anil kumble
-
మహాకుంభ్లో పుణ్య స్నానం చేసిన దిగ్గజ బౌలర్ అనిల్ కుంబ్లే
భారత దిగ్గజ స్పిన్నర్ అనిల్ కుంబ్లే, తన సతీమణి చేతనతో కలిసి ప్రయాగ్రాజ్లోని త్రివేణి సంగమంలో పుణ్య స్నానం చేశారు. మాఘ పౌర్ణమి సందర్భంగా కుంబ్లే దంపతులు మహాకుంభ్ మేళాలో పాల్గొన్నారు. అమృత స్నానం ఆచరిస్తున్న దృశ్యంతో పాటు పౌర్ణమి చంద్రుడి ఫోటోను, బోటులో భార్య చేతనతో తీసుకున్న సెల్ఫీని కుంబ్లే ఎక్స్లో పోస్ట్ చేశాడు. ఇందుకు బ్లెస్డ్ అని క్యాప్షన్ పెట్టి, మహాకుంభ్, ప్రయాగ్రాజ్ హ్యాష్ట్యాగ్లను జోడించాడు.Blessed 🙏🏽#MahaKumbh #Prayagraj pic.twitter.com/OFY6T3yF5F— Anil Kumble (@anilkumble1074) February 12, 2025కాగా, బుధవారం మాఘ పౌర్ణమి కావడంతో మహాకుంభ్కు జనం పోటెత్తారు. నిన్న ఒక్క రోజే రెండు కోట్ల మందికిపైగా పుణ్య స్నానం చేసినట్లు అధికారులు తెలిపారు. మహాకుంభ్ను నిన్నటి వరకు దాదాపుగా 50 కోట్ల మంది దర్శించుకున్నట్లు ఉత్తర్ప్రదేశ్ డీజీపీ పేర్కొన్నారు. మహాకుంభ్కు లెక్కలేని సంఖ్యలో జనం పోటెత్తుతుండటంతో భారీగా ట్రాఫిక్ జామ్ అవుతుంది. దీంతో ప్రయాగ్రాజ్లోకి వాహనాల అనుమతిని నిషేధించారు. ఎక్కడో ఉన్న పార్కింగ్ స్థలం నుంచి ఘాట్ల వరకు జనం నడిచి వెళ్తున్నారు.అనిల్ కుంబ్లే విషయానికొస్తే.. 54 ఏళ్ల ఈ దిగ్గజ స్పిన్నర్ భారత్ తరఫున 132 టెస్ట్లు, 271 వన్డేలు ఆడాడు. టెస్ట్ల్లో భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసింది కుంబ్లేనే. టెస్ట్లు, వన్డేల్లో కలుపుకుని కుంబ్లే దాదాపుగా 1000 వికెట్లు తీశాడు. కుంబ్లేకు ఐపీఎల్లో కూడా ప్రవేశముంది. కుంబ్లే ఆర్సీబీ తరఫున 2008-10 మధ్యలో 42 మ్యాచ్లు ఆడి 45 వికెట్లు పడగొట్టాడు. ఆటగాడిగా రిటైరైన అనంతరం కుంబ్లే టీమిండియా ప్రధాన కోచ్గా వ్యవహరించాడు. కుంబ్లే ఆథ్వర్యంలో టీమిండియా చారిత్రక విజయాలు సాధించింది. కుంబ్లే ప్రస్తుతం వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నాడు. -
బుమ్రా సరికొత్త చరిత్ర.. కుంబ్లే రికార్డు బ్రేక్
ఆస్ట్రేలియాతో బాక్సింగ్ డే టెస్టులో టీమిండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రా(Jasprit Bumrah) అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. మూడు కీలక వికెట్లు తీసి.. ఆది నుంచే దూకుడు ప్రదర్శించిన కంగారూలను కట్టడి చేశాడు. ఈ క్రమంలో మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్(ఎంసీజీ)లో బుమ్రా ఓ అరుదైన ఘనత సాధించాడు. భారత దిగ్గజ స్పిన్నర్ అనిల్ కుంబ్లే పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టి సరికొత్త చరిత్ర సృష్టించాడు.బోర్డర్- గావస్కర్ ట్రోఫీ(Border Gavaskar Trophy)లో భాగంగా టీమిండియా ప్రస్తుతం ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య పెర్త్లో భారత్ విజయం సాధించగా.. అడిలైడ్ పింక్ బాల్ టెస్టులో ఆసీస్ గెలుపొందింది. ఇక బ్రిస్బేన్లోని గబ్బాలో జరిగిన మూడో టెస్టు వర్షం వల్ల ‘డ్రా’ కావడంతో ఇరుజట్లు 1-1తో సమంగా ఉన్నాయి.టాపార్డర్ హిట్ఈ నేపథ్యంలో ఎంసీజీ వేదికగా గురువారం నాలుగో టెస్టు మొదలైంది. టాస్ గెలిచిన ఆతిథ్య జట్టు తొలుత బ్యాటింగ్ ఎంచుకోగా.. టాపార్డర్ అద్భుత ఆట తీరుతో ఆకట్టుకుంది. ఓపెనర్లు సామ్ కొన్స్టాస్(60), ఉస్మాన్ ఖవాజా(57).. వన్డౌన్ బ్యాటర్ మార్నస్ లబుషేన్(72) అర్ధ శతకాలతో మెరిశారు.బుమ్రా మ్యాజిక్ వల్లమిడిలార్డర్లో స్టీవ్ స్మిత్(68 నాటౌట్) కూడా హాఫ్ సెంచరీ చేయడంతో ఆసీస్ పటిష్ట స్థితిలో నిలిచింది. అయితే, డేంజరస్ బ్యాటర్ ట్రవిస్ హెడ్(0), ఆల్రౌండర్ మిచెల్ మార్ష్(4)లను బుమ్రా త్వరత్వరగా పెవిలియన్కు పంపడంతో కనీసం తొలి రోజు ఆఖరి సెషన్లోనైనా భారత జట్టుకు కాస్త ఊరట దక్కింది. వీరిద్దరితో పాటు ఉస్మాన్ ఖవాజా వికెట్ను కూడా బుమ్రా తన ఖాతాలో వేసుకున్నాడు.ఇక మెల్బోర్న్ టెస్టులో మొదటి రోజు ఆట సందర్భంగా మొత్తంగా మూడు వికెట్లు తీసిన బుమ్రా.. ఎంసీజీలో భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా నిలిచాడు. ఇప్పటి వరకు ఈ ప్రసిద్ధ మైదానంలో బుమ్రా మూడు మ్యాచ్లు(ఐదు ఇన్నింగ్స్) ఆడి మొత్తంగా 18 వికెట్లు తీశాడు. అంతకు ముందు అనిల్ కుంబ్లే మూడు మ్యాచ్లు(ఆరు ఇన్నింగ్స్) ఆడి పదిహేను వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు.మెల్బోర్న్లో టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్లు1. జస్ప్రీత్ బుమ్రా(పేసర్)- మూడు మ్యాచ్లు- ఐదు ఇన్నింగ్స్- 18 వికెట్లు2. అనిల్ కుంబ్లే(స్పిన్నర్)- మూడు మ్యాచ్లు- ఆరు ఇన్నింగ్స్- 15 వికెట్లు3. రవిచంద్రన్ అశ్విన్(స్పిన్నర్)- మూడు మ్యాచ్లు- ఆరు ఇన్నింగ్స్- 14 వికెట్లు4. కపిల్ దేవ్(పేసర్)- మూడు మ్యాచ్లు- ఆరు ఇన్నింగ్స్- 14 వికెట్లు5. ఉమేశ్ యాదవ్(పేసర్)- మూడు మ్యాచ్లు- ఆరు ఇన్నింగ్స్- 13 వికెట్లుతొలిరోజు ఆసీస్దేబాక్సింగ్ డే టెస్టు((Boxing Day Test))లో గురువారం నాటి మొదటి రోజు ఆట పూర్తయ్యేసరికి ఆస్ట్రేలియా పటిష్ట స్థితిలో నిలిచింది. 86 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 311 పరుగులు చేసింది. భారత బౌలర్లలో బుమ్రా మూడు, ఆకాశ్ దీప్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ ఒక్కో వికెట్ పడగొట్టారు.చదవండి: #Virat Kohli: యువ క్రికెటర్తో గొడవ.. విరాట్ కోహ్లికి ఐసీసీ భారీ షాక్ BUMRAH SEED TO GET HEAD FOR A DUCK!#AUSvIND | #DeliveredWithSpeed | @nbn_australia pic.twitter.com/ZlpIVFca5O— cricket.com.au (@cricketcomau) December 26, 2024 -
WTC: బుమ్రా అరుదైన రికార్డు.. భారత తొలి బౌలర్గా
ఆస్ట్రేలియాతో మూడో టెస్టులో భారత ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఐదు వికెట్లతో మెరిశాడు. బ్రిస్బేన్లో పేస్ దళాన్ని ముందుకు నడిపించిన ఈ స్పీడ్స్టర్.. ఆదివారం నాటి ఆటలో ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా(21)ను అవుట్ చేసి బ్రేక్ ఇచ్చాడు. ఆ తర్వాత మరో ఓపెనర్ నాథన్ మెక్స్వీనీ(9)ని కూడా తానే పెవిలియన్కు పంపాడు.ఆ ఇద్దరి సెంచరీలుఈ క్రమంలో బుమ్రా స్ఫూర్తితో యువ పేస్ ఆల్రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి మార్నస్ లబుషేన్(12) ఆట కట్టించాడు. ఫలితంగా 75 పరుగుల వద్ద ఆసీస్ మూడో వికెట్ కోల్పోయింది. దీంతో భారత శిబిరంలో ఉత్సాహం నెలకొంది. అయితే, ఆ ఆనందం ఎక్కువసేపు నిలవలేదు.నాలుగో నంబర్ బ్యాటర్ స్టీవ్ స్మిత్కు తోడైన ట్రవిస్ హెడ్ భారత బౌలర్లపై విరుచుకుపడ్డాడు. కేవలం 115 బంతుల్లోనే వంద పరుగుల మార్కు అందుకున్నాడు. టెస్టుల్లో తన తొమ్మిదవ సెంచరీ నమోదు చేసిన అనంతరం హెడ్.. కొరకరాని కొయ్యగా మారాడు. ఈ క్రమంలో.. ఫామ్లోలేని స్మిత్ సైతం హెడ్ ఇచ్చిన జోష్లో శతక్కొట్టేశాడు.బుమ్రా విడగొట్టేశాడుఈ మిడిలార్డర్ బ్యాటర్లను విడదీసేందుకు భారత బౌలర్లు తీవ్రంగా శ్రమించారు. అయితే, మరోసారి బుమ్రానే తన అనుభవాన్ని ఉపయోగించి స్మిత్(101)ను పెవిలియన్కు పంపాడు. ఆ తర్వాత కాసేపటికే ఆల్రౌండర్ మిచెల్ మార్ష్(5) వికెట్ను కూడా బుమ్రా తన ఖాతాలో వేసుకున్నాడు.అనంతరం.. శతకవీరుడు ట్రవిస్ హెడ్(152)ను కూడా అవుట్ చేశాడు బుమ్రా. దీంతో టీమిండియాలో తిరిగి ఉత్సాహం నిండింది. ఇక హెడ్ రూపంలో ఈ ఇన్నింగ్స్లో ఐదో వికెట్ దక్కించుకున్న బుమ్రా. తన కెరీర్లో ఓవరాల్గా పన్నెండోసారి(Five Wicket Haul) ఈ ఘనత సాధించాడు.Jasprit Bumrah gets Travis Head to bring up his fifth wicket! #AUSvIND | #MilestoneMoment | @nrmainsurance pic.twitter.com/2QGUazarZP— cricket.com.au (@cricketcomau) December 15, 2024అదే విధంగా.. ప్రపంచ టెస్టు చాంపియన్షిప్(డబ్ల్యూటీసీ)లో అతడికి ఇది తొమ్మిదో ఫైవ్ వికెట్ హాల్. అంతేకాదు.. ఆస్ట్రేలియా గడ్డ మీద నాలుగోసారి బుమ్రా ఈ ఫీట్ నమోదు చేశాడు. ఈ క్రమంలో బుమ్రా రెండు అరుదైన రికార్డులు సొంతం చేసుకున్నాడు.కమిన్స్ సరసన.. భారత తొలి బౌలర్గా రికార్డుడబ్ల్యూటీసీలో అత్యధికసార్లు ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేసిన క్రికెటర్గా ఆసీస్ సారథి ప్యాట్ కమిన్స్ కొనసాగుతున్నాడు. అతడు ఇప్పటికి తొమ్మిదిసార్లు ఈ ఘనత సాధించాడు. తాజా టెస్టుతో బుమ్రా కూడా కమిన్స్ సరసన చేరాడు. ఈ జాబితాలో సౌతాఫ్రికా పేసర్ కగిసో రబడ(7), ఆసీస్ బౌలర్ జోష్ హాజిల్వుడ్(6), న్యూజిలాండ్ ఫాస్ట్బౌలర్ టిమ్ సౌథీ(6) వీరి తర్వాతి స్థానాలో ఉన్నారు.కుంబ్లే రికార్డును సమం చేసిన బుమ్రాఇక ఆస్ట్రేలియా గడ్డపై నాలుగుసార్లు ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేసిన భారత బౌలర్గా అనిల్ కుంబ్లే కొనసాగుతున్నాడు. బ్రిస్బేన్ టెస్టుతో బుమ్రా కూడా కుంబ్లే రికార్డును సమం చేశాడు. ఇదిలా ఉంటే.. ఓవరాల్గా 23సార్లు కపిల్ దేవ్ ఫైవ్ వికెట్ల హాల్ సాధించి అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.ఆసీస్దే పైచేయిబ్రిస్బేన్లో గబ్బా మైదానంలో జరుగుతున్న మూడో టెస్టులో ఆస్ట్రేలియా టీమిండియాపై పైచేయి సాధించింది. ఆదివారం నాటి రెండో రోజు ఆట పూర్తయ్యే సరికి ఏడు వికెట్ల నష్టానికి 405 పరుగుల మేర భారీ స్కోరు సాధించింది. హెడ్, స్మిత్ సెంచరీలకు తోడు వికెట్ కీపర్ అలెక్స్ క్యారీ(45 నాటౌట్) రాణించడం వల్ల ఇది సాధ్యమైంది. ఇక భారత బౌలర్లలో బుమ్రా ఐదు, నితీశ్ రెడ్డి, మహ్మద్ సిరాజ్ తలా ఒక వికెట్ పడగొట్టారు. ఇదిలా ఉంటే.. బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఐదు టెస్టులు ఆడేందుకు భారత జట్టు ఆస్ట్రేలియాలో పర్యటిస్తోంది. ఈ క్రమంలో పెర్త్ టెస్టులో భారత్, అడిలైడ్ పింక్బాల్ టెస్టులో ఆసీస్ విజయం సాధించాయి. దీంతో ప్రస్తుతం సిరీస్ 1-1తో సమంగా ఉంది.చదవండి: భారత్తో మూడో టెస్టు: ట్రవిస్ హెడ్ వరల్డ్ రికార్డు.. సరికొత్త చరిత్ర -
అశ్విన్, భజ్జీ కాదు!.. టీమిండియా ఆల్టైమ్ అత్యుత్తమ స్పిన్నర్లు వీరే!
టీమిండియా మాజీ హెడ్కోచ్ రవిశాస్త్రి ప్రస్తుతం ఆస్ట్రేలియాలో ఉన్నాడు. భారత్- ఆసీస్ మధ్య జరుగుతున్న బోర్డర్- గావస్కర్ ట్రోఫీ సిరీస్కు కామెంటేటర్గా వ్యవహరిస్తున్నాడు. ఈ క్రమంలో రవిశాస్త్రికి ఓ ప్రశ్న ఎదురైంది. భారత క్రికెట్ జట్టులోని ముగ్గురు అత్యుత్తమ స్పిన్నర్ల పేర్లు చెప్పాలని కోరగా.. రవిశాస్త్రి ఆసక్తికర సమాధానం ఇచ్చాడు.కాగా ప్రస్తుతం టీమిండియా తరఫున టెస్టుల్లో అత్యధిక వికెట్ల వీరుల జాబితాలో రెండో స్థానంలో ఉన్నాడు రవిచంద్రన్ అశ్విన్. మరోవైపు.. మాజీ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ సైతం 103 టెస్టుల్లో 417 వికెట్లు పడగొట్టి లెజెండరీ బౌలర్గా పేరు సంపాదించాడు.ఇక అశ్విన్తో పాటు జట్టులో కొనసాగుతున్న మరో స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా కూడా 319(77 టెస్టుల్లో) వికెట్లు పడగొట్టి సత్తా చాటుతున్నాడు.అనిల్ కుంబ్లే ప్రమాదకారిఅయితే, రవిశాస్త్రి ఈ ముగ్గురిలో ఒక్కరి పేరు కూడా చెప్పకపోవడం విశేషం. తన దృష్టిలో బిషన్ సింగ్ బేడి, ఎర్రాపల్లి ప్రసన్న, అనిల్ కుంబ్లే టీమిండియా అత్యుత్తమ స్పిన్నర్లు అని పేర్కొన్నాడు. ఈ మేరకు ఫాక్స్ స్పోర్ట్స్ షోలో మాట్లాడుతూ.. ‘‘ఉపఖండ పిచ్లపై అనిల్ కుంబ్లే ప్రమాదకారి. అత్యంత దూకుడుగా ఉంటాడు. అయితే, కేవలం ఇండియాలోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా సత్తా చాటిన స్పిన్నర్. 600కు పైగా టెస్టు వికెట్లు తీయడం అంటే మాటలు కాదు.అతడు బంతితో అద్భుతాలు చేయగలడుఇక ప్రసన్న. అతడి కెరీర్ చరమాంకంలో ఉన్నపటి పరిస్థితులను పరిశీలిస్తే.. అతడు జట్టు మేనేజర్గా ఆస్ట్రేలియా పర్యటనకు వచ్చాడు. నెట్స్లో బౌలింగ్ కూడా చేశాడు. అతడు బంతితో అద్భుతాలు చేయగలడు. బాల్ను రిలీజ్ చేసే విషయంలో ఎప్పుడు ఏం చేయాలో అతడికి బాగా తెలుసు.ఆయన బౌలింగ్ యాక్షన్ సూపర్వీరిద్దరు నా లిస్టులో టాప్-3లో ఉంటే.. టాప్-1లో బిషన్ సింగ్ బేడి ఉంటాడు. ఆయన బౌలింగ్ యాక్షన్ గురించి ఎంత చెప్పినా తక్కువే’’ అని రవిశాస్త్రి పేర్కొన్నాడు. తన అభిప్రాయం ప్రకారం బిషన్ బేడి, ప్రసన్న, కుంబ్లే అత్యుత్తమ భారత స్పిన్నర్లు అని పేర్కొన్నాడు. కాగా బిషన్ బేడీ తన కెరీర్లో 67 టెస్టుల్లో 266 వికెట్లు పడగొట్టగా.. ప్రసన్న 49 టెస్టుల్లో 189 వికెట్లు తీశాడు. మరోవైపు.. కుంబ్లే 132 టెస్టుల్లో 619 వికెట్లు కూల్చి టెస్టుల్లో భారత లీడింగ్ వికెట్ టేకర్గా కొనసాగుతున్నాడు. ఇక 536 వికెట్లతో అశూ రెండోస్థానంలో ఉన్నాడుచదవండి: IPL 2025: ఆర్సీబీ కెప్టెన్ అతడే! -
చరిత్ర సృష్టించిన అశ్విన్.. కుంబ్లే ఆల్టైమ్ రికార్డు బద్దలు
ముంబై వేదికగా న్యూజిలాండ్తో జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా అదరగొడుతోంది. తొలి రెండు టెస్టుల్లో ఆధిపత్యం కొనసాగించిన కివీస్ దూకుడుకు భారత జట్టు కళ్లెం వేసింది. ముంబై టెస్టులో రెండో రోజు ఆటముగిసే సమయానికి న్యూజిలాండ్ 9 వికెట్లు కోల్పోయి 171 పరుగులు చేసింది. పర్యాటక జట్టు ప్రస్తుతం కేవలం 143 పరుగుల ఆధిక్యంలో మాత్రమే ఉంది. భారత స్పిన్నర్లు రవీంద్ర జడేజా, అశ్విన్ తమ స్పిన్ మాయాజాలాన్ని ప్రదర్శించారు. కివీస్ సెకెండ్ ఇన్నింగ్స్లో జడేజా ఇప్పటివరకు 4 వికెట్లు పడగొట్టగా, అశ్విన్ 3 కీలక వికెట్లు సాధించారు.అశ్విన్ అరుదైన రికార్డు..ఇక 3 వికెట్లతో చెలరేగిన రవిచంద్రన్ అశ్విన్ ఓ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. వాంఖడే స్టేడియంలో అత్యధిక వికెట్లు పడగొట్టిన భారత బౌలర్గా అశ్విన్ రికార్డులకెక్కాడు. అశ్విన్ ఇప్పటివరకు ప్రతిష్టాత్మక వాంఖడే స్టేడియంలో 6 టెస్టులు ఆడి 41 వికెట్లు పడగొట్టాడు.ఇంతకుముందు ఈ రికార్డు భారత స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లే పేరిట ఉండేది. వాంఖడేలో 7 టెస్టులు ఆడిన కుంబ్లే 38 వికెట్లు పడగొట్టాడు. తాజా మ్యాచ్తో కుంబ్లే ఆల్టైమ్ రికార్డును అశూ బ్రేక్ చేశాడు. ఈ జాబితాలో అశ్విన్, కుంబ్లే తర్వాత స్ధానాల్లో కపిల్ దేవ్(28) ఉన్నారు.చదవండి: IPL 2025: ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్గా టీమిండియా స్టార్ ప్లేయర్? -
చరిత్రకెక్కిన జడేజా.. జహీర్ రికార్డు బ్రేక్.. అరుదైన జాబితాలో చోటు
న్యూజిలాండ్తో మూడో టెస్టు సందర్భంగా టీమిండియా క్రికెటర్ రవీంద్ర జడేజా అరుదైన రికార్డు సాధించాడు. భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో చోటు సంపాదించాడు. ఈ క్రమంలో దిగ్గజ పేసర్ జహీర్ ఖాన్ను జడ్డూ అధిగమించాడు. కాగా ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ 2023-25లో భాగంగా మూడు మ్యాచ్లు ఆడేందుకు కివీస్ జట్టు భారత పర్యటనకు వచ్చింది.ముంబై వేదికగా మూడో టెస్టు ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య బెంగళూరు, పుణె వేదికగా జరిగిన తొలి రెండు టెస్టుల్లో ఆతిథ్య టీమిండియాను న్యూజిలాండ్ ఓడించింది. తద్వారా మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ను 2-0తో కైవసం చేసుకుంది. ఈ నేపథ్యంలో ఇరుజట్ల మధ్య ముంబై వేదికగా శుక్రవారం నామమాత్రపు మూడో టెస్టు మొదలైంది.వాంఖడే మైదానంలో జరుగుతున్న ఈ మ్యాచ్లో గెలిచి వైట్వాష్ నుంచి తప్పించుకోవాలని రోహిత్ సేన పట్టుదలగా ఉంది. మరోవైపు.. సొంతగడ్డపై ఇప్పటికే భారత్ను ఓడించి చరిత్ర సృష్టించిన టామ్ లాథమ్ బృందం విజయాన్ని పరిపూర్ణం చేసుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. ఈ క్రమంలో మూడో టెస్టులో టాస్ గెలిచిన న్యూజిలాండ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది.ఆకాశ్ దీప్ శుభారంభం.. అదరగొట్టిన వాషీస్పిన్కు అనుకూలిస్తున్న పిచ్పై భారత బౌలర్లు వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా ప్రభావం చూపుతున్నారు. ఆట తొలిరోజు భోజన విరామ సమయానికి ముందు వాషీ.. కివీస్ కెప్టెన్, ఓపెనర్ టామ్ లాథమ్(28), మిడిలార్డర్ బ్యాటర్ రచిన్ రవీంద్ర(5) రూపంలో రెండు కీలక వికెట్లు తీశాడు. మరోవైపు.. పేసర్ ఆకాశ్ దీప్ డేంజరస్ ఓపెనర్ డెవాన్ కాన్వే(4)ను అవుట్ చేసి శుభారంభం అందించాడు.లంచ్ తర్వాత వికెట్ల వేట మొదలుపెట్టిన జడ్డూఈ క్రమంలో లంచ్ బ్రేక్కు ముందు న్యూజిలాండ్ మూడు వికెట్లు కోల్పోయి 92 పరుగులు చేసింది. అయితే, భోజన విరామం తర్వాత జడ్డూ తన బౌలింగ్ పదునుపెంచాడు. క్రీజులో పాతుకుపోయి భారత బౌలర్లను ఇబ్బంది పెడుతున్న విల్ యంగ్(71)ను తొలుత పెవిలియన్కు పంపిన జడేజా.. అనంతరం టామ్ బ్లండెల్(0)ను డకౌట్ చేశాడు. ఆ తర్వాత గ్లెన్ ఫిలిప్స్(17)ను అవుట్ చేశాడు. తద్వారా జడ్డూ టెస్టుల్లో 312 వికెట్లు పూర్తి చేసుకున్నాడు.టీ బ్రేక్ సమయానికి కివీస్స్కోరు ఎంతంటే?ఈ నేపథ్యంలో భారత్ తరఫున టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో జహీర్ ఖాన్(311), ఇషాంత్ శర్మ(311)లను జడ్డూ అధిగమించాడు. వీరిద్దరి రికార్డును బ్రేక్ చేస్తూ టాప్-5లో చోటు సంపాదించాడు. ఇదిలా ఉంటే.. టీ బ్రేక్ సమయానికి న్యూజిలాండ్ ఆరు వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది.టీమిండియా తరఫున టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన టాప్-5 బౌలర్లు1. అనిల్ కుంబ్లే(స్పిన్నర్)- 619 వికెట్లు2. రవిచంద్రన్ అశ్విన్(స్పిన్నర్)- 533 వికెట్లు3. కపిల్ దేవ్(పేస్ బౌలింగ్ ఆల్రౌండర్)- 434 వికెట్లు4. హర్భజన్ సింగ్(స్పిన్నర్)- 417 వికెట్లు5. రవీంద్ర జడేజా(స్పిన్నర్)- 312 వికెట్లు.చదవండి: IPL 2025 Retentions: జాక్పాట్ కొట్టిన ఆటగాళ్లు వీరే..! -
కివీస్తో మూడో టెస్ట్.. ఆల్టైమ్ రికార్డుపై కన్నేసిన అశ్విన్
టీమిండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఓ భారీ రికార్డుపై కన్నేశాడు. న్యూజిలాండ్తో రేపటి నుంచి ప్రారంభం కాబోయే మూడో టెస్ట్లో అశ్విన్ మరో ఐదు వికెట్ల ఘనత సాధిస్తే.. అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక సార్లు ఐదు వికెట్ల ఘనతలు సాధించిన భారత ఆటగాడిగా రికార్డు సృష్టిస్తాడు. అశ్విన్, అనిల్ కుంబ్లే ఇప్పటివరకు టీమిండియా తరఫున 37 సార్లు ఐదు వికెట్ల ఘనతలు సాధించారు. అశ్విన్ ఒక్క టెస్ట్ల్లోనే ఈ ఘనత సాధించగా.. కుంబ్లే 35 సార్లు టెస్ట్ల్లో, రెండు సార్లు వన్డేల్లో ఐదు వికెట్ల ప్రదర్శనలు నమోదు చేశాడు. అంతర్జాతీయ క్రికెట్లో అశ్విన్, కుంబ్లే చెరి ఎనిమిది సార్లు 10 వికెట్ల ప్రదర్శనలు నమోదు చేశారు.అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక సార్లు ఐదు వికెట్ల ప్రదర్శనలు నమోదు చేసిన ఘనత ముత్తయ్య మురళీథరన్కు దక్కుతుంది. మురళీ శ్రీలంక తరఫున 77 ఐదు వికెట్ల ప్రదర్శనలు, 22 పది వికెట్ల ప్రదర్శనలు నమోదు చేశాడు. మురళీ తర్వాత ఈ లిస్ట్లో రిచర్డ్ హ్యాడ్లీ, షేన్ వార్న్ ఉన్నారు. హ్యాడ్లీ 41 ఐదు వికెట్ల ప్రదర్శనలు, తొమ్మిది 10 వికెట్ల ప్రదర్శనలు నమోదు చేయగా.. షేన్ వార్న్ 38 ఐదు వికెట్ల ప్రదర్శనలు, పది 10 వికెట్ల ప్రదర్శనలు నమోదు చేశాడు. ఈ జాబితాలో మురళీథరన్, హ్యాడ్లీ, వార్న్ తర్వాత అశ్విన్, కుంబ్లే ఉన్నారు.కాగా, ముంబైలోని వాంఖడే స్టేడియంలో రేపటి నుంచి భారత్, న్యూజిలాండ్ మధ్య మూడో టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కానుంది. మూడు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కోసం న్యూజిలాండ్ జట్టు భారత్లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్లోని తొలి రెండు మ్యాచ్ల్లో గెలిచిన న్యూజిలాండ్ ఇప్పటికే సిరీస్ను కైవసం చేసుకుంది. మూడో టెస్ట్ మ్యాచ్ రేపు ఉదయం 9:30 గంటల నుంచి ప్రారంభం కానుంది. చదవండి: IND vs NZ 3rd Test: బుమ్రాకు విశ్రాంతి..? -
చరిత్ర సృష్టించిన అశ్విన్.. కుంబ్లే ఆల్టైమ్ రికార్డు బద్దలు
బంగ్లాదేశ్తో టెస్టు సిరీస్లో టీమిండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ రికార్డుల మోత మోగిస్తున్నాడు. తాజాగా కాన్పూర్ వేదికగా బంగ్లాతో జరుగుతున్న రెండో టెస్టులో అశ్విన్ మరో అరుదైన రికార్డను తన ఖాతాలో వేసుకున్నాడు. ఆసియాలో అత్యధిక టెస్టు వికెట్లు పడగొట్టిన భారత బౌలర్గా యాష్ రికార్డులకెక్కాడు.తొలి ఇన్నింగ్స్లో బంగ్లా కెప్టెన్ నజ్ముల్ హొస్సేన్ శాంటోను ఔట్ చేసిన అశ్విన్ ఈ రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. అశ్విన్ ఇప్పటివరకు ఆసియాలో 420 వికెట్లు పడగొట్టాడు. ఇంతకుముందు ఈ రికార్డు భారత స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లే పేరిట ఉండేది. కుంబ్లే తన కెరీర్లో ఆసియాలో 419 వికెట్లు సాధించాడు. ఇక ఓవరాల్గా ఈ అరుదైన ఫీట్ సాధించిన జాబితాలో శ్రీలంక లెజెండ్ ముత్తయ్య మురళీధరన్ 612 వికెట్లతో తొలి స్ధానంలో ఉన్నాడు. ఆ తర్వాత స్ధానంలో అశ్విన్(420) ఉన్నాడు. అశ్విన్ తర్వాత స్ధానాల్లో కుంబ్లే, రంగనా హెరత్(354), హార్భజన్ సింగ్(300) ఉన్నారు. ఓవరాల్గా టెస్టు క్రికెట్లో 101 మ్యాచ్లు ఆడిన అశ్విన్.. 2.82 ఏకానమీతో 522 వికెట్లు పడగొట్టాడు.చదవండి: జడేజా ప్రపంచ రికార్డు.. 147 ఏళ్ల చరిత్రలో ఇదే తొలిసారి -
ఓటు హక్కు వినియోగించుకున్న ద్రవిడ్, కుంబ్లే
దేశంలో ఇవాళ (ఏప్రిల్ 26) సార్వత్రిక ఎన్నికల రెండో విడత పోలింగ్ జరుగుతుంది. ఈ విడతలో మొత్తం 13 రాష్ట్రాల్లోని 88 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఉదయం ఏడు గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. కేరళలోని 20 స్థానాలకు, కర్ణాటకలో 14, రాజస్థాన్లో 13, ఉత్తర్ప్రదేశ్ 8, మహారాష్ట్ర 8, మధ్యప్రదేశ్ 7, అస్సాం 5, బీహార్ 5, పశ్చిమ బెంగాల్ 3, చత్తీస్ఘడ్ 3, జమ్మూ కశ్మీర్ 1, మణిపూర్ 1, త్రిపురలో ఒక లోక్సభ స్థానానికి ఇవాళ పోలింగ్ జరుగతుంది. #WATCH | Rahul Dravid casts his vote in Karnataka's Bengaluru.#LokSabhaElections2024 pic.twitter.com/gZ6Ybairc1— ANI (@ANI) April 26, 2024 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఇవాల్టి ఉదయం నుంది వివిధ రంగాలకు చెందిన చాలామంది ప్రముఖులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. క్రీడారంగానికి సంబంధించి భారత మాజీ క్రికెటర్, ప్రస్తుత టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ ఇవాళ ఉదయం బెంగళూరులో ఓటు హక్కును వినియోగించుకున్నారు. భార్య, కొడుకుతో సహా పోలింగ్ కేంద్రం వద్దకు చేరిన ద్రవిడ్ అతి సాధారణ వ్యక్తిలా క్యూలో నిలబడి ఓటు వేశారు. #Vote #Indiaelections2024 #Karnataka #bengaluru pic.twitter.com/JDi9VYpIA6— Anil Kumble (@anilkumble1074) April 26, 2024 ఓటు వేసిన అనంతరం ద్రవిడ్ మీడియాతో మాట్లాడుతూ.. అర్హత కలిగిన ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చాడు. ఓటు అనేది ప్రజాస్వామ్యం మనకు కల్పించిన హక్కు అని ద్రవిడ్ తెలిపాడు. ద్రవిడ్ సహచరుడు, టీమిండియా మాజీ కోచ్ అనిల్ కుంబ్లే కూడా ఇవాళ బెంగళూరులో ఓటు వేశారు. ఓటు వినియోగించుకున్న విషయాన్ని కుంబ్లే సోషల్మీడియాలో షేర్ చేశాడు. కుంబ్లే తన సతీమణితో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నాడు. -
ధోని, సచిన్ ఒకేలా.. నేను హెడ్కోచ్గా ఉన్నపుడు: భారత మాజీ స్పిన్నర్
‘‘ఐపీఎల్లో నేను ఎంఎస్ ధోనితో కలిసి ఎన్నడూ ఆడలేదు. అయితే, టీమిండియాలో ఉన్నపుడు మాత్రం మేము సహచర ఆటగాళ్లం. సెలబ్రేషన్స్ సమయంలో నన్ను ఎత్తుకోగల ఆటగాళ్లలో ధోని ముందు వరుసలో ఉండే వాడు. ఎంత బరువైనా సరే అతడు అలవోకగా ఎత్తగలడు. ఇక నేను హెడ్కోచ్గా ఉన్నపుడు ధోని కెప్టెన్గా ఉండేవాడు. ఓసారి మేము వన్డే మ్యాచ్ కోసం రాంచికి వెళ్లాము. అక్కడ ఆప్షనల్ ప్రాక్టీస్ సెషన్ నిర్వహించేందుకు సిద్ధమయ్యాను. నిజానికి రాంచి అతడి స్వస్థలం. ఆప్షనల్ ప్రాక్టీస్కు రాకుండా తను ఇంటి వద్ద విశ్రాంతి తీసుకోవచ్చు. కానీ.. అతడు గ్రౌండ్కు వచ్చేశాడు. నాకు ఆశ్చర్యంగా అనిపించి.. ‘ఇక్కడేం చేస్తున్నావు? తదుపరి మ్యాచ్కు మనకు ఇంకా రెండ్రోజుల సమయం ఉంది. ఎందుకు వచ్చావు?’ అని అడిగాను. అందుకు బదులుగా.. ‘లేదు.. లేదు.. నేను తప్పకుండా ఇక్కడ ఉండాల్సిందే’ అని ధోని జవాబు ఇచ్చాడు. సచిన్ కూడా అచ్చం ఇలాగే! నేను ముంబై ఇండియన్స్తో ఉన్నపుడు.. సచిన్ కూడా ఆన్షనల్ ప్రాక్టీస్ సెషన్ సమయంలో సచినే ముందు బస్సెక్కడం గమనించా. 25 నుంచి 26 ఏళ్లుగా క్రికెట్ ఆడుతున్న సమయంలోనూ అదే అంకితభావం. ఈ విషయంలో వీరిద్దరూ వాళ్లకు వాళ్లే సాటి. వాళ్లకు బ్రేక్ అవసరం లేదనుకుంటారు. ఇంకొన్ని ఏళ్లపాటు ఎంఎస్ ధోని.. చెన్నై సూపర్ కింగ్స్లో ఆటగాడిగా కొనసాగినా మనం ఆశ్చర్యపోనక్కర్లేదు. ఆట పట్ల అతడికి ఉన్న ప్రేమ అలాంటిది. అందుకే ఎప్పుడూ జట్టుకు అందుబాటులో ఉండాలనే ఆలోచిస్తూ ఉంటాడు’’ అని టీమిండియా మాజీ కెప్టెన్, దిగ్గజ స్పిన్నర్ అనిల్ కుంబ్లే అన్నాడు. సీఎస్కేను ఏకంగా ఐదుసార్లు చాంపియన్గా నిలిపిన కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనికి ఇదే ఆఖరి ఐపీఎల్ సీజన్ అన్న వార్తల నడుమ.. కుంబ్లే జియో సినిమా షోలో ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు. క్రికెట్ విషయంలో దిగ్గజ బ్యాటర్ సచిన్ టెండుల్కర్, ధోని ఆలోచనలు, అంకితభావం ఒకే విధంగా ఉంటాయని వారితో తనకున్న అనుభవాలు పంచుకున్నాడు. ధోనికి ఐపీఎల్-2024 చివరి సీజన్ కాబోదని.. మరికొన్నేళ్లపాటు అతడికి లీగ్లో కొనసాగే సత్తా ఉందని అనిల్ కుంబ్లే అభిప్రాయపడ్డాడు. ఈ వికెట్ కీపర్ బ్యాటర్ ఇప్పట్లో అలసిపోడంటూ 42 ఏళ్ల ధోనిని ఉద్దేశించి ప్రశంసలు కురిపించాడు. కాగా మార్చి 22న ఐపీఎల్-2024 సీజన్ ఆరంభం కానుంది. సీఎస్కే- ఆర్సీబీ మధ్య చెపాక్లో తొలి మ్యాచ్ జరుగనుంది. చదవండి: అతడితో పోలికా?.. బుమ్రానే బెస్ట్ బౌలర్: పాక్ మాజీ పేసర్ -
