Ricky Ponting
-
అత్యధిక ఐసీసీ టైటిళ్లు గెలిచిన ఆటగాడిగా విరాట్.. పాంటింగ్ సరసన చోటు
ఛాంపియన్స్ ట్రోఫీ-2025తో టీమిండియా ఖాతాలో ఏడో ఐసీసీ ట్రోఫీ చేరింది. భారత్ తొలిసారి 1983లో ఐసీసీ ట్రోఫీ (వన్డే వరల్డ్కప్) గెలిచింది. ఆతర్వాత 2002 (ఛాంపియన్స్ ట్రోఫీ, శ్రీలంకతో సంయుక్తంగా), 2007 (టీ20 వరల్డ్కప్), 2011 (వన్డే వరల్డ్కప్), 2013 (ఛాంపియన్స్ ట్రోఫీ), 2024 (టీ20 వరల్డ్కప్), 2025లో (ఛాంపియన్స్ ట్రోఫీ) ఐసీసీ ట్రోఫీలు కైవసం చేసుకుంది. ప్రపంచంలో అత్యధిక ఐసీసీ ట్రోఫీలు గెలిచిన జట్ల జాబితాలో భారత్ ఆస్ట్రేలియా తర్వాతి స్థానంలో ఉంది.ఆస్ట్రేలియా అత్యధికంగా 10 ఐసీసీ ట్రోఫీలు (1987, 1999, 2003, 2007, 2015, 2023 వన్డే వరల్డ్కప్లు.. 2021 టీ20 వరల్డ్కప్.. 2006, 2009 ఛాంపియన్స్ ట్రోఫీ.. 2021-23 డబ్ల్యూటీసీ టైటిల్) కైవసం చేసుకుంది. ఆస్ట్రేలియా, భారత్ తర్వాత అత్యధిక ఐసీసీ టైటిళ్లు గెలిచిన ఘనత వెస్టిండీస్కు దక్కుతుంది. విండీస్ మొత్తంగా ఐదు ఐసీసీ టైటిళ్లు (1975, 1979 వన్డే వరల్డ్కప్లు.. 2012, 2016 టీ20 వరల్డ్కప్లు.. 2004 ఛాంపియన్స్ ట్రోఫీ) సాధించింది.విండీస్ తర్వాత పాకిస్తాన్ (1992 వన్డే వరల్డ్కప్.. 2009 టీ20 వరల్డ్కప్.. 2017 ఛాంపియన్స్ ట్రోఫీ), శ్రీలంక (1996 వన్డే వరల్డ్కప్.. 2014 టీ20 వరల్డ్కప్.. 2002 ఛాంపియన్స్ ట్రోఫీ (భారత్తో కలిసి సంయుక్తంగా), ఇంగ్లండ్ (2019 వన్డే వరల్డ్కప్.. 2010, 2022 టీ20 వరల్డ్కప్లు) తలో మూడు ఐసీసీ టైటిళ్లు సాధించాయి. న్యూజిలాండ్ రెండు (2000 ఛాంపియన్స్ ట్రోఫీ.. 2019-2021 డబ్ల్యూటీసీ), సౌతాఫ్రికా ఓ ఐసీసీ టైటిల్ (1998 ఛాంపియన్స్ ట్రోఫీ) గెలిచింది.ఐసీసీ టైటిళ్లు గెలిచిన జట్ల విషయం ఇలా ఉంటే.. వ్యక్తిగతంగా అత్యధిక ఐసీసీ టైటిళ్లు గెలిచిన ఘనత ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్, టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లికి దక్కుతుంది. ఈ ఇద్దరు తలో ఐదు ఐసీసీ టైటిళ్లు (అండర్-19 ఈవెంట్లు కలుపుకొని) సాధించారు. పాంటింగ్ 1999, 2003,2007 వన్డే వరల్డ్కప్లు.. 2006, 2009 ఛాంపియన్స్ ట్రోఫీలు గెలువగా.. విరాట్ 2008 అండర్ 19 వరల్డ్కప్.. 2011 వన్డే వరల్డ్కప్.. 2013, 2025 ఛాంపియన్స్ ట్రోఫీలు.. 2024 టీ20 వరల్డ్కప్ టైటిళ్లు గెలిచాడు.పాంటింగ్, విరాట్ తర్వాత అత్యధిక ఐసీసీ టైటిళ్లు గెలిచిన ఘనత రోహిత్ శర్మ (2007, 2024 టీ20 వరల్డ్కప్లు.. 2013, 2025 ఛాంపియన్స్ ట్రోఫీలు), ఆడమ్ గిల్క్రిస్ట్ (1999, 2003, 2007 వన్డే వరల్డ్కప్లు.. 2006 ఛాంపియన్స్ ట్రోఫీ), గ్లెన్ మెక్గ్రాత్ (1999, 2003, 2007 వన్డే వరల్డ్కప్లు.. 2006 ఛాంపియన్స్ ట్రోఫీ), షేన్ వాట్సన్ (2007, 2015 వన్డే వరల్డ్కప్లు.. 2006, 2009 ఛాంపియన్స్ ట్రోఫీలు), డేవిడ్ వార్నర్ (2015, 2023 వన్డే వరల్డ్కప్లు.. 2021 టీ20 వరల్డ్కప్.. 2021-23 డబ్ల్యూటీసీ టైటిల్), మిచెల్ స్టార్క్ (2015, 2023 వన్డే వరల్డ్కప్లు.. 2021 టీ20 వరల్డ్కప్.. 2021-23 డబ్ల్యూటీసీ టైటిల్), స్టీవ్ స్మిత్కు (2015, 2023 వన్డే వరల్డ్కప్లు.. 2021 టీ20 వరల్డ్కప్.. 2021-23 డబ్ల్యూటీసీ టైటిల్) దక్కుతుంది. వీరంతా తలో నాలుగు ఐసీసీ టైటిళ్లు గెలిచారు.కాగా, ఛాంపియన్స్ ట్రోఫీ-2025 ఫైనల్లో భారత్ న్యూజిలాండ్పై 4 వికెట్ల తేడాతో గెలుపొంది, మూడో ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్ను, ఓవరాల్గా ఏడో ఐసీసీ టైటిల్ను కైవసం చేసుకుంది. -
కోహ్లి లాంటి ఆటగాడిని నేను ఇప్పటివరకు చూడలేదు: పాంటింగ్
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో దుబాయ్ వేదికగా పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి అద్బుతమైన సెంచరీతో చెలరేగిన సంగతి తెలిసిందే. ఫామ్తో లేమితో సతమతమవుతున్న కోహ్లి.. దాయాదితో జరిగిన మ్యాచ్తో తన రిథమ్ను తిరిగి పొందాడు. 242 పరుగుల లక్ష్య చేధనలో ఆఖరి వరకు క్రీజులో నిలబడిన కోహ్లి.. వరల్డ్ క్రికెట్లో తనకు మించిన ఛేజ్ మాస్టర్ లేడని మరోసారి నిరూపించుకున్నాడు. కింగ్ కోహ్లి సరిగ్గా 100 పరుగులు చేసి భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు. కోహ్లికి ఇది 51వ వన్డే సెంచరీ. మ్యాచ్ ముగిసి మూడు రోజులు అవుతున్నప్పటికి కోహ్లిపై ఇంకా ప్రశంసల వర్షం కురుస్తునే ఉంది. తాజాగా ఈ జాబితాలో ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం రికీ పాంటింగ్ చేరాడు."వన్డేల్లో విరాట్ కోహ్లి కంటే మెరుగైన ఆటగాడిని నేను ఇప్పటివరకు చూడలేదు. అతడు ఇప్పుడు నన్ను (అత్యధిక వన్డే పరుగుల్లో) దాటేశాడు. వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో అతడి కంటే ముందు కేవలం ఇద్దరు బ్యాటర్లు మాత్రమే ఉన్నారు. కాబట్టి వన్డేల్లో టాప్ రన్ స్కోరర్గా నిలవాలని కోహ్లి భావిస్తాడనంలో సందేహం లేదు. కోహ్లి ఎప్పటిలాగే ఫిట్గా ఉన్నాడు. భవిష్యత్తులో కూడా ఇదే ఫిట్నెస్ను మెయింటేన్ చేస్తాడని నేను అనుకుంటున్నాను.అతడికి కష్టపడి పనిచేసే తత్వం ఉంది. అతడు ఇప్పటికీ సచిన్ కంటే 4,000 పరుగులు వెనుకబడి ఉన్నాడు. సచిన్ను కోహ్లి అధిగిమించలేడని చెప్పలేం. అతడిలో కసి ఉంటే కచ్చితంగా సచిన్ను దాటగలడు. టీ20 ప్రపంచకప్-2022లో పాకిస్తాన్పై ఏ విధంగా అయితే కోహ్లి ఆడాడో.. ఇప్పడు ఈ టోర్నీలో కూడా అదే చేశాడు. అతడొక ఛాంపియన్ ప్లేయర్. ముఖ్యంగా వైట్బాల్ ఫార్మాట్లలో అతడిని మించిన వారు లేరని" పాంటింగ్ ఐసీసీ రివ్యూ షోలో పేర్కొన్నాడు.కాగా పాక్తో జరిగిన మ్యాచ్లో కోహ్లి తన 14,000 పరుగుల మైలు రాయిని అందుకున్నాడు. ఇప్పటివరకు 299 మ్యాచ్ల్లో కోహ్లి 58.20 సగటుతో 14085 పరుగులు చేశాడు. అతడి వన్డే కెరీర్లో 51 సెంచరీలు ఉన్నాయి. కోహ్లి కంటే ముందు శ్రీలంక మాజీ కెప్టెన్ కుమార సంగక్కర(14234), సచిన్(18426) ఉన్నారు.చదవండి: మీ కంటే కోతులు బెటర్.. తక్కువగా తింటాయి: వసీం అక్రమ్ -
పాంటింగ్ను దాటేసిన కోహ్లి.. ఇక మిగిలింది సంగక్కర, సచిన్ మాత్రమే..!
పరుగుల యంత్రం విరాట్ కోహ్లి (Virat Kohli) అంతర్జాతీయ క్రికెట్లో మరో ఘనత సాధించాడు. మూడు ఫార్మాట్లలో కలిపి అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో టాప్-3లోకి చేరాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో (Champions Trophy 2025) భాగంగా పాకిస్తాన్తో నిన్న జరిగిన మ్యాచ్లో (India Vs Pakistan) సెంచరీ చేసిన విరాట్.. ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ను (Ricky Ponting) వెనక్కు నెట్టి మూడో స్థానానికి ఎగబాకాడు. ఈ జాబితాలో బ్యాటింగ్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ అగ్రస్థానంలో.. లంక దిగ్గజ బ్యాటర్ కుమార సంగక్కర రెండో స్థానంలో ఉన్నారు. అంతర్జాతీయ క్రికెట్లో విరాట్ మరో 514 పరుగులు చేస్తే సంగక్కరను కూడా వెనక్కు నెట్టి రెండో స్థానానికి ఎగబాకుతాడు.అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన టాప్-5 బ్యాటర్స్సచిన్ టెండూల్కర్- 782 ఇన్నింగ్స్ల్లో 34357 పరుగులుకుమార సంగక్కర- 666 ఇన్నింగ్స్ల్లో 28016విరాట్ కోహ్లి- 614 ఇన్నింగ్స్ల్లో 27503రికీ పాంటింగ్- 668 ఇన్నింగ్స్ల్లో 27483మహేళ జయవర్దనే- 725 ఇన్నింగ్స్ల్లో 25957కాగా, పాక్తో నిన్న జరిగిన మ్యాచ్లో విరాట్ మరో అరుదైన మైలురాయిని కూడా దాటాడు. 15 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద వన్డేల్లో 14000 పరుగులు పూర్తి చేసుకున్నాడు. తద్వారా ఈ ఘనత సాధించిన మూడో క్రికెటర్గా రికార్డు నెలకొల్పాడు. విరాట్కు ముందు సచిన్ (18426), సంగక్కర్ (14234) మాత్రమే వన్డేల్లో 14000 పరుగుల మార్కును దాటారు. ఈ రికార్డు సాధించే క్రమంలో విరాట్ మరో రికార్డు కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. వన్డేల్లో అతి తక్కువ ఇన్నింగ్స్ల్లో 14000 పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. గతంలో ఈ రికార్డు సచిన్ టెండూల్కర్ పేరిట ఉండేది. సచిన్ 350 ఇన్నింగ్స్ల్లో ఈ ఘనత సాధించగా.. విరాట్ కేవలం 287వ ఇన్నింగ్స్ల్లో 14000 పరుగులు పూర్తి చేశాడు.వన్డేల్లో 51వ సెంచరీనిన్నటి మ్యాచ్లో పాక్పై సెంచరీతో విరాట్ వన్డే సెంచరీల సంఖ్య 51కి చేరింది. మూడు ఫార్మాట్లలో కలిపి విరాట్ సెంచరీల సంఖ్య 82కు చేరింది. ప్రపంచ క్రికెట్లో సెంచరీల సంఖ్యా పరంగా సచిన్ (100) ఒక్కడే విరాట్ కంటే ముందున్నాడు.విరాట్ సూపర్ సెంచరీ.. పాక్ను చిత్తు చేసిన భారత్విరాట్ సూపర్ సెంచరీతో కదంతొక్కడంతో నిన్నటి మ్యాచ్లో పాక్పై భారత్ 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్లో విరాట్ అజేయ సెంచరీతో భారత్ను విజయతీరాలకు చేర్చాడు. తొలుత బ్యాటింగ్ చేసిన పాక్.. 49.4 ఓవర్లలో 241 పరుగులకు ఆలౌటైంది. సౌద్ షకీల్ (62) అర్ద సెంచరీతో రాణించగా.. కెప్టెన్ రిజ్వాన్ (46), ఖుష్దిల్ షా (38) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. వీరు మినహా పాక్ ఇన్నింగ్స్లో ఎవరూ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేదు. ఇమామ్ ఉల్ హక్ 10, బాబర్ ఆజమ్ 23, సల్మాన్ అఘా 19, తయ్యబ్ తాహిర్ 4, షాహీన్ అఫ్రిది 0, నసీం షా 14, హరీస్ రౌఫ్ 8 పరుగులు చేసి ఔటయ్యారు. భారత బౌలర్లలో కుల్దీప్ 3, హార్దిక్ 2, హర్షిత్ రాణా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా తలో వికెట్ తీశారు.అనంతరం బరిలోకి దిగిన భారత్.. కోహ్లి శతక్కొట్టడంతో (111 బంతుల్లో 100 నాటౌట్; 7 ఫోర్లు) 42.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. శ్రేయస్ అయ్యర్ (56).. విరాట్తో కలిసి కీలకమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పి భారత విజయాన్ని ఖరారు చేశాడు. ఓపెనర్లు రోహిత్ శర్మ (20), శుభ్మన్ గిల్ (46) కీలక ఇన్నింగ్స్లు ఆడారు. పాక్ బౌలర్లలో అఫ్రిది 2, అబ్రార్ అహ్మద్, ఖుష్దిల్ షా తలో వికెట్ తీశారు. ఈ గెలుపుతో భారత్ సెమీస్ బెర్త్ దాదాపుగా ఖరారు చేసుకుంది. వరుస పరాజయాలతో పాక్ సెమీస్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. -
Champions Trophy 2025: చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ
ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో (Champions Trophy) భాగంగా బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో టీమిండియా 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) ఖాతాలో ఓ భారీ రికార్డు చేరింది. హిట్ మ్యాన్ అంతర్జాతీయ క్రికెట్లో కెప్టెన్గా 100 విజయాలు పూర్తి చేసుకున్నాడు. తద్వారా ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్తో (Ricky Ponting) కలిసి అత్యంత వేగంగా ఈ ఘనత సాధించిన కెప్టెన్గా రికార్డు నెలకొల్పాడు. రోహిత్ ఇప్పటివరకు (బంగ్లాతో మ్యాచ్) 138 మ్యాచ్ల్లో భారత కెప్టెన్గా వ్యవహరించి 100 విజయాలు సాధించాడు. రోహిత్ సారథ్యంలో టీమిండియా 33 మ్యాచ్ల్లో ఓడింది. మూడు మ్యాచ్లు డ్రా కాగా.. ఓ మ్యాచ్ టై అయ్యింది.కెప్టెన్గా రోహిత్ సాధించిన 100 విజయాల్లో 50 టీ20ల్లో వచ్చినవి కాగా.. 38 వన్డేల్లో, 12 టెస్ట్ల్లో వచ్చాయి. కెప్టెన్గా రోహిత్ విజయాల శాతం 70కి పైగా ఉంది. అంతర్జాతీయ క్రికెట్లో రోహిత్కు ముందు రికీ పాంటింగ్ ఒక్కడే ఈ స్థాయి విన్నింగ్ పర్సంటేజీతో విజయాలు సాధించాడు. ఓ విషయంలో పాంటింగ్తో పోలిస్తే రోహితే గ్రేట్ అని చెప్పాలి. పాంటింగ్ 28 ఏళ్ల వయసులో కెప్టెన్గా బాధ్యతలు చేపట్టి ఈ స్థాయి విజయాలు సాధిస్తే.. హిట్ మ్యాన్ 30 ఏళ్ల తర్వాత టీమిండియా కెప్టెన్గా బాధ్యతలు స్వీకరించి విజయాల సెంచరీ పూర్తి చేశాడు. అంతర్జాతీయ క్రికెట్లో 30 ఏళ్ల వయసు తర్వాత 100 విజయాలు సాధించిన ఏకైక కెప్టెన్గానూ హిట్ మ్యాన్ రికార్డు నెలకొల్పాడు.అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక విజయాలు సాధించిన కెప్టెన్ల జాబితాలో రికీ పాంటింగ్ అగ్రస్థానంలో ఉన్నాడు. రికీ తన కెరీర్లో ఆసీస్కు 324 మ్యాచ్ల్లో సారథ్యం వహించి 220 మ్యాచ్ల్లో గెలిపించాడు. అంతర్జాతీయ క్రికెట్లో 200కు పైగా విజయాలు సాధించిన ఏకైక కెప్టెన్ పాంటింగ్ మాత్రమే. పాంటింగ్ తర్వాత అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక విజయాలు సాధించిన ఘనత టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనికి దక్కుతుంది. ధోని 332 మ్యాచ్ల్లో టీమిండియా కెప్టెన్ వ్యవహరించి 178 మ్యాచ్ల్లో గెలిపించాడు. ధోని తర్వాత విరాట్ కోహ్లి (135) అత్యధికంగా టీమిండియాను గెలిపించాడు.2017లో మొదలైన రోహిత్ ప్రస్తానం2017లో తొలిసారి టీమిండియా కెప్టెన్గా బాధ్యతలు చేపట్టిన రోహిత్.. 2021-22లో టీమిండియా ఆల్ ఫార్మాట్ కెప్టెన్గా నియమితుడయ్యాడు. రోహిత్ సారథ్యంలో టీమిండియా గతేడాది టీ20 వరల్డ్కప్ గెలిచింది. రోహిత్ టీమిండియాను 2023 వన్డే వరల్డ్కప్, 2021-2023 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్కు చేర్చాడు.మ్యాచ్ విషయానికొస్తే.. ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో భారత్ తొలి విజయం సాధించింది. దుబాయ్ వేదికగా బంగ్లాదేశ్తో నిన్న జరిగిన మ్యాచ్లో టీమిండియా ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్.. తౌహిద్ హృదయ్ వీరోచిత శతకంతో (100) పోరాడటంతో 49.4 ఓవర్లలో 228 పరుగులు చేసింది. హృదయ్కు జాకిర్ అలీ (68) సహకరించాడు. ఈ మ్యాచ్లో షమీ ఐదు వికెట్లు తీసి బంగ్లా పతనాన్ని శాశించాడు. అనంతరం శుభ్మన్ గిల్ (101) అజేయ శతకంతో చెలరేగడంతో భారత్ మరో 3.3 ఓవర్లు మిగిలుండగానే లక్ష్యాన్ని చేరుకుంది. రోహిత్ శర్మ (41) తన సహజ శైలిలో బ్యాట్ను ఝులింపించగా.. కేఎల్ రాహుల్ (41 నాటౌట్) సిక్సర్ కొట్టి భారత్ను గెలిపించాడు.11000 పరుగుల క్లబ్లో రోహిత్ఈ మ్యాచ్లో రోహిత్ వన్డేల్లో 11000 పరుగులు పూర్తి చేసుకున్నాడు. విరాట్ తర్వాత వన్డేల్లో అత్యంత వేగంగా ఈ ఫీట్ సాధించిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. ఈ ఘనతను కోహ్లి 222 ఇన్నింగ్స్ల్లో సాధించగా.. రోహిత్కు 261 ఇన్నింగ్స్లు పట్టింది. -
CT 2025: బుమ్రా స్థానంలో అతడే సరైనోడు: రిక్కీ పాంటింగ్
జస్ప్రీత్ బుమ్రా(Jasprit Bumrah)లేకుండానే భారత క్రికెట్ జట్టు చాంపియన్స్ ట్రోఫీ-2025 ఆడనుంది. వెన్నునొప్పి కారణంగా అతడు ఈ మెగా టోర్నీ మొత్తానికి దూరం కాగా.. యువ బౌలర్ హర్షిత్ రాణా(Harshit Rana) జట్టులోకి వచ్చాడు. అయితే, ప్రధాన పేసర్ బుమ్రా లేని లోటును మాత్రం ఎవరూ తీర్చలేరంటున్నాడు ఆస్ట్రేలియా దిగ్గజం రిక్కీ పాంటింగ్(Ricky Ponting).కానీ బుమ్రా స్థానాన్ని భర్తీ చేయగల సత్తా మాత్రం అర్ష్దీప్ సింగ్కు ఉందని పాంటింగ్ అభిప్రాయపడ్డాడు. ప్రపంచ స్థాయి ఫాస్ట్ బౌలర్ అయిన బుమ్రాకు అర్ష్ నైపుణ్యాలు ఏమీ తీసిపోవని.. టీమిండియా బౌలింగ్ విభాగానికి అతడు ప్రధాన బలం కాబోతున్నాడని పేర్కొన్నాడు. కాగా బుధవారం(ఫిబ్రవరి 19) నుంచి చాంపియన్స్ ట్రోఫీ మొదలుకానుండగా.. టీమిండియా గురువారం తమ తొలి మ్యాచ్ ఆడనుంది.దుబాయ్ వేదికగా మొదట బంగ్లాదేశ్తో తలపడనున్న రోహిత్ సేన.. తదుపరి ఫిబ్రవరి 23న పాకిస్తాన్, మార్చి 2న న్యూజిలాండ్ జట్లను ఢీకొట్టనుంది. ఈ నేపథ్యంలో ఈ ఐసీసీ ఈవెంట్లో భారత తుదిజట్టులో ఆడబోయే పేసర్ల గురించి ఆసీస్ బ్యాటింగ్ దిగ్గజం రిక్కీ పాంటింగ్ ఐసీసీ రివ్యూ షోలో భాగంగా తన అభిప్రాయాలు పంచుకున్నాడు.‘‘బుమ్రా స్థానాన్ని నేనైతే అర్ష్దీప్ సింగ్తోనే భర్తీ చేస్తాను. టీ20 క్రికెట్లో అతడి ఆట తీరు ఎలా ఉందో అందరికీ తెలిసిందే. ఇక అర్ష్ నైపుణ్యాల విషయానికొస్తే.. బుమ్రా మాదిరే అతడు కూడా కొత్త బంతితో ఆరంభ ఓవర్లలో అద్భుతం చేయగలడు.అంతేకాదు.. డెత్ ఓవర్లలోనూ రాణించగలడు. ఏదేమైనా టీమిండియా బుమ్రా సేవలను కోల్పోవడం నష్టదాయకమే. అయితే, అర్ష్ బుమ్రా లేని లోటును కొంతవరకైనా తీర్చగలడు. ఇక హర్షిత్ రాణా కూడా ప్రతిభావంతుడైన ఫాస్ట్బౌలర్ అనడంలో సందేహం లేదు.అయితే, ఆరంభంలో రాణించినంత గొప్పగా.. ఆఖరి ఓవర్లలో అతడు రాణించలేకపోవచ్చు. అర్ష్దీప్ మాదిరి నైపుణ్యాలు అతడికి లేవు. అందుకే నా ఓటు అర్ష్కే’’ అని రిక్కీ పాంటింగ్ తెలిపాడు. కాగా లెఫ్టార్మ్ పేసర్ అయిన అర్ష్దీప్ సింగ్కు ఇప్పటి వరకు కేవలం తొమ్మిది వన్డేలు ఆడిన అనుభవం మాత్రమే ఉండగా.. హర్షిత్ రైనా ఇటీవలే అరంగేట్రం చేశాడు.ఇక అర్ష్దీప్ అంతర్జాతీయ క్రికెట్లో ఇప్పటి వరకు 14 వికెట్లు తీయగా.. అతడి లిస్ట్-‘ఎ’ గణాంకాలు మాత్రం మెరుగ్గా ఉన్నాయి. 33 మ్యాచ్లలో కలిపి అతడు 55 వికెట్లు పడగొట్టాడు. ఇదిలా ఉంటే..అంతర్జాతీయ టీ20లలో మాత్రం 26 ఏళ్ల అర్ష్దీప్నకు గొప్ప రికార్డు ఉంది. 63 మ్యాచ్లు ఆడి 99 వికెట్లు కూల్చిన అతడు.. టీమిండియా తరఫున టీ20లలో అత్యధిక వికెట్ల వీరుడిగా కొనసాగుతున్నాడు.మరోవైపు హర్షిత్ రాణా టీమిండియా తరఫున ఇప్పటి వరకు రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఒక టీ20 మ్యాచ్ ఆడి ఆయా ఫార్మాట్లలో వరుసగా 4, 6, 3 వికెట్లు తీశాడు. ఇక చాంపియన్స్ ట్రోఫీ ఆడబోయే భారత పేస్ దళంలో అర్ష్దీప్ సింగ్, హర్షిత్ రాణా రూపంలో మరో ఇద్దరు యువ పేసర్లతో పాటు సీనియర్ పేసర్ మహ్మద్ షమీ కూడా అందుబాటులో ఉన్న విషయం తెలిసిందే.చదవండి: బంగ్లాదేశ్తో మ్యాచ్కు భారత తుదిజట్టు ఇదే! రోహిత్ కోరుకుంటేనే అతడికి ఛాన్స్ -
చరిత్ర సృష్టించిన స్టీవ్ స్మిత్.. డబుల్ సెంచరీ.. తొలి ఆస్ట్రేలియన్గా రికార్డు
ఆసీస్ తాత్కాలిక సారధి స్టీవ్ స్మిత్ (Steve Smith) సరికొత్త చరిత్ర సృష్టించాడు. టెస్ట్ల్లో 200 క్యాచ్లు పూర్తి చేసుకున్న తొలి ఆస్ట్రేలియన్గా రికార్డు నెలకొల్పాడు. శ్రీలంకతో జరిగిన రెండో టెస్ట్లో స్మిత్ ఈ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్లో స్మిత్ మొత్తం ఐదు క్యాచ్లు పట్టుకున్నాడు. స్మిత్ క్యాచ్ల్లో డబుల్ సెంచరీ సాధించే క్రమంలో రికీ పాంటింగ్ (Ricky Ponting) రికార్డును అధిగమించాడు. 🚨 HISTORY BY STEVEN SMITH. 🚨- Smith becomes the first ever Australian fielder to complete 200 catches in Tests. 🙇♂️pic.twitter.com/3T2v9jgcid— Mufaddal Vohra (@mufaddal_vohra) February 9, 2025పాంటింగ్ 287 ఇన్నింగ్స్ల్లో 196 క్యాచ్లు అందుకోగా.. స్మిత్ 205 ఇన్నింగ్స్ల్లోనే 200 క్యాచ్లు పూర్తి చేశాడు. ఆసీస్ తరఫున టెస్ట్ల్లో అత్యధిక క్యాచ్లు పట్టుకున్న నాన్ వికెట్కీపర్ల జాబితాలో స్మిత్, పాంటింగ్ తర్వాతి స్థానంలో మార్క్ వా ఉన్నాడు. మార్క్ వా 209 ఇన్నింగ్స్ల్లో 181 క్యాచ్లు పట్టుకున్నాడు.ఓవరాల్గా ఐదో క్రికెటర్టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇప్పటివరకు కేవలం ఐదుగురు మాత్రమే 200 క్యాచ్లు పూర్తి చేశారు. వీరిలో టీమిండియా గ్రేట్ రాహుల్ ద్రవిడ్ (Rahu Dravid) 210 క్యాచ్లతో (164 టెస్ట్ల్లో) అగ్రస్థానంలో ఉండగా.. జో రూట్ (152 టెస్ట్ల్లో 207), మహేళ జయవర్దనే (149 టెస్ట్ల్లో 205), జాక్ కల్లిస్ (166 టెస్ట్ల్లో 200) ఆతర్వాతి స్థానాల్లో ఉన్నారు. శ్రీలంకతో మ్యాచ్లో స్మిత్ కల్లిస్ సరసన చేరడంతో పాటు 200 క్యాచ్ల క్లబ్లో చేరిన ఐదో ఆటగాడిగా నిలిచాడు. అలాగే టెస్ట్ల్లో అత్యంత వేగవంతంగా 200 క్యాచ్లు పూర్తి చేసిన ఆటగాడిగానూ స్మిత్ రికార్డు నెలకొల్పాడు. స్మిత్ కేవలం 116 టెస్ట్ల్లోనే 200 క్యాచ్లు పూర్తి చేశాడు. స్మిత్ మరో 11 క్యాచ్లు పడితే టెస్ట్ల్లో అత్యధిక క్యాచ్లు పట్టిన ఆటగాడిగా రాహుల్ ద్రవిడ్ రికార్డును బద్దలు కొడతాడు.లంకతో మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్లో ఆస్ట్రేలియా 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో ఐదు క్యాచ్లు పట్టిన స్మిత్.. బ్యాటింగ్లోనూ చెలరేగి టెస్ట్ల్లో 36వ సెంచరీ నమోదు చేశాడు. ఈ సెంచరీతో స్మిత్ టెప్ట్ల్లో అత్యధిక సెంచరీలు చేసిన ఐదో ఆటగాడిగా నిలిచాడు. ప్రస్తుతం స్మిత్, జో రూట్ తలో 36 సెంచరీలతో సంయుక్తంగా ఐదో స్థానంలో ఉన్నారు. టెస్ట్ల్లో అత్యధిక సెంచరీలు చేసిన రికార్డు సచిన్ టెండూల్కర్ (51) పేరిట ఉంది.అంతకుముందు స్మిత్ లంకతో జరిగిన తొలి టెస్ట్లోనూ సెంచరీ సాధించాడు. ఇదే మ్యాచ్లో స్మిత్ టెస్ట్ల్లో 10000 పరుగులు కూడా పూర్తి చేసుకున్నాడు. ఆసీస్ రెగ్యులర్ కెప్టెన్ పాట్ కమిన్స్ వ్యక్తిగత కారణాలతో ఈ సిరీస్కు దూరం కాగా.. అతని గైర్హాజరీలో స్మిత్ ఆసీస్ కెప్టెన్గా బాధ్యతలు నిర్వహించాడు. తొలి టెస్ట్లోనూ ఘన విజయం సాధించిన ఆసీస్.. రెండు మ్యాచ్ల సిరీస్ను 2-0 తేడాతో ఊడ్చేసింది. ఫిబ్రవరి 12, 14 తేదీల్లో ఆసీస్.. శ్రీలంకతో రెండు వన్డేలు ఆడనుంది. -
అద్భుతమైన ఆటగాడు.. అతడినే పక్కనపెడతారా?: ఆసీస్ దిగ్గజం
టీమిండియా స్టార్ శ్రేయస్ అయ్యర్(Shreyas Iyer)పై ఆస్ట్రేలియా దిగ్గజ కెప్టెన్ రిక్కీ పాంటింగ్(Ricky Ponting) ప్రశంసలు కురిపించాడు. మిడిలార్డర్లో చక్కగా రాణించగల నైపుణ్యాలు అతడి సొంతమని కొనియాడాడు. అయితే, గత రెండేళ్లుగా టీమిండియా యాజమాన్యం అయ్యర్కు అడపాదడపా మాత్రమే అవకాశాలు ఇవ్వడం తనకు విస్మయం కలిగిస్తోందని పేర్కొన్నాడు.కాగా స్వదేశంలో గతేడాది ఇంగ్లండ్తో టెస్టు సిరీస్ సందర్భంగా వెన్నునొప్పితో జట్టుకు దూరమైన శ్రేయస్ అయ్యర్.. ఆ తర్వాత కఠిన పరిస్థితులు ఎదుర్కొన్నాడు. రంజీల్లో ఆడాలన్న భారత క్రికెట్ నియంత్రణ మండలి(BCCI) ఆదేశాలను తొలుత బేఖాతరు చేసిన ఈ ముంబైకర్.. తర్వాత గాయాన్ని సాకుగా చూపి తప్పించుకున్నాడు.ఈ క్రమంలో బీసీసీఐ అయ్యర్పై కఠిన చర్యలు తీసుకుంది. అతడి సెంట్రల్ కాంట్రాక్టు రద్దు చేస్తూ వేటు వేసింది. ఈ తర్వాత అతడు దేశవాళీ క్రికెట్ బరిలోకి దిగి తనను తాను నిరూపించుకున్నాడు. అంతేకాదు.. ఐపీఎల్-2024లో కోల్కతా నైట్ రైడర్స్ కెప్టెన్గా టైటిల్ గెలిచాడు.టీ20 జట్టులో మాత్రం చోటు కరువుఈ నేపథ్యంలో గతేడాది శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్లో ఆడే అవకాశం దక్కించుకున్న శ్రేయస్ అయ్యర్.. టీ20 జట్టులో మాత్రం చోటు సంపాదించలేకపోయాడు. యాజమాన్యం అతడిని ఎప్పటికప్పుడు పక్కనపెట్టి.. కొత్త ఆటగాళ్లకు అవకాశాలు ఇచ్చింది. టీ20 ప్రపంచకప్-2024 జట్టులోనూ అతడికి చాన్స్ ఇవ్వలేదు.ఇక తాజాగా ఇంగ్లండ్తో స్వదేశంలో వన్డే సిరీస్ సందర్భంగా పునరాగమనం చేసిన శ్రేయస్ అయ్యర్.. నాగ్పూర్లో జరిగిన తొలి వన్డేలో అదరగొట్టాడు. కేవలం 36 బంతుల్లోనే 59 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్లో తొమ్మిది ఫోర్లతో పాటు రెండు సిక్సర్లు ఉండటం విశేషం.అయితే, ఈ మ్యాచ్లో తనకు తొలుత తుదిజట్టులో స్థానం లేదని.. విరాట్ కోహ్లి గాయపడ్డ కారణంగానే తనను పిలిపించారని శ్రేయస్ అయ్యర్ స్వయంగా వెల్లడించాడు. ఈ నేపథ్యంలో మేనేజ్మెంట్ తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఫామ్లో ఉన్న ఆటగాడిని బెంచ్కే పరిమితం చేయాలని చూడటం సరికాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.అద్భుతమైన ఆటగాడు.. అతడినే పక్కనపెడతారా?ఈ నేపథ్యంలో లెజెండరీ బ్యాటర్ రిక్కీ పాంటింగ్ ఐసీసీ రివ్యూ షోలో మాట్లాడుతూ.. ‘‘గత రెండేళ్లుగా అతడి సేవలను ఎందుకు సరిగ్గా ఉపయోగించుకోవడం లేదో అర్థం కావడం లేదు. వన్డే ప్రపంచకప్-2023లోనూ శతకాలతో చెలరేగి భీకరమైన ఫామ్ కనబరిచాడు.మిడిలార్డర్లో సొగసైన బ్యాటింగ్తో అలరించాడు. దీంతో జట్టులో అతడి స్థానం సుస్థిరమైందని నేను అనుకున్నా. కానీ అలా జరుగలేదు. వెన్నునొప్పి కారణంగా అతడు జట్టులో స్థానం కోల్పోయాడు. ఆ తర్వాత దేశవాళీ క్రికెట్లో అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు.అయినా.. అతడిని పక్కనపెట్టాలని చూడటం సరికాదు’’ అని అభిప్రాయపడ్డాడు. కాగా ఐపీఎల్-2025లో పంజాబ్ కింగ్స్ హెడ్కోచ్గా పాంటింగ్ నియమితుడైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో వేలంలో భాగంగా శ్రేయస్ అయ్యర్ను పంజాబ్ రూ. 26.75 కోట్లకు కొనుగోలు చేయడంలో పాంటింగ్ కీలక పాత్ర పోషించాడు. వీరిద్దరు కలిసి గతంలో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున పనిచేశారు కూడా!ఇదిలా ఉంటే.. ఇంగ్లండ్తో గురువారం నాటి తొలి వన్డేలో టీమిండియా నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది. తద్వారా మూడు మ్యాచ్ల సిరీస్లో 1-0తో ఆధిక్యం సంపాదించింది. ఇరుజట్ల మధ్య ఆదివారం కటక్లో రెండో వన్డే జరుగుతుంది.చదవండి: సెంచరీకి చేరువలో ఉన్నాడని.. ఇలా చేస్తావా?: మండిపడ్డ గావస్కర్ -
స్టీవ్ స్మిత్ సరికొత్త చరిత్ర.. ఆసీస్ తొలి బ్యాటర్గా అరుదైన ఫీట్
ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్(Steve Smith) అద్బుత ఫామ్ కొనసాగిస్తున్నాడు. శ్రీలంక(Sri Lanka vs Australia)తో రెండో టెస్టులోనూ ఈ కుడిచేతి వాటం ఆటగాడు సెంచరీతో అదరగొట్టాడు. ఈ క్రమంలో ఇటీవలే టెస్టు ఫార్మాట్లో పదివేల పరుగుల మైలురాయిని అందుకున్న స్మిత్.. తాజాగా మరో అరుదైన ఘనత సాధించాడు.ఆల్టైమ్ రికార్డు బద్దలుఆసియాలో టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన ఆస్ట్రేలియా బ్యాటర్గా స్మిత్ నిలిచాడు. రిక్కీ పాంటింగ్(Ricky Ponting) ఆల్టైమ్ రికార్డును బద్దలు కొట్టి ఈ జాబితాలో అగ్రస్థానంలోకి దూసుకువచ్చాడు. కాగా టీమిండియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీ సందర్భంగా స్మిత్ మళ్లీ ఫామ్లోకి వచ్చిన విషయం తెలిసిందే.భారత్తో బ్రిస్బేన్ టెస్టులో 101 పరుగులు సాధించిన స్మిత్.. మెల్బోర్న్లో భారీ శతకం(140)తో చెలరేగాడు. అనంతరం.. శ్రీలంక పర్యటనలో భాగంగా తొలి టెస్టులోనూ తాత్కాలిక స్మిత్ శతక్కొట్టాడు. గాలె మ్యాచ్లో 141 పరుగులతో చెలరేగి జట్టు భారీ విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్ సందర్భంగానే టెస్టు ఫార్మాట్లో పదివేల పరుగుల క్లబ్లో కూడా చేరాడు.ఇక తాజాగా లంకతో రెండో టెస్టులోనూ స్టీవ్ స్మిత్ శతకం దిశగా పయనిస్తున్నాడు. ఈ క్రమంలో ఆసియా గడ్డ మీద పందొమ్మిది వందలకు పైగా పరుగులు పూర్తి చేసుకుని.. ఆస్ట్రేలియా తరఫున హయ్యస్ట్ రన్స్కోరర్గా నిలిచాడు. లంకతో రెండో టెస్టు భోజన విరామ సమయానికి స్మిత్.. ఆసియాలో 1917 పరుగులు పూర్తి చేసుకున్నాడు.కెప్టెన్ ఇన్నింగ్స్తో మెరిసిన స్మిత్ఇదిలా ఉంటే.. తొలి టెస్టులో ఆతిథ్య లంకను ఇన్నింగ్స్ 242 పరుగుల తేడాతో ఆసీస్ చిత్తు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య గురువారం నుంచి గాలెలో రెండో టెస్టు మొదలుకాగా.. టాస్ గెలిచిన శ్రీలంక తొలుత బ్యాటింగ్ చేసింది. ఆసీస్ బౌలర్ల విజృంభణ కారణంగా 257 పరుగులకే తొలి ఇన్నింగ్స్ ఆలౌట్ అయింది.ఈ క్రమంలో శుక్రవారం నాటి రెండో రోజు ఆటలో భాగంగా ఆస్ట్రేలియా అదరగొడుతోంది. ఓపెనర్లు ట్రవిస్ హెడ్(22 బంతుల్లో 21), ఉస్మాన్ ఖవాజా(57 బంతుల్లో 36) ఫర్వాలేదనిపించగా.. వన్డౌన్ బ్యాటర్ మార్నస్ లబుషేన్(4) మరోసారి విఫలమయ్యాడు.ఈ దశలో స్మిత్ మరోసారి కెప్టెన్ ఇన్నింగ్స్తో మెరిశాడు. అతడికి తోడుగా వికెట్ కీపర్ బ్యాటర్ అలెక్స్ క్యారీ వేగంగా ఆడుతూ అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. ఈ ఇద్దరి నిలకడైన ప్రదర్శన కారణంగా 55 ఓవర్ల ఆట ముగిసే సరికి ఆస్ట్రేలియా మూడు వికెట్ల నష్టానికి 215 పరుగుల వద్ద నిలిచింది.ఆసియాలో టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన ఆస్ట్రేలియా బ్యాటర్లు 👉స్టీవ్ స్మిత్: 23 మ్యాచ్లలో సగటు 50.35తో 1917+ పరుగులు. అత్యధిక స్కోరు- 178*- శతకాలు ఆరు.👉రిక్కీ పాంటింగ్: 28 మ్యాచ్లలో సగటు 41.97తో 1889 పరుగులు- అత్యధిక స్కోరు 150- శతకాలు ఐదు👉అలెన్ బోర్డర్: 22 మ్యాచ్లలో సగటు 54.51తో 1799తో 1799 పరుగులు- అత్యధిక స్కోరు 162- శతకాలు ఆరు👉మాథ్యూ హెడెన్: 19 మ్యాచ్లలో 50.39 సగటుతో 1663 పరుగులు- అత్యధిక స్కోరు 203- శతకాలు నాలుగు👉ఉస్మాన్ ఖవాజా: 17 మ్యాచ్లలో 61.76 సగటుతో 1544 పరుగులు- అత్యధిక స్కోరు 232- శతకాలు ఐదు. -
చరిత్ర సృష్టించిన స్మిత్.. పాంటింగ్ ఆల్టైమ్ రికార్డు సమం
ఆస్ట్రేలియా స్టాండింగ్ కెప్టెన్ స్టీవ్ స్మిత్(Steve Smith) అరుదైన ఘనత సాధించాడు. టెస్టుల్లో అత్యధిక క్యాచ్లు అందుకున్న ఆస్ట్రేలియా ఆటగాడిగా రికీ పాంటింగ్ రికార్డు సమం చేశాడు. గాలే వేదికగా శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో కమిందు మెండిస్ క్యాచ్ను అందుకున్న ఈ స్మిత్.. ఈ అరుదైన ఫీట్ను తన ఖాతాలో వేసుకున్నాడు. పాంటింగ్ 287 ఇన్నింగ్స్లలో 196 క్యాచ్లు అందుకోగా.. స్మిత్ కేవలం 205 ఇన్నింగ్స్లలో సరిగ్గా 196 క్యాచ్లు అందుకున్నాడు. వీరిద్దరి తర్వాతి స్ధానంలో ఆసీస్ క్రికెట్ దిగ్గజం మార్క్ వా(181) ఉన్నాడు. ఇక ఓవరాల్గా వరల్డ్ క్రికెట్లో ఈ ఫీట్ సాధించిన జాబితాలో టీమిండియా దిగ్గజం రాహుల్ ద్రవిడ్ ఉన్నాడు. 286 టెస్టు ఇన్నింగ్స్లలో ద్రవిడ్.. 210 క్యాచ్లను తీసుకున్నాడు. స్మిత్ 14 క్యాచ్లను అందుకుంటే రాహుల్ ద్రవిడ్ ఆల్టైమ్ రికార్డును బ్రేక్ చేసే అవకాశముంది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. రెండో టెస్టులోనూ ఆస్ట్రేలియా ఆధిపత్యం కొనసాగుతోంది. టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన శ్రీలంక తమ తొలి ఇన్నింగ్స్లో కాస్త తడబడుతోంది. 71 ఓవర్లకు శ్రీలంక 6 వికెట్లు కోల్పోయి 193 పరుగులు చేసింది. లంక బ్యాటర్లు కుశాల్ మెండిస్(35), రమేష్ మెండిస్(20) ఆచితూచి ఆడుతున్నారు. ఆస్ట్రేలియా బౌలర్లలో ఇప్పటివరకు నాథన్ లియోన్ మూడు వికెట్లు పడగొట్టగా..మిచెల్ స్టార్క్, మథ్యూ కుహ్నమెన్, హెడ్ తలా వికెట్ సాధించారు. కాగా ఆస్ట్రేలియా ఇప్పటికే తొలి టెస్టులో లంకను మట్టికర్పించింది.ఈ మ్యాచ్ను డ్రా ముగించినా చాలు సిరీస్ ఆసీస్ 1-0 సొంతం చేసుకుంటుంది. శ్రీలంక టూర్కు ఆసీస్ రెగ్యూలర్ కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ గాయం కారణంగా దూరమయ్యాడు. అతడి స్ధానంలో ఆసీస్ జట్టును స్మిత్ ముందుండి నడ్పిస్తున్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో కూడా ఆస్ట్రేలియా జట్టు పగ్గాలను స్మిత్ చేపట్టే అవకాశముంది.ఎందుకంటే ఛాంపియన్స్ ట్రోఫీకి కూడా కమ్మిన్స్ దూరం కానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మెగా టోర్నీకి ముందు ఆస్ట్రేలియాకు వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. జోష్ హెజిల్వుడ్, మిచిల్ మార్ష్ గాయం కారణంగా దూరం కాగా.. తాజాగా స్టార్ ఆల్రౌండర్ మార్కస్ స్టోయినిష్ పూర్తిగా వన్డే క్రికెట్కే విడ్కోలు పలికాడు.196TH TEST CATCH STEVE SMITH. 😱Steve Smith is on the verge of creating another record. This batter is top-class, and he is also a Superman in fielding. He has taken 196 catches so far, and with one more catch, he will break Ponting's record.Most Test catches for Australia by… pic.twitter.com/fKtqYvYEVs— All Cricket Records (@Cric_records45) February 6, 2025 -
యజమానులు ఎవరైనా.. జట్టు మాత్రం నాదే: రిక్కీ పాంటింగ్
ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-2025లో సరికొత్త పంజాబ్ కింగ్స్(Punjab Kings)ను చూస్తారని హెడ్కోచ్ రిక్కీ పాంటింగ్(Ricky Ponting) అన్నాడు. వేలం విషయంలో ఫ్రాంఛైజీ యజమాన్యం తనకు పూర్తి స్వేచ్ఛనిచ్చిందని.. అందుకే తన వ్యూహాలను పక్కాగా అమలు చేయగలిగినట్లు తెలిపాడు. కోరుకున్న ఆటగాళ్లను దక్కించుకోవడంలో తాము సఫలమయ్యామన్నాడు.ఇక మైదానంలో మెరుగైన ఫలితాలు సాధించడంపైనే ప్రస్తుతం తన దృష్టి మొత్తం కేంద్రీకృతమై ఉన్నట్లు రిక్కీ పాంటింగ్ పేర్కొన్నాడు. కాగా ఈ ఆస్ట్రేలియా దిగ్గజానికి ఐపీఎల్తో గత పదేళ్లుగా అనుబంధం ఉంది.ఢిల్లీ క్యాపిటల్స్తో ఏడేళ్లుఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals) ప్రాంఛైజీకి అత్యధికంగా ఏడేళ్లు అతడు హెడ్కోచ్గా పనిచేశాడు. 2018- 2024 వరకు అతడి మార్గదర్శనంలో ఢిల్లీ జట్టు మిశ్రమ ఫలితాలు అందుకుంది. అయితే, అత్యుత్తమంగా 2020లో ఫైనల్కు చేరింది. కానీ రన్నరప్తోనే సరిపెట్టుకుంది. ఇక అంతకు ముందు 2019లో.. ఆ తర్వాత 2021లో ప్లే ఆఫ్స్ వరకు చేరగలిగింది.కానీ 2022-2024 వరకు ఒక్కసారి కూడా టాప్-4లోనూ అడుగుపెట్టలేకపోయింది. ఈ నేపథ్యంలో ఢిల్లీ యాజమాన్యం రిక్కీ పాంటింగ్తో తమకున్న సుదీర్ఘ అనుబంధాన్ని తెంచుకుంది. అనంతరం.. పంజాబ్ కింగ్స్ పాంటింగ్ను తమ కుటుంబంలోకి ఆహ్వానించి ప్రధాన కోచ్గా నియమించింది.చెత్త రికార్డుతో పంజాబ్ఇక ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్కు ఉన్న చెత్త రికార్డు గురించి తెలిసిందే. క్యాష్ రిచ్ లీగ్ ఆరంభ ఎడిషన్(2008) నుంచి ఇప్పటిదాకా కేవలం రెండుసార్లే ప్లే ఆఫ్స్ చేరింది. ఆఖరి నిమిషంలో చేతులెత్తేసి మ్యాచ్లు చేజార్చుకున్న సందర్భాలు కోకొల్లలు. అయితే, ఈసారి మాత్రం పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లాలనే ఆలోచనతో పాంటింగ్ను రంగంలోకి దింపింది.ఈ నేపథ్యంలో పంజాబ్ కింగ్స్ యాజమాన్యం గురించి రిక్కీ పాంటింగ్ హెవీ గేమ్స్ పాడ్కాస్ట్లో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘వేలానికి ముందు మేము అన్ని రకాలుగా చర్చించుకున్నాం. అంతా అనుకున్నట్లే జరిగినందుకు నాకు సంతోషంగా ఉంది.యజమానులు వాళ్లే అయినా.. జట్టు పూర్తిగా నాదేఇక ఇప్పటి నుంచి ఫ్రాంఛైజీ యజమానులు ఎవరైనా సరే.. జట్టు మాత్రం పూర్తిగా నా చేతుల్లో ఉంటుంది. జట్టు గత చరిత్ర గురించి నేను చాలా విషయాలు విన్నాను. ఇకపై అందుకు భిన్నంగా ఉండాలంటే నాకు స్వేచ్ఛ కావాలని అడిగాను. అందుకు ఓనర్లు కూడా అంగీకరించారు. ఫ్రాంఛైజీ యజమానులతో పాటు అడ్మినిస్ట్రేటర్లు, బోర్డు డైరెక్టర్లు.. ఇలా ప్రతి ఒక్కరికి నా కార్యచరణ గురించి వివరించాను. నా శైలిలో జట్టును ముందుకు తీసుకువెళ్తాను. ముఖ్యంగా భారత క్రికెటర్లపై మేము ఎక్కువగా దృష్టి పెట్టాము. వారి రాక మాకు శుభారంభం లాంటిదే’’ అని రిక్కీ పాంటింగ్ పేర్కొన్నాడు.రికార్డు ధరకు అయ్యర్ను కొనికాగా ఐపీఎల్-2025 మెగా వేలంలో పంజాబ్ కింగ్స్ రికార్డు స్థాయిలో .. టీమిండియా స్టార్ శ్రేయస్ అయ్యర్ కోసం ఏకంగా రూ. 26.75 కోట్లు ఖర్చుపెట్టింది. గత సీజన్లో కోల్కతా నైట్ రైడర్స్కు టైటిల్ అందించిన ఈ విన్నింగ్ కెప్టెన్ను తమ సారథిగా నియమించింది. అంతేకాదు.. వేలానికి ముందు ప్రభ్సిమ్రన్ సింగ్, శశాంక్ సింగ్లను మాత్రమే రిటైన్ చేసుకున్న పంజాబ్.. వేలంలో మరో టీమిండియా స్టార్ స్పిన్నర్ యజువేంద్ర చహల్ను రూ. 18 కోట్లకు కొనుగోలు చేసింది. ఇక పంజాబ్ జట్టుకు నెస్ వాడియా, ప్రీతి జింటా సహ యజమానులు అన్న విషయం తెలిసిందే.చదవండి: అతడికి ఇదే చివరి ఐసీసీ టోర్నీ.. టీమిండియా గెలిస్తే చరిత్రే: సురేశ్ రైనా -
CT 2025: సెమీస్, ఫైనల్ చేరే జట్లు ఇవే!.. కానీ ఆ టీమ్తో జాగ్రత్త!
ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy) టోర్నమెంట్ రూపంలో మరో మెగా ఈవెంట్ క్రికెట్ ప్రేమికుల ముందుకు రానుంది. పాకిస్తాన్ వేదికగా ఫిబ్రవరి 19న ఈ టోర్నీకి తెరలేవనుంది. ఎనిమిది జట్లు టైటిల్ కోసం పోటీపడనున్నాయి. వన్డే వరల్డ్కప్-2023 ప్రదర్శన ఆధారంగా విజేత ఆస్ట్రేలియా, రన్నరప్ ఇండియాతో పాటు.. సౌతాఫ్రికా, న్యూజిలాండ్, అఫ్గనిస్తాన్, బంగ్లాదేశ్, ఇంగ్లండ్ ఈ టోర్నీకి అర్హత సాధించాయి.మరోవైపు.. డిఫెండింగ్ చాంపియన్ హోదాలో పాకిస్తాన్ బరిలోకి దిగనుంది. ఈవెంట్ ఆరంభానికి సమయం సమీపిస్తున్న తరుణంలో ఇప్పటికే ఆయా దేశాల బోర్డులు తమ జట్లను ప్రకటించాయి. ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ రవిశాస్త్రి(Ravi Shastri), ఆస్ట్రేలియా దిగ్గజం రిక్కీ పాంటింగ్(Ricky Ponting) చాంపియన్స్ ట్రోఫీ-2025 ఫైనలిస్టులు ఎవరన్న అంశంపై తమ అంచనాలు తెలియజేశారు.సెమీస్, ఫైనల్ చేరే జట్లు ఇవే!ఐసీసీ రివ్యూ షోలో రవిశాస్త్రి మాట్లాడుతూ.. ఇంగ్లండ్, సౌతాఫ్రికా.. టీమిండియా, ఆస్ట్రేలియా సెమీ ఫైనల్కు చేరతాయని అభిప్రాయపడ్డాడు. ఇందుకు పాంటింగ్ బదులిస్తూ.. ‘‘ఇండియా- ఆస్ట్రేలియాను దాటుకుని వేరే జట్లు పైకి వెళ్లడం ఈసారీ కష్టమే.ఎందుకంటే.. ప్రస్తుతం ఇరు దేశాల జట్లలో నాణ్యమైన నైపుణ్యాలున్న ఆటగాళ్లు మెండుగా ఉన్నారు. ఇటీవల ఐసీసీ ఈవెంట్లలో ఈ జట్లు సత్తా చాటిన తీరే ఇందుకు నిదర్శనం. కాబట్టి ఈ రెండు ఫైనల్కు చేరే అవకాశం ఉంది’’ అని అంచనా వేశాడు.కానీ పాకిస్తాన్తో జాగ్రత్తఅయితే, ఆతిథ్య జట్టు పాకిస్తాన్ను కూడా తక్కువ అంచనా వేయవద్దని రిక్కీ పాంటింగ్ ఈ సందర్భంగా గుర్తు చేశాడు. ‘‘ఇటీవలి కాలంలో నిలకడగా ఆడుతున్న జట్టు ఏదైనా ఉందంటే.. అది పాకిస్తాన్. వన్డే క్రికెట్లో ప్రస్తుతం వారి ప్రదర్శన అద్బుతంగా ఉంది.ఐసీసీ వంటి ప్రధాన టోర్నమెంట్లలో వారి ఆటతీరు ఒక్కోసారి అంచనాలకు భిన్నంగా ఉంటుంది. ఈసారి మాత్రం ప్రతికూలతలన్నీ అధిగమించే అవకాశం ఉంది’’ అని రిక్కీ పాంటింగ్ మిగతా జట్లను హెచ్చరించాడు. కాగా 2017లో చివరిసారిగా చాంపియన్స్ ట్రోఫీ టోర్నీ జరిగింది. నాటి ఫైనల్లో టీమిండియాను ఓడించి పాకిస్తాన్ టైటిల్ గెలిచింది.ఇదిలా ఉంటే.. ఈ ఐసీసీ టోర్నీలో ఆస్ట్రేలియా రెండుసార్లు చాంపియన్గా నిలిచింది. రిక్కీ పాంటింగ్ సారథ్యంలో 2006, 2009లొ ట్రోఫీని కైవసం చేసుకుంది. మరోవైపు.. టీమిండియా 2013లో మహేంద్ర సింగ్ ధోని కెప్టెన్సీలో ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ విజేతగా నిలిచింది.ఇక పాకిస్తాన్లో చాంపియన్స్ ట్రోఫీ జరుగనున్న నేపథ్యంలో భద్రతా కారణాల దృష్ట్యా టీమిండియా అక్కడికి వెళ్లడం లేదు. ఐసీసీ అనుమతితో హైబ్రిడ్ విధానంలో దుబాయ్ వేదికగా తమ మ్యాచ్లు ఆడనుంది. ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్తో మ్యాచ్తో తమ ప్రయాణం మొదలుపెట్టనున్న రోహిత్ సేన.. తదుపరి ఫిబ్రవరి 23న దాయాది పాకిస్తాన్తో తలపడనుంది. అనంతరం.. మార్చి రెండున న్యూజిలాండ్తో మ్యాచ్ ఆడుతుంది. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025కి భారత జట్టురోహిత్ శర్మ(కెప్టెన్), శుబ్మన్ గిల్(వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), రిషభ్ పంత్(వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, జస్ప్రీత్ బుమ్రా(ఫిట్నెస్ ఆధారంగా) మహ్మద్ షమీ, అర్ష్దీప్ సింగ్.ట్రావెలింగ్ రిజర్వ్స్: ఆవేశ్ ఖాన్, నితీశ్ కుమార్ రెడ్డి, వరుణ్ చక్రవర్తి. -
ఆస్ట్రేలియా ప్రపంచ రికార్డు.. టీమిండియాను వెనక్కి నెట్టి టాప్లోకి!
టీమిండియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీ సందర్భంగా ఫామ్లోకి వచ్చిన ఆస్ట్రేలియా వెటరన్ క్రికెటర్ స్టీవ్ స్మిత్(Steve Smith).. తన జోరును కొనసాగిస్తున్నాడు. మెల్బోర్న్ టెస్టులో భారీ శతకం(140) బాదిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. భారత్ ఆఖరిదైన సిడ్నీ టెస్టులో మొత్తంగా 37 పరుగులు చేసి.. 9999 పరుగుల వద్ద నిలిచాడు. తాజాగా శ్రీలంక(Australia vs Sri Lanka)తో తొలి టెస్టు సందర్భంగా టెస్టుల్లో పది వేల పరుగుల క్లబ్లో చేరాడు. తద్వారా ఆస్ట్రేలియా తరఫున ఈ ఘనత సాధించిన నాలుగో క్రికెటర్గా స్మిత్ చరిత్రకెక్కాడు. ఆస్ట్రేలియా ప్రపంచ రికార్డుఅతడి కంటే ముందు.. అలెన్ బోర్డర్, స్టీవ్ వా, రిక్కీ పాంటింగ్(Ricky Ponting) ఈ ఫీట్ నమోదు చేశారు. అయితే, తాజాగా స్మిత్ పదివేల టెస్టు పరుగుల మైలురాయిని అందుకున్న క్రమంలో ఆస్ట్రేలియా ప్రపంచ రికార్డును సొంతం చేసుకుంది. టెస్టు క్రికెట్లో ఒక దేశం తరఫున అత్యధికంగా నలుగురు ఆటగాళ్లు ఈ మైలురాయిని చేరుకోవడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఇంతకు ముందు ఈ జాబితాలో టీమిండియాతో కలిసి ఆసీస్ అగ్రస్థానంలో ఉండేది. ఇప్పుడు భారత్ను వెనక్కి నెట్టి వరల్డ్ రికార్డు సొంతం చేసుకుంది. కాగా ప్రపంచ టెస్టు చాంపియన్షిప్(డబ్ల్యూటీసీ) 2023-25 సీజన్లో ఆసీస్ జట్టు ఇప్పటికే ఫైనల్కు చేరుకుంది. బోర్డర్ -గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఐదు టెస్టుల సిరీస్లో టీమిండియాను 3-1తో ఓడించి టైటిల్ పోరుకు అర్హత సాధించింది. ఈ క్రమంలో డబ్ల్యూటీసీ తాజా ఎడిషన్లో ఆఖరిగా రెండు టెస్టుల సిరీస్ ఆడేందుకు కంగారూ జట్టు శ్రీలంకకు వచ్చింది.ఖవాజా డబుల్ ధమాకాఈ క్రమంలో గాలె అంతర్జాతీయ స్టేడియం వేదికగా ఇరుజట్ల మధ్య బుధవారం తొలి టెస్టు ఆరంభమైంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్గా ప్రమోట్ అయిన ట్రవిస్ హెడ్ ధనాధన్ దంచికొట్టి అర్ధ శతకంతో మెరవగా.. మరో ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా ఏకంగా డబుల్ సెంచరీతో చెలరేగాడు. హెడ్ 40 బంతుల్లో 57 పరుగులు సాధిస్తే.. ఖవాజా ఏకంగా 352 బంతులు ఎదుర్కొని 232 రన్స్ చేశాడు.స్మిత్ రికార్డు సెంచరీమరోవైపు.. వన్డౌన్ బ్యాటర్ మార్నస్ లబుషేన్(20) తన వైఫల్యాన్ని కొనసాగించగా.. నాలుగో స్థానంలో వచ్చిన కెప్టెన్ స్టీవ్ స్మిత్ ఆకాశమే హద్దుగా దూసుకుపోయాడు. మొత్తంగా 251 బంతులు ఫేస్ చేసిన స్మిత్.. 12 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 141 పరుగులతో సత్తా చాటాడు. తద్వారా తన టెస్టు కెరీర్లో 35వ టెస్టు సెంచరీ నమోదు చేసిన 36 ఏళ్ల స్మిత్.. పలు రికార్డులు తన ఖాతాలో వేసుకున్నాడు.సెంచరీల పరంగా రెండోస్థానంలోకి‘ఫ్యాబ్ ఫోర్’లో ఒకరిగా గుర్తింపు పొందిన స్మిత్ టెస్టు సెంచరీల పరంగా రెండో స్థానానికి చేరుకున్నాడు. ఈ లిస్టులో ఇంగ్లండ్ టెస్టు దిగ్గజం జో రూట్ 36 శతకాలతో ప్రథమస్థానంలో ఉండగా.. న్యూజిలాండ్ స్టార్ కేన్ విలియమ్సన్ 33, టీమిండియా రన్మెషీన్ విరాట్ కోహ్లి 30 సెంచరీలతో స్మిత్ తర్వాతి స్థానాల్లో ఉన్నారు.అంతేకాదు.. ప్రస్తుతం యాక్టివ్గా ఉన్న క్రికెటర్లలో మూడు ఫార్మాట్లలో కలిపి శతకాల పరంగా నాలుగో స్థానానికి ఎగబాకాడు. అంతర్జాతీయ స్థాయిలో విరాట్ కోహ్లి 81 శతకాలతో టాప్(Active Cricketers)లో ఉండగా.. రూట్ 52, రోహిత్ శర్మ 48, స్మిత్ 47 సెంచరీలతో టాప్-4లో నిలిచారు.ఇక శ్రీలంకతో మ్యాచ్లో ఖవాజా(232), స్మిత్(141)లతో పాటు జోష్ ఇంగ్లిస్ కూడా బ్యాట్ ఝులిపించాడు. 94 బంతుల్లోనే 102 పరుగులతో చెలరేగాడు. ఈ నేపథ్యంలో ఆరు వికెట్ల నష్టానికి 654 పరుగుల వద్ద ఆస్ట్రేలియా తమ తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది.టెస్టుల్లో పది వేలకు పైగా పరుగులు చేసిన ఆటగాళ్లు- ఏ దేశం తరఫున ఎందరు?👉ఆస్ట్రేలియా- నలుగురు- అలెన్ బోర్డర్, స్టీవ్ వా, రిక్కీ పాంటింగ్, స్టీవ్ స్మిత్👉ఇండియా- ముగ్గురు- సునిల్ గావస్కర్, సచిన్ టెండుల్కర్, రాహుల్ ద్రవిడ్👉ఇంగ్లండ్- ఇద్దరు- అలిస్టర్ కుక్, జో రూట్👉శ్రీలంక- ఇద్దరు- కుమార్ సంగక్కర, మహేళ జయవర్దనే👉వెస్టిండీస్- ఇద్దరు- బ్రియన్ లారా, శివ్నరైన్ చందర్పాల్👉పాకిస్తాన్- ఒక్కరు- యూనిస్ ఖాన్👉సౌతాఫ్రికా- ఒక్కరు- జాక్వెస్ కలిస్.చదవండి: మరో డీఎస్పీ!.. పోలీస్ ఉద్యోగంలో చేరిన భారత క్రికెటర్ -
ఇంకెన్నాళ్లు ఇలా?.. అతడిని ఆస్ట్రేలియా టూర్కి పంపాల్సింది!
వెటరన్ పేసర్ మహ్మద్ షమీ(Mohammed Shami) టీమిండియా పునరాగమనం ఎప్పుడు? ఇప్పటికే ఆస్ట్రేలియాతో ప్రతిష్టాత్మక టెస్టు సిరీస్కు దూరమైన ఈ సీనియర్ బౌలర్.. కనీసం ఇంగ్లండ్తో పరిమిత ఓవర్ల సిరీస్కు అయినా అందుబాటులోకి వస్తాడా?.. ఇంతకీ షమీకి ఏమైంది? అతడి గాయం తీవ్రత ఎలా ఉంది?.. దేశవాళీ క్రికెట్ ఆడేందుకు తప్ప జాతీయ జట్టుతో చేరేందుకు అతడు సిద్ధంగా లేడా?..భారత క్రికెట్ జట్టు మాజీ హెడ్కోచ్ రవిశాస్త్రి(Ravi Shastri) వ్యక్తం చేస్తున్న సందేహాలు ఇవి. అసలు షమీ ఫిట్నెస్ గురించి భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) గానీ.. జాతీయ క్రికెట్ అకాడమీ(ఎన్సీఏ) గానీ స్పష్టత ఎందుకు ఇవ్వడం లేదని ఈ మాజీ క్రికెటర్ ప్రశ్నిస్తున్నాడు. తానే గనుక బీసీసీఐ నాయకత్వంలో ఉంటే గనుక షమీని కచ్చితంగా ఆస్ట్రేలియా పర్యటనకు పంపించేవాడినని పేర్కొన్నాడు.అదే ఆఖరుకాగా వన్డే ప్రపంచకప్-2023(ODI World Cup 2023) సందర్భంగా మహ్మద్ షమీ చివరిసారిగా టీమిండియా తరఫున బరిలోకి దిగాడు. సొంతగడ్డపై జరిగిన ఈ ఐసీసీ టోర్నీలో ఈ రైటార్మ్ పేసర్ ఏకంగా 24 వికెట్లు పడగొట్టాడు. చీలమండ నొప్పి వేధిస్తున్నా బంతితో మైదానంలో దిగి.. ప్రత్యర్థులకు వణుకుపుట్టించాడు. అద్భుత ప్రదర్శనతో టీమిండియా ఫైనల్కు చేరడంలో కీలక పాత్ర పోషించాడు.దేశీ టీ20 టోర్నీతో రీ ఎంట్రీఅయితే, దురదృష్టవశాత్తూ టైటిల్ పోరులో రోహిత్ సేన ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయి.. రన్నరప్తో సరిపెట్టుకుంది. ఇక ఈ మెగా ఈవెంట ముగిసిన తర్వాత షమీ చీలమండ గాయానికి శస్త్ర చికిత్స చేయించుకున్నాడు. అనంతరం బెంగళూరులోని ఎన్సీఏలో పునరావాసం పొందాడు. దాదాపు ఏడాది తర్వాత దేశీ టీ20 టోర్నమెంట్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ సందర్భంగా బెంగాల్ తరఫున బరిలోకి దిగాడు.ఈ టోర్నీలో మొత్తంగా తొమ్మిది మ్యాచ్లు ఆడిన షమీ.. పదకొండు వికెట్లు తీసి సత్తా చాటాడు. తద్వారా పొట్టి ఫార్మాట్లో ఓవరాల్గా 201 వికెట్లు పూర్తి చేసుకున్నాడు. అప్పటికే ఆసీస్తో టీమిండియా బోర్డర్- గావస్కర్ ట్రోఫీ(Border Gavaskar Trophy) సిరీస్ మొదలుపెట్టగా.. కనీసం మూడో టెస్టు నుంచైనా షమీ జట్టుతో చేరతాడనే వార్తలు వచ్చాయి.కొన్నాళ్లు విరామం కానీ కెప్టెన్ రోహిత్ శర్మ మాత్రం షమీ గాయంపై స్పష్టత లేదని.. అతడి ఫిట్నెస్ గురించి తమకు పూర్తి సమచారం లేదని పేర్కొన్నాడు. దీంతో షమీ ఆసీస్ టూర్ అటకెక్కింది. ఈ క్రమంలో కొన్నాళ్లు విరామం తీసుకున్న షమీ.. దేశీ వన్డే టోర్నమెంట్ విజయ్ హజారే ట్రోఫీ ద్వారా రీఎంట్రీ ఇచ్చాడు. ఇటీవల మధ్యప్రదేశ్తో మ్యాచ్లో ఈ బెంగాల్ ఆటగాడు బ్యాట్ ఝులిపించడం విశేషం. 42 పరుగులతో ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు.ఇదిలా ఉంటే.. ఆస్ట్రేలియాతో టెస్టుల్లో షమీ లేని లోటు స్పష్టంగా కనిపించింది. మహ్మద్ సిరాజ్తో పాటు యువ పేసర్లు హర్షిత్ రాణా, ఆకాశ్ దీప్ పెద్దగా రాణించకపోవడంతో ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రాపై అదనపు భారం పడింది. ఇక ఈ సిరీస్ను టీమిండియా 1-3తో కోల్పోయిన విషయం తెలిసిందే.ఇంకెన్నాళ్లు ఇలా?ఈ నేపథ్యంలో ఐసీసీ రివ్యూ షోలో రవిశాస్త్రి మాట్లాడుతూ.. ‘‘అసలు అతడు ఎక్కడ ఉన్నాడు? పూర్తి స్థాయిలో కోలుకునేది ఎప్పుడు? అతడిని ఇంకెన్నాళ్లు ఎన్సీఏలో కూర్చోబెడతారు? అతడి ఫిట్నెస్ గురించి, ప్రస్తుతం అతడి పరిస్థితి గురించి బీసీసీఐ గానీ, ఎన్సీఏ గానీ ఎందుకు సరైన సమాచారం ఇవ్వలేకపోతోంది. నిజానికి అతడికి ఉన్న నైపుణ్యాల దృష్ట్యా.. నేనైతే అతడు పూర్తి ఫిట్గా లేకున్నా ఆస్ట్రేలియాకు తీసుకువెళ్లేవాడిని’’ అని షమీ గురించి ప్రస్తావించాడు.అతడిని ఆస్ట్రేలియా టూర్కి పంపాల్సింది!ఇందుకు ఆస్ట్రేలియా దిగ్గజం రిక్కీ పాంటింగ్ బదులిస్తూ.. ‘‘షమీ పూర్తి ఫిట్గా లేకపోయినా.. కనీసం నాలుగైదు ఓవర్లు అయినా బౌల్ చేసేవాడు. బ్యాకప్ సీమ్ బౌలింగ్ ఆప్షన్గా అందుబాటులో ఉండేవాడు. నిజంగా అతడు గనుక టీమిండియాతో ఉండి ఉంటే పరిస్థితి భిన్నంగా ఉండేది’’ అని అభిప్రాయపడ్డాడు. కాగా టీమిండియా తదుపరి ఇంగ్లండ్తో సొంతగడ్డపై ఐదు టీ20, మూడు వన్డే మ్యాచ్లు ఆడనుంది.చదవండి: IND vs ENG: ఇంగ్లండ్తో వన్డే సిరీస్.. మనసు మార్చుకున్న రోహిత్, కోహ్లి!? -
హిట్మ్యాన్కు ఏమైంది?.. చెత్త షాట్లు ఆడటం అవసరమా?
