arjun kapoor
-
హీరోయిన్తో బ్రేకప్.. పెళ్లిపై స్పందించిన స్టార్ హీరో
బాలీవుడ్ హీరో అర్జున్ కపూర్ ప్రస్తుతం 'మేరే హస్బెండ్ కీ బీవీ' మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్, భూమి పెడ్నేకర్ హీరోయిన్లుగా నటించారు. ఇటీవల విడుదలైన పోస్టర్లు చూస్తే ఫుల్ లవ్ అండ్ రొమాంటిక్ కామెడీ చిత్రంగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ నెలలోనే థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రచార కార్యక్రమాలతో బిజీగా ఉన్నారు అర్జున్ కపూర్. తాజాగా ఓ ఈవెంట్కు హాజరయ్యారు. ఇందులో అర్జున్ కపూర్కు పెళ్లి గురించి ప్రశ్న ఎదురైంది. దీంతో తన వివాహం ప్రణాళికల గురించి నోరు మాట్లాడారు.అర్జున్ కపూర్ మాట్లాడుతూ.."నా పెళ్లి ఎప్పుడు జరుగుతుందో అప్పుడు మీ అందరికీ తెలియజేస్తా. ఈ రోజు, సినిమా గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే ఇది సినిమా గురించి మాట్లాడుకునే సమయం. నా వ్యక్తిగత జీవితం గురించి కబుర్లు చెప్పుకోవడానికి తర్వాత తీరిగ్గా మాట్లాడుకుందాం. సమయం వచ్చినప్పుడు మీ అందరితో చెప్పడానికి వెనుకాడను. ఒక వ్యక్తిగా ఎలా ఉన్నానో మీ అందరికీ తెలుసు" అని అన్నారు.కాగా.. కొద్ది నెలల క్రితమే బాలీవుడ్ హీరోయిన్ మలైకా అరోరాతో బ్రేకప్ చేసుకున్నారు. దాదాపు కొన్నేళ్ల పాటు రిలేషన్లో వీరిద్దరు గతేడాది విడిపోతున్నట్లు ప్రకటించి ఫ్యాన్స్కు షాకిచ్చారు. తాను సింగిల్గానే ఉన్నానని గతేడాది దీపావళి పార్టీలో అర్జున్ కపూర్ వెల్లడించాడు. ప్రస్తుతం అర్జున్ నటించిన మేరే హస్బెండ్ కీ బీవీ ఫిబ్రవరి 21న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ చిత్రానికి ముదస్సర్ అజీజ్ దర్శకత్వం వహించారు. మేరే హస్బెండ్ కి బీవీ చిత్రంలో శక్తి కపూర్, అనితా రాజ్, డినో మోరియా, ఆదిత్య సీల్ కీలక పాత్రల్లో నటించారు. -
షూటింగ్ సెట్లో ప్రమాదం.. రకుల్ ప్రీత్ సింగ్ భర్తకు గాయాలు!
బాలీవుడ్ మూవీ షూటింగ్ సెట్లో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో హీరో అర్జున్ కపూర్తో పాటు నిర్మాత జాకీ భగ్నానీ, దర్శకుడు ముదస్సర్ అజీజ్కు గాయాలయ్యాయి. మేరే హస్బెండ్కి బీవీ మూవీ షూట్లో ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే ఈ ప్రమాదం ఈనెల 18న జరిగినట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయం కాస్తా ఆలస్యంగా బయటకొచ్చింది. మూవీ షూటింగ్ జరుగుతుండగా సెట్లో సీలింగ్ కూలిపోవడంతో ప్రమాదం జరిగినట్లు చిత్రబృందం తెలిపింది. ఈ ప్రమాదంపై ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియా సినీ ఎంప్లాయీస్ (FWICE) అధ్యక్షుడు బీఎన్ తివారీ స్పందించారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని ఆయన వెల్లడించారు. భద్రతా కారణాల దృష్ట్యా ఆ ప్రదేశంలో షూటింగ్ను నిలిపివేశామని తెలిపారు.బీఎన్ తివారీ మాట్లాడుతూ.. 'ఎవరికీ పెద్ద గాయాలు ఏమీ లేవు. కానీ అదృష్టవశాత్తూ ఎవరూ తీవ్రంగా గాయపడలేదు. షూటింగ్ జరుగుతున్న ప్రదేశంలో సరైన నిర్వహణ లేకపోవడంతోనే స్టూడియోలో పైకప్పు కూలిపోయింది. కాబట్టి, భద్రతా కారణాల దృష్ట్యా షూటింగ్ ఆపేశారు. సినీ పరిశ్రమలోని సిబ్బంది ఆరోగ్యం, భద్రతపై మహారాష్ట్ర ముఖ్యమంత్రికి లేఖ పంపాం. భవనాలు ఏదో ఒక రోజు కూలిపోయేలా ఉన్నాయని ఫిలిం సిటీకి కూడా లేఖ రాశాం. ఈ ప్రమాదం జరిగినప్పుడు అత్యవసర ద్వారం కనిపించలేదు. చిత్ర పరిశ్రమ అంతా దేవుడి ఆశీస్సులతో ముందుకెళ్తోంది. భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటాం' అన్నారాయన.కాగా.. అర్జున్ కపూర్ గాయంతోనే ఆసుపత్రిలో సైఫ్ అలీ ఖాన్ను పరామర్శించేందుకు వెళ్లారు. మేరే హస్బెండ్ కి బీవీ ఫిబ్రవరి 21, 2025న థియేటర్లలోకి రానుంది. నిర్మాత జాకీ భగ్నానీ గతేడాది టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ను పెళ్లాడిన సంగతి తెలిసిందే. -
లవ్ ట్రయాంగిల్ నహీ హై!
అర్జున్ కపూర్, రకుల్ప్రీత్ సింగ్, భూమీ ఫడ్నేకర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న రొమాంటిక్ కామెడీ ఫిల్మ్ ‘మేరే హాబ్జెండ్కీ బీబీ’. ‘లవ్ ట్రయాంగిల్ నహీ హై... సర్కిల్ హై’ (ప్రేమ ముక్కోణం కాదు... వలయం) అనేది ఈ సినిమా క్యాప్షన్. ముదస్సర్ అజీజ్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. వసు భగ్నానీ, జాకీ భగ్నానీ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 21న రిలీజ్ చేయనున్నట్లుగా మేకర్స్ ప్రకటించారు. మరి... లవ్ సర్కిల్లో ఫైనల్గా ఏ ఇద్దరి ప్రేమ గెలిచిందో చూడాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయక తప్పదు. ఇక ఈ సినిమాయే కాకుండా హిందీలో అజయ్ దేవగన్ ‘దే దే ఫ్యార్ దే 2’ చిత్రంలో ఓ హీరోయిన్గా నటిస్తున్నారు రకుల్. అలాగే కమల్హాసన్, కాజల్ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా నటించిన ‘ఇండియన్ 3’ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్ ఓ లీడ్ రోల్లో నటించారు. ‘దే దే ఫ్యార్ దే 2’ జూలైలో విడుదల కానుంది. ‘ఇండియన్ 3’ కూడా ఈ ఏడాదే రిలీజ్ అవుతుంది. అయితే విడుదల తేదీపై ఓ స్పష్టత రావాల్సి ఉంది. -
శ్రీదేవితో రెండో పెళ్లి.. నాన్నతో మంచి రిలేషన్ లేదు: యంగ్ హీరో
సినిమా ఇండస్ట్రీలో పెళ్లి-విడాకులు ఈ మధ్య మరీ సాధారణం అయిపోయాయి. ఒకప్పుడు మాత్రం రెండో పెళ్లి అంటేనే వింతగా చూసేవాళ్లు. అతిలోక సుందరి శ్రీదేవి కూడా నిర్మాత బోనీ కపూర్ని పెళ్లి చేసుకుంది. కాకపోతే ఆయనకు అప్పటికే పెళ్లయి కొడుకు కూతురు ఉన్నారు. ఆ కుర్రాడే అర్జున్ కపూర్. హిందీలో హీరోగా పలు సినిమాలు చేసిన ఇతడు.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. తండ్రి రెండో పెళ్లి, తల్లితో బాండింగ్ గురించి బయటపెట్టాడు.'నాకు పదేళ్ల వయసున్నప్పుడు నాన్నఅమ్మ విడిపోయారు. అప్పుడు చాలా బాధపడ్డా. విడాకులు తీసుకునేప్పుడు నాన్న.. రెండు పెద్ద సినిమాలు చేస్తున్నారు. పని హడావుడిలో ఉండేవాళ్లు. దీంతో మా మధ్య మంచి రిలేషన్ లేదు. అలా మాటలు కూడా తగ్గిపోయాయి. మాది కాస్త పేరున్న కుటుంబం కావడంతో ఇంట్లోని విషయాలు తెలుసుకునేందుకు బయటవాళ్లు ఆసక్తి చూపించేవాళ్లు. నా క్లాస్మేట్స్ కూడా నాన్న గురించి గుసగుసలాడేవారు. దీంతో చదువుపై ఇంట్రెస్ట్ పోయింది. సినిమాలపై ఆసక్తి పెరిగింది'(ఇదీ చదవండి: పెళ్లి చేసుకున్న 'బిగ్బాస్ 8' సోనియా.. ఫొటోలు వైరల్)'ఓ వయసొచ్చాక తొలి సినిమా చేశా. కానీ అది రిలీజ్ కావడానికి ముందే అమ్మ చనిపోయింది. జీవితంలో ఇలా ఎదురుదెబ్బలు తగిలేసరికి నన్ను నేను చాలా మార్చుకున్నా. బాగా ఆలోచించడం నేర్చుకున్నా. దీంతో రానురాను నాన్నతో మంచి బంధం ఏర్పడింది. ఇప్పుడు మేమిద్దరం బాగా మాట్లాడుకుంటున్నాం. నాన్న చేసిన పనికి (శ్రీదేవితో పెళ్లి) ఆయన సంతోషంగా ఉన్నంత కాలం నేను దాన్ని తప్పు అనుకోను' అని అర్జున్ కపూర్ చెప్పాడు.1983లో బోనీకపూర్ - మోనా వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు (అర్జున్, అన్షుల) పిల్లలు. 1996లో ఈ జంట విడిపోయింది. అదే ఏడాది బోనీకపూర్.. నటి శ్రీదేవిని వివాహమాడాడు. ఆ సమయంలో ఇది బాలీవుడ్లో చర్చనీయాంశంగా మారింది.(ఇదీ చదవండి: పొరపాటు చేసి క్షమాపణ చెప్పిన రష్మిక) -
నో ఆల్కహాల్, నో టాక్సిక్ పీపుల్ మలైకా పోస్ట్: షాకవుతున్న ఫ్యాన్స్
చిరకాల ప్రియుడు అర్జున్ కపూర్తో నుంచి బ్రేకప్ తరువాత నటి మలైకా అరోరా సంచలన ప్రకటన చేసింది. ఇటీవల కొన్ని పోస్ట్ల తరువాత 'నవంబర్ ఛాలెంజ్' ని ఆసక్తికరంగా ప్రకటించింది. మద్యం,నిద్రతోపాటు టాక్సిక్ పీపుల్ నుంచి దూరంగా ఉంటానంటూ ఇన్స్టాలో ఒక పోస్ట్ పెట్టింది. ఇది మాజీ ప్రియుడు అర్జున్ కపూర్ గురించేనా అంటూ షాక్ అవడం అభిమానుల వంతైంది.శారీరకంగా దృఢంగా ఉండటానికి, మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఈనెలలో(నవంబరు)లో మలైకా చేయాలను కుంటున్న తొమ్మిది పనుల లిస్ట్ను ప్రకటించింది. మలైకా నవంబర్ ఛాలెంజ్ 1. మద్యం దూరంగా ఉండటం 2. ఎనిమిది గంటల నిద్ర. 3. మంచి గురువును 4. రోజూ వ్యాయామం 5. రోజుకు పదివేల అడుగులు. 6. రోజూ ఉదయం 10 గంటల వరకు ఉపవాసం. 7. ప్రాసెస్ చేసిన ఆహారాలకు దూరంగా ఉండటం 8. రాత్రి 8 గంటల తర్వాత నోటికి తాః 9. విషపూరిత వ్యక్తులకు దూరంగా ఉండటం. శారీరంగా ఆరోగ్యంగా ఉండేందుకు సాధారణంగా ఆరోగ్య నిపుణులు కూడా ఇలాంటి సలహాలే ఇస్తారు. అలాగే మానసిక ఉల్లాసానికి సానుకూలంగా, స్నేహంగా ఉండే వ్యక్తులతో సన్నిహితం ఉండటం కూడా అవసరమే అంటారు కూడా.కాగా అర్బాజ్ ఖాన్ నుండి విడాకులు తీసుకున్న తర్వాత మలైకా,అర్జున్ రిలేషన్లో ఉన్నారు. అయితే 'సింగమ్ ఎగైన్' మూవీప్రమోషన్ ఈవెంట్లో తాను ఇంకా సింగిల్ అని ప్రకటించి, మలైకాతో తన బంధం గురించి చెప్పకనే చెప్పాడు. ప్రస్తుతం ఎవరితోనూ డేటింగ్ చేయడం తేల్చి చెప్పేశాడు. సింగం ఎగైన్ మూవీలో విలన్గా అర్జున్ కపూర్ మంచి మార్కులే సాధించాడు. సినిమా సక్సెస్ కావడంతో మరింత ఉత్సాహంగా ఉన్నాడు. -
అరుదైన జబ్బుతో అర్జున్ కపూర్ : ఎమోషనల్ కామెంట్స్,అంత ప్రమాదకరమా?
నటి మలైకా అరోరా, బాలీవుడ్ హీరో అర్జున్ కపూర్(Arjun Kapoor) ఇద్దరూ ఒకరి కోసం ఒకరం అన్నంతగా చెట్టా పట్టాలేసుకుని తిరిగిన ప్రేమజంట. ఏమైందో తెలియదు గానీ, ఇటీవల వీరిద్దరూ బ్రేకప్ చెప్పేసుకున్నారు. తాజాగా అర్జున్ కపూర్ తన ఆరోగ్యంపై కీలక విషయాన్ని వెల్లడించాడు. నిద్ర పట్టక ఇబ్బంది పడేవాడినంటూ ఎమోషనల్ కామెంట్స్ చేశాడు. హాషిమోటోస్ థైరాయిడిటిస్ ((Hashimoto's disease) అనే ఆటో ఇమ్యూన్ డిజార్డర్తో తాను బాధపడుతున్నట్లు అర్జున్ కపూర్ వెల్లడించారు. ఇది థైరాయిడ్ తరువాత స్టేజీ అని, రోగ నిరోధక శక్తిని ప్రభావితం చేస్తుందని పేర్కొన్నాడు. ఇది బరువు పెరగడానికి అది కూడా కారణం కావచ్చునని అన్నాడు. తాను లావుగా ఉండటం వల్ల మానసిక ఒత్తిడి మరింత పెరిగి అందరికీ దూరంగా ఉండేవాడినని చెప్పుకొచ్చాడు. ఎక్కువగా ఒంటరిగా ఉండటానికే ఇష్ట పడేవాడినని చెప్పాడు.‘‘సింగం ఎగైన్’’ మూవీ సమయంలో వ్యక్తిగతంగా, వృత్తిపరంగా, మానసికంగా, శారీరకంగా. నేను ఎంత డిప్రెషన్లో ఉన్నానో లేదో నాకు తెలియదు. అసలు ఈ సినిమా చేయాలా వద్దా ? నన్ను జనాలు ఆదరిస్తారా? లేదా? అనే అనుమానం పీడించేది. కానీ నాకు ఈ సినిమా పునర్జన్మ నిచ్చింది’’. కరియర్లో వరుస ఫ్లాప్లో ఇబ్బందిపడుతున్న తరుణంలో డైరెక్టర్ రోహిత్ శెట్టి, అర్జున్ కపూర్ కాంబోలో వచ్చిన 'సింగం ఎగైన్' మూవీ హిట్ టాక్ తెచ్చుకుంది. ప్రధాన విలన్ "డేంజర్ లంక" పాత్రతో అర్జున్ కపూర్ నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఇక వ్యక్తిగత జీవితానికి వస్తే.. మలైకా, అర్జున్ 2018లో డేటింగ్ ప్రారంభించారు. 2019లో, వారు సోషల్ మీడియాలో తమ సంబంధాన్ని బహిరంగంగా అంగీకరించారు. ఇటీవల ఇద్దరూ విడిపోయినట్టు ధృవీకరించారు. అసలేంటీ హషిమోటో వ్యాధి,ఎలా వస్తుంది?హషిమోటో వ్యాధికి ఖచ్చితమైన కారణాలపై స్పష్టతలేనప్పటికీ, జన్యు, పర్యావరణ , హార్మోన్ల అసమతుల్యత , జీవనశైలి ప్రధాన కారణాలుగా భావిస్తున్నారు.ఫ్యామిలీలో థైరాయిడ్ లేదా ఆటో ఇమ్యూన్ వ్యాధుల ఉంటే రావచ్చు. పురుషుల కంటే స్త్రీలే దీనికి ఎక్కువ గురయ్యే అవకాశ ఉంది. బహుశా హార్మోన్ల ప్రభావాల వల్ల కావచ్చు.ఏ వయసులోనైనా సంభవించవచ్చు, అయితే సాధారణంగా మధ్య వయస్కులలో బయటపడుతుంది.పర్యావరణ కారకాలు: అయోడిన్ అధికంగా తీసుకోవడం, రేడియేషన్కు గురికావడం లేదా ఇన్ఫెక్షన్లు.ఒత్తిడి , జీవనశైలి: దీర్ఘకాలిక ఒత్తిడి, పోషకాహారం లోపం లక్షణాలు శారీరక, మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. జీవక్రియ, గుండె పనితీరు, జీర్ణక్రియలో సమస్యలు, కండరాలపై పట్టు కోల్పోవడం, మెదడు పనితీరులో లోపాలు అలసట,బలహీనత,బరువు పెరుగటం తరచుగా డిప్రెషన్, ఆందోళన , మూడ్ స్వింగ్స్చలిని తట్టుకోలేకపోడం , కండరాలు , కీళ్ల నొప్పులుమలబద్ధకం, ఉబ్బరం వంటి లక్షణాలు కనిపిస్తాయిచికిత్ససాధారణ థైరాయిడ్ హార్మోన్ స్థాయిలను పునరుద్ధరించడానికి , అలసట మరియు బరువు పెరగడం వంటి లక్షణాలను తగ్గించడానికి థైరాయిడ్ హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీని వాడతారు.థైరాయిడ్పనితీరును క్రమం తప్పకుండాపర్యవేక్షించుకోవాలి. అవసరం మేరకు మందుల మోతాదును సర్దుబాటు చేసుకోవాలి.సెలీనియం, జింక్ సమృద్ధిగా ఉన్న సమతుల్య ఆహారం తీసుకోవాలి.ఒత్తిడికి దూరంగా ఉండేలా మెడిటేషన్, యోగా లాంటివి చేయాలి.థైరాయిడ్ ఆరోగ్యానికి తోడ్పడతాయి, అయినప్పటికీ అధిక అయోడిన్ను నివారించాలి. తగిన వ్యాయామం చేయాలిరోజుకు కనీసం 6 గంటల నిద్రం ఉండేలా జాగ్రత్త పడాలి.నోట్: ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. థైరాయిడ్ సమస్య ఉన్నట్టు అనుమానం ఉన్న వారు వెంటనే వైద్యుడిని సంప్రదించి, తగిన చికిత్స తీసుకోవాలి. -
ఏళ్లతరబడి ఫ్లాప్స్.. డిప్రెషన్లో హీరో.. జనాలు ఆదరిస్తారా అని..?
బాలీవుడ్ హీరో కమ్ విలన్ అర్జున్ కపూర్ హిట్ అందుకుని చాలాకాలమే అయింది. 2017 తర్వాత పలు సినిమాలు చేసినప్పటికీ ఒక్కటంటే ఒక్కటి కూడా కమర్షియల్గా విజయం సాధించలేదు. దాదాపు ఏడేళ్ల తర్వాత సింగం అగైన్ మూవీతో బ్లాక్బస్టర్ హిట్ అందుకుని కమ్బ్యాక్ ఇచ్చాడు. అయితే చాలాకాలంగా అతడు మానసిక ఒత్తిడికి లోనవుతున్నాడట!నా పరిస్థితి దారుణం..దీనిగురించి తాజా ఇంటర్వ్యూలో అర్జున్ కపూర్ మాట్లాడుతూ.. సింగం అగైన్ సినిమాకు సంతకం చేసినప్పుడు నా పరిస్థితి దారుణంగా ఉంది. వ్యక్తిగతంగా, వృత్తిపరంగా, శారీరకంగా, మానసికంగా అన్ని కోణాల్లోనూ బాధలో కూరుకుపోయాను. డైరెక్టర్ రోహిత్ శెట్టి నా లుక్ మార్చుకునేందుకు కొంత టైమ్ ఇచ్చాడు. అప్పటికే సినిమాపై నాకు ప్రేమ పోయింది. జనాలు ఆదరిస్తారా?ఇప్పుడీ సినిమా చేయాలా? మళ్లీ సినిమాతో ప్రేమలో పడాలా? జనాలు నిజంగా నన్ను ఆదరిస్తారా? లేదంటే తిరస్కరిస్తారా? ఇలా ఉండేవి నా ఆలోచనలు. హిట్టు అందుకుని ఏళ్లు గడిచిపోతుంటే మనపై మనకే అనుమానం రావడం సహజమే కదా! పైగా లావుగా ఉండటం వల్ల మానసిక ఒత్తిడి మరింత పెరిగింది. ఎవరితోనూ పెద్దగా మాట్లాడేవాడిని కాదు, ఒంటరిగా ఉండటానికే ఇష్టపడేవాడిని. డిప్రెషన్ సినిమానే జీవితం అనుకున్న నేను మూవీస్ చూసి ఎంజాయ్ చేయలేకపోయాను. పైగా ఇతరుల సినిమాలు చూస్తూ నాకిలాంటి ఛాన్స్ వస్తుందా? అని ఆలోచించేవాడిని. నిద్ర రావడానికి యూట్యూబ్లో షార్ట్ వీడియోలు చూసేవాడిని. గతేడాదే డిప్రెషన్ నుంచి బయటపడేందుకు థెరపీ తీసుకోవడం మొదలుపెట్టాను.హషిమోటో వ్యాధి ఎప్పుడూ చెప్పలేదు కానీ నాకు హషిమోటో అనే వ్యాధి ఉంది. మా అమ్మకు, సోదరి అన్షులాకు కూడా ఉంది. ఈ వ్యాధి వల్ల నా బరువు అదుపులో ఉండేది కాదు అని చెప్పుకొచ్చాడు. హషిమోటో అనేది ఆటోఇమ్యూన్ థైరాయిడ్ వ్యాధి. ఇది థైరాయిడ్ గ్రంధిని డ్యామేజ్ చేస్తుంది.చదవండి: భార్య కాళ్లు మొక్కినందుకు ట్రోలింగ్.. హీరో ఏమన్నాడంటే? -
మన జీవితంలో ఆ ఒక్క సెకన్ చాలు : మలైకా అరోరా
బాలీవుడ్ భామ మలైకా అరోరా బీటౌన్లో అందరికీ సుపరిచితమే. అయితే ఇటీవల ఆమె తండ్రి మరణం తర్వాత ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. కారణం ఆమె మాజీ భర్త అర్బాజ్ ఖాన్, బాయ్ఫ్రెండ్ అర్జున్ కపూర్ ఆమెను పరామర్శించేందుకు వచ్చారు. అంతకుముందే 2018 నుంచి అర్జున్ కపూర్తో డేటింగ్లో ఉందంటూ చాలాసార్లు వార్తలొచ్చాయి. ఆ తర్వాత తమ రిలేషన్పై వీరిద్దరు సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెట్టారు.అయితే తాజాగా ముంబయిలోని దివాళీ బాష్కు అర్జున్ కపూర్ హజరయ్యారు. ఈ సందర్భంగా మలైకా అరోరా గురించి కొందరు ఆరా తీశారు. దీంతో తాను ఇప్పటికీ సింగిల్గానే ఉన్నానంటూ క్లారిటీ ఇచ్చారు. అర్జున్ కామెంట్స్తో ఈ జంట విడిపోయినట్లు తెలుస్తోంది. అతని మాటలు విన్న మలైకా సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేసింది. హృదయం, ఆత్మ అంటూ మలైకా రాసుకొచ్చారు. మన హృదయాన్ని ఒక్క సెకను తాకడం వల్ల.. జీవితాంతం మన ఆత్మను తాకవచ్చంటూ మనసులో మాటను బయటపెట్టింది.బాలీవుడ్ ఐటమ్ సాంగ్స్తో గుర్తింపు తెచ్చుకున్న మలైకా.. సల్మాన్ ఖాన్ తమ్ముడు అర్భాజ్ ఖాన్ని 1998లోనే పెళ్లి చేసుకుంది. కానీ మనస్పర్థల కారణంగా 2017లో విడాకులు తీసుకుంది. ఇది జరిగిన ఏడాదికే హీరో అర్జున్ కపూర్తో డేటింగ్ మొదలుపెట్టింది. వీళ్లిద్దరూ కలిసే ఉన్నారు. చాలా ఫారెన్ టూర్స్కి వెళ్లారు. అప్పట్లో వీరి ఫొటోలు సోషల్ మీడియాలోనూ వైరల్ అయ్యాయి. -
హాట్ బ్యూటీతో విడిపోవడంపై క్లారిటీ ఇచ్చిన హీరో
ప్రేమలో పడటం, రిలేషన్షిప్లో ఉండటం, కొన్నాళ్లకు బ్రేకప్ చెప్పడం.. ఇలాంటివి బాలీవుడ్లో ఎప్పటికప్పుడు కనిపిస్తూనే ఉంటాయి. కొన్ని బయటపడతాయి. కొన్ని బయటపడవ్ అంతే! తాజాగా హీరో అర్జున్ కపూర్ తన బ్రేకప్ గురించి క్లారిటీ ఇచ్చేశాడు. మలైకా అరోరాతో విడిపోవడం గురించి బయటపెట్టాడు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 15 సినిమాలు రిలీజ్.. అవి ఏంటంటే?)ఐటమ్ సాంగ్స్తో గుర్తింపు తెచ్చుకున్న మలైకా అరోరా.. సల్మాన్ ఖాన్ తమ్ముడు అర్భాజ్ ఖాన్ని 1998లోనే పెళ్లి చేసుకుంది. కానీ మనస్పర్థల కారణంగా 2017లో విడాకులు తీసుకుంది. ఇది జరిగిన ఏడాదికే హీరో అర్జున్ కపూర్తో డేటింగ్ మొదలుపెట్టింది. వీళ్లిద్దరూ కలిసే ఉన్నారు. చాలా ఫారెన్ టూర్స్కి వెళ్లారు. ఆయా ఫొటోలు సోషల్ మీడియాలోనూ వైరల్ అయ్యాయి.మరి ఏమైందో ఏమో గానీ కొన్నాళ్ల క్రితం ఇద్దరూ ఎవరికీ వాళ్లు దూరం పాటించారు. దీంతో బ్రేకప్ అనే రూమర్స్ వచ్చాయి. కొన్నిరోజుల క్రితం మలైకా తండ్రి చనిపోతే ఆమెకు అర్జున్ అండగా నిలిచాడు. ఈ క్రమంలోనే మళ్లీ కలిసిపోయారని అందరూ అనుకున్నారు. తాజాగా దీపావళి ఈవెంట్లో పాల్గొన్న అర్జున్ కపూర్.. మైక్లో మాట్లాడుతున్న టైంలో 'మలైకా ఎలా ఉంది?' అని ఒకరు అడిగారు. దీంతో తాను ప్రస్తుతం సింగిల్గానే ఉన్నానని బదులిచ్చాడు. అంటే బ్రేకప్ని కన్ఫర్మ్ చేసినట్లే.(ఇదీ చదవండి: తెలుగు నిర్మాత.. హైదరాబాద్లోని చెరువులో దూకేశాడు: శ్రియ) View this post on Instagram A post shared by Movie Talkies (@movietalkies) -
మలైకా తండ్రిది ఆత్మహత్యా? ప్రమాదమా? తల్లి ఏమన్నారంటే?