ప్రపంచంలో మొట్ట మొదటి బౌలర్గా అశ్విన్ అరుదైన ఘనత
టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. క్రికెట్ ప్రపంచంలో ఏ బౌలర్కూ ఇంత వరకు సాధ్యం కాని ఘనత సాధించాడు. కాగా 2011లో అంతర్జాతీయ టెస్టుల్లో అడుగుపెట్టాడు ఈ చెన్నై ఆటగాడు. ఢిల్లీ వేదికగా వెస్టిండీస్తో తన తొలి టెస్టు ఆడాడు. ఈ మ్యాచ్లో తొలి ఇన్నింగ్స్లో మూడు వికెట్లు తీసిన ఈ రైటార్మ్ స్పిన్నర్.. రెండో ఇన్నింగ్స్లో ఆరు వికెట్లతో చెలరేగాడు. అలా తన కెరీర్లో తొలి ఐదు వికెట్ల హాల్ నమోదు చేశాడు. తాజాగా తన వందో టెస్టులోనూ ఈ ఘనత సాధించాడు అశ్విన్. ధర్మశాల వేదికగా ఇంగ్లండ్తో జరిగిన మ్యాచ్లో తొలి ఇన్నింగ్స్లో నాలుగు వికెట్లకే పరిమితమైన అశూ.. రెండో ఇన్నింగ్స్లో 5 వికెట్లతో దుమ్ములేపాడు. View this post on Instagram A post shared by JioCinema (@officialjiocinema) ఈ నేపథ్యంలో.. అరంగేట్రంలో, వందో టెస్టులో ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేసిన తొలి బౌలర్గా అశ్విన్ ప్రపంచ రికార్డు సొంతం చేసుకున్నాడు. 147 ఏళ్ల టెస్టు చరిత్రలో ఈ ఘనత సాధించిన ఏకైక బౌలర్గా నిలిచాడు. కాగా అశ్విన్ తన కెరీర్లో ఇప్పటి వరకు మొత్తంగా 36 సార్లు ఐదు వికెట్ల హాల్ సాధించడం విశేషం. తద్వారా టీమిండియా స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లే పేరిట ఉన్న రికార్డు(35 సార్లు) బద్దలు కొట్టాడు. అంతేకాదు ఒకే ప్రత్యర్థి జట్టుపైన అత్యధిక టెస్టు వికెట్లు తీసిన తొలి భారత బౌలర్గానూ నిలిచాడు. ఇప్పటి వరకు అశ్విన్.. ఆస్ట్రేలియా మీద 114, ఇంగ్లండ్ మీద 114 వికెట్లు తీశాడు. ఇక రవిచంద్రన్ అశ్విన్.. ఇంగ్లండ్తో సిరీస్ సందర్భంగానే 500 వికెట్లు క్లబ్లో చేరాడు. అతడి ఖాతాలో ప్రస్తుతం 516 వికెట్లు ఉన్నాయి. ఇదిలా ఉంటే.. ధర్మశాలలో ఇంగ్లండ్తో జరిగిన నామమాత్రపు ఆఖరి టెస్టులో టీమిండియా భారీ విజయం సాధించింది. ఇన్నింగ్స్ 64 పరుగుల తేడాతో గెలిచి సిరీస్ను 4-1తో కైవసం చేసుకుంది. That series winning feeling 😃#TeamIndia 🇮🇳 complete a 4⃣-1⃣ series victory with a remarkable win 👏👏 Scorecard ▶️ https://t.co/OwZ4YNua1o#INDvENG | @IDFCFIRSTBank pic.twitter.com/vkfQz5A2hy — BCCI (@BCCI) March 9, 2024 చదవండి: #Sarfaraz: తెగ మిడిసిపడుతున్నాడు.. గిల్- బెయిర్స్టో గొడవలో సర్ఫరాజ్.. వైరల్ -
చరిత్ర సృష్టించిన అశ్విన్.. తొలి భారత క్రికెటర్గా
ధర్మశాల వేదికగా ఇంగ్లండ్తో జరిగిన ఐదో టెస్టులో టీమిండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అదరగొట్టాడు.కెరీర్లో వందో టెస్టు ఆడిన అశ్విన్.. తన స్పిన్ మయాజాలంతో ప్రత్యర్ధి జట్టుకు చుక్కలు చూపించాడు. తొలి ఇన్నింగ్స్లో 4 వికెట్లు పడగొట్టిన అశూ.. రెండో ఇన్నింగ్స్లో 5 వికెట్లతో సత్తాచాటాడు. జాక్ క్రాలీ, డకెట్, పోప్ వంటి కీలక వికెట్లు పడగొట్టి ఇంగ్లీష్ జట్టును దెబ్బతీశాడు. ఓవరాల్గా అశ్విన్ తన వందో టెస్టులో 9 వికెట్లు పడగొట్టాడు. ఇక రెండో ఇన్నింగ్స్లో 5 వికెట్లతో చెలరేగిన అశ్విన్ ఓ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. టెస్టు క్రికెట్ చరిత్ర అత్యధిక సార్లు 5 వికెట్ల ఘనత సాధించిన భారత బౌలర్గా అశ్విన్ రికార్డులెక్కాడు. అశ్విన్ ఇప్పటివరకు తన టెస్టు కెరీర్లో 36 సార్లు ఐదు వికెట్ల ఘనత సాధించాడు. ఇంతకుముందు ఈ రికార్డు భారత స్పిన్ లెజెండ్ అనిల్ కుంబ్లే పేరిట ఉండేది. కుంబ్లే 132 మ్యాచ్ల్లో 35 సార్లు ఫైవ్ వికెట్ల హాల్ సాధించాడు. తాజా మ్యాచ్లో కుంబ్లే ఆల్టైమ్ రికార్డును అశ్విన్ బ్రేక్ చేశాడు. టీమిండియా ఘన విజయం.. ఇక ధర్మశాల టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించింది. ఇంగ్లండ్ను ఇన్నింగ్స్ 64 పరుగుల తేడాతో భారత్ చిత్తు చేసింది. 259 పరుగుల వెనకంజతో రెండో ఇన్నింగ్స్ను ఆరంభించిన ఇంగ్లండ్.. 195 పరుగులకే కుప్పకూలింది. దీంతో ఇన్నింగ్స్ తేడాతో ఇంగ్లండ్ ఘోర ఓటమి చవిచూసింది. భారత బౌలర్లలో అశ్విన్ 5 వికెట్లతో చెలరేగగా.. జడేజా, కుల్దీప్ యాదవ్ తలా రెండు వికెట్లు పడగొట్టారు. అంతకుముందు ఇంగ్లండ్ తమ తొలి ఇన్నింగ్స్లో సైతం 218 పరుగులకే చాపచుట్టేసింది. అనంతరం టీమిండియా తమ తొలి ఇన్నింగ్స్లో 477 పరుగుల భారీ స్కోర్ సాధించింది. రోహిత్ శర్మ(103), గిల్(110) సెంచరీలతో మెరిశారు. దీంతో భారత్కు తొలి ఇన్నింగ్స్లో 259 పరుగుల ఆధిక్యం లభించింది. ఇక వరుసగా నాలుగు టెస్టుల్లో విజయం సాధించిన భారత్.. ఐదు మ్యాచ్ల సిరీస్ను 4-1 తేడాతో సిరీస్ సొంతం చేసుకుంది. టీమిండియా వర్సెస్ ఇంగ్లండ్ ఐదో టెస్టు స్కోర్లు ►టాస్: ఇంగ్లండ్.. తొలుత బ్యాటింగ్ ►ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ స్కోరు: 218 ►భారత్ తొలి ఇన్నింగ్స్లో చేసిన పరుగులు: 477 (ఓవరాల్గా 259 పరుగుల ఆధిక్యం) ►ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్: 195 ►విజేత: టీమిండియా.. ఇన్నింగ్స్ 64 పరుగుల తేడాతో గెలుపు ►ఐదు మ్యాచ్ల సిరీస్ 4-1తో టీమిండియా కైవసం View this post on Instagram A post shared by JioCinema (@officialjiocinema) -
IND VS ENG 4th Test: కుంబ్లే రికార్డును సమం చేసిన అశ్విన్
రాంచీ టెస్ట్లో రవిచంద్రన్ అశ్విన్ రికార్డులను కొల్లగొడుతున్నాడు. తొలుత భారత గడ్డపై టెస్టుల్లో అత్యధిక వికెట్ల (351) రికార్డును బద్దలుకొట్టిన అశ్విన్.. సెకెండ్ ఇన్నింగ్స్లో ఐదు వికెట్ల (5/51) ప్రదర్శన అనంతరం కుంబ్లే పేరిట ఉండిన అత్యధిక ఐదు వికెట్ల ఘనతల రికార్డును (భారత్ తరఫున) సమం చేశాడు. కుంబ్లే 132 టెస్ట్ల్లో 35 ఐదు వికెట్ల ఘనతలు నమోదు చేస్తే.. అశ్విన్ కేవలం 99 టెస్ట్ల్లోనే ఈ ఘనతను (35 ఐదు వికెట్ల ఘనతలు) సమం చేశాడు. సుదీర్ఘ ఫార్మాట్లో అత్యధిక సార్లు ఐదు వికెట్ల ఘనతలు నమోదు చేసిన రికార్డు స్పిన్ దిగ్గజం మురళీథరన్ పేరిట ఉంది. మురళీ 133 టెస్ట్ల్లో ఏకంగా 67 సార్లు ఐదు వికెట్ల ప్రదర్శనలు నమోదు చేశాడు. మురళీ తర్వాత అత్యధిక ఐదు వికెట్ల ప్రదర్శనల రికార్డు స్పిన్ మాంత్రికుడు షేన్ వార్న్ (145 టెస్ట్ల్లో 37 సార్లు) పేరిట ఉంది. వార్న్ తర్వాతి స్థానంలో రిచర్డ్ హ్యాడ్లీ (86 మ్యాచ్ల్లో 36 సార్లు) ఉన్నాడు. ఈ మ్యాచ్లో అశ్విన్ తొలుత బద్దలుకొట్టిన రికార్డు (భారత గడ్డపై టెస్టుల్లో అత్యధిక వికెట్ల రికార్డు) కూడా కుంబ్లే పేరిట ఉండినదే కావడం విశేషం. భారత్లో కుంబ్లే 350 వికెట్లు పడగొట్టాడు. మ్యాచ్ విషయానికొస్తే.. అశ్విన్ ఐదేయడంతో (5/51) ఇంగ్లండ్ సెకెండ్ ఇన్నింగ్స్లో 145 పరుగులకే కుప్పకూలి భారత్ ముందు 192 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఉంచింది. అశ్విన్తో పాటు కుల్దీప్ (4/22) కూడా చెలరేగడంతో ఇంగ్లండ్ సెకెండ్ ఇన్నింగ్స్ పేకమేడలా కూలింది. జడేజా ఓ వికెట్ పడగొట్టాడు. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన భారత్.. మూడో రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 40 పరుగులు చేసి లక్ష్యానికి మరో 152 పరుగుల దూరంలో ఉంది. రోహిత్ శర్మ (24), యశస్వి జైస్వాల్ (16) క్రీజ్లో ఉండగా.. భారత్ చేతిలో ఇంకా 10 వికెట్లు ఉన్నాయి. రెండు రోజుల ఆట మిగిలి ఉంది. ఇంగ్లండ్ సెకెండ్ ఇన్నింగ్స్లో జాక్ క్రాలే (60) ఒక్కడే అర్దసెంచరీతో రాణించాడు. మిగతా ఆటగాళ్లంతా దారుణంగా విఫలమయ్యారు. బెయిర్స్టో (30), ఫోక్స్ (17), డకెట్ (15), రూట్ (11) రెండంకెల స్కోర్లు చేయగా.. పోప్ 0, స్టోక్స్ 4, హార్ట్లీ 7, రాబిన్సన్ 0, ఆండర్సన్ 0 పరుగులకే ఔటయ్యారు. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్.. రూట్ (122) అజేయ సెంచరీతో కదంతొక్కడంతో తొలి ఇన్నింగ్స్లో 353 పరుగులు చేసింది. రాబిన్సన్ (58), జాక్ క్రాలే (42), బెయిర్స్టో (38), ఫోక్స్ (47) ఓ మోస్తరు స్కోర్లతో రాణించారు. భారత బౌలర్లలో జడేజా 4, ఆకాశ్దీప్ 3, సిరాజ్ 2, అశ్విన్ ఓ వికెట్ పడగొట్టారు. అనంతరం బ్యాటింగ్కు దిగిన టీమిండియా తొలి ఇన్నింగ్స్లో 307 పరుగులకు ఆలౌటైంది. యశస్వి జైస్వాల్ (73), దృవ్ జురెల్ (90) అర్దసెంచరీలతో రాణించారు. షోయబ్ బషీర్ (5/119) టీమిండియా పతనాన్ని శాశించగా.. హార్ట్లీ 3, ఆండర్సన్ 2 వికెట్లు పడగొట్టారు. ఐదు మ్యాచ్ల ఈ సిరీస్లో భారత్ 2-1 ఆధిక్యంలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. -
చెత్త రికార్డు.. అనిల్ కుంబ్లేను అధిగమించిన ఆండర్సన్
రాజ్కోట్ వేదికగా టీమిండియాతో జరుగుతున్న మూడో టెస్ట్లో ఇంగ్లండ్ వెటరన్ పేసర్ జేమ్స్ ఆండర్సన్ అనవరమైన చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. టెస్ట్ క్రికెట్ చరిత్రలో అత్యధిక పరుగులు సమర్పించుకున్న బౌలర్గా అవతరించాడు. ఈ చెత్త రికార్డును ఆండర్సన్.. భారత మాజీ స్పిన్నర్ అనిల్ కుంబ్లే ఖాతాలో నుంచి లాగేసుకున్నాడు. 2008లో రిటైరైన కుంబ్లే 132 మ్యాచ్ల టెస్ట్ కెరీర్లో 18, 355 పరుగులు సమర్పించుకోగా.. ఆండర్సన్ తన 185వ టెస్ట్లో కుంబ్లే రికార్డును అధిగమించాడు (18, 371). ఈ జాబితాలో లంక స్పిన్ దిగ్గజం ముత్తయ్య మురళీథరన్ మూడో స్థానంలో (133 టెస్ట్ల్లో 18180 పరుగులు) ఉండగా.. ఆసీస్ లెజెండ్ షేన్ వార్న్ (17995), ఇంగ్లండ్ మాజీ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ (16719) నాలుగు, ఐదు స్థానాల్లో నిలిచారు. 41 ఏళ్ల ఆండర్సన్ ప్రస్తుతం 696 వికెట్లతో టెస్ట్ల్లో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాళ్ల జాబితాలో మూడో స్థానంలో ఉన్నాడు. ఈ జాబితాలో మురళీథరన్ (800), షేన్ వార్న్ (708) తొలి రెండు స్థానాల్లో నిలిచారు. ఇదే మ్యాచ్లో భారత వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ 500 వికెట్ల మైలురాయిని తాకాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో 25 ఓవర్లు వేసిన ఆండర్సన్ 61 పరుగులిచ్చి ఓ వికెట్ పడగొట్టాడు. కాగా, ఈ మ్యాచ్లో రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ 2 వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసింది. ఓపెనర్ బెన్ డకెట్ మెరుపు సెంచరీ (118 బంతుల్లో 133 నాటౌట్; 21 ఫోర్లు, 2 సిక్సర్లు) అనంతరం ఇన్నింగ్స్ను కొనసాగిస్తున్నాడు. అతనితో పాటు జో రూట్ (9) క్రీజ్లో ఉన్నాడు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్లో జాక్ క్రాలే (15), ఓలీ పోప్ (39) ఔటయ్యారు. క్రాలే వికెట్ అశ్విన్కు దక్కగా.. పోప్ను సిరాజ్ పెవిలియన్కు పంపాడు. అంతకుముందు భారత్ తొలి ఇన్నింగ్స్లో 445 పరుగులకు ఆలౌటైంది. రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా సెంచరీలతో మెరిశారు. -
చరిత్రకు అడుగు దూరంలో అశ్విన్.. తొలి బౌలర్గా!?
రాజ్కోట్ వేదికగా గురువారం నుంచి ఇంగ్లండ్తో ప్రారంభం కానున్న మూడో టెస్టులో తలపడేందుకు టీమిండియా సన్నద్దమవుతోంది. ఇప్పటికే రాజ్కోట్కు చేరుకున్న భారత జట్టు నెట్స్లో తీవ్రంగా శ్రమిస్తోంది. ఈ క్రమంలో మూడో టెస్టుకు ముందు భారత వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ను ఓ అరుదైన రికార్డు ఊరిస్తోంది. రాజ్కోట్ టెస్టులో అశ్విన్ మరో 4 వికెట్లు పడగొడితే.. స్వదేశంలో టెస్టు క్రికెట్లో అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్గా రికార్డులకెక్కుతాడు. అశ్విన్ ఇప్పటివరకు భారత్లో 346 వికెట్లు పడగొట్టాడు. ప్రస్తుతం ఈ అరుదైన ఘనత సాధించిన జాబితాలో 350 వికెట్లతో భారత స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లే అగ్రస్ధానంలో ఉన్నాడు. అయితే అశ్విన్ మరో నాలుగు వికెట్లు పడగొడితే కుంబ్లే ఆల్టైమ్ రికార్డును బ్రేక్ చేస్తాడు. అదేవిధంగా అశ్విన్ మరో ఒక్క వికెట్ సాధిస్తే.. టెస్టుల్లో 500 వికెట్ల మైలురాయిని అందుకుంటాడు. ఈ ఘనత సాధించిన తొమ్మిదో క్రికెటర్గా, రెండో భారత బౌలర్గా అశ్విన్ నిలుస్తాడు. ఇంగ్లండ్తో మూడో టెస్టుకు భారత తుది జట్టు(అంచనా): రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, శుభ్మన్ గిల్, కేఎల్ రాహుల్, సర్ఫరాజ్ ఖాన్, అక్షర్ పటేల్, ధ్రువ్ జురెల్, కుల్దీప్ యాదవ్, రవిచంద్రన్ అశ్విన్, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్ -
ఇంగ్లండ్తో రెండో టెస్ట్.. అరుదైన రికార్డులపై కన్నేసిన అశ్విన్
విశాఖ వేదికగా రేపటి నుంచి (ఫిబ్రవరి 2) ప్రారంభంకాబోయే (ఇంగ్లండ్తో) రెండో టెస్ట్కు ముందు టీమిండియా స్టార్ స్పిన్నర రవిచంద్రన్ అశ్విన్ను ఓ అరుదైన రికార్డు ఊరిస్తుంది. ఈ మ్యాచ్లో యాష్ మరో 4 వికెట్లు తీస్తే టెస్ట్ల్లో 500 వికెట్ల మైలురాయిని తాకిన తొమ్మిదో పురుష క్రికెటర్గా రికార్డుల్లోకెక్కుతాడు. ప్రస్తుతం అశ్విన్ ఖాతాలో 496 వికెట్లు (96 మ్యాచ్లు) ఉన్నాయి. ఈ రికార్డుతో పాటు రెండో టెస్ట్లో అశ్విన్ మరిన్ని రికార్డులు కూడా సాధించే అవకాశం ఉంది. ఇంగ్లండ్పై అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్గా.. ఇంగ్లండ్తో టెస్ట్ల్లో 100 వికెట్లు పడగొట్టిన తొలి భారత బౌలర్గా.. భారత్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా.. అత్యధిక ఐదు వికెట్ల ఘనతలు సాధించిన భారత బౌలర్గా పలు రికార్డులు నెలకొల్పుతాడు. ఇంగ్లండ్పై అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్గా.. టెస్ట్ల్లో ఇంగ్లండ్పై అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్ రికార్డు భగవత్ చంద్రశేఖర్ పేరిట ఉంది. చంద్రశేఖర్ ఇంగ్లండ్తో 23 మ్యాచ్లు ఆడి 95 వికెట్లు పడగొట్టాడు. రేపటి నుంచి ప్రారంభంకాబోయే రెండో టెస్ట్లో అశ్విన్ (20 టెస్ట్ల్లో 93 వికెట్లు) మరో 3 వికెట్లు తీస్తే ఇంగ్లండ్పై అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్గా రికార్డుల్లోకెక్కుతాడు. 100 వికెట్లు పడగొట్టిన తొలి భారత బౌలర్గా.. భారత్-ఇంగ్లండ్ మధ్య జరిగిన టెస్ట్ల్లో ఇప్పటివరకు ఏ భారత బౌలర్ కూడా 100 వికెట్లు తీయలేదు. రేపటి నుంచి మొదలయ్యే రెండో టెస్ట్లో అశ్విన్ మరో 7 వికెట్లు తీస్తే.. ఇంగ్లండ్పై 100 వికెట్లు సాధించిన తొలి భారత బౌలర్గా రికార్డు నెలకొల్పుతాడు. ఇరు జట్ల మధ్య టెస్ట్ల్లో ఇప్పటివరకు జేమ్స్ ఆండర్సన్ (139 వికెట్లు) మాత్రమే 100 వికెట్ల మైలురాయిని దాటాడు. భారత్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా.. అశ్విన్ భారత గడ్డపై ఇప్పటివరకు 56 టెస్ట్ మ్యాచ్లు ఆడి 343 వికెట్లు పడగొట్టాడు. అశ్విన్ రెండో టెస్ట్లో మరో 8 వికెట్లు తీస్తే భారతగడ్డపై అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా అనిల్ కుంబ్లే (350) రికార్డును బద్దలు కొడతాడు. అత్యధిక ఐదు వికెట్ల ఘనతలు సాధించిన భారత బౌలర్గా.. కెరీర్లో ఇప్పటివరకు 34 సార్లు ఐదు వికెట్ల ఘనతలు సాధించిన అశ్విన్.. ఇంగ్లండ్తో రెండో టెస్ట్లో రెండు ఇన్నింగ్స్ల్లో ఐదు వికెట్ల ఘనతలు సాధిస్తే, అనిల్ కుంబ్లే పేరిట ఉన్న రికార్డు (భారత్ తరఫున అత్యధిక ఐదు వికెట్ల ఘనతలు) బద్దలవుతుంది. వైజాగ్ పిచ్ స్పిన్నర్లకు అనుకూలించే అవకాశం ఉండటంతో అశ్విన్ పై పేర్కొన్న రికార్డులన్నీ ఇదే మ్యాచ్లో సాధించినా అశ్చర్యపోనక్కర్లేదు. -
Ind vs Eng: ఎలా ఆడాలో నేర్చుకో గిల్: కుంబ్లే విమర్శలు
India vs England, 1st Test: ఇంగ్లండ్తో టెస్టులో టీమిండియా యువ క్రికెటర్ శుబ్మన్ గిల్ ఆట తీరుపై భారత స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లే పెదవి విరిచాడు. బ్యాటింగ్ ఆర్డర్లో మూడో స్థానంలో నిలదొక్కుకోవాలంటే గిల్ తన బ్యాటింగ్ టెక్నిక్ను మరింత మెరుగుపరచుకోవాలని సూచించాడు. రాహుల్ ద్రవిడ్, ఛతేశ్వర్ పుజారాల మాదిరి ఆడితే ఈ యువ ప్లేయర్కు టెస్టుల్లో మంచి భవిష్యత్తు ఉంటుందని కుంబ్లే అభిప్రాయపడ్డాడు. స్పిన్నర్లను ఎదుర్కోవడంలో శుబ్మన్ గిల్ ఇబ్బంది పడుతున్నాడని... బలహీనతలు అధిగమించడంపై దృష్టి సారించాలని హితవు పలికాడు. కాగా ఐదు మ్యాచ్ల సిరీస్లో భాగంగా హైదరాబాద్ వేదికగా టీమిండియా- ఇంగ్లండ్ మధ్య గురువారం తొలి టెస్టు ఆరంభమైంది. ఉప్పల్లో జరుగుతున్న ఈ మ్యాచ్లో వన్డౌన్లో బరిలోకి దిగిన గిల్.. 66 బంతులు ఎదుర్కొని 23 పరుగులు మాత్రమే చేసి అవుటయ్యాడు. స్ట్రైక్ రొటేట్ చేయడం నేర్చుకో ఇంగ్లండ్ స్పిన్నర్ టామ్ హార్ట్లే బౌలింగ్లో బెన్ డకెట్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. చెత్త షాట్ సెలక్షన్తో వికెట్ పారేసుకున్నాడు. ఈ నేపథ్యంలో అనిల్ కుంబ్లే స్పోర్ట్స్ 18తో మాట్లాడుతూ గిల్ బ్యాటింగ్ గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘‘ఒత్తిడి పెరుగుతున్న కొద్దీ.. గిల్ స్ట్రైక్ రొటేట్ చేయలేకపోతున్నాడు. క్లిష్ట పరిస్థితుల్లో ఎలా బ్యాటింగ్ చేయాలో గిల్ నేర్చుకోవాలి. ఒకవేళ తను నంబర్ 3లోనే కొనసాగాలని కోరుకుంటే.. ముఖ్యంగా భారత పిచ్లపై వన్డౌన్లో నెగ్గుకురావాలనే సంకల్పంతో ఉంటే.. స్పిన్నర్లను ఎదుర్కొనేందుకు ప్రత్యేక వ్యూహాలు రచించాలి. ద్రవిడ్, పుజారాలా రాణించాలనుకుంటే లేదంటే స్ట్రైక్ రొటేట్ చేస్తూ పోవాలి. గురువారం అతడు బాగానే బ్యాటింగ్ చేశాడు. కానీ శుక్రవారం నాటి రెండో రోజు ఆటలో చెత్త షాట్తో వికెట్ సమర్పించుకున్నాడు. నేను మళ్లీ చెప్తున్నా... పుజారా, ద్రవిడ్లా వన్డౌన్లో రాణించాలనుకుంటే కచ్చితంగా గిల్ స్ట్రైక్ రొటేట్ చేయాల్సిందే. స్పిన్ బౌలింగ్ ఆడేటపుడు మణికట్టును ఎక్కువగా ఉపయోగించాలి. షాట్ల ఎంపికలోనూ జాగ్రత్త వహించాలి’’ అని కుంబ్లే.. గిల్ ఆట తీరును ఉద్దేశించి వ్యాఖ్యానించాడు. చదవండి: ICC: అవార్డుల విజేతలు, జట్ల పూర్తి జాబితా! జింబాబ్వేకే ఆ పురస్కారం -
Ind vs Eng: చరిత్ర సృష్టించిన అశూ- జడ్డూ.. ఆల్టైమ్ రికార్డు బద్దలు
India vs England, 1st Test Day 1: ఇంగ్లండ్తో మ్యాచ్ సందర్భంగా టీమిండియా స్పిన్ ద్వయం రవిచంద్రన్ అశ్విన్- రవీంద్ర జడేజా సరికొత్త చరిత్ర సృష్టించారు. టెస్టుల్లో అత్యధిక వికెట్లు కూల్చిన భారత బౌలింగ్ జోడీగా ఘనత సాధించారు. ఈ క్రమంలో టీమిండియా స్పిన్ దిగ్గజ జంట అనిల్ కుంబ్లే- హర్భజన్ సింగ్ పేరిట ఉన్న రికార్డు బద్దలు కొట్టారు. కాగా భారత జట్టు స్వదేశంలో ఇంగ్లండ్లో ఐదు మ్యాచ్ల సిరీస్ ఆడుతున్న విషయం తెలిసిందే. 246 పరుగులకు ఇంగ్లండ్ ఆలౌట్ ఇందులో భాగంగా హైదరాబాద్ వేదికగా గురువారం మొదలైన తొలి టెస్టులో టాస్ ఓడిన టీమిండియా తొలుత బౌలింగ్ చేసింది. ఈ క్రమంలో బ్యాటింగ్కు దిగిన ఇంగ్లండ్ను 246 పరుగులకు ఆలౌట్ చేసింది. భారత బౌలర్లలో రవిచంద్రన్ అశ్విన్ మూడు, రవీంద్ర జడేజా మూడు, అక్షర్ పటేల్ రెండు, జస్ప్రీత్ బుమ్రా రెండు వికెట్లు తీశారు. ఈ నేపథ్యంలో తొలి రోజు ఆటలో అశూ- జడ్డూ మొదటి రోజు ఆటలో మొత్తం కలిపి ఆరు వికెట్లు తీశారు. దీంతో ఇప్పటి వరకు టెస్టుల్లో ఇద్దరూ కలిపి 505 వికెట్లు సంయుక్తంగా తమ ఖాతాలో వేసుకున్నారు. కుంబ్లే- భజ్జీ రికార్డు బద్దలు తద్వారా టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలింగ్ జోడీగా నిలిచారు. అంతకు ముందు ఈ రికార్డు కుంబ్లే- హర్భజన్ (501) పేరిట ఉండేది. ఇక ఈ జాబితాలో హర్భజన్ సింగ్- జహీర్ ఖాన్ జోడీ(474), ఉమేశ్ యాదవ్- అశ్విన్ జంట(431) నాలుగో స్థానంలో ఉంది. ఇదిలా ఉంటే.. ఇంగ్లండ్తో తొలి టెస్టులో ఓపెనర్లు జాక్ క్రాలే(20), బెన్ డకెట్(35), మార్క్వుడ్(11) వికెట్లను అశూ పడగొట్టగా.. ఒలీ పోప్(1), జో రూట్(29), టామ్ హార్ట్లే వికెట్లను జడ్డూ తన ఖాతాలో వేసుకున్నాడు. తుదిజట్లు: టీమిండియా రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభమన్ గిల్, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, శ్రీకర్ భరత్, అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, జస్ప్రీత్ బుమ్రా,మహ్మద్ సిరాజ్. ఇంగ్లండ్ జాక్ క్రాలే, బెన్ డకెట్, ఒలీ పోప్, జో రూట్, జానీ బెయిర్ స్టో, బెన్ స్టోక్స్ (కెప్టెన్), బెన్ ఫోక్స్ (వికెట్ కీపర్), రెహాన్ అహ్మద్, టామ్ టామ్ హార్ట్లే, మార్క్ వుడ్, జాక్ లీచ్. -
సౌతాఫ్రికా వెన్ను విరిచిన బుమ్రా.. టెస్టుల్లో 4 అరుదైన రికార్డులు
Ind vs SA 2nd Test Day 2: Jasprit Bumrah Records: సౌతాఫ్రికాతో రెండో టెస్టులో టీమిండియా ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కేప్టౌన్ వేదికగా సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్లో కేవలం రెండు వికెట్లకే పరిమితమైన ఈ స్పీడ్స్టర్.. రెండో ఇన్నింగ్స్లో ఏకంగా ఆరు వికెట్లు పడగొట్టాడు. న్యూలాండ్స్ పిచ్ మీద 63/3 ఓవర్నైట్ స్కోరుతో గురువారం బ్యాటింగ్ మొదలుపెట్టిన ఆతిథ్య ప్రొటిస్ జట్టుకు బుమ్రా ఆరంభం నుంచే చుక్కలు చూపించాడు. ముందు రోజు ట్రిస్టన్ స్టబ్స్ రూపంలో వికెట్ దక్కించుకున్న బుమ్రా.. రెండో రోజు ఆట మొదలైన తొలి ఓవర్లో(17.6వ ఓవర్)నే డేవిడ్ బెడింగ్హామ్ను అవుట్ చేసి శుభారంభం అందించాడు. ఆ తర్వాత మరో నాలుగు ఓవర్ల అనంతరం కైలీ వెరెనెను పెవిలియన్కు పంపాడు. అనంతరం మార్కో జాన్సెన్ను అద్భుత రీతిలో బౌల్డ్ చేసిన ఈ రైటార్మ్ పేసర్.. కేశవ్ మహరాజ్ వికెట్ను కూడా తన ఖాతాలో వేసుకుని ఐదు వికెట్ల హాల్ అందుకున్నాడు. ఈ క్రమంలో లుంగి ఎంగిడీని అవుట్ చేసిన సౌతాఫ్రికా ఇన్నింగ్స్ ముగించిన బుమ్రా ఖాతాలో ఆరో వికెట్ జమైంది. ఈ నేపథ్యంలో.. సౌతాఫ్రికాతో రెండో టెస్టు రెండో రోజు ఆట సందర్భంగా జస్ప్రీత్ బుమ్రా నాలుగు అరుదైన రికార్డులు సాధించాడు. అవేంటంటే.. 1. సౌతాఫ్రికాలో టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన మూడో భారత బౌలర్ 2. SENA(సౌతాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా) దేశాల్లో అత్యధిక సార్లు ఐదు వికెట్ల ఘనత సాధించిన నాలుగో భారత బౌలర్. 3. సౌతాఫ్రికాలో అత్యధికసార్లు ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేసిన రెండో భారత బౌలర్. 4. న్యూలాండ్స్ పిచ్ మీద టెస్టుల్లో అత్యధిక వికెట్లు కూల్చిన రెండో బౌలర్(ఏకైక భారత బౌలర్). బుమ్రా కంటే ముందు ఈ ఘనతలు సాధించిన బౌలర్లు 1. సౌతాఫ్రికాలో అత్యధిక టెస్టు వికెట్లు తీసిన భారత బౌలర్లు 45 - అనిల్ కుంబ్లే 43 - జవగళ్ శ్రీనాథ్ 38* - జస్ప్రీత్ బుమ్రా 35 - మహ్మద్ షమీ 30 - జహీర్ ఖాన్. ⭐⭐⭐⭐⭐ A 5-star performance from #JaspritBumrah in the 2nd innings, as he picks up his 4th witcket of the morning! Will his 9th Test 5-fer lead to a historic win for #TeamIndia? Tune in to #SAvIND 2nd Test LIVE NOW | Star Sports Network#Cricket pic.twitter.com/hjDyvSAJc3 — Star Sports (@StarSportsIndia) January 4, 2024 2. SENA దేశాల్లో టెస్టుల్లో అత్యధిక సార్లు ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేసిన భారత బౌలర్లు 7 - కపిల్ దేవ్ 6 - భగవత్ చంద్రశేఖర్ 6 - జహీర్ ఖాన్ 6 - జస్ప్రీత్ బుమ్రా. 3. సౌతాఫ్రికాలో టెస్టుల్లో అత్యధికసార్లు ఫైవ్ వికెట్ హాల్స్ తీసిన భారత బౌలర్లు 3 - జవగళ్ శ్రీనాథ్ 3 - జస్ప్రీత్ బుమ్రా 2 - వెంకటేష్ ప్రసాద్ 2 - ఎస్ శ్రీశాంత్ 2 - మహ్మద్ షమీ. 4. న్యూలాండ్స్ పిచ్(కేప్టౌన్) మీద అత్యధిక టెస్టు వికెట్లు తీసిన బౌలర్లు 25 - కొలిన్ బ్లైత్ (ఇంగ్లండ్) 18 - జస్ప్రీత్ బుమ్రా (భారత్)(న్యూలాండ్స్ పిచ్ మీద ఈ ఘనత సాధించిన ఏకైక బౌలర్) 17 - షేన్ వార్న్ (ఆస్ట్రేలియా) 16 - జేమ్స్ అండర్సన్ (ఇంగ్లండ్) 15 - జానీ బ్రిగ్స్ (ఇంగ్లండ్) బుమ్రా ధాటికి సౌతాఫ్రికా రెండో ఇన్నింగ్స్లో 176 పరుగులకు ఆలౌట్ అయింది. బుమ్రాకు ఆరు వికెట్లు దక్కగా.. ముకేశ్ కుమార్ రెండు, ప్రసిద్ కృష్ణ, సిరాజ్ ఒక్కో వికెట్ తీశారు. -
ద్రవిడ్ను కొనసాగిస్తారా? సాగనంపితే... టీమిండియా కొత్త కోచ్ ఎవరు..?
