అరుణ్ జైట్లీ మండిపడ్డారు. ఆయన సమాధానంతో ప్రతిపక్ష సభ్యులు ఒక్కసారిగా వెల్లోకి దూసుకొచ్చారు. ప్రధానమంత్రి వచ్చి తీరాల్సిందేనని డిమాండు చేస్తూ, ప్రధానమంత్రి పారిపోయారని నినాదాలు చేశారు. పరిస్థితిని అదుపు చేసేందుకు డిప్యూటీ చైర్మన్ కురియన్ చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో ఆయన సభను మధ్యాహ్నం 3 గంటలకు వాయిదా వేశారు. -
ప్రధానికే ప్రాణభయమా? మరి దేశం పరిస్థితి!!
-
ప్రధానికే ప్రాణభయమా? మరి దేశం పరిస్థితి!
క్యూ లైన్లలో నిలబడ్డ కోటీశ్వరులేరి? రాజ్యసభలో వాడీవేడి చర్చ న్యూఢిల్లీ: పెద్దనోట్ల రద్దుపై రాజ్యసభలో వాడీవేడిగా చర్చ కొనసాగుతోంది. ప్రధాని మోదీ రాజ్యసభకు రావడంతో ఈ అంశంపై ప్రతిపక్ష సభ్యులు మొదట మాట్లాడుతూ.. ప్రభుత్వ తీరును ఎండగట్టారు. పెద్దనోట్ల రద్దు వంటి సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నందుకు తనను కొంతమంది బతుకనివ్వకపోవచ్చునని, తనకు ప్రాణభయం ఉందని ప్రధాని మోదీ పేర్కొనడాన్ని సమాజ్వాదీ ఎంపీ నరేశ్ అగర్వాల్ తప్పుబట్టారు. సాక్షాత్తూ ప్రధానికే ప్రాణభయం ఉంటే.. దేశాన్ని ఎవరూ కాపాడుతారని ఆయన ప్రశ్నించారు. పెద్దనోట్ల రద్దు వల్ల సామాన్య ప్రజలే కష్టాలు పడుతున్నారని, బ్యాంకుల ముందు క్యూలైన్లలో కోటీశ్వరులు ఎవరైనా నిలబడ్డరా కేంద్రాన్ని ప్రశ్నించారు. పెద్దనోట్ల రద్దుతో దేశంలో రెండో ఎమర్జెన్సీ విధించినట్టయిందని విమర్శించారు. ఎమర్జెన్సీ సమయంలోనూ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అండగా ఉన్నారని అప్పటి ప్రధాని ఇందిరాగాంధీకి నివేదికలు అందాయని, కానీ ఆ తర్వాత ఎన్నికల్లో ఏం జరిగిందో అందరికీ తెలుసనని ఆయన పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని పెద్దనోట్లను రద్దు చేశారని ఆయన ఆరోపించారు. భవిష్యత్తులో పెద్దనోట్ల రద్దులాంటి నిర్ణయాలు తీసుకోవాలంటే లోక్సభ, రాజ్యసభ అనుమతి తప్పనిసరి చేయాలని డిమాండ్ చేశారు. ఏసీబీలో విజయ్ మాల్యాలాంటి పెద్దలకు రూ. 7వేల కోట్ల రుణాలను ఎలా మాఫీ చేశారని కేంద్రాన్ని ప్రశ్నించారు. విదేశాల్లోని నల్లధనాన్ని ఎప్పుడు తీసుకొస్తారని ప్రశ్నించారు. కనీసం ఆర్థకమంత్రి జైట్లీని సైతం విశ్వాసంలోకి తీసుకోకుండా పెద్దనోట్ల రద్దును ప్రకటించారని విమర్శించారు. బ్యాంకుల నుంచి నగదు విత్డ్రాపై ఆంక్షలు పెడితే.. ప్రజలు మిమ్మల్ని నిషేధిస్తారని మోదీ సర్కార్ను హెచ్చరించారు. -
నోట్ల రద్దు: మన్మోహన్ లేచి నిలబడగానే..!
-
నోట్ల రద్దు: మన్మోహన్ లేచి నిలబడగానే..!