బాలీవుడ్లో నటి మలైకా అరోరా తండ్రి అనిల్ అరోరా హఠాన్మరణం కలకలం రేపింది. ఏడంతస్తుల భవనం నుంచి కిండి పడి మరణించడం విషాదాన్ని నింపింది. బుధవారం మధ్యాహ్నం ముంబైలోని బాంద్రాలోని తన ఇంటి బాల్కనీ నుండి దూకి ఆత్మహత్యకు పాల్పడినట్టు ముంబై పోలీసులు ధృవీకరించినట్టు తెలుస్తోంది.బాలీవుడ్నటీమణులు మలైకా అరోరా, అమృతా అరోరా తండ్రే అనిల్ అరోరా. ఆయన భార్య జాయిస్ పాలికార్ప్. కాగా విషాదానికి ఒక రోజు ముందు మలైకా అరోరా తల్లిదండ్రుల వద్దకి వెళ్లినట్టు తెలుస్తోంది. అయితే ఈ విషాద ఘటనపై కుటుంబ సభ్యులు ఇంకా ప్రకటన విడుదల చేయలేదు. మలైకా తల్లి జాయిస్ పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో అనిల్ అరోరాకు రోజూ ఉదయం బాల్కనీలో కూర్చుని వార్తాపత్రికలు చదివే అలవాటుంది. గదిలో భర్త చెప్పులు చూసి బాల్కనీలో అతని కోసం వెతకడానికి వెళ్లగా, అక్కడ కనిపించక పోవడంతో కిందకి వంగి చూడగా అప్పటికే అయన కింద పడిపోయారు. బిల్డింగ్ వాచ్మెన్ సహాయం కోసం అరుస్తున్నాడు. అనిల్ అరోరాకు మోకాళ్ల నొప్పులు ఎలాంటి అనారోగ్యం లేదని కూడా తెలిపారు. గతంలో తాము విడాకులు తీసుకున్నామని, అయితే గత కొన్నేళ్లుగా మళ్లీ సహజీవనం ప్రారంభించామని పోలీసులతో చెప్పారు. విషాద వార్త విన్న తర్వాత ఆమె పూణె నుంచి ఇంటికి చేరుకుంది. కన్నీటి పర్యంతమవుతూఇంట్లోకి వెళుతున్న వీడియో వైరల్ గా మారింది. మరోవైపు మలైకా మాజీ భర్త, నటుడు-నిర్మాత అర్బాజ్ ఖాన్ కూడా అక్కడికి చేరుకుని పోలీసు అధికారులతో మాట్లాడుతూ కనిపించారు. ఇంటి చుట్టూ భారీగా పోలీసు మోహరించారు. అనిల్ అరోరా హఠాన్మరణం వార్త తెలియగానే మలైకా స్నేహితులు ఆమెను కలిసి ఓదార్చారు. ఇందులో బాయ్ ఫ్రెండ్ అర్జున్ కపూర్ ,ఆమె మాజీ భర్త కుటుంబీకులు ఉన్నారు -
హీరో బర్త్డే.. అందరూ ఉన్నా ఒకరు మాత్రం మిస్సింగ్!
బాలీవుడ్ హీరో అర్జున్ కపూర్ బర్త్డే నేడు (జూన్ 26). అన్నయ్య బర్త్డే అంటే ఎలా ఉండాలి? ఆ రోజు తనను ఎంత సంతోషంగా ఉంచాలి? అని ఆలోచించినట్లుంది అన్షులా కపూర్. అందుకే అర్ధరాత్రి అర్జున్తో కేక్ కట్ చేయించింది. ఈ బర్త్డే పార్టీకి సంజయ్ కపూర్, వరుణ్ ధావన్ సహా తదితర సెలబ్రిటీలు హాజరయ్యారు.ఈ ఫోటోలను అన్షులా షేర్ చేస్తూ.. హ్యాపీ బర్త్డే మై నెంబర్ 1. ఎంతో పెద్ద మనసున్న నువ్వు అన్నింటినీ దాటుకుని ఇంకా ఎంతో ఎత్తుకు ఎదగాలని కోరుకుంటున్నాను. నువ్వు అనుకున్నది సాధించాలి. నీ కష్టాలు తగ్గిపోవాలి. ఎల్లప్పుడూ నవ్వుతూ ఉండాలి.. లవ్ యూ అన్నయ్య అని ఇన్స్టాగ్రామ్లో రాసుకొచ్చింది. ఇక ఈ బర్త్డే పార్టీలో బాలీవుడ్ బ్యూటీ మలైకా అరోరా మిస్సయింది. ప్రియుడి పుట్టినరోజు అనగానే అందరికన్నా ముందుగానే విషెస్ చెప్పే ఆమె ఈసారి మాత్రం సైలెంట్గానే ఉండిపోయింది. పార్టీలో సైతం కనిపించలేదు. దీంతో వీళ్లిద్దరూ విడిపోయిన మాట వాస్తవమేనని అర్థమవుతోంది. View this post on Instagram A post shared by Anshula Kapoor (@anshulakapoor)చదవండి: పొరపాటు దిద్దుకున్న నాగార్జున, వీడియో వైరల్ -
మరో జంట బ్రేకప్..విడిపోయిన మలైకా, అర్జున్ కపూర్ ?
-
బంధం ముగిసింది.. విడిపోయిన బాలీవుడ్ స్టార్ జంట!
బాలీవుడ్లో ఓ స్టార్ జంట బ్రేకప్ చెప్పుకుందని వార్తలు గుప్పుమంటున్నాయి. ఏళ్ల తరబడి చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్న మలైకా అరోరా- అర్జున్ కపూర్ ఎవరి దారి వారు చూసుకున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. దీనిపై ఈ లవ్ బర్డ్స్ ఇంతవరకు స్పందించలేదు. వారి బంధానికి కాలపరిమితి ముగిసిందని, అందుకే విడిపోయారని పలువురూ భావిస్తున్నారు. మనసులో స్థానం అలాగే..జాతీయ మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం ఇండస్ట్రీలోని ఓ వ్యక్తి ఈ బ్రేకప్పై స్పందిస్తూ.. మలైకా, అర్జున్ల మధ్య ఎంతో అనుబంధం ఉంది. బ్రేకప్ తర్వాత కూడా వారు దాన్ని కొనసాగిస్తారు. ఒకరి మనసులో ఒకరికి ప్రత్యేక స్థానం అలాగే ఉంటుంది. బ్రేకప్ గురించి మాట్లాడేందుకు వారు సుముఖత చూపడం లేదు. దీని గురించి చర్చ జరగడం కూడా వారికి ఇష్టం లేదు అని తెలిపారు.ఐదేళ్లుగా ప్రేమాయణంకాగా మలైకా అరోరా, అర్జున్ కపూర్ 2019లో తాము డేటింగ్లో ఉన్న విషయాన్ని బయటపెట్టారు. పార్టీలు, ఫంక్షన్స్కు సైతం కలిసి వెళ్లేవారు. కలిసున్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉండేవారు. అయితే గతేడాది.. వీరి ప్రేమ బంధం ముగిసిందంటూ వార్తలు రాగా వాటిని మలైకా కొట్టిపారేసింది. తనకంటే చిన్నవాడితో లవ్అలాగే తనకంటే 12 ఏళ్లు చిన్నవాడిని ప్రేమించిందని విమర్శలు రాగా దానికి కూడా గట్టి కౌంటరిచ్చింది. ప్రేమకు వయసుతో పనేంటని ప్రశ్నించింది. ఇంతలా ఒకరికొకరు తోడునీడుగా ఉన్న వీళ్లు విడిపోయారని మరోసారి వార్తలు వస్తుండటంతో అభిమానులు కంగారుపడుతున్నారు. మలైకా- అర్జున్ ఈ ఏడాది పెళ్లి చేసుకుంటారనుకుంటే ఇలా ట్విస్ట్ ఇచ్చారేంటని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.చదవండి: గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీ రివ్యూ -
తండ్రి మరణించిన 10 రోజులకే పనిలో.. సాయం చేస్తానన్న హీరో
ఇంటి పెద్ద దిక్కు మరణిస్తే ఆ కుటుంబ పరిస్థితి ఎంతో దయనీయంగా మారుతుంది. సంపాదనతో ఫ్యామిలీని పోషించే మనిషి లేకుంటే అంతా తలకిందులవుతుంది. చాలా సందర్భాల్లో పిల్లలు బడి మానేసే దుస్థితి ఏర్పడుతుంది. వయసుకు మించిన పని చేయడానికీ వెనుకాడరు. ఇటీవల ఢిల్లీలో జస్ప్రీత్ అనే పిల్లవాడు తన తండ్రిని కోల్పోవడంతో ఆయనలాగే చపాతీలు చేసే పనిలోకి దిగాడు. పదేళ్ల వయసులోనే కుటుంబ బాధ్యతను భుజాన వేసుకున్నాడు. చేయూతనిచ్చేందుకు రెడీతల్లి పంజాబ్లోని గ్రామంలో ఉండగా జస్ప్రీత్ తన సోదరితో కలిసి వాళ్ల ఆంటీ ఇంట్లో ఉంటున్నాడు. ఓ ఫుడ్ వ్లాగర్ ఇతడి పరిస్థితి సోషల్ మీడియా ద్వారా ప్రపంచానికి తెలియజేశాడు. దీంతో ఆనంద్ మహీంద్రా, ఆప్ ఎమ్మెల్యే జర్నైల్ సింగ్, బీజేపీ లీడర్ రాజీవ్ బాబ్బర్ తనకు సాయం చేసేందుకు ముందుకు వచ్చారు. తాజాగా బాలీవుడ్ హీరో అర్జున్ కపూర్ తనకు చేయూతనిచ్చేందుకు రెడీ అయ్యాడు.సెల్యూట్ ఈ పదేళ్ల బాలుడు చిరునవ్వుతో కష్టాలను దాటేందుకు ప్రయత్నిస్తున్నాడు. తండ్రి చనిపోయిన పది రోజులకే ఆయన పనిని చేసేందుకు రంగంలోకి దిగిన అతడి గుండెధైర్యానికి సెల్యూట్ చేస్తున్నాను. అతడికి లేదా అతడి సోదరికి మంచి విద్య అందించేందుకు సాయం చేయాలనుకుంటున్నాను. అతడు ఎక్కడుంటాడో తెలిస్తే చెప్పండి అని ఇన్స్టాగ్రామ్ స్టోరీలో రాసుకొచ్చాడు. ఇది చూసిన జనాలు అర్జున్ది ఎంత గొప్ప మనసు అని కొనియాడుతున్నారు.చదవండి: రూ.15 లక్షల విలువైన జ్యువెలరీ.. తల్లికి రైతుబిడ్డ గిఫ్ట్! -
పెళ్లి ప్రపోజల్ పై అర్జున్ కపూర్ కు ఫ్యూజులెగిరిపోయే సమాధానమిచ్చిన మలైకా..!
-
సింగమ్ వర్సెస్ సైతాన్ .. అదిరిపోయిన అర్జున్ కపూర్ ఫస్ట్ లుక్!
బాలీవుడ్ సింగమ్ ఫ్రాంచైజీలో రూపొందుతున్న తాజా చిత్రం ‘సింగమ్ ఎగైన్’. అజయ్ దేవగన్, అక్షయ్ కుమార్, రణ్వీర్ సింగ్, టైగర్ ష్రాఫ్, అర్జున్ కపూర్, దీపికా పదుకోన్, కరీనా కపూర్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ‘సింగమ్’ ఫ్రాంచైజీ దర్శకుడు రోహిత్ శెట్టి ‘సింగమ్ ఎగైన్’ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరగుతోంది. కాగా ఈ సినిమాలో అర్జున్ కపూర్ విలన్ పాత్రలో నటిస్తున్నట్లు పేర్కొని, ఆ పాత్రను సైతాన్గా అభివర్ణిస్తూ, ఫస్ట్ లుక్ పోస్టర్ను షేర్ చేశారు రోహిత్ శెట్టి. ‘ఈ తుఫానుకు సిద్ధంగా ఉండండి’ అంటూ అర్జున్ పాత్రను ఉద్దేశించి, సోషల్ మీడియాలో షేర్ చేశారు అజయ్ దేవగన్. రోహిత్ శెట్టి, అజయ్ దేవగన్, జ్యోతీ దేశ్పాండే నిర్మిస్తున్న ఈ చిత్రం ఆగస్టు 15న విడుదల కానుంది. మరోవైపు ‘సింగమ్ ఫ్రాంచైజీ’లో భాగంగా 2011లో ‘సింగమ్’, 2014లో ‘సింగమ్ రిటర్న్స్’ ఇప్పుడు ‘సింగమ్ ఎగైన్’ సినిమాల్లో అజయ్ దేవగన్ హీరోగా నటిస్తున్నారు. View this post on Instagram A post shared by Rohit Shetty (@itsrohitshetty) -
మాజీ భర్త రెండో పెళ్లి.. 50 ఏళ్ల వయసులో హీరోయిన్ బ్రేకప్!
సినీ ఇండస్ట్రీలో లవ్, డేటింగ్, బ్రేకప్లు ఎక్కడో ఒకచోట వింటూనే ఉంటాం. బాలీవుడ్లో అయితే కాస్తా ఎక్కువగానే ఇలాంటి వార్తలు తరచుగా వస్తుంటాయి. అయితే తాజాగా మరో స్టార్ హీరోయిన్ బ్రేకప్ చెప్పుకున్నట్లు బీటౌన్లో టాక్ వినిపిస్తోంది. ఓ యంగ్ హీరోకు స్టార్ హీరోయిన్ దూరంగా ఉంటున్నట్లు లేటెస్ట్ టాక్. ఆమె మరెవరో కాదు.. బాలీవుడ్ భామ మలైకా అరోరా. ప్రస్తుతం ఈ టాపిక్ బీటౌన్లో చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం 50 ఏళ్ల వయసులో ఉన్న మలైకా.. ఇప్పటికే తన మొదటి భర్తతో అర్బాజ్ ఖాన్తో విడాకులు తీసుకుంది. ఆ తర్వాత బాలీవుడ్ యంగ్ హీరో అర్జున్ కపూర్తో డేటింగ్ కొనసాగిస్తోంది. కొన్నేళ్ల పాటు సీక్రెట్ రిలేషన్లో ఉన్న భామ.. 2019లో తమ రిలేషన్ను బయటపెట్టారు. గతంలో చాలాసార్లు ఈవెంట్లలో ఈ జంట కనిపించి సందడి చేశారు. తాజాగా వీరిద్దరు బ్రేకప్ చెప్పుకున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే కొద్ది రోజులుగా ఈ జంట సోషల్ మీడియాలో ఎక్కడా కనిపించలేదు. ఇటీవలే మలైకా తన స్నేహితులతో కలిసి క్రిస్మస్ వేడుకలు చేసుకుంది. అలాగే న్యూ ఇయర్ వేడుకల్లోనూ అర్జున్ కపూర్, మలైకా దూరంగానే ఉన్నారు. ఈ నేపథ్యంలో బ్రేకప్ రూమర్స్ మరింత ఊపందుకున్నాయి. అయితే ఈ వార్తల్లో నిజమెంత అనే దానిపై బాలీవుడ్ భామ క్లారిటీ ఇస్తేనే తెలుస్తుంది. ఇటీవలే మలైకా మొదటి భర్త అర్బాజ్ ఖాన్ 57 ఏళ్ల వయస్సులో రెండో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. మలైకా అరోరాకు నటుడు అర్బాజ్ ఖాన్ 1998 సంవత్సరంలో పెళ్లి జరిగింది. అయితే పెళ్లయిన 18 ఏళ్ల తర్వాత అర్బాజ్, మలైకా విడాకులు తీసుకున్నారు. వీరిద్దరికి ఓ కుమారుడు కూడా ఉన్నారు. -
2023 భారీ డిజాస్టర్ సినిమా ఇదే.. రూ. 45 కోట్ల బడ్జెట్కు లక్ష మాత్రమే వచ్చింది
టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ఈ ఏడాది ఎన్నో సినిమాలు వచ్చాయి. అందులో కొన్ని అంచనాలకు మించి కలెక్షన్స్ రాబట్టాయి. నేడు ఇండియన్ సినిమాను ప్రపంచ దేశాలు కూడా దగ్గర చేర్చుకుంటున్నాయి. ఒక సినిమా కోసం నెలల పాటు కష్టపడటమే కాకుండా కోట్ల రూపాయలు ఖర్చు చేస్తారు. సినిమా బాగుంటే థియేటర్ ప్రేక్షకుల నుంచి వచ్చే డబ్బే కాకుండా శాటిలైట్ హక్కులు, ఓటీటీ రైట్స్ ఇలా పలు రకాలుగా తిరిగి పొందుతారు. అదే సినిమా బాగలేదని టాక్ వస్తే మొదటి రోజు నుంచే ఆ థియేటర్ వైపు వెళ్లరు. దీంతో నిర్మాతకు కోట్ల రూపాయల నష్టం తప్పదు. 2023లో కొన్ని వందల చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. బాలీవుడ్ హీరో అర్జున్ కపూర్ - హీరోయిన్ భూమి పెడ్నేకర్ నటించిన 'ది లేడీ కిల్లర్' నవంబర్ 3న విడుదలైంది. ఈ చిత్రం దారుణమైన వసూళ్లను అందుకుంది. బాలీవుడ్లో వీళ్లు అల్లాటప్పా యాక్టర్లు ఏమీ కాదు.. అక్కడ టాప్ రేంజ్లో వారికి గుర్తింపు ఉంది కాబట్టే ఈ సినిమా కోసం రూ. 45 కోట్లు ఖర్చు పెట్టారు.. కానీ నిర్మాతకు ఫైనల్గా కేవలం రూ. లక్ష మాత్రమే వచ్చింది. నమ్మలేకున్నా ఇదే నిజం. 2023లో విడుదల అయిన ఇండియన్ చిత్ర పరిశ్రమలోనే అత్యంత దారుణమైన డిజాస్టర్గా ఈ సినిమా కలెక్షన్స్ ఉన్నాయి. ఈ చిత్రాన్ని అజయ్ బెహల్ దర్శకత్వం వహించారు. శైలేష్ సింగ్, సాహిల్ మీర్ చందానీ నిర్మించారు. టీ-సీరీస్ వాళ్ల భాగస్వామ్యంతో ఈ సినిమా విడుదలైంది. మొత్తంగా ముంబై, ఢిల్లీ కలిపి 11 స్క్రీన్లలో మాత్రమే విడుదల చేశారు. సినిమా షూటింగులో ఉండగానే ఉత్తరాఖండ్లో భారీ వర్షాలు అప్పటికే భారీగా బడ్జెట్ పెట్టేశారు. మళ్లీ ఖర్చు పెట్టేందుకు నిర్మాతలు ముందుకు రాలేదు.. దీంతో సరిగ్గా ఎడిటింగ్ కూడా చేయకుండానే విడుదల చేశారు. సినిమాలో కథతో పాటు ఏ ఒక్క విషయం కూడ ప్రేక్షకులను మెప్పించలేక పోయింది. మొదటిరోజు కేవలం 293 టికెట్లు మాత్రమే సేల్ అయ్యాయి. ఐఎండీబీలో కూడా కేవలం 1.5 రేటింగ్తో 'ది లేడీ కిల్లర్' ఉంది. ఈ సినిమా ఓటీటీ రైట్స్ను నెట్ఫ్లిక్స్ తీసుకుంది. అందుకు గాను నిర్మాతకు ఎంత చెల్లించారనేది తెలియదు. ఓటీటీలో కూడా ఆ చిత్రం వ్యూస్ మరీ దారుణంగా ఉన్నాయి. -
ఆమెకు 50, అతడికి 38.. లవ్పై ట్రోలింగ్.. హీరో ఏమన్నాడంటే?
సెలబ్రిటీలను ఇష్టపడేవాళ్లుంటారు.. ఉత్తి పుణ్యానికే వాళ్లపై విమర్శలు గుప్పించేవాళ్లూ ఉంటారు. వారు ఏదైనా ఫోటో షేర్ చేసినా, బయటకు వెళ్లినా, ఖరీదైన వస్తువులు కొన్నా, బ్రాండెడ్ అండ్ వెరైటీ డ్రెస్సులు వేసుకున్నా, ఎవరినైనా ప్రేమించినా, ప్రియురాలికి బ్రేకప్ చెప్పినా, భార్యకు విడాకులిచ్చినా.. ఏం చేసినా సరే తిట్లదండకం అందుకోవడానికి రెడీగా ఉంటారు. ఆమెకు 50 అతడికి 38.. అలా సోషల్ మీడియాలో ఎప్పుడూ ట్రోలింగ్ బారిన పడేవారిలో హీరో అర్జున్ కపూర్ ఒకరు. ఈయన వయసు 38 ఏళ్లు. ఇంకా పెళ్లి చేసుకోలేదు. ఇతడికో ప్రియురాలు ఉంది. ఆవిడే ఐటం సాంగ్ డ్యాన్సర్, బాలీవుడ్ నటి మలైకా అరోరా. ఈమె వయసు 50. గతంలో సల్మాన్ ఖాన్ సోదరుడు అర్బాజ్ ఖాన్ను పెళ్లి చేసుకోగా వీరికి ఒక బాబు జన్మించాడు. కానీ భార్యాభర్తల మధ్య పొరపచ్చాలు రావడంతో 2017లో విడాకులు తీసుకున్నారు. అప్పటినుంచి అర్జున్ కపూర్కు మరింత దగ్గరైంది మలైకా. వయసు వ్యత్యాసంపై ట్రోలింగ్ అయితే కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకును తీసుకొచ్చే అమ్మాయిని పార్ట్నర్గా ఎంచుకోవడమేంటి? నీకంటే 12 ఏళ్లు పెద్ద.. అలాంటి ఆంటీతో లవ్వేంటి? అని నెటిజన్లు తరచూ సూటిపోటి మాటలతో అర్జున్ను వేధిస్తూనే ఉన్నారు. తాజాగా హాట్స్టార్లో ప్రసారమవుతున్న కాఫీ విత్ కరణ్ 8వ సీజన్లో పాల్గొన్న అర్జున్ ఈ ట్రోలింగ్పై స్పందించాడు. 'ట్రోలింగ్ వల్ల ఎప్పుడో ఒకసారైనా బాధపడని వ్యక్తి అంటూ ఎవరూ ఉండరు. కానీ దాన్ని ఎలా డీల్ చేస్తామనేది ముఖ్యం. లైకుల కోసం చిల్లరపనులు.. ఈ ట్రోలింగ్ వల్ల.. తప్పుడు కామెంట్లు చేసేవారి పద్ధతులు, వక్రబుద్ధి బయటపడుతుంది. ఏదిపడితే అది కామెంట్లు చేసి మన దృష్టిని ఎలాగోలా ఆకర్షించాలనుకుంటారు. మొదట్లో నేను కూడా వారి కామెంట్లకు స్పందించాలనుకున్నాను. కానీ వారికి నేను అటెన్షన్ ఇవ్వడమేంటని తర్వాత లైట్ తీసుకున్నాను. లైకుల కోసం ఇలాంటి చిల్లరపనులు చేస్తుంటారు. మళ్లీ ఇలాంటివారే మనం కనిపించగానే సెల్ఫీల కోసం ఎగబడుతారు' అని అర్జున్ కపూర్ చెప్పుకొచ్చాడు. చదవండి: వీరప్పన్ స్వయంగా చెప్పిన సంఘటనలతో డాక్యుమెంటరీ సిరీస్.. అక్కడే స్ట్రీమింగ్ -
రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్.. ఇంత వైల్డ్ ఏంట్రా బాబు!
ఇటీవలే థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అనే అడల్ట్ మూవీతో అలరించిన నటి భూమి ఫడ్నేకర్. తాజాగా అర్జున్ కపూర్ సరసన ది లేడీ కిల్లర్ అనే క్రైమ్ థ్రిల్లర్లో నటిస్తోంది. ఈ చిత్రానికి అజయ్ బహల్ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ట్రైలర్ చూస్తే ఉద్వేగభరితమైన ప్రేమకథా చిత్రంగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. అర్జున్, భూమి ఫడ్నేకర్ మధ్య శృంగార సన్నివేశాలు ఈ చిత్రంపై అంచనాలు పెంచేస్తున్నాయి. కొన్ని సీన్స్ అయితే మరింత వైల్డ్గా చూపించినట్లు ట్రైలర్లో కనిపిస్తోంది. ట్రైలర్ చూసిన ఫ్యాన్స్ అర్జున్ కపూర్కు ఈ మూవీ టర్నింగ్ పాయింట్ అవుతుందని కామెంట్స్ చేస్తున్నారు. కాగా.. ది లేడీ కిల్లర్ క్రైమ్ థ్రిల్లర్ నవంబర్ 3న థియేటర్లలోకి రానుంది. అర్జున్ కపూర్, భూమి పెడ్నేకర్ జంటగా మేరీ పట్నీ కా రీమేక్ అనే మరో ప్రాజెక్ట్లోనూ కనిపించనున్నారు. ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్ కీలక పాత్రలో నటించనుంది. అర్జున్ చివరిసారిగా ఏక్ విలన్ రిటర్న్స్లో కనిపించాడు. గతేడాది విడుదలైన ఈ చిత్రంలో జాన్ అబ్రహం, తారా సుతారియా, దిశా పటాని నటించారు. మరోవైపు భూమి ఫడ్నేకర్, షెహనాజ్ గిల్, డాలీ సింగ్, కుషా కపిల, షిబానీ బేడీలతో థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అనే చిత్రంలో కనిపించింది. ఈ చిత్రం ఇటీవలే రిలీజైంది. -
హీరోయిన్పై బ్రేకప్ రూమర్స్.. ఆ ఒక్క వీడియోతో !
