-
ఓటు హక్కు వినియోగించుకున్న ద్రవిడ్, కుంబ్లే
దేశంలో ఇవాళ (ఏప్రిల్ 26) సార్వత్రిక ఎన్నికల రెండో విడత పోలింగ్ జరుగుతుంది. ఈ విడతలో మొత్తం 13 రాష్ట్రాల్లోని 88 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఉదయం ఏడు గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. కేరళలోని 20 స్థానాలకు, కర్ణాటకలో 14, రాజస్థాన్లో 13, ఉత్తర్ప్రదేశ్ 8, మహారాష్ట్ర 8, మధ్యప్రదేశ్ 7, అస్సాం 5, బీహార్ 5, పశ్చిమ బెంగాల్ 3, చత్తీస్ఘడ్ 3, జమ్మూ కశ్మీర్ 1, మణిపూర్ 1, త్రిపురలో ఒక లోక్సభ స్థానానికి ఇవాళ పోలింగ్ జరుగతుంది. #WATCH | Rahul Dravid casts his vote in Karnataka's Bengaluru.#LokSabhaElections2024 pic.twitter.com/gZ6Ybairc1— ANI (@ANI) April 26, 2024 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఇవాల్టి ఉదయం నుంది వివిధ రంగాలకు చెందిన చాలామంది ప్రముఖులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. క్రీడారంగానికి సంబంధించి భారత మాజీ క్రికెటర్, ప్రస్తుత టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ ఇవాళ ఉదయం బెంగళూరులో ఓటు హక్కును వినియోగించుకున్నారు. భార్య, కొడుకుతో సహా పోలింగ్ కేంద్రం వద్దకు చేరిన ద్రవిడ్ అతి సాధారణ వ్యక్తిలా క్యూలో నిలబడి ఓటు వేశారు. #Vote #Indiaelections2024 #Karnataka #bengaluru pic.twitter.com/JDi9VYpIA6— Anil Kumble (@anilkumble1074) April 26, 2024 ఓటు వేసిన అనంతరం ద్రవిడ్ మీడియాతో మాట్లాడుతూ.. అర్హత కలిగిన ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చాడు. ఓటు అనేది ప్రజాస్వామ్యం మనకు కల్పించిన హక్కు అని ద్రవిడ్ తెలిపాడు. ద్రవిడ్ సహచరుడు, టీమిండియా మాజీ కోచ్ అనిల్ కుంబ్లే కూడా ఇవాళ బెంగళూరులో ఓటు వేశారు. ఓటు వినియోగించుకున్న విషయాన్ని కుంబ్లే సోషల్మీడియాలో షేర్ చేశాడు. కుంబ్లే తన సతీమణితో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నాడు. -
ధోని, సచిన్ ఒకేలా.. నేను హెడ్కోచ్గా ఉన్నపుడు: భారత మాజీ స్పిన్నర్
‘‘ఐపీఎల్లో నేను ఎంఎస్ ధోనితో కలిసి ఎన్నడూ ఆడలేదు. అయితే, టీమిండియాలో ఉన్నపుడు మాత్రం మేము సహచర ఆటగాళ్లం. సెలబ్రేషన్స్ సమయంలో నన్ను ఎత్తుకోగల ఆటగాళ్లలో ధోని ముందు వరుసలో ఉండే వాడు. ఎంత బరువైనా సరే అతడు అలవోకగా ఎత్తగలడు. ఇక నేను హెడ్కోచ్గా ఉన్నపుడు ధోని కెప్టెన్గా ఉండేవాడు. ఓసారి మేము వన్డే మ్యాచ్ కోసం రాంచికి వెళ్లాము. అక్కడ ఆప్షనల్ ప్రాక్టీస్ సెషన్ నిర్వహించేందుకు సిద్ధమయ్యాను. నిజానికి రాంచి అతడి స్వస్థలం. ఆప్షనల్ ప్రాక్టీస్కు రాకుండా తను ఇంటి వద్ద విశ్రాంతి తీసుకోవచ్చు. కానీ.. అతడు గ్రౌండ్కు వచ్చేశాడు. నాకు ఆశ్చర్యంగా అనిపించి.. ‘ఇక్కడేం చేస్తున్నావు? తదుపరి మ్యాచ్కు మనకు ఇంకా రెండ్రోజుల సమయం ఉంది. ఎందుకు వచ్చావు?’ అని అడిగాను. అందుకు బదులుగా.. ‘లేదు.. లేదు.. నేను తప్పకుండా ఇక్కడ ఉండాల్సిందే’ అని ధోని జవాబు ఇచ్చాడు. సచిన్ కూడా అచ్చం ఇలాగే! నేను ముంబై ఇండియన్స్తో ఉన్నపుడు.. సచిన్ కూడా ఆన్షనల్ ప్రాక్టీస్ సెషన్ సమయంలో సచినే ముందు బస్సెక్కడం గమనించా. 25 నుంచి 26 ఏళ్లుగా క్రికెట్ ఆడుతున్న సమయంలోనూ అదే అంకితభావం. ఈ విషయంలో వీరిద్దరూ వాళ్లకు వాళ్లే సాటి. వాళ్లకు బ్రేక్ అవసరం లేదనుకుంటారు. ఇంకొన్ని ఏళ్లపాటు ఎంఎస్ ధోని.. చెన్నై సూపర్ కింగ్స్లో ఆటగాడిగా కొనసాగినా మనం ఆశ్చర్యపోనక్కర్లేదు. ఆట పట్ల అతడికి ఉన్న ప్రేమ అలాంటిది. అందుకే ఎప్పుడూ జట్టుకు అందుబాటులో ఉండాలనే ఆలోచిస్తూ ఉంటాడు’’ అని టీమిండియా మాజీ కెప్టెన్, దిగ్గజ స్పిన్నర్ అనిల్ కుంబ్లే అన్నాడు. సీఎస్కేను ఏకంగా ఐదుసార్లు చాంపియన్గా నిలిపిన కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనికి ఇదే ఆఖరి ఐపీఎల్ సీజన్ అన్న వార్తల నడుమ.. కుంబ్లే జియో సినిమా షోలో ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు. క్రికెట్ విషయంలో దిగ్గజ బ్యాటర్ సచిన్ టెండుల్కర్, ధోని ఆలోచనలు, అంకితభావం ఒకే విధంగా ఉంటాయని వారితో తనకున్న అనుభవాలు పంచుకున్నాడు. ధోనికి ఐపీఎల్-2024 చివరి సీజన్ కాబోదని.. మరికొన్నేళ్లపాటు అతడికి లీగ్లో కొనసాగే సత్తా ఉందని అనిల్ కుంబ్లే అభిప్రాయపడ్డాడు. ఈ వికెట్ కీపర్ బ్యాటర్ ఇప్పట్లో అలసిపోడంటూ 42 ఏళ్ల ధోనిని ఉద్దేశించి ప్రశంసలు కురిపించాడు. కాగా మార్చి 22న ఐపీఎల్-2024 సీజన్ ఆరంభం కానుంది. సీఎస్కే- ఆర్సీబీ మధ్య చెపాక్లో తొలి మ్యాచ్ జరుగనుంది. చదవండి: అతడితో పోలికా?.. బుమ్రానే బెస్ట్ బౌలర్: పాక్ మాజీ పేసర్ -
ప్రపంచంలో మొట్ట మొదటి బౌలర్గా అశ్విన్ అరుదైన ఘనత
టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. క్రికెట్ ప్రపంచంలో ఏ బౌలర్కూ ఇంత వరకు సాధ్యం కాని ఘనత సాధించాడు. కాగా 2011లో అంతర్జాతీయ టెస్టుల్లో అడుగుపెట్టాడు ఈ చెన్నై ఆటగాడు. ఢిల్లీ వేదికగా వెస్టిండీస్తో తన తొలి టెస్టు ఆడాడు. ఈ మ్యాచ్లో తొలి ఇన్నింగ్స్లో మూడు వికెట్లు తీసిన ఈ రైటార్మ్ స్పిన్నర్.. రెండో ఇన్నింగ్స్లో ఆరు వికెట్లతో చెలరేగాడు. అలా తన కెరీర్లో తొలి ఐదు వికెట్ల హాల్ నమోదు చేశాడు. తాజాగా తన వందో టెస్టులోనూ ఈ ఘనత సాధించాడు అశ్విన్. ధర్మశాల వేదికగా ఇంగ్లండ్తో జరిగిన మ్యాచ్లో తొలి ఇన్నింగ్స్లో నాలుగు వికెట్లకే పరిమితమైన అశూ.. రెండో ఇన్నింగ్స్లో 5 వికెట్లతో దుమ్ములేపాడు. View this post on Instagram A post shared by JioCinema (@officialjiocinema) ఈ నేపథ్యంలో.. అరంగేట్రంలో, వందో టెస్టులో ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేసిన తొలి బౌలర్గా అశ్విన్ ప్రపంచ రికార్డు సొంతం చేసుకున్నాడు. 147 ఏళ్ల టెస్టు చరిత్రలో ఈ ఘనత సాధించిన ఏకైక బౌలర్గా నిలిచాడు. కాగా అశ్విన్ తన కెరీర్లో ఇప్పటి వరకు మొత్తంగా 36 సార్లు ఐదు వికెట్ల హాల్ సాధించడం విశేషం. తద్వారా టీమిండియా స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లే పేరిట ఉన్న రికార్డు(35 సార్లు) బద్దలు కొట్టాడు. అంతేకాదు ఒకే ప్రత్యర్థి జట్టుపైన అత్యధిక టెస్టు వికెట్లు తీసిన తొలి భారత బౌలర్గానూ నిలిచాడు. ఇప్పటి వరకు అశ్విన్.. ఆస్ట్రేలియా మీద 114, ఇంగ్లండ్ మీద 114 వికెట్లు తీశాడు. ఇక రవిచంద్రన్ అశ్విన్.. ఇంగ్లండ్తో సిరీస్ సందర్భంగానే 500 వికెట్లు క్లబ్లో చేరాడు. అతడి ఖాతాలో ప్రస్తుతం 516 వికెట్లు ఉన్నాయి. ఇదిలా ఉంటే.. ధర్మశాలలో ఇంగ్లండ్తో జరిగిన నామమాత్రపు ఆఖరి టెస్టులో టీమిండియా భారీ విజయం సాధించింది. ఇన్నింగ్స్ 64 పరుగుల తేడాతో గెలిచి సిరీస్ను 4-1తో కైవసం చేసుకుంది. That series winning feeling 😃#TeamIndia 🇮🇳 complete a 4⃣-1⃣ series victory with a remarkable win 👏👏 Scorecard ▶️ https://t.co/OwZ4YNua1o#INDvENG | @IDFCFIRSTBank pic.twitter.com/vkfQz5A2hy — BCCI (@BCCI) March 9, 2024 చదవండి: #Sarfaraz: తెగ మిడిసిపడుతున్నాడు.. గిల్- బెయిర్స్టో గొడవలో సర్ఫరాజ్.. వైరల్ -
చరిత్ర సృష్టించిన అశ్విన్.. తొలి భారత క్రికెటర్గా