న్యూఢిల్లీ: పెద్దనోట్ల రద్దు అంశంపై రాజ్యసభలో గురువారం కూడా గందరగోళ దృశ్యాలు పునరావృతమయ్యాయి. పెద్దనోట్ల రద్దుపై సభలో మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ లేచి నిలబడి మాట్లాడేందుకు ఉద్యుక్తుడవుతుండగానే మళ్లీ గందరగోళం చెలరేగింది. దీంతో మన్మోహన్ నోరు తెరిచి ఒక్క మాటైనా మాట్లాడకముందే సభ మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా పడింది. నోట్ల రద్దు అంశంపై మాజీ ప్రధాని మన్మోహన్ మాట్లాడుతారని కాంగ్రెస్ సభాపక్ష నేత ఆజాద్ డిప్యూటీ స్పీకర్ కురియన్కు తెలిపారు. మన్మోహన్ మాట్లాడితే ఎవరు వద్దన్నారంటూ కురియన్ బదులిచ్చారు. దీంతో మాట్లాడేందుకు మన్మోహన్ లేచి నిలబడ్డారు. ఇంతలోనే ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ జోక్యం చేసుకున్నారు. నోట్ల రద్దుపై రాజ్యసభలో చర్చను తిరిగి ప్రారంభించాలనుకుంటే.. ప్రారంభించవచ్చునని, అంతేకానీ సంప్రదాయాలకు విరుద్ధంగా మరోసారి ప్రతిపక్షానికి ప్రత్యేక అవకాశం ఇవ్వకూడదని జైట్లీ పేర్కొన్నారు. కొత్త విధానాలు తీసుకురావొద్దని అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య వాగ్వాదంతో సభ వాయిదా పడింది. వాయిదా అనంతరం రాజ్యసభ తిరిగి ప్రారంభం కాగానే.. సంప్రదాయం ప్రకారం నోట్ల రద్దుపై మన్మోహన్ తిరిగి చర్చను ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ నల్లధనాన్ని అరికట్టేందుకే పెద్దనోట్లను రద్దు చేశారని ప్రధాని మోదీ అంటున్నారని, కానీ ఆయన అభిప్రాయంతో తాను ఏకీభవించడం లేదని తెలిపారు. పెద్దనోట్ల రద్దుతో దేశంలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయని, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. నోట్ల రద్దు ప్రవేశపెట్టిన విధానం సరిగ్గా లేదని కేంద్రాన్ని తప్పుబట్టారు. నోట్ల రద్దుతో గ్రామీణ ఆర్థిక వ్యవస్థలకు సహకారం అందించే కోఆపరేటివ్ బ్యాంకులు కుదేలయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు. మన్మోహన్ ప్రసంగంలోని కీలకాంశాలు నోట్ల రద్దు అమలులో తీవ్రలోపాలు ఉన్నాయి. 60 నుంచి 65 మంది ప్రాణాలు కోల్పోయారు నోట్ల రద్దుతో తీవ్రవాదులకు నిధులు అడ్డుకట్ట వేయగలమని చెప్తున్నారు.. దీనిని తిరస్కరించడం లేదు నోట్ల రద్దుతో కరెన్సీ, బ్యాంకుల వ్యవస్థపై ప్రజలు నమ్మకం కోల్పోయారు. ప్రధాని 50 రోజులు ఆగమంటున్నారు. కానీ పేదలకు ఇది ఏ రకంగా ఉపయోగపడుతుంది. నోట్ల రద్దు వెనుక ఉద్దేశాలను నేను వ్యతిరేకించడం లేదు. ఈ విషయంలో ప్రజల కష్టాలు దూరం చేసేందుకు కొన్ని నిర్మాణాత్మకమైన ప్రతిపాదనలతో ప్రధాని ముందు రావాలి. బ్యాంకులో డబ్బులు డిపాజిట్ చేస్తే తిరిగి ఇవ్వలేని దేశం ఏదైనా ఉందా? నోట్ల రద్దు వ్యవస్థీకృతమైన దోపిడీ జరుగుతోంది. చట్టపరంగా చేసిన భారీ తప్పిదం ఇది. నోట్ల రద్దు కారణంగా జీడీపీ రెండుశాతం తగ్గింది. ఈ విషయంలో ఆర్బీఐని తప్పుబట్టడంలో సరైనదే. -
సభకు మోదీ.. కాంగ్రెస్ హక్కుల తీర్మానం!
న్యూఢిల్లీ: పెద్దనోట్ల రద్దుపై పార్లమెంటు ఉభయసభల్లో గందరగోళం చెలరేగుతున్న నేపథ్యంలో గురువారం తొలిసారిగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ రాజ్యసభకు హాజరయ్యారు. మధ్యాహ్నం ఒంటిగంటకు ప్రధాని మోదీ రాజ్యసభలో మాట్లాడనున్నారు. పెద్దనోట్ల రద్దు అంశంపై ప్రధాని మోదీ సభలో సమాధానం ఇవ్వాలని పట్టుబడుతూ ప్రతిపక్షాలు గత మూడురోజులుగా పట్టుబడుతున్న విషయం తెలిసిందే. ప్రధాని సభకు రావాలన్న డిమాండ్తో విపక్షాలు నిరసన చేపట్టడంతో రాజ్యసభ సమావేశాలు అర్ధంతరంగా పలుసార్లు వాయిదాపడిన సంగతి తెలిసిందే. అంతకుముందు ప్రధాని మోదీపై సభా హక్కుల ఉల్లంఘన తీర్మానం కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. ప్రధాని మోదీ సభలో మాట్లాడకుండా.. బయట మాట్లాడుతున్నారని, చర్చనుంచి ఆయన పారిపోతున్నారని ఈ సందర్భంగా కాంగ్రెస్ నేత ఆనంద్ శర్మ ఆరోపించారు. -
‘తొలిసారి నిజాయితీపరులకు గౌరవం’
న్యూఢిల్లీ: అవినీతి, నల్లధనంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పోరాటం చేస్తున్నారని కేంద్రమంత్రి పియూష్ గోయల్ అన్నారు. పెద్ద నోట్ల రద్దుపై రాజ్యసభలో బుధవారం చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తొలిసారి దేశంలో నిజాయితీపరులకు గౌరవం దక్కిందన్నారు. నోట్ల రద్దు నిర్ణయాన్ని దేశం మొత్తం స్వాగతిస్తోందని, అవినీతిపరులు, ఉగ్రవాదులకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న ప్రధాని మోదీ నిర్ణయాన్ని అన్ని పార్టీలు ప్రధాని గౌరవించాలన్నారు. సరైన సమయంలో ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకుందని పియూష్ గోయల్ అన్నారు. దేశంలో నిజాయితీపరులకు పండుగ అని ఆయన పేర్కొన్నారు. అవినీతిపరులు, నల్లధనంపైనే తమ యుద్ధమన్నారు. నోట్ల రద్దును తాము సర్జికల్ దాడిగా పోల్చలేదని, ఒకవేళ నల్లధనం, అవినీతి, ఉగ్రవాదంపై ఈ చర్యను సర్జికల్ దాడిగా భావిస్తే అదో సర్టిఫికెట్గా అంగీకరిస్తామన్నారు. కొన్ని సిరీస్ నోట్లు చెలామణిలో లేవని, ఆ నోట్లను ఎక్కడ దాచిపెట్టారని పియూష్ ప్రశ్నించారు. -
ఆ డబ్బంతా నల్లధనమేనా?
