Arjun reddy
-
అర్జున్ రెడ్డిగా ఎన్టీఆర్.. అదిరిపోయిన కాంబో ...
-
అవార్డును వేలం వేసిన విజయ్ దేవరకొండ.. దక్కించుకున్నది ఎవరంటే?
టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ క్రేజ్ యూత్లో ఎక్కువగా కనిపిస్తుంది. 2017లో సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్లో వచ్చిన అర్జున్ రెడ్డితో విజయ్ జీవితం మారిపోయింది. అందులో ఆయన నటనకు గుర్తింపుగా ఫిల్మ్ఫేర్లో ఉత్తమ నటుడి అవార్డును గెలుచుకున్నాడు. అయితే ఆ వార్డును 2018లో వేలం వేశాడు. తాజాగా ఈ విషయం మరోసారి వైరల్ అవుతుంది. ఏప్రిల్ 5న ఆయన నటించిన ఫ్యామిలీస్టార్ చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా విజయ్ ఓ ఇంటర్వ్యూలో ఈ ప్రస్థావన మరోసారి తెరపైకి వచ్చింది. ఫ్యామిలీస్టార్ సినిమా ప్రమోషన్స్లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో విజయ్ పాల్గొన్నాడు. అర్జున్ రెడ్డి సినిమాకు గాను ఉత్తమ నటుడిగా వచ్చిన ఫిలింఫేర్ అవార్డును భారీ మొత్తానికి వేలం వేసినట్లు విజయ్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. తనకు ఎలాంటి అవార్డులంటే ఇష్టం లేదని చెప్పిన విజయ్.. ఇప్పటి వరకు తనకు వచ్చిన అవార్డ్స్లలో కొన్ని ఆఫీసులో ఉంటే, మరికొన్ని ఇంట్లో ఉన్నాయని చెప్పాడు. 2018లో ఏం జరిగిందంటే.. అర్జున్ రెడ్డి సినిమాకు గాను ఫిలింఫేర్ నుంచి ఉత్తమ నటుడిగా విజయ్కు అవార్డు దక్కింది. దానిని 2019లో ఆయన వేలం వేశారు. మొదట రూ. 5లక్షలు వస్తే చాలు అనుకుని ఆన్లైన్లో వేలం ప్రక్రియ ప్రారంభించారు. ఆ సమయంలో దివి ల్యాబ్స్ కుటుంబానికి చెందిన శ్యామలాదేవి రూ. 25 లక్షలకు దక్కించుకున్నారు. అందుకోసం ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఆ ఫిలింఫేర్ అవార్డును ఆమెకు అందించారు విజయ్. అనంతరం ఆమె ఇచ్చిన రూ. 25 లక్షల మొత్తాన్ని ముఖ్యమంత్రి సహాయ నిధికి (CMRF) అందించారు. The 1st @TheRowdyClub Sundowner Party. Filmfare given away. 25 lakhs raised for CMRF 😁 Divi labs you are now a part of my journey. This blacklady is special to all of us. I shall show my appreciation by visiting you all :) pic.twitter.com/OgqA8Q0P3U — Vijay Deverakonda (@TheDeverakonda) July 15, 2018 -
నెగెటివ్ అప్రోచ్.. కచ్చా బాదం..సందీప్ రెడ్డి సీక్రెట్ ఇదే!
ఇప్పుడు దేశవ్యాప్తంగా సందీప్రెడ్డి ఓ కొత్త ట్రెండ్ తీసుకొచ్చాడు. అంతా కచ్చా బాదం. ఎలాంటి గోప్యత అవసరం లేదు. కుల్లం కుల్ల.. బూతు సీన్లు కూడా హీరో, హీరోయిన్లు చేయాల్సిందే. వ్యాంపు పాత్రలు ప్రత్యేకంగా అవసరం లేదు. ఇదేంటని చాదస్తంగా ఎవరయినా అడిగితే .. ఇదే ట్రెండ్ అంటున్నాడు. లిప్ లాక్లు, దుస్తులు విప్పడాలు, నేరుగా బెడ్రూమ్ సీన్లు.. ఇవన్నీ హాలీవుడ్ను తలపించేలా చేయడం సందీప్రెడ్డి సీక్రెట్గా మారింది. కథ, కథనం, దర్శకత్వం ఇవన్నీ పాత డైరెక్టర్లు నమ్మిన పద్ధతులు. జనానికి ఇప్పుడంతా యానిమల్ టైప్ కావాలట. అదే సందీప్రెడ్డి గుర్తించిన అంశం. ఎంత కచ్చాగా ఉంటే.. అంత రియాల్టీ అంటున్నాడు. తీసింది మూడు సినిమాలే అయినా.. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో సందీప్రెడ్డి ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. అర్జున్రెడ్డితో సంచలనం తొలి సినిమాకే ప్రత్యేక ముద్రను సంపాదించుకునే దర్శకులు చాలా అరుదు. అలాంటి అరుదైన దర్శకుల్లో సందీప్ రెడ్డి ఒకరు. తొలి సినిమా అర్జున్ రెడ్డితో సంచలనం సృష్టించాడు. టాలీవుడ్లో అప్పటి వరకు వచ్చిన సినిమా ఒకెత్తు. అర్జున్ రెడ్డి సినిమా మరో ఎత్తు. ఓ స్వచ్ఛమైన ప్రేమ కథను బోల్డ్గా చూపించి సక్సెస్ అయ్యాడు. అర్జున్రెడ్డి సినిమా చూస్తున్నంతసేపు..ప్రతి ప్రేక్షకుడు ఆ పాత్రతో ముందుకు సాగుతాడు. హీరోని వైల్డ్గా చూపించినా.. కథంతా బోల్డ్గా నడిపించినా కంటికి అది అసహ్యంగా కనిపించదు. హీరోకి కోపమొస్తే పచ్చి బూతులు తిడతాడు.. ప్రేమ పొంగుకొస్తే.. చుట్టూ ఉన్న పరిసరాలనే మర్చిపోతారు. శారీరక వాంఛ తీరకపోతే అండర్వేర్లో ఐస్ వేసుకుంటాడు. అయినా ఆ క్యారెక్టర్పై మనకు ప్రేమే కలుగుతుంది తప్పా ఎక్కడా నెగెటివ్ ఇంప్రెషన్ రాదు. అంతాలా తన కథతో కన్విన్స్ చేశాడు సందీప్ రెడ్డి. ఒక బోల్డ్ కంటెంట్ ను కరెక్ట్ వేలో చూపిస్తూ... ఆడియెన్స్ ను మెప్పించడం ఒక్క సందీప్ రెడ్డికే సాధ్యమైంది. అదే కథను మరింత బోల్డ్గా బాలీవుడ్ ప్రేక్షకులను చూపించి.. సూపర్ హిట్ కొట్టాడు. ఇలా తన తొలి రెండు సినిమాలతో ఇటు విజయ్ దేవరకొండ..అటు షాహిద్ కపూర్ల హోదానే మార్చేశాడు. అర్జున్ రెడ్డి తర్వాత ఆ తరహాలో తెలుగులో చాలా సినిమాలు వచ్చాయి.ప్రస్తుతం వస్తూనే ఉన్నాయి. ‘యానిమల్’తో మరో ప్రయోగం సాధారణంగా సినిమా అంటే నిడివి ఇంత ఉండాలి.. ప్రారంభం ఇలా.. ఇక్కడ ఇంటర్వెల్.. క్లైమాక్స్ అలా అని కొన్ని పద్దతులు ఉంటాయి. కానీ అవేవి పట్టించుకోకుండా.. తండ్రి కొడుకుల ఎమోషన్ని బోల్డ్గా, వయోలెన్స్గా చూపిస్తూ..సినిమా ఇలా కూడా చెయ్యొచ్చు అని ‘యానిమల్’తో నిరూపించాడు సందీప్రెడ్డి. రణ్బీర్ కపూర్, రష్మిక మందన్నా హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం ప్రస్తుతం ఇండియన్ బాక్సాఫీస్ని షేక్ చేస్తూ.. రూ. 1000 కోట్ల క్లబ్లోకి చేరేందుకు అడుగు దూరంలో ఉంది. వాస్తవానికి ఈ కథ రొటీన్ రివేంజ్ డ్రామా. ఇందులోని సంఘర్షణ కూడా పాతదే. కానీ సందీప్ రెడ్డి కథనాన్ని నడిపించిన విధానం.. హీరో పాత్రని మలిచిన తీరు ప్రత్యేకతను తీసుకొచ్చింది. ఈ చిత్రంలో చాలా సన్నివేశాలు సంప్రదాయ ప్రవర్తనలకు విరుద్ధంగా ఉంటాయి. కానీ హీరో పాత్ర మనస్తత్వాన్ని అర్థం చేసుకొని సినిమా చూస్తే.. దర్శకుడు అంతర్లీనంగా చెప్పదలచుకున్న విషయాలు ఇంకా స్పష్టంగా తెలుస్తాయి. సందీప్రెడ్డి చెప్పాలనుకే పాయింట్కి ఆడియన్స్ కనెక్ట్ అయ్యారు కాబట్టే.. ఈ చిత్రం సూపర్ హిట్గా నిలిచింది. వంగాపై బాలీవుడ్ ఫోకస్ యానిమల్ సినిమాతో మరోసారి తెలుగువాడి సత్తా ఏంటో ప్రపంచానికి తెలియజేశాడు సందీప్ రెడ్డి. ఇప్పుడీ సెన్సెషనల్ డైరెక్టర్తో సినిమా చేయడానికి బాలీవుడ్ స్టార్స్ క్యూ కడుతున్నారు. రణ్బీర్ కపూర్ అయితే మరోసారి సందీప్తో వర్క్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. షారుఖ్, సల్మాన్ కూడా సందీప్పై ఫోకస్ పెట్టారు. అలాగే బాలీవుడ్కి చెందిన బడా నిర్మాణ సంస్థలన్నీ సందీప్రెడ్డికి అడ్వాన్స్లు ఇచ్చేందుకు ముందుకొస్తున్నాయి. అయితే సందీప్ రెడ్డి మాత్రం ఆచి తూచి వ్యవహరిస్తున్నాడు. తన తదుపరి సినిమాను ప్రభాస్తో ప్లాన్ చేశాడు. దానికి స్పిరిట్ అనే టైటిల్ని కూడా ఖారారు చేశారు. ఆ చిత్రం తర్వాత అల్లు అర్జున్తో సినిమా చేయబోతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. భవిష్యత్తులో మహేశ్బాబు, రామ్చరణ్ లాంటి టాలీవుడ్ స్టార్స్ కూడా సందీప్ సినిమా సినిమా తీసే అవకాశాలు ఉన్నాయి. -
అర్జున్ రెడ్డి రికార్డు బ్రేక్ చేసిన బేబీ
-
వారి కోసం అవార్డునే అమ్మేశాడు.. దటీజ్ విజయ్ దేవరకొండ!
