universities
-
ట్రంప్ సంచలన నిర్ణయాలు.. విదేశీ విద్యార్థులకు భారీ షాక్
అమెరికా విశ్వవిద్యాలయాల్లో ఉన్నత విద్య అభ్యసించాలని ప్రపంచవ్యాప్తంగా కోట్లాది విద్యార్థులు ఆరాటపడుతుంటారు. అక్కడ నాణ్యమైన విద్య లభిస్తుందన్న నమ్మకమే ఇందుకు కారణం. అత్యాధునిక వసతులు, సాంకేతిక పరిజ్ఞానం, నవీన ఆవిష్కరణలు, పరిశోధనలకు అవసరమైన పూర్తి సౌకర్యాలతో అమెరికా వర్సిటీలు ఆకట్టుకున్నాయి. అయితే, ఈ ఏడాది పరిస్థితిలో చాలావరకు మార్పులు విచ్చనట్లు నిపుణులు చెబుతున్నారు.అమెరికాలో రెండోసారి డొనాల్డ్ ట్రంప్ అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత యూనివర్సిటీలు కష్టకాలం మొదలైందని అంటున్నారు. అందుకే ఉన్నత విద్య కోసం అమెరికా వర్సిటీలను ఎంచుకోకపోవడమే మంచిదని సూచిస్తున్నారు. వర్సిటీలకు ఇచ్చే నిధుల్లో భారీగా కోత విధిస్తూ ట్రంప్ ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. అంతేకాకుండా ఆంక్షలు సైతం పెంచారు. అమెరికా వర్సిటీల్లో విద్యాభ్యాసం గతంలో ఉన్నట్లు ఇకపై సులభంగా ఉండబోదు. ముఖ్యంగా విదేశీ విద్యార్థులకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలున్నాయి. ఒకవేళ ఇక్కడ చదువుకోడానికి సిద్ధపడితే భారీగా ఖర్చు చేయాల్సి రావొచ్చు. పరిశోధనలకు నిధులు కట్ అమెరికాలో ఉన్నత విద్య ప్రధానంగా ప్రభుత్వ మద్దతుపై ఆధారపడిందే. ప్రభుత్వం ఇచ్చే నిధులతోనే వర్సిటీలు చాలావరకు మనుగడ సాగిస్తుంటాయి. మెడిసిన్, టెక్నాలజీ, ఇంజనీరింగ్ వంటి రంగాల్లో పరిశోధనలు, కొత్త ఆవిష్కరణలకు ప్రభుత్వం గ్రాంట్లు మంజూరు చేస్తూ ఉంటుంది. ఇలాంటి గ్రాంట్లలో ట్రంప్ భారీగా కోతలు విధించారు. దీనివల్ల పరిశోధన కార్యక్రమాలు, శాస్త్రీయ ఆవిష్కరణలకు ఆటంకాలు తలెత్తబోతున్నాయి. నిధుల కొరత వల్ల పరిశోధనలు పూర్తిగా ఆగిపోయినా ఆశ్చర్యం లేదు. విదేశీ విద్యార్థులకు ఆర్థికంగా సహకరించే పరిస్థితి ఉండబోదు. వారికి రీసెర్చ్ అసిస్టెంట్షిప్స్, స్కాలర్షిప్స్ అందించే అవకాశాలు కుదించుకుపోతున్నాయి.ఒకవైపు వనరులు కరిగిపోతే మరోవైపు సౌకర్యాలు తగ్గిపోతాయనడంలో ఆశ్చర్యం లేదు. నిత్యం భయం భయంగానే అమెరికా విశ్వవిద్యాలయాల్లో స్వేచ్ఛాయుత వాతావరణం ఉండేది. విద్యార్థులు నిర్భయంగా రాజకీయ చర్చలు జరిపేవారు. తమకు నచ్చిన సంస్థలకు మద్దతు ప్రకటించేవారు. వర్సిటీల ప్రాంగణాల్లో ఆందోళనలు, నిరసనలకు ఎలాంటి ఆటంకాలు ఉండేవి కావు. ట్రంప్ వచ్చిన తర్వాత ఇలాంటి కార్యక్రమాలపై ఉక్కుపాదం మోపుతున్నారు. ఉగ్రవాద, తీవ్రవాద సంస్థలకు మద్దతు ప్రకటించినట్లు అనుమానం వస్తే చాలు వర్సిటీల నుంచి బహిష్కరిస్తున్నారు. విదేశీ విద్యార్థులకు బలవంతంగా బయటకు పంపిస్తున్నారు. కొందరిపై కేసులు సైతం నమోదు చేస్తున్నారు. యూనివర్సిటీల్లో భయంభయంగా గడపాల్సి వస్తోందని విదేశీ విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమపై ఎన్నో రకాల ఆంక్షలు అమల్లోకి వచ్చాయని చెబుతున్నారు. ఇతర దేశాల్లో మెరుగైన అవకాశాలు అమెరికా వర్సిటీల్లో నెలకొన్న ప్రతికూల పరిణామాలను చైనా వర్సిటీలు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నాయి. విదేశీ విద్యార్థులను ఆకర్శించడానికి ప్రయత్నిస్తున్నాయి. రీసెర్చ్ అండ్ టెక్నాలజీకి నిధుల కేటాయింపులు భారీగా పెంచబోతున్నట్లు చైనా ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. ఇన్నోవేషన్లో అమెరికాను వెనక్కి నెట్టేసి గ్లోబల్ లీడర్గా ఎదగాలని చైనా లక్ష్యంగా పెట్టుకుంది. మరోవైపు కెనడా, యూకే, జర్మనీ, ఆస్ట్రేలియా వర్సిటీలు సైతం అంతర్జాతీయ విద్యార్థులపై వల విసురుతున్నాయి. అమెరికా కంటే మెరుగైన వసతులు, నిధులు, స్వేచ్ఛ అందుబాటులో ఉన్నప్పుడు మరో దేశాన్ని ఎంచుకుంటే తప్పేం లేదని నిపుణులు పేర్కొంటున్నారు. -
‘ఉన్నత’ సంస్కరణలు తప్పనిసరి..
సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా రాష్ట్ర విశ్వవిద్యాలయాల్లో (స్టేట్ యూనివర్సిటీలు) సంస్కరణలు అమలు చేయాలని నీతి ఆయోగ్ సూచించింది. జాతీయ విద్యావిధానం 2020కి అనుగుణంగా కరిక్యులమ్, పరీక్షల విధానంతో పాటు వర్సిటీల అక్రిడిటేషన్ ప్రక్రియ వరకు అన్నింటిలోనూ మార్పులు తేవాలని పేర్కొంది. జాతీయ పరిశోధన విధానాన్ని ప్రవేశపెట్టి మానవీయ శాస్త్రాలలో పరిశోధనలను ప్రోత్సహించాలని సిఫారసు చేసింది.సెమిస్టర్ ప్రాతిపదికన బోధన నాణ్యతను లెక్కించడం నుంచి ఉన్నత విద్య రోడ్ మ్యాప్ రూపకల్పన వరకు నీతి ఆయోగ్ పలు సూచనలు చేసింది. ఈ మేరకు 20 రాష్ట్రాలకు చెందిన వర్సిటీల వైస్ చాన్సలర్ల ఆమోదంతో రూపొందించిన నివేదికను ఇటీవల విడుదల చేసింది. ఆయా రాష్ట్రాలు తమ ప్రభుత్వ విశ్వవిద్యాలయాలలో మెరుగైన సంస్కరణలకు లిఖిత పూర్వకంగా అంగీకారం తెలిపాయి. జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా రాష్ట్ర విశ్వవిద్యాలయాలను బలోపేతం చేయడం, 2047 నాటికి కేంద్రం నిర్దేశించిన వికసిత్ భారత్ దార్శనికతలో భాగంగా నివేదికను తయారు చేసినట్లు నీతి ఆయోగ్ తెలిపింది43 స్టేట్ వర్సిటీలతో కర్ణాటక టాప్.. నీతి ఆయోగ్ నివేదిక ప్రకారం ఉన్నత విద్యలో 81% విద్యార్థుల నమోదు రాష్ట్ర ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లోనే ఉంది. 2025 జనవరి నాటికి దేశంలో 495 స్టేట్ యూనివర్సిటీలు ఉన్నాయి. వీటిలో 43 వర్సిటీలతో కర్ణాటక అగ్రస్థానంలో ఉండగా పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్ 38 వర్సిటీలతో రెండో స్థానాల్లో నిలిచాయి. గత 14 ఏళ్లలో స్టేట్ వర్సిటీల వృద్ధి 50 శాతానికి పైగా ఉంది. వీటిలో విద్యార్థుల నమోదు 2011–12నుంచి 2021–22 మధ్య 38% పెరిగి దాదాపు 3.24 కోట్లకు చేరుకుంది.పరిశోధనలు.. స్టార్టప్స్విద్యలో నాణ్యతా ప్రమాణాలు, పాలన, నిధులు, ఉపాధి సామర్థ్యం అనే నాలుగు విభాగాలలో 80 సిఫార్సులతోపాటు పరిశోధన, బోధన, డిజిటలైజేషన్, అంతర్జాతీకరణ అనే కీలకమైన నాలుగు అంశాలలో తీసుకోవాల్సిన చర్యలపై నీతి ఆయోగ్ నివేదికలో సూచనలు చేసింది. మానవీయ శాస్త్రాలు, ప్రాథమిక పరిశోధనలను ప్రోత్సహించడంతో పాటు పరిశోధనలను వాణిజ్యీకరణ చేయాలని, వర్సిటీల్లో స్టార్టప్లకు అవకాశం కల్పించాలని, ప్రముఖ పరిశోధన సంస్థలను ఇందులో భాగస్వాములుగా చేయాలని నివేదిక సూచించింది.ఐఐటీలకు దీటుగా ఎదగాలి..నీతి ఆయోగ్ నివేదిక ప్రకారం దశాబ్ద కాలంలో (2011–12 నుంచి 2021–22 వరకు) విద్యార్థుల స్థూల నమోదు నిష్పత్తి (జీఈఆర్) వృద్ధి పరంగా కేరళ, హిమాచల్ప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, మిజోరాం, పశ్చిమ బెంగాల్, కర్ణాటక, గోవా, ఉత్తరాఖండ్, సిక్కిం, రాజస్థాన్ టాప్ 10 రాష్ట్రాలుగా నిలిచాయి. అరుణాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్, పంజాబ్, తమిళనాడు రాష్ట్రాలు విద్యార్థి–టీచర్ నిష్పత్తి (పీటీఆర్)లో మొదటి ఐదు స్థానాల్లో ఉన్నట్లు నివేదిక పేర్కొంది. లింగ సమానత్వ సూచిక (జీపీఐ)లో నాగాలాండ్, హిమాచల్ప్రదేశ్, ఛత్తీస్గఢ్, పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్, సిక్కిం, హరియాణా, రాజస్థాన్, త్రిపుర, తమిళనాడు టాప్ 10 రాష్ట్రాలుగా ఉన్నాయి. అమెరికా, బ్రెజిల్ దేశాల్లో ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు అత్యుత్తమ ప్రమాణాలను అనుసరిస్తున్నాయని, ఆ స్థాయిలో మన స్టేట్ వర్సిటీలు కూడా ఉండాలని సూచించింది. దేశంలో ఐఐటీలు వంటి విద్యాసంస్థలు ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు కూడా ఉన్నత ప్రమాణాల కోసం కృషి చేయాలని పేర్కొంది. గత సర్కారు హయాంలో పలు సంస్కరణలు అమలు..నీతి ఆయోగ్ తాజాగా సిఫారసు చేసిన పలు సంస్కరణలను వైఎస్సార్సీపీ అధికారంలో ఉండగా ఏపీలోని వర్సిటీలు, కళాశాల విద్యలో గతంలోనే అమలు చేయడం గమనార్హం. కళాశాలలను కంపెనీల స్టార్టప్స్తో అనుసంధానించి విద్యార్థులకు ఇంటర్న్షిప్లను అకడమిక్లో భాగం చేసింది. మానవీయ శాస్త్రాలు అభ్యసిస్తున్న విద్యార్థులకు సైతం ఇంటర్న్షిప్ తప్పనిసరి చేసింది. అంతేకాకుండా మైక్రోసాఫ్ట్ లాంటి అంతర్జాతీయ సంస్థ ద్వారా వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఫ్యూచర్ స్కిల్స్పై శిక్షణను ప్రవేశపెట్టింది. అంతర్జాతీయ యూనివర్సిటీలు అందిస్తున్న నైపుణ్య కోర్సులను మన విద్యార్థులకు ఆన్లైన్ ద్వారా అందుబాటులోకి తెచ్చింది. ఆన్లైన్ ఎడ్టెక్ సంస్థ ఎడెక్స్తో కలిసి 2 వేల అంతర్జాతీయ యూనివర్సిటీల నుంచి సర్టిఫికెట్ కోర్సులను ఉచితంగా అందించింది.ఏఐసీటీఈ ద్వారా ఏఐ, పైథాన్, క్లౌడ్ కంప్యూటింగ్ లాంటి అంశాల్లో శిక్షణను అందుబాటులోకి తెచ్చింది. దీంతో ఒక్క 2023–24 విద్యా సంవత్సరంలోనే డిగ్రీ పూర్తయిన వెంటనే దాదాపు 2 లక్షల మందికిపైగా క్యాంపస్ ఎంపికల్లో ఉద్యోగాలు సాధించారు. ఇతర సిఫారసులివీ..» విద్యా ప్రమాణాలను పెంపొందించేందుకు సెమిస్టర్ ప్రాతిపదికన బోధన నాణ్యతను లెక్కించాలి.» డిజిటల్ లెర్నింగ్ ప్లాట్ఫామ్లను బోధనతో అనుసంధానించాలి. » ప్రొఫెసర్లు, విద్యార్థులకు ప్రపంచ దృక్పథాన్ని అలవరచేందుకు విదేశీ విశ్వవిద్యాలయాలతో కలిసి పనిచేయాలి. » ఉన్నత విద్య ఆర్థిక సంస్థ (హెచ్ఈఎఫ్ఏ) తరహాలో రాష్ట్ర విశ్వవిద్యాలయాల కోసం మౌలిక సదుపాయాల ఆర్థిక సంస్థను నెలకొల్పాలి. » ఆర్థిక సహాయం కోసం బలమైన పూర్వ విద్యార్థుల సంఘాలు, కార్పొరేట్ కార్యక్రమాలపై రాష్ట్ర విశ్వవిద్యాలయాలు దృష్టి పెట్టాలి. » 2047 రాష్ట్ర స్థాయి ఉన్నత విద్యా రోడ్మ్యాప్ను రూపొందించుకోవాలి. ఉన్నత విద్యా మండళ్లకు అధికారాలు కల్పించి ప్రొఫెసర్ల నియామక ప్రక్రియను సంస్కరించాలి. » పాలక మండళ్లల్లో బోధనా బృందాలకు చోటు కల్పించాలి. » రాష్ట్ర ఉన్నత, సాంకేతిక విద్యా విభాగాల మధ్య సహకారాన్ని పెంచుతూ అక్రిడిటేషన్ ప్రక్రియను మార్చాలి. » విద్యార్థుల ఉపాధి సామర్థ్యాన్ని పెంచేందుకు ఇంటర్న్షిప్లు, అప్రెంటిస్షిప్లపై దృష్టి పెట్టాలి. వారు ఉద్యోగాల సృష్టికర్తలుగా ఎదిగేలా ప్రోత్సహించాలి. -
సీట్లన్నీ మనోళ్లకే!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని విద్యా సంస్థల్లో కన్వీనర్ కోటా సీట్లన్నీ ఈ విద్యా సంవత్సరం నుంచి తెలంగాణ విద్యార్థులకే దక్కనున్నాయి. గత పదేళ్లుగా అమలవుతున్న 15శాతం అన్–రిజర్వుడ్ కోటాకు రాష్ట్ర ప్రభుత్వం సవరణలు చేసింది. ఈ మేరకు విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి యోగితా రాణా గురువారం జీవో విడుదల చేశారు. రాష్ట్ర విభజన సమయంలో విద్యా సంస్థల్లో పదేళ్ల పాటు 15శాతం నాన్–లోకల్ కోటాను అమలు చేస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు విడుదల చేశారు. ఈ 15 శాతం కోటాలో ఏపీతో పాటు తెలంగాణ స్థానికులూ పోటీ పడుతున్నారు. రాష్ట్ర విభజన జరిగి 2024తో పదేళ్లు పూర్తయిన నేపథ్యంలో... ఈ 15శాతం కోటా గడువు ముగిసిపోయింది. ఈ లెక్కన గత విద్యా సంవత్సరంలోనే 15% కోటా రద్దు అమల్లోకి రావాల్సి ఉంది. కానీ అప్పటికే వివిధ ప్రవేశపరీక్షల ప్రకటనలు విడుదలవడంతో నాన్–లోకల్ కోటాను అమలు చేశారు. కమిటీ నివేదిక మేరకు సవరణలు రాష్ట్ర ప్రభుత్వం ఈ అంశంపై ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ ఇచ్చిన నివేదిక మేరకు తాజాగా నాన్–లోకల్ కోటాకు సవరణలు చేసింది. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు సంబంధించి 1974లో తీసుకొచ్చిన నిబంధనలు అమల్లో ఉంటాయని జీవోలో పేర్కొంది. దాని ప్రకారం.. ఉస్మానియా యూనివర్సిటీ పరిధిని తెలంగాణ లోకల్ జోన్గా పేర్కొంటారు. రాష్ట్రంలో ప్రస్తుతమున్న అన్ని యూనివర్సిటీలు కూడా ఇదే స్థానికత కిందకు వస్తాయి. 85శాతం సీట్లు స్థానికులకు, 15శాతం సీట్లు ఇతర రాష్ట్రాలు, తెలంగాణ విద్యార్థులకు కలిపి దక్కుతాయి. ఇప్పుడు ఈ 15శాతం సీట్లకు కూడా తెలంగాణ స్థానికత వర్తించేలా కొన్ని నిబంధనలు పెట్టారు. అయితే రాష్ట్రపతి ఉత్తర్వుల సవరణకు సంబంధించి ఇంతవరకు రాష్ట్రపతి కార్యాలయం నుంచి ఎలాంటి అధికారిక ఆమోదం లభించలేదు. రాష్ట్ర విభజన చట్టంలోని అంశాల మేరకే తాజాగా జీవో ఇచ్చినట్టు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. కానీ రాష్ట్రపతి ఆమోదం లేకుండా జీవో ఇవ్వడం సరికాదని.. దీనివల్ల న్యాయపరమైన సమస్యలు ఉంటాయని నిపుణులు భావిస్తున్నారు. 60వేలకుపైగా విద్యార్థులకు నో చాన్స్ రాష్ట్రంలో ప్రధానంగా సాంకేతిక, ఫార్మా కోర్సుల్లో ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు పోటీపడుతున్నారు. నాన్–లోకల్ కోటా కింద ఈ విద్యార్థులు ఏటా దాదాపు 60 వేలకుపైగా కన్వీనర్ సీట్లు పొందుతున్నారు. వారంతా ఈ విద్యా సంవత్సరం నుంచి ఇలా సీట్లు పొందే అవకాశం ఉండదు. రాష్ట్రంలో ఇంజనీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్ (టీజీఈఏపీసెట్)కు గతేడాది 3,54,803 మంది హాజరవగా.. అందులో ఇంజనీరింగ్ విభాగంలో ఏపీ విద్యార్థులు 49,071 మంది, అగ్రి, ఫార్మాకు 12,349 మంది కలిపి 61,420 మంది హాజరయ్యారు. ఎవరెవరు అర్హులు? – ఈ సవరించిన నిబంధనలు ఇంజనీరింగ్, ఫార్మసీ, టెక్నాలజీ, ఆర్కిటెక్చర్, ఫార్మా, బిజినెస్ అడ్మిని్రస్టేషన్, కంప్యూటర్ అప్లికేషన్స్, లా, ఫిజికల్ ఎడ్యుకేషన్, గ్రాడ్యుయేట్, పోస్టు–గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాలకు వర్తిస్తాయి. – ఉస్మానియా యూనివర్సిటీ పరిధిని తెలంగాణ రీజియన్గా పరిగణిస్తారు. ఈ ప్రాంత విద్యార్థులను తెలంగాణ స్థానికులుగా పరిగణిస్తారు. వారు 85శాతం లోకల్, 15శాతం అన్–రిజర్వుడ్ కోటాకు దరఖాస్తు చేసుకోవచ్చు. తెలంగాణలో 9, 10, 11, 12 తరగతులు (నాలుగేళ్లు) విద్యాభ్యాసం చేసిన విద్యార్థులను కూడా స్థానికులుగానే గుర్తిస్తారు. – ఇక తెలంగాణ వెలుపల చదువుకున్న సమయాన్ని మినహాయించి మొత్తం పదేళ్లు రాష్ట్రంలో నివసించిన అభ్యర్థులు... తెలంగాణ వెలుపల ఉద్యోగ కాలాన్ని మినహాయించి మొత్తం పదేళ్లు రాష్ట్రంలో నివసించిన తల్లిదండ్రులున్న అభ్యర్థులు.. 15శాతం అన్–రిజర్వుడ్ కోటా కింద దరఖాస్తు చేసుకోవచ్చు. తెలంగాణ స్థానికత ఉండి, ఇతర ప్రాంతాల్లో చదువుకున్న వారిని కూడా అన్–రిజర్వుడ్ కోటా కిందకు తెచ్చారు. – తెలంగాణ రాష్ట్రం, కేంద్ర ప్రభుత్వం, ప్రభుత్వ రంగ సంస్థలు, స్థానిక సంస్థలు, విశ్వవిద్యాలయాలు, రాష్ట్రంలోని ఇతర ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగం చేస్తున్న తల్లిదండ్రుల పిల్లలు 15 శాతం అన్–రిజర్వుడ్ కోటా కింద దరఖాస్తు చేసుకోవచ్చు. – రాష్ట్ర, కేంద్ర విశ్వవిద్యాలయాలు, గుర్తింపు పొందిన ప్రభుత్వ రంగ సంస్థలు, విశ్వవిద్యాలయాలు, విద్యా సంస్థలు, లోకల్ బాడీ సంస్థలకు సంబంధించి తెలంగాణ పరిధిలో భార్య, భర్త (స్పౌజ్) పనిచేస్తే.. వారి పిల్లలు 15 శాతం అన్–రిజర్వుడ్ కోటా కింద దరఖాస్తు చేసుకోవచ్చు. -
నాణ్యత లేకుంటే సీట్లు కట్!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కాలేజీలు ఇబ్బడిముబ్బడిగా కోర్సులు, సీట్లకు అనుమతులు పొందుతున్నాయి. వాటిల్లో సరైన ఫ్యాకల్టీ, మౌలిక వసతులు లేవనే ఆరోపణలున్నాయి. ఫలితంగా ఇంజనీరింగ్ విద్యలో నాణ్యత దెబ్బతింటోంది. ఏటా 57 వేల మంది కంప్యూటర్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు బయటికొస్తుండగా.. వీరిలో స్కిల్డ్ ఉద్యోగాలు పొందే వారి సంఖ్య 5 వేలు దాటడం లేదు. మరోవైపు కోర్ బ్రాంచీలు మూతపడే పరిస్థితి ఏర్పడుతోంది. ఇదే ట్రెండ్ కొనసాగితే సీఎస్ఈ, దాని అనుబంధ బ్రాంచీలు తప్ప, ఈఈఈ, సివిల్, మెకానికల్తోపాటు అనేక కోర్ గ్రూపులకు కాలం చెల్లినట్టే. ఈ పరిణామాలపై ఆందోళన చెందుతున్న ప్రభుత్వం.. వీటికి చెక్ పెట్టాలని సంకల్పించింది. కోర్సుల సమతుల్యతపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ఉన్నత విద్యామండలిని ఆదేశించింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా అన్ని కళాశాలల్లోని బ్రాంచీలపై ఆడిటింగ్ చేపట్టాలని ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. డిమాండ్ ఉన్న కోర్సుల్లో నాణ్యత పరిశీలనే దీని ప్రధాన ఉద్దేశమని మండలి వర్గాలు తెలిపాయి. నాణ్యత పాటించని కళాశాలల్లో ఆయా కోర్సుల్లో సీట్లకు కోత వేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది. సీఎస్ఈదీ క్రేజేనా? రాష్ట్రవ్యాప్తంగా 175 ఇంజనీరింగ్ కాలేజీలు కౌన్సెలింగ్లో పాల్గొంటున్నాయి. వీటిలో 1.06 లక్షల సీట్లున్నాయి. ఇందులో కనీ్వనర్ కోటా కింద 87 వేల సీట్లు ఉండగా, వీటిలో 61 వేల సీట్లు కంప్యూటర్ కోర్సుల్లోనే ఉన్నాయి. ఈ సీట్లకే పోటీ తీవ్రంగా ఉంటోంది. 2019లో రాష్ట్రంలో కంప్యూటర్ సీట్లు 22,033 మాత్రమే. 2024 సంవత్సరానికి ఇవి 61,587కు పెరిగాయి. అంటే మూడు రెట్లు పెరిగాయి. ఇక కోర్ గ్రూపు (సివిల్, మెకానికల్, ఈఈఈ తదితరాలు)ల్లో 2019లో 43,532 సీట్లు ఉంటే, 25,823 సీట్లు భర్తీ అయ్యాయి. 2024లో కోర్ గ్రూపులో సీట్లు 25,597కు పడిపోయాయి. ప్రవేశాలు కూడా 19,739కి తగ్గిపోయాయి. కోవిడ్ తర్వాత నుంచి కోర్ గ్రూపుల్లో సీట్లు, ప్రవేశాలు గణనీయంగా తగ్గిపోగా.. కంప్యూటర్ సైన్స్ సీట్లకు డిమాండ్ పెరిగింది. ఈ సీట్ల పెరుగుదల మూడు రెట్లు ఉన్నప్పటీకీ, నాణ్యత అంతంత మాత్రంగానే ఉంది. 56 శాతం మంది అన్స్కిల్డ్ ఉద్యోగాలతోనే సరిపెట్టుకుంటున్నారు. ఇప్పుడేం చేస్తారు? బ్రాంచీల ఆడిటింగ్ చేపట్టి వాటికి ప్రామాణికతను పొందుపరచాలని ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. ముందుగా కాలేజీల నుంచి సీఎస్ఈ, ఇతర కంప్యూటర్ కోర్సుల సమగ్ర సమాచారం తెప్పిస్తున్నారు. ఫ్యాకల్టీ, కోర్సుకు కావాల్సిన లాంగ్వేజ్, లైబ్రరీ, లేబొరేటరీల వివరాలను తీసుకుంటారు. సీఎస్ఈ అనుమతి లభించినప్పటి నుంచీ కాలేజీల్లో ఉపాధి అవకాశాలను పరిశీలిస్తారు. కనీసం 40 శాతం ఉపాధి కల్పించని కాలేజీలపై మరింత లోతుగా అధ్యయనం చేస్తారు. డేటాసైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఉండాల్సిన ప్రమాణాలు, బోధన పద్ధతులను మార్కెట్ నిపుణుల నుంచి తెలుసుకుంటారు. ఈ తరహా ప్రమాణాలు ఎన్ని కాలేజీల్లో ఉన్నాయో పరిశీలిస్తారు. వీటి ఆధారంగా నాణ్యతను గుర్తించి, అది లోపించిన కాలేజీల్లో సీట్లను తగ్గించాలని ప్రభుత్వానికి సిఫార్సు చేసే అవకాశముంది. మరోవైపు ప్రాజెక్టు వర్క్ను గుర్తింపు ఉన్న సాఫ్ట్వేర్ కంపెనీల్లో చేయించేలా కాలేజీలే ఆయా సంస్థలతో అవగాహన ఒప్పందం కుదుర్చుకోవాలి. ఈ దిశగా భరోసా ఇచి్చన తర్వాతే వాటికి అనుమతినివ్వాలని భావిస్తున్నారు. ఎందుకీ పరిస్థితికంప్యూటర్ సైన్స్ బ్రాంచీల్లో సీట్లు పెరిగినా... తగ్గట్టుగా ఫ్యాకల్టీ ఉండటం లేదు. చాలా కాలేజీల్లో రికార్డుల ప్రకారం బోధకులు నిపుణులే (పీహెచ్డీ, ఎంఫిల్ చేసిన వాళ్లు) ఉంటున్నారు. కానీ వాస్తవంగా బోధించేది బీటెక్, ఎంటెక్ చేసిన వాళ్లే. అరకొర వేతనాలివ్వడమే ఈ పరిస్థితికి కారణం. అనుబంధ గుర్తింపు ఇచ్చేటప్పుడు జరిగే తనిఖీ సమయంలోనే రికార్డుల్లోని బోధకులు వస్తున్నారు. ఇక మౌలిక వసతుల మాటకొస్తే... 76 కాలేజీల్లో కంప్యూటర్ కోడింగ్ లే»ొరేటరీలు లేవని జేఎన్టీయూహెచ్ వర్గాలు అంటున్నాయి. డేటాసైన్స్, సైబర్ సెక్యూరిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్పై నిష్ణాతులైన బోధకులే కరువయ్యారు. 28 కాలేజీల్లో విద్యార్థులకు కోడింగ్లో 20 శాతం పరిజ్ఞానం కూడా ఉండటం లేదని గత ఏడాది క్యాంపస్ నియామకాలు చేపట్టిన ఓ దిగ్గజ సాఫ్ట్వేర్ కంపెనీ ముఖ్య ఉద్యోగి తెలిపారు.నాణ్యత కోసమే ఆడిట్కోర్సుల ఆడిటింగ్ ద్వారా డిమాండ్ ఉన్న కోర్సుల్లో నాణ్యత ఎంతో ప్రజలకు తెలుస్తుంది. క్రేజ్ కొద్దీ చేరే విద్యార్థులు ఏమేర నష్టపోతున్నారో అర్థం చేసుకోవడానికి ఆడిటింగ్ మంచి ఆయుధమని భావిస్తున్నాం. సమాజానికి అవసరమైన ఇంజనీరింగ్ విద్యలో ప్రైవేటు కాలేజీలు వ్యాపార ధోరణితో కాకుండా, నాణ్యత ప్రమాణాలు పాటించాలని ప్రభుత్వం కోరుకుంటోంది. దీన్ని దృష్టిలో పెట్టుకునే ఆడిట్కు సిద్ధమయ్యాం. పూర్తి ఆడిట్ నివేదికను ప్రభుత్వం ముందుంచుతాం. – ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి, ఉన్నత విద్యామండలి చైర్మన్ -
ఆంగ్ల భాషా నైపుణ్యం తప్పనిసరి!
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర ప్రభుత్వ విశ్వవిద్యాలయాల నుంచి పట్టభద్రులైన యువతకు ఆంగ్లంలో సరైన నైపుణ్యం లేకపోవడం వారి పోటీ సామర్థ్యాన్ని దెబ్బతీస్తోందని నీతి ఆయోగ్ వెల్లడించింది. యువతలో భాషా నైపుణ్యాలు పెంపొందించేలా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపాల్సిన అవసరం ఎంతైనా ఉందని స్పష్టం చేసింది. విద్యార్థులు ఆంగ్లం, ఇతర విదేశీ భాషలపై పట్టుసాధించేలా అంతర్జాతీయ సంస్థల భాగస్వామ్యంతో ప్రత్యేక కార్యక్రమాలకు రూపకల్పన చేయాలని నీతి ఆయోగ్ సిఫార్సు చేసింది. ఈ మేరకు ఇటీవల ‘రాష్ట్రాలు, రాష్ట్ర ప్రభుత్వ విశ్వవిద్యాలయాల ద్వారా నాణ్యమైన ఉన్నత విద్య విస్తరణ’పేరిట విడుదల చేసిన నివేదికలో ఆంగ్ల భాష అవసరాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించింది. ‘అనేక రాష్ట్రాల్లో, స్థానిక పరిశ్రమలలో పనిచేసే నైపుణ్యం గల వ్యక్తులు, ఇతర మానవ వనరులు ప్రధానంగా రాష్ట్రం బయటి నుంచే వస్తున్నారు. ఈ ధోరణికి ముఖ్య కారణం స్థానిక యువతకు ఆంగ్ల భాషలో నైపుణ్యం తగినంతగా లేకపోవడమే. సమస్యను పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి సారించాల్సి ఉంది. విద్యార్థుల ఉపాధి నైపుణ్యాలను పెంపొందించడంతో పాటు, తద్వారా వారు రాష్ట్రంలోనే ఉంటూ జాతీయ స్థాయిలో పోటీపడే స్థాయికి తీసుకెళ్లడం అత్యవసరం’అని తన నివేదికలో పేర్కొంది. ముందున్న రెండు రాష్ట్రాలు ఆంగ్ల భాష అవసరాన్ని గుర్తించడంలో పంజాబ్, కర్ణాటక రాష్ట్రాలు ముందున్నాయని నివేదికలో పేర్కొంది. పంజాబ్ ప్రభుత్వం 2023లో బ్రిటిష్ కౌన్సిల్ సహకారంతో ఈ దిశగా ప్రయత్నాలను ప్రారంభించిందని తెలిపింది. ఆరు నెలల పాటు ఇంటెన్సివ్ 18–సెషన్ల కోర్సును నిర్వహించడం ద్వారా ఆంగ్ల భాషా నైపుణ్యాలను పెంపొందించడంపై దృష్టి పెట్టిందని వివరించింది. దాదాపు 5వేల మంది ప్రభుత్వ కళాశాలల విద్యార్థులకు ఈ పైలట్ ప్రాజెక్ట్తో లాభం కలిగిందని వెల్లడించింది. విస్తరిస్తున్న ప్రపంచీకరణ నేపథ్యంలో ప్రపంచ స్థాయిలో అభివృధ్ధి చెందేందుకు విద్యార్థులకు అవసరమైన భాషా సామర్థ్యాలను పెంపొందించడంలో పంజాబ్ చొరను నీతిఆయోగ్ ప్రశంసించింది. అదేవిధంగా, కర్ణాటక ప్రభుత్వం 2024లో ప్రారంభించిన కార్యక్రమాలను ప్రత్యేకంగా ప్రస్తావించింది. ఉన్నత విద్యకు ప్రాధాన్యం ఇవ్వడం, భాషా నైపుణ్యాలను పెంచడం, విద్యార్థులకు ఉపాధి అవకాశాలను మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకుందని గుర్తు చేసింది. మైక్రోసాఫ్ట్ ఇండియాతో భాగస్వామ్యంతో ‘ఇంగ్లిష్ స్కిల్స్ ఫర్ యూత్’కార్యక్రమం ద్వారా 16 ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాలల్లో 5,795 మంది విద్యార్థుల ఆంగ్ల నైపుణ్యాభివృధ్ధికి తోడ్పాటునందిస్తోంది. ‘స్కాలర్స్ ఫర్ అండర్ గ్రాడ్యుయేట్ టాలెంట్’కార్యక్రమం ద్వారా ఆరు విశ్వవిద్యాలయాల నుంచి అర్హులైన విద్యార్థులకు లండన్లోని విశ్వవిద్యాలయాలకు రెండు వారాల పాటు పంపి, వారితో అభ్యసించే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి ఆంగ్ల విద్యను ప్రోత్సహించిందని నీతిఆయోగ్ ప్రశంసించింది. -
పడిపోతున్న వర్సిటీల ప్రమాణాలు
రాష్ట్రాల జాబితాలోని అంశాలు కొన్నింటిని, ఉమ్మడి జాబితాలోని అంశాల్లో మరి కొన్నింటిని క్రమంగా దొడ్డిదారిన తన ఖాతా ల్లోకి మళ్లించుకొంటూ ఇప్పటికే కేంద్రం సమాఖ్య స్ఫూర్తిని అపహాస్యం చేస్తోంది. తాజాగా విశ్వవిద్యాలయాల్లో సంస్కరణల పేరుతో యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ద్వారా రూపొందించిన ముసా యిదాను బలవంతంగా రాష్ట్రాలపై రుద్ది, యూనివర్సిటీలపై పూర్తి స్థాయి పట్టుసాధించడానికి కేంద్రం అడుగులు వేయడంతో మరో కొత్త వివాదం మొగ్గ తొడిగింది.యూజీసీ ప్రతిపాదించిన సంస్కరణలు అమలులోకి వస్తే...ఎంతో కీలకమైన వైస్ ఛాన్స్లర్ల నియామకాల్లో రాష్ట్రాలకున్న హక్కు లుప్తమైపోతుంది. ఇప్పటివరకు ఉపకులపతులుగా అర్హులైన వారిని నియమించడానికి సెర్చ్ కమిటీ వేయడం ఆనవాయితీగా ఉంది. సెర్చ్ కమిటీలో రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ప్రతినిధి ఒకరు ఉంటారు. సెర్చ్ కమిటీ ఎంతో కసరత్తు జరిపి 5 పేర్లను రాష్ట్ర ప్రభుత్వానికి పంపితే... దానిని పరిశీలించి ఒక అభ్యర్థిని ఎంపిక చేసి గవర్నర్ ఆమోదానికి పంపుతుంది. కానీ, కొత్తగా వచ్చే సంస్కరణల్లో రాష్ట్ర ప్రభుత్వ ప్రమేయానికి కత్తిరింపు వేశారు. నిజానికి, రాష్ట్ర ప్రభుత్వాల హక్కుల్ని హరించే సంస్కరణలు చాలానే యూజీసీ ప్రతిపాదించింది. ఇవన్నీ రాజ్యాంగబద్ధంగా చెల్లుబాటు అవుతాయా అన్న అంశం పక్కన పెడితే... అసలు యూనివర్సిటీల్లో చేపట్టాల్సిన సంస్కరణలు ఏమిటి? నాణ్యతా ప్రమాణాలు పెంచే సంస్కరణలు కాకుండా పెత్తనం కోసం కేంద్రం వెంపర్లాడటం ఏమిటన్న ప్రశ్న తలెత్తుతోంది.సంస్కరణలు ఏ రంగంలో చేపట్టాలి?మన దేశంలోని పలు యూనివర్సిటీలు, వాటి అనుబంధ కళా శాలల విద్యా ప్రగతి ప్రమాణాలు పాతాళానికి పడిపోయాయన్నది నిర్వివాదాంశం. ఆర్థిక, సాంకేతిక అభివృద్ధికి బంగారు బాటలు వేయ డంలో ఉన్నత విద్య, పరిశోధన కీలకమైనవి. ఆరోగ్యం, ఆహారం, ఉపాధి తదితర రంగాలలో ఎదురయ్యే సవాళ్లకు తగిన పరిష్కారం అందించే పరిశోధనలు పురుడుపోసుకొనేది యూనివర్సిటీ ప్రాంగణాలలోనే. వివిధ దేశాలలో జరుగుతున్న పరిశోధనలు, ఆవిష్కరణలతో పోలిస్తే భారత్ ఎంతో వెనుకబడి ఉంది. ఒకప్పుడు దేశానికి గర్వకారణంగా నిలిచిన యూనివర్సిటీలు పలు రుగ్మతలతో కునారి ల్లుతున్నాయి. నిధుల లేమి, రాజకీయ జోక్యం, బోధనా సిబ్బంది కొరత, అవసరమైన మౌలిక సదుపాయాలు లేకపోవడం తదితర కారణాలతో యూనివర్సిటీల ప్రమాణాలు గణనీయంగా పడి పోయాయి. గతేడాది ‘క్యూఎస్’ అనే ప్రఖ్యాత సంస్థ ప్రపంచ వ్యాప్తంగా 107 దేశాల్లోని 1,740 యూనివర్సిటీలను అధ్యయనం చేసి ర్యాంకులు ఇవ్వగా అందులో భారత్కు చెందిన 78 యూనివర్సి టీలు మాత్రమే ఆ ప్రమాణాలు అందుకోగలిగాయి.ఒకప్పుడు ప్రపంచానికి దిశానిర్దేశనం చేసి, వేల సంఖ్యలో గొప్ప విద్యావేత్తలను అందించిన నలంద, తక్షశిల, విశ్వభారతి, శాంతిని కేతన్ వంటి అత్యున్నత విద్యా పీఠాలు గలిగిన భారతదేశంలో నేడు అనేక యూనివర్సిటీలలో విద్యా ప్రమాణాలు అడుగంటాయి. ఆవిష్కరణలకు మాతృమూర్తి వంటి విశ్వవిద్యాలయాలు విజ్ఞాన వెలుగులు ప్రసరించాలంటే అందుకు అనుగుణంగా మౌలిక సదు పాయాలు, నిష్ణాతులైన బోధనా సిబ్బంది ఉండాలి. రాజకీయ జోక్యానికి తావులేకుండా సమర్థత, అంకితభావం కలిగిన వ్యక్తులకు నిర్వహణ బాధ్యతలు అప్పగించాలి. విశ్వగురువు ఎలా అవుతాం?2047 నాటికి మన దేశం ‘విశ్వగురువు’గా అవతరించాలని ప్రధాని నరేంద్ర మోదీ సంకల్పంగా పెట్టుకొన్నారు. ఈ లక్ష్యం గొప్పదే. అందుకు తగిన కార్యాచరణ అన్ని రంగాలలో కనపడాలిగా! ప్రత్యేకించి ఉన్నత విద్యారంగంలో, పరిశోధనా రంగంలో అభివృద్ధి పథంవైపు అడుగులు పడాలి. అందుకు భిన్నంగా ఈ రంగంలో అడు గులు తడబడుతున్నాయి. అందుకు ఉదాహరణ దేశం నుంచి సుమారు 13 లక్షల మంది విద్యార్థులు నాణ్యమైన విద్య కోసం విదే శాల బాట పట్టడం. నాణ్యమైన ఉన్నత విద్యకు చిరునామాగా నేటికీ అమెరికా, ఇంగ్లాండ్, జర్మనీ, ఆస్ట్రేలియా వంటి దేశాలే నిలుస్తు న్నాయి. వైద్య విద్య కోసం ఒకప్పటి కమ్యూనిస్టు దేశాలైన రష్యా, అజర్జైబాన్, ఉక్రెయిన్ తదితర దేశాలకు భారతీయ విద్యార్థులు వేల సంఖ్యలో ‘క్యూ’ కడుతూనే ఉన్నారు. జబ్బు ఒకటయితే, మందు మరొకటి వేసినట్లుగా... దేశంలోని విశ్వవిద్యాలయాలను అన్ని విధాలా బలోపేతం చేసే చర్యలను తీసు కోకుండా, దేశంలో విదేశీ యూనివర్సిటీలకు ద్వారాలు తెరిచేందుకు రంగం సిద్ధం చేయడం, యూనివర్సిటీలపై రాష్ట్రాల హక్కుల్ని హరించి వేయడం విద్యావేత్తలను కలవరపరుస్తోంది. మరోవైపు ఎంతో ప్రతిష్ఠాత్మకమైన స్వదేశీ విశ్వవిద్యాలయాలను నిర్లక్ష్యం చేస్తున్నారు.దేశంలో విదేశీ యూనివర్సిటీల ఏర్పాటుకు మార్గాన్ని ఏర్ప రిస్తే... ఎటువంటి విదేశీ యూనివర్సిటీలు ఇక్కడకు వస్తాయి? ప్రపంచంలో పేరు బడిన తొలి 50 యూనివర్సిటీలు భారత్ కొస్తాయా? అని ప్రశ్నించుకొంటే స్పష్టమైన సమాధానం దొరకదు. పైగా ఇక్క డకు వచ్చే విదేశీ యూనివర్సిటీలపై తమ నియంత్రణ ఏదీ ఉండదనీ, కానీ పారదర్శకతతో ఉండాలని మాత్రమే కోరతామనీ యూజీసీ స్పష్టం చేసింది. అంటే... ఫీజుల వసూళ్ల విషయంలో విదేశీ వర్సిటీ లకు స్వేచ్ఛ ఉంటుంది. అయితే అవి ప్రదానం చేసే డిగ్రీలకు, విదేశాలలో ఇచ్చే పట్టాలకు సమానమైన విలువ ఉంటాయన్నది ఒక్కటే విద్యార్థులను ఆకర్షిస్తోంది. విదేశీ యూనివర్సిటీలు ఇక్కడ ఎంత పెట్టుబడి పెట్టాలో ముసాయిదా పత్రంలో నిర్దేశించకపోవడంతో అవి మన బ్యాంకుల నుంచే రుణాలు పొంది, వాటితోనే మౌలిక సదుపా యాలు ఏర్పాటు చేసి, లాభాల్ని మాత్రం తమ దేశానికి తీసుకెళ్లే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. పైగా విదేశీ యూనివర్సీటీలలో సంపన్నుల పిల్లలు మాత్రమే చదువు‘కొనే’ అవకాశం ఉన్నందువల్ల... దేశంలో ‘సంపన్న విద్యార్థి శ్రేణి’ మరొకటి నూతనంగా తయారవుతుంది.బోధన–పరిశోధనఒకప్పుడు దేశంలోని పలు విశ్వవిద్యాలయాలలో జరిపిన పరి శోధనలకు అంతర్జాతీయంగా పేటెంట్లు లభించాయి. ఒక అంచనా ప్రకారం... దేశంలోని మన వర్సిటీలు ఏటా 24,000 డాక్టరేట్ పట్టాల్ని ప్రదానం చేస్తున్నాయి. అంటే ఏటా వేల సంఖ్యలో పరిశో ధనా పత్రాలు వెలువడుతున్నాయి. కానీ... వాటిని దేశాభివృద్ధి కోసం ఏ మేరకు ఉపయోగించుకోగలుగుతున్నారనేదే ప్రశ్నార్థకం. అసలు రీసెర్చ్ ఈ అంశం మీద జరగవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఏది ఏమైనా... స్వదేశీ విశ్వవిద్యాలయాలకు రెండు కళ్లుగా భావించే బోధన, పరిశోధనలను పటిష్ఠం చేయాలి. విదేశీ విశ్వ విద్యాలయాల మోజులో స్వదేశీ విశ్వవిద్యాలయాలను నిర్లక్ష్యం చేయడం ఎంతమాత్రం తగదు. అంతర్జాతీయంగా చోటుచేసుకుంటున్న పరిణామాలను, సవాళ్లను ధీటుగా ఎదుర్కొనేందుకు ఉన్నత విద్యా వ్యవస్థను మెరుగ్గా తీర్చిదిద్దాలి. విశ్వ విద్యాలయాలపై రాష్ట్రాల హక్కుల్ని కొనసాగించాలి. ఉపకులపతుల నియామకం పూర్తిగా రాజకీయమై పోయింది. రాజకీయాలకు అతీతంగా విశ్వ విద్యాలయాలు పని చేయగలిగే సంస్కరణలు తేవాలి తప్ప కొండ నాలిక్కి మందేస్తే ఉన్న నాలిక ఊడిన చందంగా కేంద్రం వ్యవహరించడం సమ్మతం కాదు.డా‘‘ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు వ్యాసకర్త ఏపీ శాసన మండలి సభ్యులు, కేంద్ర మాజీ మంత్రి -
380 జిల్లాల్లో వర్సిటీలు లేవు
సాక్షి, అమరావతి : దేశంలో రాష్ట్రాల మధ్య విశ్వవిద్యాలయాలు, కాలేజీల నిష్పత్తిలో అసమానతలున్నాయని నీతి ఆయోగ్ అధ్యయన నివేదిక వెల్లడించింది. కొన్ని రాష్ట్రాల్లో ఎక్కువ విశ్వవిద్యాలయాలుంటే ఇంకొన్ని రాష్ట్రాల్లో అతి తక్కువ ఉన్నాయని తెలిపింది. ఉదా.. రాజస్థాన్లో 93, గుజరాత్లో 91, ఉత్తరప్రదేశ్లో 87 ఉండగా.. అండమాన్–నికోబార్ దీవులు, లక్షద్విప్, దాద్రా–నగర్ హవేలీ, డామన్–డయ్యూ కేంద్రపాలిత ప్రాంతాల్లో ఒక్క విశ్వవిద్యాలయం కూడా లేదని పేర్కొంది. ఈశాన్య రాష్ట్రాల్లో కూడా తక్కువ విశ్వవిద్యాలయాలున్నాయని నివేదిక తెలిపింది. దేశ రాజధాని ఢిల్లీ మినహా మిగిలిన రాష్ట్రాల్లో విశ్వవిద్యాలయాల నిష్పత్తిలోను, ఉన్నత విద్య అందుబాటులోనూ అసమానతలున్నాయని వివరించింది. నీతి ఆయోగ్ నివేదికలోని ఇతర ముఖ్యాంశాలు ఏమిటంటే.. పట్టణ ప్రాంతాల్లో 59 శాతం వర్సిటీలు.. ఇదిలా ఉంటే.. దేశవ్యాప్తంగా 1,160 విశ్వవిద్యాలయాలుంటే ఇందులో 680 వర్సిటీలు పట్టణ ప్రాంతాల్లోనూ.. 480 వరిటీలు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయి. అంటే.. 66 శాతం జనాభా గల గ్రామీణ ప్రాంతాల్లో 41 శాతం యూనివర్శిటీలుండగా 34 శాతం జనాభాగల పట్టణ ప్రాంతాల్లో 59 శాతం యూనివర్సిటీలున్నాయి. జాతీయ విద్యా విధానంలో భాగంగా 2035 నాటికి ఉన్నత విద్యలో జీఈఆర్ను 50 శాతానికి పెంచాలన్న లక్ష్యాలు నెరవేరాలంటే ప్రస్తుతమున్న 4.33 కోట్ల విద్యార్థుల నమోదును 9 కోట్లకు చేర్చాల్సి ఉంది. దాదాపు 4.5 కోట్ల మంది అదనపు విద్యార్థులను ఉన్నత విద్యలోకి తీసుకురావాలి. ఈ నేపథ్యంలో.. ప్రాంతాలు, జిల్లాలు, రాష్ట్రాల మధ్య ఉన్నత విద్యా సంస్థల్లో అసమానతలను తొలగించేందుకు చర్య లు తీసుకుంటూ క్లస్టర్ వర్శిటీలతో సహా అనేక కొత్త విశ్వవిద్యాలయాలను స్థాపించాలని నీతి ఆయోగ్ నివేదిక సూచించింది. ప్రాంతీయ డిమాండ్, యాక్సెసిబిలిటీ, సామీప్యత పరిగణనలోకి తీసుకుని కొత్త వర్సిటీలు స్థాపించాలని సూచించింది. ఉన్నత విద్యలోనూ అవకాశాలు పరిమితం.. » తక్కువ జనాభా కలిగిన ఈశాన్య రాష్ట్రాల్లో లక్ష జనాభాకు చూస్తే ఎక్కువ విశ్వవిద్యాలయాలు, కాలేజీలున్నాయి. కానీ, అత్యధిక జనాభా కలిగిన ఉత్తరప్రదేశ్లో లక్ష జనాభాకు కొన్ని వర్సిటీలే ఉన్నాయి. అలాగే, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్ వంటి రాష్ట్రాల్లోనూ ఒక లక్ష జనాభాకు తక్కువ విశ్వవిద్యాలయాలున్నాయి. » దేశంలో ఉన్నత విద్య అందుబాటులోనూ అసమానతలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. కొన్ని జిల్లాల్లో పరిమితంగా అవకాశాలు అందుబాటులో ఉండగా కొన్ని జిల్లాల్లో ఎక్కువ ఉన్నాయి. » రాజస్థాన్లోని జైపూర్లో అత్యధికంగా 35, బెంగళూరులో 25, గుజరాత్లో 21 విశ్వవిద్యాలయాలున్నాయి. » 160 జిల్లాల్లో ఒక్కో విశ్వవిద్యాలయం చొప్పున.. 102 జిల్లాల్లో మూడు కంటే తక్కువగా వర్సిటీలున్నాయి. » ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఈశాన్య రాష్ట్రాల్లోని 380 జిల్లాల్లో అసలు విశ్వవిద్యాలయాలే లేవు. » ఇక కాలేజీలు కూడా దేశంలోని కొన్ని జిల్లాల్లో అత్యధికంగా కొన్ని జిల్లాల్లో తక్కువగాను ఉన్నాయి. » బెంగళూరులో 1,118 ఉండగా రాజస్థాన్లోని జైపూర్లో 740, మహారాష్ట్రలోని పూణేలో 628 కాలేజీలు ఉన్నాయి. » దేశంలోని 153 జిల్లాల్లో 100 లేదా అంతకంటే ఎక్కువ కాలేజీలుండగా 29 జిల్లాల్లో ఒక్క కాలేజీ కూడా లేదు. 85 జిల్లాల్లో ఐదు కన్నా తక్కువ కాలేజీలున్నాయి. -
బోధకులే లేరు.. ఏం సాధిస్తాం?
సాక్షి, హైదరాబాద్: సమస్యలు పరిష్కరిస్తే తప్ప రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో మెరుగైన ప్రమాణాలు నెలకొల్పలేమని వైస్ చాన్స్లర్లు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా అధ్యాకుల కొరతను తక్షణమే తీర్చాలని కోరుతున్నారు. ప్రభుత్వ విశ్వవిద్యాలయాల వైస్ చాన్స్లర్లు ఇటీవల హైదరాబాద్లో సమావేశమై వర్సిటీల్లో సమస్యలపై చర్చించారు. అన్ని వర్సిటీల్లోనూ దాదాపు ఒకే రకమైన సమస్యలు ఉన్నాయని గుర్తించారు. ఈ సమస్యలపై సమగ్ర నివేదికను రూపొందించారు. దీనిని త్వరలో సీఎంకు అందివ్వనున్నారు. సమస్యలెన్నో.. రాష్ట్రంలోని 11 విశ్వవిద్యాలయాల్లో దాదాపు 74 శాతం అధ్యాపక పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మంజూరైన మొత్తం పోస్టులు 2,825 కాగా, ప్రస్తుతం ఉన్న రెగ్యులర్ సిబ్బంది 873 మంది మాత్రమే. మిగతా వాళ్లంతా తాత్కాలిక ఉద్యోగులే. దీంతో బోధనలో జవాబుదారీతనం లోపించి, విద్యా ప్రమాణాలు పడిపోతున్నాయనే విమర్శలున్నాయి. పోస్టుల భర్తీపై గత ప్రభుత్వం నియమించిన కామన్ రిక్రూట్మెంట్ బోర్డు స్థానంలో ప్రత్యామ్నాయాన్ని ప్రభుత్వం ఆలోచిస్తోంది. అధ్యాపకుల కొరత కారణంగా ప్రైవేటు, డీమ్డ్ వర్సిటీలతో పోటీ పడలేని స్థితి ఉంది. ఏఐ, సైబర్ సెక్యూరిటీ వంటి కోర్సులు తీసుకొచ్చినా ప్రాజెక్టులు రావడం లేదు. ఉస్మానియా వర్సిటీలో పరిశోధనలు. పరిశోధన ప్రాజెక్టులూ తగ్గిపోయాయి. 2020–21లో రూ.52.45 కోట్ల ప్రాజెక్టులొస్తే.. 2022–23 నాటికి రూ.24.75 కోట్లకు తగ్గింది. రెండేళ్లలోనే 53 శాతం పడిపోయాయి. శాపంగా మారిన నిధుల కొరత చాలా యూనివర్సిటీల్లో నిధుల కొరత ఉంది. పాలమూరు వర్సిటీకి రూ.10 కోట్లు కేటాయించినా,ఇస్తున్నది మాత్రం రూ.7 కోట్ల లోపే. ఇక్కడ ఏడు విభాగాలకు 84 పోస్టులు మంజూరైతే 17 పోస్టుల్లోనే అధ్యాపకులున్నారు. వీరిలో ఇద్దరు ప్రొఫెసర్లు. నలుగురు అసోసియేట్ ప్రొఫెసర్లు, 11 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు. కొత్తగా ప్రవేశపెట్టిన 11 సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులకు రెగ్యులర్ అధ్యాపకులే లేరు. 94 మంది తాత్కాలిక అధ్యాపకులతో బోధన కొనసాగుతోంది. తెలంగాణ వర్సిటీలో 152 ప్రొఫెసర్ పోస్టులు మంజూరైనా, ఉన్నది 61 మంది మాత్రమే. 91 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 12 సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులున్న ఈ వర్సిటీలో అకడమిక్ కన్సల్టెంట్లు, పార్ట్ టైం అధ్యాపకులతో నెట్టకొస్తున్నారు. కాకతీయ వర్సిటీలో బోధన, బోధనేతర సిబ్బంది వేతనాలకు ఏడాదికి రూ.150 కోట్లు అవసరం. రాష్ట్ర ప్రభుత్వం నుంచి బ్లాక్ గ్రాంట్ కింద రూ.97 కోట్లు మాత్రమే వస్తోంది. దీంతో అంతర్గత సమీకరణల ద్వారా రూ.53 కోట్లు సమకూర్చుకుంటున్నారు. ఇక్కడ 405 రెగ్యులర్ అధ్యాపకుల పోస్టులు ఉంటే, అందుబాటులో ఉన్నది 83 మందే. మరో 190 మందిని కాంట్రాక్టు, 201 మందిని తాత్కాలిక పద్ధతిలో తీసుకున్నారు. కొత్తగా ప్రవేశ పెట్టిన కోర్సులను కలుపుకుంటే వెయ్యి మంది వరకూ అధ్యాపకులు ఉండాలి.సాంకేతిక విద్యకు అగచాట్లుఇంజనీరింగ్లో కొత్త కోర్సులు వస్తు న్నాయి. ఆర్టిఫిíÙయల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ, డేటాసైన్స్ వంటి కోర్సులకు మౌలిక వసతులు, బోధనా నైపుణ్యం గల సిబ్బంది లేకపోవటంతో ప్రభుత్వ వర్సిటీల్లో నిర్వహించలేకపోతున్నారు. జేఎన్టీయూహెచ్లో 410 మంది అధ్యాపకులుండాలి. కానీ 169 మందే ఉన్నారు. 241 పోస్టులు ఖాళీ. కొత్త ఏఐ కోర్సులు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం సమకూర్చుకోవడానికి ఏటా రూ.200 కోట్లు అవసమని ఇక్కడి ఉన్నతాధికారులు చెబుతున్నారు. బాసర ట్రిపుల్ ఐటీలో చాలాకాలంగా విద్యార్థులకు ఇంటర్న్షిప్ లేదు. ఇక్కడ 90 మంది బోధన, 100 మంది బోధనేతర సిబ్బంది కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్నారు. -
ఆన్లైన్లోనే యాజమాన్య కోటా భర్తీ!
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ సీట్ల భర్తీపై ఈసారి కఠినంగా వ్యవహరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. యాజమాన్య కోటా సీట్లను ఆన్లైన్ విధానంలో భర్తీ చేయాలని భావిస్తోంది. దీనిపై త్వరలో కార్యాచరణ వెలువడనుంది. ఇప్పటికే ఈ విధానంపై ఉన్నత విద్యా మండలి నివేదిక రూపొందించింది. దీనిని త్వరలో ప్రభుత్వానికి అందించనుంది. బీ, సీ కేటగిరీ సీట్ల ఫీజును నిర్ణయించే అధికారం ఫీజులు, నియంత్రణ కమిటీకి అప్పగించాలని నివేదికలో పేర్కొంది. సీ కేటగిరీ ఫీజుల విషయంలో పెద్దగా అభ్యంతరాలు లేకున్నా, బీ కేటగిరీ సీట్ల ఫీజుల విషయంలోనే తర్జన భర్జన కొనసాగుతోంది. మరోవైపు ఈ తరహా నియంత్రణపై ప్రైవేటు కాలేజీలు విముఖంగా ఉన్నాయి. తమ ఖర్చులను కూడా పరిగణనలోకి తీసుకోవాలని ఎఫ్ఆర్సీ, ప్రభుత్వాన్ని కోరాయి. నియంత్రణ ఎలా? రాష్ట్రంలో దాదాపు 1.32 లక్షల ఇంజనీరింగ్ సీట్లున్నాయి. ఇందులో 70 శాతం కనీ్వనర్ కోటా కింద భర్తీ చేస్తారు. మిగిలిన 30 శాతంలో 15 శాతం బీ కేటగిరీ కింద, 15 శాతం సీ కేటగిరీ కింద భర్తీ చేస్తారు. ఇప్పటివరకు బీ, సీ కేటగిరీ సీట్ల భర్తీ అధికారం కాలేజీలకే ఉంది. బీ కేటగిరీ సీట్లను జేఈఈ, ఈఏపీసెట్, ఇంటర్ మార్కుల మెరిట్ ఆధారంగానే భర్తీ చేయాలి. ఎఫ్ఆర్సీ నిర్ణయించిన ఫీజులే తీసుకోవాలి. వీటికి ఫీజు రీయింబర్స్మెంట్ వర్తించదు. కానీ చాలా కాలేజీలు బీ కేటగిరీ సీట్ల భర్తీలో నిబంధనలు పాటించడం లేదు. అధిక ఫీజు చెల్లించినవారికే సీట్లు ఇస్తున్నట్లు ఫిర్యాదులున్నాయి. రాష్ట్రంలో 58 శాతం సీట్లు కంప్యూటర్ సైన్స్ బ్రాంచీల్లోనే ఉండటంతో, ఈ డిమాండ్ను దృష్టిలో పెట్టుకొని ఒక్కో సీటుకు రూ.6 నుంచి రూ.18 లక్షల వరకు అనధికారికంగా ఫీజులు వసూలు చేస్తున్నాయి. దీన్ని నియంత్రించాలని ప్రభుత్వం ఉన్నత విద్యా మండలి నేతృత్వంలో కమిటీ వేసింది. ఆన్లైన్ విధానంలో ఈ సీట్ల భర్తీని చేపట్టాలని ప్రభుత్వానికి సిఫార్సు చేయాలని ఆ కమిటీ నిర్ణయించింది. సీ కేటగిరీ సీట్లను ప్రవాస భారతీయుల పిల్లలకు ఇస్తారు. ఈ కేటగిరీలో విద్యార్థులు లేకపోతే కాలేజీలు ఇష్టానుసారం అమ్ముకుంటున్నాయి. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఈ రెండు కేటగిరీలపై నియంత్రణ ఉంటుందని అధికారులు చెబుతున్నారు. కాలేజీల తనిఖీలకు రంగం సిద్ధం ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలకు అనుబంధ గుర్తింపు ఇచ్చే ప్రక్రియ వచ్చే వారం మొదలవ్వబోతోంది. వివిధ బ్రాంచీలకు తగ్గట్టు మౌలిక వసతులు ఉన్నాయా? అధ్యాపకులు ఏమేర ఉన్నారనే అంశాలను పరిశీలిస్తారు. ఇవన్నీ సక్రమంగా ఉంటేనే ఈసారి అఫిలియేషన్ ఇస్తామని విశ్వవిద్యాలయాల వీసీలు చెబుతున్నారు. ముఖ్యంగా సీఎస్సీ, డేటా సైన్స్, ఆరి్టఫిíÙయల్ ఇంటెలిజెన్స్ వంటి కోర్సుల విషయంలో ప్రత్యేకంగా తనిఖీలు చేయాలని నిర్ణయించారు. జేఎన్టీయూహెచ్ పరిధిలో ముగ్గురు నిపుణుల చొప్పున ఒక్కో తనిఖీ కమిటీ వేసి కాలేజీల్లో వసతులు పరిశీలించనున్నారు. ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఫలితాలు వచ్చేలోగా ఈ ప్రక్రియ పూర్తి చేయాలని నిర్ణయించారు.ఆన్లైన్ విధానమే మంచిది యాజమాన్య కోటా సీట్ల భర్తీని ఆన్లైన్లో చేపడితేనే సమస్యలు రాకుండా ఉంటాయి. దీనిపై ఇప్పటికే కసరత్తు పూర్తయింది. ప్రభుత్వం తీసుకునే నిర్ణయంఆధారంగా ముందుకెళ్తాం. –ప్రొ. బాలకిష్టారెడ్డి,ఉన్నత విద్యామండలి చైర్మన్ -
ఆశయాన్ని దెబ్బతీసే ఆచరణ?
రాజకీయాలకు అతీతంగా సాగాల్సిన విద్యారంగానికీ రంగులు అంటుకున్నాయి. కేంద్రం ఇటీవల జారీ చేసిన ‘యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) నిబంధనలు – 2025’ ముసాయిదా చర్చ నీయాంశమైంది. విశ్వవిద్యాలయ ఉపకులపతుల ఎంపిక ప్రక్రియను సమూలంగా మార్చేస్తూ, కేంద్ర విద్యాశాఖ మంత్రి వెలువరించిన ఈ ముసాయిదా బీజేపీయేతర ప్రభుత్వాలున్న రాష్ట్రాలలో రచ్చ రేపుతోంది. ఉమ్మడి జాబితాలోని అంశమైన విద్యారంగంలో సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా కేంద్రం పెత్తనం చేయాలనుకుంటున్నదన్నది ప్రతిపక్షాల ఆరోపణ. తాజా యూజీసీ ముసాయిదా అందుకు నిదర్శనమన్నది వాటి భావన. రాష్ట్ర గవర్నర్ నిర్వాకమా అని ఇప్పటికే పలు యూనివర్సిటీల్లో వీసీలు లేకుండా పోయిన తమిళనాడు ఈ ముసాయిదాను తక్షణమే ఉపసంహరించాలని కేంద్రాన్ని కోరుతూ చట్టసభలో తీర్మానం చేయడం గమనించాల్సిన అంశం. వీసీల పదవీ కాలాన్ని మూడు నుంచి అయిదేళ్ళకు పెంచడం మంచిదే అయినా, పరిశ్రమ నిపుణులు, ప్రభుత్వ ఉన్నతాధికారుల పేరిట కాషాయ భక్తుల్ని వీసీలను చేస్తారన్న అనుమానాలకు జవాబు దొరకడమే కష్టంగా ఉంది. ముసాయిదా ప్రకారం వైస్ఛాన్సలర్ల (వీసీల) నియామకం కోసం ముగ్గురు సభ్యుల అన్వేషణ, ఎంపిక కమిటీని నియమించే అధికారాన్ని ఛాన్సలర్లకు, అంటే కేంద్రసర్కార్ నియమించే ఆ యా రాష్ట్రాల గవర్నర్లకు కట్టబెట్టారు. ఒకవేళ మార్గదర్శకాలను గనక అమలు చేయకుంటే... సదరు విద్యా సంస్థను యూజీసీ పథకాల నుంచి, లేదంటే అసలు డిగ్రీ కోర్సులు చెప్పడానికైనా వీలు లేకుండా బహిష్కరించవచ్చు. ఈ ముసాయిదాపై సంబంధిత వర్గాలు, సామాన్య ప్రజలు నెల రోజుల్లోగా తమ అభిప్రాయాలు, సలహాలు, సూచనలు చెప్పాలని కేంద్రం కోరుతోంది. వైస్–ఛాన్సలర్ మాట అటుంచి, పాఠశాల నుంచి కాలేజ్లు, విశ్వవిద్యాలయాల దాకా విద్యా రంగంపై రాష్ట్ర ప్రభుత్వాలు ఖర్చు చేస్తుంటే, రాష్ట్ర విశ్వవిద్యాలయాల ఛాన్సలర్ హోదానైనా కేంద్ర ప్రభుత్వం నియమించిన వ్యక్తి (గవర్నర్)కి అసలెలా కట్టబెడతారన్నది తమిళనాడు సీఎం స్టాలిన్ సహా పలువురి ప్రాథ మిక ప్రశ్న. సమాఖ్య స్ఫూర్తినే దెబ్బ తీసేలా ఉన్న తాజా ముసాయిదాను వ్యతిరేకిస్తూ, ప్రతిపక్ష పాలిత ప్రభుత్వాలు చట్టసభల్లో తీర్మానాలు చేయాలని ఆయన ఏకంగా పిలుపునివ్వడం విశేషం. ఇప్పటికే తమిళనాడు, పశ్చిమ బెంగాల్, కేరళ సహా అనేక రాష్ట్రాల్లో ప్రజలెన్నుకున్న ప్రభుత్వా లకూ, పై నుంచి వచ్చిన గవర్నర్లకూ మధ్య నిత్య ఘర్షణ చూస్తూనే ఉన్నాం. రాష్ట్ర సర్కార్లు నడిపే పలు విశ్వవిద్యాలయాల్లో సదరు గవర్నర్లే ఛాన్సలర్లు. వీసీల నియామకంపై వాళ్ళు రాష్ట్ర ప్రభు త్వాల అభీష్టానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న ఉదంతాలు కోకొల్లలు. ఇప్పటి వరకు వీసీల నియా మక అన్వేషణ కమిటీలను రాష్ట్ర ప్రభుత్వాలే ఏర్పాటుచేసేవి. తాజా ముసాయిదా ప్రకారం ఆ కమిటీల నియామకం సైతం ఛాన్సలర్లయిన గవర్నర్ల చేతిలోకి వెళ్ళిపోనుంది. ఢిల్లీ నుంచి తాము పంపే రబ్బరు స్టాంపులతో రాష్ట్రాల్లోని విశ్వవిద్యాలయాల్ని సైతం తమ చేతుల్లోకి తీసుకోవాలన్న ప్రయత్నమిది అని ప్రతిపక్షాల ఆరోపణ. కేంద్ర పాలకులు ఆ ఆరోపణల్ని నిజం చేయరాదు. నిజానికి, నూతన జాతీయ విద్యావిధానం (ఎన్ఈపీ) అమలు చేస్తామంటూ కేంద్రం ప్రకటించి మూడున్నరేళ్ళు దాటినా, ఉన్నత విద్యాసంస్థల సంస్కరణ నేటికీ నత్తనడక నడుస్తోంది. దీర్ఘకాల లోపాల్ని సవరించి, ఆధునిక కాలానికీ, విజ్ఞానాధారిత ఆర్థిక వ్యవస్థ అవసరాలకూ తగ్గట్లు యూనివర్సిటీలను తీర్చిదిద్దాల్సి ఉంది. ఉన్నత విద్యకు సంబంధించి నియంత్రణ వ్యవస్థయిన యూజీసీది అందులో ప్రధాన బాధ్యత. అతిగా నియంత్రిస్తోందంటూ గతంలో విమర్శలను ఎదుర్కొన్న యూజీసీ వైఖరి తాజా ముసాయిదాలో కొంత మారినట్టు కనిపిస్తోంది కానీ, కొత్త విమర్శలకు తావిచ్చింది. ఫలానా అంశం బోధించాలంటే అందులో పీజీ చేసి ఉండాల్సిందేనన్న అర్హత ప్రమాణాల్ని సడలించడం, వీసీ పదవికి పరిశ్రమలోని సీనియర్లు, ఉన్నతాధికారులకు సైతం వీలు కల్పించడం లాంటివి కొందరు స్వాగతిస్తే, మరికొందరు వ్యతిరేకిస్తున్నారు. ముఖ్యంగా,సంస్థాగత స్వతంత్రత ఎన్ఈపీ ప్రధానోద్దేశమైతే... తద్విరుద్ధంగా వీసీల నియామకంలో గవర్నర్లకు పెద్దన్న పాత్ర కల్పించడంతో కథ మళ్ళీ మొదటికొచ్చింది. ‘నీ ఎడమ చేయి తీయి... నా పుర్ర చేయి పెడతా’ అన్నట్టు ఇక వీసీల ఎంపికలో రాష్ట్రం బదులు కేంద్రం పట్టు బిగుస్తుందన్న మాట. పార్లమెంట్ చేసిన 1956 నాటి చట్టం ప్రకారం తన పరిధిలోకే రాని వీసీల ఎంపిక, నియామకాన్ని యూజీసీ నియంత్రించాలనుకోవడం సమస్యే కాదు రాజ్యాంగపరమైన చిక్కులు తెస్తుంది. గతంలో శాస్త్రవేత్త నాయుడమ్మ లాంటి వారిని వీసీలుగా నియమించినప్పుడు, వారి విజ్ఞానం విద్యాలయాలకు వన్నె తెచ్చింది. అలా చూస్తే, అధ్యాపక వర్గానికి ఆవల ఉన్న వృత్తి నిపుణులకు సైతం తలుపులు తెరవడం వల్ల ఉన్నత విద్యా సంస్థల్లో ప్రతిభావంతుల సమూహం పెరగడం మంచిదే. యూనివర్సిటీల్లో నియామక నిబంధనల్ని సరళం చేయడం స్వాగతించాల్సిందే. కానీ, ఇప్పుడైనా, అప్పుడైనా వీసీ పదవిని రాజకీయ నియామకంగా మార్చడంతోనే అసలు సమస్యంతా! వీసీల నియామకాల్లో రాజ్భవన్ను కీలకంగా మార్చడమన్నది అసలు ఎన్ఈపీ లక్ష్యాలకే విరుద్ధం. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో యూనివర్సిటీలు అక్కడి రాష్ట్ర ప్రభుత్వాలకూ, గవర్నర్లకూ మధ్య నలిగి పోతున్నాయి. వీసీల ఎంపిక సైతం గవర్నర్ల చేతికొచ్చాక పరిస్థితేమిటో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఉన్నత విద్యాలయ ప్రాంగణాన్ని నడిపే ఉత్తముడి ఎంపిక ఇటు రాష్ట్రం, అటు కేంద్రాల రాజకీయ ఒత్తిళ్ళకు అతీతంగా ఉన్నప్పుడే ఫలితం ఉంటుంది. -
తక్షణమే ప్రక్షాళన..!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలు నిధులు, నియామకాల లేమితో కునారిల్లుతున్నాయని.. వాటిని సమూలంగా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని విద్యా కమిషన్ తేల్చినట్టు సమాచారం. బోధన సిబ్బంది కొరత, తాత్కాలిక అధ్యాపకులతో నెట్టుకురావడం, అరకొర నిధులు వంటి కారణాలతో ఉన్నత విద్యాసంస్థల్లో ప్రమాణాలు దెబ్బతింటున్నాయని గుర్తించినట్టు తెలిసింది. ప్రస్తుతం కనీస స్థాయి పరిశోధనలైనా చేపట్టలేని దైన్య స్థితిలో వర్సిటీలు ఉన్నాయని.. అంతర్జాతీయంగా వస్తున్న మార్పులకు అనుగుణంగా తక్షణమే చర్యలు చేపట్టకుంటే కనీస ప్రమాణాలు కూడా కరువయ్యే ప్రమాదం ఉందని ప్రభుత్వానికి స్పష్టం చేయనున్నట్టు సమాచారం.ఈ మేరకు త్వరలోనే ముఖ్యమంత్రికి నివేదిక సమర్పించనున్నట్టు కమిషన్ వర్గాలు తెలిపాయి. రాష్ట్రంలోని యూనివర్సిటీల స్థితిగతులపై సమగ్ర అధ్యయనం చేసి.. వివిధ వర్గాల నుంచి సేకరించిన అభిప్రాయాలు, నేరుగా పరిశీలించిన అంశాలు, తీసుకోవాల్సిన చర్యలతో ఈ నివేదికను సిద్ధం చేసినట్టు వెల్లడించాయి.పోటీ ఎక్కడ?మన వర్సిటీలు కనీసం జాతీయ స్థాయిలోనూ పోటీ పడలేని పరిస్థితి ఉందని విద్యా కమిషన్ గుర్తించినట్టు తెలిసింది. రాష్ట్రంలోని 11 వర్సిటీల్లో రెండింటికి ‘జాతీయ మదింపు, గుర్తింపు కౌన్సిల్ (న్యాక్)’ గ్రేడ్ కూడా రాలేదని.. ‘ఎ’ ప్లస్ గ్రేడ్ దక్కించుకున్న వర్సిటీలు కేవలం రెండేనని కమిషన్ వర్గాలు తెలిపాయి. వర్సిటీల్లో 2,825 అధ్యాపక పోస్టులుండగా.. ప్రస్తుతమున్న రెగ్యులర్ సిబ్బంది 873 మంది మాత్రమేనని.. బోధన, బోధనేతర సిబ్బందిని కలిపి చూసినా 74 శాతం పోస్టులు ఖాళీయేనని పేర్కొన్నాయి. అంతా తాత్కాలిక సిబ్బందితోనే నెట్టుకొస్తున్నారని తెలిపాయి.ప్రాజెక్టులు డొల్ల.. పరిశోధనలు కల్ల.. వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో కీలకమైన పరిశోధనలు క్రమంగా తగ్గుతున్నాయి. 2020–21లో రూ.52.45 కోట్ల విలువైన ప్రాజెక్టులొస్తే.. 2022–23 నాటికి ఇది రూ.24.75 కోట్లకు తగ్గింది. ఇక్కడ 1,267 మంది బోధన సిబ్బందికిగాను 340 మందే రెగ్యులర్ వారున్నారు. మిగతా అంతా కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్నారే. వారికి పరిశోధనలకు మార్గదర్శకత్వం వహించే అవకాశం లేదు. జాతీయ స్థాయిలో గుర్తింపున్న ఈ వర్సిటీకి గతంలో మాదిరిగా కేంద్ర ప్రభుత్వ శాఖల పరిశోధన ప్రాజెక్టులూ అరకొరగానే వస్తున్నాయి.⇒ రాష్ట్రంలో ఇంజనీరింగ్ విద్యకు ఆయువు పట్టు అయిన జేఎన్టీయూహెచ్ కొత్త సాంకేతిక పరిజ్ఞానం కోసం రూ.200 కోట్లు ఇవ్వాలని కోరినా పట్టించుకున్నవారు లేరు. వర్సిటీలో 410 మంది ఫ్యాకల్టీకిగాను ఉన్నది 169 మందే. దీనితో కీలకమైన ఇంజనీరింగ్ బోధనలో ప్రమాణాలు దెబ్బతింటున్నాయి.⇒ మెరికల్లాంటి గ్రామీణ విద్యార్థులను తీర్చిదిద్దాల్సిన బాసరలోని రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం (ఆర్జీయూకేటీ) క్రమంగా వైభవాన్ని కోల్పోతోంది. 2008 నుంచి 2024 ఏప్రిల్ వరకూ ఇక్కడ 21 మంది విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడటం దారుణం. విద్యార్థులకు ఇంటర్న్షిప్ లేదు. ల్యాప్టాప్లు, ఆధునిక వసతులు అందుబాటులో లేవు. 90 మంది బోధన, 100 మంది బోధనేతర సిబ్బంది కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్నారు.⇒ పాలమూరు వర్సిటీలో పరిస్థితి దారుణంగా ఉందని కమిషన్ దృష్టికొచ్చింది. పేరుకు రూ.10 కోట్ల నిధులు కేటాయించినా రూ.7 కోట్లు కూడా అందడం లేదని.. కొల్లాపూర్, వనపర్తి పీజీ కేంద్రాల్లో వేతనాలు, ఇతర ఖర్చులకే నెలకు రూ.1.28 కోట్లు అవుతున్నాయని అధికారులు అంటున్నారు. నిధుల కోసం విద్యార్థుల పరీక్షలు, ప్రవేశ పరీక్షలు, బోధన రుసుములపై ఆధారపడాల్సి వస్తోందని వాపోతున్నారు. తాత్కాలిక అధ్యాపకులతో బోధన కొనసాగుతోందని అంటున్నారు. ⇒ తెలంగాణ వర్సిటీకి 152 ప్రొఫెసర్ పోస్టులు మంజూరైతే... ఉన్నది 61 మందే. 12 సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులున్న ఈ వర్సిటీని అకడమిక్ కన్సల్టెంట్లు, పార్ట్ టైం అధ్యాపకులతో నెట్టకొస్తున్నారు. వర్సిటీకి కనీసం రూ.250 కోట్ల తక్షణ నిధులు అవసమని అంచనా.⇒ కాకతీయ వర్సిటీలోనూ పరిశోధనలు సగం మేర తగ్గిపోయాయి. 405 అధ్యాపక పోస్టులకుగాను 83 మందే రెగ్యులర్ వారు. మిగతా అంతా తాత్కాలిక సిబ్బందే. నిజానికి ఇక్కడ కొత్తగా ప్రవేశపెట్టిన కోర్సులను కలిపితే వెయ్యి మంది వరకూ అధ్యాపకులు ఉండాలని అంచనా.యూనివర్సిటీల స్థాయి పెరగాలివిశ్వవిద్యాలయాలకు ఇప్పుడు జాతీయ స్థాయిలో గుర్తింపు కాదు.. అంతర్జాతీయ గుర్తింపు అవసరం. అది సాధ్యం కావాలంటే వర్సిటీల స్థాయి, ప్రమాణాలు పెరగాలి. బోధన సిబ్బంది ఖాళీలను భర్తీ చేయాలి. లైబ్రరీ, పరిశోధన అవకాశాలు, సరికొత్త టెక్నాలజీలను సమకూర్చాలి. ఈ అంశాలన్నింటిపై సమగ్ర అధ్యయనం చేశాం. త్వరలో ప్రభుత్వానికి నివేదిక ఇవ్వబోతున్నాం. – ఆకునూరి మురళి, విద్యా కమిషన్ చైర్మన్ -
వర్సిటీలకు జీతాల్లేవ్!
సాక్షి, అమరావతి: ఉన్నత విద్యపై ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటనలకు, వాస్తవ పరిస్థితులకు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా కనిపిస్తోంది. ఆయన ఆర్భాటంగా ప్రకటించిన ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) వర్సిటీ ఏర్పాటు మాట దేవుడెరుగు ఉన్న వర్సిటీల్లో పని చేస్తున్న ఆచార్యులకే జీతాలు అందని దుస్థితి నెలకొంది. వర్సిటీల్లో ఆచార్యులు, విశ్రాంత ఉద్యోగులకు గత మూడు నెలలకు పైగా ప్రభుత్వం నుంచి చెల్లింపులు నిలిచిపోవడంతో అంతర్గత నిధుల నుంచి అడ్వాన్స్ల రూపంలో ఒక నెల జీతాన్ని రెండు విడతలుగా తీసుకుంటున్న దుస్థితి నెలకొంది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే ఏకంగా రూ.1.19 లక్షల కోట్లకుపైగా అప్పులు చేసిన కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ఆచార్యులకు జీతాలను మాత్రం చెల్లించలేకపోతోంది. ఇదే పరిస్థితి కొనసాగితే వర్సిటీలు ఆర్థికంగా పతనమయ్యే ప్రమాదం ఉందని విద్యావేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రెగ్యులర్గా విశ్వవిద్యాలయాల్లో పని చేస్తున్న ఆచార్యులకు ప్రభుత్వం బ్లాక్గ్రాంట్ (సీఎఫ్ఎంస్) ద్వారా జీతాలు చెల్లించాలి. అయితే మూడు నెలలుగా ప్రభుత్వం నుంచి నిధులు విడుదల కాకపోవడంతో చరిత్రలో తొలిసారిగా వర్సిటీలు తమ అంతర్గత నిధుల నుంచి అడ్వాన్స్ రూపంలో సగం జీతాలు తీసుకోవాల్సి దుస్థితి నెలకొంది. ‘గత ప్రభుత్వంలో ఎన్నడూ ఇలాంటి పరిస్థితి లేదు. కోవిడ్ సమయంలోనూ మా జీతాలు ఆలస్యం కాలేదు. ఇప్పటికే మూడు నెలలుగా నిధుల విడుదల ఆపేశారు. మరో మూడు నెలలు ఇదే పరిస్థితి కొనసాగితే మురిగిపోతాయి. ఫలితంగా ఈ ఆర్థిక సంవత్సరంలో మా వర్సిటీపై రూ.12 కోట్లకుపైగా భారం పడుతుంది. ఇది విద్యార్థులు, ఉద్యోగుల భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపుతుంది’’ అని రాయలసీమలోని ఓ వర్సిటీ ఇన్చార్జీ వైస్ చాన్సలర్ ఆవేదన వ్యక్తం చేశారు. » ఏయూలో నవంబర్, డిసెంబర్ జీతాలను వర్సిటీ నిధుల నుంచి అడ్వాన్స్గా సర్దుబాటు చేసుకోవాల్సి వచ్చింది. » ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంలోని ద్రవిడియన్ వర్సిటీలో గత త్రైమాసికంలో రూ.8 కోట్లు విడుదల చేయాల్సిన ప్రభుత్వం కేవలం రూ.2 కోట్లు మాత్రమే ఇచ్చినట్లు సమాచారం. ఇప్పటికీ డిసెంబర్ జీతాలు అందలేదు.» ఆచార్య నాగార్జున వర్సిటీలో మూడు నెలలుగా ప్రభుత్వం నిధులివ్వకపోవడంతో వర్సిటీ అంతర్గత నిధుల నుంచి సర్దుబాటు చేసుకుంటున్నారు.» వైఎస్సార్ కడప జిల్లాలోని యోగి వేమన వర్సిటీలో గత మూడు నెలలుగా గ్రాంట్స్ విడుదల కాకపోవడంతో అంతర్గత నిధులను వినియోగిస్తున్నారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఇప్పటికీ జీతాలు అందని దుస్థితి.» తిరుపతి ఎస్వీ వర్సిటీలో చరిత్రలో ఎప్పుడూ లేనంతగా ప్రతి నెలా జీతాలు తీవ్ర ఆలస్యం అవుతున్నాయి. జూన్, జూలై జీతాలు ఆగస్టు 6న అందగా ఆగస్టు, సెప్టెంబర్ జీతాలు అక్టోబర్ 23న.. అక్టోబర్, నవంబర్ వేతనాలు డిసెంబర్ 5న చెల్లించారు. డిసెంబర్ జీతాలు ఇంకా ఇవ్వలేదు. uశ్రీకాకుళంలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయంలోనూ 3 నెలలుగా అంతర్గత నిధులనే జీతాల కోసం వెచ్చిస్తున్నారు. » అనంతపురంలోని జేఎన్టీయూలో నవంబర్ జీతాలను వర్సిటీ అంతర్గత నిధుల నుంచి జనవరి 3న సర్దుబాటు చేశారు. డిసెంబర్ జీతాలింకా ఇవ్వలేదు. » కాకినాడ జేఎన్టీయూలోనూ డిసెంబర్ నెల జీతాల కోసం ఎదురు చూపులు తప్పడం లేదు. వర్సిటీల్లో వర్గ విభేదాలు..రాజ్యాంగబద్ధంగా నియమితులైన వీసీలను కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బలవంతంగా రాజీనామాలు చేయించింది. ఇన్చార్జీ వీసీల పాలనతో చాలా వర్సిటీల్లో వర్గ విభేదాలు భగ్గుమంటున్నాయి. దీనికి తోడు గత ప్రభుత్వం నియమించిన చిరుద్యోగులను కూటమి సర్కారు పెద్ద ఎత్తున తొలగించింది. శ్రీకాకుళం అంబేడ్కర్ వర్సిటీలో 34 మంది ఔట్ సోర్సింగ్ సిబ్బందిని అర్ధాంతరంగా పంపించేశారు. ఇన్చార్జీ పాలనతో ఏయూ వందేళ్ల ఉత్సవాల్లో నిర్ణయాలు తీసుకోలేని పరిస్థితులు నెలకొన్నాయి. రాయలసీమ వర్సిటీలో పరీక్షల నిర్వహణ విభాగం పూర్తిగా అదుపు తప్పింది. మార్కుల లిస్టులు, ప్రొవిజినల్ సర్టిఫికెట్లు, కాన్వకేషన్ల కోసం నిత్యం వర్సిటీ చుట్టూ విద్యార్థులు ప్రదక్షిణలు చేయాల్సి వస్తోంది. ప్రణాళికలు తలకిందులుఉన్నత విద్యా మండలి పరిధిలోని వర్సిటీల్లో సుమారు 8 వేల మంది పెన్షనర్లు ఉన్నారు. వీరంతా పెన్షన్పైనే ఆధారపడుతున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక పెన్షన్ సకాలంలో అందట్లేదు. అక్టోబర్, నవంబర్ పెన్షన్ను ఈ నెల 2న ఇచ్చారు. డిసెంబర్ది పెండింగ్లో ఉంది. విశ్రాంత జీవితంలో ఎన్నో ప్రణాళికలను మాకొచ్చే పెన్షన్తోనే నెరవేర్చుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు అవన్నీ తలకిందులవుతున్నాయి. – శివప్రసాద్, ఏపీ వర్సిటీ పెన్షనర్ల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు -
యూనివర్సిటీలపై యూజీసీ కొరడా!
సాక్షి, అమరావతి: దేశంలో ప్రైవేట్ యూనివర్సిటీలు, విద్యా సంస్థలు తమ ఇష్టానుసారంగా అదనపు ఫీజులు వసూలు చేస్తుండటంతో.. ఎంతో మంది విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ పరిస్థితిని గుర్తించిన యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ).. ఫీజు రిడ్రెసల్ ద్వారా విద్యార్థుల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తోంది. అంతటితో వదిలేయకుండా వేగంగా ఆ ఫిర్యాదులను పరిష్కరిస్తూ యూనివర్సిటీల నుంచి విద్యార్థులకు అదనపు ఫీజులను రీఫండ్ చేయిస్తోంది. గత ఐదు విద్యా సంవత్సరాల్లో 4,257 ఫిర్యాదులు నమోదవ్వగా.. యూజీసీ ఆయా వర్సిటీల నుంచి రూ.25.51 కోట్ల సొమ్మును విద్యార్థులకు వాపస్ చేయించింది. 97% సక్సెస్ రేట్..యూజీసీ ఫీజు రిడ్రెసల్ సెల్.. ఈ–సమాధాన్ ప్లాట్ఫాం కింద పనిచేస్తుంది. ఇది విద్యార్థులకు ఆర్థిక భారం నుంచి విముక్తి కల్పించడంతో పాటు విద్యా వ్యవస్థపై విశ్వాసం పెంచడమే లక్ష్యంగా పనిచేస్తోంది. 2021–22లో 915, 2022–23లో 927, 2023–24లో 2,251 ఫిర్యాదులు వచ్చాయని యూజీసీ వర్గాలు తెలిపాయి. ఉత్తరప్రదేశ్లోని ప్రైవేట్ యూనివర్సిటీల పైనే విద్యార్థుల నుంచి అత్యధిక ఫిర్యాదులు వచ్చాయని వెల్లడించాయి.ఆ తర్వాతి స్థానాల్లో ఢిల్లీ, రాజస్థాన్ నిలిచాయని పేర్కొన్నాయి. తమకు వచి్చన ఫిర్యాదుల్లో 97 శాతానికి పైగా పరిష్కరించినట్లు యూజీసీ చైర్మన్ జగదీశ్కుమార్ చెప్పారు. మొత్తం రూ.26.30 కోట్ల విలువైన ఫిర్యాదులకు గానూ రూ.25.51 కోట్లను విద్యార్థులకు వాపస్ చేయించినట్లు వెల్లడించారు. ఇందులో 1,386 మంది విద్యారి్థనులకు రూ.8.71 కోట్ల ఫీజు రీఫండ్ చేసినట్లు తెలిపారు. -
ఆన్లైన్ విద్యలో నాణ్యతకు పట్టం
సాక్షి, అమరావతి: ప్రపంచవ్యాప్తంగా ఆన్లైన్ విద్య విస్తరిస్తోంది. కోవిడ్ మహమ్మారి తర్వాత సంప్రదాయ విశ్వవిద్యాలయాలు డిజిటల్ విద్యపై దృష్టి కేంద్రీకరించాయి. అయితే ఇప్పటి వరకు ఆన్లైన్ విద్య నాణ్యతను కొలవడానికి సరైన ప్రమాణాలు లేవు. కానీ, తొలిసారిగా ఇటీవల టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ సంస్థ ఆన్లైన్ లెర్నింగ్ ర్యాంకింగ్స్–2024ను ప్రకటించింది. ఇందులో ప్రపంచంలో 11 యూనివర్సిటీలకు గోల్డ్ స్టేటస్ ర్యాంకును ఇచి్చంది. ఇందులో భారతదేశం నుంచి మానవ్ రచన్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రీసెర్చ్ అండ్ స్టడీస్, ఓపీ జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీలు ‘బంగారు’ హోదా పొందాయి. దేశంలో ఏడు వర్సిటీలకు ర్యాంకులు... ఆన్లైన్ విద్యలో గోల్డ్ కేటగిరీలో 11 యూనివర్సిటీలు ఉన్నాయి. ఇందులో యూఎస్ఏ నుంచి మూడు, యూకే, భారత్ నుంచి రెండు చొప్పున, రష్యా, హంగేరీ, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా నుంచి ఒక్కొక్క యూనివర్సిటీ ఉన్నాయి.భారత్ నుంచి శూలిని యూనివర్సిటీ ఆఫ్ బయోటెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ సైన్సెస్కు సిల్వర్ స్టేటస్ సాధించగా, అమిటీ యూనివర్సిటీ (నోయిడా), కేఎల్ యూనివర్సిటీ (ఏపీ), లవ్లీ ప్రొఫెషనల్ వర్సిటీ (పంజాబ్), మణిపాల్ వర్సిటీ (జైపూర్) బ్రాంజ్ స్టేటస్ పొందాయి. ఈ ర్యాంకింగ్స్తో భారత్ యూనివర్సిటీలు ఆన్లైన్ విద్యను అందించడంలో పురోగతిని కనబరుస్తున్నాయని స్పష్టమవుతోంది. వీటి ఆధారంగానే ర్యాంకులు ఆన్లైన్ అభ్యాసానికి అంకితమైన సిబ్బంది, మౌలిక సదుపాయాలు, విద్యార్థుల సంతృప్తి, విద్యార్థుల్లో పురోగతి, కోర్సుల సిఫారసు వంటి అంశాలను టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ సంస్థ పరిశీలించి ర్యాంకులు కేటాయించింది. మొత్తం ప్రపంచంలో 14 యూనివర్సిటీలు వెండి, 31 కాంస్య పతకాల కేటగిరీలో నిలిచాయి. మరో 64 సంస్థలు డేటా సమర్పించినప్పటికీ పూర్తి ఎంట్రీ అవసరాలను తీర్చలేదు. కాబట్టి వాటికి రిపోర్టర్ హోదా కల్పిoచింది. అయితే ఆన్లైన్ విద్యను అందిస్తున్న యూనివర్సిటీ అభ్యాసకులు టెక్నాలజీ యాక్సెస్, టైమ్జోన్, భాషా ప్రావీణ్యంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గోల్డ్ స్టేటస్ పొందిన యూనివర్సిటీలు... » అమెరికన్ యూనివర్సిటీ(యూఎస్) » అరిజోనా స్టేట్ వర్సిటీ(యూఎస్) » హెచ్ఎస్ఈ వర్సిటీ (రష్యా) » మానవ్ వర్సిటీ (భారత్) » మాస్సే వర్సిటీ (న్యూజిలాండ్) » ఓపీ జిందాల్ (భారత్) » సెంట్రల్ఫ్లోరిడా వర్సిటీ (యూఎస్) » వర్సిటీ ఆఫ్ ఎసెక్స్ (యూకే) » లివర్పూల్ వర్సిటీ (యూకే) » సౌత్ ఆస్ట్రేలియావర్సిటీ (ఆ్రస్టేలియా) » వర్సిటీ ఆఫ్ స్జెడ్ (హంగేరి) -
అమెరికాలో యూనివర్సిటీ విద్యార్థులకు ట్రంప్ ఎఫెక్ట్
-
ట్రంప్ ప్రమాణ స్వీకారానికి ముందే అమెరికాకు తిరిగి వచ్చేయండి
న్యూయార్క్: అమెరికా 47వ అధ్యక్షుడిగా జనవరి 20న డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేయడానికి ముందే.. శీతాకాల సెలవులకు స్వదేశాలకు వెళ్లిన అంతర్జాతీయ విద్యార్థులు అమెరికాకు తిరిగి వచ్చేయాలని పలు యూనివర్సిటీలు సూచించాయి. ప్రవేశాల నిషిద్ధం, విమానాశ్రయాల్లో నిబంధనలు కఠినతరం అయ్యే అవకాశాలుంటాయి కాబట్టి జనవరి 20కి ముందే తిరిగి వచ్చేయాలని భారతీయ విద్యార్థులను పలు వర్సిటీలు హెచ్చరించాయి. వలసదారులను అమెరికా చరిత్రలోనే ఎన్నడూ లేనంత అత్యధికంగా వెనక్కి పంపిస్తానని ట్రంప్ ఎన్నికల ప్రచారంలో పదేపదే చెప్పడాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ సూచన జారీచేశాయి. చెల్లుబాటయ్యే వీసా, ఇతర ప్రయాణ పత్రాలు సక్రమంగా ఉన్న భారతీయ విద్యార్థులకు వచ్చే నష్టమేమీ లేకున్నా.. అవకాశం తీసుకోవద్దని హెచ్చరించాయి. అమెరికా వర్సిటీల్లో చదువున్న అంతర్జాతీయ విద్యార్థుల్లో భారత విద్యార్థులే అధికం కావడం గమనార్హం. 2023–24 కాలంలో భారత విద్యార్థులు చైనాను వెనక్కినెట్టి అగ్రస్థానాన్ని ఆశ్రయించారు. అమెరికా వర్సిటీల్లో 3.3 లక్షల భారతీయ విద్యార్థులు ఉండగా.. చైనా విద్యార్థులు 2.7 లక్షల మంది ఉన్నారు. సాధారణంగా అయితే నూతన సంవత్సర వేడుకల తర్వాత వారం రోజులకు తరగతులు ప్రారంభమవుతాయని, ట్రంప్ వైఖరిని దృష్టిలో పెట్టుకొని ఈసారి జనవరి 2 నుంచే తరగతులు మొదలుపెడుతున్నారని ఒక విద్యార్థి తెలిపారు. జనవరి మొదటి వారాంతం తర్వాత రావడం రిస్క్ అవుతుందని ప్రొఫెసర్లు చెప్పినట్లు వివరించారు. ఈ నేపథ్యంలో వీలైనంత త్వరగా అమెరికాకు తిరిగి వెళ్లాలని తమపై ఒత్తిడి ఉందని తెలిపారు. అమెరికాకు ఎప్పుడు తిరిగి రావాలనే విషయంలో సందేహాలను తీర్చడానికి యేల్ యూనివర్సిటీ అయితే విద్యార్థులకు ప్రత్యేకంగా ఒక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించింది. అమెరికాకు వెళ్లడానికి జనవరి 10న రిటర్న్ టికెట్ను బుక్ చేసుకున్నానని, అయితే మసాచుసెట్స్ యూనివర్సిటీ సూచన మేరకు రూ.35 వేలు అదనంగా పెట్టి.. తిరిగివెళ్లే తేదీని ముందుకు జరిపానని ఎస్.సర్సన్ అనే విద్యార్థి తెలిపారు. నిబంధనలు కఠినతరం కావచ్చని, నిశిత పరిశీలన, తనిఖీలు ముమ్మరం కావచ్చని తమ ప్రొఫెసర్లు చెప్పారని వెల్లడించారు. పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదని, అనవసరంగా సమస్యలు కొనితెచ్చుకొనే బదులు.. ముందుగా అమెరికాకు తిరిగి రావడమే ఉత్తమమని వెస్లెయాన్ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఒకరు అన్నారు. -
కమిషన్ వచ్చాకే వర్సిటీల్లో నియామకాలు!
