royal challengers bengaluru
-
అందుకే ఓడిపోయాం.. అదే అతిపెద్ద గుణపాఠం: పాటిదార్
ఐపీఎల్-2025 (IPL 2025)లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) మూడో ఓటమిని నమోదు చేసింది. పంజాబ్ కింగ్స్తో శుక్రవారం నాటి మ్యాచ్లో పాటిదార్ సేన ఐదు వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. వర్షం వల్ల ఈ మ్యాచ్కు అంతరాయం కలుగగా.. పద్నాలుగు ఓవర్లకు కుదించారు.ఈ క్రమంలో సొంత మైదానం చిన్నస్వామి స్టేడియంలో టాస్ ఓడిన ఆర్సీబీ.. తొలుత బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 14 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 95 పరుగులు చేసింది. పంజాబ్ బౌలర్లలో అర్ష్దీప్ సింగ్, మార్కో యాన్సెన్, యజువేంద్ర చహల్, హర్ప్రీత్ బ్రార్ రెండేసి వికెట్లు కూల్చగా.. జేవియర్ బార్ట్లెట్ ఒక వికెట్ సాధించాడు.ఇక పంజాబ్ ఈ లక్ష్యాన్ని ఐదు వికెట్లు కోల్పోయి.. 12.1 ఓవర్లలోనే ఛేదించింది. ఆర్సీబీ బౌలర్లలో జోష్ హాజిల్వుడ్ మూడు వికెట్లు దక్కించుకోగా.. భువనేశ్వర్ కుమార్ రెండు వికెట్లు కూల్చాడు.అతిపెద్ద గుణపాఠంఈ నేపథ్యంలో ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ (Rajat Patidar).. బ్యాటింగ్ వైఫల్యం వల్లే తాము ఓడిపోయామని పేర్కొన్నాడు. వరుస విరామాల్లో వికెట్లు కోల్పోవడమే తమ ఓటమికి ప్రధాన కారణమని పేర్కొన్నాడు. ‘‘మా బ్యాటింగ్ విభాగం ఇంకాస్త మెరుగ్గా ఆడాల్సింది.ఇలాంటి మ్యాచ్లలో భాగస్వామ్యాలు నమోదు చేయడం అత్యంత ముఖ్యం. కానీ మేము వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయాం. ఈ మ్యాచ్లో మాకు ఇదే అతిపెద్ద గుణపాఠం.పరిస్థితులకు తగ్గట్లుగా మేము మా బ్యాటింగ్ శైలిని మార్చుకోవాల్సి ఉంది. అందుకే ఈరోజు పడిక్కల్ను ఆడించలేదు. ఇక వికెట్ కూడా అంత చెత్తగా ఏమీ లేదు. చాలా కాలంగా కవర్లు కప్పి ఉంచిన కారణంగా.. ప్రత్యర్థి జట్టు బౌలర్లకు మేలు చేకూరింది.క్రెడిట్ వారికే.. మా బౌలర్లు కూడా సూపర్ఈ విజయంలో క్రెడిట్ పంజాబ్ బౌలర్లకే దక్కుతుంది. వికెట్ ఎలా ఉన్నా.. మేము మెరుగ్గా బ్యాటింగ్ చేస్తే పరిస్థితి వేరేలా ఉండేది. మా బౌలింగ్ విభాగం అద్భుతంగా రాణిస్తోంది. అదే మాకు అతిపెద్ద సానుకూలాంశం. బ్యాటర్లు కూడా గెలవాలనే పట్టుదలతోనే ఆడారు. కానీ కొన్నిసార్లు నిరాశ తప్పదు. బ్యాటింగ్ విభాగంలో ఉన్న లోటుపాట్లను సరిచేసుకుని సరికొత్త ఉత్సాహంతో ముందుకు సాగుతాం’’ అని రజత్ పాటిదార్ చెప్పుకొచ్చాడు.కాగా సొంత మైదానం చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీకి ఇది 46వ ఓటమి. ఐపీఎల్ చరిత్రలో హోం గ్రౌండ్లో అత్యధిక మ్యాచ్లలో పరాజయం పాలైన జట్టుగా ఆర్సీబీ చెత్త రికార్డు ఖాతాలో వేసుకుంది.ఐపీఎల్-2025: ఆర్సీబీ వర్సెస్ పంజాబ్ కింగ్స్👉టాస్: పంజాబ్ కింగ్స్.. మొదట బౌలింగ్👉ఆర్సీబీ స్కోరు: 95/9 (14)👉పంజాబ్ కింగ్స్ స్కోరు: 98/5 (12.1)👉ఫలితం: ఆర్సీబీపై ఐదు వికెట్ల తేడాతో పంజాబ్ విజయం👉ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: టిమ్ డేవిడ్ (ఆర్సీబీ- 26 బంతుల్లో 50 నాటౌట్). .@PunjabKingsIPL's red is shining bright in Bengaluru ❤️They continue their winning streak with an all-round show over #RCB 👏Scorecard ▶ https://t.co/7fIn60rqKZ #TATAIPL | #RCBvPBKS pic.twitter.com/NOASW2XRMD— IndianPremierLeague (@IPL) April 18, 2025చదవండి: సచిన్ రికార్డు బద్దలు కొట్టిన పాటిదార్.. ఐపీఎల్ చరిత్రలో భారత తొలి బ్యాటర్గా -
సచిన్ రికార్డు బద్దలు కొట్టిన పాటిదార్.. ఐపీఎల్లో భారత తొలి బ్యాటర్గా..
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టు కెప్టెన్ రజత్ పాటిదార్ (Rajat Patidar) టీమిండియా దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండుల్కర్ రికార్డు బద్దలు కొట్టాడు. ఐపీఎల్లో అతి తక్కువ ఇన్నింగ్స్లో అత్యధిక స్ట్రైక్రేటుతో వెయ్యి పరుగుల మైలురాయిని అందుకున్న భారత తొలి క్రికెటర్గా నిలిచాడు. వర్షం వల్ల 14 ఓవర్ల ఆటఐపీఎల్-2025 (IPL 2025)లో భాగంగా పంజాబ్ కింగ్స్తో మ్యాచ్ సందర్భంగా పాటిదార్ ఈ ఘనత సాధించాడు. బెంగళూరు వేదికగా శుక్రవారం జరిగిన ఈ మ్యాచ్కు వర్షం అంతరాయం కలిగించింది. ఈ నేపథ్యంలో పద్నాలుగు ఓవర్లకు మ్యాచ్ను కుదించగా.. టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్.. ఆర్సీబీని తొలుత బ్యాటింగ్కు ఆహ్వానించింది. ఓపెనర్లు ఫిల్ సాల్ట్ (4), విరాట్ కోహ్లి (1) పూర్తిగా విఫలం కాగా.. రజత్ పాటిదార్ (18 బంతుల్లో 23) ఫర్వాలేదనిపించాడు.95 పరుగులుఆఖర్లో టిమ్ డేవిడ్ మెరుపు ఇన్నింగ్స్ (26 బంతుల్లో 50 నాటౌట్) ఆడటంతో ఆర్సీబీ తొమ్మిది వికెట్ల నష్టానికి 95 పరుగులు చేసింది. పంజాబ్ బౌలర్లలో అర్ష్దీప్ సింగ్, మార్కో యాన్సెన్, యజువేంద్ర చహల్, హర్ప్రీత్బ్రార్ రెండేసి వికెట్లు కూల్చగా.. జేవియర్ బార్ట్లెట్ ఒక వికెట్ దక్కించుకున్నాడు.పంజాబ్ ఫటాఫట్ఇక పంజాబ్ 12.1 ఓవర్లలో ఐదు వికెట్లు నష్టపోయి ఆర్సీబీ విధించిన లక్ష్యాన్ని ఛేదించింది. నేహాల్ వధేరా (19 బంతుల్లో 33) ధనాధన్ ఇన్నింగ్స్తో పంజాబ్ను విజయతీరాలకు చేర్చాడు.ఇదిలా ఉంటే.. పంజాబ్తో మ్యాచ్లో 23 పరుగులు చేసిన ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్.. ఐపీఎల్లో వెయ్యి పరుగులు పూర్తి చేసుకున్నాడు. కేవలం 30 ఇన్నింగ్స్లోనే పాటిదార్ ఈ మైలురాయిని చేరుకున్నాడు.సచిన్ రికార్డు బ్రేక్ఈ క్రమంలో సచిన్ టెండుల్కర్, రుతురాజ్ గైక్వాడ్ పేరిట ఉన్న రికార్డును పాటిదార్ బద్దలు కొట్టాడు. వీరిద్దరు 31 ఇన్నింగ్స్లో వెయ్యి పరుగుల మార్కును అందుకున్నారు. ఇక.. గుజరాత్ టైటాన్స్ ఓపెనర్ సాయి సుదర్శన్ కేవలం 25 ఇన్నింగ్స్లోనే ఈ మైలురాయిని చేరుకుని.. ఐపీఎల్లో భారత్ తరఫున అత్యంత వేగంగా వెయ్యి పరుగులు సాధించిన బ్యాటర్గా కొనసాగుతున్నాడు.ఐపీఎల్లో భారత తొలి బ్యాటర్గా రికార్డుఅయితే, రజత్ ఇన్నింగ్స్ పరంగా సుదర్శన్ కంటే వెనుకబడి ఉన్నా... సగటు, స్ట్రైక్రేటు పరంగా మెరుగ్గా ఉన్నాడు. తద్వారా ఐపీఎల్లో 35కు పైగా సగటుతో 150కి పైగా స్ట్రైక్రేటుతో 1000 పరుగులు చేసిన భారత బ్యాటర్గా పాటిదార్ చరిత్రకెక్కాడు. టీ20 ఫార్మాట్లో అతడి నిలకడైన ఆటకు ఇది నిదర్శనం.ఐపీఎల్-2025: బెంగళూరు వర్సెస్ పంజాబ్👉వర్షం వల్ల మ్యాచ్ 14 ఓవర్లకు కుదింపు👉వేదిక: ఎం.చిన్నస్వామి స్టేడియం, బెంగళూరు👉టాస్: పంజాబ్.. తొలుత బౌలింగ్👉బెంగళూరు స్కోరు: 95/9 (14)👉పంజాబ్ స్కోరు: 98/5 (12.1)👉ఫలితం: ఐదు వికెట్ల తేడాతో బెంగళూరుపై పంజాబ్ గెలుపు👉ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: టిమ్ డేవిడ్ (26 బంతుల్లో 50 నాటౌట్). .@PunjabKingsIPL's red is shining bright in Bengaluru ❤️They continue their winning streak with an all-round show over #RCB 👏Scorecard ▶ https://t.co/7fIn60rqKZ #TATAIPL | #RCBvPBKS pic.twitter.com/NOASW2XRMD— IndianPremierLeague (@IPL) April 18, 2025చదవండి: RCB VS PBKS: చరిత్ర సృష్టించిన అర్షదీప్ సింగ్ -
టీ20 అంటేనే పరుగుల వరద.. కానీ: పిచ్ క్యూరేటర్పై డీకే అసంతృప్తి
ఐపీఎల్-2025 (IPL 2025)లో ఫ్రాంఛైజీలు వర్సెస్ క్యూరేటర్లు అన్నట్లుగా వివాదాలు పుట్టుకొస్తున్నాయి. తొలుత కోల్కతా నైట్ రైడర్స్ఈడెన్ (KKR) గార్డెన్స్ పిచ్ క్యూరేటర్ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేయగా.. ఇప్పుడు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) వంతు వచ్చింది. టీ20 క్రికెట్ అంటేనే పరుగుల వరదచిన్నస్వామి స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో ఓటమి తర్వాత ఆర్సీబీ బ్యాటింగ్ కోచ్ దినేశ్ కార్తిక్.. క్యూరేటర్ తీరును విమర్శించాడు. ‘‘టీ20 క్రికెట్ అంటేనే పరుగుల వరద. లీగ్ ప్రచారకర్తలు, అభిమానులకు ఇదే ముఖ్యం. అభిమానులంతా బ్యాటర్లు బౌండరీలు బాదుతుంటే చూడాలని కోరుకుంటారు. ఇక్కడ తొలి రెండు మ్యాచ్ల కోసం మేము బ్యాటింగ్కు ఎక్కువగా అనుకూలించే పిచ్లు రూపొందించమని విజ్ఞప్తి చేశాం. కానీ.. చిన్నస్వామి స్టేడియంలో బ్యాటింగ్ చేయడమే కష్టంగా మారిపోయింది. ఈ పిచ్ బ్యాటర్లకు అంతగా అనుకూలించడం లేదు. ఈ వికెట్పై పరుగులు రాబట్టడం సవాలుతో కూడుకున్న పని. మేము ఇక్కడ ఆడిన రెండు మ్యాచ్లలోనూ ఇదే పరిస్థితి.స్ట్రైక్ రొటేట్ చేయడం కూడా కష్టమైపోయింది. ఇక ఇలాంటి చోట భారీ షాట్ ఆడాలంటే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. అయితే, టీ20 క్రికెట్లో షాట్లు బాదితేనే ఆడేవాళ్లకు, చూసేవాళ్లకు మజా. తప్పక చర్చిస్తాంపిచ్ తప్పకుండా మేము క్యూరేటర్తో చర్చిస్తాం. ఆయనపై మాకు నమ్మకం ఉంది. మాకోసం అత్యుత్తమ పిచ్ తయారు చేస్తారని ఆశిస్తున్నాం’’ అని దినేశ్ కార్తిక్ పేర్కొన్నాడు.పాటిదార్ నాయకత్వంలో రచ్చ గెలుస్తూ.. ఇంట ఇలాకాగా ఐపీఎల్-2025లో ఆర్సీబీకి కొత్త కెప్టెన్ వచ్చాడు. రజత్ పాటిదార్ నాయకత్వంలో ఆర్సీబీ ఇప్పటి వరకు ఐదు మ్యాచ్లు పూర్తి చేసుకుని మూడు గెలిచింది. అయితే, ఈ మూడూ ఇతర వేదికలపై గెలిచినవే. సొంత మైదానం చిన్నస్వామి స్టేడియంలో ఆడిన రెండు మ్యాచ్లలోనూ బెంగళూరు జట్టుకు చేదు అనుభవమే మిగిలింది.తొలుత గుజరాత్ టైటాన్స్ చేతిలో.. తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్తో మ్యాచ్లో సొంతగడ్డపై పాటిదార్ సేన ఓటమిపాలైంది. గురువారం నాటి మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ... నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది.రహానే డైరెక్ట్గానేఇక ఢిల్లీ 17.5 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి.. లక్ష్యాన్ని ఛేదించింది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, కర్ణాటక బ్యాటర్ కేఎల్ రాహుల్ (53 బంతుల్లో 93 నాటౌట్) ఒంటి చేత్తో ఢిల్లీ జట్టును గెలిపించాడు. ఈ నేపథ్యంలో తీవ్ర నిరాశకు గురైన ఆర్సీబీ మేనేజ్మెంట్ ఈ మేరకు పిచ్ క్యూరేటర్ను తప్పుబట్టడం గమనార్హం.ఇక కేకేఆర్ పరిస్థితి కూడా ఇలాగే ఉంది. హోం గ్రౌండ్లో కాస్త అడ్వాంటేజీ ఉంటుందనుకుంటే.. అక్కడే డిఫెండింగ్ చాంపియన్కు వరుస పరాజయాలు ఎదురవుతున్నాయి. స్పిన్కు కాస్త అనుకూలించే పిచ్ తయారు చేయమని అడిగితే..క్యూరేటర్ తమ మాట వినడం లేదంటూ కోల్కతా కెప్టెన్ అజింక్య రహానే అసంతృప్తి వ్యక్తం చేయడం గమనార్హం.చదవండి: RCB Vs DC: ఇదేం కెప్టెన్సీ?.. పాటిదార్పై కోహ్లి ఫైర్?!.. డీకేతో చర్చ.. అతడు కెప్టెన్తో మాట్లాడాల్సింది! Unbeaten. Unstoppable. Unmatched 🫡History for #DC as they win the first 4⃣ games on the trot for the maiden time ever in #TATAIPL history 💙Scorecard ▶ https://t.co/h5Vb7spAOE#TATAIPL | #RCBvDC | @DelhiCapitals pic.twitter.com/wj9VIrgzVK— IndianPremierLeague (@IPL) April 10, 2025 -
ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు.. మా ఓటమికి ప్రధాన కారణం అదే: పాటిదార్
రచ్చ గెలుస్తున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) ఇంట మాత్రం మరోసారి పరాభవం ఎదుర్కొంది. సొంత మైదానం చిన్నస్వామి స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో ఆరు వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. తద్వారా ఈ సీజన్లో హోం గ్రౌండ్లో రెండో ఓటమిని నమోదు చేసింది. ఈ నేపథ్యంలో ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ (Rajat Patidar) విచారం వ్యక్తం చేశాడు.ఓవర్ కాన్ఫిడెన్స్ కాదుఢిల్లీ చేతిలో ఓటమి అనంతరం స్పందిస్తూ.. ‘‘వికెట్ ఎప్పటికప్పుడు మారిపోయినట్లుగా అనిపించింది. నిజానికి ఇది బ్యాటింగ్ చేసేందుకు అనుకూలమైన పిచ్. కానీ మేమే సరిగ్గా బ్యాటింగ్ చేయలేకపోయాం.మా జట్టులోని ప్రతి బ్యాటర్ కసితోనే ఆడతారు. వాళ్లది ఆత్మవిశ్వాసమే తప్ప.. ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు. అయితే, ఈరోజు 80/1 స్కోరు నుంచి 90/4కు పడిపోవటమన్నది ఎంత మాత్రం ఆమోదయోగ్యనీయం కాదు.మా బ్యాటింగ్ లైనప్ పటిష్టమైనది. కానీ మేము ఈరోజు పరిస్థితులను సరిగ్గా అంచనా వేయలేకపోయాం. అయితే, ఆఖర్లో టిమ్ డేవిడ్ మెరుపు ఇన్నింగ్స్ ఆడటం మాకు కాస్త ఊరట కలిగించే అంశం.మా ఓటమికి కారణం అదేఇక ఢిల్లీ ఇన్నింగ్స్ పవర్ ప్లేలో మా బౌలర్లు ఆడిన విధానం అద్భుతం. మాకు అది ఎంతో ప్రత్యేకమైనది. సొంత మైదానంలో కాకుండా వేరే మైదానాల్లోనే గెలుస్తామన్న అభిప్రాయాలతో మాకు పనిలేదు.వేదిక ఏదైనా విజయమే లక్ష్యంగా మేము బరిలోకి దిగుతాం’’ అని రజత్ పాటిదార్ చెప్పుకొచ్చాడు. తమ ఓటమికి ప్రధాన కారణం బ్యాటర్ల వైఫల్యమేనని పేర్కొన్నాడు. కాగా ఐపీఎల్-2025లో భాగంగా ఆర్సీబీ గురువారం ఢిల్లీతో తలపడింది.బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఢిల్లీ.. ఆర్సీబీని తొలుత బ్యాటింగ్కు ఆహ్వానించింది. ఈ క్రమంలో ఓపెనర్లు ఫిల్ సాల్ట్ (17 బంతుల్లో 37), విరాట్ కోహ్లి (14 బంతుల్లో 22) రాణించగా.. వన్డౌన్ బ్యాటర్ దేవదత్ పడిక్కల్ (1) విఫలమయ్యాడు.రజత్ పాటిదార్ (23 బంతుల్లో 25) ఫర్వాలేదనిపించగా.. లియామ్ లివింగ్స్టోన్ (4), జితేశ శర్మ (3) నిరాశపరిచారు. ఆఖర్లో కృనాల్ పాండ్యా (18 బంతుల్లో 18) నిలదొక్కుకునే ప్రయత్నం చేసి విఫలం కాగా.. టిమ్ డేవిడ్ (20 బంతుల్లో 37 నాటౌట్) వేగంగా ఆడి స్కోరు 163 పరుగుల మార్కుకు తీసుకువచ్చాడు.పవర్ ప్లేలో మూడు వికెట్లు.. కానీఇక లక్ష్య ఛేదనలో ఆరంభంలోనే ఢిల్లీకి వరుస షాకులు తగిలాయి. ఓపెనర్లలో ఫాఫ్ డుప్లెసిస్ (2)ను యశ్ దయాళ్, జేక్ ఫ్రేజర్ మెగర్క్(7)ను భువనేశ్వర్ కుమార్ వచ్చీ రాగానే పెవిలియన్కు పంపారు. వన్డౌన్ బ్యాటర్ అభిషేక్ పోరెల్ (7)ను కూడా భువీ వెనక్కి పంపి మంచి బ్రేక్ ఇచ్చాడు.రాహుల్ రఫ్పాడించాడుఅయితే, కేఎల్ రాహుల్ విజృంభణతో అంతా తలకిందులైంది. నెమ్మదిగా మొదలుపెట్టిన ఈ లోకల్ బ్యాటర్.. మధ్య ఓవర్లలో దూకుడు పెంచాడు. మొత్తంగా 53 బంతుల్లో ఏడు ఫోర్లు, ఆరు సిక్స్ల సాయంతో 93 పరుగులతో అజేయంగా నిలిచి ఢిల్లీని గెలుపుతీరాలకు చేర్చాడు. అతడికి తోడుగా ట్రిస్టన్ స్టబ్స్ (23 బంతుల్లో 38 నాటౌట్) రాణించాడు. ఈ క్రమంలో 17.5 ఓవర్లలో 169 పరుగులు సాధించిన ఢిల్లీ.. ఆర్సీబీపై ఆరు వికెట్ల తేడాతో జయభేరి మోగించింది. అక్షర్ సేనకు ఈ సీజన్లో వరుసగా ఇది నాలుగో విజయం కాగా.. ఆర్సీబీ ఐదు మ్యాచ్లలో మూడు గెలవగలిగింది.ఐపీఎల్-2025: బెంగళూరు వర్సెస్ ఢిల్లీ👉టాస్: ఢిల్లీ.. మొదట బౌలింగ్👉ఆర్సీబీ స్కోరు: 163/7 (20)👉ఢిల్లీ స్కోరు: 169/4 (17.5)👉ఫలితం: బెంగళూరుపై ఆరు వికెట్ల తేడాతో ఢిల్లీ గెలుపు.చదవండి: RCB Vs DC: ఇదేం కెప్టెన్సీ?.. పాటిదార్పై కోహ్లి ఫైర్?!.. డీకేతో చర్చ.. అతడు కెప్టెన్తో మాట్లాడాల్సింది! POV: It's his home ground 😎🏡#TATAIPL | #RCBvDC | @klrahul | @DelhiCapitals pic.twitter.com/kV7utADWjU— IndianPremierLeague (@IPL) April 10, 2025 -
ఇది నా హోం గ్రౌండ్: కేఎల్ రాహుల్ సెలబ్రేషన్స్ వైరల్.. పాపం కోహ్లి!
ఐపీఎల్-2025 (IPL 2025)లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర కొనసాగుతోంది. సీజన్ ఆరంభం నుంచి ఓటమన్నదే లేకుండా ముందుకు సాగుతున్న అక్షర్ సేన.. తాజాగా మరో విజయం సాధించింది. పటిష్ట రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టును వారి సొంత మైదానం చిన్నస్వామి స్టేడియంలోనే ఓడించింది.ఇందుకు ప్రధాన కారణం ఢిల్లీ క్యాపిటల్స్ వికెట్ కీపర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ (KL Rahul). ఆర్సీబీ విధించిన 164 పరుగుల లక్ష్య ఛేదనలో భాగంగా ఆరంభంలోనే అక్షర్ సేన వరుస వికెట్లు కోల్పోయింది. ఓపెనర్లు ఫాఫ్ డుప్లెసిస్ (2), జేక్ ఫ్రేజర్-మెగర్క్ (7) పూర్తిగా విఫలం కాగా.. వన్డౌన్లో వచ్చిన అభిషేక్ పోరెల్ (7) కూడా చేతులెత్తేశాడు. దీంతో పవర్ ప్లేలోనే కీలక వికెట్లు కోల్పోయి ఢిల్లీ విలవిల్లాడింది.ఆఖరి పంచ్ మనదైతే ఆ కిక్కే వేరప్పాఇలాంటి తరుణంలో నేనున్నాంటూ కేఎల్ రాహుల్ అభయమిచ్చాడు. ఆరంభంలో కాస్త నెమ్మదిగా ఆడినా.. మధ్య ఓవర్లలో మాత్రం దూకుడు పెంచి ఆర్సీబీ బౌలింగ్ను చితక్కొట్టాడు. ట్రిస్టన్ స్టబ్స్ (23 బంతుల్లో 38 నాటౌట్)తో కలిసి జట్టును విజయం దిశగా నడిపించాడు.రాహుల్ మొత్తంగా 53 బంతులు ఎదుర్కొని ఏడు ఫోర్లు, ఆరు సిక్సర్ల సాయంతో 93 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఆఖరి పంచ్ మనదైతే ఆ కిక్కే వేరప్పా అన్నట్లుగా సిక్సర్తో ఢిల్లీ విజయాన్ని ఖరారు చేశాడు. దీంతో ఢిల్లీ శిబిరంలో సంబరాలు అంబరాన్నంటగా.. రాహుల్ తన విన్నింగ్ ఇన్నింగ్స్ సెలబ్రేషన్స్ చేసుకున్న తీరు వైరల్గా మారింది."𝙏𝙝𝙞𝙨 𝙞𝙨 𝙢𝙮 𝙜𝙧𝙤𝙪𝙣𝙙" 🔥pic.twitter.com/gKtmfoFvlN— Delhi Capitals (@DelhiCapitals) April 10, 2025 ఏయ్ బిడ్డా.. ఇది నా అడ్డా!బ్యాట్తో గ్రౌండ్లో గీత గీసిన రాహుల్.. ఆ తర్వాత జెండా పాతుతున్నట్లుగా బ్యాట్తో మైదానంపై కొట్టి.. ‘‘ఇది నా హోం గ్రౌండ్’’ అంటూ సైగ చేశాడు. నిజానికి రాహుల్ వికెట్ తీసేందుకు ఆర్సీబీ ప్రయత్నించి విఫలమైన వేళ.. ఇతర బ్యాటర్లను పెవిలియన్కు పంపిన సమయంలో మాత్రం కోహ్లి వైల్డ్గా సెలబ్రేట్ చేసుకున్నాడు.Kohli is seen celebrating the wicket, glancing at KL Rahul.After the win Rahul stared at Kohli and said "This Is My Home Ground" 🔥Look at Kohli's Reaction 😭😭 pic.twitter.com/uJmO74Jck5— Radha (@Radha4565) April 11, 2025 పాపం కోహ్లి!ఇందుకు కౌంటర్గానే రాహుల్ తన క్లాసీ ఇన్నింగ్స్ తర్వాత కోహ్లికి, ఆర్సీబీ అభిమానులను ఉద్దేశించి ఈ రకంగా రియాక్షన్ ఇచ్చాడని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇక ఆర్సీబీపై ఢిల్లీ విజయంలో కీలక పాత్ర పోషించిన కేఎల్ రాహుల్కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు లభించింది.ఈ సందర్భంగా.. ‘‘ఇది నా సొంత మైదానం.. నా ఇల్లు.. నాకంటే ఈ పిచ్ గురించి ఇంకెవరికి బాగా తెలుసు?.. నేను ఎప్పుడు ఇక్కడ ఆడినా.. బ్యాటింగ్ను పూర్తిగా ఆస్వాదిస్తాను’’ అని రాహుల్ పేర్కొన్నాడు. కాగా బెంగళూరుకు చెందిన రాహుల్ ఆరంభంలో ఆర్సీబీకి ఆడాడు. ఆ తర్వాత పంజాబ్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్లకు కెప్టెన్గా వ్యవహరించిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్ను.. ఐపీఎల్-2025 మెగా వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ రూ. 14 కోట్లకు కొనుగోలు చేసింది.ఇదిలా ఉంటే.. ఐపీఎల్-2025లో ఢిల్లీకి ఇది వరుసగా నాలుగో విజయం కాగా.. ఆర్సీబీ ఇప్పటికి ఐదింట మూడు గెలిచింది. ఈ సీజన్లో ఢిల్లీకి అక్షర్ పటేల్.. బెంగళూరు జట్టుకు రజత్ పాటిదార్ నాయకత్వం వహిస్తున్నారు.ఐపీఎల్-2025: ఆర్సీబీ వర్సెస్ ఢిల్లీ👉టాస్: ఢిల్లీ.. తొలుత బౌలింగ్👉ఆర్సీబీ స్కోరు: 163/7 (20)👉ఢిల్లీ స్కోరు: 169/4 (17.5)👉ఫలితం: ఆరు వికెట్ల తేడాతో ఆర్సీబీపై ఢిల్లీ విజయం👉ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: కేఎల్ రాహుల్ (53 బంతుల్లో ఏడు ఫోర్లు, ఆరు సిక్సర్ల సాయంతో 93 రన్స్ నాటౌట్).చదవండి: RCB Vs DC: ఇదేం కెప్టెన్సీ?.. పాటిదార్పై కోహ్లి ఫైర్?!.. డీకేతో చర్చ.. అతడు కెప్టెన్తో మాట్లాడాల్సింది!POV: It's his home ground 😎🏡#TATAIPL | #RCBvDC | @klrahul | @DelhiCapitals pic.twitter.com/kV7utADWjU— IndianPremierLeague (@IPL) April 10, 2025 -
RCB Vs DC: ఇదేం కెప్టెన్సీ?.. పాటిదార్పై కోహ్లి ఫైర్?!.. అతడు కెప్టెన్తో మాట్లాడాల్సింది!
ఐపీఎల్-2025 (IPL 2025)లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB)కు మరో పరాజయం ఎదురైంది. ఢిల్లీ క్యాపిటల్స్తో గురువారం జరిగిన మ్యాచ్లో పాటిదార్ సేన ఆరు వికెట్ల తేడాతో ఓటమిని మూటగట్టుకుంది. సమిష్టి వైఫల్యంతో సొంత మైదానం చిన్నస్వామి స్టేడియంలో చేదు అనుభవం ఎదుర్కొంది.వారంతా విఫలంటాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీకి శుభారంభమే లభించింది. పవర్ ప్లేలో మెరుగైన స్కోరు సాధించినా ఆ తర్వాత వరుస విరామాల్లో వికెట్లు కోల్పోవడం దెబ్బకొట్టింది. ఓపెనర్లు ఫిల్ సాల్ట్ (17 బంతుల్లో 37), విరాట్ కోహ్లి (14 బంతుల్లో 22), కెప్టెన్ రజత్ పాటిదార్ (25) ఫర్వాలేదనిపించగా.. దేవదత్ పడిక్కల్ (1), లియామ్ లివింగ్స్టోన్ (4), జితేశ్ శర్మ (3) పూర్తిగా విఫలమయ్యారు.ఆఖర్లో టిమ్ డేవిడ్ (20 బంతుల్లో 37 నాటౌట్) కాస్త వేగంగా ఆడటంతో.. ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. ఇక వరుస విజయాలతో జోరు మీదున్న ఢిల్లీ లక్ష్య ఛేదనను 17.5 ఓవర్లలో కేవలం నాలుగు వికెట్లు కోల్పోయి పూర్తి చేసింది.చెత్త బౌలింగ్సొంతమైదానంలో కేఎల్ రాహుల్ క్లాసీ ఇన్నింగ్స్ (53 బంతుల్లో 93 నాటౌట్)తో ఢిల్లీకి విజయం అందించాడు. మిగతా వాళ్లలో ట్రిస్టన్ స్టబ్స్ (23 బంతుల్లో 38 నాటౌట్) రాణించాడు. ఇక ఆర్సీబీ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ (2/26), సూయశ్ శర్మ (1/25) ఫర్వాలేదనిపించగా.. జోష్ హాజిల్వుడ్, యశ్ దయాళ్ ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. హాజిల్వుడ్ మూడు ఓవర్లలో 40 పరుగులు ఇవ్వగా.. దయాళ్ 3.5 ఓవర్ల బౌలింగ్లో 45 రన్స్ ఇచ్చేశాడు.ఇదేం కెప్టెన్సీ?.. విరాట్ కోహ్లి ఆగ్రహంఈ నేపథ్యంలో ఢిల్లీ టాపార్డర్ ఫాఫ్ డుప్లెసిస్ (2), జేక్ ఫ్రేజర్ మెగర్క్(7), అభిషేక్ పోరెల్ (7)లను త్వరత్వరగా పెవిలియన్కు పంపినా.. ఆర్సీబీకి ప్రయోజనం లేకుండా పోయింది. మధ్య, ఆఖరి ఓవర్లలో ఆర్సీబీ బౌలర్ల వైఫల్యం వల్ల మ్యాచ్ చేజారింది. ఈ క్రమంలో ఆర్సీబీ సూపర్స్టార్ విరాట్ కోహ్లి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు.ఢిల్లీ ఇన్నింగ్స్లో 15వ ఓవర్లో జోష్ హాజిల్వుడ్ ఏకంగా 22 (4,4,2,2,4,6) పరుగులు ఇచ్చిన వేళ.. బౌండరీ లైన్ వద్ద కోహ్లి.. తమ బ్యాటింగ్ కోచ్ దినేశ్ కార్తిక్ వద్ద అసంతృప్తి వెళ్లగక్కాడు. తమ ఆటగాళ్ల వైపు చేయి చూపిస్తూ.. బౌలర్లు, ఫీల్డింగ్ సెట్ చేసిన విధానం సరిగా లేదన్నట్లుగా అసహనం వ్యక్తం చేశాడు.అతడు కెప్టెన్తో మాట్లాడాల్సింది!ఇందుకు సంబంధించిన దృశ్యాలు వైరల్ కాగా.. కెప్టెన్ రజత్ పాటిదార్ నిర్ణయంపై అసంతృప్తితోనే కోహ్లి ఇలా చేశాడనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇక ఈ ఘటన సమయంలో హిందీ కామెంట్రీ చేస్తున్న భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా.. ‘‘దినేశ్ కార్తిక్తో అతడు తీవ్రంగా చర్చిస్తున్నాడు.నిజానికి కెప్టెన్ రజత్ పాటిదార్తో మాట్లాడాల్సింది. రజత్ ఈ జట్టుకు కెప్టెన్. కాబట్టి విరాట్ కోహ్లి దినేశ్ కార్తిక్తో మాట్లాడేకంటే కూడా.. రజత్తో మాట్లాడితేనే బాగుండేది’’ అని అభిప్రాయపడ్డాడు. మరోవైపు.. వీరేందర్ సెహ్వాగ్.. ‘‘జోష్ హాజిల్వుడ్ 22 పరుగులు ఇచ్చినందుకే విరాట్ కోహ్లి కోచ్తో ఇలా చర్చించి ఉంటాడు’’ అని పేర్కొన్నాడు. Unbeaten. Unstoppable. Unmatched 🫡History for #DC as they win the first 4⃣ games on the trot for the maiden time ever in #TATAIPL history 💙Scorecard ▶ https://t.co/h5Vb7spAOE#TATAIPL | #RCBvDC | @DelhiCapitals pic.twitter.com/wj9VIrgzVK— IndianPremierLeague (@IPL) April 10, 2025చదవండి: IPL 2025: పృథ్వీ షాకు బంపరాఫర్.. ధోని టీమ్లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ!? Discussions with an experienced man amidst a crisis!Virat x DK COME ON RCB ❤️ ❤️ ❤️ #RCBvsGT #IPL2025 pic.twitter.com/oUgnB3fqOk— Dinesh Karthik Fan Club (@DKFANFOREVER) April 10, 2025🚨 VIRAT KOHLI UNLEASHES THE BEAST MODE! 🦁🏏 RCB vs DC just got SPICY! 🌶️💥 Kohli to Patidar: "CAPTAIN WHO?! अभी दिखाता हूं तेरेको, coach ko Jake chugali karta hu😂!"🕺 Dinesh Karthik: "मैं तो बस अपनी रोटी का जुगाड़ कर रहा हूं’—don’t drag me into this fire!"⚡ Is Rajat… pic.twitter.com/OgdGc8I07i— CRICKET 18 LOVER (@Cricket_18_love) April 11, 2025 -
‘అహం’ పనికిరాదు.. నా అసలు ఐపీఎల్ ప్రయాణం అప్పుడే మొదలు: కోహ్లి
జట్టు ప్రయోజనాలే తన మొదటి ప్రాధాన్యం అని టీమిండియా దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లి (Virat Kohli) స్పష్టం చేశాడు. మ్యాచ్లో పరిస్థితులను బట్టే బ్యాటింగ్ చేయాల్సి ఉంటుందని.. ఈ క్రమంలో వ్యక్తిగత ఇష్టానికి చోటు ఉండదని స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి వ్యాఖ్యానించాడు. తాను ఎప్పుడైనా జట్టు గురించే ఆలోచిస్తూ ఆడానని పేర్కొన్నాడు.‘అహం’ పనికిరాదు..‘జట్టు తరఫున ఆడుతున్నప్పుడు ‘నేను’ అనే అహం బ్యాటింగ్లో ఎప్పుడూ కనిపించకూడదు. మరో ఎండ్లో ఉన్న బ్యాటర్పై ఆధిపత్యం ప్రదర్శించే ప్రయత్నం సరైన బ్యాటింగ్ అనిపించుకోదు. నేను మ్యాచ్లో పరిస్థితిని అర్థం చేసుకునేందుకే ప్రయత్నిస్తా. దానిని బట్టే ఆడేందుకు ప్రయత్నిస్తా. ఇది నేను గర్వించే విషయం కూడా.నేను మంచి లయ అందుకొని జోరు మీదుంటే నాపై బాధ్యత వేసుకుంటా. మరో బ్యాటర్ బాగా ఆడుతుంటే అతడూ అదే బాధ్యత తీసుకుంటాడు’ అని విరాట్ విశ్లేషించాడు. కాగా ఐపీఎల్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) తరఫున 256 మ్యాచ్లు ఆడిన కోహ్లి మొత్తం 8168 పరుగులు చేశాడు. అయితే తొలి మూడు సీజన్లలో ఎక్కువగా మిడిలార్డర్లో బరిలోకి దిగిన అతడు చెప్పుకోదగ్గ ప్రభావం చూపలేకపోయాడు. 38 ఇన్నింగ్స్లు ఆడినా అతడి ఖాతాలో రెండు హాఫ్ సెంచరీలే ఉన్నాయి.నా అసలు ఐపీఎల్ ప్రయాణం అప్పుడే మొదలుఅయితే 2011 నుంచి కోహ్లి ఆట మలుపు తిరిగింది. ఈ విషయం గురించి స్పందిస్తూ.. ‘ఆర్సీబీ తరఫున మొదటి మూడేళ్లు నాకు టాపార్డర్లో ఎక్కువగా బ్యాటింగ్ చేసే అవకాశాలు రాలేదు. కాబట్టి ఐపీఎల్లో గొప్పగా ఆడలేదు. అయితే 2010లో కాస్త నిలకడ వచ్చింది. 2011 నుంచి రెగ్యులర్గా మూడో స్థానంలోకి వచ్చేశాను. సరిగ్గా చెప్పాలంటే నా అసలు ఐపీఎల్ ప్రయాణం అప్పుడే మొదలైంది’ అని కోహ్లి గుర్తు చేసుకున్నాడు. ఐపీఎల్లో సుదీర్ఘ కాలంగా ఆడటం వల్లే టీ20 ఫార్మాట్లో తన ఆటను మెరుగుపర్చుకోవడం సాధ్యమైందని కోహ్లి చెప్పుకొచ్చాడు. కాగా ఐపీఎల్ ఆరంభ సీజన్ (2008) నుంచి విరాట్ కోహ్లి ఆర్సీబీతోనే కొనసాగుతున్నాడు. ఆటగాడిగా.. కెప్టెన్గా అభిమానులను అలరించిన కోహ్లి.. జట్టుకు ఇంత వరకు ట్రోఫీని మాత్రం అందించలేకపోయాడు. ఇక ఐపీఎల్-2025 సందర్భంగా బెంగళూరు ఫ్రాంఛైజీ రజత్ పాటిదార్ను తమ సారథిగా ప్రకటించింది. ఈ సీజన్లో ఇప్పటి వరకు ఆర్సీబీ నాలుగు మ్యాచ్లు ఆడి మూడు గెలిచింది. ఇటు బ్యాటర్గా.. అటు కెప్టెన్గా పాటిదార్ రాణిస్తుండటం విశేషం. మరోవైపు.. కోహ్లి కూడా బ్యాటింగ్లో అదరగొడుతున్నాడు. ఇప్పటికి నాలుగు ఇన్నింగ్స్లో కలిపి 164 పరుగులు సాధించాడు. ఇందులో రెండు అర్ధ శతకాలు ఉన్నాయి.చదవండి: IPL 2025: సాయి సుదర్శన్ విధ్వంసం.. రాజస్థాన్పై గుజరాత్ ఘన విజయం -
నేనేంటో చూపిస్తా!.. అతడిలో ఆ కసి కనిపించింది: సెహ్వాగ్
గుజరాత్ టైటాన్స్ పేసర్ మహ్మద్ సిరాజ్ (Mohammed Siraj)పై భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ ప్రశంసలు కురిపించాడు. జాతీయ జట్టుకు దూరమైన కసి అతడి ఆటలో కనిపిస్తోందని.. త్వరలోనే అతడు టీమిండియాలో పునరాగమనం చేస్తాడని పేర్కొన్నాడు. కాగా హైదరాబాదీ పేసర్ చివరగా ఆస్ట్రేలియా పర్యటనలో భారత్ తరఫున ఆడాడు.ఆ తర్వాత స్వదేశంలో ఇంగ్లండ్తో టీ20, వన్డే సిరీస్లకు సెలక్టర్లు అతడిని ఎంపిక చేయలేదు. అనంతరం.. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 (ICC Champions Trophy)జట్టులోనూ చోటివ్వలేదు. ఈ క్రమంలో తీవ్ర నిరాశకు గురైన సిరాజ్.. జట్టు ప్రయోజనాల దృష్ట్యానే సెలక్టర్లు, కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) తనను పక్కనపెట్టి ఉంటారని పేర్కొన్నాడు.ఆర్సీబీ వదిలేసిందిఅయితే, జాతీయ జట్టుకు దూరం కావడం వల్ల దొరికిన విశ్రాంతిని పొడగించకుండా.. ఫిట్నెస్పై దృష్టి సారిస్తానని సిరాజ్ చెప్పుకొచ్చాడు. ఇదిలా ఉంటే.. ఐపీఎల్-2025కి ముందు ఈ పేస్ బౌలర్కు ఎదురుదెబ్బ తగిలిన విషయం తెలిసిందే. ఏడేళ్ల పాటు తమతో ప్రయాణం చేసిన సిరాజ్ను రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వదిలేసింది.టైటాన్స్ అక్కున చేర్చుకుందిఈ క్రమంలో గుజరాత్ టైటాన్స్ రూ. 12.25 కోట్లకు సిరాజ్ను కొనుగోలు చేసింది. ఇక ఐపీఎల్-2025లో తమ ఆరంభ మ్యాచ్లలో అంతంత మాత్రంగా రాణించిన సిరాజ్.. తన పాత జట్టు ఆర్సీబీపై మాత్రం అదరగొట్టాడు. ఆర్సీబీ సొంత మైదానం చిన్నస్వామి స్టేడియంలో బుధవారం జరిగిన మ్యాచ్లో కీలక వికెట్లు తీసి.. ప్రత్యర్థి జట్టు పతనాన్ని శాసించాడు.నాలుగు ఓవర్ల కోటాలో కేవలం 19 పరుగులే ఇచ్చి మూడు వికెట్లు కూల్చాడు. ఫిల్ సాల్ట్, దేవదత్ పడిక్కల్, లియామ్ లివింగ్ స్టోన్ల వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. తద్వారా.. గుజరాత్ను గెలిపించడంలో కీలక పాత్ర పోషించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు సిరాజ్. నేనేంటో చూపిస్తా!.. అతడిలో ఆ కసి కనిపించిందిఈ నేపథ్యంలో భారత మాజీ వీరేంద్ర సెహ్వాగ్ మాట్లాడుతూ.. ‘‘చాంపియన్స్ ట్రోఫీ జట్టుకు అతడిని ఎంపిక చేయలేదు. అతడిలో ఆ కసి కనిపించింది. యువ ఫాస్ట్ బౌలర్ నుంచి మనం ఇంతకంటే గొప్పగా ఏమి ఆశిస్తాం. అతడు తిరిగి గాడిలో పడ్డాడు.అంతేకాదు.. ‘మీరు నన్ను తీసుకోలేదు కదా!.. నేనేంటో ఇప్పుడు చూపిస్తాను’ అన్నట్లుగా చెలరేగిపోయాడు. ఇదే తరహాలో సిరాజ్ ముందుకు దూసుకవెళితే కచ్చితంగా భారత జట్టులో త్వరలోనే పునరాగమనం చేస్తాడు.కొత్త బంతితో చిన్నస్వామి స్టేడియంలో అద్భుతంగా రాణించాడు. తన మొదటి మూడు ఓవర్లలో కేవలం 12 లేదా 13 పరుగులు మాత్రమే ఇవ్వడం ఇందుకు నిదర్శనం. అయితే, నాలుగో ఓవర్లో మాత్రం కాస్త తడబడ్డాడు. లేదంటే.. ఇంకో వికెట్ అతడి ఖాతాలో చేరేదే. కొత్త బంతిని స్వింగ్ చేస్తూ అనుకున్న ఫలితాన్ని రాబట్టడం సానుకూలాంశం’’ అని హిందుస్తాన్ టైమ్స్తో పేర్కొన్నాడు.కాగా చాంపియన్స్ ట్రోఫీ జట్టు ప్రకటన సమయంలో సిరాజ్ గురించి ప్రశ్న ఎదురుకాగా.. ‘‘అతడు కొత్త బంతితో మెరుగ్గా రాణించలేడు. అందుకే పక్కనపెట్టాం’’ అని కెప్టెన్ రోహిత్ శర్మ పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సెహ్వాగ్ సిరాజ్ను ఉద్దేశించి పైవిధంగా స్పందించాడు.ఐపీఎల్-2025: ఆర్సీబీ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ఆర్సీబీ స్కోరు: 169/8 (20)గుజరాత్ టైటాన్స్ స్కోరు: 170/2 (17.5)ఫలితం: ఆర్సీబీపై ఎనిమిది వికెట్ల తేడాతో గుజరాత్ విజయంచదవండి: అందుకే ఓడిపోయాం: కోహ్లి, సాల్ట్లపై పాటిదార్ విమర్శలు! -
అందుకే ఓడిపోయాం: కోహ్లి, సాల్ట్లపై పాటిదార్ విమర్శలు!
టాపార్డర్ వైఫల్యం తమ విజయావకాశాలను దెబ్బతీసిందని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) కెప్టెన్ రజత్ పాటిదార్ (Rajat Patidar) అన్నాడు. పవర్ ప్లేలో వరుసగా వికెట్లు కోల్పోవడం వల్ల భారీ స్కోరు సాధించలేకపోయామని పేర్కొన్నాడు. అయితే, ఒక్క మ్యాచ్తో తమ బ్యాటింగ్ లైనప్ను తక్కువ చేసి చూడలేమని.. ఈ ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుంటామని తెలిపాడు.కాగా ఐపీఎల్-2025 (IPL 2025) సందర్భంగా పాటిదార్ ఆర్సీబీ కెప్టెన్గా పగ్గాలు అందుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో సీజన్ ఆరంభ మ్యాచ్లో అతడి సారథ్యంలో ఆర్సీబీ.. డిఫెండింగ్ చాంపియన్ కోల్కతా నైట్ రైడర్స్ను చిత్తు చేసింది. అనంతరం చెన్నై సూపర్ కింగ్స్పై చెపాక్లో చరిత్రాత్మక విజయం సాధించింది. పదిహేడేళ్ల విరామం తర్వాత చెన్నైని తమ సొంతగడ్డపైనే ఓడించింది.అయితే, తాజాగా తమ సొంత మైదానంలో మాత్రం ఆర్సీబీ ఇదే ఫలితాన్ని పునరావృతం చేయలేకపోయింది. గుజరాత్ టైటాన్స్తో బుధవారం చిన్నస్వామి స్టేడియంలో జరిగిన మ్యాచ్లో బెంగళూరు ఎనిమిది వికెట్ల తేడాతో చిత్తుగా ఓడింది. ఫలితంగా ఆర్సీబీ సారథిగా పాటిదార్ ఖాతాలో తొలి పరాజయం నమోదైంది.పవర్ ప్లేలో మూడు వికెట్లు కోల్పోయాంఈ నేపథ్యంలో ఓటమి అనంతరం పాటిదార్ మాట్లాడుతూ.. ‘‘పవర్ ప్లే తర్వాత మా దృక్పథం మారిపోయింది. 200 కాకపోయినా.. కనీసం 190 పరుగుల మార్కు అందుకోవాలని భావించాం. అయితే, ఆరంభంలోనే వికెట్లు కోల్పోవడం తీవ్ర ప్రభావం చూపింది.దూకుడుగా ఆడాలన్న మా ఆలోచన సరైందే. కానీ పరిస్థితులు భిన్నంగా మారిపోయాయి. పవర్ ప్లేలో మేము వరుసగా మూడు వికెట్లు కోల్పోకుండా ఉండాల్సింది. ఒక్కటి కాదు.. ఏకంగా మూడు వికెట్లు కోల్పోవడం తీవ్ర నిరాశకు గురిచేసింది.ఆ ముగ్గురు అద్భుతంఆ తర్వాత పిచ్ బ్యాటింగ్కు మరింతగా అనుకూలించింది. అయినప్పటికీ మా బౌలర్లు మ్యాచ్ను 18వ ఓవర్ వరకు తీసుకురావడం అభినందనీయం. తక్కువ స్కోరును కాపాడేందుకు వారు అద్భుతంగా పోరాడారు. కానీ ఫలితం మాత్రం దక్కలేదు.అయితే, ఈ మ్యాచ్లో జితేశ్ శర్మ, లియామ్ లివింగ్ స్టోన్, టిమ్ డేవిడ్ బ్యాటింగ్ చేసిన తీరు మాకు సానుకూలాంశం. మా బ్యాటింగ్ లైనప్ ఇప్పటికీ పటిష్టంగానే ఉంది. వరుస విరామాల్లో వికెట్లు పడినా.. ఆ ముగ్గురు సానుకూల దృక్పథంతో బ్యాటింగ్ చేయడం శుభపరిణామం’’ అని పేర్కొన్నాడు.కాగా గుజరాత్తో మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగింది ఆర్సీబీ. ఓపెనర్లు విరాట్ కోహ్లి (7), ఫిల్ సాల్ట్ (14)తో పాటు.. వన్డౌన్ బ్యాటర్ దేవదత్ పడిక్కల్(4) పూర్తిగా విఫలమయ్యారు. రజత్ పాటిదార్ కూడా 12 పరుగులకే పెవిలియన్ చేరాడు.BIG WICKET! 🙌🏻Inform Gen Bold star, #RajatPatidar has to make his way back as Gen Gold star #IshantSharma traps in front! 👊🏻Watch LIVE action ➡ https://t.co/GDqHMberRq#IPLonJiostar 👉🏻 #RCBvGT | LIVE NOW on Star Sports 1, Star Sports 1 Hindi & JioHotstar! |… pic.twitter.com/xY8lb4sCN1— Star Sports (@StarSportsIndia) April 2, 2025సిరాజ్ తీన్మార్ఇలాంటి దశలో లియామ్ లివింగ్ స్టోన్ (40 బంతుల్లో 54), జితేశ్ శర్మ (21 బంతుల్లో 33), టిమ్ డేవిడ్ (18 బంతుల్లో 32) వేగంగా ఆడి ఆర్సీబీకి గౌరవప్రదమైన స్కోరు అందించారు. ఈ ముగ్గురి అద్భుత బ్యాటింగ్ కారణంగా నిర్ణీత 20 ఓవర్లలో ఆర్సీబీ 169 పరుగులు చేయగలిగింది.గుజరాత్ బౌలర్లలో మహ్మద్ సిరాజ్ మూడు వికెట్ల (3/19)తో చెలరేగగా.. సాయి కిషోర్ రెండు, ఇషాంత్ శర్మ, ప్రసిద్ కృష్ణ, అర్షద్ ఖాన్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు. ఇక గుజరాత్ టైటాన్స్ 17.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని పూర్తి చేసింది. ఆర్సీబీ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్, జోష్ హాజిల్వుడ్ చెరో వికెట్ దక్కించున్నారు.ఇక కేవలం రెండు వికెట్లు నష్టపోయి 170 పరుగులు చేసిన టైటాన్స్ ఎనిమిది వికెట్ల తేడాతో జయభేరి మోగించింది. ఫలితంగా టైటాన్స్కు వరుసగా రెండో విజయం లభించింది.ఐపీఎల్-2025: ఆర్సీబీ వర్సెస్ గుజరాత్ఆర్సీబీ స్కోరు: 169/8 (20)గుజరాత్ స్కోరు: 170/2 (17.5)ఫలితం: ఎనిమిది వికెట్ల తేడాతో ఆర్సీబీపై గుజరాత్ గెలుపుప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: మహ్మద్ సిరాజ్ (3/19).చదవండి: ముంబై ఫ్రాంచైజీని కొనుగోలు చేసిన సారా టెండూల్కర్They came to Bengaluru with a motive 💪And they leave with 2⃣ points 🥳@gujarat_titans complete a comprehensive 8⃣-wicket victory ✌️ Scorecard ▶ https://t.co/teSEWkWPWL #TATAIPL | #RCBvGT pic.twitter.com/czVroSNEml— IndianPremierLeague (@IPL) April 2, 2025 -
ఏడేళ్లు ఆర్సీబీకి ఆడాను.. అందుకే అలా సెలబ్రేట్ చేసుకున్నా: సిరాజ్
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) జైత్రయాత్రకు గుజరాత్ టైటాన్స్ (GT) అడ్డుకట్ట వేసింది. ఆర్సీబీని వారి సొంత మైదానంలోనే ఎనిమిది వికెట్ల తేడాతో చిత్తు చేసింది. ఫలితంగా ఐపీఎల్-2025లో వరుసగా రెండు మ్యాచ్లు గెలిచిన బెంగళూరు జట్టు ఖాతాలో తొలి పరాజయం నమోదు కాగా.. టైటాన్స్కు వరుసగా రెండో విజయం లభించింది.ఇక ఆర్సీబీపై టైటాన్స్ గెలుపులో కీలక పాత్ర పోషించిన టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ (Mohammed Siraj)కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. ఈ సందర్భంగా అతడు భావోద్వేగానికి లోనయ్యాడు. ఏడేళ్ల పాటు ప్రాతినిథ్యం వహించిన జట్టుపై ఇలాంటి ప్రదర్శన నమోదు చేయడం మిశ్రమ అనుభూతిని ఇచ్చిందని పేర్కొన్నాడు.భావోద్వేగానికి గురి చేసింది‘‘నేను కాస్త ఉద్వేగానికి లోనయ్యాడు. ఏడేళ్ల పాటు ఇక్కడే (ఆర్సీబీ) ఉన్నాను. రెడ్ జెర్సీ నుంచి బ్లూ జెర్సీకి మారటం నన్ను భావోద్వేగానికి గురి చేసింది. అయితే, బంతి చేతిలోకి రాగానే నా మూడ్ మారిపోయింది.చాలా రోజులుగా ఆటతో నేను బిజీగానే ఉన్నాను. అయితే, అనుకోకుండా లభించిన విశ్రాంతి కారణంగా.. ఫిట్నెస్పై దృష్టి పెట్టడంతో పాటు బౌలింగ్లో నా తప్పులను సరిదిద్దుకునేందుకు కావాల్సినంత సమయం దొరికింది. వేలంలో గుజరాత్ టైటాన్స్ నన్ను కొనుగోలు చేయగానే.. మొదట ఆశిష్ (ఆశిష్ నెహ్రా) భాయ్తో మాట్లాడాను.బౌలింగ్ను ఆస్వాదిస్తూ ముందుకు వెళ్లాలని.. ఇతర విషయాలను పట్టించుకోవద్దని ఆయన నాకు చెప్పాడు. అదే విధంగా.. ఇషూ భాయ్ (ఇషాంత్ శర్మ) కూడా లైన్ అండ్ లెంగ్త్ తప్పవద్దని నాకు సూచించాడు. వారు నాలో ఆత్మవిశ్వాసం నింపారు.పిచ్ ఎలా ఉన్నా.. పర్లేదు మనపై మనకు నమ్మకం ఉన్నపుడు పిచ్ పరిస్థితులు మన ప్రదర్శనను ప్రభావితం చేయలేవు. నేను రొనాల్డో అభిమానిని. కాబట్టే వికెట్ తీసిన ప్రతిసారీ అలా సెలబ్రేట్ చేసుకున్నా’’ అని సిరాజ్ చెప్పుకొచ్చాడు. కాగా బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో బుధవారం జరిగిన మ్యాచ్లో టాస్ గెలిచిన గుజరాత్.. ఆర్సీబీని తొలుత బ్యాటింగ్కు ఆహ్వానించింది.A Phil Salt orbiter 🚀followed by...A Mohd. Siraj Special \|/ 🫡It's all happening in Bengaluru 🔥Updates ▶ https://t.co/teSEWkWPWL #TATAIPL | #RCBvGT | @mdsirajofficial pic.twitter.com/a8whsXHId3— IndianPremierLeague (@IPL) April 2, 2025 సిరాజ్ పేస్ పదును.. ఆర్సీబీకి షాకులుఈ క్రమంలో ఆరంభంలోనే ఓపెనర్ విరాట్ కోహ్లి (7)ని అర్షద్ ఖాన్ వెనక్కి పంపగా.. అతడి స్థానంలో వచ్చిన దేవదత్ పడిక్కల్ను సిరాజ్ బౌల్డ్ చేశాడు. ఆ తర్వాత కాసేపటికే ఫిల్ సాల్ట్ (14)ను కూడా అదే రీతిలో పెవిలియన్కు పంపాడు.ఇలా టాపార్డర్ కుప్పకూలడంతో ఆర్సీబీ కష్టాల్లో కూరుకుపోగా.. ఫామ్లో ఉన్న కెప్టెన్ రజత్ పాటిదార్ (12) కూడా తక్కువ స్కోరుకే అవుట్ కావడం ప్రభావం చూపింది. ఇషాంత్ శర్మ బౌలింగ్లో అతడు లెగ్ బిఫోర్ వికెట్గా వెనుదిరగగా.. లియామ్ లివింగ్ స్టోన్ ఇన్నింగ్స్ చక్కదిద్దాడు. 40 బంతుల్లో 54 పరుగులతో లియామ్ జోరు మీదున్న వేళ సిరాజ్ మరోసారి తన పేస్ పదును చూపించి.. ఆర్సీబీని దెబ్బకొట్టాడు.ఇక వికెట కీపర్ బ్యాటర్ జితేశ్ శర్మ (21 బంతుల్లో 33) వేగంగా ఆడే ప్రయత్నం చేయగా.. సాయి కిషోర్ అతడిని అవుట్ చేశాడు. ఆఖర్లో టిమ్ డేవిడ్ మెరుపులు (18 బంతుల్లో 32) మెరిపించగా.. ప్రసిద్ కృష్ణ అతడి జోరుకు అడ్డుకట్ట వేశాడు. మిగతా వాళ్లలో కృనాల్ పాండ్యా (5), భువనేశ్వర్ కుమార్ (1 నాటౌట్) విఫలం కాగా.. నిర్ణీత 20 ఓవర్లలో ఆర్సీబీ 8 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది.సిరాజ్ 4 ఓవర్లలో కేవలం 19 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు తీయగా.. అర్షద్ ఖాన్, ప్రసిద్ కృష్ణ, ఇషాంత్ శర్మ ఒక్కో వికెట్తో రాణించారు. సాయి కిషోర్కు రెండు వికెట్లు దక్కాయి. ఇక లక్ష్య ఛేదనలో టైటాన్స్ ఆరంభంలోనే కెప్టెన్ శుబ్మన్ గిల్ (14) వికెట్ కోల్పోయింది.బట్లర్ ధనాధన్అయితే, మరో ఓపెనర్ సాయి సుదర్శన్ (36 బంతుల్లో 49)కు జతైన వికెట్ కీపర్ బ్యాటర్ జోస్ బట్లర్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కేవలం 39 బంతుల్లోనే 5 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 73 పరుగులతో ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు. అతడితో పాటు షెర్ఫానే రూథర్ఫర్డ్ (18 బంతుల్లో 30) వేగంగా ఆడి.. సిక్సర్తో జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఈ క్రమంలో 17.5 ఓవర్లలో కేవలం రెండు వికెట్లు నష్టపోయి టైటాన్స్ పని పూర్తి చేసింది.రూ. 12.25 కోట్లకు కొనుగోలుఇదిలా ఉంటే.. సిరాజ్ ఏడేళ్ల పాటు ఆర్సీబీకి ఆడిన విషయం తెలిసిందే. అయితే, మెగా వేలానికి ముందు ఫ్రాంఛైజీ అతడిని విడిచిపెట్టింది. వేలంపాటలోనూ సిరాజ్పై ఆర్సీబీ ఆసక్తి చూపలేదు. ఈ క్రమంలో గుజరాత్ టైటాన్స్ రూ. 12.25 కోట్లకు అతడిని కొనుగోలు చేసింది.ఇక ఆస్ట్రేలియా పర్యటనలో బోర్డర్- గావస్కర్ ట్రోఫీ టెస్టు సిరీస్లో సిరాజ్ విఫలమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో... స్వదేశంలో ఇంగ్లండ్తో పరిమిత ఓవర్ల సిరీస్తో పాటు.. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 జట్టులో సెలక్టర్లు అతడికి చోటివ్వలేదు. మహ్మద్ షమీతో పాటు అర్ష్దీప్ సింగ్కు పెద్దపీట వేసి.. సిరాజ్ను తప్పించారు. దీంతో సిరాజ్కు విరామం లభించగా.. ఫిట్నెస్ మెరుగుపరచుకుని.. మరింత కఠినంగా సాధన చేశాడు. చదవండి: భారత్లో పర్యటించనున్న వెస్టిండీస్, సౌతాఫ్రికా.. షెడ్యూల్ విడుదల -
మంచి స్కోర్ చేశాము.. సీఎస్కేను వారి సొంత ఇలాకాలో ఓడించడం చాలా ప్రత్యేకం: పాటిదార్
ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో ఆర్సీబీ వరుసగా రెండో విజయం నమోదు చేసింది. సీఎస్కేతో నిన్న (మార్చి 28) జరిగిన మ్యాచ్లో ఆ జట్టు 50 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో ఆర్సీబీ అన్ని విభాగాల్లో సత్తా చాటింది. కష్ట సాధ్యమైన పిచ్పై తొలుత బ్యాటింగ్ చేసి 196 పరుగుల భారీ స్కోర్ చేసింది. అనంతరం అద్భుతంగా బౌలింగ్ చేసి విజయంవంతంగా లక్ష్యాన్ని కాపాడుకుంది. బ్యాటింగ్లో రజత్ పాటిదార్ (32 బంతుల్లో 51; 4 ఫోర్లు, 3 సిక్సర్లు), ఫిల్ సాల్ట్ (16 బంతుల్లో 32; 5 ఫోర్లు, సిక్స్), పడిక్కల్ (14 బంతుల్లో 27; 2 ఫోర్లు, 2 సిక్సర్లు), టిమ్ డేవిడ్ (8 బంతుల్లో 22 నాటౌట్; ఫోర్, 3 సిక్సర్లు) సత్తా చాటగా.. బౌలింగ్లో హాజిల్వుడ్ (4-0-21-3), లవింగ్స్టోన్ (4-0-28-2), యశ్ దయాల్ (3-0-18-2) మ్యాజిక్ చేశారు. ఫలితంగా ఆర్సీబీ సీఎస్కేను 17 ఏళ్ల తర్వాత వారి సొంత ఇలాకాలో ఓడించింది.ఈ మ్యాచ్లో ఆర్సీబీ అద్భుత ప్రదర్శనలతో ఆకట్టుకోగా.. సీఎస్కే స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేక ఓటమిపాలైంది. టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన సీఎస్కే కీలక సమయాల్లో క్యాచ్లు జారవిడచడంతో పాటు ఫీల్డింగ్లో అనవసర తప్పిదాలు చేసి అదనపు పరుగులు సమర్పించుకుంది. నూర్ అహ్మద్ (4-0-36-3), పతిరణ (4-0-36-2), ఖలీల్ అహ్మద్ (4-0-28-1) బాగానే బౌలింగ్ చేసినా మిగతా బౌలర్లు సామర్థ్యం మేరకు రాణించలేక ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. స్లోగా ఉన్న పిచ్పై సీఎస్కే బౌలర్లు 20-30 పరుగులు అదనంగా ఇచ్చారు.అనంతరం కష్ట సాధ్యమైన ఛేదనలో సీఎస్కే బ్యాటర్లు ఆదిలోనే చేతులెత్తేశారు. కనీస పోరాటం కూడా చూపలేక మ్యాచ్ను ఆర్సీబీకి అప్పగించారు. ఓ పక్క వికెట్లు పడుతున్నా రచిన్ రవీంద్ర (41) ఒక్కడే క్రీజ్లో నిలబడి ఏదో చేసే ప్రయత్నం చేశాడు. ఆఖర్లో ధోని (16 బంతుల్లో 30 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) భారీ షాట్లు ఆడినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. సీఎస్కేకు పిచ్ నుంచి కూడా ఎలాంటి సహకారం లభించలేదు. వికెట్ చాలా స్లోగా ఉండింది. కొత్త బంతి కూడా వారికి కలిసి రాలేదు.మ్యాచ్ అనంతరం విన్నింగ్ కెప్టెన్ రజత్ పాటిదార్ మాట్లాడుతూ ఇలా అన్నాడు. ఈ వికెట్పై మంచి స్కోర్ చేశాము. వికెట్ చాలా స్లోగా ఉండింది. బ్యాటర్లకు ఇది అంత సులభం కాదు. సీఎస్కేను వారి సొంత అభిమానుల మధ్య ఓడించడం చాలా ప్రత్యేకం. ఈ వికెట్పై ఛేజింగ్ చేయడం అంత సులభం కాదని తెలుసు. అందుకే 200 పరుగులు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాము. నేను క్రీజ్లో ఉన్నంత సేపు ప్రతి బంతికి భారీ షాట్ ఆడాలని లక్ష్యంగా పెట్టుకున్నాను. ఓ రకంగా సఫలమయ్యాను. స్పిన్నర్లకు ఈ ట్రాక్ చాలా ఉపయోగకరంగా ఉండింది. అందుకే ముందుగానే స్పిన్నర్లను బరిలోకి దించాలని అనుకున్నాము. లివింగ్స్టోన్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. హాజిల్వుడ్ తన తొలి ఓవర్లో, ఆతర్వాత కొత్త బంతితో మ్యాజిక్ చేశాడు. ఈ రెండు సందర్భాలు మ్యాచ్ను మాకు అనుకూలంగా మార్చాయి. మేము పరుగులు సాధించగలిగినా వారి బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. -
’పాటిదార్ను తక్కువగా అంచనా వేశాను.. రహానే ఆ ట్రిక్ మిస్సయ్యాడు’
కోల్కతా నైట్ రైడర్స్ (KKR) కెప్టెన్గా టీమిండియా వెటరన్ క్రికెటర్ అజింక్య రహానేకు శుభారంభం లభించలేదు. అతడి సారథ్యంలో డిఫెండింగ్ చాంపియన్ తమ తొలి మ్యాచ్లోనే ఘోర ఓటమిని చవిచూసింది. ఐపీఎల్-2025 ఆరంభ మ్యాచ్లో భాగంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) చేతిలో ఏడు వికెట్ల తేడాతో పరాజయం పాలైంది.ఇక కేకేఆర్ సారథిగా అజింక్య రహానే ఈ మ్యాచ్తో తన ప్రయాణం మొదలుపెట్టగా.. ఆర్సీబీ కెప్టెన్గా రజత్ పాటిదార్కు కూడా ఇదే తొలి మ్యాచ్ కావడం విశేషం. అయితే, సీనియర్ అయిన రహానే.. పాటిదార్ పన్నిన వ్యూహాల ముందు తేలిపోవడం గమనార్హం. ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా కీలక వ్యాఖ్యలు చేశాడు.కేకేఆర్- ఆర్సీబీ మ్యాచ్ ఆరంభంలో తాను పాటిదార్ను తక్కువగా అంచనా వేశానని.. అయితే, రహానే తన చెత్త నిర్ణయాలతో అతడి ముందు తలవంచాడని పేర్కొన్నాడు. ఈ మేరకు.. ‘‘రజత్ పాటిదార్ కెప్టెన్గా రాణించగలడా? అనే సందేహం ఉండేది.కేకేఆర్తో మ్యాచ్లో తొలి మూడు ఓవర్లు ఆర్సీబీకి బాగానే సాగింది. కానీ నాలుగో ఓవర్లో పాటిదార్.. రసిఖ్ సలామ్ను తీసుకువచ్చాడు. ఐదో ఓవర్లో కృనాల్ పాండ్యాను బరిలోకి దించాడు. దయచేసి ఇలా చేయకు పాటిదార్ అని మనసులో అనుకుంటూనే ఉన్నాను.రహానే బ్యాట్తో చెలరేగడంతో కేకేఆర్ పది ఓవర్లలో వంద పరుగుల మార్కు అందుకుంది. నిజానికి ఆ జట్టు 200కు పైగా స్కోరు చేయాల్సింది. కానీ పాటిదార్ వ్యూహాలు అప్పుడే పని చేయడం మొదలుపెట్టాయి. తొలి పది ఓవర్లలో పాటిదార్కు కెప్టెన్గా అసలు మార్కులేమీ వేయలేకపోయాను.నిజానికి ఆర్సీబీ బలహీనత స్పిన్నర్లు. కానీ కృనాల్ సేవలను పాటిదార్ ఉపయోగించుకున్న తీరు అద్బుతం. స్పిన్నర్లనే జట్టుకు బలంగా మార్చాడు. కృనాల్ తొలి ఓవర్లో భారీగా పరుగులు ఇచ్చినా.. తర్వాత మూడు వికెట్లు తీశాడు. సూయశ్ లూజ్ బాల్స్ వేసినా.. రసెల్ రూపంలో కీలక వికెట్ దక్కించుకున్నాడు.దీంతో కేకేఆర్ కనీసం 175 పరుగుల మార్కు కూడా దాటలేకపోయింది. నేను పాటిదార్ గురించి ఏమనుకున్నానో.. అది రహానే విషయంలో నిజమైంది. నిజానికి నరైన్ను ఆరంభంలోనే బౌలింగ్ చేయించాల్సింది. ఆర్సీబీ బ్యాటర్లు పరుగులు పిండుకుంటున్నా.. నరైన్ను రహానే ఆలస్యంగా పిలిపించడం ప్రభావం చూపింది.రహానే ట్రిక్ మిస్సయ్యాడు. దానిని ఆర్సీబీ క్యాష్ చేసుకుంది. కెప్టెన్గా పాటిదార్ హిట్టయితే.. రహానే మాత్రం గతంలో కెప్టెన్గా పనిచేసిన అనుభవం ఉన్నా తేలిపోయాడు. ఇక బ్యాటర్గానూ పాటిదార్ అదరగొట్టాడు. సునిల్ నరైన్ బౌలింగ్లో అతడు మూడు సిక్సర్లు బాదడం మామూలు విషయం కాదు.రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, మహేంద్ర సింగ్ ధోని నరైన్ బౌలింగ్ను చాలాసార్లు ఎదుర్కొన్నారు. అయితే, ముగ్గురూ కలిసి అతడి బౌలింగ్లో కేవలం నాలుగు సిక్సర్లే కొట్టారు. అయితే, పాటిదార్ మాత్రం ఇక్కడే తన సుప్రిమసీ చూపించాడు. కెప్టెన్గా గొప్ప ఆరంభం అందుకున్నాడు’’ అని ఆకాశ్ చోప్రా తన యూట్యూబ్ చానెల్ వేదికగా పేర్కొన్నాడు. కాగా రహానే గతంలో రైజింగ్ పూణె సూపర్జెయింట్(ఇప్పుడు లేదు), రాజస్తాన్ రాయల్స్ జట్లకు సారథిగా పనిచేశాడు.ఐపీఎల్-2025: కేకేఆర్ వర్సెస్ ఆర్సీబీ స్కోర్లుకేకేఆర్- 174/8 (20)ఆర్సీబీ- 177/3 (16.2)ఫలితం: ఏడు వికెట్ల తేడాతో కేకేఆర్పై ఆర్సీబీ గెలుపు -
ఐపీఎల్-2025 తొలి మ్యాచ్ కేకేఆర్ వర్సెస్ ఆర్సీబీ: తుదిజట్లు ఇవే!?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) తాజా సీజన్కు కోల్కతా నైట్ రైడర్స్ (KKR)- రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) మధ్య మ్యాచ్తో శనివారం తెరలేవనుంది. ఇందుకు ప్రఖ్యాత ఈడెన్ గార్డెన్స్ వేదిక. ఇక ఈసారి ఈ రెండు జట్లు కొత్త కెప్టెన్లతో బరిలోకి దిగుతున్నాయి.గతేడాది తమను చాంపియన్గా నిలిపిన శ్రేయస్ అయ్యర్ను వదిలేసిన కోల్కతా.. ఈసారి వెటరన్ ప్లేయర్ అజింక్య రహానేకు సారథ్య బాధ్యతలు అప్పగించింది. మరోవైపు.. బెంగళూరు ఫ్రాంఛైజీ అనూహ్య రీతిలో రజత్ పాటిదార్ను కెప్టెన్గా ఎంపిక చేసింది. ఇక మెగా వేలం-2025 నేపథ్యంలో జట్లలోనూ భారీ మార్పులు చోటుచేసుకున్న విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో కొత్త కెప్టెన్లు, కొత్త జట్లతో కేకేఆర్- ఆర్సీబీ ఏమేరకు సత్తా చాటుతాయనేది ఆసక్తికరంగా మారింది. తొలి మ్యాచ్లో గెలుపొంది సీజన్లో శుభారంభం అందుకోవాలని ఇరుజట్లు పట్టుదలగా ఉన్నాయి.వర్షం ముప్పు లేనట్లే?మరోవైపు.. వర్షం ఈ మ్యాచ్కు ఆటంకం కలిగిస్తుందన్న వార్తల నడుమ.. కోల్కతాలో వాన తెరిపినిచ్చిందని, ఎండ కూడా కాస్తోందన్న తాజా సమాచారం సానుకూలాంశంగా పరిణమించింది. మరి క్యాష్ రిచ్ లీగ్-2025 ఎడిషన్ ఆరంభ మ్యాచ్లో కేకేఆర్, ఆర్సీబీ తుదిజట్లు ఎలా ఉండబోతున్నాయో చూద్దామా?కేకేఆర్ మరోసారి స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ సునిల్ నరైన్ను ఓపెనర్గా కొనసాగించనుండగా.. అతడికి జోడీగా సౌతాఫ్రికా స్టార్ క్వింటన్ డికాక్ బరిలోకి దిగడం ఖాయమైనట్లు కనిపిస్తోంది. మూడో స్థానంలో పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ వెంకటేశ్ అయ్యర్, నాలుగో స్థానంలో కెప్టెన్ రహానే ఆడనున్నారు.కోహ్లికి జోడీగా సాల్ట్!వీరితో పాటు రింకూ సింగ్, ఆండ్రీ రసెల్, రమణ్దీప్ సింగ్లతో కేకేఆర్ బ్యాటింగ్ లైనప్ పటిష్టంగానే ఉంది. మరోవైపు.. ఆర్సీబీ తరఫున సూపర్స్టార్ విరాట్ కోహ్లితో పాటు ఫిల్ సాల్ట్ ఓపెనింగ్కు రానున్నాడు. వీరితో పాటు లియామ్ లివింగ్స్టోన్, టిమ్ డేవిడ్, జితేశ్ శర్మ బ్యాటింగ్ విభాగంలో కీలకం కానున్నారు.ఇక బౌలర్ల విషయానికొస్తే.. కేకేఆర్కు పేసర్లు హర్షిత్ రాణాతో పాటు వైభవ్ అరోరా, స్పెన్సర్ జాన్సన్లు.. స్పిన్ విభాగంలో వరుణ్ చక్రవర్తి సేవలు అందించనున్నారు. ఇంపాక్ట్ ప్లేయర్గా అంగ్క్రిష్ రఘువన్షీ బరిలోకి దిగే అవకాశం ఉంది.అదే విధంగా.. ఆర్సీబీ పేస్ దళం టీమిండియా స్వింగ్ సుల్తాన్ భువనేశ్వర్ కుమార్, యశ్ దయాళ్, జోష్ హాజిల్వుడ్లతో పటిష్టంగా కనిపిస్తోంది. ఆర్సీబీ తరఫున స్పిన్నర్ సూయశ్ శర్మ లేదంటే స్వప్నిల్ సింగ్ ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చే అవకాశం ఉంది.కేకేఆర్ వర్సెస్ ఆర్సీబీ తుదిజట్లు (అంచనా)కేకేఆర్సునిల్ నరైన్, క్వింటన్ డి కాక్(వికెట్ కీపర్), అజింక్య రహానే (కెప్టెన్), వెంకటేశ్ అయ్యర్, రింకూ సింగ్, ఆండ్రీ రసెల్, రమణ్దీప్ సింగ్, స్పెన్సర్ జాన్సన్, వైభవ్ అరోరా, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి.ఇంపాక్ట్ ప్లేయర్: అంగ్క్రిష్ రఘువన్షీ.ఆర్సీబీఫిల్ సాల్ట్, విరాట్ కోహ్లి, దేవ్దత్ పడిక్కల్, రజత్ పాటిదార్ (కెప్టెన్), లియామ్ లివింగ్స్టోన్, జితేశ్ శర్మ (వికెట్ కీపర్), టిమ్ డేవిడ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, జోష్ హాజిల్వుడ్, యశ్ దయాళ్. చదవండి: ఇంతకంటే చెత్త ఫ్రాంఛైజీ మరొకటి ఉండదు: ‘లక్నో’పై నెటిజన్లు ఫైర్ -
అతడిని ఆపటం ఎవరితరం కాలేదు: భారత మాజీ క్రికెటర్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)-2025లో డిఫెండింగ్ చాంపియన్గా కోల్కతా నైట్ రైడర్స్ బరిలోకి దిగనుంది. తాజా సీజన్లో తొలి మ్యాచ్లో భాగంగా సొంతమైదానం ఈడెన్ గార్డెన్స్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో శనివారం తలపడనుంది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా.. కోల్కతా స్టార్ సునిల్ నరైన్ (Sunil Narine) గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.ఐపీఎల్-2025 ఆరంభ మ్యాచ్లో అందరి కళ్లు నరైన్పైనే ఉన్నాయని.. ఈసారి కూడా గతేడాది మాదిరి అతడు రాణిస్తే కేకేఆర్కు తిరుగు ఉండదని పేర్కొన్నాడు. బ్యాట్తో, బంతితో రాణించగల ఈ వెస్టిండీస్ ఆటగాడు మరోసారి కోల్కతాకు కీలకం కాబోతున్నాడని ఆకాశ్ చోప్రా (Aakash Chopra) పేర్కొన్నాడు.పవర్ ప్లేలో ధనాధన్ ఇన్నింగ్స్తోకాగా గతేడాది కేకేఆర్ చాంపియన్గా నిలవడంలో సునిల్ నరైన్ది కీలక పాత్ర. ఈ స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ ఓపెనర్గా బరిలోకి దిగి పరుగుల సునామీ సృష్టించాడు. పవర్ ప్లేలో ధనాధన్ ఇన్నింగ్స్తో దంచికొట్టి కేకేఆర్ విజయాలకు బాట వేశాడు. గత సీజన్లో పద్నాలుగు ఇన్నింగ్స్లో మొత్తంగా 488 పరుగులు సాధించాడు ఈ ఎడమచేతి వాటం బ్యాటర్. 180.74 స్ట్రైక్రేటుతో పరుగులు రాబట్టి కేకేఆర్ తరఫున టాప్ రన్ స్కోరర్గా నిలిచాడు.ఈ నేపథ్యంలో కామెంటేటర్ ఆకాశ్ చోప్రా మాట్లాడుతూ.. ‘‘ఓపెనర్ సునిల్ నరైన్. నాలుగు ఓవర్లపాటు పూర్తి స్థాయిలో బౌలింగ్ చేయగలడు కూడా! అయితే, ఈసారి బ్యాట్తో ఎలా విజృంభిస్తాడన్నది ఆసక్తికరం.అతడిని ఆపటం ఎవరితరం కాలేదుగతేడాది కేకేఆర్ విజయాలను నిర్దేశించింది అతడే! అతడి అద్భుత ప్రదర్శన కారణంగా కేకేఆర్ రాత మారిపోయింది. నరైన్ బ్యాట్ నుంచి సెంచరీ కూడా జాలువారింది. ముఖ్యంగా పవర్ప్లేలో నిలకడైన బ్యాటింగ్తో పరుగులు రాబట్టిన తీరు అద్బుతం.టీ20 క్రికెట్కు ఏం కావాలో నరైన్ అది చేసి చూపించాడు. పరుగులు రాబట్టుకుంటూ పోయాడు. అతడిని ఆపటం ఎవరితరం కాలేదు. బౌలర్లు ఎన్ని వ్యూహాలు మార్చినా నరైన్ను కట్టడి చేయలేకపోయారు. సునిల్ నరైన్ ఈసారి కూడా అలాగే రాణిస్తే కేకేఆర్కు తిరుగు ఉండదు’’ అని పేర్కొన్నాడు. ఆర్సీబీ స్పిన్నర్లే కీలకంఇక తొలి మ్యాచ్లో కేకేఆర్- ఆర్సీబీ తలపడనున్న నేపథ్యంలో.. ‘‘ఆర్సీబీ స్పిన్నర్లు ఎలా బౌలింగ్ చేస్తారన్న అంశం మీదే మ్యాచ్ ఫలితం ఆధారపడి ఉంటుంది. కృనాల్ పాండ్యా, సూయశ్ శర్మలతో పాటు లియామ్ లివింగ్స్టోన్, జేకబ్ బెతెల్ ప్రదర్శనే ఆర్సీబీకి కీలకం కానుంది.ఇక కేకేఆర్కు ఈసారి మిచెల్ స్టార్క్ లేడు. అతడి స్థానంలో స్పెన్సర్ జాన్సన్ లేదంటే అన్రిచ్ నోర్జే ఆడతారు. బ్యాటర్ల విషయానికొస్తే ఫిల్ సాల్ట్, శ్రేయస్ అయ్యర్లను కేకేఆర్ కోల్పోయింది. నరైన్.. క్వింటన్ డికాక్ లేదంటే రహ్మనుల్లా గుర్బాజ్తో కలిసి ఓపెనింగ్ చేసే అవకాశం ఉంది. టాపార్డర్ రాణిస్తేనే కోల్కతాకు గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి’’ అని ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు.చదవండి: నమ్మశక్యం కాని ఇన్నింగ్స్.. అతడి బ్యాటింగ్ అద్భుతం: కివీస్ కెప్టెన్ -
‘ఫాస్ట్ బౌలర్ల మాదిరి బౌలింగ్ దేనికి? ఆ మాత్రం ధైర్యం లేదా?’