తక్కువ సినిమాలతో ఎక్కువ మంది అభిమానులను సంపాదించుకున్న హీరో విజయ్ దేవరకొండ. సినిమాల కంటే తన యాటిట్యూడ్తో యూత్లో ఎనలేని క్రేజ్ తెచ్చుకున్నాడు ఈ రౌడీ హీరో. క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఎంట్రీ ఇచ్చి.. హీరో.. స్టార్ హీరోగా ఎదిగాడు. అయితే ఈ స్టార్డమ్ విజయ్కి అంత ఈజీగా రాలేదు. తన కెరీర్ తొలినాళ్లలో చాలా కష్టపడ్డాడు. అవకాశాల కోసం నిర్మాతల ఆఫీసుల చుట్లూ తిరిగాడు. హీరోగా అవకాశాలు రాకపోవడంతో క్యారెక్టర్ ఆర్టిస్ట్గాను చేశాడు. 'పెళ్లి చూపులు' చిత్రంతో హీరోగా ఓ మోస్తరు గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక 'అర్జున్ రెడ్డి' చిత్రంతో ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయాడు. ఆపై గీత గోవిందం, టాక్సివాలా, డియర్ కామ్రేడ్, వరల్డ్ ఫేమస్ లవర్ తదితర చిత్రాలతో యూత్ను ఆకట్టుకున్నాడు. పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన ‘లైగర్’ డిజాస్టర్గా నిలిచినా.. విజయ్కి మాత్రం నార్త్లో మంచి గుర్తింపుని తెచ్చిపెట్టింది. ఇలా ఒక్కో మెట్టు ఎక్కుతూ పాన్ ఇండియా స్టార్గా ఎదిగిన విజయ్ బర్త్డే నేడు(మే 9). ఈ సందర్భంగా ఈ రౌడీ హీరో గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు.. ► విజయ్ దేవరకొండ పూర్తి పేరు దేవరకొండ విజయ్ సాయి. స్వస్థలం నాగర్ కర్నూల్ జిల్లా తమ్మన్ పేట గ్రామం. నటనపై ఉన్న ఆసక్తితో విజయ్ తండ్రి గోవర్దన్రావు ఫ్యామిలీతో కలిసి హైదారాబాద్కు షిఫ్ట్ అయ్యాడు. యాక్టర్గా అవకాశాలు లభించకపోవడంతో టెలివిజన్ డైరెక్టర్గా మారాడు. సినిమా రంగంపై తనకున్న ఇష్టంతోనే విజయ్ యాక్టర్ అవుతానంటే.. ఆయన అడ్డుచెప్పలేదు. ► విజయ్ తన పాఠశాల విద్యను పుట్టపర్తిలోని శ్రీ సత్యసాయి హయ్యర్ సెకండరీ స్కూల్ పూర్తి చేశాడు. ఇంటర్, డిగ్రీని హైదరాబాద్లోని ప్రైవేట్ కాలేజిల్లో పూర్తి చేశాడు. (చదవండి: ముస్లిం యువతిగా సమంత.. 'ఖుషి' ఫస్ట్ సింగిల్ వచ్చేసింది ) ► డిగ్రీ పూర్తయిన తర్వాత విజయ్ నటనపై దృష్టిపెట్టాడు. హైదరాబాద్లోని ఓ యాక్టింగ్ స్కూల్లో చేరాడు. కొన్నాళ్ల తర్వాత రవిబాబు దర్శకత్వం వహించిన నువ్విలా చిత్రంలో అవకాశం లభించింది.అందులో విష్ణు పాత్రను పోషించాడు. ► నువ్విలా సినిమా చేస్తున్న సమయంలోనే శేఖర్ కమ్ముల ‘లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ సినిమా కోసం ఆడిషన్స్ నిర్వహించారు. ఈ విషయం తెలుసుకొని అందరిలాగే అడిషన్స్కి వెళ్లాడు విజయ్. ఆ చిత్రంలో అజయ్ అనే చిన్న పాత్రను పోషించాడు. ► తొలి రెండు సినిమాలు విజయ్కి ఎలాంటి గుర్తింపు తెచ్చిపెట్టలేదు. కానీ నాని హీరోగా నటించిన ‘ఎవడే సుబ్రహ్మణ్యం’లో పోషించిన రిషి పాత్ర మాత్రం విజయ్కి మంచి గుర్తింపు తెచ్చింది. అయినా కూడా హీరోగా అవకాశాలు లభించలేదు. కొన్నాళ్ల తర్వాత తరుణ్ భాస్కర్ ‘పెళ్లి చూపులు’ చిత్రానికి హీరోగా విజయ్ని సెలక్ట్ చేశాడు. అయితే ఈ సినిమాను నిర్మించడానికి ఏ నిర్మాత ముందుకు రాలేదు. చివరకు రాజ్ కందుకూరి ముందుకొచ్చి ఆ చిత్రాన్ని నిర్మించాడు. అదే విజయ్ కెరీర్ని మలుపు తిప్పింది. హీరోగా తొలి సినిమాతోనే జాతీయ అవార్డును గెలుచుకున్నాడు. ఇక అర్జున్ రెడ్డితో స్టార్గా హీరోగా ఎదిగాడు. ► అర్జున్ రెడ్డి తర్వాత విజయ్కి వరుస అవకాశాలు లభించాయి. ఏ మంత్రం వేసావే, నోట, డియర్ కామ్రెడ్, వరల్డ్ ఫేమస్ లవర్ లాంటి చిత్రాలకు మిశ్రమ స్పందల రాగా.. గీత గోవిందం చిత్రం సూపర్ హిట్గా నిలిచింది. ఇక భారీ అంచనాల మధ్య పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన ‘లైగర్’విజయ్ కెరీర్లోనే భారీ డిజాస్టర్గా నిలిచింది. ఈ సినిమా రిజల్ట్ చూసి షూటింగ్ ప్రారంభించిన ‘జనగణమన’ను మధ్యలోనే ఆపేశారు. ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఖుషి సినిమా చేస్తున్నాడు. ► ఒకవైపు హీరోగా సినిమాల్లో నటిస్తూనే నిర్మాతగానూ మారాడు. కింగ్ ఆఫ్ ది హిల్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై చిన్న చిత్రాలను నిర్మిస్తున్నాడు. ‘మీకు మాత్రమే చెప్తా’. ‘పుష్పక విమానం’లాంటి చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించాడు. ► 'ది రౌడీ వేర్' పేరుతో విజయ్ దేవరకొండ సొంతంగా ఓ క్లాతింగ్ బ్రాండ్ స్థాపించాడు. ‘మిడిల్ క్లాస్ ఫండ్’పేరిట ఓ కార్యక్రమాన్ని ప్రారంభించి ఎన్నో మధ్యతరగతి కుటుంబాలకు అండగా నిలుస్తున్నాడు. (చదవండి: ఒకప్పటిలా కాదు.. హీరోయిన్స్ అంటే వాటికే పరిమితం కాదు) ► ఇక విజయ్ గురించి చాలా మందికి తెలియని విషయం ఏంటంటే.. పేద ప్రజలకు సాయం చేయడం కోసం తన అవార్డును కూడా అమ్మేశాడు. అర్జున్ రెడ్డి సినిమాకు గాను విజయ్కి బెస్ట్ యాక్టర్ ఫిలిం ఫేర్ అవార్డు లభించింది. ఆ అవార్డుని వేలం వేసి రూ.25 లక్షలకు అమ్మేశాడు. ఆ డబ్బంతా ప్రజా సేవ కోసం ప్రభుత్వం ఉపయోగించే సీఎం రిలిఫ్ ఫండ్కి విరాళంగా అందించి గొప్ప మనసు చాటుకున్నాడు. ► ప్రతీ ఏడాదికి ఒకసారి ‘ 'దేవర శాంటా’ పేరిట అభిమానులను సర్ఫ్రైజ్ చేయడం విజయ్కి అలవాటు. ఇలా పేద ప్రజల కోసం ఎన్నో సేవ కార్యక్రమాలు చేపడుతూ రియల్ లైఫ్లోనూ హీరోగా నిలుస్తున్న విజయ్ కెరీర్లో మరిన్ని విజయాలు సాధించి ఉన్నత స్థాయికి చేరుకోవాలని కోరుకుంటూ ‘సాక్షి’ తరపున, అభిమానుల తరపున పుట్టిన రోజు శుభాకాంక్షలు. -