సాక్షి, హైదరాబాద్: కామన్ రిక్రూట్మెంట్ బోర్డు స్థానంలో కాలేజ్ సర్వీస్ కమిషన్ ఏర్పాటయ్యే వరకు వర్సిటీల్లో నియామకాలు చేపట్టకూడదని ప్రభుత్వం నిర్ణయించుకున్నట్లు తెలిసింది. కమిషన్ ఏర్పాటు ప్రతిపాదనలు ఇప్పటికే సిద్ధమయ్యాయి. ప్రభుత్వం త్వరలోనే దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. దీని విధివిధానాలపై ఇంకా పూర్తిస్థాయిలో స్పష్టత రాలేదు. కమిషన్ ఏర్పాటై, విధివిధానాలు ఖరారైన తర్వాతే బోధన, బోధనేతర సిబ్బంది నియామకాల విషయంలో ముందుకెళ్లే అవకాశం ఉందని తెలుస్తోంది. దీంతో రిక్రూట్మెంట్ను వాయిదా వేయడానికే ఇలా చేస్తున్నారనే విమర్శలు విన్పిస్తున్నాయి. కమిషన్ విషయంలో కొన్ని చట్టపరమైన సందేహాలు సైతం పలువురు వ్యక్తం చేస్తుండటం గమనార్హం.నియామకాలెప్పుడో..?కాలేజ్ సర్వీస్ కమిషన్ కొత్తదేం కాదు. ఉమ్మడి రాష్ట్రంలో 1985లోనే దీన్ని ఏర్పాటు చేశారు. వర్సిటీల వీసీలు, ఉన్నత విద్యారంగ నిపుణులతో ఇది ఏర్పడుతుంది. అయితే 2000 సంవత్సరం వరకు పనిచేసిన కమిషన్ అప్పట్లో ఇంటర్, డిగ్రీ కాలేజీల్లో అధ్యాపకుల నియామకాలకే పరిమితమైంది. తర్వాత దీనిని పబ్లిక్ సర్వీస్ కమిషన్లో కలిపేశారు. విశ్వవిద్యాలయాల్లో బోధన, బోధనేతర సిబ్బంది నియామకాలు ఆయా వర్సిటీల వీసీల నేతృత్వంలో జరుగుతుండగా.. 2014–2022 మధ్య యూనివర్సిటీల్లో ఎలాంటి నియామకాలు చేపట్టలేదు.దీంతో పెద్ద ఎత్తున ఖాళీలు ఏర్పడ్డాయి. అన్నివైపుల నుంచి ఒత్తిడి రావడంతో 2022 సెప్టెంబర్ 12న కామన్ రిక్రూట్మెంట్ బోర్డు ఏర్పాటు చేశారు. ఏ వర్సిటీకి ఆ వర్సిటీ నియామకాలు చేపడుతుండటం వల్ల అవకతవకలు జరుగుతున్నాయని, అన్ని వర్సిటీలకు కలిపి బోర్డు నియామకాలు అప్పట్లో ప్రభుత్వం స్పష్టం చేసింది. కానీ అప్పట్నుంచీ కూడా బోర్డు ఎలాంటి నియామకాలు చేపట్టలేదు. ఈ నేపథ్యంలో ఇప్పటికే యూనివర్సిటీల్లో బోధన, బోధనేతర కలిపి 3 వేలకు పైగా పోస్టులు ఖాళీ అయ్యాయి. వీటిని భర్తీ చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటిస్తున్నా ఇప్పటివరకు కార్యరూపం దాల్చలేదు. తాజాగా మళ్లీ కాలేజ్ సర్వీస్ కమిషన్ తెరపైకి రావడంతో నియామకాలు ఇప్పట్లో జరుగుతాయా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.తేడా ఏంటి?ప్రభుత్వ నిర్ణయంతో కామన్ రిక్రూట్మెంట్ బోర్డుకు, కాలేజ్ సర్వీస్ కమిషన్కు తేడా ఏంటనే చర్చ మొదలైంది. రెండు దశాబ్దాల క్రితం కాలం చెల్లిన కమిషన్ను ఎందుకు తెస్తున్నారని పలువురు ప్రశ్నిస్తున్నారు. బోర్డు నిబంధనల ప్రకారం నియామకాలు చేపట్టాలంటే..తొలుత వర్సిటీలు ఖాళీలను వెల్లడిస్తాయి. అన్ని వర్సిటీలకు కలిపి బోర్డు ఉమ్మడిగా పరీక్ష నిర్వహిస్తుంది. మెరిట్ ఆధారంగా బోధన, బోధనేతర సిబ్బందిని ఎంపిక చేసి వర్సిటీలకు సిఫారసు చేస్తుంది. ఇందులో వీసీల ప్రమేయం ఏమాత్రం ఉండదు. ఇక సర్వీస్ కమిషన్కు వచ్చేసరికి ఖాళీలను కమిషనే గుర్తిస్తుంది. ఎందుకంటే ప్రతి యూనివర్సిటీ వీసీ ఇందులో సభ్యులుగా ఉంటారు. నియామకాల ప్యానెల్లోనూ వీసీ ఉంటారు. కాబట్టి వీసీల పెత్తనానికి అవకాశం ఉంటుంది. అయితే వీసీలు అవినీతికి పాల్పడుతున్నారని ఇటీవల సీఎం రేవంత్రెడ్డి ఆరోపించారు. ఈ నేపథ్యంలో వీసీ పెత్తనానికి అవకాశం ఉన్న కాలేజ్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు చర్చనీయాంశమవుతోంది. కమిషన్ ఎలా చెల్లుతుంది?కాలేజ్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు చేసేటప్పుడు చట్టపరమైన సమస్యలను పరిశీలించాలి. వర్సిటీలు యూజీసీ పరిధిలో ఉంటాయి. యూజీసీ అనుమతి లేకుండా, కేంద్ర ప్రభుత్వం చట్ట సవరణ చేయకుండా కమిషన్ ద్వారా వర్సిటీల అధ్యాపకులను నియమించడం చట్టపరంగా ఎలా చెల్లుతుంది? – ప్రొఫెసర్ గట్టు సత్యనారాయణ (పూర్వ కాలేజ్ కమిషన్ సభ్యుడు)ఏదో ఒక సాకుతో జాప్యం సరికాదుబోర్డును రద్దు చేస్తారో..కాలేజ్ సర్వీస్ కమిషన్ను తెస్తారో..ఏదో ఒకటి చేసి తక్షణం యూనివర్సిటీల్లో నియామకాలు చేపట్టాలి. ఏ విధానంలోనైనా లోపాలు ఉంటాయి. వాటిని సరిచేసుకుని వెళ్ళాలి. ఏదో ఒక సాకుతో నియామకాల్లో జాప్యం సరికాదు. – ప్రొఫెసర్ వీఎస్ ప్రసాద్ (న్యాక్ మాజీ డైరెక్టర్, అంబేడ్కర్ వర్సిటీ మాజీ వీసీ)నియామకాలు చేపట్టకపోతే కష్టంవర్సిటీల్లో పోస్టులు భారీ సంఖ్యలో ఖాళీగా ఉన్నాయి. ఇది విద్యా ప్రమాణాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. బోర్డును రద్దు చేసి, కమిషన్ తీసుకొచ్చినా ఇబ్బంది లేదుగానీ, తక్షణమే నియామకాలు చేపట్టకపోతే వర్సిటీల మనుగడకే ప్రమాదం. – ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి (ఉన్నత విద్యామండలి మాజీ చైర్మన్) -
నిధులు.. నియామకాలు!
రాష్ట్రంలోని 11 ప్రభుత్వ వర్సిటీల్లో రెండింటికి ఇప్పటికీ జాతీయ మదింపు, గుర్తింపు కౌన్సిల్ (న్యాక్) ఉత్తమ గ్రేడ్ రాలేదు. కేవలం రెండింటికే ‘ఎ’ ప్లస్ దక్కింది. జేఎన్టీయూహెచ్ ఎన్ని ప్రయత్నాలు చేసినా ‘ఎ’ గ్రేడ్ స్థాయికి రాలేకపోతోంది.సాక్షి, హైదరాబాద్: ఉన్నత విద్యకు ఊపిరిపోసే విశ్వవిద్యాలయాలను ప్రక్షాళన చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకు తగిన సిఫారసులు చేస్తూ నివేదికలు ఇవ్వాలని కొత్త వైస్ చాన్స్లర్లను ఆదేశించింది. అవసరమైతే కన్సల్టెన్సీల సేవలను ఉపయోగించుకోవాలని సూచించింది. అయితే సిబ్బంది కొరత, మౌలిక వసతుల లేమి, గాడి తప్పిన పాలన..వర్సిటీల్లో ప్రధాన సమస్యలని వీసీలు పైకి చెబుతున్నా, తగిన మొత్తంలో నిధులు ఇవ్వడంతో పాటు, పెద్ద సంఖ్యలో ఖాళీగా ఉన్న అధ్యాపకుల పోస్టులు భర్తీ చేస్తేనే వర్సిటీల్లో బోధనతో పాటు అన్ని అంశాల్లోనూ నాణ్యత మెరుగవుతుందనే అభిప్రాయం ఉంది. రాష్ట్రంలోని ఏ వర్సిటీకీ న్యాక్ అత్యుత్తమ గ్రేడ్ ఎ ప్లస్ ప్లస్ లేకపోవడాన్ని విద్యారంగ నిపుణులు గుర్తుచేస్తున్నారు. అయితే నిధులు, బోధనా సిబ్బంది కొరత చెప్పడానికి వీసీలు సాహసించడం లేదని అంటున్నారు. ఆర్థిక అంశాలే కీలకం రాష్ట్రంలోని వర్సిటీలను అధ్యాపకుల కొరత వేధిస్తోంది. ఒక్కో వర్సిటీలో ఇప్పటికీ 74 శాతం వరకు ఖాళీలున్నాయి. 2,825 అధ్యాపక పోస్టులు మంజూరైతే, ఉన్న రెగ్యులర్ సిబ్బంది కేవలం 873 మంది మాత్రమే. మిగతా వాళ్ళంతా తాత్కాలిక ఉద్యోగులే. దీంతో బోధనలో జవాబుదారీతనం లోపిస్తోందని, ఫలితంగా విద్యా ప్రమాణాలు అడుగంటిపోతున్నాయనే విమర్శలున్నాయి. ఇతర అంశాలను పక్కనబెడితే నిధుల కొరతే ప్రధాన సమస్య అని వీసీలు భావిçÜ్తున్నారు. పోస్టుల భర్తీకి కామన్ రిక్రూట్మెంట్ బోర్డును గత ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కానీ నియామకాలు జరగలేదు. ప్రస్తుత ప్రభుత్వం ఇటీవలే వీసీల నియామకం చేపట్టింది. వీరి నివేదికల అనంతరం సమస్యల పరిష్కారం దిశగా ఏ మేరకు నిధులు సమకూరుస్తుందో వేచిచూడాల్సిందే. మసక బారుతున్న ఓయూ వైభవం వందేళ్ల చరిత్ర ఉన్న ఉస్మానియా వర్సిటీకి న్యాక్ ఎ ప్లస్ గుర్తింపు ఉంది. కానీ ప్రస్తుతం ఓయూ వైభవం మసక బారుతోందనే అభిప్రాయం ఉంది. పరిశోధనలు తగ్గాయి. బోధన సిబ్బంది కొరతతో కేంద్ర ప్రభుత్వ శాఖలు పరిశోధన ప్రాజెక్టులు తగ్గించాయి. 2020–21లో రూ.52.45 కోట్ల ప్రాజెక్టులొస్తే, 2022–23 నాటికి ఇది రూ.24.75 కోట్లకు తగ్గింది. రెండేళ్ళలోనే 53 శాతం పడిపోయింది. ప్రభుత్వం 1,267 అధ్యాపక పోస్టులు మంజూరు చేసినా 340 మందే ఉన్నారు. కాంట్రాక్టు అధ్యాపకులతో కాలం వెళ్ళదీయాల్సిన పరిస్థితి ఉంది. జేఎన్టీయూహెచ్కు జవసత్వాలెలా?సాంకేతిక విద్యకు కీలకమైన ఈ విశ్వవిద్యాలయం జాతీయ ర్యాంకుల్లో స్థానం దక్కించుకోవడంలో విఫలమవుతోంది. ఇక్కడ 410 అధ్యాపకులుండాలి. కానీ 169 మందే ఉన్నారు. దీంతో కీలకమైన ఇంజనీరింగ్ బోధనలో ప్రమాణాలు దెబ్బతింటున్నాయి. స్కూల్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలను ఇంజనీరింగ్లో విలీనం చేశారు. కానీ సిబ్బంది కొరత వల్ల ప్రమాణాలు పెరగడం లేదు. కొత్త ఏఐ కోర్సులు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం సమకూర్చుకోవడానికి ఏటా రూ.200 కోట్ల మేర నిధులు అవసరమని వర్సిటీ ఉన్నతాధికారులు చెబుతున్నారు. ల్యాప్టాప్లు లేని ఆర్జీయూకేటీ బాసరలోని రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం (ఆర్జీయూకేటీ)లో విద్యార్థులకు ఇంటర్న్íÙప్ లేదు. ల్యాప్టాప్లు, ఆధునిక వసతులు అందుబాటులో లేవు. 90 మంది బోధన, 100 మంది బోధనేతర సిబ్బంది కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్నారు. మెస్ నిర్వహణ అక్రమాలకు కేంద్ర బిందువుగా మారడంతో విద్యార్థులు పలుమార్లు ఆందోళనలకు దిగారు. 2008 నుంచి 2024 ఏప్రిల్ మధ్య ఇక్కడ 21 మంది విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడ్డారు. ‘పాలమూరు’వెనుకంజ.. ఈ వర్సిటీకి ఏటా కేటాయించేది రూ.10 కోట్లు. ఇచ్చేది రూ.7 కోట్ల లోపే. కొల్లాపూర్, వనపర్తి పీజీ కేంద్రాల్లో వేతనాలు, ఇతర ఖర్చులకే నెలకు రూ.1.28 కోట్లు అవుతుంది. ఏడు విభాగాలకు 84 పోస్టులు మంజూరైతే 17 పోస్టుల్లోనే అధ్యాపకులున్నారు. వీరిలో ఇద్దరు మాత్రమే ప్రొఫెసర్లు కాగా నలుగురు అసోసియేట్ ప్రొఫెసర్లు, 11 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఉన్నారు. కొత్తగా ప్రవేశపెట్టిన 11 సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులకు రెగ్యులర్ అధ్యాకులు లేరు. 94 మంది తాత్కాలిక అధ్యాపకులతో బోధన కొనసాగుతోంది. అనుమతి వచ్చినా లా కాలేజీ భవన నిర్మాణం పూర్తవ్వలేదు. నలుగురు ఉండాల్సిన బాలికల హాస్టల్లో 8 మంది ఉండాల్సిన పరిస్థితి. ‘తెలంగాణ’కు రూపాయి విదల్చడం లేదు! ఈ వర్సిటీలో 152 ప్రొఫెసర్ పోస్టులు మంజూరైనా, ఉన్నది కేవలం 61 మంది మాత్రమే. 12 సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులుండగా అకడమిక్ కన్సల్టెంట్లు, పార్ట్ టైం అధ్యాపకులతో నెట్టుకొస్తున్నారు. ఈ వర్సిటీకి పదేళ్ళుగా ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదు. ఇతరత్రా నిధులతో నెట్టుకొస్తున్నారు. 18 ఏళ్ళలో ఒక్కసారి మాత్రమే ఇక్కడ స్నాతకోత్సవం జరిగింది. కాకతీయలో వేతనాలకే దిక్కులేదుకాకతీయ వర్సిటీ తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటోంది. బోధన, బోధనేతర సిబ్బంది వేతనాలకు ఏడాదికి రూ.150 కోట్లు అవసరం. రాష్ట్ర ప్రభుత్వం నుంచి గ్రాంట్ కింద రూ.97 కోట్లు మాత్రమే వస్తోంది. దీంతో అంతర్గత సమీకరణల ద్వారా రూ.53 కోట్లు సమకూర్చుకుంటున్నారు. 405 రెగ్యులర్ అధ్యాపకులకు గాను 83 మందే ఉన్నారు. 190 మందిని కాంట్రాక్టు, 201 మందిని తాత్కాలిక పద్ధతిలో తీసుకున్నారు. కొత్తగా ప్రవేశ పెట్టిన కోర్సులను కూడా పరిగణనలోకి తీసుకుంటే వెయ్యి మంది వరకూ అధ్యాపకులు ఉండాలని వర్సిటీ వర్గాలంటున్నాయి. నిధుల్లేకుండా మార్పు ఎలా సాధ్యం? జ్ఞానాన్ని సృష్టించి, పంచే యూనివర్సిటీల పరిస్థితి రోజురోజుకూ దిగజారుతోంది. వీటికి వివిధ రూపాల్లో నిధులు సమకూరుతాయి. ఉమ్మడి రాష్ట్రంలో విద్యకు 12 శాతం నిధులిచ్చేవారు. అదిప్పుడు సగానికి పడిపోయింది. యూజీసీ కూడా 60 శాతం నిధులు తగ్గించింది. నిధులే లేనప్పుడు మార్పు ఎలా సాధ్యం? ఢిల్లీలో ఓ సాధారణ కాలేజీకి వెళ్ళా. 250 మంది ఫ్యాకల్టీ ఉన్నారు. మన దగ్గర ఆ స్థాయిలో అధ్యాపకులు ఉండటం లేదు. పాలమూరు లాంటి వర్సిటీకి రూ.8 కోట్లు ఇవ్వడమే కష్టమవుతోంది. ఈ పరిస్థితుల్లో పరిశోధన ఎలా చేయగలరు? వాస్తవ పరిస్థితిపై ప్రభుత్వం దృష్టి పెట్టాలి. వర్సిటీల సమస్యలను పరిష్కరించే చిత్తశుద్ధి కార్యాచరణలో కన్పించాలి. వర్సిటీలకు ప్రభుత్వం పూర్తి స్వేచ్ఛనిస్తేనే మార్పు సాధ్యం. – ప్రొఫెసర్ హరగోపాల్ (విద్యారంగ నిపుణులు)అధ్యయనం మొదలైంది సీఎం ఆదేశాల మేరకు ఉన్నత విద్యలో మార్పుల దిశగా అధ్యయనం చేస్తున్నాం. త్వరలో నిపుణులతో భేటీ ఏర్పాటు చేస్తాం. ఎలాంటి మార్పులు రావాలి? గ్లోబల్ పోటీని తట్టుకునే బోధన ప్రణాళికలేంటి? అనేది అధ్యయనం చేయబోతున్నాం. – ప్రొఫెసర్ వి.బాలకిష్టారెడ్డి (ఉన్నత విద్యామండలి చైర్మన్)త్వరలో అందరితో సమావేశం నివేదిక దిశగా త్వరలో సమావేశం ఏర్పాటు చేస్తున్నాం. ప్రిన్సిపల్స్, డీన్స్, హెచ్వోడీలను పిలుస్తాం. మౌలిక వసతులు, సిబ్బంది కొరత ఇతర అంశాలపై చర్చిస్తాం. నెల రోజుల్లో నివేదిక సమరి్పస్తాం. – ప్రొఫెసర్ కుమార్ మొలుగారం, వీసీ ఓయూ -
నూరు శాతం వర్సిటీల ప్రక్షాళన
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలను నూరు శాతం ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి స్పష్టం చేశారు. కొంతకాలంగా యూనివర్సిటీలపై ప్రజల్లో నమ్మకం తగ్గుతోందని.. వాటిల్లోని పలు వ్యవస్థలు దెబ్బతిన్నాయని ఆయన వ్యాఖ్యానించారు. వర్సిటీల గౌరవాన్ని పెంచాల్సిన బాధ్యత వైస్ చాన్స్లర్లపైనే ఉందన్నారు. ఇటీవల నియమితులైన వివిధ యూనివర్సిటీల వీసీలతో సీఎం రేవంత్ శనివారం తన క్యాంపు కార్యాలయంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతిభ, సామాజిక సమీకరణాల ఆధారంగానే విశ్వవిద్యాలయాలకు వైస్ చాన్స్లర్లను ఎంపిక చేశామని.. ఈ ప్రక్రియలో ఎలాంటి ప్రభావితాలు లేవన్నారు. వర్సిటీల్లో దెబ్బతిన్న వ్యవస్థల పునరుద్ధరణకు తీసుకోవాల్సిన చర్యలపై అధ్యయనం చేయాలని వీసీలకు సూచించారు. ప్రస్తుత పరిస్థితులను పరిశీలించి అవసరమైతే కన్సల్టెన్సీలను ఏర్పాటు చేసుకొని అధ్యయనం చేపట్టి నివేదిక రూపొందించాలని దిశానిర్దేశం చేశారు.స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకోండి..‘గతంలో వీసీలను విద్యార్థులు ఏళ్ల తరబడి గుర్తుపెట్టుకొనేవాళ్లు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. మా ప్రభుత్వం మీకు స్వేచ్ఛ ఇస్తోంది. మంచిపనులు చేసేందుకు సొంతంగా నిర్ణయాలు తీసుకోండి. బాగా పనిచేసి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురండి. తప్పు జరిగితే మాత్రం ఆశ్చర్యకరమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. వర్సిటీల్లో డ్రగ్స్, గంజాయి విక్రయాలపై దృష్టిపెట్టండి. విద్యార్థులను ఎప్పటికప్పుడు గమనిస్తూ కౌన్సెలింగ్ ఇవ్వండి’ అని సీఎం రేవంత్ వీసీలకు సూచించారు. ఈ సమావేశంలో తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలకిష్టారెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్రెడ్డి కూడా పాల్గొన్నారు. -
9 వర్సిటీలకు వీసీల నియామకం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని 9 విశ్వవిద్యాల యాలకు ఉప కులపతులు నియమితులయ్యారు. ప్రభుత్వ సిఫారసుతో వర్సిటీలకు వీసీలను ఖరారు చేసినట్టు గవర్నర్ కార్యాలయం శుక్రవారం వెల్లడించింది. వ్యవసాయ, ఉద్యాన విశ్వవిద్యాలయాల వీసీల పేర్లు కూడా ఈ జాబితాలో ఉన్నాయి. రాష్ట్రానికి సంబంధించి 13 వర్సిటీలు ఉండగా.. మహిళా వర్సిటీకి ముందే వీసీని నియమించారు. జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం (జేఎన్టీయూహెచ్), డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం, జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ (జేఎన్ఏఎఫ్ఏయూ)లకు ఇంకా వీసీలను నియమించాల్సి ఉంది. అంబేడ్కర్ వర్సిటీకి అత్యధిక దరఖాస్తులురాష్ట్రంలోని వర్సిటీలకు చెందిన వీసీల పదవీ కాలం ఈ ఏడాది మే 23 తోనే ముగిసింది. ఈ నేపథ్యంలో తొలుత ఐఏఎస్ అధికారులకు వీసీలుగా బాధ్యతలు అప్పగించిన ప్రభుత్వం, మరోవైపు ఖాళీగా ఉన్న వీసీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చింది. అలాగే సెర్చ్ కమిటీలను కూడా ఏర్పాటు చేసింది. ఈ పోస్టుల కోసం 312 మంది 1,382 దరఖాస్తులు సమర్పించారు. చాలామంది అన్ని వర్సిటీలకు దరఖాస్తు చేశారు. అత్యధికంగా బీఆర్ అంబేడ్కర్ విశ్వ విద్యాలయానికి 208 దరఖాస్తులు వస్తే, ఉస్మానియాకు 193, పాలమూరుకు 159, శాతవాహనకు 158, మహాత్మాగాంధీ వర్సిటీకి 157 వచ్చాయి. జేఎన్టీయూహెచ్కు 106 దరఖాస్తులు అందాయి. వీటన్నింటినీ సెర్చ్ కమిటీ పరిశీలించి మూడు పేర్ల చొప్పున ప్రభుత్వానికి సిఫారసు చేసింది. దీంతో వీసీలను ఎంపిక చేసిన ప్రభుత్వం దసరా ముందు ఫైల్ను గవర్నర్ కార్యాలయానికి పంపింది. తాజాగా గవర్నర్ కార్యాలయం వీసీల పేర్లను ఖరారు చేసింది. వివాదంలో జేఎన్టీయూహెచ్జేఎన్టీయూహెచ్కు వీసీ నియామకం ఆఖరి దశలో ఆగిపోయింది. అంతర్గత వివాదం, వీసీ నియామకం కోసం ఏర్పాటు చేసిన సెర్చ్ కమిటీపై విమర్శలు వచ్చిన నేపథ్యంలో వీసీ ఖరారును వాయిదా వేశారని తెలిసింది. ఈ వర్సిటీకి సెర్చ్ కమిటీ ముగ్గురు పేర్లను సిఫారసు చేయగా.. ఇందులో ఓ మాజీ వీసీ పేరు ఉండటం వివాదాస్పదమైంది. గతంలో ఆయనపై పలు ఆరోపణలున్నాయని, అయినప్పటికీ ఆయన పేరును సెర్చ్ కమిటీ సూచించిందంటూ పలువురు ప్రభుత్వం దృష్టికి తెచ్చారు. దీని వెనుక ఏదో మతలబు ఉందనే అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ కారణంగానే ప్రభుత్వం ఆయనకు సంబంధించిన ఫైల్ను గవర్నర్కు పంపలేదని అధికార వర్గాలు చెబుతున్నాయి. అంతేగాకుండా ఈ మొత్తం వ్యవహారంపై పూర్తి స్థాయి విచారణకు ప్రభుత్వం ఆదేశించినట్టు సమాచారం. జేఎన్ఏఎఫ్, ‘అంబేడ్కర్’పై భేటీకాని సెర్చ్ కమిటీలుఅంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ వీసీ పోస్టు కోసం అత్యధిక సంఖ్యలో దరఖాస్తులు రాగా, ఈ పోస్టును దక్కించుకునేందుకు పెద్ద ఎత్తున పైరవీలు సైతం జరిగినట్లు తెలిసింది. కాంగ్రెస్ అధిష్టానం నుంచే నాలుగు సిఫారసులు వచ్చినట్టు తెలిసింది. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని సెర్చ్ కమిటీ ఇంతవరకూ ఈ వర్సిటీ విషయమై భేటీ అవ్వలేదని తెలుస్తోంది. అలాగే జేఎన్ఏఎఫ్ఏపై కూడా సెర్చ్ కమిటీ సమావేశం నిర్వహించలేదు. ఈ భేటీ త్వరలో జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.కొత్త వీసీలు వీరే.. యూనివర్సిటీ: వీసీపాలమూరు, మహబూబ్నగర్: ప్రొఫెసర్ జీఎన్ శ్రీనివాస్రావుకాకతీయ, వరంగల్: ప్రొఫెసర్ ప్రతాప్ రెడ్డిఉస్మానియా, హైదరాబాద్: ప్రొఫెసర్ కుమార్ మొలుగరంశాతవాహన, కరీంనగర్: ప్రొఫెసర్ ఉమేశ్కుమార్తెలుగు యూనివర్సిటీ, హైదరాబాద్: ప్రొఫెసర్ నిత్యానందరావుమహాత్మాగాంధీ, నల్లగొండ: ప్రొఫెసర్ అల్తాఫ్ హుస్సేన్తెలంగాణ, నిజామాబాద్: ప్రొఫెసర్ యాదగిరిరావుప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ: ప్రొఫెసర్ అల్దాస్ జానయ్యశ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ ఉద్యాన: ప్రొఫెసర్ రాజిరెడ్డిప్రొఫెసర్ అల్దాస్ జానయ్యజయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం వీసీగా నియమితులైన ప్రొ.అల్దాస్ జానయ్య నల్లగొండ జిల్లా, తిప్పర్తి మండలం, మామిడాల గ్రామంలో జన్మించారు. వ్యవసాయ ఆర్థిక శాస్త్రంలో డాక్టరేట్ అందుకున్నారు. ప్రస్తుతం జగిత్యాల వ్యవసాయ కాలేజీ అసోసియేట్ డీన్గా సేవలందిస్తున్నారు. 2002లో అంతర్జాతీయ వరి పరిశోధన సంస్థ ఉత్తమ శాస్త్రవేత్త అవార్డు అందుకున్నారు.ప్రొ.రాజిరెడ్డి దండకొండా లక్ష్మణ్ హార్టికల్చర్ యూనివర్సిటీ వీసీగా నియమితులైన దండ రాజిరెడ్డి మహారాష్ట్రలోని పంజాబ్రావు కృషి విద్యాపీఠ్లో అగ్రికల్చర్లో బీఎస్సీ, ఎంఎస్సీ చేశారు. గుజరాత్ అగ్రికల్చర్ వర్సిటీలో అగ్రో మెటియోరాలజీలో పీహెచ్డీ పూర్తి చేశారు. అఫ్గానిస్తాన్ అగ్రోమెట్ సర్వీసెస్ ప్రాజెక్టుకు వరల్డ్ బ్యాంకు కన్సల్టెంటుగా కొంతకాలం పనిచేశారు. చాలాకాలం పాటు జయశంకర్ అగ్రికల్చర్ వర్సిటీ డైరెక్టర్గా బాధ్యతలు చేపట్టారు.ప్రొ.వెలుదండ నిత్యానందరావు తెలుగు వర్సిటీ వీసీగా నియమితులైన ప్రొ.వెలుదండ నిత్యానందరావు స్వగ్రామం నాగర్కర్నూల్ జిల్లా మంగనూరు గ్రామం. పాలెం ఓరియంటల్ కాలేజీలో డిగ్రీ పూర్తి చేశారు. ఓయూలో ఎంఏ తెలుగు, ఎంఫిల్, పీహెచ్డీ పూర్తి చేశారు. ఆ తర్వాత ఉస్మానియా వర్సిటీ తెలుగు విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా, అదే శాఖ హెచ్వోడీగా పనిచేశారు. 2022లో పదవీ విరమణ చేశారు. ఆయన రచించిన ‘విశ్వవిద్యాలయాల్లో తెలుగు పరిశోధన’ అనే గ్రంథం అన్ని వర్సిటీల తెలుగు విభాగాల్లో ప్రామాణిక గ్రంథంగా ఇప్పటికీ బోధిస్తున్నారు.ప్రొ.టి.యాదగిరిరావు తెలంగాణ యూనివర్సిటీ వీసీగా నియమితులైన ప్రొ.యాదగిరిరావు వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం నల్లబెల్లి గ్రామంలో జన్మించారు. పీజీ, పీహెచ్డీ కాకతీయ యూనివర్సిటీలో పూర్తి చేశారు. ఇప్పుడు అదే వర్సిటీలో సీనియర్ ప్రొఫెసర్గా ఉన్నారు. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ బీవోఎస్ చైర్పర్సన్గా వ్యవహరిస్తున్నారు. గతంలో కేయూలో యూజీసీ కో–ఆర్డినేటింగ్ ఆఫీసర్గా బాధ్యతలు నిర్వర్తించారు. 2021లో రాష్ట్ర ఉత్తమ అధ్యాపకుడి అవార్డు అందుకున్నారు. తెలంగాణ వర్సిటీ సోషల్ సైన్సెస్ డీన్గా కూడా కొంతకాలం పనిచేశారు. ప్రొ.జీఎన్ శ్రీనివాస్ పాలమూరు యూనివర్సిటీ వీసీగా నియమితులైన ప్రొ.జీఎన్ శ్రీనివాస్ సిరిసిల్ల జిల్లా కొత్తపల్లి గ్రామంలో జన్మించారు. ఉస్మానియా యూనివర్సిటీలో బీటెక్, ఎంటెక్, పీహెచ్డీ పూర్తిచేశారు. ఓయూలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా ప్రస్థానం మొదలు పెట్టిన శ్రీనివాస్.. 2003లో ఏపీలోని అనంతపురం జేఎన్టీయూలో అసోసియేట్ ప్రొఫెసర్గా సేవలందించారు. వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన శ్రీనివాస్.. తెలంగాణ మలిదశ ఉద్యమంలో క్రియాశీలంగా పనిచేశారు. ప్రొ.కుమార్ మొలుగరం ఉస్మానియా వీసీగా నియమితులైన కుమార్ మొలుగరం రంగారెడ్డి జిల్లా ఘట్కేసర్ మండలం కొండాపురం గ్రామంలో జన్మించారు. ఓయూలో బీటెక్, జేఎన్టీయూలో ఎంటెక్, ఐఐటీ బాంబే నుంచి పీహెచ్డీ పట్టా అందుకున్నారు. సివిల్ ఇంజనీరింగ్ రంగంలో ఆయన అపార అనుభవశాలి. ప్రస్తుతం ఓయూ ఇంజనీరింగ్ కాలేజీలో సీనియర్ ప్రొఫెసర్గా, రీజనల్ సెంటర్ ఫర్ అర్బన్, ఎన్విరాన్మెంటల్ స్టడీస్ డైరెక్టర్గా సేవలందిస్తున్నారు. 2018లో రాష్ట్ర ఉత్తమ అధ్యాపకుడి పురస్కారం, ఇంజనీర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును అందుకున్నారు. ఓయూ 107 సంవత్సరాల చరిత్రలో వీసీగా నియమితులైన తొలి ఎస్సీ (మాదిగ) సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిగా ఘనత సాధించారు.ప్రొ.అల్తాఫ్ హుస్సేన్ నల్లగొండ మహాత్మాగాంధీ యూనివర్సిటీ వీసీగా నియమితులైన ఖాజా అల్తాఫ్ హుస్సేన్.. హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండల కేంద్రంలో జన్మించారు. ఆత్మకూరులోని ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి, వరంగల్ సీకేఎం కాలేజీలో ఇంటర్, డిగ్రీ.. కాకతీయ యూనివర్సిటీలో ఫిజిక్స్లో పీజీ, పీహెచ్డీ పూర్తిచేశారు. కేయూ ఫిజిక్స్ విభాగంలో ప్రొఫెసర్గా, హెచ్వోడీగా, రిజిస్ట్రార్గా సేవలందించారు. 2016–19 మధ్యకాలంలో కూడా మహాత్మాగాంధీ వర్సిటీ వీసీగా పనిచేశారు. మహాత్మాగాంధీ యూనివర్సిటీ విద్యార్థులు అంతర్జాతీయ స్థాయిలో రాణించేలా తీర్చిదిద్దుతామని ఎంజీయూ వీసీగా నియమితులైన అల్తాఫ్ హుస్సేన్ అన్నారు. వర్సిటీలో కొత్త కోర్సులు ప్రారంభిస్తామని ‘సాక్షి’కి తెలిపారు. ప్రొ.ప్రతాప్రెడ్డి కాకతీయ యూనివర్సిటీ వీసీగా నియమితులైన ప్రొ.ప్రతాప్రెడ్డిది రంగారెడ్డి జిల్లా యాచారం. ఓయూలో పీజీ, పీహెచ్డీ పూర్తి చేసిన ప్రతాప్రెడ్డి.. ఓయూలో జువాలజీ విభాగం హెచ్వోడీగా, రిజిస్ట్రార్గా, పీజీ అడ్మిషన్స్ డైరెక్టర్గా సేవలందించి రిటైర్ అయ్యారు. ప్రొ.ఉమేష్కుమార్శాతవాహన యూనివర్సిటీ వీసీగా నియమితులైన ఉమేష్కుమార్.. మహబూబ్నగర్ జిల్లా నారాయణపేట గ్రామంలో జన్మించారు. కెమిస్ట్రీ విభాగంలో ఆయనకు అపారమైన అనుభవం ఉంది. గతంలో మహాత్మాగాంధీ వర్సిటీ వీసీగా, రిజిస్ట్రార్గా పనిచేశారు. ఇందిరాగాంధీ జాతీయ స్థాయి ఎన్ఎస్ఎస్ ట్రోఫీని 2015లో రాష్ట్రపతి చేతుల మీదుగా అందుకున్నారు. ఎంజీ యూనివర్సిటీని అభివృద్ధి చేసేందుకు, బోధనా ప్రమాణాలు పెంచేందుకు కృషి చేశారు. -
కొత్త వీసీల నియామకం
-
విద్యారంగ మార్పుల గమ్యం ఎటువైపు?
అందరికీ విద్య లేకుండా ప్రజాస్వామ్యం బతికి బట్ట కట్టదన్నాడు భారత రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేడ్కర్. నేటి బాలలే రేపటి పౌరులు అన్నాడు తొలి ప్రధాని నెహ్రూ. కానీ దేశంలో ఇప్పటికీ అక్షరాస్యత రేటు 77% దాటలేదు. తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకుంటే అక్షరాస్యత రేటు 66% కూడా లేదని ప్రభుత్వ గణాంకాలే చెబుతున్నాయి. తమ మేనిఫెస్టోలో విద్యారంగానికి బడ్జెట్లో 15% నిధులు కేటాయి స్తామని చెప్పి 7.3% మాత్రమే కేటాయించింది కాంగ్రెస్. పక్కన ఉన్న తమిళనాడులో 13.4%,ఆంధ్రప్రదేశ్లో కూడా విద్యకు 12.6% నిధులు కేటాయించారు.పాఠశాల విద్యను తీసుకుంటే పాఠశాలల మూసివేతలు నిరాటంకంగా కొనసాగుతున్నాయి. 2022 –23 సంవత్సరంలో దాదాపు 8,500 పాఠశాలల్లో 20 మంది కన్నా తక్కువ విద్యార్థులు ఉన్నారు. 1,864 స్కూళ్లలో విద్యార్థులే లేరు. నిజానికి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గడానికి ప్రభుత్వ పాఠశాలల దగ్గరలోనే విద్యా శాఖ అధికారులు ప్రైవేటు పాఠశాలలకు అనుమతులు ఇవ్వడం. చట్ట ప్రకారం ప్రభుత్వ పాఠశాలకు కనీసం ఒక్క కిలోమీటర్ దూరం ఉంటే తప్ప అనుమతులు ఇవ్వకూడదు. విద్యార్థుల సంఖ్య తగ్గడానికి మరొక ప్రధానమైన కారణం ప్రభుత్వ పాఠశాలల్లో పూర్వ ప్రాథమిక విద్య లేకపోవడం. ఇంకా బతుకుదెరువు కోసం గ్రామాల నుండి పట్టణాలకు వలసలు, జనాభా తగ్గుదల మొదలైన అంశాలు విద్యార్థులు తగ్గిపోవడానికి కారణాలు కావచ్చు. ఇంకా ఈ విషయంపై లోతైన అధ్యయనం చేసి కారణాలను కనుక్కోకుండా, ఆ కారణాలను నిర్మూలించకుండా, తక్కువ విద్యార్థులు ఉన్నారని అక్కడ ఉన్న టీచర్లను వేరే స్కూళ్లకు పంపించడం, విద్యార్థులే లేరని పాఠశాలలను మూసివేయడం మూర్ఖత్వం.పాఠశాలల్లో ఒక ప్రణాళిక ప్రకారం బోధన జరుగుతుందా లేదా చూసుకోవాలంటే విద్యాశాఖ అధికారులు ఉండాలి. అటువంటి అధికారుల పోస్టులు దాదాపు అన్నీ ఖాళీగా ఉన్నాయి. దిగ జారుతున్న ఈ పరిస్థితులను చక్కబెట్టి సుమారు 30 వేల పాఠశాలలను అభివృద్ధి చేసే బదులు, నియోజకవర్గానికి ఒక ఇంటర్నేషనల్ స్కూల్ స్థాపి స్తామని అంటున్నారు. కామన్ స్కూల్కు భిన్నంగా ఇప్పటికే రకరకాల అంతరాలతో భ్రష్టు పడుతున్న పాఠశాల విద్యకు ఇంటర్నేషనల్ స్కూల్ ఇంకొక అంతరాల దొంతర తయారు కాబోతున్నది.అలాగే ఉన్నత విద్యలో ప్రభుత్వ రంగంలో ఉన్న 17 స్టేట్ యూనివర్సిటీలను సమగ్రంగా అభి వృద్ధి చేసే బదులు భూకబ్జాదారులకు, విద్యా వ్యాపారులకు, కంపెనీలకు ప్రైవేటు యూనివర్సిటీలు ఏర్పాటు చేసుకోవడానికి అనుమతులు ఇచ్చారు. ప్రభుత్వ రంగంలో కాకుండా ప్రభుత్వ– ప్రైవేటు భాగస్వామ్యం పద్ధతిలో 50 ఎకరాల భూమిలో ఒక ‘యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ’ని ఏర్పాటు చేస్తున్నారు. ప్రభుత్వ యూనివర్సిటీలలో 2 వేలకు పైగా ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇక ఈ యూనివర్సిటీలలో బోధనేతర సిబ్బంది ఖాళీలు తీసుకుంటే అవి వేల సంఖ్యలో ఉంటాయి. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఒక్కసారి కూడా యూనివర్సిటీలలోని పోస్టులను భర్తీ చేయలేదు.ప్రస్తుతమున్న యూనివర్సిటీలను, ఇంజనీరింగ్ కళాశాలలను, పాలిటెక్నిక్ కళాశాలలను, ఐటీఐలను సమగ్రంగా అభివృద్ధి చేసి నైపుణ్యాలను నేర్పవచ్చు. అలా చేయకుండా కొత్తగా స్కిల్ యూనివర్సిటీని స్థాపించడం ఎవరికోసమనే ప్రశ్న తలెత్తక మానదు. ముఖ్యమంత్రి విదేశీ పర్యటనలో భాగంగా 19 పేరెన్నిక గల విదేశీ కంపెనీలు హైద రాబాదుకు రాబోతున్నాయని తెలుస్తున్నది. ఇక్కడ 2 వేల మందికి నైపుణ్యాలను నేర్పిస్తామని అంటున్నారు. ఈ విదేశీ కంపెనీలకు నైపుణ్యం కలిగిన తక్కువ జీతానికి పనిచేసే, బానిస మనస్తత్వం కలిగిన కార్మికులను తయారుచేయడానికి వస్తుందా ఈ స్కిల్ యూనివర్సిటీ అనే అనుమానం కలుగు తుంది. ఇక్కడ ఫ్యాకల్టీని నియమించడంలో, విద్యార్థులకు అడ్మిషన్ కల్పించడంలో రిజర్వేషన్ల పద్ధతి పాటిస్తారా? ఫీజులు ఎంత ఉంటాయి అన్న వివరాలు ఇంకా అధికారికంగా తెలియవలసి ఉంది. చదవండి: సూక్ష్మస్థాయి ఉపాధి ‘ఏఐ’ కంటే మేలు పాఠశాల స్థాయి నుండి అన్ని వసతులతో కూడిన వ్యాయామ విద్య లేకుండా స్పోర్ట్స్ యూనివర్సిటీని స్థాపించడం అర్థరహితం. వేలాది ప్రభుత్వ పాఠశాలలకు ఆట స్థలాలు లేవు. క్రీడా పరికరాలు లేవు. అన్ని పాఠశాలలో పీఈటీ / పీడీ పోస్టులు మంజూరు చేయబడలేదు. పట్టణాలలో మెజారిటీ ప్రైవేటు పాఠశాలలకు ఆట స్థలాలే లేవు. అటువంటి పరిస్థితులలో స్పోర్ట్స్ యూనివర్సిటీని స్థాపిస్తామనడం పునాది లేకుండా భవనం నిర్మించడమే. మొత్తానికి గత తొమ్మిది నెలల్లో తెలంగాణ విద్యారంగంలో వచ్చిన మార్పుల గురించి సమాజంలో లోతైన చర్చ జరగవలసి ఉన్నది.-ప్రొఫెసర్ కె. లక్ష్మీనారాయణ హైదరాబాదు సెంట్రల్ యూనివర్సిటీలో ఆచార్యులు -
ఇంటర్ నుంచి వర్సిటీ దాకా...
సాక్షి, హైదరాబాద్: ఇంటర్, డిగ్రీ, టెక్నికల్, వర్సిటీ ఇలా ఉన్నత విద్యావ్యవస్థలోని నియామకాలన్నీ ఒకే గొడుగు కిందకు తేవాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ దిశగా కాలేజీ సర్వీస్ కమిషన్ను తెర మీదకు తెచ్చే అంశాన్ని పరిశీలిస్తోంది. దీనిపై సమగ్ర వివరాలతో నివేదిక ఇవ్వాలని సాంకేతికవిద్య విభాగం అధికారులను ప్రభుత్వం ఆదేశించినట్టు తెలిసింది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే విద్యా కమిషన్ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ తరుణంలో కాలేజీ సర్వీస్ కమిషన్ ఏర్పాటు వల్ల నియామక విధానంలో కొత్తదనం ఉంటుందని భావిస్తున్నారు.కామన్ రిక్రూట్మెంట్ బోర్డు రద్దు?..: రాష్ట్రంలో 11 యూనివర్సిటీలున్నాయి. వాటి పరిధిలో నియామకాలన్నీ ఆయా యూనివర్సిటీలే కామన్గా నోటిఫికేషన్ ఇచ్చి.. చేపడుతున్నాయి. ఈ విధానంపై అనేక ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో గత ప్రభుత్వం మార్పులు చేసింది. అన్ని యూనివర్సిటీలకు కలిపి కామన్ రిక్రూట్మెంట్ బోర్డు ఏర్పాటు చేసింది. ఉన్నత విద్యామండలి చైర్మన్ సహా, పలువురు విద్యావేత్తలను బోర్డులో చేర్చింది. అయితే, ఈ బోర్డు ఇప్పటి వరకూ ఎలాంటి నియామకాలు చేపట్టలేదు. దీనిపై యూనివర్సిటీల నుంచి వ్యతిరేకత వచ్చింది. మరోవైపు ఇంటర్, డిగ్రీ కాలేజీల అధ్యాపకుల నియామకాన్ని పబ్లిక్ సర్వీస్ కమిషన్ చేపడుతోంది. ఇప్పటికే గ్రూప్స్, ఇతర పరీక్షలు పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరిధిలో ఉన్నాయి. అధ్యాపకులు, ప్రొఫెసర్ల నియామకం కూడా చేపట్టాల్సి రావడం ఇబ్బందికరంగా ఉందని భావిస్తున్నారు. పరీక్షలకు సంబంధించిన ప్రశ్నపత్రాల రూపకల్పన, పరీక్షల నిర్వహణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చేపట్టడం వల్ల జాప్యం కూడా జరుగుతోందనే విమర్శలొస్తున్నాయి. కమిషన్ పాతదే...కాలేజీ సర్వీస్ కమిషన్ ఉమ్మడి రాష్ట్రంలో ఎప్పట్నుంచో ఉంది. కాలేజీల్లో బోధన, బోధనేతర సిబ్బంది ఖాళీలను గుర్తించి, కమిషన్కు తెలియజేస్తారు. కమిషన్ నేతృత్వంలోని కమిటీ పరీక్షలు చేపడుతుంది. అయితే 1985లో ఈ కమిషన్ను రద్దు చేశారు. నియామకాలన్నీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరిధిలోకి తెచ్చారు. మళ్లీ కాలేజీ సర్వీస్ కమిషన్కు ఊపిరి పోయడంతోపాటు విశిష్టమైన అధికారాలు ఇచ్చే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు అధికారవర్గాలు అంటున్నాయి. ప్రైవేట్ కాలేజీలు, యూనివర్సిటీల్లో అర్హత లేని ఫ్యాకల్టీని నియమిస్తున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. దీనిని దృష్టిలో ఉంచుకొని, ప్రైవేట్ కాలేజీల్లో పనిచేసే ఫ్యాకల్టీ అర్హతలను ఈ కమిషన్ పరిశీలించే అవకాశం ఉంటుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు రాష్ట్రంలోని 9 పాలిటెక్నిక్ కాలేజీలను ఇంజనీరింగ్ కాలేజీలుగా అప్గ్రేడ్ చేయాలని భావిస్తున్నారు. ఐటీఐలను కూడా ఆధునికీకరించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. దీనిని దృష్టిలో ఉంచుకొని సాంకేతిక విద్య కాలేజీల్లో నియామకాలనూ ఈ కమిషన్ పరిధిలోకి తెచ్చే ఆలోచన ఉన్నట్టు ఓ సీనియర్ అధికారి తెలిపారు. -
కాలేజీల్లో డ్రగ్స్ కట్టడికి క్లబ్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని విద్యాసంస్థల్లో ర్యాగింగ్ రక్కసిని అరికట్టడం, డ్రగ్స్ ముప్పును నివారించేందుకు తెలంగాణ ఉన్నత విద్యామండలి సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టనుంది. ఈ రెండు సమస్యలను పరిష్కరించేందుకు 24/7 పనిచేసే టోల్ఫ్రీ నంబర్ను అందుబాటులోకి తేనుంది. వారం పది రోజుల్లో ఈ టోల్ఫ్రీ నంబర్ను అందుబాటులోకి తెస్తామని విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం శనివారం ప్రకటించారు.ఎక్కడ ఇలాంటి తప్పులు జరిగినా విద్యార్థులు నిర్భయంగా ఈ నంబర్కు ఫిర్యాదు చేయొచ్చన్నారు. తెలంగాణ ఉన్నత విద్యామండలి ఆధ్వర్యంలో శనివారం మాసాబ్ట్యాంక్లోని జేఎన్ఏఎఫ్ఏయూ ఆడిటోరియంలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డ్రగ్స్ వినియోగం వారి వారి జీవితాలతోపాటు దేశాన్ని సైతం నాశనం చేస్తుందన్నారు. పాఠశాల స్థాయిలో డ్రగ్స్ను అరికట్టేందుకు ప్రహరీ క్లబ్లను ఏర్పాటుచేశామని, కాలేజీల్లో సైతం ఇలాంటి క్లబ్లను ఏర్పాటు చేస్తామని చెప్పారు.పటిష్టమైన వ్యవస్థ: డీజీపీ జితేందర్తెలంగాణను డ్రగ్ఫ్రీ రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు పటిష్టమైన వ్యవస్థను ఏర్పాటు చేశామని డీజీపీ డాక్టర్ జితేందర్ అన్నారు. రాష్ట్రంలో ర్యాగింగ్ను ఇప్పటికే నిషేధించామని, ర్యాగింగ్కు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి మాట్లాడుతూ.. విద్యార్థుల్లో నైపుణ్యాలు తగ్గుతున్నాయని అన్నారు. దీనికి పరిష్కారంగానే ప్రభుత్వం స్కిల్స్ యూనివర్సిటీని ఏర్పాటుచేసి, స్కిల్స్ కోర్సులను ప్రవేశపెట్టిందని గుర్తుచేశారు.నగరాల్లోని వర్సిటీలు, కాలేజీలే కాకుండా మారుమూల ప్రాంతాల్లోని చిన్న కాలేజీల వరకు డ్రగ్స్ చేరాయంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చని చెప్పారు. డ్రగ్స్తో కుటుంబాలు సైతం ఆర్థికంగా చితికిపోతున్నాయని పేర్కొన్నారు. కళాశాల, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ శ్రీదేవసేన మాట్లాడుతూ.. యాంటీనార్కోటిక్స్ బ్యూరో తెలంగాణలో తప్ప దేశంలో మరెక్కడా లేదన్నారు. మన యువతను నాశనం చేయాలని కొంతమంది దుష్టులు కంకణం కట్టుకున్నారని, డ్రగ్స్ అనే యాసిడ్ను పిల్లలపై ప్రయోగిస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు.యాంటీనార్కోటిక్స్ బ్యూరో డైర్టెర్ సందీప్ శాండిల్య మాట్లాడుతూ డ్రగ్స్ సంబంధిత సమాచారాన్ని 87126 71111 నంబర్కు ఫిర్యాదు చేయొచ్చన్నారు. ర్యాగింగ్కు సంబంధించి ఇటీవల ఉస్మానియా ఆసుపత్రిలో ఆరుగురు వైద్యులపై కేసులు నమోదు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్రెడ్డి, ఉన్నత విద్యామండలి వైస్చైర్మన్లు ప్రొఫెసర్ వెంకటరమణ, ప్రొఫెసర్ ఎస్కే మహమూద్, కార్యదర్శి శ్రీరాం వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు. -
గాడి తప్పిన వర్సిటీలు..
-
గాడి తప్పిన వర్సిటీలు..! పడిపోతున్న విద్యా ప్రమాణాలు
కాంట్రాక్టు లెక్చరర్లపై ఒత్తిడి.. రాష్ట్రంలోని 11 యూనివర్సిటీల్లో 1,365 మంది కాంట్రాక్టు లెక్చరర్లు పనిచేస్తున్నారు. అదీ సరిపడా లేకపోవడంతో వారిపై విపరీతమైన పనిభారం ఉంటోంది. అసలే చాలీచాలని వేతనాలకుతోడు పనిభారం వల్ల ఇబ్బందిపడుతున్నామని కాంట్రాక్టు లెక్చరర్లు వాపోతున్నారు. తమను రెగ్యులర్ చేస్తామని ప్రభుత్వాలు ఎన్నోసార్లు హామీ ఇచ్చినా నిలబెట్టుకోలేదని అంటున్నారు. సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలు నామ్కే వాస్తేగా మారిపోతున్నాయి. పరిశోధనల మాటేమోగానీ.. సాధారణ విద్యా ప్రమాణాలే నానాటికీ పడిపోతున్నాయి. ప్రభుత్వాల నిర్లక్ష్యం, నిధుల కొరత, మౌలిక సదుపాయాల లేమికితోడు అధ్యాపకుల పోస్టుల్లో చాలా వరకు ఖాళీగా ఉండటంతో.. యూనివర్సిటీల్లో చదువు గతి తప్పుతోంది. విశ్వవిద్యాలయాలు ఇచ్చే సర్టిఫికెట్లతో మార్కెట్లో ఉద్యోగాలు రావడం లేదని సీఎం రేవంత్ ఇటీవల స్వయంగా పేర్కొన్నారు కూడా. ఇలాంటి సమయంలో స్కిల్స్ యూనివర్సిటీకి శంకుస్థాపన చేసిన ప్రభుత్వం.. రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలపైనా దృష్టిపెడితే బాగుంటుందని విద్యావేత్తలు సూచిస్తున్నారు. నిధులు లేక.. పట్టించుకోక.. వందేళ్లపైన చరిత్ర ఉన్న ఉస్మానియా విశ్వవిదా్యలయం కూడా ‘నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడిటేషన్ కౌన్సిల్ (న్యాక్)’ గుర్తింపులో వెనుకబడి ఉంది. ర్యాంకు ఏటా దిగజారుతోంది. రాష్ట్రంలోని 11 యూనివర్సిటీల పరిస్థితీ ఇదే. ఎన్నో సమస్యలున్నాయని ప్రతీ ప్రభుత్వం చెప్తున్నా.. నిధులు మాత్రం ఇవ్వడం లేదు. ఫలితంగా మౌలిక వసతుల కల్పన అంతంత మాత్రంగానే ఉంటోంది. కొత్త వీసీలు వస్తేగానీ.. విశ్వవిద్యాలయాల్లో ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లతోపాటు బోధనేతర సిబ్బంది ఖాళీలు కూడా భారీగా ఉన్నాయి. వీటి భర్తీకి ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేస్తామని గత ప్రభుత్వం జీవో ఇచ్చింది. వీసీల ద్వారా కాకుండా.. కమిటీ ద్వారా నియామకాలు చేపట్టాలని భావించింది. కానీ అది ముందుకు పడలేదు. నిజానికి రాష్ట్రంలోని యూనివర్సిటీలకు వీసీలే లేరు. ఈ ఏడాది మేలోనే వీసీల పదవీకాలం పూర్తయింది. కొత్తవారి నియామకానికి సెర్చ్ కమిటీలు వేశారు. దరఖాస్తులూ తీసుకున్నారు. కానీ సెర్చ్ కమిటీలు ఇంతవరకు సమావేశం కాలేదు. వీసీల నియామకం జరిగితే తప్ప ఖాళీల భర్తీ కుదరదు. ఖాళీలు భర్తీ చేస్తే తప్ప బోధన గాడినపడేందుకు ఆస్కారం లేదు. చదువు చేప్పేవాళ్లెక్కడ? రాష్ట్రంలోని 11 విశ్వవిద్యాలయాల్లో 2,828 పోస్టులు ఉండగా.. అందులో 1,869 పోస్టులు ఖాళీయే. అంటే 70శాతం వరకు బోధనా సిబ్బంది లేరు. ఇలా ఉంటే విశ్వవిద్యాలయాల్లో బోధన ఎలా సాగుతుంది? పరిశోధనలు ఎలా సాధ్యమవుతాయని విద్యావేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం 2017లోనే వర్సిటీల్లో 1,528 ఖాళీలున్నట్టు గుర్తించింది. 1,061 పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించింది. కానీ కార్యరూపం దాల్చలేదు. ఎప్పుడూ ఏదో ఒక సమస్యతో నియామకాలు ఆగిపోయాయి. 2021 జనవరి నాటికి ఖాళీల సంఖ్య 1,869కు పెరిగింది. ఇందులో 248 ప్రొఫెసర్, 781 అసోసియేట్ ప్రొఫెసర్, 850 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు ఉన్నాయి. తర్వాత మరిన్ని పోస్టులూ ఖాళీ అయ్యాయి. మరోవైపు బోధనేతర సిబ్బంది ఖాళీలూ భారీగానే ఉన్నాయని.. మొత్తంగా 4,500కు పైగా పోస్టులు భర్తీ చేయాల్సి ఉంటుందని అధికార వర్గాలు చెప్తున్నాయి. కాంట్రాక్టు లెక్చరర్లపై ఒత్తిడి.. రాష్ట్రంలోని 11 యూనివర్సిటీల్లో 1,365 మంది కాంట్రాక్టు లెక్చరర్లు పనిచేస్తున్నారు. అదీ సరిపడా లేకపోవడంతో వారిపై విపరీతమైన పనిభారం ఉంటోంది. అసలే చాలీచాలని వేతనాలకుతోడు పనిభారం వల్ల ఇబ్బందిపడుతున్నామని కాంట్రాక్టు లెక్చరర్లు వాపోతున్నారు. తమను రెగ్యులర్ చేస్తామని ప్రభుత్వాలు ఎన్నోసార్లు హామీ ఇచ్చినా నిలబెట్టుకోలేదని అంటున్నారు. ఏ వర్సిటీ చూసినా.. అన్నీ ఖాళీలే..! కీలకమైన ఉస్మానియా యూనివర్సిటీలోనూ ఫ్యాకల్టీ కొరత తీవ్రంగా ఉంది. అన్ని విభాగాల్లోనూ కాంట్రాక్ట్, పార్ట్టైం అధ్యాపకులతో బోధన చేయిస్తున్నారు. సీనియర్ ఫ్యాకల్టీ లేకపోవడంతో పరిశోధనలేవీ ముందుకు సాగడం లేదు. పోస్టు గ్రాడ్యుయేట్ స్థాయిలో బోధన మొక్కుబడిగా ఉందనే విమర్శలున్నాయి. ల్యాబ్లలో అవసరమైన పరికరాలు, రసాయనాలు, ఇతర మౌలిక వసతులు లేవు. జేఎన్టీయూహెచ్లోనూ ఇదే దుస్థితి. నిజాం కాలేజీ, కోఠిలోని విమెన్స్ యూనివర్సిటీలోనూ చాలా కోర్సులకు ఫ్యాకల్టీ లేదు. – కరీంనగర్లోని శాతవాహన వర్సిటీలో మ్యాథ్స్, ఫార్మసీ, బోటనీ, కంప్యూటర్ సైన్స్ విభాగాల్లో రెగ్యులర్ అధ్యాపకులు లేరు. – మహబూబ్నగర్లోని పాలమూరు విశ్వవిద్యాలయంలో ఇంటిగ్రేటెడ్ కెమిస్ట్రీ, ఎంబీఏ, ఎంఎస్డబ్ల్యూ విభాగాలకు ఒక్క రెగ్యులర్ ఫ్యాకల్టీ కూడా లేరు. కాంట్రాక్టు లెక్చరర్లతో అరకొరగా కొనసాగిస్తున్నారు. – ఉస్మానియా యూనివర్సిటీ తర్వాత చెప్పుకోదగ్గ వర్సిటీ కాకతీయ విశ్వవిద్యాలయం. ఇక్కడ పొలిటికల్ సైన్స్, ఎడ్యుకేషన్ వంటి విభాగాల్లో రెగ్యులర్ అధ్యాపకులు ఒక్కరూ లేరు. ఈ వర్సిటీ పరిధిలోని కొత్తగూడెం ఇంజనీరింగ్ కాలేజీలో చాలా పోస్టులు ఖాళీయే. – నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీలో కొన్ని విభాగాల్లో ఒక్క ప్రొఫెసర్ కూడా లేని పరిస్థితి. కీలకమైన ఇంజనీరింగ్ విభాగంలో 48 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మిగతా విభాగాల్లోనూ రెగ్యులర్ అధ్యాపకులు నామమాత్రమే. – నిజామాబాద్లోని తెలంగాణ విశ్వవిద్యాలయంలో మేథ్స్, ఎకనామిక్స్, ఫార్మస్యూటికల్స్, కెమిస్ట్రీ, ఇంటిగ్రేటెడ్ ఎంబీఏ విభాగాల్లో రెగ్యులర్ అధ్యాపకులే లేరు. సదుపాయాలూ సరిగా లేక.. చాలా యూనివర్సిటీల్లో మౌలిక వసతుల పరిస్థితి దారుణంగా ఉంది. తాగునీటి సౌకర్యం కూడా సరిగా ఉండటం లేదని విద్యార్థులు వాపోతున్నారు. హాస్టళ్లు, టాయిలెట్ల పరిస్థితి దారుణంగా ఉంటోందని అంటున్నారు. పాలమూరు వర్సిటీ హాస్టళ్లలో గదుల తలుపులు, కప్బోర్డులు విరిగిపోయాయి. శాతవాహన వర్సిటీలో ఫార్మసీ కళాశాల భవనాలు నామమాత్రంగా ఉన్నాయి. ఉస్మానియా వర్సిటీ భవనాల నిర్వహణ సరిగా లేదు. కొన్ని శిథిలావస్థకు చేరాయి. వీటిని బాగు చేయాలంటే నిధుల కొరత వెంటాడుతోందని అధికారులు చెప్తున్నారు. 70శాతం కాంట్రాక్టు అధ్యాపకులే.. విశ్వవిద్యాలయాల్లో 11 ఏళ్లుగా బోధన సిబ్బంది నియామకాలు చేపట్టలేదు. 70శాతం కాంట్రాక్టు అధ్యాపకులతోనే నడిపిస్తున్నారు. వారిపైనా విపరీతమైన పనిభారం ఉంటోంది. 20 ఏళ్లుగా పనిచేస్తున్న కాంట్రాక్టు సిబ్బందిని పరి్మనెంట్ చేయలేదు. తక్షణమే యూనివర్సిటీల్లో నియామకాలు చేపట్టి, ఉన్నత ప్రమాణాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలి. – డాక్టర్ ఎం.పరమేశ్వర్ (తెలంగాణ ఆల్ యూనివర్సిటీ కాంట్రాక్ట్ ఫ్యాకల్టీస్ సంఘం నేత) -
ప్రభుత్వం మారితే వీసీలు మారాలా?: మేరుగు నాగార్జున
సాక్షి, విశాఖపట్నం/గుంటూరు: ఆంధ్రా యూనివర్సిటీలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు శనివారం హల్ చల్ చేశారు. అరుపులతో హడావుడి చేశారు. అధికారంలోకి వచ్చిన క్షణం నుంచే కక్ష సాధింపు చర్యలకు తెగబడుతున్న టీడీపీ ప్రభుత్వం.. చివరకు సరస్వతీ నిలయాలైన విశ్వవిద్యాలయాలపైనా విరుచుకుపడుతోంది. విద్యార్థులను ఉన్నతులుగా తీర్చిదిద్దే విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న వైస్ ఛాన్సలర్లు వెంటనే రాజీనామా చేసి వెళ్లిపోవాలని అల్టిమేటం జారీచేసిన సంగతి తెలిసిందే.యూనివర్శిటీలలో వీసీల బలవంతపు రాజీనామాలపై మాజీ మంత్రి మేరుగు నాగార్జున గుంటూరులోని తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ, వీసీల రాజీనామాల అంశం చాలా బాధాకరమన్నారు. తాను కూడా విశ్వవిద్యాలయంలో చదువుకుని, అధ్యాపకుడిగా పనిచేశానని తెలిపారు.‘‘ప్రభుత్వాలు వస్తుంటాయి, మారుతుంటాయి, యూనివర్శిటీలు అంటే ఒక మేధాశక్తిని తయారుచేసే కర్మాగారాలు, సీఎంలు మారుతుంటారు, కానీ యూనివర్శిటీలో వీసీని అపాయింట్చేస్తే అతని కాలపరిమితి పూర్తయ్యే వరకూ ఎవరూ కదిలించరు. యూజీసీ నిబంధనల మేరకు పనిచేస్తారు, కానీ ఈ రోజు జరుగుతున్న పరిస్ధితులు చాలా బాధాకారం....గతంలో టీడీపీ అపాయింట్ చేసిన వీసీలను కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కొనసాగించింది. విద్యా వ్యవస్ధను భ్రష్టు పట్టించవద్దు. ఎవరిపైన అయినా ఆరోపణలు, అభియోగాలు వస్తే గవర్నర్ దృష్టికి తీసుకువెళ్ళాలి, ఆయన కమిటీ వేసి తప్పులు జరిగి ఉంటే ఆయన నిర్ణయం తీసుకోవాలి, అంతేకానీ ఇలా భయపెట్టి రిజైన్ చేయడం సమంజసం కాదు....గవర్నర్ వీసీని అపాయింట్ చేస్తారు. ఇంత దారుణంగా టీడీపీ వ్యవహరించడం సరికాదు. అధికారం ఉంది కదా అని ఇలా వ్యవహరించడం తప్పు. ఇలా ఎప్పుడైనా జరిగిందా?...ఆంధ్రా యూనివర్శిటీలో టీడీపీ అపాయింట్ చేసిన వారిని కాంగ్రెస్ ప్రభుత్వం చక్కగా పనిచేయించుకుని సాగనంపింది, అక్కడే కాదు మిగిలిన యూనివర్శిటీలు, ఉన్నత విద్యామండలిలో కూడా ఇలాగే జరిగింది. విద్యా వ్యవస్ధను నాశనం చేయద్దు. నేను నా అనుభవంతో చెప్తున్నా, ఇకనైనా ఒక పద్దతి ప్రకారం నిర్ణయాలు తీసుకోండి. మీరు చేసిన తప్పులు ఇకనైనా సరిదిద్దుకోవాలి....వైఎస్ జగన్ సెక్యూరిటీపై కూడా బురదచల్లుతున్నారు. మేం ఎప్పుడూ ఇలా చేయలేదు. మీరు ప్రభుత్వాన్ని చక్కగా నడపాలని మేం కోరుకుంటున్నాం. మేం ఎక్కడా క్యాడర్ను ఉసిగొల్పలేదు’’ అని మేరుగు నాగార్జున పేర్కొన్నారు. -
ఏటా రెండుసార్లు ప్రవేశాలు సాధ్యమేనా?
సాక్షి, హైదరాబాద్: యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) కొత్తగా తీసుకురానున్న ఏటా రెండు సార్లు ప్రవేశాల విధానంపై రాష్ట్రంలోని యూనివర్సిటీలు, ఉన్నత విద్యాసంస్థలు తర్జన భర్జన పడుతున్నాయి. దీనిపై ఇప్పటి వరకూ ఎలాంటి మార్గదర్శకాలు విడుదల కాకపోయినా, ఈ విద్యా సంవత్సరం నుంచే అమలు చేయాలనే యూజీసీ ఆదేశాలు ఎలా సాధ్యమనే వాదన వినిపిస్తోంది. విశ్వవిద్యాలయాల్లో భారీగా బోధన సిబ్బంది ఖాళీలున్నాయి. ఏడాదికి రెండు బ్యాచ్లకు ఒకే అధ్యాపకుడు బోధించడం ఎలా సాధ్యమనే వాదన ఉంది. డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్లో ప్రవేశాలు ఇక నుంచి ఏడాదికి రెండుసార్లు చేపట్టాలని ఇటీవల యూజీసీ నిర్ణయించింది. ఇప్పుడు జూలై–ఆగస్టు మధ్య మాత్రమే ప్రవేశాలు జరుగుతున్నాయి. ఈ సెషన్ కాకుండా జనవరి–ఫిబ్రవరి మధ్య మరో దఫా అడ్మిషన్లు చేపట్టాలని నిర్ణయించింది. 2024–25 విద్యా సంవత్సరంలోనే దీన్ని అమలు చేయాలని భావించడంపై వర్సిటీలు సందేహాలు వ్యక్తం చేస్తున్నాయి. అమెరికానే ఆదర్శం... అమెరికా సహా ప్రపంచంలోని పలు దేశాలు ద్వైవార్షిక ప్రవేశాల విధానాన్ని అమలు చేస్తున్నాయి. దేశ విద్యా విధానంలోనూ మార్పులు తెచ్చారు. మార్కులు కాకుండా క్రెడిట్లు ఇవ్వాలని నూతన విద్యా విధానం పేర్కొంటోంది. విదేశాల్లోనూ ఇదే విధానం ఉండటం వల్ల డిగ్రీ గుర్తింపు తేలికగా ఉంటుందని భావిస్తున్నారు. అడ్మిషన్లు కూడా ఏడాదికి రెండుసార్లు ఉంటే విద్యార్థులకు ప్రయోజనం ఉంటుందని యూజీసీ చెబుతోంది. వివిధ కారణాలతో తొలి దశలో ప్రవేశం పొందలేని వారికి జనవరి– ఫివ్రబరిలో తేలికగా అడ్మిషన్ పొందే వీలుంది. ఏడాదిపాటు ఖాళీగా ఉండాల్సిన అవసరం ఉండబోదని యూజీసీ వర్గాలు అంటున్నాయి. పారిశ్రామిక వర్గాలు కూడా ఏడాదికి రెండు దఫాలు క్యాంపస్ సెలెక్షన్ చేసే వీలుందని చెబుతున్నాయి. దీనివల్ల ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని ఆశిస్తున్నారు. సన్నద్ధత ఎలా? ద్వైవార్షిక ప్రవేశాలపై సన్నద్ధతను కోరుతూ దేశంలోని అన్ని వర్సిటీలు, ఉన్నత విద్యా మండళ్లకు యూజీసీ లేఖలు రాస్తోంది. దీనిపై ఆయా సంస్థలు సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. రెండుసార్లు అడ్మిషన్ల వల్ల ఒకే కోర్సును రెండు సెషన్లుగా నిర్వహించాల్సి ఉంటుంది. మొదటి సెషన్ సెపె్టంబర్లో మొదలైతే, రెండో సెషన్ మార్చిలో మొదలవుతుంది. అప్పటికే మొదటి సెషన్ విద్యార్థులు ఒక సెమిస్టర్ పూర్తి చేసి ఉంటారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని రెండు సెషన్ల నిర్వహణకు అవసరమైన ఫ్యాకల్టీ, లేబొరేటరీలు, తరగతి గది రూపంలో అవసరమైన వనరులు వర్సిటీలు సమకూర్చుకోవాల్సి ఉంటుంది. అంతర్జాతీయ వర్సిటీలతో మన దేశంలోని విశ్వవిద్యాలయాలు ఒప్పందాలు చేసుకుంటున్నాయి. ఈ కారణంగా అదనపు క్లాసుల నిర్వహణ తేలికగా ఉండొచ్చని భావిస్తున్నారు. ఆన్లైన్ క్లాసులకు విదేశీ వర్సిటీలు తోడ్పాటును అందిస్తాయి. అయితే, ఇందుకు తగ్గ వనరులు, ఫ్యాకల్టీ, మౌలిక వసతుల ఏర్పాటుపై రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలు సందేహాలు వ్యక్తం చేస్తున్నాయి. అరకొరగా ఉన్న ఫ్యాకల్టీ కారణంగా నిర్వహణ ఏమేర సాధ్యమనే వాదన వినిపిస్తోంది. ఉన్నత విద్యా సంస్థల్లో ఎన్రోల్మెంట్ పెంచడం, స్వయంగా ఆర్థికంగా బలపడే కొన్ని కోర్సులు తెచ్చే ఆలోచన కూడా యూజీసీ చేసే వీలుందని అధికార వర్గాలు అంటున్నాయి. మార్గదర్శకాలు రావాల్సి ఉంది: ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి, ఉన్నత విద్యామండలి చైర్మన్ ద్వైవార్షిక ప్రవేశాలపై యూజీసీ కసరత్తు చేస్తోంది. అయితే, ఇది ఎలా నిర్వహించాలనే విషయంలో ఇప్పటివరకూ ఎలాంటి మార్గదర్శకాలు రాలేదు. అవి వచ్చిన తర్వాతే సాధ్యాసాధ్యాలు పరిశీలిస్తాం. అన్ని స్థాయిల్లో చర్చించాల్సి ఉంటుంది. ఎన్రోల్మెంట్ పెరుగుతుంది: ప్రొఫెసర్ ఎన్వీ రమణారావు, నిట్ డైరెక్టర్, రాయపూర్ ఏడాదికి రెండుసార్లు ప్రవేశాలు నిర్వహించడం వల్ల విద్యార్థుల హాజరు పెరుగుతుంది. ఇప్పటికే విదేశాల్లో ఇది నడుస్తోంది. ఇది విద్యార్థులకు ఉపయుక్తంగానే ఉంటుంది. కాకపోతే వనరుల సమీకరణ సవాల్గా ఉంటుంది. విద్యార్థులకు ప్రయోజనమే: ప్రొఫెసర్ శ్రీరాం వెంకటేష్, ఉన్నత విద్యామండలి కార్యదర్శి అమెరికా వంటి దేశాలు అమలు చేస్తున్న తరహాలో భారత్లోనూ ద్వైవార్షిక ప్రవేశాలు ఉంటే విద్యార్థులకు ఉపయోగమే. విద్యా సంవత్సరం నష్టపోకుండా చూడొచ్చు. ఒకసారి ప్రవేశ పరీక్ష పాసైతే రెండోసారి అడ్మిషన్లకూ ఇది అర్హతగానే ఉంటుంది. కాబట్టి సాంకేతికపరమైన సమస్యలు ఉండొకపోవచ్చు. -
‘సెర్చ్’ ఏదీ ?
సాక్షి, హైదరాబాద్ : యూనివర్సిటీల వీసీల నియామకంలో ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. రాష్ట్రంలోని పది విశ్వవిద్యాలయాల వైస్ చాన్స్లర్ల(వీసీ) ఎంపికకు సంబంధించి ప్రభుత్వం నియమించిన సెర్చ్ కమిటీలు ఇప్పటివరకూ ఒక్కసారి కూడా సమావేశం కాలేదు. అన్ని వర్సిటీల్లోనూ ఐఏఎస్లే కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. వారికి ఇతర బాధ్యతలు ఉండటంతో వర్సిటీలపై పెద్దగా దృష్టి పెట్టలేకపోతున్నారు. సాధారణ కార్యకలాపాలకు కూడా అధికారుల అనుమతి తీసుకోవాల్సి వస్తోంది. ఐఏఎస్లంతా హైదరాబాద్లోనే ఉండటంతో వర్సిటీల్లోని సిబ్బందికి ఇబ్బందులు తప్పడం లేదు. విద్యా సంవత్సరం మొదలవ్వడంతో వర్సిటీలు కీలకమైన బాధ్యతలు చేపట్టాల్సి ఉంటుంది. జేఎన్టీయూహెచ్లో అనుబంధ గుర్తింపు, కోర్సుల మార్పిడి వంటి వాటి విషయంలోనూ ఇబ్బందులు ఎదురవుతున్నాయని ప్రైవేట్ కాలేజీలు అంటున్నాయి. మరోవైపు ఐఏఎస్లు అధికారులు అందుబాటులో లేకపోవడంతో ఉన్నత విద్యామండలి కూడా యూనివర్సిటీ వ్యవహారాలపై ముందుకెళ్లే పరిస్థితి లేదు. కొత్త కోర్సులు, వాటికి సంబంధించిన బోధన ప్రణాళికపై ఏ నిర్ణయం తీసుకునే అవకాశం లేకుండాపోయిందని మండలివర్గాలు అంటున్నాయి. వీసీల పదవీ కాలం మే 21తో ముగిసింది. దీంతో కొత్తవారి నియామకానికి ప్రభుత్వం సెర్చ్ కమిటీలను ఏర్పాటు చేసింది. ఈ ప్రక్రియ పూర్తయ్యే వరకూ ఐఏఎస్ అధికారులకు వీసీలుగా అదనపు బాధ్యతలు అప్పగించింది. సెర్చ్ కమిటీలు ఏమైనట్టు? వీసీ ఎంపికకు గత నెలలోనే ప్రభుత్వం సెర్చ్ కమిటీలను ఏర్పాటు చేసింది. నిపుణులతో కూడిన ఈ కమిటీలు వచ్చిన దరఖాస్తులను వడపోయాలి. అంతిమంగా ముగ్గురిని ఎంపిక చేసి, ప్రభుత్వానికి సిఫార్సు చేయాలి. ఇందులోంచి ఒకరిని ప్రభుత్వం వీసీగా నియమిస్తుంది. మూడు వారాలైనా ఇంతవరకూ సెర్చ్ కమిటీల భేటీ జరగలేదు. వీసీల ఎంపికలో తీసుకోవాల్సిన ప్రామాణిక అంశాలేమిటో ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదు. పెద్దఎత్తున దరఖాస్తులు రావడం, అందరూ సాంకేతికంగా వీసీ పోస్టులకు అర్హులే కావడంతో సెర్చ్ కమిటీ స్వతంత్రంగా నిర్ణయం తీసుకునే అవకాశం కనిపించడం లేదని తెలుస్తోంది. వీసీల ఎంపికలో ప్రభుత్వానికి కొన్ని రాజకీయ ప్రాధాన్యతలూ ఉంటాయని నిపుణులు అంటున్నారు. సామాజిక ప్రాధాన్యత ఇందులో కీలకమని భావిస్తున్నారు. వీటిని దృష్టిలో పెట్టుకొని ఎంపిక జరగాల్సి ఉన్నప్పుడు స్పష్టత లేకుండా మేమేం చేయగలమని వారు అంటున్నారు. ఒత్తిడే కారణమా...? ప్రధాన యూనివర్సిటీల వీసీల కోసం పెద్దఎత్తున ప్రభుత్వంపై రాజకీయ ఒత్తిడి వస్తున్నట్టు తెలుస్తోంది. అత్యధికంగా ఇంజనీరింగ్ కాలేజీలకు గుర్తింపు ఇచ్చే జేఎన్టీయూహెచ్ వీసీ కోసం కేంద్రస్థాయిలో కాంగ్రెస్ పెద్దల నుంచే సిఫార్సులు వచ్చినట్టు సమాచారం. నల్లగొండ జిల్లాకు చెందిన ఓ మంత్రి వీసీ పోస్టుకు దరఖాస్తు చేసిన ఓ వ్యక్తి కోసం పట్టుబడుతున్నారు. మరోవైపు నిజామాబాద్కు చెందిన మరో కాంగ్రెస్ కీలకనేత మైనారిటీకి చెందిన మరో ప్రొఫెసర్కు ఇప్పించేందుకు ఒత్తిడి తెస్తున్నట్టు సమాచారం. జేఎన్టీయూహెచ్ వీసీ పోస్టుకు ఎన్ఐటీలో పనిచేస్తున్న రాష్ట్రానికి చెందిన ఓ వ్యక్తి పట్ల సీఎంకు సానుకూలత ఉన్నట్టు తెలిసింది. అయితే, తన మాట కన్నా పార్టీలో పెద్దవారికి ప్రాధాన్యం ఇవ్వాల్సిన పరిస్థితి ఉందని సమాచారం. ఈ కారణంగానే ఇక్కడ సెర్చ్ కమిటీ ఇంతవరకూ భేటీ అవ్వలేదని తెలుస్తోంది. ఉస్మానియా యూనివర్సిటీ వీసీ పోస్టుకు ఓ సామాజికవర్గానికి చెందిన వ్యక్తి కోసం విద్యాశాఖ ఉన్నతాధికారి కూడా పావులు కదుపుతున్నారు. సామాజిక కోణంలో ఈ ప్రతిపాదన తీసుకొస్తున్నా, యూనివర్సిటీ వర్గాల నుంచి ఆయనపై తీవ్ర వ్యతిరేకత ఉందని తెలుస్తోంది. బీఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ వీసీ పోస్టుకు కూడా జాతీయ, రాష్ట్ర స్థాయి నేతల చేత పైరవీలు జోరుగా సాగుతున్నాయి. ఈ తరహా ఒత్తిడి రావడంతోనే ప్రభుత్వం సెర్చ్ కమిటీలకు అవసరమైన మార్గదర్శకాలు ఇవ్వలేకపోతోందని ఉన్నతవిద్య వర్గాలు చర్చించుకుంటున్నాయి. -
విశ్వవిద్యాలయాలపై టీడీపీ దాడులు
తిరుపతి (తిరుపతి జిల్లా): చదువుల నిలయాలైన విశ్వవిద్యాలయాలపై తెలుగుదేశం పార్టీ మూకలు దాడులకు దిగుతున్నాయి. రెండు రోజుల క్రితం వైద్య విశ్వవిద్యాలయంపై దాడికి పాల్పడిన టీడీపీ వర్గాలు శుక్రవారం రాయలసీమకే తలమానికమైన తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం (ఎస్వీయూ), శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం (వీఎస్యూ) పై దాడులకు తెగబడ్డాయి. సుమారు 50 మంది టీడీపీ కార్యకర్తలు శుక్రవారం ఎస్వీయూలోకి కర్రలు, రాడ్లతో చొరబడ్డారు. నేరుగా పరిపాలన భవనంలోకి ప్రవేశించి, వైస్ చాన్సలర్ (వీసీ) శ్రీకాంత్రెడ్డి చాంబర్లోకి దూసుకెళ్లారు. ఆయనపైకి నీళ్ల సీసాలు, కర్రలు విసురుతూ దాడి చేశారు. అక్కడ ఉన్న ఫైళ్లను విసిరేశారు. ‘వెంటనే రాజీనామా చేయరా.. వైఎస్సార్సీపీ ప్రభుత్వం పడిపోయినా ఇంకా సీటులో కూర్చున్నావా’ అని హెచ్చరిస్తూ అసభ్య పదజాలంతో దుర్భాషలాడారు. వీసీపై టీడీపీ కార్యకర్తలు దాడి చేస్తున్నారని ఉద్యోగులు సమాచారమిచ్చినా పోలీసులు పట్టించుకున్న పాపానపోలేదు. ఓ పక్క టీడీపీ మూకల వీరంగం, మరోపక్క పోలీసులు పట్టించుకోకపోవడంతో వర్సిటీ సిబ్బంది భయభ్రాంతులకు గురయ్యారు.వారి సీట్ల నుంచి లేచి పరుగులు పెట్టారు. మహిళా ఉద్యోగులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బయటకు పరుగులు తీశారు. వీసీపై దాడులు, ఉద్యోగులు పరుగులు తీస్తున్న దృశ్యాలను కొన్ని మీడియా సంస్థలు ఉత్సాహంగా వీడియోలు తీయడం కనిపించింది. టీడీపీ దాడులు, ఆ మీడియా అత్యుత్సాహాన్ని వర్సిటీ సిబ్బంది, ప్రజలు తప్పుపడుతున్నారు. వర్సిటీకి సంబంధం లేని బయట వ్యక్తులు వర్సిటీలోని ప్రవేశించడం దారుణమని, ఆ మీడియా సంస్థల తీరూ గర్హనీయమని విమర్శిస్తున్నారు.వీఎస్యూలో శిలాఫలకాలను ధ్వంసం చేసిన టీడీపీ నాయకులువెంకటాచలం: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం కాకుటూరులోని విక్రమ సింహపురి యూనివర్సిటీ (వీఎస్యూ) లో పలు శిలాఫలకాలను టీడీపీ నాయకులు ధ్వంసం చేశారు. వీఎస్యూలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ పేరుతో సెంట్రల్ లైబ్రరీని వైస్ చాన్సలర్ జీఎం సుందరవల్లి ఇటీవల ప్రారంభించి, శిలాఫలకాలను ఆవిష్కరించారు. శుక్రవారం ఉదయం పెద్ద సంఖ్యలో వర్సిటీలోకి ప్రవేశించిన టీడీపీ నాయకులు, కార్యకర్తలు వీరంగం సృష్టించారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సెంట్రల్ లైబ్రరీ వద్ద ఉన్న శిలాఫలకాలను ధ్వంసం చేశారు. అనంతరం డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి పరిపాలన భవనం వద్దకు చేరుకున్నారు. వీఎస్యూలో దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి పేరుతో భవనాన్ని ఎలా నిర్మిస్తారని, ఆయన విగ్రహాన్ని ఎందుకు ఏర్పాటు చేశారంటూ అధికారులతో వాగ్వాదానికి దిగారు. పరిపాలన భవనంలో వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని తొలగించాలని, లేకుంటే తామే ధ్వంసం చేస్తామని అధికారులను హెచ్చరించారు. దేవాలయం వంటి విశ్వవిద్యాలయంలో టీడీపీ నాయకులు దాడులు చేయడంపై అధ్యాపకులు, ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
ప్రపంచాన్ని నిలదీస్తున్న యువత
పాలస్తీనాకు సంఘీభావం తెలియజేస్తూ అమెరికాలోని నూటయాభై విశ్వవిద్యాలయలలో విద్యార్థులు నిరసన ప్రదర్శనలు చేశారు. ఏప్రిల్ 2024లో కొనసాగిన నిరసన కార్యక్రమాల్లో బోధన–బోధనేతర ఉద్యోగులు కూడా విద్యార్థులతో పాటు భాగస్వాములయ్యారు. ఇందులో హార్వర్డ్, బర్రత్ హాల్, కొలంబియా, ప్రిన్స్టన్, న్యూయార్క్, యేల్ వంటి అన్ని అమెరికన్ యూనివర్సిటీల విద్యార్థులున్నారు. అయితే నిరసనలో చురుకుగా పాల్గొన్న పదమూడు మంది విద్యార్థులకు హార్వర్డ్ యూనివర్సిటీ డిగ్రీలివ్వకుండా ఆపేసింది. ‘గ్రాడ్యుయేషన్ ప్రోగ్రాంలకు విద్యార్థులందరూ హాజరు కావచ్చు, కానీ, డిగ్రీలు రద్దయిన ఆ పదమూడు మందికి పట్టా ఇవ్వబడదు’– అని యూనివర్సిటీ ప్రకటించింది. నిరసన సెగలకు తట్టుకోలేక, కొన్ని యూనివర్సిటీలు గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్లు వాయిదా వేసుకున్నాయి. కొన్ని మాత్రం నిర్వహించుకున్నాయి. నిర్వహించుకున్న వాటిలో హార్వర్డ్ యూనివర్సిటీ కూడా ఒకటి. గాజా మీద దాడులు ఆపాల్సిందిగా, పాలస్తీనాను రక్షించాల్సిందిగా ఈ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రాం విద్యార్థులు కోరారు. తమ తమ క్లాసురూముల్లో నుండి ఆడిటోరియంలోని వేదిక మీదికి ఒక్కొక్కరుగా వరుస క్రమంలో క్రమశిక్షణతో నడిచి వస్తూ ‘ఫ్రీ గాజా నౌ’ ‘ఫ్రీ పాలస్తీనా నౌ’–గాజాకు స్వేచ్ఛనివ్వండి! పాలస్తీనాకు స్వేచ్ఛనివ్వండి! అని రాసి ఉన్న గుడ్డ, పేపర్ బేనర్లను ప్రదర్శిస్తూ వేదిక మీదకు నడిచివెళ్లారు. డిగ్రీలు తీసుకున్నారు. డిగ్రీ తీసుకున్న విద్యార్థుల నుండి కొందరికి మాట్లాడే అవకాశం ఇస్తారు. అలా మాట్లాడే వారిని విద్యార్థులే ఎన్నుకుంటారు. ఆ అవకాశం దక్కించుకుంది భారతీయ–అమెరికన్ విద్యార్థిని శ్రుతీ కుమార్. ఆమె ప్రసంగంలోని సారాంశం ఇలా ఉంది: ‘‘నేను తీవ్రంగా నిరాశ చెందాను. ఈ కేంపస్లో భావ వ్యక్తీకరణను శిక్షించడం జరిగింది. శాసనోల్లంఘన జరిగిందని శిక్షించడం జరిగింది. స్వేచ్ఛ, సమానత్వం, మానవ హక్కుల పరిరక్షణ ఎక్కడున్నాయి? పదిహేను వందలమంది విద్యార్థులు మాట్లాడారు. పిటిషన్లు సమర్పించారు. ఐదు వందల మంది అధ్యాపకులు మాట్లాడారు. మా ఆక్రోశం, మా ఆవేదన హార్వర్డ్– నీకు వినిపిస్తోందా?గాజాలో జరుగుతున్న సంఘటనలతో మనం మన సమాజంలో నిలువుగా బలంగా విడిపొయ్యాం! మనకు తెలియని వారిలోని మానవత్వాన్ని మనం గుర్తించలేమా? మనకు భేదాభిప్రాయాలు ఉన్నంతమాత్రాన వారి వేదననూ, నొప్పినీ అర్థం చేసుకోలేమా? గాజాలో జరుగుతున్న మారణకాండను మేమెవ్వరం సమర్థించడం లేదు. భావ ప్రకటన, సంఘీ భావ ప్రకటన ఈ కేంపస్లో శిక్షలకు గురయ్యాయి. ఈ సెమిస్టర్లో ఈసారి నా పదమూడు మంది సహ విద్యార్థులకు డిగ్రీలు అందడం లేదు. వారు మాతో పాటు పట్టభద్రులు కాలేకపోతున్నారు. శాసనోల్లంఘన జరిగిందని– ఉద్యమిస్తున్న విద్యార్థుల పట్ల యూనివర్సిటీ తీసుకున్న నిర్ణయం మా విద్యార్థి లోకాన్ని ఎంతగానో బాధించింది. ఇంకా చెప్పాలంటే నలుపు, చామనచాయ చర్మం గల నాలాంటి విద్యార్థినీ విద్యార్థులకు ఇక్కడ వ్యక్తిగత భద్రత లేదు. మా పట్ల ఎందుకీ అసహనం? ఎందుకీ అణచివేత? హార్వర్డ్! మా మాటలు నీకు వినిపిస్తున్నాయా?’’అమెరికాలోని నిబ్రాస్కాలో పుట్టి పెరిగిన ఇరవైయేళ్ళ యువతి శ్రుతీ కుమార్, తన పదినిముషాల ప్రసంగంతో ప్రపంచాన్ని కదిలించింది. తన తోటి విద్యార్థులకు పట్టాలు రాకపోవడం పట్ల ఆవేదన తెలియజేస్తూ– గాజాపై జరుగుతున్న దాడుల గూర్చీ, నల్లచర్మం ఆధారంగా సాగుతున్న జాతి వివక్ష గూర్చీ ఆక్రోశిస్తూ మాట్లాడిన మాటలకు హార్వర్డ్ యూనివర్సిటీ ఆడిటోరియంలో, ఆడిటోరియం బయట ఉన్న వేలమంది, వేదిక మీద ఉన్న అధ్యాపకులతో సహా– అందరికందరూ లేచి నిలబడి కాంపస్ దద్దరిల్లిపోయేట్లు చప్పట్లు చరిచారు. ‘హార్వర్డ్ నీకు వినిపిస్తోందా?’ అని గద్గద స్వరంతో ఆమె ఆక్రోశించినపుడల్లా విద్యార్థులు పెద్దఎత్తున చప్పట్లు చరిచి ఆమెకు తమ సంఘీభావం తెలియజేశారు. అయితే ఆ ఆవేదన, ఆ ఆక్రందన హార్వర్డ్ యూనివర్సిటీ ప్రాంగణానికే పరిమితం కాలేదు. ‘ప్రపంచమా! నీకు మా ఆక్రోశం, ఆవేదన వినిపిస్తోందా?– అని యువతరం ప్రశ్నిస్తున్నట్టు ప్రపంచ శ్రోతలకు అనిపించింది.సంఘసేవ పట్ల ఆసక్తి గల శ్రుతీ కుమార్, డాక్టర్ కోర్సును వదులుకుని, వైజ్ఞానిక శాస్త్ర చరిత్ర, ఆర్థిక శాస్త్రం చదువుకుని పట్టా సాధించారు. తమిళనాడు నుండి వెళ్ళి అమెరికాలో స్థిరపడ్డ దక్షిణ భారత సంప్రదాయ కుటుంబం వారిది. మనదేశంలోనూ విద్యార్థి ఆందోళనలు జరుగుతున్నాయి. వెంటనే కులగణన జరిపించాలనీ, అందరికీ సమానంగా ఉద్యోగాల్లో అవకాశాలుండాలనీ హరియాణాలోని అశోక విశ్వవిద్యాలయ విద్యార్థులు చేపట్టిన సమ్మె, నిరసనలూ తక్కువవి కావు. ప్రపంచంలో యువతరం ప్రశ్నని బలోపేతం చేస్తూ ఉందన్న దానికి అన్ని చోట్లా జరుగుతున్న విద్యార్థి నిరసనలను సంకేతాలుగా చూడాలి!!డా‘‘ దేవరాజు మహారాజు వ్యాసకర్త కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు విజేత ‘ మెల్బోర్న్ నుంచి -
ఐఏఎస్లే ఇన్చార్జులు.. 10 యూనివర్సిటీలకు వీసీలుగా నియమించిన ప్రభుత్వం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలు ఐఏఎస్ అధికారుల అజమాయిషీలోకి వెళ్లాయి. వైస్ చాన్స్లర్ల (వీసీల) పదవీకాలం ముగియడంతో.. ప్రభుత్వం ఒక్కో యూనివర్సిటీకి ఒక్కో ఐఏఎస్ అధికారిని ఇన్చార్జి వీసీగా నియమించింది. ఈ మేరకు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలోని మొత్తం పది విశ్వవిద్యాలయాల వీసీల పదవీ కాలం ఈ నెల 21వ తేదీతో ముగిసింది. దీనితో వెంటనే వర్సిటీలు ఇన్చార్జుల అ«దీనంలోకి వెళ్లాయి. కొత్త వీసీలు వచ్చే వరకూ అధికారుల పాలనే కొనసాగుతుంది. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో వీసీల నియామక ప్రక్రియ ఆలస్యమయ్యే అవకాశం ఉందని అధికార వర్గాలు చెప్తున్నాయి. సెర్చ్ కమిటీలు వేసినా.. వాస్తవానికి వీసీల పదవీ కాలం ముగియక ముందే కొత్తవారిని ఎంపిక చేయాల్సి ఉంటుంది. అయితే ఈ ప్రక్రియకు ఎన్నికల కోడ్ అడ్డంకిగా మారిందని అధికారులు అంటున్నారు. ఎన్నికల కమిషన్ అనుమతి తీసుకుని వీసీల నియామకం కోసం దాదాపు అన్ని యూనివర్సిటీలకు సెర్చ్ కమిటీలను నియమించారు. వీసీ పోస్టుల కోసం వచ్చిన దరఖాస్తులను ఆ కమిటీ పరిశీలించి.. అన్ని అర్హతలున్న వారి జాబితాను ప్రభుత్వానికి పంపాల్సి ఉంటుంది. ఆ తర్వాత నియామకాలు ఉంటాయి. కానీ సెర్చ్ కమిటీలు ఇప్పటివరకు ఒక్కసారి కూడా సమావేశం కాలేదు. కాకతీయ యూనివర్సిటీ పరిధిలో అయితే ఎగ్జిక్యూటివ్ కమిటీ ఏర్పాటు కాకపోవడంతో సెర్చ్ కమిటీని కూడా ఏర్పాటు చేయలేదు. ఈ క్రమంలో ప్రస్తుత వీసీలనే కొంతకాలం కొనసాగించాలని తొలుత భావించారు. కానీ ఈ ప్రతిపాదనపై అధికారుల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. పలువురు వీసీలపై ఆరోపణలు, మరికొందరి తీరు వివాదాస్పదం కావడం నేపథ్యంలో.. వారిని కొనసాగించేందుకు ప్రభుత్వం సుముఖత చూపలేదు. భారీగా పైరవీలు షురూ.. వైస్ చాన్స్లర్ పోస్టుల కోసం పెద్ద సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి. రాష్ట్రంలోని పది విశ్వవిద్యాలయాలకు కలిపి 312 మంది ప్రొఫెసర్లు దరఖాస్తు చేసుకున్నారు. కొందరు ఎక్కువ వర్సిటీలకు దరఖాస్తు చేయడంతో.. మొత్తంగా 1,282 దరఖాస్తులు అందినట్టు అధికార వర్గాలు తెలిపాయి. వీటిలో ఎక్కువ భాగం అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ కోసం వచ్చాయి. ఈ విశ్వవిద్యాలయానికి 208 మంది దరఖాస్తు చేశారు. ఆ తర్వాత ఎక్కువ మంది ఉస్మానియా యూనివర్సిటీ, జేఎన్టీయూహెచ్లకు పోటీపడ్డారు. ఇలా పోటీ తీవ్రంగా ఉండటంతో మంత్రులు, ప్రభుత్వంలోని కీలక వ్యక్తుల ద్వారా కొందరు ప్రొఫెసర్లు పైరవీలు చేస్తున్నారు. రాజధానిలో ఓ యూనివర్సిటీ వీసీగా ఇంతకాలం పనిచేసిన వ్యక్తి.. నల్లగొండ జిల్లాకు చెందిన ఓ మంత్రి ద్వారా ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిసింది. ఇదే యూనివర్సిటీ వీసీ పోస్టు కోసం మెదక్ జిల్లాకు చెందిన మంత్రి ద్వారా మరో ప్రొఫెసర్ ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. ఇదే యూనివర్సిటీలో పనిచేసి రిటైర్ అయిన ప్రొఫెసర్ కూడా ఓ కీలక మైనార్టీ నేత ద్వారా ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిసింది. ఉస్మానియా యూనివర్సిటీ వీసీ పోస్టు కోసం నలుగురు తీవ్రస్థాయిలో ప్రయత్నిస్తున్నారు. పోటీ తీవ్రంగా ఉండటం, అధికార పారీ్టలోని కీలక వ్యక్తులు తమ వారి కోసం పట్టుపడుతుండటంతో.. వీసీల ఎంపిక కత్తిమీద సాములా మారిందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. -
గాజాలో కూలుతున్న జ్ఞాన వ్యవస్థలు
ప్రపంచ బ్యాంకు ప్రకారం పాలస్తీనా అక్షరాస్యత రేటు 97.51 శాతం. పాలస్తీనియన్లు ‘ప్రపంచంలోనే అత్యుత్తమ విద్యావంతులైన శరణార్థులు’. అయితే గాజాలోని విశ్వవిద్యాలయాలు ఇప్పుడు ఇజ్రాయెల్ దాడిలో నాశనమయ్యాయి. ఇప్పటివరకూ సుమారు 90 మందికి పైగా ప్రొఫెసర్లు ఈ దాడుల్లో మరణించారు. గాజా పిల్లల విద్యావకాశాలను నిర్మూలిస్తూ... పాఠశాలలు, పుస్తకాల దుకాణాలు, లైబ్రరీలు ధ్వంసమయ్యాయి. పాలస్తీనా విజ్ఞానం, జ్ఞానాన్ని ఉత్పత్తి చేసే సంస్థల వినాశనం సమస్త జ్ఞానాన్ని అంతమొందించడం కంటే తక్కువేమీ కాదు! ప్రపంచవ్యాప్తంగా ఉన్న విద్యావేత్తలు దీనిని అర్థం చేసుకున్నారు. అమెరికా, ఇతర దేశాలలోని విశ్వవిద్యాలయాల్లోని విద్యార్థుల ఆందోళనలకు కారణం అదే.గాజాలోని విశ్వవిద్యాలయాలు, ఇతర విద్యా సంస్థలపై ఇజ్రాయెల్ దాడి పాలస్తీనా విజ్ఞాన, పర్యావరణ వ్యవస్థలను నాశనం చేయడానికి చేసిన ఉద్దేశపూర్వక ప్రయత్నంగా కనిపిస్తుంది. ఇప్పటివరకు, మొత్తం 12 విశ్వవిద్యాలయాలు వైమానిక దాడులకు గురయ్యాయి. ఇజ్రాయెల్ లక్ష్యాలలో అల్–అజహర్ విశ్వవిద్యాలయం, ఇస్లామిక్ యూనివర్సిటీ ఆఫ్ గాజా (ఐయూజీ) ఉన్నాయి. దీని ఫలితంగా పాలస్తీనా అధ్యాపకులు, పండితులు, విద్యార్థులు సంవత్సరాల తరబడి సాగించిన పరిశోధన ధ్వంసమైపోయింది.ఐయూజీ ప్రెసిడెంట్, వైస్ ఛాన్స్లర్ ప్రొఫెసర్ సుఫియాన్ తాయెహ్, ఆయన కుటుంబ సభ్యులు విశ్వవిద్యాలయ క్యాంపస్పై జరిగిన ఇజ్రాయెల్ దాడిలో మరణించారు. ఐయూజీ అనేది గాజాకు చెందిన ప్రముఖ విద్యాసంస్థ. ప్రొఫెసర్ తాయెహ్ అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన పరిశోధకుడు. అలాగే, కొనసాగుతున్న దాడిలో మరణించిన 90కి పైగా విశ్వవిద్యాలయ ప్రొఫెసర్లలో ఐయూజీలో ఆంగ్ల సాహిత్యం బోధించే డాక్టర్ రెఫాత్ అలరీర్ మరొకరు.పాలస్తీనా విద్యా మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం, 2024 జనవరి 20 వరకు దాదాపు 4,400 మంది విద్యార్థులు మరణించారు, 7,800 మంది గాయపడ్డారు. 231 మంది ఉపాధ్యాయులు, నిర్వాహకులు మరణించారు, 756 మంది గాయపడ్డారు. అలాగే 378 ప్రభుత్వ నిర్వహణలోని పాఠశాలలతోపాటు, గాజాలో యునైటెడ్ నేషన్స్ రిలీఫ్ అండ్ వర్క్స్ ఏజెన్సీ (యూఎన్ఆర్డబ్ల్యూఏ) నిర్వహణలోని పాఠశాలలు పూర్తిగా లేదా పాక్షికంగా ధ్వంసమయ్యాయి. 2023 అక్టోబర్లో యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి కనీసం 97 మంది జర్నలిస్టులు, మీడియా కార్యకర్తలతోపాటు 35,000కు పైగా ప్రజలు మరణించారు.‘‘దాదాపు 90,000 మంది పాలస్తీనియన్ విశ్వవిద్యాలయ విద్యార్థులు గాజాలోని విశ్వవిద్యాలయానికి హాజరు కాలేరు. 60 శాతానికి పైగా పాఠశాలలు, దాదాపు అన్ని విశ్వవిద్యాలయాలు, లెక్కలేనన్ని పుస్తకాల దుకాణాలు, లైబ్రరీలు దెబ్బతిన్నాయి లేదా ధ్వంసమయ్యాయి. గాజా పిల్లలు, యువకుల విద్యావకాశాలను నిర్మూలిస్తూ, యూనివర్సిటీల డీ¯Œ లు, ప్రముఖ పాలస్తీనా పండితులతో సహా... వందలాది మంది ఉపాధ్యాయులు, విద్యావేత్తలు చంపబడ్డారు’’ అని దక్షిణాఫ్రికా న్యాయపరమైన అంశాల ప్రతినిధి బ్లిన్నె నీ ఘ్రాలే అంతర్జాతీయ న్యాయస్థానంలో వెల్లడించారు.ప్రజల చిహ్నాలను, డాక్యుమెంట్ చరిత్రను తుడిచిపెడుతూ లైబ్రరీలు, ఆర్కైవ్లు, మ్యూజియంలతో సహా అనేక సాంస్కృతిక వారసత్వ ప్రదేశాలు కూడా ధ్వంసమయ్యాయి. పాలస్తీనా మేధావులు దీనిని ‘చరిత్ర నుండి పాలస్తీనా ఉనికిని తుడిచివేయడానికి’ చేసే ప్రయత్నంగా చూస్తున్నారు. కెనడియన్ అసోసియేషన్ ఆఫ్ యూనివర్సిటీ టీచర్స్కు రాసిన లేఖలో కెనడాలోని మౌంట్ రాయల్ యూనివర్సిటీకి చెందిన సోషియాలజీ ప్రొఫెసర్ ముహన్నద్ అయ్యాష్ దీనిని ‘రాజకీయ పటం నుండి పాలస్తీనాను తుడిచిపెట్టే ప్రయత్నం’గా పేర్కొన్నారు. ‘పాలస్తీనా విజ్ఞానం, విజ్ఞాన నిర్మాతలు మరియు జ్ఞానాన్ని ఉత్పత్తి చేసే సంస్థల వినాశనం సమస్త జ్ఞానాన్ని అంతమొందించడం(ఎపిస్టెమిసైడ్) కంటే తక్కువేమీ కాదు’ అని వ్యాఖ్యానించారు.‘ఎపిస్టెమిసైడ్’ అంటే జ్ఞాన వ్యవస్థను చంపడం, మూగబోయేలా చేయడం, నాశనం చేయడం లేదా విలువ తగ్గించడం అని అర్థం. సోషియాలజిస్ట్ బోవెంచురా డి సౌసా శాంటోస్ ఈ పదాన్ని రూపొందించారు. ‘వలస పాలన, అణచివేత, మారణహోమాల కారణంగా అధీన సంస్కృతిలో సంభవించే విజ్ఞాన మరణంగా’ దీనిని ఆయన అభివర్ణించారు. ఇది సైనికపరంగా, సైద్ధాంతికపరంగా రెండు విధాలుగానూ ఉండొచ్చు. ఇది విముక్తి పేరుతో స్వాధీనం, శాంతి పేరుతో దురాక్రమణ, జీవన పవిత్రత పేరుతో జీవన విధ్వంసం, హక్కుల పరిరక్షణ పేరుతో మానవ హక్కులను ఉల్లంఘించే రూపంలో జరగవచ్చు.1948లో ఇజ్రాయెల్కు స్థానం కల్పించడం కోసం తాము వైదొలగాల్సి వచ్చిన తర్వాత పాలస్తీనియన్ విద్యావంతులైన ఉన్నతవర్గాలు పాలస్తీనా విద్యావ్యవస్థను పునర్నిర్మించడానికి అత్యంత ప్రాధాన్యమిచ్చాయి. వారు విద్యను తమ జీవితాలను పునర్నిర్మించడానికి, పురోగతిని సాధించడానికి ఒక చోదకశక్తిగా భావించారు. అర్థవంతమైన సాంస్కృతిక మార్పిడి, శాస్త్రీయ పురోగతి, చరిత్రపై అవగాహన, సృజనాత్మక సాహిత్య రచనలతో గాజాను పాలస్తీనా సమాజాన్ని అభివృద్ధి చేసే ప్రదేశంగా మార్చాలనే ఆశతో అనేక మంది పండితులు వివిధ ప్రాంతాల నుండి అక్కడికి వెళ్లారు. ఇందులో వారు విజయం సాధించారా లేదా అనేది చర్చనీయాంశం. కానీ కచ్చితంగా, పాలస్తీనా నేడు అత్యధిక అక్షరాస్యత రేటు ఉన్న ప్రాంతాలలో ఒకటిగా పరిగణించబడుతోంది. ప్రపంచ బ్యాంకు అంచనాల ప్రకారం పాలస్తీనా అక్షరాస్యత రేటు 97.51 శాతం. పాలస్తీనియన్లను ‘ప్రపంచంలోనే అత్యుత్తమ విద్యావంతులైన శరణార్థులు’ అంటారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న విద్యావేత్తలు దీనిని అర్థం చేసుకున్నారు. అమెరికా, ఇతర దేశాలలోని విశ్వవిద్యాలయ ప్రొఫెసర్లు, విద్యార్థుల తిరుగుబాటు వెనుక ఉన్న కారణం అదే. పాలస్తీనా విద్యాసంస్థల్లో జరుగుతున్న ప్రతిధ్వనులు విదేశాల్లోని క్యాంపస్లలో వినిపిస్తున్నాయి. ఇజ్రాయెల్ దురాక్రమణకు అమెరికా ప్రభుత్వం అందిస్తున్న నిరంతర ద్రవ్య, సైనిక, దౌత్య, నైతిక మద్దతును నిరసిస్తూ అనేక విశ్వవిద్యాలయాలలో శిబిరాలు ఏర్పాటైనాయి. దాదాపు 10 విశ్వవిద్యాలయాలలోకి పోలీసులను పిలిపించారు, 645 మందిని అరెస్టు చేశారు. అరెస్టు చేసిన వారిలో చాలా మందిని తర్వాత విడుదల చేశారు. ఉన్నత స్థాయి కొలంబియా, బోస్టన్ విశ్వవిద్యాలయాలు నిరసనల కేంద్రాలుగా మారాయి. ఈ రెండు విశ్వవిద్యాలయాల క్యాంపస్ల నుండి 200 మందికి పైగా అరెస్టులు చేశారు. గాజాలో కాల్పుల విరమణ పిలుపులో గణనీయమైన సంఖ్యలో అధ్యాపకులు పాల్గొన్నారు లేదా మద్దతు ఇచ్చారు. కొన్ని యూనివర్సిటీలలో ఆందోళన చేస్తున్న విద్యార్థులపై పాలనాధికారులు విరుచుకుపడ్డారు, వారిలో కొందరిని బహిష్కరించారు.లాస్ఏంజిల్స్లోని క్యాలిఫోర్నియా విశ్వవిద్యాలయం,ఇతర ప్రదేశాలలో పాలస్తీనా అనుకూల, ఇజ్రాయెల్ అనుకూల ప్రదర్శనకారుల మధ్య గొడవలు జరిగినట్లు వార్తలు వచ్చాయి. పాలస్తీనా విద్యను విధ్వంసకరమైన విభజన దురదృష్టాల నుండి రక్షించడానికి ప్రపంచం తన స్వరాన్ని పెంచాలి. జ్ఞాన వ్యవస్థను నాశనం చేయడానికి వారాలు పడుతుంది. కానీ దానిని పునర్నిర్మించడానికి దశాబ్దాలు పడుతుంది.ఇజ్రాయెల్తో జట్టు కట్టిన దేశాలలోని కొన్ని విశ్వవిద్యాలయాలు దురదృష్టవశాత్తూ పాలస్తీనా సంస్థలతో విద్యా మార్పిడి ఒప్పందాలను కుదుర్చుకోవడానికి విముఖత చూపాయి. మరోవైపు, ఇజ్రాయెల్ విశ్వవిద్యాలయాల విద్యార్థులను అంతర్జాతీయ సహకారానికి చెందిన ప్రయోజనాలను ఆస్వాదించడానికి సాదరంగా స్వాగతించారు. ఇజ్రాయెల్ విశ్వవిద్యాలయాలు కెనడాకు చెందిన పోస్ట్–సెకండరీ సంస్థలతో ఇప్పటికే 60 విద్యా ఒప్పందాలను కలిగి ఉన్నాయి.ముఖ్యంగా అభివృద్ధి చెందిన ప్రపంచంలోని విద్యావేత్తలు, అధ్యాపక సంఘాలు, యూనియన్లు... అస్తవ్యస్తంగా ఉన్న పాలస్తీనా వ్యవస్థను పునర్నిర్మించడానికి వాగ్దానం చేయడంతో పాటు, యుద్ధాన్ని ముగించే వైపుగా ప్రజల అభిప్రాయాన్ని నిర్మించడానికి, ఆత్మపరిశీలన చేసుకోవడానికి ఇది తగిన సమయం.- వ్యాసకర్త నార్తర్న్ బ్రిటిష్ కొలంబియా విశ్వవిద్యాలయ విశ్రాంత ప్రొఫెసర్(‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో)- అమర్జీత్ భుల్లర్ -
‘అటానమస్’లోనూ ఏపీ అదుర్స్!