బాలీవుడ్ భామ మలైకా అరోరా ఇటీవల తరచుగా వార్తల్లో నిలుస్తోంది. గత కొద్ది రోజులుగా ఆమె తన ప్రియుడు అర్జున్ కపూర్తో బ్రేకప్ చేసుకున్నారంటూ సోషల్ మీడియాలో పెద్దఎత్తున వైరలైన సంగతి తెలిసిందే. బ్రేకప్ రూమర్స్ వస్తున్న నేపథ్యంలో మలైకా ఆరోరా గట్టి సమాధానం ఇచ్చారు. ఆదివారం అర్జున్ కపూర్తో లంచ్ డేట్కు వెళ్లి మలైకా ఆరోరా రూమర్స్కు చెక్ పెట్టారు. తాజాగా ముంబయిలోని ఓ రెస్టారెంట్ నుంచి ఈ జంట బయటకు వస్తూ కనిపించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. (ఇది చదవండి: 'పుష్ప' లాంటి స్టోరీతో మరో సినిమా) కాగా.. ఇన్స్టాగ్రామ్లో సోదరీమణులు అన్షులా కపూర్, జాన్వీ కపూర్లతో సహా అర్జున్ కుటుంబాన్ని మలైకా అన్ఫాలో చేయడంతో వీరిద్దరి రిలేషన్పై రూమర్స్ వచ్చాయి. కాగా.. ఇటీవలే తన భర్త జోరావర్ సింగ్ అహ్లువాలియాతో విడాకులు తీసుకున్న నటి కుషా కపిలాతో అర్జున్కి రిలేషన్ ఉందన్న వార్తల నేపథ్యంలో ఈ గాసిప్స్ వినిపించాయి. అయితే ఈ విషయాన్ని కుషా కపిలా తీవ్రంగా ఖండించింది. కాగా.. గతంలో తామిద్దరం కలిసి జీవించాలనుకుంటున్నామని.. తమ బంధాన్ని భవిష్యత్తులోనూ కొనసాగించాలని భావిస్తున్నట్లు మలైకా వెల్లడించింది. మలైకా అరోరా బాలీవుడ్లో స్టార్ హీరోలందరితో సినిమాల్లో నటించింది. అయితే 2008లో ఈమె మాజీ భర్త అర్బాజ్ ఖాన్ తో కలిసి అర్బాజ్ ఖాన్ ప్రొడక్షన్స్ పేరుతో చిత్ర నిర్మాణ సంస్థను కూడా స్థాపించింది. ఈ సంస్థ దబాంగ్ పేరుతో సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో వరస చిత్రాలని నిర్మించింది. ఆ తర్వాత 2017తో తన భర్తతో విడాకులు తీసుకున్న మలైకా.. ప్రస్తుతం అర్జున్ కపూర్తో రిలేషన్లో ఉంది. (ఇది చదవండి: అభిమానులకు సర్ప్రైజ్ ఇచ్చిన కిచ్చా.. ఆ లుక్తో కనిపించి! ) View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
ప్రియుడి బర్త్డే బాష్: మలైకా డ్రెస్ ఖరీదెంతో తెలుసా?
బాలీవుడ్ నటుడు అర్జున్ కపూర్ ఇటీవల (జూన్ 26) పుట్టినరోజు వేడుకును చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకున్నాడు.అతని ప్రేయసి మలైకా అరోరా స్టార్ ప్రింటెడ్ బాడీకాన్ డ్రెస్లో దిల్ సే చిత్రంలోని సూపర్హిట్ సాంగ్ ఛైయ్యా ఛైయ్యాకు డ్యాన్స్ చేసి అందర్నీ ఫిదా చేసింది. సోషల్ మీడియాలో అర్జున్ కపూర్ బర్త్ డే బాష్ వీడియో వైరల్ అయిన సంగతి తెలిసిందే. అర్జున్ కపూర్ పుట్టినరోజు వేడుకలో డ్యాన్స్తో ఆకట్టుకున్న మలైకా అరోరా బాడీకాన్ డ్రస్ ఎంత అనే చర్చ జోరందుకుంది. దీని ధర అక్షరాల 99వేల రూపాయలట. మలైకా అరోరా రిబ్బడ్ బాడీకాన్ డ్రెస్ స్పానిష్ లగ్జరీ ఫ్యాషన్ హౌస్ లోవేకి చెందిన రిబ్బెడ్ కాటన్ జెర్సీలో ఆంథూరియం ట్యాంక్ డ్రెస్ అంటారు. స్లీవ్లెస్ వైట్ గౌన్పై ఎరుపు రంగు ఆంథూరియం పువ్వులను అందంగా డిజైన్ చేశారు. మలైకా వైట్ అండ్ రెడ్ గౌనులో మెరిసిపోవడమేకాదు, కిల్లింగ్ స్టెప్స్తో ఇరగదీసింది. ఈ వేడుకలో అతని సోదరి ఖుషీ కపూర్, అన్షులా కపూర్తో పాటు ఆమె ప్రియుడు రోహన్ థక్కర్, కునాల్ రావల్, అర్పితా మెహతా తదితరులు సందడి చేశారు. -
నీకేమైనా పిచ్చిపట్టిందా? ఆ ఫోటో ఏంటి?: నటిపై నెటిజన్స్ ఫైర్
స్పెషల్ సాంగ్స్తో బాగా పాపులారిటీ సంపాదించుకుంది బాలీవుడ్ నటి మలైకా అరోరా. మాజీ భర్త అర్బాజ్ ఖాన్తో పలు చిత్రాలు నిర్మించిన ఆమె టీవీ షోలతో పాటు ఓటీటీలోనూ మెరుస్తోంది. తనకంటే 12 ఏళ్లు చిన్నవాడైన హీరో అర్జున్ కపూర్తో ప్రేమలో మునిగి తేలుతున్న ఆమె మలైకా పెళ్లెప్పుడన్నది మాత్రం చెప్పడం లేదు. తాజాగా ఆమె ప్రియుడి ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. 'నా లేజీ బాయ్(బద్ధకస్తుడు)' అంటూ అర్జున్ ఒంటిపై దుస్తులు లేని ఫోటోను వదిలింది. ఇది నెటిజన్లకు ఆగ్రహం తెప్పించింది. 'ప్రేమకు వయసుతో పని లేదు, సరే, మీ జీవితం మీ ఇష్టం.. కానీ ఒక టీనేజ్ పిల్లవాడికి తల్లయి ఉండి సోషల్ మీడియాలో ఇలాగేనా ప్రవర్తించేది? నువ్విలా విచ్చలవిడిగా ప్రవర్తిస్తే ఆ అబ్బాయి బయట తలెత్తుకుని ఎలా తిరుగుతాడు? ఎంతమంది అతడిని ప్రశ్నలతో గుచ్చిగుచ్చి చంపుతారు..' 'పాపం ఈమె చేసే చీప్ పనుల వల్ల అతడు తన స్కూల్ లేదా కాలేజీలో నవ్వులపాలు కావాల్సి వస్తోంది', 'అరె.. నీకేమైనా పిచ్చి పట్టిందా? మరీ హద్దు మీరుతున్నావు. ఇలాంటివి పోస్ట్ చేయడం అవసరమా?', 'సొంత కొడుకే తనతో ఎక్కువగా ఉండటానికి ఎందుకిష్టపడడో నాకిప్పుడు అర్థమవుతోంది', 'నీ బెడ్రూమ్ విషయాలు కూడా నెట్లో పోస్ట్ చేయాల్సిన అవసరం లేదు' అని ట్రోల్ చేస్తున్నారు. కాగా మలైకా మూవింగ్ ఇన్ విత్ మలైకా షోతో ఓటీటీలో ఎంట్రీ ఇచ్చింది. అటు అర్జున్ కపూర్ లేడీకిల్లర్ చిత్రంలో నటిస్తున్నాడు. చదవండి: హీరోలు చితకబాదేవారు, నాపై నాకే అసహ్యం వేసేది -
ప్రియుడితో స్విమ్మింగ్ పూల్లో స్టార్ హీరో చెల్లెలు.. ఇంట్రెస్టింగ్ పోస్ట్
ప్రముఖ నిర్మాత బోనీకపూర్ కూతురు, హీరో అర్జున్ కపూర్ చెల్లెలు అన్షులా కపూర్ ప్రేమలో పడింది. స్క్రీన్ రైటర్ రోహన్ థక్కర్తో ఆమె డేటింగ్ చేస్తున్నట్లు కొంతకాలంగా బీటౌన్లో జోరుగా వినిపిస్తుంది. తాజాగా ఇదే విషయాన్ని అన్షులా అధికారికంగా ప్రకటించింది. ప్రియుడితో స్విమ్మింగ్ పూల్లో దిగిన ఓ రొమాంటిక్ ఫోటోను షేర్ చేస్తూ..హార్ట్ ఎమోజితో 366 అని క్యాప్షన్ ఇచ్చింది. అంతేకాకుండా మాల్దీవుల్లో ఉన్నట్లు లొకేషన్ ట్యాగ్ని కూడా యాడ్ చేసింది. ఈ పోస్టు చేసి జాన్వీ, ఖుషీ కపూర్లతో పాటు పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేస్తూ కామెంట్స్ చేశారు. తమ ప్రేమను అఫీషియల్గా అనౌన్స్ చేయడంతో త్వరలోనే అన్షులా కపూర్ పెళ్లిపీటలు ఎక్కనుందని టాక్ వినిపిస్తుంది. కాగా గతంలో అధిక బరువుతో ఇబ్బంది పడిన అన్షులా ఇటీవలి కాలంలో బరువు తగ్గి నాజుగ్గా మారిపోయింది. ఇదిలా ఉంటే బోనీకపూర్కు తొలుత మోనా కపూర్తో వివాహమైంది. బోనీకపూర్ శ్రీదేవిని ప్రేమించి పెళ్లాడిన సంగతి తెలిసిందే. అంతకుముందే ఆయనకు మోనా కపూర్తో వివాహమైంది. మొదటి భార్య సంతానమే అర్జున్ కపూర్, అన్షులా కపూర్. ఇరు కుటుంబాలకు వివాదాలు ఉన్నా శ్రీదేవి మరణం తర్వాత అర్జున్ కపూర్.. జాన్వీ, ఖుషీలను దగ్గరకు తీసుకున్నారు. అప్పట్నుంచి పలు పార్టీలు, ఫంక్షన్లకు కలిసే హాజరవుతుంటారు. -
నిజాన్ని నొక్కేస్తున్నారు, ఇంతలా దిగజారాలా?: నటుడు
నిజం గడప దాటేలోపు అబద్ధం ఊరు చుట్టేస్తుందంటారు.. సెలబ్రిటీల విషయంలో అక్షరాలా ఇదే జరుగుతుంది. వాళ్లు ఏం చేసినా దానికి నానార్థాలు తీస్తుంటారు. కొత్తవ్యక్తితో కనిపిస్తే లవ్లో ఉన్నారని, వదులైన డ్రెస్ వేసుకుంటే ప్రెగ్నెంట్ అని ఇలా ఏదేదో అనేస్తుంటారు. కొందరు దీన్ని సీరియస్గా తీసుకోకపోయినా మరికొందరు మాత్రం ఘాటుగానే జవాబిస్తుంటారు. తాజాగా బాలీవుడ్ నటి మలైకా అరోరా గర్భం దాల్చిందంటూ నెట్టింట పుకార్లు షికార్లు చేశాయి. ఇదే నిజమంటూ ఓ వెబ్సైట్ కథనం కూడా రాసేయడంపై మలైకా ప్రియుడు, నటుడు అర్జున్ కపూర్ ఫైర్ అయ్యాడు. మీరు ఎంతో సాధారణంగా భావించి రాసే వార్త మాకు ఎంత సెన్సిటివ్గా అనిపిస్తుందో మీకేం తెలుసు? ఇంత అనైతికంగా దిగజారి ఇలాంటి చెత్తవార్తలు ఎలా రాస్తున్నారు? ఇదే కాదు, చాలా వార్తలు ఈమె ఇలాగే రాసింది. మేము ఇలాంటి కథనాలపై స్పందించట్లేదు కదా అని ఈ ఫేక్ న్యూస్లను సోషల్ మీడియాలో ట్రెండ్ చేసి నిజాన్ని నొక్కేస్తున్నారు. ఇది ఇక్కడితో ఆగిపోలేదు. మా వ్యక్తిగత జీవితాలతో ఆడుకునేంత ధైర్యం చేయకండి అని ఓరకంగా వార్నింగే ఇచ్చాడు. చదవండి: టికెట్ టు ఫినాలే టాస్క్ విజేత ఎవరో తెలుసా? పుష్ప సినిమాలో హీరో ఎవరో తెలియదు: నటి -
49ఏళ్ల వయసులో నటుడితో మలైకా రెండో పెళ్లి!.. పోస్ట్ వైరల్
బాలీవుడ్ నటుడు అర్జున్ కపూర్, మలైకా అరోరా ప్రేమలో మునిగితేలుతున్న విషయం తెలిసిందే. ఈ విషయాన్ని వారు ఎప్పుడూ దాచలేదు. వెకేషన్స్, పార్టీ, ఫంక్షన్స్ ఇలా ప్రతీ వేడుకకు కలిసే హాజరవుతుంటారు. బీటౌన్లో మలైకా-అర్జున్ల జోడికి ప్రత్యేక స్థానం ఉంది. ఇక సినిమాల కంటే డేటింగ్ వార్తలతో టాక్ ఆఫ్ ది టౌన్గా మారిన ఈ జంట త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కేందుకు రెడీ అవుతున్నారట. ఈ మేరకు మలైకా తన ఇన్స్టాగ్రామ్లో ఓ ఫోటోను షేర్ చేస్తూ.. అవును నేను, అంగీకరించాను అంటూ లవ్ ఎమోజీని షేర్ చేసింది. దీంతో అర్జున్-మలైకాలు ఇప్పుడు పెళ్లి చేసుకోవడానికి డిసైడ్ అయ్యారంటూ బీటౌన్ మీడియా కోడై కూస్తుంది. మరి నిజంగానే వీళ్లు పెళ్లిపీటలు ఎక్కనున్నారా? లేదా ఏదైనా మూవీ ప్రమోషన్స్ కోసం చేసిన స్టంటా? అన్నది త్వరలోనే తేలనుంది. కాగా మలైకా ఆరోరాకు ఇదివరకే అర్భాజ్ ఖాన్తో పెళ్లయింది. 17ఏళ్ల వివాహ బంధం తర్వాత వీరు విడిపోయారు. ప్రస్తుతం మలైకా తనకంటే 12 ఏళ్లు చిన్నవాడైన అర్జున్ కపూర్తో ప్రేమలో ఉంది. View this post on Instagram A post shared by Malaika Arora (@malaikaaroraofficial) -
చేతకానితనంగా చూస్తున్నారా.. బాయ్కాట్ ట్రెండ్పై హీరో రియాక్షన్
ప్రస్తుతం బాలీవుడ్కు బాయ్కాట్ సెగ అట్టుకుంది. మొదట ఆమిర్ ఖాన్ లాల్ సింగ్ చద్ధా మొదలైన బాయ్కాట్ ట్రెండ్ ఇప్పుడు అక్షయ్ కుమార్ రక్షా బంధన్, త్వరలోనే రిలీజ్ కాబోయే హృతిక్ రోషన్ విక్రమ్ వేద చిత్రాలకు తాకింది. తాజాగా ఈ బాయ్కాట్ ట్రెండ్పై హీరో అర్జున్ కపూర్ స్పందించాడు. ఈ మేరకు ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తూ బాలీవుడ్ మొత్తం ఐక్యంగా ఉండి ఈ సమస్యను ఎదుర్కొవాలని పిలుపు నిచ్చాడు. చదవండి: ఆస్కార్ బరిలో నాని సినిమా.. మూడు క్యాటగిరిల్లో పోటీ ఈ మేరకు అర్జున్ పోస్ట్ చేస్తూ.. ‘ఇంతకాలం బాయ్కాట్పై మౌనం ఉండి తప్పుచేశాం. అది మా మర్యాద అనుకున్నాం. ఇన్నాళ్లు మా పనితనమే దీనికి సమాధానం ఇస్తుందని అనుకుని పొరపాటు చేశాం. కానీ కొందరు దీనితో ప్రయోజం పొందడం స్టార్ట్ చేశారు. బురదలో చేయి పెట్టడం ఎందుకని మేం అనుకుంటుంటే. మా సహనాన్ని చేతకానితనంగా చూస్తున్నారు. బాయ్కాట్ను ఓ ట్రెండ్గా మారుస్తున్నారు. మన గురించి రాసే రాతలు, ట్రెండ్ చేసే హ్యాష్ట్యాగ్లు వాస్తవికతకు చాలా దూరంగా ఉన్నాయి. చదవండి: వారీసు మూవీ టీంకు షాక్.. నిర్మాత దిల్ రాజు స్ట్రిక్ట్ వార్నింగ్! దీన్ని ఎదుర్కొనేందుకు మనమంతా ఏకం కావాలి’ అని అర్జున్ కపూర్ పిలుపునిచ్చాడు. అలాగే సినిమాలను బహిష్కరించాలనే సంస్కృతి సరైనది కాదంటూ అసహనం వ్యక్తం చేశాడు. ‘ప్రతి శుక్రవారం ఉదయం ప్రజల్లో ఉత్తేజం ఉండేది. కొత్త చిత్రం కోసం వాళ్లు ఉత్సాహం చూపిస్తుంటే పరిశ్రమ ప్రకాశవంతంగా వెలిగిపోయేది. కానీ, ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా మారిపోవడం ఆలోచించాల్సిన విషయం. ఇప్పుడు కొందరు మనపై బురద జల్లుతున్నారు. కానీ, సినిమా విడుదల తర్వాత ప్రజల అభిప్రాయం మారుతుందని భావిస్తున్నాం’ అంటూ అర్జున్ కపూర్ రాసుకొచ్చాడు. -
మలైకాతో పెళ్లికి రెడీగా లేను.. అర్జున్ కపూర్ షాకింగ్ కామెంట్స్
బాలీవుడ్ నటుడు అర్జున్ కపూర్, మలైకా అరోరా ప్రేమలో మునిగితేలుతున్న విషయం తెలిసిందే. సినిమాల కంటే డేటింగ్ వార్తలతో ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు ఈ జంట. ఇదిలా ఉండగా త్వరలోనే ఈ ప్రేమపక్షలు పెళ్లి పీటలు ఎక్కనున్నారంటూ బీటౌన్ మీడియా కోడై కూస్తుంది. ఈ వార్తలపై అర్జున్ కపూర్ ఆసక్తికర రీతిలో స్పందించారు. పాపులర్ షో కాఫీ విత్ కరణ్ షోకి గెస్ట్గా వచ్చిన అర్జున్ కపూర్ మలైకాతో ప్రేమ, పెళ్లి విషయాలపై స్పందించాడు. 'నేను మలైకాను ఇప్పుడే పెళ్లి చేసుకునేందుకు రెడీగా లేను. కోవిడ్ లాక్డౌన్ కారణంగా రెండేళ్లు సినిమాలు లేక అలా సమయం గడిచిపోయింది. ఇప్పుడు నేను నా కెరీర్ మీద దృష్టిపెట్టాలని అనుకుంటున్నా. నా పని నాకు సంతోషాన్ని కలిగిస్తుంది. నేను సంతోషంగా ఉంటేనే నా భాగస్వామిని సంతోషపెట్టగలను. ప్రస్తుతానికి పెళ్లి ఆలోచనలేమీ లేవు' అంటూ పేర్కొన్నాడు. ప్రస్తుతం అర్జున్ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. -
ఆ హీరో ఎంతమంది అమ్మాయిలతో బెడ్ షేర్ చేసుకున్నాడు?
కాఫీ విత్ కరణ్.. సెలబ్రిటీలతో ఇంటర్వ్యూ అనడం కన్నా వారిని రోస్ట్ చేసే షో అనడం బెటరేమో! ఎందుకంటే ఇందులో సెలబ్రిటీలను పిలిచి వారిని చిత్రవిచిత్ర ప్రశ్నలు అడిగి ఇబ్బంది పెడతాడు హోస్ట్ కరణ్ జోహార్. తాజాగా ఈ షోకు బాలీవుడ్ తారలు సోనమ్ కపూర్, అర్జున్ కపూర్ హాజరయ్యారు. ఇంకేముంది, వచ్చీరాగానే తన ప్రశ్నలకు పదును పెట్టాడు కరణ్. అర్జున్ను ఉద్దేశిస్తూ సోనమ్తో.. నీకున్న ఎంతమంది ఫ్రెండ్స్తో ఇతడు బెడ్ షేర్ చేసుకున్నాడు? అని అడిగాడు. దీనికామె అది నేనిప్పుడు మాట్లాడలేను. అయినా నాకలాంటి బ్రదర్స్ లేరు అని బదులిచ్చింది. అందుకు కరణ్ గట్టిగా నవ్వేస్తూ మరెలాంటి బ్రదర్స్ ఉన్నారని మరింత ఉడికించాడు. ఈ వ్యవహారంతో మధ్యలో కల్పించుకున్న అర్జున్.. నువ్వెలాంటి సిస్టర్వి అసలు.. మాకోసం ఏం చెప్తున్నావో తెలుస్తోందా? సోనమ్తో ట్రోల్ చేయించడానికే నన్ను ఈ షోకి పిలిచారా? ఏంటి? అని అడిగాడు. తర్వాత అర్జున్ను నీ ప్రేయసి మలైకా నెంబర్ ఏమని సేవ్ చేసుకున్నావని అడిగాడు హోస్ట్. దానికతడు నాకు మలైకా అనే పేరే ఇష్టం, కాబట్టి అలాగే సేవ్ చేసుకున్నానని చెప్తాడు. ఇక ఈ ప్రోమో హాట్స్టార్లో రిలీజవగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి వీరి సంభాషణ పూర్తిగా వినాలంటే గురువారం వరకు ఆగాల్సిందే! చదవండి: మీనాను పరామర్శించిన అలనాటి హీరోయిన్లు, ఫొటో వైరల్ మహేశ్ బాబు 'పోకిరి' స్పెషల్ షో.. ఫ్యాన్స్కు పండగే -
ఇల్లు అమ్మేసిన బాలీవుడ్ హీరో!
బాలీవుడ్ హీరో అర్జున్ కపూర్ నటించిన తాజా చిత్రం ఏక్ విలన్ రిటర్న్స్. 2014లో రిలీజైన హిట్ మూవీ ఏక్ విలన్కు ఇది రీమేక్. ఆస్మన్ భరద్వాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా జూలై 29న విడుదల కాబోతోంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉన్నాడు హీరో. ఇదిలా ఉంటే తాజాగా అర్జున్ కపూర్కు సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్గా మారింది. గతేడాది అతడు బాంద్రాలో కోట్లు పెట్టి కొత్త ఫ్లాట్ కొన్న విషయం తెలిసిందే కదా. ప్రియురాలు మలైకా అరోరాకు దగ్గరలో ఉండొచ్చని ఆలోచించిన అర్జున్ ఏకంగా రూ.20 కోట్లు పెట్టి ఆ ఫ్లాట్ను సొంతం చేసుకున్నాడు. సడన్గా ఏమైందో ఏమో తెలీదుగానీ అతడు తన ఫ్లాట్ను అమ్మేశాడట! రూ.16 కోట్లకే దాన్ని వదిలించుకున్నాడట. ప్రస్తుతం అతడు జుహులో నివసిస్తున్నాడు. చదవండి: ఓటీటీ స్ట్రీమింగ్కి రెడీ అవుతున్న నయన్-విఘ్నేశ్ల పెళ్లి వీడియో దుమ్ము లేపుతున్న లైగర్, కటౌట్ చూసి కొన్ని నమ్మేయాలంతే -
హీరోలకు చోటు లేదు.. ఆసక్తిగా 'ఏక్ విలన్ 2' పోస్టర్స్
Ek Villain 2 First Look Posters Of John Abraham Arjun Kapoor Out: బాలీవుడ్ ప్రముఖ దర్శకులలో మోహిత్ సూరి ఒకరు. ఆయన దర్శకత్వంలో శ్రద్ధా కపూర్, సిద్ధార్థ్ మల్హోత్ర, రితేష్ దేశ్ముఖ్ ప్రధాన తారగణంగా నటించిన చిత్రం 'ఏక్ విలన్'. 2014లో విడుదలైన ఈ సినిమా మంచి విజయం సాధించింది. తర్వాత ఈ సినిమాకు కొనసాగింపుగా సీక్వెల్ తెరకెక్కిస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఈ సీక్వెల్పై అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ఈ సీక్వెల్లో ఎవరు నటించనున్నారనే విషయం ఆసక్తికరంగా మారింది. ఈ సినిమాలో నటించే నటీనటులను దర్శకనిర్మాతలు కొన్నాళ్లుగా రహస్యంగా ఉంచగా, తాజాగా వారి పేర్లను బయటపెట్టారు. సుమారు ఎనిమిదేళ్ల తర్వాత నిరీక్షణకు తెరదింపారు. 'ఏక్ విలన్'కు సీక్వెల్గా వస్తున్న 'ఏక్ విలన్: రిటర్న్స్' చిత్రంలో అర్జున్ కపూర్, జాన్ అబ్రహం, దిశా పటానీ, తారా సుతారియా కీలక పాత్రలు పోషిస్తున్నారు. దీనికి సంబంధించిన పోస్టర్లను 'విలన్ల లోకంలో హీరోలకు చోటులేదు' అనే క్యాప్షన్తో విడుదల చేశారు. యాక్షన్, సస్పెన్స్ థ్రిల్లర్గా తెరకెక్కిన ఈ మూవీకి మోహిత్ సూరి దర్శకత్వం వహించారు. ఈ చిత్రం జులై 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. చదవండి: తల్లి కాబోతున్న స్టార్ హీరోయిన్ హార్ట్ సింబల్స్తో సమంత ట్వీట్.. నెట్టింట వీడియో వైరల్.. View this post on Instagram A post shared by John Abraham (@thejohnabraham) View this post on Instagram A post shared by Arjun Kapoor (@arjunkapoor) View this post on Instagram A post shared by disha patani (paatni) 🦋 (@dishapatani) View this post on Instagram A post shared by TARA💫 (@tarasutaria) -
అర్జున్ కపూర్ బాడీ షేప్పై ట్రోల్స్, ఘాటుగా స్పందించిన లవ్బర్డ్స్
Malaika Arora Reacts Trolls On Arjun Kapoor Body Shape: బాలీవుడ్ లవ్ బర్డ్స్ అర్జున్ కపూర్-మలైకా ఆరోరాలను తరచూ ట్రోలర్స్ టార్గెట్ చేస్తూనే ఉంటారు. ఇద్దరి మధ్య 12 ఏళ్ల వయసు వ్యత్యాసం, మలైకా పెళ్లయి విడాకులు కావడంతో వీరిద్దరిపై ట్రోల్స్ వస్తూనే ఉంటాయి. తాజాగా మరోసారి ఈ లవ్బర్డ్స్పై విమర్శలు చేశారు ట్రోలర్స్. అయితే ప్రతిసారి మలైకాను టార్గెట్ చేసే నెటిజన్లు ఈ సారి అర్జున్ కపూర్పై విమర్శల దాడి చేశారు. ఈ మధ్య కాస్తా బరువెక్కిన అర్జున్ ప్రతిరోజు జిమ్లో వర్కౌట్స్ చేస్తున్న వీడియోలను ఇన్స్టాగ్రామ్ వేదికగా పంచుకుంటున్నాడు. ఈ క్రమంలో ఇటీవల షేర్ చేసిన తన వర్కౌట్ వీడియో ఓ ఆకతాయి నెటిజన్ ఇలా కామెంట్ చేశాడు. తన కామెంట్లో అర్జున్ ఫిట్నెస్ ట్రైనర్ డ్రూ నీల్ను ట్యాగ్ చేశాడు. చదవండి: భారీ భద్రత నడుమ హైదరాబాద్లో ల్యాండయిన సల్మాన్ ‘ఇలాంటి క్లయింట్ ఉండటం మీ అదృష్టం. ఎందుకంటే నిత్యం మీకు డబ్బలు వస్తూనే ఉంటాయి. తరచూ అతను వర్కౌట్స్ చేస్తూనే ఉంటాడు. కానీ ఎప్పటికీ సరైన షేప్ను పొందలేడు’ అంటూ ఓ నెటిజన్ అర్జున్పై కౌంటర్ వేశాడు. ఇది చూసిన అర్జున్ ఆ కామెంట్ను స్క్రీన్ షాట్ తీసి అతడికి రీకౌంటర్ ఇచ్చాడు. ‘ప్రస్తుతం మనుషుల ఆలోచనలు ఎలా ఉన్నాయంటే ఫిట్నెస్ అంటే బాడీ మీద కట్స్ కనిపించడం, సిక్స్ ప్యాక్తో కూడిన షేప్ ఉండటం అనుకుంటున్నారు. ఎలా అంటే ఫేస్ లేని బాడీ డీపీలా. కానీ నా దృష్టిలో ఫిట్నెస్కు అసలు అర్థమేంటంటే ఏ వ్యక్తి అయితే ఎలాంటి చింతలు లేకుండా ప్రతి రోజు సాధారణ ఆరోగ్యకరమైన.. ప్రశాంతమైన జీవితాన్ని జీవించడం. చదవండి: ‘విక్రమ్’ భారీ విజయం, దర్శకుడికి కమల్ లగ్జరీ కారు బహుమతి సైలెంట్గా తన జీవితం తాను గడిపేవాడు. తన గురించి తాను మాత్రమే శ్రద్ధ తీసుకునేవాడే ఫిట్గా ఉన్నట్లు. అంతేకాని మోహం చాటేసిన డీపీలా ఉండటం కాదు’ అంటూ ఘాటూ రిప్లై ఇచ్చాడు. ఇది చూసిన అర్జున్ ప్రియురాలు, నటి మలైకా అతడికి మద్దతుగా నిలిచింది. అర్జున్ ఇన్స్టా స్టోరీని స్క్రిన్ షాట్ తీసి ‘బాగా చెప్పావ్ అర్జున్. ఇలాంటి విమర్శలు, ట్రోల్స్ నీ కాంతిని దూరం చేయకూడదు. నీ ఈ ప్రయాణంలో నీకు మరింత ధైర్యం, శక్తి రావాలని కోరుకుంటున్నా’ అని పేర్కొంది. దీంతో ఈ పోస్ట్ నెట్టింట వైరల్గా మారింది. కాగా ఈ మధ్య మలైకా-అర్జున్ల పెళ్లి వార్తలు బి-టౌన్లో హాట్టాపిక్గా నిలుస్తున్నాయి. త్వరలో ఈ జంట వివాహ బంధంతో ఒకటి కానుందని కోద్ది రోజులుగా జోరుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Arjun Kapoor (@arjunkapoor) -
మలైకాతో పెళ్లిపై ఆసక్తిగా స్పందించిన అర్జున్!