అర్జున్ రెడ్డిలో శివ పాత్రకు ఫస్ట్ చాయిస్ నేను కాదు, ఆ కమెడియన్: రాహుల్ రామ్కృష్ణ
రాహుల్ రామకృష్ణ.. తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు ఇది. షార్ట్ ఫిల్మ్ హీరోగా కెరీర్ ప్రారంభించిన అతడు సినిమాల్లో హీరోలకు ఫ్రెండ్ పాత్రలు చేస్తూ ఫేమస్ అయ్యాడు. అర్జున్రెడ్డి, జాతిరత్నాలు చిత్రాలతో కమెడియన్గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందాడు. ‘అర్జున్ రెడ్డి’లో హీరో విజయ్ దేవరకొండ స్నేహితుడిగా తన నటనతో ఆకట్టుకున్నాడు. ఈ సినిమాతో హీరోకి సమానమైన క్రేజ్ను సంపాదించుకున్నాడు రాహుల్. చదవండి: జబర్దస్త్ ‘పంచ్’ ప్రసాద్ ఆరోగ్యంపై డాక్టర్లు ఏమన్నారంటే? ఈ గుర్తింపుతో ప్రస్తుతం టాలీవుడ్లో వరుస ఆఫర్లు అందుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో రీసెంట్గా ఓ టాక్లో షో పాల్గొన్న అతడు తన వ్యక్తిగత విషయాలను పంచుకున్నాడు. ఈ మేరకు రాహుల్ రామక్రష్ణ మాట్లాడుతూ.. ‘‘నేను పుట్టిపెరిగిందంతా హిమాయత్ నగర్లోనే. మా ఫ్యామిలీలో ఎవరికీ సినిమా ప్రపంచంతో సంబంధం లేదు. నేను, తరుణ్ భాస్కర్, విజయ్ దేవరకొండ, ప్రియదర్శి అందరం ఒకేసారి సినిమాల్లోకి వచ్చాం. పెళ్లి చూపులు సినిమాకి ముందు మేమంత సినిమాల్లో ప్రయత్నాలు చేస్తున్నాం. చదవండి: ప్రత్యేక ఆకర్షణగా నాగశౌర్య పెళ్లి భోజనాలు, అరేంజ్మెంట్స్ చూస్తే షాకవ్వాల్సిందే అదే సమయంలో తరుణ్ భాస్కర్ ‘పెళ్లి చూపులు’ చేసే అవకాశం వచ్చింది. అందులో విజయ్ హీరోగా ముందు అనుకున్నాడు. ఇక అతడి ఫ్రెండ్ రోల్కు అప్పటికే తరుణ్ ప్రియదర్శికి ఛాన్స్ ఇచ్చాడు. అదే సమయంలో విజయ్ దేవరకొండతో సందీప్ రెడ్డి ‘అర్జున్ రెడ్డి’ సినిమా అనుకున్నాడు. ఆయనకి నన్ను పరిచయం చేసింది విజయ్ దేవరకొండనే. అలా ఆ సినిమాలో ‘శివ’ పాత్ర చేసే ఛాన్స్ నాకు వచ్చింది. అయితే అర్జున్ రెడ్డిలో నా పాత్రకి డబ్బింగ్ జరుగుతున్నప్పుడు ఒక విషయం తెలిసింది. మొదట ఈ సినిమాలో నా పాత్రకు ఫస్ట్ చాయిస్ నేను కాదని, ప్రియదర్శిని అనుకున్నారని తెలిసింది’’ అని చెప్పుకొచ్చాడు. -
నెట్టింట వైరల్ అవుతున్న ‘అర్జున్రెడ్డి’ డిలీటెడ్ సీన్
రౌడీ హీరో విజయ్ దేవరకొండకు స్టార్ హోదా తీసుకొచ్చిన చిత్రం ‘అర్జున్రెడ్డి’. ఈ సినిమా విడుదలైన నిన్నటికి(ఆగస్ట్ 25)ఐదేళ్లు. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు సందీప్ వంగా ‘అర్జున్ రెడ్డి’నుంచి ఓ డిలీట్ సీన్ని విడుదల చేశారు. 2.53 నిమిషాలు ఉన్న ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ఈ సీన్లో విజయ్ దేవరకొండ, రాహుల్ రామకృష్ణ మధ్య సంభాషణలను చూపించారు. ప్రీతి(షాలినీ పాండే) ఇంటికి వెళ్లిన అర్జున్ రెడ్డి... అక్కడ ఆమెను ముద్దు పెట్టుకోవడం.. అది చూసి ప్రీతి నాన్న గొడవపెట్టుకోవడంపై ఇద్దరి మధ్య చర్చ జరిగింది. (చదవండి: రజనీకాంత్తో సినిమా.. రాజమౌళి స్టేట్మెంట్, ‘ఆర్ఆర్’కి చాన్స్ ఉందా?) ‘అమ్మ, నాన్న, నానమ్మ .. ఒక పది రోజుల తర్వాత వాళ్లను కలిస్తే.. నాకు హగ్ ఇచ్చి కిస్ పెట్టుకునేవాళ్లురా. ఆ రోజు ప్రీతికి ఇచ్చింది అలాంటి కిస్సే. వేరే ఉద్దేశంతో కాదు. దాన్ని ఆమె తండ్రి తప్పుగా అర్థం చేసుకున్నాడు’అంటూ విజయ్ చెప్పే డైలాగ్తో ఆ వీడియో మొదలవుతుంది. ఈ డిలీట్ సీన్ని దర్శకుడు సందీప్ వంగా ట్విటర్లో షేర్ చేస్తూ.. ‘అర్జున్రెడ్డి’కి ఐదేళ్లు. ఈ సందర్భంగా ఈ సీన్ని షేర్ చేసుకోవడం సంతోషంగా ఉంది. చిత్రబృందానికి నా కృతజ్ఞతలు’అని రాసుకొచ్చాడు. ఆసక్తికరమైన ఈ డిలీటెడ్ సీన్పై ఓ లుక్కేయండి. 5 years for ARJUN REDDY 🙂 Very happy to share this scene 🙏 Thanks to the entire cast & crew🙏@TheDeverakonda #ShaliniPandey @eyrahul @VangaPranay @VangaPictures @rameemusic @Synccinema#5yearsforarjunreddy https://t.co/3qiQhM3YvW — Sandeep Reddy Vanga (@imvangasandeep) August 25, 2022 -
రేవంత్ నాయకత్వంలో కాంగ్రెస్ బలపడదు
సాక్షి, హైదరాబాద్: రేవంత్ నాయక త్వంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కాదని,, ఆ పార్టీని వీడి వైఎస్సార్ తెలంగాణ పార్టీలో చేసిన కల్వకుర్తికి చెందిన యువనేత చీమర్ల అర్జున్ రెడ్డి స్పష్టం చేశారు. గురువారం లోటస్ పాండ్లోని వైఎస్సార్ తెలంగాణ పార్టీ కార్యాలయంలో తన అనుచరులతో కలిసి చీమర్ల అర్జున్ రెడ్డి పార్టీలో చేరారు. ఆయనకు షర్మిల కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం అర్జున్రెడ్డి మాట్లాడుతూ.. మొదట పాలేరు.. ఆ తర్వాత కుల్వకుర్తిలో వైఎస్సార్ తెలంగాణ పార్టీ విజయకేతనం ఎగురవేస్తుందని అర్జున్ రెడ్డి జోస్యం చెప్పారు. చదవండి: కాంగ్రెస్లోకి చెరుకు సుధాకర్.. మునుగోడు కోసమేనా? -
లిప్ లాక్ ఫోటోతో పెళ్లి అనౌన్స్ చేసిన ప్రముఖ కమెడియన్