నవతరం స్పిన్నర్ల తీరును భారత స్పిన్ దిగ్గజం హర్భజన్ సింగ్ (Harbhajan Singh) విమర్శించాడు. ముఖ్యంగా టీ20 ఫార్మాట్లో చాలా మంది స్పిన్నర్లు తమ సహజత్వానికి భిన్నంగా బౌలింగ్ చేస్తున్నారన్నాడు. బంతిని స్పిన్ చేసేందుకు బదులు.. డిఫెన్సివ్గా ఆడేందుకే ఎక్కువగా మొగ్గుచూపుతున్నారని విమర్శలు గుప్పించాడు.కాగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)- 2025 సీజన్ శనివారం ఆరంభం కానున్న విషయం తెలిసిందే. ప్రఖ్యాత ఈడెన్ గార్డెన్స్ మైదానంలో కోల్కతా నైట్ రైడర్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్తో క్యాష్ రిచ్ లీగ్ తాజా సీజన్కు తెరలేవనుంది. ఇదిలా ఉంటే.. ఐపీఎల్లో గత పదిహేడు ఎడిషన్లలో స్పిన్నర్లు కేవలం మూడుసార్లు మాత్రమే పర్పుల్ క్యాప్ గెలుచుకున్నారు.ఇమ్రాన్ తాహిర్, ప్రజ్ఞాన్ ఓజా తర్వాత.. 2022లో అత్యధిక వికెట్ల వీరుడిగా టీమిండియా లెగ్బ్రేక్ స్పిన్నర్ యజువేంద్ర చహల్ ఈ ఘనత సాధించాడు. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.ఫాస్ట్ బౌలర్ల మాదిరి బౌలింగ్ దేనికి? ఆ మాత్రం ధైర్యం లేదా?‘‘టీ20లలో.. మరీ ముఖ్యంగా ఐపీఎల్లో చాలా మంది స్పిన్నర్లు ఫాస్ట్ బౌలర్ల మాదిరి బౌలింగ్ చేస్తున్నారు. బంతిని స్పిన్ చేసేందుకు ఏమాత్రం ప్రయత్నించడం లేదు. అసలు బ్యాటర్లపై అటాకింగ్ చేయడమే లేదు. వికెట్లు తీయాలనే తాపత్రయం వారిలో కరువైంది.వికెట్లు తీసే విషయంలో స్పిన్నర్లు కాస్త ధైర్యం చూపించాలి. ప్రతిసారీ ఆత్మరక్షణ ధోరణితో ఉండటం సరికాదు’’ అని భజ్జీ స్పిన్నర్ల తీరును విమర్శించాడు. ఇండియా టుడేతో ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు.కాగా మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి.. తన బౌలింగ్ శైలి ఫాస్ట్ బౌలర్ల మాదిరి ఉంటుంది కాబట్టి తాను కేవలం వన్డే, టీ20లు ఆడతానని.. టెస్టులకు సరిపడనని ఇటీవలే పేర్కొన్న విషయం తెలిసిందే. ఇక ఐపీఎల్-2025 సీజన్లో బంతిపై సెలైవా (లాలాజలం) ఉపయోగించేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) అనుమతించిన విషయం తెలిసిందే.ఐపీఎల్-2025 కెప్టెన్ల సమావేశం తర్వాత.. వారి అంగీకారంతో ఈ మేరకు సెలైవా ఉపయోగంపై విధించిన నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు బోర్డు ప్రకటించింది. అయితే, అంతర్జాతీయ క్రికెట్లో మాత్రం ఐసీసీ నిబంధనలకు కట్టుబడి ఉంటామని స్పష్టం చేసింది.స్వాగతించదగ్గ విషయంఈ నేపథ్యంలో హర్భజన్ సింగ్ స్పందిస్తూ.. ‘‘బౌలర్లు సెలైవా ఉపయోగించేందుకు అనుమతి లభించడం స్వాగతించదగ్గ విషయం. అంతర్జాతీయ క్రికెట్లోనూ ఇదే మాదిరి లాలాజలంతో బంతిని నునుపు చేసేందుకు అనుమతి వస్తే.. పేసర్లు బంతిని మరింత స్వింగ్ చేయగలుగుతారు. స్పిన్నర్లకు కూడా ప్రయోజనకరంగానే ఉంటుంది’’ అని అభిప్రాయపడ్డాడు.కాగా కోవిడ్-19 మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో అప్పట్లో లాలాజలంతో బంతిని రుద్దకుండా ఐసీసీ నిషేధం విధించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. హర్భజన్ సింగ్ టీమిండియా తరఫున టెస్టుల్లో 417, వన్డేల్లో 269, టీ20లలో 25 వికెట్లు తీశాడు. ఐపీఎల్లో 163 మ్యాచ్లు ఆడిన ఈ ఆఫ్ స్పిన్నర్ 150 వికెట్లు కూల్చాడు.చదవండి: నమ్మశక్యం కాని ఇన్నింగ్స్.. అతడి బ్యాటింగ్ అద్భుతం: కివీస్ కెప్టెన్ -
KKR Vs RCB: వర్షం వల్ల మ్యాచ్ రద్దయితే పరిస్థితి?
మెగా క్రికెట్ సమరం ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) పద్దెనిమిదవ సీజన్కు శనివారం తెరలేవనుంది. తారల సందడితో ఈడెన్ గార్డెన్స్లో క్యాష్ రిచ్ లీగ్ తాజా ఎడిషన్ను ఆరంభించేందుకు నిర్వాహకులు సిద్ధమయ్యారు. డిఫెండింగ్ చాంపియన్ కోల్కతా నైట్ రైడర్స్ (KKR)- ఇంత వరకు ఒక్కసారి కూడా ట్రోఫీ గెలవని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) మధ్య పోరుతో ఈ క్రీడా సంబరం మొదలుకానుంది.పొంచి ఉన్న వర్షం ముప్పుఅయితే, ఆరంభ వేడుకలతో పాటు మ్యాచ్కు వర్షం అడ్డుతగిలే అవకాశం ఉంది. ఆక్యూవెదర్ నివేదిక ప్రకారం కోల్కతాలో శనివారం భారీ వాన పడే అవకాశం ఉంది. ఉదయం 11 గంటల తర్వాత వర్షం ఎక్కువయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.దీంతో సాయంత్రం 6.20 నిమిషాల నుంచి 6.45 నిమిషాల వరకు జరగాల్సిన ప్రారంభోత్సవ వేడుకల ఏర్పాట్లు సజావుగా సాగడం కష్టమే. సాయంత్రం ఆరు గంటల తర్వాత వర్షం పడే అవకాశం 25 శాతం ఉందని ఆక్యూవెదర్ పేర్కొంది. టాస్ సమయానికి అంటే ఏడు గంటల సమయంలో పదిశాతం వర్ష సూచనలు ఉన్నట్లు తెలిపింది. ఇక రాత్రి పదకొండు గంటల తర్వాత ఇందుకు డెబ్బై శాతం ఆస్కారం ఉన్నట్లు వెల్లడించింది.రెండు రోజులుగా వానఈ నేపథ్యంలో కేకేఆర్- ఆర్సీబీ మధ్య ఐపీఎల్-2025 ఆరంభ మ్యాచ్ సాఫీగా సాగడం కష్టమే అనిపిస్తోంది. కోల్కతాలో గత రెండు రోజులుగా వర్షం కురుస్తూనే ఉంది. దీంతో కేకేఆర్- ఆర్సీబీ ప్రాక్టీస్ మ్యాచ్లకు అంతరాయం కలిగింది. మరోవైపు.. శుక్రవారం కూడా వాన పడగా.. ఈడెన్ గార్డెన్స్ గ్రౌండ్స్టాఫ్ కవర్లతో మైదానాన్ని కప్పి ఉంచారు.అంతేకాదు.. ఎప్పటికప్పుడు మైదానం నుంచి నీటిని క్లియర్ చేసేందుకు డ్రైనేజీ సిస్టమ్ సిద్ధంగానే ఉంది. అయితే, ఎడతెరిపిలేని వర్షం పడితే మాత్రం మ్యాచ్ జరగడం సాధ్యం కాదు. మరి వర్షం వల్ల కేకేఆర్- ఆర్సీబీ మ్యాచ్ రద్దయితే పరిస్థితి ఏమిటి?జరిగేది ఇదే..ప్లే ఆఫ్స్, ఫైనల్ మాదిరి ఐపీఎల్ గ్రూప్ దశ మ్యాచ్లకు రిజర్వ్ డే ఉండదు. అయితే, వర్షం వల్ల మ్యాచ్ ఆలస్యమైతే.. మ్యాచ్ ముగియడానికి నిర్ణీత సమయం కంటే అరవై నిమిషాల అదనపు సమయం ఇస్తారు.ఫలితం తేల్చేందుకు ఇరుజట్లు కనీసం ఐదు ఓవర్లపాటు బ్యాటింగ్ చేసే అవకాశం ఉంటుంది. ఈ ఐదు ఓవర్ల మ్యాచ్కు కటాఫ్ టైమ్ రాత్రి 10.56 నిమిషాలు. అర్ధరాత్రి 12.06 నిమిషాల వరకు మ్యాచ్ను ముగించేయాల్సి ఉంటుంది. ఒకవేళ వర్షం వల్ల మ్యాచ్ మరీ ఆలస్యమైతే ఓవర్ల సంఖ్యను తగ్గించే అవకాశం కూడా ఉంటుంది.ఇంత చేసినా ఫలితం తేలకుండా.. మ్యాచ్ రద్దు చేయాల్సి వస్తే ఇరుజట్లకు చెరో పాయింట్ లభిస్తుంది. అయితే, టైటిల్ రేసులో నిలిచే క్రమంలో ఈ ఒక్క పాయింట్ కూడా తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. అందుకే.. ఇటు కేకేఆర్.. అటు ఆర్సీబీ అభిమానులు మ్యాచ్ సజావుగా సాగాలని కోరుకుంటున్నారు. ఇదిలా ఉంటే.. ఐపీఎల్-2025 ఆరంభ వేడుకలో శ్రేయా ఘోషాల్, కరణ్ ఔజ్లా, దిశా పటాని తదితరులు ఆట, పాటలతో అలరించేందుకు సిద్ధమయ్యారు.చదవండి: IPL 2025: కెప్టెన్ల మార్పు.. ఎవరి జీతం ఎంత?.. అతి చవగ్గా దొరికిన సారథి అతడే!A little rain won’t stop us! 🌧 The ground’s got its cozy cover, and the drainage system will be ready to save the day 𝘒𝘺𝘶𝘯𝘬𝘪 𝘠𝘦𝘩 𝘐𝘗𝘓 𝘩𝘢𝘪, 𝘺𝘢𝘩𝘢𝘯 𝘴𝘢𝘣 𝘱𝘰𝘴𝘴𝘪𝘣𝘭𝘦 𝘩𝘢𝘪!#IPLonJioStar 👉 SEASON OPENER #KKRvRCB | SAT, 22nd March, 5:30 PM | LIVE on… pic.twitter.com/UwdonS9FeN— Star Sports (@StarSportsIndia) March 21, 2025 -
‘అందుకే ఆర్సీబీ టైటిల్ గెలవలేదు.. ఈసారి ఆరెంజ్ క్యాప్ అతడికే’
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) ఆరంభ ఎడిషన్ నుంచి రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టు టైటిల్ కోసం పోరాడుతూనే ఉంది. కానీ పదిహేడు సీజన్లుగా ఆర్సీబీ కల మాత్రం నెరవేరడం లేదు. విరాట్ కోహ్లి (Virat Kohli) వంటి సూపర్ స్టార్ జట్టుతో ఉండటం వల్ల భారీ స్థాయిలో క్రేజ్ సంపాదించగలిగింది కానీ.. ఇప్పటి వరకు ట్రోఫీని అందుకోలేకపోయింది.ఇందుకు ప్రధాన కారణం.. బెంగళూరు ఫ్రాంఛైజీ ఆటగాళ్లందరినీ సమానంగా చూడకపోవటమే అంటున్నాడు ఆ జట్టుకు ఆడిన షాబాద్ జకాతి. గతంలో రెండుసార్లు చెన్నై సూపర్ కింగ్స్కు ప్రాతినిథ్యం వహించిన ఈ భారత స్పిన్నర్.. అనంతరం ఆర్సీబీకి కూడా ఆడాడు. 2014లో బెంగళూరు తరఫున.. కోహ్లి కెప్టెన్సీలో ఒక్క మ్యాచ్ ఆడిన షాదాబ్ జకాతి తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.ఇది జట్టుగా ఆడాల్సిన ఆట..పదిహేడేళ్లుగా ఆర్సీబీకి టైటిల్ అందని ద్రాక్షగా ఉండటానికి కారణం ఏమిటన్న ప్రశ్నకు బదులిస్తూ.. ‘‘ఇది జట్టుగా ఆడాల్సిన ఆట. మనం ట్రోఫీలు గెలవాలని బలంగా కోరుకుంటే.. జట్టంతా ఐకమత్యంగా ఉంటేనే అది సాధ్యమవుతుంది.చెన్నై జట్టు పటిష్టంగా ఉండటానికి కారణం.. టీమిండియాలోని ప్రధాన ప్లేయర్లు ఆ టీమ్తో కొనసాగడం. అంతేకాదు.. ఆ జట్టులోని విదేశీ క్రికెటర్లు కూడా అంకితభావంతో ఆడతారు. ఒక జట్టు విజయవంతం కావాలంటే.. కూర్పు సరిగ్గా ఉండాలి. నేను ఆర్సీబీకి ఆడుతున్నపుడు.. ఆ ఫ్రాంఛైజీ కేవలం ఇద్దరు- ముగ్గురు ఆటగాళ్లపై మాత్రమే దృష్టి సారించేది.నమ్మకం, సహోదర భావం లేదుయాజమాన్యం, డ్రెసింగ్రూమ్ వాతావరణానికి పొంతనే ఉండేది కాదు. నిజానికి ఆ జట్టులో మంచి మంచి ఆటగాళ్లు ఉన్నారు. కానీ.. వారి మధ్య పరస్పర నమ్మకం, సహోదర భావం లోపించినట్లు అనిపిస్తుంది. సీఎస్కేలో మాదిరి ఆర్సీబీ ఆటగాళ్లు ఒకరితో ఒకరు మమేకం కాలేదనేది నా భావన’’ అని జకాతి స్పోర్ట్స్కీడాతో పేర్కొన్నాడు.గెలిచేది ఆ జట్టేఇక ఈసారి ప్లే ఆఫ్స్ చేరే జట్లపై తన అంచనా తెలియజేస్తూ.. ‘‘కోల్కతా నైట్ రైడర్స్ ఈసారి కూడా క్వాలిఫై అవుతుంది. చెన్నై కూడా బలంగా కనిపిస్తోంది. ఈ రెండు జట్లతో పాటు గుజరాత్ కూడా టాప్-4లోకి అడుగుపెట్టే అవకాశం ఉంది.అయితే, నాలుగో జట్టుగా లక్నో ఉంటుందా? లేదా ఢిల్లీ వస్తుందా? అనేది మాత్రం స్పష్టంగా చెప్పలేను. ఈసారి ఢిల్లీ జట్టు బాగుంది. కాబట్టి ఆ జట్టు ప్లే ఆఫ్స్ చేరినా ఆశ్చర్యం లేదు.అంతేకాదు.. ఢిల్లీ ఈసారి టైటిల్ గెలుస్తుందని నాకు అనిపిస్తోంది’’ అని షాదాబ్ జకాతి వెల్లడించాడు. ఇక ఆర్సీబీ ఈసారి ప్లే ఆఫ్స్ చేరే సూచనలు కనిపించడం లేదన్న అతడు.. విరాట్ కోహ్లి కోసమైనా వారు ట్రోఫీ గెలిస్తే బాగుండని పేర్కొన్నాడు.ఆరెంజ్ క్యాప్ అతడికేఇక ఈసారి కోహ్లి లేదంటే.. రోహిత్ శర్మ (ముంబై ఇండియన్స్)అత్యధిక పరుగుల వీరుడిగా ఆరెంజ్ క్యాప్ గెలుస్తారని జకాతి అంచనా వేశాడు.ఇక పర్పుల్ క్యాప్ను పేసర్ జస్ప్రీత్ బుమ్రా (ముంబై ఇండియన్స్) దక్కించుకుంటాడని జోస్యం చెప్పాడు. స్పిన్నర్లలో కుల్దీప్ యాదవ్ (ఢిల్లీ క్యాపిటల్స్), యజువేంద్ర చహల్ (పంజాబ్ కింగ్స్)కు ఈ అవకాశం ఉందని పేర్కొన్నాడు.చదవండి: IPL: అప్పుడు బాల్ బాయ్.. ఇప్పుడు టైటిల్ గెలిచిన కెప్టెన్!.. హ్యాట్సాఫ్ -
నేను ఎదుర్కొన్న కఠినమైన బౌలర్ అతడే.. అన్ని ఫార్మాట్లలోనూ బెస్ట్: కోహ్లి
భారత పేస్ దళ నాయకుడు జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah)పై టీమిండియా సూపర్ స్టార్ విరాట్ కోహ్లి (Virat Kohli) ప్రశంసలు కురిపించాడు. మూడు ఫార్మాట్లలోనూ ప్రస్తుతం ప్రపంచంలో అత్యుత్తమ బౌలర్ అతడేనని కొనియాడాడు. తాను ఎదుర్కొన్న బౌలర్లలో అత్యంత కఠినమైన బౌలర్ బుమ్రానే అని కోహ్లి వెల్లడించాడు.ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025లో సత్తా చాటిన కోహ్లి.. ప్రస్తుతం ఐపీఎల్-2025 సన్నాహకాలతో బిజీగా ఉన్నాడు. ఇందులో భాగంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) సోషల్ మీడియాతో మమేకమైన కోహ్లి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. అత్యుత్తమ బౌలర్ ఇక మీ కెరీర్లో ఎదుర్కొన్న టఫెస్ట్ బౌలర్ ఎవరన్న ప్రశ్నకు బదులిస్తూ.. ‘‘ప్రపంచంలో ప్రస్తుతం వన్డే, టెస్టు, టీ20 ఫార్మాట్లలో అత్యుత్తమ బౌలర్ ఎవరంటే.. జస్ప్రీత్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.ఐపీఎల్లో కొన్ని సందర్భాల్లో అతడు నన్ను అవుట్ చేశాడు. అయితే, ఎక్కువసార్లు నేనే అతడిపై పైచేయి సాధించాను. అయినా సరే.. మా ఇద్దరి మధ్య పోటీ అంటే ఎంతో ఆసక్తికరంగా, సరదాగా ఉంటుంది. ప్రతి బంతిని షాట్ బాదేందుకు నేను ప్రయత్నిస్తా.నన్ను ఆపేందుకు అతడూ ట్రై చేస్తాడు. ఇద్దరి మధ్య పోటీ తీవ్రస్థాయికి చేరుకున్న వేళ.. ఎవరూ కూడా తగ్గకుండా ముందుకు సాగితే మజాగా ఉంటుంది కదా!.. ఇక నెట్స్లో ప్రాక్టీస్ చేస్తున్నపుడు నేను రెగ్యులర్గా బుమ్రా బౌలింగ్ను ఎదుర్కొంటా. నాకు నచ్చిన, నేను ఆస్వాదించే మూమెంట్ అది. అంతేకాదు.. అదే కఠినమైన సవాల్ కూడా!’’ అని విరాట్ కోహ్లి చెప్పుకొచ్చాడు.కాగా క్యాష్ రిచ్ లీగ్ ఆరంభమైన నాటి(2008) నుంచి కోహ్లి ఆర్సీబీలో కొనసాగుతుండగా.. బుమ్రా తన కెరీర్ ఆరంభం నుంచి ముంబై ఇండియన్స్తో ప్రయాణిస్తున్నాడు. ఫోర్లు బాదిన కోహ్లి.. అవుట్ చేసిన బుమ్రాఇక 2013, ఏప్రిల్ 4న ముంబై తరఫున ఆర్సీబీతో మ్యాచ్తో బుమ్రా ఐపీఎల్లో అరంగ్రేటం చేసిన విషయం తెలిసిందే. నాడు చిన్నస్వామి స్టేడియంలో జరిగిన మ్యాచ్లో నాలుగు ఓవర్ల కోటా పూర్తి చేసి.. 32 పరుగులు ఇచ్చిన బుమ్రా మూడు వికెట్లు తీశాడు.తన ఆరంభ ఓవర్లోనే కోహ్లి ఒకటి, రెండు, నాలుగో బంతుల్లో ఫోర్లు బాది చుక్కలు చూపించగా.. ఐదో బంతికి బుమ్రా విజయం సాధించాడు. నాడు 19 ఏళ్ల వయసులో ఉన్న బుమ్రా తన అద్భుత నైపుణ్యాలతో వికెట్ల ముందు కోహ్లిని దొరకబుచ్చుకుని.. తన తొలి వికెట్ సాధించాడు. ఇక ఇప్పటి వరకు 133 మ్యాచ్లు పూర్తి చేసుకున్న బుమ్రా 165 వికెట్లు తీశాడు. ముంబై జట్టు ఐదుసార్లు టైటిల్ గెలిచిన సందర్భాల్లోనూ అతడు జట్టులో భాగంగా ఉన్నాడు.మరోవైపు.. కోహ్లి జట్టు ఆర్సీబీ ఇంత వరకు ఒక్కసారి కూడా ట్రోఫీని ముద్దాడలేకపోయింది. ఇదిలా ఉంటే.. కోహ్లి- బుమ్రా టీమిండియాకు కలిసి ఆడుతున్న విషయం తెలిసిందే. కోహ్లి సారథ్యంలో బుమ్రా ఆడగా.. పలు సందర్భాల్లో బుమ్రా కెప్టెన్సీలో కోహ్లి ఆడటం విశేషం. చదవండి: అసలు అతడిని జట్టులోకి తీసుకుంది ఎవరు?: పాక్ మాజీ క్రికెటర్ ఆగ్రహం"𝙒𝙝𝙚𝙣𝙚𝙫𝙚𝙧 𝙄 𝙛𝙖𝙘𝙚 𝙝𝙞𝙢, 𝙞𝙩'𝙨 𝙡𝙞𝙠𝙚, '𝙊𝙠𝙖𝙮, 𝙞𝙩'𝙨 𝙜𝙤𝙣𝙣𝙖 𝙗𝙚 𝙛𝙪𝙣.'" 🗣Ever wondered who’s the toughest bowler Virat’s ever faced? 🤔 Catch him spill the tea, at the 𝗥𝗖𝗕 𝗜𝗻𝗻𝗼𝘃𝗮𝘁𝗶𝗼𝗻 𝗟𝗮𝗯 𝗜𝗻𝗱𝗶𝗮𝗻 𝗦𝗽𝗼𝗿𝘁𝘀 𝗦𝘂𝗺𝗺𝗶𝘁… pic.twitter.com/36F8d8twN6— Royal Challengers Bengaluru (@RCBTweets) March 17, 2025 -
ఆర్సీబీని అవహేళన చేసిన రాయుడు.. మాజీ కోచ్ స్పందన ఇదే
టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు(Ambati Rayudu)కు రాయల్ చాలెంజర్స్ బెంగళూరుRCB) మాజీ కోచ్ సంజయ్ బంగర్ గట్టి కౌంటర్ ఇచ్చాడు. ప్రతిసారీ ఆర్సీబీని తక్కువ చేసి మాట్లాడటం సరికాదని.. తాను ఇలాంటివి సహించలేనని పేర్కొన్నాడు. కాగా అంబటి రాయుడు గతంలో చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ జట్లకు ప్రాతినిథ్యం వహించిన విషయం తెలిసిందే. మహేంద్ర సింగ్ ధోని సారథ్యంలో చెన్నై, రోహిత్ శర్మ కెప్టెన్సీలో ముంబై టైటిళ్లు గెలిచిన సందర్భాల్లో అతడు జట్టులో ఉన్నాడు. రికార్డుల రారాజు ఉన్న జట్టుఇక ఐపీఎల్లో ఏకంగా ఐదుసార్లు చాంపియన్లుగా నిలిచిన ఈ రెండు జట్లకు ఉన్నంత స్థాయిలో ఆర్సీబీకి కూడా క్రేజ్ ఉంది. ఒక్కసారి కూడా టైటిల్ గెలవకపోయినా బెంగళూరు ఫ్యాన్బేస్ రోజురోజుకూ పెరుగుతుందే తప్ప తగ్గడం లేదనడంలో సందేహం లేదు.ఇందుకు ప్రధాన కారణం రికార్డుల రారాజు, టీమిండియా ముఖచిత్రం విరాట్ కోహ్లి మొదటి నుంచి ఆ జట్టులో భాగం కావడమే! అయితే, రాయుడు మాత్రం అవకాశం వచ్చిన ప్రతిసారీ ఆర్సీబీని కించపరిచే విధంగా మాట్లాడతాడనే అభిప్రాయం ఉంది. ఇటీవల ఓ పాడ్కాస్ట్లో మాట్లాడుతూ.. ఆర్సీబీ ఏదో ఒకరోజు ట్రోఫీ గెలుస్తుందని.. అయితే, ఆ సమయం ఎప్పుడూ రాకూడదని తాను ఎల్లప్పుడూ ప్రార్థిస్తానని వ్యాఖ్యానించాడు.అన్ని జట్లకూ సాధ్యం కాదుఇక ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 ఫైనల్ వేళ కామెంట్రీ చేస్తున్న సమయంలోనూ అంబటి రాయుడు మరోసారి ఆర్సీబీని అవహేళన చేశాడు. ఈ ఫ్రాంఛైజీ గురించి మాజీ కోచ్ సంజయ్ బంగర్ మాట్లాడుతూ.. ‘‘గత నాలుగైదేళ్లుగా జట్టు నిలకడైన ప్రదర్శన కనబరుస్తోంది. నాలుగు సందర్భాల్లో ప్లే ఆఫ్స్ చేరింది.గతేడాది వరుసగా ఏడు మ్యాచ్లు ఓడిన తర్వాత కూడా టాప్-4లో అడుగుపెట్టగలిగింది. వరుస పరాజయాల తర్వాత ఇలా తిరిగి పుంజుకోవడం అన్ని జట్లకూ సాధ్యం కాదు. కాబట్టి త్వరలోనే వాళ్లు ప్రతి అవాంతరాన్ని అధిగమించి అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటారు’’ అని స్టార్ స్పోర్ట్స్ షోలో తన అభిప్రాయాలు పంచుకున్నాడు.ఇది తప్పుఇందుకు అంబటి రాయుడు బదులిస్తూ.. ‘‘నిజమే.. సంజయ్ భాయ్.. వచ్చేసారి ఆర్సీబీ అవాంతరాలు దాటుతుంది. క్వాలిఫయర్ 2 వరకైనా వెళ్తుంది’’ అని నవ్వాడు. ఇందుకు స్పందనగా.. ‘‘ఇది చాలా తప్పు. మరీ అన్యాయంగా మాట్లాడుతున్నారు. నేను ఇలాంటివి సహించలేను. ఆర్సీబీ అభిమానులు మిమ్మల్ని చూస్తున్నారు’’ అంటూ నవ్వుతూనే రాయుడు వ్యాఖ్యల్ని బంగర్ తప్పుబట్టాడు.ఇందుకు రాయుడు.. ‘‘చూస్తే చూడనివ్వండి’’ అంటూ మరోసారి ఆర్సీబీని అపహాస్యం చేశాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో బెంగళూరు ఫ్రాంఛైజీ ఫ్యాన్స్ రాయుడుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మూర్ఖత్వంతను హైలైట్ అయ్యేందుకు ప్రతిసారీ ఆర్సీబీని తక్కువ చేసి చూపుతున్నాడని.. ఆ జట్టుకు ఉన్న క్రేజ్లో వీసమైంత గుర్తింపు అయిన దక్కించుకోవాలని భలే ఆరాటపడుతున్నాడని సెటైర్లు వేస్తున్నారు.ఒక జట్టును పదే పదే కించపరచడం ద్వారా తన స్థాయి పెరుగుతుందని భావిస్తున్నాడని.. అంతకంటే మూర్ఖత్వం మరొకటి ఉండదంటూ రాయుడుకు చురకలు అంటిస్తున్నారు. ఈ సందర్భంగా టాలీవుడ్ సెలబ్రిటీల పట్ల రాయుడు చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తున్నారు. నీదే పబ్లిసిటీ స్టంట్కాగా చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా దుబాయ్లో టీమిండియా- పాకిస్తాన్ మ్యాచ్ చూసేందుకు చిరంజీవి, సుకుమార్ తదితరులు వెళ్లిన విషయం తెలిసిందే. అయితే, వారిని ఉద్దేశించి.. టీవీల్లో కనిపించాలని ఇలాంటి వారు ఇక్కడికి వస్తారంటూ రాయుడు వ్యాఖ్యానించాడు. ఇదంతా పబ్లిసిటీ స్టంట్ అని పేర్కొన్నాడు. దీంతో అతడిపై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. ఇక ఆర్సీబీ ఫ్యాన్స్ ఇప్పుడదే మాటను రాయుడు ఆపాదించడం గమనార్హం.చదవండి: 'ప్రపంచ క్రికెట్ని భారత్ శాసిస్తుంది’ -
మహిళల ప్రీమియర్ లీగ్లో డ్యాన్స్ తో అదరగొట్టిన శ్రుతి హాసన్ (ఫొటోలు)
-
అప్పుడే ఆఫర్ వచ్చింది.. కానీ!.. వదిలేసిన ఫ్రాంఛైజీ జట్టుకే కెప్టెన్గా..
గత ఏడాదే కెప్టెన్సీపై ఆసక్తి ఉందా అని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) యాజమాన్యం తనను అడిగినట్లు కొత్త కెప్టెన్ రజత్ పాటీదార్ తెలిపాడు. అయితే, ఐపీఎల్కు ముందు రాష్ట్ర జట్టుకు కెప్టెన్సీ చేయాలనుకుంటున్నట్లు వారికి చెప్పానన్నాడు. ఇప్పుడిలా ఈ అవకాశం రావడం ఆనందంగా ఉందంటూ హర్షం వ్యక్తం చేశాడు.కాగా ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) ఫ్రాంఛైజీ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) 2025 సీజన్లో కొత్త కెప్టెన్ నాయకత్వంలో బరిలోకి దిగనుంది. విరాట్ కోహ్లి మరోసారి సారథ్య బాధ్యతలు చేపట్టవచ్చనే అభిమానుల ఆశలకు భిన్నంగా టీమ్ మేనేజ్మెంట్ అనూహ్య నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.దూకుడైన బ్యాటింగ్తో జట్టులో కీలక ఆటగాడిగా ఎదిగిన రజత్ పాటీదార్ను కెప్టెన్గా నియమించింది. గురువారం జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో సారథ్య వివరాలను ఆర్సీబీ ప్రకటించింది. గత మూడు సీజన్ల పాటు కెప్టెన్గా వ్యవహరించిన డు ప్లెసిస్ను వేలానికి ముందు టీమ్ విడుదల చేయడంతో కొత్త నాయకుడి ఎంపిక అనివార్యమైంది. వేలానికి ముందు జట్టు రిటైన్ చేసుకున్న ముగ్గురు ప్లేయర్లలో పాటీదార్ ఒకడు. అతడిని రూ.11 కోట్లకు ఆర్సీబీ తమతోనే కొనసాగించింది.కాగా 2021–2024 మధ్య ఆర్సీబీ తరఫున 27 మ్యాచ్లు ఆడిన పాటీదార్ 158.84 స్ట్రైక్రేట్తో 799 పరుగులు సాధించాడు. ఇందులో 1 సెంచరీ, 7 అర్ధసెంచరీలు ఉన్నాయి. ఇప్పుడు తొలిసారి కెప్టెన్గా కూడా ఎంపిక చేసిన యాజమాన్యం పెద్ద బాధ్యతను అతనిపై పెట్టింది. ఐపీఎల్లో చరిత్రలో బెంగళూరుకు రజత్ ఎనిమిదో కెప్టెన్. గతంలో ఈ టీమ్కు ద్రవిడ్, పీటర్సన్, కుంబ్లే, వెటోరి, కోహ్లి, వాట్సన్, డుప్లెసిస్ సారథులుగా వ్యవహరించారు. రజత్ పాటిదార్ (PC: RCB X)మెరుపు బ్యాటింగ్తో గుర్తింపు... ఇండోర్కు చెందిన 32 ఏళ్ల పాటీదార్ దేశవాళీ క్రికెట్లో మధ్యప్రదేశ్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. 2021 సీజన్లో తొలిసారి అతను ఐపీఎల్ ఆడే అవకాశం దక్కించుకున్నాడు. అ సీజన్లో నాలుగు మ్యాచ్లకే పరిమితమైన అతడిని 2022 సీజన్కు ముందు విడుదల చేసింది. అయితే లవ్నీత్ సిసోడియా అనూహ్యంగా గాయపడటంతో రీప్లేస్మెంట్ ప్లేయర్గా మళ్లీ జట్టులోకి వచ్చి చెలరేగిపోయాడు.మొత్తం 333 పరుగులు చేయగా... ఎలిమినేటర్ మ్యాచ్లో లక్నోపై 54 బంతుల్లో 112 పరుగులు బాదిన ఇన్నింగ్స్ హైలైట్గా నిలిచింది. అయితే గాయం కారణంగా 2023 సీజన్కు పూర్తిగా దూరమైన అతను 2024లో తిరిగొచ్చి మెరుపు బ్యాటింగ్తో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. 2024 సీజన్లో 15 మ్యాచ్లలో 395 పరుగులు సాధించిన అతను 33 సిక్సర్లు బాదాడు.అదే ఏడాది ముస్తాక్ అలీ ట్రోఫీ, విజయ్ హజారే టోర్నీల్లో తొలిసారి మధ్యప్రదేశ్కు కెప్టెన్గా పని చేసిన అనుభవం పాటీదార్కు ఉంది. ముస్తాక్ అలీ టోర్నీలో 186.08 స్ట్రయిక్రేట్తో 428 పరుగులు చేసిన అతను జట్టును ఫైనల్ వరకు చేర్చాడు. కెప్టెన్గా ఎందుకు... ఐపీఎల్లో కెప్టెన్గా ఎంపిక చేసేందుకు మేనేజ్మెంట్ ముందుగా చూసేది అన్ని మ్యాచ్లలో కచ్చితంగా తుది జట్టులో ఉండే ఆటగాడి గురించే. అది కూడా భారత ఆటగాడైతే మరీ మంచిది. గతంలో విదేశీయులను కెప్టెన్గా చేసి అతను విఫలమవుతున్నా కొనసాగించి దాదాపు పది మందితోనే ఆడినట్లుగా టీమ్లు ఇబ్బంది పడిన ఘటనలు చాలా ఉన్నాయి. అలా చూస్తే విరాట్ కోహ్లి తర్వాత జట్టులో ప్రధాన బ్యాటర్ అయిన పాటీదార్ మినహా మరో ప్రత్యామ్నాయం ఆర్సీబీ వద్ద లేకపోయింది.కృనాల్ పాండ్యా, భువనేశ్వర్, పడిక్కల్లతో పోలిస్తే ఇది మెరుగైన నిర్ణయమే. భారత్ తరఫున 3 టెస్టులు, ఒకే ఒక వన్డే ఆడిన రజత్కు వ్యక్తిగతంగా స్టార్ ఆటగాడిలా గుర్తింపు లేకపోయినా అతనిపై యాజమాన్యం నమ్మకం ఉంచింది. ‘రజత్ ఎంపికకు ఎన్నో కారణాలు ఉన్నాయి. అతని నెమ్మదైన స్వభావం, ఒత్తిడిలోనూ ప్రశాంతంగా ఉండే తీరు, కెపె్టన్సీకి పనికొచ్చే లక్షణం. సరైన నిర్ణయాలు తీసుకోవడంలో అతని ప్రతిభ, పట్టుదల ఎలాంటివో మధ్యప్రదేశ్ కెప్టెన్గా దగ్గరి నుంచి చూశాం.సహచరులతో కలిసిపోవడం, వారికి అండగా నిలిచే తత్వం కూడా మంచి సారథికి ఉండాల్సిన మరో లక్షణం’ అని ఆర్సీబీ హెడ్ కోచ్ ఆండీ ఫ్లవర్ అన్నాడు. మరోవైపు కోహ్లికి మళ్లీ కెప్టెన్సీ ఇచ్చే విషయంపైచర్చించామన్న టీమ్ డైరెక్టర్ మో బొబాట్... ఎందుకు వద్దనుకున్నారనే ప్రశ్నపై తగిన సమాధానం ఇవ్వలేదు. కోహ్లి స్థాయి ఆటగాడికి ‘కెప్టెన్’ అనే హోదా అవసరం లేదని, తన సహజ నాయకత్వ లక్షణాలు జట్టుకు ఉపయోగపడతాయని అతను వ్యాఖ్యానించాడు.రజత్ పాటిదార్ (PC: RCB X)హడావిడి చేసే రకం కాదుఇక రజత్ పాటిదార్ మాట్లాడుతూ.. ‘‘నేను హడావిడి చేసే తరహా వ్యక్తిని కాదు కానీ మ్యాచ్లలో పరిస్థితులపై అవగాహన ఉంది. ఆటగాళ్లకు అండగా నిలిచి ఫలితాలు రాబడతా. టీమ్లో ఉన్న ఇతర ఆటగాళ్ల అనుభవమూ నాకు పనికొస్తుంది. ఇక కోహ్లినుంచి ఎంతో నేర్చుకునే అవకాశం ఉంది. అతని ఆలోచనలు, వ్యూహాలు కచ్చితంగా ఉపయోగించుకుంటా’’ అని తెలిపాడు.కోహ్లి విషెస్రజత్కు నా అభినందనలు. నీ ఆటతో ఎంతో మంది ఫ్యాన్స్ను ఆకట్టుకున్న నువ్వు ఈ హోదాకు అర్హుడవు. నువ్వు జట్టును ముందుకు తీసుకెళ్లగలవనే నమ్మకం ఉంది- విరాట్ కోహ్లి. -
ఆర్సీబీకి భారీ షాక్!
మహిళల ప్రీమియర్ లీగ్(WPL)-2025 ఆరంభానికి ముందే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వుమెన్స్ జట్టుకు భారీ షాక్ తగిలింది. ఇప్పటికే పలువురు ప్లేయర్లు గాయాల వల్ల ఈ టోర్నమెంట్కు దూరం కాగా.. తాజాగా స్టార్ స్పిన్నర్ ఆశా శోభన కూడా తప్పుకొంది.ఈ నేపథ్యంలో ఆమె స్థానాన్ని భారత వికెట్ కీపర్ బ్యాటర్ నుఝత్ పర్వీన్తో భర్తీ చేస్తున్నట్లు ఆర్సీబీ గురువారం ప్రకటన విడుదల చేసింది. ‘‘దురదృష్టవశాత్తూ.. మోకాలి గాయం కారణంగా మా చాంపియన్ ఆల్రౌండర్ ఆశా శోభన(Asha Sobhana) డబ్ల్యూపీఎల్-2025 మొత్తానికి దూరమైంది.స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ నుఝత్ పర్వీన్ ఈ సీజన్లో ఆశా శోభన స్థానాన్ని భర్తీ చేస్తుంది. నుఝత్ ఆర్సీబీకిలో నీకు స్వాగతం’’ ఆర్సీబీ సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని వెల్లడించింది.కాగా 33 ఏళ్ల లెగ్ స్పిన్నర్ ఆశా శోభన మహిళల టీ20 ప్రపంచకప్-2024 సందర్భంగా చివరగా భారత్కు ప్రాతినిథ్యం వహించింది. నాడు గ్రూప్ దశలో భాగంగా ఆస్ట్రేలియాతో మ్యాచ్లో ఆమె గాయపడింది. అయితే, ఇంత వరకు కోలుకోలేదు. ఈ నేపథ్యంలో డబ్ల్యూపీఎల్ తాజా ఎడిషన్ మొత్తానికి ఆమె దూరమైంది.గత సీజన్లో ఆశా శోభన మొత్తంగా పన్నెండు వికెట్లు తీసి జట్టు చాంపియన్గా నిలవడంలో కీలక పాత్ర పోషించింది. ఇక ఇదివరకే సోఫీ మెలినెక్స్, కేట్ క్రాస్ గాయాల కారణంగా ఆర్సీబీకి దూరం కాగా.. సోఫీ డివైన్ టోర్నీ నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకుంది.మరోవైపు.. ఆల్రౌండర్ శ్రేయాంక పాటిల్ కూడా గాయం వల్ల స్వదేశంలో పలు సిరీస్లకు దూరమైన విషయం తెలిసిందే. కాబట్టి ఆమె ఆర్సీబీ తుదిజట్టులోకి వస్తుందా లేదా అన్నది కూడా ప్రశ్నార్థకంగా మారింది.ముంబై ఇండియన్స్లోకి పరుణిక సిసోడియాడబ్ల్యూపీఎల్ ఆరంభానికి ముందు ముంబై ఇండియన్స్కు కూడా గట్టి ఎదురుదెబ్బ తగిలింది. టీమిండియా స్టార్ ఆల్రౌండర్ పూజా వస్త్రాకర్ సీజన్ మొత్తానికి దూరమైంది. ఆమె స్థానంలో పరుణిక సిసోడియా జట్టులోకి వచ్చింది. కనీస ధర రూ. 10 లక్షలతో పరుణిక ముంబై ఇండియన్స్లో చేరింది.కాగా ఇటీవల జరిగిన మహిళల అండర్-19 వరల్డ్కప్ టోర్నీలో పరుణిక అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంది. ఈ క్రమంలో ముంబై ఇండియన్స్ నుంచి ఆమెకు పిలుపు రావడం గమనార్హం. ఇక ఫిబ్రవరి 14- మార్చి 15 వరకు మహిళల ప్రీమియర్ లీగ్ జరుగనుంది. ముంబై ఇండియన్స్ వుమెన్స్, ఆర్సీబీ వుమెన్స్, యూపీ వారియర్స్, గుజరాత్ జెయింట్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య మొత్తంగా 22 మ్యాచ్లు జరుగుతాయి. -
Virat Kohli: ఆర్సీబీ కెప్టెన్గా రజత్ పాటిదార్.. కోహ్లి కామెంట్స్ వైరల్
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) కొత్త కెప్టెన్ నియామకంపై ఆ జట్టు స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి(Virat Kohli) స్పందించాడు. సారథిగా ఎంపికైన రజత్ పాటిదార్(Rajat Patidar)కు శుభాకాంక్షలు చెప్పిన ఈ రన్మెషీన్.. కెప్టెన్సీకి అతడు వందశాతం అర్హుడని ప్రశంసలు కురిపించాడు. అతడికి ఎల్లప్పుడూ తన మద్దతు ఉంటుందని ప్రకటించాడు.కాగా ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL)-2025 సీజన్కు గానూ ఆర్సీబీ టీమిండియా ఆటగాడు రజత్ పాటిదార్ను తమ కెప్టెన్గా నియమించింది. సౌతాఫ్రికా వెటరన్ స్టార్ ఫాఫ్ డుప్లెసిస్ స్థానంలో ఈ మధ్యప్రదేశ్ క్రికెటర్కు పగ్గాలు అప్పగించింది. కాగా 2021లో ఆర్సీబీలో చేరిన పాటిదార్ను 2022 వేలానికి ముందు ఫ్రాంఛైజీ విడిచిపెట్టింది.కెప్టెన్ స్థాయికిఈ క్రమంలో అతడు వేలంలో అమ్ముడుపోకుండా మిగిలిపోగా.. రీప్లేస్మెంట్ ఆటగాడిగా మళ్లీ జట్టులోకి చేర్చుకుంది. అయితే, తన అద్బుత ఆట తీరుతో అతడు ఇప్పుడు కెప్టెన్ స్థాయికి చేరుకోవడం విశేషం. ఈ నేపథ్యంలో విరాట్ కోహ్లి రజత్ పాటిదార్ గురించి తన అభిప్రాయాలు పంచుకున్నాడు.‘‘ఆర్సీబీ కొత్త కెప్టెన్గా రజత్ పాటిదార్ ఎంపికయ్యాడు. నీకు శుభాభినందనలు రజత్. నిన్ను నువ్వు నిరూపించుకుని... ఫ్రాంఛైజీతో అనుబంధాన్ని పెంచుకుని.. ఇక్కడి దాకా వచ్చావు. ఆర్సీబీ అభిమానుల హృదయాల్లో చోటు సంపాదించావు. నీ ఎదుగుదల ఇక్కడితో ఆగిపోదు.కెప్టెన్గా నువ్వు అర్హుడివి. నాతో పాటు జట్టులోని సభ్యులంతా నీ వెన్నంటే ఉంటాము. నీ పాత్రను సమర్థవంతంగా పోషించేలా సహకారం అందిస్తాం. ఇదొక కీలకమైన బాధ్యత. గత కొన్నేళ్లుగా నేనూ, ఫాఫ్ సారథ్య బాధ్యతలను మోశాం. ఇప్పుడు నీకు ఆ గౌరవం దక్కింది. నువ్వు ఈ స్థాయికి చేరుకోవడం పట్ల నాకు సంతోషంగా ఉంది. ఇది నీ హక్కుకెప్టెన్గా ఉండటం ఒక రకంగా నీకు నువ్వుగా సంపాదించుకున్న హక్కు. గత రెండేళ్ల నీ ప్రయాణం అద్భుతం. టీమిండియా తరఫున కూడా అరంగేట్రం చేశావు. మధ్యప్రదేశ్ జట్టును ముందుకు నడిపించిన తీరు కూడా నన్ను ఆకట్టుకుంది. ఇక ఇప్పుడు అద్భుతమైన ఫ్రాంఛైజీ జట్టుకు సారథిగా నిన్ను నువ్వు మరోసారి నిరూపించుకోవాల్సిన సమయం వచ్చింది.రజత్ పాటిదార్కు మద్దతుగా ఉండాలని అభిమానులకు కోరుతున్నా. ఏది ఏమైనా.. చివరకు మన అందరికీ జట్టు ప్రయోజనాలు, గెలుపే ముఖ్యం. జట్టుగా ఎదుగుదాం. మన అద్బుతమైన ఫ్రాంఛైజీకి చిరస్మరణీయ విజయాలు అందిద్దాం. రజత్కు మరోసారి శుభాకాంక్షలు. అభిమానుల ప్రేమ మనకు ఎల్లప్పుడూ లభిస్తుంది. రానున్న సీజన్లో ఆర్సీబీ సరికొత్తగా అద్భుతంగా సాగాలని ఆకాంక్షిస్తున్నా’’ అని మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి వీడియో సందేశంలో పేర్కొన్నాడు.కాగా గతేడాది.. రజత్ పాటిదార్ దేశీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో మధ్యప్రదేశ్ జట్టును ఫైనల్కు చేర్చాడు. ఇక ఐపీఎల్ కెరీర్లో 27 మ్యాచ్లు ఆడిన పాటిదార్ ఓ శతకం, ఏడు అర్ధ శతకాల సాయంతో 799 పరుగులు చేశాడు. ఇక తొమ్మిదేళ్లపాటు ఆర్సీబీ కెప్టెన్గా వ్యవహరించిన కోహ్లి 2022 సీజన్కు ముందు సారథ్య బాధ్యతల నుంచి వైదొలిగిన విషయం తెలిసిందే.చదవండి: క్రెడిట్ అతడికే ఇవ్వాలి.. నా స్థానంలో ఎవరున్నా జరిగేది అదే: రోహిత్ శర్మ 𝐊𝐢𝐧𝐠 𝐊𝐨𝐡𝐥𝐢 𝐀𝐩𝐩𝐫𝐨𝐯𝐞𝐬! 💌“Myself and the other team members will be right behind you, Rajat”: Virat Kohli“The way you have grown in this franchise and the way you have performed, you’ve made a place in the hearts of all RCB fans. This is very well deserved.”… pic.twitter.com/dgjDLm8ZCN— Royal Challengers Bengaluru (@RCBTweets) February 13, 2025 -
రీ ఎంట్రీ ఇస్తా.. క్రికెట్ ఆడాలని ఉంది.. కానీ: డివిలియర్స్
సౌతాఫ్రికా క్రికెట్ దిగ్గజం ఏబీ డివిలియర్స్(AB De Villiers) అభిమానులకు శుభవార్త చెప్పాడు. తాను తిరిగి కాంపిటేటివ్ క్రికెట్ ఆడేందుకు ఆసక్తిగా ఉన్నట్లు సంకేతాలు ఇచ్చాడు. అయితే, మరోసారి ప్రొఫెషనల్ క్రికెటర్గా మారి ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) లేదంటే.. సౌతాఫ్రికా టీ20 లీగ్లో మాత్రం ఆడలేనని స్పష్టం చేశాడు.లెజెండరీ బ్యాటర్గాకాగా 2004లో సౌతాఫ్రికా(South Africa) తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన డివిలియర్స్ లెజెండరీ బ్యాటర్గా ఎదిగాడు. ప్రొటిస్ జట్టు కెప్టెన్గానూ పనిచేశాడు. ఇక వికెట్ కీపర్గానూ సత్తా చాటిన ఈ కుడిచేతి వాటం ఆటగాడు.. తన కెరీర్లో 114 టెస్టులు, 228 వన్డేలు, 78 టీ20 మ్యాచ్లు ఆడాడు. ఆయా ఫార్మాట్లలో వరుసగా 8765, 9577, 1672 పరుగులు చేశాడు.ఇక డివిలియర్స్ ఖాతాలో ఖాతాలో 22 టెస్టు సెంచరీలు, 25 వన్డే శతకాలు ఉన్నాయి. ఐపీఎల్లో సుదీర్ఘ కాలం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(RCB)కు ప్రాతినిథ్యం వహించిన ఏబీడీ.. ఓవరాల్గా 184 మ్యాచ్లు ఆడి 5162 రన్స్ సాధించాడు. ఇందులో మూడు శతకాలు కూడా ఉండటం విశేషం.‘రియల్ క్రికెట్’ ఆడాలని ఉందికాగా 2021 నవంబరులో డివిలియర్స్ అన్ని ఫార్మాట్ల క్రికెట్ నుంచి వైదొలిగాడు. ప్రస్తుతం తన సమయంలో ఎక్కువ భాగం కుటుంబానికి కేటాయించిన ఏబీడీ.. చారిటి, బ్రాడ్కాస్టింగ్ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. ఈ నేపథ్యంలో మరోసారి తనకు ‘రియల్ క్రికెట్’ ఆడాలని ఉందంటూ అతడు వ్యాఖ్యానించడం విశేషం.ఈ విషయం గురించి మెలిండా ఫారెల్కు చెందిన యూట్యూబ్ చానెల్లో మాట్లాడుతూ.. ‘‘ఈరోజుకీ నేను క్రికెట్ ఆడగలననే నమ్మకంతో ఉన్నాను. అయితే, ఇప్పటి వరకు ఈ అంశంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. నా పిల్లలు మాత్రం నాపై ఒత్తిడి పెంచుతున్నారు. వాళ్లతో కలిసి నెట్స్లో ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు నాలో మళ్లీ క్రికెట్ ఆడాలనే కోరిక కలిగింది.ఏదో ఓ చోట కాంపిటేటివ్ క్రికెట్ ఆడాలని భావిస్తున్నా. అయితే, నేను ఆర్సీబీ గురించి మాత్రం మాట్లాడటం లేదు. ఐపీఎల్ లేదంటే సౌతాఫ్రికా టీ20 లీగ్లో మాత్రం పాల్గొనను. కేవలం నా పిల్లల కోసం, క్రికెట్ మీదున్న ప్రేమ కారణంగా మళ్లీ బరిలోకి దిగాలని భావిస్తున్నా.ఏదేమైనా మరోసారి ఒత్తిడిలోకి కూరుకుపోవాలని మాత్రం అనుకోవడం లేదు. కాస్త సరదాగా.. సంతృప్తికరంగా నా ఇన్నింగ్స్ ఉండాలని కోరుకుంటున్నా’’ అని 40 ఏళ్ల ఏబీ డివిలియర్స్ చెప్పుకొచ్చాడు.చదవండి: Ajinkya Rahane: రోహిత్ శర్మకు అంతా తెలుసు.. రిలాక్స్డ్గా ఉంటాడు -
నవశకం.. కొత్త కెప్టెన్ అతడే!.. ఆర్సీబీ హెడ్కోచ్ వ్యాఖ్యలు వైరల్
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ).. మూడుసార్లు ఫైనల్ చేరినా ఒక్కసారి కూడా ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) టైటిల్ గెలవలేకపోయింది. ప్రత్యర్థి జట్ల ఎత్తులకు చిత్తై.. ఆఖరి మెట్టుపై బోల్తా పడి ట్రోఫీని చేజార్చుకుంది. దీంతో.. ఈ క్యాష్ రిచ్ లీగ్ ఆరంభం నుంచే టీమిండియా సూపర్స్టార్ విరాట్ కోహ్లి(Virat Kohli) కెరీర్లో ఐపీఎల్ టైటిల్ లేని లోటు ఇప్పటికీ అలాగే ఉండిపోయింది.ఆర్సీబీ ముఖచిత్రంగా కోహ్లిఅయితే, ఈసారి మాత్రం ఆర్సీబీ తలరాత మారుతుందంటున్నాడు ఆ జట్టు హెడ్కోచ్ ఆండీ ఫ్లవర్(Andy Flower). అదే విధంగా కొత్త కెప్టెన్ గురంచి కూడా సంకేతాలు ఇచ్చాడు. కాగా ఆర్సీబీకి భారీ ఫాలోయింగ్ రావడానికి ప్రధాన కారణం కోహ్లినే అనడంలో సందేహం లేదు. తన ఇమేజీ ద్వారా ఆర్సీబీ ముఖచిత్రంగా మారిపోయిన ఈ రన్మెషీన్.. 2011లో తొలిసారి కెప్టెన్గా పగ్గాలు చేపట్టాడు.ఆ తర్వాత రెండేళ్లకు పూర్తిస్థాయి కెప్టెన్గా నియమితుడైన కోహ్లి.. 2016లో జట్టును ఫైనల్స్కు చేర్చాడు. కానీ తుదిపోరులో సన్రైజర్స్ హైదరాబాద్ చేతిలో ఆర్సీబీ ఓడిపోయి.. రిక్తహస్తాలతో వెనుదిరిగింది. ఆ తర్వాత కూడా చెప్పుకోదగ్గ విజయాలు సాధించలేకపోయింది. ఈ నేపథ్యంలో కెప్టెన్సీ భారాన్ని, పని ఒత్తిడిని తగ్గించుకునే క్రమంలో 2021లో సారథ్య బాధ్యతల నుంచి కోహ్లి వైదొలిగాడు.డుప్లెసిస్ సారథ్యంలోఈ క్రమంలో సౌతాఫ్రికా వెటరన్ బ్యాటర్ ఫాఫ్ డుప్లెసిస్(Faf Du Plesis) ఆర్సీబీ కెప్టెన్గా నియమితుడయ్యాడు. 2024 వరకు నాయకుడిగా జట్టును ముందుండి నడిపించాడు. అయితే, మెగా వేలానికి ముందు ఆర్సీబీ డుప్లెసిస్ను వదిలేసింది. ఆక్షన్ సమయంలోనే అతడిని కొనేందుకు ఆసక్తి చూపలేదు.ఈ నేపథ్యంలో ఆర్సీబీకి ఐపీఎల్-2025లో కొత్త కెప్టెన్ రావడం ఖాయమైంది. అతడు మరెవరో కాదు.. కోహ్లినే అంటూ ప్రచారం జరుగుతోంది. ఈ విషయమై స్పోర్ట్స్తక్తో మాట్లాడిన ఆండీ ఫ్లవర్ కీలక వ్యాఖ్యలు చేశాడు.నవశకం ఆరంభం‘‘నవశకం ఆరంభం కాబోతోంది. మూడేళ్ల సైకిల్లో ఊహించిన ఫలితాన్ని రాబట్టబోతున్నాం. అందరూ అనుకున్నదే నిజమయ్యే అవకాశం ఉంది. అయితే, ఇప్పటి వరకు అందుకు సంబంధించిన చర్చ జరుగలేదని మాత్రం చెప్పగలను’’ అని ఆండీ ఫ్లవర్ పేర్కొన్నాడు. అదే సమయంలో.. కోహ్లికే మరోసారి పగ్గాలు అప్పగించే అవకాశం ఉందని ఆండీ ఫ్లవర్ సంకేతాలు ఇచ్చాడు. మరోవైపు.. ఆర్సీబీ డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ మొ బొబాట్ సైతం కెప్టెన్సీ అంశం గురించి ఇంకా చర్చించలేదని చెప్పినా.. పరోక్షంగా కోహ్లి వైపే తాము మొగ్గుచూపే ఛాన్స్ ఉందని తెలియజేశాడు.తిరుగులేని కింగ్కాగా ఐపీఎల్ కెరీర్లో ఇప్పటి వరకు 252 మ్యాచ్లు ఆడిన విరాట్ కోహ్లి 8004 పరుగులు సాధించాడు. ఇందులో ఎనిమిది శతకాలతో పాటు.. 55 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అదే విధంగా 705 ఫోర్లు, 272 సిక్సర్లు ఈ కుడిచేతి వాటం బ్యాటర్ ఖాతాలో ఉన్నాయి. రైటార్మ్ మీడియం పేసర్ అయిన కోహ్లి ఐపీఎల్లో నాలుగు వికెట్లు కూడా తీయడం విశేషం. మూడేళ్ల షెడ్యూల్ ఇదేఇదిలా ఉంటే.. గతేడాది ప్లే ఆఫ్స్ చేరిన ఆర్సీబీ.. ఫైనల్లో మాత్రం అడుగుపెట్టలేకపోయింది. ఎలిమినేటర్ మ్యాచ్లోనే ఇంటిబాట పట్టింది. ఇక బీసీసీఐ ఇప్పటికే మూడేళ్ల ఐపీఎల్ షెడ్యూల్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఐపీఎల్-2025.. మార్చి 14- మే 25 వరకు.. ఐపీఎల్-2026.. మార్చి 15- మే 31 వరకు.. ఐపీఎల్- 2027.. మార్చి 14- మే 30 వరకు నిర్వహించనున్నారు. చదవండి: 'డబ్బులు తీసుకున్న కుక్కలు మొరుగుతూనే ఉంటాయి'.. భజ్జీ పోస్ట్ వైరల్ -
బుమ్రా తర్వాత బెస్ట్ బౌలర్.. భీకర ఫామ్లో ఆర్సీబీ పేసర్
ఐపీఎల్-2025 నేపథ్యంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) ఈసారి తమ పేస్ దళాన్ని మరింత పటిష్టం చేసుకుంది. మెగా వేలానికి ముందే యశ్ దయాళ్ను రిటైన్ చేసుకున్న ఆర్సీబీ.. వేలంలో భాగంగా టీమిండియా స్వింగ్ కింగ్ భువనేశ్వర్ కుమార్ను సొంతం చేసుకుంది. ఈ వెటరన్ పేసర్ కోసం ఏకంగా రూ. 10.75 కోట్లు ఖర్చు చేసింది.రిటెన్షన్స్ సమయంలో టీమిండియా ప్రస్తుత స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ను వదిలేసిన తర్వాత.. ఆర్సీబీ ఈ మేర అతడి స్థానాన్ని సీనియర్తో భర్తీ చేసుకుంది. ఈ నేపథ్యంలో భువీ గురించి ఆర్సీబీ కోచింగ్ సిబ్బందిలో భాగమైన దినేశ్ కార్తిక్ గతంలో చేసిన వ్యాఖ్యలు తాజాగా వైరల్ అవుతున్నాయి.అతడు బెస్ట్ టీ20 బౌలర్ఆర్సీబీ ప్రధాన కోచ్ ఆండీ ఫ్లవర్, మొ బొబాట్, ఓంకార్ సాల్వీలతో డీకే మాట్లాడుతూ.. ‘‘బుమ్రా తర్వాత.. ఇప్పటికీ తన ప్రభావం చూపగలుగుతున్న అత్యుత్తమ బౌలర్ ఎవరైనా ఉన్నారా అంటే.. భువనేశ్వర్ కుమార్ పేరు చెబుతాను. అతడు బెస్ట్ టీ20 బౌలర్’’ అని ప్రశంసలు కురిపించాడు. అదే విధంగా.. కుర్ర పేసర్ రసీఖ్ సలాం గురించి ప్రస్తావనకు రాగా.. 24 ఏళ్ల ఈ ఆటగాడి నైపుణ్యాలు అద్భుతమని డీకే కొనియాడాడు. ఇందుకు సంబంధించిన వీడియోను ఓ నెటిజన్ పోస్ట్ చేయగా.. అభిమానులను ఆకర్షిస్తోంది.భీకర ఫామ్లో భువీభువనేశ్వర్ కుమార్ టీ20 ఫార్మాట్లో ప్రస్తుతం సూపర్ ఫామ్లో ఉన్నాడు. దేశీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఉత్తరప్రదేశ్ కెప్టెన్గా వ్యవహరించిన ఈ స్వింగ్ సుల్తాన్.. ఎనిమిది ఇన్నింగ్స్లో కలిపి పదకొండు వికెట్లు పడగొట్టాడు. ఇందులో ఒక హ్యాట్రిక్ కూడా ఉంది. ఇక భువీ ఈ టోర్నీలో ఇప్పటి వరకు సగటు 12.90తో ఎకానమీ రేటు 5.64గా నమోదు చేయడం విశేషం. అంతేకాదు సారథిగానూ జట్టును విజయపథంలో నడిపి క్వార్టర్ ఫైనల్లో నిలిపి.. సెమీస్ రేసులోకి తెచ్చాడు.ఐపీఎల్-2025లో ఆర్సీబీ జట్టువిరాట్ కోహ్లి (రూ. 21 కోట్లు) రజత్ పాటిదార్ (రూ.11 కోట్లు) యశ్ దయాళ్ (రూ. 5 కోట్లు) జోష్ హాజల్వుడ్ (రూ.12.50 కోట్లు) ఫిల్ సాల్ట్ (రూ.11.50 కోట్లు) జితేశ్ శర్మ (రూ.11 కోట్లు) భువనేశ్వర్ కుమార్ (రూ.10.75 కోట్లు) లియామ్ లివింగ్స్టోన్ (రూ.8.75 కోట్లు) రసిఖ్ ధార్ (రూ.6 కోట్లు) కృనాల్ పాండ్యా (రూ. 5.75 కోట్లు) టిమ్ డేవిడ్ (రూ. 3 కోట్లు) జాకబ్ బెథెల్ (రూ. 2.60 కోట్లు) సుయాశ్ శర్మ (రూ.2.60 కోట్లు) దేవ్దత్ పడిక్కల్ (రూ. 2 కోట్లు) తుషార (రూ. 1.60 కోట్లు) రొమరియో షెఫర్డ్ (రూ. 1.50 కోట్లు లుంగి ఇన్గిడి (రూ. 1 కోటి) స్వప్నిల్ సింగ్ (రూ.50 లక్షలు) మనోజ్ (రూ. 30 లక్షలు) మోహిత్ రాఠి (రూ. 30 లక్షలు) అభినందన్ (రూ. 30 లక్షలు) స్వస్తిక్ చికార (రూ. 30 లక్షలు) .చదవండి: కెప్టెన్ ఫామ్లో లేకుంటే కష్టమే.. రోహిత్ ఇకనైనా..: ఛతేశ్వర్ పుజారా -
IPL 2025: ఆర్సీబీ కెప్టెన్ అతడే!
ఐపీఎల్-2025 మెగా వేలం ముగిసింది. సౌదీ అరేబియా వేదికగా రెండు రోజులపాటు జరిగిన ఆక్షన్లో ఫ్రాంఛైజీలు తాము కోరుకున్న ఆటగాళ్లను సొంతం చేసుకున్నాయి. ఇక వచ్చే సీజన్లో టైటిల్ లక్ష్యంగా ముందుకు సాగే క్రమంలో ప్రణాళికలు సిద్ధం చేసుకోవడమే తరువాయి. సారథులు వీరేనా?అయితే, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ), పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్, కోల్కతా నైట్ రైడర్స్ తదితర జట్లు రిటెన్షన్కు ముందే తమ కెప్టెన్లను వదిలేశాయి. ఈ క్రమంలో... వేలం ముగిసిన తర్వాత ఆయా జట్ల సారథుల నియామకంపై విశ్లేషకులు ఓ అంచనాకు వచ్చారు. పంజాబ్కు శ్రేయస్ అయ్యర్, ఢిల్లీకి కేఎల్ రాహుల్, లక్నోకు రిషభ్ పంత్, కోల్కతాకు వెంకటేశ్ అయ్యర్ కెప్టెన్లుగా వ్యవహరిస్తారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, ఆర్సీబీ విషయంలో మాత్రం క్లారిటీ రావడం లేదు.కోహ్లి తిరిగి పగ్గాలు చేపడతాడా?ఆర్సీబీ స్టార్ విరాట్ కోహ్లి తిరిగి పగ్గాలు చేపడతాడా? లేదంటే.. కెప్టెన్సీ అనుభవం ఉన్న రజత్ పాటిదార్, భువనేశ్వర్ కుమార్, ఫిల్ సాల్ట్, లియామ్ లివింగ్స్టోన్లలో ఒకరికి సారథ్య బాధ్యతలు ఇస్తారా అన్నది చర్చనీయాంశంగా మారింది. వీరిలో ఇంగ్లండ్ స్టార్లు సాల్ట్, లివింగ్స్టోన్లకు ది హండ్రెడ్, ఇంగ్లండ్ లిస్ట్-ఎ టోర్నీల్లో నాయకులుగా వ్యవహరించారు.మరోవైపు.. భారత క్రికెటర్లలో రజత్ పాటిదార్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో మధ్యప్రదేశ్కు కెప్టెన్గా ఉండగా.. భువీ ఉత్తరప్రదేశ్ సారథిగా పనిచేస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఆర్సీబీ కెప్టెన్సీ అంశంపై సౌతాఫ్రికా దిగ్గజం, బెంగళూరు మాజీ స్టార్ క్రికెటర్ ఏబీ డివిలియర్స్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఆర్సీబీ కెప్టెన్ అతడే!‘‘ఇప్పటి వరకు ఆర్సీబీ కెప్టెన్ ఎవరో ఖరారు కాలేదు. అయితే, కోహ్లినే తిరిగి కెప్టెన్ అవుతాడని భావిస్తున్నా. ప్రస్తుతం ఉన్న జట్టును బట్టి చూస్తే ఇదే జరుగుతుందని అనిపిస్తోంది’’ అని ఏబీడీ హిందుస్తాన్ టైమ్స్తో వ్యాఖ్యానించాడు. కాగా 2021లో కోహ్లి ఆర్సీబీ కెప్టెన్సీ వదిలేయగా.. సౌతాఫ్రికా స్టార్ ఫాఫ్ డుప్లెసిస్ మూడేళ్ల పాటు సారథ్యం వహించాడు. అయితే, ఈసారి వేలానికి ముందే ఆర్సీబీ అతడిని విడిచిపెట్టింది.ఫామ్లో ఉంటే అతడిని ఎవరూ ఆపలేరుఇదిలా ఉంటే.. ఆర్సీబీ బౌలింగ్ విభాగం గురించి డివిలియర్స్ ప్రస్తావిస్తూ.. ‘‘భువనేశ్వర్ కుమార్, జోష్ హాజిల్వుడ్ జట్టులోకి రావడం సానుకూలాంశం. రబడ లేడు.. గానీ.. లుంగి ఎంగిడిని దక్కించుకోగలిగారు. స్లో బాల్తో అతడు అద్భుతాలు చేయగలడు. ఒకవేళ ఎంగిడి ఫిట్గా ఉండి ఫామ్ కొనసాగిస్తే అతడిని ఎవరూ ఆపలేరు’’ అని పేర్కొన్నాడు. కాగా వచ్చే మార్చి 14- మే 25 వరకు ఐపీఎల్ 2025 సీజన్ నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది.చదవండి: వేలంలో ఎవరూ కొనలేదు..! రిటైర్మెంట్ ప్రకటించిన టీమిండియా క్రికెటర్ -
అప్పుడు రూ. 20 లక్షలు.. ఇప్పుడు రూ. 11 కోట్లు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలిసారి
ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) చరిత్రలో అత్యంత ఎక్కువ ధరకు అమ్ముడుపోయిన ఆటగాడు ఎవరనగానే ఠక్కున.. టీమిండియా స్టార్ రిషభ్ పంత్ పేరు చెప్పేస్తారు క్రికెట్ ప్రేమికులు. ఇక అతడి తర్వాతి స్థానాల్లో ఉన్నది ఎవరంటే.. మరో ఇద్దరు భారత స్టార్లు శ్రేయస్ అయ్యర్, వెంకటేశ్ అయ్యర్. మరి ఈ ముగ్గురికి సాధ్యంకాని రీతిలో ఓ అరుదైన ఫీట్ సాధించిన ఆటగాడు మరొకడు ఉన్నాడు.క్యాష్ రిచ్ లీగ్ చరిత్రలోనే అత్యధిక హైక్ పొందిన ప్లేయర్గా చరిత్ర సృష్టించాడు. ఏకంగా 5500 శాతం హైక్తో కోట్లు కొలగొట్టాడు. ఇంతకీ అతడు ఎవరా అంటారా?!.... టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ జితేశ్ శర్మ. అవును.. ఐపీఎల్లో ఇంత వరకు ఎవరికీ సాధ్యం కాని రీతిలో జితేశ్ ఏకంగా ఈసారి వేలంలో తన పాత ధర కంటే.. 5500 శాతం ఎక్కువ మొత్తం పలికాడు.21 నిమిషాల వ్యవధిలోనే సౌదీ అరేబియాలోని జెద్దా నగరంలో రెండురోజుల పాటు జరిగిన వేలంలో.. మొదటిరోజే రికార్డులు బ్రేకైన విషయం తెలిసిందే. టీమిండియా పేసర్ అర్ష్దీప్ సింగ్ను రూ. 18 కోట్లను పంజాబ్ కింగ్స్ కొనుగోలు చేయగా.. ఆ తర్వాత శ్రేయస్ అయ్యర్ కోసం రికార్డు స్థాయిలో ఏకంగా రూ. 26.75 కోట్లు ఖర్చు చేసింది. దీంతో ఐపీఎల్లో అత్యధిక ధరకు అమ్ముడుపోయిన ఆటగాడిగా అయ్యర్ నిలిచాడు.అయితే, 21 నిమిషాల వ్యవధిలోనే అతడి రికార్డును రిషభ్ పంత్ బద్దలుకొట్టాడు. లక్నో సూపర్ జెయింట్స్ ఈ వికెట్ కీపర్ను ఏకంగా రూ. 27 కోట్లకు కొనుగోలు చేసింది. అయితే, ఐపీఎల్-2024 సీజన్లో శ్రేయస్ అయ్యర్ కోల్కతా నైట్ రైడర్స్ కెప్టెన్గా ఉన్న విషయం తెలిసిందే. జట్టును చాంపియన్గా నిలిపిన అతడు కేకేఆర్ నుంచి 2022 వేలంలో రూ. 12.25 కోట్లు అందుకున్నాడు. అంతే మొత్తానికి ఈసారీ ఆడాడు.అర్ష్దీప్ హైక్ 3500 శాతానికి పైనే!అయితే, ఈసారి వేలంలో రూ. 26.75 కోట్లు దక్కించుకోవడంతో అయ్యర్కు 200 శాతం మేర హైక్ లభించినట్లయింది. మరోవైపు అర్ష్దీప్ గతంలో రూ. 4 కోట్లే అందుకున్నాడు. ఈసారి ఏకంగా రూ. 18 కోట్లు దక్కించుకున్నాడు. అంటే అర్ష్దీప్ హైక్ 3500 శాతానికి పైనే!ఇక రిషభ్ పంత్ ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్గా గతంలో రూ. 16 కోట్లు అందుకోగా.. ఈసారి 11 కోట్ల మేర హైక్ పొందాడు. మరోవైపు.. లెగ్ స్పిన్నర్ యుజువేంద్ర చహల్ కూడా భారీ జంప్ కొట్టాడు. చివరగా రాజస్తాన్ రాయల్స్కు ఆడిన చహల్ పాత ధర రూ. 6జ5 కోట్లు.. ఈసారి పంజాబ్ కింగ్స్ అతడి కోసం ఏకంగా రూ. 18 కోట్లు ఖర్చు చేసింది.20 లక్షల నుంచి 11 కోట్లకు భారీ జంప్మరి జితేశ్ శర్మ ధర సంగతి ఏమిటంటారా?!.. ఐపీఎల్ 2022 మెగా వేలంలో పంజాబ్ కింగ్స్ ఈ విదర్భ ఆటగాడిని రూ. 20 లక్షల కనీస ధరకు కొనుక్కుంది. 2024 వరకు అదే ధరకు అతడిని కొనసాగించింది. అయితే, ఈసారి వేలంలో జితేశ్కు డిమాండ్ రాగా.. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు అతడిని రూ. 11 కోట్లకు సొంతం చేసుకుంది. అలా 20 లక్షల నుంచి 11 కోట్లకు భారీ జంప్ కొట్టాడు.నిజానికి 2024 ఎడిషన్లో జితేశ్ పెద్దగా రాణించలేదు. 131 స్ట్రైక్రేటుతో కేవలం 187 పరుగులే చేశాడు. అయినప్పటికీ భారీ ధర పలకడానికి కారణం అతడి వికెట్ కీపింగ్ నైపుణ్యాలు. అంతేకాదు పొట్టిఫార్మాట్లో లోయర్ ఆర్డర్లో ఫినిషర్గానూ జితేశ్కు మంచి రికార్డు ఉంది. ఇక దినేశ్ కార్తిక్ రిటైర్మెంట్ తర్వాత ఆర్సీబీకి వికెట్ కీపర్ బ్యాటర్ అవసరం కూడా ఉండటంతో జితేశ్ పంట ఇలా పండింది. చదవండి: KKR: అతడు 12 కోట్లకే వచ్చేవాడు.. ఇషాన్ కూడా చీప్.. అయినా ఎందుకిలా? -
IPL 2025: గుడ్ బై.. స్వింగ్ కింగ్ భావోద్వేగం!.. ఆరెంజ్ ఆర్మీపై భువీ పోస్ట్
టీమిండియా వెటరన్ పేసర్ భువనేశ్వకుమార్ భావోద్వేగానికి లోనయ్యాడు. సన్రైజర్స్ హైదరాబాద్తో తన పదకొండేళ్ల సుదీర్ఘ ప్రయాణం ముగిసిపోయిందన్నాడు. ఈ జట్టుతో తనకెన్నో మరపురాని, మధురజ్ఞాపకాలు ఉన్నాయంటూ భారమైన హృదయంతో వీడ్కోలు పలికాడు. ఈ సందర్భంగా ఆరెంజ్ ఆర్మీని ఉద్దేశించి భువీ ఉద్వేగపూరిత వ్యాఖ్యలు చేశాడు.కరగని కావ్య మనసు!కాగా ఐపీఎల్ మెగా వేలం-2025కి ముందు సన్రైజర్స్ హైదరాబాద్ భువీని వదిలేసిన విషయం తెలిసిందే. అయితే, ఆక్షన్లోనైనా అతడిని కొనుగోలు చేయాలని సన్రైజర్స్ యజమాని కావ్యా మారన్కు అభిమానులు సోషల్ మీడియా వేదికగా విజ్ఞప్తి చేశారు. అయితే, ఆరెంజ్ ఆర్మీ కోరుకున్నది జరుగలేదు.భువీ కోసం పోటీ పడ్డ ముంబై, లక్నోసౌదీ అరేబియాలోని జెద్దా నగరంలో జరిగిన వేలంలో భువనేశ్వర్ కుమార్ కోసం సన్రైజర్స్ ఎలాంటి ప్రయత్నం చేయలేదు. రూ. 2 కోట్ల కనీస ధరతో అందుబాటులో ఉన్న భువీ కోసం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) ఆది నుంచి ఆసక్తి చూపించింది. రూ. 10.75 కోట్లకు ఆర్సీబీ సొంతంముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జెయింట్స్లతో పోటీపడి మరీ ధరను రూ. 10 కోట్లకు పెంచింది. ఆ తర్వాత కూడా లక్నో పోటీకి రాగా.. ఒక్కసారిగా 75 లక్షలు పెంచి రూ. 10.75 కోట్లకు ఆర్సీబీ భువీని సొంతం చేసుకుంది.సన్రైజర్స్ టైటిల్ గెలవడంలో భువీది కీలక పాత్రకాగా ఉత్తరప్రదేశ్కు చెందిన కుడిచేతి వాటం పేసర్ భువనేశ్వర్ కుమార్ 2011లో ఐపీఎల్లో ఎంట్రీ ఇచ్చాడు. 2013లో సన్రైజర్స్తో చేరిన అతడు 2024 వరకు జట్టుతోనే కొనసాగాడు. 2016లో సన్రైజర్స్ టైటిల్ గెలవడంలో భువీది కీలక పాత్ర. ఆ ఏడాది అతడు 23 వికెట్లతో చెలరేగాడు. ఆ తర్వాతి సీజన్లో అత్యుత్తమంగా 26 వికెట్లు పడగొట్టాడు. కానీ.. అప్పటి నుంచి ఒక్కసారి కూడా మళ్లీ 20 వికెట్లు కూడా తీయలేకపోయాడు. దీంతో వేలానికి ముందు సన్రైజర్స్ భువీని వదిలేసింది. ఈ నేపథ్యంలో తమ హార్ట్బ్రేక్ అయిందని ఆరెంజ్ ఆర్మీ నెట్టింట భువీ పేరును ట్రెండ్ చేసింది.గుడ్ బై.. ఆరెంజ్ ఆర్మీఈ నేపథ్యంలో భువనేశ్వర్కుమార్ తాజాగా ఎక్స్ వేదికగా ఆరెంజ్ ఆర్మీని ఉద్దేశించి వీడియో షేర్ చేశాడు. ‘‘ఎస్ఆర్హెచ్తో అద్భుతమైన పదకొండేళ్ల ప్రయాణానికి ఇక వీడ్కోలు. ఇక్కడ నాకెన్నో మరుపురాని చిర్మసరణీయ జ్ఞాపకాలు ఉన్నాయి. అయితే, మీ ప్రేమను మాత్రం మిస్ అవ్వను. మీ మద్దతను ఎన్నటికీ మరువను. మీరు, మీ మద్దతే నా బలం. నా ప్రయాణాన్ని అద్భుతంగా మలిచినందుకు ధన్యవాదాలు. నాపై మీ ప్రేమ ఇలాగే కొనసాగాలి’’ అని 34 ఏళ్ల భువీ ఉద్వేగానికి లోనయ్యాడు. ఇక వచ్చే ఏడాది ఈ స్వింగ్ కింగ్ ఆర్సీబీ జెర్సీలో దర్శనమివ్వబోతున్నాడు.చదవండి: KKR: అతడు 12 కోట్లకే వచ్చేవాడు.. ఇషాన్ కూడా చీప్.. అయినా ఎందుకిలా?After 11 incredible years with SRH, I say goodbye to this team. I have so many unforgettable and cherishable memories.One thing unmissable is the love of the fans which has been splendid! Your support has been constant.I will carry this love and support with me forever 🧡 pic.twitter.com/SywIykloHp— Bhuvneshwar Kumar (@BhuviOfficial) November 28, 2024After 11 incredible years with SRH, I say goodbye to this team. I have so many unforgettable and cherishable memories.One thing unmissable is the love of the fans which has been splendid! Your support has been constant.I will carry this love and support with me forever 🧡 pic.twitter.com/SywIykloHp— Bhuvneshwar Kumar (@BhuviOfficial) November 28, 2024 -
బిగ్బాస్ ఫేమ్, నటితో సిరాజ్ డేటింగ్?.. రూమర్లకు కారణం ఇదే!
టీమిండియా స్టార్ క్రికెటర్, హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్కు ఐపీఎల్ మెగా వేలం-2025లో భారీ మొత్తమే దక్కింది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు అతడిని వదిలేసినా.. గుజరాత్ టైటాన్స్ పట్టుబట్టి మరీ కొనుగోలు చేసింది. రూ.12.25 కోట్లు వెచ్చించి సిరాజ్ను సొంతం చేసుకుంది. దీంతో వచ్చే ఏడాది అతడు టైటాన్స్ జెర్సీలో దర్శనమివ్వబోతున్నాడు.ఇదిలా ఉంటే.. సిరాజ్ వ్యక్తిగత విషయానికి సంబంధించిన వార్త ఒకటి నెట్టింట వైరల్గా మారింది. బాలీవుడ్కు చెందిన ఓ నటితో అతడు డేటింగ్ చేస్తున్నాడనేది దాని సారాంశం. సదరు నటి పేరు మహీరా శర్మ అని, ఆమె హిందీ బిగ్బాస్ 13 కంటెస్టెంట్ అని సమాచారం.రూమర్లకు కారణం ఇదే!అయితే, సిరాజ్ గురించి ఇలాంటి వదంతులు పుట్టుకురావడానికి కారణం మాత్రం మహీరా ఇన్స్టా పోస్టులు. మహీరా తాను బ్లాక్ కలర్ డ్రెస్తో గ్లామరస్ లుక్లో కనిపిస్తున్న ఫొటోలను షేర్ చేయగా.. సిరాజ్ వాటిని లైక్ చేశాడు. లైక్ కొట్టినంత మాత్రానఅంతే.. ఇందుకు సంబంధించిన స్క్రీన్షాట్లతో వీరిద్దరి పేర్లను ముడిపెట్టి గాసిప్రాయుళ్లు తమకు నచ్చిన రీతిలో కథనాలు అల్లేస్తున్నారు. దీంతో సిరాజ్ అభిమానులు ఫైర్ అవుతున్నారు. లైక్ కొట్టినంత మాత్రాన ఇలాంటి అసత్యపు ప్రచారం చేయడం తగదని హితవు పలుకుతున్నారు. క్రికెట్కు- బాలీవుడ్కు విడదీయరాని అనుబంధంకాగా క్రికెట్కు- బాలీవుడ్కు విడదీయరాని అనుబంధం ఉన్న విషయం తెలిసిందే. నాటి క్రికెటర్ పటౌడీ అలీఖాన్ నుంచి జహీర్ ఖాన్, హర్భజన్ సింగ్, యువరాజ్ సింగ్, విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్ వరకు బాలీవుడ్ నటీమణులను పెళ్లాడిన క్రికెటర్లు ఎంతో మంది ఉన్నారు.గతంలో వీరిపై కూడా ఇలాంటి ప్రచారమేఇక భారత ఆల్రౌండర్, వేలంలో రూ. 23.75 కోట్లతో(కేకేఆర్) జాక్పాట్ కొట్టిన వెంకటేశ్ అయ్యర్ కూడా సిరాజ్ మాదిరే ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. టాలీవుడ్ నటి ప్రియాంక జువాల్కర్ ఫొటోలకు లైక్ కొట్టినందుకు వచ్చిన చిక్కు అది. అయితే, ఇటీవలే అతడు పెళ్లి చేసుకోవడంతో రూమర్లకు చెక్ పడింది. శుబ్మన్ గిల్- సారా అలీఖాన్ల పేర్లు కూడా ఇలాగే వైరల్ అయ్యాయి.అంతేకాదు.. టీమిండియా ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా గురించి గతంలో ఇలాంటి వార్తలే వచ్చాయి. నటి అనుపమా పరమేశ్వరన్ పేరుతో అతడిని ముడిపెట్టగా.. స్పోర్ట్స్ ప్రజెంటర్ సంజనా గణేషన్ను పెళ్లాడిన బుమ్రా.. వదంతులు వ్యాప్తి చేసేవారి నోళ్లు మూయించాడు.ఆస్ట్రేలియా పర్యటనలోఇదిలా ఉంటే.. సిరాజ్ ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్నాడు. బోర్డర్- గావస్కర్ ట్రోఫీ ఆడేందుకు టీమిండియాతో అక్కడికి వెళ్లాడు. ఇక ఇరుజట్ల మధ్య పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్టుకు కెప్టెన్గా వ్యవహరించిన బుమ్రా.. జట్టుకు భారీ విజయం అందించాడు. ఈ మ్యాచ్లో టీమిండియా ఏకంగా 295 పరుగుల తేడాతో గెలిచి ఆసీస్ గడ్డపై అతిపెద్ద విజయంతో చరిత్ర సృష్టించింది. ఈ టెస్టులో సిరాజ్ ఐదు వికెట్లు పడగొట్టాడు.చదవండి: IPL 2025: ఓపెనర్లుగా డేవిడ్ వార్నర్, పృథ్వీ షా..! View this post on Instagram A post shared by Tellychakkar Official ® (@tellychakkar) -
ఆరెంజ్ ఆర్మీ హార్ట్బ్రేక్.. కావ్యా మేడమ్ ఇలా ఎందుకు చేసింది!