టీమిండియా హెడ్ కోచ్గా రాహుల్ ద్రవిడ్ రెండేళ్ల పదవీకాలం వరల్డ్కప్ 2023 ఫైనల్తో ముగిసింది. దీంతో భారత జట్టు కొత్త హెడ్ కోచ్ ఎవరనే అంశంపై చర్చ మొదలైంది. మరో దఫా కొనసాగాలా లేదా అనే దానిపై ఇంకా తేల్చుకోలేదని ద్రవిడ్ వరల్డ్కప్ అనంతరం మీడియా సమావేశంలో తెలిపాడు. మరి బీసీసీఐ రవిశాస్త్రిలా ద్రవిడ్ను రెండో దఫా కొనసాగిస్తుందో లేదో వేచి చూడాలి. ప్రస్తుతానికి అయితే ఆసీస్తో టీ20 సిరీస్కు స్టాండ్ ఇన్ కోచ్గా ఎన్సీఏ డైరెక్టర్ వీవీఎస్ లక్ష్మణ్ను బీసీసీఐ ఎంపిక చేసింది. ఒకవేళ ద్రవిడ్ రెండో దఫా కోచ్గా పని చేసేందుకు నిరాకరిస్తే లక్ష్మణ్ భారత జట్టు హెడ్ కోచ్ పదవి రేసులో ముందువరుసలో ఉంటాడు. ఈ పదవి కోసం లక్ష్మణ్తో పాటు మరో ఇద్దరు టీమిండియా దిగ్గజాలు పోటీలో ఉండే అవకాశం ఉందని తెలుస్తుంది. ఇటీవలే ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమర్గా ప్రకటించబడ్డ వీరేంద్ర సెహ్వాగ్, స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లే లక్ష్మణ్తో పాటు ప్రధాన పోటీదారులుగా నిలిచే ఛాన్స్ ఉంది. వీరిలో కుంబ్లేకు గతంలో భారత జట్టు హెడ్ కోచ్గా పని చేసిన అనుభవం ఉంది. ధోనిని ఒప్పించి అప్పచెబితే.. టీమిండియా హెడ్ కోచ్ పదవి ఖాళీ అయిన నేపథ్యంలో ఈ అంశంపై నెట్టింట జోరుగా చర్చలు సాగుతున్నాయి. కొందరు ద్రవిడ్నే కొనసాగించాలని అంటుంటే, మరికొందరు అతడిని సాగనంపాలని వాధిస్తున్నారు. ఒకవేళ హెడ్ కోచ్ పదవిలో కొనసాగేందుకు ద్రవిడ్ ఆసక్తి కనబర్చకపోతే లక్ష్మణ్, అనిల్ కుంబ్లే, సెహ్వాగ్లు రేసులో ఉంటారని ప్రచారం జరుగుతుంది. కొత్తగా కొందరు టీమిండియా మోస్ట్ సక్సెస్ఫుల్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని పేరును తెరపైకి తెస్తున్నారు. ధోనికి ఇష్టం లేకపోయినా అతన్ని ఒప్పించి మరీ భారత క్రికెట్ జట్టు కోచింగ్ బాధ్యతలు అప్పజెప్పాలని వారు పట్టుబడుతున్నారు. మరి భారత జట్టుకు కోచింగ్ ఇచ్చేందుకు ధోని ముందుకు వస్తాడో లేదో వేచి చూడాలి. -
మెకానికల్ ఇంజనీర్! పాక్ను ఒంటిచేత్తో ఓడించి.. టీమిండియా పరువు కాపాడి
‘‘మంచి, చెడులను అర్థం చేసుకోవడానికి చదువు ఉపయోగపడుతుంది. క్రికెట్ను కెరీర్గా ఎంచుకుంటే కచ్చితంగా విజయవంతమవుతామనే నమ్మకం లేదు. ఒకవేళ అనుకున్నది సాధించలేక నిరాశలో కూరుకుపోతే.. దానిని ఎలా అధిగమించాలో, భవిష్యత్ పరిణామాలకు ఎలా సంసిద్ధం కావాలో కూడా చదువు మనకు నేర్పిస్తుంది’’- అనిల్ కుంబ్లే టీమిండియా స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లే పుట్టినరోజు నేడు(అక్టోబరు 17). ఈ సందర్భంగా సచిన్ టెండుల్కర్, హర్భజన్ సింగ్ వంటి టీమిండియా మాజీ క్రికెటర్లు సహా అభిమానుల నుంచి ‘జంబో’కు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. మెకానికల్ ఇంజనీర్! ఈ నేపథ్యంలో అనిల్ కుంబ్లేకు సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలు మీకోసం.. కర్ణాటకలోని బెంగళూరులో 1970లో జన్మించాడు కుంబ్లే. చదువు, క్రికెట్.. రెండింటినీ సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాడు. ముందు టీమిండియాకు ఆడి.. తర్వాత పట్టా పుచ్చుకున్నాడు టీమిండియా తరఫున 1991- 92లో రాష్ట్రీయ విద్యాలయ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ నుంచి మెకానికల్ ఇంజనీరింగ్లో బీఈ డిగ్రీ అందుకున్న కుంబ్లే.. అంతకంటే ఓ ఏడాది ముందే టీమిండియా తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. జంబో ఖాతాలో ఎన్ని వంద వికెట్లంటే? షార్జాలో శ్రీలంకతో వన్డే మ్యాచ్ సందర్భంగా అరంగేట్రం చేశాడు. అదే ఏడాది ఇంగ్లండ్తో మ్యాచ్తో టెస్టుల్లోనూ ఎంట్రీ ఇచ్చాడు. 2008లో ఇంటర్నేషనల్ క్రికెట్కు గుడ్ బై చెప్పిన కుంబ్లే.. తన కెరీర్లో మొత్తంగా 132 టెస్టులు, 271 వన్డేలు ఆడాడు. ఆయా ఫార్మాట్లలో వరుసగా 619, 337 వికెట్లు పడగొట్టి అరుదైన ఘనతలు సాధించాడు ఈ రైట్ఆర్మ్ లెగ్బ్రేక్ స్పిన్నర్. కాగా టీమిండియా కెప్టెన్గానూ అనిల్ కుంబ్లే సేవలు అందించిన విషయం తెలిసిందే. ఒకే ఒక్క వన్డేకు కెప్టెన్గా 2007లో భారత టెస్టు జట్టు పగ్గాలు చేపట్టిన కుంబ్లే 14 మ్యాచ్లకు సారథ్యం వహించాడు. కానీ, వన్డే ఫుల్టైమ్ కెప్టెన్గా మాత్రం కుంబ్లేకు అవకాశం రాలేదు. అయితే, టెస్టు సారథి కావడానికి ముందే అంటే 2002లో ఇంగ్లండ్తో వన్డేలో జట్టును మందుండి నడిపించాడు. టీమిండియా తరఫున పొట్టి ఫార్మాట్లో నో ఎంట్రీ టీమిండియా తరఫున ఒక్క టీ20 మ్యాచ్ కూడా ఆడలేకపోయిన కుంబ్లే.. ఇండియన్ ప్రీమియర్ లీగ్లో మాత్రం రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు కెప్టెన్గా వ్యవహరించాడు. ఐపీఎల్లో హవా మొత్తంగా 42 ఐపీఎల్ మ్యాచ్లు ఆడి.. 45 వికెట్లు పడగొట్టాడు. ఇందులో మూడు 4- వికెట్ హాల్స్, ఒక 5-వికెట్ హాల్ ఉంది. కాగా మొట్టమొదటిసారిగా 2007లో ప్రవేశపెట్టిన టీ20 వరల్డ్కప్ టోర్నీలో పాల్గొనే భారత జట్టులో కుంబ్లేకు సెలక్టర్లు చోటివ్వలేదు. యువ ఆటగాళ్లకు అవకాశం ఇచ్చే క్రమంలో కుంబ్లేకు ఛాన్స్ దక్కలేదు. చివరిగా బెర్ముడాతో వెస్టిండీస్లో... బెర్ముడాతో 2007 వన్డే వరల్డ్కప్ సందర్భంగా అనిల్ కుంబ్లే తన చివరి అంతర్జాతీయ వన్డే ఆడాడు. ఈ మ్యాచ్లో కుంబ్లే.. త్రీ- వికెట్ హాల్తో మెరిశాడు. మొత్తంగా 38 పరుగులిచ్చి.. బెర్ముడా కెప్టెన్ ఇర్విన్ రొమేనీ, మిడిలార్డర్ బ్యాటర్ జెనీరో టకర్, టెయిలెండర్ మలాచి జోన్స్ వికెట్లు పడగొట్టాడు. చిరస్థాయిగా నిలిచిపోయే ప్రదర్శన ఇక అనిల్ కుంబ్లే కెరీర్తో పాటు టీమిండియా అభిమానుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయే అద్భుతం 1999, ఫిబ్రవరి 7న జరిగింది. వసీం అక్రం సారథ్యంలోని పాకిస్తాన్ జట్టు 2 మ్యాచ్ల టెస్టు సిరీస్ ఆడేందుకు భారత పర్యటనకు వచ్చింది. సొంతగడ్డపై పరువు నిలబెట్టేందుకు తొలి టెస్టులో 12 పరుగుల తేడాతో గెలుపొంది 1-0 ఆధిక్యంలో నిలిచి టీమిండియాకు సవాల్ విసిరింది. ఈ క్రమంలో సొంతగడ్డపై దాయాదితో చావోరేవో తేల్చుకోవాల్సిన పరిస్థితిలో భారత జట్టు ఢిల్లీలో రెండో టెస్టుకు సిద్ధమైంది. ఈ మ్యాచ్లో 252 పరుగుల వద్ద భారత్ తమ తొలి ఇన్నింగ్స్ ముగించగా.. పాక్ కథ 172 పరుగులకే ముగిసింది. ఇక రెండో ఇన్నింగ్స్లో మహ్మద్ అజారుద్దీన్ సారథ్యంలోని టీమిండియా 339 పరుగులు చేసి భారీ ఆధిక్యంలో నిలిచింది. పాక్ను ఒంటిచేత్తో ఓడించి.. ఈ క్రమంలో 420 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్ అనిల్ కుంబ్లే చావుదెబ్బ కొట్టాడు. పది వికెట్లు తానే తీసి పాక్ బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించాడు. తొలుత ఓపెనర్ షాహిద్ ఆఫ్రిదితో మొదలుపెట్టిన కుంబ్లే.. అందరినీ తానే పెవిలియన్కు పంపాడు. ఆ పది మంది వీరే ఆఫ్రిదితో పాటు సయీద్ అన్వర్, ఇయాజ్అహ్మద్, ఇంజమామ్ ఉల్ హక్, మహ్మద్ యూసఫ్, మొయిన్ ఖాన్, సలీం మాలిక్, వసీం అక్రం, ముస్తాక్ అహ్మద్, సక్లెయిన్ ముస్తాక్, వకార్ యూనిస్ వికెట్లు పడగొట్టి.. 10- వికెట్ హాల్ నమోదు చేసి సరికొత్త చరిత్ర సృష్టించాడు. టీమిండియా విజయంలో, సిరీస్ సమం కావడంలో కీలక పాత్ర పోషించి.. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. కుంబ్లే పుట్టిన రోజు సందర్భంగా మంగళవారం (అక్టోబరు 17) బీసీసీఐ ఇందుకు సంబంధించిన వీడియో షేర్ చేసింది. చదవండి: ఆస్ట్రేలియాతో మ్యాచ్.. పాకిస్తాన్ ఆటగాళ్లకు వైరల్ ఫీవర్! On his birthday, let's relive @anilkumble1074's brilliant 🔟-wicket haul against Pakistan 🎥🔽#TeamIndia pic.twitter.com/BFrxNqLxil — BCCI (@BCCI) October 17, 2023 -
చరిత్ర సృష్టించిన అశ్విన్.. తొలి భారత బౌలర్గా! దరిదాపుల్లో ఎవరూ లేరు
ఇండోర్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలో 99 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. తద్వారా మూడు వన్డేల సిరీస్ను మరో మ్యాచ్ మిగిలూండగానే 2-0 తేడాతో టీమిండియా సొంతం చేసుకుంది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన భారత్ 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 399 పరుగులు చేసింది. భారత ఇన్నింగ్స్లో శ్రేయస్ అయ్యర్(105), శుబ్మన్ గిల్ అద్భుత సెంచరీలతో చెలరేగగా.. సూర్యకుమార్ యాదవ్( 72 నాటౌట్), కేఎల్ రాహుల్(52) కీలక ఇన్నింగ్స్లు ఆడారు. భారత ఇన్నింగ్స్లలో ఏకంగా 31 ఫోర్లు, 18 సిక్సర్లు ఉండటం విశేషం. అనంతరం వర్షం కారణంగా ఆ్రస్టేలియా లక్ష్యాన్ని 33 ఓవర్లలో 317 పరుగులుగా (డక్వర్త్ లూయిస్ ప్రకారం) నిర్దేశించారు. ఆసీస్ 28.2 ఓవర్లలో 217 పరగులకు ఆలౌటైంది. ఆసీస్ బ్యాటరల్లో సీన్ అబాట్(54) టాప్ స్కోరర్గా నిలిచాడు. భారత బౌలర్లలో అశ్విన్ మూడు వికెట్లు పడగొట్టగా.. జడేజా, ప్రసిద్ద్ కృష్ణ చెరో రెండు వికెట్లు సాధించారు. రవి చంద్రన్ అశ్విన్ అరుదైన ఘనత.. ఇక తొలి వన్డేలో పెద్దగా అకట్టుకోపోయిన భారత స్పిన్నర్ రవి చంద్రన్ అశ్విన్.. రెండో వన్డేలో మాత్రం అదరగొట్టాడు. ఈ మ్యాచ్లో 3 వికెట్లతో ఆశూ సత్తాచాటాడు. 7 ఓవర్లు బౌలింగ్ చేసిన అశ్విన్.. 41 పరుగులిచ్చి 3వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. తద్వారా అశ్విన్ ఓ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. ఓ ప్రత్యర్ధి జట్టుపై అత్యధిక అంతర్జాతీయ వికెట్లు పడగొట్టిన భారత బౌలర్గా అశ్విన్ రికార్డులకెక్కాడు. ఆసీస్పై అశ్విన్ ఇప్పటివరకు మూడు ఫార్మాట్లు కలపి 144 వికెట్లు పడగొట్టాడు. అంతకుముందు ఈ రికార్డు భారత స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లే పేరిట ఉండేది. కుంబ్లే కూడా కంగారూలపైనే ఈ ఫీట్ సాధించాడు. ఆస్ట్రేలియాపై 142 అంతర్జాతీయ వికెట్లు సాధించాడు. తాజా మ్యాచ్తో కుంబ్లే ఆల్టైమ్ రికార్డు బద్దలు కొట్టాడు. అశ్విన్ దరిదాపుల్లో కూడా ఎవరూ లేరు. కుంబ్లే తర్వాత భారత మాజీ కెప్టెన్ కపిల్ దేవ్(141) ఉన్నాడు. చదవండి: IND VS AUS 2nd ODI: చరిత్ర సృష్టించిన టీమిండియా.. వన్డే క్రికెట్లో తొలి జట్టుగా ప్రపంచ రికార్డు -
ఆస్ట్రేలియాతో తొలి వన్డే.. అరుదైన రికార్డుకు చేరువలో అశ్విన్!
మొహాలీ వేదికగా జరగనున్న తొలి వన్డేలో ఆస్ట్రేలియాతో తలపడేందుకు టీమిండియా అన్నివిధాల సిద్దమైంది. శుక్రవారం మధ్యాహ్నం 1:30లకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. కాగా ఈ సిరీస్ వరల్డ్కప్ సన్నాహకాల్లో భాగంగా జరగనుంది. అయితే తొలి రెండు వన్డేలకు రెగ్యూలర్ కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, హార్దిక్ పాండ్యా, కుల్దీప్ యాదవ్కు విశ్రాంతి ఇచ్చారు. మరోవైపు గత కొంత కాలంగా జట్టుకు దూరంగా ఉంటున్న వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్కు సెలక్టర్లు అనుహ్యంగా పిలుపునిచ్చారు. ఈ క్రమంలో ఆస్ట్రేలియాతో తొలి వన్డేకు ముందు టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ను ఓ అరుదైన రికార్డు ఊరిస్తోంది. ఈ మ్యాచ్లో అశ్విన్ మరో మూడు వికెట్లు పడగొడితే.. ఆసీస్పై అన్ని ఫార్మాట్ల్లో కలిపి అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్గా రికార్డులకెక్కుతాడు. ప్రస్తుతం ఈ రికార్డు భారత స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లే(142 వికెట్లు) పేరిట ఉంది. అశ్విన్ 140 వికెట్లతో కుంబ్లే తర్వాతి స్ధానంలో ఉన్నాడు. తుది జట్లు (అంచనా).. భారత్: ఇషాన్ కిషన్, శుబ్మన్ గిల్, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, కేఎల్ రాహుల్(కెప్టెన్), రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, అశ్విన్, మహ్మద్ షమీ, సిరాజ్, బుమ్రా ఆస్ట్రేలియా: డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, స్టీవ్ స్మిత్, లబుషేన్, అలెక్స్ కేరీ, గ్రీన్, మార్కస్ స్టాయినిస్, ప్యాట్ కమిన్స్, స్పెన్సర్ జాన్సన్, అడమ్ జంపా, హేజిల్వుడ్ చదవండి: ODI World Cup 2023: వరల్డ్కప్ ట్రోఫీని ఎవరు తయారు చేశారో తెలుసా.. ధర ఎంతంటే? -
కౌన్ బనేగా కరోడ్పతిలో క్రికెట్ ప్రశ్న.. జవాబుకు 12 లక్షల 50 వేలు
నట దిగ్గజం అమితాబ్ బచ్చన్ వ్యాఖ్యాతగా వ్యవహరించే ప్రముఖ టీవీ క్విజ్ షో కౌన్ బనేగా కరోడ్పతిలో క్రికెట్కు సంబంధించిన ప్రశ్న వచ్చింది. 12 లక్షల 50 వేల రూపాయల ఈ ప్రశ్న భారత స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లేకు సంబంధించింది. ఈ ప్రశ్న నిన్న (సెప్టెంబర్ 19) ప్రసారమైన ఎపిసోడ్లో ఓ కంటెస్టెంట్ ఎదుర్కొన్నాడు. ప్రశ్న ఏమిటంటే..? భారత స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లే టెస్ట్ల్లో ఒకే ఇన్నింగ్స్లో 10కి 10 వికెట్లు (పాక్పై) తీసినప్పుడు బౌలర్ ఎండ్లో ఉన్న అంపైర్ ఎవరు..? ఈ ప్రశ్నకు ఆప్షన్స్గా పిలూ రిపోర్టర్, ఎస్ వెంకట్రాఘవన్, డేవిడ్ షెపర్డ్, ఏవీ జయప్రకాశ్ పేర్లు ఇచ్చారు. 12 లక్షల 50 వేల రూపాయల ఈ ప్రశ్నకు జవాబు మీకు తెలిసినట్లయితే కామెంట్ చేయండి. #OnThisDay in 1999, #TeamIndia spin legend @anilkumble1074 became the first Indian bowler and second overall to scalp all the 10 wickets in a Test innings. 👏👏 Watch that fantastic bowling display 🎥👇 pic.twitter.com/OvanaqP4nU — BCCI (@BCCI) February 7, 2021 కాగా, 1999 ఫిబ్రవరిలో పాక్తో జరిగిన ఢిల్లీ టెస్ట్లో కుంబ్లే ఒకే ఇన్నింగ్స్లో 10కి 10 వికెట్లు తీశాడు. యాదృచ్చికంగా ఆ 10 మంది ఔటైన సమయంలో బౌలర్ ఎండ్లో ఏవీ జయప్రకాశ్ అంపైర్గా ఉన్నాడు. ఆ మ్యాచ్ను టీమిండియా 212 పరుగుల తేడాతో గెలుపొంది, 2-2తో సిరీస్ను డ్రా చేసుకుంది. టెస్ట్ల్లో కుంబ్లే కాకుండా మరో ఇద్దరు మాత్రమే ఒకే ఇన్నింగ్స్లో 10కి 10 వికెట్లు పడగొట్టారు. కుంబ్లేకు ముందు జిమ్ లేకర్ (ఇంగ్లండ్), ఇటీవలికాలంలో న్యూజిలాండ్ స్పిన్ బౌలర్ అజాజ్ పటేల్ ఈ ఘనత సాధించారు. ఇదిలా ఉంటే, కుంబ్లే భారత తరఫున లీడింగ్ వికెట్ టేకర్గా కెరీర్ను ముగించిన విషయం తెలిసిందే. అతను భారత్ తరఫున 132 టెస్ట్లు ఆడి 619 వికెట్లు పడగొట్టాడు. ఇందులో 35 ఐదు వికెట్ల ఘనతలు ఉన్నాయి. టెస్ట్ల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో కుంబ్లే నాలుగో స్థానంలో ఉన్నాడు. అతనికి ముందు జేమ్స్ ఆండర్సన్ (690), షేన్ వార్న్ (708), ముత్తయ్య మురళీథరన్ (800) మాత్రమే ఉన్నారు. -
కుంబ్లేకు సాధ్యం కాలేదు.. కుల్దీప్ యాదవ్ సరికొత్త చరిత్ర!
Asia Cup 2023- India vs Sri Lanka- Kuldeep Yadav Records: టీమిండియా చైనామన్ బౌలర్ కుల్దీప్ యాదవ్ అద్భుత ఆట తీరుతో ఆకట్టుకుంటున్నాడు. ఆసియా కప్-2023లో భాగంగా సూపర్-4 దశలో తొలుత పాకిస్తాన్పై.. తాజాగా శ్రీలంకతో మ్యాచ్లో అదరగొట్టాడు. కొలంబోలో దాయాదితో పోరులో 8 ఓవర్ల బౌలింగ్లో ఈ లెఫ్టార్మ్ స్పిన్నర్ 25 పరుగులిచ్చి ఏకంగా 5 వికెట్లు తీశాడు. ఇక మంగళవారం అదే వేదికపై మరోసారి మెరిశాడు కుల్దీప్. టీమిండియా 213 పరుగుల లో స్కోరును కాపాడుకోవడంలో తన వంతు పాత్ర పోషించాడు. 9.3 ఓవర్ల బౌలింగ్లో 43 పరుగులిచ్చి 4 వికెట్లు తీశాడు. లంక టెయిలెండర్ మతీశ పతిరణను బౌల్డ్ చేసి.. టీమిండియా గెలుపును ఖరారు చేశాడు. 150 వికెట్ల క్లబ్లో అత్యంత వేగంగా ఈ క్రమంలో కుల్దీప్ యాదవ్ ఓ అరుదైన రికార్డు సాధించాడు. అంతర్జాతీయ వన్డేల్లో అత్యంత వేగంగా 150 వికెట్ల క్లబ్లో చేరిన రెండో భారత బౌలర్గా నిలిచాడు. తద్వారా బీసీసీఐ ప్రస్తుత చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టాడు. కుంబ్లేకు సాధ్యం కాని ఫీట్.. తొలి భారత స్పిన్నర్గా చరిత్ర అదే విధంగా.. టీమిండియా దిగ్గజ బౌలర్లు అనిల్ కుంబ్లే, జహీర్ ఖాన్లను అధిగమించాడు. అంతేకాదు.. వన్డేల్లో అత్యంత వేగంగా 150 వికెట్లు సాధించిన తొలి భారత స్పిన్నర్గానూ కుల్దీప్ చరిత్ర సృష్టించాడు. దిగ్గజ స్పిన్ బౌలర్ అనిల్ కుంబ్లేకు సాధ్యం కాని ఫీట్ నమోదు చేశాడు. ఇదిలా ఉంటే.. శ్రీలంకపై 41 పరుగులతో గెలుపొందిన టీమిండియా ఆసియా వన్డే కప్-2023 ఫైనల్లో ప్రవేశించింది. టీమిండియా తరఫున వన్డేల్లో అత్యంత వేగంగా 150 వికెట్లు సాధించిన బౌలర్లు ►మహ్మద్ షమీ- 80 మ్యాచ్లలో.. ►కుల్దీప్ యాదవ్- 88 మ్యాచ్లలో.. ►అజిత్ అగార్కర్- 97 మ్యాచ్లలో.. ►జహీర్ ఖాన్- 103 మ్యాచ్లలో.. ►అనిల్ కుంబ్లే- 106 మ్యాచ్లలో.. ►ఇర్ఫాన్ పఠాన్- 106 మ్యాచ్లలో.. అంతర్జాతీయ వన్డేల్లో అత్యంత వేగంగా 150 వికెట్ల క్లబ్లో చేరిన స్పిన్నర్లు ►సక్లెయిన్ ముస్తాక్- 78 మ్యాచ్లలో ►రషీద్ ఖాన్- 80 మ్యాచ్లలో ►అజంత మెండిస్- 84 మ్యాచ్లలో ►కుల్దీప్ యాదవ్- 88 మ్యాచ్లలో ►ఇమ్రాన్ తాహిర్- 89 మ్యాచ్లలో. చదవండి: Ind Vs SL: ప్రతి బంతికి వికెట్ తీయాలనుకుంటాడు.. అతడు అద్భుతం: రోహిత్ Asia Cup 2023 IND VS SL: చరిత్ర సృష్టించిన లంక యువ స్పిన్నర్ As 'KUL' as it gets! 🧊@imkuldeep18 continues his sensational form as he rips one through the batter, while @klrahul pulls off a sharp stumping. 💥 Tune-in to #AsiaCupOnStar, LIVE NOW on Star Sports Network#INDvSL #Cricket pic.twitter.com/NZccClhhRW — Star Sports (@StarSportsIndia) September 12, 2023 -
అరుదైన రికార్డు ముంగిట జడ్డూ! అదే జరిగితే కపిల్ను వెనక్కి నెట్టి.. ఏకంగా
Ravindra Jadeja Eyes On Kapil Dev Record: వెస్టిండీస్తో వన్డే సిరీస్ నేపథ్యంలో టీమిండియా సీనియర్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా అరుదైన సాధించే అవకాశం ఉంది. బార్బడోస్లో జడ్డూ గనుక మూడు వికెట్లు పడగొడితే భారత క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ పేరిట ఉన్న రికార్డు బద్దలు కొట్టే అవకాశం ఉంది. కాగా టెస్టు సిరీస్తో వెస్టిండీస్ పర్యటన ఆరంభించిన భారత జట్టు.. 1-0తో ట్రోఫీ కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. అరుదైన ఘనతకు మూడడుగుల దూరంలో ఈ క్రమంలో గురువారం (జూలై 27) నుంచి వన్డే సిరీస్ ఆరంభించనుంది. బార్బడోస్ వేదికగా తొలి మ్యాచ్ ఆడనుంది. ఇక గాయం నుంచి కోలుకుని పునరాగమనం చేసిన తర్వాత రవీంద్ర జడేజా ఆకాశమే హద్దుగా చెలరేగుతున్న విషయం తెలిసిందే. మూడు ఫార్మాట్లలోనూ టీమిండియాకు కీలకంగా మారిన జడ్డూకు తుది జట్టులో చోటు దక్కడం లాంఛనమే. కుంబ్లేతో సంయుక్తంగా ఈ క్రమంలో అతడు అరుదైన ముంగిట నిలిచాడు. అదేంటంటే.. వన్డే ఫార్మాట్లో వెస్టిండీస్పై కపిల్ దేవ్ 43 వికెట్లు తీశాడు. తద్వారా ఇప్పటి వరకు విండీస్తో వన్డేల్లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్గా కొనసాగుతున్నాడు. ఆ తర్వాతి స్థానంలో 41 వికెట్లతో అనిల్ కుంబ్లేతో కలిసి రవీంద్ర జడేజా ఉన్నాడు. ఒకవేళ తాజా సిరీస్లో భాగంగా మొదటి వన్డేలో జడ్డూ మూడు వికెట్లు తీశాడంటే.. కపిల్ దేవ్ను అధిగమించడం ఖాయం. ప్రస్తుతం జడ్డూ ఫామ్ చూస్తుంటే ఇదేమీ కష్టంకాదనిపిస్తోంది. కాగా మూడు వన్డేల సిరీస్లో భాగంగా.. జూలై 27, 29 నాటి మ్యాచ్లు బార్బడోస్లో జరుగనున్నాయి. ఆగష్టు 1 నాటి ఆఖరి వన్డేకు ట్రినిడాడ్ వేదిక కానుంది. వెస్టిండీస్తో వన్డే సిరీస్కు భారత జట్టు రోహిత్ శర్మ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), శుబ్మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, సంజూ సామ్సన్, ఇషాన్ కిషన్, శార్దుల్ ఠాకూర్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, చహల్, కుల్దీప్, జైదేవ్ ఉనాద్కట్, సిరాజ్, ఉమ్రాన్ మాలిక్, ముకేశ్ కుమార్. చదవండి: ఏడాదికి 50 కోట్ల సంపాదన! మరి.. ధోని సొంత అక్క పరిస్థితి ఎలా ఉందంటే! రెండ్రోజులు అక్కడే పెట్టిన అరటిపండును శ్రీశాంత్ తిన్నాడు! ఆఖరికి లోదుస్తులు కూడా.. -
చరిత్ర సృష్టించిన అశ్విన్.. అనిల్ కుంబ్లే రికార్డు బద్దలు
ట్రినిడాడ్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా పట్టు బిగుస్తోంది. తొలి ఇన్నింగ్స్లో దక్కిన 183 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ బ్యాటింగ్ మొదలెట్టిన టీమిండియా.. 24 ఓవర్లలోనే 2 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో రోహిత్ శర్మ(44 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్లతో 57), కిషన్(34 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్లతో 52) మెరుపు ఇన్నింగ్స్ ఆడారు. దీంతో 181/2 పరుగుల వద్ద తమ రెండో ఇన్నింగ్స్ను భారత్ డిక్లేర్ చేసింది. తొలి ఇన్నింగ్స్లో దక్కిన ఆధిక్యంతో కలిపి వెస్టిండీస్ ముందు 365 పరుగుల భారీ లక్ష్యం నిలిపింది. 365 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్ నాలుగో రోజు ఆటముగిసే సమయానికి రెండు వికెట్లు కోల్పోయి 76 పరుగులు చేసింది. క్రీజులో చంద్రపాల్(24), బ్లాక్వుడ్(20) పరుగులతో ఉన్నారు. భారత్ విజయానికి మరో 8 వికెట్లు అవసరమమవ్వగా.. వెస్టిండీస్కు ఇంకా 289 పరుగులు కావాలి. అశ్విన్ అరుదైన రికార్డు.. ఇక విండీస్ సెకెండ్ ఇన్నింగ్స్లో రెండు వికెట్లు పడగొట్టిన భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అరుదైన ఘనత సాధించాడు. టెస్టుల్లో వెస్టిండీస్పై అత్యధిక వికెట్లు పడగొట్టిన రెండో భారత బౌలర్గా అశ్విన్ రికార్డులకెక్కాడు. అశ్విన్ ఇప్పటివరకు విండీస్పై 75 వికెట్లు పడగొట్టాడు. ఈ క్రమంలో అనిల్ కుంబ్లే(74)ను అశ్విన్ అధిగమించాడు. ఈ అరుదైన ఫీట్ సాధించిన జాబితాలో కపిల్ దేవ్(89) ఉన్నారు. చదవండి: IND vs WI: రోహిత్, కిషన్ మెరుపు ఇన్నింగ్స్.. విజయానికి 8 వికెట్ల దూరంలో టీమిండియా -
అశ్విన్-జడేజాల ముంగిట వరల్డ్ రికార్డు.. మరో 3 వికెట్లు తీస్తే..!