ప్రముఖ టాలీవుడ్ యంగ్ కమెడియన్ రాహుల్ రామకృష్ణ త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా రాహుల్ తన ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. కాబోయే భార్యకు ముద్దు ఇస్తున్న ఫోటోను షేర్చేస్తూ.. త్వరలోనే పెళ్లి అంటూ అనౌన్స్ చేశాడు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్గా మారింది. ఈ ఫోటో చూసిన నెటిజన్లు.. అసలైన జాతిరత్నానివి నువ్వు.. అర్జున్ రెడ్డి స్టైల్లో చెప్పినవ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పటివరకూ డజనుకు పైగా చిత్రాల్లో నటించిన రాహుల్ రామకృష్ణకు అర్జున్ రెడ్డితో పాటు గీత గోవిందం, హుషారు,ఆర్ఆర్ఆర్ తదితర చిత్రాలు మంచి గుర్తింపు తీసుకొచ్చాయి. రాహుల్ నటించిన 'కృష్ణ వ్రింద విహారి', 'విరాటపర్వం' సినిమాలు ప్రస్తుతం రిలీజ్కు సిద్ధంగా ఉన్నాయి. Getting married, finally, soonly! pic.twitter.com/o4Fg5XlsT6 — Rahul Ramakrishna (@eyrahul) May 7, 2022 -
‘అర్జున్ రెడ్డి’ ముద్దుగుమ్మ రైజా విల్సన్ (ఫోటోలు)
-
హీరోకు జబ్బు.. నిర్మాతకు డబ్బు
-
అర్జున్ రెడ్డి @ 4
-
‘అర్జున్రెడ్డి’ని వదులుకున్నందుకు బాధపడుతోన్న హీరోయిన్
Parvathy Nair Missed Arjun Reddy Movie: అన్ని కథలు అందరికీ నచ్చవు. అందుకే తారలు కొన్ని ప్రాజెక్టులకు ఓకే చెప్తారు, మరికొన్నింటిని సున్నితంగా తిరస్కరిస్తారు. అయితే తిరస్కరించిన సినిమాలు బ్లాక్బస్టర్ హిట్లుగా రికార్డు సృష్టించినప్పుడు మాత్రం అనవసరంగా మంచి అవకాశం చేజార్చుకున్నామే అని నాలుక్కరుచుకుంటారు. ఇలాంటి అనుభవమే ఎదుర్కొంది హీరోయిన్ పార్వతీ నాయర్. టాలీవుడ్లో సంచలన విజయం నమోదు చేసుకున్న అర్జున్రెడ్డిని చేజేతులా వదిలేసుకుంది. తనను వెతుక్కుంటూ వచ్చిన అవకాశాన్ని కాలితో తన్నేసుకున్నట్లైందని ఇప్పటికీ బాధపడుతోంది. సోషల్ మీడియాలో అభిమానులతో ముచ్చటించిన ఆమెను ఓ అభిమాని 'అర్జున్ రెడ్డిలో రొమాంటిక్ సీన్లు ఎక్కువగా ఉన్నాయనే మీరు ఆ సినిమాకు నో చెప్పారా? ఆ మూవీని వదులుకున్నందుకు ఇప్పుడు బాధపడుతున్నారా?' అని ప్రశ్నించాడు. దీనికి పార్వతీనాయర్ బదులిస్తూ.. 'అవును, నిజమే. కానీ అర్జున్రెడ్డి ఓ మంచి చిత్రం. ఆ సినిమాను వదులుకోకుండా ఉంటే బాగుండేది. అలాంటి మంచి సినిమా అవకాశాలు ఇంకా వస్తాయని ఆశిస్తున్నాను' అని పేర్కొంది. 2017లో వచ్చిన అర్జున్ రెడ్డి సినిమా చుట్టూ ఎన్నో వివాదాలు ముసురుకున్నప్పటికీ మంచి వసూళ్లను రాబట్టిన విషయం తెలిసిందే. ఈ చిత్రం హీరోహీరోయిన్లు విజయ్ దేవరకొండ, షాలిని పాండేకు మంచి గుర్తింపు తీసుకొచ్చింది. ఈ సినిమాతో రౌడీ హీరో క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఇది హిందీలో కబీర్ సింగ్, తమిళంలో ఆదిత్మ వర్మ పేరుతో రీమేక్ అవగా అక్కడ కూడా హిట్ కొట్టింది. -
‘అర్జున్ రెడ్డి’లా పవన్ కల్యాణ్.. ఓల్డ్ పిక్ వైరల్
పవర్ స్టార్ పవన్ కల్యాణ్కు యూత్లో ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పవన్ కల్యాణ్ సినిమా రిలీజ్ అవుతుందంటే చాలు.. ఫ్యాన్స్ ఆనందాన్ని మాటల్లో వర్ణించలేం. హిట్లు ప్లాప్లకు అతీతంగా ఆయన ప్రయాణం కొనసాగుతోంది. తొలి సినిమా నుంచే ఆయన ప్రత్యేకమైన అభిమానుల సంపాదించుకున్నాడు. అప్పట్లో పవన్ డ్రెస్సింగ్ స్టైల్, హెయిర్ స్టైల్ ఓ సెన్సేషన్. తాజాగా అప్పటి పవన్ కల్యాణ్ స్టైల్ గురించి చర్చించుకుంటున్నారు ఆయన అభిమానులు. దానికి కారణం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ఓల్డ్ ఫోటోనే. అచ్చం అర్జున్ రెడ్డి సినిమాలో విజయ్ దేవరకొండను పోలి ఉన్న పవన్ అన్ సీన్ పిక్ నిన్న సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ట్రెండ్ అవుతుంది.దాన్ని మళ్లీ రకరకాల ఎడిట్స్ లో కూడా షేర్ చేసుకుంటు పాత పవన్ ను అభిమానులు గుర్తు చేసుకుంటున్నారు. ఇక సినిమా విషయాలకొస్తే.. అజ్ఞాతవాసి సినిమా తర్వాత మూడేళ్లు గ్యాప్ తీసుకున్న పవన్.. ఇటీవల ‘వకీల్ సాబ్’తో రీఎంట్రీ ఇచ్చాడు. ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో ‘హరిహర వీరమల్లు’లో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే 30 శాతం పూర్తయింది. దీంతో పాటు ‘అయ్యప్పనుమ్ కోషియం’రీమేక్ చిత్రంలో నటిస్తున్నాడు. సాగర్ కే చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో దగ్గుబాటి రానా కీలకపాత్రలో నటిస్తున్నాడు. చదవండి: నా హృదయం ఉప్పొంగిపోయింది: మహేశ్బాబు -
ఫ్యామిలీకి దగ్గరయ్యేలా...
‘ఉప్పెన’ ఫేమ్ వైష్ణవ్ తేజ్ పంజా హీరోగా మూడో సినిమా షురూ అయింది. ‘అర్జున్ రెడ్డి’ తమిళ వెర్షన్ను తెరకెక్కించిన గిరీశాయ దర్శకత్వం వహిస్తున్నారు. కేతికా శర్మ హీరోయిన్ . బాపినీడు సమర్పణలో బీవీయస్యన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం శుక్రవారం ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి వైష్ణవ్ తేజ్ తల్లి విజయ దుర్గ కెమెరా స్విచాన్ చేయగా, ఆయన సోదరుడు, హీరో సాయితేజ్ క్లాప్ ఇచ్చారు. ‘‘ఉప్పెన’తో యూత్కు దగ్గరైన వైష్ణవ్ను ఫ్యామిలీ ఆడియన్స్కు దగ్గర చేసే కథతో ఫ్యామిలీ ఎంటర్టైనర్ను రూపొందించనున్నాం’’ అన్నారు బీవీయస్యన్ ప్రసాద్. -
సెట్స్పైకి వైష్ణవ్ కొత్త సినిమా.. హీరోయిన్ ఎవరంటే..
