-
ఈసారి టైటిల్ సన్రైజర్స్దే!.. రిక్కీ పాంటింగ్ కామెంట్స్ వైరల్
ఐపీఎల్-2024లో చాంపియన్గా నిలవడానికి గల అర్హత ఇదేనంటూ ఢిల్లీ క్యాపిటల్స్ హెడ్ కోచ్ రిక్కీ పాంటింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. దూకుడైన బ్యాటింగ్తో ముందుకు సాగే జట్టే టైటిల్ సాధిస్తుందని అభిప్రాయపడ్డాడు. కాగా క్యాష్ రిచ్ తాజా ఎడిషన్లో ఇప్పటి వరకు 31 మ్యాచ్లు జరుగగా.. తొమ్మిదికి పైగా మ్యాచ్లలో.. ఒక ఇన్నింగ్స్లో 200.. అంతకంటే పైచిలుకు స్కోర్లు నమోదయ్యాయి. ఇక ఈ సీజన్లో కొత్త కెప్టెన్ ప్యాట్ కమిన్స్ సారథ్యంలో రెట్టించిన ఉత్సాహంతో ముందుకు సాగుతున్న సన్రైజర్స్ హైదరాబాద్ రోజుల వ్యవధిలోనే తమ రికార్డు తామే బద్దలు కొట్టింది. దుమ్మురేపుతున్న సన్రైజర్స్ తొలుత ముంబై ఇండియన్స్పై 277 పరుగులు సాధించిన ఎస్ఆర్హెచ్.. ఆ తర్వాత ఆర్సీబీపై 287 పరుగులు స్కోరు చేసింది. తద్వారా ఐపీఎల్ చరిత్రలో అత్యధిక స్కోరు సాధించిన జట్టుగా రికార్డులకెక్కింది. Captain Pat reflects on the game ➕ who clinched the dressing room awards? 👀🏅 Watch as we soak in the post match vibes from our strong win in #RCBvSRH 🧡 pic.twitter.com/Ey7VhksA6B — SunRisers Hyderabad (@SunRisers) April 16, 2024 తగ్గేదేలే అంటున్న కేకేఆర్ మరోవైపు కోల్కతా నైట్ రైడర్స్ సైతం ఢిల్లీ క్యాపిటల్స్పై 272 పరుగులతో సత్తా చాటింది. ఇక తాజాగా మంగళవారం నాటి మ్యాచ్లో రాజస్తాన్ రాయల్స్, కేకేఆర్ వరుసగా 224, 223 పరుగులు స్కోరు చేశాయి. ఈ పరిణామాల నేపథ్యంలో రిక్కీ పాంటింగ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘‘ఇప్పటికే రెండుసార్లు భారీ స్కోరు చేసిన జట్టుగా ఎస్ఆర్హెచ్ రికార్డులు సాధించింది. కేకేఆర్ కూడా మా జట్టు మీద 272 రన్స్ స్కోరు చేసింది. సన్రైజర్స్ సూపర్ ఫామ్ నాకు తెలిసి ఇంపాక్ట్ ప్లేయర్ కారణంగానే బ్యాటింగ్ జట్లకు ఈ మేరకు ప్రయోజనం చేకూరుతున్నట్లు అనిపిస్తోంది. ఆర్సీబీతో మ్యాచ్లో ట్రావిస్ హెడ్ ఎంతగా ప్రభావం చూపాడో చూశాం. ఎంతో ఆత్మవిశ్వాసం ఉంటేగానీ ఆ మాదిరి షాట్లు ఆడలేరు. బ్యాటింగ్ ఆర్డర్లో డెప్త్ ఉన్న కారణంగా కూడా అతడు స్వేచ్ఛగా బ్యాట్ ఝులిపించగలిగాడు. ఐపీఎల్ వంటి మేజర్ టోర్నీల్లో లేదా బిగ్ బాష్ లీగ్లో.. ఇలా ఎక్కడ చూసినా సరే లక్ష్యాన్ని కాపాడుకోగలిగి జట్లే విజయం సాధించాయి. అయితే.. ఈసారి ఐపీఎల్ మాత్రం భిన్నంగా సాగుతోంది. ఆ జట్టుదే టైటిల్ బౌలర్లను చితక్కొడుతూ భారీ స్కోర్లు సాధించిన జట్లే టైటిల్ దిశగా వెళ్లే సూచనలు కనిపిస్తున్నాయి. డిఫెన్సివ్ బౌలింగ్పై ఆధారపడే జట్ల కంటే దూకుడుగా బ్యాటింగ్ చేసే జట్లకే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయి’’ అని రిక్కీ పాంటింగ్ అభిప్రాయపడ్డాడు. అలా అయితే ఈసారి సన్రైజర్స్దే టైటిల్! ఇక పాంటింగ్ వ్యాఖ్యలను బట్టి చూస్తే సీజన్ ఆరంభం(కేకేఆర్తో మ్యాచ్లో 204) నుంచి దూకుడుగా బ్యాటింగ్ చేస్తున్న సన్రైజర్స్కే టైటిల్ విన్నర్గా నిలిచే ఛాన్స్ ఉందని ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్ క్రేజీ కామెంట్లు చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. పాంటింగ్ మార్గదర్శనంలోని ఢిల్లీ క్యాపిటల్స్ ఈ సీజన్లో ఇప్పటి వరకు ఆడిన ఆరు మ్యాచ్లలో కేవలం రెండే గెలిచి పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో ఉంది. ఇక పంత్ సేన తమ తదుపరి మ్యాచ్లో భాగంగా బుధవారం గుజరాత్ టైటాన్స్ను అహ్మదాబాద్లో ఢీకొట్టనుంది. చదవండి: #Pat Cummins: శెభాష్.. ఇది సరైన నిర్ణయం! కమిన్స్ అన్నతో అట్లుంటది మరి.. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_7552012696.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
T20 WC: సంజూ బాగా ఆడుతున్నాడు.. అయినా పంత్కే చోటివ్వాలి!
టీ20 ప్రపంచకప్-2024 భారత జట్టులో రిషభ్ పంత్కు చోటు ఇవ్వాలని ఆస్ట్రేలియా దిగ్గజం, ఢిల్లీ క్యాపిటల్స్ హెడ్ కోచ్ రిక్కీ పాంటింగ్ అన్నాడు. మెగా టోర్నీ ఆడే అర్హత పంత్కు ఉందని.. తన దృష్టిలో అతడే టీమిండియాకు మొదటి వికెట్ కీపర్ ఆప్షన్ అని పేర్కొన్నాడు. ఐపీఎల్-2024లో సత్తా చాటి కచ్చితంగా వరల్డ్కప్ ఆడే జట్టులో పంత్ చోటు దక్కించుకుంటాడని రిక్కీ పాంటింగ్ ధీమా వ్యక్తం చేశాడు. కాగా 2022, డిసెంబరులో కారు ప్రమాదానికి గురై.. అదృష్టవశాత్తూ ప్రాణాలతో బయటపడ్డ పంత్ కోలుకోవడానికి దాదాపు ఏడాదిన్నర కాలం పట్టింది. బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో సుదీర్ఘకాలం పాటు పునరావాసం పొందిన పంత్.. క్రమక్రమంగా కోలుకుని మ్యాచ్ ఫిట్నెస్ సాధించాడు. ఈ క్రమంలో ఐపీఎల్ పదిహేడో ఎడిషన్లో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్గా తిరిగి పగ్గాలు చేపట్టిన పంత్.. వికెట్ కీపర్ బ్యాటర్గానూ సేవలు అందిస్తున్నాడు. ఇప్పటి వరకు ఆరు ఇన్నింగ్స్ ఆడి 194 పరుగులు చేసిన పంత్ ఖాతాలో రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అయితే.. కెప్టెన్గా మాత్రం పంత్ విఫలమవుతూనే ఉన్నాడు. అతడి సారథ్యంలో ఢిల్లీ ఇప్పటిదాకా ఆరు మ్యాచ్లు ఆడి కేవలం రెండే గెలిచింది. ఇదిలా ఉంటే.. మే 27న ఐపీఎల్-2024 ముగియనుండగా.. జూన్ 1 నుంచి వెస్టిండీస్- అమెరికా వేదికగా పొట్టి ప్రపంచకప్ సమరం మొదలుకానుంది. ఈ నేపథ్యంలో భారత జట్టు వికెట్ కీపర్ ఎంపిక గురించి రిక్కీ పాంటింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సంజూ బాగా ఆడుతున్నాడు.. అయినా పంత్కే చోటివ్వాలి! ‘‘వరల్డ్కప్ జట్టులో రిషభ్ పంత్కు చోటు ఇవ్వాలా? అంటే కచ్చితంగా ఇవ్వాలనే చెబుతా. ఐపీఎల్ ముగిసేలోపు అతడు అందుకు అర్హత సాధిస్తాడు. గత ఆరు సీజన్లలో పంత్ మెరుగ్గా ఆడాడు. టీమిండియా తరఫున కూడా మంచి ప్రదర్శన ఇచ్చాడు. భారత జట్టులో ప్రతిభావంతులైన ఆటగాళ్లకు కొదవలేదని తెలుసు. ముఖ్యంగా వికెట్ కీపర్ బ్యాటర్లలో ఇషాన్ కిషన్, సంజూ శాంసన్, కేఎల్ రాహుల్ బాగా ఆడుతున్నారు. చాలా ఆప్షన్లు కనిపిస్తున్నాయి. అయితే.. నేను గనుక జట్టును ఎంపిక చేయాల్సి వస్తే రిషభ్ పంత్కే మొదటి ప్రాధాన్యం ఇస్తాను. నన్నెపుడు ఈ ప్రశ్న అడిగినా ఇదే సమాధానం ఇస్తాను’’ అని రిక్కీ పాంటింగ్ చెప్పుకొచ్చాడు. కాగా వరల్డ్కప్-2024 టీమిండియా వికెట్ కీపర్ల రేసులో ప్రస్తుతం సంజూ శాంసన్ ముందుకు దూసుకుపోతున్నాడు. రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్గా వ్యవహరిస్తున్న అతడు ఇప్పటి వరకు ఆరు ఇన్నింగ్స్లో కలిపి 264 పరుగులు సాధించాడు. చదవండి: #Pat Cummins: శెభాష్.. ఇది సరైన నిర్ణయం! కమిన్స్ అన్నతో అట్లుంటది మరి.. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_7552012696.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