భారత స్పిన్ ద్వయం రవిచంద్రన్ అశ్విన్-రవీంద్ర జడేజాల కోసం ఓ వరల్డ్ రికార్డు కాసుకు కూర్చుంది. ఈ స్పిన్ ద్వయం విండీస్తో జరుగుతున్న రెండో టెస్ట్ నాలుగో రోజు మరో 3 వికెట్లు పడగొడితే టెస్ట్ క్రికెట్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన స్పిన్ ద్వయంగా రికార్డుల్లోకెక్కుతుంది. ఈ ఇద్దరు కలిసి ఇప్పటివరకు టెస్ట్ల్లో 49 మ్యాచ్ల్లో 498 వికెట్లు పడగొట్టారు. వీరికి ముందు భారత మాజీ స్పిన్ ద్వయం అనిల్ కుంబ్లే-హర్భజన్ సింగ్ 54 మ్యాచ్ల్లో 501 వికెట్లు పడగొట్టారు. టెస్ట్ క్రికెట్ చరిత్రలో అత్యధిక వికెట్లు సాధించిన స్పిన్ ద్వయం రికార్డు కుంబ్లే-భజ్జీ జోడీ పేరిట ఉంది. విండీస్తో నేటి మ్యాచ్లో అశ్విన్-జడేజా ఇద్దరు కలిసి మరో 3 వికెట్లు పడగొడితే, కుంబ్లే-భజ్జీ జోడీని వెనక్కునెట్టి టెస్ట్ల్లో అత్యధిక వికెట్లు తీసిన స్పిన్ ద్వయం రికార్డును వారి ఖాతాలో వేసుకుంటారు. ఓవరాల్గా టెస్ట్ల్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన జోడీ రికార్డు ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలింగ్ పెయిర్ జేమ్స్ ఆండర్సన్-స్టువర్ట్ బ్రాడ్ పేరిట ఉంది. వీరిద్దరు కలిసి 137 టెస్ట్ల్లో 1034 వికెట్లు పడగొట్టారు. వీరి తర్వాత షేన్ వార్న్-గ్లెన్ మెక్గ్రాత్ ద్వయం ఉంది. వీరు 104 మ్యాచ్ల్లో 1001 వికెట్లు సాధించారు. ఈ జాబితాలో ప్రస్తుతం కుంబ్లే-భజ్జీ జోడీ 11వ స్థానంలో.. అశ్విన్-జడేజా జోడీ 12వ స్థానంలో ఉన్నాయి. ఇదిలా ఉంటే, రెండో టెస్ట్ మూడో రోజు ఆట ముగిసే సమయానికి విండీస్ తొలి ఇన్నింగ్స్లో 5 వికెట్ల నష్టానికి 229 పరుగులు చేసింది. కెప్టెన్ క్రెయిగ్ బ్రాత్వైట్ (75), తేజ్నరైన్ చంద్రపాల్ (33), కిర్క్ మెక్కెంజీ (32), జెర్మైన్ బ్లాక్వుడ్ (20), జాషువ డిసిల్వ (10) ఔట్ కాగా.. అలిక్ అథనేజ్ (37), జేసన్ హోల్డర్ (11) క్రీజ్లో ఉన్నారు. భారత బౌలర్లలో జడేజా 2, ముకేశ్ కుమార్, సిరాజ్, అశ్విన్ తలో వికెట్ పడగొట్టారు. అంతకుముందు భారత్ తొలి ఇన్నింగ్స్లో 438 పరుగులకు ఆలౌటైంది. 500వ అంతర్జాతీయ మ్యాచ్ ఆడుతున్న విరాట్ కోహ్లి (121) సెంచరీతో కదంతొక్కగా.. యశస్వి (57), రోహిత్ (80), జడేజా (61), అశ్విన్ (56)అర్ధసెంచరీలతో రాణించారు. విండీస్ బౌలర్లలో కీమర్ రోచ్, వార్రికన్ చెరో 3 వికెట్లు.. హోల్డర్ 2, గాబ్రియల్ ఓ వికెట్ పడగొట్టారు. -
అతడిని టెస్టుల్లోకి తీసుకురావాలి.. ఎందుకంటే: కుంబ్లే కీలక వ్యాఖ్యలు
Anil Kumble Comments: ‘‘టీమిండియా స్పిన్ విభాగంలో అశ్విన్- జడేజా అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నారు. ఇద్దరూ అత్యంత నాణ్యమైన స్పిన్ బౌలర్లు. మూడో స్పిన్నర్గా ఉన్న అక్షర్ పటేల్ కూడా వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటున్నాడు. అయితే వీరితో పాటు కుల్దీప్ యాదవ్కు కూడా వరుస ఛాన్స్లు ఇస్తే బాగుంటుంది’’ అని టీమిండియా దిగ్గజ స్పిన్నర్ అనిల్ కుంబ్లే అన్నాడు. కాగా వెస్టిండీస్ పర్యటనలో భాగంగా తొలి టెస్టులో అశ్విన్, జడేజా అదరగొట్టిన విషయం తెలిసిందే. ముఖ్యంగా అశూ ఏకంగా 12 వికెట్లతో చెలరేగి విండీస్ను కోలుకోలేని దెబ్బకొట్టాడు. మరోవైపు జడ్డూ సైతం 5 వికెట్లతో రాణించాడు. వీరిద్దరి విజృంభణతో టీమిండియా.. ఆతిథ్య జట్టును ఇన్నింగ్స్ 141 పరుగుల తేడాతో చిత్తు చేసింది. అద్భుత నైపుణ్యాలు కలిగిన వాడు ఈ నేపథ్యంలో అశూ- జడ్డూలను కొనియాడిన అనిల్ కుంబ్లే.. కుల్దీప్ యాదవ్ను కూడా అవకాశాలు ఇవ్వాలని మేనేజ్మెంట్కు విజ్ఞప్తి చేశాడు. ‘‘కుల్దీప్ అద్భుత నైపుణ్యాలు కలవాడు. అతడికి కచ్చితంగా జట్టులో చోటివ్వాలి. నిజానికి లెగ్ స్పిన్నర్లు అటాకింగ్గా ఉంటారు. అయితే కొన్నిసార్లు ధారాళంగా పరుగులు సమర్పించుకుంటారు కూడా! అలా అని వాళ్లను పక్కనపెట్టకూడదు. నైపుణ్యాలకు మరింతసాన బెట్టుకునేలా ప్రోత్సహించాలి. వాళ్లకు కూడా అవకాశాలు ఇవ్వాలి. టెస్టు జట్టులోకి తీసుకురావాలి టెస్టులకు కుల్దీప్ పనికివస్తాడు. తనకు ఛాన్స్ వచ్చిన ప్రతిసారి మంచి ప్రదర్శనలు ఇచ్చాడు. పరిమిత ఓవర్ల క్రికెట్లో చాలా మంది మణికట్టు స్పిన్నర్లు ఉన్నారు. కానీ మనం వాళ్ల సేవలను టెస్టుల్లో వినయోగించుకోలేకపోతున్నాం’’ అని కుంబ్లే జియో సినిమా షోలో తన అభిప్రాయాలు పంచుకున్నాడు. బంగ్లాదేశ్తో చివరిగా కాగా 28 ఏళ్ల కుల్దీప్ యాదవ్ చివరిగా గతేడాది డిసెంబరులో టీమిండియా తరఫున ఆడాడు. బంగ్లాదేశ్ పర్యటనలో భాగంగా తొలి టెస్టులో మొత్తంగా ఎనిమిది వికెట్లు పడగొట్టాడు. ఆ తర్వాత స్వదేశంలో ఆస్ట్రేలియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీ ఆడిన జట్టులో స్థానం దక్కింది కానీ ఆడే అవకాశం రాలేదు. ఈ నేపథ్యంలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, హెడ్కోచ్ రాహుల్ ద్రవిడ్లను ఉద్దేశిస్తూ కుంబ్లే ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు. చదవండి: రహానేను కించపరిచిన ఇషాన్! ఇవే తగ్గించుకుంటే మంచిది.. మొన్న కోహ్లికే.. -
చరిత్ర సృష్టించిన అశ్విన్.. ప్రపంచంలోనే తొలి స్పిన్నర్గా!
వెస్టిండీస్తో జరిగిన తొలి టెస్టులో టీమిండియా వెటరన్ రవిచంద్రన్ అశ్విన్ తన స్పిన్ మయాజాలాన్ని ప్రదర్శించాడు. రెండు ఇన్నింగ్స్ల్లోనూ విండీస్ బ్యాటర్లకు అశ్విన్ చుక్కలు చూపించాడు. తొలి ఇన్నింగ్స్లో 5 వికెట్లు తీసిన రవిచంద్రన్ అశ్విన్, రెండో ఇన్నింగ్స్లో 7 వికెట్లు పడగొట్టాడు. ఓవరాల్గా రెండు ఇన్నింగ్స్లు అశూ 12 వికెట్లు పడగొట్టాడు. తద్వారా పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. ►అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన రెండో భారత బౌలర్గా అశ్విన్ నిలిచాడు. ఇప్పటివరకు 271 మ్యాచ్లు అంతర్జాతీయ మ్యాచ్లు ఆడిన అశ్విన్.. 709 వికెట్లు పడగొట్టాడు. ఈ క్రమంలో భారత దిగ్గజ స్పిన్నర్ హర్బజన్ సింగ్(707)ను అశ్విన్ అధిగమించాడు. అశ్విన్ కెరీర్లో 27 ఫోర్ వికెట్, 34 ఫైవ్ వికెట్, ఎనిమిది 10 వికెట్ల హాల్స్ ఉన్నాయి. ఈ జాబితాలో అనిల్ కుంబ్లే 953 వికెట్లతో టాప్లో ఉన్నాడు. ► వెస్టిండీస్పై ఒకే టెస్టులో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్గా అశ్విన్ నిలిచాడు. అదే విధంగా విండీస్పై ఒకే టెస్టులో అత్యుత్తమ గణంకాలు నమోదు చేసిన తొలి స్పిన్నర్గా అశ్విన్ ప్రపంచ రికార్డు సృష్టించాడు. ఇంతకుముందు ఈ రికార్డు పాకిస్తాన్ మాజీ స్పిన్నర్ సయిద్ అజ్మల్ పేరిట ఉండేది. 2011లో జరిగిన ఓ టెస్టులో అజ్మల్ 11 వికెట్లు సాధించాడు. తాజా మ్యాచ్తో అజ్మల్ రికార్డును అశ్విన్ బ్రేక్ చేశాడు. ►విజయం సాధించిన సందర్భాల్లో అత్యధిక ఫైవ్ వికెట్ల హాల్స్ నమోదు చేసిన దివంగత ఆసీస్ స్పిన్నర్ షేర్ వార్న్ రికార్డును అశ్విన్ సమం చేశాడు. వీరిద్దరూ 28 సార్లు ఫైవ్ వికెట్ల హాల్స్ సాధించారు. ►టెస్టుల్లో అత్యధిక సార్లు ఐదు వికెట్ల ఘనత సాధించిన ఐదో బౌలర్గా అశ్విన్(34 సార్లు) నిలిచాడు . శ్రీలంక తరుపున 34 సార్లు ఫైవ్ వికెట్ల హాల్ సాధించిన రంగనా హేరాత్ రికార్డును సమం చేసిన అశ్విన్.. అనిల్ కుంబ్లే (35 సార్లు) తర్వాతి స్థానంలో నిలిచాడు. చదవండి: Rohit Sharma Serious On Ishan Kishan: సింగిల్ తీయడానికి 20 బంతులు.. కిషన్పై రోహిత్ సీరియస్! వీడియో వైరల్ -
Ind vs WI: అశ్విన్ అరుదైన ఘనత.. మూడో భారత బౌలర్గా చరిత్ర
West Indies vs India, 1st Test: వెస్టిండీస్తో తొలి టెస్టు సందర్భంగా టీమిండియా ప్రధాన స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అరుదైన మైలురాయిని చేరుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక వికెట్లు తీసిన మూడో భారత బౌలర్గా చరిత్రకెక్కాడు. కాగా టీమిండియా ప్రస్తుతం వెస్టిండీస్ పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ముందుగా రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్లో భాగంగా డొమినికా వేదికగా జూలై 12న తొలి మ్యాచ్ ఆరంభమైంది. టాస్ గెలిచిన ఆతిథ్య జట్టు తొలుత బ్యాటింగ్ ఎంచుకోగా భారత స్పిన్నర్ అశ్విన్ విండీస్ బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. ఓపెనర్లు క్రెగ్ బ్రాత్వైట్(20), తేజ్నరైన్ చందర్పాల్(12)లను అవుట్ చేసి ఆరంభంలోనే షాకిచ్చాడు. అల్జారీ జోసెఫ్ను అవుట్ చేయడం ద్వారా అదే విధంగా.. టెయిలెండర్లు అలిక్ అథనాజ్(47), అల్జారీ జోసెఫ్(4), వారికన్(1) వికెట్లు కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. మొత్తంగా ఐదు వికెట్లతో రాణించి తొలిరోజు ఆటలో టీమిండియా పైచేయి సాధించేందుకు సహకరించాడు. ఇదిలా ఉంటే.. అల్జారీ జోసెఫ్ను అవుట్ చేయడం ద్వారా ఇంటర్నేషనల్ కెరీర్లో అశూ 700వ వికెట్ సాధించాడు. కుంబ్లే, భజ్జీ తర్వాత తన 271వ మ్యాచ్ సందర్భంగా ఈ అరుదైన మైలురాయిని చేరుకున్నాడు. తద్వారా దిగ్గజ స్పిన్నర్ అనిల్ కుంబ్లే, ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ తర్వాత 700 వికెట్ల క్లబ్లో చేరిన మూడో భారత బౌలర్గా నిలిచాడు. కాగా కుంబ్లే తన అంతర్జాతీయ కెరీర్లో మొత్తంగా 403 మ్యాచ్లలో 956 వికెట్లు పడగొట్టి అగ్రస్థానంలో ఉన్నాడు. 16వ స్థానంలో ఇక భజ్జీ 711 వికెట్లతో రెండో స్థానంలో కొనసాగుతుండగా.. అశూ త్వరలోనే అతడి రికార్డును బద్దలుకొట్టే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే.. అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో శ్రీలంక స్పిన్ దిగ్గజం ముత్తయ్య మురళీధరన్ 1347 వికెట్లతో ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నాడు. ఈ జాబితాలో అశూ(702 వికెట్లు) 16వ స్థానంలో కొనసాగుతున్నాడు. చదవండి: Ind Vs WI: మనం తప్పు చేశామా అని పశ్చాత్తాపపడేలా చేశాడు! తొలిరోజే కోహ్లిని టీజ్ చేసిన ఇషాన్ కిషన్.. వీడియో వైరల్ -
Ind Vs WI: చెలరేగిన అశ్విన్.. అనిల్ కుంబ్లే అరుదైన రికార్డు బద్దలు
West Indies vs India, 1st Test: వెస్టిండీస్తో తొలి టెస్టు సందర్భంగా టీమిండియా వెటరన్ స్పిన్నర్ అరుదైన ఘనత సాధించాడు. దిగ్గజ బౌలర్ అనిల్ కుంబ్లే పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టాడు. కాగా రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్లు ఆడేందుకు భారత జట్టు విండీస్ పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. బౌలింగ్ ఎటాక్ ఆరంభించిన సిరాజ్ ఇందులో భాగంగా ఇరు జట్ల మధ్య బుధవారం (జూలై 12) తొలి టెస్టు ఆరంభమైంది. డొమినికా వేదికగా సాగుతున్న ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన కరేబియన్ జట్టు తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్ బౌలింగ్ ఎటాక్ ఆరంభించగా.. తొలి వికెట్ను మాత్రం తన ఖాతాలో వేసుకున్నాడు అశ్విన్. స్పిన్ మాయాజాలంతో వెస్టిండీస్ ఇన్నింగ్స్ 13వ ఓవర్లో అద్భుత బౌలింగ్తో తగెనరైన్ చందర్పాల్ను బోల్తా కొట్టించాడు. తన స్పిన్ మాయాజాలంతో చందర్పాల్ను బౌల్డ్ చేశాడు. దీంతో విండీస్వీ మ్యాచ్లో తొలి వికెట్ కోల్పోగా.. అశ్విన్ ఖాతాలో అరుదైన రికార్డు వచ్చి చేరింది. కాగా తగెనరైన్ చందర్పాల్ను అవుట్ చేసిన అశూ.. టెస్టుల్లో టీమిండియా తరఫున అత్యధిక వికెట్లు బౌల్డ్ చేయడం ద్వారా సాధించిన బౌలర్గా నిలిచాడు. ఈ క్రమంలో అనిల్ కుంబ్లే పేరిట ఉన్న రికార్డు బ్రేక్ చేశాడు. కుంబ్లేను అధిగమించి ఇక దిగ్గజ స్పిన్నర్ అనిల్ కుంబ్లే 94 సార్లు ప్రత్యర్థి జట్టు బ్యాటర్లను బౌల్డ్ చేయగా.. అశ్విన్.. చందర్పాల్ వికెట్తో తన నెంబర్ను 95గా నమోదు చేశాడు. ఇక మహ్మద్ షమీ 66 సార్లు, కపిల్ దేవ్ 88 సార్లు ప్రత్యర్థి జట్ల బ్యాటర్లను బౌల్డ్ చేశారు. కాగా ఈ మ్యాచ్లో అశ్విన్ 17వ ఓవర్ రెండో బంతికి కెప్టెన్ క్రెగ్ బ్రాత్వైట్ వికెట్ను కూడా పడగొట్టాడు. ఈ క్రమంలో 17 ఓవర్లు ముగిసేసరికి విండీస్ 38 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఇదిలా ఉంటే.. వెస్టిండీస్తో తొలి టెస్టు సందర్భంగా ఇషాన్ కిషన్, యశస్వి జైశ్వాల్ అరంగేట్రం చేశారు. ఈ ఇద్దరు లెఫ్టాండ్ బ్యాటర్లలో యశస్వి ఓపెనర్గా బరిలోకి దిగనుండగా.. ఇషాన్ వికెట్ కీపర్గా సేవలు అందించనున్నాడు. మరోవైపు.. ఇషాన్ రాకతో ఆంధ్ర క్రికెటర్ శ్రీకర్ భరత్పై వేటు పడింది. చదవండి: మార్కు చూపించిన తిలక్ వర్మ.. కెప్టెన్ ఇన్నింగ్స్తో విహారి! ఫైనల్లో జట్టును.. -
Ind Vs WI: దవడ పగిలినా బౌలింగ్ చేసి.. దిగ్గజ బ్యాటర్ వికెట్ తీసి!
India Tour Of West Indies: అనిల్ కుంబ్లే.. ఈ రైట్ఆర్మ్ లెగ్బ్రేక్ స్పిన్నర్ టీమిండియాకు పలు చిరస్మరణీయ విజయాలు అందించిన ఆటగాళ్లలో ఒకడు. తన సుదీర్ఘ కెరీర్లో మేటి జట్లతో ఆడే అవకాశం దక్కించుకున్న ఈ కర్ణాటక బౌలర్.. భారత్ తరఫున 132 టెస్టులాటి 619 వికెట్లు పడగొట్టాడు. టీమిండియా స్టార్ టెస్టు స్పిన్నర్లలో ఒకడిగా నిలిచాడు. 1990లో ఇంగ్లండ్తో టెస్టు మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన కుంబ్లే.. భారత జట్టు సారథిగానూ సేవలు అందించాడు. కెరీర్లో ఎదురైన సవాళ్లంటినీ అధిగమించి మేటి బౌలర్గా ఎదిగాడు. ఇక కుంబ్లేకు వెస్టిండీస్తో మ్యాచ్ అంటే చాలు పూనకాలే! బ్రియన్ లారా వంటి దిగ్గజాలను పెవిలియన్కు పంపితే ఆ మజానే వేరని భావించేవాడట! దవడ పగిలినా దవడ విరిగిపోయినా మైదానం వీడక బౌలింగ్ చేయడమే ఇందుకు నిదర్శనం. తాజాగా టీమిండియా వెస్టిండీస్ పర్యటన నేపథ్యంలో అనిల్ కుంబ్లే 2002 నాటి సంగతులు గుర్తు చేసుకున్నాడు. ఆంటిగ్వా టెస్టు సందర్భంగా మెర్విన్ ధిల్లాన్ షార్ట్ డెలివరీ కారణంగా బంతి బలంగా తాకి అనిల్ కుంబ్లే దవడ పగిలింది. దీంతో మ్యాచ్కు దూరమవ్వాల్సి పరిస్థితి. విరామ సమయంలో తన భార్య చేతనకు ఫోన్ చేసి విషయం చెప్పాడు కుంబ్లే. సర్జరీ కోసం ఇంటికి వస్తున్నానని ఆమెతో అన్నాడు. కానీ.. ఆ తర్వాత మళ్లీ బౌలింగ్ చేసేందుకు మైదానంలోకి దిగాడు. 14 ఓవర్ల పాటు బౌలింగ్ చేసి బ్రియన్ లారా వికెట్ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఆ తర్వాత స్వదేశానికి తిరిగివచ్చాడు. ఈ విషయం గురించి కుంబ్లే జియో సినిమా షోలో మాట్లాడుతూ.. ‘‘నా భార్య చేతనకు కాల్ చేసి.. సర్జరీ చేయించుకోవాలి ఇంటికి వస్తున్నా అని చెప్పాను. జోక్ చేస్తున్నా అనుకుంది అందుకోసం బెంగళూరులో అన్ని ఏర్పాట్లు చేస్తానని తను నాతో అంది. ఇక కాల్ కట్ చేసే ముందు.. ‘‘నేను వెళ్లి బౌలింగ్ చేస్తాను’’అని తనతో అన్నాను. కానీ చేతన నమ్మలేదు. నేను జోక్ చేస్తున్నా అనుకుంది’’ అని చెప్పుకొచ్చాడు. ఆరోజు తాను బౌలింగ్ కొనసాగించడం తనకు సంతృప్తినిచ్చిందని పేర్కొన్నాడు. కాగా ఆంటిగ్వా వేదికగా జరిగిన నాలుగో టెస్టు డ్రాగా ముగియగా.. 2002 నాటి ఐదు మ్యాచ్ల సిరీస్ను విండీస్ కైవసం చేసుకుంది. ఇదిలా ఉంటే తాజా పర్యటనలో భాగంగా బుధవారం (జూలై 12) నుంచి వెస్టిండీస్- టీమిండియా మధ్య టెస్టు సిరీస్ ఆరంభం కానుంది. చదవండి: రోహిత్, కోహ్లి కాదు.. విండీస్పై అత్యధిక టెస్టు సెంచరీలు సాధించింది ఇతడే! జట్టు నుంచి తప్పించడం కంటే కూడా అదే ఎక్కువగా బాధిస్తోంది: టీమిండియా స్టార్ -
అంబటి రాయుడికి ట్విస్ట్ ఇచ్చిన బీసీసీఐ అనిల్ కుంబ్లే షాకింగ్ రియాక్షన్..!
-
అది చాలా పెద్ద తప్పు.. అంబటి రాయుడికి అన్యాయం చేశారు: కుంబ్లే
భారత మాజీ క్రికెటర్, చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ ఆటగాడు అంబటి రాయుడు ఐపీఎల్కు గుడ్బై చెప్పిన సంగతి తెలిసిందే. ఐపీఎల్-2023 ఫైనల్ అనంతరం తన ఐపీఎల్ కెరీర్కు రాయుడు ముగింపు పలికాడు. కాగా ఐపీఎల్లో రాయుడు ఆరు టైటిల్లను తన ఖాతాలో వేసుకున్నాడు. మూడు టైటిల్స్ ముంబై ఇండియన్స్ తరపున సాధించగా.. మరో మూడు టైటిల్స్ సీఎస్కే తరపున గెలుచుకున్నాడు. ఇక ఐపీఎల్ విషయాన్ని పక్కన పెడితే.. రాయుడి వంటి అద్భుతమైన టాలెంట్ ఉన్న ఆటగాడికి బీసీసీఐ మాత్రం అన్యాయం చేసిందనే చెప్పుకోవాలి. భారత్ తరపున రాయుడు కేవలం 55 వన్డేలు, ఆరు టీ20లు మాత్రమే ఆడాడు. 2018-19 మధ్య కాలంలో భారత జట్టులో నాలుగో స్థానంలో సరైన ఆటగాడు లేని లోటు సృష్టంగా కన్పించింది. Throw back to an india -A game which was almost 2 decades ago.. when you see that 99% of the guys you have played with are either commentators, coaches,mentors and some politicians..you realise that it’s been quite a journey but the end is near.. 😂 pic.twitter.com/qm7iX7HCrV— ATR (@RayuduAmbati) May 3, 2023 ఈ సమయంలో రాయుడు నాలుగో స్థానంలో బ్యాటింగ్కు వచ్చి అద్భుతంగా రాణించాడు. దీంతో భారత జట్టు కష్టాలు తీరి పోయాయి అని, నాలుగో స్ధానానికి సరైన ఆటగాడు దొరికాడని అంతా భావించారు. ఇదే సమయంలో 2019 వన్డే ప్రపంచకప్లో రాయుడు అడుతాడని అంతా అనుకున్నారు. కానీ ఇక్కడే అస్సలు ట్విస్ట్ చోటుచేసుకుంది. 2019 వన్డే ప్రపంచకప్కు రాయుడును కాదని ఆల్రౌండర్ విజయ్ శంకర్ను ఎమ్మెస్కే ప్రసాద్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ ఎంపిక చేసింది. ఈ క్రమంలో తనను ఎంపిక చేయకపోవడంపై తీవ్ర నిరాశ చెందిన రాయుడు అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్నాడు. అయితే తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నప్పటికీ భారత్ తరపున ఆడే అవకాశం రాలేదు. ఇక ఇదే విషయంపై తాజాగా టీమిండియా మాజీ హెడ్ కోచ్ అనిల్ కుంబ్లే స్పందించాడు. "రాయుడు 2019 ప్రపంచకప్ ఆడాల్సింది. అందులో ఎలాంటి సందేహం లేదు. అది సెలక్షన్ కమిటీతో పాటు జట్టు మేనెజ్మెంట్ చేసిన పెద్ద తప్పు. అతడిని నాలుగో స్థానం కోసం సిద్ధం చేశారు. అటువంటిది ఆ తర్వాత జట్టులో స్థానం లేకుండా చేశారు. అది చాలా ఆశ్చర్యం కలిగించింది" అని ఐపీఎల్ ఫైనల్ తర్వాత జియో సినిమాలో మాట్లాడుతూ కుంబ్లే పేర్కొన్నాడు. కాగా ఆ సమయంలో భారత జట్టు కెప్టెన్గా విరాట్ కోహ్లి, హెడ్ కోచ్గా రవిశాస్త్రి ఉన్నారు. చదవండి: WTCFinal2023: ఇంగ్లండ్ గడ్డపై అడుగుపెట్టిన ఆ ఐదుగురు! ఫోటోలు వైరల్ -
క్రికెట్ దిగ్గజాలతో రోడ్ ట్రిప్
సాక్షి, చెన్నై: క్రికెట్ దిగ్గజాలు సచిన్, అనిల్ కుంబ్లే, యువరాజ్తో గో ఫర్ రోడ్ ట్రిప్ పేరిట వినూత్న కార్యక్రమాన్ని చేపట్టామని స్పిన్నీ వ్యవస్థాపకుడు నీరజ్ సింగ్ తెలిపారు. బుధవారం స్థానికంగా ఈ కార్యక్రమం గురించి ఆయన వివరించారు. ఐపీఎల్– 2023 సీజన్లో భాగంగా మే 28వ తేదీ వరకు జరిగే మ్యాచ్లలో అభిమానులు తమ జట్లను ప్రోత్సహించే విధంగా చేసే వినూత్న అంశాలను ప్రదర్శించనున్నట్లు పేర్కొన్నారు. గో ఫార్ ఫర్ యువర్ స్క్వాడ్ అన్నది స్పిన్నీ ఎస్యూవీ ద్వారా రోడ్ ట్రిప్లో క్రికెట్ అభిమానులను భాగస్వామ్యం చేస్తామన్నారు. యూట్యూబ్, ఇన్స్ట్రాగామ్ల ద్వారా అభిమానులు భాగస్వాములు కావచ్చునని పిలుపు నిచ్చారు. -
'కుంబ్లేతో గొడవలు.. హెడ్కోచ్గా నన్ను రమ్మని కోహ్లి కోరాడు'
2016లో భారత ప్రధాన కోచ్గా బాధ్యతలు చేపట్టిన అనిల్ కుంబ్లే.. 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ అనంతరం ఆ బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. అతడి స్థానంలో అప్పటివరకు టీమిండియా క్రికెట్ డైరక్టర్గా ఉన్న రవిశాస్త్రి హెడ్ కోచ్గా బాధ్యతలు చేపట్టాడు. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్-2017లో పాకిస్తాన్ చేతిలో టీమిండియా ఓటమిపాల్వడంతో కుంబ్లే ఆ నిర్ణయం తీసుకున్నట్లు అప్పటిలో వార్తలు వినిపించాయి. మరోవైపు బీసీసీఐ కూడా కావాలనే అతడి కాంట్రక్ట్ను పొడిగించలేదని పలువురు మాజీ క్రికెటర్లు అభిప్రాయపడ్డారు. ఇక ఈ ఏడాది కాలంలో అనిల్ కుంబ్లే, అప్పటి భారత కెప్టెన్ విరాట్ కోహ్లి మధ్య చాలా విబేధాలు చోటుచేసుకున్నాయి. ఇద్దరి మధ్య మనస్పర్ధల కారణంగా ఒకరినొకరు వ్యక్తిగతంగా దూషించుకునేదాకా వెళ్లారు. ఇక తాజాగా ఇదే విషయంపై టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. కుంబ్లే భారత హెడ్ కోచ్ పదవి నుంచి తప్పుకున్నాక, తనని ఆ బాధ్యతలు చేపట్టమని బీసీసీఐ కోరింది అని సెహ్వాగ్ తెలిపాడు. "2017లో అప్పటి బీసీసీఐ సెక్రటరీ అమితాబ్ చౌదరీ, విరాట్ కోహ్లి నన్ను కలిశారు. కోహ్లి, కుంబ్లేల మధ్య ఎంత ప్రయత్నించినా సఖ్యత కుదరడం లేదని అమితాబ్ నాతో చెప్పాడు. 2017 ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత కుంబ్లే కాంట్రాక్ట్ గడువు ముగియనుందని, అనంతరం భారత హెడ్కోచ్గా బాధ్యతలు తీసుకోవాల్సిందిగా కోరాడు. ఛాంపియన్స్ ట్రోఫీ ముగిసిన వెంటనే హెడ్ కోచ్ స్థాయిలో వెస్టిండీస్ పర్యటనకు వెళ్లవచ్చు అని చెప్పాడు. కోహ్లి కూడా అదే విషయం నన్ను అడిగాడు. అయితే నేను అందుకు ఒప్పుకోలేదు. ఎందుకంటే నా జీవితంలో నేను సాధించిన దానితో సంతోషంగా ఉన్నాను. నజాఫ్గఢ్లోని చిన్న రైతు కుటుంబం నుంచి వచ్చిన నాకు భారత్ తరపున ఆడే అవకాశం వచ్చింది. ఎంతో మంది అభిమానులను, వారి ప్రేమను పొందాను. అది నా జీవితానికి చాలు. ఒక వేళ నేను కెప్టెన్గా ఉన్న ఇదే గౌరవం పొందే వాడిని" అని న్యూస్ 18కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సెహ్వాగ్ పేర్కొన్నాడు. చదవండి: Asia cup 2023: భారత్- పాకిస్తాన్ మధ్య క్రికెట్ మ్యాచ్లు జరగాలి.. మోడీ సార్నే అడుగుతా? -
చరిత్ర సృష్టించిన అశ్విన్.. తొలి భారత బౌలర్గా! దరిదాపుల్లో ఎవరూ లేరు
అహ్మదాబాద్ వేదికగా టీమిండియాతో జరగుతున్న నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియా దుమ్మురేపింది. తమ మొదటి ఇన్నింగ్స్లో ఆసీస్ 480 పరుగులకు ఆలౌటైంది. ఆసీస్ బ్యాటర్లలో ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా(180), కామెరాన్ గ్రీన్(114) అద్భుతమైన సెంచరీలతో చెలరేగారు. వారితో పాటు టెయిలాండర్ టాడ్ మర్ఫీ(41) పరుగులతో ఆకట్టుకున్నాడు. ఇక భారత బౌలర్లలో వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మరో సారి తన మాయాజాలాన్ని ప్రదర్శించాడు. తొలి ఇన్నింగ్స్లో 6 వికెట్లతో అశ్విన్ సత్తాచాటాడు. కాగా అతడిపాటు షమీ రెండు వికెట్లు, అక్షర్, జడేజా తలా వికెట్ సాధించారు. కుంబ్లే రికార్డు బ్రేక్ చేసిన అశ్విన్ ఇక 6 వికెట్లతో చెలరేగిన అశ్విన్ పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. స్వదేశంలో టెస్టు క్రికెట్లో అత్యధిక ఐదు వికెట్ల హాల్స్ సాధించిన బౌలర్గా అశూ నిలిచాడు. ఇప్పటి వరకు ఈ రికార్డు భారత దిగ్గజ స్పిన్నర్ అనిల్ కుంబ్లే పేరిట ఉండేది. భారత్ గడ్డపై టెస్టుల్లో కుంబ్లే 25 సార్లు ఐదు వికెట్లు ఘనత సాధించాడు. ఇక తాజా మ్యాచ్లో 26వ ఐదు వికెట్ హాల్ నమోదు చేసిన అశ్విన్.. కుంబ్లేను అధిగమించాడు. కాగా అశ్విన్ దారిదాపుల్లో కూడా ఏ భారత బౌలర్ లేడు. ఇక ఓవరాల్గా అశ్విన్ ఇది అశ్విన్కు 32వ ఐదు వికెట్ల ఘనత కావడం విశేషం. అదే విధంగా మరో అరుదైన రికార్డును కూడా అశ్విన్ తన ఖాతాలో వేసుకున్నాడు. టెస్టు క్రికెట్లో ఆస్ట్రేలియాపై అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్గా అశ్విన్(113) రికార్డులకెక్కాడు. ఈ క్రమంలో అనిల్ కుంబ్లే(111) రికార్డును అశ్విన్ బ్రేక్ చేశాడు. వీరిద్దరూ మినహా మరే భారత బౌలర్ ఈ జట్టుపై 100 వికెట్లకు మించి తీయలేదు. మరోవైపు బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో అత్యధిక వికెట్లు పడగొట్టిన ఆసీస్ స్పిన్నర్ నాథన్ లియాన్(113) రికార్డును అశ్విన్ సమం చేశాడు. చదవండి: Ind Vs Aus: కోహ్లి కెప్టెన్సీలో ఏడేళ్లలో రెండుసార్లు! రోహిత్ సారథ్యంలో 24 గంటల్లోనే రెండుసార్లు! ఇంత ఘోరమా? -
ఆసీస్తో నాలుగో టెస్టు.. అరుదైన రికార్డుపై కన్నేసిన అశ్విన్
భారత్, ఆస్ట్రేలియా మధ్య అహ్మదాబాద్ వేదికగా గురువారం(మార్చి 9 నుంచి) నాలుగో టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది జరగనుంది. నాలుగు మ్యాచ్ల సిరీస్లో భారత్ 2-1 ఆధిక్యంలో నిలిచింది. నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనున్న మ్యాచ్లో గెలిచి సిరీస్ను చేజిక్కించుకోవడంతో పాటు ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్లో ఫైనల్లోకి ప్రవేశించాలని టీమిండియా కన్నేసింది. ఇదే సమయంలో నాలుగో టెస్టులో అందరి చూపు టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్పైనే ఉన్నాయి. అందుకు ఒక కారణం ఉంది. భారత స్టార్ బౌలర్ అశ్విన్ నాలుగో టెస్టులో భారత లెజెండరీ బౌలర్ అనిల్ కుంబ్లే రికార్డును బద్దలు కొట్టే అవకావం ఉంది. ఆసీస్తో నాలుగో టెస్టులో అశ్విన్ ఐదు వికెట్లు తీస్తే టెస్టు క్రికెట్లో ఆస్ట్రేలియాపై అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్గా అవతరిస్తాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియాపై అత్యధిక టెస్టు వికెట్లు తీసిన రికార్డు కుంబ్లే పేరిట ఉంది. ఆస్ట్రేలియాపై టెస్టు క్రికెట్లో అనిల్ కుంబ్లే 111 వికెట్లు పడగొట్టాడు. అశ్విన్ 107 వికెట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. వీరిద్దరూ మినహా మరే భారత బౌలర్ ఈ జట్టుపై 100 వికెట్లకు మించి తీయలేదు. ఇది కాకుండా స్వదేశంలో టెస్ట్ క్రికెట్లో కుంబ్లే, అశ్విన్ ఇద్దరూ తలో 25 వికెట్లు తీసిన రికార్డును కలిగి ఉన్నారు. దీనితో పాటు మరో రికార్డు కూడా ఎదురుచూస్తోంది. మ్యాచ్లో అశ్విన్ 10 వికెట్లు తీస్తే అన్ని ఫార్మాట్లు కలిపి 700 వికెట్ల మైలురాయిని అందుకోనున్నాడు. ఇప్పటివరకు కుంబ్లే(956 వికెట్లు), హర్భజన్(707 వికెట్లు) మాత్రమే ఉన్నారు. ఇక నాలుగో టెస్టు టీమిండియాకు కీలకంగా మారింది. మ్యాచ్లో గెలిస్తే ఎలాంటి అడ్డంకులు లేకుండా డబ్ల్యూటీసీ ఫైనల్కు అర్హత సాధిస్తుంది. ఒకవేళ మ్యాచ్ ఓడినా.. డ్రా చేసుకున్న ఇతర మ్యాచ్ల ఫలితాలపై ఆధారపడాల్సి వస్తుంది. తొలి మూడు టెస్టులు రెండున్నర రోజుల్లోనే ముగియగా.. తొలి రెండు టీమిండియా గెలవగా.. ఇండోర్ వేదికగా జరిగిన మూడో టెస్టులో ఆస్ట్రేలియా విజయం సాధించింది. -
చరిత్ర సృష్టించిన ఆసీస్ స్పిన్నర్.. అనిల్ కుంబ్లే రికార్డు బద్దలు
ఇండోర్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూటో టెస్టులో టీమిండియా ఓటమి దిశగా ప్రయాణిస్తోంది. రెండో రోజు ఆటలో భాగంగా భారత్ సెకెండ్ ఇన్నింగ్స్లో కేవలం 163 పరుగులకే కుప్పకూలింది. దీంతో ఆసీస్ ముందు కేవలం 76 పరుగుల లక్ష్యాన్నే మాత్రమే టీమిండియా నిర్దేశించింది. ఆస్ట్రేలియా స్పిన్నర్ నాథన్ లియోన్ 8 వికెట్లతో టీమిండియా పతనాన్ని శాసించాడు. ఈ క్రమంలో లియాన్ ఓ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా లియాన్ చరిత్ర సృష్టించాడు. భారత్ రెండో ఇన్నింగ్స్లో 57వ ఓవర్లో ఉమేష్ యాదవ్ను ఔట్ చేసిన లియాన్.. ఈ అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో నాథన్ ఇప్పటివరకు 112 వికెట్లు పడగొట్టాడు. కాగా ఇప్పటివరకు ఈ రికార్డు భారత దిగ్గజ స్పిన్నర్ అనిల్ కుంబ్లే(111) పేరిట ఉండేది. తాజా మ్యాచ్తో కుంబ్లే రికార్డును లియాన్ బ్రేక్ చేశాడు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లు.. నాథన్ లయన్- 112 వికెట్లు అనిల్ కుంబ్లే- 111 వికెట్లు రవిచంద్రన్ అశ్విన్- 106 వికెట్లు హర్భజన్ సింగ్- 95 వికెట్లు రవీంద్ర జడేజా- 84 వికెట్లు చదవండి: IND Vs AUS: టీమిండియా నిలబెట్టుకుంటే.. 141 ఏళ్ల రికార్డు బద్దలు! -
Ind Vs Aus: 688వ వికెట్ అత్యంత ప్రత్యేకం.. అశ్విన్ అరుదైన ఘనత
India vs Australia, 3rd Test: టీమిండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అరుదైన ఘనత సాధించాడు. అంతర్జాతీయ క్రికెట్లో భారత్ తరఫున అత్యధిక వికెట్లు పడగొట్టిన మూడో బౌలర్గా నిలిచాడు. ఈ క్రమంలో దిగ్గజ ఆల్రౌండర్ కపిల్దేవ్ను అధిగమించాడు. బోర్డర్- గావస్కర్ ట్రోఫీ-2023లో భాగంగా స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న టెస్టు సిరీస్లో అశూ అదరగొడుతున్న విషయం తెలిసిందే. తొలి టెస్టులో 8, రెండో టెస్టులో ఆరు వికెట్లతో సత్తా చాటి.. ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్లో నంబర్ 1గా అవతరించాడు. 688వ వికెట్.. ఈ క్రమంలో ఇండోర్లో జరుగుతున్న మూడో టెస్టులోనూ అశ్విన్ ప్రభావం చూపుతున్నాడు. గురువారం నాటి రెండో రోజు ఆటలో భాగంగా మూడు వికెట్లు పడగొట్టాడు అశూ. తొలుత హ్యాండ్స్కోంబ్(19) తర్వాత అలెక్స్ క్యారీ(3)ని అవుట్ చేశాడు. కాగా క్యారీ వికెట్ అశ్విన్ కెరీర్లో 688వది. దీంతో అతడు ఈ అరుదైన జాబితాలో చేరాడు. ఇక ఆఖర్లో అశూ నాథన్ లియోన్ వికెట్ కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. ఇదిలా ఉంటే.. ఇండోర్ టెస్టులో టీమిండియా 109 పరుగులకు తొలి ఇన్నింగ్స్ ముగించగా.. ఆస్ట్రేలియా 197 పరుగులకు ఆలౌట్ అయింది. రవీంద్ర జడేజాకు నాలుగు, అశ్విన్కు మూడు, ఉమేశ్ యాదవ్కు మూడు వికెట్లు దక్కాయి. అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక వికెట్లు తీసిన టీమిండియా బౌలర్లు(ఇప్పటివరకు) 1.అనిల్ కుంబ్లే- 953(499) 2.హర్భజన్ సింగ్- 707(442) 3.రవిచంద్రన్ అశ్విన్- 688*(347) 4.కపిల్ దేవ్- 687(448) 5.జహీర్ ఖాన్- 597(373) నంబర్ 1 అశ్విన్ ఆస్ట్రేలియాతో రెండో టెస్టులో ఆరు వికెట్లు పడగొట్టిన ప్రదర్శన... భారత మేటి స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ను మళ్లీ ప్రపంచ నంబర్వన్ బౌలర్గా చేసింది. బుధవారం విడుదల చేసిన అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) బౌలర్ల ర్యాంకింగ్స్లో ఇంగ్లండ్ పేస్ బౌలర్ జేమ్స్ అండర్సన్ను రెండో స్థానానికి పంపించి అశ్విన్ నంబర్వన్ స్థానాన్ని అందుకున్నాడు. 36 ఏళ్ల అశ్విన్ తొలిసారి 2015లో టాప్ ర్యాంక్లో నిలిచాడు. ఆ తర్వాత పలుమార్లు అతను ఈ ఘనత సాధించాడు. గత మూడు వారాల్లో టాప్ ర్యాంక్లో ముగ్గురు వేర్వేరు బౌలర్లు నిలవడం విశేషం. అండర్సన్కంటే ముందు ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ఈ స్థానంలో ఉన్నాడు. ఇప్పటివరకు 90 టెస్ట్లు ఆడిన అశ్విన్ 463 వికెట్లు పడగొట్టాడు. ఈ చెన్నై స్పిన్నర్ 864 రేటింగ్ పాయింట్లతో తాజాగా అగ్రస్థానానికి చేరుకోగా... అండర్సన్ 859 పాయింట్లతో రెండో స్థానానికి పడిపోయాడు. కమిన్స్ మూడో స్థానానికి చేరుకోగా... భారత్కే చెందిన బుమ్రా నాలుగో ర్యాంక్లో, షాహీన్ అఫ్రిది (పాకిస్తాన్) ఐదో ర్యాంక్లో ఉన్నారు. టెస్ట్ ఆల్రౌండర్ల ర్యాంకింగ్స్లో రవీంద్ర జడేజా తొలి స్థానంలో, అశ్విన్ రెండో స్థానంలో, అక్షర్ పటేల్ ఐదో స్థానంలో ఉన్నారు. చదవండి: Jasprit Bumrah: న్యూజిలాండ్కు వెళ్లనున్న బుమ్రా Ind Vs Aus: ఇప్పటి వరకు అత్యంత చెత్త పిచ్ ఇదే! కానీ 109 పరుగులకే ఆలౌట్ కావడం వారి వైఫల్యమే! అప్పుడు కూడా ఇదే మాట అంటారా? -
ఆస్ట్రేలియాతో మూడో టెస్టు.. భారీ రికార్డుపై కన్నేసిన అశ్విన్!
బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో భాగంగా తొలి రెండు టెస్టుల్లో ఘన విజయం సాధించిన టీమిండియా.. ఇప్పుడు మూడో టెస్టులోనూ అదే ఫలితాన్ని రిపీట్ చేయాలని ఊవ్విళ్లూరుతోంది. మరోవైపు తొలి రెండు టెస్టుల్లో ఘోర పరాభావం చవిచూసిన ఆస్ట్రేలియా కనీసం మూడో టెస్టులోనైనా పోటీ ఇవ్వాలని భావిస్తోంది. కాగా ఇరు జట్ల మధ్య మూడో టెస్టు మార్చి1 నుంచి ఇండోర్ వేదికగా ప్రారంభం కానుంది. ఇక ఈ మ్యాచ్లో భారత్ విజయం సాధిస్తే నేరుగా ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్కు అర్హత సాధిస్తుంది. ఇది ఇలా ఉండగా.. మూడో టెస్టుకు ముందు భారత వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్కు ఓ అరుదైన రికార్డు ఊరిస్తోంది. ఇండోర్ టెస్టులో అశ్విన్ మరో 9 వికెట్లు సాధిస్తే.. బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్గా నిలుస్తాడు. ఇప్పటివరకు బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో అశ్విన్ 103 వికెట్లు తీశాడు. ఇక ఈ అరుదైన ఘనత సాధించిన జాబితాలో భారత దిగ్గజం అనిల్ కుంబ్లే 111 వికెట్లతో తొలి స్థానంలో ఉన్నాడు. మరో 9 వికెట్లు అశూ సాధిస్తే.. కుంబ్లేను అధిగమించి అగ్ర స్థానానికి చేరుకుంటాడు. ఇక ఈ సిరీస్లో అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. తొలి రెండు టెస్టుల్లో ఏకంగా 14 వికెట్లు పడగొట్టాడు. ప్రస్తుత అశ్విన్ జోరును చూస్తుంటే కుంబ్లే రికార్డును ఈజీగా బ్రేక్ చేసే అవకాశం ఉంది. చదవండి: Virat Kohli: ఎన్నో విజయాలు అందించా.. అయినా ఫెయిల్యూర్ కెప్టెన్ అంటూ! -
Ravindra Jadeja: కోహ్లి, అశ్విన్లతో సమానమయ్యాడు.. నెక్స్ట్ టార్గెట్ అనిల్ కుంబ్లే
BGT 2023 IND VS AUS 2n Test: టీమిండియా స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా ఇటీవలి కాలంలో ఫార్మాట్లకతీతంగా ఆకాశమే హద్దుగా చెలరేగుతున్న విషయం విధితమే. గాయం కారణంగా (ఆసీస్తో టెస్ట్ సిరీస్కు ముందు) గత ఆరు నెలలుగా అంతర్జాతీయ క్రికెట్కు దూరంగా ఉన్న జడ్డూ భాయ్.. వచ్చీ రాగానే టెస్ట్ల్లో తన మార్కు హవాను కొనసాగిస్తున్నాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ-2023లో భాగంగా నాగ్పూర్ వేదికగా జరిగిన తొలి టెస్ట్లో 7 వికెట్లతో (5/47, 70, 2/34) పాటు కీలకమైన హాఫ్సెంచరీ చేసిన జడ్డూ.. న్యూఢిల్లీలో జరిగిన రెండో టెస్ట్లో బంతితో భీకర స్థాయిలో విజృంభించి ఏకంగా 10 వికెట్లు (3/68, 26, 7/42) పడగొట్టాడు. ఈ మ్యాచ్లోనూ బ్యాట్తో పర్వాలేదనిపించిన జడేజా.. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు అత్యంత కీలకమైన 26 పరుగులు స్కోర్ చేశాడు. 10 వికెట్ల ప్రదర్శనతో అదరగొట్టి, ఆసీస్ వెన్నులో వణుకు పుట్టించినందుకు గాను జడేజాకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. ఈ అవార్డును జడేజా తన 62 టెస్ట్ మ్యాచ్ల కెరీర్లో తొమ్మిదోసారి అందుకున్నాడు. ఈ అవార్డు అందుకునే క్రమంలో జడ్డూ.. సహచర స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్, విరాట్ కోహ్లిల రికార్డును సమం చేశాడు. కోహ్లి తన 106 టెస్ట్ మ్యాచ్ల కెరీర్లో 9 సార్లు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డును అందుకోగా.. అశ్విన్ 90 టెస్ట్ల కెరీర్లో ఇన్నే సార్లు ఈ అవార్డును దక్కించుకున్నాడు. జడ్డూ మరోసారి టెస్ట్ల్లో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డును అందుకుంటే, దిగ్గజ స్పిన్నర్ అనిల్ కుంబ్లే రికార్డును సమం చేస్తాడు. భారత తరఫున అత్యధిక సార్లు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు గెలిచిన క్రికెటర్ల జాబితాలో సచిన్ అగ్రస్థానంలో ఉండగా.. రాహుల్ ద్రవిడ్, అనిల్ కుంబ్లే, జడేజా, అశ్విన్, కోహ్లి వరుసగా 2 నుంచి 5 స్థానాల్లో ఉన్నారు. కెరీర్లో 200 టెస్ట్లు ఆడిన సచిన్ 14 సార్లు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు గెలుచుకోగా.. 163 టెస్ట్లు ఆడిన ద్రవిడ్ 11 సార్లు, 132 మ్యాచ్లు ఆడిన కుంబ్లే 10 సార్లు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డుకు ఎంపికయ్యారు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ-2023లో ఇంకా రెండు టెస్ట్ మ్యాచ్లు ఆడాల్సి ఉన్నందున జడేజా ఈ సిరీస్లోనే ద్రవిడ్ రికార్డును కూడా సమం చేసే అవకాశం ఉంది. ఇండోర్లో మార్చి 1-5 వరకు మూడో టెస్ట్, అహ్మదాబాద్లో మార్చి 9-13 వరకు నాలుగో టెస్ట్ మ్యాచ్ జరుగనుంది. అనంతరం టీమిండియా ఆసీప్తో మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ ఆడుతుంది. మార్చి 17, 19, 22 తేదీల్లో ముంబై, వైజాగ్, చెన్నైల్లో మూడు వన్డేలు జరుగనున్నాయి. -
BGT 2023: అలెక్స్ క్యారీ వికెట్ ప్రత్యేకం.. అశ్విన్ అరుదైన రికార్డు
India vs Australia, 2nd Test - Ravichandran Ashwin: టీమిండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అరుదైన ఘనత సాధించాడు. ఆస్ట్రేలియాతో టెస్టుల్లో వంద వికెట్లు పడగొట్టిన రెండో భారత బౌలర్గా చరిత్రకెక్కాడు. టీమిండియా దిగ్గజ స్పిన్నర్ అనిల్ కుంబ్లే(111 వికెట్లు) తర్వాత ఈ ఫీట్ నమోదు చేసిన బౌలర్గా నిలిచాడు. వంద వికెట్ల ఘనత బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా స్వదేశంలో జరుగుతున్న రెండో టెస్టు సందర్భంగా అశ్విన్ ఈ ఘనత సాధించాడు. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా తొలి రోజు ఆటలో ఆసీస్ వికెట్ కీపర్ బ్యాటర్ అలెక్స్ క్యారీని డకౌట్ చేసి.. ఆస్ట్రేలియాపై వంద వికెట్ల మార్కును అందుకున్నాడు. ఇక సమకాలీన క్రికెటర్లలో రవీంద్ర జడేజా(71) తప్ప అశ్విన్ దరిదాపుల్లో కూడా ఎవరూ లేరు. అగ్రస్థానంలో వార్న్ ఇదిలా ఉంటే.. ఒకే ప్రత్యర్థి జట్టుపై అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా దివంగత ఆసీస్ దిగ్గజం షేన్ వార్న్ రికార్డులకెక్కాడు. ఇంగ్లండ్తో టెస్టుల్లో అతడు.. 195 వికెట్లు పడగొట్టి ఈ జాబితాలో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. కాగా రెండో టెస్టులో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో టీ బ్రేక్ సమయానికి అశ్విన్ మూడు వికెట్లతో చెలరేగగా.. మహ్మద్ షమీ 2 వికెట్లు పడగొట్టాడు. రవీంద్ర జడేజాకు ఒక వికెట్ దక్కింది. ఈ క్రమంలో మూడో సెషన్ ముగిసే సరికి 6 వికెట్ల నష్టానికి 199(56 ఓవర్లు) చేయగలిగింది. ఇక క్యారీ కంటే ముందు అశూ.. స్టీవ్ స్మిత్, మార్నస్ లబుషేన్ వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. చదవండి: Tom Blundell: కివీస్ బ్యాటర్ టామ్ బ్లండెల్ ప్రపంచ రికార్డు.. ఇంతవరకు ఎవరికీ సాధ్యం కాలేదు! IND Vs AUS: పాపం వార్నర్.. మళ్లీ షమీ చేతిలోనే! వీడియో వైరల్ GONEEEEE!#TeamIndia bowlers have the ball talking and Aussie batters dancing to their tunes! Ashwin gets two huge wickets of Labuschagne and Smith! 🔥 Tune-in to the action in the Mastercard #INDvAUS Test on Star Sports & Disney+Hotstar! #BelieveInBlue #TestByFire pic.twitter.com/xxgiqyrRau — Star Sports (@StarSportsIndia) February 17, 2023 -
చరిత్ర సృష్టించిన అశ్విన్.. 18 ఏళ్ల కుంబ్లే రికార్డు బద్దలు
టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ టెస్టుల్లో 450 వికెట్ల మైలురాయిని అందుకున్నాడు. నాగ్పూర్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతోన్న తొలి టెస్టులో అలెక్స్ క్యారీని ఔట్ చేసిన అశ్విన్.. ఈ ఘనత సాధించాడు. ఇక 450 టెస్టు వికెట్లు పడగొట్టిన అశ్విన్ పలు అరుదైన రికార్డులు తన పేరిట లిఖించుకున్నాడు. అశ్విన్ సాధించిన రికార్డులు ఇవే ►టెస్టుల్లో అత్యంత వేగంగా 450 వికెట్లు సాధించిన భారత బౌలర్గా నిలిచాడు. 89 టెస్టు మ్యాచ్లోనే అశ్విన్ ఈ ఘనతను సాధించాడు. కాగా ఇప్పటి వరకు ఈ రికార్డు భారత స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లే పేరిట ఉండేది. కుంబ్లే 93 మ్యాచ్ల్లో ఈ రికార్డును సాధించాడు. 2005లో ఈడెన్గార్డెన్స్ వేదికగా పాకిస్తాన్తో జరిగిన టెస్టులో కుంబ్లే తన 450వ వికెట్ను పడగొట్టాడు. ఇక తాజా మ్యాచ్తో 18 ఏళ్ల కుంబ్లే రికార్డును అశ్విన్ బ్రేక్ చేశాడు. ► ప్రపంచ క్రికెట్లో ఈ ఘనత సాధించిన రెండో బౌలర్గా అశ్విన్ నిలిచాడు. తొలి స్థానంలో శ్రీలంక దిగ్గజం ముత్తయ్య మురళీధరన్(80 మ్యాచ్లు) ఉన్నాడు. ► ఇక ఓవరాల్గా ప్రపంచ క్రికెట్లో 450 వికెట్ల మైలురాయిని చేరుకున్న 9వ బౌలర్గా అశ్విన్ నిలిచాడు. ► బంతుల పరంగా ఈ ఘనత సాధించిన రెండో బౌలర్గా అశ్విన్ రికార్డు సృష్టించాడు. తొలి స్థానంలో ఆస్ట్రేలియా గ్రేట్ మెక్గ్రాత్(23635) ఉండగా.. అశ్విన్(23474) రెండో స్థానంలో ఉన్నాడు. చదవండి: IND vs AUS: వారెవ్వా భరత్.. ధోనిని గుర్తుచేశాలా స్టంపౌట్! వీడియో వైరల్ -
క్రికెట్ చరిత్రలో ఇద్దరే ఇద్దరు, అందులో మన వాడు.. ఆ చారిత్రక ఘట్టానికి 24 ఏళ్లు
Anil Kumble 10 Wickets Haul Vs Pakistan: క్రికెట్ చరిత్రలో ఫిబ్రవరి 7వ తేదీకి ఓ ప్రత్యేకత ఉంది. 1999వ సంవత్సరంలో ఈ తేదీన ఢిల్లీ వేదికగా పాకిస్తాన్తో జరిగిన టెస్ట్ మ్యాచ్లో టీమిండియా దిగ్గజ లెగ్ స్పిన్నర్ అనిల్ కుంబ్లే ఒకే ఇన్నింగ్స్లో 10కి 10 వికెట్లు (10/74) పడగొట్టి చరిత్ర సృష్టించాడు. 146 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇలా జరగడం ఇది రెండోసారి మాత్రమే. 1956లో ఇంగ్లండ్ ఆఫ్ స్పిన్నర్ జిమ్ లేకర్ ఆస్ట్రేలియాపై ఒకే ఇన్నింగ్స్లో 10 వికెట్ల ఘనత (10/53) సాధించగా, ఆ ఘనతను తిరిగి 43 ఏళ్ల తర్వాత అనిల్ కుంబ్లే రెండో సారి నమోదు చేశాడు. కుంబ్లే సాధించిన ఈ ఘనతకు నేటితో 23 పూర్తై 24 ఏళ్లు పడ్డాయి. ఈ నేపథ్యంలో కుంబ్లే చారిత్రక ప్రదర్శనను నేటి దినాన క్రికెట్ అభిమానులు స్మరించుకుంటున్నారు. కుంబ్లే నమోదు చేసిన గణాంకాలను చూసి ముక్కున వేలేసుకుంటున్నారు. ఈ జనరేషన్ అభిమానులైతే 10కి 10 వికెట్లు తీయడం ఎలా సాధ్యపడిందని చర్చించుకుంటున్నారు. 2⃣6⃣.3⃣ Overs 9⃣ Maidens 7⃣4⃣ Runs 1⃣0⃣ Wickets 🗓️ #OnThisDay in 1999, #TeamIndia legend @anilkumble1074 etched his name in record books, becoming the first Indian cricketer to scalp 1⃣0⃣ wickets in a Test innings 🔝 👏 Revisit that special feat 🔽 pic.twitter.com/wAPK7YBRyi — BCCI (@BCCI) February 7, 2023 నాటి మ్యాచ్ వివరాల్లోకి వెళితే.. ఆ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ తొలి ఇన్నింగ్స్లో 252 పరుగులకు ఆలౌటైంది. సదగోపన్ రమేశ్ (60), మహ్మద్ అజహారుద్దీన్ (67) అర్ధసెంచరీలతో రాణించారు. పాక్ ఆఫ్ స్పిన్నర్ సక్లయిన్ ముస్తాక్ 5 వికెట్లు పడగొట్టాడు. అనంతరం పాక్ తొలి ఇన్నింగ్స్లో అనిల్ కుంబ్లే (4/75), హర్భజన్ సింగ్ (3/30) ధాటికి 172 పరుగులకే ఆలౌటైంది. షాహిద్ అఫ్రిది (32) టాప్ స్కోరర్గా నిలిచాడు. ఆ తర్వాత భారత్ రెండో ఇన్నింగ్స్లో 339 పరుగులకు ఆలౌటై పాక్కు 420 పరుగుల టార్గెట్ను నిర్ధేశించింది. ఈ ఇన్నింగ్స్లోనే కుంబ్లే మ్యాజిక్ చేశాడు. 101 పరుగుల వరకు ఒక్క వికెట్ కోల్పోని పాక్ను కుంబ్లే ఒక్కడే 207 పరుగులకు ఆలౌట్ చేశాడు. ఈ చారిత్రక ఘట్టానికి 23 ఏళ్లు పూర్తయిన సందర్భంగా దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్మీడియాలో వైరలవుతోంది. -
IPL: ఆల్టైం జట్టులో ఏబీడీకి చోటివ్వని టీమిండియా లెజెండ్! అతడికి బదులు..
Former Players All Time IPL XI: సౌతాఫ్రికా మాజీ కెప్టెన్, మిస్టర్ 360 ఏబీ డివిలియర్స్కు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. ముఖ్యంగా భారత్లో ఈ విధ్వంసకర బ్యాట్స్మన్కు ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ ద్వారా ఇండియన్ ఫ్యాన్స్కు మరింత చేరువయ్యాడు. ఢిల్లీ డేర్డెవిల్స్తో పాటు రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు ప్రాతినిథ్యం వహించిన ఈ వికెట్ కీపర్ బ్యాటర్ తన ఆటతో క్రికెట్ ప్రేమికులను అలరించాడు. ఇక క్యాష్ రిచ్ లీగ్ చరిత్రలో ఇప్పటి వరకు అత్యధిక పరుగుల వీరుల జాబితాలో ఆరో స్థానంలో ఉన్న ఏబీ డివిలియర్స్.. 170 ఇన్నింగ్స్లో కలిపి మొత్తంగా 5162 పరుగులు చేశాడు. ఐపీఎల్లో ఈ రైట్హ్యాండ్ బ్యాటర్ అత్యధిక స్కోరు 133. ఇలా అద్భుత ప్రదర్శనతో తను ప్రాతినిథ్యం వహించిన జట్ల విజయాల్లో కీలక పాత్ర పోషించి.. ఐపీఎల్లో తనదైన ముద్ర వేసిన ఏబీడీకి టీమిండియా మాజీ కెప్టెన్ అనిల్ కుంబ్లే తన ఆల్టైం జట్టులో చోటు ఇవ్వకపోవడం గమనార్హం. ఐపీఎల్-2023 నేపథ్యంలో జియోసినిమా షో లెజెండ్స్ లాంజ్లో క్రిస్ గేల్, సురేశ్ రైనా, పార్థివ్ పటేల్, రాబిన్ ఊతప్ప, స్కాట్ స్టైరిస్ వంటి మాజీ క్రికెటర్లతో కలిపి పాల్గొన్నాడు అనిల్ కుంబ్లే. డివిలియర్స్ కోసం తనను పక్కనపెట్టలేను ఈ సందర్భంగా... చర్చలో భాగంగా తమ ఆల్టైం ఐపీఎల్ ప్లేయింగ్ ఎలెవన్ను చెప్పాలని కోరగా.. కుంబ్లే.. డివిలియర్స్కు తన జట్టులో చోటు కష్టమని పేర్కొన్నాడు. ఇందుకు గల కారణాన్ని వివరిస్తూ.. ‘‘నా జట్టుకు ఎంఎస్ ధోని కెప్టెన్. ఈ వికెట్ కీపర్ బ్యాటర్ ఐదో స్థానంలో బ్యాటింగ్కు వస్తాడు. డివిలియర్స్ కోసం తనను పక్కనపెట్టలేను. ఇక ఆరోస్థానంలో పొలార్డ్ను ఆడిస్తా’’ అని కుంబ్లే చెప్పుకొచ్చాడు. నాలుగుసార్లు టైటిల్ గెలిచిన చెన్నై సారథి ధోనికే తన ఓటు అని పేర్కొన్నాడు. ఇదిలా ఉంటే.. ఇతరుల్లో గేల్ ఓపెనర్గా తన పేరును తాను సూచించగా.. పార్థివ్ పటేల్ అతడికి జోడీగా విరాట్ కోహ్లిని ఎంపిక చేశాడు. ఈ చర్చలో భాగంగా ఆఖర్లో పొలార్డ్ను కాదని డివిలియర్స్కే చోటిచ్చారు మిగతా మాజీలు. లెజెండ్స్ ఎంపిక చేసిన ఆల్టైం ఐపీఎల్ జట్టు క్రిస్ గేల్, విరాట్ కోహ్లి, సురేశ్ రైనా, రోహిత్ శర్మ, ఏబీ డివిలియర్స్, ఎంఎస్ ధోని(కెప్టెన్, వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, సునిల్ నరైన్, యజువేంద్ర చహల్, జస్ప్రీత్ బుమ్రా, లసిత్ మలింగ. చదవండి: Kieron Pollard: విన్యాసం బాగానే ఉంది.. ఆ ఎక్స్ప్రెషన్కు అర్థమేంటి! ICC ODI Rankings: నంబర్ వన్ బౌలర్గా సిరాజ్ -
Team India: 3 ఫార్మాట్లకు 3 వేర్వేరు జట్లు, కెప్టెన్లు, కోచ్లు..!
Anil Kumble: టీ20 వరల్డ్కప్-2022 సెమీఫైనల్లో టీమిండియా ఓటమి అనంతరం భారత మాజీ కెప్టెన్, కోచ్ అనిల్ కుంబ్లే ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. భవిష్యత్తులో టీమిండియా సక్సెస్ సాధించేందుకు తోడ్పడే కీలక ప్రతిపాదనతో ముందుకొచ్చాడు. ఇంగ్లండ్, ఆస్ట్రేలియా ఫాలో అవుతున్న.. '3 ఫార్మాట్లకు 3 వేర్వేరు జట్లు' అనే ఫార్ములాను టీమిండియా కూడా ఫాలో అవ్వాలని సూచించాడు. 2021లో ఆసీస్.. తాజాగా ముగిసిన వరల్డ్కప్ (2022)లో ఇంగ్లండ్ సక్సెస్ మంత్ర ఇదేనని పేర్కొన్నాడు. టెస్ట్ల్లో , పరిమిత ఓవర్ల క్రికెట్లో వేర్వేరు కోచ్లు, వేర్వేరు కెప్టెన్లతో ఇంగ్లండ్ జట్టు అద్భుత ఫలితాలు సాధిస్తున్న నేపథ్యంలో జరుగుతున్న చర్చపై కుంబ్లే తన అభిప్రాయాన్ని ఈమేరకు వెల్లడించాడు. మూడు ఫార్మాట్లకు ముగ్గురు కెప్టెన్లు, ముగ్గురు కోచ్లు ఉండాలని కచ్చితంగా చెప్పలేను కానీ, జట్టు మాత్రం డిఫరెంట్గా (ఆయా ఫార్మాట్లలో స్పెషలిస్ట్లతో కూడిన జట్టు) ఉంటే తప్పక సత్ఫలితాలు వస్తాయని కాన్ఫిడెంట్గా చెప్పాడు. ముఖ్యంగా టీ20లకు ప్రత్యేక జట్టు చాలా అవసరమని, ఈ ఫార్మాట్లో హార్డ్ హిట్టర్లు, ఆల్రౌండర్లు, టీ20 స్పెషలిస్ట్ల పాత్ర చాలా కీలకమని, 2021 వరల్డ్కప్లో ఆస్ట్రేలియా, తాజాగా ముగిసిన వరల్డ్కప్లో ఇంగ్లండ్ ఈ ఫార్ములా అమలు చేసే విజయాలు సాధించాయని అభిప్రాయపడ్డాడు. ఇంగ్లండ్ జట్టులో లివింగ్స్టోన్, ఆసీస్ టీమ్లో స్టొయినిస్ లాంటి ఆటగాళ్లు 6, 7 స్థానాల్లో బ్యాటింగ్ చేస్తున్నారంటే, ఆయా జట్ల కూర్పు ఎలా ఉందో ఇట్టే అర్ధమవుతుందని ఉదహరించాడు. కుంబ్లే చేసిన ఈ ప్రతిపాదనకు ఆసీస్ మాజీ ఆల్రౌండర్ టామ్ మూడీ కూడా మద్దతు పలికాడు. అన్ని జట్లు ఈ విషయం గురించి సీరియస్గా ఆలోచించాలని సూచించాడు. కాగా, విశ్వవిజేత ఇంగ్లండ్ జట్టుకు టెస్ట్ల్లో, పరిమిత ఓవర్ల ఫార్మాట్లో వేర్వేరు కోచ్లు, కెప్టెన్లు, జట్లు ఉన్న విషయం తెలిసిందే. ఆ జట్టుకు టెస్ట్ల్లో బ్రెండన్ మెక్కల్లమ్ కోచ్గా, బెన్ స్టోక్స్ కెప్టెన్గా వ్యవహరిస్తుండగా.. పరిమిత ఓవర్ల ఫార్మాట్లో మాథ్యూ మాట్ కోచ్గా, జోస్ బట్లర్ కెప్టెన్గా ఉన్నాడు. టీ20ల్లో మాజీ ఛాంపియన్ అయిన ఆసీస్కు టెస్ట్ల్లో, లిమిటెడ్ ఓవర్స్ ఫార్మాట్లో వేర్వేరు కోచ్లు లేనప్పటికీ.. కెప్టెన్లు (కమిన్స్, ఫించ్), జట్టు పూర్తిగా వేరుగా ఉంది. టీమిండియా విషయానికొస్తే.. మన జట్టు మూడు ఫార్మాట్లలో ఒకే కెప్టెన్ (రోహిత్ శర్మ), ఒకే కోచ్ (ద్రవిడ్), ఇంచుమించు ఒకే జట్టు కలిగి ఉంది. అప్పుడప్పుడు అంతగా ప్రాధాన్యత లేని సిరీస్లకు రెస్ట్ పేరుతో కెప్టెన్కు, కోచ్కు రెస్ట్ ఇస్తుంది. ఆ సమయంలో కోచ్గా ఎన్సీఏ డైరెక్టర్ వీవీఎస్ లక్ష్మణ్ కోచ్గా వ్యవహరిస్తుంటాడు. కెప్టెన్ల మాట చెప్పనక్కర్లేదు. రోహిత్ గైర్హాజరీలో ఒక్కో సిరీస్కు ఒక్కో ఆటగాడు కెప్టెన్గా పని చేశాడు. గత ఏడాది కాలంలో భారత్ ఏకంగా ఏడుగురు కెప్టెన్లను మార్చింది. చదవండి: ఐపీఎల్ 2023కు ముగ్గురు ఆసీస్ స్టార్లు డుమ్మా.. దేశ విధులే ముఖ్యమంటూ..! -
'టెస్టులు, వైట్ బాల్ క్రికెట్కు వేర్వేరు టీమ్స్ ఉండాల్సిందే'
టీ20 ప్రపంచకప్-2022 సెమీఫైనల్లో టీమిండియాకు ఘోర పరభావం ఎదురైన సంగతి తెలిసిందే. ఇంగ్లండ్పై 10 వికెట్ల తేడాతో ఓటమిపాలైన భారత్ టోర్నీ నుంచి నిష్ర్కమించింది. ఇక టోర్నీనుంచి అవమానకర రీతిలో ఇంటిముఖం పట్టిన టీమిండియాపై కొంత మంది విమర్శలు వర్షం కురిపించగా.. మరికొంత మంది మద్దతుగా నిలిచారు. అదే విధంగా టీ20 ప్రపంచకప్-2024కు భారత్ ఏ విధంగా సన్నద్ధం కావాలన్న చర్చ ప్రస్తుతం జరగుతోంది. ఈ క్రమంలో భారత మాజీ కెప్టెన్ అనిల్ కుండే తన అభిప్రాయాలను పంచుకున్నాడు. టెస్టు, వైట్బాల్ క్రికెట్కు వేర్వేరు టీమ్స్ ఉండాలి అని కుంబ్లే సూచించాడు. ఈఎస్పీఎన్ క్రికిన్ఫోతో కుంబ్లే మాట్లాడుతూ.. "ఖచ్చితంగా టెస్టు, వైట్బాల్ క్రికెట్ రెండు వేర్వేరు జట్లు ఉండాలి. ప్రతీ జట్టుకు టీ20 స్పెషలిస్టులు కావాలి. ఈ ఏడాది టీ20 ప్రపంచకప్ ఛాంపియన్స్ ఇంగ్లండ్కు, గతేడాది విజేత ఆస్ట్రేలియాకు చాలా మంది టీ20 స్పెషలిస్టులు ఉన్నారు. ఎక్కువ మంది ఆల్రౌండర్లు ఉండేలా జట్టును తయారు చేసుకోవాలి. ఇంగ్లండ్ను చూసుకుంటే లివింగ్స్టోన్ వంటి అద్భుతమైన ఆటగాడు 7 వస్థానంలో బ్యాటింగ్ వస్తాడు. అదే విధంగా ఆస్ట్రేలియా స్టార్ ఆల్రౌండర్ స్టోయినిస్ 6 స్థానంలో బ్యాటింగ్ రావడం మనం చూస్తున్నాం. ఈ విధంగా మనం జట్టును నిర్మించాలి. దీనిపై ప్రత్యేక దృష్టిసారించాలి" అని అతడు పేర్కొన్నాడు. చదవండి: T20 WC 2022: రోహిత్ను కెప్టెన్గా తప్పించండి! వాళ్లలో ఒకరిని సారథి చేయండి -
Punjab Kings: అనిల్ కుంబ్లేతో పంజాబ్ కటీఫ్! మయాంక్ విషయంలో మాత్రం..