ఆరెంజ్ ఆర్మీ అభిమానులకు చేదువార్త. టీమిండియా వెటరన్ పేసర్ భువనేశ్వర్ కుమార్కు సన్రైజర్స్ హైదరాబాద్తో బంధం తెగిపోయింది. ఐపీఎల్ మెగా వేలం-2025కి ముందు రిటెన్షన్స్లో భాగంగా సన్రైజర్స్ భువీని వదిలేసింది.అయితే, కనీసం రైట్ టు మ్యాచ్ కార్డు ద్వారానైనా భువీని తిరిగి సొంతం చేసుకుంటే బాగుండని సన్రైజర్స్ అభిమానులు భావించారు. కానీ.. వారికి నిరాశే మిగిలింది. వచ్చే ఏడాది భువనేశ్వర్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు(ఆర్సీబీ) ఆడబోతున్నాడు. కాగా సౌదీ అరేబియాలోని జెద్దా నగరంలో ఆదివారం మెగా వేలం మొదలైంది.ఈ క్రమంలో సోమవారం నాటి ఆఖరి రోజు ఆక్షన్లో భాగంగా భువీ రూ. 2 కోట్ల కనీస ధరతో అందుబాటులోకి వచ్చాడు. ఆక్షనీర్ మల్లికా సాగర్ భువీ పేరు చెప్పగానే ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జెయింట్స్ రంగంలోకి దిగాయి. తగ్గేదేలే అన్నట్లు పోటీపడుతూ ఏకంగా రూ. 9 కోట్ల వరకు తలపడ్డాయి.అయితే, ఆ తర్వాత లక్నో భువీ ధరను రూ. 10 కోట్లకు పెంచిన తర్వాత ముంబై పోటీ నుంచి తప్పుకొంది. దీంతో లక్నోకు భువీ సొంతమవుతాడని అంతా భావించారు. కానీ అనూహ్యంగా ఆర్సీబీ రేసులోకి దూసుకువచ్చింది. అమాంతం రూ. 75 లక్షలు పెంచి.. మొత్తంగా 10.75 కోట్ల రూపాయలకు భువీని బెంగళూరు దక్కించుకుంది.సన్రైజర్స్తో సుదీర్ఘ అనుబంధంఉత్తరప్రదేశ్కు చెందిన భువనేశ్వర్ కుమార్ 2011లో ఐపీఎల్లో అడుగుపెట్టాడు. తొలి సీజన్లో పుణె వారియర్స్(ఇప్పుడు లేదు) జట్టుకు ఆడాడు భువీ. ఏడు కంటే తక్కువ ఎకానమీతో 2013లో 13 వికెట్లు తీసి సత్తా చాటిన ఈ రైటార్మ్ ఫాస్ట్ మీడియం పేసర్ను.. 2014లో సన్రైజర్స్ దక్కించుకుంది.సన్రైజర్స్ ను చాంపియన్గా నిలపడంలో కీలకంరైజర్స్ తరఫున 2016లో భువీ 23 వికెట్లతో దుమ్ములేపి జట్టును చాంపియన్గా నిలపడంలో కీలక పాత్ర పోషించాడు. ఆ మరుసటి ఏడాది 26 వికెట్లతో దూసుకుపోయాడు. అయితే, ఆ తర్వాతి సీజన్ నుంచి భువీ ఒక్కసారి కూడా 20 వికెట్ల మార్కు అందుకోలేకపోయాడు. ఈ క్రమంలో సన్రైజర్స్ అతడిని వదిలేయడం గమనార్హం. అంతేకాదు వేలంలో కూడా అతడిపై ఏమాత్రం ఆసక్తి చూపలేదు.ఆరెంజ్ ఆర్మీ హార్ట్బ్రేక్.. కావ్యా మేడమ్ ఇలా ఎందుకు చేసింది!దీంతో ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ‘‘కావ్యా మేడమ్ భువీని తీసుకోవాల్సింది. నిన్ను కచ్చితంగా మిస్ అవుతావు భయ్యా!’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరికొంత మందేమో.. ‘‘నా బ్రేకప్ కంటే కూడా.. భువీ- సన్రైజర్స్ బ్రేకప్తోనే నేను ఎక్కువగా హర్ట్ అయ్యాను’’ అంటూ తమ బాధను పంచుకుంటున్నారు.కాగా గతంలో పలు సందర్భాల్లో భువీ సన్రైజర్స్ కెప్టెన్గానూ వ్యవహరించాడు.మరోవైపు.. ఆర్సీబీ అభిమానులు భువీ రాకతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇప్పటి వరకు భువీ మొత్తంగా 176 ఐపీఎల్ మ్యాచ్లు ఆడి 181 వికెట్లు తీశాడు. అత్యుత్తమ గణాంకాలు 5/19. కాగా గత కొంతకాలంగా ఈ యూపీ పేసర్కు టీమిండియాలో చోటు దక్కడం లేదు. అయితే, దేశీ టీ20లలో సత్తా చాటుతూ భువనేశ్వర్ వేలంలో ఈ మేర కోట్లు కొల్లగొట్టాడు.చదవండి: అదే మా కొంపముంచింది.. మరింత బలంగా తిరిగి వస్తాము: ఆసీస్ కెప్టెన్ -
వాషింగ్టన్ సుందర్పై ఆసక్తి చూపని ఫ్రాంఛైజీలు.. ఆఖరికి!
టీమిండియా యువ ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్కు ఐపీఎల్ మెగా వేలం-2025లో షాక్ తగిలింది. కనీస ధర రూ. 2 కోట్లతో ఆక్షన్లోకి వచ్చిన వాషీ కోసం తొలుత ఏ ఫ్రాంఛైజీ పెద్దగా ఆసక్తి చూపలేదు. కాసేపటికి.. గుజరాత్ టైటాన్స్ తొలుత బిడ్ వేసేందుకు ముందుకు వచ్చింది. కనీస ధరకు అతడిని దక్కించుకోవాలని చూసింది.ఈ క్రమంలో లక్నో సూపర్ జెయింట్స్ రంగంలోకి దిగగా.. గుజరాత్ కూడా వెనక్కి తగ్గలేదు. అయితే, ధర రూ. 3 కోట్లు దాటిన తర్వాత లక్నో తప్పుకోగా.. టైటాన్స్ ఆఖరికి రూ. 3.20 కోట్లకు వాషింగ్టన్ సుందర్ను దక్కించుకుంది. కాగా తమిళనాడుకు చెందిన వాషీ.. స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్.మూడు జట్లకుక్యాష్ రిచ్ లీగ్లో 2017లో రైజింగ్ పుణె సూపర్జెయింట్ తరఫున అడుగుపెట్టిన వాషీ.. ఆ ఏడాది ఎనిమిది వికెట్లు పడగొట్టాడు. అనంతరం 2018లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వాషీని రూ. 3.2 కోట్లకు కొనుక్కుంది. ఆర్సీబీ తరఫున అతడు మొత్తంగా 31 మ్యాచ్లు ఆడి 19 వికెట్లు తీశాడు.ఈ క్రమంలో 2022లో సన్రైజర్స్ హైదరాబాద్ వాషీని రూ. 8.75 కోట్లకు కొనుగోలు చేసి 2024 వరకు కొనసాగించింది. అయితే, ఐపీఎల్-2025 మెగా వేలానికి ముందు హైదరాబాద్ ఫ్రాంఛైజీ అతడిని వదిలేసింది. కాగా ఎస్ఆర్హెచ్ తరఫున వాషీకి పెద్దగా ఆడే అవకాశం రాలేదు. సన్రైజర్స్కు మొత్తంగా 18 మ్యాచ్లు ఆడిన వాషీ 10 వికెట్లు తీయడంతో పాటు 161 పరుగులు చేశాడు. ఇక వచ్చే ఏడాది అతడు గుజరాత్ టైటాన్స్కు ఆడబోతున్నాడు. ఇదిలా ఉంటే.. ఓవరాల్గా ఐపీఎల్లో వాషింగ్టన్ సుందర్ ఇప్పటి వరకు 60 మ్యాచ్లు ఆడి 378 రన్స్ చేయడంతో పాటు.. 37 వికెట్లు తీశాడు. -
సిరాజ్కు షాకిచ్చిన ఆర్సీబీ.. ఆఖరికి ఆ జట్టు సొంతం.. ధర మాత్రం..
ఐపీఎల్-2025లో టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ గుజరాత్ టైటాన్స్కు ఆడబోతున్నాడు. మెగా వేలంలో భాగంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) సిరాజ్కు షాకివ్వగా.. టైటాన్స్ మాత్రం భారీ మొత్తం వెచ్చించింది. కాగా హైదరాబాద్కు చెందిన సిరాజ్ సన్రైజర్స్ తరఫున 2017లో క్యాచ్ రిచ్ లీగ్లో అరంగేట్రం చేశాడు.ఏడేళ్లు అక్కడేఅయితే, ఆ మరుసటి ఏడాది(2018) ఆర్సీబీ అతడిని రెండున్నర కోట్లకు పైగా వెచ్చించి కొనుక్కుంది. 2022లో రూ. 7 కోట్ల భారీ ధరకు అట్టిపెట్టుకుని అంతే మొత్తానికి 2024 వరకు కొనసాగించింది. అయితే, 2025 మెగా వేలానికి ముందు ఆర్సీబీ సిరాజ్ను వదిలేసింది. దీంతో అతడు ఆక్షన్లోకి వచ్చాడు.చెన్నై కూడా రేసులోఈ క్రమంలో సౌదీ అరేబియాలోని జెద్దా నగరంలో జరిగిన ఆదివారం నాటి వేలంలో రూ. 2 కోట్ల కనీస ధరతో అతడు రేసులోకి వచ్చాడు. గుజరాత్ అతడి కోసం ఆదినుంచే పోటీ పడగా.. రాజస్తాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ కూడా ఆసక్తి చూపాయి. అయితే, రూ. 8 కోట్ల వరకు గుజరాత్తో నువ్వా- నేనా అన్నట్లు తలపడిన చెన్నై.. ఆ తర్వాత రేసు నుంచి నిష్క్రమించింది.మాకు వద్దు.. సిరాజ్ను మొత్తంగా వదిలేసుకున్న ఆర్సీబీఈ దశలో రాజస్తాన్ మళ్లీ పోటీకి రాగా.. గుజరాత్ రూ. 12.25 కోట్ల మెరుగైన ధరకు సిరాజ్ను సొంతం చేసుకుంది. అయితే, సిరాజ్ విషయంలో రైటు మ్యాచ్ కార్డును వినియోగించుకుంటారా అని ఆక్షనీర్ మల్లికా సాగర్ ఆర్సీబీని అడుగగా.. సదరు ఫ్రాంఛైజీ మాత్రం అంత ధర పెట్టే ఉద్దేశం తమకు లేదంటూ సిరాజ్ను మొత్తంగా వదిలేసుకుంది. ఇక ఐపీఎల్లో ఇప్పటి వరకు ఈ కుడిచేతి వాటం పేసర్ 93 మ్యాచ్లు ఆడి 93 వికెట్లు తీశాడు. ఇదిలా ఉంటే.. ఐపీఎల్లో సిరాజ్కు గుజరాత్ మూడో ఫ్రాంఛైజీ. అదే విధంగా ఇదే అత్యధిక ధర.ఇక ఐపీఎల్-2022 ద్వారాక్యాష్ రిచ్ లీగ్లో అరంగేట్రం చేసిన గుజరాత్ మొదటి ప్రయత్నంలోనే చాంపియన్గా నిలిచింది. గతేడాది రన్నరప్గా నిలిచింది. అయితే, ఈసారి మాత్రం ఎనిమిదో స్థానంతో సరిపెట్టుకుంది.చదవండి: IPL 2025 Mega Auction: కేఎల్ రాహుల్కు భారీ షాక్.. -
అతడికి రూ. 25- 28 కోట్లు.. ఆ ఫ్రాంఛైజీ సొంతం చేసుకోవడం ఖాయం!
ఐపీఎల్-2025 మెగా వేలంలో రిషభ్ పంత్ భారీ ధర పలకడం ఖాయమని భారత మాజీ క్రికెటర్ రాబిన్ ఊతప్ప అన్నాడు. ఈ వికెట్ కీపర్ కోసం ఫ్రాంఛైజీలు ఎగబడటం ఖాయమని.. లీగ్ చరిత్రలో అత్యధిక మొత్తానికి అమ్ముడుపోయిన ఆటగాడిగా పంత్ నిలుస్తాడని అంచనా వేశాడు.రూ. 25- 28 కోట్ల రూపాయలు కొల్లగొట్టబోతున్నాడుపంజాబ్ కింగ్స్ పంత్ను సొంతం చేసుకునేందుకు ఎక్కువగా ఆసక్తి చూపించవచ్చన్న ఊతప్ప.. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కూడా పంత్ కోసం పోటీపడే అవకాశం ఉందని అభిప్రాయపడ్డాడు. లక్నో సూపర్ జెయింట్స్, చెన్నై సూపర్ కింగ్స్ కూడా పంత్ వైపు మొగ్గుచూపుతాయని అంచనా వేసిన ఊతప్ప.. ఏదేమైనా ఈసారి అతడు వేలంలో రూ. 25- 28 కోట్ల రూపాయలు కొల్లగొట్టబోతున్నాడని జోస్యం చెప్పాడు.కాగా ఘోర రోడ్డు ప్రమాదం కారణంగా గతేడాది ఐపీఎల్కు దూరమైన పంత్.. కోలుకున్న తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్గా రీఎంట్రీ ఇచ్చాడు. ఐపీఎల్-2024లో 446 పరుగులు చేసిన ఈ వికెట్ కీపర్.. సారథిగా మాత్రం ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. పంత్ కెప్టెన్సీ ఢిల్లీ ఈసారి పద్నాలుగు మ్యాచ్లలో కేవలం ఏడు గెలిచి.. 14 పాయింట్లతో పట్టికలో ఆరోస్థానంలో నిలిచింది.ఈ నేపథ్యంలో మెగా వేలానికి ముందు ఢిల్లీ ఫ్రాంఛైజీ రిషభ్ పంత్ను రిలీజ్ చేసింది. ఈ నేపథ్యంలో ఓ క్రీడా చానెల్ నిర్వహించిన చర్చా కార్యక్రమంలో పాల్గొన్న భారత దిగ్గజం సునిల్ గావస్కర్ మాట్లాడుతూ.. పంత్ ను ఢిల్లీ క్యాపిటల్స్ తిరిగి తీసుకునే అవకాశముందని సూచనప్రాయంగా వెల్లడించాడు. ‘ఆటగాళ్ల వేలం ప్రక్రియ పూర్తిగా భిన్నమైంది. అది ఎలా సాగుతుందో ఎవరూ చెప్పలేరు. ఊహించలేరు.కానీ నా అంచనా ప్రకారం పంత్ను ఢిల్లీ మళ్లీ తమ జట్టులోకి తీసుకోవచ్చు. ఆటగాళ్ల రిటెన్షన్ అనేది సదరు ప్లేయర్కు, ఫ్రాంచైజీ యాజమాన్యానికి సంబంధించిన వ్యవహారం. తాను ఆశించినంత ధర రాకపోతే ఆ ఆటగాడు... తాము చెల్లించే ధరకు ఆడకపోతే ఫ్రాంచైజీ నిర్ణయాలకు విభేదించే జట్లను వీడతారు. పంత్ విషయంలోనూ ఇదే జరిగి ఉంటుందని నేను భావిస్తున్నా. రిటెన్షన్ కుదరకపోయినా... పంత్లాంటి కెప్టెన్ అవసరం ఢిల్లీకే ఉంది. అతను లేకపోతే ఫ్రాంచైజీ కొత్త సారథి వేటలో పడాలి. నా అంచనా ప్రకారం ఢిల్లీ కచ్చితంగా పంత్ను తీసుకుంటుంది’ అని అభిప్రాయపడ్డారు.అయితే, పంత్ మాత్రం గావస్కర్ వ్యాఖ్యలను కొట్టిపారేశాడు. ఢిల్లీతో కొనసాగకపోవడానికి డబ్బు మాత్రం కారణం కానే కాదని పంత్ ‘ఎక్స్’లో ట్వీట్ చేశాడు. ఇదిలా ఉంటే.. పంత్ మెగా వేలానికి అందుబాటులోకి రావడంతో ఫ్రాంచైజీలన్నీ అతడిపై కన్నేశాయి. రూ.24.75 కో ట్లతో రికార్డుఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్లు రాబిన్ ఊతప్ప సహా ఆకాశ్ చోప్రా, ఇర్ఫాన్ పఠాన్ తదితరులు పంత్కు ఈసారి కళ్లు చెదిరే మొత్తం దక్కుతుందని.. పంజాబ్ కింగ్స్ పంత్ను దక్కించుకునే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు.ఇదిలా ఉంటే.. క్యాష్ రిచ్ లీగ్లో అత్యధిక ధర పలికిన ఆటగాడిగా ఆస్ట్రేలియా స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ కొనసాగుతున్నాడు. ఐపీఎల్-2024 మినీ వేలంలో అతడి కోసం కోల్కతా నైట్రైడర్స్ ఏకంగా రూ.24.75 కోట్లు వెచ్చించింది. ఈ క్రమంలో సీజన్ ఆరంభంలో నిరాశపరిచినా.. ఆ తర్వాత విజృంభించిన స్టార్క్.. జట్టును చాంపియన్గా నిలపడంలో తన వంతు పాత్ర పోషించాడు.అయితే, మెగా వేలానికి ముందు కోల్కతా స్టార్క్తో పాటు తమ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ను విడుదల చేసింది. ఇక పంత్తో పాటు అయ్యర్, కేఎల్ రాహుల్ రూ. 2 కోట్ల కనీస ధరతో వేలంలో తమ పేరు నమోదు చేసుకున్నారు. సౌదీ అరేబియాలోని జెద్దా నగరంలో నవంబరు 24, 25 తేదీల్లో వేలంపాట జరుగనుంది. -
‘ఆర్సీబీతో నా ప్రయాణం ముగియలేదు.. నన్ను మళ్లీ కొనుక్కుంటారు’
ఐపీఎల్-2025 మెగా వేలం నేపథ్యంలో ఆస్ట్రేలియా ఆల్రౌండర్ గ్లెన్ మాక్స్వెల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ)తో తన ప్రయాణం ఇంకా ముగిసిపోలేదని పేర్కొన్నాడు. వేలంపాటలో ఫ్రాంఛైజీ తనను తిరిగి కొనుక్కునే అవకాశం ఉందన్నాడు.బాధ లేదు..ఇక రిటెన్షన్ విషయంలో ఆర్సీబీ వ్యూహాలు పక్కాగా ఉన్నాయన్న మాక్సీ.. తనను విడిచిపెట్టడం వల్ల పెద్దగా బాధ కలగలేదని తెలిపాడు. కాగా ఈసారి ఆర్సీబీ కేవలం ముగ్గురు ఆటగాళ్లనే రిటైన్ చేసుకున్న విషయం తెలిసిందే. విరాట్ కోహ్లి సహా రజత్ పాటిదార్, యశ్ దయాళ్లను అట్టిపెట్టుకుని.. మిగతా ప్లేయర్లందరినీ రిలీజ్ చేసింది.ఈసారి పర్సు వాల్యూ రూ. 120 కోట్లకు పెంచడంతో.. రిటెన్షన్స్ పోనూ ఆర్సీబీ పర్సులో రూ. 83 కోట్లు ఉన్నాయి. ఈ నేపథ్యంలో మాక్స్వెల్ ఈఎస్పీఎన్క్రిక్ఇన్ఫోతో మాట్లాడుతూ.. ‘‘వారు ఏం చేయబోతున్నారో నాకు పూర్తిగా అర్థమైంది. పటిష్టమైన జట్టును నిర్మించుకోవాలనే పట్టుదలతో ఉన్నారు.ఆర్సీబీతో నా ప్రయాణం ఇంకా ముగియలేదుముఖ్యంగా స్థానిక ఆటగాళ్లకు ఎక్కువగా అవకాశం ఇవ్వాలనుకుంటున్నారు. ఇప్పటికీ ఆర్సీబీతో నా ప్రయాణం ఇంకా ముగియలేదు. నేను తిరిగి అక్కడికి వెళ్లాలనే కోరుకుంటున్నాను. ఆర్సీబీ అద్భుతమైన ఫ్రాంఛైజీ. అక్కడి వారితో నాకెన్నో మధుర జ్ఞాపకాలు ఉన్నాయి.రిటెన్షన్ సమయంలోనూ నాకు వారి నుంచి ఫోన్కాల్ వచ్చింది. ఆండీ ఫ్లవర్ , మొ బొబాట్ నాకు జూమ్ కాల్లో అంతా వివరించారు. వారి వ్యూహాలు ఎలా ఉండబోతున్నాయో చెప్పారు. నాకు వారు అంతగా ప్రాధాన్యం ఇవ్వడం పట్ల సంతోషంగా ఉన్నాను’’ అని హర్షం వ్యక్తం చేశాడు. నిరాశపరిచిన మాక్సీకాగా పదకొండు కోట్ల రూపాయలకు పైగా వెచ్చించి కొనుగోలు చేస్తే మాక్సీ ఐపీఎల్-2024లో ఆర్సీబీ యాజమాన్యాన్ని పూర్తిగా నిరాశపరిచాడు. తొమ్మిది ఇన్నింగ్స్లో కలిపి కేవలం 52 పరుగులే చేశాడు. అయితే, తనదైన రోజు చెలరేగి ఆడే ఈ విధ్వంసకర ఆల్రౌండర్ను ఆర్సీబీ రైట్ టూ మ్యాచ్ కార్డు ద్వారా తిరిగి సొంతం చేసుకున్నా ఆశ్చర్యం లేదు. ఇక ఆర్సీబీ స్టార్, టీమిండియా కింగ్ విరాట్ కోహ్లితో మాక్సీకి మంచి అనుబంధం ఉన్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. నవంబరు 24, 25 తేదీల్లో సౌదీ అరేబియాలోని జిద్దా నగరంలో ఐపీఎల్-2025 మెగా వేలం జరుగనుంది.చదవండి: Aus Vs Pak: ఆస్ట్రేలియాకు ‘కొత్త’ కెప్టెన్.. ప్రకటించిన సీఏ! కారణం ఇదే -
‘నన్ను వెక్కిరించావు కదా.. అందుకే అలా చేశాను’
టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లితో తనకు ఎదురైన చేదు అనుభవం గురించి ఆస్ట్రేలియా ఆల్రౌండర్ గ్లెన్ మాక్స్వెల్ తాజాగా అభిమానులతో పంచుకున్నాడు. తాను కోహ్లిని వెక్కిరించిన కారణంగా అతడు తనను సోషల్ మీడియాలో బ్లాక్ చేశాడని.. అయితే, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) జట్టుతో చేరిన తర్వాత తమ మధ్య స్నేహం కుదిరిందని తెలిపాడు. కాగా మైదానంలో టీమిండియా- ఆస్ట్రేలియా క్రికెటర్ల మధ్య సంవాదాలు, దూషణలు, వ్యంగ్య వ్యాఖ్యలు కొత్త కాదు.ఇక 2017లో ఆస్ట్రేలియా జట్టు భారత్లో పర్యటించినప్పుడు కూడా కోహ్లి, మ్యాక్స్వెల్ మధ్య అలాంటి ఘటన ఒకటి జరిగింది. అయితే, ఆర్సీబీలో చేరిన తర్వాత ఒక రోజు కోహ్లి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ను మ్యాక్సీ ఫాలో అయ్యేందుకు ప్రయత్నించగా...అది సాధ్యం కాలేదు. నువ్వు నన్ను బ్లాక్ చేశావా?దాంతో సందేహం వచ్చిన మ్యాక్స్వెల్ ‘నువ్వు నన్ను బ్లాక్ చేశావా’ అని కోహ్లిని అడిగాడు. వెంటనే కోహ్లి...‘అవును...నాలుగేళ్ల క్రితం నువ్వు నన్ను వెక్కిరించిన తర్వాత ఆ పని చేశాను’ అని బదులిచ్చాడు.కాగా 2017 సిరీస్లో భాగంగా రాంచీలో జరిగిన టెస్టులో ఫీల్డింగ్ చేస్తూ కోహ్లి గాయపడ్డాడు. నొప్పిని భరించలేక కోహ్లి తన భుజంపై చేతిని ఉంచి ఇబ్బందిగా నడిచాడు. అదే టెస్టులో దీనిని మ్యాక్స్వెల్ అనుకరించి చూపించాడు. అదే ఇది కోహ్లికి ఆగ్రహం తెప్పించింది! అయితే, 2021లో మ్యాక్స్వెల్ ఐపీఎల్లో బెంగళూరు జట్టుతో చేరిన తర్వాత కోహ్లితో స్నేహం బలపడింది. మైదానంలోనూ, మైదానం బయట కూడా వీరిద్దరు ఎంతో సరదాగా ఉండేవారు.మాక్సీ ఆర్సీబీలో చేరడంలో కోహ్లిదే కీలక పాత్రనిజానికి ఆర్సీబీ కెప్టెన్గా ఉన్న సమయంలో మాక్స్వెల్ను జట్టులోకి తీసుకోవాలని కోహ్లి ఫ్రాంఛైజీకి సూచించాడు. ఈ క్రమంలో ఆసీస్ ఆల్రౌండర్ కోసం రూ. 14.25 కోట్లు ఆర్సీబీ ఖర్చు పెట్టింది. అతడి రాకతో బ్యాటింగ్ యూనిట్ విధ్వంసకరంగా మారింది. 2021, 2022, 2023 సీజన్లలో మాక్సీ వరుసగా 513, 310. 400 పరుగులు చేశాడు. అయితే, ఈ ఏడాది చెత్త ప్రదర్శనతో విమర్శలు మూటగట్టుకున్న మాక్స్వెల్ను ఆర్సీబీ విడిచిపెట్టనున్నట్లు తెలుస్తోంది.చదవండి: IPL 2025 RCB Captain: ఆర్సీబీ కెప్టెన్గా విరాట్ కోహ్లి..? -
IPL 2025: మెరుపు సెంచరీ.. ఆర్సీబీకి స్ట్రాంగ్ మెసేజ్!
మధ్యప్రదేశ్ బ్యాటర్ రజత్ పాటిదార్ అద్భుత శతకం సాధించాడు. హర్యానాతో మ్యాచ్లో జట్టు కష్టాల్లో ఉన్న వేళ మెరుపు శతకంతో ఆదుకున్నాడు. కేవలం 68 బంతుల్లోనే వంద పరుగుల మార్కు అందుకున్నాడు. తద్వారా ఆఖరి రోజు ఆటలో మధ్యప్రదేశ్ను పటిష్ట స్థితిలో నిలపగలిగాడు.కాగా రంజీ ట్రోఫీ 2024-25 ఎడిషన్లో భాగంగా తొలుత కర్ణాటకతో మ్యాచ్ను డ్రా చేసుకున్న మధ్యప్రదేశ్.. తదుపరి పంజాబ్తో మ్యాచ్లోనూ ఫలితం తేల్చలేకపోయింది. ఈ క్రమంలో శనివారం ఇండోర్ వేదికగా హర్యానా జట్టుతో రెడ్బాల్ మ్యాచ్ మొదలుపెట్టిన మధ్యప్రదేశ్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసింది. తొలి ఇన్నింగ్స్లో 308ఓపెనర్ హిమాన్షు మంత్రి(97) సహా కెప్టెన్ శుభం శర్మ(44), హర్ప్రీత్ సింగ్(36) రాణించడంతో తొలి ఇన్నింగ్స్లో 308 పరుగులు చేయగలిగింది. ఈ క్రమంలో బ్యాటింగ్కు దిగిన హర్యానా 440 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఓపెనర్ లక్ష్య దలాల్ సెంచరీ(105)తో చెలరేగగా.. హిమాన్షు రాణా 90, ధీరూ సింగ్ 94, హర్షల్ పటేల్ 81 పరుగులతో దుమ్ములేపారు. ఆధిక్యంలోకి హర్యానాదీంతో తొలి ఇన్నింగ్స్లో మధ్యప్రదేశ్ కంటే 132 పరుగుల ఆధిక్యంలో నిలిచింది హర్యానా. అనంతరం రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన మధ్యప్రదేశ్ ఆరంభంలోనే ఓపెనర్లు సాగర్ సోలంకి(32), వెంకటేశ్ అయ్యర్(28) వికెట్లు కోల్పోయింది.రజత్ మెరుపు శతకంఈ క్రమంలో వన్డౌన్లో వచ్చిన రజత్ పాటిదార్ 68 బంతుల్లోనే ధనాధన్ ఇన్నింగ్స్తో శతకం సాధించాడు. మరో ఎండ్లో హర్ప్రీత్ సింగ్(44), శుభం శర్మ(38 నాటౌట్) సహకారం అందించగా.. పట్టుదలగా క్రీజులో నిలబడి 102 బంతుల్లో 159 పరుగులు చేశాడు. టార్గెట్ 177ఈ క్రమంలో 48.1 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 308 పరుగుల వద్ద ఉండగా మధ్యప్రదేశ్ తమ రెండో ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. పాటిదార్ మెరుపు శతకం వల్ల మంగళవారం నాటి ఆఖరి రోజు ఆటలో భాగంగా హర్యానాకు 177 పరుగుల లక్ష్యం విధించగలిగింది.ఆర్సీబీకి స్ట్రాంగ్ మెసేజ్ఇక ఐపీఎల్-2025 మెగా వేలం సమీపిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అక్టోబరు 31 నాటికి ఫ్రాంఛైజీలు తమ రిటెన్షన్ జాబితాలను సమర్పించనున్నాయనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇలాంటి సమయంలో రజత్ పాటిదార్ సెంచరీ సాధించి రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) యాజమాన్యానికి రేసులో తానూ ఉన్నాననే సందేశం ఇచ్చాడంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. కాగా గత కొన్నేళ్లుగా ఆర్సీబీకి ఆడుతున్న రజత్ పాటిదార్.. ఈ ఏడాది 395 పరుగులు సాధించాడు. చదవండి: IPL 2025: వాషింగ్టన్ సుందర్ కోసం ఎగబడుతున్న ఫ్రాంఛైజీలు -
IPL 2025: ‘ఆర్సీబీ రోహిత్ శర్మను కొని.. కెప్టెన్ చేయాలి’
ఐపీఎల్-2025 మెగా వేలం నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ గనుక వేలంలోకి వస్తే.. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) అతడిని కొనుగోలు చేయాలని సూచించాడు. అంతేకాదు.. హిట్మ్యాన్ను ఆర్సీబీ తమ సారథిగా నియమిస్తే.. ట్రోఫీ గెలవాలన్న చిరకాల కల నెరవేరుతుందన్నాడు.కాగా 2008లో ఆరంభమైన ఐపీఎల్లో రోహిత్ శర్మ తొలుత దక్కన్ చార్జర్స్కు ప్రాతినిథ్యం వహించాడు. రెండో ఎడిషన్లో టైటిల్ గెలిచిన చార్జర్స్లో అతడు సభ్యుడు. ఆ తర్వాత ముంబై ఇండియన్స్ ఫ్రాంఛైజీ రోహిత్ను కొనుగోలు చేసి.. జట్టు పగ్గాలు అప్పగించింది. ఈ క్రమంలో తన కెప్టెన్సీ నైపుణాల్యతో ముంబైని ఏకంగా ఐదుసార్లు చాంపియన్గా నిలిపాడు.తొలి కెప్టెన్గా రోహిత్ రికార్డుతద్వారా క్యాష్ రిచ్ లీగ్ చరిత్రలో ఈ ఘనత సాధించిన తొలి కెప్టెన్గా రోహిత్ రికార్డు సృష్టించాడు. అయితే, ఈ ఏడాది ముంబై ఇండియన్స్ అనూహ్య నిర్ణయం తీసుకుంది. రోహిత్ శర్మపై వేటు వేసి.. గుజరాత్ టైటాన్స్ నుంచి ట్రేడ్ చేసుకున్న హార్దిక్ పాండ్యాను తమ కెప్టెన్గా నియమించుకుంది.ఈ క్రమంలో అసంతృప్తికి లోనైన రోహిత్ శర్మ జట్టును వీడాలని నిర్ణయించుకున్నాడని.. ముంబై ఫ్రాంఛైజీతో అతడి బంధం ముగిసిందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారత మాజీ బ్యాటర్ మహ్మద్ కైఫ్ మాట్లాడుతూ.. ‘‘రోహిత్ వేలంలోకి వస్తే ఆర్సీబీ.. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.టైటిల్ కరువు తీరుతుందిఅంతేకాదు.. రోహిత్ను ఒప్పించి తమ కెప్టెన్గా నియమించుకోవాలి. బ్యాటర్గా రోహిత్ మరీ మునుపటిలా పరుగులు రాబట్టలేకపోవచ్చు. ఫార్టీ, ఫిఫ్టీస్ మాత్రం చేయగలడు. అయితే, కెప్టెన్గా తుదిజట్టు కూర్పును మాత్రం చక్కగా సెట్ చేస్తాడు. అతడి వల్ల ఆర్సీబీకి లాభం చేకూరుతుంది.టైటిల్ కరువు తీరుతుంది. ఏ ఆటగాడి సేవలను ఎప్పుడు ఎలా వాడుకోవాలో రోహిత్కు బాగా తెలుసు. కెప్టెన్గా తన ప్రణాళికలు, వ్యూహాలు అమోఘం. ఒకవేళ ఆర్సీబీకి గనుక అవకాశం దొరికితే.. రోహిత్ శర్మను కొని, కెప్టెన్ చేసుకుని తీరాల్సిందే’’ అని అభిప్రాయపడ్డాడు. అదే విధంగా.. రోహిత్ ఐపీఎల్లో కొనసాగితే ఏదైనా ఒక జట్టుకు కెప్టెన్గా మాత్రమే ఉండాలని పేర్కొన్నాడు.మూడుసార్లు ఫైనల్ చేరిన ఆర్సీబీకాగా ఇప్పటి వరకు మూడుసార్లు ఫైనల్ చేరిన ఆర్సీబీ.. ఆఖరి గండాన్ని మాత్రం దాటలేకపోయింది. 2009లో దక్కన్ చార్జర్స్, 2011లో చెన్నై సూపర్ కింగ్స్, 2016లో సన్రైజర్స్ హైదరాబాద్ చేతిలో ఓడి టైటిల్ మిస్ చేసుకుంది. ఇక టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి చాలాకాలం పాటు ఆర్సీబీ కెప్టెన్గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. అయితే, ప్రస్తుతం ఆటగాడిగా అతడు బెంగళూరు ఫ్రాంఛైజీతోనే కొనసాగుతున్నాడు. ఇదిలా ఉంటే.. టీ20 ప్రపంచకప్-2024లో టీమిండియా చాంపియన్గా నిలిచిన తర్వాత రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లి అంతర్జాతీయ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం విదితమే.చదవండి: అరంగేట్రం చేసిన నాలుగేళ్లకే పాక్ క్రికెటర్ రిటైర్మెంట్.. కానీ ఓ ట్విస్ట్! -
‘ఐపీఎల్లో చెత్తగా ఆడినా.. వరల్డ్కప్లో మాత్రం దుమ్ములేపుతాడు’
ఐపీఎల్-2024లో దారుణంగా విఫలమైన ఆటగాళ్లలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ‘స్టార్’ గ్లెన్ మాక్స్వెల్ ఒకడు. ఈ ఆస్ట్రేలియా ఆల్రౌండర్ కోసం ఆర్సీబీ యాజమాన్యం ఏకంగా రూ. 11 కోట్లు ఖర్చు చేసింది.మాక్సీ ఆట తీరుపై నమ్మకంతో ఈ మేరకు భారీ మొత్తానికి అతడిని రీటైన్ చేసుకుంది. కానీ ఈ స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ మేనేజ్మెంట్, అభిమానుల అంచనాలను అందుకోలేకపోయాడు.పదిహేడో ఎడిషన్ ఆరంభం నుంచే పేలవ ప్రదర్శనతో చతికిల పడ్డ మాక్స్వెల్.. మానసిక ఒత్తిడిని కారణంగా చూపి మధ్యలో కొన్ని మ్యాచ్లలో దూరమయ్యాడు. ఈ క్రమంలో అతడి స్థానంలో ఇంగ్లండ్ ఆల్రౌండర్ విల్ జాక్స్ కొన్ని మ్యాచ్లు ఆడగా.. మాక్సీ తిరిగి వచ్చి మళ్లీ తుదిజట్టులో చోటు దక్కించుకున్నాడు.అయితే, ఓవరాల్గా ఆడిన తొమ్మిది ఇన్నింగ్స్లో కలిపి కేవలం 52 పరుగులు మాత్రమే చేశాడు. జట్టుకు అవసరమైన సమయంలో ముఖ్యంగా కీలక ఎలిమినేటర్ మ్యాచ్లో డకౌట్గా వెనుదిరిగి అభిమానుల ఆగ్రహానికి గురయ్యాడు.ఇదిలా ఉంటే.. మాక్సీ ప్రస్తుతం టీ20 ప్రపంచకప్-2024తో బిజీ కానున్నాడు. అయితే, ఐపీఎల్-2024లో అతడి ఫామ్లేమి ప్రభావం ఆస్ట్రేలియా జట్టుపై పడుతుందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆసీస్ ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా కీలక వ్యాఖ్యలు చేశాడు.‘‘ఐపీఎల్ ఫామ్తో అసలు సంబంధమే లేదు. మాక్సీ ఇప్పటికే తనను తాను ఎన్నోసార్లు నిరూపించుకున్నాడు. సుదీర్ఘకాలంగా మెగా టోర్నీల్లో అద్భుతంగా రాణించే ఆటగాడు.. పరిస్థితులను అర్థం చేసుకుని అందుకు తగ్గట్లుగా ఆడటంలో ఏమాత్రం వెనక్కి తగ్గడు.టీ20 క్రికెట్లో మిడిలార్డర్లో ఆడుతున్నపుడు కొన్నిసార్లు రిస్క్ తీసుకోకతప్పదు. ఒక్కసారి క్రీజులో కుదురుకుని మంచి ఇన్నింగ్స్ ఆడాడంటే తనకు తిరుగే ఉండదు.గతం గురించి చర్చ అనవసరం. గతాన్ని అతడు మార్చలేడు. అయితే, భవిష్యత్తును మాత్రం అందంగా మలచుకోగల సత్తా అతడికి ఉంది’’ అని ఆస్ట్రేలియా వెటరన్ ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా చెప్పుకొచ్చాడు.టీ20 ప్రపంచకప్-2024 టోర్నీకి ఆస్ట్రేలియా జట్టుమిచెల్ మార్ష్ (కెప్టెన్), ఆస్టన్ అగర్, ప్యాట్ కమిన్స్, టిమ్ డేవిడ్, నాథన్ ఎల్లిస్, కామెరాన్ గ్రీన్, జోష్ హాజిల్వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, గ్లెన్ మాక్స్వెల్, మిచెల్ స్టార్క్, మార్కస్ స్టోయినిస్, మాథ్యూ వేడ్, డేవిడ్ వార్నర్, ఆడమ్ జంపా.ట్రావెలింగ్ రిజర్వ్స్: జేక్ ఫ్రేజర్ మెగర్క్, మాథ్యూ షార్ట్. -
నేనైతే వదిలేసేదాన్నేమో: దినేశ్ కార్తిక్ భార్య భావోద్వేగం
‘‘జీవితంలో ఎప్పుడు ఏం జరగాలో అదే జరుగుతుంది. మేము 2013లో తొలిసారి ఒకరినొకరం నేరుగా కలిశాం. ఇద్దరి మనసులోనూ కలిసి జీవించాలనే ఆలోచనే వచ్చింది. ఆ తర్వాత అన్నీ సజావుగా సాగిపోయాయి.తనలో నాకు నచ్చే గొప్ప గుణం ఏమిటంటే.. ఎన్ని సవాళ్లు ఎదురైనా వాటిని అధిగమించి ముందుకు సాగటం. బాగా ఆడలేక విమర్శలు ఎదుర్కొన్నపుడు.. జట్టులో స్థానం కరువైనపుడు రెండు- మూడు రోజుల పాటు కాస్త నిరాశగా కనిపిస్తాడు.తిరిగి వెంటనే కోలుకుని తర్వాత ఏం చేయాలన్న అంశంపై దృష్టి పెడతాడు. నాకు తెలిసి అలాంటి స్థితిలో వేరే ఎవరైనా ఉంటే కచ్చితంగా చాలా రోజుల పాటు కుంగిపోతారు.వదిలేసేదాన్నేమో!నేను కూడా అథ్లెట్నే కాబట్టి అప్పుడు అతడి మానసిక స్థితి ఎలా ఉంటుందో అంచనా వేయగలను. తన స్థానంలో గనుక నేనే ఉంటే.. ఇక చాల్లే అని వదిలేసేదాన్నేమో!కానీ తను అలా కాదు. తన కెరీర్లో వివిధ దశల్లో విభిన్న పాత్రలు పోషించాల్సి వచ్చింది. చావో రేవో తేల్చుకోవాల్సిన పరిస్థితుల్లోనూ తను పట్టుదలగా నిలబడ్డాడు.గతం కంటే మెరుగ్గా ఆడుతూ ముందుకు సాగాడు. డీకే తన జీవితంలో ఏవైతే సాధించాలనుకున్నాడో అన్నీ సాధించేశాడు. ఒక అథ్లెట్ లైఫ్లో అంతకంటే గొప్ప విషయం మరొకటి ఉండదు.అలాంటి వ్యక్తి ఇకపై ఆటకు దూరంగా ఉండాలంటే అంత సులువేమీ కాదు. అయితే, వ్యక్తిగతంగా తన జీవితంలో ముందుకు సాగాలని అతడు నిర్ణయించుకున్నాడు.తన కోసం, తన కుటుంబం కోసం ఈ నిర్ణయం తీసుకున్నాడు. తను సాధించిన విజయాలు మమ్మల్ని గర్వపడేలా చేశాయి’’ అని టీమిండియా వెటరన్ క్రికెటర్ దినేశ్ కార్తిక్ భార్య దీపికా పళ్లికల్ ఉద్వేగానికి లోనయ్యారు.తన భర్త కెరీర్లో ఎన్నో ఎత్తుపళ్లాలు చూశాడని.. అయినప్పటికీ పట్టువదలని విక్రమార్కుడిలా పోరాడి తాను అనుకున్న స్థాయికి చేరుకున్నాడని తెలిపారు. కాగా ఐపీఎల్లో ఆరంభం నుంచి పదిహేడేళ్ల పాటు కొనసాగిన క్రికెటర్లలో ఒకడైన దినేశ్ కార్తిక్ ఇటీవలే రిటైర్మెంట్ ప్రకటించాడు.క్యాష్ రిచ్ లీగ్కు గుడ్బైఐపీఎల్-2024లో ఆర్సీబీకి ప్రాతినిథ్యం వహించిన అతడు ఎలిమినేటర్ మ్యాచ్లో చివరిసారిగా ఆడాడు. రాజస్తాన్ చేతిలో ఆర్సీబీ ఓటమి తర్వాత క్యాష్ రిచ్ లీగ్కు గుడ్బై చెప్పాడు. ఓటమితో తన ఐపీఎల్ కెరీర్ ముగించాడు.ఈ నేపథ్యంలో దినేశ్ కార్తిక్ భార్య, భారత స్క్వాష్ ప్లేయర్ దీపికా పళ్లికల్ పైవిధంగా స్పందించారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఆర్సీబీ సోషల్ మీడియాలో షేర్ చేసింది.కాగా దీపికా పళ్లికల్ కామన్వెల్త్ గేమ్స్లో నాలుగుసార్లు భారత్ తరఫున పతకాలు సాధించారు. ఆసియా క్రీడలు, వరల్డ్ చాంపియన్షిప్స్లోనూ మెడల్స్ గెలిచారు. డీకే- దీపిక 2015లో పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమారులు(కవలలు) సంతానం.చదవండి: Dinesh Karthik: మొదటి భార్య మోసం: ఆ నవ్వే నన్ను ముంచేసింది!.. ఎల్లప్పుడూ నా వాడే!(ఫొటోలు)Dinesh Karthik: పదిహేడు సీజన్లు.. ఒకే ఒక్క టైటిల్! అరుదైన రికార్డులు.. దటీజ్ డీకే!DK, We love you! ❤ Not often do you find a cricketer who’s loved by everyone around him. DK is one, because he was smart, humble, honest, and gentle! Celebrating @DineshKarthik's career with stories from his best friends and family! 🤗#PlayBold #ನಮ್ಮRCB #WeLoveYouDK pic.twitter.com/fW3bLGMQER— Royal Challengers Bengaluru (@RCBTweets) May 24, 2024 -
టైమ్కి చెక్ వస్తుంది.. రూ. 11 కోట్లు.. ఇంకెందుకు ఆడటం?
‘‘అంతర్జాతీయ స్థాయి క్రికెట్లో ఎంతో అనుభవం గడించాడు. ఆస్ట్రేలియా తరఫున ఎల్లప్పుడూ అద్భుతంగా ఆడతాడు. కానీ ఐపీఎల్కు వచ్చే సరికి.. అతడికి ఏమవుతుందో తెలియడం లేదు.బహుశా ఐపీఎల్ పట్ల అతడికి ఆసక్తి లేదేమో?!.. జట్టు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నపుడు తాను అవుటైనా పర్లేదనకుంటాడేమో!.. అతడి బ్యాంకు బ్యాలెన్స్ నిండుగా ఉంది.సమయానికి చెక్ అందుతుంది. సహచర ఆటగాళ్లతో కలిసి రాత్రుళ్లు పార్టీలు.. నవ్వులు.. సరదాలు.. ఫొటోలకు ఫోజులు.. ఇంతే’’ అంటూ టీమిండియా మాజీ క్రికెటర్ మనోజ్ తివారీ వ్యంగ్యాస్త్రాలు సంధించాడు.రాయల్ చాలెంజర్స్ బెంగళూరు స్టార్ గ్లెన్ మాక్స్వెల్ ఆట తీరును విమర్శిస్తూ అతడిపై మండిపడ్డాడు. ఫ్రాంఛైజీ నుంచి టైమ్కు చెక్కులు తీసుకోవడం మాత్రమే అతడికి తెలుసని.. ఆటపై అసలు ఏమాత్రం దృష్టి పెట్టడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశాడు. కాగా ఐపీఎల్-2024 నేపథ్యంలో ఆసీస్ ఆల్రౌండర్ మాక్సీని ఆర్సీబీ రూ. 11 కోట్లకు రిటైన్ చేసుకుంది. అయితే, ఈ సీజన్లో అతడు దారుణంగా విఫలమయ్యాడు. 10 ఇన్నింగ్స్ ఆడి కేవలం 52 పరుగులు చేశాడు. అదే విధంగా.. ఆరు వికెట్లు మాత్రమే తీయగలిగాడు ఈ ఆర్థోడాక్స్ బౌలర్.కీలకమైన ఎలిమినేటర్ మ్యాచ్లోనూమానసికంగా అలసిపోయానంటూ కొన్నాళ్లు సెలవు కూడా తీసుకున్నాడు. ఇక కీలకమైన ఎలిమినేటర్ మ్యాచ్లోనూ మాక్స్వెల్ తేలిపోయాడు. రాజస్తాన్ రాయల్స్తో అహ్మదాబాద్లో బుధవారం నాటి మ్యాచ్లో మాక్సీ డకౌట్ అయ్యాడు.టాపార్డర్లో విరాట్ కోహ్లి(33) ఒక్కడు ఫర్వాలేదనిపించగా.. ఫాఫ్ డుప్లెసిస్, కామెరాన్ గ్రీన్(27) త్వరగానే నిష్క్రమించారు. ఈ క్రమంలో నాలుగో నంబర్ బ్యాటర్ రజత్ పాటిదార్ 34 పరుగులతో ఆకట్టుకోగా.. ఐదో స్థానంలో వచ్చిన మాక్సీ ఖాతా తెరవకుండానే వెనుదిరిగాడు.క్వాలిఫయర్-2లో రాజస్తాన్మిగతా వాళ్లలో మహిపాల్ లామ్రోర్(17 బంతుల్లో 32) చెప్పుకోదగ్గ స్కోరు చేయగా.. ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. ఇక ఆర్సీబీ విధించిన లక్ష్యాన్ని రాజస్తాన్ 19 ఓవర్లలోనే ఛేదించింది. తద్వారా క్వాలిఫయర్-2కి అర్హత సాధించింది. ఆర్సీబీ యథావిథిగా ఇంటిబాట పట్టింది.ఈ నేపథ్యంలో మనోజ్ తివారీ మాక్సీ ఆట తీరును విమర్శిస్తూ పైవిధంగా స్పందించాడు. అదే విధంగా ఆర్సీబీ స్థాయికి తగ్గట్లు రాణించలేదని.. వరుసగా ఆరు విజయాలు సాధించినా.. అసలు పోరులో ఓడిపోతే లాభం ఉండదంటూ పెదవి విరిచాడు.చదవండి: Dinesh Karthik: పదిహేడు సీజన్లు.. ఒకే ఒక్క టైటిల్! అరుదైన రికార్డులు.. దటీజ్ డీకే!🎥 𝐓𝐡𝐞 𝟏% 𝐜𝐡𝐚𝐧𝐜𝐞 ❤️They were down and out. But what followed next was a dramatic turnaround and comeback fuelled with belief and emotions 🙌 Well done, Royal Challengers Bengaluru 👏 👏 #TATAIPL | #RRvRCB | #Eliminator | #TheFinalCall | @RCBTweets pic.twitter.com/PLssOFbBvf— IndianPremierLeague (@IPL) May 23, 2024 -
విరాట్ కోహ్లి ఆర్సీబీని వీడాలి.. ఆ జట్టులో చేరాలి: ఇంగ్లండ్ స్టార్
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు.. మళ్లీ పాత కథే.. ఐపీఎల్-2024లో వరుసగా ఆరు పరాజయాలు.. ప్లే ఆఫ్స్ రేసు నుంచి అవుటైనట్లే ఇక అనుకున్న సమయంలో అనూహ్య రీతిలో కమ్బ్యాక్.వరుసగా ఆరు మ్యాచ్లు గెలిచి టాప్-4లో అడుగు.. పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో నిలిచి ఎలిమినేటర్ మ్యాచ్కు అర్హత. ఈ గండం దాటితే క్వాలిఫయర్-2 ఆడొచ్చు. అక్కడా గెలిస్తే ఏకంగా ఫైనల్లో.. ఇక టైటిల్కు ఒకే ఒక్క అడుగు దూరం..ఆర్సీబీ జోరు చూస్తే ఈసారి కప్పు మనదే అనిపిస్తోందంటూ అభిమానులు సంబరాలు చేసుకున్నారు. సునిల్ గావస్కర్ వంటి దిగ్గజాలు సైతం.. రాజస్తాన్ రాయల్స్ను ఆర్సీబీ ఎలిమినేట్ చేయడం ఖాయమంటూ జోస్యాలు చెప్పారు.అందరి అంచనాలు తలకిందులు చేస్తూ అయితే, అందరి అంచనాలు తలకిందులు చేస్తూ రాజస్తాన్ అద్భుత ఆట తీరుతో ఆర్సీబీ ఆశలను గల్లంతు చేసింది. వరుసగా ఓటముల తర్వాత.. కీలకమైన ఎలిమినేటర్ మ్యాచ్లో గెలిచి క్వాలిఫయర్-2కు అర్హత సాధించింది.ఫలితంగా ఆర్సీబీ పదిహేడేళ్ల కల ఈసారికీ కలగానే మిగిలిపోయింది. అయితే, సీజన్ ఆసాంతం ఆ జట్టు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి అద్భుత బ్యాటింగ్తో ఆకట్టుకోవడం ఒక్కటే అభిమానులకు కాస్త ఊరట కలిగిస్తోంది.దుమ్ములేపిన కోహ్లి.. కానీ ఏం లాభం?ఈ ఎడిషన్లో కోహ్లి 15 ఇన్నింగ్స్లో కలిపి 741 పరుగులతో టాప్ స్కోరర్గా ఉన్నాడు. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కోహ్లి ఇప్పటికైనా ఆర్సీబీని వదిలేయాలని విజ్ఞప్తి చేశాడు.‘‘ఇంతకు ముందు చెప్పాను.. ఇప్పుడూ అదే చెప్తున్నా. ఇతర క్రీడల్లోని దిగ్గజాలు సైతం ఒకానొక సమయంలో తమ సొంత జట్లను వదిలి వేరే చోటకు వెళ్లి టైటిల్స్ సాధించారు.ఆర్సీబీని వీడటమే ఉత్తమంఇప్పటికే కోహ్లి ఎంతగానో ప్రయత్నించాడు. మరోసారి ఆరెంజ్క్యాప్ కూడా సొంతం చేసుకున్నాడు. ఫ్రాంఛైజీ కోసం ఎంతో చేస్తున్నాడు. కానీ ఈసారి కూడా ఆర్సీబీ టైటిల్ గెలవడంలో విఫలమైంది. బ్రాండ్వాల్యూ పరంగా ఫ్రాంఛైజీతో కోహ్లి బంధం ఎలాంటిదో తెలుసు. అయినప్పటికీ.. ట్రోఫీ ముద్దాడేందుకు కోహ్లి నూటికి నూరుపాళ్లు అర్హుడు. కాబట్టి టైటిల్ గెలిచే సత్తా ఉన్న టీమ్లోకి అతడు వెళ్లాలని కోరుకుంటున్నా’’ అని ఆర్సీబీ మాజీ ఆటగాడు కెవిన్ పీటర్సన్ పేర్కొన్నాడు.ఢిల్లీకి ఆడాలివచ్చే ఏడాది కోహ్లి ఢిల్లీ క్యాపిటల్స్కు మారిపోవాలని సూచించాడు. సొంతగడ్డకు చెందిన ఫ్రాంఛైజీకి అతడు ప్రాతినిథ్యం వహిస్తే చూడాలని ఉందని.. ఈ సందర్భంగా ఫుట్బాల్ దిగ్గజాలు బెక్హాం, క్రిస్టియానో రొనాల్డో, మెస్సీ తదితరులు ఫ్రాంఛైజీలు మారి విషయాన్ని పీటర్సన్ ప్రస్తావించాడు. కాగా ఐపీఎల్ ఆరంభం నుంచి అంటే 2008 నుంచి కోహ్లి ఆర్సీబీతోనే ఉన్నాడు. క్యాష్ రిచ్ లీగ్లో 8 వేలకు పైగా పరుగులు పూర్తి చేసుకుని చరిత్ర సృష్టించాడు.చదవండి: Hardik Pandya: భార్యతో హార్దిక్ పాండ్యాకు విభేదాలు?.. అతడి వల్లే అంటూ నటాషా పోస్ట్ వైరల్ -
ఐపీఎల్కు బైబై.. దినేశ్ కార్తిక్ రిటైర్ అయ్యాడా!.. వీడియో వైరల్
టీమిండియా వెటరన్ వికెట్ కీపర్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఫినిషర్ దినేశ్ కార్తిక్ ఇండియన్ ప్రీమియర్ లీగ్కు వీడ్కోలు పలికాడు. క్యాష్ రిచ్ లీగ్ నుంచి రిటైర్ అయ్యాడు.అయితే, రిటైర్మెంట్ గురించి డీకే నేరుగా ప్రకటించకపోయినా.. ఎలిమినేటర్ మ్యాచ్ తర్వాత మైదానంలో చోటు చేసుకున్న దృశ్యాలు ఈ విషయాన్ని ధ్రువీకరించాయి. ఐపీఎల్ నిర్వాహకులు సైతం సోషల్ మీడియా వేదికగా డీకే రిటైర్మెంట్ను నిర్ధారించారు.‘‘ఒక ఐపీఎల్ ట్రోఫీ.. అత్యధిక డిస్మిసల్స్లో భాగమైన వికెట్ కీపర్.. 16 ఏళ్లు.. ఆరు జట్లు.. ఎన్నెన్నో జ్ఞాపకాలు.. థాంక్యూ డీకే’’ అంటూ జస్ట్ రిటైర్డ్ అనే బోర్డున్న కారు వెనకాల నిల్చున్న దినేశ్ కార్తిక్.. విరాట్ కోహ్లి, మహేంద్ర సింగ్ ధోని, హార్దిక్ పాండ్యాలకు టాటా చెప్తున్నట్లుగా ఉన్న ఫొటోను ఐపీఎల్ అధికారిక ఎక్స్ ఖాతాలో షేర్ చేసింది.కాగా ఐపీఎల్-2024లో ఎలిమినేటర్ మ్యాచ్లో ఆర్సీబీ రాజస్తాన్ రాయల్స్తో తలపడింది. అహ్మదాబాద్ వేదికగా బుధవారం జరిగిన ఈ మ్యాచ్లో బెంగళూరు జట్టు నాలుగు వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఫలితంగా టైటిల్ రేసు నుంచి నిష్క్రమించి ఇంటిబాట పట్టింది.అయితే, ఈ మ్యాచ్ ముగిసిన అనంతరం డీకేను ఆర్సీబీ ప్లేయర్లు ఆత్మీయంగా హత్తుకున్నారు. ఇక అభిమానులకు అభివాదం చేస్తూ మైదానమంతా కలియదిరుగుతూ భావోద్వేగానికి గురైన దినేశ్ కార్తిక్.. వారి పట్ల కృతజ్ఞతా భావం చాటుకున్నాడు. ఆ సమయంలో ఆర్సీబీ ఆటగాళ్లు అతడి వెనకాలే నడుస్తూ కరతాళ ధ్వనులతో ఉత్సాహపరిచారు.ఓటమితో ఐపీఎల్ కెరీర్ ముగించిన డీకే ఉద్వేగానికి లోనుకాగా ఆర్సీబీ స్టార్ విరాట్ కోహ్లి అతడిని హత్తుకుని.. ‘‘మరేం పర్లేదు’’ అంటూ ఓదార్చాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో #Happy Retirement DK అంటూ ఫ్యాన్స్ అతడికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. From #RCB to Dinesh Karthik ❤️ #TATAIPL | #RRvRCB | #TheFinalCall | #Eliminator | @RCBTweets | @DineshKarthik pic.twitter.com/p2XI7A1Ta6— IndianPremierLeague (@IPL) May 22, 20241⃣ #TATAIPL 🏆2⃣nd - most dismissals by a WK in #IPL 💪3⃣rd - most appearances in the league's history! 🤯#IPLonJioCinema #RRvRCB #DineshKarthik #TATAIPLPlayoffs pic.twitter.com/dXYJz6skOi— JioCinema (@JioCinema) May 22, 2024 -
Virat Kohli: కీలక మ్యాచ్కు ముందు ఆర్సీబీకి షాక్?!
ఐపీఎల్-2024 ఆరంభంలో పేలవ ప్రదర్శనతో విమర్శలపాలైన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఊహించని విజయాలతో ప్లే ఆఫ్స్నకు దూసుకువచ్చింది. లీగ్ దశలో వరుసగా ఆరు మ్యాచ్లలో ఓడిన తర్వాత కూడా ఏమాత్రం డీలాపడకుండా.. పట్టుదలగా పోరాడి టాప్-4లో స్థానం సంపాదించింది.ఆరు మ్యాచ్లలో వరుసగా గెలుపొంది రాజస్తాన్ రాయల్స్తో ఎలిమినేటర్ మ్యాచ్కు సిద్ధమైంది. అహ్మదాబాద్ వేదికగా జరిగే ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు క్వాలిఫయర్-2కు అర్హత సాధిస్తుంది. ఈ నేపథ్యంలో కీలక మ్యాచ్కు ముందు ఆర్సీబీ ప్రాక్టీస్ సెషన్ రద్దు చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి.ఉగ్ర ముప్పు పొంచి ఉందనే సందేహాల నడుమ విరాట్ కోహ్లి భద్రతా కారణాల దృష్ట్యా ఆర్సీబీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆనంద్ బజార్ పత్రిక, హిందుస్థాన్ టైమ్స్ కథనం వెల్లడించింది. అహ్మదాబాద్లో అనుమానాస్పదంగా తచ్చాడుతున్న నలుగురు వ్యక్తులను అరెస్టు చేసిన నేపథ్యంలో ముందు జాగ్రత్తగా చర్యగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాయి.అతడు జాతీయ నిధిఈ మేరకు.. ‘‘అహ్మదాబాద్ చేరుకోగానే ఈ విషయం గురించి విరాట్ కోహ్లికి తెలిసింది. అతడు జాతీయ నిధి. అతడి భద్రతే మా ప్రథమ ప్రాధాన్యం. ఆర్సీబీ ఈ విషయంలో ఎలాంటి రిస్క్ తీసుకోవడానికి సిద్ధంగా లేదు.వాళ్లకు ఈ విషయం చెప్పిన తర్వాత ప్రాక్టీస్ సెషన్ను రద్దు చేసుకున్నట్లు తెలిపింది. రాజస్తాన్ రాయల్స్కు కూడా ఈ విషయం గురించి తెలిసింది. అయితే, వాళ్లు యథాతథంగా ప్రాక్టీస్ చేశారు’’ అని పోలీస్ అధికారి విజయ్ సంఘా పేర్కొన్నట్లు హిందుస్థాన్ టైమ్స్ తెలిపింది.ఈ క్రమంలోనే గుజరాత్ కాలేజీ గ్రౌండ్లో ప్రాక్టీస్ చేయాల్సిన ఆర్సీబీ తమ ప్రాక్టీస్ సెషన్తో పాటు ప్రీ- ప్రెస్మీట్ను కూడా క్యాన్సిల్ చేసుకున్నట్లు వెల్లడించింది. అయితే, తాజా సమాచారం ప్రకారం... ఇందుకు ఉగ్ర ముప్పు కారణం కాదని తెలుస్తోంది.భద్రతకు వచ్చిన ముప్పేమీ లేదు.. కారణం అదే‘‘భద్రతకు సంబంధించి ఎలాంటి అనుమానాలు లేవు. అంతగా సమస్య ఉందనుకుంటే ఇండోర్లో ప్రాక్టీస్ సెషన్ నిర్వహించుకోవచ్చని వాళ్లకు చెప్పాము. అయితే, వేడిమి తట్టుకోలేకమంటూ వాళ్లు సెషన్ రద్దు చేసుకున్నారు’’ అని అహ్మదాబాద్ స్టేడియం వద్ద పనిచేసే సిబ్బంది తెలిపినట్లు ఇండియా టుడే వెల్లడించింది. కారణాలు ఏమైనా మొత్తానికి కీలక మ్యాచ్కు ముందు ఆర్సీబీ ప్రాక్టీస్ చేయలేదన్నది స్పష్టమైంది. ఒక రకంగా ఇది ఎదురుదెబ్బ లాంటిదే!చదవండి: RR vs RCB: వార్ వన్సైడ్.. గెలిచేది ఆ జట్టే: టీమిండియా దిగ్గజం -
Virat Kohli: రాజస్తాన్తో కీలక మ్యాచ్.. కోహ్లి ప్లాన్ ఇదే
ఐపీఎల్-2024లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు అద్భుతాలు చేసింది. వరుసగా ఆరు ఓటముల తర్వాత... అనూహ్య రీతిలో పుంజుకుని ఏకంగా ప్లే ఆఫ్స్లో అడుగుపెట్టింది. వరుసగా ఆరు మ్యాచ్లు గెలిచి టాప్-4కు అర్హత సాధించి.. టైటిల్ రేసులో నిలవగలిగింది.రాజస్తాన్ రాయల్స్తో అమీ తుమీఈ క్రమంలో ఎలిమినేటర్ రూపంలో తొలి గండం దాటేందుకు ఆర్సీబీ సిద్ధమైంది. రాజస్తాన్ రాయల్స్తో బుధవారం నాటి మ్యాచ్లో అమీ తుమీ తేల్చుకోనుంది.ఇక ఆర్సీబీ వరుస విజయాల్లో ఆ జట్టు కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్తో పాటు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లిది కీలక పాత్ర అన్న విషయం తెలిసిందే. కోహ్లి ఈ సీజన్లో ఇప్పటి వరకు ఆడిన 14 ఇన్నింగ్స్లో కలిపి 708 పరుగులు సాధించాడు.తద్వారా టాప్ స్కోరర్గా కొనసాగుతూ ఆరెంజ్ క్యాప్ను తన దగ్గరే పెట్టుకున్నాడు. ఇక రాజస్తాన్తో చావోరేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్ నేపథ్యంలో విరాట్ కోహ్లి తన ఆట తీరు గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు.బౌలర్ల విషయంలో నా ప్లాన్ ఇదే‘‘అతిగా ఆలోచించడం నాకు ఇష్టం ఉండదు. గణాంకాలను నేను పెద్దగా పట్టించుకోను. ప్రత్యర్థి జట్టు బౌలర్ .. రిస్ట్ పొజిషన్ ఏంటి? బాల్ ఎక్కడ వేస్తాడు? అన్న విశ్లేషణలకు సంబంధించిన వీడియోలు చూడను.ఎందుకంటే.. మ్యాచ్ నాటికి ఆ బౌలర్ సరికొత్త, విభిన్న ప్రణాళికతో మన ముందుకు రావచ్చు కదా! అందుకే నేను పరిస్థితులకు తగ్గట్లుగా ఆడేందుకే మొగ్గు చూపుతా.బౌలర్ బంతిని సంధించే సమయంలో కేవలం నా కళ్లను మాత్రమే నమ్ముకుంటా. బాల్కు రియాక్ట్ అయ్యే విషయంలో నా మెదడు ఏది చెబితే అదే చేస్తా. మనకు మనంగా నిర్ణయాలు తీసుకోగలిగితే సమస్యలకు సరైన పరిష్కారాలు కనుగొనే వీలుంటుందని నేను బలంగా నమ్ముతాను. బేసిక్స్ మర్చిపోనుకంప్యూటర్ అనాలసిస్తో పరిస్థితులను అంచనా వేయలేం. మైదానంలో అప్పటికప్పుడు తీసుకునే నిర్ణయాలే ఫలితాలనిస్తాయి. బేసిక్స్ను నేనెప్పుడూ మర్చిపోను. వాటి ఆధారంగానే మూడు ఫార్మాట్లలోనూ నేను ఒకే విధంగా ఆడటానికి ఒక రకంగా ఇదే కారణం అని చెప్పవచ్చు’’ అని విరాట్ కోహ్లి పేర్కొన్నాడు. స్టార్ స్పోర్ట్స్ షోలో ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు.చదవండి: RR vs RCB: వార్ వన్సైడ్.. గెలిచేది ఆ జట్టే: టీమిండియా దిగ్గజం Incredible Icon @imVkohli talks about his mentality when he walks out to bat! 👀Will he unsettle #RajasthanRoyals' bowlers today and take #RoyalChallengersBengaluru a step closer to the #IPLfinal?📺 | #RRvRCB #Eliminator | TODAY, 6:30 PM | #IPLOnStar | #PlayOffsOnStar pic.twitter.com/Kkc1L0QqEo— Star Sports (@StarSportsIndia) May 22, 2024 -
RR vs RCB: వార్ వన్సైడ్.. గెలిచేది ఆ జట్టే: టీమిండియా దిగ్గజం
ఐపీఎల్-2024 ఆఖరి అంకానికి చేరుకుంటోంది. ఇప్పటికే ఒక ఫైనలిస్టు ఖరారు కాగా.. తుది పోరుకు అర్హత సాధించేందుకు మిగిలిన మూడు జట్లు ఉవ్విళ్లూరుతున్నాయి.ఈ సీజన్లో ప్లే ఆఫ్స్లో అడుగుపెట్టిన కోల్కతా నైట్ రైడర్స్ క్వాలిఫయర్-1లో సన్రైజర్స్ హైదరాబాద్ను ఓడించిన విషయం తెలిసిందే. అహ్మదాబాద్లో మంగళవారం జరిగిన ఈ మ్యాచ్లో రైజర్స్ను ఎనిమిది వికెట్ల తేడాతో చిత్తు చేసి ఫైనల్కు దూసుకువెళ్లింది కేకేఆర్.ఇక ఫైనల్ రేసులో మిగిలినవి రెండే మ్యాచ్లు. ఎలిమినేటర్, క్వాలిఫయర్-2. పాయింట్ల పట్టికలో మూడు, నాలుగు స్థానాల్లో నిలిచిన రాజస్తాన్ రాయల్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య బుధవారం ఎలిమినేటర్ మ్యాచ్ జరుగనుంది.సన్రైజర్స్తో ఎలిమినేటర్ విజేత పోటీఇందులో గెలిచిన జట్టు క్వాలిఫయర్-2కు అర్హత సాధిస్తుంది. క్వాలిఫయర్-1లో కేకేఆర్ చేతిలో ఓడిన సన్రైజర్స్తో అమీతుమీ తేల్చుకుంటుంది. ఆ మ్యాచ్లో గనుక గెలిస్తే ఫైనల్కు చేరుకుంటుంది.ఈ క్రమంలో బెంగళూరు- రాజస్తాన్ మధ్య ఎలిమినేటర్ మ్యాచ్ మరింత ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో టీమిండియా దిగ్గజం, ప్రముఖ కామెంటేటర్ సునిల్ గావస్కర్ ఎలిమినేటర్ విజేత ఎవరన్న అంశంపై తన అంచనా తెలియజేశాడు.‘‘ఆర్సీబీ ఈసారి ఎంతటి అద్భుతం చేసిందో చూశాం. ముఖ్యంగా వరుస పరాజయాల తర్వాత వాళ్లు తిరిగి పుంజుకున్న తీరు అమోఘం. మామూలు జట్లకు ఇలాంటివి సాధ్యం కావు.అయ్యో.. మనం ఓడిపోతూనే ఉన్నాంఆర్సీబీ ప్రధాన ఆటగాళ్లలో కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్, విరాట్ కోహ్లితో పాటు మిగతా సీనియర్ ప్లేయర్లు తమ ఆట తీరుతో.. జట్టులో ఉత్సాహం నింపారు. ఆర్సీబీ స్థానంలో మరే ఇతర జట్టు ఏదైనా ఉంటే.. ‘అయ్యో.. మనం ఓడిపోతూనే ఉన్నాం. అంతా ముగిసిపోయింది’ అని బెంబేలెత్తిపోయేవాళ్లు.కానీ డుప్లెసిస్, కోహ్లి ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసాన్ని సడలనివ్వలేదు. ఇక రాజస్తాన్.. గత నాలుగు- ఐదు మ్యాచ్లలో ఓడిపోతూనే ఉంది. ఆఖరిగా ఆడిన మ్యాచ్లోనూ ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది.వాళ్లను చూస్తే పూర్తిగా ఫామ్ కోల్పోయినట్లు కనిపిస్తున్నారు. పదకొండు రోజుల పాటు ఆటకు దూరంగా ఉన్న కేకేఆర్ మాదిరి ఏదైనా ప్రత్యేకంగా చేస్తే తప్ప రాజస్తాన్కు గెలిచే అవకాశాలు ఉండవు.లేదంటే మ్యాచ్ ఏకపక్షంగా సాగిపోయే ఛాన్స్ ఉంది. ఆర్సీబీ రాజస్తాన్ను చిత్తు చేసినా చేస్తుంది. ఒకవేళ అలా జరగకపోతేనే ఆశ్చర్యం’’ అని సునిల్ గావస్కర్ స్టార్ స్పోర్ట్స్ షోలో వ్యాఖ్యానించాడు. ఎలిమినేటర్ మ్యాచ్లో ఆర్సీబీ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంచనా వేశాడు.గావస్కర్ వర్సెస్ కోహ్లికాగా ఇటీవల గావస్కర్- కోహ్లి మధ్య మాటల యుద్ధం నడిచిన విషయం తెలిసిందే. కోహ్లి స్ట్రైక్రేటు గురించి గావస్కర్ విమర్శించగా.. రన్మెషీన్ అందుకు కాస్త ఘాటుగానే బదులిచ్చాడు. ఎలా ఆడాలో తనకు తెలుసునని.. జట్టు ప్రయోజనాల కోసం ఏం చేయాలో కూడా తెలుసంటూ కౌంటర్ వేశాడు. -
IPL 2024: ధోనిని అవమానించిన ఆర్సీబీ ప్లేయర్లు!.. తప్పు ‘తలా’దేనా?
‘‘ప్రపంచకప్ ఫైనల్ గెలిచినా.. భావోద్వేగాలు ప్రతిబింబించేలా సంబరాలు చేసుకుంటున్న సమయంలోనూ ప్రత్యర్థి జట్టుతో కరచాలనం చేయడం మర్యాద. ‘మన మధ్య పోరు ముగిసిపోయింది.మన మధ్య ఇక ఎలాంటి శత్రుత్వం లేదు. ఇప్పటికి ఇది ముగిసిపోయింది’ అని ఇరు జట్లు పరస్పరం చెప్పుకోవడానికి ఇది(షేక్హ్యాండ్) ప్రతీక’’- హర్షా భోగ్లే, కామెంటేటర్.‘‘అతడొక ఐకానిక్ ప్లేయర్. వచ్చే ఏడాది ఆడతాడో లేదో కూడా తెలియదు. బహుశా ఇదే చివరి మ్యాచ్ కూడా అయి ఉండవచ్చు. అలాంటి లెజెండ్ను కలవడానికి ఆటగాళ్లు ఆసక్తిగా ఎదురుచూడటం సహజం.ఆ తర్వాత ఎంతసేపు సంబరాలు చేసుకున్నా ఎవరూ ఏమీ అనరు. కానీ అంతా ముగిసి తెల్లారిన తర్వాత.. ‘అయ్యో.. ఎంఎస్ ధోని రిటైర్మెంట్ ప్రకటించాడు.కానీ మనం ఆయనకు డీసెంట్గా ఓ షేక్హ్యాండ్తో వీడ్కోలు పలకలేకపోయామే’ అని బాధ పడితే ప్రయోజనం ఉంటుందా?’’- ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్.ధోనికి అవమానంచెన్నై సూపర్ కింగ్స్ స్టార్ మహేంద్ర సింగ్ ధోని పట్ల రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఆటగాళ్లు వ్యవహరించిన తీరుపట్ల ఇలా కామెంటేటర్లు, మాజీ క్రికెటర్లు విరుచుకుపడ్డారు. ఐపీఎల్లో రోహిత్ శర్మ(ముంబై ఇండియన్స్)తో పాటు ఐదుసార్లు ట్రోఫీ సాధించిన దిగ్గజం పట్ల ఆర్సీబీ ప్లేయర్లు ప్రవర్తించిన విధానం అవమానకరమని మండిపడుతున్నారు.ఇక ధోని అభిమానులైతే ఆర్సీబీ జట్టును సోషల్ మీడియా వేదికగా పదునైన కామెంట్లతో తూర్పారబడుతున్నారు. అయితే, తాజాగా ఓ నెటిజన్ కొత్త వీడియోను తెరమీదకు తెచ్చారు. ధోనికి మద్దతుగా మాట్లాడే వారందరూ ఒక్కసారి ఈ దృశ్యాలను చూడాలంటూ కొత్త చర్చకు దారితీశారు.ఇంతకీ ఏం జరిగింది?... ఐపీఎల్-2024 ఆరంభం నుంచి వరుస పరాజయాలతో చతికిలపడ్డ ఆర్సీబీ.. ప్లే ఆఫ్స్ రేసులో వరుసగా ఆరు మ్యాచ్లలో గెలిచి సరికొత్త చరిత్ర సృష్టించింది.లీగ్ దశలో సొంత మైదానంలో చెన్నై సూపర్ కింగ్స్తో చావోరేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్లో 27 పరుగుల తేడాతో గెలిచింది. తద్వారా చెన్నైని ప్లే ఆఫ్స్ రేసు నుంచి తప్పించి.. టాప్-4 బెర్తును ఖరారు చేసుకుంది.ధోనిని పట్టించుకోని ఆర్సీబీ ఆటగాళ్లు?ఈ క్రమంలో ఆర్సీబీ ఆటగాళ్ల సంబరాలు అంబరాన్నంటాయి. ఫైనల్ గెలిచినంతంగా పెద్ద ఎత్తున సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ధోని సహా మిగిలిన చెన్నై ఆటగాళ్లు కరచాలనం చేసేందుకు వచ్చారు. అయితే, ఆర్సీబీ సెలబ్రేషన్స్ పూర్తికాకపోవడంతో వీళ్లను పట్టించుకోలేదు. దీంతో చిన్నబుచ్చుకున్న ధోని డ్రెసింగ్రూంకి వెళ్లిపోయాడు. ఆ తర్వాత మిగతా ఆటగాళ్లు కాసేపు వేచి చూడగా.. ఎట్టకేలకే ఆర్సీబీ ప్లేయర్లు వచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చారు.ఈ నేపథ్యంలో ధోని మూడు నిమిషాల పాటు ఎదురుచూసినా ఆర్సీబీ ఆటగాళ్లు షేక్హ్యాండ్ కోసం రాలేదని.. తలాను ఘోరంగా అవమానించారంటూ విరాట్ కోహ్లి సహా ఆర్సీబీ ఆటగాళ్లందరిపై సీఎస్కే ఫ్యాన్స్ మండిపడ్డారు.అసలు నిజం ఇదేనంటూఈ క్రమంలో ఓ వ్యక్తి నిజం ఇదేనంటూ.. ‘‘ధోని మూడు నిమిషాలు వేచి చూశాడని అభిమానులు అంటున్నారు. అయితే, అతడు కాసేపు కూడా ఎదురుచూడకుండా వెళ్లిపోయాడు. గెలిచిన జట్టుకు ఆమాత్రం సెలబ్రేట్ చేసుకునే హక్కులేదా? సీఎస్కే గతేడాది ట్రోఫీ గెలిచినపుడు సంబరాలు చేసుకుందా? లేదంటే షేక్హ్యాండ్ ఇవ్వడానికి వెళ్లిందా? ’’ అని ఓ వీడియోను పంచుకున్నారు. ఇది ఇప్పుడు ఆర్సీబీ- సీఎస్కే ఫ్యాన్స్ మధ్య మరోసారి మాటల యుద్ధానికి తెరతీసింది.చదవండి: KKR vs SRH: ప్రమాదకారి.. ఫైనల్ చేరే తొలి జట్టు ఇదే: పాక్ లెజెండ్I can understand he’s pissed but every other player came to shake hands. Those players deserved to have that moment. When CSK won last year should they have gone around celebrating or gone to shake hands? https://t.co/MPXQ9zVOYo pic.twitter.com/TxKA2My6xD— Pradhyoth (@Pradhyoth1) May 19, 2024#THALAFOREVER 🦁💛@msdhoni pic.twitter.com/zOu5KABAcP— Chennai Super Kings (@ChennaiIPL) May 19, 2024 -
యశ్ దయాల్పై కోహ్లి ఫైర్.. దెబ్బకు ధోని ఖేల్ ఖతం!
ఐపీఎల్-2024లో ప్లే ఆఫ్స్ చివరి బెర్తును ఖరారు చేసే పోటీలో చెన్నై సూపర్ కింగ్స్- రాయల్ చాలెంజర్స్ బెంగళూరు నువ్వా- నేనా అన్నట్లుగా తలపడ్డాయి. వర్షం రాకతో ఆరంభం నుంచే ఆసక్తి రేపుతూ.. హోరీహోరీగా సాగిన ఈ పోరులో ఎట్టకేలకు ఆర్సీబీదే పైచేయి అయింది.ఆఖరి వరకు నరాలు తెగే ఉత్కంఠ రేపిన మ్యాచ్ సత్తా చాటి ప్లే ఆఫ్స్లో అడుగుపెట్టింది. సమిష్టి ప్రదర్శనతో చెన్నైకి చెక్ పెట్టి టాప్-4కు అర్హత సాధించింది. చిన్నస్వామి స్టేడియంలో టాస్ గెలిచిన చెన్నై తొలుత బౌలింగ్ ఎంచుకుంది.మూడు ఓవర్ల పాటు ఆర్సీబీ బ్యాటింగ్ పూర్తైన తరుణంలో వరణుడి రాక అభిమానులను కలవరపెట్టింది. అయితే, కాసేపటికే మ్యాచ్ తిరిగి ఆరంభమైంది. ఈ క్రమంలో ఓపెనర్లు విరాట్ కోహ్లి(47), ఫాఫ్ డుప్లెసిస్(54).. వన్డౌన్ బ్యాటర్ రజత్ పాటిదార్(41) రాణించారు.వీరికి తోడు నాలుగో నంబర్ బ్యాటర్ కామెరాన్ గ్రీన్ ధనాధన్ ఇన్నింగ్స్(17 బంతుల్లో 38 నాటౌట్)తో చెలరేగాడు. మిగతా వాళ్లలో దినేశ్ కార్తిక్ 14, మాక్స్వెల్(16) ఫర్వాలేదనిపించారు. ఈ క్రమంలో ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 218 పరుగులు చేసింది.చావో రేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్లో భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన సీఎస్కే ఆరంభంలోనే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్(0) వికెట్ కోల్పోయింది. మరో ఓపెనర్ రచిన్ రవీంద్ర(61) రాణించగా.. అజింక్య రహానే(33) అతడికి సహకరించాడు.రవీంద్ర జడేజా సైతం 22 బంతుల్లో 42 పరుగులతో దుమ్ములేపాడు. మహేంద్ర సింగ్ ధోని కూడా మెరుపులు(13 బంతుల్లో 25) మెరిపించాడు. కానీ ప్లే ఆఫ్స్ చేరాలంటే ఆఖరి ఓవర్లో 17 పరుగులు అవసరం కాగా సీఎస్కే బ్యాటర్లు చేతులెత్తేశారు.కాగా అనూహ్య రీతిలో చివరి ఓవర్లో ఆర్సీబీ సారథి డుప్లెసిస్ బంతిని యశ్ దయాల్ చేతికి ఇచ్చాడు.అతడి బౌలింగ్లో తొలి బంతికే ధోని సిక్సర్ బాది ఆశలు రేకెత్తించాడు. సమీకరణం 5 బంతుల్లో 11 పరుగులుగా మారింది.దయాల్ అప్పటికే తీవ్ర ఒత్తిడిలో కూరుకుపోయాడు. ఆ సమయంలో విరాట్ కోహ్లి అతడికి దగ్గరికి దిశా నిర్దేశం చేశాడు. ధోని లాంటి లెజెండ్ క్రీజులో ఉన్నపుడు యార్కర్ కాదు స్లో బాల్ వేయాలంటూ కాస్త గట్టిగానే హెచ్చరించాడు.దీంతో యశ్ దయాల్ ధోనికి స్లో బాల్ సంధించగా.. ట్రాప్లో చిక్కుకున్న తలా స్వప్నిల్ సింగ్కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. దీంతో ఆర్సీబీ శిబిరంలో సంబరాలు మొదలయ్యాయి. ఇక మిగిలిన నాలుగు బంతుల్లో సీఎస్కే కేవలం ఒక్క పరుగు మాత్రమే సాధించడంతో.. ఆర్సీబీ ప్లే ఆఫ్స్ చేరింది.అలా కోహ్లి దెబ్బకు సెట్ అయిన యశ్ దయాల్ కీలక వికెట్ తీసి ఆర్సీబీ గెలుపునకు ప్రధాన కారణమయ్యాడు. కాగా ఈ మ్యాచ్లో కోహ్లి ఆద్యంతం కీలక సమయంలో ఆటగాళ్లకు సూచనలు ఇస్తూ సానుకూల ఫలితాలు రాబట్టడం విశేషం. ఇక ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచిన ఫాఫ్ డుప్లెసిస్ తన అవార్డును యశ్ దయాల్కు అంకితమివ్వడం మరో విశేషం. Nail-biting overs like these 📈Describe your final over emotions with an emoji 🔽Recap the match on @StarSportsIndia and @JioCinema 💻📱#TATAIPL | #RCBvCSK pic.twitter.com/XYVYvXfton— IndianPremierLeague (@IPL) May 18, 2024pic.twitter.com/xgmfhb0Fri— The Game Changer (@TheGame_26) May 19, 2024 -
RCB: అమెరికాలో అంబరాన్నంటిన సంబరాలు.. ఎందుకంత స్పెషల్?