కనికరం లేకుండా ఆడారు.. మా ఆటతీరును చూసి సిగ్గేసింది: రికీ పాంటింగ్
ఐపీఎల్-2024లో భాగంగా కోల్కతా నైట్ రైడర్స్తో జరిగిన మ్యాచ్లో 106 పరుగుల తేడాతో ఓడిపోయిన ఢిల్లీ క్యాపిటల్స్ ఓటమి పాలైన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్లో బ్యాటింగ్, బౌలింగ్ పరంగా ఢిల్లీ విఫలమైంది. తొలుత కేకేఆర్ బ్యాటర్లు ఢిల్లీ బౌలర్లను ఊచకోత కోశారు. కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి ఏకంగా 272 పరుగుల రికార్డు స్కోర్ సాధించింది. అనంతరం భారీ లక్ష్య ఛేదనలో డీసీ 166 పరుగులకే ఆలౌటైంది. ఇక ఈ ఘోర ఓటమిపై మ్యాచ్ అనంతరం ఢిల్లీ క్యాపిటల్స్ హెడ్ కోచ్ రికీ పాంటింగ్ స్పందించాడు. తమ జట్టు ఆట తీరును తనకు చాలా బాధ కల్గించందని పాంటింగ్ అన్నాడు. "ఈ మ్యాచ్లో మా జట్టు తొలి అర్ధభాగం ఆటను చూశాక సిగ్గేసింది. బౌలర్లు దారుణంగా విఫలమయ్యారు. చెత్త బౌలింగ్తో భారీగా పరుగులు సమర్పించుకున్నారు. 20 ఓవర్లు వేయడానికి ఏకంగా రెండు గంటలు సమయం పట్టింది. నిర్ణీత సమయానికి మేము 2 ఓవర్లు వెనుకబడ్డాము. దీంతో సర్కిల్ వెలుపల నలుగురు ఫీల్డర్లతోనే చివరి రెండు ఓవర్లు బౌలింగ్ చేశాం. ఈ మ్యాచ్లో చాలా విషయాలు ఆమోదయోగ్యం కానివిగా ఉన్నాయి. ఈ టోర్నమెంట్లో ముందుకు వెళ్లాలంటే కచ్చితంగా మేము చేసిన తప్పులను సరిదిద్దుకోవాలి. కేకేఆర్ బ్యాటర్లు కనీసం కనికరం లేకుండా ఆడారు. పవర్ప్లేను వారు బాగా ఉపయోగించుకున్నారు. పవర్ ప్లేలోనే 88 పరుగులు రాబట్టారు. ఆట ఆరంభంలోనే మ్యాచ్పై పట్టు కోల్పోతే తిరిగి రావడం చాలా కష్టం. మా బౌలర్లు కమ్బ్యాక్ ఇవ్వడానికి ప్రయత్నించినప్పటికి వారు మాత్రం మాకు ఎటువంటి అవకాశం ఇవ్వలేదు. ఈ మ్యాచ్లో మేము ఓడిపోయినప్పటికీ పంత్ తన ఫామ్ను కొనసాగించడం మా జట్టుకు సానుకూలాంశమని" పాంటింగ్ పోస్ట్ మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్లో పేర్కొన్నాడు. -
జో రూట్ అరుదైన ఘనత.. తొలి క్రికెటర్గా
ఇంగ్లండ్ వెటరన్ బ్యాటర్ జో రూట్ అరుదైన ఘనత సాధించాడు. టీమిండియాపై టెస్టుల్లో అత్యధిక ఫిప్టీ ప్లస్ స్కోర్లు సాధించిన క్రికెటర్గా రూట్ రికార్డులకెక్కాడు. ధర్మశాల వేదికగా భారత్తో జరిగిన ఐదో టెస్టులో 84 పరుగులు చేసిన రూట్.. ఈ అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. రూట్ ఇప్పటివరకు భారత్పై టెస్టుల్లో 21 సార్లు ఏభై పైగా పరుగులు చేశాడు. కాగా ఇంతకుముందు ఈ రికార్డు ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ పేరిట ఉండేది. పాంటింగ్ భారత్పై 20 సార్లు ఫిప్టీ ప్లస్ స్కోర్లు సాధించాడు. తాజా మ్యాచ్తో పాంటింగ్ ఆల్టైమ్ రికార్డును రూట్ బ్రేక్ చేశాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. భారత్ చేతిలో ఇన్నింగ్స్ 64 పరుగుల తేడాతో ఇంగ్లీష్ జట్టు ఓటమి పాలైంది. భారత బౌలర్ల దాటికి రెండో ఇన్నింగ్స్లో ఇంగ్లండ్ 195 పరుగులకే కుప్పకూలింది. దీంతో భారత్ భారీ విజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది. ఇక ఐదు మ్యాచ్ల సిరీస్ను టీమిండియా 4-1 తేడాతో సొంతం చేసుకుంది. స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలవగా.. యువ బ్యాటర్ యశస్వి జైశ్వాల్ ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’గా నిలిచాడు. చదవండి: IND vs ENG: రిటైర్మెంట్పై రోహిత్ శర్మ కీలక వ్యాఖ్యలు. -
IPL 2024: పంత్ రీఎంట్రీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన పాంటింగ్
ఢిల్లీ క్యాపిటల్స్ కోచ్ రికీ పాంటింగ్ తమ కెప్టెన్ రిషబ్ పంత్ పునరాగమనంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వచ్చే ఐపీఎల్ సీజన్కు (2024) పంత్ పూర్తిగా అందుబాటులో ఉండాలని కోరుకుంటూనే.. అతని రీఎంట్రీపై ఇప్పుడే ఏమీ చెప్పలేనని బాంబు పేల్చాడు. రీఎంట్రీపై పంత్ను అడిగితే మాత్రం అన్ని మ్యాచ్లకు సై అంటాడని, వికెట్కీపింగ్ విషయంలోనూ తగ్గేదేలేదని అంటాడని, నాలుగో స్థానంలో బ్యాటింగ్కు దిగుతానని ధీమాగా చెబుతాడని అన్నాడు. పంత్ ప్రస్తుత పరిస్థితి చూస్తే వచ్చే సీజన్లో అతను ఆడగలడని తెలుస్తుంది కాని అతను పూర్తి మ్యాచ్లకు అందుబాటులో ఉంటాడా.. కెప్టెన్సీ, వికెట్ కీపింగ్ బాధ్యతలను చేపట్టగలడా అనే విషయాలపై క్లారిటీ రావాల్సి ఉందని తెలిపాడు. పంత్ రీఎంట్రీకి సంబంధించి ఎలాంటి విషయమైనా తమకు యాడెడ్ అడ్వాంటేజ్ అవుతుందని అన్నాడు. కారు ప్రమాదం తాలూకా గాయాల నుంచి పూర్తిగా కోలుకున్న పంత్ రీఎంట్రీపై చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడని తెలిపాడు. ఒకవేళ పంత్ కెప్టెన్సీ చేపట్టలేని పక్షంలో డేవిడ్ వార్నర్ మళ్లీ కెప్టెన్సీ బాధ్యతలు చేపడతాడని కన్ఫర్మ్ చేశాడు. ప్రస్తుత జట్టు విషయంలో సంతృప్తి వ్యక్తం చేశాడు. హ్యారీ బ్రూక్ తమలో చేరడం కలిసొస్తుందని అభిప్రాయపడ్డాడు. అతన్ని ఫినిషర్ పాత్రలో వాడుకుంటామని తెలిపాడు. వార్నర్, మిచెల్ మార్ష్ టాపార్డర్లో ఉంటారని కన్ఫర్మ్ చేశాడు. అక్షర్, కుల్దీప్లతో స్పిన్ విభాగం పటిష్టంగా ఉందని ధీమా వ్యక్తం చేశాడు. నోర్జే, జై రిచర్డ్సన్ అందుబాటులోకి వస్తే తమకు తిరుగే ఉండదని తెలిపాడు. మేజర్ లీగ్ క్రికెట్లో వాషింగ్టన్ ఫ్రీడం కోచ్గా ఎంపికైన సందర్భంగా మాట్లాడుతూ పాంటింగ్ ఈ వ్యాఖ్యలు చేశాడు. కాగా, 2022 చివరి రోజుల్లో ఢిల్లీ కెప్టెన్ పంత్ కారు ప్రమాదానికి గురై ఏడాదికి పైగా క్రికెట్కు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. పంత్ ప్రస్తుతం గాయాల నుంచి పూర్తిగా కోలుకుని ప్రాక్టీస్ కూడా చేస్తున్నాడు. అయితే అతను వికెట్కీపింగ్ చేయగలడా లేదా అనే విషయం అనుమానాస్పదంగా ఉంది. మేజర్ యాక్సిడెంట్ కావడంతో పంత్ రెండు కాళ్లలకు తీవ్రగాయాలయ్యాయి. అతని కాళ్లలో రాడ్స్ వేసి సర్జరీ చేశారు. ఈ నేపథ్యంలో పంత్ తిరిగి మైదానంలోకి అడుగుపెట్టడంపై అనుమానాలు నెలకొన్నాయి. ఈ ఏడాది ఐపీఎల్ మార్చి చివరి నుంచి ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. -
ఆ వ్యాఖ్యలు పాంటింగ్ చేసినవేనా???