అలవోకగా షాట్లు కొట్టడంలో భారత్ కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma)ది ప్రత్యేకమైన శైలి. బ్యాటింగ్ ఇంత సులువుగా చేయొచ్చా అన్న రీతిలో.. అంత సొగసుగా ఆడి కెప్టెన్ స్థాయికి ఎదిగాడు ఈ ముంబై ఆటగాడు. అయితే, రోహిత్ ఇప్పుడు జట్టుకే భారంగా పరిణమించాడు.ఆస్ట్రేలియా తో మెల్బోర్న్లో గురువారం ప్రారంభమైన నాలుగో టెస్టులో రెండో రోజున బ్యాటింగ్కు వచ్చాడు రోహిత్ శర్మ. అయితే, కేవలం మూడు పరుగులే చేసి నిష్క్రమించాడు. ప్రత్యర్థి జట్టు కెప్టెన్ ప్యాట్ కమిన్స్ బౌలింగ్ లో మిడాన్ వద్ద.. స్కాట్ బోలాండ్కి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.పేలవ ఫామ్తో జట్టుకు భారంగాఫలితంగా కేవలం ఎనిమిది పరుగుల వద్ద ఉండగా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ వికెట్ను కోల్పోయింది. కేఎల్ రాహుల్(KL Rahul) స్థానంలో తొలిసారి ఈ సిరీస్లో ఓపెనర్గా బ్యాటింగ్కు వచ్చిన రోహిత్ ఇలా బాధ్యతారహితంగా వెనుదిరగడం.. ప్రస్తుత అతడి పేలవమైన ఫామ్ గురించి చెప్పకనే చెబుతుంది.ఈ సిరీస్లో తొలి టెస్టుకు వ్యక్తిగత కారణాల వల్ల దూరమైన రోహిత్ శర్మ.. ఆ తర్వాత రెండు టెస్టుల్లో పేలవంగా ఆడిన విషయం తెలిసిందే. నాలుగు ఇన్నింగ్స్లో 5.50 సగటుతో కేవలం 22 పరుగులు (౩, 6, 10, ౩) సాధించాడు. ఇప్పుడు మెల్బోర్న్లో మరోసారి చాలా చెత్త షాట్ ఆడి భారత్ జట్టును.. ఇన్నింగ్స్ ప్రారంభంలోనే ప్రమాదంలో పడేసాడు. చాన్నాళ్లుగా ఇదే పరిస్థితిటీమిండియాను ముందుండి నడిపించాల్సిన సారథి ఇలాంటి అతి ప్రాధాన్యం ఉన్న ఈ టెస్ట్ సిరీస్లో వరుసగా విఫలం కావడం జట్టు మానసిక స్థైర్యాన్ని కుంగదీస్తుందనడంలో సందేహం లేదు. 37 ఏళ్ళ రోహిత్ ఇప్పటి వరకు 66 టెస్ట్ మ్యాచ్లలో 41 .24 సగటుతో మొత్తం 4289 పరుగులు సాధించాడు. ప్రపంచ క్రికెట్లోనే ప్రధాన బ్యాటర్లలో ఒకడిగా ప్రశంసలు అందుకున్న రోహిత్, గత కొద్ది రోజులుగా ఆశించిన స్థాయిలో రాణించకుండా విఫలమవుతూ ఉండటం గమనార్హం.చెత్త షాట్ కొట్టాల్సిన అవసరం లేదుముఖ్యంగా మెల్బోర్న్లో రోహిత్ కొట్టిన షాట్ అతడి ప్రస్తుత ఫామ్ కి అద్దం పడుతోంది. క్రీజులో మందకొడిగా కదులుతూ అతడు అవుటైన తీరుపై పలువురు ప్రఖ్యాత కామెంటేటర్లు విమర్శలు గుప్పించారు. ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్, బ్యాటింగ్ దిగ్గజం, వ్యాఖ్యాత, ఐపీఎల్ లో పంజాబ్ కింగ్స్ హెడ్ కోచ్ రికీ పాంటింగ్(Ricky Ponting) రోహిత్ బ్యాటింగ్ తీరు పై తీవ్ర విమర్శలు చేశాడు."రోహిత్ క్రీజులో చాలా మందకొడిగా కనిపించాడు. పైగా అతడు అప్పటికింకా క్రీజులో నిలదొక్కుకోలేదు. ఇన్నింగ్స్ ప్రారంభంలోనే అటువంటి షాట్ కొట్టాల్సిన అగత్యం ఎందుకో అర్థం కావడం లేదు. రోహిత్ హుక్ షాట్స్, పుల్ షాట్స్ కొట్టడంలో దిట్ట. అటువంటి రోహిత్ కొద్ది సేపు వేచి చూచి పిచ్ తీరు తెన్నులు అర్ధం చేసుకున్న తర్వాత తన షాట్లు కొట్టాల్సింది. అలా కాకుండా ప్రారంభంలోనే ఇలాంటి చెత్త షాట్ కొట్టాల్సిన అవసరం లేదు. ఇది అతని ప్రస్తుత మానసిక పరిస్థితిని, పేలవమైన ఫామ్ని చెబుతుంది" అని పాంటింగ్ వ్యాఖ్యానించాడునీ సహజ సిద్దమైన ఆట తీరు ఏమైంది? మరో ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ డారెన్ లీమన్ కూడా రోహిత్ ఆటతీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించాడు. "రోహిత్ నువ్వు హిట్ మాన్వి. నీ సహజ సిద్దమైన ఆట తీరు ఏమైంది? షాట్లు కొట్టడానికి అవుట్ ఫీల్డ్లో కావలిసినంత వెసులుబాటు ఉండగా దానిని సద్వినియోగం చేసుకోకుండా ఇలాంటి చెత్త షాట్ కొట్టి వెనుదిరగడం బాధాకరం" అన్నాడు. అదే విధంగా.. ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ కూడా రోహిత్ వైఖరి పై విమర్శలు చేసాడు.ఇక ఈ సిరీస్లో భారత్ టాప్ ఆర్డర్ బ్యాటర్ వైఫల్యం మరోసారి ఈ ఇన్నింగ్స్లో బయటపడింది. రెండో రోజు ఆట పూర్తయ్యే సరికి భారత్ అయిదు వికెట్ల నష్టానికి 165 పరుగులు మాత్రమే చేసింది. ఆస్ట్రేలియా కంటే ఇంకా తొలి ఇన్నింగ్స్లో 310 పరుగులు వెనుకబడి ఉంది. ఈ పరిస్థితిలో భారత్ ని ఆదుకునే బాధ్యత వికెట్ కీపర్ రిషబ్ పంత్ , రవీంద్ర జడేజా పైనే ఉంది.చదవండి: విశ్రాంతి కాదు.. నిర్దాక్షిణ్యంగా అతడిపై వేటు వేయండి.: టీమిండియా దిగ్గజం -
'గిల్క్రిస్ట్లా అతడు బ్యాటింగ్ చేస్తున్నాడు.. కానీ ఇప్పుడే వద్దు'
టీమిండియాకు ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ ట్రావిస్ హెడ్ పెద్ద తలనొప్పిగా మారాడు. భారత్ అంటే చాలు ఫార్మాట్తో సంబంధం లేకుండా చెలరేగిపోతున్నాడు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా అడిలైడ్ వేదికగా జరిగిన పింక్ బాల్ టెస్టులో హెడ్ విధ్వంసకర సెంచరీతో మెరిశాడు.ఈ మ్యాచ్లో 140 పరుగులు చేసిన హెడ్.. ఆసీస్ సిరీస్ను సమం చేయడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ క్రమంలో శనివారం నుంచి గబ్బా వేదికగా ప్రారంభం కానున్న మూడో టెస్టులో ఈ డేంజరస్ ఆసీస్ బ్యాటర్ను అడ్డుకునేందుకు భారత్ ప్రత్యేక వ్యూహాలను రచిస్తోంది.అతడిని ఎలాగైనా ఆదిలోనే పెవిలియన్కు పంపాలని రోహిత్ అండ్ కో భావిస్తోంది. ఈ నేపథ్యంలో హెడ్పై ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ ప్రశంసల వర్షం కురిపించాడు. ఆసీస్ దిగ్గజం ఆడమ్ గిల్క్రిస్ట్తో హెడ్ను రికీ పోల్చాడు. అయితే ఇప్పటి నుంచే అతడిని 'గ్రేట్' అని పిలువద్దని అతడు అభిప్రాయపడ్డాడు."ట్రవిస్ హెడ్ గొప్ప క్రికెటర్లలో ఒకడిగా ఎదుగుతున్నాడు. అయితే, ఏదో ఒక ఇన్నింగ్స్ చూపి అతడిని గ్రేట్ క్రికెటర్ అని చెప్పలేము. కానీ అతడేం చేసినా అత్యద్భుతంగా చేస్తున్నాడు. జట్టు కోసం తాను చేయగలిగినంతా చేస్తూనే ఉన్నాడు. అయినప్పటికీ ప్రశంసలకు తాను అర్హుడిని కానన్నట్లుగా హుందాగా ఉంటాడు.హెడ్ బ్యాటింగ్ చేసే విధానం గిల్క్రిస్ట్ అప్రోచ్కు దగ్గరగా ఉంటుంది. బ్యాటింగ్ ఆర్డర్లో రెండు స్థానాలు ఎక్కువగా ఉన్నప్పటికీ గిల్లీ, హెడ్ ఒకేలా బ్యాటింగ్ చేస్తున్నారు. గిల్లీ ఆరు లేదా ఏడో స్ధానంలో బ్యాటింగ్ వచ్చి అద్బుత ఇన్నింగ్స్లు ఆడగా.. ఇప్పుడు హెడ్ ఐదో డౌన్ వచ్చి అదే పనిచేస్తున్నాడు. క్రీజులోకి వచ్చినప్పటి నుంచే పాజిటివ్ యాటిట్యూడ్తో బ్యాటింగ్ చేస్తాడు. అతడిలో ఔటవ్వతానన్న భయం కూడా కన్పించడం లేదు. ప్రతికూల ఫలితంతో అతడికి అస్సలు పనిలేదు. తనకు తెలిసిందల్లా ఒకటే. క్రీజులో ఉన్నంతసేపు పరుగులు రాబట్టడమే అతడి పని అని ఐసీసీ రివ్యూలో అతడు పేర్కొన్నాడు.చదవండి: IND vs AUS: మూడో టెస్టుకు ఆసీస్ తుది జట్టు ప్రకటన.. వికెట్ల వీరుడు వచ్చేశాడు -
ప్రపంచంలో అత్యుత్తమ బ్యాటర్ అతడే: రిక్కీ పాంటింగ్
ఇంగ్లండ్ యువ ఆటగాడు హ్యారీ బ్రూక్పై ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం రిక్కీ పాంటింగ్ ప్రశంసలు కురిపించాడు. ప్రస్తుతం ప్రపంచంలోని అత్యుత్తమ బ్యాటర్ అతడేనంటూ బ్రూక్ను కొనియాడాడు. స్వదేశంలోనే.. విదేశీ గడ్డపై కూడా అతడు బ్యాట్ ఝులిపించే తీరు చూడముచ్చటగా ఉంటుందని ప్రశంసించాడు.అగ్రపీఠం అధిరోహించిన బ్రూక్కాగా 25 ఏళ్ల హ్యారీ బ్రూక్ వరల్డ్ నంబర్ వన్ బ్యాటర్గా అవతరించిన విషయం తెలిసిందే. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) టెస్టు బ్యాటింగ్ ర్యాంకింగ్స్లో తొలిసారి అగ్ర స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. అద్భుత ఫామ్తో పరుగుల వరద పారిస్తున్న ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. తాజా ర్యాంకింగ్స్లో నంబర్వన్ (898 రేటింగ్ పాయింట్లు)గా నిలిచాడు.ఇటీవల న్యూజిలాండ్తో జరిగిన టెస్టు సిరీస్లో బ్రూక్ వరుసగా 171, 123, 55 పరుగులు సాధించాడు. ఈ క్రమంలో నంబర్వన్గా ఉన్న మరో ఇంగ్లండ్ బ్యాటర్ జో రూట్ (898)ను వెనక్కి నెట్టి అగ్రపీఠం అధిరోహించాడు. ఈ నేపథ్యంలో రిక్కీ పాంటింగ్ హ్యారీ బ్రూక్ గురించి ఐసీసీ రివ్యూ షోలో తన అభిప్రాయాలు పంచుకున్నాడు.ప్రపంచంలో అత్యుత్తమ బ్యాటర్ అతడే‘‘ప్రస్తుతం ప్రపంచంలోని అత్యుత్తమ టెస్టు బ్యాటర్ అతడే అనుకుంటున్నా. కేవలం సొంతగడ్డ మీద మాత్రమే కాదు.. విదేశాల్లోనూ అద్భుత ఆట తీరుతో అలరిస్తున్నాడు. ప్రత్యర్థి జట్టు దేశాల్లో ఏకంగా ఏడు శతకాలు నమోదు చేశాడు. అతడొక క్లాస్ ప్లేయర్. బ్రూక్ బ్యాటింగ్ చేస్తూ ఉంటే చూడటం నాకు ఎంతో ఇష్టం’’ అని రిక్కీ పాంటింగ్ హ్యారీ బ్రూక్ను కొనియాడాడు.ఏడు సెంచరీలు విదేశీ గడ్డపైనే కాగా రెండేళ్ల క్రితం అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన హ్యారీ బ్రూక్.. ఇప్పటి వరకు టెస్టుల్లో ఎనిమిది శతకాలు బాదాడు . ఇందులో ఏడు సెంచరీలు విదేశీ గడ్డపై చేసినవే. అదే విధంగా అతడి ఖాతాలో ద్విశతకం, ఒక త్రిశతకం కూడా ఉన్నాయి. ఇక వన్డేల్లోనూ హ్యారీ బ్రూక్ పేరిట ఒక సెంచరీ ఉంది.మొత్తంగా ఇప్పటి వరకు తన కెరీర్లో హ్యారీ బ్రూక్ ఇంగ్లండ్ తరఫున 23 టెస్టులు, 20 వన్డేలు, 39 టీ20 మ్యాచ్లు ఆడి.. ఆయా ఫార్మాట్లలో 2280, 719, 707 పరుగులు సాధించాడు.మనోళ్ల పరిస్థితి ఏంటి?ఇదిలా ఉంటే.. ఐసీసీ టాప్–10 టెస్టు బ్యాటర్ల జాబితాలో భారత్ నుంచి యశస్వి జైస్వాల్ (4వ స్థానం), రిషభ్ పంత్ (9వ స్థానం) ఉండగా...శుబ్మన్ గిల్ 17వ, విరాట్ కోహ్లి 20వ స్థానంలో కొనసాగుతున్నారు. మరోవైపు.. బౌలర్ల ర్యాంకింగ్స్లో భారత పేసర్ జస్ప్రీత్ బుమ్రా (890) తన నంబర్వన్ స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. కగిసో రబాడ (856), హాజల్వుడ్ (851) తర్వాతి స్థానాల్లో ఉన్నారు. అశ్విన్ ర్యాంక్ 4 నుంచి 5కు పడిపోగా, జడేజా 6వ స్థానంలో కొనసాగుతున్నాడు. టెస్టు ఆల్రౌండర్లలో జడేజా (415) అగ్ర స్థానం, అశ్విన్ 3వ స్థానం (283) పదిలంగా ఉన్నాయి. చదవండి: యశస్వి జైస్వాల్పై రోహిత్ శర్మ ఆగ్రహం.. ఆఖరికి యువ ఓపెనర్ లేకుండానే.. -
విరాట్ ఒక వారియర్.. అతడిని చూసి ఆసీస్ క్రికెటర్లు నేర్చుకోవాలి: పాంటింగ్
పెర్త్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టుతో టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి తిరిగి తన ఫామ్ను అందుకున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో విఫలమైన విరాట్.. రెండో ఇన్నింగ్స్లో మాత్రం అద్బుతమైన సెంచరీతో చెలరేగాడు. 143 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్లతో 100 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. ఈ ఏడాదిలో విరాట్ కోహ్లికి ఇదే తొలి అంతర్జాతీయ సెంచరీ కావడం గమనార్హం. ఇక తన రిథమ్ను తిరిగి పొందిన విరాట్.. డిసెంబర్ 6 నుంచి ఆడిలైడ్ వేదికగా ప్రారంభం కానున్న పింక్ బాల్ టెస్టుకు సన్నద్దమవుతున్నాడు.ఈ నేపథ్యంలో విరాట్ కోహ్లిపై ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ ప్రశంసల వర్షం కురిపించాడు. ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్లు మార్నస్ లబుషేన్, స్టీవ్ స్మిత్లు కోహ్లిని చూసి నేర్చుకోవాలని పాంటింగ్ సూచించాడు. కాగా ఈ ఆసీస్ స్టార్లు ఇద్దరూ ప్రస్తుతం పేలవ ఫామ్లో ఉన్నారు. పెర్త్ టెస్టులో వీరిద్దరి దారుణ ప్రదర్శన చేశారు.ఈ క్రమంలో పాంటింగ్ ఐసీసీ రివ్యూలో మాట్లాడుతూ.. "విరాట్ ఎప్పుడూ ఆత్మవిశ్వాన్ని కోల్పోడు. అతడొక వారియర్. తనను తను విశ్వసించినందున బలంగా తిరిగి వచ్చాడు. తొలి ఇన్నింగ్స్లో కంటే రెండో ఇన్నింగ్స్లో కోహ్లి డిఫెరెంట్గా కన్పించాడు. అతడు ప్రత్యర్ధిలతో పోరాడాలని భావించలేదు. కేవలం తన బలాలపై దృష్టి పెట్టాడు. లబుషేన్, స్మిత్ కూడా కోహ్లిని ఫాలో అవ్వాలి. పరుగులు ఎలా చేయాలో ముందు దృష్టి పెట్టిండి. అంతే తప్ప మీ వికెట్ గురించి ఆలోచించకండి.ఫామ్లో లేనప్పుడు ఏ ఆటగాడికైనా పరుగులు సాధించడం చాలా కష్టమవుతోంది. ఆ విషయం నాకు కూడా తెలుసు. అందకు సానుకూల దృక్పథంతో బ్యాటింగ్ చేయడమే ఒక్కటే మార్గమని పేర్కొన్నాడు. -
టీమిండియా గెలుస్తుందని అస్సలు ఊహించలేదు: రికీ పాంటింగ్
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని టీమిండియా అద్బుతమైన విజయంతో ప్రారంభించిన సంగతి తెలిసిందే. పెర్త్లోని ఆప్టస్ స్టేడియం వేదికగా జరిగిన తొలి టెస్టులో ఆసీస్ను ఏకంగా 295 పరుగుల తేడాతో భారత్ చిత్తు చేసింది. దీంతో ఐదు మ్యాచ్ల సిరీస్లో 1-0 ఆధిక్యంలో భారత్ దూసుకెళ్లింది.ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. తొలి టెస్టులో భారత్ గెలుస్తుందని తాను అస్సలు ఊహించలేదని రికీ పాంటింగ్ వెల్లడించాడు. కాగా ఈ మ్యాచ్లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ తొలి ఇన్నింగ్స్లో 150 పరుగులకే ఆలౌటైంది. దీంతో ఈ మ్యాచ్లో టీమిండియా గెలవడం కష్టమే అనుకున్నారు. కానీ బౌరత బౌలర్ల అద్బుతం చేయడంతో ఆసీస్ తమ మొదటి ఇన్నింగ్స్లో 104 పరుగులకే కుప్పకూలింది. అనంతరం సెకెండ్ ఇన్నింగ్స్లో బ్యాటర్లు చెలరేగడంతో ఆసీస్ ముందు 534 పరుగుల భారీ టార్గెట్ను భారత్ ఉంచింది. అంతటి భారీ లక్ష్యాన్ని చేధించలేక ఆసీస్ చతికలపడింది.అస్సలు ఊహించలేదు: రికీ పాంటింగ్"ఆస్ట్రేలియాకు తొలి టెస్టులోనే ఊహించని పరాభావం ఎదురైంది. దాదాపు 300 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. కచ్చితంగా వారు తీవ్ర నిరాశ చెంది ఉంటారు. టాస్ గెలిచి భారత్ బ్యాటింగ్ ఎంచుకున్నప్పుడు అది సరైన నిర్ణయమేనా నన్ను అందరూ అడిగారు.ఖచ్చితంగా అది సరైన నిర్ణయమేనని నేను చెప్పాను. ఈ స్టేడియంలో ఇప్పటివరకు నాలుగు టెస్టు మ్యాచ్లు జరిగాయి. యాదృచ్చకంగా మొదట బ్యాటింగ్ చేసిన జట్టే నాలుగు సార్లు గెలిచింది. కాబట్టి గణాంకాలను కూడా పరిగణలోకి తీసుకోవాలి.తొలి ఇన్నింగ్స్లో 150 పరుగులకే ఆలౌటైనప్పటికి, బౌలర్లు అద్బుతంగా రాణించి మ్యాచ్ను తమవైపు తిప్పుకున్నారు. బుమ్రా, సిరాజ్ బంతితో మ్యాజిక్ చేశారు. వారితో పాటు నితీష్ రెడ్డి కూడా బాగా రాణించాడు. ఆసీస్పై భారత్ పూర్తి ఆధిపత్యం చెలాయించింది. పెర్త్ వంటి కఠిన పరిస్ధితుల్లో భారత్ గెలుస్తుందని నేను అస్సలు అనుకోలేదు. కానీ భారత్ అంచనాలను తారుమారు చేసింది. అదే పెర్త్లోనే రుజువైంది" అని స్టార్ స్పోర్ట్స్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పాంటింగ్ పేర్కొన్నాడు.చదవండి: IND vs AUS: ఒకే ఒక్క వికెట్.. చరిత్రకు అడుగు దూరంలో జస్ప్రీత్ బుమ్రా -
'నేను చూసిన టాలెంటెడ్ ప్లేయర్లలో అతడొకడు.. మళ్లీ తిరిగి వస్తాడు'
టీమిండియా ఓపెనర్ పృథ్వీ షా ప్రస్తుతం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాడు. క్రమశిక్షణరాహిత్యం,ఫామ్ లేమి, ఫిట్నెస్ సమస్యలతో జాతీయ జట్టుకు దూరంగా ఉంటున్న పృథ్వీ షా.. ఇప్పుడు ఐపీఎల్లో ఆడే అవకాశం కూడా కోల్పోయాడు.ఇటీవల జెడ్డా వేదికగా జరిగిన ఐపీఎల్-2025 మెగా వేలంలో పృథ్వీ అన్సోల్డ్గా మిగిలిపోయాడు. రూ.75 లక్షల కనీస ధరతో వేలంలోకి వచ్చిన అతడిని ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేసేందుకు ముందుకు రాలేదు. తన ఐపీఎల్ అరంగేట్రం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ సైతం అతడిని తీసుకునేందుకు ఆసక్తి చూపలేదు.తన కెరీర్ ఆరంభంలో జానియర్ సచిన్ టెండూల్కర్ పేరొందిన పృథ్వీ షాకు ఇప్పుడు కనీసం ఫ్రాంచైజీ క్రికెట్లో కూడా ఆడే ఛాన్స్ రాకపోవడం అందరిని ఆశ్చర్యపరుస్తోంది. అయితే వేలంలో అమ్ముడుపోకపోవడంతో పృథ్వీ షాను నెటిజన్లు దారుణంగా ట్రోలు చేస్తున్నారు. మహ్మద్ కైఫ్ వంటి దిగ్గజ క్రికెటర్లు సైతం పృథ్వీపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. అయితే ఆస్ట్రేలియా దిగ్గజం, ఢిల్లీ క్యాపిటల్స్ హెడ్ కోచ్ రికీ పాటింగ్ మాత్రం ఈ ముంబై ఆటగాడికి మద్దతుగా నిలిచాడు."ఐపీఎల్ మెగా వేలంలో పృథ్వీ అన్సోల్డ్గా మిగిలడం నిజంగా చాలా బాధాకరం. నా కోచింగ్ కెరీర్లో ఇప్పటివరకు నేను పనిచేసిన టాలెంటెడ్ క్రికెటర్లలో పృథ్వీ ఒకడు. కనీసం అతడు యాక్సిలరేటర్ రౌండ్లోనైనా అమ్ముడుపోతాడని నేను భావించాను. కానీ అది కూడా జరగలేదు.అయితే వేలంలో అన్సోల్డ్గా మిగిలినప్పటికీ అన్ని ఫ్రాంచైజీల కళ్లు అతడిపైనే ఉన్నాయి. అతడి నుంచి ఆటను ఎవరూ దూరంగా ఉంచలేరు. కచ్చితంగా పృథ్వీ మళ్లీ తిరిగివస్తాడని నేను భావిస్తున్నాను" అని ఓ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పాంటింగ్ పేర్కొన్నాడు.కాగా రికీ పాటింగ్తో పృథ్వీషాకు మంచి అనుబంధం ఉంది. వీరిద్దరూ ఆరేళ్ల పాటు ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీలో కలిసి పనిచేశారు. ఐపీఎల్-2018 సీజన్ నుంచి ఈ ఏడాది సీజన్ వరకు ఢిల్లీ హెడ్కోచ్గా రికీ పాంటింగ్ పనిచేయగా.. పృథ్వీ షా ఆటగాడిగా కొనసాగాడు.చదవండి: IPL 2025: గుడ్ బై.. స్వింగ్ కింగ్ భావోద్వేగం!.. ఆరెంజ్ ఆర్మీపై భువీ పోస్ట్ వైరల్ -
బోర్డర్- గావస్కర్ ట్రోఫీ: కామెంటేటర్గా పాంటింగ్ అవుట్!
ఆస్ట్రేలియా- టీమిండియా మధ్య జరిగే బోర్డర్- గావస్కర్ ట్రోఫీకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రెండు మేటి జట్లు ఈ టెస్టు సిరీస్లో నువ్వా- నేనా అన్నట్లు పోటీ పడుతుంటే క్రికెట్ ప్రేమికులకు లభించే ఆ కిక్కే వేరు. ఆసీస్- భారత ఆటగాళ్ల మధ్య పరస్పర స్లెడ్జింగ్తో పాటు.. మ్యాచ్ను విశ్లేషిస్తూ కామెంటేటర్లు విసిరే ఛలోక్తులు, చమక్కులకు కూడా ఫ్యాన్స్ ఉన్నారంటే అతిశయోక్తి కాదు.కామెంట్రీకి దూరంఇరుజట్లకు చెందిన మాజీ క్రికెటర్లలో చాలా మంది ఆసీస్ - భారత్ మధ్య ఈ టెస్టు సిరీస్ను తమ వ్యాఖ్యలతో మరింత ఆసక్తికరంగా మారుస్తూ ఉంటారు. ఆసీస్ దిగ్గజ కెప్టెన్ రిక్కీ పాంటింగ్ కూడా ఈ కోవకు చెందినవాడే. అయితే, అతడు ఈసారి బోర్డర్- గావస్కర్ ట్రోఫీ తొలి టెస్టు కామెంట్రీకి దూరం కానున్నట్లు సమాచారం.కారణం ఇదేపాంటింగ్తో పాటు ఆసీస్ మరో మాజీ క్రికెటర్ జస్టిన్ లాంగర్ కూడా పెర్త్ మ్యాచ్కు దూరంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. ఆస్ట్రేలియన్ వార్తా పత్రిక ‘ది ఏజ్’ ఈ విషయాన్ని వెల్లడించింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) విధుల కారణంగా.. పాంటింగ్- లాంగర్ పెర్త్లో జరిగే.. మొదటి టెస్టు కామెంట్రీకి దూరంగా ఉండనున్నట్లు తెలిపింది.కాగా రిక్కీ పాంటింగ్ ఇటీవలే.. ఐపీఎల్ జట్టు పంజాబ్ కింగ్స్ హెడ్కోచ్గా నియమితుడైన విషయం తెలిసిందే. అదే విధంగా.. జస్టిన్ లాంగర్ సైతం లక్నో సూపర్ జెయింట్స్ శిక్షకుడిగా వ్యవహరిస్తున్నాడు. ఇదిలా ఉంటే.. నవంబరు 24, 25 తేదీల్లో ఐపీఎల్-2025 మెగా వేలం జరుగనుంది. సౌదీ అరేబియాలోని జెద్దా నగరంలో జరిగే ఆక్షన్కు కోచ్లు కూడా అందుబాటులో ఉంటారు.బీసీసీఐపై అక్కసు వెళ్లగక్కిన ఆసీస్ మీడియాఅయితే, అంతకు రెండు రోజుల ముందే.. అంటే నవంబరు 22న ఆసీస్- భారత్ మొదటి టెస్టు మొదలుకానుంది. ఈ నేపథ్యంలోనే ‘ది ఏజ్’ పాంటింగ్- లాంగర్ల గురించి ప్రస్తావిస్తూ.. బీసీసీఐపై పరోక్షంగా అక్కసు వెళ్లగక్కింది.‘‘సెవెన్ చానెల్, క్రికెట్ ఆస్ట్రేలియా గనుక.. ఇండియాలోని శక్తిమంతమైన క్రికెట్ అధికారుల నుంచి తమ ప్రయోజనాలను కాపాడుకోలేకపోతే.. పాంటింగ్, లాంగర్, ఆస్ట్రేలియా అసిస్టెంట్ కోచ్ డానియల్ వెటోరీ సైతం సౌదీ అరేబియాకు వెళ్లే పరిస్థితి ఉంది.అక్కడి జెద్దా నగరంలో ఐపీఎల్ మెగా వేలంలో పాల్గొంటూ.. ఆటగాళ్ల కోసం వీళ్లంతా కార్డులు చూపిస్తూ మనకు కనిపిస్తారు. అప్పటికి తొలి టెస్టు ముగింపునకు వస్తుంది’’ అని ‘ది ఏజ్’ పేర్కొంది.నేను కోహ్లిని అవమానించలేదు: పాంటింగ్ఇదిలా ఉంటే.. టీమిండియా హెడ్కోచ్ గౌతం గంభీర్ వ్యాఖ్యలపై రిక్కీ పాంటింగ్ స్పందించాడు. తానేమీ భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లిని అవమానించలేదని.. ఆస్ట్రేలియా గడ్డపై అతడు ఫామ్లోకి రావాలని మాత్రమే ఆశించానన్నాడు. ఏదేమైనా కోచ్గా గౌతీ తన జట్టును డిఫెండ్ చేసుకోవడంలో తప్పులేదని పేర్కొన్నాడు.కాగా కోహ్లి గత ఐదేళ్లలో కేవలం రెండే టెస్టు సెంచరీలు చేయడం ఏమిటని పాంటింగ్ విమర్శించగా.. మీడియా వేదికగా గౌతీ అతడికి కౌంటర్ ఇచ్చాడు. భారత క్రికెట్తో పాంటింగ్కు ఏం పని అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. అంతగా కావాలంటే.. ఆసీస్ ఆటగాళ్ల ఆట తీరును పరిశీలించుకోవాలని హితవు పలికాడు.చదవండి: BGT 2024: అతడి బ్యాటింగ్ అద్భుతం.. భారత తుదిజట్టులో చోటివ్వాల్సిందే: ఆసీస్ మాజీ కెప్టెన్ -
అసలు అతడికి మాతో ఏం పని?: రిక్కీ పాంటింగ్పై గంభీర్ ఫైర్
ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రిక్కీ పాంటింగ్పై టీమిండియా హెడ్కోచ్ గౌతం గంభీర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. అతడికి భారత క్రికెట్తో పనేంటని.. ఎదుటి వాళ్ల గురించి మాట్లాడే ముందు తమ ఆటగాళ్లు ఎలా ఉన్నారో చూసుకోవాలని హితవు పలికాడు. కాగా టెస్టుల్లో టీమిండియా ప్రస్తుతం కఠిన పరిస్థితులు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.డబ్ల్యూటీసీ టైటిల్ రేసులో నిలవాలంటేసొంతగడ్డపై న్యూజిలాండ్తో మూడు మ్యాచ్ల టెస్టు సిరీస్లో 3-0తో వైట్వాష్కు గురైంది రోహిత్ సేన. తద్వారా ప్రపంచ టెస్టు చాంపియన్షిప్(డబ్ల్యూటీసీ)2023-25 ఫైనల్ చేరే అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా కనీసం నాలుగు టెస్టుల్లో గెలిస్తేనే డబ్ల్యూటీసీ టైటిల్ రేసులో నిలిచే అవకాశం ఉంటుంది.ఇక కివీస్తో సిరీస్లో టీమిండియా స్టార్ బ్యాటర్లు కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి దారుణంగా విఫలమయ్యారు. న్యూజిలాండ్ చేతిలో చారిత్రాత్మక ఓటమికి ఒకరకంగా వీరిద్దరి వైఫల్యమే ప్రధాన కారణమని చెప్పవచ్చు. ఇలాంటి తరుణంలో ఆసీస్ పర్యటన భారత జట్టుకు మరింత కఠినతరంగా మారనుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.కోహ్లిపై పాంటింగ్ విమర్శలుఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా దిగ్గజ బ్యాటర్ రిక్కీ పాంటింగ్ విరాట్ కోహ్లిని ఉద్దేశించి విమర్శలు చేశాడు. అగ్రశ్రేణి బ్యాటర్గా కొనసాగుతూ గత ఐదేళ్లలో టెస్టుల్లో కేవలం రెండు శతకాలే బాదడం ఏమిటని ప్రశ్నించాడు. కోహ్లి ఆట తీరు ఇలాగే ఉంటే టీమిండియాకు తిప్పలు తప్పవని.. అతడి బ్యాటింగ్ గణాంకాలు నిజంగా ఆందోళనకరంగా ఉన్నాయని పాంటింగ్ పేర్కొన్నాడు.ఇదిలా ఉంటే.. ఆసీస్తో సిరీస్కు ముందు భారత జట్టు ప్రధాన కోచ్ గౌతం గంభీర్ సోమవారం మీడియాతో మాట్లాడాడు. ఈ సందర్భంగా పాంటింగ్ వ్యాఖ్యలను విలేఖరులు ప్రస్తావించగా గౌతీ ఫైర్ అయ్యాడు. ‘‘అసలు పాంటింగ్కు భారత క్రికెట్తో ఏం పని? అతడు.. ఆస్ట్రేలియా క్రికెట్ గురించి ఆలోచిస్తే మంచిదనుకుంటున్నాను.భారత క్రికెట్తో అతడికి ఏం పని?అయినా, విరాట్, రోహిత్ గురించి అతడికి ఆందోళన ఎందుకు? నా దృష్టిలో వాళ్లిద్దరు అద్భుతమైన ఆటగాళ్లు. కఠిన సవాళ్లకు సమర్థవంతంగా ఎదురీదగల సత్తా ఉన్నవాళ్లు. భారత క్రికెట్ తరఫున ఎన్నో విజయాలు సాధించారు. భవిష్యత్తులోనూ ఇలాగే కొనసాగుతారు’’ అని గంభీర్ ఘాటుగా బదులిచ్చాడు. విరాట్ కోహ్లి, రోహిత్ శర్మలను సమర్థిస్తూ పాంటింగ్కు గట్టి కౌంటర్ ఇచ్చాడు.కాగా నవంబరు 22 నుంచి ఆస్ట్రేలియా- టీమిండియా మధ్య బోర్డర్- గావస్కర్ ట్రోఫీ ఆరంభం కానుంది. ఇందులో భాగంగా ఇరుజట్ల మధ్య ఐదు టెస్టులు జరుగనున్నాయి. ఇందుకోసం ఇప్పటికే బీసీసీఐ, క్రికెట్ ఆస్ట్రేలియా తమ జట్లను ప్రకటించాయి. ఇదిలా ఉంటే.. కివీస్తో సిరీస్లో ఆరు ఇన్నింగ్స్లో కలిపి కోహ్లి చేసిన పరుగులు 0, 70, 1, 17, 4, 1.ఆస్ట్రేలియాతో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీకి టీమిండియారోహిత్ శర్మ (కెప్టెన్), జస్ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, అభిమన్యు ఈశ్వరన్, శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీ, కెఎల్ రాహుల్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), సర్ఫరాజ్ ఖాన్, ధృవ్ జురెల్ (వికెట్కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, మహ్మద్ సిరాజ్ , ఆకాశ్ దీప్, ప్రసిద్ కృష్ణ, హర్షిత్ రాణా, నితీశ్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్.భారత్తో తొలి టెస్టుకు ఆస్ట్రేలియా జట్టు:ప్యాట్ కమిన్స్ (కెప్టెన్), స్కాట్ బోలాండ్, అలెక్స్ క్యారీ, జోష్ హాజిల్వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లబుషేన్, నాథన్ లియాన్ , మిచెల్ మార్ష్, మెక్స్వీనీ, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్. చదవండి: ఆసీస్తో తొలి టెస్టుకు రోహిత్ దూరం! భారత కెప్టెన్ అతడే? గంభీర్ క్లారిటీ -
ఐదేళ్లలో కేవలం రెండు సెంచరీలా? కోహ్లిపై ఆసీస్ దిగ్గజం విమర్శలు
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి ప్రస్తుతం గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నాడు. టెస్టుల్లో స్థాయికి తగ్గట్లు రాణించలేక విమర్శలు మూటగట్టుకుంటున్నాడు. ముఖ్యంగా ఇటీవల స్వదేశంలో న్యూజిలాండ్తో టెస్టు సిరీస్లో కోహ్లి విఫలమైన తీరుపై అభిమానులు సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ సిరీస్లో టీమిండియా 3-0తో క్లీన్స్వీప్ కావడానికి కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు కోహ్లి వైఫల్యమే కారణమని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో తదుపరి ఆస్ట్రేలియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో గనుక రాణించకపోతే వీరిద్దరిపై వేటు వేయాలనే డిమాండ్లూ వస్తున్నాయి.ఒకవేళ అవే నిజమైతే గనుకఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా దిగ్గజ కెప్టెన్ రిక్కీ పాంటింగ్ కోహ్లి గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘‘విరాట్ గురించి ఇటీవల నేను కొన్ని గణాంకాలు చూశాను. గత ఐదేళ్లలో అతడు టెస్టుల్లో కనీసం రెండు లేదంటే మూడు మాత్రమే సెంచరీలు చేసినట్లు సదరు గణాంకాలు సూచిస్తున్నాయి.అవి సరైనవో కాదో నాకు తెలియదు. ఒకవేళ అవే నిజమైతే గనుక.. ఇది నిజంగా ఆందోళనపడాల్సిన విషయమే. టాపార్డర్ బ్యాటర్గా ఉంటూ ఐదేళ్లుగా రెండే టెస్టు శతకాలు బాదారంటే.. అలాంటి ఆటగాడు మరొకరు ఉండరనే అనుకుంటున్నా’’ అని పాంటింగ్ కోహ్లి ఆట తీరును విమర్శించాడు.ఆసీస్పై ఆడటం కోహ్లికి ఇష్టంఇక కోహ్లి గొప్ప బ్యాటర్ అనడంలో సందేహం లేదన్న పాంటింగ్.. ఆస్ట్రేలియాపై ఆడటం అంటే అతడికి ఎంతో ఇష్టమని పేర్కొన్నాడు. తమ జట్టుపై అతడికి మంచి రికార్డు ఉందని.. ఆసీస్తో తొలి టెస్టుతోనే కోహ్లి తిరిగి ఫామ్లోకి వచ్చినా ఆశ్చర్యం లేదన్నాడు. కాగా న్యూజిలాండ్తో ఇటీవల సొంతగడ్డపై మూడు టెస్టుల్లో కోహ్లి చేసిన పరుగులు వరుసగా.. 0, 70, 1, 17, 4, 1.దశాబ్దకాలం తర్వాత తొలిసారిఈ క్రమంలో దశాబ్దకాలం తర్వాత తొలిసారి ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్లో విరాట్ కోహ్లి స్థానం దిగజారింది. పదేళ్లలో తొలిసారిగా అతడు టాప్-20లో కూడా చోటు దక్కించుకోలేకపోయాడు. అంతేకాదు.. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు ఆరు టెస్టులాడిన కోహ్లి సగటున కేవలం 22 పరుగులు రాబట్టాడు. 2011లో టెస్టుల్లో అరంగేట్రం చేసిన తర్వాత కోహ్లి ఇలా లోయెస్ట్ ఆవరేజ్ నమోదు చేయడం ఇదే తొలిసారి.ఒకవేళ ఆస్ట్రేలియా గడ్డపై గనుక రాణించకపోతే కోహ్లిపై విమర్శలు మరింత పదునెక్కడం ఖాయం. కాగా నవంబరు 22 నుంచి ఆస్ట్రేలియా- టీమిండియా మధ్య బోర్డర్ గావస్కర్ ట్రోఫీ ఆరంభం కానుంది. ఈ ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్లో కనీసం నాలుగు గెలిస్తేనే టీమిండియా ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ 2023-25 ఫైనల్ చేరుతుంది. చదవండి: IPL 2025: మళ్లీ క్రికెట్ ఆడాలనుకుంటున్నాను..! ఆ ఫ్రాంఛైజీ కొనే ఛాన్స్! -
IPL 2025: గంగూలీకి బైబై.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక ప్రకటన
ఐపీఎల్-2025 సీజన్ ముందు ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంఛైజీ కీలక ప్రకటన చేసింది. తమ జట్టు ప్రధాన కోచ్గా టీమిండియా మాజీ క్రికెటర్ హేమంగ్ బదానీని నియమించినట్లు తెలిపింది. అదే విధంగా.. డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ బాధ్యతలను మరో భారత మాజీ క్రికెటర్ వేణుగోపాల్ రావుకు అప్పగించినట్లు పేర్కొంది. ఈ మేరకు గురువారం ప్రకటన విడుదల చేసింది.కాగా.. గతంలో వీరిద్దరు ఐపీఎల్లో ఆడారు. వేణుగోపాల్ ఢిల్లీ డేర్డెవిల్స్(పాతపేరు)కు ఆడగా.. 2010లో ట్రోఫీ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో బదానీ సభ్యుడు. వీరిద్దరూ కలిసి టీమిండియాకూ ఆడారు. అంతేకాదు.. వేణుగోపాల్ రావు తెలుగు, బదానీ తమిళ కామెంట్రీ కూడా చేశారు.ఇక ఢిల్లీ ఫ్రాంఛైజీ కోచింగ్ స్టాఫ్లో పనిచేసిన అనుభవం కూడా వీరికి ఉంది. ఇంటర్నేషనల్ టీ20 లీగ్లో దుబాయ్ క్యాపిటల్స్ జట్టుకు వీరు సేవలు అందించారు. మరోవైపు.. బదానీ ఇటీవలే.. సౌతాఫ్రికా టీ20 లీగ్ చాంపియన్స్ సన్రైజర్స్ ఈస్టర్న్కేప్ బ్యాటింగ్ కోచ్గానూ నియమితుడు కావడం గమనార్హం.పాంటింగ్, గంగూలీకి బైబైహెడ్కోచ్గా బదానీ, డైరెక్టర్ ఆఫ్ క్రికెట్గా వేణుగోపాల రావు నియాకం పట్ల ఢిల్లీ ఫ్రాంఛైజీ సహ యజమాని కిరణ్ కుమార్ గాంధీ హర్షం వ్యక్తం చేశాడు. వీరిద్దరికి తమ క్యాపిటల్స్ కుటుంబంలో స్వాగతం పలుకుతున్నామని.. వీరి రాకతో జట్టు విజయపథంలో నడుస్తుందని ఆశిస్తున్నామన్నాడు. కాగా ఆస్ట్రేలియా దిగ్గజం రిక్కీ పాంటింగ్తో సుదీర్ఘ బంధాన్ని తెంచుకున్న ఢిల్లీ.. ఇటీవలే అతడిని హెడ్కోచ్ పదవి నుంచి తప్పించింది. పాంటింగ్ స్థానాన్ని తాజాగా బదానీతో భర్తీ చేసింది. ఇక డైరెక్టర్ ఆఫ్ క్రికెట్గా సౌరవ్ గంగూలీ స్థానంలో వేణుగోపాలరావును తీసుకువచ్చింది.చదవండి: IND Vs NZ 1st Test: అసలేం చేశావు నువ్వు?: రోహిత్ శర్మ ఆగ్రహం -
IPL 2025: భారీ మొత్తానికి డీల్.. ఆ జట్టుతోనే పంత్!
టీమిండియా స్టార్ రిషభ్ పంత్ వచ్చే ఏడాది కూడా ఢిల్లీ క్యాపిటల్స్తోనే ఉంటాడని భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా అన్నాడు. భారీ మొత్తానికి ఫ్రాంఛైజీ అతడిని అట్టిపెట్టుకుందని.. ఢిల్లీ యాజమాన్యం తీసుకున్న నిర్ణయాల్లోకెల్లా ఇదే ఉత్తమమైందని పేర్కొన్నాడు. కాగా రోడ్డు ప్రమాదం కారణంగా ఐపీఎల్-2023 మొత్తానికి దూరమైన పంత్.. పునరాగమనంలో సత్తా చాటిన విషయం తెలిసిందే.ఈ ఏడాది ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్గా బరిలోకి దిగిన పంత్.. జట్టును ప్లే ఆఫ్స్నకు చేర్చలేకపోయినా.. ఆరో స్థానంలో నిలపగలిగాడు. అయితే, సారథిగా విఫలమైనా ఆటగాడిగా మాత్రం ఆకట్టుకున్నాడు. ఈ లెఫ్టాండర్ బ్యాటర్ మొత్తంగా 446 పరుగులు సాధించి.. ఢిల్లీ తరఫున టాప్ స్కోరర్గా నిలిచాడు. వికెట్ కీపర్గానూ రాణించాడు.పాంటింగ్తో పాటు పంత్ కూడా పంజాబ్ జట్టులోకి?అయితే, ఐపీఎల్-2025కి ముందు పంత్ ఢిల్లీ ఫ్రాంఛైజీని వీడనున్నాడనే వార్తలు వచ్చాయి. హెడ్కోచ్ రిక్కీ పాంటింగ్కు ఢిల్లీ ఉద్వాసన పలకగా.. అతడు పంజాబ్ కింగ్స్లో చేరాడు. దీంతో పాంటింగ్తో పాటు పంత్ కూడా పంజాబ్తో జట్టుకట్టనున్నాడనే వదంతులు వ్యాపించాయి. టెస్టుల్లో పునరాగమనంలో పంత్ శతక్కొట్టగా.. అతడిని అభినందిస్తూ పంజాబ్ కూడా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడం ఇందుకు ఊతమిచ్చింది.పంత్ కంటే మెరుగైన ఆటగాడు మరొకరు దొరకరుఈ నేపథ్యంలో ఆకాశ్ చోప్రా మాట్లాడుతూ.. ‘‘రిషభ్ పంత్ ఢిల్లీ జట్టును వీడి ఎక్కడికీ వెళ్లడం లేదు. రిక్కీ పాంటింగ్తో కలిసి పంజాబ్ కింగ్స్లో చేరతాడనే వార్తలు అవాస్తవం. చెన్నై సూపర్ కింగ్స్కు కూడా అతడు ఆడే అవకాశం లేదు. క్రిక్బజ్ తాజా కథనం ద్వారా ఈ విషయం వెల్లడైంది. భారీ మొత్తం వెచ్చించి అతడితో ఒప్పందం కుదుర్చుకుంది. ఢిల్లీ తీసుకున్న ఉత్తమ నిర్ణయాల్లో ఇదొకటి. అతడిని అస్సలు వదులు కోవద్దు. పంత్ కంటే మెరుగైన కెప్టెన్ మళ్లీ మరొకరు మీకు దొరకరు’’ అని పేర్కొన్నాడు. పంత్ ఢిల్లీతోనే ఉండి.. జట్టును విజయపథంలో నడిపి టైటిల్ గెలవాలని ఆకాశ్ చోప్రా ఈ సందర్భంగా ఆకాంక్షించాడు. చదవండి: రంజీ ‘జట్టు’లో విరాట్ కోహ్లి, మరో టీమిండియా స్టార్ కూడా.. డీడీసీఏ ప్రకటన -
IPL 2025: పంజాబ్ కింగ్స్ రాత మారేనా!
అన్నట్లు’... మెరుగైన ప్లేయర్లు, అంతకుమించిన సహాయక సిబ్బంది, ప్రతి మ్యాచ్లో దగ్గరుండి ప్రోత్సహించే ఫ్రాంచైజీ యాజమాన్యం, అన్నీటికి మించి జట్టు ఎలాంటి ప్రదర్శన చేసినా వెన్నంటి నిలిచే అభిమాన గణం ఇలా అన్నీ ఉన్నా... పంజాబ్ కింగ్స్ జట్టు ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఐపీఎల్ టైటిల్ గెలవలేకపోయింది. గత ఏడేళ్లుగా కనీసం టాప్–5లో కూడా నిలవలేకపోయింది. మరి ఇప్పుడు కొత్త హెడ్ కోచ్గా ఆ్రస్టేలియా దిగ్గజం రికీ పాంటింగ్ రాకతోనైనా పంజాబ్ రాత మారుతుందా లేదా వేచి చూడాలి. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఆరంభం నుంచి కొనసాగుతున్న జట్లలో పంజాబ్ ఒకటి. కొన్నేళ్లు కింగ్స్ ఎలెవన్ పంజాబ్ పేరుతో లీగ్లో ఆడింది. ఆ తర్వాత ఈ పేరును పంజాబ్ కింగ్స్గా మార్చుకుంది. అయితేనేం ఐపీఎల్ విన్నర్స్ ట్రోఫీ మాత్రం పంజాబ్ జట్టుకు అందని ద్రాక్షగానే ఉంది. క్రిస్ గేల్, ఆడమ్ గిల్క్రిస్ట్, వీరేంద్ర సెహ్వాగ్, యువరాజ్ సింగ్, కేఎల్ రాహుల్, షాన్ మార్‡్ష, డేవిడ్ మిల్లర్, మ్యాక్స్వెల్, శిఖర్ ధావన్ వంటి విధ్వంసక బ్యాటర్లు ప్రాతినిధ్యం వహించినా... టామ్ మూడీ మొదలుకొని అనిల్ కుంబ్లే వరకు ఎందరో దిగ్గజాలు హెడ్ కోచ్లుగా పనిచేసినా పంజాబ్ రాత మాత్రం మారడంలేదు. చివరిసారిగా 2014లో ఫైనల్ చేరిన పంజాబ్ జట్టు... గత ఏడు సీజన్లలో కనీసం టాప్–5లో కూడా చోటు దక్కించుకోలేకపోయింది. ఈ ఏడాది శిఖర్ ధావన్ సారథ్యంలో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్ జట్టు తొమ్మిదో స్థానంలో నిలిచింది. ఆడిన 14 మ్యాచ్ల్లో తొమ్మిదింట ఓడి 10 పాయింట్లు మాత్రమే సాధించింది. గాయం కారణంగా ధావన్ కొన్ని మ్యాచ్లకే అందుబాటులో ఉండటం... భారీ ధర పెట్టి కొనుగోలు చేసుకున్న ఇంగ్లండ్ పేస్ ఆల్రౌండర్ స్యామ్ కరన్ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోవడం పంజాబ్ విజయావకాశాలపై ప్రభావం చూపింది. ఇలాంటి దశలో జట్టు ప్రక్షాళన చేపట్టిన పంజాబ్ ఆ దిశగా తొలి అడుగు వేసింది. తన ముద్ర వేస్తాడా? గత పదేళ్లలో తరచూ ప్లేయర్లను మార్చడం... కెప్టెన్లను మార్చడం... కోచ్లను మార్చడం ఇలాంటి వాటితోనే వార్తల్లో నిలుస్తున్న పంజాబ్ కింగ్స్ ఫ్రాంచైజీ ఈసారి మెరుగైన ఫలితాలు సాధించాలనే ఉద్దేశంతోనే ఆస్ట్రేలియాకు రెండు ప్రపంచకప్లు అందించిన రికీ పాంటింగ్ను హెడ్ కోచ్గా నియమించుకుంది. ఆటగాడిగా, శిక్షకుడిగా అపార అనుభవం ఉన్న పాంటింగ్ మార్గనిర్దేశకత్వంలో పంజాబ్ ప్రదర్శన మారుతుందని యాజమాన్యం ధీమాగా ఉంది. ఐపీఎల్ ఆరంభం నుంచి ఆటగాడిగా, కోచ్గా కొనసాగుతున్న రికీ పాంటింగ్... గత ఏడేళ్లుగా ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ హెడ్ కోచ్గా వ్యవహరించాడు. ప్రతిభను గుర్తించి సానబెట్టడం, యువ ఆటగాళ్లకు అండగా నిలవడంలో తనదైన ముద్ర వేసిన పాంటింగ్... ఢిల్లీ జట్టును 2020 సీజన్లో ఫైనల్కు చేర్చాడు. ముంబై ఇండియన్స్ వంటి స్టార్లతో కూడిన జట్టుకు శిక్షణ ఇచ్చిన అనుభవం ఉన్న పాంటింగ్... పంజాబ్ జట్టును గాడిన పెడతాడని యాజమాన్యం బలంగా విశ్వసిస్తోంది. సుదీర్ఘ ప్రణాళికలో భాగంగానే పాంటింగ్ను నాలుగేళ్లకు కోచ్గా నియమించినట్లు ఫ్రాంచైజీ సీఈవో సతీశ్ మీనన్ పేర్కొన్నాడు. వారికి భిన్నంగా.. ఇప్పటి వరకు పంజాబ్ జట్టుకు టామ్ మూడీ, ఆడమ్ గిల్క్రిస్ట్, సంజయ్ బంగర్, వీరేంద్ర సెహ్వాగ్, బ్రాడ్ హాడ్జ్, అనిల్ కుంబ్లే, ట్రెవర్ బేలిస్ కోచ్లుగా వ్యవహరించారు. వీరందరికీ భిన్నంగా పాంటింగ్ జట్టును నడిపిస్తాడని యాజమాన్యం ఆశిస్తోంది. అందుకు తగ్గట్లే పంజాబ్ జట్టుతో కలిసి పనిచేసేందుకు ఉత్సుకతతో ఉన్నట్లు పాంటింగ్ వెల్లడించాడు. ‘కొత్త సవాల్ స్వీకరించడం ఆనందంగా ఉంది. ఫ్రాంచైజీ యాజమాన్యంతో సుదీర్ఘంగా చర్చించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నా. ఎన్నో ఏళ్లుగా జట్టుకు మద్దతుగా నిలుస్తున్న అభిమానులకు... భిన్నమైన జట్టును చూపిస్తా’ అని పాంటింగ్ అన్నాడు. జట్టులో సమూల మార్పులు ఆశిస్తున్న పాంటింగ్... త్వరలోనే సహాయక బృందాన్ని ఎంపిక చేయనున్నాడు. ప్రస్తుతం బంగర్ పంజాబ్ ఫ్రాంచైజీ క్రికెట్ డెవలప్మెంట్ హెడ్గా కొనసాగుతుండగా... లాంగ్వెల్ట్ ఫాస్ట్ బౌలింగ్, సునీల్ జోషి స్పిన్ బౌలింగ్ కోచ్లుగా ఉన్నారు. కోర్ గ్రూప్పై దృష్టి అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన శిఖర్ ధావన్ ఈ ఏడాది పంజాబ్ జట్టు కెప్టెన్గా వ్యవహరించాడు. అర్‡్షదీప్, జితేశ్ శర్మ, రబడ, లివింగ్స్టోన్, స్యామ్ కరన్, బెయిర్స్టో వంటి పలువురు నాణ్యమైన ప్లేయర్లు జట్టులో ఉన్నారు. వచ్చే ఐపీఎల్కు ముందు మెగా వేలం జరగనున్న నేపథ్యంలో ఈ స్టార్ ఆటగాళ్లను అట్టిపెట్టు కోవాలా లేదా అనే విషయంపై పాంటింగ్ నిర్ణయం తీసుకుంటాడు. ఈ ఏడాది ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక లక్ష్యాన్ని ఛేదించిన జట్టుగా రికార్డు సృష్టించిన పంజాబ్ కింగ్స్... అదే తీవ్రతను చివరి వరకు కొనసాగించలేకపోయింది. ఈ సీజన్ ద్వారా పంజాబ్ జట్టుకు శశాంక్ సింగ్, అశుతోష్ శర్మ వంటి నైపుణ్యం ఉన్న ఆటగాళ్లు లభించినట్లైంది. తాజా సీజన్లో అతి క్లిష్ట పరిస్థితులను సైతం ఈ జోడీ సమర్థంగా ఎదుర్కొని భవిష్యత్తుపై భరోసా పెంచింది. ఇలాంటి వాళ్లను సానబెట్టడంలో సిద్ధహస్తుడైన పాంటింగ్ వేలం నుంచే తనదైన ముద్ర వేస్తాడనడంలో సందేహం లేదు. -
IPL 2025: కొత్త హెడ్కోచ్.. ప్రకటించిన పంజాబ్ కింగ్స్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఫ్రాంఛైజీ పంజాబ్ కింగ్స్ బుధవారం కీలక ప్రకటన చేసింది. ఆస్ట్రేలియా దిగ్గజం రిక్కీ పాంటింగ్ను తమ జట్టు ప్రధాన కోచ్గా నియమించినట్లు తెలిపింది. వచ్చే ఏడాది పాంటింగ్ పంజాబ్ కింగ్స్తో చేరనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. నాలుగేళ్ల పాటు తమ జట్టుతో అతడు కొనసాగనున్నట్లు పేర్కొంది. అభిమానులకు ఇదే నా ప్రామిస్ఈ నేపథ్యంలో రిక్కీ పాంటింగ్ స్పందిస్తూ.. ‘‘హెడ్కోచ్గా నాకు అవకాశం ఇచ్చిన పంజాబ్ కింగ్స్ యాజమాన్యానికి ధన్యవాదాలు. కొత్త సవాళ్లు స్వీకరించేందుకు నేను సిద్ధంగా ఉన్నాను. జట్టు యజమానులతో చర్చలు ఫలవంతంగా ముగిశాయి. టీమ్ను ఉన్నత స్థాయిలో నిలిపేందుకు వారితో కలిసి పనిచేసేందుకు నేను సిద్ధం. సుదీర్ఘకాలంగా జట్టుకు మద్దతుగా ఉన్న అభిమానులకు విజయంతో రుణం చెల్లించే అవకాశం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం. ఇకపై సరికొత్త పంజాబ్ కింగ్స్ను చూడబోతున్నారు’’ అని పేర్కొన్నాడు. కాగా రిక్కీ పాంటింగ్ ఐపీఎల్-2024లో ఢిల్లీ క్యాపిటల్స్ హెడ్కోచ్గా పనిచేశాడు. 2018 నుంచి ఏడేళ్లపాటు ఢిల్లీ జట్టుకు సేవలు అందించాడు. ఢిల్లీతో తెగిన బంధం.. ఇకపై పంజాబ్తో ప్రయాణంఅయితే, 2020లో ఫైనల్ చేరడం మినహా పాంటింగ్ మార్గదర్శనంలో ఢిల్లీకి పెద్దగా విజయాలు దక్కలేదు. అయినప్పటికీ అతడిపై నమ్మకం ఉంచిన మేనేజ్మెంట్.. 2024 తర్వాత ఎట్టకేలకు పాంటింగ్తో బంధాన్ని తెంచుకుంది. ఈ క్రమంలో పంజాబ్ కింగ్స్ పాంటింగ్తో చర్చలు జరిపి తమ ప్రధాన కోచ్గా నియమించుకున్నట్లు తాజాగా ప్రకటించింది. మరో ఆసీస్ మాజీ క్రికెటర్ ట్రెవర్ బైలిస్ స్థానాన్ని రిక్కీ పాంటింగ్తో భర్తీ చేసింది. కాగా ఐపీఎల్-2024లో పంజాబ్ కింగ్స్ పద్నాలుగు మ్యాచ్లకు కేవలం ఐదు గెలిచి పట్టికలో తొమ్మిదో స్థానానికి పరిమితమైంది. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ పద్నాలుగింట ఏడు గెలిచి ఆరో స్థానంలో నిలిచింది.చదవండి: నాకంటే నీకే బాగా తెలుసు కదా: కోహ్లికి షాకిచ్చిన గంభీర్! -
సచిన్ ప్రపంచ రికార్డు బద్దలు కొట్టేది అతడే: రిక్కీ పాంటింగ్
అంతర్జాతీయ క్రికెట్లో వంద శతకాలు సాధించిన ఏకైక బ్యాటర్ సచిన్ టెండుల్కర్. టెస్టుల్లో 15,921... వన్డేల్లో 18,426 పరుగులతో ఓవరాల్గా రెండు ఫార్మాట్లలోనూ ఈ టీమిండియా దిగ్గజం టాప్ స్కోరర్గా కొనసాగుతున్నాడు. ఇక సచిన్ సాధించిన సెంచరీల రికార్డుకు చేరువగా ఉన్న ఏకైక క్రికెటర్ టీమిండియా రన్మెషీన్ విరాట్ కోహ్లి.ఇప్పటికే 80 శతకాలు బాదిన 35 ఏళ్ల ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. మరో 20 మార్లు వంద పరుగుల మార్కును అందుకుంటే సచిన్ టెండుల్కర్ రికార్డును సమం చేస్తాడు. అయితే, వన్డేల్లో ఇప్పటి వరకు 13,906 పరుగులు సాధించి.. టాప్ స్కోరర్ల జాబితాలో ఉన్న కోహ్లి టెస్టు ఖాతాలో 8848 పరుగులు మాత్రమే ఉన్నాయి.ఈ నేపథ్యంలో వన్డే కింగ్ అయిన కోహ్లి టెస్టుల్లో మాత్రం సచిన్ను అందుకోవడం కష్టమే అంటున్నాడు ఆస్ట్రేలియా దిగ్గజం రిక్కీ పాంటింగ్. టెస్టుల్లో సచిన్ టెండుల్కర్ అత్యధిక పరుగుల రికార్డును బద్దలు కొట్టగల సత్తా ఇంగ్లండ్ వెటరన్ బ్యాటర్ జో రూట్కు ఉందని పేర్కొన్నాడు. కాగా ఇంగ్లిష్ జట్టుకు కెప్టెన్గా వ్యవహరించిన రూట్ ప్రస్తుతం బెన్స్టోక్స్ సారథ్యంలో ఆటగాడిగా కొనసాగుతున్నాడు.అప్పట్లో ఫామ్లేమితో సతమతమైన 33 ఏళ్ల ఈ రైట్హ్యాండర్.. కొంతకాలంగా నిలకడగా రాణిస్తున్నాడు. ఇటీవల వెస్టిండీస్తో మ్యాచ్ సందర్భంగా టెస్టుల్లో 32వ సెంచరీ సాధించిన రూట్.. 12 వేల పరుగుల మైలురాయిని దాటాడు. ఈ నేపథ్యంలో రిక్కీ పాంటింగ్ మాట్లాడుతూ.. ‘‘ఇంకో నాలుగేళ్ల పాటు రూట్ టెస్టుల్లో కొనసాగితే కచ్చితంగా ఇది సాధ్యమవుతుంది.అయివతే, ఇంగ్లండ్ ఏడాదికి ఎన్ని టెస్టు మ్యాచ్లు ఆడుతుందన్న అంశం మీదే అతడి గణాంకాలు ఆధారపడి ఉంటాయి. ఏడాదికి కనీసం 14 మ్యాచ్లు ఆడటం సహా అందులో సంవత్సరానికి రూట్ 800 నుంచి వెయ్యి పరుగుల చొప్పున సాధిస్తే అతడు సచిన్ రికార్డు బ్రేక్ చేయడం సాధ్యమే.అయితే, 37 ఏళ్ల వయసులోనూ అతడు పరుగుల దాహంతో ఉంటేనే.. అది కూడా రోజురోజుకు తన ఆటను మరింత మెరుగుపరచుకుని.. నిలకడగా రాణిస్తేనే రూట్కు ఈ అవకాశం ఉంటుంది. నాలుగేళ్ల క్రితం కనీసం యాభై పరుగుల మార్కు అందుకోవడానికి కష్టాలు పడ్డ రూట్.. ఇప్పుడు తన శైలిని మార్చేశాడు. అందుకే మరో నాలుగేళ్లపాటు అతడు ఇలాగే కొనసాగితే.. కచ్చితంగా టెస్టుల్లో అత్యధిక పరుగుల వీరుడిగా అవతరిస్తాడు’’ అని రిక్కీ పాంటింగ్ అంచనా వేశాడు. ఇంగ్లండ్ మాజీ సారథి మైకేల్ వాన్ సైతం గతంలో ఇదే అభిప్రాయం వ్యక్తం చేశాడు.కాగా టెస్టుల్లో ఆసీస్ మాజీ కెప్టెన్ పాంటింగ్ టెస్టుల్లో 13,378 పరుగులు సాధించి.. సచిన్ తర్వాతి స్థానంలో కొనసాగుతున్నాడు. ఇక ఈ జాబితాలో సౌతాఫ్రికా లెజెండ్ జాక్వెస్ కలిస్(13,289), టీమిండియా దిగ్గజం రాహుల్ ద్రవిడ్(13,288), ఇంగ్లండ్ మాజీ సారథి అలిస్టర్ కుక్(12,472), శ్రీలంక లెజెండరీ వికెట్ కీపర్ కుమార్ సంగక్కర(12, 400) తర్వాత ఏడో స్థానంలో రూట్(12,027) ఉన్నాడు. -
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో విజయం ఆ జట్టుదే: పాంటింగ్
భారత క్రికెట్ జట్టు ఈ ఏడాది చివరలో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో తలపడేందుకు ఆస్ట్రేలియాకు పయనం కానుంది. ఈ పర్యటనలో భాగంగా ఆతిథ్య ఆసీస్తో టీమిండియా ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్లో తలపడనుంది.గత రెండు పర్యాయాలు కంగారులను వారి సొంత గడ్డపై ఓడించిన భారత్.. ఇప్పుడు హ్యాట్రిక్ కొట్టడమే లక్ష్యంగా పెట్టుకుంది. వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ 2025 ఫైనల్కు చేరాలన్న ఈ సిరీస్కు భారత్కు ఎంతో కీలకం. మరోవైపు ఈసారి భారత్పై ఎలాగైనా టెస్టు సిరీస్ విజయం సాధించి తమ 9 ఏళ్ల నిరీక్షణకు తెరదించాలని ఆసీస్ భావిస్తోంది. టీమిండియాపై టెస్టు సిరీస్ను ఆసీస్ చివరగా 2014-15లో సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఈసారి టెస్టు సిరీస్లో టీమిండియాను ఆసీస్ కచ్చితంగా ఓడిస్తుందని పాంటింగ్ థీమా వ్యక్తం చేశాడు."భారత్-ఆసీస్ మధ్య పోటీ ఎల్లప్పుడూ ప్రత్యేకమే. ఈసారి కూడా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఇరు జట్ల మధ్య హోరాహోరీగా సాగడం ఖాయం. గత రెండు పర్యాయాలు భారత్ చేతిలో ఓటమి చవిచూసిన ఆసీస్.. ఈ సారి మాత్రం సొంతగడ్డపై తమను తాము నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. మళ్లీ ఐదు టెస్టుల సిరీస్ను తీసుకురావడం ఇరు జట్లకు కలిసొచ్చే ఆంశం. ఇది నిజంగా కీలకపరిణామంగానే చెప్పుకోవాలి. ఎందుకంటే గత రెండు సార్లు కేవలం నాలుగు టెస్టులు మాత్రమే ఇరు జట్లు మధ్య జరిగాయి.ఇప్పుడు మళ్లీ ఐదు టెస్టులు జరగనుండడంతో అందరూ ఉత్సాహంగా ఉన్నారు. ఈ సిరీస్లో డ్రాలు ఎక్కువగా ఉంటాయో లేదో తెలియదు. కానీ ఆస్ట్రేలియానే గెలవాలని కోరుకుటున్నాను. ఆసీస్ గెలిచేందుకు సలహాలు ఇస్తా. ఏదో ఒక మ్యాచ్ డ్రా అయ్యే ఛాన్స్ ఉంది. కేవలం ఒక్క మ్యాచ్ మాత్రమే భారత్ గెలిచే ఛాన్స్ ఉంది. ఈ సిరీస్ను ఆస్ట్రేలియా. 3-1తో గెలుస్తుందని భావిస్తున్నా" అని రికీ పాంటింగ్ ఐసీసీ రివ్యూలో పాంటింగ్ పేర్కొన్నాడు. కాగా 32 ఏళ్ల తర్వాత తొలిసారి భారత్-ఆస్ట్రేలియా మధ్య ఐదు మ్యాచ్ టెస్టు సిరీస్ జరగనుంది. చివరగా 1991-92లో ఇరు జట్ల మధ్య ఐదు మ్యాచ్ల సిరీస్ జరిగింది.ఈ ఏడాది నవంబర్ 22 నుంచి పెర్త్ వేదికగా ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్ ఆరంభం కానుంది. -
ఐపీఎల్లో రీ ఎంట్రీ ఇస్తా: రిక్కీ పాంటింగ్
అంతర్జాతీయ జట్లకు కోచ్గా వ్యవహరించేందుకు తాను సిద్ధంగా లేనని ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెట్ రిక్కీ పాంటింగ్ పునురద్ఘాటించాడు. ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల క్రికెట్ జట్టు కోచ్ రేసులో తాను ఉన్నానంటూ వస్తున్న వార్తలను ఖండించాడు. ప్రస్తుతం తాను ఎంతో బిజీగా ఉన్నానన్న పాంటింగ్.. ఒకవేళ ఇంగ్లండ్ బోర్డు తన పేరును పరిశీలిస్తున్నట్లయితే ఆ ఆలోచన మానుకోవాలని విజ్ఞప్తి చేశాడు.కాగా ఆస్ట్రేలియాకు రెండుసార్లు వన్డే వరల్డ్కప్ ట్రోఫీలు అందించిన రిక్కీ పాంటింగ్.. లెజెండరీ బ్యాటర్గా పేరొందాడు. ఆటకు వీడ్కోలు పలికిన తర్వాత ఫ్రాంఛైజీ క్రికెట్ జట్ల కోచ్గా మారిన అతడు.. ఇండియన్ ప్రీమియర్ లీగ్లో ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లకు మార్గదర్శనం చేశాడు. అయితే, ఐపీఎల్-2024లో దారుణ వైఫల్యాల నేపథ్యంలో ఢిల్లీ పాంటింగ్తో బంధాన్ని తెంచుకుంది.మరోవైపు.. వన్డే వరల్డ్కప్-2023, టీ20 ప్రపంచకప్-2024లో నిరాశజనక ప్రదర్శన నేపథ్యంలో ఇంగ్లండ్ కోచ్ మాథ్యూ మ్యాట్ తన పదవి నుంచి తప్పుకొన్నాడు. ఈ క్రమంలో ఆ స్థానాన్ని రిక్కీ పాంటింగ్ భర్తీ చేసే అవకాశాలు ఉన్నాయనే వార్తలు వినిపించాయి. ఈ క్రమంలో ఐసీసీ రివ్యూ పాడ్కాస్ట్లో స్పోర్ట్స్ ప్రజెంటర్ సంజనా గణేషన్తో మాట్లాడిన రిక్కీ పాంటింగ్.. ఇంగ్లండ్ కోచ్గా వెళ్లాలన్న ఆసక్తి తనకు లేదని స్పష్టం చేశాడు.బిజీగా ఉన్నా‘‘అంతర్జాతీయ స్థాయి కోచ్ పదవి చేపట్టేందుకు నేను సుముఖంగా లేనని అధికారికంగా తెలియజేస్తున్నా. నా కుటుంబానికి, వ్యక్తిగత జీవితానికి ఎక్కువ సమయం కేటాయించాలని భావిస్తున్నా. అంతేకాదు.. కామెంటేటర్గానూ కొనసాగుతున్నాను.. కాబట్టి ఇప్పటికే బిజీ షెడ్యూల్ ఉంది.వ్యక్తిగత, వృత్తిగత జీవితాన్ని సమంగా ఆస్వాదించాలనుకుంటున్నా. అందుకే రిస్కీ జాబ్స్ చేయదలచుకోలేదు. ముఖ్యంగా.. ఇంగ్లండ్ జట్టుకు ఓ ఆస్ట్రేలియన్ కోచ్గా ఉండటమనేది కాస్త భిన్నంగా ఉంటుంది. ఇవన్నీ పక్కనపెడితే.. కామెంటేటర్గా నేను త్వరలోనే యూకేకు వెళ్లాల్సి ఉంది. ఐపీఎల్లో రీ ఎంట్రీ ఇస్తాఆస్ట్రేలియా- ఇంగ్లండ్ మధ్య సిరీస్కు వ్యాఖ్యానం చేయబోతున్నాను’’ అని రిక్కీ పాంటింగ్ తెలిపాడు. అంతేకాదు ఐపీఎల్లో రీఎంట్రీ ఇచ్చేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు తెలిపాడు. కాగా సెప్టెంబరులో ఇంగ్లండ్- ఆసీస్ మధ్య పరిమిత ఓవర్ల సిరీస్ జరుగనుంది.కాగా రాహుల్ ద్రవిడ్ స్థానంలో రిక్కీ పాంటింగ్ టీమిండియా హెడ్కోచ్గా రానున్నాడనే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే, ఇందుకు తాను ఆసక్తిగా లేనని రిక్కీ చెప్పగా.. ఆ అవసరం తమకు లేదంటూ బీసీసీఐ కార్యదర్శి జై షా అతడికి కౌంటర్ ఇచ్చాడు. అనంతరం.. ద్రవిడ్ స్థానంలో గౌతం గంభీర్ను కోచ్గా నియమిస్తున్నట్లు ప్రకటించాడు.చదవండి: IND vs SL: 'భారత్లో అన్ని బ్యాటింగ్ పిచ్లే.. అందుకే ఇక్కడ ఆడలేకపోయారు' -
వన్డే ప్రపంచకప్ ఆల్టైమ్ అత్యుత్తమ జట్టు.. కోహ్లికి నో ఛాన్స్!