-
ఆ డబ్బంతా నల్లధనమేనా?
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒకే ఒక్క ప్రకటనతో పెద్దనోట్లను రద్దు చేశారని కాంగ్రెస్ ఎంపీ ఆనంద్ శర్మ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాజ్యసభలో పెద్ద నోట్ల రద్దుపై చర్చ సందర్భంగా ఆయన కేంద్రంపై విరుచుకుపడ్డారు. చలామణిలో ఉన్న కరెన్సీలో 86 శాతం రూ.500, 1000 నోట్లేనని ఆనంద్ శర్మ గుర్తు చేశారు. ఈ డబ్బంతా నల్లధనమేనా అంటూ ఆయన సూటిగా ప్రశించారు. నల్లధనం పేరుతో దేశంలో అలజడి సృష్టించారని ఆనంద్ శర్మ వ్యాఖ్యానించారు. నల్లధనం వెలికితీయడానికి మేం వ్యతిరేకం కాదు బ్యాంకులు, ఏటీఎంల ముందు క్యూ లైన్ పెరుగుతున్న కొద్ది నగదు విత్ డ్రాను కేంద్రం పెంచుతోంది నగదు రహిత దేశమన్న నేతలు సామాన్యుల కడుపులు నింపే దాబాల్లో కార్డులు చెల్లవని మర్చిపోయారు ఎలాంటి సమయం ఇవ్వకుండా, హెచ్చరిక చేయకుండా పెద్దనోట్లు రద్దు చేశారు రైతుల వద్ద క్రెడిట్ కార్డులు ఉన్నాయా? దేశ ప్రజలకు అన్నం పెడుతున్న రైతన్నలు నల్లధనాన్ని ఇంటికి తీసుకువెళుతున్నారా? సామాన్యుల వద్ద ఉన్న రూ.500, 1000నోట్లు నల్లధనమా ప్రతి విషయాన్ని సర్జికల్ స్ట్రైక్ అంటున్నారు. ఏమీ చదువుకోకుండానే మీరంతా డాక్టర్లు అయ్యారు నోట్ల రద్దుతో మీరు ఎంపిక చేసుకున్న 15-20మంది పారిశ్రామిక వేత్తలకు సాయం చేశారు రెండున్నరేళ్లలో అప్పు మాఫీ చేసింది ఎవరికీ, రైతులకా? పారిశ్రామికవేత్తలకా? మీకు నచ్చినవాళ్లను నెత్తిన పెట్టుకుంటున్నారు తప్పు చేశారని ప్రశ్నిస్తే నిందిస్తున్నారు ప్రధాని మోదీ మరో గ్రహంలో ఉన్నారా అని ఆలోచన కలుగుతోంది ప్రధాని మోదీ మరో గ్రహంలో ఉన్నారా అని ఆలోచన కలుగుతోంది రంగుపోయే రూ.2వేల నోటును ఎవరూ నమ్మడం లేదు నల్లధనం సూట్కేసుల్లోనూ, కప్ బోర్డులోనూ లేదు వేలకోట్ల నల్లధనవంతులతో మోదీ విమానాల్లో తిరుగుతున్నారు స్విస్ బ్యాంకుల్లో డబ్బు దాచుకున్నవారి పేర్లు బయటపెట్టాలి ఆస్తులు, పెట్టుబడుల రూపంలో నోట్ల రద్దు వల్ల శుభకార్యాలు నిలిచిపోయాయి దహన సంస్కారాలపై కూడా రద్దు ప్రభావం పడింది సామాన్యులకు ప్రధాని క్షమపణ చెప్పాలి 1946లో తొలిసారి, 1978లో రెండోసారి నోట్ల రద్దు జరిగింది అప్పుడు ఇలాంటి గందరగోళం ఏర్పడలేదు నోట్ల రద్దు పక్షపాతంతో తీసుకున్న నిర్ణయం దేశం మొత్తాన్ని మీరు క్యూలో నిలబెట్టారు బ్యాంకుల ముందు ఎవరైనా ధనికులు, పారిశ్రామిక వేత్తలు ఉన్నారా? -
లోక్ సభ సమావేశాలు రేపటికి వాయిదా
న్యూఢిల్లీ: లోక్ సభ సమావేశాలు గురువారానికి వాయిదా పడ్డారు. తొలిరోజు సమావేశాలు ప్రారంభమైన వెంటనే స్పీకర్ సుమిత్రా మహాజన్ ఇటీవల మృతి చెందిన ఎంపీలు, మాజీ ఎంపీలకు సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు. ఎంపీ రేణుక సిన్హా మృతికి సభ సంతాపం తెలిపిన వెంటనే సమావేశాలు రేపటికి వాయిదా పడ్డాయి. మరోవైపు రాజ్యసభలోనూ థాయ్లాండ్ రాజు మృతికి సంతాపం తెలిపింది. రాజ్యసభలో పెద్దనోట్లపై నిరసన అనంతరం నోట్ల రద్దును నిరసిస్తూ రాజ్యసభ సభ్యులు నిరసనకు దిగారు. ఈ అంశంపై చర్చ జరగాలంటూ విపక్ష సభ్యులు డిమాండ్ చేశారు. అయితే ఈ అంశంపై అజెండా ప్రకారమే చర్చకు అనుమతి ఇస్తామని డిప్యూటీ స్పీకర్ కురియన్ స్పష్టం చేశారు. నోట్ల రద్దుపై చర్చ సందర్భంగా కాంగ్రెస్ ఎంపీ ఆనంద్ శర్మ మాట్లాడుతూ నల్లధనం పేరుతో దేశంలో అలజడి సృష్టించారన్నారు. నల్లధనం వెలికి తీయడానికి తాము వ్యతిరేకం కాదని తెలిపారు. ఒక్కమాటతో 86 శాతం కరెన్సీ పనికిరాకుండా పోయిందని ఆనంద్ శర్మ వ్యాఖ్యానించారు. -