వన్డే వరల్డ్కప్ 2023 ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో భారత ఓటమి నేపథ్యంలో బీసీసీఐపై ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు సోషల్మీడియాలో ప్రచారం జరుగుతుంది. పాంటింగ్ ఫాక్స్ న్యూస్తో మాట్లాడుతూ బీసీసీఐని క్రికెట్ మాఫియాతో పోల్చాడన్న వార్త ప్రస్తుతం నెట్టింట వైరలవుతుంది. అయితే పాంటింగ్ నిజంగా ఈ వ్యాఖ్యలు చేశాడా లేదా అని ఫ్యాక్ట్ చేయగా.. ఈ ప్రచారంలో ఎంతమాత్రం వాస్తవం లేదని తేలింది. ఈ ప్రచారంపై భారత్లోనే ఉన్న పాంటింగ్ స్పందించాల్సి ఉంది. కాగా, ASG అనే ట్విటర్ అకౌంట్ నుంచి పాంటింగ్ ఫాక్స్ క్రికెట్తో మాట్లాడుతూ బీసీసీఐపై అనుచిత వ్యాఖ్యలు చేశాడని నిన్నటి నుంచి సోషల్మీడియాలో ప్రచారం జరుగుతుంది. Ricky Ponting on Fox Cricket: "This is a win of justice against cricket mafia. Your money and power is still not winning World Cups for you. How embarrassing." Ponting owned India and BCCI 😂 pic.twitter.com/pc5LnseQi7 — ASG (@ahadfoooty) November 19, 2023 సదరు ట్వీట్లో ఏముందంటే.. ఇది క్రికెట్ మాఫియాపై (బీసీసీఐని ఉద్దేశిస్తూ) న్యాయం సాధించిన విజయం.. డబ్బు, పలుకుబడితో ప్రపంచ కప్ గెలవలేరని పాంటింగ్ అన్నట్లు ప్రచారం జరుగుతుంది. పాంటింగ్ నిజంగానే బీసీసీఐని అలా అన్నాడనుకుని పొరబడ్డ కొందరు భారత క్రికెట్ అభిమానులు పాంటింగ్పై దుమ్మెత్తిపోస్తున్నారు. ఐపీఎల్లో పిలిచి పెత్తనం ఇచ్చినందుకు (ఢిల్లీ క్యాపిటల్స్) బీసీసీఐకి సరైన గుణపాఠమే నేర్పాడని కామెంట్లు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, నిన్న జరిగిన వరల్డ్కప్ 2023 ఫైనల్లో ఆస్ట్రేలియా భారత్ను 6 వికెట్ల తేడాతో చిత్తు చేసిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. ఆసీస్ బౌలర్లు మూకుమ్మడిగా రాణించడంతో 240 పరుగుల స్వల్ప స్కోర్కే పరిమితమైంది. అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన ఆసీస్ ఆరంభంలో కాస్త తడబడినప్పటికీ.. ట్రవిస్ హెడ్ (137), లబూషేన్ (58 నాటౌట్) చిరస్మరణీయ ఇన్నింగ్స్ల సహకారంతో విజయతీరాలకు చేరింది. హెడ్-లబూషేన్ జోడీ నాలుగో వికెట్కు 192 పరుగలు భాగస్వామ్యాన్ని నమోదు చేసి ఆసీస్ను గెలిపించారు. భారత బౌలర్లలో బుమ్రా, షమీ, సిరాజ్ తలో వికెట్ పడగొట్టారు. అంతకుముందు బ్యాటింగ్లో రోహిత్ శర్మ (47), విరాట్ కోహ్లి (54), కేఎల్ రాహుల్ (66) ఓ మోస్తరుగా రాణించారు. ఆసీస్ బౌలర్లు స్టార్క్ (3/55), హాజిల్వుడ్ (2/60), కమిన్స్ (2/34), మ్యాక్స్వెల్ (1/35), జంపా (1/44) కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి టీమిండియా పతనాన్ని శాశించారు. -
CWC 2023: ధోని, పాంటింగ్ సరసన చేరిన కమిన్స్
వన్డే వరల్డ్కప్ 2023 ఫైనల్లో ఆస్ట్రేలియా టీమిండియాను ఓడించి ఆరోసారి జగజ్జేతగా నిలిచిన విషయం తెలిసిందే. పాట్ కమిన్స్ కెప్టెన్గా తన తొలి వరల్డ్కప్ సాధించి, ఓ వినూత్న ఘనత సాధించాడు. పెళ్లైన మరుసటి ఏడాదే వన్డే ప్రపంచకప్ గెలిచిన కెప్టెన్గా దిగ్గజాల సరసన చేరాడు. గతంలో రికీ పాంటింగ్ (2003), మహేంద్ర సింగ్ ధోని (2011), ఇయాన్ మోర్గన్లు (2019) పెళ్లైన మరుసటి ఏడాదే ప్రపంచకప్ సాధించిన ఆటగాళ్లుగా అరుదైన గుర్తింపు దక్కించుకున్నారు. తాజాగా కమిన్స్ వీరి సరసన చేరి అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. Who should get married in 2026?🤔 pic.twitter.com/RtVJ8PGUuf — CricTracker (@Cricketracker) November 20, 2023 కాగా, అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన ఫైనల్లో టీమిండియా పోరాడి ఓడింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నామమాత్రపు స్కోర్కే (240) పరిమితమైనప్పటికీ.. బౌలింగ్లో రాణించి చివరి వరకు పోరాడింది. ట్రవిస్ హెడ్ (137) చిరస్మరణీయ శతకంతో ఆసీస్ గెలుపు అంచుల వరకు తీసుకెళ్లాడు. లబూషేన్ (58 నాటౌట్) సహకారంతో భారత్కు గెలుపును దూరం చేశాడు. వీరిద్దరు నాలుగో వికెట్కు 192 పరుగలు భాగస్వామ్యాన్ని నమోదు చేసి ఆసీస్ను గెలిపించారు. భారత బౌలర్లలో బుమ్రా, షమీ, సిరాజ్ తలో వికెట్ పడగొట్టారు. అంతకుముందు బ్యాటింగ్లో రోహిత్ శర్మ (47), విరాట్ కోహ్లి (54), కేఎల్ రాహుల్ (66) ఓ మోస్తరుగా రాణించారు. ఆసీస్ బౌలర్లు స్టార్క్ (3/55), హాజిల్వుడ్ (2/60), కమిన్స్ (2/34), మ్యాక్స్వెల్ (1/35), జంపా (1/44) కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి టీమిండియా పతనాన్ని శాశించారు. -
రికార్డుల రారాజు కోహ్లి అరుదైన ఘనత.. ఇక మిగిలింది ఇద్దరే!
టీమిండియా రన్మెషీన్ విరాట్ కోహ్లి మరో అరుదైన ఘనత సాధించాడు. అంతర్జాతీయ వన్డేల్లో అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్ల జాబితాలో మరో స్థానం మెరుగుపరచుకున్నాడు. తద్వారా ఆస్ట్రేలియా దిగ్గజ కెప్టెన్ రిక్కీ పాంటింగ్ పేరిట ఉన్న రికార్డు బ్రేక్ చేశాడు. వన్డే వరల్డ్కప్-2023 తొలి సెమీ ఫైనల్లో న్యూజిలాండ్తో మ్యాచ్ సందర్భంగా ఈ ఫీట్ నమోదు చేశాడు. టీమిండియా ఇన్నింగ్స్లో 22వ ఓవర్ మూడో బంతికి గ్లెన్ ఫిలిప్స్ బౌలింగ్లో సింగిల్ తీసిన కోహ్లి ఓవరాల్గా 13705 పరుగుల మార్కు అందుకున్నాడు. View this post on Instagram A post shared by ICC (@icc) తద్వారా రిక్కీ పాంటింగ్ను వెనక్కినెట్టాడు. ఇక ముంబైలోని వాంఖడే వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో విరాట్ కోహ్లి అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. రచిన్ రవీంద్ర(26.6) బౌలింగ్లో సింగిల్ తీసిన కింగ్.. వన్డే వరల్డ్కప్ నాకౌట్ చరిత్రలో తన తొలి ఫిఫ్టీ నమోదు చేశాడు. కాగా ఇప్పటి వరకు మూడు వరల్డ్కప్ సెమీఫైనల్స్లో ఆడిన కోహ్లి మొత్తం కలిపి కేవలం 11 పరుగులు మాత్రమే చేయగలిగాడు. 2011 పాక్తో సెమీస్లో 9 పరుగులు... 2015 ఆస్ట్రేలియాతో సెమీస్లో 1 పరుగు... 2019 న్యూజిలాండ్తో సెమీస్లో 1 పరుగు మాత్రమే చేశాడు. తాజాగా ఈ చెత్త రికార్డు చెరిపేసి హాప్ సెంచరీతో మెరిశాడు. అంతర్జాతీయ వన్డేల్లో అత్యధిక పరుగులు సాధించిన టాప్-5 బ్యాటర్లు 18426 - సచిన్ టెండూల్కర్ 14234 - కుమార సంగక్కర 13705* - విరాట్ కోహ్లీ 13704 - రికీ పాంటింగ్ 13430 - సనత్ జయసూర్య View this post on Instagram A post shared by ICC (@icc) -
WC 2023: వార్నర్ 22వ సెంచరీ.. రికార్డులు బద్దలు! సచిన్తో పాటు..