టీమిండియా దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండుల్కర్ 2012లో అంతర్జాతీయ క్రికెట్లో వందో సెంచరీ కొట్టి.. శతక శతకాల ధీరుడిగా ప్రపంచ రికార్డు సాధించాడు. సమకాలీన క్రికెటర్లు ఎవరికీ సాధ్యం కాని ఫీట్ నమోదు చేసి.. శిఖరాగ్రాన నిలిచాడు. వన్డేల్లో 49, టెస్టుల్లో 51 సెంచరీలు తన ఖాతాలో వేసుకున్నాడు. సచిన్ పేరిట ఉన్న ఈ రికార్డు బద్దలయ్యే అవకాశమే లేదని భావిస్తున్న తరుణంలో.. విరాట్ కోహ్లి అనే కుర్రాడు తెరమీదకు వచ్చాడు.ఇప్పటికే వన్డేల్లో 50 శతకాలు బాదిన ఈ రన్మెషీన్.. సచిన్ రికార్డు బ్రేక్ చేశాడు. టెస్టుల్లో 29, టీ20లలో ఒక సెంచరీ బాది.. ఆల్టైమ్ రికార్డుకు ఎసరుపెట్టాడు. 35 ఏళ్ల వయసులోనూ ఫిట్నెస్కు మారుపేరుగా కొనసాగుతున్న కోహ్లి వరల్డ్కప్ టోర్నీల్లోనూ సత్తా చాటుతున్నాడు. వన్డే రారాజుగా కొనసాగుతున్నాడు. అయితే, ఇలాంటి రికార్డుల వీరుడికి తన ఆల్టైమ్ గ్రేటెస్ట్ వన్డే వరల్డ్కప్ ప్లేయింగ్ ఎలెవన్లో చోటు లేదంటున్నాడు ఆస్ట్రేలియా మాజీ స్టార్ మాథ్యూ హెడెన్.భారత్ నుంచి ఇద్దరు లెజెండ్స్ మాత్రమే ఈ టీమ్లో స్థానం సంపాదించడానికి అర్హులు అన్నట్లుగా తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. ఈ జట్టులో ఆస్ట్రేలియా నుంచి అత్యధికంగా నలుగురిని ఎంపిక చేసుకున్న ఈ కంగారూ బ్యాటర్.. పాకిస్తాన్ నుంచి ఇద్దరి చోటు ఇచ్చాడు. ఇదిలా ఉంటే.. విరాట్ కోహ్లి శ్రీలంకతో వన్డే సిరీస్కు సిద్ధమవుతున్నాడు. గౌతం గంభీర్ గైడెన్స్లో ప్రాక్టీస్ చేస్తున్నాడు.మాథ్యూ హెడెన్ ఎంచుకున్న గ్రేటెస్ట్ వన్డే వరల్డ్కప్ ఆల్టైమ్ ప్లేయింగ్ ఎలెవన్ఆడం గిల్క్రిస్ట్(ఆస్ట్రేలియా), వీరేంద్ర సెహ్వాగ్(ఇండియా), రిక్కీ పాంటింగ్(ఆస్ట్రేలియా- కెప్టెన్), సచిన్ టెండుల్కర్(ఇండియా), బ్రియన్ లారా(వెస్టిండీస్), జాక్వెస్ కలిస్(సౌతాఫ్రికా), వకాన్ యూనిస్(పాకిస్తాన్), వసీం అక్రం(పాకిస్తాన్), షేన్ వార్న్(ఆస్ట్రేలియా), ముత్తయ్య మురళీధరన్(శ్రీలంక), గ్లెన్ మెగ్రాత్(ఆస్ట్రేలియా).చదవండి: SA20 2025: సౌతాఫ్రికా కెప్టెన్కు షాకిచ్చిన సన్రైజర్స్.. జట్టు నుంచి ఔట్ -
సౌరవ్ గంగూలీకి ఆశాభంగం..!
ఢిల్లీ క్యాపిటల్స్కు హెడ్ కోచ్ కావాలని ఆశపడ్డ టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీకి ఆశాభంగం ఎదురైంది. దాదాను హెడ్ కోచ్ పదవి కోసం పరిగణలోకి తీసుకోవడం లేదని ఫ్రాంచైజీ యాజమాన్యం చెప్పకనే చెప్పింది. డీసీ.. గౌతమ్ గంభీర్ లాంటి ట్రాక్ రికార్డు కలిగిన వ్యక్తిని హెడ్ కోచ్గా నియమించుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది. ఇందు కోసం ఇద్దరు ముగ్గురు వరల్డ్కప్ విన్నర్ల పేర్లు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం గంగూలీ ఢిల్లీ క్యాపిటల్స్ డైరెక్టర్ ఆఫ్ క్రికెట్గా ఉన్నాడు. అలాగే అతను ఢిల్లీ క్యాపిటల్స్ సిస్టర్ ఫ్రాంచైజీలైన దుబాయ్ క్యాపిటల్స్ (ILT20), ప్రిటోరియా క్యాపిటల్స్ (SA20) మంచి చెడ్డలు కూడా చూస్తున్నాడు. ఇన్ని బాధ్యతలు మోస్తుండటంతో డీసీ యాజమాన్యం గంగూలీని హెడ్ కోచ్ పదవి కోసం పరిగణలోకి తీసుకోవడం లేదని తెలుస్తుంది.కాగా, ఢిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యం ఇటీవలే రికీ పాంటింగ్ను హెడ్ కోచ్ పదవి నుంచి తప్పించిన విషయం తెలిసిందే. ఏడు సీజన్ల పాటు హెడ్ కోచ్గా వ్యవహరించిన పాంటింగ్ డీసీని ఒక్కసారి కూడా ఛాంపియన్గా నిలబెట్టలేకపోయాడు. ఇదే కారణంగా డీసీ మేనేజ్మెంట్ అతనిపై వేటు వేసింది. పాంటింగ్ను హెడ్ కోచ్ పదవి నుంచి తొలగించాక గంగూలీ ఈ పదవిపై ఆసక్తి ఉన్నట్లు చెప్పాడు. ఓ బెంగాలీ పేపర్ను ఇచ్చిన ఇంటర్వ్యూలో గంగూలీ తన మనసులోని మాటను బయటపెట్టాడు.ఇదిలా ఉంటే, పాంటింగ్ ఆథ్వర్యంలో ఢిల్లీ క్యాపిటల్స్ కేవలం ఒకే ఒక్కసారి (2020) ఫైనల్కు చేరింది. 2018 ఎడిషన్లో తొలిసారి పాంటింగ్ ఆథ్వర్యంలో బరిలోకి దిగిన డీసీ.. ఆ సీజన్లో ఆఖరి స్థానంలో నిలిచింది. ఆతర్వాతి సీజన్లో (2019) మూడో స్థానంలో నిలిచిన ఢిల్లీ.. 2021 సీజన్లో ప్లే ఆఫ్స్కు చేరింది. గడిచిన మూడు సీజన్లలో ఢిల్లీ 5, 9, 6 స్థానాల్లో నిలిచింది. -
రిక్కీ పాంటింగ్పై వేటు.. ఢిల్లీ క్యాపిటల్స్ ప్రకటన! కొత్త కోచ్గా దాదా!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఫ్రాంఛైజీ ఢిల్లీ క్యాపిటల్స్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆస్ట్రేలియా దిగ్గజ బ్యాటర్ రిక్కీ పాంటింగ్తో తమ అనుబంధాన్ని తెంచుకుంది.ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ధ్రువీకరించింది ఢిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యం. ఏడేళ్లపాటు కొనసాగిన బంధానికి ఇక తెరపడిందంటూ.. రిక్కీ పాంటింగ్కు కృతజ్ఞతలు తెలియజేసింది. వేటు వేయడానికి కారణం అదే?కాగా 2018లో రిక్కీ పాంటింగ్ ఢిల్లీ క్యాంపులో చేరాడు. ప్యాటీ ఉప్టన్, రాహుల్ ద్రవిడ్ తర్వాత ఢిల్లీ జట్టు హెడ్ కోచ్గా బాధ్యతలు చేపట్టాడు. ఏడేళ్లపాటు ప్రధాన కోచ్గా కొనసాగాడు. అయితే, 2020లో ఫైనల్ చేరడం మినహా అతడి మార్గదర్శనంలో ఢిల్లీ చెప్పుకోదగ్గ విజయాలు సాధించలేదు. అయినప్పటికీ యాజమాన్యం పాంటింగ్పై నమ్మకం ఉంచింది.అయితే, వేలంలో పాల్గొనడం మినహా జట్టు కూర్పు తదితర అంశాలపై మరింతగా దృష్టి సారించాలని మేనేజ్మెంట్ కోరగా.. పాంటింగ్ నుంచి స్పందన కరువైందని సమాధానం. ఐపీఎల్ సీజన్ ఆరంభానికి కేవలం రెండు వారాలు ముందే జట్టుతో చేరడం పట్ల యాజమాన్యం అసంతృప్తిగా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.ఈ నేపథ్యంలో అతడిని హెడ్ కోచ్ పదవి నుంచి తప్పించినట్లు తెలుస్తోంది. ఇక రిక్కీ పాంటింగ్ స్థానంలో టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీని నియమించేందుకు ఢిల్లీ మేనేజ్మెంట్ మొగ్గుచూపుతున్నట్లు సమాచారం.కొత్త కోచ్గా దాదా?ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ డైరెక్టర్గా ఉన్న దాదాను ప్రధాన కోచ్గా బాధ్యతలు స్వీకరించాలని కోరినట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. డీసీ సహ యజమానులైన జేఎస్డబ్ల్యూ, జీఎంఆర్ గ్రూపు పెద్దలు ఈ విషయమై వచ్చే నెలలో భేటీ అయి.. ఇందుకు సంబంధించి నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.అదే విధంగా.. ఐపీఎల్-2025 మెగా వేలం నేపథ్యంలో ఆటగాళ్ల రిటెన్షన్ గురించి కూడా చర్చలు జరుపనున్నట్లు తెలుస్తోంది. కెప్టెన్ రిషభ్ పంత్తో పాటు ఆల్రౌండర్ అక్షర్ పటేల్, చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్లను కొనసాగించేందుకు మేనేజ్మెంట్ సుముఖంగా ఉన్నట్లు సన్నిహిత వర్గాలు పేర్కొంటున్నాయి. చదవండి: Ind vs Zim 4th T20: జైస్వాల్ విధ్వంసం.. గిల్ సూపర్ ఇన్నింగ్స్After 7 seasons, Delhi Capitals has decided to part ways with Ricky Ponting. It's been a great journey, Coach! Thank you for everything 💙❤️ pic.twitter.com/dnIE5QY6ac— Delhi Capitals (@DelhiCapitals) July 13, 2024 -
T20 WC 2024: అత్యధిక వికెట్లు పడగొట్టేది అతడే!
టీమిండియా పేస్ దళ నాయకుడు జస్ప్రీత్ బుమ్రాపై ఆస్ట్రేలియా దిగ్గజ బ్యాటర్ రిక్కీ పాంటింగ్ ప్రశంసలు కురిపించాడు. గత కొన్నేళ్లుగా బుమ్రా అద్భుతంగా రాణిస్తున్నాడని.. టీ20 ప్రపంచకప్-2024లోనూ కచ్చితంగా ప్రభావం చూపుతాడని అభిప్రాయపడ్డాడు.కాగా వెన్నునొప్పి కారణంగా బుమ్రా టీ20 ప్రంపచకప్-2022కు దూరమైన విషయం తెలిసిందే. నాటి టోర్నీలో టీమిండియా ప్రధాన పేసర్ బుమ్రా లేని లోటు స్పష్టంగా కనిపించింది. ఈ క్రమంలో రోహిత్ సేన సెమీస్లోనే ఇంటిబాట పట్టి విమర్శలు మూటగట్టుకుంది.పునరాగమనంలోఇదిలా ఉంటే.. గాయం నుంచి కోలుకున్న తర్వాత 2023లో పునరాగమనం చేసిన బుమ్రా.. టీమిండియా తరఫున మూడు ఫార్మాట్లలో దుమ్ములేపాడు. ఐర్లాండ్తో టీ20 సిరీస్లో కెప్టెన్గానూ రాణించాడు.ఇక ఇటీవల ముగిసిన ఐపీఎల్-2024లో ముంబై ఇండియన్స్ తరఫున 13 మ్యాచ్లు ఆడి 20 వికెట్లు తీసిన బుమ్రా.. లీడింగ్ వికెట్ టేకర్ల జాబితాలో మూడో స్థానంలో నిలిచాడు. ఎకానమీ రేటు 6.48.పొట్టి క్రికెట్ ప్రపంచకప్ టోర్నీకి ముందు బుమ్రా ఈ మేరకు రాణించడం టీమిండియాకు సానుకూలాంశంగా మారింది. ఈ నేపథ్యంలో రిక్కీ పాంటింగ్ జస్ప్రీత్ బుమ్రాను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశాడు. ఈసారి ఈ ఐసీసీ టోర్నీలో అత్యధిక వికెట్లు తీసే బౌలర్ బుమ్రానే అని ధీమా వ్యక్తం చేశాడు.లీడింగ్ వికెట్ టేకర్ జస్ప్రీత్ బుమ్రానే‘‘నా అంచనా ప్రకారం.. ఈసారి లీడింగ్ వికెట్ టేకర్ జస్ప్రీత్ బుమ్రానే. అతడొక అద్భుతమైన ఆటగాడు. చాలా ఏళ్లుగా నిలకడగా రాణిస్తున్నాడు. ఇటీవలి ఐపీఎల్ సీజన్లోనూ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. న్యూ బాల్ చేతికి ఇస్తే ఓ ఫాస్ట్బౌలర్ ఏం చేయగలడో అన్నీ చేయగల సమర్థుడు.బంతిని సూపర్గా స్వింగ్ చేస్తాడు. ఇక ఎకానమీ విషయానికొస్తే.. ఐపీఎల్ తాజా ఎడిషన్లో ఓవర్కు ఏడు పరుగుల చొప్పున ఇచ్చి వికెట్లు తీశాడు. కఠిన సమయాల్లోనూ బంతితో మ్యాజిక్ చేశాడు.టీ20 క్రికెట్లో ఎలా ఆడాలో అలాగే ఆడాడు. కాబట్టి ఈసారి అతడే లీడింగ్ వికెట్ టేకర్ అవుతాడని భావిస్తున్నా’’ అని రిక్కీ పాంటింగ్ ఐసీసీ రివ్యూ షోలో పేర్కొన్నాడు. కాగా ప్రపంచకప్-2024లో జూన్ 5న టీమిండియా తమ తొలి మ్యాచ్ ఆడనుంది. న్యూయార్క్ వేదికగా ఐర్లాండ్తో తలపడనుంది.చదవండి: ఇది నిజంగా సిగ్గు చేటు.. దేశం పరువు పోతుంది: డివిలియర్స్ -
BCCI: అవన్నీ అబద్ధాలే: ఆసీస్ మాజీలకు జై షా కౌంటర్
టీమిండియా కొత్త హెడ్ కోచ్ విషయంలో వస్తున్న వార్తలన్నీ అవాస్తవాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి కార్యదర్శి జై షా కొట్టిపారేశారు. ఈ బాధ్యతలు స్వీకరించాల్సిందిగా తాము ఇంత వరకు ఎవరినీ సంప్రదించలేదని స్పష్టం చేశారు.కాగా టీ20 ప్రపంచకప్-2024 తర్వాత రాహుల్ ద్రవిడ్ భారత జట్టు ప్రధాన కోచ్గా పదవీ కాలం ముగియనుంది. ఈ క్రమంలో ఇప్పటికే బీసీసీఐ అతడి వారసుడిని ఎంపిక చేసే క్రమంలో దరఖాస్తులు ఆహ్వానించింది. విదేశీ కోచ్ల పేర్లను కూడా పరిగణనలోకి తీసుకుంటామని తెలిపింది.హెడ్ కోచ్ రేసులోఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్లు రిక్కీ పాంటింగ్, జస్టిన్ లాంగర్ సహా న్యూజిలాండ్ మాజీ ఆటగాడు స్టీఫెన్ ఫ్లెమింగ్, శ్రీలంక లెజెండ్ మహేళ జయవర్ధనే తదితరుల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.ఈ క్రమంలో రిక్కీ పాంటింగ్ అంతర్జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. బీసీసీఐ తనకు ఆఫర్ ఇచ్చినా తిరస్కరించానని పేర్కొన్నాడు. మరోవైపు.. జస్టిన్ లాంగర్ సైతం కేఎల్ రాహుల్ తన కళ్లు తెరిపించాడంటూ టీమిండియా హెడ్ కోచ్ పదవి కోసం తాను అప్లై చేసుకోనని పరోక్షంగా వెల్లడించాడు.వాళ్లకు మేమే ఆఫర్ ఇవ్వలేదురిక్కీ పాంటింగ్, జస్టిన్ లాంగర్ వ్యాఖ్యలపై బీసీసీఐ కార్యదర్శి జై షా తాజాగా స్పందించారు. ‘‘టీమిండియా హెడ్ కోచ్ పదవి కోసం నేను గానీ, బీసీసీఐ గానీ ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్లెవరికీ ఆఫర్ చేయలేదు.మీడియా వస్తున్న వార్తలన్నీ నిజం కాదు. జాతీయ జట్టు కోసం సరైన కోచ్ను ఎంపిక చేసుకోవడం క్లిష్టతరమైన ప్రక్రియ. భారత క్రికెట్ స్వరూపాన్ని చక్కగా అర్థం చేసుకోగల వ్యక్తుల కోసం అన్వేషిస్తున్నాం.పూర్తి అవగాహన ఉన్నవాళ్లకే ప్రాధాన్యంటీమిండియా హెడ్ కోచ్గా ఉన్నవారికి భారత దేశవాళీ క్రికెట్ గురించి, ఆటగాళ్ల గురించి పూర్తి అవగాహన ఉండాలి. అలాంటి వాళ్ల కోసమే మేము ఎదురుచూస్తున్నాం.భారత జట్టు ప్రధాన కోచ్గా ఉండటం కంటే అంతర్జాతీయ క్రికెట్లో ప్రతిష్టాత్మకమైన పదవి ఇంకోటి ఉంటుందని అనుకోను. ప్రపంచవ్యాప్తంగా టీమిండియాకు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. భారత క్రికెట్ చరిత్ర, ఔన్నత్యం.. ఆట పట్ల మా అంకితభావం.. అన్నీ వెరసి ప్రపంచంలోనే అత్యుత్తమ స్థాయిలో ఉన్నాం.ఇలాంటి చోట జాబ్ చేయడం కంటే గొప్ప విషయం ఏముంటుంది?. ఇలాంటి జట్టుకు గురువుగా బాధ్యతలు నిర్వర్తించే సరైన వ్యక్తి కోసం మేము జల్లెడపట్టాల్సి ఉంటుంది’’ అని జై షా ఇండియన్ ఎక్స్ప్రెస్తో వ్యాఖ్యానించారు. చదవండి: SRH vs RR: అతడి మీదే భారం.. అలా అయితేనే సన్రైజర్స్ ముందుకు -
బీసీసీఐ ఆఫర్ నిజమే.. నేనే రిజెక్ట్ చేశా: ఆసీస్ దిగ్గజం
టీమిండియా హెడ్కోచ్ పదవిపై తనకు ఆసక్తి లేదని ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్ రిక్కీ పాంటింగ్ స్పష్టం చేశాడు. తాను ఈ బాధ్యతలను స్వీకరించేందుకు సిద్ధంగా లేనని తెలిపాడు.ప్రధాన కోచ్గా ఉండాలంటూ భారత క్రికెట్ నియంత్రణ మండలి తనకు ఆఫర్ ఇచ్చిందని.. అయితే, తాను సున్నితంగా తిరస్కరించినట్లు పాంటింగ్ వెల్లడించాడు. కాగా టీమిండియా హెడ్ కోచ్గా రాహుల్ ద్రవిడ్ ప్రయాణం ముగియనున్న విషయం తెలిసిందే.వన్డే వరల్డ్కప్-2023 తర్వాతే ద్రవిడ్ పదవీకాలం ముగియగా.. టీ20 ప్రపంచకప్-2024 ముగిసే వరకు జట్టుతో ఉండాలని బీసీసీఐ అతడిని కోరింది. ఇందుకు అంగీకరించిన ద్రవిడ్.. మెగా ఈవెంట్ తర్వాత తన బాధ్యతల నుంచి తప్పుకోనున్నాడు.ఈ క్రమంలో బీసీసీఐ ఇప్పటికే కొత్త హెడ్ కోచ్ కోసం వేట మొదలుపెట్టింది. ఇందుకు దరఖాస్తులు కూడా ఆహ్వానించింది. ఈ నేపథ్యంలో రిక్కీ పాంటింగ్తో పాటు జస్టిన్ లాంగర్, స్టీఫెన్ ఫ్లెమింగ్ తదితర విదేశీ కోచ్ల పేర్లు తెరమీదకు వచ్చాయి.ఈ విషయంపై రిక్కీ పాంటింగ్ తాజాగా స్పందించాడు. ఐసీసీ వెబ్సైట్తో మాట్లాడుతూ.. ‘‘టీమిండియా హెడ్కోచ్ నియామకం గురించి చాలా వార్తలు చూస్తున్నా. నిజానికి మన కంటే ముందు మన గురించి సోషల్ మీడియా యూజర్లకే అన్ని వివరాలు తెలిసిపోతాయి(నవ్వుతూ)!అది ఎలాగో మనకైతే అర్థం కాదు. నాక్కూడా జాతీయ జట్టుకు సీనియర్ కోచ్గా ఉండాలనే ఉంది. అయితే, అంతకంటే ఎక్కువగా నా కుటుంబంతో సమయం గడపాలని ఉంది.టీమిండియా కోచ్గా ఉండాలంటే ఐపీఎల్ జట్లతో సంబంధాలు తెంచుకోవాలన్న సంగతి తెలిసిందే. అంతేకాదు.. హెడ్ కోచ్ అంటే ఏడాదిలో దాదాపు 10 -11 నెలల పాటు బిజీగా ఉంటాం.నా ప్రస్తుత జీవనశైలి అందుకు ఏమాత్రం సరితూగదు. ఇప్పుడు నేను నా కెరీర్ పట్ల సంతృప్తిగానే ఉన్నా. ఐపీఎల్ సమయంలో చర్చలు జరిగిన మాట వాస్తవమే.నాతో పాటు జస్టిన్ లాంగర్, స్టీఫెన్ ఫ్లెమింగ్.. గౌతం గంభీర్.. ఇలా చాలా మంది పేర్లు వినిపిస్తున్నాయి. అయితే, నేను మాత్రం ప్రస్తుతం ఈ పదవి చేపట్టేందుకు సిద్ధంగా లేను’’ అని రిక్కీ పాంటింగ్ స్పష్టం చేశాడు. కాగా ఐపీఎల్లో ముంబై ఇండియన్స్తో సుదీర్ఘకాలం పాటు ప్రయాణం చేసిన రిక్కీ పాంటింగ్ ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్ కోచ్గా ఉన్నాడు. -
BCCI: టీమిండియా హెడ్కోచ్గా వాళ్లిద్దరిలో ఒకరు?
భారత పురుషుల సీనియర్ క్రికెట్ జట్టుకు కొత్త హెడ్ కోచ్ను ఎంపిక చేసేందుకు బీసీసీఐ ప్రక్రియ మొదలుపెట్టింది. ఈ అత్యున్నత పదవి కోసం అర్హులైన వారి నుంచి దరఖాస్తులు కోరుతూ బీసీసీఐ ఒక ప్రకటన విడుదల చేసింది. ఆసక్తిగలవారు ఈనెల 27వ తేదీలోపు తమ దరఖాస్తులు పంపించాలి.ఎంపికైన కొత్త హెడ్ కోచ్ పదవీకాలం మూడేన్నరేళ్లపాటు (1 జూలై 2024 నుంచి 31 డిసెంబర్ 2027 వరకు) ఉంటుంది. ప్రస్తుత హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ పదవీకాలం గత ఏడాది నవంబర్లో వన్డే వరల్డ్కప్ అనంతరం ముగిసింది.అయితే టి20 ప్రపంచకప్ నేపథ్యంలో ఈ మెగా ఈవెంట్ ముగిసేవరకు టీమిండియాకు తాత్కాలిక కోచ్గా కొనసాగాలని బీసీసీఐ కోరడంతో ద్రవిడ్ అంగీకరించాడు. ఈ నేపథ్యంలో కొత్త హెడ్ కోచ్ పదవి కోసం ద్రవిడ్ కూడా మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని బీసీసీఐ కార్యదర్శి జై షా తెలిపారు. నో చెప్పిన ద్రవిడ్అయితే, ఇందుకు ద్రవిడ్ సుముఖంగా లేనట్లు తెలుస్తోంది. మరికొంత కాలం పాటు అతడిని కోచ్గా కొనసాగాలని టీమిండియా ప్రధాన ఆటగాళ్లలో కొందరు అభ్యర్థించినట్లు సమాచారం. కనీసం టెస్టు జట్టుకైనా ద్రవిడ్ మార్గదర్శకుడిగా ఉంటే బాగుంటుందని వారు అభిప్రాయపడినట్లు తెలుస్తోంది.కానీ వేర్వేరు ఫార్మాట్లకు వేర్వేరు కోచ్ల నియామకంపై క్రికెట్ అడ్వైజరీ కమిటీదే తుది నిర్ణయం అని.. ఏదేమైనా ఇలాంటి ప్రతిపాదనలు ఆమోదం పొందకపోవచ్చని జై షా ఇప్పటికే సంకేతాలు ఇచ్చారు. మరోవైపు.. రాహుల్ ద్రవిడ్ సైతం హెడ్ కోచ్ పదవికి గుడ్బై చెప్పాలని గట్టిగా నిర్ణయించుకున్నట్లు సమాచారం. కుటుంబానికి ఎక్కువ సమయం కేటాయించే క్రమంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.లక్ష్మణ్కు ఆ ఛాన్స్ లేదుమరోవైపు.. ద్రవిడ్ గైర్హాజరీలో టీమిండియా కోచ్గా వ్యవహరించిన వీవీఎస్ లక్ష్మణ్ ప్రస్తుతం జాతీయ క్రికెట్ అకాడమీ పనులతో బిజీగా ఉన్నాడు. అయితే, బీసీసీఐ అతడిని అక్కడి నుంచి కదిలించేందుకు సిద్ధంగా లేనట్లు తెలుస్తోంది.ఫ్లెమింగ్ లేదంటే రిక్కీ పాంటింగ్?ఈ నేపథ్యంలో.. ఈసారి విదేశీ కోచ్ను రంగంలోకి తీసుకువచ్చేందుకు బీసీసీఐ సుముఖంగానే ఉన్నట్లు జై షా హింట్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పటికే న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ స్టీఫెన్ ఫ్లెమింగ్ పేరును బీసీసీఐ పరిశీలిస్తున్నట్లు వార్తలు రాగా.. మరో పేరు కూడా తెర మీదకు వచ్చింది.ఆస్ట్రేలియా దిగ్గజ సారథి రిక్కీ పాంటింగ్ కూడా టీమిండియా హెడ్కోచ్ పదవి రేసులో ఉన్నాడనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కాగా వీరిద్దరు ప్రస్తుతం ఐపీఎల్ జట్లకు హెడ్కోచ్లుగా ఉన్నారు. చెన్నై సూపర్ కింగ్స్ కోచ్గా స్టీఫెన్ ఫ్లెమింగ్ ఆ జట్టును ఐదుసార్లు విజేతగా నిలపడంలో కృషి చేయగా.. ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్(ప్రస్తుతం) జట్లకు కోచ్గా పనిచేసిన అనుభవం పాంటింగ్కు ఉంది.అది సాధ్యం కాదన్న పాంటింగ్అయితే, వీళ్లిద్దరు కూడా టీమిండియా హెడ్కోచ్ పదవి చేపట్టేందుకు సిద్ధంగా లేరని తెలుస్తోంది. ఎందుకంటే వరుస సిరీస్లతో బిజీగా ఉండే టీమిండియా కోసం కోచ్ ఏడాదిలో దాదాపు 10 నెలల పాటు అంకితం కావాల్సి ఉంటుంది.కాబట్టి కుటుంబానికి ఎక్కువ సమయం కేటాయించే వీలుండదు. అందుకే భారత జట్టు హెడ్కోచ్ పదవి ఆఫర్ వచ్చినా తాను చేపట్టలేదని రిక్కీ పాంటింగ్ గతం(2021)లో వెల్లడించాడు. ఈ పరిణామాల నేపథ్యంలో టీమిండియా కొత్త కోచ్గా ఎవరు వస్తారో? అంటూ క్రికెట్ వర్గాల్లో విస్తృత చర్చ నడుస్తోంది.చదవండి: సీజన్ మొత్తం మాకు అదే సమస్య.. అందుకే ఈ దుస్థితి: కేఎల్ రాహుల్ -
ఈసారి టైటిల్ సన్రైజర్స్దే!.. రిక్కీ పాంటింగ్ కామెంట్స్ వైరల్
ఐపీఎల్-2024లో చాంపియన్గా నిలవడానికి గల అర్హత ఇదేనంటూ ఢిల్లీ క్యాపిటల్స్ హెడ్ కోచ్ రిక్కీ పాంటింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. దూకుడైన బ్యాటింగ్తో ముందుకు సాగే జట్టే టైటిల్ సాధిస్తుందని అభిప్రాయపడ్డాడు. కాగా క్యాష్ రిచ్ తాజా ఎడిషన్లో ఇప్పటి వరకు 31 మ్యాచ్లు జరుగగా.. తొమ్మిదికి పైగా మ్యాచ్లలో.. ఒక ఇన్నింగ్స్లో 200.. అంతకంటే పైచిలుకు స్కోర్లు నమోదయ్యాయి. ఇక ఈ సీజన్లో కొత్త కెప్టెన్ ప్యాట్ కమిన్స్ సారథ్యంలో రెట్టించిన ఉత్సాహంతో ముందుకు సాగుతున్న సన్రైజర్స్ హైదరాబాద్ రోజుల వ్యవధిలోనే తమ రికార్డు తామే బద్దలు కొట్టింది. దుమ్మురేపుతున్న సన్రైజర్స్ తొలుత ముంబై ఇండియన్స్పై 277 పరుగులు సాధించిన ఎస్ఆర్హెచ్.. ఆ తర్వాత ఆర్సీబీపై 287 పరుగులు స్కోరు చేసింది. తద్వారా ఐపీఎల్ చరిత్రలో అత్యధిక స్కోరు సాధించిన జట్టుగా రికార్డులకెక్కింది. Captain Pat reflects on the game ➕ who clinched the dressing room awards? 👀🏅 Watch as we soak in the post match vibes from our strong win in #RCBvSRH 🧡 pic.twitter.com/Ey7VhksA6B — SunRisers Hyderabad (@SunRisers) April 16, 2024 తగ్గేదేలే అంటున్న కేకేఆర్ మరోవైపు కోల్కతా నైట్ రైడర్స్ సైతం ఢిల్లీ క్యాపిటల్స్పై 272 పరుగులతో సత్తా చాటింది. ఇక తాజాగా మంగళవారం నాటి మ్యాచ్లో రాజస్తాన్ రాయల్స్, కేకేఆర్ వరుసగా 224, 223 పరుగులు స్కోరు చేశాయి. ఈ పరిణామాల నేపథ్యంలో రిక్కీ పాంటింగ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘‘ఇప్పటికే రెండుసార్లు భారీ స్కోరు చేసిన జట్టుగా ఎస్ఆర్హెచ్ రికార్డులు సాధించింది. కేకేఆర్ కూడా మా జట్టు మీద 272 రన్స్ స్కోరు చేసింది. సన్రైజర్స్ సూపర్ ఫామ్ నాకు తెలిసి ఇంపాక్ట్ ప్లేయర్ కారణంగానే బ్యాటింగ్ జట్లకు ఈ మేరకు ప్రయోజనం చేకూరుతున్నట్లు అనిపిస్తోంది. ఆర్సీబీతో మ్యాచ్లో ట్రావిస్ హెడ్ ఎంతగా ప్రభావం చూపాడో చూశాం. ఎంతో ఆత్మవిశ్వాసం ఉంటేగానీ ఆ మాదిరి షాట్లు ఆడలేరు. బ్యాటింగ్ ఆర్డర్లో డెప్త్ ఉన్న కారణంగా కూడా అతడు స్వేచ్ఛగా బ్యాట్ ఝులిపించగలిగాడు. ఐపీఎల్ వంటి మేజర్ టోర్నీల్లో లేదా బిగ్ బాష్ లీగ్లో.. ఇలా ఎక్కడ చూసినా సరే లక్ష్యాన్ని కాపాడుకోగలిగి జట్లే విజయం సాధించాయి. అయితే.. ఈసారి ఐపీఎల్ మాత్రం భిన్నంగా సాగుతోంది. ఆ జట్టుదే టైటిల్ బౌలర్లను చితక్కొడుతూ భారీ స్కోర్లు సాధించిన జట్లే టైటిల్ దిశగా వెళ్లే సూచనలు కనిపిస్తున్నాయి. డిఫెన్సివ్ బౌలింగ్పై ఆధారపడే జట్ల కంటే దూకుడుగా బ్యాటింగ్ చేసే జట్లకే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయి’’ అని రిక్కీ పాంటింగ్ అభిప్రాయపడ్డాడు. అలా అయితే ఈసారి సన్రైజర్స్దే టైటిల్! ఇక పాంటింగ్ వ్యాఖ్యలను బట్టి చూస్తే సీజన్ ఆరంభం(కేకేఆర్తో మ్యాచ్లో 204) నుంచి దూకుడుగా బ్యాటింగ్ చేస్తున్న సన్రైజర్స్కే టైటిల్ విన్నర్గా నిలిచే ఛాన్స్ ఉందని ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్ క్రేజీ కామెంట్లు చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. పాంటింగ్ మార్గదర్శనంలోని ఢిల్లీ క్యాపిటల్స్ ఈ సీజన్లో ఇప్పటి వరకు ఆడిన ఆరు మ్యాచ్లలో కేవలం రెండే గెలిచి పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో ఉంది. ఇక పంత్ సేన తమ తదుపరి మ్యాచ్లో భాగంగా బుధవారం గుజరాత్ టైటాన్స్ను అహ్మదాబాద్లో ఢీకొట్టనుంది. చదవండి: #Pat Cummins: శెభాష్.. ఇది సరైన నిర్ణయం! కమిన్స్ అన్నతో అట్లుంటది మరి.. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_7552012696.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
T20 WC: సంజూ బాగా ఆడుతున్నాడు.. అయినా పంత్కే చోటివ్వాలి!
టీ20 ప్రపంచకప్-2024 భారత జట్టులో రిషభ్ పంత్కు చోటు ఇవ్వాలని ఆస్ట్రేలియా దిగ్గజం, ఢిల్లీ క్యాపిటల్స్ హెడ్ కోచ్ రిక్కీ పాంటింగ్ అన్నాడు. మెగా టోర్నీ ఆడే అర్హత పంత్కు ఉందని.. తన దృష్టిలో అతడే టీమిండియాకు మొదటి వికెట్ కీపర్ ఆప్షన్ అని పేర్కొన్నాడు. ఐపీఎల్-2024లో సత్తా చాటి కచ్చితంగా వరల్డ్కప్ ఆడే జట్టులో పంత్ చోటు దక్కించుకుంటాడని రిక్కీ పాంటింగ్ ధీమా వ్యక్తం చేశాడు. కాగా 2022, డిసెంబరులో కారు ప్రమాదానికి గురై.. అదృష్టవశాత్తూ ప్రాణాలతో బయటపడ్డ పంత్ కోలుకోవడానికి దాదాపు ఏడాదిన్నర కాలం పట్టింది. బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో సుదీర్ఘకాలం పాటు పునరావాసం పొందిన పంత్.. క్రమక్రమంగా కోలుకుని మ్యాచ్ ఫిట్నెస్ సాధించాడు. ఈ క్రమంలో ఐపీఎల్ పదిహేడో ఎడిషన్లో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్గా తిరిగి పగ్గాలు చేపట్టిన పంత్.. వికెట్ కీపర్ బ్యాటర్గానూ సేవలు అందిస్తున్నాడు. ఇప్పటి వరకు ఆరు ఇన్నింగ్స్ ఆడి 194 పరుగులు చేసిన పంత్ ఖాతాలో రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అయితే.. కెప్టెన్గా మాత్రం పంత్ విఫలమవుతూనే ఉన్నాడు. అతడి సారథ్యంలో ఢిల్లీ ఇప్పటిదాకా ఆరు మ్యాచ్లు ఆడి కేవలం రెండే గెలిచింది. ఇదిలా ఉంటే.. మే 27న ఐపీఎల్-2024 ముగియనుండగా.. జూన్ 1 నుంచి వెస్టిండీస్- అమెరికా వేదికగా పొట్టి ప్రపంచకప్ సమరం మొదలుకానుంది. ఈ నేపథ్యంలో భారత జట్టు వికెట్ కీపర్ ఎంపిక గురించి రిక్కీ పాంటింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సంజూ బాగా ఆడుతున్నాడు.. అయినా పంత్కే చోటివ్వాలి! ‘‘వరల్డ్కప్ జట్టులో రిషభ్ పంత్కు చోటు ఇవ్వాలా? అంటే కచ్చితంగా ఇవ్వాలనే చెబుతా. ఐపీఎల్ ముగిసేలోపు అతడు అందుకు అర్హత సాధిస్తాడు. గత ఆరు సీజన్లలో పంత్ మెరుగ్గా ఆడాడు. టీమిండియా తరఫున కూడా మంచి ప్రదర్శన ఇచ్చాడు. భారత జట్టులో ప్రతిభావంతులైన ఆటగాళ్లకు కొదవలేదని తెలుసు. ముఖ్యంగా వికెట్ కీపర్ బ్యాటర్లలో ఇషాన్ కిషన్, సంజూ శాంసన్, కేఎల్ రాహుల్ బాగా ఆడుతున్నారు. చాలా ఆప్షన్లు కనిపిస్తున్నాయి. అయితే.. నేను గనుక జట్టును ఎంపిక చేయాల్సి వస్తే రిషభ్ పంత్కే మొదటి ప్రాధాన్యం ఇస్తాను. నన్నెపుడు ఈ ప్రశ్న అడిగినా ఇదే సమాధానం ఇస్తాను’’ అని రిక్కీ పాంటింగ్ చెప్పుకొచ్చాడు. కాగా వరల్డ్కప్-2024 టీమిండియా వికెట్ కీపర్ల రేసులో ప్రస్తుతం సంజూ శాంసన్ ముందుకు దూసుకుపోతున్నాడు. రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్గా వ్యవహరిస్తున్న అతడు ఇప్పటి వరకు ఆరు ఇన్నింగ్స్లో కలిపి 264 పరుగులు సాధించాడు. చదవండి: #Pat Cummins: శెభాష్.. ఇది సరైన నిర్ణయం! కమిన్స్ అన్నతో అట్లుంటది మరి.. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_7552012696.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
కనికరం లేకుండా ఆడారు.. మా ఆటతీరును చూసి సిగ్గేసింది: రికీ పాంటింగ్
ఐపీఎల్-2024లో భాగంగా కోల్కతా నైట్ రైడర్స్తో జరిగిన మ్యాచ్లో 106 పరుగుల తేడాతో ఓడిపోయిన ఢిల్లీ క్యాపిటల్స్ ఓటమి పాలైన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్లో బ్యాటింగ్, బౌలింగ్ పరంగా ఢిల్లీ విఫలమైంది. తొలుత కేకేఆర్ బ్యాటర్లు ఢిల్లీ బౌలర్లను ఊచకోత కోశారు. కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి ఏకంగా 272 పరుగుల రికార్డు స్కోర్ సాధించింది. అనంతరం భారీ లక్ష్య ఛేదనలో డీసీ 166 పరుగులకే ఆలౌటైంది. ఇక ఈ ఘోర ఓటమిపై మ్యాచ్ అనంతరం ఢిల్లీ క్యాపిటల్స్ హెడ్ కోచ్ రికీ పాంటింగ్ స్పందించాడు. తమ జట్టు ఆట తీరును తనకు చాలా బాధ కల్గించందని పాంటింగ్ అన్నాడు. "ఈ మ్యాచ్లో మా జట్టు తొలి అర్ధభాగం ఆటను చూశాక సిగ్గేసింది. బౌలర్లు దారుణంగా విఫలమయ్యారు. చెత్త బౌలింగ్తో భారీగా పరుగులు సమర్పించుకున్నారు. 20 ఓవర్లు వేయడానికి ఏకంగా రెండు గంటలు సమయం పట్టింది. నిర్ణీత సమయానికి మేము 2 ఓవర్లు వెనుకబడ్డాము. దీంతో సర్కిల్ వెలుపల నలుగురు ఫీల్డర్లతోనే చివరి రెండు ఓవర్లు బౌలింగ్ చేశాం. ఈ మ్యాచ్లో చాలా విషయాలు ఆమోదయోగ్యం కానివిగా ఉన్నాయి. ఈ టోర్నమెంట్లో ముందుకు వెళ్లాలంటే కచ్చితంగా మేము చేసిన తప్పులను సరిదిద్దుకోవాలి. కేకేఆర్ బ్యాటర్లు కనీసం కనికరం లేకుండా ఆడారు. పవర్ప్లేను వారు బాగా ఉపయోగించుకున్నారు. పవర్ ప్లేలోనే 88 పరుగులు రాబట్టారు. ఆట ఆరంభంలోనే మ్యాచ్పై పట్టు కోల్పోతే తిరిగి రావడం చాలా కష్టం. మా బౌలర్లు కమ్బ్యాక్ ఇవ్వడానికి ప్రయత్నించినప్పటికి వారు మాత్రం మాకు ఎటువంటి అవకాశం ఇవ్వలేదు. ఈ మ్యాచ్లో మేము ఓడిపోయినప్పటికీ పంత్ తన ఫామ్ను కొనసాగించడం మా జట్టుకు సానుకూలాంశమని" పాంటింగ్ పోస్ట్ మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్లో పేర్కొన్నాడు. -
జో రూట్ అరుదైన ఘనత.. తొలి క్రికెటర్గా
ఇంగ్లండ్ వెటరన్ బ్యాటర్ జో రూట్ అరుదైన ఘనత సాధించాడు. టీమిండియాపై టెస్టుల్లో అత్యధిక ఫిప్టీ ప్లస్ స్కోర్లు సాధించిన క్రికెటర్గా రూట్ రికార్డులకెక్కాడు. ధర్మశాల వేదికగా భారత్తో జరిగిన ఐదో టెస్టులో 84 పరుగులు చేసిన రూట్.. ఈ అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. రూట్ ఇప్పటివరకు భారత్పై టెస్టుల్లో 21 సార్లు ఏభై పైగా పరుగులు చేశాడు. కాగా ఇంతకుముందు ఈ రికార్డు ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ పేరిట ఉండేది. పాంటింగ్ భారత్పై 20 సార్లు ఫిప్టీ ప్లస్ స్కోర్లు సాధించాడు. తాజా మ్యాచ్తో పాంటింగ్ ఆల్టైమ్ రికార్డును రూట్ బ్రేక్ చేశాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. భారత్ చేతిలో ఇన్నింగ్స్ 64 పరుగుల తేడాతో ఇంగ్లీష్ జట్టు ఓటమి పాలైంది. భారత బౌలర్ల దాటికి రెండో ఇన్నింగ్స్లో ఇంగ్లండ్ 195 పరుగులకే కుప్పకూలింది. దీంతో భారత్ భారీ విజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది. ఇక ఐదు మ్యాచ్ల సిరీస్ను టీమిండియా 4-1 తేడాతో సొంతం చేసుకుంది. స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలవగా.. యువ బ్యాటర్ యశస్వి జైశ్వాల్ ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’గా నిలిచాడు. చదవండి: IND vs ENG: రిటైర్మెంట్పై రోహిత్ శర్మ కీలక వ్యాఖ్యలు. -
IPL 2024: పంత్ రీఎంట్రీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన పాంటింగ్
ఢిల్లీ క్యాపిటల్స్ కోచ్ రికీ పాంటింగ్ తమ కెప్టెన్ రిషబ్ పంత్ పునరాగమనంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వచ్చే ఐపీఎల్ సీజన్కు (2024) పంత్ పూర్తిగా అందుబాటులో ఉండాలని కోరుకుంటూనే.. అతని రీఎంట్రీపై ఇప్పుడే ఏమీ చెప్పలేనని బాంబు పేల్చాడు. రీఎంట్రీపై పంత్ను అడిగితే మాత్రం అన్ని మ్యాచ్లకు సై అంటాడని, వికెట్కీపింగ్ విషయంలోనూ తగ్గేదేలేదని అంటాడని, నాలుగో స్థానంలో బ్యాటింగ్కు దిగుతానని ధీమాగా చెబుతాడని అన్నాడు. పంత్ ప్రస్తుత పరిస్థితి చూస్తే వచ్చే సీజన్లో అతను ఆడగలడని తెలుస్తుంది కాని అతను పూర్తి మ్యాచ్లకు అందుబాటులో ఉంటాడా.. కెప్టెన్సీ, వికెట్ కీపింగ్ బాధ్యతలను చేపట్టగలడా అనే విషయాలపై క్లారిటీ రావాల్సి ఉందని తెలిపాడు. పంత్ రీఎంట్రీకి సంబంధించి ఎలాంటి విషయమైనా తమకు యాడెడ్ అడ్వాంటేజ్ అవుతుందని అన్నాడు. కారు ప్రమాదం తాలూకా గాయాల నుంచి పూర్తిగా కోలుకున్న పంత్ రీఎంట్రీపై చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడని తెలిపాడు. ఒకవేళ పంత్ కెప్టెన్సీ చేపట్టలేని పక్షంలో డేవిడ్ వార్నర్ మళ్లీ కెప్టెన్సీ బాధ్యతలు చేపడతాడని కన్ఫర్మ్ చేశాడు. ప్రస్తుత జట్టు విషయంలో సంతృప్తి వ్యక్తం చేశాడు. హ్యారీ బ్రూక్ తమలో చేరడం కలిసొస్తుందని అభిప్రాయపడ్డాడు. అతన్ని ఫినిషర్ పాత్రలో వాడుకుంటామని తెలిపాడు. వార్నర్, మిచెల్ మార్ష్ టాపార్డర్లో ఉంటారని కన్ఫర్మ్ చేశాడు. అక్షర్, కుల్దీప్లతో స్పిన్ విభాగం పటిష్టంగా ఉందని ధీమా వ్యక్తం చేశాడు. నోర్జే, జై రిచర్డ్సన్ అందుబాటులోకి వస్తే తమకు తిరుగే ఉండదని తెలిపాడు. మేజర్ లీగ్ క్రికెట్లో వాషింగ్టన్ ఫ్రీడం కోచ్గా ఎంపికైన సందర్భంగా మాట్లాడుతూ పాంటింగ్ ఈ వ్యాఖ్యలు చేశాడు. కాగా, 2022 చివరి రోజుల్లో ఢిల్లీ కెప్టెన్ పంత్ కారు ప్రమాదానికి గురై ఏడాదికి పైగా క్రికెట్కు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. పంత్ ప్రస్తుతం గాయాల నుంచి పూర్తిగా కోలుకుని ప్రాక్టీస్ కూడా చేస్తున్నాడు. అయితే అతను వికెట్కీపింగ్ చేయగలడా లేదా అనే విషయం అనుమానాస్పదంగా ఉంది. మేజర్ యాక్సిడెంట్ కావడంతో పంత్ రెండు కాళ్లలకు తీవ్రగాయాలయ్యాయి. అతని కాళ్లలో రాడ్స్ వేసి సర్జరీ చేశారు. ఈ నేపథ్యంలో పంత్ తిరిగి మైదానంలోకి అడుగుపెట్టడంపై అనుమానాలు నెలకొన్నాయి. ఈ ఏడాది ఐపీఎల్ మార్చి చివరి నుంచి ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. -
ఆ వ్యాఖ్యలు పాంటింగ్ చేసినవేనా???
వన్డే వరల్డ్కప్ 2023 ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో భారత ఓటమి నేపథ్యంలో బీసీసీఐపై ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు సోషల్మీడియాలో ప్రచారం జరుగుతుంది. పాంటింగ్ ఫాక్స్ న్యూస్తో మాట్లాడుతూ బీసీసీఐని క్రికెట్ మాఫియాతో పోల్చాడన్న వార్త ప్రస్తుతం నెట్టింట వైరలవుతుంది. అయితే పాంటింగ్ నిజంగా ఈ వ్యాఖ్యలు చేశాడా లేదా అని ఫ్యాక్ట్ చేయగా.. ఈ ప్రచారంలో ఎంతమాత్రం వాస్తవం లేదని తేలింది. ఈ ప్రచారంపై భారత్లోనే ఉన్న పాంటింగ్ స్పందించాల్సి ఉంది. కాగా, ASG అనే ట్విటర్ అకౌంట్ నుంచి పాంటింగ్ ఫాక్స్ క్రికెట్తో మాట్లాడుతూ బీసీసీఐపై అనుచిత వ్యాఖ్యలు చేశాడని నిన్నటి నుంచి సోషల్మీడియాలో ప్రచారం జరుగుతుంది. Ricky Ponting on Fox Cricket: "This is a win of justice against cricket mafia. Your money and power is still not winning World Cups for you. How embarrassing." Ponting owned India and BCCI 😂 pic.twitter.com/pc5LnseQi7 — ASG (@ahadfoooty) November 19, 2023 సదరు ట్వీట్లో ఏముందంటే.. ఇది క్రికెట్ మాఫియాపై (బీసీసీఐని ఉద్దేశిస్తూ) న్యాయం సాధించిన విజయం.. డబ్బు, పలుకుబడితో ప్రపంచ కప్ గెలవలేరని పాంటింగ్ అన్నట్లు ప్రచారం జరుగుతుంది. పాంటింగ్ నిజంగానే బీసీసీఐని అలా అన్నాడనుకుని పొరబడ్డ కొందరు భారత క్రికెట్ అభిమానులు పాంటింగ్పై దుమ్మెత్తిపోస్తున్నారు. ఐపీఎల్లో పిలిచి పెత్తనం ఇచ్చినందుకు (ఢిల్లీ క్యాపిటల్స్) బీసీసీఐకి సరైన గుణపాఠమే నేర్పాడని కామెంట్లు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, నిన్న జరిగిన వరల్డ్కప్ 2023 ఫైనల్లో ఆస్ట్రేలియా భారత్ను 6 వికెట్ల తేడాతో చిత్తు చేసిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. ఆసీస్ బౌలర్లు మూకుమ్మడిగా రాణించడంతో 240 పరుగుల స్వల్ప స్కోర్కే పరిమితమైంది. అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన ఆసీస్ ఆరంభంలో కాస్త తడబడినప్పటికీ.. ట్రవిస్ హెడ్ (137), లబూషేన్ (58 నాటౌట్) చిరస్మరణీయ ఇన్నింగ్స్ల సహకారంతో విజయతీరాలకు చేరింది. హెడ్-లబూషేన్ జోడీ నాలుగో వికెట్కు 192 పరుగలు భాగస్వామ్యాన్ని నమోదు చేసి ఆసీస్ను గెలిపించారు. భారత బౌలర్లలో బుమ్రా, షమీ, సిరాజ్ తలో వికెట్ పడగొట్టారు. అంతకుముందు బ్యాటింగ్లో రోహిత్ శర్మ (47), విరాట్ కోహ్లి (54), కేఎల్ రాహుల్ (66) ఓ మోస్తరుగా రాణించారు. ఆసీస్ బౌలర్లు స్టార్క్ (3/55), హాజిల్వుడ్ (2/60), కమిన్స్ (2/34), మ్యాక్స్వెల్ (1/35), జంపా (1/44) కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి టీమిండియా పతనాన్ని శాశించారు. -
CWC 2023: ధోని, పాంటింగ్ సరసన చేరిన కమిన్స్
వన్డే వరల్డ్కప్ 2023 ఫైనల్లో ఆస్ట్రేలియా టీమిండియాను ఓడించి ఆరోసారి జగజ్జేతగా నిలిచిన విషయం తెలిసిందే. పాట్ కమిన్స్ కెప్టెన్గా తన తొలి వరల్డ్కప్ సాధించి, ఓ వినూత్న ఘనత సాధించాడు. పెళ్లైన మరుసటి ఏడాదే వన్డే ప్రపంచకప్ గెలిచిన కెప్టెన్గా దిగ్గజాల సరసన చేరాడు. గతంలో రికీ పాంటింగ్ (2003), మహేంద్ర సింగ్ ధోని (2011), ఇయాన్ మోర్గన్లు (2019) పెళ్లైన మరుసటి ఏడాదే ప్రపంచకప్ సాధించిన ఆటగాళ్లుగా అరుదైన గుర్తింపు దక్కించుకున్నారు. తాజాగా కమిన్స్ వీరి సరసన చేరి అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. Who should get married in 2026?🤔 pic.twitter.com/RtVJ8PGUuf — CricTracker (@Cricketracker) November 20, 2023 కాగా, అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన ఫైనల్లో టీమిండియా పోరాడి ఓడింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నామమాత్రపు స్కోర్కే (240) పరిమితమైనప్పటికీ.. బౌలింగ్లో రాణించి చివరి వరకు పోరాడింది. ట్రవిస్ హెడ్ (137) చిరస్మరణీయ శతకంతో ఆసీస్ గెలుపు అంచుల వరకు తీసుకెళ్లాడు. లబూషేన్ (58 నాటౌట్) సహకారంతో భారత్కు గెలుపును దూరం చేశాడు. వీరిద్దరు నాలుగో వికెట్కు 192 పరుగలు భాగస్వామ్యాన్ని నమోదు చేసి ఆసీస్ను గెలిపించారు. భారత బౌలర్లలో బుమ్రా, షమీ, సిరాజ్ తలో వికెట్ పడగొట్టారు. అంతకుముందు బ్యాటింగ్లో రోహిత్ శర్మ (47), విరాట్ కోహ్లి (54), కేఎల్ రాహుల్ (66) ఓ మోస్తరుగా రాణించారు. ఆసీస్ బౌలర్లు స్టార్క్ (3/55), హాజిల్వుడ్ (2/60), కమిన్స్ (2/34), మ్యాక్స్వెల్ (1/35), జంపా (1/44) కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి టీమిండియా పతనాన్ని శాశించారు. -
రికార్డుల రారాజు కోహ్లి అరుదైన ఘనత.. ఇక మిగిలింది ఇద్దరే!
టీమిండియా రన్మెషీన్ విరాట్ కోహ్లి మరో అరుదైన ఘనత సాధించాడు. అంతర్జాతీయ వన్డేల్లో అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్ల జాబితాలో మరో స్థానం మెరుగుపరచుకున్నాడు. తద్వారా ఆస్ట్రేలియా దిగ్గజ కెప్టెన్ రిక్కీ పాంటింగ్ పేరిట ఉన్న రికార్డు బ్రేక్ చేశాడు. వన్డే వరల్డ్కప్-2023 తొలి సెమీ ఫైనల్లో న్యూజిలాండ్తో మ్యాచ్ సందర్భంగా ఈ ఫీట్ నమోదు చేశాడు. టీమిండియా ఇన్నింగ్స్లో 22వ ఓవర్ మూడో బంతికి గ్లెన్ ఫిలిప్స్ బౌలింగ్లో సింగిల్ తీసిన కోహ్లి ఓవరాల్గా 13705 పరుగుల మార్కు అందుకున్నాడు. View this post on Instagram A post shared by ICC (@icc) తద్వారా రిక్కీ పాంటింగ్ను వెనక్కినెట్టాడు. ఇక ముంబైలోని వాంఖడే వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో విరాట్ కోహ్లి అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. రచిన్ రవీంద్ర(26.6) బౌలింగ్లో సింగిల్ తీసిన కింగ్.. వన్డే వరల్డ్కప్ నాకౌట్ చరిత్రలో తన తొలి ఫిఫ్టీ నమోదు చేశాడు. కాగా ఇప్పటి వరకు మూడు వరల్డ్కప్ సెమీఫైనల్స్లో ఆడిన కోహ్లి మొత్తం కలిపి కేవలం 11 పరుగులు మాత్రమే చేయగలిగాడు. 2011 పాక్తో సెమీస్లో 9 పరుగులు... 2015 ఆస్ట్రేలియాతో సెమీస్లో 1 పరుగు... 2019 న్యూజిలాండ్తో సెమీస్లో 1 పరుగు మాత్రమే చేశాడు. తాజాగా ఈ చెత్త రికార్డు చెరిపేసి హాప్ సెంచరీతో మెరిశాడు. అంతర్జాతీయ వన్డేల్లో అత్యధిక పరుగులు సాధించిన టాప్-5 బ్యాటర్లు 18426 - సచిన్ టెండూల్కర్ 14234 - కుమార సంగక్కర 13705* - విరాట్ కోహ్లీ 13704 - రికీ పాంటింగ్ 13430 - సనత్ జయసూర్య View this post on Instagram A post shared by ICC (@icc) -
WC 2023: వార్నర్ 22వ సెంచరీ.. రికార్డులు బద్దలు! సచిన్తో పాటు..
WC 2023- Aus Vs Ned- David Warner Century: నెదర్లాండ్స్తో మ్యాచ్ సందర్భంగా ఆస్ట్రేలియా వెటరన్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. ప్రపంచకప్-2023లో వరుసగా రెండో శతకంతో అదరగొట్టాడు. తద్వారా అంతర్జాతీయ వన్డే కెరీర్లో 22వ సెంచరీ సాధించిన వార్నర్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. తక్కువ ఇన్నింగ్స్లోనే ఈ ఘనత సాధించిన మూడో బ్యాటర్గా చరిత్రకెక్కాడు. ఈ క్రమంలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, సౌతాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్ రికార్డులు బద్దలు కొట్టాడు. సచిన్తో పాటుగా.. పాంటింగ్ రికార్డు బ్రేక్ అంతేకాదు.. నెదర్లాండ్స్పై శతకంతో మరో రెండు అరుదైన ఘనతలు కూడా వార్నర్ తన ఖాతాలో వేసుకున్నాడు. వరల్డ్కప్ చరిత్రలో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో టీమిండియా దిగ్గజం సచిన్ టెండుల్కర్ రికార్డు సమం చేయడంతో పాటు ఆసీస్ లెజెండ్ రిక్కీ పాంటింగ్ను అధిగమించాడు. అదే విధంగా.. వరల్డ్కప్ హిస్టరీలో వరుస శతకాలు బాదిన నాలుగో ఆస్ట్రేలియా బ్యాటర్గానూ చరిత్ర లిఖించాడు. కాగా ఢిల్లీలోని అరుణ్జైట్లీ స్టేడియంలో నెదర్లాండ్స్తో బుధవారం నాటి మ్యాచ్లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో మిచెల్ మార్ష్ను 9 పరుగులకే డచ్ బౌలర్ వాన్ బీక్ ఆరంభంలోనే దెబ్బ కొట్టినప్పటికీ మరో ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. మొత్తంగా 93 బంతుల్లో 11 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 104 పరుగులు సాధించాడు. ఇక వన్డౌన్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ 71, మార్నస్ లబుషేన్ 62 పరుగులతో అదరగొట్టారు. నెదర్లాండ్స్తో మ్యాచ్ సందర్భంగా వార్నర్ రికార్డులు ఇవే తక్కువ ఇన్నింగ్స్లోనే వన్డేల్లో 22 సెంచరీలు చేసిన క్రికెటర్లు ►126 - హషీమ్ ఆమ్లా ►143 - విరాట్ కోహ్లి ►153 - డేవిడ్ వార్నర్* ►186 - ఏబీ డివిలియర్స్ ►188 - రోహిత్ శర్మ వరల్డ్కప్ చరిత్రలో అత్యధిక శతకాలు బాదిన బ్యాటర్లు ►7 - రోహిత్ శర్మ ►6 - సచిన్ టెండూల్కర్ ►6 - డేవిడ్ వార్నర్* ►5 - రికీ పాంటింగ్ ►5 - కుమార సంగక్కర వరల్డ్కప్ టోర్నీలో వరుస సెంచరీలు సాధించిన ఆస్ట్రేలియా బ్యాటర్లు ►2 - మార్క్ వా (1996) ►2 - రికీ పాంటింగ్ (2003-07) ►2 - మాథ్యూ హేడెన్ (2007) ►2 - డేవిడ్ వార్నర్ (2023)*. చదవండి: View this post on Instagram A post shared by ICC (@icc) View this post on Instagram A post shared by ICC (@icc) -
చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ.. వరల్డ్కప్లో తొలి క్రికెటర్గా
వన్డే ప్రపంచకప్-2023లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తన సూపర్ ఫామ్ను కొనసాగిస్తున్నాడు. ఆఫ్గానిస్తాన్పై సెంచరీతో చెలరేగిన రోహిత్.. ఇప్పుడు పాకిస్తాన్పై మరో విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. హిట్మ్యాన్ 63 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్స్లతో 86 పరుగులు చేశాడు. ఇన్నింగ్స్ ఆరంభం నుంచే పాక్ బౌలర్లను రోహిత్ ఊచకోత కోశాడు. తృటిలో మరో సెంచరీ చేసే అవకాశాన్ని రోహిత్ కోల్పోయాడు. ఇక ఈ మ్యాచ్లో మెరుపు ఇన్నింగ్స్ ఆడిన హిట్మ్యాన్ పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. రోహిత్ సాధించిన రికార్డులు ఇవే.. ►వన్డే వరల్డ్కప్ చరిత్రలో విజయవంతమైన రన్ ఛేజింగ్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రోహిత్ నిలిచాడు. రోహిత్ శర్మ ఇప్పటివరకు వరల్డ్కప్లో 9 విజయవంతమైన లక్ష్య ఛేదనలో 586 పరుగులు చేశాడు. కాగా అంతకుముందు ఈ రికార్డు ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్(519) పేరిట ఉండేది. తాజా మ్యాచ్తో పాంటింగ్ రికార్డును రోహిత్ బ్రేక్ చేశాడు. ►అదే విధంగా ఈ మ్యాచ్లో 6 సిక్స్లతో చెలరేగిన హిట్మ్యాన్.. వన్డే క్రికెట్లో 300 సిక్స్ల మైలు రాయిని అందుకున్నాడు. తద్వారా అంతర్జాతీయ వన్డేల్లో 300 సిక్స్ల మార్క్ను అందుకున్న మూడో క్రికెటర్గా రోహిత్ రికార్డులకెక్కాడు. ఈ జాబితాలో పాకిస్తాన్ కెప్టెన్ షాహిద్ అఫ్రిది(351) తొలి స్ధానంలో ఉండగా.. తర్వాతి స్ధానాల్లో క్రిస్ గేల్(331), రోహిత్(303) ఉన్నారు. అదే విధంగా ఈ ఘనత సాధించిన తొలి భారత క్రికెటర్ రోహిత్ శర్మ కావడం విశేషం. ► అంతేకాకుండా అంతర్జాతీయ వన్డేల్లో అత్యంత వేగంగా 300 సిక్స్ల మైలు రాయిని అందుకున్న మొదటి క్రికెటర్గా రోహిత్ చరిత్ర సృష్టించాడు. ►వన్డే వరల్డ్కప్ టోర్నీలో పాకిస్తాన్పై అత్యధిక వ్యక్తిగత స్కోర్ సాధించిన భారత కెప్టెన్గా రోహిత్ శర్మ రికార్డులకెక్కాడు. రోహిత్ ఈ మ్యాచ్లో 86 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. -
ఈ వరల్డ్కప్లోనే కోహ్లి.. సచిన్ సెంచరీల రికార్డు బ్రేక్ చేస్తాడు!