సాక్షి, అమరావతి: ఉన్నత విద్య కళాశాలలకు స్వయం ప్రతిపత్తి సాధనలో రాష్ట్రం దూసుకెళ్తోంది. దేశంలోని అత్యధిక సంఖ్యలో అటానమస్ కళాశాలలు కలిగిన మొదటి ఐదు రాష్ట్రాల జాబితాలో ఏపీ చోటు దక్కించుకుంది. తమిళనాడు, మహారాష్ట్ర తర్వాత 165 స్వయం ప్రతిపత్తి కలిగిన కళాశాలలతో ఏపీ మూడో స్థానంలో నిలుస్తోంది. ఏపీ తర్వాతే తెలంగాణ, కర్ణాటక ఉన్నాయి. మరీ ముఖ్యంగా పెద్ద రాష్ట్రాలైన ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ కంటే మెరుగైన విద్యా ప్రమాణాలు, ఫలితాలు, సమగ్ర మౌలిక వసతుల కల్పనల ద్వారా ఏపీ విశ్వవిద్యాలయాలకు అనుబంధంగా ఎక్కువ కళాశాలలు అటానమస్ హోదాను పొందుతున్నాయి. ఈ స్వయం ప్రతిపత్తి కళాశాలలు వర్సిటీలతో సంబంధం లేకుండా సొంత పాఠ్యాంశాలను అభివృద్ధి చేసుకోవడంతో పాటు.. ప్రశ్నపత్రాల నిర్వహణ, ఫలితాల విడుదల వంటి విద్యా సంబంధ, పరిపాలనాపరమైన నిర్ణయాలు తీసుకోవడంలో స్వేచ్ఛగా పనిచేస్తాయి. యూజీసీ కంటే ముందుచూపు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ) 2023లో కొత్త జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా అనుబంధ కళాశాలలకు స్వయం ప్రతిపత్తిని అనుమతించడానికి విశ్వవిద్యాలయాల కోసం ప్రత్యేక నిబంధనలు తెచ్చింది. కానీ, చాలా రాష్ట్రాలు వాటిని అనుమలు చేయడం లేదు. అంతకుముందే ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ముందుచూపుతో ప్రతి కళాశాలకు న్యాక్ గుర్తింపుతో పాటు.. మల్టీ డిసిప్లినరీ సంస్థలుగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక సంస్కరణలు తెచ్చారు. ఇందుకు అనుగుణంగా కాలేజీలకు అక్రిడిటేషన్ వచ్చేలా సహకారం అందించేందుకు రాష్ట్ర ఉన్నత విద్యామండలిలో క్వాలిటీ అస్యూరెన్స్ సెల్ను ఏర్పాటు చేయించారు. దీని ద్వారా అన్ని కాలేజీలు న్యాక్ అక్రిడిటేషన్, ఏ గ్రేడ్తో పాటు నేషనల్ ఇనిస్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ (ఎన్ఐఆర్ఎఫ్) ర్యాంకులు సాధించేలా కార్యాచరణ చేపట్టారు. క్వాలిటీ అస్యూరెన్స్ సెల్లో వర్సిటీలు, అటానమస్ కాలేజీలు, పరిశ్రమల ప్రముఖలతో పాటు ఉన్నత విద్యాశాఖ నుంచి సలహా కమిటీని ఏర్పాటు చేశారు. న్యాక్లో గుర్తింపు పొందిన కళాశాలలను స్వయం ప్రతిపత్తి దిశగా తీసుకెళుతున్నారు. వీసీలతో యూజీసీ చర్చలు.. 2035 నాటికి దేశంలోని అన్ని కాలేజీలు స్వయం ప్రతిపత్తితో డిగ్రీలను ప్రదానం చేసే సంస్థలుగా ఎదిగేలా చేయాలన్నది యూజీసీ లక్ష్యంగా పెట్టుకుంది. 2030 నాటికి ప్రతి జిల్లాలో కనీసం ఒక్కటైనా పెద్ద సంస్థ ఈ విధమైన స్వయం ప్రతిపత్తి కలిగిన స్థాయికి ఎదగాలని భావిస్తోంది. అయితే చాలా వర్సిటీలు అనుబంధ కళాశాలలను ఆ దిశగా ప్రోత్సహించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నాయి. ఈ క్రమంలోనే యూజీసీ స్వయం ప్రతిపత్తి అజెండాను ముందుకు తీసుకెళ్లడంపై విశ్వవిద్యాలయాల వీసీలతో చర్చలు జరపాలని యూజీసీ యోచిస్తోంది. 2023లో నిబంధనలు ప్రవేశపెట్టినప్పటి నుంచి స్వయం ప్రతిపత్తి హోదా కోసం యూజీసీకి 590 కళాశాలలు దరఖాస్తులు చేసుకున్నాయి. వీటిలో 460కి పైగా దరఖాస్తులను కమిషన్ పరిశీలించి ఆమోదించింది. ‘స్వయం ప్రతిపత్తి హోదా కళాశాలలకు ఇప్పటికే ఉన్న కోర్సులను పునర్నిర్మించడానికి, రీడిజైన్ చేయడానికి స్వేచ్ఛనిస్తుంది. వారు పరిశ్రమ అవసరాలకనుగుణంగా కొత్త కోర్సులను ప్రవేశపెట్టుకోవచ్చు. విశ్వవిద్యాలయాల మాదిరిగా బోధన–అభ్యాస ప్రక్రియలను, ఫలితాల ఆధారిత అభ్యాసాన్ని ఆవిష్కరించొచ్చు. విద్యాసంస్థలు విద్యార్థుల పనితీరును అంచనా వేయడానికి కొత్త పద్ధతులను రూపొందించొచ్చు. డిప్లొమా, సర్టిఫికేట్ కోర్సులను ఆఫర్ చేయొచ్చు’ అని యూజీసీ చైర్మన్, మామిడాల జగదీశ్కుమార్ ‘సాక్షి’తో చెప్పారు. -
ఉన్నత విద్యకు ‘స్కిల్’ జత
సాక్షి, హైదరాబాద్: ఉన్నత విద్యలో నైపుణ్యం దిశగా అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే స్వల్పకాలిక నైపుణ్యాభివృద్ధి కోర్సులను కాలేజీలు, యూనివర్సిటీలు అందుబాటులోకి తెచ్చేందుకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ అంగీకారం తెలిపింది. తాజా బడ్జెట్లో రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయాన్ని ప్రస్తావించింది. విధాన పరమైన నిర్ణయాన్ని ప్రకటించినప్పటీకీ పెద్దగా నిధులు కేటాయించక పోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. డిగ్రీ, ఇంజనీరింగ్ పూర్తి చేసిన విద్యార్థుల్లో నైపుణ్యం ఉండటం లేదన్నది భారత పారిశ్రామిక వేత్తల అభిప్రాయం. సీఐఐ, ఎఫ్ఐఐ, నాస్కామ్ వంటి సంస్థల అధ్యయనంలోనూ ఇదే వెల్లడైంది. ఈ నేపథ్యంలో పారిశ్రామిక భాగస్వామ్యంతో ఈ కోర్సులను ముందుకు తీసుకెళ్ళాలన్నది ప్రభుత్వ లక్ష్యంగా కన్పిస్తోంది. తక్షణ అవసరం ఇదే..: దేశంలో ఇంజనీరింగ్ పూర్తి చేసే విద్యార్థుల్లో కేవలం 8 శాతం మంది మాత్రమే నైపుణ్యం (స్కిల్)తో బయటకు వస్తున్నారు. మిగతా వాళ్ళలో కొంతమంది స్కిల్ కోసం ప్రత్యేక కోర్సులు నేర్చుకుంటున్నారు. అయితే వాళ్లలో కోర్సు నేర్చుకునే నాటికే కొత్త నైపుణ్యాలు మార్కెట్లోకి వస్తున్నాయి. దీంతో మళ్ళీ కొత్త టెక్నాలజీ నేర్చుకుంటే తప్ప మంచి వేతనంతో ఉద్యోగం లభించే అవకాశం కన్పించడం లేదు. దీన్ని దృష్టిలో ఉంచుకునే విశ్వవిద్యాలయాలకు యూజీసీ తక్షణ మార్పులను సూచించింది. నైపుణ్యాభివృద్ధి మండళ్లు స్వల్ప వ్యవధి కోర్సులను ప్రారంభించేందుకు అనుమతి అక్కర్లేదని కూడా తెలిపింది. కాకపోతే పారిశ్రామిక భాగస్వామ్యం తప్పనిసరి. అప్పుడే విద్యార్థి అనుభవ పూర్వకంగా నైపుణ్యం సంపాదించేందుకు అవకాశం ఉంటుంది. ఇంటర్ ఉత్తీర్ణత సాధించి డిగ్రీ, బీటెక్ కోర్సుల్లో చేరే విద్యార్థులకు 3–6 నెలల వ్యవధిలో 27 రకాల నైపుణ్య కోర్సులను యూజీసీ సూచిస్తోంది. వీటికి 12 నుంచి 30 క్రెడిట్స్ ఇవ్వాలని కూడా నిర్ణయించింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల సమీక్ష జరిపింది. ఏయే కోర్సులు అందుబాటులోకి తేవచ్చు అనే విషయాన్ని ప్రభుత్వానికి ఉన్నతాధికారులు వివరించారు. ఇవీ స్కిల్ కోర్సులు అండర్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసే కాలంలో మొత్తం 27 స్కిల్ కోర్సులను నేర్చుకోవడానికి అవకాశం కల్పించాలని ప్రభుత్వం భావిస్తోంది. మార్కెట్లో డిమాండ్ ఉన్న కోర్సులకే అత్యధిక ప్రాధాన్యతనిస్తోంది. ఇందులో ఏఐ అండ్ ఎంఎల్, రోబోటిక్స్, ఐవోటీ, ఇండ్రస్టియల్ ఐవోటీ, స్మార్ట్ సిటీస్, డేటా సైన్స్ అండ్ అనలిటిక్స్, క్లౌడ్ కంప్యూటింగ్, వీఆర్ టెక్నాలజీ, సైబర్ సెక్యూరిటీ, డిజిటల్ ఫోరెన్సిక్, 5 జీ కనెక్టివిటీ, ఇండ్రస్టియల్ ఆటోమేషన్, ఎల్రక్టానిక్స్ సిస్టమ్ డిజైన్, వీఎస్ఎస్ఐ డిజైన్స్, కంప్యూటర్ భాషలో ప్రాథమిక అవగాహన, మెకానికల్ టూలింగ్, మొబైల్ కమ్యూనికేషన్ లాంటి ప్రధానమైన కోర్సులున్నాయి. తెలంగాణలో కొన్ని సాఫ్ట్వేర్ కంపెనీల భాగస్వామ్యంతో ఐవోటీ, ఏఐఎంఎల్ సహా ఇతర కంప్యూటర్ కోర్సుల్లో స్వల్పకాలిక కోర్పులు నిర్వహించవచ్చని అధికారులు అంటున్నారు. సైబర్ సెక్యూరిటీ, డేటా అనాలసిస్ వంటి వాటికి విస్తృత అవకాశాలున్నాయని భావిస్తున్నారు. తొలి దశలో ప్రైవేటు యూనివర్సిటీలు మాత్రమే ఈ దిశగా ముందుకు వెళ్ళే వీలుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే కొన్ని డీమ్డ్ వర్సిటీలు ఈ దిశగా కొన్ని కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నాయి. స్కిల్తో ఉద్యోగం సులభం డిగ్రీతో పాటు నైపుణ్యం ఉంటే ఉద్యోగం లభించడమే కాదు.. అందులో రాణించడం కూడా సులభం. కంపెనీలు ఇలాంటి అర్హతలే కోరుకుంటున్నాయి. అండర్ గ్రాడ్యుయేషన్ పూర్తయ్యే నాటికి ఏదైనా ఒక రంగంలో నైపుణ్యం అవసరం. ఈ దిశగా ప్రభుత్వం, వర్సిటీలు అడుగులు వేయడం అభినందనీయం. – శ్రీరాం వెంకటేష్ (ఉన్నత విద్య మండలి కార్యదర్శి) -
‘మేనేజ్’ చేస్తున్నారా?
సాక్షి, హైదరాబాద్: మేనేజ్మెంట్ కోటాలో ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల్లో సీట్ల భర్తీపై ప్రభుత్వం దృష్టి సారించింది. దీనిపై ఇటీవల ముఖ్యమంత్రి కార్యాలయం ఉన్నతవిద్య అధికారులను అప్రమత్తం చేసింది. విద్యార్థి సంఘాలు, వివిధ వర్గాల నుంచి వస్తున్న ఫిర్యాదులను పరిగణలోనికి తీసుకున్నట్టు తెలిసింది. దీని ఆధారంగా సమగ్ర వివరాలు అందించాలని అధికారులను సీఎంఓ ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఉన్నత విద్యామండలి సహా అన్ని యూనివర్సిటీల వీసీలు వివరాల సేకరణలో నిమగ్నమయ్యారు. విశ్వవిద్యాలయాలపై వస్తున్న ఫిర్యాదులపై ఇటీవల ముఖ్యమంత్రి విద్యాశాఖ సమీక్షలో ప్రస్తావించారు. ఇదే క్రమంలో సీట్ల అమ్మకాలపైనా ఆరా తీశారు. ఆ తర్వాతే వర్సిటీల ప్రక్షా ళన దిశగా విద్యాశాఖ ముఖ్య కార్యదర్శితో ప్రత్యేకంగా మాట్లాడినట్టు తెలిసింది. వచ్చే విద్యా సంవత్సరంలో ఇంజనీరింగ్ సీట్ల కేటాయింపుపై కఠినంగా వ్యవహరించాలని ప్రభుత్వం భావిస్తోంది. పక్కాగా తనిఖీలుండాల్సిందే... ప్రైవేట్ కాలేజీలకు గుర్తింపు ఇచ్చే సమయంలో యూనివర్సిటీ స్థాయిలో ప్రత్యేకంగా కమిటీలు వేస్తారు. ఇవి ప్రతీ కాలేజీకి వెళతాయి. అక్కడ మౌలిక వసతులు, అధ్యాపకుల పరిస్థితిని సమీక్షిస్తాయి. ఈ వ్యవహారం మొత్తం నామమాత్రంగానే సాగుతోందనే ఫిర్యాదులున్నాయి. ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలతో వర్సిటీ అధికారులు బేరం కుదుర్చుకుంటున్నారనే విమర్శలూ వస్తున్నాయి. ఇలాంటి ఆరోపణలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులకు సీఎం సూచించినట్టు తెలిసింది. చాలా కాలేజీల్లో మౌలిక వసతులు లేకున్నా అడ్డగోలుగా అనుమతులు ఇచ్చారనే ఆరోపణలున్నాయి. ఇలాంటి కాలేజీల జాబితా సిద్ధం చేయాలని అధికారులను సీఎంఓ ఆదేశించినట్టు సమాచారం. ఈ ప్రక్రియలో వీసీలనే కాకుండా, ఇతర అధికారులను కూడా భాగస్వామ్యం చేసే ఆలోచననలో ప్రభుత్వం ఉన్నట్టు సమాచారం. ఫ్యాకల్టీపై ప్రత్యేక దృష్టి గత ఏడాది రాష్ట్రంలో 14 వేల వరకూ కంప్యూటర్ దాని అనుబంధ బ్రాంచ్లలో సీట్లు పెరిగాయి. సీఎస్సీ, డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ వంటి బ్రాంచ్లలో సీట్లను యాజమాన్యాలు రూ.12 నుంచి రూ.18 లక్షల వరకూ అమ్ముకున్నట్టు ఆరోపణలు వచ్చా యి. ఉన్నత విద్యామండలికి కూడా ఇలాంటి ఫిర్యాదులు 145 వరకూ వచ్చాయి. దీనిపై ఏం చర్యలు తీసుకున్నారనే విషయమై సీఎంఓ ఆరా తీసింది. సరైన ఆధారాలు లేవంటూ అధికారులు వీటిని పక్కన బెట్టడంపై ఇటీవల సీఎం సీరియస్ అయినట్టు సమాచారం. ఫిర్యాదుల ఆధారంగా కొంతమంది అధికారుల బృందంతో దర్యాప్తు జరిపించే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. వచ్చే ఏడాది కూడా కంప్యూటర్ సైన్స్ బోధించేందుకు యూజీసీ నిబంధనల ప్రకారం అర్హతలు ఉంటేనే అఫ్లియేషన్ ఇచ్చేలా చర్యలు చేపట్టాలని అధికా రులను ప్రభుత్వం ఆదేశించినట్టు సమాచారం. -
తెలంగాణ వర్సిటీలకు వీసీల నియామకం.. నోటిఫికేషన్ విడుదల
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలోని పది యూనివర్సిటీలకు వైస్ ఛాన్సలర్ల నియామకానికి దరఖాస్తులను ఆహ్వానిస్తూ తెలంగాణ విద్యా శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన వారు వచ్చే నెల 12 వరకు పూర్తి వివరాలతో దరఖాస్తు చేసుకోవాలని తెలంగాణ ఉన్నత విద్యా మండలి తెలిపింది. ఉస్మానియా యూనివర్సిటీ, పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ, జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ (వరంగల్), మహాత్మా గాంధీ యూనివర్సిటీ (నల్గొండ), శాతవాహన యూనివర్సిటీ (కరీంనగర్), తెలంగాణ యూనివర్సిటీ (నిజామాబాద్), పాలమూరు యూనివర్సిటీ (మహబూబ్నగర్), జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైనాన్స్ యూనివర్సిటీ (హైదరాబాద్)లకు వైస్ ఛాన్స్లర్ల నియామకానికి అర్హులైన వారి నుంచి దరఖాస్తులను విద్యాశాఖ ఆహ్వానించింది. -
వర్సిటీ అధ్యాపకుల వయోపరిమితి పెంచాలి
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న అధ్యాపకుల పదవీ విరమణ వయసును 65 ఏళ్లకు పెంచాలన్న డిమాండ్ అన్ని వర్గాల నుంచి వినిపిస్తోంది. ఈ అంశాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లేందుకు పలు విశ్వవిద్యాలయాల ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ఉన్నత విద్య వర్గాలు కూడా ఈ వాదనను బలపరుస్తున్నాయి. కేంద్ర విశ్వవిద్యాలయాల్లో పదవీ విరమణ వయసు 65 ఏళ్లు ఉండగా, మెడికల్ కాలేజీల్లోనూ బోధన సిబ్బంది రిటైర్మెంట్ వయసు కూడా 65 ఏళ్లకు ఉంది. చివరకు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఉద్యోగుల పదవీ విరమణ వయసును 61 ఏళ్లకు పెంచింది. కానీ యూనివర్సిటీల్లో పనిచేస్తున్న అధ్యాపకుల రిటైర్మెంట్ వయసు మాత్రం 60 ఏళ్లుగానే ఉంది. రాష్ట్రంలో త్వరలో కొంతమంది అధ్యాపకులు రిటైర్ అయ్యే వీలుందని చెపుతున్నారు. ఇప్పటికే విశ్వవిద్యాలయాల్లో ప్రొఫె సర్లు, అసోసియేట్ ప్రొఫెసర్ల కొరత తీవ్ర స్థాయిలో ఉంది. ఈ నేపథ్యంలో త్వరలో జరిగే రిటైర్మెంట్ల కారణంగా మరికొన్ని ఖాళీలు ఏర్పడే అవకాశం ఉంది. మరో పక్క రాష్ట్రంలోని కొన్ని వర్సిటీల వైఎస్ చాన్స్లర్ల పదవీ కాలం మరో ఐదు నెలలు మాత్రమే ఉంది. దీంతో కొత్త వీసీల నియామకం చేపడితే తప్ప యూనివర్సిటీల్లో ఖాళీల భర్తీపై దృష్టి పెట్టే వీల్లేదు. ఈ సమయంలో బోధన సిబ్బంది కొరత విద్యార్థులపై తీవ్ర ప్రభావం చూపే వీలుందని అధ్యాపక వర్గాలు అంటున్నాయి. 2024లోనే ఉస్మానియా యూనివర్సిటీ న్యాక్ అసెస్మెంట్కు వెళ్లాల్సిన అవసరం ఉంది. న్యాక్లో మంచి గ్రేడ్ వస్తే తప్ప రీసెర్చ్ ప్రాజెక్టులు ఈ యూనివర్సిటీకి వచ్చే అవకాశం లేదు. ఇతర వర్సిటీల్లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో అధ్యాపకుల పదవీ విరమణ వయసును పెంచే అంశాన్ని పరిశీలించాలని ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతోంది. -
ఏపీ వర్సిటీల్లో అంతర్జాతీయ కోర్సులు
సాక్షి, అమరావతి: ఉన్నత విద్యలో అంతర్జాతీయ యూనివర్సిటీల కోర్సులను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. విద్యార్థులకు కెరీర్ గైడెన్స్పై సమగ్ర అవగాహన కల్పించేలా ఉన్నత విద్యామండలి రూపొందించిన ‘కెరీర్ టూల్ కిట్’ ఆన్లైన్ టీచింగ్ ప్రోగ్రామ్ను ఆయన మంగళవారం విజయవాడలో ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి బొత్స మాట్లాడుతూ రాష్ట్రంలోని యూనివర్సిటీలు ప్రపంచ వ్యాప్తంగా టాప్ 50 (సబ్జెక్టుల వారీగా) విశ్వవిద్యాలయాలతో కలిసి పనిచేసేలా కార్యాచరణ సిద్ధం చేశామన్నారు. తద్వారా విదేశాలకు వెళ్లి చదువుకోలేని ఎందరో విద్యార్థులు ఎంఐటీ, హార్వర్డ్ వంటి ప్రఖ్యాత వర్సిటీలు అందించే సుమారు 2 వేల కోర్సులను ఆన్లైన్లో చదువుకునే వెసులుబాటు కల్పింస్తున్నట్టు పేర్కొన్నారు. దేశంలోనే విద్యార్థులపై ఆర్థిక భారం పడకుండా చదువులు అందిస్తున్న ఏకైక రాష్ట్రంగా ఏపీ నిలుస్తోందన్నారు. నూతన జాతీయ విద్యావిధానం కంటే ముందుగానే ఏపీ విద్యావ్యవస్థలో అనేక సంస్కరణలు తీసుకొచ్చామన్నారు. ఇందులో భాగంగా ఉన్నత విద్యలో 10 నెలల ఇంటర్న్షిప్ను తప్పనిసరి చేశామన్నారు. తాజాగా తొలిసారిగా స్టైఫండ్తో కూడిన ఇంటర్న్షిప్ను ఇచ్చేలా అనేక కంపెనీలతో ఒప్పందాలు చేసుకున్నట్టు చెప్పారు. ఇప్పటికే మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజ సంస్థలతో కలిసి విద్యార్థుల్లో నైపుణ్యాభివృద్ధికి శ్రీకారం చుట్టామన్నారు. ఉన్నత విద్యామండలి 10 లక్షల మందికిపైగా విద్యార్థులకు మేలు చేస్తూ ప్రతి సెమిస్టర్లో విభిన్న అంశాల్లో మార్గనిర్దేశం చేసేలా ‘కెరీర్ టూల్ కిట్’ను తీసుకురావడం అభినందనీయమన్నారు. ఉన్నత విద్య ముఖ్య కార్యదర్శి జె.శ్యామలరావు మాట్లాడుతూ విద్యార్థుల్లో ఫ్యూచర్ స్కిల్స్, నాలెడ్జ్ ఇంప్రూవ్మెంట్, ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలుగా ప్రోత్సహించేందుకు ప్రభుత్వం విప్లవాత్మక సంస్కరణలు ప్రవేశపెట్టిందన్నారు. వాటి ఫలితాలే ఇండియా స్కిల్ రిపోర్టులో ఏపీని అగ్రగామిగా నిలబెట్టాయన్నారు. సెమిస్టర్ల వారీగా కెరీర్ గైడెన్స్ ఉన్నత విద్యామండలి చైర్మన్ కె.హేమచంద్రారెడ్డి మాట్లాడుతూ విద్యార్థులకు సెమిస్టర్ల వారీగా కార్యాచరణ ప్రణాళిక అందించడం, ఎంచుకున్న రంగాల్లో నైపుణ్యం, సాఫ్ట్ స్కిల్స్ పెంపుపై ‘కెరీర్ టూల్కిట్’ మెంటార్గా నిలుస్తుందన్నారు. విద్యా ప్రయాణంలో ప్రతి దశలో విద్యార్థులకు వ్యక్తిగత మార్గదర్శకంగా పని చేసేలా 19 రకాల కెరీర్ టూల్ కిట్లను రూపొందించామని తెలిపారు. దేశంలో ఏ యూనివర్సిటీ, విద్యామండలి చేయని విధంగా విద్యార్థి కోర్సులో చేరినప్పటి నుంచి పూర్తి చేసి బయటకు వెళ్లేంత వరకు జాబ్, రీసెర్చ్ ఓరియంటేషన్, పర్సనాలిటీ డెవలప్మెంట్, ఆర్థిక క్రమశిక్షణ, సామాజిక దృక్పథాన్ని పెంపొందించేలా ‘కెరీర్ టూల్ కిట్’ను తీసుకొచ్చామన్నారు. ఉన్నత విద్యామండలి వైస్ చైర్పర్సన్లు రామ్మోహనరావు, ఉమా మహేశ్వరిదేవి, సెక్రటరీ నజీర్ అహ్మద్, సెట్స్ స్పెషల్ ఆఫీసర్ సు«దీర్రెడ్డి పాల్గొన్నారు. -
వర్సిటీల్లో ఏం జరుగుతోంది?
సాక్షి, హైదరాబాద్: యూనివర్సిటీల పాలనాపరమైన వ్యవహారాల్లో సమూలమార్పుల దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇప్పటికే ముఖ్యమంత్రి కార్యాలయం అన్ని యూనివర్సిటీల సమగ్ర నివేదికలు తెప్పించుకుంది. ఉన్నతవిద్యలో కీలక పదవులు నిర్వహించినవారు, అధికార పార్టీకి అనుకూలంగా ఉండే కొన్ని అధ్యాపక సంఘాలతో వర్సిటీల్లో చోటుచేసుకున్న ఘటనలపై సీఎంకు నివేదికలు అందాయి. ఇటీవలి విద్యాశాఖ సమీక్షలో సీఎం వీటిని ప్రస్తావించినట్టు తెలిసింది. వర్సిటీల వీసీలు, ఉన్నతవిద్య ఉన్నతాధికారుల మధ్య వైరం, వర్సిటీల్లో కీలకవ్యక్తుల మధ్య వివాదాలు వంటి అంశాలపై సీఎంకు స్పష్టత ఉందని ఓ సీనియర్ అధికారి తెలిపారు. త్వరలో కీలక మార్పులకు అవకాశం ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఆరోపణలపై ఆరా విశ్వవిద్యాలయాల్లో వైస్ చాన్సలర్ల నియామకంలో రాజకీయ ప్రాధాన్యం అనేక దుష్ఫలితాలకు దారి తీస్తోందని పలువురు ప్రొఫెసర్లు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. వీసీని నియమించేటప్పుడు సెర్చ్ కమిటీ అన్ని విషయాలపై నివేదిక ఇస్తుంది. కానీ ఈ కమిటీకి ఏ మాత్రం ప్రాధాన్యం ఇవ్వడం లేదని వారు చెబుతున్నారు. ఓ వర్సిటీ వీసీ నియామకాన్ని సెర్చ్ కమిటీ తీవ్రంగా తప్పుబట్టినా పెద్దగా పట్టించుకోలేదు. ఆయన ప్రొఫెసర్గా ఉన్నప్పుడు పీహెచ్డీ చేసే విద్యార్థుల నుంచి డబ్బులు తీసుకున్నట్టు ఆరోపణలు వచ్చిన విషయాన్ని కమిటీ ప్రస్తావించింది. ఇలాంటి వ్యక్తిని వీసీగా పెట్టడం వల్ల పాలనపరమైన పోస్టుల భర్తీలోనూ అవినీతి జరిగినట్టు ఆరోపణలు ఉన్నాయని సీఎంకు తెలిపారు. మితిమీరిన ఐఏఎస్ల ప్రభావం విద్యాశాఖ కమిషనర్ల పాత్ర కూడా వర్సిటీల్లో కొత్త సమస్యలకు దారి తీస్తోందని నిపుణులు అంటున్నారు. ఇటీవల ఓ ఐఏఎస్ అధికారి నిర్ణయాలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. ఆయనకు నచ్చిన విషయాలను వర్సిటీ పాలక మండలిలో ఆమోదం పొందేందుకు ఒత్తిడి తెచ్చినట్టు విమర్శలున్నాయి. దీంతో ఆయనకు, వీసీకి మధ్య జరిగిన ప్రచ్ఛన్నపోరు వర్సిటీ పరువు ప్రతిష్టలకు భంగం కలిగించిందని పలువురు సీఎం దృష్టికి తెచ్చారు. అధికారులపై తన మాట నెగ్గించుకునేందుకు చేసిన ఒత్తిడి వల్ల అనేక కొత్త సమస్యలు ఎదురైనట్టు తెలిపారు. మరో యూనివర్సిటీలో ఉద్యోగ విరమణ చేసిన వ్యక్తిని రిజిస్టర్గా కొనసాగించిన తీరు కూడా అనేక విమర్శలకు కారణమైంది. దీని వెనుక వీసీ ప్రమేయం కూడా ఉందని చెబుతున్నారు. ఈ తరహా పరిణామం గతంలో ఎన్నడూ లేదని నిపుణులు అంటున్నారు. హైదరాబాద్లో అయితే ఇష్టారాజ్యం హైదరాబాద్లోని కొన్ని యూనివర్సిటీల్లో వీసీల ఇష్టారాజ్యం నడుస్తోందని ఓ ప్రొఫెసర్ సీఎం దృష్టికి తీసుకెళ్లారు. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఓ వర్సిటీ వీసీ ఇష్టానుసారం ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల నియామకం చేపట్టారు. ఇందులో పెద్దఎత్తున ముడుపులు చేతులు మారినట్టు విమర్శలున్నాయి. అనుబంధ గుర్తింపు ఇచ్చే క్రమంలోనూ ఆయన ప్రైవేటు కాలేజీల నుంచి వసూళ్లు చేపట్టినట్టు ఆరోపణలున్నాయి. రాజకీయాలకే ప్రాధాన్యతనిస్తున్నారని, విద్యార్థులపై కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నారన్నారని తరచూ ఫిర్యాదులు వస్తున్న వీసీలపైనా ప్రభుత్వం దృష్టి సారించింది. నిబంధనల పేరుతో ఒక వీసీ వ్యవహరించిన తీరుపై ఇప్పటికే సీఎం ఆరా తీసినట్టు తెలిసింది. బాసరపై ప్రత్యేక దృష్టి బాసర ట్రిపుల్ ఐటీపై వస్తున్న ఆరోపణలపై సీఎం సమగ్ర నివేదిక తెప్పించుకున్నట్టు అధికారులు చెబుతున్నారు. కొన్నేళ్లుగా అక్కడ అనేక రకాల ఫిర్యాదులు వస్తున్నాయి. విద్యార్థుల ఆత్మహత్యలు, ఆందోళనలు చోటుచేసుకుంటున్నాయి. విద్యార్థులను బెదిరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. కాంట్రాక్టుల వ్యవహారంలో అవినీతి, వీసీ, డైరెక్టర్ బాసర ట్రిపుల్ ఐటీకి ఎప్పుడో ఓసారి వెళుతున్న తీరుపై ఫిర్యాదులు వచ్చాయి. దీంతో ప్రక్షాళన అనివార్యమని సీఎం భావిస్తున్నట్టు సమాచారం. -
MPhil కోర్సులపై UGC కీలక హెచ్చరిక
ఢిల్లీ: మాస్టర్ ఆఫ్ ఫిలాసఫీ(MPhil) కోర్సులపై యూనివర్సిటీ గ్రాండ్స్ కమీషన్(యూజీసీ) కీలక హెచ్చరిక జారీ చేసీంది. ఎంఫీల్(MPhil)కు ఎలాంటి గుర్తింపు లేదని యూజీసీ కార్యదర్శి మనీష్ ఆర్. జోషి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. పలు యూనివర్సిటీలు ఇచ్చే ఎంఫీల్ (MPhil) ప్రోగ్రామ్కు ఎటువంటి గుర్తింపు లేదని (UGC)యూజీసీ వెల్లడించింది. ఎంఫీల్(MPhil)ను రద్దు చేసినప్పటికీ కొన్ని యూనివర్సిటీలు అందిస్తున్నందున విద్యార్థులు ఎవరూ చేరవద్దని పేర్కొంది. యూజీసీ మార్గదర్శకాలను అనుసరించి 2023-2024 విద్యా సంవత్సరంలో ఎంఫీల్(MPhil) అడ్మిషన్లు నిలిపిలి వేయాలని ఆదేశించినట్లు తెలిపారు. 2022 నాటి యూజీసీ నిబంధనలను గుర్తు చేస్తూ.. ఎంఫీల్(MPhil)కు గుర్తింపు లేదని యూజీసీ బుధవారం అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. చదవండి: ‘పార్లమెంట్ చీకటి గదిలా మారింది’.. కేంద్రంపై టీఎంసీ ఎంపీ విమర్శలు -
మేధావులకు నిలయాలు కావాలంటే...
విశ్వవిద్యాలయం అంటే ఒక అధ్యయన బోధన కేంద్రమని మరిచిపోతున్నామా? జ్ఞాన సముపార్జనకు అదొక నెలవని విస్మరిస్తున్నామా? కొన్నికేంద్రీయ విశ్వవిద్యాలయాలను చూస్తుంటే పరిస్థితి అలాగే కనబడుతోంది. అధ్యాపక వర్గంలో సామర్థ్యం ఉన్నవారు కొరవడుతున్నారు. విద్యార్థులు మత్తుమందులకు బానిసలవుతున్నారు. అసాంఘిక చర్యలకు నిర్భయంగా దిగుతున్నారు. మతోన్మాదం, కులోన్మాదాలు పెరుగుతున్నాయి.విశ్వవిద్యాలయాలు అంబేడ్కర్, సర్వేపల్లి రాధాకృష్ణన్, ఇమాన్యుయేల్ కాంట్, హెగెల్, జీన్పాల్ సాత్రే, చిన్నయ సూరి వంటి ప్రపంచ మేధావుల్నిసృష్టించాలంటే... జ్ఞానం, నీతి, వ్యక్తిత్వం, మానవత, ప్రజ్ఞ విస్తరించాలి. అప్పుడే ప్రపంచ యవనికపై భారతీయ విశ్వవిద్యాలయాలు మెరుస్తాయి. ప్రపంచ వ్యాప్తంగా విద్య... సామాజిక,సాంస్కృతిక, సాంకేతిక రంగాల్లో విప్లవంగా ముందుకొస్తూ ఉంది. నూతన సామాజిక నిర్మాణానికీ, ప్రపంచ అవగాహనకూ విద్యే ముఖ్యసాధనం. అటువంటి విద్యనందించే కేంద్రాలుగా విశ్వవిద్యాలయాలకు ఒక గుర్తింపు ఉంది. ఇవి దేశంలో కేంద్రీయ, రాష్ట్ర, డీమ్డ్, ప్రైవేట్ విశ్వవిద్యాలయాలుగా సేవలు అంది స్తున్నాయి. ఉన్నత విద్యను ఒక జీవనశాస్త్రంగా అధ్యయనం చేసిన వారిలో డా‘‘ బీఆర్ అంబేడ్కర్, జవహర్లాల్ నెహ్రూ, సర్వేపల్లి రాధాకృష్ణన్, మౌలానా అబుల్కలామ్ ఆజాద్, రామ్ మనోహర్ లోహియా, సర్ సి.వి.రామన్ వంటి మేధావులు ఎందరో ఉన్నారు. కానీ దేశంలో ఈనాడున్న 56 సెంట్రల్ యూనివర్సిటీలలో ఉన్న విద్యార్థులు, పరిశోధకులు వీరిలాగా నూత్న జ్ఞానాన్ని సృష్టించలేక పోతున్నారు. విశ్వ విద్యాలయ గ్రంథాలయాలు అధ్యయనపరుల కోసం ఆకలితో ఎదురుచూడాల్సి వస్తోంది. అధ్యాపక వర్గంలో అత్యున్నత బోధనా సామర్థ్యం వున్న వారి సంఖ్య తగ్గిపోతోంది. దొంగ డాక్టరేట్లు ఇచ్చి డబ్బు గుంజుకున్న చర్య లతో అనేక విశ్వవిద్యాలయాలు పీకల్లోతు ఆరోపణలలో కూరుకొని ఉన్నాయి. కొన్ని విశ్వవిద్యాలయాలలో విద్యార్థులు మత్తుమందులకు బానిసలవుతున్నారు. అసాంఘిక చర్యలకు నిర్భయంగా దిగు తున్నారు. ఇక ర్యాగింగ్ పేరుతో కొందరు సీనియర్స్... విద్యార్థినీ విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకొనేంతగా వేధింపులకు గురి చేయ డమూ కనిపిస్తోంది. శరీరాలను నగ్నంగా చూడాలనే... మనుషులను వేధించి, బాధించి ప్రేమను పొందాలనే మానవుడిలో అంతర్ నిహి తంగా వున్న క్రూర స్వభావాన్ని జనారణ్యంలో ప్రదర్శించడం అనేది, ఈనాడు కొందరు విద్యార్థులకు ఒక దినచర్యగా మారింది. మెడికల్ కాలేజీలలో అమ్మాయిల మీద లైంగికంగా దాడులు జరుగుతున్నాయి. ఉస్మానియా యూనివర్సిటీలో ఒక ప్రొఫెసర్ లైంగికంగా వేధించడం భారతదేశాన్ని కుదిపివేసింది. ఒక డాక్టరు మనిషికి ఉన్న రుగ్మతను చూడాలి. కానీ ఆమెను అనుభవించాలని అనుకోకూడదు. ఈనాటి ప్రొఫెసర్లు ఎందుకో బోధనేతర అంశాల పట్ల ఆసక్తి చూపు తున్నారు. జూదం, త్రాగుడు, క్లబ్బులు, పబ్బులు, డ్రగ్స్, ఇతర వినోదాంశాల వైపు ఉపాధ్యాయుడు వెళితే విద్యార్థుల పరిస్థితి ఏమిటి? విద్యార్థులు జ్ఞానేతర, వినోదభరిత జీవన సంస్కృతిలో కొట్టు మిట్టాడుతున్నారు. ‘నన్ను ప్రేమించకపోతే నీ మీద యాసిడ్ పోస్తా’ నని బెదిరిస్తున్నారు. కృతిమత్వం, క్రూరత్వం కొందరు విద్యా ర్థులను అలుముకుంది. నిజానికి గ్రంథాలయ పఠనం బాగా తగ్గింది. అందువల్ల లక్షలు పెట్టి కొన్న పుస్తకాలు వ్యర్థమవుతున్నాయి. ఈరోజు విద్యార్థినులు అన్ని రంగాలలో విద్యార్థులను దాటి ముందుకెళ్లి పోయారు. అది ఈర్ష్య యగా పరిణమించింది. ఈర్ష్య య మనిషిని విచ్ఛిన్నం చేస్తుంది. ఈర్ష్య య మనిషిని తినేస్తుంది. ఈరోజు విద్యార్థులు ప్రేమ అని చేస్తున్న ప్రపోజల్స్లో ప్రేమ లేదు, కామమే వుంది. కామం మనిషి కళ్లు కప్పుతుంది, అంధుణ్ణి చేస్తుంది, బధిరుణ్ణి చేస్తుంది. ఇలాంటి రుగ్మతల వల్లనే ఈ విద్యాలయాల నుంచి మంచి పరిశోధనా గ్రంథాలు రావట్లేదు. శాస్త్రజ్ఞానం అనేది మనుష్యుల బుర్రల కెక్కాలంటే, విశ్వాసాలకు అతీతంగా ఆలోచించగలగాలి. తత్వవేత్తకు, శాస్త్రవేత్తకు సమన్వయం సాధించడంలో అద్వితీయమైన పాత్రను బెర్ట్రాండ్ రస్సెల్ సాధించాడు. డార్విన్లో కానీ, కారల్ మార్క్స్లో కానీ, మరి ఏ తాత్వి కునిలోనూ, శాస్త్రవేత్తలోనూ ఉన్న లోపాన్నీ, ఆధిక్యభావాన్నీ ఎత్తి చూపడంలో కూడా రస్సెల్ వెనుకాడలేదు. ప్రతి తత్వవేత్త, శాస్త్రవేత్త జ్ఞానానికి పరిమితులు ఉంటాయి. రాబోయే కాలం వారు గతంలో చెప్పినవాటిలో కొన్నింటిని ఖండించవచ్చు. కొన్నింటిని పూరించ వచ్చు. ఆ శాస్త్రజ్ఞానం వలన సమాజానికి జరిగే నష్టాన్ని గూర్చి చెప్ప వచ్చు. ఇదొక సత్యాన్వేషణా క్రమం. ప్రతి పౌరుడు, విద్యార్థి, పరిశోధకుడు... శాస్త్రవేత్తల జీవితాలను అధ్యయనం చేయడం వలన స్ఫూర్తి పొందవచ్చు. అంతేకాదు, వారి అధ్యయన క్రమాన్నీ, పరిశోధనా క్రమాన్నీ మనం అనుసరించవచ్చు. చార్లెస్ డార్విన్ గొప్ప పరిశోధకుడే కాదు, గొప్ప అధ్యయనపరుడు కూడా! ఆయనది శాస్త్రపరమైన రచన. ఆయన జీవితంలోని ఆటు పోటులను ధైర్యంగా ఎదుర్కొన్నాడు. అపారమైన ధైర్యశాలి ఆయన. అనేక జంతు సమూహాలనూ, పక్షి సమూహాలనూ, సముద్రాలనూ, వివిధ ఖండాలనూ చూసినపుడు సహజంగా ఆ ధైర్యం వస్తుంది. జీవులు జనిస్తాయి, నశిస్తాయనే శాస్త్ర జ్ఞానం అబ్బుతుంది. ఆ అవ గాహనే అపారమైన శక్తినీ, వ్యక్తిత్వ నిర్మాణాన్నీ మనిషికి కలుగజేస్తుంది. జీవించడమే కాదు, ఈ జీవుల ప్రాదుర్భావాన్ని గూర్చి తెలుసుకోవడం కూడా ఒక గొప్ప జ్ఞానమే. ఈ పునాదిగా శాస్త్రం ఎంతో అభివృద్ధి చెందింది. 20వ శతాబ్దిలో ఎరిక్ కండెల్ చేసిన పరిశోధనలు కొత్త వెలుగులు చూశాయి. కండెల్ బయో కెమిస్త్రీ, బయో ఫిజిక్స్లను అధ్యయనం చేసి ‘ఇన్ సెర్చ్ ఆఫ్ మెమొరీ: ది ఎమర్జెన్స్ ఆఫ్ ఏ న్యూ సైన్స్ ఆఫ్ మైండ్’ అనే గ్రంథం రాశాడు. ఇందులో ఆద్భుత విషయాలు తెలియ చేశాడు. న్యూరో సైన్సుపై అభిరుచితో మనిషి జ్ఞాపక శక్తి గురించి ఎంతో పరిశోధన చేశాడు. జంతువులకు, మనుషులకు జ్ఞాపకశక్తిలో ఎంతో తేడా ఉందని కనిపెట్టాడు. ఇపుడు సైన్సు శాఖోపశాఖలుగా విస్తరించడానికి ఆనాడు డార్విన్ చేసిన పరిశోధనలే ప్రధాన కారణం. నిజానికి డార్విన్ లాగా, ఐన్స్టీన్లాగా మన విశ్వవిద్యాలయాలలో పరి శోధన చేస్తే భారతదేశం ప్రపంచానికి ఒక ఆదర్శమయ్యేది. కానీ దురదృష్టవశాత్తూ జ్ఞానార్జనకు నెలవు కావాల్సిన చోట మతోన్మాదం, కులోన్మాదాలు పెరిగాయి. రాజకీయ రంగులు పులుముకుంటున్నాయి. కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో మతోన్మాద అరాచకత్వం పెరిగిపోతోంది. చరిత్ర జ్ఞానాన్ని నిరాకరిస్తూ, పౌరాణిక జ్ఞానానికి పతాక లెత్తుతున్నారు. దుష్ట శిక్షణ పేరుతో దళితుల్ని, మైనారిటీలను వేటాడు తున్నారు. కులతత్వంతో ఊగిపోతూ కులాంతర వివాహితులను వేధి స్తున్నారు. అంబేడ్కర్ నిర్మించిన రాజ్యాంగానికి తూట్లు పొడుస్తూ జ్ఞాన శూన్యులుగా జీవిస్తున్నారు. మైనారిటీలైన ఆచార్యులను కించ పరుస్తున్నారు. చరిత్రలో ప్రసిద్ధులైన అశోకుడు, అంబేడ్కర్ అంతటి వాళ్లను తక్కువచేస్తూ, బౌద్ధ సంస్కృతిని నిరాకరిస్తున్నారు. ఓ పక్క కార్పొరేట్ శక్తులకు బానిసలుగా ఉండి అమెరికన్ సామ్రాజ్య వాదానికి తొత్తులై, ఇజ్రాయెల్ దాడులను సమర్థిస్తూ, మహిళా విద్యార్థినులను హింసిస్తూ, విశ్వవిద్యాలయాలను భయకంపిత కేంద్రాలుగా చేస్తున్నారు. విశ్వవిద్యాలయం అంటే ఒక విజ్ఞాన అధ్యయన, బోధన కేంద్ర మని మరిచిపోయారు. మతోన్మాద క్రీడలకు నెలవు చేస్తున్నారు.శాంతి, కాంతులను విధ్వంసిస్తూ ఉన్మాదాన్ని, ఉద్రేకాన్ని కలిగి స్తున్నారు. అందుకే అంబేడ్కర్ భావజాలంతో పాటు, అంబేడ్కర్ గ్రంథాలయాలు, అంబేడ్కర్ పరిశోధనా కేంద్రాలు అన్నీ విశ్వవిద్యాల యాల్లో ఏర్పాటు చేయాల్సి ఉంది. మన విశ్వ విద్యాలయాలు అంబేడ్కర్, సర్వేపల్లి రాధాకృష్ణన్, ఇమాన్యుయేల్ కాంట్, హెగెల్, జీన్పాల్ సాత్రే, చిన్నయ సూరి వంటి ప్రపంచ మేధావుల్ని సృష్టించాలంటే... జ్ఞానం, నీతి, వ్యక్తిత్వం, మాన వత, ప్రజ్ఞ విస్తరించాలి. అప్పుడే ప్రపంచ యవనికపై మన విశ్వ విద్యాలయాలు మెరుస్తాయి. ఆ ప్రగతి పథంలో మనం నడుద్దాం. అప్పుడే భారతదేశానికి కీర్తి వస్తుంది. డా‘‘ కత్తి పద్మారావు వ్యాసకర్త దళితోద్యమ నాయకుడు ‘ 98497 41695 -
కంప్యూటర్ కోర్సుల బోధనకు.. అధ్యాపకులంతా అర్హులే
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ కంప్యూటర్ కోర్సులను ఏ బ్రాంచీ అధ్యాపకులైనా బోధించే వెసులుబాటు ఇవ్వాలని అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) దేశంలోని అన్ని యూనివర్సిటీలనూ ఆదేశించింది. కొత్తగా వచ్చిన కోర్సుల బోధన కోసం ఇప్పటికే వాటిని పూర్తిచేసిన వారే ఉండాలన్న నిబంధన సరికాదని పేర్కొంది. దీనివల్ల ఎక్కడా ఫ్యాకల్టీ లభించని పరిస్థితి తలెత్తుతుందని, కంప్యూటర్ కోర్సుల బోధనకు సమస్య తలెత్తుతుందని స్పష్టం చేసింది. సంప్రదాయ కోర్సుల స్థానంలో కంప్యూటర్ ఆధారిత బ్రాంచీలకు డిమాండ్ పెరుగుతోందని.. వాటిలో ఫ్యాకల్టీకి సంబంధించి కొన్నేళ్లు ఇలాంటి పరిస్థితే ఉండే అవకాశం ఉందని పేర్కొంది. ఈ క్రమంలో సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ను కూడా బోధనకు వినియోగించుకోవాలని సూచించింది. వర్సిటీలు వేధిస్తున్నాయన్న ఫిర్యాదులతో.. కొన్నేళ్లుగా సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ వంటి ఇంజనీరింగ్ కోర్సులకు డిమాండ్ తగ్గుతూ.. కంప్యూటర్ ఆధారిత టెక్ కోర్సుల్లో చేరేవారు పెరుగుతున్నారు. మన రాష్ట్రంలో ఈసారి 58శాతం విద్యార్థులు కంప్యూటర్ కోర్సుల్లోనే చేరారు. ఆర్టిఫిíÙయల్ ఇంటెలిజెన్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, బ్లాక్చైన్ టెక్నాలజీ, రోబోటిక్స్, క్వాంటం కంప్యూటింగ్, డేటాసైన్స్, సైబర్ సెక్యూరిటీ వంటి కోర్సులకు డిమాండ్ బాగా పెరిగింది. అయితే కాలేజీలకు అనుబంధ గుర్తింపు ఇచ్చే యూనివర్సిటీలు ఈ కోర్సుల బోధనపై పలు షరతులు పెట్టాయి. సదరు సబ్జెక్టుల్లో పీజీ చేసిన వారినే ఫ్యాకల్టిగా నియమించాలని స్పష్టం చేశాయి. కానీ చాలా కాలేజీలు ఇతర ఇంజనీరింగ్ కోర్సులు (సివిల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్, సీఎస్ఈ) బోధిస్తున్న అధ్యాపకులను కొత్త కోర్సులకు ఫ్యాకల్టిగా నియమించాయి. ఈ అధ్యాపకులు కొత్త కోర్సులకు సంబంధించిన సర్టిఫికెట్ కోర్సులు చేసినవారేనని పేర్కొంటున్నాయి. కానీ దీనిని తాము అనుమతించబోమని, పీజీ చేసినవారిని నియమించాల్సిందేనని యూనివర్సిటీలు పట్టుపడుతున్నాయి. ఈ క్రమంలో ప్రైవేటు కాలేజీలపై వర్సిటీ అధికారుల వేధింపులు పెరిగాయంటూ కొందరు ఏఐసీటీఈకి ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన ఏఐసీటీఈ.. ఇతర కోర్ గ్రూపులు బోధించే వారినీ కొత్త కంప్యూటర్ కోర్సుల బోధనకు అనుమతించాలంటూ వర్సిటీలకు స్పష్టత ఇచ్చింది. ఆ కోర్సులు తప్పనిసరి ఇంజనీరింగ్లో ఏ బ్రాంచీలో బోధిస్తున్న అధ్యాపకుడైనా కొన్ని కోర్సులు చేయాల్సి ఉంటుంది. ఉదాహరణకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బోధించాలనుకుంటే మైనర్ డిగ్రీ కోర్సుగా దానిని చేయాల్సి ఉంటుంది. ఈ కోర్సులను మూక్స్, స్వయం వంటి సంస్థలు ఆన్లైన్ ద్వారా అందిస్తున్నాయి. ఇతర ఇంజనీరింగ్ బ్రాంచీల అధ్యాపకులకు సాంకేతికతలు, బోధనపై అవగాహన ఉంటుందని.. అదనంగా సర్టిఫికెట్ కోర్సులు చేయడాన్ని అర్హతగా పరిగణించాలని ఏఐసీటీఈ పేర్కొంది. ఈ సర్టిఫికెట్ కోర్సులకు 18 నుంచి 20 క్రెడిట్స్ ఉంటాయని, అవి బోధనకు సరిపోతాయని స్పష్టం చేసింది. 20% అనుమతిస్తున్నాం ఇతర బ్రాంచీల వారిని ఇప్పటికే 20శాతం వరకూ కొత్త కోర్సుల ఫ్యాకల్టిగా అనుమతిస్తున్నాం. వంద శాతం అనుమతిస్తే బోధనలో నాణ్యత ఉండదని భావిస్తున్నాం. అయితే సంబంధిత సర్టిఫికెట్ కోర్సులు చేసిన వారిని అనుమతించాలని ఏఐసీటీఈ తెలిపింది. ఇందులో సాధ్యాసాధ్యాలు పరిశీలిస్తాం. – ప్రొఫెసర్ కట్టా నర్సింహారెడ్డి, జేఎన్టీయూహెచ్ వీసీ అందరినీ అనుమతించాలి కొత్త కంప్యూటర్ కోర్సులు బోధించే నైపుణ్యం అలవరచుకున్న అందరినీ బోధనకు అనుమతించాలి. దీనికి వర్సిటీలు అభ్యంతరం చెప్పడం సరికాదు. వర్సిటీల తీరుతో ఫ్యాకల్టీ లభించక బోధన కుంటుపడుతుంది. సర్టిఫికెట్ కోర్సులు చేసిన కోర్ గ్రూప్ వారికీ కంప్యూటర్ అనుబంధ కోర్సులపై పట్టు ఉంటుంది. – వి.బాలకృష్ణారెడ్డి, సాంకేతిక, వృత్తి విద్య ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు -
రాజకీయమార్పులకు వేదికల్లా వర్సిటీలు ఎదగాలి
వ్యవస్థను మార్చే నిప్పుకణాలకు విశ్వవిద్యాలయాలే పునాదులు వేస్తాయన్నది ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి అభిప్రాయం. ఉప్పొంగే ఆ యువరక్తంలో కనిపించేది ఆవేశమే కాదు... భావితరాల ఆలోచనా విధానం అనేది ఆయన విశ్లేషణ. రాజకీయ చిత్రపటంలో అత్యున్నత శిఖరాల్లో కనిపించే నేటితరం నేతల ఆశయ పునాదులు యూనివర్సిటీల్లో కన్పిస్తాయని విశ్లేషిస్తారాయన. సమ్మిళితమైన చదువు, రాజకీయాలను వేర్వేరుగా చూడలేమన్నది ఆయన భావన. ఉ ద్యమాల పురిటిగడ్డలైన తెలంగాణ విశ్వవిద్యాలయాల్లో ఆచార్యుడిగా రాణించిన నేపథ్యం లింబాద్రిది. అంచెలంచెలుగా ఎదిగి, ఉన్నత విద్యా మండలి చైర్మన్గా పనిచేస్తున్న ప్రొఫెసర్ లింబాద్రి అసెంబ్లీ ఎన్నికల వేళ తన మనోభావాలను ‘సాక్షి’తో పంచుకున్నారు. అది ఆయన మాటల్లోనే ... రాజకీయాలకు విద్యార్థి దశే కీలకం విలువలతో కూడిన రాజకీయాలకు విద్యార్థి దశే పునాది వేస్తుంది. విద్యతో పాటు రాజకీయ అవగాహన ఉండాలి. మార్పును కోరుకునేదే విద్య. అలాంటప్పుడు రాజకీయ మార్పును ఎందుకు ఆశించకూడదు? యువ చైతన్యాన్ని ఎందుకు స్వాగతించకూడదు? రాజకీయాల్లో కీలకపాత్ర పోషి స్తున్న ఎంతోమందిని చూడండి. ఆకాశాన్ని తాకే వారి ఆలోచనా శక్తి విద్యార్థి నేపథ్యం నుంచే కన్పిస్తుంది. అందుకే యువతరాన్ని రాజకీయాల్లోకి రానివ్వాల్సిందే. ప్రోత్సహించాల్సిందే. నిజానికి రేపటి అభివృద్ధిని అంచనా వేయగలిగేది విద్యార్థి లోకమే. భావితరం ఉన్నతికి బాటలేసేది యువతరమే. ఆ దిశగానే విద్యా బోధన ఉండాలి. సరికొత్త మార్పును ప్రేరేపించే విధానపరమైన లక్ష్యాలు విద్యలో జొప్పించాలి. ఉదాహరణకు సాంకేతికతనే తీసుకోండి. ఎన్ని మార్పులొచ్చాయి. సంప్రదాయ కోర్సుల స్థానంలో టెక్నాలజీ కోర్సుల వైపు యువత మొగ్గుచూపుతున్నారు. విశ్వవ్యాప్తంగా వచ్చిన ఈ మార్పును మనమూ అందిపుచ్చుకోవాలి. ఆ క్రమంలో ఆలోచన విధానంలోనూ మార్పు లు తేవాలి. మార్కెట్లో మన శక్తిసామర్థ్యాలు నిరూపించుకునే సత్తా మన యువతరానికి ఉంది. దీన్ని మరింత పెంచగలిగే విధానపరమైన నిర్ణయాలు ప్రజల నుంచి వచ్చే నేతలు చేయాలి. విద్యార్థి దశలోనే రాజకీయ నేపథ్యం ఉన్న నేతకు ఇది మరింత బోధపడుతుందనేది నా అభిప్రాయం. సర్కారీ కొలువునే ఉద్యోగం అనుకోవద్దు.. ప్రతీ ఎన్నికల్లోనూ యువత, ఉపాధి అవకాశాలు ప్రత్యేక పాత్ర పోషిస్తున్నాయి. ఈ దిశగా అన్ని పార్టీలూ స్పందిస్తున్నాయి. కానీ వాస్తవాలను యువత తెలుసుకోవాలి. సర్కారీ కొలువునే ఉద్యోగం అనుకోవద్దు. లక్షల్లో గ్రాడ్యుయేట్లు తయారవుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగాలు వేలల్లో ఉంటున్నాయి. అంతమాత్రాన ఉపాధి లేకుండా పోతుందా? ఉద్యోగం కావాలనుకునే ప్రతీ వ్యక్తి తన నైపుణ్యాన్ని పెట్టుబడిగా పెట్టి ఉద్యోగాలు సృష్టించాలి. ఆ దిశగా మన ఎన్నికల ప్రణాళికలూ ఉండాలి. ఈ వాస్తవాన్ని నేతలు యువతకు వివరించి చెప్పాలి. ఆలోచనలు రేకెత్తించాలి. నిజానికి ఈ తరహా విద్య వైపు తెలంగాణ అడుగులు వేస్తోంది. ఉద్యోగం రాలేదనే తాత్కాలిక అసంతృప్తిని పక్కనబెడితే... ఉపాధి బాటలు వేయగల సామర్థ్యం ఉందని గుర్తిస్తే చాలు.. శాశ్వత పరిష్కారం దొరికినట్టే. విద్యారంగ శ్రేయస్సే పార్టీల ఎజెండా కావాలి విద్యార్థి లోకాన్ని వెన్నుతట్టి ప్రోత్సహించడంలో ప్రభుత్వాల కృషి మరువలేనిది. ప్రతిభకు దన్నుగా నిలిచే గురుకులాలు, రెసిడెన్షియళ్లు, ఊతం ఇచ్చే వివిధ రకాల సంక్షేమాలు అభినందనీయమే. నిజానికి విద్యను భావితరాల పెట్టుబడిగానే చూడాలి. అత్యుత్తమ మానవ వనరులు అందించే కేంద్రంగానే పరిగణించాలి. ఆ దిశగా పార్టీల మేనిఫెస్టోలు ఉండాలి. ఉన్నత విద్యా సంస్థల్లో ప్రపంచవ్యాప్తంగా మార్పులొస్తున్నాయి. దీన్ని అందుకోవాలంటే బోధన నాణ్యత పెంచాల్సిందే. అందుకు అనుగుణంగా ఖాళీల భర్తీ అనివార్యం. మన విశ్వవిద్యాలయాల్లో ఇప్పటికీ పెద్ద ఎత్తున ఖాళీలున్న మాట వాస్తవం. వాటి భర్తీకి చేపట్టిన చర్యలు, పారదర్శక నియామక విధాన నిర్ణయం ఆమోదించాల్సిందే. ఈ దిశగా చేపట్టిన కామన్ రిక్రూట్మెంట్ బోర్డు ఏర్పాటు మరో అడుగుగానే చెప్పాలి. ప్రశ్నించే తత్వమే రాజకీయ పునాది ప్రశ్నించే తత్వం నుంచే ఆలోచనలు ఉద్భవిస్తాయి. నిలదీసే నైజం నుంచే కోరుకున్న మార్పూ సాధ్యమవుతుంది. అది విద్యార్థి దశ నుంచే మొదలవ్వాలి. ఒక్కో విద్యార్థికి ఒక్కో ఆశయం ఉంటుంది. ఆ కలల స్వప్నంలోంచే గొప్ప రాజకీయవేత్తలూ పుట్టుకొస్తారు. పారిశ్రామిక వేత్తలూ ఆవిర్భవిస్తారు. రచయితలు, సైంటిస్టులూ.. రాజకీయ విశ్లేషకులు... ఇలా అన్ని వర్గాల మేధావులు సరికొత్త ఆలోచనల్లోంచే తెరపైకి వస్తారు. విద్యార్థికి రాజకీయాలెందుకు? అనే వాదనలో అర్థం లేదు. నిజానికి ఆ దిశగా విద్యార్థి లోకాన్ని ప్రోత్సహించాల్సిన అవసరమూ ఉంది. మార్కుల పరుగులే కాదు... రాజకీయ మార్పులకు వేదికల్లా విశ్వవిద్యాలయాలు ఎదగాల్సిందే. -గౌటే దేవేందర్ -
ఏపీ వర్సిటీల్లో ఖాళీల భర్తీ
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత విద్యలో నవశకానికి నాంది పలికింది. విశ్వవిద్యాలయాల్లో దశాబ్దాలుగా భర్తీకి నోచుకోని అధ్యాపక, అధ్యాపకేతర పోస్టుల్లో నియామకాలకు శ్రీకారం చుట్టింది. చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో 18 యూనివర్సిటీల్లో ఏకంగా 3,220 పోస్టుల భర్తీకి సోమవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. వీటిలో 418 ప్రొఫెసర్, 801 అసోసియేట్ ప్రొఫెసర్, 2,001 అసిస్టెంట్ ప్రొఫెసర్ (రాజీవ్ గాంధీ వైజ్ఞానిక, సాంకేతిక విశ్వవిద్యాలయం 220 లెక్చరర్ పోస్టులతో కలిపి) పోస్టుల నియామకాలను చేపడుతోంది. ఉన్నత విద్యా మండలి ‘ఉమ్మడి పోర్టల్’ ద్వారా మంగళవారం నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించనుంది. అభ్యర్థులపై ఆర్థిక భారం తగ్గించేందుకు అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుకు మాత్రం ఒకే దరఖాస్తు ఫీజుతో అన్ని యూనివర్సిటీలకు దరఖాస్తు చేసుకునే సౌలభ్యాన్ని కల్పించింది. గతంలో అయితే ప్రతి వర్సిటీకి ఒక్కో దరఖాస్తు పెట్టుకోవాల్సి వచ్చేది. వీటికే అభ్యర్థులు రూ.వేలు చెల్లించాల్సి వచ్చేది. భవిష్యత్ తరాలకు సైతం యూనివర్సిటీల్లో అత్యుత్తమ బోధన సామర్థ్యాలు అందించేందుకు వీలుగా ఎంపిక ప్రక్రియను నిర్వహిస్తోంది. ముఖ్యంగా అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీసు కమిషన్ (ఏపీపీఎస్సీ) ద్వారా స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించి పారదర్శకంగా ఎంపికలు చేపట్టనుంది. దరఖాస్తు రుసుము ఇలా.. అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుకు ఓపెన్ కేటగిరీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ.2,500.. ఎస్సీ, ఎస్టీ, పీబీడీలు (పర్సన్ బెంచ్ మార్క్ విత్ డిజేబిలిటీ) రూ.2 వేలు, ప్రవాస భారతీయులైతే 50 డాలర్లు/రూ.4.200 ఆన్లైన్లో దరఖాస్తుతో పాటు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఇక్కడ ఒకటి కంటే ఎక్కువ విభాగాల్లో టెస్ట్లు రా>యాలనుకుంటే మాత్రం విడివిడిగా ఫీజులు చెల్లించాలి. ఇక ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులకు అన్ని కేటగిరీల అభ్యర్థులు రూ.3 వేలు, ప్రవాస భారతీయులైతే ప్రొఫెసర్ పోస్టుకు రూ.150 డాలర్లు/రూ.12,600, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టుకు 100 డాలర్లు/రూ.8,400 దరఖాస్తు రుసుము చెల్లించాలి. అభ్యర్థుల దరఖాస్తు కోసం జ్టి్టp:// ట్ఛఛిటuజ్టీఝ్ఛn్టట. unజీఠ్ఛిటటజ్టీజ్ఛీట. ్చp. జౌఠి. జీn వెబ్సైట్ను అందుబాటులో ఉంచింది. వర్సిటీల వారీగా అభ్యర్థుల సందేహాలను నివృత్తి చేసేందుకు ప్రత్యేక ఫోన్ నంబర్లను అందుబాటులోకి తీసుకురానుంది. ఆయా పోస్టులకు స్క్రీనింగ్ టెస్ట్, ఇంటర్వ్యూ తేదీలను దరఖాస్తు పరిశీలన అనంతరం వెల్లడించనుంది. దరఖాస్తులకు గడువు ఇలా.. ఆన్లైన్లో దరఖాస్తు, ఫీజు చెల్లింపునకు తుది గడువు: 20.11.2023 పోస్టు ద్వారా దరఖాస్తు కాపీ, ఇతర పత్రాల సమర్పణ గడువు: 27.11.2023 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుకు నిర్వహించే స్క్రీనింగ్ టెస్ట్కు అర్హులు, అనర్హుల ప్రాథమిక జాబితా ప్రదర్శన: 30.11.2023 అభ్యంతరాల స్వీకరణ: 07.12.2023 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్ట్ స్క్రీనింగ్ టెస్టుకు ఎంపికైన అభ్యర్థుల జాబితా ప్రదర్శన: 08.12.2023 10 మార్కులు వెయిటేజీ ఇలా.. విశ్వవిద్యాలయాల్లో కాంట్రాక్ట్ పద్ధతిలో పని చేస్తున్న వారికి ఏడాదికి ఒక మార్కు చొప్పున గరిష్టంగా 10 మార్కుల వెయిటేజీ కూడా ప్రభుత్వం కల్పిస్తోంది. అయితే.. కాంట్రాక్ట్ అధ్యాపకుల్లో ఎక్కువ మంది సెల్ఫ్ ఫైనాన్స్ ప్రోగ్రామ్స్ కింద పని చేస్తున్నారు. ప్రస్తుతం చేపట్టే పోస్టుల భర్తీ ప్రక్రియలోకి వీరు రావట్లేదు. ఫలితంగా వారి విధులకు ఎటువంటి ఆటకం ఉండదు. మిగిలిన అభ్యర్థులు ఆయా పోస్టులకు దరఖాస్తు చేసుకుంటే వారి అనుభవాన్ని కూడా ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంటుంది. బాబు భర్తీ చేసింది ‘సున్నా’ చంద్రబాబు అధికారంలో ఉన్న మొదటి తొమ్మిదేళ్లూ అంటే 1995 నుంచి 2004 వరకు.. రాష్ట్రం విడిపోయాక 2014 నుంచి 2019 వరకూ విశ్వవిద్యాలయాల్లో ఒక్క పోస్టును కూడా భర్తీ చేయలేదు. ఫలితంగా విశ్వవిద్యాలయాల్లో 71 శాతం అధ్యాపక పోస్టులు ఏళ్ల తరబడి ఖాళీగా ఉండిపోయాయి. గత ఎన్నికలకు ముందు అప్పటి ప్రభుత్వం విశ్వవిద్యాలయాల పాలక మండళ్ల తీర్మానంతో పోస్టుల భర్తీ చేపట్టినా నోటిఫికేషన్ ప్రక్రియ గందరగోళాన్ని సృష్టించింది. రోస్టర్ విధానం, హేతుబద్ధీకరణ, బ్యాక్లాగ్ పోస్టుల భర్తీ విషయంలో తమకు నష్టం జరుగుతోందంటూ అనేక మంది అభ్యర్థులు కోర్టుల్లో వ్యాజ్యాలు దాఖలు చేయడంతో ప్రక్రియ నిలిచిపోయింది. కనీసం కోర్టు కేసులను కూడా పరిష్కరించాలనే ఆలోచన కూడా చంద్రబాబు ప్రభుత్వం చేయకపోవడం గమనార్హం. ఇక్కడ యూజీసీ నిబంధనలను గాలికొదిలేసి, అనుయాయులకు మేలు చేసేలా అశాస్త్రీయ పద్ధతిలో హేతుబద్ధీకరణ చేశారు. వర్సిటీలను సంప్రదించకుండా.. వాటి అవసరాలను పరిగణనలోకి తీసుకోకుండా పోస్టులను ఇష్టం వచ్చినట్టు మార్చేశారు. కొన్నిచోట్ల అవసరానికి మించి ఎక్కువ పోస్టులు చూపించారు. కొందరికి లబ్ధి చేకూర్చేందుకు పోస్టుల స్థాయి తగ్గించేశారు. యూనివర్సిటీ యూనిట్గా కాకుండా సబ్జెక్టుల వారీగా పోస్టులను హేతుబద్ధీకరించడంతో చాలామంది నష్టపోయారు. రూల్ ఆఫ్ రిజర్వేషన్ను పూర్తిగా విస్మరించారు. బోధనేతర పోస్టులకూ ప్రాధాన్యం ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత యూనివర్సిటీల పునరుజ్జీవానికి చర్యలు చేపట్టారు. కోర్టు కేసులను ఒక్కొక్కటి పరిష్కరించుకుంటూ యుద్ధప్రాతిపదికన పెద్దఎత్తున శాశ్వత పోస్టుల భర్తీని చేపట్టారు. యూనివర్సిటీల్లో పని భారం, కేడర్ నిష్పత్తికి అనుగుణంగా ఫ్యాకల్టీని ప్రభుత్వం హేతుబద్ధీకరించింది. యూనివర్సిటీలతో సంప్రదింపులు జరిపిన అనంతరం విభాగాల వారీగా పోస్టుల హేతుబద్ధీకరణ చేసింది. ఫలితంగా మొత్తం 18 యూనివర్సిటీల్లో 4,330 పోస్టులొచ్చాయి. వీటిల్లో ఇప్పటికే పని చేస్తున్న అధ్యాపకులు కాకుండా తాజాగా 3,200 మందిని నియమిస్తోంది. ఇక బోధన పోస్టులతోపాటు ప్రతి యూనివర్సిటీలో అకడమిక్ నాన్ వెకేషన్ పోస్టులు తప్పనిసరిగా ఉండాలని ప్రభుత్వం నిర్ణయించింది. అసిస్టెంట్ డైరెక్టర్/డిప్యూటీ డైరెక్టర్/ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ డైరెక్టర్, అసిస్టెంట్ లైబ్రేరియన్/డిప్యూటీ లైబ్రేరియన్/వర్సిటీ లైబ్రేరియన్, ప్లేస్మెంట్ ఆఫీసర్, నాక్ గుర్తింపులో కీలక భూమిక పోషించే ఐక్యూఏసీ డైరెక్టర్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెల్ డైరెక్టర్, ఎన్ఎస్ఎస్ కో–ఆర్డినేటర్ పోస్టులను తప్పనిసరి చేసింది. -
కొత్త కోర్సులు సరే.. ఫ్యాకల్టీ ఎక్కడ?
రాష్ట్రంలోని ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీల్లో కంప్యూటర్ సైన్స్ కోర్సులపై యూనివర్సిటీలు ప్రత్యేక దృష్టి పెట్టాయి. కొత్తగా వచ్చిన కోర్సులకు సంబంధించిన అధ్యాపకుల వివరాలు తెలియజేయాలని కాలేజీలకు సూచిస్తున్నాయి. కొన్ని కాలేజీల్లో పెరిగిన సీట్లకు సరిపడా ఫ్యాకల్టీ లేదని, సంబంధిత సబ్జెక్టుల్లో నైపుణ్యం ఉన్న వారు అస్సలు లేరని పలు సంఘాల నుంచి ఫిర్యాదులొచ్చిన నేపథ్యంలో ఈ చర్యలకు ఉపక్రమించడం గమనార్హం. మరోవైపు అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) సైతం కంప్యూటర్ కోర్సుల్లో నాణ్యత పెంచాలని సూచించింది. వివిధ రంగాల నుంచి నిపుణులను బోధకులుగా తీసుకోవాలని తెలిపింది. వాస్తవానికి అనుబంధ గుర్తింపు ఇచ్చే సమయంలో ఇలాంటి వాటిపై యూనివర్సిటీలు దృష్టి సారించాయి. అయితే, తమకు కొంత సమయం కావాలని, సీట్లు పెరిగిన తర్వాత అర్హత గల అధ్యాపకులను నియమించుకుంటామని కాలేజీలు తెలిపాయి. కానీ ఇది ఆచరణలో కనిపించడం లేదని యూనివర్సిటీ అధికారులు సైతం అంగీకరిస్తున్నారు. –సాక్షి, హైదరాబాద్ భారీగా పెరిగిన సీట్లు ఈ విద్యా సంవత్సరంలో కంప్యూటర్ సైన్స్ కోర్సులు భారీగా పెరిగాయి. వందకుపైగా కాలేజీలు సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ బ్రాంచీల్లో డిమాండ్ లేదని గుర్తింపు ఇచ్చే వర్సిటీలకు తెలిపాయి. వీటిని తగ్గించి, కంప్యూటర్ సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ, డేటాసైన్స్ వంటి బ్రాంచీల్లో సీట్లు పెంచుకున్నాయి. నిజానికి ఈ ఏడాది కొత్తగా కంప్యూటర్ సైన్స్ కోర్సులో 7,635 సీట్లు మంజూరయ్యాయి. డిమాండ్ లేని కోర్సులను రద్దు చేసుకోవడం వల్ల మరో 6,390 సీట్లు అదనంగా మార్పిడి రూపంలో పెరిగాయి. ఈ విధంగా 14,565 సీట్లు కంప్యూటర్ సైన్స్, దాని అనుబంధ విభాగాల్లో అదనంగా వచ్చి చేరాయి. సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ వంటి బ్రాంచీలను బోధించే వారు అవసరమైన మేర ఉన్నారు. కానీ కొత్తగా వచ్చిన కంప్యూటర్ కోర్సులను బోధించే అనుభవజు్ఞల కొరత రాష్ట్రవ్యాప్తంగా ఇంజనీరింగ్ కాలేజీలను వేధిస్తోంది. సరైన ఫ్యాకల్టీ లేకపోవడంతో సీఎస్ఈ బ్రాంచీలో బోధించే వారినే కొత్త కోర్సులకు వాడుతున్నారు. వారికి అవసరమైన శిక్షణ కూడా ఇవ్వకపోవడంతో కొత్త కోర్సుల్లో బోధన నాణ్యత లోపిస్తోందని కాలేజీ అధ్యాపక సంఘా నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. అనుభవంపై ఆరా కొత్త కోర్సుల్లో మాస్టర్ డిగ్రీ చేసిన వారితోనైనా బోధించేలా చూడాలని యూనివర్సిటీలు కోరుతున్నాయి. ఆర్టిఫిషీయల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్ విభాగాల్లో కంప్యూటర్ కోర్సులు చేసిన వాళ్లు అధ్యాపకులుగా పనిచేయడానికి ముందుకు రావడం లేదు. వారంతా సాఫ్ట్వేర్ రంగంలో స్థిరపడ్డారు. ఈ కారణంగా కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ (సీఎస్ఈ) బోధించే అధ్యాపకులున్న కాలేజీల్లో అదనపు కొత్త సబ్జెక్టులనైనా ప్రొఫెషనల్స్తో బోధించేందుకు ప్రయత్నించాలని వర్సిటీలు సూచిస్తున్నాయి. ఎంఎస్, ఇతర మాస్టర్ డిగ్రీలు చేసి, కనీసం అయిదేళ్లుగా సాఫ్ట్వేర్ రంగంలో పనిచేస్తున్న వారితో బోధన సమంజసమని యూనివర్సిటీలు భావిస్తున్నాయి. ఇలాంటి మార్పు ఎన్ని కాలేజీలకు అవసరమనేది క్షేత్రస్థాయి కాలేజీల వివరాలు పరిశీలించాక ఓ అవగాహనకు వచ్చే వీలుందని ఓ యూనివర్సిటీ వీసీ తెలిపారు. కొత్త కోర్సులను నిర్వహిస్తున్న కొన్ని కాలేజీలను దసరా తర్వాత ప్రత్యక్షంగా పరిశీలించి, నిర్ణయం తీసుకునే ఆలోచనలో ఉన్నట్టు చెప్పారు. -
పాఠాలే కాదు.. జీవితపాఠాలూ నేర్పాలి
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ విద్యార్థులకు మొదటి సంవత్సరంలోనే ఆత్మస్థైర్యం కల్పించే కార్యక్రమాలు చేపట్టాలని అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) విశ్వవిద్యాలయాలకు సూచించింది. విద్యార్థుల్లో ఆత్మన్యూనతా భావం తొలగించి మానసికంగా దృఢంగాఉండేలా చూడాలని పేర్కొంది. తొలిదశలో నిర్వహించే అవగాహన కార్యక్రమం (ఇండక్షన్ ప్రోగ్రామ్) నుంచే ఇది మొదలవ్వాలని తెలిపింది. ఉన్నత విద్యాసంస్థల్లో ఆత్మహత్యలు పెరుగుతున్న నేపథ్యంలో వివిధ అధ్యయనాలపై ఏఐసీటీఈ దృష్టి పెట్టింది. ఇంటర్ వరకూ ఎక్కువగా బట్టీ విధానంలో చదివే విద్యార్థులు ఇంజనీరింగ్లోని భిన్నమైన విద్యా విధానం వల్ల సొంత అవగాహన పద్ధతులపై దృష్టి కేంద్రీకరించలేకపోతున్నారని ఏఐసీటీఈ భావించింది. ఈ సమస్యను అధిగమించడానికి వీలుగా ఇంజనీరింగ్ విద్యకు ముందుగా విద్యార్థులను మానసికంగా సిద్ధం చేయాలని జాతీయ విద్యావిధానం–2020లో సూచనలు చేసింది. ఇప్పటికే ఇంజనీరింగ్ తరగతులు మొదలైనందున వచ్చే ఏడాది నుంచి విశ్వవిద్యాలయాలు దీనిపై దృష్టి పెట్టే వీలుందని అధికారులు చెబుతున్నారు. ఇవీ సూచనలు.. కేవలం పుస్తకాలకే కాకుండా సామాజికంగా ఎదురయ్యే సవాళ్లపై విద్యార్థులకు అవగాహన కల్పించాలి. తరగతి పాఠాలకే పరిమితం చేయకుండా సామాజిక అంశాలపై చర్చా వేదికలు, వ్యాసరచన పోటీలు నిర్వహించాలి. ప్రతి యూనివర్సిటీలోనూ దీనికోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలి. విద్యార్థులు ఇంజనీరింగ్లో చేరాక ఇంటర్ వరకూ ఉన్న వాతావరణం నుంచి ఇంజనీరింగ్ అనే కొత్త ప్రపంచం అర్థమయ్యేలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఏ విద్యార్థి ఏ ప్రాంతం నుంచి వచ్చాడు? అతని సామర్థ్యం ఏమిటి? అందరిలో కలుస్తున్నాడా? వంటి అంశాలను అధ్యాపకులు గమనించాలి. తరగతి గదిలో అందరి మధ్య సఖ్యత పెరిగి స్నేహపూర్వక వాతావరణం నెలకొన్న తర్వాతే బోధన చేపట్టాలి. ఇంజనీరింగ్లోని వివిధ బ్రాంచీలకు చెందిన విద్యార్థుల మధ్య సమన్వయం నెలకొనేందుకు కాలేజీలు ప్రయత్నించాలి. దీనికోసం సృజనాత్మకత, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేలా ప్రణాళిక రూపకల్పనకు వర్సిటీలు కృషి చేయాలి. అకడమిక్ నాలెడ్జ్తోపాటు అనుభవపూర్వకంగా విద్యను నేర్చుకోవడం వల్ల విద్యార్థి మానసిక వికాసం పెరుగుతుందని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ అభిప్రాయపడింది. దీన్ని కాలేజీలు విధిగా అనుసరించాలి -
పల్లెకు పోదాం.. ప్రజాసేవ చేద్దాం!
సాక్షి, అమరావతి: ‘దేశానికి పల్లె సీమలే పట్టుగొమ్మలు’ అనే నానుడిని నిజం చేయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నడుంబిగించాయి. గ్రామాలు అభివృద్ధి చెందితే దేశం ప్రగతి పథంలో పయనించినట్టే. ఈ నేపథ్యంలో గ్రామాలను అభివృద్ధి చేయడానికి యూనివర్సిటీలు, ఉన్నత విద్యా సంస్థలను ప్రభుత్వం రంగంలో దింపుతోంది. ఉన్నత భారత్ అభియాన్ పేరుతో గ్రామాల్లో సామాజిక సేవలో పాలుపంచుకునేలా వర్సిటీలు, ఉన్నత విద్యా సంస్థలను భాగస్వాములను చేస్తోంది. ఇప్పటివరకు మన రాష్ట్రంలో 129 విద్యా సంస్థలు గ్రామాలను దత్తత తీసుకోవడానికి ముందుకొచ్చాయి. ఒక్కో సంస్థ ఐదు చొప్పున 645 గ్రామాలను దత్తత తీసుకున్నాయి. గ్రామాల్లో ప్రభుత్వం నిర్దేశించుకున్న ఆరు ప్రాధాన్యత రంగాల్లో విద్యా సంస్థలు తోడ్పాటు అందిస్తున్నాయి. ఇలా గ్రామాలను దత్తత తీసుకుంటూ పల్లె సేవలో భాగస్వాములవుతున్న సంస్థలకు ప్రభుత్వం రూ.10 లక్షల చొప్పున గ్రాంట్ అందిస్తోంది. 50 వేల విద్యా సంస్థలు.. 2.5 లక్షల పంచాయతీలు.. పరిశోధన ఫలాలు, ప్రభుత్వ పథకాలను సమన్వయపరుస్తూ సాంకేతిక పరిజ్ఞాన బదిలీ ద్వారా గ్రామీణాభివృద్ధికి బాటలు వేయడమే ఉన్నత భారత్ అభియాన్ లక్ష్యం. దేశవ్యాప్తంగా 2023 నాటికి 50 వేల విద్యాసంస్థలను ఇందులో భాగస్వాములను చేయడం, వీటితో 2.5 లక్షల గ్రామ పంచాయతీలను అనుసంధానించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం కార్యాచరణ అమలు చేస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఈ సంయుక్త ప్రాజెక్టుకు జాతీయ స్థాయిలో ఐఐటీ ఢిల్లీ, రాష్ట్ర స్థాయిలో శ్రీ వేంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ సమన్వయ సంస్థలుగా వ్యవహరిస్తున్నాయి. ఆరు ప్రాధాన్యతా రంగాల్లో.. 129 విద్యా సంస్థలు ఆయా గ్రామాల్లో సురక్షిత మంచినీరు, ఆరోగ్యం–పరిసరాల పరిశుభ్రత, వ్యవసాయం, గ్రామీణ చేతివృత్తులు, స్త్రీ శిశు సంక్షేమం, గ్రామీణ మౌలిక వసతుల కల్పన వంటి ఆరు ప్రాధాన్యతా రంగాల్లో సౌకర్యాల కొరతను అధిగమించేందుకు ప్రభుత్వ తోడ్పాటుతో కృషి చేస్తాయి. ఈ 129 విద్యాసంస్థలకు చెందిన 1.93 లక్షల మంది విద్యార్థుల ద్వారా దత్తత తీసుకున్న 645 గ్రామాల్లో పెద్దఎత్తున సేవా కార్యక్రమాలను చేపడుతున్నారు. నూతన ఆవిష్కరణల ఫలాలు, పరిశోధన ఫలితాల ద్వారా పల్లె ప్రగతికి బాటలు వేస్తున్నారు. జాతీయ స్థాయికి ఎంపికైన మూడు ఆవిష్కరణలు పల్లె ప్రగతిలో కీలకంగా మారే నూతన ఆవిష్కరణలను జాతీయ స్థాయిలో ఏర్పాటు చేసే ఎగ్జిబిషన్లో ప్రదర్శిస్తారు. ఇవి పెట్టుబడులను ఆకర్షించినట్లైతే అందుకు అవసరమైన తోడ్పాటును జాతీయ, రాష్ట్ర స్థాయిలో ఏర్పాటు చేసిన ఇంక్యుబేషన్ సెంటర్ ద్వారా అందిస్తారు. గ్రామీణాభివృద్ధికి తోడ్పాటునందించే ఆవిష్కరణలను వాణిజ్య స్థాయిలో ఉత్పత్తి చేసి.. వచ్చే లాభాల్లో రాయల్టిని ఆయా విద్యాసంస్థలు, విద్యార్థులకు చెల్లిస్తారు. ఇలా ఇప్పటివరకు తిరుపతి ఐఐటీ విద్యార్థులు తాగునీటిని శుద్ధి చేసేందుకు రూపొందించిన కెపాసిటివ్ డీఅయోనైజేషన్ పరికరం, వైఎస్సార్ జిల్లా మనూ పాలిటెక్నిక్ విద్యార్థులు.. చేతివృత్తులు వారు సహజ ఉత్పత్తులు తయారీ చేసేందుకు అభివృద్ధి చేసిన నూతన సాంకేతికత, పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం విద్యార్థులు రూపొందించిన సోలార్ మొబైల్ చార్జర్ వంటి ఆవిష్కరణలను జాతీయ స్థాయి పరిశీలనకు పంపించారు. వీటితో పాటు మరో ఏడు విద్యాసంస్థలు కూడా నూతన సాంకేతికతలను అభివృద్ధి చేశాయి. విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం, సాంకేతిక నైపుణ్యం.. https://unnatbharatabhiyan.gov.in ద్వారా నమోదైన విద్యాసంస్థలు జిల్లా కలెక్టర్కు వివరాలు సమర్పించాల్సి ఉంటుంది. నమోదు ప్రక్రియ పూర్తి కాగానే, ముందు ప్రాంతీయ సమన్వయ సంస్థ, ఆ తర్వాత జాతీయ సమన్వయ సంస్థ వివరాలు తనిఖీ చేసి ఆమోదముద్ర వేస్తాయి. ఈ ప్రక్రియ పూర్తి కాగానే ఆ విద్యాసంస్థకు రూ.10 లక్షల గ్రాంటు మంజూరు చేస్తారు. ఈ మొత్తాన్ని గ్రామాలను గుర్తించడం, అక్కడ పర్యటించడం, సమస్యలను అధ్యయనం చేయడం వంటి కార్యక్రమాలకు వినియోగించుకోవచ్చు. అంతేకాకుండా ఆయా పల్లెలకు ఉపయోగపడేలా చేపట్టే పరిశోధనలకు కూడా వాడుకోవచ్చు. దత్తత గ్రామాల్లో చేపట్టాల్సిన కార్యక్రమాలకు అవసరమయ్యే మద్దతును వివిధ శాఖల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది. దత్తత తీసుకున్న పల్లెల్లో స్థానిక ప్రాధాన్యాల గుర్తింపు, సాంకేతికత బదిలీ వంటి కీలక అంశాల్లో సహకరిస్తుంది. ఈ ప్రాజెక్టులో భాగస్వాములయ్యే విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం, సాంకేతిక నైపుణ్యం, భావవ్యక్తీకరణ నైపుణ్యాలు కూడా పెంపొందుతాయి. ఆయా విద్యా సంస్థల నుంచి ఉత్తీర్ణులయ్యేనాటికి మంచి నైపుణ్యాలను పొందుతారు. నూతన ఆవిష్కరణల దిశగా అడుగులు ఉన్నత భారత్ అభియాన్ ప్రాజెక్టులో భాగస్వాములయ్యేందుకు పెద్ద ఎత్తున విద్యాసంస్థలు ముందుకొస్తున్నాయి. ఈ ప్రాజెక్టు ద్వారా అవి అభివృద్ధి చేసే నూతన ఆవిష్కరణలను నేరుగా పల్లెలకు తీసుకెళ్తున్నాయి. ఇప్పటికే 129 విద్యాసంస్థలు నమోదయ్యాయి. వీటి నుంచి 1.93 లక్షల మంది విద్యార్థులు భాగస్వాములయ్యారు. 645 గ్రామ పంచాయతీల్లో రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిన ప్రాధాన్యతా రంగాల్లో ప్రగతికి బాటలు వేస్తున్నారు. ఈ ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వ తోడ్పాటు అభినందనీయం. – ప్రొ.సర్జన్ రెడ్డి, కేంద్ర సమన్వయకర్త, ఉన్నత్ భారత్ అభియాన్ -
కెనడా కాలేజీలు, వర్సిటీలకు భారత విద్యార్థుల అవసరమే ఎక్కువ!