ధర్మశాల వేదికగా ఇంగ్లండ్తో జరిగిన ఐదో టెస్టులో టీమిండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అదరగొట్టాడు.కెరీర్లో వందో టెస్టు ఆడిన అశ్విన్.. తన స్పిన్ మయాజాలంతో ప్రత్యర్ధి జట్టుకు చుక్కలు చూపించాడు. తొలి ఇన్నింగ్స్లో 4 వికెట్లు పడగొట్టిన అశూ.. రెండో ఇన్నింగ్స్లో 5 వికెట్లతో సత్తాచాటాడు. జాక్ క్రాలీ, డకెట్, పోప్ వంటి కీలక వికెట్లు పడగొట్టి ఇంగ్లీష్ జట్టును దెబ్బతీశాడు. ఓవరాల్గా అశ్విన్ తన వందో టెస్టులో 9 వికెట్లు పడగొట్టాడు. ఇక రెండో ఇన్నింగ్స్లో 5 వికెట్లతో చెలరేగిన అశ్విన్ ఓ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. టెస్టు క్రికెట్ చరిత్ర అత్యధిక సార్లు 5 వికెట్ల ఘనత సాధించిన భారత బౌలర్గా అశ్విన్ రికార్డులెక్కాడు. అశ్విన్ ఇప్పటివరకు తన టెస్టు కెరీర్లో 36 సార్లు ఐదు వికెట్ల ఘనత సాధించాడు. ఇంతకుముందు ఈ రికార్డు భారత స్పిన్ లెజెండ్ అనిల్ కుంబ్లే పేరిట ఉండేది. కుంబ్లే 132 మ్యాచ్ల్లో 35 సార్లు ఫైవ్ వికెట్ల హాల్ సాధించాడు. తాజా మ్యాచ్లో కుంబ్లే ఆల్టైమ్ రికార్డును అశ్విన్ బ్రేక్ చేశాడు. టీమిండియా ఘన విజయం.. ఇక ధర్మశాల టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించింది. ఇంగ్లండ్ను ఇన్నింగ్స్ 64 పరుగుల తేడాతో భారత్ చిత్తు చేసింది. 259 పరుగుల వెనకంజతో రెండో ఇన్నింగ్స్ను ఆరంభించిన ఇంగ్లండ్.. 195 పరుగులకే కుప్పకూలింది. దీంతో ఇన్నింగ్స్ తేడాతో ఇంగ్లండ్ ఘోర ఓటమి చవిచూసింది. భారత బౌలర్లలో అశ్విన్ 5 వికెట్లతో చెలరేగగా.. జడేజా, కుల్దీప్ యాదవ్ తలా రెండు వికెట్లు పడగొట్టారు. అంతకుముందు ఇంగ్లండ్ తమ తొలి ఇన్నింగ్స్లో సైతం 218 పరుగులకే చాపచుట్టేసింది. అనంతరం టీమిండియా తమ తొలి ఇన్నింగ్స్లో 477 పరుగుల భారీ స్కోర్ సాధించింది. రోహిత్ శర్మ(103), గిల్(110) సెంచరీలతో మెరిశారు. దీంతో భారత్కు తొలి ఇన్నింగ్స్లో 259 పరుగుల ఆధిక్యం లభించింది. ఇక వరుసగా నాలుగు టెస్టుల్లో విజయం సాధించిన భారత్.. ఐదు మ్యాచ్ల సిరీస్ను 4-1 తేడాతో సిరీస్ సొంతం చేసుకుంది. టీమిండియా వర్సెస్ ఇంగ్లండ్ ఐదో టెస్టు స్కోర్లు ►టాస్: ఇంగ్లండ్.. తొలుత బ్యాటింగ్ ►ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ స్కోరు: 218 ►భారత్ తొలి ఇన్నింగ్స్లో చేసిన పరుగులు: 477 (ఓవరాల్గా 259 పరుగుల ఆధిక్యం) ►ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్: 195 ►విజేత: టీమిండియా.. ఇన్నింగ్స్ 64 పరుగుల తేడాతో గెలుపు ►ఐదు మ్యాచ్ల సిరీస్ 4-1తో టీమిండియా కైవసం View this post on Instagram A post shared by JioCinema (@officialjiocinema) -
IND VS ENG 4th Test: కుంబ్లే రికార్డును సమం చేసిన అశ్విన్
రాంచీ టెస్ట్లో రవిచంద్రన్ అశ్విన్ రికార్డులను కొల్లగొడుతున్నాడు. తొలుత భారత గడ్డపై టెస్టుల్లో అత్యధిక వికెట్ల (351) రికార్డును బద్దలుకొట్టిన అశ్విన్.. సెకెండ్ ఇన్నింగ్స్లో ఐదు వికెట్ల (5/51) ప్రదర్శన అనంతరం కుంబ్లే పేరిట ఉండిన అత్యధిక ఐదు వికెట్ల ఘనతల రికార్డును (భారత్ తరఫున) సమం చేశాడు. కుంబ్లే 132 టెస్ట్ల్లో 35 ఐదు వికెట్ల ఘనతలు నమోదు చేస్తే.. అశ్విన్ కేవలం 99 టెస్ట్ల్లోనే ఈ ఘనతను (35 ఐదు వికెట్ల ఘనతలు) సమం చేశాడు. సుదీర్ఘ ఫార్మాట్లో అత్యధిక సార్లు ఐదు వికెట్ల ఘనతలు నమోదు చేసిన రికార్డు స్పిన్ దిగ్గజం మురళీథరన్ పేరిట ఉంది. మురళీ 133 టెస్ట్ల్లో ఏకంగా 67 సార్లు ఐదు వికెట్ల ప్రదర్శనలు నమోదు చేశాడు. మురళీ తర్వాత అత్యధిక ఐదు వికెట్ల ప్రదర్శనల రికార్డు స్పిన్ మాంత్రికుడు షేన్ వార్న్ (145 టెస్ట్ల్లో 37 సార్లు) పేరిట ఉంది. వార్న్ తర్వాతి స్థానంలో రిచర్డ్ హ్యాడ్లీ (86 మ్యాచ్ల్లో 36 సార్లు) ఉన్నాడు. ఈ మ్యాచ్లో అశ్విన్ తొలుత బద్దలుకొట్టిన రికార్డు (భారత గడ్డపై టెస్టుల్లో అత్యధిక వికెట్ల రికార్డు) కూడా కుంబ్లే పేరిట ఉండినదే కావడం విశేషం. భారత్లో కుంబ్లే 350 వికెట్లు పడగొట్టాడు. మ్యాచ్ విషయానికొస్తే.. అశ్విన్ ఐదేయడంతో (5/51) ఇంగ్లండ్ సెకెండ్ ఇన్నింగ్స్లో 145 పరుగులకే కుప్పకూలి భారత్ ముందు 192 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఉంచింది. అశ్విన్తో పాటు కుల్దీప్ (4/22) కూడా చెలరేగడంతో ఇంగ్లండ్ సెకెండ్ ఇన్నింగ్స్ పేకమేడలా కూలింది. జడేజా ఓ వికెట్ పడగొట్టాడు. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన భారత్.. మూడో రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 40 పరుగులు చేసి లక్ష్యానికి మరో 152 పరుగుల దూరంలో ఉంది. రోహిత్ శర్మ (24), యశస్వి జైస్వాల్ (16) క్రీజ్లో ఉండగా.. భారత్ చేతిలో ఇంకా 10 వికెట్లు ఉన్నాయి. రెండు రోజుల ఆట మిగిలి ఉంది. ఇంగ్లండ్ సెకెండ్ ఇన్నింగ్స్లో జాక్ క్రాలే (60) ఒక్కడే అర్దసెంచరీతో రాణించాడు. మిగతా ఆటగాళ్లంతా దారుణంగా విఫలమయ్యారు. బెయిర్స్టో (30), ఫోక్స్ (17), డకెట్ (15), రూట్ (11) రెండంకెల స్కోర్లు చేయగా.. పోప్ 0, స్టోక్స్ 4, హార్ట్లీ 7, రాబిన్సన్ 0, ఆండర్సన్ 0 పరుగులకే ఔటయ్యారు. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్.. రూట్ (122) అజేయ సెంచరీతో కదంతొక్కడంతో తొలి ఇన్నింగ్స్లో 353 పరుగులు చేసింది. రాబిన్సన్ (58), జాక్ క్రాలే (42), బెయిర్స్టో (38), ఫోక్స్ (47) ఓ మోస్తరు స్కోర్లతో రాణించారు. భారత బౌలర్లలో జడేజా 4, ఆకాశ్దీప్ 3, సిరాజ్ 2, అశ్విన్ ఓ వికెట్ పడగొట్టారు. అనంతరం బ్యాటింగ్కు దిగిన టీమిండియా తొలి ఇన్నింగ్స్లో 307 పరుగులకు ఆలౌటైంది. యశస్వి జైస్వాల్ (73), దృవ్ జురెల్ (90) అర్దసెంచరీలతో రాణించారు. షోయబ్ బషీర్ (5/119) టీమిండియా పతనాన్ని శాశించగా.. హార్ట్లీ 3, ఆండర్సన్ 2 వికెట్లు పడగొట్టారు. ఐదు మ్యాచ్ల ఈ సిరీస్లో భారత్ 2-1 ఆధిక్యంలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. -
చెత్త రికార్డు.. అనిల్ కుంబ్లేను అధిగమించిన ఆండర్సన్
రాజ్కోట్ వేదికగా టీమిండియాతో జరుగుతున్న మూడో టెస్ట్లో ఇంగ్లండ్ వెటరన్ పేసర్ జేమ్స్ ఆండర్సన్ అనవరమైన చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. టెస్ట్ క్రికెట్ చరిత్రలో అత్యధిక పరుగులు సమర్పించుకున్న బౌలర్గా అవతరించాడు. ఈ చెత్త రికార్డును ఆండర్సన్.. భారత మాజీ స్పిన్నర్ అనిల్ కుంబ్లే ఖాతాలో నుంచి లాగేసుకున్నాడు. 2008లో రిటైరైన కుంబ్లే 132 మ్యాచ్ల టెస్ట్ కెరీర్లో 18, 355 పరుగులు సమర్పించుకోగా.. ఆండర్సన్ తన 185వ టెస్ట్లో కుంబ్లే రికార్డును అధిగమించాడు (18, 371). ఈ జాబితాలో లంక స్పిన్ దిగ్గజం ముత్తయ్య మురళీథరన్ మూడో స్థానంలో (133 టెస్ట్ల్లో 18180 పరుగులు) ఉండగా.. ఆసీస్ లెజెండ్ షేన్ వార్న్ (17995), ఇంగ్లండ్ మాజీ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ (16719) నాలుగు, ఐదు స్థానాల్లో నిలిచారు. 41 ఏళ్ల ఆండర్సన్ ప్రస్తుతం 696 వికెట్లతో టెస్ట్ల్లో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాళ్ల జాబితాలో మూడో స్థానంలో ఉన్నాడు. ఈ జాబితాలో మురళీథరన్ (800), షేన్ వార్న్ (708) తొలి రెండు స్థానాల్లో నిలిచారు. ఇదే మ్యాచ్లో భారత వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ 500 వికెట్ల మైలురాయిని తాకాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో 25 ఓవర్లు వేసిన ఆండర్సన్ 61 పరుగులిచ్చి ఓ వికెట్ పడగొట్టాడు. కాగా, ఈ మ్యాచ్లో రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ 2 వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసింది. ఓపెనర్ బెన్ డకెట్ మెరుపు సెంచరీ (118 బంతుల్లో 133 నాటౌట్; 21 ఫోర్లు, 2 సిక్సర్లు) అనంతరం ఇన్నింగ్స్ను కొనసాగిస్తున్నాడు. అతనితో పాటు జో రూట్ (9) క్రీజ్లో ఉన్నాడు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్లో జాక్ క్రాలే (15), ఓలీ పోప్ (39) ఔటయ్యారు. క్రాలే వికెట్ అశ్విన్కు దక్కగా.. పోప్ను సిరాజ్ పెవిలియన్కు పంపాడు. అంతకుముందు భారత్ తొలి ఇన్నింగ్స్లో 445 పరుగులకు ఆలౌటైంది. రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా సెంచరీలతో మెరిశారు. -
చరిత్రకు అడుగు దూరంలో అశ్విన్.. తొలి బౌలర్గా!?