బాలీవుడ్ నటి మలైకా అరోరా, హీరో అర్జున్ కపూర్ లవ్లో ఉన్నారన్న విషయం మనందరికీ తెలిసిందే! త్వరలోనే వీళ్లిద్దరూ పెళ్లి పీటలెక్కబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటిదాకా ప్రేమలో మునిగి తేలిన ఈ జంట త్వరలో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకన్నారంటు బి-టౌన్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మలైకా మాట్లాడుతూ.. తామిద్దరం కలిసి నడవాల్సిన భవిష్యత్తు కోసం ఆలోచిస్తున్నామని, ఇది తనకు చాలా ముఖ్యమైనదంటూ చెప్పడంతో ఈ రూమర్స్కు మరింత బలం చేకూరింది. చదవండి: చేసిన తప్పుల నుంచి గుణపాఠం నేర్చుకున్నా: తమన్నా దీంతో ఈ ఏడాది నవంబర్లో మలైకా-అర్జున్ పెళ్లి చేసుకోబోతున్నారంటూ బి-టౌన్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా మలైకతో పెళ్లి వార్తలపై స్పందించాడు అర్జున్ కపూర్. ఈ మేరకు అతడు తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఆసక్తికర పోస్ట్ షేర్ చేశాడు. ‘లవ్.. నా జీవితం గురించి నాకంటే ఎక్కువ ప్రతి ఒక్కరికి తెలుసని ఎలా అనిపిస్తుందో’ అంటూ నవ్వుతున్న ఎమోజీని జత చేశాడు. ఇది చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. చదవండి: త్రివిక్రమ్, మహేశ్ సినిమాలో మరో స్టార్ హీరో! దీని అర్థం ఏంటని.. అంటే మలైకా, అర్జున్ పెళ్లి చేసుకోవడం లేదా? అనే సందేహం వ్యక్తం చేస్తున్నారు. కాగా సోషల్ మీడియాలో, ఇంటర్య్వూల్లో అర్జున్, మలైకాలు ఒకరిపై ఒకరు తరచూ ప్రేమను వ్యక్త పరుచుకుంటూ ఉంటారు. ఇద్దరి సన్నిహితంగా ఉన్న ఫొటోలను ఎప్పటికప్పుడు షేర్ చేస్తుంటారనే విషయం తెలిసిందే. ఇక అర్జున్తో పెళ్లిపై మలైకా స్పందిస్తూ.. మా ఇద్దరి ఆలోచనలు ఒకేలా ఉంటాయి. అందుకే కలిసి జీవితాన్ని కొనసాగించచాలని అనుకుంటున్నాం. ఆ క్షణంగా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాం’ అని మలైకా చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4331451957.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
త్వరలో హీరోతో బాలీవుడ్ హీరోయిన్ పెళ్లి, హింట్ ఇచ్చేసిందిగా!
బాలీవుడ్ హీరోయిన్ మలైకా అరోరా, హీరో అర్జున్ కపూర్ లవ్లో ఉన్నారన్న విషయం మనందరికీ తెలిసిందే! త్వరలోనే వీళ్లిద్దరూ పెళ్లి పీటలెక్కబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటిదాకా ప్రేమలో మునిగి తేలిన జంట నెక్స్ట్ ఏంటి? అని ఆలోచిస్తున్నారట. తాజాగా బాంబే టైమ్స్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మలైకా మాట్లాడుతూ.. 'మేమిద్దరం కలిసి నడవాల్సిన భవిష్యత్తు కోసం ఆలోచిస్తున్నాం. ఇది నాకు చాలా ముఖ్యమైనది. నెక్స్ట్ ఏం చేయాలి, ఎటువైపు అడుగులు వేయాలన్న పరిస్థితి దగ్గర మేము నిలబడి ఉన్నాం. ఈ క్రమంలో మేము చాలా విషయాలను చర్చించాము. ఇద్దరి ఆలోచనలు ఒకేలా ఉన్నాయి. కలిసి జీవితాన్ని కొనసాగించాలని ఉవ్విళ్లూరుతున్నాం. మొదట్లో దీని గురించి జోక్స్ చేసుకునేవాళ్లం కానీ ఇప్పుడు సీరియస్గా తీసుకున్నాం. ఒక బంధంలో ఉన్నప్పుడు చాలా పాజిటివ్గా, సురక్షితంగా ఉన్నామనిపించాలి. అర్జున్ నాకు ఆ రెండింటినీ అందించాడు. ఎందుకంటే అతడు నావాడు' అని చెప్పుకొచ్చింది. మొత్తానికి మలైకా త్వరలోనే అర్జున్తో ఏడడుగులు నడవనున్నట్లు ఓ హింట్ ఇచ్చేసిందంటున్నారు ఫ్యాన్స్. చదవండి: నోరా ఫతేహితో డేటింగ్పై స్పందించిన కొరియోగ్రాఫర్ అంతా హ్యాపీ అనుకుంటున్న టైంలో.. నటి ఆత్మహత్య -
అతని రాకతో నాకు మరింత ధైర్యం వచ్చింది: జాన్వీ కపూర్
Janhvi Kapoor On Gaining Siblings Arjun And Anshula Kapoor Secure Stronger: అతిలోక సుందరి, దివంగత నటి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ తనదైన నటనతో బాలీవుడ్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. 'ధడక్' సినిమాతో హిందీలో ఎంట్రీ ఇచ్చి ప్రశంసలు దక్కించుకుంది. నటనతోనే కాకుండా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ అభిమానులకు టచ్లో ఉంటుంది. తాజాగా ఈ బ్యూటీ ఫిల్మ్ఫేర్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన జీవితంలోని పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. ఈ ఇంటర్వ్యూలో తన తోబుట్టువులు అర్జున్ కపూర్, అన్షులా కపూర్ గురించి చెప్పుకొచ్చింది. 'అమ్మ మరణం తర్వాత అర్జున్ అన్నయ్య, అన్షులా మా జీవితాల్లోకి వచ్చారు. వాళ్ల రాకతో మేము (జాన్వీ, ఖుషీ కపూర్) మరింత ధైర్యంగా, సురక్షితంగా ఉన్నామనే భావన కలిగింది. మాకు మరో ఇద్దరు తోబుట్టువులు దొరికారు. ఇలా ఎవరైనా చెబుతారో లేదో తెలియదు కానీ, మేము చాలా అదృష్టవంతులం. ఇంతకన్న గొప్పగా మాకు ఏం లభించదు.' అని చెప్పుకొచ్చింది జాన్వీ. తర్వాత వాళ్ల నాన్న బోనీ కపూర్ గురించి చెబుతూ 'నిజాయితీగా చెప్పాలంటే నాన్నతో ఇలా కొత్తగా ఉంది. ఆయన మాతో ఒక స్నేహితుడిలా ఉంటున్నారు. మేము నలుగురం కలిసి ఉన్నందుకు నాన్న కూడా ఎంతో ఆనందిస్తున్నారు.' అని జాన్వీ కపూర్ తెలిపింది. అర్జున్ కపూర్, అన్షులా కపూర్ ఇద్దరు బోనీ కపూర్ మొదటి భార్య మోనా శౌరీకు పుట్టిన పిల్లలనే విషయం తెలిసిందే. చదవండి: తెలుగులో జాన్వీ కపూర్ ఎంట్రీ ?.. ఫేవరెట్ హీరోతో చదవండి: శ్రీదేవి కూతుళ్లకు కరోనా !.. జాన్వీ పోస్ట్ ఏం చెబుతోంది var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_891253233.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
అందులో తప్పేముంది, అది నా ఇష్టం: ట్రోల్స్పై మలైకా ఫైర్
Malaika Arora Slams Trolling On Dating With Arjun Kapoor: బాలీవుడ్ నటుడు అర్జున్ కపూర్, మలైకా అరోరా ప్రేమలో మునిగితేలుతున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది పెళ్లి కూడా చేసుకోబోతున్నారంటూ బి-టౌన్లో టాక్ కూడా వినిపిస్తోంది. అర్జున్ వయసు 36 కాగా, మలైకాకు 48 ఏళ్లు. వీళ్లిద్దరి మధ్య 12 ఏళ్ల వ్యత్యాసం ఉంది. దీంతో వీరిద్దరి రిలేషన్ విషయంలో తరచూ ట్రోల్స్ ఎదుర్కొంటోంది ఈ జంట. అయినా ఆ రూమార్లను అవాయిడ్ చేస్తు వారి పని వారు చేసుకుంటుపోతున్నారు. అలాగే వీరిద్దరూ మీడియా ముందుకు వచ్చిన ప్రతిసారి వారి రిలేషన్, ఏజ్ రిఫరెన్స్పై ప్రశ్నలు ఎదురువుతూనే ఉన్నాయి. చదవండి: అభిమాని ఓవరాక్షన్.. చితక్కొట్టిన మైక్ టైసన్, వీడియో వైరల్ ఆ సమయంలో వాటిని దాటేయకుండ ధీటూగా సమాధానం ఇస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల ఓ ఇంటర్య్వూలో పాల్గొన్న మలైకాకు మరోసారి దీనిపై ప్రశ్న ఎదురైంది. దీనిపై స్పందించిన ఆమె అసహనానికి లోనైంది. ఎందుకు అందరు ఈ విషయాన్ని పెద్దదిగా చూస్తున్నారంటూ ట్రోలర్స్పై మండిపడింది. ‘మన సమాజంలో వయసులో చిన్న వాడితో డేటింగ్ చేయడాన్ని తప్పుగా ఎందుకు భావిస్తున్నారో అర్థం కావడం లేదు. కానీ నేను వాటిని పట్టించుకోను. ప్రేమకు వయసుతో సంబంధం లేదు. ఈ విషయాన్ని అందరూ గుర్తించాలి’ అంటూ సమాధానం ఇచ్చింది. చదవండి: సమంత ఫేక్ ఫొటో షేర్ చేసిన విజయ్, పడిపడి నవ్విన సామ్ అలాగే ‘ధైర్యంగా ఎలా జీవించాలో నేను మా అమ్మ నుంచి ప్రేరణ పొందాను. నాకు నచ్చిన జీవితం జీవించమని నాకేప్పుడు మా అమ్మ చెబుతూ ఉంటుంది. నేను ఒక ఇండిపెండెట్ ఉమెన్ని. నా జీవితాన్ని ఎలా జీవించాలనేది నా వ్యక్తిగతం. విడాకులు అనంతరం ప్రతి స్త్రీ లైఫ్లో ఎన్నో ఒడిదుడుకులు వస్తాయి. వాటన్నింటిని అధిమించి మహిళలు ధైర్యంగా జీవించాలి’ అని మలైకా సూచించింది. కాగా బాలీవుడ్ హాట్ బ్యూటీ మలైకా అరోరా ఇటీవలె రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ముంబై – పూణే ఎక్స్ ప్రెస్ హైవే మీద పన్వేల్ సమీపంలో ఈ నెల 2న జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆమె స్వల్ప గాయాలతో బయటపడింది. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1521341774.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
ఆ హీరోను నామినేట్ చేసిన సమంత.. ఎందుకో తెలుసా ?
మనకు ఇప్పటివరకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ గురించి విన్నాం. ఇప్పుడు సెలబ్రిటీల్లో 'ఎటాక్ ఛాలెంజ్' నడుస్తోంది. ఈ ఎటాక్ ఛాలెంజ్తో సినీ తారలు మరింత ఫిట్గా మారనున్నారు. ఇదిలా ఉంటే టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత వరుస పెట్టి సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంది. అలాగే సోషల్ మీడియాలో వివిధ రకాల మోటివేషనల్ కొటేషన్స్, టూర్ ఫొటోలు, పెట్స్కు సంబంధించిన విషయాలు, వర్క్ అవుట్ పోస్ట్లతో నిత్యం అలరిస్తూనే ఉంటుంది సామ్. తాజాగా తన ఇన్స్టా వేదికగా షేర్ చేసిన వర్క్ అవుట్ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియోలో సామ్ హై ఆక్టేన్ వర్క్ అవుట్ చేస్తూ కనువిందు చేసింది. చదవండి: అందుకోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నా: సమంత ఈ వర్క్ అవుట్ వీడియోను ఎటాక్ ఛాలెంజ్లో భాగంగా షేర్ చేసింది. ఈ ఛాలెంజ్ను స్వీకరించమని సామ్కు బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ సవాలు విసిరాడు. దీంతో ఆ సవాలు స్వీకరించిన సామ్ వర్క్ అవుట్ వీడియోను పంచుకుంది. తర్వాత ఈ ఛాలెంజ్ స్వీకరించాల్సిందిగా అర్జున్ కపూర్ను నామినేట్ చేసింది. 'నాకు సవాలు విసిరినందుకు ధన్యవాదాలు టైగర్ ష్రాఫ్. ఇదిగో ఈ ఛాలెంజ్ స్వీకరించాల్సిందిగా అర్జున్ కపూర్ను నామినేట్ చేస్తున్నా. చూద్దాం మీరు ఎలా చేస్తారో.' అని రాస్తూ ఇన్స్టా వేదికగా తన వర్క్ అవుట్ వీడియోను షేర్ చేసింది సామ్. ఈ పోస్ట్కు 'నేను కచ్చితంగా ఇలా చేయలేను' అని అర్జున్ కపూర్ రిప్లై ఇచ్చాడు. కాగా ఈ ఎటాక్ ఛాలెంజ్ను టైగర్ ష్రాఫ్కు కూల్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ సవాలు విసిరింది. తర్వాత వారి వెర్షన్లను చూపించమని సమంత, నిర్మాత జాకీ భగ్నానీలను నామినేట్ చేశాడు టైగర్ ష్రాఫ్. చదవండి: సమంత లేటెస్ట్ వీడియో.. వావ్ అనిపించేలా View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) బాలీవుడ్ హ్యాండ్సమ్ హంక్ జాన్ అబ్రహం, బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండేజ్, రకుల్ ప్రీత్ సింగ్ కలిసి నటించిన చిత్రం 'ఎటాక్: 1'. లక్ష్య రాజ్ ఆనంద్ తెరకెక్కించిన ఈ చిత్రం ఏప్రిల్ 1న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఈ సినిమా ప్రమోషన్స్లో భాగంగా రకుల్ ప్రీత్, జాక్వెలిన్ ఈ 'ఎటాక్ ఛాలెంజ్'ను నిర్వహించారు. View this post on Instagram A post shared by Tiger Shroff (@tigerjackieshroff) View this post on Instagram A post shared by Jacqueline Fernandez (@jacquelinef143) -
పెళ్లి నా కెరీర్పై ప్రభావం చూపలేదు: నటి కామెంట్స్ వైరల్
Malaika Arora About Her Early Marraige And Motherhood: బాలీవుడ్ బ్యూటీ మలైకా అరోరా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నిత్యం ఏదో ఒక విధంగా వార్తల్లో నిలిచే ఈ హాట్ బ్యూటీ తాజాగా తన పెళ్లిపై కీలక వ్యాఖ్యలు చేసింది. 1998లో సల్మాన్ ఖాన్ సోదరుడు అర్భాజ్ ఖాన్తో మలైకా వివాహం జరిగిన సంగతి తెలిసిందే. తర్వాత వీరికి కొడుకు పుట్టాడు. కానీ మనస్పర్థల కారణంగా 2017లో వీరు విడాకులు తీసుకున్నారు. అయితే 25ఏళ్ల వయసులోనే పెళ్లి చేసుకోవడం ఆ తర్వాత బిడ్డను కనడం తన కెరీర్పై ఎలాంటి ప్రభావం చూపలేదని మలైకా పేర్కొంది. గ్లామరస్గా ఉండేందుకు ప్రయత్నిస్తూనే ఆ సమయంలో ఎదురైన అడ్డంకుల్ని అధిగమించినట్లు తెలిపింది. పెళ్లి చేసుకొని పిల్లలు పుట్టాక చాలా తక్కువ మంది సినిమాల్లో నటించేవారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. అలాగే నటనకు నేను గ్లామర్ ఇండస్ట్రీగానే భావిస్తాను. ఆ విధంగా గ్లామరస్గా ఉండేందుఎకు ప్రయత్నిస్తూనే అవకాశాలు సొంతం చేసుకున్నాను అని వెల్లడించింది. కాగా ప్రస్తుతం మలైకా బాలీవుడ్ హీరో అర్జున్ కపూర్తో డేటింగ్లో ఉంది. ఈ ఏడాది పెళ్లి చేసుకోవచ్చనే రూమర్స్ కూడా వినిపిస్తున్నాయి. -
25 ఏళ్లకే జీవితం అయిపోదు: రూమర్స్పై మలైకా ఘాటు రిప్లై
బాలీవుడ్ నటుడు అర్జున్ కపూర్, మలైకా అరోరా ప్రేమలో మునిగితేలుతున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది పెళ్లి కూడా చేసుకోబోతున్నారంటూ టాక్ వినిపిస్తోంది. అర్జున్ వయసు 36 కాగా, మలైకాకు 48 ఏళ్లు. వీళ్లిద్దరి మధ్య 12 ఏళ్ల వ్యత్యాసం ఉంది. అయితే గత కొంత కాలంగా అర్జున్ కపూర్ మలైకా అరోరా విడిపోతున్నట్లు వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. తమ నాలుగేళ్ల ప్రేమ బంధానికి త్వరలోనే స్వస్తి పలకనున్నట్లు బీటౌన్లో పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి. అయితే వీటిపై ఇప్పటికే అర్జున్ కపూర్ స్పందించిన విషయం తెలిసిందే. మలైకాతో దిగిన ఫోటోను షేర్ చేస్తూ తాము విడిపోతున్నట్లు వస్తున్న రూమర్లను కొట్టిపారేశారు. చదవండి: వైరల్ వీడియో: అభిమానుల కోసం బయటకొచ్చిన సూపర్స్టార్ తాజాగా మలైకా కూడా తమ రిలేషన్షిప్పై స్పందించింది. ఈ మేరకు ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో ఓ పోస్టు పెట్టింది. ‘40 ఏళ్ల వయసులో ప్రేమలో పడటం సాధారణం విషయంగా భావించండి.. మీ 30 ఏళ్ల వయసులో కొత్త కలలను కనుగొని సాధించడాన్ని అంగీకరించండి.. మీ 50 ఏళ్ల వయసులో మిమ్మల్ని, మీ లక్ష్యాన్ని గుర్తుంచడాన్ని అంగీకరించండి. జీవితం 20 ఏళ్లను దాటేసింది. 25 ఏళ్లతో జీవితం ముగియదు. అలా నటించడం మానేద్దాం’ అంటూ పేర్కొన్నారు. ఈ పోస్టుతో ఇద్దరి మధ్య వయసు అంతరంపై ప్రశ్నిస్తున్న వారందరికీ గట్టి సమాధానం ఇచ్చినట్లైంది. చదవండి: ఆంటీతో డేటింగ్ అంటూ ట్రోల్స్, తొలిసారి ఘాటుగా స్పందించిన యంగ్ హీరో -
బ్రేకప్ చెప్పుకున్న లవ్బర్డ్స్!, క్లారిటీ ఇచ్చిన హీరో
Arjun Kapoor Clarity Over His Break Up With Malaika Arora!: బాలీవుడ్ యంగ్ హీరో అర్జున్ కపూర్ ప్రముఖ నటి మలైకా అరోరాతో కొంతకాలంగా డేటింగ్ చేస్తున్న సంగతి తెలిసిందే. మలైకాకు 48 ఏళ్లు కాగా.. అర్జున్ కపూర్కు 36 ఏళ్లు. అంటే వీరిద్దరి మధ్య 12 ఏళ్ల వయసు వ్యత్యాసం ఉంది. అర్జున్ సినిమాల పరంగా కంటే తనకన్నా వయసులో పెద్దదైన మలైకతో ప్రేమ వ్యవహరంతో కారణంగానే ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నాడు. అంతేకాదు ఆంటీతో డేటింగ్ ఏంటని కూడా తరచూ అతడు ట్రోల్స్ బారిన పడుతున్నాడు. చదవండి: Arjun Kapoor: ఆంటీతో డేటింగ్ అంటూ ట్రోల్స్, తొలిసారి ఘాటుగా స్పందించిన యంగ్ హీరో అయితే అవన్నీ చూసి చూడనంటూ వదిలేస్తన్నారు ఈ లవ్ బర్డ్స్. అంతేకాదు తమను ట్రోల్స్ చేస్తున్న వారికి.. ప్రేమతో వయసుకు సంబంధం లేదని, తమకు ఒకరి పట్ల ఒకరికి గౌరవం ఉందంటూ కౌంటర్గా కొటెషన్స్ చెప్పుకుంటు వస్తున్నారు ఈ జంట. ఇదిలా ఉంటే వీరిద్దరూ విడిపోయారంటూ, తమ ప్రేమకు బ్రేకప్ చెప్పుకున్నారంటూ బి-టౌన్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. చదవండి: సల్మాన్ ఖాన్తో సీక్రెట్ డేటింగ్, క్లారిటీ ఇచ్చిన నటి సమంత.. ఇంతకాలం ప్రేమ గురించి కవితలు, కొటెషన్స్ చెప్పుకొచ్చిన ఈ జంట కూడా అందరిలాగే విడిపోయిందంటూ నెటిజన్లు కామెంట్స్ చేయడం ప్రారంభించారు. ఈ క్రమంలో తమపై వచ్చిన తాజా రూమార్లకు చెక్ పెడుతూ అర్జున్ ఒక్క ఫొటోతో క్లారిటీ ఇచ్చాడు. మలైకాతో కలిసి దిగిన ఫోటోను తన ఇన్స్టాగ్రమ్లో షేర్ చేసిన అర్జున్ కపూర్.. చెత్త పుకార్లకు చోటు లేదంటూ తేల్చి చెప్పాడు. ‘నీచమైన పుకార్లకు ఇక్కడ చోటు లేదు. సురక్షితంగా, సంతోషంగా ఉండండి. లవ్ యూ ఆల్’ అనే క్యాప్షన్తో రూమర్లకు స్పష్టత ఇచ్చాడు అర్జున్ కపూర్. View this post on Instagram A post shared by Arjun Kapoor (@arjunkapoor) -
ఆర్య సినిమా నుంచే బన్నీ ఫ్యాన్: బాలీవుడ్ హీరో
Arjun Kapoor: అల్లుఅర్జున్ పుష్పరాజ్గా నటించిన చిత్రం 'పుష్ప: ది రైజ్'. ఈ సినిమా విడుదలైనప్పటి నుంచి అంచనాలను మించి వసూళ్లు అందుకుంటూ ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేస్తోంది. మరీ ముఖ్యంగా బాలీవుడ్లో ప్రకంపనలు సృష్టిస్తున్న పుష్ప చిత్రాన్ని అక్కడి సెలబ్రిటీలు సైతం మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు. తాజాగా పుష్ప ఫస్ట్ పార్ట్ చూసిన అర్జున్ కుమార్ ఈ సినిమాతో పాటు అందులో నటించిన బన్నీపై ప్రశంసలు కురిపించాడు. ఆర్య సినిమా నుంచే బన్నీకి ఫ్యాన్ అంటూ తన ఇన్స్టాగ్రామ్లో రాసుకొచ్చాడు. 'పుష్ప సినిమా కాదు, ఇదొక అనుభవం.. యాటిట్యూడ్, కూల్నెస్ రెండూ కలగలిపిన ఒక మృదువైన పొయెటిక్ మోషన్ పిక్చర్. అల్లు అర్జున్ అభిమానిగా ఆయన ఆర్య నుంచి పుష్ప వరకు ఎదిగిన తీరు చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా? ఫైరూ.. అని అర్జున్ రాసుకొచ్చాడు. దీనిపై అల్లు అర్జున్ స్పందిస్తూ.. 'మీరు ఆ ఫైర్ను ఫీలైనందుకు హ్యాపీగా ఉంది. మీ ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు' అని రిప్లై ఇచ్చాడు. ఇదిలా ఉంటే అర్జున్ కపూర్ కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. ప్రస్తుతం అతడు బికనీర్లో క్వారంటైన్లో ఉన్నాడు. -