ఒట్టావా: ఖలిస్తానీ తీవ్రవాది హర్దిప్ సింగ్ నిజ్జర్ హత్యతో కెనడా, భారత దేశాల మధ్య సంబంధాలు ఇటీవల అనూహ్య మార్గంలో పయనిస్తున్నాయి. కెనడా ఉన్నత విద్యాసంస్థల్లో భారతదేశం నుంచి పెద్ద సంఖ్యలో విద్యార్థులు చదువుతున్న కారణంగా కెనడాలోని ఖలిస్తానీ తీవ్రవాదుల భారత వ్యతిరేక ప్రకటనలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. 19వ శతాబ్దం చివరి నుంచీ కెనడాతో పంజాబ్ రాష్ట్రానికి నాటి (బ్రిటిష్ ఇండియా కాలం) నుంచీ చారిత్రకంగా సంబంధాలు ఉండడంతో–తమిళులకు శ్రీలంక ఎలాగో, పంజాబీలకు కెనడా ఇంకా అంతకన్నా ఎక్కువ ఆసక్తి ఉన్న ప్రాంతంగా మారింది. గత పదేళ్లుగా ఏటా కెనడా కాలేజీలు, యూనివర్సిటీల్లో చేరుతున్న విద్యార్థుల్లో పంజాబ్ రాష్ట్రానికి చెందిన వారే సింహభాగం అనేది తెలిసిందే. భారత విద్యార్థులు కెనడలో తమ విద్యాభ్యాసానికి చేస్తున్న వ్యయం (కోట్లాది డాలర్లు) అక్కడి ప్రావిన్సులను (రాష్ట్రాలను) ఆర్థికంగా నిలబెడుతోంది. ప్లస్ టూ తర్వాత, గ్రాడ్యుయేషన్, పీజీ కోర్సుల కోసం కెనడా వెళ్లి చదువుతున్న భారత విద్యార్థులు ఏటా దాదాపు 20 బిలియన్ల డాలర్లు (2000 కోట్ల డాలర్లు) ఖర్చుచేస్తున్నారు. ఇంత భారీ మొత్తంలో డబ్బు ఇండియా నుంచి కెనడాకు రావడంతో రెండు దేశాల మద్య సంబంధాలకు ప్రాధాన్యం పెరుగుతోంది. కెనడాలోని ఒంటారియో ప్రావిన్స్లో అక్కడి విద్యాసంస్థలకు కెనడా సర్కారు కన్నా భారత విద్యార్థులే ఎక్కువ మొత్తంలో ఫీజుల రూపంలో నిధులు సమకూర్చుతున్నారంటే–కెనడాలో భారత్ నుంచి వచ్చే అంతర్జాతీయ విద్యార్థులకు ప్రాముఖ్యం ఎంతో అర్థమౌతోంది. కెనడా కాలేజీల్లో స్థానిక విద్యార్థులు చెల్లించే ఫీజులకు మూడు రెట్లు ఎక్కువ ఫీజులను భారత విద్యార్థులు చెల్లిస్తున్నారని కొన్ని సంస్థలు అంచనా వేస్తున్నాయి. అంటే కెనడా ఉన్నత విద్యాసంస్థలు వసూలు చేసే అన్ని రకాల ట్యూషన్ ఫీజుల మొత్తంలో 76 శాతం భారత విద్యార్థుల నుంచే వస్తోందన్న మాట. ముఖ్యంగా ఒంటారియో ప్రావిన్సులోని విద్యాసంస్థలన్నీ భారత విద్యార్థుల ఫీజుల డబ్బుతోనే నడుస్తున్నాయని వార్తలొస్తున్నాయి. విద్యార్థుల నుంచి కెనడాకు 22.3 బిలియన్ డాలర్లు 2022 మార్చిలో కెనడా కాలేజీలు, వర్సిటీల ఆర్థిక పరిస్థితి, విద్యార్థుల సంఖ్యపై చేసిన ఒక విశ్లేషణ ప్రకారం–ఈ ఉత్తర అమెరికా ఫెడరల్ దేశంలో చదువుకునే విదేశీ విద్యార్థులు ఆ దేశ ఆర్థిక వ్యవస్థలోకి ఫీజులు, ఇతర ఖర్చుల రూపంలో 22.3 బిలియన్ (2230 కోట్ల డాలర్లు) డాలర్ల సొమ్ము పంపుతున్నారు. అంటే, కెనడా ప్రతి సంవత్సరం ఇతర దేశాలకు ఆటోమొబైల్ విడిభాగాలు, కలప, విమానాల ఎగుమతుల ద్వారా సంపాదించేదాని కన్నా అంతర్జాతీయ విద్యార్థులు చెల్లించేదే ఎక్కువ. ఇక సంఖ్య విషయానికి వస్తే 1990ల చివర్లో కెనడాలో చదువుకుంటున్న విదేశీ విద్యార్థుల సంఖ్య 40 వేలు కాగా, 2020–21 నాటికి ఈ సంఖ్య 4,20,000కు పెరిగింది. 2009 నుంచీ కెనడా కాలేజీలు, యూనివర్సిటీల్లో చేరి చదువులు పూర్తిచేసుకునే పంజాబీ, ఇతర భారత రాష్ట్రాల విద్యార్థుల సంఖ్య వేగం పుంజుకుంది. ఇండియా నుంచే గాక ఇతర దేశాల నుంచి వచ్చి కెనడాలో చదువుకునే విద్యార్థులు కూడా ఉన్నారు. 2021–22లో కెనడాలోని అన్ని విశ్వవిద్యాలయాల్లో చేరిన విద్యార్థుల్లో విదేశీ స్టూడెంట్ల సంఖ్య 17.6 శాతం ఉండగా, కెనడా కాలేజీల్లో ఈ అంతర్జాతీయ విద్యార్థల వాటా 22 శాతం ఉంది. ఒంటారియా ప్రావిన్స్ కాలేజీల్లో ఇలాంటి విద్యార్థుల ప్రవేశాల సంఖ్య 2016–17, 2019–20 మధ్య కాలంలో రెట్టింపు కావడం విశేషం. మరో ఆసక్తికర విషయం ఏమంటే–ఇండియాలో ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థుల సంఖ్యతో పోల్చితే దానికి ఆరు రెట్ల సంఖ్యలో భారత యువతీయువకులు విదేశీ విశ్వవిద్యాలయాలు, కాలేజీల్లో చేరుతున్నారని ఎడ్యుకేషన్ కన్సల్టెంగ్ సంస్థ ఒకటి అంచనా వేసింది. ఇలా విదేశీ ఉన్నత విద్యాసంస్థల్లో చేరే ఇండియన్ స్టూడెంట్స్ సంఖ్య ఇటీవల 7,70,000కు చేరింది. 2024 నాటికి పాశ్చాత్య దేశాలు సహా విదేశాలకు పోయి అక్కడ ఉన్నత విద్యనభ్యసించేవారి సంఖ్య 18 లక్షలకు చేరుతుందని అంచనా. :::విజయసాయిరెడ్డి, వైఎస్సార్సీపీ, రాజ్యసభ ఎంపీ ఇదీ చదవండి: భారత హైకమిషన్కు ఖలిస్తాన్ నిరసన సెగ -
విదేశీ విద్యకే మొగ్గు
సాక్షి, అమరావతి: విదేశీ విద్యపై భారతీయ విద్యార్థుల్లో ఆసక్తి పెరుగుతోంది. అంతర్జాతీయ యూనివర్సిటీలు/విద్యా సంస్థలు ప్రదానం చేసే డిగ్రీలకు ప్రత్యేక గుర్తింపు ఉండటంతో విదేశాల బాటపడుతున్నారు. కేంద్ర ప్రభుత్వ గణాంకాల ప్రకారం.. 2022 నాటికి 79 దేశాల్లో 13 లక్షల మందికిపైగా భారతీయ విద్యార్థులు వివిధ వర్సిటీల్లో విద్యనభ్యసిస్తున్నారు. గత ఐదేళ్లతో పోలిస్తే గతేడాది ఏకంగా 7.5 లక్షల మంది విద్యార్థులు విదేశాలకు పయనమయ్యారు. ఈ ఏడాది ఇప్పటివరకు 3.37 లక్షల మంది తరలివెళ్లారు. ముఖ్యంగా అండర్ గ్రాడ్యుయేషన్ కోర్సుల్లో చేరేందుకు కెనడా, అమెరికా, యునైటెడ్ కింగ్డమ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వంటి దేశాలను ఎక్కువగా ఎంపిక చేసుకుంటున్నారు. అమెరికాకే మొదటి ప్రాధాన్యత.. సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇంజనీరింగ్, గణితం (స్టెమ్) కోర్సుల్లో భారతీయ విద్యార్థులు ఎక్కువగా చేరుతున్నారు. ఈ కోర్సులకు మంచి అవకాశాలు ఉండటంతో విద్యార్థులు వాటినే ఎంచుకుంటున్నారు. మంచి పే ప్యాకేజీల కోసం బిజినెస్ అండ్ మేనేజ్మెంట్ కోర్సుల్లో చేరేవారూ ఉంటున్నారు. ఈ క్రమంలో భారతీయులు తమ మొదటి ప్రాధాన్యతను అమెరికాకే ఇస్తున్నారు. ఇక్కడ స్టెమ్ కోర్సుల్లోనే ఎక్కువ మంది చేరుతున్నారు. ప్రస్తుతం అమెరికాలో 4.5 లక్షల మంది భారతీయ విద్యార్థులు చదువుతున్నారు. రెండో స్థానంలో కెనడా.. భారతీయ విద్యార్థులను ఆకర్షిస్తున్న దేశాల్లో అమెరికా తర్వాత కెనడా రెండో స్థానంలో నిలుస్తోంది. యూఎస్తో పోలిస్తే వర్సిటీల్లో సీటు సాధించడం, ఇమ్మిగ్రేషన్ విధానాలు అనుకూలంగా ఉండటంతో కెనడాకు ప్రాధాన్యం పెరుగుతోంది. ఆ దేశ ఇమ్మిగ్రేషన్– సిటిజన్షిప్ డేటా ప్రకారం.. కెనడాకు వచ్చిన అంతర్జాతీయ విద్యార్థుల జాబితాలో 1.86 లక్షల మందితో భారత్ అగ్రస్థానంలో ఉంది. ఇక యూకే తక్కువ కాల వ్యవధిలో వివిధ కోర్సులు అందిస్తుండటం, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ల్లో విద్యాభ్యాసం తర్వాత శాశ్వత నివాసితులుగా మారేందుకు అవకాశాలు ఉండటం భారతీయ విద్యార్థులను ఆకర్షిస్తున్నాయి. ఇక ఇంజనీరింగ్ కోర్సుల్లో తక్కువ ట్యూషన్ ఫీజులు ఉండటంతో జర్మనీని ఎంచుకుంటున్నారు. వెనక్కి వచ్చేవారు తక్కువే.. ముఖ్యంగా 2015–19 మధ్య విదేశాల్లో చదివిన భారతీయ విద్యార్థుల్లో కేవలం 22 శాతం మంది మాత్రమే స్వదేశానికి తిరిగి వచ్చి మంచి ఉపాధిని పొందినట్టు కేంద్ర ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. -
నేడు వర్సిటీలతో గవర్నర్ సమావేశం
సాక్షి, హైదరాబాద్: ‘చాన్స్లర్ కనెక్ట్స్ అల్యూమినీ’ కార్యక్రమంలో భాగంగా గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సోమవారం రాష్ట్ర విశ్వవిద్యాలయాల అధికారులు, ప్రముఖ విద్యావేత్తలతో సమావేశమవుతారు. రాజ్భవన్ కమ్యూనిటీ హాల్లో ఉదయం 9.30 గంటలకు జరగనున్న ఈ కార్యక్రమంలో విద్యార్థుల సమస్యలపై గవర్నర్ వర్సిటీ అధికారులతో చర్చించనున్నారు. సుదీర్ఘ కాలంగా పెద్ద సంఖ్యలో బోధన, బోధనేతర సిబ్బంది పోస్టులు ఖాళీగా ఉండడంతో చాలా వర్సిటీల్లో పలు రకాల కోర్సులు మూతబడడం, ఫీజులను అడ్డగోలుగా పెంచడం, తరగతుల నిర్వహణ జరగకపోవడం, కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమై 5 నెలలు గడుస్తున్నా ఇంకా కొన్ని వర్సిటీల్లో గత విద్యా సంవత్సరం చివరి సెమిస్టర్ పరీక్షలు జరగకపోవడం, రాజకీయాలతో వర్సిటీల పాలన వ్యవహారాలు పూర్తిగా గాడి తప్పడం వంటి అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది. -
ఏపీ వర్సిటీ, ట్రిపుల్ ఐటీల్లో భారీ రిక్రూట్మెంట్
సాక్షి, గుంటూరు: ఆంధ్రప్రదేశ్లోని వర్సిటీలు, ట్రిపుల్ ఐటీల్లో భారీ రిక్రూట్మెంట్కు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. 3,295 పోస్టుల భర్తీకి సీఎం జగన్ ఆమోదం తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వర్సిటీల్లో రెగ్యులర్ సిబ్బంది నియామకానికి ఆమోదం తెలిపింది జగన్ ప్రభుత్వం. నవంబర్ 15 నాటికి నియామక ప్రక్రియ మొత్తం పూర్తి కానుంది. ఈ పోస్టులను ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేయనున్నారు. యూనివర్సిటీల్లో 2,635 అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు ట్రిపుల్ ఐటీల్లో 660 పోస్టులు ఉన్నత విద్యాశాఖలో అత్యున్నత ప్రమాణాల కల్పనలో భాగంగా.. ఇప్పటికే ప్రపంచస్థాయి కరిక్యులమ్ ఏర్పాటు దిశగా సన్నాహాలు సాగుతున్నాయి. ఇదిలా ఉంటే.. మరోవైపు వైద్య ఆరోగ్య శాఖలో 51 వేల పోస్టులను ప్రభుత్వం భర్తీ చేసిన సంగతి తెలిసిందే. -
తస్మాత్ జాగ్రత్త! ఈ 20 యూనివర్సిటీలు నకిలీవి.. 8 రాజధానిలోనే..
న్యూఢిల్లీ: దేశంలో మరో 20 సంస్థలు విశ్వవిద్యాలయాలుగా చెలామణి అవుతున్నాయని, అవన్నీ నకిలీవని యునివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) బుధవారం ప్రకటించింది. ఈ 20 సంస్థల్లో ఎనిమిది ఢిల్లీలోనే ఉన్నట్టు పేర్కొంది. ‘‘ఉత్తరప్రదేశ్లో గాంధీ హిందీ విద్యాపీఠ్, నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ ఎలక్ట్రో కాంప్లెక్స్ హోమియోపతి, నేతాజీ సుభాష్చంద్రబోస్ (ఓపెన్) యూనివర్సిటీ, భారతీయ శిక్షా పరిషత్ అనే నాలుగు నకిలీ యూనివర్సిటీలు ఉన్నాయి. పశ్చిమబెంగాల్, ఏపీల్లో రెండేసి నకిలీ వర్సిటీలున్నాయి. కర్ణాటకలో బదగాన్వీ సర్కార్ వరల్డ్ యూనివర్సిటీ ఎడ్యుకేషన్, కేరళలో సెయింట్ జాన్స్ వర్సిటీ, మహారాష్ట్రలో రాజా అరబిక్ యూనివర్సిటీ, పుదుచ్చెరిలో శ్రీ బోధి అకాడమీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ నకిలీవే’’ అని యూజీసీ కార్యదర్శి మనీశ్ జోషి స్పష్టంచేశారు. ఢిల్లీలోని 8 నకిలీ వర్సిటీలు ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ అండ్ ఫిజికల్ హెల్త్ సైన్సెస్; కమర్షియల్ యూనివర్సిటీ లిమిటెడ్, దరియాగంజ్; యునైటెడ్ నేషన్స్ యూనివర్సిటీ ఒకేషనల్ యూనివర్సిటీ; ఏడీఆర్–సెంట్రిక్ జ్యుడీషియల్ యూనివర్సిటీ; ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ అండ్ ఇంజనీరింగ్; విశ్వకర్మ ఓపెన్ యూనివర్సిటీ ఫర్ సెల్ఫ్–ఎంప్లాయిమెంట్; ఆధ్యాత్మిక్ విశ్వవిద్యాలయ. -
బోధన.. వేదన
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో అధ్యాపకుల కొరత విద్యాప్రమాణాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. జాతీయ ర్యాంకింగ్లో యూనివర్సిటీలు వెనకబడుతున్నాయి. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ (ఎన్ఐఆర్ఎఫ్–2023)లో దశాబ్దాల చరిత్ర ఉన్న ఉస్మానియా యూనివర్సిటీ ఓవరాల్ ర్యాంకులో 64కు పడిపోయింది. గతేడాది ఓయూ 46వ ర్యాంకులో నిలిచింది. జేఎన్టీయూహెచ్ గతేడాది 76వ ర్యాంకుతో ఉంటే ఈ ఏడాది 98వ ర్యాంకుతో సరిపెట్టుకుంది. అధ్యాపకుల కొరతే ఈ పరిస్థితికి కారణమని అన్ని వర్గాలూ భావిస్తున్నా ప్రభుత్వం మాత్రం దీన్ని పట్టించుకోవడం లేదు. గతేడాది తెలంగాణ యూనివర్సిటీల కామన్ రిక్రూట్మెంట్ బోర్డు ఏర్పాటు బిల్లును అసెంబ్లీ ఆమోదించినా అది ఇంకా గవర్నర్ వద్దే పెండింగ్లో ఉంది. ఈ ఫైల్ను రాష్ట్రపతి పరిశీలనకు పంపామని గవర్నర్ పేర్కొన్నారు. 1,869 పోస్టులు ఖాళీ.. రాష్ట్రంలోని 11 యూనివర్సిటీల్లోనూ అధ్యాపకుల కొరత వేధిస్తోంది. అన్నిచోట్లా కాంట్రాక్టు అధ్యాపకులతోనే నెట్టుకొస్తున్నారు. విద్యాశాఖ గణాంకాల ప్రకారం 2021 జనవరి 31 నాటికి 11 యూనివర్సిటీల్లో 2,837 మంజూరైన పోస్టులు ఉండగా వాటిలో ఏకంగా 1,869 పోస్టులు ఖాళీగానే ఉండిపోయాయి. అంటే కేవలం 968 (34.12 శాతం) మందే రెగ్యులర్ ఆధ్యాపకులు పనిచేస్తున్నారు. ప్రస్తుతం 157 మంది ప్రొఫెసర్లు ఉండగా మరో 238 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అలాగే 129 మంది అసోసియేట్ ప్రొఫెసర్లు ఉండగా మరో 781 పోస్టులు ఖాళీగా ఉండిపోయాయి. 682 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు పనిచేస్తుండగా 850 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అయితే 1,869 ఖాళీల్లో 1,061 పోస్టుల భర్తీకి ప్రభుత్వం మూడేళ్ల కిందటే ఆమోదం తెలిపినా ఇంతవరకు వాటిని భర్తీ చేయలేదు. ప్రొఫెసర్లేరి? ♦ రాష్ట్రంలో ఒక్క ప్రొఫెసర్ కూడా లేని యూనివర్సిటీలు ఆరు ఉన్నాయి. అవి శాతవాహన, మహత్మాగాంధీ, పాలమూరు, ఆర్జీయూకేటీ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ, పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ. శాతవాహన, రాజీవ్గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ అండ్ టెక్నాలజీ (ఆర్జీయూకేటీ), బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్లే లేరు. పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో అసోసియేట్ ప్రొఫెసర్ ఒకరే ఉన్నారు. మెుత్తంగా చూస్తే 11 యూనివర్సిటీల్లో 61.65 శాతం ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగానే ఉండిపోయాయి. మరోవైపు 85.82 శాతం అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా ఉండగా 55.48 శాతం అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు ఉన్నత విద్యాశాఖ లెక్కలు వేసింది. ♦వందేళ్లకుపైగా చరిత్రగల ఉస్మానియా యూనివర్సిటీలో సగానికిపైగా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కాకతీయ యూనివర్సిటీలో ఇప్పుడు కేవలం ఒక్కరే ప్రొఫెసర్ ఉండగా అసోసియేట్ ప్రొఫెసర్లు ఇద్దరే ఉన్నారు. శాతవాహన యూనివర్సిటీ, ఆర్జీయూకేటీ, బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీల్లో ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు ఒక్కరంటే ఒక్కరూ లేరు. తెలుగు యూనివర్సిటీలో ఒక్క అసోసియేట్ ప్రొఫెసర్తోనే నెట్టుకొస్తున్నారు. జవహర్లాల్ నెహ్రూ ఆర్కిట్చెర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీలో (జేఎన్ఏఎఫ్ఏయూ) ఇద్దరు అసోసియేట్ ప్రొఫెసర్లు బోధన సాగిస్తున్నారు. క్రమబద్ధీకరణ చేయరా? గత కొంతకాలంగా రెగ్యులర్ చేయాలని ఆందోళన చేస్తున్న యూనివర్సిటీల అసిస్టెంట్ ప్రొఫెసర్ల జేఏసీ ఆదివారం మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, జగదీశ్రెడ్డి, నిరంజన్రెడ్డి, కొప్పుల ఈశ్వర్, ఎర్రబెల్లి దయాకర్రావులను కలిసింది. ఏళ్ల తరబడి పనిచేస్తున్న తమను రెగ్యులర్ చేసేందుకు కృషి చేయాలని వినతిపత్రం అందించింది. సోమవారం జరిగే కేబినేట్ సమావేశంలో ఈ అంశాన్ని ప్రస్తావించాలని కోరింది. -
విద్యావ్యవస్థలో ఏఐ భాగం కావాలి: సీఎం జగన్
సాక్షి, తాడేపల్లి: ఏపీలో పాఠశాల విద్య, ఉన్నత విద్యలో కీలక మార్పులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అడుగులు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో విద్యాశాఖ అధికారులు, యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్లతో తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్ కీలక సమావేశం చేపట్టారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి జగన్ మాట్లాడుతూ.. విద్యారంగంలో కీలక మార్పులకు శ్రీకారం చుట్టాం. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ విధానాన్ని తీసుకురావాలి. విద్యారంగంలో టెక్నాలజీని విరివిగా ఉపయోగించుకోవాలి. టెక్నాలజీని ఉపయోగించి మార్పులు తీసుకురావాలి. అధునాతన పద్ధతిలో వైద్య విద్యార్థులకు బోధన ఉండాలి. మన విద్యార్థులు క్రియేటర్లుగా ఉండాలి. విద్యార్థులకు కావాల్సిన కోర్సులు, లెర్నింగ్ ఆప్షన్స్పై చర్చించాలి. రానున్న రోజుల్లో సిలబస్ విధానం మార్చే అవకాశం ఉంది. అంతర్జాతీయ స్థాయిలో విద్యా సంస్థలతో ఎంవోయూలు పెంచుకోవాలి. విద్యావ్యవస్థలో ఏఐ భాగం కావాలి.. రానున్న రోజుల్లో ఏఐ టెక్నాలజీ ద్వారా విద్యావ్యవస్థలో సరికొత్త మార్పులు వస్తాయి. విద్యావ్యవస్థలో ఏఐని భాగం చేయాల్సిన అవసరం ఉంది. అగ్మెంటేషన్ రియాల్లీలను బోధనలో వాడుకోవడంపై దృష్టి సారించాలి. మన ఫ్యాకల్లీ కూడా ఆ స్థాయిలో పిల్లలకు విద్యనందించాలి. విద్యారంగంలో ఇప్పుడు జరుగుతున్న మార్పులను గమనిస్తే.. మనం ఒక స్థాయిలో ఉంటే.. లక్ష్యం ఇంకో స్థాయిలో ఉంది. ఈ గ్యాప్ను పూడ్చాలంటే.. ఏం చేయాలన్నదానిపై ఆలోచనలు చేయాలి. ఉన్నత విద్యా రంగంలో వైస్ఛాన్సలర్లది కీలక పాత్ర. టెక్నాలజీ పరంగా చూస్తే.. మొదటి రివల్యూషన్ 1784లో స్టీమ్తో రైలు ఇంజన్ రూపంలో చూశాం. తర్వాత 100 ఏళ్ల తర్వాత విద్యుత్ రూపంలో మరొక రివల్యూన్ చూశాం. మూడోది 1960–70 ప్రాంతంలో కంప్యూటర్లు, ఐటీ రంగం రూపేణా మరొక విప్లవం చూశాం. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రూపంలో నాలుగో విప్లవం దిశగా అడుగులు వేస్తున్నాం. రాబోయే రోజుల్లో విద్యావిధానాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పూర్తిగా మార్చబోతోంది. ఈ అడుగులో మనం వెనుకబడితే.. కేవలం అనుసరించే వాళ్లుగానే మనం మిగులుతాం. సరైన సమయంలో తగిన విధంగా అడుగులు వేయగలిగితే.. మనం ఈరంగాల్లో నాయకులమవుతాం. ఏఐ అభివృద్ధి చెందుతున్న కొద్దీ.. దీన్ని వినియోగించుకుని, సామర్ధ్యాన్ని పెంచుకునే వర్గం ఒకరు అయితే, ఏఐని క్రియేట్ చేసేవారు.. మరొక వర్గంగా తయారవుతారు. మనం క్రియేటర్లుగా మారాలి.. గతంలో స్టీం ఇంజిన్, ఎలక్ట్రిసిటీ, కంప్యూటర్ విప్లవాల్లో మనం వెనకడుగులోనే ఉన్నాం. మనం ఏదీ క్రియేట్ చేసే పరిస్థితిలో లేం. అందుకనే ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్లో మనం క్రియేటర్లుగా మారడం అన్నది చాలా ముఖ్యమైనది. ఈ రంగంలో మనం లీడర్లుగా తయారు కావడం చాలా ముఖ్యం. ఎమర్జింగ్ టెక్నాలజీస్లో మనం క్రియేటర్లుగా తయారు కావాలి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఒకవైపు మన విద్యావిధానంలోకి తీసుకువచ్చి.. విద్యార్థులకు బోధన, నేర్చుకునే సమర్థతను పెంచుకోవడంలో ఎలా వాడుకోవాలి? అన్న కార్యక్రమం చేస్తూనే.. రెండోవైపున ఏఐ క్రియట్ చేసే స్కిల్స్, టాలెంట్ను కూడా మన పిల్లల్లోకి తీసుకుని రావాలి. ఇది కూడా కరిక్యులమ్లో భాగం కావాల్సిన అవసరముంది. మార్పులకు శ్రీకారం.. ఇటీవలే జర్మన్ కాన్సులేట్ జనరల్ నన్ను కలిశారు. జర్మనీ లాంటి దేశంలో నైపుణ్యం ఉన్న మానవవనరుల కొరత ఉందని చెప్పారు. పాశ్చాత్య ప్రపంచం అంతా డెమోగ్రఫిక్ ఇన్బ్యాలెన్స్ ఎదుర్కొంటోంది. మనదేశంలో, మన రాష్ట్రంలో సుమారు 70శాతం మంది పనిచేసే వయస్సులో ఉన్నారు. వీరికి సరైన నాలెడ్జ్, స్కిల్స్ ఇవ్వలేకపోతే మనం ప్రపంచానికి మార్గనిర్దేశకులుగా ఉండలేం. ఇది వాస్తవం. అందుకే విద్యారంగంలో మార్పులకు మనం శ్రీకారం చుట్టాలి. ఏ రకమైన మార్పులకు శ్రీకారం చుడితే.. మనం అనుకున్నట్టు ఫలితాలు ఉంటాయి, విద్యారంగంలో ఇంకా మెరుగ్గా ఎలా చేయగలుగుతాం అన్నదానిపై ఆలోచనలు చేయాలి. మన పిల్లలు లీడర్లుగా ఉండాలి.. నలుగురితో నేను మాట్లాడి... నాకు అనిపించిన ఆలోచనలన్నింటినీ కూడా వీసీల ముందు ఉంచుతున్నాను. ఈ ఆలోచనలు కార్యాచరణలోకి రావాలి, వీటికి రూపకల్పన జరగాలి. ఇందులో మీ పాత్ర గరిష్టంగా ఉండాలి. ఈరోజు మనం మొట్టమొదటి అడుగు వేస్తున్నాం. ఈ తొలి అడుగు మన ఆలోచనలను చైతన్యం చేయడం ద్వారా విద్యారంగాన్ని ఇప్పుడున్న స్థాయి నుంచి మెరుగైన స్థాయికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ప్రపంచస్థాయిలో మన పిల్లలను అనేక రంగాల్లో లీడర్లుగా చూడాలనుకుంటున్నాం. ఇవాళ మనం చదివిస్తున్న, చదువుకుంటున్న చదువులు నిజంగానే.. ప్రపంచస్థాయిలో నాయకులుగా నిలబడగలిగే స్థాయిలో ఉన్నాయా? లేకపోతే.. ఎలా చేయాలన్న దానిపై ఆలోచనలు చేయాల్సిన అవసరం ఉంది. పిల్లలకు చదువులు చెప్తే విధానాలను పరిశీలిస్తే.. మనం కొన్ని సబ్జెక్టులను నిర్దేశిస్తున్నాం. ఒకసారి వెస్ట్రన్ కరిక్యులమ్ చూస్తే.. వెస్ట్రన్ వరల్డ్లో... ఒక ఫ్యాకల్టీని తీసుకుంటే.. చాలా వర్టికల్స్ కనిపిస్తాయి. విద్యార్థులకు మరిన్ని ఆప్షన్స్ ఇవ్వాలి.. ఒక బీకాంలోనే అసెట్ మేనేజ్మెంట్, ఫైనాన్సియల్ మార్కెట్, రిస్క్ మేనేజ్మెంట్, సెక్యూరిటీ అనాలసిస్ ఇలాంటి వర్టికల్స్ ఎన్నో ఉన్నాయి. మన దగ్గర లేవు. మంచి డిగ్రీ రావాలంటే విదేశాలకు పోవాల్సిందే. మనం కూడా చదువుకునే విద్యార్థులకు మరిన్ని ఆప్షన్లు ఇవ్వాలి. వారు కావాల్సిన వర్టికల్స్ చదువుకునే అవకాశాలను ఇవ్వాలి. మనం డిగ్రీలకు సంబంధించి తాజాగా క్రెడిట్స్ఇస్తున్నాం. కానీ, వాటి స్థాయిని కూడా పెంచాల్సి ఉంది. పిల్లలకు కావాల్సిన కోర్సుల్లో బోధన అందించాల్సిన అవసరం ఉంది. ఆ రకంగా చేయడానికి ప్రతీ ఫ్యాకల్టీలో మనం క్రియేట్ చేయగలగాలి. దీనిపై ప్రతి వీసీ కూడా ఆలోచన చేయాలి. ఇవేకాకుండా రకరకాల అంశాల్లో అడుగులు పడాల్సి ఉంది. మనం ఇచ్చే డిగ్రీలకు సంబంధించి కూడా మార్పులు రావాల్సి ఉంది. ఇంటర్న్షిప్ను తప్పనిసరి చేసి, ఉద్యోగాల కల్పన దిశగా అడుగులేశాం. ఇది కూడా చాలా ముఖ్యమైన విషయం. వైద్య రంగంలో ఎన్నో మార్పులు.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను పూర్తిగా వినియోగించుకోవాలి. సెక్యూరిటీ అనాలసిస్, రిస్క్ మేనేజ్మెంట్ వంటి వర్టికల్ కోర్సులకు సంబంధించి బోధన చేసే స్థాయిలో మనం ఉన్నామా? లేదా? అన్నదికూడా చూడాలి. ఒకవేళ లేకపోతే.. అలాంటి కోర్సులు కావాలనుకునే విద్యార్థులకు బోధనను నిలిపేస్తామా? అంటే నిలిపివేయలేం. వర్చువల్ రియాలిటీని తీసుకునివచ్చి ఆగ్మెంటెడ్ రియాలిటీతో కలుపుతాం. ఎప్పుడైతే ఈ రెండూ కలిసాయో.. వర్చువల్ క్లాస్ టీచర్ విద్యార్ధులకు పాఠాలు చెబుతారు. ఆ మేరకు తరగతుల నిర్వహణ ఉండాలి. మెడికల్ కోర్సుల బోధనలో కూడా మార్పులు గణనీయంగా రావాల్సి ఉంది. 5 ఏళ్ల మెడికల్ కోర్సు రాబోయే రోజుల్లో ఇవాళ సాంకేతిక పరిజ్ఞానానికి తగినట్టుగా కూడా మార్పులు రావాలి. శరీరాన్ని కోసి ఆపరేషన్ చేసే రోజులు పోయాయి. కేవలం కొన్ని హోల్స్ చేసి.. కంప్యూటర్ల ద్వారా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను వాడకుని ఆపరేషన్ చేసే స్థాయి వచ్చింది. అందుకే వైద్యులకు రోబోటిక్స్, ఏఐలను పాఠ్యప్రణాళికలో, బోధనలో భాగస్వామ్యం చేయాలి. హర్యానాలోని ఒక మెడికల్ కాలేజీలో కూడా దీనికి సంబంధించిన కోర్సులనుకూడా పెట్టారు. కేవలం మెడిసిన్లో చికిత్సకు సంబంధించిన జ్ఞానం ఇవ్వడమేకాదు, టెక్నాలజీని ఎలా వాడుకోవాలన్న దానిపై పాఠ్యప్రణాళికలో మార్పులు తీసుకురావాలి. ప్రపంచవ్యాప్తంగా ఎమర్జింగ్ టెక్నాలజీని అవగాహన చేసుకోవాలి. దాన్ని కరిక్యులమ్లో ఇంటిగ్రేట్ చేసుకోవాలి. దాన్ని వినయోగించుకోవడం, ఆ రంగాల్లో బోధనను మెరుగుపరచడం చేయాలి. ఇవాళ ప్రపంచ వ్యాప్తంగా దీనికి సంబంధించిన కంటెంట్ అందుబాటులో ఉంది. అందులో వర్చువల్ రియాల్టీ, అగమెంటెడ్ రియాల్టీని కరిక్యులమ్లోకి తీసుకునిరావాలి. వ్యవసాయంలో కూడా గణనీయ మార్పులు.. వ్యవసాయం చేసే తీరుకూడా గణనీయంగా మారిపోతోంది. మన రాష్ట్రంలో గ్రామస్థాయిలో ఆర్బీకేలను తీసుకుని రావడం ద్వారా మిగతా రాష్ట్రాలతో పోలిస్తే.. గణనీయ మార్పులు తీసుకు వచ్చాం. గ్రామ స్ధాయిలో చేయిపట్టుకుని నడిపే వ్యవస్ధను తీసుకొచ్చాం. ఈ అడుగులు ఇక్కడితో ఆగిపోకూడదు. ప్రతి రైతును, ప్రతి ఎకరాలో సాగును కూడా చేయిపట్టుకుని నడిపించుకునే స్థాయికి వెళ్లాలి. ప్రతి ఎకరాలో భూసార పరీక్ష చేస్తాం. శాటిలైట్ ఇమేజ్ ద్వారా భూమిలో ఉన్న కాంపోజిషన్ చెప్పే పరిస్థితి ఉంది. డ్రోన్ల ద్వారా భూసారం ఇంకా దగ్గరగా తెలుసుకునే అవకాశం వస్తోంది. ఈ రిపోర్ట్ ద్వారా ప్లాంట్ డాక్టర్ కాన్సెప్ట్ తీసుకుని రావచ్చు. దీని ద్వారా ఆ పంటలకు ఎంత మోతాదులో ఎరువులు వేయాలో ఇట్టే తెలిసిపోతుంది. ఈ టెక్నాలజీని మనం పిల్లలకు నేర్పకపోతే.. మనం వెనకబడతాం. ప్రశ్నా పత్నం విధానం మారాలి.. ఆక్స్ఫర్డ్, హార్వర్డ్, ఎంఐటీ, కేంబ్రిడ్జ్ గాని చూస్తే.. వీళ్ల పాఠ్యపుస్తకాలు, వీళ్ల బోధనా పద్ధతులు, ప్రశ్నపత్రాలు రూపొందించే విధానం.. చాలా విభిన్నంగా ఉంటుంది. మనకు, వీరికీ తేడా ఎందుకు ఉంటుంది? అన్నదానిపై ఆలోచన చేయాలి. మన పిల్లలకు మంచి సబ్జెక్ట్ జ్ఞానం ఉండొచ్చు.. కానీ, వెస్ట్రన్ దేశాల మాదిరిగానే అక్కడ రూపొందించే ప్రశ్నలకు సమాధానాలు నింపే పరిస్థితుల్లో ఉన్నారా? అన్నది చూడాలి. ప్రశ్నా పత్నం విధానం మారాలి. వెస్ట్రన్ వరల్డ్ ఎలా బోధిస్తుందన్నది మన కరిక్యులమ్లోకి రావాలి. ఇవేమీ చేయకపోతే మనం వెనకబడి ఉంటాం. అక్కడ పాఠ్యపుస్తకాలు కూడా పిల్లలకు ఇచ్చి.. సమాధానాలు రాయించి.. ప్రాక్టికల్ అప్లికబిలిటీ ఉందా? లేదా? అని చూస్తారు. మనం ప్రాక్టికల్ అప్లికబులిటీ ఆఫ్ నాలెడ్జ్ను తీసుకునిరావడం లేదు. అందుకే ప్రశ్నపత్రాల రూపకల్పన, బోధనా పద్ధతులు పూర్తిగా మారాలి. ఇవన్నీకూడా అత్యంత కీలకమైన అంశాలు. ఇవన్నీ చేయాల్సిన మార్పులు. ఇవి చేయకపోతే వెనుకబడతాం. ఇవన్నీ చేయాలంటే.. ఎలా చేయాలి? ఎలా చేయగలుగుతాం? అన్నది ఆలోచన చేయాలి. ఒక్కో యూనివర్శిటీ ఒక్కో రకంగా కరిక్యులమ్ తయారు చేయలేదు. ఒక్కో మాదిరిగా ఉండలేదు. మనం చేస్తున్న విజన్ కోసం ఒక హైలెవల్ అకడమిక్ బోర్డు మనకు అవసరం. ప్రపంచంలోనే అత్యుత్తమ ప్రతిభావంతులతో ఈ బోర్డును ఏర్పాటు చేద్దాం. ఆ బోర్డు ఏర్పాటు చేసిన తర్వాత వాళ్లకు పైన చెప్పిన అంశాలన్నింటినీ ఇంటిగ్రేట్ చేస్తూ ఈ మార్పులతో కరిక్యులమ్ను రీడిజైన్ చేద్దాం. పాఠ్యప్రణాళికను, బోధనను, ప్రశ్నపత్రాల తీరును మారుద్దాం. వర్చువల్ రియాలిటీ, ఏఐ టెక్నాలజీని పాఠ్యప్రణాళికలో భాగం చేద్దాం. బోధనలో కూడా వాడుకుందాం. ఇవన్నీ అత్యంత సమర్ధవంతంగా ఎలా చేయాలన్నదానిపై ఆలోచన చేయడానికే బోర్డు ఏర్పాటు చేద్దాం. ప్రాథమిక విద్యాస్థాయి నుంచే మార్పులు రావాలి.. కేవలం ఉన్నత విద్యాస్థాయిలోనే మార్పులు చేస్తే ఫలితాలు రావు. ప్రాథమిక విద్యాస్థాయి నుంచే ఈ మార్పులు రావాలి. ఆ దిశగా ఇప్పటికే కొన్ని అడుగులు పడ్డాయి. స్కూళ్లను ఇప్పటికే ఇంగ్లీష్ మీడియంలోకి మార్పు చేశాం. బైలింగువల్ పాఠ్యపుస్తకాలు ఇచ్చాం. ఆరోవ తరగతి ఆ పైనున్న తరగతులను డిజిటల్ క్లాస్ రూమ్స్లా మార్చాం. తరగతి గదుల్లో ఐఎఫ్పీ ప్యానెల్స్ ఏర్పాటు చేస్తున్నాం. డిసెంబరు నాటికి 6వ తరగతి ఆపై తరగతులకు చెందిన 63వేల క్లాస్రూమ్స్ను ఐఎఫ్పి ఫ్యానెల్స్తో డిజిటలైజ్ చేస్తున్నాం. ఇప్పటికే 31వేల తరగతి గదులకు ప్యానెల్స్ ఏర్పాటు చేశాం. బైజూస్ కంటెంట్ను ఇంటిగ్రేట్ చేశాం. 8వ తరగతి విద్యార్థులకు ట్యాబులు ఇచ్చాం. దీనికి తదుపరిగా తీసుకు రావాల్సిన మార్పులు తీసుకురావాలి. వీఆర్, ఏఆర్, ఏఐలని టెక్నాలజీని వాడుకుని వారికి మంచి బోధన, నేర్చుకునే సమర్థతను పెంచాలి. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ క్రియేటర్లుగా కూడా తొలిఅడుగులు అక్కడ పడాలి. అందుకే పాఠశాల విద్య స్థాయిలో ఒక బోర్డును, హయ్యర్ఎడ్యుకేషన్ లెవల్లో మరొక బోర్డును ఏర్పాటు చేయాలి. ఈ రెండింటిని ఇంటిగ్రేట్ చేయాలి. పౌండేషన్ లెవల్ నుంచి హయ్యర్ ఎడ్యుకేషన్ వరకు తీసుకుంటున్న చర్యలను సినర్జీ చేయాలి. కలను సాకారం చేసుకోవాలి.. నా ఆలోచనలను తదుపరిస్థాయికి మీరు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఎమర్జింగ్ టెక్నాలజీస్లో పలు విధానాలు ఇప్పటికే వచ్చేశాయి. కాని వాటి ఫ్యాకల్టీలో మనం వెనకబడి ఉన్నాం. కంటెంట్ ఇంటర్నెట్లో అందుబాటులో ఉంది. దాన్ని ఎలా వాడుకోవాలి అన్నదానిపై మనం ఆలోచన ఉండాలి. శిక్షణ ఇచ్చుకుంటూ పోతే మనకూ తగినంత ఫ్యాకల్టీ సిద్ధం అవుతారు. ఆ రకంగా దీన్ని అధిగమించాలి. దీనిపై మరిన్ని సాలోచనలు చేయడానికి నాలుగైదు యూనివర్సిటీలతో వర్కింగ్ గ్రూపులను ఏర్పాటు చేయాలి. మెడికల్, ఇంజనీరింగ్తో పాటు ఇతర ఫ్యాకల్టీలు కూడా గ్రూపులుగా ఏర్పాటు చేసుకుని అత్యుత్తమ పాఠ్యప్రణాళిక, అత్యుత్తమ బోధనా పద్ధతులను ఖరారు చేయాలి. మన కలను సాకారం చేసుకోవాలి అని సూచనలు చేశారు. ఇది కూడా చదవండి: రామోజీ కథ, బాబు నిర్మాత, పవన్ యాక్టర్: ఎంపీ భరత్ సీరియస్ -
విద్యాశాఖ అధికారులు, యూనివర్శిటీ వీసీలతో సీఎం జగన్ కీలక సమావేశం
సాక్షి, తాడేపల్లి: పాఠశాల విద్య, ఉన్నత విద్యలో కీలక మార్పులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అడుగులు వేస్తున్నారు. విద్యాశాఖ అధికారులు, యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్లతో తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో సీఎం కీలక సమావేశం చేపట్టారు. విద్యారంగంలో కీలక మార్పులపై సమాలోచనలు చేశారు. బోధనలో, నైపుణ్యాభివృద్ధిలో ఎమర్జింగ్ టెక్నాలజీస్ అనుసంధానంపై సీఎం కీలక దృష్టి సారించారు. ఏఐ, వర్చువల్ రియాల్టీ, అగ్మెంటేషన్ రియాల్టీలను బోధనలో వాడుకోవడంపై ప్రధానంగా చర్చించారు. ఈ సమావేశానికి స్టేట్ హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ ఛైర్మన్ హేమచంద్రారెడ్డి, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. హేమచంద్రారెడ్డి, స్టేట్ హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ ఛైర్మన్ రాష్ట్రానికి, విద్యావ్యవస్థకు ,యువకులకు సీఎం వైఎస్ జగన్ దిశానిర్దేశం చేశారు అంతర్జాతీయ ప్రమాణాలతో ప్రతి విద్యార్థికి ఉన్నత విద్య అందించాలన్నది సీఎం ఆరాటం దేశం యావత్తు దృష్టి ఆకర్షించేలా రాష్ట్రంలో విద్యావిధానం అమలు చేయాలని సీఎం ఆదేశించారు ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ వ్యనస్థను ప్రవేశపెట్టి విద్యార్థులకు అందివ్వాలని సీఎం ఆదేశించారు రొటీన్ విద్యావిధానం కాకుండా విద్యార్థుల ఆశలు ఆశయాలకు అనుగుణంగా కరిక్యులమ్ రూపొందించాలని సీఎం ఆదేశించారు వీసీలు నాలుగు గ్రూపులుగా విడిపోయి నాలుగు టాపిక్ లపై చర్చించాలని సీఎం ఆదేశించారు చర్చించిన అంశాలు సిఫార్సులపై సాయంత్రం తనకుకు నివేదిక ఇవ్వాలని సీఎం ఆదేశించారు ప్రపంచ స్థాయి ప్రమాణాలతో విద్యావిధానం అమలు చేయాలని సీఎం ఆదేశించారు టెక్నాలజీ ప్రవేశం సహా అంతర్జాతీయ స్థాయి లో పలు అంశాలను కరిక్యులమ్ లో జోడించాలని సీఎం ఆదేశించారు వీసీలంతా కలసి కరిక్యులమ్ సిద్దం చేయాలని సీఎం ఆదేశించారు మా ఆలోచనలతో సీఎంకు నివేదిక అందిస్తాం గడచిన నాలుగేళ్లుగా యూనివర్సిటీల్లో ఎక్కడా రాజకీయాలు ఏవీ లేవు రాష్ట్రంలో విద్యావిధానం నాణ్యంగా,ఆదర్శంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు ప్రసాదరెడ్డి,ఆంధ్రా యూనివర్సిటీ వీసీ ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ పై సీఎం మాకు దిశానిర్దేశం చేశారు అంతర్జాతీయంగా పరీక్షా విధానం వేరుగా ఉంటుందని తెలిపారు ఓపెన్ బుక్ విధానంలో పరీక్షా విధానం అమలును పరిశీలించాలని సీఎం ఆదేశించారు అంతర్జాతీయ స్థాయిలో అమలవుతోన్న ఒపెన్ బుక్ పరీక్షా విధానం అమలు చేయాలని సీఎం ఆదేశించారు రానున్న 5 ఏళ్లలో లీడ్ రోల్ విధానం అమలు చేసేలా నూతన విద్యా విధానం అమలు చేయాలని సీఎం ఆదేశించారు యావత్ దేశం మన రాష్ట్రం వైపు చూసేలా నూతన విద్యా విధానం ఉండాలన్నారు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ లో స్టూడెంట్ కు కావాల్సిన కోర్సులు ,లెర్నింగ్ ఆప్షన్లపై చర్చించాలన్నారు అంతర్జాతీయ స్థాయిలో పేరొందిన విద్యావిధానం, పరీక్షా విధానంలో సంస్కరణలు అమలు చేయలని సీఎం సూచించారు ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ను తీసుకురావడంపై సమగ్రంగా చర్చించాలని సీఎం ఆదేశించారు గ్లోబల్ గా ఎడ్యుకేషన్ మాప్స్ లో ఎపీ ఉండాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలో చర్చించాలన్నారు ఇంటర్నేషనల్ ప్రొఫెసర్లను పిలచి విద్యావిధానంలో తీసుకోవాల్సిన మార్పులపై చర్చించాలని నిర్దేశించారు విష్ణువర్దన్ రెడ్డి ఎన్జీరంగా విశ్వవిద్యాలయం వీసీ వ్యవసాయరంగంలో అభివృద్ది జరగాలని సీఎం ఆదేశించారు వ్యవసాయ విశ్వ విద్యాలయం విద్యావ్యవస్థలో మార్పు జరగాలని సీఎం ఆదేశించారు లోయర్ ,హయ్యర్ ఎడ్యుకేషన్ లో టెక్నాలజీ వినియోగించి మార్పులు తీసుకోవాలని సీఎం ఆదేశించారు ప్రొఫెసర్ భారతి, పద్మావతి విశ్వ విద్యాలయం వీసీ అంతర్జాతీయ స్థాయిలో విద్యా సంస్థలతో ఎంవోయూలు పెంచుకోవాలని సీఎం ఆదేశించారు అంతర్జాతీయ స్థాయిలో మెరుగైన విద్యావిధానం తీసుకురావాలని సీఎం ఆదేశించారు బాబ్జి, వైఎస్ఆర్ యూనివర్సిటీ వీసీ వైద్య విద్యలో ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ద్వారా మెరుగైన ఫలితాలుంటాయి పేషంట్లకు అధునాతన పద్దతుల్లో మెరుగైన వైద్యం అందించేలా మెడికల్ స్టూడెంట్స్ కు విద్యా బోధన అందించాలని సీఎం ఆదేశించారు ప్రసాదరాజు, జెఎన్ టీయూ వీసీ మన విద్యార్థులు క్రియేటప్లుగా ఉండాలికానీ ఫాలోవర్లుగా ఉండకూడడదని సీఎం ఆదేశించారు ఉన్నత వుద్యలో నాలెడ్జ్ క్రియేటర్లుగా ఉండాలని సీఎం ఆదేశించారు రానున్న రోజుల్లో సిలబస్, పరీక్షా విధానం సమూలంగా మార్చే అవకాశం ఉంది చదవండి: ఎగిరి గంతేసిన టీడీపీ.. తీరా చూస్తే.. అసలు గుట్టు తెలిసిందిలే.. -
US: యూనివర్సిటీల్లో ఆ రిజర్వేషన్లపై నిషేధం
వాషింగ్టన్ డీసీ: అమెరికా సుప్రీం కోర్టు గురువారం సంచలన తీర్పు ఇచ్చింది. యూనివర్సిటీల అడ్మిషన్లలో జాతి సంబంధిత రిజర్వేషన్లపై నిషేధం విధిస్తున్నట్లు ఆదేశాలు జారీ చేసింది. ఈ తీర్పుపై సర్వత్రా ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయి. ఆఫ్రో-అమెరికన్లు, ఇతర మైనారిటీలకు విద్యావకాశాలను పెంపొందించే ఉద్దేశంతో యూనివర్సిటీ అడ్మిషన్లను అమలు చేస్తున్నారు. 1960 సంవత్సరం నుంచి ఇవి అమలు అవుతున్నాయి. ఈ మేరకు అడ్మిషన్ విధానాల్లో జాతి, తెగ పదాలను ప్రధానంగా ఉపయోగిస్తూ వస్తున్నారు. అయితే.. ఇకపై ఆ పదాలను ఉపయోగించడానికి వీల్లేదని.. ఆ పదాలను నిషేధిస్తూ అమెరికా అత్యున్నత న్యాయస్థానం తీర్పు వెల్లడించింది. 👨⚖️ ఈ మేరకు చీఫ్ జస్టిస్ జాన్ రాబర్ట్స్ ఆ సంచలన తీర్పు చదువుతూ.. ఒక స్టూడెంట్ను అతని అనుభవాల ఆధారంగా పరిగణించబడాలిగానీ జాతి ఆధారంగా కాదు. యూనివర్సిటీలలో ఇకపై జాతి సంబంధిత అడ్మిషన్లు కొనసాగడానికి వీల్లేదు అంటూ తీర్పు కాపీని చదివి వినిపించారాయన. 👉 అమెరికాలో అత్యంత పురాతనమైన ఉన్నత విద్యాసంస్థలు హార్వర్డ్ యూనివర్సిటీ, యూనివర్శిటీ ఆఫ్ నార్త్ కరోలినా (UNC)ల్లో అడ్మిషన్ల విధానంలో పారదర్శకత కోరుతూ ఓ విద్యార్థి సంఘం వేసిన పిటిషన్ ఆధారంగా అమెరికా సుప్రీం కోర్టు ఈ తీర్పు వెల్లడించింది. 👉 ఒకప్పుడు అఫ్రో-అమెరికన్ల పట్ల విపరీతమైన జాతి వివక్ష కొనసాగేది. ఈ క్రమంలోనే అమెరికా ఉన్నత విద్యాసంస్థల్లో వాళ్లకు అవకాశాలు దక్కేవి కావు. 👉 అయితే.. 1960లో జరిగిన పౌర హక్కుల ఉద్యమం ఆధారంగా యూనివర్సిటీలలో నల్ల జాతి పౌరులకు,ఇతర మైనారీటీలకు విద్యావకాశాలు అందజేసే ఉద్దేశంతో పలు నూతన విధానాలు తీసుకొచ్చారు. 👉 అయితే.. జాతి సంబంధిత అడ్మిషన్ విధానాల వల్ల సమానత్వానికి తావు లేకుండా పోయిందని, పైగా మెరుగైన అర్హత కలిగిన ఆసియా అమెరికన్లకు అవకాశాలు దూరం అవుతున్నాయని సదరు గ్రూప్ సుప్రీం ముందు వాదించింది. 👉 నల్లజాతి అమెరికన్లకు చోటు కల్పించేందుకు ఆసియన్ల పట్ల వివక్ష చూపుతున్నారన్నది ప్రధాన అభ్యంతరం చాలా కాలంగా కొనసాగుతోందక్కడ. 👨⚖️ తాజాగా.. సుప్రీం కోర్టు ధర్మాసనంలోని 6-3 న్యాయమూర్తుల మెజార్టీ సదరు రెండు యూనివర్సిటీలలో జాతి సంబంధిత అడ్మిషన్లు చెల్లవంటూ తీర్పు ఇచ్చింది. ట్రంప్ తప్పా అంతా ఆగ్రహం యూనివర్శిటీ అడ్మిషన్లలో రిజర్వేషన్లపై నిషేధం తీర్పుపై ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. తీర్పుతో తాను విబేధిస్తున్నట్లు తెలిపారాయన. అమెరికాలో వివక్ష ఇంకా మనుగడలోనే ఉందన్న విషయాన్ని గుర్తు చేశారాయన. జాతుల పరంగా వైవిధ్యం ఉన్నప్పుడే అమెరికా విద్యాసంస్థలు బలోపేతంగా ఉంటాయని తాను భావిస్తున్నట్లు అభిప్రాయపడ్డారు. కోర్టు తీర్పు తుది నిర్ణయం కాదంటూ ప్రధానంగా ప్రస్తావించారాయన. The odds have been stacked against working people for too long – we cannot let today's Supreme Court decision effectively ending affirmative action in higher education take us backwards. We can and must do better. pic.twitter.com/Myy3D5jUGH — President Biden (@POTUS) June 30, 2023 సుప్రీం తీర్పు.. భవిష్యత్తు తరాలకు అవకాశాలను నిరాకరించడమే అవుతుందని ఉపాధ్యక్షురాలు కమలా హ్యారీస్ అభిప్రాయపడ్డారు. తీర్పును వర్ణాంధత్వం అంటూ అభివర్ణించిన ఆమె.. దేశాన్ని వెనక్కి తీసుకెళ్లడమే అంటూ తీవ్రంగా వ్యతిరేకించారామె. Today’s Supreme Court decision in Students for Fair Admissions v. Harvard and Students for Fair Admissions v. University of North Carolina is a step backward for our nation. Read my full statement. pic.twitter.com/pIBCmVMr6d — Vice President Kamala Harris (@VP) June 29, 2023 రిజర్వేషన్లపై నిషేధం విధిస్తూ సుప్రీం ఇచ్చిన తీర్పుపై మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా మండిపడ్డారు. అందరికీ అవకాశాల పేరిటే ఈ విధానాలు తెరపైకి వచ్చాయని.. తద్వారానే తాను, తన భార్య మిచెల్లీ లాంటి వాళ్లం వృద్ధిలోకి వచ్చామని అంటున్నారాయన. ఆ విధానాలు తెచ్చిన ఉద్దేశ్యాన్ని న్యాయవ్యవస్థ గుర్తించి ఉంటే బాగుండేదని అంటున్నారాయన. Affirmative action was never a complete answer in the drive towards a more just society. But for generations of students who had been systematically excluded from most of America’s key institutions—it gave us the chance to show we more than deserved a seat at the table. In the… https://t.co/Kr0ODATEq3 — Barack Obama (@BarackObama) June 29, 2023 ట్రంప్ మాత్రం ఇలా.. ఇది గొప్ప శుభదినం అంటూ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. సుప్రీం తీర్పుపై హర్షం వ్యక్తం చేసిన ఆయన.. సోషల్ మీడియాలో ఓ సుదీర్ఘమైన పోస్ట్ సైతం ఉంచారు. అమెరికాకు ఇది గొప్ప రోజు. ఇది ప్రతి ఒక్కరూ ఎదురుచూసిన.. ఆశించిన తీర్పు. దీని ఫలితం అద్భుతంగా ఉంటుంది. ప్రపంచంలోని ఇతర దేశాలతో మనల్ని పోటీగా ఉంచుతుంది అంటూ ట్రూత్సోషల్లో పోస్ట్ చేశారాయన. -
ఉన్నతశ్రేణి విద్య మిథ్యేనా?!
ఒకప్పుడు ప్రపంచానికి నలందా, తక్షశిలవంటి అత్యుత్తమ శ్రేణి విద్యాకేంద్రాలను అందించి, విశ్వమంతటా విజ్ఞాన కాంతులు వెదజల్లిన భారత్ చాన్నాళ్లుగా విద్యారంగంలో వెలవెలబోతోందన్న అసంతృప్తి ఉంది. ప్రతిష్ఠాత్మక క్యూఎస్ ప్రపంచ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ తాజా జాబితాలో మొదటి 150లో మన దేశానికి చోటుదక్కింది. అంతర్జాతీయంగా చూస్తే ఇదేమంత గొప్ప ర్యాంకు కాకపోవచ్చు. వినడానికి కాస్త ఇబ్బందిగా కూడా ఉండొచ్చు. ఎందుకంటే ప్రపంచ శ్రేణి విద్యాసంస్థలనదగ్గ 1,500 విశ్వవిద్యాలయాల జాబితాను ఆ సంస్థ ప్రకటిస్తే మొదటి పదిలో, కనీసం మొదటి యాభైలో, పోనీ... మొదటి వందలో మన విద్యాసంస్థలేవీ లేవు. బొంబాయి ఐఐటీ ఈ జాబితాలో 149వ స్థానాన్ని పొందగలిగింది. ఆ సంస్థకు ఈ స్థాయి గౌరవం దక్కటం ఎనిమిదేళ్ల తర్వాత ఇదే ప్రథమం. బెంగళూరు ఐఐఎస్సీ తొలి 200 ర్యాంకుల్లో స్థానం దక్కించుకోలేకపోగా, మద్రాస్ ఐఐటీ నిరుడున్న 174వ స్థానాన్ని చేజార్చుకుని 197కి పోయింది. దాన్ని బట్టి మన ఉన్నత విద్యాకేంద్రాల తీరుతెన్నులెలా ఉన్నాయో సులభంగానే గ్రహించవచ్చు. ఏటా రివాజుగా క్యూఎస్ ర్యాంకులు ప్రక టించటం, అందులో మన యూనివర్సిటీలు ఎక్కడో అట్టడుగున ఉండటం అనేకులను బాధిస్తోంది. ప్రపంచం మొత్తంలో 30,000 వరకూ విశ్వవిద్యాలయాలున్నాయి. క్యూఎస్ సంస్థ ఏటా అందులో అత్యుత్తమంగా భావించిన 5 శాతాన్ని... అంటే 1,500 యూనివర్సిటీలను ఎంపిక చేసుకుని వాటి వాటి అర్హతల ఆధారంగా ర్యాంకులు ఇస్తుంది. జీవితంలో ఎదగాలన్న తపన, తాప త్రయం ఉన్నవారు...తమ జ్ఞాన తృష్ణ తీర్చుకోవటానికి అనువైన విద్యాకేంద్రం కోసం అన్వేషిస్తున్న వారు మెరుగైన విశ్వవిద్యాలయం కోసం వెదుకులాడతారు. ప్రపంచం ఇంతగా ఎదిగినా, బహుళ రంగాల్లో అభివృద్ధి సాధించినా అత్యుత్తమ శ్రేణి సంస్థను ఎంపిక చేసుకోవటం ఏ విద్యార్థికైనా అంత సులభం కాదు. ఎందుకంటే ప్రతి విశ్వవిద్యాలయమూ తమ దగ్గరున్న అధ్యాపక బృందం గురించి, తమ బోధనాంశాల తీరుతెన్నుల గురించి, పరిశోధనలకు అందే ప్రాధాన్యత గురించి స్వోత్కర్షలకు పోతుంది. కానీ తటస్థ సంస్థలు నిర్దిష్టమైన గీటురాళ్లు రూపొందించుకుని వాటి మంచిచెడ్డలను చెప్పగలిగితే విద్యార్జన కోసం తాపత్రయపడే యువతకు ఎంపిక సులభమవుతుంది. అంతేకాదు...ఈ తులనాత్మక విశ్లేషణ పరిశోధన కోసం తపించే విద్యార్థులకూ, విధాన నిర్ణేతలకూ కూడా సాయపడుతుంది. విధానపరమైన నిర్ణయాల కోసం చేసే అధ్యయనంలో ఏ విశ్వవిద్యా లయం తోడ్పాటు తీసుకోవచ్చునో, నిధుల విడుదలలో ఏ సంస్థకు ప్రాధాన్యం ఇవ్వాలో విధాన నిర్ణేతలు నిర్ణయించుకుంటారు. ప్రైవేటు రంగ పరిశ్రమలకు కూడా ఈ ర్యాంకింగ్లే ఆధారం. క్యూఎస్ సంస్థ ఆ పని చేస్తోంది. ఈనెల మొదటివారంలో కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖకు అనుబంధంగా ఉండే ఎన్ఐఆర్ఎఫ్ అత్యుత్తమ శ్రేణి విద్యాసంస్థల జాబితాను విడుదల చేసింది. అందులో విశ్వవిద్యాలయాల్లో బెంగళూరులోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ప్రథమ స్థానం పొందగా, ఢిల్లీ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ రెండో స్థానంలో, అక్కడి జమియా మిలియా ఇస్లామియా మూడో స్థానంలో నిలిచాయి. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం పదో ర్యాంకులో ఉంది. అలాగే ఐఐటీల్లో మద్రాస్ ఐఐటీ ప్రథమ స్థానంలో, బొంబాయి ఐఐటీ ద్వితీయ స్థానంలో ఉన్నాయి. అయితే అంతర్జాతీయ ర్యాంకింగ్ల విషయంలో విమర్శలు కూడా ఉన్నాయి. విశ్వవిద్యాల యాల్లో సాగే పరిశోధనలు, ఆ సంస్థల పేరుప్రఖ్యాతులు, అక్కడుండే విద్యార్థి–అధ్యాపక నిష్పత్తి, అంతర్జాతీయ వైవిధ్యత తదితరాలను క్యూఎస్ వంటి సంస్థలు గీటురాళ్లుగా తీసుకుంటున్నాయి. సహజంగానే ఈ అంశాలన్నిటా సంపన్న దేశాల్లోని విశ్వవిద్యాలయాలే ముందంజలో ఉంటాయి. వాటికి అటు ప్రభుత్వాలనుంచీ, ఇటు ప్రైవేటు సంస్థలనుంచీ నిధులు దండిగా వస్తాయి. వెనకబడిన దేశాల్లోని విశ్వవిద్యాలయాల్లో అత్యుత్తమ శ్రేణి అధ్యాపకులున్నా, అక్కడ మెరికల్లాంటి విద్యార్థులు రూపొందుతున్నా క్యూఎస్ సంస్థకు పట్టవు. అందువల్లే ఇలాంటి జాబితాల విశ్వసనీయతపైనా, వాటి కచ్చితత్వంపైనా విద్యారంగ నిపుణులు పెదవి విరుస్తుంటారు. ఈ విమర్శలను పరిగణనలోకి తీసుకుని కాబోలు... విద్యాసంస్థల నిర్వహణ, పరిశోధనలకుండే అంతర్జాతీయ నెట్వర్క్, అక్కడి విద్యార్థులకు లభించే ఉద్యోగావకాశాలు అనే అంశాలను ఈసారి చేర్చింది. ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి. మన దేశంలో ఉన్నత విద్యారంగాన్ని గత మూడు దశాబ్దాలుగా ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేశాయి. పూర్తికాలం పనిచేసే అత్యుత్తమ అధ్యాపకులను ఎంపిక చేయటానికి, అవసరమైన నిధులు కేటాయించి విశ్వవిద్యాలయాలను తీర్చిదిద్దటానికి పాలకులు ముందుకు రావటం లేదు. ఖాళీ అవు తున్న స్థానాల్లో కాంట్రాక్టు లెక్చరర్లను నియమించి చేతులు దులుపుకుంటున్నారు. మన విశ్వవిద్యా లయాలకు ప్రపంచశ్రేణి గుర్తింపు తీసుకురావాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలో సూచించడానికి మాజీ ఎన్నికల ప్రధాన కమిషనర్ ఆధ్వర్యంలో 13 మందితో నిపుణుల కమిటీని ఏర్పాటుచేశారు. ఆ తర్వాత ప్రభుత్వ రంగంలో పది, ప్రైవేటు రంగంలో పది ఉన్నత విద్యాసంస్థలను ఆ కమిటీ ఎంపిక చేసింది. వాటికి తలో వందకోట్లు నిధులిస్తున్నామని కూడా ప్రకటించారు. అయితే క్యూఎస్ ఎంపిక చేసిన జాబితాలో ఒక్క బొంబాయి ఐఐటీ మాత్రమే ఆ మాత్రమైనా స్థానం సంపాదించుకోగలిగింది. ర్యాంకింగ్ల సంగతలావుంచి మన ఉన్నత విద్యారంగాన్ని ప్రక్షాళన చేయాల్సిన అవసరమైతే ఉంది. ఆ దిశగా చర్యలకు ఉపక్రమిస్తే భావి తరాలు ఉన్నత స్థాయికి ఎదుగుతాయి. మన దేశానికి మళ్లీ గత వైభవం సాధ్యమవుతుంది. -
ర్యాంకుల్లో తెలంగాణ రాష్ట్రం వెనుకబాటు బాధాకరం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మంచి విద్యార్థులు, అధ్యాపకులు ఉన్నా, జాతీయ ర్యాంకుల్లో తెలంగాణ వెనుకబడటం బాధాకరమని గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందర రాజన్ అన్నారు. సమాజ శ్రేయస్సే లక్ష్యంగా, విద్యార్థుల ఉజ్వల భవిష్యత్ ధ్యేయంగా వర్సిటీల వీసీలు పనిచేయాల్సిన అవసరం ఉందని ఉద్బో«దించారు. రాజ్భవన్లో సోమవారం ఆమె విశ్వవిద్యాలయాల వైఎస్ చాన్స్లర్లతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ.. ఎన్ఐఆర్ఎఫ్ వంటి జాతీయ స్థాయి ర్యాంకుల్లో మనం ఎందుకు వెనుకబడ్డామనేది గుర్తించాలని, ఈ లోపాన్ని అధిగమించేందుకు కృషి చేయాలని సూచించారు. విశ్వవిద్యాలయాల నుంచి బయటకొచ్చే విద్యార్థులను ఉద్యోగాలు కల్పించే వారిగా తీర్చిదిద్దాలని, ఉన్నత విద్యలో మౌలిక వసతుల కల్పనకు తోడ్పడాలని సూచించారు. విద్యాలయాల్లో, ముఖ్యంగా అమ్మాయిలుండే కాలేజీల్లో పరిశుభ్రతకు ప్రాధాన్యమివ్వాలన్నారు. విద్యార్థులను సామాజిక బాధ్యత, పరిశోధన, కొత్తదనం వైపు నడిపించాల్సిన బాధ్యత విశ్వవిద్యాలయాలపైనే ఉందన్నారు. ఈ దిశగా కృషి చేసిన వర్సిటీలకు ఉత్తమ అవార్డులు అందిస్తామన్నారు. కామన్ రిక్రూట్మెంట్ బోర్డు విషయంలో యూజీసీ, ఇతర విశ్వవిద్యాలయాలు, విద్యావేత్తలు నుంచి సమాచారం తీసుకున్నానని, తన వ్యాఖ్యలతో బిల్లును రాష్ట్రపతికి సిఫార్సు చేశానని గవర్నర్ తెలిపారు. ఈ క్రమంలో తాను వివిధ యూనివర్సిటీలను సందర్శించానని, కొంతమంది వీసీలను తొలగించాల్సి ఉన్నా కూడా కొనసాగించాల్సి వచ్చిందన్నారు. ప్రైవేటు వర్సిటీల బిల్లు విషయంలోనూ విద్యార్థులకు ఏది ఉపయోగమో అదే చేస్తానన్నారు. బిల్లును రాష్ట్రపతికి పంపినట్టు తెలిపారు. పూర్వ విద్యార్థుల సేవలు వాడుకోవాలి.. వర్సిటీలు పూర్వ విద్యార్థుల సేవలను వినియోగించుకోవాలని, క్రీడలను ప్రోత్సహించాలని గవర్నర్ తమిళిసై సూచించారు. ఈ అంశాలపై తనకు నివేదిక ఇవ్వాలని వీసీలను ఆదేశించారు. బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడటం బాధాకరమన్నారు. వారిలో మనోధైర్యం నింపేలా విద్యాబోధన జరగాలన్నారు. వీసీలకు పరిమితులన్నా విద్యార్థుల కోసం పనిచేయాలని కోరారు. ఈ సందర్భంగా విద్యార్థులకోసం డిజిటల్ లైబ్రరీని ఆమె ప్రారంభించారు. కార్యక్రమంలో వివిధ వర్సిటీల వీసీలు.. లక్ష్మీకాంత్ రాథోడ్, గోపాల్రెడ్డి, నీరజ్ ప్రభాకర్, కవిత థరియా రావు, రవీందర్ రెడ్డి, బి.కరుణాకర్ రెడ్డి, విజ్జులత, కిషన్రావు, రిజిస్ట్రార్లు లక్ష్మీనారాయణ, వెంకటరమణ పాల్గొన్నారు. కాగా, జేఎన్టీయూహెచ్, ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీల వీసీలు గవర్నర్ సమావేశానికి రాకపోవడం చర్చనీయాంశమైంది. -
మీరు స్టూడెంట్సా? యాపిల్ బంపరాఫర్.. భారీ డిస్కౌంట్లు, ఫ్రీగా ఎయిర్ పాడ్స్!
భారతీయ విద్యార్ధులకు ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ శుభవార్త చెప్పింది. వారి కోసం ప్రత్యేక సేల్ను అందుబాటులోకి తెచ్చింది. ‘బ్యాక్ టూ యూనివర్సిటీ 2023’ పేరుతో జూన్ 22 నుంచి అక్టోబర్ 2 వరకు జరిగే ఈ సేల్లో విద్యార్ధులు కొనుగోలు చేసే ఐపాడ్, మ్యాక్బుక్స్,డెస్క్ ట్యాప్ కంప్యూటర్లపై భారీ డిస్కౌంట్లు ఇస్తున్నట్లు తెలిపింది. 11 అంగుళాల యాపిల్ ఐపాడ్ ప్రో, 12.9 అంగుళాల ఐపాడ్ ప్రో, 24 అంగుళాల ఐపాడ్ పో’లు డిస్కౌంట్ ధరకే సొంతం చేసుకోవచ్చని పేర్కొంది. ఇక, ఈ సేల్లో కొనుగోలు చేసే ప్రొడక్ట్లపై ఉచితంగా ఎయిర్ పాడ్స్, యాపిల్ కేర్ ప్లస్ ప్లాన్స్ పై 20 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. బ్యాక్ టూ యూనివర్సిటీ సేల్లో విద్యార్ధులతో పాటు బోధన,బోధనేతర సిబ్బంది యాపిల్ ప్రొడక్ట్లను మార్కెట్ ధర కంటే తక్కువకే పొందవచ్చు. ప్రస్తుతం, కొనసాగుతున్న సేల్లో అర్హులైన కస్టమర్లు 11 అంగుళాల ఐపాడ్ ప్రో ధర రూ.96,900 ఉంటే రూ.76,900కే కొనుగోలు చేయొచ్చు. 12.9 అంగుళాల ఐపాడ్ ప్రో ధర రూ.1,12,900 ఉంటే రూ.1,02,900కే, రూ.59,900 ఐపాడ్ను రూ.54,900కే పొందవచ్చు. ఈ మూడు ఐపాడ్ మోడళ్లపై సెకండ్ జనరేషన్ యాపిల్ పెన్సిల్లు ఉచితంగా అందిస్తుంది. ఎం 1 పవర్డ్ 13 అంగుళాల మాక్ బుక్ ఎయిర్ను రూ. 89,900కే సొంతం చేసుకోవచ్చు. దీని అసలు లాంచ్ ధర రూ.99,900గా ఉంది. 13 అంగుళాల మ్యాక్ బుక్ ఎయిర్ 13 అసలు ధర రూ.1,29,900 కాగా రూ.1,04,900 కే విద్యార్ధులు కొనుగోలు చేయొచ్చు. సేల్లో 15 అంగుళాల మ్యాక్ బుక్ ఎయిర్ ధర రూ. 1,24,900, అసలు ధర రూ. 1,34,900 గా ఉంది. తాజా,ఆఫర్లు ధృవీకరించబడిన విద్యార్ధులకు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. యూనివర్సిటీ విద్యార్థులు,ఇతర సిబ్బంది యాపిల్ అధికారిక వెబ్సైట్ను విజిట్ చేసి అర్హులో, కాదో తెలుసుకోవచ్చు. చదవండి👉 ఆ ఇద్దరు ఉద్యోగుల కోసం.. రెండు కంపెనీల సీఈవోలు పోటీ..రేసులో చివరికి ఎవరు గెలిచారంటే? -
అక్కడి యూనివర్సిటీల్లో హోలీ వేడుకలు నిషేధం..
విశ్వవిద్యాలయాల్లో హోలీ వేడుకల్ని నిషేధిస్తూ పాకిస్థాన్ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆ దేశ ఉన్నత విద్యా మండలి ఉత్తర్వులు జారీ చేసింది. ఈ వేడుకల కారణంగా సామాజిక సంస్కృతిక విలువలు దెబ్బతింటున్నాయని పేర్కొంది. దేశానికి ఉన్న ఇస్లామిక్ గుర్తింపునకు భంగం వాటిల్లుతుందని స్పష్టం చేసింది. క్వాయిడ్-ఐ-అజామ్ విశ్వవిద్యాలయంలో జూన్ 12న హోలీ వేడుకలు జరిగిన వీడియోలు నెట్టింట వైరల్ కాగా విద్యా మండలి ఈ నిర్ణయం తీసుకుంది. 'వివిధ రకాల మత విశ్వాసాలు, ఆచారాలతో కూడిన వైవిధ్యత ఇతర మతాలను గౌరవించే సమాజాన్ని సృష్టిస్తుంది. ఈ రకమైన సమాజాన్ని అందరూ కోరుకుంటారు. ఈ వాస్తవాన్ని మేము గౌరవిస్తున్నాం. కానీ ఈ దేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకుంటున్నాం' అని విద్యామండలి ఉత్తర్వుల్లో పేర్కొంటూ హోలీ వేడుకలను నిషేధించింది. Holi celebrations in Quaid-I-Azam University Islamabad Pakistan 🍁 Biggest holi celebration in Pakistan 💓 pic.twitter.com/xdBXwYEglt — QAU News (@NewsQau) June 13, 2023 క్వాయిడ్-ఐ-అజామ్ విశ్వవిద్యాలయంలో హోలీ వేడుకలు ఈసారి ఘనంగా జరిగాయి. వీటిని యూనివర్సిటీకి చెందిన సంస్కృతిక సంస్థ నిర్వహించింది. ఇవి కాస్త వైరల్ కాగా విద్యా మండలి ఈ నిర్ణయం తీసుకుంది. పంజాబ్ యూనివర్సిటీ ప్రాంగణంలో మార్చి నెలలో హోలీ వేడుకలు జరుపుతున్న హందూ విద్యార్థులపై ఇస్లామిక్ స్టుడెంట్ ఆర్గనైజేషన్ దాడులు జరిపింది. ఇందులో 15 మంది హిందూ విద్యార్థులు గాయపడ్డారు. Holi celebrations Quaid-i-Azam University Islamabad 🖤 🥀#QAU_ISLAMABAD #holi #holi2023 pic.twitter.com/CHVkY5NL1m — QAU News (@NewsQau) June 19, 2023 ఇదీ చదవండి: ముంబై దాడుల ప్రధాన సూత్రధారికి అండగా నిలిచిన చైనా -
చదువులకూ పెద్దన్నే..