WC 2023- Aus Vs Ned- David Warner Century: నెదర్లాండ్స్తో మ్యాచ్ సందర్భంగా ఆస్ట్రేలియా వెటరన్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. ప్రపంచకప్-2023లో వరుసగా రెండో శతకంతో అదరగొట్టాడు. తద్వారా అంతర్జాతీయ వన్డే కెరీర్లో 22వ సెంచరీ సాధించిన వార్నర్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. తక్కువ ఇన్నింగ్స్లోనే ఈ ఘనత సాధించిన మూడో బ్యాటర్గా చరిత్రకెక్కాడు. ఈ క్రమంలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, సౌతాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్ రికార్డులు బద్దలు కొట్టాడు. సచిన్తో పాటుగా.. పాంటింగ్ రికార్డు బ్రేక్ అంతేకాదు.. నెదర్లాండ్స్పై శతకంతో మరో రెండు అరుదైన ఘనతలు కూడా వార్నర్ తన ఖాతాలో వేసుకున్నాడు. వరల్డ్కప్ చరిత్రలో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో టీమిండియా దిగ్గజం సచిన్ టెండుల్కర్ రికార్డు సమం చేయడంతో పాటు ఆసీస్ లెజెండ్ రిక్కీ పాంటింగ్ను అధిగమించాడు. అదే విధంగా.. వరల్డ్కప్ హిస్టరీలో వరుస శతకాలు బాదిన నాలుగో ఆస్ట్రేలియా బ్యాటర్గానూ చరిత్ర లిఖించాడు. కాగా ఢిల్లీలోని అరుణ్జైట్లీ స్టేడియంలో నెదర్లాండ్స్తో బుధవారం నాటి మ్యాచ్లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో మిచెల్ మార్ష్ను 9 పరుగులకే డచ్ బౌలర్ వాన్ బీక్ ఆరంభంలోనే దెబ్బ కొట్టినప్పటికీ మరో ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. మొత్తంగా 93 బంతుల్లో 11 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 104 పరుగులు సాధించాడు. ఇక వన్డౌన్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ 71, మార్నస్ లబుషేన్ 62 పరుగులతో అదరగొట్టారు. నెదర్లాండ్స్తో మ్యాచ్ సందర్భంగా వార్నర్ రికార్డులు ఇవే తక్కువ ఇన్నింగ్స్లోనే వన్డేల్లో 22 సెంచరీలు చేసిన క్రికెటర్లు ►126 - హషీమ్ ఆమ్లా ►143 - విరాట్ కోహ్లి ►153 - డేవిడ్ వార్నర్* ►186 - ఏబీ డివిలియర్స్ ►188 - రోహిత్ శర్మ వరల్డ్కప్ చరిత్రలో అత్యధిక శతకాలు బాదిన బ్యాటర్లు ►7 - రోహిత్ శర్మ ►6 - సచిన్ టెండూల్కర్ ►6 - డేవిడ్ వార్నర్* ►5 - రికీ పాంటింగ్ ►5 - కుమార సంగక్కర వరల్డ్కప్ టోర్నీలో వరుస సెంచరీలు సాధించిన ఆస్ట్రేలియా బ్యాటర్లు ►2 - మార్క్ వా (1996) ►2 - రికీ పాంటింగ్ (2003-07) ►2 - మాథ్యూ హేడెన్ (2007) ►2 - డేవిడ్ వార్నర్ (2023)*. చదవండి: View this post on Instagram A post shared by ICC (@icc) View this post on Instagram A post shared by ICC (@icc) -
చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ.. వరల్డ్కప్లో తొలి క్రికెటర్గా
వన్డే ప్రపంచకప్-2023లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తన సూపర్ ఫామ్ను కొనసాగిస్తున్నాడు. ఆఫ్గానిస్తాన్పై సెంచరీతో చెలరేగిన రోహిత్.. ఇప్పుడు పాకిస్తాన్పై మరో విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. హిట్మ్యాన్ 63 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్స్లతో 86 పరుగులు చేశాడు. ఇన్నింగ్స్ ఆరంభం నుంచే పాక్ బౌలర్లను రోహిత్ ఊచకోత కోశాడు. తృటిలో మరో సెంచరీ చేసే అవకాశాన్ని రోహిత్ కోల్పోయాడు. ఇక ఈ మ్యాచ్లో మెరుపు ఇన్నింగ్స్ ఆడిన హిట్మ్యాన్ పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. రోహిత్ సాధించిన రికార్డులు ఇవే.. ►వన్డే వరల్డ్కప్ చరిత్రలో విజయవంతమైన రన్ ఛేజింగ్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రోహిత్ నిలిచాడు. రోహిత్ శర్మ ఇప్పటివరకు వరల్డ్కప్లో 9 విజయవంతమైన లక్ష్య ఛేదనలో 586 పరుగులు చేశాడు. కాగా అంతకుముందు ఈ రికార్డు ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్(519) పేరిట ఉండేది. తాజా మ్యాచ్తో పాంటింగ్ రికార్డును రోహిత్ బ్రేక్ చేశాడు. ►అదే విధంగా ఈ మ్యాచ్లో 6 సిక్స్లతో చెలరేగిన హిట్మ్యాన్.. వన్డే క్రికెట్లో 300 సిక్స్ల మైలు రాయిని అందుకున్నాడు. తద్వారా అంతర్జాతీయ వన్డేల్లో 300 సిక్స్ల మార్క్ను అందుకున్న మూడో క్రికెటర్గా రోహిత్ రికార్డులకెక్కాడు. ఈ జాబితాలో పాకిస్తాన్ కెప్టెన్ షాహిద్ అఫ్రిది(351) తొలి స్ధానంలో ఉండగా.. తర్వాతి స్ధానాల్లో క్రిస్ గేల్(331), రోహిత్(303) ఉన్నారు. అదే విధంగా ఈ ఘనత సాధించిన తొలి భారత క్రికెటర్ రోహిత్ శర్మ కావడం విశేషం. ► అంతేకాకుండా అంతర్జాతీయ వన్డేల్లో అత్యంత వేగంగా 300 సిక్స్ల మైలు రాయిని అందుకున్న మొదటి క్రికెటర్గా రోహిత్ చరిత్ర సృష్టించాడు. ►వన్డే వరల్డ్కప్ టోర్నీలో పాకిస్తాన్పై అత్యధిక వ్యక్తిగత స్కోర్ సాధించిన భారత కెప్టెన్గా రోహిత్ శర్మ రికార్డులకెక్కాడు. రోహిత్ ఈ మ్యాచ్లో 86 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. -
ఈ వరల్డ్కప్లోనే కోహ్లి.. సచిన్ సెంచరీల రికార్డు బ్రేక్ చేస్తాడు!
ICC WC 2023- Kohli Eyes On Big Records: టీమిండియా స్టార్ విరాట్ కోహ్లిని ఉద్దేశించి ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రిక్కీ పాంటింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వన్డే వరల్డ్కప్-2023 సందర్భంగా రన్మెషీన్.. భారత దిగ్గజ బ్యాటర్ సచిన్ టెండుల్కర్ సెంచరీల రికార్డును బ్రేక్ చేయగలడని పేర్కొన్నాడు. ఆరంభ మ్యాచ్లో ఆసీస్ మీద కోహ్లి అద్భుతంగా ఆడాడన్న రిక్కీ పాంటింగ్.. సెంచరీ చేజారిన లోటును తదుపరి మ్యాచ్లలో తీర్చుకుంటాడని అభిప్రాయపడ్డాడు. ఈ టోర్నీలో కనీసం రెండు శతకాలైనా బాదుతాడని ధీమా వ్యక్తం చేశాడు. కోహ్లి, రాహుల్ పట్టుదలగా నిలబడి కాగా చెన్నైలోని చెపాక్లో తొలి మ్యాచ్లోనే రోహిత్ సేన కష్టమ్మీద గెలిచిన విషయం తెలిసిందే. టాస్ ఓడి తొలుత ఫీల్డింగ్ చేసిన భారత్ కంగారూ జట్టును 199 పరుగులకే కట్టడి చేసింది. అయితే, స్వల్ప లక్ష్య ఛేదనలో 2 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కోహ్లి(85), కేఎల్ రాహుల్(97- నాటౌట్) పట్టుదలగా నిలబడి అద్భుత ఇన్నింగ్స్తో జట్టుకు విజయం అందించారు. కాగా అంతర్జాతీయ వన్డేల్లో కోహ్లి ఇప్పటి వరకు 47 శతకాలు బాదాడు. మరో మూడు సెంచరీలు చేస్తే మాస్టర్ బ్లాస్టర్ సచిన్ పేరిట ఉన్న రికార్డు(49) బద్దలు కొట్టాలంటే కోహ్లి మరో మూడు సెంచరీలు చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో.. ది ఐసీసీ రివ్యూ పాడ్కాస్ట్లో ఇందుకు సంబంధించిన ప్రస్తావన రాగా.. ఆసీస్ లెజెండ్ రిక్కీ పాంటింగ్ స్పందిస్తూ.. ‘‘ఈసారి కోహ్లి కచ్చితంగా కనీసం రెండు సెంచరీలు చేస్తాడు. కనీసం రెండు శతకాలు ఖాయం ఒకవేళ అంతకు మించి రాణిస్తే కథ వేరేలా ఉంటది. కోహ్లికి ఇదే చివరి వన్డే వరల్డ్కప్ అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఒకవేళ అదే మైండ్సెట్తో గనుక బరిలోకి దిగితే పరుగుల దాహం తీర్చుకోకుండా వెనుదిరగడు. ప్రస్తుతం కోహ్లి మంచి ఫామ్లో ఉన్నాడు. సచిన్ రికార్డును సమం చేస్తాడు లేదంటే బ్రేక్ చేసినా చేస్తాడు. ఈ రెండింటిలో ఏదో ఒకటి చేసి ఈ వరల్డ్కప్ను చిరస్మరణీయం చేసుకుంటాడు’’ అని చెప్పుకొచ్చాడు. చదవండి: వెళ్లి ప్రాక్టీస్ మ్యాచ్లు ఆడుకో పో బాబర్.. పాక్ కెప్టెన్పై ఫ్యాన్స్ ట్రోల్స్ -
విరాట్ కోహ్లి అరుదైన ఘనత.. రికీ పాంటింగ్ రికార్డు బద్దలు
టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి తన అద్భుత ఫామ్ను కొనసాగిస్తున్నాడు. ఆసీస్తో తొలి రెండు వన్డేలకు దూరంగా ఉన్న కోహ్లి.. మూడో వన్డేతో రీ ఎంట్రీ ఇచ్చాడు. ఈ మ్యాచ్లో భారత్ ఓటమి పాలైనప్పటికీ కోహ్లి మాత్రం అద్బుతమైన హాఫ్ సెంచరీతో చెలరేగాడు. 61 బంతులు ఎదుర్కొన్న కోహ్లి 5 ఫోర్లు, 1 సిక్స్తో 56 పరుగులు చేశాడు. హాఫ్ సెంచరీతో మెరిసిన కోహ్లి ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. అంతర్జాతీయ వన్డేల్లో అత్యధిక ఫిప్టి ప్లస్ స్కోర్లు సాధించిన మూడో ఆటగాడిగా విరాట్ నిలిచాడు. ఇప్పటవరకు 269 ఇన్సింగ్స్లు ఆడిన కోహ్లి.. 113 సార్లు ఏభై పైగా స్కోర్లు సాధించాడు. ఇప్పటివరకు ఈ రికార్డు ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్(112) పేరిట ఉండేది. తాజా మ్యాచ్తో పాంటింగ్ రికార్డును కింగ్ కోహ్లి బ్రేక్ చేశాడు. ఈ అరుదైన ఘనత సాధించిన జాబితాలో భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్(145) తొలి స్ధానంలో ఉన్నాడు. ఆ తర్వాత శ్రీలంక లెజెండ్ కుమార్ సంగక్కర(118) ఉన్నాడు. అంతేకాకుండా వన్డేల్లో నాన్ ఓపెనర్గా అత్యధిక ఫిప్టి ప్లస్ స్కోర్లు చేసిన కుమార్ సంగక్కర(112) రికార్డును కోహ్లి సమం చేశాడు. ఇప్పటివరకు నాన్ ఓపెనర్గా వచ్చి కోహ్లి కూడా 112 సార్లు ఏభై పైగా పరుగులు సాధించాడు. చదవండి: World Cup 2023: వరల్డ్కప్కు ముందు ఆస్ట్రేలియాకు బిగ్ షాక్.. -
Virat Kohli: సచిన్ రికార్డు బద్దలు కొట్టిన కోహ్లి.. ప్రపంచంలోనే తొలి బ్యాటర్గా
Asia Cup 2023- India vs Pakistan- Virat Kohli Century: దాయాది పాకిస్తాన్తో మ్యాచ్ అంటే టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి పూనకాలే అన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గతేడాది టీ20 వరల్డ్కప్-2022లో చిరకాల ప్రత్యర్థిపై భారత్కు తన అద్భుత ఇన్నింగ్స్తో చిరస్మరణీయ విజయం అందించిన తీరును ఎవరూ మర్చిపోలేరు. పాకిస్తాన్తో మ్యాచ్లో ఆకాశమే హద్దుగా కోహ్లి ఇక తాజాగా మరోసారి పాక్పై అదిరిపోయే బ్యాటింగ్తో తనకు తానే సాటి అని నిరూపించుకున్నాడు. ఆసియా కప్-2023 సూపర్ -4 మ్యాచ్లో ఆకాశమే హద్దుగా అజేయ సెంచరీతో చెలరేగాడు. కోహ్లి ఇన్నింగ్స్లో ఏకంగా 9 ఫోర్లు, 3 సిక్సర్లు ఉండటం విశేషం. సచిన్ టెండుల్కర్ రికార్డు బద్దలు.. ప్రపంచంలో తొలి బ్యాటర్గా ఈ క్రమంలో అంతర్జాతీయ వన్డేల్లో 47వ సెంచరీ సాధించిన విరాట్ కోహ్లి.. టీమిండియా దిగ్గజం సచిన్ టెండుల్కర్ పేరిట ఉన్న ప్రపంచ రికార్డు బద్దలు కొట్టాడు. అంతర్జాతీయ వన్డే క్రికెట్లో తక్కువ ఇన్నింగ్స్లో 13 వేల పరుగులు పూర్తి చేసుకున్న తొలి బ్యాటర్గా కోహ్లి రికార్డు సృష్టించాడు. ఈ క్రమంలో సచిన్ టెండుల్కర్ను కోహ్లి అధిగమించాడు. చెలరేగిన బ్యాటర్లు.. టీమిండియా భారీ స్కోరు ఇదిలా ఉంటే.. పాకిస్తాన్తో మ్యాచ్లో రిజర్వ్ డే అయిన సోమవారం టీమిండియా బ్యాటర్లు కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లి అజేయ సెంచరీలతో అదరగొట్టారు. దీంతో నిర్ణీత 50 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి భారత జట్టు 356 పరుగుల భారీ స్కోరు సాధించింది. అంతకు ముందు ఆదివారం ఓపెనర్లు రోహిత్ శర్మ (56), శుబ్మన్ గిల్(58) అర్ధ శతకాలు సాధించారు. కాగా కొలంబోలో జరగుతున్న ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన పాకిస్తాన్ తొలుత బౌలింగ్ ఎంచుకున్న విషయం తెలిసిందే. వన్డేల్లో 13 వేల పరుగులు చేసేందుకు.. ఎవరికి ఎన్ని ఇన్నింగ్స్ అవసరమయ్యాయంటే? 1. విరాట్ కోహ్లి- 267 2. సచిన్ టెండుల్కర్- 321 3. రిక్కీ పాంటింగ్- 341 4. కుమార్ సంగక్కర- 363 5. సనత్ జయసూర్య- 416. చదవండి: రోహిత్ పూర్తిగా నిరాశపరిచాడు.. మరీ చెత్తగా..: టీమిండియా మాజీ ఓపెనర్ 💯 NUMBER 4️⃣7️⃣ King @imVkohli, take a bow! 🙌😍 Legendary knock by the modern day great. #Pakistan truly gets the best out of the King! Tune-in to #AsiaCupOnStar, LIVE NOW on Star Sports Network#INDvPAK #Cricket pic.twitter.com/7BfKckU1AO — Star Sports (@StarSportsIndia) September 11, 2023 -
IND VS PAK: పాంటింగ్ సరసన కోహ్లి.. మిగిలింది సంగక్కర, సచిన్ మాత్రమే..!