అజిత్ సినిమా కోసం నాగ చైతన్య, విజయ్ దేవరకొండ, జాన్వీ కపూర్
Valimai Posters Launched Naga Chaitanya Vijay Devarakonda Jhanvi Arjun: తమిళ స్టార్ హీరో అజిత్ తెలుగులోనూ అనేక అభిమానులను సంపాదించుకున్నాడు. ఆయన నటన, యాక్షన్ సీన్స్, ముఖ్యంగా బైక్ రైడింగ్లో అజిత్ను చూస్తే సగటు అభిమానికి పూనకం రాకుండా ఉండదు. అజిత్ తాజా చిత్రం 'వలిమై'లో బైక్ చేజింగ్ సీన్స్తో తన అభిమానులకు మళ్లీ పూనకాలు తెప్పించే ప్రయత్నం చేస్తున్నాడు ఈ హీరో. హెచ్ వినోద్ దర్శకత్వం వహించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. తమిళ, తెలుగు, హిందీ భాషల్లో జనవరి 13న రిలీజ్ కానుంది. అయితే ఇప్పటివరకూ తమిళ పోస్టర్, ట్రైలర్ను మాత్రమే విడుదల చేసింది ఈ చిత్ర బృందం. ఇదీ చదవండి: ఆకట్టుకుంటున్న అజిత్ కుమార్ ‘వాలిమై’ మూవీ ట్రైలర్ తాజాగా బుధవారం (జనవరి 5) తెలుగు టైటిల్తో కూడిన విడుదల తేది పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ పోస్టర్ను టాలీవుడ్ గుడ్బాయ్ నాగచైతన్య, రౌడీ హీరో విజయ్ దేవరకొండ సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు. 'నేను అజిత్ సర్కి పెద్ద అభిమానిని. ఆయన సినిమా పోస్టర్ను విడుదల చేయడం చాలా సంతోషంగా ఉంది' అని రాసుకొచ్చాడు చై. 'అజిత్ గారు, మై బ్రదర్ కార్తికేయ, చిత్ర బృందం అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్' అని విజయ్ ట్వీట్ చేశాడు. అలాగే వలిమై హిందీ పోస్టర్లను బాలీవుడ్ నటులు అర్జున్ కపూర్, జాన్వీ కపూర్ విడుదల చేశారు. సినిమా మంచి విజయం అందుకోవాలని వారంతా ఆకాంక్షించారు. My absolute pleasure to launch the Telugu poster of #AjithKumar sir’s #Valimai being a huge fan myself! wishing the team all the very best @BoneyKapoor #HVinoth @thisisysr @BayViewProjOffl @ZeeStudios_ @sureshchandraa @ActorKartikeya #NiravShah @humasqureshi #ValimaiFromPongal pic.twitter.com/pDUsz6d2oM — chaitanya akkineni (@chay_akkineni) January 4, 2022 Wishing #AjithKumar garu, my Brother @ActorKartikeya and the entire team all the very best! @BoneyKapoor #HVinoth @thisisysr @BayViewProjOffl @ZeeStudios_ @sureshchandraa #NiravShah #Valimai in Telugu, Tamil and Hindi. #ValimaiFromJan13 pic.twitter.com/6YHfx5Ycjh — Vijay Deverakonda (@TheDeverakonda) January 4, 2022 ఈ పోస్టర్లలో అజిత్ తుపాకీ పట్టుకుని సీరియస్ కనిపించాడు. యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని జీ స్టూడియోస్ సంస్థతో కలిసి బోనీ కపూర్ నిర్మించారు. ఇందులో విలన్గా కార్తికేయ నటించగా.. బాలీవుడ్ నటి హ్యూమా ఖురేషి హీరోయిన్ అని తెలుస్తోంది. View this post on Instagram A post shared by Arjun Kapoor (@arjunkapoor) View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) ఇదీ చదవండి: దీపికా బర్త్డే.. ప్రభాస్, సమంతల స్వీటెస్ట్ విషెస్ -
ఆంటీతో డేటింగ్ అంటూ ట్రోల్స్, తొలిసారి ఘాటుగా స్పందించిన యంగ్ హీరో
Arjun Kapoor Response On Trolls: బాలీవుడ్ యంగ్ హీరో అర్జున్ కపూర్ ప్రముఖ నటి మలైకా అరోరాతో కొంతకాలంగా డేటింగ్ చేస్తున్న సంగతి తెలిసిందే. మలైకాకు 48 ఏళ్లు కాగా.. అర్జున్ కపూర్కు 36 ఏళ్లు. అంటే వీరిద్దరి మధ్య 12 ఏళ్ల వయసు వ్యత్యాసం ఉంది. అర్జున్ సినిమాల పరంగా కంటే తనకన్నా వయసులో పెద్దదైన మలైకతో ప్రేమ వ్యవహరంతో కారణంగానే ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నాడు. అంతేకాదు ఆంటీతో డేటింగ్ ఏంటని కూడా తరచూ ట్రోల్స్ ఎదుర్కొంటున్నాడు. చదవండి: దుబాయ్లో హీరోయిన్తో హీరో విక్రమ్ తనయుడు డేటింగ్, ఫొటోలు వైరల్ అయితే ఈ కామెంట్స్ను అర్జున్, మలైక ఇంతకాలం చూసి చూడనట్టు వదిలేశారు. అంతేకాదు ట్రోలర్స్కు గట్టి సమాధానంగా సమయం వచ్చినప్పుడల్లా వీరిద్దరూ సోషల్ మీడియాలో ఒకరిపై ఒకరు ప్రేమ, గౌరవాన్ని వ్యక్తపరుస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలో ఇటీవల ఓ చానల్కు ఇచ్చిన ఇంటర్య్వూలో ఇలాంటి కామెంట్స్పై స్వయంగా స్పందించాడు అర్జున్ కపూర్. ఈ సందర్భంగా అర్జున్ మాట్లాడుతూ.. ‘నాకు తెలిసి ఇలాంటి వ్యాఖ్యలపై స్పందన కోరుకునేది మీడియా మాత్రమే. సాధారణంగా ట్రోలింగ్స్లో తొంభైశాతం కామెంట్స్ను అంతగా పట్టించుకోము. చూసి చూడనట్టు వదిలేస్తాం. ఎందుకంటే అవన్ని నిజం కాదు అందులో కొన్ని ఫేక్. అదే వ్యక్తులు నన్ను కలిసినప్పుడు నాతో సెల్ఫీ తీసుకోవడానికి ఆసక్తి చూపుతుంటారు. అందుకే వాటిని నమ్మలేం’ అంటూ తనదైన శైలిలో ట్రోలర్స్కు ఘాటుగా సమాధానం ఇచ్చాడు. చదవండి: ఢిల్లీ సీఎంకు కరణ్ జోహార్ ట్వీట్, నిర్మాతపై నెటిజన్ల మండిపాటు అంతేకాదు.. ‘నా వ్యక్తిగత జీవితంలో నేను ఏదైనా చేస్తాను. అది నా హక్కు. నా పనికి గుర్తింపు లభిస్తే చాలు. మిగిలినదంతా చెత్త. ఎవరి వయస్సు ఎంత అనే దాని గురించి మీరు అంతగా బాధపడాల్సిన అవసరం లేదు. ఎవరి లైఫ్ వారు జీవించాలి. వయస్సును చూసి రిలేషన్ షిప్లోకి దిగడం నాకు తెలిసి ఓ వెర్రితనం’ అని వ్యాఖ్యానించాడు. కాగా, మలైకకు సల్మాన్ ఖాన్ సోదరుడు అర్భాజ్ ఖాన్తో వివాహం కాగా వీరికి కుమారుడు ఆర్హాన్ ఖాన్ ఉన్నాడు. ఇటీవల అర్భాజ్, మలైకలు విడాకులు తీసుకుని విడిపోయిన సంగతి తెలిసిందే. -
అర్జున్ కపూర్కి కరోనా.. ఇల్లుకు సీల్ వేసిన బీఎంసీ
బాలీవుడ్లో కరోనా కలకలం సృష్టిస్తోంది. ఇటీవల బీటౌన్కు చెందిన ప్రముఖుల కరోనా బారిన పడిన తెలిసిందే. తాజాగా హీరో అర్జున్ కపూర్కు బుధవారం (డిసెంబర్ 29) కొవిడ్ పాజిటివ్ అని తేలింది. అర్జున్ కపూర్తోపాటు అతని సోదరి అన్షులా కపూర్కు మహ్మమారి సోకింది. కరీనా కపూర్ ఖాన్ కొవిడ్ నుంచి కోలుకున్న తర్వాత వీరిద్దర కరోనా బారిన పడ్డారు. ప్రస్తుతం వీరిద్దరూ హోం ఐసోలేషన్లో ఉన్నారు. ఇటీవల తమను కలిసిన వారందరూ కరోనా పరీక్షలు చేయించుకోవాలని వారు కోరారు. అర్జున్ కపూర్ ప్రేయసీ మలైక అరోరా కొవిడ్ పరీక్షలు చేసుకోగా ఆమెకు నెగెటివ్ వచ్చింది. ఇటీవల వారిద్దరూ ఓ డిన్నర్ డేట్కు వెళ్లినట్లు సమాచారం. అలాగే రియా కపూర్, తన భర్త కరణ్ బూలానీకి కూడా కరోనా సోకింది. ఈ విషయాన్ని రియా కపూర్ తన ఇన్స్టా గ్రామ్ స్టోరీ ద్వారా షేర్ చేసింది. 'ఎంత జాగ్రత్తగా ఉన్నప్పటికీ నేను నా భర్త కరోనా బారిన పడ్డాం. ఇది మహమ్మారి స్వభావం. మేమిద్దరం ఐసోలేట్ అవుతున్నాం. వైద్యులు సూచించిన మెడిసిన్ తీసుకుంటున్నాం.' అని తెలిపారు. అర్జున్ కపూర్ ఇంట్లో నలుగురికి కరోనా రావడంతో బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BMC) అప్రమత్తమైంది. ముంబైలోని అర్జున్ కపూర్ నివాసానికి సీల్ వేసింది. ఇంటి పరిసరాలను శానిటైజ్ చేస్తుంది బీఎంసీ. ఇదిలా ఉంటే గతేడాది సెప్టెంబర్లో అర్జున్ కపూర్ తొలిసారిగా కరోనా బారిన పడ్డాడు. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
మాల్దీవుల్లో ప్రియుడితో రచ్చచేస్తున్న మలైకా అరోరా
సెలబ్రిటీలు, ప్రేమికులు ఎక్కువగా మాల్దీవులు వెళ్లడానికి ఇష్టపడుతుంటారు. వారికి ఏమాత్రం సమయం దొరికినా వెంటనే అక్కడ వాలిపోతుంటారు. తాజాగా, బాలీవుడ్ ప్రేమజంట.. మలైకా అరోరా, అర్జున్ కపూర్లు కూడా మాల్దీవులకు వెళ్లారు. వారు సరదాగా గడిపిన క్షణాలను ఇన్స్టాగ్రామ్ వేదికగా పంచుకున్నారు. సూర్యకిరణాలు నేలను ముద్దాడుతున్న ఫోటోలను కూడా తీశారు. మలైకా అరోరా తన ప్రియుడితో కలిసి సెల్ఫీ దిగడమే కాక అక్కడ సైక్లింగ్ కూడా చేశారు. ప్రస్తుతం వీరి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. కాగా, ఈ జంట 2018 నుంచి డేటింగ్లో ఉంది. మలైకా అరోరా విషయానికి వస్తే ఆమె ఒక డ్యాన్స్ రియాలిటీ షోలో టెరెన్స్ లూయిస్, గీతాకపూర్తో కలిసి జడ్జిగా వ్యవహరించారు. అంతేకాకుండా చయ్యా.. చయ్యా పాట.., మున్నీ బద్నాం హుయ్ డార్లింగ్ తేరే లియే, అనార్కలీ డిస్కో చాలీ పాటల్లో హుషారైన స్టెప్పులతో ఫ్యాన్స్ను ఆకట్టుకున్నారు. మిలింద్ సోమన్, అనూశా దండేకర్లతో కలిసి సూపర్ మోడల్ ఆఫ్ ది ఇయర్ 2 కు జడ్జిగా పనిచేశారు. అర్జున్ కపూర్.. సైఫ్ అలీఖాన్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్, యామీ గౌతమ్లతో కలిసి హరర్ కామెడీ మూవీ భూత్ పోలీస్, సందీప్ ఔర్ పింకీ ఫరార్ లో నటించారు. గతేడాది కృతి సనన్, సంజయ్ దత్లతో కలిసి పీరియాడిక్ డ్రామా పానిపట్లోనూ నటించారు. -
మార్కెట్లోకి కొత్త కారు.. తెగ కొనేస్తున్న బాలీవుడ్, టాలీవుడ్ స్టార్స్
స్టార్ హీరోలకు, హీరోయిన్లకు లగ్జరీ కార్లు అంటే మక్కువ ఎక్కువ. మార్కేట్లోకి వచ్చిన కొత్తరకం మోడల్ కార్లను ఎప్పుడెప్పుడు తమ ఇంటిముందు పార్క్ చేయాలాని ఎదురు చూస్తుంటారు. అందుకే కొత్త రకం కారు వచ్చిందంటే చాలు క్షణం అలస్యం చేయకుండా కొనేస్తారు. దేశంలో భాగ పేరొందిన మోడల్స్లో సూపర్-హాట్ మెర్సిడెస్ మేబాచ్ జీఎల్ఎస్ 600 ఒకటి. దీని ధర 2- 4 కోట్ల వరకు ఉంటుంది. ఈ కారు అంటే హీరో, హిరోయిన్లు తెగ ఇష్ట పడుతున్నారు. ఇటీవల ఈ మోడల్ కారును కొనుగోలు చేసిన వారిలో భాగ పేరొందిన స్టార్ హీరో, హీరోయిన్ల గురుంచి తెలుసుకుందాం. ఈ ఖరీదైన కారును నడుపుతు వారు రహదారిపై కనిపించారు. 1.రామ్ చరణ్ దక్షిణాది అతిపెద్ద హీరోలలో రామ్ చరణ్ ఒకరు. అతని ఫ్యాన్ ఫాలోయింగ్ సంఖ్య ఈ కారు కోసం అతను చెల్లించిన మొత్తం కంటే ఎక్కువ. హై సెక్యూరిటీ, అధునాతన టెక్నాలజీతో చరణ్ కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన ఈ కారు ధర రూ.4 కోట్లు ఉంటుందట. అయితే చెర్రి దగ్గర ఇప్పటికే ఫెరారీ, బీఎమ్డబ్ల్యూ వంటి ఖరీదైన కార్లు ఉన్నాయి. 2.రణవీర్ సింగ్ మిస్టర్ బాజీరావ్ 'మస్తానీ' గత సంవత్సరం జూలైలో ఈ మెర్సిడెస్ మేబాచ్ జీఎల్ఎస్ కారును కొన్నాడు. భారతదేశంలో ప్రారంభించిన ఒక నెల తరువాత దీనిని కొనుగోలు చేశాడు. దీనిని కొనుగోలు చేసిన తర్వాత లంబోర్ఘినిని కూడా కొనుగోలు చేశాడు.(చదవండి: ఆపిల్ కొంపముంచిన చిప్స్...!) 3. అర్జున్ కపూర్ 'అర్జున్ కపూర్' పరిచయం అవసరంలేని బాలీవుడ్ స్టార్. ఎందుకంటే ఇతడు హీరోగా మాత్రమే కాకుండా అసిస్టెంట్ ప్రొడ్యూసర్, అసిస్టెంట్ డైరెక్టర్ గా కూడా పనిచేసారు. అతడు ఇషాక్ జాదే వంటి సినిమా వల్ల బాగా పాపులర్ అయ్యాడు. జర్మనీ లగ్జరీ వాహన తయారీ సంస్థ Mercedes-Maybach GLS 600 కారుని ఈ ఏడాది సెప్టెంబర్ లో కొనుగోలు చేశాడు.(చదవండి: సౌరవ్ గంగూలీపై కోకాకోలా కీలక నిర్ణయం..!) 4. కృతి సనన్ ‘మిమి’ సక్సెస్.. చేతిలో ‘ఆదిపురుష్’ వంటి భారీ ప్రాజెక్ట్తో ఫుల్ స్వింగ్లో ఉన్న హీరోయిన్ కృతీ సనన్ తనకు తానే ఓ ఖరీదైన గిఫ్ట్ ఇచ్చుకున్నారు. సరికొత్త మెర్సిడెస్-మేబాచ్ జీఎల్ఎస్ 600 కారును తనకు తానే గిఫ్ట్గా ఇచ్చుకున్నారు కృతీ సనన్. 5. ఆయుష్మాన్ ఖురానా 2018లో వచ్చిన ‘అంధాదూన్’ అనే సినిమాతో ఆయన నేషనల్ అవార్డు అందుకున్న ఆయుష్మాన్ ఖురానా ఈ ఏడాది జూలై నెలలో ఖరీదైన మెర్సిడెస్-మేబాచ్ జీఎల్ఎస్ 600 కారును కొన్నారు. -
రోడ్డు పక్కన టిఫిన్ చేసిన బన్ని, ఇదేంటని అడిగిన సమంత
♦ ఫొటోలు షేర్ చేసి ఇదేంటి? అని అడిగిన అక్కినేని కోడలు సమంత ♦ రోడ్డు పక్కన బండి దగ్గర టిఫిన్ చేసిన బన్ని, వీడియో వైరల్ ♦ ఆ స్కర్ట్యే కావాలంటున్న తేజస్విని ♦ లైట్స్ .. కెమెరా.. యాక్షన్ అంటూ ఫొటో షేర్ చేసిన అర్జున్ కపూర్ ♦ తెల్ల చీరలో మెరిసి పోతున్న సోనాలి బింద్రె View this post on Instagram A post shared by S (@samantharuthprabhuoffl) View this post on Instagram A post shared by Tejaswi Madivada (@tejaswimadivada) View this post on Instagram A post shared by Sonali Bendre (@iamsonalibendre) View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) View this post on Instagram A post shared by Namrata Shirodkar (@namratashirodkar) View this post on Instagram A post shared by Arjun Kapoor (@arjunkapoor) View this post on Instagram A post shared by Alekhya Harika (@alekhyaharika_) View this post on Instagram A post shared by Poonam Bajwa (@poonambajwa555) View this post on Instagram A post shared by Sushmita Sen (@sushmitasen47) View this post on Instagram A post shared by Priya Prakash Varrier💫 (@priya.p.varrier) -
అర్జున్కపూర్-షాహిద్తో సోనాక్షి బ్రేకప్ స్టోరీ
థప్పడ్ సే డర్ నహీ లగ్తా సాబ్.. ప్యార్ సే లగ్తా హై! (చెంప దెబ్బంటే భయం లేదు సర్.. ప్రేమంటేనే భయం!) డైలాగ్తో పాపులర్ అయిన కథానాయిక.. అర్థమైపోయి ఉంటుంది ఎవరో?! అవును.. సోనాక్షీ సిన్హా. ఈ వారం ‘మొహబ్బతే’కి నాయిక కూడా! ఆమె ప్రేమ జీవితం.. అందులో వైఫల్యం.. సాక్ష్యాధారాలతో ఎక్కడా లేవు. హిందీ, ఇంగ్లిష్ పత్రికలు, వెబ్ మీడియాలో వచ్చిన వార్తలు.. వంటి రూమర్స్ని కూర్చి ఇస్తున్న కథనం ఇది. ప్రభుదేవా దర్శకత్వంలో వచ్చిన ‘ఆర్. రాజ్కుమార్’ సినిమా గుర్తుందా? అందులో సోనాక్షీ సిన్హా, షాహిద్ కపూర్ హీరోహీరోయిన్లు. ఆ సెట్స్లోనే వీళ్లిద్దరి మధ్య ప్రేమ చిగురించిందని పుకారు. ‘నా జీవితంలో ఇద్దరే ఇద్దరిని ప్రాణప్రదంగా ప్రేమించాను’ అని షాహిద్ కపూర్ ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. ఆ ఇద్దరిలో ఒకరు కరీనా.. ఇంకొకరు సోనాక్షీ అనే నిర్ధారణకొచ్చారు షాహీద్, సోనాక్షీ జంటను అభిమానించే కొంతమంది. ఇందుకు కారణం లేకపోలేదు. ‘కాఫీ విత్ కరణ్ షో’లో ఇంటర్వ్యూకి వచ్చిన ప్రతిసారి షాహిద్ కపూర్ ఆ సమయంలో తను ఎవరితోనైతే రిలేషన్లో ఉన్నాడో ఆ సహచరితో వచ్చేవాడని.. అలా సెకండ్ సీజన్లో కరీనా కపూర్, థర్డ్ సీజన్లో ప్రియాంక చోప్రా, ఫోర్త్ సీజన్లో సోనాక్షీ సిన్హా, చివరకు భార్య మీరా రాజ్పుత్తో వచ్చాడని కామెంట్ చేశాడు షో హోస్ట్ కరణ్ జోహార్. ఇదే విషయమై షాహిద్ను అడిగాడు కూడా.. ‘నువ్వు కరీనా, ప్రియాంకతో డేట్ చేశావ్ కదా.. సోనాక్షీతో కూడా డేటింగ్లో ఉన్నావని రూమర్స్ వినిపిస్తున్నాయి’ అని. కాదని తోసిపుచ్చలేదు షాహిద్ కపూర్. అంతేకాదు ‘ఆర్. రాజ్కుమార్’ సెట్స్లో షూటింగ్ తర్వాత సోనాక్షీ, షాహిద్ సరదాగా షికారుకెళ్లేవారని, పార్టీలూ చేసుకున్నారనీ బాలీవుడ్ వర్గాల నుంచి సమాచారం. దీనికి ఉదాహరణగా సోషల్ మీడియాలో పోస్ట్ అయిన ‘షాహిద్ను ముద్దు పెట్టుకుంటున్న సోనాక్షీ సిన్హా’ ఫొటోను చూపిస్తారు. ఇదంతా నిజమే అయితే ఆ ప్రేమ పెళ్లి వరకు ఎందుకు రాలేదో.. వాళ్లెందకు విడిపోయారో తెలియదు. కానీ వాళ్లిద్దరు మాత్రం విడివిడిగా ‘మేం మంచి స్నేహితులం.. అప్పుడు.. ఇప్పుడు.. ఎప్పుడూ’ అని చెప్తారు మీడియా ఎప్పుడు ప్రశ్నించినా! ప్యాకప్ అవగానే పార్టీలు.. హ్యాంగవుట్స్ సోనాక్షీ సిన్హా, అర్జున్ కపూర్ జంట కలసి నటించిన ‘తేవర్’ సినిమా షూటింగ్ అప్పుడే వాళ్లు ప్రేమలో పడ్డారని బాలీవుడ్ సినిమా పత్రికల కథనం. షూటింగ్ ప్యాకప్ అవగానే పార్టీలు.. హ్యాంగవుట్స్, ముంబై శివారులోని థియేటర్లలో సినిమాలకూ వెళ్లేవారట. ఆ టైమ్లో పాపరాజీ కెమెరాలకూ చిక్కారనీ మీడియా కవరేజ్. అయితే ‘తేవర్’ సినిమా పూర్తవడంతోనే వీళ్ల ప్రేమా ముగిసిపోయిందనీ బాలీవుడ్ మాట. ఈ ఇరువురి మనస్తత్వాల్లోని వైరుధ్యమే ఆ బ్రేకప్కి రీజన్ అని ఇద్దరి సన్నిహితులు చెప్తారు. సోనాక్షీది అలాంటి తత్వమే.. ‘సోనాక్షీ చాలా ఎమోషనల్. ఏ ఫీలింగ్స్నూ దాచుకోలేదు. బేషరతుగా ప్రేమిస్తుంది. అర్జున్ కపూర్ ఇందుకు కాస్త భిన్నం. అతను గుంభనంగా ఉంటాడు. సోనాక్షీ స్ట్రాంగ్ ఎమోషన్స్ను సంభాళించలేకపోయాడు’ అని ఒక సోర్స్ కామెంట్. ‘ప్రేమ విషయంలో సోనాక్షీది సాధారణ అమ్మాయిల తత్వమే. అర్జున్ చుట్టే తన ప్రపంచాన్ని అల్లుకుంది. ఇది అర్జున్ను ఊపిరాడనివ్వకుండా చేసింది. ఏమైనా వాళ్ల బ్రేకప్కు ఆ ఇద్దరిలో ఎవరినీ బ్లేమ్ చేయలేం.. అదలా జరిగిపోయింది అంతే!’ అంటూ ఇంకో సోర్స్ విశ్లేషణ. సోనాక్షీ మాత్రం.. ‘సినిమా రంగంలోని అబ్బాయిని కాకుండా కాస్త మంచి వ్యక్తిత్వం ఉన్న అబ్బాయిని చూసుకోమని మా పేరెంట్స్ చెప్తుంటారు. చూద్దాం.. అలాంటి వ్యక్తి తారసపడితే తప్పకుండా నా ప్రేమ విషయాన్ని ముందు మీకే షేర్ చేస్తాను’ అంటూ మీడియా ఎన్కౌంటర్ నుంచి తప్పించుకుంటూ ఉంటుందెప్పుడూ! ∙ఎస్సార్ -
జాన్వీ అలా పిలిస్తే విచిత్రంగా అనిపిస్తుంది: అర్జున్