ICC WC 2023- Kohli Eyes On Big Records: టీమిండియా స్టార్ విరాట్ కోహ్లిని ఉద్దేశించి ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రిక్కీ పాంటింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వన్డే వరల్డ్కప్-2023 సందర్భంగా రన్మెషీన్.. భారత దిగ్గజ బ్యాటర్ సచిన్ టెండుల్కర్ సెంచరీల రికార్డును బ్రేక్ చేయగలడని పేర్కొన్నాడు. ఆరంభ మ్యాచ్లో ఆసీస్ మీద కోహ్లి అద్భుతంగా ఆడాడన్న రిక్కీ పాంటింగ్.. సెంచరీ చేజారిన లోటును తదుపరి మ్యాచ్లలో తీర్చుకుంటాడని అభిప్రాయపడ్డాడు. ఈ టోర్నీలో కనీసం రెండు శతకాలైనా బాదుతాడని ధీమా వ్యక్తం చేశాడు. కోహ్లి, రాహుల్ పట్టుదలగా నిలబడి కాగా చెన్నైలోని చెపాక్లో తొలి మ్యాచ్లోనే రోహిత్ సేన కష్టమ్మీద గెలిచిన విషయం తెలిసిందే. టాస్ ఓడి తొలుత ఫీల్డింగ్ చేసిన భారత్ కంగారూ జట్టును 199 పరుగులకే కట్టడి చేసింది. అయితే, స్వల్ప లక్ష్య ఛేదనలో 2 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కోహ్లి(85), కేఎల్ రాహుల్(97- నాటౌట్) పట్టుదలగా నిలబడి అద్భుత ఇన్నింగ్స్తో జట్టుకు విజయం అందించారు. కాగా అంతర్జాతీయ వన్డేల్లో కోహ్లి ఇప్పటి వరకు 47 శతకాలు బాదాడు. మరో మూడు సెంచరీలు చేస్తే మాస్టర్ బ్లాస్టర్ సచిన్ పేరిట ఉన్న రికార్డు(49) బద్దలు కొట్టాలంటే కోహ్లి మరో మూడు సెంచరీలు చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో.. ది ఐసీసీ రివ్యూ పాడ్కాస్ట్లో ఇందుకు సంబంధించిన ప్రస్తావన రాగా.. ఆసీస్ లెజెండ్ రిక్కీ పాంటింగ్ స్పందిస్తూ.. ‘‘ఈసారి కోహ్లి కచ్చితంగా కనీసం రెండు సెంచరీలు చేస్తాడు. కనీసం రెండు శతకాలు ఖాయం ఒకవేళ అంతకు మించి రాణిస్తే కథ వేరేలా ఉంటది. కోహ్లికి ఇదే చివరి వన్డే వరల్డ్కప్ అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఒకవేళ అదే మైండ్సెట్తో గనుక బరిలోకి దిగితే పరుగుల దాహం తీర్చుకోకుండా వెనుదిరగడు. ప్రస్తుతం కోహ్లి మంచి ఫామ్లో ఉన్నాడు. సచిన్ రికార్డును సమం చేస్తాడు లేదంటే బ్రేక్ చేసినా చేస్తాడు. ఈ రెండింటిలో ఏదో ఒకటి చేసి ఈ వరల్డ్కప్ను చిరస్మరణీయం చేసుకుంటాడు’’ అని చెప్పుకొచ్చాడు. చదవండి: వెళ్లి ప్రాక్టీస్ మ్యాచ్లు ఆడుకో పో బాబర్.. పాక్ కెప్టెన్పై ఫ్యాన్స్ ట్రోల్స్ -
విరాట్ కోహ్లి అరుదైన ఘనత.. రికీ పాంటింగ్ రికార్డు బద్దలు
టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి తన అద్భుత ఫామ్ను కొనసాగిస్తున్నాడు. ఆసీస్తో తొలి రెండు వన్డేలకు దూరంగా ఉన్న కోహ్లి.. మూడో వన్డేతో రీ ఎంట్రీ ఇచ్చాడు. ఈ మ్యాచ్లో భారత్ ఓటమి పాలైనప్పటికీ కోహ్లి మాత్రం అద్బుతమైన హాఫ్ సెంచరీతో చెలరేగాడు. 61 బంతులు ఎదుర్కొన్న కోహ్లి 5 ఫోర్లు, 1 సిక్స్తో 56 పరుగులు చేశాడు. హాఫ్ సెంచరీతో మెరిసిన కోహ్లి ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. అంతర్జాతీయ వన్డేల్లో అత్యధిక ఫిప్టి ప్లస్ స్కోర్లు సాధించిన మూడో ఆటగాడిగా విరాట్ నిలిచాడు. ఇప్పటవరకు 269 ఇన్సింగ్స్లు ఆడిన కోహ్లి.. 113 సార్లు ఏభై పైగా స్కోర్లు సాధించాడు. ఇప్పటివరకు ఈ రికార్డు ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్(112) పేరిట ఉండేది. తాజా మ్యాచ్తో పాంటింగ్ రికార్డును కింగ్ కోహ్లి బ్రేక్ చేశాడు. ఈ అరుదైన ఘనత సాధించిన జాబితాలో భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్(145) తొలి స్ధానంలో ఉన్నాడు. ఆ తర్వాత శ్రీలంక లెజెండ్ కుమార్ సంగక్కర(118) ఉన్నాడు. అంతేకాకుండా వన్డేల్లో నాన్ ఓపెనర్గా అత్యధిక ఫిప్టి ప్లస్ స్కోర్లు చేసిన కుమార్ సంగక్కర(112) రికార్డును కోహ్లి సమం చేశాడు. ఇప్పటివరకు నాన్ ఓపెనర్గా వచ్చి కోహ్లి కూడా 112 సార్లు ఏభై పైగా పరుగులు సాధించాడు. చదవండి: World Cup 2023: వరల్డ్కప్కు ముందు ఆస్ట్రేలియాకు బిగ్ షాక్.. -
Virat Kohli: సచిన్ రికార్డు బద్దలు కొట్టిన కోహ్లి.. ప్రపంచంలోనే తొలి బ్యాటర్గా
Asia Cup 2023- India vs Pakistan- Virat Kohli Century: దాయాది పాకిస్తాన్తో మ్యాచ్ అంటే టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి పూనకాలే అన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గతేడాది టీ20 వరల్డ్కప్-2022లో చిరకాల ప్రత్యర్థిపై భారత్కు తన అద్భుత ఇన్నింగ్స్తో చిరస్మరణీయ విజయం అందించిన తీరును ఎవరూ మర్చిపోలేరు. పాకిస్తాన్తో మ్యాచ్లో ఆకాశమే హద్దుగా కోహ్లి ఇక తాజాగా మరోసారి పాక్పై అదిరిపోయే బ్యాటింగ్తో తనకు తానే సాటి అని నిరూపించుకున్నాడు. ఆసియా కప్-2023 సూపర్ -4 మ్యాచ్లో ఆకాశమే హద్దుగా అజేయ సెంచరీతో చెలరేగాడు. కోహ్లి ఇన్నింగ్స్లో ఏకంగా 9 ఫోర్లు, 3 సిక్సర్లు ఉండటం విశేషం. సచిన్ టెండుల్కర్ రికార్డు బద్దలు.. ప్రపంచంలో తొలి బ్యాటర్గా ఈ క్రమంలో అంతర్జాతీయ వన్డేల్లో 47వ సెంచరీ సాధించిన విరాట్ కోహ్లి.. టీమిండియా దిగ్గజం సచిన్ టెండుల్కర్ పేరిట ఉన్న ప్రపంచ రికార్డు బద్దలు కొట్టాడు. అంతర్జాతీయ వన్డే క్రికెట్లో తక్కువ ఇన్నింగ్స్లో 13 వేల పరుగులు పూర్తి చేసుకున్న తొలి బ్యాటర్గా కోహ్లి రికార్డు సృష్టించాడు. ఈ క్రమంలో సచిన్ టెండుల్కర్ను కోహ్లి అధిగమించాడు. చెలరేగిన బ్యాటర్లు.. టీమిండియా భారీ స్కోరు ఇదిలా ఉంటే.. పాకిస్తాన్తో మ్యాచ్లో రిజర్వ్ డే అయిన సోమవారం టీమిండియా బ్యాటర్లు కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లి అజేయ సెంచరీలతో అదరగొట్టారు. దీంతో నిర్ణీత 50 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి భారత జట్టు 356 పరుగుల భారీ స్కోరు సాధించింది. అంతకు ముందు ఆదివారం ఓపెనర్లు రోహిత్ శర్మ (56), శుబ్మన్ గిల్(58) అర్ధ శతకాలు సాధించారు. కాగా కొలంబోలో జరగుతున్న ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన పాకిస్తాన్ తొలుత బౌలింగ్ ఎంచుకున్న విషయం తెలిసిందే. వన్డేల్లో 13 వేల పరుగులు చేసేందుకు.. ఎవరికి ఎన్ని ఇన్నింగ్స్ అవసరమయ్యాయంటే? 1. విరాట్ కోహ్లి- 267 2. సచిన్ టెండుల్కర్- 321 3. రిక్కీ పాంటింగ్- 341 4. కుమార్ సంగక్కర- 363 5. సనత్ జయసూర్య- 416. చదవండి: రోహిత్ పూర్తిగా నిరాశపరిచాడు.. మరీ చెత్తగా..: టీమిండియా మాజీ ఓపెనర్ 💯 NUMBER 4️⃣7️⃣ King @imVkohli, take a bow! 🙌😍 Legendary knock by the modern day great. #Pakistan truly gets the best out of the King! Tune-in to #AsiaCupOnStar, LIVE NOW on Star Sports Network#INDvPAK #Cricket pic.twitter.com/7BfKckU1AO — Star Sports (@StarSportsIndia) September 11, 2023 -
IND VS PAK: పాంటింగ్ సరసన కోహ్లి.. మిగిలింది సంగక్కర, సచిన్ మాత్రమే..!
టీమిండియా స్టార్ బ్యాటర్, రికార్డుల రారాజు విరాట్ కోహ్లి మరో రికార్డు తన ఖాతాలో వేసుకున్నాడు. ఆసియా కప్-2023లో భాగంగా పాకిస్తాన్తో జరుగుతున్న సూపర్-4 మ్యాచ్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్న కింగ్ కోహ్లి.. వన్డేల్లో అత్యధిక సార్లు 50 ప్లస్ స్కోర్లు చేసిన ఆటగాళ్ల జాబితాలో మూడో స్థానానికి ఎగబాకాడు. నేటి మ్యాచ్తో వన్డేల్లో 112వసారి 50 ప్లస్ స్కోర్ (46 సెంచరీలు, 66 అర్ధసెంచరీలు) నమోదు చేసిన కోహ్లి.. ఆసీస్ దిగ్గజం రికీ పాంటింగ్ (112)తో సమంగా మూడో స్థానంలో నిలిచాడు. ఈ జాబితాలో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ (145) అగ్రస్థానంలో ఉండగా.. శ్రీలంక లెజెండ్ కుమార సంగక్కర (118) రెండో ప్లేస్లో ఉన్నాడు. ఈ జాబితాలో ప్రస్తుతం కోహ్లికి ముందు వీరిద్దరు మాత్రమే ఉన్నారు. ఇదిలా ఉంటే, పాక్తో జరుగుతున్న మ్యాచ్లో టీమిండియా ఆటగాళ్లు వరసపెట్టి హాఫ్ సెంచరీలు బాదారు. తొలుత రోహిత్ (56), శుభ్మన్ గిల్ (58).. ఇవాళ రాహుల్ (82 నాటౌట్), కోహ్లి (76 నాటౌట్) అర్ధశతకాలు నమోదు చేశారు. ఫలితంగా టీమిండియా 43 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 280 పరుగులు చేసింది. భారత ఇన్నింగ్స్లో ఇంకా 7 ఓవర్లు మిగిలి ఉండటంతో ఈ మ్యాచ్లో భారీ స్కోర్ నమోదవ్వడం ఖాయంగా తెలుస్తుంది. -
'బంతిని మార్చడం వల్లే ఆసీస్ ఓటమి.. విచారణ చేపట్టండి'
దాదాపు నెలరోజులకు పైగా అలరించిన యాషెస్ సిరీస్ ముగిసింది. తొలి రెండు టెస్టుల్లో గెలిచిన ఆస్ట్రేలియా మరోసారి 'యాషెస్'ను ఎగురేసుకపోతుందని అంతా భావించారు. కానీ మూడో టెస్టును గెలిచిన ఇంగ్లండ్ 2-1కి ఆధిక్యం తగ్గించింది. ఇక నాలుగో టెస్టులో ఇంగ్లండ్కు గెలిచే అవకాశం వచ్చినప్పటికి వరుణుడు అడ్డుపడడంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఇక కీలకమైన ఐదోటెస్టులో ఆస్ట్రేలియా ఇంగ్లండ్ విధించిన 384 పరుగుల భారీ లక్ష్యాన్ని చేధించే క్రమంలో 334 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో ఇంగ్లండ్ 49 పరుగుల తేడాతో విజయం సాధించి సిరీస్ను 2-2తో సమం చేసింది. అయినప్పటికి గత యాషెస్ను గెలిచిన ఆస్ట్రేలియా మరోసారి ట్రోఫీని రిటైన్ చేసుకుంది. నాలుగో రోజు ఆటలో ఇంగ్లండ్ కొత్త బంతి తీసుకుంది. దాదాపు 37 ఓవర్ల పాటు అదే బంతితో బౌలింగ్ చేసింది. బంతి స్వింగ్ కాకపోవడంతో ఇంగ్లండ్ పేసర్లు ఎంత ప్రయత్నించినా వాళ్లను ఔట్ చేయలేకపోయారు. అయితే నాలుగో రోజు మార్క్ వుడ్ వేసిన ఒక బంతి ఖవాజా హెల్మెట్ ను బలంగా తాకింది. దీంతో ఆ బాల్ పాడవడంతో అంపైర్లు మరో బాల్ తీసుకున్నారు. అక్కడి నుంచే కథ మారిపోయింది. ఐదో రోజు ఉదయం ఆస్ట్రేలియా ఓపెనర్లును త్వరగా కోల్పోయింది. కాగా మ్యాచ్ ముగిశాకా ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు రికీ పాంటింగ్ బంతిని మార్చడంపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. బంతిని మార్చడం వల్లే ఆస్ట్రేలియా మ్యాచ్ ఓడిందని పేర్కొన్నాడు. స్కైస్పోర్ట్స్తో మాట్లాడుతూ.. '' బంతి పరిస్థితి అంచనా వేయకుండానే దానిని మార్చాలని నిర్ణయించడం సరైంది కాదు. రెండు బంతులను పోలుస్తే సరైనవి చెప్పే మార్గంలో ప్రపంచంలో మరెక్కడా చూడలేదు. మధ్యలో అలా కొత్త బంతిని తీసుకోవడం సరైంది కాదు. మీరు ఒకవేళ బంతిని మార్చాలని భావిస్తే ఆ తరహాలోనే ఉండేలా చూడాలి. అంపైర్లు పరీక్షిస్తున్న పెట్టలో మరీ పాతబడిన బంతులు ఎక్కువగా లేవు. కొన్ని చూసినప్పటికి వాటిని పక్కన పడేశారు. పాత బంతి స్థానంలో కొత్తదానిని ఎంపిక చేసినట్లుగా ఉంది. ఐదోరోజు పిచ్ ఉదయం బౌలింగ్కు అనుకూలంగా ఉంది. నాలుగోరోజు చివర్లో బంతిని మార్చడం వల్ల ఇంగ్లండ్కు కలిసొచ్చింది. అందుకే ఈ విషయంలో విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తున్నా. బాక్స్లో అలాంటి పాత బంతులు లేవా? లేకపోతే అంపైర్లు ఏదొకటి ఎంచుకుని ఆడించారా? అనేది తేలాలి. అప్పటికి 37 ఓవర్లు మాత్రమే ఆ బంతితో ఆట జరిగింది. కానీ మార్చిన బంతి మాత్రం దానికి తగ్గట్టుగా లేదు'' అంటూ పాంటింగ్ పేర్కొన్నాడు. ఇక ఉస్మాన్ ఖవాజా మాట్లాడుతూ.. "వాళ్లు బంతిని మార్చగానే ఆ కొత్త బాల్ చాలా భిన్నంగా ఉన్నట్లు అర్థమైంది. అప్పుడే అంపైర్ కుమార్ ధర్మసేన దగ్గరికి వెళ్లి ఈ బాల్ ఎంత పాతది? 8 ఓవర్లు వేసినట్లు కనిపిస్తోంది అని అడిగాను. ఆ బంతి నా బ్యాట్ ను చాలా బలంగా తాకింది. యాషెస్ లో ప్రతి టెస్టులో ఓపెనింగ్ చేశాను. కానీ ఏ బంతి కూడా అంత బలంగా నా బ్యాట్ను తాకలేదు. కొత్తగా బ్యాటింగ్ చేయడానికి వచ్చే వాళ్లతో ఈ కొత్త బంతి కాస్త భిన్నంగా ఉందని చెప్పాను. కొన్ని విషయాలు మనం నియంత్రించలేము. ఇది నిరాశ కలిగించింది. ఇంగ్లండ్ ది క్లాస్ బౌలింగ్ అటాక్. వాళ్లకు కాస్త సందు దొరికినా దానిని అద్భుతంగా ఉపయోగించుకుంటారు" అని ఖవాజా అన్నాడు. "There's no way in the world you can look at those two balls there and say in any way that they're comparable" 😤 Ricky Ponting is NOT happy with that 'new' ball 😳 pic.twitter.com/maDFpv8RhM — Sky Sports Cricket (@SkyCricket) July 31, 2023 Won WC by boundary count now winning ashes by changing ball. Is this how a 40 overs old ball change would look alike @ECB_cricket ? pic.twitter.com/aJPWSB2qkZ — ̴D̴̴e̴̴e̴̴p̴̴s̴ (@vkrcholic) July 31, 2023 చదవండి: మేమంతా దేశం కోసమే ఆడతాం.. అంతేగానీ: కపిల్ దేవ్కు జడ్డూ స్ట్రాంగ్ కౌంటర్ -
పాంటింగ్పై ద్రాక్ష పండ్లతో దాడి.. 'వాళ్లను ఊరికే వదలను'
ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు రికీ పాంటింగ్కు ఇంగ్లండ్ అభిమానుల నుంచి చేదు అనుభవం ఎదురైంది. మ్యాచ్ జరిగిన తీరు గురించి పాంటింగ్ మాట్లాడుతున్న సమయంలో స్టాండ్స్లో ఉన్న అభిమానుల్లో ఒక ఆకతాయి పాంటింగ్వైపు ద్రాక్షా పండ్లను విసిరారు. అవి నేరుగా పాంటింగ్ షూ వద్ద పడగా.. కొన్ని అతని మొహాన్ని తాకాయి. దీంతో అభిమానుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన పాంటింగ్.. తనపైకి ద్రాక్ష పండ్లు విసిరిన వ్యక్తిని పట్టుకోవాలని అక్కడి సెక్యూరిటీ అధికారులకు తెలిపాడు. ''నాపై ద్రాక్ష పండ్లతో దాడి చేశారు. ఈ దాడికి పాల్పడిన వ్యక్తిని కనిపెట్టాల్సిందే.. వాళ్లు ఎవరైనా సరే వదిలే ప్రసక్తే లేదు'' అంటూ పేర్కొన్నాడు. ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మధ్య తొలిరోజు ఆట ముగిసిన అనంతరం షో హోస్ట్ ఇయాన్ వార్డ్, రికీ పాంటింగ్లు స్పిన్నర్ టాడ్ మర్ఫీని ఇంటర్య్వూ చేశారు. ఇది ముగిసిన అనంతరం తొలిరోజు ఆట ఎలా జరిగిందన్న విషయాన్ని పాంటింగ్ వివరిస్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇక యాషెస్ సిరీస్లో భాగంగా ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న ఐదో టెస్టు తొలిరోజే ఆసక్తికరంగా సాగింది. ఇంగ్లండ్ను తొలిరోజే ఆలౌట్ చేయడంలో సక్సెస్ అయిన ఆస్ట్రేలియా ఆ తర్వాత బ్యాటింగ్లోనూ నిలకడను ప్రదర్శించింది. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో 283 పరుగులకు ఆలౌట్ అయిన సంగతి తెలిసిందే. ఆసీస్ బౌలర్ల దాటికి బ్రూక్ మినహా పెద్దగా ఎవరు రాణించలేకపోయారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన ఆస్ట్రేలియా తొలిరోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టానికి 61 పరుగులు చేసింది. ఉస్మాన్ ఖవాజా 26, లబుషేన్ 2 పరుగులతో క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం ఆసీస్ మరో 222 పరుగులు వెనుకబడి ఉంది. Hi @piersmorgan & @TheBarmyArmy Is this within the spirit of the game? Pelting grapes at Ponting who’s just a commentator. I know you’ve lost the Ashes and all talk about Sour grapes pic.twitter.com/xkewu1h8v3 — FIFA Womens World Cup Stan account ⚽️ (@MetalcoreMagpie) July 28, 2023 చదవండి: టీ20 వరల్డ్ కప్ 2024కు అర్హత సాధించిన ఐర్లాండ్.. Novak Djokovic: జొకోవిచ్ తండ్రి సంచలన వ్యాఖ్యలు.. ఆందోళనలో అభిమానులు -
Ashes 2023: అదొక్కటే మార్పు.. చివరి టెస్టులో వార్నర్కు చోటు!
The Ashes, 2023- England vs Australia, 5th Test: ఇంగ్లండ్- ఆస్ట్రేలియా మధ్య ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్-2023 తుది అంకానికి చేరుకుంది. ఇరు జట్ల మధ్య ఆఖరిదైన ఐదో టెస్టు జూలై 27న ఆరంభం కానుంది. ఇక ఈ సిరీస్లో ఇప్పటి వరకు ఆస్ట్రేలియా రెండు, ఇంగ్లండ్ ఒక మ్యాచ్ గెలవగా.. నాలుగో టెస్టు వర్షార్పణం అయింది. ఆ ఒక్కటి గెలిచి కచ్చితంగా గెలుస్తామని భావించిన ఆతిథ్య ఇంగ్లండ్కు వరణుడు చేదు అనుభవం మిగల్చడంతో మాంచెస్టర్ డ్రాగా ముగిసిపోయింది. దీంతో.. ట్రోఫీ కోల్పోయినప్పటికీ ఐదో టెస్టు గెలిచి సిరీస్ సమం చేయాలని స్టోక్స్ బృందం ఆశిస్తోంది. అదే సమయంలో 2-1తో ఆధిక్యంలో ఉన్న పర్యాటక ఆసీస్ చివరి మ్యాచ్లోనూ సత్తా చాటి టైటిల్ గెలవాలని పట్టుదలగా ఉంది. ఈ నేపథ్యంలో ఆసీస్ దిగ్గజం రిక్కీ పాంటింగ్ ఐదో టెస్టు తుది జట్టు కూర్పు గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు. యువ స్పిన్నర్ టాడ్ మర్ఫీకి టీమ్లో స్థానంలో కల్పించాలని మేనేజ్మెంట్కు విజ్ఞప్తి చేశాడు. బ్యాటింగ్ ఆర్డర్ను పటిష్టం చేసే క్రమంలో మర్ఫీని నాలుగో టెస్టు నుంచి తప్పించి తప్పుచేశారని అభిప్రాయపడ్డారు. అదొక్కటే మార్పు ‘‘ఆఖరి టెస్టులో ఆస్ట్రేలియా ఏం చేయబోతోందో చూడాలి. నా లెక్క ప్రకారమైతే మర్ఫీని కచ్చితంగా జట్టులోకి తీసుకురావాలి. ఓవల్ మైదానంలో పిచ్ స్పిన్కు అనుకూలిస్తుంది. కాబట్టి అతడిని ఆడిస్తే ప్రయోజనకరంగా ఉంటుంది. మర్ఫీ ఒక్కడు తప్ప జట్టులో ఎలాంటి మార్పులు ఉండబోవనుకుంటున్నా. మాంచెస్టర్లో పర్వాలేదనిపించాడు. తక్కువ స్కోర్లకే పరిమితమైనా మెరుగైన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. తను ఓపెనర్గా రావడం ఖాయమనిపిస్తోంది’’ అని రిక్కీ పాంటింగ్ ఐసీసీ రివ్యూ షోలో తన అభిప్రాయాలు పంచుకున్నాడు. కాగా జూలై 27- 31 వరకు ఇంగ్లండ్- ఆస్ట్రేలియా మధ్య లండన్లోని కెన్నింగ్టన్ ఓవల్ వేదికగా ఐదో టెస్టు నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది. యాషెస్ ఐదో టెస్టుకు పాంటింగ్ ఎంచుకున్న ఆసీస్ తుది జట్టు: డేవిడ్ వార్నర్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లబుషేన్, స్టీవ్ స్మిత్, ట్రవిస్ హెడ్, మిచెల్ మార్ష్, అలెక్స్ క్యారీ, మిచెల్ స్టార్క్, ప్యాట్ కమిన్స్(కెప్టెన్), టాడ్ మర్ఫీ, జోష్ హాజిల్వుడ్. పాంటింగ్ ఇంగ్లండ్ తుదిజట్టు: జాక్ క్రాలీ, బెన్ డకెట్, మొయిన్ అలీ, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్ (కెప్టెన్), జానీ బెయిర్స్టో, క్రిస్ వోక్స్, మార్క్ వుడ్, స్టువర్ట్ బ్రాడ్, జోష్ టంగ్. చదవండి: 69 ఏళ్ల వయసులో ‘సూపర్స్టార్’ పెళ్లి! ఎవరీ బ్యూటీ? ఆమె పిల్లలు కూడా.. -
జైశ్వాల్ ఒక్కడే కాదు.. అతడు కూడా టాలెంటెడ్.. ఛాన్స్ ఇస్తేనే: పాంటింగ్
India tour of West Indies, 2023: ‘‘ఇండియాలో దేశవాళీ క్రికెట్లో అద్భుతంగా ఆడుతున్న ఆటగాళ్లు ఎంతో మంది ఉన్నారు. వాళ్లు ఎప్పుడెప్పుడు అంతర్జాతీయ స్థాయిలో టెస్టు క్రికెట్ ఆడతారా అని ఎదురుచూడటం తప్ప మనమేం చేయలేం. నా దృష్టిలో యశస్వి జైశ్వాల్ మాదిరే రుతురాజ్ గైక్వాడ్ కూడా అత్యంత ప్రతిభావంతుడైన ఆటగాడు. టెస్టుల్లో అతడు గొప్పగా రాణిస్తాడనే నమ్మకం ఉంది. రానున్న రెండేళ్లలో టీమిండియాకు మూడు ఫార్మాట్లలో అతడు కీలక ఆటగాడిగా ఎదగడం ఖాయం. వీరితో పాటు భారత ఓపెనర్ పృథ్వీ షా కూడా అద్భుత నైపుణ్యాలు ఉన్న బ్యాటర్. అదే విధంగా సర్ఫరాజ్ కూడా దేశవాళీ క్రికెట్లో రాణిస్తున్నాడు. అయితే, ప్రస్తుత పరిస్థితుల్లో వీరిద్దరు టీమిండియాలో చోటు దక్కించుకోవాలంటే మరికొన్నాళ్లు వేచి చూడక తప్పదు’’ అని ఆస్ట్రేలియా దిగ్గజం రిక్కీ పాంటింగ్ అన్నాడు. టీమిండియా యువ సంచలనం యశస్వి జైశ్వాల్ను ప్రశంసిస్తూనే రుతురాజ్ గైక్వాడ్కు కూడా అవకాశాలు ఇవ్వాలని సూచించాడు. అరుదైన రికార్డులు సాధించి కాగా డబ్ల్యూటీసీ 2023-25 సైకిల్లో భాగంగా టీమిండియా వెస్టిండీస్తో తమ తొలి సిరీస్ ఆడుతోంది. ఇందులో భాగంగా డొమినికా వేదికగా జరిగిన మొదటి టెస్టు సందర్భంగా ముంబై బ్యాటర్ యశస్వి జైశ్వాల్ అరంగేట్రం చేశాడు. మొట్టమొదటి అంతర్జాతీయ మ్యాచ్లోనే అద్భుత శతకం(171)తో అలరించాడు. టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. అరుదైన రికార్డులెన్నో సాధించి ప్రశంసలు అందుకుంటున్నాడు. కాగా విండీస్తో టెస్టు సిరీస్ నేపథ్యంలో సెలక్టర్ల పిలుపు అందుకున్న మరో ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్కు మాత్రం నిరాశే ఎదురైంది. రుతు బెంచ్కు పరిమితం కెప్టెన్ రోహిత్ శర్మకు జోడీగా యశస్వి ఓపెనర్గా బరిలోకి దిగడంతో రుతు బెంచ్కే పరిమితమవ్వాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో ఐసీసీ షోలో రిక్కీ పాంటింగ్ మాట్లాడుతూ.. యశస్వి ప్రత్యేకమైన నైపుణ్యాలు కలిగిన ఆటగాడని కొనియాడాడు. ఐపీఎల్లో అద్భుతంగా ఆడి రాత్రి రాత్రే సూపర్స్టార్గా మారిపోయాడన్నాడు. రుతురాజ్కు కూడా ఛాన్స్ ఇస్తే అతడు మంచి బ్యాటర్ అని అందరికీ తెలుసని, అయితే ఈ సీజన్లో మాత్రం మునుపెన్నడూ లేని విధంగా తనలోని అన్ని రకాల టాలెంట్స్ ప్రదర్శించాని యశస్విపై ప్రశంసలు కురిపించాడు. అదే సమయంలో రుతురాజ్ గైక్వాడ్ గురించి ప్రస్తావిస్తూ.. ఈ చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనర్కు కూడా వరుస అవకాశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశాడు. ఇద్దరూ అదరగొట్టారు కాగా ఐపీఎల్-2023 సీజన్లో రాజస్తాన్ రాయల్స్ ఓపెనర్ యశస్వి జైశ్వాల్ 14 మ్యాచ్లలో ఓ సెంచరీ(124) సాయంతో 625 పరుగులు చేశాడు. ఇక రుతురాజ్ గైక్వాడ్ 16 మ్యాచ్లు ఆడి 590 పరుగులు సాధించాడు. అత్యధిక స్కోరు 92. ఇదిలా ఉంటే.. తొలి టెస్టులో విజయంతో 1-0తో ముందంజ వేసిన టీమిండియా జూలై 20 నుంచి విండీస్తో రెండో టెస్టులో తలపడనుంది. చదవండి: బీసీసీఐకి థాంక్స్.. కచ్చితంగా స్వర్ణం గెలుస్తాం: టీమిండియా కొత్త కెప్టెన్ రుతురాజ్ -
ఆ విషయంలో బెన్ స్టోక్స్ టీమిండియా దిగ్గజ కెప్టెన్తో సమానం..!
ఆసీస్ మాజీ సారధి రికీ పాంటింగ్.. ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ను టీమిండియా విజయవంతమైన నాయకుడు మహేంద్ర సింగ్ ధోనితో పోల్చాడు. బెన్ స్టోక్స్ యొక్క మ్యాచ్ విన్నింగ్ సామర్థ్యం మిస్టర్ కూల్ కెప్టెన్ సామర్థ్యంతో సరిసమానంగా ఉంటుందని అన్నాడు. ప్రసుత్త కెప్టెన్లతో పోలిస్తే స్టోక్స్ ఒత్తిడిని మెరుగ్గా హ్యాండిల్ చేయగలడని కితాబునిచ్చాడు. స్టోక్స్ చాలాకాలంగా ఫార్మాట్లకతీతంగా బ్యాట్తో పాటు బంతితోనూ సత్తా చాటుతూ మ్యాచ్ విన్నర్గా మారాడని అన్నాడు. ఒత్తిడి సమయాల్లో స్టోక్స్ తనలోని అత్యుత్తమ ప్రతిభను బయటపెట్టి జట్టు విజయాల్లో ప్రధానపాత్ర పోషించాడని పేర్కొన్నాడు. తాజాగా లార్డ్స్లో జరిగిన యాషెస్ సిరీస్ రెండో టెస్ట్లోనూ స్టోక్స్ ఇదే తరహా ప్రదర్శనను కనబర్చి, తన జట్టును ఒంటిచేత్తో గెలిపించినంత పని చేశాడని తెలిపాడు. 2019 లీడ్స్ టెస్ట్లోనూ స్టోక్స్ ఇలాగే ఒంటిపోరాటం చేసి ఇంగ్లండ్కు చిరస్మరణీయ విజయాన్ని అందించాడని గుర్తు చేశాడు. టెస్ట్ల్లో స్టోక్స్ బ్యాట్తో 36, బంతితో 32 కంటే ఎక్కువ సగటు కలిగి ఉన్నాడని తక్కువ అంచనా వేయరాదని, ఈ సంఖ్యలకు మించి ఆటను ప్రభావితం చేయగల సామర్థ్యం అతనికి ఉందని కొనియాడాడు. టెస్ట్ల్లోనే కాక పరిమిత ఓవర్ల ఫార్మాట్లలోనూ స్టోక్స్ అత్యుత్తమ ఆటగాడని, ఇందుకు 2022 టీ20 వరల్డ్కప్ ఫైనల్ మ్యాచే నిదర్శనమని అన్నాడు. ఐసీసీ రివ్యూలో పాంటింగ్ స్టోక్స్పై ప్రశంసల వర్షం కురిపించాడు. కాగా, ఇటీవల ముగిసిన యాషెస్ రెండో టెస్ట్లో ఆసీస్ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ విజయంతో ఆసీస్ 5 మ్యాచ్ల సిరీస్లో 2-0 ఆధిక్యంలోకి వెళ్లింది. -
ఆమె అందానికి క్లీన్బౌల్డ్! షేన్ వార్న్తో బార్లో తొలిసారి చూశా.. సంపాదనలోనూ
దూకుడైన బ్యాటింగ్తో ఆస్ట్రేలియాకు అనేక విజయాలు అందించిన దిగ్గజ కెప్టెన్ రిక్కీ పాంటింగ్. అంతర్జాతీయ క్రికెట్లో అన్ని ఫార్మాట్లలో కలిపి 27483 పరుగులు సాధించిన ఈ రైట్హ్యాండ్ బ్యాటర్ ప్రస్తుతం కోచ్గా, కామెంటేటర్గా క్రికెట్కు సేవలు అందిస్తున్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్లో ఢిల్లీ క్యాపిటల్స్ హెడ్కోచ్గా ఉన్న ఈ ఆసీస్ మాజీ సారథి వ్యక్తిగత జీవితం గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం!! ఆమెను చూడగానే తన అగ్రెసివ్ బ్యాటింగ్తో మైదానంలో ప్రత్యర్థి బౌలర్లకు చెమటలు పట్టించే రిక్కీ పాంటింగ్.. ఓ అమ్మాయిని చూడగానే మాత్రం నిలువెల్లా పులకరింపుతో సిగ్గులమొగ్గ అయ్యాడట. ఆమె పేరు రియాన్నా జెన్నిఫర్ కాంటోర్. ఓసారి రిక్కీ మ్యాచ్ ఆడుతున్న సమయంలో అతడి కుటుంబం కూడా స్టేడియానికి వచ్చింది. ఆట ముగిసిన తర్వాత వాళ్లను కలిసేందుకు వెళ్లిన రిక్కీ పాంటింగ్కు అక్కడ రియాన్నా తారసపడింది. మ్యాచ్ చూసేందుకు వచ్చిన ఆమెను చూడగానే రిక్కీ మనసు పారేసుకున్నాడు. తొలిచూపులోనే ప్రేమలో పడ్డాడు తొలిచూపులోనే ఆమెతో ప్రేమలో పడిపోయాడు. ఇంకేముంది.. ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే ఆమె వివరాలు సేకరించాడు. అప్పటికి కాలేజీ స్టూడెంట్ అయిన రియాన్నా లా చదువుతోంది. దీంతో ఆమె చదువుతున్న యూనివర్సిటీకి వెళ్లి మరీ ఆమెను కలిశాడు. మ్యాచ్ ముగిసిన వెంటనే హుటాహుటిన అక్కడికి రియాన్నాతో మాటలు కలిపాడు. ముచ్చటగా ముగ్గురు పిల్లలు రిక్కీ పట్ల రియాన్నాకు కూడా మంచి అభిప్రాయం ఉండటంతో అతడితో స్నేహానికి అంగీకరించింది. అలా కొన్నాళ్లపాటు డేటింగ్ చేసిన వీరిద్దరు 2002, జూన్ 22న వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఈ జంటకు ప్రస్తుతం ముగ్గురు సంతానం. ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు. నేను అప్పుడే చూశా నిజానికి రిక్కీ.. రియాన్నాను చూడటానికి ముందే ఆమె అతడిని చూసిందట. షేన్ వార్న్తో కలిసి అతడు బార్లో ఉన్నపుడు చూశానని గతంలో ఓ ఇంటర్వ్యూలో రియాన్నా చెప్పింది. 21 ఏళ్లుగా అన్యోన్యంగా సాగుతున్న ఈ జంట.. రెండ్రోజుల క్రితమే పెళ్లిరోజు జరుపుకొంది. సంపాదనలోనూ.. దిక్రిక్లాంజ్ నివేదిక ప్రకారం రిక్కీ పాంటింగ్ నెట్వర్త్ సుమారు 480 కోట్ల రూపాయలు. ఆసీస్ మేటి క్రికెటర్గా, ఎండార్స్మెంట్ల రూపంలో .. ఐపీఎల్ కోచ్గా రిక్కీ ఈ మేరకు ఆస్తులు కూడబెట్టినట్లు సదరు రిపోర్టు వెల్లడించింది. మెల్బోర్న్లో రిక్కీ- రియాన్నా కుటుంబం నివసించే ఇంటి విలువ దాదాపు 20 కోట్లు ఉంటుందని అంచనా. ఇదిలా ఉంటే.. 48 ఏళ్ల రిక్కీ పాంటింగ్ ప్రస్తుతం యాషెస్ సిరీస్ కామెంట్రీతో బిజీగా ఉన్నాడు. చదవండి: లెజండరీ ఓపెనర్ దిల్షాన్.. డీకే మాదిరే! ఉపుల్ తరంగతో భార్య ‘బంధం’.. అతడినే పెళ్లాడి! ధోని నమ్మకం నిలబెట్టిన ప్రపంచకప్ విజేత, 2 సార్లు ఐపీఎల్ ‘విన్నర్’.. ఇప్పుడు పోలీస్ -
'మెక్కల్లమ్ కంటే ముందు నన్ను సంప్రదించారు.. తిరస్కరించా'
ఇంగ్లండ్, ఆస్ట్రేలియా జట్లు ప్రస్తుతం ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్తో బిజీగా ఉన్నాయి. ఇరుజట్ల మధ్య ఎడ్జ్బాస్టన్ వేదికగా ముగిసిన తొలి టెస్టులో ఆస్ట్రేలియా రెండు వికెట్ల తేడాతో సంచలన విజయం సాధించింది. బజ్బాల్ ఆటతీరుతో దూకుడు మీదున్న ఇంగ్లండ్కు.. ఆసీస్ ఓటమి రుచి చూపించి బ్రేకులు వేసింది. అయితే 2021లో జరిగిన యాషెస్ సిరీస్లో ఇంగ్లండ్ 0-4 తేడాతో ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఈ దెబ్బతో అప్పటి టెస్టు కెప్టెన్ జో రూట్ నాయకత్వ బాధ్యతల నుంచి తప్పుకోగా.. బ్యాటింగ్ మెంటార్గా ఉన్న గ్రహం థోర్ఫ్, మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్న అష్లే గైల్స్ తమ పదవులను కోల్పోయారు. ఆ తర్వాత రాబ్ కీ అనే వ్యక్తి ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు(ఈసీబీ)కి కొత్త డైరెక్టర్గా ఎంపికయ్యాడు. కాగా రాబ్ కీ వచ్చీ రావడంతోనే తన మార్క్ను చూపించే ప్రయత్నం చేశాడు. ఇంగ్లండ్ టెస్టు క్రికెట్ కోచ్ పదవికి మెక్కల్లమ్ కంటే ముందు ఆస్ట్రేలియా దిగ్గజం రికీ పాంటింగ్ను సంప్రదించినట్లు తెలిసింది. ఈ విషయాన్ని స్వయంగా పాంటింగ్ తాజాగా రివీల్ చేశాడు. గురిల్లా క్రికెట్పాడ్ కాస్ట్కు ఇంటర్య్వూ ఇచ్చిన పాంటింగ్ కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. ''మెక్కల్లమ్ కంటే ముందు ఇంగ్లండ్ టెస్టు క్రికెట్ కోచ్ పదవికి నన్ను ముందు సంప్రదించారు. ఈ విషయంలో రాబ్ కీ కీలకంగా వ్యవహరించాడు. అతనే స్వయంగా నా దగ్గరకు వచ్చి ఇంగ్లండ్ టెస్టు కోచ్గా ఆఫర్ ఇచ్చాడు. కానీ అప్పుడున్న పరిస్థితుల్లో దానిని తిరస్కరించా. ఎందుకంటే అంతర్జాతీయ క్రికెట్ కోచ్గా ఫుల్టైమ్ పనిచేయడానికి అప్పటికి నేను మానసికంగా సిద్దం కాలేదు. పిల్లలు చిన్నవాళ్లు కావడం.. అంతర్జాతీయ కోచ్గా ఉంటే జట్టుతో పాటు వివిధ దేశాలకు పర్యటించాల్సి ఉంటుంది. కానీ ఆ సమయంలో నా ఫ్యామిలీకి దూరంగా ఉండాలని అనుకోలేదు. అందుకే కోచ్ పదవి ఆఫర్ను తిరస్కరించాల్సి వచ్చింది.'' అంటూ చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ బ్రెండన్ మెక్కల్లమ్ను ఇంగ్లండ్ టెస్టు క్రికెట్ కోచ్ పదవి వరించింది. రూట్ స్థానంలో బెన్ స్టోక్స్ టెస్టు కెప్టెన్గా ఎంపికయ్యాడు. వీరిద్దరు కలిసిన తర్వాత ఇంగ్లండ్ టెస్టు క్రికెట్ పూర్తిగా మారిపోయింది. బజ్బాల్ క్రికెట్ను పరిచయం చేసిన ఈ ద్వయం ఇంగ్లండ్కు టెస్టుల్లో వరుస విజయాలు కట్టబెట్టారు. ఈ ఇద్దరు బాధ్యతలు తీసుకున్నాకా ఇంగ్లండ్ టెస్టుల్లో 13 మ్యాచ్ల్లో 11 విజయాలు సాధించడంతో పాటు పాకిస్తాన్, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ లాంటి జట్లపై సిరీస్ విజయాలు సాధించింది. చదవండి: హెచ్సీఏకు మంత్రి శ్రీనివాస్ గౌడ్ వార్నింగ్ చీఫ్ సెలెక్టర్ పదవికి ఆహ్వానాలు.. ముందు వరుసలో సెహ్వాగ్! -
IPL 2024: పాంటింగ్కు గుడ్బై.. ఢిల్లీ హెడ్ కోచ్గా గంగూలీ!
ఐపీఎల్-2024 సీజన్కు ముందు ఢిల్లీ క్యాపిటల్స్ తమ హెడ్కోచ్ రికీ పాంటింగ్కు గుడ్బై చెప్పే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అతడు స్ధానాన్ని టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీతో భర్తీ చేయాలని ఢిల్లీ క్యాపిటల్స్ మెనెజ్మెంట్ భావిస్తున్నట్లు సమాచారం. ఇక 2018 నుంచి ఢిల్లీ ప్రధాన కోచ్గా ఉన్న పాంటింగ్.. జట్టుకు ట్రోఫీని అందించడంలో విఫలమయ్యాడు. అదే విధంగా ఈ ఏడాది సీజన్లో అయితే ఢిల్లీ మరి చెత్త ప్రదర్శన కనబరిచింది. 4 మ్యాచ్ల్లో కేవలం ఐదింట మాత్రమే విజయం సాధించింది. ఈ నేపధ్యంలోనే పాంటింగ్ను సాగనంపాలని ఢిల్లీ నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక గంగూలీ విషయానికి వస్తే.. దాదా ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్ డైరెక్టర్గా ఉన్నాడు. గంగూలీ 2019 ఐపీఎల్ ఎడిషన్లో మెంటార్గా ఢిల్లీ జట్టుతో తన ప్రయాణాన్ని ప్రారంభించాడు. 2019, 2020 సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేఆప్స్ చేరడంలో గంగూలీ కీలక పాత్ర పోషించాడు. అప్పుడు ఢిల్లీ కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్ ఉన్నాడు. అయితే ఈ వార్తలపై ఢిల్లీ ఇప్పటివరకు ఎటువంటి ప్రకటన చేయలేదు. చదవండి: WTC Final: కొంచెం ఆలోచించండి.. కోచ్గా ద్రవిడ్ జీరో: పాకిస్తాన్ మాజీ క్రికెటర్ -
కోహ్లీని లైట్ తీసుకుంటే ఆసీస్ అవుట్..!
-
వాళ్ళిద్దరిని అవుట్ చేస్తేనే ఆస్ట్రేలియాకి ఛాన్స్ , కీలక వ్యాఖ్యలు చేసిన రిక్కీపాంటింగ్..!
-
WTC Final: భరత్ వద్దు.. అతడే బెటర్ ఆప్షన్..!
భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య ఓవల్ మైదానం వేదికగా జూన్ 7 నుంచి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2021-23 ఫైనల్ మ్యాచ్ ప్రారంభంకానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇరు జట్లు ఎలా ఉండాలో విశ్లేషకులు ఇప్పటి నుంచే అంచనా వేయడం మొదలుపెట్టారు. తాజాగా ఆసీస్ బ్యాటింగ్ దిగ్గజం రికీ పాంటింగ్.. టీమిండియా ఎలా ఉండాలో తన అభిప్రాయాన్ని బయటపెట్టాడు. మెజారిటీ విశ్లేషకులు టీమిండియా ఎలా ఉండాలని అనుకున్నారో, పాంటింగ్ సైతం అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. అయితే వికెట్ కీపర్ విషయంలో మాత్రం పాంటింగ్ కాస్త భిన్నంగా స్పందించాడు. కేఎస్ భరత్తో పోలిస్తే ఇషాన్ కిషన్ బెటర్ ఆప్షన్ అవుతాడని అభిప్రాయపడ్డాడు. రోహిత్, గిల్ ఓపెనింగ్ స్థానాల్లో ఎలాగూ ఫిక్స్ అయ్యారు కాబట్టి, ఆరో స్థానంలో ఇషాన్ బెటర్ ఛాయిస్ అవుతాడని అన్నాడు. ఓవల్ పిచ్ బ్యాటింగ్తో పాటు స్పిన్నర్లకు అనుకూలంగా ఉండనున్న నేపథ్యంలో యాజమాన్యం సైతం ఇషాన్ పేరునే పరిశీలిస్తే ఉపయోగకరంగా ఉంటుందని తెలిపాడు. వేగంగా ఆడటం ఇషాన్కు అదనంగా కలిసొచ్చే అంశమని అన్నాడు. భారత తుది జట్టు(అంచనా): రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్, చతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లి, అజింక్యా రహానే, ఇషాన్ కిషన్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, ఉమేశ్ యాదవ్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్ చదవండి: ఫామ్లో ఉన్నాడు.. రికార్డులు బద్దలు కొట్టడం కష్టమేమి కాదు -
WTC Final: అతడు భారత జట్టులో ఉండాల్సింది.. ఎక్స్ ఫ్యాక్టర్ అయి ఉండేవాడు: పాంటింగ్
జూన్ 7 నుంచి లండన్ వేదికగా జరగనున్న వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లో ఆస్ట్రేలియాతో తలపడేందుకు టీమిండియా సిద్దమవుతోంది. ఇప్పటికే ఇంగ్లండ్ గడ్డపై అడుగుపెట్టిన రోహిత్ సేన ప్రాక్టీస్లో బీజీబీజీగా గడుపుతోంది. ఈ మెగాఫైనల్కు ముందు ఆస్ట్రేలియా మాజీ కెప్టె్న్ రికీ పాంటింగ్ ఆసక్తికర వాఖ్యలు చేశాడు. డబ్ల్యూటీసీ ఫైనల్కు భారత జట్టులో ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా ఉండి బాగుండేదని పాంటింగ్ అభిప్రాయపడ్డాడు. కాగా పాండ్యా గత కొంత కాలంగా కేవలం పరిమిత ఓవర్ల క్రికెట్ మాత్రమే ఆడుతున్నాడు. వెన్ను గాయం కారణంగా 2018 తర్వాత ఇప్పటి వరకూ హార్దిక్ పాండ్యా టెస్టు మ్యాచ్ ఆడలేదు. ఎక్స్ ఫ్యాక్టర్ అయి ఉండేవాడు.. "డబ్ల్యూటీసీ ఫైనల్ జట్టులో హార్దిక్ పాండ్యా వంటి ఆల్రౌండర్ ఉండాల్సింది. అతడిని ఎంపికచేసి ఉంటే భారత జట్టు మరింత బలంగా ఉండేది. అయితే టెస్టు క్రికెట్ తన శరీరంపై మరింత భారాన్ని మోపుతుందని గతంలో హార్దిక్ చెప్పాడన్న సంగతి నాకు తెలుసు. కానీ ఇది కేవలం ఒక్క టెస్టు మ్యాచ్ మాత్రమే కదా. అతడు బ్యాటింగ్, బౌలింగ్ పరంగా అద్భుతంగా రాణిస్తున్నాడు. ఐపీఎల్-2023లో ప్రతీ మ్యాచ్లోనూ అతడు బౌలింగ్ చేశాడు. అదే విధంగా అతడి బౌలింగ్లో మంచి పేస్ కూడా ఉంది. హార్దిక్ జట్టులో ఉండి ఉంటే కచ్చితంగా ఎక్స్ ఫ్యాక్టర్ అయి ఉండేవాడు" అని దిఐసీసీ రివ్యూలో పాంటింగ్ పేర్కొన్నాడు. చదవండి: ఇటువంటి అద్భుతాలు సర్ జడేజా ఒక్కడికే సాధ్యం.. చాలా సంతోషంగా ఉంది: రైనా -
డబ్ల్యూటీసీ ఫైనల్.. అత్యుత్తమ ప్లేయింగ్ ఎలెవన్ ఇదే! వార్నర్, అశ్విన్కు నో ఛాన్స్
క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ మరో పది రోజుల్లో ప్రారంభం కానుంది. జూన్ 7 నుంచి లండన్ వేదికగా భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య డబ్ల్యూటీసీ ఫైనల్ జరగనుంది. ఇకడబ్ల్యూటీసీ ఫైనల్కు ముందు ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ ఇరు జట్లనుంచి అత్యుత్తమ ప్లేయింగ్ ఎలెవన్ను ఎంచుకున్నాడు. తన ఎంచుకున్న జట్టులో ఓపెనర్లుగా రోహిత్ శర్మ, ఉస్మాన్ ఖవాజాలకు పాంటింగ్ అవకాశం ఇచ్చాడు. అదే విధంగా ఫస్ట్డౌన్లో ఆసీస్ టాప్ఆర్డర్ బ్యాటర్ మార్నస్ లాబుషేన్కు చోటిచ్చాడు. ఇక సెకెండ్ డౌన్లో విరాట్ కోహ్లి ఛాన్స్ దక్కింది. అదే విధంగా వరుసగా నాలుగు ఐదు స్ధానాల్లో స్టీవ్ స్మిత్, రవీంద్ర జడేజా ఎంపికయ్యారు. తన జట్టులో వికెట్ కీపరగా అలెక్స్ కారీకు ప్లేస్ దక్కింది. బౌలర్ల కోటాలో పాట్ కమ్మిన్స్, మిచెల్ స్టార్క్, నాథన్ లయాన్, మహ్మద్ షమీకు అవకాశం దక్కింది. అయితే ఈ జట్టులో ఆసీస్ స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్, భారత వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్కు చోటు దక్కకపోవడం కావడం గమనార్హం. ఇక తన ఎంచుకున్న ఈ ఉమ్మడి జట్టుకు రోహిత్ శర్మను కెప్టెన్గా పాంటింగ్ ఎంచుకున్నాడు. రికీ పాంటింగ్ ఎంచుకున్న కంబైన్డ్ ప్లేయింగ్ ఎలెవన్ : రోహిత్ శర్మ (కెప్టెన్), ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లాబుస్చాగ్నే, విరాట్ కోహ్లీ, స్టీవ్ స్మిత్, రవీంద్ర జడేజా, అలెక్స్ కారీ (వికెట్ కీపర్), పాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, నాథన్ లియాన్, మహ్మద్ షమీ చదవండి: ODI WC 2023: వన్డే వరల్డ్కప్ షెడ్యూల్, వేదికలు.. వివరాల వెల్లడి ఆరోజే: జై షా కీలక ప్రకటన -
డబ్ల్యూటీసీ ఫైనల్పై పాంటింగ్ జోస్యం.. విజేత ఎవరంటే?
క్రికెట్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న డబ్ల్యూటీసీ ఫైనల్కు సమయం దగ్గరపడుతోంది. లండన్ వేదికగా జూన్ 7న ప్రారంభం కానున్న డబ్ల్యూటీసీ ఫైనల్లో ఆస్ట్రేలియా, భారత జట్లు తలపడనున్నాయి. కాగా ఈ మెగా ఫైనల్లో ఎవరు గెలుస్తారనే ఆంశంపై మాజీ క్రికెటర్లు తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. తాజాగా ఈ జాబితాలోకి ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ చేరాడు. భారత్ కంటే ఆసీస్కే విజయం సాధించే ఛాన్స్లు ఎక్కువగా ఉన్నాయని పాంటింగ్ జోస్యం చెప్పాడు. లండన్లోని ఓవల్ మైదానం పరిస్థితులు ఆస్ట్రేలియా తరహాలోనే ఉంటాయని పాంటింగ్ తెలిపాడు. "ఓవల్ పిచ్ ఆస్ట్రేలియా వికెట్ మాదిరిగానే ఉంటుంది. కాబట్టి ఆసీస్కు గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇదే మ్యాచ్ భారత్లో జరిగితే కచ్చితంగా టీమిండియానే విజయం సాధించేది. ఆస్ట్రేలియా గెలవడం చాలా కష్టంన. అదే ఆస్ట్రేలియాలో జరిగితే ఆసీస్ ఫేవరెట్ అని చెబుతాను. ఈ ఫైనల్ ఇంగ్లండ్లో జరుగుతుంది కాబట్టి రెండు జట్లు కూడా తీవ్రంగా పోటీపడతాయి. 1990వ దశకం చివరలో లేదా 2000వ దశకం ప్రారంభంతో పోలిస్తే ఇప్పుడు విదేశీ గడ్డపై భారత్ అద్భుతుంగా ఆడుతోంది. వారి బ్యాటింగ్ స్కిల్స్ కూడా మెరుగయ్యాయి. గత 10-15 ఏళ్లలో భారత క్రికెట్ మంచి ఫాస్ట్బౌలర్లను తయారు చేసింది. వారు జట్టు విజయంలో కీలక పాత్ర పోషిస్తున్నారు" ఢిల్లీలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో పాంటింగ్ పేర్కొన్నాడు. చదవండి: అతడే మ్యాచ్ను ఫినిష్ చేస్తాడని అనుకున్నా.. మేం షాక్లో ఉన్నాం: శాంసన్ -
మెరుగవ్వాలి కానీ దిగజారుతారా?! పాంటింగ్ హెడ్కోచ్ పదవి గోవిందా! వాళ్లు కూడా అవుట్!
IPL 2023- Delhi Capitals- Ricky Ponting- Sourav Ganguly: ఐపీఎల్-2023 సీజన్లో ఇంత వరకు విజయాల ఖాతా తెరవని ఒకే ఒక జట్టు ఢిల్లీ క్యాపిటల్స్. 2020లో ఫైనల్ చేరిన ఢిల్లీ మళ్లీ ఆ స్థాయిలో ఇంతవరకు రాణించింది లేదు. మూడేళ్ల క్రితం ఫైనల్ వరకు వెళ్లిన ఢిల్లీ ముంబై ఇండియన్స్ చేతిలో 5 వికెట్ల తేడాతో పరాజయాన్ని మూటగట్టుకుని రన్నరప్తో సరిపెట్టుకుంది. ఆ మరుసటి ఏడాది ప్లే ఆఫ్స్ చేరినప్పటికీ ఆశించిన ఫలితాన్ని రాబట్టలేకపోయింది. ఇక 2022లో మాత్రం కనీసం టాప్-4లో నిలవలేకపోయింది. 14 మ్యాచ్లకు గానూ ఏడింటి గెలిచిన ఢిల్లీ 14 పాయింట్లతో పట్టికలో ఐదో స్థానానికి పరిమితమైంది. ఇక తాజా ఎడిషన్లో మరీ ఘోరంగా ఆడిన ఐదు మ్యాచ్లలో ఐదూ ఓడి విమర్శలు ఎదుర్కొంటోంది. దెబ్బ మీద దెబ్బ ఈ నేపథ్యంలో ఏడాదికేడాది మెరుగవ్వాల్సింది పోయి ఇలా దిగజారమేమిటని అభిమానులు మండిపడుతున్నారు. కాగా రిషభ్ పంత్ యాక్సిడెంట్ కారణంగా జట్టుకు దూరం కావడం.. పృథ్వీ షా వంటి స్టార్ ప్లేయర్ల వరుస వైఫల్యాలు ఢిల్లీ క్యాపిటల్స్ ఆట తీరుపై ప్రభావం చూపిస్తున్నాయి. పంత్ స్థానంలో కెప్టెన్గా పగ్గాలు చేపట్టిన డేవిడ్ వార్నర్ తనదైన ముద్ర వేయలేకపోతున్నాడు. సారథిగా ఆశించిన మేర రాణించలేక చతికిలపడ్డాడు. ఇక కోచింగ్ స్టాఫ్ విషయానికొస్తే.. ఆస్ట్రేలియా దిగ్గజం రిక్కీ పాంటింగ్ హెడ్కోచ్గా ఉండగా.. బీసీసీఐ మాజీ అధ్యక్షుడు, టీమిండియా లెజెండ్ సౌరవ్ గంగూలీ డైరెక్టర్ ఆఫ్ క్రికెట్గా సేవలు అందిస్తున్నాడు. మరోవైపు షేన్ వాట్సన్, జేమ్స్ హోప్స్, అజిత్ అగార్కర్, ప్రవీణ్ ఆమ్రే, బిజూ జార్జ్ అసిస్టెంట్ కోచ్లుగా వ్యవహరిస్తున్నారు. జంబో స్టాఫ్నకు స్వస్తి.. పాంటింగ్ పదవికి ఎసరు! తాజా సమాచారం ప్రకారం.. ఢిల్లీ క్యాపిటల్స్ వరుసగా విఫలమవుతున్న నేపథ్యంలో కోచింగ్ స్టాఫ్ను తగ్గించుకునే ఆలోచనలో పడిందట ఫ్రాంఛైజీ. జంబో స్టాఫ్ను తగ్గించడం సహా రిక్కీని హెడ్కోచ్గా కొనసాగించాలా లేదా అన్న విషయంపై కసరత్తు చేస్తోందట. ఈ మేరకు.. ‘‘కచ్చితంగా మార్పులు ఉండబోతున్నాయి. అయితే, సీజన్ మధ్యలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోరు. కానీ ఢిల్లీ క్యాపిటల్స్ ఓనర్లు జేఎస్డబ్ల్యూ, జీఎంఆర్ గ్రూప్ సభ్యులు కలిసి కూర్చుని మాట్లాడాలని నిర్ణయించుకున్నారు. కాబట్టి వచ్చే ఏడాది ఈ జంబో కోచింగ్ స్టాఫ్ కనుమరుగై పోవచ్చు. ముఖ్యంగా కొన్ని పెద్ద తలకాయలు ఇకపై జట్టుతో కొనసాగకపోవచ్చు’’ అని విశ్వసనీయ వర్గాలు తెలిపినట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా తన కథనంలో పేర్కొంది. 2018 నుంచి ఢిల్లీతో దీంతో పాంటింగ్ పదవి పోయే అవకాశాలు ఉన్నాయంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇక ఆర్సీబీ చేతిలో ఢిల్లీ ఓటమి అనంతరం టీమిండియా మాజీ బ్యాటర్ వీరేంద్ర సెహ్వాగ్ మాట్లాడుతూ.. గతంలో విజయాలకు క్రెడిట్ తీసుకున్న రిక్కీ పాంటింగ్ ఓటములకు కూడా బాధ్యత వహించాలంటూ విమర్శించిన విషయం తెలిసిందే. కాగా రిక్కీ పాంటింగ్ 2018 నుంచి ఢిల్లీ జట్టు హెడ్కోచ్గా వ్యవహరిస్తున్నాడు. చదవండి: ‘పిచ్చి వేషాలు వేసినా నన్నెవరూ ఏం చేయలేరు; అదే అర్జున్ టెండుల్కర్ను చూడండి!’ చెత్తగా ప్రవర్తించారు.. నితీశ్ రాణాకు బీసీసీఐ షాక్! సూర్యకు భారీ జరిమానా -
ఇదేమైనా టీమిండియానా? గెలిస్తే క్రెడిట్ తీసుకుని.. ఓడితే వేరే వాళ్లను నిందిస్తూ..
IPL 2023 RCB Vs DC- Sehwag Slams Ricky Ponting: ‘‘ఒక జట్టు గెలిస్తే క్రెడిట్ కోచ్కి ఇస్తారు. మరి ఓడిపోయినప్పుడు జవాబుదారీగా ఉండాల్సింది కూడా వాళ్లే కదా! గతంలో అన్నట్లుగా ఇప్పుడు అదే మాట చెప్తున్నా.. రిక్కీ పాంటింగ్ కోచ్గా అద్భుతంగా తన బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్ను ఫైనల్కు తీసుకువెళ్లాడు. గత కొన్నేళ్లుగా వాళ్లు ప్రతి సీజన్లో దాదాపు ప్లే ఆఫ్స్ చేరుకుంటున్నారు. వీటన్నింటికీ క్రెడిట్ తీసుకుంటున్న రిక్కీ పాంటింగ్.. ఓటములకు కూడా బాధ్యత వహించాలి. ఇదేమైనా టీమిండియా అనుకున్నావా ఇదేమీ టీమిండియా కాదు.. గెలిచినప్పుడు క్రెడిట్ మాదే అని చెప్పుకొంటూ.. ఓడినపుడు మాత్రం ఇంకెవరినో నిందిస్తూ బాధ్యులను చేయడానికి! నిజానికి ఐపీఎల్లో కోచ్ పాత్ర సున్నా. ఆటగాళ్లకు తమపై తాము విశ్వాసం కోల్పోకుండా ప్రతి మేనేజ్మెంట్ అన్ని రకాలుగా అండగా నిలవాలి. అయితే, జట్టు మెరుగైన ప్రదర్శన చేసినపుడు మాత్రమే కోచ్కు విలువ వస్తుంది. ప్రస్తుత సీజన్లో ఢిల్లీ ప్రదర్శన అత్యంత దారుణంగా ఉంది. ఇప్పటికైనా లోపాలు తెలుసుకుని.. వాటిని సరిచేసుకుంటేనే ముందుకు సాగే అవకాశం ఉంటుంది’’ అని టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ అన్నాడు. పాంటింగ్ అసలేం చేస్తున్నాడు? ఢిల్లీ కోచ్ రిక్కీ పాంటింగ్ అసలు ఏం చేస్తున్నాడో అర్థం కావడం లేదంటూ విమర్శలు గుప్పించాడు. గెలిచినపుడు క్రెడిట్ తీసుకోవడం కాదని.. వరుస ఓటములకు బాధ్యత వహించాలంటూ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్-2023లో ఆర్సీబీతో శనివారం నాటి మ్యాచ్లో ఓటమితో ఢిల్లీ క్యాపిటల్స్ పరాజయాల సంఖ్య ఐదుకు చేరింది. తాజా ఎడిషన్లో ఇంతవరకు ఒక్క గెలుపు కూడా నమోదు చేయని జట్టుగా వార్నర్ బృందం అపఖ్యాతిని మూటగట్టుకుంది. ఆడిన ఐదింటిలో ఐదు ఓడి పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో నిలిచింది. లోపాలు సవరించుకోవాలి ఈ నేపథ్యంలో ఆర్సీబీతో మ్యాచ్లో ఢిల్లీ ఓటమి అనంతరం క్రిక్బజ్ షోలో మాట్లాడుతూ వీరూ భాయ్ తన అభిప్రాయాలు పంచుకున్నాడు. వరుస పరాజయాలకు కోచ్ రిక్కీ పాంటింగ్ను బాధ్యుడిని చేయాలని పేర్కొన్నాడు. ఇప్పటికైనా లోపం ఎక్కడుందో గమనించి.. పొరపాట్లు సరిచేసుకోవాలని సూచించాడు. లేదంటే చెత్త రికార్డులతో ఇంటిబాట పట్టక తప్పదని హెచ్చరించాడు. చదవండి: గంగూలీ స్థాయి పెరిగింది.. కోహ్లి అలా... రవిశాస్త్రి ఇలా! అధికారం ఉండదంటూ.. సెంచరీతో చెలరేగిన బాబర్.. ఎవరికీ అందనంత ఎత్తులో! Back to winning ways 🙌@RCBTweets register a 23-run win at home and clinch their second win of the season 👏👏 Scorecard ▶️ https://t.co/xb3InbFbrg #TATAIPL | #RCBvDC pic.twitter.com/5lE5gWQm8H — IndianPremierLeague (@IPL) April 15, 2023 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4381453179.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
'చూసి భయపడ్డాడా.. అలా దాక్కుంటున్నాడు'
ఐపీఎల్ 16వ సీజన్లో రికీ పాంటింగ్ ఢిల్లీ క్యాపిటల్స్ హెడ్కోచ్గా పనిచేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ ఆడిన నాలుగు మ్యాచ్ల్లోనూ పరాజయం పాలై పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో ఉంది. డేవిడ్ వార్నర్, అక్షర్ పటేల్ మినహా మిగతావారు రాణించకపోవడంతో ఢిల్లీ వరుస ఓటములను చవిచూసింది. దీనికి తోడు రిషబ్ పంత్ కూడా యాక్సిడెంట్ కారణంగా దూరమవడంతో అతడు లేని లోటు స్పష్టంగా తెలుస్తోంది. ఈ సంగతి పక్కనబెడితే.. నిన్నటి తరంలో దిగ్గజ క్రికెటర్లుగా వెలుగొందిన పాంటింగ్, సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ, బ్రియాన్ లారాలు ఐపీఎల్లో వివిధ ఫ్రాంచైజీల్లో ఏదో ఒక ముఖ్య పాత్రలో కొనసాగుతూ ఇప్పటి ఆటగాళ్లకు మార్గనిర్దేశం చేస్తున్నారు. కాగా ఢిల్లీ క్యాపిటల్స్ హెడ్కోచ్ పాంటింగ్, ఆర్సీబీ స్టార్ విరాట్ కోహ్లి ఒక ప్రమోషన్ కార్యక్రమం సందర్భంగా ఎదురుపడ్డారు. చాలా రోజుల తర్వాత ఇద్దరు కలవడంతో పిచ్చాపాటిగా మాట్లాడుకున్నారు. అయితే వీరి మీటింగ్లో ఒక కుర్రాడు ప్రధాన ఆకర్షణగా నిలిచాడు. పాంటింగ్ వెనకాల నిల్చొని అదే పనిగా కోహ్లిని చూస్తున్నాడు. కాసేపటి తర్వాత పాంటింగ్ ఆ కుర్రాడిని కోహ్లికి పరిచయం చేశాడు. అచ్చం నీలాగే ఉన్నాడు.. కొత్త వాళ్లతో మాట్లాడాలంటే బెరుకు అనుకుంటా అని కోహ్లి నవ్వుతూ పేర్కొన్నాడు. దీనికి పాంటింగ్.. అదేం లేదులే.. ఒక్కసారి నువ్వు నచ్చావనుకో ఇక జన్మలో నిన్ను వదిలిపెట్టడు. అని పేర్కొన్నాడు. ఆ తర్వాత కోహ్లి, పాంటింగ్లు అక్కడి నుంచి వెళ్లిపోయారు. మరి కోహ్లిని ఆకట్టుకున్న ఆ కుర్రాడు ఎవరో తెలుసా.. రికీ పాంటింగ్ కుమారుడు జూనియర్ పాంటింగ్ అలియాస్ ఫ్లెచర్ విలియమ్ పాంటింగ్. ఐపీఎల్ చూడడానికి తండ్రితో పాటు వచ్చిన ఫ్లెచర్ మ్యాచ్లను ఎంజాయ్ చేస్తున్నాడు. అన్నట్లు చెప్పడం మరిచాం. పాంటింగ్ లాగే ఫ్లెచర్ విలియమ్కు కూడా క్రికెట్ అంటే అమితమైన ఆసక్తి. ఇక ఈ వీడియోను ఢిల్లీ క్యాపిటల్స్ ట్విటర్ షేర్ చేసిన కాసేపటికే వైరల్గా మారిపోయింది. Jab Ricky Met Kohli 🥺 Extended Cameo: Ricky Jr 👶🏻#YehHaiNayiDilli #IPL2023 #ViratKohli #KingKohli #RCBvDC | @imVkohli | @RickyPonting pic.twitter.com/0LegGmLtga — Delhi Capitals (@DelhiCapitals) April 13, 2023 -
WC 2023: వాళ్లిద్దరు చెలరేగితే ఈసారి ట్రోఫీ ఆసీస్దే: రిక్కీ పాంటింగ్
ICC World Cup 2023: వన్డే ప్రపంచకప్-2023 నేపథ్యంలో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రిక్కీ పాంటింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. భారత్ వేదికగా జరుగనున్న ఈ ఐసీసీ మెగా టోర్నీలో ఆసీస్కు ఇద్దరు బౌలర్లు కీలకంగా మారనున్నారని పేర్కొన్నాడు. వారిద్దరు అత్యుత్తమ ప్రదర్శన కనబరిస్తే కంగారు జట్టు ఆరోసారి వన్డే వరల్డ్కప్ ట్రోఫీ గెలిచే అవకాశాలు ఉన్నాయని అభిప్రాయపడ్డాడు. కాగా 1987, 1999, 2003, 2007, 2015లో ఆస్ట్రేలియా జగజ్జేతగా అవతరించిన విషయం తెలిసిందే. ఐదుసార్లు ప్రపంచ చాంపియన్గా నిలిచిన ఆసీస్ ఈసారి కూడా వన్డే ప్రపంచకప్-2023కు నేరుగా అర్హత సాధించింది. ఐసీసీ సూపర్ లీగ్ పాయింట్ల పట్టికలో ఆరోస్థానంలో నిలిచింది. వాళ్లిద్దరు విజృంభిస్తే ఈ నేపథ్యంలో భారత్ వేదికగా అక్టోబరులో మొదలుకానున్న మెగా ఈవెంట్కు సన్నద్ధమవుతోంది. ఈ క్రమంలో ఐసీసీ రివ్యూ షోలో మాట్లాడిన రిక్కీ పాంటింగ్.. పేసర్ మిచెల్ స్టార్క్, లెగ్ స్పిన్నర్ ఆడం జంపా విజృంభిస్తే ఈసారి ఆసీస్కు తిరుగు ఉండదని ధీమా వ్యక్తం చేశాడు. వీరిద్దరు చెలరేగితే టైటిల్ గెలిచే అవకాశాలు మెండుగా ఉంటాయని పేర్కొన్నాడు. ‘‘మిచెల్ స్టార్క్ .. ఆరడుగుల ఐదు అంగుళాల ఎత్తు.. లెఫ్టార్మర్.. గంటకు సుమారు 140 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేయగలడు. అతడు ఫామ్లో ఉంటే ప్రత్యర్థి బ్యాటర్లకు చుక్కలే! పరిమిత ఓవర్ల క్రికెట్లో గణాంకాలు చూస్తే స్టార్క్ సత్తా ఏమిటో అర్థమవుతుంది. ట్రంప్ కార్డ్ అతడే ఇక ఆడం జంపా. స్టార్క్తో పాటు జంపా కూడా గత నాలుగైదేళ్లుగా పరిమిత ఓవర్ల క్రికెట్లో కీలక బౌలర్గా ఎదుగుతున్నాడు. ఆసీస్ బౌలింగ్ విభాగానికి వెన్నెముకలా మారాడు. ఇటీవల టీమిండియాతో సిరీస్లో అతడు లేని లోటు కనిపించింది. లెగ్ స్పిన్నర్ జంపా రానున్న వరల్డ్కప్లో ఆస్ట్రేలియాకు ట్రంప్ కార్డ్గా మారనున్నాడనడంలో ఎలాంటి సందేహం లేదు’’ అని రిక్కీ పాంటింగ్ చెప్పుకొచ్చాడు. కాగా 2015 ప్రపంచకప్ టోర్నీలో స్టార్క్ 8 మ్యాచ్లలో 22 వికెట్లు పడగొట్టి ఆసీస్ విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. గత రెండు పర్యాయాల్లో ఆసీస్ తరఫున ఈ ఐసీసీ ఈవెంట్లో లీడ్ వికెట్ టేకర్గా ఉన్నాడు. ఇక జంపా.. గతేడాది అద్భుత ప్రదర్శనతో ఆసీస్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా నిలిచాడు. ఇదిలా ఉంటే రిక్కీ పాంటింగ్ ప్రస్తుతం ఐపీఎల్-2023లో ఢిల్లీ క్యాపిటల్స్ కోచ్గా బిజీబిజీగా ఉన్నాడు. చదవండి: CSK Vs LSG: చెత్త బౌలింగ్.. పేసర్లకు ధోని స్ట్రాంగ్ వార్నింగ్! ఇలాగే కొనసాగితే సన్రైజర్స్కు గుడ్న్యూస్.. విధ్వంసకర వీరుడు వచ్చేశాడు! ఇక తిరుగుండదు -
IPL 2023: ఆ జట్టు బాగుంది.. ట్రోఫీ గెలిచే అవకాశాలు మెండు: రిక్కీ పాంటింగ్
IPL 2023: ఆస్ట్రేలియా దిగ్గజం, ఢిల్లీ క్యాపిటల్స్ హెడ్ కోచ్ రిక్కీ పాంటింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్-2023లో గతేడాది చాంపియన్ గుజరాత్ టైటాన్స్, రన్నరప్ రాజస్తాన్ రాయల్స్ ఆధిపత్యం కొనసాగించే అవకాశం ఉందని అభిప్రాయపడ్డాడు. టీ20 ఫార్మాట్లో విజేతలను అంచనా వేయడం కష్టమేనన్న పాంటింగ్.. మిగతా జట్లతో పోలిస్తే రాజస్తాన్ రాయల్స్ మాత్రం మెరుగ్గా కనిపిస్తోందని పేర్కొన్నాడు. రిక్కీ పాంటింగ్ మార్గదర్శనంలో టీమిండియా స్టార్ క్రికెటర్ రిషభ్ పంత్ సారథ్యంలోని ఢిల్లీ క్యాపిటల్స్ ఐదో స్థానంతో ఐపీఎల్-2022ను ముగించిన విషయం తెలిసిందే. అయితే, ఈసారి యాక్సిడెంట్ కారణంగా పంత్ పదహారో ఎడిషన్కు దూరం కాగా.. ఆసీస్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఢిల్లీ కెప్టెన్గా నియమితుడయ్యాడు. ఈక్రమంలో ఢిల్లీ క్యాపిటల్స్ పంత్లేని లోటును అధిగమించి మెరుగైన ప్రదర్శన కనబరిచాలని పట్టుదలగా ఉంది. ఇందుకు సంబంధించి హెడ్కోచ్ పాంటింగ్ ఇప్పటికే ఆ దిశగా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నట్లు వెల్లడించాడు. రాజస్తాన్ ఫేవరెట్.. ఎందుకంటే ఈ నేపథ్యంలో ఐసీసీ రివ్యూ షోలో పాంటింగ్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ‘‘ఇది నిజంగా చాలా కఠినమైన ప్రశ్న.. ఐపీఎల్లో ఏ జట్టు డామినేట్ చేస్తుందన్న విషయాన్ని కచ్చితంగా అంచనా వేయలేం. గతేడాది అద్భుతంగా రాణించిన గుజరాత్.. ఏకంగా టైటిల్ విజేతగా నిలిచింది. ఇక రాజస్తాన్ రాయల్స్ను తక్కువ చేయలేం. ఆ జట్టు పటిష్టంగా ఉంది. ఈసారి కూడా వారి ఎంపిక చాలా బాగుంది. టీ20లలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ ఊహించలేరు. అయితే, జట్ల బలాబలాలను విశ్లేషిస్తే నాకైతే రాజస్తాన్ రాయల్స్ మిగతా జట్ల కంటే మెరుగ్గా ఉన్నట్లు కనిపిస్తోంది. రాజస్తాన్ ఈసారి ఫేవరెట్గా బరిలో దిగనుంది’’ అని పాంటింగ్ పేర్కొన్నాడు. వారికి ట్రోఫీ గెలిచే అవకాశాలు మెండుగా ఉన్నాయని చెప్పుకొచ్చాడు. కాగా అరంగేట్ర సీజన్లోనే హార్దిక్ సేన ట్రోఫీ గెలిచి చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. మరోవైపు, రెండోసారి ఫైనల్ చేరిన సంజూ శాంసన్ బృందం రన్నరప్తో సరిపెట్టుకుంది. ఇక యువ ఆటగాళ్ల విషయానికొస్తే.. తమ ప్లేయర్లు యశ్ ధుల్, అమన్ ఖాన్ ఈసారి అద్భుతంగా రాణిస్తారని రిక్కీ పాంటింగ్ ఆశాభావం వ్యక్తం చేశాడు. చదవండి: IPL 2023: తెర వెనుక నాయకులను చూసేద్దామా.. Neymar: ఆన్లైన్ పేకాటలో 9 కోట్లు మాయం.. నెయ్మర్ కన్నీటిపర్యంతం! -
పంత్కు అరుదైన గౌరవం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక నిర్ణయం!
ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్, టీమిండియా స్టార్ ఆటగాడు రిషబ్ పంత్ ఈ ఏడాది ఐపీఎల్కు దూరం కానున్న సంగతి తెలిసిందే. గతేడాది డిసెంబర్ 30న కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన పంత్.. నెమ్మదిగా కోలుకుంటున్నాడు. ఈ ఏడాది సీజన్లో ఢిల్లీ కెప్టెన్గా డేవిడ్ వార్నర్ వ్యవహరించనున్నాడు. ఇక ఇది ఇలా ఉండగా.. ఐపీఎల్కు దూరమైన రిషబ్ పంత్కు ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ మేనేజ్మెంట్ అరుదైన గౌరవం ఇవ్వనుంది. ఈ ఏడాది సీజన్లో పంత్ జెర్సీ నెంబర్తో బరిలోకి దిగాలని ఢిల్లీ జట్టు మేనేజ్మెంట్ భావిస్తున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని ఢిల్లీ క్యాపిటల్స్ హెడ్ కోచ్ రికీ పాంటింగ్ కూడా దృవీకరించాడు. "మేం పంత్ను చాలా మిస్ అవ్వబోతున్నాం. ప్రతీ మ్యాచ్కు డగౌట్లో అతడు నా పక్కన కూర్చోవాలని నేను భావిస్తున్నాను. ఒకవేళ అది కుదరకపోతే మాకు సాధ్యమయ్యే మార్గాల్లో అతన్ని జట్టులో భాగం చేయాలనుకుంటున్నాము. మేము అతడి జెర్సీ నంబర్ను మా షర్టులపై లేదా క్యాప్లపై ఉంచాలి అనుకుంటున్నాం. అతడు మా జట్టుతో లేకపోయినా, ఎప్పటికీ అతడే మా నాయకుడు అని తెలియజేయడం కోసమే ఇదంతా. మేము ఇంకా పంత్ స్థానాన్ని ఎవరితో భర్తీ చేయాలన్నది నిర్ణయించలేదు. అయితే సర్ఫరాజ్ ఖాన్ మాత్రం మా జట్టుతో చేరాడు. ఈ ఏడాది సీజన్కు ముందు మేము ప్రాక్టీస్ మ్యాచ్లు ఆడాలి అనుకుంటున్నాము" అని పాంటింగ్ పేర్కొన్నాడు. చదవండి: IPL 2023: ఐపీఎల్కు ముందు కేకేఆర్కు ఊహించని షాక్! ఇక అంతే సంగతి? -
ఖరీదైన 6 బెడ్ రూమ్ల భవనాన్ని కొనుగోలు చేసిన పాంటింగ్.. ధర ఎంతో తెలుసా..?
ఆస్ట్రేలియా మాజీ సారధి, టూ టైమ్ వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్, ఢిల్లీ క్యాపిటల్స్ హెడ్ కోచ్ రికీ పాంటింగ్ ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ శివారు ప్రాంతమైన టూరక్లో అత్యంత విలాసవంతమైన 6 బెడ్ రూమ్ల భవనాన్ని కొనుగోలు చేశాడు. లగ్జరీ స్విమ్మింగ్ పూల్తో పాటు టెన్నిస్ కోర్ట్ కలిగిన ఈ మాన్షన్ ఖరీదు 20 మిలియన్ డాలర్లకు పైనే ఉంటుందని ఆస్ట్రేలియా మీడియా కథనాలు ప్రసారం చేస్తుంది. 1400 చదరపు మీటర్ల విస్తీర్ణంలో పాలరాతిచే నిర్మించబడ్డ ఈ అత్యధునిక విల్లాలో ఇండోర్-అవుట్డోర్ లివింగ్ స్పేస్లతో పాటు ఆధునిక వంటగది సమకూర్చబడింది. పాంటింగ్ ఇంత విలాసవంతమైన భవనాన్ని కొనుగోలు చేయడం ఇది మొదటిసారి కాదు. 2013లో ఈ ఆసీస్ మాజీ కెప్టెన్ 9.2 మిలియన్ డాలర్లు వెచ్చించి బ్రైటన్లోని బీచ్సైడ్ శివారులో ఓ లగ్జరీ మ్యాన్షన్ను కొన్నాడు. ప్రస్తుతం పాంటింగ్ కుటంబంతో కలిసి అందులోనే నివాసం ఉంటున్నాడు. బ్రైటన్ గోల్డెన్ మైల్గా పిలవబడే ఆ సుందర భవనంలో 7 పడక గదులు, ఎనిమిది స్నానపు గదులు, అంతర్గత థియేటర్ మరియు బీచ్కి ప్రైవేట్ లేన్వే ఉన్నాయి. ఈ రెండు భవనాలే కాక పాంటింగ్ 2019లో మరో భవనాన్ని కూడా కొనుగోలు చేశాడు. దాని ఖరీదు 3.5 మిలియన్ డాలర్లు. ఇందులో నాలుగు పడక గదులు, మూడు బాత్రూమ్లు ఉన్నాయి. ఈ విల్లా పోర్ట్ వ్యూ కలిగి ఉంటుంది. ఇదిలా ఉంటే, అంతర్జాతీయ క్రికెట్లో అత్యంత విజయవంతమైన కెప్టెన్లలో ఒకడిగా పేరు తెచ్చుకున్న పాంటింగ్.. ఆస్ట్రేలియా తరఫున 168 టెస్ట్ మ్యాచ్ల్లో 51.85 సగటున 41 సెంచరీల సాయంతో 13,378 పరుగులు చేశాడు. 374 వన్డేల్లో 41.81 సగటున 29 సెంచరీల సాయంతో 13,589 పరుగులు చేశాడు. -
BGT 2023: ‘సెంచరీ కరువైంది.. ఆ విషయం తెలుసు.. కానీ’
Ind Vs Aus Test Series 2023: ‘‘ఈ సిరీస్లో బ్యాటర్ల ఫామ్ గురించి నేను పెద్దగా మాట్లాడదలచుకోలేదు. ఎందుకంటే వాళ్లకు ఇదో పీడకల లాంటిది’’ అని ఆస్ట్రేలియా దిగ్గజం రికీ పాంటింగ్ అన్నాడు. నాగ్పూర్, ఢిల్లీ టెస్టుల్లో వికెట్ కఠినంగా ఉందని.. పరుగులు రాబట్టేందుకు బ్యాటర్లు కష్టపడ్డారని పేర్కొన్నాడు. తొలి రెండు మ్యాచ్లలో ఓడినప్పటికీ ఇండోర్ విజయంతో ఆసీస్ తిరిగి పుంజుకోవడం హర్షించదగ్గ విషయమన్నాడు. కాగా బోర్డర్- గావస్కర్ ట్రోఫీ-2023 సిరీస్లో భాగంగా ఆస్ట్రేలియా టీమిండియాతో నాలుగు మ్యాచ్ల టెస్టు సిరీస్ ఆడేందుకు భారత్కు వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు మూడు టెస్టులు జరుగగా.. ఒకే ఒక్క సెంచరీ(రోహిత్ శర్మ) నమోదైంది. ఆ తర్వాత ఒక్క బ్యాటర్ కూడా కనీసం మూడంకెల స్కోరు అందుకోలేకపోయాడు. నిరాశపరిచిన కోహ్లి ముఖ్యంగా ఎన్నో అంచనాలతో బరిలోకి దిగిన టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి సైతం నిరాశపరిచాడు. రెండో టెస్టులో 64 పరుగులతో పర్వాలేనిపించినా.. అనుకున్న స్థాయిలో మాత్రం రాణించలేకోయాడు. తొలి టెస్టులో 12, మూడో టెస్టులో 35 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో.. ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్లో 74 సెంచరీలు పూర్తి చేసుకున్న కోహ్లి.. ఈ సిరీస్లో వరుస శతకాలు బాదుతాడని ఆశపడ్డ అభిమానులకు నిరాశే ఎదురైంది. సెంచరీ కరువైంది.. తనకు ఆ విషయం తెలుసు ఈ నేపథ్యంలో ఆసీస్ బ్యాటింగ్ లెజెండ్ రిక్కీ పాంటింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఐసీసీ రివ్యూలో తన అభిప్రాయాలు పంచుకుంటూ.. ‘‘కోహ్లి గురించి ఇప్పటికే ఎన్నోసార్లు మాట్లాడాను. చాంపియన్లు ఎల్లప్పుడూ చాంపియన్లుగానే ఉంటారు. కఠిన పరిస్థితులను దాటుకుని ముందుకు సాగమని వాళ్లకు ఎవరూ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం తను భారీ స్కోర్లు నమోదు చేయలేకపోతున్నాడు. చాన్నాళ్లుగా టెస్టుల్లో సెంచరీ కరువైంది. అయితే, ఓ బ్యాటర్ పరుగులు చేయడానికి ఇబ్బంది పడుతున్నాడన్న విషయం అతడికి తప్పకుండా తెలిసి ఉంటుంది. లోపాలు ఎక్కడున్నాయో.. వాటిని ఎలా సరిదిద్దుకోవాలో కూడా తెలుస్తుంది. కోహ్లి ఫామ్ విషయంలో నాకెలాంటి భయాలు లేవు. తను తప్పకుండా తిరిగి పుంజుకుంటాడు’’ అని రిక్కీ పాంటింగ్ ధీమా వ్యక్తం చేశాడు. బ్యాటర్లకు చుక్కలే జరిగిన మూడు మ్యాచ్లలో బంతి బీభత్సంగా టర్న్ అయిందని.. పరుగులు రాబట్టలేక బ్యాటర్లు చుక్కలు చూశారని అభిప్రాయపడ్డాడు. కాగా స్పిన్నర్లకు అనుకూలించిన పిచ్లపై తొలి రెండు మ్యాచ్లలో టీమిండియా నెగ్గగా.. మూడో మ్యాచ్లో ఆసీస్ విజయం సాధించింది. ఇక ఇరు జట్ల మధ్య నిర్ణయాత్మక నాలుగో టెస్టు మార్చి 9 నుంచి అహ్మదాబాద్ వేదికగా ఆరంభం కానుంది. చదవండి: Virat Kohli: నాకు ఇలాంటివి అస్సలు నచ్చవు.. కనీసం: స్మృతి మంధాన WPL 2023: ఎంఎస్డీ పేరును బ్యాట్పై రాసుకుని హాఫ్ సెంచరీ బాదిన యూపీ వారియర్జ్ బ్యాటర్ -
నా అద్భుత ఫామ్కు కారణం అతడే: అక్షర్ పటేల్
టీమిండియా ఆల్రౌండర్ అక్షర్పటేల్ తన అద్భుత ఫామ్ను కొనసాగిస్తున్నాడు. తొలి టెస్టులో అర్దసెంచరీతో చెలరేగిన అక్షర్.. ఇప్పుడు రెండో టెస్టులోనే కీలక ఇన్నింగ్స్తో జట్టును అదుకున్నాడు. రవిచంద్రన్ అశ్విన్తో కలిసి అక్షర్ కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు. వీరిద్దరు ఎనిమిదో వికెట్కు 114 పరుగులు జోడించారు. అక్షర్ పటేల్ 115 బాల్స్లో మూడు సిక్సర్లు, ఐదు ఫోర్లతో 74 రన్స్ చేయగా అశ్విన్ ఐదు ఫోర్లతో 31పరుగులు చేశాడు. వీరిద్దరి కీలక ఇన్నింగ్స్ ఫలితంగా తొలి ఇన్నింగ్స్లో భారత్ 263 పరుగులకు ఆలౌటైంది. ఇక తన అద్భుత ప్రదర్శన పట్ల మ్యాచ్ అనంతరం అక్షర్పటేల్ స్పందించాడు. తన బ్యాటింగ్ స్కిల్స్ మెరుగుపడడంలో ఆసీస్ లెజెండ్ రికీ పాంటింగ్ కీలక పాత్ర పోషించాడు అని అతడు తెలిపాడు. "ఐపీఎల్లో మా జట్టు(ఢిల్లీ క్యాపిటల్స్) హెడ్ కోచ్ రికీ పాంటింగ్ నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను. నా బ్యాటింగ్ స్కిల్స్ మెరుగుపడడంలో రికీ కీలక పాత్ర పోషించాడు. అదే విధంగా భారత జట్టులో కూడా చాలా మంది బ్యాటర్ల నుంచి బ్యాటింగ్ టెక్నిక్స్ నేర్చుకుంటున్నాను. నా జట్టు కోసం 100 శాతం ఎఫక్ట్ పెడతాను. ఆల్రౌండర్గా బ్యాట్తో బాల్తో రాణించడమే నా లక్క్ష్యం. నేను సాధించే 30, 40 పరుగులను మ్యాచ్ విన్నింగ్ స్కోర్లుగా మలచాలి అనుకున్నాను. రాబోయే మ్యాచ్ల్లో కూడా నా మైండ్ సెట్ ఈ విధంగానే ఉంటుంది" అని ఎన్డీడివీతో పేర్కొన్నాడు. చదవండి: IND Vs AUS 2nd Test: అక్షర్ లేకపోయుంటే.. వాళ్లకు పట్టిన గతే మనకూ! -
'ఆడకపోయినా పర్లేదు.. పక్కన కూర్చుంటే చాలు'
టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ గతేడాది డిసెంబర్ 30న కారు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. కారు ప్రమాదంలో తీవ్ర గాయాలు కావడంతో పంత్ ముంబైలోని కోకిలాబెన్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నాడు.పంత్ పూర్తిగా కోలుకోవడానికి ఆరు నెలలు పట్టే అవకాశం ఉందని వైద్యులు ఇప్పటికే పేర్కొన్నారు. దీంతో ఈ ఏడాది అంతర్జాతీయ క్రికెట్తో పాటు ఐపీఎల్కు కూడా పంత్ దూరమయ్యాడు. ఇకపోతే పంత్ ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. పంత్ గైర్హాజరీలో ఢిల్లీ క్యాపిటల్స్ను ఎవరు నడిపించనున్నారనేది ఆసక్తికరంగా మారింది. అయితే డేవిడ్ వార్నర్కు పగ్గాలు అప్పగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయం పక్కనబెడితే.. ఢిల్లీ క్యాపిటల్స్ హెడ్కోచ్ రికీ పాంటింగ్ రిషబ్ పంత్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. పంత్ ఈసారి ఐపీఎల్ ఆడకపోయినా పర్లేదు.. కానీ డగౌట్లో నా పక్కన కూర్చుంటే చాలని పేర్కొన్నాడు. ట్విటర్లో బుమ్రా భార్య.. ప్రెజంటేటర్ సంజనా గణేషన్కు ఇచ్చిన ఇంటర్య్వూలో పాంటింగ్ మాట్లాడాడు. ''అలాంటి వ్యక్తులను భర్తీ చేయలేం. అంతే. అలాంటి ప్లేయర్స్ చెట్లపై పెరగరు. టీమ్ లో పంత్ స్థానంలో వచ్చే వికెట్ కీపర్ బ్యాటర్ కోసం మేము వెతకాలి. అతను ఆడటానికి ఫిట్ గా లేకపోయినా కూడా పంత్ మాతో ఉండాలని కోరుకుంటున్నాం. పంత్ ఓ కెప్టెన్ గానే కాదు.. అందరికీ వ్యాపించే అతని నవ్వు మాకు బాగా నచ్చుతుంది. ఒకవేళ అతడు ప్రయాణాలకు సిద్ధంగా ఉంటే, టీమ్ తో పాటు రాగలిగితే.. అతడు నాతోపాటు డగౌట్ లో కూర్చోవాలని కోరుకుంటున్నాను. మార్చి నెలలో మేము క్యాంప్ ఏర్పాటు చేయబోతున్నాం. అప్పటిలోగా అతడు రాగలిగితే టీమ్ తోపాటు ఉండాల్సిందిగా కోరుకుంటున్నా. పంత్ అంటే నాకు చాలా ఇష్టం. అతను త్వరగా కోలుకోవాలని మళ్లీ క్రికెట్ ఆడాలని కోరుకుంటున్నా'' అంటూ ముగించాడు. Ricky Ponting talking about Rishabh Pant - this is such a beautiful video.pic.twitter.com/XNl4Pd5AWs — Johns. (@CricCrazyJohns) January 20, 2023 చదవండి: ధోని కొత్త లుక్ అదుర్స్.. ఫోటో వైరల్ U-19 Womens T20 WC: రూల్స్ భ్రష్టు పట్టించారు.. క్రీడాస్పూర్తికి విరుద్ధం -
న్యూజిలాండ్తో వన్డే సిరీస్.. సెహ్వాగ్ రికార్డుపై కన్నేసిన కోహ్లి
శ్రీలంకతో వన్డే సిరీస్లో అదరగొట్టిన టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి..ఇప్పుడు అదే జోరును న్యూజిలాండ్పై కొనసాగించడానికి సిద్దమవుతున్నాడు. స్వదేశంలో న్యూజిలాండ్తో భారత్ మూడు వన్డేలు, మూడు టీ20ల సిరీస్లో తలపడనుంది. జనవరి 18న హైదరాబాద్ వేదికగా ఇరు జట్లు మధ్య తొలి వన్డే జరగనుంది. అయితే కోహ్లి కేవలం వన్డే జట్టులో మాత్రమే భాగంగా ఉన్నాడు. ఇక న్యూజిలాండ్తో వన్డే సిరీస్లో కింగ్ కోహ్లి అరుదైన రికార్డుపై కన్నేశాడు. ఈ సిరీస్లో విరాట్ మరో రెండు సెంచరీలు సాధిస్తే.. కివీస్పై వన్డేల్లో అత్యధిక సెంచరీలు సాధించిన రికీ పాంటింగ్, వీరేంద్ర సెహ్వాగ్ రికార్డును రికార్డును బ్రేక్ చేస్తాడు. కివీస్పై పాంటింగ్, సెహ్వాగ్ వన్డేల్లో 6 సెంచరీలు సాధించారు. ఇక కోహ్లి ఇప్పటివరకు న్యూజిలాండ్పై ఐదు సెంచరీలు సాధించి సనత్ జయసూర్య, సచిన్ టెండూల్కర్తో కలిసి సంయుక్తంగా ఉన్నాడు. చదవండి: IND vs NZ: హైదరాబాద్లో వన్డే సందడి.. పూర్తిగా అమ్ముడుపోయిన టికెట్లు -
తల్లిని సర్ప్రైజ్ చేద్దామనుకుని ఇలా!.. త్వరగా కోలుకో.. కోహ్లి ట్వీట్
Rishabh Pant Accident Sequence- న్యూఢిల్లీ/డెహ్రాడూన్: భారత స్టార్ క్రికెటర్ రిషభ్ పంత్ శుక్రవారం ఉదయం పెను ప్రమాదానికి గురైన విషయం విదితమే. ఢిల్లీ నుంచి ఉత్తరాఖండ్లోని తన స్వస్థలం రూర్కీకి వెళ్తుండగా పంత్ కారు అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టింది. శుక్రవారం ఉదయం 5 గంటల 30 నిమిషాలకు ఈ సంఘటన జరిగింది. ప్రమాదం జరిగిన వెంటనే పంత్ కారులో మంటలు చెలరేగాయి. అటువైపు వెళ్తున్న హరియాణా రోడ్వేస్కు చెందిన బస్ డ్రైవర్ సుశీల్ మాన్ ప్రమాద దృశ్యాన్ని చూసి బస్సు ఆపి అక్కడకు చేరుకున్నాడు. అప్పటికే పంత్ కారు కిటికీ అద్దాలు పగులగొట్టుకొని బయటకు వచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. ఆ తర్వాత సుశీల్ సహాయంతో పంత్ కారు బయటకు వచ్చాడు. ఆ వెంటనే పంత్ను అంబులెన్స్లో స్థానిక ఆసుపత్రికి తరలించారని హరిద్వార్ సీనియర్ సూపరిటెండెంట్ ఆఫ్ పోలీస్ అజయ్ సింగ్ తెలిపారు. ప్రమాద తీవ్రతకు పంత్ కారు పూర్తిగా దగ్ధమైంది. తల్లికి సర్ప్రైజ్ ఇద్దామనుకుని తల్లికి ముందస్తు సమాచారం ఇవ్వకుండా స్వస్థలం చేరుకొని సర్ప్రైజ్ ఇద్దామనుకొని పంత్ స్వయంగా కారు నడుపుతూ ఢిల్లీ నుంచి బయలుదేరాడు. ప్రమాదంలో పంత్ నుదురు చిట్లింది. వీపుపై గాయాలయ్యాయి. కుడి మోకాలి లిగ్మెంట్ స్థానభ్రంశమైంది. ప్రస్తుతం పంత్ ఆరోగ్యం నిలకడగా ఉందని... అతని మెదడుకు, వెన్నెముకకు ఎలాంటి గాయాలు కాలేదని ఎంఆర్ఐ స్కాన్లలో తేలినట్లు బీసీసీఐ తెలిపింది. బీసీసీఐ ప్రకటన పంత్ చికిత్సకయ్యే ఖర్చులన్నీ తాము భరిస్తామని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ప్రకటించారు. అయితే పంత్ బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ ప్లేయర్ కావడంతో చికిత్స ఖర్చులను తాము చెల్లిస్తామని బీసీసీఐ కార్యదర్శి జై షా తెలిపారు. పంత్ తొందరగా కోలుకోవాలని జాతీయ క్రికెట్ అకాడమీ చీఫ్ వీవీఎస్ లక్ష్మణ్ ఆకాంక్షించాడు. ప్రముఖుల స్పందన భారత ప్రధాని నరేంద్ర మోదీతోపాటు దిగ్గజం సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లి, శిఖర్ ధావన్, వీరేంద్ర సెహ్వాగ్, పాక్ క్రికెటర్ షాహిన్ షా అఫ్రిది, ఢిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యం, హెడ్ కోచ్ రికీ పాంటింగ్ తదితరులు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ పంత్కు ధైర్యం చెప్పారు. కోహ్లి ట్వీట్ అతడు త్వరగా కోలుకోవాలని, ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు. ఇక టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి సైతం.. ‘‘త్వరగా కోలుకో పంత్.. నీకోసం ప్రార్థిస్తున్నా’’ అంటూ ట్వీట్ చేశాడు. కాగా వచ్చే నెలలో స్వదేశంలో శ్రీలంకతో జరిగే ఆరు మ్యాచ్ల సిరీస్కు పంత్ దూరంగా ఉన్నాడు. ఇప్పటి వరకు పంత్ 33 టెస్టులు ఆడి 2,271 పరుగులు సాధించాడు. 30 వన్డేల్లో, 66 టి20 మ్యాచ్ల్లోనూ పంత్ భారత్కు ప్రాతినిథ్యం వహించాడు. చదవండి: Pak Vs NZ 1st Test: ఫలితం రాబట్టాలనుకున్నాం.. కానీ! పాక్ అలా బతికిపోయింది! Rishabh Pant Accident: వేగంగా దూసుకొచ్చిన కారు.. సీసీటీవీ ఫుటేజీ వైరల్! ప్రమాదానికి కారణం అదేనా? -
Pak Vs NZ: రికార్డులు బద్దలు కొట్టిన బాబర్! అచ్చం సెహ్వాగ్లా అలా!
పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం న్యూజిలాండ్తో స్వదేశంలో జరుగుతున్న టెస్టు మొదటి రోజు ఆటలో అద్భుత ఆట తీరు కనబరిచాడు. 48 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి జట్టు కష్టాల్లో కూరుకుపోయిన వేళ బాధ్యతాయుత ఇన్నింగ్స్ ఆడాడు. దాదాపు నాలుగేళ్ల విరామం తర్వాత ఎంట్రీ ఇచ్చిన సర్ఫరాజ్ అహ్మద్తో కలిసి 196 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి జట్టును ఆదుకున్నాడు. ఈ క్రమంలో 9 టెస్టు సెంచరీ(277 బంతుల్లో 161 నాటౌట్; 15 ఫోర్లు, 1 సిక్స్) చేసిన బాబర్ పలు రికార్డులు బద్దలు కొట్టాడు. పాకిస్తాన్ తరఫున క్యాలెండర్ ఇయర్లో అన్ని ఫార్మాట్లలో కలిపి అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్గా నిలిచాడు. ఈ క్రమంలో మహ్మద్ యూసఫ్ పేరిట ఉన్న 16 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టాడు. రిక్కీ పాంటింగ్ను అధిగమించి కివీస్తో మ్యాచ్లో తొలి సెషన్లోనే 54 పరుగుల వద్ద ఈ ఘనత అందుకున్నాడు. అదే విధంగా.. క్యాలెండర్ ఇయర్లో అత్యధిక సార్లు 50కి పైచిలుకు పరుగులు సాధించిన బ్యాటర్గా చరిత్ర సృష్టించాడు. 25 హాఫ్ సెంచరీలు నమోదు చేసి.. ఆస్ట్రేలియా దిగ్గజం రిక్కీ పాంటింగ్(2005లో 24 అర్ధ శతకాలు)ను అధిగమించాడు. ఇదిలా ఉంటే శతకం పూర్తి చేసుకున్న తర్వాత అచ్చం టీమిండియా విధ్వంసకర ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్లా బాబర్ సెలబ్రేషన్ చేసుకున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. క్యాలెండర్ ఇయర్లో అత్యధిక పరుగులు సాధించిన పాక్ బ్యాటర్లు ►బాబర్ ఆజం- 44 మ్యాచ్లలో 2477 పరుగులు- 2022 ►మహ్మద్ యూసఫ్- 33 మ్యాచ్లలో 2435 పరుగులు- 2006 ►సయీద్ అన్వర్- 43 మ్యాచ్లలో 2296 పరుగులు- 1996 ►మహ్మద్ యూసఫ్- 41 మ్యాచ్లలో 2226 పరుగులు- 2002 ►ఇంజమాముల్ హక్- 46 మ్యాచ్లలో 2164 పరుగులు- 2000 ►బాబర్ ఆజం- 36 మ్యాచ్లలో 2082 పరుగులు- 2019 ►మిస్బా ఉల్ హక్- 42 మ్యాచ్లలో 2078 పరుగులు- 2013 ►మహ్మద్ యూసఫ్- 53 మ్యాచ్లలో 2000 పరుగులు- 2000 ►యూనిస్ ఖాన్- 48 మ్యాచ్లలో 1947 పరుగులు- 2002 ►మహ్మద్ రిజ్వాన్- 44 మ్యాచ్లలో 1915 పరుగులు- 2021 చదవండి: David Warner: ఎన్నాళ్లకెన్నాళ్లకు.. అద్భుత శతకం.. అరుదైన రికార్డుల జాబితాలో వార్నర్ Suryakumar Yadav: సీక్రెట్ రివీల్ చేసిన సూర్యకుమార్.. వాళ్ల వల్లే ఇలా! కేకేఆర్ నుంచి మారిన తర్వాతే -
ఎన్నాళ్లకెన్నాళ్లకు.. అద్భుత శతకం.. అరుదైన రికార్డుల జాబితాలో వార్నర్
Australia vs South Africa, 2nd Test- David Warner : దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టులో ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ సెంచరీతో మెరిశాడు. దాదాపుగా గత మూడేళ్లుగా శతకం సాధించలేక విమర్శలపాలైన అతడు.. ప్రఖ్యాత మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ వేదికగా బ్యాట్తోనే సమాధానమిచ్చాడు. అంతేకాదు ఈ అద్భుత ఇన్నింగ్స్ ద్వారా అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు ఈ ఓపెనింగ్ బ్యాటర్. ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ 2021-23లో భాగంగా స్వదేశంలో ఆసీస్.. సౌతాఫ్రికాతో తలపడుతోంది. ఇందులో భాగంగా రెండో మ్యాచ్లోనూ తుది జట్టులో చోటు దక్కించుకున్న వార్నర్కు ఇది 100వ టెస్టు. ఈ క్రమంలో మంగళవారం నాటి రెండో రోజు ఆటలో భాగంగా సౌతాఫ్రికా స్టార్ బౌలర్ కగిసో రబడ బౌలింగ్లో ఫోర్ బాది 100 పరుగుల మార్కు అందుకున్నాడు వార్నర్. అరుదైన ఘనతలు ఈ నేపథ్యంలో కెరీర్లో 25వ టెస్టు సెంచరీ నమోదు చేసిన వార్నర్.. దిగ్గజాల సరసన చోటు సంపాదించాడు. ఆడిన 100వ టెస్టులో శతకం సాధించిన 10వ బ్యాటర్గా చరిత్రకెక్కాడు. అంతేగాక ఈ ఘనత సాధించిన రెండో ఆస్ట్రేలియా బ్యాటర్గా నిలిచాడు. అంతకుముందు రిక్కీ పాంటింగ్ ఈ ఫీట్ నమోదు చేశాడు. అదే విధంగా టెస్టుల్లో 8 వేల పరుగులు పూర్తి చేసుకున్న ఎనిమిదో ఆసీస్ ప్లేయర్గా వార్నర్ ఘనత వహించాడు. 100వ టెస్టులో సెంచరీ సాధించిన బ్యాటర్లు ►కోలిన్ కౌడ్రే- 104- ఇంగ్లండ్ వర్సెస్ ఆస్ట్రేలియా- 1968 ►జావేద్ మియాందాద్- 145- పాకిస్తాన్ వర్సెస్ ఇండియా- 1989 ►గోర్డాన్ గ్రీనిడ్జ్- 149- వెస్టిండీస్ వర్సెస్ ఇంగ్లండ్- 1990 ►అలెక్స్ స్టెవార్ట్- 105- ఇంగ్లండ్ వర్సెస్ వెస్టిండీస్-2000 ►ఇంజమాముల్ హక్ - 184- పాకిస్తాన్ వర్సెస్ ఇండియా- 2005 ►రిక్కీ పాంటింగ్- 120 , 143 నాటౌట్- ఆస్ట్రేలియా వర్సెస్ సౌతాఫ్రికా- 2006 ►గ్రేమ్ స్మిత్- 131- సౌతాఫ్రికా వర్సెస్ ఇంగ్లండ్- 2012 ►హషీం ఆమ్లా- 134- సౌతాఫ్రికా వర్సెస్ శ్రీలంక- 2017 ►జో రూట్- 218- ఇంగ్లండ్ వర్సెస్ ఇండియా- 2021 ►డేవిడ్ వార్నర్- 100 నాటౌట్- ఆస్ట్రేలియా వర్సెస్ సౌతాఫ్రికా, 2022 చదవండి: Suryakumar Yadav: సీక్రెట్ రివీల్ చేసిన సూర్యకుమార్.. వాళ్ల వల్లే ఇలా! కేకేఆర్ నుంచి మారిన తర్వాతే Ind Vs Ban: టీమిండియా దిగ్గజానికి మాతృ వియోగం.. సంతాపం ప్రకటిస్తూనే.. హ్యాట్సాఫ్ చెబుతూ 💯 in Test 💯! Well played, David Warner! #PlayOfTheDay#AUSvSA | @nrmainsurance pic.twitter.com/DsgFyoBvLR — cricket.com.au (@cricketcomau) December 27, 2022 -
Pak Vs Eng: పాక్ను చిత్తుగా ఓడించి.. కోహ్లి రికార్డు సమం చేసిన స్టోక్స్
Pakistan vs England, 3rd Test: సొంతగడ్డపై పాకిస్తాన్కు ఘోర పరాభవాన్ని మిగిల్చి ఇంగ్లండ్ జట్టు చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. కరాచీలో మంగళవారం ముగిసిన మూడో టెస్టులో బెన్ స్టోక్స్ బృందం ఆతిథ్య పాక్ను 8 వికెట్ల తేడాతో ఓడించింది. కాగా స్వదేశంలో ఇలా క్లీన్స్వీప్ కావడం పాక్ టెస్టు క్రికెట్ చరిత్రలో ఇదే తొలిసారి. కోహ్లి రికార్డు సమం అదే విధంగా.. సొంతగడ్డపై వరుసగా నాలుగు టెస్టులు ఓడిన మొదటి పాకిస్తాన్ కెప్టెన్ కూడా బాబర్ ఆజం కావడం విశేషం. ఇలా మూడో టెస్టుతో పాక్ ఖాతాలో చెత్త రికార్డులు నమోదు కాగా.. ఇంగ్లండ్ సారథి బెన్ స్టోక్స్ మాత్రం అరుదైన జాబితాలో చోటు దక్కించుకున్నాడు. టీమిండియా విజయవంతమైన టెస్టు కెప్టెన్గా పేరొందిన విరాట్ కోహ్లి రికార్డును సమం చేశాడు. టెస్టుల్లోనూ దూకుడుగా జో రూట్ తర్వాత ఇంగ్లండ్ టెస్టు పగ్గాలు చేపట్టిన స్టోక్స్.. జట్టును విజయపథంలో నడుపుతున్న విషయం తెలిసిందే. కోచ్ బ్రెండన్ మెకల్లమ్తో కలిసి సంప్రదాయ క్రికెట్లోనూ దూకుడైన ఆటకు మారు పేరుగా జట్టును మార్చి మెరుగైన ఫలితాలు రాబడుతున్నారు. ఈ క్రమంలో పాక్తో మూడో టెస్టులో ఇంగ్లండ్ గెలవడంతో ఈ ఏడాది స్టోక్స్ ఖాతాలో 9(ఆడిన 10 మ్యాచ్లలో) విజయాలు చేరాయి. తద్వారా క్యాలెండర్ ఇయర్లో ఈ ఘనత సాధించిన టెస్టు కెప్టెన్ల జాబితాలో స్టోక్స్ చోటు సంపాదించాడు. ఈ ఫీట్ నమోదు చేసిన ఏడో సారథిగా నిలిచాడు. అంతకుముందు గ్రేమ్ స్మిత్(సౌతాఫ్రికా), రిక్కీ పాంటింగ్(ఆస్ట్రేలియా), స్టీవ్ వా(ఆస్ట్రేలియా), మైకేల్ వాన్(ఇంగ్లండ్), క్లైవ్ లాయిడ్(వెస్టిండీస్), విరాట్ కోహ్లి(ఇండియా) ఈ ఘనత సాధించారు. సొంతగడ్డపై ఓటమి తప్పలేదు పాకిస్తాన్తో జరిగిన మూడు టెస్టుల సిరీస్ను ఇంగ్లండ్ 3–0తో సొంతం చేసుకుంది. చివరి టెస్టులో గెలుపు కోసం మ్యాచ్ నాలుగో రోజు మంగళవారం ఇంగ్లండ్ మరో 55 పరుగులు చేయాల్సి ఉండగా... 11.1 ఓవర్లలో లక్ష్యాన్ని అందుకుంది. రెండో ఇన్నింగ్స్లో ఇంగ్లండ్ 2 వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. బెన్ డకెట్ (82 నాటౌట్; 12 ఫోర్లు), బెన్ స్టోక్స్ (35 నాటౌట్; 3 ఫోర్లు) మూడో వికెట్కు అభేద్యంగా 73 పరుగులు జోడించి ఆటను ముగించారు. సిరీస్లోని తొలి టెస్టులో 74 పరుగులతో, రెండో టెస్టులో 26 పరుగులతో ఇంగ్లండ్ విజయం సాధించింది. హ్యారీ బ్రూక్ ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’... ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’గా నిలిచాడు. జట్టులో ఇద్దరు సీనియర్ పేసర్లు అండర్సన్, స్టువర్ట్ బ్రాడ్ లేకుండా 2007 తర్వాత ఇంగ్లండ్ గెలిచిన తొలి మ్యాచ్ ఇదే కావడం విశేషం. చదవండి: వచ్చీ రాగానే మొదలెట్టేశాడు.. సూర్యకుమార్ ఊచకోత కొనసాగింపు India Players- Ranji Trophy: ఇంట్లో కూర్చోవద్దు.. బీసీసీఐ ఆదేశాలు! మొన్న సంజూ, ఇషాన్.. ఇప్పుడు సూర్య, చహల్ -
చాలా మందిని భయపెట్టా.. నాకు కూడా భయమేసింది.. ఇప్పుడిలా!
అస్వస్థతతో ఆస్పత్రిలో చేరిన ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ కోలుకున్నాడు. ఆస్పత్రి నుంచి డిచ్చార్జ్ అయిన పాంటింగ్ తిరిగి మళ్లీ కామెంటేటర్గా బాధ్యతలు చేపట్టాడు. కాగా ఆస్ట్రేలియా, వెస్టిండీస్ మధ్య జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్లో కామెంటేటర్గా వ్యవహారిస్తున్న పాంటింగ్ ఛాతి నోప్పితో బాధపడ్డాడు. దీంతో హుటాహుటిన అతడిని పెర్త్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. పాంటింగ్ గుండెపోటుకు గురయ్యారనే వార్తతో అతడి అభిమానులు ఆందోళన చెందారు. ఇప్పుడు అతడు కోలుకోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే పాంటింగ్ ఆస్పత్రి నుంచి డిచ్చార్జ్ అయ్యి విశ్రాంతి తీసుకుంటాడని అంతా భావించారు. కానీ అతడు తిరిగి మళ్లీ కామెంటరీ బ్యాక్స్లో కనిపించి అందరనీ ఆశ్చర్యపరిచాడు. ఇక పాంటింగ్ కూడా తన ఆరోగ్యం గురించి పలు విషయాలను అభిమానులతో పంచుకున్నాడు. "నేను నిన్న(నవంబర్ 02) చాలా మందిని భయపెట్టాను. నిజం చెప్పాలంటే నాకు కూడా కొంచెం భయంగానే ఉండేది. నేను కామ్ బ్యాక్స్లో ఉండగా.. ఛాతిలో చిన్నగా నొప్పి మొదలైంది. నొప్పి వస్తుండడంతో కామెంటరీ కూడా ఎక్కువగా ఇవ్వలేదు. ఆఖరికి కామ్ బ్యాక్స్ను విడిచి పెట్టి వెళ్లిపోదామని నిర్ణయించకున్నాను. ఈ క్రమంలో కూర్చోని లేచిన వెంటనే ఒక్క సారిగా మైకంలోకి వెళ్లినట్లు అనిపించింది. వెంటనే అక్కడ ఉన్న బెంచ్ను పట్టుకున్నాను. ఆ సమయంలో నా సహచరలు లాంగర్, క్రిస్ జోన్స్ వెంటనే నన్ను ఆసుపత్రికి తీసుకువెళ్లారు. ఇప్పుడు నా ఆరోగ్యం నిలకడగా ఉంది. మళ్లీ నేను వాఖ్యతగా నా బాధ్యతలు నిర్వర్తిస్తాను" అని ఛానల్ సెవెన్తో పేర్కొన్నారు. కాగా ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్లలో పాంటింగ్ ఒకడు. ఆస్ట్రేలియా తరపున 168 టెస్టుల్లో 13,378 పరుగులు... 375 వన్డేల్లో 13,704 పరుగులు చేశారడు. టెస్టుల్లో 41 సెంచరీలు, వన్డేల్లో 30 శతకాలను సాధించారు. అదే విధంగా ఆస్ట్రేలియాకు రెండు ప్రపంచ కప్ లను కెప్టెన్గా పాంటింగ్ అందించాడు. చదవండి: IND vs BAN: షమీకి గాయం.. అతడి స్థానంలో యంగ్ బౌలర్.. బీసీసీఐ ప్రకటన -
ఆసీస్ మాజీ కెప్టెన్ పాంటింగ్ కు అస్వస్థత
-
రికీ పాంటింగ్కు ఛాతీ నొప్పి.. ఆసుపత్రికి తరలింపు
ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు రికీ పాంటింగ్ ఆసుపత్రిలో చేరాడు. క్రికెట్కు రిటైర్మెంట్ ఇచ్చిన తర్వాత పాంటింగ్ కామెంటేటర్గా విధులు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా వెస్టిండీస్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న తొలి టెస్టులో భాగంగా పాంటింగ్ కామెంటేటర్గా వ్యవహరిస్తున్నాడు. తొలి టెస్టు మూడో రోజు ఆట మొదలైన కాసేపటికే మ్యాచ్ కామెంటరీ చేస్తున్న పాంటింగ్కు ఛాతీలో నొప్పి వచ్చింది. దీంతో హుటాహుటిన పాంటింగ్ను సమీపంలోని ఆసుపత్రికి తరలించినట్లు క్రికెట్ వర్గాలు పేర్కొన్నారు. ప్రస్తుతం పాంటింగ్ కు వైద్యులు చికిత్సను అందిస్తున్నారు. ఇప్పటికైతే పాంటింగ్ ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు సమాచారం. త్వరలోనే పూర్తి ఆరోగ్యంతో తిరిగి రావాలని క్రికెట్ అభిమానులు కోరుకుంటున్నారు. ఇక ఆస్ట్రేలియా క్రికెట్లో రికీ పాంటింగ్ది ప్రత్యేక ప్రస్థానం. వన్డే క్రికెట్లో ఆస్ట్రేలియాకు రెండు ప్రపంచకప్లు అందించిన కెప్టెన్గా పాంటింగ్ ఘనత అందుకున్నాడు. 1995 నుంచి 2012 మధ్య కాలంలో ఆస్ట్రేలియాకు ప్రాతినిధ్యం వహించిన పాంటింగ్ ఆల్టైం గ్రేట్ బ్యాట్స్మన్ లిస్టులో చోటు సంపాదించాడు. పాంటింగ్ ఆసీస్ తరపున 168 టెస్టుల్లో 13,378 పరుగులు, 375 వన్డేల్లో 13,704 పరుగులు సాధించాడు. అతని ఖాతాలో 41 టెస్టు సెంచరీలు, 30 వన్డే సెంచరీలు ఉన్నాయి. చదవండి: తండ్రికి తగ్గ తనయుడు.. ఆ పోలికలు ఎక్కడికి పోతాయి -
'కోహ్లి కొట్టిన సిక్స్ చరిత్రలో నిలిచిపోతుంది'
టి20 ప్రపంచకప్లో భాగంగా అక్టోబర్ 23న పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో విరాట్ కోహ్లి ఆడిన ఇన్నింగ్స్ అంత త్వరగా ఎవరు మరిచిపోలేరు. ఈ మ్యాచ్లో 53 బంతుల్లో కోహ్లీ 82 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. పాక్ బౌలర్ల తప్పిదాలను క్యాష్ చేసుకున్న విరాట్ వీరోచిత ఇన్నింగ్స్ ఆడి ఒంటిచేత్తో మ్యాచ్ను గెలిపించాడు. ఇక ఆ మ్యాచ్లో 19వ ఓవర్లో కోహ్లి కొట్టిన రెండు సిక్సర్లు ఇన్నింగ్స్కే హైలైట్ అవడమే కాదు టీమిండియా వైపు మ్యాచ్ మొగ్గుచూపింది. తాజాగా ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ సైతం ఇదే విషయాన్ని ప్రస్తావించాడు. ''కోహ్లి సిక్స్ ప్రపంచకప్ చరిత్రలోనే హైలెట్గా నిలిచిపోతుంది. హారిస్ రౌఫ్ బౌలింగ్లో అతడి తల మీదుగా కోహ్లి కొట్టిన సిక్సర్ను అభిమానులు ఎప్పటికీ మరిచిపోలేరు. ఈ షాట్ గురించి అభిమానులు మాట్లాడుకుంటూనే ఉంటారు. పరిమిత ఓవర్ల క్రికెట్లో ఈ షాట్ గొప్పదని చెప్పలేం కానీ టి20 ప్రపంచకప్ వరకు వస్తే మాత్రం ఇది చరిత్రలో నిలిచిపోయే సిక్సర్'' అని పేర్కొన్నాడు. ఇక టి20 ప్రపంచకప్లో సూపర్-12 దశలో గ్రూప్-2 టాపర్గా నిలిచిన టీమిండియా సెమీస్లో అడుగుపెట్టింది. సెమీస్లో ఇంగ్లండ్తో గురువారం(నవంబర్ 10న) అమితుమీ తేల్చుకోనుంది. కేఎల్ రాహుల్ మంచి టచ్లో ఉండడం.. కోహ్లి, సూర్యకుమార్లు తమ కెరీర్లోనే అత్యుత్తమ ఫామ్ కనబరుస్తుండడం టీమిండియాకు సానుకూలాంశంగా మారింది. మొత్తంగా ఇంగ్లండ్ బౌలర్లకు, టీమిండియా బ్యాటర్లకు మధ్య సవాల్ అని చెప్పొచ్చు. చదవండి: Suryakumar Yadav: '360 డిగ్రీస్' రహస్యం చెప్పేసిన సూర్యకుమార్ -
WC 2022: టీమిండియాతో ఫైనల్ ఆడే జట్టు ఇదే: ఆసీస్ దిగ్గజం
ICC Mens T20 World Cup 2022- Final Prediction: టీ20 ప్రపంచకప్-2022 తుది అంకానికి చేరుకుంటోంది. సూపర్-12లో భాగమైన ఎనిమిది జట్లు సెమీస్ బెర్తు కోసం హోరాహోరీగా తలపడుతున్నాయి. మరోవైపు ఈ ఎడిషన్లో వర్షం సైతం జట్ల తలరాతను ప్రభావితం చేసే అంశంగా పరిణమించిన విషయం తెలిసిందే. ముఖ్యంగా గ్రూప్-2లో ఆదివారం(నవంబరు 6) నాటి మ్యాచ్లు ముగిసేదాకా సెమీస్ చేరే జట్లేవో చెప్పలేని పరిస్థితి. బుమ్రా లేకున్నా ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం రిక్కీ పాంటింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టీమిండియాతో పాటు ఫైనల్ చేరే జట్టు ఇదేనంటూ అంచనా వేశాడు. ఈ మేరకు ఐసీసీ వెబ్సైట్ కాలమ్లో.. ‘‘ఆస్ట్రేలియా కొన్ని విభాగాల్లో కాస్త వెనుకబడి ఉంది. మరోవైపు టీమిండియా జస్ప్రీత్ బుమ్రా సేవలు కోల్పోయింది. అయినప్పటికీ ఈ రెండు జట్లు తమ అత్యుత్తమ ప్రదర్శన కనబరిచేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తున్నాయి. ఫైనల్ మ్యాచ్ను నేరుగా వీక్షించేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నా. ఈ టోర్నీ ఆసాంతం స్టేడియం ప్రేక్షకులతో కిక్కిరిసిపోతోంది. కచ్చితంగా చెప్పలేం.. అయితే కొన్ని మ్యాచ్లకు అంతరాయం కలిగినా ఇండియా- పాకిస్తాన్ వంటి మ్యాచ్లు పూర్తి వినోదం అందించాయి. నిజానికి ఫైనల్ ఆడేందుకు మెల్బోర్న్కు ఏ జట్లు వెళ్తాయో ఎవరూ కరెక్ట్గా చెప్పలేరు. అయితే, ఆస్ట్రేలియా తన మార్గాన్ని సుగమం చేసుకుంటుందని భావిస్తున్నా. సౌతాఫ్రికా కూడా ప్రమాదకర జట్టే. అయితే, నేను ముందు నుంచి చెప్తున్నట్లుగానే ఇండియా- ఆస్ట్రేలియా మధ్యే ఫైనల్ జరుగుతుందని అనుకుంటున్నా’’ అని పాంటింగ్ రాసుకొచ్చాడు. కాగా గ్రూప్-2లో ఉన్న టీమిండియా ఇప్పటి వరకు ఆడిన 4 మ్యాచ్లలో 3 గెలిచి ఆరు పాయింట్లతో టాపర్గా ఉండగా.. గ్రూప్-1లో ఆస్ట్రేలియా నాలుగింట రెండు గెలిచి ఐదు పాయింట్లతో ప్రస్తుతం మూడో స్థానంలో ఉంది. ఇక ఇదే గ్రూపులో ఉన్న న్యూజిలాండ్ మెరుగైన రన్రేటుతో 7 పాయింట్లతో టాపర్గా కొనసాగుతోంది. మరోవైపు ఇంగ్లండ్ ఆసీస్ కంటే మెరుగైన రన్రేటుతో ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆసీస్ సెమీస్ చేరడమే కష్టంగా మారనుంది. ఈ నేపథ్యంలో పాంటింగ్ ఈ మేరకు వ్యాఖ్యలు చేయడం గమనార్హం. కాగా నవంబరు 13న మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ వేదికగా ప్రపంచకప్ ఫైనల్ నిర్వహణకు షెడ్యూల్ ఖరారైన విషయం తెలిసిందే. చదవండి: NZ Vs IRE: ప్రపంచ రికార్డు నెలకొల్పిన ఐరిష్ బౌలర్! భువీని సైతం వెనక్కి నెట్టి ఐసీసీ భారత్కు సపోర్ట్ చేస్తోంది.. వారికి ఉత్తమ అంపైర్ అవార్డులు ఇవ్వాలంటూ పాక్ మాజీ ప్లేయర్ అక్కసు -
'మ్యాచ్లో చెలరేగడానికి పాంటింగ్ వీడియోనే స్పూర్తి'
సికిందర్ రజా.. ఇప్పుడు ఒక సంచలనం. పాకిస్తాన్ మూలాలున్న జింబాబ్వే క్రికెటర్. టి20 ప్రపంచకప్లో గురువారం పాకిస్తాన్ను ఒక్క పరుగు తేడాతో చిత్తు చేయడంలో రజా పాత్ర మరువలేనిది. మ్యాచ్ దాదాపు పాకిస్తాన్వైపు తిరిగింది అనుకున్న తరుణంలో సికందర్ రజా అద్భుతం చేశాడు. ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీయడంతో పాటు తన మరుసటి ఓవర్లో మరో వికెట్ పడగొట్టి మ్యాచ్ను మలుపు తిప్పాడు. రజా ఔట్ చేసింది షాదాబ్ ఖాన్, హైదర్ అలీ, షాన్ మసూద్లు. ఈ ముగ్గురు మ్యాచ్ను ఏ క్షణంలోనైనా మలుపు తిప్పగల సమర్థులు. వీరిని ఔట్ చేశాడు గనుకనే రజా అంత ఫేమస్ అయ్యాడు. ఇక సికందర్ రజా మ్యాచ్లో అంతగా రెచ్చిపోవడం వెనుక ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ పాంటింగ్ ఉన్నాడంటే నమ్ముతారా. అయితే అది కేవలం వీడియో రూపంలోనే. అవునండీ సికందర్ రజా ప్రదర్శనకు పాంటింగ్ వీడియోనే ప్రేరణ. మరి రజాకు అంతలా స్పూర్తినిచ్చేలా ఆ వీడియోలో ఏముంది అనేది ఆసక్తి కలిగించింది. అయితే పాకిస్తాన్, జింబాబ్వే మ్యాచ్కు ముందు పాంటింగ్.. జింబాబ్వే ఆటగాళ్లనుద్దేశించి స్పూర్తినిచ్చే వ్యాఖ్యలు చేశాడు. ''నాకు తెలిసిన ఆటగాళ్లకు ఆల్ ది బెస్ట్.. తెలియని ఆటగాళ్లు బాగా రాణించాలని కోరకుంటున్నా. ఒత్తడిని తట్టుకొని మీరు విజయం సాధించాలని కోరుకుంటున్నా'' అంటూ తెలిపాడు. పాంటింగ్ వ్యాఖ్యలను తాను స్పూర్తిగా తీసుకున్నట్లు సికిందర్ రజా మ్యాచ్ అనంతరం తెలిపాడు. ''నేను చాలా ఉత్సాహంగా ఉన్నా. మ్యాచ్కు ముందు రికీ పాంటింగ్ వీడియో క్లిప్ చూశా. ఆయన వ్యాఖ్యలు నాకు బాగా నచ్చాయి. ఎందుకో ఆయన వ్యాఖ్యలు ఆదర్శంగా తీసుకొని రాణించాలనుకున్నా. అన్నీ కలిసొచ్చి.. మ్యాచ్ విజయంలో కీలకపాత్ర పోషించా. అందుకు పాంటింగ్కు థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఇక మ్యాచ్ విజయం అనంతరం కొంత మంది మిత్రులు, బంధువులు మెసేజ్ చేయడం నా కంట్లో నీరు తెప్పించింది.'' అంటూ చెప్పుకొచ్చాడు. పాకిస్తాన్పై సంచలన విజయం నమోదు చేసిన జింబాబ్వే తమ తర్వాతి మ్యాచ్ అక్టోబర్ 30న(ఆదివారం) బంగ్లాదేశ్తో ఆడనుంది. అదే రోజు టీమిండియా.. సౌతాఫ్రికాతో, పాకిస్తాన్ నెదర్లాండ్స్తో అమితుమీ తేల్చుకోనున్నాయి. చదవండి: సౌతాఫ్రికాలో పుట్టి నెదర్లాండ్స్ తరపున ఆడి; తాజాగా కివీస్కు టి20 ప్రపంచకప్లో దుమ్మురేపుతున్న వరుణుడు.. పాక్ మూలాలున్న క్రికెటర్ ముచ్చెమటలు పట్టించాడు -
కోహ్లి లాంటి ఆటగాడిని మళ్లీ చూస్తానో లేదో తెలియదు: పాంటింగ్
టీమిండియా స్టార్ ఆటగాడు, రన్ మిషన్ విరాట్ కోహ్లి తిరిగి తన పూర్వ వైభవాన్ని పొందాడు. ఆసియాకప్-2022లో ఆఫ్గానిస్తాన్పై అద్భుతమైన సెంచరీ తర్వాత.. కోహ్లి జోరుకు బ్రేక్లు లేవు. సొంత గడ్డపై ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్లలో అదరగొట్టిన కోహ్లి.. ఇప్పడు టీ20 ప్రపంచకప్లో సత్తా చాటేందుకు సిద్దమవుతున్నాడు. టీ20 ప్రపంచకప్ సన్నాహకాల్లో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన వార్మప్ మ్యాచ్లో బ్యాటింగ్లో విఫలమైనప్పటికీ.. ఫీల్డింగ్లో మాత్రం కోహ్లి దుమ్ము రేపాడు. ఓ సంచలన క్యాచ్, రనౌట్తో భారత విజయంలో కింగ్ కీలక పాత్ర పోషించాడు. ఇక ఇది ఇలా ఉండగా.. విరాట్ కోహ్లిపై ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాటింగ్ ప్రశంసల జల్లు కురింపించాడు. వైట్ బాల్ క్రికెట్లో కోహ్లి లాంటి ఆటగాడిని మళ్లీ చూస్తానో లేదో తెలియదని పాంటింగ్ అన్నాడు. ప్రస్తుతం పాంటింగ్ టీ20 ప్రపంచకప్-22లో కామెంటేటర్గా వ్యవహరిస్తున్నాడు. భారత్, ఆస్ట్రేలియా వార్మప్ మ్యాచ్ సందర్భంగా పాంటింగ్ ఈ వాఖ్యలు చేశాడు. "విరాట్ సారధిగా జట్టును విజయ ఫథంలో నడిపించాడు. నిజంగా అతడి కెప్టెన్సీలో ఆస్ట్రేలియా గడ్డపై టెస్టు సిరీస్ గెలవడం అద్భుతం. పరిమిత ఓవర్ల క్రికెట్లో కోహ్లి లాంటి ఆటగాడిని చూస్తానో లేదో ఖచ్చితంగా తెలియదు. ముఖ్యంగా వన్డే క్రికెట్లో కోహ్లి రికార్డులు అద్భుతమైనవి" అని పాంటింగ్ పేర్కొన్నాడు. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4911494512.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); చదవండి: BCCI New President: గంగూలీకి బైబై! బీసీసీఐ 36వ అధ్యక్షుడిగా రోజర్ బిన్నీ -
'మూడేళ్ల క్రితం ఈ ప్రశ్న అడిగి ఉంటే..'
టీమిండియా దిగ్గజం సచిన్ టెండూల్కర్ వంద సెంచరీల రికార్డును అందుకోవడం ఇప్పట్లో కష్టమే. కానీ ఆ ఫీట్ను అందుకునే అవకాశం మాత్రం ఈ తరంలో ఒక్కడికే ఉంది. అతనెవరో కాదు.. టీమిండియా రన్మెషిన్ విరాట్ కోహ్లి. కోహ్లి ఖాతాలో 71 సెంచరీలు ఉన్నప్పటికి.. సచిన్ రికార్డు బద్దలు కొంటాలంటే మరో 30 సెంచరీలు చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడున్న ఫామ్ దృష్యా కోహ్లికి ఇది పెద్ద సమస్య కాకపోవచ్చు. కానీ వింటేజ్ కోహ్లిని చూసి చాలా కాలమైపోయింది. ఇటీవలే ఆసియా కప్లో అఫ్గనిస్తాన్పై టి20ల్లో తొలి సెంచరీ.. మొత్తంగా 71వ సెంచరీ సాధించినప్పటికి.. కోహ్లి ఫామ్పై కొంత అనుమానం మిగిలే ఉంది. ఆసియా కప్లో చూపించిన ఫామ్ను కోహ్లి రాబోయే మ్యాచ్ల్లో చూపిస్తాడా అనేది ఆసక్తికరంగా మారింది. 33 ఏళ్ల వయసున్న కోహ్లి.. మరో నాలుగైదేళ్లు క్రికెట్ ఆడే సత్తా ఉంది. కానీ ఈ నాలుగేళ్లలో అతను సచిన్ వంద సెంచరీల రికార్డును అందుకోగలడా అనేది సందేహంగా మారింది. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ రికీ పాంటింగ్ కోహ్లి వంద సెంచరీల రికార్డును బద్దలు కొడతాడా అనేదానిపై ఆసక్తికరంగా స్పందించాడు. ''మూడేళ్ల క్రితం ఈ ప్రశ్న అడిగి ఉంటే కచ్చితంగా సాధించేవాడని చెప్పేవాడిని. కానీ కోహ్లి ఇప్పుడు కాస్త నెమ్మదించాడు. కోహ్లి సచిన్ను అధిగమించాలంటే మరో 30 సెంచరీలు చేయాల్సి ఉంది. ఇది కాస్త కష్టమైనప్పటికి కోహ్లికి సచిన్ వంద సెంచరీల రికార్డును బద్దలు కొట్టే అవకాశం ఇంకా ఉంది. ఇందులో ఎలాంటి అనుమానం లేదు. కోహ్లి వయసు 33 ఏళ్లు.. మరో నాలుగైదేళ్లు అతనిలో క్రికెట్ ఆడే సత్తా ఉంది. ఇప్పటికి 71 శతకాలు సాధించాడు. అతను రికార్డులు సాధిస్తాడని చెప్పలేం.. ఎందుకంటే ఎన్ని రికార్డులు సాధించినా అతని దాహం తీరనిదే.'' అంటూ పాంటింగ్ చెప్పుకొచ్చాడు. చదవండి: 'అలా అనుకుంటే ఎవరు పర్ఫెక్ట్గా లేరు.. ఇప్పుడేంటి?' -
రోహిత్, కోహ్లి కాదు.. వరల్డ్ టాప్-5 టీ20 ఆటగాళ్లు వీరే!