మొహాలి: మూడు ఐపీఎల్ సీజన్లలో తమ జట్టుకు హెడ్ కోచ్గా వ్యవహరించినా... ఆశించిన ఫలితాలు అందించలేకపోయిన అనిల్ కుంబ్లేతో పంజాబ్ కింగ్స్ బంధం తెంచుకుంది. వచ్చే సీజన్ కోసం కుంబ్లేతో ఒప్పందాన్ని పునరుద్ధరించడం లేదని ప్రకటించింది. టీమ్ యజమానులైన ప్రీతి జింటా, నెస్ వాడియా తదితరులు కలిసి సమష్టిగా ఈ నిర్ణయం తీసుకున్నారు. త్వరలోనే కొత్త కోచ్ను ఫ్రాంచైజీ ఎంపిక చేస్తుంది. 2020లో కుంబ్లే హెడ్ కోచ్గా బాధ్యతలు చేపట్టగా వరుసగా రెండేళ్లు టీమ్ ఐదో స్థానంలో నిలిచింది. 2022లో పది టీమ్ల ఐపీఎల్లో పంజాబ్ ఆరో స్థానంతో సరిపెట్టుకుంది. జట్టులో ఎన్ని మార్పులు చేసినా, వ్యూహాలు మార్చినా పంజాబ్ కోచ్ పదవి ఎవరికీ కలిసి రాలేదు. 2014 నుంచి చూస్తే ఆ జట్టుకు కుంబ్లే ఐదో కోచ్. వరుసగా సంజయ్ బంగర్, వీరేంద్ర సెహ్వాగ్, బ్రాడ్ హాడ్జ్, మైక్ హెసన్ కోచ్గా పని చేసినా జట్టు రాత మారలేదు. కుంబ్లే కోచ్గా ఉన్న సమయంలో పంజాబ్ 42 మ్యాచ్లు ఆడగా... 18 గెలిచి, 22 ఓడింది.మరో 2 మ్యాచ్లు ‘టై’గా ముగిశాయి. ఓవరాల్గా కూడా 2008 నుంచి ఐపీఎల్లో ఉన్నా రెండుసార్లు మాత్రమే పంజాబ్ ప్లే ఆఫ్స్కు వెళ్లగలిగింది. 2014లో ఫైనల్ చేరడం ఆ జట్టు అత్యుత్తమ ప్రదర్శన. గత సీజన్ వేలంలో బెయిర్స్టో, రబడ, లివింగ్స్టోన్, శిఖర్ ధావన్లాంటి ఆటగాళ్లను ఎంచుకున్నా ఫలితం మాత్రం మారలేదు. కోచ్ను తప్పించిన పంజాబ్ మరోవైపు కెప్టెన్గా మయాంక్ అగర్వాల్ను కొనసాగించే విషయంలో ఇంకా ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదు. చదవండి: Asia Cup 2022: పాక్ క్రికెటర్పై పుజారా ప్రశంసల వర్షం -
కొత్త కోచ్ వేటలో పంజాబ్ కింగ్స్.. కుంబ్లేకు మంగళం పాడనుందా!
టీమిండియా దిగ్గజ స్పిన్నర్ అనిల్ కుంబ్లేకు ఐపీఎల్ ఫ్రాంచైజీ పంజాబ్ కింగ్స్ షాకివ్వనున్నట్లు సమాచారం. పంజాబ్ కింగ్స్ కోచ్గా అనిల్ కుంబ్లే స్తానంలో కొత్త వ్యక్తిని తీసుకొచ్చే పనిలో ఉంది. ఈ సెప్టెంబర్తో కుంబ్లేకు పంజాబ్ కింగ్స్తో ఉన్న మూడేళ్ల ఒప్పందం ముగియనుంది. ఈ నేపథ్యంలోనే కుంబ్లేతో ఒప్పందాన్ని రెన్యువల్ చేసుకునేందుకు పంజాబ్ కింగ్స్ ఇష్టపడడం లేదని తెలుస్తోంది. ఇప్పటికే పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ పదవికి ఇంగ్లండ్ మాజీ ఆటగాడు ఇయాన్ మోర్గాన్ సహా హైదరాబాద్ మాజీ కోచ్ ట్రెవర్ బెలిస్ పేర్లను పరిశీలించినట్లు తెలుస్తోంది. వీరితో పాటు టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి పేరు కూడా పరిశీలినలో ఉంది. మరో వారంలో పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ ఎవరనే దానిపై సందిగ్దం వీడనుందని ఫ్రాంచైజీ అధికారి ఒకరు పేర్కొన్నారు. ఇక కుంబ్లే హయాంలో పంజాబ్ కింగ్స్ ఐపీఎల్లో 42 మ్యాచ్ల్లో 19 విజయాలు అందుకుంది. అనిల్ కుంబ్లే కోచింగ్లో వరుసగా నాలుగు సీజన్లలోనూ ఆరో స్థానంతోనే సరిపెట్టుకుంది పంజాబ్ కింగ్స్. నాలుగు సీజన్లలో ముగ్గురు కెప్టెన్లను, ప్లేయర్లను మార్చినా ఫలితం మాత్రం మారలేదు. అందుకే కుంబ్లేని సాగనంపి, కొత్త హెడ్ కోచ్ని నియమించుకునేందుకు పంజాబ్ కింగ్స ప్రయత్నాలు చేస్తోంది. కాగా ఐపీఎల్ ప్రారంభం నుంచి పంజాబ్ కింగ్స్ 2014 మినహా ఒక్కసారి కూడా ఫైనల్ చేరిన దాఖలాలు లేవు. ఎంతమంది కెప్టెన్లు, కోచ్లు, ఆటగాళ్లు మారినా ఆ జట్టు ఆట తీరు మాత్రం మెరుగపడడం లేదు. అంతేకాదు జట్టు పటిష్టంగా ఉండాలనే ఉద్దేశంతో ఐపీఎల్ మెగావేలంలోనూ దూకుడు కనబరిచింది పంజాబ్ కింగ్స్. వేలంలో శిఖర్ ధావన్, లియామ్ లివింగ్స్టోన్, జానీ బెయిర్ స్టో, కగిసో రబడా లాంటి పేరున్న ఆటగాళ్లను తీసుకుంది. కానీ ఎలాంటి ఉపయోగం లేకుండా పోయింది. ఈ సీజన్ ప్రారంభానికి ముందు కేఎల్ రాహుల్ లక్నో సూపర్ జెయింట్స్కు కెప్టెన్గా వెళ్లిపోవడంతో.. శిఖర్ ధావన్ను కాదని మయాంక్ అగర్వాల్కు నాయకత్వ బాధ్యతలు అప్పగించింది. కెప్టెన్సీ ఒత్తిడిలో పడి మయాంక్ తన బ్యాటింగ్ను పూర్తిగా మరిచిపోయాడు. సీజన్లో కొన్ని మంచి విజయాలు అందుకున్నప్పటికి పంజాబ్ కింగ్స్ 14 మ్యాచ్ల్లో ఏడు విజయాలు.. ఏడు పరాజయాలతో ఆరో స్థానంలో నిలిచి మరోసారి లీగ్ దశకే పరిమితమయింది. మరి కొత్త కోచ్ రాకతో పంజాబ్ కింగ్స్ దశ వచ్చే సీజన్లోనైనా మారుతుందేమో చూడాలి. -
Ind Vs Wi: కోట్ల డబ్బు... టీమిండియాలో చోటు.. శెభాష్ రవి.. అంతా ఆయన వల్లే!
Ind Vs Wi- Ravi Bishnoi Reaction After ODI T20 Call Up: భారత యువ క్రికెటర్ రవి బిష్ణోయి ఆనందడోలికల్లో తేలియాడుతున్నాడు. వెస్టిండీస్తో సిరీస్ నేపథ్యంలో బీసీసీఐ నుంచి పిలుపు రావడంతో సంతోషంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నాడు. రవితో పాటు అతడి శ్రేయోలాభిలాషులు, అభిమానులు సైతం పట్టరాని ఆనందంలో మునిగిపోయారు. ఈ క్రమంలో రాజస్తాన్లోని రవి ఇంటి ముందు పెద్ద సంఖ్యలో జనం గుమిగూడి సందడి చేశారు. తొలిసారి జాతీయ జట్టుకు ఎంపికైన సందర్భంగా అతడికి అభినందనలు తెలియజేశారు. కాగా స్వదేశంలో విండీస్తో జరిగే వన్డే, టీ20 సిరీస్కు బీసీసీఐ జట్టును ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా రెండు సిరీస్లకు రవి బిష్ణోయిని ఎంపిక చేశారు. ఇక ఇండియన్ ప్రీమియర్ లీగ్లో భాగంగా 21 ఏళ్ల ఈ యువ స్పిన్నర్ పంజాబ్ కింగ్స్కు ప్రాతినిథ్యం వహించిన సంగతి తెలిసిందే. ఇక ఐపీఎల్ మెగా వేలం-2022 నేపథ్యంలో లక్నో సూపర్ జాయింట్స్ జట్టు రవిని ఎంపిక చేసుకుంది. సుమారు 4 కోట్లు వెచ్చించి అతడిని సొంతం చేసుకుంది. ఈ క్రమంలో ఇప్పుడు ఏకంగా జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహించే అవకాశం రావడంతో రవి ఆనందానికి అవధులు లేకుండాపోయాయి. అంతా ఆయన వల్లే... ఈ నేపథ్యంలో అతడు మాట్లాడుతూ... ఐపీఎల్ నుంచి టీమిండియా వరకు తన ప్రయాణంలో భారత దిగ్గజం, పంజాబ్ కింగ్స్కు హెడ్కోచ్గా వ్యవహరించిన అనిల్ కుంబ్లే పాత్ర మరువలేనిదన్నాడు. స్పోర్ట్స్ స్టార్తో ముచ్చటించిన రవి బిష్ణోయి... ‘‘అనిల్ సర్ నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను. ఒత్తిడిలోనూ ఆత్మ విశ్వాసం కోల్పోకుండా ధైర్యంగా ముందుకు సాగితే మంచి ఫలితాలు ఉంటాయని ఆయన నన్ను ప్రోత్సహించారు. మనలోని బలాలను గుర్తించి వాటిని సరైన సమయంలో సరిగ్గా వినియోగించుకోవాలని చెప్పేవారు. ప్రణాళికలను మైదానంలో పక్కాగా అమలు చేయాలని, అప్పుడే మెరుగైన ఫలితాలు రాబట్టవచ్చని నేర్పారు. మెరుగైన క్రికెటర్గా ఎదగడంలో ఈ సలహాలు, సూచనలు నాకెంతగానో తోడ్పడ్డాయి’’ అని చెప్పుకొచ్చాడు. భారత జట్టుకు ఎంపిక కావడం గర్వంగా ఉందని, వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటానని ధీమా వ్యక్తం చేశాడు. చదవండి: IND vs WI: జట్టును ప్రకటించిన వెస్టిండీస్.. సీనియర్ బౌలర్ రీ ఎంట్రీ Team owner, Dr. Sanjiv Goenka, Chairman @rpsggroup welcomes the 3️⃣ drafted picks for #TeamLucknow! 👏😇@klrahul11 @MStoinis @bishnoi0056 #IPL2022 pic.twitter.com/AbbURvQC5Q — Lucknow Super Giants (@LucknowIPL) January 21, 2022 -
టెస్టుల్లో అశ్విన్ అరుదైన రికార్డు.. కుంబ్లేను దాటేశాడుగా..
Ashwin becomes 2nd fastest bowler to take 300 Test wickets at home: టెస్ట్ క్రికెట్లో టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ పలు రికార్డులను సృష్టించాడు. భారత్ తరుపున టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్గా అశ్విన్ నిలిచాడు. 350 వికెట్లతో అనిల్ కుంబ్లే తొలి స్ధానంలో ఉండగా, 300 వికెట్లతో అశ్విన్ రెండో స్ధానంలో ఉన్నాడు. అదే విధంగా స్వదేశంలో వేగవంతంగా 300 వికెట్లు సాధించిన రెండో బౌలర్గా రికార్డు సాధించాడు. తొలి స్ధానంలో శ్రీలంక లెజెండ్ ముత్తయ్య మురళీధరన్ ఉన్నాడు. కాగా 48 మ్యాచ్ల్లో ఈ ఘనతను మురళీధరన్ సాధించగా, 49 మ్యాచ్ల్లో అశ్విన్ ఈ రికార్డును సాధించాడు. భారత్ తరుపున స్వదేశంలో వేగవంతంగా 300 వికెట్లు సాధించిన తొలి బౌలర్గా నిలిచాడు. అంతకు ముందు భారత దిగ్గజ ఆటగాడు అనిల్ కుంబ్లే 52 మ్యాచ్ల్లో 300 వికెట్లు పడగొట్టాడు. న్యూజిలాండ్తో జరిగిన రెండో టెస్ట్లో హెన్రీ నికోలస్ వికెట్ పడగొట్టి అశ్విన్ ఈ ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక స్వదేశంలో జరిగిన న్యూజిలాండ్తో టెస్ట్ సిరీస్లో మొత్తంగా 14 వికెట్లు పడగొట్టాడు. చదవండి: ముత్తయ్య మురళీధరన్ రికార్డును బద్దలు కొట్టేది అతడే.. -
Ravichandran Ashwin: అశ్విన్ సరికొత్త రికార్డు.. కుంబ్లేను అధిగమించి..
Ind Vs Nz 2nd Test: Ashwin Record Most 50 Plus Test Wickets In Calendar Year: న్యూజిలాండ్తో రెండో టెస్టులో టీమిండియా బౌలర్లు అదరగొడుతున్నారు. తొలి ఇన్నింగ్స్లో 62 పరుగులకే ఆలౌట్ చేసి కివీస్ను తిప్పలుపెట్టిన మన బౌలర్లు రెండో ఇన్నింగ్స్లోనూ చుక్కలు చూపిస్తున్నారు. ఇక ముంబై టెస్టు సందర్భంగా ఇప్పటికే పలు రికార్డులు నమోదైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆదివారం అశ్విన్ మరో ఘనతను సాధించాడు. రెండో ఇన్నింగ్స్లో భాగంగా కివీస్ ఓపెనర్లు టామ్ లాథమ్, విల్ యంగ్తో పాటు.. రాస్ టేలర్ వికెట్ను పడగొట్టాడు. తద్వారా టెస్టుల్లో క్యాలెండర్ ఇయర్లో 50 కంటే ఎక్కువ వికెట్లు.. ఎక్కువసార్లు సాధించిన భారత బౌలర్ల జాబితాలో అగ్రస్థానానికి చేరుకున్నాడు. అశ్విన్ మొత్తంగా నాలుగుసార్లు (2015, 2016, 2017, 2021) ఈ ఫీట్ సాధించాడు. అంతకు ముందు అనిల్ కుంబ్లే 3 సార్లు(1999, 2004, 2006), హర్భజన్ సింగ్ 3 సార్లు(2001, 2002, 2008), కపిల్దేవ్ 2 సార్లు(1979, 1983) ఈ ఘనత సాధించారు. ఇక రెండో టెస్టు విషయానికొస్తే... తొలి ఇన్నింగ్స్లో అశ్విన్ 4 వికెట్లు పడగొట్టిన సంగతి తెలిసిందే. అదే విధంగా కాన్పూర్ టెస్టులో 6 వికెట్లు పడగొట్టి హర్భజన్ సింగ్ రికార్డును అధిగమించాడు. చదవండి: Sara Tendulkar: నైట్ డేట్కు వెళ్లిన సారా టెండుల్కర్.. ఇంతకీ ఎవరా వ్యక్తి! గిల్ బ్యాటింగ్ చేస్తుంటే.. Ashwin gets his third as Ross Taylor departs after scoring 6 runs. Live - https://t.co/CmrJV47AeP #INDvNZ @Paytm pic.twitter.com/VExwF4Qg67 — BCCI (@BCCI) December 5, 2021 -
రికార్డుల అజాజ్..! ఒకే ఇన్నింగ్స్లో 10 వికెట్లు.. స్పందించిన కుంబ్లే
Ajaz Patel Becomes 3rd Bowler to Pick 10 Wickets in a Test Cricket History: న్యూజిలాండ్ స్పిన్నర్ ఆజాజ్ పటేల్ టెస్ట్ క్రికెట్లో ప్రపంచ రికార్డు సాధించాడు. భారత్తో జరిగిన రెండో టెస్ట్ తొలి ఇన్నింగ్స్లో 10 వికెట్లు పడగొట్టాడు. ఈ క్రమంలో ఒకే ఇన్నింగ్స్లో 10 వికెట్లు పడగొట్టిన మూడో బౌలర్గా రికార్డులకెక్కాడు. ఈ మ్యాచ్లో 47 ఓవర్లు వేసిన ఆజాజ్ పటేల్ 119 పరుగులు ఇచ్చి 10 వికెట్లు సాధించాడు. అంతకు ముందు జిమ్ లేకర్, అనిల్ కుంబ్లే ఈ ఘనత సాధించారు. 1956లో ఇంగ్లండ్ బౌలర్ జిమ్ లేకర్ ఆస్ట్రేలియాపై పది వికెట్లు సాధించగా, 1999లో భారత స్పిన్నర్ అనిల్ కుంబ్లే పాకిస్తాన్పై 10 వికెట్లు పడగొట్టాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే టీమిండియా తొలి ఇన్నింగ్స్లో 325 పరుగులకు ఆలౌటైంది. టీమిండియా బ్యాటర్లలో మయాంక్ అగర్వాల్ 150 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. ఇక అజాజ్ ఘనతపై స్పందించిన అనిల్ కుంబ్లే.. ‘‘చాలా బాగా బౌలింగ్ చేశావు. వెల్కమ్ టూ క్లబ్’’ అంటూ స్వాగతం పలికాడు. చదవండి: Ind Vs Nz 2nd Test: ఒకే ఇన్నింగ్స్లో 10 వికెట్లు సాధించిన న్యూజిలాండ్ బౌలర్ #10wickets #AjazPatel #INDvzNZ Retweet ♻️ Like ♥️ pic.twitter.com/cuEIlgFfVZ — Yash Vashisth Tyagi (@vashisthtyagi3) December 4, 2021 Spinner Ajaz Patel smashed all records as he became only the third player in Test cricket history to grab all 10 wickets in an innings#AjazPatel #INDvsNZhttps://t.co/W5QzdjeTvr — CricketNDTV (@CricketNDTV) December 4, 2021 Welcome to the club #AjazPatel #Perfect10 Well bowled! A special effort to achieve it on Day1 & 2 of a test match. #INDvzNZ — Anil Kumble (@anilkumble1074) December 4, 2021 -
కుంబ్లే రికార్డు బద్దలు కొట్టిన సౌథీ
Tim Southee Breaks Anil Kumble Record Most Wickets IND vs NZ.. న్యూజిలాండ్ పేసర్ టిమ్ సౌథీ టీమిండియాకు కొరకరాని కొయ్యగా తయారయ్యాడు. బౌలింగ్ తనదైన పేస్తో మెప్పిస్తున్న సౌథీ వికెట్లతో చెలరేగుతున్నాడు. టీమిండియాతో జరుగుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్లో ఐదు వికెట్లతో మెరిసిన సౌథీ.. రెండో ఇన్నింగ్స్లోనూ ఇప్పటికే మూడు వికెట్లు తీశాడు. ఈ నేపథ్యంలోనే సౌథీ టెస్టుల్లో అరుదైన రికార్డు సాధించాడు. చదవండి: Kyle Jamieson: 1865 బంతులు.. కైల్ జేమీసన్ అరుదైన ఘనత సౌథీ టీమిండియాపై ఇప్పటివరకు 10 టెస్టుల్లో 51 వికెట్లు తీశాడు. తద్వారా న్యూజిలాండ్ తరపున ఒక బౌలర్ టీమిండియాపై ఎక్కువ వికెట్లు సాధించిన జాబితాలో రెండో స్థానానికి చేరుకున్నాడు. కివీస్ తరపున రిచర్డ్ హడ్లీ(1976-90) టీమిండియాపై 14 టెస్టుల్లో 65 వికెట్లతో టాప్ స్థానంలో ఉన్నాడు. ఇక ఓవరాల్గా టీమిండియా- న్యూజిలాండ్ బై లేటరల్ టెస్టు సిరీస్ పరంగా చూసుకుంటే సౌథీ.. భారత లెగ్స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లే రికార్డును బ్రేక్ చేశాడు. న్యూజిలాండ్పై 50 వికెట్లు తీసిన కుంబ్లేను తాజాగా సౌథీ అధిగమించాడు. ఈ జాబితాలో రిచర్డ్ హడ్లీ(65 వికెట్లు) తొలి స్థానంలో.. బిషన్ సింగ్ బేడీ(57 వికెట్లు) రెండో స్థానంలో.. ప్రసన్న(55 వికెట్లు) మూడో స్థానం.. రవిచంద్రన్ అశ్విన్(55 వికెట్లు) నాలుగో స్థానంలో ఉండగా.. సౌథీ 51 వికెట్లతో ఐదో స్థానంలో ఉన్నాడు. ఇక ఆసియా గడ్డపై సౌథీకి బౌలర్గా మంచి రికార్డు ఉంది. ఆసియా గడ్డపై సౌథీ ఆడిన 12 మ్యాచ్ల్లో 47 వికెట్లు తీశాడు. చదవండి: IND vs NZ: డిఫెన్స్ ఆడాలనుకున్నాడు.. అవకాశమే ఇవ్వలేదు -
Sourav Ganguly: కుంబ్లే స్థానంలో గంగూలీ.. ఇంతకీ ఆ కమిటీ ఏం చేస్తుంది?
BCCI president Sourav Ganguly replaces Anil Kumble as chairman of ICC Men’s Cricket Committee: భారత క్రికెట్ నియంత్రణ మండలి అధ్యక్షుడు, టీమిండియా మాజీ సారథి సౌరవ్ గంగూలీ కొత్త బాధ్యతలు చేపట్టనున్నాడు. అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) పురుషుల క్రికెట్ కమిటీ చైర్మన్గా నియమితుడయ్యాడు. భారత జట్టు మాజీ కెప్టెన్ అనిల్ కుంబ్లే స్థానంలో కొత్త బాస్గా గంగూలీ పగ్గాలు చేపట్టనున్నాడు. కాగా సుదీర్ఘకాలంలో ఈ పదవిలో కొనసాగుతున్న అనిల్ కుంబ్లే పదవీ కాలం ముగియడంతో ఐసీసీ ఈ మేరకు అతడి స్థానాన్ని గంగూలీతో భర్తీ చేసింది. ఇందుకు సంబంధించి ఐసీసీ బుధవారం పత్రికా ప్రకటన విడుదల చేసింది. కాగా టీమిండియా సారథిగా పలు చిరస్మరణీయ విజయాలు అందించిన గంగూలీకి క్రికెట్ ప్రపంచంలో ప్రత్యేక గుర్తింపు ఉంది. కాగా ఆటగాడిగానే కాకుండా... క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్(క్యాబ్) అధ్యక్షుడిగా తొలుత సేవలు అందించిన గంగూలీ.. ప్రస్తుతం బీసీసీఐ ప్రెసిడెంట్గా పని చేస్తున్నాడు. ఇక ఇప్పుడు ఐసీసీ మెన్స్ క్రికెట్ కమిటీ చైర్మన్గా కూడా సేవలు అందించనున్నాడు. ఈ కమిటీ ఏం చేస్తుంది... ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ (సీఈసీ)కి ఇది సబ్–కమిటీ. క్రికెట్ ఆట విషయాలను చర్చిస్తుంది. అంపైర్లు, రిఫరీల నిర్ణయాలు, ఆటలో సాంకేతికత వినియోగం, శాశ్వత హోదా దరఖాస్తులు, అనుమానాస్పద బౌలింగ్ యాక్షన్లపై వచ్చే ఫిర్యాదుల్ని సమీక్షించి సీఈసీకి సిఫార్సు చేస్తుంది. చదవండి: Virat Kohli: దిష్టి తగిలింది.. ఏంటి కోహ్లి ఇలాంటివి కూడా నమ్ముతాడా?.. పోస్టు వైరల్! Venkatesh Iyer: టీమిండియాకు ఆడటం ముఖ్యం కాదు.. అదే నా కల.. నాకంటే తను సెలక్ట్ కావడమే ఎంతో సంతోషం! -
హ్యాపీ బర్త్డే కుంబ్లే.. చిరస్మరణీయ కానుకను షేర్ చేసిన బీసీసీఐ
On Anil Kumble Birthday, BCCI Shares 10 Wicket Haul Vs Pakistan: టీమిండియా మాజీ కెప్టెన్, స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లే 51వ జన్మదినాన్ని పురస్కరించుకుని బీసీసీఐ శుభాకాంక్షలు తెలిపింది. ఈ సందర్భంగా 1999లో అతను పాకిస్థాన్పై ఒకే ఇన్నింగ్స్లో పది వికెట్లు తీసిన వీడియోను ట్విటర్లో షేర్ చేసింది. 403 అంతర్జాతీయ మ్యాచ్లు, 956 వికెట్లు.. టెస్ట్ క్రికెట్లో ఇంగ్లండ్ బౌలర్ జిమ్ లేకర్ తర్వాత ఒకే ఇన్నింగ్స్లో 10 వికెట్లు తీసిన ఏకైక బౌలర్.. టీమిండియా మాజీ కెప్టెన్ అనిల్ కుంబ్లేకు జన్మదిన శుభాకాంక్షలు అంటూ బీసీసీఐ ట్వీట్లో పేర్కొంది. కుంబ్లే విషెస్ తెలిపిన వారిలో బీసీసీఐతో పాటు పలువురు ప్రముఖ క్రికెటర్లు ఉన్నారు. 4⃣0⃣3⃣ intl. games 👍 9⃣5⃣6⃣ intl. wickets 👌 Only the second bowler in Test cricket to scalp 10 wickets in an innings 👏 Wishing former #TeamIndia captain @anilkumble1074 a very happy birthday. 🎂 👏 Let's revisit his brilliant 1⃣0⃣-wicket haul against Pakistan 🎥 🔽 pic.twitter.com/BFrxNqKZsN — BCCI (@BCCI) October 17, 2021 కాగా, 1989లో అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేసిన కుంబ్లే.. 132 టెస్ట్లు, 271 వన్డేలు ఆడాడు. టెస్ట్ల్లో 619 వికెట్లతో పాటు ఓ సెంచరీ 5 అర్ధ సెంచరీలు చేసిన జంబో(కుంబ్లేని ముద్దుగా పిలిచే పేరు).. వన్డేల్లో 337 వికెట్లు పడగొట్టాడు. కుంబ్లే టెస్ట్ల్లో నేటికి టీమిండియా తరఫున అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్గా కొనసాగుతున్నాడు. ఓవరాల్గా టెస్ట్ క్రికెట్లో మురళీధరన్, షేన్ వార్న్, జేమ్స్ ఆండర్సన్ తర్వాత నాలుగో అత్యధిక వికెట్ల వీరుడిగా కొనసాగుతున్నాడు. 2008 నవంబర్లో అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన జంబో.. 2016-17 సంవత్సరాల్లో టీమిండియా హెడ్ కోచ్గా కూడా వ్యవహరించాడు. ప్రస్తుతం అతను ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్ హెడ్ కోచ్గా ఉన్నాడు. చదవండి: ధోని అభిమానులకు వరుస శుభవార్తలు.. తాజాగా మరొకటి -
కుంబ్లే వద్దన్నాడు.. టీమిండియాకు కొత్త విదేశీ కోచ్!