మరింత సమగ్రత అవసరం
మానసిక ఆరోగ్య సంరక్షణ బిల్లును రాజ్యసభ ఆమోదించి వారం గడవకుండానే ఒక దురదృష్టకరమైన ఉదంతం వెలుగులోకొచ్చింది. పశ్చిమ బెంగాల్లోని బెహ్రాం పూర్ మానసిక రోగుల ఆస్పత్రిలో గత ఆరునెలలుగా 65మంది రోగులను ఎలాంటి అచ్ఛాదనా లేకుండా దిగంబరంగా ఉంచుతున్నారని స్వచ్ఛంద సంస్థ ‘అంజలి’ కార్యకర్తలు సామాజిక మాధ్యమాల్లో ఆరోపించారు. అందుకు సంబం ధించి కొన్ని ఛాయాచిత్రాలను కూడా వారు విడుదల చేశారు. మన దేశంలో మానసిక అస్వస్థతకు గురైనవారి పట్ల ఎలాంటి అమానవీయ, నిర్లక్ష్య ధోరణులు రాజ్యమేలుతున్నాయో ఈ ఉదంతం రుజువు చేస్తున్నది. రాజ్యసభ ఆమోదించిన బిల్లు దాదాపు మూడు దశాబ్దాలనాటి మానసిక ఆరోగ్య చట్టానికి 134 సవరణలను తీసుకొచ్చింది. ముఖ్యంగా ఆత్మహత్యాయత్నాన్ని నేరంగా పరిగణించకుండా మాన సిక కుంగుబాటుగా తాజా బిల్లు గుర్తిస్తోంది. మానసిక రోగుల హక్కుల విష యంలో వివిధ దేశాల్లోని చట్టాలు అసంపూర్ణంగా ఉన్నాయని, వాటిని తక్షణం సవరించాలని 2007నాటి ఐక్యరాజ్యసమితి ఒడంబడిక సభ్య దేశాలకు నిర్దేశిం చింది. మన దేశంలో మరో ఆరేళ్లకు... అంటే 2013లోగానీ దానికి అనుగుణమైన బిల్లు రూపొందలేదు. ఆ తర్వాత రాజ్యసభ ఆమోదం పొందడానికి మరో మూడేళ్లు పట్టింది. 1987నాటి చట్టం ఎన్నో అంశాలను పరిగణనలోకి తీసుకోవడం లేదని, అందువల్ల మానసిక రోగుల సంక్షేమం, చికిత్స వంటి అంశాల్లో అడుగడుగునా నిర్లక్ష్యం ఏర్పడుతున్నదని ఎన్నో ఏళ్లుగా ఆరోగ్య రంగంలో పనిచేస్తున్న స్వచ్ఛంద సంస్థలు అంటున్నాయి. సమితి ఒడంబడికకు అనుగుణంగా ఆ చట్టాన్ని సవరించా లని కోరుతున్నాయి. ఏమైతేనేం ఇన్నాళ్లకు ఆ చట్టానికి సవరణలు తీసుకొచ్చారు. ఈ బిల్లు చరిత్రాత్మకమైనదని దాదాపు అన్ని పక్షాల ఎంపీలు కొనియాడారు. ఇదింకా లోక్సభ ఆమోదం కూడా పొందవలసి ఉంది. వలస పాలకుల కాలంలో 1912లో తొలిసారి ఉన్మాద రోగుల చట్టం తీసు కొచ్చారు. 1987లో దాని స్థానంలో మానసిక ఆరోగ్య చట్టం వచ్చింది. అయితే అంతకు ముందున్న చట్టమైనా, 1987నాటి చట్టమైనా మౌలికంగా మానసిక రోగుల చికిత్స, వారిని ఆస్పత్రిలో చేర్చుకోవడం, డిశ్చార్జి చేయడం, మానసిక చికిత్సాల యాల క్రమబద్ధీకరణ వంటి అంశాలపైనే కేంద్రీకరించాయి. మానసిక రోగుల కుండే హక్కులు, వారిపై వివక్ష ప్రదర్శించి ఆ హక్కులకు భంగం కలిగించిన సందర్భాల్లో తీసుకోదగిన చర్యలేమిటన్న విషయాల్లో ఆ రెండు చట్టాలూ మౌనం పాటించాయి. తాజా బిల్లు అనేక అంశాల్లో మెరుగ్గానే ఉన్నా అది పట్టించుకోకుండా వదిలేసిన ముఖ్యాంశాలు కూడా ఉన్నాయి. రోగుల పేదరికం, వారిచుట్టూ ఉండే పరిసరాలు, ముఖ్యంగా వ్యక్తుల మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీసే స్థితిగతులు వంటి విషయాలపై ఇది దష్టి పెట్టలేదు. మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీసినవారిపై చర్యలకు సంబంధించిన ప్రస్తావన లేదు. అస్వస్థతపై చూపిన శ్రద్ధ, దాని నివారణ తదితరాలపై లేదు. ఒక ఇంట్లో మానసిక రోగి ఉన్నప్పుడు అలాంటివారితో వ్యవ హరించాల్సిన తీరుపై ఆ కుటుంబంలోని వారికి కౌన్సెలింగ్ అవసరమవుతుంది. కొన్ని సందర్భాల్లో వారికి సైతం చికిత్స అవసరం ఉంటుంది. మన సంస్కతి, సామాజిక స్థితిగతులు ఎలాంటివంటే... కుటుంబంలో ఎవరి మానసిక స్థితి అయినా సరిగాలేని పక్షంలో వారికి చికిత్స ఇప్పించడం కంటే ఆ సంగతి వెల్లడి కాకూడదని కోరుకుంటారు. వారు ఎవరి కంటా పడకూడదనుకుంటారు. మానసిక