ఆర్సీబీ.. ఆర్సీబీ.. ఆర్సీబీ.. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఇదే పేరు.. ఆర్సీబీ నామస్మరణతో హోరెత్తుతూ ఆగని జోరు... రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ఏకంగా ఐపీఎల్-2024 టైటిల్ సాధించిందా? అన్నంతగా సంబరాలు..ఖండాంతరాలు దాటిన సంబురం.. అమెరికాలోనూ పేలుతున్న విన్నింగ్ క్రాకర్స్.. ఆర్సీబీ ప్లే ఆఫ్స్ చేరిన క్రమంలో ‘నమ్మ బెంగళూరు’ అంటూ కనీవినీ ఎరుగని రీతిలో సెలబ్రేషన్స్.. అంత ప్రత్యేకమాఈ విజయం అంత ప్రత్యేకమా అంటే అవుననే చెప్పాలి. ఇంత వరకు ఒక్కసారి కూడా ఆర్సీబీ టైటిల్ గెలవనే లేదు. అయితే, అనూహ్య రీతిలో ఈసారి మహిళా ప్రీమియర్ లీగ్ రూపంలో తొలిసారి బెంగళూరు ఫ్రాంఛైజీకి ట్రోఫీ దక్కింది.స్మృతి మంధాన కెప్టెన్సీలో ఆర్సీబీ వుమెన్ టీమ్ కప్ కొట్టింది. ఇదే జోరులో పురుషుల జట్టు కూడా ఈసారి ట్రోఫీ సాధిస్తుందని.. టైటిల్ లేదన్న వెలితిని పూరిస్తుందని అభిమానులు ఆశపడ్డారు. అయితే, ఆరంభ మ్యాచ్లోనే ఆర్సీబీ ఓటమిపాలైంది. చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో పరాజయంతో సీజన్ను మొదలుపెట్టింది.ఆ తర్వాత సొంతగడ్డపై పంజాబ్ కింగ్స్పై విజయం సాధించిన బెంగళూరు జట్టు.. అదే జోరును కొనసాగించలేకపోయింది. వరుస వైఫల్యాలతో చతికిల పడి ప్లే ఆఫ్స్ నుంచి నిష్క్రమించే తొలి జట్టు అవుతుందేమోనన్న భావన కలిగించింది. KGF త్రయంలో విరాట్ కోహ్లి రాణించినా గ్లెన్ మాక్స్వెల్, కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ అంచనాలు అందుకోలేకపోయారు.మాక్సీ కొన్నాళ్లు జట్టుకు దూరంగాఫలితంగా విమర్శల పాలయ్యారు. దీంతో మాక్సీ కొన్నాళ్లు జట్టుకు దూరంగా ఉన్నాడు. ఈ క్రమంలో ప్లే ఆఫ్స్ చేరాలంటే ప్రతి మ్యాచ్లోనూ చావోరేవో తేల్చుకోవాల్సిన పరిస్థితి. నిజానికి ఇలాంటి ఒత్తిడిలో ఏ జట్టైనా చిత్తవుతుంది. కానీ ఆర్సీబీ అందుకు విరుద్ధం.ఎంత ఒత్తిడి పెరిగితే అంతగా చెలరేగిపోతాం అన్నట్లుగా వరుసగా ఆరు విజయాలు సాధించి.. ఇప్పుడిలా ప్లే ఆఫ్స్లో అడుగుపెట్టింది. చెన్నై సూపర్ కింగ్స్పై తప్పక గెలవాల్సిన మ్యాచ్లో ఊహించని విజయం సాధించింది. రిపీట్ అవుతుందా?సీఎస్కేపై గెలిచినా నెట్ రన్రేటు పరంగా కూడా ఆ జట్టు కంటే మెరుగైన స్థితిలో ఉంటేనే టాప్-4కు అర్హత సాధిస్తుందన్న తరుణంలో అద్భుతం చేసి.. టాప్-4కు అర్హత సాధించింది. కాగా 2016లోనూ ఆరంభంలో ఆకట్టుకోలేకపోయిన ఆర్సీబీ.. ఆ తర్వాత వరుస విజయాలతో ప్లే ఆఫ్స్ చేరి.. అటుపై ఫైనల్లో అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఈసారి కూడా అదే ఫలితం పునరావృతమవుతుందని అభిమానులు భావిస్తున్నారు. కాగా 2016 ఫైనల్లో ఆర్సీబీ సన్రైజర్స్ హైదరాబాద్ చేతిలో ఓటమిపాలైన విషయం తెలిసిందే.ఆర్సీబీ వర్సెస్ చెన్నై స్కోర్లు👉వేదిక: చిన్నస్వామి స్టేడియం.. బెంగళూరు👉టాస్: చెన్నై.. బౌలింగ్👉ఆర్సీబీ స్కోరు: 218/5 (20)👉చెన్నై స్కోరు: 191/7 (20)👉ఫలితం: చెన్నైపై 27 పరుగుల తేడాతో ఆర్సీబీ విజయం.. ప్లే ఆఫ్స్లో ఎంట్రీ👉ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: ఫాప్ డుప్లెసిస్(39 బంతుల్లో 54, కీలక సమయంలో రెండు క్యాచ్లు).చదవండి: Virat Kohli: కన్నీళ్లు పెట్టుకున్న కోహ్లి, అనుష్క.. వీడియో వైరల్ Winning celebration of RCB in North America right now🔥🔥.Bigger than any franchise.RCB , RCB , RCB . pic.twitter.com/2M2FipXGYX— Kohlified. (@123perthclassic) May 19, 2024Winning celebration of RCB near Trump building Chicago. right now🔥🔥.Bigger than any franchise.RCB , RCB , RCB . pic.twitter.com/dy1Oko6QS7— #RCBNation (@9Sxventy3) May 19, 2024Bengaluru won't sleep tonight 😎RCB RCB all over the city @RCBTweets ❤️🔥pic.twitter.com/6jvvAAVERT— M. (@RCB_Hiv3) May 18, 2024Hear the Roar, Hear "Kohli, Kohli & RCB, RCB" Chants when they qualify for playoffs.- King Kohli & RCB are emotions..!!!! pic.twitter.com/Afqck4jNSH— Tanuj Singh (@ImTanujSingh) May 18, 2024📽️ RAW Reactions post a surreal win ❤️When emotions spoke louder than words at Chinnaswamy 🏟️A special lap of honour for the @RCBTweets fans that continue to believe in their side 👏👏#TATAIPL | #RCBvCSK pic.twitter.com/CrBQUBRKEI— IndianPremierLeague (@IPL) May 19, 2024 -
Virat Kohli: బహుశా ఇదే చివరి మ్యాచ్.. కోహ్లి వ్యాఖ్యలు వైరల్
ఐపీఎల్-2024 ప్లే ఆఫ్స్ రేసు తుది అంకానికి చేరుకుంది. కోల్కతా నైట్ రైడర్స్, రాజస్తాన్ రాయల్స్, సన్రైజర్స్ హైదరాబాద్ బెర్తులు ఖరారు చేసుకోగా.. నాలుగో స్థానం కోసం చెన్నై సూపర్ కింగ్స్- రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య గట్టి పోటీ నెలకొంది.బెంగళూరు వేదికగా ఈ రెండు జట్లు శనివారం తలపడబోతున్నాయి. ఈ మ్యాచ్కు వర్షం ఆటంకం కలిగించే సూచనలు ఉన్నాయి. ఒకవేళ వాన వల్ల మ్యాచ్ రద్దైతే మాత్రం ఎలాంటి సమీకరణలతో పనిలేకుండా చెన్నై టాప్-4కు దూసుకువెళ్తుంది.బహుశా ఇదే ఆఖరిసారిఇదిలా ఉంటే.. చెన్నై సూపర్ స్టార్ మహేంద్ర సింగ్ ధోనికి ఇదే ఆఖరి సీజన్ అన్న వార్తల నేపథ్యంలో ఆర్సీబీ మేటి క్రికెటర్ విరాట్ కోహ్లి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘మహీ భాయ్.. నేను మరోసారి కలిసి(ప్రత్యర్థులుగా) ఆడబోతున్నాం.బహుశా ఇదే ఆఖరిసారి కావొచ్చేమో ఎవరికి తెలుసు! ఏదేమైనా మా అభిమానులకు ఇదొక గొప్ప కానుకలాంటిదే. టీమిండియాలో ఇద్దరం కలిసి ఎన్నో గుర్తుండిపోయే ఇన్నింగ్స్ ఆడాం.మహీ భాయ్ తన ఫినిషింగ్ టచ్తో ఎన్నో మ్యాచ్లలో జట్టును గెలిపించాడని అందరికీ తెలిసిందే’’ అని కోహ్లి పేర్కొన్నాడు. ఐపీఎల్లో ధోనితో కలిసి ఆడే ఆఖరి మ్యాచ్ ఇదే కావొచ్చంటూ.. ధోని రిటైర్మెంట్పై కోహ్లి సంకేతాలు ఇచ్చాడు.రుతురాజ్ గైక్వాడ్కు పగ్గాలుకాగా 42 ఏళ్ల ధోని చెన్నై సూపర్ కింగ్స్ను ఇప్పటికే ఐదుసార్లు చాంపియన్గా నిలిపాడు. అయితే, ఐపీఎల్-2024 ఆరంభానికి ముందే కెప్టెన్సీ పగ్గాలను రుతురాజ్ గైక్వాడ్కు అప్పగించిన తలా.. వికెట్కీపర్ బ్యాటర్గా కొనసాగుతున్నాడు.ఈ సీజన్లో పలు మ్యాచ్లలో వింటేజ్ ధోనిని తలపిస్తూ పరుగుల విధ్వంసం సృష్టించిన మహీ.. 10 ఇన్నింగ్స్లో కలిపి 136 పరుగులు సాధించాడు. మోకాలి నొప్పి వేధిస్తున్నా సీఎస్కే తరఫున బరిలోకి దిగిన అతడు.. వచ్చే సీజన్లో ఆటకు గుడ్బై చెప్పే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో కోహ్లి వ్యాఖ్యలు ధోని రిటైర్మెంట్ ఊహాగానాలకు మరింత ఊతమిచ్చాయి.చదవండి: MI: అంతా ఫేక్!.. అర్జున్ టెండుల్కర్ ఓవరాక్షన్.. ఆ తర్వాత ఇలా! -
IPL 2024: చెన్నైని ఓడించినా ఆర్సీబీ ప్లే ఆఫ్స్ చేరదు! అదెలా?
ఐపీఎల్-2024 ప్లే ఆఫ్స్లో మూడో బెర్తు కూడా ఖరారైంది. కోల్కతా నైట్ రైడర్స్ టేబుల్ టాపర్గా ముందుగానే టాప్-4లో తిష్ట వేయగా.. రాజస్తాన్ రాయల్స్, సన్రైజర్స్ హైదరాబాద్ కూడా అర్హత సాధించాయి.లక్నో సూపర్ జెయింట్స్పై ఢిల్లీ క్యాపిటల్స్ విజయం(మే 14)తో ఎలాంటి సమీకరణలతో పనిలేకుండా రాజస్తాన్.. గుజరాత్ టైటాన్స్తో గురువారం నాటి మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడంతో సన్రైజర్స్ ప్లే ఆఫ్స్లో నేరుగా చోటు దక్కించుకున్నాయి.ఆ మూడు జట్ల మధ్య పోటీఇక ప్లే ఆఫ్స్లో మిగిలిన ఒక్క స్థానం కోసం చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, లక్నో సూపర్ జెయింట్స్ జట్టు పోటీపడుతున్నాయి. నిజానికి రన్రేటు పరంగా ఈ రెండు జట్ల కంటే వెనుకబడి ఉన్న లక్నో(12 పాయింట్లు, నెట్ రన్రేటు -0.787) ఈ రేసు నుంచి అనధికారికంగా నిష్క్రమించినట్లే!ఒకవేళ ఆశలు సజీవం చేసుకోవాలంటే.. ముంబై ఇండియన్స్తో శుక్రవారం నాటి మ్యాచ్లో భారీ తేడాతో లక్నో గెలవాలి. అయినప్పటికీ సీఎస్కే- ఆర్సీబీ ఫలితంపై ఆధారపడాల్సి ఉంటుంది. అందులోనూ ఆర్సీబీని సీఎస్కే కచ్చితంగా.. అది కూడా స్వల్ప తేడాతో ఓడిస్తేనే లక్నోకు అవకాశం ఉంటుంది.సీఎస్కే- ఆర్సీబీ ఫలితంపై సర్వత్రా ఆసక్తిఈ నేపథ్యంలో.. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప లక్నో వరుసగా మూడోసారి ప్లే ఆఫ్స్ చేరడం సాధ్యంకాదు. కాబట్టి ప్రధానంగా పోటీలో ఉన్నది సీఎస్కే- ఆర్సీబీ మాత్రమే అని చెప్పవచ్చు.ఈ రెండు జట్లలోనూ చెన్నై(14 పాయింట్లు, రన్రేటు 0.528) ఆర్సీబీ(12 పాయింట్లు 0.387) కంటే ఓ మెట్టు పైనే ఉంది. అయినప్పటికీ ఆర్సీబీ సీఎస్కేను దాటి ప్లే ఆఫ్స్ చేరాలంటే..? సాధ్యమయ్యే రెండు సమీకరణలు ఇలా!అలా చెన్నైపై గెలిచినా సాధ్యం కాదు1. చిన్నస్వామి స్టేడియంలో శనివారం జరిగే మ్యాచ్లో ఆర్సీబీ తొలుత బ్యాటింగ్ చేసి 200 పరుగులకు తక్కువ కాకుండా స్కోరు చేయాలి. అంతేకాదు 18 పరుగుల తేడాతో చెన్నైని ఓడించాలి. అంతకంటే ఒక్క పరుగు తక్కువ తేడాతో చెన్నైని ఓడించినా ఫలితం ఉండదు. నెట్ రన్రేటు ఆధారంగా చెన్నై ప్లే ఆఫ్స్ చేరితే.. ఆర్సీబీ మాత్రం ఇంటిబాట పడుతుంది.2. ఒకవేళ ఆర్సీబీ గనుక సెకండ్ బ్యాటింగ్ చేయాల్సి వచ్చి.. చెన్నై విధించిన 201 పరుగుల లక్ష్యాన్ని.. 11 బంతులు మిగిలి ఉండగానే ఆర్సీబీ పూర్తి చేయాలి. చదవండి: Kavya Maran- SRH: కేన్ మామను హత్తుకున్న కావ్యా.. వీడియో వైరల్ -
Virat Kohli: ఒక్కసారి క్రికెట్కు వీడ్కోలు పలికితే.. కోహ్లి నోట రిటైర్మెంట్ మాట!
‘‘క్రీడాకారులుగా మన కెరీర్కు కచ్చితంగా ఆఖరి తేదీ అనేది ఒకటి ఉంటుంది. కాబట్టి నేను నా ఆటలో లోపాలు ఏమైనా ఉంటే వాటిని సరిదిద్దుకోవడంపైనే ఎల్లప్పుడూ దృష్టి సారిస్తాను.కెరీర్ ముగిసి పోయిన తర్వాత.. ‘ఓహ్.. ఆరోజు నేను అలా చేస్తే బాగుండు.. ఇలా చేస్తే ఇంకా మెరుగ్గా ఉండేది’ అని పశ్చాత్తాపపడాలని అనుకోవడం లేదు. కెరీర్కు వీడ్కోలు పలికిన తర్వాత కూడా ఎల్లకాలం గతం గురించే ఆలోచిస్తూ కూర్చోవడం నాకు ఇష్టం ఉండదు. అందుకే ప్రతీ పని ఇప్పుడే పూర్తి చేసుకుంటాను.పశ్చాత్తాపపడేందుకు ఏదీ మిగలనివ్వను. కచ్చితంగా నేను ఇది సాధిస్తాననే అనుకుంటున్నా’’ అంటూ టీమిండియా స్టార్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఓపెనర్ విరాట్ కోహ్లి ధీమా వ్యక్తం చేశాడు.మీ కంటికి కూడా కనిపించనుఆర్సీబీ రాయల్ గాలా డిన్నర్ నేపథ్యంలో రిటైర్మెంట్ తర్వాత తాను చేయాలనుకుంటున్న పనుల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘ఒక్కసారి క్రికెట్కు వీడ్కోలు పలికితే.. ఆ తర్వాత కొన్నాళ్ల పాటు మీ కంటికి కూడా కనిపించను(నవ్వుతూ).అందుకే ఇక్కడ ఉన్నంతసేపు నా శాయశక్తులా, అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చేందుకు తపిస్తున్నా. ఆ తపనే నన్ను ఇప్పుడు ముందుకు నడిపిస్తోంది’’ అని విరాట్ కోహ్లి చెప్పుకొచ్చాడు. కాగా 2008లో టీమిండియా తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన కోహ్లి జట్టులో కీలక సభ్యుడిగా మారాడు.రికార్డుల రారాజుగా పేరొంది కెప్టెన్ స్థాయికి ఎదిగాడు. ప్రస్తుతం రోహిత్ శర్మ కెప్టెన్సీలో ఆటగాడిగా కొనసాగుతున్న కోహ్లి.. 2008 నుంచి ఇప్పటిదాకా ఐపీఎల్లో ఆర్సీబీకే ప్రాతినిథ్యం వహిస్తున్నాడు.అత్యధిక పరుగుల వీరుడుపదహారేళ్ల సుదీర్ఘ కెరీర్లో ఒక్కసారి కూడా గాయాల బెడదతో కోహ్లి జట్టుకు దూరం కాలేదంటే ఫిట్నెస్ మీద అతడికి ఉన్న శ్రద్ధ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ఇక 35 ఏళ్ల ఈ రైట్హ్యాండ్ బ్యాటర్.. ప్రస్తుతం ఐపీఎల్-2024తో బిజీగా ఉన్నాడు.ఇప్పటి వరకు ఈ సీజన్లో 13 మ్యాచ్లలో ఆడి 661 పరుగులు సాధించిన విరాట్ కోహ్లి.. అత్యధిక పరుగుల వీరుడి(ఆరెంజ్ క్యాప్ హోల్డర్)గా కొనసాగుతున్నాడు. లీగ్ దశలో ఆర్సీబీ తమ ఆఖరి మ్యాచ్లో మే 18న చెన్నై సూపర్ కింగ్స్తో తలపడనుంది. ఒకవేళ ఈ మ్యాచ్లో ఓడిపోతే ఆర్సీబీ ఇంటిబాట పడుతుంది. కాగా బెంగళూరు జట్టు ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఐపీఎల్ ట్రోఫీ సాధించలేదన్న సంగతి తెలిసిందే.చదవండి: IPL 2024: సన్రైజర్స్ ప్లే ఆఫ్స్ చేరదు.. ఆ నాలుగు జట్లే! ఫ్యాన్స్ ఫైర్ View this post on Instagram A post shared by Royal Challengers Bengaluru (@royalchallengers.bengaluru) -
IPL 2024: సన్రైజర్స్ ప్లే ఆఫ్స్ చేరదు.. ఆ నాలుగు జట్లే! ఫ్యాన్స్ ఫైర్
ఐపీఎల్-2024 ప్లే ఆఫ్స్ రేసు రసవత్తరంగా సాగుతోంది. లీగ్ దశ ముగింపునకు వచ్చినా టాప్-4 బెర్తులపై ఇంత వరకూ స్పష్టత రాలేదు. కోల్కతా నైట్ రైడర్స్, రాజస్తాన్ రాయల్స్ ఇప్పటికే ప్లే ఆఫ్స్ చేరగా.. మిగిలిన రెండు స్థానాల కోసం ఆసక్తికర పోటీ నడుస్తోంది.ప్రస్తుతం మూడో స్థానంలో ఉన్న చెన్నై సూపర్ కింగ్స్, సన్రైజర్స్ హైదరాబాద్ ఈ రేసులో ముందుండగా.. రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు కూడా ఆశలు ఇంకా సజీవంగానే ఉన్నాయి.చెన్నై ఇప్పటికి 13 మ్యాచ్లు ఆడి ఏడింట గెలిచి 14 పాయింట్లు(నెట్ రన్రేటు 0.528) సాధించగా.. పన్నెండు ఆడి ఏడింట గెలిచి 14 పాయింట్లతో ఉన్న సన్రైజర్స్ నెట్ రన్రేటు (0.406) పరంగా కాస్త వెనుకబడి ప్రస్తుతం నాలుగో స్థానంలో ఉంది.అతిపెద్ద సానుకూలాంశంఅయితే, రైజర్స్కు ఇంకా రెండు మ్యాచ్లు మిగిలి ఉండటం.. అది కూడా సొంతగడ్డపై జరుగనుండటం అతిపెద్ద సానుకూలాంశం. గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్తో మ్యాచ్లలో ఏదో ఒకటి గెలిచినా 16 పాయింట్లతో కనీసం నాలుగో స్థానం ఖరారు చేసుకుంటుంది.మరోవైపు.. ఆర్సీబీ ఖాతాలో 12 పాయింట్లే ఉన్నాయి. మిగిలింది ఇంకొక్క మ్యాచ్. అది కూడా సీఎస్కే(మే 18)తో! ఈ మ్యాచ్లో చెన్నైని కచ్చితంగా ఓడిస్తేనే ఆర్సీబీకి అవకాశం ఉంటుంది. లేదంటే ఇంటికి వెళ్లడమే తరువాయి!చెన్నై పరిస్థితి కూడా ఇంచుమించు ఇదే. ఓడితే ఇంటికే లేదంటే సన్రైజర్స్ మ్యాచ్ల ఫలితం తేలేవరకు వేచి చూడాలి. ఈ సమీకరణల నేపథ్యంలో ఎలా చూసినా సన్రైజర్స్ సీఎస్కే, ఆర్సీబీ కంటే ఓ మెట్టు పైనే ఉన్నట్లు స్పష్టమవుతోంది.రెండు మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ ఓడిపోతే పరిస్థితి ఏంటి?అయితే, టీమిండియా స్పిన్ దిగ్గజం హర్భజన్ సింగ్ మాత్రం సన్రైజర్స్ హైదరాబాద్ ఈసారి ప్లే ఆఫ్స్ చేరదంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. స్టార్ స్పోర్ట్స్ షోలో తన అభిప్రాయాలు పంచుకుంటూ.. చెన్నై సూపర్ కింగ్స్తో పాటు ఆర్సీబీ టాప్-4లో అడుగుపెడుతుందని జోస్యం చెప్పాడు.‘‘తదుపరి రెండు మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ ఓడిపోతే పరిస్థితి ఏంటి? ఐపీఎల్లో ఏదైనా జరగొచ్చు కదా! ఒకవేళ హైదరాబాద్ రెండు మ్యాచ్లూ ఓడి.. ఆర్సీబీ చెన్నై మీద గెలిస్తే.. అప్పుడు రెండు జట్ల ఖాతాలో 14 పాయింట్లే ఉంటాయి.రన్రేటు పరంగా సన్రైజర్స్ కంటే ఈ రెండు జట్లు మెరుగ్గానే ఉంటాయి. అందుకే నా టాప్ 4.. కేకేఆర్, రాజస్తాన్, చెన్నై, బెంగళూరు’’ అని హర్భజన్ సింగ్ చెప్పుకొచ్చాడు.భగ్గుమంటున్న ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్కాగా భజ్జీ వ్యాఖ్యలపై సన్రైజర్స్ హైదరాబాద్ అభిమానులు భగ్గుమంటున్నారు. విధ్వంసకర బ్యాటింగ్తో సొంతగడ్డపై చెలరేగే ప్యాట్ కమిన్స్ బృందాన్ని తక్కువ అంచనా వేయడమే గాకుండా.. అపశకునపు మాటలు మాట్లాడటం సరికాదంటూ ఫైర్ అవుతున్నారు. ఇక సన్రైజర్స్ గురువారం నాటి మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్తో తలపడనుంది. ఉప్పల్లోని రాజీవ్గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం ఇందుకు వేదిక.చదవండి: అతడి కంటే చెత్త కెప్టెన్ ఇంకొకరు లేరు.. పైగా హార్దిక్ను అంటారా?.. గంభీర్ ఫైర్ Ready to put on a show this evening 🧡💙#PlayWithFire #SRHvGT pic.twitter.com/o07Or5fu12— SunRisers Hyderabad (@SunRisers) May 16, 2024 -
సిక్సర్ల మోత.. ఐపీఎల్ చరిత్రలో ఇదే తొలిసారి
ఐపీఎల్-2024 తుది అంకానికి చేరుకుంటోంది. ఈ సీజన్లో ప్లే ఆఫ్స్లో అడుగుపెట్టిన తొలి జట్టుగా కోల్కతా నైట్ రైడర్స్ నిలవగా.. ఢిల్లీ క్యాపిటల్స్- లక్నో సూపర్ జెయింట్స్ మ్యాచ్ ఫలితంతో రాజస్తాన్ రాయల్స్ కూడా టాప్-4కు అర్హత సాధించింది.సొంత మైదానంలో ఢిల్లీ క్యాపిటల్స్ లక్నోను ఓడించడంతో రాజస్తాన్ ప్లే ఆఫ్స్ బెర్తును ఖరారు చేసుకుంది. ఇదిలా ఉంటే.. ఐపీఎల్ తాజా ఎడిషన్లో 64వ మ్యాచ్ అయిన ఢిల్లీ- లక్నో పోరు తర్వాత సరికొత్త చరిత్ర ఆవిష్కృతమైంది.ఈసారి ఏకంగాక్యాష్ రిచ్ లీగ్ చరిత్రలో అత్యధిక సిక్సర్లు నమోదైన సీజన్గా 2024 నిలిచింది. ఈ ఎడిషన్లో ఇప్పటి వరకు మొత్తంగా 1125 సిక్సర్లు నమోదయ్యాయి. ఇక మంగళవారం నాటి మ్యాచ్ సందర్భంగా ఢిల్లీ బ్యాటర్లలో అభిషేక్ పోరెల్ 4, షాయీ హోప్ రెండు, ట్రిస్టన్ స్టబ్స్ 4 సిక్సర్లు బాదగా.. లక్నో ఆటగాళ్లలో నికోలసన్ పూరన్ 4, అర్షద్ ఖాన్ 5, యుద్వీర్ సింగ్ చరక్ ఒక సిక్సర్ కొట్టారు.కాగా ఐపీఎల్-2024 ఆరంభం నుంచే సిక్సర్ల మోత మోగుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా విధ్వంసకర బ్యాటింగ్కు మారుపేరుగా మారిన సన్రైజర్స్ హైదరాబాద్తో పాటు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కూడా సిక్స్ల వర్షం కురిపించింది. తద్వారా ఈ సీజన్లో ఇప్పటి వరకు అత్యధిక సిక్స్లు నమోదు చేసిన తొలి రెండు జట్లుగా సన్రైజర్స్, ఆర్సీబీ నిలవగా.. అనూహ్య రీతిలో ఢిల్లీ క్యాపిటల్స్ మూడో స్థానం ఆక్రమించింది.ఒక ఐపీఎల్ సీజన్లో అత్యధిక సిక్సర్లు👉1125 సిక్సర్లు - 2024👉1124 సిక్సర్లు - 2023👉1062 సిక్సర్లు - 2022👉872 సిక్సర్లు- 2018👉784 సిక్సర్లు- 20192024లో ఇప్పటి వరకు అత్యధిక సిక్స్లు నమోదు చేసిన జట్లు👉సన్రైజర్స్ హైదరాబాద్- 12 మ్యాచ్లలో 146 సిక్స్లు👉ఆర్సీబీ- 13 మ్యాచ్లలో 141 సిక్స్లు👉ఢిల్లీ క్యాపిటల్స్- 14 మ్యాచ్లలో 135 సిక్స్లు👉కోల్కతా నైట్ రైడర్స్- 12 మ్యాచ్లలో 125 సిక్స్లు👉ముంబై ఇండియన్స్- 13 మ్యాచ్లలో 122 సిక్స్లు👉పంజాబ్ కింగ్స్- 12 మ్యాచ్లలో 102 సిక్స్లు👉రాజస్తాన్ రాయల్స్- 12 మ్యాచ్లలో 100 సిక్స్లు. Fearless striking from Arshad Khan 🔥He's not given up yet in this chase 💪Watch the match LIVE on @StarSportsIndia and @JioCinema 💻📱#TATAIPL | #DCvLSG pic.twitter.com/JxfdwBnG0t— IndianPremierLeague (@IPL) May 14, 2024 -
Virat Kohli: ఆర్సీబీ కెప్టెన్గా మళ్లీ కోహ్లినే!
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు.. 2008 నుంచి ఇప్పటి దాకా.. ఇంత వరకు ఒక్కసారి కూడా ఐపీఎల్ టైటిల్ గెలవలేదు. అయినప్పటికీ ఆ జట్టుకు ఉన్న అభిమాన గణం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆర్సీబీకి ఉన్నంత విశ్వసనీయమైన ఫ్యాన్ బేస్ మరే జట్టుకు లేదంటారు.నాయకుడి స్థానం నుంచి వైదొలిగిఇంతటి క్రేజ్కు కారణం టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి అన్న విషయం తెలిసిందే. ఇక్కడే తన ఫ్రాంఛైజీ క్రికెట్ మొదలుపెట్టిన ఈ రన్మెషీన్.. ఇప్పటికీ ఆ జట్టుతోనే కొనసాగుతున్నాడు. ఈ క్రమంలోనూ కెప్టెన్గానూ బాధ్యతలు చేపట్టిన కోహ్లి పనిఒత్తిడిని తగ్గించుకుని.. కేవలం బ్యాటింగ్పై ఫోకస్ చేసే క్రమంలో నాయకుడి స్థానం నుంచి 2021 తర్వాత తప్పుకొన్నాడు.గత రెండు సీజన్లుగా సౌతాఫ్రికా స్టార్ ఫాఫ్ డుప్లెసిస్ ఆర్సీబీ కెప్టెన్గా కొనసాగుతుండగా.. కోహ్లి ఓపెనింగ్ బ్యాటర్గా సేవలు అందిస్తున్నాడు. అయితే, అతడి సారథ్యంలో గతేడాది ఆరో స్థానంతో ముగించిన ఆర్సీబీ.. ఐపీఎల్-2024 ఆరంభంలో వరుస ఓటములు చవిచూసింది.వరుసగా ఐదు విజయాలు సాధించితర్వాత తిరిగి పుంజుకుని వరుసగా ఐదు విజయాలు సాధించి.. ప్రస్తుతానికి ప్లే ఆఫ్స్ ఆశలు సజీవం చేసుకుంది. అయితే, కేజీఎఫ్గా ప్రసిద్ధి పొందిన ఆర్సీబీ బ్యాటింగ్ త్రయం కోహ్లి, గ్లెన్ మాక్స్వెల్, ఫాఫ్లలో కేవలం కోహ్లి ఒక్కడే రాణిస్తున్నాడు.ఇప్పటి వరకు ఈ ఎడిషన్లో ఆడిన 13 మ్యాచ్లలో కలిపి 661 పరుగులు చేసిన కోహ్లి ఆరెంజ్ క్యాప్ హోల్డర్గా కొనసాగుతున్నాడు. అయితే, జట్టును ప్లే ఆఫ్స్ చేర్చడం మాత్రం కష్టంగా మారింది.ఈ నేపథ్యంలో టీమిండియా స్పిన్ దిగ్గజం, ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ హర్భజన్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వచ్చే సీజన్లో విరాట్ కోహ్లిని మళ్లీ కెప్టెన్గా ప్రకటించాలని ఆర్సీబీ మేనేజ్మెంట్కు సూచించాడు.ఆర్సీబీకి కోహ్లి కూడా అలాగేఈ మేరకు.. "ఈసారి వాళ్లు(ఆర్సీబీ గనుక ) ప్లే ఆఫ్స్నకు అర్హత సాధించకపోతే.. భారత క్రికెటర్ను కెప్టెన్గా తీసుకురావాలి. అయినా ఎవరో ఎందుకు? మళ్లీ కోహ్లినే కెప్టెన్ను చేస్తే సరిపోతుంది కదా! చెన్నై జట్టు మీద ధోని ప్రభావం ఎంత ఉంటుందో.. ఆర్సీబీకి కోహ్లి కూడా అలాగే!బలమైన నాయకుడు. జట్టును ఎలా ముందుకు నడిపించాలో అతడికి తెలుసు. ప్రస్తుతం వాళ్లు దూకుడుగానే ఆడుతున్నారు. కోహ్లి సారథిగా వస్తే మరింత బాగుంటుంది. విరాట్ కోహ్లి తిరిగి ఆర్సీబీ పగ్గాలు చేపడితే చూడాలని ఉంది" అని భజ్జీ స్టార్ స్పోర్ట్స్ షోలో వ్యాఖ్యానించాడు.చదవండి: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు: ధోని ఫ్యాన్స్పై సంచలన వ్యాఖ్యలు -
Royal Challengers Bengaluru: తిరుమల శ్రీవారి సేవలో ఆర్సీబీ క్రికెటర్లు (ఫొటోలు)
-
RCB- Virushka: అనుష్క శర్మ సెలబ్రేషన్స్.. కోహ్లి రియాక్షన్ వైరల్
ఐపీఎల్-2024 ఆరంభంలో వరుస ఓటములతో చతికిల పడ్డ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు అనూహ్య రీతిలో తిరిగి పుంజుకుంది. తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్తో ఆదివారం నాటి మ్యాచ్లో వరుసగా ఐదో గెలుపు నమోదు చేసి.. ప్లే ఆఫ్స్ రేసులో ఇంకా తాము ఉన్నామనే సంకేతాలు ఇచ్చింది.ఇక ఈ మ్యాచ్లో47 పరుగుల తేడాతో ఢిల్లీని చిత్తు చేసిన ఆర్సీబీ పాయింట్ల పట్టికలో ఐదో స్థానానికి దూసుకవచ్చింది. కాగా తప్పక గెలవాల్సిన మ్యాచ్లో విజయం సాధించడంతో ఆర్సీబీ సంబరాలు అంబరాన్నంటాయి.చిన్నస్వామి స్టేడియంలో బెంగళూరు విధించిన 187 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక.. ఢిల్లీ 140 పరుగులకే కుప్పకూలింది. దీంతో ఆర్సీబీ ఆటగాళ్లతో ఆర్సీబీ అభిమానులు కూడా సంతోషంలో మునిగిపోయారు.ఇందుకు సంబంధించిన దృశ్యాలు నెటిజన్లను ఆకర్షిస్తున్నాయి. ఇక ఇందులో ఆర్సీబీ స్టార్ విరాట్ కోహ్లి సతీమణి, బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ హైలైట్గా నిలిచారు. ఆర్సీబీ గెలుపు ఖరారు కాగానే.. ఆమె పట్టరాని ఆనందంతో ఉద్వేగానికి లోనయ్యారు.వావ్.. థాంక్ గాడ్!‘వావ్’ అంటూ దేవుడికి కృతజ్ఞతలు చెప్పినట్లుగా చేతులు జోడించి ఆర్సీబీ విజయాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ వైరల్గా మారాయి. ఇందుకు కోహ్లి కూడా తనదైన శైలిలో మజిల్స్ చూపిస్తూ బదులిచ్చాడు. కాగా ఓ యాడ్ సందర్భంగా అనుష్కను కలిసిన కోహ్లి ఆమెతో ప్రేమలో పడ్డాడు. 2017లో ఇటలీలో ఆమెను పెళ్లాడాడు.ఈ జంటకు కుమార్తె వామిక, కుమారుడు అకాయ్ సంతానం. అకాయ్ ఈ ఏడాది ఫిబ్రవరిలో జన్మించాడు. లండన్లో తన ప్రసవం తర్వాత ఇటీవలే ఇండియాకు తిరిగి వచ్చిన అనుష్క.. ఇలా భర్తను చీర్ చేస్తూ ఆర్సీబీకి మద్దతుగా స్టేడియానికి వస్తున్నారు. ఇక ఢిల్లీతో మ్యాచ్లో ఓపెనింగ్ బ్యాటర్ కోహ్లి 13 బంతుల్లో 27 పరుగులు చేశాడు.ఆర్సీబీ వర్సెస్ ఢిల్లీ స్కోర్లు👉వేదిక: చిన్నస్వామి స్టేడియం.. బెంగళూరు👉టాస్: ఢిల్లీ.. బౌలింగ్👉ఆర్సీబీ స్కోరు: 187/9 (20)👉ఢిల్లీ స్కోరు: 140 (19.1)👉ఫలితం: 47 పరుగుల తేడాతో ఢిల్లీపై ఆర్సీబీ గెలుపు👉ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: కామెరాన్ గ్రీన్(24 బంతుల్లో 32 నాటౌట్.. ఒక వికెట్ (1/19)). Wrapped up in style ⚡️High fives 🙌 all around as #RCB make it FIVE 🖐️ in a row 🔥A comfortable 4️⃣7️⃣-run win at home 🥳Scorecard ▶️ https://t.co/AFDOfgLefa#TATAIPL | #RCBvDC pic.twitter.com/qhCm0AwUIE— IndianPremierLeague (@IPL) May 12, 2024 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_7522010156.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
Virat Kohli: నన్నే ఏడిపిస్తావా?.. ప్రతీకారం తీర్చుకున్న కోహ్లి!
ఐపీఎల్-2024 ప్లే ఆఫ్స్ ఆశలు సజీవంగా ఉండాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం సాధించింది. ఢిల్లీ క్యాపిటల్స్తో ఆదివారం నాటి మ్యాచ్లో 47 పరుగుల తేడాతో జయభేరి మోగించింది.ఇదిలా ఉంటే.. ఆర్సీబీ- ఢిల్లీ మ్యాచ్ సందర్భంగా ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఆర్సీబీ స్టార్ విరాట్ కోహ్లి, ఢిల్లీ సీనియర్ పేసర్ ఇషాంత్ల ‘బ్రొమాన్స్’ హైలైట్గా నిలిచింది.కాగా చిన్నస్వామి స్టేడియంలో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు నష్టపోయి 187 పరుగులు చేసింది. ఇక ఓపెనర్ విరాట్ కోహ్లి 13 బంతులు ఎదుర్కొని 27 పరుగులు చేశాడు.అయితే, ఆర్సీబీ ఇన్నింగ్స్ నాలుగో ఓవర్ వేసిన ఇషాంత్ శర్మ బౌలింగ్లో మొదటి బంతికి ఫోర్ బాదిన కోహ్లి.. ఇషాంత్ను టీజ్ చేశాడు. తదుపరి బంతికి స్లిప్లో ఫీల్డర్ను పెట్టు అంటూ ఆటపట్టించాడు. అంతేకాదు.. మరుసటి బాల్ను సిక్సర్గా మలిచాడు.దీంతో ఉడుక్కున్నా కామ్గా కనిపించిన ఇషాంత్.. నాలుగో బంతికి కోహ్లిని ఊరించగా.. అతడు బంతిని గాల్లోకి లేపాడు. అభిషేక్ పోరెల్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా కోహ్లి ఇచ్చిన క్యాచ్ పట్టడంతో అతడు పెవిలియన్ చేరక తప్పలేదు.ఈ క్రమంలో తానే గెలిచానన్నట్లుగా ఇషాంత్ కోహ్లిని నవ్వుతూ కోహ్లి దగ్గరు వచ్చి.. ‘‘వెళ్లు వెళ్లు ’’ అన్నట్లుగా సైగ చేశాడు. ఇందుకు బదులుగా కోహ్లి కూడా నవ్వుతూ సరేలే అన్నట్లు మైదానాన్ని వీడాడు.వీళ్లిద్దరి ఫ్రెండ్లీ బ్యాంటర్కు సంబంధించిన ఫొటోను షేర్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్.. ‘‘పశ్చిమ ఢిల్లీ అబ్బాయిలు ఇదిగో ఇలా ఉంటారు’’ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. అయితే, లక్ష్య ఛేదనలో ఆరంభం నుంచే తడబడ్డ ఢిల్లీ క్యాపిటల్స్ 19.1 ఓవర్లలో 140 పరుగులకే కుప్పకూలింది.అయితే, పదకొండో స్థానంలో బ్యాటింగ్కు వచ్చిన ఇషాంత్ శర్మ నాలుగు బంతులు ఎదుర్కొని సున్నా పరుగులతో నాటౌట్గా నిలిచాడు. ఈ క్రమంలో కోహ్లి ఇషాంత్ శర్మ దగ్గరికి వెళ్లి ‘సర్లే పదా ఇంకా’ అంటూ టీజ్ చేశాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. కాగా కోహ్లి- ఇషాంత్ దేశవాళీ క్రికెట్లో ఢిల్లీకి ప్రాతినిథ్య వహించారు. ఇక టీమిండియాలో కోహ్లి కెప్టెన్సీలో ఇషాంత్ ఆడిన విషయం తెలిసిందే.Kohli man I love him 🤣❤pic.twitter.com/65HxtsIwta— POTT⁷⁶⁵ (@KlolZone) May 12, 2024Wrapped up in style ⚡️High fives 🙌 all around as #RCB make it FIVE 🖐️ in a row 🔥A comfortable 4️⃣7️⃣-run win at home 🥳Scorecard ▶️ https://t.co/AFDOfgLefa#TATAIPL | #RCBvDC pic.twitter.com/qhCm0AwUIE— IndianPremierLeague (@IPL) May 12, 2024 -
ఢిల్లీపై ఆర్సీబీ ఘన విజయం.. వరుసగా ఐదో గెలుపు
ఐపీఎల్-2024లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ప్లే ఆఫ్స్ ఆశలను సజీవం చేసుకుంది. సొంతగడ్డపై ఢిల్లీ క్యాపిటల్స్ను చిత్తు చేసి గెలుపు జెండా ఎగురవేసింది. 47 పరుగుల తేడాతో ఢిల్లీని ఓడించి పాయింట్ల పట్టికలో ఐదో స్థానానికి చేరుకుంది.టాస్ ఓడిన ఆర్సీబీ తొలుత బ్యాటింగ్కు దిగి.. నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 187 పరుగులు సాధించింది. అయితే, మోస్తరు లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీకి ఆర్సీబీ బౌలర్లు ఆరంభంలోనే చుక్కలు చూపించారు.యశ్ దయాల్ మూడు వికెట్లతో చెలరేగగా.. ఫెర్గూసన్ రెండు, స్వప్నిల్, సిరాజ్, గ్రీన్ ఒక్కో వికెట్ తీశారు. ఈ క్రమంలో ఢిల్లీని 140 పరుగులకే ఆలౌట్ చేసిన ఆర్సీబీ విజయం సాధించింది.ఆర్సీబీ వర్సెస్ ఢిల్లీ స్కోర్లు👉వేదిక: చిన్నస్వామి స్టేడియం.. బెంగళూరు👉టాస్: ఢిల్లీ.. బౌలింగ్👉ఆర్సీబీ స్కోరు: 187/9 (20)👉ఢిల్లీ స్కోరు: 140 (19.1)👉ఫలితం: 47 పరుగుల తేడాతో ఢిల్లీపై ఆర్సీబీ గెలుపురాణించిన విల్ జాక్స్, పాటిదార్.. ఆర్సీబీ స్కోరు ఎంతంటే! ఐపీఎల్- 2024 ప్లే ఆఫ్స్ రేసులో భాగంగా మరో రసవత్తర సమరం జరుగుతోంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా ఆర్సీబీ ఢిల్లీ క్యాపిటల్స్తో తలపడుతోంది.సొంతమైదానంలో టాస్ ఓడిన ఆర్సీబీ.. ఢిల్లీ ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేసింది. ఓపెనర్ విరాట్ కోహ్లి(13 బంతుల్లో 27) ధాటిగా ఆరంభించగా.. మరో ఓపెనర్, కెప్టెన్ డుప్లెసిస్(6) మాత్రం పూర్తిగా నిరాశపరిచాడు.ఈ క్రమంలో విల్ జాక్స్(29 బంతుల్లో 41), రజత్ పాటిదార్ (32 బంతుల్లో 52) మెరుపు ఇన్నింగ్స్తో జట్టును ఆదుకున్నారు. వీరికి తోడు ఐదో నంబర్ బ్యాటర్ కామెరాన్ గ్రీన్(24 బంతుల్లో 32 పరుగులు నాటౌట్) కూడా రాణించాడు.అయితే, లోయర్ ఆర్డర్ మహిపాల్ లామ్రోర్(13) ఒక్కడు డబుల్ డిజిట్ స్కోరు చేయగా.. దినేశ్ కార్తిక్, స్వప్నిల్ సింగ్ డకౌట్ అయ్యారు. కరణ్ శర్మ ఆరు పరుగులు చేసి రనౌట్ కాగా.. మహ్మద్ సిరాజ్ పరుగుల ఖాతా తెరవకుండానే రనౌట్ అయ్యాడు. ఈ నేపథ్యంలో ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 187 పరుగులు స్కోరు చేసింది.ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లలో ఖలీల్ అహ్మద్, రసిఖ్ దార్ సలాం రెండేసి వికెట్లు తీయగా.. ఇషాంత్ శర్మ, ముకేశ్ కుమార్, కుల్దీప్ యాదవ్ ఒక్కో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టుకు ప్లే ఆఫ్స్ ఆశలు సజీవంగా ఉంటాయి. -
RCB Vs PBKS: సారీ చెప్పిన కోహ్లి!.. ప్రీతి జింటా రియాక్షన్ వైరల్
ఐపీఎల్-2024లో పంజాబ్ కింగ్స్ కథ ముగిసింది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో గురువారం నాటి మ్యాచ్లో ఓటమితో ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించింది.ఈ నేపథ్యంలో పంజాబ్ అభిమానులతో పాటు ఆ జట్టు మేనేజ్మెంట్కు సైతం భంగపాటు తప్పలేదు. అయితే, జట్టు పరాభవం నేపథ్యంలోనూ పంజాబ్ ఫ్రాంఛైజీ సహ యజమాని, బాలీవుడ్ నటి ప్రీతి జింటా వ్యవహరించిన తీరు అభిమానులను ఆకట్టుకుంటోంది.కోహ్లి వికెట్ పడగానే కాగా ధర్మశాల వేదికగా జరిగిన మ్యాచ్లో పంజాబ్ను ఆర్సీబీ 60 పరుగులతో చిత్తు చేసింది. ఇక ఈ విజయంలో విరాట్ కోహ్లిదే కీలక పాత్ర అన్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్లో 47 బంతులు ఎదుర్కొన్న కోహ్లి 7 ఫోర్లు, 6 సిక్స్ల సాయంతో 92 పరుగులు చేశాడు.Going..Going..GONE!Virat Kohli clobbers that delivery into the stands in grand fashion! 💥Watch the match LIVE on @JioCinema and @StarSportsIndia 💻📱#TATAIPL | #PBKSvRCB pic.twitter.com/Y5eVp7Q6fN— IndianPremierLeague (@IPL) May 9, 2024అర్ష్దీప్ సింగ్ బౌలింగ్లో రిలీ రొసోవ్కు క్యాచ్ ఇవ్వడంతో ఈ ఆర్సీబీ ఓపెనర్ ఇన్నింగ్స్కు తెరపడింది. ఈ నేపథ్యంలో ప్రీతి జింటా చప్పట్లు కొడుతూ కోహ్లి వికెట్ను సెలబ్రేట్ చేసుకుంది. అయితే, ఆ సంతోషం ఎక్కువసేపు నిలవలేదు.The Punjab Kings bounce back with crucial breakthroughs, especially the big one of Virat Kohli 👏👏#RCB 238/5 with 5 deliveries leftWatch the match LIVE on @JioCinema and @StarSportsIndia 💻📱#TATAIPL | #PBKSvRCB pic.twitter.com/9mu2bMjrWV— IndianPremierLeague (@IPL) May 9, 2024లక్ష్య ఛేదనలో పంజాబ్ బ్యాటర్లంతా విఫలం కావడంతో ఆ జట్టుకు పరాజయమే ఎదురైంది. ఈ నేపథ్యంలో నిరాశకు లోనైనా ప్రీతి జింటా హుందాగా వ్యవహరించింది.సారీ చెప్పిన కోహ్లి!.. ప్రీతి జింటా రియాక్షన్ వైరల్ఆర్సీబీ స్టార్ విరాట్ కోహ్లి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు అందుకున్న సమయంలో.. మ్యాచ్ను తాము లాగేసుకున్నందుకు ప్రీతి జింటాకు సారీ చెప్పాడు. ఇందుకు బదులుగా కోహ్లితో కరచాలనం చేస్తూ... ‘‘మరేం పర్లేదు’’ అన్నట్లుగా నవ్వులు చిందించిందామె.ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో లక్నో యజమాని సంజీవ్ గోయెంకాను ప్రీతి జింటాతో పోలుస్తూ నెటిజన్లు ఆమెను ప్రశంసిస్తున్నారు. సంజీవ్ గోయెంకాకు చురకలుమ్యాచ్ ఓడటమే కాదు.. ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించినా ప్రీతి ఆ బాధ బయటకు తెలియకుండా నవ్వుతూ కవర్ చేసిందని.. ఆమెను చూసి గోయెంకా చాలా నేర్చుకోవాలని చురకలు అంటిస్తున్నారు. కాగా సన్రైజర్స్ హైదరాబాద్ చేతిలో లక్నో ఓటమి నేపథ్యంలో ఆ జట్టు ఓనర్ సంజీవ్ గోయెంకా కెప్టెన్ కేఎల్ రాహుల్కు బహిరంగంగానే చీవాట్లు పెట్టిన విషయం తెలిసిందే. చదవండి: ద్రవిడ్ గుడ్ బై!.. టీమిండియా కొత్త కోచ్గా ఫారినర్?.. జై షా కామెంట్స్ వైరల్Preity Zinta with Virat Kohli at the post match presentation ceremony. ❤️ pic.twitter.com/z1G2L1IIr8— Mufaddal Vohra (@mufaddal_vohra) May 10, 2024Virat Kohli said Sorry to Preity Zinta when he met with her in post match award presentation & Preity Zinta smiles.- King Kohli winning the hearts of everyone, He's a pure soul. ❤️🐐 pic.twitter.com/2h2JFnZsyz— Tanuj Singh (@ImTanujSingh) May 10, 2024 -
ఆర్సీబీ ఘన విజయం: కోహ్లి కీలక వ్యాఖ్యలు
ఐపీఎల్-2024 ఆరంభంలో కాస్త తడబడ్డా తిరిగి పుంజుకుని పరుగుల వరద పారిస్తున్నాడు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు బ్యాటర్ విరాట్ కోహ్లి. అత్యధిక పరుగుల వీరుడిగా కొనసాగుతూ ఆరెంజ్ క్యాప్ తన దగ్గరే పెట్టుకున్నాడు.తాజాగా పంజాబ్ కింగ్స్తో మ్యాచ్లో దుమ్ములేపిన ఈ ఆర్సీబీ ఓపెనర్ జట్టును గెలిపించడంలో కీలక పాత్ర పోషించాడు. 47 బంతుల్లో 7 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో వింటేజ్ కోహ్లిని గుర్తుచేస్తూ 92 పరుగులు సాధించాడు. సెంచరీ చేజారినా అద్భుత ఇన్నింగ్స్తో ఆకట్టుకోగలిగాడు.Going..Going..GONE!Virat Kohli clobbers that delivery into the stands in grand fashion! 💥Watch the match LIVE on @JioCinema and @StarSportsIndia 💻📱#TATAIPL | #PBKSvRCB pic.twitter.com/Y5eVp7Q6fN— IndianPremierLeague (@IPL) May 9, 2024కోహ్లి స్ట్రైక్రేటుపై విమర్శలుఈ మ్యాచ్తో కలిపి ఈ సీజన్లో 12 ఇన్నింగ్స్ ఆడిన విరాట్ కోహ్లి ఓ శతకం సాయంతో 634 పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఈ క్రమంలో ఈ రన్మెషీన్ స్ట్రైక్రేటు 153.51గా నమోదైంది.కాగా గత కొన్ని రోజులుగా విరాట్ కోహ్లి స్ట్రైక్రేటుపై విమర్శలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. స్వార్థపూరిత ఇన్నింగ్స్ ఆడుతూ జట్టుకు మేలు కంటే చేటే ఎక్కువ చేస్తున్నాడంటూ కొంతమంది మాజీ క్రికెటర్లు విమర్శించారు.ఇందుకు కోహ్లి గట్టిగానే బదులివ్వగా.. సునిల్ గావస్కర్ వంటి వాళ్లు చూసిందే మాట్లాడుతున్నాం అంటూ మరోసారి విమర్శనాస్త్రాలు సంధించారు. ఈ నేపథ్యంలో పంజాబ్ కింగ్స్తో మ్యాచ్ అనంతరం కోహ్లి కీలక వ్యాఖ్యలు చేశాడు.‘‘నాకు క్వాంటిటీ కంటే క్వాలిటీ ముఖ్యం. లోపాలు సరిచేసుకుని ముందుకు ఎలా వెళ్లాలో నాకు తెలుసు. రోజురోజుకు ఆటను మెరుగుపరచుకోవడమే నా పని.స్పిన్నర్ల బౌలింగ్లో స్లాగ్స్వీప్ షాట్లు ఆడాను. నిజానికి నేను అలాంటివి గతంలో ప్రాక్టీస్ కూడా చేయలేదు. కానీ కొన్నిసార్లు రిస్క్ తీసుకోకతప్పదని నాకు తెలుసు.స్ట్రైక్రేటు పెంచుకునే క్రమంలోనాకోసం, జట్టు ప్రయోజనాల కోసం స్ట్రైక్రేటు పెంచుకునే క్రమంలో ఇలాంటివి చేయాల్సిందే’’ అని కోహ్లి పేర్కొన్నాడు. ఇక వరుస ఓటముల తర్వాత ఆర్సీబీ వరుస విజయాల పట్ల స్పందిస్తూ.. ‘‘నిజం చెప్పాలంటే.. మేము మొదటి అర్థ భాగంలో స్థాయికి తగ్గట్లు రాణించలేదు.అందుకే పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉన్నపుడు ఆత్మ గౌరవం కోసం ఆడాలని నిర్ణయించుకున్నాం. మా అభిమానులను గర్వపడేలా చేయాలనుకున్నాం. ఇప్పుడు ఏడో స్థానానికి చేరుకోగలిగాం. మేము ఇదే పని కాస్త ముందు చేసి ఉంటే ఎంతో బాగుండేది’’ అని కోహ్లి చెప్పుకొచ్చాడు. కాగా ఐపీఎల్-2024 ప్లే ఆఫ్స్ నుంచి ఇప్పటికే ముంబై ఇండియన్స్ నిష్క్రమించగా.. ఆర్సీబీ చేతిలో గురువారం 60 పరుగుల తేడాతో ఓడిన పంజాబ్ కూడా ఆశలు కూడా గల్లంతయ్యాయి.చదవండి: ద్రవిడ్ గుడ్ బై!.. టీమిండియా కొత్త కోచ్గా ఫారినర్?.. జై షా కామెంట్స్ వైరల్ The Punjab Kings bounce back with crucial breakthroughs, especially the big one of Virat Kohli 👏👏#RCB 238/5 with 5 deliveries leftWatch the match LIVE on @JioCinema and @StarSportsIndia 💻📱#TATAIPL | #PBKSvRCB pic.twitter.com/9mu2bMjrWV— IndianPremierLeague (@IPL) May 9, 2024 -
RCB Vs PBKS Photos: చెలరేగిన కోహ్లి, పటిదార్ 60 పరుగులతో బెంగళూరు ఘనవిజయం (ఫొటోలు)
-
అచ్చా.. అలాగా?: కోహ్లిపై గావస్కర్ కామెంట్స్.. ఫ్యాన్స్ ఫైర్
పదకొండు ఇన్నింగ్స్.. 542 రన్స్.. సగటు 67.75.. స్ట్రైక్ రేటు 148.08.. అత్యధిక స్కోరు 113 నాటౌట్. ఐపీఎల్-2024లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి ఇప్పటి దాకా నమోదు చేసిన గణాంకాలు. ఇక పదకొండింట జట్టు గెలిచిన మ్యాచ్లు నాలుగు.వరల్డ్కప్ జట్టులోనూ అతడి స్థానాన్ని ప్రశ్నిస్తూఈ సీజన్ ఆరంభం నుంచి కోహ్లి మెరుగ్గానే ఆడుతున్నా.. జట్టు వరుస పరాజయాల పాలవడంతో అతడి స్ట్రైక్రేటు చర్చనీయాంశంగా మారింది. మిగతా ఆటగాళ్లు ఎంతగా విఫలమవుతున్నా పట్టించుకోని కొందరు కామెంటేటర్లు అదే పనిగా కోహ్లి ఆట తీరును విమర్శించడం.. వరల్డ్కప్ జట్టులోనూ అతడి స్థానాన్ని ప్రశ్నించడం వంటివి చేశారు.మరికొందరు మాజీ క్రికెటర్లు మాత్రం జట్టు ప్రయోజనాలు, పరిస్థితులకు అనుగుణంగా ఈ ఓపెనింగ్ బ్యాటర్ ఆడుతున్నాడంటూ కోహ్లిని సమర్థించారు. ఈ నేపథ్యంలో కోహ్లి స్పందిస్తూ.. ‘‘బయట ఎక్కడో కూర్చుని మాట్లాడేవాళ్ల కామెంట్లను పట్టించుకోను. జట్టు కోసం ఏం చేయాలో నాకు తెలుసు’’ అంటూ విమర్శకులకు కౌంటర్ వేశాడు.మీ అంత కాకపోయినా.. మేమూ కాస్త క్రికెట్ ఆడాముఈ క్రమంలో టీమిండియా దిగ్గజం, ప్రముఖ కామెంటేటర్ సునిల్ గావస్కర్ కాస్త ఘాటుగానే బదులిచ్చాడు. ‘‘అవునా.. చాలా మంది మేము బయట వాగుడు పట్టించుకోం అని గంభీరాలు పలుకుతూ ఉంటారు.మరెందుకని ఇలాంటి రిప్లైలు ఇస్తూ ఉంటారు. మీ అంత కాకపోయినా.. మేమూ కాస్త క్రికెట్ ఆడాము. మాకేమీ అజెండాలు ఉండవు. మేము ఏం చూస్తున్నామో దాని గురించే మాట్లాడతాం.మాకు ఒకరంటే ఇష్టం.. మరొకరంటే కోపం ఉండదు. ఏం జరుగుతుందో దాని గురించే మాట్లాడతాం’’ అని గావస్కర్ అన్నాడు. ఈ నేపథ్యంలో గావస్కర్పై కోహ్లి ఫ్యాన్స్ విరుచుకుపడుతున్నారు. గతంలో.. కోహ్లిని విమర్శించే క్రమంలో అతడి భార్య అనుష్క శర్మను ఉద్దేశించి గావస్కర్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ ఏకిపారేస్తున్నారు.ప్రతిసారీ కోహ్లి గురించే మాట్లాడటం ద్వారా ఎల్లపుడూ వార్తల్లో ఉండేందుకు చేసే ప్రయత్నమే ఇదంటూ మండిపడుతున్నారు. గతంలో గావస్కర్ 176 బంతుల్లో 36 పరుగులు చేసిన విషయాన్ని ప్రస్తావిస్తూ.. జట్టు ప్రయోజనాల కోసం మీరు ఏం చేసినా చెల్లుబాటే గానీ.. కోహ్లి చేస్తే మాత్రం తప్పా అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.విమర్శలు సరికాదుఈ నేపథ్యంలో పాకిస్తాన్ లెజెండరీ పేసర్ వసీం అక్రం స్పందిస్తూ.. కోహ్లి ఒక్కడే జట్టును గెలిపించలేడని.. అనవసరంగా అతడిని తక్కువ చేసి మాట్లాడవద్దని కామెంటేటర్లకు హితవు పలికాడు. ఆర్సీబీలో మిగతా బ్యాటర్లు కూడా రాణిస్తేనే కోహ్లిపై ఒత్తిడి తగ్గి స్వేచ్ఛగా బ్యాట్ ఝులిపించగలడని అభిప్రాయపడ్డాడు. కాగా ఈ సీజన్లో వరుస పరాజయాలతో చతికిల పడ్డ ఆర్సీబీ.. హ్యాట్రిక్ విజయాలతో గాడిలో పడింది.చదవండి: ‘ధనాధన్’ ధోని డకౌట్.. ప్రీతి జింటా రియాక్షన్ వైరల్ -
కోహ్లి స్ట్రైక్రేటుపై గంభీర్ వ్యాఖ్యలు.. వైరల్
టీమిండియా స్టార్ విరాట్ కోహ్లితో తనకు ఎలాంటి విభేదాలు లేవని భారత మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ స్పష్టం చేశాడు. మీడియా అత్యుత్సాహం వల్లే తమ గురించి తప్పుడు సమాచారం వ్యాప్తి చెందిందని పేర్కొన్నాడు.అదే విధంగా ఐపీఎల్-2024లో ఆర్సీబీ ఓపెనర్గా బరిలోకి దిగుతున్న కోహ్లి స్ట్రైక్రేటు గురించి కూడా గంభీర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కాగా గతేడాది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు- లక్నో సూపర్ జెయింట్స్ మధ్య మ్యాచ్ సందర్భంగా కోహ్లి- అప్పటి లక్నో మెంటార్ గంభీర్ మధ్య వాగ్వాదం జరిగిన విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో వీరిద్దరి ప్రవర్తనపై విమర్శలు వెల్లువెత్తాయి. అయితే, తాజా సీజన్లో కేకేఆర్ మెంటార్గా అవతారమెత్తిన గంభీర్.. ఇటీవలి మ్యాచ్ సందర్భంగా కోహ్లిని ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నాడు. ఇద్దరూ సరదాగా మాట్లాడుకున్నారు.గొడవ పడితే చూడాలనిఇందుకు సంబంధించిన దృశ్యాలు వైరల్ అయ్యాయి. ఈ క్రమంలో ఓ షోలో విరాట్ కోహ్లి మాట్లాడుతూ.. ‘‘మేము ఇద్దరం గొడవ పడితే చూడాలని అనుకునే వాళ్లే ఎక్కువగా ఉంటారు. వాళ్లను ఈ వీడియోలు నిరాశపరిచి ఉంటాయి’’ అని చమత్కరించాడు.ఈ విషయంపై తాజాగా స్పందించిన గౌతం గంభీర్ కోహ్లి వ్యాఖ్యలతో ఏకీభవించాడు. టీఆర్పీ రేటింగ్ల కోసమే మీడియా ఇలాంటివి ఎక్కువగా ప్రచారం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశాడు. తాను, విరాట్ కోహ్లి ఎలాంటి వాళ్లమో, తమ మధ్య అనుబంధం ఎలా ఉంటుందో వారికి తెలియదన్న గౌతీ.. వీలైతే పాజిటివిటీని పెంచే అంశాలను చూపించాలన్నాడు.ఎవరికి వారే ప్రత్యేకంతాను, కోహ్లి పరిణతి చెందిన వ్యక్తులం కాబట్టి ఇలాంటి వాటి గురించి ఎక్కువగా పట్టించుకోమని గంభీర్ చెప్పుకొచ్చాడు. ఇక కోహ్లి స్ట్రైక్రేటు గురించి జరుగుతున్న చర్చలపై స్పందిస్తూ.. ‘‘ప్రతి ఒక్క ఆటగాడు భిన్నంగా ఉంటాడు.మాక్స్వెల్ ఆడినట్లు కోహ్లి ఆడకపోవచ్చు. కోహ్లి తీరుగా మాక్స్వెల్ షాట్లు బాదలేకపోవచ్చు. పదకొండు మంది సభ్యులున్న జట్టులో ఎవరికి వారే ప్రత్యేకం. బ్యాటింగ్ ఆర్డర్లో 1- 8 వరకు విధ్వంసకర బ్యాటర్లు అందుబాటులో ఉంటే స్కోరు 300 కావొచ్చు లేదంటే 30 పరుగులకే ఆలౌట్ కావచ్చు.జట్టును గెలిపించినపుడు స్ట్రైక్రేటు 100 ఉన్నా బాగానే అనిపిస్తుంది. ఒకవేళ ఓడిపోతే మాత్రం 180 స్ట్రైక్రేటు కూడా మన కంటికి కనిపించదు. మ్యాచ్ జరిగే వేదిక, పిచ్ పరిస్థితి, ప్రత్యర్థి జట్టు.. ఇలా భిన్న అంశాలపై స్ట్రైక్రేటు ఆధారపడి ఉంటుందన్న విషయం మర్చిపోకూడదు’’ అంటూ విరాట్ కోహ్లికి గంభీర్ మద్దుతుగా నిలిచాడు. కాగా ఈ సీజన్లో కోహ్లి ఆడిన 9 మ్యాచ్లలో కలిపి 145.76 స్ట్రైక్రేటుతో 430 పరుగులు సాధించి టాప్ స్కోరర్గా కొనసాగుతున్నాడు. -
SRH Vs RCB: తెలుగులో మాట్లాడిన కమిన్స్.. ఆర్సీబీకి వార్నింగ్!
ఐపీఎల్-2024లో వరుస విజయాలతో సత్తా చాటుతున్న సన్రైజర్స్ హైదరాబాద్ మరో ఆసక్తికర పోరుకు సిద్ధమైంది. సొంతమైదానంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో గురువారం తలపడనుంది. ఇందుకోసం పూర్తి స్థాయిలో సన్నద్ధమైంది.ఈ సీజన్లో ఇప్పటికే ఆర్సీబీని తమ సొంతగడ్డపైనే ఓడించిన సన్రైజర్స్ ఉప్పల్లోనూ ఆ సీన్ను రిపీట్ చేయాలని భావిస్తోంది. చిన్నస్వామి స్టేడియంలో పరుగుల వరద పారించి ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోరు(287) సాధించిన రైజర్స్... హైదరాబాద్లో తమ రికార్డును బ్రేక్ చేయాలని పట్టుదలగా ఉంది.ప్యాట్ కమిన్స్ బృందం జోరు చూస్తుంటే ఇదేమీ అసాధ్యం కాకపోవచ్చనే అనిపిస్తోంది. మరోవైపు.. ఆర్సీబీ సైతం ఘోర పరాభవానికి బదులు తీర్చుకోవాలని భావిస్తున్న తరుణంలో ఇరుజట్ల మధ్య హోరాహోరీ ఖాయమంటూ ఈ మ్యాచ్ కోసం అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు.The crossover we all love to see 🤩 pic.twitter.com/nLlDlUcH7E— SunRisers Hyderabad (@SunRisers) April 24, 2024ఇదిలా ఉంటే.. ఈ కీలక పోరుకు ముందే సన్రైజర్స్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ హైదరాబాద్ ఫ్యాన్స్ను తన మాటలతో ఖుషీ చేశాడు. ‘‘ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను.కమిన్స్ అంటే క్లాస్ అనుకుంటివా? మాస్.. ఊరమాస్.. ఎస్ఆర్హెచ్ అంటే ఫ్లవర్ అనుకుంటివా.. ఫైరూ’’ అంటూ తెలుగులో డైలాగ్స్ చెప్పి దుమ్ములేపాడు. తగ్గేదేలే అంటూ ఆర్సీబీకి గట్టి వార్నింగ్ ఇచ్చాడు. ఇందుకు స్పందించిన ఆరెంజ్ ఆర్మీ.. ‘‘కెప్టెన్ ఓ రేంజు.. మామ మనోడే.. సూపర్ కమిన్స్’’ అంటూ కామెంట్లతో హర్షం వ్యక్తం చేస్తున్నారు.కాగా ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ రాకతో సన్రైజర్స్ తలరాత మారిపోయింది. గత మూడేళ్లుగా వైఫల్యాలతో చతికిల పడ్డ రైజర్స్ను తన కెప్టెన్సీతో ఈ సీజన్లో హాట్ ఫేవరెట్గా మార్చాడు ఈ పేస్ బౌలర్. అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, హెన్రిచ్ క్లాసెన్ వంటి హిట్టర్లకు తోడు బౌలర్లు కూడా రాణిస్తుండటంతో తన కెప్టెన్సీ వ్యూహాలకు మరింత పదును పెట్టి వరుస విజయాలు సాధిస్తున్నాడు. ఇక ఈ ఎడిషన్లో సన్రైజర్స్ ఇప్పటి వరకు ఆడిన ఏడు మ్యాచ్లలో ఐదు గెలిచి పట్టికలో మూడో స్థానంలో ఉండగా.. ఆర్సీబీ ఎనిమిదింట ఏడు ఓడి అట్టడుగున ఉంది.చదవండి: IPL 2024: అన్ని జట్లు ఓడాయి.. ఒక్క సన్రైజర్స్ మాత్రమే..!ఓవైపు కెప్టెన్గా #OrangeORangeu అనిపిస్తున్నాడు 💪అది సరిపోదు అన్నట్టు.. ఈ Mass డైలాగ్స్ 💥@patcummins30 మామ.. నువ్వు సూపర్ అంతే! 🤩చూడండి#TATAIPLHyderabad v Bengaluru | రేపు 6 PM నుంచిమీ #StarSportsTelugu లో#IPLonStar #OrangeORangeu #ProudToBeTelugu pic.twitter.com/wv5IzPZhFe— StarSportsTelugu (@StarSportsTel) April 24, 2024 -
చిన్న పిల్లాడిలా కోహ్లి సంబరాలు.. వాళ్లకు థాంక్స్!
ఐపీఎల్-2024లో ఎట్టకేలకు రాయల్ చాలెంజర్స్ పరాజయాలకు బ్రేక్ పడింది. సన్రైజర్స్ హైదరాబాద్తో గురువారం నాటి మ్యాచ్లో గెలిచిన ఆర్సీబీ.. ఈ సీజన్లో రెండో గెలుపు నమోదు చేసింది. దీంతో ఆర్సీబీ శిబిరంలో నవ్వులు పూశాయి.ఆ జట్టు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి అయితే.. చిన్నపిల్లాడిలా సంతోషంతో గంతులేశాడు. రైజర్స్ వికెట్ పడిన ప్రతిసారీ పెద్ద ఎత్తున సెలబ్రేట్ చేసుకున్న కోహ్లి.. జట్టు విజయం ఖరారు కాగానే ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యాడు.ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇందుకు స్పందనగా.. ‘‘చాలా రోజుల తర్వాత కోహ్లి మనస్ఫూర్తిగా నవ్వడం చూస్తున్నాం’’ అంటూ కింగ్ కోహ్లి ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు.కాగా ఐపీఎల్-2024లో సన్రైజర్స్తో మ్యాచ్లో ఆర్సీబీ 35 పరుగుల తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే. ఉప్పల్లో జరిగిన ఈ మ్యాచ్లో విరాట్ కోహ్లి అర్ధ శతకం(43 బంతుల్లో 51) సాధించాడు. రజత్ పాటిదార్ (20 బంతుల్లో 50) మెరుపు ఇన్నింగ్స్ ఆడగా.. కామెరాన్ గ్రీన్(37 నాటౌట్) సైతం రాణించాడు.దీంతో 206 పరుగులు స్కోరు చేసిన ఆర్సీబీ.. లక్ష్య ఛేదనకు దిగిన సన్రైజర్స్ను 171 పరుగులకే కట్టడి చేసింది. తద్వారా రైజర్స్ విజయపరంపరకు బ్రేక్ వేసి.. సొంతమైదానం చిన్నస్వామి స్టేడియంలో తమకు ఎదురైన పరాభవానికి బదులు తీర్చుకుంది.ఇక ఈ సీజన్లో ఆర్సీబీకి ఇది రెండో విజయం. సీజన్లో తమ రెండో మ్యాచ్లో పంజాబ్ కింగ్స్పై గెలుపొందిన ఆర్సీబీ.. మళ్లీ ఇప్పుడిలా హైదరాబాద్ గడ్డపై గెలుపును రుచిచూసింది. దీంతో ఆటగాళ్లలో ఒక్కసారిగా ఉత్సాహం నిండింది.ఇక రైజర్స్ సొంతమైదానంలో జరిగిన ఈ మ్యాచ్కు ఆరెంజ్ ఆర్మీతో పాటు ఆర్సీబీ 12th మ్యాన్ ఆర్మీ కూడా భారీగానే తరలి వచ్చింది. జట్టు జెర్సీలు ధరించి ఫాఫ్ డుప్లెసిస్ బృందాన్ని చీర్ చేశారు ఫ్యాన్స్. ఈ నేపథ్యంలో తమకు మద్దతుగా నిలిచిన ఉప్పల్ ప్రేక్షకులకు కోహ్లి చేతులు జోడిస్తూ ధన్యవాదాలు తెలపడం విశేషం. కాగా ఇప్పటి వరకు ఆడిన తొమ్మిది మ్యాచ్లలో రెండు గెలిచిన ఆర్సీబీ 4 పాయింట్లతో ప్రస్తుతం పదో స్థానంలో కొనసాగుతోంది. మరోవైపు.. సన్రైజర్స్ ఎనిమిదింట ఐదు గెలిచి మూడో స్థానంలో ఉంది.చదవండి: SRH Vs RCB: అరెరే.. ఏమైంది మీకు! కావ్య రియాక్షన్ వైరల్ Yesterday RCB Fans Be Like......#RCBvsSRH #SRHvsRCB #ViratKohli𓃵pic.twitter.com/VfXTDJNJP0— Analytic Board (@AnalyticB0ard) April 26, 2024 -
కోహ్లి.. ఇలాగేనా ఆడేది?: టీమిండియా దిగ్గజం విమర్శలు
సన్రైజర్స్ హైదరాబాద్తో మ్యాచ్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి ఆట తీరుపై టీమిండియా దిగ్గజం సునిల్ గావస్కర్ పెదవి విరిచాడు. స్థాయికి తగ్గట్లు రాణించడంలో కోహ్లి విఫలమవుతున్నాడని విమర్శించాడు.ఐపీఎల్-2024లో భాగంగా సన్రైజర్స్- ఆర్సీబీ మధ్య బుధవారం నాటి మ్యాచ్లో కోహ్లి అర్ధ శతకం బాదిన విషయం తెలిసిందే. ఉప్పల్ వేదికగా కోహ్లి 43 బంతులు ఎదుర్కొని 4 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 51 పరుగులు చేశాడు.ఈ క్రమంలో కోహ్లి స్ట్రైక్ రేటు 118.6గా నమోదైంది. ఇక రైజర్స్ పేసర్ జయదేవ్ ఉనాద్కట్ బౌలింగ్లో ఈ ఓపెనింగ్ బ్యాటర్ పెవిలియన్ చేరాడు. ఈ మ్యాచ్లో కోహ్లితో పాటు రజత్ పాటిదార్(20 బంతుల్లో 50) హాఫ్ సెంచరీ చేయగా.. కామెరాన్ గ్రీన్(20 బంతుల్లో 37 నాటౌట్) విలువైన ఇన్నింగ్స్ ఆడాడు.ఈ నేపథ్యంలో ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది. ఇందులో కీలక పాత్ర మాత్రం 250 స్ట్రైక్రేటుతో అర్ధ శతకం సాధించిన పాటిదార్దే.ఇక లక్ష్య ఛేదనలో 171 పరుగులకే సన్రైజర్స్ పరిమితం కావడంతో ఆర్సీబీ 35 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ నేపథ్యంలో సునిల్ గావస్కర్ కోహ్లి స్ట్రైక్రేటు గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు.‘‘ఆరంభంలో బాగానే ఆడినా మధ్యలో కాస్త వెనుకబడినట్లు కనిపించింది. నంబర్స్ గురించి స్పష్టంగా ప్రస్తావించలేకపోతున్నాను గానీ.. 31- 32 స్కోరు వరకు అతడు బౌండరీ బాదలేకపోయాడు.ఇన్నింగ్స్ తొలి బంతి నుంచి క్రీజులో ఉండి.. 14- 15 ఓవర్ వరకు బ్యాటింగ్ కొనసాగించాలనుకుంటే ఈ స్ట్రైక్రేటు మాత్రం సరిపోదు. ఫ్రాంఛైజీ కోహ్లి వంటి టాప్ క్లాస్ ప్లేయర్నుంచి ఇలాంటి ఇన్నింగ్స్ ఆశించదు’’ అని సునిల్ గావస్కర్ స్టార్ స్ట్పోర్స్ షోలో వ్యాఖ్యానించాడు. విరాట్ కోహ్లి ఇంకాస్త మెరుగ్గా ఆడితే బాగుండేదని అభిప్రాయపడ్డాడు.కాగా సన్రైజర్స్తో మ్యాచ్లో పరుగుల విధ్వంసం సృష్టించి ఆర్సీబీ గెలుపులో ప్రధాన పాత్ర పోషించిన రజత్ పాటిదార్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఇక ఈ సీజన్లో ఆర్సీబీకి ఇది రెండో గెలుపు. ఈ విజయంతో ఆర్సీబీ ఖాతాలో మరో రెండు పాయింట్లు చేరినప్పటికీ పట్టికలో మాత్రం అట్టడుగున పదో స్థానంలోనే కొనసాగుతోంది.Lofted with perfection and style! 😎@RCBTweets move to 61/1 after 6 oversWatch the match LIVE on @JioCinema and @StarSportsIndia 💻📱#TATAIPL | #SRHvRCB | @imVkohli pic.twitter.com/WdVkWT99yz— IndianPremierLeague (@IPL) April 25, 2024 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4381453179.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
SRH: మాకున్న బలం అదే.. తగ్గేదేలే: కమిన్స్
ఐపీఎల్-2024లో సన్రైజర్స్ హైదరాబాద్ జైత్రయాత్రకు అడ్డుకట్ట పడింది. సొంతగడ్డపై తమకు ఎదురైన పరాభవానికి రాయల్ చాలెంజర్స్ బెంగళూరు రైజర్స్పై ప్రతీకారం తీర్చుకుంది. ఉప్పల్ మైదానంలో ప్యాట్ కమిన్స్ బృందాన్ని 35 పరుగుల తేడాతో ఓడించి ఈ సీజన్ లెక్క సరిచేసింది.రాణించిన కోహ్లి, పాటిదార్, గ్రీన్ ఇరుజట్ల మధ్య గురువారం జరిగిన మ్యాచ్లో టాస్ గెలిచిన ఆర్సీబీ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. విరాట్ కోహ్లి (51), రజత్ పాటిదార్(20 బంతుల్లో 50) అర్ధ శతకాలు సాధించగా.. కామెరాన్ గ్రీన్(20 బంతుల్లో 37*) దూకుడుగా ఆడాడు.ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లు నష్టపోయిన ఆర్సీబీ 206 పరుగులు స్కోరు చేసింది. ఇప్పటికే ఈ సీజన్లో మూడుసార్లు 250 పైచిలుకు పరుగులు సాధించిన రైజర్స్ ఈ లక్ష్యాన్ని తేలికగ్గానే ఛేదిస్తుందని ఆరెంజ్ ఆర్మీ భావించింది.దూకుడుగా ఆరంభించి.. భారీ మూల్యమే చెల్లించికానీ ఆర్సీబీ బౌలర్ల దెబ్బకు 171 పరుగులకే రైజర్స్ కథ ముగిసిపోయింది. విధ్వంసకర ఓపెనర్ ట్రావిస్ హెడ్(1) ఆదిలోనే అవుట్ కావడం.. అభిషేక్ శర్మ(13 బంతుల్లో 31) మెరుపులు మెరిపించినా ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోవడం ప్రభావం చూపింది.అయినప్పటికీ దూకుడును కొనసాగించిన రైజర్స్ బ్యాటర్లు ఐడెన్ మార్క్రమ్(7), నితీశ్ రెడ్డి(13), హెన్రిచ్ క్లాసెన్(7)లను ఆర్సీబీ బౌలర్లు త్వరత్వరగా పెవిలియన్కు పంపారు. కాసేపు పోరాడినాఈ క్రమంలో ఆరో స్థానంలో వచ్చిన షాబాజ్ అహ్మద్ (37 బంతుల్లో 40 నాటౌట్) ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేయగా.. కెప్టెన్ ప్యాట్ కమిన్స్(15 బంతుల్లో 31) ధనాధన్ ఇన్నింగ్స్ ఆడాడు. కానీ మిగతా వాళ్ల నుంచి సహకారం అందకపోవడంతో రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసి ఓటమిని అంగీకరించింది. ఇక ఆర్సీబీ బౌలర్లలో స్వప్నిల్ సింగ్, కరణ్ శర్మ, లాకీ ఫెర్గూసన్ రెండేసి వికెట్లు తీయగా.. విల్ జాక్స్, యశ్ దయాళ్ ఒక్కో వికెట్ పడగొట్టారు. ఈ నేపథ్యంలో సన్రైజర్స్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ఓటమిపై స్పందిస్తూ.. తమ బ్యాటర్లు దూకుడుగా ఆడటాన్ని సమర్థించాడు. ‘‘ఈరోజు మాకు సరైన ముగింపు లభించలేదు. తొలుత పరుగులు కట్టడి చేయలేకపోయాం.ప్రతి మ్యాచ్ గెలవలేంఆ తర్వాత లక్ష్య ఛేదనలో వరుసగా వికెట్లు కోల్పోయాం. నిజానికి మేము ముందుగా బ్యాటింగ్ చేసి ఉంటే బాగుండేది. ఏదేమైనా మా వాళ్లు చాలా బాగా ఆడారు. టీ20 క్రికెట్లో ప్రతీ మ్యాచ్ గెలవడం ఎవరికీ సాధ్యం కాదు. ఈ ఓటమినే తలచుకుంటూ కూర్చోము.మాకున్న బలం అదేరిస్క్ ఉన్నా సరే దూకుడుగా బ్యాటింగ్ చేయడమే మాకున్న బలం. అయితే, ప్రతి మ్యాచ్లోనూ ఇది వర్కౌట్ అవ్వాలని లేదు. ఒకటీ రెండు మ్యాచ్లలో ప్రతికూల ఫలితాలు రావచ్చు. ఈ మ్యాచ్లో మేము మెరుగైన స్కోరే చేశాం. ఇక ముందు కూడా మా వాళ్లు ఇంతే దూకుడుగా బ్యాటింగ్ చేయడమే మంచిదని భావిస్తున్నా’’ అని పేర్కొన్నాడు. చదవండి: #Kavya Maran: అరెరే.. ఏమైందిరా మీకు! కావ్య రియాక్షన్ వైరల్ 📍 Hyderabad VIBE Virat Kohli ☺️ ❤️#TATAIPL | #SRHvRCB | @RCBTweets | @imVkohli pic.twitter.com/llKITaKky3— IndianPremierLeague (@IPL) April 26, 2024 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_7522010156.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
రూ. 17.5 కోట్లు ఇస్తే సరిపోతుందా?.. పాపం అతడు!