రాజ్కోట్ వేదికగా గురువారం నుంచి ఇంగ్లండ్తో ప్రారంభం కానున్న మూడో టెస్టులో తలపడేందుకు టీమిండియా సన్నద్దమవుతోంది. ఇప్పటికే రాజ్కోట్కు చేరుకున్న భారత జట్టు నెట్స్లో తీవ్రంగా శ్రమిస్తోంది. ఈ క్రమంలో మూడో టెస్టుకు ముందు భారత వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ను ఓ అరుదైన రికార్డు ఊరిస్తోంది. రాజ్కోట్ టెస్టులో అశ్విన్ మరో 4 వికెట్లు పడగొడితే.. స్వదేశంలో టెస్టు క్రికెట్లో అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్గా రికార్డులకెక్కుతాడు. అశ్విన్ ఇప్పటివరకు భారత్లో 346 వికెట్లు పడగొట్టాడు. ప్రస్తుతం ఈ అరుదైన ఘనత సాధించిన జాబితాలో 350 వికెట్లతో భారత స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లే అగ్రస్ధానంలో ఉన్నాడు. అయితే అశ్విన్ మరో నాలుగు వికెట్లు పడగొడితే కుంబ్లే ఆల్టైమ్ రికార్డును బ్రేక్ చేస్తాడు. అదేవిధంగా అశ్విన్ మరో ఒక్క వికెట్ సాధిస్తే.. టెస్టుల్లో 500 వికెట్ల మైలురాయిని అందుకుంటాడు. ఈ ఘనత సాధించిన తొమ్మిదో క్రికెటర్గా, రెండో భారత బౌలర్గా అశ్విన్ నిలుస్తాడు. ఇంగ్లండ్తో మూడో టెస్టుకు భారత తుది జట్టు(అంచనా): రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, శుభ్మన్ గిల్, కేఎల్ రాహుల్, సర్ఫరాజ్ ఖాన్, అక్షర్ పటేల్, ధ్రువ్ జురెల్, కుల్దీప్ యాదవ్, రవిచంద్రన్ అశ్విన్, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్ -
ఇంగ్లండ్తో రెండో టెస్ట్.. అరుదైన రికార్డులపై కన్నేసిన అశ్విన్
విశాఖ వేదికగా రేపటి నుంచి (ఫిబ్రవరి 2) ప్రారంభంకాబోయే (ఇంగ్లండ్తో) రెండో టెస్ట్కు ముందు టీమిండియా స్టార్ స్పిన్నర రవిచంద్రన్ అశ్విన్ను ఓ అరుదైన రికార్డు ఊరిస్తుంది. ఈ మ్యాచ్లో యాష్ మరో 4 వికెట్లు తీస్తే టెస్ట్ల్లో 500 వికెట్ల మైలురాయిని తాకిన తొమ్మిదో పురుష క్రికెటర్గా రికార్డుల్లోకెక్కుతాడు. ప్రస్తుతం అశ్విన్ ఖాతాలో 496 వికెట్లు (96 మ్యాచ్లు) ఉన్నాయి. ఈ రికార్డుతో పాటు రెండో టెస్ట్లో అశ్విన్ మరిన్ని రికార్డులు కూడా సాధించే అవకాశం ఉంది. ఇంగ్లండ్పై అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్గా.. ఇంగ్లండ్తో టెస్ట్ల్లో 100 వికెట్లు పడగొట్టిన తొలి భారత బౌలర్గా.. భారత్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా.. అత్యధిక ఐదు వికెట్ల ఘనతలు సాధించిన భారత బౌలర్గా పలు రికార్డులు నెలకొల్పుతాడు. ఇంగ్లండ్పై అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్గా.. టెస్ట్ల్లో ఇంగ్లండ్పై అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్ రికార్డు భగవత్ చంద్రశేఖర్ పేరిట ఉంది. చంద్రశేఖర్ ఇంగ్లండ్తో 23 మ్యాచ్లు ఆడి 95 వికెట్లు పడగొట్టాడు. రేపటి నుంచి ప్రారంభంకాబోయే రెండో టెస్ట్లో అశ్విన్ (20 టెస్ట్ల్లో 93 వికెట్లు) మరో 3 వికెట్లు తీస్తే ఇంగ్లండ్పై అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్గా రికార్డుల్లోకెక్కుతాడు. 100 వికెట్లు పడగొట్టిన తొలి భారత బౌలర్గా.. భారత్-ఇంగ్లండ్ మధ్య జరిగిన టెస్ట్ల్లో ఇప్పటివరకు ఏ భారత బౌలర్ కూడా 100 వికెట్లు తీయలేదు. రేపటి నుంచి మొదలయ్యే రెండో టెస్ట్లో అశ్విన్ మరో 7 వికెట్లు తీస్తే.. ఇంగ్లండ్పై 100 వికెట్లు సాధించిన తొలి భారత బౌలర్గా రికార్డు నెలకొల్పుతాడు. ఇరు జట్ల మధ్య టెస్ట్ల్లో ఇప్పటివరకు జేమ్స్ ఆండర్సన్ (139 వికెట్లు) మాత్రమే 100 వికెట్ల మైలురాయిని దాటాడు. భారత్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా.. అశ్విన్ భారత గడ్డపై ఇప్పటివరకు 56 టెస్ట్ మ్యాచ్లు ఆడి 343 వికెట్లు పడగొట్టాడు. అశ్విన్ రెండో టెస్ట్లో మరో 8 వికెట్లు తీస్తే భారతగడ్డపై అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా అనిల్ కుంబ్లే (350) రికార్డును బద్దలు కొడతాడు. అత్యధిక ఐదు వికెట్ల ఘనతలు సాధించిన భారత బౌలర్గా.. కెరీర్లో ఇప్పటివరకు 34 సార్లు ఐదు వికెట్ల ఘనతలు సాధించిన అశ్విన్.. ఇంగ్లండ్తో రెండో టెస్ట్లో రెండు ఇన్నింగ్స్ల్లో ఐదు వికెట్ల ఘనతలు సాధిస్తే, అనిల్ కుంబ్లే పేరిట ఉన్న రికార్డు (భారత్ తరఫున అత్యధిక ఐదు వికెట్ల ఘనతలు) బద్దలవుతుంది. వైజాగ్ పిచ్ స్పిన్నర్లకు అనుకూలించే అవకాశం ఉండటంతో అశ్విన్ పై పేర్కొన్న రికార్డులన్నీ ఇదే మ్యాచ్లో సాధించినా అశ్చర్యపోనక్కర్లేదు. -
Ind vs Eng: ఎలా ఆడాలో నేర్చుకో గిల్: కుంబ్లే విమర్శలు
India vs England, 1st Test: ఇంగ్లండ్తో టెస్టులో టీమిండియా యువ క్రికెటర్ శుబ్మన్ గిల్ ఆట తీరుపై భారత స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లే పెదవి విరిచాడు. బ్యాటింగ్ ఆర్డర్లో మూడో స్థానంలో నిలదొక్కుకోవాలంటే గిల్ తన బ్యాటింగ్ టెక్నిక్ను మరింత మెరుగుపరచుకోవాలని సూచించాడు. రాహుల్ ద్రవిడ్, ఛతేశ్వర్ పుజారాల మాదిరి ఆడితే ఈ యువ ప్లేయర్కు టెస్టుల్లో మంచి భవిష్యత్తు ఉంటుందని కుంబ్లే అభిప్రాయపడ్డాడు. స్పిన్నర్లను ఎదుర్కోవడంలో శుబ్మన్ గిల్ ఇబ్బంది పడుతున్నాడని... బలహీనతలు అధిగమించడంపై దృష్టి సారించాలని హితవు పలికాడు. కాగా ఐదు మ్యాచ్ల సిరీస్లో భాగంగా హైదరాబాద్ వేదికగా టీమిండియా- ఇంగ్లండ్ మధ్య గురువారం తొలి టెస్టు ఆరంభమైంది. ఉప్పల్లో జరుగుతున్న ఈ మ్యాచ్లో వన్డౌన్లో బరిలోకి దిగిన గిల్.. 66 బంతులు ఎదుర్కొని 23 పరుగులు మాత్రమే చేసి అవుటయ్యాడు. స్ట్రైక్ రొటేట్ చేయడం నేర్చుకో ఇంగ్లండ్ స్పిన్నర్ టామ్ హార్ట్లే బౌలింగ్లో బెన్ డకెట్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. చెత్త షాట్ సెలక్షన్తో వికెట్ పారేసుకున్నాడు. ఈ నేపథ్యంలో అనిల్ కుంబ్లే స్పోర్ట్స్ 18తో మాట్లాడుతూ గిల్ బ్యాటింగ్ గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘‘ఒత్తిడి పెరుగుతున్న కొద్దీ.. గిల్ స్ట్రైక్ రొటేట్ చేయలేకపోతున్నాడు. క్లిష్ట పరిస్థితుల్లో ఎలా బ్యాటింగ్ చేయాలో గిల్ నేర్చుకోవాలి. ఒకవేళ తను నంబర్ 3లోనే కొనసాగాలని కోరుకుంటే.. ముఖ్యంగా భారత పిచ్లపై వన్డౌన్లో నెగ్గుకురావాలనే సంకల్పంతో ఉంటే.. స్పిన్నర్లను ఎదుర్కొనేందుకు ప్రత్యేక వ్యూహాలు రచించాలి. ద్రవిడ్, పుజారాలా రాణించాలనుకుంటే లేదంటే స్ట్రైక్ రొటేట్ చేస్తూ పోవాలి. గురువారం అతడు బాగానే బ్యాటింగ్ చేశాడు. కానీ శుక్రవారం నాటి రెండో రోజు ఆటలో చెత్త షాట్తో వికెట్ సమర్పించుకున్నాడు. నేను మళ్లీ చెప్తున్నా... పుజారా, ద్రవిడ్లా వన్డౌన్లో రాణించాలనుకుంటే కచ్చితంగా గిల్ స్ట్రైక్ రొటేట్ చేయాల్సిందే. స్పిన్ బౌలింగ్ ఆడేటపుడు మణికట్టును ఎక్కువగా ఉపయోగించాలి. షాట్ల ఎంపికలోనూ జాగ్రత్త వహించాలి’’ అని కుంబ్లే.. గిల్ ఆట తీరును ఉద్దేశించి వ్యాఖ్యానించాడు. చదవండి: ICC: అవార్డుల విజేతలు, జట్ల పూర్తి జాబితా! జింబాబ్వేకే ఆ పురస్కారం -
Ind vs Eng: చరిత్ర సృష్టించిన అశూ- జడ్డూ.. ఆల్టైమ్ రికార్డు బద్దలు
India vs England, 1st Test Day 1: ఇంగ్లండ్తో మ్యాచ్ సందర్భంగా టీమిండియా స్పిన్ ద్వయం రవిచంద్రన్ అశ్విన్- రవీంద్ర జడేజా సరికొత్త చరిత్ర సృష్టించారు. టెస్టుల్లో అత్యధిక వికెట్లు కూల్చిన భారత బౌలింగ్ జోడీగా ఘనత సాధించారు. ఈ క్రమంలో టీమిండియా స్పిన్ దిగ్గజ జంట అనిల్ కుంబ్లే- హర్భజన్ సింగ్ పేరిట ఉన్న రికార్డు బద్దలు కొట్టారు. కాగా భారత జట్టు స్వదేశంలో ఇంగ్లండ్లో ఐదు మ్యాచ్ల సిరీస్ ఆడుతున్న విషయం తెలిసిందే. 246 పరుగులకు ఇంగ్లండ్ ఆలౌట్ ఇందులో భాగంగా హైదరాబాద్ వేదికగా గురువారం మొదలైన తొలి టెస్టులో టాస్ ఓడిన టీమిండియా తొలుత బౌలింగ్ చేసింది. ఈ క్రమంలో బ్యాటింగ్కు దిగిన ఇంగ్లండ్ను 246 పరుగులకు ఆలౌట్ చేసింది. భారత బౌలర్లలో రవిచంద్రన్ అశ్విన్ మూడు, రవీంద్ర జడేజా మూడు, అక్షర్ పటేల్ రెండు, జస్ప్రీత్ బుమ్రా రెండు వికెట్లు తీశారు. ఈ నేపథ్యంలో తొలి రోజు ఆటలో అశూ- జడ్డూ మొదటి రోజు ఆటలో మొత్తం కలిపి ఆరు వికెట్లు తీశారు. దీంతో ఇప్పటి వరకు టెస్టుల్లో ఇద్దరూ కలిపి 505 వికెట్లు సంయుక్తంగా తమ ఖాతాలో వేసుకున్నారు. కుంబ్లే- భజ్జీ రికార్డు బద్దలు తద్వారా టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలింగ్ జోడీగా నిలిచారు. అంతకు ముందు ఈ రికార్డు కుంబ్లే- హర్భజన్ (501) పేరిట ఉండేది. ఇక ఈ జాబితాలో హర్భజన్ సింగ్- జహీర్ ఖాన్ జోడీ(474), ఉమేశ్ యాదవ్- అశ్విన్ జంట(431) నాలుగో స్థానంలో ఉంది. ఇదిలా ఉంటే.. ఇంగ్లండ్తో తొలి టెస్టులో ఓపెనర్లు జాక్ క్రాలే(20), బెన్ డకెట్(35), మార్క్వుడ్(11) వికెట్లను అశూ పడగొట్టగా.. ఒలీ పోప్(1), జో రూట్(29), టామ్ హార్ట్లే వికెట్లను జడ్డూ తన ఖాతాలో వేసుకున్నాడు. తుదిజట్లు: టీమిండియా రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభమన్ గిల్, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, శ్రీకర్ భరత్, అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, జస్ప్రీత్ బుమ్రా,మహ్మద్ సిరాజ్. ఇంగ్లండ్ జాక్ క్రాలే, బెన్ డకెట్, ఒలీ పోప్, జో రూట్, జానీ బెయిర్ స్టో, బెన్ స్టోక్స్ (కెప్టెన్), బెన్ ఫోక్స్ (వికెట్ కీపర్), రెహాన్ అహ్మద్, టామ్ టామ్ హార్ట్లే, మార్క్ వుడ్, జాక్ లీచ్. -