Ricky Ponting Picks Two Indians In World T20I Top 5 List: ఆస్ట్రేలియా వేదికగా జరగన్న టీ20 ప్రపంచకప్-2022కు సమయం దగ్గర పడతుండడంతో ఆయా జట్లు తమ ప్రణాళికలు రచిస్తున్నాయి. ఇందులో భాగంగానే ఈ మెగా ఈవెంట్కు ముందు ధ్వైపాక్షిక సిరీస్లతో జట్లు బీజీ బీజీగా గడపనునున్నాయి. ఇక భారత విషయానికి వస్తే.. ప్రపంచకప్ ముందు ప్రస్తుత జరుగుతున్న ఆసియాకప్తో పాటు స్వదేశంలో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్లు ఆడనుంది. కాగా 2013 ఛాంపియన్స్ ట్రోఫీ కైవసం చేసుకున్న తర్వాత ఇప్పటి వరకు భారత్ ఒక్క ఐసీసీ టైటిల్ కూడా గెలవలేదు. కాబట్టి ఈ ఏడాది జరగనున్న టీ20 ప్రపంచకప్లో గెలిచి భారత్కు టైటిల్ అందించాలని రోహిత్ సేన ఉవ్విళ్లూరుతోంది. ఇక ఇది ఇలా ఉండగా.. 'ఐసీసీ రివ్యూ' షో పాల్గొన్న ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్కు ఓ కఠినమైన ప్రశ్న ఎదురైంది. ప్రస్తుతం ప్రపంచ టీ20 క్రికెట్లో టాప్- ఫైవ్ ప్లేయర్ల పేర్లు చెప్పమని ఆడగగా.. పాంటింగ్ తన మొదటి ఎంపికగా భారత స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యాను ఎంచుకున్నాడు. అదే విధంగా మిగితా నాలుగు స్ధానాల్లో టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా, ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్, పాకిస్తాన్ సారథి బాబర్ ఆజాం, ఆఫ్గానిస్తాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్ను ఎంపిక చేశాడు. చదవండి: Asia Cup 2022 IND VS SL Super 4 Match: పంత్, చహల్లను పక్కకు పెట్టడమే ఉత్తమం..! -
ఏ జట్టులోనైనా సూర్యకు చోటు ఖాయం.. ఎందుకంటే: ఆసీస్ దిగ్గజం
దుబాయ్: భారత బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్పై ఆస్ట్రేలియా దిగ్గజం రికీ పాంటింగ్ ప్రశంసలు కురిపించాడు. అతని ఆట తనను ఎంతో ఆకట్టుకుందని, విధ్వంసకర శైలి ఏబీ డివిలియర్స్ను గుర్తుకు తెస్తోందని పాంటింగ్ అన్నాడు. భారత జట్టు తరఫున అతను నాలుగో స్థానంలో ఆడటమే సరైందని పాంటింగ్ సూచించాడు. ‘సూర్యకుమార్ కూడా డివిలియర్స్ తరహాలోనే మైదానమంతా 360 డిగ్రీ షాట్లు ఆడతాడు. ల్యాప్ షాట్, కట్ షాట్, ర్యాంప్ షాట్ల గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది. లెగ్సైడ్ వైపు మరింత అద్భుతంగా ఆడే సూర్య అటు పేస్ బౌలింగ్, ఇటు స్పిన్ను సమర్థంగా ఎదుర్కోగలడు. ఏ జట్టులోనైనా సూర్యకు చోటు ఖాయం. షాట్లు ఆడే సమయంలో ఎక్కడా వెనక్కి తగ్గకుండా ఆడే సూర్యకుమార్ ఆత్మవిశ్వాసం నన్ను ఆకర్షించింది. నాకు తెలిసి అతను మిడిలార్డర్లో ఆడటం సరైంది. మ్యాచ్ను సరిగా నడిపించడంతో పాటు చివర్లో క్రీజ్లో ఉంటే చెలరేగిపోగలడు’ అని ఆసీస్ మాజీ కెప్టెన్ విశ్లేషించాడు. చదవండి: Hasin Jahan: ఇండియా పేరు మార్చండి.. ప్రధాని మోదీకి క్రికెటర్ షమీ ‘భార్య’ అభ్యర్ధన -
మ్యాచ్కు 15 రోజులుంది.. అప్పుడే జోస్యం చెప్పిన పాంటింగ్
చిరకాల ప్రత్యర్థులైన భారత్, పాకిస్తాన్ మ్యాచ్ అంటే ఎనలేని క్రేజ్. ఎన్నిసార్లు చెప్పుకున్నా బోర్ కొట్టని అంశం కూడా. ఈ చిరకాల ప్రత్యర్థులు తలపడుతున్నారంటే టీఆర్పీ రేటింగ్స్ బద్దలవడం ఖాయం. దాయాదుల సమరాన్ని ఇరుదేశాల అభిమానులు కన్నార్పకుండా చూస్తారు. అలాంటి అవకాశం మరోసారి ఆసియాకప్ రూపంలో వచ్చింది. ఆగస్టు 28న దుబాయ్ వేదికగా ఇరుజట్లు మరోసారి అమితుమీ తేల్చుకోనున్నాయి. ఎవరు గెలిస్తారన్న దానిపై భారీ అంచనాలు ఉండడం సహజం. టీమిండియా ఫెవరెట్ అని కొందరంటే.. లేదు ఈసారి పాకిస్తాన్దే విజయం అని మరికొందరు జోస్యం చెబుతుంటారు. మ్యాచ్ జరిగేంతవరకు ఇలాంటి జోస్యాలు ఎన్నో వస్తూనే ఉంటాయి. మరి అంత క్రేజ్ ఉన్న భారత-పాకిస్తాన్ మ్యాచ్లో ఎవరో గెలుస్తారనే దానిపై మాజీ క్రికెటర్లు కూడా తమకు నచ్చింది చెబుతుంటారు. తాజాగా ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు రికీ పాంటింగ్ ఆసియా కప్లో భారత్- పాకిస్తాన్ మధ్య విజేత ఎవరనేది జోస్యం చెప్పాడు. ''ఇంకో 15-20 ఏళ్లయినా సరే.. భారత్, పాకిస్తాన్ మ్యాచ్కున్న క్రేజ్ పోవడం కష్టం. క్రికెట్ చరిత్రలో ఈ ఇరుజట్లు ఎప్పటికి చిరకాల ప్రత్యర్థులుగానే అభిమానులు చూస్తారు. ఒక క్రికెట్ లవర్గా నేను చెప్పేదేం ఏంటేంటే.. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్లను కూడా చిరకాల ప్రత్యర్థులగానే చూస్తారు. కానీ యాషెస్ లాంటి టెస్టు సిరీస్కు మాత్రమే ఇది పరిమితం. కానీ భారత్, పాకిస్తాన్ మధ్య ఉన్న ఆధిపత్య దోరణి అలా ఉండదు. వన్డే, టెస్టు, టి20 ఇలా ఏదైనా చిరకాల ప్రత్యర్థులుగానే ఉంటారు. అందుకే ఈ మ్యాచ్కు ఇంత క్రేజ్ ఉంటుంది. ఇక ఆసియాకప్లో విజేత ఎవరంటే చెప్పడం కష్టమే. ఎందుకంటే ప్రపంచకప్ లాంటి మేజర్ టోర్నీలో పాకిస్తాన్పై భారత్ ఆధిపత్యం ఎక్కువగా ఉంటే.. ఆసియా కప్లో మాత్రం ఇరుజట్లు పోటాపోటీగా ఉన్నాయి. ఇప్పటివరకు ఆసియా కప్లో 13 సార్లు తలపడితే.. భారత్ ఏడు గెలిస్తే.. పాకిస్తాన్ ఐదు గెలవగా.. ఒక మ్యాచ్ ఫలితం రాలేదు. కానీ నా ఓటు టీమిండియాకే వేస్తున్నా. ఆగస్టు 28న జరగబోయే మ్యాచ్లో టీమిండియానే ఫెవరెట్గా కనిపిస్తోంది. ఈ మధ్యకాలంలో పాకిస్తాన్ మంచి ఆటను కనబరుస్తున్నప్పటికి ఒత్తిడిలో చిత్తవుతుందేమో అనిపిస్తుంది. ఇరుజట్ల ఆటగాళ్ల ప్రతిభకు కొదువ లేనప్పటికి.. నా దృష్టిలో మాత్రం భారత్ ఫెవరెట్గా కనిపిస్తోంది. ఇక ఆసియాకప్కు ఎంపిక చేసిన భారత్ జట్టు కూడా సమతుల్యంగా ఉంది. ఈ క్యాలెండర్ ఇయర్లో హెవీ రొటేషన్లోనూ భారత్ 21 మ్యాచ్ల్లో 17 మ్యాచ్లు గెలిచింది. కెప్టెన్లు మారినా టీమిండియా సక్సెస్ మాత్రం ఎక్కడా ఆగలేదు. బుమ్రా లాంటి వరల్డ్ క్లాస్ బౌలర్ దూరమైనప్పటికి బౌలింగ్ టీమ్ పటిష్టంగా ఉండడం సానుకూలాంశం. రానున్న టి20 ప్రపంచకప్ దృష్టిలో పెట్టుకొని చూస్తే ఆసియా కప్ టీమిండియాకు మంచి ప్రాక్టీస్లా ఉపయోగపడనుంది.'' అంటూ చెప్పుకొచ్చాడు. -
'డబ్ల్యూటీసీ ఫైనల్స్కు ఆస్ట్రేలియా చేరాలంటే భారత్ సిరీస్ కీలకం'
ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ (2021-23)లో భాగంగా వచ్చే ఏడాది భారత పర్యటనకు ఆస్ట్రేలియా రానుంది. ఈ పర్యటనలో భాగంగా టీమిండియాతో ఆసీస్ నాలుగు మ్యాచ్ల టెస్టు సిరీస్లో తలపడనుంది. ఇక ఇరు జట్ల మధ్య తొలి టెస్టు మార్చి 3న న్యూఢిల్లీ వేదికగా జరగనుంది. ఈ క్రమంలో డబ్ల్యూటీసీ ఫైనల్స్కు ఆస్ట్రేలియా, భారత్ జట్లు అర్హత సాధించే అవకాశాలు ఈ సిరీస్పై ఆధారపడి ఉంటాయని ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ అభిప్రాయపడ్డాడు. కాగా ప్రస్తుతం డబ్ల్యూటీసీ పాయిట్ల పట్టికలో ఆస్ట్రేలియా రెండో స్థానంలో ఉండగా, పట్టికలో భారత్ నాలుగో స్థానంలో ఉంది. ఇక బోర్డర్-గవాస్కర్ సిరీస్కు ముందు బంగ్లాదేశ్తో టెస్టు సిరీస్లో భారత్ తలపడనుంది. అదే విధంగా భారత పర్యటనను ముగించుకున్న తర్వాత ఆస్ట్రేలియ స్వదేశంలో వెస్టిండీస్, దక్షిణాఫ్రికా జట్లతో ఆడనుంది. "డబ్ల్యూటీసీ ఫైనల్స్కు అర్హత సాధించాలంటే బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ ఆస్ట్రేలియా, భారత్ జట్లకు చాలా కీలకం. ఈ సిరీస్ కోసం నేను ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. భారత్-ఆసీస్ మధ్య పోటీ చాలా రసవత్తరంగా ఉంటుంది. అది ఆస్ట్రేలియాలో జరిగినా, భారత్లో జరిగినా పోటీ మాత్రం తప్పదు. రెండు జట్ల మధ్య పోటీ ప్రతీ ఏటా మరింత పెరుగుతోంది" అని పాంటింగ్ పేర్కొన్నాడు. అదే విదంగా ఆసీస్ ఆటగాళ్లు మార్నస్ లాబుషేన్, స్టీవ్ స్మిత్లపై పాంటింగ్ ప్రశంసల వర్షం కురిపించాడు. "లాబుషేన్, స్టీవ్ స్మిత్ ఇద్దరూ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్లో ఉన్నారు. శ్రీలంకపై వీరిద్దరూ సెంచరీలతో చెలరేగారు. భారత పర్యటనలో కూడా ఆసీస్ జట్టుకు వీరిద్దరూ కీలకం కానున్నారు" అని పాంటింగ్ తెలిపాడు. చదవండి: Updated WTC Points Table: పాకిస్తాన్కు శ్రీలంక షాక్.. టీమిండియా తర్వాతి స్థానంలో బాబర్ ఆజం బృందం! -
టీ20 వరల్డ్కప్ గెలవబోయేది ఆ జట్టే.. ఇంగ్లండ్, టీమిండియాలకు కూడా ఛాన్స్ ఉంది..!
Ricky Ponting: ఈ ఏడాది చివర్లో (అక్టోబర్, నవంబర్) జరిగే పొట్టి ప్రపంచకప్లో విజేత ఎవరనే అంశంపై చర్చ అప్పుడే మొదలైంది. ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ ఈ ఆసక్తికర డిబేట్కు తెర లేపాడు. 2022 టీ20 వరల్డ్కప్ విజేత ఎవరో తేల్చేయడంతో పాటు ఫైనల్, సెమీఫైనల్స్కు చేరే జట్లను కన్ఫర్మ్ చేశాడు. అందుకు ఆయా జట్లకు గల అవకాశాలను, కారణాలను విశ్లేషించాడు. ఈసారి ప్రపంచకప్ గెలవాలంటే అదృష్టం కూడా కలిసిరావాలని అభిప్రాయపడ్డాడు. హోమ్ అడ్వాంటేజ్తో పాటు పటిష్టమైన జట్టును కలిగిన ఆసీస్కే ఈ ఏడాది ప్రపంచకప్ గెలిచి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని జోస్యం చెప్పాడు. ఫైనల్లో టీమిండియాపై గెలిచి ఆసీస్ ప్రపంచ ఛాంపియన్ హోదాను నిలబెట్టుకుంటుందని అన్నాడు. ఫైనల్ రేసులో ఇంగ్లండ్ అవకాశాలను కూడా కొట్టిపారేయలేమంటూనే.. భారత్, ఇంగ్లండ్, ఆసీస్లలో ఏ జట్టు ఫైనల్కు చేరినా అంతిమ విజయం మాత్రం ఆసీస్దేనని గొప్పలు పోయాడు. ప్రస్తుతం టీ20 ఫార్మాట్లో ఇంగ్లండ్ను మించిన జట్టు లేదంటూనే.. ఆ జట్టుకు కొన్ని బలహీనతలు ఉన్నాయని తెలిపాడు. ఆ జట్టు వైట్ బాల్ కోచ్ మాథ్యూ మాట్ గైడెన్స్ను ఈ సందర్భంగా కొనియాడాడు. ఫైనల్ ఫోర్లో నాలుగో జట్టుగా సౌతాఫ్రికాకు అవకాశం ఉందని అన్నాడు. పాక్, న్యూజిలాండ్లు కూడా బలమైన బృందాన్నే కలిగినప్పటికీ.. ఆ జట్లకు అదృష్టం కలిసిరాదని అభిప్రాయపడ్డాడు. చదవండి: టీమిండియా మెంటల్ హెల్త్ కోచ్గా మళ్లీ అతనే..! -
ఆ యువ ఆటగాడు సైమండ్స్ను గుర్తు చేస్తున్నాడు: రికీ పాంటింగ్
యువ ఆటగాడు టిమ్ డేవిడ్పై ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ ప్రశంసల వర్షం కురిపించాడు. టిమ్ డేవిడ్ తన ఆటతీరుతో ఆసీస్ మాజీ ఆల్ రౌండర్, దివంగత ఆండ్రూ సైమండ్స్ను గుర్తుకు తెస్తున్నాడని పాంటింగ్ కొనియాడాడు. అదే విధంగా ఈ ఏడాది జరగనున్న టీ20 ప్రపంచకప్ ఆసీస్ జట్టులో డేవిడ్ ఖచ్చితంగా ఉండాలని పాంటింగ్ అభిప్రాయపడ్డాడు. కాగా సింగపూర్లో జన్మించిన టిమ్ డేవిడ్ ప్రస్తుతం ఆస్ట్రేలియా తరపున ఆడేందుకు ఎదురుచేస్తున్నాడు. ప్రపంచవ్యాప్తంగా వివిధ టీ20 లీగ్లలో డేవిడ్ అద్భుతంగా రాణిస్తున్నాడు. ఈ ఏడాది ఐపీఎల్ ముంబై ఇండియన్స్ తరపున ఆడిన డేవిడ్ అకట్టుకున్నాడు. కాగా ఐపీఎల్ మెగా వేలంలో డేవిడ్ను ముంబై ఏకంగా 8.25 కోట్ల భారీ దక్కించుకోంది. అయితే గత కొంత కాలంగా డేవిడ్ టీ20 క్రికెట్లో అద్భుతంగా రాణిస్తున్నా.. ఆస్ట్రేలియా జాతీయ ఇంకా చోటు దక్కలేదు. ఈ నేపథ్యంలో పాంటింగ్ మాట్లాడుతూ.. "నేను సెలెక్టర్గా ఉన్నట్లయితే.. ఇప్పటికే డెవిడ్ను ఎంపిక చేసేవాడిని. అతడు అద్భుతమైన మ్యాచ్ ఫినిషర్. అటువంటి ఆటగాడు ఇప్పటికే జట్టులో ఉండాలి. అతడిని టీ20 ప్రపంచకప్-2022కు ఎంపిక చేయండి. డేవిడ్ నా సహచరుడు సైమండ్స్ను గుర్తుచేస్తున్నాడు. 2003 వన్డే ప్రపంచ కప్లో సైమండ్స్ ఏ విధంగా అయితే రాణించాడో.. ఇప్పడు డేవిడ్ కూడా అదే చేయగలడని నేను భావిస్తున్నాను. అతడిని జట్టులోకి తీసుకుంటే ఆస్ట్రేలియా ప్రపంచకప్ను గెలుచుకునే అవకాశం ఉంటుంది. కాగా ఆస్ట్రేలియా జట్టులో మిడిల్ ఆర్డర్లో అద్బుతమైన ఆటగాళ్లు ఉన్నారని నాకు తెలుసు. కానీ గత రెండేళ్లుగా డేవిడ్ కూడా టీ20ల్లో అత్యుత్తమంగా రాణిస్తున్నాడు. కాబట్టి ఒక్కసారైనా అతడికి ఆడే అవకాశం ఇవ్వాలి అని పాంటింగ్ పేర్కొన్నాడు. చదవండి: IND vs WI: వెస్టిండీస్తో రెండో వన్డే.. ప్రపంచ రికార్డుకు చేరువలో భారత్..! -
T20 WC 2022: ఇషాన్ కిషన్ వద్దు.. పంత్, డీకే ఉంటే బెటర్!
T20 World Cup 2022: టీ20 ప్రపంచకప్-2022 టోర్నీకి సమయం ఆసన్నమవుతున్న తరుణంలో టీమిండియా బ్యాటింగ్ లైనప్ గురించి ఆస్ట్రేలియా దిగ్గజం రిక్కీ పాంటింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ముఖ్యంగా ఐసీసీ టోర్నీలో వెటరన్ బ్యాటర్ దినేశ్ కార్తిక్, స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా ఫినిషర్లుగా కీలక పాత్ర పోషించగలరని అంచనా వేశాడు. ఇక వీరికి యువ వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ తోడైతే టీమిండియాను ఎదుర్కోవడం ప్రత్యర్థి జట్లకు అంత తేలికేమీ కాదని అభిప్రాయపడ్డాడు. ఇంతమంది ఉన్నారు కాబట్టే! కాగా ఆస్ట్రేలియా వేదికగా అక్టోబరు 16 నుంచి పొట్టి ఫార్మాట్ ప్రపంచకప్ టోర్నీ ఆరంభం కానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పటికే పలు దేశాల క్రికెట్ బోర్డులు మెగా ఈవెంట్కు పంపాల్సిన జట్లపై కసరత్తులు చేస్తున్నాయి. బెంచ్ స్ట్రెంత్ పరీక్షిస్తున్నాయి. అయితే, ఓవైపు దినేశ్ కార్తిక్ వంటి వెటరన్ ప్లేయర్లు రాణించడం.. మరోవైపు యువ ఆటగాళ్లు దూసుకువస్తున్న తరుణంలో.. టీమిండియా ఎంపిక కాస్త కష్టతరంగా మారింది. రెండేసి జట్లతో వేర్వేరు దేశాలతో సిరీస్లు ఆడుతున్న తరుణంలో చాలా మంది ఆటగాళ్లకు తమను తాము నిరూపించుకునే అవకాశం లభిస్తోంది. ఈ నేపథ్యంలో భారత జట్టులో పోటీ తీవ్రతరమైంది. ఇక స్వదేశంలో దక్షిణాఫ్రికాతో సిరీస్కు కెప్టెన్గా వ్యవహరించిన పంత్ బ్యాటర్గా విఫలం కావడంతో అతడిని ప్రపంచకప్ జట్టుకు సెలక్ట్ చేయవద్దంటూ కొందరు మాజీ క్రికెటర్లు అభిప్రాయపడ్డారు. ఇక ఇంగ్లండ్తో టీ20 సిరీస్లో ఆఖరి రెండు మ్యాచ్లలో ఓపెనర్గా దిగిన పంత్.. వరుసగా 26, ఒక పరుగు సాధించాడు. అయితే, మూడో వన్డేలో మాత్రం అజేయ సెంచరీతో సత్తా చాటాడు. మరోవైపు.. సూర్యకుమార్ యాదవ్ ఇంగ్లండ్పై పొట్టి ఫార్మాట్ తొలి సెంచరీ సాధించి తానూ రేసులో ఉన్న విషయాన్ని మరోసారి గుర్తుచేశాడు. ఇషాన్ వద్దు.. పంత్, డీకే ఉండాలి! ఈ నేపథ్యంలో రిక్కీ పాంటింగ్ మాట్లాడుతూ.. ‘‘రిషభ్ పంత్ వన్డే ఫార్మాట్లో ఎలా ఆడగలడో మరోసారి నిరూపించుకున్నాడు. అదే విధంగా టీ20 ఫార్మాట్లోనూ తను సత్తా చాటగలడు. ఇక ఇటీవల ముగిసిన ఐపీఎల్ తాజా సీజన్లో దినేశ్ కార్తిక్ అత్యుత్తమ ప్రదర్శన కనబరిచాడు. నా ప్రపంచకప్ జట్టులో వాళ్లిద్దరికీ తప్పక చోటు ఉంటుంది. రిషభ్ మూడు నాలుగు లేదంటే ఐదో స్థానంలో వచ్చినా.. దినేశ్, హార్దిక్ ఫినిషర్లుగా రాణించగలరు. వీళ్లు ముగ్గురూ చెలరేగితే టీమిండియా మరింత ప్రమాదకర జట్టుగా మారుతుందనడంలో సందేహం లేదు’’ అని పేర్కొన్నాడు. అయితే, ఇషాన్ కిషన్కు జట్టులో స్థానం కష్టమన్న పాంటింగ్.. శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ మధ్య కూడా పోటీ తీవ్రంగా ఉంటుందని అభిప్రాయపడ్డాడు. తాజా ఫామ్ ప్రకారం వీళ్లిద్దరి కంటే సూర్య ముందుంటాడన్నాడు. నిజానికి జట్టులో ఇలా ఎక్కువ మంది ప్రతిభావంతులైన ఆటగాళ్లు ఉంటే సెలక్టర్లకు తలనొప్పులు తప్పవని పాంటింగ్ పేర్కొన్నాడు. ఇక వికెట్ కీపర్ బ్యాటర్లలో తానైతే ఇషాన్ను కాదని పంత్, డీకేలకే ఓటు వేస్తానని పాంటింగ్ తెలిపాడు. చదవండి: IND Vs ZIM: జింబాబ్వేతో వన్డే సిరీస్.. టీమిండియా కెప్టెన్గా కేఎల్ రాహుల్..! -
'అతడు టీ20 ప్రపంచకప్లో టీమిండియాకు బెస్ట్ ఫినిషర్ అవుతాడు'
టీమిండియా వెటరన్ ఆటగాడు దినేష్ కార్తీక్పై ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ ప్రశంసలు వర్షం కురిపించాడు. ఈ ఏడాది ఆక్టోబర్లో ఆస్ట్రేలియా వేదికగా జరుగనున్న టీ20 ప్రపంచకప్కు భారత జట్టులో కార్తీక్కు కచ్చితంగా చోటు దక్కుతందని పాంటింగ్ ధీమా వ్యక్తం చేశాడు. ఇక ఐపీఎల్-2022లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచిన కార్తీక్ భారత జట్టులోకి రీఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం దక్షిణాఫ్రికాతో జరుగుతున్నటీ20 సిరీస్లో టీమిండియాలో భాగంగా ఉన్నాడు. ఇక ఈ ఏడాది సీజన్లో ఆర్సీబీ తరపున ఆడిన కార్తీక్.. జట్టుకు అత్యుత్తమ ఫినిషర్గా మారాడు. 16 మ్యాచ్లు ఆడిన డీకే 330 పరుగులు సాధించాడు. ఈ నేపథ్యంలో రికీ పాంటింగ్ మాట్లాడుతూ.. "కార్తీక్కు టీ20 ప్రపంచకప్కు భారత జట్టులో చోటు దక్కుతుందని భావిస్తున్నాను. అతడు ఐదు లేదా ఆరో స్థానంలో అత్యుత్తమంగా బ్యాటింగ్ చేయగలడు. ఈ ఏడాది ఆర్సీబీ తరపున కార్తీక్ మ్యాచ్లు ఫినిష్ చేసిన విధానం అద్భుతమైనది. సీజన్ అంతటా కార్తీక్ మెరుగైన ప్రదర్శన చేశాడు. అదే విధంగా టీ20 ప్రపంచకప్లో కూడా కార్తీక్ టీమిండియాకు బెస్ట్ ఫినిషర్ పాత్ర పోషిస్తాడని నేను అశిస్తున్నా" అని పేర్కొన్నాడు. చదవండి: టీ20 ప్రపంచకప్కు ఉమ్రాన్ మాలిక్ను ఎంపిక చేయవద్దు: రవిశాస్త్రి -
'మా జట్టు ప్లేఆఫ్స్ చేరకపోవడం సిగ్గుగా అనిపించింది'
ఇటీవల ముగిసిన ఐపీఎల్-2022లో ఢిల్లీ క్యాపిటల్స్ లీగ్ దశలోనే ఇంటిముఖం పట్టిన సంగతి తెలిసిందే. ప్లే ఆఫ్స్కు చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్పై ఢిల్లీ ఓటమి చెంది టోర్నీ నుంచి నిష్క్రమించింది. అయితే తమ జట్టు ప్లేఆఫ్స్ చేరకపోవడంపై ఢిల్లీ స్టార్ ఆల్ రౌండర్ మిచెల్ మార్ష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఢిల్లీ ప్లేఆఫ్కు చేరుకోలేకపోవడం తమకు సిగ్గుగా ఉందని మార్ష్ తెలిపాడు. "మేము ఐపీఎల్ ప్లే ఆఫ్స్కు చేరుకోలేకపోవడం నాకు సిగ్గుగా అనిపించింది. హెడ్ కోచ్ రికీ పాంటింగ్ మా జట్టు ఆటగాళ్లను చాలా బాగా చూసుకున్నాడు. అతడు నాయకుడిగా, జట్టు ప్రధాన కోచ్గా జట్టును అద్భుతంగా ముందుకు నడిపించాడు. అతడి కోసమైనా మేము టైటిల్ సాధించాలని భావించాము. అదే విధంగా ఢిల్లీ జట్టుకు నేను చాలా ముఖ్యమైన ఆటగాడిగా పాంటింగ్ భావించాడు" అని మార్ష్ పేర్కొన్నాడు. ఇక గాయం కారణంగా ఈ ఏడాది ఐపీఎల్ ఆరంభ మ్యాచ్లకు మార్ష్ దూరమయ్యాడు. అనంతరం జట్టులోకి వచ్చిన ఒక్క మ్యాచ్ తర్వాత కరోనా బారిన పడ్డాడు. దీంతో కొన్ని మ్యాచ్లకు దూరమయ్యాడు. అయితే కరోనా నుంచి కోలుకున్నాక మార్ష్ ఆద్భుతంగా రాణించాడు. ఈ సీజన్లో 8 మ్యాచ్లు ఆడిన మార్ష్ 251 పరుగులు చేశాడు. చదవండి: Mitchell Marsh: 'భారత్లో నాకు శాపం తగిలింది'.. ఆసీస్ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు -
పంత్ను నిందించాల్సిన అవసరం లేదు.. శ్రేయస్ తర్వాత: పాంటింగ్
IPL 2022 DC Vs MI- Ricky Ponting Comments: ‘‘ఢిల్లీ క్యాపిటల్స్కు కెప్టెన్గా రిషభ్ పంత్ సరైన ఛాయిస్ అనడంలో నాకు ఏమాత్రం సందేహం లేదు. గత సీజన్లో.. ఇప్పుడు కూడా తను తన బాధ్యతను సక్రమంగా నెరవేర్చాడు. శ్రేయస్ అయ్యర్ గాయపడిన నేపథ్యంలో అతడి నుంచి సారథ్య బాధ్యతలు చేపట్టిన తర్వాత పంత్ అద్భుతంగా రాణిస్తూ జట్టును ముందుకు నడిపిస్తున్నాడు’’ అని ఢిల్లీ క్యాపిటల్స్ హెడ్కోచ్ రిక్కీ పాంటింగ్ తమ కెప్టెన్ రిషభ్ పంత్కు మద్దతుగా నిలిచాడు. పంత్ ఇంకా చిన్నవాడని, అయినప్పటికీ ఐపీఎల్ లాంటి ప్రఖ్యాత లీగ్లో ఒత్తిడిని అధిగమిస్తూ ముందుకు సాగుతున్న తీరు అమోఘమని కొనియాడాడు. చిన్న చిన్న తప్పిదాలు చేయడం సహజమని, తను ఇంకా నేర్చుకునే దశలోనే ఉన్నాడని అండగా నిలబడ్డాడు. ప్లే ఆఫ్స్ బెర్తును ఖరారు చేసుకోవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్.. ముంబై ఇండియన్స్ చేతిలో ఓడిన సంగతి తెలిసిందే. చివరి ఓవర్ వరకు ఉత్కంఠ రేపిన ఈ మ్యాచ్లో సింపుల్ క్యాచ్ వదిలేయడం సహా ముంబై ఆటగాడు టిమ్ డేవిడ్ విషయంలో రివ్యూకు వెళ్లకుండా పంత్ చేసిన తప్పిదాల వల్ల భారీ మూల్యమే చెల్లించాల్సి వచ్చింది. దీంతో అతడిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం రిక్కీ పాంటింగ్ మాట్లాడుతూ.. పంత్ను వెనకేసుకొచ్చాడు. ‘‘పంత్ ఇంకా చిన్న పిల్లవాడు.. కెప్టెన్గా నేర్చుకునే దశలోనే ఉన్నాడు. ముఖ్యంగా టీ20 జట్టు సారథిగా.. అది కూడా ఐపీఎల్ లాంటి ప్రధాన లీగ్లో ఒత్తిడిని తట్టుకోవడం మామూలు విషయం కాదు. ప్రతి విషయాన్ని భూతద్దంలో పెట్టి చూస్తారు. అయితే గెలుపోటములు సహజమే’’ అంటూ ఢిల్లీ ఓటమికి పంత్ను నిందించాల్సిన అవసరం లేదంటూ పంత్కు పాంటింగ్కు మద్దతునిచ్చాడు. ఇక ముంబైతో మ్యాచ్లో తమకు శుభారంభం లభించలేదన్న పాంటింగ్.. టాపార్డర్ విఫలమైందని అసంతృప్తి వ్యక్తం చేశాడు. 40 పరుగులకే నాలుగు వికెట్లు పడ్డాయని, టీ20 ఫార్మాట్లో భారీ స్కోరు చేయాలంటే ఇలా జరగడం ఆమోదయోగ్యం కాదన్నాడు. అదే విధంగా ముంబై ప్లేయర్ టిమ్ డేవిడ్ బాగా ఆడాడని, ఓటమి నుంచి తాము పాఠాలు నేర్చుకోవాల్సిన ఆవశ్యకత ఉందని పేర్కొన్నాడు. కాగా ఢిల్లీ ఓటమితో ఆర్సీబీ వరుసగా మూడోసారి ప్లే ఆఫ్స్ చేరింది. ఐపీఎల్ మ్యాచ్: 69- ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ టాస్: ముంబై- తొలుత బౌలింగ్ ఢిల్లీ స్కోరు: 159/7 (20) ముంబై స్కోరు: 160/5 (19.1) విజేత: ముంబై.. ఐదు వికెట్ల తేడాతో గెలుపు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: జస్ప్రీత్ బుమ్రా(4 ఓవర్లలో 25 పరుగులు ఇచ్చి 3 వికెట్లు) చదవండి👉🏾Rishabh Pant: ఒత్తిడి సమస్యే కాదు.. మా ఓటమికి కారణం అదే.. ఇకనైనా: పంత్ అసంతృప్తి! చదవండి👉🏾IPL 2022 DC VS MI: టిమ్ డేవిడ్కు గిఫ్ట్ పంపిన ఆర్సీబీ కెప్టెన్..! var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4381453179.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); .@mipaltan end their #TATAIPL 2022 campaign on a winning note! 👍 👍 The @ImRo45-led unit beat #DC by 5 wickets & with it, @RCBTweets qualify for the Playoffs. 👏 👏 #MIvDC Scorecard ▶️ https://t.co/sN8zo9RIV4 pic.twitter.com/kzO12DXq7w — IndianPremierLeague (@IPL) May 21, 2022 -
'భారీ తేడాతో ఓడిపోయాం.. తరువాతి మ్యాచ్లో మేము ఏంటో చూపిస్తాం'
ఐపీఎల్-2022లో భాగంగా ఆదివారం చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో 91 పరుగుల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్ ఘోర పరాజయం పాలైన సంగతి తెలిసిందే. కాగా ఢిల్లీ ఓటమిపై హెడ్ కోచ్ రికీ పాటింగ్ స్పందించాడు. సీఎస్కేపై భారీ తేడాతో ఓటమి చెందడం తమ జట్టు నెట్ రన్ రేట్ను దెబ్బతీసిందని పాటింగ్ తెలిపాడు. "ఈ మ్యాచ్లో 91 పరుగుల తేడాతో ఓడిపోయాం. ఈ ఓటమి మా నెట్ రన్ రేట్పై భారీ ప్రభావం చూపింది. మా తదుపరి మ్యాచ్లో మేము బలంగా పుంజుకోవాలి. మరో మూడు మ్యాచ్ల్లో విజయం సాధిస్తే ప్లేఆఫ్కు చేరుకోగలమని మేము భావిస్తున్నాము. ప్లేఆఫ్కు చేరడానికి ఎనిమిది మ్యాచ్ల్లో విజయం సాధిస్తే చాలు. అయితే ఒక మ్యాచ్లో భారీ విజయం సాధించి మా రన్రేట్ను మెరుగు పరుచుకోవాలి. అదే విధంగా ఫీల్డ్లో పంత్ తీసుకునే ప్రతి నిర్ణయానికి నేను పూర్తిగా మద్దతు ఇస్తాను. ఏ కెప్టెన్కైనా ఒత్తిడిలో నిర్ణయాలు తీసుకోవడం అంత సులభం కాదు. ఒక కెప్టెన్ చాలా తక్కువ సమయంలో నిర్ణయాలు తీసుకుంటాడు. ఏ నిర్ణయం తీసుకున్న జట్టు విజయాన్ని దృష్టిలో పెట్టుకునే తీసుకుంటాడు" అని మ్యాచ్ అనంతరం విలేకరుల సమావేశంలో రికీ పాటింగ్ పేర్కొన్నాడు. చదవండి: CSK VS DC: డెవాన్ కాన్వేను దిగ్గజ ఆటగాడితో పోలుస్తున్న నెటిజన్లు var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4381453179.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
IPL 2022: రిషభ్ భయ్యా గ్రేట్.. బాగా ఆడితే క్రెడిట్ మాకు.. లేదంటే!
IPL 2022 DC Vs SRH: ‘‘రిషభ్ భయ్యా.. చాలా కామ్గా ఉంటాడు. ఒత్తిడినంతా తానే భరిస్తాడు. జట్టు బాధ్యతను తీసుకుంటాడు. ఎప్పుడైనా మేము ఒత్తిడిలో కూరుకుపోతే దానిని అధిగమించేలా మమ్మల్ని ప్రోత్సహిస్తాడు. మేము బాగా ఆడితే క్రెడిట్ అంతా మాకే ఇస్తాడు. అయితే, జట్టు కష్టాల్లో కూరుకుపోయినపుడు మాత్రం తానే ముందుంటాడు’’ అని ఢిల్లీ క్యాపిటల్స్ యువ బౌలర్ చేతన్ సకారియా.. తమ కెప్టెన్ రిషభ్ పంత్పై ప్రశంసలు కురిపించాడు. తమకు ఏమాత్రం ఇబ్బంది కలగకుండా అన్నీ తానై వ్యవహరిస్తాడని పేర్కొన్నాడు. కాగా ఐపీఎల్-2021 మినీ వేలంలో భాగంగా 20 లక్షల రూపాయల కనీస ధరతో ఆక్షన్లోకి రాగా రాజస్తాన్ రాయల్స్ ఏకంగా 1.2 కోట్లకు అతడిని కొనుగోలు చేసింది. ఇక మెగా వేలం-2022 నేపథ్యంలో సకారియాను వదిలేయగా ఢిల్లీ క్యాపిటల్స్ అతడిని సొంతం చేసుకుంది. అతడి కోసం 4. 20 కోట్ల రూపాయలు వెచ్చించింది. అయితే, ఈ సీజన్లో ఆరంభ మ్యాచ్లు ఆడలేకపోయిన ఈ లెఫ్టార్మ్ సీమర్ కోల్కతా నైట్రైడర్స్తో పోరులో జట్టులోకి వచ్చాడు. ఆరోన్ ఫించ్ వికెట్ తీసి సత్తా చాటాడు. ఇక కొత్త ఫ్రాంఛైజీతో తన అనుబంధం పట్ల స్పందిస్తూ తాజాగా ఎన్డీటీవీతో ముచ్చటించిన సకారియా కోచ్ రిక్కీ పాంటింగ్, కెప్టెన్ రిషభ్ పంత్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘రిక్కీ పాంటింగ్ ఆలోచనా విధానం నన్ను ఆకట్టుకుంది. క్లిష్ట సమయాల్లో ఆయన మాలో ఆత్మవిశ్వాసం నింపడానికి చేయని ప్రయత్నం ఉండదు. సరదాగా మాట్లాడుతూ.. జోకులు వేస్తూ ఆటగాళ్లతో కలిసిపోతారు. ఒక్కో ఆటగాడితో ప్రత్యేకంగా మాట్లాడుతూ.. వారికి ఏం కావాలో అడిగి తెలుసుకుంటారు. అందుకు తగ్గట్లుగా మెళకువలు నేర్పుతారు’’ అని పాంటింగ్ పట్ల అభిమానం చాటుకున్నాడు. ఇక కెప్టెన్గా పంత్ ఎంతో బాధ్యతాయుతంగా వ్యవహరిస్తాడంటూ ప్రశంసించాడు. కాగా ఆడిన తొమ్మిది మ్యాచ్లలో నాలుగు మాత్రమే గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్.. గురువారం(మే 5) సన్రైజర్స్ హైదరాబాద్తో తలపడనుంది. ప్లే ఆఫ్స్ రేసులో సాఫీగా దూసుకుపోవాలంటే ఢిల్లీ ఈ మ్యాచ్లో కచ్చితంగా గెలవాల్సి ఉంటుంది. చదవండి👉🏾MS Dhoni- Virat Kohli: ‘ధోని పట్ల ఇంత ఘోరంగా ప్రవర్తిస్తావా! నీ స్థాయి ఏమిటి? ఏమనుకుంటున్నావు కోహ్లి?’ The sound off #RP17's bat when he is in full swing 🤩#YehHaiNayiDilli | #IPL2022 | @RishabhPant17#TATAIPL | #IPL | #DelhiCapitals pic.twitter.com/G4rws7Qk0n — Delhi Capitals (@DelhiCapitals) May 4, 2022 Just 7️⃣ seconds of Bapu smashing 'em down the ground 🔥#YehHaiNayiDilli | #IPL2022 #TATAIPL | #IPL | #DelhiCapitals | @akshar2026 pic.twitter.com/OUnoYucElR — Delhi Capitals (@DelhiCapitals) May 4, 2022 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4141448520.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
ఆ మ్యాచ్ చూస్తూ రిమోట్లు, బాటిళ్లు పగులగొట్టా: రికీ పాంటింగ్
ఐపీఎల్ 2022 సీజన్ ఫస్ట్ హాఫ్ మ్యాచ్ల్లో భాగంగా రాజస్థాన్ రాయల్స్- ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో హైడ్రామా నెలకొన్న సంగతి తెలిసిందే. ఆ మ్యాచ్లో రాజస్థాన్ నిర్ధేశించిన భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆఖరి ఓవర్లో ఢిల్లీ కెప్టెన్ అతని సహచరులు వ్యవహరించిన తీరు తీవ్ర దుమారాన్ని రేపింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్ఆర్.. జోస్ బట్లర్ విధ్వంసకర శతకంతో (65 బంతుల్లో 116; 9 ఫోర్లు, 9 సిక్సర్లు) చెలరేగడంతో 222 పరుగుల భారీ స్కోర్ నమోదు చేయగా, ఛేదనలో డీసీ లక్ష్యానికి 15 పరుగుల దూరంలో నిలిచిపోయింది. భారీ లక్ష్య ఛేదనలో ఢిల్లీకి చివరి ఓవర్లో 36 పరుగులు అవసరం కాగా, ఆ దశలో రోవ్మన్ పావెల్ ఒక్కసారిగి విరుచుకుపడి తొలి మూడు బంతులను సిక్సర్లుగా మలిచి (మెక్ కాయ్ బౌలింగ్) మ్యాచ్ను డీసీ వైపుకు తిప్పాడు. అయితే మెక్ కాయ్ వేసిన నాలుగో బంతి నడుం కంటే ఎత్తుకు వెళ్లినప్పటికీ ఫీల్డ్ అంపైర్ నితిన్ మీనన్ నో బాల్గా ప్రకటించకపోవడంతో వివాదం మొదలైంది. అంపైర్ నిర్ణయం పట్ల అసహనానికి గురైన డీసీ సారధి పంత్ డగౌట్లో నుంచి తమ ఆటగాళ్లను వెనక్కు రావల్సిందిగా సైగలు చేశాడు. నో బాల్ విషయంలో పంత్ ఇలా వ్యవహరించడాన్ని చాలా మంది తప్పుబట్టారు. కాగా, ఈ మ్యాచ్ ఆఖర్లో జరిగిన హైడ్రామా మొత్తాన్ని టీవీలో వీక్షించిన ఢిల్లీ హెడ్ కోచ్ తాజాగా స్పందించాడు. కరోనా బారిన పడటంతో గత కొన్ని రోజులుగా క్వారంటైన్లో ఉంటున్న పాంటింగ్ నాటి హైఓల్టేజీ మ్యాచ్పై మాట్లాడుతూ.. మ్యాచ్ చివరి ఓవర్లో తాను కూడా అసహనానికి గురయ్యానని తెలిపాడు. ఆ సమయంలో తాను కోపాన్ని అదుపు చేసుకోలేక 3-4 టీవీ రిమోట్లు పగొలగొట్టానని అన్నాడు. ఫ్రస్ట్రేషన్ను కంట్రోల్ చేసుకోలేక ఎదురుగా ఉన్న బాటిళ్లను గోడకేసి కొట్టానని వెల్లడించాడు. అలాంటి కీలక సమయంలో తాను జట్టుతో పాటు లేకపోవడం కలచివేసిందని పేర్కొన్నాడు. అయినప్పటికీ టెక్స్ట్ మెసేజ్ల ద్వారా జట్టును సమన్వయం చేసుకున్నానని తెలిపాడు. చదవండి: కెప్టెన్ పిలిస్తే ఊపుకుంటూ వెళ్లడమేనా.. కుల్దీప్ను మెడపట్టి తోసిన చహల్ var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4031445617.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
రాజస్తాన్ రాయల్స్తో మ్యాచ్.. ఢిల్లీ క్యాపిటల్స్కు భారీ షాక్!
ఐపీఎల్-2022లో భాగంగా శుక్రవారం (ఏప్రిల్ 22) రాజస్థాన్ రాయల్స్తో జరగనున్న మ్యాచ్కు ఢిల్లీ క్యాపిటల్స్ ప్రధాన కోచ్ రికీ పాంటింగ్ దూరం కానున్నాడు. ఢిల్లీ టీమ్ హోటల్లో పాంటింగ్తో పాటు బస చేస్తున్న అతడి కుటుంబ సభ్యులలో ఒకరికి కోవిడ్ పాజిటివ్గా నిర్ధారణైంది. దీంతో అతడు తన ఫ్యామిలీతో పాటు ఐసోలేషన్లోకి వెళ్లనున్నాడు. ఇప్పటికే ఢిల్లీ జట్టులో కరోనా కేసులు నమోదు కావడంతో రాజస్థాన్-ఢిల్లీ మ్యాచ్ను బీసీసీఐ పుణే నుంచి వాంఖడే స్టేడియంకు మార్పుచేసింది. "ఢిల్లీ క్యాపిటల్స్ హెడ్ కోచ్ రికీ పాంటింగ్ కుటుంబ సభ్యులలో ఒకరు కరోనా బారిన పడ్డారు. దీంతో వారు ఐసోలేషన్లో ఉన్నారు. కాగా పాటింగ్కు మాత్రం రెండు సార్లు కరోనా పరీక్షలు నిర్వహించగా నెగెటివ్గా తేలింది. అయితే జట్టు ప్రయోజనాల దృష్ట్యా, అతడు తన కుటంబంతో సన్నిహితంగా ఉన్నందున ఐదు రోజులు పాటు ఐసోలేషన్లో ఉండాలని వైద్య బృందం సూచించనట్లు" ఢిల్లీ క్యాపిటల్స్ అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఇక మ్యాచ్లో హెడ్ కోచ్ లేకుండానే ఢిల్లీ క్యాపిటల్స్ బరిలోకి దిగనుంది. అస్టెంట్ కోచ్ షేన్ వాట్సన్ పాంటింగ్ బాధ్యతలు నిర్వహించనున్నాడు. చదవండి: కోహ్లి భాయ్ని ఔట్ చేయడమే నా లక్ష్యం: ఉమ్రాన్ మాలిక్ -
"అతడు అద్భుతమైన స్పిన్నర్.. వేలానికి ముందే సొంతం చేసుకోవాలి అనుకున్నాం"
ఐపీఎల్-2022లో ఢిల్లీ క్యాపిటల్స్ స్పిన్నర్ కుల్ధీప్ యాదవ్ అద్భుతంగా రాణిస్తోన్నాడు. ఇప్పటి వరకు ఈ సీజన్లో ఐదు మ్యాచ్లు ఆడిన కుల్థీప్ యాదవ్ 11 వికెట్లు పడగొట్టాడు. ఈ టోర్న్మెంట్లో ఇప్పటివరకు అత్యధిక వికెట్ల పడగొట్టిన బౌలర్ల జాబితాలో మూడో స్ధానంలో ఉన్నాడు. ఇది ఇలా ఉంటే.. గత కొన్ని సీజన్లుగా కోల్కతా నైట్రైడర్స్కు ప్రాతినిధ్యం వహించిన కుల్థీప్ యాదవ్ను ఆ జట్టు ఐపీఎల్-2022 మెగా వేలానికి ముందు రీటైన్ చేసుకోలేదు. మెగా వేలంలో కుల్ధీప్ యాదవ్ను రూ. 2 కోట్లకు ఢిల్లీ క్యాపిటల్స్ కొనుగోలు చేసింది. ఇక 2021 సీజన్లో కేకేఆర్కు ప్రాతినిధ్యం వహించిన కుల్థీప్కు ఒక్క మ్యాచ్లో కూడా అవకాశం రాలేదు. ఈ క్రమంలో ఢిల్లీ క్యాపిటల్స్ హెడ్ కోచ్ రికీ పాంటింగ్ ఆసక్తికర వాఖ్యలు చేశాడు. ఐపీఎల్ మెగా వేలంలో అతడిని దక్కించుకోవడానికి ఢిల్లీ ఫ్రాంచైజీ ఎలా తహతహలాడిందో వెల్లడించాడు. కేకేఆర్లో అద్భతమైన స్పిన్నర్లు ఉన్నారని, అందుకే గత రెండు సీజన్లలో కుల్దీప్కు అవకాశం దక్కలేదని అతడు తెలిపాడు. "కుల్దీప్ను వేలంలోకి కొనుగోలు చేయడానికి మా ప్రాంఛైజీ చాలా ఆసక్తి కనబరిచింది. అయితే గత రెండు సీజన్లలో కేకేఆర్కు చక్రవర్తి, నరైన్ ,షకీబ్ వంటి అద్భుతమైన స్పిన్నర్లు ఉన్నారు. అందుకే కుల్థీప్కు పెద్దగా అవకాశం దక్కలేదు. కాగా కుల్థీప్ మాత్రం అద్భుతమైన స్పిన్నర్లలో ఒకడు" అని పాంటింగ్ పేర్కొన్నాడు. ఇక ఆర్సీబీతో జరిగిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ 16 పరుగుల తేడాతో ఓటమి చెందింది. -
అంపైర్తో ఢిల్లీ క్యాపిటల్స్ హెడ్కోచ్ వాగ్వాదం
క్రికెట్లో ఎమోషన్స్కు కొదువ ఉండదు. తప్పుడు నిర్ణయాలు తీసుకునే అంపైర్లతో ఆటగాళ్లకు గొడవలు జరిగిన ఘటనలు చాలానే ఉన్నాయి.అందులో ఒక అంపైర్ తప్పు చేస్తే.. అవసరంగా మరొక అంపైర్తో వాగ్వాదానికి దిగిన సందర్భాలు ఉన్నాయి.తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్ హెడ్కోచ్ రికీ పాంటింగ్ అంపైర్తో వాగ్వావాదానికి దిగడం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. విషయంలోకి వెళితే.. ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్ 19వ ఓవర్ ఉమేశ్ యాదవ్ వేశాడు. ఆ ఓవర్ రెండో బంతిని ఉమేశ్ ఫుల్టాస్ యార్కర్ వేశాడె. బంతి వైడ్ లైన్ అవతల పడినప్పటికి అంపైర్ వైడ్ ఇవ్వలేదు. అయితే శార్దూల్ అది వైడ్ కదా అని అంపైర్ను చూసినప్పటికి అతని వైపు నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదు. దీంతో ఇదేం నిర్ణయమో అంటూ తర్వాతి బంతికి సిద్ధమయ్యాడు. ఇదే సమయంలో డగౌట్లో ఉన్న పాంటింగ్.. ''అదేంటి అంత క్లియర్గా వైడ్ అని తెలుస్తుంటే అంపైర్ ఇవ్వకపోవడమేంటి'' అని అరిచాడు. ఆ తర్వాత అక్కడే ఉన్న మరో అంపైర్తో వైడ్ ఇవ్వకపోవడమేంటని వాగ్వాదానికి దిగాడు. ఇదంతా అక్కడి కెమెరాల్లో రికార్డయింది. ఇక మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 215 పరుగులు చేసింది. చదవండి: IPL 2022: చెత్త నిర్ణయాలు వద్దు.. మా అంపైర్లను పంపిస్తాం; బీసీసీఐకి చురకలు #RickyPonting fighting with umpire pic.twitter.com/3jPYobJZAe — Raj (@Raj93465898) April 10, 2022 -
WC 2022 Final: ఆడం గిల్క్రిస్ట్ రికార్డు బద్దలు కొట్టిన అలిస్సా హేలీ..
ICC Women World Cup 2022 Final Aus Vs Eng- Alyssa Healy: ఐసీసీ మహిళా వరల్డ్కప్-2022 టోర్నీ ఫైనల్లో ఆస్ట్రేలియా వికెట్ కీపర్ బ్యాటర్ అలిస్సా హేలీ చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆడింది. ఇంగ్లండ్ బౌలర్లకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా విధ్వంసకర ఆట తీరుతో విరుచుకుపడింది. కేవలం 138 బంతుల్లోనే 170 పరుగులు చేసి వారికి పీడకలను మిగిల్చింది. అలిస్సా ఏకంగా 26 ఫోర్లు బాదిందంటే ఆ బౌలర్ల పరిస్థితి ఏమిటో అర్థం చేసుకోవచ్చు. View this post on Instagram A post shared by ICC (@icc) View this post on Instagram A post shared by ICC (@icc) ఈ క్రమంలో తన అద్భుత ఇన్నింగ్స్తో అలిస్సా సరికొత్త చరిత్ర సృష్టించింది. ఆడం గిల్క్రిస్ట్ పేరిట ఉన్న ప్రపంచ రికార్డు బద్దలు కొట్టింది. ఐసీసీ క్రికెట్ వరల్డ్కప్ ఫైనల్లో అత్యధిక స్కోరు సాధించిన క్రికెటర్ల జాబితాలో ప్రథమస్థానంలో నిలిచింది. క్రికెట్ దిగ్గజాలు ఆడం గిల్క్రిస్ట్, రిక్కీ పాంటింగ్, వివియన్ రిచర్డ్స్ను వెనక్కి నెట్టింది. తద్వారా ప్రపంచకప్ ఫైనల్లో అరుదైన ఫీట్తో సువర్ణాక్షరాలతో తన పేరును లిఖించుకుంది. ఇక మ్యాచ్ విషయానికొస్తే హేలీ అద్భుత ఇన్నింగ్స్తో ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 356 పరుగులు చేసింది. ఐసీసీ ప్రపంచకప్ ఫైనల్లో అత్యధిక స్కోర్లు 1. అలిస్సా హేలీ(ఆస్ట్రేలియా)- 170 పరుగులు- ప్రత్యర్థి ఇంగ్లండ్- 2022 2. ఆడం గిల్క్రిస్ట్(ఆస్ట్రేలియా)- 149 పరుగులు- ప్రత్యర్థి శ్రీలంక-2007 3. రిక్కీ పాంటింగ్(ఆస్ట్రేలియా)- 140 పరుగులు(నాటౌట్)- ప్రత్యర్థి ఇండియా- 2003 4. వివియన్ రిచర్డ్స్(వెస్టిండీస్)- 138 పరుగులు(నాటౌట్)- ప్రత్యర్థి ఇంగ్లండ్- 1979 చదవండి: IPL 2022: ఢిల్లీ జట్టుకు గుడ్న్యూస్.. వాళ్లిద్దరూ జట్టులోకి రానున్నారన్న పాంటింగ్! -
IPL 2022: ఢిల్లీ క్యాపిటల్స్కు గుడ్న్యూస్!
IPL 2022: ఐపీఎల్-2022 సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ ఇప్పటి వరకు ఆడిన రెండు మ్యాచ్లలో ఒక విజయం సాధించగా.. ఒక మ్యాచ్లో ఓటమిపాలైంది. గెలుపోటముల సంగతి ఎలా ఉన్నా.. స్టార్ బౌలర్ అన్రిచ్ నోర్జే, స్టార్ బ్యాటర్ డేవిడ్ వార్నర్ జట్టులో లేని లోటు స్పష్టంగా కనిపిస్తోంది. అయితే, వీరిద్దరు తర్వాతి మ్యాచ్లో అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. వీరితో పాటు మిచెల్ మార్ష్ సైతం సెలక్షన్కు అందుబాటులో ఉండనున్నాడు. ఈ విషయాన్ని ఢిల్లీ క్యాపిటల్స్ హెడ్కోచ్ రిక్కీ పాంటింగ్ వెల్లడించాడు. తాజా సీజన్లో తమ రెండో మ్యాచ్లో భాగంగా ఢిల్లీ.. శనివారం గుజరాత్ టైటాన్స్తో తలపడింది. ఇందులో 14 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఈ క్రమంలో మ్యాచ్ అనంతరం రిక్కీ పాంటింగ్ మాట్లాడుతూ... నోర్జే గాయం నుంచి పూర్తిగా కోలుకున్నాడని, నెట్స్లో బౌలింగ్ చేస్తున్నాడని పేర్కొన్నాడు. దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు నుంచి క్లియరెన్స్ సర్టిఫికెట్ పొందగానే మైదానంలో దిగుతాడని తెలిపాడు. తమ తదుపరి మ్యాచ్లో నోర్జే ఆడతాడని ఆశాభావం వ్యక్తం చేశాడు. ఇక డేవిడ్ వార్నర్ సైతం ముంబైకి చేరుకున్నాడన్న పాంటింగ్.. క్వారంటైన్ పూర్తి చేసుకుని జట్టుతో చేరతాడని పేర్కొన్నాడు. అదే విధంగా ఆదివారం మిచెల్ మార్ష్ సైతం సెలక్షన్కు అందుబాటులోకి వస్తాడని, కేకేఆర్తో మ్యాచ్ నాటికి అతడు జట్టులోకి వస్తాడని తెలిపాడు. కాగా లక్నో సూపర్జెయింట్స్తో ఏప్రిల్ 7న ఢిల్లీ తమ తదుపరి మ్యాచ్ ఆడనుంది. ఆ తర్వాత 10న కోల్కతాతో తలపడనుంది. చదవండి: IPL 2022: విజయ్ శంకర్ చేసిన రనౌట్ సరైనదేనా! .@gujarat_titans win by 14 runs and register their second win in #TATAIPL 2022. Scorecard - https://t.co/onI4mQ4M92 #GTvDC #TATAIPL pic.twitter.com/Fy8GJDoXTL — IndianPremierLeague (@IPL) April 2, 2022 -
రిషబ్ పంత్ గురించి పాంటింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు
ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ గురించి ఆ జట్టు హెడ్కోచ్ రికీ పాంటింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టీమిండియా భవిష్యత్తు కెప్టెన్ అయ్యే అవకాశాలు పంత్కు పుష్కలంగా ఉన్నాయని పేర్కొన్నాడు. ''అధిక ఒత్తిడిలో నాయకత్వం వహించే అవకాశాన్ని పంత్ అందిపుచ్చుకున్నాడు. ఐపీఎల్ల్ లాంటి మేజర్ టోర్నీలో కెప్టెన్గా సక్సెస్ అయిన పంత్.. భవిష్యత్తులో టీమిండియాకు కెప్టెన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అందులో ఎటువంటి డౌట్ లేదు. టీమిండియా ప్రస్తుత కెప్టెన్ రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్కు నాయకత్వం వహించినప్పుడు 23-24 ఏళ్లు ఉంటాయి. కట్చేస్తే ఇప్పుడు హిట్మ్యాన్ ఐపీఎల్లో విజయవంతమైన కెప్టెన్గా నిలిచాడు. ముంబైని ఐదుసార్లు చాంపియన్గా నిలిపిన రోహిత్ గేమ్ స్ట్రాటజీ అదుర్స్. సరిగ్గా అలాంటి స్థితిలోనే పంత్ కూడా ఉన్నాడు. చిన్న వయసులోనే కెప్టెన్ కావడం వల్ల.. ఒత్తిడిని అధిగమించే వీలు ఉంటుంది. రోహిత్ లాగే పంత్ కూడా ఢిల్లీని చాంపియన్స్ను చేసే అవకాశం ఉంటుంది. '' అంటూ పేర్కొన్నాడు. గతేడాది సీజన్లో శ్రేయాస్ అయ్యర్ గైర్హాజరీలో పంత్ తొలిసారి ఢిల్లీ క్యాపిటల్స్కు నాయకత్వం వహించాడు. తాను కెప్టెన్ అయిన తొలిసారే జట్టును సూపర్గా నడిపించాడు. ప్లేఆఫ్స్ వరకు జట్టును తీసుకెళ్లి పంత్ కెప్టెన్గా విజయవంతమయ్యాడు. అందుకే ఈసారి మెగావేలానికి ముందు అంతకముందు కెప్టెన్గాఉన్న శ్రేయాస్ అయ్యర్ను రిలీజ్ చేసింది. ఇక పంత్ ఈసారి రెగ్యులర్ కెప్టెన్గా పూర్తి స్థాయి బాధ్యతలు చేపట్టనున్నాడు. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ మార్చి 27న ముంబై ఇండియన్స్తో తొలి మ్యాచ్ ఆడనుంది. చదవండి: IPL 2022: 'మా కెప్టెన్ది విచిత్ర వైఖరి.. లేటుగా వచ్చారని బస్ నుంచి దింపేశాడు' IPL 2022: ఒంటరివాడైన రోహిత్.. ప్రస్తుత సీజన్లో టైటిల్ గెలిచిన ఏకైక కెప్టెన్గా..! -
Shoaib Akhtar: పాంటింగ్ కాకుండా వేరే వాళ్లైయ్యుంటే తల బద్దలయ్యేదే..!
పాకిస్థాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్.. దిగ్గజ ఆసీస్ ప్లేయర్ రికీ పాంటింగ్ను ఉద్దేశిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 1999లో పెర్త్లో జరిగిన టెస్ట్ మ్యాచ్ను గుర్తు చేసుకుంటూ కీలక వ్యాఖ్యలు చేశాడు. నాటి ఆసీస్ పర్యటనలో పాక్ అప్పటికే 0–2తో వెనుకబడి ఉందని, మూడో టెస్ట్లో ఎలాగైనా గెలవాలనే కసితో ప్రత్యర్ధులపై బౌన్సర్లతో విరుచుకుపడాలని డిసైడయ్యానని పేర్కొన్నాడు. ప్లాన్లో భాగంగా పాంటింగ్ను టార్గెట్ చేశానని, అయితే ఆ సమయంలో పాంటింగ్ కాకుండా ఏ ఇతర ఆటగాడు క్రీజ్లో ఉన్నా బంతితో తల పగులగొట్టేవాడినేనని ఓ ప్రముఖ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నాటి సంగతులను గుర్తు చేసుకున్నాడు. ఇదే సందర్భంగా అక్తర్ మాట్లాడుతూ.. 2005 ఆసీస్ పర్యటనలో జస్టిన్ లాంగర్తో గొడవ జరిగిందని, అలాగే మాథ్యూ హేడెన్తో చిన్నపాటి ఘర్షణ కొట్టుకునేంతవరకు వెళ్లిందని గుర్తు చేసుకున్నాడు. ఆస్ట్రేలియా క్రికెటర్లలాగే తాను కూడా దూకుడుగా ఉండే వాడినని.. ఆ యాటిట్యూడ్ ఆసీస్ ఆటగాళ్లకు కూడా బాగా నచ్చేదని చెప్పుకొచ్చాడు. అప్పట్లోలా ప్రస్తుత ఆస్ట్రేలియా ఆటగాళ్లలో దూకుడు లేదని, అంతా సున్నితంగా ఉన్నారని, నేటి తరం ఆసీస్ ఆటగాళ్లలో ఆ వైఖరి ఎందుకు కొరవడిందో అర్ధం కావడం లేదని అన్నాడు. బ్రిస్బేన్లోని జెఫ్ థామ్సన్ ఇల్లు తనకు రెండో ఇల్లు లాంటిదని ఈ సందర్భంగా ప్రస్తావించాడు. చదవండి: వరల్డ్కప్కు ముందే భారత్- పాక్ మ్యాచ్.. ఎప్పుడంటే..? -
Shane Warne: వార్న్ను తలచుకుని ఒక్కసారిగా ఏడ్చేసిన రికీ పాంటింగ్
‘‘మిగతా వాళ్లలాగే నేను కూడా తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యాను. పొద్దున నిద్ర లేవగానే మెసేజ్లు వెల్లువెత్తాయి. నా కుమార్తెను పొద్దున్నే నెట్బాల్ ఆడటానికి తీసుకువెళ్లాలనే ప్లాన్తో గత రాత్రి నిద్రపోయాను. కానీ అంతలోనే ఇలా జరిగిపోయింది. ఈ విషయాన్ని అస్సలు జీర్ణించుకోలేకపోతున్నాను. తనతో మడిపడిన జ్ఞాపకాలెన్నో ఉన్నాయి. నా జీవితంలో తనొక భాగం’’ అంటూ ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. సహచర ఆటగాడు షేన్ వార్న్ను గుర్తు చేసుకుని కన్నీటి పర్యంతమయ్యాడు. కాగా ఆసీస్ క్రికెట్ దిగ్గజం, స్పిన్ మాంత్రికుడు షేన్ వార్న్ హఠాన్మరణం చెందిన విషయం విదితమే. థాయ్లాండ్లోని విల్లాలో ప్రాణాలు వదిలారు. ఈ విషాదం నుంచి క్రీడా ప్రపంచం ఇంకా కోలుకోలేదు. ఈ క్రమంలో వార్న్ సహచర ఆటగాళ్లు, అభిమానులు అతడిని తలచుకుని ఉద్వేగానికి లోనవుతున్నారు. మణికట్టుతో మాయ చేసే కింగ్ ఆఫ్ స్పిన్ను గుర్తుచేసుకుంటూ కన్నీళ్లు పెడుతున్నారు. ఈ క్రమంలో రికీ పాంటింగ్ సైతం దుఃఖం ఆపుకోలేక బోరున ఏడ్చేశాడు. ఇక 15 ఏళ్ల వయసులో క్రికెట్ అకాడమీలో వార్న్ను కలిశానన్న 47 ఏళ్ల పాంటింగ్... వార్న్ తనకు ఓ నిక్నేమ్ పెట్టాడంటూ గుర్తు చేసుకున్నాడు. దశాబ్దకాలం పాటు కలిసి క్రికెట్ ఆడామని, కెరీర్లో ఎన్నో ఎత్తుపల్లాలు చూశామంటూ అతడితో సాన్నిహిత్యాన్ని గుర్తుచేసుకుంటూ నివాళి అర్పించాడు. కాగా రికీ పాంటింగ్ సారథ్యంలో వార్న్ అనేక అంతర్జాతీయ మ్యాచ్లు ఆడాడు. ఈ క్రమంలో వీరి మధ్య అనుబంధం ఏర్పడింది. చదవండి: Shane Warne: స్పిన్ మాంత్రికుడి మృతిపై అనుమానాలు.. గదిలో రక్తపు మరకలు..! -
పాంటింగ్ సిఫార్సు.. కీలక పాత్రలో ఆస్ట్రేలియా మాజీ ఆల్రౌండర్
ఆస్ట్రేలియా మాజీ ఆల్రౌండర్ షేన్ వాట్సన్ ఐపీఎల్లో మరోసారి మెరవనున్నాడు. ఈసారి ఆటగాడిగా కాకుండా అసిస్టెంట్ కోచ్ పాత్రలో కనిపించనున్నాడు. రెండుసార్లు ఐపీఎల్ టైటిల్ గెలిచిన జట్లలో సభ్యుడిగా ఉన్న వాట్సన్ ఢిల్లీ క్యాపిటల్స్కు అసిస్టెంట్ కోచ్గా వ్యవహరించే అవకాశం లభించింది. ఢిల్లీ క్యాపిటల్స్ ప్రధాన కోచ్ రికీ పాంటింగ్ స్వయంగా వాట్సన్ను సిఫార్సు చేయడంతో ఢిల్లీ క్యాపిటల్స్ అందుకు అంగీకరించినట్లు తెలుస్తోంది. త్వరలోనే సదరు ఫ్రాంచైజీ దీనికి సంబంధించి వివరాలు వెల్లడించనుంది. కాగా ఆస్ట్రేలియన్ ఆల్రౌండర్గా తిరుగులేని గుర్తింపు పొందిన షేన్ వాట్సన్ ఐపీఎల్లోనూ తన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. 2008లో రాజస్తాన్ రాయల్స్ మొయిడెన్ ఐపీఎల్ టైటిల్ను గెలవడంలో వాట్సన్ కీలకపాత్ర పోషించాడు. ఆ తర్వాత సీఎస్కేకు వెళ్లిన వాట్సన్ 2018లో ఐపీఎల్ ఫైనల్లో సూపర్ ఇన్నింగ్స్ ఆడి జట్టుకు మూడో ఐపీఎల్ టైటిల్ అందించాడు. వయసు మీద పడడంతో 2020 సీజన్ నుంచి వాట్సన్ ఐపీఎల్కు దూరమయ్యాడు. తాజాగా అసిస్టెంట్ కోచ్ పాత్రలో వాట్సన్ ఐపీఎల్లో మరోసారి కనిపించనుండడం ఆసక్తిగా మారింది. కాగా ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ను మార్చి 26 నుంచి ప్రారంభించేందుకు బీసీసీఐ కసరత్తులు జరుపుతుంది. ఇక టీమిండియా మాజీ క్రికెటర్ అజిత్ అగార్కర్ కూడా ఢిల్లీ క్యాపిటల్స్కు అసిస్టెంచ్ కోచ్గా వ్యవహరించనున్నాడు. ఇప్పటికే ఢిల్లీ ఫ్రాంచైజీ అగార్కర్కు సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. చదవండి: IPL 2022: ఐపీఎల్ ఫ్రాంచైజీలకు బిగ్ షాక్.. ఆస్ట్రేలియా ఆటగాళ్లు దూరం! PSL 2022: మూడు సిక్సర్లతో మ్యాచ్ స్వరూపాన్ని మార్చేశాడు.. ఫలితం సూపర్ ఓవర్ -
కోహ్లి మరిన్ని రికార్డులు బద్దలుకొడతాడు.. టెస్టు కెప్టెన్గా అతడే సరైనోడు: పాంటింగ్
టీమిండియా కొత్త టెస్టు కెప్టెన్ ఎంపిక అంశంపై ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం రికీ పాంటింగ్ స్పందించాడు. టెస్టు సారథ్య బాధ్యతల నుంచి తప్పుకొన్న విరాట్ కోహ్లి నిర్ణయం తనను విస్మయానికి గురి చేసిందన్న పాంటింగ్... అతడు గొప్ప కెప్టెన్ అని కొనియాడాడు. అజింక్య రహానేకు కూడా టెస్టు సారథిగా మంచి మార్కులే పడతాయని, ఆస్ట్రేలియాలో మ్యాచ్లను గెలిపించిన విధానమే ఇందుకు నిదర్శనమన్నాడు. కెప్టెన్సీ రేసులో కేఎల్ రాహుల్ పేరు కూడా వినిపిస్తోందని, అయితే, కోహ్లి స్థానాన్ని భర్తీ చేయగలిగేది మాత్రం రోహిత్ శర్మనే అని పాంటింగ్ అభిప్రాయపడ్డాడు. ఈ మేరకు పాంటింగ్ మాట్లాడుతూ... ‘‘కోహ్లి నిర్ణయం నన్ను షాక్కు గురిచేసింది. అయితే, ఆటగాడిగా కొనసాగుతాననడం మంచి విషయం. తనకు ఇప్పుడు 33 ఏళ్లు. కెప్టెన్సీ భారం లేదు. కాబట్టి ఆటగాడిగా కోహ్లి మరిన్ని రికార్డులు బద్దలు కొట్టగలడు. కొత్త కెప్టెన్ విషయానికొస్తే.... నేను అజింక్య రహానేతో కలిసి పనిచేశాను. తను చాలా మంచి ఆటగాడు. ప్రస్తుతం తను గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నాడు. అయితే, ఆస్ట్రేలియా సిరీస్లో నాయకుడిగా తానేంటో నిరూపించుకున్న విషయాన్ని మర్చిపోవద్దు. కానీ... అది సరిపోదు కదా! ఇప్పుడు కేఎల్ రాహుల్ పేరును కూడా కొందరు సూచిస్తున్నారు. విదేశీ గడ్డపై అతడి రికార్డు బాగుంది. కానీ... నా అభిప్రాయం ప్రకారం రోహిత్ శర్మ మాత్రమే విరాట్ కోహ్లి స్థానాన్ని భర్తీ చేయగలడు. ముంబై ఇండియన్స్ జట్టును ముందుండి నడిపించిన విధానాన్ని నేను దగ్గరగా గమనించాను. తను విజయవంతమైన సారథి. ఇప్పుడు టీమిండియా పరిమిత ఓవర్ల కెప్టెన్గా ఉన్నాడు. గత రెండు మూడేళ్లుగా టెస్టుల్లో రాణిస్తున్నాడు’’ అని పేర్కొన్నాడు. చదవండి: IPL 2022 Auction: కొత్త ఫ్రాంఛైజీ 8 కోట్లు పెట్టింది; అతడిని వదిలేసినందుకు చాలా బాధగా ఉంది.. కానీ: హెడ్కోచ్ ENG vs WI: నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు.. సంచలనం సృష్టించిన జాసన్ హోల్డర్ -
'ఆస్ట్రేలియన్ కామెంటేటర్లకు పిచ్చి పట్టింది'
యాషెస్ సిరీస్లో భాగంగా ఇంగ్లండ్తో జరిగిన రెండో టెస్టులో ఆస్ట్రేలియా భారీ విజయాన్ని సాధించింది. ఈ విషయం పక్కనబెడితే.. మ్యాచ్ నాలుగోరోజు ఇంగ్లండ్ కెప్టెన్ రూట్ వ్యవహారంలో ఆస్ట్రేలియన్ కామెంటేటర్ల వెకిలి నవ్వును సోషల్ మీడియాలో నెటిజన్లు ఏకిపారేశారు. ఈ కామెంటేటర్స్లో ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ కూడా ఉండడం విశేషం. చదవండి: అసలేం చేస్తున్నావు.. నువ్వు కెప్టెన్గా ఉండి ఏం లాభం: రికీ పాంటింగ్ విషయంలోకి వెళితే.. మ్యాచ్ నాలుగోరోజు ఆటలో ఆసీస్ పేసర్ మిచెల్ స్టార్క్ వేసిన ఒక బంతి రూట్ కాళ్ల మధ్యలో బలంగా తాకింది. దీంతో నొప్పితో బాధపడిన రూట్.. స్టార్క్ తర్వాతి బంతిని లెగ్సైడ్ దిశగా ఆడాడు. కాగా రూట్కు నొప్పి ఉండడంతో కాళ్లను కాస్త దూరం పెడుతూ రన్స్ తీశాడు. ఇది గమనించిన ఒక ఆస్ట్రేలియన్ కామెంటేటర్ 'పాపం రూట్ నొప్పితో బాధపడుతున్నాడు.. మ్యాచ్ ఎలాగూ పోతుంది.. రిటైర్డ్హర్ట్ అయితే బాగుంటుంది''.. అన్నాడు. ఇది విన్న పాంటింగ్ ఒక్కసారిగా నవ్వేశాడు. అయితే ఆస్ట్రేలియన్ కామెంటేటర్ల ప్రవర్తనపై సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోల్స్ వచ్చాయి. '' రూట్ నొప్పితో బాధపడుతుంటే మీకు నవ్వులాటగా ఉంది..''.. '' ఒక జట్టు కెప్టెన్కు మీరిచ్చే గౌరవం ఇదేనా''.. '' ఒక ఆటగాడు నొప్పితో బాధపడుతుంటే మీకు నవ్వెలా వస్తుంది'' అంటూ రెచ్చిపోయారు. చదవండి: మ్యాచ్ ఆడుతుండగానే చాతిలో నొప్పి... పరుగున ఆసుపత్రికి Absolute scenes in the commentary box, completely losing it watching Joe Root run 😂 #Ashes pic.twitter.com/0CoJCSPTKD — 7Cricket (@7Cricket) December 19, 2021 -
Ashes Series 2nd Test: నువ్వు కెప్టెన్గా ఉండి ఏం లాభం: రికీ పాంటింగ్
Ricky Ponting Comments On Joe Root Captaincy: ఇంగ్లండ్ టెస్టు జట్టు కెప్టెన్ జో రూట్ తీరును ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం రికీ పాంటింగ్ విమర్శించాడు. అసలు కెప్టెన్గా ఉండి ఏం లాభం అంటూ ఘాటు విమర్శలు చేశాడు. యాషెస్ సిరీస్లో భాగంగా రెండో టెస్టులో ఇంగ్లండ్ ఆసీస్ చేతిలో చిత్తుగా ఓడిపోయిన సంగతి తెలిసిందే. 275 పరుగుల తేడాతో ఓటమి పాలై భంగపాటుకు గురైంది. మరోవైపు .. సిరీస్ ఆరంభం నుంచి దూకుడు మీదున్న ఆతిథ్య ఆసీస్ జట్టు 2-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఈ నేపథ్యంలో ఓటమిపై స్పందించిన జో రూట్ తమ బౌలర్ల ప్రదర్శనపై పెదవి విరిచాడు. సరైన లెంత్తో బౌల్ చేయలేకపోయారని వాపోయాడు. నాలుగేళ్ల క్రితం జరిగిన తప్పిదాలే పునరావృతమయ్యాయని.. ఇంకాస్త మెరుగ్గా ఆడి ఉంటే బాగుండేదని చెప్పుకొచ్చాడు. ముఖ్యంగా మొదటి ఇన్నింగ్స్లో నిలకడలేమి కారణంగా ప్రత్యర్థిని కట్టడిచేయలేపోయామని పేర్కొన్నాడు. ఈ క్రమంలో రికీ పాంటింగ్ మాట్లాడుతూ.. ‘‘నిజంగా రూట్ మాటలు వినగానే షాక్కు గురయ్యాను. బౌలర్లను మార్చాల్సింది ఎవరు? నువ్వు కెప్టెన్గా ఉండి ఏం చేస్తున్నావు? బౌలర్ల లైన్ లెంగ్త్ గురించి సలహాలు ఇవ్వలేవా? నువ్వు అసలు మైదానంలో ఏం చేస్తున్నావు?’’ అని మండిపడ్డాడు. అదే విధంగా... ‘‘కెప్టెన్గా.. నీకెలాంటి ప్రదర్శన కావాలో బౌలర్లకు చెప్పాలి. నువ్వు ఆశించినట్లుగా జరగడం లేదని భావించినపుడు వాళ్లను మార్చాలి. నీ వ్యూహాలను అమలు చేసే బౌలర్లను రంగంలోకి దించాలి. ప్రత్యర్థి బ్యాటర్లను అవుట్ చేయడానికి ఎలాంటి ప్రణాళికలు రచించావో.. వాళ్లు ఏం అనుకుంటున్నారో తెలుసుకోవాలి. ముందు వాళ్లతో ఓపెన్గా మాట్లాడాలి. అది కదా కెప్టెన్సీ అంటే’’ అంటూ తీవ్రస్థాయిలో విమర్శించాడు. రెండో టెస్టు- స్కోర్లు: ►ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్: 473-9 డిక్లేర్డ్ ►రెండో ఇన్నింగ్స్: 230-9 డిక్లేర్డ్ ►ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 236-10 ఆలౌట్ ►రెండో ఇన్నింగ్స్: 192 ఆలౌట్ చదవండి: Ashes Series 2nd Test: చివరి రోజు 69.5 ఓవర్ల పాటు బ్యాటింగ్... 50.4 ఓవర్లు ఎదుర్కొంది ఆ ఇద్దరే! What a way to end an epic innings! 😲 That's the first time Buttler has been dismissed hit wicket in his 193-innings first class career #Ashes pic.twitter.com/nRP09djjay — cricket.com.au (@cricketcomau) December 20, 2021 -
హెడ్కోచ్గా ఆఫర్.. ద్రవిడ్ను ఎంపికచేయడం ఆశ్చర్యపరిచింది
Ricky Ponting Reveals About Approach For Team Indias Head Coach.. ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు రికీ పాంటింగ్ టీమిండియా హెడ్కోచ్ పదవిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్ 2021 జరుగుతున్న సమయంలోనే తనకు టీమిండియా హెడ్కోచ్ పదవి ఆఫర్ వచ్చిందని తెలిపాడు. అయితే వర్క్లోడ్ దృష్యా ఆ అవకాశాన్ని తిరస్కరించాల్సి వచ్చిందని పేర్కొన్నాడు. ప్రస్తుతం ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్కు కోచ్గా ఉన్న పాంటింగ్ గ్రేడ్ క్రికెట్ పాడ్కాస్ట్ ఇంటర్య్వూలో మాట్లాడాడు. చదవండి: Rachin Ravindra Facts: ఎవరీ రచిన్ రవీంద్ర.. సచిన్, ద్రవిడ్తో ఏంటి సంబంధం? ''ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్కు కోచ్గా ఉన్నా. సంవత్సరంలో 300 రోజులు భారత్లోనే గడుపుతున్నా. టీమిండియాకు హెడ్కోచ్గా వెళ్తే .. రెండు పనులు బ్యాలెన్స్ చేసుకోవడం కష్టం. కానీ అంత టైమ్ కూడా వేస్ట్ చేయలేదు. వర్క్లోడ్ ఎక్కువయ్యే అవకాశం ఉండడంతో ఐపీఎల్లో కోచ్ పదవిని పక్కనబెట్టి టీమిండియాకు మాత్రమే పనిచేయాల్సి వస్తుంది. ఇప్పటికైతే టీమిండియా హెడ్కోచ్ పదవిపై ఆసక్తి లేదు. అందుకే తిరస్కరించా. కానీ రాహుల్ ద్రవిడ్ను హెడ్కోచ్గా నియమించడంపై ఒక్కక్షణం ఆశ్చర్యపోయా. అయితే అండర్-19 క్రికెట్లో కోచ్గా ద్రవిడ్ పాత్ర అభినందనీయం. అతను అటు ఫ్యామిలీని.. ఇటు బాధ్యతలను చక్కగా బ్యాలెన్స్ చేసుకోగలడు. ద్రవిడ్కు అప్పజెప్పి బీసీసీఐ మంచి పని చేసింది. రానున్న కాలంలో అతని పర్యవేక్షణలో టీమిండియా రాటుదేలడం గ్యారంటీ'' అని చెప్పుకొచ్చాడు. చదవండి: వచ్చే ఏడాది ప్రపంచ కప్ నుంచి న్యూజిలాండ్ ఔట్.. కారణం ఏంటంటే! -
'ఢిల్లీ తప్పనిసరిగా టైటిల్ గెలుస్తుంది'
Ricky Pontings Motivational Speech to DC players ahead of KKR clash: ఐపీఎల్ 2021లో ఢిల్లీ క్యాపిటల్స్ తప్పనిసరిగా టైటిల్ నెగ్గుతుందని ఆ జట్టు హెడ్ కోచ్ రికీ పాటింగ్ ఆశాభావం వ్యక్తం చేశాడు. కాగా నేడు క్వాలిఫయర్ - 2లో భాగంగా షార్జా వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్.. కేకేఆర్తో తలపడనుంది. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్లో చెన్నైతో ఢీకొట్టనుంది. ప్రస్తుత సీజన్లో 14 మ్యాచ్ల్లో 10 విజయాలు సాధించి పాయింట్ల ఢిల్లీ పట్టికలో అగ్రస్ధానంలో నిలిచింది. అయితే క్వాలిఫయర్-1లో సీఎస్కే చేతిలో ఓటమి చెందిన తరువాత ఢిల్లీ కాస్త ఢీలా పడింది. ఈ క్రమంలో నేడు జరగబోయే క్వాలిఫయర్ - 2లో ఏ విధంగానైనా గెలిచి ఫైనల్కు చేరాలని ఢిల్లీ ఉర్రుతలూగుతుంది. అయితే ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందు రికీ పాంటింగ్ తన జట్టుకు భావోద్వేగంతో కూడిన ప్రసంగం ఇచ్చాడు. తమ జట్టు గత కొద్ది సీజన్ల నుంచి చాలా బాగా ఆడుతుందని, మా ఆటగాళ్ల మీద పూర్తి నమ్మకం ఉందని, తప్పని సరిగా ఢిల్లీ ఛాంపియన్గా నిలుస్తోందని పాటింగ్ తెలిపాడు. "నేను మూడు సంవత్సరాలుగా ఢిల్లీ జట్టులో ఉన్నాను .2018లో పాయింట్ల పట్టికలో చివరి స్ధానంలో నిలిచాము. 2019లో మా జట్టు మూడో స్ధానంలో నిలవగా, గత సంవత్సరంలో రన్నర్ప్గా నిలిచాము. మేము ఈ ఏడాది టైటిల్ గెలవగలమన్న నమ్మకముంది. రెండేళ్ల క్రితం ఉన్న ఢిల్లీ జట్టుకు.. ప్రస్తుతం ఉన్న ఢిల్లీ జట్టుకు చాలా తేడా ఉందంటూ' పాంటింగ్ పేర్కొన్నాడు. చదవండి: T20 World Cup 2021: కోల్కతా ఓపెనర్ వెంకటేష్ అయ్యర్కు బంపర్ ఆఫర్.. -
ధోని లాంటి ఫినిషర్ లేకపోతే ఎంత మేటి జట్టైనా ఏం ప్రయోజనం..?