ఐపీఎల్-2024లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు చెత్త ప్రదర్శన కనబరుస్తోంది. ఇప్పటి వరకు ఆడిన ఎనిమిది మ్యాచ్లలో కేవలం ఒక్కటి మాత్రమే గెలిచి.. ఇప్పటికే ప్లే ఆఫ్స్ రేసు నుంచి దాదాపుగా నిష్క్రమించింది. ఈ నేపథ్యంలో ఫాఫ్ డుప్లెసిస్ బృందంపై ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్, గతంలో ఆర్సీబీకి ఆడిన ఆరోన్ ఫించ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఈ సీజన్లో ఆర్సీబీ వైఫల్యాలకు కారణాలు ఇవేనంటూ తన అభిప్రాయాలు పంచుకున్నాడు.‘‘వేలం సమయంలోనే వారు తప్పటడుగు వేసినట్లు కనిపించింది. బ్యాటర్ల కోసం కోట్లకు కోట్లు ఖర్చుపెట్టారు గానీ బౌలింగ్ విభాగంపై పెద్దగా దృష్టి సారించలేదు.ముఖ్యంగా ఈ జట్టులో ఒక్క వరల్డ్క్లాస్ స్పిన్నర్ కూడా లేడు. ఈ విషయంలో కేకేఆర్ పూర్తిగా విజయవంతమైంది. వాళ్లకు సునిల్ నరైన్ రూపంలో ప్రపంచస్థాయి స్పిన్ బౌలర్ దొరికాడు. ఒంటిచేత్తో మ్యాచ్ను మలుపు తిప్పేయగలడు.ఆర్సీబీకి మాత్రం ఇలాంటి స్పిన్నర్ లేడు. మరో విషయం ఏమిటంటే.. వాళ్లు పెద్ద మొత్తం వెచ్చించి ఎంతో మంది ఆటగాళ్లను కొనుగోలు చేశారు. వారిలో కామెరాన్ గ్రీన్ కూడా ఒకడు.అతడికి చెల్లించే జీతం భారీ మొత్తంలో ఉంటుంది. అలాంటపుడు సేవలను ఉపయోగించుకోవడంలోనూ తెలివిగా వ్యవహరించాలి కదా! నిజానికి మిడిలార్డర్లో కంటే టాపార్డర్లోనే గ్రీన్ మెరుగ్గా రాణించగలడు.కానీ అతడిని మిడిలార్డర్లోనే పంపిస్తున్నారు. తనకు సౌకర్యంగా లేని స్థానంలో వెళ్లి బ్యాటింగ్ చేయమని చెప్తే ఏ ఆటగాడైనా ఏం చేయగలడు. కచ్చితంగా ఇబ్బంది పడతాడు కదా’’ అని ఆరోన్ ఫించ్ ఆర్సీబీ నిరాశజనక ప్రదర్శనకు ఈ రెండూ కారణం కావొచ్చని స్టార్ స్పోర్ట్స్ షోలో చెప్పుకొచ్చాడు. కాగా ఆస్ట్రేలియా స్టార్ కామెరాన్ గ్రీన్ కోసం ఆర్సీబీ రూ. 17.50 కోట్లు వెచ్చించి ముంబై ఇండియన్స్ నుంచి ట్రేడ్ చేసుకుంది. అయితే, టాపార్డర్లో పవర్ఫుల్ స్ట్రైకర్ అయిన గ్రీన్ను మిడిలార్డర్లో ఆడిస్తోంది. విరాట్ కోహ్లితో కలిసి ఫాఫ్ డుప్లెసిస్ ఓపెనింగ్ చేస్తుండగా.. గత మ్యాచ్లో విల్జాక్స్ వన్డౌన్లో రాగా..పేస్ఆల్రౌండర్ గ్రీన్ ఐదో స్థానంలో బరిలోకి దిగాడు.చదవండి: MS Dhoni Angry Video: ‘నన్నెందుకు చూపిస్తున్నావు?’.. ధోని సీరియస్.. వీడియో వైరల్ var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4381453179.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
నువ్వు చాలా మంచోడివి ప్యాట్: కోహ్లి కామెంట్స్ వైరల్
ఐపీఎల్-2024లో ఏప్రిల్ 15న చిన్నస్వామి స్టేడియంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ సాధించిన స్కోరు 287/3. ఓపెనర్ ట్రావిస్ హెడ్ 41 బంతుల్లోనే 102 పరుగులతో చెలరేగగా.. మరో ఓపెనర్ అభిషేక్ శర్మ 34, వన్డౌన్ బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్ 31 బంతుల్లో 67 పరుగులు రాబట్టారు.ఇక నాలుగో స్థానంలో వచ్చిన వచ్చిన ఐడెన్ మార్క్రమ్ 17 బంతుల్లో 32, ఐదో నంబర్లో బ్యాటింగ్ చేసిన అబ్దుల్ సమద్ 10 బంతుల్లోనే 37 పరుగులతో ఆఖరి వరకు అజేయంగా నిలిచారు. వీరి అద్భుత ఇన్నింగ్స్ ఫలితమే 287. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోరు.భారీ లక్ష్య ఛేదనలో ఆర్సీబీ ఆఖరి వరకు పట్టుదలగా పోరాడింది. కానీ 262 పరుగులకే పరిమితమై ఓటమిని ఆహ్వానించింది. చిన్నస్వామి స్టేడియాన్ని పరుగుల వరదతో ముంచెత్తిన సన్రైజర్స్ 25 పరుగుల తేడాతో గెలుపొంది సత్తా చాటింది.ఇప్పుడు మళ్లీ ఏప్రిల్ 25న ఇరు జట్లు మరోసారి ముఖాముఖి తలపడనున్నాయి. ఏడింట ఐదు విజయాలతో మూడో స్థానంలో ఉన్న సన్రైజర్స్.. ఇప్పటికే ప్లే ఆఫ్స్ రేసు(ఎనిమిదికి ఒక్కటే విజయం) నుంచి దాదాపుగా నిష్క్రమించిన ఆర్సీబీకి మధ్య పోరు ఆసక్తికరంగా మారింది.ప్లే ఆఫ్స్ అవకాశాలను మెరుగు పరచుకునేందుకు సన్రైజర్స్ మరో విజయానికి గురిపెట్టగా.. ఆర్సీబీ పరువు కోసం పాకులాడుతోంది. ఈ నేపథ్యంలో సన్రైజర్స్- ఆర్సీబీ మధ్య గురువారం నాటి పోరు రసవత్తరంగా మారనుంది.ఈ నేపథ్యంలో ఇప్పటికే రెండు జట్లు ఉప్పల్ స్టేడియంలో ప్రాక్టీస్ పూర్తి చేసుకోగా.. రైజర్స్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్- ఆర్సీబీ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి మధ్య ఈ సందర్భంగా ఆసక్తికర సంభాషణ జరిగింది.కోహ్లి దగ్గరికి వచ్చిన కమిన్స్.. ‘‘వికెట్ ఫ్లాట్గా కనిపించేలా చేస్తానని కోచ్ చెప్తున్నాడు. నేనైతే ఆ విషయం విన్నాను మరి’’ అని టీజ్ చేశాడు. ఇందుకు స్పందనగా.. ‘‘నువ్వు చాలా మంచివాడివి ప్యాట్’’ అని కోహ్లి బదులిచ్చాడు.ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో ఆర్సీబీ షేర్ చేయగా వైరల్ అవుతోంది. కాగా గత మ్యాచ్లో కోహ్లి 20 బంతుల్లో 42 పరుగులు చేయగా.. పేస్ బౌలర్ కమిన్స్ 4 ఓవర్లలో 43 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు. -
RCB: ఇంకా రేసులోనే ఆర్సీబీ! అలా అయితే ప్లే ఆఫ్స్లో!
ఐపీఎల్-2024లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు పేలవ ప్రదర్శనతో అభిమానులను పూర్తిగా నిరాశపరిచింది. విరాట్ కోహ్లి, ఫాఫ్ డుప్లెసిస్, గ్లెన్ మాక్స్వెల్, కామెరాన్ గ్రీన్, మహ్మద్ సిరాజ్ వంటి టాప్ స్టార్లు జట్టులో ఉన్నా వరుస వైఫల్యాలతో చతికిలపడింది.ఇప్పటి వరకు ఆడిన ఎనిమిది మ్యాచ్లలో కేవలం ఒక్కటి మాత్రమే గెలిచి రెండు పాయింట్లతో పట్టికలో అట్టడుగున పదో స్థానంలో ఉంది. ఒక రకంగా ప్లే ఆఫ్స్ రేసు నుంచి ఆర్సీబీ దాదాపుగా నిష్క్రమించినట్లే! అయితే, తిరిగి పుంజుకుంటే మాత్రం పోటీలో నిలిచే అవకాశం ఉంటుంది. అందుకు సాధ్యమయ్యే కొన్ని సమీకరణలు గమనిద్దాం!మరోమాట లేదు.. గెలవాల్సిందేమరోమాట లేకుండా ఆర్సీబీ ఇప్పటి నుంచి ఆడే అన్ని మ్యాచ్లలో తప్పనిసరిగా గెలవాలి. నెట్ రన్రేటు -1.046 మరీ దారుణంగా ఉంది కాబట్టి కచ్చితంగా భారీ విజయాలు సాధించాలి.అదే జరిగితే.. ఆర్సీబీ ఖాతాలో 12 పాయింట్లు చేరి మొత్తం 14 అవుతాయి. అదే విధంగా.. నెట్ రన్రేటు కూడా మెరుగుపరచుకుంటే ప్లే ఆఫ్స్ ఆశలు సజీవంగా ఉంటాయి. కాగా ఆర్సీబీకి తదుపరి సన్రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటాన్స్(రెండుసార్లు), పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్తో మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. ఇవన్నీ భారీ తేడాతో గెలిచినా ఇతర జట్ల ఫలితాలపై ఆర్సీబీ భవితవ్యం ఆధారపడి ఉంటుంది.టాప్లో ఉన్న ఆ మూడు జట్లు..పట్టికలో అగ్రస్థానంలో ఉన్న రాజస్తాన్ రాయల్స్, కోల్కతా నైట్ రైడర్స్, సన్రైజర్స్ తమకు మిగిలిన ఆరు మ్యాచ్లలో ఎన్ని గెలిస్తే(తమపై మినహా) ఆర్సీబీకి అంత మంచిది. లక్నో, చెన్నై, ఢిల్లీ, గుజరాత్, ముంబై, పంజాబ్ కింగ్స్ ఈ జట్లు భారీ తేడాతో విజయం సాధించడం ఆర్సీబీకి ముఖ్యం.ఇంకెలా అంటే..►తొమ్మిదో స్థానంలో ఉన్న పంజాబ్ కింగ్స్ తమకు మిగిలిన ఆరు మ్యాచ్లలో నాలుగు కంటే ఎక్కువ విజయాలు సాధించకూడదు.►ఢిల్లీ క్యాపిటల్స్ మిగిలిన ఐదింటిలో రెండు కంటే.. ముంబై ఇండియన్స్ ఆరింటిలో మూడు కంటే ఎక్కువ గెలవకూడదు.►చెన్నై మిగిలిన ఆరు మ్యాచ్లలో రెండు కంటే.. గుజరాత్ ఐదింటిలో ఒకటి కంటే ఎక్కువ గెలవద్దు.►లక్నో మిగిలిన ఆరు మ్యాచ్లలో ఒకటి కంటే ఎక్కువ గెలవకూడదు.►కేకేఆర్, సన్రైజర్స్ మిగిలిని ఏడు మ్యాచ్లలో ఒకటి కంటే ఎక్కువ విజయాలు సాధిస్తే చాలు!►ఆర్సీబీ ప్లే ఆఫ్స్ చేరేందుకు కొన్ని సమీకరణలు మాత్రమే ఇవి. ఇంతా జరిగినా ఆర్సీబీ ప్లే ఆఫ్స్ చేరుతుందా అంటే? ఏమో గుర్రం ఎగరావచ్చు! లేదంటే గురువారం నాటి సన్రైజర్స్తో మ్యాచ్లో ఓడి పూర్తిగా నిష్క్రమించనూవచ్చు!!చదవండి: నువ్వు చాలా మంచోడివి ప్యాట్: కోహ్లి కామెంట్స్ వైరల్ var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_7522010156.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
IPL 2024: అరెరె.. మీరెందుకిలా అంటున్నార్సార్?!
గుజరాత్ టైటాన్స్.. చెన్నై సూపర్ కింగ్స్.. లక్నో సూపర్ జెయింట్స్.. ముంబై ఇండియన్స్.. ఐపీఎల్-2023లో ప్లే ఆఫ్స్ చేరిన జట్లు.. వీటిలో గుజరాత్- చెన్నై మధ్య టైటిల్ పోరు జరుగగా సూపర్ కింగ్స్ చాంపియన్గా అవతరించింది. ఇక పాయింట్ల పట్టికలో సన్రైజర్స్ హైదరాబాద్ అట్టడుగున నిలవగా.. ఢిల్లీ క్యాపిటల్స్(9), పంజాబ్ కింగ్స్(8), కోల్కతా నైట్ రైడర్స్(7) కింద నుంచి నాలుగు స్థానాల్లో నిలిచాయి. రాజస్తాన్ రాయల్స్, ఆర్సీబీ మెరుగైన ప్రదర్శనతో వరుసగా ఐదు, ఆరో స్థానంలో నిలిచాయి. 2023 పూర్తైన తర్వాత పాయింట్ల పట్టిక స్వరూపం ఇది. ఇక ఇప్పుడు ఐపీఎల్-2024లో సగానికి పైగా మ్యాచ్లు అయిపోయాయి. గతేడాది పట్టికతో తాజా సీజన్ను టేబుల్ను పోలిస్తే టాప్-5 జట్లలో పూర్తి వ్యత్యాసం కనిపిస్తోంది. రాజస్తాన్ రాయల్స్ ఎనిమిదింట ఏడు విజయాలతో నంబర్ వన్లో ఉండగా.. గతేడాది నామమాత్రపు ప్రదర్శనకు పరిమితమైన కోల్కతా, చెత్త ప్రదర్శనతో విమర్శలు మూటగట్టుకున్న సన్రైజర్స్ ముందుకు దూసుకువచ్చాయి. కేకేఆర్, ఎస్ఆర్హెచ్ ఆడిన ఏడింట ఐదు విజయాలతో వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. డిఫెండింగ్ చాంపియన్ చెన్నై ఏడింట నాలుగు విజయాలతో టాప్-4లో కొనసాగుతోంది. లక్నో ప్రస్తుతం ఐదో స్థానంలో ఉంది. అయితే, ఆర్సీబీ, ముంబై మాత్రం చెత్త ప్రదర్శన కనబరుస్తున్నాయి. కొత్త కెప్టెన్ హార్దిక్ పాండ్యా సారథ్యంలో ముంబై ఎనిమిదింట కేవలం మూడుసార్లు గెలవగా..ఫాఫ్ డుప్లెసిస్ బృందం ఆర్సీబీ ఎనిమిదింట ఒక్కటి మాత్రమే గెలిచి ప్లే ఆఫ్స్ నుంచి దాదాపుగా నిష్క్రమించింది. అయితే..ఈసారి ధనాధన్ బ్యాటింగ్తో దుమ్ములేపుతున్న జట్టు ఏదైనా ఉందంటే.. సన్రైజర్స్. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక స్కోరు సాధించడంతో పాటు మూడుసార్లు 250కి పైగా స్కోర్లు సాధించి సత్తా చాటింది. కేకేఆర్, ఆర్సీబీ సైతం ఈ మార్కును టచ్ చేశాయి. ఈ నేపథ్యంలో సునిల్ గావస్కర్ వంటి దిగ్గజాలు.. ప్రతిసారి హిట్టింగ్ చేస్తే ఐపీఎల్ బోర్ కొట్టడం ఖాయమంటూ వ్యాఖ్యానించడం కొంతమంది అభిమానులకు మింగుడుపడటం లేదు. ముంబై, ఆర్సీబీ, సీఎస్కే వంటి జట్లు పరుగుల వరద పారిస్తే మురిసిపోయే మాజీ క్రికెటర్లు ఈసారి వేరే జట్లు హిట్టింగ్ ఆడితే చూసి ఓర్వలేకపోతున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈసారి టేబుల్ తలకిందులయ్యేట్లుగా కనిపిస్తునందువల్లే బోర్ కొడుతుందంటూ ఇన్ఫ్ల్యూయెన్స్ చేసేలా కామెంట్లు చేస్తున్నారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కాగా ఈసారి ఇప్పటికైతే ప్లే ఆఫ్స్ రేసులో రాజస్తాన్, కేకేఆర్, ఎస్ఆర్హెచ్, చెన్నై ముందు వరుసలో ఉండగా.. లక్నో, గుజరాత్ సైతం పోటీనిచ్చే అవకాశం ఉంది. సగానికి పైగా మ్యాచ్లు పూర్తయ్యేసరికి ఈ జట్లు టాప్-6లో ఉండగా.. ముంబై, ఢిల్లీ, పంజాబ్, ఆర్సీబీ వరుసగా ఏడు, ఎనిమిది, తొమ్మిది, పదో స్థానంలో నిలిచాయి. -
ఇంకెవరు.. నీ భార్యనే: కోహ్లి ఆన్సర్తో షాకైన డీకే
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు స్టార్ విరాట్ కోహ్లి ఆటతోనే కాదు తన చురుకుదనంతో అభిమానులను ఫిదా చేస్తూ ఉంటాడు. క్రీజులో దిగగానే భారీ షాట్లతో విరుచుకుపడగల ఈ రన్ మెషీన్.. మైదానంలో తన చేష్టలతోనూ వినోదం పంచుతూ ఉంటాడు. అదే విధంగా.. సహచర ఆటగాళ్లతోనూ సరదాగా ఉంటూ తన చుట్టూ ఉన్న వాతావరణాన్ని ఆహ్లాదభరింతగా మారుస్తాడు. తాజాగా ఆర్సీబీ షేర్ చేసిన ఓ వీడియో ఈ విషయాన్ని మరోసారి నిరూపించింది. తోటి ప్లేయర్ దినేశ్ కార్తిక్ అడిగిన ప్రశ్నలకు కోహ్లి ఊహించని సమాధానమివ్వడమే గాకుండా.. మళ్లీ అతడిని మాట్లాడకుండా చేశాడు. ఇంతకీ విషయం ఏమిటంటే.. ఐపీఎల్-2024లో మ్యాచ్ల నుంచి విరామం దొరికిన సమయంలో ఆర్సీబీ తమ ఆటగాళ్లతో పలు ఆసక్తికర వీడియోలు రూపొందిస్తోంది. ఈ క్రమంలో.. ఆర్సీబీ వికెట్ కీపర్ బ్యాటర్ దినేశ్ కార్తిక్ హోస్ట్గా వ్యవహరిస్తూ ఉండగా... కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్, పేసర్ మహ్మద్ సిరాజ్ తదితరులతో కలిసి కోహ్లి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ సెషన్లో పాల్గొన్నాడు. ఇంకెవరు నీ భార్యనే! ఇందులో భాగంగా.. డీకే ముందుగా.. ‘‘క్రికెటర్ కాకుండా నా ఫేవరెట్ ప్లేయర్ ఎవరో చెప్పగలరా?’’ అని అడగ్గా.. కోహ్లి వెంటనే తడుముకోకుండా .. ‘‘నీ భార్య’’ అని ఆన్సర్ ఇచ్చాడు. దీంతో క్షణంపాటు ఆశ్చర్యంలో మునిగిన డీకే.. ‘‘అవును.. సరైన సమాధానం.. కానీ నిజానికి నా మనసులో వేరే పేరు అనుకున్నా’’ అన్నాడు. డీకే అలా అనగానే అక్కడ నవ్వులు పూశాయి. ఇందుకు సంబంధించిన వీడియో కోహ్లి ఫ్యాన్స్ను ఆకర్షిస్తోంది. మీరూ ఓ లుక్కేయండి.. మోసం చేసిన మొదటి భార్య? కాగా దినేశ్ కార్తిక్ భార్య పేరు దీపికా పళ్లికల్. ఆమె స్వ్కాష్ ప్లేయర్. భారత్ తరఫున అంతర్జాతీయ టోర్నీల్లో పాల్గొని ఎన్నో పతకాలు సాధించారు. అయితే, దీపికా కంటే ముందు డీకే నికితా వంజరాను పెళ్లాడాడు. కానీ ఆమె డీకేతో వివాహ బంధంలో ఉండగానే భర్త స్నేహితుడు, టీమిండియా మాజీ క్రికెటర్ మురళీ విజయ్తో సాన్నిహిత్యం పెంచుకున్నట్లు సమాచారం. ఈ క్రమంలో డీకే ఆమెకు విడాకులివ్వగా.. మురళీ విజయ్ను పెళ్లాడింది. తర్వాత డీకే దీపికాను పెళ్లి చేసుకున్నాడు. ఇదిలా ఉంటే.. ఐపీఎల్-2024లో కోహ్లి బ్యాటర్గా రాణిస్తున్నా ఆర్సీబీ చెత్త ప్రదర్శనతో విమర్శలు మూటగట్టుకుంటోంది. ఆడిన ఏడు మ్యాచ్లలో కేవలం ఒక్కటి గెలిచి పట్టికలో పదో స్థానంలో ఉంది. అయితే, కోహ్లి మాత్రం 361 పరుగులతో టాప్ స్కోరర్గా కొనసాగుతూ ఆరెంజ్ క్యాప్ ప్రస్తుతానికి తన వద్ద పెట్టుకున్నాడు. మరోవైపు.. దినేశ్ కార్తిక్ సైతం జట్టు కష్టాల్లో ఉన్నపుడు బ్యాట్ ఝులిపిస్తూనే ఉన్నాడు. అయినా ఫలితం మాత్రం ఉండటం లేదు. Virat Kohli - the legend. 🤣👌 pic.twitter.com/1TMIPxEQT2 — Mufaddal Vohra (@mufaddal_vohra) April 19, 2024 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_7522010156.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
RCB: అక్కడే మొదలు.. అక్కడే ముగిస్తా: కేఎల్ రాహుల్
‘‘ఆ రోజు విరాట్ అక్కడే ఉన్నాడు. కోచ్ రే జెన్సింగ్స్.. ఇంకా మిగతా సహాయక సిబ్బంది కూడా ఉన్నారు. అప్పుడు విరాట్ వచ్చి.. ‘నీకు ఈ కాంట్రాక్ట్ మీద సంతకం పెట్టడం ఇష్టమేనా? ఆర్సీబీకి ఆడతావా? అని అడిగాడు. అందుకు బదులుగా.. ‘ఏంటీ జోక్ చేస్తున్నావా?.. నా చిరకాల కల అది’ అని అన్నాన్నేను. అప్పుడు విరాట్.. ‘అవును.. జోక్ చేశానులే.. అయినా.. ఇది నీకు ఆప్షన్ కాదు.. ముందు ఈ కాంట్రాక్టు మీద సంతకం పెట్టు’ అన్నాడు. నేను అలాగే చేశాను. అప్పుడు వెంటనే విరాట్ స్పందిస్తూ.. ‘ఇక నుంచి నీ ప్రయాణం క్రేజీగా ఉండబోతోంది. వచ్చే రెండు నెలలు నీకు ఫుల్ మజా’ అంటూ నన్ను ఆటపట్టించాడు’’ అని టీమిండియా స్టార్, ఐపీఎల్ ఫ్రాంఛైజీ లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ అన్నాడు. క్యాష్ రిచ్ లీగ్లో అడుగుపెట్టిన నాటి జ్ఞాపకాలను తాజాగా గుర్తు చేసుకున్నాడు. కాగా కర్ణాటకకు చెందిన కన్ననూర్ లోకేశ్ రాహుల్ 2013లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తరఫున అరంగేట్రం చేశాడు. ఆ ఏడాది దేశవాళీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో అదరగొట్టి ఐపీఎల్లోనూ ఎంట్రీ ఇచ్చాడు. కేకేఆర్తో మ్యాచ్తో ఎంట్రీ సొంతమైదానం బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో కోల్కతా నైట్ రైడర్స్తో ఆర్సీబీ తరఫున అరంగేట్రం చేశాడు. ఇక ఆ తర్వాత సన్రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్(కెప్టెన్)కు ఆడిన రాహుల్.. 2022లో ఎంట్రీ ఇచ్చిన లక్నో సూపర్ జెయింట్స్ సారథిగా బాధ్యతలు చేపట్టాడు. తమ తొలి సీజన్లోనే లక్నోను ప్లే ఆఫ్స్ చేర్చి సత్తా చాటాడు. ఇక ఐపీఎల్-2024లోనూ ప్రస్తుతం లక్నో పరిస్థితి మెరుగ్గానే ఉంది. ఆడిన ఆరు మ్యాచ్లలో మూడు గెలిచి ఐదో స్థానంలో ఉంది. శుక్రవారం నాటి మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్తో లక్నో వేదికగా సూపర్ జెయింట్స్ తలపడనుంది. ఇదిలా ఉంటే.. లక్నోకు సారథిగా ఉన్నా కేఎల్ రాహుల్ మనసులో ఆర్సీబీకి మాత్రం ప్రత్యేక స్థానం ఉంది. తన సొంత రాష్ట్రానికి చెందిన ఫ్రాంఛైజీ కావడంతో పాటు.. తనకు లైఫ్ కూడా ఇచ్చిన ఆర్సీబీ అంటే అతడికి గౌరవం. ఈ విషయాన్ని తాజాగా రవిచంద్రన్ అశ్విన్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పంచుకున్నాడు రాహుల్. అక్కడే మొదలు.. అక్కడే ముగిస్తా ‘‘ఆ రెండు నెలలు ఆర్సీబీలో నేను చాలా నేర్చుకున్నాను. మంచి అనుభవం గడించాను. అంతా త్వరత్వరగా జరిగిపోయింది. బెంగళూరుకు ఆడటం నాకెల్లప్పుడూ ఇష్టమే. నా కెరీర్ మొదలైందే అక్కడ! అక్కడే కెరీర్ ముగిస్తే బాగుంటుందని కూడా అనుకుంటున్నా. ఏదేమైనా భిన్న జట్లతో.. భిన్న ప్లేయర్లతో కలిపే ఐపీఎల్ ఓ అద్భుతమైన టోర్నీ’’ అని కేఎల్ రాహుల్ చెప్పుకొచ్చాడు. చదవండి: హార్దిక్ను పట్టించుకోని ఆకాశ్.. రోహిత్ మాట విని అలా! వైరల్ వీడియో var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4381453179.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
RCB కెప్టెన్గా అతడు ఉంటే ఏం మాట్లాడగలరు: సెహ్వాగ్
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ఆట తీరుపై విమర్శలు వెల్లుతుతున్నాయి. సొంతమైదానంలో సన్రైజర్స్ హైదరాబాద్ చేతిలో చిత్తుగా ఓడిపోవడంతో సొంత జట్టు అభిమానులు సైతం అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇలాగే కొనసాగితే ఐపీఎల్-2024లో కనీసం ప్లే ఆఫ్స్ కూడా చేరే అవకాశం ఉండదని మండిపడుతున్నారు. ఇక ఇప్పటికే భారత టెన్నిస్ దిగ్గజం మహేశ్ భూపతి సైతం ఆర్సీబీని కొత్త వాళ్లకు అమ్మేయాలంటూ యాజమాన్యం తీరును విమర్శించాడు. జట్టు నిండా స్టార్లు ఉన్నా ఇలాంటి చెత్త ప్రదర్శన ఏమిటని ఘాటు వ్యాఖ్యలు చేశాడు. ఈ నేపథ్యంలో ఆర్సీబీ వైఫల్యాలను ఎత్తిచూపుతూ టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. అదే ఇక్కడ ప్రధాన సమస్య ‘‘జట్టులో 12- 15 మంది భారత ఆటగాళ్లు ఉన్నారు. కేవలం 10 మంది విదేశీ క్రికెటర్లు ఉన్నారు. కానీ ఆర్సీబీ కోచింగ్ సిబ్బందిలో దాదాపుగా అందరూ విదేశీయులే ఉన్నారు. అదే ఇక్కడ ప్రధాన సమస్య. ఇక ఆటగాళ్లలో కొంతమంది మాత్రమే అంతర్జాతీయ స్థాయిలో ఆడుతున్నారు. వీరిలో సగం మందికి ఇంగ్లిష్ పూర్తిగా అర్థమే కాదు. అలాంటపుడు ఆ విదేశీ కోచ్లు వీరిని ఎలా మోటివేట్ చేయగలరు? వారితో ఎక్కువ సమయం ఎలా గడపగలరు? భాష పూర్తిగా రాని ఆటగాళ్లు తమ సమస్యలను కోచ్లకు ఎలా వివరించగలరు? నాకైతే ఆర్సీబీలో ఒక్క ఇండియన్ కోచ్ కూడా కనిపించడం లేదు. కనీసం ఒక్కరైనా అనుభవజ్ఞుడైన కోచ్ ఉంటే బాగుంటుంది కదా! ఆటగాళ్లు ఏది చర్చించాలన్నా అందుకు తగిన వాతావరణం ఉండాలి. కెప్టెన్గా అతడు ఉంటే ఏం మాట్లాడతారు? నాకు తెలిసి చాలా మంది ఆటగాళ్లు కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ దగ్గరికి వెళ్లడానికే సంశయిస్తారు. ఎందుకంటే అతడు ఏదైనా అడిగితే వీరు సమాధానం చెప్పలేరు కదా! ఒకవేళ కెప్టెన్ గనుక భారతీయుడైతే.. సదరు ఆటగాళ్లు తాము అనుకుంటున్న విషయాన్ని స్పష్టంగా అతడికి తెలియజేయగలరు. కానీ విదేశీ ఆటగాడితో సరిగా కమ్యూనికేట్ చేయలేక.. ఒకదానికి బదులు ఇంకొకటి మాట్లాడితే తదుపరి మ్యాచ్లో తుదిజట్టులో చోటు దక్కే అవకాశం కూడా ఉండకపోవచ్చు. ఆర్సీబీ సహాయక సిబ్బందిలో కనీసం ఇద్దరు నుంచి ముగ్గురైనా భారతీయులు ఉండాలి’’ అని క్రిక్బజ్ షోలో సెహ్వాగ్ వ్యాఖ్యానించాడు. కాగా ఐపీఎల్-2024లో ఆర్సీబీ ఇప్పటి వరకు ఆడిన ఏడు మ్యాచ్లలో కేవలం ఒక్కటి గెలిచి ఆరు ఓడిపోయింది. దీంతో ప్లే ఆఫ్స్ అవకాశాలను సంక్లిష్టంగా మార్చుకుంది. ఇక ఈ సీజన్లో ఆర్సీబీ హెడ్కోచ్గా ఆండీ ఫ్లవర్ బాధ్యతలు చేపట్టగా.. బ్యాటింగ్, స్పిన్ బౌలింగ్ కోచ్గా టీమిండియా మాజీ ఆల్రౌండర్ శ్రీధరన్ శ్రీరామ్, బౌలింగ్ కోచ్గా ఆడం గ్రిఫిత్(టాస్మేనియా మాజీ క్రికెటర్), ఫీల్డింగ్ కోచ్గా మలోలన్ రంగరాజన్ వ్యవహరిస్తున్నారు. చదవండి: SRH: ‘బాధితులు’ కూడా అసూయ పడేలా.. కమిన్స్ ఏమన్నాడో తెలుసా? var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4381453179.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
ఏంట్రా ఈ బ్యాటింగ్?.. ఆగ్రహం వెళ్లగక్కిన కోహ్లి.. రియాక్షన్ వైరల్
‘‘నేను కొడితే అదోలా ఉంటుందని..ఆళ్లూ.. ఈళ్లూ చెప్పడమే గానీ.. నాకు కూడా తెలియదు.. ఇప్పుడు మీకు తెలుస్తుంది’’.. బిజినెస్మేన్ సినిమాలో మహేశ్ బాబు చెప్పిన మాదిరే సన్రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు కూడా ఆర్సీబీ బౌలింగ్ను చితక్కొట్టారు. ఏమాత్రం కనికరం లేకుండా బెంగళూరు బౌలర్లపై విరుచుపడుతూ చిన్నస్వామి స్టేడియంలో పరుగుల వరద పారించాడు. కో..డితే సిక్స్.. లేదంటే ఫోర్.. తగ్గేదేలే అన్నట్లు ట్రావిస్ హెడ్(41 బంతుల్లో 102) ఓవైపు ఊచకోత కోస్తుంటే మరోవైపు హెన్రిచ్ క్లాసెన్(31 బంతుల్లో 67) ఛాన్స్ వచ్చినప్పుడల్లా వీరబాదుడు బాదాడు. THE SHOOTING STAR...!!! 💫 - 106M monster by Heinrich Klaasen. 🥵 pic.twitter.com/raWQGOLOiM — Mufaddal Vohra (@mufaddal_vohra) April 15, 2024 వీరిద్దరి తుఫాన్ ఇన్నింగ్స్ చూసి ఆరెంజ్ ఆర్మీ కేకలతో స్టేడియం హోరెత్తిపోగా.. ఆర్సీబీ ఫ్యాన్స్ మాత్రం జరుగుతున్న పరుగుల విధ్వంసాన్ని చూడలేక తమలో తామే మదనపడిపోతూ సతమతమయ్యారు. అభిమానుల పరిస్థితే ఇలా ఉంటే.. మరి ఆర్సీబీ బౌలర్లు, ఫీల్డర్ల పరిస్థితి ఇంకెలా ఉంటుంది? వికెట్ తీయడం సంగతి దేవుడెరుగు.. ముందు పరుగుల ప్రవాహానికి కట్టడి చేయడం ఎలా అని తలలు పట్టుకున్నారంతా! కాలితో తంతూ ఆగ్రహం వెళ్లగక్కిన కోహ్లి ఇక ఆర్సీబీ ముఖచిత్రంగా భావించే స్టార్ విరాట్ కోహ్లి అయితే తీవ్ర అసహానికి లోనయ్యాడు. రైజర్స్ బ్యాటర్లు తమ సొంత మైదానంలో దుమ్ములేపుతుంటే అస్సలు చూడలేకపోయాడు. ఏ దశలోనూ వారిని కట్టడి చేయలేక బౌలర్లు చేతులెత్తేస్తుంటే గాల్లోకి కాలితో పంచ్లు విసురుతూ కోపాన్ని వెళ్లగక్కాడు. అదే సమయంలో వికెట్ పడినప్పుడల్లా జట్టును ఉత్సాహపరుస్తూ.. చప్పట్లు కొడుతూ సంతోషం వ్యక్తం చేశాడు. సన్రైజర్స్ బ్యాటింగ్ పూర్తయ్యేంత వరకు కోహ్లి ఇచ్చిన వైవిధ్యమైన ఎక్స్ప్రెషన్స్, రియాక్షన్స్ చూసి ఫ్యాన్స్.. ‘‘అయ్యో పాపం ఆర్సీబీ’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. Everyone's mental health after watching RCB bowlers #RCBvsSRH pic.twitter.com/dSy38RctKC — Rohan Naik (@RohanNaik_) April 15, 2024 ఆర్సీబీ బౌలర్లపై ఫ్యాన్స్ మండిపాటు ఇలాగే ఆడితే ఆర్సీబీ ఈసారి కనీసం ప్లే ఆఫ్స్ కూడా చేరదంటూ ఆర్సీబీ బౌలర్లను పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నారు. కాగా బెంగళూరులో సోమవారం జరిగిన మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన సన్రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 287 పరుగులు చేసింది. తద్వారా ఐపీఎల్ చరిత్రలో తమ రికార్డును తామే బ్రేక్ చేసి.. అత్యధిక పరుగులు సాధించిన జట్టుగా చరిత్రకెక్కింది. ఇక లక్ష్య ఛేదనలో కోహ్లి(42), ఫాఫ్ డుప్లెసిస్(28 బంతుల్లో 62) శుభారంభం అందించినా.. మిడిలార్డర్ పూర్తిగా విఫలమైంది. ఇక ఆఖర్లో దినేశ్ కార్తిక్(35 బంతుల్లో 83) విధ్వంసకర అర్ధ శతకం బాదినా.. అనూజ్ రావత్(14 బంతుల్లో 25 నాటౌట్) మెరుపులు మెరిపించినా లక్ష్యాన్ని ఛేదించడంలో ఆర్సీబీ విఫలమైంది. ఫలితంగా 25 పరుగుల తేడాతో ఓడిపోయి వరుసగా ఐదో పరాజయం నమోదు చేసింది. చదవండి: #T20WorldCup2024: రోహిత్తో ద్రవిడ్, అగార్కర్ చర్చలు.. హార్దిక్ పాండ్యాకు నో ఛాన్స్! var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_7552012696.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); A 1⃣0⃣8⃣m monster! 💥 The bowlers can finally breathe at the Chinnaswamy as the batting carnage comes to an end! 🥶 Recap the match on @StarSportsIndia and @JioCinema 💻📱#TATAIPL | #RCBvSRH pic.twitter.com/lclY9rs2Kf — IndianPremierLeague (@IPL) April 15, 2024 -
వారెవ్వా.. ఏమా విధ్వంసం! సంభ్రమాశ్చర్యంలో కావ్యా మారన్
#OrangeArmy: సన్రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్ల విజృంభణతో చిన్నస్వామి స్టేడియం చిన్నబోయింది. ఆరంభం నుంచే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు బౌలర్లపై విరుచుకుపడుతూ సృష్టించిన పరుగుల సునామీలో పాత రికార్డులు కొట్టుకుపోతుంటే అందుకు సాక్షిగా నిలిచింది. అయినా.. లక్ష్య ఛేదనలో ఆర్సీబీ బ్యాటర్లు మ్యాజిక్ చేస్తారనే ఆశ. సొంతమైదానంలో కచ్చితంగా రికార్డు టార్గెట్ను చేధిస్తారనే నమ్మకం ఆ జట్టు అభిమానుల్లో! కానీ సన్రైజర్స్ బౌలర్ల ముందు ఆర్సీబీ బ్యాటర్లు ఎక్కువసేపు నిలవలేకపోయారు. అయినప్పటికీ.. కొండంత లక్ష్యాన్ని కరిగించేందుకు ఆఖరి వరకు అసాధారణ పోరాట పటిమ కనబరిచారు. అయితే.. హోరాహోరీగా సాగిన మ్యాచ్లో చివరికి సన్రైజర్స్ పైచేయి సాధించింది. ఆర్సీబీపై 25 పరుగుల తేడాతో జయభేరి మోగించి ఘన విజయాన్ని అందుకుంది. దీంతో ఆరెంజ్ ఆర్మీ సంబరాలు అంబరాన్నంటాయి. ఆద్యంతం పరుగుల వరద పారిన ఈ మ్యాచ్లో సన్రైజర్స్ యజమాని కావ్యా మారన్ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. తొలుత తమ జట్టు హిట్టింగ్ చేసినపుడు.. ముఖ్యంగా ట్రావిస్ హెడ్ విధ్వంసకర శతకం నేపథ్యంలో ఆమె సంభ్రమాశ్చర్యాలకు లోనైంది. సన్రైజర్స్ బ్యాటర్లు పరుగుల వరద పారించిన సమయంలో సంతోషంతో కావ్య ముఖం వెలిగిపోయింది. The art 🎨 of nailing practice to execution for a record breaking total! 🧡 Travis Head 🤝 Heinrich Klaasen#TATAIPL | #RCBvSRH | @SunRisers pic.twitter.com/gA5HcYGwFM — IndianPremierLeague (@IPL) April 16, 2024 అలాగే ప్రమాదకరంగా మారుతున్న ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్(28 బంతుల్లో 62) అవుటైన సమయంలో ఏకంగా చిన్నపాటి స్టెప్పులేసిందామె! ఇందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. కావ్యా ఎక్స్ప్రెషన్స్కు ఫిదా అవుతున్న నెటిజన్లు ఆమెకు, సన్రైజర్స్కు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కాగా ఆర్సీబీతో బెంగళూరులో సోమవారం జరిగిన సన్రైజర్స్ మ్యాచ్కు కావ్యా మారన్ తన తల్లిదండ్రులతో కలిసి హాజరయ్యారు. సన్రైజర్స్ వర్సెస్ ఆర్సీబీ స్కోర్లు: ►టాస్: ఆర్సీబీ.. బౌలింగ్ ►సన్రైజర్స్ స్కోరు: 287/3 (20) ►ఆర్సీబీ స్కోరు: 262/7 (20) ►ఫలితం: ఆర్సీబీపై 25 పరుగుల తేడాతో సన్రైజర్స్ విజయం ►ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: ట్రావిస్ హెడ్ (41 బంతుల్లో 102 పరుగులు). చదవండి: ఐపీఎల్ నుంచి తప్పుకున్న మ్యాక్స్వెల్ Kavya Maran enjoying the Head-Abhishek show. pic.twitter.com/jaYpDIquOS — Mufaddal Vohra (@mufaddal_vohra) April 15, 2024 -
బెంగళూరులో దుమ్మురేగొట్టిన ఆరెంజ్ ఆర్మీ ‘ఓ రేంజ్’ బ్యాటింగ్ (ఫొటోలు)
-
RCB Vs MI Highlights Photos: ఇషాన్, సూర్యకుమార్ల విధ్వంసం ముంబై ఘనవిజయం (ఫొటోలు)
-
రోహిత్, కోహ్లి కాదు.. ప్రపంచంలో అతడే బెస్ట్!
టీమిండియా వెటరన్ వికెట్ కీపర్ దినేశ్ కార్తిక్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. భూగ్రహం మీద ప్రస్తుతం అత్యంత విలువైన క్రికెటర్ ఇతడేనంటూ టీమిండియా స్టార్లలో ఓ ఆటగాడి పేరు చెప్పాడు. డీకే చెప్పిన ఆ ప్లేయర్ రన్మెషీన్ విరాట్ కోహ్లినో లేదంటే హిట్మ్యాన్ రోహిత్ శర్మనో కానే కాదు! మరెవరు?.. దినేశ్ కార్తిక్ ప్రస్తుతం ఐపీఎల్-2024లో బిజీగా ఉన్నాడు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తరఫున బరిలోకి దిగి ఫినిషర్గా తన బాధ్యతలు నెరవేరుస్తున్నాడు ఈ వికెట్ కీపర్ బ్యాటర్. ఇక ఇప్పటి వరకు తాజా ఎడిషన్లో ఆడిన నాలుగు ఇన్నింగ్స్లో డీకే 90 పరుగులు చేశాడు. తదుపరి ముంబై ఇండియన్స్ ఆర్సీబీ మ్యాచ్ సందర్భంగా డీకే మళ్లీ గురువారం బరిలో దిగనున్నాడు. ముంబైలోని వాంఖడే వేదికగా జరుగనున్న మ్యాచ్లో ఆడనున్నాడు. ఇదిలా ఉంటే.. కేవలం ఆటగాడినే కాకుండా కామెంటేటర్గానూ దినేశ్ కార్తిక్ రాణిస్తున్న విషయం తెలిసిందే. భూగ్రహం మొత్తంమీద అత్యంత విలువైన క్రికెటర్ అతడే ఈ నేపథ్యంలో నాసిర్ హుసేన్, మైఖేల్ అథెర్టన్లతో కలిసి డీకే స్కై స్పోర్ట్స్తో ముచ్చటించాడు. ఈ సందర్భంగా మోస్ట్ వాల్యూబుల్ క్రికెటర్ గురించి ప్రస్తావన రాగా.. ‘‘నిజం చెప్పాలంటే అతడిలా మూడు ఫార్మాట్లలో ప్రత్యర్థులపై ఆధిపత్యం కనబరుస్తున్న మరొక ఆటగాడు లేడంటే అతిశయోక్తి కాదు. అతడి సత్తా అలాంటిది. కాబట్టి ప్రస్తుతం ఈ భూగ్రహం మొత్తంమీద అత్యంత విలువైన క్రికెటర్ అతడే. ఎందుకంటే.. మూడు ఫార్మాట్లలోనూ అతడు సమర్థవంతంగా ఆడుతున్నాడు. వేరే ఆటగాడికి లేని నైపుణ్యాలను ప్రదర్శిస్తున్నాడు. అతడు బరిలో ఉంటే ప్రత్యర్థులు వణికిపోవాల్సిందే’’ అంటూ డీకే.. టీమిండియా పేస్ దళ నాయకుడు జస్ప్రీత్ బుమ్రా పేరు చెప్పాడు. తన దృష్టిలో ప్రస్తుతం బుమ్రా మాత్రం ఈ ప్రపంచం మొత్తం మీద విలువైన క్రికెటర్ అని పేర్కొన్నాడు. కాగా భారత జట్టు ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఐపీఎల్-2024లో ముంబై ఇండియన్స్ తరఫున ఆడుతున్నాడు. ఇప్పటి వరకు ఆడిన నాలుగు మ్యాచ్లలో కలిపి ఐదు వికెట్లు తీశాడు. ఇక గురువారం ముంబై- ఆర్సీబీ మ్యాచ్ సందర్భంగా బుమ్రా- డీకే ఎదురుపడే అవకాశం ఉంది. చదవండి: T20 WC: హార్దిక్, రాహుల్కు నో ఛాన్స్.. ఆ ముగ్గురూ ఫిక్స్! -
కోహ్లి ఆ తప్పు చేయకపోయి ఉంటేనా..: సెహ్వాగ్
‘‘ఇలాంటి ప్రశ్నలకు జవాబు మీకు కూడా తెలుసు కదా? అయినా ప్రతిసారీ మమ్మల్నే ఎందుకు ఇలా కఠినమైన ప్రశ్నలు అడుగుతారు? మాతో బ్యాడ్ కామెంట్స్ చెప్పించాలనే కదా మీ ప్రయత్నం. 183 పరుగులు చాలా? విరాట్ కోహ్లి స్లోగా ఆడాడా? ఫాఫ్ డుప్లెసిస్ ఇన్నింగ్స్ నెమ్మదిగా సాగిందా? లేదంటే.. ఆర్సీబీ ఇంకా కనీసం 20 పరుగులు చేయాల్సిందా? ఇలాంటి ప్రశ్నలకు మీరు కూడా సమాధానం చెప్పవచ్చు’’ అంటూ టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ తనకు ప్రశ్నలు సంధించిన స్పోర్ట్స్ ప్రజెంటర్ను సరదాగా ట్రోల్ చేశాడు. కావాలనే కఠినమైన ప్రశ్నలు వేసి తమను బ్యాడ్ చేసేందుకు చూస్తున్నారంటూ ఆటపట్టించాడు. కాగా సెహ్వాగ్ ప్రస్తుతం ఐపీఎల్-2024 కామెంటేటర్గా ఉన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో రాజస్తాన్ రాయల్స్- రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య శనివారం నాటి మ్యాచ్ సందర్భంగా ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు. ఒక్కడే లాక్కొచ్చాడు ఇక రాజస్తాన్ చేతిలో ఓటమిపాలైన ఆర్సీబీ ఇన్నింగ్స్ గురించి ప్రస్తావిస్తూ.. ‘‘అవును.. ఈరోజు కోహ్లి శతకం బాదాడు. ఆర్సీబీ తరఫున ప్రస్తుతం అతడు ఒక్కడు మాత్రమే ఫామ్లో ఉన్నాడు. మిగతా వాళ్లలో ఎవరూ కూడా పరుగులు చేయడం లేదు. నిజానికి కోహ్లి ఆఖరి వరకు క్రీజులో ఉండటం మంచిదైంది. మిగతా వాళ్ల నుంచి ఎటువంటి సహకారం లేకపోయినా ఒంటరిగా లాక్కొచ్చాడు. కానీ కోహ్లి చేసిన తప్పు అదే మాక్స్వెల్, గ్రీన్ అసలు ప్రభావం చూపలేదు. మహిపాల్ లామ్రోర్, దినేశ్ కార్తిక్ ఏమయ్యారో అర్థం కాలేదు. వాళ్లిద్దరూ మంచి ఫామ్లో ఉన్నారు. ఇద్దరిలో ఒక్కరు బ్యాటింగ్కు వచ్చినా బాగుండేది. ఇక కోహ్లి హాఫ్ సెంచరీ(39 బంతుల్లో 50) తర్వాత వేగం పెంచాల్సింది. అలా చేయకుండా కోహ్లి తప్పు చేశాడు. అతడి స్ట్రైక్రేటు పెరిగితే ఆర్సీబీ 200 పరుగులు మార్కు చేరుకునేది ’’ అని వీరూ భాయ్ అభిప్రాయపడ్డాడు. కాగా జైపూర్లో రాజస్తాన్తో జరిగిన మ్యాచ్లో ఆర్సీబీ ఆరు వికెట్ల తేడాతో ఓడిపోయింది. కోహ్లి అజేయ శతకం(113) వృథాగా పోగా.. ఆర్సీబీ ఈ సీజన్లో నాలుగో పరాజయాన్ని మూటగట్టుకుంది. రాజస్తాన్ రాయల్స్ వర్సెస్ ఆర్సీబీ స్కోర్లు: ►వేదిక: జైపూర్.. సవాయి మాన్సింగ్ స్టేడియం ►టాస్: రాజస్తాన్.. బౌలింగ్ ►ఆర్సీబీ స్కోరు: 183/3 (20) ►రాజస్తాన్ స్కోరు: 189/4 (19.1) ►ఫలితం: ఆరు వికెట్ల తేడాతో ఆర్సీబీపై రాజస్తాన్ విజయం ►ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: జోస్ బట్లర్(రాజస్తాన్). చదవండి: Virat Kohli: ఇంత స్వార్థమా?.. ఐపీఎల్ చరిత్రలో కోహ్లి చెత్త రికార్డు var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4381453179.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
IPL 2024: ఒక్కడు ఎంత కాలమని లాక్కొస్తాడు..సెంచరీ చేసినా చెత్త కామెంట్లే..!
ఐపీఎల్ 2024లో భాగంగా రాజస్థాన్ రాయల్స్తో నిన్న (ఏప్రిల్ 6) జరిగిన మ్యాచ్లో ఆర్సీబీ ఆటగాడు విరాట్ కోహ్లి అజేయ సెంచరీతో (72 బంతుల్లో 113 నాటౌట్; 12 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరిసిన విషయం తెలిసిందే. ఈ సీజన్లో ఇదే మొదటి సెంచరీ. స్పిన్నర్లకు అనుకూలిస్తున్న పిచ్పై సెంచరీ చేసేందుకు విరాట్ చాలా కష్టపడ్డాడు. జట్టు ప్రయోజనాల దృష్ట్యా విరాట్ చివరి వరకు క్రీజ్లో నిలబడాలని భావిస్తే.. అది కాస్త మిస్ ఫైర్ అయ్యింది. విరాట్ సెంచరీ కోసం నిదానంగా ఆడాడంటూ గిట్టని వాళ్లు కామెంట్లు చేస్తున్నారు. జట్టు కోసం నిస్వార్దంగా బ్యాటింగ్ చేసి విమర్శలు ఎదుర్కొంటుండటంతో కోహ్లి అభిమానులు రంగంలోకి దిగారు. తమ ఆరాధ్య ఆటగాడిని టార్గెట్ చేస్తున్న వారిపై ఎదురుదాడికి దిగారు. 18 మ్యాచ్లు అయినా ఒక్కరు కూడా సాధించలేకపోతే విరాట్ సీజన్ తొలి సెంచరీ చేసి చూపించాడని, ఇది తమ ఆరాధ్య ఆటగాడి లెవెల్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. స్లోగా బ్యాటింగ్ చేశాడని కామెంట్లు చూసే ముందు విరాట్ బ్యాటింగ్ చేసే సమయంలో పిచ్ ఎలా ఉందో తెలుసుకోవాలంటూ చురకలు అంటిస్తున్నారు. నిన్నటి మ్యాచ్ జరిగిన పిచ్పై 183 పరుగుల స్కోర్ డిఫెండ్ చేసుకోదగిందే అంటూ మెసేజ్లు చేస్తున్నారు. అయినా ఎంత కాలమని విరాట్ ఒక్కడు ఆర్సీబీ బండిని లాక్కొస్తాడని తమ ఆరాధ్య ఆటగాడిని ఆకాశానికెత్తుతున్నారు. ఈ సీజన్లో అప్పటివరకు ఎవరి వల్ల కాని సెంచరీని చేసి చూపించినా చెత్త కామెంట్లేనా అని మండిపడుతున్నారు. జట్టులోని మిగతా ఆటగాళ్లంతా సహకరిస్తే కోహ్లి వ్యక్తిగతంగా చేసిన స్కోర్తోనే (113) మ్యాచ్లు గెలవొచ్చంటూ ప్రగల్బాలు పలుకుతున్నారు. గిట్టని వారు చెబుతున్నట్లు విరాట్ ఇన్నింగ్స్ మరీ అంత నెమ్మదిగా ఏమీ సాగలేదని.. చెత్త బంతులను ప్రతి సందర్భంలోనూ విరాట్ చీల్చిచెండాడని గుర్తు చేస్తున్నారు. అద్భుతంగా బౌలింగ్ చేసినందుకు అశ్విన్, చహల్లకు, సూపర్ సెంచరీ చేసినందుకు బట్లర్కు క్రెడిట్ ఇవ్వాల్సింది పోయి విరాట్ను టార్గెట్ చేయడం విడ్డూరంగా ఉందని కామెంట్లు చేస్తున్నారు. కాగా, రాజస్థాన్ రాయల్స్తో నిన్న జరిగిన మ్యాచ్లో విరాట్ సెంచరీతో కదంతొక్కినా ఆర్సీబీ 6 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఛేదనలో జోస్ బట్లర్ మెరుపు వేగంతో సెంచరీ (58 బంతుల్లో 100 నాటౌట్; 9 ఫోర్లు, 4 సిక్సర్లు) చేసి రాయల్స్ను గెలిపించాడు. తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ విరాట్ సెంచరీతో చెలరేగడంతో నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది. డుప్లెసిస్ (44) రాణించాడు. విరాట్ తన సెంచరీని 67 బంతుల్లో సాధించాడు. ఐపీఎల్ చరిత్రలో బంతుల పరంగా ఇది స్లోయెస్ట్ సెంచరీగా రికార్డైంది. అశ్విన్ (4-0-28-0), చహల్ (4-0-34-2) కట్టుదిట్టంగా బౌలింగ్ చేయండతో విరాట్ అనుకున్నంత వేగంగా పరుగులు రాబట్టలేకపోయాడు. ఈ విషయాన్ని కోహ్లి సైతం అంగీకరించాడు. అనంతరం 184 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన రాయల్స్.. బట్లర్ సుడిగాలి శతకంతో విరుచుకపడటంతో మరో ఐదు బంతులు మిగిలుండగానే విజయతీరాలకు చేరింది. బట్లర్తో పాటు సంజూ శాంసన్ (42 బంతుల్లో 69; 8 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించాడు. -
అతడి వల్లే ఓడిపోయాం.. అలా చేయకుంటే బాగుండేది!
‘‘తొలి ఇన్నింగ్స్లో వికెట్ పూర్తిగా బ్యాటింగ్కు అనుకూలించలేదు. ఏదేమైనా ఇక్కడ 190 స్కోరు చేస్తే బాగుంటుందని భావించాం. కనీసం ఇంకో 10- 15 పరుగులు చేస్తే ఫలితం బాగుండేది. మిడిల్ ఓవర్లలో ప్రత్యర్థి జట్టు స్పిన్నర్లు అద్బుతంగా బౌలింగ్ చేశారు. టాస్ గెలిసి తొలుత బౌలింగ్ ఎంచుకోవడం కూడా వారికి సానుకూల ఫలితాలను ఇచ్చింది. మ్యాచ్ సాగుతున్నీ కొద్దీ పిచ్ మీద తేమ కారణంగా బ్యాటింగ్ సులువైంది. విరాట్ ఆఖరి వరకు బాగానే ఆడాడు. ఆఖరి ఓవర్లలో కామెరాన్ గ్రీన్ బ్యాట్ ఝలిపిస్తే బాగుండేది. స్పిన్నర్ల బౌలింగ్లో పరుగులు రాబట్టాలని శాయ శక్తులా కృషి చేసినా సాధ్యం కాలేదు. అదే సీమర్ల బౌలింగ్లో హిట్టింగ్ ఆడగలిగాం. ఇక లక్ష్య ఛేదనకు దిగిన ప్రత్యర్థిని తొలి నాలుగు ఓవర్లలో బాగానే కట్టడి చేయగలిగాం. అప్పుడే మ్యాచ్ మలుపు తిరిగింది కానీ ఆరో ఓవర్లో మేము 20కి పైగా పరుగులు సమర్పించుకోవడంతో మ్యాచ్ మలుపు తిరిగింది. ఆ తర్వాత మాపై క్రమంగా ఒత్తిడి పెరిగింది. ఎక్కువగా కుడిచేతి వాటం బ్యాటర్లే ఉన్నారు కాబట్టి మాక్స్వెల్తో బౌలింగ్ చేయించలేదు. ఇద్దరు రైట్ హ్యాండర్లు క్రీజులో ఉన్నపుడు మా లెఫ్టార్మ్ స్పిన్నర్ హిమాన్షు శర్మను బరిలోకి దించాం. వికెట్లు తీసేందుకు మా ప్రయత్నం చేశాం. జైస్వాల్(లెఫ్టాండర్) అవుటైన తర్వాత కూడా మాక్సీతో బౌలింగ్ చేయించాలని అనుకోలేదు. ఇక ఈ మ్యాచ్లో మా ఫీల్డింగ్ అత్యంత సాధారణంగా ఉంది. తదుపరి మ్యాచ్లో తిరిగి పుంజుకోవడానికి ప్రయత్నిస్తాం’’ అని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ అన్నాడు. ఐపీఎల్-2024లో భాగంగా రాజస్తాన్ రాయల్స్ చేతిలో ఓటమి అనంతరం ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు.ఘ ఆ ఓవర్లోనే ఆర్సీబీ కొంప మునిగింది లక్ష్య ఛేదనకు దిగిన రాజస్తాన్ను తొలి నాలుగు ఓవర్లలో కట్టడి చేసినా.. మయాంక్ దాగర్ వేసిన ఆరో ఓవర్ నుంచి మ్యాచ్ స్వరూపం మారిపోయిందని డుప్లెసిస్ పేర్కొన్నాడు. ఆ తర్వాత ఏ దశలోనూ రాజస్తాన్ను ఆపలేకపోయామని.. ఫీల్డింగ్ వైఫల్యాల వల్ల కూడా మూల్యం చెల్లించామని తెలిపాడు. కాగా జైపూర్లో శనివారం నాటి మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్లు నష్టపోయి 183 పరుగులు చేసింది. అయితే, లక్ష్య ఛేదనకు దిగిన రాజస్తాన్ ఆరంభంలోనే యశస్వి జైస్వాల్(0) వికెట్ కోల్పోయినా.. జోస్ బట్లర్(100- నాటౌట్), సంజూ శాంసన్(69) ఇన్నింగ్స్ కారణంగా విజయఢంకా మోగించింది. కేవలం 19.1 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి టార్గెట్ను పూర్తి చేసి ఆరు వికెట్ల తేడాతో గెలిచింది. ఆర్సీబీ బౌలర్లలో రీస్ టోప్లీ రెండు వికెట్లు తీయగా.. మహ్మద్ సిరాజ్, యశ్ దయాల్ ఒక్కో వికెట్ పడగొట్టారు. ఇక రెండు ఓవర్లు బౌలింగ్ చేసిన మయాంక్ దాగర్ ఏకంగా 34 పరుగులు ఇచ్చుకున్నాడు. రాజస్తాన్ ఇన్నింగ్స్లో ఆరో ఓవర్ బౌల్ చేసిన ఈ లెఫ్టార్మ్ ఆర్థోడాక్స్ స్పిన్నర్ ఏకంగా 20 పరుగులు ఇవ్వడం ఆర్సీబీ కొంపముంచింది. ఇక ఈ మ్యాచ్లో ఆర్సీబీ స్టార్ విరాట్ కోహ్లి అజేయ శతకం(113) వృథాగా పోయింది. చదవండి: Virat Kohli: ఇంత స్వార్థమా?.. ఐపీఎల్ చరిత్రలో కోహ్లి చెత్త రికార్డు var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_7522010156.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
RCB: ఫామ్లో ఉన్నా అతడిని ఎందుకు ఆడించలేదు?
రాజస్తాన్ రాయల్స్తో మ్యాచ్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు కూర్పు గురించి టీమిండియా మాజీ ఆల్రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. మహిపాల్ లామ్రోర్కు తుదిజట్టులో చోటు కల్పించకపోవడాన్ని తప్పుబట్టాడు. కాగా ఐపీఎల్-2024లో భాగంగా శనివారం రాజస్తాన్తో తలపడ్డ ఆర్సీబీకి భంగపాటు తప్పలేదు. జైపూర్లో జరిగిన ఈ మ్యాచ్లో ఆరు వికెట్ల తేడాతో ఆర్సీబీ ఓటమి పాలైంది. తద్వారా ఈ సీజన్లో నాలుగో ఓటమి నమోదు చేసింది. స్టార్ ఓపెనర్ విరాట్ కోహ్లి అజేయ శతకం(113)తో వృథాగా పోగా.. జోస్ బట్లర్ సెంచరీ(100- నాటౌట్) రాజస్తాన్ను గెలిపించింది. ఇదిలా ఉంటే ఈ మ్యాచ్ ద్వారా ఆర్సీబీ బ్యాటర్ సౌరవ్ చౌహాన్ ఐపీఎల్లో అడుగుపెట్టాడు. అయితే అరంగేట్రంలో ఈ గుజరాత్ ఆటగాడు ప్రభావం చూపలేకపోయాడు. #ICYMI Local lad and our brilliant leggie, Himanshu 🔁 Saurav#PlayBold #ನಮ್ಮRCB #IPL2024 #RRvRCB pic.twitter.com/05BczWmHJh — Royal Challengers Bengaluru (@RCBTweets) April 6, 2024 సౌరవ్ అరంగేట్రంలో ఇలా నాలుగో స్థానంలో బ్యాటింగ్కు దిగి మొత్తంగా ఆరు బంతులు ఎదుర్కొని కేవలం తొమ్మిది పరుగులు మాత్రమే చేసిన లెఫ్టాండర్ సౌరవ్.. యజువేంద్ర చహల్ బౌలింగ్లో వెనుదిరిగాడు. మరోవైపు.. ఇంపాక్ట్ ప్లేయర్గా నామినేట్ చేసిన మహిపాల్ లామ్రోర్ సేవలను ఉపయోగించుకోలేకపోయింది ఆర్సీబీ. 4⃣ wins in 4⃣ matches for the @rajasthanroyals 🩷 And with that victory, the move to the 🔝 of the Points Table 😎💪 Scorecard ▶️ https://t.co/IqTifedScU#TATAIPL | #RRvRCB pic.twitter.com/cwrUr2vmJN — IndianPremierLeague (@IPL) April 6, 2024 ఫామ్లో ఉన్నా అతడిని ఎందుకు ఆడించలేదు? ఈ విషయంపై స్పందించిన ఇర్ఫాన్ పఠాన్ ఆర్సీబీ వ్యూహాలపై పెదవి విరిచాడు. ‘‘ దేశవాళీ క్రికెట్లో మహిపాల్ లామ్రోర్ ఈ పిచ్పై ఎన్నో మ్యాచ్లు ఆడాడు. కానీ ఈరోజు అతడికి ఆర్సీబీ తుదిజట్టులో చోటు కల్పించలేదు. అతడు ఫామ్లోనే ఉన్నాడు కూడా! అయినా ఇలా ఎందుకు చేశారో తెలియదు. భారత కోచ్లు కూడా ఐపీఎల్ విషయాల్లో కాస్త జోక్యం చేసుకుంటే.. ఇలాంటి ప్రాథమిక తప్పిదాలు జరగవు. ప్రతిభ ఉన్నవాళ్లకు అవకాశాలు సన్నగిల్లుతున్నాయన్న దానికి ఇది కేవలం ఒక్క ఉదాహరణ మాత్రమే’’ అని ఇర్ఫాన్ పఠాన్ ఎక్స్ వేదికగా తన అభిప్రాయం పంచుకున్నాడు. ధనాధన్ ఇన్నింగ్స్ ఆడిన లామ్రోర్ కాగా రాజస్తాన్లోని నాగౌర్కు చెందిన లెఫ్టాండ్ బ్యాటర్ మహిపాల్ లామ్రోర్ ఐపీఎల్లో ఆర్సీబీకి ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఇప్పటి వరకు క్యాష్ రిచ్ లీగ్లో 32 మ్యాచ్లు ఆడిన ఈ బ్యాటింగ్ ఆల్రౌండర్.. 452 పరుగులు చేశాడు. లెఫ్టార్మ్ ఆర్థోడాక్స్ బౌలర్ అయిన అతడు ఒక వికెట్ కూడా తీశాడు. ఇక ఈ సీజన్లో ఇప్పటి వరకు ఆర్సీబీ సాధించిన ఒకే ఒక్క విజయం(పంజాబ్పై)లోనూ లామ్రోర్ కీలక పాత్ర పోషించాడు. పంజాబ్ కింగ్స్తో మ్యాచ్లో కేవలం 8 బంతుల్లోనే 17 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఇక లక్నో సూపర్ జెయింట్స్తో మ్యాచ్లో 13 బంతుల్లోనే 33 రన్స్ చేశాడు. రాజస్తాన్ వర్సెస్ ఆర్సీబీ స్కోర్లు: ►వేదిక: జైపూర్.. సవాయి మాన్సింగ్ స్టేడియం ►టాస్: రాజస్తాన్.. బౌలింగ్ ►ఆర్సీబీ స్కోరు: 183/3 (20) ►రాజస్తాన్ స్కోరు: 189/4 (19.1) ►ఫలితం: ఆరు వికెట్ల తేడాతో ఆర్సీబీపై రాజస్తాన్ గెలుపు ►ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: జోస్ బట్లర్(రాజస్తాన్). చదవండి: Virat Kohli: స్లో ఇన్నింగ్స్ అంటూ సెటైర్లు.. కోహ్లి స్పందన ఇదే -
స్లో ఇన్నింగ్స్ అంటూ సెటైర్లు.. కోహ్లి స్పందన ఇదే
ఐపీఎల్-2024లో సెంచరీ నమోదు చేసిన తొలి క్రికెటర్గా నిలిచాడు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు బ్యాటర్ విరాట్ కోహ్లి. అంతేకాదు క్యాష్ రిచ్ లీగ్ చరిత్రలో 7500 పరుగుల మైలురాయి అందుకున్న తొలి క్రికెటర్గా రికార్డు సృష్టించాడు. రాజస్తాన్ రాయల్స్తో మ్యాచ్ సందర్భంగా శనివారం ఈ ఘనత సాధించాడు. కోహ్లి స్లో ఇన్నింగ్స్ ఇక మ్యాచ్ విషయానికొస్తే.. జైపూర్లోని సవాయి మాన్సింగ్ స్టేడియంలో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగింది ఆర్సీబీ. ఈ క్రమంలో ఓపెనర్ విరాట్ కోహ్లి 113 పరుగులతో ఆఖరి వరకు అజేయంగా నిలవగా.. మరో ఓపెనర్, కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ 44 పరుగులు సాధించాడు. వీరి తర్వాతి స్థానాల్లో బరిలోకి దిగిన గ్లెన్ మాక్స్వెల్(1), సౌరవ్ చౌహాన్(9) పూర్తిగా నిరాశపరిచారు. కామెరాన్ గ్రీన్ ఆరు బంతులు ఎదుర్కొని 5 పరుగులతో నాటౌట్గా ఉన్నాడు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి ఆర్సీబీ 183 రన్స్ స్కోరు చేసింది. లక్ష్య ఛేదనకు దిగిన రాజస్తాన్ 19.1 ఓవర్లలోనే పని పూర్తి చేసి ఆరు వికెట్ల తేడాతో విజయం నమోదు చేసింది. ఇదిలా ఉంటే.. ఆర్సీబీ బ్యాటర్లలో కోహ్లి స్లో ఇన్నింగ్స్ ఫలితాన్ని ప్రభావితం చేసిందంటూ విమర్శలు వస్తున్నాయి. దూకుడుగా ఆడలేకపోయానని తెలుసు ఈ నేపథ్యంలో ఆర్సీబీ ఇన్నింగ్స్ అనంతరం విరాట్ కోహ్లి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ‘‘చూసేందుకు వికెట్ కాస్త ఫ్లాట్గా అనిపించింది. కానీ మ్యాచ్ సాగుతున్న కొద్దీ పిచ్ స్వభావం మారిపోయింది. కాబట్టి మా(విరాట్/డుప్లెసిస్)లో ఒక్కరైనా ఆఖరి వరకు బ్యాటింగ్ చేయాలని భావించాం. ఈ పిచ్పై 183 రన్స్.. మెరుగైన స్కోరే అనిపిస్తోంది. ఇలాగే బ్యాటింగ్ చేయాలని నేనేమీ ముందే ప్రణాళికలు రచించుకోలేదు. నేను దూకుడుగా ఆడలేకపోయానని నాకు తెలుసు. బౌలర్ల వ్యూహాలను అంచనా వేసి అందుకు తగ్గట్లుగా బ్యాటింగ్ చేశాను. పరిస్థితులకు అనుగుణంగా పరిణతితో కూడిన ఇన్నింగ్స్ ఆడటం అవసరమని భావించా. ఈ పిచ్పై అలవోకగా పరుగులు రాబట్టడం బ్యాటర్లకు అంత సులువేమీ కాదు’’ అని విరాట్ కోహ్లి పేర్కొన్నాడు. యజువేంద్ర చహల్, రవిచంద్రన్ అశ్విన్ బౌలింగ్లో హిట్టింగ్ ఆడటం కుదరలేదని తెలిపాడు. కాగా రాజస్తాన్తో మ్యాచ్లో కోహ్లి 67 బంతుల్లో శతకం పూర్తి చేసుకున్నాడు. ఓవరాల్గా ఐపీఎల్ హిస్టరీలోనే ఇది స్లోయెస్ట్ సెంచరీ. ఇక ఇదే మ్యాచ్లో రాజస్తాన్ బ్యాటర్ జోస్ బట్లర్ 58 బంతుల్లోనే 100 పరుగుల మార్కు అందుకుని సిక్సర్తో జట్టును గెలిపించడం విశేషం. చదవండి: IPL 2024: నీకు ‘బడిత పూజ’ తప్పదు.. యువీ ‘ఫైర్’! var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_7522010156.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); Another day, another fifty for Virat Kohli 🫡 👑#RRvRCB #TATAIPL #IPLonJioCinema pic.twitter.com/3OrfdETaqE — JioCinema (@JioCinema) April 6, 2024 -
Virat Kohli: ఇంత స్వార్థమా?.. ఐపీఎల్ చరిత్రలో కోహ్లి చెత్త రికార్డు
మళ్లీ పాత కథే.. ఐపీఎల్-2024లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు మరో పరాజయం. రాజస్తాన్ రాయల్స్తో శనివారం జరిగిన మ్యాచ్లో ఆర్సీబీ ఆరు వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. స్టార్ ఓపెనర్ విరాట్ కోహ్లి అజేయ శతకం(113) బాదినా జట్టును గెలిపించలేకపోయాడు. మరో ఓపెనర్, కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్(44) తప్ప మిగతా బ్యాటర్లు పెద్దగా రాణించకపోవడం.. ‘మిగిలిన వాళ్లకు ఆడే అవకాశం రాకపోవడం’తో నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది ఆర్సీబీ. అయితే, సొంతమైదానంలో లక్ష్య ఛేదనలో ఆరంభంలోనే ఓపెనర్ యశస్వి జైస్వాల్ డకౌట్గా వెనుదిరిగినా రాజస్తాన్ తిరిగి పుంజుకుంది. మరో ఓపెనర్ జోస్ బట్లర్(100 నాటౌట్) సెంచరీతో చెలరేగగా.. కెప్టెన సంజూ శాంసన్ హాఫ్ సెంచరీ(69)తో మెరిశాడు. వీరిద్దరి ఇన్నింగ్స్ కారణంగా మరో ఐదు బంతులు మిగిలి ఉండగానే టార్గెట్ పూర్తి చేసిన రాజస్తాన్ జయభేరి మోగించి వరుసగా నాలుగో గెలుపు అందుకుంది. ఇక ఆర్సీబీ ఖాతాలో మాత్రం నాలుగో ఓటమి చేరింది. 4⃣ wins in 4⃣ matches for the @rajasthanroyals 🩷 And with that victory, the move to the 🔝 of the Points Table 😎💪 Scorecard ▶️ https://t.co/IqTifedScU#TATAIPL | #RRvRCB pic.twitter.com/cwrUr2vmJN — IndianPremierLeague (@IPL) April 6, 2024 అయితే, ఈ మ్యాచ్లో సెంచరీ చేసినా విరాట్ కోహ్లిపై మాత్రం విమర్శల వర్షం కురుస్తోంది. కోహ్లి స్వార్థపూరిత ఇన్నింగ్స్ వల్లే ఆర్సీబీ 183 పరుగులకు పరిమితమైందని.. ఒకరకంగా జట్టు ఓటమికి అతడు కూడా కారణమే అని నెటిజన్లు మండిపడుతున్నారు. కాగా ఈ మ్యాచ్లో కోహ్లి 72 బంతుల్లో 113 పరుగులు సాధించాడు. అతడి ఇన్నింగ్స్లో 12 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి. నిజానికి కోహ్లి వంద పరుగుల మార్కు అందుకోవడానికి 67 బంతులు తీసుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలో.. భారత గడ్డపై సెంచరీ కొట్టడానికి ఇన్ని బంతులు(స్లోయెస్ట్ సెంచరీ) తీసుకున్న తొలి క్రికెటర్గా చెత్త రికార్డు సృష్టించాడు. Another day, another fifty for Virat Kohli 🫡 👑#RRvRCB #TATAIPL #IPLonJioCinema pic.twitter.com/3OrfdETaqE — JioCinema (@JioCinema) April 6, 2024 ఓవరాల్గా మనీశ్ పాండే(2009- సెంచూరియన్)తో కలిసి సంయుక్తంగా ఈ రికార్డును పంచుకున్నాడు. ఈ నేపథ్యంలో కోహ్లిని పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు. అంతేకాదు.. టీ20 క్రికెట్లో కోహ్లి యాభై కంటే ఎక్కువ బంతులు ఎదుర్కొన్న సందర్భాల్లో అతడి జట్టు 96 శాతం మ్యాచ్లు ఓడిపోయిందంటూ గణాంకాలు షేర్ చేస్తున్నారు. "I've still got it, I guess." ❤️#RRvRCB #TATAIPL #IPLonJioCinema #ViratKohli pic.twitter.com/XdO7AmVq5l — JioCinema (@JioCinema) April 6, 2024 అంతేకాదు.. సెల్ఫిష్ అంటూ కోహ్లిని ట్రెండ్ చేస్తున్నారు. రాజస్తాన్ రాయల్స్ సైతం.. ‘‘200 పరుగులకు పైగా స్కోరు సాధ్యమయ్యే చోట 184 కూడా పర్లేదులెండి!’’ అంటూ కోహ్లి ఇన్నింగ్స్పై సెటైర్లు వేసింది. -
IPL 2024 RR Vs RCB : 6 వికెట్లతో బెంగళూరుపై రాయల్స్ ఘనవిజయం (ఫొటోలు)
-
పింక్ జెర్సీతో బరిలోకి దిగిన రాజస్తాన్.. ఎందుకంటే?
ఐపీఎల్-2024లో భాగంగా జైపూర్ వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్లో రాజస్తాన్ రాయల్స్ పింక్ జెర్సీతో బరిలోకి దిగింది. గ్రామీణ మహిళా సాధికారతకు మద్దతు తెలియజేస్తూ ఈ స్పెషల్ జెర్సీని రాజస్తాన్ ఆటగాళ్లు ధరించారు. సవాయ్ మాన్సింగ్ స్టేడియం పింక్ కలర్తో నిండిపోయింది. అదే విధంగా ఈ మ్యాచ్ కోసం అమ్ముడైన ఒక్కో టికెట్టుపై రూ.100ను మహిళల వృద్ధికి ఆ ప్రాంచైజీ విరాళంగా ఇవ్వనుంది. అంతేకాకుండా ఈ మ్యాచ్లో తమ జట్టు కొట్టే ఒక్కో సిక్సర్కు.. రాజస్థాన్లోని ఆరు కుటుంబాలకు సొలార్ పవర్ను ఆ ఫ్రాంచైజీ అందించనుంది. ఇక ఈ మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ గెలిచిన రాజస్తాన్ రాయల్స్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. తుది జట్లు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: విరాట్ కోహ్లీ, ఫాఫ్ డు ప్లెసిస్ (కెప్టెన్), రజత్ పటీదార్, గ్లెన్ మాక్స్వెల్, కామెరాన్ గ్రీన్, దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), సౌరవ్ చౌహాన్, రీస్ టోప్లీ, మయాంక్ దాగర్, మహ్మద్ సిరాజ్, యశ్ దయాల్ రాజస్థాన్ రాయల్స్: యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్, సంజు శాంసన్(కెప్టెన్), రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్, షిమ్రాన్ హెట్మెయర్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, అవేష్ ఖాన్, నాండ్రే బర్గర్, యుజ్వేంద్ర చాహల్ Tonight, we’re walking out to play for the women of Rajasthan… 💗#PinkPromise pic.twitter.com/ZPulqvGBI5 — Rajasthan Royals (@rajasthanroyals) April 6, 2024 -
RR Vs RCB: కోహ్లి ఫాస్టెస్ట్ సెంచరీ అక్కడే.. కానీ!
