Aiden Markram
-
SA Vs NZ: న్యూజిలాండ్తో సెమీస్.. సౌతాఫ్రికాకు గుడ్ న్యూస్
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో రెండో సెమీఫైనల్కు సమయం అసన్నమైంది. సెకెండ్ సెమీఫైనల్లో లహోర్ వేదికగా దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్కు ముందు సౌతాఫ్రికాకు అదిరిపోయే వార్త అందింది. తొడ కండరాల గాయంతో బాధపడుతున్న ప్రోటీస్ స్టార్ ఐడైన్ మార్క్రమ్.. ఇప్పుడు పూర్తి ఫిట్నెస్ సాధించాడు.మంగళవారం నిర్వహించిన ఫిట్నెస్ టెస్టులో అతడు పాసైనట్లు క్రికెట్ సౌతాఫ్రికా ఓ ప్రకటనలో వెల్లడించింది. ఇంగ్లండ్తో జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్లో స్టాండిండ్ కెప్టెన్గా ఉన్న మార్క్రమ్ తొడ కండరాలు పట్టేశాయి. దీంతో అతడు మ్యాచ్ మధ్యలోనే మైదాన్ని వీడాడు. ఈ క్రమంలో ప్రోటీస్ పగ్గాలు హెన్రిచ్ క్లాసెన్ చేపట్టాడు. అయితే సెమీఫైనల్లో అతడు ఆడేది అనుమానంగా మారింది. అతడికి బ్యాకప్గా జార్జ్ లిండేను సైతం సౌతాఫ్రికా క్రికెట్ బోర్డు పాకిస్తాన్కు రప్పించింది. కానీ ఐడైన్ ఇప్పుడు ఫిట్నెస్ సాధించడంతో సౌతాఫ్రికా టీమ్ మెనెజ్మెంట్ ఊపిరి పీల్చుకుంది. మరోవైపు ఇంగ్లండ్తో మ్యాచ్కు జ్వరం కారణంగా దూరమైన ప్రోటీస్ కెప్టెన్ టెంబా బావుమా, ఓపెనర్ డీజోర్జీ కూడా పూర్తిగా కోలుకున్నట్లు తెలుస్తోంది.వీరిద్దరూ కూడా కివీస్తో మ్యాచ్కు అందుబాటులో ఉండనున్నారు. ఇక ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు ఆదివారం జరగనున్న ఫైనల్లో టీమిండియాతో తాడోపేడో తెల్చుకోనుంది.సౌతాఫ్రికా తుది జట్టు(అంచనా): ర్యాన్ రికెల్టన్, టెంబా బావుమా (కెప్టెన్), రాస్సీ వాన్ డెర్ డస్సెన్, ఐడెన్ మార్క్రామ్, హెన్రిచ్ క్లాసెన్ (వికెట్ కీపర్), డేవిడ్ మిల్లర్, మార్కో జాన్సెన్, వియాన్ ముల్డర్, కేశవ్ మహారాజ్, కగిసో రబడ, లుంగి ఎంగిడీన్యూజిలాండ్ తుది జట్టు(అంచనా): విల్ యంగ్, డెవాన్ కాన్వే, కేన్ విలియమ్సన్, రచిన్ రవీంద్ర, టామ్ లాథమ్ (వికెట్ కీపర్), గ్లెన్ ఫిలిప్స్, మైకేల్ బ్రేస్వెల్, మిచెల్ సాంట్నర్ (కెప్టెన్), నాథన్ స్మిత్, మాట్ హెన్రీ, విల్ ఓ'రూర్క్చదవండి: శుబ్మన్ గిల్ చేసిన ‘తప్పు’..! టీమిండియాకు శాపమయ్యేది! ఎందుకంటే.. -
SA vs ENG: హిట్టర్లు వచ్చేశారు..! కీలక మ్యాచ్లో బవుమా లేకుండానే..
చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy)లో మరో ఆసక్తికపోరుకు రంగం సిద్దమైంది. గ్రూప్-‘బి’ ఆఖరి లీగ్ మ్యాచ్లో భాగంగా సౌతాఫ్రికా- ఇంగ్లండ్(South Africa vs England) తలపడనున్నాయి. కరాచీ వేదికగా శనివారం నాటి ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకోగా.. ప్రొటిస్ జట్టు బౌలింగ్కు సిద్ధమైంది.కాగా ఈ ఐసీసీ వన్డే టోర్నీ నుంచి ఇంగ్లండ్ ఇప్పటికే నిష్క్రమించిన విషయం తెలిసిందే. అయితే, ఆఖరి మ్యాచ్లోనైనా గెలిచి పరువు నిలబెట్టుకోవాలని పట్టుదలగా ఉంది. మరోవైపు.. ఎలాంటి సమీకరణలతో పనిలేకుండా సెమీ ఫైనల్లో అడుగుపెట్టాలంటే సౌతాఫ్రికా ఈ మ్యాచ్లో తప్పక గెలవాల్సిందే. కాబట్టి ప్రొటిస్ జట్టుకు కూడా ఇంగ్లండ్తో పోరు కీలకంగా మారడంతో మ్యాచ్ మరింత రసవత్తరం కానుంది.హిట్టర్లు వచ్చేశారు..! కీలక మ్యాచ్లో బవుమా లేకుండానే.. అయితే, ఈ మ్యాచ్కు సౌతాఫ్రికా రెగ్యులర్ కెప్టెన్ టెంబా బవుమా(Temba Bavuma) దూరమయ్యాడు. అతడితో పాటు టోనీ డి జోర్జ్ కూడా ఇంగ్లండ్తో మ్యాచ్కు అందుబాటులో లేడని తాత్కాలిక సారథి ఐడెన్ మార్క్రమ్ టాస్ సందర్భంగా వెల్లడించాడు. వీరిద్దరు అనారోగ్యంతో బాధపడుతున్నారని.. బవుమా, టోనీ స్థానాల్లో ట్రిస్టన్ స్టబ్స్, హెన్రిచ్ క్లాసెన్ తుదిజట్టులోకి వచ్చినట్లు తెలిపాడు. గత మ్యాచ్ వర్షం కారణంగా రద్దైందని.. అయితే, ఆ తర్వాత తాము నెట్స్లో తీవ్రంగా శ్రమించి ఇంగ్లండ్తో మ్యాచ్కు సిద్ధమైనట్లు తెలిపాడు.సరైన సమయంలోనేమరోవైపు ఇంగ్లండ్ కెప్టెన్గా చివరి మ్యాచ్ ఆడుతున్న బట్లర్ మాట్లాడుతూ.. తాను సరైన సమయంలోనే కెప్టెన్సీకి రాజీనామా చేసినట్లు తెలిపాడు. అన్నీ ఆలోచించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నానన్నాడు. గాయపడిన మార్క్వుడ్ స్థానంలో సకీబ్ మహబూబ్ జట్టులోకి వచ్చినట్లు పేర్కొన్నాడు. కాగా ఆసీస్, అఫ్గనిస్తాన్ జట్ల చేతిలో ఓటమి తర్వాత ఇంగ్లండ్ నిష్క్రమించగా... గ్రూప్-బి నుంచి ఆస్ట్రేలియా సెమీస్ చేరింది. గ్రూప్-ఎ నుంచి టీమిండియా,న్యూజిలాండ్ బెర్తులు ఖరారు చేసుకున్నాయి.తుదిజట్లుసౌతాఫ్రికాట్రిస్టన్ స్టబ్స్, ర్యాన్ రికెల్టన్, రాసీ వాన్ డెర్ డస్సెన్, ఐడెన్ మార్క్రమ్(కెప్టెన్), హెన్రిచ్ క్లాసెన్(వికెట్ కీపర్), డేవిడ్ మిల్లర్, వియాన్ ముల్డర్, మార్కో జాన్సెన్, కేశవ్ మహరాజ్, కగిసో రబడ, లుంగి ఎన్గిడి.ఇంగ్లండ్ఫిలిప్ సాల్ట్, బెన్ డకెట్, జామీ స్మిత్(వికెట్ కీపర్), జో రూట్, హ్యారీ బ్రూక్, జోస్ బట్లర్(కెప్టెన్), లియామ్ లివింగ్స్టోన్, జామీ ఓవర్టన్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, సకీబ్ మహమూద్.చదవండి: Champions Trophy: ఆసీస్తో కీలక సమరం.. ఆఫ్ఘనిస్తాన్ కొంపముంచిన రషీద్ ఖాన్ -
SA20 2025: తొలిసారి విజేతగా ఎంఐ కేప్టౌన్.. ప్రైజ్మనీ ఎంతంటే?
ముచ్చటగా మూడోసారి గెలిచి.. సౌతాఫ్రికా టీ20 లీగ్(South Africa T20 League)లో ‘హ్యాట్రిక్’ చాంపియన్గా నిలవాలన్న సన్రైజర్స్ ఈస్టర్న్ కేప్(Sunrisers Eastern Cape) జట్టుకు చేదు అనుభవం ఎదురైంది. బ్యాటర్ల సమష్టి కృషికి... రబడ, బౌల్ట్ బుల్లెట్ బౌలింగ్ తోడవడంతో... ముంబై ఇండియన్స్ (ఎంఐ) కేప్టౌన్ జట్టు ఫైనల్లో రైజర్స్పై విజయం సాధించింది. తద్వారా తొలిసారి SAT20 ట్రోఫీ చేజిక్కించుకుంది. మరి ఫైనల్ విశేషాలు, ప్రైజ్మనీ వివరాలు, అత్యధిక పరుగులు, వికెట్ల వీరులు తదితర అంశాలపై ఓ లుక్కేద్దామా?!సౌతాఫ్రికా టీ20 లీగ్లో భాగంగా శనివారం అర్ధరాత్రి దాటాక ఎంఐ కేప్టౌన్- సన్రైజర్స్ ఈస్టర్న్కేప్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరిగింది. రషీద్ ఖాన్ కెప్టెన్సీలోని ఎంఐ జట్టు మొదట బ్యాటింగ్ చేసి నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. రికెల్టన్ (15 బంతుల్లో 33; 1 ఫోర్, 4 సిక్స్లు), ఎస్టెర్హ్యుజెన్ (39; 2 ఫోర్లు, 2 సిక్స్లు), బ్రేవిస్ (18 బంతుల్లో 38; 2 ఫోర్లు, 4 సిక్స్లు), డసెన్ (23) తలా కొన్ని పరుగులు చేశారు.సన్రైజర్స్బ్యాటింగ్ ఆర్డర్ కుదేలుఇక సన్రైజర్స్ ఈస్టర్న్ కేప్ బౌలర్లలో మార్కో యాన్సెన్, రిచర్డ్ గ్లీసన్, లియామ్ డాసన్ తలా 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో ఎంఐ కేప్టౌన్ బౌలర్ల ధాటికి సన్రైజర్స్ జట్టు నిలవలేకపోయింది. 18.4 ఓవర్లలో 105 పరుగులకు ఆలౌటైంది. టామ్ అబెల్ (30) టాప్ స్కోరర్ కాగా... కెప్టెన్ మార్క్రమ్ (6), స్టబ్స్ (15), యాన్సెన్ (5), బెడింగ్హమ్ (5) విఫలమయ్యారు. ఎంఐ బౌలర్లలో రబడ 4 వికెట్లు పడగొట్టగా... బౌల్డ్ 4 ఓవర్లలో కేవలం 9 పరుగులే ఇచ్చి 2 వికెట్లు తీశాడు.ఈ క్రమంలో ఎంఐ కేప్టౌన్ జట్టు 76 పరుగుల తేడాతో డిఫెండింగ్ చాంపియన్ సన్రైజర్స్ ఈస్టర్న్ కేప్ టీమ్ను చిత్తు చేసింది. ఈ నేపథ్యంలో గత రెండు పర్యాయాలు విజేతగా నిలిచిన సన్రైజర్స్ ఫ్రాంచైజీకి చెందిన ఈస్టర్న్ కేప్ జట్టు... ఈసారి రన్నరప్తో సరిపెట్టుకోగా... ఎంఐ కేప్టౌన్ తొలిసారి ట్రోఫీ హస్తగతం చేసుకుంది. బౌల్డ్కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’, మార్కో యాన్సెన్కు ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’అవార్డులు దక్కాయి. కాగా 2023లో తొలిసారి సౌతాఫ్రికా టీ20 లీగ్ ప్రవేశపెట్టగాఅవార్డుల వివరాలు👉ఫైనల్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్- బౌల్ట్ (ఎంఐ కేప్టౌన్) 👉స్పిరిట్ ఆఫ్ ద సీజన్- ఎంఐ కేప్టౌన్ 👉క్యాచ్ ఆఫ్ ద సీజన్- బ్రేవిస్ (ఎంఐ కేప్టౌన్) 👉రైజింగ్ స్టార్ బ్రేవిస్- (ఎంఐ కేప్టౌన్) 👉బ్యాటర్ ఆఫ్ ద సీజన్- ప్రిటోరియస్ (పార్ల్ రాయల్స్) 👉బౌలర్ ఆఫ్ ద సీజన్- యాన్సెన్ (ఈస్టర్న్ కేప్) 👉ప్లేయర్ ఆఫ్ ది సీజన్- యాన్సెన్ (ఈస్టర్న్ కేప్) ఎస్ఏ20 2025 విశేషాలు 👉అత్యధిక పరుగులు- ప్రిటోరియస్ 397 👉అత్యధిక వికెట్లు- యాన్సెన్ 19 వికెట్లు 👉అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన- రబడ 4/25 👉అత్యధిక సిక్స్లు- బ్రేవిస్ 25 👉అత్యధిక ఫోర్లు- ప్రిటోరియస్ 47 ప్రైజ్మనీ వివరాలు👉విజేత జట్టుకు 3,25,00,000 ర్యాండ్లు (రూ. 15 కోట్ల 46 లక్షలు) 👉రన్నరప్ జట్టుకు 1,62,00,000 ర్యాండ్లు (రూ. 7 కోట్ల 70 లక్షలు). చదవండి: చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ.. సచిన్ టెండుల్కర్ను దాటేసి..𝐏𝐎𝐕 - 𝒀𝒐𝒖'𝒗𝒆 𝒋𝒖𝒔𝒕 𝒘𝒐𝒏 #BetwaySA20 season 3 🏆 #WelcomeToIncredible pic.twitter.com/RZmQFsGMFK— Betway SA20 (@SA20_League) February 8, 2025 -
రాయల్స్ చిత్తు.. ఫైనల్కు దూసుకెళ్లిన సన్రైజర్స్
సౌతాఫ్రికా టీ20 లీగ్-2025 ఫైనల్లో సన్రైజర్స్ ఈస్ట్రన్కేప్(Sunrisers Eastern Cape) అడుగుపెట్టింది. గురువారం సెంచూరియన్ వేదికగా జరిగిన క్వాలిఫయర్-2లో పార్ల్ రాయల్స్ను 8 వికెట్ల తేడాతో చిత్తు చేసిన సన్రైజర్స్.. వరుసగా మూడో సారి తమ ఫైనల్ బెర్త్ను ఖారారు చేసుకుంది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన పార్ల్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 175 పరుగుల భారీ స్కోర్ సాధించింది. పార్ల్ బ్యాటర్లలో రూబిన్ హెర్మాన్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 53 బంతులు మాత్రమే ఎదుర్కొన్న హెర్మాన్.. 8 ఫోర్లు, 3 సిక్స్లతో 81 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. అతడితో పాటు ఓపెనర్ లువాన్-డ్రే ప్రిటోరియస్(59) హాఫ్ సెంచరీతో మెరిశాడు. సన్రైజర్స్ బౌలర్లలో ఓవర్టన్, మార్కో జానెసన్, బార్టమన్, మార్క్రమ్ తలా వికెట్ సాధించారు.టోనీ ఊచకోత..అనంతరం 176 పరుగుల లక్ష్యాన్ని సన్రైజర్స్ కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 19.2 ఓవర్లలో చేధించింది. లక్ష్య చేధనలో ఈస్ట్రన్ కేప్ ఓపెనర్ టోనీ డి జోర్జి ఆకాశమే హద్దుగా చెలరేగాడు. రాయల్స్ బౌలర్లను టోనీ ఊచకోత కోశాడు. కేవలం 49 బంతుల్లోనే 11 ఫోర్లు, 2 సిక్స్లతో 78 పరుగులు చేసి ఔటయ్యాడు.అతడితో పాటు జోర్డాన్ హెర్మాన్ సైతం కీలక ఇన్నింగ్స్ ఆడాడు. 48 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్లతో 69 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. రాయల్స్ బౌలర్లలో మఫాక, దునిత్ వెల్లలాగే తలా వికెట్ సాధించారు. మిగితా బౌలర్లంతా దారుణంగా విఫలమయ్యారు.ఎంఐ కేప్టౌన్తో ఢీ..ఇక శనివారం(ఫిబ్రవరి 8)న జోహాన్స్బర్గ్ వేదికగా జరగనున్న ఫైనల్ పోరులో సన్రైజర్స్, ఎంఐ కేప్టౌన్ జట్లు అమీతుమీ తెల్చుకోనున్నాయి. కేప్టౌన్కు ఇదే తొలి ఫైనల్ కాగా.. సన్రైజర్స్కు మాత్రం ఇది ముచ్చటగా మూడో ఫైనల్. తొలి రెండు సీజన్లలోనూ మార్క్రమ్ సారథ్యంలోనే సన్రైజర్స్ ఈస్ట్రన్ కేప్ ఛాంపియన్స్గా నిలిచింది. కాగా ఈస్ట్రన్ కేప్ జట్టు ఐపీఎల్ ప్రాంఛైజీ సన్రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యానికే సంబంధించినదే కావడం గమనార్హం. చదవండి: IND vs ENG: చరిత్ర సృష్టించిన హర్షిత్ రాణా.. తొలి భారత ప్లేయర్గా -
సన్రైజర్స్ ఘన విజయం.. సూపర్ కింగ్స్ ఎలిమినేట్
సౌతాఫ్రికా టీ20 లీగ్లో డిఫెండింగ్ చాంపియన్ సన్రైజర్స్ ఈస్టర్న్ కేప్(Sunrisers Eastern Cape) మరోసారి టైటిల్ రేసులో నిలిచింది. ఎలిమినేటర్ మ్యాచ్లో జొబర్గ్ సూపర్ కింగ్స్(Joburg Super Kings)ను చిత్తు చేసి క్వాలిఫయర్-2కు అర్హత సాధించింది. కాగా 2023లో మొదలైన సౌతాఫ్రికా టీ20 లీగ్(SA20)లో ఐపీఎల్ ఫ్రాంఛైజీ సన్రైజర్స్ హైదరాబాద్కు చెందిన ఈస్టర్న్ కేప్ జట్టు అరంగేట్ర చాంపియన్గా నిలిచింది.గతేడాది కూడా మార్క్రమ్ సారథ్యంలోని ఈ జట్టు విజేతగా అవతరించి వరుసగా రెండోసారి టైటిల్ గెలిచింది. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి కూడా టైటిల్కు గురిపెట్టిన సన్రైజర్స్ ఈస్టర్న్ కేప్ ఎస్ఏ20- 2025 ఆరంభంలో మాత్రం చేదు అనుభవాలు ఎదుర్కొంది.హ్యాట్రిక్ పరాజయాలుజనవరి 9న లీగ్ తొలి మ్యాచ్లో భాగంగా ముంబై ఇండియన్స్ కేప్టౌన్ చేతిలో 97 పరుగుల తేడాతో సన్రైజర్స్ చిత్తుగా ఓడింది. అనంతరం రాయల్ పర్ల్స్ చేతిలోనూ తొమ్మిది వికెట్ల తేడాతో పరాభవం పాలైంది. ఆ తర్వాత ప్రిటోరియా క్యాపిటల్స్ చేతిలో ఆరు వికెట్ల తేడాతో ఓడిపోయి.. హ్యాట్రిక్ పరాజయాలు నమోదు చేసింది.ఆపై విజయాల బాట పట్టిఅయితే, నాలుగో మ్యాచ్లో డర్బన్ సూపర్ జెయింట్స్పై గెలుపొంది విజయాల బాట పట్టిన సన్రైజర్స్.. ఆపై వరుసగా మూడు మ్యాచ్లలో జయభేరి మోగించి ప్లే ఆఫ్స్ రేసులోకి వచ్చింది. లీగ్ దశలో మొత్తంగా పది మ్యాచ్లో ఐదింట గెలిచి పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో నిలిచిన సన్రైజర్స్ ఎలిమినేటర్ మ్యాచ్కు అర్హత సాధించింది.ఇందులో భాగంగా బుధవారం రాత్రి జొబర్గ్ సూపర్ కింగ్స్తో తలపడింది సన్రైజర్స్ ఈస్టర్న్ కేప్ జట్టు. సెంచూరియన్ వేదికగా సాగిన ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన సూపర్ కింగ్స్ తొలుత బౌలింగ్ చేసింది. ఈ క్రమంలో బ్యాటింగ్కు దిగిన సన్రైజర్స్ నిర్ణీత ఇరవై ఓవర్లలో ఆరు వికెట్లు నష్టపోయి 184 పరుగులు చేసింది.మార్క్రమ్ కెప్టెన్ ఇన్నింగ్స్ఓపెనర్లు బెడింగ్హాం(14 బంతుల్లో 27), టోనీ డి జోర్జి(9 బంతుల్లో 14) ధాటిగా ఇన్నింగ్స్ ఆరంభించగా.. జోర్డాన్ హెర్మాన్(16 బంతుల్లో 12), అబెల్(10 బంతుల్లో 10) నిరాశపరిచారు. ఈ క్రమంలో ఐడెన్ మార్క్రమ్ కెప్టెన్ ఇన్నింగ్స్తో మెరిశాడు. నలభై బంతుల్లో ఐదు ఫోర్లు, రెండు సిక్సర్ల సాయంతో 62 పరుగులు చేసి ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు.మిగతా వాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ ట్రిస్టన్ స్టబ్స్ 21 బంతుల్లో 26 పరుగులు చేయగా.. ఆఖర్లో మార్కో జాన్సెన్ మెరుపు ఇన్నింగ్స్(12 బంతుల్లో 23) ఆడాడు. ఫలితంగా సన్రైజర్స్ మంచి స్కోరు(184-6) నమోదు చేయగలిగింది. జొబర్గ్ సూపర్ కింగ్స్ బౌలర్లలో ఇమ్రాన్ తాహిర్, విల్జోయెన్ రెండేసి వికెట్లు దక్కించుకోగా.. మహీశ్ తీక్షణ, మొయిన్ అలీ ఒక్కో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.సూపర్ కింగ్స్ ఎలిమినేట్ఇక లక్ష్య ఛేదనలో జొబర్గ్ శుభారంభమే అందుకున్నా దానిని కొనసాగించలేకపోయింది. ఓపెనర్లలో డెవాన్ కాన్వే(20 బంతుల్లో 30) రాణించగా.. కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్(18 బంతుల్లో 19) మాత్రం విఫలమయ్యాడు. మిగిలిన ఆటగాళ్లలో జేపీ కింగ్(9), విహాన్ ల్యూబే(13), మొయిన్ అలీ(0), హార్డస్ విల్జోయెన్(14) పూర్తిగా నిరాశపరచగా.. వికెట్ కీపర్ బ్యాటర్ జానీ బెయిర్స్టో ధనాధన్ దంచికొట్టాడు.కేవలం 17 బంతుల్లోనే 37 పరుగులు సాధించాడు. అతడికి తోడుగా ఇవాన్ జోన్స్(17 బంతుల్లో 22నాటౌట్) రాణించాడు. కానీ అప్పటికే పరిస్థితి చేజారిపోయింది. ఇరవై ఓవర్లు పూర్తయ్యేసరికి ఏడు వికెట్లు నష్టపోయిన జొబర్గ్ సూపర్ కింగ్స్ 152 పరుగులకే పరిమితమైంది. దీంతో 32 పరుగుల తేడాతో గెలుపొందిన సన్రైజర్స్ ఈస్టర్న్ కేప్.. జొబర్గ్ను ఎలిమినేట్ చేసి క్వాలిఫయర్-2కు అర్హత సాధించింది.క్వాలిఫయర్-2లో పర్ల్ రాయల్స్తో ఢీసన్రైజర్స్ విజయంలో కీలక పాత్ర పోషించిన కెప్టెన్ ఐడెన్ మార్క్రమ్ ప్లేయర్ ఆఫ్ దిమ్యాచ్ అవార్డు అందుకున్నాడు. ఇక తదుపరి గురువారం నాటి క్వాలిఫయర్-2 మ్యాచ్లో సన్రైజర్స్ పర్ల్ రాయల్స్ను ఢీకొట్టనుంది. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు శనివారం జరిగే ఫైనల్లో ముంబై ఇండియన్స్ కేప్టౌన్తో టైటిల్ కోసం తలపడుతుంది.చదవండి: ఇదేం పద్ధతి?: రోహిత్ శర్మ ఆగ్రహం -
కాన్వే మెరుపు ఇన్నింగ్స్.. సన్రైజర్స్కు ‘బోనస్’ షాక్!
సౌతాఫ్రికా టీ20 లీగ్-2025(SA20- 2025) ఎడిషన్ తుది అంకానికి చేరుకుంటోంది. ఇప్పటికే పర్ల్ రాయల్స్(Parl Royals) ప్లే ఆఫ్స్నకు అర్హత సాధించగా.. మిగిలిన మూడు స్థానాల కోసం నాలుగు జట్ల మధ్య ప్రధాన పోటీ నెలకొంది. ఇలాంటి తరుణంలో సన్రైజర్స్ ఈస్టర్న్కేప్(Sunrisers Eastern Cape) జట్టుకు జొబర్గ్ సూపర్ కింగ్స్ భారీ షాకిచ్చింది.సన్రైజర్స్ వరుస విజయాలకు అడ్డుకట్ట వేయడంతో పాటు.. ‘బోనస్’ పాయింట్(Win With Bonus Point)తో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి ఎగబాకింది. ప్లే ఆఫ్స్ రేసులోనూ రైజర్స్తో పోటీకి సై అంటోంది. కాగా గ్వెబెర్హా వేదికగా జనవరి 9న సౌతాఫ్రికా టీ20 లీగ్ మూడో సీజన్ ఆరంభమైంది. తొలి మ్యాచ్లో పర్ల్ రాయల్స్తో తలపడ్డ.. డిఫెండింగ్ చాంపియన్ సన్రైజర్స్ ఓటమితో ప్రయాణాన్ని ఆరంభించింది.వరుసగా నాలుగు విజయాలుఅనంతరం.. ప్రిటోరియా క్యాపిటల్స్ చేతిలోనూ ఓడిన మార్క్రమ్ బృందం.. తర్వాత వరుసగా నాలుగు విజయాలు సాధించింది. డర్బన్ సూపర్ జెయింట్స్ను వరుసగా రెండు మ్యాచ్లలో చిత్తు చేయడంతో పాటు.. ప్రిటోరియా క్యాపిటల్స, జొబర్గ్ సూపర్ కింగ్స్పై గెలుపొందింది.ఈసారి మాత్రం ఘోర పరాజయంఇక ఆదివారం నాటి మ్యాచ్లో జొబర్గ్ జట్టుతోనే తలపడిన సన్రైజర్స్ ఈసారి మాత్రం ఘోర పరాజయం పాలైంది. జొహన్నస్బర్గ్ వేదికగా టాస్ గెలిచిన సన్రైజర్స్ తొలుత బ్యాటింగ్ చేసింది. అయితే, జొబర్గ్ బౌలర్ల ధాటికి 118 పరుగులకే కుప్పకూలింది. ఓపెనర్ బెడింగ్హాం(40 బంతుల్లో 48), వికెట్ కీపర్ ట్రిస్టన్ స్టబ్స్(37), మార్కో జాన్సెన్(22) మాత్రమే రాణించారు.మిగతా వాళ్లలో ఓపెనర్ జాక్ క్రాలే, అబెల్, జోర్డాన్ హెర్మాన్, కెప్టెన్ ఐడెన్ మార్క్రమ్, బేయర్స్ స్వానెపోయెల్ డకౌట్ కాగా.. లియామ్ డాసన్, ఒట్నీల్ బార్ట్మన్, రిచర్డ్ గ్లెసాన్(1*) ఒక్కో పరుగు మాత్రమే చేశారు. ఇక జొబర్గ్ బౌలర్లలో విల్జోన్ నాలుగు వికెట్లతో చెలరేగగా.. సిపామ్ల మూడు వికెట్లు, ఇమ్రాన్ తాహిర్, మతీశ పతిరణ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు.What a start for the Joburg Super Kings 🏎️#BetwaySA20 #JSKvSEC #WelcomeToIncredible pic.twitter.com/jQhU4dIW85— Betway SA20 (@SA20_League) January 26, 2025 డెవాన్ కాన్వే మెరుపు ఇన్నింగ్స్ఇక స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన జొబర్గ్ సూపర్ కింగ్స్ ఆదిలోనే కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్(15) వికెట్ కోల్పోయింది. అయితే, మరో ఓపెనర్ డెవాన్ కాన్వే ధనాధన్ దంచికొట్టాడు. 56 బంతుల్లో పదకొండు ఫోర్లు, మూడు సిక్సర్ల సాయంతో 76 పరుగులతో అజేయంగా నిలిచాడు. అతడికి తోడుగా వన్డౌన్ బ్యాటర్ విహాన్ లూబే(17 బంతుల్లో 3 ఫోర్లు, ఒక సిక్సర్ , 25 రన్స్) మెరుపు ఇన్నింగ్స్తో రాణించాడు.ఫలితంగా మరో 36 బంతులు మిగిలి ఉండగానే జొబర్గ్ సూపర్ కింగ్స్ లక్ష్యాన్ని ఛేదించింది. తొమ్మిది వికెట్ల తేడాతో సన్రైజర్స్పై గెలుపొంది.. అదనపు పాయింట్ను కూడా ఖాతాలో వేసుకుంది. కాగా సౌతాఫ్రికా టీ20 లీగ్లో ఆరు జట్లు లీగ్ దశలో పదేసి మ్యాచ్లు ఆడతాయి. పాయింట్ల కేటాయింపు ఇలామ్యాచ్ గెలిస్తే నాలుగు పాయింట్లు, ఫలితం తేలకపోతే రెండు పాయింట్లు వస్తాయి. ఓడితే పాయింట్లేమీ రావు. ఇక గెలిచిన- ఓడిన జట్టు మధ్య రన్రేటు పరంగా 1.25 రెట్ల తేడా ఉంటే.. నాలుగు పాయింట్లకు అదనంగా మరో బోనస్ పాయింట్ కూడా వస్తుంది.జొబర్గ్ సూపర్ కింగ్స్ ఈ నిబంధన ప్రకారమే తాజాగా బోనస్ పాయింట్ సాధించి.. ఓవరాల్గా 15 పాయింట్లతో పట్టికలో నాలుగో స్థానానికి దూసుకువచ్చింది. కాగా పర్ల్ రాయల్స్ ఇప్పటికి ఏడు మ్యాచ్లు పూర్తి చేసుకుని ఆరు విజయాలతో 24 పాయింట్లు సాధించి ప్లే ఆఫ్స్లో అడుగుపెట్టింది.మరోవైపు.. ఎంఐ కేప్టౌన్ ఏడింట నాలుగు(21 పాయింట్లు), సన్రైజర్స్ ఎనిమిదింట నాలుగు(19 పాయింట్ల) విజయాలతో పట్టికలో రెండు, మూడు స్థానాల్లో కొనసాగుతున్నాయి. జొబర్గ్ ఏడింట మూడు గెలిచి నాలుగో స్థానంలో.. ప్రిటోరియా క్యాపిటల్స్ ఏడింట కేవలం ఒక్కటి గెలిచి ఐదు, డర్బన్ సూపర్ జెయింట్స్ ఎనిమిదింట ఒక్క విజయంతో అట్టడుగున ఆరో స్థానంలో ఉన్నాయి. చదవండి: చరిత్ర సృష్టించిన హసరంగ.. ఫాస్టెస్ట్ ట్రిపుల్ సెంచరీ -
రాయల్స్ ఓపెనర్ విధ్వంసం.. మార్క్రమ్ మెరుపు ఇన్నింగ్స్ వృధా
సౌతాఫ్రికా టీ20 లీగ్లో (SA20 2025) నిన్న (జనవరి 11) రెండు మ్యాచ్లు జరిగాయి. తొలి మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్ సన్రైజర్స్ ఈస్ట్రన్కేప్పై పార్ల్ రాయల్స్ 9 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన సన్రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. కెప్టెన్ మార్క్రమ్ 49 బంతుల్లో 7 ఫోర్లు, రెండు సిక్సర్ల సాయంతో 82 పరుగులు చేసి టాప్ స్కోరర్గా నిలిచాడు. జోర్డన్ హెర్మన్ 10, జాక్ క్రాలే 27, టామ్ ఏబెల్ 20, మార్కో జన్సెన్ 4, ట్రిస్టన్ స్టబ్స్ 28 (నాటౌట్) పరుగులు చేశారు. రాయల్స్ బౌలర్లలో క్వేనా మపాకా, ముజీబ్ ఉర్ రెహ్మాన్ తలో రెండు వికెట్లు పడగొట్టారు.ఓ మోస్తరు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన రాయల్స్ 18.4 ఓవర్లలో వికెట్ మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. ఓపెనర్ లుహాన్ డ్రే ప్రిటోరియస్ (51 బంతుల్లో 97; 10 ఫోర్లు, 6 సిక్సర్లు) రాయల్స్ గెలుపుకు బలమైన పునాది వేశాడు. మరో ఓపెనర్ జో రూట్ 44 బంతుల్లో 4 ఫోర్లు, సిక్సర్ సాయంతో 62 పరుగులు చేసి రాయల్స్ను విజయతీరాలకు చేర్చాడు. రూట్కు కెప్టెన్ డేవిడ్ మిల్లర్ (17 నాటౌట్) సహకరించాడు. రాయల్స్ కోల్పోయిన ఏకైక వికెట్ మార్కో జన్సెన్కు దక్కింది.డిఫెండింగ్ ఛాంపియన్ను చిత్తు చేసిన సూపర్ కింగ్స్నిన్ననే జరిగిన రెండో మ్యాచ్లో ముంబై ఇండియన్స్ కేప్టౌన్పై జోబర్గ్ సూపర్ కింగ్స్ ఆరు పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఎంఐ కేప్టౌన్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 140 పరుగులు చేసింది. లోయర్ ఆర్డర్ బ్యాటర్లు జార్జ్ లిండే (48 నాటౌట్), డెలానో పాట్గెటర్ (44 నాటౌట్) ఓ మోస్తరు స్కోర్లు చేయడంతో ఎంఐ ఈ మాత్రమే స్కోరైనా చేయగలిగింది. కేప్టౌన్ 75 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోగా.. లిండే, పాట్గెటర్ తమ జట్టుకు గౌరవప్రదమైన స్కోర్ అందించారు. జోబర్గ్ సూపర్ కింగ్స్ బౌలర్లలో తబ్రేజ్ షంషి, డేవిడ్ వీస్, సిపామ్లా, ఈవాన్ జోన్స్ తలో వికెట్ పడగొట్టారు.141 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన సూపర్కింగ్స్కు వర్షం పలుమార్లు అడ్డుతగిలింది. 11.3 ఓవర్ల అనంతరం మొదలైన వర్షం ఎంతకీ తగ్గకపోవడంతో డక్వర్త్ లూయిస్ పద్దతిన సూపర్ కింగ్స్ను విజేతగా ప్రకటించారు. మ్యాచ్ ఆగిపోయే సమయానికి సూపర్ కింగ్స్ 3 వికెట్లు కోల్పోయి 82 పరుగులు చేసింది. సూపర్ కింగ్స్ ఇన్నింగ్స్లో డెవాన్ కాన్వే 9, డుప్లెసిస్ 30, లుస్ డు ప్లూయ్ 24 (నాటౌట్), జానీ బెయిర్స్టో 14 పరుగులు చేశారు. సూపర్ కింగ్స్ ఇన్నింగ్స్లో టాప్ స్కోరర్గా నిలిచిన డుప్లెసిస్కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ఎంఐ బౌలర్లలో రబాడకు రెండు, ట్రెంట్ బౌల్ట్కు ఓ వికెట్ దక్కాయి. -
జూనియర్ ఏబీడీ విధ్వంసం.. తొలి మ్యాచ్లో సన్రైజర్స్ చిత్తు
సౌతాఫ్రికా టీ20 లీగ్-2025(SA20) ను డిఫెండిండ్ ఛాంపియన్స్ సన్రైజర్స్ ఈస్టర్న్ కేప్ ఘోర ఓటమితో ఆరంభించింది. సెయింట్ జార్జ్ పార్క్ వేదికగా ఏంఐ కేప్ టౌన్తో జరిగిన మ్యాచ్లో 97 పరుగుల తేడాతో సన్రైజర్స్ పరాజయం పాలైంది. 175 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన సన్రైజర్స్ ఈస్టర్న్ కేప్.. ఎంఐ బౌలర్ల దాటికి 15 ఓవర్లలో కేవలం 77 పరుగులకే కుప్పకూలింది.ఎంఐ ఆల్రౌండర్ డెలానో పోట్గీటర్ 5 వికెట్లతో ఈస్టర్న్ కేప్ పతనాన్ని శాసించాడు. ఈ మ్యాచ్లో 3 ఓవర్లు బౌలింగ్ చేసిన పోట్గీటర్ కేవలం 10 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. అతడితో పాటు ట్రెంట్ బౌల్ట్ రెండు, లిండే, ఒమర్జాయ్ తలా వికెట్ సాధించారు. సన్రైజర్స్ బ్యాటర్లలో కెప్టెన్ ఐడైన్ మార్క్రమ్(19) టాప్ స్కోరర్గా నిలవగా.. మిగితా బ్యాటర్లంతా పూర్తిగా తేలిపోయారు.బ్రెవిస్ విధ్వంసం..అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఎంఐ కేప్టౌన్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. మొదటి ఓవర్లోనే సన్రైజర్స్ పేసర్ మార్కో జానెసన్.. రీజా హెండ్రిక్స్ను ఔట్ చేసిన కేప్టౌన్ జట్టుకు బిగిషాకిచ్చాడు. ఆ తర్వాత రాస్సీ వాన్ డెర్ డస్సెన్(16), కానర్ ఎస్టెర్హజెన్(22) ఎంఐ ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశారు.Marco rocked, and Reeza was left shocked! 🤯☝️Jansen picks up the 1st wicket of the new season of the #SA20! 🔥Catch all the action LIVE on Disney+Hotstar, Star Sports 2 & Sports18-2!#SECvMICT pic.twitter.com/kA4kgI5wuK— JioCinema (@JioCinema) January 9, 2025అయితే వీరిద్దరూ వరుస క్రమంలో ఔట్ కావడంతో కేప్టౌన్ జట్టు మళ్లీ కష్టాల్లో పడింది. ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన యువ ఆటగాడు డెవాల్డ్ బ్రెవిస్(Dewald Brevis) విధ్వంసం సృష్టించాడు. సన్రైజర్స్ బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. మైదానం నలుమూలల బౌండరీల వర్షం కురిపించాడు.Dewald Brevis 🔛🔥Keep watching the #SA20 LIVE on Disney + Hotstar, Star Sports 2 & Sports18-2!#DewaldBrevis #SECvMICT pic.twitter.com/58X2QHetea— JioCinema (@JioCinema) January 9, 2025 కేవలం 29 బంతులు మాత్రమే ఎదుర్కొన్న 'జూనియర్ ఏబీడీ' 2 ఫోర్లు, 6 సిక్స్లతో 57 పరుగులు చేసి ఔటయ్యాడు. అతడితో పాటు పోట్గీటర్ ఆఖరిలో(12 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్సర్తో 25 పరుగులు) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. సన్రైజర్స్ బౌలర్లలో మార్కో జానెసన్, గ్లీసన్ తలా రెండు వికెట్లు సాధించగా.. బేయర్స్ స్వాన్పోయెల్, లైమ్ డాసన్, హర్మర్ తలా వికెట్ సాధించారు.ఇదే తొలి విజయం..కాగా సౌతాఫ్రికా టీ20 లీగ్లో సన్రైజర్స్ ఈస్టర్న్ కేప్ జట్టుపై ఎంఐకేప్టౌన్కు ఇదే తొలి విజయం కావడం గమనార్హం. గత రెండు సీజన్లలో ఒక్కసారి కూడా సన్రైజర్స్పై కేప్టౌన్ విజయం సాధించలేదు. ఇక ఆల్రౌండ్ షోతో అదరగొట్టిన పోట్గీటర్కు ప్లేయర్ ఆఫ్ది మ్యాచ్ అవార్డు దక్కింది.చదవండి: CT 2025: 'అఫ్గానిస్తాన్తో మ్యాచ్ ఆడొద్దు'.. సౌతాఫ్రికాకు ఆ దేశ ప్రజల పిలుపు -
మార్క్రమ్, బాష్ మెరుపులు.. పటిష్ట స్థితిలో సౌతాఫ్రికా
సెంచూరియన్: పాకిస్తాన్తో తొలి టెస్టులో దక్షిణాఫ్రికా పటిష్ట స్థితిలో నిలిచింది. అరంగేట్ర మ్యాచ్లో బంతితో 4 వికెట్లు పడగొట్టిన కార్బిన్ బాష్ (93 బంతుల్లో 81 నాటౌట్; 15 ఫోర్లు) బ్యాట్తోనూ విజృంభించాడు. లోయర్ ఆర్డర్ అండతో పాకిస్తాన్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొంటూ అర్ధ సెంచరీ నమోదు చేశాడు. అరంగేట్ర మ్యాచ్లో 9వ స్థానంలో బ్యాటింగ్కు దిగి అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన ఆటగాడిగా బాష్ రికార్డుల్లోకెక్కాడు. ఫలితంగా ఓవర్నైట్ స్కోరు 82/3తో శుక్రవారం రెండో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన దక్షిణాఫ్రికా చివరకు 73.4 ఓవర్లలో 301 పరుగులకు ఆలౌటైంది. దీంతో ఆతిథ్య సఫారీ జట్టుకు 90 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. ఓపెనర్ మార్క్రమ్ (144 బంతుల్లో 89; 15 ఫోర్లు) 11 పరుగుల తేడాతో సెంచరీని కోల్పోయాడు. కెప్టెన్ బవుమా (31; 4 ఫోర్లు), బెడింగ్హమ్ (30; 5 ఫోర్లు) ఫర్వాలేదనిపించారు. కైల్ వెరిన్ (2), మార్కో యాన్సెన్ (2) విఫలమయ్యారు. పాకిస్తాన్ బౌలర్లలో ఖుర్రమ్ షహజాద్, నసీమ్ షా చెరో 3 వికెట్లు పడగొట్టారు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన పాకిస్తాన్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి 22 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 88 పరుగులు చేసింది. కెప్టెన్ షాన్ మసూద్ (28; 4 ఫోర్లు) అయూబ్ (28; 6 ఫోర్లు), కమ్రాన్ గులామ్ (4) అవుట్ కాగా... బాబర్ ఆజమ్ (16 బ్యాటింగ్), సౌద్ షకీల్ (8 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. చేతిలో 7 వికెట్లు ఉన్న పాకిస్తాన్... ప్రత్యర్థి తొలి ఇన్నింగ్స్ స్కోరుకు 2 పరుగులు వెనుకబడి ఉంది. సఫారీ బౌలర్లలో జన్సెన్ 2 వికెట్లు తీశాడు. -
టీమిండియాతో సిరీస్.. సౌతాఫ్రికాదే గెలుపు: సిక్సర్ల వీరుడి కామెంట్స్ వైరల్
టీ20 సిరీస్లో చెరో విజయంతో సమంగా ఉన్న టీమిండియా- సౌతాఫ్రికా మరో కీలక పోరుకు సిద్ధమయ్యాయి. ఇరుజట్ల మధ్య బుధవారం సెంచూరియన్ వేదికగా మూడో టీ20 జరుగనుంది. ఇందులో గెలిచి ఆధిక్యం పెంచుకోవాలని ఇటు సూర్య సేన.. అటు ప్రొటిస్ జట్టు తహతహలాడుతున్నాయి.మొదటి రెండు టీ20లలో అలాఈ నేపథ్యంలో సౌతాఫ్రికా మాజీ క్రికెటర్ హర్షల్ గిబ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మొదటి రెండు టీ20లలో పిచ్లు భారత జట్టుకే అనుకూలంగా ఉన్నాయని పేర్కొన్నాడు. టీ20 మ్యాచ్లలో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేమని.. అయితే, టీమిండియాపై తమ జట్టు పైచేయి సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశాడు.టీమిండియాతో సిరీస్ను 3-1తో కైవసం చేసుకుంటుందని హర్షల్ గిబ్స్ విశ్వాసం కనబరిచాడు. ఇందుకు గల కారణాన్ని విశ్లేషిస్తూ.. ‘‘ఈ ఫార్మాట్లో ఏదైనా జరగవచ్చు. నాకు తెలిసి ఇప్పటి వరకు వికెట్ టీమిండియాకే అనుకూలించింది. అయితే, సెంచూరియన్, జొహన్నస్బర్గ్ మ్యాచ్లలో మాత్రం భారీస్కోర్లు నమోదవుతాయని భావిస్తున్నా.3-1తో ప్రొటిస్ జట్టుదే సిరీస్ఆ రెండు మ్యాచ్లలో ఏదైనా జరగొచ్చు. తొలి రెండు టీ20లలో ప్రొటిస్ పూర్తిస్థాయి, పటిష్ట జట్టుతోనే బరిలోకి దిగింది. అయితే, టీమిండియా మాత్రం అనుభవలేమి ఆటగాళ్లతో ఇక్కడికి వచ్చింది. నా అంచనా ప్రకారం ఈ సిరీస్ను 3-1తో ప్రొటిస్ జట్టు సొంతం చేసుకుంటుంది’’ అని హర్షల్ గిబ్స్ పేర్కొన్నాడు. ఈ మేరకు స్పోర్ట్స్బూమ్తో వ్యాఖ్యలు చేశాడు.మిగిలిన రెండు టీ20లలోకాగా నాలుగు మ్యాచ్ల టీ20 సిరీస్ ఆడేందుకు టీమిండియా సౌతాఫ్రికాకు వెళ్లిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా డర్బన్ వేదికగా తొలి మ్యాచ్లో సూర్యకుమార్ సేన 61 పరుగుల తేడాతో విజయం సాధించింది. అయితే, గెబెహాలో జరిగిన రెండో టీ20లో భారత బౌలర్లు ఆఖరి వరకు పోరాడినా ఫలితం లేకపోయింది. ఆతిథ్య జట్టు చేతిలో టీమిండియా మూడు వికెట్ల తేడాతో ఓటమి పాలైంది.ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య తదుపరి సెంచూరియన్లోని సూపర్స్పోర్ట్ పార్క్లో బుధవారం మూడో టీ20... అదే విధంగా.. శుక్రవారం జొహన్నస్బర్గ్లోని ది వాండరర్స్ స్టేడియంలో ఆఖరి టీ20 జరుగునున్నాయి. ఈ రెండు మ్యాచ్లు భారత కాలమానం ప్రకారం.. రాత్రి 8.30 నిమిషాలకు మొదలయ్యేలా షెడ్యూల్ ఖరారైంది.ప్రపంచ రికార్డు ఖాతాలో వేసుకునిఇదిలా ఉంటే.. అంతర్జాతీయ క్రికెట్ ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు బాదిన తొలి ఆటగాడిగా హర్షల్ గిబ్స్ చరిత్ర పుటల్లో తన పేరు లిఖించుకున్నాడు. 2007లో నెదర్లాండ్స్తో మ్యాచ్లో డాన్ వాన్ బంగ్ బౌలింగ్లో వరుసగా సిక్స్లతో విరుచుకుపడ్డాడు.ఇక గిబ్స్ తర్వాత వన్డేల్లో జస్కరన్ మల్హోత్రా (అమెరికా) పాపువా న్యూగినియాతో 2021 నాటి మ్యాచ్లో మళ్లీ ఈ ఫీట్ నమోదు చేశాడు. ఇదిలా ఉంటే.. అంతర్జాతీయ టీ20లలో టీమిండియా మాజీ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ స్టువర్ట్ బ్రాడ్ (ఇంగ్లండ్; 2007లో) బౌలింగ్లో ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు బాదాడు. తర్వాత వెస్టిండీస్ వీరుడు కీరన్ పొలార్డ్ శ్రీలంక బౌలర్ అఖిల ధనంజయ(2021లో) బౌలింగ్లో ఈ ఘనత సాధించాడు.సౌతాఫ్రికాతో టీ20లకు భారత జట్టుసంజూ శాంసన్(వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), తిలక్ వర్మ, అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, అర్ష్దీప్ సింగ్, రవి బిష్ణోయ్, వరుణ్ చక్రవర్తి, అవేశ్ ఖాన్, జితేశ్ శర్మ, విజయ్కుమార్ వైశాఖ్, రమణ్దీప్ సింగ్, యశ్ దయాళ్.సౌతాఫ్రికా జట్టురియాన్ రికెల్టన్, రీజా హెండ్రిక్స్, ఐడెన్ మార్క్రమ్(కెప్టెన్), ట్రిస్టన్ స్టబ్స్, మార్కో జాన్సెన్, హెన్రిచ్ క్లాసెన్(వికెట్ కీపర్), డేవిడ్ మిల్లర్, ఆండిలే సిమెలేన్, గెరాల్డ్ కొయెట్జీ, కేశవ్ మహారాజ్, నకబయోమ్జీ పీటర్, పాట్రిక్ క్రూగర్, మిహ్లాలీ ఎంపోంగ్వానా, డోనోవన్ ఫెరీరా, ఒట్నీల్ బార్ట్మన్, లుథో సిపామ్లా.చదవండి: BGT: బీసీసీఐ కీలక నిర్ణయం!.. అభిమానులకు బ్యాడ్న్యూస్! -
ఊచకోత..; ఒక్కసారి అతడు హిట్టింగ్ మొదలుపెడితే ఆపలేం: మార్క్రమ్
యాభై బంతుల్లో ఏడు ఫోర్లు, పది సిక్సర్లు.. మొత్తంగా 107 పరుగులు.. టీమిండియా స్టార్, ఓపెనర్ సంజూ శాంసన్ డర్బన్ వేదికగా సౌతాఫ్రికా బౌలింగ్ను ఒక రకంగా ఊచకోత కోశాడు. ప్రొటిస్ బౌలర్లపై అటాక్ చేస్తూ పరుగుల విధ్వంసంతో 214కు పైగా స్ట్రైక్ రేటు నమోదు చేశాడు. ఆద్యంతం అద్భుతమైన షాట్లతో క్రికెట్ ప్రేమికులను అలరిస్తూ ఆకాశమే హద్దుగా చెలరేగాడు.ఎంత మంది బౌలర్లను మార్చినా ప్రయోజనం లేదుసంజూ జోరుకు కళ్లెం వేయడానికి సౌతాఫ్రికా కెప్టెన్ ఐడెన్ మార్క్రమ్ ఎంత మంది బౌలర్లను మార్చినా ప్రయోజనం లేకపోయింది. అతడే స్వయంగా ఈ విషయాన్ని అంగీకరించాడు. తొలి టీ20లో టీమిండియా చేతిలో ఓడిన తర్వాత మార్క్రమ్ మాట్లాడుతూ... సంజూ శాంసన్పై ప్రశంసలు కురిపించాడు.అసాధారణ ఇన్నింగ్స్.. అతడిని ఆపలేకపోయాం‘‘ఈ మ్యాచ్లో సంజూ అసాధారణ ఇన్నింగ్స్ ఆడాడు. మా బౌలర్లను తీవ్ర ఒత్తిడిలోకి నెట్టాడు. అతడిని అవుట్ చేయడానికి మేము చాలానే ప్లాన్స్ వేశాం. ఎప్పటికప్పుడు మెరుగైన ప్రణాళికతో ముందుకు వెళ్లాం. ఒక్కసారి అతడు అలా క్రీజులో కుదురుకుని హిట్టింగ్ మొదలు పెట్టాక.. అతడిని ఆపడం కుదిరేపని కాదు.అదొక్కటే మాకు సానుకూలాంశంఅతడి ముందు ఒక రకంగా తలొగ్గడం తప్ప ఏమీ చేయలేకపోయాం. అయితే, డెత్ ఓవర్లలో మా వాళ్లు బాగా బౌలింగ్ చేశారు. గెరాల్డ్ కోయెట్జీ, మార్కో జాన్సెన్ ఆట తీరు మాకు ఈ మ్యాచ్లో సానుకూలాంశం’’ అని మార్క్రమ్ పేర్కొన్నాడు. తదుపరి మ్యాచ్లో పొరపాట్లను సరి చేసుకుని మెరుగైన ఆట తీరుతో ముందుకు వస్తామని తెలిపాడు.Sanju Chetta is on fire! 🔥💥Watch the 1st #SAvIND T20I LIVE on #JioCinema, #Sports18, and #ColorsCineplex! 👈#TeamIndia #JioCinemaSports #SanjuSamson pic.twitter.com/kTeX4Wf6AQ— JioCinema (@JioCinema) November 8, 2024 కాగా నాలుగు టీ20 మ్యాచ్ల సిరీస్ ఆడేందుకు టీమిండియా సౌతాఫ్రికా పర్యటనకు వెళ్లింది. ఈ క్రమంలో సూర్య సేన శుక్రవారం మార్క్రమ్ బృందంతో తొలి మ్యాచ్లో తలపడింది. తిలక్ సైతండర్బన్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా సంజూ అద్భుత శతకం, తిలక్ వర్మ(18 బంతుల్లో 33) ధనాధన్ ఇన్నింగ్స్ కారణంగా.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 202 పరుగుల భారీ స్కోరు సాధించింది.భారత బౌలర్ల విజృంభణలక్ష్య ఛేదనలో భారత బౌలర్ల ధాటికి సౌతాఫ్రికా 141 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో 61 పరుగుల తేడాతో భారీ ఓటమిని చవిచూసింది. ఇక టీమిండియా స్పిన్నర్లు వరుణ్ చక్రవర్తి(3/25), రవి బిష్ణోయి(3/28) చెరో మూడు వికెట్లతో చెలరేగగా.. పేసర్లు అర్ష్దీప్ సింగ్ ఒకటి, అవేశ్ ఖాన్ రెండు వికెట్లు దక్కించుకున్నారు. ఈ మ్యాచ్లో మార్క్రమ్ ఎనిమిది పరుగులకే నిష్క్రమించాడు. ఇక ఇరుజట్ల మధ్య ఆదివారం రెండో మ్యాచ్ జరుగనుంది.చదవండి: BGT: వరుసగా 4 సెంచరీలు.. ఆస్ట్రేలియాలో ఫెయిల్.. అయినా టీమిండియా ఓపెనర్గా అతడే! -
Ind vs SA: అతడు పట్టిందల్లా బంగారమే!.. ఒక్కో మ్యాచ్కు రూ. 73 కోట్లు!
టీ20 ప్రపంచకప్-2024లో చాంపియన్గా అవతరించిన టీమిండియా ఆ తర్వాత ద్వైపాక్షిక సిరీస్లలోనూ దుమ్ములేపింది. రోహిత్ శర్మ స్థానంలో పూర్తి స్థాయిలో భారత టీ20 జట్టు పగ్గాలు చేపట్టిన సూర్యకుమార్ యాదవ్ పట్టిందల్లా బంగారమే అన్నట్లుగా ముందుకు సాగుతున్నాడు. తొలుత శ్రీలంక పర్యటనలో సూర్య సేన టీ20 సిరీస్ను 3-0తో క్లీన్స్వీప్ చేయగా.. తర్వాత సొంతగడ్డపై పూర్తిగా యువ ఆటగాళ్లతో కూడిన జట్టుతో బంగ్లాదేశ్ను 3-0తో వైట్వాష్ చేసింది.అదొక్కటి సానుకూలాంశంఅయితే, సౌతాఫ్రికా గడ్డపై రాణించడం టీమిండియాకు అంత తేలికేమీ కాదు. కానీ.. ప్రపంచకప్-2024 ఫైనల్లో భారత్ చేతిలో ఓటమి తర్వాత ప్రొటిస్ జట్టు ఇంకా పూర్తిగా కోలుకోకపోవడం మనకు సానుకూలాంశం. మెగా టోర్నీ తర్వాత వెస్టిండీస్ చేతిలో 0–3తో వైట్వాష్కు గురైన సౌతాఫ్రికా.. తర్వాత పసికూన ఐర్లాండ్తో సిరీస్ను 1–1తో ‘డ్రా’గా ముగించింది.ఈ నేపథ్యంలో రెట్టించిన ఉత్సాహంతో సూర్య సేన వస్తుంటే.. గత పరాభవాల నుంచి కోలుకుని స్వదేశంలో సత్తా చాటాలని సౌతాఫ్రికా పట్టుదలగా ఉంది. హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్ రీఎంట్రీతో తమ రాత మారుతుందని ధీమాగా ఉంది. ఈ నేపథ్యంలో సఫారీలతో టీమిండియా సమరం ఈసారి మరింత రసవత్తరంగా మారనుంది.ఒక్కో మ్యాచ్తో రూ. 73 కోట్లు! నిజానికి.. భారత జట్టు స్వదేశంలో న్యూజిలాండ్తో సిరీస్ ముగిసిన వెంటనే ఆస్ట్రేలియా పర్యటన కోసం వెళ్లాల్సి ఉంది. తొలుత టీమిండియా షెడ్యూల్లో ఈ సిరీస్ లేనే లేదు. కానీ ఆదాయం కోసమే హడావిడిగా దీనిని ఏర్పాటు చేశారు. దక్షిణాఫ్రికా బోర్డును ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కించేందుకు టీ20 స్పెషలిస్ట్లతో భారత టీమ్ను ఎంపిక చేశారు.టీమిండియాతో టీ20 సిరీస్లో ఒక్కో మ్యాచ్ ద్వారా దక్షిణాఫ్రికాకు 150 మిలియన్ ర్యాండ్ల (సుమారు రూ.73 కోట్లు) ఆదాయం రానుందని అంచనా. ఐపీఎల్ తరహాలో దక్షిణాఫ్రికా బోర్డు ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఎస్ఏ20(SAT20) టోర్నీ ద్వారా వచ్చిన మొత్తం లాభం 54 మిలియన్ ర్యాండ్లతో (రూ. 26 కోట్లు) పోలిస్తే దీని విలువ ఏమిటో అర్థమవుతుంది! ఇక ఐపీఎల్-2025 మెగా వేలానికి ముందు తమ సత్తాను నిరూపించుకునేందుకు కూడా సౌతాఫ్రికా ఆటగాళ్లకు ఈ సిరీస్ గొప్ప వేదిక కానుంది.సౌతాఫ్రికా వర్సెస్ టీమిండియా టీ20 సిరీస్ 2024👉మొదటి టీ20- నవంబరు 8(శుక్రవారం)- డర్బన్- రాత్రి గం.8:30లకు👉రెండో టీ20- నవంబరు 10(ఆదివారం)- గ్వెబెర్హ- రాత్రి 7.30 నిమిషాలకు👉మూడో టీ20- నవంబరు 13(బుధవారం)- సెంచూరియన్- రాత్రి గం.8:30లకు👉నాలుగో టీ20- నవంబరు 15(శుక్రవారం)- జొహన్నస్బర్గ్- రాత్రి గం.8:30లకుజట్లుసౌతాఫ్రికారీజా హెండ్రిక్స్, రియాన్ రికెల్టన్(వికెట్ కీపర్), ఐడెన్ మార్క్రమ్(కెప్టెన్), ట్రిస్టన్ స్టబ్స్, హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, మార్కో జాన్సెన్, కేశవ్ మహారాజ్, గెరాల్డ్ కోయెట్జీ, నకబయోమ్జీ పీటర్, ఒట్నీల్ బార్ట్మన్, డోనోవన్ ఫెరీరా, మిహ్లాలీ ఎంపోంగ్వానా, ప్యాట్రిక్ క్రుగర్.భారత్అభిషేక్ శర్మ, సంజూ శాంసన్(వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, రింకు సింగ్, అక్షర్ పటేల్, విజయ్ కుమార్ వైశాక్, అవేష్ ఖాన్, వరుణ్ చక్రవర్తి, అర్ష్దీప్ సింగ్, యశ్ దయాళ్, రవి బిష్ణోయ్, రమణ్దీప్ సింగ్, జితేశ్ శర్మ.ముఖాముఖి రికార్డులుఇప్పటి వరకు టీమిండియా- సౌతాఫ్రికా 27 టీ20 మ్యాచ్లలో తలపడగా.. భారత్ 15 మ్యాచ్లలో గెలుపొందగా.. సౌతాఫ్రికా పదకొండింట విజయం సాధించింది. ఒక మ్యాచ్ వర్షం వల్ల ఫలితం తేలకుండా ముగిసిపోయింది. -
క్లీన్ స్వీప్ పరాభవం తప్పించుకున్న సౌతాఫ్రికా
షార్జా వేదికగా ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ను సౌతాఫ్రికా 1-2 తేడాతో కోల్పోయింది. నిన్న (సెప్టెంబర్ 22) జరిగిన నామమాత్రపు మూడో వన్డేలో సౌతాఫ్రికా 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. తద్వారా ఆఫ్ఘన్ల చేతిలో క్లీన్ స్వీప్ పరాభవం నుంచి తప్పించుకుంది. రెండో వన్డేలో సెంచరీ హీరో ఈ మ్యాచ్లో కూడా రాణించినప్పటికీ.. ఆఫ్ఘనిస్తాన్కు పరాజయం తప్పలేదు. తొలుత బౌలర్లు.. ఆతర్వాత మార్క్రమ్ నిలకడగా ఆడి సౌతాఫ్రికాకు ఎట్టకేలకే ఓ విజయాన్ని అందించారు.Afghanistan wins the ODI series against South Africa. 🇦🇫 pic.twitter.com/ddmwyc4Akd— Mufaddal Vohra (@mufaddal_vohra) September 22, 2024ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్.. 34 ఓవర్లలో 169 పరుగులకు ఆలౌటైంది. రహ్మానుల్లా గుర్బాజ్ మరో మంచి ఇన్నింగ్స్తో (89) ఆఫ్ఘనిస్తాన్కు చెప్పుకోదగ్గ స్కోర్ అందించాడు. గుర్బాజ్ మినహా ఆఫ్ఘనిస్తాన్ ఇన్నింగ్స్లో ఏ ఒక్కరూ రాణించలేదు. అల్లా ఘజన్ఫర్ (31), షాహిది (10) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. సౌతాఫ్రికా బౌలర్లలో ఎంగిడి, నకాబా పీటర్, ఫ్లెహ్లుక్వాయో తలో మూడు వికెట్లు పడగొట్టగా.. ఫోర్టుయిన్ ఓ వికెట్ దక్కించుకున్నాడు.Rahmanullah Gurbaz scored 89 (94) out of Afghanistan's 169 total.- The lone warrior of Afghans tonight! 👏pic.twitter.com/pQQIQzm1aC— Mufaddal Vohra (@mufaddal_vohra) September 22, 2024అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన సౌతాఫ్రికా.. 33 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. ఎయిడెన్ మార్క్రమ్ (69 నాటౌట్), ట్రిస్టన్ స్టబ్స్ (26 నాటౌట్) ప్రొటీస్ను విజయతీరాలకు చేర్చారు. సౌతాఫ్రికా ఇన్నింగ్స్లో టోనీ జోర్జీ 26, బవుమా 22, రీజా హెండ్రిక్స్ 18 పరుగులు చేశారు. ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లలో ఘజన్ఫర్, నబీ, అహ్మద్ మాలిక్ తలో వికెట్ పడగొట్టారు. ఈ మ్యాచ్లో 89 పరుగులు చేయడంతో పాటు రెండో వన్డేలో రికార్డు సెంచరీ చేసిన గుర్బాజ్కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్, సిరీస్ అవార్డులు లభించాయి.చదవండి: రసవత్తరంగా సాగుతున్న న్యూజిలాండ్, శ్రీలంక టెస్ట్ మ్యాచ్ -
వన్డేల్లో అఫ్గన్ సంచలనం.. 177 రన్స్ తేడాతో సౌతాఫ్రికా చిత్తు
Afghanistan Beat South Africa By 177 Runs Ind 2nd ODI 2024: తమ వన్డే క్రికెట్ చరిత్రలో అఫ్గనిస్తాన్ సరికొత్త చరిత్ర లిఖించింది. పటిష్ట సౌతాఫ్రికాపై తొలిసారిగా సిరీస్ నెగ్గింది. తద్వారా ఈ ఘనత సాధించిన మొదటి అఫ్గన్ జట్టుగా హష్మతుల్లా బృందం నిలిచింది. కాగా అఫ్గనిస్తాన్తో మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ ఆడేందుకు సౌతాఫ్రికా యూఏఈ పర్యటనకు వెళ్లింది.ఏకంగా 177 పరుగుల తేడాతో చిత్తుఈ క్రమంలో షార్జా వేదికగా బుధవారం జరిగిన తొలి వన్డేలో ఆతిథ్య జట్టు చేతిలో అనూహ్య రీతిలో ఆరు వికెట్ల తేడాతో ఓడిపోయింది. అఫ్గనిస్తాన్కు సౌతాఫ్రికాపై ఇదే తొలి వన్డే విజయం. అనంతరం.. శుక్రవారం షార్జాలోనే జరిగిన రెండో మ్యాచ్లోనూ హష్మతుల్లా బృందం సంచలన విజయం సాధించింది.సౌతాఫ్రికాను ఏకంగా 177 పరుగుల తేడాతో చిత్తు చేసింది. అఫ్గన్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ తన అద్భుత ప్రదర్శనతో ప్రొటిస్ జట్టు బ్యాటింగ్ ఆర్డర్ను కుదేలు చేశాడు. 9 ఓవర్ల బౌలింగ్ కోటా పూర్తి చేసి కేవలం 19 పరుగులు మాత్రమే ఇచ్చి ఏకంగా ఐదు వికెట్లు పడగొట్టాడు.శతక్కొట్టిన గుర్బాజ్షార్జా వేదికగా శుక్రవారం రాత్రి జరిగిన మ్యాచ్లో టాస్ గెలిచిన అఫ్గనిస్తాన్ తొలుత బ్యాటింగ్ చేసింది. ఓపెనర్ రహ్మనుల్లా గుర్బాజ్ ఆకాశమే హద్దుగా చెలరేగి సెంచరీతో మెరిశాడు. 110 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్స్ల సాయంతో 105 పరుగులు సాధించాడు. మరో ఓపెనర్ రియాజ్ హసన్ 29 పరుగులతో ఫర్వాలేదనిపించగా.. వన్డౌన్ బ్యాటర్ రహ్మత్ షా(50) హాఫ్ సెంచరీ కొట్టాడు. ఇక నాలుగో నంబర్ బ్యాటర్ అజ్మతుల్లా ఒమర్జాయ్ సైతం 86 పరుగులతో ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు. ఈ క్రమంలో నిర్ణీత 50 ఓవర్లలో కేవలం నాలుగు వికెట్లు నష్టపోయిన అఫ్గనిస్తాన్ 311 పరుగుల భారీ స్కోరు సాధించింది.రషీద్ ఖాన్ వికెట్ల వేటసౌతాఫ్రికా బౌలర్లలో లుంగి ఎంగిడి, నండ్రేబర్గర్, కాబా పీటర్, ఐడెన్ మార్క్రమ్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు. ఇక లక్ష్య ఛేదనలో సౌతాఫ్రికాకు శుభారంభం లభించలేదు. కెప్టెన్ తెంబా బవుమా 38, మరో ఓపెనర్ టోరీ డి జోర్జి 31 పరుగులకే అవుట్ అయ్యారు. వీరిద్దరు నిష్క్రమించిన తర్వాత ప్రొటిస్ జట్ట బ్యాటింగ్ ఆర్డర్ను రషీద్ ఖాన్ కుప్పకూల్చాడు.టోనీ వికెట్తో వేట మొదలుపెట్టిన రషీద్ ఖాన్.. మార్క్రమ్(21), ట్రిస్టన్ స్టబ్స్(5), కైలీ వెరెన్నె(2), వియాన్ మల్డర్(2)లను పెవిలియన్కు పంపి సౌతాఫ్రికా వెన్ను విరిచాడు. మిగతా పనిని మరో స్పిన్నర్ నంగేయాలియా ఖరోటే పూర్తి చేశాడు. ఈ మ్యాచ్లో రషీద్ ఐదు వికెట్లు దక్కించుకోగా.. ఖరోటే 4, అజ్మతుల్లా ఒమర్జాయ్ ఒక వికెట్ తీశారు.అఫ్గనిస్తాన్ వర్సెస్ సౌతాఫ్రికా- రెండో వన్డే👉వేదిక: షార్జా క్రికెట్ స్టేడియం👉టాస్: అఫ్గనిస్తాన్.. తొలుత బ్యాటింగ్👉అఫ్గన్ స్కోరు: 311/4 (50)👉సౌతాఫ్రికా స్కోరు: 134 (34.2)👉ఫలితం: సౌతాఫ్రికాపై 177 పరుగుల తేడాతో అఫ్గన్ సంచలన విజయం👉ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: రషీద్ ఖాన్.చదవండి: ఇంగ్లండ్ గడ్డపై దుమ్ములేపిన చహల్.. బంగ్లాతో సిరీస్కు సై!High 🖐️s for @RashidKhan_19 after a sensational performance to help #AfghanAtalan secure a series win over Proteas. 🤩👏#AFGvSA | #GloriousNationVictoriousTeam pic.twitter.com/xRAz6CBBpE— Afghanistan Cricket Board (@ACBofficials) September 20, 2024 -
T20 World Cup 2024 Final: క్రికెట్ అభిమానులకు బ్యాడ్ న్యూస్
ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులకు ఇదో చేదు వార్త. భారత్, సౌతాఫ్రికా మధ్య ఇవాళ (జూన్ 29) జరగాల్సిన టీ20 వరల్డ్కప్ 2024 ఫైనల్ మ్యాచ్కు వరుణుడు అడ్డుతగలనున్నాడు. మ్యాచ్కు వేదిక అయినా బార్బడోస్లో మ్యాచ్ జరిగే సమయానికి (భారతకాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు) వర్షం పడే సూచనలు ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. HEAVY RAIN IN BARBADOS. 🌧️- We've a Reserve Day for the Final. (Revsportz).pic.twitter.com/dmCnirETxv— Mufaddal Vohra (@mufaddal_vohra) June 28, 2024మ్యాచ్కు ముందు రోజు బార్బడోస్లో భారీ వర్షం పడింది. ఈ వర్షంతో బార్బడోస్లోని కెన్నింగ్టన్ ఓవల్ మైదానం చిత్తడిగా మారింది. మ్యాచ్ ముందు రోజు వర్షం పడుతున్న దృశ్యాలు సోషల్మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఒకవేళ మ్యాచ్ షెడ్యూలైన రోజు రద్దైతే రిజ్వర్ డే రోజున కొనసాగిస్తారు. ఒకవేళ ఆ రోజు కూడా రద్దైతే ఇరు జట్లను సంయుక్త విజేతలుగా ప్రకటిస్తారు. ఇరు జట్ల ఆటగాళ్లు, అభిమానులు కప్ గెలవాలని కృత నిశ్చయంతో ఉన్నారు కాబట్టి మ్యాచ్ జరగాలనే కోరుకుంటున్నారు. ఈ కప్ గెలిస్తే సౌతాఫ్రికాకు చిరకాల కోరిక నెరవేరనుండగా.. భారత్కు 13 ఏళ్ల కరువు తీరనుంది. సౌతాఫ్రికా ఇంత వరకు ఒక్క వరల్డ్కప్ టైటిల్కు కూడా గెలవకపోగా.. భారత్ చివరిసారిగా 2011 వన్డే ప్రపంచకప్ గెలిచింది. కాగా భారత్, సౌతాఫ్రికా జట్లు సెమీఫైనల్లో ఇంగ్లండ్, ఆఫ్ఘనిస్తాన్ జట్లపై ఘన విజయాలు సాధించి ఫైనల్లోకి ప్రవేశించిన విషయం తెలిసిందే. ఈ టోర్నీలో ఇరు జట్లు అజేయ జట్లు అజేయ జట్లుగా ఫైనల్స్కు చేరాయి. -
T20 World Cup 2024: 30 ఏళ్ల చరిత్రలో తొలిసారి..!