సౌతాఫ్రికా వెన్ను విరిచిన బుమ్రా.. టెస్టుల్లో 4 అరుదైన రికార్డులు
Ind vs SA 2nd Test Day 2: Jasprit Bumrah Records: సౌతాఫ్రికాతో రెండో టెస్టులో టీమిండియా ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కేప్టౌన్ వేదికగా సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్లో కేవలం రెండు వికెట్లకే పరిమితమైన ఈ స్పీడ్స్టర్.. రెండో ఇన్నింగ్స్లో ఏకంగా ఆరు వికెట్లు పడగొట్టాడు. న్యూలాండ్స్ పిచ్ మీద 63/3 ఓవర్నైట్ స్కోరుతో గురువారం బ్యాటింగ్ మొదలుపెట్టిన ఆతిథ్య ప్రొటిస్ జట్టుకు బుమ్రా ఆరంభం నుంచే చుక్కలు చూపించాడు. ముందు రోజు ట్రిస్టన్ స్టబ్స్ రూపంలో వికెట్ దక్కించుకున్న బుమ్రా.. రెండో రోజు ఆట మొదలైన తొలి ఓవర్లో(17.6వ ఓవర్)నే డేవిడ్ బెడింగ్హామ్ను అవుట్ చేసి శుభారంభం అందించాడు. ఆ తర్వాత మరో నాలుగు ఓవర్ల అనంతరం కైలీ వెరెనెను పెవిలియన్కు పంపాడు. అనంతరం మార్కో జాన్సెన్ను అద్భుత రీతిలో బౌల్డ్ చేసిన ఈ రైటార్మ్ పేసర్.. కేశవ్ మహరాజ్ వికెట్ను కూడా తన ఖాతాలో వేసుకుని ఐదు వికెట్ల హాల్ అందుకున్నాడు. ఈ క్రమంలో లుంగి ఎంగిడీని అవుట్ చేసిన సౌతాఫ్రికా ఇన్నింగ్స్ ముగించిన బుమ్రా ఖాతాలో ఆరో వికెట్ జమైంది. ఈ నేపథ్యంలో.. సౌతాఫ్రికాతో రెండో టెస్టు రెండో రోజు ఆట సందర్భంగా జస్ప్రీత్ బుమ్రా నాలుగు అరుదైన రికార్డులు సాధించాడు. అవేంటంటే.. 1. సౌతాఫ్రికాలో టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన మూడో భారత బౌలర్ 2. SENA(సౌతాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా) దేశాల్లో అత్యధిక సార్లు ఐదు వికెట్ల ఘనత సాధించిన నాలుగో భారత బౌలర్. 3. సౌతాఫ్రికాలో అత్యధికసార్లు ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేసిన రెండో భారత బౌలర్. 4. న్యూలాండ్స్ పిచ్ మీద టెస్టుల్లో అత్యధిక వికెట్లు కూల్చిన రెండో బౌలర్(ఏకైక భారత బౌలర్). బుమ్రా కంటే ముందు ఈ ఘనతలు సాధించిన బౌలర్లు 1. సౌతాఫ్రికాలో అత్యధిక టెస్టు వికెట్లు తీసిన భారత బౌలర్లు 45 - అనిల్ కుంబ్లే 43 - జవగళ్ శ్రీనాథ్ 38* - జస్ప్రీత్ బుమ్రా 35 - మహ్మద్ షమీ 30 - జహీర్ ఖాన్. ⭐⭐⭐⭐⭐ A 5-star performance from #JaspritBumrah in the 2nd innings, as he picks up his 4th witcket of the morning! Will his 9th Test 5-fer lead to a historic win for #TeamIndia? Tune in to #SAvIND 2nd Test LIVE NOW | Star Sports Network#Cricket pic.twitter.com/hjDyvSAJc3 — Star Sports (@StarSportsIndia) January 4, 2024 2. SENA దేశాల్లో టెస్టుల్లో అత్యధిక సార్లు ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేసిన భారత బౌలర్లు 7 - కపిల్ దేవ్ 6 - భగవత్ చంద్రశేఖర్ 6 - జహీర్ ఖాన్ 6 - జస్ప్రీత్ బుమ్రా. 3. సౌతాఫ్రికాలో టెస్టుల్లో అత్యధికసార్లు ఫైవ్ వికెట్ హాల్స్ తీసిన భారత బౌలర్లు 3 - జవగళ్ శ్రీనాథ్ 3 - జస్ప్రీత్ బుమ్రా 2 - వెంకటేష్ ప్రసాద్ 2 - ఎస్ శ్రీశాంత్ 2 - మహ్మద్ షమీ. 4. న్యూలాండ్స్ పిచ్(కేప్టౌన్) మీద అత్యధిక టెస్టు వికెట్లు తీసిన బౌలర్లు 25 - కొలిన్ బ్లైత్ (ఇంగ్లండ్) 18 - జస్ప్రీత్ బుమ్రా (భారత్)(న్యూలాండ్స్ పిచ్ మీద ఈ ఘనత సాధించిన ఏకైక బౌలర్) 17 - షేన్ వార్న్ (ఆస్ట్రేలియా) 16 - జేమ్స్ అండర్సన్ (ఇంగ్లండ్) 15 - జానీ బ్రిగ్స్ (ఇంగ్లండ్) బుమ్రా ధాటికి సౌతాఫ్రికా రెండో ఇన్నింగ్స్లో 176 పరుగులకు ఆలౌట్ అయింది. బుమ్రాకు ఆరు వికెట్లు దక్కగా.. ముకేశ్ కుమార్ రెండు, ప్రసిద్ కృష్ణ, సిరాజ్ ఒక్కో వికెట్ తీశారు. -
ద్రవిడ్ను కొనసాగిస్తారా? సాగనంపితే... టీమిండియా కొత్త కోచ్ ఎవరు..?
టీమిండియా హెడ్ కోచ్గా రాహుల్ ద్రవిడ్ రెండేళ్ల పదవీకాలం వరల్డ్కప్ 2023 ఫైనల్తో ముగిసింది. దీంతో భారత జట్టు కొత్త హెడ్ కోచ్ ఎవరనే అంశంపై చర్చ మొదలైంది. మరో దఫా కొనసాగాలా లేదా అనే దానిపై ఇంకా తేల్చుకోలేదని ద్రవిడ్ వరల్డ్కప్ అనంతరం మీడియా సమావేశంలో తెలిపాడు. మరి బీసీసీఐ రవిశాస్త్రిలా ద్రవిడ్ను రెండో దఫా కొనసాగిస్తుందో లేదో వేచి చూడాలి. ప్రస్తుతానికి అయితే ఆసీస్తో టీ20 సిరీస్కు స్టాండ్ ఇన్ కోచ్గా ఎన్సీఏ డైరెక్టర్ వీవీఎస్ లక్ష్మణ్ను బీసీసీఐ ఎంపిక చేసింది. ఒకవేళ ద్రవిడ్ రెండో దఫా కోచ్గా పని చేసేందుకు నిరాకరిస్తే లక్ష్మణ్ భారత జట్టు హెడ్ కోచ్ పదవి రేసులో ముందువరుసలో ఉంటాడు. ఈ పదవి కోసం లక్ష్మణ్తో పాటు మరో ఇద్దరు టీమిండియా దిగ్గజాలు పోటీలో ఉండే అవకాశం ఉందని తెలుస్తుంది. ఇటీవలే ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమర్గా ప్రకటించబడ్డ వీరేంద్ర సెహ్వాగ్, స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లే లక్ష్మణ్తో పాటు ప్రధాన పోటీదారులుగా నిలిచే ఛాన్స్ ఉంది. వీరిలో కుంబ్లేకు గతంలో భారత జట్టు హెడ్ కోచ్గా పని చేసిన అనుభవం ఉంది. ధోనిని ఒప్పించి అప్పచెబితే.. టీమిండియా హెడ్ కోచ్ పదవి ఖాళీ అయిన నేపథ్యంలో ఈ అంశంపై నెట్టింట జోరుగా చర్చలు సాగుతున్నాయి. కొందరు ద్రవిడ్నే కొనసాగించాలని అంటుంటే, మరికొందరు అతడిని సాగనంపాలని వాధిస్తున్నారు. ఒకవేళ హెడ్ కోచ్ పదవిలో కొనసాగేందుకు ద్రవిడ్ ఆసక్తి కనబర్చకపోతే లక్ష్మణ్, అనిల్ కుంబ్లే, సెహ్వాగ్లు రేసులో ఉంటారని ప్రచారం జరుగుతుంది. కొత్తగా కొందరు టీమిండియా మోస్ట్ సక్సెస్ఫుల్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని పేరును తెరపైకి తెస్తున్నారు. ధోనికి ఇష్టం లేకపోయినా అతన్ని ఒప్పించి మరీ భారత క్రికెట్ జట్టు కోచింగ్ బాధ్యతలు అప్పజెప్పాలని వారు పట్టుబడుతున్నారు. మరి భారత జట్టుకు కోచింగ్ ఇచ్చేందుకు ధోని ముందుకు వస్తాడో లేదో వేచి చూడాలి. -
మెకానికల్ ఇంజనీర్! పాక్ను ఒంటిచేత్తో ఓడించి.. టీమిండియా పరువు కాపాడి
‘‘మంచి, చెడులను అర్థం చేసుకోవడానికి చదువు ఉపయోగపడుతుంది. క్రికెట్ను కెరీర్గా ఎంచుకుంటే కచ్చితంగా విజయవంతమవుతామనే నమ్మకం లేదు. ఒకవేళ అనుకున్నది సాధించలేక నిరాశలో కూరుకుపోతే.. దానిని ఎలా అధిగమించాలో, భవిష్యత్ పరిణామాలకు ఎలా సంసిద్ధం కావాలో కూడా చదువు మనకు నేర్పిస్తుంది’’- అనిల్ కుంబ్లే టీమిండియా స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లే పుట్టినరోజు నేడు(అక్టోబరు 17). ఈ సందర్భంగా సచిన్ టెండుల్కర్, హర్భజన్ సింగ్ వంటి టీమిండియా మాజీ క్రికెటర్లు సహా అభిమానుల నుంచి ‘జంబో’కు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. మెకానికల్ ఇంజనీర్! ఈ నేపథ్యంలో అనిల్ కుంబ్లేకు సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలు మీకోసం.. కర్ణాటకలోని బెంగళూరులో 1970లో జన్మించాడు కుంబ్లే. చదువు, క్రికెట్.. రెండింటినీ సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాడు. ముందు టీమిండియాకు ఆడి.. తర్వాత పట్టా పుచ్చుకున్నాడు టీమిండియా తరఫున 1991- 92లో రాష్ట్రీయ విద్యాలయ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ నుంచి మెకానికల్ ఇంజనీరింగ్లో బీఈ డిగ్రీ అందుకున్న కుంబ్లే.. అంతకంటే ఓ ఏడాది ముందే టీమిండియా తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. జంబో ఖాతాలో ఎన్ని వంద వికెట్లంటే? షార్జాలో శ్రీలంకతో వన్డే మ్యాచ్ సందర్భంగా అరంగేట్రం చేశాడు. అదే ఏడాది ఇంగ్లండ్తో మ్యాచ్తో టెస్టుల్లోనూ ఎంట్రీ ఇచ్చాడు. 2008లో ఇంటర్నేషనల్ క్రికెట్కు గుడ్ బై చెప్పిన కుంబ్లే.. తన కెరీర్లో మొత్తంగా 132 టెస్టులు, 271 వన్డేలు ఆడాడు. ఆయా ఫార్మాట్లలో వరుసగా 619, 337 వికెట్లు పడగొట్టి అరుదైన ఘనతలు సాధించాడు ఈ రైట్ఆర్మ్ లెగ్బ్రేక్ స్పిన్నర్. కాగా టీమిండియా కెప్టెన్గానూ అనిల్ కుంబ్లే సేవలు అందించిన విషయం తెలిసిందే. ఒకే ఒక్క వన్డేకు కెప్టెన్గా 2007లో భారత టెస్టు జట్టు పగ్గాలు చేపట్టిన కుంబ్లే 14 మ్యాచ్లకు సారథ్యం వహించాడు. కానీ, వన్డే ఫుల్టైమ్ కెప్టెన్గా మాత్రం కుంబ్లేకు అవకాశం రాలేదు. అయితే, టెస్టు సారథి కావడానికి ముందే అంటే 2002లో ఇంగ్లండ్తో వన్డేలో జట్టును మందుండి నడిపించాడు. టీమిండియా తరఫున పొట్టి ఫార్మాట్లో నో ఎంట్రీ టీమిండియా తరఫున ఒక్క టీ20 మ్యాచ్ కూడా ఆడలేకపోయిన కుంబ్లే.. ఇండియన్ ప్రీమియర్ లీగ్లో మాత్రం రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు కెప్టెన్గా వ్యవహరించాడు. ఐపీఎల్లో హవా మొత్తంగా 42 ఐపీఎల్ మ్యాచ్లు ఆడి.. 