ఐపీఎల్-2024లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తమ ఐదో మ్యాచ్లో రాజస్తాన్ రాయల్స్తో తలపడనుంది. జైపూర్లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో శనివారం ఇరు జట్ల మధ్య మ్యాచ్ జరుగనుంది. ఇక ఈ సీజన్లో ఇప్పటి వరకు ఆడిన నాలుగు మ్యాచ్లలో ఆర్సీబీ కేవలం ఒకటి మాత్రమే గెలిచింది. ఫలితంగా రెండు పాయింట్లతో పట్టికలో ఎనిమిదో స్థానంలో ఉంది. మరోవైపు.. రాజస్తాన్ రాయల్స్ హ్యాట్రిక్ విజయాలతో జోరు మీదుంది. ఆడిన మూడు మ్యాచ్లలో మూడూ గెలిచి ఆరు పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతోంది. అయితే, ఇరుజట్ల మధ్య ముఖాముఖి పోరులో ఆర్సీబీదే పైచేయి. ఆర్సీబీదే పైచేయి.. కానీ ఇప్పటి వరకు రాజస్తాన్తో ఆడిన 30 మ్యాచ్లలో బెంగళూరు 15సార్లు గెలిచి.. 12 సార్లు ఓటమిపాలైంది. మూడు మ్యాచ్లలో ఫలితం తేలలేదు. ఓవరాల్గా రాయల్స్పై ఆర్సీబీదే పైచేయి అయినప్పటికీ రాజస్తాన్తో మ్యాచ్ అంటే ఆర్సీబీ స్టార్ విరాట్ కోహ్లి అభిమానులు వణికిపోతున్నారు. ఇప్పటి వరకు జైపూర్ స్టేడియంలో కోహ్లికి ఉన్న పేలవ రికార్డే(ఐపీఎల్లో) ఇందుకు కారణం. అంతర్జాతీయ మ్యాచ్లలో కోహ్లి ఇక్కడ హీరోనే. ఇప్పటి వరకు మూడు మ్యాచ్లు ఆడి 195 పరుగులతో అదరగొట్టాడు. ఇందులో ఓ సెంచరీ, ఓ హాఫ్ సెంచరీ ఉన్నాయి. కోహ్లి ఫాస్టెస్ట్ సెంచరీ ఇక్కడే.. ఐపీఎల్లో మాత్రం వరస్ట్ ఆస్ట్రేలియాతో మ్యాచ్ సందర్భంగా 2013లో ఇక్కడ వన్డే ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేశాడు కోహ్లి. కేవలం 52 బంతుల్లోనే వంద పరుగులు పూర్తి చేసుకున్నాడు. కానీ.. ఐపీఎల్లో మాత్రం ఒక్కసారి కూడా కనీసం యాభై పరుగుల మార్కు అందుకోలేకపోయాడు. సవాయి మాన్సింగ్ స్టేడియంలో మొత్తం ఎనిమిది మ్యాచ్లు ఆడి కోహ్లి సాధించిన పరుగులు కేవలం 149. అత్యధిక స్కోరు 39 నాటౌట్. ఐపీఎల్లో కోహ్లి వరస్ట్ యావరేజ్ కూడా ఇక్కడే. సందీప్ శర్మ బౌలింగ్లో ఏడుసార్లు ఇక ఆఖరిగా రాజస్తాన్ రాయల్స్తో ఇక్కడ ఆడిన మ్యాచ్లో కోహ్లి 19 బంతులు ఎదుర్కొని 18 పరుగులు మాత్రమే చేయగలిగాడు. కాగా రాజస్తాన్ పేసర్ సందీప్ శర్మ ఐపీఎల్లో కోహ్లిపై ఆధిపత్యం కొనసాగిస్తున్నాడు. ఇప్పటి వరకు అతడి బౌలింగ్లో కోహ్లి 67 బంతులు ఎదుర్కొని కేవలం 87 రన్స్ చేశాడు. ఏడుసార్లు అతడి బౌలింగ్లో అవుటయ్యాడు కూడా! ఇక ఈ సీజన్ ఆరంభం నుంచి కోహ్లి ఒక్కడే ఆర్సీబీ టాపార్డర్లో రాణిస్తున్నాడు. ఇక్కడ గనుక గత సెంటిమెంట్ రిపీట్ చేస్తూ త్వరగానే పెవిలియన్ చేరితే అంతే సంగతులు!! రాజస్తాన్ రాయల్స్ వర్సెస్ ఆర్సీబీ తుదిజట్ల అంచనా రాజస్తాన్ జోస్ బట్లర్, యశస్వి జైస్వాల్, సంజూ శాంసన్ (కెప్టెన్/ వికెట్ కీపర్), రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్, షిమ్రాన్ హెట్మైర్, రవిచంద్రన్ అశ్విన్, యజువేంద్ర చహల్, సందీప్ శర్మ(గాయం నుంచి కోలుకుని తిరిగి వచ్చే ఛాన్స్)/నండ్రీ బర్గర్, ఆవేశ్ ఖాన్, ట్రెంట్ బౌల్ట్. [ఇంపాక్ట్ ప్లేయర్ - శుభమ్ దూబే]. ఆర్సీబీ విరాట్ కోహ్లి, ఫాఫ్ డుప్లెసిస్ (కెప్టెన్), రజత్ పాటిదార్, గ్లెన్ మాక్స్వెల్, కామెరూన్ గ్రీన్, అనుజ్ రావత్ (వికెట్ కీపర్), దినేశ్ కార్తీక్, మయాంక్ దాగర్, రీస్ టాప్లీ, మహ్మద్ సిరాజ్, యశ్ దయాల్. [ఇంపాక్ట్ ప్లేయర్ - మహిపాల్ లోమ్రోర్]. చదవండి: జడ్డూ అవుట్ కావాలి కదా? కమిన్స్ ఎందుకు వదిలేశాడు? వీడియో వైరల్ var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_7552012696.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
ఆర్సీబీ వరుస వైఫల్యాలపై ఏబీడీ కామెంట్స్.. కోహ్లి గనుక
ఐపీఎల్-2024లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ప్రదర్శనపై ఆ జట్టు మాజీ ఆటగాడు, సౌతాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్ స్పందించాడు. తాజా ఎడిషన్ను ఆర్సీబీ మరీ చెత్తగా ఏమీ ఆరంభించలేదని.. అలా అని అంతగొప్పగా ఏమీ రాణించడం లేదని పేర్కొన్నాడు. కాగా ఐపీఎల్ పదిహేడో సీజన్ ఆరంభ మ్యాచ్లో ఆర్సీబీ- డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్తో తలపడింది. చెపాక్లో జరిగిన ఆ మ్యాచ్లో ఆరు వికెట్ల తేడాతో ఓడిపోయింది. అనంతరం.. సొంతమైదానం చిన్నస్వామి స్టేడియంలో పంజాబ్ కింగ్స్పై గెలిచి సత్తా చాటింది. కానీ.. ఆ తదుపరి వరుసగా కోల్కతా నైట్ రైడర్స్, లక్నో సూపర్ జెయింట్స్ చేతిలో చిత్తుగా ఓడి విమర్శల పాలైంది. ఓపెనర్ విరాట్ కోహ్లి తప్ప ఇతర ప్రధాన బ్యాటర్లు ఎవరూ పెద్దగా రాణించకపోవడం వల్ల వరుస ఓటములు మూటగట్టుకుంది. ఈ నేపథ్యంలో ఏబీ డివిలియర్స్ ఆర్సీబీ ఆట తీరుపై యూట్యూబ్ వేదికగా తన అభిప్రాయాలు పంచుకున్నాడు. ‘‘ఆర్సీబీ ప్రదర్శన మరీ చెత్తగానూ.. అంత గొప్పగానూ లేదు. కనీసం ఇంకో రెండు మ్యాచ్లలో గెలిస్తేనే వాళ్లు తిరిగి పుంజుకోగలరు. రేసులో ముందుకు వెళ్లగలరు. విరాట్కు ఈ సీజన్లో శుభారంభమే లభించింది. అతడు ఇదే జోరును కొనసాగించాలని కోరుకుంటున్నాను. మిడిల్ ఓవర్లలో అతడి అవసరం ఆర్సీబీకి ఎంతగానో ఉంది. మొదటి ఆరు ఓవర్లలో అతడు దంచికొడుతుంటే చూడటం బాగుటుంది. ఫాఫ్ కూడా కాస్త రిస్క్ తీసుకోవాల్సిందే. ఏదేమైనా విరాట్ 6- 15 ఓవర్ల వరకు క్రీజులో ఉంటేనే ఆర్సీబీ అనుకున్న లక్ష్యాలను సాధించగలదు’’ అని ఏబీ డివిలియర్స్ అభిప్రాయపడ్డాడు. కాగా ఆర్సీబీ ‘స్టార్’ బ్యాటర్లు కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్, గ్లెన్ మాక్స్వెల్, కామెరాన్ గ్రీన్, రజత్ పాటిదార్ ఇంత వరకు బ్యాట్ ఝులిపించలేకపోయారు. ఇక తదుపరి బెంగళూరు జట్టు శనివారం రాజస్తాన్ రాయల్స్తో తలపడనుంది. జైపూర్ వేదికగా ఏప్రిల్ 6న ఈ మ్యాచ్ జరుగనుంది. చదవండి: IPL 2024: వాళ్లకు రిషభ్ పంత్ స్ట్రాంగ్ వార్నింగ్.. ఇకపై 📸: 𝙃𝙤𝙡𝙙 𝙩𝙝𝙖𝙩 𝙥𝙤𝙨𝙚 👑 #RCBvLSG #TATAIPL #IPLonJioCinema pic.twitter.com/UW5tZft1lQ — JioCinema (@JioCinema) April 2, 2024 -
IPL: చరిత్ర సృష్టించిన కోహ్లి.. ‘సెంచరీ’ కొట్టిన ఒకే ఒక్కడు!
IPL 2024- RCB Vs LSG: రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) స్టార్ విరాట్ కోహ్లి సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఒకే వేదికపై వంద టీ20 మ్యాచ్లు ఆడిన భారత తొలి క్రికెటర్గా రికార్డులకెక్కాడు. కాగా ఐపీఎల్-2024లో భాగంగా ఆర్సీబీ మంగళవారం లక్నో సూపర్ జెయింట్స్తో తలపడింది.బెంగళూరులోని ఎం.చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఆర్సీబీ తొలుత బౌలింగ్ చేసింది. ఈ క్రమంలో బ్యాటింగ్కు దిగిన లక్నో క్వింటన్ డికాక్(56 బంతుల్లో 81), నికోలస్ పూరన్(21 బంతుల్లో 40- నాటౌట్) అద్భుత ఇన్నింగ్స్ కారణంగా నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్లు నష్టపోయి 181 పరుగులు చేసింది.ఇక లక్ష్య ఛేదనకు దిగిన ఆర్సీబీ ఆరంభంలో కాస్త పర్వాలేదనిపించినా.. ఆ తర్వాత వరుసగా వికెట్లు కోల్పోయింది. ఓపెనర్లు విరాట్ కోహ్లి(16 బంతుల్లో 22), ఫాఫ్ డుప్లెసిస్(19), రజత్ పాటిదార్(29) కాసేపు క్రీజులో నిలబడ్డారు. కానీ లక్నో యంగ్ పేసర్ మయాంక్ యాదవ్ ధాటికి గ్లెన్ మాక్స్వెల్ డకౌట్ కాగా.. కామెరాన్ గ్రీన్ 9 పరుగులకే నిష్క్రమించాడు.📸: 𝙃𝙤𝙡𝙙 𝙩𝙝𝙖𝙩 𝙥𝙤𝙨𝙚 👑 #RCBvLSG #TATAIPL #IPLonJioCinema pic.twitter.com/UW5tZft1lQ— JioCinema (@JioCinema) April 2, 2024వికెట్ కీపర్ అనూజ్ రావత్(11) క్రీజులో పాతుకుపోయేందుకు ప్రయత్నించినా లాభం లేకపోయింది. మహిపాల్ లామ్రోర్ (13 బంతుల్లో 33) కాసేపు మెరుపులు మెరిపించినా ఆర్సీబీ లక్ష్యానికి చేరువకాలేకపోయింది. ఫలితంగా 28 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.A win at home followed by a win away from home for the Lucknow Super Giants! 👏👏They move to number 4⃣ on the Points Table!Scorecard ▶️ https://t.co/ZZ42YW8tPz#TATAIPL | #RCBvLSG pic.twitter.com/uc8rWveRim— IndianPremierLeague (@IPL) April 2, 2024ఇక మ్యాచ్ ఫలితం ఎలా ఉన్నా.. ఆర్సీబీ స్టార్ విరాట్ కోహ్లి మాత్రం అరుదైన ఘనత తన ఖాతాలో వేసుకున్నాడు. ఒకే వేదికపై వంద టీ20లు ఆడిన మొట్టమొదటి భారత క్రికెటర్గా నిలిచాడు. చిన్నస్వామి స్టేడియంలో లక్నోతో ఆడిన మ్యాచ్ ద్వారా కోహ్లి ఇక్కడ అలా సెంచరీ కొట్టాడన్న మాట!ఒకే వేదికపై అత్యధిక టీ20లు ఆడిన భారత క్రికెటర్లు1. విరాట్ కోహ్లి- ఎం.చిన్నస్వామి స్టేడియం- బెంగళూరు- 1002. రోహిత్ శర్మ- వాంఖడే స్టేడియం- ముంబై- 803. మహేంద్ర సింగ్ ధోని- ఎంఏ చిదంబరం స్టేడియం(చెపాక్)- చెన్నై.చదవండి: WC 2019: పెద్ద పొరపాటు చేశాం.. అలా ఇంగ్లండ్ వరల్డ్కప్ గెలిచింది! -
రూ.11 కోట్లు టైమ్కి తీసుకుంటాడు.. చెత్తగా ఆడతాడు!
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఆల్రౌండర్ గ్లెన్ మాక్స్వెల్ ఆట తీరుపై టీమిండియా మాజీ క్రికెటర్ మనోజ్ తివారి విమర్శలు గుప్పించాడు. అతడు జట్టుకు ఏమాత్రం ఉపయోగపడటం లేదని పేర్కొన్నాడు. అంచనాలకు తగ్గట్లు ఒక్కసారి కూడా రాణించడం లేదని.. కోట్లకు కోట్లు మాత్రం తీసుకుంటాడని ఘాటు వ్యాఖ్యలు చేశాడు. కాగా ఐపీఎల్-2024లో లక్నో సూపర్ జెయింట్స్తో మంగళవారం జరిగిన మ్యాచ్లో ఆర్సీబీ ఓడిపోయిన విషయం తెలిసిందే. సొంతమైదానం చిన్నస్వామి స్టేడియంలో 28 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. ఈ మ్యాచ్లో స్పిన్ ఆల్రౌండర్ మాక్సీ నాలుగు ఓవర్ల కోటాలో 23 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు తీశాడు. లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్(20), ఆల్రౌండర్ మార్కస్ స్టొయినిస్(24) రూపంలో కీలక వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. కానీ.. బ్యాటింగ్లో మాత్రం పూర్తిగా తేలిపోయాడు. లక్నో విధించిన లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో టాపార్డర్ విఫలం కాగా.. బాధ్యత తీసుకోవాల్సిన నాలుగో నంబర్ బ్యాటర్ మాక్సీ చేతులెత్తేశాడు. 4 overs, 14 runs, 3 wickets, 24 laser beams 🔥⚡pic.twitter.com/pw5NOSbdpM — Lucknow Super Giants (@LucknowIPL) April 2, 2024 లక్నో యువ పేస్ సంచలనం మయాంక్ యాదవ్ బౌలింగ్లో డకౌట్గా వెనుదిరిగాడు. ఆ తర్వాత మహిపాల్ లామ్రోర్(13 బంతుల్లో 33) కాసేపు పోరాడినా ఆర్సీబీని ఓటమి నుంచి తప్పించలేకపోయాడు. ఈ నేపథ్యంలో మనోజ్ తివారి క్రిక్బజ్ షోలో మాక్స్వెల్ గురించి మాట్లాడాడు. ఇలా వస్తాడు.. అలా వెళ్లిపోతాడు ‘‘ఆర్సీబీ గ్లెన్ మాక్స్వెల్ను రిటైన్ చేసుకుంది. సరైన సమయానికి జీతం తీసుకుంటాడు. కానీ అదే స్థాయిలో ఆట మాత్రం ఆడలేకపోతున్నాడు. ఇలా వస్తాడు.. అలా వెళ్లిపోతాడు అన్నట్లుగా ఉంది అతడి పరిస్థితి. ఆటగాడిగా అతడికి అన్ని రకాల నైపుణ్యాలు ఉన్నాయి. కానీ వాటిని ఎక్కడ ప్రదర్శిస్తున్నాడు? ఐపీఎల్లో అతడి ట్రాక్ రికార్డు చూసినట్లయితే,, పంజాబ్ ఫ్రాంఛైజీకి ఆడినపుడు కూడా ఇలాగే ఉండేవాడు. మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శన చేస్తాడని ఆశిస్తే తుస్సుమనిపించేవాడు. అతడి ఆటలో నిలకడలేదు. ఇప్పటికైనా లోపాలు సరిచేసుకుంటే మంచిది’’ అని మాజీ బ్యాటర్ మనోజ్ తివారి అభిప్రాయపడ్డాడు. కాగా ఐపీఎల్-2024 కోసం ఆర్సీబీ రూ. 11 కోట్లకు మాక్సీని రిటైన్ చేసుకుంది. ఆర్సీబీ తరఫున గత సీజన్లో 14 మ్యాచ్లు ఆడి 400 పరుగులు చేశాడు. కేవలం మూడు వికెట్లు మాత్రమే తీయగలిగాడు. అతడికి ఏకంగా 17 కోట్లు ఇదిలా ఉంటే.. ముంబై ఇండియన్స్ నుంచి భారీ ధర(రూ. 17.5 కోట్లు)కు ట్రేడ్ చేసుకున్న కామెరాన్ గ్రీన్ కూడా ఆర్సీబీకి పెద్దగా ఉపయోగపడటం లేదని మనోజ్ తివారి పేర్కొన్నాడు. ఏదేమైనా.. సౌతాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్ జట్టుతో లేనిలోటు ఆర్సీబీలో స్పష్టంగా కనిపిస్తోందన్నాడు. ఆర్సీబీ వర్సెస్ లక్నో స్కోర్లు: టాస్: ఆర్సీబీ.. బౌలింగ్ లక్నో స్కోరు: 181/5 (20) ఆర్సీబీ స్కోరు: 153 (19.4) ఫలితం: 28 పరుగుల తేడాతో ఆర్సీబీపై లక్నో గెలుపు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: మయాంక్ యాదవ్(లక్నో- 3/14). చదవండి: MI: పాండ్యా ఒక్కడిని అలా వదిలేశారు.. అంతటికీ కారణం పెద్ద తలకాయలే! var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_7522010156.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
IPL 2024: తొలి ఫాస్ట్ బౌలర్గా మయాంక్ సంచలన రికార్డు
మయాంక్ యాదవ్.. 21 ఏళ్ల ఈ లక్నో సూపర్ జెయింట్స్ ఐపీఎల్లోకి ఓ బుల్లెట్లా దూసుకువచ్చాడు. అరంగేట్రంలోనే తన స్పీడ్ పవర్తో సత్తా చాటిన ఈ యువ ఫాస్ట్ బౌలర్.. రెండో మ్యాచ్లోనూ ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. తన పేస్ పదునుతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు బ్యాటర్లకు చెమటలు పట్టించిన మయాంక్.. లక్నోను విజేతగా నిలపడంలో కీలక పాత్ర పోషించాడు. అద్భుతమైన స్పెల్(3/14)తో ఆర్సీబీ బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించాడు ఈ యంగ్ స్పీడ్ గన్. First the catch and now an excellent direct-hit! 🎯#RCB lose both their openers courtesy of DDP 👏👏 Head to @JioCinema and @StarSportsIndia to watch the match LIVE#TATAIPL | #RCBvLSG | @devdpd07 pic.twitter.com/oXoYWi5PC8 — IndianPremierLeague (@IPL) April 2, 2024 తద్వారా వరుసగా రెండోసారి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు’ అందుకున్నాడు మయాంక్ యాదవ్. ఇక ఆర్సీబీతో మ్యాచ్ సందర్భంగా మ్యాచ్ సందర్భంగా ఈ రైటార్మ్ పేసర్ సంచలన డెలివరీతో మెరిశాడు. బెంగళూరు ఇన్నింగ్స్లో ఎనిమిదో ఓవర్ వేసిన మయాంక్.. రెండో బంతిని గంటకు 156.7 కిలో మీటర్ల వేగంతో సంధించాడు. 𝙎𝙃𝙀𝙀𝙍 𝙋𝘼𝘾𝙀! 🔥🔥 Mayank Yadav with an absolute ripper to dismiss Cameron Green 👏 Head to @JioCinema and @StarSportsIndia to watch the match LIVE#TATAIPL | #RCBvLSG pic.twitter.com/sMDrfmlZim — IndianPremierLeague (@IPL) April 2, 2024 క్యాష్ రిచ్ లీగ్ పదిహేడో ఎడిషన్లోనే అది ఫాస్టెస్ట్ డెలివరీ కావడం విశేషం. ఇక పదో ఓవర్ వేసిన మయాంక్ బౌలింగ్లో రెండో బాల్ స్పీడ్ కూడా 155.3KMPHగా నమోదైంది. ఇదిలా ఉంటే.. పంజాబ్ కింగ్స్తో మ్యాచ్ సందర్భంగా క్యాష్ రిచ్ లీగ్లో అడుగుపెట్టిన మయాంక్.. ఆ మ్యాచ్లో 155.8 KMPH వేగంతో బంతిని విసిరిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మయాంక్ యాదవ్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్లో మూడుసార్లు 155 KMPH స్పీడ్తో బౌలింగ్ చేసిన తొలి బౌలర్గా రికార్డులకెక్కాడు. ఇప్పటి వరకు మొత్తంగా 48 బంతులు మాత్రమే వేసి ఈ ఘనత సాధించడం విశేషం. ఇక కశ్మీర్ ఎక్స్ప్రెస్, సన్రైజర్స్ హైదరాబాద్ పేసర్ ఉమ్రాన్ మాలిక్, ఢిల్లీ క్యాపిటల్స్ ఫాస్ట్ బౌలర్ అన్రిచ్ నోర్జే రెండుసార్లు గంటకు 155 కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగంతో బౌలింగ్ చేశారు. ఇక ఓవరాల్గా ఐపీఎల్ ఫాస్టెస్ట్ డెలివరీల విషయానికి వస్తే.. మయాంక్ యాదవ్ నాలుగో స్థానంలో ఉన్నాడు. ఐపీఎల్-2011లో షాన్ టైట్ 157.7 KMPH వేగంతో బౌలింగ్ చేసి అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఐపీఎల్లో గంటకు 155 కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగంతో బౌలింగ్ చేసిన టాప్-5 బౌలర్లు 1. షాన్ టైట్- 157.7 KMPH 2. లాకీ ఫెర్గూసన్- 157.3 KMPH 3. ఉమ్రాన్ మాలిక్- 157 KMPH 4. మయాంక్ యాదవ్- 156.7 KMPH 5. అన్రిచ్ నోర్జే- 156.2 KMPH. 4 overs, 14 runs, 3 wickets, 24 laser beams 🔥⚡pic.twitter.com/pw5NOSbdpM — Lucknow Super Giants (@LucknowIPL) April 2, 2024 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_7522010156.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
IPL: చరిత్ర సృష్టించిన కోహ్లి.. ‘సెంచరీ’ కొట్టిన ఒకే ఒక్కడు!
IPL 2024- RCB Vs LSG: రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) స్టార్ విరాట్ కోహ్లి సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఒకే వేదికపై వంద టీ20 మ్యాచ్లు ఆడిన భారత తొలి క్రికెటర్గా రికార్డులకెక్కాడు. కాగా ఐపీఎల్-2024లో భాగంగా ఆర్సీబీ మంగళవారం లక్నో సూపర్ జెయింట్స్తో తలపడింది. బెంగళూరులోని ఎం.చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఆర్సీబీ తొలుత బౌలింగ్ చేసింది. ఈ క్రమంలో బ్యాటింగ్కు దిగిన లక్నో క్వింటన్ డికాక్(56 బంతుల్లో 81), నికోలస్ పూరన్(21 బంతుల్లో 40- నాటౌట్) అద్భుత ఇన్నింగ్స్ కారణంగా నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్లు నష్టపోయి 181 పరుగులు చేసింది. ఇక లక్ష్య ఛేదనకు దిగిన ఆర్సీబీ ఆరంభంలో కాస్త పర్వాలేదనిపించినా.. ఆ తర్వాత వరుసగా వికెట్లు కోల్పోయింది. ఓపెనర్లు విరాట్ కోహ్లి(16 బంతుల్లో 22), ఫాఫ్ డుప్లెసిస్(19), రజత్ పాటిదార్(29) కాసేపు క్రీజులో నిలబడ్డారు. కానీ లక్నో యంగ్ పేసర్ మయాంక్ యాదవ్ ధాటికి గ్లెన్ మాక్స్వెల్ డకౌట్ కాగా.. కామెరాన్ గ్రీన్ 9 పరుగులకే నిష్క్రమించాడు. 📸: 𝙃𝙤𝙡𝙙 𝙩𝙝𝙖𝙩 𝙥𝙤𝙨𝙚 👑 #RCBvLSG #TATAIPL #IPLonJioCinema pic.twitter.com/UW5tZft1lQ — JioCinema (@JioCinema) April 2, 2024 వికెట్ కీపర్ అనూజ్ రావత్(11) క్రీజులో పాతుకుపోయేందుకు ప్రయత్నించినా లాభం లేకపోయింది. మహిపాల్ లామ్రోర్ (13 బంతుల్లో 33) కాసేపు మెరుపులు మెరిపించినా ఆర్సీబీ లక్ష్యానికి చేరువకాలేకపోయింది. ఫలితంగా 28 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. A win at home followed by a win away from home for the Lucknow Super Giants! 👏👏 They move to number 4⃣ on the Points Table! Scorecard ▶️ https://t.co/ZZ42YW8tPz#TATAIPL | #RCBvLSG pic.twitter.com/uc8rWveRim — IndianPremierLeague (@IPL) April 2, 2024 ఇక మ్యాచ్ ఫలితం ఎలా ఉన్నా.. ఆర్సీబీ స్టార్ విరాట్ కోహ్లి మాత్రం అరుదైన ఘనత తన ఖాతాలో వేసుకున్నాడు. ఒకే వేదికపై వంద టీ20లు ఆడిన మొట్టమొదటి భారత క్రికెటర్గా నిలిచాడు. చిన్నస్వామి స్టేడియంలో లక్నోతో ఆడిన మ్యాచ్ ద్వారా కోహ్లి ఇక్కడ అలా సెంచరీ కొట్టాడన్న మాట! ఒకే వేదికపై అత్యధిక టీ20లు ఆడిన భారత క్రికెటర్లు 1. విరాట్ కోహ్లి- ఎం.చిన్నస్వామి స్టేడియం- బెంగళూరు- 100 2. రోహిత్ శర్మ- వాంఖడే స్టేడియం- ముంబై- 80 3. మహేంద్ర సింగ్ ధోని- ఎంఏ చిదంబరం స్టేడియం(చెపాక్)- చెన్నై. చదవండి: WC 2019: పెద్ద పొరపాటు చేశాం.. అలా ఇంగ్లండ్ వరల్డ్కప్ గెలిచింది! var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4381453179.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
హడలెత్తించిన లక్నో పేస్ బౌలర్..సూపర్ జెయింట్స్ రెండో విజయం (ఫొటోలు)
-
బెంగుళూరుకు మరో షాక్
-
IPL 2024: ఏదైనా ఆర్సీబీకి మాత్రమే సాధ్యం..!
ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ఉన్న వైవిధ్యం ఏ ఫ్రాంచైజీకి ఉండదు. విషయం ఏదైనా సరే ఈ ఫ్రాంచైజీ చాలా డిఫరెంట్గా ఉంటుంది. 16 సీజన్లలో ఒక్కసారి కూడా టైటిల్ గెలవలేకపోయినా ఈ జట్టుపై అభిమానుల్లో విపరీతమైన అంచనాలు ఉంటాయి. ఏ యేటికి ఆ యేడు ఆర్సీబీ క్రేజ్ పెరుగుతుందే తప్ప తరగదు. ఈ జట్టు అభిమానులు తమ ఆటగాళ్లపై ఎట్టి పరిస్థితుల్లో నమ్మకాన్ని కోల్పోరు. ప్రదర్శన పరంగా ఎంతటి హీన స్థితిలో ఉన్నా ఆర్సీబీ అభిమానులు "ఈ సాలా కప్ నమదే" అంటూ బీరాలు పలుకుతుంటారు. రికార్డులు నెలకొల్పాలన్నా వీరే.. చెత్త రికార్డులు మూటగట్టుకోవాలన్నా వీరే. ట్రెండ్ సెట్ చేయాలన్నా వీరే.. అదే ట్రెండ్ను బ్రేక్ చేయాలన్నా వీరే. గణాంకాలు, గత రికార్డులు పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతుంది. తాజాగా జరిగిన ఓ ఘటన ఆర్సీబీ ఎంత వైవిధ్యమైన జట్టో మరోసారి రుజువు చేస్తుంది. ప్రస్తుత సీజన్లో ఇప్పటివరకు జరిగిన 11 మ్యాచ్ల్లో పదింట సొంత మైదానాల్లో ఆడిన జట్లే విజేతలుగా నిలిచాయి. ఒక్క ఆర్సీబీ మాత్రమే తమ సొంత మైదానంలో మ్యాచ్ను కోల్పోయి హోం గ్రౌండ్ సెంటిమెంట్ను బ్రేక్ చేసింది. శుక్రవారం (మార్చి 29) బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో కేకేఆర్తో జరిగిన మ్యాచ్లో ఆర్సీబీ ఓటమిపాలైంది. పది మ్యాచ్లుగా నడస్తున్న సెంటిమెంట్ను ఆర్సీబీ బ్రేక్ చేసింది. ఆర్సీబీ అన్ని జట్లలా కాదని అని నిరూపించడానికి ఇలాంటి ఉదాహరణలు చాలా ఉన్నాయి. ఇదిలా ఉంటే, ఐపీఎల్లో ఆదివారం (మార్చి 31) డబుల్ హెడర్ మ్యాచ్లు జరుగనున్నాయి. మధ్యాహ్నం జరిగే మ్యాచ్లో గుజరాత్ తమ సొంత మైదానంలో సన్రైజర్స్ను ఎదుర్కోనుండగా.. రాత్రి మ్యాచ్లో ఢిల్లీ, సీఎస్కే జట్లు తలడనున్నాయి. ఆర్సీబీ తమ తదుపరి మ్యాచ్ను ఏప్రిల్ 2న ఆడనుంది. సొంత మైదానంలో జరిగే ఆ మ్యాచ్లో ఆర్సీబీ.. లక్నో సూపర్ జెయింట్స్ను ఢీకొంటుంది. -
#RCB: ఇదేందయ్యా.. ఆ పందొమ్మిది పేర్లు పచ్చబొట్టుగా!
అభిమానులందు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు అభిమానులు వేరు అని మరోసారి నిరూపించాడు ఓ యువకుడు. మాట నిలబెట్టుకుంటూ ఏకంగా పందొమ్మిది పేర్లను చేతిపై పచ్చబొట్టు పొడిపించుకున్నాడు. ఇంతకీ ఆ పేర్లు ఎవరివంటే?!.. 2008లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ మొదలైన నాటి నుంచి ఇప్పటిదాకా ఆర్సీబీ ఒక్కసారి కూడా టైటిల్ గెలవలేదు. ‘ఈసారి కప్ మనకే’ అని ఆశలు పెట్టుకోవడం.. ఆఖరి దాకా ఎదురుచూసి ఉసూరుమనడం.. పదహారేళ్లుగా ఆర్సీబీ ఫ్యాన్స్కు అలవాటైపోయింది. మధ్యలో మూడుసార్లు ఫైనల్ వరకు చేరినా ఆఖరి మెట్టుపై బోల్తా పడటంతో నెక్ట్స్ టైమ్ బెటర్ లక్ అనుకోవడం తప్ప ఇంకేమీ చేయలేకపోయారు. విరాట్ కోహ్లి వంటి స్టార్, రన్మెషీన్లో జట్టులో ఉన్నా ఆర్సీబీ టైటిల్ గండం దాటకపోవడంతో ఒకరకంగా పూర్తి నిరాశలో కూరుకుపోయారు. అలాంటి అభిమానులకు కొత్త ఊపిరిలూదుతూ మహిళా జట్టు తొలిసారి ఆర్సీబీకి ట్రోఫీ అందించింది. వుమెన్ ప్రీమియర్ లీగ్ రెండో ఎడిషన్-2024లో చాంపియన్గా అవతరించి బెంగళూరు ఫ్రాంఛైజీకి మొదటి టైటిల్ అందించింది. స్మృతి మంధాన సారథ్యంలోని ఆర్సీబీ వుమెన్ టీమ్ ఈ ఘనత సాధించింది. ఈ క్రమంలో ఓ అభిమాని టైటిల్ సాధించిన ఆ జట్టులోని ప్లేయర్ల అందరి పేర్లు పచ్చబొట్టు వేయించుకున్నాడు. ఇందులో తాజా ఎడిషన్కు దూరమైన హీథర్ నైట్ పేరు కూడా ఉండటం విశేషం. ఈ మేరకు.. ‘‘మూడుసార్లు ఐపీఎల్ ఫైనల్ చేరినా మెన్స్ టీమ్ టైటిల్ సాధించలేకపోయింది. అయితే, పదహారేళ్ల మా కలను ఆర్సీబీ మహిళా జట్టు నెరవేర్చింది. ఒకవేళ WPL 2024 గెలిస్తే వాళ్ల పేర్లను టాటూ వేయించుకుంటానని నేను ప్రామిస్ చేశా. ఈరోజు ఆ మాట నిలబెట్టుకున్నా’’ అంటూ మనోజ్ నాయక్ అనే ట్విటర్ యూజర్ అకౌంట్లో ఓ వీడియో ప్రత్యక్షమైంది. ఇందులో ఆర్సీబీ జెర్సీ వేసుకున్న వ్యక్తి.. స్మృతి మంధాన సహా జట్టులోని మొత్తం పందొమ్మిది పేర్లను పచ్చబొట్టు వేయించుకున్నాడు. మరి వాళ్ల పేర్లు ఏమిటంటే.. స్మృతి మంధాన, సోఫీ డివైన్, ఎలిస్ పెర్రీ, రేణుకా సింగ్, రిచా ఘోష్, దిశా కసత్, శ్రేయాంక పాటిల్, ఇంద్రాణి రాయ్, ఆశా శోభన, ఏక్తా బిస్త్, సబ్బినేని మేఘన, జార్జియా వరేహం, శుభా సతీశ్, కేట్ క్రాస్, నదినె డి క్లర్క్, సోఫీ మొలినెక్స్, సిమ్రన్ బహదూర్, శ్రద్ధా పొఖార్కర్, హీథర్ నైట్(తాజా ఎడిషన్కు దూరం). ఇదిలా ఉంటే.. ఐపీఎల్-2024లో ఆర్సీబీకి శుభారంభం లభించలేదు. ఆరంభ మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో ఓడిన బెంగళూరు.. తర్వాత పంజాబ్ కింగ్స్పై గెలిచింది. కానీ మూడో మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ను ఎదుర్కొన్న ఫాఫ్ డుప్లెసిస్ బృందం మళ్లీ ఓటమిని చవిచూసింది. తదుపరి మంగళవారం లక్నో సూపర్ జెయింట్స్తో తలపడనుంది. చదవండి: #Mayank Yadav: నేను ఆరాధించే ఫాస్ట్ బౌలర్ ఆ ఒక్కడే: నయా ‘స్పీడ్గన్’ Frm loosing 3 IPL finals n never giving up and wining an @wplt20 🏆. @RCBTweets women's have given us everything what we dreamed for the past 16yrs😭. Had promised myself to get inked of all the RCB players name if they win this wpl 2024. And today I kept my promise.#RCBFAN pic.twitter.com/SpDaVk9wOT — Manoj nayak (@Nmanoj183) March 30, 2024 -
ఆర్సీబీ ఓటమిపై స్పందించిన కోహ్లి
ఐపీఎల్-2024లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు మరో ఓటమి ఎదురైంది. ఆరంభ మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో ఓడిన ఆర్సీబీ.. తిరిగి పుంజుకుని పంజాబ్ కింగ్స్పై విజయం సాధించింది. కానీ మళ్లీ పాత కథను పునరావృతం చేస్తూ సొంత మైదానంలో శుక్రవారం నాటి మ్యాచ్లో పరాజయం పాలైంది.కోల్కతా నైట్ రైడర్స్ చేతిలో ఏడు వికెట్ల తేడాతో ఓటమిని చవిచూసింది. ఈ విషయంపై స్పందించిన ఆర్సీబీ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి.. జట్టులో ఉత్సాహం నింపే ప్రయత్నం చేశాడు. స్థాయికి తగ్గ ప్రదర్శన ఇవ్వలేకపోయాం కాబట్టే ఓడిపోయామని.. కచ్చితంగా తిరిగి పుంజుకుంటామనే ఆశాభావం వ్యక్తం చేశాడు.కాగా కేకేఆర్తో మ్యాచ్లో కోహ్లి ఒక్కడే రాణించిన విషయం తెలిసిందే. ఓపెనర్గా బరిలోకి దిగిన ఈ రన్మెషీన్.. 59 బంతుల్లో 83 పరుగులు సాధించాడు. ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు. మిగతా వాళ్లలో కనీసం ఒక్కరు కూడా 35 పరుగుల మార్కును కూడా అందుకోలేకపోయారు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి ఆర్సీబీ 182 పరుగులు చేసింది.ఈ క్రమంలో లక్ష్య ఛేదనకు దిగిన కేకేఆర్ 16.5 ఓవర్లలోనే పని పూర్తి చేసింది. ఫిలిప్ సాల్ట్(30), ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ సునిల్ నరైన్(47), వెంకటేశ్ అయ్యర్(50) అద్భుత ఇన్నింగ్స్ కారణంగా ఆర్సీబీ విధించిన టార్గెట్ను ఉఫ్మని ఊదేసింది. ఫలితంగా బెంగళూరుకు రెండో పరాజయం ఎదురైంది. ఈ నేపథ్యంలో డ్రెసింగ్ రూంలో ఆర్సీబీ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్న కోహ్లి సహచర ఆటగాళ్లను ఉద్దేశించి ప్రసంగించాడు. ‘‘ఈరోజు ఎంత కఠినంగా గడిచిందో మనందరికీ తెలుసు. నిజానికి మనం ఇంతకంటే గొప్పగా ఆడేవాళ్లం.కానీ.. అలా జరిగిపోయింది. జట్టుగా మనం పటిష్టంగా ఉన్నామనే ధైర్యంతో ముందుకు సాగాలి. మన నైపుణ్యాల పట్ల నమ్మకం ఉంచాలి. అలా అయితేనే మనం తిరిగి పుంజుకోగలం. సరైన మార్గంలో లక్ష్యం దిశగా పయనించగలం’’ అని కోహ్లి స్ఫూర్తిదాయక వ్యాఖ్యలు చేశాడు.కాగా ఐపీఎల్ తాజా సీజన్లో ఇప్పటి వరకు ఆడిన మూడు మ్యాచ్లలో ఆర్సీబీ బ్యాటర్ కోహ్లి 181 పరుగులు సాధించాడు. అత్యధిక పరుగుల వీరుడిగా కొనసాగుతూ ఆరెంజ్ క్యాప్ను మరోసారి(ప్రస్తుతానికి) కైవసం చేసుకున్నాడు. అతడి తర్వాతి స్థానంలో సన్రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్(2 మ్యాచ్లలో 143 రన్స్) ఉన్నాడు.2️⃣ high quality shots 2️⃣ maximum resultsPredict Virat Kohli's final score tonight 👇Watch the match LIVE on @JioCinema and @StarSportsIndia 💻📱Match Updates ▶️ https://t.co/CJLmcs7aNa#TATAIPL | #RCBvKKR | @RCBTweets pic.twitter.com/WUuarIrM2m— IndianPremierLeague (@IPL) March 29, 2024 View this post on Instagram A post shared by Virat Kohli (@virat.kohli)2️⃣ high quality shots 2️⃣ maximum resultsPredict Virat Kohli's final score tonight 👇Watch the match LIVE on @JioCinema and @StarSportsIndia 💻📱Match Updates ▶️ https://t.co/CJLmcs7aNa#TATAIPL | #RCBvKKR | @RCBTweets pic.twitter.com/WUuarIrM2m— IndianPremierLeague (@IPL) March 29, 2024 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4381453179.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
IPL 2024: ఆర్సీబీ ఓటమిపై స్పందించిన కోహ్లి.. ఇలా అయితే!
ఐపీఎల్-2024లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు మరో ఓటమి ఎదురైంది. ఆరంభ మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో ఓడిన ఆర్సీబీ.. తిరిగి పుంజుకుని పంజాబ్ కింగ్స్పై విజయం సాధించింది. కానీ మళ్లీ పాత కథను పునరావృతం చేస్తూ సొంత మైదానంలో శుక్రవారం నాటి మ్యాచ్లో పరాజయం పాలైంది. కోల్కతా నైట్ రైడర్స్ చేతిలో ఏడు వికెట్ల తేడాతో ఓటమిని చవిచూసింది. ఈ విషయంపై స్పందించిన ఆర్సీబీ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి.. జట్టులో ఉత్సాహం నింపే ప్రయత్నం చేశాడు. స్థాయికి తగ్గ ప్రదర్శన ఇవ్వలేకపోయాం కాబట్టే ఓడిపోయామని.. కచ్చితంగా తిరిగి పుంజుకుంటామనే ఆశాభావం వ్యక్తం చేశాడు. కాగా కేకేఆర్తో మ్యాచ్లో కోహ్లి ఒక్కడే రాణించిన విషయం తెలిసిందే. ఓపెనర్గా బరిలోకి దిగిన ఈ రన్మెషీన్.. 59 బంతుల్లో 83 పరుగులు సాధించాడు. ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు. మిగతా వాళ్లలో కనీసం ఒక్కరు కూడా 35 పరుగుల మార్కును కూడా అందుకోలేకపోయారు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి ఆర్సీబీ 182 పరుగులు చేసింది. ఈ క్రమంలో లక్ష్య ఛేదనకు దిగిన కేకేఆర్ 16.5 ఓవర్లలోనే పని పూర్తి చేసింది. ఫిలిప్ సాల్ట్(30), ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ సునిల్ నరైన్(47), వెంకటేశ్ అయ్యర్(50) అద్భుత ఇన్నింగ్స్ కారణంగా ఆర్సీబీ విధించిన టార్గెట్ను ఉఫ్మని ఊదేసింది. ఫలితంగా బెంగళూరుకు రెండో పరాజయం ఎదురైంది. ఈ నేపథ్యంలో డ్రెసింగ్ రూంలో ‘ఆర్సీబీ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు అందుకున్న కోహ్లి సహచర ఆటగాళ్లను ఉద్దేశించి ప్రసంగించాడు. ‘‘ఈరోజు ఎంత కఠినంగా గడిచిందో మనందరికీ తెలుసు. నిజానికి మనం ఇంతకంటే గొప్పగా ఆడేవాళ్లం. కానీ.. అలా జరిగిపోయింది. జట్టుగా మనం పటిష్టంగా ఉన్నామనే ధైర్యంతో ముందుకు సాగాలి. మన నైపుణ్యాల పట్ల నమ్మకం ఉంచాలి. అలా అయితేనే మనం తిరిగి పుంజుకోగలం. సరైన మార్గంలో లక్ష్యం దిశగా పయనించగలం’’ అని కోహ్లి స్ఫూర్తిదాయక వ్యాఖ్యలు చేశాడు. కాగా ఐపీఎల్ తాజా సీజన్లో ఇప్పటి వరకు ఆడిన మూడు మ్యాచ్లలో ఆర్సీబీ బ్యాటర్ కోహ్లి 181 పరుగులు సాధించాడు. అత్యధిక పరుగుల వీరుడిగా కొనసాగుతూ ఆరెంజ్ క్యాప్ను మరోసారి(ప్రస్తుతానికి) కైవసం చేసుకున్నాడు. అతడి తర్వాతి స్థానంలో సన్రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్(2 మ్యాచ్లలో 143 రన్స్) ఉన్నాడు. చదవండి: IPL 2024: కోహ్లి, గంభీర్కు ఆస్కార్ ఇవ్వాలి: టీమిండియా దిగ్గజం 2️⃣ high quality shots 2️⃣ maximum results Predict Virat Kohli's final score tonight 👇 Watch the match LIVE on @JioCinema and @StarSportsIndia 💻📱 Match Updates ▶️ https://t.co/CJLmcs7aNa#TATAIPL | #RCBvKKR | @RCBTweets pic.twitter.com/WUuarIrM2m — IndianPremierLeague (@IPL) March 29, 2024 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4381453179.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
IPL 2024: కోహ్లి, గంభీర్కు ఆస్కార్ ఇవ్వాలి: టీమిండియా దిగ్గజం
ఐపీఎల్-2024.. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు- కోల్కతా నైట్ రైడర్స్ మ్యాచ్ సందర్భంగా ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఆర్సీబీ స్టార్ విరాట్ కోహ్లి- కేకేఆర్ మెంటార్ గౌతం గంభీర్ ఒకరినొకరు ఆత్మీయంగా హత్తుకున్నారు. దశాబ్దకాలంగా కోహ్లి- గంభీర్ మధ్య ప్రచ్ఛన్న యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. గౌతీ కేకేఆర్ ఆటగాడిగా ఉన్న సమయంలోనే కోహ్లి ఓసారి మైదానంలో అతడితో వాగ్వాదానికి దిగాడు. అప్పటి నుంచి వీరిద్దరి మధ్య వైరం నడుస్తోంది. ఇక గతేడాది లక్నో సూపర్ జెయింట్స్కు మెంటార్గా ఉన్న గంభీర్.. ఆర్సీబీతో మ్యాచ్ సందర్భంగా కోహ్లి- నవీన్ ఉల్ హక్(లక్నో బౌలర్) గొడవలో తలదూర్చాడు. దీంతో కోహ్లి సైతం దీటుగా బదులిస్తూ గంభీర్కు కౌంటర్ వేశాడు. క్రికెట్ వర్గాలను విస్మయపరిచిన ఈ ఘటన చర్చనీయాంశంగా మారింది. ఈ విషయంలో కోహ్లి- గంభీర్ తప్పొప్పులను ఎంచుతూ మాజీ క్రికెటర్లు,. అభిమానులు రెండు గ్రూపులుగా విడిపోయారు. ఇదిలా ఉంటే.. తాజాగా వీరిద్దరు ఇలా కలిసిపోవడం గమనార్హం. విరామ సమయంలో కోహ్లి వద్దకు వెళ్లి గంభీర్ షేక్ హ్యాండ్ ఇవ్వగా.. అనంతరం ఇద్దరూ ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో కామెంటేటర్ రవిశాస్త్రి స్పందిస్తూ.. ‘‘విరాట్ కోహ్లి- గౌతం గంభీర్ హగ్ కారణంగా కేకేఆర్కు ఫెయిర్ ప్లే అవార్డు ఇవ్వాల్సిందే’’ అని పేర్కొన్నాడు. ఇందుకు బదులిస్తూ మరో కామెంటేటర్ సునిల్ గావస్కర్ షాకింగ్ కామెంట్ చేశాడు. ‘‘ఫెయిర్ ప్లే అవార్డు ఒక్కటే కాదు. ఆస్కార్ అవార్డు కూడా ఇవ్వాలి’’ అని ఈ టీమిండియా దిగ్గజం పేర్కొన్నాడు. గావస్కర్ వ్యాఖ్య నెట్టింట వైరల్ కాగా.. ‘‘వీరిద్దరు కేవలం ఇలా నటించారని మాత్రమే అంటున్నారా?’’ అని నెటిజన్లు సరదాగా ట్రోల్ చేస్తున్నారు. కాగా ఈ మ్యాచ్లో కేకేఆర్ ఆర్సీబీపై ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ నేపథ్యంలో సొంతమైదానంలో కోహ్లి వీరోచిత ఇన్నింగ్స్(59 బంతుల్లో 83 రన్స్) వృథాగా పోయింది. తదుపరి ఆర్సీబీ లక్నో సూపర్ జెయింట్స్తో.. కేకేఆర్ ఢిల్లీ క్యాపిటల్స్తో తలపడనున్నాయి. Our favourite strategic timeout ever 🫂#IPLonJioCinema #RCBvKKR #TATAIPL #JioCinemaSports pic.twitter.com/A50VPhD6RI — JioCinema (@JioCinema) March 29, 2024 -
వెంకటేశ్ అయ్యర్ గాయంపై అప్డేట్!..అందుకే ఆ సెలబ్రేషన్!
ఐపీఎల్-2024ను పేలవంగా ఆరంభించిన వెంకటేశ్ అయ్యర్.. తాజా మ్యాచ్లో మాత్రం దంచికొట్టాడు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్లో ఈ కోల్కతా నైట్ రైడర్స్ బ్యాటర్ దుమ్ములేపాడు. ఫోర్లు, సిక్సర్లతో చెలరేగుతూ అభిమానులను అలరించాడు. ఎదుర్కొన్న 30 బంతుల్లోనే 50 పరుగులతో సత్తా చాటాడు. అయితే, ఈ మ్యాచ్ సందర్భంగా వెంకటేశ్ అయ్యర్ వెన్నునొప్పితో బాధపడ్డాడు. ఈ క్రమంలో అతడిని స్కానింగ్కు పంపించారు. ఈ నేపథ్యంలో గాయంపై అప్డేట్ అందించిన అయ్యర్.. ‘‘కండరాలు పట్టేసినట్లు అనిపించింది. ఎందుకైనా మంచిదని స్కానింగ్కు వెళ్లాను. ఈ రోజు మ్యాచ్ అద్భుతంగా సాగింది. మరో ఎండ్లో సునిల్ నరైన్ నుంచి గొప్ప సహకారం లభించింది. ఈరోజు క్రెడిట్ మొత్తం నరైన్కు ఇవ్వాల్సిందే. మాపై ఏమాత్రం ఒత్తిడి పడకుండా చూసుకున్నాడు. విజయానికి అతడు పునాదులు వేస్తే.. మేము పని పూర్తిచేశాం’’ అని పేర్కొన్నాడు. వెన్నునొప్పి గురించి పెద్దగా ఆందోళన అక్కర్లేదని తెలిపాడు. ఇక హాఫ్ సెంచరీ నేపథ్యంలో తన ‘కిస్’ సెలబ్రేషన్ గురించి చెబుతూ.. ‘‘నాకు కాబోయే భార్య కూడా ఈరోజు మ్యాచ్కు వచ్చింది. నా ఇన్నింగ్స్లో ఆమెకూ క్రెడిట్ ఇవ్వాలని భావించాను’’ అని వెంకటేశ్ అయ్యర్ నవ్వులు చిందించాడు. కాగా గతేడాది నవంబరులో వెంకటేశ్ అయ్యర్కు ఎంగేజ్మెంట్ జరిగిన విషయం తెలిసిందే. ఫ్యాషన్ డిజైనర్ అయిన శృతి రఘునాథన్తో అతడు నిశ్చితార్థం చేసుకున్నాడు. త్వరలోనే ఈ జంట పెళ్లిపీటలు ఎక్కబోతున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే.. శుక్రవారం బెంగళూరు వేదికగా ఆర్సీబీతో జరిగిన మ్యాచ్లో కేకేఆర్ ఏడు వికెట్ల తేడాతో గెలుపొందింది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ సునిల్ నరైన్ (22 బంతుల్లో 47 పరుగులు) అద్భుతంగా రాణించాడు. చదవండి: IPL 2024: రూ.11 కోట్లు తీసుకున్నాడు.. కట్ చేస్తే! ఆర్సీబీని నిండా ముంచేశాడు A well deserved 50 for Venkatesh Iyer in just 29 deliveries 💪🫡‼️#KKRvRCB pic.twitter.com/IDDmCiFjNu — Kolkata Knight Riders Universe (@KKRUniverse) March 29, 2024 -
#KKR: ఆర్సీబీపై మా విజయానికి కారణం అదే: అయ్యర్
చిన్నస్వామి స్టేడియంలో పరుగుల వరద పారించిన కోల్కతా నైట్ రైడర్స్ ఆల్రౌండర్ సునిల్ నరైన్పై ఆ జట్టు సారథి శ్రేయస్ అయ్యర్ ప్రశంసలు కురిపించాడు. ఓపెనర్గా వచ్చి తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడని కొనియాడాడు. అద్భుత ఇన్నింగ్స్ ఆడి జట్టు గొప్ప ఆరంభం అందించాడని పేర్కొన్నాడు. ఐపీఎల్-2024లో భాగంగా కేకేఆర్ శుక్రవారం రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో తలపడింది. టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకోగా.. ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లు నష్టపోయి 182 పరుగులు చేసింది. అయితే, ఆరంభంలో బౌలర్లకు కాస్త అనుకూలించిన బెంగళూరు పిచ్పై.. సెకండాఫ్లో బ్యాటర్లు రెచ్చిపోయారు. ఆర్సీబీ విధించిన లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో కేకేఆర్ ఓపెనర్ ఫిలిప్ సాల్ట్(20 బంతుల్లో 30) మెరుగ్గా రాణించగా.. మరో ఓపెనర్, ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ సునిల్ నరైన్ ధనాధన్ ఇన్నింగ్స్తో దంచికొట్టాడు. 22 బంతులు ఎదుర్కొన్న ఈ బౌలింగ్ ఆల్రౌండర్ 2 ఫోర్లు, 5 సిక్స్ల సాయంతో 47 పరుగులు చేశాడు. A quick-fire 47 off just 22 deliveries 💥💥 An entertaining opening act from Sunil Narine comes to an end 👏👏 Head to @JioCinema and @StarSportsIndia to watch the match LIVE#TATAIPL | #RCBvKKR pic.twitter.com/s0dNMzrL80 — IndianPremierLeague (@IPL) March 29, 2024 ఇక వన్డౌన్లో వచ్చిన వెంకటేశ్ అయ్యర్ 30 బంతుల్లోనే యాభై పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఆఖర్లో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 39, రింకూ సింగ్ 5 పరుగులతో అజేయంగా నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చారు. 16.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించిన కేకేఆర్ ఆర్సీబీపై ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. తద్వారా పదిహేడో ఎడిషన్లో వరుసగా రెండో గెలుపు నమోదు చేసింది. ఈ నేపథ్యంలో కేకేఆర్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ జట్టు ఆట తీరుపై హర్షం వ్యక్తం చేశాడు. వికెట్ బౌలర్లకు పెద్దగా అనుకూలించడం లేదని ఆండ్రీ రసెల్ చెప్పాడని.. పిచ్ పరిస్థితులను సరిగ్గా అంచనా వేసి తమకు సూచనలు ఇచ్చాడని తెలిపాడు. ఈ క్రమంలో సునిల్ నరైన్ను ఓపెనర్గా పంపాలా వద్దా అన్న అంశంపై చర్చలు జరిపామని.. ఆఖరికి ఓపెనర్గానే బరిలోకి దించామని పేర్కొన్నాడు. జట్టులో తన పాత్ర ఏమిటో నరైన్కు స్పష్టంగా తెలుసని అయ్యర్ పేర్కొన్నాడు. కాగా ఆర్సీబీతో మ్యాచ్లో రసెల్ నాలుగు ఓవర్ల బౌలింగ్ కోటా పూర్తి చేసి 29 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు తీశాడు. మరోవైపు నరైన్ 4 ఓవర్లలో 40 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు. Venkatesh F-IYER 🔥🔥 Head to @JioCinema and @StarSportsIndia to watch the match LIVE#TATAIPL | #RCBvKKR pic.twitter.com/2EeUvGTR8J — IndianPremierLeague (@IPL) March 29, 2024 ఇక వరుసగా రెండో గెలుపుపై స్పందిస్తూ.. ఇది కేవలం ఆరంభం మాత్రమేనని.. టోర్నీలో మున్ముందు ఇంకెన్నో సాధించాల్సి ఉందని శ్రేయస్ అయ్యర్ పేర్కొన్నాడు. కాగా కేకేఆర్ తదుపరి మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్తో తలపడనుంది. విశాఖపట్నంలో బుధవారం ఇరు జట్ల మధ్య మ్యాచ్ జరుగనుంది. చదవండి: #Kohli: పాపం.. కోహ్లి ఒక్కడు ఏం చేయగలడు? -
RCB Vs KKR: పాపం.. కోహ్లి ఒక్కడు ఏం చేయగలడు?
IPL 2024 RCB vs KKR: రాయల్ చాలెంజర్స్ బెంగళూరు బ్యాటర్ల తీరును టీమిండియా దిగ్గజం, కామెంటేటర్ సునిల్ గావస్కర్ విమర్శించాడు. ప్రతిసారి విరాట్ కోహ్లి ఒక్కడి మీదే ఆధారపడితే ఫలితం ఇలాగే ఉంటుందని ఆగ్రహం వ్యక్తం చేశాడు. కోహ్లి ఒక్కడు ఎంతని పోరాడగలడంటూ చురకలు అంటించాడు. కాగా ఐపీఎల్-2024లో భాగంగా ఆర్సీబీ రెండో పరాజయాన్ని చవిచూసిన విషయం తెలిసిందే. పదిహేడో ఎడిషన్ ఆరంభ మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో ఓడిన ఆర్సీబీ.. అనంతరం సొంతగడ్డపై పంజాబ్ కింగ్స్తో మ్యాచ్లో జయభేరి మోగించింది. అయితే, అదే జోరును కొనసాగించలేక చతికిలపడింది. తాజాగా కోల్కతా నైట్ రైడర్స్తో మ్యాచ్లో ఓటమిని చవిచూసింది. చిన్నస్వామి స్టేడియంలో శుక్రవారం జరిగిన మ్యాచ్లో ఏకంగా ఏడు వికెట్ల తేడాతో ఆర్సీబీ పరాజయం పాలైంది. సొంత మైదానంలో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు.. ఆరంభంలోనే ఓపెనర్, కెప్టెన్ డుప్లెసిస్(8) వికెట్ కోల్పోయింది. King Kohli in his Kingdom! 🥵🤌#RCBvsKKR pic.twitter.com/c8kgfXdWHS — OneCricket (@OneCricketApp) March 29, 2024 మరో ఓపెనర్ విరాట్ కోహ్లి(59 బంతుల్లో 83- నాటౌట్) ఆఖరి వరకు అజేయంగా నిలిచినా.. ఇతరుల నుంచి పెద్దగా సహకారం అందలేదు. వన్డౌన్ బ్యాటర్ కామెరాన్ గ్రీన్ 33 పరుగులతో పర్వాలేదనిపించగా.. గ్లెన్ మాక్స్వెల్ మెరుపులు(19 బంతుల్లో 23) కాసేపు అలరించాయి. ఇక రజత్ పాటిదార్(3) మరోసారి నిరాశపరచగా.. అనూజ్ రావత్(3) సైతం చేతులెత్తేశాడు. ఆఖర్లో దినేశ్ కార్తిక్(8 బంతుల్లో 20) ధనాధన్ ఇన్నింగ్స్ ఆడి రనౌట్గా వెనుదిరిగాడు. ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 182 పరుగులు స్కోరు చేయగలిగింది ఆర్సీబీ. అయితే, కేకేఆర్ బ్యాటర్లు దంచికొట్టడంతో 16.5 ఓవర్లలోనే లక్ష్యం ఛేదించడంతో ఆర్సీబీకి ఓటమి తప్పలేదు. ఈ నేపథ్యంలో సునిల్ గావస్కర్ మాట్లాడుతూ.. ‘‘కోహ్లి ఒక్కడు ఎంతని చేయగలడు. అతడికి కనీసం ఒక్కరైనా సహకారం అందించి ఉండే బాగుండేది. ఒకవేళ ఈరోజు తనకు మరో బ్యాటర్ నుంచి సపోర్టు దొరికి ఉంటే 83కు బదులు 120 పరుగులు చేసేవాడు. ఇది ఒక్కడి ఆట కాదు కదా. జట్టుగా ఆడాల్సిన ఆట. కానీ దురదృష్టవశాత్తూ ఈరోజు తనొక్కడే పోరాడాల్సి వచ్చింది’’ అని పేర్కొన్నాడు. మిగతా బ్యాటర్లు ఇంకాస్త మెరుగ్గా రాణించి ఉంటే ఆర్సీబీ మంచి స్కోరు చేసి ఉండేదని అన్నాడు. ఈ మేరకు స్టార్ స్పోర్ట్స్ షోలో గావస్కర్ తన అభిప్రాయం పంచుకున్నాడు. కాగా ఆర్సీబీ తాజా ఓటమితో పాయింట్ల పట్టికలో ఆరో స్థానానికి పడిపోగా.. ఇప్పటి వరకు రెండు మ్యాచ్లు ఆడి గెలిచిన కేకేఆర్ నాలుగు పాయింట్లతో రెండోస్థానంలో కొనసాగుతోంది. చదవండి: IPL 2024: రూ.11 కోట్లు తీసుకున్నాడు.. కట్ చేస్తే! ఆర్సీబీని నిండా ముంచేశాడు -
కోహ్లి ఆర్సీబీని వీడితే జరిగేది ఇదే.. నెటిజన్ మండిపాటు!
పంజాబ్ కింగ్స్తో ఆర్సీబీ మ్యాచ్ సందర్భంగా ఓ వ్యక్తి మైదానంలోకి పరిగెత్తుకు వచ్చాడు. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి క్రీజులో ఉన్న సమయంలో దూసుకువచ్చి.. అతడి పాదాలకు నమస్కరించాడు. అనంతరం కోహ్లిని గట్టిగా ఆలింగనం చేసుకున్నాడు. ఇంతలో అక్కడికి చేరుకున్న భద్రతా సిబ్బంది సదరు వ్యక్తిని బలవంతంగా బయటకు తీసుకువెళ్లారు. ఐపీఎల్-2024లో భాగంగా ఆర్సీబీ- పంజాబ్ మధ్య బెంగళూరులో సోమవారం నాటి మ్యాచ్లో ఈ ఘటన జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో తాజాగా నెట్టింట వైరల్ అవుతోంది. కోహ్లిని హత్తుకున్న సదరు అజ్ఞాత వ్యక్తిని బయటకు తీసుకువెళ్లి దారుణంగా కొట్టారంటూ మరో వీడియో తెర మీదకు వచ్చింది. ప్రణీత్ అనే ఎక్స్ యూజర్ ఈ దృశ్యాలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ‘‘ఆర్సీబీ నుంచి ఇలాంటి ప్రవర్తన ఊహించలేదు. ఎవరి మీదా చెయ్యి చేసుకునే హక్కు మీకు లేదు. అలా చేయడం చట్టానికి విరుద్ధం. నిబంధనలు అతిక్రమించినందుకు అతడిని జైళ్లో పెట్టవచ్చు. లేదంటే జరిమానా విధించొచ్చు. అంతేగానీ స్టేడియంలోనే అతడిని కొడతారా? ఒక్కసారి విరాట్ కోహ్లి గనుక ఆర్సీబీని వీడితే మిమ్మల్ని ఒక్కడు కూడా పట్టించుకోడు’’ అంటూ ఘాటుగా విమర్శించాడు. అయితే, ఈ వీడియోలో ఉన్నది.. కోహ్లిని హత్తుకున్న వ్యక్తేనా? కాదా? అన్న అంశంపై మాత్రం క్లారిటీ లేదు. ఇదిలా ఉంటే.. పంజాబ్తో మ్యాచ్లో 77 పరుగులు చేసిన కోహ్లి.. ఆర్సీబీని గెలిపించాడు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డుతో పాటు ఆరెంజ్ క్యాప్ కూడా అందుకున్నాడు. ఆర్సీబీ తమ తదుపరి మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్తో తలపడనుంది. బెంగళూరు వేదికగా శుక్రవారం ఈ మ్యాచ్ జరుగనుంది. -
ఇప్పటికీ నా పేరు వాడుకుంటారు: కోహ్లి సెటైర్లు
టీ20 ప్రపంచకప్-2024 రేసులో తాను ముందే ఉన్నానని టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి స్పష్టం చేశాడు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికీ పొట్టి ఫార్మాట్ను ప్రమోట్ చేసేందుకు తన పేరును వాడుకుంటున్నారంటూ విమర్శకులకు చురకలు అంటించాడు. కాగా రోహిత్ శర్మ సారథ్యంలో ఈ ఏడాది ప్రపంచకప్ ఆడబోతున్న భారత జట్టులో కోహ్లికి స్థానం దక్కకపోవచ్చంటూ ఇటీవల వార్తలు వైరలైన విషయం తెలిసిందే. యువ ఆటగాళ్లకు పెద్దపీట వేయాలనే ఉద్దేశంతో బీసీసీఐ చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్... కోహ్లిని పక్కనపెట్టాలనే యోచనలో ఉన్నాడంటూ వదంతులు వ్యాపించాయి. ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ కీర్తి ఆజాద్ స్పందిస్తూ.. తన జట్టులో కోహ్లి కచ్చితంగా ఉండాలంటూ రోహిత్ శర్మ ఇప్పటికే స్పష్టం చేశాడంటూ తానూ ఓ ట్వీట్తో ఈ చర్చలో భాగమయ్యాడు. ఇదిలా ఉంటే.. దాదాపు రెండు నెలల విరామం తర్వాత ఐపీఎల్-2024తో రీఎంట్రీ ఇచ్చాడు విరాట్ కోహ్లి. వ్యక్తిగత కారణాల దృష్ట్యా ఆటకు దూరమైన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. ఆర్సీబీ తరఫున ఆరంభ మ్యాచ్లో కేవలం 21 పరుగులకే పరిమితమయ్యాడు. అయితే, సోమవారం పంజాబ్ కింగ్స్తో మ్యాచ్లో విశ్వరూపం ప్రదర్శించాడు. జానీ బెయిర్ స్టో క్యాచ్ వదిలేయడంతో సున్నా పరుగుల వద్ద లైఫ్ పొందిన కోహ్లి.. 77 పరుగుల(11 ఫోర్లు, 2 సిక్సర్లు)తో రాణించాడు. తద్వారా ఆర్సీబీ విజయంలో కీలక పాత్ర పోషించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. అంతేకాదు ఇప్పటి వరకు రెండు మ్యాచ్లలో కలిపి మొత్తంగా 98 పరుగులతో ఆరెంజ్క్యాప్ను కూడా కైవసం(ప్రస్తుతానికి) చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో కోహ్లి మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘‘టీ20 ఫార్మాట్లో నేను ఓపెనింగ్ చేస్తున్నాను. ఎల్లప్పుడూ మా జట్టుకు శుభారంభం ఇచ్చేందుకు ప్రయత్నిస్తా. అయితే, వికెట్లు పడేకొద్దీ పరిస్థితులకు తగ్గట్లుగా ఆడాల్సి ఉంటుంది. కొన్నిసార్లు షాట్లు ఆడేందుకు సంశయించాల్సి వస్తుంది. ఏదేమైనా ఎప్పుటికప్పుడు ఆటను మెరుగుపరచుకుంటూ ఉంటేనే ముందుకు వెళ్లగలుగుతాం. ఇప్పటికీ టీ20 ఫార్మాట్ను ప్రమోట్ చేసేందుకు నా పేరును తరచుగా వాడటం చూస్తూనే ఉన్నాం’’ అని పేర్కొన్నాడు. ఆరెంజ్ క్యాప్ ప్రస్తుతానికి తన వద్ద ఉందని.. ఇప్పుడే సంబరాలు చేసుకోవడం సరికాదంటూ అభిమానులపై సరదాగా చిరుకోపం ప్రదర్శించాడు. గణాంకాలు కేవలం నంబర్లే అయినా మంచి జ్ఞాపకాలుగా మిగిలిపోతాయని రాహల్ ద్రవిడ్ ఎల్లప్పుడూ చెబుతూ ఉంటాడని కోహ్లి ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నాడు. పనిలో పనిగా తాను టీ20 వరల్డ్కప్ జట్టు రేసులో లేనన్న వారికి సమాధానం కూడా ఇచ్చాడు. 🗣️🗣️ You're not going to think of numbers and stats, it's the memories that you create Orange cap holder Virat Kohli with a special message and a special mention to #TeamIndia Head Coach Rahul Dravid 🤗#TATAIPL | #RCBvPBKS | @imVkohli pic.twitter.com/uW0Vb7Y8m9 — IndianPremierLeague (@IPL) March 25, 2024 -
‘వదిలేసిన చెత్త’ అంటూ ఓవరాక్షన్.. పాపం అతడి పరిస్థితి ఇదీ!
‘‘ఒకరు వదిలేసిన చెత్త.. మరొకరికి విలువైన ఖజానా’’.. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు నయా పేసర్ యశ్ దయాల్ గురించి టీమిండియా మాజీ క్రికెటర్, కామెంటేటర్ మురళీ కార్తిక్ చేసిన వ్యాఖ్య ఇది. తమ ఆటగాడిని పట్టుకుని ‘ట్రాష్’ అన్నందుకు అతడికి గట్టిగానే కౌంటర్ ఇచ్చింది ఆర్సీబీ. పంజాబ్ కింగ్స్తో మ్యాచ్లో యశ్ దయాళ్ ప్రదర్శనను కొనియాడుతూ.. ‘‘అవును.. అతడొక విలువైన ఖజానా’’ అంటూ మురళీ కార్తిక్ స్టైల్లోనే అతడికి దిమ్మతిరిగేలా సమాధానం ఇచ్చింది. ఇంతకీ ఏం జరిగిందంటే.. గతేడాది ఐపీఎల్ సీజన్లో యశ్ దయాళ్ గుజరాత్ టైటాన్స్కు ప్రాతినిథ్యం వహించాడు. ఆ ఫ్రాంఛైజీ తరఫున ఆడిన ఐదు మ్యాచ్లలో కలిపి రెండు వికెట్లు మాత్రమే తీయగలిగాడు. గుజరాత్ తనకోసం వెచ్చించిన రూ. 3.2 కోట్లకు ఆ స్థాయిలో న్యాయం చేయలేకపోయాడీ యూపీ బౌలర్. అయితే, ఆ సీజన్లో కోల్కతా నైట్ రైడర్స్తో జరిగిన మ్యాచ్ మాత్రం యశ్ దయాళ్కు పీడకలను మిగిల్చింది. అతడి బౌలింగ్లో కేకేఆర్ ఫినిషర్ రింకూ సింగ్ ఒకే ఓవర్లో ఐదు సిక్సర్లు బాది తమ జట్టును గెలిపించాడు. దీంతో యశ్ దయాళ్పై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరిగింది. విపరీతపు కామెంట్లతో యశ్పై విరుచుకుపడ్డారు కొంతమంది నెటిజన్లు. ఇదిలా ఉంటే.. ఐపీఎల్-2024కు ముందు గుజరాత్ యశ్ దయాళ్ను వదిలివేయగా.. ఆర్సీబీ ఏకంగా ఐదు కోట్ల రూపాయలు ఖర్చు చేసి అతడిని కొనుగోలు చేసింది. ఈ క్రమంలో పదిహేడో ఎడిషన్ ఆరంభ మ్యాచ్లో ఆర్సీబీ తరఫున ఒక వికెట్ తీసిన యశ్ దయాళ్.. సోమవారం పంజాబ్ కింగ్స్తో మ్యాచ్లో సత్తా చాటాడు. పవర్ ప్లేలో తాను వేసిన మూడు ఓవర్లలో కేవలం 10 పరుగులు మాత్రమే ఇచ్చిన ఈ లెఫ్టార్మ్ పేసర్.. డెత్ ఓవర్లో సామ కర్రన్ను బౌన్సర్తో బోల్తా కొట్టించి ఒక వికెట్ కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. తద్వారా ఆర్సీబీ విజయంలో తానూ భాగమయ్యాడు. అయితే, మురళీ కార్తిక్ మాత్రం యశ్ దయాళ్ను ఉద్దేశించి ఈ మేరకు కామెంట్ చేయడం గమనార్హం. ఫలితంగా అతడిపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం యశ్ దయాళ్ మాట్లాడుతూ.. నాటి చేదు ఘటన(రింకూ సిక్సర్లు)ను గుర్తు చేసుకున్నాడు. ‘‘ఆరోజు మ్యాచ్ అయిపోయిన తర్వాత నేను మైదానం వీడి వెళ్లిపోయాను. సోషల్ మీడియా అస్సలు చూడొద్దని నాకు చెప్పారు. అయినా నేను వినలేదు. ఓపెన్ చేశాను.ఆ తర్వాత నా కుటుంబంతో మాట్లాడాను. చాలా మంది నా బ్యాగ్రౌండ్ గురించి.. నేను ఎక్కడి నుంచి ఇక్కడి దాకా వచ్చాను అన్న విషయాల గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు. రెండు- మూడు రోజుల పాటు ఆ కామెంట్లు నన్ను వెంటాడాయి. ఆ తర్వాత క్రమక్రమంగా నేను కోలుకున్నాను’’ అని యశ్ దయాళ్ చెప్పుకొచ్చాడు. చదవండి: IPL 2024: మళ్లీ ముంబై కెప్టెన్గా రోహిత్ శర్మ?!.. అంతకంటే సర్ప్రైజ్? He’s treasure. Period. ❤🔥 pic.twitter.com/PaLI8Bw88g — Royal Challengers Bengaluru (@RCBTweets) March 25, 2024 -
అందుకే ఆ రెండు నెలలు అక్కడే ఉన్నాం: కోహ్లి
రెండు నెలల పాటు ఆటకు దూరంగా.. కుటుంబానికి దగ్గరగా ఉండటం వింత అనుభూతినిచ్చిందని టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి అన్నాడు. తన ఇద్దరు పిల్లలతో కలిసి గడిపిన మధుర క్షణాలు వెలకట్టలేనివని పేర్కొన్నాడు. ఇప్పుడిక మళ్లీ ఆట మొదలుపెట్టానన్న కోహ్లి.. అత్యుత్తమ ప్రదర్శన కనబరిచేందుకు ఎల్లవేళలా కృషి చేస్తానని అభిమానులకు మాట ఇచ్చాడు. కాగా స్వదేశంలో ఇంగ్లండ్తో ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్కు విరాట్ కోహ్లి దూరమైన విషయం తెలిసిందే. తన భార్య అనుష్క శర్మ ప్రసవం నేపథ్యంలో సెలవు తీసుకున్న ఈ రన్మెషీన్.. ఫిబ్రవరి 15న తమకు కుమారుడు జన్మించాడని ప్రకటించాడు. పిల్లాడికి అకాయ్గా నామకరణం చేసినట్లు వెల్లడించాడు. ఈ క్రమంలో ఐపీఎల్-2024 ద్వారా రీఎంట్రీ ఇచ్చాడు ఈ ఆర్సీబీ(రాయల్ చాలెంజర్స్ బెంగళూరు) బ్యాటర్. సీఎస్కేతో జరిగిన ఆరంభ మ్యాచ్లో కేవలం 21 పరుగులకే పరిమితమైన కోహ్లి.. సోమవారం నాటి మ్యాచ్లో మాత్రం అదరగొట్టాడు. పంజాబ్ కింగ్స్తో బెంగళూరులో జరిగిన మ్యాచ్లో 49 బంతుల్లో 77 పరుగులు సాధించాడు. ఆర్సీబీని గెలిపించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. 𝗙𝗹𝘂𝗲𝗻𝘁! ✨ King Kohli is off the mark in the chase and how 😎 Head to @JioCinema and @StarSportsIndia to watch the match LIVE#TATAIPL | #RCBvPBKS | @imVkohli pic.twitter.com/mgYvM716Gs — IndianPremierLeague (@IPL) March 25, 2024 ఈ నేపథ్యంలో విరాట్ కోహ్లి తన వ్యక్తిగత జీవితం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘ఆ రెండు నెలల పాటు సాధారణ జీవితం గడిపే అవకాశం వచ్చింది. అప్పుడు మేము మన దేశానికి దూరంగా.. రోడ్డు మీద నడుస్తున్నా మమ్మల్ని ఎవరూ గుర్తుపట్టని ప్రదేశంలో ఉన్నాం. కుటుంబమంతా కలిసే ఉన్నాం. అదొక వింతైన అనుభూతి. ఇద్దరు పిల్లలు ఉన్నపుడు వారితో గడిపే సమయాన్ని కూడా పెంచుకోవాలి కదా! ఏదేమైనా ఆ రెండు నెలలు మొత్తంగా ఫ్యామిలీతో ఉండేందుకు అవకాశం ఇచ్చినందుకు దేవుడికి కచ్చితంగా కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఆ మధురానుభూతులను అస్సలు మర్చిపోలేను. ఇప్పుడిక ఆట మొదలైంది. కచ్చితంగా నా బెస్ట్ ఇస్తానని ప్రామిస్ చేస్తున్నా’’ అని కోహ్లి పేర్కొన్నాడు. మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ అనంతరం ఈ మేరకు వ్యాఖ్యానించాడు. కాగా ఆర్సీబీ తదుపరి శుక్రవారం నాటి మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్తో తలపడనుంది. కాగా కోహ్లి- అనుష్క శర్మ దంపతులకు తొలి సంతానంగా కూతురు వామిక జన్మించిన సంగతి తెలిసిందే. -
కోహ్లిని ‘బెదిరించిన’ జడ్డూ.. ఆర్సీబీ స్టార్ రియాక్షన్ అదుర్స్!
ఐపీఎల్-2024 ఆరంభ మ్యాచ్ సందర్భంగా ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. చెన్నై సూపర్ కింగ్స్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు బ్యాటర్ విరాట్ కోహ్లి పరస్పరం టీజ్ చేసుకోవడం హైలైట్గా నిలిచింది. చెన్నైలోని చెపాక్ వేదికగా సీఎస్కే- ఆర్సీబీ మధ్య మ్యాచ్తో ఐపీఎల్ పదిహేడో ఎడిషన్కు తెరలేచిన విషయం తెలిసిందే. సొంతమైదానంలో బెంగళూరుపై ఆధిపత్యం చాటుకుంటూ డిఫెండింగ్ చాంపియన్ చెన్నై ఆరు వికెట్ల తేడాతో గెలుపొందింది. విజయంతో సీజన్ను ఆరంభించింది. ఇదిలా ఉంటే.. ఆర్సీబీతో మ్యాచ్ సందర్భంగా బౌలింగ్ చేసే క్రమంలో రవీంద్ర జడేజా కోహ్లిని ఆటపట్టించాడు. ఆర్సీబీ ఇన్నింగ్స్లో పదకొండో ఓవర్లో జడ్డూ.. కామెరాన్ గ్రీన్ను తన బౌలింగ్తో బెంబేలెత్తించాడు. అదే సమయంలో నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉన్న కోహ్లి వద్దకు వెళ్లి.. బాల్ అతడి ముఖానికి దగ్గరగా తీసుకువెళ్లి రనౌట్ చేస్తానంటూ సరదాగా బెదిరించాడు. వెంటనే పొజిషన్లోకి వచ్చిన కోహ్లి.. ‘‘పాపం.. అతడిని కాస్త ఊపిరి పీల్చుకోనివ్వు’’ అంటూ కామెరాన్ గ్రీన్ను మరీ ఎక్కువ ఇబ్బంది పెట్టకు అంటూ జడ్డూకు బదులిచ్చాడు. వీరిద్దరి మధ్య జరిగిన ఈ సరదా సంఘటన అభిమానులను ఆకర్షిస్తోంది. కాగా అండర్-19 స్థాయి నుంచే కోహ్లి- జడ్డూ మధ్య స్నేహం ఉంది. ఇదిలా ఉంటే ఈ మ్యాచ్లో ఆర్సీబీ స్టార్ కోహ్లి 21 పరుగులకే పరిమితం కాగా.. సీఎస్కే కీలక ఆల్రౌండర్ జడేజా పొదుపుగా బౌలింగ్ చేయడంతో పాటు 25 పరుగులతో ఆఖరి వరకు అజేయంగా నిలిచి జట్టును గెలిపించాడు. చదవండి: #Kohli: ఇలాంటి ప్రవర్తన అస్సలు ఊహించలేదు.. నీకిది తగునా కోహ్లి? Shining on #CSK Debut ✨ Home Support 💛 Finishing touch 💪 Summing up @ChennaiIPL's opening win of the season with Shivam Dube & Debutant Rachin Ravindra 👌👌 - By @RajalArora #TATAIPL | #CSKvRCB pic.twitter.com/r65i4T0zb9 — IndianPremierLeague (@IPL) March 23, 2024 -
ఆర్సీబీతో మ్యాచ్ అంటే శివాలెత్తిపోతాడు.. ఇదే రుజువు!
Shivam Dube vs RCB in the IPL: రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ అంటే చాలు శివాలెత్తిపోతాడు చెన్నై సూపర్ కింగ్స్ ఆల్రౌండర్ శివం దూబే. తాజాగా ఐపీఎల్-2024 ఆరంభ మ్యాచ్లోనూ మరోసారి ఈ విషయాన్ని నిరూపించాడు. ఇంపాక్ట్ ప్లేయర్గా బరిలోకి దిగి ధనాధన్ ఇన్నింగ్స్తో చెలరేగాడు. మరో ఆల్రౌండర్ రవీంద్ర జడేజాతో కలిసి స్కోరును బోర్డును పరుగులు పెట్టించి జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఈ మ్యాచ్లో ఐదో స్థానంలో వచ్చిన శివం 28 బంతుల్లో 4 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 34 పరుగులు చేయగా.. ఆరో స్థానంలో బ్యాటింగ్ చేసిన జడ్డూ 17 బంతుల్లో 25 రన్స్ చేశాడు. ఆఖరి వరకు ఇద్దరూ అజేయంగా నిలిచారు. ఇక ఐపీఎల్-2023 ఫైనల్లోనూ దూబే- జడేజా ద్వయం ఇదే తరహాలో నాటౌట్గా నిలిచి గుజరాత్ టైటాన్స్పై చెన్నై గెలుపొందడంలో కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. నాటి మ్యాచ్లో వన్డౌన్లో వచ్చిన దూబే 32, ఏడో స్థానంలో వచ్చిన జడేజా 15 పరుగులతో అజేయంగా నిలిచారు. నేను, జడేజా నాటౌట్గానే ఉన్నాం ఈ నేపథ్యంలో తాజా విజయం తర్వాత శివం దూబే మాట్లాడుతూ.. ‘‘2023 నుంచి ఇప్పటి దాకా నేను, జడేజా నాటౌట్గానే ఉన్నాం. చెన్నై తరఫున మ్యాచ్ ఫినిష్ చేయడం ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటుంది. మహీ భాయ్ నుంచి నేను నేర్చుకున్నది అదే. ప్రతి మ్యాచ్లోనూ తనలాగే ఫినిషర్ పాత్ర పోషించాలని భావిస్తాను. ఐపీఎల్ తాజా ఎడిషన్ తొలి మ్యాచ్లోనే నాకు ఆ అవకాశం దక్కింది. బాల్ను సరిగ్గా అంచనా వేసి బాదడంపైనే దృష్టి సారించాను. ఆఖరి వరకు క్రీజులో ఉంటే నేను ఏం చేయగలనో నాకు తెలుసు’’ అని పేర్కొన్నాడు. సహచర ప్లేయర్ రచిన్ రవీంద్రతో సంభాషిస్తూ శివం దూబే ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు. ఆర్సీబీతో మ్యాచ్ అంటే పూనకాలే! ఇప్పటి వరకు ఆర్సీబీతో మ్యాచ్లలో మొత్తంగా 133 బంతులు ఎదుర్కొన్న శివం దూబే సగటు 113.50తో 227 పరుగులు చేశాడు. ఇందులో 16 ఫోర్లు, 16 సిక్సర్లు కూడా ఉన్నాయి. 2021లో ఆర్సీబీతో మ్యాచ్లో 46(32), 2022లో 95*(46), 2023లో 52(27).. తాజాగా 34*(28) పరుగులు చేశాడు శివం దూబే!! Talk about living upto the Impact Player tag! 👏 👏 That was one fine knock from Shivam Dube in the chase! 👌 👌 Scorecard ▶️ https://t.co/4j6FaLF15Y#TATAIPL | #CSKvRCB | @IamShivamDube | @ChennaiIPL pic.twitter.com/207zz2Jz8l — IndianPremierLeague (@IPL) March 22, 2024 -
ప్రతిసారీ ధోని ఎంట్రీ ఏంటి?.. కెప్టెన్ అతడు కదా: సెహ్వాగ్
#CSKvsRCB- #MSDhoni: చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్గా అరుదైన ఘనతలు సాధించిన మహేంద్ర సింగ్ ధోని స్థానాన్ని భర్తీ చేయడం అంత సులువు కాదు. ధోని భాగమై ఉన్న జట్టును సారథిగా ముందుకు నడిపించలేక.. ఒత్తిడిలో చిత్తై రవీంద్ర జడేజా 2022 సీజన్లో పగ్గాలు చేపట్టి మధ్యలోనే వదిలేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ధోనినే మళ్లీ రంగంలోకి దిగినా ఫలితం లేకుండా పోయింది. అయితే, 2023లో తన అద్బుతమైన కెప్టెన్సీ నైపుణ్యాలతో సీఎస్కేను చాంపియన్గా నిలిపాడు ధోని. వయసు పైబడటం, భవిష్యత్ కెప్టెన్ను తయారు చేసే క్రమంలో ఐపీఎల్-2024 సీజన్కు ముందే తన బాధ్యతల నుంచి తప్పుకొన్నాడు తలా. ఎవరి స్థానాన్నో భర్తీ చేయడానికి రాలేదు కెప్టెన్సీ పగ్గాలను ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్కు అందించాడు. రుతు సైతం.. గతేడాది నుంచే ధోని భయ్యా తనకు ఈ విషయం గురించి సంకేతాలు ఇచ్చాడని పేర్కొన్నాడు. అంతేకాదు.. ‘‘సీఎస్కే కెప్టెన్గా ఎంపిక కావడం నాకు దక్కిన గౌరవం. అయితే, ఇక్కడ నేను ఎవరి స్థానాన్నో భర్తీ చేయడానికి రాలేదు. నన్ను నేను నిరూపించుకునే అవకాశం కోసం ఎదురు చూస్తున్నా’’ అని టోర్నీ ఆరంభానికి ముందే స్పష్టం చేశాడు రుతురాజ్ గైక్వాడ్. ఫీల్డింగ్ సెట్ చేసిన ధోని అందుకు తగ్గట్లుగానే ఆరంభ మ్యాచ్లో కెప్టెన్గా తనదైన ముద్ర వేసేందుకు ప్రయత్నించాడు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరుపై చెన్నై ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించడంతో సారథిగా అరంగేట్రంలోనే గెలుపు రుచి చవిచూశాడు. అయితే, మ్యాచ్ మధ్యలో ధోని రుతురాజ్కు సలహాలు ఇస్తూ కనిపించాడు. అంతేకాదు.. ఫీల్డింగ్ సెట్ చేసే విషయంలో ఈ వికెట్ కీపర్ చొరవ తీసుకున్నాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు ధోని అభిమానులను అలరించాయి. ధోని క్రేజ్ దృష్ట్యా కెమెరామెన్ సైతం ప్రతిసారి అతడిపైనే ఫోకస్ చేయడం విశేషం. Just a reminder: 𝙏𝙝𝙖𝙡𝙖 𝙣𝙚𝙫𝙚𝙧 𝙢𝙞𝙨𝙨𝙚𝙨 😉#CSKvsRCB #TATAIPL #IPLonJioCinema #IPL2024 #JioCinemaSports pic.twitter.com/KMhidAc9Sp — JioCinema (@JioCinema) March 22, 2024 అతడు ఇప్పుడు కెప్టెన్ ఈ నేపథ్యంలో హర్యానా కామెంట్రీ బాక్స్లో ఉన్న టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ తనదైన శైలిలో ఛలోక్తులు విసిరాడు. ‘‘భయ్యా.. దయచేసి రుతురాజ్ ముఖాన్ని కూడా కాస్త చూపించండి. అతడు ఇప్పుడు కెప్టెన్. ఏంటో.. ఈ కెమెరామెన్ ఎప్పుడూ ధోని ఫేస్ మాత్రమే చూపిస్తున్నాడు’’ అని వీరూ భాయ్ కామెంట్ చేశాడు. ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్లో కెప్టెన్గా రుతురాజ్కు మంచి మార్కులే పడ్డాయి. Shining on #CSK Debut ✨ Home Support 💛 Finishing touch 💪 Summing up @ChennaiIPL's opening win of the season with Shivam Dube & Debutant Rachin Ravindra 👌👌 - By @RajalArora #TATAIPL | #CSKvRCB pic.twitter.com/r65i4T0zb9 — IndianPremierLeague (@IPL) March 23, 2024 రుతురాజ్ కెప్టెన్సీ బాగుంది భారత మాజీ ఆల్రౌండర్ ఇర్ఫాన్ పఠాన్.. రుతు కెప్టెన్సీ గురించి ప్రస్తావిస్తూ.. ‘‘తొలి 26 బంతుల తర్వాత సీఎస్కే అద్భుతరీతిలో తిరిగి పుంజుకుంది. ఒత్తిడిలోనూ రుతురాజ్ బౌలింగ్ విభాగాన్ని ప్రయోగించడంలో చేసిన మార్పులు ఆకట్టుకున్నాయి’’ అని ఎక్స్ వేదికగా ప్రశంసించాడు. ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్లో ఓపెనర్గా రుతురాజ్ కేవలం 15 పరుగులు మాత్రమే చేయగలిగాడు. -
#Kohli: అస్సలు ఊహించలేదు.. నీకిది తగునా కోహ్లి?