సౌతాఫ్రికా జట్టు 30 ఏళ్ల తమ వరల్డ్కప్ చరిత్రలో తొలిసారి ఫైనల్స్కు చేరింది. ప్రపంచకప్ టోర్నీల్లో ప్రొటీస్ ప్రస్తానం 1992 వన్డే వరల్డ్కప్ ఎడిషన్తో మొదలు కాగా.. తొలిసారి ఆ జట్టు సెమీస్ గండం దాటింది. టీ20 వరల్డ్కప్ 2024లో భాగంగా ఇవాళ (జూన్ 27) జరిగిన తొలి సెమీఫైనల్లో ఆఫ్ఘనిస్తాన్ను చిత్తు చేయడంతో సఫారీల మూడు దశాబ్దాల కల సారాకమైంది. సౌతాఫ్రికా 1992, 1999, 2007, 2015, 2023 వన్డే ప్రపంచకప్ ఎడిషన్లలో సెమీఫైనల్ వరకు చేరినా ఫైనల్కు చేరలేకపోయింది. పొట్టి ప్రపంచకప్లో ఆరంభ ఎడిషన్ నుంచి పాల్గొనినా రెండు సార్లు (2009, 2024) మాత్రమే అతికష్టం మీద సెమీస్కు చేరింది.బలాబలాల పరంగా సౌతాఫ్రికా పటిష్టమైన జట్టే అయినా.. క్రికెట్ చరిత్రలో ఆ జట్టుకు అత్యంత దురదృష్టవంతమైన జట్టుగా పేరుంది. ఇనేళ్ల ఆ జట్టు చరిత్రలో ప్రతిసారి బలమైన జట్టుతోనే బరిలోకి దిగినప్పటికీ అదృష్టం కలిసి రాకపోవడంతో ఒక్క ఐసీసీ కూడా టైటిల్ (వరల్డ్కప్) గెలవలేకపోయింది. ఐసీసీ టోర్నీల్లో ఫైనల్కు చేరాలన్న ఆ జట్టు కలను ఎయిడెన్ మార్క్రమ్ సార్దకం చేశాడు. సౌతాఫ్రికాను వరల్డ్కప్ (టీ20) ఫైనల్కు చేర్చిన తొలి కెప్టెన్గా మార్క్రమ్ రికార్డుల్లోకెక్కాడు. మార్క్రమ్కు అండర్-19 విభాగంలో సౌతాఫ్రికాకు తొలి ప్రపంచకప్ అందించిన కెప్టెన్గానూ రికార్ంది. మార్క్రమ్ సెంటిమెంట్ తమకు మరోసారి రిపీట్ అవుతుందని దక్షిణాఫ్రికా ఆటగాళ్లు, అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ట్రినిడాడ్ వేదికగా ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన తొలి సెమీఫైనల్లో సౌతాఫ్రికా 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి ఫైనల్కు చేరింది. భారత్- ఇంగ్లండ్ మధ్య రెండో సెమీఫైనల్ ఇవాళ రాత్రి 8 గంటలకు ప్రారంభంకానుంది. ఈ మ్యాచ్కు వరుణుడి ముప్పు పొంచి ఉందని సమాచారం. ఒకవేళ ఈ మ్యాచ్ వర్షం కారణంగా పూర్తిగా తుడిచిపెట్టుకుపోతే సూపర్-8లో మెరుగైన పాయింట్లు ఉన్న కారణంగా టీమిండియా ఫైనల్స్కు వెళ్తుంది. రెండో సెమీఫైనల్స్కు రిజర్వ్ డే లేదు. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టుతో సౌతాఫ్రికా ఫైనల్లో తలపడుతుంది. -
టీ20 వరల్డ్కప్ : చిత్తుగా ఓడిన ఆఫ్ఘనిస్తాన్.. ఫైనల్లో సౌతాఫ్రికా (ఫొటోలు)
-
మాకు ఇదొక గుణపాఠం.. వాళ్లు అద్భుతం: మార్క్రమ్
టీ20 ప్రపంచకప్-2024లో సెమీస్ చేరడం సంతోషంగా ఉందని సౌతాఫ్రికా కెప్టెన్ ఐడెన్ మార్క్రమ్ హర్షం వ్యక్తం చేశాడు. తమ జట్టు అద్భుతంగా ఆడిందని.. ఈ గెలుపు తమకు ఊరటనందించిందని పేర్కొన్నాడు.వర్షం పడి వెలిసిన తర్వాత పిచ్ బ్యాటింగ్కు మరింత అనుకూలంగా మారిందన్న మార్క్రమ్.. వీలైనంత త్వరగా మ్యాచ్ పూర్తి చేయాలని భావించినట్లు తెలిపాడు. అందుకు తగ్గట్లుగానే ఫలితం కూడా వచ్చిందని సంతోషం వ్యక్తం చేశాడు.కాగా టీ20 ప్రపంచకప్-2024 సూపర్-8లో భాగంగా వెస్టిండీస్తో సోమవారం జరిగిన మ్యాచ్లో సౌతాఫ్రికా గెలుపొందిన విషయం తెలిసిందే. అంటిగ్వా వేదికగా టాస్ గెలిచిన ప్రొటిస్ జట్టు విండీస్ను తొలుత బ్యాటింగ్కు ఆహ్వానించింది.వర్షం వల్ల అంతరాయం సౌతాఫ్రికా బౌలర్ల దెబ్బకు వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లు నష్టపోయి కేవలం 135 పరుగులు మాత్రమే చేసింది. రోస్టన్ చేజ్ హాఫ్ సెంచరీతో ఆకట్టుకోగా.. ఓపెనర్ కైలీ మేయర్స్ 35 పరుగులతో రాణించాడు.ప్రొటిస్ స్పిన్నర్ తబ్రేజ్ షంసీ మూడు కీలక వికెట్లు కూల్చి విండీస్ బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించాడు. ఇక ఈ మ్యాచ్కు వర్షం అంతరాయం కలిగించగా.. రెండో ఇన్నింగ్స్ను 17 ఓవర్లకు కుదించారు.డీఎల్ఎస్ పద్ధతి ప్రకారం సౌతాఫ్రికా లక్ష్యాన్ని 123 పరుగులుగా నిర్దేశించారు. ఈ క్రమంలో ఆరంభంలో ప్రొటిస్ జట్టు వికెట్లు కోల్పోయినా.. ట్రిస్టన్ స్టబ్స్(29), హెన్రిచ్ క్లాసెన్(22), మార్కో జాన్సన్(14 బంతుల్లో 21) మెరుగ్గా రాణించి జట్టుకు విజయం అందించారు.మాకిది ఒక గుణపాఠం లాంటిదేమరో ఐదు బంతులు మిగిలి ఉండగానే టార్గెట్ ఛేదించిన సౌతాఫ్రికా సెమీ ఫైనల్లో అడుగుపెట్టగా.. ఆతిథ్య వెస్టిండీస్ సెమీస్ ఆశలు గల్లంతయ్యాయి. ఈ నేపథ్యంలో సౌతాఫ్రికా కెప్టెన్ ఐడెన్ మార్క్రమ్ మాట్లాడుతూ.. ‘‘మా వాళ్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు.వికెట్ను సరిగ్గా అంచనా వేసి అందుకు తగ్గట్లుగా ఆడారు. షంసీ రూపంలో మిస్టరీ స్పిన్నర్ను వెస్టిండీస్పై అస్త్రంలా ప్రయోగించి విజయవంతమయ్యాం.అయితే, లక్ష్య ఛేదనలో భాగస్వామ్యాలు నెలకొల్పడంలో మేము విఫలమయ్యాం. మాకిది ఒక గుణపాఠం లాంటిదే. పరిస్థితులకు అనుగుణంగా ఇంకాస్త తెలివిగా వ్యవహరించి ముందుకు సాగాలి’’ అని పేర్కొన్నాడు. కాగా ఈ మ్యాచ్లో మార్క్రమ్ 18 పరుగులు చేయడంతో పాటు ఒక వికెట్ తీశాడు.చదవండి: కోహ్లి, రోహిత్లకు అదే ఆఖరి ఛాన్స్.. పట్టుబట్టిన గంభీర్! -
ఇంగ్లండ్-సౌతాఫ్రికా సూపర్-8 పోరు.. తుది జట్లు ఇవే
టీ20 వరల్డ్ కప్-2024లో కీలక సమరానికి సమయం అసన్నమైంది. ఈ మెగా టోర్నీ సూపర్-8లో భాగంగా సెయింట్ లూసియా వేదికగా ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా జట్లు తలపడతున్నాయి. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ హైవోల్టేజ్ మ్యాచ్లో ఇంగ్లండ్ ఎటువంటి మార్పులు లేకుండా బరిలోకి దిగగా.. సౌతాఫ్రికా మాత్రం తమ తుది జట్టులో ఒక మార్పు చేసింది.స్పిన్నర్ షంమ్సీ స్ధానంలో ఒట్నీల్ బార్ట్మాన్ తుది జట్టులోకి వచ్చాడు. ఇక ఇరు జట్లు ఇప్పటికే సూపర్-8 రౌండ్లో చెరో విజయం సాధించాయి. తుది జట్లుదక్షిణాఫ్రికా: క్వింటన్ డికాక్(వికెట్ కీపర్), రీజా హెండ్రిక్స్, ఐడెన్ మార్క్రామ్(కెప్టెన్), డేవిడ్ మిల్లర్, హెన్రిచ్ క్లాసెన్, ట్రిస్టన్ స్టబ్స్, మార్కో జాన్సెన్, కేశవ్ మహరాజ్, కగిసో రబడ, అన్రిచ్ నార్ట్జే, ఒట్నీల్ బార్ట్మన్ఇంగ్లండ్: ఫిలిప్ సాల్ట్, జోస్ బట్లర్(కెప్టెన్/ వికెట్ కీపర్), హ్యారీ బ్రూక్, జానీ బెయిర్స్టో, మొయిన్ అలీ, లియామ్ లివింగ్స్టోన్, సామ్ కర్రాన్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్, రీస్ టోప్లీ -
టీ20 వరల్డ్కప్లో నేటి (జూన్ 21) మ్యాచ్.. ఇంగ్లండ్తో సౌతాఫ్రికా 'ఢీ'
టీ20 వరల్డ్కప్ 2024లో ఇవాళ (జూన్ 21) మరో ఆసక్తికర సమరం జరుగనుంది. సూపర్-8 గ్రూప్-2లో భాగంగా సౌతాఫ్రికా, ఇంగ్లండ్ జట్లు తలపడనున్నాయి. సెయింట్ లూసియా వేదికగా ఈ మ్యాచ్ జరుగనుంది. భారతకాలమానం రాత్రి 8 గంటలకు ప్రారంభంకానుంది. గ్రూప్-2 నుంచి ఇంగ్లండ్, సౌతాఫ్రికా ఇదివరకే చెరో మ్యాచ్ గెలిచి పాయింట్ల పట్టికలో మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయి. ఇంగ్లండ్.. వెస్టిండీస్పై, సౌతాఫ్రికా.. యూఎస్ఏపై గెలిచి చెరో రెండు పాయింట్లు ఖాతాలో వేసుకున్నాయి. ఈ టోర్నీలో ఇప్పటివరకు అజేయంగా ఉన్న సౌతాఫ్రికా.. తాజాగా జరిగిన మ్యాచ్లో విండీస్పై గెలిచి ఇంగ్లండ్ మరో గెలుపుపై ధీమాగా ఉన్నాయి. టీ20 ప్రపంచకప్ టోర్నీల్లో సౌతాఫ్రికా, ఇంగ్లండ్ ఇప్పటివరకు ఆరు మ్యాచ్ల్లో ఎదురెదురుపడగా.. సౌతాఫ్రికా 4, ఇంగ్లండ్ 2 మ్యాచ్ల్లో విజయాలు సాధించాయి. ఇరు జట్లు చివరిసారి తలపడిన మ్యాచ్లో (2022) ఇంగ్లండ్దే పైచేయిగా నిలిచింది.ప్రస్తుత ఫామ్ ప్రకారం చూస్తే.. సౌతాఫ్రికాతో పోలిస్తే ఇంగ్లండ్కే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆ జట్టులో ఓపెనర్లు సాల్ట్, బట్లర్ మంచి ఫామ్లో ఉన్నారు. బౌలింగ్ పరంగా చూస్తే.. ఇంగ్లండ్ కంటే సౌతాఫ్రికా కాస్త మెరుగ్గా కనిపిస్తుంది. ఆ జట్టు పేసర్లు ఓట్నీల్, రబాడ భీకర ఫామ్లో ఉన్నారు.వాతావరణం విషయానికొస్తే.. నేటి మ్యాచ్కు వర్షం నుంచి ఎలాంటి ముప్పు ఉండదు. మ్యాచ్ జరిగే సమయానికి వాతావరణం ఆహ్లాదంగా ఉండే అవకాశం ఉంది. ఈ మ్యాచ్ ఎలాంటి అవాంతరాలు ఎదురుకాకుండా సవ్యంగా సాగనుంది.పిచ్ విషయానికొస్తే.. సెయింట్ లూసియా పిచ్ బ్యాటర్లకు అనుకూలించే అవకాశం ఉంది. ప్రస్తుత ప్రపంచకప్లో నమోదైన టాప్ స్కోర్లలో మెజార్టీ శాతం ఇక్కడ నమోదైనవే. ఈ వికెట్పై బౌలర్లు గడ్డు పరిస్థితులు ఎదుర్కోక తప్పదు.తుది జట్లు (అంచనా).. ఇంగ్లండ్: ఫిల్ సాల్ట్, జోస్ బట్లర్ (కెప్టెన్/వికెట్కీపర్), మొయిన్ అలీ, జానీ బెయిర్స్టో, హ్యారీ బ్రూక్, లియామ్ లివింగ్స్టోన్, సామ్ కర్రన్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్, రీస్ టాప్లీసౌతాఫ్రికా: క్వింటన్ డికాక్ (వికెట్కీపర్), రీజా హెండ్రిక్స్, ఎయిడెన్ మార్క్రమ్ (కెప్టెన్), ట్రిస్టన్ స్టబ్స్, హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, మార్కో జాన్సెన్, కేశవ్ మహారాజ్, కగిసో రబడ, అన్రిచ్ నోర్ట్జే, ఒట్నీల్ బార్ట్మన్ -
SA Vs Nepal: నరాలు తెగే ఉత్కంఠ.. ఆఖరి బంతికి!
టీ20 ప్రపంచకప్-2024 లీగ్ మ్యాచ్లో నేపాల్ జట్టు సౌతాఫ్రికాకు చెమటలు పట్టించింది. ఆఖరి బంతి వరకు నరాలు తెగే ఉత్కంఠ రేపి.. చివరికి ఒక్క పరుగు తేడాతో ఓటమిపాలైంది.అయితే.. నువ్వా-నేనా అన్నట్లుగా పటిష్ట ప్రొటిస్ జట్టుతో విజయం కోసం నేపాల్ జట్టు పోరాడిన తీరు మాత్రం అభిమానుల మనసు గెలుచుకుంది.వరల్డ్కప్-2024 లీగ్ దశలో బంగ్లాదేశ్, నెదర్లాండ్స్, నేపాల్, శ్రీలంకతో కలిసి గ్రూప్-డిలో ఉన్న సౌతాఫ్రికా ఇప్పటికే హ్యాట్రిక్ విజయాలతో సూపర్-8కు చేరుకుంది. మరోవైపు.. నేపాల్ వరుసగా రెండు మ్యాచ్లు ఓడి టోర్నీ నుంచి దాదాపుగా నిష్క్రమించింది.సౌతాఫ్రికాకు చుక్కలు చూపించిఇలాంటి దశలో నామమాత్రపు ఆఖరి మ్యాచ్లో సౌతాఫ్రికాకు చుక్కలు చూపించి సత్తా చాటింది. సెయింట్ విన్సెంట్ వేదికగా శనివారం ఉదయం జరిగిన మ్యాచ్లో టాస్ గెలిచిన నేపాల్ తొలుత బౌలింగ్ చేసింది.స్పిన్నర్ కుశాల్ భూర్తేల్(4/19), పేసర్ దీపేంద్ర సింగ్(3/21) సంచలన ప్రదర్శన కనబరిచారు. అద్భుత స్పెల్స్తో సౌతాఫ్రికాను 115 పరుగులకు కట్టడి చేశారు. ప్రొటిస్ ఇన్నింగ్స్లో ఓపెనర్ రీజా హెండ్రిక్స్(43) టాప్ స్కోరర్గా నిలవగా.. ట్రిస్టన్ స్టబ్స్(18 బంతుల్లో 27 నాటౌట్) రాణించాడు. View this post on Instagram A post shared by ICC (@icc) ఇక లక్ష్య ఛేదనకు దిగిన నేపాల్ను సౌతాఫ్రికా స్పిన్నర్ తబ్రేజ్ షంసీ ఆదిలోనే దెబ్బకొట్టినా.. ఓపెనర్ ఆసిఫ్ షేక్(49 బంతుల్లో 42) పట్టుదలగా నిలబడ్డాడు. అతడికి తోడుగా అనిల్ సా(27) రాణించాడు. View this post on Instagram A post shared by ICC (@icc)అయితే, మిగతా బ్యాటర్ల నుంచి వీరికి సహకారం అందలేదు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి నేపాల్ 114 పరుగులు మాత్రమే చేయగలిగింది. విజయానికి ఒక్క పరుగు దూరంలో నిలిచిపోయింది.ఇక నేపాల్ టాపార్డర్ను కుప్పకూల్చిన తబ్రేజ్ షంసీ(4/19) ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలవగా.. కెప్టెన్ ఐడెన్ మార్క్రమ్ ఒక వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు.నేపాల్పై విజయంతో గ్రూప్ దశలో నాలుగింటికి నాలుగు మ్యాచ్లు గెలిచిన సౌతాఫ్రికా.. పొట్టి ఫార్మాట్ వరల్డ్కప్ తొమ్మిదో ఎడిషన్లో ఈ ఘనత సాధించిన తొలి జట్టుగా నిలిచింది.సౌతాఫ్రికా వర్సెస్ నేపాల్ స్కోర్లుసౌతాఫ్రికా- 115/7 (20)నేపాల్- 114/7 (20)ఫలితం- ఒక్క పరుగు తేడాతో నేపాల్పై సౌతాఫ్రికా గెలుపు. చదవండి: T20 WC: పాకిస్తాన్కు చావు దెబ్బ.. ప్రపంచకప్ టోర్నీ నుంచి అవుట్ View this post on Instagram A post shared by ICC (@icc) -
నరాలు తెగే ఉత్కంఠ: ఒక్క క్యాచ్తో అంతా తలకిందులు.. వీడియో
టీ20 ప్రపంచకప్-2024లో దక్షిణాఫ్రికా జైత్రయాత్ర కొనసాగుతోంది. శ్రీలంక, బంగ్లాదేశ్, నెదర్లాండ్స్, నేపాల్లతో కలిసి గ్రూప్-డిలో భాగమైన ప్రొటిస్ జట్టు ఇప్పటికే మూడు మ్యాచ్లు ఆడేసింది.తొలుత శ్రీలంకను ఆరు వికెట్ల తేడాతో చిత్తు చేసిన మార్క్రమ్ బృందం.. ఆ తర్వాత నెదర్లాండ్స్ పనిపట్టింది. నాలుగు వికెట్ల తేడాతో ఆ జట్టును ఓడించి.. గ్రూప్-డి టాపర్గా నిలిచింది.ఇక తాజాగా సోమవారం నాటి మ్యాచ్లో బంగ్లాదేశ్తో ఆఖరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన పోరులో.. చివరికి పైచేయి సాధించింది. నాలుగు పరుగుల స్వల్ప తేడాతో నజ్ముల్ షాంటో బృందాన్ని ఓడించిన సౌతాఫ్రికా.. ఈ ఎడిషన్లో సూపర్-8 చేరిన తొలి జట్టుగా నిలిచింది.న్యూయార్క్ వేదికగా ఆద్యంతం ఆసక్తి రేపిన ఈ మ్యాచ్లో.. టాస్ గెలిచి ప్రొటిస్ జట్టు తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్ క్వింటన్ డికాక్(18) ఒక్కడు కాస్త ఫర్వాలేదనిపించగా.. మరో ఓపెనర్ రీజా హెండ్రిక్స్(0), కెప్టెన్ ఐడెన్ మార్క్రమ్(4) పూర్తిగా నిరాశపరిచారు.నాలుగో నంబర్ బ్యాటర్ ట్రిస్టన్ స్టబ్స్ సైతం సున్నాకే పెవిలియన్ చేరాడు. ఈ క్రమంలో పీకల్లోతు కష్టాలో ఉన్న సౌతాఫ్రికాను హెన్రిచ్ క్లాసెన్ గట్టెక్కించాడు.తన శైలికి భిన్నంగా ఆచితూచి ఆడుతూ 44 బంతుల్లో 46 పరుగులు సాధించాడు క్లాసెన్. అతడికి తోడుగా డేవిడ్ మిల్లర్(29) రాణించాడు. ఈ క్రమంలో సౌతాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 113 పరుగులు చేసింది.ఇక లక్ష్యం స్వల్పంగానే కనిపిస్తున్నా.. బ్యాటింగ్కు అనుకూలించని న్యూయార్క్ పిచ్పై బంగ్లాదేశ్ పరుగులు రాబట్టేందుకు ఆపసోపాలు పడింది. టాపార్డర్లో కెప్టెన్ నజ్ముల్ షాంటో(14) మినహా అందరూ సింగిల్ డిజిట్ స్కోర్లు చేయగా.. తౌహీద్ హృదయ్(37), మహ్మదుల్లా(20) బంగ్లా శిబిరంలో గెలుపు ఆశలు రేకెత్తించారు.సౌతాఫ్రికాపై గెలవాలంటే ఆఖరి ఓవర్లో విజయానికి 11 పరుగులు అవసరం కాగా.. కేవలం ఆరు పరుగులే వచ్చాయి. అయితే, ఈ ఓవర్ ఆసాంతం ఎంతో ఆసక్తిగా సాగింది.డెత్ ఓవర్లో మార్క్రమ్ తమ స్పిన్నర్ కేశవ్ మహరాజ్ చేతికి బంతినివ్వగా.. అతడు వైడ్తో ఆరంభించాడు. దీంతో బంగ్లా విజయ సమీకరణం ఆరు బంతుల్లో 10 పరుగులుగా మారింది.ఈ క్రమంలో మహ్మదుల్లా 1, జాకిర్ అలీ 2 పరుగులు తీయగా.. నాలుగు బంతుల్లో 7 పరుగులు అవసరమయ్యాయి. అయితే, అక్కడే మ్యాచ్ మలుపు తిరిగింది. మహరాజ్ బౌలింగ్లో జాకిర్ అలీ(8) ఇచ్చిన క్యాచ్ను మార్క్రమ్ ఒడిసిపట్టాడు.ఆ తర్వాతి బంతికి లెగ్బై రూపంలో ఒక పరుగు రాగా.. రెండు బంతుల్లో 6 పరుగులు అవసరమయ్యాయి. ఈ క్రమంలో మహరాజ్ బౌలిండ్లో షాట్ ఆడేందుకు ప్రయత్నించిన మహ్మదుల్లా బౌండరీ దిశగా బంతిని గాల్లోకి లేపాడు.అయితే, బౌండరీ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న మార్క్రమ్ ఊహించని రీతిలో క్యాచ్ అందుకోగా.. మహ్మదుల్లా ఇన్నింగ్స్కు తెరపడింది. ఇక ఆఖరి బంతికి ఆరు పరుగులు అవసరం కాగా టస్కిన్ అహ్మద్ ఒక్కటి మాత్రమే తీయగలిగాడు.చదవండి: జట్టును నాశనం చేసింది ఎవరో చెప్తా: ఆఫ్రిది ఘాటు వ్యాఖ్యలు View this post on Instagram A post shared by ICC (@icc) దీంతో సౌతాఫ్రికా నాలుగు పరుగుల తేడాతో విజయం సాధించి సూపర్-8లో అడుగుపెట్టింది. నిజానికి మార్క్రమ్ గనుక మహ్మదుల్లా క్యాచ్ వదిలేసి ఉంటే ఫలితం వేరేలా ఉండేది. అయితే, బ్యాటింగ్లో విఫలమైనా తన కెప్టెన్సీ, అద్బుత ఫీల్డింగ్తో మార్క్రమ్ సౌతాఫ్రికా విజయంలో కీలక పాత్ర పోషించాడు. View this post on Instagram A post shared by ICC (@icc) -
సౌతాఫ్రికా టీ20 లీగ్కు సంబంధించి బిగ్ అప్డేట్
సౌతాఫ్రికా టీ20 లీగ్కు (SA20) సంబంధించిన ఆసక్తికర ప్రకటన వెలువడింది. లీగ్ మూడో ఎడిషన్ (2025) ప్రారంభ తేదీ, ఫైనల్ మ్యాచ్ జరుగబోయే తేదీలను క్రికెట్ సౌతాఫ్రికా అధ్యక్షుడు గ్రేమ్ స్మిత్ ప్రకటించారు. SA20 2025 సీజన్ వచ్చే ఏడాది జనవరి 9న ప్రారంభై, ఫిబ్రవరి 8న జరిగే ఫైనల్తో ముగుస్తుందని స్మిత్ వెల్లడించాడు. పూర్తి షెడ్యూల్, ఆటగాళ్ల వేలం తదితర అంశాలకు సంబంధించిన వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని స్మిత్ తెలిపాడు.కాగా, సౌతాఫ్రికా టీ20 లీగ్లో ఇప్పటివరకు జరిగిన రెండు ఎడిషన్లలో సన్రైజర్స్ ఈస్ట్రన్కేప్ విజేతగా నిలిచింది. ఈ ఫ్రాంచైజీ సన్రైజర్స్ హైదరాబాద్ యజమాని కావ్య మారన్ ఆథ్వర్యంలో నడుస్తుంది. గడిచిన సీజన్ ఫైనల్లో సన్రైజర్స్.. డర్బన్ సూపర్ జెయింట్స్పై 89 పరుగుల తేడాతో విజయం సాధించి, వరుసగా రెండోసారి ఛాంపియన్గా నిలిచింది. దీనికి ముందు జరిగిన అరంగేట్రం సీజన్ ఫైనల్లో సన్రైజర్స్.. ప్రిటోరియా క్యాపిటల్స్పై విజేతగా నిలిచి టైటిల్ ఎగరేసుకుపోయింది. ఈ లీగ్లో మొత్తం ఆరు జట్లు పాల్గొంటాయి. సన్రైజర్స్ ఈస్ట్రన్కేప్తో పాటు ప్రిటోరియా క్యాపిటల్స్, డర్బన్ సూపర్ జెయింట్స్, జోబర్గ్ సూపర్ కింగ్స్, పార్ల్ రాయల్స్, ఎంఐ కేప్టౌన్ మిగతా ఫ్రాంచైజీలుగా ఉన్నాయి. ఈ లీగ్లోని ఫ్రాంచైలన్నీ వివిధ ఐపీఎల్ ఫ్రాంచైజీలకు చెందిన ఓనర్ల ఆథ్వర్యంలో నడుస్తున్నాయి.ఈ లీగ్లో అత్యధిక పరుగుల రికార్డు హెన్రిచ్ క్లాసెన్ (810 పరుగులు) పేరిట ఉండగా.. అత్యధిక వికెట్ల ఘనత ఓట్నీల్ బార్ట్మన్కు (30 వికెట్లు) దక్కుతుంది. కెప్టెన్ల విషయానికొస్తే.. ఎంఐ కేప్టౌన్కు కీరన్ పోలార్డ్ నాయకత్వం వహిస్తుండగా.. డర్బన్ సూపర్ జెయింట్స్కు కేశవ్ మహారాజ్, జోబర్గ్ సూపర్ కింగ్స్కు డెప్లెసిస్, పార్ల్ రాయల్స్కు డేవిడ్ మిల్లర్, ప్రిటోరియా క్యాపిటల్స్కు వేన్ పార్నెల్, సన్రైజర్స్ ఈస్ట్రన్కేప్కు ఎయిడెన్ మార్క్రమ్ సారథులుగా వ్యవహరిస్తున్నారు. -
చాలా సంతోషంగా ఉంది.. కానీ పిచ్ మాత్రం: మార్క్రమ్
టీ20 వరల్డ్కప్-2024లో దక్షిణాఫ్రికా బోణీ కొట్టింది. న్యూయర్క్ వేదికగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో 6 వికెట్ల తేడాతో సౌతాఫ్రికా విజయం సాధించింది. 78 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు ప్రోటీస్ తీవ్రంగా శ్రమించింది.బౌన్స్కు సహకరిస్తున్న డ్రాప్ ఇన్ పిచ్పై దక్షిణాఫ్రికా చెమటోడ్చుతూ 78 పరుగుల లక్ష్యాన్ని 16.2 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. హెన్రిచ్ క్లాసెన్(19 నాటౌట్), డికాక్(20) పరుగులతో రాణించారు. లంక బౌలర్లలో కెప్టెన్ హసరంగా రెండు, తుషారా, షనక తలా వికెట్ సాధించారు. అంతకముందు బ్యాటింగ్ చేసిన లంక.. ప్రోటీస్ బౌలర్ల దాటికి విలవిల్లాడింది. 19.1 ఓవర్లలో శ్రీలంక కేవలం 77 పరుగులకే కుప్పకూలింది. దక్షిఫ్రికా పేసర్ అన్రిచ్ నోర్జే 4 వికెట్లతో లంక పతనాన్ని శాసించగా.. మహారాజ్, రబాడ తలా రెండు వికెట్లు పడగొట్టారు. ఇక ఈ విజయంపై మ్యాచ్ అనంతరం దక్షిణాఫ్రికా కెప్టెన్ ఐడైన్ మార్క్రమ్ స్పందించాడు. న్యూయర్క్ పిచ్ బ్యాటింగ్కు చాలా కఠినంగా ఉందని మార్క్రమ్ తెలిపాడు."టోర్నమెంట్ను విజయంతో ఆరంభించడం చాలా సంతోషంగా ఉంది. కానీ ఈ మ్యాచ్లో బ్యాటింగ్ పరంగా కాస్త ఇబ్బంది పడ్డాం. న్యూయర్క్ వికెట్ బ్యాటింగ్కు చాలా కఠినంగా ఉంది. అదృష్టవశాత్తూ మా బ్యాటర్లు కాస్త ఓపికతో ఆడి మ్యాచ్ను ఫినిష్ చేశారు. గతంలో కూడా మాకు ఇటువంటి పిచ్లపై ఆడిన అనుభవం ఉంది. ప్రపంచవ్యాప్తంగా విభిన్న పరిస్ధితుల్లో ఆడుతూ వస్తున్నాం. అయితే న్యూయర్క్ వికెట్ నుంచి కూడా మేము నేర్చుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. ఎందుకంటే మా తదుపరి రెండు మ్యాచ్లు కూడా ఇక్కడే ఆడనున్నాం. కాబట్టి వీలైనంత త్వరగా ఈ వికెట్కు అలవాటు పడాలి.ఇక నోర్జే అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. అతడి ఫామ్ గురించి ఏ రోజు మేము ఆందోళన చెందలేదు. అతడు రెట్టింపు ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతాడని నేను అశిస్తున్నాను. నోర్జే ప్రదర్శన పట్ల మా డ్రెస్సింగ్ రూమ్ చాలా ఆనందంగా ఉందని" పోస్ట్మ్యాచ్ ప్రేజేంటేషన్లో మార్క్రమ్ పేర్కొన్నాడు. -
T20 WC: అందరినీ ఓడిస్తాం.. ఈసారి ట్రోఫీ మాదే: మార్క్రమ్
ఐసీసీ టోర్నమెంట్లలో లీగ్ దశలో అదరగొట్టడం.. నాకౌట్ మ్యాచ్లలో తేలిపోయి ఇంటి బాట పట్టడం.. ఫలితంగా ‘చోకర్స్’ అనే ముద్ర. అవును.. సౌతాఫ్రికా గురించే ఈ ప్రస్తావన. పటిష్ట జట్టుగా పేరొందిన ప్రొటిస్ జట్టు 1998లో చాంపియన్స్ ట్రోఫీ రూపంలో తొలిసారి ఐసీసీ టైటిల్ సాధించింది.అదే మొదలు.. అదే ఆఖరుహాన్సీ క్రోంజీ సారథ్యంలో ఫైనల్లో వెస్టిండీస్ను 4 వికెట్ల తేడాతో ఓడించి చాంపియన్గా నిలిచింది. అయితే, ఆ తర్వాత ఇంత వరకు మళ్లీ ఒక్కసారి కూడా మెగా టోర్నీ విజేతగా నిలవలేకపోయింది. కానీ.. ఈసారి మాత్రం ఆ అపవాదును చెరిపేసుకుంటామంటున్నాడు సౌతాఫ్రికా పరిమిత ఓవర్ల కెప్టెన్ ఐడెన్ మార్క్రమ్.టీ20 ప్రపంచకప్-2024 చాంపియన్గా నిలుస్తామని ధీమా వ్యక్తం చేశాడు మార్క్రమ్. కాగా అమెరికా- వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న ఈ మెగా ఈవెంట్లో ప్రొటిస్ జట్టు.. శ్రీలంక, బంగ్లాదేశ్, నెదర్లాండ్స్, నేపాల్లతో కలిసి గ్రూప్-డీ లో ఉంది.ఈ క్రమంలో న్యూయార్క్ వేదికగా సోమవారం శ్రీలంకతో తమ తొలి మ్యాచ్లో తలపడనుంది సౌతాఫ్రికా. ఈ నేపథ్యంలో మీడియా ముందుకు వచ్చిన కెప్టెన్ ఐడెన్ మార్క్రమ్ వరల్డ్కప్ గెలిచేందుకే తాము ఇక్కడికి వచ్చామని పేర్కొన్నాడు.ఈసారి ట్రోఫీ మాదే‘‘నేను పూర్తి విశ్వాసంతో ఉన్నాను. ఈ టోర్నీలో పోటీపడుతున్న జట్లన్నీ గొప్పగానే ఆడుతున్నాయి. అయితే, మేము గనుక ఒక్కసారి ఫామ్లోకి వచ్చామంటే.. మా అత్యుత్తమ ప్రదర్శనతో ముందుకు సాగుతూనే ఉంటాం.ప్రత్యర్థి ఎవరైనా ఓడించే తీరతాం. మా ఆట తీరుపై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టాల్సిన ఆవశ్యకత ఉంది. అయితే, మేము ఇక్కడికి వచ్చింది మాత్రం ట్రోఫీ గెలిచేందుకే!’’ అని పేర్కొన్నాడు. ఈసారి చాంపియన్లుగా నిలిచేది తామేనంటూ మార్క్రమ్ విశ్వాసం వ్యక్తం చేశాడు.టీ20 ప్రపంచకప్-2024కు సౌతాఫ్రికా జట్టు ఐడెన్ మార్క్రమ్ (కెప్టెన్), ఒట్నియల్ బార్ట్మన్, గెరాల్డ్ కోయెట్జీ, క్వింటన్ డికాక్, జోర్న్ ఫార్చ్యూన్, రీజా హెండ్రిక్స్, మార్కో జాన్సెన్, హెన్రిచ్ క్లాసెన్, కేశవ్ మహారాజ్, డేవిడ్ మిల్లర్, అన్రిచ్ నోర్జే, కగిసో రబాడ, ర్యాన్ రికెల్టన్, తబ్రైజ్ షంసీ, ట్రిస్టన్ స్టబ్స్.చదవండి: T20 WC 2024: దక్షిణాఫ్రికా వర్సెస్ శ్రీలంక.. గెలుపు ఎవరిది? -
#Glen Phillips: ఫిలిప్స్ ఏమైనా టూర్కు వచ్చాడా.. ? కనీసం ఒక్క ఛాన్స్ కూడా
ఐపీఎల్-2024లో సన్రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు ఐడైన్ మార్క్రమ్ ఆట తీరు ఏ మాత్రం మారలేదు. ఈ మెగా ఈవెంట్లో భాగంగా చెపాక్ వేదికగా రాజస్తాన్ రాయల్స్తో క్వాలిఫయర్-2 మ్యాచ్లో మార్క్రమ్ తీవ్రనిరాశ పరిచాడు. గత కొన్ని మ్యాచ్ల నుంచి తుది జట్టుకు దూరంగా ఉంటున్న మార్క్రమ్కు ఈ మ్యాచ్లో అనుహ్యంగా చోటుదక్కింది.అయితే మెనెజ్మెంట్ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని మార్క్రమ్ వమ్ము చేశాడు. కీలక సమయంలో బ్యాటింగ్కు వచ్చిన మార్క్రమ్ కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి ఔటయ్యాడు. బౌల్ట్ బౌలింగ్లో చాహల్కు క్యాచ్ ఇచ్చి మార్క్రమ్ పెవిలియన్కు చేరాడు. ఈ క్రమంలో మార్క్రమ్తో పాటు జట్టు మెనెజ్మెంట్పై అభిమానులు ఫైర్ అవుతున్నారు. వరుసగా విఫలమైన ఆటగాడికి కీలక మ్యాచ్లో ఎందుకు ఛాన్స్ ఇచ్చారని మండిపడుతున్నారు. అతడికి బదులుగా కివీస్ సూపర్ స్టార్ గ్లెన్ ఫిలిప్స్ ఛాన్స్ ఇవ్వల్సిందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. మరికొంత మంది అయితే ఫిలిప్స్ ఏమైనా టూర్కు వచ్చాడా అంటూ పోస్ట్లు పెడుతున్నారు. కాగా ఈ ఏడాది సీజన్లో ఫిలిప్స్కు కనీసం ఒక్క మ్యాచ్లో కూడా ఆడే అవకాశం ఎస్ఆర్హెచ్ మెనెజ్మెంట్ ఇవ్వలేదు. దీంతో ఎక్స్లో #గ్లెన్ ఫిలిప్స్ అనే కీవర్డ్ ట్రెండ్ అవుతోంది. -
T20 WC SA Squad: సౌతాఫ్రికా జట్టు ప్రకటన.. ఇద్దరు అన్క్యాప్డ్ ప్లేయర్లకు ఛాన్స్
టీ20 ప్రపంచకప్-2024 కోసం సౌతాఫ్రికా తమ జట్టు ప్రకటించింది. మెగా టోర్నీ నేపథ్యంలో 15 మంది సభ్యులతో కూడిన జట్టు వివరాలను మంగళవారం వెల్లడించింది. ఐసీసీ ఈవెంట్లో ఐడెన్ మార్క్రమ్ సారథ్యంలో తలపడే టీమ్లో అన్రిచ్ నోర్జే, క్వింటన్ డికాక్లకు చోటు ఇవ్వడం గమనార్హం.కాగా ఇటీవలే వీరిద్దరిని సౌతాఫ్రికా సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి బోర్డు తప్పించిన విషయం తెలిసిందే. వెన్నునొప్పి కారణంగా పేసర్ ఆన్రిచ్ నోర్జే గతేడాది సెప్టెంబరు నుంచి అంతర్జాతీయ క్రికెట్కు దూరంగా ఉండగా.. వరల్డ్కప్-2023 టోర్నీ తర్వాత వన్డేలకు కూడా రిటైర్మెంట్ ప్రకటించాడు డికాక్.అన్క్యాప్ట్ ప్లేయర్ల పంట పండింది!ఇదిలా ఉంటే.. సౌతాఫ్రికా టీ20 లీగ్లో సత్తా చాటిన ఇద్దరు అన్క్యాప్ట్ ప్లేయర్ల పంట పండింది. ఇంతవరకు జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహించని రియాన్ రికెల్టన్, ఒట్నీల్ బార్ట్మన్లు ఏకంగా ప్రపంచకప్ జట్టులో చోటు సంపాదించారు. ఎంఐ కేప్టౌన్ తరఫున రికెల్టన్ 530 పరుగులతో సౌతాఫ్రికా టీ20 లీగ్లో టాప్ స్కోరర్గా నిలవగా.. సన్రైజర్స్ ఈస్టర్న్కేప్ తరఫున బరిలోకి దిగిన బార్ట్మన్ 18 వికెట్లతో రాణించి జట్టును వరుసగా రెండోసారి చాంపియన్గా నిలపడంలో కీలక పాత్ర పోషించాడు.ఈ నేపథ్యంలో ఈ ఇద్దరు యువ ఆటగాళ్లకు సౌతాఫ్రికా పెద్దపీటవేయడం గమనార్హం. ఇక ఐపీఎల్-2024లో దుమ్ములేపుతున్న పవర్ హిట్టర్ హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, ట్రిస్టన్ స్టబ్స్లు కూడా మెగా ఈవెంట్లో భాగం కానున్నారు. కాగా జూన్ 1న ప్రపంచకప్నకు తెరలేవనుండగా.. జూన్ 3న సౌతాఫ్రికా న్యూయార్క్ వేదికగా శ్రీలంకతో తమ తొలి మ్యాచ్ ఆడనుంది.టీ20 ప్రపంచకప్-2024 కోసం సౌతాఫ్రికా జట్టు ఇదే:ఐడెన్ మార్క్రమ్(కెప్టెన్), ఒట్నీల్ బార్ట్మన్, గెరాల్డ్ కొయోట్జీ, క్వింటన్ డికాక్, జోర్న్ ఫార్చూన్, రీజా హెండ్రిక్స్, మార్కో జాన్సెన్, హెన్రిచ్ క్లాసెన్, కేశవ్ మహరాజ్, డేవిడ్ మిల్లర్, అన్రిచ్ నోర్జే, కగిసో రబడ, రియాన్ రికెల్టన్, తబ్రేజ్ షంసీ, ట్రిస్టన్ స్టబ్స్.ట్రావెలింగ్ రిజర్వ్స్: నండ్రీ బర్గర్, లుంగి ఎంగిడి. -
Viral Video: పతిరణ కళ్లు చెదిరే యార్కర్ దెబ్బకు మార్క్రమ్ ఫ్యూజులు ఔట్
సన్రైజర్స్తో నిన్న (ఏప్రిల్ 28) జరిగిన మ్యాచ్లో సీఎస్కే పేసర్ మతీశ పతిరణ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. ఈ సీజన్లో అరివీర భయంకర ఫామ్లో (6 మ్యాచ్ల్లో 13 వికెట్లు) ఉన్న పతిరణ.. సన్రైజర్స్తో జరిగిన మ్యాచ్లో 2 ఓవర్లలో 17 పరుగులిచ్చి 2 కీలక వికెట్లు (మార్క్రమ్, క్లాసెన్) పడగొట్టాడు. ఇందులో మార్క్రమ్ను బౌల్డ్ చేసిన బంతి మ్యాచ్ మొత్తానికే హైలైట్గా నిలిచింది. పతిరణ సంధించిన స్వింగింగ్ యార్కర్ దెబ్బకు మిడిల్ స్టంప్ గాల్లోకి ఎగిరింది. ఇది చూసి బ్యాటర్ మార్క్రమ్కు ఫ్యూజులు ఎగిరిపోయాయి. పడిపోయిన వికెట్లను చూస్తూ నిస్సహాయంగా పెవిలియన్ బాట పట్టాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతుంది. PATHIRANA, THE FUTURE LEGEND OF CSK. 👑🦁 pic.twitter.com/Hv5Cwu5r6R— Johns. (@CricCrazyJohns) April 28, 2024 ఈ మ్యాచ్లో పతిరణతో పాటు రుతురాజ్ గైక్వాడ్ (98), డారిల్ మిచెల్ (52, 5 క్యాచ్లు), తుషార్ దేశ్పాండే (3-0-27-4) చెలరేగడంతో సీఎస్కే 78 పరుగుల తేడాతో సన్రైజర్స్ను చిత్తు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్కే.. నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసింది. భువనేశ్వర్, నటరాజన్, ఉనద్కత్ తలో వికెట్ పడగొట్టారు.భారీ లక్ష్య ఛేదనలో చేతులెత్తేసిన సన్రైజర్స్.. 18.5 ఓవర్లలో 134 పరుగులకే కుప్పకూలి దారుణ ఓటమిని మూటగట్టుకుంది. తుషార్ దేశ్ పాండే, ముస్తాఫిజుర్ (2.5-0-19-2), పతిరణ, రవీంద్ర జడేజా (4-0-22-1), శార్దూల్ ఠాకూర్ (4-0-27-1) సన్రైజర్స్ పతనాన్ని శాశించారు. సన్రైజర్స్ ఇన్నింగ్స్లో 32 పరుగులు చేసిన మార్క్రమ్ టాప్ స్కోరర్గా నిలిచాడు. ట్రవిస్ హెడ్ (13), అభిషేక్ శర్మ (15), నితీశ్ రెడ్డి (15), క్లాసెన్ (20), అబ్దుల్ సమద్ (19) రెండంకెల స్కోర్లు చేశారు. ఈ గెలుపుతో సీఎస్కే మూడో స్థానానికి ఎగబాకగా.. ఆ స్థానంలో ఉండిన సన్రైజర్స్ నాలుగో స్థానానికి పడిపోయింది. -
ఇదేమి చెత్త బ్యాటింగ్రా బాబు.. ఫుల్ టాస్ బాల్కు కూడా! వీడియో
ఐపీఎల్-2024లో సన్రైజర్స్ హైదరాబాద్ స్టార్ బ్యాటర్ ఐడైన్ మార్క్రమ్ తన పేలవ ఈ మెగా ఈవెంట్లో భాగంగా ఉప్పల్ వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్లో మార్క్రమ్ నిరాశపరిచాడు. కీలక సమయంలో క్రీజులోకి వచ్చిన మార్క్రమ్ ఏ మాత్రం ఇంపాక్ట్ చూపించలేకపోయాడు. 8 బంతులు ఎదుర్కొన్న మార్క్రమ్.. కేవలం 7 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు.స్పిన్నర్ స్వప్నిల్ సింగ్ బౌలింగ్లో ఫుల్ టాస్ బంతికి వికెట్ల ముందు మార్క్రమ్ దొరికిపోయాడు. రివ్యూ తీసుకున్నప్పటికి క్లియర్ ప్లంబ్(ఎల్బీ)గా తేలింది. ఈ క్రమంలో అతడిని నెటిజన్లు దారుణంగా ట్రోలు చేస్తున్నారు. ఫుల్ టాస్ బాల్ కూడా ఆడలేవా అంటూ పోస్టులు పెడుతున్నారు.మరి కొంతమంది వరుసగా విఫలమవతున్నప్పటికి మార్క్రమ్కు ఛాన్స్ ఇవ్వడాన్ని తప్పుబడుతున్నారు. అతడి స్ధానంలో గ్లెన్ ఫిలిప్స్కు ఛాన్స్ ఇవ్వాలని ఎస్ఆర్హెచ్ మెనెజ్మెంట్కు సూచిస్తున్నారు. ఇప్పటివరకు ఈ ఏడాది సీజన్లో 8 మ్యాచ్లు ఆడిన మార్క్రమ్.. 27.83 సగటుతో 167 పరుగులు చేశాడు. SRH fans reaction watching Aiden markram batting in this season pic.twitter.com/b6vx0pgeZr— Abhi (@Ragnarfreak) April 25, 2024pic.twitter.com/4klNQt9XoJ— Cricket Videos (@cricketvid123) April 25, 2024 -
SRH: మా జట్టు సూపర్.. దూకుడుగా ముందుకొస్తాం: కమిన్స్
ఐపీఎల్-2024లో దూకుడైన ఆటతో ముందుకు వస్తామంటున్నాడు సన్రైజర్స్ హైదరాబాద్ కొత్త కెప్టెన్ ప్యాట్ కమిన్స్. తాజా ఎడిషన్ను గెలుపుతో మొదలుపెట్టి శుభారంభంతో ఆరెంజ్ ఆర్మీని ఖుషీ చేస్తామని పేర్కొన్నాడు. గత మూడేళ్లుగా పేలవ ప్రదర్శనతో విమర్శలు మూటగట్టుకుంటున్న ఎస్ఆర్హెచ్ ఈసారి పలు మార్పులతో బరిలోకి దిగనుంది. వెస్టిండీస్ లెజెండ్ బ్రియన్ లారా స్థానంలో న్యూజిలాండ్ దిగ్గజ స్పిన్నర్ డానియెల్ వెటోరిని హెడ్కోచ్గా నియమించింది. అదే విధంగా సౌతాఫ్రికా స్టార్ ఐడెన్ మార్క్రమ్ స్థానంలో డబ్ల్యూటీసీ 2021-23, వన్డే వరల్డ్కప్-2023 విజేత, ఆసీస్ సారథి కమిన్స్కు పగ్గాలు అప్పగించింది. మినీ వేలంలో ఏకంగా రూ. 20. 50 కోట్లు ఖర్చు చేసి మరీ ఈ పేస్ బౌలర్ను కొనుగోలు చేసింది. ఇక మార్చి 22న ఐపీఎల్ పదిహేడో ఎడిషన్ ఆరంభం కానుండగా.. మార్చి 23న కోల్కతా నైట్ రైడర్స్తో సన్రైజర్స్ తమ తొలి మ్యాచ్ ఆడనుంది. ఈ నేపథ్యంలో కెప్టెన్ ప్యాట్ కమిన్స్ మాట్లాడుతూ.. ‘‘శుభారంభం కోసం ఎదురు చూస్తున్నాం. ఏదేమైనా టీ20 ఫార్మాట్ ఆడటం కాస్త కష్టంగానే ఉంటుంది. కేకేఆర్కు మంచి జట్టు ఉంది. అయితే, మేము కూడా తక్కువేమీ కాదు. దూకుడైన ఆటతో తాజా సీజన్ను ఆరంభించాలని చూస్తున్నాం. మా జట్టు అనుభవజ్ఞులు, యువ ఆటగాళ్ల సమ్మేళనం. భువీ ఉన్నాడు. గతేడాది మార్క్రమ్ కెప్టెన్గానూ వ్యవహరించాడు. వీరితో పాటు అభిషేక్, ఉమ్రాన్ మాలిక్ వంటి యంగ్ టాలెంట్కు కూడా కొదువలేదు. కొత్త సభ్యులతో కలిసి ఐపీఎల్ ఆడేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నా’’ అని పేర్కొన్నాడు. కొత్త సీజన్ కోసం అభిమానులు సిద్ధంగా ఉండాలంటూ ఆరెంజ్ ఆర్మీకి కమిన్స్ పిలుపునిచ్చాడు. 𝐂𝐚𝐩𝐭𝐚𝐢𝐧 𝐂𝐮𝐦𝐦𝐢𝐧𝐬’ 𝐟𝐢𝐫𝐬𝐭 𝐝𝐚𝐲 𝐚𝐬 𝐚 𝐑𝐢𝐬𝐞𝐫 🤩🧡 pic.twitter.com/JWSJ40WwsF — SunRisers Hyderabad (@SunRisers) March 21, 2024 -
SRH: రెండుసార్లు చాంపియన్గా నిలబెడితే ఇలా చేస్తారా? షాకయ్యా
SRH- IPL 2024: సన్రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ మార్పు నిర్ణయం తనను ఆశ్చర్యానికి గురిచేసిందని టీమిండియా దిగ్గజ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అన్నాడు. ఐడెన్ మార్క్రమ్నే సారథిగా కొనసాగించాల్సిందని అభిప్రాయపడ్డాడు. ఇందుకు గల కారణాన్ని కూడా అశూ వెల్లడించాడు. గత మూడు సీజన్లుగా చెత్త ప్రదర్శనతో పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానం కోసం పోటీ పడుతోంది సన్రైజర్స్. డేవిడ్ వార్నర్ తర్వాత ఎంత మంది కెప్టెన్లను మార్చినా జట్టు తలరాతను మాత్రం మార్చుకోలేకపోయింది. ఈ నేపథ్యంలో ఐపీఎల్-2024 వేలంలో వ్యూహాత్మకంగా పావులు కదిపింది. రూ. 20. 50 కోట్ల భారీ ధరకు ఆస్ట్రేలియా కెప్టెన్, వన్డే వరల్డ్కప్-2023 విజేత ప్యాట్ కమిన్స్ను కొనుగోలు చేసింది. గత ఎడిషన్లో రైజర్స్ జట్టును ముందుకు నడిపించిన ఐడెన్ మార్క్రమ్ స్థానంలో సారథిగా నియమించింది. ఈ నేపథ్యంలో రవిచంద్రన్ అశ్విన్.. సన్రైజర్స్ హైదరాబాద్ నిర్ణయం సరైంది కాదేమోనని అభిప్రాయపడ్డాడు. సౌతాఫ్రికా టీ20 లీగ్ అరంగేట్ర, తాజా సీజన్లో సన్రైజర్స్ ఈస్ట్రర్న్కేప్ను చాంపియన్గా నిలబెట్టిన మార్క్రమ్పై వేటు వేయకుండా ఉండాల్సిందని పేర్కొన్నాడు. ఈ మేరకు తన యూట్యూబ్ చానెల్లో మాట్లాడుతూ.. ‘‘సౌతాఫ్రికా టీ20 లీగ్లో సన్రైజర్స్ వరుసగా రెండు టైటిళ్లు గెలిచింది. అత్యద్బుతమైన జట్టుతో ట్రోఫీలు అందుకుంది. కానీ ఇక్కడ మార్క్రమ్ను కాదని వాళ్లు ప్యాట్ కమిన్స్ను కెప్టెన్ చేశారు. నిజంగా ఇది షాకింగ్గా అనిపించింది. మార్క్రమ్నే సారథిగా కొనసాగిస్తారని ఊహించాను. సౌతాఫ్రికాలో సన్రైజర్స్ కెప్టెన్గా అత్యద్బుత ప్రదర్శన కనబరిచాడు. కానీ ఇలా ఎందుకు జరిగిందో అర్థం కావడం లేదు. కమిన్స్ను కెప్టెన్గా ప్రకటించినందు వల్ల తుదిజట్టు కూర్పులో రైజర్స్ కచ్చితంగా ఇబ్బందులు ఎదుర్కొంటుంది. ట్రవిస్ హెడ్ను బ్యాకప్గా ఉపయోగించుకున్నా.. మార్క్రమ్, హెన్రిచ్క్లాసెన్, వనిందు హసరంగలను ప్రధాన ప్లేయర్లుగా ఆడించాల్సి ఉంటుంది. ఒకవేళ హసరంగ లేకుంటే కొన్ని వేదికల్లో ఫజల్హక్ ఫారూకీ లేదంటే మార్కోజాన్సెన్లను ఆడించే అవకాశం ఉంది. ఏదేమైనా విదేశీ ప్లేయర్లను ఆడించే విషయంలో రైజర్స్కు ఇబ్బందులు తప్పవు’’ అని రాజస్తాన్ రాయల్స్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ అన్నాడు. కాగా మార్చి 23న కేకేఆర్తో సన్రైజర్స్ తమ తొలి మ్యాచ్ ఆడనుంది. చదవండి: పేరు మార్చుకున్న ఆర్సీబీ... కన్నడలో మాట్లాడిన కోహ్లి.. వీడియో -
IPL 2024: సన్రైజర్స్ తుదిజట్టు ఇదే.. మార్క్రమ్కు నో ఛాన్స్?
ఐపీఎల్-2024 ఆరంభానికి కౌంట్డౌన్ మొదలైంది. మార్చి 22న ఈ మెగా ఈవెంట్కు చెపాక్ వేదికగా తెరలేవనుంది. డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్- రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య ఆరంభ మ్యాచ్ జరుగనుంది. ఈ క్రమంలో మరుసటి రోజే అంటే మార్చి 23న సన్రైజర్స్ హైదరాబాద్ కోల్కతా నైట్ రైడర్స్తో తమ తొలి మ్యాచ్ ఆడనుంది. కోల్కతా వేదికగా ఈ మ్యాచ్ జరుగనుంది. ఇదిలా ఉంటే.. గత కొన్నేళ్లుగా పేలవ ప్రదర్శనతో విమర్శలు మూటగట్టుకుంటున్న సన్రైజర్స్ ఈసారి మరో కొత్త కెప్టెన్తో ముందుకు రానుంది. ఆస్ట్రేలియా సారథి, వన్డే వరల్డ్కప్-2023 విజేత ప్యాట్ కమిన్స్పై కోట్లు కుమ్మరించి తన నాయకుడిగా ప్రకటించింది. ఈ క్రమంలో సౌతాఫ్రికా కెప్టెన్ ఐడెన్ మార్క్రమ్పై వేటు వేసింది. ఇక జట్టులో వీరిద్దరితో పాటు మరో ఆరుగురు విదేశీ ప్లేయర్లు కూడా ఉన్నారు. నిబంధనల ప్రకారం తుదిజట్టులో కేవలం నలుగురు ఫారిన్ ప్లేయర్లను మాత్రమే ఆడించాలి. ఈ నేపథ్యంలో సన్రైజర్స్ ప్లేయింగ్ ఎలెవన్ ఎలా ఉండబోతుందా అన్న చర్చల నడుమ.. టీమిండియా మాజీ ఓపెనర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా తన జట్టును ప్రకటించాడు. విదేశీ ప్లేయర్ల కోటాలో కెప్టెన్ ప్యాట్ కమిన్స్తో పాటు.. ట్రవిస్ హెడ్, హెన్రిచ్ క్లాసెన్, మార్కో జాన్సెన్లకు తన టీమ్లో చోటిచ్చాడు. ‘‘అభిషేక్ శర్మ, ట్రవిస్ హెడ్.. ఇద్దరు లెఫ్టాండర్లతో ఓపెనింగ్ చేయించాలనుకుంటే వీరికి ఇన్నింగ్స్ ఆరంభించే అవకాశం ఇవ్వాలి. లేదంటే అభిషేక్ను వన్డౌన్లో ఆడించి.. మయాంక్ అగర్వాల్ను ఓపెనర్గా పంపాలి. ఆ తర్వాతి స్థానాల్లో రాహుల్ త్రిపాఠి, హెన్రిచ్ క్లాసెన్, వాషింగ్టన్ సుందర్, మార్కో జాన్సెన్, ప్యాట్ కమిన్స్, భువనేశ్వర్ కుమార్, మయాంక్ మార్కండే, జయదేవ్ ఉనాద్కట్/ఉమ్రాన్ మాలిక్/టి. నటరాజన్లను పంపించాలి’’అని ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు. ఒకవేళ స్పిన్ పిచ్లపై ఆడాల్సి వస్తే.. మార్కో జాన్సెన్ స్థానంలో వనిందు హసరంగను తీసుకుంటే బాగుంటుందని ఆకాశ్ చోప్రా సూచించాడు. షాబాజ్ అహ్మద్ రూపంలో మరో స్పిన్ బౌలింగ్ ఆప్షన్ కూడా ఉంది కాబట్టి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నాడు. కాగా ఆకాశ్ చోప్రా తన తుదిజట్టులో ఐడెన్ మార్క్రమ్కు చోటు ఇవ్వకపోవడం గమనార్హం. గత సీజన్లో అతడు 13 ఇన్నింగ్స్ ఆడి సగటు 22.55తో 248 పరుగులు సాధించాడు. ఐపీఎల్ 2024- సన్రైజర్స్ హైదరాబాద్- ఆకాశ్ చోప్రా తుదిజట్టు: అభిషేక్ శర్మ, ట్రవిస్ హెడ్, మయాంక్ అగర్వాల్, రాహుల్ త్రిపాఠి, హెన్రిచ్ క్లాసెన్, వాషింగ్టన్ సుందర్, మార్కో జాన్సెన్, ప్యాట్ కమిన్స్, భువనేశ్వర్ కుమార్, మయాంక్ మార్కండే, జయదేవ్ ఉనాద్కట్/ఉమ్రాన్ మాలిక్/టి. నటరాజన్. ఐపీఎల్-2024- సన్రైజర్స్ జట్టు: అబ్దుల్ సమద్ ఐడెన్ మార్క్రమ్* రాహుల్ త్రిపాఠి గ్లెన్ ఫిలిప్స్* హెన్రిచ్ క్లాసెన్* మయాంక్ అగర్వాల్.. అన్మోల్ ప్రీత్ సింగ్ ఉపేంద్ర సింగ్ యాదవ్ నితీష్ కుమార్ రెడ్డి అభిషేక్ శర్మ మార్కో జాన్సెన్* వాషింగ్టన్ సుందర్ సన్వీర్ సింగ్ భువనేశ్వర్ కుమార్ టి.నటరాజన్ మయాంక్ మార్కండే ఉమ్రాన్ మాలిక్ ఫజల్హక్ ఫరూఖీ* షాబాజ్ అహ్మద్ (ఆర్సీబీ నుంచి ట్రేడింగ్) ట్రావిస్ హెడ్ * (వేలం - 6.80 కోట్లు) వనిందు హసరంగ* (వేలం - 1.50 కోట్లు) ప్యాట్ కమిన్స్* (వేలం - 20.50 కోట్లు) జయదేవ్ ఉనాద్కట్ (వేలం - 1.60 కోట్లు) ఆకాశ్ సింగ్ (వేలం - 20 లక్షలు) ఝతావేద్ సుబ్రమణియన్ (వేలం - 20 లక్షలు) *- విదేశీ ఆటగాళ్లు. చదవండి: హార్దిక్ రిటైర్ అవ్వటమే బెటర్: భారత మాజీ పేసర్ షాకింగ్ కామెంట్స్ -
ఒక్క సీజన్కేనా? ఎస్ఆర్హెచ్ కెప్టెన్గా కమ్మిన్స్ సరైనోడు కాదు!
ఐపీఎల్-2024 సీజన్కు ముందు సన్రైజర్స్ హైదరాబాద్ తమ కెప్టెన్సీ మార్పు చేసిన సంగతి తెలిసిందే. ఆస్ట్రేలియా స్టార్, వన్డే ప్రపంచకప్ 2023 విన్నింగ్ కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ను తమ జట్టు కొత్త కెప్టెన్గా ఎస్ఆర్హెచ్ నియమించింది. గతేడాది సీజన్లో కెప్టెన్గా వ్యవహరించిన ఎయిడెన్ మార్క్రమ్ను తప్పిస్తూ కమ్మిన్స్కు తమ జట్టు పగ్గాలను ఆరెంజ్ ఆర్మీ అప్పగించింది. కాగా గతేడాది జరిగిన ఐపీఎల్ వేలంలో రికార్డు స్థాయిలో కమిన్స్ను రూ.20.50 కోట్లకు సన్రైజర్స్ దక్కించుకుంది. అయితే గత మూడేళ్లలో ఎస్ఆర్హెచ్ సారథ్య బాధ్యతలు చేపట్టిన నాలుగో ఆటగాడిగా కమ్మిన్స్ నిలిచాడు. అయితే ఎస్ఆర్హెచ్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని చాలా మంది తప్పుబడుతున్నారు. తాజాగా ఈ జాబితాలోకి టీమిండియా మాజీ ఆల్రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ చేరాడు. "ప్యాట్ కమ్మిన్స్ అద్భుతమైన కెప్టెన్ అనడంలో ఎటువంటి సందేహం లేదు. అతడొక వరల్డ్క్లాస్ కెప్టెన్. కమ్మిన్స్ సారథ్యంలోనే ఆస్ట్రేలియా వరల్డ్కప్ను సొంతం చేసుకుంది. గత రెండేళ్లగా తన వ్యక్తిగత ప్రదర్శనతో కూడా కమ్మిన్స్ అకట్టుకుంటున్నాడు. కానీ ఇక్కడ ఒక్కటే సమస్య. టెస్టుల్లో, వన్డేల్లో సారథి సఫలమైన కమ్మిన్స్.. టీ20ల్లో మాత్రం తన మార్క్ను చూపించలేకపోయాడు. అదే విధంగా టీ20ల్లో తన వ్యక్తిగత ప్రదర్శన కూడా అంతంతమాత్రమే. ఐపీఎల్లో కూడా అతడి గణాంకాలు అంత బాగోలేవు. అయితే ఎస్ఆర్హెచ్ ఏ ఉద్దేశ్యంతో ఈ నిర్ణయం తీసుకుందో నాకు అర్ధం కావడం లేదు. ఇప్పుడు మార్క్రరమ్ పరిస్థితి ఏంటి? అతడికి కేవలం ఒక్క సీజన్లో మాత్రమే కెప్టెన్సీ ఛాన్స్ ఇచ్చారు. మరో అవకాశం ఇచ్చి ఉంటే బాగుండేదని" స్టార్స్పోర్ట్స్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పఠాన్ పేర్కొన్నాడు. కాగా సౌతాఫ్రికా టీ20 లీగ్లో ఎస్ఆర్హెచ్ ఫ్రాంచైజీకి చెందిన సన్రైజర్స్ ఈస్టెర్న్ కేప్ జట్టును మార్క్రమ్ వరుసగా రెండుసార్లు చాంపియన్గా నిలబెట్టాడు. అయితే ఐపీఎల్లో మాత్రం సారథిగా ఈ ప్రోటీస్ స్టార్ విఫలమయ్యాడు. చదవండి: WPL 2024: భారీ సిక్సర్ కొట్టిన ఆర్సీబీ బ్యాటర్.. దెబ్బకు కారు అద్దం పగిలిపోయింది! వీడియో -
పాపం మార్క్రమ్.. ఏంటి కావ్య పాప ఇది? మరీ ఇంత అన్యాయమా?
ఐపీఎల్-2024 సీజన్ ఆరంభానికి ముందు సన్రైజర్స్ హైదరాబాద్.. ఆ జట్టు కెప్టెన్, సౌతాఫ్రికా స్టార్ ఐడైన్ మార్క్రమ్కు ఊహించని షాకిచ్చింది. మార్క్రమ్ను తమ జట్టు కెప్టెన్సీ బాధ్యతల నుంచి ఎస్ఆర్హెచ్ తప్పించింది. అతడి స్ధానంలో వన్డే ప్రపంచకప్ 2023 విన్నింగ్ కెప్టెన్, ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ ప్యాట్ కమిన్స్కు జట్టు పగ్గాలను సన్రైజర్స్ అప్పగించింది. ఈ మెరకు సోషల్ మీడియా వేదికగా ప్రకటన విడుదల చేసింది. కాగా మినీ వేలంలో ఫ్రాంచైజీ కమిన్స్ను రూ.20.50 కోట్ల భారీ ధర వెచ్చించి కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. అయితే ఎస్ఆర్హెచ్ తీసుకున్న నిర్ణయంపై భిన్నభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొంతమంది కమ్మిన్స్ను సారథిగా నియమించడాన్ని సమర్ధిస్తుంటే.. మరి కొంత మంది తప్పుబడుతున్నారు. మారక్రమ్ అద్బుతమైన నాయకుడని, అతడికి మరో ఛాన్స్ ఇవ్వాలందని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. మీ ఫ్రాంచైజీని వరుసగా రెండు సార్లు నిలిపిన ఆటగాడికి అన్యాయం చేశారని ఎస్ఆర్హెచ్ ఓనర్ కావ్య మారన్ను ఉద్దేశించి కామెంట్లు చేస్తున్నారు. కాగా సౌతాఫ్రికా టీ20 లీగ్లో ఎస్ఆర్హెచ్ ఫ్రాంచైజీకి చెందిన సన్రైజర్స్ ఈస్టెర్న్ కేప్ జట్టును మార్క్రమ్ వరుసగా రెండుసార్లు చాంపియన్గా నిలబెట్టాడు. గతేడాది ప్రారంభ సీజన్లోనే జట్టును విజేతగా నిలిపిన అతను.. ఇటీవల రెండో సీజన్లోనూ టైటిల్ను అందించాడు. అయితే ఐపీఎల్లో మాత్రం మార్క్రమ్ తన కెప్టెన్సీ మార్క్ను చూపించలేకపోయాడు. గత సీజన్లో ఎయిడెన్ మార్క్రమ్ సారథ్యంలో బరిలోకి దిగిన సన్రైజర్స్ పేలవ ప్రదర్శన కనబర్చింది. ఆడిన 14 మ్యాచుల్లో నాలుగింట్లో మాత్రమే గెలిచింది. పది మ్యాచుల్లో ఓడి పాయింట్ల పట్టికలో అట్టడుగు నిలిచింది. -
IPL 2024: సన్రైజర్స్కు కొత్త కెప్టెన్.. ప్రకటించిన ఫ్రాంఛైజీ
Big Change In IPL 2024: Sunrisers Hyderabad New Captain: ఐపీఎల్-2024 ఆరంభానికి ముందు సన్రైజర్స్ హైదరాబాద్ తమ కొత్త కెప్టెన్ పేరును ప్రకటించింది. ముందుగా ఊహించినట్లుగానే ఆస్ట్రేలియా సారథి ప్యాట్ కమిన్స్కు ఎస్ఆర్హెచ్ నాయకుడిగా బాధ్యతలు అప్పగించింది. గత సీజన్లో సారథిగా వ్యవహరించిన సౌతాఫ్రికా స్టార్ ఐడెన్ మార్క్రమ్ స్థానాన్ని కమిన్స్తో భర్తీ చేసింది. కాగా 2016లో డేవిడ్ వార్నర్ కెప్టెన్సీలో తొలిసారి ఐపీఎల్ ట్రోఫీని గెలిచింది సన్రైజర్స్. ఆ తర్వాత మళ్లీ చెప్పుకోదగ్గ స్థాయిలో రాణించలేకపోయింది. ఈ క్రమంలో వార్నర్పై వేటు వేయగా.. ఆ తర్వాత పరిస్థితి మరింత దిగజారింది. కేన్ మామనూ మార్చేసింది వార్నర్ స్థానంలో న్యూజిలాండ్ సారథి కేన్ విలియమ్సన్ను కెప్టెన్గా తీసుకువచ్చినప్పటికీ అనుకున్న ఫలితాలు రాబట్టలేకపోయింది. ఫలితంగా కేన్ మామకూ బైబై చెప్పింది ఫ్రాంఛైజీ. మార్క్రమ్కూ ఉద్వాసన ఐపీఎల్-2022 ఎడిషన్లో పద్నాలుగింట కేవలం ఆరు మ్యాచ్లు మాత్రమే గెలిచి పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానానికి పరిమితం కావడంతో ఈ మేరకు కేన్ మామపై వేటు వేసింది. అతడి స్థానంలో ఐడెన్ మార్క్రమ్కు సారథ్య బాధ్యతలు అప్పగించింది. అయినప్పటికీ ఎస్ఆర్హెచ్ రాత మారలేదు సరికదా మరింత పేలవ ప్రదర్శనలతో విమర్శలు మూటగట్టుకుంది. గతేడాది పద్నాలుంగిట కేవలం నాలుగు మాత్రమే గెలిచి అట్టడుగున పదో స్థానంలో నిలిచింది. రూ. 20 కోట్లు ఖర్చు చేసి మరీ ఈ నేపథ్యంలో సరైన సారథి వేటలో పడిన సన్రైజర్స్ ఐపీఎల్-2024 వేలంలో భాగంగా ప్యాట్ కమిన్స్ కోసం ఏకంగా రూ. 20.50 కోట్లు ఖర్చు చేసింది. వన్డే వరల్డ్కప్-2023లో ఆసీస్ను చాంపియన్గా నిలిపిన ఈ పేస్ బౌలర్ కోసం భారీ మొత్తాన్ని వెచ్చించి.. తాజాగా అతడిని కెప్టెన్గా ప్రకటించింది. ఇక కోల్కతా నైట్ రైడర్స్తో మార్చి 23న జరుగనున్న మ్యాచ్తో సన్రైజర్స్ తాజా ఎడిషన్ ప్రయాణాన్ని ఆరంభించనుంది. ఆ తర్వాత మార్చి 27న హైదరాబాద్లో ముంబై ఇండియన్స్తో, మార్చి 31న అహ్మదాబాద్లో గుజరాత్ టైటాన్స్తో, ఏప్రిల్ 5న హైదరాబాద్లో చెన్నై సూపర్ కింగ్స్తో తలపడనుంది. తొలి దఫా షెడ్యూల్లో భాగంగా ఈ మేరకు మ్యాచ్లు ఆడనుంది. చదవండి: IPL 2024: సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు ఇదే..! #OrangeArmy! Our new skipper Pat Cummins 🧡#IPL2024 pic.twitter.com/ODNY9pdlEf — SunRisers Hyderabad (@SunRisers) March 4, 2024 -
సన్ రైజర్స్ సంచలన నిర్ణయం.. మార్క్రమ్కు బిగ్ షాక్! కొత్త కెప్టెన్ అతడే?