తొలి సినిమా ఉప్పెన తోనే బాక్సాఫీస్ బద్దలు కొట్టిన హీరో వైష్ణవ్ తేజ్. తొలి చిత్రంతోనే తనదైన నటనతో సముద్రమంత క్రేజ్ సంపాదించుకొని ఓవర్నైట్ స్టార్ అయ్యాడు. దీంతో వైష్ణవ్ తేజ్కి ఆఫర్స్ వెల్లువెత్తుతున్నాయి. మెగా కాంపౌండ్ హీరో కోసం దర్శకనిర్మాతలు క్యూ కట్టేస్తున్నారు. ఉప్పెన రిలీజ్ కాకముందే క్రిష్ డైరెక్షన్లో ఓ సినిమాను పూర్తి చేశాడు. ప్రస్తుతం ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరపుకుంటోంది. ఇందులో వైష్ణవ్కు జోడీగా రకుల్ ప్రీత్ నటించింది. ఇప్పటికే పలు సినిమాలు వైష్ణవ్ చేతిలో ఉన్నాయి. తాజాగా వైష్ణవ్ చేస్తున్న మూడో సినిమా గురించి అప్డేట్ వచ్చేసింది. అర్జున్రెడ్డి తమిళ రీమేక్ను డైరెక్ట్ చేసిన గిరీశయ్యతో చేస్తున్న సినిమా సెట్స్పైకి వెళ్లింది. శుక్రవారం సాయి ధరమ్ తేజ్ క్లాప్ కొట్టి ఈ సినిమాను లాంఛనంగా ప్రారంభించారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఈ సినిమాలో వైష్ణవ్ సరసన 'రొమాంటిక్' బ్యూటీ కేతిక శర్మ నటిస్తుంది. ప్రస్తుతం ఈమె ఆకాష్ పూరీ హీరోగా రూపొందుతున్న 'రొమాంటిక్' మూవీలోనూ నటిస్తుంది. తొలి సినిమాతోనే లక్కీ హీరో అనిపించుకున్న వైష్ణవ్తో సినిమా అనగానే కేతిక వెంటనే ఓకే చేసిందట. మరి రెండవ సినిమాతో వైష్ణవ్..మరో హిట్ను అందుకుంటాడా అన్నది చూడాల్సి ఉంది. ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర సినీ క్రియేషన్స్ బ్యానర్లో బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. చదవండి : వైష్ణవ్ తేజ్ తొలి పారితోషికం ఎంతంటే? ‘ఉప్పెన’ డిలీటెడ్ సీన్.. ఆ అమ్మాయి కాళ్లు పట్టుకున్న వైష్ణవ్ -
బిగ్బాస్ కంటెస్టెంట్ ‘సైకిల్’
పునర్ణవి భూపాలం, మహత్ రాఘవేంద్ర శ్వేతావర్మ, సూర్య లీడ్రోల్స్లో ఆట్ల అర్జున్రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'సైకిల్'. గ్రే మీడియా బ్యానర్ పై, ఓవరసీస్ నెట్వర్క్ ఎంటర్టైన్మెంట్ విజయా ఫిలింస్, ఓంశ్రీ మణికంఠా ఫిలింస్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం. సంక్రాంతి బరిలో పోటీకి దిగుతున్న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా జనవరి 15న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా దర్శకుడు అర్జున్రెడ్డి మాట్టాడుతూ... "భారతీయ సినిమాలో ఇంకా చెప్పటానికేం లేవు అన్నట్లుగా బోలెడన్ని కథలతో సినిమాలొచ్చాయి." "ఐనా కొత్త కథలు రాస్తున్నాం కొత్త సినిమాలు తీస్తున్నాం. ఆ ప్రయత్నంలోనే పుట్టిన్పప్పటి నుంచి ఇప్పటి వరకు ఇంజన్కాని, ఇంధనం కానీ లేకుండా నడుస్తూ, మనతో కలిసి ప్రయాణిస్తున్న సైకిల్ పేరుని మా సినిమాకి టైటిల్గా పెట్టుకుని ఫస్ట్ సీన్లోనే దానికి సంబంధించిన ఇంట్రస్టింగ్ లింక్తో క్లీన్ కామెడీ ఎంటర్టైనర్ తీశాము. ఈ చిత్రంలో హీరో, హీరోయిన్స్తో పాటు సుదర్శన్, అనితా చౌదరి, క్యారెక్టర్స్ మ్యాజిక్ చేస్తాయి. వీళ్లతోపాటు, సూర్య, మధుమణి నవీన్నేని, ఆర్ఎక్స్ 100 లక్ష్మణ్, అన్నపూర్ణమ్మ జోగీబ్రదర్స్ కూడా చాలా ఎంటర్టైన్ చేస్తారు. కామెడీ జోనర్ సినిమాకి బ్యూటీఫుల్ లవ్స్టోరీ మ్యాజిక్ యాడ్ ఐతే, ఎంత కొత్తగా వుంటుందో, మా చిత్రంతో చూస్తారు" అని తెలిపారు. (చదవండి: స్వర్గంలో అడుగుపెట్టి 15 ఏళ్లు: రామ్) ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రేక్షకులకు చేరువగా తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాలలో 90 స్క్రీన్లలో విడుదల చేస్తోంది చిత్రయూనిట్. త్వరలో టీజర్తోపాటు, ఆడియో రిలీజ్ చేసుకుని ధియేటర్స్లోకి రాబోతున్న ఈ సినిమాకు నిర్మాతలు, పి.రాంప్రసాద్, డి.నవీన్రెడ్డి, సహనిర్మాతఃవి.బాలాజీరాజు, కెమెరాఃసిద్ధంమనోహర్, సంగీతంః జి.ఎం.సతీష్, ఎడిటింగ్ః గడుతూరిసత్య, ఆర్ట్ః రామ్కుమార్, పిఆర్వో శ్రీ, పబ్లిసిటీ డిజైనర్ ఓంకార్ కడియం. (చదవండి: ఈ హ్యాపీనెస్ ఏమిటి? ఎట్లా ఇట్లా అయితే?: కత్తి మహేష్) -
విజయ్ ఎదురుగానే అర్జున్ రెడ్డిని ఏకిపారేసిన నటి
‘అర్జున్ రెడ్డి’ విడుదలై రెండేళ్లు అయినా ఆ సినిమాపై వివాదాలు మాత్రం ఇంకా రాజుకుంటూనే ఉన్నాయి. ఈ చిత్రాన్ని కబీర్ సింగ్ పేరుతో హిందీలోనూ తెరకెక్కించడంతో విమర్శకులు మండిపడిన విషయం తెలిసిందే. ఈ చిత్రాలపై మలయాళ నటి పార్వతీ మీనన్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించింది. ఒక నటిగా తానైతే ఆ సినిమాల్లో నటించేదాన్నే కాదంటూ కుండబద్ధలు కొట్టారు. తాజాగా గోవా ఫిల్మ్ ఫెస్ట్వల్ వేదికలో విజయ్ దేవరకొండ ఎదురుగానే ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. ‘ఒక సినిమా చూస్తే అది విషాదంగా ఉన్నా అక్కడే వదిలేస్తాం. అయితే అర్జున్రెడ్డి సినిమాలో హీరో మహిళను చెంపదెబ్బ కొడతాడు. దానికి యూట్యూబ్లో వచ్చిన కామెంట్లు చూసి షాకయ్యాను. ఈ సినిమాలో హింస ఎక్కువగా ఉండి, యువతను ప్రేరేపించేదిగా ఉంది. అయితే ఒక నటిగా ఈ సినిమాలో భాగం కాకుండా మాత్రమే ఉండగలను కానీ దర్శకుడిని సినిమా చేయవద్దని చెప్పలేను’ అని పార్వతి పేర్కొన్నారు. అయితే తనకు ఎదురొచ్చిన వాళ్లను చంపేసుకుంటూ పోయే జోకర్ సినిమా మాత్రం వాస్తవాలను చూపించిందనడం గమనార్హం. నటి పార్వతీ మీనన్ వ్యాఖ్యలపై హీరో విజయ్ స్పందిస్తూ.. ‘ఈ వార్తలు చూస్తుంటే చిరాకు పుడుతోంది. ప్రేమలో ఉన్నప్పుడు చిన్నపాటి ఘర్షణలు సహజం.. అది ప్రేమజంటకు అర్థమవుతుంది. అయినా దాన్ని ఎందుకు పెద్దదిగా చూస్తున్నారో అర్థం కావట్లేదు. ఇద్దరి మధ్య నిజమైన ప్రేమ ఉన్నప్పుడు ఇలాంటివి జరిగే అవకాశం ఉంటుంది. పార్వతిని, ఆమె చేసే పనిని నేను ఇష్టపడతాను. ఆమె ప్రశ్నల వెనుక ఉన్న ఆంతర్యాన్ని నేను అర్థం చేసుకోగలను. కొన్నిసార్లు ఆమె మాటలతో ఏకీభవిస్తాను. కానీ సోషల్ మీడియా హడావుడే తనకు చికాకు కలిగిస్తోందన్నారు. వారు ఏం మాట్లాడుతున్నారో వాళ్లకే అర్థం కావట్లేదు’ అంటూ చివరాఖరకు సోషల్ మీడియాపై ఫైర్ అయ్యాడు రౌడీ. -
ఆదిత్య వర్మను ఢీ కొట్టనున్న మాగీ