టీమిండియా స్టార్ బ్యాటర్, రికార్డుల రారాజు విరాట్ కోహ్లి మరో రికార్డు తన ఖాతాలో వేసుకున్నాడు. ఆసియా కప్-2023లో భాగంగా పాకిస్తాన్తో జరుగుతున్న సూపర్-4 మ్యాచ్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్న కింగ్ కోహ్లి.. వన్డేల్లో అత్యధిక సార్లు 50 ప్లస్ స్కోర్లు చేసిన ఆటగాళ్ల జాబితాలో మూడో స్థానానికి ఎగబాకాడు. నేటి మ్యాచ్తో వన్డేల్లో 112వసారి 50 ప్లస్ స్కోర్ (46 సెంచరీలు, 66 అర్ధసెంచరీలు) నమోదు చేసిన కోహ్లి.. ఆసీస్ దిగ్గజం రికీ పాంటింగ్ (112)తో సమంగా మూడో స్థానంలో నిలిచాడు. ఈ జాబితాలో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ (145) అగ్రస్థానంలో ఉండగా.. శ్రీలంక లెజెండ్ కుమార సంగక్కర (118) రెండో ప్లేస్లో ఉన్నాడు. ఈ జాబితాలో ప్రస్తుతం కోహ్లికి ముందు వీరిద్దరు మాత్రమే ఉన్నారు. ఇదిలా ఉంటే, పాక్తో జరుగుతున్న మ్యాచ్లో టీమిండియా ఆటగాళ్లు వరసపెట్టి హాఫ్ సెంచరీలు బాదారు. తొలుత రోహిత్ (56), శుభ్మన్ గిల్ (58).. ఇవాళ రాహుల్ (82 నాటౌట్), కోహ్లి (76 నాటౌట్) అర్ధశతకాలు నమోదు చేశారు. ఫలితంగా టీమిండియా 43 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 280 పరుగులు చేసింది. భారత ఇన్నింగ్స్లో ఇంకా 7 ఓవర్లు మిగిలి ఉండటంతో ఈ మ్యాచ్లో భారీ స్కోర్ నమోదవ్వడం ఖాయంగా తెలుస్తుంది. -
'బంతిని మార్చడం వల్లే ఆసీస్ ఓటమి.. విచారణ చేపట్టండి'
దాదాపు నెలరోజులకు పైగా అలరించిన యాషెస్ సిరీస్ ముగిసింది. తొలి రెండు టెస్టుల్లో గెలిచిన ఆస్ట్రేలియా మరోసారి 'యాషెస్'ను ఎగురేసుకపోతుందని అంతా భావించారు. కానీ మూడో టెస్టును గెలిచిన ఇంగ్లండ్ 2-1కి ఆధిక్యం తగ్గించింది. ఇక నాలుగో టెస్టులో ఇంగ్లండ్కు గెలిచే అవకాశం వచ్చినప్పటికి వరుణుడు అడ్డుపడడంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఇక కీలకమైన ఐదోటెస్టులో ఆస్ట్రేలియా ఇంగ్లండ్ విధించిన 384 పరుగుల భారీ లక్ష్యాన్ని చేధించే క్రమంలో 334 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో ఇంగ్లండ్ 49 పరుగుల తేడాతో విజయం సాధించి సిరీస్ను 2-2తో సమం చేసింది. అయినప్పటికి గత యాషెస్ను గెలిచిన ఆస్ట్రేలియా మరోసారి ట్రోఫీని రిటైన్ చేసుకుంది. నాలుగో రోజు ఆటలో ఇంగ్లండ్ కొత్త బంతి తీసుకుంది. దాదాపు 37 ఓవర్ల పాటు అదే బంతితో బౌలింగ్ చేసింది. బంతి స్వింగ్ కాకపోవడంతో ఇంగ్లండ్ పేసర్లు ఎంత ప్రయత్నించినా వాళ్లను ఔట్ చేయలేకపోయారు. అయితే నాలుగో రోజు మార్క్ వుడ్ వేసిన ఒక బంతి ఖవాజా హెల్మెట్ ను బలంగా తాకింది. దీంతో ఆ బాల్ పాడవడంతో అంపైర్లు మరో బాల్ తీసుకున్నారు. అక్కడి నుంచే కథ మారిపోయింది. ఐదో రోజు ఉదయం ఆస్ట్రేలియా ఓపెనర్లును త్వరగా కోల్పోయింది. కాగా మ్యాచ్ ముగిశాకా ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు రికీ పాంటింగ్ బంతిని మార్చడంపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. బంతిని మార్చడం వల్లే ఆస్ట్రేలియా మ్యాచ్ ఓడిందని పేర్కొన్నాడు. స్కైస్పోర్ట్స్తో మాట్లాడుతూ.. '' బంతి పరిస్థితి అంచనా వేయకుండానే దానిని మార్చాలని నిర్ణయించడం సరైంది కాదు. రెండు బంతులను పోలుస్తే సరైనవి చెప్పే మార్గంలో ప్రపంచంలో మరెక్కడా చూడలేదు. మధ్యలో అలా కొత్త బంతిని తీసుకోవడం సరైంది కాదు. మీరు ఒకవేళ బంతిని మార్చాలని భావిస్తే ఆ తరహాలోనే ఉండేలా చూడాలి. అంపైర్లు పరీక్షిస్తున్న పెట్టలో మరీ పాతబడిన బంతులు ఎక్కువగా లేవు. కొన్ని చూసినప్పటికి వాటిని పక్కన పడేశారు. పాత బంతి స్థానంలో కొత్తదానిని ఎంపిక చేసినట్లుగా ఉంది. ఐదోరోజు పిచ్ ఉదయం బౌలింగ్కు అనుకూలంగా ఉంది. నాలుగోరోజు చివర్లో బంతిని మార్చడం వల్ల ఇంగ్లండ్కు కలిసొచ్చింది. అందుకే ఈ విషయంలో విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తున్నా. బాక్స్లో అలాంటి పాత బంతులు లేవా? లేకపోతే అంపైర్లు ఏదొకటి ఎంచుకుని ఆడించారా? అనేది తేలాలి. అప్పటికి 37 ఓవర్లు మాత్రమే ఆ బంతితో ఆట జరిగింది. కానీ మార్చిన బంతి మాత్రం దానికి తగ్గట్టుగా లేదు'' అంటూ పాంటింగ్ పేర్కొన్నాడు. ఇక ఉస్మాన్ ఖవాజా మాట్లాడుతూ.. "వాళ్లు బంతిని మార్చగానే ఆ కొత్త బాల్ చాలా భిన్నంగా ఉన్నట్లు అర్థమైంది. అప్పుడే అంపైర్ కుమార్ ధర్మసేన దగ్గరికి వెళ్లి ఈ బాల్ ఎంత పాతది? 8 ఓవర్లు వేసినట్లు కనిపిస్తోంది అని అడిగాను. ఆ బంతి నా బ్యాట్ ను చాలా బలంగా తాకింది. యాషెస్ లో ప్రతి టెస్టులో ఓపెనింగ్ చేశాను. కానీ ఏ బంతి కూడా అంత బలంగా నా బ్యాట్ను తాకలేదు. కొత్తగా బ్యాటింగ్ చేయడానికి వచ్చే వాళ్లతో ఈ కొత్త బంతి కాస్త భిన్నంగా ఉందని చెప్పాను. కొన్ని విషయాలు మనం నియంత్రించలేము. ఇది నిరాశ కలిగించింది. ఇంగ్లండ్ ది క్లాస్ బౌలింగ్ అటాక్. వాళ్లకు కాస్త సందు దొరికినా దానిని అద్భుతంగా ఉపయోగించుకుంటారు" అని ఖవాజా అన్నాడు. "There's no way in the world you can look at those two balls there and say in any way that they're comparable" 😤 Ricky Ponting is NOT happy with that 'new' ball 😳 pic.twitter.com/maDFpv8RhM — Sky Sports Cricket (@SkyCricket) July 31, 2023 Won WC by boundary count now winning ashes by changing ball. Is this how a 40 overs old ball change would look alike @ECB_cricket ? pic.twitter.com/aJPWSB2qkZ — ̴D̴̴e̴̴e̴̴p̴̴s̴ (@vkrcholic) July 31, 2023 చదవండి: మేమంతా దేశం కోసమే ఆడతాం.. అంతేగానీ: కపిల్ దేవ్కు జడ్డూ స్ట్రాంగ్ కౌంటర్ -
పాంటింగ్పై ద్రాక్ష పండ్లతో దాడి.. 'వాళ్లను ఊరికే వదలను'
ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు రికీ పాంటింగ్కు ఇంగ్లండ్ అభిమానుల నుంచి చేదు అనుభవం ఎదురైంది. మ్యాచ్ జరిగిన తీరు గురించి పాంటింగ్ మాట్లాడుతున్న సమయంలో స్టాండ్స్లో ఉన్న అభిమానుల్లో ఒక ఆకతాయి పాంటింగ్వైపు ద్రాక్షా పండ్లను విసిరారు. అవి నేరుగా పాంటింగ్ షూ వద్ద పడగా.. కొన్ని అతని మొహాన్ని తాకాయి. దీంతో అభిమానుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన పాంటింగ్.. తనపైకి ద్రాక్ష పండ్లు విసిరిన వ్యక్తిని పట్టుకోవాలని అక్కడి సెక్యూరిటీ అధికారులకు తెలిపాడు. ''నాపై ద్రాక్ష పండ్లతో దాడి చేశారు. ఈ దాడికి పాల్పడిన వ్యక్తిని కనిపెట్టాల్సిందే.. వాళ్లు ఎవరైనా సరే వదిలే ప్రసక్తే లేదు'' అంటూ పేర్కొన్నాడు. ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మధ్య తొలిరోజు ఆట ముగిసిన అనంతరం షో హోస్ట్ ఇయాన్ వార్డ్, రికీ పాంటింగ్లు స్పిన్నర్ టాడ్ మర్ఫీని ఇంటర్య్వూ చేశారు. ఇది ముగిసిన అనంతరం తొలిరోజు ఆట ఎలా జరిగిందన్న విషయాన్ని పాంటింగ్ వివరిస్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇక యాషెస్ సిరీస్లో భాగంగా ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న ఐదో టెస్టు తొలిరోజే ఆసక్తికరంగా సాగింది. ఇంగ్లండ్ను తొలిరోజే ఆలౌట్ చేయడంలో సక్సెస్ అయిన ఆస్ట్రేలియా ఆ తర్వాత బ్యాటింగ్లోనూ నిలకడను ప్రదర్శించింది. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో 283 పరుగులకు ఆలౌట్ అయిన సంగతి తెలిసిందే. ఆసీస్ బౌలర్ల దాటికి బ్రూక్ మినహా పెద్దగా ఎవరు రాణించలేకపోయారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన ఆస్ట్రేలియా తొలిరోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టానికి 61 పరుగులు చేసింది. ఉస్మాన్ ఖవాజా 26, లబుషేన్ 2 పరుగులతో క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం ఆసీస్ మరో 222 పరుగులు వెనుకబడి ఉంది. Hi @piersmorgan & @TheBarmyArmy Is this within the spirit of the game? Pelting grapes at Ponting who’s just a commentator. I know you’ve lost the Ashes and all talk about Sour grapes pic.twitter.com/xkewu1h8v3 — FIFA Womens World Cup Stan account ⚽️ (@MetalcoreMagpie) July 28, 2023 చదవండి: టీ20 వరల్డ్ కప్ 2024కు అర్హత సాధించిన ఐర్లాండ్.. Novak Djokovic: జొకోవిచ్ తండ్రి సంచలన వ్యాఖ్యలు.. ఆందోళనలో అభిమానులు -