Virat Kohli Reaction To Rachin Ravindra Dismissal: ఇండియన్ ప్రీమియర్ లీగ్ అరంగేట్రంలోనే అదరగొట్టాడు చెన్నై సూపర్ కింగ్స్ క్రికెటర్ రచిన్ రవీంద్ర. న్యూజిలాండ్కు చెందిన ఈ ఆల్రౌండర్ ఐపీఎల్-2024 ఆరంభ మ్యాచ్లో ఓపెనర్గా బరిలోకి దిగాడు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో శుక్రవారం నాటి మ్యాచ్లో ఈ భారత సంతతి ఆటగాడు ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపించాడు. మొత్తంగా 15 బంతులు ఎదుర్కొన్న రచిన్ ఏకంగా 37(3 ఫోర్లు, 3 సిక్సర్లు) పరుగులు రాబట్టి చెన్నై ఇన్నింగ్స్లో టాప్ స్కోరర్గా నిలిచాడు. తద్వారా విజయంలో తానూ భాగమై సత్తా చాటాడు రచిన్ రవీంద్ర. కాగా ఆర్సీబీతో మ్యాచ్లో జోరు మీదున్న సమయంలో రచిన్ను కర్ణ్ శర్మ అవుట్ చేశాడు. కర్ణ్ బౌలింగ్లో స్లాగ్ స్వీప్ షాట్ ఆడేందుకు ప్రయత్నించిన రచిన్ డీప్ బ్యాక్వర్డ్ స్క్వేర్ లెగ్లో ఫీల్డింగ్ చేస్తున్న రజత్ పాటిదార్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. 6⃣.5⃣ - SIX 6⃣.6⃣ - OUT That was an interesting passage of play! Head to @JioCinema and @StarSportsIndia to watch the match LIVE Follow the match ▶️ https://t.co/4j6FaLF15Y #TATAIPL | #CSKvRCB pic.twitter.com/JjiIclkEoj — IndianPremierLeague (@IPL) March 22, 2024 ఫలితంగా ఆర్సీబీ శిబిరంలో సంబరాలు షురూ కాగా.. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి వ్యవహరించిన తీరు అభిమానులను ఆశ్చర్యపరిచింది. రచిన్ను ఉద్దేశించి అభ్యంతకర వ్యాఖ్యలు చేస్తూ.. వెళ్లిపో అన్నట్లు కోహ్లి ఎక్స్ప్రెషన్స్ ఇచ్చాడన్నట్లుగా ఓ వీడియో నెట్టింట వైరల్గా మారింది. pic.twitter.com/HUcInu5yTz — Bangladesh vs Sri Lanka (@Hanji_CricDekho) March 22, 2024 దీంతో.. ‘‘అస్సలు ఊహించలేదు.. నీ స్థాయికి, వయసుకు ఇది తగదు చీకూ’’ అంటూ కోహ్లి అభిమానులు సైతం అతడి తీరును విమర్శిస్తున్నారు. కాగా ఈ మ్యాచ్లో ఆర్సీబీ చెన్నై చేతిలో ఓడి పరాజయంతో సీజన్ను ఆరంభించింది. ఇక ఆర్సీబీ ఓపెనర్ కోహ్లి చెపాక్లో జరిగిన ఈ మ్యాచ్లో 20 బంతులు ఎదుర్కొని కేవలం 21 పరుగులు మాత్రమే చేశాడు. ముస్తాఫిజుర్ బౌలింగ్లో రచిన్ రవీంద్రకు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. అదీ సంగతి!! అందుకే ఆ వైల్డ్ సెలబ్రేషన్! Fielder ki kamaal ki lapak aur khatam hua Kohli ka luck! 🤯 Lijiye mazaa #IPLonJioCinema ka Bhojpuri mein ek dum FREE!#TATAIPL #JioCinemaSports pic.twitter.com/3tCrsyTGBo — JioCinema (@JioCinema) March 22, 2024 చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు స్కోర్లు: ►వేదిక: ఎంఏ చిదంబరం స్టేడియం(చెపాక్), చెన్నై ►టాస్: రాయల్ చాలెంజర్స్ బెంగళూరు.. బ్యాటింగ్ ►రాయల్ చాలెంజర్స్ బెంగళూరు స్కోరు: 173/6 (20) ►చెన్నై సూపర్ కింగ్స్ స్కోరు: 176/4 (18.4) ►విజేత: ఆరు వికెట్ల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్ గెలుపు ►ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: ముస్తాఫిజుర్ రహ్మాన్ (4/29). చదవండి: IPL 2024: ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చాడు.. ఆర్సీబీ కొంపముంచాడు! ఎవరంటే? -
అదే మ్యాచ్ను మలుపు తిప్పింది.. ధోని భాయ్ జట్టుతో ఉన్నా సరే!
Ruturaj Comments After Chennai Super Kings won by 6 wkts: చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్గా తొలి మ్యాచ్లోనే విజయం అందుకున్నాడు యువ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్. ఐపీఎల్-2024 ఆరంభ మ్యాచ్లో పటిష్ట రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో పోరులో సీఎస్కేను గెలిపించి సత్తా చాటాడు. సొంత మైదానం చెపాక్ వేదికగా గెలుపు నమోదు చేసి మధుర జ్ఞాపకాలు ప్రోది చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో రుతురాజ్ గైక్వాడ్ మాట్లాడుతూ.. కెప్టెన్సీని ఎల్లప్పుడూ ఆస్వాదిస్తానని తెలిపాడు. సారథిగా వ్యవహరించడం తనపై ఎలాంటి అదనపు ఒత్తిడిని కలిగించదని పేర్కొన్నాడు. దేశవాళీ క్రికెట్లో మహారాష్ట్రను ముందుండి నడిపించిన అనుభవం తనకు ఉందని తెలిపాడు. అదే మ్యాచ్ను మలుపు తిప్పింది ఇక ఈ మ్యాచ్లో మహీ భాయ్(మహేంద్ర సింగ్) ఉన్నాడు కాబట్టి తన పని మరింత సులువైందని రుతురాజ్ గైక్వాడ్ పేర్కొన్నాడు. అదే విధంగా.. మ్యాచ్ గురించి చెబుతూ.. ‘‘ఆరంభ ఓవర్ల నుంచే మ్యాచ్ మా నియంత్రణలోకి వచ్చేసింది. వాళ్లను మరింత తక్కువ స్కోరుకే పరిమితం చేయగలం అనుకున్నాం. కానీ అలా కుదరలేదు. నిజానికి మాక్స్వెల్, ఫాఫ్లను అవుట్ చేయడమే మ్యాచ్ను మలుపు తిప్పింది. వరుస విరామాల్లో మూడు వికెట్లు పడగొట్టడం తో మ్యాచ్ మా చేతుల్లోకి వస్తుందన్న నమ్మకం కుదిరింది. All Happening Here! Faf du Plessis ✅ Rajat Patidar ✅ Glenn Maxwell ✅@ChennaiIPL bounced back & in some style 👏 👏#RCB are 3 down for 42 in 6 overs! Head to @JioCinema and @StarSportsIndia to watch the match LIVE Follow the match ▶️ https://t.co/4j6FaLF15Y#TATAIPL |… pic.twitter.com/tyBRQJDtWY — IndianPremierLeague (@IPL) March 22, 2024 మా జట్టులోని ప్రతి ఒక్కరూ స్ట్రోక్ ప్లేయర్సే. జింక్స్(అజింక్య రహానే) కూడా సానుకూల దృక్పథంతో ఆడాడు. జట్టులోని ప్రతి ఒక్కరికి తమ పాత్ర ఏమిటన్న అంశంపై స్పష్టత ఉంది. ఈ రోజు బౌలర్లు తమ పాత్రను చక్కగా నెరవేర్చారు. అందరూ బాగానే బ్యాటింగ్ చేశారు. అయితే, టాపార్డర్ బ్యాటర్లు 15 ఓవర్ వరకు క్రీజులో ఉండగలిగితే మిగతా వాళ్ల పని మరింత సులువవుతుంది’’ అని రుతురాజ్ గైక్వాడ్ విశ్లేషించాడు. ఓపెనర్గా మాత్రం విఫలం కాగా శుక్రవారం నాటి మ్యాచ్లో టాస్ ఓడిన చెన్నై తొలుత బౌలింగ్ చేసింది. ఆర్సీబీని 173 ఓవర్లకు కట్టడి చేసిన రుతురాజ్ సేన.. 18.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. ఈ విజయంలో కీలక పాత్ర పోషించిన సీఎస్కే బౌలర్ ముస్తాఫిజుర్ రహ్మాన్(4/29) ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. ఇక రుతురాజ్ ఈ మ్యాచ్లో కేవలం 15 పరుగులే చేసి ఓపెనర్గా మాత్రం విఫలమయ్యాడు. సీఎస్కే వర్సెస్ ఆర్సీబీ స్కోర్లు: ►వేదిక: ఎంఏ చిదంబరం స్టేడియం(చెపాక్), చెన్నై ►టాస్: ఆర్సీబీ.. బ్యాటింగ్ ►ఆర్సీబీ స్కోరు: 173/6 (20) ►సీఎస్కే స్కోరు: 176/4 (18.4) ►ఫలితం: ఆరు వికెట్ల తేడాతో సీఎస్కే గెలుపు. చదవండి: IPL 2024: టీమిండియాలోనే కాదు.. ఇక్కడా ఇంతేనా?! వీడియో వైరల్ -
IPL2024 : బెంగళూరుపై చెన్నై విజయం (ఫొటోలు)
-
IPL 2024 Opening Ceremony: అట్టహాసంగా ఆరంభం
IPL 2024 Opening Ceremony: ఐపీఎల్ పదిహేడో ఎడిషన్ ఆరంభ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్, యంగ్ హీరో టైగర్ ష్రాఫ్ డ్యాన్స్తో దుమ్ములేపారు. జోష్గా స్టెప్పులేస్తూ చెపాక్ స్టేడియాన్ని హోరెత్తించారు. 𝗣𝗼𝘄𝗲𝗿𝗵𝗼𝘂𝘀𝗲 💥@iTIGERSHROFF starts the #TATAIPL Opening Ceremony with his energetic performance 😍👏 pic.twitter.com/8HsssiKNPO — IndianPremierLeague (@IPL) March 22, 2024 𝙀𝙡𝙚𝙘𝙩𝙧𝙞𝙛𝙮𝙞𝙣𝙜 ⚡️⚡️ Chennai erupts in joy as @akshaykumar leaves his mark at the #TATAIPL Opening Ceremony 🥳 pic.twitter.com/TMuedfuvyU — IndianPremierLeague (@IPL) March 22, 2024 💃🕺 Chennai grooves to the melodies of Sonu Nigam during the Opening Ceremony#TATAIPL pic.twitter.com/jVnlskQKQj — IndianPremierLeague (@IPL) March 22, 2024 అనంతరం సోనూ నిగమ్ మధుర గాత్రంతో వందేమాతరం ఆలాపనతో ప్రేక్షకుల్లోని దేశభక్తిని తట్టిలేపగా... ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ మా తుజే సలాంతో గూప్బంప్స్ తెప్పించాడు. ఆ తర్వాత మోహిత్ చౌహాన్ కూడా ఈ స్వర తరంగానికి తోడయ్యాడు. భల్లే లక్కా, మసక్కలి, ఛయ్య ఛయ్య పాటలతో దుమ్ములేపాడు. అనంతరం లేడీ సింగర్లు నీతి మోహన్ బర్సోరే సాంగ్తో శ్రోతల చెవుల్లో స్వాతి చినుకుల వర్షం కురిపించింది. 𝙰 𝙼𝚞𝚜𝚒𝚌𝚊𝚕 𝙼𝚊𝚜𝚝𝚎𝚛𝚢 🎶@arrahman has left everyone in awe of his brilliance at the #TATAIPL Opening Ceremony 😍 🙌 pic.twitter.com/tbiiROXdog — IndianPremierLeague (@IPL) March 22, 2024 బీసీసీఐ బాస్లు, కెప్టెన్ల ఆగమనం వినోద కార్యక్రమాలు ముగిసిన తర్వాత భారత క్రికెట్ నియంత్రణ మండలి అధ్యక్షుడు రోజర్ బిన్నీ, కార్యదర్శి జై షా మిగతా ఆఫీస్ బేరర్లు వేదిక మీదకు విచ్చేశారు. ఆ తర్వాత ఢిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ కొత్త కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ ఐపీఎల్-2024 ట్రోఫీని స్టేజీ మీదకు తీసుకువచ్చాడు. అనంతరం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ కూడా వేదిక మీదకు చేరుకున్నాడు. అంతా కలిసి ట్రోఫీతో ఫోజులిచ్చారు. అనంతరం ఆరంభ మ్యాచ్కు సిద్ధమయ్యారు. -
RCB: అభిమానులకు క్షమాపణ చెప్పిన ఆర్సీబీ
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంఛైజీ తమ అభిమానులకు క్షమాపణ చెప్పింది. ఆర్సీబీ అన్బాక్స్ ఈవెంట్ సందర్భంగా కలిగిన అసౌకర్యానికి చింతిస్తూ డబ్బు తిరిగి చెల్లిస్తామని ప్రకటించింది. కాగా ప్రతి ఏడాది ఐపీఎల్ సీజన్ ఆరంభానికి ముందు ఆర్సీబీ అన్బాక్స్ ఈవెంట్ పేరిట కార్యక్రమం నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా మార్చి 19న బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో అట్టహాసంగా ఈవెంట్ నిర్వహించింది. విరాట్ కోహ్లి సహా ఆర్సీబీ స్టార్లు, వుమెన్ ప్రీమియర్ లీగ్-2024లో చాంపియన్గా నిలిచిన ఆర్సీబీ మహిళా జట్టు.. ఇతర సెలబ్రిటీలు పాల్గొన్నారు. ఈ ఈవెంట్లో ఆర్సీబీ తమ పేరు, లోగో మార్పులతో పాటు కొత్త జెర్సీని కూడా విడుదల చేసింది. అయితే, ఈ ఈవెంట్ను ఆర్సీబీ వెబ్సైట్, యాప్లో ప్రత్యక్షంగా వీక్షించాలంటే రూ. 99 చెల్లించాలని నిబంధన విధించింది. అయినప్పటికీ చాలా మంది అభిమానులు డబ్బు చెల్లించి ఈవెంట్ను చూసేందుకు సిద్ధమయ్యారు. అక్కడ ఫ్రీగా స్ట్రీమింగ్ కానీ.. ప్రసారంలో ఇబ్బందులు తలెత్తడంతో తమ అధికారిక యూట్యూబ్ చానెల్లో లైవ్ స్ట్రీమింగ్ చేసింది. దీంతో డబ్బు చెల్లించిన వాళ్లు.. ‘‘ఇదేం పద్ధతి’’ అంటూ ఆర్సీబీ తీరుపై మండిపడ్డారు. ఈ నేపథ్యంలో క్షమాపణ కోరుతూ ఆర్సీబీ ప్రకటన విడుదల చేసింది. మీ డబ్బులు రీఫండ్ చేస్తాం ‘‘ప్రియమైన ఆర్సీబీ అభిమానులారా.. పెద్ద ఎత్తున ఈ ఈవెంట్కు డిమాండ్ ఏర్పడిన నేపథ్యంలో లైవ్ స్ట్రీమింగ్ విషయంలో ఇబ్బందులు తలెత్తాయి. ఫలితంగా అంతరాయం కలిగింది. అందుకే మీ డబ్బులు రీఫండ్ చేయాలని నిర్ణయించాం. ఇప్పటికే ఆ ప్రక్రియ కూడా మొదలుపెట్టేశాం. రానున్న ఏడు రోజుల్లో మీ డబ్బు మీ అకౌంట్లకు చేరుతుంది. మాతో సహకరించినందుకు ధన్యవాదాలు. తదుపరి ఇలాంటి సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటాం’’ అని ఆర్సీబీ గురువారం తెలిపింది. కాగా ఈరోజు(మార్చి 22)న ఐపీఎల్-2024 ఎడిషన్ ఆరంభం కానున్న విషయం తెలిసిందే. చెపాక్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్- రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్తో ఈ టోర్నీకి తెరలేవనుంది. కొత్త కెప్టెన్ రుతురాజ్గైక్వాడ్ సారథ్యంలో చెన్నై.. ఫాఫ్ డుప్లెసిస్ బృందంతో తలపడనుంది. చదవండి: ధోని ఆటగాడిగానూ రిటైర్ అయితే బాగుండేది: టీమిండియా మాజీ క్రికెటర్ షాకింగ్ కామెంట్స్ -
కోహ్లీ... టీ20ల్లో శిఖరాగ్రానికి ఆరు పరుగుల దూరం!
ఐపీఎల్ 2024 సీజన్ ప్రారంభ మ్యాచ్కు ఆర్సీబీ స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లిని ఓ భారీ రికార్డు ఊరిస్తుంది. చెన్నైలోని చెపాక్ స్టేడియంలో ఇవాళ (మార్చి 22) జరిగే సీజన్ తొలి మ్యాచ్లో (సీఎస్కేతో) కింగ్ మరో ఆరు పరుగులు చేస్తే టీ20ల్లో 12000 పరుగుల మైలురాయిని తాకిన తొలి భారత క్రికెటర్గా రికార్డుల్లోకెక్కుతాడు. 2007లో టీ20 క్రికెట్ ఆడటం మొదలుపెట్టిన కోహ్లి టీ20 ఫార్మాట్ మొత్తంలో కలిపి 376 మ్యాచ్లు ఆడి 41.21 సగటను, 133.42 స్ట్రయిక్రేట్తో 11994 పరుగులు చేశాడు. ఇందులో 8 సెంచరీలు, 91 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ప్రపంచ క్రికెట్లో కేవలం ఐదుగురు మాత్రమే టీ20ల్లో 12000 పరుగుల మైలురాయిని తాకారు. టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో విండీస్ వీరుడు క్రిస్ గేల్ (14562) టాప్లో ఉండగా.. పాక్ షోయబ్ మాలిక్ (13360), విండీస్ పోలార్డ్ (12900), ఇంగ్లండ్ అలెక్స్ హేల్స్ (12319), ఆసీస్ డేవిడ్ వార్నర్ (12065) వరుసగా రెండు నుంచి ఐదు స్థానాల్లో ఉన్నారు. కాగా, ఐపీఎల్ 2024 సీజన్ ఇవాల్లి (మార్చి 22) నుంచి ప్రారంభంకానున్న విషయం తెలిసిందే. చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా జరుగనున్న సీజన్ తొలి మ్యాచ్లో ఫైవ్ టైమ్ ఛాంపియన్ చెన్నై సూపర్కింగ్స్ (సీఎస్కే), ఇప్పటివరకు ఒక్క టైటిల్ కూడా గెలవని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ భారతకాలమానం ప్రకారం రాత్రి 7:30 గంటలకు ప్రారంభంకానుంది. తుది జట్లు (అంచనా): సీఎస్కే: రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), రచిన్ రవీంద్ర, అజింక్య రహానే, డారిల్ మిచెల్, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోని (వికెట్కీపర్), శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహర్, మహీశ్ తీక్షణ, ముస్తాఫిజుర్ రెహ్మాన్ ఆర్సీబీ: విరాట్ కోహ్లి, ఫాఫ్ డుప్లెసిస్ (కెప్టెన్), రజత్ పాటిదార్, కెమరూన్ గ్రీన్, గ్లెన్ మ్యాక్స్వెల్, దినేశ్ కార్తీక్ (వికెట్కీపర్), అనూజ్ రావత్, అల్జరీ జోసఫ్, సిరాజ్, కర్ణ్ శర్మ, ఆకాశ్దీప్ -
ధోని ఆటగాడిగానూ రిటైర్ అయితే బాగుండేది: భారత మాజీ ఓపెనర్
#MSDhoni- IPL 2024: చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మార్పుపై టీమిండియా మాజీ ఓపెనర్ వసీం జాఫర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. మహేంద్ర సింగ్ ధోని ఆటగాడిగానూ తప్పుకొంటేనే కొత్త సారథి పని సులువు అవుతుందని అభిప్రాయపడ్డాడు. కాగా ఐపీఎల్-2024 ఆరంభానికి ఒక్క రోజు ముందు (మార్చి 21).. ధోని కెప్టెన్సీని వదిలేసి.. రుతురాజ్ గైక్వాడ్కు అప్పగించాడని సీఎస్కే ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, తలా ఆటగాడిగా మాత్రం కొనసాగుతాడని సంకేతాలు ఇచ్చింది. What it means! 🗣️💛#WhistlePodu #Yellove 🦁💛 pic.twitter.com/WCLqVI4xyU — Chennai Super Kings (@ChennaiIPL) March 22, 2024 అందుకు అనుగుణంగానే సీఎస్కే సీఈఓ కాశీ విశ్వనాథ్ సైతం ధోని తాజా సీజన్ మొత్తానికి అందుబాటులో ఉంటాడని స్పష్టం చేశాడు. ఈ నేపథ్యంలో మాజీ ఓపెనర్ వసీం జాఫర్ మాట్లాడుతూ.. ధోని ఆటగాడిగా కూడా రిటైర్ ఉంటే బాగుండేదని పేర్కొన్నాడు. ఆటగాడిగానూ రిటైర్ అయితే బాగుండేది. ఈఎస్పీఎన్క్రిక్ఇన్ఫో ఇంటర్వ్యూలో భాగంగా.. ధోని సీఎస్కే కెప్టెన్సీ వదిలేయడం గురించి ప్రస్తావించగా.. ‘‘ధోని కెప్టెన్గానే కాదు.. ఆటగాడిగానూ రిటైర్ అయితే బాగుండేది. ధోని ప్లేయర్గా ఉన్న జట్టును నాయకుడిగా ముందుకు నడిపించడం యువ ఆటగాడికి సాధ్యం కాదు. ఒకవేళ కొత్త కెప్టెన్ ఏదైనా నిర్ణయం తీసుకుంటే.. ధోని దానిని అంగీకరించవచ్చు లేదంటే వద్దని చెప్పవచ్చు. కాబట్టి ధోని మైదానంలో ఉండగా రుతురాజ్ గైక్వాడ్ సొంత నిర్ణయం తీసుకునేందుకు కచ్చితంగా ఇబ్బంది పడతాడు. అలా అయితే కెప్టెన్సీ కష్టం అంతేకాదు కొన్నిసార్లు తన నిర్ణయాలు అమలు చేయలేకపోవచ్చు కూడా! అప్పుడు కెప్టెన్సీ మరింత కష్టతరంగా మారుతుంది. అదే ధోని గనుక జట్టుతో లేకుంటే స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే వీలు ఉంటుంది. ధోని వారసుడిగా రుతురాజ్ తనదైన ముద్ర వేసే అవకాశం ఉంటుంది’’ అని వసీం జాఫర్ అభిప్రాయం వ్యక్తం చేశాడు. కాగా 2022లో ధోని సారథిగా తప్పుకొని టీమిండియా స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజాకు సీఎస్కే నాయకత్వ బాధ్యతలు అప్పగించిన విషయం తెలిసిందే. అయితే, కెప్టెన్సీ అనుభవం లేని జడ్డూ.. ఆటగాడిగానూ విఫలమై విమర్శలు మూటగట్టుకున్నాడు. మధ్యలోనే లీగ్ నుంచి నిష్క్రమించగా.. అతడి స్థానంలో ధోని మళ్లీ పగ్గాలు చేపట్టాడు. ఆ ఎడిషన్లో దారుణ ప్రదర్శనతో పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో నిలిచిన సీఎస్కే.. 2023లో అనూహ్య రీతిలో పుంజుకుని చాంపియన్గా నిలిచింది. ధోని నాయకత్వంలో ఐదోసారి టైటిల్ విజేతగా అవతరించింది. ఇక శుక్రవారం (మార్చి 22) ఐపీఎల్ పదిహేడో ఎడిషన్ ఆరంభం కానున్న విషయం తెలిసిందే. చెపాక్ వేదికగా చెన్నై.. రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో తొలి మ్యాచ్లో తలపడనుంది. చదవండి: IPL 2024: మెరుపులా వచ్చి మాయం!.. ఇకనైనా మారు! -
IPL 2024: చెన్నై, ఆర్సీబీ మ్యాచ్కు ముందు వాతావరణం, పిచ్ వివరాలు
ఐపీఎల్ 2024 సీజన్ తొలి మ్యాచ్ ఇవాళ (మార్చి 22) జరుగనుంది. చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా ఫైవ్ టైమ్ ఛాంపియన్ చెన్నై సూపర్కింగ్స్ (సీఎస్కే), ఇప్పటివరకు ఒక్క టైటిల్ కూడా గెలవని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ భారతకాలమానం ప్రకారం రాత్రి 7:30 గంటలకు ప్రారంభంకానుంది. అక్షయ్ కుమార్, ఏఆర్ రెహ్మాన్లచే ప్రత్యేక కార్యక్రమం.. మ్యాచ్కు ముందు సీజన్ ఆరంభ వేడుకలు జరుగనున్నాయి. సాయంత్రం 6:30 గంటలకు ప్రారంభమయ్యే ఈ ఈవెంట్లో బాలీవుడ్ నటులు అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్, సంగీత మాంత్రికుడు ఎఆర్ రెహ్మాన్, సింగర్ సోనూ నిగమ్ పెర్ఫార్మ్ చేయనున్నారు. సీఎస్కే నూతన కెప్టెన్గా రుతురాజ్.. లీగ్ ప్రారంభానికి కొద్ది గంటల ముందు డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ సంచలన నిర్ణయం తీసుకుంది. నూతన కెప్టెన్గా రుతురాజ్ గైక్వాడ్ను ఎంపిక చేస్తున్నట్లు ప్రకటించింది. మాజీ కెప్టెన్ ధోని స్వచ్ఛందంగా కెప్టెన్సీ నుంచి తప్పుకుని రుతురాజ్కు బాధ్యతలు అప్పజెప్పాడు. వాతావరణం ఎలా ఉందంటే.. సీఎస్కే, ఆర్సీబీ మ్యాచ్కు వేదిక అయిన చెన్నైలో వాతావరణం ఆటకు ఆనువుగా ఉంది. వాతావరణం నుంచి మ్యాచ్కు ఎలాంటి అవాంతరాలు సంభవించవు. చెన్నైలోని కొన్ని ప్రాంతాల్లో గురువారం రాత్రి తేలికపాటి వర్షం పడినప్పటికీ.. ఇవాళ మ్యాచ్ జరిగే సమయంలో (7-11 గంటల మధ్యలో) వాతావరణం పొడిగా ఉంటుందని వాతావరణ శాఖ వెల్లడించింది. మ్యాచ్ వేలల్లో ఉష్ణోగ్రతలు 30, 31 డిగ్రీల మధ్యలో ఉండే అవకాశం ఉంది. వర్షం నుంచి ఎలాంటి ముప్పు లేదు. పిచ్ ఎవరికి అనుకూలం.. చెపాక్ పిచ్ బ్యాటింగ్, బౌలింగ్ రెండిటికీ అనుకూలిస్తుందని చెప్పాలి. తొలుత బ్యాటర్లకు స్వర్గధామంగా కనిపించే ఈ పిచ్ క్రమంగా స్నిన్కు అనుకూలిస్తూ బౌలర్ ఫ్రెండ్లీగా మారుతుంది. ఈ పిచ్పై ఛేదన కాస్త కష్టంగానే ఉంటుంది. తొలుత బ్యాటింగ్ చేసే జట్టుకే విజయావకాశాలు అధికంగా ఉంటాయి. రాత్రి వేళలో తేమ శాతం అధికమైతే స్పిన్నర్లు చెలరేగే అవకాశం ఉంటుంది. హెడ్ టు హెడ్ రికార్డులను పరిశీలిస్తే.. ఐదు సార్లు ఛాంపియన్ అయిన సూపర్ కింగ్స్కు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై ఘనమైన రికార్డు ఉంది. ఈ ఇరు జట్లు ఐపీఎల్లో 31 సార్లు ఎదురెదురుపడగా.. సీఎస్కే 20, ఆర్సీబీ 10 సందర్భాల్లో విజయం సాధించాయి. ఓ మ్యాచ్లో ఫలితం తేలలేదు. చెపాక్ విషయానికొస్తే.. ఆర్సీబీపై సీఎస్కే సంపూర్ణ ఆధిపత్యం కలిగి ఉంది. ఇక్కడ ఇరు జట్లు 8 మ్యాచ్ల్లో తలపడగా.. సీఎస్కే ఏకంగా ఏడు మ్యాచ్ల్లో జయకేతనం ఎగురవేసింది. కేవలం ఒక్క మ్యాచ్లో మాత్రమే ఆర్సీబీ విజయం సాధించింది. అది కూడా లీగ్ ప్రారంభ ఎడిషన్ అయిన 2008లో. నాటి నుంచి ఇప్పటివరకు ఆర్సీబీ సీఎస్కేపై చెపాక్లో ఒక్క మ్యాచ్లో కూడా గెలవలేదు. తుది జట్లు (అంచనా).. సీఎస్కే: రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), రచిన్ రవీంద్ర, అజింక్య రహానే, డారిల్ మిచెల్, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోని (వికెట్కీపర్), శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహర్, మహీశ్ తీక్షణ, ముస్తాఫిజుర్ రెహ్మాన్ ఆర్సీబీ: విరాట్ కోహ్లి, ఫాఫ్ డుప్లెసిస్ (కెప్టెన్), రజత్ పాటిదార్, కెమరూన్ గ్రీన్, గ్లెన్ మ్యాక్స్వెల్, దినేశ్ కార్తీక్ (వికెట్కీపర్), అనూజ్ రావత్, అల్జరీ జోసఫ్, సిరాజ్, కర్ణ్ శర్మ, ఆకాశ్దీప్ -
అతడికి నా పేరు కూడా తెలుసు: ఆర్సీబీ క్వీన్ పోస్ట్ వైరల్
భారత మహిళా క్రికెటర్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు స్టార్ శ్రేయాంక పాటిల్ ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతోంది. ఇంతకంటే ఇంకేం కావాలి అన్నట్లు గాల్లోతేలిపోయే అనుభూతిని ఆస్వాదిస్తోంది. తన రోల్ మోడల్ను నేరుగా కలవడమే గాకుండా.. అతడితో ప్రశంసలు అందుకోవడమే ఇందుకు కారణం. ఐపీఎల్ తర్వాత బీసీసీఐ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన టీ20 టోర్నీ వుమెన్ ప్రీమియర్ లీగ్ ద్వారా లైమ్లైట్లోకి వచ్చిన బెంగళూరు అమ్మాయి శ్రేయాంక. దేశవాళీ క్రికెట్లో సొంత రాష్ట్రం కర్ణాటకకు ఆడుతున్న 21 ఏళ్ల ఈ ఆఫ్ స్పిన్ బౌలర్ గతేడాది భారత జట్టు తరఫున అరంగేట్రం చేసింది. గతేడాది ఆరంభమైన వుమెన్ ప్రీమియర్ లీగ్లో ఆర్సీబీకి ఆడే అవకాశాన్ని దక్కించుకుంది. రూ. 10 లక్షలకు తనను కొనుక్కున్న ఆర్సీబీకి తాజా ఎడిషన్లో పైసా వసూల్ ప్రదర్శన ఇచ్చింది. ముఖ్యంగా ఆదివారం ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన ఫైనల్లో కీలక సమయంలో నాలుగు వికెట్లు తీసింది. తద్వారా డబ్ల్యూపీఎల్-2024లో ఆర్సీబీ చాంపియన్గా నిలవడంతో కీలక పాత్ర పోషించి ప్రశంసలు అందుకుంటోంది. ఇక సీజన్లో మొత్తంగా 9 మ్యాచ్లు ఆడి 13 వికెట్లు తీసిన శ్రేయాంక పర్పుల్ క్యాప్(అత్యధిక వికెట్లు) విజేతగా నిలిచింది. No we’re not crying, you are 😭pic.twitter.com/Nb9TKf5NFw — Royal Challengers Bengaluru (@RCBTweets) March 17, 2024 అంతేకాదు ఎమర్జింగ్ ప్లేయర్ అవార్డునూ సొంతం చేసుకుంది. ఇదిలా ఉంటే.. మార్చి 22న ఐపీఎల్-2024 ఆరంభం కానున్న నేపథ్యంలో ఆర్సీబీ అన్బాక్స్ ఈవెంట్ నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ట్రోఫీ గెలిచిన మహిళా జట్టును ఆర్సీబీ పురుష జట్టు గార్డ్ ఆఫ్ ఆనర్తో సముచితంగా గౌరవించింది. ఇక ఈ ఈవెంట్లో పేరు, లోగో మార్పులతో కొత్త జెర్సీని రివీల్ చేసింది ఆర్సీబీ. ఈ కార్యక్రమంలో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లిని కలిసే అవకాశం వచ్చింది శ్రేయాంకకు! ఈ నేపథ్యంలో కింగ్ కోహ్లితో దిగిన ఫొటోను షేర్ చేస్తూ ఉద్వేగానికి లోనైందామె. ‘‘అతడి వల్లే క్రికెట్ చూడటం అలవాటు చేసుకున్నా. అతడిలాగే క్రికెటర్ కావాలని కలలు కంటూ పెరిగాను. ఎట్టకేలకు.. జీవితకాలానికి సరిపడా సంతోషాన్నిచ్చే క్షణం నిన్న రాత్రి చోటుచేసుకుంది. ‘హాయ్.. శ్రేయాంక.. అద్భుతంగా బౌల్ చేశావు’ అని విరాట్ నాతో అన్నాడు. అతడికి నా పేరు కూడా తెలుసు’’ అంటూ రోల్మోడల్తో కలిసి ఫ్యాన్గర్ల్ మూమెంట్ను ఆస్వాదించినట్లు శ్రేయాంక పాటిల్ తెలిపింది. ఈ మేరకు బుధవారం ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టగా వైరల్గా మారింది. చదవండి: Sachin Tendulkar: నేను 22 ఏళ్లు ఎదురుచూశా.. నువ్వు ఆ మాత్రం వెయిట్ చేయలేవా? Started watching cricket cos of him. Grew up dreaming to be like him. And last night, had the moment of my life. Virat said, “Hi Shreyanka, well bowled.” He actually knows my name 😬😬😬#StillAFanGirl #rolemodel pic.twitter.com/z3DB0C8Pt0 — Shreyanka Patil (@shreyanka_patil) March 20, 2024 -
IPL 2024: ఆర్సీబీపై సీఎస్కేదే ఆధిపత్యం.. పదహారేళ్లలో..!
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న క్రికెట్ పండుగ ఇండియన్ ప్రీమియర్ లీగ్ మరి కొద్ది గంటల్లో ప్రారంభం కానుంది. ఈ సీజన్ తొలి మ్యాచ్ చెన్నైలోని చిదంబరం స్టేడియం (చెపాక్) వేదికగా మార్చి 22న జరుగనుంది. సీజన్ ఓపెనర్లో డిఫెండింగ్ ఛాంపియన్స్ చెన్నై సూపర్ కింగ్స్.. ఇప్పటివరకు ఒక్కసారి కూడా టైటిల్ గెలవని ఆర్సీబీతో తలపడుతుంది. ఈ మ్యాచ్ భారతకాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతుంది. హెడ్ టు హెడ్ రికార్డులను ఓసారి పరిశీలిస్తే.. ఐదు సార్లు ఛాంపియన్ అయిన సూపర్ కింగ్స్కు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై ఘనమైన రికార్డు ఉంది. ఈ ఇరు జట్లు ఐపీఎల్లో 31 సార్లు ఎదురెదురుపడగా.. సీఎస్కే 20, ఆర్సీబీ 10 సందర్భాల్లో విజయం సాధించాయి. ఓ మ్యాచ్లో ఫలితం తేలలేదు. సొంత అడ్డా చెపాక్లో ఏ జట్టుపై అయినా పట్టపగ్గాల్లేని సీఎస్కే.. ఆర్సీబీపై సంపూర్ణ ఆధిపత్యం కలిగి ఉంది. చెపాక్ ఈ ఇరు జట్లు ఇప్పటివరకు 8 మ్యాచ్ల్లో తలపడగా.. సీఎస్కే ఏకంగా ఏడు మ్యాచ్ల్లో జయకేతనం ఎగురవేసింది. కేవలం ఒక్క మ్యాచ్లో మాత్రమే ఆర్సీబీ విజయం సాధించింది. అది కూడా లీగ్ ప్రారంభ ఎడిషన్ అయిన 2008లో. నాటి నుంచి ఇప్పటివరకు ఆర్సీబీ సీఎస్కేపై చెపాక్లో ఒక్క మ్యాచ్లో కూడా గెలిచింది లేదు. చెపాక్ పిచ్ విషయానికొస్తే.. ఈ మైదానం బ్యాటింగ్, బౌలింగ్ రెండిటికీ అనుకూలిస్తుందని చెప్పాలి. తొలుత బ్యాటర్లకు స్వర్గధామంగా కనిపించే ఈ పిచ్ క్రమంగా స్నిన్కు అనుకూలిస్తూ బౌలర్ ఫ్రెండ్లీగా మారుతుంది. ఈ పిచ్పై ఛేదన కాస్త కష్టంగానే ఉంటుంది. ఇందుకు అక్కడి వాతావరణం కూడా ఓ కారణం. వేసవికాలం రాత్రి వేళల్లో తేమ శాతం అధికంగా ఉండటంతో స్పిన్నర్లు చెలరేగే అవకాశం ఉంటుంది. తుది జట్లు (అంచనా): సీఎస్కే: రుతురాజ్ గైక్వాడ్, రచిన్ రవీంద్ర, అజింక్య రహానే, డారిల్ మిచెల్, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోని (కెప్టెన్/వికెట్కీపర్), శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహర్, మహీశ్ తీక్షణ, మతీశ పతిరణ ఆర్సీబీ: విరాట్ కోహ్లి, ఫాఫ్ డుప్లెసిస్ (కెప్టెన్), రజత్ పాటిదార్, కెమరూన్ గ్రీన్, గ్లెన్ మ్యాక్స్వెల్, దినేశ్ కార్తీక్ (వికెట్కీపర్), అనూజ్ రావత్, అల్జరీ జోసఫ్, సిరాజ్, కర్ణ్ శర్మ, ఆకాశ్దీప్ -
IPL 2024: షెడ్యూల్, వేదికలు, పది జట్లు.. పూర్తి వివరాలు
అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న మెగా క్రికెట్ సమరానికి సమయం ఆసన్నమైంది. చెపాక్ వేదికగా మార్చి 22న ఐపీఎల్ పదిహేడో ఎడిషన్ మొదలుకానుంది. డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్- రాయల్ చాలెంజర్స్ బెంగళూరు పోరుతో 2024 సీజన్కు తెరలేవనుంది. ఇక దేశంలో లోక్సభ ఎన్నికల నేపథ్యంలో తొలి 17 రోజులకు సంబంధించిన షెడ్యూల్ మాత్రమే విడుదలైన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా 21 మ్యాచ్లు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు ఇప్పటికే తెలిపారు. ఈ నేపథ్యంలో ఏ రోజు ఏ మ్యాచ్?.. వేదికలు, మ్యాచ్ ఆరంభ సమయం, జట్లు తదితర వివరాలు తెలుసుకుందాం! ఐపీఎల్-2024 తొలి దఫా షెడ్యూల్లో 21 మ్యాచ్లు.. ఏయే వేదికల్లో అంటే! ►మార్చి 22- చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్కే- CSK) వర్సెస్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ- RCB)- చెన్నై ►మార్చి 23- పంజాబ్ కింగ్స్(పీబీకేఎస్- PBKS)వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్(డీసీ- DC)- మొహాలీ(మధ్యాహ్నం) ►మార్చి 23- కోల్కతా నైట్ రైడర్స్(కేకేఆర్) వర్సెస్ సన్రైజర్స్ హైదరాబాద్(ఎస్ఆర్హెచ్)- కోల్కతా(రాత్రి) ►మార్చి 24- రాజస్తాన్ రాయల్స్(ఆర్ఆర్) వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్(ఎల్ఎస్జీ)- జైపూర్(మధ్యాహ్నం) ►మార్చి 24- గుజరాత్ టైటాన్స్(జీటీ-GT) వర్సెస్ ముంబై ఇండియన్స్(ఎంఐ- MI)- అహ్మదాబాద్(రాత్రి) ►మార్చి 25- ఆర్సీబీ- పంజాబ్ కింగ్స్- బెంగళూరు ►మార్చి 26- సీఎస్కే- గుజరాత్ టైటాన్స్- చెన్నై ►మార్చి 27- సన్రైజర్స్- ముంబై- హైదరాబాద్ ►మార్చి 28- రాజస్తాన్- ఢిల్లీ- జైపూర్ ►మార్చి 29- ఆర్సీబీ- కేకేఆర్- బెంగళూరు ►మార్చి 30- లక్నో- పంజాబ్- లక్నోలో ►మార్చి 31- గుజరాత్- సన్రైజర్స్- అహ్మదాబాద్(మధ్యాహ్నం) ►మార్చి 31- ఢిల్లీ- సీఎస్కే- వైజాగ్ ►ఏప్రిల్ 1- ముంబై- రాజస్తాన్- ముంబై ►ఏప్రిల్ 2- ఆర్సీబీ- లక్నో- బెంగళూరు ►ఏప్రిల్ 3- ఢిల్లీ- కేకేఆర్- వైజాగ్ ►ఏప్రిల్ 4- గుజరాత్- పంజాబ్- అహ్మదాబాద్ ►ఏప్రిల్ 5- సన్రైజర్స్- సీఎస్కే- హైదరాబాద్ ►ఏప్రిల్ 6- రాజస్తాన్- ఆర్సీబీ- జైపూర్ ►ఏప్రిల్ 7- ముంబై- ఢిల్లీ- ముంబై ►ఏప్రిల్ 7- లక్నో- గుజరాత్- లక్నో. నోట్: మార్చి 23, 24, 31, ఏప్రిల్7న డబుల్ హెడర్ మ్యాచ్లు.. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం జరిగే మ్యాచ్లు 3.30కి, రాత్రి జరిగే మ్యాచ్లు 7.30కి ఆరంభమవుతాయి. స్టార్ స్పోర్ట్స్(టెలివిజన్), జియో సినిమా(డిజిటల్)లో ప్రత్యక్ష ప్రసారం. ఐపీఎల్-2024 తొలి దఫా మ్యాచ్లు జరిగే వేదికలు చెన్నై, మొహాలి, కోల్కతా, జైపూర్, అహ్మదాబాద్, బెంగళూరు, హైదరాబాద్, లక్నో, వైజాగ్, ముంబై. తొలి దఫా షెడ్యూల్లో ఢిల్లీ క్యాపిటల్స్కు వైజాగ్ హోం గ్రౌండ్గా ఉంటుంది. IPL 2024లో పాల్గొనే పది జట్ల వివరాలు చెన్నై సూపర్ కింగ్స్: ఎంఎస్ ధోని (కెప్టెన్), మొయిన్ అలీ, దీపక్ చహర్, తుషార్ దేశ్పాండే, శివమ్ దూబే, రుతురాజ్ గైక్వాడ్, రాజవర్ధన్ హంగర్గేకర్, రవీంద్ర జడేజా, అజయ్ మండల్, ముఖేష్ చౌదరి, అజింక్య రహానే, షేక్ రషీద్, మిచెల్ సాంట్నర్, సిమర్జీత్ సింగ్, నిశాంత్ సింధు, ప్రశాంత్ సోలంకి, మహీశ్ తీక్షణ, రచిన్ రవీంద్ర, శార్దూల్ ఠాకూర్, డారిల్ మిచెల్, సమీర్ రిజ్వీ, ముస్తాఫిజుర్ రెహమాన్, అవనీష్ రావు అరవెల్లి. ►గాయపడిన ఆటగాళ్ళు: డెవాన్ కాన్వే, మతీష పతిరణ. ముంబై ఇండియన్స్ హార్దిక్ పాండ్యా (కెప్టెన్), రోహిత్ శర్మ, డెవాల్డ్ బ్రెవిస్, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, నంబూరి తిలక్ వర్మ, టిమ్ డేవిడ్, విష్ణు వినోద్, అర్జున్ టెండూల్కర్, షామ్స్ ములానీ, నేహాల్ వధేరా, జస్ప్రీత్ బుమ్రా, కుమార్ కార్తికేయ, పీయూష్ చావ్లా, ఆకాష్ మధ్వల్ , ల్యూక్ వుడ్, రొమారియో షెపర్డ్, గెరాల్డ్ కోయెట్జీ, శ్రేయాస్ గోపాల్, నువాన్ తుషార, నమన్ ధీర్, అన్షుల్ కాంబోజ్, మొహమ్మద్ నబీ, శివాలిక్ శర్మ. ►గాయపడిన/ఉపసంహరించుకున్న ఆటగాళ్లు: జాసన్ బెహ్రెన్డార్ఫ్, దిల్షాన్ మధుశాంక. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫాఫ్ డు ప్లెసిస్ (కెప్టెన్), గ్లెన్ మాక్స్వెల్, విరాట్ కోహ్లి, రజత్ పాటీదార్, అనూజ్ రావత్, దినేష్ కార్తీక్, సుయాష్ ప్రభుదేశాయి, విల్ జాక్స్, మహిపాల్ లామ్రోర్, కర్ణ్ శర్మ, మనోజ్ భాండాగే, మయాంక్ దాగర్, విజయ్కుమార్ వైశాక్, ఆకాశ్ దీప్, మహ్మద్ సిరాజ్, రీస్ టోప్లీ, హిమాన్షు శర్మ, రాజన్ కుమార్, కామెరాన్ గ్రీన్, అల్జారీ జోసెఫ్, యష్ దయాల్, టామ్ కరాన్, లాకీ ఫెర్గూసన్, స్వప్నిల్ సింగ్, సౌరవ్ చౌహాన్. కోల్కతా నైట్ రైడర్స్ శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), నితీష్ రాణా, రింకూ సింగ్, రహ్మానుల్లా గుర్బాజ్, ఫిల్ సాల్ట్, సునీల్ నరైన్, సుయాష్ శర్మ, అనుకూల్ రాయ్, ఆండ్రీ రస్సెల్, వెంకటేష్ అయ్యర్, హర్షిత్ రాణా, వైభవ్ అరోరా, వరుణ్ చక్రవర్తి, కేఎస్ భరత్, చేతన్ సకారియా, మిచెల్ స్టార్క్, అంగ్క్రిష్ రఘువంశీ, రమణదీప్ సింగ్, షెర్ఫానే రూథర్ఫోర్డ్, మనీష్ పాండే, ముజీబ్ ఉర్ రెహమాన్, దుష్మంత చమీరా, సాకిబ్ హుస్సేన్. ►గాయపడిన/ఉపసంహరించుకున్న ఆటగాళ్ళు: జాసన్ రాయ్, గుస్ అట్కిన్సన్. గుజరాత్ టైటాన్స్ శుభమన్ గిల్ (కెప్టెన్), డేవిడ్ మిల్లర్, మాథ్యూ వేడ్, వృద్ధిమాన్ సాహా, కేన్ విలియమ్సన్, అభినవ్ మనోహర్, బి. సాయి సుదర్శన్, దర్శన్ నల్కండే, విజయ్ శంకర్, జయంత్ యాదవ్, రాహుల్ తెవాటియా, నూర్ అహ్మద్, సాయి కిషోర్, రషీద్ ఖాన్, జాషువా లిటిల్, మోహిత్ శర్మ, అజ్మతుల్లా ఒమర్జాయ్, ఉమేష్ యాదవ్, షారుక్ ఖాన్, సుశాంత్ మిశ్రా, కార్తీక్ త్యాగి, మానవ్ సుతార్, స్పెన్సర్ జాన్సన్. ►గాయపడిన/ఉపసంహరించుకున్న ఆటగాళ్లు: మహ్మద్ షమీ, రాబిన్ మింజ్. లక్నో సూపర్ జెయింట్స్ కేఎల్ రాహుల్ (కెప్టెన్), క్వింటన్ డి కాక్, నికోలస్ పూరన్, ఆయుష్ బదోని, కైల్ మేయర్స్, మార్కస్ స్టోయినిస్, దీపక్ హుడా, దేవదత్ పడిక్కల్, రవి బిష్ణోయ్, నవీన్-ఉల్-హక్, కృనాల్ పాండ్యా, యుధ్వీర్ సింగ్, ప్రేరక్ మన్కడ్, యశ్ ఠాకూర్, అమిత్ మిశ్రా, షమర్ జోసెఫ్, మయాంక్ యాదవ్, మొహ్సిన్ ఖాన్, కె. గౌతం, శివమ్ మావి, అర్షిన్ కులకర్ణి, ఎం. సిద్ధార్థ్, ఆష్టన్ టర్నర్, డేవిడ్ విల్లీ, మొమ్మద్. అర్షద్ ఖాన్. ►గాయపడిన/ఉపసంహరించుకున్న ఆటగాళ్ళు: మార్క్ వుడ్. రాజస్థాన్ రాయల్స్ సంజు శాంసన్ (కెప్టెన్), జోస్ బట్లర్, షిమ్రాన్ హెట్మెయర్, యశస్వి జైస్వాల్, ధ్రువ్ జురెల్, రియాన్ పరాగ్, డొనోవన్ ఫెరీరా, కునాల్ రాథోడ్, రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ సేన్, నవదీప్ సైనీ, సందీప్ శర్మ, ట్రెంట్ బౌల్ట్, యజువేంద్ర చహల్, ఆడం జంపా, ఆవేష్ ఖాన్, రోవ్మన్ పావెల్, శుభమ్ దూబే, టామ్ కోహ్లర్-కాడ్మోర్, అబిద్ ముస్తాక్, నండ్రే బర్గర్. ►గాయపడిన/ఉపసంహరించుకున్న ఆటగాళ్లు: ప్రసిద్ధ్ కృష్ణ. ఢిల్లీ క్యాపిటల్స్ రిషబ్ పంత్ (కెప్టెన్), ప్రవీణ్ దూబే, డేవిడ్ వార్నర్, విక్కీ ఓస్త్వాల్, పృథ్వీ షా, అన్రిచ్ నోర్జే, అభిషేక్ పోరెల్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, జేక్ ఫ్రేజర్-మెక్గర్క్, లలిత్ యాదవ్, ఖలీల్ అహ్మద్, మిచెల్ మార్ష్, ఇషాంత్ శర్మ, యష్ ధుల్, ముఖేష్ కుమార్, ట్రిస్టన్ స్టబ్స్, రికీ భుయ్, కుమార్ కుషాగ్రా, రసిఖ్ దార్, ఝే రిచర్డ్సన్, సుమిత్ కుమార్, షాయ్ హోప్, స్వస్తిక్ చికార. ►గాయపడిన/ఉపసంహరించుకున్న ఆటగాళ్లు: హ్యారీ బ్రూక్, లుంగి ఎన్గిడి. పంజాబ్ కింగ్స్ శిఖర్ ధావన్ (కెప్టెన్), మాథ్యూ షార్ట్, ప్రభ్సిమ్రాన్ సింగ్, జితేష్ శర్మ, సికందర్ రజా, రిషి ధావన్, లియామ్ లివింగ్స్టోన్, అథర్వ తైడే, అర్ష్దీప్ సింగ్, నాథన్ ఎల్లిస్, సామ్ కరాన్, కగిసో రబడ, హర్ప్రీత్ బ్రార్, రాహుల్ చహర్, హర్ప్రీత్ భట్యా , విద్వత్ కవేరప్ప, శివమ్ సింగ్, హర్షల్ పటేల్, క్రిస్ వోక్స్, అశుతోష్ శర్మ, విశ్వనాథ్ ప్రతాప్ సింగ్, శశాంక్ సింగ్, తనయ్ త్యాగరాజన్, ప్రిన్స్ చౌదరి, రిలీ రోసౌవ్. సన్రైజర్స్ హైదరాబాద్ పాట్ కమిన్స్(కెప్టెన్), అబ్దుల్ సమద్, అభిషేక్ శర్మ, ఐడెన్ మార్క్రమ్, మార్కో జాన్సెన్, రాహుల్ త్రిపాఠి, వాషింగ్టన్ సుందర్, గ్లెన్ ఫిలిప్స్, సన్వీర్ సింగ్, హెన్రిచ్ క్లాసెన్, భువనేశ్వర్ కుమార్, మయాంక్ అగర్వాల్, టి. నటరాజన్, అన్మోల్ప్రీత్ సింగ్, మయాంక్ మార్కండే, ఉపేంద్ర, ఉపేంద్ర సింగ్ యాదవ్, ఉమ్రాన్ మాలిక్, నితీష్ కుమార్ రెడ్డి, ఫజల్హక్ ఫరూకీ, షాబాజ్ అహ్మద్, ట్రావిస్ హెడ్, వనిందు హసరంగా, జయదేవ్ ఉనాద్కట్, ఆకాష్ సింగ్, ఝాతావేద్ సుబ్రమణ్యన్. చదవండి: SRH: రెండుసార్లు చాంపియన్గా నిలబెడితే ఇలా చేస్తారా? షాకయ్యా -
పేరు మార్చుకున్న ఆర్సీబీ... కన్నడలో మాట్లాడిన కోహ్లి.. వీడియో
Royal Challengers Bangalore Has A New Name Ahead Of IPL 2024: ఐపీఎల్-2024 ఆరంభానికి ముందు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంఛైజీ కీలక ప్రకటన చేసింది. తమ పేరును Royal Challengers Bangalore నుంచి 'Royal Challengers Bengaluru'గా మార్చుకుంటున్నట్లు అధికారిక ప్రకటన విడుదల చేసింది. చిన్నస్వామి స్టేడియంలో మంగళవారం జరిగిన ఆర్సీబీ అన్బాక్స్ ఈవెంట్లో ఈ విషయాన్ని వెల్లడించింది. ‘‘ఈ పట్టణ సంస్కృతి, వారసత్వాన్ని పుణికిపుచ్చుకుని.. కొత్త అధ్యాయానికి శ్రీకారం చుడుతున్నాం. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు('Royal Challengers Bengaluru') ఇది మీ జట్టు.. మీ ఆర్సీబీ’’ అంటూ కొత్త లోగో, నూతన జెర్సీని రివీల్ చేసింది. ఇక ఈ కార్యక్రమానికి టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి, ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్, మహిళా జట్టు సారథి స్మృతి మంధాన సహా కీలక ఆటగాళ్లంతా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆర్సీబీకి తొలి టైటిల్ అందించిన వుమెన్ ప్రీమియర్ లీగ్-2024 చాంపియన్ స్మృతి మంధాన సేనకు పురుష జట్టు నుంచి గార్డ్ ఆఫ్ ఆనర్ లభించింది. Guard of Honour for our WPL Champions at Johnnie Walker presents RCB Unbox powered by @Kotak_Life and @Duroflex_world 🫡👏#PlayBold #ನಮ್ಮRCB #WPL2024 pic.twitter.com/ikwL5Mx0E1 — Royal Challengers Bengaluru (@RCBTweets) March 20, 2024 ఇదిలా ఉంటే.. అన్బాక్స్ ఈవెంట్ సందర్భంగా విరాట్ కోహ్లి కన్నడలో మాట్లాడటం హైలైట్గా నిలిచింది. ‘‘మీ అందరికీ ఒక్క విషయం చెప్పాలనుకుంటున్నా.. ఆర్సీబీ చరిత్రలో ఇదొక నూతన అధ్యాయం’’ అని కోహ్లి అభిమానులను ఉద్దేశించి వ్యాఖ్యానించాడు. అదే విధంగా.. ఫ్రాంఛైజీ క్రికెట్ ఆడినంత కాలం ఆర్సీబీతోనే ఉంటానని పేర్కొన్నాడు. Virat Kohli speaking Kannada. - "THE NEW CHAPTER OF RCB" 👑pic.twitter.com/KQWk4Wdab8 — Johns. (@CricCrazyJohns) March 19, 2024 దీంతో చిన్నస్వామి స్టేడియం మొత్తం కోహ్లి నామస్మరణతో హోరెత్తిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. కాగా పదహారేళ్లుగా ఆర్సీబీ పురుష జట్టు ఒక్కసారి కూడా టైటిల్ గెలవలేదు. గతంలో రెండుసార్లు ఫైనల్ చేరినా.. టైటిల్ లాంఛనం పూర్తి చేయలేకపోయింది. RCB is red Now kissed with blue We’re ready with our new armour To Play Bold for you! Presenting to you, Royal Challengers Bengaluru’s match livery of 2024! 🤩 How good is this, 12th Man Army? 🗣️#PlayBold #ನಮ್ಮRCB #RCBUnbox #IPL2024 pic.twitter.com/2ySPpmhrsq — Royal Challengers Bengaluru (@RCBTweets) March 19, 2024 ఈ క్రమంలో ఐపీఎల్ పదిహేడో ఎడిషన్కు ముందు పేరు మార్పుతో బరిలోకి దిగనుండటంతో ఈసారైనా రాత మారుతుందేమోనని అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు. WPL టైటిల్ గెలవడం శుభసూచకమంటూ మహిళా జట్టును ప్రశంసిస్తూనే.. ఫాఫ్ బృందం కూడా ట్రోఫీ గెలవాలని ఆకాంక్షిస్తున్నారు. -
ఆర్సీబీకి శుభవార్త
మహిళల ఐపీఎల్ 2024 ఎడిషన్ చివరి దశకు చేరింది. గ్రూప్ దశలో మరో రెండు మ్యాచ్లు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఇదివరకే రెండు ప్లేఆఫ్స్ బెర్త్లు ఖరారైపోయాయి. ఇక మిగిలింది ఓ బెర్త్. ఈ బెర్త్ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు దాదాపుగా ఖరారు చేసుకుంది. ఏదో మహాద్భతం జరిగితే తప్ప ఆర్సీబీ ప్లేఆఫ్స్కు చేరదు. ఇవాళ (మార్చి 12) ముంబై ఇండయన్స్తో జరిగే మ్యాచ్లో ఆర్సీబీ ఓడినా ప్లేఆఫ్స్కు అర్హత సాధిస్తుంది. అయితే భారీ తేడాతో ఓడితే మాత్రం సమీకరణలు మారిపోతాయి. ఇవాల్టి మ్యాచ్లో ఆర్సీబీ ముంబై చేతిలో 60 కంటే ఎక్కువ పరుగుల తేడాతో ఓడితే యూపీ వారియర్జ్ ప్లేఆఫ్స్కు చేరుకుంటుంది. ఆర్సీబీ తర్వాత యూపీ వారియర్జ్కు మాత్రమే ప్లేఆఫ్స్కు చేరుకునే ఛాన్స్ ఉందని అనుకోవడానికి వీల్లేదు. గుజరాత్ జెయింట్స్ తమ చివరాఖరి గ్రూప్ మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ను కనీసం 57 పరుగుల తేడాతో ఓడిస్తే ఈ జట్టు కూడా ప్లేఆఫ్స్ బరిలో ఉంటుంది. ఏ జట్టు అవకాశాలు ఎలా ఉన్నాయంటే.. ఆర్సీబీ ముంబై ఇండియన్స్నూ గెలిస్తే దర్జాగా ప్లేఆఫ్స్కు చేరుకుంటుంది. ఆర్సీబీ ముంబై ఇండియన్స్ చేతిలో 60 కంటే ఎక్కువ పరుగుల తేడాతో ఓడితే మాత్రం యూపీ వారియర్జ్ ప్లేఆఫ్స్కు చేరుకుంటుంది. గుజరాత్ ఢిల్లీ క్యాపిటల్స్ను 57 అంతకంటే ఎక్కువ పరుగుల తేడాతో ఓడించి, ఆర్సీబీ ముంబై ఇండియన్స్ చేతిలో 60 కంటే ఎక్కువ పరుగుల తేడాతో ఓడితే గుజరాత్ ప్లేఆఫ్స్కు చేరుకుంటుంది. ప్లేఆఫ్స్కు క్వాలిఫై అయ్యే మూడో జట్టు మార్చి 15న జరిగే ఎలిమినేటర్ మ్యాచ్లో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉన్న జట్టుతో తలపడుతుంది. తదుపరి జరుగబోయే రెండు గ్రూప్ మ్యాచ్ల ఆధారంగా పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాలు నిర్దారించబడతాయి. ప్రస్తుతానికి రన్రేట్ ఆధారంగా ఢిల్లీ టాప్లో ఉంది. పాయింట్లు సమానంగా ఉన్నా ముంబై ఇండియన్స్ రెండో స్థానంలో నిలిచింది. ఎలిమినేటర్లో గెలిచిన జట్టు పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచే జట్టుతో మార్చి 17న జరిగే అంతిమ సమరంలో అమీతుమీ తేల్చుకోనుంది. -
IPL 2024: తొలి మ్యాచ్లో చెన్నై ప్రత్యర్ధి గుజరాత్ కాదు..!
ఐపీఎల్ 2024కు సంబంధించిన తొలి విడత షెడ్యూల్ (15 రోజులు) ఇవాళ (ఫిబ్రవరి 22) సాయంత్రం 5 గంటలకు విడుదల కానున్న విషయం తెలిసిందే. చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా తొలి మ్యాచ్ జరుగనుంది. లీగ్ అనవాయితీ ప్రకారం తొలి మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్.. రన్నరప్ జట్టు తలపడతాయి. ఈ లెక్కన డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్.. గత సీజన్ రన్నరప్ గుజరాత్ టైటాన్స్ తొలి మ్యాచ్లో తలపడాల్సి ఉంది. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల తొలి మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్ ప్రత్యర్ధిని మార్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మ్యాచ్లో సీఎస్కే ప్రత్యర్ధిగా గుజరాత్ టైటాన్స్ కాకుండా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఉండనున్నట్లు తాజా సమాచారం. ఇదే జరిగితే 16 సీజన్లుగా కొనసాగుతున్న ఆనవాయితీకి బ్రేక్ పడినట్లవుతుంది. ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాలంటే మరికొన్ని గంటలు వేచి చూడాల్సిందే. కాగా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2024 షెడ్యూల్ ఇవాళ సాయంత్రం 5 గంటలకు విడుదల కానుంది. ఇందుకు సంబంధించిన ప్రత్యక్ష ప్రసారాన్ని స్టార్ స్పోర్ట్స్, జియో సినిమాలో వీక్షించవచ్చు. నేడు విడుదల చేసే షెడ్యూల్ కేవలం 15 రోజులకు మాత్రమే ఉండనున్నట్లు ఐపీఎల్ ఛైర్మన్ అరుణ్ ధుమాల్ వెల్లడించారు. దేశంలో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో విడతల వారీగా షెడ్యూల్ను విడుదల చేయనున్నట్లు ధుమాల్ సృష్టం చేశారు. టోర్నీ మొత్తం భారత్లోనే జరగనున్నట్లు ఆయన తెలిపారు. -
హృదయం ముక్కలైంది.. సిరాజ్ పోస్ట్ వైరల్! అతడికి ఏకంగా రూ. 11 కోట్లు!
టీమిండియా స్టార్ బౌలర్, ఆర్సీబీ పేసర్ మహ్మద్ సిరాజ్ తన సోషల్ మీడియా పోస్ట్తో నెట్టింట వైరల్ అవుతున్నాడు. ఇన్స్టా స్టోరీలో ముక్కలైన హృదయాన్ని తలపించే ఎమోజీలతో హాట్టాపిక్గా మారాడు. ఈ నేపథ్యంలో సిరాజ్ నర్మగర్భ పోస్ట్పై టీమిండియా, ఆర్సీబీ ఫ్యాన్స్ తమకు తోచిన విధంగా కామెంట్స్ చేస్తున్నారు. కాగా హైదరాబాదీ స్టార్ క్రికెటర్ మహ్మద్ సిరాజ్ ప్రస్తుతం సౌతాఫ్రికా పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. టీ20 సిరీస్లో భాగమైన అతడికి.. వన్డే సిరీస్ సందర్భంగా మేనేజ్మెంట్ విశ్రాంతినిచ్చింది. ఈ క్రమంలో.. డిసెంబరు 26న మొదలుకానున్న టెస్టు సిరీస్తో సిరాజ్ మళ్లీ మైదానంలో అడుగుపెట్టనున్నాడు. ఈ నేపథ్యంలో రెడ్ హార్ట్బ్రేక్ ఎమోజీలను సిరాజ్ తన ఇన్స్టా స్టోరీలో షేర్ చేయడం చర్చకు దారితీసింది. ఈ క్రమంలో.. ‘‘ఐపీఎల్-2024 వేలంలో ఆర్సీబీ అనుసరించిన వ్యూహాలు.. బౌలర్లను కొనుగోలు చేసిన విధానం సిరాజ్కు నచ్చలేదేమో’’ అని కొందరు కామెంట్ చేస్తున్నారు. మరికొందరేమో.. ‘‘కొంపదీసి సిరాజ్ గాయపడ్డాడా ఏంటి? ఇప్పటి వరకు సౌతాఫ్రికా గడ్డపై ఇండియా టెస్టు సిరీస్ గెలిచిందే లేదు. ఇప్పటికే మహ్మద్ షమీ జట్టుకు దూరమయ్యాడు. ఇప్పుడు సిరాజ్ ఈ బ్రేకింగ్ హార్ట్ ఎమోజీలతో ఏం సందేశం ఇస్తున్నట్లు?’’ అంటూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇంకొందరేమో.. ‘‘సూర్యకుమార్ యాదవ్ మాదిరిగానే సిరాజ్ ఆర్సీబీ కెప్టెన్ కావాలని భావించాడేమో! పాపం.. ఇంతకీ ఆర్సీబీ క్యాంప్లో ఏం జరుగుతోందో మీకేమైనా తెలుసా?’’ అంటూ సరదాగా ట్రోల్ చేస్తున్నారు. కాగా ఐపీఎల్-2024 వేలానికి ముందు హార్దిక్ పాండ్యాను ట్రేడ్ చేసుకున్న ముంబై ఇండియన్స్ అతడిని కెప్టెన్గా నియమించింది. టీమిండియా సారథి రోహిత్ శర్మను కాదని పాండ్యాకు పెద్దపీట వేసింది. ఈ నేపథ్యంలో తన హృదయం ముక్కలైందంటూ.. రోహిత్ గైర్హాజరీలో ముంబై ఇండియన్స్ను ముందుకు నడిపించిన సూర్యకుమార్ పోస్ట్ చేసిన విషయం తెలిసిందే. సిరాజ్ క్రిప్టిక్ పోస్ట్ నేపథ్యంలో సూర్య పోస్ట్ను తెరమీదకు తెచ్చి నెటిజన్లు ఇలా కామెంట్లు చేస్తున్నారు. తాను ఆ ఎమోజీలు పోస్ట్ చేయడానికి గల కారణం ఏమిటో మహ్మద్ సిరాజ్ స్పందిస్తేనే క్లారిటీ వస్తుంది. ఐపీఎల్ వేలం-2024లో ఆర్సీబీ కొన్న ప్లేయర్లు వీరే: వెస్టిండీస్ స్పీడ్స్టర్ అల్జారీ జోసెఫ్ను అత్యధికంగా రూ.11.50 కోట్లకు కొనుగోలు చేసిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు.. అతడితో పాటు యశ్ దయాళ్ (రూ.5 కోట్లు), టామ్ కరన్ (రూ.1.50 కోట్లు), లాకీ ఫెర్గూసన్ (రూ.2 కోట్లు), స్వప్నిల్ సింగ్ (రూ.20 లక్షలు), సౌరవ్ చౌహాన్ (రూ.20 లక్షలు)లను సొంతం చేసుకుంది. ఇక సిరాజ్ను ఆర్సీబీ రూ. ఏడు కోట్లకు రిటైన్ చేసుకున్న విషయం తెలిసిందే. Did Siraj wake up and see his co-bowlers who ll be bowling at Chinnaswamy? pic.twitter.com/ZIDVVUvUD6 — 𝐒𝐞𝐫𝐠𝐢𝐨 Das (@SergioCSKK) December 21, 2023 Is there any secret message behind this? — King Kohli's Fan (@ViratFan100) December 21, 2023 Mohammed Siraj's Instagram story. pic.twitter.com/TSCqSCbshv — Mufaddal Vohra (@mufaddal_vohra) December 21, 2023 -
IPL 2024: ఆర్సీబీ అభిమానులకు శుభవార్త చెప్పిన మ్యాక్స్వెల్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అభిమానులకు ఆ ఫ్రాంచైజీ స్టార్ ఆటగాడు గ్లెన్ మ్యాక్స్వెల్ శుభవార్త చెప్పాడు. తన ఒంట్లో ఓపిక ఉన్నంత వరకు ఐపీఎల్ ఆడతానని ఆర్సీబీ అభిమానుల్లో జోష్ నింపాడు. తనకెంతో ఇష్టమైన ఐపీఎల్ను 'ఇక నడవలేను' అనుకునే వరకు ఆడతానని తెలిపాడు. తన జీవితంలో ఐపీఎలే తన చివరి క్రికెట్ టోర్నీ అవుతుందని అన్నాడు. తన కెరీర్కు ఐపీఎల్ ఎంతో మేలు చేసిందని.. ఐపీఎల్లో తాను కలిసిన ఆటగాళ్లు, కోచ్ల నుంచి ఎంతో నేర్చుకున్నానని.. విరాట్ కోహ్లి, ఏబీ డివిలియర్స్, డుప్లెసిస్ లాంటి ఆటగాళ్లతో భుజాలు రాసుకుంటూ గడిపిన క్షణాలను ఎప్పటికీ మర్చిపోలేనని భావోద్వేగానికి లోనయ్యాడు. ఐపీఎల్లో దీర్ఘకాలంపాటు కొనసాగుతానని మ్యాక్సీ చెప్పకనే చెప్పడంతో ఆర్సీబీ అభిమానులు సంబురపడిపోతున్నారు. ప్రస్తుతం భీకర ఫామ్లో ఉన్న మ్యాక్సీపై గంపెడాశలు పెట్టుకున్న ఆర్సీబీ ఫ్యాన్స్.. ఈ విధ్వంసకర ఆటగాడు ఈసారి ఎలాగైనా ఆర్సీబీకి టైటిల్ అందిస్తాడని నమ్మకంగా ఉన్నారు. మ్యాక్సీ ఐపీఎల్ ఆడినంత కాలం ఆర్సీబీ అతన్ని దూరం చేసుకోదని గట్టిగా నమ్ముతున్న అభిమానులు.. కోహ్లితో ఉన్న సాన్నిహిత్యం అతన్ని ఆర్సీబీకి దూరం చేయదని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాలను మదిలో పెట్టుకునే ఆర్సీబీ అభిమానులు ప్రస్తుత మ్యాక్సీ స్టేట్మెంట్ విని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఐపీఎల్తో మ్యాక్స్వెల్కు పదేళ్లకు పైగా అనుబంధం ఉన్న విషయం తెలిసిందే. 2012 సీజన్లో ఢిల్లీ డేర్డెవిల్స్తో మొదలైన అతని ప్రస్తానం.. ఆతర్వాత ముంబై, పంజాబ్ ఫ్రాంచైజీలతో విజయవంతంగా సాగింది. ఈ ఆసీస్ విధ్వంసకర ఆటగాడు కోహ్లి ప్రత్యేక చొరవతో 2021 సీజన్లో ఆర్సీబీతో జతకట్టాడు. ప్రస్తుతం ఆర్సీబీ మ్యాక్సీకి 14.25 కోట్ల రెమ్యూనరేషన్ చెల్లిస్తుంది. గత సీజన్లో అతను 183.49 స్ట్రయిక్రేట్తో 400 పరుగులు చేసి మంచి టచ్లో కనిపించాడు. మ్యాక్స్వెల్ ఇటీవలి భారత పర్యటనలోనూ భీకర ఫామ్లో ఉన్నాడు. ఈ పర్యటనలో అతను నెల వ్యవధిలో మూడు మెరుపు శతకాలతో (వరల్డ్కప్లో 2, టీ20 సిరీస్లో ఒకటి) విరుచుకుపడ్డాడు. -
ఐపీఎల్లో ఓ వెలుగు వెలిగిన స్టార్ క్రికెటర్, అక్కడ మాత్రం దయనీయ స్థితిలో..!
ఈ ఏడాది (2023) ఐపీఎల్లో, అంతకుముందు జరిగిన సౌతాఫ్రికా టీ20 లీగ్లో మెరుపులు మెరిపించిన సౌతాఫ్రికన్ లెజెండ్ ఫాఫ్ డుప్లెసిస్ ప్రస్తుతం అమెరికా వేదికగా జరుగుతున్న మేజర్ లీగ్ క్రికెట్ (ఎంఎల్సీ) ఇనాగురల్ ఎడిషన్లో దారుణంగా విఫలమవుతున్నాడు. ఎంఎల్సీ-2023లో ఇప్పటివరకు 7 మ్యాచ్లు ఆడిన డుప్లెసిస్.. తన క్రికెటింగ్ కెరీర్లోకెళ్లా అత్యంత దారుణమైన గణాంకాలు నమోదు చేశాడు. 7 ఇన్నింగ్స్ల్లో 6.57 సగటున 85.18 స్ట్రయిక్రేట్తో కేవలం 46 పరుగులు మాత్రమే చేశాడు. లీగ్ క్రికెట్లో ఘన చరిత్ర కలిగిన డప్లెసిస్.. తన 13 ఏళ్ల కెరీర్లో ఇప్పటివరకు ఏ లీగ్లోనూ ఇంత పేలవ ప్రదర్శన కనబర్చలేదు. డుప్లెసిస్ వరుస వైఫల్యాల నేపథ్యంలో అతని ఐపీఎల్ ఫ్రాంచైజీ ఆర్సీబీ ఆందోళన చెందుతుంది. ఆ జట్టు అభిమానుల బాధ వర్ణణాతీతంగా ఉంది. డుప్లెసిస్ వచ్చే సీజన్లో ఎలాగైనా తమకు ఐపీఎల్ టైటిల్ సాధించిపెడతాడని గంపెడాశలు పెట్టుకున్న ఆర్సీబీ అభిమానులు.. ఫాఫ్ దయనీయ పరిస్థితి చూసి కుమిలిపోతున్నారు. ఇలాగైతే 2024లో కూడా తాము టైటిల్ గెలిచినట్లే అని తలలుపట్టుకుంటున్నారు. ఎంఎల్సీలో చెన్నై సూపర్ కింగ్స్ అనుబంధ ఫ్రాంచైజీ అయిన టెక్సాస్ సూపర్ కింగ్స్కు ప్రాతినిథ్యం వహించిన డుప్లెసిస్.. ముంబై ఇండియన్స్ న్యూయార్క్తో జరిగిన ఆఖరి మ్యాచ్లో 9 బంతులు ఎదుర్కొని కేవలం 6 పరుగులు మాత్రమే చేశాడు. ఆ మ్యాచ్లో సూపర్ కింగ్స్.. ముంబై ఇండియన్స్ చేతిలో ఓడి లీగ్ నుంచి నిష్క్రమించింది. భారతకాలమానం రేపు (జులై 31) జరుగబోయే ఫైనల్లో ముంబై ఇండియన్స్ న్యూయార్క్.. సియాటిల్ ఆర్కాస్ను ఢీకొంటుంది. కాగా, టెస్ట్ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించి, పరిమిత ఓవర్ల ఫార్మాట్లలో కొనసాగుతున్న డుప్లెసిస్.. ఎంఎల్సీ మినహాయించి ఈ ఏడాది టీ20 లీగ్ల్లో మెరుపులు మెరిపించిన విషయం తెలిసిందే. ఐపీఎల్లో 14 మ్యాచ్లు ఆడిన అతను.. 56.15 సగటున, 153.68 స్ట్రయిక్ రేట్తో 730 పరుగులు చేయగా.. సౌతాఫ్రికా టీ20 లీగ్లో 11 మ్యాచ్ల్లో 41 సగటున, 147.60 స్ట్రయిక్రేట్తో 369 పరుగులు చేశాడు. -
IPL 2024: సన్రైజర్స్లో కీలక పరిణామం.. హెడ్ కోచ్కు ఉద్వాసన..!
ఐపీఎల్ 2024 సీజన్ ప్రారంభానికి సమయం చాలా ఉండగానే, అన్ని జట్లు సన్నాహకాలు మొదలుపెట్టాయి. తొలుత లక్నో సూపర్ జెయింట్స్ హెడ్ కోచ్ను మార్చి తమ ప్రిపరేషన్స్ మొదలయ్యాయని సంకేతాలు పంపగా.. తాజాగా ఆర్సీబీ, సన్రైజర్స్, రాజస్థాన్ రాయల్స్ కూడా అదే పనిలో పడ్డాయి. ఫ్లవర్ను తప్పించి లాంగర్ను ఎంచుకున్న లక్నో.. లక్నో సూపర్ జెయింట్స్.. తమ ఫ్రాంచైజీ హెడ్ కోచ్ పదవి నుంచి ఆండీ ఫ్లవర్ను తప్పించి, ఆ స్థానాన్ని ఆసీస్ మాజీ కోచ్ జస్టిన్ లాంగర్కు కట్టబెట్టింది. ఫ్లవర్ ఆధ్వర్యంలో ఎల్ఎస్జీ 2022, 2023 సీజన్లలో వరుసగా ప్లే ఆఫ్స్కు చేరింది. బ్రియాన్ లారాకు ఉద్వాసన.. కొత్త కోచ్ వేటలో సన్రైజర్స్ 2023 సీజన్ ప్రారంభానికి ముందు టామ్ మూడీ నుంచి సన్రైజర్స్ హైదరాబాద్ హెడ్ కోచ్ బాధ్యతలు చేపట్టిన బ్రియాన్ లారా.. ఆ సీజన్లో ఫ్రాంచైజీపై ఎలాంటి ప్రభావం చూపించలేకపోయాడు. అతని ఆధ్వర్యంలో సన్రైజర్స్ గత సీజన్లో 10 మ్యాచ్లు ఆడి కేవలం నాలుగే విజయాలతో ఆఖరి స్థానంతో ముగించింది. దీంతో ఎస్ఆర్హెచ్ యాజమాన్యం లారాపై వేటు వేయాలని భావిస్తుందట. కొత్త కోచ్ రేసులో ఆండీ ఫ్లవర్, మరో విదేశీ ఆటగాడు ఉన్నట్లు సమాచారం. ఫ్లవర్కు భలే గిరాకి.. లక్నో సూపర్ జెయింట్స్ వదిలించుకున్న జింబాబ్వే మాజీ ఆటగాడు ఆండీ ఫ్లవర్కు ఐపీఎల్లో భలే గిరాకి ఉంది. కోచ్గా అతని ట్రాక్ రికార్డే ఇందుకు కారణం. లక్నో ఫ్రాంచైజీ ఫ్లవర్ను వదిలించుకున్న తర్వాత అతని కోసం రెండు ఫ్రాంచైజీలు ఎగబడుతున్నాయి. రాజస్థాన్ రాయల్స్ అతనిపై కన్నేసినట్లు సమాచారం. ఫ్లవర్తో రాయల్స్ బేరసారాలు అంతిమ దశలో ఉన్నట్లు తెలుస్తుంది. ఫ్లవర్ ఎంపికకు ఆ జట్టు డైరెక్టర్ సంగక్కర కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ఆర్సీబీలో కీలక మార్పులు.. 2024 ఐపీఎల్ సీజన్ కోసం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కీలక మార్పులకు శ్రీకారం చుట్టినట్లు తెలుస్తుంది. ఫ్రాంచైజీలో కీలక సభ్యులైన డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ మైక్ హెస్సన్, హెడ్ కోచ్ సంజయ్ బాంగర్లను వారి పదవుల నుంచి తప్పించాలని యాజమాన్యం భావిస్తున్నట్లు సమాచారం. బాంగర్, హెస్సన్లు గత ఐదు సీజన్లుగా ఆర్సీబీతో అనుబంధం కలిగి ఉన్నారు. భారత మాజీ క్రికెటర్ బాంగర్ను ఆర్సీబీ యాజమాన్యం 2022లో హెడ్ కోచ్గా నియమించుకుంది. -
IPL 2023: ఆర్సీబీ వైఫల్యాలకు కారణం ఎవరంటారు..?