అమెరికా సంయుక్త రాష్ట్రాలు..! కొందరికి అగ్రరాజ్యం.. దేశాలకు పెద్దన్న.. మరికొన్నింటికి కుట్రదారు, శత్రువు.. కానీ ప్రపంచం మొత్తం అంగీకరించే ఓ అంశంలో పైచేయి ఆ దేశానిదే.. అదే అత్యుత్తమ ఉన్నత విద్య. రెండు వందలకుపైగా దేశాలున్న ఈ భూమ్మీద ఒక్క అమెరికానే ఎక్కువమంది విదేశీ విద్యార్థులను ఎందుకు ఆకర్షిస్తోందో తెలుసా? రెండు లక్షల మంది.. గత ఏడాది ఒక్క భారతదేశం నుంచే ఉన్నత చదువుల కోసం అమెరికాకు చేరిన విద్యార్థుల సంఖ్య ఇది. గత ఏడాది మొత్తంగా 200 దేశాలకు చెందిన 9.48 లక్షల మందికిపైగా విద్యార్థులు అమెరికాలోని నాలుగు వేలకుపైగా ఉన్న యూనివర్సిటీల్లో చేరడం గమనార్హం. దీనికి ఎన్నో కారణాలు. అంతర్జాతీయ స్థాయి విద్యాసంస్థలు, విస్తృత అవకాశాలు, వైవిధ్యత, చదువుకోవడంలో రకరకాల వెసులుబాట్లు, అంతర్జాతీయ గుర్తింపు, స్కాలర్షిప్లు.. ఇలా మరెన్నో సానుకూల అంశాలు విద్యార్థులను అమెరికా వైపు ఆకర్శిస్తున్నాయి. ప్రభుత్వ విద్యా సంస్థలు టాప్! అమెరికా మొత్తమ్మీద ఉన్నత విద్యనందించే సంస్థలు నాలుగు వేలకుపైనే ఉన్నాయి. అత్యాధునిక కృత్రిమ మేధ/మెషీన్ లెర్నింగ్ మొదలుకుని జెనెటిక్ ఇంజనీరింగ్ వరకు.. ఆర్ట్స్, హ్యుమానిటీస్, పొలిటికల్ ఎకానమీ.. ఇలా ఎన్నో రంగాలకు సంబంధించి విస్తృతస్థాయి కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ప్రైవేట్ విద్యా సంస్థలు ఉన్నా.. ప్రభుత్వ సంస్థల్లో చేరే విద్యార్థులే ఎక్కువని అక్కడి విద్యాశాఖ గణాంకాలు చెప్తున్నాయి. కాలేజీలు, యూనివర్సిటీల్లో అత్యధికం గ్రాడ్యుయేట్, పీహెచ్డీ ప్రోగ్రామ్స్ అందిస్తున్నాయి. కమ్యూనిటీ కాలేజీల్లో రెండేళ్ల కోర్సులుంటాయి. ఇవి సిద్ధాంతాలకు కాకుండా వాస్తవిక జ్ఞానానికి, ఉద్యోగాలకు పనికొచ్చే విషయాలకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తాయి. విదేశీ విద్యార్థుల్లో చాలామంది ఈ కమ్యూనిటీ కాలేజీలు అందించే రకరకాల సర్టిఫికెట్, డిప్లొమా కోర్సులు చేసి.. తర్వాత ఉన్నత విద్య కోసం ఇతర యూనివర్సిటీల్లో చేరుతుంటారు. హార్వర్డ్, యేల్, బ్రౌన్, ప్రిన్స్టన్ వంటి ప్రైవేట్ యూనివర్సిటీలు విద్యార్థుల ఫీజులతోపాటు దాతలు ఇచ్చే విరాళాలతో నడుస్తూంటాయి. ఎన్నో రకాల వెసులుబాట్లతో.. భారత్లో ఇంటర్మీడియట్లో చదివే కోర్సులే మీరు భవిష్యత్తులో ఏం కావాలని అనుకుంటున్నారో నిర్ణయిస్తాయి. ఎంపీసీ అయితే ఇంజనీరింగ్.. బైపీసీ అయితే వైద్యం. కానీ అమెరికాలో విభిన్న చదువులకు అవకాశం ఉంటుంది. చాలా యూనివర్సిటీల్లోని నాలుగేళ్ల గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్లోనూ రెండేళ్లపాటు హ్యుమానిటీస్, నేచురల్ సైన్సెస్, సోషల్ సైన్స్, గణితం వంటి సబ్జెక్టుల్లో కోర్సు చేయాల్సి ఉంటుంది. ఈ నాలుగేళ్ల కోర్సు సమయంలో ఎప్పుడైనా మీరు ఎంచుకున్న మేజర్ (ప్రధాన సబ్జెక్ట్)ను మార్చుకోవచ్చు. ఇంజనీరింగ్ చేస్తూ కంప్యూటర్ సైన్స్ నుంచి కృత్రిమ మేధకు మారిపోవచ్చు. యూనివర్సిటీలో చేరేటప్పుడు ఫలానా సబ్జెక్టు అని ఎంచుకోవాల్సిన అవసరమూ లేదు. యూనివర్సిటీ అందించే వేర్వేరు కోర్సులను దగ్గరి నుంచి పరిశీలించి.. నచ్చిన అంశాన్ని మేజర్గా ఎంచుకోవచ్చు. కచ్చితంగా క్లాస్రూమ్లకు రావాలన్న నియమం లేదు. ఆన్లైన్ కోర్సులు చేయవచ్చు. ఒకేసారి రెండు డిగ్రీలు చదవవచ్చు. ఒక యూనివర్సిటీ నుంచి ఇంకోదానిలోకి మారి కోర్సులు కొనసాగించేందుకూ అభ్యంతరాలు ఉండవు. గుర్తింపు, ఉద్యోగావకాశాలు అమెరికా యూనివర్సిటీల నుంచి పట్టభద్రులైన వారికి ప్రపంచ దేశాలన్నింటిలోనూ తగిన గుర్తింపు ఉంటుంది. చదువుకునే సమయంలోనే వివిధ దేశాల వారితో కలిసిమెలిసి ఉండే అవకాశం లభిస్తుంది. పేరు ప్రతిష్టలున్న అధ్యాపకులు, నిపుణుల నుంచి నేర్చుకుని ఉంటారు. ప్రపంచవ్యాప్తంగా ఉండే యూనివర్సిటీల పూర్వ విద్యార్థుల నెట్వర్క్, ఫార్చ్యూన్–500 కంపెనీల్లో అత్యధికం అగ్రరాజ్యంలోనే ఉండటం వంటి కారణాలతోనూ అమెరికాలో చదివిన వారికి మెరుగైన ఉద్యోగావకాశాలు కలిగిస్తాయి. అమెరికాలో చదువు పూర్తయిన తర్వాత మూడేళ్లపాటు ఆ దేశంలోనే పనిచేసుకునేందుకు అవకాశం ఉంటుంది. సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మేథమెటిక్స్ విద్యార్థులకు ఇది ఎంతో విలువైన వృత్తిపరమైన నైపుణ్యాన్ని అందిస్తుంది. దీన్ని ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రెయినింగ్ (ఓపీటీ) అంటారు. యూనివర్సిటీలు స్వయంగా కెరీర్ సర్వీసులను కూడా అందిస్తాయి. విదేశీ విద్యార్థులకు, కంపెనీలకు మధ్య వారధిగా నిలుస్తాయి. రెజ్యూమ్లు ఎలా తయారు చేసుకోవాలన్న చిన్న అంశాల నుంచి కంపెనీలతో కెరీర్ ఫెయిర్లు, మెంటార్షిప్ ప్రోగ్రామ్స్ వరకు సాయం అందిస్తాయి. ఖర్చుల మాటేమిటి? అమెరికా చదువులంటే ఖరీదైనవని చాలామంది అంటూ ఉంటారు. అందులో వాస్తవం కొంతే. జాగ్రత్తగా ప్రణాళిక ప్రకారం వ్యవహరిస్తే.. అమెరికాలో ఉన్నత విద్యాభ్యాసం కోసం బోలెడన్ని స్కాలర్షిప్లు, గ్రాంట్లు అందుబాటులో ఉన్నాయి. దీనికితోడు చదువుకునేటప్పుడే పనిచేసుకునేందుకు అవకాశం కల్పించడం, రుణాలు వంటి మార్గాల ద్వారా విద్యాభ్యాసానికయ్యే ఖర్చులను పొందవచ్చు. ♦ అమెరికాలో ఉన్నత విద్యాభ్యాసానికి లభించే ఆర్థిక సాయం ప్రధానంగా రెండు రకాలు. ఒకటి మీ అవసరాలను తీర్చేది. రెండోది మీ ప్రతిభకు అనుగుణంగా దక్కేది. కొన్ని స్కాలర్షిప్స్ ట్యూషన్ ఫీజులతోపాటు అక్కడి రోజువారీ ఖర్చులకు కావాల్సిన మొత్తాలను కూడా అందిస్తాయి. కొన్ని స్కాలర్షిప్లు ట్యూషన్ ఫీజు మొత్తం లేదా అందులో కొంత భాగాన్ని చెల్లిస్తాయి. ♦ యూనివర్సిటీ ఆఫ్ సదరన్ కాలిఫోర్నియాను ఉదాహరణగా తీసుకుంటే.. విదేశీ విద్యార్థుల కోసం మెరిట్ ఆధారిత స్కాలర్ర్షిప్ లు, క్యాంపస్లో ఉద్యోగం చేసుకునే వెసులుబాటు ఉంటుంది. మీ అవసరాలకు తగిన ఆర్థిక సాయం (నీడ్స్ బేస్డ్ ఫైనాన్షియల్ ఎయిడ్) ఈ యూనివర్సిటీలో లభించదు. ♦ కేవలం గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్కు మాత్రమే కాకుండా అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్కు కూడా కొన్ని కాలేజీలు, విద్యాసంస్థలు ఆర్థిక సాయం అందిస్తాయి. ఈ అంశంపై మీకు సాయం అవసరమనుకుంటే ‘ఎడ్యుకేషన్ యూఎస్ఏ’ విభాగాన్ని సంప్రదించవచ్చు. - కంచర్ల యాదగిరిరెడ్డి -
ప్రపంచంలోని టాప్ 10 యూనివర్సిటీస్
-
కాలేజీలు, వర్సిటీల్లో..చదువు... సంపాదన
సాక్షి, అమరావతి: యూనివర్సిటీలు, కాలేజీలు, ఉన్నత విద్యాసంస్థల్లో ‘ఎర్న్ వైల్ లెర్న్’ (చదువుతూ సంపాదన–ఈడబ్ల్యూఎల్) పథకాన్ని త్వరలో ప్రవేశపెట్టాలని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) నిర్ణయించింది. దీనికి సంబంధించిన ముసాయిదా ప్రతిపాదనలను సెంట్రల్ యూనివర్సిటీలు, ఇతర ఉన్నత విద్యాసంస్థలకు పంపింది. సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల విద్యార్థులను చదువుల్లో ముందుకు తీసుకెళ్లడంతోపాటు వారికి ఆర్థికంగా వెన్నుదన్నుగా నిలిచేందుకు ఈ పథకాన్ని యూజీసీ రూపొందించింది. ఈ వర్గాల విద్యార్థులు తమ విద్యను కొనసాగిస్తూనే కొంత సంపాదించుకునేందుకు వీలుగా ‘చదువుతూనే సంపాదన’ అనే కార్యక్రమానికి శ్రీకారం చుడుతోంది. దీనిని విజయవంతంగా అమలుచేయడం ద్వారా సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల విద్యార్థులకు పార్ట్టైమ్ ఎంగేజ్మెంట్ అవకాశాలను అందించాలని అన్ని ఉన్నత విద్యాసంస్థలకు యూజీసీ ప్రతిపాదించింది. ప్రతి గంటకు నిర్ణీత మొత్తాన్ని చెల్లించాలని, గరిష్టంగా వారానికి 20 గంటలపాటు నెలలో 20 రోజులు ఈ పార్ట్టైమ్ వర్క్లు వారికి అప్పగించాలని యూజీసీ పేర్కొంది. రోజూ తరగతిలో బోధనాభ్యసన ప్రక్రియలు పూర్తయిన తర్వాతే ఈ పార్ట్టైమ్ సేవలను విద్యార్థులకు కల్పించాలని తెలిపింది. ‘చదువుతూ సంపాదన’ అనే ఈ పథకం ద్వారా ఈ వర్గాల విద్యార్థులు వారి చదువులకు అవసరమైన ఆర్థిక వనరులను సమకూర్చుకోవడానికి వీలవుతుందని, అదే సమయంలో వారు ఉపాధి మార్గాలను మెరుగుపర్చుకునేలా నైపుణ్యాలు, సామర్థ్యాలను పెంపొందించుకోగలుగుతారని యూజీసీ అభిప్రాయపడింది. ఈ ‘ఎర్న్ వైల్ లెర్న్’ పథకం బలహీనవర్గాలకు చెందిన విద్యార్థుల చదువుల్లో ఆర్థిక కష్టాలను తగ్గించడంతో పాటు విద్యార్థుల్లో కష్టపడి సంపాదించే తత్వాన్ని పెంపొందిస్తుంది. చదువుల్లో విద్యార్థులను మరింత మెరుగుపరుస్తుంది. విద్య నాణ్యత పెరగడంతోపాటు వారిలో సానుకూల దృక్పథాన్ని అభివృద్ధి చేస్తుంది’.. అని యూజీసీ తన ముసాయిదా ప్రతిపాదనల్లో పేర్కొంది. అంతేకాక.. వ్యక్తిత్వాన్ని పెంచుకోవడానికి, సాంకేతిక నైపుణ్యాల మెరుగుకు తోడ్పాటునందిస్తుందని, తద్వారా ఈ వర్గాల విద్యార్థుల్లో సామర్థ్యాలు గణనీయంగా పెరుగుతాయని యూజీసీ అభిప్రాయపడింది. ‘విద్యార్థులు వృత్తిపరమైన పనులను త్వరగా చేపట్టడంలో ఈ కార్యక్రమం సహాయపడుతుంది. పార్టుటైమ్ పనుల కేటాయింపు ఇలా.. సామాజికంగా, ఆర్థికంగా బలహీన వర్గాల విద్యార్థులకు విద్యాసంస్థల్లో ఎలాంటి పార్ట్టైమ్ ఉపాధి కార్యక్రమాలు కలి్పంచాలో కూడా యూజీసీ సూచించింది. ఇందుకు సంబంధించిన జాబితాను రూపొందించింది. ఇందులో.. ♦ రీసెర్చ్ ప్రాజెక్టులతో కూడిన అసిస్టెంట్షిప్, లైబ్రరీ అసైన్మెంట్లు, కంప్యూటర్ సర్విసెస్, డేటాఎంట్రీ, లేబొరేటరీ అసిస్టెంట్లు తదితరాలతో పాటు ఆయా సంస్థలు ఇతర అంశాల్లోనూ పార్ట్టైమ్ జాబ్లను కలి్పంచాలని యూజీసీ పేర్కొంది. ♦ ఇందుకు సంబంధించి ఆయా ఉన్నత విద్యాసంస్థల్లో ప్రత్యేక సెల్లను ఏర్పాటుచేయాలని తెలిపింది. ♦ సంస్థ డీన్ లేదా డిపార్ట్మెంటల్ హెడ్ తదితరులతో చర్చించి అర్హులైన విద్యార్థులను గుర్తించిన అనంతరం ఉన్నతాధికారుల ఆమోదంతో విద్యార్థులకు తగ్గ పనులను అప్పగించాలని వివరించింది. ♦ ప్రతి అకడమిక్ సెషన్లోనూ ఈ విద్యార్థులను గుర్తించి పూల్గా ఏర్పరచి వీసీ, లేదా ప్రిన్సిపాళ్ల ఆమోదంతో పార్ట్టైమ్ పనులు కేటాయించాలని మార్గదర్శకాల్లో పేర్కొంది. ♦ జాతీయ విద్యా విధానం–2020కి అనుగుణంగా ఈ మార్గదర్శకాలు రూపొందించారు. ♦ సామాజిక–ఆర్థికంగా వెనుకబడిన వర్గాల విద్యార్థుల సమస్యలను పరిష్కరించడానికి ఇది ఎంతో ఉత్తమమైన కార్యక్రమమని యూజీసీ వివరించింది. ♦ మహిళలు, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనార్టీ వర్గాల విద్యార్థులు, గ్రామీణ ప్రాంత విద్యార్థులు, చిన్నచిన్న పట్టణాల నుంచి వచ్చిన పిల్లలు, దివ్యాంగులు, ఆర్థికంగా వెనుకబడ్డ వారికి ఈ కార్యక్రమం ద్వారా ప్రాధాన్యమివ్వాలని తెలిపింది. బ్రిడ్జి కోర్సుల నిర్వహణ ఇక ఉన్నత విద్యాసంస్థల్లో చేరే ఈ విద్యార్థులకు తొలి ఏడాదిలోనే బ్రిడ్జి కోర్సులను నిర్వహించాలని యూజీసీ పేర్కొంది. సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన ఈ విద్యార్థులు సంబంధిత కోర్సుల్లోని అంశాలకు సంబంధించి పూర్వపు పరిజ్ఞానాన్ని పూర్తిగా నేర్చుకునే పరిస్థితుల్లేక వెనుకబడి ఉంటారని, ఆ లోపాన్ని పూరించేందుకు ఈ కోర్సులు ఎంతగానో తోడ్పడతాయని తెలిపింది. ఇతర విద్యార్థులతో సమాన స్థాయికి వీరు చేరుకునేందుకు ఇవి అవకాశం కలి్పస్తాయని తెలిపింది. సెమిస్టర్ ప్రోగ్రామ్ ప్రారంభానికి ముందు ఏటా వీటిని నిర్వహించాలని సూచించింది. -
సీఎం జగన్ ను కలిసిన పలు యూనివర్సిటీల వీసీలు
-
యూనివర్సిటీల్లో పరిశోధనల్ని ప్రోత్సహించాలి
సాక్షి, విశాఖపట్నం: విశ్వవిద్యాలయాలు బోధనలకు మాత్రమే పరిమితమవుతున్నాయని, పరిశోధనలకు దూరంగా ఉండటం బాధాకరమని రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ చెప్పారు. అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీస్ (ఏఐయూ) సహకారంతో ఆంధ్ర విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో దక్షిణ భారతదేశ ఉపకులపతుల సదస్సు–2023ని ఏయూ కన్వెన్షన్ హాల్లో గవర్నర్ మంగళవారం ప్రారంభించారు. రెండురోజుల సదస్సులో తొలిరోజు ‘రీసెర్చ్ అండ్ ఎక్స్లెన్స్ ఫర్ ట్రాన్స్ఫర్మేటివ్ హయ్యర్ ఎడ్యుకేషన్’ అంశంపై గవర్నర్ ప్రసంగించారు. ఉన్నతవిద్యలో పరిశోధనల్లో పూర్తిస్థాయిలో లక్ష్యాల్ని చేసుకోవాలని, అదేవిధంగా యూనివర్సిటీలు బోధనకే పరిమితం కాకూడదని సూచించారు. పరిశోధన రంగంవైపు విద్యార్థుల్ని ప్రోత్సహించాలని, ఇందుకనుగుణంగా రీసెర్చ్ రంగంలో పెట్టుబడుల్ని పెంచాల్సిన అవసరం ఉందని చెప్పారు. ప్రపంచస్థాయి ర్యాంకింగ్లలో అత్యుత్తమ స్థానంలో భారతీయ విశ్వవిద్యాలయాలు స్థానం సాధించాలని ఆకాంక్షించారు. ప్రపంచంలోనే మూడో అతిపెద్ద స్టార్టప్ ఎకోసిస్టమ్ కలిగిన దేశంగా భారత్ ఉందని నాస్కామ్ స్పష్టం చేసిందని, 2022 నాటికి దేశంలో 80 వేలకు పైగా స్టార్టప్ సంస్థలున్నాయని తెలిపారు. కోవిడ్ సమయంలో అమెరికా, చైనా, యూకే సహా 50 దేశాలకు మనదేశం మార్గదర్శిగా నిలవడాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. నూతన విద్యావిధానంలో పరిశోధనలకు అత్యంత ప్రాధాన్యం కల్పించినట్లు తెలిపారు. ఆత్మనిర్భర్ భారత్ సాకారం చేసే దిశగా సమష్టిగా పనిచేయాలని ఆయన కోరారు. ఏయూ వీసీ ప్రొ.పీవీజీడీ ప్రసాదరెడ్డి మాట్లాడుతూ స్వయం సమృద్ధి సాధించాలన్న ప్రధానమంత్రి మోదీ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆకాంక్షల్ని సాకారం చేసే దిశగా ఆంధ్ర విశ్వవిద్యాలయం పనిచేస్తోందని తెలిపారు. ఏఐయూ అధ్యక్షుడు ఆచార్య సురంజన్ దాస్ మాట్లాడుతూ దేశీయ పరిజ్ఞానాన్ని పరిరక్షించడంతో పాటు పరిశోధనలకు అనుగుణంగా ఉన్నతవిద్యని ఇంగ్లిష్తో పాటు స్థానిక భాషల్లో అందించాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ హేమచంద్రారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్నత విద్యని పటిష్టం చేసేందుకు గవర్నర్, ముఖ్యమంత్రి ఐదు లక్ష్యాల్ని ఏర్పాటు చేసుకుని వాటిని సాధించే దిశగా పనిచేస్తున్నారని తెలిపారు. ఇందులో భాగంగా హయ్యర్ ఎడ్యుకేషన్ ప్లానింగ్ బోర్డు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. సదస్సులో తొలుత ఏఐయూ ప్రత్యేక సంచికని గవర్నర్ ఆవిష్కరించారు. ఈ సదస్సులో స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఆర్పీ సిసోడియా, ఉన్నత విద్యామండలి ఉపాధ్యక్షుడు రామ్మోహన్రావు, ఏయూ రెక్టార్ ఆచార్య కె.సమత, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ కృష్ణమోహన్, 140 విశ్వవిద్యాలయాల ఉపకులపతులు, ప్రిన్సిపాల్స్ పాల్గొన్నారు. -
స్కూళ్లు, కాలేజీల్లో అమ్మాయిలపై నిషేధంపై తాలిబన్ల కీలక ప్రకటన
కాబూల్: అఫ్గానిస్తాన్లో అమ్మాయిలు హైస్కూళ్లు, కాలేజీలు, యూనివర్సిటీల్లో చదవుకోకుండా తాలిబన్ ప్రభుత్వం కొద్దిరోజుల క్రితం నిషేధం విధించిన విషయం తెలిసిందే. ఈ చర్యను ప్రపంచదేశాలు తీవ్రంగా తప్పుబట్టాయి. తాజాగా ఇందుకు సంబంధించి తాలిబన్లు కీలక ప్రకటన చేశారు. విద్యాసంస్థల్లో అమ్మాయిలపై విధించిన నిషేధం శాశ్వతం కాదని తాలిబన్ ప్రభుత్వ ప్రతినిధి తెలిపారు. ఇది కొంతకాలం వాయిదా మాత్రమే పడినట్లు పేర్కొన్నారు. స్కూళ్లు, కాలేజీలు, యూనివర్సిటీల్లో అమ్మాయిలకు అనువైన వాతావరణం కల్పించిన తర్వాత వాళ్లు మళ్లీ చదువుకుంటారని పేర్కొన్నారు. మహిళా విద్యకు తాము వ్యతిరేకం కాదన్నారు. అయితే ఇది ఎప్పటివరకు పూర్తవుతుందనే వివరాలు మాత్రం వెల్లడించలేదు. అఫ్గాన్లో తాలిబన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అరాచక పాలన కొనసాగుతోంది. ముఖ్యంగా మహిళల హక్కులను వారు కాలరాస్తున్నారు. మగ తోడు లేకుండా, హిజాబ్ ధరించకుండా మహిళలు బయటకు వెళ్లొద్దని నిబంధన తీసుకొచ్చారు. అలాగే ఆరో తరగతి తర్వాత అమ్మాయిల, అబ్బాయిలు కలిసి చదువుకోవడాన్ని తాలిబన్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే విద్యాసంస్థల్లో అమ్మాయిలపై డిసెంబర్లో నిషేధం విధించారు. చదవండి: కరోనా పరీక్షలు.. దక్షిణ కొరియా, జపాన్పై చైనా ప్రతీకార చర్యలు.. -
అసలు పేచీ స్క్రీనింగ్ టెస్టే
సాక్షి, హైదరాబాద్: యూనివర్సిటీల్లో ఖాళీ పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం అనుసరించాలనుకుంటున్న స్క్రీనింగ్ టెస్ట్ విధానమే వివాదంగా మారింది. ఇందుకు సంబంధించిన ఫైల్ను గవర్నర్ ఆమోదించపోవడానికి ఈ నిబంధనే కారణమని తెలుస్తోంది. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) నిబంధనలకు ఇది విరుద్ధమని గరవ్నర్ భావిస్తున్నట్లు అధికార వర్గాలు అంటున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 12 విశ్వవిద్యాలయాల్లో దాదాపు 3 వేల పోస్టుల భర్తీకి ప్రభుత్వం కొత్తగా కామన్ రిక్రూట్మెంట్ బోర్డును ఏర్పాటు చేసింది. ఇందుకు అవసరమైన చట్టాన్ని అసెంబ్లీ ఆమోదించి గవర్నర్ అనుమతి కోసం పంపింది. దీనిపై అనేక అనుమానాలున్నాయని, నివృత్తి చేయాలని విద్యామంత్రికి గవర్నర్ తమిళిసై సూచించారు. ఈ నేపథ్యంలో విద్యాశాఖ ఉన్నతాధికారులతోకలసి రాజ్భవన్కు వెళ్లిన మంత్రి సబిత గవర్నర్ సందేహాలను నివృత్తి చేశారు. అయినప్పటికీ నెలల తరబడి ఈ బిల్లుకు మోక్షం కలగడంలేదు. అసలా రూల్ ఎక్కడిది? ఇప్పటివరకు వర్సిటీలన్నీ సొంతంగా నియామకాలు చేపట్టేవి. అయితే కామన్ బోర్డు బిల్లులో అసిస్టెంట్ ప్రొఫెసర్లు సహా అన్ని పోస్టులకు దరఖాస్తు చేసేవారికి స్క్రీనింగ్ టెస్ట్ పెడుతున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. కానీ యూజీసీ నిబంధనల ప్రకారం ఒక పోస్టుకు 200 మంది దరఖాస్తు చేస్తేనే పరీక్ష పెట్టాలనే నిబంధన ఉన్నట్లు గవర్నర్ కార్యాలయం గుర్తించింది. యూజీసీ నిబంధనల ప్రకారమే చట్టా న్ని తెచ్చామని చెబుతున్న ప్రభుత్వం... లేని పరీక్ష ను ఎందుకు తెచ్చిందనే దానిపై గవర్నర్ కార్యాల యం అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలిసింది. దీన్ని మారిస్తేనే బిల్లును ఆమోదిస్తామని ప్రభుత్వానికి గవర్నర్ సూచించినట్లు సమాచారం. ఈ సూచనను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవడానికి ఇష్టపడ ట్లేదు. అవసరమైతే వర్సిటీల చాన్సలర్గా గవర్నర్ ను తప్పించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు అధికార వర్గాలు చెబుతున్నాయి. ఈ పీటముడి నేపథ్యంలో వర్సిటీల్లో అధ్యాపక పోస్టుల కోసం నిరీక్షిస్తున్న 3 వేల మంది నిరాశ చెందుతున్నారు. వీసీల నుంచి వ్యతిరేకత... కామన్ రిక్రూట్మెంట్ బోర్డు ఏర్పాటును పలు వర్సిటీల వీసీలు వ్యతిరేకిస్తున్నారు. బోర్డు నియమాక ప్రక్రియకు సంబంధించిన వ్యయం మొత్తాన్ని వర్సిటీల నిధుల నుంచే ఖర్చు చేసే ప్రతిపాదనను వారు ఆక్షేపిస్తున్నారు. ఒడిశాలో ఈ తరహా బోర్డు ను ఏర్పాటు చేసినా నియామకాల్లో వీసీలకే ప్రాధా న్యం ఇచ్చారని చెబుతున్నారు. ఛత్తీస్గఢ్లోనూ ఇదే తరహా విధానం కొనసాగుతోందని ఓ వీసీ తెలిపా రు. విశ్వవిద్యాలయాల పరిస్థితులతో సంబంధం లేని ఐఏఎస్ అధికారులకు బోర్డు సభ్యులుగా పూర్తి అధికారాలు ఇవ్వడం వల్ల తమ ప్రాధాన్యత తగ్గుతుందనే ఆందోళన వారు వ్యక్తం చేస్తున్నారు. మరో వైపు బోర్డు ఏర్పాటుపై గవర్నర్, ప్రభు త్వం మధ్య నెలకొన్న వివాదం కారణంగా నియామక ప్రక్రియే ఆగిపోయిందని, దీనివల్ల అధ్యాపకులు లేక బోధన కుంటుపడుతోందని వీసీలు అంటున్నారు. ఇది చెల్లదు.. సుప్రీం తీర్పు ఉంది.. ప్రభుత్వం స్క్రీనింగ్ టెస్ట్ పెట్టాలనుకోవడం యూజీసీ నిబంధనలకు విరుద్ధం. 2017లో చంద్రబాబు ప్రభుత్వం కూడా ఇదే విధానాన్ని అనుసరించింది. సర్వీస్ కమిషన్ ద్వారా చేపట్టిన నియామకాలను సుప్రీంకోర్టు రద్దు చేసింది. వివిధ వర్సిటీల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు అధ్యాపకులను పర్మనెంట్ చేస్తామని ప్రభుత్వమే చెప్పింది. ఇది కూడా చేయకుండా కొత్త నియామకాలు ఎలా చేపడతారు. – డాక్టర్ ఎం. రామేశ్వరరావు, తెలంగాణ ఆల్ యూనివర్సిటీస్ కాంట్రాక్టు టీచర్స్ జేఏసీ చైర్మన్ -
అమ్మాయిలకు మద్దతుగా అబ్బాయిలు.. క్లాస్లు బాయ్కాట్ చేసి నిరసన
అఫ్గానిస్తాన్లో అమ్మాయిలు యునివర్సిటీల్లో చదువుకోకుండా తాలిబన్ ప్రభుత్వం ఇటీవల నిషేధం విధించిన విషయం తెలిసిందే. దీంతో వారు ఉన్నత విద్యకు దూరమై ఇళ్లకే పరిమితమయ్యారు. అయితే యూనివర్సిటీల్లో చదువుకునే అబ్బాయిలు.. అమ్మాయిలకు మద్దతుగా నిరసన బాట పట్టారు. తమకు కూడా చదువు వద్దని క్లాస్లు బహిష్కరించారు. అమ్మాయిలను కూడా క్లాస్లోకి అనుమతిస్తేనే తాము చదువుకుంటామని, లేదంటే చదువు మానేస్తామని హెచ్చరించారు. అమ్మాయిలకు తిరిగి యూనివర్సిటీల్లో చదువుకునే అవకాశం కల్పించాలని అబ్బాయిలు డిమాండ్ చేస్తున్నారు. తమ అక్కా చెల్లెళ్లను ఉన్నత విద్యకు నోచునివ్వకపోతే తమకు కూడా చదువు అవసరం లేదని చెప్పారు. యూనివర్సిటీకి వెళ్లబోమని తేల్చిచెప్పారు. కాబుల్ యూనివర్సిటీలోని లెక్చరర్లు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మహిళలు చదువుకోకుండా నిషేధం విధించడం సరైన నిర్ణయం కాదన్నారు. తాలిబన్ల నిర్ణయం కారణంగా తన ఇద్దరు చెల్లెల్లు చదువు మానేయాల్సి వచ్చింది ఓ లెక్చరర్ ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు ఈ వ్యవహారంలో ప్రంపచ దేశాలు జోక్యం చేసుకోవాలని మానవహక్కుల ఆందోళకారులు విజ్ఞప్తి చేస్తున్నారు. తాలిబన్లు తమ నిర్ణయం ఉపసంహరించుకునేలా ఒత్తిడి తేవాలని కోరుతున్నారు. చదవండి: పక్క సీట్లో సీరియల్ కిల్లర్.. భయంతో వణికిపోయిన మహిళ.. ఫొటో వైరల్.. -
పీహెచ్డీ ఇక.. ఆషామాషీ కాదు.. నిబంధనలు సవరించిన యూజీసీ
విశ్వవిద్యాలయాలు, ఇతర ఉన్నత విద్యాసంస్థల్లో పరిశోధన కోర్సుల నిర్వహణ నిబంధనలను యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) మరింత కఠినతరం చేసింది. పరిశోధనల్లో సమగ్రత లేమి, నాణ్యతారహితంగా థీసెస్ల రూపకల్పన, ఏళ్ల తరబడి కొనసాగింపు వంటి విమర్శలు కొన్నేళ్లుగా వెల్లువెత్తుతున్న నేపథ్యంలో యూజీసీ పీహెచ్డీ కోర్సుల నిబంధనలను సవరించింది. ఈ మేరకు ఇటీవల గెజిట్ నోటిఫికేషన్ జారీచేసింది. ఆ నోటిఫికేషన్ ప్రకారం.. – సాక్షి, అమరావత ప్రవేశాలనుంచే పకడ్బందీ చర్యలు ► అభ్యర్థులు నాలుగేళ్ల బ్యాచిలర్ డిగ్రీ, ఒక ఏడాది మాస్టర్ డిగ్రీ, లేదా మూడేళ్ల డిగ్రీ, రెండేళ్ల పీజీచేసిన వారు 55 శాతం మార్కులు సాధించి ఉంటేనే పీహెచ్డీ కోర్సుల్లో చేరడానికి అర్హులు. విదేశీ విద్యార్థులకైనా దీనికి సమాన ప్రమాణార్హతలుండాలి. ► ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ (నాన్–క్రీమీలేయర్), విభిన్న ప్రతిభావంతులు, ఆర్థికంగా వెనుకబడినవర్గాలు (ఈడబ్ల్యూఎస్) తదితర కేటగిరీల అభ్యర్థులకు ఐదుశాతం మార్కుల సడలింపు ఇవ్వవచ్చు. ► గతంలో ఎంఫిల్ పూర్తిచేసి ఇప్పుడు పీహెచ్డీ కోర్సుల్లో చేరాలనుకునేవారికి కూడా 55% మార్కులు ఉండాలి. గ్రేడింగ్ విధానం అమల్లో ఉన్న విద్యాసంస్థల అభ్యర్థులకు పాయింట్ల స్కేల్లో సమానమైన గ్రేడ్ ఉండాలి. ప్రవేశపరీక్ష, ఇంటర్వ్యూల ద్వారానే ప్రవేశాలు ► ప్రత్యేక ప్రవేశపరీక్షల ద్వారానే ప్రవేశాలు చేపట్టాలి. ► యూజీసీ, ఇతర సంబంధిత అధీకృత ఉన్నతసంస్థల మార్గదర్శకాలననుసరించి రిజర్వేషన్లను పాటించాలి. ► యూజీసీ–నెట్, యూజీసీ–సీఎస్ఐఆర్, నెట్, గేట్, సీఈఈడీ ఫెలోషిప్, స్కాలర్షిప్లకు అర్హతపొందిన వారికి ఇంటర్వ్యూ ఆధారంగా ప్రవేశాలు కల్పించవచ్చు. లేదా ఆయా వర్సిటీలు, ఇతర ఉన్నత విద్యాసంస్థలు ప్రవేశపరీక్షలు నిర్వహించి చేర్చుకోవచ్చు. ► ఎంట్రన్స్ టెస్ట్ సిలబస్లో 50 శాతం రీసెర్చ్ మెథడాలజీ, 50 శాతం సబ్జెక్టు ఉండాలి. ప్రవేశపరీక్షలో 50 శాతం మార్కులు సాధించడం తప్పనిసరి. ► ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ (నాన్–క్రీమీలేయర్), విభిన్న ప్రతిభావంతులు, ఈడబ్ల్యూఎస్ తదితర కేటగిరీల అభ్యర్థులకు 5 శాతం మార్కుల సడలింపు ఇవ్వవచ్చు. వీరికి ఇంటర్వ్యూలు నిర్వహించి ప్రవేశాలు కల్పించాలి. ► ప్రవేశపరీక్ష మార్కులకు 70 శాతం, ఇంటర్వ్యూలకు 30 శాతం వెయిటేజీ ఇచ్చి అర్హులను ఎంపికచేయాలి. ► మౌలిక సదుపాయాలు, తగినంతమంది ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు ఉంటే ప్రైవేటు పీజీ కాలేజీలు కూడా పీహెచ్డీ కోర్సులను అమలు చేయవచ్చు. అడ్వయిజరీ కమిటీతో నిత్యం పరిశీలన ► ప్రతి వర్సిటీలో ఒక సీనియర్ ప్రొఫెసర్ కన్వీనర్గా యూనివర్సిటీ రీసెర్చి అడ్వయిజరీ కమిటీ ఏర్పాటుచేయాలి. ఈ కమిటీ రీసెర్చి ప్రతిపాదనలను పరిశీలించి టాపిక్ను నిర్ణయిస్తుంది. పరిశోధన పద్ధతి, మెథడాలజీలను పరిశీలిస్తుంది. పరిశోధన కార్యక్రమాన్ని ఎప్పటికప్పుడు పరిశీలిస్తుంది. ► అభ్యర్థి తన పరిశోధనపై ప్రతి సెమిస్టర్కు ఈ కమిటీకి సంక్షిప్త నివేదిక ఇవ్వాలి. ఈ కమిటీ.. వర్సిటీ లేదా సంస్థకు పరిశోధనపై పురోగతి నివేదిక ఇవ్వాలి. ► పరిశోధన సంతృప్తికరంగా లేకపోతే అభ్యర్థికి కమిటీ సూచనలివ్వాలి. ఆ సూచనల ప్రకారం పరిశోధన చేయలేకపోతే ఆ పీహెచ్డీ రిజిస్ట్రేషన్ను రద్దుచేసేలా కమిటీ సిఫార్సు చేస్తుంది. ► అభ్యర్థి థీసెస్ను సమర్పించేముందు దానిపై అడ్వయిజరీ కమిటీ, ఇతర ఫ్యాకల్టీ సభ్యులు, పీహెచ్డీ అభ్యర్థుల సమక్షంలో ప్రెజెంటేషన్ ఇవ్వాలి. థీసెస్ సంతృప్తికరంగా లేకపోతే తిరస్కరణ, పీహెచ్డీకి అనర్హత ► ఆయా ఉన్నత విద్యాసంస్థలు థీసెస్ను ప్లాగరిజం (కాపీకొట్టడం) కనిపెట్టేందుకు నిర్దేశించిన సాఫ్ట్వేర్ ఉపయోగించి పరిశీలించాలి. ► కాపీకొట్టలేదని, ఇంకెక్కడా సమర్పించలేదని అభ్యర్థి అండర్టేకింగ్ తీసుకుని పర్యవేక్షకుల సంతకాలతో థీసెస్ను అనుమతించాలి. ► తరువాత పర్యవేక్షకుడితోపాటు ఆయా రంగాల్లో పబ్లికేషన్లలో నిష్ణాతులైనæ ఇద్దరు బయటి నిపుణులతో అభ్యర్థిని పరిశీలన చేయించాలి. వీలైతే అందులో ఒకరు విదేశీ నిపుణులై ఉండాలి. ► బయటి నిపుణుల్లో ఏ ఒక్కరైనా థీసెస్ను రిజెక్టు చేస్తే ప్రత్యామ్నాయంగా మరో బయటి నిపుణుడి పరిశీలనకు పంపించాలి. అతను సంతృప్తి చెందితే.. ఫ్యాకల్టీ, పీహెచ్డీ స్కాలర్ల సమక్షంలో వైవా నిర్వహించాలి. ► ప్రత్యామ్నాయ పరిశీలకుడు థీసెస్ను ఆమోదించకపోతే దాన్ని ఆ ఉన్నత విద్యాసంస్థ తిరస్కరిస్తుంది. ఆ అభ్యర్థిని పీహెచ్డీ అవార్డుకు అనర్హుడిగా ప్రకటిస్తుంది. ► పీహెచ్డీ అవార్డు ప్రక్రియను ఆయా సంస్థలు ఆరునెలల్లో పూర్తిచేయాలి. ► థీసెస్ సంతృప్తికరంగా ఉండి పీహెచ్డీ అవార్డుకు అర్హత సాధించినవారికి దాన్ని జారీచేసేముందు ఆయా విద్యాసంస్థలు ఆ థీసెస్ సాఫ్ట్కాపీ (ఎలక్ట్రానిక్ కాపీ) ఇతర సంస్థలకు అందుబాటులోకి వచ్చేలా యూజీసీ ఆధ్వ2ర్యంలోని ఇన్ఫ్లిబినెట్ (ఇన్ఫర్మేషన్ అండ్ లైబ్రరీ నెట్వర్క్)కు సమర్పించాలి. నిర్దిష్ట కాలపరిమితి ► ప్రవేశం పొందిన రోజునుంచి కనీసం మూడేళ్లలో.. గరిష్టంగా ఆరేళ్లలో పూర్తిచేయాలి. ► ఆయా సంస్థల నిబంధనలను అనుసరించి గడువును అదనంగా రెండేళ్ల వరకు పొడిగించవచ్చు. ► 40 శాతం కన్నా ఎక్కువ అంగవైకల్యమున్న వారికి మరో రెండేళ్లు గడువు ఇవ్వవచ్చు. గరిష్టంగా పదేళ్లకు మించి గడువు ఇవ్వరాదు. ► మహిళలకు 240 రోజులు ప్రసూతి, శిశుసంరక్షణ సెలవులు ఇస్తారు. అదనపు అర్హతలుంటేనే పర్యవేక్షణ బాధ్యత ► పీహెచ్డీ విద్యార్థులకు గైడ్ లేదా సూపర్వైజర్, సహ సూపర్వైజర్లుగా నియమితులయ్యేవారికి నిర్దేశిత అర్హతలు ఉండాలి. ► వర్సిటీలు, ఉన్నత విద్యాసంస్థల్లోని రెగ్యులర్ ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లకు ఐదు, అసిస్టెంటు ప్రొఫెసర్లకు మూడు రీసెర్చి పబ్లికేషన్లు ప్రఖ్యాత జాతీయ, అంతర్జాతీయ జర్నల్స్లో ప్రచురితమై ఉంటేనే గైడ్లుగా నియమించాలి. ► ఇతర సంస్థల్లో గైడ్గా వ్యవహరించేవారికి బాధ్యత ఇవ్వరాదు. అలాంటి వారిని కో సూపర్వైజర్గా నియమించవచ్చు. ► ఇతర సంస్థల నిపుణుల పర్యవేక్షణలోని పరిశోధనలకు పీహెచ్డీలను ప్రదానం చేయడం నిబంధనలకు విరుద్ధం. ► ప్రొఫెసర్ ఎనిమిదిమందికి, అసోసియేట్ ప్రొఫెసర్ ఆరుగురికి, అసిస్టెంటు ప్రొఫెసర్ నలుగురికి పర్యవేక్షకులుగా ఉండవచ్చు. ► మహిళలు పెళ్లి, ఇతర కారణాలవల్ల అదే పరిశోధనను ఇతర విద్యాసంస్థల్లోకి మార్చుకోవచ్చు. ► అభ్యర్థులు తమ పరిశోధనతోపాటు ఆ అంశంపై విద్యాబోధన, రచన అంశాలపైనా శిక్షణ పొందాలి. ట్యుటోరియల్, లేబొరేటరీ వర్కు, మూల్యాంకనాలతోసహా వారానికి నాలుగు నుంచి ఆరుగంటలు బోధన, పరిశోధన అసిస్టెంట్షిప్లలో పాల్గొనాలి. ► థీసెస్ సమర్పించాలంటే యూజీసీ నిర్దేశించిన 10 పాయింట్ల ప్రామాణికాల్లో 55 శాతం పాయింట్లు సాధించాలి. -
China Zero Covid policy: యూనివర్సిటీలు ఖాళీ
బీజింగ్: చైనాలో ‘జీరో కోవిడ్’ నిబంధనలకు వ్యతిరేకంగా గొంతెత్తిన వారిపై షీ జిన్పింగ్ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. నిరసనలు, ఆందోళనలను ఎక్కడికక్కడ అణచివేస్తోంది. తాజాగా విశ్వవిద్యాలయాల నుంచి విద్యార్థులను వారి ఇళ్లకు బలవంతంగా పంపిచేస్తుండడం గమనార్హం. దీంతో విద్యా సంస్థలు ఖాళీ అవుతున్నాయి. విద్యార్థులు నిరసన కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటుండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కరోనా నిబంధనలను సడలించాలని, అధ్యక్షుడు జిన్పింగ్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ జనం వీధుల్లోకి వస్తున్నారు. డ్రాగన్ దేశంలో ఈ స్థాయిలో ప్రభుత్వంపై వ్యతిరేకత వెల్లువెత్తడం గత కొన్ని దశాబ్దాల్లో ఇదే మొదటిసారి. పోలీసులు, సైనిక సిబ్బంది భారీ సంఖ్యలో మోహరించడంతో బీజింగ్, షాంఘై సహా పలు నగరాల్లో మంగళవారం ఆందోళనలు పెద్దగా కనిపించలేదు. మరోవైపు ‘జీరో కోవిడ్’ వ్యూహాన్ని ఇప్పటికిప్పుడు మార్చే అవకాశం లేదని అధికార కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా సంకేతాలిచ్చింది. అప్పట్లో వర్సిటీలే ఉద్యమ కేంద్రాలు అధినేత షీ జిన్పింగ్ చదువుకున్న తిసింగువా యూనివర్సిటీ నుంచి విద్యార్థులను ఇళ్లకు పంపించారు. రాజధాని బీజింగ్లోని పాఠశాలలు సైతం ఇదే నిర్ణయం తీసుకున్నాయి. గాంగ్డాంగ్ ప్రావిన్స్లోని విద్యాసంస్థలు కూడా విద్యార్థులను వారి స్వస్థలాలకు పంపించాయి. కొన్ని యూనివర్సిటీలు విద్యార్థులకు బస్సులను సమకూర్చాయి. ఇకపై తరగతులు, వార్షిక పరీక్షలను ఆన్లైన్లోనే నిర్వహించనున్నట్లు తేల్చిచెప్పాయి. ఇళ్లకు వెళ్లిపోవాలని కోరుకొనే వారికి అన్ని ఏర్పాట్లు చేస్తామని బీజింగ్ ఫారెస్ట్రీ యూనివర్సిటీ ప్రకటించింది. చైనాలో 1980వ దశకంలో ప్రజాస్వామ్య సంస్కరణల కోసం విద్యార్థులు పెద్ద ఎత్తున ఉద్యమించారు. అప్పట్లో యూనివర్సిటీ క్యాంపస్లే ఉద్యమ కేంద్రాలుగా మారాయి. 1989లో చరిత్రాత్మక తియానన్మెన్ స్క్వేర్ వద్ద విద్యార్థుల ఊరేగింపుపై సైన్యం దాడి చేసింది. యూనివర్సిటీల్లో విద్యార్థులు లేకుండా చేయడం ద్వారా జీరో కోవిడ్ వ్యతిరేక పోరాటాన్ని నీరుగార్చాలన్నదే ప్రభుత్వ వ్యూహమని యూనివర్సిటీ ఆఫ్ షికాగోలో పనిచేస్తున్న చైనా రాజకీయ వ్యవహారాల నిపుణుడు డాలీ యాంగ్ విశ్లేషించారు. చైనాలో మళ్లీ కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. నిత్యం 30 వేలకుపైగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ప్రజలంతా కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా జనం రాకపోకలపై అధికారులు ఇప్పటికే ఆంక్షలు విధించారు. ప్రయాణాలు మానుకోవాలని చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో యూనివర్సిటీలు విద్యార్థులను ఇళ్లకు పంపిస్తుండడం గమనార్హం. -
వర్సిటీల్లో నిష్ణాతుల నియామకం
సాక్షి, అమరావతి: యూనివర్సిటీలు, కాలేజీలు, ఉన్నత విద్యా సంస్థల్లో అనుభవజ్ఞులైన నిపుణుల సేవలను వినియోగించుకోవాలని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) సూచించింది. ఇందుకోసం ‘ప్రొఫెసర్ ఆఫ్ ప్రాక్టీస్ (పీవోపీ)’ హోదాను సృష్టించింది. ఈ విధానం కింద వివిధ రంగాల్లో అనుభవజ్ఞులైన వారిని, పారిశ్రామిక నిపుణుల సేవలను వినియోగించుకొని ప్రపంచస్థాయి అత్యున్నత ప్రమాణాలు సాధించవచ్చని పేర్కొంది. ప్రస్తుతం విశ్వవిద్యాలయాలు, ఇతర ఉన్నత విద్యా సంస్థల్లో పార్టు టైమ్, గెస్ట్, కాంట్రాక్టు ప్రాతిపదికన అసిస్టెంట్ ప్రొఫెసర్లను నియమిస్తున్నారు. వీరికన్నా వివిధ రంగాల్లో నిపుణులైన వారి సేవల వల్ల ఎక్కువ ప్రయోజనం ఉంటుందని యూజీసీ అభిప్రాయపడుతోంది. ఇప్పటికే అభివృద్ధి చెందిన దేశాలు పీవోపీ విధానంతో మంచి ఫలితాలు సాధిస్తున్నాయని వివరించింది. విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సలర్లు, ఉన్నత విద్యా కళాశాలల ప్రిన్సిపాళ్లు వారి సంస్థల్లో పీవోపీ నియామకాలకు నిబంధనల మార్పునకు చర్యలు తీసుకోవడంతోపాటు, ఆ చర్యల నివేదికను కూడా పంపాలని యూజీసీ అన్ని సంస్థలను కోరింది. పీవోపీల నియామకాలపై గత నెలలోనే నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనికి అధికారిక విద్యార్హతలు, ప్రచురణ తదితరాలు తప్పనిసరి కాదని స్పష్టం చేసింది. ఎమ్ఐటీ వంటి ప్రతిష్టాత్మక సంస్థల్లో అమలు ప్రాక్టీస్ ప్రొఫెసర్ విధానాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రతిష్టాత్మక విద్యా సంస్థలు అనుసరిస్తున్నాయి. మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎమ్ఐటీ), హార్వర్డ్ విశ్వవిద్యాలయం, స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయం, స్కూల్ ఆఫ్ ఓరియంటల్ అండ్ ఆఫ్రికన్ స్టడీస్ (ఎస్ఓఏఎస్), యూనివర్సిటీ ఆఫ్ లండన్, కార్నెల్ విశ్వవిద్యాలయం, హెల్సింకి విశ్వవిద్యాలయం వంటి అనేక విశ్వవిద్యాలయాల్లో ఈ విధానంలో నిపుణుల నియామకం జరుగుతోంది. మన దేశంలోనూ ఢిల్లీ, మద్రాస్, గౌహతి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో (ఐఐటీలలో) పీవోపీలను నియమించారు. పీవోపీల నియామకానికి యూజీసీ మార్గదర్శకాలు.. ► ఈ నిపుణుల నియామకం విశ్వవిద్యాలయం, కళాశాలల మంజూరైన పోస్టుల పరిమితి మేరకు మాత్రమే ఉంటుంది. ► విద్యా సంస్థల్లో నియమించే పీవోపీల సంఖ్య మంజూరైన పోస్టుల్లో 10 శాతానికి మించకూడదు ► సంస్థలో మంజూరైన పోస్టుల సంఖ్యను లేదా రెగ్యులర్ ఫ్యాకల్టీ నియామకంపై ప్రభావం చూపకూడదు ► గౌరవ ప్రాతిపదికన ఈ నియామకాలు ఉండాలి ► పరిశ్రమల ద్వారా ఆయా సంస్థలకు వచ్చే నిధులు లేదా ఆయా ఉన్నత విద్యా సంస్థల్లోని సొంత నిధులతో నియామకాలు చేపట్టాలి ► పీవోపీల గరిష్ట పదవీ కాలం మూడేళ్లు. అవసరమైన సందర్భాల్లో ఒక సంవత్సరం పొడిగించవచ్చు ► ఇప్పటికే టీచింగ్ పొజిషన్లో ఉన్నవారికి లేదా పదవీ విరమణ చేసిన వారికి ఈ పథకం వర్తించదు. -
ఈ మార్పులు మంచికేనా?
ఎక్కడైనా, ఎప్పుడైనా.... కాలాన్ని బట్టి నియమ నిబంధనల్ని మార్చాల్సిందే. కానీ, కొత్త నియమ నిబంధనలు పురోగమింపజేస్తాయా, తిరోగమింపజేస్తాయా అన్నదే కీలకం. విశ్వవిద్యాలయాల్లో పరిశోధనకు సంబంధించిన డాక్టోరల్ డిగ్రీల రూల్స్లో యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) చేసిన సమూలమార్పులు ఇప్పుడు అదే చర్చకు దారి తీస్తున్నాయి. ఎంఫిల్ కోర్సుల రద్దు, పీహెచ్డీ రావడానికి చేయాల్సిన కోర్స్వర్క్ను సడలించడం, నాలుగేళ్ళ డిగ్రీ కోర్స్ చేసిన వెంటనే పీహెచ్డీలో పేరు నమోదుకు అనుమతించడం లాంటి మార్పులపై భిన్నాభిప్రాయాలున్నాయి. యువ విద్యార్థులను మరింతగా పరిశోధన వైపు ఆకర్షించడానికే ఈ చర్య అని యూజీసీ చెబుతోంది. కానీ ఆచరణలో ఇది ప్రమాణాల క్షీణతకూ, పర్యవేక్షకుల కొరతకూ దారితీస్తుందనే వాదన బలంగా వినపడుతోంది. నిజానికి యూజీసీ 2009లో, తర్వాత 2016లో కొన్ని నియమాలు పెట్టింది. వాటి స్థానంలో కొత్తవాటిని ఈ నెల 7న వెల్లడించింది. ఈ కొత్త ‘యూజీసీ (పీహెచ్డీ కనీస ప్రమాణాలు, విధానాల) నిబంధనలు 2022’ వల్ల పీహెచ్డీ చేయడానికి అర్హత నుంచి ప్రవేశ విధానం, మూల్యాంకన పద్ధతుల దాకా అన్నీ మారనున్నాయి. మునుపటి నిబంధనల కింద అనుమతి లేని వర్కింగ్ ప్రొఫెష నల్స్ పార్ట్టైమ్ పీహెచ్డీలకు సైతం పచ్చజెండా ఊపారు. మాస్టర్స్ డిగ్రీ ఒక ఏడాది (2 సెమిస్టర్లు) చదివినా, లేక నాలుగేళ్ళ (8 సెమిస్టర్ల) బ్యాచ్లర్ డిగ్రీలో కనీసం 75 శాతం మార్కులు సాధించినా పీహెచ్డీలో చేరవచ్చు. ఎప్పటిలానే నెట్/ జేఆర్ఎఫ్ అర్హతలు, ప్రవేశపరీక్షలతో ప్రవేశాలు చేసుకో వచ్చు. అయితే పీహెచ్డీ ప్రవేశాలకు ఉమ్మడి ప్రవేశపరీక్ష చర్చను ప్రస్తావించకుండా వదిలేశారు. పీహెచ్డీ చేస్తున్నవారు తప్పనిసరిగా ప్రత్యేక జర్నల్స్లో కనీసం ఒక పరిశోధనా పత్రాన్ని ప్రచురించాలనీ, సదస్సుల్లో కనీసం రెండు పత్రసమర్పణలు చేయాలనీ పాత నిబంధనలు. ఆ రెండూ ఇక తీసేశారు. ఇప్పటి దాకా పరిశోధనకు ప్రవేశద్వారంగా ఉన్న ఎంఫిల్ కోర్సును ‘జాతీయ విద్యావిధానం’ సిఫార్సుకు అనుగుణంగా ఎత్తేశారు. ఇవన్నీ పరిశోధనలో నాణ్యతను దెబ్బతీస్తాయనేది విద్యావేత్తల్లో ఒక వర్గం ఆందోళన. మరో వర్గం మాత్రం తప్పనిసరి తద్దినంగా మారిన పత్రాల నిబంధనల్లో పలు లోపాలున్నాయనీ, వాటితో ప్రయోజనం లేదు గనక ఎత్తేయాలన్న నిర్ణయం సరైనదేననీ అంటోంది. అసలీ పత్రాల ప్రచురణ అంశంపై యూజీసీ చాలాకాలంగా తర్జనభర్జన పడుతోంది. పరిశోధక విద్యార్థుల నుంచి రుసుము వసూలు చేసి, పత్రాలను ప్రచురించే ‘దోపిడీ జర్నల్స్’, గ్రంథచౌర్యం పెరగడంతో సమస్య వచ్చిపడింది. విశ్వవిద్యాలయ పత్రాల్లో నూటికి 75 ‘స్కోపస్’ గుర్తింపు పొందని జర్నల్స్లోనే ప్రచురిత మవుతున్నాయనేది ఒక అధ్యయనం. అందుకే, ఆ తరహా జర్నల్స్లో, వాటి ప్రచురణకర్తలు పెట్టే సదస్సుల్లో ఇచ్చిన పత్రాలను పరిగణనలోకి తీసుకోరాదని 2019లోనే యూజీసీ ప్యానెల్ సిఫార్సు చేసింది. సామాజికంగా, ఆర్థికంగా వెనకబడ్డ విద్యార్థులకు విస్తృత సంబంధాలు, ఆర్థిక స్థోమత ఉండవు గనక అలాంటి దోపిడీ జర్నల్స్కు అడ్డుకట్ట వేయాల్సిందే. రిసెర్చ్ స్కాలర్లపై ఒత్తిడిని తగ్గించాల్సిందే. కానీ, ప్రత్యామ్నాయం చూడకుండా, పత్రాలే అక్కర్లేదనడం వివేకవంతమేనా? మన దగ్గర ఇప్పటికీ విద్యార్థులు ఎక్కువ, నాణ్యమైన జర్నల్స్ తక్కువ. ఇదో పెనుసమస్య. ప్రపంచ పరిశోధకుల్లో 12 శాతం మంది మనవాళ్ళే అయినా, భారత పరిశోధనా పత్రాలు 4.52 శాతమేనట. 2020 నాటి స్కోపస్ శాస్త్రీయ ప్రచురణల డేటాబేస్ తేల్చింది. ఆచరణలో లోపాలున్నా, పత్రాల ప్రచురణ ఆలోచన అసలంటూ మంచిదే. ఐఐటీల్లో పత్రాల ప్రచురణ తప్పనిసరి కాకున్నా నాణ్యమైన పరిశోధన సాగుతోందంటే ఆచార్యులు, విద్యార్థుల నిబద్ధతే కారణం. అలాంటి వాతావరణం కరవైన విశ్వవిద్యాలయాల్లో ఇప్పుడిక పత్రాలు లేకుండానే పరిశోధనాసక్తి, ప్రమాణాలు తగ్గకుండా ఎలా చూస్తారు? అలాగే, డిగ్రీ అవుతూనే పీహెచ్డీలో చేరిన విద్యార్థికి పరిశోధనా జ్ఞానం ఎలా ఉంటుంది? పీజీ చేసి, ఎంఫిల్లో మౌలిక పరిశోధనా పద్ధతులు తెలుసుకున్నాక ఆసక్తితో పీహెచ్డీ చేయడం వేరు. పరిశోధనలో ఓనమాలు తెలియకుండా డిగ్రీ అవుతూనే పీహెచ్డీలోకి దిగడం వేరు. అలా దిగినా, ఆరేళ్ళ నిర్ణీత వ్యవధిలో తొలి ఏళ్ళన్నీ పరి శోధనా పద్ధతులు తెలుసుకోవడానికే ఖర్చయిపోతుంది. అలాగే, పత్రసమర్పణ, ప్రచురణ తప్పని సరి కానప్పుడు విద్యార్థులకు లోతైన అధ్యయనానికి ప్రేరణ లేకుండా పోయే ప్రమాదమూ ఉంది. పరిశోధనను సైతం మామూలు చదువులంత తేలిగ్గా తీసుకోవడం మన దగ్గరే. మొదట్లో 1920లలో మన దగ్గర కొన్ని డజన్ల మందే పీహెచ్డీ స్కాలర్లుండేవారు. కానీ, ఇవాళ అమెరికాలో ఏటా 64 వేలకు పైగా డాక్టరేట్లు వస్తుంటే, 24 వేల మంది పీహెచ్డీ స్కాలర్లతో మనం ప్రపంచంలో 4వ స్థానంలో ఉన్నాం. 2010తో పోలిస్తే 2017లో పీహెచ్డీలో చేరేవారి సంఖ్య రెట్టింపు దాటింది. 2000 నాటికి దేశంలో డాక్టరేట్ ప్రదానం చేసే సంస్థలు 326. తీరా, 2017 కల్లా వాటి సంఖ్య 912. అంటే పీహెచ్డీ ఎంత వేలంవెర్రిగా మారిందో అర్థం చేసుకోవచ్చు. ఏటా 60 లక్షల మంది గ్రాడ్యు యేట్లు, 15 లక్షల మంది పోస్ట్ గ్రాడ్యుయేట్లు వస్తున్న దేశంలో నిఖార్సయిన పరిశోధక విద్యార్థుల శాతం ప్రశ్నార్థకమే. ఇప్పటికే నాసిరకమని పేరుపడ్డ మన విశ్వవిద్యాలయ రిసెర్చ్ ప్రమాణాలు మరింత దిగజారడానికి కొత్త నిబంధనలు కారణం కాకూడదు. లోతుగా పునఃపరిశీలన చేసినా తప్పు లేదు. ప్రామాణిక పరిశోధనలకై ఒక అడుగు వెనక్కి వేసినా... ప్రగతికి అది ముందడుగే! -
కామన్ బోర్డుపై జగడం! యూనివర్సిటీలపై సర్కార్ దృష్టి
సాక్షి, హైదరాబాద్: విశ్వవిద్యాలయాల్లో టీచింగ్, నాన్–టీచింగ్ సిబ్బంది పోస్టుల భర్తీ కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన కామన్ రిక్రూట్మెంట్ బోర్డు వివాదాస్పదంగా మారింది. అసలీ బోర్డును ఎందుకు తెచ్చారో చెప్పాలని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రభుత్వాన్ని వివరణ కోరారు. యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ (యూజీసీ) నిబంధనల మేరకే బోర్డు ఏర్పాటు జరిగిందా? అని ఆమె సందేహాలు లేవనెత్తారు. ప్రభుత్వం మాత్రం అన్ని నిబంధనలకు లోబడే ఉమ్మడి నియామక బోర్డును ఏర్పాటు చేశామని సమర్థించుకుంటోంది. గత అసెంబ్లీ సమావేశాల్లో ఉభయసభల ఆమోదం పొందిన ఈ బిల్లు, ప్రస్తుతం గవర్నర్ వద్ద ఉంది. గవర్నర్ ఆమోదిస్తే చట్టంగా మారుతుంది. ఈ దశలోనే వివాదం మొదలైంది. ఏమిటీ వివాదం? రాష్ట్రంలోని 15 వర్సిటీల్లో 8 ఏళ్లుగా నియామకాలు జరగలేదు. టీచింగ్, నాన్–టీచింగ్ కలిపి 8 వేల పోస్టుల ఖాళీలున్నాయి. గతంలో వర్సిటీల్లో ఎక్కడికక్కడే సిబ్బందిని నియమించుకునే వాళ్లు. ఈ విధానంలో అవినీతి జరుగుతోందని భావించిన ప్రభుత్వం ఎవరికి వారు ఇష్టానుసారంగా మార్గదర్శకాలు పెట్టుకోవడం సరికాదంటూ ఉమ్మడి నియామకాలు చేపట్టాలని నిర్ణయించింది. అయితే, ఇది తమ అధికారాన్ని తగ్గించేలా ఉందంటూ వీసీలూ అంతర్గతంగా వ్యతిరేకిస్తున్నారు. ఉమ్మడి బోర్డులో ఉన్నత విద్యామండలి చైర్మన్, ఇతర ఐఏఎస్ అధికారుల పాత్రను వాళ్లు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇదే కోణంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల జగడం ఈ వివాదానికి ఆజ్యం పోసింది. వర్సిటీల చాన్స్లర్గా ఉండే గవర్నర్ ఉమ్మడి బోర్డుపై మరింత స్పష్టత కోరుతూ విద్యామంత్రికి లేఖ రాసి, వివాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లారు. ఉమ్మడి బోర్డు పేరుతో ప్రభుత్వం రాజకీయ నియామకాలు చేపట్టే వీలుందనే అనుమానం ఆమె వ్యక్తం చేశారు. మొత్తం మీద అటు గవర్నర్, ఇటు ప్రభుత్వం మధ్యలో వర్సిటీల్లో నియామకాలు ఇప్పట్లో జరిగే అవకాశం కన్పించడం లేదని అంటున్నారు. భారీగా ఖాళీలు... తగ్గుతున్న నాణ్యత వర్సిటీల్లో నియామకాలు లేకపోవడంతో భారీగా ఖాళీలు ఏర్పడాయి. ఇది ఉన్నత విద్యపై తీవ్ర ప్రభావం చూపుతోంది. రెగ్యులర్ ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు లేకపోవడంతో పరిశోధనలకు తీవ్ర ఆటంకం కలుగుతోంది. కాంట్రాక్టు సిబ్బందితో ఏదో నెట్టుకొస్తున్నా ఆశించిన ఫలితాలు రావడం లేదు. ► 2021 జనవరి 31 నాటికి 11 వర్సిటీల్లో 2,837 పోస్టులుంటే అందులో 1,869 పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. కేవలం 968 మంది (34.12 శాతం) మాత్రమే రెగ్యులర్ అధ్యాపకులున్నారు. ► 1,869 ఖాళీల్లో 1,061 పోస్టుల భర్తీకి ప్రభుత్వం మూడేళ్ల కిందటే ఆమోదం తెలిపినా భర్తీ చేయలేదు. ► శాతవాహన, మహాత్మాగాంధీ, పాలమూరు, ఆర్జీయూకేటీ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయాల్లో ప్రస్తుతం ఒక్క ప్రొఫెసర్ కూడా లేరు. శాతవాహన, రాజీవ్గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ అండ్ టెక్నాలజీ (ఆర్జీయూకేటీ), అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీల్లో ఒక్క అసోసియేట్ ప్రొఫెసర్ కూడా లేరు. పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో అసోసియేట్ ప్రొఫెసర్ ఒకే ఒకరున్నారు. ► 11 వర్సిటీల్లో 61.65 శాతం ప్రొఫెసర్, 85.82 శాతం అసోసియేట్ ప్రొఫెసర్, 55.48 శాతం అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. చదవండి: గవర్నర్ తమిళిసై ప్రశ్నల వర్షం.. మాట్లాడకుండా వెళ్లిపోయిన సబిత -
కేరళ గవర్నర్కు బిగ్ షాక్.. ఛాన్సలర్గా తప్పిస్తూ ఆర్డినెన్స్?
తిరువనంతపురం: కేరళ గవర్నర్, ప్రభుత్వం మధ్య వివాదం మరింత ముదురుతోంది. యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్ పదవి నుంచి తప్పుకోవాలని ఆదేశించటంతో ఈ వివాదం తారస్థాయికి చేరింది. ఈ క్రమంలో గవర్నర్ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్ను యూనివర్సిటీల ఛాన్సలర్గా తప్పించేందుకు సిద్ధమవుతోంది ఎల్డీఎఫ్ నేతృత్వంలోని కేరళ సర్కార్. గవర్నర్ను తప్పిస్తూ ఆర్డినెన్స్ తీసుకురావాలని ముఖ్యమంత్రి పినరయి విజయన్ నేతృత్వంలో బుధవారం సమావేశమైన కేబినెట్ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఆర్డినెన్స్ ముసాయిదాపై మంత్రివర్గంలో చర్చించినట్లు పేర్కొన్నాయి. యూనివర్సిటీల ఛాన్సలర్గా గవర్నర్ను తొలగించి.. ఆయన స్థానంలో నైపుణ్యం గల వ్యక్తిని తీసుకురావాలని భావిస్తున్నట్లు ఎల్డీఎఫ్ ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కొద్ది రోజుల క్రితం కేరళలోని 9 వర్సిటీల వైస్ ఛాన్సలర్గా రాజీనామా చేయాలంటూ ఆదేశించారు గవర్నర్ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్. దీంతో వివాదం మొదలైంది. గవర్నర్ అధికారాలపై ప్రభుత్వం ప్రశ్నించగా.. వివాదం ముదిరింది. రాష్ట్రవ్యాప్తంగా గవర్నర్కు వ్యతిరేకంగా ఎల్డీఎఫ్ శ్రేణులు నిరసనలు తెలిపే కార్యక్రమానికి పిలుపునిచ్చారు. మరోవైపు.. వైస్ ఛాన్సలర్ల అంశంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని కేరళ హైకోర్టు సైతం సూచించినట్లు సమాచారం. ఇదీ చదవండి: గవర్నర్ వైఖరిపై ఎల్డీఎఫ్ విస్తృతస్థాయి నిరసన -
అసలేం జరుగుతోంది?.. ముదురుతున్న వివాదం.. సబిత వ్యాఖ్యలపై స్పందించిన రాజ్భవన్
సాక్షి, హైదరాబాద్: పెండింగ్ బిల్లులపై వివాదం ముదురుతోంది. యూనివర్శిటీ బిల్లు విషయంలో తనకు ఎలాంటి సమాచారం రాలేదన్న మంత్రి సబితా ఇంద్రారెడ్డి వ్యాఖ్యలపై రాజ్భవన్ వర్గాలు స్పందించాయి. గవర్నర్ నుంచి లేఖ రాలేదనడం సరికాదని, యూనివర్శిటీల బిల్లు వ్యవహారంపై మెసెంజర్ ద్వారా నిన్ననే(సోమవారం) సమాచారం ఇచ్చామని రాజ్భవన్ పేర్కొంది. చదవండి: తెలంగాణలో పొలిటికల్ హీట్.. ప్రధాని మోదీ పర్యటనపై వివాదం కాగా, ‘తెలంగాణ యూనివర్సిటీస్ కామన్ రిక్రూట్మెంట్ బోర్డు బిల్లు–2022’ విషయంలో పలు సందేహాలు ఉన్నాయని.. దీనిపై రాజ్భవన్కు వచ్చి తనతో చర్చించాలని విద్యాశాఖ మంత్రికి సోమవారం గవర్నర్ లేఖ రాశారు. వర్సిటీల్లో పోస్టుల భర్తీకి ఇప్పుడున్న విధానంలో ఇబ్బందులేమిటని.. కొత్త విధానంతో న్యాయపరమైన చిక్కులు వస్తే ఎలాగని ప్రశ్నించారు. కొంతకాలం నుంచి రాజ్భవన్, ప్రగతిభవన్ మధ్య విభేదాలు కొనసాగుతున్న నేపథ్యంలో గవర్నర్ తమిళిసై లేఖలు చర్చనీయాంశంగా మారాయి. యూనివర్సిటీల బిల్లుకు సంబంధించి విద్యా మంత్రికి రాసిన లేఖలో గవర్నర్ పలు సందేహాలు లేవనెత్తారు. ఈ క్రమంలో ప్రగతిభవన్, రాజ్భవన్ మధ్య విభేదాలు తారస్థాయికి చేరాయి. ఈ క్రమంలోనే పరస్పరం బహిరంగ ఆరోపణలు, విమర్శలు వినవస్తున్నాయి. ఇప్పుడీ విభేదాలు ముదిరినట్టుగా కనిపిస్తున్నాయని రాజకీయ వర్గాలు అంటున్నాయి. గతంలో నామినేటెడ్ ఎమ్మెల్సీగా పాడి కౌశిక్రెడ్డి పేరును రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించగా.. గవర్నర్ ఆమోదించకుండా పెండింగ్లో పెట్టడంతో విభేదాలు బయటపడ్డాయి. సమ్మక్క–సారక్క జాతరకు వెళ్లేందుకు గవర్నర్ హెలికాప్టర్ కోరగా.. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయకపోవడం వివాదంగా మారింది. తర్వాత గణతంత్ర వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం రాజ్భవన్కే పరిమితం చేసి సాదాసీదాగా నిర్వహించడం పట్ల గవర్నర్ బహిరంగంగానే విమర్శలు చేశారు. -
వచ్చి చర్చించండి.. సబితకు గవర్నర్ పిలుపు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వానికి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ షాకిచ్చారు. ‘తెలంగాణ యూనివర్సిటీస్ కామన్ రిక్రూట్మెంట్ బోర్డు బిల్లు–2022’ విషయంలో పలు సందేహాలు ఉన్నాయని.. దీనిపై రాజ్భవన్కు వచ్చి తనతో చర్చించాలని విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డికి సోమవారం గవర్నర్ లేఖ రాశారు. వర్సిటీల్లో పోస్టుల భర్తీకి ఇప్పుడున్న విధానంలో ఇబ్బందులేమిటని.. కొత్త విధానంతో న్యాయపరమైన చిక్కులు వస్తే ఎలాగని ప్రశ్నించారు. ఇదే సమయంలో ఈ కొత్త విధానంపై అభిప్రాయం వ్యక్తం చేయాలని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ)కి గవర్నర్ లేఖ రాశారు. కొంతకాలం నుంచి రాజ్భవన్, ప్రగతిభవన్ మధ్య విభేదాలు కొనసాగుతున్న నేపథ్యంలో గవర్నర్ తమిళిసై లేఖలు చర్చనీయాంశంగా మారాయి. యూనివర్సిటీల బిల్లుకు సంబంధించి విద్యా మంత్రికి రాసిన లేఖలో గవర్నర్ పలు సందేహాలు లేవనెత్తారు. ‘‘ప్రస్తుత విద్యా విధానాన్ని అనుసరించి రాష్ట్ర విశ్వవిద్యాలయాల్లో బోధన, బోధనేతర పోస్టులను పారదర్శకంగా భర్తీ చేయడంలో ఉన్న ఇబ్బందులు ఏమిటి? కొత్త విధానంతో న్యాయపరమైన చిక్కులు ఎదురై పోస్టుల భర్తీలో మరింత జాప్యం జరిగే అవకాశం ఉండటంతో ఉద్యోగార్థులు నష్టపోరా? గత ఎనిమిదేళ్లుగా యూనివర్సిటీల్లో ఖాళీల భర్తీకి ఎందుకు చర్యలు తీసుకోలేదు? యూనివర్సిటీల్లో ఖాళీలను భర్తీ చేయాలని గత 3 ఏళ్లలో తాను ఎన్నోసార్లు లేఖలు రాసినా ఎందుకు చర్యలు తీసుకోలేదు?’’ అని ప్రశ్నించారు. ఈ అంశాలపై చర్చించడానికి రాజ్భవన్కు రావాలని మంత్రి సబితను కోరారు. ఇక రాష్ట్రంలోని వర్సిటీల్లో పోస్టుల భర్తీకి కామన్ రిక్రూట్మెంట్ బోర్డు ఏర్పాటు చేయడం చట్టబద్ధమేనా? న్యాయస్థానాల్లో చెల్లుబాటు అవుతుందా? అన్న విషయంలో అభిప్రాయం చెప్పాలని యూజీసీని గవర్నర్ తమిళిసై కోరారు. ఈ మేరకు యూజీసీ చైర్మన్కు లేఖ రాశారు. ఇంకా పెండింగ్లోనే 7 బిల్లులు రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ 13న తెలంగాణ యూనివర్సిటీస్ కామన్ రిక్రూట్మెంట్ బోర్డు బిల్లుతోపాటు మరో ఏడు బిల్లులను శాసనసభ, శాసనమండలిలలో ఆమోదించి గవర్నర్కు పంపింది. అందులో ఒక్క జీఎస్టీ చట్ట సవరణ బిల్లును గవర్నర్ ఆమోదించి తిరిగి పంపారు. వర్సిటీల బిల్లు సహా ఏడు బిల్లులు ఇంకా రాజ్భవన్లోనే పెండింగ్లో ఉన్నాయి. ఇందులో ములుగు అటవీ కళాశాలను తెలంగాణ అటవీ విశ్వవిద్యాలయంగా మార్చే బిల్లు, తెలంగాణ యూనివర్సిటీస్ కామన్ రిక్రూట్మెంట్ బోర్డు బిల్లు, ప్రైవేటు వర్సిటీల చట్ట సవరణ బిల్లు, పురపాలికల చట్ట సవరణ బిల్లు, అజామాబాద్ పారిశ్రామిక ప్రాంత చట్ట సవరణ బిల్లు, పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ చట్ట సవరణ బిల్లు, మోటార్ వాహనాలపై పన్నుల చట్ట సవరణ బిల్లు ఉన్నాయి. గవర్నర్ ఆమోదిస్తే వెంటనే వాటిని అమల్లోకి తీసుకువస్తూ గెజిట్ నోటిఫికేషన్లు జారీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. వీటిలో యూనివర్సిటీల బోర్డు బిల్లును గవర్నర్ మంగళవారంలోగా ఆమోదించకపోతే.. రాజ్భవన్ను వేలాది మందితో ముట్టడిస్తామని యూనివర్సిటీ విద్యార్థుల జేఏసీ ఆదివారం ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే గవర్నర్ తమిళిసై మంత్రి సబితకు లేఖ రాసినట్టుగా చెప్తున్నారు. ఎత్తులు.. పైఎత్తులతో.. ప్రగతిభవన్, రాజ్భవన్ మధ్య విభేదాలు తారస్థాయికి చేరాయని.. ఈ క్రమంలోనే పరస్పరం బహిరంగ ఆరోపణలు, విమర్శలు వినవస్తున్నాయని రాజకీయవర్గాలు చెప్తున్నాయి. ఇప్పుడీ విభేదాలు ముదిరినట్టుగా కనిపిస్తున్నాయని అంటున్నాయి. గతంలో నామినేటెడ్ ఎమ్మెల్సీగా పాడి కౌశిక్రెడ్డి పేరును రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించగా.. గవర్నర్ ఆమోదించకుండా పెండింగ్లో పెట్టడంతో విభేదాలు బయటపడ్డాయి. సమ్మక్క–సారక్క జాతరకు వెళ్లేందుకు గవర్నర్ హెలికాప్టర్ కోరగా.. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయకపోవడం వివాదంగా మారింది. తర్వాత గణతంత్ర వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం రాజ్భవన్కే పరిమితం చేసి సాదాసీదాగా నిర్వహించడం పట్ల గవర్నర్ బహిరంగంగానే విమర్శలు చేశారు. సీఎం కేసీఆర్ రాజ్భవన్కు రావడం మానేశారని ఆమె ఎన్నో పర్యాయాలు అసంతృప్తి వ్యక్తం చేశారు. గవర్నర్ ప్రసంగం లేకుండానే శాసనసభ బడ్జెట్ సమావేశాలను ప్రారంభించడాన్ని తప్పుపట్టారు. మరోవైపు మంత్రులు బీజేపీ కార్యకలాపాలకు రాజ్భవన్ అడ్డాగా మారిందని గవర్నర్పై విమర్శలు గుప్పించారు. ఇలాంటి ఎన్నో వివాదాలు తలెత్తాయి. ఇటీవల తన వ్యక్తిగత ఖర్చులకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి డబ్బులు తీసుకోవడం లేదని గవర్నర్ ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. తనను కలిసేందుకు సీఎం కేసీఆర్, రాష్ట్ర మంత్రులెవరూ రాకపోవడంతోనే.. యూనివర్సిటీల నియామకాల బిల్లును అడ్డు పెట్టుకుని మంత్రిని పిలుస్తూ గవర్నర్ లేఖ రాశారని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. రాజ్భవన్కు వెళ్తారా? సీఎం కేసీఆర్తోపాటు రాష్ట్ర మంత్రులు ఏడాదికాలం నుంచి రాజ్భవన్తో అంటీముట్టనట్టు ఉంటున్న నేపథ్యంలో ఓ రాష్ట్ర మంత్రికి గవర్నర్ నుంచి పిలుపురావడం చర్చనీయాంశంగా మారింది. గవర్నర్ లేఖకు స్పందించి మంత్రి సబిత రాజ్భవన్కు వెళ్తారా, లేదా? అన్నది ఆసక్తికరంగా మారింది. రాష్ట్ర ప్రభుత్వం పట్టింపులకు పోతే మాత్రం మంత్రి సబితను రాజ్భవన్కు పంపించే అవకాశాలు ఉండవని రాజకీయ వర్గాలు అంటున్నాయి. అయితే ఇటీవల గవర్నర్ తమిళిసై మీడియాతో మాట్లాడుతూ... ‘‘శాసనసభలో పాసైన బిల్లులకు ఆమోదం తెలిపే అంశం పూర్తిగా నా పరిధిలోనిది. గవర్నర్గా నాకు విస్తృత అధికారాలు ఉంటాయి. నా పరిధిలోనే నేను నడుచుకుంటున్నాను’’ అని పేర్కొనడం గమనార్హం. చదవండి: మోదీ వల్లే దేశ ఆర్థిక వ్యవస్థ పతనం -
గవర్నర్ ఉత్తర్వులపై కేరళ సీఎం ఫైర్
బెంగళూరు: కేరళలో తొమ్మిది యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్లు సోమవారం ఉదయం 11.30 గంటల కల్లా వైదొలగాలని గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. దీంతో కర్ణాటక పాలక ప్రభుత్వం గవర్నర్ ఆదేశాలను సవాలు చేస్తూ పిటిషన్ దాఖలు చేసింది. ఈ మేరకు కేరళ హైకోర్టు దాఖలైన పిటీషన్ పరిశీలించేందుకు సోమవారం సాయంత్రమే ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించనుంది. ఐతే గవర్నర్ ఖాన్ సుప్రీం కోర్టు ఆదేశాలను ప్రస్తావిస్తూ... విశ్వవిద్యాలయా వైస్ ఛాన్సలర్లను నియమించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని తేల్చి చెబుతున్నారు. దీంతో రాష్ట్రంలో విశ్వవిద్యాలయాలను నాశనం చేయాలనే ఉద్దేశంతోనే మాతో ఇలా యుద్ధానికి దిగుతున్నారంటూ గవర్నర్పై కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ విరుచుకుపడ్డారు. సంఘ పరివార్కి ధీటుగా గవర్నర్ వ్యవహరిస్తున్నారంటూ మండిపడ్డారు. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ప్రభుత్వం, విద్యాపరంగా స్వతంత్రంగా ఉండాల్సిన యూనివర్సిటీల అధికారాలను కాలరాసేలా గవర్నర్ తన చర్యలను అతిక్రమిస్తున్నారంటూ ఆరోపణలు చేశారు. కేరళ ప్రభుత్వం వివిధ యూనివర్సిటీలకు వీసీలను సొంతంగా నియమిస్తున్న నేపథ్యం ఉందని, కానీ గవర్నర్ ఇది తన బాధ్యత అంటూ వాదిస్తున్నారని అన్నారు. అయినా గవర్నర్ కార్యాలయం రాష్ట్ర ప్రభుత్వాన్ని సంక్షోభంలో పడేయడానికో లేదా ప్రభుత్వంపై చర్యలు తీసుకోవడానికో కాదని స్పష్టం చేశారు. అంతేగాదు గవర్నర్కు అలాంటి దిశానిర్దేశం చేసే అధికారం లేదని సీపీఎం నాయకుడు సీతారాం ఏచూరి కూడా కరాఖండీగా చెప్పారు. ఇది ఏకపక్షం, చట్టవిరుద్ధం, రాజకీయ ప్రేరేపితమైనదంటూ విమర్శలు గుప్పించారు. విద్యాసంస్థల్లో హిందూత్వ భావజాలన్ని ప్రచారం చేయాలన్న కుట్రపూరిత ఉద్దేశంతోనే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారంటూ ఆరోపణలు చేశారు. (చదవండి: దీపావళి కానుకగా ఖరీదైన గిఫ్టులు ఇచ్చిన పర్యాటక మంత్రి) -
బోర్డు సరే.. విధివిధానాలెప్పుడు?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో నియామక ప్రక్రియకు ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నా ఇందుకు సంబంధించిన విధివిధానాలు ఇంకా ఖరారు కాలేదు. నియామకాలకు ఏ నిబంధనలు తీసుకురావాలి అనే దానిపై స్పష్టత కనిపించడంలేదు. మరోవైపు తమ ప్రాధాన్యత తగ్గిస్తూ ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేయడాన్ని వర్సిటీల వీసీలు జీర్ణించుకోలేకపోతున్నారు. రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల్లో టీచింగ్, నాన్–టీచింగ్ పోస్టుల భర్తీని ఎప్పట్లా ఎవరికి వారే కాకుండా ఉమ్మడిగా నియామకాలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు అనుగుణంగా బోర్డు ఏర్పాటును కూ డా ప్రకటించింది. ఈ బోర్డుకు చైర్మన్గా ఉన్నత విద్యామండలి చైర్మన్ నేతృత్వం వహిస్తారు. ఉన్నత విద్యా విభాగం ప్రత్యేక చీఫ్ సెక్రటరీ, ఆర్థిక శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి, కాలేజీ విద్య కమిషనర్ సభ్యులుగా ఉంటారు. ఈ తరహా నిర్ణయం మాత్రమే జరిగింది తప్ప ఇంత వరకూ బోర్డు సభ్యులు భేటీ కాలేదు. వర్సిటీల వీసీలతో సంప్రదించి విధివిధానాలు ఖరారు చేయాలా లేక సొంతంగా చేస్తే ఏమైనా సమస్యలు ఉంటాయా? అనే విషయమై అధికారులు తర్జనభర్జన పడుతున్నారు. దీనిపై ఏకాభిప్రాయం కుదరకపోవడం వల్లే విధివిధానాలపై ముందుకు వెళ్లలేకపోతున్న ట్లు ఉన్నత విద్యామండలి వర్గాలు చెబుతున్నాయి. భారీగా ఖాళీలు.. రాష్ట్రంలోని 11 యూనివర్సిటీల్లో 2,828 మంజూరైన పోస్టులున్నాయి. వాటిలో ఇప్పటికీ 1,869 పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. 2017లో ఒకసారి విశ్వవిద్యాలయాల్లో ఖాళీలపై ప్రభుత్వం నివేదిక తెప్పించుకుంది. అప్పట్లోనే 1,528 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తేల్చారు. అందులో 1,061 పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. కానీ ఇప్పటివరకూ ఈ పోస్టుల భర్తీ కార్యాచరణకు నోచుకోలేదు. రిజర్వేషన్ల అంశం, న్యాయపరమైన వివాదాలు, నియామక విధానంపై కసరత్తు పేరుతో అధికారులు కాలయాపన చేస్తూ వస్తున్నారు. ఈలోగా కొందరు రిటైర్ కావడంతో 2021 జనవరి నాటికి వర్సిటీల్లో ఖాళీల సంఖ్య 1,869కి చేరింది. ఇందులో 238 ప్రొఫెసర్ పోస్టులు, 781 అసోసియేట్ ప్రొఫెసర్, 850 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు ఉన్నాయి. ఈ స్థాయిలో ఖాళీలు ఏర్పడటంతో ప్రభుత్వం తాత్కాలిక, కాంట్రాక్టు అధ్యాపకులతో బోధన సాగిస్తోంది. ఫలితంగా విద్యా ప్రమాణాలు పడిపోతున్నాయనే విమర్శలొస్తున్నా యి. ఈ నేపథ్యంలోనే నియామక ప్రక్రియకు బో ర్డు వేసినా ముందడుగు పడకపోవడంతో అధ్యా పక పోస్టులు ఆశిస్తున్న వారిలో నిరాశ నెలకొంది. -
ఆన్లైన్ కోర్సులు ప్రారంభించండి
సాక్షి, అమరావతి: యూనివర్సిటీలు సహా దేశంలోని ఉన్నత విద్యా సంస్థలు ‘మాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్సు’ (మూక్స్)కింద స్టడీ వెబ్స్ ఆఫ్ యాక్టివ్ లెర్నింగ్ ఫర్ యంగ్ యాస్పైరింగ్ మైండ్స్ (స్వయం) ద్వారా రూపకల్పన చేసిన కోర్సుల్లో 40 శాతం ఆన్లైన్లో అందించాలని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) సూచించింది. విద్యా సంస్థలు ప్రస్తుతం అందిస్తున్న కోర్సులకు ఇవి అదనమని తెలిపింది. వీటి అమలుకు చర్యల నివేదికలను కూడా సమర్పించాలని తాజాగా పేర్కొంది. విద్యార్థులు డిజిటల్, ఆన్లైన్ వేదికలుగా చదువులు కొనసాగించేందుకు కేంద్ర ప్రభుత్వం మూక్స్ వేదికను ఏర్పాటు చేసింది. కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో విద్యార్థుల చదువుకు ఆటంకం కలగకుండా కేంద్రం ఈ విధానానికి శ్రీకారం చుట్టింది. ఇందుకోసం ‘స్వయం’ ద్వారా వివిధ ఆన్లైన్ కోర్సులకు రూపకల్పన చేసింది. అన్ని యూనివర్సిటీలు, ఉన్నత విద్యా సంస్థలు అవి అందిస్తున్న కోర్సులకు అదనంగా ‘స్వయం’ ద్వారా ఆన్లైన్ కోర్సులనూ అందించాలని 2021లోనే సూచించింది. కరోనా సమయంలో కొంతవరకు స్పందన వచ్చినా, ఆ తర్వాత అనుకున్న రీతిలో ముందుకు సాగలేదు. దీంతో ‘స్వయం’ కోర్సుల్లో కనీసం 40 శాతమైనా అందించాలని తాజాగా పేర్కొంది. వీటి ద్వారా విద్యార్థులు తక్కువ ఫీజుతో ఉన్నత విద్య అందుకోగలుగుతారని భావిస్తోంది. రెగ్యులర్ కోర్సులు చేస్తూనే డ్యూయెల్ డిగ్రీ కింద స్వయం కోర్సులకు అవకాశం కల్పించింది. ఈ కోర్సులకు యూజీసీ క్రెడిట్ ఫ్రేమ్వర్కును కూడా ఏర్పాటుచేసింది. ఈ కోర్సులు అభ్యసించే వారికి క్రెడిట్ల కేటాయింపుతో పాటు వాటిని వేర్వేరు కోర్సులు అభ్యసించే సంస్థలకు బదలాయించుకొనే వెసులుబాటు కూడా కల్పించింది. పలు విశ్వవిద్యాలయాలు ఇప్పటికే క్రెడిట్ బదిలీ కోసం ‘స్వయం’ కోర్సులను ఆమోదించాయని, మిగిలిన వర్సిటీలు కూడా చర్యలు తీసుకోవాలని యూజీసీ తాజాగా పేర్కొంది. ముందుగా వర్సిటీలు అకడమిక్ కౌన్సిళ్ల నుంచి ఆమోదం పొందాలని పేర్కొంది. క్రెడిట్ల కేటాయింపు, బదిలీని ఆయా విభాగాల హెడ్లు, డీన్లు ఆమోదించాలని తెలిపింది. ఈ ఆన్లైన్ కోర్సుల విధానంపై నిపుణులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. తరగతి గదిలో ప్రత్యక్ష బోధన ద్వారా విద్యార్థులకు మేలు జరుగుతుందని, ఇలా డిజిటల్, ఆన్లైన్ బోధన వల్ల ప్రమాణాలు మెరుగుపడవని అభిప్రాయపడుతున్నారు. పైగా ఆన్లైన్ కోర్సుల్లో పర్యవేక్షణ కొరవడుతుందని, విద్యార్థుల సామర్థ్యాలు, నైపుణ్యాన్ని కచ్చితంగా అంచనా వేయలేమని పేర్కొంటున్నారు. విద్యా సంస్థల్లో బోధన సిబ్బంది, మౌలిక సదుపాయాలు కల్పించలేక ఇలా ఆన్లైన్ బోధన వైపు వెళ్లడం సరైన పద్ధతి కాదని చెబుతున్నారు. -
వర్సిటీల్లో పోస్టుల భర్తీకి గ్రీన్సిగ్నల్!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా అన్ని విశ్వవిద్యాలయాల్లో ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, ఇతర ఖాళీలన్నీ భర్తీ చేసేందుకు ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. నియామక ప్రక్రియ కోసం ప్రత్యేకంగా రిక్రూట్మెంట్ బోర్డును ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. సీఎం కేసీఆర్ మంగళవారం మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఉన్నతాధికారులతో ఈ అంశంపై సమీక్షించారు. ఈ సందర్భంగా యూనివర్సిటీల్లో ఖాళీలకు సంబంధించిన వివరాలను అధికారులు సీఎంకు వివరించారు. దీనిపై స్పందించిన సీఎం నియామకాలకు గ్రీన్సిగ్నల్ ఇచ్చారు. అయితే రాష్ట్రంలోని 11 యూనివర్సిటీలు ఎవరికి వారుగా నియామకాలు చేపట్టకుండా ఉమ్మడి నియామక విధానాన్ని అమలు చేయాలని ఆదేశించారు. వర్సిటీల వారీగా రిక్రూట్మెంట్ జరగడం వల్ల గతంలో వచ్చిన ఆరోపణలు, విమర్శలను పరిగణనలోకి తీసుకుని ఒకే రిక్రూట్మెంట్ బోర్డు ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు నిపుణులతో కూడిన ప్రత్యేక కమిటీ కోసం కొన్ని పేర్లు పంపాలని సూచించినట్టు తెలిసింది. రిక్రూట్మెంట్కు సంబంధించి త్వరలోనే విధి విధానాలను ఖరారు చేయనున్నారు. సగానికిపైగా ఖాళీలు.. రాష్ట్రంలోని 11 వర్సిటీల్లో మొత్తం 2,828 పోస్టులు ఉండగా.. అందులో 1,869 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 2017లో విశ్వవిద్యాలయాల్లో ఖాళీలపై ప్రభుత్వం నివేదిక తెప్పించుకుంది. అప్పట్లోనే 1,528 పోస్టులు ఖాళీగా ఉన్నట్టు గుర్తించి.. వాటిలో 1,061 పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇప్పటివరకు ఆ పోస్టుల భర్తీ ముందుకు పడలేదు. రిజర్వేషన్ల అంశం, న్యాయపరమైన వివాదాలు, నియామక విధానంపై కసరత్తు పేరిట విద్యాశాఖ అధికారులు కాలయాపన చేశారనే ఆరోపణలున్నాయి. ఈ క్రమంలో మరికొందరు పదవీ విరమణ చేయడంతో 2021 జనవరి చివరినాటికి యూనివర్సిటీల్లో ఖాళీల సంఖ్య 1,869కి చేరింది. ఇందులో 238 ప్రొఫెసర్ పోస్టులు, 781 అసోసియేట్ ప్రొఫెసర్, 850 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు ఉన్నాయి. ఇలా భారీ సంఖ్యలో ఖాళీలు ఏర్పడటంతో తాత్కాలిక, కాంట్రాక్టు అధ్యాపకులతో బోధన కొనసాగిస్తున్నారు. ఫలితంగా విద్యా ప్రమాణాలు పడిపోతున్నాయనే విమర్శలు ఉన్నాయి. ఎట్టకేలకు పోస్టుల భర్తీకి ప్రభుత్వం ముందుకు వచ్చింది. ట్రిపుల్ఐటీ నిరసనపై నివేదిక బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థుల నిరనసకు సంబంధించి మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమగ్ర వివరాలతో సీఎం కేసీఆర్కు నివేదిక అందజేశారు. విద్యార్థులతో చర్చలు ఫలప్రదం కావడం, అక్కడ తీసుకున్న చర్యలను వివరించారు. ట్రిపుల్ఐటీలో వెంటనే మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయాలని, విద్యార్థుల డిమాండ్లు తక్షణం కొన్నింటిని, ప్రాధాన్యతా క్రమంలో మరికొన్నింటిని నెరవేర్చాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చామని తెలిపారు. -
గవర్నర్తో విభేదాలు.. మమత సర్కార్ కీలక నిర్ణయం
కోల్కత: పశ్చిమబెంగాల్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని యూనివర్శిటీలకు ఇకపై ముఖ్యమంత్రి మమతా బెనర్జీనే ఛాన్సలర్గా వ్యవహరిస్తారని ప్రకటించింది. ఈ మేరకు అసెంబ్లీలో సవరణ బిల్లు ప్రవేశపెట్టాలని కేబినెట్ నిర్ణయించింది. బెంగాల్ విద్యాశాఖ మంత్రి బర్త్య బసు ఈ విషయాన్ని వెల్లడించారు. విశ్వవిద్యాలయాల్లో నియామకాలపై గవర్నర్ జగదీప్ ధన్కడ్, మమతా బెనర్జీ సర్కార్ మధ్య పలుమార్లు విభేదాలు తలెత్తాయి. రాజ్భవన్తో సంబంధం లేకుండా దీదీ సర్కార్ వీసీలను నియమిస్తోందంటూ గవర్నర్ ధన్కడ్ ఆరోపణలు గుప్పించారు. ఈ నేపథ్యంలోనే గవర్నర్ను ఛాన్సలర్ హోదా నుంచి తప్పించాలని మమత నిర్ణయించుకున్నారు. తమిళనాడులోని స్టాలిన్ ప్రభుత్వం కూడా ఇలాంటి చట్టమే తెచ్చింది. చదవండి👇 మహిళా ఎంపీపై బీజేపీ చీఫ్ వివాదాస్పద వ్యాఖ్యలు పెళ్లికి తొందరపడాల్సిందే.. ఉరుకులు.. పరుగులు.. ఆలస్యం చేశారంటే! -
హైదరాబాద్లో ఏరో, ఫార్మా వర్సిటీలు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఏరోనాటికల్, ఫార్మా విశ్వవిద్యాలయాలు రాబోతున్నాయి. వీలైనంత త్వరగా హైదరాబాద్లో వీటిని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. వర్సిటీల ఏర్పాటుకు సంబంధించి సమగ్ర వివరాలతో నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రిని ఇటీవల ప్రభుత్వం ఆదేశించినట్టు విశ్వసనీయంగా తెలిసింది. సీఎం కేసీఆర్ స్వయంగా ఈ ప్రతిపాదనను తెరమీదకు తెచ్చినట్టు ఉన్నత విద్య వర్గాలు తెలిపాయి. రాష్ట్రంలో దాదాపు 185 ఫార్మా కాలేజీలుండగా, ఇవి కేవలం బోధనకే పరిమితమవుతున్నాయి. అదీగాక, దేశంలో ఔషధ తయారీలో పరిశోధన చేసే వారి సంఖ్య కూడా తక్కువగా ఉందని ప్రభుత్వం భావిస్తోంది. కరోనా సమయంలో హైదరాబాద్ టీకా తయారీలో కీలక భూమిక పోషించింది. ఇక్కడే వ్యాక్సిన్ తయారవ్వడం, అనేక కీలక పరిశోధనలకు భాగ్యనగరం వేదికగా నిలవడాన్ని కేసీఆర్ ప్రస్తావించినట్టు అధికార వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో పరిశోధనకు ప్రత్యేకంగా వర్సిటీ ఉండాలన్నది కేసీఆర్ మనోభీష్టంగా అధికారులు భావిస్తున్నారు. యూనివర్సిటీ ఏర్పాటైతే పరిశోధకులను భారత్కు అందించడంతోపాటు, తెలంగాణ దేశంలోనే నంబర్ వన్గా ఉంటుందని సీఎం అన్నట్టు తెలిసింది. సరికొత్త అన్వేషణలు: ఏరోనాటికల్ విభాగంలో భారత్లో తెలంగాణ మూడో స్థానంలో ఉంది. భవిష్యత్లో ఈ సెక్టార్లో మరిన్ని ఆవిష్కరణలకు ఆస్కారం ఉందనే సంకేతాలు వెలువడుతున్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రపంచవ్యాప్తంగా ఏరోనాటికల్ రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా పరిశోధనలను పెంచాలని ముఖ్యమంత్రి ఉద్బోధించినట్టు ఉన్నత విద్యామండలి అధికారులు చెబుతున్నారు. ఏరో, ఫార్మా రంగాలకు సంబంధించిన యూనివర్సిటీల ఏర్పాటుకు కావల్సిన మౌలిక వసతులు, తక్షణమే చేపట్టాల్సిన చర్యలపై సమగ్ర నివేదిక రూపొందించే పనిలో అధికారులున్నారు. ఇది పూర్తయిన తర్వాత నేరుగా ముఖ్యమంత్రితో అధికారులు భేటీ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. మంచి పరిణామమే ఫార్మా, ఏరోనాటికల్ విశ్వవిద్యాలయాల ఏర్పాటుపై సీఎం కేసీఆర్ ఆసక్తిగా ఉన్నారు. ఇందుకు సంబంధించిన నివేదిక కూడా కోరారు. ఇవి రూపుదాలిస్తే తెలంగాణ మంచి పరిశోధన కేంద్రంగా గుర్తింపు పొందడమే కాకుండా ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయి. వీలైనంత త్వరగా దీనిపై సమగ్ర వివరాలు సేకరించి నివేదిక రూపొందిస్తాం. ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి,ఉన్నత విద్యామండలి చైర్మన్ -
సార్లు లేరు.. చదువుల్లేవు
సాక్షి ప్రతినిధి, నల్లగొండ/హైదరాబాద్/ ఉస్మానియా యూనివర్సిటీ/నాంపల్లి: ఉత్తమ విద్యకు, సరికొత్త పరిశోధనలు, ఆవిష్కరణలకు నిలయంగా.. విద్యార్థుల వికాసానికి తోడ్పడే కేంద్రంగా ఉండాల్సిన అత్యున్నత విద్యా సంస్థలే.. యూనివర్సిటీలు. కానీ రాష్ట్రంలో యూనివర్సిటీలకే ‘వికా సం’ లేని దుస్థితి. రెగ్యులర్ అధ్యాపకులు లేక నామ మాత్రపు బోధన ఒకవైపు.. ఏమాత్రం మౌలిక సదుపాయాలు లేక అవస్థలు మరోవైపు.. విద్యార్థుల భవిష్యత్తుకు గండి కొడుతున్నాయి. కొత్త పరిశోధనలు, ఆవిష్కరణలేమోగానీ కనీస ‘చదువు’కే దిక్కు లేకుండా పోతోందని.. ప్రభుత్వం నుంచి తగిన సాయం అందకపోవడం, అధికారుల నిర్లక్ష్యం, వ్యవస్థాపరమైన లోపాలు వంటివి వర్సిటీలకు శాపంగా మారాయని ఆందోళన వ్యక్తమవుతోంది. ఏళ్లు గడుస్తున్నా నియామకాలేవి? రాష్ట్రంలోని 11 యూనివర్సిటీల్లో మంజూరైన పోస్టు లు 2,828 ఉండగా.. అందులో 1,869 పోస్టులు అంటే మూడింట రెండొంతులు ఖాళీగానే ఉండటం గమనార్హం. నిజానికి 2017 నవంబర్ నాటికి యూనివర్సిటీల్లో 1,528 ఖాళీలు ఉన్నట్టు గుర్తిం చారు. అప్పట్లోనే 1,061 పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కానీ ఇదుగో.. అదుగో అంటూ ఉన్నత విద్యాశాఖ, ఉన్నత విద్యా మండలి ఇప్పటికీ ఏమీ తేల్చలేదు. ఓ సారి రిజర్వే షన్లు అంశం అంటూ, మరోసారి న్యాయపరమైన వివాదా లు అంటూ, మరోసారి నియామకాల తీరుపై కసరత్తు చేస్తున్నామంటూ దాట వేస్తూ వచ్చాయి. దీనితో గత ఏడాది జనవరి 31 నాటికి ఖాళీల సంఖ్య 1,869కి పెరిగింది. కేటగిరీల వారీగా చూస్తే 238 ప్రొఫెసర్ పోస్టులు, 781 అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులు, 850 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ పోస్టులకు సంబం ధించి కాంట్రాక్టు, తాత్కాలిక అధ్యాపకులతో బోధన నిర్వహిస్తూ మమ అనిపిస్తున్న పరిస్థితి నెల కొంది. దీనివల్ల పూర్తిస్థాయిలో బోధన అందడం లేదని, రెగ్యులర్ అధ్యాపకుల నియామకాలు చేపట్టాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. వందేళ్ల ఉస్మానియాకూ తప్పని సమస్య 105 ఏళ్ల చరిత్ర కలిగిన ఉస్మానియా యూనివర్సిటీ కూడా ఫ్యాకల్టీ కొరత, మౌలిక సదుపాయాల లేమి తో సతమతం అవుతోంది. దాదాపు అన్ని విభాగా ల్లోనూ కాంట్రాక్టు, పార్ట్టైం అధ్యాపకులతో బోధన కొనసాగుతోంది. సీనియర్ ఫ్యాకల్టీ లేక పరి శోధనలనే మాటే లేకుండా పోయిందని.. పీజీ స్థాయిలో బోధన మొక్కుబడిగా సాగుతోందని విద్యార్థులు వాపోతున్నారు. ల్యాబ్లలో రసాయ నాలు, పరి కరాలు సరిగా లేవని.. ఇతర మౌలిక వసతులూ లేక ఇబ్బంది పడుతున్నామని అంటు న్నారు. జేఎన్టీయూ లోనూ ఇదే దుస్థితి నెలకొంది. ఇక ఉన్నత విద్యా మండలి ప్రతిష్టాత్మ కంగా నిజాం కాలేజీలో, కోఠి ఉమెన్స్ కాలేజీలో ప్రవేశపెట్టిన బీఏ ఆనర్స్ కోర్సుకు ఫ్యాకల్టీ సమస్య వేధిస్తోంది. ఓయూలో పేరుకే ఫ్యాన్లు.. కానీ తిరగవు.. తెలుగు వర్సిటీలో ముగ్గురే.. దేశంలోనే మొట్టమొదటి భాషా విశ్వవిద్యాలయ మైన పొట్టి శ్రీరాములు తెలుగు వర్సిటీ పరిస్థితి మరీ చిత్రం. ఇందులో మొత్తంగా ముగ్గురే రెగ్యులర్ ప్రొఫెసర్లు పనిచేస్తున్నారు. ఇందులోనూ ఒకరు రిజిస్ట్రార్గా, మరొకరు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినర్ గా పనిచేస్తుండటం గమనార్హం. జ్యోతిషం, తెలు గు, ఇంగ్లిష్, కంప్యూటర్, భాషా అను బంధ శాఖ, విజ్ఞాన సరస్వత శాఖ. తులనాత్మక అధ్యయన శాఖ, జర్నలిజం, భాషాభివృద్ధి శాఖ, లింగ్విస్టిక్, భాషా నిఘంటు నిర్మాణ శాఖ జానపదం, సంగీ తం శాఖల్లో పోస్టులన్నీ ఖాళీయే. అన్నింటా తాత్కా లిక అధ్యాపకులతో బోధన కొనసాగిస్తున్నారు. నీళ్లు కూడా సరిగా రావట్లేదు మా హాస్టల్లో సరిగా వస తులు లేవు. మామూలు నీళ్లకే కాదు తాగునీటికీ ఇబ్బంది వస్తోంది. డైనింగ్ హాల్లో, ఇతర చోట్ల ఏర్పాట్లేమీ లేవు. – పరశురామ్, మహాత్మాగాంధీ యూనివర్సిటీ విద్యార్థి ‘తెలుగు’ ప్రొఫెసరే లేరు తెలుగు విశ్వవిద్యాలయం ఏ భాషాభివృద్ధి కోసం ఏర్ప డిందో ఆ భాషకే సరైన దిక్కు లేకుండా పోయింది. తెలుగు శాఖలో కూడా రెగ్యు లర్ ఫ్యాకల్టీ లేకపోవడం శోచనీయం. వర్సిటీ పాలక మండలి నిద్రావస్థలో ఉంది. – శివకృష్ణ, రీసెర్చ్ స్కాలర్, తెలుగు వర్సిటీ ఏ వర్సిటీ అయినా అంతే.. ► కరీంనగర్లోని శాతవాహన వర్సిటీలో కీలకమైన మ్యాథ్స్, ఫార్మసీ, బోటనీ, కంప్యూటర్ సైన్స్ విభాగాల్లో రెగ్యులర్ అధ్యాపకులు ఒక్కరు కూడా లేరు. ► మహబూబ్నగర్లోని పాలమూరు విశ్వవిద్యాలయంలో ఇంటిగ్రేటెడ్ కెమిస్ట్రీ, ఎంబీఏ, ఎంఎస్డబ్ల్యూ విభాగాలను ఒక్క రెగ్యులర్ ఫ్యాకల్టీ లేకుండానే కొనసాగిస్తున్నారు. ► వరంగల్ కాకతీయ వర్సిటీలో పొలిటికల్ సైన్స్, ఎడ్యుకేషన్ వంటి విభాగాల్లో రెగ్యులర్ అధ్యాపకులు లేరు. యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల, కొత్తగూడెం ఇంజనీరింగ్ కళాశాలలో చాలా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ► నల్లగొండలోని మహాత్మాగాంధీ వర్సిటీలో కొన్ని విభాగాల్లో ఒక్కొక్క ప్రొఫెసర్ మాత్రమే ఉన్నారు. కీలకమైన ఇంజనీరింగ్లో 48 పోస్టులు ఖాళీయే. మిగతా విభాగాల్లోనూ రెగ్యులర్ అధ్యాపకులు నామమాత్రమే. ► నిజామాబాద్ తెలంగాణ వర్సిటీలో కీలకమైన మ్యాథ్స్, ఎకనామిక్స్, ఫార్మాస్యూ టికల్ కెమిస్ట్రీ, ఇంటిగ్రేటెడ్ ఎంబీఏ విభాగాల్లో రెగ్యులర్ అధ్యాపకులే లేరు. మొత్తం 152 పోస్టులకుగాను రెగ్యులర్ సిబ్బంది 69 మందే. హాస్టళ్లలో పరిస్థితీ ఇంతే.. ► యూనివర్సిటీల్లో అధ్యాపకులు, మౌలిక సదుపాయాల కొరతకు తోడు హాస్టళ్ల లోనూ సమస్యలు వెంటాడుతున్నాయి. కొన్నిచోట్ల తాగునీటికీ ఇబ్బంది పడాల్సి వస్తోంది. పాలమూరు యూనివర్సిటీ హాస్ట ళ్లలో గదుల తలుపులు, కప్బోర్డులు విరిగి పోయాయి. కిచెన్ లేక ఆరుబయటే వం టలు చేయాల్సి వస్తోంది. మరుగుదొడ్లు అధ్వానంగా ఉన్నాయి. శాతవాహన వర్సి టీలో ఫార్మసీ కళాశాల, హాస్టళ్లు పాత భవనాలు, రేకులషెడ్లలో కొనసాగుతు న్నాయి. మహత్మాగాంధీ వర్సిటీ బాలికల హస్టల్లో తాగు నీటి సరఫరా సరిగా లేదని విద్యార్థినులు వాపోతున్నారు. -
ఉద్యోగాలిచ్చే స్థాయికి విద్యార్థులు ఎదగాలి
బాలానగర్: విద్యార్థులు ఉద్యోగాల కోసం ఎదురుచూడటం కాదు.. మీరే ఉద్యోగాలిచ్చే స్థాయికి ఎదగాలని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పిలుపునిచ్చారు. శనివారం జవహర్లాల్ సాంకేతిక విశ్వ విద్యాలయంలో (జేఎన్టీయూ) నిర్వహించిన యూనివర్సిటీ 10వ స్నాతకోత్సవం కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. గోల్డ్ మెడల్స్ సాధించిన విద్యార్థినీ, విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కలిసి విద్యార్థులను తీర్చిదిద్దారన్నారు. దీనికి తోడుగా విద్యార్థుల శ్రమ, పట్టుదల తోడై గోల్డ్ మెడల్స్, డాక్టరేట్ సాధించారని ప్రశంసించారు. కొన్ని రోజులుగా యువత ఆత్మహత్యలకు పాల్పడుతున్న విషయం తనను తీవ్రంగా కలచివేసిందని ఆవేదన వ్యక్తంచేశారు. వివాహంతో సంబంధం లేకుండా ప్రతి విద్యార్థినీ చదువుకోవాలని, దీనిలో భాగంగానే ప్రభుత్వం పెళ్లి వయోపరిమితిని పెంచిందని తెలిపారు. కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీకార్యదర్శి చంద్రశేఖర్కు గవర్నర్ గౌరవ డాక్టరేట్ను ప్రదానం చేశారు. అనంతరం విద్యార్థులకు గోల్డ్ మెడల్స్ అందజేశారు. కార్యక్రమంలో వర్సిటీ ఉప కులపతి కట్టా నర్సింహారెడ్డి, రెక్టార్ గోవర్ధన్, రిజిస్ట్రార్ మంజూర్ హుస్సేన్, ఈసీ కమిటీ మెంబర్, డైరెక్టర్లు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. -
ప్రమాణాలు లేకపోతే.. ఒక తరం నష్టపోతుంది
ఉన్నత విద్యారంగం, యూనివర్సిటీల్లో నాణ్యత ప్రమాణాల పెంపే ప్రథమ ప్రాధాన్యంగా ముందుకు సాగుతానని యూనివర్సిటీ గ్రాంట్స్ (యూజీసీ) కమిషన్ చైర్మన్ ప్రొఫెసర్ మామిడాల జగదీశ్ కుమార్ పేర్కొన్నారు. యూనివర్సిటీల్లో సరైన ప్రమాణాలు లేకపోతే ఆ తరమే నష్టపోతుందని, ఆ నష్టం వాటిల్లకుండా తనవంతు కృషి చేస్తానని తెలిపారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్నత విద్యలో నాణ్యతా ప్రమాణాల పెంపునకు తన వంతుగా పూర్తి సహాయ, సహకారాలు అందిస్తానని వెల్లడించారు. నల్లగొండ జిల్లా తిప్పర్తి మండలం, మామిడాల గ్రామానికి చెందిన ప్రొఫెసర్ జగదీశ్కుమార్ యూజీసీ నూతన చైర్మన్గా శుక్రవారం నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఢిల్లీ నుంచి ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే.. – సాక్షి ప్రతినిధి, నల్లగొండ వర్సిటీల్లో పరిశోధనలకు పెద్ద పీట లోతైన పరిశోధనలు లేకపోతే మెరుగైన ఆవిష్కరణలకు అవకాశం ఉండదు. దానివల్ల సమాజానికి నష్టం వాటిల్లుతుంది. అందుకే యూనివర్సిటీల్లో పరిశోధనలకు పెద్ద పీట వేస్తా. మెరుగైన పరిశోధనలు జరిగినప్పుడే వాటి ఫలితాలు కూడా మెరుగ్గా ఉంటాయి. అయితే పరిశోధన ఫలాలు ప్రజల దగ్గరికి చేరితేనే సార్థకత ఉంటుంది. నియామకాలు వేగవంతం చేస్తా రాష్ట్ర యూనివర్సిటీల్లో అధ్యాపకుల నియామకాల అంశమే ప్రధాన సమస్యగా ఉంది. చాలా రాష్ట్రాల్లో వివిధ కారణాలతో నియామకాలు ఆగిపోయాయి. ఈ విషయంలో అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, విద్యాశాఖ మంత్రులు, వైస్ ఛాన్స్లర్లతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహిస్తా. నియామకాలు వేగవంతం జరిగేలా కృషి చేస్తా. అనుమతి లేని విద్యా సంస్థలపై కొరడా అనుమతిలేని విద్యాసంస్థలు, యూనివర్సిటీలపై కఠిన చర్యలు చేపడతాం.కొన్ని వర్సిటీలు, కాలేజీలు విద్యార్థులకు విద్యను అందించడం లేదు. పేపరుపైనే విద్యా సంస్థలుగా ఉన్నాయి. కొన్నిటికి అనుమతులే ఉండటం లేదు. అధికారుల తనిఖీల్లోనూ ఈ విషయం వెల్లడైంది. అలాంటి వాటిని అలాగే వదిలేస్తే విద్యలో నాణ్యత ప్రమాణాలు దెబ్బతింటాయి. వీటిపై యువతలో పెద్ద ఎత్తున అవగాహన కల్పించేందుకు కృషి చేస్తాం. నూతన విద్యా విధానంతో ప్రయోజనాలెన్నో.. నూతన విద్యా విధానంతో అనేక ప్రయోజనాలు ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు, పేద విద్యార్థులకు టెక్నాలజీ అందుబాటులోకి వస్తుంది. ఎంతో మెరుగైన విద్యా బోధన అందుతుంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఇంగ్లిష్ మీడియం బోధన అవసరమే. అయితే మాతృభాషలో బోధన చేపడితే విద్యార్థులకు సులభంగా అర్థం అవుతుంది. వచ్చే ఏడాది అమల్లోకి ‘హెకీ’ నూతన విద్యా విధానం అమల్లో భాగంగా వచ్చే ఏడాది హైయ్యర్ ఎడ్యుకేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (హెకీ) అమల్లోకి తెచ్చేలా చర్యలు చేపడతున్నాం. అందులో నాలుగు విభాగాలు ఉంటాయి. ఒకటి ప్రస్తుతం ఉన్న యూజీసీ రెగ్యులేటరీ వ్యవహారాలు చూస్తుంది. మరో సంస్థ నిధులు, ఇంకో సంస్థ అసెస్మెంట్స్, గ్రేడింగ్, నాలుగో సంస్థ నాణ్యత ప్రమాణాల పెంపు వంటి కార్యకలాపాలను చూడనుంది. యూనివర్సిటీల దూర విద్యా కేంద్రాలకు విధించిన భౌగోళిక పరిధిని అవి దాటడానికి వీల్లేదన్న అంశంపై తగిన చర్యలు చేపడతా. తెలుగు ప్రజల అభిమానం మరువలేనిది యూజీసీ చైర్మన్గా నియామకంతో తెలుగు ప్రజల నుంచి అందుతున్న అభినందనలు ఎంతో శక్తిని ఇస్తున్నాయి. వారి అభిమానం మరువలేనిది. తెలుగు రాష్ట్రాలపై ప్రత్యేక శ్రద్ధ యూజీసీ చైర్మన్గా అనేక బాధ్యతలు ఉన్నా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఉన్నత విద్యపై ప్రత్యేకంగా దృష్టి సారించి పని చేస్తా. చొరవ తీసుకొని తెలుగు రాష్ట్రాల్లో వైస్ ఛాన్స్లర్లు, విద్యాశాఖ మంత్రులతో ప్రత్యేకంగా చర్చిస్తా. ఈ మేరకు త్వరలోనే సమావేశం నిర్వహిస్తా. యూనివర్సిటీల్లో ఉన్న సమస్యలేంటి? వాటి పరిష్కారానికి చేపట్టాల్సిన చర్యలు, యూజీసీ నుంచి ఎలాంటి సహకారం అవసరం.. అన్న అన్ని అంశాలపై చర్చించి తగిన చర్యలు చేపడతా. -
‘నకిలీ’ని పట్టేస్తుంది!