ఐపీఎల్-2024 సీజన్కు ముందు సన్రైజర్స్ హైదరాబాద్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వేలంలో రూ.20.50 కోట్టు ఖర్చు పెట్టి కొనుగోలు చేసిన ఆసీస్ స్టార్ ప్యాట్ కమ్మిన్స్కు తమ జట్టు పగ్గాలు అప్పజెప్పాలని ఎస్ఆర్హెచ్ ఫ్రాంచైజీ నిర్ణయించుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం కెప్టెన్గా ఉన్న ఐడైన్ మార్క్రమ్ను తప్పించేందుకు ఎస్ఆర్హెచ్ సిద్దమైనట్లు వినికిడి. ఈ విషయంపై ఒకట్రెండు రోజుల్లో ఆరెంజ్ ఆర్మీ నుంచి అధికారిక ప్రకటన వెలువడే అవకాశముంది. కాగా కెప్టెన్గా కమ్మిన్స్కు ఉన్న అనుభవం దృష్ట్యా.. ఎస్ఆర్హెచ్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. కమిన్స్ కెప్టెన్గానే కాకుండా ఫ్రంట్ లైన్ బౌలర్గా సన్రైజర్స్కు కీలకం కానున్నాడు. కాగా కమ్మిన్స్ సారథ్యంలోనే వన్డే ప్రపంచకప్-2023ను, వరల్డ్టెస్టు ఛాంపియన్ షిప్ టైటిల్ను ఆసీస్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే మార్క్రమ్ సైతం దక్షిణాఫ్రికా టీ20 లీగ్లో వరుసగా రెండు సార్లు ఎస్ఆర్హెచ్ ఫ్రాంఛైజీ సన్రైజర్స్ ఈస్ట్రన్ కేప్ను ఛాంపియన్స్గా నిలిపాడు. కానీ ఐపీఎల్లో మాత్రం మార్క్రమ్ తన మార్క్ను చూపించలేకపోయాడు. గతేడాది సీజన్లో ఎస్ఆర్హెచ్ జట్టు పగ్గాలను చేపట్టిన మార్క్రమ్ జట్టును విజయ పథంలో నడిపించడంలో విఫలమయ్యాడు. అతడి సారథ్యంలో సన్రైజర్స్ 14 మ్యాచ్ల్లో కేవలం నాలుగు మాత్రమే గెలిచింది. -
రెండోసారి ఛాంపియన్గా సన్రైజర్స్.. ఎగిరి గంతేసిన కావ్య పాప! వీడియో వైరల్
సౌతాఫ్రికా టీ20 లీగ్-2024 విజేతగా సన్రైజర్స్ ఈస్టర్న్ కేప్ నిలిచింది. శనివారం కేప్టౌన్ వేదికగా జరిగిన ఫైనల్లో డర్బన్ సూపర్ జెయింట్ 89 పరుగుల తేడాతో సన్రైజర్స్ చిత్తు చేసింది. తద్వారా వరుసగా రెండోసారి దక్షిణాఫ్రికా టీ20 లీగ్ ఛాంపియన్గా సన్రైజర్స్ అవతరించింది. టోర్నీ అసాంతం అద్బుతమైన ప్రదర్శన కనబరిచిన ఈస్టర్న్ కేప్.. తుదిపోరులోనే తమకు తిరుగులేదని నిరూపించుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన సన్రైజర్స్ 20 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 204 పరుగులు చేసింది. సన్రైజర్స్ ట్రిస్టన్ స్టబ్స్(30 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్లతో 56), టామ్ అబెల్(34 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్లతో 55) హాఫ్ సెంచరీలతో చెలరేగాడు. అనంతరం లక్ష్య ఛేదనలో డర్బన్ సూపర్ జెయింట్ కేవలం 115 పరుగులకే ఆలౌటైంది. కావ్య పాప సెలబ్రేషన్స్.. ఇక ఈ విజయం నేపథ్యంలో సన్రైజర్స్ ఓనర్ కావ్య మారన్ సంబరాలు అంబరాలను అంటాయి. డర్బన్ ఆఖరి వికెట్ రీస్ టోప్లీ ఔట్ అవ్వగానే కావ్య పాప ఎగిరి గంతేసింది. వెంటనే మైదానంలో వచ్చి తమ జట్టు ఆటగాళ్లను కావ్య అభినంధించింది. అంతకముందు సన్రైజర్స్ బ్యాటింగ్ సమయంలో కూడా బౌండరీలు బాదిన ప్రతీసారి కావ్య స్టాండ్స్లో నుంచి చప్పట్లు కొడుతూ ప్రోత్సహించింది. ఆ తర్వాత మైదానంలో కావ్య మాట్లాడుతూ.. రెండో సారి ఛాంపియన్గా నిలవడం చాలా సంతోషంగా ఉందని చెప్పుకొచ్చింది. కావ్య సెలబ్రేషన్స్కు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. కాగా ఐపీఎల్లో కూడా కావ్య స్టేడియాల్లో సందడి చేస్తూ ఉంటుంది. చదవండి: SA20 2024: సన్రైజర్స్ సంచలనం.. వరుసగా రెండో సారి ఛాంపియన్స్గా] Here comes the winning message from kavya herself,her voice is very sweet tbh ❤️ #Bundesliga #RealMadrid #OrangeArmy #SCOvFRA #Kavya #KavyaMaran #SAt20 #SECvDSG #Klaasen #Markram #CHAMPION #ILT20 #SA20Finalpic.twitter.com/9RrJcj8lZB — Arpita Singhal (@arpita_singhal1) February 10, 2024 Congratulations to Sunrisers Eastern Cape and boys for making Kavya maran win another title 🫣#SCOvFRA #Kavya #KavyaMaran #SAt20 #SECvDSG #Klaasen #Markram #CHAMPION pic.twitter.com/e5fMnxnqrI — Arpita Singhal (@arpita_singhal1) February 10, 2024 -
పక్షిలా.. గాల్లోకి ఎగిరి.. ఒంటిచేత్తో సంచలన క్యాచ్! వీడియో
SAT20 League 2024: డర్బన్ సూపర్ జెయింట్స్తో మ్యాచ్లో సన్రైజర్స్ ఈస్టర్న్ కేప్ కెప్టెన్ ఐడెన్ మార్కరమ్ సంచలన క్యాచ్తో మెరిశాడు. డర్బన్ బ్యాటర్ జేజే స్మట్స్ బంతిని గాల్లోకి లేపగానే పక్షిలా ఎగిరి ఒంటిచేత్తో ఒడిసిపట్టాడు. ఈ క్రమంలో దాదాపు రెండు సెకండ్లపాటు గాల్లోనే ఉన్న మార్కరమ్ విజయవంతంగా క్యాచ్ పట్టి.. కీలక వికెట్ కూల్చడంలో తన వంతు పాత్ర పోషించాడు. కాగా సౌతాఫ్రికా టీ20 లీగ్-2024లో భాగంగా క్వాలిఫయర్-1లో సన్రైజర్స్- డర్బన్ సూపర్ జెయింట్స్తో తలపడింది. కేప్టౌన్లో మంగళవారం జరిగిన ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన సన్రైజర్స్.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. ఈ క్రమంలో టార్గెట్ ఛేదించేందుకు బరిలోకి దిగిన డర్బన్ను ఆదిలోనే కష్టాలపాలైంది. అతడికి తోడుగా వియాన్ మల్దర్(38), హెన్రిచ్ క్లాసెన్(23) రాణించినా మిగతా వాళ్ల నుంచి ఏమాత్రం సహకారం అందలేదు. ఒంటిచేత్తో సంచలన క్యాచ్ ఈ క్రమంలో రైజర్స్ పేసర్ల ధాటికి తలవంచిన డర్బన్ 51 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఈ విజయంతో సన్రైజర్స్ 2024-ఫైనల్లో అడుగుపెట్టిన తొలి జట్టుగా నిలిచింది. ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్లో మార్కరమ్ పట్టిన క్యాచ్ హైలైట్గా నిలిచింది. డర్బన్ ఇన్నింగ్స్లో నాలుగో ఓవర్ ఐదో బంతికి రైజర్స్ పేసర్ ఒట్నీల్ బార్ట్మన్ బౌలింగ్లో.. నాలుగో నంబర్ బ్యాటర్ జేజే స్మట్స్ మిడాన్ దిశగా పుల్ షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో బంతి గాల్లోకి లేవగానే మెరుపువేగంతో కదిలిన మార్కరమ్ ఒంటి చేత్తో అద్భుత క్యాచ్ అందుకున్నాడు. దీంతో.. 4 బంతులు ఎదుర్కొన్న స్మట్స్ పరుగుల ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరాడు. చదవండి: దంచికొట్టిన మలన్.. చెలరేగిన పేసర్లు.. ఫైనల్కు సన్రైజర్స్ 𝐈𝐬 𝐢𝐭 𝐚 𝐛𝐢𝐫𝐝, 𝐢𝐬 𝐢𝐭 𝐩𝐥𝐚𝐧𝐞.. 𝐧𝐨 𝐢𝐭 𝐢𝐬 𝐒𝐮𝐩𝐞𝐫 𝐀𝐢𝐝𝐞𝐧. 🦸♂️#Betway #SA20 #Playoffs #SECvDSG #WelcomeToIncredible pic.twitter.com/WFz4dZJvPW — Betway SA20 (@SA20_League) February 6, 2024 -
దంచికొట్టిన మలన్.. చెలరేగిన పేసర్లు.. ఫైనల్కు సన్రైజర్స్
SA20, 2024 Qualifier 1 - Sunrisers Eastern Cape won by 51 runs: సౌతాఫ్రికా టీ20 లీగ్-2024లో సన్రైజర్స్ ఈస్టర్న్ కేప్ జైత్రయాత్ర కొనసాగుతోంది. అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంటున్న ఈ డిఫెండింగ్ చాంపియన్ ఫైనల్లో అడుగుపెట్టింది. క్వాలిఫయర్-1లో డర్బన్ సూపర్ జెయింట్స్ను చిత్తు చేసి.. ఈ సీజన్లో తుదిపోరుకు అర్హత సాధించిన తొలి జట్టుగా నిలిచింది. దంచికొట్టిన మలన్ సొంతమైదానం న్యూలాండ్స్లో మంగళవారం డర్బన్తో జరిగిన మ్యాచ్లో టాస్ గెలిచిన సన్రైజర్స్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్ డేవిడ్ మలన్(45 బంతుల్లో 63 రన్స్) దంచికొట్టగా.. కెప్టెన్ ఐడెన్ మార్కరమ్(23 బంతుల్లో 30) కూడా రాణించాడు. చెలరేగిన ఒట్నీల్, జాన్సెన్ వీరిద్దరి ఇన్నింగ్స్ కారణంగా నిర్ణీత 20 ఓవర్లలో సన్రైజర్స్ 8 వికెట్ల నష్టానికి 157 పరుగులు స్కోరు చేసింది. ఈ క్రమంలో లక్ష్య ఛేదనకు దిగిన డర్బన్ సూపర్ జెయింట్స్కు సన్రైజర్స్ పేసర్లు ఒట్నీల్ బార్ట్మన్, మార్కో జాన్సెస్ చుక్కలు చూపించారు. 51 పరుగుల తేడాతో రైజర్స్ గెలుపు ఇద్దరూ తలా నాలుగేసి వికెట్లు పడగొట్టి డర్బన్ బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించారు. వీరికి తోడు స్పిన్నర్ లియామ్ డాసన్ రెండు కీలక వికెట్లు తీసి 106 పరుగులకే డర్బన్ జట్టును ఆలౌట్ చేయడంలో తన వంతు పాత్ర పోషించాడు. రైజర్స్ విధించిన టార్గెట్ను పూర్తిచేయలేక 19.3 ఓవర్లకే డర్బన్ ఇలా చేతులెత్తేయడంతో 51 పరుగుల తేడాతో ఓటమి తప్పలేదు. అద్భుత బౌలింగ్తో డర్బన్ బ్యాటర్లలో క్వింటన్ డికాక్(20), వియాన్ మల్దర్(38), హెన్రిచ్ క్లాసెన్(23) మాత్రమే రెండంకెల స్కోరు చేశారు. ఇక సన్రైజర్స్ విజయంలో కీలక పాత్ర పోషించిన ఒట్నీల్ బార్ట్మన్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కించుకున్నాడు. ఈ మ్యాచ్లో అతడు నాలుగు ఓవర్ల బౌలింగ్లో కేవలం 10 పరుగులు మాత్రమే ఇచ్చి ఏకంగా నాలుగు వికెట్లు కూల్చాడు. డర్బన్కు మరో అవకాశం ఇదిలా ఉంటే.. డర్బన్ సూపర్ జెయింట్స్కు క్వాలిఫయర్-2 రూపంలో మరో అవకాశం ఉంది. పర్ల్ రాయల్స్, జోబర్గ్ సూపర్ కింగ్స్ మధ్య జరిగే ఎలిమినేటర్ మ్యాచ్ విజేతతో డర్బన్ ఫైనల్లో చోటు కోసం తలపడాల్సి ఉంటుంది. చదవండి: జింబాబ్వే పర్యటనకు టీమిండియా.. ఐదు మ్యాచ్ల సిరీస్.. షెడ్యూల్ ఇదే 𝑭𝒊𝒓𝒔𝒕 𝒊𝒏𝒏𝒊𝒏𝒈𝒔 𝒂𝒄𝒕𝒊𝒐𝒏 🔥#Betway #SA20 #Playoffs #SECvDSG #WelcomeToIncredible pic.twitter.com/LG99C0gG5r — Betway SA20 (@SA20_League) February 6, 2024 -
సౌతాఫ్రికా టీ20 లీగ్.. తొలి మ్యాచ్ వర్షార్పణం
సౌతాఫ్రికా టీ20 లీగ్ 2024 ఎడిషన్కు వరుణుడు ఘన స్వాగతం పలికాడు. సన్రైజర్స్ ఈస్ట్రన్ కేప్, జోబర్గ్ సూపర్ కింగ్స్ మధ్య నిన్న (జనవరి 10) జరగాల్సిన తొలి మ్యాచ్ వర్షం కారణంగా టాస్ కూడా పడకుండానే రద్దైంది. గతేడాది ఛాంపియన్ అయిన సన్రైజర్స్ ఈ మ్యాచ్లో ఫేవరెట్గా ఉండింది. సన్రైజర్స్కు ఎయిడెన్ మార్క్రమ్ నాయకత్వం వహిస్తుండగా.. జోబర్గ్ సూపర్ కింగ్స్ డుప్లెసిస్ కెప్టెన్గా ఉన్నాడు. సూపర్ కింగ్స్ గతేడాది సెమీఫైనల్ వరకు చేరింది. ఇదిలా ఉంటే, సౌతాఫ్రికా టీ20 లీగ్ గత ఎడిషన్లోనే పురుడు పోసుకుంది. తొలి ఎడిషన్ ఫైనల్లో సన్రైజర్స్.. ప్రిటోరియా క్యాపిటల్స్ను ఓడించి ఛాంపియన్గా నిలిచింది. ఫైనల్లో తొలుత బ్యాటింగ్ చేసిన ప్రిటోరియా 19.3 ఓవర్లలో 135 పరుగులకు ఆలౌట్ కాగా.. సన్రైజర్స్ 16.2 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. సన్రైజర్స్ ఈస్ట్రన్ కేప్ స్క్వాడ్: ఆడమ్ రోసింగ్టన్ (వికెట్కీపర్), ఎయిడెన్ మార్క్రమ్ (కెప్టెన్), టెంబా బవుమా, డేవిడ్ మలాన్, ట్రిస్టన్ స్టబ్స్, మార్కో జన్సెన్, సైమన్ హార్మర్, టామ్ ఎబెల్, ఒట్నీల్ బార్ట్మన్, లియామ్ డాసన్, అయాబులెలా గ్కమనే, సరెల్ ఎర్వీ, ప్యాట్రిక్ క్రూగర్స్, బెయర్స్ స్వానోపోల్, ఆండీల్ సైమ్లేన్, కాలెబ్ సలేకా, జోర్డన్ హెర్మన్ జోబర్గ్ సూపర్ కింగ్స్ స్క్వాడ్: ఫాఫ్ డుప్లెసిస్ (కెప్టెన్), డోనోవన్ ఫెరీరా (వికెట్కీపర్), రీజా హెండ్రిక్స్, లీస్ డు ప్లూయ్, మొయిన్ అలీ, రొమారియో షెపర్డ్, కైల్ సిమండ్స్, గెరాల్డ్ కొయెట్జీ, లిజాడ్ విలియమ్స్, నండ్రే బర్గర్, ఇమ్రాన్ తాహిర్, వేన్ మాడ్సెన్, ఆరోన్ ఫంగిసో, డేవిడ్ వీస్, డయ్యన్ గేలియం, సిబోనెలో మఖాన్యా, జహీర్ ఖాన్, సామ్ కుక్, రోనన్ హెర్మాన్ -
అదే మా కొంపముంచింది.. మార్క్రమ్ బ్యాటింగ్ తీరు అత్యద్భుతం: సౌతాఫ్రికా కెప్టెన్
కేప్టౌన్ వేదికగా టీమిండియాతో జరిగిన రెండో టెస్ట్లో సౌతాఫ్రికా 7 వికెట్ల తేడాతో చిత్తైన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్లో ఇరు జట్ల పేసర్లు అద్భుతంగా బౌలింగ్ చేసినప్పటికీ.. అంతిమంగా భారత పేసర్లదే పైచేయిగా నిలిచింది. సిరాజ్ (6/15) విశ్వరూపం ప్రదర్శించడంతో తొలి ఇన్నింగ్స్లో 55 పరుగులకే కుప్పకూలిన సౌతాఫ్రికా.. ఆతర్వాత భారత్ను 153 పరుగులకే పరిమితం చేసి తిరిగి మ్యాచ్లోకి వచ్చింది. అనంతరం మార్క్రమ్ కఠినమైన పిచ్పై నమ్మశక్యంకాని రీతిలో బ్యాటింగ్ విన్యాసాలు ప్రదర్శించి టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే మరపురాని ఇన్నింగ్స్ (106) ఆడాడు. మార్క్రమ్ రెచ్చిపోతుండటంతో ఓ సమయంలో సౌతాఫ్రికా మ్యాచ్పై పట్టు సాధించేలా కనిపించింది. అయితే బుమ్రా (6/60) మరో ఎండ్లో ఎవరినీ కుదురుకోనీయకపోవడంతో సౌతాఫ్రికా సెకెండ్ ఇన్నింగ్స్కు 176 పరుగుల వద్ద తెర పడింది. ఫలితంగా దక్షిణాఫ్రికా టీమిండియా ముందు స్వల్ప లక్ష్యాన్ని (79) ఉంచింది. ఈ లక్ష్యాన్ని భారత్ ఆడుతూపాడుతూ ఛేదించి, రెండు మ్యాచ్ల సిరీస్ను 1-1తో సమంగా ముగించింది. కెరీర్లో చివరి టెస్ట్ ఆడుతున్న దక్షిణాఫ్రికా తాత్కాలిక కెప్టెన్ డీన్ ఎల్గర్ మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ ఇలా అన్నాడు. తొలి ఇన్నింగ్స్లో చావుదెబ్బ (55 పరుగులకు ఆలౌట్) తినడం మా విజయావకాశాలను దెబ్బతీసింది. మార్క్రమ్ చిరస్మరణీయ శతకంతో తిరిగి మమ్మల్ని మ్యాచ్లోకి తెచ్చాడు. భారత పేసర్లు పరిస్థితులను సద్వినియోగం చేసుకుని అద్భుతంగా బౌలింగ్ చేశారు. ఈ ఓటమిని జీర్జించుకోవడం కాస్త కఠినమే. 2-0 తేడాతో సిరీస్ను గెలిచుంటే బాగుండేది. అయినా పర్లేదు. గెలుపు కోసం మా వంతు పోరాటం చేశాం. మా కుర్రాళ్ల ప్రదర్శన పట్ల గర్వంగా ఉంది. సిరీస్ ఆధ్యాంతం పేసర్లు బౌలింగ్ చేసిన తీరు.. ఈ మ్యాచ్ సెకెండ్ ఇన్నింగ్స్లో మార్క్రమ్ బ్యాటింగ్ చేసిన తీరు అత్యద్భుతం. ఈ పిచ్పై ఫలితం అందరి ఊహలకు విరుద్దంగా వచ్చింది. దురదృష్టవశాత్తూ మేమే బాధితులమయ్యాము. ఈ ఫలితం ఓ గుణపాఠం లాంటిది. టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకోవడంపై స్పందిస్తూ.. రోహిత్ శర్మ సైతం అదే పని చేసేవాడు. అంతిమంగా చూస్తే తొలి రోజు తొలి సెషనే మా కొంపముంచిందని ఎల్గర్ అన్నాడు. -
కఠినమైన పిచ్పై అద్భుత శతకం.. మార్క్రమ్ ఖాతాలో అరుదైన రికార్డు
కేప్టౌన్ వేదికగా టీమిండియాతో జరుగుతున్న రెండో టెస్ట్లో సౌతాఫ్రికా ఆటగాడు ఎయిడెన్ మార్క్రమ్ అద్బుత శతకంతో (103 బంతుల్లో 106; 17 ఫోర్లు, 2 సిక్సర్లు) అలరించిన విషయం తెలిసిందే. మార్క్రమ్ ఈ సెంచరీని ఎంతో కఠినమైన పిచ్పై సాధించడం విశేషం. ప్రత్యర్ధి బ్యాటర్లతో పాటు సొంత బ్యాటర్లు సైతం ఒక్కో పరుగు చేసేందుకు ఇబ్బందిపడ్డ పిచ్పై మార్క్రమ్ చిరస్మరణీయ సెంచరీ సాధించి ఔరా అనిపించాడు. పేసర్లకు స్వర్గధామంగా ఉన్న పిచ్పై సెంచరీ చేయడమే అద్భుతమనుకుంటే మార్క్రమ్ ఈ సెంచరీని కాస్త సౌతాఫ్రికా తరఫున టెస్ట్ల్లో అత్యంత వేగవంతమైన ఆరో సెంచరీగా (99 బంతుల్లో) మలిచాడు. అలాగే మార్క్రమ్ కేప్టౌన్లో సెంచరీ చేసిన తొలి ప్రొటిస్ బ్యాటర్గానూ రికార్డుల్లోకెక్కాడు. ఈ రికార్డులతో పాటు మార్క్రమ్ మరో రికార్డును సైతం తన ఖాతాలో వేసుకున్నాడు. సౌతాఫ్రికా తరఫున ఓ పూర్తయిన టెస్ట్ ఇన్నింగ్స్లో అత్యధిక శాతం (60.22) పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. ఈ ఇన్నింగ్స్లో (సెకెండ్) సౌతాఫ్రికా 176 పరుగులు చేయగా.. మార్క్రమ్ ఒక్కడే 103 పరుగులు చేసి రికార్డు నెలకొల్పాడు. ఓవరాల్గా ఓ పూర్తయిన టెస్ట్ ఇన్నింగ్స్లో అత్యధిక శాతం పరుగుల రికార్డు ఆస్ట్రేలియా ఆటగాడు చార్లెస్ బ్యానర్మ్యాన్ పేరిట ఉంది. 1877లో ఇంగ్లండ్తో జరిగిన టెస్ట్ ఇన్నింగ్స్లో అతను జట్టు స్కోర్లో 67.34 శాతం పరుగులు సాధించాడు. ఆ ఇన్నింగ్స్లో ఆసీస్ 245 పరుగులు చేయగా.. బ్యానర్మ్యాన్ ఒక్కడే 165 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఈ విభాగంలో ఆసీస్ ఆటగాడు మైఖేల్ స్లేటర్ (66.84), టీమిండియా సొగసరి వీవీఎస్ లక్ష్మణ్ (63.98) రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు. ఇదిలా ఉంటే, మార్క్రమ్ సెంచరీతో చెలరేగడంతో సౌతాఫ్రికా సెకెండ్ ఇన్నింగ్స్ 176 పరుగుల వద్ద ముగిసింది. టీమిండియా పేసు గుర్రం బుమ్రా ఆరు వికెట్లతో సౌతాఫ్రికా పతనాన్ని శాశించాడు. ముకేశ్ 2, సిరాజ్, ప్రసిద్ద్ కృష్ణ తలో వికెట్ పడగొట్టారు. టీమిండియా టార్గెట్ 79 పరుగులుగా ఉంది. అంతకుముందు సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్లో 55 పరుగులు చేయగా.. భారత్ తొలి ఇన్నింగ్స్లో 153 పరుగులకు ఆలౌటైంది. -
రాహుల్ చేసిన తప్పు వల్ల.. మార్క్రమ్ సెంచరీ! తొలి సఫారీ బ్యాటర్గా..
Ind vs SA 2nd Test- Fastest Test hundreds for South Africa: సౌతాఫ్రికా- టీమిండియా మధ్య నిర్ణయాత్మక రెండో టెస్టు.. కేప్టౌన్లో తొలి రోజే ఏకంగా 23 వికెట్లు.. భారత పేసర్ల ధాటికి తొలుత 55 పరుగులకే ఆలౌట్ అయిన సౌతాఫ్రికా... ఆ తర్వాత టీమిండియా 153 పరుగుల వద్ద తొలి ఇన్నింగ్స్ ముగించి 36 పరుగుల ఆధిక్యం సంపాదించింది. ఆ తర్వాత మళ్లీ బ్యాటింగ్ మొదలుపెట్టిన ఆతిథ్య సౌతాఫ్రికా బుధవారం నాటి మొదటి రోజు ఆట ముగిసే సరికి 3 వికెట్ల నష్టానికి 63 పరుగులు చేసింది. అప్పటికి ఓపెనర్ ఐడెన్ మార్క్రమ్ 51 బంతులు ఎదుర్కొని 36 పరుగులు, ఐదో నంబర్ బ్యాటర్ డేవిడ్ బెడింగ్హామ్ ఆరు బంతులు ఆడి 7 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఇక తొలి రోజు ఆటలో టీమిండియా పేసర్లలో మహ్మద్ సిరాజ్ ఏకంగా ఆరు వికెట్లు దక్కించుకోగా.. జస్ప్రీత్ బుమ్రా, ముకేశ్ కుమార్ చెరో రెండు వికెట్లు తీశారు. ఇక టీమిండియా ఇన్నింగ్స్ సందర్భంగా సౌతాఫ్రికా ఫాస్ట్ బౌలర్లు రబడ, లుంగి ఎంగిడి, నండ్రే బర్గర్ తలా మూడు వికెట్లు పడగొట్టారు. అనంతరం మళ్లీ బౌలింగ్కు దిగిన టీమిండియా పేసర్లలో ముకేశ్ కుమార్ రెండు, బుమ్రా ఒక వికెట్ తీశారు. తద్వారా పేసర్లకు న్యూలాండ్స్ పిచ్ స్వర్గధామం అన్న విషయం మరోసారి నిరూపితమైంది. తొలి రోజే బ్యాటర్లుకు చుక్కలు చూపిస్తూ ఏకంగా 23 వికెట్ల ప్రదర్శనకు వేదికైన ఇలాంటి అత్యంత కఠినమైన పిచ్పై సెంచరీని ఊహించగలమా!? అది కూడా అత్యంత వేగవంతమైన శతకం!! ⭐⭐⭐⭐⭐ A 5-star performance from #JaspritBumrah in the 2nd innings, as he picks up his 4th witcket of the morning! Will his 9th Test 5-fer lead to a historic win for #TeamIndia? Tune in to #SAvIND 2nd Test LIVE NOW | Star Sports Network#Cricket pic.twitter.com/hjDyvSAJc3 — Star Sports (@StarSportsIndia) January 4, 2024 రెండో రోజు ఆట సందర్భంగా ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడు సౌతాఫ్రికా ఓపెనర్ ఐడెన్ మార్క్రమ్. గురువారం 63/3 ఓవర్నైట్ స్కోరుతో మొదలుపెట్టిన ప్రొటిస్ జట్టు.. బుమ్రా ధాటికి వరుసగా నాలుగు వికెట్లు కోల్పోయిన వేళ మార్క్రమ్ పట్టుదలగా క్రీజులో నిలబడ్డాడు. రాహుల్ జారవిడిచిన క్యాచ్ వల్ల సెంచరీ భారత పేసర్లకు కొరకరాని కొయ్యగా మారిన అతడు 73 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఉన్న సమయంలో.. బుమ్రా బౌలింగ్లో వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ క్యాచ్ మిస్ చేయడంతో లైఫ్ పొందాడు. ఈ క్రమంలో 99 బంతుల్లోనే సెంచరీ మార్కు అందుకుని మార్క్రమ్ చరిత్రకెక్కాడు. కేప్టౌన్ గడ్డపై తొలి సఫారీ బ్యాటర్గా మార్క్రమ్ రికార్డు సౌతాఫ్రికా తరఫున టెస్టుల్లో అత్యంత వేగంగా శతకం బాదిన ఆరో బ్యాటర్గా మార్క్రమ్ నిలిచాడు. అదే విధంగా కేప్టౌన్లో ఈ ఘనత సాధించిన తొలి ప్రొటిస్ బ్యాటర్గా రికార్డు సృష్టించాడు. సౌతాఫ్రికా తరఫున అత్యంత వేగంగా సెంచరీలు చేసింది వీరే ►ఏబీ డివిలియర్స్(75 బంతుల్లో)- ఇండియా మీద- 2010 సెంచూరియన్ మ్యాచ్లో.. ►హషీం ఆమ్లా(87 బంతుల్లో)- ఆస్ట్రేలియా మీద- 2012 పెర్త్ మ్యాచ్లో.. ►డెనిస్ లిండ్సే(95 బంతుల్లో)- ఆస్ట్రేలియా మీద- 1966 జొహన్నస్బర్గ్ మ్యాచ్లో ►జాంటీ రోడ్స్(95 బంతుల్లో)- వెస్టిండీస్ మీద- 1999 సెంచూరియన్ మ్యాచ్లో ►షాన్ పొలాక్(95 బంతుల్లో)- శ్రీలంక మీద- 2001 సెంచూరియన్ మ్యాచ్లో ►ఐడెన్ మార్క్రమ్(99 బంతుల్లో)- ఇండియా మీద- 2024 కేప్టౌన్ మ్యాచ్లో.. ఇక మార్క్రమ్ 106 పరుగుల స్కోరు వద్ద ఉన్న సమయంలో సిరాజ్ బౌలింగ్లో రోహిత్ శర్మకు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. ఆ తరువాత కగిసో రబడ(2), లుంగి ఎంగిడి(8) అవుట్ కావడంతో సౌతాఫ్రికా 176 పరుగుల వద్ద రెండో ఇన్నింగ్స్ ముగించి 78 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. ఈ మ్యాచ్లో టీమిండియా గెలవాలంటే 79 పరుగులు చేయాలి. రెండో రోజు ఆటలో బుమ్రా ఆరు వికెట్లు దక్కించుకోవడం విశేషం. KL Rahul dropped a regulation catch of Aiden Markram (73) #KLRahul #INDvsSA #SAvsIND pic.twitter.com/V0ACuF5puD — Outofaukaat (@outofaukaat) January 4, 2024 -
Ind vs SA: నిన్న సిరాజ్.. నేడు బుమ్రా.. ఉతికి ‘ఆరే’శారు
సౌతాఫ్రికా- టీమిండియా మధ్య రెండో టెస్టు రెండో రోజు ఆట మొదలైంది. కేప్టౌన్ వేదికగా 63/3(17) ఓవర్నైట్ స్కోర్తో రెండో రోజు ఆటను ప్రారంభించిన ప్రొటిస్ జట్టుకు భారత పేసర్ జస్ప్రీత్ బుమ్రా చుక్కలు చూపిస్తున్నాడు. ఈ స్పీడ్స్టర్ దాటికి సౌతాఫ్రికా మొదటి సెషన్లోనే నాలుగు వికెట్లు కోల్పోయింది. గురువారం నాటి ఆటలో భాగంగా తొలి ఓవర్లోనే డేవిడ్ బెడింగ్హామ్ను పెవిలియన్కు పంపాడు బుమ్రా. 17.6వ ఓవర్ వద్ద 11 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఉన్న సమయంలో బెడింగ్హామ్ రాహుల్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఆ మరుసటి నాలుగో ఓవర్లో బుమ్రా మరోసారి తన బౌలింగ్ పదును రుచి చూపించాడు. 21.1 ఓవర్ వద్ద కైలీ వెరెనె(9) వికెట్ పడగొట్టాడు. ఆ తర్వాత మళ్లీ 23.5వ ఓవర్ వద్ద మార్కో జాన్సెన్ను అద్భుత రీతిలో బౌల్డ్ చేశాడు బుమ్రా. తద్వారా రెండో రోజు తొలి సెషన్లోనే మూడో వికెట్ కూడా దక్కించుకున్నాడు. ఆ తర్వాత కేశవ్ మహరాజ్ను పెవిలియన్కు పంపి నాలుగో వికెట్ తన ఖాతాలో జమ చేసుకున్నాడు. ఇక మొదటి రోజు ఆటలో భాగంగా బుమ్రా ట్రిస్టన్ స్టబ్స్ను అవుట్ చేసిన విషయం తెలిసిందే. దీంతో సౌతాఫ్రికా రెండో ఇన్నింగ్స్లో బుమ్రా ఇప్పటికే ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేయడం విశేషం. ఇదిలా ఉంటే.. బుమ్రా ధాటికి 117 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయిన సౌతాఫ్రికా.. 176 పరుగుల వద్ద ఆలౌట్ అయింది. సెంచరీ హీరో ఐడెన్ మార్క్రమ్ వికెట్ను మహ్మద్ సిరాజ్ దక్కించుకోగా.. ప్రసిద్ కృష్ణ ఒక వికెట్ తీశాడు. ఆఖర్లో బుమ్రా తన ఆరో వికెట్గా లుంగి ఎంగిడిని పెవిలియన్కు పంపి సౌతాఫ్రికా ఇన్నింగ్స్కు ముగింపు పలికాడు. ఇక సౌతాఫ్రికాను తొలి ఇన్నింగ్స్లో 55 పరుగులకే ఆలౌట్ చేయడంలో సిరాజ్ ఆరు వికెట్లతో కీలక పాత్ర పోషించగా.. రెండో ఇన్నింగ్స్లో బుమ్రా ఆరేయడం(ఆరు వికెట్లు తీయడం) విశేషం. Ugly shot, handy wicket!#JaspritBumrah adds to his tally of wickets, getting his 2️⃣nd scalp of the morning.#SouthAfrica 5️⃣ down and still trailing. Tune in to #SAvIND 2nd Test LIVE NOW | Star Sports Network#Cricket pic.twitter.com/xdVMC5Bit3 — Star Sports (@StarSportsIndia) January 4, 2024 -
సౌతాఫ్రికాను చిత్తు చేసిన టీమిండియా.. సిరీస్ కైవసం
సౌతాఫ్రికాను చిత్తు చేసిన టీమిండియా.. సిరీస్ కైవసం నిర్ణయాత్మక మూడో వన్డేలో టీమిండియా సౌతాఫ్రికాను చిత్తు చేసి 2-1 తేడాతో సిరీస్ను కైవసం చేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. సంజూ శాంసన్ సెంచరీతో (108) చెలరేగడంతో 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 296 పరుగులు చేయగా.. ఛేదనలో సౌతాఫ్రికా 45.5 ఓవర్లలో 218 పరుగులకు ఆలౌటై 78 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. అర్ష్దీప్ సింగ్ 4 వికెట్లతో చెలరేగగా.. సుందర్, ఆవేశ్ ఖాన్ చెరో 2 వికెట్లు, అక్షర్ పటేల్, ముకేశ్ కుమార్ తలో వికెట్ దక్కించుకున్నారు. ఆరో వికెట్ కోల్పోయిన సౌతాఫ్రికా 177 పరుగుల వద్ద (33.2వ ఓవర్) సౌతాఫ్రికా ఆరో వికెట్ కోల్పోయింది. సుందర్ బౌలింగ్లో రాహుల్కు క్యాచ్ ఇచ్చి ముల్దర్ (1) ఔటయ్యాడు. ఐదో వికెట్ కోల్పోయిన సౌతాఫ్రికా 174 పరుగుల వద్ద సౌతాఫ్రికా ఐదో వికెట్ కోల్పోయింది. ఆవేశ్ ఖాన్ బౌలింగ్లో సాయి సుదర్శన్కు క్యాచ్ ఇచ్చి క్లాసెన్ (21) ఔటయ్యాడు. నాలుగో వికెట్ కోల్పోయిన సౌతాఫ్రికా 161 పరుగుల వద్ద (29.4వ ఓవర్) సౌతాఫ్రికా నాలుగో వికెట్ కోల్పోయింది. అర్షదీప్ బౌలింగ్లో జార్జీ (81) ఔటయ్యాడు. మూడో వికెట్ కోల్పోయిన సౌతాఫ్రికా 141 పరుగుల వద్ద (25.5వ ఓవర్) సౌతాఫ్రికా మూడో వికెట్ కోల్పోయింది. సుందర్ బౌలింగ్లో మార్క్రమ్ (36) ఔటయ్యాడు. 22 ఓవర్ల తర్వాత సౌతాఫ్రికా స్కోర్ 112/2 ఇన్నింగ్స్ ఆరంభంలో కాస్త తడబడిన సౌతాఫ్రికా ఆ తర్వాత నెమ్మదిగా లక్ష్యం దిశగా సాగుతుంది. జార్జీ (64) అర్ధసెంచరీ చేసి ఉత్సాహంగా కనిపిస్తున్నాడు. జార్జీకు జతగా మార్క్రమ్ (19) క్రీజ్లో ఉన్నాడు. 22 ఓవర్ల తర్వాత సౌతాఫ్రికా స్కోర్ 112/2గా ఉంది. రెండో వికెట్ కోల్పోయిన సౌతాఫ్రికా 76 పరుగుల వద్ద (14.4 ఓవర్లో) సౌతాఫ్రికా రెండో వికెట్ కోల్పోయింది. అక్షర్ బౌలింగ్లో డస్సెన్ (2) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. టార్గెట్ 297.. తొలి వికెట్ కోల్పోయిన సౌతాఫ్రికా 297 పరుగుల లక్ష్య ఛేదనలో సౌతాఫ్రికా 59 పరుగుల వద్ద (8.2వ ఓవర్) తొలి వికెట్ కోల్పోయింది. అర్ష్దీప్ బౌలింగ్లో రీజా హెండ్రిక్స్ (19) ఔటయ్యాడు. టార్గెట్ 297.. ధాటిగా ఆడుతున్న సౌతాఫ్రికా ఓపెనర్లు 297 పరుగుల లక్ష్య ఛేదనలో సౌతాఫ్రికా ఓపెనర్లు ధాటిగా ఆడుతున్నారు. 6 ఓవర్ల తర్వాత జట్టు స్కోర్ 46/0గా ఉంది. జార్జీ (29), రీజా హెండ్రిక్స్ (11) క్రీజ్లో ఉన్నారు. సంజూ శతకం.. ఆఖర్లో మెరిసిన రింకూ.. సౌతాఫ్రికా టార్గెట్ 297 నిర్ణయాత్మక మూడో వన్డేలో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 296 పరుగులు చేసింది. సంజూ శాంసన్ (108) తన కెరీర్లో తొలి శతకంతో టీమిండియా ఈ స్థాయి స్కోర్ చేయడానికి పునాది వేయగా.. ఆఖర్లో రింకూ సింగ్ (38) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. తిలక్ వర్మ (52) సైతం బాధ్యతాయుతమైన హాఫ్ సెంచరీ సాధించాడు. అక్షర్ ఔట్ కేవలం ఒక్క పరుగు చేసి అక్షర్ పటేల్ ఔటయ్యాడు. హెండ్రిక్స్ బౌలింగ్లో అక్షర్ వెనుదిరిగాడు. 47 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 259/6గా ఉంది. రింకూ (24), సుందర్ (2) క్రీజ్లో ఉన్నారు. ఐదో వికెట్ కోల్పోయిన టీమిండియా 108 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద సంజూ శాంసన్ ఔటయ్యాడు. విలియమ్స్ బౌలింగ్లో భారీ షాట్కు ప్రయత్నించి సంజూ పెవిలియన్కు చేరాడు. 46 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 249/5గా ఉంది. రింకూ (18), అక్షర్ పటేల్ (1) క్రీజ్లో ఉన్నారు. శతక్కొట్టిన సంజూ టీమిండియా వికెట్కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ తన అంతర్జాతీయ కెరీర్లో ఎట్టకేలకు మూడంకెల స్కోర్ను సాధించాడు. సౌతాఫ్రికాతో ఇవాళ జరుగుతున్న మూడో వన్డేలో సంజూ 110 బంతుల్లో సెంచరీ మార్కును చేరుకున్నాడు. అంతర్జాతీయ స్థాయిలో సంజూకు ఇది తొలి సెంచరీ. సంజూ శతకంలో 6 ఫోర్లు, 2 సిక్సర్లు ఉన్నాయి. కఠినమైన పిచ్పై జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు సంజూ అత్యంత కీలకమై ఇన్నింగ్స్ ఆడాడు. 44 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 235/4గా ఉంది. సంజూకు జతగా రింకూ (14) క్రీజ్లో ఉన్నాడు. నాలుగో వికెట్ కోల్పోయిన టీమిండియా తిలక్ వర్మ (52) హాఫ్ సెంచరీ పూర్తయిన వెంటనే ఔటయ్యాడు. ఆది కేశవ్ మహారాజ్ బౌలింగ్లో ఇబ్బంది పడ్డ తిలక్ ఆఖరికి తిలక్ హాఫ్ సెంచరీ పూర్తయ్యాక అతని బౌలింగ్లోనే ఔటయ్యాడు. 41.2 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 217/4గా ఉంది. సంజూ (96) జతగా రింకూ సింగ్ బరిలోకి దిగాడు. హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న తిలక్ ఆరంభంలో చాలా నిదానంగా ఆడిన తిలక్ వర్మ ఇన్నింగ్స్ కొనసాగే కొద్ది వేగం పెంచాడు. తిలక్ వన్డేల్లో తన తొలి హాఫ్ సెంచరీని 75 బంతుల్లో పూర్తి చేశాడు. మరో ఎండ్లో సంజూ శాంసన్ (95) శతకానికి చేరువయ్యాడు. 41 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 216/3గా ఉంది. 37 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 178/3 37 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 178/3గా ఉంది. సంజూ శాంసన్ (71), తిలక్ వర్మ (39) క్రీజ్లో ఉన్నారు. హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న సంజూ చాలా రోజుల తర్వాత సంజూ శాంసన్ అంతర్జాతీయ వన్డేల్లో హాఫ్ సెంచరీ చేశాడు. ఈ మ్యాచ్లో అతను 66 బంతుల్లో 4 ఫోర్ల సాయంతో ఈ ఫీట్ను సాధించాడు. సంజూకు జతగా తిలక్ వర్మ (8) క్రీజ్లో ఉన్నాడు. 28 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 121/3గా ఉంది. మూడో వికెట్ కోల్పోయిన టీమిండియా 101 పరుగుల వద్ద (18.5వ ఓవర్) టీమిండియా మూడో వికెట్ కోల్పోయింది. ముల్దర్ బౌలింగ్లో క్లాసెన్కు క్యాచ్ ఇచ్చి రాహుల్ (21) ఔటయ్యాడు. శాంసన్ (38), తిలక్ క్రీజ్లో ఉన్నారు. ఆచితూచి ఆడుతున్న శాంసన్, రాహుల్ 49 పరుగులకే 2 వికెట్లు కోల్పోవడంతో టీమిండియా ఆటగాళ్లు సంజూ శాంసన్ (33), కేఎల్ రాహుల్ (20) ఆచితూచి ఆడుతున్నారు. 18 ఓవర్ల తర్వాత జట్టు స్కోర్ 95/2గా ఉంది. 12 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 68/2 12 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 68/2గా ఉంది. సంజూ శాంసన్ (19), కేఎల్ రాహుల్ (7) క్రీజ్లో ఉన్నారు. రెండో వికెట్ కోల్పోయిన టీమిండియా 49 పరుగుల వద్ద టీమిండియా రెండో వికెట్ కోల్పోయింది. 10 పరుగులు చేసి సాయి సుదర్శన్ ఔటయ్యాడు. హెండ్రిక్స్ బౌలింగ్లో సుదర్శన్ ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. 8 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 50/2గా ఉంది. సంజూ శాంసన్ (9), కేఎల్ రాహుల్ (1) క్రీజ్లో ఉన్నారు. తొలి వికెట్ కోల్పోయిన టీమిండియా ఇన్నింగ్స్ ఐదవ ఓవర్లో సిక్సర్, బౌండరీ బాదిన అనంతరం నండ్రే బర్గర్ బౌలింగ్లో రజత్ పాటిదార్ (22) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 4.4 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 34/1గా ఉంది. సాయి సుదర్శన్ (9), సంజూ శాంసన్ క్రీజ్లో ఉన్నారు. 3 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 20/0 తొలుత బ్యాటింగ్కు దిగిన టీమిండియా ఆచితూచి ఆడుతుంది. ఓపెనర్ల సాయి సుదర్శన్ (5), రజత్ పాటిదార్ (12) నెమ్మదిగా ఆడుతున్నారు. 3 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 20/0గా ఉంది. బ్యాటింగ్కు దిగిన టీమిండియా పార్ల్ వేదికగా జరుగుతున్న నిర్ణయాత్మక మూడో వన్డేలో టీమిండియా టాస్ ఓడి సౌతాఫ్రికా ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్కు దిగింది. ఈ మ్యాచ్లో సౌతాఫ్రికా రెండో వన్డేలో బరిలోకి దిగిన జట్టునే కొనసాగిస్తుండగా.. టీమిండియా రెండు మార్పులు చేసింది. గాయం కారణంగా రుతురాజ్ ఈ మ్యాచ్ నుంచి తప్పుకోగా.. కుల్దీప్ యాదవ్కు విశ్రాంతినిచ్చారు. వీరి స్థానాల్లో రజత్ పాటిదార్, వాషింగ్టన్ సుందర్ బరిలోకి దిగనున్నారు. తుది జట్లు: భారత్: సాయి సుదర్శన్, రజత్ పాటిదార్, తిలక్ వర్మ, కేఎల్ రాహుల్ (కెప్టెన్), రింకూ సింగ్, సంజు శాంసన్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, అర్ష్దీప్ సింగ్, అవేష్ ఖాన్, ముఖేష్ కుమార్ దక్షిణాఫ్రికా: టోనీ డి జోర్జి, రీజా హెండ్రిక్స్, రాస్సీ వాన్ డెర్ డస్సెన్, ఎయిడెన్ మార్క్రమ్ (కెప్టెన్), హెన్రిచ్ క్లాసెన్ (వికెట్ కీపర్), డేవిడ్ మిల్లర్, వియాన్ ముల్డర్, కేశవ్ మహరాజ్, నండ్రే బర్గర్, బ్యూరాన్ హెండ్రిక్స్, లిజాడ్ విలియమ్స్ -
Ind vs SA: టాస్ గెలిచిన సౌతాఫ్రికా.. రుతు అవుట్.. రజత్ అరంగేట్రం
Ind vs SA 3rd ODI- Rajat Patidar Makes His Debut: సౌతాఫ్రికా- టీమిండియా మధ్య నిర్ణయాత్మక మూడో వన్డే పర్ల్ వేదికగా గురువారం మొదలుకానుంది. ఇందులో భాగంగా ఆతిథ్య సౌతాఫ్రికా టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. రెండో మ్యాచ్లో ఆడిన జట్టుతోనే తాము బరిలోకి దిగుతున్నట్లుప్రొటిస్ సారథి ఐడెన్ మార్క్రమ్ తెలిపాడు. రజత్ పాటిదార్ అరంగేట్రం మరోవైపు.. తాము రెండు మార్పులతో మైదానంలో దిగనున్నట్లు తాత్కాలిక కెప్టెన్ కేఎల్ రాహుల్ వెల్లడించాడు. టీమిండియా తరఫున రజత్ పాటిదార్ అరంగేట్రం చేయనున్నాడన్న రాహుల్.. రుతురాజ్ గైక్వాడ్ వేలికి గాయమైన కారణంగా జట్టుకు దూరమైనట్లు తెలిపాడు. గెలిచి తీరాల్సిందే అదే విధంగా.. చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్కు విశ్రాంతినిచ్చి.. అతడి స్థానంలో వాషింగ్టన్ సుందర్ను తుదిజట్టుకి ఎంపిక చేసినట్లు రాహుల్ పేర్కొన్నాడు. కాగా సౌతాఫ్రికా పర్యటనలో భాగంగా భారత జట్టు మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ను 1-1తో సమం చేసింది. అయితే, మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ను సొంతం చేసుకోవాలంటే ఈ మ్యాచ్లో తప్పక గెలవాల్సిందే! తొలి వన్డేలో టీమిండియా గెలవగా.. రెండో మ్యాచ్లో సౌతాఫ్రికా ఘన విజయం సాధించింది. టీమిండియా- సౌతాఫ్రికా మూడో వన్డే తుదిజట్లు ఇవే: సౌతాఫ్రికా: రీజా హెండ్రిక్స్, టోనీ డి జోర్జీ, రాస్సీ వాన్ డెర్ డస్సెన్, ఐడెన్ మార్క్రమ్ (కెప్టెన్), హెన్రిచ్ క్లాసెన్(వికెట్ కీపర్), డేవిడ్ మిల్లర్, వియాన్ ముల్డర్, కేశవ్ మహారాజ్, నాండ్రే బర్గర్, లిజాడ్ విలియమ్స్, బ్యూరాన్ హెండ్రిక్స్. భారత్: సంజూ శాంసన్, సాయి సుదర్శన్, రజత్ పాటిదార్, తిలక్ వర్మ, కేఎల్ రాహుల్(కెప్టెన్/ వికెట్ కీపర్), రింకూ సింగ్, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, అర్ష్దీప్ సింగ్, అవేశ్ ఖాన్, ముఖేష్ కుమార్. A look at #TeamIndia's Playing XI for the third and final ODI 👌👌 Rajat Patidar is set to make his ODI debut 👏👏 Follow the Match ▶️ https://t.co/nSIIL6gzER#TeamIndia | #SAvIND pic.twitter.com/3qHkp6M32u — BCCI (@BCCI) December 21, 2023 -
సన్రైజర్స్ హైదరాబాద్ సంచలన నిర్ణయం.. !?
దుబాయ్ వేదికగా జరిగిన ఐపీఎల్-2024 మినీ వేలంలో సన్రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ వ్యూహత్మకంగా వ్యవహరించింది. వేలంలో ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్, వరల్డ్కప్ హీరో ట్రావిస్ హెడ్, శ్రీలంక స్టార్ ఆల్రౌండర్ వనిందు హసరంగాను ఎస్ఆర్హెచ్ సొంతం చేసుకుంది. వీరి ముగ్గురి రాకతో ఎస్ఆర్హెచ్ జట్టు ఇప్పుడు మరింత పటిష్టంగా కన్పిస్తోంది. అయితే ఐపీఎల్-2024 సీజన్కు ముందు ఎస్ఆర్హెచ్ యాజమాన్యం ఓ సంచలన నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. వేలంలో రూ.20.50 కోట్టు ఖర్చు పెట్టి కొనుగోలు చేసిన ప్యాట్ కమ్మిన్స్కు తమ జట్టు పగ్గాలు అప్పజెప్పాలని ఎస్ఆర్హెచ్ మేనెజ్మెంట్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కెప్టెన్గా ఉన్న ఐడైన్ మార్క్రమ్ను తప్పించాలని ఎస్ఆర్హెచ్ ఆలోచిస్తున్నట్లు సమాచారం. కెప్టెన్గా కమ్మిన్స్కు ఉన్న అనుభవం దృష్ట్యా సారథ్య మార్పు కోసం సన్రైజర్స్ యోచిస్తున్నట్లు పలు రిపోర్టులు పేర్కొంటున్నాయి. కాగా కమ్మిన్స్ సారథ్యంలోనే వన్డే ప్రపంచకప్ను, వరల్డ్టెస్టు ఛాంపియన్ షిప్ టైటిల్ను ఆసీస్ సొంతం చేసుకుంది. కాగా గత మూడు సీజన్ల నుంచి ఎస్ఆర్హెచ్ దారుణ ప్రదర్శన కనబరుస్తోంది. కెప్టెన్లు, కోచ్లను మార్చినప్పటికి ఫలితం మాత్రం శూన్యమే. కమ్మిన్స్, హెడ్ రాకతోనైనా ఎస్ఆర్హెచ్ తలరాత మారుతుందో లేదో వేచి చూడాలి. ఐపీఎల్ 2024 కోసం సన్రైజర్స్ జట్టు: అబ్దుల్ సమద్ బ్యాటర్ 4 కోట్లు రాహుల్ త్రిపాఠి బ్యాటర్ 8.5 కోట్లు ఎయిడెన్ మార్క్రమ్ బ్యాటర్ 2.6 కోట్లు (కెప్టెన్) గ్లెన్ ఫిలిప్స్ బ్యాటర్ 1.5 కోట్లు హెన్రిచ్ క్లాసెన్ బ్యాటర్ 5.25 కోట్లు మయాంక్ అగర్వాల్ బ్యాటర్ 8.25 కోట్లు ట్రావిస్ హెడ్ బ్యాటర్ 6.8 కోట్లు అన్మోల్ప్రీత్ సింగ్ బ్యాటర్ 20 లక్షలు ఉపేంద్ర యాదవ్ వికెట్ కీపర్ 25 లక్షలు షాబాజ్ అహ్మద్ ఆల్ రౌండర్ 2.4 కోట్లు నితీష్ కుమార్ రెడ్డి ఆల్ రౌండర్ 20 లక్షలు అభిషేక్ శర్మ ఆల్ రౌండర్ 6.5 కోట్లు మార్కో జాన్సెన్ ఆల్ రౌండర్ 4.2 కోట్లు వాషింగ్టన్ సుందర్ ఆల్ రౌండర్ 8.75 కోట్లు సన్వీర్ సింగ్ ఆల్ రౌండర్ 20 లక్షలు పాట్ కమిన్స్ బౌలర్ 20.5 కోట్లు భువనేశ్వర్ కుమార్ బౌలర్ 4.2 కోట్లు టి నటరాజన్ బౌలర్ 4 కోట్లు వనిందు హసరంగా బౌలర్ 1.5 కోట్లు మయాంక్ మార్కండే బౌలర్ 50 లక్షలు ఉమ్రాన్ మాలిక్ బౌలర్ 4 కోట్లు ఫజల్హాక్ ఫరూకీ బౌలర్ 50 లక్షలు జయదేవ్ ఉనద్కత్ బౌలర్ 1.6 కోట్లు ఆకాశ్ సింగ్ బౌలర్ 20 లక్షలు ఝటావేద్ సుబ్రమణ్యం బౌలర్ 20 లక్షలు -
శతక్కొట్టిన సౌతాఫ్రికా ఓపెనర్.. రెండో వన్డేలో టీమిండియా ఓటమి
శతక్కొట్టిన సౌతాఫ్రికా ఓపెనర్.. రెండో వన్డేలో టీమిండియా ఓటమి దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో వన్డేలో టీమిండియా 8 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. పోర్ట్ ఎలిజబెత్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 46.2 ఓవర్లలో 211 పరుగులకు ఆలౌట్ కాగా.. సౌతాఫ్రికా కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 42.3 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. భారత ఇన్నింగ్స్లో సాయి సుదర్శన్ (62), కేఎల్ రాహుల్ (56) అర్ధసెంచరీలతో రాణించగా.. సౌతాఫ్రికాను యువ ఓపెనర్ టోనీ జోర్జీ (119) అజేయమైన శతకంతో విజయతీరాలకు చేర్చాడు. ఈ సిరీస్లో తొలి వన్డేలో భారత్ గెలవగా.. రెండో వన్డేలో సౌతాఫ్రికా విజయం సాధించింది. నిర్ణయాత్మకమైన మూడో వన్డే డిసెంబర్ 21న జరుగనుంది. శతక్కొట్టిన టోనీ జోర్జీ దక్షిణాఫ్రికా యువ ఓపెనర్ టోనీ జోర్జీ 109 బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు. టోనీకి కెరీర్లో ఇది తొలి సెంచరీ. 37 ఓవర్ల తర్వాత సౌతాఫ్రికా స్కోర్ 187/1. ఎట్టకేలకు తొలి వికెట్ పడింది.. 212 పరుగుల లక్ష్య ఛేదనలో సౌతాఫ్రికా 130 పరుగుల వద్ద (27.5వ ఓవర్) తొలి వికెట్ కోల్పోయింది. అర్ష్దీప్ సింగ్ బౌలింగ్లో రీజా హెండ్రిక్స్ (52) ఔటయ్యాడు. టోనీ జోర్జీ (75), డస్సెన్ క్రీజ్లో ఉన్నారు. హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న జోర్జీ సౌతాఫ్రికా ఓపెనర్ టోనీ జోర్జీ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అతనికి జతగా మరో ఓపెనర్ రీజా హెండ్రిక్స్ 25 పరుగులతో క్రీజ్లో ఉన్నాడు. 18 ఓవర్ల తర్వాత సౌతాఫ్రికా స్కోర్ 77/0గా ఉంది. టార్గెట్ 212.. ఆచితూచి ఆడుతున్న సౌతాఫ్రికా 212 పరుగుల లక్ష్య ఛేదనలో సౌతాఫ్రికా ఆచితూచి ఆడుతుంది. 7 ఓవర్ల తర్వాత ఆ జట్టు స్కోర్ 29/0గా ఉంది. టోనీ డి జర్జీ (21), రీజా హెండ్రిక్స్ (7) క్రీజ్లో ఉన్నారు. 211 పరుగులకు ఆలౌటైన టీమిండియా తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 46.2 ఓవర్లలో 211 పరుగులకు ఆలౌటైంది. ఆవేశ్ ఖాన్ (9) ఆఖరి వికెట్గా వెనుదిరిగాడు. భారత ఇన్నింగ్స్లో సాయి సుదర్శన్ (62), కేఎల్ రాహుల్ (56) మాత్రమే అర్ధసెంచరీలతో రాణించారు. సఫారీ బౌలర్లలో నంబ్రే బర్గర్ 3, హెండ్రిక్స్, కేశవ్ మహారాజ్ చెరో 2, లిజాడ్ విలియమ్స్, ఎయిడెన్ మార్క్రమ్ తలో వికెట్ పడగొట్టారు. ఎనిమిదో వికెట్ కోల్పోయిన టీమిండియా 186 పరుగుల వద్ద టీమిండియా ఎనిమిదో వికెట్ కోల్పోయింది. మార్క్రమ్ బౌలింగ్లో అక్షర్ పటేల్ (7) ఔటయ్యాడు. పేక మేడలా కూలుతున్న టీమిండియా ఇన్నింగ్స్ ఆరంభంలో కాస్త మెరుగ్గా ఆడిన టీమిండియా, ఆతర్వాత వరుసగా వికెట్లు కోల్పోతుంది. 172 పరుగుల వద్ద భారత జట్టు ఏడో వికెట్ కోల్పోయింది. కేశవ్ మహారాజ్ బౌలింగ్లో కుల్దీప్ యాదవ్ (1) ఔటయ్యాడు. ఆరో వికెట్ కోల్పోయిన టీమిండియా 169 పరుగుల వద్ద టీమిండియా ఆరో వికెట్ కోల్పోయింది. కేశవ్ మహారాజ్ బౌలింగ్లో రింకూ సింగ్ (17) స్టంపౌటయ్యాడు. 167 పరుగులకే సగం వికెట్లు కోల్పోయిన టీమిండియా టీమిండియా 167 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. హాఫ్ సెంచరీ అనంతరం కేఎల్ రాహుల్ (56) ఔటయ్యాడు. నండ్రే బర్గర్ బౌలింగ్లో మిల్లర్కు క్యాచ్ ఇచ్చి రాహుల్ పెవిలియన్ బాట పట్టాడు. సంజూ శాంసన్ క్లీన్ బౌల్డ్ 136 పరుగుల వద్ద టీమిండియా నాలుగో వికెట్ కోల్పోయింది. హెండ్రిక్స్ బౌలింగ్లో సంజూ శాంసన్ (12) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. మూడో వికెట్ కోల్పోయిన టీమిండియా.. సాయి సుదర్శన్ ఔట్ 114 పరుగుల వద్ద టీమిండియా మూడో వికెట్ కోల్పోయింది. 62 పరుగులు చేసి సాయి సుదర్శన్ ఔటయ్యాడు. లిజాడ్ విలియమ్స్ బౌలింగ్లో క్లాసెన్కు క్యాచ్ ఇచ్చి సుదర్శన్ పెవిలియన్కు చేరాడు. హాఫ్ సెంచరీ పూర్తి చేసిన సాయి సుదర్శన్ టీమిండియా ఓపెనర్ సాయి సుదర్శన్ తన వన్డే కెరీర్లో వరుసగా రెండో హాఫ్ సెంచరీ సాధించాడు. సౌతాఫ్రికాతో సిరీస్లో భాగంగా జరిగిన తొలి వన్డేలో అజేయమైన అర్ధశతకం సాధించిన సుదర్శన్.. రెండో వన్డేలోనూ హాఫ్ సెంచరీ మార్కును దాటాడు. 20 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 84/2గా ఉంది. సుదర్శన్తో పాటు కేఎల్ రాహుల్ (15) క్రీజ్లో ఉన్నాడు. నత్త నడకన సాగుతున్న టీమిండియా బ్యాటింగ్ టీమిండియా బ్యాటింగ్ నత్త నడకను తలపిస్తుంది. 15 ఓవర్ల తర్వాత జట్టు స్కోర్ 54/2గా ఉంది. సాయి సుదర్శన్ (36), కేఎల్ రాహుల్ (1) క్రీజ్లో ఉన్నారు. రెండో వికెట్ కోల్పోయిన టీమిండియా.. 46 పరుగుల వద్ద టీమిండియా రెండో వికెట్ కోల్పోయింది. 10 పరుగులు చేసిన తిలక్ వర్మ.. బర్గర్ బౌలింగ్లో పెవిలియన్కు చేరాడు. క్రీజులోకి కెప్టెన్ రాహుల్ వచ్చాడు. రెండో బంతికే వికెట్ కోల్పోయిన టీమిండియా టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన టీమిండియా రెండో బంతికే వికెట్ కోల్పోయింది. నంబ్రే బర్గర్ బౌలింగ్లో తొలి బంతికి బౌండరీ బాదిన రుతురాజ్ ఆతర్వాతి బంతికే ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. రుతురాజ్ రివ్యూకి వెళ్లడంతో భారత్ ఓ రివ్యూ కోల్పోయింది. పోర్ట్ ఎలిజబెత్ వేదికగా టీమిండియాతో జరుగుతున్న రెండో వన్డేలో సౌతాఫ్రికా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ కోసం టీమిండియా ఒకటి, సౌతాఫ్రికా రెండు మార్పులు చేసింది. భారత్ తరఫున శ్రేయస్ అయ్యర్ స్థానాన్ని రింకూ సింగ్ భర్తీ చేశాడు. ఈ మ్యాచ్తో రింకూ వన్డే అరంగట్రేం చేయనున్నాడు. మరోవైపు సౌతాఫ్రికా రెండు మార్పులు చేసింది. ఆండిలే ఫెహ్లుక్వాయో, తబ్రేజ్ షంషి స్థానాల్లో బ్యూరాన్ హెండ్రిక్స్, లిజాడ్ విలియమ్స్ తుది జట్టులోకి వచ్చారు. తుది జట్లు: భారత్: సాయి సుదర్శన్, రుతురాజ్ గైక్వాడ్, తిలక్ వర్మ, కేఎల్ రాహుల్ (కెప్టెన్), రింకూ సింగ్, సంజు శాంసన్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, అర్ష్దీప్ సింగ్, అవేష్ ఖాన్, ముఖేష్ కుమార్ దక్షిణాఫ్రికా: టోనీ డి జోర్జి, రీజా హెండ్రిక్స్, రాస్సీ వాన్ డెర్ డస్సెన్, ఎయిడెన్ మార్క్రమ్ (కెప్టెన్), హెన్రిచ్ క్లాసెన్ (వికెట్ కీపర్), డేవిడ్ మిల్లర్, వియాన్ ముల్డర్, కేశవ్ మహరాజ్, నండ్రే బర్గర్, బ్యూరాన్ హెండ్రిక్స్, లిజాడ్ విలియమ్స్ -
ఛేదించగల లక్ష్యమే.. వాళ్లు బ్యాటింగ్ చేసినపుడు మాత్రం: మార్క్రమ్
South Africa vs India, 3rd T20I: టీమిండియా చేతిలో ఘోర ఓటమి తమను నిరాశకు గురిచేసిందని సౌతాఫ్రికా కెప్టెన్ ఎయిడెన్ మార్క్రమ్ అన్నాడు. స్థాయికి తగ్గట్లు రాణించి ఉంటే లక్ష్యాన్ని కచ్చితంగా ఛేదించేవాళ్లమేనని పేర్కొన్నాడు. కాగా మూడో టీ20లో భారత జట్టు సౌతాఫ్రికాను చిత్తుగా ఓడించిన విషయం తెలిసిందే. జొహన్నస్బర్గ్లోని వాండరర్స్ వేదికగా గురువారం నాటి మ్యాచ్లో టాస్ ఓడిన టీమిండియా తొలుత బ్యాటింగ్ చేసింది. ఓపెనర్ యశస్వి జైశ్వాల్(41 బంతుల్లో 60), కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్(56 బంతుల్లో 100) అద్భుతంగా రాణించారు. వీరిద్దరి హీరోచిత ఇన్నింగ్స్ కారణంగా.. నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 201 పరుగుల స్కోరు సాధించింది. ఈ క్రమంలో భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికాకు భారత బౌలర్లు చుక్కలు చూపించారు. పేసర్లు ముకేశ్ కుమార్, అర్ష్దీప్ ఒక్కో వికెట్ తీయగా.. స్పిన్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా రెండు వికెట్లు పడగొట్టాడు. అయితే, మరో స్పిన్నర్, చైనామన్ బౌలర్ కుల్దీప్ యాదవ్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. మొత్తంగా 2.5 ఓవర్లు బౌలింగ్ చేసిన ఈ బర్త్డే బాయ్ పదిహేడు పరుగులిచ్చి.. ఏకంగా ఐదు వికెట్లు కూల్చాడు. ఇలా భారత బౌలర్ల విజృంభణ కారణంగా ఆతిథ్య సౌతాఫ్రికా 13.5 ఓవర్లలో 95 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయింది. దీంతో ఏకంగా 106 పరుగుల తేడాతో భారీ పరాజయాన్ని చవిచూసింది. #KuldeepYadav spun a web around the South African batters, picking up 5️⃣ wickets for just 17 runs 🤯 Here's the best of his spell 🕸️ Tune in to South Africa v India 1st ODI, SUN, 17th DEC. Coverage starts at 12.30 PM#SAvIND #Cricket pic.twitter.com/pfUEaTWD3i — Star Sports (@StarSportsIndia) December 15, 2023 ఛేదించదగ్గ లక్ష్యమే ఇక రెండో టీ20లో ఓడినప్పటికీ.. నిర్ణయాత్మక ఆఖరి మ్యాచ్లో అద్భుతంగా రాణించిన సూర్యకుమార్ సేన సిరీస్ను సమం చేసి ట్రోఫీని పంచుకుంది. ఈ నేపథ్యంలో ప్రొటిస్ జట్టు సారథి ఎయిడెన్ మార్క్రమ్ మాట్లాడుతూ.. ‘‘ఇది మేము ఛేదించదగ్గ స్కోరే. టీమిండియా బ్యాటింగ్ చేసినపుడు కానీ పనిపూర్తి చేయలేకపోయాం. పూర్తిగా విఫలమయ్యాం. నిజానికి మేము ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో బ్యాటర్లు నలుమూలలా హిట్ చేయగల పరిస్థితి ఉంది. ఛేజింగ్లోనూ ఇలాగే ఉంటుందనుకున్నాం. ఇంకాస్త మెరుగ్గా ఆడాల్సింది. అయితే, ఈ సిరీస్ ద్వారా మాకు కొన్ని సానుకూలతలు కూడా లభించాయి. లోపాలు సరిచేసుకుని సరికొత్త ఉత్సాహంతో ముందుకు సాగుతాం’’అని పేర్కొన్నాడు. కాగా ఈ మ్యాచ్లో మార్క్రమ్ 14 బంతుల్లో 25 పరుగులు సాధించాడు. సూర్య ప్రతాపం ఇక సౌతాఫ్రికా ఇన్నింగ్స్లో డేవిడ్ మిల్లర్ 35 రన్స్తో టాప్ స్కోరర్గా నిలిచాడు. మరోవైపు.. సుడిగాలి శతకంతో చెలరేగిన టీమిండియా సారథి సూర్యకుమార్ యాదవ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్తో పాటు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు కూడా అందుకున్నాడు. చదవండి: మహ్మద్ సిరాజ్ బుల్లెట్ త్రో.. సౌతాఫ్రికా బ్యాటర్ ఫ్యూజ్లు ఔట్! -
స్కై విధ్వంసకర శతకం.. కుల్దీప్ మాయాజాలం.. టీమిండియా ఘన విజయం