ఆదిత్య వర్మ చిత్రంతో పోటీకి మాగీ చిత్రం సిద్ధం అవుతోంది. నటుడు విక్రమ్ వారసుడు ధ్రువ్ విక్రమ్ హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ఆదిత్యవర్మ. ఈ చిత్రం 22న తెరపైకి రానుంది. కాగా ఆదిత్య వర్మతో పోటీ పడుతోంది మాగీ చిత్రం. సాయిగణేశ్ పిక్చర్స్ పతారంపై ఆర్.కార్తికేయన్ జగదీశ్ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం మాగీ. రియా, నిమ్మి, హరిణి ముగ్గురు కథానాయికలు నటించిన ఈ చిత్రంలో డౌట్ సెంథిల్, తిథియన్ కథానాయకులుగా నటించారు. రేయ, లియో, చిన్నసామి, మన్నై సాధిక్, ప్రదీప్, సాయి, జీవా, తిలక్ శంకర్, వీరలక్ష్మి, విజయరాఘవ్, పొన్.కరుణ, సాయిరాం ముఖ్యపాత్రల్లో నటించారు. మణిరాజు ఛాయాగ్రహణం, ప్రభాకరన్ మెయ్యప్పన్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధం అయ్యింది. చిత్ర వివరాలను దర్శక, నిర్మాత తెలుపుతూ చిత్రాన్ని పూర్తిగా కొడైకెనాల్, ఆ చుట్టు పక్క ప్రాంతాల్లో చిత్రీకరించినట్లు చెప్పారు. చిత్రం జనరంజకమైన అంశాలతో పిల్లల నుంచి పెద్దల వరకూ అందరినీ అలరించే విధంగా ఉంటుందన్నారు. హర్రర్తో కూడిన నూరు శాతం వినోదభరిత కథాచిత్రంగా మాగీ ఉంటుందని తెలిపారు. నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న చిత్రాన్ని ఈ నెల 22న విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు. కాగా ఆదిత్య వర్మకు సంబంధించి ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్, ట్రైలర్ కోలీవుడ్ అభిమానులను ఉర్రూతలూగిస్తోంది. అందులోనూ చియాన్ విక్రమ్ వారసుడు తెరంగేట్రం చేస్తున్న చిత్రం కావడంతో ఆదిత్య వర్మపై భారీ అంచానాలే ఉన్నాయి. ఇలాంటి సందర్భంలో వినూత్న కథతో ప్రయోగాత్మకంగా తెరకెక్కించిన మాగీ.. ఆదిత్య వర్మను ఢీ కొట్ట బోతోంది. మరి ప్రేక్షకులు ఏ చిత్రాన్ని ఆదరిస్తారో.. బాక్సీఫీస్ వద్ద ఎవరు విజయం సాధిస్తారో చూడాలి. ఇక తెలుగులో సూపర్ డూపర్ హిట్గా నిలిచిన ‘అర్జున్ రెడ్డి’ తమిళ రిమేక్గా ‘ఆదిత్య వర్మ’ వస్తున్న విషయం తెలిసిందే. -
దీపికా, అలియాలతో విజయ్ దేవరకొండ సందడి
‘అర్జున్రెడ్డి’ సక్సెస్తో టాలీవుడ్లో క్రేజీ హీరో అయ్యాడు విజయ్దేవరకొండ. సినిమాలలో, అడియో రిలీజ్ ఫంక్షన్లతో పాటు పలు సినిమా కార్యక్రమాలలో తనదైన రీతి మాట్లాడుతూ తనకుంటూ ఓ ప్రత్యేకతను తెచ్చుకున్నాడు. టాలీవుడ్లో వరస విజయాలతో దూసుకుపోతూ మోస్ట్ వాంటెడ్ హీరో అయ్యాడు ఈ ‘గీత గోవిందం’ హీరో. ఇక బాలీవుడ్ నిర్మాత కరణ్జోహర్ అర్జున్రెడ్డిని హీందీలో రీమేక్లో నటించమని అడగడంతో విజయ్ క్రేజ్ మరింత పెరిగింది. అలాగే ఇటీవల విజయ్ నటించిన డియర్ కామ్రేడ్ను కూడా కరణ్ హీందీలో రీమేక్ చేయనున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. దీంతో విజయ్కి టాలీవుడ్లోనే కాకుండా బాలీవుడ్కు కూడా సుపరిచితుడయ్యాడు. ఈ క్రమంలో ఈ ‘వరల్డ్ ఫేమస్ లవర్’ హీరోకి బాలీవుడ్లో ఆఫర్లు కూడా వస్తున్నాయంటా. అయితే ప్రస్తుతం టాలీవుడ్లో బీజీగా ఉండటంతో బీటౌన్కి వెళ్లడానికి కాస్త సమయం పడుతుందని చెపుకొస్తున్నాడు రౌడీ. తాజాగా ఇంటర్నేషనల్ సింగర్ ‘క్యాటీ పెర్రి’ మ్యుజిక్ షో కోసం ముంబాయిలోని వన్ప్లేస్ హోటల్లో ఏర్పాటు చేసిని పార్టీకి నిర్మాత కరణ్ జోహర్ హోస్ట్గా వ్యవహరించాడు. ఈ పార్టీకి విజయ్ దేవరకొండకు కూడా ఆహ్వనం అందింది. ఇక ఈ పార్టీకి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్, కైరా అద్వానీ, దీపికా పదుకోన్, జాక్వేలిన్ ఫేర్నాండేస్, హీరో రణ్వీర్ సింగ్ తమిళ హీరో విజయ్ సేతుపతి, అర్జున్ కపూర్, సిధ్దార్థ చతుర్వేది, అభిషేక్ బచ్చన్లతో పాటు పలువురు బాలీవుడ్ స్టార్స్ హాజరయ్యారు. ఈ క్రమంలో విజయ్ను అలియా భట్ హాయ్ అంటూ పలకరించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట సందడి చేస్తున్నాయి. కాగా ప్రేమకథగా తెరకెక్కుతున్న రౌడీ తాజా సినిమా ‘వరల్డ్ ఫేమస్ లవర్’ సినిమాలో నలుగురు హీరోయిన్స్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాను వచ్చే ఏడాదిలో విడుదల చేయనున్నట్లు సమాచారం. View this post on Instagram Vijay deverakonda ❣️ Vijay ❤️ Follow me @thedeverakondaf Follow me @thedeverakondaf _______________⏫_______________ Turn on Post Notification 🔔 _______________⏫_______________ Follow me @thedeverakondaf Follow me @thedeverakondaf _______________⏫______________ #arjunreddyfever #arjunreddy😎 #arjunreddy #arjunreddymania #shalinipandey #vijay #vijayfans #vijaydeverakonda # #rowdywear #kajal #rowdies #rowdy #rowdyclub #geethagovindam #NOTA # #ajith #tamil #taxiwaala #teluguactress rajini #dearcomrade #alluarjun #prabhas #samantha #bollywoodactress #tamilactress #kollywoodcinema #thedeverakondafc _________________________________ Follow me @thedeverakondaf Follow me @thedeverakondaf @thedeverakonda A post shared by Vijay Deverakonda🔵 (@thedeverakondaf) on Nov 15, 2019 at 12:57am PST -
‘ఆయన లేకుంటే.. ఇక్కడ ఉండేవాడిని కాదు’
తమిళ స్టార్ హీరో విక్రమ్ తనయుడు ద్రువ్ విక్రమ్ తెలుగు ‘అర్జున్ రెడ్డి’ తమిళ రీమేక్ ‘అదిత్య వర్మ’తో వెండితెరకు పరిచయం కానున్నారు. కాగా ఈ సినిమా షూటింగ్ను పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలో ద్రువ్తో కలిసి సినిమాను ప్రమోట్ చేయడంలో విక్రమ్ కూడా బీజీ అయిపోయారు. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ.. ‘అదిత్య వర్మ’ ద్రువ్కు మంచి గుర్తింపు తెచ్చిపెడుతుందని తాను గట్టిగా నమ్ముతున్నానని అన్నారు. ద్రువ్ సినిమా కెరీర్కు అదిత్య వర్మ సరైన చిత్రం అన్నారు. తెలుగు అర్జున్ రెడ్డి చుశానని అది నాకు బాగా నచ్చిందని, ఈ సినిమా పలు బాషాల్లో రీమేక్ అవ్వడం సవాలుతో కూడుకున్న విషయం అన్నారు. అందుకే నిర్మాత ముఖేష్ మెహతా అర్జున్ రెడ్డి మిళ రీమేక్కు ద్రువ్ను ఎంచుకున్నారని విక్రమ్ అన్నారు. ఇక గిరిసయ్య దర్శకత్వం వహిస్తున్న అదిత్య వర్మ షూటింగ్ను పూర్తి చేసుకుని నవంబర్ 21వ తేదీన విడుదలకు సిద్ధంగా ఉంది. తెలుగు అర్జున్ రెడ్డి హీరోయిన్ ప్రీతి పాత్రలో బనితా సింధు అదిత్య వర్మతో తమిళ తెరంగేట్రం చేయగా, ప్రియానంద్ కీలక పాత్రలో కనిపించనున్నారు. కాగా గత నెలలో జరిగిన అదిత్య వర్మ అడియో లాంచ్లో ద్రువ్ మాట్లాడుతూ.. ‘ఈ సినిమాలో తాను నటించడానికి మా నాన్న విక్రమ్ చాలా శ్రమించారు. ఆయనకు నా కృతజ్ఞతలు. అలాగే ‘నా తండ్రి అంకితాభావం ఉన్న నటుడని నాకు తెలుసు, మా నాన్న ఈ స్థాయికి రావడానికి చాలా కష్టపడ్డాడు. ఆయన ప్రోత్సహం, ప్రమేయం లేకుంటే ఈ రోజు నేను ఇక్కడ ఉండేవాడిని కాదని’ అన్నాడు. -
నాన్న పదేళ్ల స్ట్రగుల్ చూశా!