హైదరాబాద్కు చెందిన ఓ సాఫ్ట్వేర్ కంపెనీకి ఓ ఉద్యోగి తెలంగాణలో పేరున్న యూనివర్సిటీ నుంచి బీటెక్ చేసినట్టు సర్టిఫికెట్ సమర్పించాడు. దీనిపై థర్డ్పార్టీ విచారణ చేయించిన ఆ కంపెనీ అది నకిలీదని తెలుసుకుంది. సదరు వర్సిటీ దీన్ని పరిశీ లించి, కంపెనీకి రిపోర్టు ఇవ్వడానికి రెండేళ్లు పట్టింది. అప్పటికే ఆ ఉద్యోగి అక్కడ పనిచేసిన అనుభవంతో వేరే కంపె నీలో చేరాడు. రంగంలోకి దిగిన పోలీసులు హైదరాబాద్లోని పాతబస్తీలో అది తయారైనట్టు తేల్చారు. అప్పటికే ఆ నకిలీ సర్టిఫికెట్లు ఇచ్చే వ్యక్తి మకాం మార్చాడు. దీంతో కేసు పెండింగ్లో పడింది. సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఏటా అన్ని యూనివర్సిటీల నుంచి 20కి పైగా నకిలీ సర్టిఫికెట్లను గుర్తిస్తున్నారు. ఇవి కేవలం దర్యాప్తు సంస్థల దృష్టికొచ్చినవే. అంతకన్నా ఎన్నో రెట్లు నకిలీలు పుట్టుకొస్తున్నాయని పోలీసు వర్గాలు సైతం ఒప్పుకుంటున్నాయి. ఫిర్యాదులు లేకపోవడంతో ఇవి వెలుగులోకి రావడంలేదు. కేవలం ఒక కంప్యూటర్, కొద్ది పాటి టెక్నాలజీతోనే అన్ని వర్సిటీల నకిలీ సర్టిఫికెట్లు చేస్తున్నట్టు ఇటీవల ఉన్నత విద్యామండలి దృష్టికొచ్చింది. పలు ఇంజనీరింగ్ కాలేజీల్లో కూడా నకిలీ సర్టిఫికెట్లతో అధ్యాపకులుగా చెలామణి అవుతున్నారనే ఆరోపణ లున్నాయి. వాటిని తనిఖీ చేసే యంత్రాంగం లేకపోవడం పెను సమస్యగా మారింది. కళ్లు తెరిచిన అధికారులు నకిలీ ధ్రువపత్రాలను అడ్డుకునేందుకు ఉన్నత విద్యామండలి, పోలీసు యంత్రాంగం సంయుక్తంగా కృషి చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా గత నెల డీజీపీ మహేందర్ రెడ్డి సమక్షంలో ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. వీటిని గుర్తించేందుకు ప్రత్యేక సాఫ్ట్వేర్ రూపొం దించాలని నిర్ణయించారు. అన్ని వర్సిటీల వీసీలతో ఉన్నత విద్యామండలి సంప్రదింపులు జరుపు తోంది. సర్టిఫికెట్ అసలుదా? నకిలీదా? తేల్చడా నికి ఇప్పటివరకూ వర్సిటీ సిబ్బంది మాత్రమే పరిశీలించాల్సి వస్తోంది. విశ్వవిద్యాలయాల్లో అంతంత మాత్రంగా ఉన్న సిబ్బంది కారణంగా ఈ ప్రక్రియ ఆలస్యమవుతోంది. ఈలోగా నకిలీల ముఠా యథేచ్ఛగా దందా కొనసాగిస్తోంది. విదేశాల్లో ఉద్యోగాలు పొందాలనుకునే వాళ్లు, రాష్ట్రంలో సాఫ్ట్వేర్, ఇతర సాంకేతిక ఉపాధి అవకాశాలు అందిపుచ్చుకోవాలనుకునే వాళ్లు నకిలీ సర్టిఫికెట్లనే ఆశ్రయిస్తున్నారని అధికారులు అంటు న్నారు. దీన్ని అడ్డుకోవడానికి కంపెనీలు నేరుగా తనిఖీ చేసుకునే వెసులుబాటు కల్పించాలని నిర్ణయించారు. కట్టడి ఇలా... ♦అన్ని విశ్వవిద్యాలయాల సర్టిఫికెట్లను ప్రత్యేక సాఫ్ట్వేర్ ద్వారా ఆన్లైన్లో అప్లోడ్ చేస్తారు. ఇందుకు సంబం« దించిన సర్వర్ రాష్ట్ర అధికారుల పర్యవే క్షణలో ఉంటుంది. దీనిద్వారా ప్రతీ కంపెనీ అభ్యర్థి సర్టిఫికెట్లు అసలువో, నకిలీవో తెలుసుకోవచ్చు. ♦అన్ని భద్రతా చర్యలు తీసుకుని సాఫ్ట్వేర్ ను రూపొందించాలని భావిస్తున్నారు. సంబంధిత కంపెనీలు ఆ వెబ్సైట్కు లాగిన్ అయి దాని సరిఫ్టికెట్ స్థితిగతులు తెలుసుకోవచ్చు. ♦కొన్ని సందర్భాల్లో విధిగా సంబంధిత వర్సిటీలు ధ్రువీకరించాల్సి ఉంటుంది. ఇలాంటప్పుడు ఆయా కంపెనీలు వర్సిటీ అధికారులను సంప్రదించాలి. ♦పోలీసుల భాగస్వామ్యం కూడా ఉండే ఈ సాఫ్ట్వేర్ ద్వారా నకిలీ సర్టిఫికెట్లు వచ్చిన వెంటనే పోలీసులు అప్రమత్తమవుతారు. వెంటనే కేసు నమోదు చేసి, నిందితులను అదుపులోకి తీసుకునే అవకాశం ఉంటుందని అధికారులు చెప్పారు. మంచి ప్రయోగం నకిలీ సర్టిఫికెట్లను అడ్డుకునేందుకు ఉన్నత విద్యామండలి కృషి చేస్తోంది. ఇప్పటికే సాఫ్ట్వేర్ ఎలా రూపొందించాలి? ఎలాంటి మెళకువలు అవసరమనే దానిపై డీజీపీతో జరిగిన సమావేశంలో చర్చించాం. త్వరలోనే ఈ ప్రక్రియ ఓ కొలిక్కి వస్తుంది. అత్యాధునిక సాంకేతికతతో రూపొందిస్తున్నందున కచ్చితంగా మంచి ఫలితాలుంటాయి. – ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి (ఉన్నత విద్యామండలి చైర్మన్) -
డిగ్రీ చదివి... నకిలీ తెలివి
సాక్షిప్రతినిధి, వరంగల్: వరంగల్ కేంద్రంగా సాగుతున్న నకిలీ సర్టిఫికెట్ల ముఠా గుట్టురట్టు అయింది. విద్యార్థులు, నిరుద్యోగుల అమాయకత్వాన్ని సొమ్ము చేసుకుంటున్న నిందితులు ఎట్టకేలకు పోలీసులకు చిక్కారు. నకిలీ సర్టిఫికెట్ల సహాయంతో విద్యార్థులను విదేశాలకు తరలిస్తున్న 12 మంది నిందితులను మంగళవారం వరంగల్ పోలీసు కమిషనరేట్ టాస్క్ఫోర్స్ బృందం అరెస్టు చేసింది. వీరి నుంచి 212 నకిలీ సర్టిఫికెట్లు, ఆరు ల్యాప్టాప్లు, ఐపాడ్, 2 ప్రింటర్లు, ఐదు సీపీయూలు, 25 నకిలీ రబ్బర్ స్టాంపులు, 2 ప్రింటర్ రోలర్స్, 5 ప్రింటర్ కలర్స్ బాటిళ్లు, లామినేషన్ మిషన్, 12 సెల్ఫోన్లు, 10 లామినేషన్ గ్లాస్ పేపర్లను స్వాధీనం చేసుకుంది. మరో ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నారు. ఈ ముఠా వివరాలను వరంగల్ పోలీస్ కమిషనర్ డాక్టర్ తరుణ్జోషి వెల్లడించారు. నిందితులందరూ డిగ్రీ చదివినవారే. దార అరుణ్, ఆకుల రవిఅవినాష్ ప్రధాన నిందితులు. కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి ఉన్న ఈ ఇద్దరు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఇంటర్నెట్ సెంటర్ నిర్వహిస్తుండేవారు. పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించాలనే దుర్బుద్ధితో పక్కదారి పట్టారు. దేశంలోని వివిధ విశ్వవిద్యాలయాలు, డీమ్డ్ ఇంజనీరింగ్ కళాశాలల పేరిట నకిలీ సర్టిఫికెట్లను తయారు చేసి అర్హతలులేని విద్యార్థులకు కొన్ని కన్సల్టెన్సీ సంస్థల ద్వారా విక్రయించేవారు. ఆ విధంగా విద్యార్థులు విదేశాలకు వెళ్లేందుకు మార్గం సుగమం చేసేవారు. ముఠా అక్రమాలు అనేకం.. కొన్ని విదేశాల్లో విద్యాభాసనకు కనీస మార్కుల శాతాన్ని తప్పనిసరి చేయడంతోపాటు, మొదటి ప్రయత్నంలోనే ఉత్తీర్ణులై ఉండాలని కొన్ని యూనివర్సిటీలు నియమం పెట్టడంతో ఆ మేరకు నకిలీ సర్టిఫికెట్లను తయారు చేసి విద్యార్థులకు అందజేసేవారు. ఇందుకుగాను రూ.లక్ష నుంచి రూ.4 లక్షల వరకు వసూలు చేసేవారు. సర్టిఫికెట్లపై ఎవరికీ అనుమానం రాని విధంగా విదేశాల నుంచి సర్టిఫికెట్ల ముద్రణకు అవసరమైన కాగితాలను ఆన్లైన్ ద్వారా కొనుగోలు చేసేవారు. పక్కా సమాచారంతో టాస్క్ఫోర్స్ ఇన్చార్జ్, అదనపు డీసీపీ వైభవ్ గైక్వాడ్ అధ్వర్యంలో ప్రత్యేక నిఘా వేసిన పోలీసులు వలపన్ని నిందితులను పట్టుకున్నారు. ఒకే సమయంలో అన్ని ప్రాంతాల్లో ముఠాకు సంబంధించిన కన్సల్టెన్సీ సంస్థలపై దాడులు నిర్వహించడంతో నకిలీ సర్టిఫికెట్ల తయారీ వ్యవహారం బయటపడింది. ఈ ముఠాను పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన పోలీసులను కమిషనర్ ప్రత్యేకంగా అభినందించారు. -
యూనివర్సిటీలకు ఏం ఒరగబెట్టారు?
విశ్వవిద్యాలయాలు విశ్వ విద్యా వికాస కేంద్రాలు. విద్య వికాసానికి, ఆ వికాసంతో విశ్వ మానవాళి జీవితాలను కొత్త పుంతలు తొక్కించగలిగిన ఆవిష్కరణలు చేయడానికి అవి వేదికలని తెలిసిన సంగతే. అటువంటి యూనివర్సిటీలు ఇవ్వాళ తెలంగాణ ప్రభుత్వ నిర్లక్ష్యంతో నిర్వీర్యమవుతున్నాయి. తెలంగాణ ఉద్య మంలో ప్రజానీకాన్ని చైతన్యపరిచి, ఉద్యమ బాటలో నడిపిన యూనివర్సిటీ కేంద్రాలు ఇప్పుడు స్వరాష్ట్రంలో ప్రభుత్వ ప్రభుత్వ నిర్లక్ష్యంతో కునారిల్లుతున్నాయి. కేవలం యూనివర్సిటీ సర్వీసులో ఉన్న కొద్దిమంది సీనియర్ అధ్యాపకులే యూనివర్సిటీల మనుగడకు ఊపిరిలూదుతున్నారు. కొత్త నియామకాలు ఎండమా వులుగా కనిపిస్తున్నాయి. గత ప్రభుత్వాలు యూనివర్సి టీలను ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం చేసారని గొంత్తెత్తిన నాయకుడే నేడు రాష్ట్రాన్ని పాలిస్తూ.. వాటిని మరింత నిర్లక్ష్యం చేస్తుంటే ఎలా అర్థం చేసుకోవాలో తెలియని అయోమయపరిస్థితిలో విద్యార్థిలోకం ఉంది. యూనివర్సిటీలకు బడ్జెట్ కేటాయించకుండా, అధ్యాపక, అధ్యాపకేతర పోస్టులు భర్తీ చేయకుండా, మౌలిక వసతుల కల్పనకు ఏ మాత్రం కృషి చేయ కుండా గాలికొదిలేసిన ప్రభుత్వం.. మరోవైపు యూని వర్సిటీలు ఫీజులు పెంచుకోవడానికి అనుమతించి, యూనివర్సిటీలను పేద విద్యార్థులకు దూరం చేసే కుట్ర చేస్తున్నది. ప్రభుత్వ అనుమతిని సాకుగా చూపి యూనివర్సిటీలు పేద విద్యార్థులకు చెల్లింపు సాధ్యం కాని విధంగా ఫీజులను పెంచేశారు. అధ్యాపకులను నియమించి విద్యాప్రమాణాలను పెంచాల్సిన కొత్త వైస్ ఛాన్స్లర్లు ఫీజుల పెంపుపైనే దృష్టిపెట్టడం కనిపి స్తుంది. ఉస్మానియా, జెఎన్టియుహెచ్, కాకతీయ, మహాత్మగాంధీ యూనివర్సిటీలలో ఇంజనీరింగ్, పార్మసీ, పీజీ రెగ్యులర్, సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సుల ఫీజు భారీగా నిర్ణయించడం అధికారుల బాధ్యతారాహి త్యమే. వందేళ్ల ఉస్మానియా విశ్వ విద్యాలయంలో ఎంఏ(ఆర్ట్స్, సోషల్ సైన్సెస్) రెగ్యులర్ కోర్సుల ఫీజు రూ. 2,260 నుంచి రూ. 14,000 వరకు; సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులకు రూ. 5170 నుంచి రూ. 21,000లకు పెంచారు. ఎంకామ్కి రూ. 30,000, ఎంబీఏ రూ. 35,000, ఎమ్మెస్సీ సైన్స్ కోర్సులకు రూ. 2,260 నుంచి రూ.20,490; సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సుకి రూ. 35,000 పెంచారు. ఇంజనీరింగ్ కోర్స్ ఫీజులనయితే భారీగా పెంచారు. రూ.18,000 నుంచి రూ. 35,000 వరకు, సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సుల ఫీజు రూ. 75,000 వరకు పెంచారు, ఈ ఏడాది ప్రారంభించిన ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ – మిషన్ లెర్నింగ్ కోర్సులను సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులుగా పేర్కొని ఫీజు లక్ష ఇరవై వేల రూపాయలుగా నిర్ణయించారు. అలాగే మైనింగ్ ఇంజ నీరింగ్ కోర్సు ఫీజు రూ. 1,00,000. దీన్ని గమనిస్తే పేద విద్యార్థులను యూనివర్సిటీ విద్యకు దూరం చేసే కుట్ర బహిర్గతమవుతుంది. ఈ ఫీజుల పెంపుదలను నిరసిస్తూ.. విద్యార్థులు శాంతియుతంగా ఆందోళనకు దిగితే పోలీసులతో పాశవిక దాడులు చేయించి కేసులు పెట్టడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? సిబ్బందికి జీతభత్యాలు చెల్లించడానికే యూని వర్సిటీ అధికారులు సతమతమౌతున్న తీరు గమనిస్తే యూనివర్సిటీల దయనీయ ఆర్థిక పరిస్థితి అవగత మౌతుంది. ఉమ్మడి రాష్ట్రంలో కేటాయించిన పరిమా ణంలోనే యూనివర్సిటీలకు బడ్జెట్ని కేటాయించడం చూస్తే తెలంగాణ రాష్ట్రం సిద్ధించినా యూనివర్సిటీలకు జరిగిన మేలేమీ లేదని అర్థమవుతుంది. అంతర్జాతీయ స్థాయి యూనివర్సిటీగా ఉన్న ఉస్మానియా నేడు పాల కుల నిర్లక్ష్యంతో నిర్వీర్యమవుతోంది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని యూనివర్సిటీల్లో కలిపి 2,220 ఖాళీలు ఉన్నాయి. రాష్ట్రంలో పేద విద్యార్థులు విద్యనభ్యసించడానికి ఉపకరిస్తున్న ఫీజు రీయంబర్స్మెంట్ పథకంపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర అలసత్వం ప్రదర్శిస్తుంది. గత రెండేళ్లుగా రూ. 3,816 కోట్ల ఫీజు రీయంబర్స్మెంట్ నిధులు విడుదల చేయకపోవడం వల్ల అనేకమంది విద్యార్థులు ఉన్నత విద్యకు, ఉద్యోగ అవకాశాలకు దూరం అవుతున్నారు. ఈ పరిస్థితిని మార్చి యూని వర్సిటీలను అద్భుత విజ్ఞాన కే్రందాలుగా విలసిల్లేలా చూడటం తెలంగాణ ప్రభుత్వ బాధ్యత. ప్రవీణ్ రెడ్డి వ్యాసకర్త రాష్ట్ర కార్యదర్శి, ఏబీవీపీ, తెలంగాణ మొబైల్ : 90104 05476 -
ప్రయత్నిస్తే ప్రమాణాల పెరుగుదల
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఉన్నత విద్యా ప్రమాణాలు మెరుగుపడేందుకు తక్షణమే చర్యలు చేపట్టాలని నేషనల్ అనాలసిస్ అండ్ అక్రెడిటేషన్ కౌన్సిల్ (న్యాక్) సూచించింది. ఈ దిశగా ఉన్నత విద్యా మండలి ఓ కమిటీ వేయాలని పేర్కొంది. నాణ్యత ప్రమాణాల కోసం విశ్వవిద్యాలయాల స్థాయిలో పనిచేస్తున్న కమిటీలను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని తెలిపింది. విద్యా శాఖ నిధుల కేటాయింపు పెరగాలని పేర్కొంది. విద్యా రంగానికి రాష్ట్ర జీడీపీలో 30 శాతం రాష్ట్రం, 10 శాతం కేంద్రం ఖర్చు చేయాలని 1960లో కొఠారీ కమిటీ చేసిన సిఫార్సును న్యాక్ ప్రస్తావించింది. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత 2018–19లో 9.8 శాతం, 2019–20లో 7.5, 2020–21లో 7.4 శాతం నిధులే ఇవ్వడాన్ని ఉదహరించింది. రాష్ట్రంలో 85 శాతం కాలేజీలు యూజీ, పీజీ కోర్సులు కలిగి ఉంటే, అందులో 15 శాతం సంస్థలకే న్యాక్ గుర్తింపు ఉందని తెలిపింది. క్యుమ్యులేటివ్ గ్రేడ్ పాయింట్ యావరేజ్ (సీజీపీఏ)లో 80 శాతం గుర్తింపు గల కాలేజీలకు తక్కువ గ్రేడ్ వచ్చిందని, దీన్ని పెంచితేనే విద్యా ప్రమాణాలు మెరుగుపడతాయని సూచించింది. న్యాక్ చేసిన పలు సూచనలు.. ►విశ్వవిద్యాలయాలు ఇప్పటికీ పాత పద్ధతులనే అనుసరిస్తున్నాయి. వీటిని పూర్తిగా మార్చాలి. నైపుణ్యం ఉండే కోర్సులను అభివృద్ధి చేసేందుకు ప్రయత్నించాలి. ఈ క్రమంలో పారిశ్రామికవేత్తలు, నిపుణులతో సమన్వయం అవసరం. అకడమిక్ ఆడిట్లో యూనివర్సిటీలు వెనుకబడ్డాయి. ఫీడ్బ్యాక్ ఆధారంగా ముందుకెళ్లే చర్యలు ఉండాలి. ►టీచింగ్ విధానంలో గణనీయ మార్పులు అవసరం. విద్యార్థి కేంద్రంగా బోధన జరగాలి. ప్రాజెక్టు వర్క్ ఎక్కువగా ఉండేలా చూడాలి. పరిశోధన దిశగా విద్యార్థులను తీసుకెళ్లే ప్రయత్నం చేయాలి. ఇది జరగాలంటే అధ్యాపకుడిలోనూ పరిశోధన విధానాన్ని మేళవించే మెళకువలు అభివృద్ధి చెందాలి. ►విశ్వవిద్యాలయాలు ప్రధానంగా జాతీయ, అంతర్జాతీయ మార్పులను మేళవింపు చేసుకోవాలి. అంతర్జాతీయ సంస్థలతో కలసి పరిశోధన చేపట్టాలి. అప్పుడే విద్యార్థి ఆలోచన ధోరణి విస్తృతమవుతుంది. విజ్ఞాన మార్పిడి చాలా అవసరం. దీనిపై విశ్వవిద్యాలయాల్లో ఎలాంటి కృషి జరగట్లేదు. పారిశ్రామిక నిపుణులతో కలసి కొత్తదనం నింపేలా ఎంటర్ప్రెన్యూర్ను అభివృద్ధి చేయాలి. ఎన్సీపీ, ఎన్ఎస్ఎస్ కార్యక్రమాలు చురుకుగా ఉంటే విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధిస్తారు. ►మౌలిక వసతుల కల్పన కొన్ని యూనివర్సిటీలకే పరిమితమైంది. దీన్ని కాలేజీ స్థాయికి తీసుకెళ్లాలి. లైబ్రరీల ఏర్పాటు, కొత్త సాఫ్ట్వేర్ అందుబాటులోకి తేవడం, రిఫరెన్స్ జర్నల్స్ ఉండేలా చూడటం, ఎలక్ట్రానిక్ సెర్చ్ ఫ్యాకల్టీ అభివృద్ధి, ఈ–క్లాస్ రూమ్స్ పెంచడం అత్యంత ముఖ్యమైన అంశాలు. ►క్రీడలు, సాంస్కృత కార్యక్రమాలు పూర్తిగా తగ్గిపోయాయి. వ్యాయామ ఉపాధ్యాయుల నియామకానికి ఎక్కడా ప్రాధాన్యం కన్పించట్లేదు. సబ్జెక్టు అధ్యాపకుల కొరత కాలేజీలు, యూనివర్సిటీలను వేధిస్తోంది. దేశంలో కొన్ని యూనివర్సిటీలు అంతర్జాతీయ క్రీడాకారులను ఆహ్వానిస్తున్నాయి. ఇక్కడ ప్రమాణాలు బాగుంటున్నాయి. ఈ తరహా ప్రయోగాలు చేయాలి. ►ఉన్నత విద్య ప్రమాణాలు పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వమే నాయకత్వం వహించాలి. సంబంధిత అధికారులతో చర్చలు జరపాలి. మెరుగైన రీతిలో బోధనకు గల అవకాశాలను పరిశీలించాలి. రాష్ట్ర ఉన్నత విద్యా మండలి కీలక పాత్ర పోషించాలి. వాస్తవ నివేదికలను, క్షేత్రస్థాయి నుంచి సేకరించి, విలువైన సూచనలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలి. -
Afghanistan: అఫ్గాన్లో మహిళలు చదువుకోవచ్చు..కానీ
సాక్షి, కాబూల్: అఫ్గానిస్తాన్లోని విశ్వవిద్యాలయాల్లో మహిళలు పోస్టు గ్రాడ్యుయేట్ వరకు చదువు కొనసాగించవచ్చునని తాలిబన్ ప్రభుత్వం తెలిపింది. అయితే, తరగతి గదుల్లో పురుషులకు, మహిళలకు వేరుగా ఏర్పాట్లుండాలనీ, విద్యార్థినులకు ఇస్లామ్ సంప్రదాయ వస్త్రధారణ తప్పనిసరని స్పష్టం చేసింది. తాలిబన్ ప్రభుత్వంలో ఉన్నత విద్యా శాఖ మంత్రి అబ్దుల్ బాకీ హక్కానీ ఆదివారం మీడియాతో మాట్లాడారు. 20 ఏళ్ల క్రితం అనుసరించిన విధానాలనే మళ్లీ తాము అమలు చేయాలనుకోవడం లేదని వ్యాఖ్యానించారు. బాలబాలికలు కలిసి చదువు కొనసాగించేందు(కో ఎడ్యుకేషన్)కు అనుమతించబోమన్నారు. బాలికలు హిజాబ్ ధరించడం తప్పనిసరని తెలిపారు. వ్సటీల్లో బోధించే సబ్జెక్టులపై సమీక్ష చేపడతామన్నారు. చదవండి: అఫ్గాన్: మహిళలు జన్మనివ్వడానికే.. మంత్రులుగా పనికి రారు -
యూనివర్సిటీల్లో ప్రొఫెసర్లు ఏరీ?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలను అధ్యాపకుల కొరత వేధిస్తోంది. తెలంగాణవ్యాప్తంగా 11 యూనివర్సిటీల్లో ఏకంగా 1,869 ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా ఉండటం బోధనా ప్రమాణాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఆరు యూనివర్సిటీల్లో ప్రొఫెసర్లే లేకపోవడం సమస్య తీవ్రతకు అద్దంపడుతోంది. అధ్యాపకుల కొరత కొట్టొచ్చినట్టూ కన్పిస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లోని అధ్యాపకుల ఖాళీలను కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు భర్తీ చేస్తుండగా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం 65 శాతం ఖాళీలున్నా ఏమాత్రం పట్టించుకోవట్లేదని విద్యారంగ నిపుణులు విమర్శిస్తున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే దశాబ్దాల చరిత్ర ఉన్న ఉస్మానియా యూనివర్సిటీ లాంటి వాటిలోనూ విద్యా ప్రమాణాలు పడిపోయి, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ), నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రెడిటేషన్ కౌన్సిల్ గుర్తింపు కోల్పోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వర్సిటీల ఉనికికే ప్రమాదం... రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో పదేళ్లుగా అధ్యాపకుల నియామకం ప్రహసనంగా మారిందని, ఖాళీల భర్తీకి నోటిఫికేషన్లు ఇవ్వడం, ఆపై కుంటి సాకులతో వాయిదా వేయడం పరిపాటిగా మారిందన్న విమర్శలు వస్తున్నాయి. కాంట్రాక్టు సిబ్బందితో కాలం వెళ్లదీసినా ఆశించిన ఫలితాలు ఆమడ దూరంలోనే ఉంటున్నాయి. విశ్వవిద్యాలయాల్లో ముఖ్య భూమిక పోషించే పరిశోధనలు సైతం ప్రొఫెసర్ల కొరతతో ముందుకు సాగడం లేదు. ప్రభుత్వ లెక్కల ప్రకారం రాష్ట్రంలోని 11 యూనివర్సిటీల్లో 2,837 మంజూరైన పోస్టులు ఉంటే అందులో 1,869 పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. కేవలం 968 మంది (34.12 శాతం) రెగ్యులర్ ఆధ్యాపకులున్నారు. ప్రస్తుతం ఉన్న ప్రొఫెసర్ల సంఖ్య 157కాగా ఇంకా 238 ఖాళీలున్నాయి. అలాగే 129 మంది అసోసియేట్ ప్రొఫెసర్లుంటే ఇంకా 781 ఖాళీలున్నాయి. వర్సిటీల్లో 682 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు పనిచేస్తుంటే మరో 850 ఖాళీలున్నాయి. మొత్తంగా 1,869 ఖాళీల్లో 1,061 పోస్టుల భర్తీకి సర్కార్ మూడేళ్ల క్రితమే ఆమోదం తెలిపినా ఇప్పటికీ కార్యాచరణకు నోచుకోలేదు. ఇదీ దుస్థితి... ►శాతవాహన, మహాత్మాగాంధీ, పాలమూరు, ఆర్జీయూకేటీ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ యూనివర్సి టీ, పొట్టి శ్రీరాములు తె లుగు యూనివర్సిటీ (మొ త్తం ఆరు)ల్లో ఒక్క ప్రొఫె సర్ కూడా లేరు. శాతవాహన, ఆర్జీయూకేటీ, బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ వర్సిటీల్లో ఒక్క అసోసియేట్ ప్రొఫెసర్ కూడా లేరు. పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో ఒకే ఒక్క అసోసియేట్ ప్రొఫెసర్ ఉన్నారు. ►రాష్ట్రంలోని 11 యూనివర్సిటీల్లో 61.65 శాతం ప్రొఫెసర్ పోస్టులు, 85.82 శాతం అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులు, 55.48 శాతం అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ►ఉస్మానియా వర్సిటీలో సగానికిపైగా అధ్యాపక పోస్టులు ఖాళీగా ఉండగా కాకతీయ యూనివర్సిటీలో కేవలం ఒకే ఒక్క ప్రొఫెసర్ ఇద్దరు అసోసియేట్ ప్రొఫెసర్లు మాత్రమే ఉన్నారు. ►జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీలో (జేఎన్ఏఎఫ్ఏయూ) ఉన్నది ఇద్దరు అసోసియేట్ ప్రొఫెసర్లే. -
ఇంగ్లిష్ తొలగింపే లక్ష్యంగా...
హిందుత్వ ప్రాపంచిక దృక్పథం 2014 నుంచి సంపూర్ణంగా దేశాన్ని నియంత్రిస్తూ ఉంది. ఢిల్లీలో నరేంద్రమోదీ, అమిత్ షాలు, నాగ్పూర్లోని మోహన్ భగవత్, దత్తాత్రేయ హొసబలె తదితర ఆర్ఎస్ఎస్ అధినేతలు ఒక అసాధారణమైన జాతీయవాద భావజాలాన్ని అమలుచేస్తూ వస్తున్నారు. హిందూ ఆధ్యాత్మిక వ్యవస్థలో చారిత్రకంగా మినహాయించిన కులాలు, కమ్యూనిటీలను ఈ జాతీయవాద లక్ష్యం మినహాయించబోదనీ, వారు హిందువులైతే విద్యా వ్యవస్థల్లోంచి వారిని పక్కన పెట్టమని వీరు చెబుతూ వస్తున్నారు. అదే సమయంలో ముస్లింలను, క్రిస్టియన్లను ఇతరులుగా మాత్రమే ఈ దృక్పథం చూస్తుంటుంది. 1990ల సరళీకరణ తర్వాత బడా వాణిజ్య కుటుంబాలు విద్యా వ్యాపారంలోకి అడుగుపెడుతూ వచ్చాయి. రాజీవ్గాంధీ హయాం లోనే హరియాణాలోని సోనిపట్లో ప్రైవేట్ విద్యారంగం కోసం ఏర్పర్చిన ప్రత్యేక ఆర్థిక మండళ్లలో వీరికి భారీ స్థాయిలో భూమిని కేటాయించారు. ఆ తర్వాతే అత్యున్నత ప్రమాణాలతో కూడిన విద్యను అందించే విశ్వవిద్యాలయాలు ఉనికిలోకి వచ్చాయి. అత్యంత ఖర్చుతో కూడిన ప్రైవేట్ ఇంగ్లిష్ మీడియంని వీటిలో ప్రవేశపెట్టారు. ప్రభుత్వ రిజర్వేషన్ పాలసీని ఇవి పాటించలేదు. ఇప్పుడు అత్యంత సరళమైన ఆర్ట్, ప్రాథమిక సైన్స్ విశ్వవిద్యాలయాలుగా పేరొందిన అశోకా, ఓపీ జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీలు ఇక్కడే మనుగడలో ఉన్నాయి. దేశంలోని అత్యంత ఖరీదైన ప్రైవేట్ విశ్వవిద్యాలయాల్లో ఒకటైన అశోకా విశ్వవిద్యలయాన్ని 2014లోనే స్థాపించడం గమనార్హం. కేంద్ర విద్యా చట్టాలు, నిబంధనలను అమలు చేస్తున్న జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం, ఢిల్లీ విశ్వవిద్యాలయం, హైదరాబాద్ సెంట్రల్ విశ్వవిద్యాలయం, అలీఘర్ ముస్లిం వర్సిటీలతో పోలిస్తే పై వర్సిటీల స్వభావం, పనితీరు పూర్తిగా భిన్నమైనవి. ఇవి తమ సొంత సిలబస్ని కలిగి ఉండటమే కాకుండా, అత్యత నాణ్యమైన ఆంగ్లో - అమెరికన్ ఇంగ్లిష్ను బోధిస్తున్నాయి. కాబట్టే ఈ విశ్వవిద్యాలయాల్లోని విద్యార్థులు ప్రపంచ మార్కెట్లలో తమ ఉద్యోగావకాశాలకు సంబంధించి సమర్థవంతంగా పోటీ పడగలుగుతున్నారు. నిరుపేద ఆర్థిక నేపథ్యం కలిగి ఉండి తొలి తరం ప్రాంతీయ భాషా స్కూల్ విద్యా విధానంలో పెరిగివచ్చిన దళితులు, ఆదివాసీలు, ఓబీసీలు ఈ ప్రైవేట్ విద్యా కేంపస్లలోకి కనీసం అడుగు కూడా పెట్టలేరు. జేఎన్యూ, ఢిల్లీ, హైదరాబాద్ విశ్వవిద్యాలయం నాణ్యమైన విద్యను అందించేవి. ప్రాంతీయ భాషలో చదువుకున్న తొలితరం యువత కూడా ఇవి అందించే నాణ్యమైన విద్యను, ఇంగ్లిష్ భాషను క్రమంగా అందిపుచ్చుకోగల వాతావరణం ఈ విద్యాసంస్థల్లో ఉండేది. కానీ ప్రైవేట్ విశ్వవిద్యాలయాల్లో అలాంటి వాతావరణం ఉండదు. మనం ఉత్తమమైన ప్రభుత్వ విశ్వవిద్యాలయాలను బలహీనపర్చి శుద్ధ ప్రైవేట్ ఉన్నత విద్యను ప్రోత్సహించినట్లయితే పేదవర్గాలు అతి త్వరలో లేక తర్వాతైనా నిస్పృహకు గురికాక తప్పదు. ఐఐటీలు, ఐఐఎమ్లు వంటి కేంద్ర విద్యా సంస్థలు, సెంట్రల్ విశ్వవిద్యాలయాల్లో హిందుత్వ శక్తులు హిందీని మరింతగా ముందుకు తీసుకు వస్తున్నారు. అలాగే వారి శుద్ధ జాతి కేంద్రక హిందుత్వ సిలబస్ని కూడా ప్రోత్సహిస్తున్నారు. ఒకవైపు ప్రభుత్వ విద్యా సంస్థలను బలహీనపరుస్తూ, మరోవైపు విదేశీ మార్కెట్ల కోసం సంపన్నులను విద్యావంతులను చేయడానికి ప్రైవేట్ విద్యా సంస్థలను ప్రోత్సహించడం జాతీయవాదం కానే కాదు. భారతదేశం భాషా పరంగా చూస్తే చైనా, జపాన్ వంటి ఇంగ్లిషేతర జాతీయ భాషను కలిగిన దేశం కాదు. అలాగే హిందీ భాష మాండరిన్ (చైనా), జపనీస్ భాష లాంటిది అసలే కాదు. ప్రభుత్వ విద్యా సంస్థల్లో ఇంగ్లిష్ను వ్యతిరేకిస్తూ, ప్రైవేట్ విద్యా సంస్థల్లో దానికి అపారమైన ప్రోత్సాహాన్ని ఇవ్వడం ప్రమాదకరమైన పద్ధతి. దీని ద్వారా ఒకనాటికి భారతీయ ఇంగ్లిష్, పూర్వపు సంస్కృతంలాగా కొద్దిమంది చేతివిద్యలా మారిపోతుంది. హిందుత్వ శక్తుల ద్వారా తీసుకొస్తున్న ఈ భాషా, సిలబస్ కంటెంట్ రాజకీయాల ప్రమాదాన్ని శూద్ర/దళిత/ఆదివాసీ మేధావులు గమనించే స్థితిలో లేరు. పైగా విద్యా విభాగాల నుంచి దీనికి ప్రతిఘటన ఎదురుకావడం లేదు. హిందుత్వ స్కూల్ మానసపుత్రిక బెనారస్ హిందూ యూనివర్సిటీ ఇప్పుడు చాలావరకు హిందీలో బోధన చేస్తూ పీజీ, అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులు తమ పరీక్షలను హిందీ, ఇంగ్లిష్ భాషల్లో రాసేలా అనుమతిస్తోంది. కానీ చాలామంది హిందీలోనే పరీక్షలు రాస్తున్నారు, తమ పరిశోధనలను సమర్పిస్తున్నారు. అయితే గత 35 ఏళ్లుగా మన విద్యావ్యవస్థను ప్రభావితం చేయగల మేధావులను ఈ విశ్వవిద్యాలయం సృష్టించలేకపోయింది. తద్భిన్నంగా, జేఎన్యూ, ఢిల్లీ యూనివర్సిటీ, హైదరాబాద్ యూనివర్సిటీ అనేకమంది స్కాలర్లను, ప్రభుత్వ ఉన్నతోద్యోగులను, ప్రముఖ రాజకీయ నేతలను రూపొందించాయి. ప్రమాణాలను తీసివేసే ధోరణి ఇలాగే కొనసాగితే, ఈ వర్సిటీలు కూడా మన పేరుమోసిన జాతీయవాద విశ్వవిద్యాలయాల స్థాయికి పడిపోతాయి. పైగా, హిందుత్వ స్కూల్ దేశీయ పరిశ్రమలు, వ్యవసాయం, విద్యారంగాల్లో భారీ ప్రైవేటీకరణ పట్ల అనుకూలత వ్యక్తం చేస్తోంది. పారిశ్రామిక ఆర్థిక వ్యవస్థను వారు ప్రైవేటీకరిస్తున్న తీరు అందరికీ తెలిసిందే. ఇప్పుడు కొత్త సాగుచట్టాల ద్వారా వ్యవసాయ మార్కెట్లను కూడా ప్రైవేటీకరించాలని నిర్ణయించారు. ఈ చట్టాలకు వ్యతిరేకంగానే రైతులు పోరాడుతున్నారు. ఇక ఉన్నత విద్యలో వీరి విధానం కచ్చితంగా భవిష్యత్తుకు భారం కానుంది. ప్రైవేట్ విద్యా సంస్థలను జాతీయీకరణకు బదులుగా అంతర్జాతీయీకరణ వైపు అనుమతిస్తున్నారు. అదే సమయంలో ప్రభుత్వ విశ్వవిద్యాలయాలను ప్రమాణాలు పెద్దగా లేని శుద్ధ జాతీయవాద పంథా వైపు తీసుకుపోతున్నారు. ప్రస్తుతం అంతర్జాతీయీకరణ పొందిన ప్రపంచంలో ప్రాంతీయీకరించిన విద్యావ్యవస్థను తీసుకురావడంతో పేదలు మరింతగా అవకాశాలు కోల్పోయి ప్రమాణాలు దిగజారిన వర్గంగా మిగిలిపోతారు. కేంద్రప్రభుత్వం యూజీసీ ద్వారా అన్ని ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో సిలబస్నీ, భాషనీ, సంస్థాగత చట్రాన్నీ నియంత్రిస్తోంది. అంతర్జాతీయ ప్రమాణాలు లేదా స్పర్థాతత్వం వంటివి కేంద్ర ప్రభుత్వ ప్రాధాన్యాంశాలు కావు. భారతీయతపై కాకుండా ప్రాచీన హిందూతత్వంపై, హిందూ విజ్ఞానంపై దృష్టి సారించే హిందూ జాతీయవాదం లక్ష్యం ఏమిటంటే, మెల్లగా ఆంగ్లీకరణను రంగం నుంచి తప్పించడమే. ఉదాహరణకు రాజకీయ తత్వవిచారాన్ని బోధించేటప్పుడు దాంట్లోని యూరోపియన్ చింతనను తగ్గించివేసి భారతీయ వేద విజ్ఞానాన్ని, ఉపనిషత్ చింతనను ముందుకు తీసుకువస్తున్నారు. అయితే దీంట్లోనూ బౌద్ధచింతనను మినహాయించడం కుట్రపూరితం అనిపిస్తోంది. చివరకు జేఎన్యూ, ఢిల్లీ వర్సిటీలు కూడా ఇప్పుడు ఇంగ్లిష్ నైపుణ్యాలను, అంతర్జాతీయ స్పర్థకు తావిచ్చే జ్ఞానాన్ని మెరుగుపర్చడంపై కాకుండా, హిందీ, హిందుత్వ భావజాలానికి పరిమితం కావడంపైనే దృష్టి పెడుతున్నాయి. చివరకు కేంద్రీకృత పాలన ఉన్న చైనాలో కూడా విద్యావ్యవహారాల్లో ఇంత సంకుచిత దృష్టితో వ్యవహరించడం లేదు. ఈమధ్యనే ప్రతాప్ భాను మెహతా రాజీనామా, వెనువెంటనే అశోకా యూనివర్సిటీలలో జరిగిన చర్చను చూస్తే, విద్యా దార్శనికత కలిగిన ఆధ్యాపకులు జేఎన్యూ, ఢిల్లీ వర్శిటీల వంటి కేంద్ర విశ్వవిద్యాలయాలను వదిలిపెట్టి వెళ్లిపోతున్న సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కంచ ఐలయ్య, వ్యాసకర్త ఇంగ్లిష్, తెలుగు భాషల్లో ప్రముఖ రచయిత, సామాజిక కార్యకర్త -
ఉన్నత విద్యా కోర్సుల్లో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా అన్ని యూనివర్సిటీల్లోని వివిధ కోర్సుల్లో ఆర్థికంగా వెనుకబడిన తరగతులకు (ఈడబ్ల్యూఎస్) 10 శాతం ప్రత్యేక కోటా అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించి త్వరలో మార్గదర్శకాలు విడుదల కానున్నాయి. ప్రత్యేక కోటా అమలుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని అన్ని విశ్వవిద్యాలయాలకు రాష్ట్ర ఉన్నత విద్యామండలి సూచించింది. ఈడబ్ల్యూఎస్ కింద 10 శాతం రిజర్వేషన్లను కల్పించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఆదాయం రూ.8 లక్షల లోపు ఉన్న వారికి ఈ రిజర్వేషన్లు అమలు చేస్తారు. అయితే ప్రస్తుత విద్యా సంవత్సరానికి సంబంధించిన అడ్మిషన్ల ప్రక్రియ ఇప్పటికే మొదలైంది. కొద్ది రోజుల్లోనే అడ్మిషన్లు పూర్తి కానున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈడబ్ల్యూఎస్ కింద 10 శాతం సీట్లను భర్తీ చేయాల్సి ఉందని, అందుకు తగినట్లు ఏర్పాట్లు చేసుకోవాలని విశ్వవిద్యాలయాలకు ఉన్నత విద్యా మండలి సూచించింది. 10 శాతం అదనంగా సీట్లు ఈ రిజర్వేషన్ల అమలుకు గాను ప్రస్తుతం అందుబాటులో ఉన్న సీట్లలో 10 శాతం సీట్లను కేటాయించడం కాకుండా, అదనంగా 10 శాతం సీట్లను సృష్టిస్తారు. ఈ సీట్లను కన్వీనర్ కోటా కింద అర్హులైన ఈడబ్ల్యూఎస్ కేటగిరీ విద్యార్థులకు కేటాయిస్తారు. ప్రభుత్వం నుంచి అధికారిక ఉత్తర్వులు వెలువడిన వెంటనే 10 శాతం సీట్లు పెంచి ఈ కోటా కింద భర్తీ చేస్తారు. అయితే సాధారణ ఎంఏ, ఎమ్కాం, సాధారణ డిగ్రీ కోర్సుల్లో ఇప్పటికే ఉన్న సీట్లు భర్తీ కావడం లేదనీ, అందువల్ల ఈ కోర్సులకు ప్రత్యేక కోటాను సృష్టించినా ప్రత్యేకంగా ఒరిగేదేమీ లేదని ఉన్నత విద్యా మండలి వర్గాలు అంటున్నాయి. ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఎంబీఏ, ఎంసీఏ, పాలిటెక్నిక్, డిమాండ్ ఉన్న ఇతర పీజీల వంటి కోర్సుల్లో ఈ కోటాకు విలువ ఉంటుందని చెబుతున్నాయి. -
క్రీడా రంగంలో అద్భుతమైన కెరీర్.. ముఖ్యమైన సమాచారం మీకోసం
ప్రపంచ క్రీడా వేదిక టోక్యో ఒలింపిక్స్లో మన క్రీడాకారులు చక్కటి ప్రతిభ చూపుతున్నారు. అంతర్జాతీయంగా పలు అంశాల్లో ముందు వరుసలో నిలుస్తున్నారు. అయినప్పటికీ నేటికీ చాలామంది తల్లిదండ్రులు ఆటలతో కెరీర్ కష్టమనుకుంటారు. అందుకే పిల్లలను ఇంజనీరింగ్, మెడిసిన్, సీఏ వంటి కోర్సుల వైపు పోత్సహించినట్టుగా.. క్రీడల వైపు ప్రోత్సహించడం లేదు. వాస్తవానికి ప్రతిభ ఉంటే.. స్పోర్ట్స్ రంగంలోనూ అద్భుతమైన కెరీర్ సొంతం చేసుకునే అవకాశం ఉంది. దేశంలో స్పోర్ట్స్ కోర్సులను అందించేందుకు ప్రత్యేకంగా ‘నేషనల్ స్పోర్ట్స్ యూనివర్సిటీ(ఇంపాల్)’ని∙ఏర్పాటు చేశారు. దీంతోపాటు మరెన్నో పబ్లిక్ ఇన్స్టిట్యూట్స్, స్పోర్ట్స్ కాలేజీలు పలు కోర్సులు అందిస్తున్నాయి. ఈ నేపథ్యంలో.. దేశంలో స్పోర్ట్స్ కోర్సులు, కెరీర్ అవకాశాలపై ప్రత్యేక కథనం... మన యువత జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో రాణిస్తూ.. క్రీడలను కూడా కెరీర్గా మలచుకోవచ్చని నిరూపిస్తోంది. పలువురు స్పోర్ట్స్తో పేరు ప్రఖ్యాతులతోపాటు, ప్రభుత్వ ఉద్యోగాలు సైతం సొంతం చేసుకుంటున్నారు. దేశంలో క్రికెట్కు ఉన్న క్రేజ్ అంతాఇంతా కాదు. క్రికెట్ ఒక్కటే కాదు.. హాకీ, బ్యాడ్మింటన్, వాలీబాల్, ఫుట్బాల్, బాస్కెట్బాల్, బాక్సింగ్, జిమ్నాస్టిక్స్, టేబుల్ టెన్నిస్, రెజ్లింగ్, సైక్లింగ్, చెస్, అథ్లెటిక్స్, కబడ్డీ వంటి క్రీడలపైనా ఆసక్తి ఎక్కువే. ఆయా క్రీడాకారులకు అంతర్జాతీయంగా అద్భుతమైన గుర్తింపు లభిస్తోంది. సచిన్ టెండూల్కర్, ఎంఎస్ ధోని, కోహ్లీ, సానియా మీర్జా, పీవీ సింధు, అభినవ్ బింద్రా, సుశీల్ కుమార్, విశ్వనాథ్ ఆనంద్, మేరీకోమ్ వంటి వారే అందుకు నిదర్శనం. ప్రభుత్వ, ప్రైవేటు రంగాలు క్రీడాకారుడిగా రాణించాలంటే.. ఎంచుకున్న క్రీడలో ప్రతిభతోపాటు బలమైన సంకల్పం, పట్టుదల చాలా అవసరం. ⇔ ఒక వయసు దాటాక స్పోర్ట్స్ కెరీర్ ముగిసినట్టే అనుకుంటే పొరపాటే. ఎందుకంటే.. క్రీడాకారుడిగా కెరీర్ ముగిసిన తర్వాత కూడా అద్భుతమై రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టవచ్చు. ముఖ్యంగా స్పోర్ట్స్ కోచింగ్, అథ్లెటిక్ అడ్మినిస్ట్రేషన్, స్పోర్ట్స్ మెడిసిన్, స్పోర్ట్స్ ప్రమోషన్, స్పోర్ట్స్ సెకాలజీ, స్పోర్ట్స్ మార్కెటింగ్ వంటి అనుబంధ రంగాల్లో ప్రవేశించవచ్చు. ⇔ స్పోర్ట్స్ ప్లేయర్, స్పోర్ట్స్ టీచర్, స్పోర్ట్స్ సైకాలజిస్ట్, స్పోర్ట్స్ జర్నలిస్ట్, స్పోర్ట్స్ కోచ్ అండ్ ఇన్స్ట్రక్టర్, స్పోర్ట్స్ వ్యాఖ్యాత, స్పోర్ట్స్ ఫొటోగ్రాఫర్, పర్సనల్ ట్రైనర్, ప్రొఫెషనల్ అథ్లెట్, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్, హెల్త్ అడ్వైజ్ ఆఫీసర్ వంటి విభాగాల్లో రాణించవచ్చు. ⇔ స్కూల్ స్థాయిలో క్రీడల్లో ప్రతిభ చూపినవారికి ‘స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా’ ఆధ్వర్యంలోని వివిధ స్పోర్ట్స్ సంస్థలు, అకాడమీలు శిక్షణనిస్తున్నాయి. చురుకైన యువతకు చక్కటి శిక్షణ ఇచ్చి.. ప్రతిభావంతులైన క్రీడాకారులుగా తీర్చిదిద్దుతున్నారు. డిప్లొమా నుంచి పీహెచ్డీ వరకూ క్రీడలకు సంబంధించి డిప్లొమా నుంచి పీహెచ్డీ వరకు పలు స్థాయిల్లో కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా » బీఎస్సీ–స్పోర్ట్స్ కోచింగ్ » బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్(బీపీఈఎస్) » ఎంఎస్సీ స్పోర్ట్స్ కోచింగ్(రెండేళ్లు) » ఎంఏ స్పోర్ట్స్ సైకాలజీ(రెండేళ్లు) » ఎంఏ/ఎంఎస్సీ స్పోర్ట్స్ సైకాలజీ, ఎంపీటీ స్పోర్ట్స్ సైకోథెరఫీ, ఎంఎస్సీ/ఎంఫీల్/పీహెచ్డీ స్పోర్ట్స్ సైకాలజీ తదితర కోర్సుల్లో చేరే అవకాశముంది. ప్రవేశం–అర్హతలు స్పోర్ట్స్ కోర్సుల్లో ప్రవేశానికి పలు అర్హతలు నిర్దేశించారు. ఇంటర్మీడియెట్ పూర్తి చేసి, సంపూర్ణ శారీరక ఆరోగ్యంతో ఉన్నవారు అండర్ గ్రాడ్యుయేషన్ స్థాయి కోర్సుల్లో చేరవచ్చు. యూజీ కోర్సులు పూర్తిచేసినవారు పీజీ కోర్సులకు వెళ్లవచ్చు. ఎంబీబీఎస్ తర్వాత స్పోర్ట్స్ మెడిసిన్లో డిప్లొమా/పీజీ డిప్లొమా చేయవచ్చు. అభ్యర్థుల అకడెమిక్ మెరిట్ ,టెస్టులు, క్రీడా ప్రతిభ ఆధారంగా ఆయా కోర్సుల్లో ప్రవేశాలు చేపడతారు. పలు స్పోర్ట్స్ ఇన్స్టిట్యూట్లు ⇔ నేషనల్ స్పోర్ట్స్ యూనివర్సిటీ (ఇంపాల్); ⇔ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్(పటియాలా); ⇔ఇందిరాగాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ సైన్స్ (న్యూఢిల్లీ); ⇔లక్ష్మీబాయి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ (గ్వాలియర్); ⇔లక్ష్మీబాయి నేషనల్ కాలేజ్ ఫర్ ఫిజికల్ ఎడ్యుకేషన్ (తిరువనంతపురం); ⇔టాటా ఫుట్బాల్ అకాడమీ (జంషెడ్పూర్); ⇔ నేషనల్ క్రికెట్ అకాడమీ (బెంగళూరు); ⇔ ఢిల్లీ యూనివర్సిటీ. నేషనల్ స్పోర్ట్స్ యూనివర్సిటీ మణిపూర్ రాజధాని ఇంపాల్లో ఏర్పాటు చేసిన ‘నేషనల్ స్పోర్ట్స్ యూనివర్సిటీ’ పలు కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. కేంద్రంలోని యువజన, క్రీడా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని సెంట్రల్ యూనివర్సిటీ ఇది. ఈ వర్సిటీ 2021–22 విద్యా సంవత్సరానికి వివిధ యూజీ/పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తు కోరుతోంది. ► బీఎస్సీ–స్పోర్ట్స్ కోచింగ్: నాలుగేళ్ల కాలపరిమితి గల బీఎస్సీ స్పోర్ట్స్ కోచింగ్ కోర్సులో ఆర్చరీ, అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్, బాక్సింగ్, ఫుట్బాల్, హాకీ, షూటింగ్, స్విమ్మింగ్, వెయిట్ లిఫ్టింగ్ స్పెషలైజేషన్లు ఉన్నాయి. ఇంటర్మీడియెట్/తత్సమాన ఉత్తీర్ణులై ఉండాలి. ఇంటర్నెట్ బేస్డ్ ప్రోక్టర్డ్ టెస్ట్కు 50 శాతం, అభ్యర్థి క్రీడా ప్రతిభకు మరో 50 శాతం మార్కుల ఆధారంగా ప్రవేశం కల్పిస్తారు. ► బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్(బీపీఈఎస్): బీపీఈఎస్ కోర్సు కాలపరిమితి మూడేళ్లు. ఇంటర్మీడియెట్(10+2)లేదా తత్సమాన ఉత్తీర్ణత తప్పనిసరి. ఇంటర్నెట్ బేస్డ్ ప్రోక్టర్డ్ టెస్ట్లో 70 శాతం, క్రీడల్లో చూపిన ప్రతిభకు 30 శాతం వెయిటేజీ ఆధారంగా ప్రవేశం కల్పిస్తారు. ► ఎంఎస్సీ స్పోర్ట్స్ కోచింగ్(రెండేళ్లు): బీఎస్సీ స్పోర్ట్స్ కోచింగ్/గ్రాడ్యుయేషన్ విత్ డిప్లొమా ఇన్ స్పోర్ట్స్ కోచింగ్, బీపీఈఎస్ విత్ డిప్లొమా ఇన్ స్పోర్ట్స్ కోచింగ్/ బీపీఈడీ లేదా తత్సమాన కోర్సుల్లో 50 శాతం మార్కులు తప్పనిసరి. ఇంటర్నెట్ బేస్డ్ ప్రోక్టర్డ్ టెస్ట్కు 100 మార్కులు, క్రీడా ప్రతిభకు 30 మార్కులు, వైవాకు 20 మార్కుల ఆధారంగా ప్రవేశం కల్పిస్తారు. ► ఎంఏ స్పోర్ట్స్ సైకాలజీ(రెండేళ్లు): ఈ కోర్సులో ప్రవేశానికి అభ్యర్థి బీపీఈఎస్/ బీపీఈడీ/బీఏ(హానర్స్), బీఏ సైకాలజీ/స్పోర్ట్స్ సైకాలజీలో 50 మార్కులు తప్పనిసరి. ఇంటర్నెట్ బేస్డ్ ప్రోక్టర్డ్ టెస్ట్కు 100 మార్కులు, వైవాకు 30 మార్కులు, క్రీడా ప్రతిభకు 20 మార్కుల వెయిటేజీ ఆధారంగా ప్రవేశం కల్పిస్తారు. ముఖ్య సమాచారం ► ఎన్ఎస్యూ ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 17 ఆగస్టు 2021 ► ఆన్లైన్ ఎంట్రన్స్ టెస్ట్: 10 సెప్టెంబర్ 2021 ► ఫిజికల్ ఫిట్నెస్, గేమ్ ప్రొఫిషియన్సీ టెస్ట్: సెప్టెంబర్ 22–24 ► పూర్తి వివరాలకు వెబ్సైట్: www.nsu.ac.in స్సోర్ట్స్ సైకాలజీకి క్రేజ్ క్రీడాకారుల్లో మానసిక ఒత్తిడిని తగ్గించేందుకు స్పోర్ట్స్ సైకాలజిస్టుల అవసరం ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతం మన దేశంలో సుశిక్షుతులైన స్పోర్ట్స్ సైకాలజిస్టులు కొరత నెలకొంది. దాంతో మన దేశ క్రీడా సంఘాలు అమెరికా,ఆస్ట్రేలియాకు చెందిన స్పోర్ట్స్ సైకాలజిస్టులను నియమించుకుంటున్నాయి. ప్రస్తుతం దేశంలో దాదాపు అన్ని యూనివర్సిటీలు ఎంఏ,ఎంఎస్సీ సైకాలజీ కోర్సులు అందిస్తున్నా.. స్పోర్ట్స్ సైకాలజీ కోర్సు మాత్రం చాలా తక్కువ యూనివర్సిటీల్లో ఉంది.వాటిలో చెప్పుకోదగ్గవి.. ►గురునానక్దేవ్ యూనివర్సిటీ(అమృత్సర్): ఎంఏ/ఎంఎస్సీ స్పోర్ట్స్ సైకాలజీ, ఎంపీటీ స్పోర్ట్స్ సైకోథెరఫీ. ►తమిళనాడు ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీ(చెన్నై): ఎంఎస్సీ/ ఎంఫిల్/ పీహెచ్డీ స్పోర్ట్స్ సైకాలజీ. ► రాజస్థాన్ సెంట్రల్ యూనివర్సిటీ: ఎంఏ/ఎంఎస్సీ స్పోర్ట్స్ సైకాలజీ. ►లక్ష్మీబాయి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్(గ్వాలియర్):ఎంఏ స్పోర్ట్స్ సైకాలజీ. -
తెలంగాణ: యూనివర్సిటీల వీసీలతో గవర్నర్ భేటీ
సాక్షి, హైదరాబాద్: విశ్వ విద్యాలయాలు ఉత్కృష్టత నిలయాలుగా ఎదగాలని గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ వైస్ ఛాన్సలర్లకు సూచించారు. విశ్వవిద్యాలయాలు కేవలం 'టీచింగ్ యూనివర్సిటీలు' గా మాత్రమే మిగలకూడదని అవి పరిశోధన, ఆవిష్కరణల నిలయాలుగా ఎదగాలన్నారు. గ్లోబల్ ఇన్నొవేషన్లో భారతదేశం 49వ స్థానంలో ఉందని, అయితే టాప్ ట్వంటీ లోకి భారత్ను తీసుకురావాలంటే విశ్వవిద్యాలయాలు కూడా పరిశోధనల్లో, ఆవిష్కరణల్లో మరింత చురుకుగా వ్యవహరించాల్సి ఉంటుందని గవర్నర్ అన్నారు. కోవిడ్ సంక్షోభానికి సంబంధించి సైన్స్, సామాజిక శాస్త్రాల ఉమ్మడి పరిశోధన కూడా సాగాలని ఆమె సూచించారు. గవర్నర్ రాష్ట్రంలోని మొత్తం 14 విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సలర్లతో.. వర్చువల్గా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని ఉన్నత విద్యలో మరింతగా అభివృద్ధి చేసి నంబర్ వన్ గా తీర్చిదిద్దడానికి అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని గవర్నర్ పిలుపునిచ్చారు. విశ్వవిద్యాలయాలలో అకడమిక్ సోషల్ రెస్పాన్సిబిలిటీ పెంపొందించడం, పరిశోధనలను ప్రోత్సహించడం, విద్యార్థులందరికీ వ్యాక్సినేషన్ ఇవ్వడం, యూత్ రెడ్ క్రాస్, ఎన్ ఎస్ ఎస్ సేవలు మరింత విస్తరించడం, గ్రామాల దత్తత ఇలాంటి అంశాలను ప్రోత్సహించాలని గవర్నర్ సూచించారు. విశ్వవిద్యాలయాలు సకాలంలో క్లాసులు, పరీక్షలు నిర్వహించి ఫలితాలు ప్రకటించి అకాడమిక్ సంవత్సరం నష్టపోకుండా చూడాల్సిన బాధ్యత ఉందన్నారు. ఆన్లైన్ క్లాసులు పొందలేక పోతున్న అణగారిన వర్గాలకు ప్రత్యేకమైన సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత ఉందని గుర్తు చేశారు. ఆన్ లైన్ విద్య డిజిటల్ అంతరాలను పూడ్చేదిగా ఉండాలి, కానీ మరింత గా అంతరాలను పెంచేదిగా ఉండకూడదని గవర్నర్ అన్నారు. ఈ సందర్భంగా మొత్తం 14 మంది వివిధ విశ్వవిద్యాలయాలకు చెందిన వైస్ ఛాన్స్లర్లు తమ యూనివర్సిటీల కార్యక్రమాలను, ప్రగతిని గవర్నర్కు వివరించారు. చదవండి: ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలు రద్దు: మంత్రి సబితా జూన్ 23లోగా జీవో అమల్లోకి తీసుకురావాలి: హైకోర్టు -
TS: పది యూనివర్సిటీలకు వీసీలను నియమించిన ప్రభుత్వం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని పది విశ్వవిద్యాలయాలకు వైస్చాన్స్లర్లను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు ఆదేశాల మేరకు ఏర్పాటు చేసిన సెర్చ్ కమిటీలు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) నిబంధనల మేరకు రాష్ట్రంలోని అన్ని వర్సిటీలకు వీసీల నియామక ప్రక్రియలో భాగంగా పేర్లను సిఫారసు చేశారు. కరోనా నేపథ్యంలో కొంత ఆలస్యమైనా నిబంధనల ప్రకారం అభ్యర్థుల ఎంపిక కసరత్తు పూర్తిచేసి గవర్నర్ ఆమోదం కోసం సిఫారసు చేశారు. వీసీల నియామకానికి శనివారం రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆమోదం తెలిపారు. గవర్నర్ ఆమోదం మేరకు రాష్ట్ర ప్రభుత్వం వారిని వీసీలుగా నియమించింది. వీటికి సంబంధించి యూనివర్సిటీ వారీగా ఉన్నత విద్యా శాఖ నియామక ఉత్తర్వులు జారీ చేసింది. ఇక బాసరలోని ట్రిపుల్ఐటీకీ ప్రభుత్వం త్వరలోనే వీసీని నియమించనుంది. ట్రిపుల్ ఐటీకి ప్రొఫెసర్ గోవర్ధన్ పేరును ఖరారు చేసినట్లు తెలిసింది. ముగ్గురికి రెండోసారి అవకాశం.. వీసీలుగా నియమితులైన వారిలో ముగ్గురికి రెండోసారి అవకాశం దక్కించింది. బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీకి వీసీగా నియమితులైన ప్రొఫెసర్ కె.సీతారామరావు ఇంతకుముందు కూడా అదే యూనివర్సిటీ వీసీగా పని చేశారు. 2016 జూలై నుంచి 2019 జూలై వరకు ఆయన వీసీగా పని చేశారు. ప్రొఫెసర్ కవిత దర్యాణి జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీకి (జేఎన్ఏఎఫ్ఏయూ) రెండోసారి వీసీగా నియమితులయ్యారు. అలాగే ప్రొఫెసర్ కట్టా నర్సింహారెడ్డి ఉమ్మడి ఏపీలో మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం వీసీగా పని చేశారు. ఉన్నత విద్యా మండలి వైస్ చైర్మన్గా సేవలందించిన ప్రొఫెసర్ సంకసాల మల్లేశ్ తాజాగా శాతవాహన యూనివర్సిటీ వీసీగా నియమితులయ్యారు. ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ముగ్గురికి వీసీలుగా అవకాశం దక్కింది. ప్రొఫెసర్ టి.రమేశ్, ప్రొఫెసర్ సీతారామరావు, ప్రొఫెసర్ రవీందర్ యాదవ్ ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన వారే. రెండేళ్ల తర్వాత నియమకాలు.. రాష్ట్రంలోని 10 వర్సిటీలకు 2016లో ప్రభుత్వం వీసీలను నియమించింది. వారందరి పదవీ కాలం 2019లో ముగిసింది. దీంతో ప్రభుత్వం వీసీల నియామకానికి నోటిఫికేషన్ జారీ చేసింది. రాష్ట్రంలోని వర్సిటీలతో పాటు ఇతర రాష్ట్రాల చెందిన 984 మంది ప్రొఫెసర్లు దరఖాస్తు చేసుకున్నారు. వాటిన్నింటినీ ప్రభుత్వం క్రోడీకరించి సెర్చ్ కమిటీలను ఏర్పాటు చేసింది. ఆ తర్వాత కొన్ని కారణాలతో సెర్చ్ కమిటీల సమావేశాలు ఆలస్యయ్యాయి. ఎట్టలకేలకు గత ఫిబ్రవరిలో సెర్చ్ కమిటీల సమావేశాలను ప్రభుత్వం పూర్తి చేసింది. ఒక్కో యూనివర్సిటీ వీసీ పోస్టు కోసం ముగ్గురు చొప్పున పేర్లను గవర్నర్ ఆమోదానికి పంపించింది. ప్రొఫెసర్ కవితా దర్యాణి ప్రొఫెసర్ కవితా దర్యాణి.. జేఎన్ఏఎఫ్ఏయూలో ఆర్కిటెక్చర్ విభాగం లెక్చరర్గా 1985లో ఉద్యోగ ప్రస్థానం ప్రారంభించారు. 2002లో జేఎన్టీయూ హైదరాబాద్ లో అడినషల్ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్గా, 2004లో ప్రొఫెసర్గా పదోన్నతి పొందారు. అనంతరం మాసబ్ట్యాంక్ జేఎన్ఏఎఫ్ఏయూకు డైరెక్టర్ ఆఫ్ ఎవాల్యూషన్గా, 2013 నుంచి 2016 వరకు ఇదే యూనివర్సిటీ రిజిస్ట్రార్గా, 2017లో వీసీగా పదోన్నతి పొందారు. తాటికొండ రమేశ్ వరంగల్లోని గోవిందరాజుగుట్ట ప్రాంతానికి చెందిన తాటికొండ రమేష్ నిరుపేద కుటుంబంలో జన్మించారు. తండ్రి రామయ్య ఆజాంజాహీ మిల్లులో కార్మికుడిగా పనిచేయగా, తల్లి లక్ష్మమ్మ మద్రాస్ చక్కెర బీడీ కంపెనీలో బీడీలు చుట్టేవారు. ఆమెతో కలసి నాలుగో తరగతి సమయం నుంచే తల్లితో పాటు బీడీలు చుట్టేవారు. హైస్కూల్ విద్యతో పాటు ఇంటర్, డిగ్రీ వరంగల్లోనే పూర్తి చేశారు. ఉస్మానియా యూనివర్సిటీలో 1987లో ఎంఏ సోషియాలజీ, 1990లో ఎంఫిల్, 2009లో పీహెచ్డీ పూర్తిచేసిన ఆయన.. 1992లో కేయూ సోషియాలజీ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్గా నియమితులయ్యారు. నిర్మల్ పీజీ సెంటర్లో 1991లో సోషియాలజీ అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేశారు. కేయూలో సోషియాలజీ విభాగానికి అధిపతిగా, బీఓఎస్గా, సోషల్ సైన్స్ డీన్గా బాధ్యతలు నిర్వర్తించారు. ప్రస్తుతం కేయూ అకడమిక్ ఆడిట్ డీన్గా ఉన్న ఆయన 20కి పైగా పుస్తకాలు రచించారు. తంగెడ కిషన్రావు కరీనంగర్ జిల్లాకు చెందిన ప్రొఫెసర్ తంగెడ కిషన్రావు 1973లో ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఏ చేశారు. 1991లో అదే యూనివర్సిటీలో పీహెచ్డీ పూర్తి చేశారు. 1974 నుంచి 1984 వరకు భువనగిరిలోని శ్రీలక్ష్మి నరసింహస్వామి డిగ్రీ కాలేజీలో తెలుగు లెక్చరర్గా పని చేశారు. అప్పటి నుంచి 1991 వరకు ఉస్మానియా యూనివర్సిటీలో అకడమిక్ ఆడిట్ సెల్లో డిప్యూటీ డైరెక్టర్ హోదాలో పని చేశారు. 1991 నుంచి 1999 వరకు ఉస్మానియాలోనే అసిస్టెంట్ ప్రొఫెసర్గా, 1999 నుంచి ప్రొఫెసర్గా పని చేశారు. 2006 నుంచి బోర్డు ఆఫ్ స్టడీస్ చైర్మన్గానూ పని చేశారు. ప్రొఫెసర్ డి. రవీందర్ యాదవ్ ప్రొఫెసర్ డి.రవీందర్ యాదవ్.. ఉమ్మడి వరంగల్ జిల్లా జనగామ మండలం వడ్లకొండ గ్రామంలో వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఏ, ఎంఫిల్, పీహెచ్డీ పూర్తి చేశారు. 1990లో అదే యూనివర్సిటీలో పొలిటికల్ సైన్స్ డిపార్ట్మెంట్లో ఫ్యాకల్టీగా నియమితులయ్యారు. కేంద్ర మావన వనరుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన లీడర్షిప్ ఇన్ అకడమిక్ ప్రోగ్రాంలో శిక్షణ పొందారు. ఓయూ పోస్టు గ్రాడ్యుయేట్ కాలేజీ ప్రిన్సిపాల్గా గతంలో పని చేశారు. గత నాలుగేళ్లుగా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపాల్గా పని చేస్తున్నారు. మహత్మాగాంధీ యూనివర్సిటీలో సోషల్ సైన్సెస్ డీన్గా, సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ స్టడీస్ కోఆర్డినేటర్గా పని చేశారు. నిజాం కాలేజీ, ఓయూ పీజీ కాలేజీల్లోనూ ఆయన సేవలు అందించారు. సీతారామారావు వరంగల్ జిల్లా హన్మ కొండకు ప్రొఫెసర్ సీతా రామారావు కేయూ యూని వర్సిటీ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ విభా గంలో 1977లో పీజీ, 1981లో ఎంఫిల్, 1999లో పీహెచ్డీ పూర్తిచేశారు. 1978లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా నియమితులైన ఆయన ప్రొఫెసర్గా పదోన్నతి పొంది విభాగాధిపతిగా, బోర్డు ఆఫ్ స్టడీస్ చైర్మన్గా, సోషల్ సైన్స్ డీన్గా బాధ్యతలు నిర్వర్తించారు. 2015లో ప్రొఫెసర్గా ఉద్యోగ విరమణ చేశాక 2016లో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వీసీగా నియమితులై మూడేళ్ల పాటు కొనసాగారు. ప్రొఫెసర్ సంకసాల మల్లేశ్ కరీంనగర్ జిల్లాలోని హన్మాజ్పేట్ గ్రామంలోని నిరుపేద కుటుంబానికి చెందిన ప్రొఫెసర్ సంకసాల మల్లేశ్ ఉన్నత స్థాయికి ఎదిగారు. పదో తరగతి వరకు కరీంనగర్ జిల్లాలోనే చదువుకున్న ఆయన బాబు జగ్జీవన్రామ్ కాలేజీలో డిగ్రీ పూర్తిచేశారు. ఆ తర్వాత ఉస్మానియా వర్సిటీలో ఎంఏ ఫిలాసఫీ, ఎంఫిల్ పూర్తి చేశారు. ఇంటర్నేషనల్ జర్మనీ ఫెలోషిప్ అందుకుని అక్కడే పీహెచ్డీ పూర్తి చేశారు. 1992లో లెక్చరర్గా నియమితులైన ఆయన 1994లో యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీలో చేశారు. ఆ తర్వాత నిజాం కాలేజీ ప్రిన్సి పాల్గా పని చేశారు. 2010లో యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ ఫిలాసఫీ డిపార్ట్మెంట్ హెడ్గా, 2012 నుంచి 2014 వరకు ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపాల్గా పని చేశారు. లక్ష్మీకాంత్ రాథోడ్ మహబూబ్నగర్ జిల్లా మద్దూరు మండలం తిమ్మారెడ్డిపల్లి గ్రామానికి చెందిన ప్రొఫెసర్ లక్ష్మీకాంత్ రాథోడ్.. మహబూబ్నగర్లోని ఎంవీఎస్ ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో డిగ్రీ పూర్తి చేశారు. 1989లో ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఏ ఎకానమిక్స్ పూర్తి చేశారు. బీపీఈడీ, ఎంపీఈడీ పూర్తి చేసిన ఆయన.. 2006లో పీహెచ్డీ పూర్తి చేశారు. ఎయిడెడ్ కాలేజీలో ఫిజికల్ ఎడ్యుకేషన్ లెక్చరర్గా ఉద్యోగ జీవితం ప్రారంభించి.. ఐదేళ్ల తర్వాత ఉస్మానియాలో ఫ్యాకల్టీగా చేరారు. అప్పటి నుంచి 2020 ఆగస్టు వరకు ఫ్యాకల్టీ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్గా పని చేశారు. 2018 నుంచి ఇప్పటివరకు నిజాం కాలేజీ ప్రిన్సిపాల్గా పని చేస్తున్నారు. యూనివర్సిటీ ఫిజికల్ ఎడ్యుకేషన్ కాలేజీ ప్రిన్సిపాల్గా, యూనివర్సిటీ ఫిజికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్గా కూడా పని చేశారు. సీహెచ్ గోపాల్రెడ్డి కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం పోతిరెడ్డిపేట గ్రామానికి చెందిన ప్రొఫెసర్ సీహెచ్ గోపాల్రెడ్డి.. వరంగల్ కాకతీయ యూని వర్సిటీలో బీఎస్సీ డిగ్రీ చేశారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్సిటీలో ఎమ్మెస్సీ ఫిజిక్స్లో పీజీ, పీహెచ్డీ పూర్తి చేశారు. 1990లో అదే యూనివర్సిటీ ఫిజిక్స్ డిపార్ట్మెంట్లో ఫ్యాకల్టీగా ఉద్యోగంలో చేరారు. ఆ తర్వాత యూనివర్సిటీలో వివిధ హోదాల్లో పని చేశారు. నల్లగొండ పీజీ కాలేజీ డిపార్ట్మెంట్ హెడ్గా, సైఫాబాద్ యూనివర్సిటీ సైన్స్ కాలేజీ వైస్ ప్రిన్సిపాల్గా, యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీ ఫిజిక్స్ హెడ్గా మూడేళ్లు పని చేశారు. డీన్గా, అడ్మిషన్స్ డైరెక్టర్గానూ సేవలందించారు. 2016లో ఉస్మానియా యూనివర్సిటీ రిజిస్ట్రార్గా నియమితు లయ్యారు. ప్రస్తుతం రిజిస్ట్రార్గా కొనసాగుతున్నారు. డి.రవీందర్గుప్తా యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపూర్కి చెందిన ప్రొఫెసర్ డి.రవీందర్గుప్తా తెలంగాణ యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్గా నియమితులయ్యారు. ప్రస్తుతం ఉస్మానియా యూనివర్సిటీలో ఫిజిక్స్ డిపార్ట్మెంట్లో ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. ఆయన రాసిన 172 ఆర్టికల్స్ అంతర్జాతీయ జర్నల్స్లో పబ్లిష్ అయ్యాయి. డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ టెక్నాలజీ ఆధ్వర్యంలో 1994లో బాయ్స్కాస్ట్ ఫెలోషిప్ పొందారు. 1996లో యునైటెడ్ కింగ్డమ్ రాయల్ సొసైటీ విజిటింగ్ ఫెలోషిప్ పొందారు. సైన్స్ టెక్నాలజీ విభాగంలో 1994లో ఏపీజే అబ్దుల్ కలాం చేతుల మీదుగా యంగ్ సైంటిస్ట్ అవార్డును అందుకున్నారు. యూజీసీ కెరీర్ అవార్డును పొందారు. కట్టా నర్సింహారెడ్డి నల్లగొండ జిల్లా కేంద్రంలోని పానగల్కు చెందిన కట్ట నర్సింహారెడ్డి.. మహాత్మాగాంధీ యూని వర్సిటీ వీసీగా 2011 నుంచి 2014 వరకు పని చేశారు. అంతకుముందు ఉస్మానియా యూని వర్సిటీలో ఫిజిక్స్ డిపార్ట్మెం ట్ హెడ్గా బాధ్యతలు నిర్వర్తిం చారు. 2013లో పదవీ విరమణ పొం దారు. ఆయన తండ్రి రామ చంద్రా రెడ్డి ఎమ్మెల్సీగా పోటీ చేశారు. చదవండి: చిన్నపిల్లలకు వ్యాక్సిన్ త్వరగా తీసుకురండి: గవర్నర్ తమిళిసై -
టాప్ టెన్లో నిలవాలి
రాష్ట్రంలో ప్రాథమిక, ఉన్నత విద్యను పటిష్టం చేస్తున్నాం. అమ్మ ఒడి, ఇంగ్లిష్ మీడియం, సీబీఎస్సీ సిలబస్, నాడు–నేడు పనులతో విద్యా రంగం రూపురేఖలనే మార్చేస్తున్నాం. అన్ని వసతుల మధ్య పిల్లలు విద్యనభ్యసించేలా చర్యలు తీసుకుంటున్నాం. ఇదే సందర్భంలో వర్సిటీ స్థాయిలో కూడా అత్యున్నత ప్రమాణాలు నెలకొల్పాలి. ఇందుకు దేశంలోని టాప్ 10 వర్సిటీల్లో అమలవుతున్న విధానాలను అధ్యయనం చేయాలి. అవసరమైన వాటిని మన వర్సిటీల్లో అమలు చేయాలి. మన విశ్వవిద్యాలయాలు కూడా దేశంలోని టాప్ 10 జాబితాలో నిలిచేలా కార్యాచరణ రూపొందించాలి. – సీఎం జగన్ సాక్షి, అమరావతి: యూనివర్సిటీలలో అన్ని ప్రమాణాలు పెరగాలని, దేశంలో టాప్ టెన్లో మన యూనివర్సిటీలు నిలవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. ఆ మేరకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ఐఐటీల స్థాయిలో ట్రిపుల్ ఐటీలుండాలని, అందుకు అనుగుణంగా వాటిని తీర్చిదిద్దాలని చెప్పారు. ఉన్నత విద్య అభివృద్ధిలో భాగంగా నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ (ఎన్ఐఆర్ఎఫ్)లో యూనివర్సిటీలను మెరుగుపరచడంపై బుధవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. విద్య, వైద్య రంగాలకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, ఆ దిశలోనే పెద్ద ఎత్తున నాడు–నేడు కార్యక్రమం చేపట్టామని పేర్కొన్నారు. విద్యార్థులకు మేలు చేసేలా ప్రమాణాలు పెంచేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు. విద్యా, ఆరోగ్య సంస్థల్లో సంస్కరణలు తీసుకురావాలని, దీనిపై అధికారులు మూడు నాలుగు సార్లు సమావేశమై విధివిధానాలు రూపొందించాలని స్పష్టం చేశారు. ఆ మేరకు అవసరమైన బిల్లులను రూపొందించి ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే ప్రవేశ పెట్టాలని సూచించారు. కొత్తగా ఏర్పాటు చేస్తున్న మెడికల్ కాలేజీల్లో 70 శాతం సీట్లు కనీ్వనర్ కోటాలో, మిగిలిన 30 శాతం సీట్లు పేమెంట్ (మేనేజ్మెంట్) కోటాలో ఉండేలా ఆలోచన చేయాల్సిందిగా ఆదేశించారు. దీని వల్ల పేద విద్యార్థులకు మరిన్ని సీట్లు అందుబాటులోకి వస్తాయని, అంతే కాకుండా ప్రతి కాలేజీ స్వయం సమృద్ధితో నడుస్తుందని చెప్పారు. దీంతో నిర్వహణకు ఇబ్బంది లేకుండా ఉంటుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎన్ఐఆర్ఎఫ్ ప్రమాణాలను ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. ఈ సమీక్షలో సీఎం ఇంకా ఏమన్నారంటే.. ర్యాంకింగ్ ఇంకా మెరుగు పడాలి ► జేఎన్టీయూ రెండు యూనివర్సిటీలు (కాకినాడ, అనంతపురం), ఆంధ్రా యూనివర్సిటీ, ఎస్వీ యూనివర్సిటీ, పద్మావతి మహిళా యూనివర్సిటీతో పాటు, ట్రిపుల్ ఐటీలను ఇప్పడున్న పరిస్థితి నుంచి మెరుగైన పరిస్థితిలోకి తీసుకువెళ్లడంపై కార్యాచరణ రూపొందించండి. ► ఆ మేరకు ప్రతిపాదనలు సిద్ధం చేసి ఎన్ని నిధులు అవసరమో చెప్పండి. కడపలో రానున్న ఆర్కిటెక్చర్ యూనివర్శిటీపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టండి. ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్లో ఏయూ ప్రస్తుతం 19వ స్థానంలో, ఎస్వీ యూనివర్సిటీ 38వ స్థానంలో ఉన్నాయి. రెండేళ్లలో వీటి స్థానాలు గణనీయంగా మెరుగు పడడానికి తీసుకోవాల్సిన చర్యలపై దృష్టి పెట్టండి. ప్రతిభావంతుల ఎంపిక ► ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్లో ఉత్తమ స్థానాల్లో ఉన్న యూనివర్సిటీలలో పద్ధతులను అధ్యయనం చేయండి. మౌలిక సదుపాయాలు, బోధనా పద్ధ్దతులు, బోధనా సిబ్బంది తదితర అంశాల్లో ఆచరించాల్సిన పద్ధతులపై దృష్టి పెట్టండి. ► ప్రతిభ ఉన్న వారినే యూనివర్సిటీల్లో బోధనా సిబ్బందిగా నియమించాలి. ప్రతిభావంతులను ఎంపిక చేయడానికి తగిన చర్యలు తీసుకోండి. రిక్రూట్మెంట్ కోసం పటిష్టమైన పద్ధతులను రూపొందించండి. విదేశీ వర్సిటీలతో భాగస్వామ్యం ► విదేశాల్లోని అత్యుత్తమ యూనివర్సిటీల పద్ధతులను, విధానాలను కూడా అధ్యయనం చేసి వాటిని మన యూనిర్సిటీల్లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి. వారి పాఠ్య ప్రణాళికలను ఇక్కడ అనుసంధానం చేసుకోవడంపైనా దృష్టి పెట్టాలి. ► బోధనతో పాటు కోర్సులకు సంబంధించి విదేశీ వర్సిటీలతో భాగస్వామ్యం ఏర్పాటు చేసుకోండి. ట్రిపుల్ ఐటీల్లో బిజినెస్ కోర్సులు ► ట్రిపుల్ ఐటీల్లో ప్రస్తుతం 22,946 మంది విద్యార్థులు ఉన్నారు. శ్రీకాకుళం, ఒంగోలులో ట్రిపుల్ ఐటీల నిర్మాణాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేయాలి. గత ప్రభుత్వ హయాంలో ట్రిపుల్ ఐటీలను పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. ట్రిపుల్ ఐటీలకు సంబంధించి రూ.180 కోట్లకు పైగా నిధులను మళ్లించారు. ► మళ్లీ ట్రిపుల్ ఐటీలు మెరుగు పడాలి. ఇప్పుడున్న మౌలిక సదుపాయాలను మెరుగు పరచాలి. దీని కోసం కార్యాచరణ రూపొందించండి. ట్రిపుల్ ఐటీల్లో మంచి బిజినెస్ కోర్సులను ప్రవేశ పెట్టడంపైనా దృష్టి పెట్టండి. ఈ కోర్సులు అత్యుత్తమంగా ఉండాలి. ఇంజినీరింగ్ కోర్సులు మంచి నైపుణ్యం ఉన్న మానవ వనరులను అందించేలా చూడాలి. విద్య, ఆరోగ్య వ్యవస్థలు బావుండాలి ► రాష్ట్రంలో ఇప్పటి వరకు 11 మెడికల్ కాలేజీలు మాత్రమే ఉన్నాయి. కొత్తగా మరో 16 మెడికల్ కాలేజీలను తీసుకు వస్తున్నాం. మెడికల్ సీట్ల సంఖ్య గణనీయంగా పెరగబోతోంది. ఆ కాలేజీలను మెరుగ్గా నిర్వహించడానికి చక్కటి విధానాలు పాటించాలి. ► విద్యా, ఆరోగ్య వ్యవస్థ బాగు పడాలనే తపనతో వేల కోట్లు ఖర్చు చేస్తున్నాం. అందు కోసం పెద్ద ఎత్తున నాడు–నేడు కార్యక్రమం అమలు చేస్తున్నాం. ఈ సంస్థలన్నింటినీ అత్యుత్తమంగా నడుపుకునేలా చక్కటి విధానాలను తీసుకురావాలి. ► గ్రామ సచివాలయాల సిబ్బందికి ఇచ్చే శిక్షణను ట్రిపుల్ ఐటీలతో కలిసి నిర్వహించాలి. ఉపాధ్యాయులకు శిక్షణ కార్యాక్రమాలను కూడా ట్రిపుల్ ఐటీలు నిర్వహించాలి. ► ఈ సమీక్షలో విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, ఉన్నత విద్యా శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సతీష్ చంద్ర, ఆర్థిక శాఖ కార్యదర్శి ఎన్.గుల్జార్, రాష్ట్ర ఉన్నత విద్యా మండలి (ఏపీఎస్సీహెచ్ఈ) చైర్మన్ కె.హేమచంద్రారెడ్డి, ఆర్జీయూకేటీ ఛాన్సలర్ ప్రొఫెసర్ కెసి రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
భావి అవసరాలు తీర్చేలా నూతన విద్యావిధానం
అహ్మదాబాద్: భారత్ గత సంవత్సరం ఆవిష్కరించిన నూతన విద్యా విధానం భవిష్యత్ అవసరాలను తీర్చగలదని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పేర్కొన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఆ విధానాన్ని రూపొందించారని ప్రశంసించారు. విద్యార్థి నేర్చుకునే జ్ఞానం దేశాభివృద్ధికి ఉపయోగపడాలనే డాక్టర్ ఎస్ రాధాకృష్ణన్ ఆకాంక్షను తీర్చేదిగా ఉందన్నారు. ప్రజాస్వామ్య విలువలు భారత సామాజిక జీవనంలో అంతర్లీనంగా ఉన్నాయన్నారు. అహ్మదాబాద్లోని బాబాసాహెబ్ అంబేడ్కర్ యూనివర్సిటీ నిర్వహించిన ‘అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీస్’ 95వ వార్షిక సమావేశం, యూనివర్సిటీ వైస్ చాన్సెలర్ల జాతీయ సెమినార్ను ఉద్దేశించి ప్రధాని మోదీ బుధవారం ప్రసంగించారు. ప్రతీ విద్యార్థికి వేర్వేరు ప్రత్యేక సామర్థ్యాలు ఉంటాయని, వాటిని గుర్తించాల్సిన బాధ్యత ఉపాధ్యాయుడిపై ఉంటుందని ప్రధాని పేర్కొన్నారు. ‘విద్యార్థి సామర్థ్యం ఏమిటి? సరిగ్గా బోధిస్తే ఏ స్థాయికి వెళ్లగలడు? ఆ విద్యార్థి లక్ష్యం ఏమిటి? అనే అంశాలను విశ్లేషించాలి’ అని సూచించారు. కృత్రిమ మేథ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, బిగ్ డేటా, 3డీ ప్రింటింగ్, వర్చువల్ రియాలిటీ, రోబోటిక్స్, జియో ఇన్ఫర్మేటిక్స్, మొబైల్ టెక్నాలజీ, స్మార్ట్ హెల్త్ కేర్, రక్షణ తదితర రంగాల్లో భారత్ను యావత్ ప్రపంచం దిక్సూచిగా చూస్తోందన్నారు. భవిష్యత్ అవసరాల కోసం మూడు నగరాల్లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్కిల్స్ను ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. జ్ఞానం, ఆత్మగౌరవం, మర్యాదపూర్వక వ్యవహారశైలిని అంబేద్కర్ గౌరవించేవారన్నారు. ఆయన చూపిన ఈ మార్గంలో నడిచే బాధ్యతను మన విద్యాలయాలు చేపట్టాలన్నారు. అంబేద్కర్పై కిశోర్ మాక్వానా రచించిన నాలుగు పుస్తకాలను ప్రధాని ఆవిష్కరించారు. అంబేద్కర్కు ప్రధాని నివాళులు బీఆర్ అంబేడ్కర్ 130వ జయంతి సందర్భంగా ప్రధాని మోదీ ఘనంగా నివాళులర్పించారు. అణగారిన వర్గాలను సామాజిక స్రవంతిలోకి తీసుకురావడానికి అంబేడ్కర్ చేసిన కృషి తరతరాలకు స్ఫూర్తిదాయకమని ప్రధాని పేర్కొన్నారు. జయంతి సందర్భంగా అంబేడ్కర్కు శిరçస్సు వంచి నమస్కరిస్తున్నానని బుధవారం ప్రధాని ట్వీట్ చేశారు. సరిపడా వ్యాక్సిన్లు అందజేస్తాం ► కరోనాపై కలిసికట్టుగా పోరాడుదాం ► ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు సాక్షి, న్యూఢిల్లీ: దేశ అవసరాలకు సరిపడా కోవిడ్–19 వ్యాక్సిన్లను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. కరోనా మహమ్మారిపై అందరం కలిసికట్టుగా పోరాడుతామని పిలుపునిచ్చారు. ఈ విషయంలో రాజకీయ పార్టీలు, ప్రభుత్వేతర స్వచ్ఛంద సంస్థలు, కమ్యూనిటీ గ్రూప్లు ఏకతాటిపైకి రావాలని కోరారు. మోదీ గురువారం అన్ని రాష్ట్రాల గవర్నర్లు, కేంద్ర పాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. కరోనాను ఎదుర్కొనే విషయంలో సామాజిక సంస్థలు రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి పనిచేసేలా చూడాలని అన్నారు. గత ఏడాది వైరస్ ఉధృతి అధికంగా ఉన్నప్పుడు జన్ భాగీదారి(ప్రజల భాగస్వామ్యం)తో సమర్థంగా కట్టడి చేయగలిగామని గుర్తుచేశారు. ఈసారి కూడా ప్రజలను మరింత కార్యోన్ముఖులను చేయాలని పిలుపునిచ్చారు. టీమ్ ఇండియా స్ఫూర్తితో పోరాటం కరోనా మహమ్మారిపై జరుగుతున్న పోరాటంలో అందరినీ కలుపుకొని పోయేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు రాజకీయాలను పక్కనపెట్టి ఈ పోరాటంలో ‘టీమ్ ఇండియా’ స్ఫూర్తితో ఏకతాటిపైకి రావాల్సిన అవసరం ఉందన్నారు. ‘ఎప్పటికప్పుడు పరీక్షలు నిర్వహించడం (టెస్ట్), వైరస్ రూపాంతరం చెందుతున్న తీరుపై దృష్టి పెట్టడం (ట్రాక్), సరైన సమయంలో చికిత్సనందించడం (ట్రీట్)’ అనే వ్యూహాన్ని సమర్థంగా అమలు చేయాలని సూచించారు. ఆయన బుధవారం గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. -
వీటిలో గత పదేళ్ళుగా నియామకాలు లేవు!
హైదరాబాద్: ఏళ్లు గడుస్తున్నా రాష్ట్రంలోని యూనివర్సిటీల్లో అధ్యాపక నియామకాలకు మోక్షం లభించట్లేదు. కోర్టు కేసులంటూ కొన్నేళ్లు.. ప్రభుత్వ అనుమతుల కోసమంటూ ఇంకొన్నేళ్లు.. తీరా ప్రభుత్వం అనుమతి ఇచ్చాక నిబంధనల రూపకల్పన పేరుతో మరికొన్నేళ్లు.. తరువాత ఎన్నికల కోడ్.. ఇలా కారణం ఏదైనా పదేళ్లుగా నియామకాలు జరగట్లేదు. సెర్చ్ కమిటీల సమావేశాలు పూర్తయినా వీసీల నియామకాలు జరగకపోవడంతో అధ్యాపకుల పోస్టుల ఖాళీల భర్తీకి ముందడుగు పడట్లేదు. కాంట్రాక్టు సిబ్బందితో నెట్టుకొస్తున్నా ఆశించిన ఫలితాలు రావట్లేదు. ఎంతో కీలకమైన ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా ఉండటంతో యూనివర్సిటీల్లో పరిశోధన అటకెక్కింది. లెక్కలు తేల్చిన విద్యాశాఖ... యూనివర్సిటీల్లోని ఖాళీలు, ప్రస్తుతం పనిచేస్తున్న అధ్యాపకుల తాజా లెక్కలను విద్యాశాఖ విడుదల చేసింది. దీని ప్రకారం 2021 జనవరి 31 నాటికి 11 యూనివర్సిటీల్లో 2,837 మంజూరైన పోస్టులుంటే అందులో 1,869 పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. యూనివర్సిటీల్లో కేవలం 968 మందే (34.12 శాతం) రెగ్యులర్ ఆధ్యాపకులున్నారు. ప్రస్తుతం 157 మంది ప్రొఫెసర్లు ఉండగా 238 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అలాగే 129 మంది అసోసియేట్ ప్రొఫెసర్లు ఉండగా 781 పోస్టులు ఖాళీగా ఉండిపోయాయి. 682 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు పనిచేస్తుండగా 850 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అయితే 1,869 ఖాళీల్లో 1,061 పోస్టుల భర్తీకి ప్రభుత్వం మూడేళ్ల కిందటే ఆమోదం తెలిపినా ఇంతవరకు వాటిని భర్తీ చేయకపోవడం గమనార్హం. ఆరు యూనివర్సిటీల్లో లేని ప్రొఫెసర్లు.. రాష్ట్రంలో ఒక్క ప్రొఫెసర్ కూడా లేకుండానే శాతవాహన, మహాత్మాగాంధీ, పాలమూరు, ఆర్జీయూకేటీ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ, పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలు నెట్టుకొస్తున్నాయి. ముఖ్యంగా శాతవాహన, ఆర్జీయూకేటీ, బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీల్లో అసోసియేట్ ప్రొఫెసర్లు ఒక్కరు కూడా లేని దుస్థితి నెలకొంది. ఇక పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో అసోసియేట్ ప్రొఫెసర్ ఒక్కరే ఉన్నారు. మెుత్తంగా చూస్తే రాష్ట్రంలోని 11 యూనివర్సిటీల్లో 61.65 శాతం ప్రొఫెసర్ పోస్టులు, 85.82 శాతం అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులు, 55.48 శాతం అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు ఉన్నత విద్యాశాఖ లెక్కగట్టింది. చారిత్రక యూనివర్సిటీల్లోనూ భారీగా ఖాళీలే... వందేళ్లు దాటిన ఉస్మానియా యూనివర్సిటీలో సగానికిపైగా పోస్టులు ఖాళీగానే ఉండిపోయాయి. గత పదేళ్లుగా యూనివర్సిటీల్లో నియామకాలను పెద్దగా చేపట్టకపోవడం, వివిధ కారణాలతో పోస్టుల భర్తీని ఉన్నత విద్యాశాఖ వాయిదా వేయడమే ఇందుకు కారణం. ఓయూ తరువాత ఎంతో కీలకమైన కాకతీయ యూనివర్సిటీలో ఇప్పుడు కేవలం ఒక్కరే ప్రొఫెసర్ ఉండగా అసోసియేట్ ప్రొఫెసర్లు ఇద్దరే ఉన్నారు. జవహార్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీలో (జేఎన్ఏఎఫ్ఏయూ) ఇద్దరే అసోసియేట్ ప్రొఫెసర్లు ఉన్నారు. అభివృద్ధిపైనా లేని ధ్యాస.. యూనివర్సిటీల్లో పరిశోధన, అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి పెట్టడం లేదు. గతేడాది కంటే ఈసారి బడ్జెట్లో నిధుల కేటాయింపులు పెరిగినా యూనివర్సిటీల అభివృద్ధికి ప్రగతి పద్దు కింద నిధులను కేటాయించట్లేదు. ఈసారి కూడా నిర్వహణ పద్దులోనే ఆ మెుత్తాన్ని పెంచింది. గతేడాది రూ. 606.73 కోట్లు కేటాయిస్తే ఈసారి రూ. 627.28 కోట్లు కేటాయించింది. అయితే అవి వర్సిటీల్లో యూజీసీ సవరించిన వేతనాల చెల్లింపునకే సరిపోనున్నాయి. -
వర్సిటీ పోస్టులన్నీ 'రీ రేషనలైజేషన్'
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని 14 యూనివర్సిటీల్లో ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీ ప్రక్రియను పునఃప్రారంభించడంపై ఉన్నత విద్యామండలి దృష్టి సారిస్తోంది. గత ప్రభుత్వ హయాంలో ఈ పోస్టుల భర్తీకి జారీ చేసిన జీవోలు, నోటిఫికేషన్లను న్యాయస్థానం ఇటీవల రద్దు చేయడంతో కొత్తగా ప్రక్రియను ప్రారంభించనున్నారు. గత సర్కారు ఇష్టానుసారంగా పోస్టుల హేతుబద్ధీకరణ చేపట్టడంతో న్యాయవివాదాల్లో చిక్కుకున్నాయి. ఆ లోపాలను సవరించి వర్సిటీల వారీగా పోస్టుల హేతుబద్ధీకరణ చేపట్టాలని మండలి భావిస్తోంది. రేషనలైజేషన్, రిజర్వేషన్లు, రోస్టర్ విధానం, వయోపరిమితి తదితర అంశాలపై న్యాయస్థానం మార్గదర్శకాల ప్రకారం వ్యవహరిస్తామని ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ప్రొఫెసర్ కె.హేమచంద్రారెడ్డి తెలిపారు. ప్రభుత్వ ఆదేశాలను అనుసరించి త్వరలోనే ఇందుకు సంబంధించిన ప్రక్రియను చేపట్టనున్నామన్నారు. నిబంధనల ప్రకారం హేతుబద్ధీకరణ వర్సిటీ పోస్టుల హేతుబద్ధీకరణపై యూజీసీ మార్గదర్శకాలతో పాటు ప్రభుత్వ నిబంధనలను పాటించనున్నారు. వర్సిటీలకే బాధ్యత అప్పగించనున్నారు. హేతుబద్ధీకరణ ముగిశాక కొత్తగా పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. మెరిట్ అభ్యర్థులను గుర్తించేందుకు స్క్రీనింగ్ టెస్టు నిర్వహించాలని భావిస్తున్నారు. వర్సిటీ పోస్టులను పూర్తి పారదర్శకంగా, మెరిట్ ప్రాతిపదికన భర్తీ చేయాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇప్పటికే ఉన్నత విద్యాశాఖ, ఉన్నత విద్యామండలిని ఆదేశించారు. కమిటీ సిఫార్సులంటూ క్యాడర్ మార్పు రాష్ట్రంలోని 14 యూనివర్సిటీల్లో 1,385 బోధనా సిబ్బంది పోస్టుల భర్తీ ప్రక్రియలో గత ప్రభుత్వం అక్రమాలు, అవకతవకలకు తావిచ్చింది. వర్సిటీల స్వయం ప్రతిపత్తిని పక్కన పెట్టి కమిటీ ద్వారా పోస్టుల హేతుబద్ధీకరణ చేసింది. కమిటీ సిఫార్సులంటూ నిబంధనలకు విరుద్ధంగా 570 ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులను అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులుగా క్యాడర్ మార్పు చేసింది. ఒక విభాగం పోస్టును మరో విభాగానికి తరలించింది. రిజర్వేషన్లు, రోస్టర్ పాయింట్లను కూడా తమకు అనుకూలంగా మార్చుకున్నారు. తమ సామాజిక వర్గానికి ప్రొఫెసర్ పోస్టులు ప్రొఫెసర్ పోస్టులను తమ సామాజికవర్గం వారితో గత ప్రభుత్వ పెద్దలు భర్తీ చేయించారు. అనంతపురం జేఎన్టీయూలో 9 ప్రొఫెసర్ పోస్టులలో ఏడింటిని ఒకే సామాజికవర్గం వారితో భర్తీ చేశారు. కృష్ణా వర్సిటీలో 4 ప్రొఫెసర్ పోస్టులు, రాయలసీమ వర్సిటీలో 4 ప్రొఫెసర్ పోస్టులతోపాటు మరికొన్ని వర్సిటీల్లో కూడా తమ వారితో భర్తీ చేశారు. రేషనలైజేషన్ జీవోలు, నోటిఫికేషన్లను న్యాయస్థానం రద్దు చేసినందున ఈ ప్రొఫెసర్ పోస్టుల నియామకాలు కూడా రద్దు కానున్నాయి. -
దేశంలో నంబర్వన్గా నిలుపుతాం: మంత్రి సురేష్
సాక్షి, విజయవాడ : రాష్ట్రంలోని యూనివర్సిటీల బలోపేతానికి ప్రాధాన్యతనిస్తున్నామని విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ తెలిపారు. ప్రతీ యూనివర్సిటీలో ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ని ఏర్పాటు చేశామని వెల్లడించారు. తొమ్మిది యూనివర్సిటీలకి వైస్ ఛాన్సలర్లని నియమించామని, మూడు యూనివర్సిటీలకి సెర్చ్ కమిటీలు ఏర్పాటు చేశామన్నారు. విద్యా సంస్ధలలో రాజకీయ జోక్యం లేకుండా ఉత్తమ ఫలితాల దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేశామని పేర్కొన్నారు. మంగళవారం విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి సురేష్ మాట్లాడుతూ.. ఉన్నత విద్యలో అర్హులకి పూర్తిస్ధాయి ఫీజు రీఎంబర్స్ మెంట్ చెల్లిస్తున్నామన్నారు. ఈ నెల 11 న అమ్మ ఒడి రెండవ విడత కార్యక్రమం ప్రాంభిస్తున్నట్లు చెప్పారు. నాడు నేడులో మూడు విడతలలో 11 వేలకోట్ల రూపాయిలు ఖర్చు చేస్తున్నామని, దేశంలో ఎక్కడాలేని విధంగా హైయర్ ఎడ్యుకేషన్ ప్లానింగ్ బోర్డు ఏర్పాటు చేశామన్నారు. ‘కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ఉన్నత విద్యను బలోపేతం చేస్తున్నాం. నిబంధనలు పాటించని 247 కళాశాలలకి షోకాజ్ నోటీసులు ఇచ్చాం. 48 ప్రైవేట్ అన్ ఎయిడెడ్ డిగ్రీ కళాశాలలపై చర్యలు తీసుకున్నాం. నాణ్యతా ప్రమాణాలు పాటించని కళాశాలలపై చర్యలుంటాయి. ఈ నూతన విద్యా సంవత్సరంలో ఆన్ లైన్ అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభించాం. ఇంటర్లో వచ్చే ఏడాది నుంచి ఆన్లైన్ అడ్మిషన్లు ప్రారంభిస్తాం.అవినీతికి తావులేకుండా యూనివర్సిటీలలో పూర్తిగా కంప్యూటీకరణ చేస్తున్నాం. ఉన్నత విద్యలో ర్యాపిడ్ ఎడ్యుకేషన్ సర్వే నిర్వహిస్తున్నాం. ఈ విద్యాసంవత్సరంలో మూడు కొత్త కోర్సులు ప్రారంభిస్తున్నాం. అయిదేళ్ల పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సుని ప్రారంభిస్తున్నాం.నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్ బీఈడీ కోర్సుని తీసుకువస్తున్నాం. నాలుగేళ్ల ఆనర్స్ డిగ్రీ కోసం ఒక ఏడాది పిజికోర్సుని కొత్తగా ప్రవేశపెడుతున్నాం. ఈ ఏడాదిలో ఉన్నత విద్యామండలిని మరింత బలోపేతం చేసి దేశంలో నంబర్ వన్గా నిలబడతాం’ అని అన్నారు. -
వినియోగదారుల చట్టం కిందకి విద్యాసంస్థలు?