స్కై విధ్వంసకర శతకం.. కుల్దీప్ మాయాజాలం.. టీమిండియా ఘన విజయం దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టీ20లో టీమిండియా 106 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఫలితంగా మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ 1-1తో డ్రాగా (తొలి టీ20 వర్షం కారణంగా రద్దైంది) ముగిసింది. ఈ మ్యాచ్లో తొలుత సూర్యకుమార్ విధ్వంసకర శతకంతో (56 బంతుల్లో 100; 7 ఫోర్లు, 8 సిక్సర్లు) విరుచుకుపడగా.. అనంతరం కుల్దీప్ ఐదు వికెట్ల ప్రదర్శనతో (2.5-0-17-5) మాయాజాలం చేసి టీమిండియాను గెలిపించారు. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా.. స్కై శతక్కొట్టడంతో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 201 పరుగులు స్కోర్ చేసింది. అనంతరం ఛేదనకు దిగిన సౌతాఫ్రికా కుల్దీప్ ధాటికి 13.5 ఓవర్లలో 95 పరుగులకే కుప్పకూలి ఓటమిపాలైంది. భారత బౌలర్లలో జడేజా 2, అర్షదీప్, ముకేశ్ తలో వికెట్ పడగొట్టగా.. సౌతాఫ్రికా ఇన్నింగ్స్లో మిల్లర్ (35) టాప్ స్కోరర్గా నిలిచాడు. ఏడో వికెట్ కోల్పోయిన సౌతాఫ్రికా 89 పరుగుల వద్ద సౌతాఫ్రికా ఏడో వికెట్ కోల్పోయింది. కుల్దీప్ బౌలింగ్లో కేశవ్ మహారాజ్ (0) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆరో వికెట్ కోల్పోయిన సౌతాఫ్రికా 82 పరుగుల వద్ద సౌతాఫ్రికా ఆరో వికెట్ కోల్పోయింది. జడేజా బౌలింగ్లో ఫెహ్లుక్వాయో (0) ఔటయ్యాడు. 75 పరుగులకే సగం వికెట్లు కోల్పోయిన సౌతాఫ్రికా 202 పరుగుల లక్ష్య ఛేదనలో సౌతాఫ్రికా 75 పరుగులకే సగం వికెట్లు కోల్పోయింది. కుల్దీప్ బౌలింగ్లో ఫెరియెరా (12) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. నాలుగో వికెట్ కోల్పోయిన సౌతాఫ్రికా జడేజా బౌలింగ్లో జైస్వాల్కు క్యాచ్ ఇచ్చి మార్క్రమ్ (25) ఔటయ్యాడు. 6.1 ఓవర్ల తర్వాత సౌతాఫ్రికా స్కోర్ 42/4గా ఉంది. మూడో వికెట్ కోల్పోయిన సౌతాఫ్రికా 42 పరుగుల వద్ద సౌతాఫ్రికా మూడో వికెట్ కోల్పోయింది. అర్షదీప్ బౌలింగ్లో క్లాసెన్ (5) క్యాచ్ ఔటయ్యాడు. 5.4 ఓవర్ల తర్వాత సౌతాఫ్రికా స్కోర్ 42/3గా ఉంది. మార్క్రమ్ (25), మిల్లర్ క్రీజ్లో ఉన్నారు. టార్గెట్ 202.. రెండో వికెట్ కోల్పోయిన సౌతాఫ్రికా సిరాజ్ అద్భుతమైన డైరెక్ట్ త్రోతో రీజా హెండ్రిక్స్ను (8) రనౌట్ చేశాడు. టార్గెట్ 202.. తొలి వికెట్ కోల్పోయిన సౌతాఫ్రికా ముకేశ్ కుమార్ వేసిన రెండో ఓవర్లో సౌతాఫ్రికా వికెట్ కోల్పోయింది. ముకేశ్ బౌలింగ్లో బ్రీట్జ్కీ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అంతకుముందు తొలి ఓవర్ను సిరాజ్ మెయిడిన్ చేశాడు. సూర్యకుమార్ సుడిగాలి శతకం.. టీమిండియా భారీ స్కోర్ సూర్యకుమార్ యాదవ్ సుడిగాలి శతకంతో (56 బంతుల్లో 100; 7 ఫోర్లు, 8 సిక్సర్లు) చెలరేగడంతో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడో టీ20లో టీమిండియా భారీ స్కోర్ చేసింది. స్కైకు యశస్వి జైస్వాల్ (60) అర్ధసెంచరీ తోడవ్వడంతో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 201 పరుగులు స్కోర్ చేసింది. ఆఖరి ఓవర్లో భారత్ మూడు వికెట్లు కోల్పోయింది. జడేజాను (4) అనవసరంగా రనౌట్ చేసిన జితేశ్ శర్మ (4) హిట్ వికెట్గా ఔటయ్యాడు. సూర్యకుమార్ ఊచకోత.. 55 బంతుల్లో శతకం టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ 55 బంతుల్లో 7 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో సెంచరీ పూర్తి చేశాడు. 19.1 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 194/4గా ఉంది. స్కైతో పాటు జితేశ్ శర్మ క్రీజ్లో ఉన్నాడు. సెంచరీకి చేరువైన స్కై హాఫ్ సెంచరీ తర్వాత పట్టపగ్గాలు లేకుండా రెచ్చిపోతున్న స్కై సెంచరీకి చేరువయ్యాడు. 50 బంతుల్లో 6 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో 92 పరుగులతో అజేయంగా నిలిచాడు. 17 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 173/3గా ఉంది. స్కైతో పాటు రింకూ (5) క్రీజ్లో ఉన్నాడు. మూడో వికెట్ కోల్పోయిన టీమిండియా.. జైస్వాల్ ఔట్ 141 పరుగుల వద్ద టీమిండియా మూడో వికెట్ కోల్పోయింది. షంషి బౌలింగ్లో యశస్వి జైస్వాల్ (60) ఔటయ్యాడు. 14 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 141/3గా ఉంది. సూర్యకుమార్ (65), రింకూ సింగ్ క్రీజ్లో ఉన్నారు. 12 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 108/2 12 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 108/2గా ఉంది. జైస్వాల్ (57), స్కై (35) ధాటిగా బ్యాటింగ్ చేస్తున్నారు. 2 వికెట్లు పడ్డా చెలరేగి ఆడుతున్న జైస్వాల్, స్కై మూడో ఓవర్లోనే రెండు వికెట్లు కోల్పోయినా టీమిండియా బ్యాటర్లు ఏమాత్రం తగ్గకుండా దూకుడుగా ఆడుతున్నారు. జైస్వాల్ (28), జ్కై (19) పోటాపోటీగా బౌండరీలు, సిక్సర్లు బాదుతూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టిస్తున్నారు. 6 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 62/2గా ఉంది. వరుస బంతుల్లో వికెట్లు కోల్పోయిన టీమిండియా 29 పరుగుల వద్ద (2.2 ఓవర్లు) టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. అతర్వాతి బంతికే టీమిండియా మరో వికెట్ కూడా కోల్పోయింది. కేశవ్ మహారాజ్ బౌలింగ్లో శుభ్మన్ గిల్ (12), తిలక్ వర్మ (0) వరుస బంతుల్లో ఔటయ్యారు. తొలి ఓవర్లోనే హ్యాట్రిక్ ఫోర్లు బాదిన గిల్ రెండో టీ20లో డకౌట్ అయిన శుభ్మన్ గిల్.. ఈ మ్యాచ్లో తొలి ఓవర్లోనే హ్యాట్రిక్ ఫోర్లతో విరుచుకుపడ్డాడు. అరంగేట్రం బౌలర్ నండ్రే బర్గర్ బౌలింగ్లో చివరి 3 బంతులను గిల్ బౌండరీలుగా మలిచాడు. జోహన్నెస్బర్గ్ వేదికగా టీమిండియాతో జరుగుతున్న కీలకమైన మూడో టీ20లో సౌతాఫ్రికా టాస్ గెలిచి తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ కోసం సౌతాఫ్రికా ఏకంగా మూడు మార్పులు చేయగా.. భారత్, రెండో మ్యాచ్లో బరిలోకి దిగిన జట్టునే యధాతథంగా కొనసాగిస్తుంది. ట్రిస్టన్ స్టబ్స్ స్థానంలో డొనొవన్ ఫెరియెరా.. మార్కో జాన్సెన్, గెరాల్డ్ కొయెట్జీ స్థానాల్లో కేశవ్ మహారాజ్, నండ్రే బర్గర్ జట్టులోకి వచ్చారు. టీమిండియా: యశస్వి జైస్వాల్, శుభ్మన్ గిల్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), రింకూ సింగ్, జితేశ్ శర్మ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, ముకేష్ కుమార్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, అర్ష్దీప్ సింగ్. సౌతాఫ్రికా: రీజా హెండ్రిక్స్, మాథ్యూ బ్రీట్జ్కే, ఎయిడెన్ మార్క్రమ్ (కెప్టెన్), హెన్రిచ్ క్లాసెన్, డొనొవన్ ఫెరియెరా, డేవిడ్ మిల్లర్, కేశవ్ మహారాజ్, నండ్రే బర్గర్, అండిల్ ఫెహ్లుక్వాయో, లిజాడ్ విలియమ్స్, తబ్రేజ్ షంసీ. -
Ind vs SA T20: సమం కోసం భారత్ సమరం
జొహన్నెస్బర్గ్: ఒకటి వాన ఖాతాలో... మరొకటి ఆతి థ్య ఖాతాలో పడిపోయాయి. ఇప్పుడు భారత్ ఖాతా తెరవాల్సిన సమయం వచ్చింది. దక్షిణాఫ్రికాతో ఆఖరి పోరులో టీమిండియా గెలిస్తేనే మూడు టి20ల సిరీస్ను 1–1తో సమం చేయగలదు. లేదంటే సిరీస్ చేజారుతుంది. ఈ నేపథ్యంలో ఆఖరి సమ రం యువ భారత్ సత్తాకు పరీక్ష పెడు తోంది. గురువారం జరిగే మ్యాచ్లో సూర్యకుమార్ సేన గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. నిజానికి గత మ్యాచ్లో భారత్ చేసిన స్కోరు తక్కు వేం కాదు. కానీ వాన ప్రతాపం, మంచ్ ప్రభావంతో బౌలర్లు కట్టు తప్పా రు. ఇదే అదనుగా దక్షిణాఫ్రికా బ్యాట ర్లు చెలరేగారు. ఇప్పుడు ‘సీన్’ అర్థమైన ‘సూర్య అండ్ కో’ తప్పకుండా సరైన ఎత్తుగడతోనే బరిలోకి దిగడం ఖాయం. ఇదే జరిగితే సిరీస్ చేతికి అందకపోయినా... చేజారడం మాత్రం జరగదు. ఓపెనర్లు చెలరేగితే... ఆస్ట్రేలియాతో సొంతగడ్డపై జరిగిన ఐదు టి20ల సిరీస్లో టాపార్డర్ కీలకపాత్ర పోషించింది. ఇక్కడ యశస్వి–శుబ్మన్ గిల్ జోడి డకౌట్లతో నిరాశపరిచింది. ఇది ఇన్నింగ్స్పై ప్రభావం చూపించింది. పొట్టి ఫార్మాట్లో పవర్ ప్లే, డెత్ ఓవర్లే స్కోరును ఒక్కసారిగా మార్చేస్తాయి. భారత్ విషయంలో అదే జరిగింది. తిలక్వర్మ ఉన్నంత సేపు ధాటిగా ఆడాడు. మ్యాచ్ మ్యాచ్కు రాటుదేలుతున్న రింకూ సింగ్పై అందరి దృష్టి పడింది. కచ్చితత్వంతో కూడిన భారీషాట్లు అతన్ని మరో మెట్టుపై నిలబెడుతున్నాయి. కెప్టెన్ సూర్య కుమార్ ఎలాగూ ఫామ్లోనే ఉన్నాడు. బ్యాటింగ్ ఆర్డర్పై పెద్దగా బెంగలేకపోయినా... బౌలింగ్ విభాగం తేలిపోవడమే జట్టు మేనేజ్మెంట్ను కలవర పెడుతోంది. అనుభవజు్ఞలైన రవీంద్ర జడేజా, సిరాజ్లు ప్రత్యర్థి బ్యాటర్లను కట్టడి చేయలేకపోగా...అర్ష్దీప్, ముకేశ్ విఫలమయ్యారు. కీలకమైన ఈ మ్యా చ్లో బౌన్సీ పిచ్ సహకారంతో భారత బౌలర్లు లైన్ అండ్ లెంత్కు కట్టుబడితే ఆశించిన ఫలితాల్ని అందుకోవచ్చు. సిరీస్పై కన్నేసిన సఫారీ రెండో మ్యాచ్ గెలిచి 1–0తో జోరుమీదున్న ఆతిథ్య దక్షిణాఫ్రికా ఇప్పుడు సిరీస్పై కన్నేసింది. ఆఖరి మ్యాచ్లోనూ భారత్ను కంగుతినిపించి 2–0తో సిరీస్ను వశం చేసుకోవాలనే లక్ష్యంతో మార్క్రమ్ సారథ్యంలోని సఫారీ బరిలోకి దిగుతోంది. రెండో మ్యాచ్లో ఓపెనర్ హెన్డ్రిక్స్, మార్క్రమ్ సుడిగాలి వేగం మిగతా బ్యాటర్లు కొట్టిన అడపాదడపా బౌండరీలతో కుదించిన లక్ష్యాన్ని దర్జాగా ఛేదించేలా చేసింది. అయితే రబడా, ఇన్గిడిలాంటి స్పీడ్స్టర్లు అందుబాటులో లేని సఫారీ బౌలింగ్ కూడా పేలవంగానే కనిపిస్తోంది. ఈ విభాగాన్ని మె రుగు పర్చుకుంటేనే సిరీస్ను చేజిక్కించుకుంటుంది. లేదంటే యువ భారత్ సిరీస్ సమం చేసుకుంటుంది. జట్లు (అంచనా) భారత్: సూర్యకుమార్ (కెప్టెన్ ), యశస్వి, శుబ్మన్, తిలక్వర్మ, రింకూ సింగ్, జితేశ్ శర్మ, జడేజా, అర్ష్దీప్ సింగ్, కుల్దీప్, సిరాజ్, ముకేశ్. దక్షిణాఫ్రికా: మార్క్రమ్ (కెప్టెన్ ), హెన్డ్రిక్స్, బ్రీట్కి, క్లాసెన్, మిల్లర్, స్టబ్స్, ఫెలుక్వాయో, జాన్సెన్, కొయెట్జి, లిజాడ్ విలియమ్స్, షమ్సీ. పిచ్–వాతావరణం వాండరర్స్ వికెట్ బ్యాటింగ్కు స్వర్గధామం. భారీ స్కోర్లు, మెరుపులకు లెక్కేలేదు. అయితే పేస్ బౌలర్లకు కూడా కాస్త అనుకూలించే పిచ్ ఇది. టాస్ నెగ్గిన జట్టు ఛేదనకే మొగ్గు చూపవచ్చు. గురువారం వర్ష సూచన అయితే ఉంది. కానీ మ్యాచ్ సమయానికల్లా అనుకూల వాతావరణం ఉంటుంది. -
Ind Vs SA: క్షమాపణలు చెప్పిన రింకూ సింగ్! వీడియో వైరల్
South Africa vs India, 2nd T20I- Rinku Singh: టీమిండియా తరఫున టీ20లలో అదరగొడుతూ తనదైన ముద్ర వేస్తున్నాడు యువ బ్యాటర్ రింకూ సింగ్. కీలక సమయంలో విలువైన ఇన్నింగ్స్ ఆడుతూ నయా ఫినిషర్గా నీరాజనాలు అందుకుంటున్నాడు. ఇటీవల ఆస్ట్రేలియాతో స్వదేశంలో టీ20 సిరీస్లో అద్భుత ప్రదర్శన కనబరిచిన ఈ యూపీ బ్యాటర్.. తాజాగా సౌతాఫ్రికా గడ్డ మీద కూడా సత్తా చాటాడు. రింకూ ధనాధన్ ఇన్నింగ్స్ ప్రొటిస్ జట్టుతో రెండో టీ20లో ఓపెనర్లు విఫలమైన వేళ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్(56)తో కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దాడు. కేవలం 39 బంతుల్లోనే 68 పరుగులతో అజేయంగా నిలిచాడు. అతడి ఇన్నింగ్స్లో 9 ఫోర్లు, 2 సిక్సర్లు ఉన్నాయి. అయితే, వర్షం కారణంగా సౌతాఫ్రికా ఇన్నింగ్స్ను 15 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్లో భారత్కు ఓటమి తప్పలేదు. ప్రొటిస్ ఓపెనర్ రీజా హెండ్రిక్స్ 27 బంతుల్లోనే 49 పరుగులతో చెలరేగగా.. కెప్టెన్ ఎయిడెన్ మార్క్రమ్ 30 పరుగులతో రాణించాడు. ఈ క్రమంలో డక్వర్త్ లూయీస్ పద్ధతి ప్రకారం సౌతాఫ్రికా ఐదు వికెట్ల తేడాతో టీమిండియాపై గెలుపొందింది. ఇదిలా ఉంటే.. పోర్ట్ ఎలిజబెత్ వేదికగా మంగళవారం జరిగిన ఈ మ్యాచ్లో రింకూ సింగ్ బాదిన సిక్సర్ కారణంగా మీడియా గ్లాస్ బాక్స్ బద్దలైన విషయం తెలిసిందే. సిక్సర్ దెబ్బకు అద్దం పగిలింది పందొమ్మిదవ ఓవర్లో మార్క్రమ్ బౌలింగ్లో రింకూ స్ట్రెయిట్ హిట్ కారణంగా సైట్స్క్రీన్ బ్రేక్ అయిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. సారీ చెప్పిన రింకూ.. సో క్యూట్ అంటున్న నెటిజన్లు ఇక ఈ విషయం గురించి మ్యాచ్ అనంతరం స్పందించిన రింకూ సింగ్.. స్టేడియం నిర్వాహకులకు క్షమాపణలు చెప్పడం విశేషం. ఈ మేరకు బీసీసీఐ విడుదల చేసిన వీడియోలో తన ప్రదర్శన గురించి మాట్లాడుతున్న సమయంలో.. ‘‘ఆ బంతిని సిక్సర్గా మలచాలని మాత్రమే భావించాను. నా షాట్ కారణంగా అద్దం పగిలిపోయిందని నాకు తెలియదు. ఆ విషయం గురించి ఇప్పుడే తెలిసింది. గ్లాస్ బ్రేక్ చేసినందుకు సారీ చెబుతున్నా’’ అని రింకూ సింగ్ పేర్కొన్నాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. ‘‘సో క్యూట్ రింకూ.. నీ ఆటతోనే కాదు అమాయకత్వపు, హుందాతనపు మాటలతోనూ మా మనసులు దోచుకున్నావు’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. Maiden international FIFTY 👌 Chat with captain @surya_14kumar 💬 ... and that glass-breaking SIX 😉@rinkusingh235 sums up his thoughts post the 2⃣nd #SAvIND T20I 🎥🔽 #TeamIndia pic.twitter.com/Ee8GY7eObW — BCCI (@BCCI) December 13, 2023 కాగా ఇప్పటి వరకు పలు మ్యాచ్లలో ధనాధన్ ఇన్నింగ్స్ ఆడినప్పటికీ రింకూ అంతర్జాతీయ క్రికెట్లో ఒక్కసారి కూడా యాభై పరుగుల మార్కు అందుకోలేకపోయాడు. అయితే, తాజా టీ20 సందర్భంగా కఠినమైన సఫారీ పిచ్లపై తన తొలి ఇంటర్నేషనల్ హాఫ్ సెంచరీ నమోదు చేయడం విశేషం. అంతా సూర్య భాయ్ వల్లే ఈ నేపథ్యంలో రింకూ మాట్లాడుతూ.. ‘‘మ్యాచ్ జరుగుతున్న సమయంలో సూర్య భాయ్ నాకు సూచనలు ఇచ్చారు. ఒత్తిడికి లోనుకాకుండా నీ సహజమైన ఆటనే ఆడమని చెప్పారు. తొందరపాటు తగదు.. భారీ షాట్ల కోసం కాస్త ఓపికగా ఎదురు చూడాలని చెప్పారు. నిజానికి ఆరంభంలో వికెట్ కాస్త కఠినంగా అనిపించింది. అయితే, కాసేపటి తర్వాత షాట్లు ఆడేందుకు వీలు కలిగింది’’ అని తెలిపాడు. కాగా సౌతాఫ్రికా పర్యటనలో భాగంగా మూడు మ్యాచ్ల సిరీస్లో తొలి టీ20 వర్షం కారణంగా రద్దు కాగా.. రెండో మ్యాచ్లో సూర్య సేనకు ఓటమి ఎదురైంది. ఇక నిర్ణయాత్మక మూడో టీ20 జొహన్నస్బర్గ్ వేదికగా గురువారం జరుగనుంది. #AidenMarkram brought himself on in the penultimate over, and #RinkuSingh made him pay with back-to-back maximums 🔥 Rinku has brought his A-game to South Africa! Tune-in to the 2nd #SAvIND T20I LIVE NOW | Star Sports Network#Cricket pic.twitter.com/HiibVjyuZH — Star Sports (@StarSportsIndia) December 12, 2023 చదవండి: Ind vs SA: అందుకే ఓడిపోయాం.. మాకు ఇదొక గుణపాఠం: సూర్యకుమార్ -
SA VS IND 2nd T20: భారత్పై సౌతాఫ్రికా విజయం
భారత్పై సౌతాఫ్రికా విజయం భారత్పై ఐదు వికెట్ల తేడాతో సౌతాఫ్రికా విజయం సాధించింది. సౌతాఫ్రికా స్కోరు 154-5 ఐదో వికెట్ కోల్పోయిన సౌతాఫ్రికా 139 పరుగుల వద్ద సౌతాఫ్రికా తమ ఐదో వికెట్ కోల్పోయింది. మిల్లర్ ఔటయ్యాడు. నాలుగవ వికెట్ కోల్పోయిన సౌతాఫ్రికా 108 పరుగుల వద్ద సౌతాఫ్రికా నాలుగవ వికెట్ కోల్పోయింది. హేఇన్రిచ్ క్లాసేన్ ఔటయ్యాడు. టార్గెట్ 152.. 22 బంతుల్లోనే 50 పరుగులు పూర్తి చేసిన సౌతాఫ్రికా 152 పరుగుల లక్ష్య ఛేదనలో సౌతాఫ్రికా 22 బంతుల్లోనే 50 పరుగులు పూర్తి చేసుకుంది. 4 ఓవర్ల తర్వాత ఆ జట్టు స్కోర్ 56/1గా ఉంది. మార్క్రమ్ (14), హెండ్రిక్స్ (21) క్రీజ్లో ఉన్నారు. తొలి వికెట్ కోల్పోయిన సౌతాఫ్రికా 42 పరుగుల వద్ద (2.5 ఓవర్) సౌతాఫ్రికా తొలి వికెట్ కోల్పోయింది. అనవసర పరుగుకు ప్రయత్నించి బ్రీట్జ్కీ (16) రనౌటయ్యాడు. టార్గెట్ 152.. 2 ఓవర్లలోనే 38 పరుగులు బాదిన సౌతాఫ్రికా 152 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన సౌతాఫ్రికా శరవేగంగా పరుగులు సాధిస్తుంది. ఆ జట్టు 2 ఓవర్లలోనే 38 పరుగులు పిండుకుంది. హెండ్రిక్స్ (19), బ్రీట్జ్కీ (14) క్రీజ్లో ఉన్నారు. తగ్గిన వర్షం.. సౌతాఫ్రికా లక్ష్యం ఎంతంటే..? వర్షం తగ్గిన అనంతరం అంపైర్లు ఓవర్లను కుదించారు. భారత ఇన్నింగ్స్ను 19.3 ఓవర్ల వద్దనే ముగించిన అంపైర్లు.. డక్వర్త్ లూయిస్ పద్దతిన సౌతాఫ్రికా లక్ష్యాన్ని 15 ఓవర్లలో 152 పరుగులకు మార్చారు. వర్షం అంతరాయం భారత ఇన్నింగ్స్ మరో 3 బంతుల్లో ముగుస్తుందనగా వర్షం మొదలైంది. 19.3 ఓవర్ల తర్వాత భారత స్కోర్ 180/7గా ఉంది. గెరాల్డ్ కొయెట్జీ బౌలింగ్లో చివరి రెండు బంతుల్లో రవీంద్ర జడేజా (19), అర్షదీప్ సింగ్(0) ఔటయ్యారు. రింకూ సింగ్ (68)తో పాటు సిరాజ్ క్రీజ్లో ఉన్నాడు. రింకూ మెరుపు అర్ధశతకం రింకూ సింగ్ కేవలం 30 బంతుల్లో 9 ఫోర్ల సాయంతో తన కెరీర్లో తొలి అర్ధసెంచరీని పూర్తి చేసుకున్నాడు. దీనికి ముందు జితేశ్ శర్మ (1) మార్క్రమ్ బౌలింగ్లో స్టబ్స్కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. నాలుగో వికెట్ కోల్పోయిన టీమిండియా 125 పరుగుల వద్ద (13.5 ఓవర్లలో) టీమిండియా నాలుగో వికెట్ కోల్పోయింది. షంషి బౌలింగ్లో జన్సెన్కు క్యాచ్ ఇచ్చి సూర్యకుమార్ యాదవ్ (56) ఔటయ్యాడు. రింకూ (34), జితేశ్ శర్మ క్రీజ్లో ఉన్నారు. మూడో వికెట్ కోల్పోయిన టీమిండియా 55 పరుగుల వద్ద టీమిండియా మూడో వికెట్ కోల్పోయింది. కొయెట్జీ బౌలింగ్లో జన్సెన్కు క్యాచ్ ఇచ్చి తిలక్ వర్మ (29) ఔటయ్యాడు. ధాటిగా ఆడుతున్న తిలక్, స్కై ఓపెనర్లు గిల్, యశస్వి డకౌట్లు అయ్యాక తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ ధాటిగా ఆడుతున్నారు. వీరి ధాటికి భారత్ 5 ఓవర్లలోనే 50 పరుగుల మార్కు (53) దాటింది. స్కై (21), తిలక్ (28) క్రీజ్లో ఉన్నారు. రెండో వికెట్ కోల్పోయిన టీమిండియా.. గిల్ డకౌట్ 6 పరుగులకే టీమిండియా 2 వికెట్లు కోల్పోయింది. తొలి ఓవర్లో యశస్వి జైస్వాల్ డకౌట్ కాగా.. రెండో ఓవర్ ఆఖరి బంతికి శుభ్మన్ గిల్ కూడా సున్నా పరుగులకే ఔటయ్యాడు. లిజాడ్ విలియమ్స్ బౌలింగ్లో గిల్ ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. మూడో బంతికే వికెట్ కోల్పోయిన టీమిండియా టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన టీమిండియా మూడో బంతికే వికెట్ కోల్పోయింది. జన్సెన్ బౌలింగ్లో మిల్లర్కు క్యాచ్ ఇచ్చి యశస్వి జైస్వాల్ డకౌటయ్యాడు. సెయింట్ జార్జ్స్ పార్క్ వేదికగా టీమిండియాతో జరుగుతున్న రెండో టీ20లో సౌతాఫ్రికా టాస్ గెలిచి తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. స్వల్ప అనారోగ్యం కారణంగా రుతురాజ్ ఈ మ్యాచ్కు అందుబాటులో లేడని భారత కెప్టెన్ సూర్యకుమార్ ప్రకటించాడు. భారత జట్టులో శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్లకు కూడా అవకాశం దక్కలేదు. తిలక్ వర్మ, జితేశ్ శర్మ వీరి స్థానాల్లో జట్టులోకి వచ్చారు. టీమిండియా: యశస్వి జైస్వాల్, శుభ్మన్ గిల్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), రింకూ సింగ్, జితేశ్ శర్మ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, ముకేష్ కుమార్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, అర్ష్దీప్ సింగ్. సౌతాఫ్రికా: రీజా హెండ్రిక్స్, మాథ్యూ బ్రీట్జ్కే, ఎయిడెన్ మార్క్రమ్ (కెప్టెన్), హెన్రిచ్ క్లాసెన్, ట్రిస్టన్ స్టబ్స్, డేవిడ్ మిల్లర్, మార్కో జాన్సెన్, అండిల్ ఫెహ్లుక్వాయో, గెరాల్డ్ కొయెట్జీ, లిజాడ్ విలియమ్స్, తబ్రేజ్ షంసీ. -
వన్డే కెప్టెన్గా మార్క్రమ్
జొహన్నెస్బర్గ్: భారత్తో సొంతగడ్డపై మూడు ఫార్మాట్లలో జరిగే సిరీస్ల కోసం దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు తమ జట్లను ప్రకటించింది. వన్డే ప్రపంచకప్లో సఫారీ టీమ్కు సారథిగా వ్యవహరించిన తెంబా బవుమా, పేసర్ కగిసో రబాడలకు వన్డే, టి20 సిరీస్ల నుంచి విశ్రాంతి కలి్పంచింది. దాంతో ప్రస్తుతం టి20 టీమ్ కెప్టెన్గా ఉన్న ఎయిడెన్ మార్క్రమ్ వన్డే జట్టుకు కూడా నాయకత్వం వహిస్తాడు. తొలి రెండు టి20లకు మాత్రమే అందుబాటులో ఉండే కొయెట్జీ, జాన్సెన్, ఎన్గిడిలతో పాటు బవుమా, రబాడ టెస్టు సిరీస్ కోసం సన్నద్ధమయ్యేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సఫారీ బోర్డు వెల్లడించింది. డేవిడ్ బెడింగమ్, ట్రిస్టన్ స్టబ్స్, నాండ్ర్ బర్జర్కు తొలిసారి టెస్టు జట్టులో స్థానం లభించగా... కీపర్ కైల్ వెరీన్, పేసర్ ఎన్గిడి టెస్టుల్లో పునరాగమనం చేశారు. వరల్డ్ టెస్టు చాంపియన్షిప్లో దక్షిణాఫ్రికాకు ఇదే మొదటి సిరీస్ కానుంది. ఈ పర్యటనలో భాగంగా భారత్, దక్షిణాఫ్రికా మధ్య 3 టి20లు, 3 వన్డేలు, 2 టెస్టులు జరుగుతాయి. దక్షిణాఫ్రికా జట్లు: టి20: మార్క్రమ్ (కెప్టెన్), హెన్డ్రిక్స్, బ్రీజ్కే, స్టబ్స్, క్లాసెన్, మిల్లర్, ఫెరీరా, బర్జర్, జాన్సెన్, కొయెట్జీ, ఫెలుక్వాయో, కేశవ్ మహరాజ్, షమ్సీ, విలియమ్స్, బార్త్మన్, ఎన్గిడి. వన్డే: మార్క్రమ్ (కెప్టెన్), జోర్జి, హెన్డ్రిక్స్, వాన్డర్ డసెన్, వెరీన్, క్లాసెన్, మిల్లర్, బర్జర్, ముల్డర్, ఎంపొంగ్వానా, ఫెలుక్వాయో, కేశవ్ మహరాజ్, షమ్సీ, విలియమ్స్, బార్త్మన్. టెస్టు: బవుమా (కెప్టెన్), బెడింగమ్, బర్జర్, కొయెట్జీ, జోర్జి, ఎల్గర్, జాన్సెన్, కేశవ్ మహరాజ్, మార్క్రమ్, ముల్డర్, ఎన్గిడి, పీటర్సన్, రబాడ, స్టబ్స్, వెరీన్. -
భారత్తో సిరీస్కు దక్షిణాఫ్రికా జట్టు ప్రకటన.. కెప్టెన్కు షాక్
డిసెంబర్ 10 నుంచి వచ్చే ఏడాది జనవరి 7 వరకు భారత్తో జరిగే మూడు ఫార్మాట్ల సిరీస్ల కోసం క్రికెట్ సౌతాఫ్రికా ఇవాళ (డిసెంబర్ 4) జట్లను ప్రకటించింది. సౌతాఫ్రికా సెలెక్టర్లు పరిమిత ఓవర్ల జట్ల నుంచి రెగ్యులర్ కెప్టెన్ టెంబా బవుమా, స్టార్ పేసర్ కగిసో రబాడను తప్పించారు. వన్డే, టీ20 జట్లకు ఎయిడెన్ మార్క్రమ్ కెప్టెన్గా వ్యవహరించనున్నాడు. ఫ్రీడం సిరీస్గా నామకరణం చేయబడిన ఈ మల్టీ ఫార్మాట్ సిరీస్లో మూడు టీ20లు (కేఎఫ్సీ సిరీస్), మూడు వన్డేలు (బెట్వే సిరీస్), రెండు టెస్ట్ మ్యాచ్లు (బెట్వే సిరీస్) జరుగుతాయి. ఈ పర్యటనలో తొలుత టీ20 సిరీస్, ఆతర్వాత వన్డే, టెస్ట్ సిరీస్లు జరుగుతాయి. 🟢 SQUAD ANNOUNCEMENT 🟡 CSA has today named the Proteas squads for the all-format inbound tour against India from 10 Dec – 7 Jan 🇿🇦🇮🇳 Captain Temba Bavuma and Kagiso Rabada are amongst a group of players that have been omitted for the white-ball leg of the tour in order to… pic.twitter.com/myFE24QZaz — Proteas Men (@ProteasMenCSA) December 4, 2023 భారత్తో టీ20 సిరీస్కు దక్షిణాఫ్రికా జట్టు: ఎయిడెన్ మార్క్రమ్ (కెప్టెన్), ఒట్నీల్ బార్ట్మ్యాన్, మాథ్యూ బ్రీట్జ్కీ, నండ్రే బర్గర్, గెరాల్డ్ కొయెట్జీ, డొనొవన్ ఫెరియెరా, రీజా హెండ్రిక్స్, మార్కో జన్సెన్, హెన్రిచ్ క్లాసెన్, కేశవ్ మహారాజ్, డేవిడ్ మిల్లర్, లుంగి ఎంగిడి, అండీల్ ఫెహ్లుక్వాయో, తబ్రేజ్ షంషి, ట్రిస్టన్ స్టబ్స్, లిజాడ్ విలియమ్స్ భారత్తో వన్డే సిరీస్కు దక్షిణాఫ్రికా జట్టు: ఎయిడెన్ మార్క్రమ్ (కెప్టెన్), ఒట్నీల్ బార్ట్మ్యాన్, నండ్రే బర్గర్, టోనీ డి జోర్జీ, రీజా హెండ్రిక్స్, హెన్రిచ్ క్లాసెన్, కేశవ్ మహారాజ్, డేవిడ్ మిల్లర్, మిహ్లాలి పోంగ్వానా, వియాన్ ముల్దర్, అండీల్ ఫెహ్లుక్వాయో, తబ్రేజ్ షంషి, రస్సీ వాన్ డర్ డస్సెన్, కైల్ వెర్రిన్, లిజాడ్ విలియమ్స్ భారత్తో టెస్ట్ సిరీస్కు దక్షిణాఫ్రికా జట్టు: టెంబా బవుమా (కెప్టెన్), డేవిడ్ బెడింగ్హమ్, నండ్రే బర్గర్, గెరాల్డ్ కొయెట్జీ, టోనీ డి జోర్జీ, డీన్ ఎల్గర్, మార్కో జన్సెన్, కేశవ్ మహారాజ్, ఎయిడెన్ మార్క్రమ్, వియాన్ ముల్దర్, లుంగి ఎంగిడి, కీగన్ పీటర్సన్, కగిసో రబాడ, ట్రిస్టన్ స్టబ్స్, కైల్ వెర్రిన్ -
IPL 2024: 13 కోట్ల ఆటగాడిని వదిలేసిన సన్రైజర్స్.. మరో బౌలర్కు ఝలక్
ఐపీఎల్ 2024 సీజన్కు ముందు సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు 13 కోట్ల ఆటగాడు హ్యారీ బ్రూక్తో తెగదెంపులు చేసుకుంది. ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్ అతనితో పాటు మరో గుర్తింపు పొందిన బౌలర్ను కూడా వేలానికి వదిలేసింది. మొత్తంగా ఎస్ఆర్హెచ్ ఆరుగురు ఆటగాళ్లను రిలీజ్ చేసి, 19 మందిని కొనసాగించింది. సన్రైజర్స్ రిలీజ్ చేసిన ఆటగాళ్లు వీరే.. హ్యారీ బ్రూక్ ఆదిల్ రషీద్ సమర్థ్ వ్యాస్ కార్తీక్ త్యాగీ వివ్రాంత్ శర్మ అకీల్ హొసేన్ సన్రైజర్స్ కొనసాగించనున్న ఆటగాళ్లు.. ఎయిడెన్ మార్క్రమ్ (కెప్టెన్) అబ్దుల్ సమద్ రాహుల్ త్రిపాఠి గ్లెన్ ఫిలిప్స్ హెన్రిచ్ క్లాసెన్ మయాంక్ అగర్వాల్ అన్మోల్ప్రీత్ సింగ్ ఉపేంద్ర సింగ్ యాదవ్ నితీశ్ కుమార్ రెడ్డి షాబాజ్ అహ్మద్ (ఆర్సీబీ నుంచి ట్రేడింగ్) అభిషేక్ శర్మ మార్కో జన్సెన్ వాషింగ్టన్ సుందర్ సన్వీర్ సింగ్ భువనేశ్వర్ కుమార్ టి నటరాజన్ మయాంక్ మార్కండే ఉమ్రాన్ మాలిక్ ఫజల్ హక్ ఫారూకీ -
మాక్స్వెల్ విధ్వంసకర ఇన్నింగ్స్.. వరల్డ్కప్ చరిత్రలోనే ఫాస్టెస్ట్ సెంచరీ
WC 2023- #AUSvsNED- #GlennMaxwellFastestCentury: వన్డే వరల్డ్కప్-2023లో నెదర్లాండ్స్తో మ్యాచ్లో ఆస్ట్రేలియా ఆల్రౌండర్ గ్లెన్ మాక్స్వెల్ విధ్వంసకర ఇన్నింగ్స్తో అదరగొట్టాడు. ఢిల్లీలోని అరుణ్జైట్లీ మైదానంలో ఆకాశమే హద్దుగా చెలరేగుతూ ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపించాడు. డచ్ బౌలర్లను ఓ ఆటాడుకున్న మాక్సీ కేవలం 40 బంతుల్లోనే శతకం పూర్తి చేసుకున్నాడు. ఏకంగా 252.50 స్ట్రైక్రేటుతో 101 పరుగులు సాధించి వన్డే వరల్డ్కప్ చరిత్రలో ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేశాడు. ఈ క్రమంలో సౌతాఫ్రికా వైస్ కెప్టెన్ ఎయిడెన్ మార్కరమ్ పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టాడు. కాగా ప్రపంచకప్-2023లో ఢిల్లీలోనే మార్కరమ్ 49 బంతుల్లో శతకం సాధించిన విషయం తెలిసిందే. వరల్డ్కప్ చరిత్రలో వేగవంతమైన సెంచరీలు(ఎదుర్కొన్న బంతుల పరంగా) నమోదు చేసింది వీరే ►40 - గ్లెన్ మాక్స్వెల్ నెదర్లాండ్స్ మీద, ఢిల్లీలో-2023 ►49 - ఎయిడెన్ మార్కరమ్ శ్రీలంక మీద, ఢిల్లీలో- 2023 ►50 - కెవిన్ ఓబ్రెయిన్ ఇంగ్లండ్ మీద, బెంగళూరులో- 2011 ►51 -గ్లెన్ మాక్స్వెల్ శ్రీలంక మీద, సిడ్నీలో- 2015 ►52 - ఏబీ డివిలియర్స్ వెస్టిండీస్ మీద, సిడ్నీలో 2015 ఆస్ట్రేలియా భారీ స్కోరు: నెదర్లాండ్స్తో బుధవారం నాటి మ్యాచ్లో డేవిడ్ వార్నర్ 104 , స్టీవ్ స్మిత్ 71, మార్నస్ లబుషేన్ 62 పరుగులతో అదరగొట్టగా.. మాక్సీ సునామీ ఇన్నింగ్స్ కారణంగా ఆస్ట్రేలియా 399 పరుగుల భారీ స్కోరు చేసింది. పసికూన నెదర్లాండ్స్ ముందు కొండంత లక్ష్యాన్ని విధించింది. View this post on Instagram A post shared by ICC (@icc) View this post on Instagram A post shared by ICC (@icc) -
ఐపీఎల్ ఆడిన అనుభవం కలిసొచ్చింది.. అతడు మాత్రం అద్బుతం: సౌతాఫ్రికా కెప్టెన్
వన్డే ప్రపంచకప్-2023లో దక్షిణాఫ్రికా మరో అద్బుత విజయాన్ని అందుకుంది. ముంబై వేదికగా బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో 149 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికా గెలుపొందింది. తొలుత బ్యాటింగ్లో దుమ్మురేపిన ప్రోటీస్.. అనంతరం బౌలింగ్లో బంగ్లాకు చుక్కలు చూపించింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 382 పరుగులు చేసింది. ప్రోటీస్ బ్యాటర్లలో క్వింటన్ డికాక్ అద్భుతమైన శతకంతో చెలరేగగా.. హెన్రిస్ క్లాసెన్ మెరుపులు మెరిపించాడు. 140 బంతులు ఎదుర్కొన్న డికాక్.. 15 ఫోర్లు, 7 సిక్స్లతో 174 పరుగులు చేయగా.. క్లాసెన్ కేవలం 49 బంతుల్లో 2 ఫోర్లు, 8 సిక్స్లతో 90 పరుగులు చేశాడు. అనంతరం 383 పరగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ 233 పరుగులకు ఆలౌటైంది. బంగ్లా బ్యాటర్లలో మహ్మదుల్లా ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు. మహ్మదుల్లా 111 బంతుల్లో 111 పరుగులు చేశాడు. దక్షిణాఫ్రికా బౌలర్లలో గెరాల్డ్ కోయెట్జీ మూడు వికెట్లు సాధించగా.. జానెసన్, విలియమ్స్, రబాడ తలా రెండు వికెట్లు పడగొట్టారు. ఇక ఈ విజయంపై ప్రోటీస్ తాత్కాలిక సారథి ఐడెన్ మార్క్రామ్ స్పందించాడు. ఈ మ్యాచ్లో తమ జట్టు ఆల్రౌండ్ ప్రదర్శన పట్ల మార్క్రామ్ సంతోషం వ్యక్తం చేశాడు. "ఈ మెగా టోర్నీలో మరో విజయం సాధించడం ఆనందంగా ఉంది. మా బాయ్స్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచారు. మొదట బ్యాటింగ్లో, తర్వాత బౌలింగ్లో మేము పైచేయి సాధించాం. మాకు ఎటువంటి డెత్ బౌలింగ్ సమస్య లేదు. ఈ మ్యాచ్లో డెత్ ఓవర్లలో మా బౌలర్లు కొంచెం అదనంగా పరుగులు సమర్పించుకున్నారు. ఎందుకంటే అవతలి ఎండ్లో మహ్మదుల్లా క్రీజులో సెటిల్ అయివున్నాడు. అతడు అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. మా డెత్ బౌలింగ్ ప్రణాళికలను అమలు చేయడానికి అదే సరైన సమయమని భావించాడు. కానీ అతడు మా బౌలర్లపై కాస్త పైచేయి సాధించాడు. ఇక బ్యాటింగ్లో డికాక్ సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. అతడు మా జట్టులో చాలా కీలకం. అదే విధంగా క్లాసెన్ మరోసారి తన క్లాస్ను చూపించాడు. మాకు అద్భుతమైన ఫినిషింగ్ ఇచ్చాడు. మా బ్యాటింగ్ లైనప్ టాప్ 6లో ఉన్న ప్రతీ ఒక్కరూ సూపర్ ఫామ్లో ఉన్నారు. ప్రతీ ఒక్కరి రోల్ క్లియర్గా ఉంది. ఇక బావుమా ప్రస్తుతం కోలుకున్నాడు. అతడు పాకిస్తాన్తో జరిగే మా తదుపరి మ్యాచ్కు అందుబాటులోకి వచ్చే అవకాశముంది. కాగా ఐపీఎల్ ఆడిన అనుభవం కూడా మాకు బాగా కలిసొచ్చిందని" పోస్ట్మ్యాచ్ ప్రేజేంటేషన్లో మార్క్రామ్ పేర్కొన్నాడు. -
WC 2023: నెదర్లాండ్స్ చేతిలో చిత్తుగా ఓడిన సౌతాఫ్రికాకు మరో షాక్!
ICC ODI WC 2023: వన్డే వరల్డ్కప్-2023లో భాగంగా ఇంగ్లండ్తో మ్యాచ్ నేపథ్యంలో సౌతాఫ్రికాకు ఎదురుదెబ్బ తగిలింది. అనారోగ్యం కారణంగా కెప్టెన్ తెంబా బవుమా జట్టుకు దూరమయ్యాడు. అతడి స్థానంలో ఎయిడెన్ మార్కరమ్ సౌతాఫ్రికా కెప్టెన్సీ పగ్గాలు చేపట్టాడు. కాగా పటిష్ట ప్రొటిస్ జట్టు గత మ్యాచ్లో అనూహ్య రీతిలో నెదర్లాండ్స్ చేతిలో ఓటమిపాలైన విషయం తెలిసిందే. ధర్మశాలలో అక్టోబరు 17 వర్షం కారణంగా 43 ఓవర్లకు కుదించిన మ్యాచ్లో 38 పరుగుల తేడాతో ఓటమిని మూటగట్టుకుంది. ఈ క్రమంలో డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్తో శనివారం నాటి మ్యాచ్కు ముందు తెంబా బవుమా జట్టుకు దూరమయ్యాడు. రీజా హెండ్రిక్స్ అతడి స్థానంలో తుదిజట్టులో చోటు దక్కించుకున్నాడు. కాగా నెదర్లాండ్స్ చేతిలో ఓటమి తప్ప కెప్టెన్గా బవుమా మిగతా మ్యాచ్లలో విజయవంతమయ్యాడు. అయితే, బ్యాటర్గా మాత్రం పూర్తిగా విఫలమయ్యాడు. శ్రీలంక, ఆస్ట్రేలియా, నెదర్లాండ్స్ జట్లతో మ్యాచ్లలో వరుసగా 8, 35, 11 పరుగులు మాత్రమే సాధించాడు. ఈ క్రమంలో అనారోగ్యం కారణంగా జట్టుకు దూరమైన వన్డౌన్ బ్యాటర్ బవుమా స్థానంలో వచ్చిన హెండ్రిక్స్ ఏ మేరకు రాణిస్తాడో చూడాలి! ఇక ఇంగ్లండ్తో ముంబై మ్యాచ్లో టాస్ ఓడిన సౌతాఫ్రికా తొలుత బ్యాటింగ్కు దిగింది. చదవండి: ఇలాంటి బ్యాటర్ను చూడలేదు.. మొన్నటి దాకా మావాళ్లు తోపులు అన్నారు.. ఇప్పుడు: రమీజ్ రాజా View this post on Instagram A post shared by ICC (@icc) -
WC 2023: 4,4,4,2,6! ఒకే ఓవర్లో 26 రన్స్.. పతిరణ చెత్త రికార్డు! వీడియో వైరల్
ICC Cricket World Cup 2023- South Africa vs Sri Lanka: వన్డే వరల్డ్కప్-2023లో భాగంగా శ్రీలంకతో ఆరంభ మ్యాచ్లో సౌతాఫ్రికా బ్యాటర్లు శతకాల మోత మోగించారు. ప్రొటిస్ ఓపెనర్ క్వింటన్ డికాక్ 84 బంతుల్లో 100 పరుగులు చేశాడు. వన్డౌన్లో వచ్చిన వాన్ డెర్ డసెన్ 110 బంతుల్లో 108 రన్స్ సాధించాడు. వీరిద్దరిని మించేలా.. కేవలం 49 బంతుల్లోనే సెంచరీ మార్కు అందుకుని వన్డే వరల్డ్కప్ చరిత్రలో సరికొత్త రికార్డు లిఖించాడు ఎయిడెన్ మార్కరమ్. ఫాస్టెస్ట్ సెంచరీతో ప్రపంచ రికార్డు బద్దలు కొట్టాడు. సుడిగాలి శతకం.. బలైన పతిరణ మొత్తంగా ఈ మ్యాచ్లో 54 బంతులు ఎదుర్కొన్న మార్కరమ్.. 14 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 106 పరుగులు సాధించాడు. ఇక ఈ మ్యాచ్లో మార్కరమ్ పరుగుల దాహానికి బలైన బౌలర్లలో లంక యువ పేసర్ మతీశ పతిరణ ముందు వరుసలో ఉన్నాడు. ప్రపంచకప్ చరిత్రలో చెత్త రికార్డు ప్రొటిస్ ఇన్నింగ్స్ 43వ ఓవర్లో పతిరణకు మార్కరమ్ చుక్కలు చూపించాడు. రెండో బంతి నుంచి మొదలుపెట్టి వరుసగా 4,4,4,2,6 బాదాడు. ఇక ఓవర్ తొలి బంతికి ఒక రన్ రాగా.. పతిరణ ఏకంగా ఐదు వైడ్బాల్స్ వేశాడు. దీంతో మొత్తంగా 43వ ఓవర్లో 26 పరుగులు వచ్చాయి. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. ఇక సౌతాఫ్రికాతో మ్యాచ్లో పతిరణ 10 ఓవర్ల బౌలింగ్లో రికార్డుస్థాయిలో 95 పరుగులు సమర్పించుకుని ఒకే ఒక్క వికెట్(డికాక్) తీశాడు. ఈ క్రమంలో శ్రీలంక తరఫున వన్డే వరల్డ్కప్ చరిత్రలో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్గా చెత్త రికార్డు నమోదు చేశాడు. శ్రీలంక తరఫున వన్డే వరల్డ్కప్ టోర్నీలో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్లు వీరే అషాంత డి మెల్- 1987- కరాచిలో వెస్టిండీస్తో మ్యాచ్లో.. 91 మతీశ పతిరణ- 2023*- ఢిల్లీలో సౌతాఫ్రికాతో మ్యాచ్లో.. 95 నువాన్ ప్రదీప్- 2019- ది ఓవల్లో ఆస్ట్రేలియాతో మ్యాచ్లో.. 88 తిసార పెరీరా- 2015- సిడ్నీలో ఆస్ట్రేలియాతో మ్యాచ్లో..87. చదవండి: WC 2023: ఆసీస్తో టీమిండియా తొలి మ్యాచ్.. మీ తుదిజట్టును ఎంచుకోండి! View this post on Instagram A post shared by ICC (@icc) -
లంక బౌలర్ల తుక్కు రేగ్గొట్టిన సౌతాఫ్రికా బ్యాటర్లు.. 3 శతకాలు.. వరల్డ్కప్లో అత్యధిక స్కోర్
న్యూఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో శ్రీలంకతో ఇవాళ (అక్టోబర్ 7) జరుగుతున్న వరల్డ్కప్ మ్యాచ్లో సౌతాఫ్రికా బ్యాటర్లు విధ్వంసం సృష్టించారు. ఈ మ్యాచ్లో టాస్ ఓడినప్పటికీ ప్రత్యర్ధి ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేసిన సఫారీలు రికార్డు స్థాయిలో 400కి పైగా పరుగులు స్కోర్ చేశారు. ఈ మ్యాచ్లో ఏకంగా ముగ్గురు సఫారీ బ్యాటర్లు సెంచరీలతో కదంతొక్కారు. తొలుత క్వింటన్ డికాక్ (84 బంతుల్లో 100; 12 ఫోర్లు, 3 సిక్సర్లు), ఆతర్వాత రస్సీ వాన్ డెర్ డస్సెన్ (110 బంతుల్లో 108; 13 ఫోర్లు, 3 సిక్సర్లు), ఆఖర్లో ఎయిడెన్ మార్క్రమ్ (106) సెంచరీలతో విరుచుకుపడ్డారు. ఈ ముగ్గురు శతక వీరుల్లో మార్క్రమ్ సృష్టించిన విధ్వంసం ఓ రేంజ్లో ఉండింది. మార్క్రమ్ కేవలం 49 బంతుల్లోనే 14 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో శతక్కొట్టాడు. అతను తన సెంచరీ మార్కును సిక్సర్తో అందుకున్నాడు. ఆఖర్లో డేవిడ్ మిల్లర్ (21 బంతుల్లో 39 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), హెన్రిచ్ క్లాసెన్ (20 బంతుల్లో 32; ఫోర్, 3 సిక్సర్లు), మార్కో జన్సెన్ (7 బంతుల్లో 12 నాటౌట్; సిక్స్) కూడా మెరుపు ఇన్నింగ్స్లతో విరుచుకుపడటంతో సౌతాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి రికార్డు స్థాయిలో 428 పరుగులు చేసింది. వన్డే వరల్డ్కప్ చరిత్రలో ఇదే అత్యధిక స్కోర్గా రికార్డుల్లోకెక్కింది. గత రికార్డు ఆసీస్ పేరిట ఉండింది. 2015 వరల్డ్కప్లో ఆస్ట్రేలియా.. బంగ్లాదేశ్పై 417/6 స్కోర్ చేసింది. ఈ మ్యాచ్కు ముందు వరకు వరల్డ్కప్లో ఇదే అత్యధిక టీమ్ స్కోర్. మొత్తంగా వరల్డ్కప్లో 400కు పైగా స్కోర్ ఐదుసార్లు నమోదు కాగా.. అందులో మూడుసార్లు సౌతాఫ్రికానే ఈ మార్కును దాటింది. వరల్డ్కప్లో భారత్ ఓసారి 400 ప్లస్ స్కోర్ నమోదు చేసింది. 2007 వరల్డ్కప్లో బెర్ముడాపై భారత్ 413/5 స్కోర్ చేసింది. కాగా, సౌతాఫ్రికా ఇన్నింగ్స్లో కెప్టెన్ బవుమా (8) ఒక్కడే విఫలమయ్యాడు. సఫారీ బ్యాటర్ల విధ్వంసం ధాటికి లంక బౌలర్లు విలవిలలాడిపోయారు. దాదాపుగా అందరూ దాదాపు 9 రన్రేట్తో పరుగులు సమర్పించకున్నారు. రజిత 10 ఓవర్లలో వికెట్ తీసి 90 పరుగులు, దిల్షన్ మధుషంక 10 ఓవర్లలో 2 వికెట్లు తీసి 89 పరుగులు, దసున్ షనక 6 ఓవర్లలో 36 పరుగులు, ధనంజయ డిసిల్వ 4 ఓవర్లలో 39, మతీష పతిరణ 10 ఓవర్లలో ఒక్క వికెట్ తీసి అత్యధికంగా 95 పరుగులు, దునిత్ వెల్లలగే 10 ఓవర్లలో వికెట్ పడగొట్టి 81 పరుగులు సమర్పించుకున్నారు. -
WC 2023: మార్కరమ్ ఫాస్టెస్ట్ సెంచరీ.. వరల్డ్కప్ చరిత్రలో తొలి బ్యాటర్గా
ICC Cricket World Cup 2023- South Africa vs Sri Lanka, 4th Match: వన్డే వరల్డ్కప్-2023లో భాగంగా శ్రీలంకతో మ్యాచ్లో సౌతాఫ్రికా బ్యాటర్లు దుమ్ములేపుతున్నారు. లంక బౌలర్లకు చుక్కలు చూపిస్తూ ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నారు. శతకాల మోత మోగిస్తూ అభిమానులకు కావాల్సినంత మజా అందిస్తున్నారు. మెరుపు సెంచరీతో ఢిల్లీలో ఓపెనర్ క్వింటన్ డికాక్ 100, వన్డౌన్ బ్యాటర్ రాసీ వాన్ 108 పరుగులు సాధించగా.. నాలుగోస్థానంలో బరిలోకి దిగిన ఎయిడెన్ మార్కరమ్ మెరుపు సెంచరీతో చరిత్ర సృష్టించాడు. ప్రపంచ రికార్డు బద్దలు ప్రపంచకప్ టోర్నీలో అత్యంత వేగంగా 100 పరుగుల మార్కు అందుకున్న బ్యాటర్గా రికార్డులకెక్కాడు. 49 బంతుల్లోనే సుడిగాలి శతకంతో పరుగుల సునామీ కొనసాగిస్తున్నాడు. కాగా సౌతాఫ్రికా ఇన్నింగ్స్లో భాగంగా 45.5 ఓవర్ వద్ద మధుషంక బౌలింగ్లో సిక్స్ బాది మార్కరమ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. తద్వారా కెవిన్ ఒబ్రెయిన్ పేరిట ఉన్న ప్రపంచ రికార్డు బద్దలు కొట్టి.. ఈ ఘనత సాధించిన మొదటి బ్యాటర్గా నిలిచాడు. వన్డే వరల్డ్కప్ చరిత్రలో ఫాస్టెస్ట్ సెంచరీలు(బంతుల పరంగా) ►2023: ఎయిడెన్ మార్కరమ్- 49.. ఢిల్లీలో శ్రీలంక మీద ►2011: కెవిన్ ఒబ్రెయిన్- 50... బెంగళూరులో ఇంగ్లండ్ మీద ►2015: గ్లెన్ మాక్స్వెల్-51.. సిడ్నీలో శ్రీలంక మీద ►2015: ఏబీ డివిలియర్స్- 52... సిడ్నీలో వెస్టిండీస్ మీద. View this post on Instagram A post shared by ICC (@icc) View this post on Instagram A post shared by ICC (@icc) -
WC: స్వదేశానికి సౌతాఫ్రికా సారథి బవుమా.. కెప్టెన్గా మార్కరమ్
Temba Bavuma to travel back home: సౌతాఫ్రికా క్రికెట్ జట్టు కెప్టెన్ తెంబా బవుమా స్వదేశానికి తిరిగి పయనం కానున్నాడు. వ్యక్తిగత కారణాల దృష్ట్యా తమ ఇంటికి వెళ్లనున్నాడు. ఈ నేపథ్యంలో ప్రపంచకప్ వార్మప్ మ్యాచ్లకు బవుమా దూరం కానున్నాడు. ఈ విషయాన్ని సౌతాఫ్రికా క్రికెట్ ధ్రువీకరించింది. కాగా అక్టోబరు 5 నుంచి ఆరంభం కానున్న వన్డే వరల్డ్కప్-2023 కోసం ఇప్పటికే ప్రొటిస్ జట్టు భారత్కు చేరుకున్న విషయం తెలిసిందే. కేరళలో వార్మప్ మ్యాచ్లు ఆడే క్రమంలో సోమవారం త్రివేండ్రంలో అడుగుపెట్టింది. అక్కడే అఫ్గనిస్తాన్తో సెప్టెంబరు 29న, న్యూజిలాండ్తో అక్టోబరు 2న తలపడనుంది. View this post on Instagram A post shared by Proteas Men (@proteasmencsa) ఆ రెండు మ్యాచ్లకు బవుమా దూరం: సౌతాఫ్రికా క్రికెట్ అయితే, జట్టుతో పాటే భారత్కు విచ్చేసిన తెంబా బవుమా వ్యక్తిగత కారణాల దృష్ట్యా తిరిగి సౌతాఫ్రికాకు వెళ్లనున్నాడు. ఈ మేరకు.. ‘‘ఐసీసీ క్రికెట్ వరల్డ్కప్-2023లో అఫ్గనిస్తాన్, న్యూజిలాండ్లతో సెప్టెంబరు 29, అక్టోబరు 2న జరుగనున్న వార్మప్ మ్యాచ్లకు బవుమా దూరం కానున్నాడు. అతడి గైర్హాజరీలో ఎయిడెన్ మార్కరమ్ కెప్టెన్గా వ్యవహరిస్తాడు’’ అని క్రికెట్ సౌతాఫ్రికా ప్రకటన విడుదల చేసింది. కాగా గురువారమే బవుమా తిరిగి వెళ్లిపోనున్నట్లు సమాచారం. అతడి స్థానంలో టీ20 కెప్టెన్ మార్కరమ్ వార్మప్ మ్యాచ్లలో వన్డే జట్టుకు సారథ్యం వహించనున్నాడు. సూపర్ఫామ్లో బవుమా ప్రొటిస్ కెప్టెన్ తెంబా బవుమా వన్డే ఫార్మాట్లో ప్రస్తుతం సూపర్ ఫామ్లో ఉన్నాడు. ఈ ఏడాది ఇప్పటి వరకు ఆడిన 10 మ్యాచ్లలో 104.08 స్ట్రైక్రేటుతో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. గత తొమ్మిది వన్డే ఇన్నింగ్స్లో ఏకంగా మూడు సెంచరీలు సాధించాడు. మరో మ్యాచ్లో కేవలం పది పరుగుల తేడాతో శతకం చేజార్చుకున్నాడు. చదవండి: 'ఈ డర్టీ గేమ్లో నాకు ఆడాలని లేదు.. కావాలనే నన్ను తప్పించారు' హైదరాబాద్లో ఘన స్వాగతం.. ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అయ్యా: బాబర్ భావోద్వేగం View this post on Instagram A post shared by Proteas Men (@proteasmencsa) -
జన్సెన్ ఆల్రౌండ్ షో.. ఆసీస్కు షాకిచ్చిన సౌతాఫ్రికా.. సిరీస్ కైవసం
స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరిగిన 5 మ్యాచ్ల వన్డే సిరీస్ను సౌతాఫ్రికా 3-2 తేడాతో కైవసం చేసుకుంది. జొహన్నెస్బర్గ్ వేదికగా ఇవాళ (సెప్టెంబర్ 17) జరిగిన ఐదో వన్డేలో సౌతాఫ్రికా 122 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. మార్కో జన్సెన్ ఆల్రౌండ్ షోతో (23 బంతుల్లో 47; 4 ఫోర్లు, 3 సిక్సర్లు, 8-1-39-5) ఇరగదీసి తన జట్టును విజయపథాన నడిపించాడు. జన్సెన్కు కేశవ్ మహారాజ్ (9.1-2-33-4) సహకరించడంతో ఆస్ట్రేలియా ఓటమిపాలైంది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా.. మార్క్రమ్ (87 బంతుల్లో 93; 9 ఫోర్లు, 3 సిక్సర్లు), డేవిడ్ మిల్లర్ (65 బంతుల్లో 63; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ధ సెంచరీలతో చెలరేగడంతో.. నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 315 పరుగులు చేసింది. ఇన్నింగ్స్ చివర్లో మార్కో జన్సెన్, ఫెలుక్వాయో (19 బంతుల్లో 39 నాటౌట్; 2 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్తో విరుచుకుపడటంతో సౌతాఫ్రికా 300 స్కోర్ను దాటింది. ఆసీస్ బౌలర్లలో ఆడమ్ జంపా (3/71), సీన్ అబాట్ (2/54), గ్రీన్ (1/59), నాథన్ ఇల్లిస్ (1/49), టిమ్ డేవిడ్ (1/20) వికెట్లు పడగొట్టారు. అనంతరం 316 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆసీస్.. జన్సెన్, కేశవ్ మహారాజ్, ఫెలుక్వాయో (1/44) ధాటికి 34.1 ఓవర్లలో 193 పరుగులకు ఆలౌటైంది. ఆసీస్ ఇన్నింగ్స్లో కెప్టెన్ మిచెల్ మార్ష్ (71) టాప్ స్కోరర్గా నిలువగా.. లబూషేన్ (44) పర్వాలేదనిపించాడు. వీరు మినహాయించి అంతా విఫలమయ్యారు. వార్నర్ 10, ఇంగ్లిస్ 0, అలెక్స్ క్యారీ 2, గ్రీన్ 18, టిమ్ డేవిడ్ 1, సీన్ అబాట్ 23, మైఖేల్ నెసర్ 0, జంపా 5 పరుగులు చేసి నిరాశపరిచారు. కాగా, ఈ సిరీస్లో ఆసీస్ తొలి రెండు వన్డేలు గెలువగా.. ఆతర్వాత సౌతాఫ్రికా వరుసగా మూడు విజయాలు సాధించి, సిరీస్ కైవసం చేసుకుంది. దీనికి ముందు జరిగిన 3 మ్యాచ్ల టీ20 సిరీస్ను ఆసీస్ 3-0తో క్లీన్స్వీప్ చేసింది. -
చెలరేగిన మార్క్రమ్, మిల్లర్.. క్లాసెన్పై ప్రతీకారం తీర్చుకున్న జంపా
జోహన్నెస్బర్గ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న నిర్ణయాత్మకమైన ఐదో వన్డేలో సౌతాఫ్రికా భారీ స్కోర్ సాధించింది. ఈ మ్యాచ్లో టాస్ ఓడి ఆస్ట్రేలియా ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా.. నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 315 పరుగులు చేసింది. చెలరేగిన మార్క్రమ్, మిల్లర్.. తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా.. మార్క్రమ్్ (87 బంతుల్లో 93; 9 ఫోర్లు, 3 సిక్సర్లు), డేవిడ్ మిల్లర్ (65 బంతుల్లో 63; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ధ సెంచరీలతో చెలరేగడంతో భారీ స్కోర్ చేసింది. ఆఖర్లో జన్సెన్, ఫెలుక్వాయో మెరుపులు.. ఇన్నింగ్స్ చివర్లో మార్కో జన్సెన్ (23 బంతుల్లో 47; 4 ఫోర్లు, 3 సిక్సర్లు), ఫెలుక్వాయో (19 బంతుల్లో 39 నాటౌట్; 2 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్తో విరుచుకుపడటంతో సౌతాఫ్రికా 300 పరుగుల మార్కును దాటింది. పర్వాలేదనిపించిన డికాక్, డస్సెన్.. సౌతాఫ్రికా ఇన్నింగ్స్లో మార్క్రమ్, మిల్లర్, జన్సెన్, ఫెలుక్వాయోలతో పాటు డికాక్ (27), డస్సెన్ (30) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. కెప్టెన్ బవుమా (0), గత మ్యాచ్లో విధ్వంసకర శతకంతో వీరవిహారం చేసిన క్లాసెన్ (6), గెరాల్డ్ కొయెట్జీ (0), కేశవ్ మహారాజ్ (0) నిరాశపరిచారు. క్లాసెన్పై ప్రతీకారం తీర్చుకున్న జంపా.. నాలుగో వన్డేలో తన బౌలింగ్లో భారీగా పరుగులు పిండుకుని, వన్డేల్లో అత్యంత ఘోరమైన గణాంకాలు (10-0-113-0) నమోదు చసేలా చేసిన క్లాసెన్పై ఈ మ్యాచ్లో ఆడమ్ జంపా ప్రతీకారం తీర్చుకున్నాడు. ఈ మ్యాచ్లో జంపా.. క్లాసెన్ను కేవలం 6 పరుగులకే క్లీన్బౌల్డ్ చేశాడు. క్లాసెన్ వికెట్ తీశాడన్న మాట తప్పిస్తే.. జంపా ఈ మ్యాచ్లోనూ భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. 10 ఓవర్లలో 3 వికెట్లు తీసి ఏకంగా 71 పరుగులు సమర్పించుకున్నాడు. జంపాతో పాటు సీన్ అబాట్ (2/54), గ్రీన్ (1/59), నాథన్ ఇల్లిస్ (1/49), టిమ్ డేవిడ్ (1/20) వికెట్లు తీశారు. అనంతరం 316 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆసీస్.. 15 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 91 పరుగులు చేసింది. వార్నర్ (10), ఇంగ్లిస్ (0) ఔట్ కాగా.. మిచెల్ మార్ష్ (46), లబూషేన్ (27) క్రీజ్లో ఉన్నారు. జన్సెన్కు 2 వికెట్లు పడ్డాయి. కాగా, 5 మ్యాచ్లో ఈ వన్డే సిరీస్లో ప్రస్తుతం ఇరు జట్లు చెరో 2 మ్యాచ్లు గెలిచి, సిరీస్లో సమంగా నిలిచాయి. -
శతక్కొట్టిన మార్క్రమ్.. వార్నర్ ఒంటరిపోరాటం.. ఎట్టకేలకు సౌతాఫ్రికాకు తొలి గెలుపు
స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న పరిమిత ఓవర్ల సిరీస్లో సౌతాఫ్రికా ఎట్టకేలకు తొలి గెలుపు సాధించింది. 5 వన్డేల సిరీస్లో భాగంగా నిన్న (సెప్టెంబర్ 12) జరిగిన మూడో మ్యాచ్లో ప్రొటీస్ 111 పరుగుల తేడాతో గెలుపొందింది. 3 మ్యాచ్ల టీ20 సిరీస్ను 0-3 తేడాతో కోల్పోయిన సౌతాఫ్రికా.. ఆతర్వాత వన్డే సిరీస్లో వరుసగా రెండు మ్యాచ్ల్లో పరాజయంపాలైంది. తాజా గెలుపుతో ఆ జట్టు సిరీస్ అవకాశాలను (1-2) సజీవంగా ఉంచుకుంది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా.. ఎయిడెన్ మార్క్రమ్ విధ్వంసకర శతకంతో (74 బంతుల్లో 102 నాటౌట్; 9 ఫోర్లు, 4 సిక్సర్లు) విరుచుకుపడటంతో నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 338 పరుగులు చేసింది. డికాక్ (82), బవుమా (57)లు సైతం అర్ధసెంచరీలతో చెలరేగగా.. హెండ్రిక్స్ (39), జన్సెన్ (32) పర్వాలేదనిపించారు. క్లాసెన్ (0), మిల్లర్ (8) విఫలమయ్యారు. ఆసీస్ బౌలర్లలో ట్రవిస్ హెడ్ 2 వికెట్లు పడగొట్టగా.. స్టోయినిస్, నాథన్ ఇల్లిస్, తీన్వర్ సంగా తలో వికెట్ దక్కించుకున్నారు. అనంతరం 339 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆసీస్ ఓ దశలో విజయం దిశగా సాగినప్పటికీ.. సఫారీ యువ ఫాస్ట్ బౌలర్ గెరాల్డ్ కొయెట్జీ (4/50) ఆసీస్ విజయావకాశాలకు అడ్డుకట్ట వేశాడు. అతనికి తబ్రేజ్ షంషి (2/29), కేశవ్ మహారాజ్ (2/37), మగాల (1/40) సహకరించారు. ఆసీస్ ఇన్నింగ్స్లో వార్నర్ (78) ఒక్కడే ఒంటరిపోరాటం చేశాడు. ట్రవిస్ హెడ్ (38), మిచెల్ మార్ష్ (29)లకు శుభారంభాలు లభించినప్పటికీ, వారు ఎక్కువ సేపు క్రీజ్లో నిలబడలేకపోయారు. వార్నర్ ఔటయ్యాక ఆసీస్ ఇన్నింగ్స్ పేకమేడలా కూలింది. లబూషేన్ (15), అలెక్స్ క్యారీ (12), స్టోయినిస్ (10), టిమ్ డేవిడ్ (8), సీన్ అబాట్ (2), ఇల్లిస్ (16), తన్వీర్ సంగా (0) ఇలా వచ్చి అలా పెవిలియన్కు వెళ్లారు. ఈ సిరీస్లో నాలుగో వన్డే సెప్టెంబర్ 15న సెంచూరియన్లో జరుగనుంది. -
మార్క్రమ్ విధ్వంసకర శతకం.. సౌతాఫ్రికా భారీ స్కోర్
5 మ్యాచ్ల వన్డే సిరీస్లో భాగంగా ఆస్ట్రేలియాతో ఇవాళ (సెప్టెంబర్12) జరుగుతున్న కీలకమైన మూడో వన్డేలో సౌతాఫ్రికా బ్యాటర్లు చెలరేగిపోయారు. ముఖ్యంగా ఆ జట్టు స్టార్ ఆటగాడు ఎయిడెన్ మార్క్రమ్ ఆకాశమే హద్దుగా విజృంభించాడు. కేవలం 74 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో విధ్వంసకర శతకంతో (102 నాటౌట్) విరుచుకుపడ్డాడు. మార్క్రమ్కు జతగా క్వింటన్ డికాక్ (77 బంతుల్లో 82; 10 ఫోర్లు, 2 సిక్సర్లు), కెప్టెన్ టెంబా బవుమా (62 బంతుల్లో 57; 6 ఫోర్లు) అర్ధసెంచరీలతో రాణించగా.. రీజా హెండ్రిక్స్ (39), మార్కో జన్సెన్ (32) పర్వాలేదనిపించారు. ఈ నలుగురు సత్తా చాటడంతో సౌతాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 338 పరుగుల భారీ స్కోర్ చేసింది. సఫారీ ఇన్నింగ్స్లో హెన్రిచ్ క్లాసెన్ (0), డేవిడ్ మిల్లర్ (6) నిరాశపరిచారు. ఆసీస్ బౌలర్లలో ట్రవిస్ హెడ్ 2 వికెట్లు పడగొట్టగా.. మార్కస్ స్టోయినిస్, నాథన్ ఇల్లిస్, తన్వీర్ సంగా తలో వికెట్ దక్కించుకున్నారు. కాగా, 5 మ్యాచ్ల ఈ వన్డే సిరీస్లో తొలి రెండు మ్యాచ్లు నెగ్గిన ఆసీస్ 2-0 ఆధిక్యంలో కొనసాగుతుంది. దీనికి ముందు జరిగిన 3 మ్యాచ్ల టీ20 సిరీస్ను సైతం ఆసీస్ 3-0తో క్లీన్స్వీప్ చేసింది. ప్రస్తుతానికి సౌతాఫ్రికా పర్యటనలో ఆస్ట్రేలియా అజేయ జట్టుగా కొనసాగుతుంది. -
ఆసీస్తో సిరీస్.. సౌతాఫ్రికా జట్టు ప్రకటన.. జట్టు నిండా విధ్వంసకర ఆటగాళ్లే..!
ఆస్ట్రేలియాతో స్వదేశంలో జరిగే టీ20, వన్డే సిరీస్ల కోసం క్రికెట్ సౌతాఫ్రికా (సీఎస్ఏ) వేర్వేరు జట్లను ఇవాళ (ఆగస్ట్ 14) ప్రకటించింది. ఈ పర్యటనలోని టీ20 సిరీస్ కోసం సౌతాఫ్రికన్ సెలెక్టర్లు విధ్వంసకర ఆటగాడు డెవాల్డ్ బ్రెవిస్కు తొలిసారి పిలుపునిచ్చారు. ఇతనితో పాటు వికెట్కీపర్ కమ్ బ్యాటర్ డోనోవన్ ఫెర్రీరా, యువ బ్యాటర్ మాథ్యూ బ్రీట్జ్కీలను కూడా తొలిసారి ఎంపిక చేశారు. ఆసీస్ పర్యటనలోని 3 మ్యాచ్ల టీ20 సిరీస్ కోసం సౌతాఫ్రికా సెలెక్టర్లు 15 మంది సభ్యులతో కూడిన యువ జట్టును ప్రకటించారు. సీనియర్లు క్వింటన్ డికాక్, హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, కగిసో రబాడ, అన్రిచ్ నోర్జేల గైర్హాజరీలో సెలెక్టర్లు యువకులకు అవకాశం ఇచ్చారు. పైపేర్కొన్న సీనియర్లంతా ఇదే పర్యటనలో జరిగే 5 మ్యాచ్ల వన్డే సిరీస్కు అందుబాటులోకి వస్తారు. టీ20 సిరీస్కు ఎయిడెన్ మార్క్రమ్, వన్డే సిరీస్కు టెంబా బవుమా కెప్టెన్లుగా వ్యవహరిస్తారు. గాయం కారణంగా గతకొంతకాలంగా జట్టుకు దూరంగా ఉన్న సీనియర్ ఆటగాడు కేశవ్ మహారాజ్ సైతం రెండు జట్లలో చోటు దక్కించుకున్నాడు. ఆసీస్ పర్యటనలో టీ20 సిరీస్కు సౌతాఫ్రికా జట్టు: ఎయిడెన్ మార్క్రమ్ (కెప్టెన్), టెంబా బవుమా, మాథ్యూ బ్రీట్జ్కీ, డెవాల్డ్ బ్రెవిస్, గెరాల్డ్ కోయెట్జీ, డోనోవన్ ఫెర్రీరా, జోర్న్ ఫార్టుయిన్, రీజా హెండ్రిక్స్, మార్కో జన్సెన్, సిసంద మగాల, కేశవ్ మహరాజ్, లుంగీ ఎంగిడి, తబ్రేజ్ షంషి, ట్రిస్టన్ స్టబ్స్, లిజాడ్ విలియమ్స్, రస్సీ వాన్ డెర్ డస్సెన్ ఆసీస్ పర్యటనలో వన్డే సిరీస్కు సౌతాఫ్రికా జట్టు: టెంబా బవుమా (కెప్టెన్), డెవాల్డ్ బ్రెవిస్, గెరాల్డ్ కోయెట్జీ, క్వింటన్ డికాక్, జోర్న్ ఫార్టుయిన్, రీజా హెండ్రిక్స్, మార్కో జన్సెన్, హెన్రిచ్ క్లాసెన్, సిసంద మగాలా, కేశవ్ మహరాజ్, ఎయిడెన్ మార్క్రమ్, డేవిడ్ మిల్లర్, లుంగి ఎంగిడి, అన్రిచ్ నోర్జే, తబ్రేజ్ షంషి, వేన్ పార్నెల్, కగిసో రబాడ, ట్రిస్టన్ స్టబ్స్, రస్సీ వాన్ డెర్ డస్సెన్ షెడ్యూల్.. ఆగస్ట్ 30: తొలి టీ20 (డర్బన్) సెప్టెంబర్ 1: రెండో టీ20 (డర్బన్) సెప్టెంబర్ 2: మూడో టీ20 (డర్బన్) సెప్టెంబర్ 7: తొలి వన్డే (బ్లోంఫొన్టెయిన్) సెప్టెంబర్ 9: రెండో వన్డే (బ్లోంఫొన్టెయిన్) సెప్టెంబర్ 12: మూడో వన్డే (పోచెఫ్స్ట్రూమ్) సెప్టెంబర్ 15: నాలుగో వన్డే (సెంచూరియన్) సెప్టెంబర్ 17: ఐదో వన్డే (జోహనెస్బర్గ్) -
పెళ్లి చేసుకున్న సన్రైజర్స్ కెప్టెన్.. అమ్మాయి ఎవరంటే?