45 వికెట్లు పడగొట్టాడు. ఇందులో మూడు 4- వికెట్ హాల్స్, ఒక 5-వికెట్ హాల్ ఉంది. కాగా మొట్టమొదటిసారిగా 2007లో ప్రవేశపెట్టిన టీ20 వరల్డ్కప్ టోర్నీలో పాల్గొనే భారత జట్టులో కుంబ్లేకు సెలక్టర్లు చోటివ్వలేదు. యువ ఆటగాళ్లకు అవకాశం ఇచ్చే క్రమంలో కుంబ్లేకు ఛాన్స్ దక్కలేదు. చివరిగా బెర్ముడాతో వెస్టిండీస్లో... బెర్ముడాతో 2007 వన్డే వరల్డ్కప్ సందర్భంగా అనిల్ కుంబ్లే తన చివరి అంతర్జాతీయ వన్డే ఆడాడు. ఈ మ్యాచ్లో కుంబ్లే.. త్రీ- వికెట్ హాల్తో మెరిశాడు. మొత్తంగా 38 పరుగులిచ్చి.. బెర్ముడా కెప్టెన్ ఇర్విన్ రొమేనీ, మిడిలార్డర్ బ్యాటర్ జెనీరో టకర్, టెయిలెండర్ మలాచి జోన్స్ వికెట్లు పడగొట్టాడు. చిరస్థాయిగా నిలిచిపోయే ప్రదర్శన ఇక అనిల్ కుంబ్లే కెరీర్తో పాటు టీమిండియా అభిమానుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయే అద్భుతం 1999, ఫిబ్రవరి 7న జరిగింది. వసీం అక్రం సారథ్యంలోని పాకిస్తాన్ జట్టు 2 మ్యాచ్ల టెస్టు సిరీస్ ఆడేందుకు భారత పర్యటనకు వచ్చింది. సొంతగడ్డపై పరువు నిలబెట్టేందుకు తొలి టెస్టులో 12 పరుగుల తేడాతో గెలుపొంది 1-0 ఆధిక్యంలో నిలిచి టీమిండియాకు సవాల్ విసిరింది. ఈ క్రమంలో సొంతగడ్డపై దాయాదితో చావోరేవో తేల్చుకోవాల్సిన పరిస్థితిలో భారత జట్టు ఢిల్లీలో రెండో టెస్టుకు సిద్ధమైంది. ఈ మ్యాచ్లో 252 పరుగుల వద్ద భారత్ తమ తొలి ఇన్నింగ్స్ ముగించగా.. పాక్ కథ 172 పరుగులకే ముగిసింది. ఇక రెండో ఇన్నింగ్స్లో మహ్మద్ అజారుద్దీన్ సారథ్యంలోని టీమిండియా 339 పరుగులు చేసి భారీ ఆధిక్యంలో నిలిచింది. పాక్ను ఒంటిచేత్తో ఓడించి.. ఈ క్రమంలో 420 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్ అనిల్ కుంబ్లే చావుదెబ్బ కొట్టాడు. పది వికెట్లు తానే తీసి పాక్ బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించాడు. తొలుత ఓపెనర్ షాహిద్ ఆఫ్రిదితో మొదలుపెట్టిన కుంబ్లే.. అందరినీ తానే పెవిలియన్కు పంపాడు. ఆ పది మంది వీరే ఆఫ్రిదితో పాటు సయీద్ అన్వర్, ఇయాజ్అహ్మద్, ఇంజమామ్ ఉల్ హక్, మహ్మద్ యూసఫ్, మొయిన్ ఖాన్, సలీం మాలిక్, వసీం అక్రం, ముస్తాక్ అహ్మద్, సక్లెయిన్ ముస్తాక్, వకార్ యూనిస్ వికెట్లు పడగొట్టి.. 10- వికెట్ హాల్ నమోదు చేసి సరికొత్త చరిత్ర సృష్టించాడు. టీమిండియా విజయంలో, సిరీస్ సమం కావడంలో కీలక పాత్ర పోషించి.. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. కుంబ్లే పుట్టిన రోజు సందర్భంగా మంగళవారం (అక్టోబరు 17) బీసీసీఐ ఇందుకు సంబంధించిన వీడియో షేర్ చేసింది. చదవండి: ఆస్ట్రేలియాతో మ్యాచ్.. పాకిస్తాన్ ఆటగాళ్లకు వైరల్ ఫీవర్! On his birthday, let's relive @anilkumble1074's brilliant 🔟-wicket haul against Pakistan 🎥🔽#TeamIndia pic.twitter.com/BFrxNqLxil — BCCI (@BCCI) October 17, 2023 -
చరిత్ర సృష్టించిన అశ్విన్.. తొలి భారత బౌలర్గా! దరిదాపుల్లో ఎవరూ లేరు
ఇండోర్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలో 99 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. తద్వారా మూడు వన్డేల సిరీస్ను మరో మ్యాచ్ మిగిలూండగానే 2-0 తేడాతో టీమిండియా సొంతం చేసుకుంది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన భారత్ 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 399 పరుగులు చేసింది. భారత ఇన్నింగ్స్లో శ్రేయస్ అయ్యర్(105), శుబ్మన్ గిల్ అద్భుత సెంచరీలతో చెలరేగగా.. సూర్యకుమార్ యాదవ్( 72 నాటౌట్), కేఎల్ రాహుల్(52) కీలక ఇన్నింగ్స్లు ఆడారు. భారత ఇన్నింగ్స్లలో ఏకంగా 31 ఫోర్లు, 18 సిక్సర్లు ఉండటం విశేషం. అనంతరం వర్షం కారణంగా ఆ్రస్టేలియా లక్ష్యాన్ని 33 ఓవర్లలో 317 పరుగులుగా (డక్వర్త్ లూయిస్ ప్రకారం) నిర్దేశించారు. ఆసీస్ 28.2 ఓవర్లలో 217 పరగులకు ఆలౌటైంది. ఆసీస్ బ్యాటరల్లో సీన్ అబాట్(54) టాప్ స్కోరర్గా నిలిచాడు. భారత బౌలర్లలో అశ్విన్ మూడు వికెట్లు పడగొట్టగా.. జడేజా, ప్రసిద్ద్ కృష్ణ చెరో రెండు వికెట్లు సాధించారు. రవి చంద్రన్ అశ్విన్ అరుదైన ఘనత.. ఇక తొలి వన్డేలో పెద్దగా అకట్టుకోపోయిన భారత స్పిన్నర్ రవి చంద్రన్ అశ్విన్.. రెండో వన్డేలో మాత్రం అదరగొట్టాడు. ఈ మ్యాచ్లో 3 వికెట్లతో ఆశూ సత్తాచాటాడు. 7 ఓవర్లు బౌలింగ్ చేసిన అశ్విన్.. 41 పరుగులిచ్చి 3వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. తద్వారా అశ్విన్ ఓ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. ఓ ప్రత్యర్ధి జట్టుపై అత్యధిక అంతర్జాతీయ వికెట్లు పడగొట్టిన భారత బౌలర్గా అశ్విన్ రికార్డులకెక్కాడు. ఆసీస్పై అశ్విన్ ఇప్పటివరకు మూడు ఫార్మాట్లు కలపి 144 వికెట్లు పడగొట్టాడు. అంతకుముందు ఈ రికార్డు భారత స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లే పేరిట ఉండేది. కుంబ్లే కూడా కంగారూలపైనే ఈ ఫీట్ సాధించాడు. ఆస్ట్రేలియాపై 142 అంతర్జాతీయ వికెట్లు సాధించాడు. తాజా మ్యాచ్తో కుంబ్లే ఆల్టైమ్ రికార్డు బద్దలు కొట్టాడు. అశ్విన్ దరిదాపుల్లో కూడా ఎవరూ లేరు. కుంబ్లే తర్వాత భారత మాజీ కెప్టెన్ కపిల్ దేవ్(141) ఉన్నాడు. చదవండి: IND VS AUS 2nd ODI: చరిత్ర సృష్టించిన టీమిండియా.. వన్డే క్రికెట్లో తొలి జట్టుగా ప్రపంచ రికార్డు -
ఆస్ట్రేలియాతో తొలి వన్డే.. అరుదైన రికార్డుకు చేరువలో అశ్విన్!
మొహాలీ వేదికగా జరగనున్న తొలి వన్డేలో ఆస్ట్రేలియాతో తలపడేందుకు టీమిండియా అన్నివిధాల సిద్దమైంది. శుక్రవారం మధ్యాహ్నం 1:30లకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. కాగా ఈ సిరీస్ వరల్డ్కప్ సన్నాహకాల్లో భాగంగా జరగనుంది. అయితే తొలి రెండు వన్డేలకు రెగ్యూలర్ కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, హార్దిక్ పాండ్యా, కుల్దీప్ యాదవ్కు విశ్రాంతి ఇచ్చారు. మరోవైపు గత కొంత కాలంగా జట్టుకు దూరంగా ఉంటున్న వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్కు సెలక్టర్లు అనుహ్యంగా పిలుపునిచ్చారు. ఈ క్రమంలో ఆస్ట్రేలియాతో తొలి వన్డేకు ముందు టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ను ఓ అరుదైన రికార్డు ఊరిస్తోంది. ఈ మ్యాచ్లో అశ్విన్ మరో మూడు వికెట్లు పడగొడితే.. ఆసీస్పై అన్ని ఫార్మాట్ల్లో కలిపి అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్గా రికార్డులకెక్కుతాడు. ప్రస్తుతం ఈ రికార్డు భారత స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లే(142 వికెట్లు) పేరిట ఉంది. అశ్విన్ 140 వికెట్లతో కుంబ్లే తర్వాతి స్ధానంలో ఉన్నాడు. తుది జట్లు (అంచనా).. భారత్: ఇషాన్ కిషన్, శుబ్మన్ గిల్, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, కేఎల్ రాహుల్(కెప్టెన్), రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, అశ్విన్, మహ్మద్ షమీ, సిరాజ్, బుమ్రా ఆస్ట్రేలియా: డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, స్టీవ్ స్మిత్, లబుషేన్, అలెక్స్ కేరీ, గ్రీన్, మార్కస్ స్టాయినిస్, ప్యాట్ కమిన్స్, స్పెన్సర్ జాన్సన్, అడమ్ జంపా, హేజిల్వుడ్ చదవండి: ODI World Cup 2023: వరల్డ్కప్ ట్రోఫీని ఎవరు తయారు చేశారో తెలుసా.. ధర ఎంతంటే? -
కౌన్ బనేగా కరోడ్పతిలో క్రికెట్ ప్రశ్న.. జవాబుకు 12 లక్షల 50 వేలు
నట దిగ్గజం అమితాబ్ బచ్చన్ వ్యాఖ్యాతగా వ్యవహరించే ప్రముఖ టీవీ క్విజ్ షో కౌన్ బనేగా కరోడ్పతిలో క్రికెట్కు సంబంధించిన ప్రశ్న వచ్చింది. 12 లక్షల 50 వేల రూపాయల ఈ ప్రశ్న భారత స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లేకు సంబంధించింది. ఈ ప్రశ్న నిన్న (సెప్టెంబర్ 19) ప్రసారమైన ఎపిసోడ్లో ఓ కంటెస్టెంట్ ఎదుర్కొన్నాడు. ప్రశ్న ఏమిటంటే..? భారత స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లే టెస్ట్ల్లో ఒకే ఇన్నింగ్స్లో 10కి 10 వికెట్లు (పాక్పై) తీసినప్పుడు బౌలర్ ఎండ్లో ఉన్న అంపైర్ ఎవరు..? ఈ ప్రశ్నకు ఆప్షన్స్గా పిలూ రిపోర్టర్, ఎస్ వెంకట్రాఘవన్, డేవిడ్ షెపర్డ్, ఏవీ జయప్రకాశ్ పేర్లు ఇచ్చారు. 12 లక్షల 50 వేల రూపాయల ఈ ప్రశ్నకు జవాబు మీకు తెలిసినట్లయితే కామెంట్ చేయండి. #OnThisDay in 1999, #TeamIndia spin legend @anilkumble1074 became the first Indian bowler and second overall to scalp all the 10 wickets in a Test innings. 👏👏 Watch that fantastic bowling display 🎥👇 pic.twitter.com/OvanaqP4nU — BCCI (@BCCI) February 7, 2021 కాగా, 1999 ఫిబ్రవరిలో పాక్తో జరిగిన ఢిల్లీ టెస్ట్లో కుంబ్లే ఒకే ఇన్నింగ్స్లో 10కి 10 వికెట్లు తీశాడు. యాదృచ్చికంగా ఆ 10 మంది ఔటైన సమయంలో బౌలర్ ఎండ్లో ఏవీ జయప్రకాశ్ అంపైర్గా ఉన్నాడు. ఆ మ్యాచ్ను టీమిండియా 212 పరుగుల తేడాతో గెలుపొంది, 2-2తో సిరీస్ను డ్రా చేసుకుంది. టెస్ట్ల్లో కుంబ్లే కాకుండా మరో ఇద్దరు మాత్రమే ఒకే ఇన్నింగ్స్లో 10కి 10 వికెట్లు పడగొట్టారు. కుంబ్లేకు ముందు జిమ్ లేకర్ (ఇంగ్లండ్), ఇటీవలికాలంలో న్యూజిలాండ్ స్పిన్ బౌలర్ అజాజ్ పటేల్ ఈ ఘనత సాధించారు. ఇదిలా ఉంటే, కుంబ్లే భారత తరఫున లీడింగ్ వికెట్ టేకర్గా కెరీర్ను ముగించిన విషయం తెలిసిందే. అతను భారత్ తరఫున 132 టెస్ట్లు ఆడి 619 వికెట్లు పడగొట్టాడు. ఇందులో 35 ఐదు వికెట్ల ఘనతలు ఉన్నాయి. టెస్ట్ల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో కుంబ్లే నాలుగో స్థానంలో ఉన్నాడు. అతనికి ముందు జేమ్స్ ఆండర్సన్ (690), షేన్ వార్న్ (708), ముత్తయ్య మురళీథరన్ (800) మాత్రమే ఉన్నారు. -
కుంబ్లేకు సాధ్యం కాలేదు.. కుల్దీప్ యాదవ్ సరికొత్త చరిత్ర!