న్యూఢిల్లీ: విద్యాసంస్థలు, విశ్వవిద్యాలయాల సేవల్లో లోపం వినియోగదారుల చట్టం–1986 కిందకు వస్తుందా అనే విషయాన్ని పరిశీలించడానికి సుప్రీంకోర్టు అంగీకరించింది. తమిళనాడులోని సేలంకి చెందిన వినాయక మిషన్ యూనివర్సిటీ సరైన సేవలు అందించడంలో విఫలమైందని ఆరోపిస్తూ వైద్యవిద్యార్థి మనుసోలంకి, ఇతర విద్యార్థులు సుప్రీంకోర్టులో పిటిషన్వేశారు. ధర్మాసనం ఈ అప్పీల్ను విచారణకు అంగీకరించింది. జాతీయ వినియోగదారుల ఫిర్యాదుల పరిష్కార కమిషన్ (ఎన్సీడీఆర్సీ) నిర్ణయంపై అప్పీల్ ని పరిశీలించిన సుప్రీంకోర్టు, ఆరు వారాల్లోగా తమ వాదనను వినిపించాలని ఆదేశించింది. మహర్షి దయానంద్ యూనివర్సిటీ వర్సెస్ పీటీ కోషి కేసులో గతంలో సుప్రీంకోర్టు, విద్యని సరుకుగా పరిగణించలేమని తీర్పునిచ్చిన నేపథ్యంలో తిరిగి ఇది చర్చనీయాంశంగా మారింది. రెండు సంవత్సరాలు థాయ్లాండ్లోనూ, రెండున్నర సంవత్సరాలు యూనివర్సిటీలో చదువు చెప్పిస్తామని విద్యార్థులను 2005–2006 సంవత్సరంలో చేర్చకున్నారు. విద్యార్థులకు ఎంబీబీఎస్ ఫైనల్ డిగ్రీ సర్టిఫికెట్లు అందజేస్తామని, వాటికి కేంద్ర ప్రభుత్వం, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా గుర్తింపు వచ్చేలా చూస్తామని కూడా ఇచ్చిన హామీని విద్యాసంస్థలు నెరవేర్చకపోవడంతో ఈ వివాదం చెలరేగింది. -
ఒకే వేదికపైకి వంద విదేశీ వర్సిటీలు
సాక్షి, అమరావతి: విద్యార్థులకు అత్యుత్తమ విద్యావకాశాలను కల్పించే దిశగా అడుగులు వేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు మరో వినూత్న ప్రయత్నం చేపడుతోంది. విదేశాల్లో చదువుకోవాలనే ఆసక్తి ఉన్న విద్యార్థుల కోసం ఒకేసారి అమెరికాలోని 100 అత్యుత్తమ విశ్వవిద్యాలయాలను తొలిసారి ఒకే వేదికపైకి తీసుకొస్తోంది. ఆన్లైన్ సదస్సు ద్వారా అమెరికాలో విద్యాభ్యాస అవకాశాలు, ఆర్థిక ప్రోత్సాహకాలు, గుర్తింపు తదితర అనేక అంశాలపై విశ్వ విద్యాలయాల అధికారులు విద్యార్థులకు నేరుగా సమాచారం అందిస్తారు. రాష్ట్రంలో విద్యార్థులకు విదేశీ విద్యావకాశాలు కల్పించే దిశగా చర్యలు తీసుకోవాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉన్నత విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. అందులో భాగంగా విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ నేతృత్వంలో విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్ చంద్ర, ముఖ్యమంత్రి కార్యాలయ ప్రత్యేకాధికారి డాక్టర్ ఎం.హరికృష్ణ ఇతర ఉన్నతాధికారులు విదేశీ విద్యావకాశాలు కల్పించే దిశగా పలు చర్యలు చేపట్టారు. కరోనా నేపథ్యంలో విద్యార్థుల కోసం అమెరికాలోని విశ్వవిద్యాలయాలను ఒకే వేదికపైకి తీసుకొచ్చి మన రాష్ట్ర విద్యార్థులకు ప్రత్యక్షంగా అవగాహన కల్పించేలా రాష్ట్ర ప్రభుత్వ విదేశీ విద్యా విభాగం ద్వారా ఈ సదస్సు నిర్వహిస్తున్నామని ఆ విభాగం కోఆర్డినేటర్ డాక్టర్ కుమార్ అన్నవరపు తెలిపారు. ► ఎడ్యుకేషన్ యూఎస్ఏ నిర్వహించే వార్షిక యూఎస్ యూనివర్సిటీ ఫెయిర్ను ఈసారి ఆన్లైన్ సదస్సుగా నిర్వహించాలని నిర్ణయించింది. ► ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, హైదరాబాద్లోని అమెరికా కాన్సులేట్, అమెరికా వర్సిటీలు సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి. ► అమెరికాలో డిగ్రీ, మాస్టర్స్, పీహెచ్డీ చేయాలనుకునే విద్యార్థులకు ఇది ఎంతో ఉపయోగకరం. ► అమెరికాలోని అకడమిక్ కార్యక్రమాలు, విద్యార్థులకు ఆర్థిక సహకారం, ఆ సంస్థలకు దరఖాస్తు విధానం తదితర అంశాలపై ఆ వర్సిటీల అధికారులు వివరిస్తారు. ► ఎడ్యుకేషన్ యూఎస్ఏ.. అమెరికా ఉన్నత విద్యకు సంబంధించిన అధికారిక సంస్థ. ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా 425 అంతర్జాతీయ విద్యార్థి సలహా కేంద్రాలను నిర్వహిస్తోంది. ఈ లింక్ ద్వారా పాల్గొనవచ్చు ► గ్రాడ్యుయేట్ ఫెయిర్ (మాస్టర్, పీహెచ్డీ కార్యక్రమాలు) అక్టోబర్ 2, 3 తేదీల్లో సాయంత్రం 5.30 నుంచి రాత్రి 10.30 వరకు. దీనికోసం ‘ bit.ly/EdUSAFair20-Bmail' ’ లింక్ ద్వారా నమోదు చేసుకోవచ్చు. ► అండర్ గ్రాడ్యుయేట్ ఫెయిర్ (అసోసియేట్ అండ్ బ్యాచిలర్స్ ప్రోగ్రామ్స్) అక్టోబర్ 9, 10 తేదీల్లో సాయంత్రం 5:30 నుంచి 10:30 గంటల వరకు. దీని కోసం "bit.ly/UGEdUSAFair20&Bmail' ద్వారా నమోదు చేసుకోవాలి. ► ఇతర వివరాలకోసం ‘educationalcoordinator20@gmail.com లేదా ‘usiefhyderabad@usief.org.in’ మెయిల్ ఐడీ ద్వారా సంప్రదించవచ్చని కుమార్ అన్నవరపు తెలిపారు. -
పాత సీట్లకు ప్రభుత్వ ఫీజులే
సాక్షి, హైదరాబాద్: పాత విద్యా సంస్థలనే యూనివర్సిటీలుగా మార్చితే అవి బ్రౌన్ఫీల్డ్ యూనివర్సిటీలుగా, పాత విద్యా సంస్థలు లేకుండా కొత్తగా యూనివర్సిటీని ఏర్పాటు చేస్తే గ్రీన్ఫీల్డ్ యూనివర్సిటీలుగా అనుమతి ఇచ్చామని విద్యాశాఖ మంత్రి పి.సబితారెడ్డి స్పష్టంచేశారు. బ్రౌన్ఫీల్డ్ వర్సిటీల్లో పాత సీట్లకు ప్రభుత్వం నిర్ణయించిన ఫీజులే ఉంటాయని, వాటికి ఫీజు రీయింబర్స్మెంట్ వస్తుందని పేర్కొన్నారు. అదే వర్సిటీల్లో కొత్త సీట్లలో చేపట్టే ప్రవేశాల్లో మాత్రం యాజమాన్యాలే ఫీజులను నిర్ణయిస్తాయని, వాటికి రీయింబర్స్మెంట్ వర్తించదని స్పష్టం చేశారు. సోమవారం అసెంబ్లీలో ప్రైవేటు యూనివర్సిటీల సవరణ బిల్లుపై చర్చ సందర్భంగా సభ్యలు లేవనెత్తిన వివిధ అంశాలపై ఆమె వివరణ ఇచ్చారు. ఇంజనీరింగ్ కాలేజీల విషయంలో నిబంధనలు పాటించని మంత్రులు, ఎమ్మెల్యేల కాలేజీలను కూడా మూసివేయించామని చెప్పారు. యూనివర్సిటీల ఏర్పాటుకు 16 దరఖాస్తులు వస్తే నిపుణుల కమిటీ సిఫారసు చేసిన 9 సంస్థల్లో 8 సంస్థలు ముందుకు వచ్చాయని, అందులో వివాదాల్లేని 5 సంస్థలకు మొదటి విడతలో అనుమతి ఇచ్చామని, మిగతావి ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయని వివరించారు. గ్రీన్ ఫీల్డ్ యూనివర్సిటీల్లో ఫీజులు యాజమాన్యాలే నిర్ణయించుకుంటాయని, ఆయా సంస్థల గవర్నింగ్ బాడీలో విద్యాశాఖ కార్యదర్శి ఉంటారని, ప్రభుత్వ నియంత్రణ ఉంటుం దని అన్నారు. వాటిల్లో 25 శాతం సీట్లు తెలంగాణ విద్యార్థులకే ఇవ్వాలన్న నిబంధన ఉందన్నారు. వీసీలు, అధ్యాపకుల నియామకాలకు లైన్ క్లియర్ అయిందన్నారు. ప్రపంచస్థాయి ఎలా సాధ్యం? ఎమ్మెల్యే డి. శ్రీధర్బాబు మాట్లాడుతూ వర్సిటీల్లో వసతులే లేకుంటే ప్రపంచస్థాయిలో అవి ఎలా పోటీ పడతాయని ప్రశ్నిం చారు. ఎమ్మెల్యే మోజంఖాన్ మాట్లాడుతూ ప్రైవేటు వర్సిటీల్లో పేదలకు రిజర్వేషన్లు కల్పి ంచాలన్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రాజేందర్రెడ్డి, సంజయ్ మాట్లాడుతూ ప్రైవేటు వర్సిటీల అవసరం ఎంతైనా ఉందన్నారు. సభ్యుల ప్రశ్నలపై మంత్రి సమాధానం ఇచ్చాక బిల్లును సభ ఆమోదించింది. -
విద్యార్థులూ.. బహుపరాక్
సాక్షి, అమరావతి: దేశంలో అనుమతులు లేని యూనివర్సిటీలు ఇతర విద్యాసంస్థల (ఫేక్ వర్సిటీలు, సంస్థల) పట్ల విద్యార్థులు, తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ) సూచిస్తోంది. ముఖ్యంగా ఆన్లైన్ దూరవిద్య, ఆన్లైన్ మోడ్ కోర్సులు అందించే సంస్థల ఎంపికలో జాగ్రత్తలు పాటించాలని పేర్కొంది. సదరు సంస్థలకు, అవి అందించే కోర్సులకు తమ గుర్తింపు ఉందో లేదోననే విషయాన్ని యూజీసీ అధికారిక వెబ్సైట్లో సూచించిన పోర్టళ్ల ద్వారా పరిశీలన చేసుకోవాలని పబ్లిక్ నోటీస్ జారీ చేసింది. నిషేధిత ప్రోగ్రామ్స్ ఇవీ.. ► ఇంజనీరింగ్, మెడిసిన్, లా, డెంటల్, ఫార్మసీ, నర్సింగ్, ఆర్కిటెక్చర్, ఫిజియోథెరపి, అగ్రికల్చర్, హోటల్ మేనేజ్మెంట్, పాక అధ్యయనాలు(కలినరీ స్టడీస్), వేల్యూయేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్. ► చట్టబద్ధమైన కౌన్సిల్స్, రెగ్యులేటరీ సంస్థల ద్వారా ఓడీఎల్ మోడ్లో అందించడానికి అనుమతించని ఇతర కార్యక్రమాలు. ► ఎం.ఫిల్, పీహెచ్డీ ప్రోగ్రామ్లు కూడా ఓడీఎల్, ఆన్లైన్ మోడ్లలో అందించడాన్ని నిషేధించారు. ► ఏ విద్యాసంస్థ అయినా దానికి నిర్దేశించిన ప్రాదేశిక ప్రాంతాలకు లోబడి మాత్రమే ఓడీఎల్ సెషన్స్, కాంటాక్ట్ ప్రోగ్రామ్స్, ప్రోగ్రామ్ డెలివరీ, పరీక్షల నిర్వహణ, ప్రవేశాలను చేపట్టాలి. దాని ప్రాదేశిక ప్రాంత పరిధిలో మాత్రమే పనిచేయాలి. ► కేంద్ర, రాష్ట్ర వర్సిటీలు, డీమ్డ్ వర్సిటీలు, ప్రైవేట్ వర్సిటీలు తమ ఓడీఎల్, ఆన్లైన్ ప్రోగ్రామ్లను ప్రైవేట్ కోచింగ్ ఇనిస్టిట్యూట్స్ ద్వారా ఫ్రాంచైజీల తరహాలో నిర్వహించడాన్ని నిషేధించారు. కేవలం వాటి ప్రధాన కార్యాలయాల నుంచి మాత్రమే ఓడీఎల్ ప్రోగ్రాములను అందిస్తాయి. ► ఏదైనా విద్యాసంస్థ వీటికి భిన్నంగా కార్యకలాపాలు నిర్వహిస్తుంటే తమకు ఫిర్యాదు చేయాలని యూజీసీ సూచించింది. చెక్ చేసుకోండి ► ఉన్నత విద్యాసంస్థల గుర్తింపు, ఓడీఎల్, ఆన్లైన్ ప్రోగ్రామ్లకు అనుమతి పొందిన విద్యాసంస్థల జాబితాను ► యూజీసీ వెబ్సైట్‘డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.యూజీసీ.ఏసీ.ఐఎన్/డీఈబీ’, లేదా ‘హెచ్టీటీపీ://డీఈబీ.యూజీసీ.ఏసీ.ఐఎన్’లలో చూడవచ్చు. ► స్వయం ప్రతిపత్తి గల సంస్థలు, ఓడీఎల్ ప్రోగ్రామ్స్ అందించేందుకు యూజీసీ అనుమతి పొందిన సంస్థల వివరాలను ‘హెచ్టీటీపీ://డీఈబీ.యూజీసీ.ఏసీ.ఐ ఎన్/ఎన్ఓటీఐసీఈఎస్’ లేదా హెచ్టీటీపీ://డీఈబీ.యూజీసీ.ఏసీ.ఐఎన్/ఎన్ఓటీఐసీఈఎస్.హెచ్ టీఎంఎల్’ పోర్టల్లో పరిశీలన చేసుకోవాలి. ► ప్రవేశం పొందేముందు యూజీసీ వెబ్సైట్లోని ‘హెచ్టీటీపీ://డీఈబీ.యూజీసీ.ఏసీ.ఐఎన్’లో నోటీసుల ద్వారా తెలుసుకోవాలి. ► కోవిడ్ నేపథ్యంలో ఓడీఎల్ ప్రోగ్రామ్స్ కాలవ్యవధిని 12 నెలలకు పరిమితం చేశారు. వీటిని ఈ ఏడాది సెప్టెంబర్, అక్టోబర్, వచ్చే ఏడాది ఫిబ్రవరి, మార్చి నుంచి ప్రారంభించేలా అనుమతి ఇచ్చింది. ► డిగ్రీ, పీజీ కోర్సులను ఓడీఎల్ మోడ్లో అందించే సంస్థలు తప్పనిసరిగా నిర్దేశిత అర్హతా ప్రమాణాలను పాటించాలి. -
ఫైనలియర్ పరీక్షలు రాయడం తప్పనిసరి
న్యూఢిల్లీ: విశ్వవిద్యాలయాల్లో చివరి సంవత్సరం పరీక్షలను తప్పనిసరిగా నిర్వహించాలంటూ కేంద్ర మానవ వనరుల అభివృద్ధి(హెచ్చార్డీ) మంత్రిత్వ శాఖ జారీ చేసిన ఆదేశాలను పంజాబ్, మహారాష్ట్ర, ఒడిశా, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, ఢిల్లీ ప్రభుత్వాలు వ్యతిరేకిస్తున్నాయి. కరోనా వైరస్ నానాటికీ విజృంభిస్తున్న నేపథ్యంలో పరీక్షలు నిర్వహించడం సరైంది కాదని పేర్కొంటున్నాయి. ఈ ఏడాది మార్చి నెలలో జరగాల్సిన ఆఖరి సంవత్సరం పరీక్షలను సెప్టెంబర్లో నిర్వహించాలని యూజీసీ ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు మార్గదర్శకాల్లో సవరణలు సైతం చేసింది. ఆరు రాష్ట్రాల అభ్యంతరాలపై హెచ్చార్డీ శాఖ అధికారి ఒకరు స్పందిం చారు. విద్యార్థుల ఉన్న త చదువులు, భవిష్యత్తు ఉద్యో గ అవకాశాల దృష్ట్యా ఫైనలియర్ పరీక్షలు రాయడం తప్పనిసరి అని పేర్కొన్నారు. ఈ విషయంలో రాష్ట్రాల సందేహాలను నివృత్తి చేస్తామని చెప్పా రు. రాష్ట్రాలు తమకు వీలైన సమయంలోనే ఈ పరీక్షలు నిర్వహించవచ్చని సూచిం చారు. ఆన్లైన్ విధానంలోనూ పరీక్షలు రాసే అవకాశం ఉందని గుర్తుచేశారు. -
వర్సిటీల్లో పరీక్షలు రద్దు!
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా విశ్వవిద్యాలయాలు, ఇతర ఉన్నత విద్యా సంస్థల్లో జూలైలో జరగాల్సిన ఫైనల్ ఇయర్ పరీక్షలన్నీ రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. కొత్త విద్యా సంవత్సరం ప్రారంభాన్ని అక్టోబర్ వరకు వాయిదా వేయనున్నట్టు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ అధికారులు బుధవారం వెల్లడించారు. ఈ మేరకు త్వరలో అధికారిక ప్రకటన రానుంది. ఇంటర్మీడియెట్, టెర్మినల్ సెమిస్టర్ పరీక్షలకు సంబంధించిన మార్గదర్శకాలను తిరిగి రూపొందించి, కొత్త విద్యా సంవత్సరం కేలండర్ను తయారు చేయాలని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ)ని హెచ్ఆర్డీ మంత్రి రమేష్ పోఖ్రియాల్ గతంలో ఆదేశించారు. కొత్త మార్గదర్శకాలను రూపొందించడానికి హరియాణా యూనివర్సిటీ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ ఆర్సీ కుహాద్ ఆధ్వర్యంలో యూజీసీ ప్యానెల్ను ఏర్పాటు చేశారు. కొత్త ఎకడమిక్ కేలండర్పై కసరత్తు చేస్తున్న ఈ ప్యానెల్ మరో వారం రోజుల్లో కొత్త మార్గదర్శకాలను ప్రకటిస్తుందని హెచ్ఆర్డీ అధికారులు తెలిపారు. విద్యార్థులు, అధ్యాపకులు, ఇతర సిబ్బంది ఆరోగ్యాన్ని, భద్రతను దృష్టిలో ఉంచుకొని కొత్త విధానాన్ని రూపొందిస్తారు. ఫైనల్ ఇయర్ పరీక్షలు రద్దు చేసి, విద్యార్థులు పూర్వ ప్రతిభ ఆధారంగా మార్కులు నిర్ణయించేలా కసరత్తు జరుగుతోంది. అయితే ఆ మార్కుల పట్ల విద్యార్థులెవరైనా అసంతృప్తిగా ఉంటే, కోవిడ్ తగ్గుముఖం పట్టాక జరిగే పరీక్షల్లో పాల్గొనే అవకాశం ఇస్తారని అధికారులు వివరించారు. ఆగస్టు, సెప్టెంబర్లో ప్రారంభం కావల్సి ఉన్న విద్యా సంవత్సరాన్ని అక్టోబర్ వరకు వాయిదా వేసే అవకాశాలున్నాయి. ఎన్సీఈఆర్టీకి కొత్త మార్గదర్శకాలు 2020–21 విద్యాసంవత్సరానికి సంబంధించి కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎన్సీఈఆర్టీ)కి పలు మార్గదర్శకాలు జారీ చేసింది. 1–5 క్లాస్ల వరకు ఆన్లైన్ తరగతులు నిర్వహించడానికి వీలుగా ఇన్ఫోగ్రాఫిక్స్, పోస్టర్ ప్రజెంటేషన్స్ వంటివి అక్టోబర్ నాటికల్లా రూపొందించాలి. 6–12తరగతుల వారికి మార్చికల్లా సిద్ధంచేయాలి. ఆన్లైన్ తరగతుల్లో పాల్గొనేలా టీచర్లకు శిక్షణతరగతుల్ని డిసెంబర్నాటికి పూర్తి చేయాలి. 6–12తరగతుల విద్యార్థులకి ఆన్లైన్ బోధనకు టీచర్లకు శిక్షణ వచ్చే ఏడాది జూన్ నాటికల్లా పూర్తి కావాలి. ఆన్లైన్ తరగతుల్లో పాల్గొనే సదుపాయాలు లేని విద్యార్థులకు చదువు చెప్పడానికి సిలబస్ను, పుస్తకాల తయారీ పని డిసెంబర్కల్లా పూర్తి కావాలని కేంద్రం స్పష్టం చేసింది. -
ఐసీఐసీఐలో కోటి వరకు విద్యారుణం
ముంబై: ఐసీఐసీఐ బ్యాంక్లో విద్యా రుణాలు(ఎడ్యుకేషన్ లోన్స్)ను వేగంగా అందించేందుకు చర్యలు చేపట్టింది. కేవలం నిమిషాల వ్యవధిలోనే వినియోగదారులకు రూ.10లక్షల నుంచి కోటి రూపాయలు అందించే ప్రణాళికను రూపకల్పన చేసింది. ‘ఇన్స్టా ఎడ్యుకేషన్ లోన్’ పేరిట నిబంధనలు, షరతులతో కొద్ది నిమిషాల్లోనే విద్యా రుణాలను అందించనుంది. పూర్తిగా డిజిటల్ పద్దతిలో విద్యా రుణాల ప్రక్రియను చేపట్టనుంది. దేశీయ, ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయాలు, కళాశాలలో ప్రవేశం పొందిన విద్యార్థులకు బ్యాంక్ రుణాలను మంజూరు చేస్తుంది. అయితే వినియోగదారులు తమ స్థిర డిపాజిట్ల(ఫిక్సడ్ డిపాజిట్స్)లో 90శాతం బ్యాంక్ రుణాలు పొందవచ్చు అని ఐసీఐసీఐ బ్యాంక్ తెలిపింది. వేగంగా మంజూరు చేసే రుణాల వల్ల విద్యార్థులు ఎంతో ప్రయోజనం పొందుతారని ఐసీఐసీఐ తెలిపింది. కాగా రుణాలు చెల్లించడానికి పది సంవత్సరాల కాలపరిమితిని బ్యాంక్ విధించింది. మరోవైపు ఆదాయపు పన్ను చట్టం, 1961 లోని సెక్షన్ 80 ఇ ప్రకారం.. 8 సంవత్సరాల వరకు బ్యాంక్లో విద్యా రుణాలకు ఆదాయపు పన్ను మినహాయింపు వర్తిస్తుంది. కాగా అంతర్జాతీయ సంస్థలలో ప్రవేశం పొందే విద్యార్థుల కోసం, బ్యాంక్ రుణాలు రూ. 10 లక్షల నుంచి రూ.కోటి వరకు, దేశీయ సంస్థలలో రూ.10 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు పొందవచ్చు.కాగా విద్యారుణాలను అప్లై చేయాలంటే..మొదటగా వినియోగదారులు ఐసీఐసీఐ ఇంటర్నెట్ బ్యాంకింగ్లో లాగిన్ అవ్వాలి. ఆ తర్వాత బ్యాంక్ సైట్లో రుణాలకు సంబంధించిన ఆఫర్ను అధ్యయనం చేయాలి. వినియోగదారులకు కావాల్సిన రుణం, చెల్లించే కాలపరిమితి, ప్రవేశం పొందిన విశ్వవిద్యాలయం పేరు తదితర వివరాలను అప్లికేషన్ ఫార్మ్లో నమోదు చేయాలి. తరువాత విద్యార్థి పేరు, పుట్టిన తేదీ, విద్యార్థితో సంబంధం వంటి వివరాలను నమోదు చేయాలి. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత బ్యాంక్కు సంబంధించిన నిబంధనలు, షరతులను అంగీకరిస్తే వన్ టైమ్ పాస్వర్డ్ (OTP) ద్వారా బ్యాంక్ దృవీకరించిన నెంబర్ వస్తుంది. ఆ తర్వాత ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాక, విద్యారుణాలు పొందిన మంజూరు లేఖను బ్యాంక్ వినియోగదారులకు అందిస్తుంది. (చదవండి: ‘బోగస్’తో బ్యాంక్కు టోకరా!) -
ప్రభుత్వ వర్సిటీల బలోపేతమే లక్ష్యం
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ యూనివర్సిటీల బలోపేతమే తన లక్ష్యమని గవర్నర్, యూనివర్సిటీల చాన్సలర్ తమిళిసై సౌందరరాజన్ చెప్పారు. యూనివర్సిటీల్లో మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు చేపడుతున్నామని, ఖాళీల భర్తీ చేస్తామని తెలిపారు. శుక్రవారం ఆమె ఆన్లైన్ ద్వారా మీడియాతో మాట్లాడారు. ఇప్పటికే ప్రభుత్వం వైస్ చాన్సలర్ల నియామకం, అధ్యాపక ఖాళీల భర్తీకి చర్యలు చేపట్టిందని, అవి ప్రస్తుతం కరోనా కారణంగా ఆగిపోయినట్లు వెల్లడించారు. దీనిపై సీఎం కేసీఆర్తోనూ చర్చించానన్నారు. తాను ప్రతి యూనివర్సిటీతో మాట్లాడుతున్నానని, ఇందులో భాగంగా శుక్రవారం కాకతీయ యూనివర్సిటీతో మాట్లాడానని చెప్పారు. అన్ని వర్సిటీలకు ఫ్యాకల్టీ, ఖాళీలు, పరిశోధన, మౌలిక సదుపాయాలు, అవసరాలు, స్థలాలు తదితర 41 అంశాలపై వివరాలను తీసుకుంటున్నట్లు చెప్పారు. అన్ని రాగానే ఒక్కొక్కటిగా పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు. ఒక్కరోజులోనే మ్యాజిక్లాగా మార్పు సాధ్యం కాదని పేర్కొన్నారు. దీటుగా ప్రభుత్వ వర్సిటీల అభివృద్ధి.. రాష్ట్రంలో ప్రైవేటు యూనివర్సిటీలు రావడం వల్ల ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని గవర్నర్ చెప్పారు. వాటికి దీటుగా ప్రభుత్వ యూనివర్సిటీల అభివృద్ధి చేస్తామని వెల్లడించారు. ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదువుకునేవారు గర్వపడేలా తీర్చిదిద్దుతామన్నారు. విద్యార్థులకు కేవలం డిగ్రీలు ఇవ్వడమే కాకుండా ఉపాధి అవకాశాలను పెంచడమే లక్ష్యంగా పని చేస్తామని పేర్కొన్నారు. యూనివర్సిటీ హాస్టళ్లలో భౌతిక దూరం పాటించేలా చర్యలు చేపడుతున్నామని తెలిపారు. కొత్త భవనాలను నిర్మిస్తామని, అవసరమైతే కొన్ని క్లాస్ రూమ్లను హాస్టళ్లుగా మార్పు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నామన్నారు. ఆన్లైన్, ఆఫ్లైన్లో విద్యా బోధనకు చర్యలు చేపడుతున్నామని, కొత్త కరిక్యులమ్తో సరికొత్త విద్యా విధానం రాబోతోందని వెల్లడించారు. కొంతమంది హాస్టళ్లలో ఉండి ఆన్లైన్లో ఉంటే మరికొంత మంది తరగతి గదుల్లో ఉంటారని.. అలా షిప్ట్ పద్ధతుల్లో బోధనపైనా పరిశీలన జరుపుతున్నామని వివరించారు. ట్రిపుల్ ఈ మోడ్లో విద్య.. ఎంజాయ్, ఎడ్యుకేట్, ఎంప్లాయిమెంట్ వంటి ట్రిపుల్ఈ మోడ్ విద్య ఉండేలా చర్యలు చేపట్టాలని యూనివర్సిటీలను ఆదేశించానని గవర్నర్ తమిళిసై చెప్పారు. పారిశ్రామిక రంగాలతో మాట్లాడాలని, నాణ్యమైన విద్యతో అవకాశాలు పెంచాలని చెప్పానన్నారు. ‘ప్రభుత్వ యూనివర్సిటీలు, కాలేజీల విద్యార్థులకు ఉపాధి అవకాశాలు పెంచడమే నా లక్ష్యం. యూనివర్సిటీల్లో పరిశోధనలు పెరగాల్సి ఉంది. విద్యార్థుల హాజరు 20% తక్కువగా ఉంది. సరైన సౌకర్యాలు లేక ఆన్లైన్లో కూడా 30% విద్యార్థులు హాజరు కాలేకపోతున్నారు. డిజిటల్ లైబ్రరీలను అందుబాటులోకి తెస్తాం. విద్యార్థులు వీలైనంత ఎక్కువ లబ్ధి పొందాలన్నదే నా ఉద్దేశం. వర్సిటీల భూములు అన్యాక్రాంతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. టీచర్ల జీతాల విషయంలో యాజమాన్యాలు మానవతా దృక్పథంతో ఆలోచించాలి. తెలంగాణ కోవిడ్ని బలంగా ఎదుర్కొంటోంది. వైరస్ కల్చర్ను రూపొందించిన సీసీఎంబీకి అభినందనలు.. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఈసారి రాజ్భవన్లో దీపాలంకరణ ఉండదు.. పండ్ల మొక్కలతోనే అలంకరిస్తాం. రాజ్భవన్లో గోశాల ఏర్పాటు చేస్తాం. తలసేమియా బాధితులతో జూన్ 2న సెలబ్రేషన్స్ నిర్వహిస్తాం. కోవిడ్పై కనెక్ట్ చాన్సలర్ కింద 6,303 దరఖాస్తులు వచ్చాయి. అందులో 4 భాషల్లో బాగా రాసిన వారికి అవార్డులు ఇస్తాం. కన్సొలేషన్ బహుమతులు అందజేస్తాం. అన్ని యూనివర్సిటీల పూర్వ విద్యార్థులను అభివృద్ధిలో భాగస్వాములను చేస్తాం..’అని ఆమె తెలిపారు. -
వర్సిటీల ఆన్లైన్ బోధన
సాక్షి, హైదరాబాద్: కరోనా దెబ్బతో విద్యాబోధన తీరులో మార్పు రానుంది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఇప్పటికే విద్యా రంగాన్ని డిజిటైజేషన్ వైపు తీసుకెళ్లింది. కరోనా ఏమో ఇప్పుడు ఆన్లైన్ తరగతులు, వర్చువల్ సమావేశాల వైపు వేగంగా తీసుకెళ్తోంది. భవిష్యత్తులోనూ ఆన్లైన్ విద్య కొన సాగించేందుకు ప్రపంచవ్యాప్తంగా యూనివర్సిటీలు సిద్ధమవుతున్నాయి. కరోనా కారణంగా ఇప్పటివరకు 191 దేశాల్లోని 158 కోట్ల విద్యార్థుల చదువులకు ఆటంకం ఏర్పడగా, ఇప్పటికే ప్రత్యామ్నాయ బోధన విధానానికి చర్యలు చేపట్టాయి. మన దేశంలోనూ సంప్రదాయ డిగ్రీలు కాకుండా ఇంజనీరింగ్, మేనేజ్మెంట్ వంటి కోర్సుల్లో ఆన్లైన్ తరగతుల నిర్వహణకు చర్యలు చేపట్టాయి. ప్రైవేటు విద్యా సంస్థలైతే పాఠశాల విద్యలో ఈ విధానాన్ని అమలు చేస్తుండగా, ప్రభుత్వ రంగంలోనూ పలు చర్యలు చేపట్టాయి. అయితే ఉన్నత విద్యలో ఒక ప్రత్యేక విధానం ఉండాలన్న ఆలోచనతో కేంద్రం ‘భారత్ పఢే’పేరుతో దేశంలో ఈ–లెర్నింగ్ విద్యా విధానం ఉండాల్సిన తీరుపై విద్యావేత్తల నుంచి అభిప్రాయాలను సేకరించింది. డిగ్రీ కోర్సులను కూడా ఆన్లైన్లో నిర్వహించాలన్న ఆలోచనతో ముందుకు సాగుతున్నట్లు టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. యూనివర్సిటీస్ ఇన్ 2030 పేరుతో నిర్వహించిన ఈ సర్వేలో ప్రపంచంలోని టాప్ యూనివర్సిటీలకు చెందిన ప్రముఖులు, విద్యావేత్తలు, విద్యార్థులతో మాట్లాడినట్లు పేర్కొంది. సర్వేలో వెల్లడైన ప్రధాన అంశాలివే ► ప్రపంచంలోని ప్రఖ్యాత యూనివర్సిటీలు 2030 నాటికి ఆన్లైన్లో పూర్తిస్థాయి డిగ్రీ కోర్సులు ప్రవేశ పెడతాయని అంగీకరీస్తారా అని ప్రశ్నించగా, 5 శాతం మంది అసలే అంగీకరించబోమని చెప్పగా, 13 శాతం మంది అలా కుదరకపోవచ్చని పేర్కొన్నారు. 19 శాతం మంది ఏమీ చెప్పకపోగా, 45 శాతం మంది అవునని, 18 శాతం మంది కచ్చితంగా అవునని (మొత్తంగా 63 శాతం) స్పష్టం చేశారు. ► పూర్తి స్థాయి డిగ్రీ కోర్సులను ప్రపంచ ప్రఖ్యాత యూనివర్సిటీలు ఆన్లైన్లో ప్రవేశ పెడతాయని చెప్పిన వారిలో యూరప్లో 54 శాతం మంది ఉండగా, ఉత్తర అమెరికాలో 79 శాతం మంది ఉన్నారు. ఆసియా దేశాల్లో 53 శాతం మంది, ఆస్ట్రేలియాలో 71 శాతం మంది ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. ► డిగ్రీ కోర్సుల్లో ప్రత్యక్ష బోధన కంటే ఆన్లైన్ బోధన మెరుగ్గా ఉంటుందా అన్న ప్రశ్నకు ప్రత్యక్ష బోధన కంటే ఆన్లైన్ బోధన మెరుగ్గా ఉండదని అత్యధిక శాతం మంది స్పష్టం చేశారు. 53 శాతం మంది (ఇందులో 5 శాతం అసలే మెరుగైంది కాదని) మెరుగ్గా ఉండదన్న సమాధానమే చెప్పారు. యూరోప్లో 62 శాతం మంది, ఉత్తర అమెరికాలో 57 శాతం మంది, ఆసియాలో 37 శాతం మంది ఇదే విషయాన్ని చెప్పారు. ఆస్ట్రేలియాలో మాత్రం 54 శాతం మంది ప్రత్యక్ష బోధన కంటే ఆన్లైన్ బోధన మెరుగ్గా ఉం టుందని చెప్పడం గమనార్హం. అందులో 12 శాతం మంది అయితే ఆన్లైన్ బోధనే కచ్చితంగా మెరుగైందని పేర్కొన్నారు. ► ప్రత్యక్ష విద్యా సంబంధ సమావేశాల స్థానంలో ఆన్లైన్లో వర్చువల్ అకడమిక్ కాన్ఫరెన్స్లు వస్తాయా అంటే 10 శాతం అసలే రావని చెప్పగా, 44 శాతం మంది రావని చెప్పారు. 22 శాతం మంది వస్తాయని వెల్లడించగా, 4 శాతం మంది కచ్చితంగా వస్తాయని స్పష్టం చేశారు. 20 శాతం మంది తెలియదని పేర్కొన్నారు. ► ప్రత్యక్ష బోధన పోయి ఆన్లైన్ బోధనే ఉంటుందా అంటే 23 శాతం మంది అది అసలే సాధ్యం కాదని తెగేసి చెప్పగా, 42 శాతం మంది సాధ్యమని చెప్పారు. 16 శాతం మంది ఏమీ తెలియదని చెప్పగా, 19 శాతం మంది అవునని పేర్కొన్నారు. ► కొత్త పరిశోధన పత్రాలు అన్నీ ఆన్లైన్లోనే అందుబాటులో ఉంటాయా.. అన్న ప్రశ్నకు 69 శాతం మంది అవుననే సమాధానమిచ్చారు. యూరప్లో 80 శాతం మంది అవునని చెప్పగా, ఉత్తర అమెరికాలో 43 శాతం మంది, ఆసియాలో 64 శాతం మంది, ఆస్టేలియాలో 65 శాతం మంది అవునని పేర్కొన్నారు. -
అంతర్జాతీయ వర్సిటీల ఉచిత ఆన్లైన్ కోర్సులు
సాక్షి, అమరావతి: కరోనా వైరస్ నేపథ్యంలో దాదాపు ప్రపంచవ్యాప్తంగా విద్యాసంస్థలు మూతపడి విద్యార్థులు ఇళ్లకే పరిమితమయ్యారు. ఈ సమయాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకొనేందుకు ప్రపంచ శ్రేణి యూనివర్సిటీలు సహా పలు వర్సిటీలు ఉచితంగా ఆన్లైన్ కోర్సులు అందిస్తున్నాయి. ప్రపంచ ప్రఖ్యాత హార్వర్డ్, స్టాన్ఫోర్డ్, డ్యూక్, మిచిగాన్ సహా అంతర్జాతీయంగా ప్రముఖ యూనివర్సిటీలు కూడా విద్యార్థులకు ఉచితంగా ఆన్లైన్ కోర్సులను అందించేందుకు నిర్ణయించాయి. మాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్సు (మూక్స్) విధానంలో అందించే ఈ కోర్సులను పూర్తి చేసిన వారికి ఆయా వర్సిటీలు సర్టిఫికెట్లు, క్రెడిట్లు అందిస్తాయి. ఈ క్రెడిట్లకు భవిష్యత్తులో ప్రాధాన్యం కూడా దక్కనుంది. ► స్టాన్ఫోర్డ్, జార్జియాటెక్, యేల్, డ్యూక్, మిచిగాన్ వంటి అనేక వర్సిటీలలొ దాదాపు 178 మూక్స్ సర్టిఫికేషన్ కోర్సులు. ► ఉచితంగా ఆన్లైన్ సర్టిఫికేషన్ కోర్సులు అందించనున్న వర్సిటీలు 50. ► వీటిలో పెన్, జార్జియాటెక్, జాన్స్ హాకిన్స్, కాల్టెక్, డ్యూక్, ఇంపీరియల్ కాలేజ్ ఆఫ్ లండన్ వంటివి ఉన్నాయి. ► 180 రోజుల్లో పూర్తయ్యేలా ఈ సర్టిఫికేషన్ కోర్సులకు ఈ ఏడాది మే ఆఖరు వరకే అవకాశం ఉంది. ► ఇవే కాకుండా గూగుల్, అమెజాన్ వంటి దిగ్గజ కంపెనీలు కూడా ఫ్రీ ఆన్లైన్ కోర్సులను అందిస్తున్నాయి. ► ఈ కోర్సుల వ్యవధి వారంలో 5 నుంచి 10 గంటలవరకు మాత్రమే ఉంటుంది. ఫ్రీ ఆన్లైన్ కోర్సుల్లో ముఖ్యమైన కేటగిరీలు కంప్యూటర్ సైన్సు; బిజినెస్; ఇంజనీరింగ్; హెల్త్ అండ్ మెడిసిన్; హ్యుమానిటీస్; డేటా సైన్స్; పర్సనల్ డెవలప్మెంట్; ఆర్ట్ అండ్ డిజైన్ ప్రోగ్రామింగ్; మేథమెటిక్స్; సైన్స్; సోషల్ సైన్సెస్. ఈ విభాగాల్లోనూ పలు స్పెషలైజ్డ్ కోర్సులు అందుబాటులో ఉంటున్నాయి. ఎడ్యుకేషన్ అండ్ ట్రయినింగ్: ఉచితంగా అందిస్తున్న ఈ కోర్సులకు సంబంధించిన సమాచారాన్ని https://www.classcentral.com/report/coursera-free-certificate-covid-19/ వెబ్సైట్ ద్వారా తెలుసుకోవచ్చు. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో విద్యార్థులు ఈ ఉచిత ఆన్లైన్ కోర్సుల అవకాశాన్ని వినియోగించుకోవడం ద్వారా భవిష్యత్తులో ఆ క్రెడిట్లతో ప్రయోజనం పొందగలుగుతారని రాష్ట్ర విదేశీవిద్య కో ఆర్డినేటర్ డాక్టర్ కుమార్ అన్నవరపు పేర్కొన్నారు. విద్యా సమాచారం ఆకాశవాణి ద్వారా ఎంసెట్ శిక్షణ కరోనా వైరస్తో లాక్డౌన్ కారణంగా విద్యార్థులు పాఠశాలలకు దూరమై ఇళ్లకే పరిమితమైన నేపథ్యంలో వారికి ఆన్లైన్ విద్యను అందించే ప్రయత్నంలో భాగంగా సాంఘిక సంక్షేమ, ఇతర సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థలు ఆకాశవాణి విజయవాడ కేంద్రం ద్వారా ఎంసెట్ శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ బుధవారం తెలిపారు. ఈ కార్యక్రమాలు నేటి నుంచి ప్రారంభమవుతాయన్నారు. రోజూ ఉదయం 10.30 నుంచి 11 గంటల వరకు ఆకాశవాణి విజయవాడ కేంద్రం ద్వారా వినవచ్చన్నారు. రేడియో సెట్ లేని విద్యార్థులు స్మార్ట్ ఫోన్లో ఆల్ ఇండియా రేడియో మొబైల్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని దాని ద్వారా వినాలని సూచించారు. ఫీజులపై త్వరలో నోటిఫికేషన్ రాష్ట్రంలోని ఇంజనీరింగ్, ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ, బీఎడ్, ఎంఎడ్, లాంగ్వేజ్ పండిట్ ట్రైనింగ్ (ఎల్పీటీ) తదితర కోర్సులకు సంబంధించి 2020–21 నుంచి 2022–23 వరకు మూడేళ్ల కాలపరిమితి ఫీజుల ఖరారుకు సంబందించి త్వరలోనే నోటిఫికేషన్ను వెలువరించనున్నామని రాష్ట్ర ఉన్నత విద్యా పర్యవేక్షణ, నియంత్రణ కమిషన్ కార్యదర్శి డాక్టర్ ఎన్.రాజశేఖరరెడ్డి తెలిపారు. ఇప్పటికే ఇందుకు సంబంధించిన అన్ని ప్రక్రియలను కమిషన్ పూర్తిచేసిందని వివరించారు. ఈనెల 18 లేదా 19వ తేదీల్లో నోటిఫికేషన్ను ప్రకటిస్తామని చెప్పారు. సెట్ల దరఖాస్తు ఫీజు గడువు పెంపు రాష్ట్రంలో ఇంజనీరింగ్ తదితర ప్రొఫెషనల్ కోర్సుల్లో ప్రవేశానికి సంబంధించి నిర్వహించే ఎంసెట్ సహా అన్ని ప్రవేశ పరీక్షల ఆన్లైన్ దరఖాస్తు గడువును మే 7వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం లాక్డౌన్ను మే 3 వరకు పొడిగించిన నేపథ్యంలో ఈ దరఖాస్తు గడువును పొడిగించినట్లు వివరించారు. ఈ ప్రవేశ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా మే 7 వరకు ఫీజు చెల్లించి దరఖాస్తులు సమర్పించవచ్చని వివరించారు. డేటా అప్లోడింగ్ గడువు పెంపు కోవిడ్–19 నేపథ్యంలో రాష్ట్రంలోని మెడికల్, డెంటల్, నర్సింగ్, ఫిజియోథెరపీ కోర్సులకు ఫీజుల నిర్ణయానికి సంబంధించి ఆయా కాలేజీల డాక్యుమెంట్లు, ఇతర సమాచారం, అప్లోడింగ్ గడువును కాలేజీల వినతి మేరకు మే 6 వరకు పొడిగించినట్లు రాష్ట్ర ఉన్నత విద్యా నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ (ఏపీహెచ్ఈఎంఆర్సీ) కార్యదర్శి డాక్టర్ ఎన్.రాజశేఖరరెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. నోటిఫికేషన్లో తెలిపిన మేరకు కోర్సుల వారీగా నిర్ణీత రుసుమును ఏప్రిల్ 24వ తేదీలోగా కాలేజీలు చెల్లించాల్సి ఉంటుంది. డిగ్రీ, లా, ఫిజికల్ ఎడ్యుకేషన్ కాలేజీల సమాచార సమర్పణ గడువు పొడిగింపు రాష్ట్రంలో సాధారణ డిగ్రీ, లా, ఫిజికల్ ఎడ్యుకేషన్ కోర్సులకు ఫీజుల నిర్ణయానికి సంబంధించి ఆయా కాలేజీలు డాక్యుమెంట్లు, ఇతర సమాచార సమర్పణ తేదీని మే 6 వరకు పొడిగించినట్లు రాజశేఖరరెడ్డి తెలిపారు. కాలేజీలు చెల్లించాల్సిన ప్రాసెసింగ్ ఫీజును ఏప్రిల్ 24లోగా చెల్లించాలి. -
బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు వర్సిటీ ఈసీల్లో పెద్దపీట
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని వివిధ విశ్వవిద్యాలయాల ఎగ్జిక్యూటివ్ కమిటీ (ఈసీ)ల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు సముచిత ప్రాధాన్యం కల్పిస్తూ ప్రభుత్వం నియామకాలు చేసింది. బడుగు, బలహీనవర్గాలు, మైనార్టీలు, మహిళలకు ప్రాధాన్యమివ్వాలని ముఖ్యమంత్రి జగన్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఆయా వర్గాలకు నామినేటెడ్ పదవులు, నామినేటెడ్ పనులు, కాంట్రాక్టులు, ఔట్ సోర్సింగ్ కొలువుల్లో కోటాను కూడా అమల్లోకి తెస్తూ అసెంబ్లీలో ప్రత్యేకంగా చట్టాన్ని కూడా ఆమోదింపచేసి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఔట్సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగాలను టీడీపీ హయాంలో రిజర్వేషన్లతో సంబంధం లేకుండా అమ్ముకుంటూ కాంట్రాక్టు సంస్థలు భర్తీచేయగా ముఖ్యమంత్రి జగన్ దీన్ని పూర్తిగా రద్దు చేయించారు. ఈ పోస్టుల భర్తీకి ప్రైవేట్ సంస్థలను తప్పించి ప్రత్యేకంగా ప్రభుత్వం తరఫునే కార్పొరేషన్ ఏర్పాటు చేయించారు. నిరుద్యోగులు నేరుగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుంటే కొత్త చట్టంలో నిర్దేశించిన రిజర్వేషన్ల ప్రకారం నియామకాలు చేపట్టే విధానాన్ని తెచ్చారు. గతంలో ఆ ఉద్యోగులకు ఇచ్చే వేతనాల్లో కొంత మొత్తం ప్రైవేట్ సంస్థలు కమీషన్ల కింద వసూలు చేసుకునేవి. ఇప్పుడు నేరుగా మొత్తం వేతనం ఉద్యోగికే దక్కేలా చేశారు. అలాగే మహిళలకు అన్ని పదవులు, పనుల్లో 50 శాతం కోటాను చట్టబద్ధం చేయించారు. బడుగు బలహీన వర్గాలకు, మహిళలకు ప్రాధాన్యం వర్సిటీ నామినేటెడ్ పదవుల్లో కూడా ఆయా వర్గాలకు సముచిత ప్రాధాన్యం కల్పించారు. రాష్ట్రంలోని 14 వర్సిటీల్లోని ఎగ్జిక్యూటివ్ కమిటీల్లో 116 మందిని నామినేట్ చేయగా 63 (54.31 శాతం) మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు చెందిన వారే ఉండటం గమనార్హం. మహిళలకు మొత్తం పోస్టుల్లో 50 శాతం (58 పోస్టులు) కేటాయించారు. ఐదుగురు మైనార్టీలతో కలుపుకొని బీసీలు 34 మంది, ఎస్సీలు 23 మంది, ఎస్టీలు ఆరుగురు ఉన్నారు. వర్సిటీల వారీగా ఎగ్జిక్యూటివ్ కమిటీల్లో నియామకాలు -
పరిశోధన, అభివృద్ధికి శూన్యం!
సాక్షి, హైదరాబాద్: ఎప్పటిలాగే యూనివర్సిటీల్లో పరిశోధన, అభివృద్ధికి రాష్ట్ర బడ్జెట్లో పెద్దగా నిధులను కేటాయించలేదు. ఇంటర్మీడియట్ విద్యను మినహాయిస్తే ఉన్న త, సాంకేతిక విద్యలో నిర్వహణ, ప్రగతి ప ద్దు కింద గతేడాది కంటే ఈసారి నిధులను ప్రభుత్వం తగ్గించింది. యూనివర్సిటీలకు నిర్వహణ పద్దులో గతేడాది కంటే ఈసారి నిధులను పెంచింది. అయితే పెరిగిన నిధులు యూనివర్సిటీల్లో యూజీసీ సవరించిన వేతనాల చెల్లింపునకే సరిపోనున్నాయి. సెంట్రల్ పీఆర్సీ సిఫారసు మేరకు యూజీసీ ప్రకటించిన వేతనాలను అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం గతేడాది ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఆ మేరకు ఆ వేతనాల చెల్లింపులకు అయ్యే అదనపు నిధులను మాత్రమే నిర్వహణ పద్దులో కేటాయించింది. ఈసారి ఉన్నత, సాంకేతిక విద్యకు మొత్తంగా రూ.1,723.28 కోట్లు కేటాయించగా, అందులో నిర్వహణ పద్దు కింద రూ.1,638.04 కోట్లు, ప్రగతి పద్దు కింద రూ.85.24 కోట్లు కేటాయించింది. అదే గతేడాది మొత్తంగా రూ.1,690.79 కోట్లు కేటాయించగా, అందులో నిర్వహణ పద్దు కింద రూ.1,632.85 కోట్లు, ప్రగతి పద్దు కింద రూ.57.94 కోట్లు కేటాయించింది. యూనివర్సిటీల్లో ఇంక్యుబేటర్ల ఏర్పాటు, పరిశోధనలు, ఇతర అభివృద్ధి కార్యక్రమాలు మొత్తంగా రూ.2,500 కోట్ల వరకు బడ్జెట్ కావాలని అడిగినా రూ.1,723.27 కోట్లకే పరిమితం చేసింది. ఇక ఇంటర్మీడియట్ విద్యాశాఖకు నిర్వహణ పద్దులో గతేడాది కంటే రూ.30 కోట్ల వరకు కోత పెట్టగా, ప్రగతి పద్దులో రూ.28.53 కోట్లు అదనంగా ఇచ్చింది. సాంకేతిక విద్యలో భారీ కోత.. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో క్రీడా పరికరాల సామగ్రి కొనుగోలు కోసం గతేడాది రూ.5.78 కోట్లు కేటాయించగా, ఈసారి రూ.34.27 కోట్లు కేటాయించింది. పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీకి గతేడాదిలాగే ఈసారి కూడా రూ.3 కోట్లు, ఉస్మానియా యూనివర్సిటీ సెంటినరీ బిల్డింగ్ నిర్మాణం కింద రూ.3 కోట్లు, వివిధ పథకాల కింద రూ.3.22 కోట్లు ప్రగతి పద్దు కింద కేటాయించింది. కేంద్ర ప్రాయోజిత పథకాలకు రాష్ట్ర వాటా కింద గతేడాదిలాగే నిధులను కేటాయించింది. గతేడాది రూ.14.95 కోట్లు కేటాయించగా, ఈసారి రూ.15.04 కోట్లు కేటాయించింది. మరోవైపు సాంకేతిక విద్యలో నిర్వహణ పద్దులో భారీగా కోత పెట్టింది. గతేడాది రూ.320.29 కోట్లు కేటాయించగా, ఈసారి రూ.265.08 కోట్లకే పరిమితం చేసింది. జేఎన్టీయూ అనుబంధ ఇంజనీరింగ్ కాలేజీల్లో సుల్తాన్పూర్ కాలేజీకి రూ.5.10 కోట్లు, మంథని కాలేజీకి రూ.63 లక్షలు, కరీంనగర్లో కొత్త ఇంజనీరింగ్ కాలేజీలకు రూ.5.59 కోట్లు కేటాయించింది. అయితే జగిత్యాల ఇంజనీరింగ్ కాలేజీ గురించి బడ్జెట్లో ప్రస్తావనే లేదు. పాలిటెక్నిక్ కాలేజీలకు గతేడాదితో పోల్చితే భారీగా బడ్జెట్ను తగ్గించింది. 2019–20 ఆర్థిక సంవత్సరంలో రూ.142.83 కోట్లు ఇవ్వగా, ఈసారి రూ.98.99 కోట్లు మాత్రమే కేటాయించింది. -
డిజిటల్ బాటలో యూనివర్సిటీలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అన్ని విశ్వవిద్యాలయాలను డిజిటలైజ్ చేసే దిశగా ప్రభుత్వం కార్యాచరణ చేపట్టింది. వర్సిటీల కార్యకలాపాలను ఆన్లైన్లోనే.. అత్యంత పారదర్శకంగా కొనసాగించనున్నారు. విద్యా శాఖపై సమీక్ష సందర్భంగా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ మేరకు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సాధ్యమైనంత త్వరగా వర్సిటీల్లో అన్ని కార్యకలాపాలను ఆన్లైన్లో నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. దీంతో ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి(విద్యా శాఖ) సతీష్చంద్ర కొద్దిరోజుల క్రితం వర్సిటీలకు ప్రత్యేక సర్క్యులర్ జారీ చేశారు. వర్సిటీల సమాచారం మొత్తం ప్రభుత్వ సర్వర్తో అనుసంధానించాలని పేర్కొన్నారు. మీట నొక్కగానే మొత్తం సమాచారం తెలిసేలా ఉండాలని సూచించారు. వర్సిటీల మధ్య ఇంటర్నల్ నెట్వర్క్ యూనివర్సిటీల్లోని అన్ని వ్యవస్థలు, కార్యకలాపాలను కంప్యూటరీకరణ చేస్తారు. సేవలను ఆన్లైన్లోనే అందిస్తారు. పేపర్ వర్కు అనేది లేకుండా అన్ని వర్సిటీల్లోనూ ఈ–ఆఫీసులను అభివృద్ధి పర్చనున్నారు. ఈ–ఆఫీసు ద్వారా అన్ని విభాగాలను అనుసంధానిస్తారు. విద్యార్థులకు ఇంటిగ్రేటెడ్ సేవలను అందించడానికి వర్సిటీలన్నింటి మధ్య ఇంటర్నల్ నెట్వర్కును ఏర్పాటు చేస్తారు. ఈ ప్రక్రియలో విశ్వవిద్యాలయాలకు సహకరించేందుకు నోడల్ ఏజెన్సీగా సెంటర్ ఫర్ ఫైనాన్షియల్ సర్వీసెస్, సిస్టమ్స్ వ్యవహరించనుంది. ప్రవేశాలు ఆన్లైన్లోనే.. యూనివర్సిటీలు, వాటి పరిధిలోని కళాశాలల్లో విద్యార్థుల ప్రవేశాలను ఆన్లైన్లో నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. అలాగే వర్సిటీలు, వాటి పరిధిలోని కాలేజీల్లో సిబ్బంది, విద్యార్థులకు బయోమెట్రిక్ హాజరును తప్పనిసరి చేయనున్నారు. దానిపై నిరంతర పర్యవేక్షణ ఉండేలా జియో బయోమెట్రిక్ను అనుసరిస్తారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇవి అమల్లోకి తీసుకురావాలని వర్సిటీలకు విద్యాశాఖ తాజా ఆదేశాలు జారీ చేసింది. పరిశోధనలకు పెద్దపీట అన్ని విశ్వవిద్యాలయాల్లో పరిశోధనలకు పెద్దపీట వేయాలని ఉన్నత విద్యాశాఖ స్పష్టం చేసింది. ప్రస్తుతం పలు యూనివర్సిటీల్లో పరిశోధనలు మొక్కుబడిగా మాత్రమే కొనసాగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం పరిశోధనలకు అత్యధికంగా నిధులు అందిస్తోంది. పరిశోధనలు లేనందున రాష్ట్ర యూనివర్సిటీలు ఆ నిధులను పొందలేకపోతున్నాయి. పరిశోధనలపై దృష్టి పెట్టడం ద్వారా విశ్వవిద్యాలయాలు నూతన ఆవిష్కరణల పరంగానే కాకుండా బోధనాభ్యసన ప్రక్రియలో మెరుగైన ఫలితాలు సాధించవచ్చని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. విశ్వవిద్యాలయాల్లో వాటి సామర్థ్యాలను బట్టి ఒక నిర్దిష్ట రంగంలో పరిశోధనల కోసం ఒక సమగ్ర నెట్వర్క్ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. వర్సిటీల ఉపకులపతులు, ఆయా విభాగాధిపతులను ఒకే వేదికపైకి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేయనున్నారు. -
'వీసీల నిమామక ప్రక్రియ వేగవంతం చేయండి'
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ విశ్వవిద్యాలయాల్లో వైస్ చాన్సలర్ల నియామకంపై ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. వివిధ విశ్వవిద్యాలయాల వైస్ చాన్స్లర్ల నియామక ప్రక్రియను వేగవంతం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. వీసీ నియామక ప్రక్రియ పూర్వరంగంలో, సెర్చ్ కమిటీ నుంచి పేర్లు తెప్పించుకుని ముందుగా ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్ల నియామకాలు చేపట్టాలని సీఎం ఆదేశించారు.దీనివల్ల వీసీల నియామక ప్రక్రియకు మార్గం సుగమం అవుతుందని ఆయన పేర్కొన్నారు.రాబోయే రెండు-మూడు రోజుల్లోనే ఇదంతా జరగాలని సీఎం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. -
విద్యా వ్యవస్ధలో సంస్కరణలు
-
వారంలోగా వర్సిటీలకు ఈసీలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని అన్ని వర్సిటీలకు వారం రోజుల్లోగా ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్స్ను (ఈసీ) నియమించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. జవహర్లాల్ నెహ్రూ ఫైన్ ఆర్ట్స్, ఆర్కిటెక్చర్ యూనివర్సిటీకి ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఉండగా, అక్టోబరులో కాకతీయ యూనివర్సిటీకి ఈసీని నియమించింది. మిగతా వర్సిటీలకు ఈసీలు లేకపోవడంతో పాలన స్తంభించిపోయింది. దీంతో వర్సిటీల ఈసీల్లో ఉండే సభ్యుల పేర్లతో కూడిన ఫైలును ప్రభుత్వానికి గతంలోనే పంపించామని, వారం రోజుల్లోగా ఈసీల నియామక ఉత్తర్వులు వెలువడనున్నాయని ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ పాపిరెడ్డి గురువారం వెల్లడించారు. -
ఐదేళ్లలో అన్నింటికీ న్యాక్ గుర్తింపు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థలు, యూనివర్సిటీలు రానున్న ఐదేళ్లలో నేషనల్ అసెస్మెంట్, అక్రిడిటేషన్ కౌన్సిల్(న్యాక్) గ్రేడింగ్ సాధించేలా ప్రభుత్వం కార్యాచరణ ప్రారంభించింది. అన్ని విద్యాసంస్థలకు న్యాక్ గుర్తింపు ఉండాలని, వర్సిటీలకు న్యాక్ ఏ–గ్రేడ్ ఉండాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. దీంతో దశలవారీగా విద్యాసంస్థలు న్యాక్ గ్రేడింగ్ సాధించేలా ‘ఇంటర్నల్ క్వాలిటీ అసెస్మెంట్ సెల్’ను ఏర్పాటు చేస్తోంది. విద్యారంగ నిపుణులు, పలువురు ఆచార్యులు ఇందులో సభ్యులుగా ఉంటారు. న్యాక్, దాని గ్రేడింగ్ ప్రాధాన్యం, ఆ గుర్తింపు లేకుంటే వచ్చే నష్టాలు వివరిస్తూ దాన్ని ఎలా సాధించాలనే దానిపై విద్యాసంస్థలకు ఉన్నత విద్యామండలి మార్గనిర్దేశం చేయడం ప్రారంభించింది. ఇప్పటికే కాకినాడ జేఎన్టీయూ పరిధిలోని ఇంజనీరింగ్ కాలేజీలతో సమావేశం నిర్వహించింది. అనంతపురం జేఎన్టీయూ ఇంజనీరింగ్ కాలేజీలతో సమావేశాలను ఏర్పాటు చేయనున్నారు. ఇతర వర్సిటీల పరిధిలోని యూజీ, పీజీ కాలేజీలు, ఇతర విద్యాసంస్థలు న్యాక్ గుర్తింపును సొంతం చేసుకునేలా ప్రణాళికను అమల్లోకి తేనున్నారు. ఇంటర్నల్ క్వాలిటీ అసెస్మెంట్సెల్ నుంచి కాలేజీలకు సహకారం అందిస్తారు. 80 కాలేజీలకే గుర్తింపు రాష్ట్రంలో పాత విశ్వవిద్యాలయాలకు తప్ప గత దశాబ్ద కాలంలో కొత్తగా ఏర్పడిన వాటిలో కొన్నింటికి ఇప్పటికీ న్యాక్ గ్రేడింగ్ లేకపోవడం గమనార్హం. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ గుర్తింపు లేని వర్సిటీలు కూడా ఉన్నాయి. కొన్ని వర్సిటీలకు నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ ర్యాంకు సైతం దక్కలేదు. ఇక కాలేజీల్లో కేవలం 80 కాలేజీలకు న్యాక్ గుర్తింపు ఉంది. గత ప్రభుత్వ హయాంలో ఆయా విద్యాసంస్థల అభివృద్ధికి నిధులేవీ ఇవ్వలేదు. అన్ని రకాల మౌలిక వసతులు, బోధన, బోధనేతర సిబ్బంది ఉన్న విద్యాసంస్థలకే న్యాక్ గుర్తింపు దక్కుతుంది. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక అన్ని విద్యా సంస్థలు న్యాక్ గుర్తింపు సాధించడానికి వీలుగా సహకారం అందిస్తున్నారు. న్యాక్ గుర్తింపు తప్పనిసరి న్యాక్ గుర్తింపు ఉంటేనే విద్యాసంస్థలకు మనుగడ ఉంటుంది. అన్ని కాలేజీలు న్యాక్ గుర్తింపు పొందేలా మార్గనిర్దేశం చేస్తున్నాం. నూతన విద్యావిధానం ప్రకారం అన్ని విద్యాసంస్థలకూ న్యాక్ గుర్తింపు తప్పనిసరి. రాష్ట్రంలో 2 వేలకు పైగా కాలేజీలు ఉండగా, కేవలం 80 సంస్థలకు మాత్రమే న్యాక్ గుర్తింపు ఉంది. 2030 కల్లా అన్ని సంస్థలు న్యాక్ గుర్తింపు సాధించాలి. కొత్త వర్సిటీలు కూడా న్యాక్ గ్రేడింగ్ సాధించాల్సి ఉంది. –ప్రొఫెసర్హేమచంద్రారెడ్డి, ఉన్నత విద్యామండలి చైర్మన్ -
పదవీకాలం ముగిసినా..
సాక్షి, హైదరాబాద్: యూనివర్సిటీల వైస్ చాన్స్లర్ (వీసీ) పదవీకాలం ముగిసిన తరువాత నిర్ణీత వ్యవధిలోనే మళ్లీ వైస్ చాన్స్లర్ను నియమించే నిబంధన రాబోతోందా? అంటే ఉన్నత విద్యాశాఖ వర్గాల నుంచి అవుననే సమాధానం వ్యక్తమవుతోంది. ఉమ్మడి ఏపీలో రాష్ట్రంలోని వర్సిటీలకు వీసీల నియామకాలు చేపట్టడంతో నెలల తరబడి జాప్యం జరిగేది. అలాంటి జాప్యాన్ని నివారించే చర్యలపై ఉన్నత విద్యా శాఖ కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది. ఈ మేరకు విద్యావేత్తలు, నిపుణులు, వర్సిటీల ప్రతినిధులు తమ అభిప్రాయాన్ని వర్సిటీల చట్టాల రూపకల్పన కమిటీకి తెలియజేసినట్లు సమాచారం. రాష్ట్ర ఏర్పాటు తర్వాత రాష్ట్రంలోని 11 వర్సిటీలకు వేర్వేరు చట్టాలు, వేర్వేరు నిబంధనలు ఉన్న నేపథ్యంలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో ప్రభు త్వం ఒకే రకమైన వర్సిటీలకు ఒకే రకమైన చట్టాల రూపకల్పనకు శ్రీకారం చుట్టింది. దీనిలో భాగంగా గతేడాది ఉన్నత విద్యా మండలి ఓ ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. ప్రస్తుతం ఆ కమిటీ తమ నివేదికను రూపొందించింది. దానిపై వర్సిటీల నుంచి అభిప్రాయాలను స్వీకరించింది. ఆ అభిప్రాయాల్లో కొన్నింటిని తమ నివేదికలో పొందుపరిచే చర్యలు చేపట్టింది. సోమవారం కూడా ఓయూ మాజీ వీసీ ప్రొఫెసర్ సులేమాన్ సిద్ధిఖీ, ఓయూ లా డిపార్ట్మెంట్ ప్రొఫెసర్ జీబీ రెడ్డి, రిజిస్ట్రార్ గోపాల్రెడ్డి, నిరంజన్చారి తదితరులతో కూడిన కమిటీ సమావేశమైంది. ఈ సందర్భంగా తమకు వచ్చిన అభిప్రాయాలను పరిశీలించింది. ప్రధానంగా వీసీల పదవీ కాలం పూర్తి కాగానే నిర్ణీత వ్యవధిలోనే మళ్లీ వీసీలను నియమించాలన్న నిబంధనను పొందుపరచాలని సూచించినట్లు తెలిసింది. ప్రస్తుతం కమిటీ ఆ నిబంధననూ çపరిగణనలోకి తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ నెల 7న మరోసారి సమావే«శమై తుది నివే దిక ఖరారు చేయనుంది. వీలైతే అదే రోజు లేదంటే వారంలోగా ప్రభుత్వానికి తమ సిఫారసులతో కూడిన వర్సిటీల కొత్త చట్టాల తుది నివేదిక అందజేసేందుకు చర్యలు చేపట్టింది. భౌగోళిక స్వరూపాల్లోనూ మార్పులు.. ఈ చట్టాల్లో 60 నుంచి 70 శాతం వరకు కామన్ నిబంధనలే ఉండనున్నాయి. చాన్స్లర్, వీసీ, రిజిస్ట్రార్ వంటి నియామకాల నిబంధనలు ఒకే రకంగా ఉండనున్నాయి. మిగతా 30 నుంచి 40 శాతం నిబంధనలు మాత్రం ఆయా యూనివర్సిటీల ప్రత్యేకతకు అనుగుణంగా ఉంటాయి. బోధన, బోధనేతర సిబ్బంది నియామకాల్లో సబ్జెక్టు సంబంధమైన కొన్ని నిబంధనలు వేర్వేరుగా ఉండబోతున్నాయి. వర్సిటీ భౌగోళిక స్వరూపాల్లో మార్పులకు ప్రభుత్వం ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ త్వరలోనే నివేదికను ఇవ్వనుంది. కొత్త జిల్లాల ఏర్పాటు తరువాత ఆయా జిల్లాలు ఏ వర్సిటీకి దగ్గరగా ఉంటాయో ఆ వర్సిటీ పరిధిలోకి తీసుకువచ్చే చర్యలు చేపట్టింది. ఆ నివేదికను తెప్పించుకొని, వీలైతే ఆ అంశాలను కూడా యూనివర్సిటీల చట్టాల్లో పొందుపరిచే అవకాశం ఉంది. నాలుగు రకాల చట్టాలు.. ముఖ్యంగా 11 యూనివర్సిటీలకు 4 రకాల చట్టాలను తీసుకొచ్చేలా కమిటీ సిఫారసు చేస్తోంది. ఉస్మానియా, కాకతీయ, శాతవాహన, మహాత్మాగాంధీ, పాలమూరు, తెలంగాణ వంటి సంప్రదాయ వర్సిటీలకు ఒక చట్టాన్ని సిఫారసు చేసేలా నివేదికను సిద్ధం చేస్తోంది. జేఎన్టీయూ, జేఎన్ఏఎఫ్ఏయూ, బాసరలోని ఆర్జీయూకేటీ వంటి టెక్నికల్ వర్సిటీలకు ఒక చట్టాన్ని సిఫారసు చేస్తోంది. తెలుగు వర్సిటీని, భవిష్యత్తులో ఏదైనా భాషా సంబంధ వర్సిటీలు వస్తే వాటిని పరిగణనలోకి తీసుకునేలా లాంగ్వేజ్ అండ్ కల్చర్వర్సిటీల చట్టం ఉండాలని పేర్కొంటోంది. అంబేడ్కర్ ఓపెన్ వర్సిటీకి ప్రత్యేకంగా ఒక చట్టాన్ని సిఫారసు చేస్తోంది. దీనిలో భాగంగా గత చట్టాల్లో ఉన్న లోపాలు పునరావృతం కాకుండా పరిశీలన జరుపుతోంది. -
ఈసీల్లేవు..వీసీల్లేరు!
సాక్షి, హైదరాబాద్: ఎగ్జిక్యూటివ్ కమిటీలు (ఈసీ), వీసీలు లేకపోవడంతో యూనివర్సిటీల పాలన అస్తవ్యస్తంగా తయారైంది. నియామకాలపై దృష్టి పెట్టేవారు లేరు. నిధుల సద్వినియోగానికి చర్యలు చేపట్టే వారు లేరు. ఐదేళ్లుగా అభివృద్ధి కుంటుపడుతోంది. యూనివర్సిటీల్లో ఏ పని చేయాలన్నా, విధానపర నిర్ణయం తీసుకోవాలన్నా నిపుణులు, అధ్యాపకులు, ప్రముఖులు మొత్తంగా 13 మందితో కూడిన పూర్తి స్థాయి ఈసీలు ఉండాల్సిందే. కానీ అవి లేకపోవడంతో ఎలాంటి నిర్ణయాలు తీసుకునే పరిస్థితి లేకుండాపోతోంది. ఈసీలో ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఉండే ముగ్గురు ఐఏఎస్ అధికారులు, వైస్ చాన్స్లర్ ఏదైనా నిర్ణయం తీసుకుంటే అది కోర్టుల్లో నిలబడే పరిస్థితి లేదు. ఈ విషయాన్ని ప్రభుత్వం గత ఐదేళ్లుగా పక్కన పడేసింది. ఒక్క జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ (జేఎన్ఏఎఫ్ఏయూ) తప్ప మిగతా యూనివర్సిటీలకు ఈసీలను నియమించాలన్న విషయాన్నే పట్టించుకోవడం లేదు. కోర్టు మొట్టికాయలు వేస్తే తప్ప.. యూనివర్సిటీలకు ఈసీలను నియమించే విషయంలో ఎవరో ఒకరు అడిగితే తప్ప ప్రభుత్వం స్పందించడం లేదు. కాకతీయ యూనివర్సిటీకి గత నెల 13వ తేదీన ఆగమేఘాలపై ఈసీని నియమించింది. ఆ యూనివర్సిటీ ఈసీ సభ్యుల నియామకం విషయంలో సుప్రీంకోర్టులో కేసు గత నెల 15వ తేదీన హియరింగ్ ఉండటంతో పూర్తి స్థాయి ఈసీని నియమించింది. మరోవైపు వైస్ చాన్స్లర్ల నియామకం కోసం సెర్చ్ కమిటీలను ఏర్పాటుచేసినా, అవి ఇంతవరకు సమావేశమైందీ లేదు. వీసీ పదవి కోసం వచ్చిన దరఖాస్తులను పరిశీలించిందీ లేదు. 2010లోనే ఈసీల రద్దు.. రాష్ట్రంలోని యూనివర్సిటీల ఈసీలు 2010లోనే రద్దు అయ్యాయి. 2010 ఏప్రిల్ 9వ తేదీన కాకతీయ యూనివర్సిటీ పాలక మండలిని ప్రభుత్వం రద్దు చేసింది. దాంతో పాటు ఉస్మానియా, శాతవాహన, పాలమూరు, తెలంగాణ, మహాత్మాగాంధీ, అంబేడ్కర్ ఓపెన్, తెలుగు యూనివర్సిటీల పాలక మండళ్లను రద్దు చేసింది. ఆ తరువాత 2011 నవంబర్ 15వ తేదీన ఉస్మానియా యూనివర్సిటీతోపాటు మిగతా యూనివర్సిటీలకు ఈసీలను నియమించింది. అందులో కాకతీయ యూనివర్సిటీకి ఈసీని నియమించలేదు. ఆ పదవీ కాలం కూడా 2014తోనే పూర్తయిపోయింది. అప్పటి నుంచి వాటికి పూర్తి స్థాయి ఈసీలే లేకుండాపోయాయి. పూర్తి స్థాయి ఈసీలు ఉంటే... ప్రతి యూనివర్సిటీ ఈసీకి ఆ యూనివర్సిటీ వైస్ చాన్స్లర్ (వీసీ) చైర్మన్గా ఉంటారు. అలాగే విద్యాశాఖ, ఆర్థిక శాఖ, కళాశాల విద్యా కమిషనర్ (టెక్నికల్ యూనివర్సిటీ అయితే సాంకేతిక విద్యా కమిషనర్) ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఉంటారు. ఇక యూనివర్సిటీ కాలేజీల నుంచి ఒక ప్రిన్సిపాల్, ఇద్దరు అధ్యాపకులు, డిగ్రీ కాలేజీల నుంచి ఒక ప్రిన్సిపాల్, ఒక అధ్యాపకుడు, సమాజంలో వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు/నిపుణులు నలుగురు కలుపుకొని మొత్తంగా 13 మంది సభ్యులు ఈసీలో ఉంటారు. ఆ యూనివర్సిటీ రెక్టార్ ఉంటే అతను కూడా ఈసీలో సభ్యులుగా ఉంటారు. ఇలాంటి కమిటీ తీసుకునే నిర్ణయమే విధానంగా మారుతుంది. యూనివర్సిటీకి సంబంధించి ఏ పని చేయాలన్నా ఈసీ అనుమతి తీసుకోవాల్సిందే. దానినే వైస్ చాన్స్లర్ అమలు చేస్తారు. అంతేకాదు అడ్మినిస్ట్రేషన్, అకడమిక్, ప్రమోషన్స్, ఉద్యోగాల భర్తీ, సైంటిఫిక్ పరికరాలు, ల్యాబ్ వస్తువుల కొనుగోలు, యూజీసీ నిధుల వినియోగం ఇలా అన్నింటికి ఈసీ ఆమోదం ఉండాల్సిందే. ►కాకతీయ వర్సిటీలో పూర్తి స్థాయి ఎగ్జిక్యూటివ్ కమిటీ లేకుండానే ఏడేళ్ల క్రితం చేపట్టిన నియామకాలను ఈసీలో ఎక్స్అఫీషియో సభ్యులుగా ఉండే ముగ్గురు ఐఏఎస్ అధికారులు, వీసీ అప్రూవ్ చేశారు. ఈసీ లేకుండా ఎలా అప్రూవ్ చేస్తారంటూ ఒకరు కోర్టును ఆశ్రయించడంతో ఆ సెలెక్షన్స్ను కోర్టు కొట్టివేసింది. ►2015, 2016 సంవత్సరాల్లో ఉస్మానియా యూనివర్సిటీకి డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, యూజీసీ నుంచి వచ్చిన ప్రాజెక్టు నిధులను పూర్తి స్థాయి ఈసీ సద్వినియోగపరచుకోకపోవడంతో వెనక్కి వెళ్లిపోయాయి. ►2016లో జేఎన్ఏఎఫ్ఏయూ వీసీ నియామకం కోసం ఏర్పాటుచేసిన సెర్చ్ కమిటీలో వర్సిటీ నామినీని నియమించారు. పూర్తి స్థాయి ఈసీ లేకుండా, దాని అప్రూవల్ లేకుండా వర్సిటీ నామినీని ఎక్స్ అఫీషియో సభ్యులు ఎలా నామినేట్ చేస్తారని ఒకరు కోర్టును ఆశ్రయించారు. దీంతో ప్రభుత్వం పూర్తిస్థాయి ఈసీని నియమించాల్సి వచ్చింది. ►ఇప్పుడు రాష్ట్రంలోని అన్ని వర్సిటీలకు వైస్ చాన్స్లర్లు (వీసీ) లేరు. 2016లో నియమితులైన వీసీల పదవీ కాలం జూన్, జూలై నెలల్లోనే ముగిసిపోయింది. ఇన్చార్జి వీసీలుగా ఉన్న ఐఏఎస్ అధికారులు వర్సిటీలను పట్టించుకునే పరిస్థితి లేకుండాపోయింది. అకడమిక్ మార్పుల కోసమైనా ఈసీలు ఉండాల్సిందే ఈసీలో ఎక్స్అఫీషియో మెంబర్స్గా ఉండే వారు తీసుకునే నిర్ణయాలు వ్యాలిడ్ కావు. కోర్టులో అవి నిలబడవు. అకడమిక్ అంశాలు చూసేందుకు నిపుణులు అవసరం. మార్పులు చేయాలన్నా వారు ఉండాల్సిందే. విభాగాలు చేసే అకడమిక్ మార్పులను ఈసీ పరిశీలించి విధానపర నిర్ణయాలు తీసుకునే వీలుంటుంది. అకడమిక్ కేలండర్ సరిగ్గా అమలు కావడం లేదు. జూలై నెలలో ప్రారంభం కావాల్సిన అకడమిక్ ఇయర్ సెప్టెంబర్లో ప్రారంభమైంది. పీజీ పరీక్షలు నిర్వహించిన నెల రోజుల్లో ఫలితాలు ఇవ్వాలి. ఆరు నెలల వరకు కూడా కొన్ని పరీక్షల ఫలితాలు రావడం లేదు. – ప్రొఫెసర్ భట్టు సత్యనారాయణ, ఉస్మానియా యూనివర్సిటీ -
వర్సిటీల్లో స్వేచ్ఛ ఎప్పుడు?
న్యూఢిల్లీ: ప్రధాని మోదీ విద్యార్థులకు ఐన్స్టీన్ చాలెంజ్ విసరడంపై కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరం స్పందించారు. దేశంలోని విశ్వవిద్యాలయాలు ఆలోచన, భావ ప్రకటన స్వేచ్ఛ నిలయాలుగా ఎప్పుడు మారుతాయని ప్రశ్నించారు. మనీలాండరింగ్ ఆరోపణలపై ప్రస్తుతం తిహార్ జైలులో ఉన్న చిదంబరం కోరిక మేరకు కుటుంబసభ్యులు ఓ ట్వీట్ చేశారు. అందులో.. ‘ప్రధాని మోదీ విద్యార్థులకు ఐన్స్టీన్ చాలెంజ్ విసిరినందుకు సంతోషం. ఐన్స్టీన్ చెప్పినట్లుగా.. బోధన, రచన, పత్రిక రంగాల్లో స్వేచ్ఛ ప్రజల సహజ, ఉన్నత వికాసానికి పునాది వంటివి’. అయితే, మన వర్సిటీలు అటువంటి వాస్తవమైన స్వేచ్ఛా నిలయాలుగా ఎప్పుడు మారతాయి?’అని పేర్కొన్నారు. -
యూనివర్సిటీల్లో డేటా బ్యాంక్
సాక్షి, హైదరాబాద్: యూనివర్సిటీల్లో పరిశోధనలను ప్రోత్సహించాలని, అందుకు అనుగుణంగా వర్సిటీలు చర్యలు చేపట్టాలని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్రాజన్ స్పష్టం చేశారు. ప్రతి వర్సిటీ లో డేటా బ్యాంకు ఏర్పాటు చేయాలని, అందులో పరిశోధన పత్రాలు, వర్సిటీలకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని ఉంచాలని ఆదేశించారు. రాష్ట్ర గవర్నర్గా వచ్చాక ఆమె తొలిసారి వర్సిటీల చాన్స్లర్ హోదాలో గురువారం అంబేడ్కర్ ఓపెన్ వర్సిటీలో వైస్చాన్స్లర్లు, రిజిస్ట్రార్లతో 3 గంటల సమీక్ష నిర్వహించారు. ఆహ్లాదకర వాతావరణంలో వర్సిటీల్లో విద్యా బోధన, అభ్యసన కార్యక్రమాలు ఉండేలా చూడాలన్నారు. ‘లవ్ అండ్ లెర్న్’, ‘ఎం జాయ్ అండ్ ఎడ్యుకేట్’ వాతావరణాన్ని వర్సిటీ ల్లో పెంపొందించాలని తెలిపారు. రాష్ట్రంలోని 15 వర్సిటీల్లోని అభివృద్ధి, విద్యా కార్యక్రమాలపై అధికారులు నివేదికలు అందజేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ఇప్పటివరకు పాఠశాల విద్యలోనే ఉన్న స్టూడెంట్స్ హెల్త్ ప్రొఫైల్ విధానాన్ని వర్సిటీల్లోనూ అమలు చేయాలన్నారు. అందులో విద్యా ర్థుల ఆరోగ్య వివరాలు ఉండాలన్నారు. విద్యార్థుల పోషక సూచికను అభివృద్ధి చేయాలని, పాఠ్యాంశాల్లో యోగా చేర్చాలని చెప్పారు. వర్సిటీల్లో ఏటా స్నాతకోత్సవాలు నిర్వహించాలని, తాను కచ్చితంగా అందులో పాల్గొంటానని తెలిపారు. దేశంలోనే ముందుంచేలా పనిచేయండి.. తెలంగాణను విద్యారంగంలో దేశంలోనే ముం దుంచేలా సమష్టిగా పనిచేయాలని సూచించారు. అందుబాటులోని వనరులతో మౌలిక సదుపాయాలను మెరుగుపరచాలన్నారు. గ్రామాలను వర్సిటీలు దత్తత తీసుకోవాలన్నారు. ఉన్నత విద్యలో కేంద్రం చేపడుతున్న కార్యక్రమాలను వివరిం చారు. సమావేశంలో విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్రెడ్డి, ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి, వైస్ చైర్మన్ లింబాద్రి, వర్సిటీల ఇన్చార్జి వీసీలు అరవింద్కుమార్, ప్రశాంతి, అనిల్ కుమార్, రాహుల్ బొజ్జా, చిరంజీవులు, సందీప్కుమార్ సుల్తానియా, ప్రవీణ్రావు, కవిత, గోవర్ధన్ పాల్గొన్నారు. -
త్వరలో వర్సిటీలకు వీసీలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని యూనివర్సిటీలకు వైస్ చాన్స్లర్లను నియమించే ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేసింది. ఈ మేరకు విద్యా శాఖ కార్యదర్శి బి.జనార్దన్రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఉస్మానియా, కాకతీయ, తెలంగాణ, పాలమూరు, జేఎన్టీయూహెచ్, శాతవాహన యూని వర్సిటీ, పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ, బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ, మహత్మాగాంధీ యూనివర్సిటీల్లో ఒక్కో యూనివర్సిటీకి ఒక సెర్చ్ కమిటీ ఏర్పాటు చేశారు. ముగ్గురు సభ్యులతో ఈ కమిటీలను ఏర్పాటు చేసింది. అన్ని సెర్చ్ కమిటీల్లో రాష్ట్ర ప్రభుత్వ నామినీగా రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ను నియమించింది. ఆయా యూనివర్సిటీల ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్స్(ఈసీ) నామినీలను, యూజీసీ నామినీలను కమిటీల్లో సభ్యులుగా నియమిం చింది. ఇప్పటికే యూనివర్సిటీల వీసీల ఎంపిక కోసం దరఖాస్తులు స్వీకరించిన ప్రభుత్వం, ఆ దరఖాస్తులను పరిశీలించి ప్రతి వర్సిటీకి ముగ్గురి పేర్లను సిఫారసు చేసేందుకు సెర్చ్ కమిటీలను ఏర్పాటు చేసింది. ప్రతి వర్సిటీకి కమిటీలు తమ నివేదికలో ఇచ్చే ముగ్గురి పేర్లలో ఒక్కరిని చాన్స్లర్ అయిన గవర్నర్.. వీసీలను నియమిస్తారని వెల్లడించింది. ప్రభుత్వ నామినీగా వ్యవహరించే ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ సెర్చ్ కమిటీల సమావేశాలను నిర్వహిస్తారని ఉత్వర్వుల్లో పేర్కొంది. వీలైనంత త్వరగా సెర్చ్ కమిటీలు సమావేశమై ప్రతి వర్సిటీ వీసీ పోస్టుకు వచ్చిన దరఖాస్తుల్లో ముగ్గురి పేర్లను సిఫారసు చేయాలని స్పష్టం చేసింది. -
యూనివర్సిటీలు ఇక మానవాభివృద్ధి కేంద్రాలు
సాక్షి, అమరావతి: ఉన్నత విద్యారంగాన్ని మరింత పటిష్ట పరిచేందుకు వీలుగా కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ చర్యలు చేపట్టింది. ఉన్నత విద్యా కోర్సులను సమాజ అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దడంతోపాటు ప్రతి సంస్థకు పారిశ్రామిక అనుసంధానం పెంచడమే లక్ష్యంగా కార్యక్రమాలకు శ్రీకారం చుడుతోంది. ఇందులో భాగంగా యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ద్వారా దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల్లో మానవ వనరుల అభివృద్ధి కేంద్రాలు ఏర్పాటు చేయాలని సంకలి్పంచింది. యూనివర్సిటీలు సహా ఉన్నత విద్యాసంస్థల్లోని సంప్రదాయక కోర్సులను నేటి అవసరాలకు అనుగుణంగా నవీకరించడం, ఉన్నత విద్యా కోర్సులను సమాజ అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దడం, ఆయా విద్యాసంస్థల్లోని బోధనా విధానాల్లో సమూల మార్పులు చేయడం, క్షేత్రస్థాయి పరిశీలనలు, పరిశోధనలు, ప్రాజెక్ట్ వర్క్ల ద్వారా విద్యార్థుల్లో అవగాహన, పరిశీలనాశక్తిని పెంచడం, ఉపాధి అవకాశాలు పెరిగేలా నైపుణ్యాలను పెంచడం, బోధకులకు నూతన విధానాలపై ఎప్పటికప్పుడు పునశ్చరణ కార్యక్రమాలు నిర్వహించడం వంటి లక్ష్యాలతో మానవాభివృద్ధి కేంద్రాలు పనిచేస్తాయి. వీటిని శాశ్వత ప్రాతిపదికన యూనివర్సిటీల్లో ఏర్పాటు చేయనున్నారు. ఇందుకు అవసరమయ్యే వనరులను యూజీసీయే సమకూరుస్తుంది. గ్రాడ్యుయేట్లు పెరుగుతున్నా.. ఉపాధి కరవు దేశంలో 950 యూనివర్సిటీలు, వాటి పరిధిలోని 42 వేల కాలేజీల్లో 3.1 కోట్ల మంది విద్యను అభ్యసిస్తున్నారు. గడచిన పదేళ్లలో ఆయా విద్యాసంస్థల్లో చేరికలు రెట్టింపయ్యాయి. ఏటా కాలేజీల నుంచి బయటకు వస్తున్న గ్రాడ్యుయేట్ల సంఖ్య పెరుగుతున్నా నైపుణ్యాల లేమి కారణంగా వారికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభ్యం కావడం లేదు. లక్ష్యాల నిర్దేశం లేకుండా సాగుతున్న విద్యావిధానం వల్లే ఈ పరిస్థితి నెలకొంది. విద్యాసంస్థల నుంచి బయటకు వచి్చన తరువాత ఉపాధి అవకాశాలు దక్కేలా విద్యార్థుల్లో నైపుణ్యాలను పెంచేందుకు ఇకనుంచి అవుట్ కమ్ బేస్డ్ ఎడ్యుకేషన్ (ఓబీఈ) విధానాన్ని అనుసరించనున్నారు. అంతర్జాతీయ స్థాయిలో ఎదురయ్యే పోటీని ఎదుర్కొనేందుకు వీలుగా దీనిని ప్రారంభించనున్నారు. లక్ష్యాలివీ.. ►ఉన్నత విద్యారంగంలో పరస్పర భాగస్వామ్యం ద్వారా సృజనాత్మకతల పెంపు. ►ప్రస్తుతం దేశంలో ఉన్నత విద్యాసంస్థల్లోని గరిష్ట చేరికలు 25.2గా ఉంది. దాన్ని 50 శాతంగా చేయడం. ►ఉన్నత విద్యాసంస్థల్లోని గరిష్ట చేరికల్లో రాష్ట్రాల మధ్య వ్యత్యాసాన్ని.. లింగ, సామాజిక వ్యత్యాసాన్ని తగ్గించడం. ►ప్రపంచ స్థాయిలో ప్రతిభ కలిగిన ప్రతి నలుగురిలో ఒకరు భారతీయుడు ఉండేలా ఉన్నత విద్యారంగాన్ని తీర్చిదిద్దడం. ►అంతర్జాతీయంగా అగ్రస్థానంలో ఉన్న 200 వర్సిటీల్లో 20 వర్సిటీలు దేశానికి సంబంధించినవే ఉండేలా రూపకల్పన చేయడం. ►ఫ్రీ మాసివ్ ఆన్లైన్ ఓపెన్ కోర్సు (మూక్స్) పెంచడం.. వ్యక్తి కేంద్రీకృతంగా నైపుణ్యాలు పెంచేలా పాఠ్య ప్రణాళికలు రూపొందించడం. ►స్టార్టప్ ప్రోగ్రామ్లు, ఎంటర్ప్రెన్యూర్ షిప్ దిశగా విద్యార్థుల ఆసక్తిని మళ్లించడం.. ఇందుకు ‘ఇన్–హౌస్ ఎడ్యుకేషన్ టెక్నాలజీ ఇంక్యుబేటర్’ల ఏర్పాటు దిశగా టీచర్లను ప్రోత్సహించడం. ►ప్రతివారం అకడమిక్ లీడర్ షిప్, సాంకేతికాభివృద్ధి అభ్యసనం, ప్రకృతి విపత్తుల నిర్వహణ, సామాజిక సంబంధాలు పెంపొందించేలా ‘థీమ్ బేస్డ్’ కార్యక్రమాల నిర్వహణ. ►వీటిద్వారా అంతర్జాతీయ, జాతీయ దృక్కోణంలో విద్య అంతఃస్సారాన్ని అర్థం చేసుకోవడం. 2020 నాటికి గుణాత్మక మార్పులు కనిపించేలా.. ►మానవ వనరుల అభివృద్ధి కేంద్రాల ద్వారా 2020 నాటికి ఉన్నత విద్యారంగంలో గుణాత్మక మార్పులు సాధించడం యూజీసీ లక్ష్యం. ►ఇందుకు ఇస్రో, నాసా సహకారంతో ‘శాటిలైట్ ఇంటరాక్టివ్ టెలివిజన్ ఎక్స్పర్మెంట్ (సైట్)’, యూజీసీ ‘కన్సారి్టయం ఫర్ ఎడ్యుకేషనల్ కమ్యూనికేషన్ (సీఈసీ)’ విధానాలను సమర్థవంతంగా వినియోగించుకోవడం. ►దేశంలో ‘ప్రీ డిజిటల్’ కాలానికి చెందిన లక్షలాది మంది బోధకుల్లో ఇన్సెంటివ్, ఇతర విధానాల ద్వారా మార్పులు తీసుకురావటం. మానవ వనరుల అభివృద్ధి కేంద్రాల పనితీరు ఇలా ►యూనివర్సిటీ స్థాయిలో ఏర్పాటు చేసే హెచ్ఆర్డీసీలు.. యూజీసీ ఆధ్వర్యంలో స్వయం ప్రతిపత్తితో కార్యకలాపాలు నిర్వహించాలి ►వర్సిటీలు, కాలేజీలకు మధ్య అనుసంధానాన్ని మెరుగుపర్చాలి.. వేర్వేరు రాష్ట్రాల్లోని వర్సిటీలను అనుసంధానించాలి ►యూజీసీ నిబంధనల మేరకు నూతన కోర్సులను ఇవి రూపొందించాలి ►ఇప్పటికే పనిచేస్తున్న బోధనా సిబ్బందికి పునశ్చరణ కార్యక్రమాలు నిర్వహించాలి ►వీటి నిర్వహణకు ఏటా రూ.25 లక్షల చొప్పున యూజీసీ అందిస్తుంది ►లైబ్రరీ, పరికరాల నిర్వహణ, ఇతర కార్యక్రమాలకు నిర్దేశిత మొత్తాలను ఇస్తుంది -
ఆరేళ్లయినా అంతంతే!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీల్లో సీట్ల పెంపుపై ఏళ్ల తరబడి నిరాసక్తత కొనసాగుతోంది. అటు యూనివర్సిటీలు, ఇటు ఉన్నత విద్యామండలి కూడా సీట్ల పెంపుపై ఆలోచనలు చేయడం లేదు. ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీనే పూర్తి కావడం లేదని, అందుకే డిమాండ్ ఉన్నా, కొత్త కోర్సులను ప్రవేశ పెట్టడంపై దృష్టి పెట్టడం లేదని అధికారులు బహిరంగంగానే అంగీకరిస్తున్నారు. కంప్యూటర్ సైన్స్ వంటి అనేక కోర్సులకు యూనివర్సిటీ కాలేజీల్లో భారీగా డిమాండ్ ఉంది. అయినా వాటిల్లో సీట్ల పెంపును ఎవరూ పట్టించుకోవడం లేదు. ఉమ్మడి రాష్ట్రంలో అదే పరిస్థితి ఉన్నా తెలంగాణ వచ్చాక కూడా ఆ దిశగా యూనివర్సిటీలు, ఉన్నత విద్యామండలి ఆలోచనలు చేయడం లేదు. కనీసం ఈ ఆరేళ్లలో ఒక్కసారి అయినా సీట్ల పెంపు కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించిన దాఖలు లేవు. రాష్ట్రంలోని ప్రైవేటు కాలేజీల్లో డిమాండ్ ఉన్న కోర్సుల్లో సీట్ల పెంపును ఇటీవల నిలిపివేశారు తప్ప గతంలో ఆమోదించారు. కానీ ప్రభుత్వ కాలేజీల్లో మాత్రం సీట్ల పెంపు దిశగా ఆలోచనలు చేయడం లేదు. ఉస్మానియా యూనివర్సిటీలోని ప్రతిష్టాత్మక ఇంజనీరింగ్ కాలేజీల్లో పదేళ్లుగా 420 సీట్లు మాత్రమే ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో విద్యార్థులు ప్రైవేటు కాలేజీల్లోకి వెళ్లక తప్పని పరిస్థితి నెలకొంది. కొన్ని మిగిలినా.. చేరే అవకాశంలేదు ప్రస్తుతం రాష్ట్రంలోని 7 యూనివర్సిటీల పరిధిలోని 14 ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీల్లో 3,055 సీట్లు అందుబాటులో ఉన్నాయి. అందులో కంప్యూటర్ సైన్స్, సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్సహా దాదాపు ఆ సీట్లు అన్నీ వంద శాతం భర్తీ అవుతున్నాయి. చివరకు ఎన్ఐటీ, ఐఐటీలకు ఎవరైనా వెళ్లిపోతే మాత్రమే వందలోపు వరకు సీట్లు మిగిలిపోతున్నాయి. వాటిల్లో చేరేందుకు స్లైడింగ్కు అవకాశం ఇవ్వకపోవడం వల్ల అవి ఖాళీగా ఉండిపోతున్నాయి. ఆ సీట్లలో చేరేందుకు అవకాశం ఇవ్వాలని విద్యార్థులు కోరుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. మరోవైపు కొత్త సీట్ల పెంపు విషయంలో ప్రభుత్వం ఇప్పుడు ఇంజనీరింగ్ సీట్లను పెంచవద్దని విధానపరమైన నిర్ణయం తీసుకుందని, అందుకే తాము ఆ దిశగా ఆలోచనలు చేయడం లేదని అధికారులు చెబుతుండటం గమనార్హం. కానీ యూనివర్సిటీల్లో ఇంజనీరింగ్ కాలేజీల్లో సీట్లకు ఉండే డిమాండ్కు అనుగుణంగా తగిన చర్యలు చేపట్టాలన్న ఆలోచనలు చేయకపోవడంతో విద్యార్థులకు ఏటా నిరాశ తప్పడం లేదు. ఇవే కాదు బీఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లోనూ అదే పరిస్థితి నెలకొంది. రాష్ట్రంలోని యూనివర్సిటీల్లో ఫార్మసీ కాలేజీలు 3 మాత్రమే ఉండగా, వాటిల్లో కేవలం 180 సీట్లే ఉన్నాయి. ఫార్మసీ కోర్సులకు డిమాండ్ ఉన్నా సీట్ల పెంపును పట్టించుకోవడం లేదు. ఎంబీఏ కాలేజీలు 19 ఉండగా వాటిల్లో 1,290 సీట్లు మాత్రమే ఉన్నాయి. ఎంసీఏ కాలేజీలు 13 ఉండగా, వాటిల్లో 670 సీట్లు ఉన్నాయి. -
సీబీసీఎస్ అమలులో గందరగోళం
సాక్షి, హైదరాబాద్: డిగ్రీలో చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టం (సీబీసీఎస్) నిర్వహించడంలో వైస్ చాన్స్లర్లు అనుసరిస్తున్న ఇష్టారాజ్య విధానాలు విద్యార్థులను గందరగోళంలో పడేస్తున్నాయి. ఫలితంగా కొన్ని యూనివర్సిటీల్లో ఇంకా డిగ్రీ వార్షిక పరీక్షలు కొనసాగుతుండగా మరికొన్ని యూనివర్సిటీల్లో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభించేందుకు చర్యలు మొదలు పెట్టాయి. కొన్ని యూనివర్సిటీలు అయితే ఇటు పరీక్షలు నిర్వహిస్తూనే.. అటు కొత్త విద్యా సంవత్సర తరగతుల ప్రారంభానికి ప్రకటనలు చేస్తుండటంతో విద్యార్థుల్లో గందరగోళం నెలకొంది. గత విద్యా సంవత్సరంలో సీబీసీఎస్ అమలులో వైఫల్యం కారణంగానే డిగ్రీ పరీక్షలు మే నెలలో మొదలై ఇప్పటికీ పూర్తి కాకుండా జూలై వరకు కొనసాగించే పరిస్థితి నెలకొంది. ఉస్మానియాలో జూలై 8వ తేదీ వరకు, కాకతీయలో జూలై 2 వరకు, తెలంగాణ విశ్వవిద్యాలయంలో జూలై 6 వరకు, పాలమూరు వర్సిటీలో జూన్ 29 వరకు, శాతవాహన వర్సిటీలో జూన్ 24 వరకు, మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయంలో జూన్ 22వ తేదీ వరకు 2018–19 విద్యా సంవత్సర డిగ్రీ వార్షిక పరీక్షలు జరగనున్నాయి. ఈ పరీక్షలు పూర్తి కాకుండానే డిగ్రీ ద్వితీయ, తృతీయ సంవత్సర విద్యార్థులకు శాతవాహన, కాకతీయ, ఉస్మానియా, మహా త్మాగాంధీ విశ్వవిద్యాలయాలు జూన్ 17వ తేదీ నుంచి, పాలమూరు విశ్వవిద్యాలయం జూన్ 19వ తేదీ నుంచి, తెలంగాణ వర్సిటీ 26వ తేదీ నుంచి ఈ విద్యా సంవత్సరాన్ని ప్రారంభిస్తున్నట్టు ప్రకటించాయి. దీంతో విద్యార్థులే కాదు.. అధ్యాపకుల్లోనూ గందరగోళం నెలకొంది. విద్యార్థుల్లో అయోమయం.. ఓవైపు పరీక్షలు పూర్తి కాకుండానే యూనివర్సిటీలు మరుసటి విద్యాసంవత్సరం ప్రారంభించబోతున్నట్టు ప్రకటించడం చూసి విద్యార్థులు తీవ్ర అయోమయానికి గురవుతున్నారు. విశ్వవిద్యాలయ అధికారుల అసమర్థత వల్ల మండుటెండల్లో పరీక్షలు రాస్తున్న విద్యార్థులు అసలు పరీక్షలు పూర్తి కాకుండా తరగతులకు ఎలా హాజరవుతారని వారు ప్రశ్నిస్తున్నారు. ఒక విద్యాసంవత్సరం పూర్తి చేసి పరీక్షలు రాసిన విద్యార్థులకు కనీసం రెండు వారాలైనా సెలవులు ఉండాలని ఆ తర్వాతే తరగతులు ప్రారంభించాలని వారు కోరుతున్నారు. పరీక్షల నిర్వహణలో అసమర్థత వల్ల డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులు కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో పీజీ ఎంట్రన్స్ రాయలేకపోయారని, రాష్ట్ర స్థాయిలో నిర్వహించిన ఐసెట్, లాసెట్ లాంటి పరీక్షలకు కూడా పూర్తిస్థాయిలో సన్నద్ధం కాలేకపోయామని, ఫలితంగా నష్టపోవాల్సి వచ్చిందని వాపోతున్నారు. ఈసారి అయినా పక్కా చర్యలు చేపట్టాలి కామన్ అకడమిక్ క్యాలెండర్ అన్ని యూనివర్సిటీల్లో అమలు చేసేలా చూడాలని ఉన్నత విద్యామండలిని మే మొదటి వారంలోనే తెలంగాణ ప్రభుత్వ కళాశాలల గెజిటెడ్ అధ్యాపక సంఘం కోరింది. అయినప్పటికీ ఉన్నత విద్యా మండలి పూర్తిస్థాయిలో శ్రద్ధ కనబరచడం లేదని సంఘం రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు డాక్టర్ సంజీవయ్య, డాక్టర్ కె.సురేందర్రెడ్డి ఆరోపించారు. యూనివర్సిటీ అధికారులు కూడా నిర్ణయాలు తీసుకోవడంలో తమకు స్వేచ్ఛ ఉందని, ఎవరి విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తున్నారని వారు ఆరోపించారు. -
‘పరిశోధనకు’ ప్రాధాన్యమేదీ?