అస్వస్థత ఉన్నదని తెలిస్తే కుటుంబాన్ని ఇరుగు పొరుగు చిన్నచూపు చూస్తారని, హేళన చేస్తారని వారి భయం. రోగులకు ఎలక్ట్రో కన్వల్సివ్ థెరపీ(ఈసీటీ) ఇవ్వడం వారి శ్రేయస్సురీత్యా మంచిదికాదని, దాన్ని నిషేధించాలని అంతర్జాతీయంగా నిపుణులు చెబుతున్న మాట. బిల్లు దాని జోలికి వెళ్లలేదు. అలాగే మానసిక రోగుల సంరక్షకుల నియా మకం, వారి హక్కులు, బాధ్యత వంటి అంశాల గురించి ఇందులో లేదు. మానసిక వైకల్యం ఉన్న వ్యక్తులకుండే హక్కులకు సంబంధించి 2014లో రూపొందిన బిల్లులో దీని ప్రస్తావన ఉంది. ఆ బిల్లు ఇంకా పార్లమెంటు ఆమోదం కోసం ఎదురు చూస్తున్నది. ఆ అంశాలను ప్రస్తుత బిల్లులో చేర్చి ఉంటే మరికాస్త సమగ్రత వచ్చేది. చట్టం అమలులో నిర్లక్ష్యం వహించినా, మానసిక రోగుల హక్కుల్ని ఉల్లంఘించినా ఆర్నెల్ల వరకూ జైలు, రూ. 10,000 వరకూ జరిమానా విధించవచ్చునని బిల్లు నిర్దేశిస్తున్నది. అయితే వీటిని అంశాలవారీగా నిర్దిష్టంగా పేర్కొని ఉంటే సబబుగా ఉండేదని ఆరోగ్య కార్యకర్తలు చెబుతున్నారు. అలాంటి నిర్దిష్టత ఉన్నట్టయితేనే బెంగాల్ ఆస్పత్రిలో జరిగినలాంటి ఉదంతాలను నివారించడానికి వీలవుతుంది. అస్వస్థతకు ఎలాంటి చికిత్స అవసరమనుకుంటున్నారో రోగులు నిర్ణయించు కోవచ్చునని బిల్లు చెబుతోంది. వారు ఆ స్థితిలో లేరనుకుంటే ఆ సంగతిని నిపు ణులు ధ్రువీకరించాల్సి ఉంటుంది. తమపట్ల అమానవీయంగా ప్రవర్తించడం, అందరితో సమంగా చూడకపోవడంవంటి అంశాల్లో ఫిర్యాదు చేసే వీలుంటుంది. మానసిక రోగులను మెట్రోలో ప్రయాణించడానికి అనుమతించబోమని ఢిల్లీ మెట్రో రైలు సంస్థ నిబంధన పెట్టడంపై మూడు నెలలక్రితం తీవ్ర విమర్శలొ చ్చాయి. తాజా బిల్లు చట్టమైతే ఇలాంటి నిబంధనలకు ఆస్కారం ఉండదు. మన దేశంలో మానసిక రోగులు పదిమంది ఉంటే వారిలో ఒక్కరికి మాత్రమే చికిత్స లభిస్తున్నదని ఈమధ్య అంతర్జాతీయ వైద్య జర్నల్ లాన్సెట్ వెల్లడించింది. దేశంలో దాదాపు 10 శాతంమంది జనాభా వివిధ రకాలైన మానసిక అస్వస్థతకు గురవుతున్నట్టు అది తెలిపింది. ఇందులో మానసిక కుంగుబాటు మొదలుకొని మాదకద్రవ్యాల వాడకం వరకూ ఎన్నో ఉన్నాయి. ప్రపంచంలో మూడోవంతు మంది మానసిక రోగులు భారత, చైనాల్లో ఉన్నారు. వీరిలో మహిళలే అధికం. అభివద్ధి చెందిన దేశాల్లోని రోగుల సంఖ్యతో పోలిస్తే ఇది చాలా ఎక్కువ. కానీ మన దేశంలో సగటున పది లక్షలమందికి ముగ్గురు మాత్రమే మానసిక వైద్య నిపుణులున్నారు. ఈ స్థితి మారాలి. లోక్సభలో చర్చకొచ్చినప్పుడైనా బిల్లులో ప్రస్తావనకు రాని కీలకాంశాలను చేర్చి దానికి మరింత సమగ్రత తీసుకురావాలి. -
మెటర్నిటీ బిల్లుకు రాజ్యసభ ఆమోదం
న్యూఢిల్లీ: ఎంతోకాలంగా పెండింగ్ లో ఉన్న మెటర్నిటీ బెనిఫిట్ యాక్ట్ 1961 సవరణ బిల్లును గురువారం రాజ్యసభలో ఆమోదించింది. ఈ బిల్లును కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ మంగళవారం ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. బిల్లుపై చర్చించిన రాజ్యసభ ఎట్టకేలకు ఆమోదం తెలిపారు. దీంతో ఇప్పటికే కేబినేట్ ఆమోదం పొందిన ఈ బిల్లు శీతాకాల సమావేశాల్లోనే లోక్ సభలో ఆమోదానికి వెళ్లే అవకాశం ఉంది. బిల్లుతో లాభాలు: 1. మెటర్నిటీ లీవ్ కింద ఇప్పటివరకూ అమల్లోవున్న 12వారాల సెలవు పరిమితి 26వారాలకు పెరగనుంది. 2. ప్రభుత్వ, ప్రైవేటు సెక్టార్లలో పనిచేస్తున్న మహిళలకు ఈ బిల్లు వర్తిస్తుంది. 3. ఇద్దరూ లేదా ఎక్కువ మంది పిల్లలు ఉన్న మహిళలకు ఈ సెలవు దినాలు వర్తించవు. 4. ఇంటి నుంచి పనిచేసే మహిళలకు కూడా వర్తించే విధంగా బిల్లును సవరించారు. -