Asia Cup 2023- India vs Sri Lanka- Kuldeep Yadav Records: టీమిండియా చైనామన్ బౌలర్ కుల్దీప్ యాదవ్ అద్భుత ఆట తీరుతో ఆకట్టుకుంటున్నాడు. ఆసియా కప్-2023లో భాగంగా సూపర్-4 దశలో తొలుత పాకిస్తాన్పై.. తాజాగా శ్రీలంకతో మ్యాచ్లో అదరగొట్టాడు. కొలంబోలో దాయాదితో పోరులో 8 ఓవర్ల బౌలింగ్లో ఈ లెఫ్టార్మ్ స్పిన్నర్ 25 పరుగులిచ్చి ఏకంగా 5 వికెట్లు తీశాడు. ఇక మంగళవారం అదే వేదికపై మరోసారి మెరిశాడు కుల్దీప్. టీమిండియా 213 పరుగుల లో స్కోరును కాపాడుకోవడంలో తన వంతు పాత్ర పోషించాడు. 9.3 ఓవర్ల బౌలింగ్లో 43 పరుగులిచ్చి 4 వికెట్లు తీశాడు. లంక టెయిలెండర్ మతీశ పతిరణను బౌల్డ్ చేసి.. టీమిండియా గెలుపును ఖరారు చేశాడు. 150 వికెట్ల క్లబ్లో అత్యంత వేగంగా ఈ క్రమంలో కుల్దీప్ యాదవ్ ఓ అరుదైన రికార్డు సాధించాడు. అంతర్జాతీయ వన్డేల్లో అత్యంత వేగంగా 150 వికెట్ల క్లబ్లో చేరిన రెండో భారత బౌలర్గా నిలిచాడు. తద్వారా బీసీసీఐ ప్రస్తుత చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టాడు. కుంబ్లేకు సాధ్యం కాని ఫీట్.. తొలి భారత స్పిన్నర్గా చరిత్ర అదే విధంగా.. టీమిండియా దిగ్గజ బౌలర్లు అనిల్ కుంబ్లే, జహీర్ ఖాన్లను అధిగమించాడు. అంతేకాదు.. వన్డేల్లో అత్యంత వేగంగా 150 వికెట్లు సాధించిన తొలి భారత స్పిన్నర్గానూ కుల్దీప్ చరిత్ర సృష్టించాడు. దిగ్గజ స్పిన్ బౌలర్ అనిల్ కుంబ్లేకు సాధ్యం కాని ఫీట్ నమోదు చేశాడు. ఇదిలా ఉంటే.. శ్రీలంకపై 41 పరుగులతో గెలుపొందిన టీమిండియా ఆసియా వన్డే కప్-2023 ఫైనల్లో ప్రవేశించింది. టీమిండియా తరఫున వన్డేల్లో అత్యంత వేగంగా 150 వికెట్లు సాధించిన బౌలర్లు ►మహ్మద్ షమీ- 80 మ్యాచ్లలో.. ►కుల్దీప్ యాదవ్- 88 మ్యాచ్లలో.. ►అజిత్ అగార్కర్- 97 మ్యాచ్లలో.. ►జహీర్ ఖాన్- 103 మ్యాచ్లలో.. ►అనిల్ కుంబ్లే- 106 మ్యాచ్లలో.. ►ఇర్ఫాన్ పఠాన్- 106 మ్యాచ్లలో.. అంతర్జాతీయ వన్డేల్లో అత్యంత వేగంగా 150 వికెట్ల క్లబ్లో చేరిన స్పిన్నర్లు ►సక్లెయిన్ ముస్తాక్- 78 మ్యాచ్లలో ►రషీద్ ఖాన్- 80 మ్యాచ్లలో ►అజంత మెండిస్- 84 మ్యాచ్లలో ►కుల్దీప్ యాదవ్- 88 మ్యాచ్లలో ►ఇమ్రాన్ తాహిర్- 89 మ్యాచ్లలో. చదవండి: Ind Vs SL: ప్రతి బంతికి వికెట్ తీయాలనుకుంటాడు.. అతడు అద్భుతం: రోహిత్ Asia Cup 2023 IND VS SL: చరిత్ర సృష్టించిన లంక యువ స్పిన్నర్ As 'KUL' as it gets! 🧊@imkuldeep18 continues his sensational form as he rips one through the batter, while @klrahul pulls off a sharp stumping. 💥 Tune-in to #AsiaCupOnStar, LIVE NOW on Star Sports Network#INDvSL #Cricket pic.twitter.com/NZccClhhRW — Star Sports (@StarSportsIndia) September 12, 2023 -
అరుదైన రికార్డు ముంగిట జడ్డూ! అదే జరిగితే కపిల్ను వెనక్కి నెట్టి.. ఏకంగా
Ravindra Jadeja Eyes On Kapil Dev Record: వెస్టిండీస్తో వన్డే సిరీస్ నేపథ్యంలో టీమిండియా సీనియర్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా అరుదైన సాధించే అవకాశం ఉంది. బార్బడోస్లో జడ్డూ గనుక మూడు వికెట్లు పడగొడితే భారత క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ పేరిట ఉన్న రికార్డు బద్దలు కొట్టే అవకాశం ఉంది. కాగా టెస్టు సిరీస్తో వెస్టిండీస్ పర్యటన ఆరంభించిన భారత జట్టు.. 1-0తో ట్రోఫీ కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. అరుదైన ఘనతకు మూడడుగుల దూరంలో ఈ క్రమంలో గురువారం (జూలై 27) నుంచి వన్డే సిరీస్ ఆరంభించనుంది. బార్బడోస్ వేదికగా తొలి మ్యాచ్ ఆడనుంది. ఇక గాయం నుంచి కోలుకుని పునరాగమనం చేసిన తర్వాత రవీంద్ర జడేజా ఆకాశమే హద్దుగా చెలరేగుతున్న విషయం తెలిసిందే. మూడు ఫార్మాట్లలోనూ టీమిండియాకు కీలకంగా మారిన జడ్డూకు తుది జట్టులో చోటు దక్కడం లాంఛనమే. కుంబ్లేతో సంయుక్తంగా ఈ క్రమంలో అతడు అరుదైన ముంగిట నిలిచాడు. అదేంటంటే.. వన్డే ఫార్మాట్లో వెస్టిండీస్పై కపిల్ దేవ్ 43 వికెట్లు తీశాడు. తద్వారా ఇప్పటి వరకు విండీస్తో వన్డేల్లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్గా కొనసాగుతున్నాడు. ఆ తర్వాతి స్థానంలో 41 వికెట్లతో అనిల్ కుంబ్లేతో కలిసి రవీంద్ర జడేజా ఉన్నాడు. ఒకవేళ తాజా సిరీస్లో భాగంగా మొదటి వన్డేలో జడ్డూ మూడు వికెట్లు తీశాడంటే.. కపిల్ దేవ్ను అధిగమించడం ఖాయం. ప్రస్తుతం జడ్డూ ఫామ్ చూస్తుంటే ఇదేమీ కష్టంకాదనిపిస్తోంది. కాగా మూడు వన్డేల సిరీస్లో భాగంగా.. జూలై 27, 29 నాటి మ్యాచ్లు బార్బడోస్లో జరుగనున్నాయి. ఆగష్టు 1 నాటి ఆఖరి వన్డేకు ట్రినిడాడ్ వేదిక కానుంది. వెస్టిండీస్తో వన్డే సిరీస్కు భారత జట్టు రోహిత్ శర్మ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), శుబ్మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, సంజూ సామ్సన్, ఇషాన్ కిషన్, శార్దుల్ ఠాకూర్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, చహల్, కుల్దీప్, జైదేవ్ ఉనాద్కట్, సిరాజ్, ఉమ్రాన్ మాలిక్, ముకేశ్ కుమార్. చదవండి: ఏడాదికి 50 కోట్ల సంపాదన! మరి.. ధోని సొంత అక్క పరిస్థితి ఎలా ఉందంటే! రెండ్రోజులు అక్కడే పెట్టిన అరటిపండును శ్రీశాంత్ తిన్నాడు! ఆఖరికి లోదుస్తులు కూడా.. -
చరిత్ర సృష్టించిన అశ్విన్.. అనిల్ కుంబ్లే రికార్డు బద్దలు
ట్రినిడాడ్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా పట్టు బిగుస్తోంది. తొలి ఇన్నింగ్స్లో దక్కిన 183 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ బ్యాటింగ్ మొదలెట్టిన టీమిండియా.. 24 ఓవర్లలోనే 2 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో రోహిత్ శర్మ(44 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్లతో 57), కిషన్(34 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్లతో 52) మెరుపు ఇన్నింగ్స్ ఆడారు. దీంతో 181/2 పరుగుల వద్ద తమ రెండో ఇన్నింగ్స్ను భారత్ డిక్లేర్ చేసింది. తొలి ఇన్నింగ్స్లో దక్కిన ఆధిక్యంతో కలిపి వెస్టిండీస్ ముందు 365 పరుగుల భారీ లక్ష్యం నిలిపింది. 365 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్ నాలుగో రోజు ఆటముగిసే సమయానికి రెండు వికెట్లు కోల్పోయి 76 పరుగులు చేసింది. క్రీజులో చంద్రపాల్(24), బ్లాక్వుడ్(20) పరుగులతో ఉన్నారు. భారత్ విజయానికి మరో 8 వికెట్లు అవసరమమవ్వగా.. వెస్టిండీస్కు ఇంకా 289 పరుగులు కావాలి. అశ్విన్ అరుదైన రికార్డు.. ఇక విండీస్ సెకెండ్ ఇన్నింగ్స్లో రెండు వికెట్లు పడగొట్టిన భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అరుదైన ఘనత సాధించాడు. టెస్టుల్లో వెస్టిండీస్పై అత్యధిక వికెట్లు పడగొట్టిన రెండో భారత బౌలర్గా అశ్విన్ రికార్డులకెక్కాడు. అశ్విన్ ఇప్పటివరకు విండీస్పై 75 వికెట్లు పడగొట్టాడు. ఈ క్రమంలో అనిల్ కుంబ్లే(74)ను అశ్విన్ అధిగమించాడు. ఈ అరుదైన ఫీట్ సాధించిన జాబితాలో కపిల్ దేవ్(89) ఉన్నారు. చదవండి: IND vs WI: రోహిత్, కిషన్ మెరుపు ఇన్నింగ్స్.. విజయానికి 8 వికెట్ల దూరంలో టీమిండియా -
అశ్విన్-జడేజాల ముంగిట వరల్డ్ రికార్డు.. మరో 3 వికెట్లు తీస్తే..!