మే 21న జరిగిన మ్యాచ్లో గుజరాత్ చేతిలో ఓటమితో ఐపీఎల్ 2023లో ఆర్సీబీ ప్రస్థానం ముగిసింది. దీంతో వరుసగా ఆ జట్టు 16వ ఎడిషన్లోనూ రిక్త హస్తాలతోనే లీగ్ నుంచి నిష్క్రమించింది. ప్రతి ఏడాది ఈ సారి కప్ మాదే అంటూ ఊదరగొట్టే ఆర్సీబీ.. ఈ ఏడాది కనీసం ప్లే ఆఫ్స్కు కూడా చేరకుండానే నిరాశగా లీగ్ నుంచి వైదొలిగింది. గత సీజన్లతో పోలిస్తే ఈ సీజన్లో ఆర్సీబీ పరిస్థితి మరింత దారుణంగా ఉన్నప్పటికీ.. డుప్లెసిస్ (14 మ్యాచ్ల్లో 730 పరుగులు), కోహ్లి (14 మ్యాచ్ల్లో 639 పరుగులు)లు జాకీలు వేసి పైకి లేపడంతో గ్రూప్ స్టేజ్ ఆఖరి మ్యాచ్ వరకు నెట్టుకొచ్చింది. డుప్లెసిస్, కోహ్లిల తర్వాత అడపాదడపా మ్యాక్స్వెల్ (14 మ్యాచ్ల్లో 400 పరుగులు), సిరాజ్ (14 మ్యాచ్ల్లో 19 వికెట్లు) రాణించడంతో ఆర్సీబీ 14 మ్యాచ్ల్లో కనీసం 7 మ్యాచ్ల్లోనైనా గెలవగలిగింది. వాస్తవానికి పైన పేర్కొన్న నలుగురి ప్రదర్శనలతో పాటు మిగతా జట్టు సభ్యులు నామమాత్రంగా రాణించినా ఆర్సీబీ 14 మ్యాచ్ల్లో కనీసం 9 మ్యాచ్ల్లోనైనా గెలవగలిగేదే. అయితే ఆ నలుగురు మినహాయించి ఒక్కరు కూడా కనీస ప్రదర్శన చేయకపోవడంతో ఆ జట్టుకు ఈ దుస్థితి దాపురించింది. బౌలింగ్లో కర్ణ్ శర్మ (9 వికెట్లు), హసరంగ (9 వికెట్లు), వేన్ పార్నెల్ (9 వికెట్లు), విజయ్కుమార్ వైశాఖ్ (9 వికెట్లు) కాస్త పర్వాలేదనిపించినప్పటికీ, వారి నుంచి ఈ ప్రదర్శనలు సరిపోలేదు. వీరు ఏదో టెయిలెండర్ల వికెట్లు సాధించారే తప్పించి, పరుగులను నియంత్రించలేకపోయారు. పలు మ్యాచ్ల్లో ఆర్సీబీ 200కు పైగా పరుగులు సాధించినప్పటికీ, ఆ స్కోర్లను డిఫెండ్ చేసుకోలేక చతికిలపడింది. ఆర్సీబీ బౌలింగ్ విభాగంలో దారుణంగా విఫలమైన వారిలో ఆల్రౌండర్ అని చెప్పుకునే షాబాజ్ అహ్మద్ (10 మ్యాచ్ల్లో ఒక్క వికెట్, 42 పరుగులు), హర్షల్ పటేల్ (8 వికెట్లు) ముఖ్యులు. వీరిలో మరి ముఖ్యంగా హర్షల్ పటేల్ తన స్థాయికి తగ్గట్టుగా రాణించకపోగా, ధారాళంగా పరుగులు సమర్పించుకున్నాడు. ఇక ఈ ఏడాది ఆర్సీబీ వైఫల్యాలకు ముఖ్య కారకులుగా చెప్పుకునే బ్యాటింగ్ హీరోల గురించి మాట్లాడుకోవాలి. గతేడాది ప్రదర్శనతో గ్రేట్ ఫినిషర్గా కీర్తించబడిన దినేశ్ కార్తీక్ (13 మ్యాచ్ల్లో 140 పరుగులు, 4 డకౌట్లు).. ఈ ఏడాది అత్యంత దారుణంగా విఫలమై, ఆర్సీబీ ఓటములకు ప్రత్యక్ష కారణమయ్యాడు. డీకే తన స్థాయికి తగ్గట్టుగా ఆడి ఉంటే ఆర్సీబీ సునాయాసంగా మరో 2 మ్యాచ్లు గెలిచేది. బ్యాటింగ్ విభాగంలో ఘోరంగా విఫలమైన మరో 4 ఆటగాళ్లు.. మహిపాల్ లోమ్రార్ (12 మ్యాచ్ల్లో 135 పరుగులు), షాబాజ్ అహ్మద్ (10 మ్యాచ్ల్లో 42 పరుగులు), అనూజ్ రావత్ (9 మ్యాచ్ల్లో 91), సుయాశ్ ప్రభుదేశాయ్ (5 మ్యాచ్ల్లో 35). వీరు గల్లీ క్రికెటర్ల కంటే హీనంగా బ్యాటింగ్ చేసి జట్టు ఓటముల్లో కీలకపాత్ర పోషించారు. డుప్లెసిస్-కోహ్లి జోడీ తొలి వికెట్కు రికార్డు స్థాయి భాగస్వామ్యాలు నమోదు చేసినప్పటికీ.. వీరు కనీస స్థాయి ఆట కూడా ఆడకుండా విఫలమయ్యారు. మొత్తంగా చూస్తే ఆ నలుగురు (డెప్లెసిస్, కోహ్లి, మ్యాక్స్వెల్, సిరాజ్) మినహాయించి జట్టు మొత్తం విఫలం కావడంతో ఈ ఏడాది ప్లే ఆఫ్స్కు చేరకుండానే ఆర్సీబీ ఖేల్ ఖతమైంది. ఈ ఏడాది ఆర్సీబీ వైఫల్యాల్లో ముఖ్య కారకులపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. చదవండి: సెమీ ఫైనల్కు వెళ్లే అర్హత ఆర్సీబీకి లేదు: డుప్లెసిస్ వ్యాఖ్యలు వైరల్ -
IPL 2023: ఆర్సీబీ టైటిల్ గెలవదని డుప్లెసిస్ ముందే చెప్పాడు..!
ఐపీఎల్ 2023లో ఆర్సీబీ ప్రస్తానం నిన్నటితో (మే 21) ముగిసింది. గుజరాత్ టైటాన్స్ చేతిలో ఓటమితో ఆ జట్టు కుంగుబాటుతో లీగ్ నుంచి నిష్క్రమించింది. విరాట్ కోహ్లి సెంచరీ చేయడంతో తప్పక గెలుస్తామనుకున్న మ్యాచ్లో ఆర్సీబీ ఓడింది. ఆర్సీబీ ప్లే ఆఫ్స్ అవకాశాలపై శుభ్మన్ గిల్ నీళ్లు చల్లాడు. ఫలితంగా ఆర్సీబీ ఇంటికి, ముంబై ప్లే ఆఫ్స్కు చేరాయి. ఆర్సీబీ.. ఈ ఏడాది కూడా టైటిల్ గెలవకుండా నిరాశగా వెనుదిరిగిన నేపథ్యంలో ఆ జట్టుకు సంబంధించిన పాత వీడియో ఒకటి ప్రస్తుతం ట్రెండింగ్లో నిలిచింది. సీజన్ ప్రారంభానికి ముందు ఓ ప్రత్యేక కార్యక్రమం సందర్భంగా ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ "ఈ ఏడాది కప్ లేదు" అని అన్నాడు. ఆర్సీబీ స్లోగన్ "ఈ సాల కప్ నమ్దే"ను డుప్లెసిస్ పొరపాటున "ఈ సాల కప్ నహీ" అని ఉచ్ఛరించాడు. దీంతో పక్కనే ఉన్న కోహ్లి.. డుప్లెసిస్ చేసిన తప్పును నవ్వుతూ సరిచేశాడు. దీనికి సంబంధించిన వీడియోను కొందరు ఆర్సీబీకి, ఆ జట్టు అభిమానులకు ట్యాగ్ చేస్తూ సోషల్మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఆర్సీబీ ఈ ఏడాది కూడా టైటిల్ గెలవదని డుప్లెసిస్కు ముందే తెలుసని కామెంట్లు చేస్తున్నారు. కొందరు సరదాగా ఈ వీడియోను షేర్ చేస్తుంటే, కొందరేమో ఆర్సీబీ ఓటమిని తమాషా చేస్తూ రాక్షసానందం పొందుతున్నారు. Even Faf Knows Ee Sala Cup Nahi 😂😂😂😂🙊😂😂😂😂#RCB pic.twitter.com/ZRu3moy66X — Dr Khushboo 🇮🇳 (@khushbookadri) April 1, 2023 తమ జట్టుపై అనవసర ట్రోలింగ్కు దిగుతున్న వారికి ఆర్సీబీ అభిమానులు సైతం ధీటైన సమాధానాలతో బదులిస్తున్నారు. ఆర్సీబీ ఎప్పటికీ టైటిల్ గెలవలేకపోయిన మేము వారితోనే ఉంటామని, కింగ్ కోహ్లి ఎప్పటికీ కింగేనని, డుప్లెసిస్ లాంటి టాలెంటెడ్ ఆటగాడిని హేళన చేస్తే క్రికెట్ అభిమానులు క్షమించరని కౌంటర్లిస్తున్నారు. కాగా, గుజరాత్ టైటాన్స్తో నిన్న జరిగిన మ్యాచ్లో విరాట్ కోహ్లి వీరోచిత శతకం వృధా అయ్యింది. శుభ్మన్ గిల్ సూపర్ సెంచరీతో గుజరాత్ను గెలిపించాడు. ఆర్సీబీ ఓటమిపాలవ్వడంతో ప్లే ఆఫ్స్కు చేరిన నాలుగో జట్టుగా ముంబై నిలిచింది. రేపు (మే 23) జరుగబోయే క్వాలిఫయర్ 1 మ్యాచ్లో గుజరాత్-సీఎస్కే.. మే 24న జరిగే ఎలిమినేటర్ మ్యాచ్లో లక్నో-ముంబై.. మే 26న జరిగే క్వాలిఫయర్ 2లో క్వాలిఫయర్ 1లో ఓడిన జట్టు-ఎలిమినేటర్లో గెలిచిన జట్టు.. మే 28న జరిగే ఫైనల్లో క్వాలిఫయర్ 1 విన్నర్-క్వాలిఫయర్ 2 విన్నర్లు తలపడతాయి. చదవండి: ఇంగ్లండ్కు బయల్దేరనున్న విరాట్ కోహ్లి -
SRH VS MI: ముంబై 11.4 ఓవర్లలో ఛేజ్ చేస్తేనే..!
సన్రైజర్స్ ఇవాళ (మే 21) జరుగుతున్న మ్యాచ్లో ముంబై ఇండియన్స్ ఐపీఎల్ 2023 భవితవ్యం తేలనుంది. ఈ మ్యాచ్లో ముంబై ఒకవేళ గెలిచినా నెట్ రన్రేట్ కీలకం కానుంది. ఎందుకంటే.. గుజరాత్తో ఇవాళ రాత్రి జరుగబోయే మ్యాచ్లో ఆర్సీబీ గెలిస్తే, మెరుగైన రన్రేట్ కారణంగా ఆ జట్టే ప్లే ఆఫ్స్కు అర్హత సాధిస్తుంది. ఒకవేళ గుజరాత్పై ఆర్సీబీ గెలిచినా ముంబై ప్లే ఆఫ్స్కు చేరాలంటే.. సన్రైజర్స్పై సాదాసీదాగా గెలిస్తే సరిపోదు. సన్రైజర్స్ నిర్ధేశించిన 201 పరుగుల లక్ష్యాన్ని ముంబై కేవలం 11.4 ఓవర్లలో ఛేదించాల్సి ఉంటుంది. ఇది అంత ఆషామాషీ విషయం కాదు కాబట్టి, గుజరాత్- ఆర్సీబీ మ్యాచే ప్లే ఆఫ్స్ నాలుగో బెర్తును డిసైడ్ చేస్తుంది. మరోవైపు గుజరాత్-ఆర్సీబీ మ్యాచ్కు వరుణుడు ముప్పు పొంచి ఉన్నట్లు తెలుస్తోంది. మ్యాచ్ సమయానికి ఉరుములతో కూడిన ఓ మోస్తరు వర్షం పడే అవకాశం ఉందని యాక్యూ వెదర్ చూపిస్తుంది. ఒకవేళ వర్షం కారణంగా మ్యాచ్ సాధ్యపడకపోతే ఆర్సీబీ ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమిస్తుంది (సన్రైజర్స్పై ముంబై గెలిచి). మ్యాచ్ రద్దైతే ఆర్సీబీ, గుజరాత్లకు చెరో పాయింట్ కేటాయిస్తారు. అప్పుడు ఆర్సీబీ ఖాతాలో 15 పాయింట్లు ఉంటాయి. సన్రైజర్స్పై ముంబై గెలిస్తే.. ఆ జట్టు 16 పాయింట్లతో నాలుగో జట్టుగా ప్లే ఆఫ్స్కు అర్హత సాధిస్తుంది. గుజరాత్ (18),సీఎస్కే (17), లక్నో (17) ఇదివరకే ప్లే ఆఫ్స్కు చేరుకోగా.. నాలుగో ప్లేస్ కోసం ముంబై, రాజస్థాన్, ఆర్సీబీ మధ్య పోటీ నెలకొంది. ఇదిలా ఉంటే, ముంబైతో మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన సన్రైజర్స్ భారీ స్కోర్ సాధించింది. వివ్రాంత్ శర్మ (69), మయాంక్ అగర్వాల్ (83) మెరుపు ఇన్నింగ్స్లతో విరుచుకుపడటంతో ఆ జట్టు నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది. క్లాసెన్ (18), ఫిలిప్స్ (1), బ్రూక్ (0) విఫలమయ్యారు. ముంబై బౌలర్లలో ఆకాశ్ మధ్వాల్ 4 వికెట్లు పడగొట్టాడు. 7 ఓవర్ల తర్వాత ముంబై స్కోర్ 73/1గా ఉంది. ఇషాన్ కిషన్ విఫలం కాగా.. కెమారూన్ గ్రీన్ (15 బంతుల్లో 42) ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నాడు. రోహిత్ (16 బంతుల్లో 16) పరుగులు చేసేందుకు ఇబ్బంది పడుతున్నాడు. చదవండి: MI VS SRH: ముంబై అంటే చాలు మనోడికి పూనకం వస్తుంది..! -
RCB VS GT: ఆర్సీబీ ఫ్యాన్స్కు బ్యాడ్న్యూస్.. వర్షం ముప్పు..?
బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా ఇవాళ (రాత్రి 7:30) అత్యంత కీలక సమరం జరుగనుంది. ఈ మ్యాచ్లో లోకల్ టీమ్ ఆర్సీబీ.. టేబుల్ టాపర్ గుజరాత్ టైటాన్స్తో అమీతుమీ తేల్చుకోనుంది. ఆర్సీబీ ప్లే ఆఫ్స్కు చేరాలంటే ఈ మ్యాచ్ తప్పక గెలవాల్సి ఉంది. ఇలాంటి కీలక మ్యాచ్కు ముందు ఆర్సీబీని ఓ అంశం తీవ్రంగా కలవరపెడుతుంది. ఈ మ్యాచ్కు వర్షం ముంపు పొంచి ఉందని వాతావరణ శాఖ వెల్లడించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మ్యాచ్ సమయానికి ఉరుములతో కూడిన ఓ మోస్తరు వర్షం పడే అవకాశం ఉందని యాక్యూ వెదర్ చూపిస్తుంది. ఒకవేళ వర్షం కారణంగా మ్యాచ్ సాధ్యపడకపోయినా లేక ఆటంకం కలిగినా ఆర్సీబీ తీవ్ర నష్టంగా పరిగణించబడుతుంది. మ్యాచ్ రద్దైతే ఆర్సీబీ, గుజరాత్లకు చెరో పాయింట్ కేటాయిస్తారు. అప్పుడు ఆర్సీబీ ఖాతాలో 15 పాయింట్లు ఉంటాయి. ఇది జరిగి, సన్రైజర్స్పై ముంబై గెలిస్తే.. ఆ జట్టు 16 పాయింట్లతో నాలుగో జట్టుగా ప్లే ఆఫ్స్కు అర్హత సాధిస్తుంది. ఈ సమీకరణల నేపథ్యంలో నేటి మ్యాచ్ వరుణుడు ఆటంకం లేకుండా సాగాలని ఆర్సీబీ అభిమానులు దేవుళ్లను వేడుకుంటున్నారు. కాగా, గుజరాత్ (18),సీఎస్కే (17), లక్నో (17) ఇదివరకే ప్లే ఆఫ్స్కు చేరుకున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే, ఐపీఎల్ 2023 కీలక దశకు చేరిన తరుణంలో ఆర్సీబీ ఆటగాళ్లు సత్తా చాటుతున్నారు. బ్యాటర్లు విరాట్ కోహ్లి, డుప్లెసిస్, మ్యాక్స్వెల్ ఓ రేంజ్లో ఇరగదీస్తున్నారు. గత మ్యాచ్లో విరాట్ సూపర్ సెంచరీతో కదంతొక్కాడు. డుప్లెసిస్, మ్యాక్స్వెల్, బ్రేస్వెల్ రాణిస్తున్నారు. బౌలింగ్లో సిరాజ్, పార్నెల్, హసరంగ, హాజిల్వుడ్ పర్వాలేదనిపిస్తున్నారు. వర్షం నుంచి ఎలాంటి ఆటంకం కలగకపోతే ఈ మ్యాచ్లో ఆర్సీబీ తప్పక గెలుస్తుందని ఆ జట్టు అభిమానులు గట్టిగా నమ్ముతున్నారు. ఆర్సీబీ.. గెలిచి నిలుస్తుందా లేక ఓడి నిష్క్రమిస్తుందా అన్నది తెలియాలంటే మరికొద్ది గంటలు వేచి చూడాలి. చదవండి: MI Vs SRH: ముంబైకి చావోరేవో.. యువ బ్యాటర్ రీఎంట్రీ! ఉమ్రాన్కు ‘లాస్ట్’ ఛాన్స్! -
ఇలా జరిగితే ఐపీఎల్ 2023 ఫైనల్లో ఆర్సీబీ, లక్నో జట్లు..!
ఐపీఎల్-2023 ప్లే ఆఫ్స్ బెర్తులు రసవత్తరంగా మారాయి. నేడు (మే 18, ఆర్సీబీ వర్సెస్ సన్రైజర్స్), రేపు (మే 19, పంజాబ్, రాజస్థాన్) జరుగబోయే మ్యాచ్లతో ప్లే ఆఫ్స్ బెర్తులపై ఓ క్లారిటీ వస్తుంది. ప్రస్తుతానికి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న గుజరాత్ టైటాన్స్ను పక్కన పెడితే.. ప్లే ఆఫ్స్ రేసులో అనధికారికంగా ఐదు జట్లు (సీఎస్కే, లక్నో, ముంబై, ఆర్సీబీ, రాజస్థాన్) ఉన్నాయి. ఈ ఐదింటిలో మూడు జట్లు ప్లే ఆఫ్స్కు చేరుకుంటే, రెండు జట్లు లీగ్ నుంచి నిష్క్రమిస్తాయి. ఈ క్రమంలో కొందరు క్రేజీ అభిమానులు ఆర్సీబీ-లక్నో జట్లు ఫైనల్లో తలపడితే మజా ఉంటుందని ఆశిస్తున్నారు. కోహ్లి-గంభీర్ల మధ్య వివాదాల నేపథ్యంలో ఇలాంటి ఫైనల్ జరిగితే రసవత్తరంగా ఉంటుందని వారు భావిస్తున్నారు. ఈ రెండు జట్లు ఫైనల్కు చేరితే సగటు అభిమానికి కావాల్సినంత మజా దొరుకుతుందని అనుకుంటున్నారు. మరి ఆర్సీబీ-లక్నో జట్లు ఫైనల్కు చేరాలంటే తదుపరి జరుగబోయే మ్యాచ్ల్లో ఏ జట్లు గెలవాలో ఓ సారి పరిశీలిద్దాం. సన్రైజర్స్పై ఇవాల్టి మ్యాచ్లో ఆర్సీబీ గెలవాలి రాజస్థాన్పై పంజాబ్ గెలవాలి సీఎస్కేపై ఢిల్లీ గెలవాలి కేకేఆర్పై లక్నో గెలవాలి ముంబైపై సన్రైజర్స్ గెలవాలి గుజరాత్పై ఆర్సీబీ గెలవాలి అప్పుడు టేబుల్ టాపర్గా గుజరాత్ (18), రెండో స్థానంలో లక్నో (17), మూడో ప్లేస్లో ఆర్సీబీ (16), నాలుగో స్థానంలో సీఎస్కే (15) ఉంటాయి. ఇదే జరిగితే.. క్వాలిఫయర్-1లో గుజరాత్-లక్నో (లక్నో గెలవాలి) ఎలిమినేటర్లో ఆర్సీబీ-సీఎస్కే (ఆర్సీబీ గెలవాలి) క్వాలిఫయర్-2లో ఆర్సీబీ-గుజరాత్ (ఆర్సీబీ గెలవాలి) తలపడతాయి. పై పేర్కొన్న విధంగా అన్ని జరిగితే ఐపీఎల్ 2023 ఫైనల్లో లక్నో-ఆర్సీబీ తలపడే అవకాశం ఉంటుంది. చదవండి: SRH VS RCB: ఆర్సీబీని బయపెడుతున్న కోహ్లి -
SRH VS RCB: ఆర్సీబీని భయపెడుతున్న కోహ్లి
హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం (ఉప్పల్) వేదికగా సన్రైజర్స్తో ఇవాళ (మే 18) జరుగబోయే అత్యంత కీలకమైన మ్యాచ్కు ముందు విరాట్ కోహ్లి.. తన సొంత జట్టు ఆర్సీబీనే బయపెడుతున్నాడు. ఐపీఎల్లో సన్రైజర్స్పై ఓ మోస్తరు రికార్డు (20 మ్యాచ్ల్లో 31.61 సగటున 136.77 స్ట్రయిక్ రేట్తో 569 పరుగులు) కలిగిన కోహ్లి.. ఆ జట్టుతో ఆడిన గత రెండు మ్యాచ్ల్లో గోల్డెన్ డకౌట్ (తొలి బంతికే ఔట్) కావడమే ఆర్సీబీ భయానికి కారణం. ప్లే ఆఫ్స్కు చేరాలంటే అత్యంత కీలకంగా మారిన ఈ మ్యాచ్లో కోహ్లి గోల్డెన్ డకౌట్ అయినా లేక విఫలమైనా ఆర్సీబీ అభిమానులు, ఆ జట్టు యాజమాన్యం అస్సలు తట్టుకోలేని పరిస్థితి. ప్రస్తుత సీజన్లో కేవలం KGF (కోహ్లి, గ్లెన్ మ్యాక్స్వెల్, ఫాఫ్ డుప్లెసిస్) మెరుపులతో ఇంత వరకు నెట్టుకొచ్చిన ఆర్సీబీ.. తమకు అత్యంత కీలకమైన తదుపరి రెండు మ్యాచ్ల విషయంలో కోహ్లిపై భారీ అంచనాలు పెట్టుకుంది. ఈ రెండు మ్యాచ్ల్లో కోహ్లి విజృంభిస్తే, ఈ సాలా కప్ నమ్దే (ఈ సారి కప్ మాదే) అని ఫ్యాన్స్ అంటున్నారు. సన్రైజర్స్తో మ్యాచ్కు వేదిక అయిన ఉప్పల్ స్టేడియం కోహ్లికి అచ్చొందే అయినప్పటికీ.. ఆర్సీబీ ఫ్యాన్స్లో ఏదో మూల కీడు శంకిస్తుంది. ఓ వైపు సన్రైజర్స్ అభిమానులు సైతం తమకే మద్దతుగా నిలబడుతున్నప్పటికీ.. ఆర్సీబీ అభిమానుల్లో ఏదో తెలియని కలవరం నెలకొంది. నాసికరం జట్టుతో ఇంతవరకు నెట్టుకొచ్చిన KGF.. తదుపరి మ్యాచ్ల్లో అంచనాలకు మించి రాణించాలని ఆర్సీబీ ఫ్యాన్స్ దేవుళ్లను ప్రార్ధిస్తున్నారు. తదుపరి జరుగబోయే మ్యాచ్ల్లో విజృంభించి, ఈ ఏడాదైనా కోహ్లికి ఐపీఎల్ టైటిల్ను గిఫ్ట్గా ఇవ్వాలని ఆర్సీబీ ఆటగాళ్లు సైతం భావిస్తున్నారు. కాగా, ఈ మ్యాచ్లో గెలుపుతో సన్రైజర్స్కు ఒరిగేదేమీ లేనప్పటికీ, ఆర్సీబీకి మాత్రం అత్యంత కీలకం. ఈ మ్యాచ్లో గెలిస్తేనే ఆర్సీబీ ప్లే ఆఫ్స్ అవకాశాలు సజీవంగా ఉంటాయి. లేదంటే పరిస్థితులు చాలా ఇబ్బందికరంగా మారతాయి. ఆర్సీబీకి మరో మ్యాచ్ ఆడే అవకాశం ఉన్నా, అది టేబుల్ టాపర్ గుజరాత్తో (మే 21న) కావడం, అదీ భారీ తేడాతో గెలవాల్సి ఉండటం ఆ జట్టుకు పెద్ద సమస్యగా మారుతుంది. చదవండి: సన్రైజర్స్తో కీలక మ్యాచ్..! బౌలింగ్ చేసిన కోహ్లి.. ‘కేజీఎఫ్’ వీడియో వైరల్ -
గతం సన్రైజర్స్కు అనుకూలం, మరి ఆర్సీబీ గెలుస్తుందా..?
ఐపీఎల్ 2023లో భాగంగా హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా ఇవాళ (మే 18) జరుగబోయే కీలక సమరంలో సన్రైజర్స్-రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్లో గెలుపుతో సన్రైజర్స్కు ఒరిగేదేమీ లేనప్పటికీ, ఆర్సీబీకి మాత్రం అత్యంత కీలకం. ఈ మ్యాచ్లో గెలిస్తేనే ఆర్సీబీ ప్లే ఆఫ్స్ అవకాశాలు సజీవంగా ఉంటాయి. లేదంటే పరిస్థితులు చాలా ఇబ్బందికరంగా మారతాయి. ఆర్సీబీకి మరో మ్యాచ్ ఆడే అవకాశం ఉన్నా, అది టేబుల్ టాపర్ గుజరాత్తో (మే 21న) కావడం, అదీ భారీ తేడాతో గెలవాల్సి ఉండటం ఆ జట్టుకు పెద్ద సమస్యగా మారుతుంది. ఇక, నేటి మ్యాచ్లో ఏ జట్టు గెలుస్తుందో, ఏ జట్టు ఓడుతుందో అన్న విషయాన్ని పక్కన పెడితే.. ఆర్సీబీపై సన్రైజర్స్ గెలుపోటముల రికార్డు ఘనంగా ఉంది. ఇరు జట్ల మధ్య ఇప్పటివరకు 22 మ్యాచ్లు జరగ్గా.. సన్రైజర్స్ 12, ఆర్సీబీ 9 మ్యాచ్ల్లో గెలుపొందాయి. ఓ మ్యాచ్ రద్దైంది. గతం సన్రైజర్స్కు అనుకూలంగా ఉండటంతో ఈ మ్యాచ్లో ఆర్సీబీ గెలుస్తుందా..లేదా..? అన్న ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ప్రస్తుత ఫామ్ ప్రకారం సన్రైజర్స్తో పోలిస్తే ఆర్సీబీకే విజయావకాశాలు అధికంగా ఉన్నప్పటికీ.. ఆ జట్టు పూర్తిగా KGF (కోహ్లి, గ్లెన్ మ్యాక్స్వెల్, ఫాఫ్ డుప్లెసిస్)పైనే అధారపడి ఉండటం వారి ఫ్యాన్స్ను కలవరపెడుతుంది. మరోవైపు సన్రైజర్స్ పరిస్థితి సైతం ఏమంత ఆశాజనకంగా లేదు. ఆటగాళ్ల నిలకడలేమి ఆ జట్టు ఓటములకు ప్రధాన కారణంగా మారింది. ఏ ఆటగాడు ఎప్పుడు ఎలా ఆడతాడో వారితో పాటు ఎవరికీ తెలియని పరిస్థితి. KGFతో పాటు సిరాజ్, హాజిల్వుడ్, కర్ణ్ శర్మ తమ ఫామ్ను కొనసాగిస్తే, నేటి మ్యాచ్లో ఆర్సీబీ గెలవడం పెద్ద సమస్య ఏమీ కాకపోవచ్చు. సన్రైజర్స్ ఫ్యాన్స్ సైతం నేటి మ్యాచ్లో ఆర్సీబీనే గెలవాలనుకోవడం విశేషం. తమ జట్టు ఎలాగూ ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించింది కాబట్టి, వారు ఆర్సీబీ గెలిచి ప్లే ఆఫ్స్కు చేరుకోవాలని కోరుకుంటున్నారు. విరాట్ కోహ్లి ఇంతవరకు ఐపీఎల్ టైటిల్ గెలవలేదన్న సానుభూతి అభిమానుల్లో ఉంది. దీంతో ఈ యేడు సన్రైజర్స్ ఫ్యాన్స్ కూడా ఆర్సీబీ మద్దతుదారులుగా మారిపోయారు. ఏది ఎలా ఉన్నా, నేటి మ్యాచ్లో ఎవరు గెలుస్తారో వేచి చూడాలి. చదవండి: IPL 2023: సన్రైజర్స్తో ఆర్సీబీ మ్యాచ్.. గెలిచిందా నిలుస్తుంది..! -
IPL 2023: సన్రైజర్స్తో ఆర్సీబీ మ్యాచ్.. గెలిచిందా నిలుస్తుంది..!
ఐపీఎల్ 2023లో భాగంగా ఇవాళ (మే 18) మరో కీలక మ్యాచ్ జరుగనుంది. హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా సన్రైజర్స్తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అమీతుమీ తేల్చుకోనుంది. ఈ మ్యాచ్లో ఆర్సీబీ తప్పక గెలిస్తేనే ప్లే ఆఫ్స్ అవకాశాలు సజీవంగా ఉంటాయి. ఒకవేళ ఆర్సీబీ ఓడిందా.. ఢిల్లీ (అధికారికంగా ఔట్), సన్రైజర్స్, పంజాబ్, కేకేఆర్ (ప్లే ఆఫ్స్ అవకాశాలు దాదాపుగా లేనట్లే) బాటలోనే ప్లే ఆఫ్స్కు చేరకుండా లీగ్ నుంచి నిష్క్రమించే ప్రమాదం ఉంది. నేటి మ్యాచ్లో ఆర్సీబీ.. ఎస్ఆర్హెచ్ చేతిలో ఓడినా మరో అవకాశం ఉంటుంది. అయితే మే 21న గుజరాత్తో జరిగే మ్యాచ్లో ఆర్సీబీ భారీ తేడాతో విజయం సాధించాల్సి ఉంటుంది. అప్పటికీ ఆర్సీబీ ప్లే ఆఫ్స్కు అర్హత సాధిస్తుందని చెప్పలేని పరిస్థితి. రేపు (మే 19) జరుగబోయే మ్యాచ్లో రాజస్థాన్పై పంజాబ్, మే 20న జరిగే రెండు మ్యాచ్ల్లో ఢిల్లీపై సీఎస్కే, కేకేఆర్పై లక్నో, మే 21న (మధ్యాహ్నం) జరిగే మ్యాచ్లో సన్రైజర్స్ చేతిలో ముంబై ఓడితే అప్పుడు ఆర్సీబీ ప్లే ఆఫ్స్కు అర్హత సాధిస్తుంది. అప్పటికి కూడా నెట్ రన్రేట్ కీలకంగా మారుతుంది. గుజరాత్పై ఆర్సీబీ సాధారణ విజయం సాధించినా ముంబైతో సమానంగా ఇరు జట్ల ఖాతాలో 14 పాయింట్లు ఉంటాయి. అప్పుడు మెరుగైన రన్రేట్ కలిగిన జట్టు గుజరాత్ (18), సీఎస్కే (17), లక్నో (17)లతో పాటు ప్లే ఆఫ్స్కు చేరుతుంది. ఒకవేళ పంజాబ్పై రాజస్థాన్ గెలిచినా.. సన్రైజర్స్పై ముంబై గెలిచినా.. ఢిల్లీ చేతిలో సీఎస్కే, కేకేఆర్ చేతిలో లక్నో ఓడినా సమీకరణలన్నీ మారిపోతాయి. అప్పుడు 2, 3, 4 స్థానాల కోసం సీఎస్కే, లక్నో, ముంబై, ఆర్సీబీ, రాజస్థాన్ జట్లు పోటీపడాల్సి ఉంటుంది. నెగిటివ్ రన్రేట్ కారణంగా 12 పాయింట్లు ఉన్నప్పటికీ కేకేఆర్, పంజాబ్ జట్లు ప్లే ఆఫ్స్ రేసు నుంచి అనధికారికంగా నిష్క్రమించినట్లే. చదవండి: చిక్కుల్లో చెన్నై సూపర్ కింగ్స్.. కేసు నమోదు! ఎందుకంటే? -
KKR VS RR: ఆ రికార్డును ఎవరూ పట్టించుకోలేదు.. కోహ్లి తర్వాత యశస్వి ఒక్కడే..!
ఐపీఎల్ 2023లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా కేకేఆర్తో నిన్న (మే 11) జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ ప్లేయర్లు పలు రికార్డులను కొల్లగొట్టారు. ఐపీఎల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా చహల్ (143 మ్యాచ్ల్లో 187 వికెట్లు) అవతరించగా.. ఫాస్టెస్ట్ ఫిఫ్టి రికార్డును (13 బంతుల్లో) జైస్వాల్ బద్దలు కొట్టాడు. ఈ రెండు ఐపీఎల్ అత్యుత్తమ రికార్డులతో పాటు పలు సాధారణ రికార్డులు సైతం ఈ మ్యాచ్లో నమోదయ్యాయి. ప్రస్తుత సీజన్లో డెత్ ఓవర్లలో (16 నుంచి 20 ఓవర్లు) అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్గా చహల్ (11) రికార్డుల్లోకెక్కగా, బంతుల పరంగా రాజస్థాన్ ఐపీఎల్లో రెండో అతి పెద్ద విజయాన్ని (41) నమోదు చేసింది. అయితే, ఇన్ని రికార్డుల మధ్య ఒక్క రికార్డును మాత్రం ఎవరూ నోటీస్ చేయలేదు. ఈ మ్యాచ్ తొలి ఓవర్లో (నితీశ్ రాణా బౌలింగ్) తొలి రెండు బంతులను సిక్సర్లుగా మలిచిన యశస్వి.. ఐపీఎల్ చరిత్రలో ఆర్సీబీ ఆటగాడు విరాట్ కోహ్లి తర్వాత ఈ ఫీట్ సాధించిన రెండో ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. 2019లో రాజస్థాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో విరాట్ ఇన్నింగ్స్ తొలి రెండు బంతులను బ్యాక్ టు బ్యాక్ సిక్సర్లుగా మలిచాడు. ఇక మ్యాచ్ విషయానికొస్తే.. యశస్వి (47 బంతుల్లో 98 నాటౌట్; 13 ఫోర్లు, 5 సిక్సర్లు), సంజూ శాంసన్ (29 బంతుల్లో 48 నాటౌట్; 2 ఫోర్లు, 5 సిక్సర్లు) పరుగుల సునామీ సృష్టించిన ఈ మ్యాచ్లో కేకేఆర్పై రాజస్థాన్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్.. నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేయగా.. రాజస్థాన్ 13.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. ఈ గెలుపుతో రాజస్థాన్ పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి ఎగబాకగా.. కేకేఆర్ ఏడో స్థానంలో నిలిచింది. చదవండి: జైస్వాల్ సెంచరీ చేయకుండా అడ్డుకున్న సుయాశ్.. ఏకి పారేసిన ఆకాశ్ -
నిప్పు ఉప్పులా ఉండే కోహ్లి, గంగూలీ కలిసిపోయారు.. కోహ్లి ఇక ఢిల్లీకి వచ్చేయ్..!
ఆర్సీబీ కీ ప్లేయర్ విరాట్ కోహ్లి, ఢిల్లీ క్యాపిటల్స్ డైరెక్టర్ సౌరవ్ గంగూలీ చాలాకాలంగా తమ మధ్య నెలకొన్న విభేదాలకు స్వస్తి పలికినట్లు తెలుస్తోంది. నిన్న (మే 6) ఆర్సీబీ-డీసీ జట్ల మధ్య మ్యాచ్ అనంతరం వీరిరువురు ఆప్యాయంగా కరచాలనం చేస్తూ, ఒకరి భజం మరొకరు తట్టుకుంటూ కనిపించారు. ఈ సీన్ ప్రస్తుతం సోషల్మీడియాలో వైరలవుతోంది. 🚨 Massive Respect 🚨 Hand Shake And Almost Hug Moment Between Sourav Ganguly & Virat Kohli Two Of The Best To Lead Indian Cricket ❤️#IPL23 #rcbvsdc #DCvsRCB pic.twitter.com/bIoLrNNvVD — Vaibhav Bhola 🇮🇳 (@VibhuBhola) May 6, 2023 కోహ్లి, దాదా కలిసిపోయారని భారత క్రికెట్ అభిమానులు సంబరపడిపోతున్నారు. డీసీ అభిమానులైతే ఓ అడుగు ముందుకేసి.. గంగూలీతో వివాదం సమసిపోయింది కదా కోహ్లి.. ఆర్సీబీని వదిలేసి తమ జట్టుకు వచ్చేయ్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. కోహ్లి అభిమానులు సైతం తమ ఆరాధ్య క్రికెటర్ గంగూలీతో హుందాగా వ్యవహరించడం పట్ల హర్షిస్తున్నారు. The way Virat Kohli looked at ganguly pic.twitter.com/pLoAzyn9EI — itz_mksoni25 (@_itz_mksoni25) April 17, 2023 కాగా, గంగూలీ బీసీసీఐ బాస్గా ఉన్నప్పుడు టీమిండియా కెప్టెన్సీ విషయంలో కోహ్లితో మొదలైన వివాదం నిన్న మొన్నటి వరకు సాగింది. ఈ మధ్యలో అనేక సందర్భాల్లో వీరు బహిరంగానే ఒకరితో ఒకరు విభేదించారు. ప్రస్తుత ఐపీఎల్ సీజన్లోనే డీసీతో జరిగిన తొలి మ్యాచ్ సందర్భంగా వీరిద్దరి మధ్య విభేదాలు తారా స్థాయికి చేరినట్లు కనిపించాయి. ఆ మ్యాచ్లో వీరిద్దరూ ఎదురెదురు పడినప్పటికీ ఒకరినొకరు పలకరించుకోకుండా తప్పించుకున్నారు. Virat Kohli stares towards Sourav Ganguly and Ricky Ponting after takes the catch. 🔥 pic.twitter.com/EmuAzzzzMb — S. (@Sobuujj) April 15, 2023 తొలుత కోహ్లి ఏదో మనసులో పెట్టుకుని గంగూలీ వైపు కోపంగా చూడగా.. ఆతర్వాత ఇరువురు షేక్ హ్యాండ్ ఇచ్చుకునే తరుణంలో (మ్యాచ్ అనంతరం) కోహ్లిని చూసి గంగూలీ తప్పుకున్నాడు. దీంతో కోహ్లికి చిర్రెత్తిపోయి వెనక్కు తిరిగి గంగూలీవైపు మరోసారి బిర్రుగా చూశాడు. గంగూలీ చర్యకు బదులుగా కోహ్లి.. ఇన్స్టాగ్రామ్లో గంగూలీని అన్ఫాలో చేసి, తమ మధ్య అగాధాన్ని మరింత పెంచుకున్నాడు. No handshake between Virat Kohli and Sourav Ganguly❓😳 📸: Jio Cinema#RCBvDC #IPL23 #IPL2023 #IPLonJioCinema pic.twitter.com/7iRoSq4kw7 — CrickDesi (@Crick_Desi) April 15, 2023 అయితే దాదా.. తాను కూడా తగ్గేదేలేదంటూ ఇన్స్టాలో కోహ్లిని అన్ ఫాలో చేశాడు. దీంతో వీరిద్దరి మధ్య వివాదం మరింత ముదిరేలా ఉందని అభిమానులు అనుకున్నారు. అయితే ఎవరూ ఊహించని విధంగా నిన్నటి మ్యాచ్ అనంతరం కోహ్లి-గంగూలీ ఆప్యాయంగా ఒకరికొకరు షేక్ హ్యాండ్ ఇచ్చుకోవడంతో ఇరువురి అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చదవండి: గంభీర్, గంగూలీలతో వివాదం.. బీసీసీఐకి కోహ్లి లేఖ ఇదిలా ఉంటే, ఢిల్లీ క్యాపిటల్స్తో నిన్న (మే 6) జరిగిన మ్యాచ్లో ఆర్సీబీ 7 వికెట్ల తేడాతో పరాజయంపాలైన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ భారీ స్కోర్ సాధించినప్పటికీ.. దాన్ని డిఫెండ్ చేసుకోవడంలో విఫలమై దారుణ పరాభవాన్ని మూటగట్టుకుంది. కోహ్లి (55), మహిపాల్ లోమ్రార్ (54 నాటౌట్), డుప్లెసిస్ (45) రాణించడంతో ఆర్సీబీ 181 పరుగులు చేయగా.. ఛేదనలో ఫిలిప్ సాల్ట్ (87) చెలరేగడంతో ఢిల్లీ మరో 20 బంతులు మిగిలుండగానే సునాయాస విజయం సాధించింది. ఢిల్లీ బ్యాటర్లలోవార్నర్ (22), మిచెల్ మార్ష్ (26) ఓ మోస్తరుగా రాణించగా.. రిలీ రొస్సో (35 నాటౌట్), అక్షర్ పటేల్ (8 నాటౌట్) డీసీని విజయతీరాలకు చేర్చారు. చదవండి: కోహ్లిని మరోసారి రెచ్చిగొట్టిన నవీన్ ఉల్ హక్.. గంభీర్ మద్దతు -
కోహ్లిని మరోసారి రెచ్చిగొట్టిన నవీన్ ఉల్ హక్.. గంభీర్ మద్దతు
ఐపీఎల్ 2023లో భాగంగా మే 1న ఆర్సీబీ-లక్నో సూపర్ జెయింట్స్ మధ్య జరిగిన మ్యాచ్లో కోహ్లి.. నవీన్ ఉల్ హక్, గౌతమ్ గంభీర్ల మధ్య జరిగిన వివాదం ఇంకా సద్దుమణగక ముందే నవీన్ ఉల్ హక్ మరోసారి కోహ్లిని రెచ్చగొట్టాడు. ఈ ఆఫ్ఘనిస్తాన్ పేసర్ తాజాగా తన జట్టు మెంటార్ గంభీర్తో కలిసి దిగిన ఫోటోను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేస్తూ కోహ్లిని రెచ్చగొట్టే కామెంట్స్ చేశాడు. మీతో ఇతరులు ఎలా వ్యవహరించాలని కోరుకుంటారో, మీరు కూడా వారితో అలాగే వ్యవహరించండి.. మీతో ఇతరులు ఎలా మట్లాడాలనుకుంటారో, మీరు కూడా వారితో అలాగే మాట్లాడండి అంటూ నవీన్ తన ఇన్స్టాలో రాసుకొచ్చాడు. దీనిపై గంభీర్ స్పందిస్తూ.. నువ్వు ఎలా ఉంటావో అలాగే ఉండు, ఎప్పుడూ మార్చుకోకు.. అంటూ నవీన్ కామెంట్స్కు మద్దతు పలుకుతూ కోహ్లికి పరోక్షంగా చురకలంటించాడు. మరి నవీన్-గంభీర్లు చేసిన ఈ వ్యాఖ్యలపై కోహ్లి ఎలా స్పందిస్తాడో వేచి చూడాలి. View this post on Instagram A post shared by Naveen ul haq Murid (@naveen_ul_haq) మరోవైపు, గంభీర్ వ్యవహారం విషయమై కోహ్లి.. బీసీసీఐకి ఓ లేఖ రాసినట్లు ప్రచారం జరుగుతుంది. ఆ లేఖలో కోహ్లి తన తప్పేమీ లేదని, తాను అమాయకుడినని, వారు రెచ్చగొడితేనే నేను స్పందించానని పేర్కొన్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే, కృనాల్ పాండ్యా (గాయంతో కేఎల్ రాహుల్ ఐపీఎల్ నుంచి వైదొలిగాడు) నేతృత్వంలో లక్నో టీమ్ ఇవాళ (మే 7) టేబుల్ టాపర్ గుజరాత్ టైటాన్స్తో ఢీకొట్టనుంది. మధ్యాహ్నం 3: 30 గంటలకు ఈ మ్యాచ్లో అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరుగనుంది. ప్రస్తుతం లక్నో 10 మ్యాచ్ల్లో 5 విజయాలతో పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతోంది. చదవండి: గంభీర్, గంగూలీలతో వివాదం.. బీసీసీఐకి కోహ్లి లేఖ -
DC VS RCB: ఢిల్లీ క్యాపిటల్స్కు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ ప్లేయర్
ఆర్సీబీతో ఇవాళ (మే 6, రాత్రి 7: 30 గటంలకు) జరుగబోయే కీలక మ్యాచ్కు ముందు ఢిల్లీ క్యాపిటల్స్కు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ బౌలర్ అన్రిచ్ నోర్జే వ్యక్తిగత కారణాల చేత స్వదేశానికి (దక్షిణాఫ్రికా) వెళ్లిపోయాడు. ఈ విషయాన్ని డీసీ యాజమాన్యం అధికారికంగా ప్రకటించింది. పర్సనల్ ఎమర్జెన్సీ కారణంగా నోర్జే ఇంటికి వెళ్లినట్లు డీసీ మేనేజ్మెంట్ పేర్కొంది. డీసీ ఆడబోయే తదుపరి మ్యాచ్ సమయానికంతా నోర్జే అందబాటులో ఉంటాడని ఆశాభావం వ్యక్తం చేసింది. చదవండి: DC Vs RCB: విరాట్ సెంచరీ కొట్టు.. ఆర్సీబీని గెలిపించు! అదే దాదాకు నువ్విచ్చే కానుక 𝐎𝐟𝐟𝐢𝐜𝐢𝐚𝐥 𝐒𝐭𝐚𝐭𝐞𝐦𝐞𝐧𝐭 Owing to a personal emergency, Delhi Capitals fast bowler Anrich Nortje had to leave for South Africa late on Friday night. He will be unavailable for this evening’s game against Royal Challengers Bangalore. pic.twitter.com/lig7mfgLan — Delhi Capitals (@DelhiCapitals) May 6, 2023 కాగా, నోర్జే లేని లోటు డీసీ విజయావకాశాలపై తీవ్ర ప్రభావం చూపనుంది. కచ్చితమైన వేగం, లైన్ అండ్ లెంగ్త్తో బౌలింగ్ చేసే నోర్జే.. ఈ సీజన్లో ఢిల్లీ సాధించిన అతికొద్ది విజయాల్లో కీలకపాత్ర పోషించాడు. 9 మ్యాచ్ల్లో కేవలం మూడే విజయాలు సాధించి, పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉన్న ఢిల్లీకి నోర్జే లేకపోవడం పెద్ద ఎదురుదెబ్బే. చదవండి: CSK VS MI: ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత చెత్త రికార్డు మూటగట్టుకున్న రోహిత్ శర్మ -
ఢిల్లీ క్యాపిటల్స్తో మ్యాచ్.. చరిత్ర సృష్టించనున్న విరాట్ కోహ్లి
ఐపీఎల్-2023లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు-ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య ఇవాళ (మే 6) రాత్రి 7: 30 గంటలకు జరుగనున్న మ్యాచ్లో ఓ భారీ రికార్డు నమోదయ్యే అవకాశం ఉంది. ఈ మ్యాచ్లో ఆర్సీబీ స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి 12 పరుగులు చేస్తే.. ఐపీఎల్ చరిత్రలో 7000 పరుగుల మార్కును అందుకున్న తొలి ఆటగాడిగా రికార్డు సృష్టించనున్నాడు. ప్రస్తుతం కోహ్లి ఖాతాలో 6988 పరుగులు (232 మ్యాచ్ల్లో) ఉన్నాయి. ఐపీఎల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో కోహ్లి టాప్లో ఉండగా.. ఆ తర్వాత శిఖర్ ధవన్ (6536), డేవిడ్ వార్నర్ (6189), రోహిత్ శర్మ (6063) వరుసగా 2, 3, 4 స్థానాల్లో ఉన్నారు. చదవండి: CSK VS MI: ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత చెత్త రికార్డు మూటగట్టుకున్న రోహిత్ శర్మ కాగా, ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో సూపర్ ఫామ్లో (9 మ్యాచ్ల్లో 364 పరుగులు, 5 ఫిఫ్టీలు) ఉన్న విరాట్ కోహ్లికి ఢిల్లీతో మ్యాచ్లోనే 7000 పరుగుల మార్కును అధిగమించడం పెద్ద కష్టమేమీ కాకపోవచ్చు. ఐపీఎల్-2023 50వ మ్యాచ్లో కోహ్లి ఈ మైలురాయిని అందుకోగలిగితే, అతనికి ఈ మ్యాచ్లో చిరకాలం గుర్తుండిపోతుంది. ఆర్సీబీ ప్లే ఆఫ్స్కు అర్హత సాధించే విషయంలోనూ ఈ మ్యాచ్ చాలా కీలకంగా ఉన్నందున, కోహ్లి సైతం ఈ మ్యాచ్లో శక్తి మేరకు రాణించాలని ఆశిస్తాడు. ఆర్సీబీ ప్రస్తుతం 9 మ్యాచ్ల్లో 5 విజయాలతో పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో (-0.030) కొనసాగుతోంది. ఈ మ్యాచ్లో ఆర్సీబీ భారీ తేడాతో గెలిస్తే ఏకంగా 3 స్థానాలు మెరుగుపర్చుకుని రెండో ప్లేస్కు (ముంబై చేతిలో చెన్నై ఓడితే) ఎగబాకుతుంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో గుజరాత్ టాప్లో (14 పాయింట్లు) ఉండగా.. లక్నో (11 పాయింట్లు, 0.639) రెండులో, సీఎస్కే (11 పాయింట్లు, 0.329) మూడులో, రాజస్థాన్ (10 పాయింట్లు, 0.448) నాలుగో స్థానంలో ఉన్నాయి. చదవండి: DC Vs RCB: విరాట్ సెంచరీ కొట్టు.. ఆర్సీబీని గెలిపించు! అదే దాదాకు నువ్విచ్చే కానుక -
క్రికెట్ ప్రపంచాన్ని శాసిస్తాను.. హీరోయిన్ను పెళ్లాడతాను..!
టీమిండియా స్టార్ క్రికెటర్, రికార్డుల రారాజు, పరుగుల యంత్రం విరాట్ కోహ్లి తాను టీమిండియా క్రికెటర్ కావాలని, అలాగే పెద్దయ్యాక హీరోయిన్ను పెళ్లాడాలని చిన్నప్పుడే ఫిక్స్ అయ్యాడట. టీమిండియా క్రికెటర్ కావాలన్నది తన ధ్యేయమని, చిన్నతనంలో తన స్నేహితుడి (షలజ్ సోంధి) స్లాం బుక్లో రాసిన కోహ్లి.. అదే స్నేహితుడి తల్లితో తాను హీరోయిన్ను పెళ్లాడతానని అప్పుడే చెప్పాడట. కోహ్లి చిన్నతనంలో జరిగిన ఇలాంటి ఆసక్తికర విషయాలను ఆర్సీబీ ఇటీవలే ఓ ప్రత్యేక వీడియోలా రూపొందించి సోషల్మీడియాలో విడుదల చేసింది. Stories from Virat Kohli’s childhood in Delhi We met Virat’s first coach Rajkumar Sharma, childhood friend Shalaj & his mother, and they tell us beautiful unheard anecdotes from Virat’s early days as a budding cricketer in Delhi, on @HombaleFilms brings to you Bold Diaries.… pic.twitter.com/wzbpeoTxfu — Royal Challengers Bangalore (@RCBTweets) May 5, 2023 కోహ్లి గొప్ప క్రికెటర్ అవుతాడని ముందే తెలుసు.. ఈ వీడియోలో కోహ్లి చిన్ననాటి గురువు రాజ్కుమార్ శర్మ, అతని చిన్ననాటి నేస్తం షలజ్ సోంధి, సోంధి తల్లి.. కోహ్లితో తమ అనుభవాలను షేర్ చేసుకున్నారు. కోహ్లి చిన్నతనం నుంచే చాలా యాక్టివ్గా ఉండేవాడని, 10 ఏళ్ల వయసులోనే అతను పెద్దపెద్ద లక్ష్యాలను పెట్టుకునే వాడని, కోహ్లి ఓ నాచురల్ టాలెంటెడ్ ఆటగాడని, అతను పెద్దయ్యాక తప్పక గొప్పవాడవుతాడని తాను ముందే గుర్తించానని కోహ్లి గురువు రాజ్కుమార్ శర్మ అన్నాడు. టీమిండియా క్రికెటర్ కావాలన్న కోరిక.. కోహ్లి స్నేహితుడు షలజ్ మాట్లాడుతూ.. కోహ్లి చిన్నతనంలో చాలా అల్లరి చేసేవాడని, ప్రాక్టీస్ అవ్వగానే తాము స్ట్రీట్ ఫుడ్ వేటలో పడే వారమని తెలిపాడు. షలజ్.. కోహ్లికి సంబంధించి ఓ ఆసక్తికర విషయాన్ని సైతం వెల్లడించాడు. కోహ్లి చిన్నతనంలోనే భారత క్రికెటర్ కావాలని యాంబిషన్గా పెట్టుకున్నాడని, చీకూ (కోహ్లి ముద్దు పేరు).. దాన్ని తన కఠిన దీక్షతో నెరవేర్చుకున్నాడని తెలిపాడు. హీరోయిన్ను పెళ్లి చేసుకుంటాను.. కోహ్లికి సంబంధించిన మరో ఆసక్తికర విషయాన్ని కోహ్లి స్నేహితుడు సోంధీ తల్లి షేర్ చేసుకున్నారు. తాను చిన్నతనంలో సోంధీ అతని గ్యాంగ్కు తిండి పట్టుకెళ్లేదాన్నని, ఓ రోజు కోహ్లి గోడపై ఉన్న పోస్టర్ను చూపిస్తూ.. నా ఫోటో కూడా ఓ రోజు ఇలాగే పోస్టర్పై ఉంటుందని, తాను పెద్దయ్యాక హీరోయిన్ను పెళ్లాడతానని చెప్పాడని సోంధి తల్లి చెప్పుకొచ్చింది. క్రికెట్ ప్రపంచాన్ని శాసిస్తాను.. 2005లో 17 ఏళ్ల కోహ్లి.. తాను క్రికెట్ ప్రపంచాన్ని శాసించబోతున్నాని తెలిపినట్లు స్టార్ మహిళా క్రికెటర్లు హీలీ, పెర్రీ వెల్లడించారు. కోహ్లికి సంబంధించిన ఇలాంటి ఆసక్తికర విషయాలన్నిటితో కూడిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరలవుతోంది. కాగా, కోహ్లి అనుకున్నట్లుగానే టీమిండియా క్రికెటర్ అయ్యాడు, చెప్పినట్లుగానే క్రికెట్ ప్రపంచాన్ని శాసిస్తున్నాడు, అలాగే తాను ఆశించినట్లు హీరోయిన్ను (అనుష్క శర్మ) పెళ్లాడాడు. -
IPL 2023: ఐపీఎల్ జట్టుకు కొత్త కెప్టెన్
ఐపీఎల్-2023 సీజన్లో ఓ జట్టుకు కొత్త కెప్టెన్ వచ్చాడు. మే 1న ఆర్సీబీతో జరిగిన మ్యాచ్లో గాయపడిన కేఎల్ రాహుల్ స్థానంలో కృనాల్ పాండ్యా లక్నో సూపర్ జెయింట్స్ తాత్కాలిక కెప్టెన్గా బాధ్యతలు చేపట్టనున్నాడు. లీగ్లో లక్నో తదుపరి ఆడబోయే మ్యాచ్కు కృనాల్ కెప్టెన్గా వ్యవహరించనున్నాడు. ఈ విషయాన్ని ఎల్ఎస్జీ యాజమాన్యం అధికారికంగా ప్రకటించింది. కృనాల్ నేతృత్వంలో లక్నో సూపర్ జెయింట్స్ ఇవాళ (మే 3) చెన్నై సూపర్ కింగ్స్తో తలపడనుందని పేర్కొంది. కేఎల్ రాహుల్ గాయం తీవ్రమైందని, ఈ విషయాన్ని బీసీసీఐ స్వయంగా టేకప్ చేస్తుందని, ఐపీఎల్లో తదుపరి మ్యాచ్ల్లో రాహుల్ ఆడాలా లేదా అన్న విషయంపై తుది నిర్ణయం బీసీసీఐ / ఎన్సీఏలదేనని లక్నో టీమ్ మేనేజ్మెంట్ వెల్లడించింది. వచ్చే నెలలో డబ్ల్యూటీసీ ఫైనల్ (జూన్ 7) ఉన్న దృష్ట్యా బీసీసీఐ రాహుల్ ఇంజ్యూరీ విషయాన్ని చాలా సీరియస్గా తీసుకుంటుందని, రాహుల్ విషయంలో ఎన్సీఏ మెడికల్ టీమ్ నిర్ణయమే ఫైనల్ అని స్పష్టం చేసింది. కాగా, ఆర్సీబీతో మ్యాచ్లో ఫీల్డింగ్ చేస్తూ (బౌండరీని ఆపే క్రమంలో ఛేజ్ చేస్తూ) కేఎల్ రాహుల్ గాయపడిన విషయం తెలిసిందే. ఆ మ్యాచ్లోనే రాహుల్ స్థానంలో కృనాల్ తాత్కాలికంగా కెప్టెన్గా వ్యవహరించాడు. ఇదిలా ఉంటే, ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్ ఆడిన 9 మ్యాచ్ల్లో 5 విజయాలు సాధించి, పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతుంది. లీగ్ కీలక దశకు చేరిన తరుణంలో గాయం కారణంగా రాహుల్ దూరం కావడం లక్నో టీమ్పై తీవ్ర ప్రభావం చూపనుంది. ప్రస్తుతం లక్నో.. గుజరాత్ (అగ్రస్థానం), రాజస్థాన్ (రెండో స్థానం), చెన్నై (నాలుగు), ఆర్సీబీ (ఐదు), పంజాబ్ (ఆరు)లతో పాటు ప్లే ఆఫ్స్ రేసులో నిలిచింది. -
కోహ్లి, గంభీర్లను సస్పెండ్ చేసి పాడేయండి.. ఓవరాక్షన్ ఎక్కువైంది..!
ఐపీఎల్-2023లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్- రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య మే 1న జరిగిన మ్యాచ్లో విరాట్ కోహ్లి-ఎల్ఎస్జీ మెంటార్ గౌతమ్ గంభీర్ల మధ్య జరిగిన ఘర్షనపై క్రికెట్ దిగ్గజం, భారత మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ ఘాటుగా స్పందించాడు. కోహ్లి-గంభీర్లు జరిమానాలు విధిస్తే మారే రకం కాదని, వారిని తక్షణమే ఐపీఎల్ నుంచి సస్పెండ్ చేయాలని నిర్వహకులకు సూచించాడు. కోహ్లి-గంభీర్ల ఓవరాక్షన్ మరీ ఎక్కువైందని, ఇష్టం లేకపోతే స్వచ్ఛందంగా తప్పుకోవాలి కానీ, భారత క్రికెట్ పరువును ఇలా బజారుకీడ్చకూడదని హెచ్చరించాడు. జరిమానాలు విధించి సరిపెట్టుకుంటే వారి ఓవరాక్షన్ ఆగదని, కఠినమైన శిక్షలు వేస్తే ఏమైనా మారే అవకాశం ఉంటుందని అన్నాడు. కోట్లల్లో రెమ్యూనరేషన్ తీసుకునే కోహ్లి, గంభీర్లు ఫైన్లు అస్సలు లెక్క చేయరని, భవిష్యత్తులో ఇలాంటివి జరగవని వారి నుంచి కచ్చితమైన హామీ లభిస్తేనే లీగ్లో కొనసాగించాలని, అలా చేయకపోతే వారిని లీగ్ నుంచి బహిష్కరించాలని కోరాడు. రూల్స్ వ్యతిరేకించి, దేశ పరువును బజారుకీడ్చిన వారు ఎంతటి స్టార్ క్రికెటర్లైనా సహించకూడదని, కఠిన చర్చలు తీసుకుంటేనే మున్ముందు ఇలాంటివి జరగకుండా ఉంటాయని అభిప్రాయపడ్డాడు. తాము క్రికెట్ ఆడే రోజుల్లో కూడా స్వల్ప స్థాయిలో కవ్వింపులు ఉండేవని, మరీ ఇలా బాహాబాహీకి దిగిన దాఖలాలు చాలా అరుదు అని తెలిపాడు. కాగా, లక్నో-ఆర్సీబీ మ్యాచ్లో నవీన్ ఉల్ హాక్-కోహ్లిల మధ్య మొదలైన చిన్నపాటి వివాదం చినిచినికి గాలివానలా మారి క్రికెట్ సర్కిల్స్లో ప్రకంపనలకు కారణమైంది. నవీన్తో కోహ్లి గొడవపడటాన్ని పర్సనల్గా తీసుకున్న గంభీర్ మ్యాచ్ అనంతరం నానా హంగామా చేశాడు. కోహ్లి కూడా ఏ మాత్రం తగ్గలేదు. వీరిద్దరి గొడవకు దిగిన సమయంలో లక్నో మైదానం రణరంగాన్ని తలపించింది. బాహాటంగా గొడవకు దిగి, రూల్స్ను తుంగలో తొక్కినందుకు గాను బీసీసీఐ కోహ్లి, గంభీర్లకు 100 శాతం (ఒక మ్యాచ్కు) మ్యాచ్ ఫీజ్లో కోత విధించింది. -
ఐపీఎల్ 2023లో ఏం జరుగుతోంది..? ఆ రెండు మ్యాచ్లు ఫిక్స్ అయ్యాయి..!
ఐపీఎల్-2023లో ఫస్ట్ ఆఫ్ మ్యాచ్లు అయిపోయాక ఒక్కసారిగా భారీ మార్పులు సంభవిస్తున్నాయి. బ్యాటర్లకు స్వర్గధామంగా ఉన్న పిచ్లు ఉన్నట్లుండి బౌలర్లకు పెద్ద ఎత్తున సహకరిస్తున్నాయి. బ్యాటర్ల హవా కొనసాగిన మైదానాల్లో బౌలర్లు రాజ్యమేలుతున్నారు. రాజస్థాన్ రాయల్స్-ముంబై ఇండియన్స్ మ్యాచ్ తర్వాత వరుసగా రెండు మ్యాచ్ల్లో ఆయా జట్లు అతి స్వల్ప స్కోర్లను డిఫెండ్ చేసుకోగలిగాయి. అంతకుముందు వరకు పరిస్థితి వేరేలా ఉండేది. దాదాపు ప్రతి మ్యాచ్లో రెండు జట్లు అలవోకగా 200 స్కోర్ను దాటేవి. ఉన్నట్లుండి ఈ మార్పుకు కారణమేంటని అభిమానులు చర్చింకుంటున్నారు. ఆర్సీబీ-లక్నో, ఢిల్లీ-గుజరాత్ మ్యాచ్లు ఫిక్స్ అయ్యాయా అని అనుమానులు వ్యక్తం చేస్తున్నారు. ఈ రెండు మ్యాచ్ల్లో బౌలర్లు అత్యుత్తమ ప్రతిభ కనబర్చారన్నది కాదనలేని సత్యమే అయినప్పటికీ, ఇదే వేదికలపై గతంలో పరుగుల వరద పారిన విషయాన్ని మరచిపోకూడదు. బ్యాటర్లకు ఓ రేంజ్లో సహకరించిన పిచ్లు ఒక్కసారిగా స్లో పిచ్లుగా మారి బౌలర్ల పిచ్లుగా మారాయంటే ఏదో జరుగుతుందని అభిమానులు సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. గత రెండు మ్యాచ్లు సాగిన వైనం కూడా అభిమానుల అనుమానాలకు బలం చేకూరుస్తున్నాయి. పిచ్ బ్యాటర్లకు సహకరిస్తుందని అర్ధం వచ్చేలా టాస్ గెలిచిన జట్లు తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాయి. ఆతర్వాత అతి స్వల్ప స్కోర్లను విజయవంతంగా డిఫెండ్ చేసుకున్నాయి. పైగా ఈ రెండు మ్యాచ్ల్లో ఓడిన జట్లు (లక్నో, గుజరాత్) హాట్ ఫేవరెట్ జట్లు. స్వల్ప లక్ష్య ఛేదనలో విధ్వంసకర బ్యాటర్లు ఉన్న జట్లు ఒక్కో పరుగు చేసేందుకు ఆపసోపాలు పడ్డాయి. ఆర్సీబీ-లక్నో మ్యాచ్లో ఇది స్పష్టంగా కనిపించింది. ఈ మ్యాచ్లో లక్నో ఓటమిని ముందుగానే ఖరారు చేసి, ప్రజల దృష్టిని మరల్చేందుకు ఐపీఎల్ యాజమాన్యం ఉద్దేశపూర్వకంగానే కోహ్లి-నవీన్ ఉల్ హాక్-గంభీర్ల డ్రామాను తెరపైకి తెచ్చిందని కొందరు అభిమానులు అనుకుంటున్నారు. మరికొందరైతే బెట్టింగ్ మాఫియాను ప్రోత్సహించేందుకు తక్కువ అంచనాలు కలిగిన జట్లను ఐపీఎల్ యాజమాన్యమే గెలిపిస్తుందని చర్చించుకుంటున్నారు. క్రికెట్ పరిజ్ఞానం, ఐపీఎల్ ఫాలో అయిన అనుభవం ఉన్న కొందరైతే, ఏ మ్యాచ్లో ఏ జట్టు గెలుస్తుందో ముందే చెప్పేస్తున్నారు. గత అనుభవాల దృష్ట్యా లీగ్ సాగబోయే తీరును వారు ముందే పసిగడుతున్నారు. మ్యాచ్లు వన్ సైడెడ్గా సాగితే (బ్యాటర్లకు సహకారం) కూడా జనాలు చూడరని, బెట్టింగ్లు కాసే వారు సులువుగా మ్యాచ్ తీరును అంచనా వేయగలుగుతున్నారని ఐపీఎల్ యాజమాన్యమే ఇలాంటి స్క్రిప్టెడ్ గేమ్స్ను ప్లాన్ చేస్తుందని ఇంకొందరు ఆరోపిస్తున్నారు. -
LSG VS RCB: కోహ్లి-నవీన్-గంభీర్లలో తప్పెవరిది..?
కోహ్లి-నవీన్ ఉల్ హాక్-గంభీర్ల మధ్య నిన్నటి (మే 1) మ్యాచ్ (ఎల్ఎస్జీ వర్సెస్ ఆర్సీబీ) సందర్భంగా చోటు చేసుకున్న వివాదం, ఆ తదనంతర పరిణామాలు జెంటిల్మెన్ గేమ్కు మాయని మచ్చగా మిగిలిపోనున్నాయి. దిగ్గజ క్రికెట్గా వేనోళ్ల కీర్తించబడుతున్న విరాట్ కోహ్లి తన స్థాయిని మరిచి గొడవకు బీజం వేస్తే.. నవీన్ ఉల్ హాక్ను సాకుగా చూపి గంభీర్ గొడవను పెద్దది చేసి భారత క్రికెట్ పరువును బజారుకీడ్చాడు. కోహ్లి-నవీన్ వివాదాన్ని గంభీర్ ఆటలో భాగంగా చూసుంటే ఈ ఇష్యూ ఇంత పెద్దదయ్యేది కాదు. అయితే కోహ్లి అంటే మొదటి నుంచి సరిపోని గంభీర్.. ఉద్దేశపూర్వకంగానే కోహ్లితో గొడవను ప్రొలాంగ్ చేశాడు. అందరూ అనుకుంటున్నట్లు కోహ్లి.. నవీన్ను కవ్వించడంతో ఈ గొడవ మొదలయ్యుండకపోవచ్చు. ప్రస్తుత ఐపీఎల్ సీజన్లోనే ఇరు జట్ల మధ్య జరిగిన తొలి మ్యాచ్ (ఏప్రిల్ 10) అనంతరం ఈ గొడవ స్టార్ట్ అయ్యిందని చాలామంది అభిప్రాయపడుతున్నారు. (చేయాల్సిందంతా చేసి.. కోహ్లి, గంభీర్ గొడవకు మూల కారకుడు?) నరాలు తెగే ఉత్కంఠ నడుమ సాగిన ఆ మ్యాచ్లో లక్నో చివరి బంతికి విజయం సాధించింది. లక్నో విజయానంతరం ఆ జట్టు మెంటార్ గంభీర్.. ఆర్సీబీ అభిమానులను వారి సొంతగడ్డపై హేలన చేసేలా వ్యంగ్యమైన సంబరాలు చేసుకున్నాడు (నోరు మూయండి అన్నట్లు). సాధారణంగా ఎవరిది వారికి తిరిగి ఇచ్చే అలవాటున్న కోహ్లి.. నిన్నటి మ్యాచ్ ఆరంభం నుంచే గంభీర్పై రివెంజ్కు ప్లాన్ చేశాడు. అందులో భాగంగానే లక్నో వికెట్ కోల్పోయిన ప్రతిసారి స్టేడియంలోని ప్రేక్షకుల వైపు సైగ చేస్తూ తనదైన స్టయిల్లో గంభీర్కు చురక తగిలేలా ప్రవర్తించాడు. ఇది మనసులో పెట్టుకునే గంభీర్.. నవీన్ ఇష్యూను హైలైట్ చేసి, కోహ్లిపై పైచేయి సాధించాలని చూశాడు. మరోపక్క నవీన్ సైతం గంభీర్ అండ చూసుకుని సీనియర్ అన్న గౌరవం కూడా లేకుండా కోహ్లితో ఇష్టవచ్చినట్లు ప్రవర్తించాడు. మరి ఈ తంతు గురించి పూర్తిగా తెలిసాక తప్పెవరిదో, ఒప్పెవరిదో మీరే చెప్పండి. (కోహ్లీ-గంభీర్ గొడవకు రాజకీయ రంగు.. ఎన్నికల్లో బుద్ధిచెబుతామంటున్న కన్నడిగులు..!) -
నవీన్ ఉల్ హాక్ మామూలోడు కాదు.. అఫ్రిది లాంటి ముదురును కూడా లెక్కచేయలేదు..!
లక్నో సూపర్ జెయింట్స్-రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య నిన్న (మే 1) జరిగిన మ్యాచ్లో విరాట్ కోహ్లి-నవీన్ ఉల్ హాక్- గౌతమ్ గంభీర్ల మధ్య వివాదం క్రికెట్ సర్కిల్స్లో ప్రకంపనలు సృష్టిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఏ నోట విన్నా, ఏ సోషల్మీడియా ప్లాట్ఫాంపై చూసినా ఇదే టాపిక్పై డిస్కషన్ నడుస్తోంది. ఎవరికి తోచిన విధంగా వారు కోహ్లి-నవీన్-గంభీర్ల క్యారెక్టర్లను అనలైజ్ చేస్తున్నారు. కోహ్లి-గంభీర్ల మధ్య పచ్చిగడ్డి వేయకుండానే భగ్గుమనేది.. కొందరు గొడవ స్టార్ట్ చేసింది కోహ్లి అంటే, మరికొందరు నవీన్ను తప్పుపడుతుంటే, మెజారిటీ శాతం గంభీర్ గొడవను పెద్దది చేసి ఓవరాక్షన్ చేశాడని అంటున్నారు. ఎవరి అభిప్రాయం ఎలా ఉన్నా నిజానిజాలు, పూర్వపరాలు తెలుసుకోకుండా కామెంట్లు చేయడం మాత్రం తప్పే. కోహ్లి-గంభీర్ల విషయానికొస్తే.. వీరి మధ్య వైరం ఈనాటిది కాదు. ఇద్దరు కలిసి టీమిండియాకు ఆడే రోజుల నుంచే వీరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేది. ఐపీఎల్లో సైతం వీరు పలు సందర్భాల్లో కొట్టుకునే దాకా వెళ్లారు. ఆట వరకు వీరిద్దరు పర్ఫెక్షనిస్ట్లే అయినప్పటికీ.. వీరి ఆన్ ఫీల్డ్ బిహేవియర్ మాత్రం కెరీర్ ఆరంభం నుంచే బాగోలేదు. భావోద్వేగాలు అదుపు చేసుకోవడంలో వీరిద్దరూ ఫెల్యూర్సే అని చెప్పాలి. అయితే ఉద్దేశపూర్వకంగా గొడవ పడాలని వీరెప్పుడూ అనుకోరని వీరితో పరిచయమున్న ఎవరినడిగినా చెబుతారు. ఆటలో భాగంగా మొదలయ్యే కవ్వింపు కొన్ని సందర్భాల్లో వివాదాలకు దారి తీసింది. అదే నవీన్ ఉల్ హాక్ విషయానికొస్తే.. అమాయకంగా కనిపించే ఈ ఆఫ్ఘానీ పేసర్ చాలా మదురు అని జనాలకు ఇప్పుడిప్పుడే తెలుస్తోంది. అతని చిన్నపాటి కెరీర్ మొత్తం వివాదాల మయం. ప్రపంచం నలుమూలలా జరిగే లీగ్ల్లో పాల్గొన్న నవీన్.. దాదాపు ప్రతి చోట ఎవరితో ఒకరితో గొడవ పడ్డ సందర్భాలు ఉన్నాయి. ఓసారి అతని ఘనకార్యాల ట్రాక్ రికార్డుపై లుక్కేస్తే ఈ విషయం క్లియర్గా అర్ధమవుతుంది. అమీర్, షాహిద్ అఫ్రిదిలతో గొడవ.. 2020 లంక ప్రీమియర్ లీగ్లో నవీన్ తన కంటే మహామదుర్లైన పాకిస్తాన్ ఆటగాళ్లు షాహిద్ అఫ్రిది, మహ్మద్ అమీర్లతో గొడవపడ్డాడు. ఆతర్వాత బిగ్బాష్ లీగ్-2022లో డి ఆర్కీ షార్ట్తో, 2023 లంక ప్రీమియర్ లీగ్లో తిసార పెరీరాతో, ఐపీఎల్ 2023లో విరాట్తో కయ్యానికి కాలు దువ్వాడు. ఆఫ్ఘనిస్తాన్లోని కాబుల్ ప్రాంతానికి చెందిన నవీన్.. దేశవిదేశాల్లో ఆడిన చాలా మ్యాచ్లో ప్రత్యర్ధి జట్ల ఆటగాళ్లతో గొడవలు పడ్డాడు. My advise to the young player was simple, play the game and don't indulge in abusive talk. I have friends in Afghanistan team and we have very cordial relations. Respect for teammates and opponents is the basic spirit of the game. https://t.co/LlVzsfHDEQ — Shahid Afridi (@SAfridiOfficial) December 1, 2020 Naveen-ul-Haq fight between other players in SriLanka Premier League Fight 01 : Naveen Vs Thisara Perera#IPL2023 #RCBvLSG #ViratKohli #naveenulhaq #Gambhir #gambhirvskohli #LPL #SriLanka pic.twitter.com/LLXLmf8qle — விடாமுயற்சியுடன் டேவிட் (@DavidVaasu) May 2, 2023 సహచరుడు రషీద్ ఖాన్ను చూసి నేర్చుకోవాలి.. అడపాదడపా టాలెంట్తో నెట్టుకొస్తున్నాడని కొన్ని ఫ్రాంచైజీలు అక్కున చేర్చుకున్నాయి, లేకపోతే ఇతన్ని దేకేవాడే లేడు. సహచరులు, గుజరాత్ ఆటగాళ్లు రషీద్ ఖాన్, యువ స్పిన్నర్ నూర్ అహ్మద్ ఎంత హుందాగా వ్యవహరిస్తారో, అందుకు ఇతను పూర్తి వ్యతిరేకంగా ప్రవర్తించి తమ దేశ పరువును పోగొట్టుకున్నాడు. వయసులో పెద్దవాడు, క్రికెట్ దిగ్గజం అయిన విరాట్ కోహ్లి ఆవేశంలో ఓ మాట అన్నాడని సర్దుకుపోయి ఉంటే, ఈ వివాదం ఇంత పెద్దదయ్యే కాదు. మంచికో చెడుకో కోహ్లితో వివాదం కారణంగా చాలామందికి తెలియని నవీన్ పేరు, ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా మార్మోగిపోతుంది. -
IPL 2023: ఈ సాలా కప్ నమదే, రాసి పెట్టుకోండి.. లక్కీ మ్యాన్ మాతోనే ఉన్నాడు..!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రారంభమైన నాటి నుండి 'ఈ సాలా కప్ నమదే'.. ఈ సాలా కప్ నమదే అంటూ ఆర్సీబీ అభిమానులు హడావుడి చేయడం చూస్తూనే ఉన్నాం. 15 సీజన్లు అయిపోయినా ఆ జట్టు ఇంతవరకు ఒక్క టైటిల్ కూడా సాధించింది లేదు కానీ, ఆ జపం మాత్రం వదలడం లేదు. 2009, 2011, 2016 సీజన్లలో ఫైనల్కు చేరినా ఆర్సీబీకి అదృష్టం కలిసి రాలేదు. ప్రస్తుత సీజన్లోనూ ఆర్సీబీ అభిమానులు అదే స్లోగన్ చెప్తూ ఊదరగొడుతున్నారు. ప్రస్తుత సీజన్లో వారికి అశించిన ఫలితాలు రాకపోయినా, చెత్త జట్టుతో (KGFS (కోహ్లి,మ్యాక్సీ, డుప్లెసిస్,సిరాజ్) మినహా) అతి కష్టం మీద నెట్టుకొస్తున్నా ఆర్సీబీ ఫ్యాన్స్ మాత్రం ఈ సాలా కప్ నమదే అని ధీమాగా చెబుతున్నారు. పైగా నిన్న (మే 1) లక్నోపై విజయానంతరం వారి వాయిస్లో బేస్ పెరిగింది. ఈ సాలా కప్ నమదే అంటూ ఇంకా గట్టిగా వాదిస్తున్నారు. వారి కాన్ఫిడెన్స్కు కారణం ఏంటని ఆరా తీస్తే.. చాలామంది ఓ ఆటగాడి పేరు చెబుతున్నారు. అతడే ఆర్సీబీ వెటరన్ స్పిన్నర్ కర్ణ్ శర్మ. కర్ణ్ శర్మ ఎక్కడ ఉంటే ఆ జట్టు టైటిల్ గెలవడం మనం చూశాం. ఇతగాడు 2016 (సన్రైజర్స్ హైదరాబాద్), 2017 (ముంబై ఇండియన్స్), 2018 (సీఎస్కే), 2021 (సీఎస్కే) సీజన్లలో వివిధ విన్నింగ్ టీమ్లలో భాగంగా ఉన్నాడు. ఐపీఎల్లో కర్ణ్ శర్మను మోస్ట్ లక్కీయెస్ట్ పర్సన్గా పేరుంది. ఆర్సీబీ అభిమానులు ప్రస్తుతం కర్ణ్ శర్మ సెంటిమెంట్ పైనే గంపెడాశలు పెట్టుకున్నారు. పైగా ప్రత్యర్ధులు ఈ ఏడాది తమను తక్కువ అంచనా వేయడం కూడా కలిసొస్తుందని వారు భావిస్తున్నారు. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో (9 మ్యాచ్ల్లో 5 విజయాలు) ఉన్న ఆర్సీబీ.. తదుపరి మ్యాచ్ల్లో వరుస విజయాలు సాధించి, ఆ తర్వాత టైటిల్ కూడా సాధించి తీరుతుందని ఆర్సీబీ ఫ్యాన్స్ నమ్మకంగా ఉన్నారు. ఈ సాలా కప్ నమదే.. రాసి పెట్టుకోండి అంటూ సోషల్మీడియాను హోరెత్తిస్తున్నారు. మరోవైపు ఆర్సీబీ వ్యతిరేకులు మాత్రం ఆర్సీబీకి అంత సీన్ లేదని, కర్ణ్ శర్మ గతేడాది కూడా వారితోనే ఉన్నాడు, అప్పుడు కానిది ఇప్పుడెలా కుదురుతుందని పంచ్లు వేస్తున్నారు. మరికొందరైతే దినేశ్ కార్తీక్, షాబాజ్ అహ్మద్ లాంటి దిగ్గజాలను జట్టులో ఉంచుకుని టైటిల్ సాధించాలనుకోవడం అత్యాశే అవుతుందని సెటైర్లు వేస్తున్నారు. మరి ఫ్యాన్స్ నమ్మకాన్ని ఆర్సీబీ నీలబెడుతుందో, నీరుగారుస్తుందో వేచి చూడాలి. -
LSG Vs RCB: కోహ్లి-గంభీర్ మధ్యే కాదు.. లక్నో-ఆర్సీబీ మధ్య కూడా యుద్ధం జరిగింది..!
అటల్ బిహారీ వాజ్పేయ్ స్టేడియం వేదికగా నిన్న (మే 1) జరిగిన మ్యాచ్లో విరాట్ కోహ్లి-నవీన్ ఉల్ హాక్-గౌతమ్ గంభీర్ల మధ్య ఓ రేంజ్లో మాటల యుద్ధం జరిగిన విషయం తెలిసిందే. ఓ దశలో కోహ్లి-గంభీర్లు కొట్టుకునేంత వరకు కూడా వెళ్లారు. నవీన్ సైతం ఏమాత్రం తగ్గలేదు. కోహ్లి తనను టార్గెట్ చేసిన ప్రతిసారి కౌంటర్ అటాక్ చేశాడు. కెప్టెన్ రాహుల్ కోహ్లికి సారి చెప్పమన్నా, ఈ ఆఫ్ఘానీ ఎంత మాత్రం తగ్గలేదు. గంభీర్ సపోర్ట్ చేస్తుండటంతో నవీన్ మరింత రెచ్చిపోయాడు. మ్యాచ్ అనంతరం (మే 2) నవీన్.. కోహ్లితో సోషల్మీడియా వార్కు కూడా దిగాడు. కోహ్లి చేసిన పోస్ట్కు కౌంటర్గా మరో పోస్ట్ పెట్టాడు. ఈ రెండు పోస్ట్లు ఒకదానితో ఒకటి సంబంధం లేనివే అయినప్పటికీ.. కోహ్లి పోస్ట్ చేసిన కొద్ది నిమిషాల్లోనే నవీన్ కూడా తన ఇన్స్టాలో ఓ స్టోరీ పోస్ట్ చేయడంతో అందరూ దీన్ని కౌంటర్ అటాక్ అనుకుంటున్నారు. It's 1-1 in IPL 2023. 📸: BCCI/IPL#CricTracker #LSGvRCB pic.twitter.com/CBDOTSMlLc — CricTracker (@Cricketracker) May 2, 2023 ఓ పక్క మైదనంలో కోహ్లి-నవీన్-గంభీర్ల మధ్య వన్ టు టూ ఫైట్ నడుస్తుంటే.. మరోపక్క కోహ్లి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆర్సీబీ, గతంలో జరిగిన ఓ సన్నివేశాన్ని టార్గెట్ చేస్తూ లక్నో సూపర్ జెయింట్స్కు దిమ్మతిరిగిపోయే కౌంటరిచ్చింది. ప్రస్తుత సీజన్లోనే ఇరు జట్ల మధ్య ఏప్రిల్ 10న జరిగిన మ్యాచ్లో ఆర్సీబీపై విజయం అనంతరం లక్నో టీమ్ ఓ ఆసక్తికర ట్వీట్ చేసింది. లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఇదే మీరు ధైర్యంగా ఆడే విధానం అంటూ ఆర్సీబీని కించపరిచే విధంగా ట్వీట్ చేసింది. దీనికి బదులుగా నిన్న లక్నోపై విజయానంతరం ఆర్సీబీ కూడా ఓ ట్వీట్ చేసింది. ఈ విధంగా మేము ధైర్యంగా ఆడతాము అంటూ లక్నోకు టిట్ ఫర్ టాట్ చేసి చూపించింది. కాగా, ఆర్సీబీ ఈ ఏడాది ప్లే బోల్డ్ అనే నినాదంతో బరిలోకి దిగిన విషయం తెలిసిందే.