'అందంగా ఉంటుందనే ప్రేమించొద్దు'
న్యూఢిల్లీ: 'అందంగా ఉంటుందని మాత్రమే కశ్మీర్ ను ప్రేమించకండి.. అక్కడి ప్రజల్ని, వాళ్ల పిల్లల్ని, ఆందోళనల్లో కళ్లు పోయినవారినికి కూడా ప్రేమను పంచండి' అంటూ భావోద్వేగానికి లోనయ్యారు కశ్మీరీ నేత, రాజ్యసభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు గులాం నబీ ఆజాద్. గడిచిన 32 రోజులుగా కశ్మీర్ లో అట్టుడుకుతున్న ఆందోళనలపై బుధవారం రాజ్యసభలో చర్చను ప్రారంభించిన ఆయన.. మిగతా భారతీయులలాగే కశ్మీరీలను సమదృష్టితో చూడాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. (కశ్మీర్పై పెదవి విప్పిన ప్రధాని మోదీ) '32 రోజుల తర్వాతైన కశ్మీర్ ఆందోళనలపై ఎట్టకేలకు చర్చను అంగీకరించినందుకు ప్రభుత్వానికి ధన్యవాధాలు. కశ్మీర్ భారత్ లో అంతర్భాగమనే నిజం. కానీ అక్కడి ప్రజలతో మనం కలిసిపోయామా?లేదా? అని ఆలోచించుకోవాలి. దాదాపు ప్రతి కశ్మీరీ కుటుంబం ఉగ్రవాద పీడను అనుభవించింది. ప్రస్తుతం అక్కడి పరిస్థితులు అత్యంత సున్నితంగా మారాయి. 32 రోజులుగా కర్ఫ్యూ కొనసాగుతోంది. ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఆగ్రహావేశాలకు కారణం ఏదైనా కావచ్చు.. దాన్ని పరిష్కరించే దిశగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నించలేదు. కనీసం ఇప్పుడైనా కశ్మీరీలకు సంఘీభావం తెలపండి. అఖిలపక్షాన్ని పంపి, పరిస్థితులు చక్కబెట్టేందుకు చర్యలు తీసుకోండి. పార్లమెంట్ సమావేశాలు ముగిసేలోపే ఆపని చేస్తే.. కశ్మీరీలకు భరోసా ఇచ్చినవాళ్లం అవుతాం'అని గులాం నబీ ఆజాద్ అన్నారు. తెలంగాణలో మాట్లాడితే ఢిల్లీకి వినబడుతుందా? దళితులపై దాడులు, కశ్మీర్ సమస్యలపై ప్రభుత్వ స్పందన కోసం పార్లమెంట్ లో ఎంపీలు ఆందోళనలు చేస్తోంటే.. ప్రధాని నరేంద్ర మోదీ మాత్రం ఆ సమస్యలపై పార్లమెంట్ లో కాకుండా బయటి సభల్లో స్పందించడమేమిటని ఆజాద్ ప్రశ్నించారు. 'తెలంగాణలో జరిగిన సమావేశంలో మీరు(ప్రధాని) దళితులపై దాడులను ఖండించారు. ఆ మాటలు పార్లమెంట్ వరకు వినబడలేదు. ఆ ప్రకటనేదో ఇక్కడి నుంచే చేస్తే సబబుగా ఉండేది'అని ఆజాద్ వ్యాఖ్యానించారు. -
విభజన సమయంలో 6 హామీలిచ్చా: మన్మోహన్
న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదాపై మాజీ ప్రధాని, రాజ్యసభ సభ్యుడు మన్మోహన్ సింగ్ శుక్రవారం సభలో మాట్లాడారు. ఏపీ విభజన సమయంలో తాను ఆరు హామీలు ఇచ్చినట్లు ఆయన తెలిపారు. ఆ హామీలపై అరుణ్ జైట్లీ కూడా సంతృప్తి వ్యక్తం చేశారన్నారు. నాడు ఇచ్చిన హామీలనుఅమలు చేయాల్సిన బాధ్యత ఎన్డీయే ప్రభుత్వంపై ఉందని మన్మోహన్ సింగ్ అన్నారు. విభజన హామీలను కేబినెట్ కూడా ఆమోదించిందని, ఆర్డినెన్స్ జారీ చేయాలని రాష్ట్రపతిని కోరినట్లు ఆయన తెలిపారు. ఎన్నికల షెడ్యూల్ రావడం వల్ల ఆర్డినెన్స్ ఆగిపోయిందని మన్మోహన్ సింగ్ తెలిపారు. మరోవైపు కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ మాట్లాడుతూ ఏపీకి ప్రత్యేక హోదాపై సభలో చాలాసార్లు చర్చించామన్నారు. ఆంధ్రప్రదేశ్ను ఆదుకునే విషయంలో కేంద్రానికి చిత్తశుద్ధి ఉందన్నారు. 14 వ ఆర్థిక సంఘం కొన్ని సిఫార్సులు చేసిందని, ఆ రాష్ట్రానికి మేలు చేసే మార్గాలను పరిశీలిస్తున్నామన్నారు. ప్రతి ఒక్కరూ సంతృప్తిపడేలా సమస్యను పరిష్కరిస్తామని జైట్లీ తెలిపారు. ఇప్పటికే ఏపీ ఎంపీలతో ప్రధాని మోదీ మాట్లాడారని ఆయన పేర్కొన్నారు. -
ఓటింగ్ జరుగుతుందా?
-
ఓటింగ్ జరుగుతుందా?
►నేడు రాజ్యసభకు హోదాపై ప్రైవేట్ మెంబర్ బిల్లు ►కేవీపీ బిల్లుపై ఉత్కంఠ న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కోసం కాంగ్రెస్ ఎంపీ కేవీపీ రామచంద్రరావు ప్రవేశ పెట్టిన ప్రైవేట్ మెంబర్ బిల్లు శుక్రవారం రాజ్యసభలో మరోసారి వేడిపుట్టించనుంది. ఈ బిల్లుపై ఓటింగ్ జరగాల్సి ఉండడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. గతంలో ఎన్నడూ లేని విధంగా కాంగ్రెస్ పార్టీ తమ సభ్యులకు విప్ జారీ చేసింది. కేవీపీ బిల్లుపై చర్చ ముగియడంతో పాటు కేంద్ర మంత్రి జవాబు కూడా ఇచ్చారు. ఈ బిల్లుపై ఓటింగ్కు కేవీపీ పట్టుబట్టడంతో అప్పట్లో కోరం లేక వాయిదా పడింది. గతవారం రాజ్యసభలో జరిగిన చర్చ సందర్భంగా కేవీపీ బిల్లును ద్రవ్య బిల్లుగా కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్ల్లీ పేర్కొన్నారు. ద్రవ్య బిల్లుపై రాజ్యసభలో ఓటింగ్కు రాజ్యాంగ పరమైన అవరోధాలున్నాయని జైట్లీ చెప్పారు. అయితే ఈ బిల్లును ద్రవ్య బిల్లుగా ఇంకా ప్రభుత్వం ప్రకటించలేదు. ఈ బిల్లును ద్రవ్య బిల్లుగా ప్రభుత్వం ప్రకటించవచ్చునని కాంగ్రెస్ ఎంపీ జైరాం రమేశ్ గురువారం చెప్పారు. ప్రభుత్వం ఈ బిల్లును ద్రవ్య బిల్లుగా పరిగణించే పక్షంలో ఓటింగ్కు అనుమతి లభించకపోవచ్చు. ఎట్టి పరిస్థితుల్లోనూ బిల్లును ఉపసంహరించుకునే ప్రసక్తి లేదని కేవీపీ కూడా స్పష్టం చేశారు. గురువారం ఇక్కడ జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో పలువురు వక్తలు ఈ అంశాన్ని ప్రస్తావించారు. రాజ్యాంగ పరంగా ప్రభుత్వం వద్ద వాదన ఉందని, వాస్తవానికి ఈ బిల్లు సభ ముందుకు వచ్చినప్పుడు ఉభయ పక్షాల వాదనలు విన్న తర్వాత చైర్ తమ నిర్ణయాన్ని ప్రకటిస్తుందని రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పీజే కురియన్ గత వారం స్పష్టం చేసిన విషయం తెలిసిందే. -
ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలి
-
ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలి: మేకపాటి
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఆవశ్యతకను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి సోమవారం లోక్ సభలో వివరించారు. పార్లమెంట్లో ఇచ్చిన హామీలు అమలు కాకపోతే చట్టాలు ఎందుకని ఆయన ప్రశ్నించారు. ఏపీకి ప్రత్యేక హోదా హామీ ఇచ్చి 26 నెలలు గడిచాయని, 5కోట్లమంది ప్రజలు హోదా కోసం ఆందోళనగా ఉన్నారన్నారు. రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి అనేక హామీలు ఇచ్చారని మేకపాటి ఈ సందర్భంగా సభలో గుర్తు చేశారు. హామీలు అమలు చేయకపోతే ప్రజాస్వామ్యంపై నమ్మకం పోతుందని ఆయన అన్నారు. ప్రజాస్వామ్యం గౌరవాన్ని అందరూ కాపాడాలని మేకపాటి విజ్ఞప్తి చేశారు. పార్టీ మారినవారిని మూడు నెలల సమయం ఇచ్చి, వారిపై అనర్హత వేటు వేసే అధికారం ఎన్నికల కమిషన్కు ఇవ్వాలని ఆయన కోరారు. -
'మాట ఇచ్చి మర్చిపోతే ఎలా?'