సాక్షి, హైదరాబాద్: పరిశోధన.. ఇప్పుడు ఉన్నత విద్యాసంస్థల్లో నాణ్యత ప్రమాణాలతోపాటు పరిశోధనలకు ప్రాధాన్యం పెరిగింది. యూనివర్సిటీలు, ఉన్నత విద్యాసంస్థలన్నీ పరిశోధనలకు ప్రాధాన్యం ఇస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం కూడా పరిశోధనల వైపే మొగ్గుచూపుతుండటంతో అన్ని రాష్ట్రాలు అందుకు అనుగుణంగా ముందుకు సాగుతున్నాయి. అయితే తెలంగాణలో మాత్రం పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. తెలంగాణలోని విద్యాసంస్థలు పరిశోధనల్లో ఇంకా వెనుకబడే ఉన్నాయి. డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ (పీహెచ్డీ) ప్రవేశాల్లో ప్రధాన రాష్ట్రాలన్నీ ముందుండగా, తెలంగాణ మాత్రం 12వ స్థానానికే పరిమితమైంది. అత్యధికంగా తమిళనాడులో 29,778 మంది విద్యార్థులు పీహెచ్డీలు చేస్తుండగా, తెలంగాణలో 4,884 మంది మాత్రమే పీహెచ్డీ విద్యార్థులు ఉన్నారు. దేశవ్యాప్తంగా పెరుగుతున్నా.. గడిచిన ఆరేళ్లలో పరిస్థితిని పోల్చితే దేశవ్యాప్తంగా పీహెచ్డీ ప్రవేశాలు ఏటేటా పెరుగుతున్నాయి. కానీ తెలంగాణలో మాత్రం ఆశించిన మేర పీహెచ్డీ ప్రవేశాలు పెరగడం లేదు. ఉస్మానియా, కాకతీయ వంటి యూనివర్సిటీల్లో పీహెచ్డీ ప్రవేశాల విషయంలో గొడవలు సర్వసాధారణం అయ్యాయి. చివరకు తెలుగు యూనివర్సిటీలోనూ అదే పరిస్థితి నెలకొంది. రెండేళ్ల కిందటి విద్యా సంవత్సరాన్ని పేర్కొంటూ ఇటీవల పీహెచ్డీ ప్రవేశాలకు తెలుగు యూనివర్సిటీ నోటిఫికేషన్ జారీ చేసిందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. మిగతా యూనివర్సిటీల్లో ప్రొఫెసర్లు లేకపోయినా పీహెచ్డీ ప్రవేశాలు చేపట్టడం, ప్రొఫెసర్లు ఉన్న చోట వివాదాలతో పీహెచ్డీలకు ప్రవేశాలు జారీ చేయకపోవడం వంటి సమస్యలతో రాష్ట్రంలో పీహెచ్డీ ప్రవేశాలు గందరగోళంగా మారాయి. రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కాలేజీల్లో పీహెచ్డీ గ్రాడ్యుయేట్లు దాదాపు 30 వేల మంది వరకు అవసరమున్నా, కేవలం 2 వేలలోపే ఉండటంతో ఇంజనీరింగ్ కాలేజీల యాజమాన్యాలు ఇతర రాష్ట్రాల అభ్యర్థులపై ఆధారపడాల్సి వస్తోంది. కాలేజీలకు అవసరాలు ఉండటంతో ఇతర రాష్ట్ర యూనివర్సిటీల నుంచి పీహెచ్డీలను కొనుక్కుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయంలో జేఎన్టీయూహెచ్ కూడా నకిలీ పీహెచ్డీలను గుర్తించి, ఆ ఫ్యాకల్టీని బ్లాక్ లిస్టులో పెట్టింది. పీజీలు చేస్తున్నా పీహెచ్డీలకు దూరం.. దేశవ్యాప్తంగా పీజీ కోర్సుల్లో లక్షల మంది చేరుతున్నా అంతా పీహెచ్డీలు చేయడం లేదు. గడిచిన ఆరేళ్లలో పీహెచ్డీలు చేస్తున్న వారి సంఖ్య పెరిగినా ఆశించిన స్థాయిలో లేదన్నది విద్యావేత్తల అభి ప్రాయం. దేశవ్యాప్తంగా ఉన్నత విద్యా సంస్థల్లో 72.65 లక్షల మంది చదువుతుండగా, అందులో పీహెచ్డీలు చేస్తున్న విద్యార్థుల సంఖ్య కేవలం 0.5 శాతమే. యూనివర్సిటీలు, కాలేజీలుసహా దేశవ్యాప్తంగా 1,61,412 మంది విద్యార్థులు పీహెచ్డీలు చేస్తున్నారు. యూనివర్సిటీలు మినహా పీహెచ్డీ కోర్సులను నిర్వహిస్తున్న కాలేజీలు దేశంలో 3.6 శాతమే ఉన్నట్లు కేంద్ర ఉన్నత విద్యాశాఖ అంచనా వేసింది. పీహెచ్డీలు చేస్తున్న మొత్తం విద్యార్థుల్లో అత్యధికంగా 43,959 మంది (31.6 శాతం) రాష్ట్ర యూనివర్సిటీల్లో పీహెచ్డీలు చేస్తుండగా, జాతీయ స్థాయి విద్యాసంస్థల్లో 28,383 మంది (20.4 శాతం) చేస్తున్నారు. సెంట్రల్ యూనివర్సిటీల్లో 15.8 శాతం మంది, డీమ్డ్ యూనివర్సిటీల్లో 13.4 శాతం మంది పీహెచ్డీలు చేస్తున్నారు. మిగతా వారు ఇతర ప్రైవేటు యూనివర్సిటీలు, కాలేజీల్లో చేస్తున్నారు. మొత్తం పీహెచ్డీ ప్రవేశాల్లో 3,110 మంది ఇంటిగ్రేటెడ్ పీహెచ్డీలు చేస్తున్నారు. మరోవైపు పీహెచ్డీ చేస్తున్న వారిలో మహిళలకంటే పురుషులే ఎక్కువ మంది ఉన్నట్లు కేంద్రం లెక్కలు తేల్చింది. సైన్స్కోర్సుల్లోనేఎక్కువ మంది.. దేశంలో అత్యధికంగా సైన్స్ కోర్సుల్లోనే పీహెచ్డీలు చేస్తున్నారు. ఆ తరువాత స్థానం ఇంజనీరింగ్దే. సైన్స్ స్ట్రీమ్లో మొత్తంగా 41,844 మంది పీహెచ్డీలు చేస్తుండగా, ఇంజనీరింగ్లో 38,714 మంది చేస్తున్నారు. ఇందులోనూ మెకానికల్ ఇంజనీరింగ్లో 5,235 మంది, సివిల్ ఇంజ నీరింగ్లో 35,967 మంది పీహెచ్డీలు చేస్తున్నారు. సైన్స్లో పీహెచ్డీలు చేస్తున్న వారిలో 5,612 మంది (21.1%) అగ్రికల్చర్, అనుబంధ రంగాల్లో చేస్తున్నారు. ఇందులో 58.9% మంది పురుషులే ఉన్నారు. తమ పీజీ పూర్తయ్యాక ఇంజనీరింగ్లో 20.07 శాతం మంది పీహెచ్డీలలో చేరుతున్నారు. మెడికల్ సైన్స్లో 7,086 మంది, సోషల్ సైన్స్లో 18,366 మంది పీహెచ్డీలు చేస్తుండగా, కామర్స్లో 4,493 మంది పీహెచ్డీలలో చేరారు. భారతీయ భాషల్లో 7,850 మంది, విదేశీ భాష ల్లో 3,889 మంది పీహెచ్డీలు చేస్తుండగా ఒక్క ఇంగ్లిష్లోనే 3,110 మంది పీహెచ్డీలలో చేరారు. -
ఉన్నత విద్యాసంస్థల్లో సీట్లు... 25 శాతం పెంపు
సాక్షి, హైదరాబాద్ : దేశంలోని ఉన్నత విద్యాసంస్థల్లో ప్రస్తుతం ఉన్న సీట్లకు అదనంగా 25 శాతం సీట్ల పెరుగుదల వచ్చే విద్యా సంవత్సరం నుంచి (2019–20) అమల్లోకి రానుంది. ఈ మేరకు సీట్ల పెంపు విధానంపై కేంద్ర మానవవనరుల అభివృద్ధిశాఖ (ఎంహెచ్ఆర్డీ) స్పష్టత ఇచ్చింది. అగ్రవర్ణ పేదలకు కేంద్ర ప్రభుత్వం 10 శాతం రిజర్వేషన్లను కల్పించిన నేపథ్యంలో దేశంలోని అన్ని కేంద్ర విద్యాసంస్థల్లో సీట్లు పెంచుతూ రూపొందించిన విధానాన్ని హెచ్ఆర్డీ శాఖ వెల్లడించింది. దానికి ఆర్థికంగా వెనుకబడిన వర్గాలుగా (ఈడబ్ల్యూఎస్) నామకరణం చేసింది. ఈ మేరకు మంగళవారం ఎంహెచ్ఆర్డీ అడ్మిషన్స్ చైర్మన్ ప్రొఫెసర్ కేఎస్ఎన్ కాశీవిశ్వనాథం నివేదికను ఎంహెచ్ఆర్డీ డైరెక్టర్కు అందజేశారు. ఆ నివేదికను యథాతథంగా అన్ని జాతీయ విద్యాసంస్థలకు ఎంహెచ్ఆర్డీ పంపించింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 900 యూనివర్సిటీలు, 40 వేల కాలేజీలు ఉండగా వాటన్నింటిలో 25 శాతం సీట్లను పెంచి ఈడబ్ల్యూఎస్ విద్యార్థుల కోసం ప్రత్యేకంగా అమల్లోకి తెచ్చిన రిజర్వేషన్లు అమలు చేయాలని అందులో స్పష్టం చేసింది. ఇందులో భాగంగా ప్రతి 100 సీట్లకు 25 సీట్లను అదనంగా పెంచి 125 ïసీట్లు చేయనుంది. ప్రస్తుతం ఉన్న రిజర్వేషన్ల కోటా ఏమాత్రం తగ్గకుండా అదనపు సీట్లలో ఈడబ్ల్యూఎస్ విద్యార్థులకు అదనంగా సీట్లను కేటాయించాలని çవివరించింది. అంటే ప్రతి 125 సీట్లను 100 శాతంతో సమానంగా పరిగణనలోకి తీసుకొని ఓసీ కేటగిరీలో మాత్రం అదనంగా సీట్లను కేటాయిస్తూ రిజర్వేషన్లు అమలు చేయాలని స్పష్టం చేసింది. ఉన్న రిజర్వేషన్లకు భంగం వాటిల్లకుండా: ప్రస్తుతం ఉన్న రిజర్వేషన్లకు ఏమాత్రం భంగం వాటిల్లకుండా ఈడబ్ల్యూఎస్ విద్యార్థుల కోసం అమల్లోకి తెచ్చిన రిజర్వేషన్లను అమలు చేయాలని ఎంహెచ్ఆర్డీ నిర్ణయించింది. ప్రస్తుతం ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 7.5 శాతం, ఓబీసీలకు 27 శాతం, ఓపెన్ కేటగిరీ (ఓసీ) వారికి 50.5 శాతం రిజర్వేషన్లను కేంద్రం అమలు చేస్తోంది. పెంచిన సీట్లను ఆ రిజర్వేషన్లకు అనుగుణంగా సమాన పెంపును వర్తింపజేయాలని స్పష్టం చేసింది. అంటే అదనంగా పెరిగిన 25 శాతం సీట్లలో ఈడబ్ల్యూఎస్ విద్యార్థులకు ప్రత్యేకంగా కేటాయించాలని ఫార్ములాను జారీ చేసింది. ఇందులో ఈడబ్ల్యూఎస్ విద్యార్థులకు సీట్లను కేటాయించడంతోపాటు ఇప్పుడున్న ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఓసీ రిజర్వేషన్లకు భంగం వాటిల్లకుండా ఓసీ కేటగిరీలోనే ఈడబ్ల్యూఎస్ విద్యార్థులకు అదనంగా సీట్లు వచ్చేలా ఫార్ములాను ప్రకటించింది. 25 శాతం సీట్లు పెంచిన ప్రకారం.. ప్రస్తుతం ఎస్సీలకు రిజర్వేషన్ల ప్రకారం ప్రతి వంద సీట్లకుగాను 15 సీట్లు వస్తుండగా ఇకపై 19 సీట్లు లభిస్తాయి. అలాగే ఎస్టీలకు 7.5 సీట్లు వస్తుండగా ఇకపై 9 సీట్లు కేటాయిస్తారు. ఓబీసీలకు 27 సీట్లు ఇస్తుండగా ఇకపై 34 సీట్లను కేటాయిస్తారు. ఓపెన్ కేటగిరీలో 50.5 సీట్లను అన్ని వర్గాల వారికి సమానంగా ఇస్తుండగా దాన్ని యథాతథంగా (నాన్ ఈడబ్లూఎస్ పేరుతో) కొనసాగిస్తారు. ఇందులోనే వాటికి అదనంగా ఈడబ్ల్యూఎస్ విద్యార్థులకు 12 సీట్లను ఇస్తారు. ఇలా మొత్తంగా 125 సీట్లను 100 శాతంగా తీసుకొని భర్తీ చేసేలా మావనవనరుల అభివృద్ధిశాఖ చర్యలు చేపట్టింది. లక్షల్లో సీట్లు పెరుగుదల... కేంద్రం నిర్ణయం ప్రకారం దేశంలోని విద్యాసంస్థల్లో లక్షల సంఖ్యలో సీట్లు పెరగనున్నాయి. ఈ పెంపును జాతీయస్థాయి విద్యాసంస్థలతోపాటు రాష్ట్రాల్లో ప్రభుత్వం నుంచి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆర్థిక సహాయం పొందే విద్యాసంస్థల్లోనూ ఈ పెంపును అమలు చేయాలని ఇప్పటికే ఎంహెచ్ఆర్డీ డైరెక్టర్ అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు ఇటీవల ఆదేశాలు జారీ చేశారు. తాజాగా సీట్ల పెంపు విధానం, రిజర్వేషన్ల వర్తింపు విధానంపై స్పష్టత ఇవ్వడంతో ఆ దిశగా అన్ని రాష్ట్రాలూ చర్యలు చేపట్టే వీలుంది. దీంతో లక్షల సంఖ్యలో సీట్లు పెరగనున్నాయి. ఇందులో భాగంగా రాష్ట్రంలోనూ ఇంజనీరింగ్ వంటి కోర్సుల్లో సీట్లను పెంచే అవకాశం ఉంది. ప్రస్తుతం సాధారణ డిగ్రీలోని 4.32 లక్షల సీట్లలో 2.40 లక్షల సీట్లే భర్తీ అవుతున్నాయి. వాటిల్లో పెంపును పక్కన పెట్టినా ఇంజనీరింగ్, ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ, లా, బీఎడ్, డీఎడ్ వంటి వృత్తివిద్యా కోర్సుల్లో 2 లక్షల వరకు సీట్లు ఉన్నాయి. 25 శాతం పెంపు ప్రకారం వాటిల్లో 50 వేల వరకు సీట్లు పెరిగే అవకాశం ఉంది. ఇవి కాకుండా జాతీయస్థాయిలో తెలుగు విద్యార్థులు ఎక్కువగా పోటీ పడే ముఖ్యమైన విద్యాసంస్థలైన కేంద్రీయ విశ్వవిద్యాలయాలు, ఐఐటీలు, ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీలు, ప్రభుత్వ ఆర్థిక సహకారంతో కొనసాగే జాతీయస్థాయి సాంకేతిక విద్యా సంస్థ (జీఎఫ్టీఐ)ల్లో 9,489 సీట్లు అదనంగా పెరుగునున్నాయి. తెలుగు విద్యార్థులకు మరిన్ని సీట్లు.. దేశంలోని ఐఐటీలు, ఎన్ఐటీలు, ట్రిపుల్ఐటీలు, జీఎప్టీఐలలో ఏటా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు 18 శాతం వరకు సీట్లను సొంతం చేసుకుంటున్నారు. ఈ లెక్కన ఇకపై పెరిగే 9,489 సీట్లలోనూ అదే నిష్పత్తిలో మన విద్యార్థులకు అదనపు సీట్లు లభించనున్నాయి. ప్రస్తుతం ఆయా విద్యాసంస్థల్లో 37,952 సీట్లు ఉండగా 25 శాతం సీట్ల పెంపుతో అదనంగా 9,489 సీట్లను ఏర్పాటు చేయనున్నారు. దీంతో వాటిల్లోని సీట్ల సంఖ్య 47,441కి చేరుకోనుంది. దీంతో పోటీలో ముందుండే తెలంగాణ, ఏపీ విద్యార్థులకు అదనంగా ప్రయోజనం చేకూరే అవకాశం ఉంది. ఇవి కాకుండా బాలికల కోసం ప్రత్యేకంగా సూపర్ న్యూమరీ కింద ఐఐటీల్లో 800, ఎన్ఐటీల్లో 653 సీట్లను, జీఎఫ్టీఐలలోనూ సీట్లను ఎంహెచ్ఆర్డీ పెంచింది. వరంగల్ ఎన్ఐటీలో 210 సీట్లు... జాతీయస్థాయి పోటీనే కాకుండా హోంస్టేట్ కోటా 50 శాతం సీట్లను స్థానికులకే కేటాయించే వరంగల్ ఎన్ఐటీలో 210 సీట్లు పెరగనున్నట్లు ఎన్ఐటీ డైరెక్టర్ ప్రొఫెసర్ ఎన్వీ రమణరావు పేర్కొన్నారు. అంటే ఇందులో తెలంగాణ విద్యార్థులకే 105 సీట్లు వచ్చే విద్యా సంవత్సరం నుంచి అదనంగా లభించనున్నాయి. ప్రస్తుతం వరంగల్ ఎన్ఐటీలో 840 సీట్లు ఉండగా ప్రతి వందకు 25 సీట్ల చొప్పున పెంపుతో వాటి సంఖ్య 1,050కి చేరనుంది. అలాగే జాతీయస్థాయి పోటీగల హైదరాబాద్ ఐఐటీ, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీల్లోనూ సీట్లు పెరుగుతాయి. మొత్తంగా దేశంలోని సెంట్రల్ యూనివర్సిటీల్లో ప్రస్తుతం 7,23,679 సీట్లు ఉండగా 1,80,918 సీట్ల పెంపుతో అవి 9,04,598 లక్షలకు చేరుకోనున్నాయి. -
అర్హతలున్నా అలక్ష్యం!
పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా 30 శాతం సిలబస్ను మార్చుకుని కోర్సులు నిర్వహించుకునేలా అర్హతలున్న కాలేజీలకు అటానమస్ హోదా ఇవ్వడంలో యూనివర్సిటీలు అలసత్వం ప్రదర్శిస్తున్నాయి. అర్హతలున్న కాలేజీలు అటానమస్ హోదా తీసుకునేలా ప్రోత్సహించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ), అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) పదేపదే చెబుతున్నా వర్సిటీలు పట్టించుకోవట్లేదు. తమిళనాడు మినహా మిగతా రాష్ట్రాలు అటానమస్ హోదా ఇచ్చే విషయంలో ఘోరంగా విఫలమయ్యాయి. తెలంగాణ రాష్ట్రంలోనూ అర్హత కలిగిన కాలేజీలు అనేకం ఉన్నా అటానమస్ హోదా కోసం ప్రయత్నిస్తున్న కాలేజీలు పెద్దగా లేవు. రాష్ట్రంలోని 11 యూనివర్సిటీల పరిధిలో దాదాపు 3 వేల ఉన్నత విద్యాసంస్థలు ఉంటే కేవలం 59 కాలేజీలకే అటానమస్ హోదా ఉండటం ఈ పరిస్థితికి అద్దం పడుతోంది. – సాక్షి, హైదరాబాద్ పెత్తనం పోతుందనే... విద్యార్థులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పనే లక్ష్యంగా ఉన్నత విద్యలో నాణ్యతా ప్రమాణాలు పెంచేందుకు అనేక చర్యలు చేపడుతున్న కేంద్రం... న్యాక్ గుర్తింపు ఉంటేనే రూసా నిధులను ఇస్తామన్న నిబంధనను విధించింది. అంతేకాదు న్యాక్ గుర్తింపు ఇచ్చే నిబంధనలను మార్చింది. విద్యార్థుల అభిప్రాయాలను, ఆ కాలేజీలో క్యాంపస్ ప్లేస్మెంట్లను కూడా పరిగణనలోకి తీసుకున్నాకే న్యాక్ గుర్తింపు ఇచ్చేలా నిబంధనలను సవరించింది. మరోవైపు న్యాక్ గుర్తింపు ఉన్న కాలేజీలన్నీ అటానమస్ కోసం చర్యలు చేపట్టేలా అవగాహన కల్పించేందుకు సిద్ధమైంది. కానీ రాష్ట్రాల్లోని యూనివర్సిటీల అధికారులు తమ పరిధిలోని కాలేజీలపై పెత్తనం పోతుందని, తమకు వచ్చే ముడుపులకు గండి పడుతుందన్న ఆలోచనలతో ప్రమాణాలుగల కాలేజీలు అటానమస్ హోదా కోసం దరఖాస్తు చేసుకునేలా ప్రోత్సహించడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. అంతేకాదు కొన్ని కా>లేజీలు దరఖాస్తు చేసుకున్నా ఎన్వోసీ ఇవ్వకుండా యూజీసీకి ఆ దరఖాస్తులను పంపట్లేదన్న విమర్శలు ఉన్నాయి. అటానమస్తో ఎన్నెన్నో ప్రయోజనాలు.. .అటానమస్ హోదా వల్ల కాలేజీలకే అనేక ప్రయోజనాలు చేకూరనున్నాయి. కాలేజీలు మార్కెట్ అవసరాలకు అనుగుణంగా 30% సిలబస్ను మార్పు చేసుకోవచ్చు. తద్వారా విద్యార్థులు ఎక్కువగా తమ కాలేజీ ల్లో చేరేలా ఆకర్షించవచ్చు. సొంత పరీక్షల విధానం అమలు చేసుకోవచ్చు. పారిశ్రామిక అవసరాలకు తగిన ట్లు సిలబస్ రూపొందించుకుని అమలు చేస్తారు కనుక పరిశ్రమలు కూడా అటానమస్ కాలేజీల నుంచే ఎక్కు వ మంది విద్యార్థులకు క్యాంపస్ ప్లేస్మెంట్లు ఇచ్చే అవకాశం ఉంటుంది. డీమ్డ్ టు బి యూనివర్సిటీ హోదా పొందేందుకు అటానమస్ హోదా తప్పనిసరి. అటానమస్ హోదాకు దరఖాస్తు చేసే కాలేజీల్లోని కోర్సులకు ఎన్బీఏ 675 పాయింట్లకంటే ఎక్కువ స్కోర్ ఉండాలని లేదా కనీసం న్యాక్ ఏ గ్రేడ్ కలిగి ఉండాలి. రాష్ట్రంలో పరిస్థితి ఇలా.. రాష్ట్రంలోని 11 యూనివర్సిటీల పరిధిలోని 3 వేల వరకు కాలేజీలు ఉంటే వాటిలో కేవలం 59 కాలేజీలకే అటానమస్ హోదా ఉంది. ముఖ్యంగా ఉస్మానియా యూనివర్సిటీ, జేఎన్టీయూ, కాకతీయ, తెలంగాణ యూనివర్సిటీల పరిధిలోని 42 ఇంజనీరింగ్ కాలేజీలకు అటానమస్ హోదా ఉండగా మిగతావి డిగ్రీ, పీజీ, బీఎడ్ కాలేజీలు. 658 కాలేజీలకే అటానమస్ ప్రస్తుతం దేశవ్యాప్తంగా 900 వరకు యూనివర్సిటీలు, 40 వేల వరకు ఉన్నతవిద్య కాలేజీలు ఉన్నాయి. యూజీసీ ఇటీవల జారీ చేసిన లెక్కల ప్రకారం 25 రాష్ట్రాల్లోని 106 వర్సిటీల పరిధిలోని 658 కాలేజీలకే అటానమస్ హోదా ఉంది. ఈ పరిస్థితుల్లో కాలేజీల్లో నాణ్యతా ప్రమాణాలను పెంచడం తోపాటు అటానమస్ హోదా తీసుకునేలా కాలేజీలను ప్రోత్సహించాలని కేంద్రం తెలి పింది. దీనిలో భాగంగా అటానమస్కు దరఖాస్తు చేసేలా కాలేజీలను ప్రోత్సహించేం దుకు ఫిబ్రవరి 4న యూజీసీ మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీలో దేశవ్యాప్త సదస్సు నిర్వహించనుంది. మార్పులు తెచ్చుకోవాలి.. యూనివర్సిటీలు తమ విధానాల్లో మార్పులు తెచ్చుకోవాలి. కాలేజీలపై పెత్తనం కోసం పాకులాడవద్దు. అర్హత కలిగిన కాలేజీలు అటానమస్ హోదా కోసం దరఖాస్తు చేసుకునేలా ప్రోత్సహించాలి. అప్పుడే నాణ్యత ప్రమాణాలు పెరుగుతాయి. – తుమ్మల పాపిరెడ్డి, ఉన్నత విద్యామండలి చైర్మన్ -
అర్హతలున్నా అలక్ష్యం!
పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా 30 శాతం సిలబస్ను మార్చుకుని కోర్సులు నిర్వహించుకునేలా అర్హతలున్న కాలేజీలకు అటానమస్ హోదా ఇవ్వడంలో యూనివర్సిటీలు అలసత్వం ప్రదర్శిస్తున్నాయి. అర్హతలున్న కాలేజీలు అటానమస్ హోదా తీసుకునేలా ప్రోత్సహించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ), అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) పదేపదే చెబుతున్నా వర్సిటీలు పట్టించుకోవట్లేదు. తమిళనాడు మినహా మిగతా రాష్ట్రాలు అటానమస్ హోదా ఇచ్చే విషయంలో ఘోరంగా విఫలమయ్యాయి. తెలంగాణ రాష్ట్రంలోనూ అర్హత కలిగిన కాలేజీలు అనేకం ఉన్నా అటానమస్ హోదా కోసం ప్రయత్నిస్తున్న కాలేజీలు పెద్దగా లేవు. రాష్ట్రంలోని 11 యూనివర్సిటీల పరిధిలో దాదాపు 3 వేల ఉన్నత విద్యాసంస్థలు ఉంటే కేవలం 59 కాలేజీలకే అటానమస్ హోదా ఉండటం ఈ పరిస్థితికి అద్దం పడుతోంది. – సాక్షి, హైదరాబాద్ పెత్తనం పోతుందనే... విద్యార్థులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పనే లక్ష్యంగా ఉన్నత విద్యలో నాణ్యతా ప్రమాణాలు పెంచేందుకు అనేక చర్యలు చేపడుతున్న కేంద్రం... న్యాక్ గుర్తింపు ఉంటేనే రూసా నిధులను ఇస్తామన్న నిబంధనను విధించింది. అంతేకాదు న్యాక్ గుర్తింపు ఇచ్చే నిబంధనలను మార్చింది. విద్యార్థుల అభిప్రాయాలను, ఆ కాలేజీలో క్యాంపస్ ప్లేస్మెంట్లను కూడా పరిగణనలోకి తీసుకున్నాకే న్యాక్ గుర్తింపు ఇచ్చేలా నిబంధనలను సవరించింది. మరోవైపు న్యాక్ గుర్తింపు ఉన్న కాలేజీలన్నీ అటానమస్ కోసం చర్యలు చేపట్టేలా అవగాహన కల్పించేందుకు సిద్ధమైంది. కానీ రాష్ట్రాల్లోని యూనివర్సిటీల అధికారులు తమ పరిధిలోని కాలేజీలపై పెత్తనం పోతుందని, తమకు వచ్చే ముడుపులకు గండి పడుతుందన్న ఆలోచనలతో ప్రమాణాలుగల కాలేజీలు అటానమస్ హోదా కోసం దరఖాస్తు చేసుకునేలా ప్రోత్సహించడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. అంతేకాదు కొన్ని కా>లేజీలు దరఖాస్తు చేసుకున్నా ఎన్వోసీ ఇవ్వకుండా యూజీసీకి ఆ దరఖాస్తులను పంపట్లేదన్న విమర్శలు ఉన్నాయి. అటానమస్తో ఎన్నెన్నో ప్రయోజనాలు.. .అటానమస్ హోదా వల్ల కాలేజీలకే అనేక ప్రయోజనాలు చేకూరనున్నాయి. కాలేజీలు మార్కెట్ అవసరాలకు అనుగుణంగా 30% సిలబస్ను మార్పు చేసుకోవచ్చు. తద్వారా విద్యార్థులు ఎక్కువగా తమ కాలేజీ ల్లో చేరేలా ఆకర్షించవచ్చు. సొంత పరీక్షల విధానం అమలు చేసుకోవచ్చు. పారిశ్రామిక అవసరాలకు తగిన ట్లు సిలబస్ రూపొందించుకుని అమలు చేస్తారు కనుక పరిశ్రమలు కూడా అటానమస్ కాలేజీల నుంచే ఎక్కు వ మంది విద్యార్థులకు క్యాంపస్ ప్లేస్మెంట్లు ఇచ్చే అవకాశం ఉంటుంది. డీమ్డ్ టు బి యూనివర్సిటీ హోదా పొందేందుకు అటానమస్ హోదా తప్పనిసరి. అటానమస్ హోదాకు దరఖాస్తు చేసే కాలేజీల్లోని కోర్సులకు ఎన్బీఏ 675 పాయింట్లకంటే ఎక్కువ స్కోర్ ఉండాలని లేదా కనీసం న్యాక్ ఏ గ్రేడ్ కలిగి ఉండాలి. రాష్ట్రంలో పరిస్థితి ఇలా.. రాష్ట్రంలోని 11 యూనివర్సిటీల పరిధిలోని 3 వేల వరకు కాలేజీలు ఉంటే వాటిలో కేవలం 59 కాలేజీలకే అటానమస్ హోదా ఉంది. ముఖ్యంగా ఉస్మానియా యూనివర్సిటీ, జేఎన్టీయూ, కాకతీయ, తెలంగాణ యూనివర్సిటీల పరిధిలోని 42 ఇంజనీరింగ్ కాలేజీలకు అటానమస్ హోదా ఉండగా మిగతావి డిగ్రీ, పీజీ, బీఎడ్ కాలేజీలు. 658 కాలేజీలకే అటానమస్ ప్రస్తుతం దేశవ్యాప్తంగా 900 వరకు యూనివర్సిటీలు, 40 వేల వరకు ఉన్నతవిద్య కాలేజీలు ఉన్నాయి. యూజీసీ ఇటీవల జారీ చేసిన లెక్కల ప్రకారం 25 రాష్ట్రాల్లోని 106 వర్సిటీల పరిధిలోని 658 కాలేజీలకే అటానమస్ హోదా ఉంది. ఈ పరిస్థితుల్లో కాలేజీల్లో నాణ్యతా ప్రమాణాలను పెంచడం తోపాటు అటానమస్ హోదా తీసుకునేలా కాలేజీలను ప్రోత్సహించాలని కేంద్రం తెలి పింది. దీనిలో భాగంగా అటానమస్కు దరఖాస్తు చేసేలా కాలేజీలను ప్రోత్సహించేం దుకు ఫిబ్రవరి 4న యూజీసీ మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీలో దేశవ్యాప్త సదస్సు నిర్వహించనుంది. మార్పులు తెచ్చుకోవాలి.. యూనివర్సిటీలు తమ విధానాల్లో మార్పులు తెచ్చుకోవాలి. కాలేజీలపై పెత్తనం కోసం పాకులాడవద్దు. అర్హత కలిగిన కాలేజీలు అటానమస్ హోదా కోసం దరఖాస్తు చేసుకునేలా ప్రోత్సహించాలి. అప్పుడే నాణ్యత ప్రమాణాలు పెరుగుతాయి. – తుమ్మల పాపిరెడ్డి, ఉన్నత విద్యామండలి చైర్మన్ -
ఎన్నికల వేళ మమత కీలక నిర్ణయం
కోల్కత్తా: లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని కళాశాలల్లో, విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్న అధ్యాపకుల పదవీ విరమణ వయస్సును పెంచుతున్నట్లు ప్రకటించారు. 62 ఏళ్లుగా ఉన్న అధ్యాపక ఉద్యోగ విరమణ వయస్సును 65 ఏళ్లకు పెంచారు. అదే విధంగా యూనివర్సిటీ వైఎస్ ఛాన్సలర్ (వీ.సీ) విరమణ వయస్సును కూడా 70 ఏళ్లకు పెంచారు. ఈ మేరకు సోమవారం కోల్కత్తా వర్సిటీలో జరిగిన స్నాతకోత్సవంలో మమత ప్రకటించారు. కార్యక్రమంలో బెనర్జీ మాట్లాడుతూ... ‘‘ 60 ఏళ్లు దాటిన తరువాత ఓ ఉద్యోగి పనిచేయలేడని నేను అనుకోను. వారి అనుభవాలు, సేవలు మన విద్యార్థులకు చాలా అవసరం. అందుకే అధ్యాపకుల పదవీ విరమణ వయస్సును పెంచుతున్నాం. బలహీన వర్గాల ఉన్నత విద్య కోసం రూ.200 కోట్లు విడుదల చేస్తున్నాం. మౌలిక సదుపాయాల కోసం రూ. 28000 కోట్లను ఈ ఏడాదికి ఖర్చు చేయదలచాం’ అని తెలిపారు. కాగా ఉన్నత విద్యపై మమతా బెనర్జీ ప్రత్యేక శ్రద్ద చూపుతున్న విషయం తెలిసిందే. దానిలో భాగంగానే నదియా జిల్లాలో కన్యశ్రీ విశ్వవిద్యాలయంకు జనవరి 10న శంకస్థాపన చేయనున్నట్లు వెల్లడించారు. -
సృజనాత్మకతకు ప్రాధాన్యత ఇవ్వాలి
న్యూఢిల్లీ: దేశంలోని ఉన్నత విద్యాసంస్థలు, విశ్వవిద్యాలయాలు చదువుతో పాటు సృజనాత్మకతకు సమ ప్రాధాన్యం ఇవ్వాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. సృజనాత్మకత అంటూ లేకుండాపోతే మానవ జీవితం దుర్భరమైపోతుందని వ్యాఖ్యానించారు. ‘అకడమిక్ లీడర్షిప్ ఆన్ ఎడ్యుకేషన్ ఫర్ రీసర్జెన్స్’ పేరుతో కేంద్ర మానవవనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ(హెచ్ఆర్డీ) శనివారం నాడిక్కడ నిర్వహించిన సమావేశంలో ప్రధాని మాట్లాడారు. ‘జ్ఞానం అన్నది పుస్తకాలకు పరిమితమైన విషయం కాదు. చదువు ముఖ్యోద్దేశం అన్ని కోణాల్లోనూ మనల్ని మనం పరిపూర్ణులుగా మలచుకోవడమే. కానీ సృజనాత్మకత లేకుండా అది సాధ్యం కాదు. సరికొత్త ఆలోచనలు లేకుంటే మానవ జీవితం దుర్భరమైపోతుంది. మన ప్రాచీన విశ్వవిద్యాలయాలైన తక్షశిల, నలంద, విక్రమశిల చదువుతో పాటు సృజనాత్మకతకు సమ ప్రాధాన్యం ఇచ్చాయి. కళాశాలలను, విశ్వవిద్యాలయాలను అనుసంధానం చేయడం ద్వారా వారిలో పరిశోధనలు, నూతన ఆవిష్కరణలపై ఆసక్తిని పెంపొందించాలి. తద్వారా దేశం ఎదుర్కొంటున్న పలు సమస్యలకు వినూత్నమైన పరిష్కారాలు లభించే వీలుంది’ అని మోదీ తెలిపారు. ‘చదువు, జ్ఞానం కంటే వ్యక్తిత్వ నిర్మాణానికి అంబేడ్కర్, పండిట్ దీన్దయాళ్ ఉపాధ్యాయ, రామ్మనోహర్ లోహియా అధిక ప్రాధాన్యత ఇచ్చారు. పరిపూర్ణమైన విద్యే ఓ వ్యక్తిని మనిషిగా తీర్చిదిద్దుతుందని స్వామి వివేకానంద నొక్కి వక్కాణించారు’ అని అన్నారు. ప్రతిపక్షంగా కాంగ్రెస్ విఫలమైంది దేశంలో ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్ విఫలమయిందనీ, ఆ పార్టీ క్షేత్రస్థాయిలో ప్రజల నుంచి దూరం జరిగిపోయిందని మోదీ విమర్శించారు. ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేయడం, అబద్ధాలను ప్రచారం చేయడమే ఏకైక అజెండాగా ఆ పార్టీ పెట్టుకుందని ఎద్దేవా చేశారు. బిలాస్పూర్, బస్తీ, చిత్తోర్గఢ్, ధనబాద్, మందసౌర్లోని బీజేపీ బూత్ స్థాయి కార్యకర్తలను ఉద్దేశించి శనివారం ‘నమో యాప్’ ద్వారా ప్రధాని మాట్లాడారు. కాంగ్రెస్ తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు అన్ని మాధ్యమాలను విస్తృతంగా వాడుకోవాలనీ, ప్రజల్లోకి చొచ్చుకెళ్లాలని మోదీ కార్యకర్తలకు సూచించారు. దేశంలో విజన్(దూరదృష్టి) లేనివారు టెలివిజన్లా మారి కామెడీ చేస్తున్నారని కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. పెద్ద నోట్ల రద్దు కారణంగా రియల్ఎస్టేట్ రంగంలో నల్లధనం తుడిచిపెట్టుకుపోయిందనీ, స్థిరాస్తుల ధరలు సామాన్యులకు అందుబాటులోకి వచ్చాయని వెల్లడించారు. అలాగే ప్రభుత్వం తీసుకున్న చర్యలతో ప్రజలు పొదుపు చేస్తున్న మొత్తం గత నాలుగేళ్లలో పెరిగిందన్నారు. ప్రభుత్వ అభివృద్ధి పథకాలు, తీసుకుంటున్న చర్యలతో 2014–17 మధ్యకాలంలో దాదాపు 3,500 మావోయిస్టులు లొంగిపోయారని ప్రధాని తెలిపారు. కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించాలన్న ఏకైక లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ సర్జికల్ స్ట్రైక్స్ యధార్థతను ప్రశ్నిస్తూ దేశానికి వ్యతిరేకంగా వెళుతోందని ప్రధాని విమర్శించారు. కార్గిల్ యుద్ధ విజయోత్సవాలను జరుపుకునేందుకు కాంగ్రెస్ నిరాకరించిందన్నారు. -
సర్జికల్ స్ట్రయిక్స్ సంబరాలు : యూజీసీ ఆదేశం
న్యూఢిల్లీ : సర్జికల్ స్ట్రయిక్స్ మీకు గుర్తుండే ఉంటుంది. సరిగ్గా రెండేళ్ల క్రితం పాక్ ఆక్రమిత కశ్మీర్లోని నియంత్రణ రేఖ వెంబడి మాటువేసిన తీవ్ర వాదులను మట్టుబెడుతూ.. భారత సైన్యం జరిపిన లక్షిత దాడులు. ఈ దాడులు ఇరు దేశాల మధ్య యుద్ధ వాతావరణాన్నే సృష్టించాయి.భారత సైన్యం జరిపిన ఈ దాడులతో పాక్ ఒక్కసారిగా భయభ్రాంతురాలైంది. భారత త్రివిధ (సైన్యం, నావికా, వైమానిక) దళాలు ఈ ఆపరేషన్లో పాల్గొన్నాయి. ఒళ్లు గగుర్పుటించే వీడియోలు కూడా బయటకి వచ్చాయి. సర్జికల్ స్ట్రయిక్స్ జరిపిన తర్వాత భారత సైన్యాన్ని వెల్లువెత్తిన ప్రశంసలు అన్నీ ఇన్నీ కావు. మరో వారం రోజులకు భారత సైన్యం జరిపిన ఈ సర్జికల్ స్ట్రయిక్స్కు రెండేళ్ల పూర్తవుతున్నాయి. ఈ సందర్భంగా దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాలు, ఉన్నత విద్యాసంస్థలు సెప్టెంబర్ 29వ తేదీని సర్జికల్ స్ట్రయిక్స్ దినోత్సవంగా జరుపుకోవాలని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. దీనిలో భాగంగా సాయుధ దళాల త్యాగాల గురించి మాజీ సైనికాధికారులతో చర్చా కార్యక్రమాలు, ప్రత్యేక కవాతులు, సాయుధ దళాలకు తమ మద్దతు తెలుపుతూ డిజిటల్ లేదా చేతిరాత గ్రీటింగ్ కార్డులను పంపడం లాంటి కార్యక్రమాలను నిర్వహించాలని యూజీసీ పేర్కొంది. అన్ని యూనివర్సిటీల్లో ఉన్న ఎన్సీసీ యూనిట్లు కూడా సెప్టెంబర్ 29న ప్రత్యేక పరేడ్లను నిర్వహించనున్నాయి. ఎన్సీసీ కమాండర్లు కూడా సరిహద్దు రక్షణ గురించి ప్రసంగించనున్నారు. అలాగే ఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద ప్రత్యేక మల్టీమీడియా ఎగ్జిబిషన్లో నిర్వహించనున్నట్లు యూజీసీ తెలిపింది. దీంతోపాటు అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు, ముఖ్య పట్టణాలు, ఇతర ప్రాంతాల్లోనూ ఎగ్జిబిషన్లు నిర్వహించే అవకాశం ఉందని, వీటిని విద్యార్థులు, అధ్యాపకులు సందర్శించాలని ఉపకులపతులకు గురువారం రాసిన లేఖలో యూజీసీ వెల్లడించింది. -
కాలేజీల్లో జంక్ ఫుడ్ అమ్మకాలపై నిషేధం
న్యూఢిల్లీ: అన్ని విశ్వవిద్యాలయాలు, ఉన్నత స్థాయి విద్యా సంస్థల్లో జంక్ ఫుడ్ అమ్మకాల్ని నిషేధించాలని యూజీసీ బుధవారం ఆదేశాలు జారీ చేసింది. ‘విద్యార్థుల జీవన ప్రమాణాలు మెరుగుపర్చడానికి కళాశాలల్లో జంక్ ఫుడ్ను నిషేధించాల్సిన అవసరముంది. ఆరోగ్య కరమైన పదార్థాలను అందించడం వల్ల విద్యా ర్థుల్లో ఏదైనా నేర్చుకోవాలనే దృక్పథం అలవ డుతుంది. ఊబకాయ సమస్యను సైతం దూరం చేయవచ్చు. అధికబరువుకు జీవనశైలి రుగ్మ తలకు ప్రత్యక్ష సంబంధం ఉంది. జంక్ఫుడ్ నిషేధం వల్ల ఈ రుగ్మతలన్నింటిని అధిగమించవచ్చు’ అని యూజీసీ పేర్కొంది. కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ ఇదివరకు ఇచ్చిన ఆదేశాల మేరకు విద్యా సంస్థల ప్రాంగణాల్లో జంక్ఫుడ్ అమ్మకాలపై నిషేధిస్తూ యూజీసీ ఈ నిర్ణయం తీసుకుంది. జంక్ఫుడ్, దాని వల్ల కలిగే దుష్ఫలితాలపై యువతకు అవగాహన కల్పించాలని యూజీసీ ఉత్తర్వుల్లో వర్సిటీలకు సూచించింది. -
వర్సిటీల్లో ‘కమీషన్ల’ సదస్సులు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రతి జిల్లాలో విశ్వవిద్యాలయాల్లో జ్ఞానభేరి సదస్సుల పేరిట ప్రభుత్వం భారీగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తోంది. ఈ సదస్సుల ముసుగులో రూ.100 కోట్లకుపైగా కమీషన్లు దండుకోవడానికి ప్రభుత్వ పెద్దలు స్కెచ్ వేసినట్లు తెలుస్తోంది. ఈ సదస్సుల కోసం ఒక్కో జిల్లాల్లో ఒక్కో యూనివర్సిటీకి రూ.కోటి చొప్పున ఖర్చవుతుందని, ఈ భారాన్ని ఉన్నత విద్యామండలి, ఆయా యూనివర్సిటీలు చెరి సగం భరించాలని ఉన్నత విద్యాశాఖ తొలుత ఉత్తర్వులు ఇచ్చింది. ప్రతి సదస్సుకు ఆ జిల్లాలోని 12 వేల మంది విద్యార్థులను తరలించాలని, వారికి వక్తృత్వం, వ్యాస రచన తదితర పోటీలు నిర్వహించాలని సూచించింది. 10 ఈవెంట్లలో నిర్వహించే ఈ పోటీల్లో గెలుపొందిన మొదటి ముగ్గురికి ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతుల కింద నగదును అందిస్తారు. ప్రథమ బహుమతి కింద రూ.లక్ష, ద్వితీయ బహుమతిగా రూ.50 వేలు, తృతీయ బహుమతిగా రూ.25 వేలు ఇవ్వనున్నారు. తిరుపతి శ్రీవేంకటేశ్వర యూనివర్సిటీలో ఇప్పటికే ఒక సదస్సు నిర్వహించారు. సదస్సుల నిర్వహణకు అయ్యే ఖర్చును వర్సిటీలు విద్యార్థుల నుంచి వసూలు చేసే ఫీజుల నుంచే సమకూర్చుకోవాల్సి ఉంటుంది. ప్రతి జిల్లాకు రూ.10 కోట్లు జ్ఞానభేరి సదస్సు కోసం ప్రతి జిల్లాకు రూ.కోటి చొప్పున ఖర్చు పెట్టాలని చెబుతూ వచ్చిన ప్రభుత్వం ఇప్పుడు ఆ వ్యయాన్ని 10 రెట్లు పెంచేసింది. సదస్సు నిర్వహణ కోసం ప్రతి జిల్లాకు రూ.10 కోట్ల చొప్పున కేటాయిస్తున్నామని సీఎం చంద్రబాబు, మంత్రి గంటా శ్రీనివాసరావు ఇటీవల ప్రకటించారు. ప్రతి జిల్లాలో జ్ఞానభేరి సదస్సుకు ఎంత దుబారాగా ఖర్చు చేసినా రూ.3 కోట్లకు మించి కాదని, ఏకంగా రూ.10 కోట్ల చొప్పున కేటాయించడం దోపిడీకేనన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పది రకాల ఈవెంట్లలో ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతుల కింద నగదు ప్రోత్సాహకంగా ఇచ్చే మొత్తం రూ.17.50 లక్షలే. ఇతర విద్యార్థులకు కేవలం పార్టిసిపేషన్ సర్టిఫికెట్లు ఇస్తారు. పోటీల నిర్వహణ, సదస్సులో పాల్గొనే విద్యార్థులకు, భోజనం, రవాణా, ఇతర సదుపాయలు, వేదిక ఏర్పాటుకు అంతా కలిపి రూ.3 కోట్లకు మించి ఖర్చు కాదని అంచనా. కానీ, ప్రతి జిల్లాకు రూ.10 కోట్ల చొప్పున 13 జిల్లాలకు రూ.130 కోట్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో రూ.100 కోట్ల వరకు కమీషన్ల రూపంలో ప్రభుత్వ పెద్దలు తమ జేబుల్లో వేసుకోబోతున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. వర్సిటీల్లో మౌలిక సదుపాయాలకు నిధులేవీ? రాష్ట్రంలో వర్సిటీల్లో, వాటి పరిధిలోని కళాశాలల్లో మౌలిక సదుపాయాల్లేక విద్యార్ధులు, అధ్యాపకులు నానా అవస్థలు పడుతున్నారు. గత ఏడాది రూ.380 కోట్లు ఇస్తామని ప్రభుత్వం జీఓ ఇచ్చి నయాపైసా విడుదల చేయలేదు. ఈ బడ్జెట్లో నిధులే లేవు. సదుపాయాల కల్పనకు నిధులు లేవని చెబుతున్న ప్రభుత్వం జ్ఞానభేరి సదస్సుల పేరిట వ్యక్తిగత ప్రచారం కోసం రూ.వందల కోట్లు ధారపోయడం దారుణమని పలువురు విమర్శిస్తున్నారు. ఎన్నికల ముందు విద్యార్థులను మభ్యపెట్టేందుకే సీఎం సదస్సులు నిర్వహిస్తున్నారని ఆరోపిస్తున్నారు. -
‘డిస్టెన్స్’పై యూజీసీ ఆంక్షలు
సాక్షి, హైదరాబాద్: ఓపెన్, డిస్టెన్స్ లెర్నింగ్ (ఓడీఎల్) కోర్సులకు అనుమతులు మంజూరు చేసే విషయంలో యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ) పలు విశ్వవిద్యాలయాలపై ఆంక్షలు విధించింది. 2018–19 విద్యా సంవత్సరం, ఆపై కాలానికి విశ్వవిద్యాలయాలు, వాటికి అనుమతిచ్చిన కోర్సులతో యూజీసీ ఇటీవల ఒక జాబితా విడుదల చేసింది. అందులో ముఖ్యమైన కోర్సులకు సంబంధించి ప్రభుత్వ విశ్వవిద్యాలయాలతో సహా చాలా వర్సిటీల పేర్లు గల్లంతయ్యాయి. దీంతో ఆయా వర్సిటీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. నియంత్రణ సంస్థల అనుమతి తప్పనిసరి ఎంబీఏ/ఎంసీఏ/బీఈడీ/ఎంఈడీ/బీఈడీ (స్పెషల్ ఎడ్యుకేషన్)/ఎంఈడీ (స్పెషల్ ఎడ్యుకేషన్)/హోటల్ మేనేజ్మెంట్ వంటి ప్రొఫెషనల్ కోర్సులకు గుర్తింపు లభించాలంటే తొలుత ఆయా కోర్సులకు సంబంధించిన నియంత్రణ సంస్థల అనుమతులు తీసుకోవాల్సి ఉంటుందని యూజీసీ కొత్త నిబంధనలు విధించింది. ఉదాహరణకు బీఈడీ వంటి కోర్సులను దూరవిద్యా విధానంలో ఆఫర్ చేయాలంటే యూజీసీకి దరఖాస్తు చేసుకోవడానికి ముందు నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ (ఎన్సీటీఈ) అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఇలా ప్రతి కోర్సుకూ ఆయా నియంత్రణ సంస్థల అనుమతి తీసుకోవాలి. ప్రైవేటు సంస్థలను నియంత్రించే విషయాన్ని సరిగా పట్టించుకోకుండా, ప్రభుత్వ ఉన్నత విద్యా సంస్థల విషయంలో యూజీసీ ఇలా వ్యవహరించడం సరికాదని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. కొత్త నిబంధనల వల్ల వర్సిటీ పాలనా వ్యవహారాలు గాడితప్పి, అసలు లక్ష్యాలు పక్కదారిపడతాయని వారు విమర్శిస్తున్నారు. -
వెళ్తోంది లక్షల్లో.. వస్తోంది వేలల్లో
సాక్షి, హైదరాబాద్: ఐఐటీలు.. ఐఐఎంలు.. ఇంకా ఎన్నో ప్రతిష్టాత్మక యూనివర్సిటీలు! అయినా విదేశీ విద్యార్థులను ఆకర్షించడంలో భారత్ వెనుకబడే ఉంది. విదేశాల్లో చదువుకునేందుకు మన దేశం నుంచి ఏటా లక్షల మంది వెళ్తుంటే.. విదేశాల నుంచి మాత్రం వేలల్లోనే వస్తున్నారు. ప్రపంచంలోని దాదాపు 90 దేశాల్లో 7.5 లక్షల మందికి పైగా భారతీయ విద్యార్థులు చదువుతుంటే మన దేశంలో మాత్రం విదేశీ విద్యార్థులు కేవలం 46,144 మందే చదువుకుంటున్నారు. ఏటా కొత్తగా వస్తున్న విదేశీ విద్యార్థుల సంఖ్యలో పెరుగుదల వేయి మాత్రమే ఉంది. రాష్ట్రాల వారీగా చూస్తే విదేశీ విద్యార్థులు ఎక్కువగా కర్ణాటకలో చదువుతుండగా.. ఆ తర్వాతి స్థానంలో ఉత్తరప్రదేశ్ ఉంది. తెలంగాణ ఆరో స్థానంలో ఉండగా, ఆంధ్రప్రదేశ్ 8వ స్థానంలో ఉంది. ఆరు రాష్టాల్లో అయితే విదేశీ విద్యార్థులు కేవలం పది మంది లోపే ఉన్నట్టు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. ఐదేళ్లతో పోలిస్తే కాస్త మెరుగు.. తక్కువ స్థాయిలోనే ఉన్నా గడచిన ఐదేళ్లుగా విదేశీ విద్యార్థుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. 2013–14 విద్యా సంవత్సరంలో భారత్లో 39,517 మంది విదేశీ విద్యార్థులు చదివితే 2017–18 నాటికి ఆ సంఖ్య 46,144కు పెరిగింది. రాష్ట్రాల వారీగా చూస్తే 2013–14లో కర్ణాటకలో 13,903 మంది చదవగా.. ప్రస్తుతం వారి సంఖ్య కాస్త తగ్గింది. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం 2013–14తో పోలిస్తే ప్రస్తుతం విద్యార్థుల సంఖ్య పెరిగింది. 2013–14లో తెలంగాణలో 2,103 మంది ఉండగా, ప్రస్తుతం ఆ సంఖ్య 2,877కు పెరిగింది. ఆంధ్రప్రదేశ్లో అప్పట్లో 862 మంది విదేశీ విద్యార్థులు ఉండగా.. ఇప్పుడు వారి సంఖ్య 2,092కు పెరిగింది. నేపాల్ విద్యార్థులే అధికం విదేశాల నుంచి భారత్కు వస్తున్నవారిలో ఎక్కువ మంది నేపాల్కు చెందిన వారే ఉన్నారు. చదువుల కోసం మన దేశం నుంచి విద్యార్థులు 166 దేశాలకు వెళ్తుండగా.. భారత్కు మాత్రం 10 దేశాల నుంచే ఎక్కువగా వస్తున్నారు. మొత్తం విదేశీ విద్యార్థుల్లో 24.9 శాతం మంది నేపాల్కు చెందినవారు కాగా, అఫ్గాన్ విద్యార్థులు 9.5 శాతం, సుడాన్ విద్యార్థులు 4.8 శాతం, భూటాన్ విద్యార్థులు 4.8 శాతం మంది, నైజీరియా విద్యార్థులు 4.3 శాతం, బంగ్లాదేశ్, ఇరాన్ విద్యార్థులు 4 శాతం మంది, యెమన్ విద్యార్థులు 3.2 శాతం మంది, అమెరికా విద్యార్థులు 3.1 శాతం, శ్రీలంక విద్యార్థులు 2.7 శాతం ఉన్నారు. బీటెక్, బీబీఏ వైపే ఎక్కువ.. భారత్కు వస్తున్న విదేశీ విద్యార్థుల్లో ఎక్కువ మంది బీటెక్ వైపు చూస్తున్నారు. గడచిన ఐదేళ్లలో ఎక్కువ మంది బీటెక్ చదివిన వారే ఉన్నారు. 2013–14లో 4,135 మంది బీటెక్ చదవగా.. ప్రస్తుతం ఆ కోర్సును 7,610 మంది చదువుతున్నారు. బీటెక్ తర్వాత బీబీఏ కోర్సును ఎక్కువ మంది చదువుతున్నారు. ఉత్తరప్రదేశ్లోనే అత్యధికంగా పీహెచ్డీలు విదేశీ విద్యార్థుల్లో అత్యధికంగా పీహెచ్డీలను (412 మంది) ఉత్తరప్రదేశ్లో చేస్తున్నారు. కర్ణాటకలో ఎక్కువ మంది(897) ఎం.ఫిల్ చేస్తున్నారు. డిగ్రీ (10,051 మంది), పీజీ (1,533), ఇంటిగ్రేటెడ్ కోర్సులు (7181) చేస్తున్న వారు కూడా కర్ణాటకలోనే ఉన్నారు. -
నియామకాలు నిలిపివేయండి
సాక్షి, హైదరాబాద్ : దేశవ్యాప్తంగా అన్ని యూనివర్సిటీల్లో నియామకాలను నిలిపివేయాలని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ఆదేశాలు జారీ చేసింది. నియామకాల్లో యూనివర్సిటీ వారీగా ఉన్న రోస్టర్ కమ్ రిజర్వేషన్లు కాకుండా, విభాగాల వారీగా రోస్టర్ కమ్ రిజర్వేషన్లు అమలు చేయాలని గత ఏప్రిల్లో అలహాబాద్ హైకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. దీంతో నియామకాల్లో కోర్టు నిబంధనలు పాటించాలని యూజీసీ అప్పట్లో యూనివర్సిటీలకు లేఖలు రాసింది. అయితే తాజాగా ఆ వ్యవహారంపై సుప్రీంకోర్టులో కేంద్ర ప్రభుత్వం స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు తుది తీర్పు వచ్చేవరకు నియామకాలను ఏ దశలో ఉన్నా నిలిపివేయాలని పేర్కొంది. ఈ మేరకు గురువారం యూజీసీ జాయింట్ సెక్రటరీ డాక్టర్ ఊర్మిళదేవి అన్ని రాష్ట్రాల, సెంట్రల్ యూనివర్సిటీల రిజిస్ట్రార్లకు ఆదేశాలు జారీ చేసింది. -
యూనివర్సిటీలకు సుప్రీం షాక్
సాక్షి, న్యూఢిల్లీ : యూనివర్సిటీలకు సుప్రీంకోర్టు షాకిచ్చింది. ప్రభుత్వ, ప్రవేటు యూనివర్సిటీలు ఏకపక్షంగా ఫీజలు పెంచకూడదంటూ అత్యన్నత న్యాయస్థానం తీర్పును వెలువరించింది. తమిళనాడులోని అన్నమలై యూనివర్సిటీకి చెందిన ఎమ్బీబీఎస్ విద్యార్థులు దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీం ధర్మాసనం ఆదివారం విచారించింది. రుసుముల నియంత్రణ కమిటీని సంప్రదించకుండా ఇష్టారాజ్యంగా ఫీజులు పెంచి విద్యార్థులపై భారం మోపొద్దని తీర్పులో పేర్కొంది. 2013-14 విద్యా సంవత్సరంలో అన్నమలై యూనివర్సిటీ ఏడాదికి 5.54 లక్షలు ఫీజు పెంచడంతో ఎమ్బీబీఎస్, బీడీఎస్ విద్యార్థులు మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. విద్యార్థులు దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు తిరస్కరించడంతో వారు సుప్రీంకోర్టులో పిటిషన్ చేశారు. దీనిపై విచారించిన జస్టిస్ అరుణ్ మిశ్రా, యూయూ లలిత్లతో కూడిన ధర్మాసనం 2003లో రాజ్యాంగ ధర్మాసనం వెలువరించిన తీర్పుకు విరుద్ధంగా ఉందంటూ వ్యాఖ్యానించింది. ప్రతి రాష్ట్రం సొంతగా ఫీజుల నియంత్రణ కమిటీని కలిగి ఉండాలని, ఆ కమిటీని సంప్రదించి మాత్రమే ఫీజులు పెంచాలని 2003లో సుప్రీంకోర్టు రాష్ట్రాలకు సూచించింది. 1992 చట్టం ప్రకారం మరో రెండు వారాల్లో యూనివర్సిటీ బ్యాలెన్స్ షీట్ను సమర్పించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. నిబంధనల ప్రకారం ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఎమ్బీబీఎస్కు 12,290, బీడీఎస్ కోర్సుకు 10,290 వసూలు చేయాలని పేర్కొంది. -
కొత్త సీసాలో పాత సారానా?
ఏ విశ్వవిద్యాలయమైనా రాజకీయ ఒత్తిడుల నుంచి బయటపడి స్వేచ్ఛగా, స్వయం ప్రతిపత్తితో మనుగడ సాగించినప్పుడే ఉత్తమ ఫలితాలను సాధించగ లదు. ఒకప్పుడు భారతీయ చరిత్రలో పేరు మోసిన తక్షశిల, నలంద విశ్వవిద్యాలయాలు ప్రపంచంలోనే అగ్రశ్రేణి విశ్వవిద్యాలయాలుగా వెలుగొందాయంటే ఆర్థికంగా వాటికి కావలసిన నిధులను ఆ కాలంలోని రాజులు సమకూర్చడం, వాటి పరిపాలనా వ్యవహారాల్లో ఏనాడూ వారు వేలుపెట్టకపోవడమే. కానీ నేటి ఆధునిక విశ్వవిద్యాలయాలు పేరుకు స్వయం ప్రతిపత్తి కలవే గానీ ప్రతివిషయంలో రాజకీయ జోక్యం పెరిగిపోయింది. అధ్యాపకుల నియామకాల దగ్గర్నుంచి, నిధుల కేటాయింపు వరకు అన్నిటిలోనూ అవినీతి, అక్రమాలకు తెరలేపుతూ రాజకీయ నాయకులు, ప్రభుత్వ పెద్దలు, అధికారులు వీటిని అయినవారి ఆవాసులుగా మార్చుతున్నారు. ఇలాంటి దుష్పరిణామాలను అడ్డుకోవడానికే యూజీసీ వంటి స్వతంత్ర సంస్థలు వెలిశాయి. కానీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం యూజీసీని రద్దు చేసి కొత్తగా భారతీయ ఉన్నత విద్యా కమిషన్ అనే సంస్థను దాని స్థానంలో ఏర్పాటు చెయ్యాలనే ప్రతిపాదనలను తెరపైకి తెచ్చింది. సంస్థ పేరు మార్చినంత మాత్రాన దాని అవలక్షణాలు చెరిగిపోవు. మన దేశంలో ఉన్నత విద్య కష్టాల బారినపడటానికి కారణం సరైన నియంత్రణా సంస్థలను రూపొందించకపోవడం కాదు. ప్రస్తుత సంస్థల ఆశ్రిత పక్షపాతంతోపాటు, పాలక మండలుల ఆలోచనాధోరణి కూడా కారణమే. ఏ ఉన్నత విద్యాసంస్థనైనా రాజకీయ ప్రయోజనాలకోసం పనిముట్టుగా వాడుకోవాలని చూసినప్పుడే దాని పతనం ప్రారంభం అవుతుందని యూజీసీ ఉదంతం చెబుతుంది. ప్రభుత్వాలు మారినప్పుడల్లా వాటికనుగుణంగా దాన్ని తోలుబొమ్మను చేసి ఆడించారు కాబట్టే యూజీసీ ఇప్పుడు పాలకులకు ఖాయిలా పడ్డ పరిశ్రమలా, నిర్వీర్యమైన వ్యవస్థలా కనిపిస్తోంది. అంతమాత్రాన యూజీసీని నిర్వహించిన పాత్రను ఈ దేశం ఎన్నటికీ మర్చిపోదు. ఇప్పుడు యూజీసీ స్థానంలో కొత్తగా హెచ్.ఇ.సి.ఐ. ఏర్పాటు కూడా కొంత వివాదాస్పదంగానే మారింది. ఇప్పుడు యూజీసీ స్థానంలో హెచ్.ఇ.సి.ఐ.ని తీసుకురావటంలో కూడా ముఖ్యోద్దేశం విధులను నియంత్రణ నుండి వేరు చెయ్యటమే. అసలు నిజం.. వర్సిటీలపై ఆర్థిక ఆంక్షలు విధించటమే. హెచ్.ఇ.సి.ఐ.ని స్థాపించటానికి రూపొందిం చిన చట్టంలో, విద్యా ప్రమాణాలను అత్యున్నత స్థాయిలో నిలపటానికి, విద్యా బోధనలో నాణ్యతను తీసుకురావటానికి ఈ కొత్త నియంత్రణా సంస్థ పనిచేస్తుందని పేర్కొన్నా, నాణ్యత అనే దానికి నిర్వచనాన్ని మాత్రం ఇవ్వలేకపోతోంది. ఎన్ని రకాలైన ప్రమాణాలను నిర్వచించినా వాటికి నానార్థాలు చెబుతూ, వాటిలోని లోపాలను ఆసరాగా చేసుకుని పబ్బం గడుపుకోవటం మన విద్యా సంస్థలకు అలవాటుగా మారింది. ప్రతి ప్రామాణికానికి నకిలీ ప్రామాణికాన్ని రూపొందించటం పరిపాటైంది. నిజానికి వాసిపరంగా విద్యా సంబంధమైన సామర్థ్యాన్ని అంచనా వెయ్యటం అంత సులభమేమీ కాదు. ఎన్నో ప్రయోగాలు చేస్తూనే ఉన్నా నాణ్యత మాత్రం వీసమెత్తు కూడా పెరగలేదు. ఇక్కడ విచిత్రం ఏమింటంటే.. వందలోపు జాతీయ ర్యాంకులు సాధించిన సంస్థలకు ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటోంది. సహజంగానే దేశంలోని ప్రతిష్టాత్మక సంస్థలైన ఐఐటీలు, ఎన్ఈటీలు, ఐఐ ఎమ్లు వందలోపు నిలబడతాయి. వీటికి ఇప్పటికే నిధులు ఇబ్బడిముబ్బడిగా అందుతున్నాయి. మళ్లీ వీటికే నిధుల వరద పారించటంలో ఆంతర్యమేమిటో ఏలినవారే చెప్పాలి. నిధులు లేక, సరైన మౌలిక వసతులు లేక, రాష్ట్ర ప్రభుత్వాల కనికరం లేక ర్యాంకుల్లో వెనుకబడిన రాష్ట్ర విశ్వ విద్యాలయాలకు ఏ మాత్రం ఆర్థిక సహాయం లేక ఇంకా వెనుకబడుతున్నాయి. కొత్తగా ఈ మధ్య ‘ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎక్సలెన్సీ’ అంటూ ఇప్పటికే దేశంలో అత్యంత పేరు ప్రఖ్యాతులు సంపాదించిన సంస్థలలో మొదటి 20 వాటిని ఎన్నుకుని వాటికి ఎటువంటి నిబంధనలు నియంత్రణలూ లేకుండా పూర్తి స్వేచ్ఛని చ్చారు. మిగతా వాటిని మాత్రం యూజీసీ ఉక్కు పిడికిళ్లలోనే నలగమని ఆదేశాలిచ్చారు. అదేమంటే వాటిలో ప్రమాణాలు దిగువ స్థాయిలో ఉన్నాయంటున్నారు. అసలు విశ్వవిద్యాలయాల్లో ప్రమాణాలు దిగజారటానికి కారకులు రాజకీయ నాయకులు, విద్యా సంస్థల ఏలికలు, ప్రైవేటు విద్యా సంస్థల యాజమాన్యాలే. గ్రేడింగ్ విధానం ద్వారా పరిమిత స్వయంప్రతిపత్తి, ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎక్సలెన్సీ, మోడల్ పాఠ్యాంశ వృత్తి విద్యా కోర్సులు, ఐసీటీ వినియోగం వంటి ఎన్నో మార్గాల ద్వారా ఉన్నత విద్యా సంస్థల సామర్థ్యాన్ని పెంపొందించాలని చూస్తున్న ఈ తరుణంలో వాటి ఫలితాలు రాకముందే, యూజీసీ స్థానంలో మరో కొత్త సంస్థ హెచ్ఇసీఐను తీసుకురావల్సిన అవసరం లేదు. రాజకీయ క్రీడలో ప్రత్యర్థులను ఓడించటానికి విద్యా సంస్థలను ఫణంగా పెట్టడం దిగజారుడుతనం తప్ప ఇంకొకటి కాదు. ఇప్పటికే ఈ జూద క్రీడలో క్షతగాత్రులుగా హైదరాబాద్, వారణాసి, ఢిల్లీ, పూణే, అలహాబాద్ తదితర విశ్వవిద్యాలయాలు మిగిలాయి. మరింతగా వీటిని ఫణంగా పెట్టడానికి హెచ్.ఇ.సి.ఐ.ని ఒక ఆయుధంగా తయారుచేస్తే అంతకన్నా ఆత్మహత్యాసదృశ్యం ఇంకొకటి ఉండదు. ప్రొ‘‘ ఇ. శ్రీనివాసరెడ్డి ,వ్యాసకర్త ప్రిన్సిపాల్, యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ‘ మొబైల్ : 789361 11985 -
తిరోగమనంలో ‘పరిశోధనలు’
తెలంగాణ రాష్ట్రంలో జాతీయ ,అంతర్జాతీయ విద్యాసంస్థలు, కేంద్రీయ విశ్వవిద్యాలయాలు. వివిధ రాష్ట్ర స్థాయి విశ్వవిద్యాలయాలు లెక్కకు మిక్కుటంగా ఉన్నాయి. దేశ రాజధాని ఢిల్లీ తరువాత మన రాష్ట్రంలోనే 11 రాష్ట్రవిశ్వవిద్యాలయాలు , 3 కేంద్రీయ విశ్వవిద్యాలయాలు , 2 జాతీయ స్థాయి సంస్థలు ఎన్ఐటి,త్రిపుల్ ఐటీ, 1 డీమ్డ్ విశ్వవిద్యాలయం.. ఇలా మొత్తం 17 విశ్వవిద్యాలయాలు తెలంగాణలో ఉన్నాయి. రాష్ట్ర విశ్వవిద్యాలయాల్లో మెరుగైన వసతులు లేమి, ఆర్థిక సంక్షోభం వల్ల పరిశోధనలు ఆవిష్కరణలు వాటి ఫలితాల అభివృద్ధి కేవలం కేంద్రీయ విశ్వవిద్యాలయాలకు మాత్రమే పరిమితమవుతున్నాయి. నూతన పద్ధతులను ఉపయోగించి పరిశోధన చేయాలంటే పరిశోధనాత్మక పరికరాలు, ఆధునిక ప్రయోగశాలలు , విశాలమైన భవనాలతోపాటు అనుభవం కల్గిన ఆచార్యులు పూర్తిస్థాయి లో ఉండాలి. కానీ మన రాష్ట్రం లో ఇప్పటికే 1200 ఆచార్య, సహా ఆచార్య పోస్టులు ఖాళీగా ఉండగా రాబోయే రెండేళ్లలో చాల మంది సీనియర్ ఆచార్యులు పదవి విరమణ పొందే అవకాశం ఉంది ఇది పరిశోధనకు గొడ్డలి పెట్టులాంటి చర్య. దేశ వ్యాప్తంగా నేషనల్ ఫెలోషిప్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్ పేరు మీద కేంద్ర మానవ వనరుల శాఖ వారు షెడ్యూల్ కులాల వారికి 3000 ,ట్రైబల్ కులాలవారికి 800, వెనుకబడిన కులాలు ఓబీసీ వారికీ 300 స్లాట్స్ చొప్పున అందిస్తున్న సరిపోవడం లేదు. దేశవ్యాప్తంగా 331 ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు ఉండగా ఓబీసీ వారికి కేవలం 300 ఫెలోషిప్ మాత్రమే కల్పించడం వల్ల విశ్వవిద్యాలయానికి ఒక్కఫెలోషిప్ కూడా నోచుకోని స్థితిలో ఓబీసీ విద్యార్థులు ఉన్నారు కాబట్టి జనాభా ప్రాతిపదికన 50 శాతం ఉన్న ఓబీసీ లకు కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకొని 10000 స్లాట్స్ వారికి పెంచాలి. అలాగే.. ఎస్సీ, ఎస్టీ కులాల వారికీ అదనంగా 5000 స్లాట్స్ను పెంచాలి. మన విశ్వవిద్యాలయాలు ప్రపంచంలోనే పరిశోధన రంగంలో అత్యున్నత స్థానాన్ని ఆక్రమించే ఆస్కారం వుండే దిశగా యూనివర్సిటీ నిధుల సంఘము, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రోత్సాహం ఉండాలి. మన రాష్ట్ర ఉన్నత విద్య మండలి ప్రమాణాలకు పట్టం కట్టినపుడే తెలంగాణ పరిశోధన రంగంలో గొప్ప స్థానంలో ఉంటుంది. – ఈర్ల రాకేష్, పరిశోధక విద్యార్థి, కాకతీయ వర్సిటీ -
ఎస్సీ, ఎస్టీలకు ప్రత్యేక వర్సిటీలు
సాక్షి, హైదరాబాద్: ఎస్సీ, ఎస్టీలకు ప్రత్యేకంగా సాంఘిక సంక్షేమ యూనివర్సిటీలను ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్కు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి బుధవారం లేఖ రాశారు. సాంఘిక సంక్షే మ శాఖ రెసిడెన్షియల్ స్కూళ్లలో ప్రమాణాలు పెరిగాయని, వీటిలో చదివి దేశవ్యాప్తంగా విద్యార్థులు పోటీపడగలుగుతున్నారని పేర్కొన్నారు. ఈ అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఎస్సీ, ఎస్టీల విద్యా ప్రమాణాలను పెంచడానికి, మరింత అభివృద్ధి చెందడానికి ప్రత్యేకంగా యూనివర్సిటీలను ఏర్పాటు చేయాలని కోరారు. -
పత్తాలేని పాలక మండళ్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని విశ్వ విద్యాలయాల్లో పాలన గాడితప్పుతోంది. విధానపరౖ నిర్ణయాలు తీసుకోవాల్సిన పాలక మండళ్లు (ఈసీ) లేక అభివృద్ధి కుంటుపడుతోంది. ఉద్యోగులు, అధ్యాపకుల నియామకాలు, పదోన్నతులు, వేతనాల పెంపు, అభివృద్ధి పనులు.. ఇలా అన్నింటికీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిళ్ల అనుమతి తప్పనిసరి కావడం, ఏళ్ల తరబడి ఈసీల నియామకంపై ప్రభుత్వం దృష్టి సారించకపోవడంతో వర్సిటీల పాలన దెబ్బతింటోంది. కొన్ని వర్సిటీలకు పదేళ్లుగా ఈసీలు లేకున్నా పట్టించున్న పరిస్థితి లేదు. వర్సిటీలకు స్వయం ప్రతిపత్తి ఉన్నా.. ఈసీలు లేక అన్నింటికీ ఐఏఎస్ అధికారుల చుట్టూ తిరుగాల్సిన పరిస్థితి నెలకొంది. శాతవాహన, కేయూకు 2009 నుంచే.. రాష్ట్రంలోని శాతవాహన, కాకతీయ వర్సిటీలకు 2009 నుంచే ఇబ్బందులు మొదలయ్యాయి. అంతకుముందు నియమించిన ఈసీల పదవీకాలంలో ముగియడం, తరువాత ఈసీలను నియమించకపోవడంతో ఇబ్బందులు తలెత్తాయి. తెలంగాణ వర్సిటీ ఈసీని 2011లో రద్దు చేశాక మళ్లీ నియమించలేదు. మిగతా వర్సిటీలదీ ఇదే పరిస్థితి. 2011లో ఉస్మానియా, జేఎన్టీయూకే ఈసీలను నియమించినా వాటి పదవీకాలం 2014తో ముగిసింది. ఆ తరువాత రాష్ట్రంలోని ఏ వర్సిటీకీ ఈసీలను నియమించలేదు. రాష్ట్రం ఏర్పడిన తరువాత కూడా వాటిపై ప్రభుత్వం దృష్టి సారించలేదు. 10 లక్షలకు మించి ఖర్చు చేయాలంటే.. వర్సిటీల్లో అభివృద్ధి పనులను చేపట్టడంలో ఈసీ నిర్ణయమే కీలకం. రూ.10 లక్షలకు మించిన వ్యయంతో ఏ పని చేయాలన్నా, ఎలాంటి కొనుగోళ్లు చేపట్టాలన్నా ఈసీ ఆమోదం ఉండాలి. 12–13 మంది ఉండే పూర్తి స్థాయి ఈసీ లేకున్నా ఐదుగురు సభ్యులు (కోరం) ఉన్న ఈసీ ఆమోదం తప్పనిసరి. ప్రస్తుతం అది కూడా లేకపోవడంతో వర్సిటీల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేని పరిస్థితి నెలకొంది. ఏ నిర్ణయమైనా పరుగెత్తాల్సిందే పాలక మండళ్లు లేకపోవడంతో వర్సిటీలకు సంబంధించి ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ఎక్స్ అఫిషియో సభ్యులైన ఐఏఎస్ అధికారుల వద్దకు వీసీలు పరుగెత్తాల్సి వస్తోంది. రూ.10 లక్షలలోపు పనికైనా రోజుల తరబడి వేచి ఉండాల్సి వస్తోంది. మరోవైపు ఈసీలు లేకపోవడంతో ప్రభుత్వం నుంచి ఎక్కువ మొత్తంలో నిధులను వర్సిటీలు రాబట్టుకోలేకపోతున్నా యి. ఎక్స్ ఆఫిషియో సభ్యులు వర్సిటీల బాగోగులు పెద్దగా పట్టించుకోవడం లేదు. దీంతో అధిక మొత్తంలో నిధులు కావాలని అడిగే పరిస్థితి లేదు. వర్సిటీ నియామకాల్లోనూ ఇదే పరిస్థితి. గతంలో ఈసీలు లేకుండా చేపట్టిన నియామకాలు న్యాయ వివాదాల్లో చిక్కుకున్నాయి. 2010లో కాకతీయ వర్సిటీ జంతు శాస్త్ర విభాగంలో ఇద్దరు అధ్యాపకుల నియామకాలపై పలువురు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. పూర్తి స్థాయి పాలక మండలి లేకుండా నియామకాలు ఎలా చేపడతారంటూ కోర్టుకెక్కారు. నియామకాలు చెల్లవని కోర్టు తీర్పునిచ్చింది. వారు సుప్రీంకోర్టును ఆశ్రయించి తాత్కాలికంగా పోస్టింగ్ పొందారు. కేయూ ఇంజనీరింగ్ కాలేజీలోనూ నలుగురు అధ్యాపకుల నియామకాలపై వివాదం కొనసాగుతూనే ఉంది. తెలంగాణ వర్సిటీలోనూ ఇదే పరిస్థితి. ప్రస్తుతం వర్సిటీల్లోని 1,061 పోస్టుల భర్తీ ఈసీ నియామకాలతో ముడిపడి ఉండటంతో ముందుకు సాగడం లేదు. -
వర్సిటీ అధ్యాపకుల భర్తీపై న్యాయసలహా
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలోని యూనివర్సిటీల్లో అధ్యాపక పోస్టుల భర్తీ వ్యవహారంలో రోస్టర్ విధానంపై న్యాయ సలహా ఇవ్వాలని ప్రభుత్వం అడ్వొకేట్ జనరల్ను కోరింది. ఈమేరకు విద్యా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్య లేఖ రాసినట్లు తెలిపింది. పోస్టుల భర్తీలో యూనివర్సిటీల వారీగా రోస్టర్ అమలు చేయాలా? లేక విభాగాల (సబ్జెక్టు) వారీగా రోస్టర్ను అమలు చేయాలా? అన్న విషయంలో యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ఇచ్చిన సమాధానంపై ఈ లేఖ రాశారు. ఈ విషయంలో స్పష్టత ఇవ్వాలని గతంలోనే యూజీసీకి లేఖ రాయగా, అది సెంట్రల్ యూనివర్సిటీలకు వర్తిస్తుందని ఒక చోట, అన్ని యూనివర్సిటీలకు వర్తిస్తుందనే అర్థం వచ్చేలా మరొక చోట పేర్కొనడంతో గందరగోళం నెలకొంది. దీంతో ఆ లేఖను ఎలా అన్వయించు కోవాలన్న విషయంలో సలహా ఇవ్వాలని ప్రభుత్వం అడ్వొకేట్ జనరల్ను కోరింది. -
ఆ కాలేజీలకు షాక్!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని డిగ్రీ కాలేజీల్లోని కోర్సుల్లో వరుసగా మూడేళ్ల పాటు 25 శాతం సీట్లు భర్తీ కానీ కాలేజీల్లో తాజాగా సీట్లు లభించే విద్యార్థులను చివరి దశ కౌన్సెలింగ్ తర్వాత ఇతర కాలేజీల్లో కోరుకున్న (ఆప్షన్ ఇచ్చిన) కోర్సుల్లోకి బదిలీ చేస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. 25 శాతం ప్రవేశాలు లేకపోతే ఆయా కోర్సుల నిర్వహణ కష్టం కాబట్టి ఈ చర్యలు చేపడుతున్నట్లు పేర్కొంది. శుక్రవారం విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్య డిగ్రీ ఆన్లైన్ ప్రవేశాలు చేపట్టేందుకు జారీ చేసిన మార్గదర్శకాల ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. యూనివర్సిటీలు నిర్ణయించే ఫీజులనే కాలేజీలు అమలు చేయాలని, దానిని అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. జరిమానాతోపాటు అవసరమైతే కాలేజీల గుర్తింపును రద్దు చేస్తామని స్పష్టం చేశారు. ప్రవేశాల్లో రూల్ రిజర్వేషన్, ఇతర నిబంధనలు అమలు చేయాలన్నారు. మరోవైపు డిగ్రీ ఆన్లైన్ ప్రవేశాల ప్రక్రియలో భాగంగా విద్యార్థులకు అవసరమైన అన్ని సేవలు అందించేందుకు మూడు ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. ఆన్లైన్ ప్రవేశాలకు ప్రాజెక్టు మానిటరింగ్ యూనిట్తోపాటు ఉన్నత విద్యా మండలి కోఆర్డినేషన్ కమిటీ, కళాశాల విద్యా శాఖ కోఆర్డినేషన్ కమిటీలను ఏర్పాటు చేశారు. ప్రవేశాలకు సంబంధించి సమస్యలుంటే.. : ప్రవేశాలకు సంబంధించి విద్యార్థికి ఏ సమస్య వచ్చినా ఆయా డిగ్రీ కాలేజీలోని ప్రిన్సిపల్, సీనియర్ అధ్యాపకులతో కూడిన కమిటీ, హెల్ప్లైన్ కేంద్రాన్ని సంప్రదించవచ్చు.అక్కడ సమస్య పరిష్కారం కాకుంటే యూనివర్సిటీలోని కోఆర్డినేషన్ కమిటీ, హెల్ప్లైన్ సెంటర్కు వెళ్లవచ్చు. అయినా పరిష్కారం కాకపోతే జిల్లా స్థాయిలోని ఇంటిగ్రేటెడ్ కాలేజీల ప్రిన్సిపాల్ నేతృత్వంలోని జిల్లా కోఆర్డినేషన్ కమిటీ, హెల్ప్లైన్ కేంద్రాన్ని సంప్రదించవచ్చు. -
వారంలో వర్సిటీ అధ్యాపక నోటిఫికేషన్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న 1,061 పోస్టుల భర్తీకి వారంలో నోటిఫికేషన్లు జారీ చేసేందుకు ఉన్నత విద్యామండలి చర్యలు చేపట్టింది. పోస్టు ల భర్తీలో వర్సిటీలవారీగానే రోస్టర్ కమ్ రిజర్వేషన్ అమలు చేయాలని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) స్పష్టం చేయడంతో అందుకు అనుగుణంగా నోటిఫికేషన్లు జారీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. గతంలోనూ పోస్టుల భర్తీలో వర్సిటీలవారీగానే రోస్టర్ కమ్ రిజర్వేషన్ను అమలు చేస్తూ పోస్టులను భర్తీ చేసేవారు. అయితే ఇటీవల అలహాబాద్ హైకోర్టు వర్సిటీలవారీగా కాకుండా యూనివర్సిటీల్లో సంబంధిత విభాగాలవారీగానే రోస్టర్ కమ్ రిజర్వేషన్లను పోస్టుల భర్తీలో అమలు చేయాలని తీర్పు ఇవ్వడంతో యూజీసీ అన్ని వర్సిటీల వీసీలకు ఈ మేరకు లేఖలు రాసింది. దీంతో రాష్ట్రంలోని వర్సిటీలు గందరగోళంలో పడ్డాయి. పోస్టుల భర్తీలో యూనివర్సిటీలవారీగా రోస్టర్ కమ్ రిజర్వేషన్లు పాటించాలా లేక యూజీసీ తాజా నిబంధనల ప్రకారం పోస్టులను విభాగాలవారీగా రోస్టర్ కమ్ రిజర్వేషన్లు అమలు చేయాలా అనే విషయాన్ని ప్రభుత్వం, ఉన్నత విద్యామండలి దృష్టికి తీసుకెళ్లాయి. దీంతో నోటిఫికేషన్ల జారీ ఆగిపోయింది. ఈ నేపథ్యంలో ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి దీనిపై యూజీసీ అధికారులతో చర్చించారు. అయితే అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై కేంద్ర మానవ వనరుల అభివృద్ధిశాఖ అలహాబాద్ హైకోర్టు ధర్మాసనం ఎదుట అప్పీల్ చేసేందుకు సిద్ధమైందని, అందువల్ల ప్రస్తుతానికి పాత విధానం ప్రకారమే పోస్టులను భర్తీ చేయాలని యూజీసీ సూచించింది. దీంతో త్వరలోనే పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేయాలని యూనివర్సిటీలకు సూచించినట్లు పాపిరెడ్డి వెల్లడించారు. -
వీడు మాములోడు కాదు...
విదేశాల్లో చదువుకోవాలనుకుంటే చాలా కష్టపడాలి. అక్కడి యూనివర్సిటీల్లో చేరాలంటే ఎన్నో ప్రవేశ పరీక్షలు రాయాలి, ఇంటర్వ్యూలు ఫేస్ చేయాలి. అయితే పరీక్షల గోల మనకెందుకులే కొందరు వదిలేస్తారు. మరికొంతమంది పట్టుదలతో సాధిస్తారు. అయితే హూస్టన్కు చెందిన మైఖేల్ బ్రౌన్ మాత్రం అమెరికాలోని దాదాపు అన్ని ప్రముఖ విశ్వవిద్యాలయాలకు దరఖాస్తు చేయగా అన్నింటికి అర్హత సాధించాడు. స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ మొదలుకొని యేల్, ప్రిన్స్టన్, టెక్సాస్ ఇలా ప్రఖ్యాత యూనివర్సిటీలన్నింటికి ఎంపికై అవి అందించే స్కాలర్షిప్లకు అర్హత సాధించాడు. ఈ సందర్భంగా అతడు మాట్లాడుతూ... నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఎవ్వరూ కూడా రిజెక్ట్ చేయలేరు ఈ యూనివర్సిటీల్లో చేరడానికి. మరీ ముఖ్యంగా స్టాన్ఫోర్డ్లాంటి విశ్వవిద్యాలయంలో చదువుకునేందుకు అవకాశం వస్తే వదులుకోలేరు కదా అని తన ఆనందాన్ని పంచుకున్నాడు. తన కొడుకు సాధించిన విజయానికి అతని తల్లి ఉప్పొంగుతూ...‘బ్రౌన్ చిన్నప్పటి నుంచీ చురుగ్గానే ఉండేవాడు. ఏ పని మొదలుపెట్టినా...మధ్యలో వదిలిపెట్టేవాడు కాదు’ అంటూ తెలిపింది. -
వర్సిటీలపై మావోల గురి
సాక్షి, హైదరాబాద్ : రోజురోజుకూ బలహీనమవుతున్న మావోయిస్టు పార్టీ పునరుజ్జీవం కోసం తీవ్రంగా ప్రయత్నిస్తోందా? అందులో భాగంగా విద్యార్థులను ఆకర్షించడంపై దృష్టి సారించిందా? రాష్ట్ర యూనివర్సిటీల్లోని విద్యార్థులను మావోయిస్టు పార్టీలో చేర్చే బాధ్యతను తెలంగాణ కమిటీ తీసుకుందా..? ఈ ప్రశ్నలకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ వర్గాలు ఔననే సమాధానమిస్తున్నాయి. మావోయిస్టు పార్టీ కేడర్ను పెంచుకోవడం, సాంకేతికంగా బలపడటం కోసం యూనివర్సిటీల్లో చదువుతున్న విద్యార్థులే టార్గెట్గా వ్యూహాలు సిద్ధం చేసినట్టు అధికారులు చెబుతున్నారు. మొత్తంగా దేశవ్యాప్తంగా విద్యార్థులను చేర్చుకోవడంపై మావోయిస్టు పార్టీ దృష్టి పెట్టిందన్న విషయం కలవరపెడుతోందని పోలీసు వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. 13 ఏళ్ల తర్వాత వర్సిటీల్లో.. మావోయిస్టు పార్టీ భావజాలంతో పనిచేస్తున్న పలు సంఘాలను ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం 13 ఏళ్ల క్రితం నిషేధిత జాబితాలో చేర్చింది. రాడికల్ స్టూడెంట్ యూనియన్, రాడికల్ యూత్ లీగ్, సింగరేణి కార్మిక సంఘం, ఆలిండియా రెవల్యూషనరీ స్టూడెంట్ ఫెడరేషన్, రైతు కూలీ సంఘం, విప్లవ కార్మిక సంఘం, రెవల్యూషనరీ రైటర్స్ అసోసియేషన్ వంటివి మావోయిస్టు కార్యకలాపాల్లో భాగస్వామ్యం వహించాయని పేర్కొంటూ ఈ నిషేధం విధించింది. తెలంగాణ ఆవిర్భావం తర్వాత కూడా ఈ సంఘాలపై నిషేధం కొనసాగుతోంది. అయితే రాష్టం ఏర్పాటైన మరుసటి ఏడాది 2015లో కొంత మంది యూనివర్సిటీల విద్యార్థులు మావోయిస్టు పార్టీ వైపు ఆకర్షితులయ్యారు. దీంతో మావోయిస్టులు భారీ స్థాయిలో రిక్రూట్మెంట్కు ప్రయత్నించినట్టు ఇంటెలిజెన్స్ వర్గాలు అనుమానించాయి. దాంతో కొందరు విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ కూడా ఇచ్చాయి. అయినా కాకతీయ, ఉస్మానియా వర్సిటీలకు చెందిన సుమారు 24 మంది విద్యార్థులు మావోయిస్టు పార్టీలో చేరినట్టు ఎస్ఐబీ (స్టేట్ ఇంటెలిజెన్స్ బ్యూరో) వర్గాలు స్పష్టం చేశాయి. అలా వెళ్లిన వారిలో సూర్యాపేటకు చెందిన వివేక్, వరంగల్కు చెందిన శృతి ఇద్దరూ ఎన్కౌంటర్లో మృత్యువాత పడ్డారు. ఇప్పుడు హెచ్సీయూపై దృష్టి! రాష్ట్రంలో కాకతీయ, ఉస్మానియా యూనివర్సిటీల నుంచి రిక్రూట్మెంట్ విషయంలో మావోయిస్టు పార్టీ అనుకున్నంతగా సక్సెస్ కాలేదు. దాంతో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన కీలక విద్యార్థి నేతలను తాజాగా టార్గెట్ చేసుకుంది. ఇప్పటికే మావోయిస్టు భావజాలం ఉన్న కొందరు విద్యార్థులను రిక్రూట్ చేసుకునే దిశగా మానసికంగా సిద్ధం చేసినట్టు కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు గుర్తించాయి. ఇదే సమయంలో హెచ్సీయూకు చెందిన ఇద్దరు విద్యార్థులు కృష్ణాజిల్లాకు చెందిన పృథ్వీరాజ్, పశ్చిమబెంగాల్కు చెందిన చందన్ మిశ్రాల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. రోహిత్ వేముల ఆత్మహత్యకు ప్రతీకారంగా హెచ్సీయూ వీసీని చంపేందుకు కుట్ర పన్నినట్టు ఆరోపిస్తూ పోలీసులు వారిని అరెస్టు చేయడం సంచలనం సృష్టిస్తోంది. మిశ్రాతో దేశవ్యాప్తంగా..! బెంగాల్కు చెందిన చందన్ మిశ్రా వ్యవహారంపై ఇప్పుడు రెండు రాష్ట్రాల పోలీసు ఉన్నతాధికారులు దృష్టి సారించారు. మిశ్రా ఓ కొరియర్ ద్వారా మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శి హరిభూషణ్ను ఈ ఏడాది జనవరిలో కలిశారని.. మావోయిస్టు పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపాడని వెల్లడవడం నిఘా వర్గాలను కలవరపెడుతోంది. మావోయిస్టు పార్టీకి కంచుకోటగా పేరున్న పశ్చిమ బెంగాల్కు చెందిన చందన్ మిశ్రా.. పంజాబ్లోని తన స్నేహితుడు, వ్యవసాయ సంఘం నేత అమూల్సింగ్ను సైతం కలసి మావోయిస్టు పార్టీలోకి ఆహ్వానించినట్టు తెలియడం సంచలనంగా మారింది. హరిభూషణ్ను కలసిన సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీలకు చెందిన ఫ్రంటల్ ఆర్గనైజేషన్ విద్యార్థులను మావోయిస్టు పార్టీ కోసం పనిచేసేలా కృషి చేసేందుకు మిశ్రా ఆసక్తి చూపారని వెల్లడికావడం చర్చనీయాంశంగా మారింది. హెచ్సీయూ వీసీని హతమార్చిన తర్వాత మిశ్రాకు మావోయిస్టు పార్టీలో కీలకమైన పదవి ఇస్తానని హరిభూషణ్ చెప్పినట్టు తెలిసింది. దాంతో మిశ్రా దేశవ్యాప్తంగా తనకున్న పరిచయాలతో, మావోయిస్టు భావజాలంతో ఉన్న విద్యార్థులను, విద్యార్థి నేతలను ఏకం చేసేందుకు కార్యచరణ రూపొందించుకున్నట్టు నిఘా వర్గాలు స్పష్టం చేశాయి. మొత్తంగా గతంలోలా వర్సిటీల్లో రాడికల్ విద్యార్థి విభాగాలను ఫ్రంటల్ ఆర్గనైజేషన్ పేరుతో నడిపించేందుకు హరిభూషణ్ వ్యూహరచన చేసినట్టు తెలుస్తోంది. దీనివల్ల యూనివర్సిటీల్లో పట్టుతోపాటు కేడర్పరంగా అర్బన్ ప్రాంతాల్లో గ్రీన్ కారిడార్ కమిటీలను సృష్టించాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నట్టు నిఘా విభాగాలు అనుమానిస్తున్నాయి. అరెస్టులు కుట్రపూరితమంటున్న విరసం వీసీ హత్యకు కుట్రపన్నారంటూ పృథ్వీరాజ్, చందన్మిశ్రాలను పోలీసులు చేసినా.. ఈ ఆరోపణలకు బలం చేకూర్చే అంశాలేవీ వెల్లడించకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విప్లవ రచయితల సంఘం (విరసం) సైతం పోలీసుల ఆరోపణలను ఖండిస్తోంది. పృథ్వీరాజ్, చందన్మిశ్రాలను నాలుగు రోజుల క్రితం విజయవాడలో అరెస్టు చేసి చిత్రహింసలు పెట్టారని... వీసీ హత్య కుట్ర పేరిట విశ్వవిద్యాలయాల్లో మరింత నిర్బంధ వాతావరణం సృష్టించాలని చూస్తున్నారని పేర్కొంటోంది. హెచ్సీయూ వీసీ అప్పారావుకు భద్రత పెంపు మావోయిస్టులు హెచ్సీయూ వైస్ చాన్సలర్ పొదిలి అప్పారావు హత్యకు కుట్రపన్నారన్న వార్తల నేపథ్యంలో ఆయనకు భద్రత పెంచారు. రోహిత్ వేముల ఘటన అనంతరమే రాష్ట్రం ప్రభుత్వం ఆయనకు ఇద్దరు గన్మన్లను కేటాయించిన విషయం తెలిసిందే. తాజాగా హెచ్సీయూలో వీసీ కార్యాలయం, అధికారిక నివాసాల వద్ద ప్రైవేటు సెక్యూరిటీని పెంచారు. గుర్తు తెలియని వ్యక్తులెవరూ లోనికి రాకుండా కట్టుదిట్టం చేస్తున్నారు. -
66 వేల డిగ్రీ సీట్లకు కోత!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని డిగ్రీ కాలేజీల్లో దాదాపు 66 వేల సీట్లకు కోత పడే అవకాశముంది. గడిచిన రెండేళ్లలో వరుసగా 25 శాతం సీట్లు కూడా భర్తీ కానీ కాలేజీల్లో ఈసారి ప్రవేశాలు చేపట్టొద్దని, వాటిల్లోని విద్యార్థులను ఇతర కాలేజీల్లోకి పంపాలని యూనివర్సిటీలు ఇప్పటికే నిర్ణయించాయి. ఇందులో భాగంగా అన్ని యూనివర్సిటీలు తమ పరిధిలోని ప్రైవేటు డిగ్రీ కాలేజీల్లో 25 శాతం లోపు సీట్లు భర్తీ కానీ కాలేజీల లెక్కలు తేల్చాయి. ఇందులో 51 కాలేజీల్లో ఒక్క విద్యార్థి కూడా చేరలేదని, దాదాపు 250 కాలేజీల్లో 25 శాతంలోపే సీట్లు భర్తీ అయ్యాయని లెక్కలు వేశారు. ఒక్కరు కూడా చేరని కాలేజీల్లో మొత్తం 10,150 సీట్లు ఉండగా, 25 శాతంలోపు విద్యార్థులు చేరిన కాలేజీల్లో 56,285 సీట్లు ఉన్నట్లు తేలింది. అందులో 8,803 సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. దీంతో ఆయా కాలేజీల్లో ఈసారి ప్రవేశాలు చేపట్టొద్దని వర్సిటీలు ఆలోచిస్తున్నట్లు తెలిసింది. 25 వేల సీట్లలో 4 వేలే భర్తీ.. రాష్ట్రంలోని డిగ్రీ కాలేజీల్లో భర్తీ కానీ సీట్లు కాకతీయ యూనివర్సిటీ పరిధిలోనే అత్యధికంగా ఉన్నాయి. 25 శాతంలోపే సీట్లు భర్తీ అయిన కాలేజీల్లో మొత్తం సీట్లు 25,055 ఉంటే 4,047 సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో 25 శాతంలోపే భర్తీ అయిన కాలేజీల్లో మొత్తం సీట్లు 10,610 ఉంటే వాటిల్లో 1,731 సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. ఈ నేపథ్యంలో అలాంటి కాలేజీల్లో ఈసారి ప్రవేశాలకు అవకాశం ఇవ్వొద్దని యూనివర్సిటీలు కసరత్తు చేస్తున్నాయి.