ముంబై: ‘‘అన్షులా మాత్రమే.. నన్ను ‘భాయ్’ అని పిలుస్తుంది. కానీ జాన్వీ ‘అర్జున్ భయ్యా’ అంటుంది. ఎందుకో జాన్వీ అలా పిలిస్తే నాకు విచిత్రంగా అనిపిస్తుంది. చాలా కొత్తగా కూడా ఉంటుంది’’ అన్నాడు బాలీవుడ్ హీరో అర్జున్ కపూర్. నిజానికి తనను అలా పిలవమని, ఎప్పుడూ చెప్పలేదని.. జాన్వీకి ఎలా నచ్చితే అలాగే పిలుస్తుందని చెప్పుకొచ్చాడు. ఇప్పటికీ తమది పరిపూర్ణ కుటుంబం కాదని, ఒకరితో ఒకరం కలిసి పోయేందుకు ఇంకాస్త సమయం పడుతుందని పేర్కొన్నాడు. తామంతా కలిసినపుడు ఎంతో ఆహ్లాదంగా గడుపుతామని, అయితే అంతమాత్రాన ఇప్పుడే ఒక్క కుటుంబంగా మారిపోయామని చెప్పడం అబద్ధమే అవుతుందన్నాడు. కాగా శ్రీదేవి మరణించిన సమయంలో జాన్వీ, ఖుషీకి దగ్గరయ్యారు బోనీ కపూర్ మాజీ భార్య మోనా శౌరీ పిల్లలు అర్జున్, అన్షులాలు. అప్పటి నుంచి చెల్లెళ్లద్దరికీ అన్న ప్రేమను పంచుతున్నాడు అర్జున్ కపూర్. ఈ విషయం పట్ల బోనీ కపూర్ సైతం సంతోషంగా ఉన్నాడు. అయితే, జాన్వీ, ఖుషీలతో తన అనుబంధం గురించి అతడు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... ‘‘కేవలం అభిప్రాయాలు వేరుగా ఉన్నంత మాత్రాన మేం ఇంకా కలిసిపోలేదని చెప్పడం లేదు. రెండు వేర్వేరు కుటుంబాలు ఒక్కటి కావడానికి చాలా సమయం పడుతుంది. అంతేగానీ.. ఇప్పుడే అంతా కలిసిపోయాం.. మేమంతా ఒక్కటే అనే అబద్ధపు ప్రచారాలు చేయడం నాకిష్టం ఉండదు. దేనికైనా సమయం పడుతుంది’’ అని చెప్పుకొచ్చాడు. కాగా మోనాకు విడాకులు ఇచ్చి, బోనీ కపూర్ శ్రీదేవిని పెళ్లాడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అనారోగ్యం బారిన పడిన మోనా 2012లో మరణించింది. ఆమె చనిపోయిన 6 సంవత్సరాలకు శ్రీదేవి కన్నుమూసింది. -
ప్రియుడికి మలైక స్పెషల్ బర్త్డే విషెస్
బాలీవుడ్ హీరో అర్జున్ కపూర్ బర్త్డే సందర్భంగా బాలీవుడ్కు చెందిన పలువురు సినీ ప్రముఖులు అతడికి సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇక అతడి కజిన్స్ సోనమ్ కపూర్, జాన్వీ కపూర్లు సైతం ప్రత్యేకంగా విషెస్ తెలిపారు. ఇక అతడి ప్రియురాలు, నటి మలైక అరోరా చెప్పిన స్పెషల్గా బర్త్డే విష్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మలైక అర్జున్ను పట్టుకుని చిరునవ్వులు చిందిస్తున్న ఫొటోను షేర్ చేస్తూ ‘హ్యాపీ బర్త్డే మై సన్షైన్’ అంటూ రెడ్ హర్ట్ ఎమోజీని జత చేసింది. కాగా సరిగ్గా ఇదే రోజు అంటే అర్జున్ 33వ బర్త్డే సందర్భంగా వీరి రిలేషన్ షిప్ను అధికారికంగా ప్రకటించారు ఈ లవ్ బర్ట్స్. ఇక అప్పటి నుంచి ఈ జంట బి-టౌన్లో చక్కర్లు కొడుతున్న ఫొటోలు సోషల్ మీడియాలో తరచూ హల్చల్ చేస్తుంటాయి. కాగా సల్మాన్ ఖాన్ సోదరుడు అర్భాజ్ ఖాన్తో విడాకుల అనంతరం మలైక అర్జున్తో డేటింగ్ చేస్తున్న సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Malaika Arora (@malaikaaroraofficial) -
Sardar Ka Grandson: ‘సర్దార్ కా గ్రాండ్సన్’ మూవీ రివ్యూ
పిల్లలు ఉన్న చోట పెద్దలు ఉండక తప్పదు. కాని ఆ పెద్దలకు ఒక బాల్యం ఉంటుంది. బతికిన ఒక ఊరు ఉంటుంది. ఏదో ఒక స్థలంతో, ఆవాసంతో బంధం ఉంటుంది. తమ చివరి రోజుల్లో వాటిని ఒకసారి చూసుకోవాలని వారికి ఉంటుంది. పిల్లలకు అది పట్టదు. కాని వారిని అర్థం చేసుకుంటే ఆ కోరిక నెరవేరుస్తే వారు పొందే ఆనందం చాలా విలువైనది. ‘సర్దార్ కా గ్రాండ్సన్’లో ఒక నానమ్మ చివరి సందర్శనను మనవడు నెరవేరుస్తాడు. ఆదివారం సినిమా పరిచయం. వృద్ధాప్యంలో జ్ఞాపకం పెద్ద ఊతంగా ఉంటుంది. గతం ఒక ఓదార్పుగా ఉంటుంది. ఎన్నో చేదు అనుభవాలు కూడా వాటిలో ఉంటాయి. కాని వాటి గాఢత, ఆ సందర్భాలను దాటి రావడం వల్ల పూర్తిగా తగ్గి, ఆ అనుభవాల పునఃసందర్శనకు కూడా శక్తి ఉంటుంది. ఇక మంచి జ్ఞాపకాలనైతే వెతుక్కుంటూ వెళ్లాలని ఉంటుంది. వృద్ధాప్యంలో ఉన్నవారి మనసుల్లో ఏం కోరిక ఉందో పిల్లలకు పెద్దగా పట్టదు. వారిని బాగా చూసుకుంటున్నాం కదా అనుకుంటారు. మహా అయితే పుణ్యక్షేత్రాలకు తీసుకువెళతారు. కాని ఇవాళ్టి వృద్ధులు ఒకప్పటి యవ్వనవంతులు, యువతీ యువకులు, భార్యాభర్తలు, ఉద్యోగులు, సంసారులు. వారి జీవనంతో పెనవేసుకున్న విషయాలు ఎన్నో ఉంటాయి. వాటిలో కొన్నింటిని వారు ఆఖరిశ్వాస వరకూ పూర్తిగా అంటి పెట్టుకుని ఉంటారు. తాము పోయేలోపు ఆ ఫలానా స్థలాన్నో, వ్యక్తినో, ఊరినో తిరిగి చూడాలనుకుంటారు. ఆ కోరిక తీరిస్తే వారికి కలిగే ఆనందం అనంతం. ‘సర్దార్ కా గ్రాండ్’ ఇటీవల నెట్ఫ్లిక్స్లో విడుదలైన సినిమా. అమృత్సర్లో స్థిరపడిన శ్రీమంతురాలైన 90 ఏళ్ల వృద్ధురాలి కథ అది. ఆమె పిల్లలు బాగా స్థిరపడ్డారు. ఆమె కూడా ఇక హాయిగా చివరి శ్వాస తీసుకోవచ్చు. కాని ఆమె మనసులో ఒక కోరిక. తాను మరణించేలోపు తను ఇష్టపడి కట్టుకున్న ఇంటిని చూడాలనేది. అదేం పెద్ద కోరిక అనుకోవచ్చు. కాని ఆ ఇల్లు లాహోర్లో ఉంది. దేశ విభజన సమయంలో దానిని ఆమె విడిచి వచ్చేసింది. అక్కడ ఉండగా భర్తతో ఎంతో ఇష్టపడి ఆ ఇంటిని కట్టుకుంది. అందులోనే తొలి బిడ్డకు జన్మనిచ్చింది. అందులోనే నాటి అల్లర్లలో భర్త ప్రాణం విడిచాడు. ఆ ఇంటిని చూసుకోవాలని ఉంటుంది. కాని ఆమె ఆరోగ్యరీత్యా వేరే కారణాల రీత్యా ఎవరూ ఆ కోరికను మన్నించరు. కాని ఆమె మనవడు ఆమె కోరికను అర్థం చేసుకుంటాడు. దానిని నెరవేర్చాలనుకుంటాడు. అక్కడే సమస్య వస్తుంది. ఇంటినే కదిలించి అమృత్సర్లో ఉన్నవారు పాకిస్తాన్కు వెళ్లిరావడం పెద్ద సమస్య కాదు. కాని మనవడికి వీసా వస్తుంది కాని నానమ్మకు రాదు. దానికి కారణం గతంలో ఒక క్రికెట్ మేచ్లో ఆమె చేసిన అల్లరే కారణం. అందుకని మనవడు లాహోర్ వెళతాడు. ఏ ఇంటికైతే తన నానమ్మ రాలేదో ఆ ఇంటినే అమృత్సర్కు తీసుకువస్తాడు. అంటే దానిని పునాదులతో సహా పెకలించి ట్రక్కు మీద పెట్టి అమృత్సర్ తీసుకువస్తాడు. అయితే అదంత సులువు కాదు. దాని కోసం అతడు ఏమేమి తిప్పలు పడ్డాడనేది కథ. కొంచెం హాస్యం, కొంచెం సెంటిమెంట్తో సినిమా మొదటి పదిహేను నిమిషాలు స్లోగా ఉన్నా తర్వాత అందుకుంటుంది. నీనా గుప్తా సర్వమై ఈ సినిమా గత నెల విడుదలైంది. ఆశించినంత స్పందన రాలేదు. దానికి కారణం ఈ స్క్రిప్ట్ ఇంకా బాగుండొచ్చు. అయితే ఈ సినిమా ఒకసారి చూసేంతగా ఆకట్టుకోవడానికి కారణం వృద్ధురాలిగా నటించిన నీనా గుప్తా నటన. ఆమె మన మనసులోని భావాలను, నాటి అనుభవాల గాఢతను తెర మీద వ్యక్తం చేయడంలో గొప్ప నటన చూపించింది. ఈ సినిమా చూసినంత సేపు మన ఇంట్లో నానమ్మో, తాతయ్యో, ఇరువురో ఉంటే ‘మీకేం కావాలి... మీరేం చూడాలనుకుంటున్నారు... మీరెవరిని కలవాలనుకుంటున్నారు’ అని అడిగేలా ఉంటుంది. మిగిలిన పాత్రల్లో అర్జున్ కపూర్, రకుల్ప్రీత్ సింగ్ నటించారు. లాహోర్ ఫ్లాష్బ్యాక్లో జాన్ అబ్రహామ్, అదితి రావ్ హైదరీ మెప్పిస్తారు. జాన్ అబ్రహామ్ దీని నిర్మాత. -
సోనమ్ వల్ల గొడవ, చివరికి తన్నులు తిన్నా: హీరో
గొడవలకు దూరంగా ఉండే బాలీవుడ్ హీరో అర్జున్ కపూర్ బాల్యంలో మాత్రం ఓ విద్యార్థిని చెడుగుడు ఆడేశాడట. తన కజిన్ సోనమ్ కపూర్ను ఏడిపించిన వ్యక్తిని నిందిస్తూ పట్టపగలే చుక్కలు చూపించబోయాడట! కానీ అతడు పెద్ద బాక్సర్ కావడంతో అర్జున్ వాచిపోయిన కన్నుతో ఇంటికి వెళ్లాల్సి వచ్చింది. ఇంతకీ ఆ రోజు ఏం జరిగిందో వివరంగా తెలియాలంటే ఇది చదివేయండి.. అర్జున్ కపూర్, అతడి కజిన్ సోనమ్ కపూర్ ఆర్య విద్యా మందిర్ పాఠశాలలో చదివేవారు. ఇద్దరికీ బాస్కెట్బాల్ ఆడటం అంటే ఎంతో ఆసక్తి ఉండేది. ఓసారి సోనమ్ స్కూల్ గ్రౌండ్లో బాస్కెట్బాల్ ఆడుకుంటుండగా సీనియర్లు వచ్చి ఆమె దగ్గరున్న బాల్ను లాక్కున్నారు. ఆడింది చాలు, ఇప్పుడు మేం ఆడుకుంటామని దురుసుగా సమాధానమిచ్చారు. దీంతో సోనమ్ గుక్క పెట్టి ఏడ్చుకుంటూ అర్జున్ దగ్గరకు వెళ్లి ఓ అబ్బాయి నాతో చెడుగా ప్రవర్తించాడు అని ఫిర్యాదు చేసింది. నిజానికి అర్జున్ గొడవలకు దూరంగా ఉండే మనిషి. కానీ తన సోదరిని ఏడిపించారని తెలియగానే అతడి కోపం కట్టలు తెంచుకుంది. వెంటనే అర్జున్ తన కజిన్ను ఏడిపించిన వ్యక్తి దగ్గరకు వెళ్లి ఇష్టమొచ్చినట్లు తిట్టాడు. అతడు అలానే కాసేపటి వరకు చూసీచూసీ చివరకు అర్జున్ ముఖం మీద గట్టిగా ఒక పంచ్ ఇచ్చాడట. దీంతో కమిలిపోయిన ముఖంతో అర్జున్ ఇంటికి వెళ్లగా.. అంతా తన వల్లే జరిగిందని బాధపడిన సోనమ్ క్షమాపణ కూడా చెప్పింది. అయితే అతడో బాక్సర్ అని తెలియక గొడవ పెట్టుకున్నానని, కానీ అతడిచ్చిన పంచ్కు ఆస్పత్రికి కూడా వెళ్లాల్సి వచ్చిందని అర్జున్ తాజా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. పైగా ఈ గొడవకు అంతటికీ తనే కారణమంటూ తనను సస్పెండ్ చేశారని తెలిపాడు. తనకు ఇంతటి ఘోర అవమానం జరిగినందుకు గానూ ఇకపై ఏం జరిగినా స్కూల్లో నీ గురించి నువ్వే చూసుకో అని సోనమ్కు గట్టిగా చెప్పానని పేర్కొన్నాడు. కాగా అర్జున్ చివరిసారిగా 'సర్దార్ కా గ్రాండ్సన్' చిత్రంలో కనిపించాడు. ఇందులో జాన్ అబ్రహాం, నీనా గుప్తా, అదితిరావు హైదరీ, రకుల్ ప్రీత్ సింగ్ నటించారు. అర్జున్ ప్రస్తుతం 'ఏక్ విలన్ 2', 'భూత్ పోలీస్' చిత్రాలు చేస్తున్నాడు. చదవండి: మలైకా ఇంటి దగ్గర్లో బాలీవుడ్ నటుడి కొత్త విల్లా! -
ప్రేయసి ఇంటి సమీపంలో నటుడి కొత్త విల్లా, ఖరీదు ఎంతంటే?
'నువ్వక్కడుంటే నేనిక్కడుంటే ప్రాణం విలవిల..' అని హిందీలో పాటలు పాడుకుంటున్నాడట బాలీవుడ్ నటుడు అర్జున్ కపూర్. ఇంతకీ అతడు ఎవరి గురించి పాడుకుంటున్నారో మీకీపాటికే అర్థమై ఉంటుంది. అవును, తన ప్రేయసి మలైకా అరోరా గురించే! ఆమెతో ఎడబాటును అస్సలు భరించలేకపోతున్నాడట అర్జున్. ఆమెను చూడకుండా ఉండటం తన వల్ల కావడం లేదని, ఏకంగా ఆమె ఇంటికి సమీపంలోనే ఓ ఖరీదైన విల్లా కొనుగోలు చేశాడట. సెలబ్రిటీల నివాసాలకు నిలయమైన ముంబైలోని బాంద్రాలో అర్జున్ ఓ విలాసవంతమైన విల్లాను తన సొంతం చేసుకున్నాడని బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. ఒక హాలు, వంటగది, బాల్కనీతో పాటు నాలుగు బెడ్రూమ్లు ఉన్న ఈ స్కై విల్లాను 20 నుంచి 23 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసినట్లు సమాచారం. మరి ఇదెంతవరకు నిజమనేది తెలియాల్సి ఉంది. కాగా మలైకా-అర్జున్ రెండేళ్లుగా ప్రేమలో మునిగి తేలుతున్నారు. సల్మాన్ ఖాన్ సోదరుడు అర్భాజ్ ఖాన్తో విడాకులు తీసుకున్న మలైకా అర్జున్ కంటే 12 ఏళ్లు పెద్దదైనప్పటికీ వారి లవ్ లైఫ్లో ఇప్పటివరకు ఎలాంటి సమస్యలూ ఎదురై దాఖలాలు లేవు. అంతేకాకుండా మలైకాకు ఒ కొడుకు ఉన్నాడు కాబట్టి వారి వ్యక్తిగత విషయాల గురించి ఎక్కువగా స్పందించమని అర్జున్ ఈ మధ్యే మీడియాకు తెలిపాడు. భాగస్వామిగా మలైకా గతాన్ని గౌరవిస్తానని చెప్పాడు. కానీ పెళ్లి ప్రస్తావన మాత్రం లేవనెత్తలేదు. చదవండి: మలైకతో అర్జున్ డేటింగ్, తన గతాన్ని గౌరవిస్తున్నా ఆ బాధ చూడలేక కూతుర్ని చంపేయాలనుకున్నా -
మలైకతో అర్జున్ డేటింగ్, తన గతాన్ని గౌరవిస్తున్నాను
ప్రస్తుతం బాలీవుడ్ లవ్బర్డ్స్ అంటే వెంటనే గుర్తొచ్చేది మలైకా అరోరా-అర్జున్ కపూర్ల జంట. అంతగా ఈ జంట బి-టౌన్లో చక్కర్లు కొడుతున్నారు. కొంతకాలం సిక్రెట్ డేటింగ్లో ఉన్న వీరు ఏడాది క్రితమే వారి రిలేషన్ను అధికారికంగా ప్రకటించారు. అయితే మొదట్లో ఈ జంట పెద్దగా కలిసి తిరిగేవారు కాదు. పైగా వారి రిలేషన్ గురించి బయట ఎక్కడా ప్రస్తావించడానికి ఆసక్తిని చూపేవారు కాదు. తాజాగా దీనికి కారణాన్ని వెల్లడించాడు అర్జున్. కాగా మలైకా, అర్జున్ కంటే 12 ఏళ్లు పెద్దదనే విషయం తెలిసిందే. సల్మాన్ ఖాన్ సోదరుడు అర్భాజ్ ఖాన్తో మలైకా విడాకులు తీసుకుని విడిపోయింది. అనంతరం అర్జున్తో ప్రేమ వ్యవహారన్ని కొనసాగిస్తోంది. అయితే మలైకా-అర్భాజ్ ఖాన్ దంపతులకు ఆర్హాన్ అనే కుమారుడు ఉన్నాడు. ప్రస్తుతం అర్హాన్ మలైకాతోనే ఉంటున్నాడు. ఇదిలా ఉండగా ఇటీవల ఓ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అర్జున్ తమ ప్రేమ వ్యవహరాన్ని గోప్యంగా ఉంచడానికి కారణం చెప్పాడు. ‘నేను నా వ్యక్తిగత విషయాలను బహిరంగంగా మాట్లాడేందుకు ఇష్టపడను. ఎందుకంటే నా జీవిత భాగస్వామిని గౌరవించాలన్నది నా అభిప్రాయం. అంతేకాదు తనకు ఓ గతం కూడా ఉంది. నేను మా రిలేషన్ గురించి మాట్లాడే ముందు తనకు ఓ కుమారుడు కూడా ఉన్నాడనేది దృష్టి పెట్టుకుని వ్యవహరించాలి. ఎందుకంటే ఇలాంటి సంఘటనలు, పరిస్థితులు పిల్లలను ప్రభావితం చేస్తాయి. అందుకే మా వ్యక్తిగత విషయాలను ఎక్కువగా ప్రస్తావించను’ అంటు చెప్పుకొచ్చాడు. అంతేగాక తను మలైకా గతానికి గౌరవం కూడా ఇస్తానని చెప్పాడు. ‘నేను మా మధ్య ఉన్న కొన్ని సరిహద్దులను గౌరవించడానికి ప్రయత్నిస్తాను. ఎందుకంటే భాగస్వామిగా తనకు నేను సౌకర్యవంతమైన పరిస్థితులను ఇవ్వాలి. అందుకే మా మధ్య కొన్ని సరిహద్దులను సృష్టించుకున్నాము. ఇక ఈ రోజు నేను దీనిపై మాట్లాడటానికి కారణం లేకపోలేదు. ఇంతకాలం మేము మాకు కావాల్సినంత సమయాన్ని కేటాయించుకున్నాము. ఇప్పుడు తన గురించి నేను, నా గురించి తను పూర్తిగా తెలుసుకుని ఒకరినొకరం అర్థం చేసుకున్నాం. దీనివల్ల తనపై, తన గతంపై నాకు ఇంకా గౌరవం పెరిగింది’ అంటూ అర్జున్ వివరణ ఇచ్చాడు. కాగా అర్జున్ నటించిన ‘సర్దార్ కా గ్రాండ్సన్’ మూవీ నెట్ఫ్లీక్స్లో విడుదలైన సంగతి తెలిసిందే. ఇందులో నీనా గుప్తా కీలక పాత్రలో కనిపించారు. ప్రస్తుతం అర్జున్ నటిస్తున్న భూట్ పోలీసులో సైఫ్ అలీ ఖాన్, జాక్వేలిన్ ఫెర్నాడేజ్, యామి గౌతమ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. -
నానమ్మ కోరిక నెరవేర్చలేకపోయా: హీరో
బాలీవుడ్ నటుడు అర్జున్ కపూర్ తాజాగా నటించిన చిత్రం "సర్దార్ కా గ్రాండ్సన్". ఇందులో నానమ్మ కోరిక తీర్చేందుకు తపనపడే మనవడి పాత్రలో నటించాడు అర్జున్. అయితే రియల్ లైఫ్లో మాత్రం బామ్మ కోరిక నెరవేర్చలేకపోయానని బాధపడుతున్నాడు. తాజాగా ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అర్జున్ మాట్లాడుతూ.. "నాకు 26 ఏళ్లు ఉన్నప్పుడు జల్దీ షాదీ కరో బేటా (త్వరగా పెళ్లి చేసుకో బాబు) అంటూ బామ్మ ఓ కోరిక కోరింది. తనకు మునిమనవరాళ్లను ఎత్తుకోవాలని ఉందంటూ తహతహలాడింది. నావరకైతే అది అంత ఈజీ కాదు, నేను దాన్ని సుసాధ్యం చేయలేకపోయాను. కానీ, కపూర్ ఫ్యామిలీ త్వరలోనే ఆ కోరిక నెరవేర్చుతుంది" అని చెప్పుకొచ్చాడు. ఇక తొమ్మిదేళ్ల క్రితం తల్లి తనతో గడిపిన ఆఖరు క్షణాల్లో జరిగిన సంభాషణను సైతం పంచుకున్నాడు. తాను, తన సోదరి అన్షుల స్వతంత్రంగా బతకాలని అమ్మ మరీ మరీ చెప్పిందని, విలువలను కాపాడుతూ మంచి పౌరులుగా ఎదగాలని కోరుకుందని తెలిపాడు. ఈ ప్రక్రియ ఒకచోట ఆగిపోదని, నిరంతరం జరుగుతూ ఉంటుందని పేర్కొన్నాడు. కాగా అర్జున్ కపూర్ ప్రధాన పాత్రలో నటించిన 'సర్దార్ కా గ్రాండ్ సన్' సినిమా మే 18 నుంచి నెట్ఫ్లిక్స్లో ప్రసారం కానుంది. ఇందులో నీనా గుప్తా నానమ్మ పాత్రలో నటిస్తోంది. అదితి రావు హైదరీ, జాన్ అబ్రహాం, రకుల్ ప్రీత్ సింగ్, సోనీ రాజ్దాన్, కన్వల్జిత్ సింగ్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. కాశ్వీ నాయర్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. చదవండి: హీరోవి నీకేం తక్కువ? నువ్వే కాపాడొచ్చు కదా? -
ట్రక్ నడిపా.. షాక్ ఇచ్చా!
కొత్త చాలెంజ్లను స్వీకరించడంలో ముందు వరుసలో ఉండే హీరోయిన్ల పేర్లలో రకుల్ప్రీత్ సింగ్ పేరు తప్పక ఉంటుంది. ఇప్పుడీ ప్రస్తావన ఎందుకంటే హిందీ చిత్రం ‘సర్దార్ అండ్ గ్రాండ్సన్’ కోసం రకుల్ ఓ హెవీ ట్రక్ను నడిపి, చిత్రయూనిట్కు షాక్ ఇచ్చారు. ఈ విషయం గురించి రకుల్ మాట్లాడుతూ– ‘‘నాకు డ్రైవింగ్ అంటే చాలా ఇష్టం. కానీ హెవీ ట్రక్ను నడపడం అంత సులభం కాదు. మొదట కొంచెం నెర్వస్గా అనిపించినా ఆ తర్వాత ఆత్మవిశ్వాసంతో బాగా నడపగలిగాను. నా డ్రైవింగ్ స్కిల్స్ చూసి యూనిట్ సభ్యులు షాక్ అయ్యారు. ట్రక్ నడపడం అనేది జీవితాంతం ఒక మంచి జ్ఞాపకంగా మిగిలిపోతుంది’’ అన్నారు. అర్జున్కపూర్ హీరోగా నటించిన ఈ చిత్రం మేలో ఓటీటీ ప్లాట్ఫామ్లో విడుదల కానుంది. ఈ సినిమా కాకుండా.. రకుల్ హిందీలో ‘మేడే, థ్యాంక్యూ గాడ్, ఎటాక్’ సినిమాల్లో హీరోయిన్గా నటిస్తున్నారు. -
హీరోవి నీకేం తక్కువ? నువ్వే కాపాడొచ్చు కదా?
సోషల్ మీడియా వచ్చాక ప్రతివాడికి ఎదుటివాళ్లను చులకన చేసి మాట్లాడటం ఈజీ అయిపోయింది. మరీ ముఖ్యంగా సెలబ్రిటీలు ఏం మాట్లాడినా, ఏ పోస్టు పెట్టినా వారిని విపరీతంగా ఆడేసుకుంటున్నారు నెటిజన్లు. దీనిపై కొందరు సెలబ్రిటీలు మౌనం వహించినప్పటికీ మరికొందరు మాత్రం వాళ్ల ఆట కట్టించేందుకు ఘాటు రిప్లై ఇస్తారు. బాలీవుడ్ యంగ్ హీరో అర్జున్ కపూర్ కూడా అదే కోవలోకి వస్తాడు. అతడు తాజాగా ఓ బాలుడి ఫొటోను షేర్ చేశాడు. దాతలు ఎవరైనా పెద్దమనసుతో ముందుకొచ్చి ఈ పిల్లవాడి ఆరోగ్యాన్ని కాపాడేందుకు సహాయం చేయగలరు అని రాసుకొచ్చాడు. అర్జున్ చేస్తున్న మంచిపనికి ఎంతోమంది అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తూ కామెంట్లు చేశారు. కానీ ఓ నెటిజన్ మాత్రం.. నీ ఒక్కరోజు జీతంతో అతడిని కాపాడొచ్చు కదా అని వ్యంగ్యంగా రాసుకొచ్చాడు. ఇది చూసిన అర్జున్.. "నేను నిజంగా రోజుకు రూ.16 కోట్లు సంపాదిస్తే ఈ పోస్ట్ పెట్టాల్సిన అవసరమే రాకపోయేది. అంత మొత్తం డబ్బులు ముట్టజెప్పకపోయినా ఎంతోకొంత నా వంతు సాయం చేశాను. వీలైతే మీరు కూడా సాయం చేయండి" అని బదులిచ్చాడు. ఎంతో కూల్గా ఆన్సర్ ఇచ్చిన అర్జున్ కపూర్ను చూసి ఫ్యాన్స్ మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు. ఆ బాలుడు ఆరోగ్యవంతుడయ్యేందుకు తమవంతు సాయం అందిస్తామంటూ ముందుకు వస్తున్నారు. View this post on Instagram A post shared by Arjun Kapoor (@arjunkapoor) చదవండి: బాలీవుడ్ నటి సీక్రెట్ ఎంగేజ్మెంట్! నిజమేనా? ఊర్వశి వజ్రాల మాస్కు: రేటు తెలిస్తే దిమ్మ తిరగాల్సిందే! -
బాలీవుడ్ నటి సీక్రెట్ ఎంగేజ్మెంట్! నిజమేనా?