సినిమా: తన తండ్రి 10 ఏళ్ల స్ట్రగుల్స్ను అనుభవించినట్లు ఆయన వారసుడు ధ్రువ్ విక్రమ్ పేర్కొన్నారు. ఈయన కథానాయకుడిగా పరిచయం అవుతున్న చిత్రం ఆదిత్యవర్మ. ఇది తెలుగులో సంచలన విజయాన్ని సాధించిన అర్జున్రెడ్డి చిత్రానికి రీమేక్ అన్న విషయం తెలిసిందే. ధ్రువ్ విక్రమ్కు జంటగా భవితసంధు నటించిన ఇందులో నటి ప్రియాఆనంద్ ప్రధాన పాత్రలో నటించారు. ఈ చిత్రం ఈ నెల 8న తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. ఈ సందర్భంగా చిత్ర హీరోహీరోయిన్లు ధ్రువ్విక్రమ్, భవితసంధు బుధవారం సాయంత్రం విలేకరులతో ముచ్చటించారు. నటుడు ధ్రువ్ ముచ్చట్లు చూద్దాం.. ప్ర: ఆదిత్యవర్య చిత్రం గురించి చెప్పండి? జ: ఆదిత్యవర్మ చిత్రం చాలా కేర్ఫుల్గా యూనిట్ అంతా కలిసి శ్రమించిన చిత్రం ఇది. ప్ర:అర్జున్రెడ్డి చిత్రాన్ని ఎంచుకోవడానికి కారణం? జ: నాకు హీరో పాత్ర హ్యాబిట్. నాకు చాలెంజింగ్ అనిపించింది. ప్ర: చిత్రంలో హీరోయిన్తో లిప్లాక్ సన్నివేశాలు గురించి? జ: అవన్నీ స్క్రిప్ట్లో భాగంగానే చేశాం. భవితసంధు చాలా బాగా నటించింది. ప్ర:చిత్రం చూశారా? జ:నేనింకా చూడలేదు. నాన్న అయితే ఇప్పటికి వంద సార్లు చూసి ఉంటారు. ఆయన హ్యాపీ. ప్ర: మీ నాన్నగారిలో మీకు నచ్చిన విషయం? జ: ఆయన డెడికేషన్, తపన. పాత్ర కోసం పడే శ్రమ అన్నీ నన్ను ఆశ్చర్యపరిచేవే. అలా భవిష్యత్లో నేను కూడా చేస్తానోలేదో చెప్ప లేను. ఆయన ప్రారంభంలో నటుడిగా నిలదొక్కుకోవడానికి 10 ఏళ్లు స్ట్రగుల్స్ పడ్డారు. ప్ర: మీ నాన్న నటించిన చిత్రాల్లో మీకు నచ్చిన చిత్రం? జ: నాన్న నటించిన చిత్రాలన్నీ బాగున్నాయి.సేతు, పితామగన్, బీమ, దూళ్ అన్నీ నచ్చాయి. ప్ర: మీ నాన్న నటించిన చిత్రాల రీమేక్లో ఏ చిత్రంలో నటించాలని కోరుకుంటున్నారు? జ: భీమ చిత్ర రీమేక్ చేస్తే అందులో నటించాలని ఆశగా ఉంది. ప్ర:నాన్నతో కలిసి నటించనున్నట్లు ప్రచారం జరగడం గురించి? జ: దర్శకుడు వెట్రిమారన్ నాన్నను కలిసి మా ఇద్దరితో చిత్రం చేయాలని చెప్పారు. మాకోసం ఆయన స్క్రిప్ట్ను సిద్ధం చేసినట్లున్నారు. అది నాన్నకు వినిపించారు.అయితే ఇంకా ఫైనలైజ్ కాలేదు. ప్ర:మీకు నచ్చిన నటుడు? జ: నాకు అందరు నటులు ఇష్టమే.అయితే అందరికంటే నాన్న ఎక్కువ ఇష్టం. ప్ర: మీరు నటించే చిత్రాల కథలను మీరే ఎంపిక చేసుకుంటారా? మీ నాన్న సెలెక్ట్ చేస్తారా? జ: ప్రస్తుతానికి అలాంటి సందర్భం రాలేదు. అయితే కథ నాకు నచ్చితే ఆ తరువాత నాన్న దృష్టికి తీసుకెళ్లతాను. ప్ర:తదుపరి చిత్రం? జ: ఇంకా ఏ చిత్రాన్ని అంగీకరించలేదు. ఆదిత్యవర్య చిత్రంపైనే నా దృష్టి అంతా. ఈ చిత్రం విడుదలైన తరువాత కొత్త చిత్రంపై దృష్టిసారిస్తాను -
సీన్ టు సీన్ అర్జున్రెడ్డే..!!
తెలుగులో అర్జున్రెడ్డి.. హిందీలో కబీర్ ఖాన్.. ఇప్పుడు తమిళంలో ఆదిత్యవర్మ. తెలుగు నాట సూపర్హిట్ అయిన ‘అర్జున్రెడ్డి’ సినిమా హిందీలోనూ ‘కబీర్ సింగ్’గా ప్రేక్షకుల ఆదరణ పొందిన సంగతి తెలిసిందే. హిందీలోనూ ఈ సినిమా కథ మీద, ఈ సినిమాలో హీరో పాత్రను చూపించిన తీరు మీద తీవ్ర విమర్శలు వచ్చాయి. కానీ భారీ వసూళ్లతో ఈ ఏడాది బిగ్గెస్ట్ హిట్స్లో ఒకటిగా నిలిచి ‘కబీర్ సింగ్’ అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇప్పుడు ఇదే కథ త్వరలో తమిళ ప్రేక్షకులను ‘ఆదిత్య వర్మ’గా పలుకరించనుంది. ఈ సినిమా ట్రైలర్ తాజాగా విడుదలైంది. ఇందులో తమిళ స్టార్ హీరో విక్రమ్ తనయుడు ధ్రువ్ విక్రమ్ హీరోగా నటించారు. ఆయన సరసన బనితా సంధు కథానాయికగా నటించింది. అర్జున్ రెడ్డి కథ మనకు తెలిసిందే. అచ్చం తమిళంలోనూ సీన్ టు సీన్ అదే కథను తెరకెక్కించినట్టు ట్రైలర్ను బట్టి అర్థమవుతోంది. కానీ, ఈ ట్రైలర్లో ధ్రువ్ తనదైన ఒరిజినల్, ఇంటెన్స్, రా నటనతో ఆకట్టుకున్నాడు. ప్రేమలో విఫలమైన వైద్యుడిగా, డ్రగ్, ఆల్కాహల్ ఆడిక్ట్గా ఎమోషనల్ సీన్లలో తనదైన నటనను కనబరిచి ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. ఈ తమిళ ట్రైలర్పై ఇప్పటికే పాజిటివ్ బజ్ క్రియేట్ అయినట్టు కనిపిస్తోంది. అన్నట్టు, బాలా దర్శకత్వంలో అర్జున్రెడ్డి తమిళ రీమేక్ను పూర్తిస్థాయిలో తెరకెక్కించిన తర్వాత.. అది బాగా రాలేదని నిర్మాతలు పక్కనపెట్టిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కొత్త దర్శకుడు గిరాషాయా దర్శకత్వంలో మళ్లీ పూర్తిస్థాయిలో ఈ సినిమాను తెరకెక్కించారు. బాలా దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఆదిత్యవర్మ’ టీజర్లో తమిళ నేపథ్యానికి అనుగుణంగా కొన్ని మార్పులు చేసినట్టు కనిపించింది. కానీ ఇప్పుడు కొత్త దర్శకుడు తీసిన ట్రైలర్లో మాత్రం పూర్తిగా ‘అర్జున్రెడ్డి’ యథాతథంగా కనిపిస్తుండటం గమనార్హం. ప్రస్తుతం యూట్యూబ్లో ఈ ట్రైలర్కు మంచి రెస్పాన్స్ వస్తోంది. -
నాన్న లేకుంటే నేను లేను