దక్షిణాఫ్రికా స్టార్ ఆటగాడు, సన్రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ఎయిడెన్ మార్క్రమ్ ఓ ఇంటివాడయ్యాడు. శనివారం తన చిరకాల స్నేహితురాలు నికోల్ను మార్క్రమ్ పెళ్లాడాడు. వీరిద్దరి వివాహం సెంచూరియన్లోని ఓ పంక్షన్ హాల్లో ఘనంగా జరిగింది. వీరిద్దరి వివాహానికి వారి స్నేహితులు, బంధువులు హజరయ్యారు. ఇందుకు సంబంధించిన ఫోటోను నికోల్ ఇన్స్టాగ్రమ్లో షేర్ చేసింది. కాగా వీరిద్దరూ గత 10 ఏళ్ల నుంచి రిలేషన్షిప్లో ఉన్నారు. ఈ క్రమంలో గత ఏడాది వీరిద్దిరి నిశ్చితార్ధం కూడా జరిగింది. కాగా నికోల్ సొంతంగా ఆన్లైన్లో ఓ జ్యూవెలరీ స్టోర్ను నడుపుతోంది. ఇక మార్క్రమ్ ఐపీఎల్లో తొలిసారిగా సన్రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్గా బాధ్యతలు చేపట్టాడు. ఐపీఎల్-2023 సీజన్లో ఎస్ఆర్హెచ్ కెప్టెన్గా వ్యవహరించిన మార్క్రమ్.. జట్టును విజయం పథంలో నడింపించలేకపోయాడు. ఈ ఏడాది సీజన్లో అతడి సారధ్యంలోని ఎస్ఆర్హెచ్ పాయింట్ల పట్టికలో ఆఖరి స్ధానంలో నిలిచింది. కానీ సౌతాఫ్రికా టీ20 లీగ్లో మాత్రం ఎస్ఆర్హెచ్ ఫ్రాంచైజీ సన్రైజర్స్ ఈస్టర్న్ కేప్ను ఛాంపియన్గా నిలిపాడు. చదవండి: #HarmanpreetKaur: 'డేర్ అండ్ డాషింగ్' హర్మన్ప్రీత్.. కుండ బద్దలయ్యేలా! -
MI Vs SRH: ముంబైకి చావోరేవో.. యువ బ్యాటర్ రీఎంట్రీ! ఉమ్రాన్కు ‘లాస్ట్’ ఛాన్స్!
IPL 2023 MI vs SRH: ఐపీఎల్-2023లో ప్లే ఆఫ్స్ చేరుకోవాలంటే చావోరేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్.. సన్రైజర్స్ హైదరాబాద్తో తలపడనుంది. ముంబైలోని వాంఖడే వేదికగా ఆదివారం ఇరు జట్ల మధ్య మ్యాచ్ జరుగనుంది. ఇప్పటి వరకు ఆడిన 13 మ్యాచ్లలో తొమ్మిదింట ఓడిన రైజర్స్.. ఈ మ్యాచ్లో గెలిచినా పెద్దగా ఒరిగేమీ లేదు. అలా అయితే ముంబైకి చేదు అనుభవం తప్పదు మహా అయితే, ఈ విజయంతో ఢిల్లీ క్యాపిటల్స్ను వెనక్కినెట్టి పట్టికలో తొమ్మిదో స్థానానికి చేరుకుంటుంది. గెలుపుతో సీజన్ను ముగించామనే సంతృప్తితో నిష్క్రమిస్తుంది. అయితే, ఇప్పటి వరకు పేలవ ప్రదర్శనతో విమర్శలు మూటగట్టుకున్న రైజర్స్ ఈ మ్యాచ్లో గనుక రైజ్ అయితే, ముంబైకి చేదు అనుభవం తప్పదు. కానీ.. పటిష్టమైన బ్యాటింగ్ ఆర్డర్ కలిగిన ముంబైని ఓడించడం రైజర్స్కు అంత సులువేమీ కాదు. ముఖ్యంగా సొంతమైదానంలో ఈ మ్యాచ్ జరగడం ముంబైకి అత్యంత సానుకూలాంశం. ఇక ముఖాముఖి పోరులోనూ సన్రైజర్స్పై ముంబైదే పైచేయి. ముంబైదే పైచేయి ఇప్పటి వరకు ఇరు జట్లు 20సార్లు తలపడగా రోహిత్ సేన 11 సార్లు.. ఎస్ఆర్హెచ్ 9 సార్లు గెలిచింది. గత ఆరు మ్యాచ్లలో నాలుగింట ముంబైనే విజయం వరించింది. దీంతో ముంబై ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతుండగా.. గత మూడు మ్యాచ్లలో ఓడిన రైజర్స్ విజయంతో సీజన్ను ముగించాలని ఆరాటపడుతోంది. ఇక ఈ మ్యాచ్లో గెలుపొందితే రోహిత్ సేన ప్లే ఆఫ్స్ చేరనుంది. ఒకవేళ ఓడితే ఆర్సీబీకి మార్గం సుగమమవుతుంది. కాగా ఆదివారం మధ్యాహ్నం (3:30) ముంబై- రైజర్స్ మ్యాచ్ జరుగనుండగా.. రాత్రి 7. 30 గంటలకు ఆర్సీబీ- గుజరాత్ టైటాన్స్తో మ్యాచ్ ఆడనుంది. పోటీలో ముంబై, ఆర్సీబీ.. ఆశల పల్లకిలో రాజస్తాన్ ఇదిలా ఉంటే.. ఈ సీజన్లో గుజరాత్ టైటాన్స్ సహా చెన్నై సూపర్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ ప్లే ఆఫ్స్లో అడుగుపెట్టాయి. నాలుగో స్థానం కోసం ముంబై,ఆర్సీబీ రేసులో ఉన్నాయి. లీగ్ దశలో తమ ఆఖరి మ్యాచ్లలో ఈ రెండూ గనుక ఓడితే రాజస్తాన్కు ప్లే ఆఫ్ అవకాశాలు ఉంటాయి. ఇదిలా ఉంటే.. రైజర్స్తో మ్యాచ్లో హైదరాబాదీ బ్యాటర్ తిలక్ వర్మ ముంబై తుది జట్టులో చోటు దక్కించుకునే ఛాన్స్ ఉంది. మరోవైపు.. బెంచ్ మీద ఉన్నవాళ్లకు ఛాన్స్ ఇస్తామంటూ రైజర్స్ కెప్టెన్ మార్కరమ్ చెప్పిన నేపథ్యంలో బౌలర్ ఉమ్రాన్ మాలిక్కు అవకాశం దక్కొచ్చు. ముంబై ఇండియన్స్ వర్సెస్ సన్రైజర్స్ హైదరాబాద్ తుది జట్లు(అంచనా) ముంబై: ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), రోహిత్ శర్మ(కెప్టెన్), కామెరూన్ గ్రీన్, సూర్యకుమార్ యాదవ్, నేహాల్ వధేరా/తిలక్ వర్మ, టిమ్ డేవిడ్, క్రిస్ జోర్డాన్, విష్ణు వినోద్, పీయూష్ చావ్లా, జాసన్ బెహ్రెన్ డార్ఫ్, కుమార్ కార్తికేయ సన్రైజర్స్ అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠి, ఎయిడెన్ మార్కరమ్(కెప్టెన్), హెన్రిచ్ క్లాసెన్(వికెట్ కీపర్), హ్యారీ బ్రూక్, గ్లెన్ ఫిలిప్స్, అబ్దుల్ సమద్, కార్తిక్ త్యాగి, ఉమ్రాన్ మాలిక్, భువనేశ్వర్ కుమార్, నితీష్ రెడ్డి. చదవండి: సంచలన ఇన్నింగ్స్.. రింకూతో గంభీర్ ముచ్చట..! ట్వీట్ వైరల్ -
'కెప్టెన్ అయ్యుండి ఉమ్రాన్ విషయం తెలియదంటావ్!'
ఐపీఎల్ 16వ సీజన్లో ఎస్ఆర్హెచ్ రెండో జట్టుగా ప్లే ఆఫ్ రేసు నుంచి నిష్క్రమించిన సంగతి తెలిసిందే. ఆరంభం నుంచే మెరుగైన ఆటతీరును కనబరచని ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ ఇలా అన్ని విభాగాల్లో విఫలమైంది. ఎయిడెన్ మార్క్రమ్ కెప్టెన్గా బాధ్యతలు చేపట్టినా ఎస్ఆర్హెచ్ ఆటతీరులో పెద్దగా మార్పు లేదు. క్లాసెన్ మినహా జట్టులో స్థిరమైన బ్యాటింగ్ చేసిన ఆటగాడు ఒక్కడు కనిపించలేదు. బౌలింగ్ విభాగం కూడా అంతంతమాత్రమే. తాజాగా ఆర్సీబీతో మ్యాచ్ సందర్భంగా.. టాస్ సమయంలో ఉమ్రాన్ మాలిక్ విషయంలో ఎస్ఆర్హెచ్ కెప్టెన్ మార్క్రమ్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తి కలిగించాయి. మొన్నటికి మొన్న తప్పుడు షీట్ సమర్పించి ఒక ఆటగాడి డెబ్యూ చేయకపోవడానికి కారణమయ్యాడు. ఇక టాస్ సమయంలో తుది జట్టు విషయంపై స్పందించాడు. ''హ్యారీ బ్రూక్ తుది జట్టులోకి వచ్చాడు. కార్తిక్ త్యాగి, నితీశ్లు అరంగేట్రం చేశారు అని తెలిపాడు. అయితే ఉమ్రాన్ మాలిక్ ఎందుకు ఆడడం లేదని ప్రశ్న వేయగా.. దీనిపై మార్క్రమ్.. 150 కిమీ వేగంతో బంతులు విసరగల నైపుణ్యం ఉమ్రాన్ మాలిక్ సొంతం. కానీ అతను ఆడకపోవడం వెనుక ఏం జరుగుతుందో నాకు తెలియదు. కానీ అతని బౌలింగ్లో వేగం ఉంది. చాలా ఆట ఆడాల్సి ఉంది.'' అంటూ తన మాటలతో చిన్నపాటి కన్ఫూజన్ క్రియేట్ చేశాడు. మార్క్రమ్ వ్యాఖ్యలపై క్రికెట్ ఫ్యాన్స్ వినూత్నంగా స్పందించారు. ''ఏందయ్యా మార్క్రమ్.. కెప్టెన్ అయ్యుండి ఉమ్రాన్ మాలిక్ విషయం తెలియదంటావా.. జట్టులో ఏం జరుగుతుంది'' అంటూ కామెంట్ చేశారు. అయితే ఇటీవలే ఎస్ఆర్హెచ్ కోచ్ బ్రియాన్ లారా బర్త్డే వేడుకల్లోనూ ఉమ్రన్ మాలిక్ ఎక్కడా కనిపించలేదు. దీంతో కచ్చితంగా ఉమ్రాన్ విషయంలో ఏదో జరిగిందంటూ అభిమానులు పేర్కొన్నారు. Working with @DaleSteyn62 😎 IPL journey with @SunRisers 🧡 Message for young fans 🤗 His answers are as quick & rapid as his spells 🔥 Presenting 𝙁𝙖𝙨𝙩 𝙏𝙖𝙠𝙚𝙨 with @umran_malik_01⚡️⚡️ - By @ameyatilak #TATAIPL | #SRHvRCB pic.twitter.com/qAUSpHuMLD — IndianPremierLeague (@IPL) May 18, 2023 How does Markram not know what's up with Umran Malik behind the scenes? Been a weird season, with weird vibes from SRH. — Nikhil 🏏 (@CricCrazyNIKS) May 18, 2023 SRH is out of IPL 2023 but still they are not giving chances to Umran Malik 🤦♂️ SRH management surely doesn't believe in team building for the future and this explains their bad performance for last 3 seasons. pic.twitter.com/Zv9sZ70BAu — Utsav 💔 (@utsav045) May 18, 2023 చదవండి: క్లాసెన్ విధ్వంసం.. సీజన్లో ఎస్ఆర్హెచ్ తరపున రెండో శతకం -
IPL 2023: కోహ్లి సెంచరీ.. ఆర్సీబీ ఘన విజయం
IPL 2023: SRH Vs RCB Match Live Updates: ఎస్ఆర్హెచ్తో జరిగిన మ్యాచ్లో ఆర్సీబీ 8 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని సాధించింది. 187 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ 19.2 ఓవర్లలో రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి టార్గెట్ను అందుకుంది. కోహ్లి 61 బంతుల్లో శతకంతో వీరవిహారం చేయగా.. డుప్లెసిస్ 47 బంతుల్లో 71 పరుగులతో రాణించాడు. ఈ మ్యాచ్లో విజయంతో ఆర్సీబీ రన్రేట్ను మరింత మెరుగుపరుచుకుంది. 13 ఓవర్లలో ఆర్సీబీ 117/0 ఆర్సీబీ 13 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 117 పరుగులు చేసింది. కోహ్లి 64, డుప్లెసిస్ 54 పరుగులతో ఆడుతున్నారు. కోహ్లి, డుప్లెసిస్ అర్థశతకాలు.. ఆర్సీబీ 108/0 ఎస్ఆర్హెచ్తో మ్యాచ్లో ఆర్సీబీ టార్గెట్ దిశగా సాగుతుంది. కోహ్లి, డుప్లెసిస్లు అర్థశతకాలతో చెలరేగడంతో ఆర్సీబీ 12 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 108 పరుగులు చేసింది. దంచుతున్న కోహ్లి, డుప్లెసిస్.. ఆర్సీబీ 90/1 187 పరుగుల పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ ఇన్నింగ్స్ దూకుడుగా ఆరంభించింది. కోహ్లి 46, డుప్లెసిస్ 42 పరుగులతో చెలరేగి ఆడుతున్నారు. ప్రస్తుతం ఆర్సీబీ 9 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 90 పరుగులు చేసింది. ఆర్సీబీ టార్గెట్ 187.. ఆర్సీబీతో మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. హెన్రిచ్ క్లాసెన్ 51 బంతుల్లో 104 పరుగులతో విధ్వంసం సృష్టించగా.. హ్యారీ బ్రూక్ 27 పరుగులు చేశాడు. ఆర్సీబీ బౌలర్లలో మైకెల్ బ్రాస్వెల్ రెండు వికెట్లు తీయగా.. సిరాజ్, హర్షల్పటేల్, షాబాజ్ అహ్మద్లు తలా ఒక వికెట్ తీశారు. క్లాసెన్ సెంచరీ.. ఎస్ఆర్హెచ్ 19 ఓవర్లలో 182/4 19 ఓవర్లు ముగిసేసరికి ఎస్ఆర్హెచ్ నాలుగు వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది. హెన్రిచ్ క్లాసెన్ 49 బంతుల్లో శతకం సాధించాడు. 51 బంతుల్లో 104 పరుగులు చేసిన క్లాసెన్ హర్షల్పటేల్ బౌలింగ్లో వెనుదిరిగాడు. క్లాసెన్ ఫిఫ్టీ.. 11 ఓవర్లలో ఎస్ఆర్హెచ్ 95/2 11 ఓవర్లు ముగిసేసరికి ఎస్ఆర్హెచ్ రెండు వికెట్ల నష్టానికి 94 పరుగులు చేసింది. హెన్రిచ్ క్లాసెన్ 24 బంతుల్లో ఫిఫ్టీ మార్క్ అందుకోగా.. మార్క్రమ్ 16 పరుగులతో ఆడుతున్నాడు. 33 పరుగులకే రెండు వికెట్లు డౌన్ ఆర్సీబీతో మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ 33 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. మైకెల్ బ్రాస్వెల్ ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీయడం విశేషం. తొలుత 11 పరుగులు చేసిన అభిషేక్ శర్మను క్లీన్బౌల్డ్ చేసిన బ్రాస్వెల్.. ఆ తర్వాత 15 పరుగులు చేసిన రాహుల్ త్రిపాఠిని క్యాచ్ ఔట్గా పెవిలియన్ చేర్చాడు. 4 ఓవర్లలో ఎస్ఆర్హెచ్ 27/0 4 ఓవర్లు ముగిసేసరికి ఎస్ఆర్హెచ్ వికెట్ నష్టపోకుండా 27 పరుగులు చేసింది. అభిషేక్ శర్మ 11, రాహుల్ త్రిపాఠి 15 పరుగులతో ఆడుతున్నారు. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆర్సీబీ ఐపీఎల్ 16వ సీజన్లో భాగంగా గురువారం 65వ మ్యాచ్లో హైదరాబాద్ వేదికగా ఎస్ఆర్హెచ్, ఆర్సీబీ తలపడుతున్నాయి. టాస్ గెలిచిన ఆర్సీబీ బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ ఎస్ఆర్హెచ్ కన్నా ఆర్సీబీకి చాలా కీలకం. ప్లేఆఫ్ చేరాలంటే మ్యాచ్లో ఆర్సీబీ గెలవడం తప్పనిసరి. సన్రైజర్స్ హైదరాబాద్ (ప్లేయింగ్ XI): అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠి, ఐడెన్ మార్క్రమ్ (కెప్టెన్), హెన్రిచ్ క్లాసెన్ (వికెట్ కీపర్), హ్యారీ బ్రూక్, గ్లెన్ ఫిలిప్స్, అబ్దుల్ సమద్, కార్తీక్ త్యాగి, మయాంక్ డాగర్, భువనేశ్వర్ కుమార్, నితీష్ రెడ్డి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ప్లేయింగ్ XI): విరాట్ కోహ్లీ, ఫాఫ్ డు ప్లెసిస్ (కెప్టెన్), గ్లెన్ మాక్స్వెల్, మహిపాల్ లోమ్రోర్, అనుజ్ రావత్ (వికెట్ కీపర్), షాబాజ్ అహ్మద్, మైకేల్ బ్రేస్వెల్, వేన్ పార్నెల్, హర్షల్ పటేల్, కర్ణ్ శర్మ, మహ్మద్ సిరాజ్ #RCB won the toss and opted to field first in Hyderabad 🏏 Catch all the action from #SRHvRCB - LIVE & FREE on #JioCinema, available on all sim cards.#EveryGameMatters #TATAIPL #IPLonJioCinema #IPL2023pic.twitter.com/1NmcJyczIb — JioCinema (@JioCinema) May 18, 2023 -
గతం సన్రైజర్స్కు అనుకూలం, మరి ఆర్సీబీ గెలుస్తుందా..?
ఐపీఎల్ 2023లో భాగంగా హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా ఇవాళ (మే 18) జరుగబోయే కీలక సమరంలో సన్రైజర్స్-రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్లో గెలుపుతో సన్రైజర్స్కు ఒరిగేదేమీ లేనప్పటికీ, ఆర్సీబీకి మాత్రం అత్యంత కీలకం. ఈ మ్యాచ్లో గెలిస్తేనే ఆర్సీబీ ప్లే ఆఫ్స్ అవకాశాలు సజీవంగా ఉంటాయి. లేదంటే పరిస్థితులు చాలా ఇబ్బందికరంగా మారతాయి. ఆర్సీబీకి మరో మ్యాచ్ ఆడే అవకాశం ఉన్నా, అది టేబుల్ టాపర్ గుజరాత్తో (మే 21న) కావడం, అదీ భారీ తేడాతో గెలవాల్సి ఉండటం ఆ జట్టుకు పెద్ద సమస్యగా మారుతుంది. ఇక, నేటి మ్యాచ్లో ఏ జట్టు గెలుస్తుందో, ఏ జట్టు ఓడుతుందో అన్న విషయాన్ని పక్కన పెడితే.. ఆర్సీబీపై సన్రైజర్స్ గెలుపోటముల రికార్డు ఘనంగా ఉంది. ఇరు జట్ల మధ్య ఇప్పటివరకు 22 మ్యాచ్లు జరగ్గా.. సన్రైజర్స్ 12, ఆర్సీబీ 9 మ్యాచ్ల్లో గెలుపొందాయి. ఓ మ్యాచ్ రద్దైంది. గతం సన్రైజర్స్కు అనుకూలంగా ఉండటంతో ఈ మ్యాచ్లో ఆర్సీబీ గెలుస్తుందా..లేదా..? అన్న ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ప్రస్తుత ఫామ్ ప్రకారం సన్రైజర్స్తో పోలిస్తే ఆర్సీబీకే విజయావకాశాలు అధికంగా ఉన్నప్పటికీ.. ఆ జట్టు పూర్తిగా KGF (కోహ్లి, గ్లెన్ మ్యాక్స్వెల్, ఫాఫ్ డుప్లెసిస్)పైనే అధారపడి ఉండటం వారి ఫ్యాన్స్ను కలవరపెడుతుంది. మరోవైపు సన్రైజర్స్ పరిస్థితి సైతం ఏమంత ఆశాజనకంగా లేదు. ఆటగాళ్ల నిలకడలేమి ఆ జట్టు ఓటములకు ప్రధాన కారణంగా మారింది. ఏ ఆటగాడు ఎప్పుడు ఎలా ఆడతాడో వారితో పాటు ఎవరికీ తెలియని పరిస్థితి. KGFతో పాటు సిరాజ్, హాజిల్వుడ్, కర్ణ్ శర్మ తమ ఫామ్ను కొనసాగిస్తే, నేటి మ్యాచ్లో ఆర్సీబీ గెలవడం పెద్ద సమస్య ఏమీ కాకపోవచ్చు. సన్రైజర్స్ ఫ్యాన్స్ సైతం నేటి మ్యాచ్లో ఆర్సీబీనే గెలవాలనుకోవడం విశేషం. తమ జట్టు ఎలాగూ ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించింది కాబట్టి, వారు ఆర్సీబీ గెలిచి ప్లే ఆఫ్స్కు చేరుకోవాలని కోరుకుంటున్నారు. విరాట్ కోహ్లి ఇంతవరకు ఐపీఎల్ టైటిల్ గెలవలేదన్న సానుభూతి అభిమానుల్లో ఉంది. దీంతో ఈ యేడు సన్రైజర్స్ ఫ్యాన్స్ కూడా ఆర్సీబీ మద్దతుదారులుగా మారిపోయారు. ఏది ఎలా ఉన్నా, నేటి మ్యాచ్లో ఎవరు గెలుస్తారో వేచి చూడాలి. చదవండి: IPL 2023: సన్రైజర్స్తో ఆర్సీబీ మ్యాచ్.. గెలిచిందా నిలుస్తుంది..! -
ఒక్కరం కూడా సహకారం అందించలేకపోయాం.. అంతా మా వల్లే: మార్కరమ్
IPL 2023- GT Vs SRH: ‘‘పవర్ ప్లేలోనే నాలుగు వికెట్లు కోల్పోవడం తీవ్ర ప్రభావం చూపింది. అప్పుడే మేము పీకల్లోతు కష్టాల్లో మునిగిపోయాం. మా నుంచి గేమ్ చేజారిపోయింది’’ అని సన్రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ఎయిడెన్ మార్కరమ్ అన్నాడు. పేసర్ భువనేశ్వర్ కుమార్, వికెట్ కీపర్ బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్ అద్భుతంగా రాణించారని.. అయినా ఫలితం లేకుండా పోయిందని వాపోయాడు. రైజర్స్ అవుట్ ఐపీఎల్-2023లో గుజరాత్ టైటాన్స్తో సోమవారం మ్యాచ్లో సన్రైజర్స్ 34 పరుగుల తేడాతో ఓటమి పాలైన విషయం తెలిసిందే. ఈ గెలుపుతో టైటాన్స్ వరుసగా రెండోసారి ప్లే ఆఫ్స్లో అడుగుపెట్టగా.. రైజర్స్ అధికారికంగా ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించింది. అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన రైజర్స్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. గిల్ సెంచరీతో స్టార్ పేసర్ భువీ.. టైటాన్స్ ఓపెనర్ వృద్ధిమాన్ సాహాను డకౌట్ చేసి శుభారంభం అందించాడు. కానీ మరో ఓపెనర్ శుబ్మన్ గిల్ ఆ ఆనందాన్ని నిలవకుండా చేశాడు. అతడికి వన్డౌన్ బ్యాటర్ సాయి సుదర్శన్ కూడా తోడయ్యాడు. మిగతా వాళ్లంతా సింగిల్ డిజిట్కే పరిమితమైన వేళ గిల్ సెంచరీ(58 బంతుల్లో 101 పరుగులు)తో చెలరేగగా.. సాయి 47 పరుగులతో రాణించాడు. కుప్పకూలిన టాపార్డర్ వీరిద్దరి అద్బుత ప్రదర్శన కారణంగా సొంతమైదానంలో నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి గుజరాత్ 188 పరుగులు స్కోరు చేసింది. భువీ మొత్తంగా 5 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక లక్ష్య ఛేదనకు దిగిన రైజర్స్ టాపార్డర్ కుప్పకూలింది. టైటాన్స్ పేసర్ షమీ ధాటికి కకావికలమైంది. ఓపెనర్లు అన్మోల్ప్రీత్ సింగ్(5), అభిషేక్ శర్మ (4) పూర్తిగా నిరాశపరిచారు. ఇక వన్డౌన్లో వచ్చిన కెప్టెన్ మార్కరమ్(10) వైఫల్యం కొనసాగించాడు. రాహుల్ త్రిపాఠి(1) తప్పుడు షాట్ సెలక్షన్తో వికెట్ పారేసుకున్నాడు. పాపం క్లాసెన్ జట్టు కష్టాల్లో కూరుకుపోయిన వేళ.. ఐదో స్థానంలో బ్యాటింగ్కు వచ్చిన హెన్రిచ్ క్లాసెన్ క్లాస్ బ్యాటింగ్తో ఆకట్టుకున్నాడు. వికెట్ పడకుండా జాగ్రత్తపడుతూనే వీలు చిక్కినప్పుడల్లా ఫోర్లు, సిక్సర్లు బాదాడు. ఓ వైపు టపాటపా వికెట్లు పడుతున్నా.. సంయమనంతో ఓపికగా ఆడాడు. భువీ నుంచి సహకారం అందడంతో 44 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 64 పరుగులు చేశాడు. క్లాసెన్ కారణంగా ఏదో అద్భుతం జరుగబోతుందని ఆశించిన ఆరెంజ్ ఆర్మీ ఆశలపై నీళ్లు చల్లుతూ 17వ ఓవర్ ఐదో బంతికి షమీ అతడిని పెవలియన్కు పంపాడు. తర్వాత భువీ(27) కాసేపు పోరాడినా ఫలితం లేకుండా పోయింది. 34 పరుగుల తేడాతో రైజర్స్ ఓటమిపాలైంది. మార్కరమ్ (PC: IPL) సహకారం అందించలేకపోయాం.. అంతా మావల్లే ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం మార్కరమ్ మాట్లాడుతూ.. ‘మా జట్టులో బంతిని స్వింగ్ చేయగల వరల్డ్ క్లాస్ బౌలర్లు ఉన్నారు. భువీ ఈరోజు అద్భుతంగా ఆడాడు. అతడికి క్రెడిట్ ఇవ్వాల్సిందే! అయితే, శుబ్మన్ తన ఇన్నింగ్స్తో మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు. అతడు అద్భుతం ఇక క్లాసెన్ తాను ఎంతటి అద్భుతమైన బ్యాటరో మరోసారి నిరూపించాడు. క్లాస్ బ్యాటింగ్తో ఆకట్టుకున్నాడు. కానీ మాలో ఒక్కరం కూడా అతడికి సహకారం అందించలేకపోయాం. తన పోరాటం వృథాగా పోవడం నిజంగా దురదృష్టకరం. మిగిలిన రెండు మ్యాచ్లలో కొత్త వాళ్లకు అవకాశాలు ఇచ్చే అంశం గురించి ఆలోచిస్తాం. ఈ ఏడాది కూడా నిరాశగా టోర్నీని ముగించడం బాధిస్తోంది. ఈ మ్యాచ్లో మమ్మల్ని పోటీలో ఉంచేందుకు భువీ శాయశక్తులా ప్రయత్నించాడు. కానీ మేము మ్యాచ్ను కాపాడుకోలేకపోయాం’’ అని విచారం వ్యక్తం చేశాడు. చదవండి: తండ్రి లాంటి వారు చనువుగా, ఏదో తెలిసీ తెలియక తాకితే అపార్థం చేసుకుంటారా? A comprehensive win at home and @gujarat_titans qualify for the #TATAIPL 2023 playoffs 🥳 They register a 34-run win over #SRH 👏🏻👏🏻 Follow the match ▶️ https://t.co/GH3aM3hyup #TATAIPL | #GTvSRH pic.twitter.com/gwUNLVjF0J — IndianPremierLeague (@IPL) May 15, 2023 -
నీకు ఎవడ్రా బాబు కెప్టెన్సీ ఇచ్చింది.. ఒక్క మ్యాచ్లోనైనా ఆడావా?
ఐపీఎల్-2023లో సన్రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ఐడైన్ మార్క్రమ్ మరోసారి దారుణంగా విఫలమయ్యాడు. ఈ మెగా ఈవెంట్లో భాగంగా గుజరాత్ టైటాన్స్తో మ్యాచ్లో కేవలం 10 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్కు చేరాడు. కీలక సమయంలో క్రీజులోకి వచ్చిన మార్క్రమ్.. షమీ బౌలింగ్లో ఔటయ్యాడు. ఇప్పటివరకు ఈ ఏడాది సీజన్లో 12 మ్యాచ్లు ఆడిన ఐడైన్ మార్క్రమ్ 217 పరుగులు మాత్రమే చేశాడు. అతడి ఇన్నింగ్స్లో అత్యధిక స్కోర్గా 50 పరుగులు ఉన్నాయి. మార్క్రమ్ వ్యక్తిగత ప్రదర్శనతోనే కాకుండా కెప్టెన్సీ పరంగా కూడా నిరాశపరిచాడు. తొలిసారి ఎస్ఆర్హెచ్ కెప్టెన్సీ చేపట్టిన మార్క్రమ్ జట్టును నడిపించడంలో విఫలమయ్యాడు. అతడి కెప్టెన్సీలో ఇప్పటి వరకు 10 మ్యాచ్లు ఆడిన ఆరెంజ్ ఆర్మీ.. 4 మ్యాచ్ల్లో మాత్రమే విజయం సాధించింది. ఇక బ్యాటింగ్, కెప్టెన్సీ పరంగా విఫలమైన మార్క్రమ్పై సన్రైజర్స్ అభిమానులు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. మార్క్రమ్కు కెప్టెన్సీ ఇచ్చి సన్రైజర్స్ తప్పు చేసిందని సోషల్మీడియాలో పోస్టులు చేస్తున్నారు. Chase of 189, SRH needed their captain to perform and as always Markram boy chose the right path of academy gone for 10 off 10 balls, strike rate-100🙈😋😍 #GTvSRH pic.twitter.com/wmkMeBU2Rn — TukTuk Academy (@TukTuk_Academy) May 15, 2023 చదవండి: IPL 2023: వారెవ్వా భువీ.. 2 పరుగులు, 4 వికెట్లు! వీడియో వైరల్ -
మార్క్రమ్ చేసిన తప్పు.. ఆలస్యంగా వెలుగులోకి
ఐపీఎల్ 16వ సీజన్లో ఎస్ఆర్హెచ్ ప్లేఆఫ్ అవకాశాలు దాదాపు ముగిసినట్లే. శనివారం లక్నో సూపర్జెయింట్స్తో జరిగిన మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ ఏడు వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. 182 పరుగుల భారీ స్కోరు చేసి కూడా మ్యాచ్ను కాపాడుకోలేకపోయింది. అభిషేక్ శర్మ వేసిన ఇన్నింగ్స్ 16వ ఓవర్ ఎస్ఆర్హెచ్ను ముంచగా.. మిగతా బౌలర్లు కూడా అంతగా రాణించలేకపోయారు. దీంతో ఎస్ఆర్హెచ్ భారీ ఓటమిని మూటగట్టుకుంది. అయితే మ్యాచ్కు ముందు మార్క్రమ్ చేసిన తప్పిదం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రతీ మ్యాచ్కు ముందు ఇచ్చే తుది జట్టు షీట్ను మార్క్రమ్ తప్పుగా ఇచ్చాడు. టాస్ సమయంలో చెప్పిన ఆటగాడి పేరు తుది జట్టులో లేకపోగా.. కనీసం సబ్స్టిట్యూట్గా కూడా లేకపోవడం గమనార్హం. విషయంలోకి వెళితే.. వాస్తవానికి లక్నో సూపర్జెయింట్స్తో మ్యాచ్ ద్వారా యంగ్ బౌలర్ సన్విర్ సింగ్ అరంగేట్రం చేయాల్సింది. మార్క్రమ్ కూడా టాస్ సమయంలో సన్విర్ సింగ్ ఐపీఎల్తో పాటు ఎస్ఆర్హెచ్ తరపున డెబ్యూ చేయనున్నట్లు పేర్కొన్నాడు. కానీ సన్వర్ సింగ్ పేరు ఆ తర్వాత తుది జట్టులో కనిపించలేదు. పొరపాటున అలా జరిగి ఉంటుందిలే అనుకుంటే.. అసలు ఫీల్డింగ్.. బ్యాటింగ్ ఇలా రెండు సమయాల్లోనూ అతను కనిపించలేదు. ఇక వివ్రాంత్ శర్మ రెండో ఇన్నింగ్స్లో ఇంపాక్ట్ సబ్స్టిట్యూట్గా వచ్చాడు. మాజీ క్రికెటర్.. ప్రస్తుతం ఐపీఎల్లో కామెంటేటర్గా పనిచేస్తున్న స్కాట్ స్టైరిస్ ఈ తప్పిదాన్ని గుర్తించాడు. మార్క్రమ్ ఇచ్చిన తప్పుడు షీట్ను కెమెరా ముందు పెట్టాడు. ఆ షీట్లో సన్వర్ సింగ్ పేరు క్రాస్ చేసి నటరాజన్ పేరును పెట్టారు. ''ఒక ఆటగాడికి అరంగేట్రం అని చెప్పి ఇప్పుడు అతని పేరు కనిపించకపోవడం అనేది తప్పు. మ్యాచ్ అరంగేట్రం చేస్తున్నానన్న సంతోషం కాసేపు కూడా లేకుండా చేశారు. దీనికి మార్క్రమ్ బాధ్యత వహించాలి.'' అని పేర్కొన్నాడు. మరో విశేషమేమిటంటే.. సన్వర్ సింగ్ మ్యాచ్ ప్రారంభానికి ముందు ఎస్ఆర్హెచ్ క్యాప్ అందుకున్నాడు. కానీ తుదిజట్టు సహా ఇంపాక్ట్ ప్లేయర్లలో ఎక్కడా అతని పేరు కనిపించలేదు. అయితే ఎస్ఆర్హెచ్ బౌలింగ్ సమయంలో నటరాజన్ను సన్వర్ సింగ్ స్థానంలో ఇంపాక్ట్ ప్లేయర్గా పంపించినట్లు తెలిసింది. అయితే గుజరాత్ టైటాన్స్తో మ్యాచ్లో సన్వర్ సింగ్ ఎస్ఆర్హెచ్ తరపున అరంగేట్రం చేసే అవకాశం ఉంది. These Clowns had submitted wrong teamsheet lmao 😭 pic.twitter.com/sti6OnBX2r — . (@manisayzz) May 14, 2023 చదవండి: ఔటైతే బాధపడతారు.. కానీ ఇక్కడ సీన్ రివర్స్ -
అదే మా కొంపముంచింది.. బౌలర్లు ఒత్తిడికి లోనయ్యారు! చెత్త కెప్టెన్సీ వల్లే ఇదంతా
ఐపీఎల్-2023లో సన్రైజర్స్ హైదరాబాద్ కథ ముగిసింది. ఈ మెగా ఈవెంట్లో భాగంగా శనివారం లక్నో సూపర్ జెయింట్స్తో జరిగిన మ్యాచ్లో ఓటమిపాలైన ఎస్ఆర్హెచ్.. ఈ టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ మ్యాచ్లో 7 వికెట్ల తేడాతో సన్రైజర్స్ పరాజయం పాలైంది. 183 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకోవడంలో ఎస్ఆర్హెచ్ బౌలర్లు విఫలమయ్యారు. ముఖ్యంగా లక్నో ఇన్నింగ్స్ 16 ఓవర్ వేసిన అభిషేక్ శర్మ ఏకంగా 31 పరుగులిచ్చి మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు. ఇక ఈ ఓటమిపై మ్యాచ్ అనంతరం ఎస్ఆర్హెచ్ కెప్టెన్ ఐడైన్ మార్క్రమ్ స్పందించాడు. బ్యాటింగ్లో మరో 20 పరుగులు అదనంగా చేసే ఉంటే ఫలితం మరో విధంగా ఉండేది అని మార్క్రమ్ అన్నాడు. "182 పరుగులు మంచి స్కోర్ అని భావించాం. కానీ దురదృష్టవశాత్తూ డిఫెండ్ చేసుకోలేకపోయాము. మేము తొలుత బ్యాటింగ్ బాగా చేశాం. ఒక మంచి భాగస్వామ్యాన్ని నెలకొల్పి స్కోర్ బోర్డ్ను 200 పరుగులు దాటించే ఉంటే బాగుండేది. మ్యాచ్ జరుగుతున్నా కొద్దీ వికెట్ చాలా నెమ్మదించింది. అందుకు తగ్గట్టుగా ఆరంభం నుంచి మా బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. అయితే స్టోయినిష్, పూరన్ వంటి అద్భుతమైన ఆటగాళ్లు క్రీజులో ఉండడంతో మా బౌలర్లకు కాస్త ఒత్తిడికి లోనయ్యారు. ఫిలిప్స్ అద్భుతంగా బౌలింగ్లో చేయడంతో నేను బౌలింగ్ చేయాల్సిన అవసరం రాలేదు. ఇక మా చివరి మూడు మ్యాచ్ల్లో యువ ఆటగాళ్లకు అవకాశాలు ఇస్తాం" అని పోస్ట్ మ్యాచ్ ప్రేజేంటేషన్లో మార్క్రమ్ పేర్కొన్నాడు. కాగా మార్కండే వంటి రెగ్యూలర్ స్పిన్నర్ ఉన్నప్పటకీ అభిషేక్ శర్మతో బౌలింగ్ చేయించిన మార్క్రమ్పై సన్రైజర్స్ అభిమానులు విమర్శలు వర్షం కురిపిస్తున్నారు. మార్క్రమ్ చెత్త కెప్టెన్సీ వల్లే ఎస్ఆర్హెచ్ ఓడిపోయింది అని సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. చదవండి: IPL 2023: ధోని కెప్టెన్సీపై సునీల్ గవాస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు -
SRH VS LSG: కీలక మ్యాచ్లో తేలిపోయిన మార్క్రమ్, గ్లెన్ ఫిలిప్స్.. వరుస బంతుల్లో..!
ప్లే ఆఫ్స్కు చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ ఆటగాళ్లు తడబడుతున్నారు. ఇన్నింగ్స్ ఆరంభం నుంచి క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయిన సన్రైజర్స్.. ఓ దశలో మార్క్రమ్, క్లాసెన్ ధాటిగా ఆడుతుండటంతో భారీ స్కోర్ సాధిస్తుందని అంతా ఊహించారు. అయితే వీరిద్దరు కృనాల్ పాండ్యా (13వ ఓవర్) బౌలింగ్లో వరస బంతుల్లో పెవిలియన్కు చేరి దారుణంగా నిరాశపరిచారు. మార్క్రమ్ (20 బంతుల్లో 28; 2 ఫోర్లు, సిక్స్) ఓ మోస్తరుగా పరుగులు సాధించగా.. గత మ్యాచ్లో విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడిన గ్లెన్ ఫిలిప్స్ తొలి బంతికే క్లీన్ బౌల్డయ్యాడు. కీలక మ్యాచ్లో వీరిద్దరూ తేలిపోవడంతో భారీ స్కోర్పై గంపెడాశలు పెట్టుకున్న అభిమానులు ఢీలా పడిపోయారు. కాగా, ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న సన్రైజర్స్.. 13 ఓవర్లలో 117 పరుగులు మాత్రమే చేసి సగం వికెట్లు కోల్పోయింది. అన్మోల్ప్రీత్ సింగ్ (36), రాహుల్ త్రిపాఠి (20), మార్క్రమ్ (28) ఓ మోస్తరు స్కోర్లు సాధించగా.. గ్లెన్ ఫిలిప్స్ (0), అభిషేక్ శర్మ (7) దారుణంగా నిరాశపరిచారు. లక్నో బౌలర్లలో కృనాల్ 2, యుద్ద్వీర్ సింగ్, యశ్ ఠాకూర్, అమిత్ మిశ్రా తలో వికెట్ పడగొట్టారు. ప్లే ఆఫ్స్ నేపథ్యంలో లక్నో కంటే సన్రైజర్స్కు ఈ మ్యాచ్ అత్యంత కీలకం. ఈ మ్యాచ్లో మార్క్రమ్ సేన గెలిస్తేనే ప్లే ఆఫ్స్ ఆశలు సజీవంగా ఉంటాయి. చదవండి: లక్నోతో సన్రైజర్స్ కీలక పోరు.. 13 కోట్ల ఆటగాడికి మరో సారి నోఛాన్స్ -
నిమిషాల్లో అంతా తారుమారైంది.. వాళ్ల వల్లే గెలిచాం.. అయితే: మార్కరమ్
IPL 2023 RR Vs SRH: ‘‘నిమిషాల్లో అంతా తారుమారైంది. ఉత్కంఠ పోరులో విజయం మా వైపు నిలిచింది. భావోద్వేగాలు పెల్లుబికాయి. 215 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడం అంత సులువేమీ కాదు. భారీ టార్గెట్ను ఛేజ్ చేసే క్రమంలో జట్టు సమష్టిగా పోరాడింది. ఊహించనదాని కంటే ఎక్కువే స్కోరు చేస్తామని అనుకున్నాం. అదే నిజమైంది. వాస్తవానికి ముందు నుంచే మేము కాస్త దూకుడు ప్రదర్శించాల్సింది’’ అని సన్రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ఎయిడెన్ మార్కరమ్ అన్నాడు. బ్యాటర్ల సమష్టి ప్రదర్శనతోనే గెలుపు వరించిందని సంతోషం వ్యక్తం చేశాడు. నాడు ఘోర పరాభవం ఐపీఎల్-2023లో తమ తొలి మ్యాచ్లో ఉప్పల్లో రాజస్తాన్ రాయల్స్తో తలపడిన సన్రైజర్స్కు చేదు అనుభవం మిగిలిన విషయం తెలిసిందే. సొంతమైదానంలో ఏకంగా 72 పరుగుల భారీ తేడాతో ఓడి ఐపీఎల్ పదహారో ఎడిష్ను ఓటమితో ఆరంభించింది. ఈ క్రమంలో ఆదివారం (మే 7) నాటి మ్యాచ్లో రాజస్తాన్పై ప్రతీకారం తీర్చుకునే అవకాశం వచ్చింది. మరోసారి బట్లర్ విశ్వరూరం జైపూర్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన రాజస్తాన్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. యశస్వి జైశ్వాల్ (18 బంతుల్లో 35 పరుగులు) మెరుగ్గా రాణించగా.. మరో ఓపెనర్ జోస్ బట్లర్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 59 బంతుల్లోనే 10 ఫోర్లు, 4 సిక్స్ల సాయంతో ఏకంగా 95 పరుగులు సాధించాడు. ఇక కెప్టెన్ సంజూ శాంసన్(38 బంతుల్లో 66 పరుగులు) ఆఖర్లో మెరుపులు మెరిపించాడు. అభిషేక్, త్రిపాఠి కలిసి ఈ నేపథ్యంలో నిర్ణీత 20 ఓవర్లలో కేవలం 2 వికెట్లు నష్టపోయి రాజస్తాన్ 214 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఇక లక్ష్య ఛేదనకు దిగిన రైజర్స్ పవర్ ప్లేలో వికెట్ నష్టానికి 52 పరుగులు చేయగలిగింది. ఈ క్రమంలో ఓపెనర్ అభిషేక్ శర్మ(55 పరుగులు)కు తోడైన రాహుల్ త్రిపాఠి అతడితో కలిసి స్కోరు బోర్డును ముందుకు నడిపాడు. అయితే, 13వ ఓవర్లో అశ్విన్ బౌలింగ్లో సిక్స్ బాదిన అభిషేక్.. మరోసారి భారీ షాట్కు యత్నించి పెవిలియన్ చేరడంతో రైజర్స్ రెండో వికెట్ కోల్పోయింది. ఈ క్రమంలో క్రీజులోకి వచ్చిన క్లాసెన్ 12 బంతుల్లో 26 పరుగులు సాధించి 16వ ఓవర్ ఐదో బంతికి పెవిలియన్ చేరాడు. ఫిలిప్స్ అద్భుతం చేశాడు.. 6,6,6,4 ఆ తర్వాత కాసేపటికే త్రిపాఠి(29 బంతుల్లో 47 పరుగులు)ని చహల్ పెవిలియన్కు పంపాడు. దీంతో క్రీజులో(18వ ఓవర్ మూడో బంతి)కి వచ్చిన గ్లెన్ ఫిలిప్స్ తొలుత రెండు పరుగులు, ఆ తర్వాత ఒక పరుగు మాత్రమే తీశాడు. ఇంతలోనే మరో ఎండ్లో ఉన్న మార్కరమ్(6)ను చహల్ ఎల్బీడబ్ల్యూ చేశాడు. నో బాల్ వల్ల అదృష్టం దీంతో రైజర్స్ అవకాశాలు సన్నగిల్లుతున్న తరుణంలో ఫిలిప్స్ అద్భుతం చేశాడు. కుల్దిప్ యాదవ్ బౌలింగ్లో వరుసగా 6,6,6, 4 బాది మ్యాచ్ను మలుపుతిప్పాడు. ఇక ఆఖరి బంతికి హైడ్రామా నెలకొనగా.. సందీప్ శర్మ నోబాల్ కారణంగా రైజర్స్కు అదృష్టం కలిసి వచ్చింది. రాజస్తాన్ నాలుగు వికెట్ల తేడాతో గెలిచిందన్న స్టేట్మెంట్ నిమిషాల్లో తారుమారైంది. ప్రేక్షకులను మునివేళ్ల మీద నిలబెట్టిన మ్యాచ్లో రైజర్స్ నాలుగు వికెట్ల తేడాతో గెలుపొందడంతో ఆరెంజ్ ఆర్మీ సంబరాలు అంబరాన్నంటాయి. వాళ్ల వల్లే గెలిచాం ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం మార్కరమ్ మాట్లాడుతూ.. ‘‘అభిషేక్ మాకు శుభారంభం అందించాడు. త్రిపాఠి అతడికి తోడుగా నిలబడ్డాడు. ఆ తర్వాత ఫిలిప్స్, క్లాసీ అద్భుత పాత్ర పోషించారు. సమద్ ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు. ఒత్తిడి పెరిగినపుడు సరైన టెక్నిక్ను ఉపయోగిస్తే ఇలాంటి ఫలితం వస్తుంది’’ అని తమ బ్యాటర్ల ఆట తీరు పట్ల హర్షం వ్యక్తం చేశాడు. చదవండి: ఇన్నాళ్లు ఎక్కడున్నావ్ ఫిలిప్స్.. బ్రూక్కు వదిలేసి మంచి పని చేసింది..! సాహో సాహా.. టెస్ట్ జట్టులో చోటు కన్ఫర్మ్.. రహానే లాగే..! WHAT. A. GAME 😱😱 Abdul Samad wins it for the @SunRisers as he hits a maximum off the final delivery. #SRH win by 4 wickets. Scorecard - https://t.co/1EMWKvcgh9 #TATAIPL #RRvSRH #IPL2023 pic.twitter.com/yh0WVMEbOz — IndianPremierLeague (@IPL) May 7, 2023 -
IPL 2023: ఉత్కంఠపోరులో ఎస్ఆర్హెచ్ సంచలన విజయం
ఐపీఎల్ 16వ సీజన్లో భాగంగా రాజస్తాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ నాలుగు వికెట్ల తేడాతో సంచలన విజయం సాధించింది. 215 పరుగుల కష్టసాధ్యమైన లక్ష్యాన్ని ఆఖరి బంతికి అందుకొని ఉత్కంఠ విజయాన్ని అందుకుంది. 18వ ఓవర్లో గ్లెన్ పిలిప్స్ 22 పరుగులు పిండుకోవడంతో మ్యాచ్ మలుపు తిరిగింది. ఆఖరి ఓవర్లో 17 పరుగులు అవసరమైన దశలో అబ్దుల్ సమద్, మార్కో జాన్సెన్లు సమయోచితంగా ఆడి ఎస్ఆర్హెచ్ను గెలిపించారు. ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్లో అబిషేక్ శర్మ 55, రాహుల్ త్రిపాఠి 47, గ్లెన్ పిలిప్స్ 25, క్లాసెన్ 26 పరుగులతో రాణించారు. రాజస్తాన్ బౌలర్లలో చహల్ నాలుగు వికెట్లు తీయగా.. అశ్విన్, కుల్దీప్ యాదవ్ చెరొక వికెట్ తీశారు. ఐదో వికెట్ కోల్పోయిన ఎస్ఆర్హెచ్.. చహల్ ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీయడంతో ఎస్ఆర్హెచ్ ఐదో వికెట్ కోల్పోయింది. తొలుత రాహుల్ త్రిపాఠిని వెనక్కి పంపిన చహల్.. మార్క్రమ్ను ఎల్బీగా పెవిలియన్ చేర్చాడు. ప్రస్తుతం ఎస్ఆర్హెచ్ 18 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. క్లాసెన్(26)ఔట్.. మూడో వికెట్ కోల్పోయిన ఎస్ఆర్హెచ్ 26 పరుగులు చేసిన క్లాసెన్ చహల్ బౌలింగ్లో భారీ షాట్కు యత్నించి బట్లర్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం ఎస్ఆర్హెచ్ 17 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. రాహుల్ త్రిపాఠి 47, మార్క్రమ్ 6 పరుగులతో క్రీజులో ఉన్నారు. 14 ఓవర్లలో ఎస్ఆర్హెచ్ 136/2 14 ఓవర్లు ముగిసేసరికి ఎస్ఆర్హెచ్ రెండు వికెట్ల నష్టానికి 136 పరుగులు చేసింది. రాహుల్ త్రిపాఠి 37, క్లాసెన్ 8 పరుగులతో ఆడుతున్నారు. అంతకముందు 55 పరుగులు అభిషేక్ శర్మ అశ్విన్ బౌలింగ్లో చహల్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. 9 ఓవర్లలో ఎస్ఆర్హెచ్ 73/1 ఎస్ఆర్హెచ్ 9 ఓవర్లలో వికెట్ నష్టానికి 73 పరుగులు చేసింది. అభిషేక్ శర్మ 32, రాహుల్ త్రిపాఠి 7 పరుగులతో క్రీజులో ఉన్నారు. టార్గెట్ 215.. ఏడు ఓవర్లలో ఎస్ఆర్హెచ్ 58/1 215 పరుగుల భారీ టార్గెట్తో బరిలోకి దిగిన ఎస్ఆర్హెచ్ ఏడు ఓవర్లలో వికెట్ నష్టానికి 58 పరుగులు చేసింది. అభిషేక్ శర్మ 20, రాహుల్ త్రిపాఠి 4 పరుగులతో క్రీజులో ఉన్నారు. బట్లర్, శాంసన్ విధ్వంసం.. ఎస్ఆర్హెచ్ టార్గెట్ ఎంతంటే? ఎస్ఆర్హెచ్తో మ్యాచ్లో రాజస్తాన్ రాయల్స్ భారీ స్కోరు సాధించింది. బట్లర్, సంజూ శాంసన్ దూకుడుతో రాజస్తాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసింది. జాస్ బట్లర్ (59 బంతుల్లో 95 పరుగులు).. ఐదు పరుగులతో సెంచరీ మిస్ అవ్వగా.. కెప్టెన్ సంజూ శాంసన్(38 బంతుల్లో 66 నాటౌట్) విధ్వంసం సృష్టించాడు. జైశ్వాల్ 35 పరుగులు చేశాడు. ఎస్ఆర్హెచ్ బౌలర్లలో భువనేశ్వర్, మార్కో జాన్సెన్ చెరొక వికెట్ తీశారు. శాంసన్, బట్లర్ దూకుడు.. రాజస్తాన్ 185/1 ఎస్ఆర్హెచ్తో మ్యాచ్లో రాజస్తాన్ రాయల్స్ భారీ స్కోరు దిశగా పయనిస్తోంది. బట్లర్ 91, శాంసన్ 47 పరుగులతో విధ్వంసం సృష్టించడంతో 17 ఓవర్లు ముగిసేసరికి రాజస్తాన్ వికెట్ నష్టానికి 185 పరుగులు చేసింది. బట్లర్ అర్థశతకం.. రాజస్తాన్ 12 ఓవర్లలో 125/1 జాస్ బట్లర్ అర్థ శతకంతో మెరవడంతో రాజస్తాన్ భారీ స్కోరు దిశగా పయనిస్తోంది. ప్రస్తుతం 12 ఓవర్లలో వికెట్ నష్టానికి 125 పరుగులు చేసింది. బట్లర్ 51, శాంసన్ 32 పరుగులతో ఆడుతున్నారు. జైశ్వాల్(35) ఔట్.. రాజస్తాన్ 8 ఓవర్లలో 74/1 35 పరుగులు చేసిన జైశ్వాల్ మార్కో జాన్సెన్ బౌలింగ్లో నటరాజన్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో రాజస్తాన్ తొలి వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం రాజస్తాన్ 8 ఓవర్లలో వికెట్ నష్టానికి 74 పరుగులు చేసింది. జాస్ బట్లర్ 20, సంజూ శాంసన్ 13 పరుగులతో ఆడుతున్నాడు. 3 ఓవర్లలో రాజస్తాన్ రాయల్స్ 35/0 మూడు ఓవర్లు ముగిసేసరికి రాజస్తాన్ రాయల్స్ వికెట్ నష్టపోకుండా 35 పరుగులు చేసింది. యశస్వి జైశ్వాల్ 17, జాస్ బట్లర్ 12 పరుగులతో క్రీజులో ఉన్నారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాజస్తాన్ ఐపీఎల్ 16వ సీజన్లో ఆదివారం జైపూర్ వేదికగా 52వ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్, సన్రైజర్స్ హైదరాబాద్ ఢీ కొంటున్నాయి. జైపూర్లోని స్లో పిచ్ వేదికగా ఇరుజట్లు పోటీ పడతున్నాయి. టాస్ గెలిచిన రాజస్తాన్ రాయల్స్ బ్యాటింగ్ ఎంచుకుంది. Sanju Samson wins the toss and opts for hosts @rajasthanroyals to BAT FIRST tonight!🏏 Watch #RRvSRH, LIVE & FREE on #JioCinema, available on any sim card.#RRvSRH #TATAIPL #IPLonJioCinema #IPL2023pic.twitter.com/OdiLISl766 — JioCinema (@JioCinema) May 7, 2023 సన్రైజర్స్ హైదరాబాద్ (ప్లేయింగ్ XI): అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠి, ఐడెన్ మార్క్రామ్(కెప్టెన్), హెన్రిచ్ క్లాసెన్(వికెట్ కీపర్), గ్లెన్ ఫిలిప్స్, అబ్దుల్ సమద్, మార్కో జాన్సెన్, వివ్రాంత్ శర్మ, మయాంక్ మార్కండే, భువనేశ్వర్ కుమార్, టి నటరాజన్ రాజస్థాన్ రాయల్స్ (ప్లేయింగ్ XI): యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్, సంజు శాంసన్(వికెట్ కీపర్/కెప్టెన్), జో రూట్, ధ్రువ్ జురెల్, షిమ్రాన్ హెట్మెయర్, రవిచంద్రన్ అశ్విన్, మురుగన్ అశ్విన్, సందీప్ శర్మ, కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్ వరుసగా రెండు మ్యాచ్లు ఓడిన సంజూ సేన విజయంపై కన్నేసింది. మరోవైపు వరుస పరాజయాలతో పాయింట్ల పట్టికలో అడుగున ఉన్న హైదరాబాద్ బలమైన రాజస్తాన్ను ఎలా ఎదుర్కొంటుదనేది ఆసక్తిగా మారింది. -
ఓటమిని అస్సలు జీర్ణించుకోలేకపోతున్నాం.. నా వల్లే ఇలా! అతడు మాత్రం..
IPL 2023 SRH Vs KKR: ‘‘ఈ ఓటమిని అస్సలు జీర్ణించుకోలేకపోతున్నాం. ఆఖరి ఓవర్లలో మేము ఇంకాస్త మెరుగ్గా బ్యాటింగ్ చేయాల్సింది. కానీ పని పూర్తి చేయడంలో విఫలమయ్యాం’’ అని సన్రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ఎయిడెన్ మార్కరమ్ విచారం వ్యక్తం చేశాడు. హెన్రిచ్ క్లాసెన్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడన్న మార్కరమ్.. తాను మాత్రం ఆరంభంలో తడబాటుకు లోనయ్యానని.. అదే ఓటమికి దారి తీసిందని ఆవేదన వ్యక్తం చేశాడు. రాణా, రింకూ మెరుగ్గా ఐపీఎల్-2023లో భాగంగా కోల్కతా నైట్ రైడర్స్తో మ్యాచ్లో రైజర్స్ ఆఖరి వరకు పోరాడినా ఫలితం లేకుండా పోయింది. సొంతమైదానంలో 5 పరుగుల తేడాతో కేకేఆర్ చేతిలో పరాజయం పాలైంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన కోల్కతా తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. నితీశ్ రాణా కెప్టెన్ ఇన్నింగ్స్(31 బంతుల్లో 42 పరుగులు)కు తోడు.. రింకూ సింగ్(35 బంతుల్లో 46 పరుగులు) రాణించడంతో మెరుగైన స్కోరు సాధించింది. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. ఈ క్రమంలో లక్ష్య ఛేదనకు దిగిన రైజర్స్ 166 పరుగులకే పరిమితమైంది. మార్కరమ్ (PC: IPL Twitter) క్లాసెన్ రాణించినా ఓపెనర్లు మయాంక్ అగర్వాల్(18), అభిషేక్ శర్మ(9)తో పాటు హ్యారీ బ్రూక్ డకౌట్ కావడం తీవ్ర ప్రభావం చూపింది. ఈ క్రమంలో నాలుగో స్థానంలో వచ్చిన కెప్టెన్ మార్కరమ్.. 40 బంతుల్లో 41 పరుగులు చేయగలిగాడు. ఆరో స్థానంలో వచ్చిన క్లాసెన్ 20 బంతుల్లో 36 పరుగులతో ఆకట్టుకున్నాడు. అదే ప్రభావం చూపింది అయితే, ఆఖరి ఓవర్లో విజయానికి 9 పరుగులు అవసరమైన నేపథ్యంలో కేకేఆర్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి తన మాయాజాలంతో రైజర్స్ను కట్టడి చేశాడు. చివరి ఓవర్లో కేవలం 3 పరుగులే రావడంతో హైదరాబాద్ ఓటమి ఖరారైంది. ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం మార్కరమ్ మాట్లాడుతూ.. తాను ఆరంభంలో బంతులు వృథా చేయడం ప్రభావం చూపిందని పేర్కొన్నాడు. ఇదో గుణపాఠం ‘‘బౌలర్లు మెరుగైన ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. మాకు శుభారంభమే లభించింది. కానీ.. లక్ష్య ఛేదనలో తడబడ్డాం. ఈ ఓటమిని జీర్ణించుకోవడం కష్టంగా ఉంది. మా ప్రణాళికలు సరిగ్గా అమలు చేయలేకపోయాం. ఇదొక గుణపాఠం. లోపాలు సవరించుకుని ముందుకు సాగుతాం’’ అని మార్కరమ్ చెప్పుకొచ్చాడు. కాగా విజయంతో ఈడెన్ గార్డెన్స్లో తమకు ఎదురైన పరాభవానికి రైజర్స్పై కేకేఆర్ ప్రతీకారం తీర్చుకున్నట్లయింది. కేకేఆర్ గెలుపులో కీలక పాత్ర పోషించిన వరుణ్ చక్రవర్తి(4 ఓవర్లలో 20 పరుగులు ఇచ్చి ఒక వికెట్) ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. చదవండి: IPL 2023: లిటన్ దాస్ స్థానంలో బిగ్ హిట్టర్.. ఇక నేను బాగా ఆడినపుడే.. నాకు క్రెడిట్ దక్కకుండా చేస్తాడు: ఇషాన్ కిషన్ #KKR clinch a nail-biter here in Hyderabad as Varun Chakaravarthy defends 9 runs in the final over.@KKRiders win by 5 runs. Scorecard - https://t.co/dTunuF3aow #TATAIPL #SRHvKKR #IPL2023 pic.twitter.com/g9KGaBbADy — IndianPremierLeague (@IPL) May 4, 2023 -
సంచలన క్యాచ్తో మెరిసిన ఎస్ఆర్హెచ్ కెప్టెన్
ఐపీఎల్ 16వ సీజన్లో ఎస్ఆర్హెచ్ కెప్టెన్ ఐడెన్ మార్క్రమ్ సంచలన క్యాచ్తో మెరిశాడు. కేకేఆర్తో మ్యాచ్లో మార్క్రమ్ ఈ ఫీట్ సాధించాడు. విషయంలోకి వెళితే.. 35 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన తర్వాత కెప్టెన్ నితీశ్ రానా, రింకూ సింగ్లు ఇన్నింగ్స్ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు. నాలుగో వికెట్కు దాదాపు 60 పరుగులు జోడించారు. ఈ జోడి బలపడుతున్న సమయంలో ఇక లాభం లేదని మార్క్రమ్ తానే బౌలింగ్కు దిగాడు. తొలి బంతికి రింకూ సింగ్ సింగిల్ తీయగా.. రెండో బంతిని నితీశ్ రానా లాంగాన్ దిశగా గాల్లోకి లేపాడు. అయితే మార్క్రమ్ లాంగాన్ దిశగా దాదాపు 30 గజాల దూరం పరిగెత్తి డైవ్ చేస్తూ అద్బుతంగా క్యాచ్ తీసుకోవడంతో కేకేఆర్ కెప్టెన్ 42 పరుగుల ఇన్నింగ్స్కు తెరపడింది. ఈ సీజన్లో వన్ ఆఫ్ ది బెస్ట్ క్యాచెస్ జాబితాలో చోటు సంపాదించింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. Just something about Proteas and 👌🏻 fielding efforts... @AidzMarkram's 💥 catch sends the #KKR skipper packing 🔙#IPLonJioCinema #TATAIPL #IPL2023 pic.twitter.com/bAn65remH3 — JioCinema (@JioCinema) May 4, 2023 చదవండి: తీవ్ర గాయం.. ప్రమాదంలో పాక్ క్రికెటర్ భవితవ్యం! -
IPL 2023: ఎస్ఆర్హెచ్ వర్సెస్ కేకేఆర్ మ్యాచ్ అప్డేట్స్
IPL 2023: SRH Vs KKR Match Live Updates: మార్క్రమ్(41)ఔట్.. ఆరో వికెట్ డౌన్ 41 పరుగులు చేసిన మార్క్రమ్ వైభవ్ అరోరా బౌలింగ్లో రింకూ సింగ్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో ఎస్ఆర్హెచ్ 145 పరుగుల వద్ద ఆరో వికెట్ కోల్పోయింది. క్లాసెన్(36) ఔట్.. ఎస్ఆర్హెచ్ 134/5 హెన్రిచ్ క్లాసెన్(36) రూపంలో ఎస్ఆర్హెచ్ ఐదో వికెట్ నష్టపోయింది. మార్క్రమ్తో కలిసి ఐదో వికెట్కు 50కి పైగా పరుగులు జోడించిన క్లాసెన్ ఠాకూర్ బౌలింగ్లో భారీ షాట్కు యత్నించి రసెల్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం ఎస్ఆర్హెచ్ ఐదు వికెట్ల నష్టానికి 134 పరుగులు చేసింది. మార్క్రమ్ 39, అబ్దుల్ సమద్ ఐదు పరుగులతో ఆడుతున్నారు. బ్రూక్ డకౌట్.. నాలుగు వికెట్లు కోల్పోయిన ఎస్ఆర్హెచ్ 172 పరుగుల టార్గెట్తో బరిలోకి దిగిన ఎస్ఆర్హెచ్ కష్టాల్లో పడింది. హ్యారీ బ్రూక్ డకౌట్గా వెనుదిరగడంతో నాలుగో వికెట్ నష్టపోయింది. ప్రస్తుతం ఎస్ఆర్హెచ్ 4 వికెట్ల నష్టానికి 61 పరుగులు చేసింది. మార్క్రమ్ 2, క్లాసెన్ ఐదు పరుగులతో ఆడుతున్నారు. టార్గెట్ 172.. 38 పరుగులకు రెండు వికెట్లు డౌన్ 172 పరుగుల టార్గెట్తో బరిలోకి దిగిన ఎస్ఆర్హెచ్ 5 ఓవర్లు ముగిసేసరికి రెండు వికెట్ల నష్టానికి 38 పరుగులు చేసింది. రాహుల్ త్రిపాఠి 6, మార్క్రమ్ సున్నా పరుగులతో క్రీజులో ఉన్నారు. అంతకముందు అభిషేక్ శర్మ 9, మయాంక్ అగర్వాల్ 18 పరుగులు చేసి ఔటయ్యారు. Photo Credit : IPL Website ఎస్ఆర్హెచ్ టార్గెట్ 172 ఎస్ఆర్హెచ్తో మ్యాచ్లో కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. రింకూ సింగ్ 46 పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా.. కెప్టెన్ నితీశ్రానా 42 పరుగులు చేశాడు. ఎస్ఆర్హెచ్ బౌలర్లలో మార్కో జాన్సన్, టి. నటరాజన్లు చెరో రెండె వికెట్లు తీయగా.. భువనేశ్వర్, కార్తిక్ త్యాగి, మార్క్రమ్, మయాంక్ మార్కండేలు తలా ఒక వికెట్ తీశారు. Photo Credit : IPL Website 16 ఓవరల్లో కేకేఆర్ 137/6 16 ఓవర్లు ముగిసేసరికి కేకేఆర్ ఆరు వికెట్ల నష్టానికి 137 పరుగులు చేసింది. రింకూ సింగ్ 29, శార్దూల్ ఠాకూర్ ఆరు పరుగులతో ఆడుతున్నారు. Photo Credit : IPL Website నాలుగో వికెట్ కోల్పోయిన కేకేఆర్ 42 పరుగులు చేసిన నితీశ్ రానా మార్క్రమ్ స్టన్నింగ్ క్యాచ్కు వెనుదిరిగాడు. అతని బౌలింగ్లో భారీ షాట్కు యత్నించి కాట్ అండ్ బౌల్డ్ అయ్యాడు. ప్రస్తుతం కేకేఆర్ 12 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 103 పరుగులు చేసింది. రింకూ సింగ్ 22, రసెల్ ఆరు పరుగులతో క్రీజులో ఉన్నారు. Photo Credit : IPL Website 9 ఓవర్లలో కేకేఆర్ స్కోరు 73/3 9 ఓవర్లు ముగిసేసరికి కేకేఆర్ మూడు వికెట్ల నష్టానికి 73 పరుగులు చేసింది. నితీశ్ రానా 24, రింకూ సింగ్ 17 పరుగులతో క్రీజులో ఉన్నారు. Photo Credit : IPL Website 35 పరుగులకే మూడు వికెట్లు డౌన్ 35 పరుగుల వద్ద కేకేఆర్ మూడో వికెట్ కోల్పోయింది. 20 పరుగులు చేసిన జేసన్ రాయ్ కార్తిక్ త్యాగి బౌలింగ్లో మయాంక్ అగర్వాల్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. Photo Credit : IPL Website 16 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన కేకేఆర్ ఎస్ఆర్హెచ్తో మ్యాచ్లో కేకేఆర్కు ఆరంభంలోనే షాక్ తగిలింది. 16 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. మార్కో జాన్సన్ ఒకే ఓవర్లో రెండు వికెట్లు పడగొట్టడం విశేషం. Photo Credit : IPL Website టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కేకేఆర్ ఐపీఎల్ 16వ సీజన్లో హైదరాబాద్ వేదికగా 47వ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్, కేకేఆర్ తలపడుతున్నాయి. టాస్ గెలిచిన కేకేఆర్ బ్యాటింగ్ ఎంచుకుంది. సన్రైజర్స్ హైదరాబాద్ (ప్లేయింగ్ XI): మయాంక్ అగర్వాల్, అభిషేక్ శర్మ, ఐడెన్ మార్క్రమ్ (కెప్టెన్), హెన్రిచ్ క్లాసెన్ (వికెట్ కీపర్), హ్యారీ బ్రూక్, అబ్దుల్ సమద్, మార్కో జాన్సెన్, మయాంక్ మార్కండే, భువనేశ్వర్ కుమార్, కార్తీక్ త్యాగి, టి నటరాజన్ కోల్కతా నైట్ రైడర్స్ (ప్లేయింగ్ XI): రహ్మానుల్లా గుర్బాజ్(వికెట్ కీపర్), జాసన్ రాయ్, వెంకటేష్ అయ్యర్, నితీష్ రాణా(కెప్టెన్), ఆండ్రీ రస్సెల్, రింకూ సింగ్, సునీల్ నరైన్, శార్దూల్ ఠాకూర్, వైభవ్ అరోరా, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి Nitish Rana calls right at the toss & @KKRiders choose to BAT FIRST tonight🏏 Watch #SRHvKKR, LIVE & FREE on #JioCinema, available on any sim card.#TATAIPL #IPLonJioCinema #IPL2023 pic.twitter.com/A6QyPUh2nt — JioCinema (@JioCinema) May 4, 2023 గత మ్యాచ్లో విజయంతో ఎస్ఆర్హెచ్ వరుస ఓటములకు బ్రేక్ వేసింది. ఇక కేకేఆర్ మాత్రం ఒక మ్యాచ్లో గెలుపు.. మరో మ్యాచ్లో ఓటమి అన్నట్లుగా సాగుతుంది. ఈ సీజన్లో ఇరుజట్ల మధ్య జరిగిన మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ విజయం సాధించింది. హ్యారీ బ్రూక్ సెంచరీ సాధించింది ఈ మ్యాచ్లోనే. -
SRH Vs KKR: కేకేఆర్తో పోరుకు సన్రైజర్స్ సై! అతడికి నో ఛాన్స్!