భారత స్పిన్ ద్వయం రవిచంద్రన్ అశ్విన్-రవీంద్ర జడేజాల కోసం ఓ వరల్డ్ రికార్డు కాసుకు కూర్చుంది. ఈ స్పిన్ ద్వయం విండీస్తో జరుగుతున్న రెండో టెస్ట్ నాలుగో రోజు మరో 3 వికెట్లు పడగొడితే టెస్ట్ క్రికెట్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన స్పిన్ ద్వయంగా రికార్డుల్లోకెక్కుతుంది. ఈ ఇద్దరు కలిసి ఇప్పటివరకు టెస్ట్ల్లో 49 మ్యాచ్ల్లో 498 వికెట్లు పడగొట్టారు. వీరికి ముందు భారత మాజీ స్పిన్ ద్వయం అనిల్ కుంబ్లే-హర్భజన్ సింగ్ 54 మ్యాచ్ల్లో 501 వికెట్లు పడగొట్టారు. టెస్ట్ క్రికెట్ చరిత్రలో అత్యధిక వికెట్లు సాధించిన స్పిన్ ద్వయం రికార్డు కుంబ్లే-భజ్జీ జోడీ పేరిట ఉంది. విండీస్తో నేటి మ్యాచ్లో అశ్విన్-జడేజా ఇద్దరు కలిసి మరో 3 వికెట్లు పడగొడితే, కుంబ్లే-భజ్జీ జోడీని వెనక్కునెట్టి టెస్ట్ల్లో అత్యధిక వికెట్లు తీసిన స్పిన్ ద్వయం రికార్డును వారి ఖాతాలో వేసుకుంటారు. ఓవరాల్గా టెస్ట్ల్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన జోడీ రికార్డు ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలింగ్ పెయిర్ జేమ్స్ ఆండర్సన్-స్టువర్ట్ బ్రాడ్ పేరిట ఉంది. వీరిద్దరు కలిసి 137 టెస్ట్ల్లో 1034 వికెట్లు పడగొట్టారు. వీరి తర్వాత షేన్ వార్న్-గ్లెన్ మెక్గ్రాత్ ద్వయం ఉంది. వీరు 104 మ్యాచ్ల్లో 1001 వికెట్లు సాధించారు. ఈ జాబితాలో ప్రస్తుతం కుంబ్లే-భజ్జీ జోడీ 11వ స్థానంలో.. అశ్విన్-జడేజా జోడీ 12వ స్థానంలో ఉన్నాయి. ఇదిలా ఉంటే, రెండో టెస్ట్ మూడో రోజు ఆట ముగిసే సమయానికి విండీస్ తొలి ఇన్నింగ్స్లో 5 వికెట్ల నష్టానికి 229 పరుగులు చేసింది. కెప్టెన్ క్రెయిగ్ బ్రాత్వైట్ (75), తేజ్నరైన్ చంద్రపాల్ (33), కిర్క్ మెక్కెంజీ (32), జెర్మైన్ బ్లాక్వుడ్ (20), జాషువ డిసిల్వ (10) ఔట్ కాగా.. అలిక్ అథనేజ్ (37), జేసన్ హోల్డర్ (11) క్రీజ్లో ఉన్నారు. భారత బౌలర్లలో జడేజా 2, ముకేశ్ కుమార్, సిరాజ్, అశ్విన్ తలో వికెట్ పడగొట్టారు. అంతకుముందు భారత్ తొలి ఇన్నింగ్స్లో 438 పరుగులకు ఆలౌటైంది. 500వ అంతర్జాతీయ మ్యాచ్ ఆడుతున్న విరాట్ కోహ్లి (121) సెంచరీతో కదంతొక్కగా.. యశస్వి (57), రోహిత్ (80), జడేజా (61), అశ్విన్ (56)అర్ధసెంచరీలతో రాణించారు. విండీస్ బౌలర్లలో కీమర్ రోచ్, వార్రికన్ చెరో 3 వికెట్లు.. హోల్డర్ 2, గాబ్రియల్ ఓ వికెట్ పడగొట్టారు. -
అతడిని టెస్టుల్లోకి తీసుకురావాలి.. ఎందుకంటే: కుంబ్లే కీలక వ్యాఖ్యలు
Anil Kumble Comments: ‘‘టీమిండియా స్పిన్ విభాగంలో అశ్విన్- జడేజా అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నారు. ఇద్దరూ అత్యంత నాణ్యమైన స్పిన్ బౌలర్లు. మూడో స్పిన్నర్గా ఉన్న అక్షర్ పటేల్ కూడా వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటున్నాడు. అయితే వీరితో పాటు కుల్దీప్ యాదవ్కు కూడా వరుస ఛాన్స్లు ఇస్తే బాగుంటుంది’’ అని టీమిండియా దిగ్గజ స్పిన్నర్ అనిల్ కుంబ్లే అన్నాడు. కాగా వెస్టిండీస్ పర్యటనలో భాగంగా తొలి టెస్టులో అశ్విన్, జడేజా అదరగొట్టిన విషయం తెలిసిందే. ముఖ్యంగా అశూ ఏకంగా 12 వికెట్లతో చెలరేగి విండీస్ను కోలుకోలేని దెబ్బకొట్టాడు. మరోవైపు జడ్డూ సైతం 5 వికెట్లతో రాణించాడు. వీరిద్దరి విజృంభణతో టీమిండియా.. ఆతిథ్య జట్టును ఇన్నింగ్స్ 141 పరుగుల తేడాతో చిత్తు చేసింది. అద్భుత నైపుణ్యాలు కలిగిన వాడు ఈ నేపథ్యంలో అశూ- జడ్డూలను కొనియాడిన అనిల్ కుంబ్లే.. కుల్దీప్ యాదవ్ను కూడా అవకాశాలు ఇవ్వాలని మేనేజ్మెంట్కు విజ్ఞప్తి చేశాడు. ‘‘కుల్దీప్ అద్భుత నైపుణ్యాలు కలవాడు. అతడికి కచ్చితంగా జట్టులో చోటివ్వాలి. నిజానికి లెగ్ స్పిన్నర్లు అటాకింగ్గా ఉంటారు. అయితే కొన్నిసార్లు ధారాళంగా పరుగులు సమర్పించుకుంటారు కూడా! అలా అని వాళ్లను పక్కనపెట్టకూడదు. నైపుణ్యాలకు మరింతసాన బెట్టుకునేలా ప్రోత్సహించాలి. వాళ్లకు కూడా అవకాశాలు ఇవ్వాలి. టెస్టు జట్టులోకి తీసుకురావాలి టెస్టులకు కుల్దీప్ పనికివస్తాడు. తనకు ఛాన్స్ వచ్చిన ప్రతిసారి మంచి ప్రదర్శనలు ఇచ్చాడు. పరిమిత ఓవర్ల క్రికెట్లో చాలా మంది మణికట్టు స్పిన్నర్లు ఉన్నారు. కానీ మనం వాళ్ల సేవలను టెస్టుల్లో వినయోగించుకోలేకపోతున్నాం’’ అని కుంబ్లే జియో సినిమా షోలో తన అభిప్రాయాలు పంచుకున్నాడు. బంగ్లాదేశ్తో చివరిగా కాగా 28 ఏళ్ల కుల్దీప్ యాదవ్ చివరిగా గతేడాది డిసెంబరులో టీమిండియా తరఫున ఆడాడు. బంగ్లాదేశ్ పర్యటనలో భాగంగా తొలి టెస్టులో మొత్తంగా ఎనిమిది వికెట్లు పడగొట్టాడు. ఆ తర్వాత స్వదేశంలో ఆస్ట్రేలియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీ ఆడిన జట్టులో స్థానం దక్కింది కానీ ఆడే అవకాశం రాలేదు. ఈ నేపథ్యంలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, హెడ్కోచ్ రాహుల్ ద్రవిడ్లను ఉద్దేశిస్తూ కుంబ్లే ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు. చదవండి: రహానేను కించపరిచిన ఇషాన్! ఇవే తగ్గించుకుంటే మంచిది.. మొన్న కోహ్లికే.. -
చరిత్ర సృష్టించిన అశ్విన్.. ప్రపంచంలోనే తొలి స్పిన్నర్గా!
వెస్టిండీస్తో జరిగిన తొలి టెస్టులో టీమిండియా వెటరన్ రవిచంద్రన్ అశ్విన్ తన స్పిన్ మయాజాలాన్ని ప్రదర్శించాడు. రెండు ఇన్నింగ్స్ల్లోనూ విండీస్ బ్యాటర్లకు అశ్విన్ చుక్కలు చూపించాడు. తొలి ఇన్నింగ్స్లో 5 వికెట్లు తీసిన రవిచంద్రన్ అశ్విన్, రెండో ఇన్నింగ్స్లో 7 వికెట్లు పడగొట్టాడు. ఓవరాల్గా రెండు ఇన్నింగ్స్లు అశూ 12 వికెట్లు పడగొట్టాడు. తద్వారా పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. ►అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన రెండో భారత బౌలర్గా అశ్విన్ నిలిచాడు. ఇప్పటివరకు 271 మ్యాచ్లు అంతర్జాతీయ మ్యాచ్లు ఆడిన అశ్విన్.. 709 వికెట్లు పడగొట్టాడు. ఈ క్రమంలో భారత దిగ్గజ స్పిన్నర్ హర్బజన్ సింగ్(707)ను అశ్విన్ అధిగమించాడు. అశ్విన్ కెరీర్లో 27 ఫోర్ వికెట్, 34 ఫైవ్ వికెట్, ఎనిమిది 10 వికెట్ల హాల్స్ ఉన్నాయి. ఈ జాబితాలో అనిల్ కుంబ్లే 953 వికెట్లతో టాప్లో ఉన్నాడు. ► వెస్టిండీస్పై ఒకే టెస్టులో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్గా అశ్విన్ నిలిచాడు. అదే విధంగా విండీస్పై ఒకే టెస్టులో అత్యుత్తమ గణంకాలు నమోదు చేసిన తొలి స్పిన్నర్గా అశ్విన్ ప్రపంచ రికార్డు సృష్టించాడు. ఇంతకుముందు ఈ రికార్డు పాకిస్తాన్ మాజీ స్పిన్నర్ సయిద్ అజ్మల్ పేరిట ఉండేది. 2011లో జరిగిన ఓ టెస్టులో అజ్మల్ 11 వికెట్లు సాధించాడు. తాజా మ్యాచ్తో అజ్మల్ రికార్డును అశ్విన్ బ్రేక్ చేశాడు. ►విజయం సాధించిన సందర్భాల్లో అత్యధిక ఫైవ్ వికెట్ల హాల్స్ నమోదు చేసిన దివంగత ఆసీస్ స్పిన్నర్ షేర్ వార్న్ రికార్డును అశ్విన్ సమం చేశాడు. వీరిద్దరూ 28 సార్లు ఫైవ్ వికెట్ల హాల్స్ సాధించారు. ►టెస్టుల్లో అత్యధిక సార్లు ఐదు వికెట్ల ఘనత సాధించిన ఐదో బౌలర్గా అశ్విన్(34 సార్లు) నిలిచాడు . శ్రీలంక తరుపున 34 సార్లు ఫైవ్ వికెట్ల హాల్ సాధించిన రంగనా హేరాత్ రికార్డును సమం చేసిన అశ్విన్.. అనిల్ కుంబ్లే (35 సార్లు) తర్వాతి స్థానంలో నిలిచాడు. చదవండి: Rohit Sharma Serious On Ishan Kishan: సింగిల్ తీయడానికి 20 బంతులు.. కిషన్పై రోహిత్ సీరియస్! వీడియో వైరల్ -
Ind vs WI: అశ్విన్ అరుదైన ఘనత.. మూడో భారత బౌలర్గా చరిత్ర