Ashes 2023: అదొక్కటే మార్పు.. చివరి టెస్టులో వార్నర్కు చోటు!
The Ashes, 2023- England vs Australia, 5th Test: ఇంగ్లండ్- ఆస్ట్రేలియా మధ్య ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్-2023 తుది అంకానికి చేరుకుంది. ఇరు జట్ల మధ్య ఆఖరిదైన ఐదో టెస్టు జూలై 27న ఆరంభం కానుంది. ఇక ఈ సిరీస్లో ఇప్పటి వరకు ఆస్ట్రేలియా రెండు, ఇంగ్లండ్ ఒక మ్యాచ్ గెలవగా.. నాలుగో టెస్టు వర్షార్పణం అయింది. ఆ ఒక్కటి గెలిచి కచ్చితంగా గెలుస్తామని భావించిన ఆతిథ్య ఇంగ్లండ్కు వరణుడు చేదు అనుభవం మిగల్చడంతో మాంచెస్టర్ డ్రాగా ముగిసిపోయింది. దీంతో.. ట్రోఫీ కోల్పోయినప్పటికీ ఐదో టెస్టు గెలిచి సిరీస్ సమం చేయాలని స్టోక్స్ బృందం ఆశిస్తోంది. అదే సమయంలో 2-1తో ఆధిక్యంలో ఉన్న పర్యాటక ఆసీస్ చివరి మ్యాచ్లోనూ సత్తా చాటి టైటిల్ గెలవాలని పట్టుదలగా ఉంది. ఈ నేపథ్యంలో ఆసీస్ దిగ్గజం రిక్కీ పాంటింగ్ ఐదో టెస్టు తుది జట్టు కూర్పు గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు. యువ స్పిన్నర్ టాడ్ మర్ఫీకి టీమ్లో స్థానంలో కల్పించాలని మేనేజ్మెంట్కు విజ్ఞప్తి చేశాడు. బ్యాటింగ్ ఆర్డర్ను పటిష్టం చేసే క్రమంలో మర్ఫీని నాలుగో టెస్టు నుంచి తప్పించి తప్పుచేశారని అభిప్రాయపడ్డారు. అదొక్కటే మార్పు ‘‘ఆఖరి టెస్టులో ఆస్ట్రేలియా ఏం చేయబోతోందో చూడాలి. నా లెక్క ప్రకారమైతే మర్ఫీని కచ్చితంగా జట్టులోకి తీసుకురావాలి. ఓవల్ మైదానంలో పిచ్ స్పిన్కు అనుకూలిస్తుంది. కాబట్టి అతడిని ఆడిస్తే ప్రయోజనకరంగా ఉంటుంది. మర్ఫీ ఒక్కడు తప్ప జట్టులో ఎలాంటి మార్పులు ఉండబోవనుకుంటున్నా. మాంచెస్టర్లో పర్వాలేదనిపించాడు. తక్కువ స్కోర్లకే పరిమితమైనా మెరుగైన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. తను ఓపెనర్గా రావడం ఖాయమనిపిస్తోంది’’ అని రిక్కీ పాంటింగ్ ఐసీసీ రివ్యూ షోలో తన అభిప్రాయాలు పంచుకున్నాడు. కాగా జూలై 27- 31 వరకు ఇంగ్లండ్- ఆస్ట్రేలియా మధ్య లండన్లోని కెన్నింగ్టన్ ఓవల్ వేదికగా ఐదో టెస్టు నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది. యాషెస్ ఐదో టెస్టుకు పాంటింగ్ ఎంచుకున్న ఆసీస్ తుది జట్టు: డేవిడ్ వార్నర్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లబుషేన్, స్టీవ్ స్మిత్, ట్రవిస్ హెడ్, మిచెల్ మార్ష్, అలెక్స్ క్యారీ, మిచెల్ స్టార్క్, ప్యాట్ కమిన్స్(కెప్టెన్), టాడ్ మర్ఫీ, జోష్ హాజిల్వుడ్. పాంటింగ్ ఇంగ్లండ్ తుదిజట్టు: జాక్ క్రాలీ, బెన్ డకెట్, మొయిన్ అలీ, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్ (కెప్టెన్), జానీ బెయిర్స్టో, క్రిస్ వోక్స్, మార్క్ వుడ్, స్టువర్ట్ బ్రాడ్, జోష్ టంగ్. చదవండి: 69 ఏళ్ల వయసులో ‘సూపర్స్టార్’ పెళ్లి! ఎవరీ బ్యూటీ? ఆమె పిల్లలు కూడా.. -
జైశ్వాల్ ఒక్కడే కాదు.. అతడు కూడా టాలెంటెడ్.. ఛాన్స్ ఇస్తేనే: పాంటింగ్
India tour of West Indies, 2023: ‘‘ఇండియాలో దేశవాళీ క్రికెట్లో అద్భుతంగా ఆడుతున్న ఆటగాళ్లు ఎంతో మంది ఉన్నారు. వాళ్లు ఎప్పుడెప్పుడు అంతర్జాతీయ స్థాయిలో టెస్టు క్రికెట్ ఆడతారా అని ఎదురుచూడటం తప్ప మనమేం చేయలేం. నా దృష్టిలో యశస్వి జైశ్వాల్ మాదిరే రుతురాజ్ గైక్వాడ్ కూడా అత్యంత ప్రతిభావంతుడైన ఆటగాడు. టెస్టుల్లో అతడు గొప్పగా రాణిస్తాడనే నమ్మకం ఉంది. రానున్న రెండేళ్లలో టీమిండియాకు మూడు ఫార్మాట్లలో అతడు కీలక ఆటగాడిగా ఎదగడం ఖాయం. వీరితో పాటు భారత ఓపెనర్ పృథ్వీ షా కూడా అద్భుత నైపుణ్యాలు ఉన్న బ్యాటర్. అదే విధంగా సర్ఫరాజ్ కూడా దేశవాళీ క్రికెట్లో రాణిస్తున్నాడు. అయితే, ప్రస్తుత పరిస్థితుల్లో వీరిద్దరు టీమిండియాలో చోటు దక్కించుకోవాలంటే మరికొన్నాళ్లు వేచి చూడక తప్పదు’’ అని ఆస్ట్రేలియా దిగ్గజం రిక్కీ పాంటింగ్ అన్నాడు. టీమిండియా యువ సంచలనం యశస్వి జైశ్వాల్ను ప్రశంసిస్తూనే రుతురాజ్ గైక్వాడ్కు కూడా అవకాశాలు ఇవ్వాలని సూచించాడు. అరుదైన రికార్డులు సాధించి కాగా డబ్ల్యూటీసీ 2023-25 సైకిల్లో భాగంగా టీమిండియా వెస్టిండీస్తో తమ తొలి సిరీస్ ఆడుతోంది. ఇందులో భాగంగా డొమినికా వేదికగా జరిగిన మొదటి టెస్టు సందర్భంగా ముంబై బ్యాటర్ యశస్వి జైశ్వాల్ అరంగేట్రం చేశాడు. మొట్టమొదటి అంతర్జాతీయ మ్యాచ్లోనే అద్భుత శతకం(171)తో అలరించాడు. టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. అరుదైన రికార్డులెన్నో సాధించి ప్రశంసలు అందుకుంటున్నాడు. కాగా విండీస్తో టెస్టు సిరీస్ నేపథ్యంలో సెలక్టర్ల పిలుపు అందుకున్న మరో ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్కు మాత్రం నిరాశే ఎదురైంది. రుతు బెంచ్కు పరిమితం కెప్టెన్ రోహిత్ శర్మకు జోడీగా యశస్వి ఓపెనర్గా బరిలోకి దిగడంతో రుతు బెంచ్కే పరిమితమవ్వాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో ఐసీసీ షోలో రిక్కీ పాంటింగ్ మాట్లాడుతూ.. యశస్వి ప్రత్యేకమైన నైపుణ్యాలు కలిగిన ఆటగాడని కొనియాడాడు. ఐపీఎల్లో అద్భుతంగా ఆడి రాత్రి రాత్రే సూపర్స్టార్గా మారిపోయాడన్నాడు. రుతురాజ్కు కూడా ఛాన్స్ ఇస్తే అతడు మంచి బ్యాటర్ అని అందరికీ తెలుసని, అయితే ఈ సీజన్లో మాత్రం మునుపెన్నడూ లేని విధంగా తనలోని అన్ని రకాల టాలెంట్స్ ప్రదర్శించాని యశస్విపై ప్రశంసలు కురిపించాడు. అదే సమయంలో రుతురాజ్ గైక్వాడ్ గురించి ప్రస్తావిస్తూ.. ఈ చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనర్కు కూడా వరుస అవకాశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశాడు. ఇద్దరూ అదరగొట్టారు కాగా ఐపీఎల్-2023 సీజన్లో రాజస్తాన్ రాయల్స్ ఓపెనర్ యశస్వి జైశ్వాల్ 14 మ్యాచ్లలో ఓ సెంచరీ(124) సాయంతో 625 పరుగులు చేశాడు. ఇక రుతురాజ్ గైక్వాడ్ 16 మ్యాచ్లు ఆడి 590 పరుగులు సాధించాడు. అత్యధిక స్కోరు 92. ఇదిలా ఉంటే.. తొలి టెస్టులో విజయంతో 1-0తో ముందంజ వేసిన టీమిండియా జూలై 20 నుంచి విండీస్తో రెండో టెస్టులో తలపడనుంది. చదవండి: బీసీసీఐకి థాంక్స్.. కచ్చితంగా స్వర్ణం గెలుస్తాం: టీమిండియా కొత్త కెప్టెన్ రుతురాజ్ -
ఆ విషయంలో బెన్ స్టోక్స్ టీమిండియా దిగ్గజ కెప్టెన్తో సమానం..!