న్యూఢిల్లీ: విభజన సమయంలో ఏపీ విషయంలో నాటి ప్రధాని ఆరు హామీలు ఇచ్చారని కాంగ్రెస్ పార్టీ నేత, రాజ్యసభ సభ్యుడు జైరాం రమేశ్ అన్నారు. గురువారం సాయంత్రం రాజ్యసభలో ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంపై చర్చ ప్రారంభమైంది. ఈ చర్చను జైరాం రమేశ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా పలు అంశాలు స్పృషించారు. ప్రత్యేక హోదా ఐదేళ్లు ఏపీకి ఇవ్వాలని అడిగితే కాదు పదేళ్లు ఇవ్వాలని నాడు వెంకయ్యనాయుడు కోరారని ఆయన గుర్తు చేశారు. పోలవరం నిర్మాణానికి కేంద్రం సాయం చేయాలని అప్పుడే నిర్ణయించామని చెప్పారు. వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ ఏమైందని ఆయన ప్రశ్నించారు. రాజధాని నిర్మాణానికి ఎంత సాయం చేశారో చెప్పాలని, హైకోర్టు విభజన అంశం ఏమైందని నిలదీశారు. రెవిన్యూలోటు భర్తీకి ఏం చర్యలు తీసుకున్నారని జైరాం ప్రశ్నించారు. ప్రత్యేక హోదా విషయం స్పష్టమైన సమాధానం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. మరోపక్క, ఏపీకి ఇచ్చిన హామీలు కేంద్రం అమలుచేయాలని సమాజ్ వాది పార్టీ నేత ఎంపీ నరేష్ అగర్వాల్ డిమాండ్ చేశారు. ప్రత్యేక హోదా విషయంలో మాట నిలబెట్టుకోవాలని అన్నారు. అలాగే, ఏపీతో సహా పది రాష్ట్రాల పరిస్థితి ఏం బాగోలేదని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ సుఖేందురాయ్ అన్నారు. బెంగాల్ తో సహా ఆ పది రాష్ట్రాలతో కేంద్రం సమావేశం ఏర్పాటుచేయాలని అన్నారు. ఏపీకి ఇచ్చిన హామీలు ఇవ్వాలని కోరారు. జేడీయూ ఎంపీ అన్సారీ కూడా ఏపీకి ప్రత్యేక హోదాపై స్పందిస్తూ అధికారంలోకి వచ్చాక అంతకుముందు ఇచ్చిన హామీలు మర్చిపోకూడదని అన్నారు. గతంలో బీజేపీ ఇచ్చిన హామీలు గుర్తుచేసుకుంటే మంచిదని హితవు పలికారు. -
ఆ మూడు పార్టీలు డ్రామాలాడుతున్నాయి
-
ఆ మూడు పార్టీలు డ్రామాలాడుతున్నాయి
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా సాధించే విషయంలో టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు డ్రామాలాడుతున్నాయని వైఎస్ఆర్ సీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి విమర్శించారు. రాజ్యసభలో ఆ మూడు పార్టీలు కుమ్మక్కై ప్రత్యేక హోదా బిల్లు ఓటింగ్కు రాకుండా చేశాయని అన్నారు. బిల్లును ప్రవేశపెట్టిన కాంగ్రెస్ సభ్యులే పోడియం వద్దకు వెళ్లి సభను అడ్డుకోవడం దురదృష్టకరమని చెప్పారు. సమస్యను పొడగించి లబ్ధి పొందాలని కాంగ్రెస్ పార్టీ చూస్తోందని విజయసాయి రెడ్డి విమర్శించారు. రెండేళ్లుగా ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్న పార్టీ వైఎస్ఆర్ సీపీ ఒక్కటేనని అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా సాధించడానికి తమ పోరాటాన్ని కొనసాగిస్తామని విజయసాయి రెడ్డి చెప్పారు. రాజ్యసభ సోమవారానికి వాయిదా పడింది. -
రాజ్యసభలో గందరగోళం, సోమవారానికి వాయిదా
-
రాజ్యసభలో గందరగోళం, సోమవారానికి వాయిదా
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కల్పించాలని కోరుతూ కాంగ్రెస్ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు ప్రవేశపెట్టిన ప్రైవేట్ సభ్యుడి బిల్లుపై చర్చ జరగకుండానే రాజ్యసభ సోమవారానికి వాయిదా పడింది. ప్రైవేట్ బిల్లుపై చర్చకు కాంగ్రెస్ సభ్యులు పట్టుబడుతూ నినాదాలు చేయడంతో గందరగోళం చోటుచేసుకుంది. ఈ సందర్భంగా కాంగ్రెస్ ఎంపీ ఆనంద్ శర్మ మాట్లాడుతూ ఈ వ్యవహారంపై కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఏపీకి ప్రత్యేక హోదాను బీజేపీ అడ్డుకుంటుందని ఆయన వ్యాఖ్యానించారు. హోదాపై కేంద్రం అధికారికంగా ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. మరోవైపు అనూహ్యంగా అధికార బీజేపీ సభ్యులు పోడియం ముందుకొచ్చి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఆప్ ఎంపీ భగవంత్ మన్పై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో అధికార, విపక్ష సభ్యుల ఆందోళనలు, నిరసనల మధ్య సభ దద్దరిల్లింది. ఈ నేపథ్యంలో విపక్ష సభ్యులు జోక్యం చేసుకుని సభ్యుల హక్కులను అధికార పార్టీ కబళిస్తోందని ఆరోపించారు. అయితే సభా కార్యక్రమాలు సజావుగా నిర్వహించడం తన బాధ్యతని డిప్యూటీ ఛైర్మన్ అన్నారు. అధికార పార్టీ సభ్యులు సభలోకి వచ్చి నినాదాలు చేయడం సబబు కాదని అన్నారు. అయినప్పటికీ బీజేపీ సభ్యులు శాంతించకపోవడంతో డిప్యూటీ ఛైర్మన్ కురియన్ సభను సోమవారానికి వాయిదా వేశారు. కాగా ఈ రోజు ఉదయం నుంచి రాజ్యసభ మూడుసార్లు వాయిదా పడింది.