IPL 2023 SRH Vs KKR: సొంతగడ్డపై.. కోల్కతా నైట్ రైడర్స్తో పోరుకు సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు సిద్ధమైంది. ఉప్పల్లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో గురువారం ఇరు జట్ల మధ్య మ్యాచ్ జరుగనుంది. ఐపీఎల్-2023లో గత మ్యాచ్లో కేకేఆర్ను ఓడించిన రైజర్స్.. కోల్కతాపై విజయపరంపరను కొనసాగించాలని పట్టుదలగా ఉంది. మరోవైపు ఈడెన్ గార్డెన్స్తో ఎదురైన పరాభవానికి బదులు తీర్చుకోవాలని నితీశ్ రాణా సేన ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ మ్యాచ్ మరింత రసవత్తరంగా మారనుంది. కాగా ఈ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ ఒకే ఒక మార్పుతో బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. ఒకే ఒక మార్పు.. ! రాయ్ వచ్చేస్తున్నాడు! దాదాపుగా ఢిల్లీ క్యాపిటల్స్తో మ్యాచ్ ఆడిన జట్టునే కొనసాగించనున్న రైజర్స్.. అకీల్ హొసేన్ స్థానంలో మార్కో జాన్సెన్ను తీసుకురావాలనే యోచనలో ఉన్నట్లు సమాచారం. మరోవైపు.. ఇంగ్లంగ్ విధ్వంసకర వీరుడు జేసన్ రాయ్ పూర్తి ఫిట్గా ఉన్న నేపథ్యంలో కేకేఆర్ డేవిడ్ వీజ్ స్థానాన్ని అతడితో భర్తీ చేయనున్నట్లు తెలుస్తోంది. రాయ్ రాకతో కోల్కతా బ్యాటింగ్ ఆర్డర్ పటిష్టం కానుంది. కాగా ఇప్పటి వరకు మూడు మ్యాచ్లు ఆడిన జేసన్ రాయ్ 160 పరుగులు చేశాడు. ఇందులో ఓ అర్థ శతకం(61) ఉంది. ముఖాముఖి పోరులో ఐపీఎల్లో ఇప్పటి వరకు ఎస్ఆర్హెచ్- కేకేఆర్ మధ్య 24 మ్యాచ్లు జరిగాయి. ఇందులో హైదరాబాద్ కేవలం తొమ్మిదింట విజయాలు సాధించగా.. 15 సార్లు గెలుపు కేకేఆర్ననే వరించింది. అయితే, గత మ్యాచ్లో కేకేఆర్పై 23 పరుగులతో పైచేయి సాధించడం ద్వారా ఎస్ఆర్హెచ్ పూర్తి ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగనుంది. పిచ్, వాతావరణం ఆకాశం మేఘావృతమై ఉన్న నేపథ్యంలో వర్షం పడే సూచనలు కనిపిస్తున్నాయి. పిచ్పై పచ్చిక ఉన్న నేపథ్యంలో ఫాస్ట్బౌలర్లకు అనుకూలించే పరిస్థితి ఉంది. ఎస్ఆర్హెచ్ వర్సెస్ కేకేఆర్ తుది జట్లు(అంచనా) సన్రైజర్స్ హైదరాబాద్ అభిషేక్ శర్మ, మయాంక్ అగర్వాల్, రాహుల్ త్రిపాఠి, ఎయిడెన్ మార్కరమ్ (కెప్టెన్), హ్యారీ బ్రూక్, హెన్రిచ్ క్లాసెన్ (వికెట్ కీపర్), అబ్దుల్ సమద్, మార్కో జాన్సెన్, భువనేశ్వర్ కుమార్, మయాంక్ మార్కండే, ఉమ్రాన్ మాలిక్. కోల్కతా నైట్ రైడర్స్ జేసన్ రాయ్, రహ్మానుల్లా గుర్బాజ్ (వికెట్ కీపర్), వెంకటేష్ అయ్యర్, నితీష్ రాణా (కెప్టెన్), ఆండ్రీ రస్సెల్, రింకూ సింగ్, శార్దూల్ ఠాకూర్, సునీల్ నరైన్, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి, సుయాష్ శర్మ. చదవండి: నేను బాగా ఆడినపుడే.. నాకు క్రెడిట్ దక్కకుండా చేస్తాడు: ఇషాన్ కిషన్ చిన్నప్పటి నుంచే అశ్విన్కు నాపై క్రష్! స్కూల్ మొత్తం తెలుసు! ఓరోజు.. It's time for Physix practicals says Prof. Klaasen 🥼🔥 pic.twitter.com/CHNQ0LKF8P — SunRisers Hyderabad (@SunRisers) May 4, 2023 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4381453179.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
ఒక్కోసారి అలా జరుగుతుంది.. బాధపడాల్సిన అవసరం లేదు.. వాళ్లిద్దరి వల్లే ఇలా: మార్కరమ్
IPL 2023- SRH Won by 9 Runs On Delhi Capitals: ‘‘జట్టు సమష్టి ప్రదర్శన కారణంగానే ఈ విజయం సాధ్యమైంది. మా ఆటగాళ్ల అద్భుత నైపుణ్యాలకు తోడు గెలవాలన్న వారి పట్టుదలే ఇక్కడిదాకా తీసుకువచ్చింది. మనం సరైన వ్యూహాలు రచించినపుడు కూడా ఒక్కోసారి ఫలితాలు అనుకూలంగా రాకపోవచ్చు. అంతమాత్రాన బాధపడాల్సిన అవసరం లేదు. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే ఇలాంటి ఫలితాలు దక్కుతాయి. సరైన సమయంలో రాణించి మా జట్టు విజయం అందుకుంది’’ అని సన్రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ఎయిడెన్ మార్కరమ్ సంతోషం వ్యక్తం చేశాడు. ఐపీఎల్-2023లో ఢిల్లీ క్యాపిటల్స్తో మ్యాచ్లో రైజర్స్ జయకేతనం ఎగురవేసిన విషయం తెలిసిందే. ఆఖరి ఓవర్ వరకు నువ్వా- నేనా అన్నట్లు శనివారం హోరాహొరీగా సాగిన పోరులో ఎట్టకేలకు మార్కరమ్ బృందం 9 పరుగుల తేడాతో గెలుపొందింది. సొంతగడ్డపై ఢిల్లీని ఓడించి ఉప్పల్లో జరిగిన పరాభవానికి బదులు తీర్చుకుంది. అదరగొట్టిన అభిషేక్, క్లాసీ క్లాసెన్ ఢిల్లీలోని అరుణ్జైట్లీ స్టేడియంలో టాస్ గెలిచిన సన్రైజర్స్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్ అభిషేక్ శర్మ (36 బంతుల్లో 12 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 67 పరుగులు) మినహా టాపార్డర్ పూర్తిగా విఫలమైనప్పటికీ.. వికెట్ కీపర్ బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్ (27 బంతుల్లో 53 పరుగులు నాటౌట్) అద్భుత ఇన్నింగ్స్తో జట్టును ఆదుకున్నాడు. దంచికొట్టిన సాల్ట్, మిచెల్ ఆఖర్లో అబ్దుల్ సమద్(28 పరుగులు), అకీల్ హొసేన్ (16 పరుగులు నాటౌట్) తమ వంతు పాత్ర పోషించాడు. ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో సన్రైజర్స్ 6 వికెట్లు నష్టపోయి 197 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనకు దిగిన ఢిల్లీకి రైజర్స్ స్టార్ పేసర్ భువనేశ్వర్ కుమార్ ఆరంభంలోనే షాకిచ్చినప్పటికీ.. ఫిలిప్ సాల్ట్(59), మిచెల్ మార్ష్(63) ఇన్నింగ్స్ను చక్కదిద్దే బాధ్యత తీసుకున్నారు. అయితే, వీరిద్దరు అవుటైన తర్వాత ఢిల్లీ పతనం ఆరంభమైంది. ఆఖర్లో అక్షర్ పటేల్ (14 బంతుల్లో 29 పరుగులు) మెరుపులు మెరిపించినా ఫలితం లేకుండా పోయింది. 9 పరుగుల తేడాతో వార్నర్ బృందానికి రైజర్స్ చేతిలో ఓటమి తప్పలేదు. ఢిల్లీపై గెలుపుతో సన్రైజర్స్ ఈ సీజన్లో మూడో విజయం అందుకుని పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానానికి చేరుకుంది. వాళ్లిద్దరు అద్భుతం.. మా బౌలర్లు కూడా ఈ నేపథ్యంలో విజయానంతరం రైజర్స్ కెప్టెన్ మార్కరమ్ మాట్లాడుతూ.. ‘‘అభిషేక్ ఆరంభం నుంచి అదరగొట్టాడు. అద్భుత ఫామ్లో ఉన్న క్లాసీ(క్లాసెన్) అతడికి తోడయ్యాడు. ఆత్మవిశ్వాసంతో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. మాకు ఎదురైన పరాభవానికి బదులు తీర్చుకోవడం సంతోషంగా ఉంది. మా బౌలర్లు పట్టుదలగా నిలబడ్డారు. ప్రత్యర్థి ఆట కట్టించారు. ఈ విజయం మాలో విశ్వాసాన్ని మరింత పెంచింది. ఇక సొంతగడ్డపై కూడా విజయపరంపర ఇలాగే కొనసాగించాలని భావిస్తున్నాం’’ అని పేర్కొన్నాడు. కాగా మే 4న సన్రైజర్స్ ఉప్పల్ వేదికగా కోల్కతా నైట్రైడర్స్తో తమ తదుపరి మ్యాచ్లో తలపడనుంది. చదవండి: డబ్ల్యూటీసీ ఫైనల్కు ముందు ఆసీస్కు పుజారా వార్నింగ్.. 3 మ్యాచ్ల్లో 2 సెంచరీలు DC VS SRH: ప్రపంచంలో ఇతనికి మించిన ఆల్రౌండర్ లేడు.. ఓడినా పర్లేదు..! The Delhi Capitals came close to the target but it's @SunRisers who emerge victorious in Delhi 👏🏻👏🏻#SRH register a 9-run victory over #DC 👌🏻👌🏻 Scorecard ▶️ https://t.co/iOYYyw2zca #TATAIPL | #DCvSRH pic.twitter.com/S5METD41pF — IndianPremierLeague (@IPL) April 29, 2023 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4381453179.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
ఢిల్లీ క్యాపిటల్స్పై 9 పరుగుల తేడాతో ఎస్ఆర్హెచ్ విజయం
ఐపీఎల్ 16వ సీజన్లో ఎస్ఆర్హెచ్ మూడో విజయాన్ని నమోదు చేసింది. శనివారం ఢిల్లీ క్యాపటల్స్తో జరిగిన మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ 9 పరుగుల తేడాతో విజయం అందుకుంది. 198 పరుగుల టార్గెట్తో బరిలోకి దిగిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. మిచెల్ మార్ష్ 63, ఫిల్ సాల్ట్ 59 పరుగులు చేసి మంచి ఆరంభాన్ని ఇచ్చినప్పటికి మిగతావారు విఫలం కావడంతో ఢిల్లీ చేజేతులా ఓటమిని కొనితెచ్చుకుంది. ఎస్ఆర్హెచ్ బౌలర్లలో మయాంక్ మార్కండే రెండు వికెట్లు తీయగా.. నటరాజన్, భువనేశ్వర్, అభిషేక్ శర్మ, అకిల్ హొసెన్లు తలా ఒక వికెట్ తీశారు. 18 ఓవర్లలో ఢిల్లీ క్యాపిటల్స్ 163/6 18 ఓవర్లు ముగిసేసరికి ఢిల్లీ క్యాపిటల్స్ ఆరు వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది.. అక్షర్ పటేల్ 14, రిపల్ పటేల్ 3 పరుగులతో క్రీజులో ఉన్నారు. మిచెల్ మార్ష్(63) ఔట్.. నాలుగో వికెట్ కోల్పోయిన ఢిల్లీ. ప్రస్తుతం ఢిల్లీ స్కోరు 125/4గా ఉంది మూడో వికెట్ కోల్పోయిన ఢిల్లీ క్యాపిటల్స్ 198 పరుగుల టార్గెట్తో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ మూడో వికెట్ కోల్పోయింది. ఒక్క పరుగు మాత్రమే చేసిన మనీష్ పాండే అత్యంత పేలవంగా స్టంపౌట్ అయ్యాడు. ప్రస్తుతం ఢిల్లీ మూడు వికెట్ల నష్టానికి 125 పరుగులు చేసింది. దంచుతున్న మార్ష్, పిలిప్ సాల్ట్.. ఢిల్లీ 97/1 ఎస్ఆర్హెచ్తో మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ దాటిగా ఆడుతుంది. 9 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 97 పరుగులు చేసింది. మార్ష్ 47, పిలిప్ సాల్ట్ 49 పరుగులతో ఆడుతున్నారు. ఆరు ఓవర్లలో ఢిల్లీ క్యాపిటల్స్ 57/1 198 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ ఆరు ఓవర్లలో వికెట్ నష్టానికి 57 పరుగులు చేసింది. పిలిప్ సాల్ట్ 36, మిచెల్ మార్ష్ 20 పరుగులతో క్రీజులో ఉన్నారు. Photo Credit : IPL Website క్లాసెన్, అభిషేక్ శర్మ మెరుపులు.. ఢిల్లీ క్యాపిటల్స్ టార్గెట్ 198 ఐపీఎల్ 16వ సీజన్లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్తో మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ భారీస్కోరు చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 197 పరుగులు చేసింది. హెన్రిచ్ క్లాసెన్ 27 బంతుల్లో 53 పరుగులు నాటౌట్ తొలి అర్థసెంచరీతో మెరవగా.. అభిషేక్ శర్మ 36 బంతుల్లో 67 పరుగులతో రాణించాడు. ఢిల్లీ బౌలర్లలో మిచెల్ మార్ష్ నాలుగు వికెట్లతో చెలరేగాడు. 17 ఓవర్లలో ఎస్ఆర్హెచ్ 162/6 17 ఓవర్లు ముగిసేసరికి ఎస్ఆర్హెచ్ ఆరు వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. 28 పరుగులు చేసిన అబ్దుల్ సమద్ మిచెల్ మార్ష్ బౌలింగ్లో కీపర్ పిలిప్ సాల్ట్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. 13 ఓవర్లలో ఎస్ఆర్హెచ్ 120/5 13 ఓవర్లలో ఎస్ఆర్హెచ్ ఐదు వికెట్ల నష్టానికి 120 పరుగులు చేసింది. అబ్దుల్ సమద్ 8, క్లాసెన్ 17 పరుగులతో ఆడుతున్నారు. Photo Credit : IPL Website 11 ఓవర్లలో ఎస్ఆర్హెచ్ 107/4 11 ఓవర్లలో ఎస్ఆర్హెచ్ నాలుగు వికెట్ల నష్టానికి 107 పరుగులు చేసింది. అభిషేక్ శర్మ 66, క్లాసెన్ 12 పరుగులతో ఆడుతున్నారు. అంతకముందు మార్క్రమ్ 8 పరుగులు వద్ద ఔట్ కాగా.. హ్యారీ బ్రూక్ డకౌట్గా వెనుదిరిగాడు. Photo Credit : IPL Website అభిషేక్ శర్మ ఫిఫ్టీ.. ఎస్ఆర్హెచ్ 83/2 ఎస్ఆర్హెచ్ ఓపెనర్ అభిషేక్ శర్మ హాఫ్ సెంచరీతో మెరిశాడు. సిక్సర్తో ఫిఫ్టీ మార్క్ అందుకోవడం విశేషం. ప్రస్తుతం ఎస్ఆర్హెచ్ రెండు వికెట్ల నష్టానికి 79 పరుగులు చేసింది. అభిషేక్ 57, మార్క్రమ్ 8 పరుగులతో ఆడుతున్నారు. ఆరు ఓవర్లలో ఎస్ఆర్హెచ్ 62/2 ఢిల్లీ క్యాపిటల్స్తో మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ ఆరు ఓవర్లు ముగిసేసరికి రెండు వికెట్ల నష్టానికి 62 పరుగులు చేసింది. అభిషేక్ శర్మ 43, మార్క్రమ్ 2 పరుగులతో క్రీజులో ఉన్నారు. Photo Credit : IPL Website టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఎస్ఆర్హెచ్ ఐపీఎల్ 16వ సీజన్లో భాగంగా శనివారం ఢిల్లీ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్, ఎస్ఆర్హెచ్ తలపడుతున్నాయి. టాస్ గెలిచిన ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఢిల్లీ క్యాపిటల్స్ (ప్లేయింగ్ XI): డేవిడ్ వార్నర్ (కెప్టెన్), ఫిలిప్ సాల్ట్ (వికెట్కీపర్), మిచెల్ మార్ష్, మనీష్ పాండే, ప్రియమ్ గార్గ్, అక్షర్ పటేల్, రిపాల్ పటేల్, కుల్దీప్ యాదవ్, అన్రిచ్ నార్ట్జే, ఇషాంత్ శర్మ, ముఖేష్ కుమార్ సన్రైజర్స్ హైదరాబాద్ (ప్లేయింగ్ XI): హ్యారీ బ్రూక్, మయాంక్ అగర్వాల్, రాహుల్ త్రిపాఠి, ఐడెన్ మార్క్రామ్(కెప్టెన్), హెన్రిచ్ క్లాసెన్(వికెట్కీపర్), అభిషేక్ శర్మ, అబ్దుల్ సమద్, అకేల్ హోసేన్, భువనేశ్వర్ కుమార్, మయాంక్ మార్కండే, ఉమ్రాన్ మాలిక్ Meanwhile, in Delhi, @SunRisers win the toss & elect to bat first! Who will come out victorious in the capital? 💬👇#DCvSRH #IPLonJioCinema #TATAIPL pic.twitter.com/Jwsvh30otU — JioCinema (@JioCinema) April 29, 2023 వరుస పరాజయాలతో సతమతమవుతున్న ఎస్ఆర్హెచ్ ఈ మ్యాచ్లోనైనా గెలిచి గాడిలో పడుతుందేమో చూడాలి. మరోవైపు ఢిల్లీ క్యాపిటల్స్ మూడో విజయంపై కన్నేసింది. -
'ఇంత దారుణమా.. ఎస్ఆర్హెచ్కే ఇది చెల్లింది!'
ఐపీఎల్ 16వ సీజన్లో ఎస్ఆర్హెచ్ వైఫల్యం కొనసాగుతుంది. సీజన్లో ఏడు మ్యాచ్లాడిన ఎస్ఆర్హెచ్ కేవలం రెండు మ్యాచ్ల్లో మాత్రమే నెగ్గి పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో నిలిచింది. అయితే రోజురోజుకు ఎస్ఆర్హెచ్ ఆట దిగజారిపోతుంది. ఈ సీజన్లో వరుస విజయాలతో దుమ్మురేపుతున్న జట్లను ఎస్ఆర్హెచ్ ఓడించలేదంటే ఒక అర్థం ఉంది. కానీ సీజన్లో వరుసగా ఐదు ఓటములు చవిచూసి ఆఖరిస్థానంలో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్తో చేతిలోనే పరాభవం ఎదుర్కోవడం ఎస్ఆర్హెచ్ అభిమానులను ఆశ్చర్యం కలిగించింది. వాస్తవానికి మ్యాచ్కు ముందు ఢిల్లీ క్యాపిటల్స్ కంటే ఎస్ఆర్హెచ్ ఫెవరెట్గా కనిపించింది. ముందు బౌలింగ్ చేసి ఢిల్లీని తక్కువ స్కోరుకే పరిమితం చేయడంతో అరె ఎస్ఆర్హెచ్ మరో విజయాన్ని ఖాతాలో వేసుకుంటుందిలే అని అంతా అనుకున్నారు. కానీ సీన్ మొత్తం రివర్స్ అయింది. ఢిల్లీ క్యాపిటల్స్ ఇచ్చిన 145 పరుగుల సాధారణ లక్ష్యాన్ని అందుకోవడానికి ఎస్ఆర్హెచ్ కిందామీదా పడింది. నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 137 పరుగులు మాత్రమే చేసి ఏడు పరుగుల తేడాతో పరాజయం పాలైంది. వాషింగ్టన్ సుందర్ ఆఖరి వరకు క్రీజులో ఉన్నప్పటికి జట్టును గెలిపించలేకపోయాడు. బౌలింగ్లో మూడు వికెట్లు తీసి.. బ్యాటింగ్లో 15 బంతుల్లో 24 పరుగులతో రాణించి ఫామ్లోకి వచ్చాడంటూ ఊదరగొట్టినా ఉపయోగం లేకుండా పోయింది. నిజానికి సీఎస్కేతో మ్యాచ్ సందర్భంగానే తొలుత బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్హెచ్ అష్టకష్టాలు పడింది. అదే చెత్త బ్యాటింగ్ను సోమవారం ఢిల్లీ క్యాపిటల్స్పై ప్రదర్శించింది. ధాటిగా ఆడిన హెన్రిచ్ క్లాసెన్ను మార్క్రమ్ కంటే ముందే పంపించి ఉంటే ఫలితం కచ్చితంగా వేరుగా ఉండేది. ఒక రకంగా చేజేతులా ఎస్ఆర్హెచ్ ఓటమిని కొనితెచ్చుకుంది. ఈ ఓటమిని జీర్ణించుకోలేని ఎస్ఆర్హెచ్ అభిమానులు సోషల్ మీడియాలో ట్రోల్స్ వర్షం కురిపించారు. ముఖ్యంగా ''ఎస్ఆర్హెచ్ను బ్యాన్ చేయండి'' అనేది ఎక్కువగా కనిపించింది.. ''ఇంత దారుణమా.. ఆఖరికి ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో కూడా ఓడారు'' అంటూ కామెంట్ చేశారు. చదవండి: 'వార్నర్ను పక్కన పెట్టి అతడికి ఢిల్లీ కెప్టెన్సీ ఇవ్వండి' -
అదే మా ఓటమికి కారణం.. అస్సలు ఊహించలేదు! ఆ మాట చెప్పడానికి సిగ్గులేదు
ఐపీఎల్-2023లో వరుసగా ఎస్ఆర్హెచ్ మూడో ఓటమి చవిచూసింది. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో 7 పరుగుల తేడాతో ఎస్ఆర్హెచ్ పరాజయం పాలైంది. బ్యాటింగ్లో దారుణ ప్రదర్శన కనబరిచిన ఆరెంజ్ ఆర్మీ.. 145 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కూడా ఛేదించలేకపోయింది. ఇక ఈ ఓటమిపై మ్యాచ్ అనంతరం ఎస్ఆర్హెచ్ కెప్టెన్ ఐడైన్ మార్క్రమ్ స్పందించాడు. బ్యాటింగ్లో వైఫల్యంతోనే ఈ మ్యాచ్లో ఓటమి పాలైం అని మార్క్రమ్ ఒప్పుకున్నాడు. "మేం బ్యాటింగ్లో మళ్లీ విఫలమయ్యాం. కనీసం గెలవాలన్న కసి కూడా మా బ్యాటర్లలో కనిపించలేదు. మ్యాచ్ సగం వరకు మేమే విజయం సాధిస్తామని భావించాను. కానీ ఒక్క సారిగా మా బ్యాటర్లు ఒత్తిడికి లోనయ్యారు. అదే మా ఓటమిని శాసించింది. అలా జరుగుతుందని నేను అస్సలు ఊహించలేదు. జట్టులో అద్భుతమైన ఆటగాళ్లు ఉన్నప్పటికీ.. దురదృష్టవశాత్తూ మేం విజయం సాధించలేకపోతున్నాం. మా బాయ్స్ స్వేచ్చగా బ్యాటింగ్ చేసే విషయంపై ఫోకస్ పెట్టాలి. అదే విధంగా మా ఆటగాళ్లు ఇంకా చాలా విషయాలు నేర్చుకోవాలి. లేదంటే ముందుకు వెళ్లడం కష్టం. మేము ఈ మ్యాచ్లో అద్భుతంగా ఆడాలని భావించాం. కానీ మా బౌలర్లు అత్యుత్తమంగా రాణించనప్పటికీ.. బ్యాటింగ్లో మాత్రం చేతులెత్తేశాం. ఈ మ్యాచ్లో మా ఇంటెంట్ అస్సలు బాగోలేదు. మా బౌలర్లు ఇక్కడి పరిస్థితులకు తగ్గట్టు అద్భుతంగా రాణించారు. మా తర్వాతి మ్యాచ్ల్లో ఈ తప్పిదాలు పునరావృతం కాకుండా ప్రయత్నిస్తాం" అని పోస్ట్మ్యాచ్ ప్రేజేంటేషన్లో మార్క్రమ్ పేర్కొన్నాడు. ఇక ఇది ఇలా ఉండగా.. ఈ మ్యాచ్లో దారుణంగా విఫలమైన కెప్టెన్ మార్క్రమ్పై అభిమానులు మండిపడుతున్నారు. కీలక సమయంలో క్రీజులోకి వచ్చిన మార్క్రమ్ కేవలం 3 పరుగులు మాత్రమే పెవిలియన్కు చేరాడు. దారుణ ప్రదర్శన కనబరిచి ఓటమికి షాక్లు చెప్పుతున్నావు అంటూ సోషల్ మీడియా వేదికగా విమర్శల వర్షం కురిపిస్తున్నారు. చదవండి: IPL 2023: ఢిల్లీ క్యాపిటల్స్ అరుదైన ఘనత.. ఐపీఎల్ చరిత్రలో ఇదే తొలి సారి -
అదే మా ఓటమిని శాసించింది.. వారు అద్భుతంగా రాణించారు: మార్క్రమ్
ఐపీఎల్-2023లో సన్రైజర్స్ హైదరాబాద్ మరోసారి దారుణ ప్రదర్శన కనబరిచింది. చెపాక్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో 7 వికెట్ల తేడాతో ఎస్ఆర్హెచ్ ఓటమి చవి చూసింది. ఇక వరుస ఓటములతో ఎస్ఆర్హెచ్ పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్ధానంలో కొనసాగుతుంది. ఈ ఏడాది సీజన్లో ఇప్పటి వరకు ఆడిన 6 మ్యాచ్ల్లో కేవలం రెండింట మాత్రమే సన్రైజర్స్ విజయం సాధించింది. ఇక సీఎస్కే చేతిలో ఓటమిపై ఎస్ఆర్హెచ్ కెప్టెన్ ఐడెన్ మార్క్రమ్ మ్యాచ్ అనంతరం స్పందించాడు. బ్యాటింగ్ వైఫల్యం కారణంగానే ఈ మ్యాచ్లో ఓడిపోయమని మార్క్రమ్ తెలిపాడు. "ఈ టోర్నీలో మరో ఓటమి చవి చూడడం చాలా బాధగా ఉంది. ఈవెంట్లో ముందుకు వెళ్లాలంటే మా ఆట తీరులో మార్పులు చేయాల్సిన అవసరం చాలా ఉంది. ఇక బ్యాటింగ్ పరంగా మేము దారుణంగా విఫలమయ్యాం. ప్రత్యర్ధి ముందు కనీస టార్గెట్ను కూడా ఉంచలేకపోయాం. చెన్నై పిచ్ బ్యాటింగ్కు అద్భుతంగా ఉంది. అటువంటి వికెట్పై 134 మంచి టార్గెట్ కాదు. కనీసం మేము 160 పరుగులైనా సాధిస్తాము అని భావించాను. కానీ దురదృష్టవశాత్తూ మిడిల్ ఓవర్లలో భాగస్వామ్యాలను నెలకొల్పలేకపోయాం. అందుకే నామమాత్రపు స్కోర్ మాత్రమే చేయగలిగాం. చెన్నై బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. చెపాక్లో స్పిన్నర్లు కీలక పాత్ర పోషిస్తారని మాకు ముందే తెలుసు. మేము అన్ని ప్రణాళికలు సిద్దం చేసుకున్నాం. కానీ దురదృష్టవశాత్తూ మా స్పిన్నర్లు అంతగా రాణించలేకపోయారు. ఇక రాబోయో మ్యాచ్ల్లో బ్యాటింగ్ పరంగా మేము చాలా మెరుగు అవ్వాలి. జట్టులో కొంత మంది యువ ఆటగాళ్లు ఇంకా బ్యాట్తో రాణించాల్సిన అవసరముంది" అని పోస్ట్ మ్యాచ్ ప్రేజేంటేషన్లో మార్క్రమ్ పేర్కొన్నాడు. చదవండి: IPL 2023: ఇదే నా చివరి ఐపీఎల్ కావొచ్చు.. అతడు అద్భుతం! నేను ఎప్పటికీ మర్చిపోను: ధోని -
ఎస్ఆర్హెచ్పై సీఎస్కే ఘన విజయం
ఎస్ఆర్హెచ్తో జరిగిన మ్యాచ్లో సీఎస్కే ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 135 పరుగుల టార్గెట్ను 18.4 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి చేధించింది. డెవన్ కాన్వే(55 బంతుల్లో 77 నాటౌట్) మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడాడు. రుతురాజ్ గైక్వాడ్ 35 పరుగులు చేశాడు. ఎస్ఆర్హెచ్ బౌలర్లలో మయాంక్ మార్కండే రెండు వికెట్లు పడగొట్టాడు. విజయానికి 16 పరుగుల దూరంలో సీఎస్కే.. సీఎస్కే ఆడుతూ పాడుతూ లక్ష్యం దిశగా సాగుతుంది. 16 ఓవర్లు ముగిసేరికి రెండు వికెట్ల నష్టానికి 119 పరుగులు చేసింది. విజయానికి ఇంకా 16 పరుగుల దూరంలో మాత్రమే ఉంది. కాన్వే 65, రాయుడు 8 పరుగులతో క్రీజులో ఉన్నారు. కాన్వే ఫిఫ్టీ.. 10 ఓవర్లలో సీఎస్కే 86/0 135 పరుగుల టార్గెట్తో బరిలోకి దిగిన సీఎస్కే ప్రస్తుతం 10 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 86 పరుగులు చేసింది. డెవన్ కాన్వే 33 బంతుల్లో అర్థసెంచరీ మార్క్ అందుకున్నాడు. గైక్వాడ్ 34 పరుగులతో సహకరిస్తుననాడు. విజయం దిశగా సీఎస్కే.. 7 ఓవర్లలో 66/0 ఎస్ఆర్హెచ్తో మ్యాచ్లో సీఎస్కే విజయం దిశగా పయనిస్తోంది. ఏడు ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టపోకుండా 66 పరుగులు చేసింది. కాన్వే 42, గైక్వాడ్ 22 పరుగులతో ఆడుతున్నారు. టార్గెట్ 135.. సీఎస్కే 32/0 135 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సీఎస్కే 4 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 32 పరుగులు చేసింది. రుతురాజ్ 14, కాన్వే 17 పరుగులతో ఆడుతున్నారు. Photo Credit : IPL Website సీఎస్కే టార్గెట్ 135 సీఎస్కేతో మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ మోస్తరు స్కోరుకే పరిమితమైంది. నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 134 పరుగులు మాత్రమే చేసింది. అభిషేక్ శర్మ 34 పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా.. రాహుల్ త్రిపాఠి 21 పరుగులు చేశాడు. ఎస్ఆర్హెచ్ బౌలర్లలో జడేజా మూడు వికెట్లతో మెరవగా.. మతీషా పతీరణా, ఆకాశ్ సింగ్, మహీష్ తీక్షణలు తలా ఒక వికెట్ తీశారు. Photo Credit : IPL Website 16 ఓవర్లలో ఎస్ఆర్హెచ్ 106/5 16 ఓవర్లు ముగిసేసరికి ఎస్ఆర్హెచ్ ఐదు వికెట్ల నష్టానికి 106 పరుగులు చేసింది. క్లాసెన్ 11, మార్కో జాన్సెన్ ఐదు పరుగులతో ఆడుతున్నారు. Photo Credit : IPL Website 95 పరుగులకే ఐదు వికెట్లు 95 పరుగుల వద్ద ఎస్ఆర్హెచ్ ఐదో వికెట్ కోల్పోయింది. జడేజా బౌలింగ్లో మయాంక్ అగర్వాల్ షాట్ ఆడే ప్రయత్నంలో ధోని సూపర్ స్టంపౌట్తో వెనుదిరిగాడు. Photo Credit : IPL Website నాలుగో వికెట్ కోల్పోయిన ఎస్ఆర్హెచ్ సీఎస్కేతో మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ వరుస విరామాల్లో వికెట్లు కోల్పోతూ వస్తోంది. 12 పరుగులు చేసిన మార్క్రమ్ తీక్షణ బౌలింగ్లో ధోనికి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం నాలుగు వికెట్ల నష్టానికి 91 పరుగులు చేసింది. Photo Credit : IPL Website రెండో వికెట్ కోల్పోయిన ఎస్ఆర్హెచ్ సీఎస్కేతో మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ రెండో వికెట్ కోల్పోయింది. మంచి టచ్లో కనిపించిన అభిషేక్ నాయర్(36 పరుగులు) జడేజా బౌలింగ్లో రహానేకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం ఎస్ఆర్హెచ్ 11 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 83 పరుగులు చేసింది. రాహుల్ త్రిపాఠి 21, మార్ర్కమ్ 8 పరుగులతో ఆడుతున్నారు. Photo Credit : IPL Website బ్రూక్(18)ఔట్.. తొలి వికెట్ కోల్పోయిన ఎస్ఆర్హెచ్ 18 పరుగులు చేసిన బ్రూక్ ఆకాశ్ సింగ్ బౌలింగ్లో రుతురాజ్ గైక్వాడ్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం ఎస్ఆర్హెచ్ వికెట్ నష్టానికి 45 పరుగులు చేసింది. అభిషేక్ 20, త్రిపాఠి ఒక పరుగుతో క్రీజులో ఉన్నారు. Photo Credit : IPL Website 4 ఓవర్లలో ఎస్ఆర్హెచ్ 34/0 4 ఓవర్లు ముగిసేసరికి ఎస్ఆర్హెచ్ వికెట్ నష్టపోకుండా 34 పరుగులు చేసింది. బ్రూక్ 18, అభిషేక్ శర్మ 15 పరుగులతో క్రీజులో ఉన్నారు. Photo Credit : IPL Website టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న సీఎస్కే ఐపీఎల్ 16వ సీజన్లో ఇవాళ(శుక్రవారం) చెన్నై వేదికగా 29వ మ్యాచ్లో సీఎస్కే, ఎస్ఆర్హెచ్ తలపడుతున్నాయి. టాస్ గెలిచిన సీఎస్కే ఫీల్డింగ్ ఎంచుకుంది. చెన్నై సూపర్ కింగ్స్ (ప్లేయింగ్ XI): రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే, అజింక్యా రహానే, శివమ్ దూబే, మొయిన్ అలీ, రవీంద్ర జడేజా, MS ధోని(కెప్టెన్/వికెట్ కీపర్), మహేశ్ తీక్షణ, తుషార్ దేశ్పాండే, ఆకాష్ సింగ్, మతీషా పతిరానా సన్రైజర్స్ హైదరాబాద్ (ప్లేయింగ్ XI): హ్యారీ బ్రూక్, మయాంక్ అగర్వాల్, రాహుల్ త్రిపాఠి, ఐడెన్ మార్క్రామ్(కెప్టెన్), హెన్రిచ్ క్లాసెన్(వికెట్కీపర్), అభిషేక్ శర్మ, వాషింగ్టన్ సుందర్, మార్కో జాన్సెన్, భువనేశ్వర్ కుమార్, మయాంక్ మార్కండే, ఉమ్రాన్ మాలిక్ #ThalaDhoni wins the toss and @ChennaiIPL are BOWLING FIRST at Chepauk! Watch the #TATAIPL Southern Derby⚔️, in Tamil or Telugu, LIVE & FREE on #JioCinema#CSKvSRH #TATAIPL #IPLonJioCinema #IPL2023 pic.twitter.com/lvnYvDnLPm — JioCinema (@JioCinema) April 21, 2023 వరుస విజయాలతో దూకుడు మీదున్న సీఎస్కేను ఎస్ఆర్హెచ్ ఎలా నిలువరిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. హోంగ్రౌండ్లో మ్యాచ్ ఆడుతుండడంతో సీఎస్కే మ్యాచ్లో మరింత బలంగా కనిపిస్తుంది. -
అదే మా కొంపముంచింది.. లేదంటేనా! అందుకే అలా చేశా: మార్క్రమ్
ఐపీఎల్-2023లో భాగంగా ఉప్పల్ వేదికగా ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో 14 పరుగుల తేడాతో సన్రైజర్స్ ఓటమి పాలైంది. ఈ టోర్నీలో ఎస్ఆర్హెచ్కు ఇది మూడో పరాజయం. 193 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సన్రైజర్స్ 178 పరుగులకు ఆలౌటైంది. ఇక సొంత మైదానంలో ఓటమిపై మ్యాచ్ అనంతరం ఎస్ఆర్హెచ్ కెప్టెన్ ఐడైన్ మార్క్రమ్ స్పందించాడు. బ్యాటింగ్ వైఫల్యంతో ఈ మ్యాచ్లో ఓటమి పాలైమని మార్క్రమ్ తెలిపాడు. పోస్ట్ మ్యాచ్ ప్రేజేటేషన్లో మార్క్రమ్ మాట్లాడుతూ.. "బ్యాటింగ్లో సమిష్టగా రాణించడంలో విఫలమయ్యాం. అదే మా ఓటమిని శాసించింది. అయితే మ్యాచ్ను ఇంత దగ్గరగా తీసుకువెళ్లినందుకు మా బాయ్స్కు క్రెడిట్ ఇవ్వాలని అనుకుంటున్నాను. అయితే మేము ఆఖరిలో కొన్ని అదనపు పరుగులు సమర్పించుకున్నాం. పిచ్ మ్యాచ్ మొత్తం ఒకేలా ఉంది. వికెట్ నెమ్మదిగా ఉండటంతో పాటు బ్యాటింగ్కు అనుకూలంగా ఉంది. మేము ఎప్పుడైతే మా ఆటలో వేగం పెంచామో..దురదృష్టవశాత్తూ బంతి బ్యాట్పైకి రాలేదు. బౌలర్లను ఎదుర్కొవడానికి కాస్త ఇబ్బందిగా అనిపించింది. మంచు ప్రభావం ఉంటుందనే టాస్ గెలిచి ముందుగా ఫీల్డింగ్ తీసుకున్నాం. కానీ మేము అనుకున్నది జరగలేదు. ఒక వేళ డ్యూ ప్రభావం ఉండి ఉంటే కచ్చితంగా మేము విజయం సాధించేవాళ్లం" అని పేర్కొన్నాడు. చదవండి: IPL 2023 SRH vs MI: నీ ఆటకు ఓ దండం రా బాబు.. వెళ్లి గల్లీ క్రికెట్ ఆడుకో పో! -
స్టన్నింగ్ క్యాచ్తో అరుదైన జాబితాలో ఎస్ఆర్హెచ్ కెప్టెన్
ఎస్ఆర్హెచ్ కెప్టెన్ ఐడెన్ మార్క్రమ్ స్టన్నింగ్ క్యాచ్తో మెరిశాడు. ముంబై ఇండియన్స్తో సొంతగ్రౌండ్లో జరుగుతున్న మ్యాచ్లో అద్బుత విన్యాసాన్ని ప్రదర్శించాడు. మార్కో జాన్సెన్ బౌలింగ్లో ఇన్నింగ్స్ 12వ ఓవర్ ఐదో బంతిని మిడాఫ్ దిశగా భారీ షాట్ ఆడాడు. అంతా బౌండరీ వెళుతుందని అనుకున్నారు. కానీ అక్కడే ఉన్న మార్క్రమ్ ఎడమవైపుకు డైవ్ చేస్తూ అద్బుతంగా క్యాచ్ తీసుకున్నాడు. మార్క్రమ్ స్టన్నింగ్ క్యాచ్ను ఊహించని సూర్యకుమార్ నిరాశగా పెవిలియన్ బాట పట్టాడు. కాగా అంతకముందు ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ల క్యాచ్లు తీసుకుంది కూడా మార్ర్కమ్ కావడం విశేషం. ఈ నేపథ్యంలో మార్క్రమ్ అరుదైన జాబితాలో చేరిపోయాడు. ఐపీఎల్లో ఒక మ్యాచ్ ఇన్నింగ్స్లో తొలి మూడు క్యాచ్లను ఒకే ప్లేయర్ తీసుకోవడం ఇది నాలుగో సారి మాత్రమే. ఇంతకముందు కేన్ రిచర్డ్సన్ వర్సెస్ ఎస్ఆర్హెచ్ 2014లో, హార్దిక్ పాండ్యా వర్సెస్ సీఎస్కే 2015లో, ఫాఫ్ డుప్లెసిస్ వర్సెస్ కేకేఆర్ 2019లో ఉన్నారు. Aiden Markram setting an example on the field! All three catches so far taken by the South African... That SKY catch was a scorcher!#IPL2023 #SRHvsMI #RohitSharma #AidenMarkram #TATAIPL #MumbaiIndians #SunrisersHyderabadpic.twitter.com/fUV54r2Gaq — OneCricket (@OneCricketApp) April 18, 2023 CAUGHT IN 4K - Aiden Markram 🔥#TATAIPL #IPLonJioCinema #SRHvMI #IPL2023 #OrangeFireIdhi | @SunRisers @AidzMarkram pic.twitter.com/WJVkXuH2pL — JioCinema (@JioCinema) April 18, 2023 చదవండి: రోహిత్ రికార్డు.. ఐపీఎల్ చరిత్రలో నాలుగో ఆటగాడిగా రోహిత్ ఔట్.. బుంగమూతి పెట్టిన రితికా -
ఎస్ఆర్హెచ్ 178 ఆలౌట్.. 14 పరుగుల తేడాతో ముంబై గెలుపు
ఎస్ఆర్హెచ్తో మ్యాచ్లో ముంబై ఇండియన్స్14 పరుగుల తేడాతో విజయం సాధించింది. 193 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఎస్ఆర్హెచ్ 19.5 ఓవర్లలో 178 పరుగులకు ఆలౌట్ అయింది. మయాంక్ అగర్వాల్ 48 పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా.. క్లాసెన్ 36, మార్క్రమ్ 22 పరుగులు చేసి ఔటయ్యారు. ముంబై బౌలర్లలో పియూష్ చావ్లా, రిలే మెరిడిత్, జాసన్ బెహండార్ఫ్లు తలా రెండు వికెట్లు తీయగా.. అర్జున్ టెండూల్కర్, కామెరాన్ గ్రీన్ చెరొక వికెట్ పడగొట్టారు. ఆరో వికెట్ కోల్పోయిన ఎస్ఆర్హెచ్ ముంబై ఇండియన్స్తో మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ ఓటమి దిశగా పయనిస్తోంది. మయాంక్ అగర్వాల్(48), క్లాసెన్(36) వెనువెంటనే ఔట్ కావడంతో ఎస్ఆర్హెచ్ 132 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయింది. అబ్దుల్ సమద్1, మార్కో జాన్సెన్ (0) క్రీజులో ఉన్నారు. నాలుగో వికెట్ కోల్పోయిన ఎస్ఆర్హెచ్ అభిషేక్ శర్మ(1) రూపంలో ఎస్ఆర్హెచ్ నాలుగో వికెట్ కోల్పోయింది. పియూష్ చావ్లా బౌలింగ్లో భారీ షాట్కు యత్నించి టిమ్ డేవిడ్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. 8 ఓవర్లలో ఎస్ఆర్హెచ్ 64/2 8 ఓవర్లు ముగిసేసరికి ఎస్ఆర్హెచ్ రెండు వికెట్ల నష్టానికి 64 పరుగులు చేసింది. మయాంక్ అగర్వాల్ 28, మార్క్రమ్ 17 పరుగులతో క్రీజులో ఉన్నారు. రెండు వికెట్లు కోల్పోయిన ఎస్ఆర్హెచ్.. 4 ఓవర్లలో 26/2 4 ఓవర్లు ముగిసేసరికి ఎస్ఆర్హెచ్ రెండు వికెట్ల నష్టానికి 26 పరుగులు చేసింది. మయాంక్ ఆరు పరుగులతో ఆడుతున్నారు. అంతకముందు హ్యారీ బ్రూక్ 9, రాహుల్ త్రిపాఠి ఏడు పరుగులు చేసి బెండార్ఫ్ బౌలింగ్లో వెనుదిరిగారు. ఎస్ఆర్హెచ్ టార్గెట్ 193.. ఎస్ఆర్హెచ్తో మ్యాచ్లో ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. కామెరాన్ గ్రీన్ 40 బంతుల్లో ఆరు ఫోర్లు, రెండు సిక్సర్ల సాయంతో 60 పరుగులు నాటౌట్ టాప్ స్కోరర్గా నిలవగా.. తిలక్ వర్మ 17 బంతుల్లో 37 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడగా.. ఇషాన్ కిషన్ 38 పరుగులు చేశాడు. ఎస్ఆర్హెచ్ బౌలర్లలో మార్కో జాన్సెన్ రెండు వికెట్లు తీయగా.. నటరాజన్, భువనేశ్వర్ చెరొక వికెట్ తీశారు. ఫిఫ్టీతో మెరిసిన గ్రీన్.. ముంబై 172/4 ముంబై బ్యాటర్ కామెరాన్ గ్రీన్ ఫిఫ్టీతో మెరిశాడు. 33 బంతుల్లో 5ఫోర్లు, సిక్సర్ సాయంతో అర్థసెంచరీ సాధించాడు. కాగా గ్రీన్కు ఇదే తొలి ఐపీఎల్ హాఫ్ సెంచరీ. ప్రస్తుతం ముంబై 18 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. గ్రీన్ 58, టిమ్ డేవిడ్ 2 పరుగులతో క్రీజులో ఉన్నారు. దంచి కొడుతున్న తిలక్ వర్మ.. 16 ఓవర్లలో 144/3 హోంగ్రౌండ్లో తిలక్ వర్మ దుమ్మురేపుతున్నాడు. ఎస్ఆర్హెచ్ బౌలర్లను ఉతికారేస్తూ ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపిస్తున్నాడు. 16 ఓవర్లు ముగిసేసరికి ముంబై ఇండియన్స్ మూడు వికెట్ల నష్టానికి 144 పరుగులు చేసింది. తిలక్ వర్మ 15 బంతుల్లో 31 బ్యాటింగ్, గ్రీన్ 38 బ్యాటింగ్ క్రీజులో ఉన్నారు. మార్క్రమ్ స్టన్నింగ్ క్యాచ్.. సూర్య(7) ఔట్ ఎస్ఆర్హెచ్తో మ్యాచ్లో ముంబై మూడో ఇకెట కోల్పోయింది. మార్కో జాన్సెన్ బౌలింగ్లో షాట్ ఆడే ప్రయత్నంలో మార్క్రమ్ స్టన్నింగ్ క్యాచ్తో వెనుదిరిగాడు. ప్రస్తుతం ముంబై 12 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 95 పరుగులు చేసింది. గ్రీన్ 21, తిలక్ వర్మ క్రీజులో ఉన్నారు. 9 ఓవర్లలో ముంబై 69/1 9 ఓవర్లు ముగిసేసరికి ముంబై ఇండియన్స్ వికెట్ నష్టానికి 69 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్ 25, కామెరాన్ గ్రీన్ 15 పరుగులతో క్రీజులో ఉన్నారు. అంతకముందు 28 పరుగులు చేసిన రోహిత్ శర్మ నటరాజన్ బౌలింగ్లో మార్క్రమ్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. రోహిత్ శర్మ(28) ఔట్.. తొలి వికెట్ డౌన్ ఎస్ఆర్హెచ్తో మ్యాచ్లో ముంబై ఇండియన్స్ తొలి వికెట్ కోల్పోయింది. 28 పరుగులు చేసిన రోహిత్ శర్మ నటరాజన్ బౌలింగ్లో మార్క్రమ్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం ఎస్ఆర్హెచ్ వికెట్ నష్టానికి 41 పరుగులు చేసింది. 3 ఓవర్లలో ముంబై ఇండియన్స్ స్కోరెంతంటే? మూడు ఓవర్లు ముగిసేసరికి ముంబై ఇండియన్స్ వికెట్ నష్టపోకుండా 28 పరుగులు చేసింది. రోహిత్ శర్మ 19, ఇషాన్ కిషన్ 8 పరుగులతో ఆడుతున్నారు. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఎస్ఆర్హెచ్ ఐపీఎల్ 16వ సీజన్ 25వ మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ ఎదురుపడుతున్నాయి. టాస్ గెలిచిన ఎస్ఆర్హెచ్ బౌలింగ్ ఎంచుకుంది. కాగా ఈ రెండు జట్లు ఓటములతోనే సీజన్ను ప్రారంభించాయి. ఆ తర్వాత పుంజుకుని వరుసగా రెండు విజయాలు నమోదు చేసిన ఇరుజట్లు హ్యాట్రిక్ విజయంపై కన్నేశాయి. #TheOrangeArmy skipper Aiden Markram elects to field first after winning the toss in Hyderabad 🤩 Watch #SRHvMI -LIVE & FREE with #IPLonJioCinema across all telecom operators 👈#IPL2023 #TATAIPL | @SunRisers @AidzMarkram pic.twitter.com/wW3pe1MV2e — JioCinema (@JioCinema) April 18, 2023 సన్రైజర్స్ హైదరాబాద్ (ప్లేయింగ్ XI): మయాంక్ అగర్వాల్, హ్యారీ బ్రూక్, రాహుల్ త్రిపాఠి, ఐడెన్ మార్క్రమ్(కెప్టెన్), హెన్రిచ్ క్లాసెన్(వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, వాషింగ్టన్ సుందర్, మార్కో జాన్సెన్, భువనేశ్వర్ కుమార్, మయాంక్ మార్కండే, టి నటరాజన్ ముంబై ఇండియన్స్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ(కెప్టెన్), ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, టిమ్ డేవిడ్, కామెరాన్ గ్రీన్, అర్జున్ టెండూల్కర్, నేహాల్ వధేరా, హృతిక్ షోకీన్, పీయూష్ చావ్లా, జాసన్ బెహ్రెన్ డార్ఫ్ ఇక సొంత గ్రౌండ్లో ఆడుతుండడం ఎస్ఆర్హెచ్కు పెద్ద బలం అని చెప్చొచ్చు. పంజాబ్ కింగ్స్ను చిత్తు చేసిన మార్క్రమ్ సేన ముంబై పట్టు పట్టేందుకు సిద్ధమైంది. గత మ్యాచ్లో కోల్కతాకు షాకిచ్చిన ముంబై అదే జోరు కొనసాగించాలని భావిస్తోంది. దాంతో, ఎవరిది పై చేయి కానుంది అనే ఆసక్తి అభిమానుల్లో మొదలైంది. ఇరుజట్ల గత రికార్డులు పరిశీలిస్తే 19 మ్యాచ్లు జరగ్గా.. పదింటిలో ముంబై నెగ్గగా.. తొమ్మిది మ్యాచ్ల్లో ఎస్ఆర్హెచ్ విజయం సాధించింది. -
గెలిచారు.. కానీ తప్పిదాలు చాలానే
ఐపీఎల్ 16వ సీజన్లో ఎస్ఆర్హెచ్ రెండో విజయాన్నినమోదు చేసింది. శుక్రవారం కేకేఆర్తో మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ 20 పరుగుల తేడాతో గెలిచింది. అయితే మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ గెలిచినప్పటికి చాలా లోపాలు ఉన్నాయి. భారీ స్కోర్లు నమోదైన మ్యాచ్లో బౌలింగ్ సంగతి పక్కనబెడితే ఎస్ఆర్హెచ్ ఫీల్డింగ్ మాత్రం దారుణంగా ఉందని చెప్పొచ్చు. సులువైన క్యాచ్లు వదిలేయడంతో పాటు రనౌట్ చాన్స్లు కూడా మిస్ చేశారు. కేకేఆర్ ముందు 229 పరుగులు కష్టసాధ్యమైన లక్ష్యం ఉంది కాబట్టే ఎస్ఆర్హెచ్ గెలిచింది అనుకోవచ్చు. అటు ఇటుగా టార్గెట్ 200 ఉండుంటే మాత్రం ఎస్ఆర్హెచ్ కచ్చితంగా ఓడిపోయి ఉండేది. రానున్న మ్యాచ్ల్లో ఫీల్డింగ్, బౌలింగ్ లాంటి అంశాల్లో మెరుగుపడాల్సిన అవసరం చాలా ఉంది. ఇక హ్యారీ బ్రూక్ సీజన్లో తొలి సెంచరీ నమోదు చేయడం.. కెప్టెన్ మార్క్రమ్ హఫ్ సెంచరీ చేయడం.. అభిషేక్ శర్మ మంచి స్ట్రైక్రేట్తో బ్యాటింగ్ చేయడం చూస్తుంటే ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్కు తిరుగుండదనిపిస్తుంది. మయాంక్ అగర్వాల్ గాడిలో పడితే ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ లైనఫ్ మరింత పటిష్టంగా తయారవుతుంది. ఇదే జోష్ను వచ్చే మ్యాచ్ల్లోనూ కంటిన్యూ చూస్తే ఎస్ఆర్హెచ్ టైటిల్ కొట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదు. -
హ్యారీ బ్రూక్ సెంచరీ.. 23 పరుగుల తేడాతో ఎస్ఆర్హెచ్ విజయం
ఐపీఎల్ 16వ సీజన్లో ఎస్ఆర్హెచ్ రెండో విజయాన్ని నమోదు చేసింది. 229 పరుగుల కష్టసాధ్యమైన లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. నితీష్రానా(41 బంతుల్లో 75 పరుగులు), రింకూ సింగ్(31 బంతుల్లో 58 పరుగులు) మినహా మిగతావారు రాణించడంలో విఫలమయ్యారు. ఎస్ఆర్హెచ్ బౌలర్లలో మార్కో జాన్సెన్, మయాంక్ మార్కండేలు తలా రెండు వికెట్లు తీయగా.. నటరాజన్, భువనేశ్వర్, ఉమ్రాన్ మాలిక్ తలా ఒక వికెట్ తీశారు. నితీష్ రానా ఔట్.. ఆరో వికెట్ కోల్పోయిన కేకేఆర్ ధాటిగా ఆడుతున్న నితీష్ రానా(41 బంతుల్లో 75 పరుగులు) నటరాజన్ బౌలింగ్లో సుందర్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం కేకేఆర్ ఆరు వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. విధ్వంసం సృష్టిస్తున్న నితీష్, రింకూ సింగ్.. 16 ఓవర్లు ముగిసేసరికి కేకేఆర్ ఐదు వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. నితీష్ రానా 38 బంతుల్లో 69 బ్యాటింగ్, రింకూ సింగ్ 18 బంతుల్లో 32 బ్యాటింగ్ విధ్వంసం సృష్టిస్తున్నారు. కేకేఆర్ గెలవాలంటే 24 బంతుల్లో 70 పరుగులు చేయాల్సి ఉంది. మరోసారి విఫలమైన రసెల్.. ఐదో వికెట్ కోల్పోయిన కేకేఆర్ కేకేఆర్ ఆల్రౌండర్ ఆండీ రసెల్ బ్యాటింగ్ వైఫల్యం కొనసాగుతుంది. తాజాగా ఎస్ఆర్హెచ్తో మ్యాచ్లో మూడు పరుగులు మాత్రమే చేసి మయాంక్ మార్కండే బౌలింగ్లో వెనుదిరిగాడు. దీంతో కేకేఆర్ 96 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. నాలుగో వికెట్ కోల్పోయిన కేకేఆర్ భారీ లక్ష్య ఛేదనలో కేకేఆర్ తడబడుతుంది. ఎన్ జగదీశన్(36) రూపంలో కేకేఆర్ నాలుగో వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం కేకేఆర్ 4 వికెట్ల నష్టానికి 83 పరుగులు చేసింది. నితీష్ రానా 35, రసెల్ ఒక్క పరుగుతో క్రీజులో ఉన్నారు. 34 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన కేకేఆర్ 229 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్ కష్టాల్లో పడింది. 34 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. నితీష్ రాణా 2, ఎన్ జగదీషన్ 20 పరుగులతో ఆడుతున్నారు. Photo Credit : IPL Website హ్యారీ బ్రూక్ సెంచరీ.. కేకేఆర్ టార్గెట్ 229 కేకేఆర్తో మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ భారీ స్కోరు చేసింది. హ్యారీ బ్రూక్ 55 బంతుల్లో 100 నాటౌట్ సీజన్లో తొలి సెంచరీ నమోదు చేయడంతో ఎస్ఆర్హెచ్ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 228 పరుగులు చేసింది. మార్క్రమ్ 50, అభిషేక్ శర్మ 35 పరుగులతో రాణించారు. Photo Credit : IPL Website మార్క్రమ్(50) ఔట్.. ఎస్ఆర్హెచ్ 129/3 ఈ సీజన్లో ఎస్ఆర్హెచ్ తొలిసారి దూకుడు ప్రదర్శిస్తోంది. కెప్టెన్ మార్క్రమ్ 25 బంతుల్లోనే ఫిఫ్టీ మార్క్ అందుకున్నాడు. అయితే ఫిఫ్టీ కొట్టిన మరుసటి బంతికే వరుణ్ చక్రవర్తి బౌలింగ్లో ఔటయ్యాడు. ప్రస్తుతం ఎస్ఆర్హెచ్ మూడు వికెట్ల నష్టానికి 129 పరుగులు చేసింది. బ్రూక్ 53 పరుగులతో క్రీజులో ఉన్నారు. Photo Credit : IPL Website 9 ఓవర్లలో ఎస్ఆర్హెచ్ 85/2 9 ఓవర్లు ముగిసేసరికి ఎస్ఆర్హెచ్ రెండు వికెట్ల నష్టానికి 85 పరుగులు చేసింది. బ్రూక్ 45, మార్క్రమ్ 14 పరుగులతో ఆడుతున్నారు. Photo Credit : IPL Website తొలి వికెట్ కోల్పోయిన ఎస్ఆర్హెచ్ మయాంక్ అగర్వాల్ మరోసారి విఫలమయ్యాడు. కేకేఆర్తో మ్యాచ్లో 9 పరుగులు చేసిన మయాంక్ రసెల్ బౌలింగ్లో వరుణ్ చక్రవర్తికి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం ఎస్ఆర్హెచ్ వికెట్ నష్టానికి 46 పరుగులు చేసింది. Photo Credit : IPL Website 2 ఓవర్లలో ఎస్ఆర్హెచ్ 28/0 కేకేఆర్తో మ్యాచ్ను ఎస్ఆర్హెచ్ దూకుడుగా ఆరంభించింది. 2 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టపోకుండా 28 పరుగులు చేసింది. హ్యారీ బ్రూక్ 18, మయాంక్ అగర్వాల్ 6 పరుగులతో క్రీజులో ఉన్నారు. Photo Credit : IPL Website టాస్ గెలిచిన కేకేఆర్ ఐపీఎల్ 16వ సీజన్ 19వ మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్, కోల్కతా నైట్ రైడర్స్ ఢీ కొంటున్నాయి. టాస్ గెలిచిన కేకేఆర్ ఫీల్డింగ్ ఎంచుకుంది. కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో జరుగుతుండడంతో మ్యాచ్ ఆసక్తికరంగా ఉండనుంది. సన్రైజర్స్ హైదరాబాద్ (ప్లేయింగ్ XI): హ్యారీ బ్రూక్, మయాంక్ అగర్వాల్, రాహుల్ త్రిపాఠి, ఐడెన్ మార్క్రామ్(కెప్టెన్), అభిషేక్ శర్మ, హెన్రిచ్ క్లాసెన్(వికెట్కీపర్), మార్కో జాన్సెన్, భువనేశ్వర్ కుమార్, మయాంక్ మార్కండే, ఉమ్రాన్ మాలిక్, టి నటరాజన్ కోల్కతా నైట్ రైడర్స్ (ప్లేయింగ్ XI): రహ్మానుల్లా గుర్బాజ్(వికెట్కీపర్), N జగదీసన్, నితీష్ రాణా(కెప్టెన్), రింకు సింగ్, ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్, శార్దూల్ ఠాకూర్, ఉమేష్ యాదవ్, సుయాష్ శర్మ, లాకీ ఫెర్గూసన్, వరుణ్ చక్రవర్తి The 🪙 lands in favour of @KKRiders & they'll be BOWLING first in #KKRvSRH! Catch pulsating #TATAIPL action, LIVE & FREE, on JioCinema on all telecom operators!#IPLonJioCinema #IPL2023 | @SunRisers pic.twitter.com/8QeJTF05el — JioCinema (@JioCinema) April 14, 2023 ఇక వరుసగా రెండు మ్యాచుల్లో నెగ్గిన కోల్కతా హ్యాట్రిక్ కొట్టాలని పట్టుదలతో ఉంది. మరోవైపు హోంగ్రౌండ్లో పంజాబ్ కింగ్స్ను ఓడించి బోణీ కొట్టిన ఎస్ఆర్హెచ్ రెండో విజయంపై కన్నేసింది. దాంతో, పై చేయి సాధించే జట్టు ఏది అనేది? మరికొన్ని గంటల్లో తెలియనుంది. ఇక ఇరుజట్లు ఇప్పటిరకు 23 మ్యాచ్లు జరగ్గా.. కేకేఆర్ 15 సార్లు గెలుపొందితే.. ఎస్ఆర్హెచ్ 8సార్లు మాత్రమే నెగ్గింది. -
వాళ్లదే పైచేయి; డెత్ ఓవర్ల స్పెషలిస్టులు ఉన్నారు.. మాకేం భయం లేదు: మార్కరమ్
IPL 2023- Kolkata Knight Riders vs Sunrisers Hyderabad: ‘‘శార్దూల్ ఠాకూర్, రింకూ సింగ్ కేకేఆర్కు పూర్తి న్యాయం చేస్తున్నారు. కీలక సమయాల్లో అద్భుతంగా రాణించారు. నిజానికి కేకేఆర్ దూకుడైన ఆటతో ముందుకు సాగుతోంది. సమిష్టిగా రాణిస్తే వారిని తట్టుకోవడం కష్టమే. ప్రతి ఒక్కరికి తమ రోజంటూ ఒకటి ఉంటుంది. నిజానికి కేకేఆర్ రూపంలో మాకు భారీ ముప్పు ఎదురుకాబోతుంది. అయితే, మా బలాలు ఏమిటో మాకు తెలుసు. మా ప్రణాళికలు పక్కాగా అమలు చేస్తే గనుక అనుకున్న ఫలితాలను రాబట్టగలం. శార్దూల్, రింకూలు అద్భుతంగా ఫినిషింగ్ చేస్తున్నారు. అయితే, మా బౌలర్లపై మాకు పూర్తి నమ్మకం ఉంది. ముఖ్యంగా డెత్ ఓవర్లలో మా వాళ్లు అద్భుతంగా బౌలింగ్ చేస్తారు. ప్రత్యర్థి బ్యాటర్లను కట్టడి చేయగలరు’’ అని సన్రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ఎయిడెన్ మార్కరమ్ అన్నాడు. వరుస ఓటములు తర్వాత కాగా ఐపీఎల్-2023లో ఇప్పటి వరకు ఆడిన మూడు మ్యాచ్లలో మూడింట ఒకటి మాత్రమే గెలిచింది ఎస్ఆర్హెచ్. సొంతమైదానంలో రాజస్తాన్ రాయల్స్తో తమ ఆరంభ మ్యాచ్లో రెగ్యులర్ కెప్టెన్ మార్కరమ్ దూరం కాగా.. స్టార్ పేసర్ భువనేశ్వర్ కుమార్ సారథ్యం వహించాడు. ఈ మ్యాచ్లో భారీ తేడాతో ఓడి పరాజయంతో పదహారో ఎడిషన్ను ఆరంభించింది. ఇక రెండో మ్యాచ్కు మార్కరమ్ అందుబాటులోకి రాగా లక్నో సూపర్ జెయింట్స్లో చేతిలో 5 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. తర్వాత.. ఉప్పల్లో పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో 8 వికెట్ల తేడాతో గెలుపొంది.. ఎట్టకేలకు తొలి విజయం నమోదు చేసింది. కేకేఆర్తో మ్యాచ్ ఈ క్రమంలో ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్కతా నైట్ రైడర్స్తో సన్రైజర్స్ శుక్రవారం తమ నాలుగో మ్యాచ్ ఆడనుంది. ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన కెప్టెన్ మార్కరమ్.. తమ బౌలర్లపై నమ్మకం ఉందంటూ ధీమా వ్యక్తం చేశాడు. కేకేఆర్కు గత రెండు మ్యాచ్లలో విజయాలు అందించిన శార్దూల్ ఠాకూర్, రింకూ సింగ్లను చూసి తామేమీ బెదిరిపోవడం లేదని.. వాళ్లను కట్టడి చేసే వ్యూహాలు రచించామని పేర్కొన్నాడు. ముఖాముఖి పోరులో మాత్రం కేకేఆర్తో ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్లలో సన్రైజర్స్ కేవలం 8 మ్యాచ్లలో మాత్రమే గెలుపొందింది. మిగిలిన 15 సార్లు విజయం కేకేఆర్నే వరించింది. ఇక ఈడెన్ గార్డెన్స్లో సైతం కోల్కతాదే పైచేయి. సొంతమైదానంలో ఎస్ఆర్హెచ్తో ఆడిన ఎనిమిది మ్యాచ్లలో కేకేఆర్ ఆరింట గెలుపొందింది. ఇక 2020 తర్వాత సన్రైజర్స్ కేవలం ఇక్కడ ఒక మ్యాచ్ మాత్రమే గెలిచింది. మీకు తెలుసా? సన్రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్ రాహుల్ త్రిపాఠి ఇంత వరకు ఒక్కసారి కూడా సునిల్ నరైన్ బౌలింగ్లో అవుట్ కాలేదు. నరైన్ బౌలింగ్లో త్రిపాఠి 150కి పైగా స్ట్రైక్రేటుతో ఆధిపత్యం కొనసాగిస్తున్నాడు. ఇక మార్కరమ్ కేకేఆర్తో చివరి మ్యాచ్లో వరుణ్ చక్రవర్తి బౌలింగ్లో 20 బంతుల్లో 40 పరుగులు రాబట్టాడు. సమిష్టిగా పోరాడితేనే సన్రైజర్స్ పేస్ దళానికి నాయకుడు టీమిండియా వెటరన్ పేసర్ భువనేశ్వర్ కుమార్. అతడితో పాటు ప్రొటిస్ ఫాస్ట్బౌలర్ మార్కో జాన్సెన్, ఉమ్రాన్ మాలిక్, నటరాజన్ ఉన్నారు. ఇక స్పిన్ విభాగంలో ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్, గత మ్యాచ్ హీరో మయాంక్ మార్కండే మరోసారి రాణించాలని ఎస్ఆర్హెచ్ కోరుకుంటోంది. తుది జట్టులో బౌలింగ్ విభాగంలో మార్కండే, జాన్సెన్, భువీ, ఉమ్రాన్ మాలిక్కు కచ్చితంగా చోటు దక్కించుకునే అవకాశాలు ఉన్నాయి. ఇదిలా ఉంటే బ్యాటింగ్ విభాగంలో టాపార్డర్ రాణిస్తేనే కోల్కతాను నిలువరించడం సన్రైజర్స్కు సాధ్యమవుతుంది. కేకేఆర్తో మ్యాచ్ సన్రైజర్స్ తుది జట్టు అంచనా మయాంక్ అగర్వాల్, హ్యారీ బ్రూక్, రాహుల్ త్రిపాఠి, ఎయిడెన్ మార్కరమ్(కెప్టెన్), హెన్రిచ్ క్లాసెన్(వికెట్ కీపర్), అబ్దుల్ సమద్, వాషింగ్టన్ సుందర్, మయాంక్ మార్కండే, మార్కో జాన్సెన్, భువనేశ్వర్ కుమార్, ఉమ్రాన్ మాలిక్. చదవండి: ఒకప్పుడు పర్పుల్ క్యాప్ విన్నర్.. తర్వాత నెట్బౌలర్! 6.5 కోట్ల నుంచి 50 లక్షల ధరకు.. దుమ్ము రేపుతున్నాడు.. సన్రైజర్స్ వదిలేసి పెద్ద తప్పు చేసింది! ఎవరంటే? var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4031445617.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
SRH Vs PBKS: అద్భుత ఇన్నింగ్స్.. త్రిపాఠి- మార్కరమ్ అరుదైన ఘనత..