ఆసీస్ మాజీ సారధి రికీ పాంటింగ్.. ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ను టీమిండియా విజయవంతమైన నాయకుడు మహేంద్ర సింగ్ ధోనితో పోల్చాడు. బెన్ స్టోక్స్ యొక్క మ్యాచ్ విన్నింగ్ సామర్థ్యం మిస్టర్ కూల్ కెప్టెన్ సామర్థ్యంతో సరిసమానంగా ఉంటుందని అన్నాడు. ప్రసుత్త కెప్టెన్లతో పోలిస్తే స్టోక్స్ ఒత్తిడిని మెరుగ్గా హ్యాండిల్ చేయగలడని కితాబునిచ్చాడు. స్టోక్స్ చాలాకాలంగా ఫార్మాట్లకతీతంగా బ్యాట్తో పాటు బంతితోనూ సత్తా చాటుతూ మ్యాచ్ విన్నర్గా మారాడని అన్నాడు. ఒత్తిడి సమయాల్లో స్టోక్స్ తనలోని అత్యుత్తమ ప్రతిభను బయటపెట్టి జట్టు విజయాల్లో ప్రధానపాత్ర పోషించాడని పేర్కొన్నాడు. తాజాగా లార్డ్స్లో జరిగిన యాషెస్ సిరీస్ రెండో టెస్ట్లోనూ స్టోక్స్ ఇదే తరహా ప్రదర్శనను కనబర్చి, తన జట్టును ఒంటిచేత్తో గెలిపించినంత పని చేశాడని తెలిపాడు. 2019 లీడ్స్ టెస్ట్లోనూ స్టోక్స్ ఇలాగే ఒంటిపోరాటం చేసి ఇంగ్లండ్కు చిరస్మరణీయ విజయాన్ని అందించాడని గుర్తు చేశాడు. టెస్ట్ల్లో స్టోక్స్ బ్యాట్తో 36, బంతితో 32 కంటే ఎక్కువ సగటు కలిగి ఉన్నాడని తక్కువ అంచనా వేయరాదని, ఈ సంఖ్యలకు మించి ఆటను ప్రభావితం చేయగల సామర్థ్యం అతనికి ఉందని కొనియాడాడు. టెస్ట్ల్లోనే కాక పరిమిత ఓవర్ల ఫార్మాట్లలోనూ స్టోక్స్ అత్యుత్తమ ఆటగాడని, ఇందుకు 2022 టీ20 వరల్డ్కప్ ఫైనల్ మ్యాచే నిదర్శనమని అన్నాడు. ఐసీసీ రివ్యూలో పాంటింగ్ స్టోక్స్పై ప్రశంసల వర్షం కురిపించాడు. కాగా, ఇటీవల ముగిసిన యాషెస్ రెండో టెస్ట్లో ఆసీస్ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ విజయంతో ఆసీస్ 5 మ్యాచ్ల సిరీస్లో 2-0 ఆధిక్యంలోకి వెళ్లింది. -
ఆమె అందానికి క్లీన్బౌల్డ్! షేన్ వార్న్తో బార్లో తొలిసారి చూశా.. సంపాదనలోనూ
దూకుడైన బ్యాటింగ్తో ఆస్ట్రేలియాకు అనేక విజయాలు అందించిన దిగ్గజ కెప్టెన్ రిక్కీ పాంటింగ్. అంతర్జాతీయ క్రికెట్లో అన్ని ఫార్మాట్లలో కలిపి 27483 పరుగులు సాధించిన ఈ రైట్హ్యాండ్ బ్యాటర్ ప్రస్తుతం కోచ్గా, కామెంటేటర్గా క్రికెట్కు సేవలు అందిస్తున్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్లో ఢిల్లీ క్యాపిటల్స్ హెడ్కోచ్గా ఉన్న ఈ ఆసీస్ మాజీ సారథి వ్యక్తిగత జీవితం గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం!! ఆమెను చూడగానే తన అగ్రెసివ్ బ్యాటింగ్తో మైదానంలో ప్రత్యర్థి బౌలర్లకు చెమటలు పట్టించే రిక్కీ పాంటింగ్.. ఓ అమ్మాయిని చూడగానే మాత్రం నిలువెల్లా పులకరింపుతో సిగ్గులమొగ్గ అయ్యాడట. ఆమె పేరు రియాన్నా జెన్నిఫర్ కాంటోర్. ఓసారి రిక్కీ మ్యాచ్ ఆడుతున్న సమయంలో అతడి కుటుంబం కూడా స్టేడియానికి వచ్చింది. ఆట ముగిసిన తర్వాత వాళ్లను కలిసేందుకు వెళ్లిన రిక్కీ పాంటింగ్కు అక్కడ రియాన్నా తారసపడింది. మ్యాచ్ చూసేందుకు వచ్చిన ఆమెను చూడగానే రిక్కీ మనసు పారేసుకున్నాడు. తొలిచూపులోనే ప్రేమలో పడ్డాడు తొలిచూపులోనే ఆమెతో ప్రేమలో పడిపోయాడు. ఇంకేముంది.. ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే ఆమె వివరాలు సేకరించాడు. అప్పటికి కాలేజీ స్టూడెంట్ అయిన రియాన్నా లా చదువుతోంది. దీంతో ఆమె చదువుతున్న యూనివర్సిటీకి వెళ్లి మరీ ఆమెను కలిశాడు. మ్యాచ్ ముగిసిన వెంటనే హుటాహుటిన అక్కడికి రియాన్నాతో మాటలు కలిపాడు. ముచ్చటగా ముగ్గురు పిల్లలు రిక్కీ పట్ల రియాన్నాకు కూడా మంచి అభిప్రాయం ఉండటంతో అతడితో స్నేహానికి అంగీకరించింది. అలా కొన్నాళ్లపాటు డేటింగ్ చేసిన వీరిద్దరు 2002, జూన్ 22న వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఈ జంటకు ప్రస్తుతం ముగ్గురు సంతానం. ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు. నేను అప్పుడే చూశా నిజానికి రిక్కీ.. రియాన్నాను చూడటానికి ముందే ఆమె అతడిని చూసిందట. షేన్ వార్న్తో కలిసి అతడు బార్లో ఉన్నపుడు చూశానని గతంలో ఓ ఇంటర్వ్యూలో రియాన్నా చెప్పింది. 21 ఏళ్లుగా అన్యోన్యంగా సాగుతున్న ఈ జంట.. రెండ్రోజుల క్రితమే పెళ్లిరోజు జరుపుకొంది. సంపాదనలోనూ.. దిక్రిక్లాంజ్ నివేదిక ప్రకారం రిక్కీ పాంటింగ్ నెట్వర్త్ సుమారు 480 కోట్ల రూపాయలు. ఆసీస్ మేటి క్రికెటర్గా, ఎండార్స్మెంట్ల రూపంలో .. ఐపీఎల్ కోచ్గా రిక్కీ ఈ మేరకు ఆస్తులు కూడబెట్టినట్లు సదరు రిపోర్టు వెల్లడించింది. మెల్బోర్న్లో రిక్కీ- రియాన్నా కుటుంబం నివసించే ఇంటి విలువ దాదాపు 20 కోట్లు ఉంటుందని అంచనా. ఇదిలా ఉంటే.. 48 ఏళ్ల రిక్కీ పాంటింగ్ ప్రస్తుతం యాషెస్ సిరీస్ కామెంట్రీతో బిజీగా ఉన్నాడు. చదవండి: లెజండరీ ఓపెనర్ దిల్షాన్.. డీకే మాదిరే! ఉపుల్ తరంగతో భార్య ‘బంధం’.. అతడినే పెళ్లాడి! ధోని నమ్మకం నిలబెట్టిన ప్రపంచకప్ విజేత, 2 సార్లు ఐపీఎల్ ‘విన్నర్’.. ఇప్పుడు పోలీస్ -
'మెక్కల్లమ్ కంటే ముందు నన్ను సంప్రదించారు.. తిరస్కరించా'
ఇంగ్లండ్, ఆస్ట్రేలియా జట్లు ప్రస్తుతం ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్తో బిజీగా ఉన్నాయి. ఇరుజట్ల మధ్య ఎడ్జ్బాస్టన్ వేదికగా ముగిసిన తొలి టెస్టులో ఆస్ట్రేలియా రెండు వికెట్ల తేడాతో సంచలన విజయం సాధించింది. బజ్బాల్ ఆటతీరుతో దూకుడు మీదున్న ఇంగ్లండ్కు.. ఆసీస్ ఓటమి రుచి చూపించి బ్రేకులు వేసింది. అయితే 2021లో జరిగిన యాషెస్ సిరీస్లో ఇంగ్లండ్ 0-4 తేడాతో ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఈ దెబ్బతో అప్పటి టెస్టు కెప్టెన్ జో రూట్ నాయకత్వ బాధ్యతల నుంచి తప్పుకోగా.. బ్యాటింగ్ మెంటార్గా ఉన్న గ్రహం థోర్ఫ్, మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్న అష్లే గైల్స్ తమ పదవులను కోల్పోయారు. ఆ తర్వాత రాబ్ కీ అనే వ్యక్తి ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు(ఈసీబీ)కి కొత్త డైరెక్టర్గా ఎంపికయ్యాడు. కాగా రాబ్ కీ వచ్చీ రావడంతోనే తన మార్క్ను చూపించే ప్రయత్నం చేశాడు. ఇంగ్లండ్ టెస్టు క్రికెట్ కోచ్ పదవికి మెక్కల్లమ్ కంటే ముందు ఆస్ట్రేలియా దిగ్గజం రికీ పాంటింగ్ను సంప్రదించినట్లు తెలిసింది. ఈ విషయాన్ని స్వయంగా పాంటింగ్ తాజాగా రివీల్ చేశాడు. గురిల్లా క్రికెట్పాడ్ కాస్ట్కు ఇంటర్య్వూ ఇచ్చిన పాంటింగ్ కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. ''మెక్కల్లమ్ కంటే ముందు ఇంగ్లండ్ టెస్టు క్రికెట్ కోచ్ పదవికి నన్ను ముందు సంప్రదించారు. ఈ విషయంలో రాబ్ కీ కీలకంగా వ్యవహరించాడు. అతనే స్వయంగా నా దగ్గరకు వచ్చి ఇంగ్లండ్ టెస్టు కోచ్గా ఆఫర్ ఇచ్చాడు. కానీ అప్పుడున్న పరిస్థితుల్లో దానిని తిరస్కరించా. ఎందుకంటే అంతర్జాతీయ క్రికెట్ కోచ్గా ఫుల్టైమ్ పనిచేయడానికి అప్పటికి నేను మానసికంగా సిద్దం కాలేదు. పిల్లలు చిన్నవాళ్లు కావడం.. అంతర్జాతీయ కోచ్గా ఉంటే జట్టుతో పాటు వివిధ దేశాలకు పర్యటించాల్సి ఉంటుంది. కానీ ఆ సమయంలో నా ఫ్యామిలీకి దూరంగా ఉండాలని అనుకోలేదు. అందుకే కోచ్ పదవి ఆఫర్ను తిరస్కరించాల్సి వచ్చింది.'' అంటూ చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ బ్రెండన్ మెక్కల్లమ్ను ఇంగ్లండ్ టెస్టు క్రికెట్ కోచ్ పదవి వరించింది. రూట్ స్థానంలో బెన్ స్టోక్స్ టెస్టు కెప్టెన్గా ఎంపికయ్యాడు. వీరిద్దరు కలిసిన తర్వాత ఇంగ్లండ్ టెస్టు క్రికెట్ పూర్తిగా మారిపోయింది. బజ్బాల్ క్రికెట్ను పరిచయం చేసిన ఈ ద్వయం ఇంగ్లండ్కు టెస్టుల్లో వరుస విజయాలు కట్టబెట్టారు. ఈ ఇద్దరు బాధ్యతలు తీసుకున్నాకా ఇంగ్లండ్ టెస్టుల్లో 13 మ్యాచ్ల్లో 11 విజయాలు సాధించడంతో పాటు పాకిస్తాన్, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ లాంటి జట్లపై సిరీస్ విజయాలు సాధించింది. చదవండి: హెచ్సీఏకు మంత్రి శ్రీనివాస్ గౌడ్ వార్నింగ్ చీఫ్ సెలెక్టర్ పదవికి ఆహ్వానాలు.. ముందు వరుసలో సెహ్వాగ్! -
IPL 2024: పాంటింగ్కు గుడ్బై.. ఢిల్లీ హెడ్ కోచ్గా గంగూలీ!
ఐపీఎల్-2024 సీజన్కు ముందు ఢిల్లీ క్యాపిటల్స్ తమ హెడ్కోచ్ రికీ పాంటింగ్కు గుడ్బై చెప్పే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అతడు స్ధానాన్ని టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీతో భర్తీ చేయాలని ఢిల్లీ క్యాపిటల్స్ మెనెజ్మెంట్ భావిస్తున్నట్లు సమాచారం. ఇక 2018 నుంచి ఢిల్లీ ప్రధాన కోచ్గా ఉన్న పాంటింగ్.. జట్టుకు ట్రోఫీని అందించడంలో విఫలమయ్యాడు. అదే విధంగా ఈ ఏడాది సీజన్లో అయితే ఢిల్లీ మరి చెత్త ప్రదర్శన కనబరిచింది. 4 మ్యాచ్ల్లో కేవలం ఐదింట మాత్రమే విజయం సాధించింది. ఈ నేపధ్యంలోనే పాంటింగ్ను సాగనంపాలని ఢిల్లీ నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక గంగూలీ విషయానికి వస్తే.. దాదా ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్ డైరెక్టర్గా ఉన్నాడు. గంగూలీ 2019 ఐపీఎల్ ఎడిషన్లో మెంటార్గా ఢిల్లీ జట్టుతో తన ప్రయాణాన్ని ప్రారంభించాడు. 2019, 2020 సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేఆప్స్ చేరడంలో గంగూలీ కీలక పాత్ర పోషించాడు. అప్పుడు ఢిల్లీ కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్ ఉన్నాడు. అయితే ఈ వార్తలపై ఢిల్లీ ఇప్పటివరకు ఎటువంటి ప్రకటన చేయలేదు. చదవండి: WTC Final: కొంచెం ఆలోచించండి.. కోచ్గా ద్రవిడ్ జీరో: పాకిస్తాన్ మాజీ క్రికెటర్ -
కోహ్లీని లైట్ తీసుకుంటే ఆసీస్ అవుట్..!
-
వాళ్ళిద్దరిని అవుట్ చేస్తేనే ఆస్ట్రేలియాకి ఛాన్స్ , కీలక వ్యాఖ్యలు చేసిన రిక్కీపాంటింగ్..!
-
WTC Final: భరత్ వద్దు.. అతడే బెటర్ ఆప్షన్..!
భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య ఓవల్ మైదానం వేదికగా జూన్ 7 నుంచి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2021-23 ఫైనల్ మ్యాచ్ ప్రారంభంకానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇరు జట్లు ఎలా ఉండాలో విశ్లేషకులు ఇప్పటి నుంచే అంచనా వేయడం మొదలుపెట్టారు. తాజాగా ఆసీస్ బ్యాటింగ్ దిగ్గజం రికీ పాంటింగ్.. టీమిండియా ఎలా ఉండాలో తన అభిప్రాయాన్ని బయటపెట్టాడు. మెజారిటీ విశ్లేషకులు టీమిండియా ఎలా ఉండాలని అనుకున్నారో, పాంటింగ్ సైతం అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. అయితే వికెట్ కీపర్ విషయంలో మాత్రం పాంటింగ్ కాస్త భిన్నంగా స్పందించాడు. కేఎస్ భరత్తో పోలిస్తే ఇషాన్ కిషన్ బెటర్ ఆప్షన్ అవుతాడని అభిప్రాయపడ్డాడు. రోహిత్, గిల్ ఓపెనింగ్ స్థానాల్లో ఎలాగూ ఫిక్స్ అయ్యారు కాబట్టి, ఆరో స్థానంలో ఇషాన్ బెటర్ ఛాయిస్ అవుతాడని అన్నాడు. ఓవల్ పిచ్ బ్యాటింగ్తో పాటు స్పిన్నర్లకు అనుకూలంగా ఉండనున్న నేపథ్యంలో యాజమాన్యం సైతం ఇషాన్ పేరునే పరిశీలిస్తే ఉపయోగకరంగా ఉంటుందని తెలిపాడు. వేగంగా ఆడటం ఇషాన్కు అదనంగా కలిసొచ్చే అంశమని అన్నాడు. భారత తుది జట్టు(అంచనా): రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్, చతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లి, అజింక్యా రహానే, ఇషాన్ కిషన్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, ఉమేశ్ యాదవ్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్ చదవండి: ఫామ్లో ఉన్నాడు.. రికార్డులు బద్దలు కొట్టడం కష్టమేమి కాదు
Pagination
ఓటర్ మిత్రమా.. జాగ్రత్త! ఆ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు!
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
నియోజకవర్గానికో హబ్..
No Headline
No Headline
పాలమూరు సమగ్రాభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు
పూర్తిస్థాయిలో వలసల నివారణకు కృషి..
అహంకారానికి,ఆత్మగౌరవానికి మధ్య పోరు..
No Headline
పార్లమెంట్లో ప్రజల గొంతుకనవుతా..
కేంద్ర నిధులతోనే అనేక అభివృద్ధి పనులు..
ఓటింగ్ శాతం పెరుగుతుందా ?..తగ్గుతుందా ?
తప్పక చదవండి
- AP: నేడు 13 జిల్లాలకు భారీ వర్ష సూచన
- నాడు చెప్పుతో కొట్టి.. నేడు ‘కాపు’ కాస్తానంటూ కాకమ్మ కబుర్లు!
- Weekly Horoscope: ఈ రాశి వారికి జీవితాశయం నెరవేరి ఉత్సాహంగా గడుపుతారు
- అమ్మా... నా పేరు గుర్తుందా?
- నాడు చదువులు ఉత్త మిథ్య.. నేడు జీవితకాల భరోసా!
- చట్టం మీ బాబు చుట్టమా రామోజీ?
- ఇక మాటల్లేవ్!
- ‘ప్లేఆఫ్స్’కు కోల్కతా
- వందో ఆస్కార్కి నాలుగు వేల కోట్లు!
- ఓటర్ మిత్రమా.. జాగ్రత్త! ఆ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు!
Advertisement