సిడ్నీ: టీ20 ఫార్మాట్లో టీమిండియా మాజీ సారధి మహేంద్రసింగ్ ధోని లాంటి అద్భుతమైన ఫినిషర్ ప్రతి జట్టుకు అవసరమని, జట్టులో అలాంటి ఆటగాడు లేకపోతే ఎంత మేటి జట్టైనా ఏ ప్రయోజనం లేదని ఆసీస్ మాజీ సారథి రికీ పాంటింగ్ అభిప్రాయపడ్డాడు. అక్టోబర్లో ప్రారంభంకానున్న టీ20 ప్రపంచకప్లో ఆస్ట్రేలియా విజయావకాశాలపై పాంటింగ్ స్పందిస్తూ ఈ మేరకు వ్యాఖ్యానించాడు. ప్రస్తుత ఆసీస్ జట్టులో అనుభవజ్ఞులైన ఆటగాళ్లకు కొదవ లేకున్నా.. లోయర్ మిడిలార్డర్లో ధోని, హార్ధిక్ పాండ్యా లాంటి ఫినిషర్లు లేకపోవడం జట్టు విజయావకాశాలను కచ్చితంగా ప్రభావితం చేస్తుందని పేర్కొన్నాడు. వికెట్ కీపింగ్ నైపుణ్యంతో పాటు ఆఖరి ఓవర్లలో వేగంగా పరుగులు రాబట్టగలిగే ధోని లాంటి ఆటగాడిని ఆసీస్ జట్టు తయారు చేసుకోలేకపోయిందని, దీని ఫలితాన్ని ఆ జట్టు గత కొన్నేళ్లుగా అనుభవిస్తుందని చెప్పుకొచ్చాడు. టీ20 ఫార్మాట్లో ఫినిషర్ స్థానం ఎంతో ప్రత్యేకమని, చివరి మూడు, నాలుగు ఓవర్లలో 50 పరుగులు చేయాలంటే అదే సరైన స్థానమని అభిప్రాయపడ్డాడు. పాండ్యా, పోలార్డ్ లాంటి ఆటగాళ్లు ఇదే ఫార్ములాను అమలు చేసి సత్ఫలితాలు సాధించిన విషయాన్ని గుర్తు చేశాడు. ఆసీస్ జట్టులో వార్నర్, ఫించ్, మ్యాక్స్వెల్ లాంటి బిగ్ హిట్టర్స్ ఉన్నప్పటికీ.. వారంతా టాపార్డర్ ఆటగాళ్లే కావడం వల్ల జట్టు ఆశించిన స్థాయి విజయాలు నమోదు చేయలేకపోతుందని వాపోయాడు. అయితే స్టొయినిస్, పాట్ కమిన్స్ లాంటి ఆటగాళ్లు మంచి ఫినిషర్లుగా మారే అవకాశముందని ఈ ఢిల్లీ క్యాపిటల్స్ కోచ్ అభిప్రాయపడ్డాడు. గిల్క్రిస్ట్ లాంటి విధ్వంసకర కీపర్ను అందించిన జట్టులో ప్రస్తుతం ఆ స్థాయి ఆటగాడు లేకపోవడం విచారకరమని, ఇకనైనా వికెట్ కీపింగ్ స్థానంపై ఆస్ట్రేలియా జట్టు ఓ క్లారిటీ రావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. కాగా, ప్రస్తుతం ఆసీస్ జట్టులో మాథ్యూ వేడ్, ఫిలిప్, అలెక్స్ క్యారీలు వికెట్ కీపింగ్ బ్యాట్స్మెన్లుగా కొనసాగుతున్నారు. ఈ ముగ్గురిలో ఎవరిని ఎప్పుడు తుది జట్టులోకి తీసుకుంటుందో జట్టు మేనేజ్మెంట్కే ఎరుక అని చురకలంటించాడు. చదవండి: ఆ బౌలర్ ఎప్పటికీ టీమిండియాకు ఆడలేడు.. -
‘ట్రావెల్ బ్యాన్’ అనేది సమస్యే కాదు: పాంటింగ్
అహ్మదాబాద్: కరోనా వైరస్ విజృంభణ కారణంగా భారత్ నుంచి విమానరాకపోకలను ఆస్ట్రేలియా ప్రభుత్వం నిలిపివేయడంపై ఆ దేశ మాజీ క్రికెట్ కెప్టెన్ రికీ పాంటింగ్ స్పందించాడు. ఇప్పటికే పలువురు ఆస్ట్రేలియా క్రికెటర్లు ఐపీఎల్ వీడి స్వదేశానికి బయల్దేరిన తరుణంలో ట్రావెల్ బ్యాన్పై చర్చనడుస్తోంది. దీనిపై మాట్లాడిన పాంటింగ్.. అదేమీ పెద్ద సమస్య కాదని అంటున్నాడు. భారత్ నుంచి విమానరాకపోకలను తమ దేశం నిలిపివేయడాన్ని సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదన్నాడు. అది చాలా చిన్న విషయమని, దాని గురించి పెద్దగా ఆలోచించాల్సిన పనిలేదన్నాడు. తమ జట్టులోని విదేశీ ఆటగాళ్లు విమాన రాకపోకల నిషేధం అంశాన్ని మరీ ఎక్కువగా పట్టించుకోవడం లేదన్నాడు. కానీ భారత్లోని ప్రజలు పడుతున్న ఇబ్బందులే తమను తీవ్రంగా కలిచివేస్తున్నాయన్నాడు. తాము బయోబబుల్లో ఉన్నామని, భారత్లోని బయట పరిస్థితులే తీవ్రంగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రతీ రోజూ బారత్లో కరోనా కేసులు ఎక్కువ నమోదు కావడంం ఆందోళన పరుస్తుందన్నాడు. తమ జట్టులోని రవిచంద్రన్ అశ్విన్ తల్లిదండ్రులకు కరోనా సోకడంతో లీగ్ను వీడిన విషయాన్ని పాంటింగ్ ప్రస్తావించాడు. ఈ తరహా విపత్కర పరిస్థితులే తమను ఎక్కువ బాధిస్తున్నాయన్నాడు. ప్రస్తుత సమయంలో ఎవరైతే కోవిడ్-19తో బాధపడుతున్నారో వారి చుట్టే తమ మనసు తిరుగుతుందని, తమ ప్రయాణాల గురించి ఎటువంటి ఆందోళనా లేదన్నాడు. భారత్లో కరోనా వైరస్ తీవ్ర రూపం దాల్చడంతో మనదేశ విమాన ప్రయాణాలపై ఆస్ట్రేలియా ప్రభుత్వం మే 15వరకూ నిషేధాన్ని విధించిన సంగతి తెలిసిందే. అప్పటికి పరిస్థితులు చక్కబడితే తిరిగి విమానరాకపోకలకు మార్గం సుగుమం అవుతుంది. ఒకవేళ భారత్లో అప్పటికీ ఇదే పరిస్థితి ఉంటే మాత్రంం ఐపీఎల్లో ఉన్న ఆస్ట్రేలియా క్రికెటర్లు తమ దేశాలకు వెళ్లడం కష్టతరం కావొచ్చు. ఇక్కడ చదవండి: Virender Sehwag: పంత్ కెప్టెన్సీకి 5 మార్కులు కూడా ఇవ్వను -
‘అశ్విన్కు బౌలింగ్ ఎందుకు ఇవ్వలేదో అడుగుతా’
ముంబై: రాజస్తాన్ రాయల్స్ జరిగిన మ్యాచ్లో ఓటమి చెందడంపై ఢిల్లీ క్యాపిటల్స్ హెడ్ కోచ్ రికీ పాంటింగ్ అసహనం వ్యక్తం చేశాడు. గెలుపు అంచుల వరకూ వెళ్లి పరాజయం చెందడం జట్టు తప్పిదంగా పాంటింగ్ పేర్కొన్నాడు. ప్రధానంగా చివరి ఓవర్లో మోరిస్కు వేసిన రెండు బంతుల్ని స్లాట్ వేశారని, దాంతోనే మ్యాచ్ తమ చేతుల్లోంచి చేజారిపోయిందన్నాడు. ఎవరికైనా బంతుల్ని స్లాట్లో వేస్తే కచ్చితంగా హిట్ చేస్తారన్నాడు. అందులోనూ చావో రేవో పరిస్థితుల్లో ఈ తరహా బంతులు సరైనది కాదని పాంటింగ్ అన్నాడు. మ్యాచ్ తర్వాత పోస్ట్ మ్యాచ్ కాన్ఫరెన్స్లో మాట్లాడిన పాంటింగ్.. టామ్ కరాన్ వేసిన ఆ రెండు బంతులు తమ జట్టుకు విజయాన్ని దూరం చేశాయని తేల్చేశాడు. ఇషాంత్ స్థానాన్ని అవేష్ ఖాన్ పూర్తి స్థాయిలో భర్తీ చేస్తాడని ఆశిస్తున్నట్లు చెప్పాడు. ఇషాంత్ అనుభవం జట్టుకు అవసరమొస్తుందని అభిప్రాయపడ్డాడు. క్రిస్ వోక్స్, కగిసో రబడ, నోర్ట్జే, టామ్ కుర్రన్లతో బౌలింగ్ విభాగం బలంగా ఉందని, రవిచంద్రన్ అశ్విన్ రూపంలో నాణ్యమైన స్పిన్నర్ జట్టులో ఉన్నాడని చెప్పాడు. అశ్విన్కు బౌలింగ్ ఎందుకు ఇవ్వలేదో అడుగుతా మ్యాచ్ చేజారిపోవడానికి ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్కు బౌలింగ్ ఇవ్వకపోవడం కూడా ఒక కారణమన్నాడు. రాజస్థాన్తో మ్యాచ్లో అశ్విన్ అద్భుతమైన గణాంకాలతో బౌలింగ్ చేస్తే అతని చేత పూర్తి కోటా బౌలింగ్ వేయించకపోవడం నిజంగానే తప్పిదమన్నాడు. తాము ఆడిన తొలి గేమ్లో అశ్విన్ నిరాశపరిస్తే, రెండో గేమ్ నాటికి సెట్ అయ్యాడన్నాడు. తొలి గేమ్ నుంచి చేసిన తప్పిదాల నుంచి గుణపాఠం నేర్చుకుని, రాజస్థాన్తో మ్యాచ్లో చాలా పొదుపుగా బౌలింగ్ చేశాడని పాంటింగ్ తెలిపాడు. మరి అటువంటప్పుడు అశ్విన్ చేత పూర్తి కోటా బౌలింగ్ వేయించకపోవడం తప్పిదమే అవుతుందన్నాడు. ఈ విషయంపై జట్టు సభ్యులతో కూర్చొని మాట్లాడతానని, దీనిపై ఒక క్లారిటీ తీసుకోవాలని పాంటింగ్ అన్నాడు. తాము బౌలింగ్ చేసేటప్పుడు బంతిపై గ్రిప్ దొరకలేదని, అందుకే బౌలర్లు అనుకున్న విధంగా బౌలింగ్ చేయలేకపోయారన్నాడు. తమ ఫలితంపై డ్యూ కూడా ప్రభావం చూపిందని పాంటింగ్ స్పష్టం చేశాడు. ఇక్కడ చదవండి: ఢిల్లీ ఓటమి: పంత్ మిస్టేక్ వెరీ క్లియర్..! సామ్సన్.. నా బ్యాటింగ్ చూడు! Chris Morris: ఇజ్జత్ అంటే ఇదేనేమో.. వెల్డన్ మోరిస్! -
'పాంటింగ్తో కలిసి పనిచేయడం ఆనందంగా ఉంది'
ముంబై: గతేడాది ఐపీఎల్ సీజన్లో ఆద్యంతం దుమ్మురేపే ప్రదర్శనతో ఆకట్టుకున్న ఢిల్లీ క్యాపిటల్స్ ఫైనల్లో ముంబై ఇండియన్స్ చేతిలో ఓడిపోయి చతికిలపడింది. ఒక జట్టుగా ఢిల్లీ క్యాపిటల్స్ ఆకట్టుకుంటే.. ఆ జట్టు యువ ఆటగాడు పృథ్వీ షాకు మాత్రం నిరాశనే మిగిల్చింది. ఢిల్లీ తరపున గతేడాది 13 మ్యాచ్లాడిన అతను 228 పరుగులు మాత్రమే చేశాడు. ఆ సీజన్లో అతని అత్యధిక స్కోరు 66గా ఉంది. ఆ తర్వాత ఆసీస్ గడ్డపై జరిగిన టెస్టు సిరీస్లో భాగంగా తొలి టెస్టు మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో పృథ్వీ షా డకౌట్ అవ్వడం.. రెండో ఇన్నింగ్స్లో 4 పరుగులే చేయడంతో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. బ్యాటింగ్ రాని ఒక ఆటగాడిని తీసుకొచ్చి ఓపెనర్ స్థానంలో ఆడించడమేంటంటూ విపరీతంగా ట్రోల్ చేశారు. ఈ దెబ్బతో పృథ్వీ షా ఆసీస్ సిరీస్లో మరో మ్యాచ్ ఆడే అవకాశం రాకుండా పోయింది. అయితే ఆ తర్వాత జరిగిన విజయ్ హజారే ట్రోపీలో మాత్రం పృథ్వీ షా దుమ్మురేపే ప్రదర్శన చేశాడు. నాలుగు శతకాలతో రెచ్చిపోయిన అతను టోర్నీ టాప్ స్కోరర్గా నిలిచి తిట్టినవాళ్ల చేతే శెభాష్ అనిపించుకున్నాడు. కాగా 2021 ఐపీఎల్ సీజన్లో సీఎస్కేతో జరిగిన తొలి మ్యాచ్లోనే పృథ్వీ షా తన విలువేంటో చూపించాడు. 38 బంతుల్లోనే 72 పరుగులు చేసిన పృథ్వీ ఢిల్లీ ఆ మ్యాచ్ గెలవడంలో కీలకపాత్ర పోషించాడు. ఈ నేపథ్యంలో ఢిల్లీ క్యాపిటల్స్ ప్రధాన కోచ్ రికీ పాంటింగ్ గురించి పృథ్వీ షా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. పాంటింగ్తో కలిసి పనిచేయడం ఆనందంగా ఉంది. గతేడాది సీజన్లో నేను విఫలమైనప్పుడు నా వెన్నంటి ఉండి ప్రోత్సహించాడు. ఆయన మార్గదర్శనంలో పనిచేయడం గొప్ప అనుభూతి. ఆసీస్ తరపున ఎన్నో మ్యాచ్లు ఆడిన పాంటింగ్కు అనుభవం ఎక్కువ.. అందేకే అతనిచ్చే సలహాలు.. ఐడియాలు మాలాంటి యువ ఆటగాళ్లకు ఎంతో ప్రేరణ కలిగిస్తాయి. ఈ సీజన్లో తొలి మ్యాచ్ ఆడడానికి ముందు నా బ్యాటింగ్లో చిన్నపాటి మార్పులు చేసుకున్నాను. గతేడాది సీజన్లో చేసిన తప్పులను మళ్లీ చేయకుండా ఉండేందుకు ప్రాక్టీస్ చేశాను. అంతకముందు విజయ్ హజారే ట్రోపీ ఆరంభానికి ముందు నా కోచ్లు రజనీకాంత్ శివగ్నానమ్, ప్రవీణ్ ఆమ్రే వద్ద సలహాలు తీసుకోవడం కూడా బాగా ఉపయోగపడింది. విజయ్ హజారే ట్రోపీలో రాణించడం వెనుక కారణం కూడా అదే అంటూ ముగించాడు. కాగా సీఎస్కేపై విజయంతో ఉత్సాహంగా ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్ మరికొద్ది సేపట్లో రాజస్తాన్ రాయల్స్ను ఎదుర్కొనబోతుంది. చదవండి: ఆ స్థానంలో వస్తే ఆరెంజ్ క్యాప్ ఎలా వస్తుంది! పంత్లో నాకు ఆ ఇద్దరు కనిపిస్తున్నారు: పాంటింగ్ -
పంత్లో నాకు ఆ ఇద్దరు కనిపిస్తున్నారు: పాంటింగ్
ముంబై: ఐపీఎల్ 14వ సీజన్ను ఢిల్లీ క్యాపిటల్స్ ఘనంగా ఆరంభించిన సంగతి తెలిసిందే. సీఎస్కేతో జరిగిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ 189 పరుగుల లక్ష్యాన్ని 3 వికెట్లు మాత్రమే కోల్పోయి చేధించింది. ఆ జట్టు ఓపెనర్లు పృథ్వీ షా, శిఖర్ ధావన్ మెరుపు ఇన్నింగ్స్లు ఆడడంతో సునాయస విజయాన్ని దక్కించుకుంది. తొలి మ్యాచ్ విజయంతో ఉత్సాహంగా కనిపిస్తున్న ఢిల్లీ క్యాపిటల్స్ రేపు రాజస్తాన్ రాయల్స్తో ఆడనుంది. ఈ నేపథ్యంలో ఆ జట్టు కోచ్ రికీ పాంటింగ్ రిషబ్ పంత్పై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ''నాకు రిషబ్ పంత్లో కోహ్లి, విలియమ్సన్లు కనిపిస్తున్నారని.. అతని దూకుడులో కోహ్లి కనిపిస్తుంటే.. కెప్టెన్సీలో విలియమ్సన్ను గుర్తుకు తెస్తున్నాడు. ఈ ఐపీఎల్లో పంత్ ఏ స్థానంలో బ్యాటింగ్ రావాలనేదానిపై మాకు క్లారిటీ లేదు. కానీ అతనికి నాలుగు, ఐదు స్థానాల్లో బ్యాటింగ్ బాగా అచ్చొచ్చంది. అయితే ఒక విషయంలో మాత్రం అతను మరింత రాటు దేలాల్సి ఉంది. జట్టులోకి కీపర్గా వచ్చిన రిషబ్ పంత్ కొన్నిసార్లు కీపింగ్లో అనవసర తప్పులు చేస్తున్నాడు. బ్యాటింగ్ పరంగా చూసుకుంటే మంచి టచ్లో ఉన్న అతనికి బ్రిలియంట్ ఫుట్వర్క్ ఉండడం అతనికి కలిసొచ్చే అంశం. ఎలాగు బ్యాటింగ్లో దూకుడు ప్రదర్శించే పంత్ కీపింగ్లోనూ మెరుగుపడితే ఇంకో 10-12 ఏళ్లు టీమిండియా తరపున లీడింగ్ వికెట్ కీపర్గా కొనసాగుతాడు.''అంటూ చెప్పుకొచ్చాడు. కాగా భుజం గాయంతో ఐపీఎల్ సీజన్కు దూరమైన శ్రేయాస్ అయ్యర్ స్థానంలో పంత్ కెప్టెన్గా ఎంపికైన సంగతి తెలిసిందే. చదవండి: పంత్ సేనకు భారీ షాక్.. స్టార్ పేసర్కు కరోనా చదవండి: 'పంత్ కూల్గా ఉండడం మాకు కలిసొచ్చింది' -
శ్రేయస్ అయ్యర్కు పాంటింగ్ ఆహ్వానం..!
ముంబై: ఇంగ్లండ్తో జరిగిన టీ20 సిరీస్లో శ్రేయస్ అయ్యర్ గాయపడటంతో ఇంగ్లండ్ వన్డే సిరీస్తో పాటు ఐపీఎల్-14 సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్గా వ్యవహరిస్తున్న అయ్యర్.. లీగ్ మొత్తానికి దూరం కావడంతో అతని స్థానంలో టీమిండియా విధ్వంసకర బ్యాట్స్మెన్ రిషబ్ పంత్కు జట్టు పగ్గాలు అప్పగించిన సంగతి తెలిసిందే. కాగా, మూడు రోజుల క్రితం అయ్యర్ సర్జరీ చేయించుకున్నాడు. భుజానికి నిర్వహించిన శస్త్రచికిత్స విజయవంతం అయ్యిందని, త్వరలోనే తిరిగి మైదానంలో అడుగుపెడతానని ఆయన సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు. అయ్యర్కు సుమారు నాలుగు నెలలు విశ్రాంతి అవసరం కావడంతో అతను మళ్లీ క్రికెట్ ఫీల్డ్లో దిగడానికి చాలా సమయమే ఉంది. కాగా, నిన్న సీఎస్కేతో ముంబై వేదికగా జరిగిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ విజయం సాధించిన తర్వాత ఆ జట్టు హెడ్ కోచ్ రికీ పాంటింగ్..శ్రేయస్ అయ్యర్ను వర్చువల్ కాల్లో ముచ్చటించాడు. తొలుత పలువురు ఢిల్లీ ఆటగాళ్లు అయ్యర్ను విష్ చేయగా, ఆ తర్వాత పాంటింగ్ మాట్లాడాడు. ఈ క్రమంలోనే తమతో జాయిన్ కావాలని పాంటింగ్ రిక్వెస్ట్ చేశాడు. శస్త్ర చికిత్స తర్వాత భుజం ఎలా ఉందని ముందుగా అడిగిన పాంటింగ్.. వచ్చి జట్టుతో కలవమన్నాడు. ‘ అంతా ఓకేనా.. ఓహ్ నీ హెయిర్ స్టైల్ బాగుంది. వచ్చి జట్టుతో కలవచ్చు కదా. కేవలం ఏడు రోజులే క్వారంటైన్. క్వారంటైన్ అనేది చాలా తొందరగా అయిపోతుంది. నన్ను నమ్ము. 12వ ఆటగాడిగా జట్టుతో ఉండు’ అంటూ అయ్యర్తో పాంటింగ్ సరదాగా చమత్కరించాడు. ఇక్కడ చదవండి: ఆఫ్ స్పిన్ టెస్టుల్లో మాత్రమే వేస్తావా.. టీ20ల్లో వేయవా! నన్ను బాధించింది.. ఇక ఆలోచించడం లేదు: పృథ్వీ షా -
నేను అలా చేయను.. నా భార్య విడాకులిచ్చేస్తుంది!
ముంబై: ఈ ఐపీఎల్-14 సీజన్లో భాగంగా గతవారం ఢిల్లీ క్యాపిటల్స్కు ఆ జట్టు హెడ్ రికీ పాంటింగ్ ఇచ్చిన స్ఫూర్తిదాయకమైన ప్రసంగం సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. దీనికి ఫ్యాన్స్ అభినందనలు కూడా అందుకున్నాడు పాంటింగ్. అతని స్ఫూర్తిదాయకమైన స్పీచ్ను స్పోర్ట్ డ్రామా కథాంశంగా 2007లో వచ్చిన చక్ దే ఇండియాలోని కబీర్ఖాన్(షారుక్ఖాన్)తో పోలుస్తూ అభిమానులు ట్వీటర్ వేదికగా కొనియాడాడు. అక్కడ కబీర్ఖాన్-ఇక్కడ పాంటింగ్లు ఒకే తరహాలో వారి జట్లలో జోష్ను నింపారన్నారు. అయితే ఇక్కడ ఆ ఇద్దరికీ ఒక తేడా ఉందని ఢిల్లీ క్యాపిటల్స్ తన ట్వీటర్ హ్యాండిల్లో రాసుకు రావడమే కాకుండా పాంటింగ్ మాట్లాడిన ఒక వీడియోను సైతం విడుదల చేసింది. నేను అలా చేయను.. నా భార్య విడాకులిస్తుంది అయితే ఆ ఒక్క తేడా ఏమిటంటే మ్యాచ్కు ముందు పాంటింగ్ క్లీన్ షేవ్తో ఉండటమే. దీనిపై ఆ వీడియోలో పాంటింగ్ తన గడ్డం గురించి మాట్లాడుతూ.. ‘నేను ఎప్పుడూ పెరిగిన గడ్డంతో ఉండను. మ్యాచ్ ప్రారంభానికి ముందు అసలే ఉండను. నా భార్య నన్ను టెలివిజన్లో చూస్తుంది. నా భార్య నన్ను గడ్డంతో చూసిందంటే విడాకులు ఇచ్చేస్తుంది(నవ్వుతూ). అందుకే నేను క్లీన్ షేవ్తో ఉంటాను. మ్యాచ్ ప్రారంభమయ్యే ముందు రాత్రి నేను షేవ్ చేసుకోక తప్పదు. ఇది నాకు ఆచారంగా వస్తుంది. మాకు ఏప్రిల్ 10వ తేదీన ఐపీఎల్ మ్యాచ్ ఉంది కాబట్టే 9వ తేదీ రాత్రే షేవ్ చేసుకుంటాను. ఏ మ్యాచ్కైనా అలానే చేస్తాను. ఈ విషయాన్ని మావాళ్లు గుర్తించారో లేదో నాకైతే కచ్చింతంగా తెలీదు’ అని పేర్కొన్నాడు. మూడేళ్ల క్రితం 2018లో ఢిల్లీ క్యాపిటల్స్ కోచ్గా బాధ్యతలు చేపట్టిన పాంటింగ్.. ఆ మరుసటి ఏడాది ఢిల్లీని ప్లే ఆఫ్స్కు చేర్చడంలో కీలక పాత్ర పోషించాడు. 2020లో ఢిల్లీ ఫైనల్కు చేరిన సంగతి తెలిసిందే. The only difference between @RickyPonting and Kabir Khan is that the latter had a stubble on Matchday 😉#CSKvDC #YehHaiNayiDilli #IPL2021 pic.twitter.com/nRioP0WKRS — Delhi Capitals (@DelhiCapitals) April 10, 2021 -
‘నయీ దిల్లీ’కి మరో చాన్స్
రెండేళ్ల క్రితం డేర్డెవిల్స్ను వదిలి క్యాపిటల్స్ అంటూ పేరు మార్చుకొని వచ్చిన ఢిల్లీ నిజంగా కొత్తగా కనిపించింది. అప్పటి వరకు ఆరు సీజన్ల పాటు వరుసగా 9, 8, 7, 6, 6, 8 స్థానాల్లో నిలిచి ఇదేం టీమ్రా బాబూ అంటూ సొంత అభిమానులే జట్టు ప్రదర్శనతో విసుగెత్తిపోయేలా చేసింది. ఇలాంటి స్థితిలో కొత్త కోచ్, కొత్త కెప్టెన్ నేతృత్వంలో 2019లో మూడో స్థానంలో నిలిచిన టీమ్ ఏడాది తిరిగేసరికి మరో మెట్టు ఎక్కింది. ‘నయీ దిల్లీ’ అంటూ ఫైనల్ వరకు చేరి సత్తా చాటింది. లీగ్ దశలో చాలా బాగా ఆడినా... దురదృష్టవశాత్తూ రెండో స్థానానికే పరిమితమైన టీమ్ ఇప్పుడు ఆ అడ్డంకిని దాటి విజేతగా నిలవాలని పట్టుదలగా ఉంది. కొత్త కెప్టెన్ రిషభ్ పంత్ నాయకత్వ ప్రదర్శన... అన్నీ తానే అయి వ్యవహరించే కోచ్ రికీ పాంటింగ్ వ్యూహాలు ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నేళ్లుగా ఎదురు చూస్తున్న తొలి టైటిల్ కలను నెరవేరుస్తాయా అనేది ఆసక్తికరం. కొత్తగా వచ్చినవారు... వేలంపరంగా చూస్తే ఢిల్లీ ఎంపిక అంత గొప్పగా ఏమీ లేదు. ఫామ్ను బట్టి రబడ, నోర్జేలు ఖాయంగా తుది జట్టులో ఉండే అవకాశం ఉన్న చోట మరో విదేశీ పేసర్ టామ్ కరన్ (రూ. 5.25 కోట్లు«) కోసం భారీ మొత్తం వెచ్చించింది. అదే విధంగా ఎన్ని మ్యాచ్లలో తుది జట్టులో ఉంటాడో తెలియని స్టీవ్ స్మిత్ (రూ.2.20)ను అందరికంటే ముందు ఎంచుకుంది. భారత పేసర్ ఉమేశ్ యాదవ్ (రూ. 1 కోటి) ఎంపిక సరైంది కాగా... ప్రత్యామ్నాయ వికెట్ కీపర్ బ్యాట్స్మన్గా లివింగ్స్టోన్ (రూ. 2 కోట్లు) తీసుకుంది. మరో నలుగురు యువ ఆటగాళ్లు రిపాల్ పటేల్, విష్ణు వినోద్, లుక్మాన్ మేరివాలా, ఎం. సిద్ధార్థ్లను రూ. 20 లక్షల కనీస ధరకే సొంతం చేసుకుంది. తుది జట్టు అంచనా/ఫామ్ గత ఏడాది ఆటగాడిగా, కెప్టెన్గా కూడా జట్టును సమర్థంగా నడిపించిన శ్రేయస్ అయ్యర్ లేకపోవడం టీమ్కు పెద్ద లోటు. అతని స్థానంలో అన్ని మ్యాచ్లు ఆడేందుకు రహానే మినహా (గత సీజన్లో టీమ్ 17 మ్యాచ్లు ఆడితే రహానేకు 9 మ్యాచ్లలోనే చాన్స్ లభించింది) మరో ప్రత్యామ్నాయం కనిపించడం లేదు. నలుగురు విదేశీ ఆటగాళ్ల జాబితాను చూస్తే రబడ, నోర్జే ఖాయం. ఆల్రౌండర్గా స్టొయినిస్ లేదా అతనికి ప్రత్యామ్నాయంగా సరిగ్గా అలాంటి శైలి ఉన్న వోక్స్ అందుబాటులో ఉన్నాడు. మిగిలిన మరో స్థానంలో హిట్టర్ హెట్మైర్ను కాదని స్మిత్కు ఎన్ని మ్యాచ్లు దక్కుతాయో చూడాలి. ఆటగాడికంటే స్మిత్ మెంటార్ పాత్రనే ఎక్కువగా పోషించేటట్లు కనిపిస్తోంది. గత సీజన్లో 3 మ్యాచ్లకు దూరమైన పంత్... ఇప్పుడు కెప్టెన్ కాబట్టి అన్ని మ్యాచ్లు ఆడతాడనడంలో సందేహం లేదు. భారత పేస్ బౌలర్లలో ఇషాంత్ శర్మ, ఉమేశ్ యాదవ్లాంటి సీనియర్లు అందుబాటులో ఉండగా, అవేశ్ ఖాన్కు కొన్ని మ్యాచ్లు దక్కవచ్చు. స్పిన్లో మరోసారి అశ్విన్, అక్షర్ ద్వయం ప్రత్యర్థులను దెబ్బ తీయగలదు. సీనియర్ లెగ్స్పిన్నర్ అమిత్ మిశ్రా కూడా అందుబాటులో ఉన్నాడు. పెద్దగా మార్పులు లేకుండా గత సీజన్లో ఆడిన తుది జట్టే ఈసారి కూడా ఎక్కువగా బరిలోకి దిగే అవకాశం ఉంది. అన్నింటికి మించి ఇటీవలి అద్భుత ఫామ్, పెరిగిన ఆత్మవిశ్వాసంతో పంత్ నాయకుడిగా మైదానంలో ఎలా జట్టు నడిపిస్తాడనేది ఆసక్తికరం. జట్టు వివరాలు భారత ఆటగాళ్లు: రిషభ్ పంత్ (కెప్టెన్), అజింక్య రహానే, రవిచంద్రన్ అశ్విన్, ఎం.సిద్ధార్థ్, విష్ణు వినోద్, లలిత్ యాదవ్, అవేశ్ ఖాన్, అక్షర్ పటేల్, అమిత్ మిశ్రా, ఇషాంత్ శర్మ, రిపాల్ పటేల్, శిఖర్ ధావన్, ప్రవీణ్ దూబే, పృథ్వీ షా, ఉమేశ్ యాదవ్, లుక్మాన్ మేరివాలా. విదేశీ ఆటగాళ్లు: కగిసో రబడ, స్టొయినిస్, స్యామ్ బిల్లింగ్స్, క్రిస్ వోక్స్, స్టీవ్ స్మిత్, హెట్ మైర్, నోర్జే, టామ్ కరన్. సహాయక సిబ్బంది: రికీ పాంటింగ్ (కోచ్), మొహమ్మద్ కైఫ్ (అసిస్టెంట్ కోచ్), ప్రవీణ్ ఆమ్రే (అసిస్టెంట్ కోచ్), అజయ్ రాత్రా (అసిస్టెంట్ కోచ్), జేమ్స్ హోప్స్ (పేస్ బౌలింగ్ కోచ్). అత్యుత్తమ ప్రదర్శన 2020లో రన్నరప్ 2020లో ప్రదర్శన: 14 మ్యాచ్లలో 8 విజయాలు సాధించి రెండో స్థానంతో ప్లే ఆఫ్స్కు అర్హత సాధించింది. అయితే లీగ్ దశలో రెండు సార్లు, ఆపై తొలి క్వాలిఫయర్, ఫైనల్లో కూడా ముంబై ఇండియన్స్ చేతిలోనే ఓడి తొలి టైటిల్కు దూరమైంది. బ్యాటింగ్లో శిఖర్ ధావన్ (619 పరుగులు), శ్రేయస్ అయ్యర్ (519) కీలక పాత్ర పోషించగా... రబడ, నోర్జే కలిసి 52 వికెట్లు పడగొట్టారు. అక్షర్, స్టొయినిస్ ఆల్రౌండ్ ప్రదర్శన కూడా జట్టుకు విజయాలు అందించింది. -
అప్పుడు 12.5 కోట్లు; ఇప్పుడు మరీ ఇంత తక్కువ ధర: పాంటింగ్
న్యూఢిల్లీ: తక్కువ ధరకే స్టీవ్ స్మిత్ తమ జట్టు సొంతమవుతాడని భావించలేదని ఢిల్లీ క్యాపిటల్స్ హెడ్ కోచ్, ఆసీస్ దిగ్గజం రికీ పాంటింగ్ అన్నాడు. ఐపీఎల్-2021 సీజన్లో అతడు తప్పకుండా రాణిస్తాడని, తన సత్తా ఏంటో నిరూపించుకుంటాడని ఆశాభావం వ్యక్తం చేశాడు. కాగా రూ. 12.4 కోట్లు వెచ్చించి స్మిత్ను కొనుగోలు చేసిన రాజస్తాన్ రాయల్స్ జట్టు, గత సీజన్ ముగిసిన అనంతరం అతడిని విడుదల చేయడమే గాకుండా, సంజూ శాంసన్కు కెప్టెన్సీ పగ్గాలు అప్పగించిన విషయం తెలిసిందే. స్మిత్ నేతృత్వంలోని రాజస్తాన్ రాయల్స్ గతేడాది 14 మ్యాచ్లాడి 6 విజయాలు, 8 ఓటములతో పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచింది. బ్యాట్స్మన్గా 14 మ్యాచ్ల్లో 311 పరుగుల సాధించిన స్మిత్ బ్యాట్స్మెన్గానూ ఆకట్టుకోలేకపోయాడు. దీంతో యాజమాన్యం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో ఇటీవల చెన్నైలో జరిగిన మినీ వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ స్మిత్ను రూ. 2.2 కోట్లకు దక్కించుకుంది. ఈ నేపథ్యంలో రికీ పాంటింగ్ మాట్లాడుతూ.. ‘‘ఇంత తక్కువ ధరకే మేం స్మితీని దక్కించుకుంటామని అనుకోలేదు. సుదీర్ఘ కాలంగా అతడిని కొనసాగించిన ఫ్రాంఛైజీ ఈ సీజన్లో తనను వదులుకుంది. నిజానికి తను ఆట మీద కసితో ఉన్నాడు. ఈసారి కచ్చితంగా పరుగుల వరద పారిస్తాడు. వచ్చే ఏడాది మెగా వేలం ఉంటుందన్న సంగతి తనకు తెలుసు. కాబట్టి ఈ సీజన్లో బాగా రాణిస్తే, తనను కొనుగోలు చేసేందుకు భవిష్యత్తులో పెద్దమొత్తం ఖర్చు చేయాల్సిన అవసరం వస్తుందేమో!’’ అని చెప్పుకొచ్చాడు. ఇక వేలం జరుగుతున్న సమయంలో తాను ఇంట్లోనే ఉన్నానన్న పాంటింగ్... ‘‘ఫ్రాంఛైజీ యజమానులతో ఆరోజు ఫోన్లో మాట్లాడుతూనే ఉన్నాను. ఇంతలో స్మిత్ కోసం బిడ్ వేసినట్లు తెలిసింది. వెనువెంటనే డీసీ అతడిని కొనుగోలు చేసిందనే ప్రకటన కూడా వెలువడింది. స్మిత్ అనుభవం, తన క్లాసిక్ ఆట మా జట్టుకు ప్రయోజనం చేకూరుస్తుందనే విషయంలో ఎలాంటి సందేహం లేదు’’ అని స్టీవ్ స్మిత్పై ప్రశంసలు కురిపించాడు. కాగా రాజస్తాన్ రాయల్స్ స్మిత్ను వదులుకున్న తర్వాత రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్ పోటీపడగా, డీసీ అతడిని సొంతం చేసుకుంది. ఇక ఏప్రిల్ 10న తమ తొలి మ్యాచ్లో డీసీ చెన్నై సూపర్ కింగ్స్తో తలపడనుంది. రెగ్యులర్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ గాయం కారణంగా దూరం కావడంతో, టీమిండియా యువ కెరటం రిషభ్ పంత్ సారథ్యంలో ముందుకు సాగనుంది. చదవండి: ధోని బాయ్ జట్టుతో తొలి మ్యాచ్.. అది కెప్టెన్గా ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఇదే.. పూర్తి వివరాలు -
పృథ్వీషా ఆ అలవాటును మార్చుకోవాలి: పాంటింగ్
ముంబై: ఢిల్లీ క్యాపిటల్స్ కీలక ఆటగాడు పృథ్వీషాకు ఉన్న వింత అలవాటుపై ఆ జట్టు ప్రధాన కోచ్ రికీ పాంటింగ్ స్పందించాడు. గతేడాది ఐపీఎల్లో విఫలమైన సందర్భంగా షాకు ఉన్న ఆ అలవాటు గరించి తాను తెలుసుకున్నానని పేర్కొన్నాడు. దుబాయ్ వేదికగా జరిగిన గత ఐపీఎల్ సీజన్లో 13 మ్యాచ్ల్లో 2 అర్ధశతకాల సాయంతో కేవలం 228 పరుగులు చేసిన షా.. తీవ్ర నిరుత్సాహానికి లోనయ్యాడని, స్కోర్ చేయలేకపోతే నెట్స్లో బ్యాటింగ్ సాధన చేసే అలవాటు తనకు లేదని చెప్పాడని వెల్లడించాడు. గత సీజన్లో నాలుగైదు ఇన్నింగ్స్ల్లో 10 కంటే తక్కువ పరుగులు సాధించినప్పుడు తాను అతనితో మాట్లాడానని, నెట్స్లో సాధన చేయాలని కోరితే తన కళ్లలోకి చూసి తాను ఫెయిలైనప్పుడు బ్యాటింగ్ సాధన చేయనని చెప్పాడని పేర్కొన్నాడు. అయితే ఈ అలవాటు అతని కెరీర్కు ఏమాత్రం మంచిదికాదని చెప్పానని, కోచ్గా అతను ఫామ్లోలేని సమయంలో తగిన సలహాలు అందించానని పాంటింగ్ తెలిపాడు. టెక్నిక్ పరంగా టీమిండియా దిగ్గజ ఆటగాడు సచిన్తో దగ్గరి పోలికలున్న షా.. ఈ ఏడాది ఆ వింత అలవాటుకు స్వస్తిపలికి పరుగుల వరద పారించాలని ఆశాభావం వ్యక్తం చేశాడు. ముంబైకి చెందిన 21 ఏళ్ల పృథ్వీ షా ఈ ఏడాది విజయ్ హజారే వన్డే టోర్నీలో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. 8 మ్యాచ్ల్లో 4 భారీ శతకాలు, ఓ అర్ధశతకం సాయంతో 827 పరుగులు సాధించి, టోర్నీ చరిత్రలో ఏ ఆటగాడికి సాధ్యంకాని 800 పరుగుల మైలురాయిని అందుకున్నాడు. ఇదిలా ఉంటే ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో రిషబ్ పంత్ సారధ్యంలోని ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ముంబై వేదికగా ఏప్రిల్ 10న జరిగే మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ను ఢీకొంటుంది. చదవండి: రాయల్ లుక్లో రాజస్థాన్ రాయల్స్.. -
కోహ్లి అరుదైన రికార్డు.. ఎవరికీ అందనంత దూరంలో!
పుణె: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి మరో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. అంతర్జాతీయ వన్డేల్లో మూడో స్థానంలో బ్యాటింగ్ దిగి 10 వేలకు పైగా పరుగులు చేసిన రెండో క్రికెటర్గా నిలిచాడు. ఇంగ్లండ్తో జరుగుతున్న రెండో వన్డేలో ఈ ఘనత సాధించాడు. కాగా ఆస్ట్రేలియా దిగ్గజం, మాజీ సారథి రికీ పాంటింగ్ ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాడు. తన కెరీర్లో వన్డే ఫార్మాట్లో మూడో నంబర్ బ్యాట్స్మెన్గా మైదానంలోకి దిగి పాంటింగ్ మొత్తంగా 12662 పరుగులు చేశాడు. ఇక కోహ్లి విషయానికొస్తే, పుణె వేదికగా జరుగుతున్న రెండో వన్డే మ్యాచ్లో 66 పరుగుల వద్ద ఈ రన్మెషీన్ అవుటయ్యాడు. ఈ క్రమంలో మూడో స్థానంలో బ్యాటింగ్ వచ్చి 10046 పరుగులు పూర్తిచేసుకున్నాడు. కాగా పాంటింగ్(12662), కోహ్లి(10046) తర్వాత శ్రీలంక మాజీ కెప్టెన్ కుమార్ సంగక్కర(9,747- 238 ఇన్నింగ్స్), దక్షిణాఫ్రికా ఆటగాడు జాక్వస్ కలిస్(7,774) తర్వాతి స్థానాల్లో ఉన్నాడు. ఇక ప్రస్తుతం ఆడుతున్న ఆటగాళ్లలో న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్(5421) ఒక్కడే ఈ జాబితాలో చోటుదక్కించుకున్నాడు. ఇక ఈ మ్యాచ్లో కోహ్లి మరో రికార్డు కూడా నెలకొల్పాడు. 50- ఓవర్ల క్రికెట్లో, దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ గ్రేమ్ స్మిత్(5416) పేరిట ఉన్న రికార్డును అధిగమించి, అత్యధిక పరుగులు చేసిన ఐదో కెప్టెన్గా కూడా నిలిచాడు. చదవండి: బెన్స్టోక్స్కు అంపైర్ వార్నింగ్.. ఇంకోసారి ఇలా చేస్తే! కోహ్లిలా దూకుడుగా ఉండటం మా విధానం కాదు! -
ఒక్క టెస్ట్.. 3 రికార్డులు.. కోహ్లికి మాత్రమే
చెన్నై: ఇంగ్లండ్తో జరగనున్న మొదటి టెస్టులో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లిని అరుదైన రికార్డులు ఊరిస్తున్నాయి. ఒక్క టెస్టు మ్యాచ్ ద్వారా మూడు అరుదైన రికార్డులను తన ఖాతాలో వేసుకునే అవకాశం కోహ్లికి లభించనుంది. ఇక అసలు విషయంలోకి వెళితే.. టీమిండియా మోస్ట్ సక్సెస్ఫుల్ కెప్టెన్గా ముద్రపడిన ఎంఎస్ ధోనీ రికార్డును సమం చేసే అవకాశం కోహ్లికి లభించింది. కెప్టెన్గా ధోని స్వదేశంలో టీమిండియాకు 21 విజయాలు సాధించిపెట్టాడు. ప్రస్తుతం కోహ్లి ఖాతాలో 20 విజయాలు ఉన్నాయి. కోహ్లి కెప్టెన్సీలో టీమిండియా మొదటి టెస్టు మ్యాచ్ గెలిస్తే ధోనీని సమం చేస్తాడు. చదవండి: క్రికెట్ ఆస్ట్రేలియా కీలక నిర్ణయం.. లాభపడిన కివీస్ దీంతో పాటు కెప్టెన్గా టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో నాలుగో స్థానానికి ఎగబాకడానికి కోహ్లి 14 పరుగుల అవసరం ఉన్నాయి. ఇప్పటి వరకూ కోహ్లి టెస్టుల్లో కెప్టెన్గా 5220 పరుగులు చేశాడు. మరో 14 పరుగులు చేస్తే.. విండీస్ దిగ్గజం క్లైవ్ లాయిడ్ రికార్డును కోహ్లి అధిగమిస్తాడు. కోహ్లి, లాయిడ్ కంటే ముందు గ్రేమ్ స్మిత్ (8659), అలన్ బోర్డర్ (6623), రికీ పాంటింగ్ (6542) ఉన్నారు. ఇక మూడో రికార్డు ఏంటంటే.. ఒకవేళ ఇంగ్లండ్తో జరగనున్న మొదటి టెస్టులో కోహ్లి సెంచరీ సాధిస్తే కెప్టెన్ హోదాలో(వన్డే, టెస్టులు) కలిపి అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా రికార్డులకెక్కనున్నాడు.కోహ్లి ఇప్పటివరకు కెప్టెన్గా 41 సెంచరీలు చేయగా.. ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్తో కలిసి సంయుక్తంగా తొలి స్థానంలో ఉన్నాడు. చదవండి: కోచ్గా నా బాధ్యత నిర్వర్తించడం తప్పా? టీమిండియా తరపున కోహ్లి 87 టెస్టుల్లో 7318 పరుగులు, 251 వన్డేల్లో 12040 పరుగులు, 85 టీ20ల్లో 2928 పరుగులు చేశాడు. టెస్టుల్లో 27 సెంచరీలు, వన్డేల్లో 43 శతకాలు సాధించాడు. కాగా ఇంగ్లండ్, భారత్ల మధ్య తొలి టెస్ట్ ఫిబ్రవరి 5 నుంచి చెన్నైలో జరగనున్న విషయం తెలిసిందే. -
దిగ్గజాలు ఇప్పుడేం సమాధానం ఇస్తారు!