Sunrisers Hyderabad vs Punjab Kings: ఐపీఎల్-2023లో ఆరెంజ్ ఆర్మీకి ఎట్టకేలకు ‘సన్రైజ్’ అయింది. హైదరాబాద్ జట్టు విన్రైజర్స్గా నిలిచి తాజా ఎడిషన్లో తొలి విజయం నమోదు చేసింది. సమిష్టి ప్రదర్శనతో సొంతగడ్డపై పంజాబ్ కింగ్స్ను చిత్తు చేసి అభిమానులను ఖుషీ చేసింది. ఉప్పల్ వేదికగా ఆదివారం జరిగిన మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకున్న సన్రైజర్స్ హైదరాబాద్కు సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్ శుభారంభం అందించాడు. తొలి బంతికే పంజాబ్ ఓపెనర్ ప్రబ్సిమ్రన్ సింగ్ను పెవిలియన్కు పంపాడు. చెలరేగిన మార్కండే ఈ క్రమంలో మార్కో జాన్సెన్ రెండు వికెట్లు తీయగా.. దేశీ స్పిన్నర్ మయాంక్ మార్కండే నాలుగు వికెట్లతో చెలరేగాడు. కశ్మీర్ స్పీడ్స్టర్ ఉమ్రాన్ మాలిక్ రెండు వికెట్లతో మెరిశాడు. రైజర్స్ బౌలర్ల విజృంభణతో పంజాబ్ బ్యాటర్లు పెవిలియన్కు క్యూ కట్టినప్పటికీ కెప్టెన్ శిఖర్ ధావన్ అద్భుత ఇన్నింగ్స్ (66 బంతుల్లో 99 పరుగులు)ఆడాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో ధావన్ సేన 9 వికెట్ల నష్టానికి 143 పరుగులు చేసింది. స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన సన్రైజర్స్కు శుభారంభం లభించలేదు. ఓపెనర్లు హ్యారీ బ్రూక్(14 బంతుల్లో 13 పరుగులు), మయాంక్ అగర్వాల్ (20 బంతుల్లో 21 పరుగులు) నిరాశపరిచారు. త్రిపాఠి, మార్కరమ్ వల్లే ఇలా.. అరుదైన ఘనత ఈ క్రమంలో వన్డౌన్ బ్యాటర్ రాహుల్ త్రిపాఠి(48 బంతుల్లో 74 పరుగులు నాటౌట్), కెప్టెన్ ఎయిడెన్ మార్కరమ్ (21 బంతుల్లో 37 పరుగులు నాటౌట్)బాధ్యతాయుత ఇన్నింగ్స్ ఆడారు. వరుస బౌండరీలతో విరుచుకుపడిన త్రిపాఠి 35 బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేసుకోగా.. నాథన్ ఎలిస్ ఓవర్లో మార్కరమ్ నాలుగు ఫోర్లు బాది రైజర్స్ విజయం ఖరారు చేశాడు. వీరిద్దరి అద్భుత భాగస్వామ్యంతో సన్రైజర్స్ ఖాతాలో తొలి గెలుపు వచ్చి చేరింది. ఈ నేపథ్యంలో త్రిపాఠి, మార్కరమ్ అరుదైన ఘనత అందుకున్నారు. ఎస్ఆర్హెచ్ తరఫున మూడో వికెట్కు వంద పరుగుల భాగస్వామ్యం నమోదు చేసిన ఐదో జోడీగా నిలిచారు. ఎస్ఆర్హెచ్ తరఫున మూడో వికెట్కు 100 పరుగుల భాగస్వామ్యం ►మనీశ్ పాండే- విజయ్ శంకర్ -2021- దుబాయ్లో- రాజస్తాన్ రాయల్స్ మీద- 140 పరుగులు ►కేన్ విలియమ్సన్- మనీశ్ పాండే- 2018- బెంగళూరలో- ఆర్సీబీతో మ్యాచ్లో- 135 పరుగులు ►డేవిడ్ వార్నర్- విజయ్ శంకర్- 2017- గుజరాత్ లయన్స్ మీద- కాన్పూర్లో- 133 పరుగులు ►కేఎల్ రాహుల్- డేవిడ్ వార్నర్- 2014లో- ముంబై ఇండియన్స్ మీద- దుబాయ్లో- 111 పరుగులు ►రాహుల్ త్రిపాఠి- ఎయిడెన్ మార్కరమ్- 2023లో- పంజాబ్ కింగ్స్ మీద- హైదరాబాద్లో- 100 పరుగులు అదే విధంగా ఈ గెలుపుతో సొంతగడ్డపై హైదరాబాద్ జట్టు 31వ విజయం నమోదు చేసింది. ఇప్పటివరకు ఆడిన 46 మ్యాచ్లలో 31 గెలిచి.. 15 ఓడిపోయింది. చదవండి: అలా చేయడం సరికాదని తెలుసు.. కానీ తప్పలేదు.. అయితే: మార్కరమ్ #KavyaMaran: 'చల్ హట్ రే'.. నీకు నేనే దొరికానా! 𝗪𝗛𝗔𝗧 𝗔 𝗪𝗜𝗡!👌 👌 1⃣st victory of the #TATAIPL 2023 for @SunRisers as they beat #PBKS by 8⃣ wickets in Hyderabad 👏 👏 Scorecard 👉 https://t.co/Di3djWhVcZ #TATAIPL | #SRHvPBKS pic.twitter.com/DoAFIkaMgb — IndianPremierLeague (@IPL) April 9, 2023 -
అలా చేయడం సరికాదని తెలుసు.. కానీ తప్పలేదు.. అయితే: మార్కరమ్
ఐపీఎల్-2023లో సన్రైజర్స్ హైదరాబాద్ తొలి విజయం నమోదు చేసింది. ఉప్పల్ వేదికగా పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో 8 వికెట్ల తేడాతో ఎస్ఆర్హెచ్ ఘన విజయం సాధించింది. బౌలింగ్ బ్యాటింగ్లో అదరగొట్టిన ఆరెంజ్ ఆర్మీ.. పంజాబ్ను చిత్తు చేసింది. 144 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఎస్ఆర్హెచ్ రెండు వికెట్లు కోల్పోయి 17.1 ఓవర్లలో ఛేదించింది. సన్రైజర్స్ బ్యాటర్లలో రాహుల్ త్రిపాఠి(74 నాటౌట్) పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడగా.. కెప్టెన్ మార్కరమ్(37నాటౌట్) రాణించాడు. అంతకుముందు బౌలింగ్లో స్పిన్నర్ మయాంక్ మార్కండే నాలుగు వికెట్లతో పంజాబ్ను దెబ్బ తీశాడు. ఇక ఈ ఘన విజయంపై మ్యాచ్ అనంతరం ఎస్ఆర్హెచ్ కెప్టెన్ ఎయిడెన్ మార్కరమ్ స్పందించాడు. ఈ విజయం చాలా ప్రత్యేకమైనది మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ.. "ఈ విజయం మాకు చాలా స్పెషల్. ఛేజింగ్ ఆరంభంలో మాకు కాస్త ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ.. ఆఖరికి విజయం సాధించడం చాలా సంతోషంగా ఉంది. మా జట్టుకు అద్భుతమైన ఫ్యాన్ బేస్ ఉంది. ఇంతమంది అభిమానుల మధ్య మా తొలి విజయాన్ని నమోదు చేయడం ఆనందంగా ఉంది. అది సరైన నిర్ణయం కాదని తెలుసు.. అయితే ప్రయోగం ఫలించింది ఇక ఈ మ్యాచ్లో అదిల్ రషీద్ వంటి స్టార్ స్పిన్నర్ను పక్కన పెట్టి మయాంక్ మార్కండేను ఆడించడం సరైన నిర్ణయం కాదని నాకు తెలుసు. కానీ నేను ప్రయోగం చేయాలనుకున్నాను. నేను చేసిన ప్రయోగం ఫలించింది. మార్కండే అద్భుతంగా రాణించాడు. అదే విధంగా రాహుల్ త్రిపాఠి గురుంచి ఎంత చెప్పినా తక్కువే. అతడు కొంచెం కూడా ఒత్తిడి లేకుండా ఆడాడు. రాహుల్ తన క్లాస్ ఏంటో మరోసారి చూపించాడు. ఇది మాకు తొలి విజయం. తర్వాతి మ్యాచ్ల్లో కూడా ఇదే జోరును కొనసాగిస్తాం" అని మార్కరమ్ పేర్కొన్నాడు. చదవండి: IPL 2023: మరి నువ్వు మారవా బ్రో.. 13 కోట్లు తీసుకున్నావు! ఇదేనా ఆట? 𝗪𝗛𝗔𝗧 𝗔 𝗪𝗜𝗡!👌 👌 1⃣st victory of the #TATAIPL 2023 for @SunRisers as they beat #PBKS by 8⃣ wickets in Hyderabad 👏 👏 Scorecard 👉 https://t.co/Di3djWhVcZ #TATAIPL | #SRHvPBKS pic.twitter.com/DoAFIkaMgb — IndianPremierLeague (@IPL) April 9, 2023 -
IPL 2023 SRH Vs PBKS: ‘విన్’రైజర్స్...
Sunrisers Hyderabad vs Punjab Kings- సాక్షి, హైదరాబాద్: ఐపీఎల్ సీజన్లో రెండు వరుస ఓటముల తర్వాత సన్రైజర్స్ చెలరేగింది. హైదరాబాద్ జట్టు సంపూర్ణ ఆధిపత్యంతో కీలక విజయాన్ని నమోదు చేసింది. ఆదివారం ఉప్పల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో సన్రైజర్స్ 8 వికెట్ల తేడాతో పంజాబ్ కింగ్స్పై ఘన విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన పంజాబ్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 143 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ శిఖర్ ధావన్ (66 బంతుల్లో 99 నాటౌట్; 12 ఫోర్లు, 5 సిక్స్లు) త్రుటిలో సెంచరీకి దూరమయ్యాడు. మయాంక్ మర్కండే (4/15) కింగ్స్ పతనంలో కీలకపాత్ర పోషించాడు. అనంతరం సన్రైజర్స్ 17.1 ఓవర్లలో 2 వికెట్లకు 145 పరుగులు చేసి గెలిచింది. రాహుల్ త్రిపాఠి (48 బంతుల్లో 74 నాటౌట్; 10 ఫోర్లు, 3 సిక్స్లు), కెపె్టన్ మార్క్రమ్ (21 బంతుల్లో 37 నాటౌట్; 6 ఫోర్లు) కలిసి జట్టును గెలిపించారు. వీరిద్దరు మూడో వికెట్కు 52 బంతుల్లోనే 100 పరుగులు జోడించారు. శిఖర్ మినహా... ఒక ఎండ్లో ధావన్ పట్టుదలగా చివరి వరకు నిలబడగా, మరో ఎండ్ నుంచి కనీసం సహకారం లేకపోవడంతో పంజాబ్ భారీ స్కోరు సాధించలేకపోయింది. ఇన్నింగ్స్ తొలి బంతికి ప్రభ్సిమ్రన్ (0)ను అవుట్ చేసి భువనేశ్వర్ మొదటి దెబ్బ కొట్టాడు. ఆ తర్వాత జాన్సెన్ తన వరుస ఓవర్లలో మాథ్యూ షార్ట్ (1), జితేశ్ శర్మ (4)లను అవుట్ చేయడంతో జట్టు 22 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. స్యామ్ కరన్ (15 బంతుల్లో 22; 3 ఫోర్లు, 1 సిక్స్) కొద్దిసేపు ధావన్కు అండగా నిలిచాడు. అయితే ఆ తర్వాత పంజాబ్ టపటపా వికెట్లు కోల్పోయింది. 35 పరుగుల వ్యవధిలో ఆ జట్టు 6 వికెట్లు చేజార్చుకుంది. దాంతో స్కోరు 88/9 వద్ద నిలిచింది. పంజాబ్ 100 పరుగులు చేయడం కూడా సందేహంగానే అనిపించింది. అయితే ఈ దశలో ధావన్ తను అనుభవాన్నంతా రంగరించి బాధ్యతను తీసుకున్నాడు. ఈ సమయంలో ధావన్ 47 పరుగుల వద్ద (38 బంతుల్లో) ఉన్నాడు. ఆపై చెలరేగిపోయిన అతను తర్వాతి 28 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సర్లతో మరో 52 పరుగులు సాధించడం విశేషం. చివరి వికెట్కు ధావన్, మోహిత్ రాఠీ 55 పరుగులు జోడించగా, అందులో 52 ధావనే చేశాడు. భారీ భాగస్వామ్యం... ఛేదనలో రైజర్స్కు పెద్దగా ఇబ్బంది ఎదురు కాలేదు. ఓపెనర్లు బ్రూక్ (13), మయాంక్ అగర్వాల్ (21) ఫర్వాలేదనిపించడంతో పవర్ప్లేలో స్కోరు 34 పరుగులకు చేరింది. వీరిద్దరు తక్కువ వ్యవధిలో వెనుదిరిగినా... త్రిపాఠి, మార్క్రమ్ కలిసి సునాయాసంగా జట్టును విజయం దిశగా నడిపించారు. పంజాబ్ బౌలర్లు ఎంతగా శ్రమించినా ఈ జోడీని ఇబ్బంది పెట్టలేకపోయారు. వరుస ఫోర్లతో దూకుడు ప్రదర్శించిన త్రిపాఠి 35 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఎలిస్ ఓవర్లో మార్క్రమ్ నాలుగు ఫోర్లు కొట్టడంతో హైదరాబాద్ గెలుపు ఖాయమైంది. స్కోరు వివరాలు పంజాబ్ కింగ్స్ ఇన్నింగ్స్: ప్రభ్సిమ్రన్ (ఎల్బీ) (బి) భువనేశ్వర్ 0; ధావన్ (నాటౌట్) 99; షార్ట్ (ఎల్బీ) (బి) జాన్సెన్ 1; జితేశ్ (సి) మార్క్రమ్ (బి) జాన్సెన్ 4; కరన్ (సి) భువనేశ్వర్ (బి) మర్కండే 22; రజా (సి) మయాంక్ (బి) ఉమ్రాన్ 5; షారుఖ్ (ఎల్బీ) (బి) మర్కండే 4; హర్ప్రీత్ (బి) ఉమ్రాన్ 1; చహర్ (ఎల్బీ) (బి) మర్కండే 0; ఎలిస్ (బి) మర్కండే 0; రాఠీ (నాటౌట్) 1; ఎక్స్ట్రాలు 6; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు 143). వికెట్ల పతనం: 1–0, 2–10, 3–22, 4–63, 5–69, 6–74, 7–77, 8–78, 9–88. బౌలింగ్: భువనేశ్వర్ 4–0–33–1, జాన్సెన్ 3–1–16–2, నటరాజన్ 4–0–40–0, సుందర్ 1–0–6–0, మర్కండే 4–0–15–4, ఉమ్రాన్ 4–0–32–2. సన్రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్: బ్రూక్ (బి) అర్ష్ దీప్ 13; మయాంక్ (సి) కరన్ (బి) చహర్ 21; త్రిపాఠి (నాటౌట్) 74; మార్క్రమ్ (నాటౌట్) 37; ఎక్స్ట్రాలు 0; మొత్తం (17.1 ఓవర్లలో 2 వికెట్లకు) 145. వికెట్ల పతనం: 1–27, 2–45. బౌలింగ్: స్యామ్ కరన్ 3–0–14–0, అర్ష్ దీప్ 3–0–20–1, హర్ప్రీత్ 3.1–0–26–0, ఎలిస్ 3–0–28–0, రాహుల్ చహర్ 3–0–28–1, రాఠీ 2–0–29–0. 𝗪𝗛𝗔𝗧 𝗔 𝗪𝗜𝗡!👌 👌 1⃣st victory of the #TATAIPL 2023 for @SunRisers as they beat #PBKS by 8⃣ wickets in Hyderabad 👏 👏 Scorecard 👉 https://t.co/Di3djWhVcZ #TATAIPL | #SRHvPBKS pic.twitter.com/DoAFIkaMgb — IndianPremierLeague (@IPL) April 9, 2023 -
IPL 2023: వరుసగా రెండు ఓటములు.. ఈసారి ట్రోఫీ సన్రైజర్స్దే.. అదెలా..?
ఇండియన్ ప్రీమియర్ లీగ్-2023లో సన్రైజర్స్ హైదరాబాద్ తొలి రెండు మ్యాచ్ల్లో పరాజయాలు ఎదుర్కొన్న నేపథ్యంలో ఓ ఆసక్తికర అంశం తెరపైకి వచ్చింది. 2016 ఐపీఎల్లో సన్రైజర్స్ ఇలాగే తొలి రెండు మ్యాచ్ల్లో ఓటమిపాలై, ఆతర్వాత ఏకంగా టైటిల్ కైవసం చేసుకోవడంతో ఈ సారి కూడా అదే సీన్ రిపీట్ అవుతుందని ఆ జట్టు అభిమానులు అంచనా వేస్తున్నారు. 2016లో సన్రైజర్స్ తొలి మ్యాచ్లో ఆర్సీబీ చేతిలో (45 పరుగుల తేడాతో), రెండో మ్యాచ్లో కోల్కతా నైట్రైడర్స్ చేతిలో (8 వికెట్ల తేడాతో) ఓటమిపాలు కాగా.. ప్రస్తుత ఎడిషన్లో ఆ జట్టు తొలి మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ చేతిలో (72 పరుగుల తేడాతో), రెండో మ్యాచ్లో లక్నో సూపర్ జెయింట్స్ చేతిలో (5 వికెట్ల తేడాతో) పరాజయంపాలైంది. కాగా, తొలి రెండు మ్యాచ్ల్లో సన్రైజర్స్ ఘోర పరాజయాలు ఎదుర్కొన్న నేపథ్యంలో ఆ జట్టు అభిమానులు ఈ విషయాన్ని హైలైట్ చేస్తూ ఊరట పొందుతున్నారు. కొత్త కెప్టెన్ ఎయిడెన్ మార్క్రమ్ వచ్చాక అయినా సన్ 'రైజ్' అవుతుందని భావిస్తే.. అతను కూడా ఏమీ చేయలేకపోవడంతో (గోల్డెన్ డక్) కొందరు ఫ్యాన్స్ నిరాశలో కూరుకుపోయారు. తదుపరి ఏప్రిల్ 9న పంజాబ్తో జరుగబోయే మ్యాచ్ నుంచి తమ విజయయాత్ర కొనసాగుతుందని మరికొందరు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇది ఆరంభమే, ఇంకా బహుదూర ప్రయాణం సాగించాల్సి ఉంది, ఈ మధ్యలో ఏమైనా జరగవచ్చు, ఈసారి జట్టు కూడా పటిష్టంగా ఉందనుకుంటూ కొందరు హార్డ్కోర్ అభిమానులు తమను తాము తృప్తి పరుచుకుంటున్నారు. ఇదిలా ఉంటే, లక్నో సూపర్ జెయింట్స్తో నిన్న (ఏప్రిల్ 8) జరిగిన మ్యాచ్లో సన్రైజర్స్ అన్ని విభాగాల్లో ఘోరంగా విఫలమై దారుణ ఓటమిని మూటగట్టుకుంది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆ జట్టు నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 121 పరుగుల అతి సాధారణ స్కోర్ చేసింది. కెప్టెన్ మార్క్రమ్ గోల్డన్ డకౌట్ కాగా.. 13.25 కోట్ల ఆటగాడు హ్యారీ బ్రూక్ (3) వరుసగా రెండో మ్యాచ్లోనూ విఫలమై దారుణంగా నిరాశపరిచాడు. రాహుల్ త్రిపాఠి (41 బంతుల్లో 35), వాషింగ్టన్ సుందర్ (28 బంతుల్లో 16) టెస్ట్ మ్యాచ్ ఇన్నింగ్స్లు ఆడారు. స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఎల్ఎస్జే.. ఆడుతూ పాడుతూ విజయతీరాలకు (16 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 127) చేరింది. తొలుత బౌలింగ్లో (4-0-18-3) అదరగొట్టిన కృనాల్ పాండ్యా, ఆతర్వాత బ్యాటింగ్లోనూ (23 బంతుల్లో 34; 4 ఫోర్లు, సిక్స్) రెచ్చిపోయి ఒంటిచేత్తో తన జట్టును గెలిపించాడు. -
రూ. 13 కోట్లు పెట్టారు కదా! ఇలాగే ఉంటది.. కానీ పాపం: భారత మాజీ క్రికెటర్
IPL 2023- SRH- Harry Brook: ‘‘ఐపీఎల్ వేలం జరిగిన ప్రతిసారి నా దృష్టి విదేశీ ఆటగాళ్లపై కూడా ఉంటుంది. ముఖ్యంగా ఇంగ్లిష్ ప్లేయర్లు.. వారికి లభించే మొత్తాలను గమనిస్తూ ఉంటా. అందుకు తగ్గట్లే వాళ్లు ఐపీఎల్లో మెరుగైన ప్రదర్శన కనబరుస్తారని ఆశిస్తా. కానీ, వారి విషయంలో నా అంచనాలు చాలా వరకు తలకిందులు అయ్యాయి. ఉపఖండ పిచ్లపై.. ఐపీఎల్ వంటి ప్రతిష్టాత్మక టోర్నీల్లో.. భారీ ప్రైస్ ట్యాగ్ల నేపథ్యంలో నెలకొన్న అంచనాలు అందుకోవడం అంత తేలికేమీ కాదు. ఇంగ్లండ్ ఆటగాళ్లలో అతికొద్ది మంది మాత్రమే ఐపీఎల్లో ఒత్తిడి అధిగమించి తమను తాము నిరూపించుకున్నారు. అయితే, ఆస్ట్రేలియన్లు, వెస్టిండీస్, సౌతాఫ్రికా క్రికెటర్ల పరిస్థితి ఇందుకు భిన్నం. వారు ఇక్కడి పరిస్థితులు, ఐపీఎల్ ఫార్మాట్ను సరిగ్గా అర్థం చేసుకుని ముందుకు సాగుతున్నారు. కానీ ఇంగ్లిష్ ఆటగాళ్లు మాత్రం ఇంకా వారిలా అదరగొట్టలేకపోతున్నారు’’ అని టీమిండియా మాజీ క్రికెటర్, కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ అన్నాడు. కోట్లు కుమ్మరించారు ఐపీఎల్-2023లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్ చేతిలో సన్రైజర్స్ హైదరాబాద్ ఓటమి నేపథ్యంలో మంజ్రేకర్ ఈ మేరకు స్టార్ స్టోర్స్ షోలో మాట్లాడుతూ తన అభిప్రాయాలు పంచుకున్నాడు. హైదరాబాద్ ఫ్రాంఛైజీ కోట్లు కుమ్మరించి కొనుగోలు చేసిన ఇంగ్లండ్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అవే బ్రూక్ను ఒత్తిడిలోకి నెట్టేస్తున్నాయి బ్రూక్ త్వరలోనే తనదైన శైలిలో చెలరేగాలని ఆశిస్తున్నట్లు మంజ్రేకర్ పేర్కొన్నాడు. ‘‘హ్యారీ బ్రూక్ ఫామ్లోకి వస్తాడనే అనుకుంటున్నా? అయితే అది ఎప్పుడంటే మాత్రం కచ్చితంగా చెప్పలేను. ఇందుకు మరో రెండు మ్యాచ్లు లేదంటే మూడు మ్యాచ్ల సమయం పట్టొచ్చు. తన బలమేంటో తెలుసుకుని.. తన నైపుణ్యాలు ప్రదర్శించగలుగుతాడు. ప్రస్తుతం అతడిపై అధిక ధర పలికిన ప్లేయర్ అనే ట్యాగ్.. చుట్టూ జనాల అంచనాలు.. భారత పిచ్లపై బౌలర్లను ఎలా ఎదుర్కోవాలో తెలియని అనుభవలేమి ఒత్తిడిని పెంచుతున్నాయి. వీటిని అధిగమిస్తే బ్రూక్ తప్పకుండా రాణించగలడు’’ అంటూ మంజ్రేకర్ హ్యారీ బ్రూక్కు అండగా నిలబడ్డాడు. 13 కోట్ల రూపాయలు పలికిన పవర్ హిట్టర్.. ఐపీఎల్లో ఇలా 24 ఏళ్ల బ్రూక్ బిగ్ హిట్టర్గా పేరొందాడు. గతేడాది 6 టెస్టులు ఆడి ఏకంగా నాలుగు సెంచరీలు సాధించాడు. అరంగేట్రంలోనే శతకం బాది తన ఆగమనాన్ని ఘనంగా చాటాడు. ఇప్పటి వరకు ఇంగ్లండ్ తరఫున 20 టీ20లు ఆడిన ఈ రైట్ హ్యాండ్ బ్యాటర్ 372 పరుగులు చేశాడు. ఇక ఐపీఎల్- 2023 మినీ వేలంలో సన్రైజర్స్ అతడి కోసం ఇతర ఫ్రాంఛైజీలతో పోటీపడి ఏకంగా 13.25 కోట్లు ఖర్చు పెట్టి కొనుగోలు చేసింది. కానీ ఇప్పటి వరకు ఆడిన రెండు మ్యాచ్లలో ఈ సన్రైజర్స్ బ్యాటర్ పూర్తిగా విఫలమయ్యాడు. రాజస్తాన్, లక్నోలతో మ్యాచ్లలో కలిపి 16 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో అతడిపై విమర్శలు వెల్లువెత్తుతుండగా మంజ్రేకర్ ఈ మేరకు అండగా నిలవడం గమనార్హం. చదవండి: సీఎస్కేతో మ్యాచ్.. సచిన్ కొడుకు ఐపీఎల్ ఎంట్రీ! ఎయిడెన్ అన్న, బ్రూక్ వల్లే ఇదంతా! సాకులు వెతుక్కోవద్దన్న లారా.. బ్యాటర్లపై ఫైర్! ఎవరు బాబు నీవు.. వెళ్లి టెస్టులు ఆడుకో పో! అక్కడ కూడా పనికి రాడు -
ఎయిడెన్ అన్న, బ్రూక్ వల్లే ఇదంతా! సాకులు వెతుక్కోవద్దన్న లారా.. బ్యాటర్లపై ఫైర్!
Lucknow Super Giants vs Sunrisers Hyderabad: ‘‘వరుసగా వికెట్లు కోల్పోవడం తీవ్ర ప్రభావం చూపుతోంది. తొలి మ్యాచ్లో మొదటి ఓవర్లోనే వికెట్లు కోల్పోయాం. ఈరోజు ఏడు బంతుల వ్యవధిలోనే మూడు వికెట్లు పడ్డాయి. దీంతో మ్యాచ్ స్వరూపం మొత్తం మారిపోయింది. కచ్చితంగా మా బ్యాటర్ల ఆట తీరు మెరుగుపడాల్సి ఉంది. లోపాలు సరిచేసుకుంటేనే అనుకున్న ఫలితాలు రాబడుతూ ముందుకు సాగే వీలు ఉంటుంది’’ అని సన్రైజర్స్ హెడ్కోచ్ బ్రియన్ లారా అన్నాడు. ఐపీఎల్-2023లో బ్యాటర్ల దారుణ వైఫల్యమే తొలి రెండు మ్యాచ్లలో ఓటములకు కారణమైందని పేర్కొన్నాడు. పేలవమైన ప్రదర్శనతో రైజర్స్ వరుస ఓటములు ఇప్పటికైనా తమ బ్యాటింగ్ విభాగం పొరపాట్లు సరిచేసుకోవాలని, ఆ మేరకు కావాల్సిన చర్యలు చేపడతామని లారా వెల్లడించాడు. కాగా ఐపీఎల్-2022 సీజన్ను ఎనిమిదో స్థానంతో ముగించిన సన్రైజర్స్.. పదహారో ఎడిషన్నూ పేలవంగా ఆరంభించింది. సొంతగడ్డపై రాజస్తాన్ రాయల్స్తో ఆడిన తొలి మ్యాచ్లో ఘోర పరాజయం పాలైన రైజర్స్... శుక్రవారం నాటి మ్యాచ్లోనూ చేతులెత్తేసింది. లక్నో సూపర్ జెయింట్స్ చేతిలో 5 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. ఈ రెండు మ్యాచ్లలోనూ బ్యాటర్ల వైఫల్యం కొట్టొచ్చినట్లు కనపడింది. ఎయిడెన్ అన్న.. హ్యారీ బ్రూక్ మరీ ఘోరంగా తొలి మ్యాచ్లో టాపార్డర్ పూర్తిగా విఫలం కాగా.. లక్నోలో మ్యాచ్లో 50/1తో పర్వాలేదనిపించినా.. కేవలం నాలుగు పరుగుల వ్యవధిలో మూడు వికెట్లు కోల్పోవడం దెబ్బకొట్టింది. భారీ అంచనాల నడుమ బ్యాటింగ్కు దిగిన కెప్టెన్ ఎయిడెన్ మార్కరమ్ గోల్డెన్ డకౌట్ కాగా.. హ్యారీ బ్రూక్(3) మరోసారి పూర్తిగా నిరాశపరిచాడు. ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో 121 పరుగులు చేసి స్వల్ప లక్ష్యం విధించిన హైదరాబాద్ జట్టుపై రాహుల్ సేన ఘన విజయం సాధించింది. 16 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించడంతో రైజర్స్ ఖాతాలో వరుసగా రెండో ఓటమి వచ్చి చేరింది. వాళ్లిద్దరు అవుట్ అవడం దెబ్బతీసింది ఈ నేపథ్యంలో ఓటమి అనంతరం లారా మాట్లాడుతూ.. అన్మోల్ప్రీత్ సింగ్ అవుటైన తర్వాత.. కెప్టెన్ ఎయిడెన్ మార్కరమ్, హ్యారీబ్రూక్ వెనువెంటనే పెవిలియన్ చేరడం తమను చావు దెబ్బతీసిందన్నాడు. కనీసం 150- 160 పరుగులు చేస్తే పరిస్థితి వేరేలా ఉండేదని అభిప్రాయపడ్డాడు. పిచ్ను నిందిస్తూ ఓటమికి సాకులు వెతుక్కోబోమని.. తమ బ్యాటింగ్ విభాగం మెరుగుపడాల్సి ఉందని లారా చెప్పుకొచ్చాడు. చదవండి: టెస్టులాడేటోడిని ఐపీఎల్ ఆడిస్తే ఇలానే ఉంటుంది! ఎవరు బాబు నీవు.. వెళ్లి టెస్టులు ఆడుకో పో! అక్కడ కూడా పనికి రాడు An all-round @krunalpandya24 performance and a clinical @LucknowIPL chase at home to move to the 🔝 of the table 👌🏻👌🏻 #TATAIPL We have got the #LSGvSRH clash summed up for you 🔽 pic.twitter.com/d0m9foUkqf — IndianPremierLeague (@IPL) April 8, 2023 -
అదే మా కొంపముంచింది.. వారు మాత్రం అద్భుతం! పిచ్ కూడా: ఎస్ఆర్హెచ్ కెప్టెన్
ఐపీఎల్-2023లో సన్రైజర్స్ హైదరాబాద్ వరుసగా రెండో ఓటమి చవిచూసింది. వాజ్పేయి స్టేడియం వేదికగా లక్నో సూపర్ జెయింట్స్తో జరిగిన మ్యాచ్లో 5వికెట్ల తేడాతో ఎస్ఆర్హెచ్ ఓటమి పాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్హెచ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి కేవలం 121 పరుగులు మాత్రమే చేయగల్గింది. ఎస్ఆర్హెచ్ బ్యాటర్లలో అన్మోల్ప్రీత్ సింగ్(31), త్రిపాఠి(35), సమద్(21) పరుగులతో పర్వాలేదనపించారు. ఇక కెప్టెన్గా తొలి మ్యాచ్ ఆడిన ఐడైన్ మార్క్రమ్ గోల్డన్ డక్గా వెనుదిరిగాడు. మరోవైపు లక్నో బౌలర్లలో కృనాల్ పాండ్యా మూడు వికెట్లతో చెలరేగాడు. 122 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో 5 వికెట్లు కోల్పోయి 16 ఓవర్లలోనే చేధించింది. ఇక ఈ ఘోర ఓటమిపై మ్యాచ్ అనంతరం ఎస్ఆర్హెచ్ కెప్టెన్ ఐడైన్ మార్క్రమ్ స్పందించాడు. ఈ మ్యాచ్లో ఓటమికి కారణం తమ బ్యాటింగ్ వైఫల్యమే అని మార్క్రమ్ అంగీకరించాడు. "మేము బ్యాటింగ్లో దారుణంగా విఫలమయ్యాం. మేము నిర్ణీత ఓవర్లలో 150 నుంచి 160 పరుగులు చేయడానికి ప్రయ్నత్నించాము. కానీ మేము అనుకున్న టార్గెట్కు చేరుకోలేకపోయాం. అయితే లక్నో వికెట్ కూడా బ్యాటింగ్కు పెద్దగా సహకరించలేదు. కానీ మేము ఈ మ్యాచ్లో ఆఖరి వరకు పోరాడినందుకు సంతోషంగా ఉంది. ఈ పరిస్థితులకు అనుగుణంగా మా బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. మేము మరిన్ని పరుగులు చేసి ఉంటే.. మా బౌలర్లు కచ్చితంగా మ్యాచ్ను మలుపు తిప్పేవారు. ఇక మా తర్వాతి హోం మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ను ఢీ కొట్టబోతున్నాం. అక్కడ మా పొరపాట్లను సరిదిద్దుకుంటాం అని ఐడైన్ మార్క్రమ్ పేర్కొన్నాడు. ఇక పిచ్ బ్యాటింగ్కు సహకరించలేదు అని మార్క్రమ్ చేసిన వాఖ్యలపై ఆరెంజ్ ఆర్మీ అభిమానులు మండిపడుతున్నారు. బ్యాటింగ్లో కొంచెం కూడా దూకుడు లేకుండా ఆడిందే కాక, వికెట్ సహకరించలేదు అని చెప్పడానికి సిగ్గులేదు అంటూ ట్రోలు చేస్తున్నారు. -
కెప్టెన్గా తొలి మ్యాచ్లోనే గోల్డెన్ డక్.. ఏం ఎంట్రీ అన్నా!
''అన్నొచ్చేశాడు.. ఇక ఎస్ఆర్హెచ్ కథ మారిపోనుంది''.. ''మార్క్రమ్ ఎంట్రీతో ఎస్ఆర్హెచ్లో కొత్త జోష్ కనిపిస్తుంది''..'' కొత్త కెప్టెన్సీలో ఎస్ఆర్హెచ్ అదరగొట్టనుంది''.. ''వాతి(మార్క్రమ్) కమింగ్.. బి కేర్ఫుల్ అపోజిట్ టీం మెంబర్స్''.. మార్క్రమ్ ఎరా మొదలైంది.. ఇక ఎవరు ఆపలేరు''.. ఇదంతా లక్నో సూపర్ జెయింట్స్తో మ్యాచ్కు ముందు ఎయిడెన్ మార్క్రమ్ ఎంట్రీ గురించి ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ సోషల్ మీడియలో ఇలా ఊదరగొట్టారు. కట్చేస్తే.. కెప్టెన్గా తొలి మ్యాచ్ ఆడుతున్న మార్క్రమ్ గోల్డెన్ డకౌట్ అయ్యాడు. లక్నోతో మ్యాచ్లో కృనాల్ పాండ్యా బౌలింగ్లో క్లీన్బౌల్డ్ అయ్యాడు. కనీసం బంతిని కూడా అంచనా వేయడంలో విఫలమైన మార్క్రమ్ పేలవ రీతిలో క్లీన్బౌల్డ్ అయ్యాడు. మార్క్రమ్ వచ్చాడు ఏదో చేస్తాడనుకుంటే ఇలా గోల్డెన్ డకౌట్ అవ్వడం ఏంటని ఎస్ఆర్హెచ్ అభిమానులు మండిపడ్డారు. కెప్టెన్గా తొలి మ్యాచ్లోనే గోల్డెన్ డక్.. ఏం ఎంట్రీ ఇచ్చావ్ అన్నా అంటూ వ్యంగ్యంగా పేర్కొన్నారు. అయితే మార్క్రమ్ వచ్చినా ఎస్ఆర్హెచ్ ఆటతీరు ఏ మాత్రం మారలేదు. పరుగులు చేయాల్సిన బ్యాటర్లు పోటీ పడి మరి వికెట్లు సమర్పించుకున్నారు. పార్ట్టైం బౌలర్గా వ్యవహరించే కృనాల్ పాండ్యా బౌలింగ్లో ముగ్గురు బ్యాటర్లు ఔటయ్యారంటే ఎస్ఆర్హెచ్ ఎంత బాగా బ్యాటింగ్ చేసిందో అర్థం చేసుకోవచ్చు. Headline for tomorrow's 𝐓𝐡𝐞 𝐋𝐮𝐜𝐤𝐧𝐨𝐰 𝐓𝐢𝐦𝐞𝐬 📰 𝘏𝘶𝘮𝘢𝘢𝘳 𝘗𝘢𝘯𝘥𝘺𝘢 𝘣𝘩𝘢𝘪𝘺𝘢, 𝘮𝘢𝘴𝘵 𝘣𝘢𝘢#LSGvSRH #TATAIPL #IPLonJioCinema | @krunalpandya24 pic.twitter.com/mQ7dui048U — JioCinema (@JioCinema) April 7, 2023 Golden duck for Aiden Markram on captaincy debut. Krunal Pandya on fire! pic.twitter.com/mfv0bPn3Zk — Mufaddal Vohra (@mufaddal_vohra) April 7, 2023 Golden Duck on debut match as a captain in IPL 🔥🔥 Aiden Markram era starts from here they said, well said😍😍 #LSGvSRH pic.twitter.com/Gg69nUxQGG — TukTuk Academy (@TukTuk_Academy) April 7, 2023 Search: Markram Era 😂😂🤣🤣🤣🤣🤣 — Dileep (@dileeptweetsz) April 7, 2023 చదవండి: ''గ్లాడియేటర్' సినిమా చూసినప్పుడల్లా ఏడుస్తా' ఆ ముగ్గురు దిగ్గజాలు క్రికెట్ను ఏలేవారేమో! -
IPL 2023: ఎస్ఆర్హెచ్పై లక్నో ఘన విజయం
ఎస్ఆర్హెచ్పై లక్నో ఘన విజయం ఎస్ఆర్హెచ్తో జరిగిన మ్యాచ్లో లక్నో సూపర్ జెయింట్స్ ఐదు వికెట్ల తేడాతో ఘన విజయాన్ని సాధించింది. 122 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో సూపర్ జెయింట్స్ 16 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి టార్గెట్ను అందుకుంది. కేఎల్ రాహుల్ 35, కృనాల్ పాండ్యా 34 పరుగులతో రాణించి జట్టును విజయతీరాలకు చేర్చారు. ఎస్ఆర్హెచ్ బౌలర్లలో ఆదిల్ రషీద్ రెండు వికెట్లు పడగొట్టగా.. ఫజల్లా ఫరుకీ, భువనేశ్వర్, ఉమ్రాన్ మాలిక్లు తలా ఒక వికెట్ తీశారు. అంతకముందు బ్యాటింగ్లో విఫలమైన ఎస్ఆర్హెచ్ లక్నో ముందు 122 పరుగుల సాధారణ లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న ఎస్ఆర్హెచ్ ఏ దశలోనూ కలిసిరాలేదు. ఒక్కరంటే ఒక్కరు కూడా చెప్పుకోదగ్గ స్కోరు చేయలేకపోయారు. నిర్ణీత 20 ఓవర్లలో ఎస్ఆర్హెచ్ 8 వికెట్ల నష్టానికి 121 పరుగులు చేసింది. రాహుల్ త్రిపాఠి 35, అన్మోల్ప్రీత్ సింగ్ 31, అబ్దుల సమద్ 10 బంతుల్లో 21 నాటౌట్ రాణించారు. లక్నో బౌలర్లలో కృనాల్ పాండ్యా మూడు వికెట్లు తీయగా.. అమిత్ మిశ్రా రెండు, బిష్ణోయి, యష్ ఠాకూర్ చెరొక వికెట్ తీశారు. ఆడుతూ పాడుతూ లక్ష్యం దిశగా లక్నో 122 పరుగుల టార్గెట్తో బరిలోకి దిగిన లక్నో సూపర్ జెయింట్స్ లక్ష్యం దిశగా సాగుతుంది. 9 ఓవర్లు ముగిసేసరికి రెండు వికెట్ల నష్టానికి 72 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ 30, కృనాల్ పాండ్యా 15 పరుగులతో క్రీజులో ఉన్నారు. Photo Credit : IPL Website విఫలమైన ఎస్ఆర్హెచ్ బ్యాటర్లు.. లక్నో టార్గెట్ 122 బ్యాటింగ్లో విఫలమైన ఎస్ఆర్హెచ్ లక్నో ముందు 122 పరుగుల సాధారణ లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న ఎస్ఆర్హెచ్ ఏ దశలోనూ కలిసిరాలేదు. ఒక్కరంటే ఒక్కరు కూడా చెప్పుకోదగ్గ స్కోరు చేయలేకపోయారు. నిర్ణీత 20 ఓవర్లలో ఎస్ఆర్హెచ్ 8 వికెట్ల నష్టానికి 121 పరుగులు చేసింది. రాహుల్ త్రిపాఠి 35, అన్మోల్ప్రీత్ సింగ్ 31, అబ్దుల సమద్ 10 బంతుల్లో 21 నాటౌట్ రాణించారు. లక్నో బౌలర్లలో కృనాల్ పాండ్యా మూడు వికెట్లు తీయగా.. అమిత్ మిశ్రా రెండు, బిష్ణోయి, యష్ ఠాకూర్ చెరొక వికెట్ తీశారు. Photo Credit : IPL Website మెరిసిన అమిత్ మిశ్రా.. ఆరో వికెట్ కోల్పోయిన ఎస్ఆర్హెచ్ లక్నో సూపర్ జెయింట్స్తో మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ దారుణ ఆటతీరు కనబరుస్తోంది. అమిత్ మిశ్రా ఒకే ఓవర్లు రెండు వికెట్లు తీయడంతో ఎస్ఆర్హెచ్ ఆరో వికెట్ కోల్పోయింది. నాలుగు పరుగులు చేసిన ఆదిల్ రషీద్ హుడాకు క్యాచ్ ఇచ్చాడు. అంతకముందు వాషింగ్టన్ సుందర్(16) రూపంలో ఎస్ఆర్హెచ్ ఐదో వికెట్ కోల్పోయింది. అమిత్ మిశ్రా బౌలింగ్లో భారీ షాట్కు యత్నించిన సుందర్ దీపక్ హుడాకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. Photo Credit : IPL Website 14 ఓవర్లలో ఎస్ఆర్హెచ్ 76/4 14 ఓవర్లు ముగిసేసరికి ఎస్ఆర్హెచ్ నాలుగు వికెట్ల నష్టానికి 76 పరుగులు చేసింది. వాషింగ్టన్ సుందర్ 9 , రాహుల్ త్రిపాఠి 23 పరుగులతో క్రీజులో ఉన్నారు. 9 ఓవర్లు ముగిసేసరికి ఎస్ఆర్హెచ్ నాలుగు వికెట్ల నష్టానికి 55 పరుగులు చేసింది. రవి బిష్ణోయి బౌలింగ్లో బ్రూక్ స్టంపౌట్గా వెనుదిరగడంతో ఎస్ఆర్హెచ్ నాలుగో వికెట్ కోల్పోయింది. Photo Credit : IPL Website మార్క్రమ్ గోల్డెన్ డక్.. మూడో వికెట్ కోల్పోయిన ఎస్ఆర్హెచ్ కృనాల్ పాండ్యా ఎస్ఆర్హెచ్ను దెబ్బతీశాడు. కెప్టెన్ ఎయిడెన్ మార్ర్కమ్ గోల్డెన్ డకౌట్ అయ్యాడు. దీంతో ఎస్ఆర్హెచ్ మూడో వికెట్ కోల్పోయింది. అంతకముందు అన్మోల్ప్రీత్ సింగ్(31 పరుగులు) రూపంలో ఎస్ఆర్హెచ్ రెండో వికెట్ కోల్పోయింది. కృనాల్ పాండ్యా బౌలింగ్లో అన్మోల్ప్రీత్ సింగ్ ఎల్బీగా వెనుదిరిగాడు. ప్రస్తుతం 8 ఓవర్లు ముగిసేసరికి ఎస్ఆర్హెచ్ మూడు వికెట్ల నష్టానికి 50 పరుగులు చేసింది. Photo Credit : IPL Website తొలి వికెట్ కోల్పోయిన ఎస్ఆర్హెచ్ లక్నోతో మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ తొలి వికెట్ కోల్పోయింది. మయాంక్ అగర్వాల్(8 పరుగులు) కృనాల్ పాండ్యా బౌలింగ్లో స్టోయినిస్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం ఎస్ఆర్హెచ్ వికెట్ నష్టానికి 21 పరుగులు చేసింది. Photo Credit : IPL Website టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఎస్ఆర్హెచ్ ఐపీఎల్ 16వ సీజన్ పదో మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్, లక్నో సూపర్ జెయింట్స్ తలపడుతున్నాయి. టాస్ గెలిచిన ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ ఎంచుకుంది. సన్రైజర్స్ హైదరాబాద్ (ప్లేయింగ్ XI): మయాంక్ అగర్వాల్, అన్మోల్ప్రీత్ సింగ్(వికెట్ కీపర్), రాహుల్ త్రిపాఠి, ఐడెన్ మార్క్రమ్(కెప్టెన్), హ్యారీ బ్రూక్, వాషింగ్టన్ సుందర్, అబ్దుల్ సమద్, భువనేశ్వర్ కుమార్, T నటరాజన్, ఉమ్రాన్ మాలిక్, ఆదిల్ రషీద్ లక్నో సూపర్ జెయింట్స్ (ప్లేయింగ్ XI): కేఎల్ రాహుల్(కెప్టెన్), కైల్ మేయర్స్, దీపక్ హుడా, మార్కస్ స్టోయినిస్, నికోలస్ పూరన్(వికెట్ కీపర్), రొమారియో షెపర్డ్, కృనాల్ పాండ్యా, అమిత్ మిశ్రా, యశ్ ఠాకూర్, జయదేవ్ ఉనద్కత్, రవి బిష్ణోయ్ .@AidzMarkram calls right at the toss, and the @SunRisers are batting first in #LSGvSRH 🏏 Watch this #TATAIPL - LIVE & FREE on #JioCinema across all telecom operators.#IPL2023 #IPLonJioCinema | @LucknowIPL pic.twitter.com/bVTAyxAXiJ — JioCinema (@JioCinema) April 7, 2023 తొలి మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ చేతిలో చిత్తుగా ఓడిన హైదరాబాద్ విజయం సాధించాలనే పట్టుదలతో ఉంది. కెప్టెన్ ఎయిడెన్ మార్క్రమ్ రాకతో ఎస్ఆర్హెచ్ ఆత్మవిశ్వాసంతో ఉంది. సొంతగడ్డపై పోరులో గెలుపు సొంతం చేసుకోవాలని కేఎల్ రాహుల్ సేన భావిస్తోంది. దాంతో, అటల్ బిహారీ వాజ్పేయి ఎకనా స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ ఆసక్తికరంగా ఉండనుంది. మొదటి మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ను ఓడించిన లక్నో రెండో మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో ఓటమి పాలైన విషయం తెలిసిందే. -
లక్నో సూపర్ జెయింట్స్తో మ్యాచ్.. సన్రైజర్స్లో కీలక మార్పులు
SRH VS LSG: ఐపీఎల్-2023లో భాగంగా ఇవాళ (ఏప్రిల్ 7) లక్నో సూపర్ జెయింట్స్- సన్రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడనున్నాయి. అటల్ బిహారి స్టేడియంలో రాత్రి 7: 30 గంటలకు ప్రారంభంకాబోయే ఈ మ్యాచ్ కోసం ఇరు జట్లు భారీ మార్పులు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తొలుత ఎల్ఎస్జే విషయానికొస్తే.. ఈ జట్టులో రెండు మార్పులకు ఆస్కారం ఉంది. మార్కస్ స్టొయినిస్ స్థానంలో సఫారీ వికెట్కీపర్ క్వింటన్ డికాక్కు తుది జట్టులో చోటు దొరకవచ్చు. జయదేవ్ ఉనద్కత్ను ఫైనల్ ఎలెవెన్లో ఆడించవచ్చు. పేసర్ యశ్ ఠాకూర్ ఇంపాక్ట్ ప్లేయర్గా ఉండే అవకాశం ఉంది. సన్రైజర్స్ విషయానికొస్తే.. రెగ్యులర్ కెప్టెన్ ఎయిడెన్ మార్క్రమ్ ఈ మ్యాచ్లో తప్పక బరిలో ఉంటాడు. తొలి మ్యాచ్లో కెప్టెన్సీ చేసిన భువీ వైస్ కెప్టెన్గా వ్యవహరిస్తాడు. వికెట్కీపర్ కోటాలో గ్లెన్ ఫిలిప్స్కు బదులు హెన్రిచ్ క్లాసెన్ తుది జట్టులోకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. లెగ్ స్పిన్నర్ మయాంక్ మార్కండే ఇంపాక్ట్ ప్లేయర్గా ఉండవచ్చు. తుది జట్లు (అంచనా).. సన్రైజర్స్ హైదరాబాద్: మయాంక్ అగర్వాల్, అభిషేక్ శర్మ, హ్యారీ బ్రూక్, రాహుల్ త్రిపాఠి, ఎయిడెన్ మార్క్రమ్ (కెప్టెన్), హెన్రిచ్ క్లాసెన్ (వికెట్కీపర్), వాషింగ్టన్ సుందర్, భువనేశ్వర్ కుమార్, టి నటరాజన్, ఉమ్రాన్ మాలిక్, ఫజల్హక్ ఫారూఖీ, మయాంక్ మార్కండే (ఇంపాక్ట్ ప్లేయర్) లక్నో సూపర్ జెయింట్స్: కేఎల్ రాహుల్ (కెప్టెన్), క్వింటన్ డికాక్ (వికెట్కీపర్), కైల్ మేయర్స్, దీపక్ హుడా, కృనాల్ పాండ్యా, నికోలస్ పూరన్, కృష్ణప్ప గౌతమ్, మార్క్ వుడ్, రవి బిష్ణోయ్, జయదేవ్ ఉనద్కత్, ఆవేశ్ ఖాన్, యశ్ ఠాకూర్ (ఇంపాక్ట్ ప్లేయర్) -
లక్నోతో మ్యాచ్.. సన్రైజర్స్ కెప్టెన్ వచ్చేశాడు! 13 కోట్ల ఆటగాడికి నో ఛాన్స్
ఐపీఎల్-2023లో బోణీ కొట్టేందుకు సన్రైజర్స్ హైదరాబాద్ ఉవ్విళ్లూరుతుంది. ఈ మెగా ఈవెంట్లో భాగంగా ఎస్ఆర్హెచ్ ఏప్రిల్ 7న వాజపేయి స్టేడియం వేదికగా లక్నో సూపర్ జెయింట్స్తో తలపడనుంది. లక్నో సూపర్ జెయింట్స్తో జరగబోయే ఈ పోరులో ఎస్ఆర్హెచ్ అద్భుతమైన కమ్బ్యాక్ ఇవ్వాలని భావిస్తోంది. కాగా ఎస్ఆర్హెచ్ తమ తొలి మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ చేతిలో ఘోర పరాజయం చవిచూసిన సంగతి తెలిసిందే. ఇక లక్నోతో మ్యాచ్కు ఎస్ఆర్హెచ్ కెప్టెన్ ఐడెన్ మార్క్రమ్ అందుబాటులో ఉండనున్నాడు. నెదర్లాండ్స్తో సిరీస్ కారణంగా తొలి మ్యాచ్కు దూరమైన మార్క్రమ్.. లక్నోతో మ్యాచ్లో మాత్రం తమ జట్టును ముందుండి నడిపించనున్నాడు. మార్క్రమ్ జట్టుతో కలవడం సన్రైజర్స్ పటిష్టంగా కన్పిస్తోంది. అయితే మార్క్రమ్ అందుబాటులోకి రావడంతో లక్నోతో మ్యాచ్కు హ్యారీ బ్రూక్ను పక్కన పెట్టనున్నట్లు సమాచారం. అదే విధంగా వికెట్ కీపర్ బ్యాటర్ గ్లెన్ ఫిలిప్స్ స్థానంలో హెన్రిచ్ క్లాసన్ తుది జట్టులోకి రానున్నట్లు తెలుస్తోంది. కాగా ఐపీఎల్-2023 మినీ వేలంలో ఇంగ్లండ్ పవర్ హిట్టర్ 13.25 కోట్ల రూపాయలకు ఎస్ఆర్హెచ్ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. అయితే తన తొలి మ్యాచ్లో బ్రూక్ ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయాడు. 21 బంతులు ఎదుర్కొన్న అతడు కేవలం 13 పరుగులు మాత్రమే చేశాడు. ఈ క్రమంలోనే బ్రూక్ను పక్కన పెట్టాలని ఎస్ఆర్హెచ్ మెన్జెమెంట్ భావిస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. మార్క్రమ్, అభిషేక్ చెలరేగితే... ఇక బ్యాటింగ్ పరంగా ఎస్ఆర్హెచ్ పటిష్టంగా కన్పిస్తోంది. ఎస్ఆర్హెచ్ బ్యాటర్లు అభిషేక్ శర్మ, త్రిపాఠి, మారక్రమ్, మయాంక్ అగర్వాల్ చెలరేగితే లక్నో బౌలర్లకు కష్టాలు తప్పవు. కెప్టెన్ మార్క్రమ్ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. నెదర్లాండ్పై సూపర్ సెంచరీ తర్వాత మార్క్రమ్కు ఇదే తొలి మ్యాచ్ కావడం గమనార్హం. మార్క్రమ్ తన ఆల్రౌండ్ స్కిల్స్తో లక్నోకు చుక్కలు చూపించగలడని ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఇక బౌలింగ్ విషయానికి వస్తే.. ఎస్ఆర్హెచ్ పేసర్లు తమ మార్క్ను చూపించడంలో విఫలమయ్యారు. రాజస్థాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో పేసర్లు దారుణ ప్రదర్శన కనబరిచారు. ఈ మ్యాచ్లో ఒక నటరాజన్ మినహా మిగితా అందరూ నిరాశపరిచారు. కానీ జట్టులో ఉమ్రాన్ మాలిక్, భువనేశ్వర్ కుమార్, ఫజల్హక్ ఫారూఖీ వంటి స్పీడ్ స్టార్లు ఉన్నారు. వీరు తమ స్థాయికి తగ్గట్టు ప్రదర్శన చేస్తే.. లక్నో బ్యాటర్లకు చుక్కలు కన్పించడం ఖాయం. సన్రైజర్స్ బౌలర్లు అద్భుతంగా రాణిస్తారో లేదా తొలి మ్యాచ్లా తెలిపోతారో వేచి చూడాలి. ఎస్ఆర్హెచ్ తుది జట్టు(అంచనా) అభిషేక్ శర్మ, మయాంక్ అగర్వాల్, రాహుల్ త్రిపాఠి, ఐడెన్ మార్క్రమ్ (కెప్టెన్), హెన్రిచ్ క్లాసెన్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, భువనేశ్వర్ కుమార్, ఆదిల్ రషీద్, ఉమ్రాన్ మాలిక్, టి. నటరాజన్, ఫజల్హక్ ఫారూఖీ ఇంపాక్ట్ ప్లేయర్స్(అంచనా) అబ్దుల్ సమద్, మయాంక్ దాగర్, ఉపేంద్ర యాదవ్, మయాంక్ మార్కండే, వివ్రంత్ శర్మ చదవండి: IPL 2023: శ్రేయస్ అయ్యర్ స్థానంలో యువ సంచలనం.. ఎవరంటే? -
భారీ జంప్ కొట్టిన మార్క్రమ్.. కెరీర్ బెస్ట్ సాధించిన శుభ్మన్
సౌతాఫ్రికా స్టార్ బ్యాటర్ ఎయిడెన్ మార్క్రమ్ తాజాగా విడుదల చేసిన ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్లో భారీ జంప్ కొట్టాడు. ఇటీవలే నెదర్లాండ్స్తో జరిగిన మూడో వన్డేలో భారీ శతకం (175) బాదిన మార్క్రమ్.. ఏకంగా 13 స్థానాలు మెరుగుపర్చుకుని 41వ స్థానానికి ఎగబాకాడు. అలాగే ఆల్రౌండర్స్ విభాగంలో 16 స్థానాలు మెరుగుపర్చుకుని 32వ స్థానానికి చేరాడు. నెదర్లాండ్స్తో సిరీస్లో రెండో వన్డేలోనూ అర్ధసెంచరీతో (51 నాటౌట్) రాణించిన మార్క్రమ్.. దక్షిణాఫ్రికా 2-0 తేడాతో సిరీస్ చేజిక్కించుకోవడంతో పాటు సఫారీ టీమ్ వన్డే వరల్డ్కప్-2023కు నేరుగా అర్హత సాధించడంలోనూ ప్రధాన పాత్ర పోషించాడు. కెరీర్లో తొలిసారి ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్లో 41వ స్థానానికి చేరిన మార్క్రమ్.. వన్డేలతో పాటు టీ20లు, టెస్ట్ల్లోనూ సత్తా చాటుతున్నాడు. ఇక ఈ వారం ర్యాంకింగ్స్ మెరుగుపర్చుకున్న ఆటగాళ్ల విషయానికొస్తే.. టీమిండియా యువకెరటం శుభ్మన్ గిల్ఓ స్థానం మెరుగుపర్చుకుని కెరీర్ బెస్ట్ నాలుగో ర్యాంక్ సాధించగా.. బౌలింగ్ విభాగంలో న్యూజిలాండ్ ప్లేయర్ మ్యాట్ హెన్రీ ఏకంగా 5 స్థానాలు జంప్ చేసి 10 నుంచి 5వ స్థానానికి ఎగబాకాడు. నెదార్లండ్స్తో సిరీస్లో ఓ ఫైఫర్తో పాటు 8 వికెట్లు పడగొట్టిన సఫారీ బౌలర్ సిసండ మగాలా ఏకంగా 35 స్థానాలు ఎగబాకి 165 ర్యాంక్కు చేరుకున్నాడు. బ్యాటర్ల విభాగంలో పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్ అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. డస్సెన్, ఇమామ్ ఉల్ హాక్, గిల్, వార్నర్, కోహ్లి, డికాక్, రోహిత్, స్టీవ్ స్మిత్, ఫకర్ జామన్ వరుసగా 2 నుంచి 10 స్థానాల్లో ఉన్నారు. బౌలింగ్ విభాగంలో జోష్ హాజిల్వుడ్ టాప్లో కొనసాగుతుండగా.. బౌల్డ్, సిరాజ్, స్టార్క్, మ్యాట్ హెన్రీ, రషీద్ ఖాన్, జంపా, షాహీన్ అఫ్రిది, ముజీబ్ రెహ్మాన్, షకీబ్ 2 నుంచి 10 ప్లేస్ల్లో ఉన్నారు. ఆల్రౌండర్ల విభాగంలో షకీబ్ టాప్లో కొనసాగుతుండగా.. నబీ, రషీద్ ఖాన్ టాప్-3లో ఉన్నారు. -
వచ్చేశారు..ఇక తగ్గేదేలే..SRHకి గుడ్ న్యూస్
-
సన్రైజర్స్కు గుడ్న్యూస్.. విధ్వంసకర వీరుడు వచ్చేశాడు! ఇక తిరుగుండదు
ఐపీఎల్-2023ను సన్రైజర్స్ హైదారాబాద్ ఓటమితో ఆరంభించిన సంగతి తెలిసిందే. రాజస్తాన్ రాయల్స్తో జరిగిన తొలి మ్యాచ్లో 72 పరుగుల తేడాతో ఎస్ఆర్హెచ్ పరాజయం పాలైంది. ఇక ఎస్ఆర్హెచ్ తన తదుపరి మ్యాచ్లో ఏప్రిల్ 7న లక్నో వేదికగా లక్నోసూపర్ జెయింట్స్తో తలపడనుంది. అయితే ఈ మ్యాచ్కు ఎస్ఆర్హెచ్కు గుడ్ న్యూస్ అందింది. ఆ జట్టు కెప్టెన్, ప్రోటీస్ స్టార్ ఆటగాడు ఐడైన్ మార్క్రమ్తో పాటు హెన్రిచ్ క్లాసన్, మార్కో జానెసన్ ఆరెంజ్ ఆర్మీ క్యాంప్లో కలిశారు. వీరు ముగ్గురు నెదర్లాండ్స్తో వన్డే సిరీస్ కారణంగా రాజస్తాన్ రాయల్స్తో జరిగిన మొదటి మ్యాచ్కు దూరమయ్యారు. కాగా వీరు ముగ్గురు కూడా ప్రస్తుతం అద్భుతమైన ఫామ్లో ఉన్నారు. నెదార్లాండ్స్తో వన్డే సిరీస్లో అదరగొట్టిన మార్క్రమ్.. మ్యాన్ ఆఫ్ ది సిరీస్గా నిలిచాడు. ఇక వీరి రాకతోనైనా ఎస్ఆర్హెచ్ తల రాత మారుతుందని అభిమానులు ఆశిస్తున్నారు. మరోవైపు వీరితో పాటు దక్షిణాఫ్రికా స్టార్ ఆటగాళ్లు క్వింటన్ డికాక్(లక్నో సూపర్ జెయింట్స్), మిల్లర్(గుజరాత్ టైటాన్స్), రబాడ(పంజాబ్ కింగ్స్), నోర్జే(ఢిల్లీ) కూడా భారత్కు చేరుకున్నారు. చదవండి: IPL 2023-PANT: గుజరాత్తో ఢిల్లీ క్యాపిటల్స్ పోరు.. పంత్ వచ్చేస్తున్నాడు! -
దంచికొట్టిన మార్కరమ్.. ప్రొటిస్కు ప్రపంచకప్ బెర్తు ఖరారు! ఒక్కడివే 175 కొట్టావు..
South Africa Beat Netherlands By 146 Runs: నెదర్లాండ్స్తో మూడో వన్డేలో సౌతాఫ్రికా దుమ్ములేపింది. డచ్ జట్టును ఏకంగా 146 పరుగుల భారీ తేడాతో ఓడించి ఘన విజయం సాధించింది. తద్వారా మూడు మ్యాచ్ల సిరీస్ను 2-0తో కైవసం చేసుకుంది. ఎయిడెన్ మార్కరమ్ అద్భుత ప్రదర్శనతో జట్టును గెలిపించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు అందుకున్నాడు. ఇక ఈ భారీ గెలుపుతో ఐసీసీ వన్డే క్రికెట్ వరల్డ్కప్ సూపర్ లీగ్ పాయింట్ల పట్టికలో ప్రొటిస్ వెస్టిండీస్ను వెనక్కినెట్టింది. దీంతో ఎనిమిదో స్థానానికి చేరి ప్రపంచకప్-2023 బెర్తు దాదాపుగా ఖాయం చేసుకుంది. తుపాన్ ఇన్నింగ్స్తో విరుచుకుపడ్డ మార్కరమ్ జోహన్సన్బర్గ్ వేదికగా ఆదివారం నెదర్లాండ్స్తో మ్యాచ్లో టాస్ ఓడిన ఆతిథ్య సౌతాఫ్రికా తొలుత బ్యాటింగ్కు దిగింది. ఓపెనర్లు క్వింటన్ డికాక్(8), తెంబా బవుమా(6) సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితం కాగా.. వన్డౌన్ బ్యాటర్ వాన్ డెర్ డసెన్ 25 పరుగులతో ఫర్వాలేదనిపించాడు. ఈ క్రమంలో నాలుగో స్థానంలో బ్యాటింగ్కు దిగిన ఎయిడెన్ మార్కరమ్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. అప్పటిదాకా జోష్లో ఉన్న డచ్ బౌలర్లకు చుక్కలు చూపిస్తూ.. 126 బంతుల్లో 17 ఫోర్లు, 7 సిక్సర్లతో 175 పరుగులు సాధించాడు. ఆరో స్థానంలో బ్యాటింగ్ చేసిన డేవిడ్ మిల్లర్ 61 బంతుల్లో 91 పరుగులతో విధ్వంసం సృష్టించాడు. మార్కరమ్, మిల్లర్ తుపాన్ ఇన్నింగ్స్తో విరుచుకుపడటంతో నిర్ణీత 50 ఓవర్లలో సౌతాఫ్రికా 8 వికెట్ల నష్టానికి 370 పరుగులు చేసింది. ఇక భారీ టార్గెట్ చేజ్ చేసేందుకు రంగంలోకి దిగిన నెదర్లాండ్స్ 39.1 ఓవర్లలో 224 పరుగులు చేసి ఆలౌట్ అయింది. బ్యాట్తోనే కాదు బంతితోనూ మెరిశాడు డచ్ ఇన్నింగ్స్లో 61 పరుగులతో ముసా అహ్మద్ టాప్ స్కోరర్గా నిలిచాడు. ప్రొటిస్ బౌలర్లలో సిసాంద మగల 5 వికెట్లతో మెరిశాడు. బ్యాటింగ్తో అదరగొట్టిన మార్కరమ్ 2 వికెట్లు కూల్చాడు. లుంగి ఎంగిడి ఒకటి, మార్కో జాన్సెన్ ఒకటి, తబ్రేజ్ షంసీ ఒక వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. ఈ నేపథ్యంలో 146 పరుగులతో గెలుపొందిన సౌతాఫ్రికా వన్డే సూపర్లీగ్లో 98 పాయింట్లతో ముందడుగు వేసింది. భారత్ వేదికగా జరుగనున్న వన్డే వరల్డ్కప్ టోర్నీకి నేరుగా అర్హత సాధించే క్రమంలో మరో ముందడుగు వేసింది. బంగ్లాదేశ్- ఐర్లాండ్ వన్డే సిరీస్ ఫలితం తేలితే.. ఐరిష్ జట్టును బంగ్లా చిత్తు చేస్తే ప్రొటిస్కు బెర్తు ఖాయమవుతుంది. ప్రస్తుత ఫామ్ దృష్ట్యా బంగ్లా ఐర్లాండ్ను క్లీన్స్వీప్ చేసేట్లుగానే కనిపిస్తోంది. అలా అయితే ప్రొటిస్ పంట పండినట్లవుతుంది. నువ్వుంటే బాగుండేది.. మిస్ యూ ఇదిలా ఉంటే.. ఎయిడెన్ మార్కరమ్ ఇన్నింగ్స్పై సన్రైజర్స్ ఫ్యా న్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ‘‘నువ్వుంటే బాగుండేది. ఒక్కడివే 175 పరుగులు సాధించావు. ఇక్కడ అంతా కలిసి కనీసం 150 కూడా కొట్టలేదు.. మిస్ యూ మార్కరమ్! కనీసం నువ్వు వచ్చాకైనా రాత మారుతదేమో’’ అని ఆరెంజ్ ఆర్మీ కామెంట్లు చేస్తోంది. కాగా సౌతాఫ్రికా టీ20 లీగ్ అరంగేట్ర సీజన్లో సన్రైజర్స్ ఈస్టర్న్కేప్ జట్టును మార్కరమ్ విజేతగా నిలిపాడు. సారథిగా ముందుండి నడిచి తొలి సీజన్ చాంపియన్గా సన్రైజర్స్ను నిలబెట్టాడు. వన్డే వరల్డ్కప్-2023కి నేరుగా అర్హత సాధించిన జట్లు: PC: ICC చదవండి: IPL 2023- Bhuvneshwar Kumar: నువ్వసలు పనికిరావు.. పైగా ఇలా మాట్లాడతావా? చెత్తగా ఆడిందే గాక.. IPL 2023- Virat Kohli: చెలరేగిన హైదరాబాదీ.. అయినా! కోహ్లి అద్భుత ఇన్నింగ్స్.. అరుదైన ఘనత! ఒకే ఒక్కడితో.. -
అక్కడ కెప్టెన్ ఇరగదీశాడు.. ఇక్కడ ఎస్ఆర్హెచ్ మాత్రం
ఐపీఎల్లో ఎస్ఆర్హెచ్ కెప్టెన్గా వ్యవహరిస్తున్న ఐడెన్ మార్క్రమ్ ఇంకా జట్టుతో చేరలేదు. మార్క్రమ్ ఒక్కడే కాదు సౌతాఫ్రికాకు ఆడుతున్న ఏ ఒక్కరు కూడా ఇంకా ఐపీఎల్ ఆడేందుకు రాలేదు. ప్రస్తుతం వారంతా తమ సొంతజట్టు సౌతాఫ్రికాను వన్డే వరల్డ్కప్కు క్వాలిఫై చేసే పనిలో ఉన్నారు. దీంతో ఐపీఎల్ 16వ సీజన్కు మార్క్రమ్ వచ్చేవరకు అతని స్థానంలో భువనేశ్వర్ ఎస్ఆర్హెచ్ను నడిపించనున్నాడు. ఇక నెదర్లాండ్స్తో సౌతాఫ్రికా వన్డే సిరీస్ ఆడుతున్న సంగతి తెలిసిందే. ఆదివారం నెదర్లాండ్స్తో జరుగుతున్న మూడో వన్డే రీషెడ్యూల్డ్ మ్యాచ్లో మార్క్రమ్ సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. 126 బంతుల్లో 17 ఫోర్లు, ఏడు సిక్సర్ల సాయంతో 175 పరుగులు చేశాడు. అతనికి డేవిడ్ మిల్లర్(61 బంతుల్లో 91 పరుగులు) సహకరించాడు. దీంతో సౌతాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 370 పరుగులు చేసింది. భారీ టార్గెట్తో బరిలోకి దిగిన నెదర్లాండ్స్ 33 ఓవర్లు ముగిసేసరికి ఐదు వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది. ఈ సంగతి పక్కనబెడితే.. ఎస్ఆర్హెచ్ కెప్టెన్ మార్క్రమ్ సంచలన ఇన్నింగ్స్తో ఇరగదీస్తే.. ఐపీఎల్లో తన జట్టు ఎస్ఆర్హెచ్ మాత్రం తొలి మ్యాచ్లోనే ఘోర ఓటమిని చవిచూసింది. ఆదివారం రాజస్తాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ 72 పరుగుల తేడాతో భారీ ఓటమిని చవిచూసింది. 204 పరుగుల భారీ టార్గెట్ను చేధించే క్రమంలో ఎస్ఆర్హెచ్ 8 వికెట్ల నష్టానికి 131 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో అభిమానులు ఎస్ఆర్హెచ్పై ట్రోల్స్తో విరుచుకుపడ్డారు. ''అక్కడ కెప్టెన్ ఇరగదీస్తే.. ఇక్కడ ఎస్ఆర్హెచ్ మాత్రం అదే ఆటతీరు కనబరిచింది''..'' కెప్టెన్ వస్తే గానీ ఎస్ఆర్హెచ్ రాత మారదేమో'' అంటూ కామెంట్ చేశారు. చదవండి: చరిత్ర సృష్టించిన చహల్.. -
సన్రైజర్స్ కెప్టెన్గా భువనేశ్వర్ కుమార్!
క్రికెట్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న ఐపీఎల్-2023 సీజన్కు మరో 24 గంటల్లో తెరలేవనుంది. మార్చి 31న అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరగనున్న మ్యాచ్తో ఈ ధానాధాన్ లీగ్ ఆరంభం కానుంది. ఇక ఇది ఇలా ఉండగా ఐపీఎల్ ఆరంభ మ్యాచ్లకు దక్షిణాఫ్రికా స్టార్ ఆటగాళ్లు దూరం కానున్నారు. దక్షిణాఫ్రికా, నెదర్లాండ్ జట్ల మధ్య వన్డే సిరీస్ నేపథ్యంలో ప్రోటీస్ స్టార్ ఆటగాళ్లు మార్క్రమ్, డేవిడ్ మిల్లర్, రబాడ, మగాల, డికాక్, నోర్జే ఐపీఎల్ తొలి మ్యాచ్లకు అందుబాటులో ఉండరు. ఎస్ఆర్హెచ్ కెప్టెన్గా భువనేశ్వర్ కుమార్ కాగా ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్గా ఐడైన్ మార్క్రమ్ ఎంపికైన సంగతి తెలిసిందే. అయితే ఎస్ఆర్హెచ్ తొలి మ్యాచ్కు మార్క్రమ్ దూరం కానున్నాడు. ఐపీఎల్-2023లో ఎస్ఆర్హెచ్ తమ తొలి మ్యాచ్లో ఏప్రిల్2న హైదరాబాద్ వేదికగా రాజస్తాన్ రాయల్స్తో తలపడనుంది. ఈ మ్యాచ్కు మార్క్రమ్ గైర్హజరీ నేపథ్యంలో ఎస్ఆర్హెచ్ కెప్టెన్గా వెటరన్ పేసర్ భువనేశ్వర్ కుమార్ వ్యవహరించనున్నట్లు తెలుస్తోంది. కాగా గతంలో కూడా కొన్ని మ్యాచ్ల్లో ఆరెంజ్ ఆర్మీ సారథిగా భువీ వ్యవహరించాడు. అదే విధంగా గత కొన్ని సీజన్ల నుంచి ఎస్ఆర్హెచ్ జట్టులో కీలక సభ్యునిగా భువీ కొనసాగుతున్నాడు. ఈ క్రమంలోనే అతడికి జట్టు పగ్గాలు అప్పజెప్పాలని ఎస్ఆర్హెచ్ మెన్జెమెంట్ ఆలోచిస్తున్నట్లు సమాచారం. -
సన్రైజర్స్ సరికొత్తగా...