West Indies vs India, 1st Test: వెస్టిండీస్తో తొలి టెస్టు సందర్భంగా టీమిండియా ప్రధాన స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అరుదైన మైలురాయిని చేరుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక వికెట్లు తీసిన మూడో భారత బౌలర్గా చరిత్రకెక్కాడు. కాగా టీమిండియా ప్రస్తుతం వెస్టిండీస్ పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ముందుగా రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్లో భాగంగా డొమినికా వేదికగా జూలై 12న తొలి మ్యాచ్ ఆరంభమైంది. టాస్ గెలిచిన ఆతిథ్య జట్టు తొలుత బ్యాటింగ్ ఎంచుకోగా భారత స్పిన్నర్ అశ్విన్ విండీస్ బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. ఓపెనర్లు క్రెగ్ బ్రాత్వైట్(20), తేజ్నరైన్ చందర్పాల్(12)లను అవుట్ చేసి ఆరంభంలోనే షాకిచ్చాడు. అల్జారీ జోసెఫ్ను అవుట్ చేయడం ద్వారా అదే విధంగా.. టెయిలెండర్లు అలిక్ అథనాజ్(47), అల్జారీ జోసెఫ్(4), వారికన్(1) వికెట్లు కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. మొత్తంగా ఐదు వికెట్లతో రాణించి తొలిరోజు ఆటలో టీమిండియా పైచేయి సాధించేందుకు సహకరించాడు. ఇదిలా ఉంటే.. అల్జారీ జోసెఫ్ను అవుట్ చేయడం ద్వారా ఇంటర్నేషనల్ కెరీర్లో అశూ 700వ వికెట్ సాధించాడు. కుంబ్లే, భజ్జీ తర్వాత తన 271వ మ్యాచ్ సందర్భంగా ఈ అరుదైన మైలురాయిని చేరుకున్నాడు. తద్వారా దిగ్గజ స్పిన్నర్ అనిల్ కుంబ్లే, ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ తర్వాత 700 వికెట్ల క్లబ్లో చేరిన మూడో భారత బౌలర్గా నిలిచాడు. కాగా కుంబ్లే తన అంతర్జాతీయ కెరీర్లో మొత్తంగా 403 మ్యాచ్లలో 956 వికెట్లు పడగొట్టి అగ్రస్థానంలో ఉన్నాడు. 16వ స్థానంలో ఇక భజ్జీ 711 వికెట్లతో రెండో స్థానంలో కొనసాగుతుండగా.. అశూ త్వరలోనే అతడి రికార్డును బద్దలుకొట్టే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే.. అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో శ్రీలంక స్పిన్ దిగ్గజం ముత్తయ్య మురళీధరన్ 1347 వికెట్లతో ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నాడు. ఈ జాబితాలో అశూ(702 వికెట్లు) 16వ స్థానంలో కొనసాగుతున్నాడు. చదవండి: Ind Vs WI: మనం తప్పు చేశామా అని పశ్చాత్తాపపడేలా చేశాడు! తొలిరోజే కోహ్లిని టీజ్ చేసిన ఇషాన్ కిషన్.. వీడియో వైరల్ -
Ind Vs WI: చెలరేగిన అశ్విన్.. అనిల్ కుంబ్లే అరుదైన రికార్డు బద్దలు
West Indies vs India, 1st Test: వెస్టిండీస్తో తొలి టెస్టు సందర్భంగా టీమిండియా వెటరన్ స్పిన్నర్ అరుదైన ఘనత సాధించాడు. దిగ్గజ బౌలర్ అనిల్ కుంబ్లే పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టాడు. కాగా రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్లు ఆడేందుకు భారత జట్టు విండీస్ పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. బౌలింగ్ ఎటాక్ ఆరంభించిన సిరాజ్ ఇందులో భాగంగా ఇరు జట్ల మధ్య బుధవారం (జూలై 12) తొలి టెస్టు ఆరంభమైంది. డొమినికా వేదికగా సాగుతున్న ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన కరేబియన్ జట్టు తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్ బౌలింగ్ ఎటాక్ ఆరంభించగా.. తొలి వికెట్ను మాత్రం తన ఖాతాలో వేసుకున్నాడు అశ్విన్. స్పిన్ మాయాజాలంతో వెస్టిండీస్ ఇన్నింగ్స్ 13వ ఓవర్లో అద్భుత బౌలింగ్తో తగెనరైన్ చందర్పాల్ను బోల్తా కొట్టించాడు. తన స్పిన్ మాయాజాలంతో చందర్పాల్ను బౌల్డ్ చేశాడు. దీంతో విండీస్వీ మ్యాచ్లో తొలి వికెట్ కోల్పోగా.. అశ్విన్ ఖాతాలో అరుదైన రికార్డు వచ్చి చేరింది. కాగా తగెనరైన్ చందర్పాల్ను అవుట్ చేసిన అశూ.. టెస్టుల్లో టీమిండియా తరఫున అత్యధిక వికెట్లు బౌల్డ్ చేయడం ద్వారా సాధించిన బౌలర్గా నిలిచాడు. ఈ క్రమంలో అనిల్ కుంబ్లే పేరిట ఉన్న రికార్డు బ్రేక్ చేశాడు. కుంబ్లేను అధిగమించి ఇక దిగ్గజ స్పిన్నర్ అనిల్ కుంబ్లే 94 సార్లు ప్రత్యర్థి జట్టు బ్యాటర్లను బౌల్డ్ చేయగా.. అశ్విన్.. చందర్పాల్ వికెట్తో తన నెంబర్ను 95గా నమోదు చేశాడు. ఇక మహ్మద్ షమీ 66 సార్లు, కపిల్ దేవ్ 88 సార్లు ప్రత్యర్థి జట్ల బ్యాటర్లను బౌల్డ్ చేశారు. కాగా ఈ మ్యాచ్లో అశ్విన్ 17వ ఓవర్ రెండో బంతికి కెప్టెన్ క్రెగ్ బ్రాత్వైట్ వికెట్ను కూడా పడగొట్టాడు. ఈ క్రమంలో 17 ఓవర్లు ముగిసేసరికి విండీస్ 38 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఇదిలా ఉంటే.. వెస్టిండీస్తో తొలి టెస్టు సందర్భంగా ఇషాన్ కిషన్, యశస్వి జైశ్వాల్ అరంగేట్రం చేశారు. ఈ ఇద్దరు లెఫ్టాండ్ బ్యాటర్లలో యశస్వి ఓపెనర్గా బరిలోకి దిగనుండగా.. ఇషాన్ వికెట్ కీపర్గా సేవలు అందించనున్నాడు. మరోవైపు.. ఇషాన్ రాకతో ఆంధ్ర క్రికెటర్ శ్రీకర్ భరత్పై వేటు పడింది. చదవండి: మార్కు చూపించిన తిలక్ వర్మ.. కెప్టెన్ ఇన్నింగ్స్తో విహారి! ఫైనల్లో జట్టును.. -
Ind Vs WI: దవడ పగిలినా బౌలింగ్ చేసి.. దిగ్గజ బ్యాటర్ వికెట్ తీసి!
India Tour Of West Indies: అనిల్ కుంబ్లే.. ఈ రైట్ఆర్మ్ లెగ్బ్రేక్ స్పిన్నర్ టీమిండియాకు పలు చిరస్మరణీయ విజయాలు అందించిన ఆటగాళ్లలో ఒకడు. తన సుదీర్ఘ కెరీర్లో మేటి జట్లతో ఆడే అవకాశం దక్కించుకున్న ఈ కర్ణాటక బౌలర్.. భారత్ తరఫున 132 టెస్టులాటి 619 వికెట్లు పడగొట్టాడు. టీమిండియా స్టార్ టెస్టు స్పిన్నర్లలో ఒకడిగా నిలిచాడు. 1990లో ఇంగ్లండ్తో టెస్టు మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన కుంబ్లే.. భారత జట్టు సారథిగానూ సేవలు అందించాడు. కెరీర్లో ఎదురైన సవాళ్లంటినీ అధిగమించి మేటి బౌలర్గా ఎదిగాడు. ఇక కుంబ్లేకు వెస్టిండీస్తో మ్యాచ్ అంటే చాలు పూనకాలే! బ్రియన్ లారా వంటి దిగ్గజాలను పెవిలియన్కు పంపితే ఆ మజానే వేరని భావించేవాడట! దవడ పగిలినా దవడ విరిగిపోయినా మైదానం వీడక బౌలింగ్ చేయడమే ఇందుకు నిదర్శనం. తాజాగా టీమిండియా వెస్టిండీస్ పర్యటన నేపథ్యంలో అనిల్ కుంబ్లే 2002 నాటి సంగతులు గుర్తు చేసుకున్నాడు. ఆంటిగ్వా టెస్టు సందర్భంగా మెర్విన్ ధిల్లాన్ షార్ట్ డెలివరీ కారణంగా బంతి బలంగా తాకి అనిల్ కుంబ్లే దవడ పగిలింది. దీంతో మ్యాచ్కు దూరమవ్వాల్సి పరిస్థితి. విరామ సమయంలో తన భార్య చేతనకు ఫోన్ చేసి విషయం చెప్పాడు కుంబ్లే. సర్జరీ కోసం ఇంటికి వస్తున్నానని ఆమెతో అన్నాడు. కానీ.. ఆ తర్వాత మళ్లీ బౌలింగ్ చేసేందుకు మైదానంలోకి దిగాడు. 14 ఓవర్ల పాటు బౌలింగ్ చేసి బ్రియన్ లారా వికెట్ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఆ తర్వాత స్వదేశానికి తిరిగివచ్చాడు. ఈ విషయం గురించి కుంబ్లే జియో సినిమా షోలో మాట్లాడుతూ.. ‘‘నా భార్య చేతనకు కాల్ చేసి.. సర్జరీ చేయించుకోవాలి ఇంటికి వస్తున్నా అని చెప్పాను. జోక్ చేస్తున్నా అనుకుంది అందుకోసం బెంగళూరులో అన్ని ఏర్పాట్లు చేస్తానని తను నాతో అంది. ఇక కాల్ కట్ చేసే ముందు.. ‘‘నేను వెళ్లి బౌలింగ్ చేస్తాను’’అని తనతో అన్నాను. కానీ చేతన నమ్మలేదు. నేను జోక్ చేస్తున్నా అనుకుంది’’ అని చెప్పుకొచ్చాడు. ఆరోజు తాను బౌలింగ్ కొనసాగించడం తనకు సంతృప్తినిచ్చిందని పేర్కొన్నాడు. కాగా ఆంటిగ్వా వేదికగా జరిగిన నాలుగో టెస్టు డ్రాగా ముగియగా.. 2002 నాటి ఐదు మ్యాచ్ల సిరీస్ను విండీస్ కైవసం చేసుకుంది. ఇదిలా ఉంటే తాజా పర్యటనలో భాగంగా బుధవారం (జూలై 12) నుంచి వెస్టిండీస్- టీమిండియా మధ్య టెస్టు సిరీస్ ఆరంభం కానుంది. చదవండి: రోహిత్, కోహ్లి కాదు.. విండీస్పై అత్యధిక టెస్టు సెంచరీలు సాధించింది ఇతడే! జట్టు నుంచి తప్పించడం కంటే కూడా అదే ఎక్కువగా బాధిస్తోంది: టీమిండియా స్టార్
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
జగన్నాథుడి జైత్రయాత్ర తథ్యం..కూటమి కుట్రలు పారలేదు
ఫేస్బుక్, ఇన్స్టా డౌన్.. యూజర్ల గగ్గోలు
కేతిరెడ్డి పెద్ద రెడ్డి ఇంట్లో పోలీసుల వీరంగం
వైఎస్సార్సీపీ గెలుపుతో చంద్రబాబు రథచక్రాలు విరిగిపోతాయి...
కియారాకు అరుదరైన అవకాశం
రేపటి నుంచి ఏపీ ఈఏపీ సెట్ పరీక్షలు.. ముఖ్యమైన సూచనలు ఇవే..
గవర్నమెంట్ పాజిటివ్ వోట్ ముఖ్యంగా మహిళలు..గ్రాఫ్ చూస్తే..!
సూపర్ మామ్స్! రికార్డుల సృష్టించిన తల్లులు
ఎమ్మెల్యే ఇంట్లోకి చొరబడి.. తాడిపత్రిలో పోలీసుల ఓవరాక్షన్
ఏపీలో రికార్డ్ స్థాయిలో పోలింగ్..
తప్పక చదవండి
- ఇవాళే అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం!
- చైనాకు ఒకేసారి రెండు దెబ్బలు.. షాకిచ్చిన బైడెన్, ట్రంప్!
- అతనితో 16 రోజులే ఉన్నాను.. రెండో పెళ్లి చేసుకోవాలని ఉంది: ఎస్తర్
- BCCI: టీమిండియా హెడ్కోచ్గా వాళ్లిద్దరిలో ఒకరు?
- మనీష్ సిసోడియా జ్యుడిషీయల్ కస్టడీ పొడగింపు
- కెనడాలో ఘనంగా పదేళ్ల తెలంగాణ ఉత్సవాలు!
- పాడెపై వెళ్లి నామినేషన్! గోరఖ్పూర్లో విచిత్రం
- రామ్-పూరీ 'డబుల్ ఇస్మార్ట్' టీజర్ ఎలా ఉందంటే?
- సీజన్ మొత్తం మాకు అదే సమస్య.. అందుకే ఈ దుస్థితి: కేఎల్ రాహుల్
- 100 విమానాలు కొనుగోలు చేయనున్న ఇండిగో.. ఎందుకంటే..
Advertisement