బాలీవుడ్ నటి మలైకా అరోరా, యంగ్ హీరో అర్జున్ కపూర్ ప్రేమలో ఉన్న విషయం అందరికీ తెలిసిందే.. కొన్నాళ్లుగా ప్రేమపాటలు పాడుకుంటున్న ఈ జంట ఉగాది పండగ రోజు సీక్రెజ్గా ఎంగేజ్మెంట్ చేసుకుందంటూ నెటిజన్లు చెవులు కొరుక్కుంటున్నారు. ఈ మేరకు ఆమె వేలికి డైమండ్ రింగ్ తొడిగి ఉన్న ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అయితే ఈ వార్తల్లో కొంత నిజం, మరికొంత అబద్ధం ఉంది. అదెలాంగంటే.. మలైకా అరోరా మంగళవారం నాడు తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో డైమండ్ రింగ్ ధరించిన ఫొటోలను అభిమానులతో పంచుకుంది. "మీ జీవితంలో అత్యంత ముఖ్యమైన ఘట్టాన్ని ఆరంభించబోతున్నారా? అయితే ఈ నిశ్చితార్థపు ఉంగరాలు అందుకు సరిగ్గా సరిపోతాయి. నేను పెట్టుకున్న రింగ్ ఎంతో బాగుంది కదూ.. ఇలాంటివి మాత్రమే కాదు, మీకు నచ్చిన రీతిలో రింగ్స్ తయారు చేయించుకోవచ్చు కూడా.." అంటూ ఓ జ్యూవెలరీ బ్రాండ్ను ప్రమోట్ చేసింది మలైకా. ఈ పోస్ట్ ద్వారా ఆమె కేవలం ఓ యాడ్ షూట్లో భాగంగానే ఈ ఫొటోలను పంచుకుందని స్పష్టమవుతోంది. కాబట్టి మలైకా, అర్జున్లు నిశ్చితార్థం చేసుకున్నారనేది అవాస్తవం. కాకపోతే ఆమె వేలికి వజ్రపు ఉంగరం ఉందన్నది మాత్రం నిజం. ఇదిలా వుంటే ఆమధ్య వీళ్లిద్దరూ కరోనా బారిన పడగా ఒకే ఇంట్లో క్వారంటైన్లో ఉండి మహమ్మారిని తరిమికొట్టారు. ఇదిలా వుంటే ప్రస్తుతం మలైకా 'ఇండియాస్ బెస్ట్ డ్యాన్సర్' అనే రియాలిటీ షోలో జడ్జిగా వ్యవహరిస్తోంది. View this post on Instagram A post shared by Malaika Arora (@malaikaaroraofficial) చదవండి: డిన్నర్: ప్రియుడిని వెంటేసుకుని ఇంటికి! ట్రోలింగ్: ఆ నటి ముసలావిడైపోయింది! -
నటి మలైకాకు మాజీ భర్త నుంచి స్పెషల్ గిఫ్ట్
ముంబై : సినిమాల కంటే వ్యక్తిగత విషయాలతో బాగా ఫేమస్ అయిన నటి మలైకా అరోరా. మొదట బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ తమ్ముడు అర్భాజ్ ఖాన్తో విడాకులు, ఆ తర్వాత యంగ్ హీరో అర్జున్ కపూర్తో డేటింగ్ వంటి విషయాలు మలైకాను హైలైట్ చేశాయి. ఇప్పుడు మరోసారి మలైకా పేరు టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యింది. దీనికి కారణం ఇన్స్టాగ్రామ్లో ఆమె తన మాజీ భర్త కోసం ఓ పోస్ట్ పెట్టడమే. మలైకా కోసం అర్భాజ్ తన తోటలోని రుచికరమైన మామాడి పండ్లు పండ్లను బహుమతిగా పంపాడు. దీంతో అతడికి థ్యాంక్స్ చెబుతూనే, దీన్ని ఆన్లైన్లో సైతం ఆర్డర్ చేసుకోవచ్చని చెబుతూ మాజీ భర్త బిజినెస్ను ప్రమోట్ చేసింది. ఇది చూసిన నెటిజన్లు..మలైకా పోస్ట్ను తెగ షేర్ చేస్తుండటంతో ఈ పోస్ట్ వైరల్గా మారింది. అయితే ఏం జరిగిందో ఏమో కానీ కొద్ది సేపటికే తన ఇన్స్టాగ్రామ్ స్టోరీ నుంచి దీన్ని డిలీట్ చేసేసింది మలైకా. అయితే అప్పటికే దీన్ని స్ర్కీన్షాట్లు చేస్తూ నెటిజన్లు వైరల్ చేసేశారు. కాగా ఓ యాడ్ షూట్లో ప్రేమలో పడిపోయిన మలైకా- అర్భాజ్ ఖాన్లు 1998లో అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నారు. అయితే వీరి మధ్య అభిప్రాయ భేధాలు తలెత్తడంతో 18 ఏళ్ల వైవివాహిక బంధానికి ఇరువురు గుడ్ బై చెప్పేసుకున్నారు. వీరి విడాకులు అయిన కొద్ది కాలానికే మలైకా బాలీవుడ్ యంగ్ హీరో అర్జున్ కపూర్తో డేటింగ్లో ఉండగా.. అర్భాజ్ ఇటాలియన్ మోడల్ జార్జియా ఆండ్రియానీతో తన రిలేషన్షిప్ను అధికారికంగా ప్రకటించాడు. తన కన్నా వయసులో 12 ఏళ్ల చిన్నవాడు అయినప్పటికీ పీకల్లోతు ప్రేమలో మునిగి పోయింది ఈ హాట్ బ్యూటీ. నాలుగు పదుల వయసులోనూ.. తన ఫిట్నెస్తో కుర్రకారు గుండెల్లో సెగలు పుట్టిస్తోంది. ఇక అర్జున్- మలైకా రిలేషన్షిప్లో ఉన్నట్లు స్వయంగా వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇద్దరూ కలిసి పలు పార్టీలకు చెట్టాపట్టాలేసుకొని కెమెరాలకు చిక్కుతుంటారు. బుధవారం రాత్రి బాలీవుడ్ ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ నిర్వహించిన ఓ పార్టీలో వీరిద్దరూ కనపించిన ఫోటోలు మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చదవండి : డిన్నర్: ప్రియుడిని వెంటేసుకుని ఇంటికి! విడాకులకు సిద్దంగానే ఉన్నావా అని అడిగారు.. -
ఫొటోగ్రాఫర్కు బాలీవుడ్ హీరో హెచ్చరిక!
బాలీవుడ్ ప్రేమ జంట అర్జున్ కపూర్, మలైకా అరోరాను ఫొటోగ్రాఫర్లు నీడలా వెంటాడుతున్నారు. ఈ లవ్ బర్డ్స్ ఎక్కడికి వెళ్లినా వారిని కెమెరాలో బంధిస్తూ క్లిక్మనిపిస్తున్నారు. ఆదివారం నాడు అర్జున్, మలైకా.. కరీనా కపూర్- సైఫ్ అలీఖాన్ దంపతుల నివాసానికి వెళ్లారు. ఈ క్రమంలో ఓ ఫొటోగ్రాఫర్ వీరిని తన కెమెరాలో బంధించేందుకు తెగ ఆరాటపడ్డాడు. ఇందుకోసం ఏకంగా కరీనా ఇంటి గోడెక్కడానికి ప్రయత్నించాడు. అది చూసిన అర్జున్ ఆగ్రహానికి లోనయ్యాడు. వెంటనే అతడిని సమీపించి ఇది చాలా తప్పు అని చెప్తూ ముందు గోడ దిగండి అని కోరాడు. 'అసలు అలా ఎలా గోడెక్కుతారు? మీరు చేసేది చాలా తప్పు' అంటూ వారించాడు. దీంతో అతడు వెంటనే గోడ దిగేశాడు. తర్వాత ఈ ప్రేమ పక్షులు కరీనా ఇంట్లోకి వెళ్లి ఆమె రెండో కొడుకును చూసి, వారికి శుభాకాంక్షలు చెప్పి బయటకు వచ్చారు. వీరిని చూసిన సదరు ఫొటోగ్రాఫర్ తను చేసిన పనికి చింతిస్తూ అర్జున్కు క్షమాపణలు చెప్పాడు. ఇదిలా ఉంటే కరీనా కపూర్ ఫిబ్రవరి 21న పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. అప్పటి నుంచి ఈ తల్లీకొడుకులను చూసేందుకు పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు ఆమె ఇంటికి వెళ్లొస్తున్నారు. కానీ ఇప్పటివరకు సైఫ్ దంపతులు వారి కొడుకు ఫొటోలను అభిమానులతో పంచుకోనేలేదు. చదవండి: ప్రియుడిని ఇంటికి తీసుకెళ్లిన బాలీవుడ్ నటి -
అర్జున్ కపూర్ - రకుల్ మూవీ.. ఓటీటీ ప్లాట్ ఫామ్లో
బాలీవుడ్ హీరో అర్జున్ కపూర్, హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటించిన చిత్రం ‘సర్దార్ కా గ్రాండ్సన్’. దర్శకుడు కాశ్వీ నాయర్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో నటి నీనా గుప్తా కీలక పాత్రలో నటించారు. డైరెక్టర్ కాశ్వీ నాయర్కి తొలి సినిమా. తాజాగా చిత్ర బృందం ఈ మూవీని ఓటీటీ ప్లాట్ఫామ్ ‘నెట్ఫ్లిక్స్’లో విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. కానీ, ఎప్పుడు విడుదల చేస్తారనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. ఈ చిత్రంలో అదితీ రావ్ హైదరీ, జాన్ అబ్రహం ప్రత్యేక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా కథ.. తన అమ్మమ్మ చివరి కోరిక తీర్చటం కోసం హీరో సాహసాలు చేయటం చూట్టూ తిరుగుతుంది. ‘ఇలాంటి పాత్రలో నేను మొదటిసారిగా నటించాను. నా పాత్రపై ప్రేక్షకులు ఎలా స్పందిస్తారో అని ఆత్రుతగా ఉన్నాను’ అని నటీ నీనా గుప్తా తెలిపారు. ‘ తల్లితండ్రులు, కుటుంబసభ్యులు అందరూ సిద్ధంగా ఉండండి.. సర్దార్ కా గ్రాండ్సన్ చిత్రం ‘నెట్ఫ్లిక్స్’లో రాబోతుంది’ అని అర్జున్ కపూర్ ఇన్స్టాగ్రామ్లో పేర్నొన్నారు. ఈ చిత్రాన్ని భూషణ్ కుమార్, జాన్ అబ్రహం, నిఖిల్ అద్వానీ, మధు భోజ్వానీ, క్రిషన్ కుమార్, మోనిషా అద్వానీ నిర్మించారు. ఇక అర్జున్ కపూర్ చివరగా.. పానీపట్ చిత్రంలో కనిపించిన విషయం తెలిసిందే. హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ సినిమాల విషయానికి వస్తే.. బిగ్ బి అమితాబ్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న 'మే డే' లో కనిపంచనున్నారు. View this post on Instagram A post shared by Arjun Kapoor (@arjunkapoor) చదవండి: ఏడేళ్లు క్షణంలా గడిచిపోయాయి.. థాంక్యూ -
ప్రియుడిని ఇంటికి తీసుకెళ్లిన బాలీవుడ్ నటి
ముంబై: బాలీవుడ్ నటి మలైకా అరోరా, హీరో అర్జున్ కపూర్ గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో వీళ్లిద్దరూ కలిసి ఎన్నో పార్టీలు చేసుకోవడమే కాక ఏ కార్యక్రమమైనా కలిసే వెళ్లేవారు. అయితే ఈసారి మాత్రం వీళ్లు ఎక్కడెక్కడో బయట తిరగకుండా నేరుగా మలైకా ఇంటికి వెళ్లారు. మలైకా.. కొడుకు అర్హాన్ ఖాన్ను, ప్రియుడు అర్జున్ను వెంటేసుకుని ముంబైలోని తన తల్లిగారింటికి డిన్నర్కు వెళ్లింది. అక్కడే ఈ లవ్ కపుల్తో పాటు కుటుంబం అంతా కలిసి భోజనం చేసింది. ఈ డిన్నర్కు మలైకా అక్క అమృత కుటుంబం కూడా హాజరైంది. ఇక భోజనం అనంతరం బయటకు అడుగుపెట్టిన మలైకా, అర్జున్ల ఫొటోలను క్లిక్మనిపించగా అవి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) కాగా ప్రేమికుల దినోత్సవం నాడు ఈ ప్రేమ జంట రొమాంటిక్ డిన్నర్ను ఎంజాయ్ చేసిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన ఫొటోలను కూడా మలైకా ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ ద్వారా అభిమానులతో పంచుకుంది. ఇదిలా వుంటే ఆమె చివరగా ఇండియా బెస్ట్ డ్యాన్సర్ షోకు జడ్జిగా కనిపించింది. అటు అర్జున్ కపూర్ 'సందీప్ ఔర్ పింకీ ఫరార్', 'భూత్ పోలీస్' చిత్రాలతో బిజీగా ఉన్నాడు. చదవండి: ట్రోలింగ్: ఆ నటి ముసలావిడైపోయింది! బర్త్డే పార్టీ!: మీ సోదరుడు చనిపోయాడు, గుర్తుందా? -
అమ్మ పడ్డ బాధ మరెవరూ పడకూడదు: హీరో
మనం తరచూ చూసే అనేక సినిమాల్లో నటీనటులు సాయం కోసం ఎదురు చూసేవారికి చెయ్యందించడం, ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడం వంటివి చూస్తుంటాం. కానీ నిజ జీవితంలో సాయం చేసే నటులు అరుదుగా కనిపిస్తారు. ఇటువంటి అరుదైన నటుల సరసన తాజాగా బాలీవుడ్ యాక్టర్ అర్జున్ కపూర్ చేరారు. కేన్సర్ మహమ్మారితో పోరాడుతున్న నిరుపేదలకు సాయం చేయనున్నట్లు అర్జున్ కపూర్ ప్రకటించారు. ఈ ఏడాది వాలెంటైన్స్ డే సందర్భంగా 100 మంది కేన్సర్ బారిన పడ్డ దంపతులకు సాయం చేయడానికి ఆయన ముందుకొచ్చారు. అర్జున్ తల్లి కేన్సర్తో మరణించారు. అమ్మ పడిన బాధ మరెవరూ పడకూడదన్న ఉద్దేశ్యంతో ఈ నిర్ణయం తీసుకున్నాడు అర్జున్. ఇందులో భాగంగా కేన్సర్ పేషెంట్స్ ఎయిడ్ అసోసియేషన్ (సీపీఏఏ) బృందంతో కలిసి పనిచేయనున్నాడు. అర్జున్ మాట్లాడుతూ..‘‘కరోనా మహమ్మారి ప్రపంచాన్ని కబళిస్తోన్న సమయంలో అందరం ఎక్కడికక్కడ స్ట్రక్ అయిపోయాం. ఆ సమయం లో బీటలు వారిన మానవ సంబంధాలు, అనుబంధాలపై కొత్త ఆశలు చిగురించాయి. ఈ క్రమంలోనే ఒకరికి ఒకరు సాయం చేసుకుంటూ అండగా నిలబడుతూ మన ఆలోచనా విధానంలో మార్పులు చేసుకున్నాం. నా ఆలోచనా తీరు కూడ మారింది. ఫిబ్రవరిలో ప్రపంచమంతా వాలెంటైన్స్ డే జరుపుకుంటూ...మనం ఎంతో ఇష్టపడే వారు ప్రత్యేకంగా ఫీల్ అయ్యేలా వివిధ కార్యక్రమాలు చేస్తుంటాం. ఈ సారి నేను ఏదైనా కొత్తగా భిన్నంగా చేయాలనుకున్నాను. ఈ క్రమంలో ఈ నిర్ణయంతీసుకున్నా’’ నని చెప్పాడు. కేన్సర్ పేషెంట్స్ ఎయిడ్ అసోసియేషన్తో కలిసి నిరుపేద 100 మంది కేన్సర్ బాధిత జంటలకు సాయం చేస్తానని చెప్పాడు. భార్యాభర్తలలో ఒకరు క్యాన్సర్ బారిన పడితే రెండో వారు ఆ సమస్యను ఎదుర్కోవడంలో ప్రతి అడుగులో తమ పార్టనర్తో కలిసి సమస్యలను ఎదుర్కొన్నవారే. అందుకే దంపతులను ఆదుకోవాలనుకున్నాను. ఒక పక్క కేన్సర్తో బాధపడుతూ ఉంటే మరోపక్క కోవిడ్–19తో ఎంతోమంది ఉద్యోగాలు కోల్పోయారు. కనీసం ఆహారం కొనుక్కోవడానికి కూడా డబ్బులు లేక ఇబ్బంది పడిన వారు ఎందరో ఉన్నారు. వీరిలో అందరికి కాకపోయిన కొందరికైనా సాయం చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి శ్రీ కారం చుట్టానని అర్జున్ కపూర్ వివరించాడు. ఒక్కో పేషెంట్కు కీమో, రేడియో థెరపీలు, సర్జరీలు, మెడిసిన్స్ కోసం సంవత్సరానికి లక్ష రూపాయల వరకు అవసరమవుతాయి. అందువల్ల కేన్సర్ బారిన పడ్డ జంటకు లక్షరూపాయల నగదు సాయం చేస్తా’’ అని చెప్పాడు. కేన్సర్ బాధితులను ఆదుకునేందుకు మరింత మంది ముందుకు రావాలని అర్జున్ కపూర్ కోరాడు. చదవండి: నిన్ను ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటా: హీరో -
నిన్ను ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటా: హీరో
ఫిబ్రవరి 3 తన తల్లి మోనా కపూర్ పుట్టిన రోజు సందర్భంగా బాలీవుడ్ హీరో అర్జున్ కపూర్ ఒక మనసును తాకే వీడియోను విడుదల చేశాడు. ‘అమ్మ పుట్టినరోజు నేడు. తను ఉంటే ఎంత హడావిడి ఉండేదో. నేను నా అభిమానులకు చెప్పేది ఒక్కటే. జీవితంలో ఎప్పుడు ఏమి జరుగుతుందో చెప్పలేము. కనుక మన కుటుంబ సభ్యులతో వీలైనంత ఎక్కువ సమయం గడపండి’ అని ఆ వీడియోలో పేర్కొన్నాడు. నిజానికి అర్జున్ కపూర్ బాల్యం అంత సుఖంగా సాగలేదు. అతడు ప్రఖ్యాత నిర్మాత బోనీ కపూర్ కుమారుడు. ఇద్దరు పిల్లలు పుట్టాక బోనీ కపూర్ నటి శ్రీదేవిని వివాహం చేసుకున్నారు. ఈ వివాహం బోనీ కపూర్ కుటుంబంలో సహజంగానే తుఫాన్ రేపింది. బోనీ కపూర్ భార్య మోనా కపూర్ బోనీ కపూర్ నుంచి దూరంగా వచ్చేసింది. బోనీ కపూర్ మీద కొంచెం కూడా ఆధారపడకుండా జీవించ దలుచుకుంది. కొడుకు అర్జున్ కపూర్, కుమార్తె అన్షులా కపూర్ ఆ కారణం వల్ల తల్లితో విపరీతంగా అటాచ్మెంట్ పెంచుకున్నారు. అర్జున్ కపూర్కు తండ్రి రెండో పెళ్లి సమయానికి 12 ఏళ్లు. 1996లో బోనీకపూర్కు శ్రీదేవితో పెళ్లి జరిగాక ఆ వంటరితనం వల్ల మోనా కపూర్ చాలా బాధలే పడింది. 2012లో మరణించింది. ఆమె మరణించిన 6 సంవత్సరాలకు శ్రీదేవి మరణించింది. తండ్రి ప్రేమకు దూరమైన అర్జున్ కపూర్ తల్లిని కూడా దూరం చేసుకుని ఆ బాధ తనలో ఎప్పటికీ చెరిగిపోదని చెప్పాడు. ‘అమ్మా... నిన్ను నేను ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాను’ అన్నాడు ఆ వీడియోలో. (చదవండి: అవి ఉంటేనే మజా!: జాన్వీ కపూర్) అమ్మను ఆటపట్టించే కొడుకు నటుడు అనుపమ్ ఖేర్కు తల్లి దులారి అంటే ఎంతో ప్రేమ. ఆమెకు చిన్న కష్టం వచ్చినా తట్టుకోలేడు. నటుడుగా ఎంత పేరున్నా తల్లి ముందు కొడుకులా ఆమెతో కబుర్లలో మునిగిపోతాడు. అంతే కాదు... ఆమెతో టైమ్పాస్ సంభాషణలు రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటాడు. ఇటీవల అతను విడుదల చేసిన వీడియో జనానికి నచ్చింది. అందులో అతడు తన తల్లిని ‘అమ్మా... నీకు ఇంగ్లిష్ వచ్చా’ అని అడిగితే ఆమె ‘రాదు... నాకు ఇంగ్లిష్ రాదు... నేను చిన్నప్పుడు నీలాంటి అబ్బాయిలతో ఆడుకోవడానికి వెళ్లిపోయేదాన్ని స్కూల్ ఎగ్గొట్టి. ఒకణ్ణి కొడితే వేలు విరిగిపోయింది... చూడు ఇప్పటికీ ఉంది ఆ వంకర’ అని ఆమె ఆ వీడియోలో చూపించింది. అప్పుడు అక్కడే ఉన్న తన తమ్ముడు రాజు ఖేర్ గురించి అనుపమ్ ఖేర్ తల్లికి ఫిర్యాదు చేస్తూ ‘చూడమ్మా.. వాడు రాత్రి ఎనిమిదిన్నరకు టీ తాగుతున్నాడు’ అనంటే ఆమె ‘ఆకలిగా ఉందేమోరా.. నిజమే.. ఈ టైమ్లో టీ తాగితే అడ్జస్ట్ కాదు’ అంది. ‘అడ్జస్ట్ కాదమ్మా... డైజెస్ట్’ అని అనుపమ్ ఖేర్ ఆటపట్టించాడు. ‘పెద్ద చెప్పొచ్చావులేరా గాడిదా’ అందామె. కొడుకు ఎంత పెద్దవాడైనా ఆ కొడుకును తిట్టగలిగే శక్తి ఒక్క అమ్మకే కదా ఉంది. View this post on Instagram A post shared by Arjun Kapoor (@arjunkapoor) View this post on Instagram A post shared by Anupam Kher (@anupampkher) -
కరోనాను తేలికగా తీసుకోవద్దు
‘‘కరోనా వైరస్ అనేది చాలా సీరియస్ విషయం. చిన్నా పెద్దా అనే తేడా దానికి లేదు. కొందరు కరోనాని తేలికగా తీసుకోవచ్చు. కానీ అది అంత తేలిక కాదు. అందుకే ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించి సోషల్ డిస్టెన్స్తో ఉండాలని కోరుకుంటున్నా’’ అన్నారు బాలీవుడ్ నటుడు అర్జున్ కపూర్. గత నెలలో అర్జున్కు కరోనా పాజిటì వ్ అని నిర్ధారణ అయింది. ప్రస్తుతం ఆయన కరోనా నుంచి కోలుకున్నారు. ‘‘నేను నెగిటివ్ అని తేలటంతో ఆనందంగా ఉంది. పూర్తిగా కోలుకున్నాను’’ అన్నారు అర్జున్. ‘‘ప్రాణాలను సైతం లెక్కచేయకుండా కోవిడ్ నియంత్రణకు శ్రమిస్తున్న ఫ్రంట్లైన్ ఉద్యోగులకు పెద్ద సెల్యూట్. హ్యాపీగా నా పనులు మొదలుపెట్టేశా’’ అని కూడా అర్జున్ కపూర్ అన్నారు. -
ఒక్క రోజే 90 వేల కేసులు
న్యూఢిల్లీ: దేశంలో శనివారం కరోనా కేసులు భారీగా బయటపడ్డాయి. కేవలం 24 గంటల్లో రికార్డు స్థాయిలో 90,632 కేసులు నిర్ధారణయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 41,13,811కు చేరుకుంది. నాలుగు రోజులుగా రోజుకు 80 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో రికార్డు స్థాయిలో 73,642 మంది కోలుకోగా.. 1,065 మంది మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 70,626కు చేరుకుందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దేశంలో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 31,80,865కు చేరుకోగా, యాక్టివ్ కేసుల సంఖ్య 8,62,320గా ఉంది. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసులు 20.96 శాతం ఉన్నాయి. దేశంలో కరోనా రికవరీ రేటు క్రమంగా పెరుగుతోంది. శనివారానికి ఇది 77.32 శాతానికి పెరిగినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. మరణాల రేటు ప్రస్తుతం 1.72 శాతానికి పడిపోయిందని తెలిపింది. ఇంజనీర్డ్ సర్ఫేస్ రూపకల్పన ఐఐటీ గువాహటికి చెందిన నిపుణులు కరోనాను గుర్తించడానికి, ఎదుర్కోవడానికి ఇంజనీర్డ్ సర్ఫేస్ను తయారు చేశారు. కరోనా వైరస్ రెండు భాగాలుగా ఉంటుందని అందులో లోపలి పొర న్యూక్లియిక్ ఆసిడ్ ఉండగా, బయటి వైపు గ్లైకోప్రొటీన్ అనే కొమ్ములు ఉంటాయని చెప్పారు. ఈ సర్ఫేస్ మీద కరోనా వైరస్ పడితే వెంటనే గుర్తించవచ్చని చెప్పారు. ఇందులో పలు సెల్ఫ్ అసెంబుల్డ్ మోనో లేయర్స్ (ఎస్ఏఎంస్) ఉన్నాయని పేర్కొన్నారు. కరోనా వంటి ప్రొటీన్లు దానిపై పడినప్పుడు అవి పీల్చుకుంటాయని చెప్పారు. ప్రత్యేకించి ఈ సర్ఫేస్ను పీపీఈలకు తగిలించినప్పుడు కరోనాను గుర్తించడమేగాక, నాశనం చేయవచ్చని వెల్లడించారు. ఈ విషయాలన్నీ పలు జర్నల్స్లో సైతం ప్రచురితమైనట్లు చెప్పారు. అర్జున్ కపూర్కు కోవిడ్ బాలీవుడ్ నటుడు అర్జున్ కపూర్ (35) కోవిడ్ బారినపడ్డారు ఆదివారం ఆయనే స్వయంగా ఈ విషయం వెల్లడించారు. అయితే తనకు లక్షణాలేమీ లేవని, ప్రస్తుతం ఆరోగ్యం బాగానే ఉందని, హోమ్ క్వారంటైన్లో ఉన్నానని చెప్పారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ బాలీవుడ్ ప్రముఖులు ట్వీట్లు చేశారు. -