రెండేళ్ల క్రితం ఎనిమిది జట్లు పాల్గొన్న ఐపీఎల్లో ఎనిమిదో స్థానం... గత ఏడాది పది జట్లు పాల్గొన్న ఐపీఎల్లోనూ ఎనిమిదో స్థానం... ఆట మెరుగుపడలేదని అనుకోవాలా లేక తమకంటే రెండు జట్లు కింద ఉన్నాయి కాబట్టి బాగానే ఆడినట్లా! 2016లో చాంపియన్గా నిలిచాక తర్వాతి నాలుగు సీజన్లలో టాప్–4లో ఉంటూ నిలకడ ప్రదర్శించిన సన్రైజర్స్ హైదరాబాద్ ఆట గత రెండేళ్లు పూర్తిగా గతి తప్పింది. సమష్టి వైఫల్యంతో పాటు వార్నర్ వివాదం టీమ్ను బాగా ఇబ్బంది పెట్టాయి. 2019 ఐపీఎల్ తర్వాత మళ్లీ ఇప్పుడే రైజర్స్ తమ సొంత మైదానం హైదరాబాద్లో మ్యాచ్లు ఆడబోతోంది. పలువురు ఆటగాళ్ల మార్పులతో పాటు సహాయక సిబ్బందిలోనూ స్వల్ప మార్పుచేర్పులతో కొత్త సీజన్కు సిద్ధమైంది. ఇలాంటి నేపథ్యంలో జట్టు ఎలాంటి ప్రదర్శన ఇస్తుందని అభిమానులంతా ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. దక్షిణాఫ్రికా టి20 కెప్టెన్ ఎయిడెన్ మార్క్రమ్ కొత్త కెపె్టన్గా ముందు నిలబడగా, ఆల్టైమ్ గ్రేట్ క్రికెటర్లలో ఒకడైన బ్రియాన్ లారా ఈసారి పూర్తి స్థాయిలో జట్టుకు హెడ్ కోచ్గా బాధ్యతలు చేపట్టడం విశేషం. –సాక్షి క్రీడా విభాగం కొత్త సీజన్ వేలానికి ముందు హైదరాబాద్ 2022లో ఆడిన వారి నుంచి 12 మంది ఆటగాళ్లను వదిలేసుకుంది. వీరిలో ‘కేన్ మామా’ అంటూ అభిమానులు పిలుచుకున్న విలియమ్సన్తో పాటు నికోలస్ పూరన్ తదితరులు ఉన్నారు. మరో 12 మందిని కొనసాగించగా అందులోంచే దక్షిణాఫ్రికా క్రికెటర్ మార్క్రమ్ను కెప్టెన్గా ఎంపికయ్యాడు. ఇటీవలే దక్షిణాఫ్రికా టి20 లీగ్లో సన్రైజర్స్ యాజమాన్యానికే చెందిన ఈస్టర్న్ కేప్ టీమ్ మార్క్రమ్ సారథ్యంలోనే విజేతగా నిలిచింది. కాబట్టి నాయకత్వం విషయంలో ఫ్రాంచైజీ అన్నీ ఆలోచించే నిర్ణయం తీసుకుందని భావించవచ్చు. సీనియర్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ అందుబాటులో ఉన్నా... మార్క్రమ్పైనే యాజమాన్యం విశ్వాసం ఉంచింది. జట్టు తరఫున గత ఒక్క సీజన్ మాత్రమే ఆడిన అతను 12 ఇన్నింగ్స్లలో 139.05 స్ట్రయిక్రేట్తో 381 పరుగులు చేసి మెరుగైన ప్రదర్శనే కనబర్చాడు. ఈసారి అతడి బ్యాటింగ్తో పాటు కెపె్టన్సీ బాధ్యతలు కూడా జట్టుకు కీలకం కానున్నాయి. ముఖ్యంగా ‘హోం గ్రౌండ్’ ఉప్పల్ స్టేడియంలో జరిగే 7 మ్యాచ్ల కోసం జట్టులో అందుబాటులో ఉన్న వనరులను సమర్థంగా ఉపయోగించుకోగలిగి విజయాలు సాధిస్తే ‘ప్లే ఆఫ్స్’ అవకాశాలు మెరుగ్గా ఉంటాయి. బ్రూక్ చెలరేగుతాడా... సన్రైజర్స్ బ్యాటింగ్ లైనప్ లో ఈసారి అందరినీ ఆకర్షిస్తున్న ఆటగాడు ఇంగ్లండ్కు చెందిన 24 ఏళ్ల హ్యారీ బ్రూక్. అంతర్జాతీయ క్రికెట్లో ఇప్పటికే ‘ఆల్ ఫార్మాట్’ ఆటగాడిగా గుర్తింపు తెచ్చుకున్న అతను 99 టి20ల్లో విధ్వంసకర స్ట్రయిక్రేట్ 148.32తో 2432 పరుగులు చేశాడు. మిడిలార్డర్లో బ్రూక్ బ్యాటింగ్ రైజర్స్కు ‘బూస్ట్’ ఇవ్వగలదు. అయితే భారత గడ్డపై తొలిసారి ఆడనున్న అతను పరిస్థితులను ఎలా వాడుకుంటాడనేది చూడాలి. మిడిలార్డర్లో అతనితో పాటు మార్క్రమ్, వికెట్ కీపర్లు ఫిలిప్స్, క్లాసెన్ (ఇద్దరిలో ఒకరు), ఆల్రౌండర్లు వాషింగ్టన్ సుందర్ జట్టుకు మంచి స్కోరు అందించగలరు. గత ఏడాది పంజాబ్ కింగ్స్ తరఫున పేలవ ప్రదర్శన కనబర్చిన మయాంక్ అగర్వాల్ ఇప్పుడు సన్రైజర్స్కు ఓపెనర్గా బరిలోకి దిగుతాడు. గత సీజన్ టీమ్ టాప్ స్కోరర్ అభిõÙక్ శర్మ, రాహుల్ త్రిపాఠిలు టాపార్డర్లో వేగంగా పరుగులు సాధించాల్సి ఉంటుంది. అయితే ఇతర జట్లతో పోలిస్తే తొలి బంతి నుంచే బౌలర్లపై విరుచుకుపడే విధ్వంసక ఓపెనర్ హైదరాబాద్ వద్ద లేడనేది స్పష్టం. పేసర్ల బృందం... బ్యాటింగ్తో పోలిస్తే మరోసారి హైదరాబాద్ బౌలింగ్ కాస్త పదునుగా కనిపిస్తోంది. గత సీజన్లో ఆడిన 14 మ్యాచ్ల్లోనూ ‘ఫాస్టెస్ట్ బాల్’ విసిరిన ఉమ్రాన్ మలిక్ ఇప్పుడు కూడా కీలక బాధ్యత పోషించాల్సి ఉంది. పైగా ఈ ఏడాది కాలంలో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించడంతో అతని ఆట మెరుగవడంతో పాటు బాధ్యత కూడా పెరిగింది. బౌలింగ్లో మునుపటి వాడి లోపించడంతో భారత జట్టు చోటుతో పాటు బోర్డు కాంట్రాక్ట్ కూడా కోల్పోయిన భువనేశ్వర్ ఈసారి ఏమాత్రం ప్రభావం చూపిస్తాడనేది చెప్పలేం. అయితే నటరాజన్, కార్తీక్ త్యాగి, జాన్సెన్, ఫజల్ హఖ్లతో పేస్ బృందం పెద్దదిగానే ఉంది. ఆల్రౌండర్ సుందర్ ఆఫ్ స్పిన్ జట్టుకు సానుకూలాంశం కాగా, రెగ్యులర్ స్పిన్నర్గా ఆదిల్ రషీద్ కనిపిస్తున్నాడు. ఇంగ్లండ్ తరఫున గత కొన్నేళ్లుగా వన్డేలు, టి20ల్లో అద్భుత ప్రదర్శన కనబరుస్తున్న రషీద్ అన్ని మ్యాచ్లకు అందుబాటులో ఉంటే గతంలో రషీద్ ఖాన్ తరహాలో లెగ్స్పిన్తో ప్రత్యర్థిపై పైచేయి సాధించవచ్చు. దేశవాళీ లెగ్స్పిన్నర్ మయాంక్ మర్కండే కూడా టీమ్లో ఉన్నాడు కానీ గత రెండు సీజన్లుగా అతను రాణించలేకపోయాడు. అయితే ఓవరాల్గా చూస్తే ఇప్పటికే గుర్తింపు తెచ్చుకున్న క్రికెటర్లు మినహా కొత్తగా జట్టులోకి వచ్చి న యువ ఆటగాళ్లలో మరీ చెప్పుకోదగ్గ ప్లేయర్లు ఎవరూ లేరు. 20 ఐపీఎల్ మ్యాచ్లు ఆడినా ఇప్పటి వరకు కీలక దశలో సమద్పై పూర్తి నమ్మకం ఉంచలేని పరిస్థితి. కాబట్టి తుది జట్టులో వీరిలో ఎవరికి స్థానం దక్కుతుందనేది సందేహమే. సన్రైజర్స్ జట్టు వివరాలు మార్క్రమ్ (కెప్టెన్), గ్లెన్ ఫిలిప్స్, మార్కో జాన్సెన్, ఫజల్ హఖ్ ఫారుఖీ, హ్యారీ బ్రూక్, క్లాసెన్, ఆదిల్ రషీద్, అకీల్ హొసీన్ (విదేశీ ఆటగాళ్లు). అబ్దుల్ సమద్, రాహుల్ త్రిపాఠి, అభిషేక్ శర్మ, వాషింగ్టన్ సుందర్, భువనేశ్వర్, కార్తీక్ త్యాగి, నటరాజన్, ఉమ్రాన్ మలిక్, మయాంక్ అగర్వాల్, అన్మోల్ ప్రీత్ సింగ్, మయాంక్ మర్కండే, వివ్రాంత్ శర్మ, మయాంక్ డాగర్, సమర్థ్ వ్యాస్, సన్వీర్, ఉపేంద్ర సింగ్, నితీశ్ కుమార్ రెడ్డి. సహాయక సిబ్బంది బ్రియాన్ లారా (హెడ్ కోచ్), డేల్ స్టెయిన్ (పేస్ బౌలింగ్ కోచ్), ముత్తయ్య మురళీధరన్ (స్పిన్ బౌలింగ్ కోచ్), ర్యాన్ కుక్ (ఫీల్డింగ్ కోచ్), సైమన్ హెల్మెట్ (అసిస్టెంట్ కోచ్). -
ఐపీఎల్కు ముందు సన్రైజర్స్ కీలక నిర్ణయం.. ఈసారైనా
ఐపీఎల్-2023 సీజన్ ప్రారంభానికి ముందు సన్రైజర్స్ హైదరాబాద్ కీలక నిర్ణయం తీసుకుంది. తమ జట్టు ఫీల్డింగ్ కోచ్గా నెదర్లాండ్స్ ప్రధాన కోచ్ ర్యాన్ కుక్ను ఎస్ఆర్హెచ్ నియమించింది. గత ఏడాది సీజన్లో దారుణ ప్రదర్శన అనంతరం ఎస్ఆర్హెచ్.. తమ కోచింగ్ స్టాప్లో భారీ మార్పులు చేసింది. ఈ క్రమంలోనే గతేడాది సీజన్లోనే బ్యాటింగ్ కోచ్గా వ్యవహరించిన విండీస్ దిగ్గజం బ్రియాన్ లారా.. ఈ ఏడాది సీజన్లో హెడ్కోచ్గా బాధ్యతలు చేపట్టనున్నాడు. ఇక ర్యాన్ కుక్ విషయానికి వస్తే.. అతడు తొట్ట తొలి సౌతాఫ్రికా టీ20 లీగ్ టైటిల్ను సొంతం చేసుకున్న సన్రైజర్స్ ఈస్టర్న్ కేప్కు అసిస్టెంట్ కోచ్గా పనిచేశాడు. ఐపీఎల్ 16వ సీజన్ నేపథ్యంలో నెదర్లాండ్స్ తదుపరి రెండు ద్వైపాక్షిక సిరీస్లకు కుక్ దూరం కానున్నారు. అతడు ఒకట్రెండు రోజుల్లో ఎస్ఆర్ హెచ్ జట్టుతో కలిసే అవకాశం ఉంది. అతడు హెడ్కోచ్ బ్రియాన్ లారాతో కలిసి పని చేయనన్నాడు. మార్క్రమ్ మ్యాజిక్ చేస్తాడా? గత ఏడాది సీజన్లో దారుణ ప్రదర్శన కనబరిచిన ఎస్ఆర్హెచ్.. పాయింట్ల పట్టికలో 8వ స్ధానంలో నిలిచింది. దీంతో ఐపీఎల్ 16వ సీజన్కు ముందు ఎస్ఆర్హెచ్ తమ జట్టులో సమూల మార్పులు చేసింది. ఈ నేపథ్యంలో తమ జట్టు కెప్టెన్గా దక్షిణాఫ్రికా స్టార్ బ్యాటర్ ఐడైన్ మార్క్రమ్ను సన్రైజర్స్ నియమించింది. కాగా తొట్ట తొలి సౌతాఫ్రికా టీ20 లీగ్ టైటిల్ను సొంతం చేసుకున్న ఎస్ఆర్హెచ్ ఫ్రాంచైజీ సన్రైజర్స్ ఈస్టర్న్ కేప్కు కూడా మార్క్రమ్ సారథ్యం వహించాడు. దీంతో ఐపీఎల్లో కూడా మార్క్రమ్ సారథిగా విజయవంతమవుతాడని ఆరెంజ్ ఆర్మీ అభిమానులు భావిస్తున్నారు. ఇక ఈ ఏడాది ఐపీఎల్ మార్చి 31 నుంచి ప్రారంభం కానుంది. ఎస్ఆర్హెచ్ తమ తొలి మ్యాచ్లో హైదరాబాద్ వేదికగా ఏప్రిల్2న రాజస్తాన్ రాయల్స్తో తలపడనుంది. చదవండి: IND vs AUS: మూడో వన్డేకు సూర్యకుమార్ను తప్పిస్తారా..? క్లారిటీ ఇచ్చిన రోహిత్ శర్మ -
SA Vs WI 2nd Test: దక్షిణాఫ్రికా ఘన విజయం.. సిరీస్ క్లీన్స్వీప్
జొహన్నెస్బర్గ్- South Africa vs West Indies, 2nd Test: వెస్టిండీస్లో జరిగిన రెండు టెస్టుల సిరీస్ను దక్షిణాఫ్రికా 2–0తో క్లీన్స్వీప్ చేసింది. శనివారం ముగిసిన రెండో టెస్టులో దక్షిణాఫ్రికా 284 పరుగుల భారీ తేడాతో విండీస్పై ఘన విజయం సాధించింది. 391 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్ తమ రెండో ఇన్నింగ్స్లో 35.1 ఓవర్లలో 106 పరుగులకే కుప్పకూలింది. జోషువా డి సిల్వ (34)దే అత్యధిక స్కోరు. సఫారీ బౌలర్లలో గెరాల్డ్ కొయెట్జీ, సైమన్ హార్మర్ చెరో 3 వికెట్లు పడగొట్టగా... రబడ, కేశవ్ మహరాజ్ చెరో 2 వికెట్లు తీశారు. అంతకు ముందు 287/7తో నాలుగో రోజు ఆట కొనసాగించిన దక్షిణాఫ్రికా తమ రెండో ఇన్నింగ్స్లో 321 పరుగులకు ఆలౌటైంది. బవుమా ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలవగా, ఎయిడెన్ మార్క్రమ్కు ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డు దక్కింది. తొలి టెస్టులో దక్షిణాఫ్రికా 87 పరుగుల తేడాతో నెగ్గింది. చదవండి: Virat Kohli: ఎన్నాళ్లకెన్నాళ్లకు! సుదీర్ఘ నిరీక్షణకు తెర.. కోహ్లి ముఖంపై చిరునవ్వు! ఫ్యాన్స్ ఖుషీ IPL 2023: ముంబై ఇండియన్స్కు భారీ షాక్! -
సన్రైజర్స్కు బ్యాడ్ న్యూస్.. కొత్త కెప్టెన్ దూరం! సారథిగా భువీ
ఐపీఎల్-2023 సీజన్ ప్రారంభానికి ముందు ఆయా ప్రాంఛైజీలకు ఓ బ్యాడ్ న్యూస్. దక్షిణాఫ్రికా స్టార్ ఆటగాళ్లు ఈ ఏడాది సీజన్ ప్రారంభ మ్యాచ్ల్లో ఆడే అవకాశాలు కనిపించడం లేదు. దక్షిణాఫ్రికా జట్టు స్వదేశంలో మార్చి 31 నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు నెదర్లాండ్స్తో రెండు మ్యాచ్ల రీ షెడ్యూల్ వన్డే సిరీస్ ఆడనుండడమే దీనికి కారణం. కాగా ఈ సిరీస్లో తమ జట్టు స్టార్ ఆటగాళ్లను భాగం చేయాలని దక్షిణాఫ్రికా క్రికెట్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఇప్పటికే తమ నిర్ణయాన్ని దక్షిణాఫ్రికా క్రికెట్ బీసీసీఐకి కూడా తెలియజేసినట్లు సమాచారం. ఇక ఐపీఎల్ ఫ్రాంచైజీలతో కాంట్రాక్టు కల్గి ఉన్న కగిసో రబడ, లుంగి ఎంగిడీ, రాస్సీ వాన్ డెర్ డ్యూసెన్, డేవిడ్ మిల్లర్, క్వింటన్ డి కాక్, ఐడెన్ మార్క్రమ్, స్టాబ్స్, మార్కో జాన్సెన్, క్లాసన్ వంటి ప్రోటీస్ ఆటగాళ్లు నెదర్లాండ్స్తో వన్డే సిరీస్లో భాగమయ్యే ఛాన్స్ ఉంది. తొలి మ్యాచ్కు మార్క్రమ్ దూరం.. కెప్టెన్గా భువీ కాగా ప్రోటీస్ స్టార్ బ్యాటర్ ఐడెన్ మార్క్రమ్ సన్రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్గా ఎంపికైన సంగతి తెలిసిందే. ఈ ఏడాది సీజన్ నుంచే ఎస్ఆర్హెచ్ సారథిగా మార్క్రమ్ తన ప్రయాణాన్ని ఆరంభించనున్నాడు. ఈ ఏడాది సీజన్లో ఎస్ఆర్హెచ్ తమ తొలి మ్యాచ్లో ఏప్రిల్2న రాజస్తాన్ రాయల్స్తో తలపడనుంది. ఈ మ్యాచ్కు మార్క్రమ్ దూరం కావడం దాదాపు ఖాయంగా కన్పిస్తోంది. ఈ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ కెప్టెన్గా వెటరన్ పేసర్ భువనేశ్వర్ కుమార్ వ్యవహరించే అవకాశం ఉంది. అనంతరం సన్రైజర్స్ రెండో మ్యాచ్కు మార్క్రామ్ జట్టుతో కలిసే అవకాశం ఉంది. ఇక ఐపీఎల్ 2023 మార్చి 31 నుంచి ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్లో అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడనున్నాయి. చదవండి: IND vs AUS: ఎంత పని చేశావు భరత్.. ఈజీ క్యాచ్ డ్రాప్! వీడియో వైరల్ -
మెరిసిన మార్క్రమ్ మామ.. సూపర్ ఫామ్ కొనసాగిస్తున్న సన్రైజర్స్ సారధి
జొహనెస్బర్గ్: దక్షిణాఫ్రికా టీ20 జట్టు కెప్టెన్ ఎయిడెన్ మార్క్రమ్ సూపర్ ఫామ్ను కొనసాగిస్తున్నాడు. గత కొంతకాలంగా ఫార్మాట్లకతీతంగా విశ్వరూపం ప్రదర్శిస్తున్న మార్క్రమ్.. వెస్టిండీస్తో బుధవారం మొదలైన రెండో టెస్టులోనూ అదే జోరు కొనసాగించాడు. ఈ మ్యాచ్ తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా.. తొలి రోజు ఆట ముగిసే సమయానికి 7 వికెట్లు కోల్పోయి 311 పరుగులు (తొలి ఇన్నింగ్స్) సాధించింది. మార్క్రమ్ (139 బంతుల్లో 96; 17 ఫోర్లు), టోనీ డి జార్జి (155 బంతుల్లో 86; 11 ఫోర్లు) అర్ధ సెంచరీలతో రాణించారు. మార్క్రమ్ 4 పరుగుల తేడాతో సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయాడు. తొలి వికెట్కు డీన్ ఎల్గర్ (54 బంతుల్లో 42; 7 ఫోర్లు)తో కలిసి 76 పరుగులు, రెండో వికెట్కు టోనీ డి జార్జితో 116 పరుగులు జోడించిన మార్క్రమ్.. క్రీజ్లో ఉన్నంత సేపు విండీస్ బౌలర్ల సహనాన్ని పరీక్షించాడు. సఫారీ బ్యాటర్లలో బవుమా (28), ర్యాన్ రికెల్టన్ (22), వియాన్ ముల్దర్ (12), సైమన్ హార్మర్ (1) తక్కువ స్కోర్కే పరిమితం కాగా, ఆట ముగిసే సమయానికి హెన్రిచ్ క్లాసెన్ (17), కేశవ్ మహారాజ్ క్రీజ్లో ఉన్నారు. విండీస్ బౌలర్లలో గుడకేశ్ మోటీ మూడు వికెట్లు, కైల్ మేయర్స్ రెండు వికెట్లు తీయగా.. అల్జరీ జోసఫ్, జేసన్ హోల్డర్ తలో వికెట్ దక్కించుకున్నారు. కాగా, 2 టెస్ట్లు, 3 వన్డేలు, 3 టీ20ల సిరీస్ కోసం సౌతాఫ్రికాలో పర్యటిస్తున్న విండీస్, టూర్లో భాగంగా జరిగిన తొలి టెస్ట్లో ఆతిధ్య జట్టు చేతిలో 87 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. -
దక్షిణాఫ్రికా కొత్త కెప్టెన్గా స్టార్ క్రికెటర్.. బవుమాపై వేటు!
దక్షిణాఫ్రికా కొత్త టీ20 కెప్టెన్గా ఆ జట్టు స్టార్ బ్యాటర్ ఐడెన్ మార్క్రమ్ ఎంపికయ్యాడు. టెంబా బవుమా స్థానంలో తమ జట్టు కెప్టెన్గా మార్క్రమ్ను దక్షిణాఫ్రికా క్రికెట్ నియమించింది. ఇక బవుమా కేవలం వన్డేలు,టెస్టుల్లో మాత్రమే ప్రోటీస్ జట్టుకు సారథ్యం వహించనున్నాడు. అదే విధంగా వైట్బాల్ క్రికెట్లో తమ జట్టు బ్యాటింగ్ కోచ్గా మాజీ ఆటగాడు జేపీ డుమిని, బౌలింగ్ కోచ్గా రోరీ క్లీన్వెల్ట్ను దక్షిణాఫ్రికా క్రికెట్ ఎంపిక చేసింది. కాగా స్వదేశంలో వెస్టిండీస్తో జరగనున్న వన్డే, టీ20 సిరీస్లకు జట్టును ప్రకటించిన క్రికెట్ సౌతాఫ్రికా.. ఈ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇక ఇది ఇలా ఉండగా.. మాజీ కెప్టెన్ బవుమాను ఇకపై టీ20లకు పరిగణించకూడదని ప్రోటీస్ సెలక్టర్లు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. మరోవైపు అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్న ప్రోటీస్ మాజీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్.. విండీస్ సిరీస్తో తిరిగి రీ ఎంట్రీ ఇస్తాడని వార్తలు వినిపించాయి. అయితే సెలక్టర్లు మాత్రం అతడి పునరాగమనంపై ఆసక్తి చూపకపోయినట్లు తెలుస్తోంది. అదే విధంగా ప్రోటీస్ పరిమిత ఓవర్ల హెడ్ కోచ్ రాబ్ వాల్టర్తో డుప్లెసిస్ జరిపిన చర్చలు కూడా విఫలమైనట్లు పలు నివేదికలు పేర్కొంటున్నాయి. ఇక జట్టు ఎంపిక విషయానికి వస్తే.. వన్డే సిరీస్కు స్టార్ పేసర్లు కగిసో రబాడ, అన్రిచ్ నోర్జేకు సెలక్టర్లు విశ్రాంతి ఇచ్చారు. యువ క్రికెటర్లు గెరాల్డ్ కోయెట్జీ, ర్యాన్ రికెల్టన్, టోనీ డి జోర్జి,ట్రిస్టన్ స్టబ్స్ కు తొలి సారి దక్షిణాఫ్రికా వన్డే జట్టులో చోటు దక్కింది. తొలి రెండు వన్డేలకు దక్షిణాఫ్రికా జట్టు: టెంబా బవుమా (కెప్టెన్), గెరాల్డ్ కోయెట్జీ, క్వింటన్ డి కాక్, టోనీ డి జోర్జి, జార్న్ ఫార్టుయిన్, రీజా హెండ్రిక్స్, సిసంద మగాలా, కేశవ్ మహరాజ్, వియాన్ ముల్డర్, లుంగీ ఎంగిడీ, ర్యాన్ రికెల్టన్, ఆండిలే స్టిల్బుబ్స్, ఫెహ్లుక్వేబ్స్, లిజాడ్ విలియమ్స్, రాస్సీ వాన్ డెర్ డస్సెన్. మూడో వన్డే కోసం జట్టు: టెంబా బావుమా (కెప్టెన్), గెరాల్డ్ కోయెట్జీ, క్వింటన్ డి కాక్, టోనీ డి జోర్జి, బ్జోర్న్ ఫోర్టుయిన్, రీజా హెండ్రిక్స్, మార్కో జాన్సెన్, హెన్రిచ్ క్లాసెన్, సిసంద మగల, కేశవ్ మహరాజ్, ఐడెన్ మార్క్రామ్, డేవిడ్ మిల్లర్ , లుంగి ఎం, ర్యాన్ రికెల్టన్, వేన్ పార్నెల్, ఆండిలే ఫెహ్లుక్వాయో, ట్రిస్టన్ స్టబ్స్, లిజాడ్ విలియమ్స్, రాస్సీ వాన్ డెర్ డ్యూసెన్. టీ20లకు ప్రోటీస్ జట్టు: ఐడెన్ మార్క్రామ్ (కెప్టెన్), క్వింటన్ డి కాక్, జార్న్ ఫోర్టుయిన్, రీజా హెండ్రిక్స్, మార్కో జాన్సెన్, హెన్రిచ్ క్లాసెన్, సిసంద మగాలా, డేవిడ్ మిల్లర్, లుంగి ఎన్గిడి, అన్రిచ్ నార్టే, వేన్ పార్నెల్, కగిసో రబాడ, రిలీ రోసోవ్, , ట్రిస్టన్ స్టబ్స్. -
విండీస్ను శాసించిన రబాడ.. తొలి టెస్టులో ఘన విజయం
వెస్టిండీస్తో జరిగిన తొలి టెస్టులో సౌతాఫ్రికా శుభారంభం చేసింది. సెంచూరియన్ వేదికగా ముగిసిన తొలి టెస్టులో ప్రొటీస్ 87 పరుగుల తేడాతో విజయం అందుకుంది. 246 పరుగుల టార్గెట్తో నాలుగో ఇన్నింగ్స్ ఆరంభించిన వెస్టిండీస్ 41 ఓవర్లలో 159 పరుగులకు ఆలౌటైంది. జెర్మెన్ బ్లాక్వుడ్ 79 పరుగులతో ఒంటరిపోరాటం చేయగా మిగతావారు విఫలమయ్యారు. కగిసో రబాడ ఆరు వికెట్లతో విండీస్ నడ్డి విరవగా.. మార్కో జాన్సెన్ రెండు, నోర్ట్జే , కోట్జే చెరొక వికెట్ తీశారు. అంతకముందు సౌతాఫ్రికా రెండో ఇన్నింగ్స్లో 116 పరుగులకు ఆలౌట్ అయింది. ఇక తొలి ఇన్నింగ్స్లో సౌతాఫ్రికా 342 పరుగులకు ఆలౌట్ కాగా.. విండీస్ తొలి ఇన్నింగ్స్లో 212 పరుగుల వద్ద ముగించడంతో సౌతాఫ్రికాకు 130 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించినట్లయింది. ఇక తొలి ఇన్నింగ్స్లో సెంచరీ, రెండో ఇన్నింగ్స్లో 47 పరుగులతో ఆకట్టుకున్న ఓపెనర్ మార్క్రమ్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఇరుజట్ల మధ్య రెండో టెస్టు మార్చి 8 నుంచి 12 వరకు జోహన్నెస్బర్గ్ వేదికగా జరగనుంది. చదవండి: టీమిండియా నిలబెట్టుకుంటే.. 141 ఏళ్ల రికార్డు బద్దలు! 'లక్ష్యం చిన్నదే.. రేపు ఏమైనా జరగొచ్చు!' -
సంబరాల్లో సన్రైజర్స్ ఫ్యాన్స్.. ఎందుకో తెలుసా..?
Aiden Markram: ఐపీఎల్ 2023 సీజన్ ప్రారంభానికి నెల రోజుల ముందే సన్రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ అభిమానులు సంబురాల్లో మునిగి తేలుతున్నారు. ఇందుకు కారణం ఏంటంటే.. వెస్టిండీస్తో ఇవాళ (ఫిబ్రవరి 28) ప్రారంభమైన టెస్ట్ మ్యాచ్లో సౌతాఫ్రికా ఆటగాడు ఎయిడెన్ మార్క్రమ్ సెంచరీ చేశాడు. మార్క్రమ్ను ఎస్ఆర్హెచ్ యాజమాన్యం ఇటీవలే కెప్టెన్గా నియమించుకుంది. ఇదే ఎస్ఆర్హెచ్ సంబరాలకు కారణంగా నిలిచింది. ఇటీవలే ముగిసిన సౌతాఫ్రికా టీ20 లీగ్లో తమ సిస్టర్ ఫ్రాంచైజీ అయిన సన్రైజర్స్ ఈస్టర్న్ కేప్ను ఛాంపియన్గా నిలిపిన మార్క్రమ్.. సెంచరీల మీద సెంచరీలు బాదుతూ ఎస్ఆర్హెచ్ను కూడా ఛాంపియన్గా నిలపాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. భీకర ఫామ్లో ఉన్న మార్క్రమ్ ఇదే ఫామ్ను కొనసాగిస్తూ.. ఐపీఎల్లోనూ పరుగుల వరద పారించాలని అభిమానులు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మ్యాచ్ విషయానికొస్తే.. 2 టెస్ట్లు, 3 వన్డేలు, 3 టీ20లు ఆడేందుకు విండీస్ జట్టు సౌతాఫ్రికాలో పర్యటిస్తుంది. టెస్ట్ సిరీస్లో భాగంగా సెంచూరియన్ వేదికగా ఇవాల్టి నుంచి తొలి మ్యాచ్ ప్రారంభమైంది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా.. మూడో సెషన్ సమయానికి 7 వికెట్ల నష్టానికి 296 పరుగులు చేసింది. ఓపెనర్లు డీన్ ఎల్గర్ (71) అర్ధసెంచరీతో, మార్క్రమ్ (115) సెంచరీతో రాణించారు. తొలి వికెట్కు 141 పరుగులు జోడించిన సఫారీలు ఆతర్వాత వరుస క్రమంలో వికెట్లు కోల్పోయి భారీ స్కోర్ సాధించే అవకాశాన్ని చేజార్చుకున్నారు. టోనీ డి జోర్జీ 28 పరుగులు చేసి ఔట్ కాగా.. కెప్టెన్ బవుమా 0, కీగన్ పీటర్సన్ 14, క్లాసెన్ 20, ముత్తుసామి 3 పరుగులు చేసి ఔటయ్యారు. జన్సెన్, రబాడ క్రీజ్లో ఉన్నారు. విండీస్ బౌలర్లలో అల్జరీ జోసఫ్ 3 వికెట్లు పడగొట్టగా.. కీమర్ రోచ్, కైల్ మేయర్స్, షానన్ గాబ్రియెల్ తలో వికెట్ దక్కించుకున్నారు. -
ఆ ఇద్దరి నుంచే కెప్టెన్సీ స్కిల్స్ నేర్చుకున్నా: సన్రైజర్స్ కొత్త కెప్టెన్
ఐపీఎల్లో సన్రైజర్స్ హైదరాబాద్ కొత్త కెప్టెన్గా దక్షిణాఫ్రికా స్టార్ ఆటగాడు ఐడెన్ మార్క్రమ్ ఎంపికైన సంగతి తెలిసిందే. గత సీజన్లో ఎస్ఆర్హెచ్ కెప్టెన్గా వ్యవహరించిన కేన్ విలియమ్సన్ నుంచి మార్క్రమ్ బాధ్యతలు నుంచి స్వీకరించనున్నాడు. కాగా ఈ ఏడాది సీజన్ మినీ వేలంకు ముందు విలియమ్సన్ను ఎస్ఆర్ హెచ్ విడిచిపెట్టింది. అయితే మినీవేలంలో విలియమ్సన్ను గుజరాత్ టైటాన్స్ సొంతం చేసుకుంది. అదే విధంగా సౌతాఫ్రికా టీ20 లీగ్లో సన్రైజర్స్ ఈస్టర్న్ కేప్ సారథ్యం వహించిన మార్క్రమ్.. తమ జట్టు తొలి టైటిల్ను అందించాడు. ఇక ఈ లీగ్లో మార్క్రమ్ సారధిగానే కాకుండా వ్యక్తిగత ప్రదర్శనతో కూడా ఆకట్టుకున్నాడు. 12 మ్యాచ్లు ఆడిన అతడు 366 పరుగులతో పాటు 11 వికెట్లు కూడా సాధించాడు. ఇక ఐపీఎల్లో సన్రైజర్స్ సారథిగా బాధ్యతలు చేపట్టిన మార్క్రామ్ తొలి సారి స్పందించాడు. ఇండియాటూడేతో మార్క్రమ్ మాట్లాడుతూ.. "సన్రైజర్స్ కెప్టెన్గా బాధ్యతలు చేపట్టడం చాలా సంతోషంగా ఉంది. కెప్టెన్గా జట్టును విజయ పథంలో నడిపించడానికి 100 శాతం ఎఫక్ట్ పెడతాను. అదే విధంగా మా జట్టుకు అభిమానులు మద్దతు కూడా చాలా ఉంటుంది. కాబట్టి వారిని సంతృప్తి పరచేందుకు మేము గట్టిగా ప్రయత్నిస్తాం. ఇక నా కెరీర్లో ఆదర్శప్రాయులైన వ్యక్తుల గురించి మాట్లాడాలంటే.. జాతీయ జట్టుకు ఆడేటప్పుడు ఫాఫ్ డు ప్లెసిస్ నుంచి చాలా విషయాలు నేర్చకున్నాను. ముఖ్యంగా ఒక సారథిగా ఎలా ఉండాలో తెలుసుకున్నాను. ఇక గతేడాది సన్రైజర్స్లో ఆడినప్పుడు కేన్ విలియమ్సన్ నుంచి కూడా కెప్టెన్సీ స్కిల్స్ను నేర్చుకున్నాను. ఫాప్ లాగే కేన్ కూడా చాలా ప్రశాంతంగా ఉంటాడు. ఆటగాళ్లకు మద్దతుగా నిలవడం, వారిలో ఆత్మవిశ్వాసం నింపండం వంటవి విలియమ్సన్ ప్రత్యేకం. అందుకే ఈ ఇద్దరి నుంచి నేను చాలా నేర్చుకున్నాను. అదే విధంగా హెడ్ కోచ్ బ్రియాన్ లారాతో కలిసి పనిచేయడానికి ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నాను" అని అతడు పేర్కొన్నాడు. చదవండి: T20 WC 2023: సెమీస్కు ముందు టీమిండియాకు బిగ్ షాక్.. స్టార్ ఆల్రౌండర్ దూరం -
సన్రైజర్స్ కొత్త సారధి పేరు ప్రకటన.. ఆరెంజ్ ఆర్మీ కెప్టెన్ ఎవరంటే..?
Aiden Markram: మరి కొద్ది రోజుల్లో ఐపీఎల్-2023 సీజన్ ప్రారంభంకానున్న నేపథ్యంలో సన్రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ ఇవాళ (ఫిబ్రవరి 23) తమ నూతన సారధి పేరును అధికారికంగా ప్రకటించింది. మినీ ఐపీఎల్గా పరిగణించబడే సౌతాఫ్రికా టీ20 లీగ్లో (ఎస్ఏ20) తమ సిస్టర్ ఫ్రాంచైజీ అయిన సన్రైజర్స్ ఈస్ట్రన్ కేప్ను ఛాంపియన్గా నిలబెట్టిన సఫారీ ఆటగాడు ఎయిడెన్ మార్క్రమ్ను ఎస్ఆర్హెచ్ యాజమాన్యం కెప్టెన్గా నియమించింది. నిరీక్షణకు తెరపడింది.. ఆరెంజ్ ఆర్మీ కొత్త కెప్టెన్ ఎయిడెన్ మార్క్రమ్కు హలో చెప్పండి అంటూ ట్విటర్లో ఓ వీడియోను పోస్ట్ చేసింది. THE. WAIT. IS. OVER. ⏳#OrangeArmy, say hello to our new captain Aiden Markram 🧡#AidenMarkram #SRHCaptain #IPL2023 | @AidzMarkram pic.twitter.com/3kQelkd8CP — SunRisers Hyderabad (@SunRisers) February 23, 2023 కాగా, ఐపీఎల్ 2023 మినీ వేలానికి ముందు సన్రైజర్స్ హైదరాబాద్ తమ కెప్టెన్ కేన్ విలియమ్సన్ను వేలానికి విడిచిపెట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కెప్టెన్ ఎంపిక అనివార్యం కాగా.. రేసులో పలువురి పేర్లు ప్రముఖంగా వినిపించాయి. ఎస్ఆర్హెచ్ కెప్టెన్సీ రేసులో మయాంక్ అగర్వాల్, భువనేశ్వర్ కుమార్, ఎయిడెన్ మార్క్రమ్లు పోటీ పడగా.. యాజమాన్యం మార్క్రమ్ వైపు మొగ్గు చూపింది. సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు: ఎయిడెన్ మార్క్రమ్ (కెప్టెన్), మయాంక్ అగర్వాల్, రాహుల్ త్రిపాఠి, సమర్థ్ వ్యాస్, గ్లెన్ ఫిలిప్స్, అన్మోల్ప్రీత్ సింగ్, హ్యారీ బ్రూక్, అబ్దుల్ సమద్, నితీశ్కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్, ఉపేంద్ర యాదవ్, సన్వీర్ సింగ్, వివ్రాంత్ శర్మ, అభిషేక్ శర్మ, మార్కో జన్సెన్, వాషింగ్టన్ సుందర్, కార్తీక్ త్యాగీ, ఉమ్రాన్ మాలిక్, టి నటరాజన్, ఫజల్ హక్ ఫారూఖీ, భువనేశ్వర్ కుమార్, ఆదిల్ రషీద్, అకీల్ హొసేన్, మయాంక్ డాగర్, మయాంక్ మార్కండే -
మార్కరమ్ సూపర్ సెంచరీ.. ఫైనల్కు చేరిన సన్రైజర్స్
సౌతాఫ్రికా టీ20 లీగ్-2023 ఫైనల్లో సన్రైజర్స్ ఈస్టర్న్ కేప్ జట్టు అడుగు పెట్టింది. గురువారం సెంచూరియన్ వేదికగా జరిగిన రెండో సెమీ ఫైనల్లో జోబర్గ్ సూపర్ కింగ్స్ను 14 పరుగుల తేడాతో ఓడించి ఫైనల్బెర్త్ను సన్రైజర్స్ ఖారారు చేసుకుంది. సన్రైజర్స్ ఫైనల్కు చేరడంలో ఆ జట్టు కెప్టెన్ ఐడెన్ మార్కరమ్ కీలక పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్లో మార్కరమ్ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. కేవలం 58 బంతులు ఎదుర్కొన్న మార్కరమ్ 6 సిక్స్లు, 6 ఫోర్లుతో 100 పరుగులు చేశాడు. అతడితో పాటు జోర్డాన్ హెర్మాన్ 48 పరుగులతో రాణించాడు. వీరిద్దరి అద్భుత ఇన్నింగ్స్లు ఫలితంగా తొలుత బ్యాటింగ్ చేసిన సన్రైజర్స్ ఈస్టర్న్ కేప్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 213 పరుగులు చేసింది. కాగా జోబర్గ్ సూపర్ కింగ్స్ బౌలర్లలో విలియమ్స్ నాలుగు వికెట్లు సాధించాడు. పోరాడి ఓడిన సూపర్ కింగ్స్ 214 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 199 పరుగులు మాత్రమే చేయగల్గింది. దీంతో విజయానికి 14 పరుగుల దూరంలో సూపర్ కింగ్స్ నిలిచిపోయింది. సన్రైజర్స్ జట్టులో రోలోఫ్ వాన్ డెర్ మెర్వే రెండు వికెట్లు, మగాల, జానెసన్, బార్ట్మాన్ తలా వికెట్ సాధించారు. ఫైనల్లో ప్రిటోరియా క్యాపిటల్స్తో ఢీ జోహన్నెస్బర్గ్ వేదికగా ఫిబ్రవరి 11న జరగనున్న ఫైనల్ పోరులో ప్రిటోరియా క్యాపిటల్స్తో సన్రైజర్స్ ఈస్టర్న్ కేప్ తలపడనుంది. తొలి సెమీఫైనల్లో పార్ల్ రాయల్స్ను చిత్తు చేసి ప్రిటోరియా ఫైనల్కు చేరుకున్న సంగతి తెలిసిందే. చదవండి: Womens T20 WC: ధనాధన్ ఆటకు అమ్మాయిలు సిద్ధం.. హర్మన్ప్రీత్ సేన ఈసారైనా...! -
SA20 2023: చెలరేగిన బట్లర్, మిల్లర్.. సన్రైజర్స్కు భంగపాటు
Sunrisers Eastern Cape vs Paarl Royals: సౌతాఫ్రికా టీ20 లీగ్లో గత మ్యాచ్లో భారీ విజయం సాధించిన సన్రైజర్స్ ఈస్టర్న్ కేప్ తాజా మ్యాచ్లో ఓడిపోయింది. పర్ల్ రాయల్స్ చేతిలో 5 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. జోస్ బట్లర్, డేవిడ్ మిల్లర్ మెరుపు ఇన్నింగ్స్తో రాయల్స్ జట్టును గెలిపించారు. సెయింట్ జార్జ్ పార్క్ వేదికగా మంగళవారం జరిగిన మ్యాచ్లో టాస్ గెలిచిన సన్రైజర్స్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్లు రాసింగ్టన్(4), జోర్డాన్ హెర్మాన్(4) విఫలం కాగా.. వన్డౌన్ బ్యాటర్ స్మట్స్ జట్టును ఆదుకున్నాడు. 49 బంతుల్లో 9 ఫోర్ల సాయంతో 65 పరుగులు సాధించాడు. మిగతా బ్యాటర్లలో ఎవరూ కనీసం 20 పరుగుల మార్కును అందుకోలేకపోయారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో మార్కరమ్ బృందం 7 వికెట్లు నష్టపోయి 130 పరుగులు చేసింది. బట్లర్ హాఫ్ సెంచరీ లక్ష్య ఛేదనకు దిగిన రాయల్స్కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. మార్కో జాన్సెన్ జేసన్ రాయ్ను 8 పరుగులకే పెవిలియన్కు పంపాడు. ఆ తర్వాత వరుసగా వికెట్లు పడ్డా.. మరో ఓపెనర్ జోస్ బట్లర్ నిలకడైన ప్రదర్శన కనబరిచాడు. మిల్లర్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఈ వికెట్ కీపర్ బ్యాటర్ 39 బంతుల్లో 51 పరుగులతో రాణించాడు. కెప్టెన్ డేవిడ్ మిల్లర్ 23 బంతుల్లో 4 సిక్స్ల సాయంతో 37 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడి ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు. వీరిద్దరు చెలరేగడంతో రాయల్స్ జట్టు 18.5 ఓవర్లలోనే టార్గెట్ను ఛేజ్ చేసింది. రాయల్స్ సారథి డేవిడ్ మిల్లర్ను ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు వరించింది. ఏ స్థానంలో ఉన్నాయంటే కాగా ఈ ఓటమితో సన్రైజర్స్ ఖాతాలో నాలుగో పరాజయం నమోదైంది. ఇక ఇప్పటి వరకు ఆడిన ఎనిమిది మ్యాచ్లలో రైజర్స్ నాలుగు గెలిచి.. నాలుగు ఓడింది. 17 పాయింట్లతో ప్రస్తుతం పట్టికలో రెండో స్థానంలో ఉంది. ఇక రాయల్స్ సైతం 17 పాయింట్లు సాధించగా.. రైజర్స్(0.508) కంటే రన్రేటు(0.050) పరంగా వెనుకబడి మూడో స్థానంలో ఉంది. చదవండి: మైదానంలో ‘కింగ్’లైనా.. ‘రాణుల’ ప్రేమకు తలవంచిన వాళ్లే! Shubman Gill: 'చాలా క్లిష్టమైన ప్రశ్న.. కోహ్లికే నా ఓటు' 𝙈𝙖𝙟𝙚𝙨𝙩𝙞𝙘 𝙈𝙞𝙡𝙡𝙚𝙧 👀the super hits of the Royal's skipper More action from the #SA20League 👉 LIVE on #JioCinema, #Sports18 & @ColorsTvTamil 📲#SA20 #SA20onJioCinema #SA20onSports18 pic.twitter.com/VsJiM9uyKS — JioCinema (@JioCinema) January 24, 2023 -
ఐపీఎల్లో నిరాశపరిచినా.. సౌతాఫ్రికా లీగ్లో మాత్రం దుమ్మురేపుతున్న సన్రైజర్స్
Sunrisers Eastern Cape: గత కొన్ని సీజన్లుగా ఐపీఎల్లో ఘోర పరాజయాలు మూటగట్టుకుంటూ, ఫ్యాన్స్ తలెత్తుకోలేకుండా చేసిన సన్రైజర్స్ ఫ్రాంచైజీ.. సౌతాఫ్రికా టీ20 లీగ్లో మాత్రం అబ్బురపడే ప్రదర్శన కనబరుస్తూ, వరుస విజయాలతో అదరగొడుతుంది. సీజన్ను వరుస పరాజయాలతో ప్రారంభించినా, ఆతర్వాత హ్రాటిక్ విజయాలు, మధ్యలో ఓ ఓటమి, తాజాగా (జనవరి 22) మరో భారీ విజయం సాధించి పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి (7 మ్యాచ్ల్లో 4 విజయాలతో 17 పాయింట్లు) ఎగబాకింది. డర్బన్ సూపర్ జెయింట్స్తో నిన్న జరిగిన మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన సన్రైజర్స్ ఈస్టర్న్ కేప్ టీమ్.. ఓపెనర్లు ఆడమ్ రాస్సింగ్టన్ (30 బంతుల్లో 72; 10 ఫోర్లు, 4 సిక్సర్లు), జోర్డాన్ హెర్మన్ (44 బంతుల్లో 59; 9 ఫోర్లు, సిక్స్) విధ్వంసకర అర్ధశతకాలతో, కెప్టెన్ మార్క్రమ్ (34 బంతుల్లో 44 నాటౌట్; 3 ఫోర్లు, సిక్స్), ట్రిస్టన్ స్టబ్స్ (13 బంతుల్లో 27 నాటౌట్; ఫోర్, 2 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్లతో విరుచుకుపడటంతో నిర్ణీత ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 210 పరుగుల భారీ స్కోర్ చేసింది. అనంతరం 211 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన సూపర్ జెయింట్స్ టీమ్.. రోల్ఫ్ వాన్ డెర్ మెర్వ్ (4-0-20-6) స్పిన్ మాయాజాలం ధాటికి విలవిలలాడిపోయి 86 పరుగులకే కుప్పకూలింది. సూపర్ జెయింట్స్ ఇన్నింగ్స్లో కైల్ మేయర్స్ (11), వియాన్ ముల్దర్ (29), కేశవ్ మహారాజ్ (12 నాటౌట్) మాత్రమే రెండంకెల స్కోర్ చేశారు. సన్రైజర్స్ బౌలర్లలో వాన్ డెర్ మెర్వ్ ఆరేయగా.. జెజె స్మట్స్, మార్క్రమ్, జన్సెన్, మాసన్ క్రేన్ తలో వికెట్ పడగొట్టారు. మినీ ఐపీఎల్గా పిలువబడే సౌతాఫ్రికా లీగ్ తొలి సీజన్లో సన్రైజర్స్ అద్భుత ప్రదర్శన పట్ల సన్రైజర్స్ హైదరాబాద్ ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఐపీఎల్లో సన్రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యమే ఎస్ఏ20 లీగ్లో సన్రైజర్స్ ఈస్టర్న్ కేప్ టీమ్ను కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. -
దుమ్మురేపుతున్న సన్రైజర్స్.. హ్యాట్రిక్ విజయాలు.. ఫ్యాన్స్ ఖుషీ
SA20, 2023- Paarl Royals vs Sunrisers Eastern Cape: సౌతాఫ్రికా టీ20 లీగ్లో సన్రైజర్స్ ఈస్టర్న్ కేప్ జట్టు దుమ్మురేపుతోంది. తొలి రెండు మ్యాచ్లలో ఓడినా.. పడిలేచిన కెరటంలా హ్యాట్రిక్ విజయాలు నమోదు చేసింది. ఈ నెల 10న పర్ల్ రాయల్స్- ఎంఐ కేప్టౌన్తో మ్యాచ్తో ప్రొటిస్ పొట్టి లీగ్కు తెరలేచింది. ఈ క్రమంలో జనవరి 12న ప్రిటోరియా క్యాపిటల్స్తో తొలి మ్యాచ్ ఆడిన సన్రైజర్స్ ఈస్టర్న్కేప్ 23 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఆ తర్వాత మళ్లీ క్యాపిటల్స్ చేతిలోనే 37 పరుగుల తేడాతో పరాజయాన్ని మూటగట్టుకుంది. దీంతో ఎయిడెన్ మార్కరమ్ బృందం ఆట తీరుపై విమర్శలు వచ్చాయి. పర్ల్తో మ్యాచ్లో అయితే, ఎంఐ కేప్టౌన్ను వరుసగా 4 వికెట్లు, 2 వికెట్ల తేడాతో ఓడించిన సన్రైజర్స్.. గురువారం నాటి మ్యాచ్లో పర్ల్ రాయల్స్ను మట్టికరిపించింది. 5 వికెట్ల తేడాతో గెలుపొంది హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేసింది. పర్ల్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన సన్రైజర్స్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్కు దిగిన పర్ల్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 127 పరుగులు చేసింది. సన్రైజర్స్ కెప్టెన్ ఎయిడెన్ మార్కరమ్ బంతితో రాణించడం విశేషం. 3 ఓవర్లు బౌలింగ్ వేసి అతడు 21 పరుగులు ఇచ్చి 2 వికెట్లు కూల్చాడు. సమిష్టి కృషితో.. ఇతర బౌలర్లలో మగల ఒక వికెట్ తీయగా.. వాన్ డెర్ మెర్వె, బ్రైడన్ కార్సే రెండేసి వికెట్లు తమ ఖాతాలో వేసుకున్నారు. ఇక స్వల్ప లక్ష్యంతో బ్యాటింగ్కు దిగిన సన్రైజర్స్కు ఓపెనర్స్ ఆడం రాసింగ్టన్ 20 రన్స్ స్కోరు చేయగా, జోర్డాన్ హెర్మన్ 43 పరుగులతో రాణించాడు. ఫ్యాన్స్ ఖుషీ ఇక కెప్టెన్ మార్కరమ్ 23 బంతుల్లో 23 పరుగులు సాధించగా.. ఆఖర్లో ట్రిస్టన్ స్టబ్స్ 12 బంతుల్లో 18 పరుగులు, మార్కో జాన్సెన్ 21 పరుగులతో అజేయంగా నిలిచి జట్టును విజయతీరాలకు తీర్చారు. 18.2 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 131 పరుగులు చేసిన సన్రైజర్స్ ఈస్టర్న్ కేప్ పర్ల్పై ఐదు వికెట్ల తేడాతో గెలుపొందింది. మార్కరమ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. ఇక ఈ మ్యాచ్లో సన్రైజర్స్ సహ యజమాని కావ్య మారన్ హైలైట్గా నిలిచారు. కాగా సన్రైజర్స్ వరుసగా మూడు విజయాలు సాధించడంతో ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. రైజర్స్ ఐపీఎల్-2023లో మంచి ప్రదర్శన చేయాలని కోరుకుంటున్నారు. చదవండి: Hockey WC 2023: నెదర్లాండ్స్ సంచలన విజయం.. ఆస్ట్రేలియాను వెనక్కి నెట్టి చరిత్ర! ఇక భారత్ క్వార్టర్స్ అవకాశాలు?! కర్ణాటక కెప్టెన్గా రాహుల్ ద్రవిడ్ తనయుడు అన్వయ్ ద్రవిడ్ Top scorer in his first #SA20 game! 👊 Jordan Hermann shares his thoughts on his performance & our win in Paarl! 🗣️#SEC #SunrisersEasternCape #PRvSEC #SA20 #PlayWithFire pic.twitter.com/u8HQNKIu2Q — Sunrisers Eastern Cape (@SunrisersEC) January 19, 2023 -
అదరగొట్టిన మార్కరమ్.. సన్రైజర్స్ తొలి విజయం
సౌతాఫ్రికా టీ20 లీగ్లో సన్రైజర్స్ ఈస్టర్న్ కేప్ జట్టు తొలి విజయం నమోదు చేసింది. ఈ టోర్నీలో భాగంగా మంగళవారం ఎంఐ కేప్టౌన్తో జరిగిన మ్యాచ్లో 4 వికెట్ల తేడాతో సన్రైజర్స్ విజయం సాధించింది. 159 పరుగుల విజయం లక్ష్యంతో బరిలోకి ఈస్టర్న్ కేప్ 19.3 ఓవర్లలో 6వికెట్లు కోల్పోయి చేధించింది. ఇక సన్రైజర్స్ గెలుపులో ఆ జట్టు కెప్టెన్ ఎయిడెన్ మార్కరమ్ కీలక పాత్ర పోషించాడు. తొలుత బౌలింగ్లో రెండు వికెట్లు పడగొట్టిన మార్క్రమ్.. అనంతరం బ్యాటింగ్లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఈ మ్యాచ్లో 35 బంతులు ఎదుర్కొన్న మార్కరమ్ 7 ఫోర్లు సాయంతో 50 పరుగలు సాధించాడు. అతడితో పాటు సరేల్ ఎర్వీ(41), స్టబ్స్(30) పరుగులతో రాణించారు. ఎంఐ కేప్టౌన్ బౌలర్లలో ఒడియన్ స్మిత్ మూడు, సామ్ కుర్రాన్ రెండు, రషీద్ ఖాన్ ఒక్క వికెట్ సాధించారు. ఇక తొలుత బ్యాటింగ్ చేసిన ఎంఐ కేప్టౌన్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 158 పరుగులు చేసింది. కాగా కేప్టౌన్ 52 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ క్రమంలో రాసీ వాన్ డర్ డస్సెన్ (29), లిండే(63) అద్భుత ఇన్నింగ్స్లతో జట్టుకు గౌరవప్రదమైన స్కోర్ను అందించారు. కాగా ఈస్టర్న్ కేప్ బౌలర్లలో బార్ట్మాన్ మూడు వికెట్లు, మగాల, మార్కరమ్ తలా రెండువికెట్లు పడగొట్టారు. చదవండి: IND vs NZ: న్యూజిలాండ్తో తొలి వన్డే.. సూర్యకుమార్కు నో ఛాన్స్! కిషన్కు చోటు -
దంచికొట్టిన సాల్ట్! సన్రైజర్స్కు తొలి మ్యాచ్లోనే చేదు అనుభవం
SA20, 2023 3rd Match- Sunrisers Eastern Cape vs Pretoria Capitals: సౌతాఫ్రికా టీ20 లీగ్లో సన్రైజర్స్ ఈస్టర్న్కేప్ జట్టుకు తొలి మ్యాచ్లో చేదు అనుభవం ఎదురైంది. ప్రిటోరియా క్యాపిటల్స్ చేతిలో 23 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. దీంతో ప్రొటిస్ పొట్టి లీగ్లో ఢిల్లీ ఫ్రాంఛైజీ ఘనంగా ఆగమనం చాటగా.. హైదరాబాద్ ఫ్రాంఛైజీ పోరాడి ఓడింది. సెయింట్ జార్జ్ పార్క్ వేదికగా.. గురువారం జరిగిన మ్యాచ్లో టాస్ గెలిచిన ఈస్టర్న్ కేప్.. తొలుత బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్కు దిగిన ప్రిటోరియాకు ఓపెనర్ ఫిలిప్ సాల్ట్.. అదిరిపోయే ఆరంభం అందించాడు. తోటి బ్యాటర్ల నుంచి పెద్దగా సహకారం లేకపోయినా.. ఆకాశమే హద్దుగా చెలరేగాడు. భారీ స్కోరు బంతుల్లో 11 ఫోర్ల సాయంతో 77 పరుగులతో ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు. దీంతో పార్నెల్ బృందం నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 193 పరుగులు చేసింది. ఈస్టర్న్ కేప్ బౌలర్లలో బార్ట్మన్, మార్కరమ్కు రెండేసి వికెట్లు దక్కగా.. మార్కో జాన్సెన్ ఒకటి, మగల ఒక్కో వికెట్ తీశారు. ఇక భారీ లక్ష్య ఛేదనకు దిగిన సన్రైజర్స్ ఈస్టర్న్ కేప్నకు జేజే స్మట్స్ శుభారంభం అందించాడు. 51 బంతుల్లో 66 పరుగులు చేశాడు. ఇతరుల్లో ట్రిస్టన్ స్టబ్స్ 23, టామ్ అబెల్ 40(నాటౌట్) రాణించారు. కానీ అప్పటికే జరగ్సాలిన నష్టం జరిగిపోయింది. దీంతో 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 170 పరుగులు చేయగలిగిన మార్కరమ్ బృందం 23 పరుగుల తేడాతో పరాజయాన్ని మూటగట్టుకుంది. ఇదిలా ఉంటే ఇంగ్లండ్ బ్యాటర్ సాల్ట్ ఐపీఎల్-2023లో ఢిల్లీ క్యాపిటల్స్కు ప్రాతినిథ్యం వహించనున్నాడు. మరోవైపు.. మార్కరమ్ సన్రైజర్స్ జట్టులో కీలక సభ్యుడన్న సంగతి తెలిసిందే. మ్యాచ్ స్కోర్లు ప్రిటోరియా క్యాపిటల్స్- 193/6 (20) సన్రైజర్స్ ఈస్టర్న్కేప్- 170/5 (20) చదవండి: Rashid Khan: రషీద్ ఖాన్ సంచలన నిర్ణయం! IND vs SL: టీమిండియా ఆల్రౌండ్ ప్రదర్శన.. సిరీస్ చిక్కింది -
IPL 2023 Auction: ఎన్ని కోట్లు పెట్టడానికైనా ఎస్ఆర్హెచ్ రెడీ! కెప్టెన్గా అతడే!
IPL 2023 Mini Auction- Sunrisers Hyderabad: కేన్ విలియమ్సన్, నికోలస్ పూరన్ వంటి కీలక ఆటగాళ్లను రిలీజ్ చేసిన సన్రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంఛైజీ ఐపీఎల్ మినీ వేలం-2023లో కెప్టెన్ ఆప్షన్ కోసం టార్గెట్ చేయనుంది. జట్టులో ఉన్న 13 ఖాళీలను భర్తీ చేసే క్రమంలో ఇతర ఫ్రాంఛైజీలతో పోటీ పడనుంది. కాగా మిగతా జట్లతో పోలిస్తే ఎక్కువ ఖాళీలు కలిగి ఉన్న సన్రైజర్స్.. పర్సులో అత్యధికంగా 42.25 కోట్ల రూపాయలు ఉన్నాయి. కెప్టెన్గా స్టోక్స్? ఇంగ్లండ్ టెస్టు జట్టు సారథి బెన్ స్టోక్స్పై సన్రైజర్స్ దృష్టి సారించినట్లు తెలుస్తోంది. సంప్రదాయ క్రికెట్లోనూ కోచ్ బ్రెండన్ మెకల్లమ్తో కలిసి బజ్బాల్ విధానం అవలంబిస్తూ దూకుడైన ఆటతో.. జట్టును విజయవంతంగా ముందుకు నడిపిస్తున్నాడు ఈ ఆల్రౌండర్. ఆటగాడిగానూ మెరుగ్గా రాణిస్తున్నాడు. ఈ నేపథ్యంలో మినీ వేలంలో స్టోక్స్ కోసం ఫ్రాంఛైజీల మధ్య తీవ్రమైన పోటీ జరగడం ఖాయం. అయితే, గత సీజన్లలో వరుసగా కెప్టెన్లను మార్చినప్పటికీ సన్రైజర్స్ అనుకున్న ఫలితాలు రాబట్టలేకపోయింది. తొలుత డేవిడ్ వార్నర్.. ఇప్పుడు కేన్ విలియమ్సన్ను వదిలేసిన హైదరాబాద్ జట్టు స్టోక్స్ కోసం ఎంత మొత్తమైనా చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. మరోవైపు టీమిండియా సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్, సౌతాఫ్రికా స్టార్ ఎయిడెన్ మార్కరమ్ పేర్లు కూడా కెప్టెన్సీ రేసులో వినిపిస్తున్నాయి. అయితే, సన్రైజర్స్ మాత్రం స్టోక్స్ను ఎలాగైనా దక్కించుకొని కెప్టెన్ చేయాలనుకుంటోందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఐపీఎల్-2023 మినీ వేలంలో సన్రైజర్స్ టార్గెట్ చేసే ప్రధాన ఆటగాళ్లు(అంచనా) బెన్ స్టోక్స్ మయాంక్ అగర్వాల్ సామ్ కరన్ కామెరూన్ గ్రీన్ సన్రైజర్స్ రిటైన్ చేసుకున్న ఆటగాళ్లు అబ్దుల్ సమద్ (రూ. 4 కోట్లు), ఐడెన్ మార్క్రామ్ (రూ. 2.6 కోట్లు), రాహుల్ త్రిపాఠి (రూ. 8.5 కోట్లు), గ్లెన్ ఫిలిప్స్ (రూ. 1.5 కోట్లు), అభిషేక్ శర్మ (రూ. 6.5 కోట్లు), మార్కో జాన్సెన్ (రూ. 4.2 కోట్లు ), వాషింగ్టన్ సుందర్ (8.75 కోట్లు), ఫజల్హక్ ఫరూఖీ (రూ. 50 లక్షలు), కార్తీక్ త్యాగి (రూ. 4 కోట్లు) భువనేశ్వర్ కుమార్ (రూ. 4.2 కోట్లు), టి నటరాజన్ (రూ. 4 కోట్లు), ఉమ్రాన్ మాలిక్ (రూ. 4 కోట్లు) వదిలేసిన ఆటగాళ్లు కేన్ విలియమ్సన్, నికోలస్ పూరన్, జగదీశ సుచిత్, ప్రియమ్ గార్గ్, రవికుమార్ సమర్థ్, రొమారియో షెపర్డ్, సౌరభ్ దూబే, సీన్ అబాట్, శశాంక్ సింగ్, శ్రేయాస్ గోపాల్, సుశాంత్ మిశ్రా, విష్ణు వినోద్ చదవండి: వేలంలో.. ఆ అఫ్గన్ యువ బౌలర్ సూపర్స్టార్! స్టోక్స్, ఉనాద్కట్ కోసం పోటీ: మిస్టర్ ఐపీఎల్ IPL 2023 Auction: గ్రీన్కు 20, కర్రన్కు 19.5, స్టోక్స్కు 19 కోట్లు..! -
భువీ, అభిషేక్ కాదు.. సన్రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ అతడే!
ఐపీఎల్-2023 మినీ వేలంకు ముందు న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ను సన్రైజర్స్ హైదరాబాద్ విడిచిపెట్టిన సంగతి తెలిసిందే. దీంతో రాబోయే సీజన్లో ఎస్ఆర్హెచ్ కెప్టెన్సీ బాధ్యతలు ఎవరు చేపడతారన్నది అన్నది ప్రస్తుతం అందరి మెదడలను తొలుస్తున్న ప్రశ్న. ఈ క్రమంలో ఐపీఎల్-2023లో ఎస్ఆర్హెచ్ కెప్టెన్గా ఆ జట్టు ఆల్రౌండర్ ఐడెన్ మార్క్రామ్ను నియమించాలని మేనేజెమెంట్ భావిస్తున్నట్లు సమాచారం. అయితే తొలుత భువనేశ్వర్ కుమార్ లేదా యువ ఆటగాడు అభిషేక్ శర్మ సన్రైజర్స్ కెప్టెన్గా బాధ్యతలు చేపడతారని వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే. "జట్టు కెప్టెన్సీపై నిర్ణయం తీసుకోవడానికి చాలా సమయం ఉంది. అభిమానులు కూడా మా నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నారు అని నాకు తెలుసు. కానీ కెప్టెన్సీ పెద్ద బాధ్యత. ప్రస్తుతం మా దృష్టిలో ఐడెన్ మార్క్రామ్ ఉన్నాడు. అతడికి అంతర్జాతీయ స్థాయిలో కెప్టెన్సీ అనుభవం లేనప్పటికీ జట్టును నడిపించగల సత్తా ఉంది. దక్షిణాఫ్రికా టీ20 లీగ్లో కూడా మా జట్టు కెప్టెన్సీ బాధ్యతలు ఐడన్కే అప్పజెప్పాలని భావిస్తున్నాము. త్వరలోనే మా కోచింగ్ స్టాప్తో చర్చించి ఓ నిర్ణయం తీసుకుంటాము" అని ఎస్ఆర్హెచ్ ఫ్రాంచైజీకు సంబంధించిన ఓ అధికారి ఇన్సైడ్ స్పోర్ట్తో పేర్కొన్నారు. సన్రైజర్స్ రిటెన్షన్ లిస్ట్: ఎయిడెన్ మార్క్రమ్, రాహుల్ త్రిపాఠి, గ్లేన్ ఫిలిప్స్, అబ్దుల్ సమద్, అభిషేక్ శర్మ, మార్కోజాన్సెన్, వాషింగ్టన్ సుందర్, కార్తీక్ త్యాగీ, టీ నటరాజన్, ఫజల్లక్ ఫరూఖీ.,భువనేశ్వర్ కుమార్ సన్రైజర్స్ విడిచిపెట్టిన ఆటగాళ్ల జాబితా కేన్ విలియమ్సన్, నికోలస్ పూరన్, జగదీశ సుచిత్, ప్రియమ్ గార్గ్, రవికుమార్ సమర్థ్, రొమారియో షెపర్డ్, సౌరభ్ దూబే, సీన్ అబాట్, శశాంక్ సింగ్, శ్రేయాస్ గోపాల్, సుశాంత్ మిశ్రా, విష్ణు వినోద్ చదవండి: IND vs NZ: గెలిస్తే... సిరీస్ మన చేతికి.. సంజూ సామ్సన్, యువ పేసర్కు అవకాశం? -
రోహిత్ మరీ ఇంత బద్దకమా..
టి20 ప్రపంచకప్లో భాగంగా సౌతాఫ్రికాతో మ్యాచ్లో భారత ఆటగాళ్ల ఫేలవమైన ఫీల్డింగ్ టీమిండియా కొంపముంచుతుంది. ముఖ్యంగా కెప్టెన్ రోహిత్ శర్మ మ్యాచ్లో మరీ బద్దకంగా కనిపించాడు. మార్ర్కమ్ రనౌట్ విషయంలో రోహిత్ వ్యవహరించిన తీరు సోషల్ మీడియలో వైరల్గా మారింది. షమీ వేసిన ఇన్నింగ్స్ 13వ ఓవర్లో ఐదో బంతిని మిల్లర్ ఆన్సైడ్ ఆడాడు. సింగిల్కు కాల్ ఇచ్చిన మిల్లర్ పరిగెత్తేలోపే బంతి రోహిత్ శర్మ అందుకున్నాడు. ఆ సమయంలో నాన్స్ట్రైక్ ఎండ్లో ఉన్న మార్క్రమ్ క్రీజు మధ్యలోనే ఉన్నాడు. ఈ నేపథ్యంలో రోహిత్ మంచి రనౌట్ చాన్స్ మిస్ చేశాడు. ఎంత టైమ్ గ్యాప్ ఉందంటే.. డైరెక్ట్ హిట్ కాకపోయినా.. కనీసం వేగంగా పరిగెత్తి వికెట్లను తాకించినా మార్క్రమ్ ఔటయ్యేవాడు. అలా బంగారం లాంటి రనౌట్ చాన్స్ మిస్ అయింది. అంతకముందు కోహ్లి కూడా మార్క్రమ్ ఇచ్చిన క్యాచ్ను వదిలేశాడు. అలా రెండుసార్లు ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకన్న మార్క్రమ్ అర్థసెంచరీతో మెరిశాడు. Virat Kohli drops a catch & Rohit Sharma misses a run-out❌ Aiden Markram survivies twice in an over! 📸: Disney + Hotstar pic.twitter.com/pxAjo6xsWS — CricTracker (@Cricketracker) October 30, 2022 చదవండి: తెలివిగా వ్యవహరించిన కార్తిక్.. లాస్ట్ మ్యాచ్ హీరో జీరో అయ్యాడు -
2019లో బాబర్.. ఇప్పుడు మారక్రమ్.. వారెవ్వా కుల్దీప్
లక్నో వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో భారత్ 9 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. అయితే ఈ మ్యాచ్లో భారత వెటరన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ అద్భుతమైన ప్రదర్శనతో అకట్టుకున్నాడు. తన 8 ఓవర్ల కోటాలో 39 పరుగులు ఇచ్చి ఓ వికెట్ యాదవ్ పడగొట్టాడు. ముఖ్యంగా దక్షిణాప్రికా బ్యాటర్ మార్కరమ్ను కుల్దీప్ ఔట్ చేసిన విధానం మ్యాచ్ మొత్తానికే హైలెట్గా నిలిచింది. సౌతాఫ్రికా ఇన్నింగ్స్లో 16వ ఓవర్ వేసిన కుల్దీప్.. ఓ అద్భుమైన బంతితో మార్కరమ్ను క్లీన్ బౌల్డ్ చేశాడు. కుల్దీప్ వేసిన ఈ పదునైన బంతి గింగిరాలు తిరుగుకుంటూ వికెట్లను గిరాటేసింది. ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ ట్విటర్లో షేర్ చేసింది. కాగా 2019 వన్డే ప్రపంచకప్లో కూడా కుల్దీప్ ఇటువంటి బంతితోనే పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజంను క్లీన్ బౌల్డ్ చేశాడు. Absolute Beaut! 🙌 🙌@imkuldeep18 gets Aiden Markram out with a ripper! 👍 👍 #TeamIndia Follow the match ▶️ https://t.co/d65WZUUDh2 Don’t miss the LIVE coverage of the #INDvSA match on @StarSportsIndia. pic.twitter.com/KMajjtsA67 — BCCI (@BCCI) October 6, 2022 చదవండి: IND Vs SA: 'దటీజ్ సంజూ.. ఇప్పటికైనా కళ్లు తెరవండి' -
CSA T20: జట్టు పేరు, ఇద్దరు ఆటగాళ్ల పేర్లు వెల్లడించిన సన్రైజర్స్!
South Africa T20 League- Sunrisers Eastern Cape: సౌతాఫ్రికా టీ20 లీగ్తో ఐపీఎల్ ఫ్రాంఛైజీ సన్రైజర్స్ హైదరాబాద్ అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్ క్రికెట్ మార్కెట్లో అడుగుపెడుతోంది. దక్షిణాఫ్రికా వేదికగా వచ్చే ఏడాది ఈ లీగ్ ఆరంభం కానుంది. ఇందులో పాల్గొనబోయే ఆరు ఫ్రాంఛైజీలలో ఒకటైన పోర్ట్ ఎలిజబెత్ను సన్రైజర్స్ దక్కించుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తమ జట్టుకు సన్రైజర్స్ ఈస్టర్న్ కేప్గా నామకరణం చేసింది. అదే విధంగా వేలం కంటే ముందే తాము ఒప్పందం కుదుర్చుకున్న ఇద్దరు ఆటగాళ్ల పేర్లను వెల్లడించింది. దక్షిణాఫ్రికా టీ20 ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ ఎయిడెన్ మార్కరమ్తో పాటు డెత్ఓవర్ల బౌలింగ్ స్పెషలిస్టు ఒట్నీల్ బార్టమన్(అన్క్యాప్డ్)ను సొంతం చేసుకున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటన చేసింది. హైదరాబాద్ తరఫున ఎయిడెన్ మార్కరమ్ ఐపీఎల్లో ఇప్పటికే సన్రైజర్స్కు ప్రాతినిథ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. ఐపీఎల్-2022తో జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన అతడు తాజా ఎడిషన్లో 381 పరుగులు చేశాడు. ఇక టీ20 ప్రపంచకప్-2021 నుంచి దక్షిణాఫ్రికా తరఫున ఇప్పటి వరకు నాలుగు అర్ధ శతకాలు బాదాడు. ఈ క్రమంలో సౌతాఫ్రికా టీ20 ప్లేయర్ ఆఫ్ ది ఇయర్గా ఎంపికయ్యాడు. డెత్ఓవర్ల స్పెషలిస్టు ఇక ఒట్నీల్ విషయానికొస్తే.. 29 ఏళ్ల ఈ దక్షిణాఫ్రికా ఆటగాడు రైట్ ఆర్మ్ పేసర్గా రాణిస్తున్నాడు. సీఎస్ఏ ప్రొవిన్షియల్ టీ20 కప్ టోర్నీలో నార్తర్న్ కేప్నకు ప్రాతినిథ్యం వహించాడు. డెత్ఓవర్ల స్పెషలిస్టుగా అతడికి పేరుంది. ఇప్పటి వరకు 35 టీ20 మ్యాచ్లు ఆడిన అన్క్యాప్డ్ ప్లేయర్.. 41 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. స్వదేశంలో గతేడాది పాకిస్తాన్తో సిరీస్ సందర్భంగా జట్టుకు ఎంపికైనప్పటికీ అనారోగ్య కారణాల వల్ల దురదృష్టవశాత్తూ జట్టుకు దూరమయ్యాడు. కాగా దక్షిణాఫ్రికా టీ20 లీగ్ నిబంధనల ప్రకారం వేలం కంటే ముందే ఆరు జట్లు ఐదుగురు ఆటగాళ్లతో ఒప్పందం కుదుర్చుకోవచ్చు. ఇందులో ఒకరు దక్షిణాఫ్రికా జాతీయ జట్టుకు ఆడుతున్న క్రికెటర్, మరొకరు ప్రొటిస్ అన్క్యాప్డ్ ప్లేయర్ ఉండాలి. చదవండి: MS Dhoni: ఆ అవకాశమే లేదు! ఒకవేళ అదే ముఖ్యమైతే.. బీసీసీఐతో బంధాలన్నీ తెంచుకున్న తర్వాతే! CSA T20 League: జట్టు పేరును వెల్లడించిన రాయల్స్ గ్రూప్.. బట్లర్ సహా.. MI Capetown: ఐదుగురు ఆటగాళ్ల పేర్లను ప్రకటించిన ఎంఐ కేప్టౌన్.. రబడ సహా.. View this post on Instagram A post shared by Sunrisers Eastern Cape (@sunrisersec)