బ్రిస్బేన్: ఆసీస్తో జరిగిన నాలుగు టెస్టుల సిరీస్లో భాగంగా అడిలైడ్ వేదికగా జరిగిన డే నైట్ టెస్టు మ్యాచ్లో టీమిండియా ఘోర ఓటమిని మూట గట్టుకున్న సంగతి తెలిసిందే. తొలి టెస్టులో భాగంగా రెండో ఇన్నింగ్స్లో 36 పరుగులకే ఆలౌటై అత్యంత చెత్త రికార్డును మూట గట్టుకున్న భారత జట్టుపై సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోల్స్ వచ్చాయి.అందునా తొలి టెస్టు తర్వాత టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి పెటర్నిటీ సెలవులపై స్వదేశానికి తిరిగి రావడంతో ఇవి మరీ ఎక్కువయ్యాయి. ముఖ్యంగా రికీ పాంటింగ్, మైకెల్ వాన్, మార్క్ వా, మైకెల్ క్లార్క్, బ్రాడ్ హడిన్ లాంటి మాజీ ఆటగాళ్లు సోషల్ మీడియా వేదికగా టీమిండియాపై వెటకారంతో మాట్లాడిన మాటలు అప్పట్లో వైరల్ అయ్యాయి. ' కోహ్లి లేని టీమిండియాను చూడలేమని ఒకరంటే.. తొలి టెస్టులోనే ఘోర ఓటమిని మూటగట్టుకున్న టీమిండియా పని అయిపోయిందని.. ఈసారి వైట్వాష్ తప్పదని.. టీమిండియాకు ఇది ఒక చీకటి సిరీస్' అంటూ ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు.చదవండి: ఈరోజుతో నా కల నెరవేరింది కానీ నెలరోజులు తిరగకముందే టీమిండియా 2-1 తేడాతో ఆసీస్ను వారి సొంత గడ్డపైనే వరుసగా రెండో సారి టెస్టు సిరీస్ను దక్కించుకొని ధీటుగా సమాధానం ఇచ్చింది. ఈ క్రమంలో టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ వినూత్న రీతిలో స్పందించాడు. టీమిండియాను ఎత్తిపొడుస్తూ మాట్లాడిన మాజీ ఆటగాళ్లను దృష్టిలో పెట్టుకొని వారి ట్వీట్స్తో పాటు భారత జట్టు కప్ అందుకున్న ఫోటోను షేర్ చేస్తూ తనదైన శైలిలో చురకలంటించాడు. ‘గుడ్ ఈవ్నింగ్ గబ్బా!! ఈ మైదానంలో నేను ఆడలేకపోయాను క్షమించండి. కఠినమైన సమయంలో మాకు ఆతిథ్యం ఇచ్చినందుకు, గట్టి పోటీ ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఈ సిరీస్ను ఎప్పటికీ మరిచిపోలేం. ఇక కొందరు దిగ్గజాలను దృష్టిలో పెట్టుకొని ఈ వ్యాఖ్యలు చేస్తున్నా.. కోహ్లి లేకుండా మేం సిరీస్ను గెలవలేమన్నారు. ప్రధాన ఆటగాళ్లంతా గాయపడినా కుర్రాళ్లతో కలిసి బ్రిస్బేన్ టెస్టులో మరుపురాని విజయాన్ని సొంతం చేసుకున్నాం. ఎల్హెచ్ఎస్ ఈక్వల్స్ టూ ఆర్ఎల్ఎస్.. ఈక్వేషన్ను సరిచేశాం. దిగ్గజాలు ఇప్పుడే సమాధానం ఇస్తారో చెప్పండి' అంటూ ట్రోల్ చేశాడు.చదవండి: ఇంగ్లండ్తో టెస్టు సిరీస్: భారత జట్టు ఇదే! కాగా మూడో టెస్టులో ఆసీస్ కెప్టెన్ టిమ్ పైన్, అశ్విన్ల మధ్య జరిగిన సంభాషణ గురించి అందరికి తెలిసిందే. గాయంతో నాలుగో టెస్టుకు దూరమైన అశ్విన్ మూడో టెస్టులో ఓటమి దిశగా పయనిస్తున్న భారత్ను హనుమ విహారితో కలిసి ఆసీస్ భీకరమైన బౌలింగ్కు ఎదురొడ్డి నిలిచాడు. ఒకవైపు ఆసీస్ పేసర్ల విసురుతున్న బౌన్సర్ల దాటికి నెత్తురోడుతున్న ఏ మాత్రం ఆలక్ష్యం వహించకుండా ఓపికతో ఆడిన అశ్విన్.. టీమిండియాను ఓటమి నుంచి గట్టెక్కించాడు. ఈ క్రమంలోనే టిమ్ పైన్ అశ్విన్పై స్లెడ్జింగ్కు దిగిన సంగతి తెలిసిందే. 'నిన్ను గబ్బాలో ఎదుర్కొవడానికి ఎంతో ఆసక్తిగా ఉన్నా.. అశ్విన్'అంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశాడు.వీటికి అశ్విన్ కూడా తనదైన శైలిలో ‘మేము కూడా మిమ్మల్ని భారత్లో కలుసుకునేందుకు ఆసక్తిగా ఉన్నాం. బహుశా నీకు అదే చివరి సిరీస్ కావొచ్చు.'అని ధీటుగా బదులిచ్చాడు. అయితే పైన్ తాను చేసిన పనికి సిగ్గుపడుతూ అశ్విన్కు క్షమాపణ కోరడంతో వివాదం సద్దుమణిగింది.చదవండి: ఆసీస్తో సిరీస్ : అసలైన హీరో అతనే కాగా నాలుగో టెస్టులో ఆతిథ్య జట్టు నిర్థేశించిన 328 పరుగుల విజయ లక్ష్యాన్ని టీమిండియా 7 వికట్లు కోల్పోయి ఛేదించింది. రిషభ్ పంత్(89 నాటౌట్), శుభ్మన్ గిల్(91) దూకుడు కనబర్చగా.. పుజారా(56) తనదైన డిఫెన్స్తో మెరిసాడు. ఫలితంగా నాలుగు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ను భారత్ 2-1తో కైవసం చేసుకోవడంతో పాటు 32 ఏళ్లుగా గబ్బా మైదానంలో అపజయం అంటూ తెలియని ఆసీస్ రికార్డును బ్రేక్ చేస్తూ టీమిండియా చరిత్రను తిరగరాసింది. LHS ( not = ) RHS ! Yours happily India tour of OZ 2020/21 Humbled by all the love and support we have received over the last 4 weeks!🙏 pic.twitter.com/nmjC3znglx — Ashwin 🇮🇳 (@ashwinravi99) January 19, 2021 -
టీమిండియాకు ఇంకా క్లారిటీ లేదు: పాంటింగ్
సిడ్నీ: మరికొద్ది రోజుల్లో ఆస్ట్రేలియా- టీమిండియా జట్ల మధ్య జరుగునున్న ద్వైపాక్షిక సిరీస్ కోసం క్రికెట్ ఫ్యాన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇటీవలే ముగిసిన ఐపీఎల్-13వ సీజన్తో బాగా ఎంజాయ్ చేసిన అభిమానులు..కొద్ది విరామం తర్వాత ఆస్ట్రేలియాతో భారత్ జట్టు సిరీస్ ఆడటం మరింత మజాను తీసుకురానుంది. మూడు వన్డేల సిరీస్లో భాగంగా ఈ నెల 27వ తేదీన మొదటి వన్డేతో ద్వైపాక్షిక సిరీస్ ఆరంభం కానుంది. వన్డే సిరీస్ తర్వాత టీ20 సిరీస్, టెస్టు సిరీస్లు జరుగనున్నాయి. కాగా, టీమిండియాతో వన్డే సిరీస్, టీ20 సిరీస్తో పాటు తొలి టెస్టు తర్వాత కెప్టెన్ విరాట్ కోహ్లి స్వదేశానికి బయల్దేరతాడు. కోహ్లి భార్య అనుష్క శర్మ వచ్చే ఏడాది జనవరిలో ప్రసవించే అవకాశం ఉండటంతో.. టీమిండియా కెప్టెన్ పితృత్వ సెలవులు తీసుకున్న విషయం తెలిసిందే. అయితే కోహ్లి గైర్హాజరీ తర్వాత జట్టు కెప్టెన్ ఎవరనే దానిపై బీసీసీఐ ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. టెస్టు వైస్ కెప్టెన్గా ఉన్న రహానేకు సారథ్య బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. (క్రికెటర్ సిరాజ్ తండ్రి కన్నుమూత) అయితే కోహ్లి గైర్హాజరీ జట్టుపై తీవ్ర ప్రభావం చూపడం ఖాయమని అంటున్నాడు ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్. తొలి టెస్టు తర్వాత కోహ్లి స్వదేశానికి వెళ్లిపోతే ఆ స్థానాన్ని పూడ్చడం చాలా కష్టమని అభిప్రాయపడ్డాడు. 'విరాట్ కోహ్లీ వెళ్లిపోతే టీమిండియా ఇబ్బంది పడుతుంది. అతడి బ్యాటింగ్, నాయకత్వం లేకపోవడం ఆటగాళ్లపై అదనపు ఒత్తిడి పడుతుంది. అజింక్య రహానే కెప్టెన్సీ బాధ్యతలు తీసుకునే అవకాశం ఉంది. అలా అయితే అది అతడిపైనా అదనపు ఒత్తిడినే పెంచుతుంది. కీలకమైన నాలుగో స్థానంలో ఆడే కొత్త బ్యాట్స్మన్ను వారు గుర్తించాలి. తొలి టెస్టు బ్యాటింగ్ ఆర్డర్ పైనే వారికింకా స్పష్టత లేదనుకుంటున్నా. ఎవరు ఓపెనింగ్ చేయాలి?, కోహ్లి వెళ్తే నాలుగో స్థానంలో ఎవరు? వంటివి ఇంకా తెలియదు' అని అన్నాడు. భారత్ క్రికెట్ జట్టుకు చాలా ప్రశ్నలకు క్లారిటీ లేదు. వాటికి జవాబు వెతకాల్సి ఉంది. షమీ, జస్ప్రీత్ బుమ్రా, ఇషాంత్ శర్మ, ఉమేశ్లో ఎవరిని ఆడిస్తారు?.. యువ పేసర్లు నవదీప్ సైని, మొహమ్మద్ సిరాజ్ వీరిలో ఎవరిని తీసుకుంటారు?. స్సిన్నర్లలో ఎవరిని ఎంచుకుంటారు?, ఇలా చాలా ప్రశ్నలు టీమిండియా ముందున్నాయి’ అని పాంటింగ్ పేర్కొన్నాడు.(10 కోట్ల చీర్లీడర్.. మాక్స్వెల్ స్పందన) -
‘ఐపీఎల్ టైటిల్ గెలవడానికే వచ్చాం’
దుబాయ్: ఈ ఐపీఎల్ సీజన్లో ముంబై ఇండియన్స్తో ఆడిన మూడు మ్యాచ్ల్లో ఢిల్లీ క్యాపిటల్స్ ఓటమి పాలైంది. లీగ్ దశలో రెండు మ్యాచ్లతో పాటు క్వాలిఫయర్-1లో కూడా ముంబై ఇండియన్స్ చేతిలో ఢిల్లీ ఓడింది. అయితే ముంబై ఇండియన్స్తో జరిగే ఫైనల్లో తమ కుర్రాళ్లు అత్యుత్తమ ఆటను ప్రదర్శించడానికి సిద్ధంగా ఉన్నారని హెడ్ కోచ్ రికీ పాంటింగ్ తెలిపాడు. ఈ సీజన్ను అత్యుత్తమంగా ముగించే సత్తా ఢిల్లీకి ఉందని ధీమా వ్యక్తం చేశాడు. ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్కు సంబంధించి ప్రిమ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడిన పాంటింగ్..‘నేను చాలా భారీ అంచనాలతో యూఏఈకి వచ్చా. (‘ఏంటిది కోహ్లి.. ధోనిలా ఆలోచించలేవా?!’) మా జట్టు కచ్చితంగా బెస్ట్ జట్టే. సీజన్ ఆరంభంలో ఢిల్లీ ప్రదర్శనే ఇందుకు ఉదాహరణ. కానీ సెకండ్ లెగ్లో మేము కాస్త వెనుకబడ్డాం. చివరి మూడు మ్యాచ్ల్లో రెండు మ్యాచ్లు గెలిచాం. ఫైనల్లో కూడా మేము ఏమిటో చూపిస్తాం. మాకు ఇదొక మంచి సీజన్. మేము ఇప్పటికీ గెలవలేదు. అదే లక్ష్యంతో ఇక్కడికి వచ్చాం. మేము టైటిల్ గెలవడం కోసమే ఇక్కడ ఉన్నాం’ అని పాంటింగ్ పేర్కొన్నాడు.ఈ సీజన్లో వరుసగా నాలుగు మ్యాచ్లు ఓడిపోవడం తమను తీవ్ర నిరాశలోకి నెట్టిందన్నాడు. కాగా, ఆ తర్వాత పుంజుకోవడం తమ జట్టులో ఉన్న టాలెంట్కు నిదర్శనమన్నాడు. కొంతమందికి సరైన అవకాశాలు కూడా ఇవ్వలేకపోయామని, వారికి నిరాశ అనేది ఉంటుందన్నాడు. బెస్ట్ ఎలెవన్ అనేది చూసే జట్టును పోరుకు సిద్ధం చేస్తున్నామన్నాడు. తమ అత్యుత్తమ క్రికెట్ ఇంకా రావాల్సి ఉందని పాంటింగ్ అన్నాడు. అది ఫైనల్ మ్యాచ్ ద్వారా నెరవేరుతుందని ఆశిస్తున్నానన్నాడు. -
అదే పాంటింగ్ నాతో చెప్పాడు: రహానే
అబుదాబి: రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో సోమవారం జరిగిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ విజయం సాధించడంతో టాప్-2కు చేరింది. అదే సమయంలో ఆర్సీబీ కూడా ప్లేఆఫ్స్కు చేరింది. ఢిల్లీ 19 ఓవర్లో గెలవడంతో ఆర్సీబీ ప్లేఆఫ్స్ బెర్తుకు ఢోకా లేకుండా పోయింది. ఆర్సీబీ 153 పరుగుల టార్గెట్ను నిర్దేశించగా, ఢిల్లీ 19 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి ఛేదించింది. అజింక్యా రహానే(60; 46 బంతుల్లో 5 ఫోర్లు, 1సిక్స్)లు రాణించి విజయానికి బాటలు వేశాడు. కాగా, మ్యాచ్ తర్వాత రహానే మాట్లాడుతూ.. పలు విషయాలను షేర్ చేసుకున్నాడు. క్రికెట్ అంటేనే ఫన్నీగా ఉంటుందని, ఎప్పుడు ఏమి జరుగుతుందో చెప్పడం కష్టమన్నాడు. (ప్లీజ్ ఆ నిబంధనను తప్పనిసరి చేయండి : సచిన్) ఇక ఈ సీజన్ ఆరంభానికి ముందు తమ ప్రధాన కోచ్ రికీ పాంటింగ్ చెప్పిన విషయాన్ని రహానే గుర్తుచేసుకున్నాడు. ‘ నీకు మూడో స్థానంలో బ్యాటింగ్ బాగుంటుందని రికీ చెప్పాడు. ఆ స్థానంలో బ్యాటింగ్ చేయడం నీకు ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందన్నాడు. ఆర్సీబీతో మ్యాచ్లో మూడో స్థానంలో రాణించడం సంతోషంగా ఉంది. కానీ విజయానికి చేరువగా వచ్చిన తర్వాత నేను ఔట్ కావడం నిరాశ కల్గించింది. నేను గేమ్ను ఫినిష్ చేయాలనుకున్నా. ఒక్కోసారి మ్యాచ్ ఆకస్మికంగా ఛేంజ్ అయిపోతూ ఉంటుంది. ఆ టెన్షన్ కాస్త నాలో ఉంది. కానీ మ్యాచ్లో విజయం సాధించి ప్లేఆఫ్స్కు చేరడమే కాకుండా రెండో స్థానాన్ని దక్కించుకోవడం శుభపరిణామం’ అని రహానే తెలిపాడు. ఇక సరైన సమయంలో రహానే ఫామ్లోకి వచ్చాడంటూ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ప్రశంసించాడు. చెత్త బంతుల్ని బౌండరీలకు తరలించడమే కాకుండా స్టైక్ రొటేట్ చేస్తూ సింగిల్స్, డబుల్స్ కూడా బాగా తీశాడన్నాడు. తన అనుభవంతో మంచి ఇన్నింగ్స్ ఆడాడని అయ్యర్ కొనియాడాడు. -
'అతని ఆట నాకు ఆశ్చర్యం కలిగించింది'
దుబాయ్ : ఐపీఎల్ 13వ సీజన్లో నిలవాలంటే తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ జూలు విదిల్చింది. స్వయంగా వార్నర్తో పాటు సాహా కూడా ఆహా అనిపించే రీతిలో విధ్వంసక బ్యాటింగ్ ప్రదర్శన కనబర్చడంతో ఢిల్లీ క్యాపిటల్సపై భారీ విజయం సాధించింది. 88 పరుగుల భారీ విజయంతో ఎస్ఆర్హెచ్ ప్లేఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. వృద్దిమాన్ సాహా 87 పరుగులతో జట్టు టాప్ స్కోరర్గా నిలవగా.. మరో ఓపెనర్ వార్నర్ 66 పరుగులతో విధ్వంసం సృష్టించాడు. కాగా ఆరంభం నుంచి దూకుడుగా ఆడుతూ లీగ్లో మంచి ప్రదర్శన కనబరుస్తున్న ఢిల్లీకి వరుసగా ఇది హ్యాట్రిక్ ఓటమి. ఈ సందర్భంగా ఢిల్లీ క్యాపిటల్ప్ ప్రధాన కోచ్ రికీ పాంటింగ్ సాహా ప్రదర్శనపై ఆశ్చర్యానికి గురైనట్లు తెలిపాడు. వికెట్కీపర్ కమ్ బ్యాట్స్మెన్ అయిన వృద్దిమాన్ సాహా నాకౌట్ ఇన్నింగ్స్తో విజయానికి దూరం కావాల్సి వచ్చిందంటూ ఇంటర్య్వూలో చెప్పుకొచ్చాడు. 'ఈరోజు సాహా అద్భుతమైన ఆటతీరును ప్రదర్శించాడు. నిజానికి అతని ఆట నన్ను కొంచెం ఆశ్చర్యానికి గురిచేసింది. సాహా మంచి ప్రతిభ కలిగిన ఆటగాడిని ముందే తెలుసు.. కానీ ఐపీఎల్ 13వ సీజన్ ప్రారంభం నుంచి జట్టుతో ఉంటున్న తుది జట్టులో అతనికి అవకాశం రాలేదు. జానీ బెయిర్స్టో స్థానంలో ఢిల్లీతో మ్యాచ్లో ఓపెనర్గా బరిలోకి దిగి తుఫాను ఇన్నింగ్స్ ఆడేశాడు. అతని ఆటతీరే మా ఇరు జట్ల మధ్య వత్యాసంగా చెప్పొచ్చు. ఒక తుఫాను వచ్చేముందు ఎంత ప్రశాంతంగా ఉంటుందో.. అచ్చం అలానే సాహా తన ఇన్నింగ్స్ను కొనసాగించాడు. సాహా ప్రదర్శనతో జానీ బెయిర్స్టో రానున్న మ్యాచ్ల్లో ఓపెనర్గా రావడం కష్టమే.. ఒకవేళ ఆడినా ఇక నాలుగోస్థానంలోనే ఆడాలేమో. ఎస్ఆర్హెచ్ విధించిన 220 పరుగులు చేధించడం కొంచెం కష్టమే. శిఖర్ ధావన్, అజింక్యా రహానేలు ఓపెనర్లుగా వచ్చినా.. ఫామ్లో ఉన్న శిఖర్ ధావన్ సున్నాకే వెనుదిరగడం.. మిగతావారు పూర్తిగా విఫలం కావడం.. బౌలింగ్లో పూర్తిగా తేలిపోవడం జట్టు ఓటమికి కారణాలుగా చెప్పవచ్చు. అయినా సాహా, వార్నర్ దాటికి పవర్ప్లేలో ఆ జట్టు ఈ లీగ్లోనే అత్యధికంగా 77 పరుగులు చేయడంతో విజయానికి అక్కడే దూరమయ్యామని అనిపించాం. ఆరంభం నుంచి ఎన్ని మ్యాచ్లు గెలిస్తే సులువుగా ప్లేఆఫ్ చేరొచ్చనే విషయంపై స్పష్టంగానే ఉన్నాం. ఒక దశలో ఏడు విజయాలు సాధించిన తర్వాత వరుసగా హ్యాట్రిక్ ఓటములు నమోదు చేయడంతో టాప్ ప్లేస్ కోసం మళ్లీ పోటీ ఏర్పడింది. ఇప్పుడు దానిని సరిచేయాల్సిన అవసరం ఉంది. మాకు రెండు మ్యాచ్లు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఆ రెండు మ్యాచ్ల్లో కఠినమైన ముంబై, ఆర్సీబీని ఎదుర్కోనున్నాం. రెండు మ్యాచ్లు గెలవడానికి శాయశక్తులా ప్రయత్నిస్తాం.. రెండు గెలిస్తే టాప్ ప్లేస్ మా సొంతం అవుతుంది. ఒకవేళ ఒకటి గెలిస్తే.. రన్రేట్ కీలకమవుతుంది.. అందుకే రానున్న మ్యాచ్ల్లో రన్రేట్ను కూడా మరింత మెరుగుపరుచుకుంటాం.' అని పాంటింగ్ తెలిపాడు. -
నా కెప్టెన్సీ స్కిల్స్కు అతనే కారణం: రోహిత్
దుబాయ్: రోహిత్ శర్మ,.. ఒక సక్సెస్ఫుల్ కెప్టెన్. టీమిండియాకు సారథ్యం వహించిన కొన్ని సందర్భాలతో పాటు ఐపీఎల్లో కూడా రోహిత్ శర్మ తన మార్కు కెప్టెన్సీని చూపెట్టి ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాడు. ఐపీఎల్లో నాలుగు టైటిల్స్ సాధించిన ఏకైక కెప్టెన్ రోహిత్ శర్మ. పాంటింగ్ నుంచి కెప్టెన్సీ పగ్గాలు అందుకున్న రోహిత్ శర్మ 2013లో తొలిసారి ముంబై ఇండియన్స్కు టైటిల్ సాధించిపెట్టాడు. ఆపై 2015, 2017, 2019ల్లో ముంబై ఇండియన్స్ టైటిల్స్ గెలిచింది. ఇది ఐపీఎల్ చరిత్రలో ఒక జట్టు సాధించిన అత్యధిక టైటిల్స్ జాబితాలో అగ్రస్థానంలో ఉంది. ఈ నాలుగు సందర్భాల్లోనూ రోహిత్ శర్మ కెప్టెన్గానే ఉండటం ఇక్కడ విశేషం. (చదవండి: ఊరిస్తున్న సన్రైజర్స్ టైటిల్ సెంటిమెంట్!) అయితే తాను కెప్టెన్సీలో రాటుదేలడానికి ఆసీస్ దిగ్జజ కెప్టెన్, ప్రస్తుత ఢిల్లీ క్యాపిటల్స్ కోచ్ రికీ పాంటింగే కారణమని అంటున్నాడు రోహిత్. తన నాయకత్వ లక్షణాలు మెరుగుపడటానికి పాంటింగ్ ఎంతగానో దోహద పడ్డాడని అన్నాడు. ఇండియా టూడే నిర్వహించిన ఫస్ట్ ఎపిసోడ్ ఇన్సిపిరేషన్ సీజన్-2లో రోహిత్ మాట్లాడుతూ.. ‘ ప్రతీ ఒక్క ఆటగాడి నుంచి ఏ విధంగా ప్రదర్శన రాబట్టాలో అనే విషయం పాంటింగ్ వద్ద నుంచి నేర్చుకున్నా. ఇక్కడ నా ప్రదర్శన అనేది ముఖ్యమైనదే అయినా ఇక్కడ ప్రతీ ఒక్కరి సాయం తీసుకోవడానికి యత్నిస్తా. తుదిజట్టులోని మిగతా పదిమంది సభ్యులతో పాటు రిజర్వ్ బెంచ్లో ఉన్నవారి సలహాలు కూడా స్వీకరిస్తా. ఇది చాలా ముఖ్యమైనది. ఈ విషయాన్ని ప్రత్యేకంగా రికీ పాంటింగ్ నుంచి బోధపడింది. నాకు పాంటింగ్ ఎప్పుడూ ఒకటే చెబుతూ ఉండేవాడు. కెప్టెన్సీ చేసేటప్పుడు వారి ఏమి చేస్తున్నారు అనే విషయం గురించి ఆలోచించకు. వారు చెప్పేది ముందు విను. దాన్ని మర్యాదగా స్వీకరించి దాన్ని ఫిల్టర్ చేసుకో అని పాంటింగ్ చెబుతూ ఉండేవాడు. ఇదొక గొప్ప పాంటింగ్ నుంచి నేర్చుకున్న గొప్ప పాఠం’ అని రోహిత్ శర్మ తెలిపాడు. గతంలో ముంబై ఇండియన్స్కు కెప్టెన్గా చేసిన పాంటింగ్, ఆపై కోచ్గా కూడా పని చేశాడు. ఇక ఆసీస్కు రెండు వన్డే వరల్డ్కప్లు అందించిన ఘనత పాంటింగ్ది. మరొకవైపు ఆసీస్ను టెస్టుల్లోనూ, వన్డేల్లోనూ నంబర్ వన్ స్థానంలో నిలబెట్టాడు. -
‘టీ 20 క్రికెట్లో అతడే ప్రమాదకర ఆటగాడు’
దుబాయ్: మరో ముడు రోజుల్లో ప్రారంభం కానున్న ఐపీఎల్ 2020(సెప్టెంబర్ 19)పై క్రికెట్ అభిమానులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఐపీఎల్ 2020కు సంబంధించి టీమ్ల బల బలాలపై ప్రముఖ క్రికెటర్లు విశ్లేషిస్తున్నారు. ప్రస్తుత టీ 20 క్రికెట్లో టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మనే అత్యుత్తమ బ్యాట్స్మెన్ అని ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ తెలిపాడు. రికీ పాంటింగ్ ఐపీఎల్ 2020లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు కోచ్గా వ్యవహరిస్తున్నాడు. మొంబై ఇండియన్స్లో ప్రమాదకర ఆటగాడు ఏవరనే ప్రశ్నకు సమాధానమిస్తు ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ అని పాంటింగ్ సమాధానమిచ్చాడు. రోహిత్ తన కెరీర్లోనే అత్యుత్తమ ఫామ్ కొనసాగిస్తున్నట్లు పాంటింగ్ పేర్కొన్నాడు. ఐపీఎల్లో రోహిత్ శర్మ కెప్టెన్గా మొంబై ఇండియన్స్ 4 టైటెల్సి గెలుపొందిన విషయం తెలిసిందే. (చదవండి: రోహిత్ నా రోల్ మోడల్: పాక్ క్రికెటర్) -
పృథ్వీ షా.. నీ ప్రతిభ అమోఘం
దుబాయ్ : ఐపీఎల్ 13వ సీజన్ ఆరంభానికి ఇంకా 13 రోజుల సమయం మాత్రమే ఉండడంతో లీగ్లో పాల్గొంటున్న అన్ని జట్లు తమ ప్రాక్టీస్ను మరింత ముమ్మరం చేశాయి. ఐపీఎల్కు సంబంధించిన షెడ్యూల్ను కూడా నేడు విడుదల చేయనున్నట్లు ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ఛైర్మన్ బ్రిజేష్ పటేల్ శనివారం వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ పృథ్వీ షా శనివారం నెట్స్లో జట్టు ప్రధాన కోచ్ రికీ పాంటింగ్ ఆధ్వర్యంలో కఠోర సాధన చేశాడు. ప్రాక్టీస్ చేస్తున్నంత సేపు మంచి ఫుట్వర్క్ కొనసాగిస్తూ బారీ షాట్లను ఆడాడు. (చదవండి : షెడ్యూల్ నేడే విడుదల) పృథ్వీ షా ప్రాక్టీస్ను దగ్గర్నుంచి గమనించిన పాంటింగ్ అతన్ని ప్రశంసలతో ముంచెత్తాడు. పృథ్వీ షా ప్రతిభ అమోఘం. అతని ఫుట్వర్క్ అద్భుతంగా ఉంది. పేసర్లను టార్గెట్ చేస్తూ అతను కొడుతున్న ప్రతీ షాట్లో మంచి టైమింగ్ కనిపిస్తుంది. ఈ సందర్భంగా పృథ్వీ ఆడిన ఒక షాట్ను.. 'నిజంగా అద్భుతమైన షాట్ ఆడావు .. వాట్ ఏ బ్యూటీ' అంటూ కామెంట్ చేశాడు. ఈ విషయాన్ని ఢిల్లీ క్యాపిటల్స్ తన ట్విటర్లో షేర్ చేసుకుంది. ఢిల్లీ డేర్డెవిల్స్ నుంచి ఢిల్లీ క్యాపిటల్స్గా పేరు మార్చుకున్న తర్వాత 2019లో ఆ జట్టు ఏడు సంవత్సరాల తర్వాత ప్లేఆఫ్లో ఆడడం విశేషం. శ్రేయాస్ అయ్యర్ సారథ్యంలో సమతూకంతో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు పాంటింగ్ ప్రధాన కోచ్గా ఈ సీజన్లో ఎలాంటి ప్రదర్శన చేస్తుందో చూడాలి. అయితే ఢిల్లీ జట్టుకు ఐపీఎల్ 2020లో క్రిస్ వోక్స్, జాసన్ రాయ్ లాంటి కీలక ఆటగాళ్ల సేవలను కోల్పోనుంది. కాగా గత సీజన్లో పృథ్వీ షా 16 మ్యాచ్ల్లో 353 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. సెప్టెంబర్ 19 నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్ 2020 నవంబర్ 10 వరకు కొనసాగనుంది. No arguments there, Punter 😉 . You know it's a 🔝 shot when @RickyPonting can't help but praise it 👌🏻 .#Dream11IPL #YehHaiNayiDilli @PrithviShaw pic.twitter.com/lemRCZr0Ok — Delhi Capitals (Tweeting from 🇦🇪) (@DelhiCapitals) September 5, 2020 -
దుబాయ్ చేరిన ఢిల్లీ క్యాపిటల్స్ కోచ్ పాంటింగ్
దుబాయ్: ఢిల్లీ క్యాపిటల్స్ (డీసీ) హెడ్ కోచ్, ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ గురువారం దుబాయ్ చేరుకున్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) సీజన్–13 కోసం ఆదివారమే డీసీ జట్టు ఇక్కడికి రాగా పాంటింగ్ ఆలస్యంగా జట్టుతో కలిశాడు. నిబంధనల ప్రకారం అతను ఆరు రోజుల క్వారంటైన్కు వెళ్లిపోయాడు. తనకు కేటాయించిన హోటల్ గదికి చేరుకున్న పాంటింగ్ ఆరు రోజుల అధికారిక క్వారంటైన్ ప్రారంభమైందంటూ ట్వీట్ చేశాడు. ఈ సీజన్లో తమ జట్టుకు ప్రాతినిధ్యం వహించనున్న భారత సీనియర్ స్పిన్నర్ అశ్విన్ను మన్కడింగ్ చేయనివ్వబోనని వ్యాఖ్యానించి రికీ తాజాగా భారీ చర్చకు తావిచ్చాడు. -
అశ్విన్ను అలా చేయనివ్వను!
న్యూఢిల్లీ: గత ఏడాది ఐపీఎల్లో రాజస్తాన్తో జరిగిన మ్యాచ్లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ ‘మన్కడింగ్’ ద్వారా జాస్ బట్లర్ను రనౌట్ చేయడం తీవ్ర వివాదంగా మారిన సంగతి తెలిసిందే. తాను నిబంధనల ప్రకారమే చేశానని అశ్విన్ ఒకే మాటపై నిలబడగా...అది క్రీడా స్ఫూర్తినికి విరుద్ధమంటూ విమర్శలు వచ్చాయి. ఈ సారి 2020 ఐపీఎల్లో అశ్విన్ ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు తరఫున ఆడనున్నాడు. దానికి హెడ్ కోచ్గా ఆసీస్ దిగ్గజం రికీ పాంటింగ్ వ్యవహరిస్తున్నాడు. ఇకపై అలాంటి ఘటన జరగదని, ఈ విషయంలో తాను అశ్విన్తో ‘గట్టిగా’ మాట్లాడతానని పాంటింగ్ వ్యా ఖ్యానించాడు. క్రీడా స్ఫూర్తికి విరుద్ధంగా ఎలాంటి ఘటనా జరగదని పాంటింగ్ హామీ ఇచ్చాడు. ‘మా జట్టు అలాంటి తరహా క్రికెట్ను ఆడబోవడం లేదు. నేను అశ్విన్ను కలవగానే అన్నింటికింటే ముందు ఇదే విషయంపై మాట్లాడతా. గత ఏడాది అతను మా జట్టుతో లేడు. అశ్విన్ అద్భుతమైన బౌలర్. ఈ ఘటన జరిగినప్పుడు నేను మా ఆటగాళ్లతో కూడా అది తప్పని చెప్పాను. అశ్విన్లాంటి స్థాయి ఆటగాడు అలా చేస్తే మరికొందరు అతడిని అనుసరిస్తారు. కాబట్టి ఇప్పుడు అతడిని కలిశాక దీనిపై చర్చిస్తా. నాకు తెలిసి అతను మళ్లీ తన చర్యను సమర్థించుకోవచ్చు. అయితే క్రీడా స్ఫూర్తికి మాత్రం ఇది పూర్తిగా విరుద్ధం. నేను, మా ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ మాత్రం అలాగే భావిస్తాం’ అని పాంటింగ్ వివరించాడు. అయితే అశ్విన్ తరహాలో ‘మన్కడింగ్’ ద్వారా బ్యాట్స్మన్ను అవుట్ చేయడం తప్పేమీ కాదంటూ ఎంసీసీ రూపొందించిన నిబంధనల కమిటీలో పాంటింగ్ కూడా సభ్యుడు కావడం విశేషం. మరో వైపు 2008లో సిడ్నీలో భారత్తో జరిగిన టెస్టు లో పలు మార్లు క్రీడా స్ఫూర్తికి వ్యతిరేకంగా వ్యవహరించిన పాంటింగ్, ఇప్పుడు క్రీడా స్ఫూర్తి మాటలు చెప్పడం హాస్యాస్పదమని భారత అభిమానులు అతనిపై విరుచుకు పడ్డారు. -
అరుదైన ఫీట్.. ఒకే రోజు
లండన్: ప్రపంచ క్రికెట్లో రికీ పాంటింగ్, అలెస్టర్ కుక్లకు ప్రత్యేక స్థానం ఉంది. ఆస్ట్రేలియా కెప్టెన్గా పాంటింగ్ జట్టుకు ఎన్నో చిరస్మరణీయమైన విజయాలను అందిస్తే, ఇంగ్లండ్ సారథిగా అలెస్టర్ కుక్ అనేక గెలుపులను చూశాడు. వీరిద్దరూ బ్యాటింగ్లో కూడా ఎన్నో రికార్డులను ఖాతాలో వేసుకుని దిగ్గజ క్రికెటర్లుగా నిలిచారు.. అందులో 10వేల టెస్టు పరుగుల మార్కు ఒకటి. అయితే ఈ ఫీట్ను 2008లో పాంటింగ్ సాధిస్తే, 2016లో కుక్ నమోదు చేశాడు. కాగా, ఈ సేమ్ ఫీట్ను వీరిద్దరూ ఒకే రోజు(మే 30)నే నమోదు చేయడం ఇక్కడ విశేషం. ఈ అరుదైన ఘనతను సాధించడానికి వీరిద్దర మధ్య కాల వ్యవధి ఎనిమిదేళ్లు. 10వేల పరుగుల మార్కును చేరిన 7వ బ్యాట్స్మన్గా పాంటింగ్ కాగా, కుక్ 12వ బ్యాట్స్మన్గా నిలిచాడు. కాగా, ఈ ఘనతను సాధించిన పిన్న వయస్కుడిగా కుక్ రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. 2008లో పాంటింగ్ ఇలా.. ఆంటిగ్వాలోని నార్త్ సౌండ్లో వెస్టిండీస్తో జరిగిన రెండో టెస్టు మ్యాచ్లో పాంటింగ్ 10 వేల మార్కును చేరాడు. విండీస్తో మ్యాచ్లో భాగంగా తొలి రోజు 61 పరుగులు సాధించడం ద్వారా పాంటింగ్ అరుదైన జాబితాలో చేరిపోయాడు. అప్పటివరకూ ఇద్దరు ఆస్ట్రేలియా ఆటగాళ్లు మాత్రమే 10 వేల పరుగుల రికార్డును చేరగా మూడో ఆసీస్ క్రికెటర్గా పాంటింగ్ నిలిచాడు.ఆసీస్ కెప్టెన్లుగా చేసిన అలెన్ బోర్డర్, స్టీవ్ వాల సరసన పాంటింగ్ చేరాడు. విండీస్ టెస్టు మ్యాచ్లో ఈ రికార్డును చేరిన కాసేపటికే పాంటింగ్ ఇన్నింగ్స్కు తెరపడింది. మరో నాలుగు పరుగులు మాత్రమే జోడించి పాంటింగ్ పెవిలియన్ చేరాడు. సచిన్ రికార్డు బద్ధలైన వేళ.. 2016లో చెస్టర్ లీ స్ట్రీట్లో శ్రీలంకతో జరిగిన టెస్టు మ్యాచ్లో కుక్ 10 వేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు. అప్పుడు లంకేయులతో జరిగిన రెండో టెస్టులో కుక్ ఈ ఫీట్ను నమోదు చేశాడు. అదే సమయంలో 10 వేల పరుగుల రికార్డును పిన్న వయసులో అందుకున్న క్రికెటర్గా సరికొత్త రికార్డు సృష్టించాడు. 31 ఏళ్ల ఐదు నెలల 7 రోజుల వయసులో కుక్ ఈ రికార్డు సాధించగా, సచిన్ 31 ఏళ్ల 10 నెలల 20 రోజుల వయసులో దీన్ని నమోదు చేశాడు. 2005లో కోల్కతాలో పాకిస్తాన్తో జరిగిన టెస్టులో సచిన్ 10 వేల మార్కును చేరుకున్నాడు. కాగా, 11 ఏళ్ల తర్వాత ఆ రికార్డును కుక్ బ్రేక్ చేసి నయా రికార్డు లిఖించాడు. -
పాంటింగే అత్యుత్తమ కోచ్: భారత బౌలర్
హైదరాబాద్: ఆస్ట్రేలియా మాజీ సారథి, ఢిల్లీ క్యాపిటల్స్ ప్రధాన కోచ్ రికీ పాంటింగ్పై సీనియర్ బౌలర్ ఇషాంత్ శర్మ ప్రశంసల వర్షం కురిపించాడు. సోమవారం ఇన్స్టాగ్రామ్ లైవ్లో అభిమానులతో ముచ్చటించిన ఇషాంత్ పలు ఆసక్తికవిషయాను వెల్లడించాడు. తాను కలిసిన వారిలో పాంటింగ్ అత్యుత్తమ కోచ్ అని లంబూ స్పష్టం చేశాడు.‘గడేడాది ఐపీఎల్లో ఆడేందుకు జట్టులో చేరినప్పుడు కాస్త ఇబ్బందిపడ్డాను. ఆ సమయంలో నా మొదటి చాయిస్ ఎప్పుడూ నువ్వే.. సీనియర్వి కాబట్టి కొత్త కుర్రాళ్లకు దారి చూపించు అని పాంటింగ్ పేర్కొంటూ నాలో ఆత్మవిశ్వాసాన్ని నింపాడు. సీనియర్గా ఎలా ఉండాలో నేర్పాడు. అతని సలహాలు నాకు ఎంతగానో ఉపయోగపడ్డాయి’ అంటూ ఇషాంత్ పేర్కొన్నాడు. ఈ క్రమంలో 2008లో భారత్-ఆస్ట్రేలియా టెస్టు సిరీస్ గురించి లంబూ వద్ద అభిమానులు ప్రస్తావించారు. ‘ఇక పాంటింగ్ అంతర్జాతీయ క్రికెట్లో కొనసాగుతున్నప్పుడు ఎక్కువ సార్లు ఔట్ చేయడం, అతడిని ఎక్కువగా ఇబ్బంది పెట్టిన విషయం ఎప్పటికీ మరిచిపోలేను. ముఖ్యంగా 2008లో జరిగిన పెర్త్ టెస్టులో పాంటింగ్కు బౌలింగ్ చేసిన విధానం, అనంతరం స్వదేశంలో అతడిని ఇబ్బంది పెట్టిన తీరు నా కెరీర్లో చాలా గొప్పవి’ అని ఇషాంత్ పేర్కొన్నాడు. ఇక ప్రసుతం భారత టెస్టు జట్టులో రెగ్యులర్ బౌలర్ అయిన ఇషాంత్ నిలకడగా రాణిస్తూ జూనియర్లకు మార్గనిర్దేశకం చేస్తున్నాడు. ఇక ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్ తరుపున లంబూ ప్రాతినిథ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. ఇక గత సీజన్లో ఢిల్లీ తరుపున 13 మ్యాచ్లు ఆడిన ఇషాంత్ 13 వికెట్లు పడగొట్టాడు. చదవండి: ‘కశ్మీర్ గురించి పట్టించుకోవడం మానేయ్’ ‘ఆ ఇన్నింగ్స్’ ఆడాలనుంది! -
ఆ జోరు అంతర్జాతీయ క్రికెట్లో కనబడదే?
సిడ్నీ: ఇప్పటికే జట్టులో చోటు కోల్పోయి తన కెరీర్పై డైలమాలో పడ్డ ఆస్ట్రేలియా క్రికెటర్ ఉస్మాన్ ఖవాజాపై ఆ దేశ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అంతర్జాతీయ కెరీర్లో ఎప్పుడూ ఖవాజా నుంచి ఒక మంచి ప్రదర్శన చూడలేదన్నాడు. ఖవాజాలో నిలకడైన ప్రదర్శన లేకపోవడమే అతనిపై వేటుకు కారణమన్నాడు. ఇప్పటివరకూ ఖవాజా 44 టెస్టులు, 40 వన్డేలు ఆడాడు. వన్డేల్లో రెండు సెంచరీల సాయంతో 1,554 పరుగులు చేయగా, టెస్టుల్లో 8 సెంచరీలు, 14 హాఫ్ సెంచరీలతో 2,887 పరుగులు చేశాడు. అయితే ఈ తరహా ప్రదర్శన సరిపోదు అంటున్నాడు రెండుసార్లు వరల్డ్కప్ గెలిచిన ఆసీస్ జట్టుకు కెప్టెన్గా రికీ పాంటింగ్. ఇక ఖవాజా మళ్లీ ఆసీస్ జట్టులో రీఎంట్రీపై పాంటింగ్ అనుమానం వ్యక్తం చేశాడు. (‘పీఎస్ఎల్లో కశ్మీర్ టీమ్ ఉండాలి’) ‘ ఖవాజాకు ఆసీస్ జట్టులో చోటు కష్టమే. నేను ఎప్పుడూ అతనొక మంచి ప్లేయర్ అని ఫీలవుతూ ఉండేవాడిని. కానీ నేను ఆశించిన స్థాయిలో అంతర్జాతీయ ప్రదర్శన ఒక్కటి కూడా చేయలేదు. ఏదో కొన్ని మెరుపులు తప్పితే నిలకడ మాత్రం ఖవాజాలో ఎక్కడా కనిపించలేదు. అతనిలో నిలకడ ఉంటే ఆసీస్ జట్టులో కొనసాగేవాడు. అది లేకపోవడం వల్లే జట్టులో చోటు కోల్పోయాడు. దేశవాళీ క్రికెట్లో ఖవాజా చేసిన పరుగులతో పోలిస్తే, అంతర్జాతీయ క్రికెట్లో చాలా తక్కువ చేశాడు. దేశవాళీల్లో భారీ పరుగులు చేస్తే, అంతర్జాతీయ క్రికెట్లో తేలిపోతారు. మనం ఎప్పుడూ గొప్ప ఆటగాళ్లమని రాసి ఉండదు. వచ్చిన అవకాశాన్ని ఒడిసి పట్టుకోవడంలోనే గొప్పతనం ఉంటుంది. ఈ సీజన్ సమ్మర్ క్రికెట్ ఆరంభమైన తర్వాత తిరిగి ఖవాజాకు అవకాశం వస్తుంది. అక్కడ నిరూపించుకుని మళ్లీ అవకాశం కోసం వేచి చూడాలి. ఒకవేళ మళ్లీ ఆడే అవకాశం వస్తే అప్పుడైనా ఎవర్నీ నిరాశపరచడనే అనుకుంటున్నా’ అని పాంటింగ్ తెలిపాడు. గతేడాది యాషెస్ సిరీస్లో భాగంగా మధ్యలో జట్టులో చోటు కోల్పోయిన ఖవాజాకు మళ్లీ ఆడే అవకాశం రాలేదు. దాంతో ఇటీవల సీఏ విడుదల చేసిన ఆటగాళ్ల కాంట్రాక్ట్ జాబితాలో ఖవాజాకు చోటు దక్కలేదు. (ఈ బ్యాట్తో ఎక్కడ కొడతానో తెలుసా?) -
'పాంటింగ్ నిర్ణయం మా కొంప ముంచింది'
సిడ్నీ : క్రికెట్లో దాయాదుల పోరు అంటే ఆ మజానే వేరుగా ఉంటుంది. ఉదాహరణకు భారత్- పాకిస్తాన్ తలపడ్డాయంటే అభిమానులు పూనకాలతో ఊగిపోతారు. సరిగ్గా అలాంటి ఘటనలే యాషెస్ సిరీస్లోనూ చోటుచేసుకుంటుంది. ఆస్ట్రేలియా-ఇంగ్లండ్ మధ్య జరిగే యాషెస్ సిరీస్ను ఇరు దేశాలు అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తాయి. టెస్ట్ మ్యాచ్లు అంటేనే బోర్గా ఫీలయ్యే ఈ రోజుల్లో కూడా యాషెస్ సిరీస్కు భారీ సంఖ్యలో ప్రేక్షకాదరణ లభిస్తుంది. ఎందుకంటే యాషెస్ అనగానే ఇరు జట్లు కొదమ సింహాల్లా తలపడడంతో సిరీస్ ఆద్యంతం రసవత్తరంగా సాగుతుంది. దీనికి తోడు ఆటగాళ్ల స్లెడ్జింగ్ అభిమానులకు కావాల్సిన మజానిస్తుంది. అందులో 2005 ఎడ్జ్బాస్టన్ టెస్ట్ ఒకటి. ఈ మ్యాచ్లో ఆఖరి వరకు ఊరించిన విజయం ఇంగ్లండ్ను వరించింది. ఆ జట్టు అనూహ్యంగా 2 పరుగులతో విజయాన్నందుకుంది. ('ఆ విషయంలో సచిన్ కంటే కోహ్లి ముందుంటాడు') అయితే ఈ మ్యాచ్లో నాటి ఆస్ట్రేలియా కెప్టెన్ రికీ పాంటింగ్ తీసుకున్న చెత్త నిర్ణయమే తమ కొంప ముంచిందని ఆ జట్టు మాజీ ప్లేయర్ షేన్ వార్న్ తెలిపాడు. పాంటింగ్ కెప్టెన్సీలోనే ఇది అత్యంత చెత్త నిర్ణయమని విమర్శించాడు. బ్యాటింగ్కు అనుకూలించే ఆ వికెట్పై టాస్ గెలిచిన పాంటింగ్ బౌలింగ్.. ఎంచుకోవడమే అతను చేసిన పెద్దతప్పుగా చెప్పుకొచ్చాడు. ‘ఓ కెప్టెన్గా పంటర్ తీసుకున్న ఆ నిర్ణయం అత్యంత చెత్తది. అతని నిర్ణయం ఇంగ్లండ్కు మేలు చేసింది. ఆ సిరీస్లో ఇంగ్లండ్ పోరాడిన తీరు అద్భుతం. బ్రెట్లీ, మైకెల్ కస్ప్రోవిక్స్ దాదాపు తమ విజయాన్ని ఖాయం చేసినా ఇంగ్లండ్ పట్టువదల్లేదు. ఆ మ్యాచ్లో నేను హిట్ వికెట్ అయిన తీరు ఇప్పటికీ అంతుపట్టడం లేదు. ఆ రాత్రి ముందు చివరి ఓవర్లో స్టీవ్ హర్మిసన్ స్లోయర్ బంతితో మైకెల్ క్లార్క్ను బౌల్ట్ చేశాడు. అప్పటికి మా విజయానికి 107 పరుగులు కావాలి. బ్రెట్ లీ, మైకెల్ కస్ప్రోవిక్స్ ఉండటంతో మాకు గెలిచే అవకాశాలు ఉన్నాయనుకున్నా. కానీ ఇంగ్లండ్ అద్భుతంగా పోరాడింది. బంతి రివర్స్ స్వింగ్ అవుతుండటంతో 90 మైళ్ల వేగంతో బంతులు విసిరి ఫలితాన్ని రాబట్టారు. హార్మీసన్, ఫ్లింటాఫ్ సూపర్బ్గా బౌలింగ్ చేశారు. నా బ్యాటింగ్ సమయంలో ముందుకొచ్చి ఆడాలని నిర్ణయించుకున్నా. కానీ నా కాలు స్టంప్స్ తాకడంతో హిట్ వికెట్గా వెనుదిరిగా. దీంతో నేను హిట్ వికెట్ అవ్వడం ఇప్పటికీ మరిచిపోలేదంటూ' షేన్ వార్న్ చెప్పుకొచ్చాడు. ('జాగ్రత్త.. నేను బరిలోకి దిగుతున్నా') కాగా మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ మొదటి ఇన్నింగ్స్లో 407 రన్స్ చేసింది. అనంతరం ఆసీస్ 308 పరుగులు చేసి 99 రన్స్ వెనుకబడింది. ఇక రెండో ఇన్నింగ్స్లో ఆతిథ్య జట్టు 182 పరుగులకే కుప్పకూలడంతో ఆసీస్ ముందు 282 పరుగుల లక్ష్యం నమోదైంది. ఈ టార్గెట్ చేజింగ్లో తడబడిన ఆసీస్.. వరుస విరామాల్లో వికెట్లు కోల్పుతూ లక్ష్యం వైపు దూసుకెళ్లింది. బ్రెట్లీ(43 నాటౌట్)తో కలిసి షేన్ వార్న్(42) విజయం దిశగా నడిపించారు. కానీ వార్నర్ హిట్ వికెట్ అవ్వగా.. చివరి బ్యాట్స్మన్ను హర్మిసన్ ఔట్ చేశాడు. దీంతో రెండు పరుగుల దూరంలో ఆసీస్ ఓటమికి తలవంచింది. -
'పాంటింగ్ గెలుపు కోసం చూస్తాడు.. ధోని మాత్రం'
సిడ్నీ : ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు మైక్ హస్సీ టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని పై ప్రశంసల వర్షం కురిపించాడు. కెప్టెన్సీ విషయంలో రికీ పాంటింగ్ కంటే ధోనినే బెటర్గా కనిపిస్తాడని హస్సీ పేర్కొన్నాడు. ఇటీవల ఒక ఇన్స్టాగ్రాం లైవ్ చాట్లో పాల్గొన్న హస్సీ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. రికీ పాంటింగ్ సారధ్యంలో 2007 ప్రపంచకప్, 2006, 2009 చాంపియన్స్ ట్రోపీ గెలవడంలో హస్సీ కీలక పాత్ర పోషించాడు. ఇటు ఎంఎస్ ధోని సారధ్యంలోనూ ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ టైటిల్ గెలవడంలోనూ హస్సీ ప్రముఖ పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అయితే ఇద్దరు కెప్టెన్సీలో ఆడిన మీరు ఎవరిని ఉత్తమ కెప్టెన్గా ఎంపిక చేసుకుంటారనే ప్రశ్న హస్సీకి ఎదురైంది. (‘ఆ బ్యాట్తో ధోని ఆడొద్దన్నాడు’) దీనికి హస్సీ స్పందిస్తూ' నా దృష్టిలో పాంటింగ్, ధోనిలిద్దరు అత్యుత్తమ కెప్టెన్లే. కానీ నాయకత్వ విషయంలో ఇద్దరి మధ్య చాలా వత్యాసాలు కనిపిస్తాయి. ముందుగా పాంటింగ్ విషయానికి వస్తే.. అతడికి నాయకత్వం వహించడం అంటే ఇష్టం. గెలవడం అంటే ఇంకా ఇష్టం. ప్రతి విషయంలోనూ కచ్చితత్వాన్ని కోరుకుంటాడు. చివరికి ప్రాక్టీస్ చేసేటప్పుడు కూడా జట్టును ముందుండి నడిపిస్తాడు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు కూడా అతడే ఆ కష్టాన్ని ముందుగా ఎదుర్కొంటాడు. ఆటగాళ్లపై ఒత్తిడిని తగ్గించేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తాడు. (దక్షిణాఫ్రికా క్రికెటర్కు కరోనా పాజిటివ్) ఇదే లక్షణం ధోనిలోనూ కనబడుతుంది. మ్యాచ్ ఆసాంతం ధోని ఎంతో ప్రశాంతంగా ఉంటాడు. అనవసరంగా ఒత్తిడికి లోనయ్యే నిర్ణయాలను తీసుకోడు. బౌలర్లకు ఎప్పటికప్పుడు సూచనలిస్తూ వారికి ఒత్తిడి తగ్గిస్తాడు. అయితే కొన్ని సార్లు ధోనీ తీసుకునే నిర్ణయాలు షాక్కు గురిచేస్తాయి. అయితే ఆ నిర్ణయాలు కచ్చితంగా పనిచేస్తూ ఫలితాలను రాబడతాయి. ధోనీకి తనపై తనకున్న నమ్మకమే అతను తీసుకునే నిర్ణయంలోనూ కనబడుతుంది. ఈ విషయంలో మాత్రం నేను పాంటింగ్ కంటే ధోనినే అత్యుత్తమమని చెప్పగలను' అంటూ పేర్కొన్నాడు. 2012లో ఆటకు రిటైర్మంట్ ప్రకటించిన మైక్ హస్సీ ఆస్ట్రేలియా తరపున 185 వన్డేలు, 79 టెస్టులు, 38 టీ20లు ఆడాడు. ఇక ఐపీఎల్లో చెన్నె సూపర్కింగ్స్ తరపున ఆడిన హస్సీ 2018 నుంచి అదే జట్టుకు బ్యాటింగ్ కోచ్గా కొనసాగుతున్నాడు. (ధావన్ ఒక ఇడియట్..స్ట్రైక్ తీసుకోనన్నాడు..!) -
'నా కెరీర్లో ఆ స్పెల్ ఎప్పటికి మరిచిపోను'
1999లో పాకిస్తాన్ పేసర్ షోయబ్ అక్తర్ అత్యంత వేగంగా బంతులు విసిరిన స్పెల్గా తనకు ఎప్పటికి గుర్తుండిపోతుందని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ పేర్కొన్నాడు.1999లో పాక్ జట్టు తమ దేశంలో పర్యటించింది. కాగా పెర్త్లో జరిగిన టెస్టు మ్యాచ్లో అక్తర్ ఒక ఓవర్లో ప్రతీ బాల్ను గంటకు 150 కిలోమీటర్ల వేగంతో విసిరాడని గుర్తుచేశాడు. కాగా అంతకుముందు ఇంగ్లండ్ మాజీ ఆల్రౌండర్ ఆండ్రూ ఫ్లింటాఫ్ తనకు వేసిన అత్యుత్తమ ఓవర్ అని పాంటింగ్ చెప్పుకొచ్చాడు. (‘మామూలు ప్రపంచకప్ పోరాటం కాదిది’) ఇదే విషయాన్ని రికీ పాంటింగ్ ట్విటర్లో షేర్ చేస్తూ.. ' నా కెరీర్లో ఫ్లింటాఫ్ వేసిన ఓవర్ను బెస్ట్ ఓవర్గా చెప్పుకొన్న తర్వాత వెంటనే నాకు అక్తర్ వేసిన స్పెల్ గుర్తుకువచ్చింది. అక్తర్ వేసిన ప్రతీ బాల్ గంటకు 150 కిలోమీటర్ల వేగంతో సాగింది. వేసిన ప్రతీ బంతి నన్ను బాగానే ఇబ్బంది పెట్టింది. అక్తర్ అత్యంత ఫాస్ట్ బౌలింగ్ను కూడా నేను ఎప్పటికి మరిచిపోను' అంటూ చెప్పుకొచ్చాడు. 2005లో జరిగిన యాషేస్ సిరీస్లో ఫ్లింటాఫ్ వేసిన ఒక ఓవర్ అత్యుత్తమ ఓవర్గా మిగిలిపోతుందని పాంటింగ్ చెప్పుకొచ్చాడు. ఎడ్జ్బాస్టన్ వేదికగా జరిగిన రెండో టెస్టులో ఫ్లింటాఫ్ వేసిన ఓవర్ మొత్తంలో పాంటింగ్ బ్యాటింగ్ చేయడానికి అపసోఫాలు పడ్డాడు. చివరి బంతికి పాంటింగ్ ఏకంగా వికెట్ సమర్పించుకొని వెనుదిరిగాడు. కాగా పాంటింగ్ తన కెరీర్లో అన్ని ఫార్మాట్లు కలిపి 27, 486 పరుగులు చేశాడు. అంతేగాక పాంటింగ్ ఈ తరంలో ఉత్తమ కెప్టెన్గానూ నిలవడమే గాక 2003, 2007 ప్రపంచకప్లు జట్టుకు అందించడంలో ముఖ్య పాత్ర పోషించాడు. (వారిద్దరికి ఇది మరిచిపోలేని రోజు) -
నీ బ్యాట్ సరే.. అందులో స్ప్రింగ్ ఏది?
మెల్బోర్న్: 2011 వన్డే వరల్డ్కప్ను రెండోసారి సాధించడానికి ముందు టీమిండియా కేవలం రెండుసార్లు మాత్రమే ఆ మెగా టోర్నీలో ఫైనల్కు చేరింది. అందులో 1983 వరల్డ్కప్ను భారత్ సాధిస్తే, 2003 వరల్డ్కప్లో మాత్రం రనరప్గా సరిపెట్టుకుంది. సౌరవ్ గంగూలీ నేతృత్వంలోని టీమిండియా 17 ఏళ్ల క్రితం వన్డే వరల్డ్కప్లో ఫైనల్కు చేరినా ట్రోఫీని కైవసం చేసుకోలేకపోయింది. ఆనాటి ఫైనల్లో ఆసీస్ చేతిలో భారత్ 125 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. కాగా, రికీ పాంటింగ్ నేతృత్వంలోని ఆసీస్ మాత్రం ఆ మెగాఫైట్లో రెచ్చిపోయింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ 50 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 359 పరుగులు చేసి రికార్డు స్కోరును భారత్ ముందుంచింది. అందులో పాంటింగ్(140 నాటౌట్) భారీ సెంచరీకి తోడు గిల్ క్రిస్ట్(57), మాథ్యూ హేడెన్(37), డామియన్ మార్టిన్(88 నాటౌట్)లు రాణించడంతో ఆసీస్ మూడొందల యాభైకి పైగా పరుగుల్ని అవలీలగా చేసింది. (ఇది భరించలేని చెత్త వైరస్) అయితే ఆ ఫైనల్ మ్యాచ్కు ఎన్నో ఏళ్ల ముందు నుంచే పలువురు క్రికెటర్లు భిన్నమైన బ్యాట్లు వాడుతున్నారనే విమర్శలు వినిపిస్తూ వచ్చాయి. కొంతమంది బ్యాట్లలో రాడ్లు వాడుతుండగా, మరికొంతమంది బ్యాట్ హ్యాండిల్ గ్రిప్ లోపల స్ప్రింగ్లు వాడుతున్నారనే దుమారం బాగా వినిపించేది. ఇప్పుడు మరొకసారి ఆ సెగ పాంటింగ్కు తాకింది. అదేంటి పాంటింగ్ క్రికెట్కు వీడ్కోలు చెప్పి చాలాకాలమే అయ్యింది కదా.. ఇప్పుడు అతని బ్యాట్లో స్ప్రింగ్లు ప్రస్తావన ఎంటి అనుకుంటున్నారా. తాజాగా 2003 వరల్డ్కప్లో ఫైనల్లో వాడిన బ్యాట్ను పాంటింగ్ ట్వీటర్లో పోస్ట్ చేయడమే మళ్లీ అప్పటి స్ప్రింగ్ల మాట తెరపైకి వచ్చింది. (‘దొంగ నిల్వలు పెట్టుకోవద్దు’) ‘ఇప్పుడు మనమంతా ఇంట్లోనే ఎక్కువగా ఉంటున్నాం. మనకు తగినంత సమయం లభించింది. నేను రెగ్యులర్గా కొన్ని విషయాలను అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటాను. ఆ క్రమంలోనే 2003 వరల్డ్కప్లో నేను వాడిన బ్యాట్ను షేర్ చేసుకుంటున్నా’ అని పాంటింగ్ పోస్ట్ పెట్టాడు. దీనిలో భాగంగా ఆనాటి బ్యాట్ను రెండు వైపులకు తిప్పిమరీ ఫొటోలు పెట్టాడు. ఈ విషయంలో పాంటింగ్పై ట్రోలింగ్కు దిగారు భారత అభిమానులు. ‘ నీ బ్యాట్ హ్యాండిల్కు ఉన్న గ్రిప్ తీస్తే స్ప్రింగ్ ఉంటుంది కదా.. అది కూడా ఓపెన్ చేసి చూపించు’ అని ఒకరు ఎద్దేవా చేయగా, ఆ బ్యాట్కు సంబంధించి స్ప్రింగ్ను ఎక్కడ దాచావ్’ అని మరొక అభిమాని ప్రశ్నించాడు. ‘ స్ప్రింగ్తో తయారు చేసిన బ్యాట్ అది’ మరొక అభిమాని సెటైర్ వేశాడు. ‘ నీ బ్యాట్ అసల రూపం ఇది’ అని ఆ బ్యాట్కు స్ప్రింగ్ తగలించి మరీ ఒక అభిమాని రిప్లై ఇచ్చాడు. సరిగ్గా నేటికి(మార్చి 23) ఆ ఫైనల్ జరిగి 17 ఏళ్లు పూర్తి చేసుకోవడంతో పాంటింగ్ తన బ్యాట్ను షేర్ చేసుకుంటే దానికి అభిమానులు మాత్రం ఇలా విమర్శలకు దిగుతున్నారు. కాగా, ఐసీసీ మాత్రం ‘2003లో ఇదే రోజు’ అని పాంటింగ్ పోస్ట్కు బదులిచ్చింది. Given we've all got a bit of time on our hands as we stay at home, thought I'd go through what I've kept from my career and share some of it with everyone on a regular basis - this is the bat I used in the 2003 World Cup final. pic.twitter.com/meoBP6NJvg — Ricky Ponting AO (@RickyPonting) March 23, 2020 -
'ఆ వివాదం చాలా రోజులు వెంటాడింది'
సిడ్నీ : 2008లో జరిగిన 'మంకీ గేట్ వివాదం' క్రికెట్ ప్రేమికులెవరూ అంత తేలిగ్గా మరిచిపోలేరు. భారత సీనియర్ క్రికెటర్ హర్భజన్ సింగ్, ఆస్ట్రేలియా మాజీ ఆల్రౌండర్ ఆండ్రూ సైమండ్స్ల మధ్య మైదానంలో చోటుచేసుకున్న ఈ వివాదంపై తీవ్ర దుమారం రేగింది. తాజాగా ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ ఈ ఘటనను మరోసారి గుర్తు చేశాడు. 'బహుశా మంకీ గేట్ వివాదం నా కెప్టెన్సీ కెరీర్లోనే అత్యంత హీనమైన ఘటన. 2005 యాషెస్ సిరీస్ ఓటమి కూడా కఠినమైనదే. కానీ ఈ సిరీస్ ఓటమి అనేది నా నియంత్రణలో జరిగింది. కానీ మంకీగేట్ వివాదం చోటు చేసుకున్నప్పుడు మాత్రం నేనేం చేయలేకపోయాను. ఇది చాలా రోజులు మమ్మల్ని వెంటాడింది. అడిలైడ్ టెస్ట్ మ్యాచ్ కోసం మైదానంలోకి వస్తుండగా.. క్రికెట్ ఆస్ట్రేలియా అధికారులు మాట్లాడటం నాకింకా గుర్తుంది. ఈ టెస్ట్ మ్యాచ్ ముగింపులో ఈ వివాదంపై విచారణ జరిగింది. మంకీగేట్ వివాదం తుది ఫలితంతో మేం తీవ్ర నిరాశకు గురయ్యాం. ఇది మా తదుపరి మ్యాచ్ ఫలితాలపై బాగా ప్రభావం చూపింది. పెర్త్ వేదికగా భారత్తో జరిగిన మ్యాచ్లు గెలుస్తామనుకున్నాం... కానీ ఓటమి తప్పలేదు. ఆ తర్వాత మా పరిస్థితి మరింత దిగజారింది' అని పాంటింగ్ చెప్పుకొచ్చాడు. ('ధోని ఇక జట్టులోకి రావడం కష్టమే') 2007-08 ఆస్ట్రేలియాలో పర్యటనలో భాగంగా జరిగిన సిడ్నీ టెస్ట్లో హర్భజన్ సింగ్ తనను మంకీ అంటూ జాతివివక్ష వ్యాఖ్యలు చేశాడని ఆండ్రూ సైమండ్స్ మ్యాచ్ రిఫరీకి ఫిర్యాదు చేయడంతో ఈ వివాదం చెలరేగింది. దీంతో రిఫరీ హర్భజన్పై 50 శాతం మ్యాచ్ ఫీజు కోతతో పాటు మూడు టెస్ట్ల నిషేధం విధించాడు. అయితే వ్యవహారంలో భజ్జీ తప్పులేదని అప్పటి భారత్ ఆటగాళ్లు స్పష్టం చేశారు. నిషేధం ఎత్తేయకపోతే సిరీస్ నుంచి తప్పుకుంటామని హెచ్చరించారు. అప్పటి అప్పీల్ కమిషనర్ జాన్ హనెసన్ ముందు హర్భజన్కు సచిన్ మద్దతుగా నిలవడంతో బజ్జీకి శిక్షను రద్దు చేశారు. (క్రికెటర్ హర్బజన్సింగ్ బ్యాట్ చోరీ) -
పాంటింగ్ ఆల్టైమ్ బెస్ట్ ఫీల్డర్లు వీరే..
మెల్బోర్న్: ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ బ్యాటింగ్ దిగ్గజమే కాదు.. తన జనరేషన్లో అత్యుత్తమ ఫీల్డర్ కూడా. అయితే ఆల్టైమ్ టాప్-3 బెస్ట్ ఫీల్డర్లలో ఇద్దరు దక్షిణాఫ్రికా దిగ్గజాల పేర్లు వెల్లడించిన పాంటింగ్.. ఒక ఆసీస్ ఆటగాడి పేరును పేర్కొన్నాడు. ట్వీటర్లో క్వశ్చన్-ఆన్సర్లో భాగంగా ఆల్టైమ్ టాప్-3 బెస్ట్ ఫీల్డర్లు ఎవరు అనే ప్రశ్నకు సమాధానంగా జాంటీ రోడ్స్(దక్షిణాఫ్రికా), ఏబీ డివిలియర్స్(దక్షిణాఫ్రికా), ఆండ్రూ సైమండ్స్(ఆస్ట్రేలియా)ల పేర్లను పాంటింగ్ సూచించాడు. వీరు ముగ్గురు తన ఆల్టైమ్ బెస్ట్ ఫీల్డర్లని పాంటింగ్ పేర్కొన్నాడు. ఇక ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్ హెడ్ కోచ్ ఉన్న పాంటింగ్.. టీమిండియా యువ వికెట్ కీపర్ , ఢిల్లీ జట్టు సభ్యుడైన రిషభ్ పంత్ను వెనకేసుకొచ్చాడు. పంత్లో విశేషమైన టాలెంట్ ఉందని, అతన్ని త్వరలోనే మళ్లీ భారత క్రికెట్ జట్టులో చూస్తామన్నాడు. అందుకు పెద్దగా సమయం కూడా ఏమీ పట్టదన్నాడు. ఐపీఎల్లో పంత్తో కలిసి పని చేసిన క్రమంలో అతనిలో విశేషమైన నైపుణ్యాన్ని చూశానని తెలిపాడు. పంత్ గురించి అడిగిన ప్రశ్నకు సమాధానంగా పాంటింగ్ పైవిధంగా స్పందించాడు. (ఇక్కడ చదవండి: ‘పంత్.. వారి నోటికి తాళం వేయి’) -
‘ఆ చాన్స్ టీమిండియాకు ఇవ్వం’
ముంబై: టీమిండియాతో జరుగనున్న మూడు వన్డేల సిరీస్ను తమ జట్టు గెలుస్తుందని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ అభిప్రాయపడ్డాడు. ఈ సిరీస్ను ఆసీస్ 2-1తేడాతో గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశాడు. భారత్కు వారి దేశంలో సిరీస్ గెలిచే అవకాశాన్ని ఆసీస్ ఈసారి కూడా ఇవ్వదని జోస్యం చెప్పాడు. భారత్లో వారి గడ్డపై గతేడాది జరిగిన వన్డే సిరీస్లో తమదే పైచేయి అయ్యిందని, ఇప్పుడు కూడా అదే పునరావృతం అవుతుందన్నాడు. (ఇక్కడ చదవండి: స్టీవ్ స్మిత్ ఆర్డర్ మారనుంది..) టీమిండియాకు ప్రతీకారం తీర్చుకునే చాన్స్ ఇవ్వబోమన్నాడు. వన్డే వరల్డ్కప్ దగ్గర్నుంచీ ఆసీస్ క్రమేపీ పుంజుకుందన్నాడు. పాకిస్తాన్, న్యూజిలాండ్ జట్లను వైట్వైష్ చేసిన ఆసీస్.. ఇప్పుడు భారత్పై అదే తరహా ప్రదర్శనను రిపీట్ చేయడానికి సిద్ధమైందన్నాడు. ట్వీటర్లో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్లో భాగంగా భారత్పై ఆసీస్ గెలుస్తుందా అనే ప్రశ్నకు పాంటింగ్ పై విధంగా స్పందించాడు. ఇక టెస్టు ఫార్మాట్లో దుమ్మురేపి ఆసీస్ జట్టులో రెగ్యులర్ ఆటగాడిగా మారిపోయిన లబూషేన్ గురించి మాట్లాడుతూ.. ‘ ఆసీస్కు లబూషేన్ ఒక వెన్నుముకలా మారిపోయాడు. ప్రత్యేకంగా మిడిల్ ఆర్డర్లో జట్టు పటిష్టం కావడానికి లబూషేన్ ఒక కారణం. స్పిన్ బాగా ఆడే లబూషేన్ భారత్పై కచ్చితంగా రాణిస్తాడు’ అని పాంటింగ్ మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పాడు. 2019 ఫిబ్రవరి-మార్చి నెలలో ఆసీస్ జట్టు భారత్లో పర్యటించింది. రెండు టీ20ల సిరీస్ను క్లీన్స్వీప్ చేసిన ఆసీస్.. ఐదు వన్డేల సిరీస్ను 3-2 తేడాతో కైవసం చేసుకుంది. -
రికీ పాంటింగ్ దశాబ్దపు టెస్టు జట్టు ఇదే..
మెల్బోర్న్: ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ ఈ దశాబ్దపు టెస్టు జట్టును ప్రకటించాడు. దీంట్లో భారత్ నుంచి విరాట్ కోహ్లి మాత్రమే చోటిచ్చాడు. విరాట్నే తన జట్టు కెప్టెన్గా కూడా ఎన్నుకున్నాడు. ఇక ఈ జట్టులో అత్యధికంగా నలుగురు ఇంగ్లండ్ ఆటగాళ్లుండగా ఆసీస్ నుంచి ముగ్గురున్నారు. అయితే వికెట్ కీపర్గా ఎన్నో ఘనతలు తన పేరిట లిఖించుకున్న ఎంఎస్ ధోనీని కాకుండా కుమార సంగక్కరను తీసుకోవడం గమనార్హం. ఓపెనర్లుగా డేవిడ్ వార్నర్, అలిస్టర్ కుక్ ఉన్నారు. పేస్ విభాగంలో ఇంగ్లండ్ బౌలర్లు అండర్సన్, స్టువర్ట్ బ్రాడ్లు ఉండగా, దక్షిణాఫ్రికా నుంచి డేల్ స్టెయిన్కు కూడా అవకాశం కల్పించాడు. ఇదే పాంటింగ్ టెస్టు జట్టు: డేవిడ్ వార్నర్, అలెస్టర్ కుక్, కేన్ విలియమ్సన్, స్టీవ్ స్మిత్, విరాట్ కోహ్లి (కెప్టెన్), సంగర్కర (కీపర్), బెన్ స్టోక్స్, డేల్ స్టెయిన్, నాథన్ లియాన్, స్టువర్ట్ బ్రాడ్, అండర్సన్. -
ధోనికి నో ఛాన్స్.. కోహ్లికే ఓటు
మెల్బోర్న్: టీమిండియా సారథి విరాట్ కోహ్లికి ఆస్ట్రేలియా మాజీ సారథి రికీ పాంటింగ్ సముచిత స్థానాన్ని కల్పించాడు. ఈ దశాబ్దపు తన బెస్ట్ టెస్టు జట్టును పాంటింగ్ తాజాగా ప్రకటించాడు. అయితే ఈ జట్టుకు విరాట్ కోహ్లి నాయకత్వం వహించనున్నాడు. పదకొండు మంది సభ్యులతో కూడిన తన టెస్టు జట్టులో టీమిండియా నుంచి కోహ్లికి ఒక్కడికే పాంటింగ్ అవకాశం కల్పించాడు. సుదీర్ఘకాలంగా టెస్టుల్లో చాంపియన్గా కొనసాగుతున్న భారత్ నుంచి ఒక్కరికే అవకాశం ఇవ్వడం గమనార్హం. సారథిగా కాకపోయినా కనీసం వికెట్ కీపర్గా కూడా ఎంఎస్ ధోనిని పాంటింగ్ ఎంపిక చేయలేదు. వికెట్ కీపర్గా ధోనిని కాదని శ్రీలంక మాజీ క్రికెటర్ కుమార సంగక్కరకు అవకాశం కల్పించాడు. జట్టులో స్పిన్నర్గా ఉపఖండపు స్పిన్నర్లను కాదని లియోన్ను ఎంపిక చేయడం అందరిలోనూ అనుమానాలను రేకెత్తిస్తోంది. ఇక 11 మంది జాబితాలో ఇంగ్లండ్ నుంచి అత్యధికంగా నలుగురికి, ఆసీస్ నుంచి కేవలం ముగ్గురికే అవకాశం ఇచ్చాడు. ఓపెనర్లగా డేవిడ్ వార్నర్, అలిస్టర్ కుక్లను ఎంపిక చేశాడు. వన్డౌన్లో న్యూజిలాండ్ సారథి కేన్ విలియమ్సన్, ఆ తర్వాతి వరుసగా స్టీవ్ స్మిత్, విరాట్ కోహ్లి, కుమార సంగక్కరలు మిడిలార్డర్లో బ్యాటింగ్కు దిగుతారని పేర్కొన్నాడు. ఈ దశాబ్దపు బెస్ట్ ఆల్రౌండర్ బెన్ స్టోక్స్ అంటూ కితాబిస్తూ అతడికి జట్టులో చోటిచ్చాడు. ఇక ఇంగ్లండ్ పేస్ ద్వయం స్టువార్ట్ బ్రాడ్, అండర్సన్లవైపే పాంటింగ్ మొగ్గు చూపాడు. అంతేకాకుండా దక్షిణాఫ్రికా నుంచి డేల్ స్టెయిన్ను ఎంపిక చేశాడు. అయితే పాంటింగ్ టెస్టు జట్టుపై మాజీ క్రికెటర్లు పెదవి విరుస్తున్నారు. పక్షపాతంగా జట్టును ప్రకటించాడని విమర్శిస్తున్నారు. పాంటింగ్ టెస్టు జట్టు ఇదే విరాట్ కోహ్లి(సారథి), డేవిడ్ వార్నర్, అలిస్టర్ కుక్, స్టీవ్ స్మిత్, కేన్ విలియమ్సన్, కుమార సంగక్కర, బెన్ స్టోక్స్, స్టువార్ట్ బ్రాడ్, డేల్ స్టెయిన్, జేమ్స్ అండర్సన్, నాథన్ లియోన్ చదవండి: కోహ్లితో టచ్లోనే ఉన్నాడుగా.. మంచు కొండల్లో విరుష్కల విహారం -
రికీ పాంటింగ్ రికార్డు బ్రేక్
కోల్కతా: బంగ్లాదేశ్తో జరుగుతున్న పింక్ బాల్ టెస్టులో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి రికార్డులు మీద రికార్డులు కొల్లకొడుతున్నాడు. టెస్టు ఫార్మాట్లో కెప్టెన్గా ఐదు వేల పరుగుల్ని వేగవంతంగా పూర్తి చేసిన రికార్డే కాకుండా, పింక్ బాల్ టెస్టులో సెంచరీ సాధించిన తొలి భారత ఆటగాడిగా రికార్డు నెలకొల్పిన కోహ్లి.. మరో ఘనతను నమోదు చేశాడు. టెస్టుల్లో ఒక కెప్టెన్గా అత్యధిక సెంచరీలు సాధించిన జాబితాలో రెండో స్థానాన్ని ఆక్రమించాడు. బంగ్లాతో టెస్టులో చేసిన సెంచరీ కోహ్లికి ఈ ఫార్మాట్లో 27వది కాగా, కెప్టెన్గా 20వ టెస్టు శతకం. దాంతో దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ గ్రేమ్ స్మిత్(25) తర్వాత స్థానంలో కోహ్లి నిలిచాడు. ఈ క్రమంలోనే పాంటింగ్ను కోహ్లి అధిగమించాడు. మరొకవైపు అంతర్జాతీయ క్రికెట్లో కెప్టెన్గా అత్యధిక సెంచరీలు సాధించిన జాబితాలో పాంటింగ్ సరసన నిలిచాడు. అంతర్జాతీయ క్రికెట్లో అన్ని ఫార్మాట్లలో కలిపి కెప్టెన్గా కోహ్లికి ఇది 41వ సెంచరీ. పాంటింగ్ కూడా 41 శతకాలు ఉన్నాడు. ఇప్పుడు పాంటింగ్తో కలిసి సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచాడు కోహ్లి. ఇక టెస్టుల్లో అత్యధిక సెంచరీలు సాధించిన జాబితాలో ఆసీస్ క్రికెటర్ స్టీవ్ స్మిత్ను కోహ్లి దాటేశాడు. ఒక ఆటగాడిగా కోహ్లి టెస్టుల్లో 27 సెంచరీలు సాధించగా, గ్రేమ్ స్మిత్, అలెన్ బోర్డర్లు కూడా అన్నే సెంచరీలతో ఉన్నారు. దాంతో వారితో కలిసి టెస్టు ఆటగాళ్ల జాబితాలో 17వ స్థానంలో ఉన్నాడు. మరొకవైపు అత్యధిక అంతర్జాతీయ సెంచరీలు సాధించిన జాబితాలో కోహ్లి మూడో స్థానంలో ఉన్నాడు. కోహ్లి 70 అంతర్జాతీయ సెంచరీలతో టాప్-3లో నిలిచాడు. ముందు వరసులో సచిన్ టెండూల్కర్(100 సెంచరీలు), పాంటింగ్( 71 సెంచరీలు)లు ఉన్నారు. బంగ్లాదేశ్తో టెస్టులో కోహ్లి 136 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఆరో వికెట్గా ఔటయ్యాడు. అంతకుముందు రవీంద్ర జడేజా(12) పెవిలియన్ చేరాడు.భారత జట్టు 82 ఓవర్లు ముగిసే సరికి ఆరు వికెట్లు కోల్పోయి 309 పరుగులు చేసింది. దాంతో భారత్కు 203 పరుగుల ఆధిక్యం లభించింది. బంగ్లాదేశ్ తన తొలి ఇన్నింగ్స్లో 106 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే. -
మీ ఫేవరెట్ వన్డే కెప్టెన్ ఎవరు?
సిడ్నీ: ‘మీకు రికీ పాంటింగ్, ఎంఎస్ ధోనిల్లో ఫేవరెట్ వన్డే కెప్టెన్ ఎవరు?’ అనే ప్రశ్న ఆసీస్ మాజీ క్రికెటర్ మైక్ హస్సీకి ఎదురైంది. ఆసీస్ తరఫున పాంటింగ్తో కలిసి సుదీర్ఘ కాలం క్రికెట్ ఆడగా, ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో ఎంఎస్ ధోని నేతృత్వంలో హస్సీ ఆడాడు. ఈ నేపథ్యంలో హస్సీని ఒక ఇబ్బందికర ప్రశ్న కాస్త ఆలోచనలో పడేసింది. భారత్ క్రికెట్ తరఫున ఒక టీ20 వరల్డ్కప్, 2013 చాంపియన్స్ ట్రోఫీ, వన్డే వరల్డ్కప్లను గెలిచిన ఘనత ధోనిది. ఐసీసీ నిర్వహించే ఈ మూడు మెగా టైటిల్స్ను ధోని తన కెప్టెన్సీలో అందుకుని దీన్ని సాధించిన ఏకైక భారత కెప్టెన్గా గుర్తింపు పొందాడు. ఇక ధోని వన్డే విజయాల సగటు 59.52గా ఉంది. మొత్తం వన్డే ఫార్మాట్లో 199 మ్యాచ్లకు గాను 110 విజయాలు అందుకున్నాడు ధోని. ఇక పాంటింగ్ విషయానికొస్తే 2003, 2007 వన్డే వరల్డ్కప్లను అందించిన ఆసీస్ కెప్టెన్. ఆ జట్టు కెప్టెన్గా తన కెరీర్గా ముగిసే నాటికి పాంటింగ్ విజయాల సగటు 76.14గా ఉంది. అయితే ఇద్దరి కెప్టెన్లతో ఆడిన క్రికెటర్ హస్సీ. దాంతో హస్సీకి కష్టతరమైన ప్రశ్న ఎదురైనా దానికి మాత్రం క్లియర్గా సమాధానం చెప్పాడు. ‘నేను ధోని, పాంటింగ్ల సారథ్యంలో మ్యాచ్లు ఆడా. ఆ ఇద్దరిలో ఎవరు మీ ఫేవరెట్ కెప్టెన్ అంటే ఏమి చెబుతా. ఇది కచ్చితంగా కఠినతరమైన ప్రశ్నే. కాకపోతే నేనే పాంటింగే నా ఫేవరెట్ కెప్టెన్ అని బదులిస్తా. ఎందుకంటే ధోని కెప్టెన్సీలో నేను వన్డేలు ఆడలేదు. దాంతో నా ఫేవరెట్ వన్డే కెప్టెన్ పాంటింగే అవుతాడు కదా’ అని హస్సీ చెప్పాడు. 2011, 2012 ఐపీఎల్ టైటిల్స్ గెలిచిన సీఎస్కే జట్టులో హస్సీ సభ్యుడిగా ఉన్నాడు. ధోని కెప్టెన్సీలో వరుసగా రెండు టైటిల్స్ సాధించిన సీఎస్కే జట్టులో హస్సీ పాల్గొన్నాడు.