లవ్ బర్డ్స్కి కరోనా
బాలీవుడ్ నటుడు అర్జున్ కపూర్కు, నటి మలైకా అరోరాకు కరోనా సోకింది. తనకు కరోనా వచ్చిందనే విషయాన్ని అర్జున్ ట్విట్టర్ ద్వారా తెలిపారు. ‘‘నాకు కరోనా సోకిందనే విషయం అందరికీ తెలియజేయడం నా బాధ్యత. నేను బాగానే ఉన్నాను. నాకు ఎటువంటి లక్షణాలు కనిపించడం లేదు. వైద్యుల సూచన మేరకు మా ఇంట్లోనే ఐసోలేషన్లో ఉన్నాను. View this post on Instagram 🙏😷 A post shared by Malaika Arora (@malaikaaroraofficial) on Sep 6, 2020 at 10:54pm PDT నా ఆరోగ్యానికి సంబంధించిన విషయాన్ని ఎప్పటికప్పుడు మీకు తెలియజేస్తాను. మనందరం ఈ వైరస్ను ధైర్యంగా ఎదుర్కొని, క్షేమంగా బయటపడతాం అని నమ్ముతున్నాను’’ అన్నారు అర్జున్ కపూర్. అలాగే మలైకా అరోరాకు కరోనా వచ్చినట్లు ఆమె సోదరి అమృతా అరోరా తెలియజేశారు. అర్జున్, మలైకా కొంత కాలంగా ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ ఇద్దరూ పెళ్లి చేసుకోవాలనే ప్లాన్లో కూడా ఉన్నారని బాలీవుడ్ టాక్. View this post on Instagram 🙏🏽 A post shared by Arjun Kapoor (@arjunkapoor) on Sep 6, 2020 at 1:33am PDT -
కరోనా బారిన పడిన స్టార్ హీరో
ముంబై: బాలీవుడ్ హీరో అర్జున్ కపూర్ కరోనా వైరస్ బారిన పడ్డాడు. తనకు కోవిడ్-19 పాజిటివ్గా నిర్ధారణ అయినట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. అయితే తనకు లక్షణాలేవీ బయటపడలేదని, వైద్యుల సూచన మేరకు హోం క్వారంటైన్లో ఉండనున్నట్లు తెలిపాడు. ఈ మేరకు ఇన్స్టాలో నోట్ షేర్ చేసిన అర్జున్ కపూర్.. ‘‘నాకు కరోనా వైరస్ సోకింది. ఈ విషయం మీతో పంచుకోవడం నా కర్తవ్యం. ప్రస్తుతానికి బాగానే ఉన్నాను. లక్షణాలేవీ కనిపించడం లేదు. వైద్యులు, అధికారుల సూచనలు, సలహాలు తీసుకుంటూ హోం ఐసోలేషన్లోనే ఉంటున్నాను. నాకు మద్దతుగా నిలిచిన ప్రతీ ఒక్కరికి ముందుగానే ధన్యవాదాలు చెబుతున్నాను. నా ఆరోగ్యానికి సంబంధించిన అప్డేట్స్ మీతో షేర్ చేసుకుంటాను. ఈ అసాధారణ, ఊహించని కఠిన సమయాల్లో.. మానవత్వమే వైరస్పై విజయం సాధిస్తుందని నమ్ముతున్నాను. ప్రేమతో అర్జున్’’ అని ఉద్వేగానికి లోనయ్యాడు.(చదవండి: అన్నికంటే అదే పెద్ద బలం: జెనీలియా ) కాగా ప్రముఖ సినీ నిర్మాత బోనీ కపూర్- మోనీ శౌరీ కపూర్ల సంతానమైన అర్జున్ కపూర్ ‘ఇష్క్జాదే’ సినిమాతో బాలీవుడ్లో హీరోగా పరిచయమ్యాడు. ఆ తర్వాత గూండే, 2 స్టేట్స్, తేవర్, నమస్తే ఇంగ్లండ్, హాఫ్ గర్ల్ఫ్రెండ్ సినిమాలతో స్టార్గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక గతేడాది విడుదలైన భారీ పీరియాడికల్ మూవీ పానిపట్ ఆశించినంతగా విజయం సాధించకపోవడంతో.. మళ్లీ ఎంటర్టైన్మెంట్ బాట పట్టాడు. ప్రస్తుతం సైఫ్ అలీఖాన్తో కలిసి హారర్ కామెడీ చిత్రం ‘భూత్ పోలీస్’లో నటిస్తున్న అర్జున్ కపూర్.. టాలీవుడ్ హీరో నితిన్ హీరోగా తెరకెక్కిన‘భీష్మ: ది బ్యాచిలర్’ హిందీ రీమేక్లోనూ నటించనున్నాడు. తొలుత దర్శకుడు కావాలనే లక్ష్యంతో బీ-టన్లో అడుగుపెట్టిన అర్జున్ ఇప్పుడు వరుస సినిమాలతో హీరోగా బిజీ అయ్యాడు. తనకంటే వయస్సులో పెద్దదైన మలైకా అరోరాతో పీకల్లోతు ప్రేమలో మునిగిపోయాడు.(చదవండి: తండ్రి విడిచి వెళ్లాడు.. 140 కిలోల బరువు పెరిగాడు) View this post on Instagram 🙏🏽 A post shared by Arjun Kapoor (@arjunkapoor) on Sep 6, 2020 at 1:33am PDT -
సరదాలు.. నవ్వులు
సైఫ్ అలీఖాన్, అర్జున్ కపూర్ ముఖ్య పాత్రల్లో తెరకెక్కనున్న హారర్ కామెడీ చిత్రం ‘భూత్ పోలీస్’. పవన్ క్రిపలానీ దర్శకత్వం వహించనున్న ఈ సినిమాలో సైఫ్, అర్జున్లకు జోడీగా జాక్వెలిన్ ఫెర్నాండజ్, యామీ గౌతమ్ నటించనున్నారు. ఫాతిమా సనా షేక్ ముఖ్య పాత్రలో కనిపిస్తారు. ‘‘ఇదో వినోదాత్మక చిత్రం. దీనికి మరింత సరదాను ఈ ఇద్దరు హీరోయిన్లు తీసుకువస్తారని అనుకుంటున్నాం. సైఫ్–జాక్వెలిన్, అర్జున్–యామీ జంటలు అందించే వినోదం ప్రేక్షకులకు బాగా నచ్చుతుందనుకుంటున్నాం’’ అన్నారు దర్శకుడు. త్వరలో ఈ చిత్రం షూటింగ్ ప్రారంభం కానుంది. -
భూత్ పోలీస్
సైఫ్ అలీఖాన్, అర్జున్ కపూర్ కాంబినేషన్లో ఓ చిత్రం రూపొందనుంది. ‘భూత్ పోలీస్’ అనే టైటిల్తో హారర్ కామెడీ జానర్లో ఈ చిత్రం తెరకెక్కనుంది. పవన్ క్రిపలానీ దర్శకత్వంలో ఈ సినిమాను రమేష్ తౌరానీ, అక్షయ్ పూరీ నిర్మించనున్నారు. ఫాతిమా సనా షేక్ హీరోయిన్. ఈ సినిమాలో అర్జున్ కపూర్ దెయ్యంగా కనిపిస్తారు. సైఫ్ అలీను ఇబ్బందిపెడతారట. ‘‘భూత్ పోలీస్’లోని థ్రిల్స్ని ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను. సైఫ్, అర్జున్ ఆద్యంతం నవ్విస్తారు’’ అన్నారు దర్శకుడు పవన్. -
హద్దులుదాటిన ప్రేమకథ
జాన్ అబ్రహాం, అదితీరావు హైదరీ తాత–నానమ్మ పాత్రల్లో కనిపించనున్నారా? అంటే అవుననే అంటున్నాయి బాలీవుడ్ వర్గాలు. ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న లుక్ ఈ పాత్రలకు సంబంధించినదే. మరి.. ఫొటోలో యంగ్గా కనిపిస్తున్నారు కదా అనుకుంటున్నారా? ఆ సీక్రెట్ త్వరలో చెబుతారట. ప్రస్తుతానికి ఈ లుక్స్ని విడుదల చేశారు. ఇంకా పేరు పెట్టని ఈ సినిమా ఫ్లాష్బ్యాక్లో ఈ ఇద్దరి నటీనటుల పాత్రలు వస్తాయట. అర్జున్కపూర్, రకుల్ప్రీత్ సింగ్ ఓ జంటగా నటిస్తోన్న ఈ చిత్రాన్ని సరిహద్దులు దాటిన ప్రేమకథతో తెరకెక్కిస్తున్నారని సమాచారం. నిఖిల్ అద్వాని దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో అర్జున్కపూర్ నానమ్మ, తాతయ్యల పాత్రల్లో అదితి, జాన్ అబ్రహాం కనిపిస్తారట. -
షూటింగ్కు రకుల్ రెడీ .. ఆరోజే స్టార్ట్
ముంబై : కరోనా వ్యాప్తి నేపథ్యంలో దేశంలో విధించిన లాక్డౌన్లో అన్ని భాషల్లోని సినిమా షూటింగ్లకు బ్రేక్ పడిన విషయం తెలిసిందే.. ఇటీవల అన్లాక్ ప్రక్రియలో భాగంగా కేంద్రం షూటింగ్లను గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో మళ్లీ చిత్రీకరణ మొదలు పెడుతున్నారు. ఇప్పటికే ఆమిర్ ఖాన్ వంటి నటులు తన సినిమా షూటింగ్లను తిరిగి ప్రారంభించగా.. కరోనా జాగత్తలు పాటిస్తూ మరి కొంత మంది షూటింగ్లలో పాల్గొనేందుకు రెడీ అవుతున్నారు. ఈ క్రమంలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ త్వరలో మూవీ షూటింగ్ స్టార్ట్ చేయనున్నారు. అయితే అది తెలుగు సినిమా కాదు బాలీవుడ్. (రకుల్ ప్రీత్, మంచు లక్ష్మి సైక్లింగ్ ఫోటోలు) నిర్మాత బోనీ కపూర్ కొడుకు అర్జున్ కపూర్, రకుల్ ప్రీత్ సింగ ఓ సినిమాలో కలిసి నటిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటి వరకు ఈ సినిమాకు పేరును వెల్లడించలేదు. ఈ మూవీ షూటింగ్ ఆగష్టు 25 నుంచి ముంబైలో ప్రారంభం కాబోతుంది. ఈ విషయాన్ని తరణ్ ఆదర్శ్ ట్విటర్లో వెల్డించారు. ప్రస్తుతం 10 రోజులపాటు షెడ్యూల్ ఉందని, ఆ తర్వాత సెప్టెంబర్ చివరలో మరో నాలుగు రోజు షూట్ చేయనున్నట్లు తెలిపారు. లవ్ డ్రామా నేపథ్యంలో సాగే ఈ సినిమాతో కాశ్వీ నాయర్ డైరెక్టర్గా పరిచయమవుతున్నారు. భూషణ్ కుమార్, జాన్ అబ్రహం, నిఖిల్ అద్వానీ, మధు భోజ్వానీ, క్రిషన్ కుమార్, మోనిషా అద్వానీ నిర్మిస్తున్నారు. (కరణం మల్లేశ్వరి పాత్రలో రకుల్) FILMING RESUMES... #ArjunKapoor and #RakulPreetSingh starrer - a cross-border love story - to resume shoot from 25 Aug 2020... Will have a 10-day shoot in the current schedule, followed by a 4-day shoot in Sept-end 2020... The film - not titled yet - is directed by Kaashvie Nair. pic.twitter.com/jBpNxGu0vc — taran adarsh (@taran_adarsh) August 20, 2020 -
అతిథిగా అదితి?
అర్జున్ కపూర్, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా ఓ హిందీ చిత్రం తెరకెక్కుతోంది. ప్రముఖ బాలీవుడ్ హీరో జాన్ అబ్రహాం ఈ చిత్రానికి నిర్మాత. నీనా గుప్తా ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. బామ్మ, మనవడికి మధ్య నడిచే కథ ఇదని సమాచారం. నీనా గుప్తా బామ్మగా, అర్జున్ కపూర్ మనవడి పాత్రలో కనిపిస్తారు. ప్రముఖ హీరోయిన్ అదితీ రావ్ హైదరి అతిథి పాత్రలో మెరవనున్నారని సమాచారం. నీనా గుప్తా యవ్వనంలో ఉన్న పాత్రలో అదితి కనిపిస్తారట. అదితీకి జోడీగా జాన్ అబ్రహాం నటించనున్నారట. లాక్ డౌన్ ముందు చిత్రీకరణ ప్రారంభం అయింది. ఈ నెలాఖరులో మళ్లీ చిత్రీకరణ మొదలుపెడతారట. ఈ చిత్రానికి కాశవీ నాయర్ దర్శకత్వం వహిస్తున్నారు. -
‘సుశాంత్ను అందుకే తొలగించారా!’
ముంబై: సినీ రచయిత చేతన్ భగత్ ఐదేళ్ల క్రితం చేసిన ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో నెటిజన్లు బాలీవుడ్ హీరో అర్జున్ కపూర్పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘మోహిత్ సూరి దర్శకత్వంలో వస్తున్న ‘హాఫ్ గర్ల్ఫ్రెండ్’ చిత్రంలో సుశాంత్ సింగ్ రాజ్పుత్ లీడ్రోల్లో నటించబోతున్నాడు. ఇది చాలా సంతోషంగా ఉంది’ అంటూ 2015లో చేతన్ చేసిన ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే చివరికి ఈ సినిమాలో అర్జున్ కపూర్ హీరోగా నటించిన విషయం తెలిసిందే. కావాలనే ఈ సినిమా నుంచి సుశాంత్ను తొలగించారంటూ దర్శకుడిపై, అర్జున్ కపూర్, బాలీవుడ్ ప్రముఖులపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాలీవుడ్లో బంధుప్రీతి(నెపొటిజం) కారణంగా సుశాంత్ ‘హాఫ్ గర్ల్ఫ్రెండ్’ సినిమా నుంచి తొలగించి స్టార్కిడ్ అయిన అర్జున్ను తీసుకున్నారంటూ మండిపడుతున్నారు. (జస్టిస్ ఫర్ సుశాంత్) So happy to share @itsSSR will play lead in @mohit11481 directed Half Girlfriend. Shooting begins 1Q16. https://t.co/dUHSVZ2FQ5 — Chetan Bhagat (@chetan_bhagat) November 7, 2015 అంతేగాక ఈ సినిమాలో అర్జున్ నటనపై విమర్శలు గుప్పిస్తున్నారు. ‘‘బాలీవుడ్లో బంధుప్రీతి(నెపోటిజమ్) ఎంతగా పేరుకుపోయిందో చూశారా. సుశాంత్ను తొలగించి అదిత్య రాయ్... రణ్వీర్లు.. లెజెండరి నటుడు అర్జున్ కపూర్లు సినిమా అవకాశాలు పొందారు’’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇది అనుకోకుండా జరిగిందా లేదా అన్యాయంగా సుశాంత్ను తొలగించడం వల్ల జరిగిందా? ఒక్కసారి ఆలోచించండి. ప్లీజ్ ఇప్పటికైనా సుశాంత్కు న్యాయం జరిగేలా చూడాలని, లేదంటే భవిష్యత్తులో మరికొందరు సుశాంత్లను పొగొట్టుకోవాల్సి వస్తుంది. ఇందుకోసం బాలీవుడ్ స్టార్కిడ్స్ సినిమాలను బైకాట్ చేయాలని ఇకపై వారి సినిమాలు చూడొద్దంటూ పిలుపునిస్తున్నారు. (సుశాంత్ ఫైనల్ పోస్ట్మార్టమ్ రిపోర్ట్) -
‘సుశాంత్ ఎందుకిలా చేశాడో చెప్పలేను’
ముంబై: బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్యతో సినీ ఇండస్ట్రీ దిగ్భ్రాంతికి లోనైంది. ఎంతో ప్రతిభ, భవిష్యత్ ఉన్న సుశాంత్ అర్ధాంతరంగా తనువు చాలించడంతో సహ నటులు జీర్ణించుకోలేకోపోతున్నారు. తాజాగా యంగ్ హీరో అర్జున్ కపూర్ సుశాంత్తో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నాడు. అతనితో చివరిసారిగా చేసిన ఇన్స్టాగ్రామ్ సంభాషణ తాలూకు స్క్రీన్ షాట్ను షేర్ చేశాడు. దాంతోపాటు ఇద్దరూ కలిసున్న ఫొటోను షేర్ చేసి నివాళి అర్పించాడు. ‘సుశాంత్ ఎందుకిలాంటి నిర్ణయం తీసుకున్నాడో చెప్పలేను. కానీ, తను అనుకున్న దిశగా సాగి‘పోయాడు’అని అర్జున్ చెప్పుకొచ్చాడు. అక్కడైనా అతనికి మనశ్శాంతి దొరికిందని భావిస్తున్నానని పేర్కొన్నాడు. (చదవండి: రంగుల ప్రపంచం వెనుక ఎన్నో విషాదాలు) అమ్మను గుర్తుచేసుకుని.. ‘2018 డిసెంబర్లో సుశాంత్ కేదార్నాథ్ సినిమా విడుదలైంది. ఆసమయంలో సుశాంత్ వాళ్ల అమ్మను గుర్తు చేసుకుని బాధ పడ్డాడు. ఆమె లేని లోటు అతనిలో కనిపించింది. కేదార్నాథ్కు అభినందనలు తెలపడంతోపాటు.. 2019లో విడుదల కావాల్సిన సొంచరియా సినిమాకు గుడ్లక్ చెప్పాను. సుశాంత్తో పెద్దగా పరిచయం లేనప్పటికీ.. యశ్రాజ్ ఫిలింస్లో జరిగే షూటింగులు, ఈవెంట్లలో అప్పుడప్పుడూ కలిసేవాళ్లం. బహుశా అమ్మ ఉంటే సుశాంత్ తన వ్యధను ఆమెకు చెప్పుకునేవాడు కావొచ్చు’అని అర్జున్ కపూర్ ఇన్స్టా పోస్టులో రాసుకొచ్చాడు. (చదవండి: సుశాంత్ మరణంపై సన్నీ లియోన్ భావోద్వేగ లేఖ) -
అర్జున్ పోస్టు : ‘అబ్బా.. ఏం మామిడి జోక్ వేశారు!’
ముంబై: బాలీవుడ్ హీరో అర్జున్ కపూర్ బ్యూటీ క్వీన్ కత్రినా కైఫ్ను మరోసారి టార్గెట్ చేశాడు. అర్జున్ తన సహా నటులను వీలు చిక్కినప్పుడల్లా ఆటపట్టిస్తూ ఉంటాడన్న విషయం తెలిసిందే. ఇప్పటికే పలుమార్లు కత్రినాను సోషల్ మీడియా వేదికగా ఆటపట్టించిన అర్జున్ మరోసారి తన ఫేమస్ ప్రకటన మ్యాంగో స్లైస్పై సోమవారం ఇన్స్టాగ్రామ్లో పోస్టు చేశాడు. ‘హాలో ఫ్రెండ్స్ మామిడి కాలం వచ్చేసింది. ఇది చూడగానే మీకు గుర్తోచ్చేంది కత్రినా స్లైస్ యాడ్ కదా!’ అంటూ ఇన్స్టాలో పోస్టు చేశాడు. (అప్పుడు దూరాన్ని తరిమేద్దాం) View this post on Instagram Hello friends, mango season is here... aur aam dekh ke yaad aaya... @katrinakaif, would you like a SLICE ? 😉🥭 #Mango #Summer #AamKiBaat A post shared by Arjun Kapoor (@arjunkapoor) on May 25, 2020 at 12:29am PDT ఇది చూసిన కత్రినా ‘‘అవును.. ప్లీజ్ మీరు కూడా స్లైస్లు తీనాలని కోరుకుంటున్న’ అంటూ సమాధానం ఇచ్చారు. దీనికి అర్జున్ ‘మా కోసం స్లైస్ తినాలని వినూత్నంగా చెప్పావు కాబట్టి.. నీకు నీలాగే ఇష్టంగా తింటానని వాగ్దానం చేస్తున్న’ అంటూ అర్జున్ కామెంట్ చేశాడు. ఇక వీరి ఫన్నీ కామెంట్స్ చూసిన నెటిజన్లు.. ‘‘హ హ్హా హ్హా.. కత్రినాను మీరు ఆటపట్టించిన తీరు అద్భుతం’’. ‘‘అబ్బా.. ఏం మామిడి జోక్ వేశారు’’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. (వైరల్: అర్జున్ పోస్ట్.. కత్రినా ఫన్నీ రిప్లై) -
వైరల్: అర్జున్ పోస్ట్.. కత్రినా ఫన్నీ రిప్లై
ముంబై: బాలీవుడ్ హీరో అర్జున్ కపూర్ షేర్ చేసిన వీడియోకు కత్రినా కైఫ్ స్పందించిన తీరు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. క్వారంటైన్లో ఉన్న ఓ వ్యక్తి వినూత్నంగా క్రికెట్ ఆడుతున్న ఓ ఫన్నీ వీడియోను అర్జున్ తన ఇన్స్టాగ్రామ్లో బుధవారం షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా వైరల్ అవుతోంది. ఈ వీడియోకు ‘క్రికెట్ ప్రేమికుడు లాక్డౌన్లో సామాజిక దూరం పాటిస్తూనే తనకు తానే క్రికెట్ ఆడుతూ మిగతా ఆభిమానులకు సవాలు విసిరాడు’ అంటూ అర్జున్ భారత క్రికెట్ జట్టు సారథి విరాట్ కోహ్లిని ట్యాగ్ చేశాడు. (అందుకే విడిపోవాలనుకుంటున్నా: అలియా) దీనికి ‘‘లాక్డౌన్లో క్రికెట్ ప్రేమికులంతా... విరాట్ కోహ్లి మీరు కూడా ఇలానే చేస్తున్నారా’’ అనే క్యాప్షన్ను జత చేశాడు. అర్జున్ పోస్టు చూసిన కత్రినా స్పందిస్తూ.. ‘‘నేను చేస్తాను’’ అంటూ చేయి పైకెత్తి ఉన్న అమ్మాయి ఎమోజీని జత చేశారు. దీనికి అర్జున్ ‘సెల్ఫ్ క్రికెట్’ అంటూ తల పట్టుకుని ఉన్న ఎమోజీతో తన స్పందనను తెలిపాడు. కాగా ఇంతవరకు విరాట్, అర్జున్ పోస్టుకు స్పందిచలేదు. ఇక విరాట్ దీనిపై ఎలాంటి కామెంటు చేస్తాడో వేచి చూడాల్సిందే. (‘తను నవ్వింది.. నా కళ్లల్లో నీళ్లు తిరిగాయి’) -
స్టే హోం.. స్టే సైఫ్: కరీనాకు హీరో సూచన!
బాలీవుడ్ హీరో అర్జున్ కపూర్ తరచూ తనకు సంబంధిచన ప్రతి విషయాన్ని సోషలో మీడియాలో పంచుకుంటూ ఉంటాడన్న విషయం తెలిసిందే. అంతేకాదు తన సహా నటుల చేసిన పోస్టులకు చమత్కారంగా కామెంట్లు పెట్టి వారిని ఎడిపిస్తూ.. సోషల్ మీడియాలో యాక్టివ్ ఉంటాడు. ఇప్పుడు అర్జున్కు బాలీవుడ్ భామ కరీనా కపూర్ చిక్కారు. (బాలీవుడ్ భీష్మ) View this post on Instagram Blow a kiss 😘 , Fire a gun 🔫 Bebo’s always got Me to Lean On 😉 A post shared by Arjun Kapoor (@arjunkapoor) on Jan 31, 2020 at 7:31pm PST కరీనా తన వీపుకు ఆనుకుని ఉన్న ఫోటో తన ఇన్స్టాగ్రామ్ షేర్ చేస్తూ.. 2015లో అర్జున్, కరీనా కపూర్లు భార్యభర్తలుగా నటించిన మెజర్ లేజర్, డిజే స్నేక్స్లోని ఫేమస్ ట్రాక్ను జత చేశాడు. ‘బెబో ఎప్పుడూ నన్నే టార్గెట్ చేస్తుంది’ అనే క్యాప్షన్తో చేసి షేర్ చేసి కరీనాను ట్యాగ్ చేశాడు. అంతేకాదు కరోనా సమయంలో జాగ్రత్తగా ఉండాలని.. ‘‘స్టే హోం.. స్టే సైఫ్’’ అంటూ లాక్డౌన్లో ఇంట్లోనే ఉండాలని సూచించాడు. కాగా ప్రస్తుతం అర్జున్, నటి మలైకా ఆరోరాతో డేటింగ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇక మలైకా, కరీనాలు బీ-టౌన్లో బెస్ట్ ఫ్రెండ్స్ కూడా. (లాల్ సింగ్ టైమ్కి రాడా?) -
బాలీవుడ్ భీష్మ
‘భీష్మ: ది బ్యాచిలర్’ తెలుగు ప్రేక్షకులను బాగా నవ్వించాడు. అందుకే బాలీవుడ్లోనూ రీమేక్ కాబోతున్నాడు. నితిన్, రష్మిక జంటగా వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘భీష్మ’. ఫిబ్రవరిలో విడుదలైన ఈ చిత్రం నితిన్ కెరీర్లో భారీ వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. ఈ సినిమా హిందీలో రీమేక్ కానుంది. ఈ రీమేక్లో రణ్బీర్ కపూర్ యాక్ట్ చేస్తారని ప్రచారం జరిగింది. కానీ బాలీవుడ్ ‘భీష్మ’ కన్ ఫర్మ్ అయ్యారట. ఈ సినిమాలో హీరోగా అర్జున్ కపూర్ నటించబోతున్నారు అని తాజా సమాచారం. ఈ సినిమాకు దర్శకుడు ఎవరు అనే విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు. -
పేర్లు తారుమారు
‘సందీప్ ఔర్ పింకీ’ అంటే ఎవరైనా ఏమనుకుంటారు? సందీప్ అబ్బాయి పేరు, పింకీ అమ్మాయి పేరు అనే కదా. కానీ ఇక్కడ తారుమారు అయ్యాయి. సందీప్ అంటే అమ్మాయి.. పింకీ అంటే అబ్బాయి. అసలు విషయంలోకి వస్తే... అర్జున్ కపూర్, పరిణీతీ చోప్రా జంటగా ‘సందీప్ ఔర్ పింకీ ఫరార్’ అనే చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రం ఫస్ట్ లుక్ని విడుదల చేశారు. ఈ నెలలోనే సినిమాని విడుదల చేయాలనుకుంటున్నారు. ఇక పేర్లు గురించి చెప్పాలంటే.. అర్జున్ కపూర్ పాత్ర పేరు ‘పింకీ దహియా’. పరిణీతి పాత్ర పేరు ‘సందీప్ కౌర్’. దిబాకర్ బెనర్జీ దర్శకత్వంలో ఆదిత్యా చోప్రా నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 20న విడుదల కానుంది.