Foreign Head Coach For Team India.. టి20 ప్రపంచకప్ 2021 తర్వాత టీమిండియా ప్రధాన కోచ్ పదవి నుంచి రవిశాస్త్రి తప్పుకోనున్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే రవిశాస్త్రి తర్వాత టీమిండియా కోచ్ పదవి ఎవరిని వరించనుందనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే కోచ్ పదవికి సంబంధించి టి20 ప్రపంచకప్ అనంతరం దరఖాస్తులు కోరనుంది. కాగా రాహుల్ ద్రవిడ్, వీరేంద్ర సెహ్వాగ్ పేర్లు ముందుగా తెరపైకి రాగా ఆ తర్వాత అనిల్ కుంబ్లేకి టీమిండియా కోచ్ పదవి కట్టబెట్టే అవకాశాలు ఉన్నట్లు బీసీసీఐ ఒక ప్రకటనలో తెలిపినట్లు సమాచారం. చదవండి: టీమిండియా ప్రధాన కోచ్గా మరోసారి ఆయనే! తాజాగా బీసీసీఐ మరో కొత్త ప్రతిపాధనను తెరమీదకు తీసుకువచ్చింది. అనిల్ కుంబ్లే టీమిండియా కోచ్ పదవికి ఆసక్తి చూపించడం లేదని.. గంగూలీ ఒక్కడే కుంబ్లే కోచ్గా రావాలని అడిగినట్లు బీసీసీఐ ప్రతినిధి అనధికారిక ప్రకటనలో పేర్కొన్నారు. అయితే ఈ నిర్ణయం బోర్డు సభ్యులకు నచ్చకపోవడంతో గంగూలీ ఆ ఆలోచనను విరమించుకునే అవకాశం ఉందని.. అందుకే టీమిండియాకు విదేశీ కోచ్ వచ్చే అవకాశం ఉందని సమాచారం. దీనికోసం బీసీసీఐ ఇప్పటికే పలువురు విదేశీ కోచ్లను సంప్రదించినట్లు తెలుస్తుంది. అయితే బీసీసీఐ ఎవరిని సంప్రదించిదనే వివరాలపై స్పష్టత లేదు. అంతేగాక ప్రస్తుతం ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్కు కోచ్గా వ్యవహరిస్తున్న కుంబ్లే పనితనం అనుకున్నంత సజావుగా లేదు. అతని పర్యవేక్షణలో పంజాబ్ కింగ్స్ అనుకున్నంత స్థాయిలో రాణించలేకపోతుంది. కుంబ్లే ఇప్పటికే తనకు కోచ్ పదవిపై ఆసక్తి లేదని అనధికారికంగా పేర్కొన్నప్పటికీ.. బహిరంగంగా మాత్రం ఐపీఎల్లో పంజాబ్ను సరిగా నడిపించలేకపోతున్నాడు.. ఇక టీమిండియాను ఎలా నడిపిస్తాడని బీసీసీఐ సభ్యులు గంగూలీ ఎదుట పేర్కొన్నట్లు సమాచారం. ఇక వివిఎస్ లక్ష్మణ్ కూడా కోచ్ పదవి చేపట్టే అవకాశాలు దాదాపు లేనట్లే. అందుకే బీసీసీఐ విదేశీ కోచ్పై ఆసక్తి చూపిస్తుందని క్రీడా వర్గాలు పేర్కొంటున్నాయి. చదవండి: Sunil Gavaskar: రానున్న రెండు వరల్డ్కప్లకు అతడే కెప్టెన్గా ఉండాలి! -
ఒక్కటి ఓడినా కాల్చుకుతింటారు.. ఇమేజ్ డ్యామేజ్.. ఇంకా: రవిశాస్త్రి
Ravi Shastri To Step Down As Team India Head Coach: టీమిండియా ప్రధాన కోచ్ పదవి అంటే కత్తి మీద సాములాంటిదని రవిశాస్త్రి అన్నాడు. అభిమానుల అంచనాలు అందుకుంటే అంతా సవ్యంగా సాగుతుందని, లేనిపక్షంలో విమర్శల జడి కురుస్తుందని పేర్కొన్నాడు. జట్టు విజయం తప్ప ఓటమిని ఫ్యాన్స్ జీర్ణించుకోలేరని, వరుస పరాజయాల తర్వాత కనీసం ఒక్కసారైనా గెలవకపోతే పరిస్థితి దారుణంగా ఉంటుందని చెప్పుకొచ్చాడు. 2017లో భారత జట్టు హెడ్ కోచ్గా నియమితుడైన రవిశాస్త్రి హయాంలో టీమిండియా చెప్పుకోదగ్గ స్థాయిలో రాణించిన సంగతి తెలిసిందే. ఇటీవలి ఆస్ట్రేలియా టూర్, ఇంగ్లండ్ ఇండియా పర్యటన, ఇండియా ఇంగ్లండ్ టూర్లోనూ కోహ్లి సేన విజయాలు సాధించడం ఇందుకు తాజా నిదర్శనం. ఇక ఇదిలా ఉంటే.. టి20 వరల్డ్కప్ తర్వాత తన పదవి నుంచి రవిశాస్త్రి తప్పుకోనున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. టీమిండియా దక్షిణాఫ్రికా టూర్ వరకు అందుబాటులో ఉండాలని బీసీసీఐ కోరినా, ఆయన అందుకు నిరాకరించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ‘ది గార్డియన్’కు రవిశాస్త్రి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. ఇంగ్లండ్ పర్యటనలో భాగంగా బుక్ లాంచ్ చేసిన రవిశాస్త్రికి కరోనా సోకిన సంగతి తెలిసిందే. ఫలితంగా ఇతర కోచ్లు ఐసోలేషన్కు వెళ్లడం, ఐదో టెస్టుకు ముందు టీమిండియా అసిస్టెంట్ ఫిజియో యోగేశ్ పర్మార్కు కోవిడ్ పాజిటివ్గా తేలడంతో మ్యాచ్ నిరవధికంగా వాయిదా పడింది. దీంతో రవిశాస్త్రిని ఫ్యాన్స్ విపరీతంగా ట్రోల్ చేశారు. ఈ నేపథ్యంలో అతడు మాట్లాడుతూ.. ‘‘మనకు కోవిడ్ సోకిందా లేదా అన్న విషయం గురించి వాళ్ల(అభిమానుల)కు అనవసరం. ఎప్పుడూ జట్టు గెలుపొందడమే వాళ్లకు కావాల్సింది. భారత జట్టుకు కోచ్గా ఉండటం అంటే బ్రెజిల్ లేదా ఇంగ్లండ్ ఫుట్బాల్ జట్టుకు కోచ్గా ఉన్నట్లే. అంచనాలు ఆ స్థాయిలో ఉంటాయి. ఆరు నెలల పాటు జట్టు మంచి విజయాలు సాధించినప్పటికీ.. ఆ తర్వాత ఒక్క ఓటమి ఎదురైనా మనల్ని టార్గెట్ చేస్తారు. కాబట్టి మనకు అప్పటికప్పుడు గెలుపు అవసరం. లేదంటే మనల్ని కాల్చుకుతింటారు. ఇమేజ్ డ్యామేజ్ చేసేందుకు వెనుకాడరు. అలాంటి సమయంలో ఇదిగో ఇలా నాలాగా దాక్కోవాల్సి వస్తుంది’’ అని పేర్కొన్నాడు. గెలిచే అవకాశాలు ఉన్నాయి.. అయితే అదొక్కటే బాధ! ఇక అక్టోబరులో ప్రారంభం కానున్న టీ20 వరల్డ్కప్నకు సన్నద్ధం కావడం గురించి రవిశాస్త్రి చెబుతూ.. ‘‘మా శాయశక్తులా కృషి చేస్తాం. మా స్థాయికి తగ్గట్లు ఆడితే గెలుపు ఖాయం. నిజానికి టెస్ట్ మ్యాచ్ అంటే ఒక రకమైన ఒత్తిడి ఉంటుంది. అదే టీ20 మ్యాచ్లను ఎంజాయ్ చేస్తూ ఆడవచ్చు. కప్ గెలిచే విధంగా అద్భుతమైన ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాం’’ అని వెల్లడించాడు. ఇక ఎంతో మంది గొప్ప ఆటగాళ్లతో పనిచేశానని, డ్రెసింగ్ రూంలో మంచి వాతావరణం ఉంటుందన్న రవిశాస్త్రి.. ఈ మెగా టోర్నీ తర్వాత కాస్త బాధపడాల్సి వస్తుందని కోచ్ పదవి నుంచి తప్పుకునే విషయాన్ని చెప్పకనే చెప్పాడు. కాగా రవిశాస్త్రి స్థానంలో అనిల్ కుంబ్లే హెడ్ కోచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటూ వార్తలు వినిపిస్తున్నాయి. చదవండి: MS Dhoni: జోరు మీదున్న తలైవా.. ఫోర్లు, సిక్సర్ల వర్షం -
టీమిండియా ప్రధాన కోచ్గా మరోసారి ఆయనే!
Anil Kumble As Team India Coach.. టి20 ప్రపంచకప్ తర్వాత టీమిండియా ప్రధాన కోచ్ పదవి నుంచి రవిశాస్త్రి తప్పుకోనున్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. బీసీసీఐ రవిశాస్త్రిని దక్షిణాఫ్రికా పర్యటన వరకు అందుబాటులో ఉండాలని కోరినా అందుకు ఆయన ఒప్పుకోలేదని తెలిసింది. దీంతో బీసీసీఐ కొత్త కోచ్ అన్వేషణలో పడింది. దీనికి సంబంధించి బీసీసీఐ టి20 ప్రపంచకప్ తర్వాత దరఖాస్తులను కోరనుంది. కాగా రాహుల్ ద్రవిడ్, వీరేంద్ర సెహ్వాగ్లలో ఎవరో ఒకరిని ప్రధాన కోచ్ పదవి వరించే అవకాశముందని ఊహాగానాలు వస్తున్నాయి. అయితే తాజాగా అనిల్ కుంబ్లే మరోసారి టీమిండియా ప్రధాన కోచ్గా బాధ్యతలు చేపట్టాలంటూ బీసీసీఐ అతన్ని కోరినట్లు అనధికారిక రిపోర్ట్స్ ద్వారా తెలిసింది. ఇంతకముందు అనిల్ కుంబ్లే టీమిండియాకు కోచ్గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. అయితే కోహ్లి, కుంబ్లే మధ్య విభేదాలు బయటపడ్డాయి. కుంబ్లే ఆలోచన విధానంతో కోహ్లికి పొసగలేదు. జట్టు ఎంపికలో ఇద్దరి మధ్య పొరపచ్చాలు వచ్చాయి. దీంతో ఏడాది కాంట్రాక్ట్ కన్నా ముందే కుంబ్లే అర్థంతరంగా కోచ్ పదవి నుంచి పక్కకు తప్పుకోవాల్సి వచ్చింది. చదవండి: కోహ్లి వారసుడి ఎంపికపై చాయిస్ను వెల్లడించిన లిటిల్ మాస్టర్ ఇక 2016లో ధోని కెప్టెన్గా ఉన్న సమయంలో అనిల్ కుంబ్లే టీమిండియా ప్రధాన కోచ్ బాధ్యతలను స్వీకరించాడు. ఏడాది కాలానికి గానూ కుంబ్లే కోచ్ పదవిలో ఉంటారని బీసీసీఐ మేనేజ్మెంట్ తెలిపింది. అయితే 2017 జనవరిలో ధోని పరిమిత ఓవర్ల నుంచి కెప్టెన్గా వైదొలిగాడు. ఆ తర్వాత కోహ్లి కెప్టెన్ అవడం జరిగింది. ఇద్దరి మధ్య సఖ్యత లేకపోవడంతో వారిద్దరి మధ్య ఉన్న విభేదాలు బహిరంగంగానే వెలుగుచూశాయి. కాగా కుంబ్లే, కోహ్లి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరడంతో అప్పటి బీసీసీఐ సభ్యుడు వినోద్ రాయ్ కుంబ్లే వెస్టిండీస్ టూర్ వరకు ఆ పదవిలో ఉంటాడని తెలిపాడు. కాగా 2017 ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో పాకిస్తాన్ చేతిలో టీమిండియా పరాజయం పాలైంది. తన కాంట్రాక్ట్కు ఇంకా సమయమున్నప్పటికీ 2017 జూన్ 20న కుంబ్లే టీమిండియా కోచ్ పదవికి అర్థంతరంగా రాజీనామా చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత కోహ్లి రవిశాస్త్రిని ప్రధాన కోచ్ పదవి ఇవ్వాలని బీసీసీఐని కోరడం.. వెంటనే టీమిండియా కోచ్గా రవిశాస్త్రి బాధ్యతలు చేపట్టడం జరిగిపోయింది. చదవండి: Virat Kohli: కోహ్లి నిర్ణయం సరైందే.. తను వరల్డ్కప్ గెలవాలి ఇప్పటికైతే కుంబ్లే విషయంలో క్లారిటీ లేకపోయినప్పటికీ.. కోహ్లీతో విభేదాల కారణంగానే పదవికి రాజీనామా చేశాడు. మరి ఇప్పుడు కోహ్లి జట్టులోనే ఉన్నాడు.. టి20 ప్రపంచకప్ తర్వాత టి20 కెప్టెన్సీ నుంచి తప్పుకోనున్న కోహ్లి పరిమిత, టెస్టు జట్టుకు మాత్రం కెప్టెన్గా కొనసాగనున్నాడు. మరి కుంబ్లే కోచ్ పదవికి ఆసక్తి చూపిస్తాడా అనేది ఆసక్తికరంగా మారింది. ఇక కుంబ్లేతో పాటు వివిఎస్ లక్ష్మణ్ కూడా టీమిండియా కోచ్ పదవి చేపట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది. మరి ఈ వార్తల్లో నిజమెంత అనేది తెలియాలంటే టి20 ప్రపంచకప్ ముగిసేంతవరకు వేచి చూడాల్సిందే. చదవండి: ఇప్పటికైతే రోహిత్.. మరి తర్వాత ఎవరు? -
James Anderson: అండర్సన్ అరుదైన రికార్డు.. కుంబ్లే సరసన
నాటింగ్హమ్: ఇంగ్లండ్ సీనియర్ స్టార్ బౌలర్ జేమ్స్ అండర్సన్ భారత్తో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్లో మరో మైలురాయిని అందుకున్నాడు. టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా అనిల్ కుంబ్లే(619 వికెట్లు)తో సమానంగా నిలిచాడు. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లిని గోల్డెన్ డక్(0) చేయడం ద్వారా అండర్సన్ 619వ వికెట్ను తన ఖాతాలో వేసుకున్నాడు తద్వారా కుంబ్లే 619 టెస్టు కెరీర్ వికెట్ల రికార్డును సమం చేశాడు. కాగా సంప్రదాయ ఫార్మాట్లో అత్యధిక వికెట్ల రికార్డు ఇప్పటికీ మురళీధరన్ (శ్రీలంక; 800) పేరిట పదిలంగా ఉండగా, తర్వాతి స్థానాల్లో షేన్ వార్న్ (ఆస్ట్రేలియా; 708), కుంబ్లే (619) ఉన్నారు. 2003లో అరంగేట్రం చేసిన అండర్సన్ 163వ టెస్టుతో కుంబ్లే మైలురాయిని చేరుకున్నాడు. ఓవరాల్గా అండర్సన్ 163 టెస్టుల్లో 619 వికెట్లు, 194 వన్డేల్లో 269 వికెట్లు, 19 టీ20ల్లో 18 వికెట్లు తీశాడు. -
ఆంధ్ర ప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ను కలిసిన అనిల్ కుంబ్లే
-
ఏపీ సీఎం వైఎస్ జగన్ను కలిసిన అనిల్ కుంబ్లే
తాడేపల్లి: టీమిండియా మాజీ కోచ్, దిగ్గజ స్పిన్ బౌలర్ అనిల్ కుంబ్లే.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసారు. సోమవారం తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో ఆయన.. సీఎం వైయస్ జగన్తో భేటీ అయ్యారు. ఈ భేటీలో ఇరువురి మధ్య క్రీడల అభివృద్ధికి సంబంధించి పలు అంశాలు చర్చకు వచ్చాయి. ఏపీలో స్పోర్ట్స్ యూనివర్శిటీ, క్రీడా సామగ్రి తయారీ ఫ్యాక్టరీ ఏర్పాటుపై ఇరువురు చర్చించారు. ఈ రెండు ప్రాజెక్ట్ల ఏర్పాటుపై దృష్టి సారించాలని, దీనికి తన వంతు సహకారం అందిస్తానని కుంబ్లే సీఎంకు తెలిపారు. క్రీడా సామగ్రి తయారీ ఫ్యాక్టరీలు ప్రస్తుతం జలంధర్, మీరట్ లాంటి నగరాల్లో మాత్రమే ఉన్నాయని, అక్కడి నుంచే అన్ని రకాల క్రీడా సామగ్రి సరఫరా జరుగుతుందని కుంబ్లే.. సీఎం దృష్టికి తీసుకువచ్చారు. ఏపీలో ఫ్యాక్టరీ పెడితే అందరికీ అందుబాటులో క్రీడా సామగ్రి ఉంటుందని ఆయన సీఎంకు వివరించారు. టీమిండియాకు టెస్ట్ కెప్టెన్గా, ప్రధాన బౌలర్గా వ్యవహరించిన అనిల్ కుంబ్లే.. భారత జట్టు ప్రధాన కోచ్ సహా బీసీసీఐలో పలు ఉన్నత పదవులు చేపట్టాడు. -
Younis Khan: కుంబ్లే బౌలింగ్లో డకౌట్.. మొయిన్ భాయ్ తిట్టాడు!
ఇస్లామాబాద్: పాకిస్తాన్ క్రికెట్ చరిత్రలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాడు యూనిస్ ఖాన్. ముఖ్యంగా టెస్టు జట్టు మిడిలార్డర్ గొప్ప బ్యాట్స్మెన్లలో ఒకడిగా గుర్తింపు పొందాడు. సంప్రదాయ క్రికెట్లో 10 వేలకు పైగా పరుగులు చేసిన అతడు... వన్డేల్లో 7 వేల పరుగులు సాధించాడు. మూడు ఫార్మాట్లలోనూ పాకిస్తాన్ జట్టుకు కెప్టెన్గా వ్యవహరించిన యూనిస్ ఖాన్... ప్రస్తుతం బ్యాటింగ్ కోచ్గా సేవలు అందిస్తున్న విషయం తెలిసిందే. అతడి శిక్షణలోని పాక్ గత కొన్ని నెలలుగా మంచి విజయాలు నమోదు చేస్తోంది. ఇటీవల దక్షిణాఫ్రికా, జింబాబ్వేల్లో పర్యటించిన పాక్ జట్టు ఆ దేశాలను ఓడించి వరుస సిరీస్లు కైవసం చేసుకుంది. ఇలా ఆటగాడిగా, కెప్టెన్గా, కోచ్గా ప్రతీ అంశంలోనూ తనదైన ముద్ర వేస్తున్న యూనిస్ ఖాన్.. కెరీర్ ఆరంభంలో మాత్రం బాగా తిట్లు తిన్నాడట. మాజీ కెప్టెన్ మొయిన్ ఖాన్ అతడికి చివాట్లు పెట్టాడట. ఈ విషయాల గురించి యూనిస్ ఖాన్ తాజాగా మాట్లాడుతూ... ‘‘నాకు గుర్తుంది. మొయిన్ ఖాన్ సారథ్యంలోనే నేను అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాను. అయితే, భారత జట్టుతో జరిగిన మ్యాచ్లో నేను డకౌట్గా వెనుదిరగటంతో భాయ్ నన్ను బాగా తిట్టాడు. తనకు చాలా కోపం వచ్చింది. ఏదేమైనా తనకు ధన్యవాదాలు చెప్పాలి. నిజానికి తన కారణంగానే నా తప్పులు సరిదిద్దుకోగలిగాను. ఎన్నో పాఠాలు నేర్చుకున్నా. అంతర్జాతీయ క్రికెట్లో నా విజయం వెనుక భాయ్ పాత్ర మరువలేనిది’’ అని గత జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నాడు. కాగా 2000 సంవత్సరం మార్చిలో షార్జాలో భారత్తో జరిగిన వన్డే మ్యాచ్లో అనిల్ కుంబ్లే బౌలింగ్లో యూనిస్ డకౌట్ అయ్యాడు. ఇక ఈ మ్యాచ్లో గంగూలీ కెప్టెన్సీలోని టీమిండియా 5 వికెట్ల తేడాతో దాయాది జట్టుపై ఘన విజయం సాధించింది. మహ్మద్ అజారుద్దీన్(54 పరుగులు) ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. కాగా యూఏఈఓలో నిర్వహించిన కోకా కోలా కప్ మక్కోణపు వన్డే సిరీస్లో భారత్, పాకిస్తాన్, దక్షిణాఫ్రికా జట్లు పాల్గొన్నాయి. చదవండి: Viral: సిగ్గు పడాలి.. ఇలాగేనా పోరాడేది: భజ్జీ Suryakumar Yadav: కోహ్లి నన్ను స్లెడ్జ్ చేశాడు.. సంతోషం! -
కుంబ్లే కారణంగా అనేక నిద్రలేని రాత్రులు గడిపా..
న్యూఢిల్లీ: "ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్"కు ఎంపికైన నేపథ్యంలో టీమిండియా స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లేపై శ్రీలంక, పాకిస్తాన్లకు చెందిన మాజీ క్రికెటర్లు ప్రశంసల వర్షం కురిపించారు. కుంబ్లే కారణంగా అనేక నిద్రలేని రాత్రులు గడిపానని లంక ఆల్టైమ్ గ్రేట్ ఆటగాడు సంగక్కర కొనియాడాడు. వేగం, కచ్చితత్వం అతని ప్రధాన ఆయుధాలని, వీటితో కెరీర్ ఆసాంతం తనను చాలా ఇబ్బంది పెట్టాడని పేర్కొన్నాడు. అతని ఎత్తు అతనికి అడ్వాంటేజ్ అని, దాని వల్ల అతను విసిరిన బంతులు బాగా బౌన్స్ అయ్యేవని గుర్తు చేసుకున్నాడు. బౌలర్గా తనను ఇబ్బంది పెట్టినా, వ్యక్తిగతంగా చాలా మంచివాడని పొగడ్తలతో ముంచెత్తాడు. బ్యాట్స్మన్ను కట్టడి చేసేందుకు కుంబ్లే వద్ద పక్కా ప్రణాళిక ఉంటుందని, దాన్ని అతను తూచా తప్పకుండా అమలు చేసి సత్ఫలితాలు సాధించాడని మరో శ్రీలంక ఆటగాడు జయవర్ధనే పేర్కొన్నాడు. కుంబ్లే బలాలేంటో తనకు బాగా తెలుసని, తన బంతుల ద్వారా అతడు బ్యాట్స్మన్ను ప్రశ్నిస్తూనే ఉంటాడని అతను వెల్లడించాడు. ఇదిలా ఉంటే బౌలర్లు సైతం కుంబ్లేను ఆకాశానికెత్తారు. పాక్ మాజీ ఆటగాడు వసీమ్ అక్రమ్ కుంబ్లేను ప్రశంసలతో ముంచెత్తాడు. ఢిల్లీలో కుంబ్లే తమపై 10 వికెట్లు తీయడం తన కళ్లెదుటే మెదులుతుందని, అతని పదో వికెట్ నేనే కావడంతో ఆ చారిత్రక ఘట్టాన్ని ప్రత్యక్షంగా చూసే అవకాశం తనకు దక్కిందని పేర్కొన్నాడు. కాగా, కుంబ్లే భారత్ తరఫున 132 టెస్టులు, 271 వన్డేలు ఆడాడు. టెస్టుల్లో 619, వన్డేల్లో 337 వికెట్లు పడగొట్టాడు. అతను టీమిండియా కోచ్గా కూడా పనిచేశాడు. చదవండి: ఇంగ్లండ్లో ఐపీఎల్ నిర్వహణ డౌటే.. -
పొలార్డ్ను మరిపిస్తున్నాడు.. ఆ సాహసం చేయలేను: కుంబ్లే
ముంబై: ఈ ఐపీఎల్ సీజన్కు సంబంధించి ఫిబ్రవరిలో జరిగిన వేలంలో తమిళనాడుకు చెందిన యువ క్రికెటర్ షారుఖ్ ఖాన్ను పంజాబ్ కింగ్స్ సొంతం చేసుకుంది. కుడి చేతి వాటం స్పిన్నర్ అయిన షారుఖ్.. హార్ద్ హిట్టర్ కూడా. తమిళనాడు ప్రీమియర్ లీగ్లో ఆకట్టుకోవడంతో షారుఖ్ వెలుగులోకి వచ్చాడు. లోయర్-మిడిల్ ఆర్డర్లో 30 నుంచి 40 పరుగుల్ని ఈజీగా సాధిస్తూ ఐపీఎల్ ఫ్రాంచైజీల దృష్టిని ఆకర్షించాడు. షారుఖ్పై ముందు నుంచీ కన్నేసిన పంజాబ్ కింగ్స్.. వేలంలో భారీ ధర చెల్లించి తీసుకుంది. అతని కనీస ధర రూ. 20లక్షలు ఉంటే రూ. 5 కోట్ల 25 లక్షలకు పంజాబ్ పోటీ పడి మరీ కొనుగోలు చేసింది. ప్రధానంగా ఒక హిట్టర్ కావాలనే ఉద్దేశంతో షారుఖ్పై ముందు నుంచి ఫోకస్ చేసిన పంజాబ్ అతన్ని తీసుకున్న వెంటనే ఆనందం వ్యక్తం చేసింది. ఇదిలా ఉంచితే, పంజాబ్ కింగ్స్ ప్రాక్టీస్లో షారుఖ్ ఖాన్ ఆకట్టుకోవడంపై ఆ ఫ్రాంఛైజీ కోచ్ అనిల్ కుంబ్లే సంతోషం వ్యక్తం చేస్తున్నాడు. ఏకంగా ఆ యువ క్రికెటర్ను ముంబై ఇండియన్స్ స్టార్ ప్లేయర్ కీరోన్ పొలార్డ్తో పోలుస్తున్నాడు. షారుఖ్ షాట్లు చూస్తుంటే తనకు పొలార్డ్ గుర్తుకు వస్తున్నాడంటూ కుంబ్లే పేర్కొన్నాడు. గతంలో ముంబై ఇండియన్స్కు మెంటార్గా పని చేసిన సమయంలో పొలార్డ్కు నెట్స్ బౌలింగ్ వేసిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించాడు. తాను నెట్స్లో పొలార్డ్కు బౌలింగ్ వేసిన అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని చూస్తే షారుక్ కూడా అవే స్కిల్స్ ఉన్నాయంటూ కొనియాడాడు. ‘ నేను ముంబై ఇండియన్స్తో కలిసి పని చేసిన సమయంలో పొలార్డ్ చాలా ప్రమాదకరంగా కనిపించేవాడు. నేను అతనికి పదే పదే ఒకే విషయం చెప్పేవాడిని. నా వైపు స్టైయిట్ బంతిని కొట్టకు అనే చెప్పేవాడిని. కానీ ఇప్పుడు షారుక్కు బౌలింగ్ వేసే ధైర్యం చేయడం లేదు. నా వయసు పెరిగింది. నా శరీరం బౌలింగ్ చేయడానికి సహకరించడం లేదు. దాంతో షారుఖ్కు కూడా బౌలింగ్ చేసే సాహసం చేయడం లేదు. అతని ప్రాక్టీస్ను గమనిస్తే పొలార్డ్ షాట్లే నాకు గుర్తుకు వస్తున్నాయి’అని కుంబ్లే తెలిపాడు. ఈ ఐపీఎల్ సీజన్లో ఏప్రిల్ 12వ తేదీన పంజాబ్ కింగ్స్- రాజస్తాన్ రాయల్స్ జట్ల మధ్య మ్యాచ్ జరుగనుంది. ఇక్కడ చదవండి: రూ. 8 కోట్లు పెట్టి కొన్నారు.. మెరెడిత్కు స్థానం లేదా! పంజాబ్ కింగ్స్ జట్టు ఇదే -
కుంబ్లేను అనుకరిస్తున్న బూమ్..బూమ్.. బూమ్రా
సాక్షి, చెన్నై: ఇటీవల ముగిసిన ఆసీస్ పర్యటనలో గాయం కారణంగా ఆఖరి టెస్ట్కు దూరమైన భారత స్పీడ్ గన్ జస్ప్రీత్ బూమ్రా.. ఇంగ్లండ్తో ప్రారంభంకానున్న నాలుగు టెస్ట్ల సిరీస్కు అందుబాటులోకి వచ్చాడు. చెన్నైలో జరుగనున్న తొలి రెండు టెస్ట్లకు జట్టులోకి వచ్చిన ఈ రేసు గుర్రం.. నెట్ ప్రాక్టీస్ సందర్భంగా భారత లెజెండరీ స్పిన్నర్ అనిల్ కుంబ్లేను అనుకరిస్తూ సరదాగా బౌలింగ్ చేశాడు. ఈ సన్నివేశానికి సంబంధించిన వీడియోను భారత క్రికెట్ జట్టు తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసూ.. మనమింత వరకు యార్కర్లు, బౌన్సర్లను వేసే బూమ్రానే చూశాం.. ఇదిగో బూమ్రాలోని సరి కొత్త కోణం అంటూ క్యాప్షన్ను జోడించింది. ఈ వీడియోలో బూమ్రా.. అనిల్ కుంబ్లేలా బౌలింగ్ చేసేందుకు ప్రయత్నిస్తుంటాడు. సరదాగా సాగిన ఈ సన్నివేశం ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది. కాగా, భారత్ తరపున అత్యధిక వన్డే, టెస్ట్ వికెట్లు సాధించిన బౌలర్గా కొనసాగుతున్న అనిల్ కుంబ్లే.. భారత జట్టు ప్రధాన కోచ్గా కూడా వ్యవహరించాడు. గత కొంత కాలంగా భారత జట్టులో కీలక సభ్యుడిగా కొనసాగుతూ వస్తున్న 27 ఏళ్ల జస్ప్రీత్ బూమ్రా వైవిధ్యభరితమైన బౌలింగ్ శైలిని కలిగి ఉంటాడు. అలాంటిది అతను మరొక బౌలర్ను అనుకరించడం సరదాగా ఉందని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. కాగా, ఇంగ్లండ్తో ప్రారంభం కానున్న తొలి టెస్టు ఫిబ్రవరి 5న చెన్నైలో ప్రారంభం కానుంది. -
కోట్లు పెట్టి కొన్నాం, వదిలించుకోక తప్పదు!
న్యూఢిల్లీ: ఈ ఏడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో దారుణంగా విఫలమైన ఆస్ట్రేలియా ఆల్రౌండర్ గ్లెన్ మ్యాక్స్వెల్, వెస్టిండీస్ బౌలర్ షెల్డన్ కాట్రెల్లపై వేటు వేసేందుకు కింగ్స్ ఎలెవన్ పంజాబ్ సిద్ధమైంది. వచ్చే ఏడాది జరిగే ఐపీఎల్కు మరో ఆరు నెలల సమయం మాత్రమే ఉండటంతో... ఈ ఏడాది జట్టు ప్రదర్శనపై పంజాబ్ యాజమాన్యం అప్పుడే సమీక్షను ఆరంభించింది. కెప్టెన్గా కేఎల్ రాహుల్, హెడ్ కోచ్గా అనిల్ కుంబ్లేను కొనసాగించేందుకు సిద్ధమైంది. రాహుల్ ఈ ఏడాది అద్భుతంగా రాణించాడు. 14 మ్యాచ్ల్లో 55.83 సగటుతో 670 పరుగులు చేసి టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడికి ఇచ్చే ఆరెంజ్ క్యాప్ను గెల్చుకున్నాడు. ఇందులో ఒక సెంచరీ, ఐదు అర్ధ సెంచరీలు ఉండటం విశేషం. అంతేకాకుండా పంజాబ్ కోచ్గా తనకు తొలి ఏడాదే అయినా... జట్టును వరుస ఓటముల నుంచి గెలుపు బాట పట్టించిన కుంబ్లే పనితీరుపై పంజాబ్ సంతృప్తితోనే ఉంది. అయితే వేలంలో కోట్లు వెచ్చించి తెచ్చుకున్న మ్యాక్స్వెల్ (రూ.10.75 కోట్లు), కాట్రెల్ (రూ.8.5 కోట్లు) ప్రదర్శనలపై తీవ్ర అసంతృప్తితో ఉన్న పంజాబ్... వారిని వదిలించుకునేందుకు సిద్ధమైనట్లు సమాచారం. (చదవండి: నేను అలాంటి వాడిని కాదు: రోహిత్) మ్యాక్స్వెల్ ఆడిన 13 మ్యాచ్ల్లో కేవలం 108 పరుగులు మాత్రమే చేశాడు. మయాంక్ అగర్వాల్, నికోలస్ పూరన్, షమీ, గేల్, యువ లెగ్స్పిన్నర్ రవి బిష్ణోయ్, అర్ష్దీప్ సింగ్లను కొనసాగించే వీలుంది. ముఖ్యంగా మిడిల్ ఆర్డర్ను పటిష్టం చేసేలా కసరత్తులు ఆరంభించింది. ఈ సీజన్ తొలి అర్ధ భాగంలో కేవలం ఒకే విజయాన్ని నమోదు చేసిన పంజాబ్... అనంతరం వరుసగా ఐదు మ్యాచ్ల్లో గెలిచి ప్లే ఆఫ్స్కు అర్హత సాధించేలా కనిపించింది. అయితే చివరి రెండు మ్యాచ్ల్లోనూ ఓడి ఇంటి దారి పట్టింది. (చదవండి: 100 బాల్స్.. 102 రన్స్.. నో సిక్సర్స్) -
శభాష్ అనిల్ కుంబ్లే: గావస్కర్
న్యూఢిల్లీ: వరుసగా ఐదు మ్యాచ్ల్లో ఓటమి తర్వాత పుంజుకుని ప్లేఆఫ్స్ రేసు ఆశల్ని సజీవంగా ఉంచుకున్న కింగ్స్ పంజాబ్పై దిగ్గజ క్రికెటర్ సునీల్ గావస్కర్ ప్రశంసలు కురిపించాడు. వరుసగా నాలుగు విజయాలు సాధించి ఒక్కసారిగా రేసులోకి వచ్చేసిన పంజాబ్ పోరాట స్ఫూర్తితో దూసుకుపోవడానికి కోచ్ అనిల్ కుంబ్లేనే కారణమని గావస్కర్ కొనియాడాడు. తన క్రికెట్ కెరీర్లో ఏ విధంగా అయితే పోరాటం చేశాడో, అదే స్ఫూర్తితోనే జట్టులోకి నింపాడని గావస్కర్ ప్రశంసించాడు. స్టార్ స్పోర్స్ క్రికెట్ లైవ్ షోలో గావస్కర్ మాట్లాడుతూ.. ‘ కింగ్స్ పంజాబ్ వరుస విజయాల్లో కుంబ్లే రోల్ను మరచిపోకూడదు. కుంబ్లే ఒక పోరాట యోధుడు. అది అతని క్రికెట్ కెరీర్లో చాలా దగ్గరగా చూశాం. తల పగిలినప్పుడు కూడా కట్టుకట్టుకుని బౌలింగ్ వేసి తన అంకిత భావాన్ని చాటుకున్నాడు. (ధోని ఈజ్ బ్యాక్: సెహ్వాగ్) ఇప్పుడు కింగ్స్ పంజాబ్లో కూడా అదే అంకిత భావాన్ని నింపుతున్నాడు కుంబ్లే. అసాధ్యమనుకున్న పరిస్థితుల్ని నుంచి కింగ్స్ పంజాబ్ను గాడిలో పెట్టాడు. ప్రస్తుతం కింగ్స్ పంజాబ్ రేసులోకి వచ్చింది’ అని గావస్కర్ పేర్కొన్నాడు. సన్రైజర్స్ హైదరాబాద్తో ఇటీవల జరిగిన మ్యాచ్లో 126 పరుగుల్ని కూడా కాపాడుకుని విజయాన్ని సాధించడం పంజాబ్ ఆటగాళ్లలో గెలవాలి అనే కసే కారణమన్నాడు. అందుకు వారిలో అనిల్ కుంబ్లే నింపిన స్ఫూర్తే ప్రధాన కారణంగా గావస్కర్ చెప్పుకొచ్చాడు. ఇక కింగ్స పంజాబ్ కెప్టెన్ కేఎల్ రాహుల్పై కూడా గావస్కర్ ప్రశంసలు కురిపించాడు. కెప్టెన్సీ పాత్రలో రాహుల్ ఎంతో చక్కగా ఒదిగిపోయాడో మనం చూస్తున్న మ్యాచ్లే ఉదాహరణ అని తెలిపాడు.బ్యాటింగ్లో ఆకట్టుకోవడమే కాకుండా, ఫీల్డింగ్లో మార్పులు, బౌలింగ్ చేయిస్తున్న విధానం రాహుల్ కెప్టెన్గా ఎంతో ఎదిగాడు అనడాన్ని చూపెడుతుందన్నాడు. హైదరాబాద్తో మ్యాచ్లో చివరి ఓవర్ను అర్షదీప్కు ఇవ్వడంలో రాహుల్ కెప్టెన్సీ చాతుర్యం కనబడిందన్నాడు. ఎస్ఆర్హెచ్ 14 పరుగులు చేయాల్సిన సమయంలో అర్షదీప్ను బౌలింగ్కు ఉపయోగించి సక్సెస్ కావడం రాహుల్లోని కెప్టెన్సీ పరిణితికి నిదర్శమన్నాడు. (బ్రేక్లో ఒక ప్లేయర్ను మిస్సయ్యాం..!) -
సూపర్ ఓవర్ ఓటమిపై కుంబ్లే రియాక్షన్
దుబాయ్: ఐపీఎల్-13వ సీజన్లో భాగంగా రెండో మ్యాచే సూపర్ ఓవర్కు దారి తీయడం లీగ్పై ఆసక్తిని అమాంతం పెంచేసింది. ఆదివారం కింగ్స్ పంజాబ్-ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ నరాలు తెగే ఉత్కంఠను రేకెత్తించింది. చివరకు ఆ మ్యాచ్ సూపర్ వరకు వెళ్లడం అందులో ఢిల్లీ క్యాపిటల్స్ విజయం సాధించడం జరిగింది. సూపర్ ఓవర్లో కింగ్స్ పంజాబ్ రెండు పరుగులే చేసి రెండు వికెట్లు కోల్పోవడంతో వారి ఇన్నింగ్స్ ఇంకా బంతులు ఉండగానే ముగిసింది. సూపర్ ఓవర్లో ఏ జట్టైనా రెండు వికెట్లు కోల్పోతే అక్కడితో వారి ఇన్నింగ్స్కు తెరపడుతోంది. కింగ్స్ పంజాబ్ జట్టులో రాహుల్ రెండు పరుగులే చేసి ఔట్ కాగా, ఆపై వెంటనే పూరన్కు పెవిలియన్ చేరాడు. ఇలా సూపర్ ఓవర్లో ఒక జట్టు రెండు పరుగులే నిర్దేశించిన సందర్భాలు చాలా అరుదు. దాంతో కింగ్స్ పంజాబ్ ఓటమి ముందే డిసైడ్ అయిపోయింది. ఆ రెండు పరుగుల్ని ఢిల్లీ సునాయాసంగా సాధించడంతో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. ఈ ఓటమిపై కింగ్స్ పంజాబ్ హెడ్కోచ్ అనిల్ కుంబ్లే మాట్లాడుతూ.. ‘ ఇది చాలా నిరాశ కల్గించింది. మ్యాచ్ ఆద్యంత ఆకట్టుకుని చివరకు ఇలా దారుణంగా ఓటమి పాలు కావడం బాధించింది. మేము మ్యాచ్ గెలవాల్సింది. కానీ చేజేతులా చేసుకున్నాం. ఇది నిజంగా దురదృష్టమే. మ్యాచ్ ఎప్పుడైతే సూపర్ ఓవర్కు దారి తీసినప్పుడు మేము కనీసం 10-12 పరుగులు చేస్తే బాగుండేది. కానీ అలా జరగలేదు. ఢిల్లీ ఓటమి అంచుల నుంచి బయటకొచ్చి గెలుపును అందుకుంది. ఇక్కడ ఢిల్లీని అభినందించాలి. ఇది మాకు ఫస్ట్గేమ్ కాబట్టి చేసిన పొరపాట్లను గుణపాఠం నేర్చుకుంటాం. ఓవరాల్గా చూస్తే మా ఆట బాగుంది. వచ్చే గేమ్నాటికి అన్నీ సర్దుకుంటాయి అని ఆశిస్తున్నా’ అని కుంబ్లే తెలిపాడు.(చదవండి: కోహ్లి.. నీకు అర్థమవుతోందా..?) -
కేఎల్ రాహుల్ కెప్టెన్సీపై నమ్మకం ఉంది
దుబాయ్ : ఐపీఎల్ 2020లో కేఎల్ రాహుల్కు కెప్టెన్గా కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ను సమర్థంగా నడిపించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని ఆ జట్టు హెడ్ కోచ్ అనిల్ కుంబ్లే అభిప్రాయపడ్డాడు. 2019లో పంజాబ్ జట్టును నడిపించిన రవిచంద్రన్ అశ్విన్ గతేడాది డిసెంబర్లో జరిగిన వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ కొనుగోలు చేసింది. దీంతో కింగ్స్ యాజమాన్యం కేఎల్ రాహుల్ను కెప్టెన్గా ఎంపిక చేసింది. సెస్టెంబర్ 19 నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్ 13వ సీజన్కు ఇప్పటికే కింగ్స్ ఎలెవెన్ తన ప్రాక్టీస్ను కూడా ఆరంభించింది. కేఎల్ రాహుల్ కెప్టెన్సీపై తనకు అపారమైన నమ్మకముందని..టీమిండియాకు ఆడిన అనుభవం అతన్ని కెప్టెన్ అయ్యేలా చేసిందని అనిల్ కుంబ్లే పేర్కొన్నాడు. కుంబ్లే వీడియోను కింగ్స్ పంజాబ్ తన ట్విటర్లో షేర్ చేసింది. 'కేఎల్ రాహుల్ ప్రశాంతంగా ఉంటాడు.. ఆటలో ఎంతో నేర్పును ప్రదర్శిస్తాడు. చాలా రోజుల నుంచే రాహుల్ అతి దగ్గరినుంచి గమనిస్తూ వచ్చాను. అంతర్జాతీయ క్రికెట్ ఆడిన అనుభవంతో పాటు కొన్ని సంవత్సరాలుగా అతను కింగ్స్ జట్టుతో పాటే కొనసాగుతున్నాడు. కెప్టెన్గా అతనికి ఇది ఎంతో లాభదాయకం. కింగ్స్ జట్టుకు సంబంధించి బలాలు, బలహీనతలు రాహుల్కు ఈ పాటికే అర్థమయిఉంటాయి. అందుకే కెప్టెన్గా, బ్యాట్స్మన్గా, వికెట్ కీపర్గా తన వంతు పాత్రను సమర్థంగా పోషించగలడు. ఈసారి లీగ్ దుబాయ్లో జరుగుతుండడం కొంత ఇబ్బందే అయినా.. జట్టుగా మాత్రం బ్యాలెన్సింగ్తో ఉంది. సీనియర్లు, జూనియర్లతో కలిసి జట్టు సమతూకంగా ఉంది. ఈసారి మా జట్టుపై మంచి అంచనాలే నెలకొన్నాయి. ఒక కోచ్గా నా బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తాననే నమ్మకం నాకు ఉంది.' అంటూ కుంబ్లే చెప్పుకొచ్చాడు. కాగా కుంబ్లే గతేడాది అక్టోబర్లో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్కు ప్రధాన కోచ్గా ఎంపిక అయ్యాడు. చదవండి : మంజ్రేకర్కు బీసీసీఐ షాక్ చిన్నప్పుడు ఏమైనా స్ప్రింగులు మింగాడా -
‘విరాట్ కోహ్లి తిడతాడని భయపడ్డాను’
న్యూఢిల్లీ: దాదాపు మూడేళ్ల క్రితం భారత క్రికెట్ జట్టులోకి అరంగేట్రం చేసిన చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ తన మార్కు స్పిన్తో రెగ్యులర్ సభ్యుడిగా మారిపోయాడు. కానీ 2017లోనే అతని అరంగేట్రం మొదలైంది. కాగా 2017లో దర్మశాల వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ ద్వారా కుల్దీప్ టెస్టు అరంగేట్రం జరిగింది. ఆసీస్తో జరిగిన టెస్ట్ మ్యాచ్లో కులదీప్ తొలి ఇన్నింగ్స్లో 68 పరుగులిచ్చి 4కీలక వికేట్లు పడగొట్టాడు. కులదీప్ మాయాజాలంతో ఆ మ్యాచ్లో భారత్ పైచేయి సాధించి విజయఢంకా మొగించింది. ప్రస్తుతం యూఏఈలో జరగనున్న ఐపీఎల్లో కులదీప్ కోల్కత్త నైట్ రైడర్స్ తరపున ఆడనున్నాడు. తన తొలి మ్యాచ్లో అప్పటి కోచ్ అనిల్ కుంబ్లే సహకారం మరువలేనిదని తెలిపారు. కుల్దీప్ తన తొలి టెస్ట్ మ్యాచ్ విషయాల గురించి ఓ మీడియా సమావేశంలో పంచుకున్నాడు. కుల్దీప్ మాట్లాడుతూ.. ఆసీస్తో జరిగిన మ్యాచ్కు ఒక రోజు ముందే కుంబ్లే తనను కలిసి, రేపు జరగబోయే టెస్ట్ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో 5 వికెట్లు పడగొట్టాలని అన్నాడు. అయితే మ్యాచ్ ప్రారంభ ముందు రోజు రాత్రి 9 గంటలకు పడుకున్నానని, తెల్లవారు జామున 3 గంటలకు మెళుకువ వచ్చిందని అన్నాడు. అయితే ఆ సమయంలో తీవ్ర ఒత్తిడి, ఉద్వేగంలో ఉన్నానని, తమ పక్క రూమ్లో కెప్టెన్ విరాట్ కోహ్లి ఉన్నారని తెలిపాడు. కానీ అంత ఉదయాన విరాట్ బాయ్ను నిద్రలేపితే తిడతాడనే భయంతో విరాట్ను లేపకుండా తిరిగి తన రూమ్కు వెళ్లి 6 గంటల వరకు నిద్రపోయానని పేర్కొన్నాడు. నిద్రలేచిన వెంటనే టిఫిన్ చేసి, గ్రౌండ్లో అడుగుపెట్టానని తన చిరకాలం స్వప్నం నేరవేరినందుకు సంతోషం, ఒత్తిడి, భావోద్వేగంతో ఉన్నట్లు తెలిపాడు. కానీ ఇలాంటి ఉద్విగ్న క్షణాల్లో ఒత్తిడికి లోనవడం సరికాదని సాధారణ రంజీ మ్యాచ్లాగా భావించాలని నిర్ణయించుకున్నట్లు కుల్దీప్ యాదవ్ పేర్కొన్నాడు. చదవండి: 10 నిమిషాలు మైండ్ బ్లాక్: కుల్దీప్ -
కుంబ్లేతో మా పని సులువవుతుంది
దుబాయ్: కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు కోచ్గా భారత దిగ్గజం అనిల్ కుంబ్లే ఉండటం తమ అదృష్టమని కెప్టెన్ లోకేశ్ రాహుల్ వ్యాఖ్యానించాడు. ఆయన వ్యూహాలను మైదానంలో సరిగ్గా అమలు చేయగలిగితే చాలని అతను అన్నాడు. ‘ఈ సీజన్లో అనిల్ భాయ్ మాతో ఉండటం ఎంతో మేలు చేస్తుంది. ఒకే నగరం నుంచి వచ్చిన వాళ్లం కాబట్టి మైదానంలోనూ, మైదానం బయటా ఆయనతో నాకు మంచి సంబంధాలు ఉన్నాయి. అనిల్ భాయ్ కోచ్గా ఉండటం వల్ల కెప్టెన్గా నా పని సులువవుతుంది. జట్టు ప్రణాళికలు ఆయనే రూపొందిస్తారు. వాటిని అమలు చేయడమే మా బాధ్యత’ అని రాహుల్ వివరించాడు. వారిద్దరు చెలరేగితే... పంజాబ్ జట్టులో గేల్, మ్యాక్స్వెల్ రూపంలో ఇద్దరు విధ్వంసక బ్యాట్స్మెన్ ఉన్నారు. గత రెండు ఐపీఎల్లలో రాహుల్ కూడా అద్భుతంగా రాణించాడు. వీరందరి కాంబినేషన్తో కింగ్స్ ఎలెవన్ చెలరేగగలదని కెప్టెన్ విశ్వాసం వ్యక్తం చేశాడు. ‘మ్యాక్స్వెల్ గతంలోనూ పంజాబ్ తరఫున ఆడి చక్కటి ప్రదర్శన కనబర్చాడు. అందుకే వేలంలో కూడా అతను కావాలని గట్టిగా కోరుకున్నాం. తనదైన రోజున అతను ఏ బౌలింగ్నైనా తుత్తునియలు చేయగలడు. గత రెండు సీజన్లలో మా జట్టు మిడిలార్డర్లో అలాంటి బ్యాట్స్మన్ లేని లోటు కనిపించింది. గేల్తో కూడా చాలా ఏళ్లు కలిసి ఆడాను. మా జట్టులో ఉండటం ఎంతో మేలు చేస్తుంది. అతను మా ప్రధాన బృందంలో కీలక భాగం. అతని అనుభవంతో మా కోసం మ్యాచ్లు గెలిపించగలడు. ఈ ఐపీఎల్ సీజన్ ఎన్నో విధాలా ప్రత్యేకమైంది. నేను ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నా’ అని రాహుల్ విశ్లేషించాడు. -
‘అతనేమీ వార్న్ కాదు.. కుంబ్లే అనుకోండి’
సౌతాంప్టన్: వచ్చే ఏడాది ఫిబ్రవరిలో భారత పర్యటనలో ఇంగ్లండ్ జట్టు మెరుగ్గా రాణించాలంటే ప్రస్తుతం పాకిస్తాన్తో జరుగుతున్న సిరీస్లో స్పిన్నర్ యాసిర్ షాను సమర్థవంతంగా ఎలా ఎదుర్కోవాలనే అంశాన్ని నేర్చుకోవాలని ఇంగ్లిష్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ నాసిర్ హుస్సేన్ సూచించాడు. పాక్తో స్వదేశంలో జరుగుతున్న మూడు టెస్టుల సిరీస్లో భాగంగా ఆఖరి టెస్టులో యాసిర్ షా బౌలింగ్ ఆడటానికి భయపడుతున్న ఇంగ్లండ్ క్రికెటర్లను ఉద్దేశించి హుస్సేన్ మాట్లాడాడు. అసలు యాసిర్ షా బౌలింగ్ను ఎదుర్కోవడానికి ఎటువంటి భయాందోళనలు వద్దని, మానసికంగా దృఢంగా ఉంటే అతని బౌలింగ్ను ఆడటం కష్టం కాదన్నాడు. అదే సమయంలో లెగ్ బ్రేక్ బౌలర్ యాసిర్ షాను ఆసీస్ దిగ్గజ స్పిన్నర్ షేన్ వార్న్లా ట్రీట్ చేయవద్దని చురకలంటించాడు. (చదవండి: ఇంగ్లండ్తో సిరీస్పై క్లారిటీ ఇచ్చిన దాదా) యాసిర్ షా ఒక సాధారణ స్పిన్నర్ మాత్రమేనని హుస్సేన్ అభిప్రాయపడ్డాడు. భారత స్పిన్ లెజెండ్ అనిల్ కుంబ్లే తరహా బౌలర్గా యాసిర్ షాను భావించాలన్నాడు. ఇక్కడ తానేమీ కుంబ్లేను తక్కువ చేయడం లేదన్నాడు. మూడో టెస్టులో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో సిబ్లే, ఓలీ పోప్లు యాసిర్ షాకు ఔట్ కావడంపై నాసిర్ హుస్సేన్ స్పందించాడు. సిబ్లే ఎల్బీగా పెవిలియన్ చేరగా, ఓలీ పోప్లు బౌల్డ్ అయ్యాడు. ఈ ఇద్దరూ బ్యాక్ఫుట్ ఆడుతూ వికెట్లు సమర్పించుకోవడంతో హుస్సేన్ కాస్త సెటైరిక్గా మాట్లాడాడు. దానిలో భాగంగానే వార్న్, కుంబ్లే ప్రస్తావన తీసుకొచ్చాడు. ‘ యాసిర్ షాను మరో వార్న్ అనుకోకండి. అతనొక సాధారణ లెగ్ స్పిన్నర్. కుంబ్లే తరహా బౌలర్ అనుకోండి. నేను ఇక్కడ కుంబ్లేను కించపరచడం లేదు. కేవలం విషయం చెబుతున్నా. వార్న్ ఏ వికెట్పైనైనా తొలి రోజు నుంచే టెస్టుల్లో ఆధిపత్యం చెలాయిస్తాడు. కుంబ్లే అలా కాదు. క్రమంగా వికెట్పై పట్టు సాధిస్తాడు. దాంతోనే వార్న్-కుంబ్లేల పోలిక తెచ్చా’ అని హుస్సేన్ పేర్కొన్నాడు. ఈ మూడు టెస్టుల సిరీస్లో ఇప్పటివరకూ యాసిర్ షా 11 వికెట్లు సాధించాడు. ఈ సిరీస్లో తొలి టెస్టులో ఇంగ్లండ్ విజయం సాధించగా, రెండో టెస్టు డ్రాగా ముగిసింది. ఇక మూడో టెస్టులో ఇంగ్లండ్ పూర్తి ఆధిపత్యం చెలాయిస్తోంది. రెండో రోజు శనివారం ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో 8 వికెట్లకు 583 పరుగులు చేసి డిక్లేర్ చేసింది. జాక్ క్రాలీ (267; 34 ఫోర్లు, సిక్స్) డబుల్ సెంచరీ... జోస్ బట్లర్ (152; 13 ఫోర్లు, 2 సిక్స్లు) సెంచరీ సాధించారు. ఆపై బ్యాటింగ్ ప్రారంభించిన పాకిస్తాన్ తొలి ఇన్నింగ్స్లో 93 ఓవర్లలో 273 పరుగులకు ఆలౌటైంది. దాంతో ఇంగ్లండ్కు 310 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. పాక్ కెప్టెన్ అజహర్ అలీ (141 నాటౌట్) సెంచరీ సాధించాడు. అలాగే టెస్టుల్లో 6 వేల పరుగుల మైలురాయిని దాటి అరుదైన జాబితాలో చేరిపోయాడు.(చదవండి: ‘ఇదేనా ధోనికిచ్చే గౌరవం’) -
రాంగ్ ఆన్సర్స్ మాత్రమే చెప్పండి: సచిన్
లాక్డౌన్ మొదలైన నాటి నుంచి సెలబ్రిటీలంతా సోషల్ మీడియాలో మరింత యాక్టివ్గా ఉంటున్నారు. ఎప్పటికప్పుడు తమకు సంబంధించిన అప్డేట్స్ షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు. క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ కూడా ప్రతిరోజూ ఏదో ఒక కొత్త పోస్టుతో ఫ్యాన్స్కు చేరువగా ఉంటున్నాడు. ఈ క్రమంలో బుధవారం వరల్డ్ ఫొటోగ్రఫీ డే సందర్భంగా ఓ విభిన్నమైన ఫొటోను షేర్ చేశాడు. ఇందులో.. గాల్లో ఓ కారు తేలుతూ ఉండగా.. కింద ఉన్న మరో కారు వద్ద జనాలు గుమిగూడి ఉన్నారు. దీనికి.. ‘‘ఈ పిక్చర్లో ఏం జరుగుతుందో చెప్పగలరా? అనిల్ కుంబ్లే మీరేమనుకుంటున్నారు’’ అంటూ పజిల్ విసిరాడు. అంతేగాక తప్పు సమాధానాలు మాత్రమే స్వీకరిస్తానంటూ షరతు పెట్టాడు.(ప్రేయసి పోస్టుపై కేఎల్ రాహుల్ కామెంట్..) ఈ సరదా పోస్టుకు అంతే సరదాగా స్పందించిన అనిల్ కుంబ్లే.. ‘‘నాకు సరైన సమాధానం తెలుసు. కానీ నేను దీనిని ప్రయత్నించను. ఎందుకంటే వాళ్లు తప్పు సమాధానాలే కోరుకుంటున్నారు’’ అని బదులిచ్చాడు. దీంతో ఈ ఫొటోలాగే నీ గూగ్లీలు కూడా ఆన్సర్ చేయడం కష్టమంటూ సచిన్ చమత్కరించాడు. కాగా లెగ్స్పిన్నర్ అనిల్ కుంబ్లేకు ఫొటోగ్రఫీపై ఆసక్తి ఉన్న సంగతి తెలిసిందే. అతడి ఇన్స్టాగ్రాం నిండా వైల్డ్లైఫ్ ఫొటోలు దర్శనమిస్తాయి. ఇక ‘వైడ్ యాంగిల్’ పేరిట రాసిన పుస్తకంలో కుంబ్లే ఎన్నో ఫొటోలతో పాటు ఫొటోగ్రఫీ టెక్నిక్స్ను కూడా పొందుపరిచాడు. ఈ సీనియర్ క్రికెటర్లో దాగున్న మరో పార్శ్వానికి ప్రతిబింబంగా నిలిచిన ఈ బుక్ను 2010లో షేన్ వార్న్ ఆవిష్కరించాడు. కాగా కుంబ్లే ప్రస్తుతం ఐపీఎల్ టీం కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కోచ్గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.(ధోని కెప్టెన్ అవుతాడని అప్పుడే ఊహించా) What do you think is happening in this pic, people? 🤔@anilkumble1074, any thoughts? Only wrong answers accepted! 😜😋#WorldPhotographyDay pic.twitter.com/mqkxSxyj0n — Sachin Tendulkar (@sachin_rt) August 19, 2020 -
10 నిమిషాలు మైండ్ బ్లాక్: కుల్దీప్
న్యూఢిల్లీ: దాదాపు మూడేళ్ల క్రితం భారత క్రికెట్ జట్టులోకి అరంగేట్రం చేసిన చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ తన మార్కు స్పిన్తో రెగ్యులర్ సభ్యుడిగా మారిపోయాడు. 2014లో యూఏఈలో జరిగిన అండర్-19 వరల్డ్కప్లో రాణించడంతో కుల్దీప్ యాదవ్ ఒక్కసారిగా జాతీయ సెలక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. కానీ 2017లో అతని అరంగేట్రం షురూ అయ్యింది. ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ ద్వారా కుల్దీప్ టెస్టు అరంగేట్రం జరిగింది. అయితే ఆ సమయంలోనే దిగ్గజ స్పిన్నర్ షేన్వార్న్ను కలిసే కుల్దీప్కు లభించింది. అప్పుడు టీమిండియా కోచ్గా ఉన్న అనిల్ కుంబ్లే.. కుల్దీప్ను వార్న్కు పరిచయం చేశాడంట. తాను వార్న్ను కలుస్తానంటూ అనిల్ భాయ్ను కోరి మరీ కలిశానంటూ కుల్దీప్ తెలిపాడు. టీవీ ప్రెజెంటర్ మడోనా టిక్సియారా ఇన్స్టాగ్రామ్ లైవ్చాట్లో పాల్గొన్న కుల్దీప్.. ఈ విషయాన్ని వెల్లడించాడు. అదొక మధుర జ్ఞాపకంగా పేర్కొన్న కుల్దీప్.. వార్న్తో తన బౌలింగ్ గురించి చాలా విషయాలను చెప్పినట్లు తెలిపాడు. (మరో రెండేళ్లు ‘కింగ్స్’లో ధోని) ‘నేను పుణెలో జరిగిన టెస్టు మ్యాచ్లో వార్న్ను కలిశా. వార్న్ను కలవడం అదే తొలిసారి. ఆసమయంలో మాకు ప్రధాన కోచ్గా అనిల్ కుంబ్లే భాయ్ ఉన్నారు. షేన్ వార్న్ను కలిసి కొన్ని విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నట్లు కుంబ్లేకు చెప్పా. చివరికు కుంబ్లే సాయంతో వార్న్ను కలిశా. కానీ పది నిమిషాలు ఏమీ మాట్లాడలేకపోయా. వార్న్ కలిశాక మైండ్ బ్లాక్ అయ్యింది. కుంబ్లే-వార్న్లు మాట్లాడుకుంటూ ఉంటే చాలాసేపు అలా వింటూనే ఉన్నా. చివరగా మాట్లాడం ఆరంభించా. చాలా విషయాలను వార్న్తో పంచుకున్నా. నా భవిష్యత్తు ప్రణాళికలు ఏమిటి అనేది వార్న్కు చెప్పుకొచ్చా. వికెట్కు రెండు వైపులా బంతిని ఎలా సంధిస్తాను అనే విషయాన్ని వార్న్కు వివరించా. అయితే అంతా విన్న వార్న్.. నువ్వు ఎక్కువగా ఆలోచిస్తున్నావ్ అని అన్నాడు. కొన్ని చిన్న చిన్న టెక్నిక్స్ వార్న్ తెలిపాడు. బ్యాట్స్మన్ మదిలో ఏమి ఆలోచిస్తూ ఉండవచ్చు అనే దానిని ఊహిస్తూ బౌలింగ్ చేయమని వార్న్ సలహా ఇచ్చాడు’ అని కుల్దీప్ తెలిపాడు. కాగా, ఆ తర్వాత వార్న్ను చాలాసార్లు కలిసే అవకాశం దక్కిందన్నాడు. ఐపీఎల్లో కేకేఆర్కు ఆడుతుండగా వార్న్ కామెంటేటర్గా ఉండగా కలిసే అవకాశం దొరికిందన్నాడు. ఒక కోచ్ ఎలా అయితే చెబుతాడో అలానే పలు విషయాల్ని వార్న్ తనకు చెప్పాడన్నాడు. అవి తన కెరీర్కు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని కుల్దీప్ పేర్కొన్నాడు.(మరో ‘హోరాహోరీ’కి రంగం సిద్ధం) -
ముగింపు బాగుండాల్సింది: అనిల్ కుంబ్లే
బెంగళూరు: భారత క్రికెట్ జట్టు చీఫ్ కోచ్గా తన పదవీ కాలం సంతృప్తికరంగా సాగిందని, అయితే ముగింపు మరికాస్త మెరుగ్గా ఉంటే బాగుండేదని మాజీ ఆటగాడు అనిల్ కుంబ్లే అన్నాడు. కుంబ్లే కోచ్గా ఉన్న సమయంలో ఆడిన 17 టెస్టులో 1 మాత్రమే ఓడిన భారత్... చాంపియన్స్ ట్రోఫీలో ఫైనల్కు చేరింది. కానీ కెప్టెన్ కోహ్లితో విభేదాల కారణంగా కుంబ్లే అర్ధాంతరంగా తన పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ‘ఆ ఏడాది కాలం మా జట్టు చాలా బాగా ఆడింది. అందులో నా పాత్ర కూడా కొంత ఉండటం సంతోషకరం. కాబట్టి ఎలాంటి ఫిర్యాదులు లేవు. అయితే కోచ్గా నా చివరి రోజులు మరింత బాగా ఉండాల్సిందనే విషయం నాకు తెలుసు. కానీ నేను బాధపడటం లేదు. తప్పుకునేందుకు సరైన సమయమని కోచ్కు అనిపిస్తే తప్పుకోవడమే మంచిది. నాకు భారత కోచ్గా అవకాశం రావడం, సంవత్సరంపాటు జట్టు ఆటగాళ్లతో గడపడం అద్భుతం. అత్యుత్తమ ఆటగాళ్లతో కలిసి మరోసారి డ్రెస్సింగ్ రూమ్ను పంచుకోవడం గొప్ప అనుభూతి’ అని కుంబ్లే వ్యాఖ్యానించాడు. -
ఇంకా మెరుగ్గా నిర్వర్తించాల్సింది: కుంబ్లే
ముంబై: భారత క్రికెట్(టీమిండియా)లో మంచి సౌమ్యుడిగా పేరు సంపాదించుకున్న క్రికెటర్లలో అనిల్ కుంబ్లే ఒకడు. టీమిండియా జట్టు కెప్టెన్గానే కాకుండా ప్రధాన కోచ్గా కూడా తనదైన ముద్ర వేశాడు కుంబ్లే. అయితే తాజాగా జింబాంబ్వే మాజీ క్రికెటర్ పొమ్మి మాంగ్వా నిర్వహించిన ఆన్లైన్ సెషన్లో తన కోచ్ పదవిపై కుంబ్లే స్పందించారు. ఆయన స్పందిస్తూ.. టీమిండియాకు ప్రధాన కోచ్గా తన పాత్రను సమర్ధవంతంగా నిర్వహించానని, కానీ తన కోచ్ పదవిని చివర్లో ఇంకా మెరుగ్గా నిర్వహిస్తే బాగుండేదని తెలిపాడు. తాను కోచ్ పదవిని మెరుగ్గా నిర్వర్తించానని కుంబ్లే అన్నాడు. అయితే ప్రస్తుత టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లితో విభేదాలు కారణంగానే కుంబ్లే తన పదవిని అర్థాంతరంగా వదులుకోవాల్సి వచ్చిందని పలువురు ఆరోపించిన విషయం తెలిసిందే. అయితే ఐపీఎల్లో కూడా కుంబ్లే కీలక పాత్ర పోషించాడు. ఇప్పటివరకు ముంబై ఇండియన్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్లకు మెంటార్గా కుంబ్లే వ్యవహరించాడు. కేవలం కెప్టెన్గా, కోచ్గా మాత్రమే కాకుండా తన బౌలింగ్ నైపుణ్యంతో టీమిండియాకు ఎన్నో చారిత్రాత్మక విజయాలను కుంబ్లే అందించాడు. (చదవండి: అప్పుడు కుంబ్లేను కోహ్లి వద్దన్నాడు.. ఇప్పుడైతే?) -
కుంబ్లే... కట్టు... వికెట్టు
‘నాది ఒకటే అభ్యర్థన. దయచేసి అప్పీల్ మాత్రం చేయవద్దు’... అనిల్ కుంబ్లేకు భారత ఫిజియో ఆండ్రూ లీపస్ ఆ రోజు ఇచ్చిన సూచన ఇది. కానీ ఒక దిగ్గజ ఆటగాడిని బౌలింగ్ చేయకుండా, వికెట్ కోసం అప్పీల్ చేయకుండా ఆపడం ఆ గాయానికే సాధ్యం కాలేదు! తలకు చుట్టిన ఆ కట్టు బిగువున బాధను భరిస్తూనే అతను తనదైన శైలిలో తన పని చేసుకుంటూ పోయాడు. అలాంటి ఒక అప్పీల్కే ప్రత్యర్థి స్టార్ బ్యాట్స్మన్ లారా చిక్కాడు. తన బాధ్యత నెరవేర్చినట్లు భావించిన అనిల్ ఆ నొప్పిని మర్చిపోయాడు. కానీ నాటి అపూర్వ ప్రదర్శనను మాత్రం ఏ భారత క్రీడాభిమాని కూడా మరచిపోడు. అంకిత భావంలో, పోరాటతత్వంలో అందరికీ అందనంత ఎత్తులో ఉండే అనిల్ కుంబ్లే దానిని ఆంటిగ్వా గడ్డపై నిరూపించాడు. వెస్టిండీస్ గడ్డపై 2002లో సౌరవ్ గంగూలీ నాయకత్వంలో భారత జట్టు పర్యటించింది. ఐదు టెస్టుల సిరీస్లో తొలి మూడు మ్యాచ్లు ముగిసేసరికి ఇరు జట్లు చెరో టెస్టు గెలిచి 1–1తో సమంగా ఉన్నాయి. సెయింట్ జాన్స్ (ఆంటిగ్వా)లో నాలుగో టెస్టు జరిగింది. తొలి రోజు భారత్ 226/3తో పటిష్ట స్థితిలో నిలవగా, రెండో రోజు ఆటలో వికెట్ కీపర్ అజయ్ రాత్రా కంటే ముందే ఏడో స్థానంలో అనిల్ కుంబ్లే బ్యాటింగ్కు వచ్చాడు. మరో ఎండ్లో వీవీఎస్ లక్ష్మణ్ ఉన్నాడు. విలవిలా... విండీస్ పేసర్ మెర్విన్ డిల్లాన్ అప్పటికే బౌన్సర్లతో జోరు మీదున్నాడు. కుంబ్లేపై కూడా అతను వచ్చీ రాగానే ఇలాగే ఒక షార్ట్ పిచ్ బంతిని సంధించాడు. తప్పించుకునే ప్రయత్నంలో కుంబ్లే తల పక్కకు తిప్పేసినా దూసుకొచ్చిన బంతి అతని దవడను బలంగా తాకింది. పదునైన పేస్ బౌలింగ్ దెబ్బకు అతని ముఖం ఒక్కసారిగా అదిరిపోయింది. ఫిజియో ఆండ్రూ లీపస్ క్రీజ్ వరకు వచ్చేలోపే క్షణాల్లో గాయం నుంచి తీవ్రంగా రక్తం కారింది. స్వల్ప చికిత్స తర్వాత మైదానం వీడాలని సహచరులు కోరినా కుంబ్లే ఒప్పుకోలేదు. తాను ప్రధాన బ్యాట్స్మన్ కాకపోయినా పట్టుదలగా నిలబడేందుకే సిద్ధమయ్యాడు. డిల్లాన్ ఏమీ కనికరం చూపలేదు. మళ్లీ అలాగే చెలరేగిపోయాడు. చివరకు డిల్లాన్ బౌలింగ్లోనే బ్యాక్వర్డ్ షార్ట్ లెగ్లో చందర్పాల్కు క్యాచ్ ఇచ్చి కుంబ్లే వెనుదిరిగాడు. ఘటన జరిగిన రోజు ఆస్పత్రిలో ఎక్స్రే తీయగా ఏమీ కనిపించలేదు. కానీ మరుసటి ఉదయం నొప్పి తీవ్రమైందని కుంబ్లే చెప్పడంతో మరో ఎక్స్రే తీశారు. అప్పుడు దవడలో పగులు వచ్చినట్లు కనిపించింది. అయితే భారత్లోనే సర్జరీ చేస్తే మంచిదని టీమ్ మేనేజ్మెంట్ భావించింది. దాంతో గాయంపై ఒత్తిడి పడకుండా పెద్ద బ్యాండేజీ చుట్టిన ఫిజియో లీపస్... ఎలాంటి కదలిక లేకుండా, కనీసం మాట్లాడకుండా కూర్చోవాలని చెప్పేశాడు. అయితే కథ అక్కడితో ముగిసిపోలేదు. బ్యాండేజీతో బరిలోకి... వీవీఎస్ లక్ష్మణ్ (130), అజయ్ రాత్రా (115), రాహుల్ ద్రవిడ్ (91), వసీమ్ జాఫర్ (86) రాణించడంతో... మూడో రోజు భారత్ తొమ్మిది వికెట్లకు 513 పరుగుల భారీ స్కోరు వద్ద తొలి ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసింది. విండీస్ బ్యాటింగ్కు వచ్చే సమయానికి పిచ్ స్పిన్కు కాస్త అనుకూలంగా కనిపించింది. కానీ ప్రధాన స్పిన్నర్ కుంబ్లే ఆడలేడు కాబట్టి కెప్టెన్ గంగూలీ ఏమీ చేయలేక ఇతర బౌలర్లపై ఆధారపడ్డాడు. అయితే అనూహ్యంగా కట్టుతోనే కుంబ్లే క్రీజ్లోకి వచ్చేందుకు సిద్ధం కావడంతో అంతా ఆశ్చర్యపోయారు. అవసరంగా ఒత్తిడి పెంచుకోవద్దు, విశ్రాంతి తీసుకోమని కెప్టెన్ గంగూలీ చెప్పినా కుంబ్లే వినలేదు. ఇలా మధ్యలో నేను వదిలి వెళ్లలేనంటూ బౌలింగ్కు సిద్ధమయ్యాడు. తొలి ఓవర్లోనే అతను నొప్పితో అల్లాడుతుండటం చూసిన అంపైర్ డేవిడ్ షెఫర్డ్ బౌలింగ్ చేయగలవా అంటూ మళ్లీ మళ్లీ అడిగాడు. ఆ ఓవర్ తర్వాత లీపస్ మళ్లీ వచ్చి గట్టిగా కట్టు కట్టాడు. చివరకు కుంబ్లే అదే పట్టుదలతో బౌలింగ్ చేసి అత్యంత కీలకమైన బ్రియాన్ లారా వికెట్ పడగొట్టాడు. ఆఫ్స్టంప్ పడి లోపలకు దూసుకొచ్చిన బంతికి లారా వికెట్ల ముందు ఎల్బీగా దొరికిపోయాడు. ఆ సమయంలో కుంబ్లేలో కనిపించిన భావోద్వేగం గురించి చెప్పేందుకు మాటలు చాలవు. వరుసగా 14 ఓవర్లు బౌలింగ్ చేసిన అనంతరం మూడో రోజు ఆట ముగిసింది. టెస్టు మ్యాచ్ పేలవ ‘డ్రా’గా ముగిసినా... అనిల్ కుంబ్లే పోరాటం ప్రత్యేకంగా నిలిచిపోయింది. మ్యాచ్ను చూస్తూ ఊరికే కూర్చోవడం నాకు బాగా అనిపించలేదు. అందుకే బరిలోకి దిగాను. జట్టు కోసం నాకు సాధ్యమైనంత రీతిలో ప్రయత్నం చేశాననే సంతృప్తితో ఇప్పుడు స్వదేశం వెళ్లగలుగుతున్నాను కదా. –కుంబ్లే వ్యాఖ్య కొసమెరుపు... కుంబ్లే లేని భారం మ్యాచ్పై అందరికంటే ఎక్కువగా సచిన్పై పడింది. అతని స్పిన్ను గంగూలీ నమ్ముకోవడంతో విండీస్ తొలి ఇన్నింగ్స్లో సచిన్ ఏకంగా 34 ఓవర్లు బౌలింగ్ చేశాడు. 200 టెస్టుల కెరీర్లో అతను ఒక మ్యాచ్లో బౌలింగ్ చేసిన అత్యధిక ఓవర్లు ఇవే. మరోవైపు భారత్ తరఫున ఆడిన 11 మంది కూడా ఈ ఇన్నింగ్స్లో బౌలింగ్ చేశారు. టెస్టు చరిత్రలో ఇలా జరగడం ఇది మూడోసారి మాత్రమే. –సాక్షి క్రీడా విభాగం