సినిమా: నాన్న లేకుంటే తాను లేను అని పేర్కొన్నారు నవ నటుడు ధ్రువ్ విక్రమ్. నటుడు విక్రమ్ వారసుడైన ఈయన కథానాయకుడిగా పరిచయం అవుతున్న చిత్రం ఆదిత్యవర్మ. తెలుగులో సంచలన విజయాన్ని సాధించిన అర్జున్రెడ్డి చిత్రానికి ఇది రీమేక్. ఇందులో ధ్రువ్ విక్రమ్కు జంటగా బనిత, ప్రియా ఆనంద్, అన్భుదాసన్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు. గిరిసాయి దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రానికి రధన్ సంగీతాన్ని అందించారు. కాగా ఆదిత్యవర్మ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం మంగళవారం ఉదయం చెన్నైలోని సత్యం థియేటర్లో జరిగింది. చిత్ర నిర్మాత ముఖేశ్ మెహతా మాట్లాడుతూ ఆదిత్యవర్మ చిత్ర షూటింగ్లో నటుడు విక్రమ్ ఎప్పుడు ఒక స్టార్ నటుడిగా నడుచుకోలేదన్నారు. 2021లో విక్రమ్, ధ్రువ్విక్రమ్ కలిసి నటించి మనల్ని ఆనందపరుస్తారని భావిస్తున్నానన్నారు. ధ్రువ్ విక్రమ్ మాట్లాడుతూ తాను పలు పాఠాశాలల్లో, కళాశాల్లో ప్రసంగించానన్నారు. అయితే ఈ వేడుక కొంచెం ప్రత్యేకం అన్నారు. కారణం తన కుటుంబం ఇక్కడ ఉందన్నారు. చిత్ర దర్శకుడు గిరిసాయి, సహ దర్శకుడి గురించి ధ్రువ్ విక్రమ్ మాట్లాడుతూ ప్రారంభం నుంచి ఈ చిత్రానికి ప్రతిభావంతులు ఉండడం చూసి ఘనతగా భావించానన్నారు. తన తండ్రి విక్రమ్ గురించి చెప్పడానికి మాటలు లేవన్నారు. ఈ చిత్రానికి అంకితభావం 100 శాతం అని చెప్పారు. తన తండ్రి మంచి నటుడన్నదానికంటే మంచి తండ్రి అన్నదే తనకు తెలుసన్నారు. నటుడు విక్రమ్ మాట్లాడుతూ ధ్రువ్ మాదిరి మాట్లాడడం తనకు రాదన్నారు. తనకు 12వ తరగతి పరీక్ష ఫలితాల కోసం వేచి ఉన్నప్పుడో, తాను నటించిన సేతు చిత్రం విడుదల కోసం ఎదురు చూసినప్పుడో ఎలాంటి ఆందోళనకు గురి కాలేదన్నది ఒప్పుకుంటున్నానన్నారు. ఇప్పుడే కాదు, కొద్ది రోజులుగా తాను చాలా ఆందోళన చెందుతున్నానన్నారు. ఈ చిత్రంలో ధ్రువ్ను కథానాయకుడిగా ఎంచుకున్నందుకు, అతనిపై నమ్మకం పెట్టినందుకు నిర్మాత ముఖేష్ మెహతాకు ధన్యవాదాలు తెలుపుతున్నానన్నారు. దర్శకుడు గిరిసాయి, సహ దర్శకుడు షరియా లేకుంటే ఈ చిత్రం సాధ్యం అయ్యేది కాదని పేర్కొన్నారు. -
వైరల్ ట్రైలర్స్
‘‘ప్రైవేటైజేషన్ ఈజ్ టేకింగోవర్. పూర్ స్టేయింగ్ పూర్ అండ్ రిచ్ బికమింగ్ రిచర్’’.జార్జిరెడ్డి మాట్లాడుతున్నాడు.‘‘.. బీయింగ్ అగైనెస్ట్ దిస్, వి హ్యావ్ రైజ్డ్ అవర్ వాయిస్ టు ప్రొటెస్ట్.. బట్ అవర్ ప్రొటెస్ట్ హ్యాజ్ రిమెయిన్డ్ అన్హర్డ్..’’(పేదోడు పేదోడిగానే ఉండిపోతున్నాడు. ఉన్నోడు ఇంకా ఇంకా ఉన్నోడు అయిపోతున్నాడు. దీనిపై మేము గళం విప్పాం. పిడికిలి బిగించాం). ఉస్మానియా విశ్వవిద్యాలయం 1967. హాస్టల్ డైనింగ్ హాల్. ‘‘మనం తిన్న ప్లేట్లల్ల ఉప్పేసి కడుగుతరు ఈ నా కొడుకులు. తినండ్రా మీరు తిన్నంక అదే ప్లేట్లల్లో ఉచ్చ పోసి కడుగుత..’’అన్నం పరబ్రహ్మ స్వరూపం. వర్ణం? మనుధర్మ వికృతరూపం. తింటున్న ప్లేట్లు గాల్లోకి లేచాయి. ‘‘రేయ్.. ఏం కూశావ్రా’’ అగ్రవర్ణం పైకి లేచింది. జార్జిరెడ్డి కూడా పైకి లేచాడు. తనది ఏ వర్ణమో అతడు చూసుకోలేదు. ‘ఉచ్చపోసి కడుగుతా’ అని అరిచిన ‘అధమ’ వర్ణం వైపు నిలబడ్డాడు! ‘అర్జున్రెడ్డి’ సినిమాలో అమిత్గాడి హాస్టల్కి వెళ్లి మరీ వాడి ముక్కూమూతి పగలగొట్టినట్లు.. ‘ఏం కూశావ్రా..’ అని అధమ వర్ణంపైకి లేచిన అగ్రవర్ణం ముక్కు బద్దలు కొట్టాడు జార్జిరెడ్డి.‘‘ఈ దేశంలో పుట్టి, ఈ దేశం గాలి పీల్చి, ఈ దేశం కోసం పోరాడుతున్న విద్యార్థులారా.. యుద్ధానికి సిద్ధం కండి. భారత్ మాతాకీ జై.’’క్యాంపస్లోకి అవుట్ సైడర్స్! టార్గెట్ జార్జిరెడ్డి!‘‘ఎవరు వాడు?’’.. పొలీస్ ఇన్స్పెక్టర్ అడిగాడు.‘‘ఎవడో కొత్త కుర్రోడు సార్. పేరు జార్జిరెడ్డి’’.. ముఖం పచ్చడైన భరతమాత ముద్దుబిడ్డ ఒకడు చేతులు కట్టుకుని చెబుతున్నాడు.‘‘ఎనీ బడి కెన్ సాల్వ్ దిస్?’’.. ఫిజిక్స్ క్లాస్ రూమ్లో లెక్చరర్ అడిగాడు. జార్జిరెడ్డి చెయ్యెత్తాడు. క్లాసయ్యాక క్లాస్మేట్ అడిగాడు.. ‘‘నిజం చెప్పు డబుల్ ఎమ్మెస్సీ కదా!’’ జార్జిరెడ్డి నవ్వలేదు. నవ్వీ నవ్వనట్లు చూశాడు. క్యాంపస్లోకి మళ్లీ ఔట్ సైడర్స్. మళ్లీ జార్జిరెడ్డే టార్గెట్. వీడిని ఇలాగే వదిలేస్తే క్యాంపస్ చేజారిపోతుంది. ‘‘పోతేపోయింది.. ఆ నా కొడుకుల చేతిలోకి పోతుంది’’. కత్తులు, కర్రలు.. ఉస్మానియాలో ఉద్రిక్తత. కారణం.. మళ్లీ జార్జిరెడ్డి! ‘‘వన్ ఇయర్ రస్టికేట్ లెటర్ టైప్ చెయ్యండి’’.. వైస్ చాన్స్లర్ ఆర్డర్. ఇంటికొచ్చాడు జార్జిరెడ్డి. ‘‘నేను అనుకున్న క్యాంపస్ ఇది కాదమ్మా..’’ తల్లితో అన్నాడు. కానీ క్యాంపస్ అనుకున్న హీరో మాత్రం జార్జిరెడ్డే. రష్యన్ రివల్యూషన్ పుస్తకాన్ని కొడుకు చేతికిచ్చింది తల్లి. జార్జిరెడ్డి రీచార్జ్రెడ్డి అయ్యాడు. ‘‘జార్జిరెడ్డి దాదా అయిండన్నా.. ఔటర్స్ లోపలికి రావాలంటేనే భయపడుతున్నారు. అంతేకాదు.. అప్పర్ క్యాస్ట్ అంటే.. అసలు ఆలోచించకుండా కొడుతున్నాడు’’ ‘‘అసలు ఈడెవడు భయ్యా. నిన్నగాక మొన్నొచ్చాడు’’ వచ్చింది నిన్నగాక మొన్ననే. ఉండబోతున్నది ఉస్మానియా క్యాంపస్ ఉన్నంతకాలం. ‘‘స్కాలర్షిప్పులు రాకుండా చేసినా, ఏం చేసినా సరే.. గల్లా పట్టుకుని ప్రశ్నించండి.. రైజ్ యువర్ వాయిస్’’.. జార్జిరెడ్డి స్పీచ్కి క్యాంపస్లోని చెట్టు కూడా తలలు ఊపుతున్నాయి. ‘‘ఈ కాలేజేమైనా వాళ్ల అయ్యదా? తాతదా? ఎవరికి ఆయాసమొచ్చినా ఉరికొస్తుండు’’ ‘‘ఎవరో కనుక్కోండి’’ జార్జిరెడ్డి. మ్యాన్ ఆఫ్ యాక్షన్. ‘‘టుడే వాట్ వియ్ లెఫ్ట్ విత్ అజ్ ఈజ్ ఆర్గనైజింగ్ దిస్ అండ్ మీట్ వయొలెన్స్ విత్ వయొలెన్స్’’ జార్జిరెడ్డి మాట్లాడుతున్నాడు. ‘‘రైజ్ యువర్ వాయిస్. బిఫోర్ ద ట్రూత్ డైస్’’. జార్జిరెడ్డి కొట్లాడుతున్నాడు. ‘‘జీనా హైతో మర్నా సీకో.. కదమ్ కదమ్ పర్ లడ్నా సీకో’’. బతకాలంటే చావడం ఎలాగో నేర్చుకో. ప్రతి అడుగులోనూ పోరాడటం నేర్చుకో. రెండేళ్ల క్రితం ‘అర్జున్రెడ్డి’ సినిమా ట్రైలర్ ఎంత వైరల్ అయిందో.. ఇప్పుడు ‘జార్జిరెడి’్డ ట్రైలర్ అలాగే యూత్ని ఊపేస్తోంది. అర్జున్రెడ్డి లవ్ స్టోరీ. జార్జిరెడ్డి వార్ స్టోరీ. పేదరికంపై వార్. ప్రైవేటీకరణపై వార్. అగ్రవర్ణ ఆధిపత్యంపై వార్. ఉత్తమాటలపై వార్. చెత్త రాజకీయాలపై వార్. సమసమాజ స్థాపనే ధ్యేయంగా జీవించి, పోరాడి, అమరుడైన విద్యార్థి ఉద్యమ నాయకుడు జార్జిరెడ్డిపై ఈ సినిమాను తీస్తున్నది జీవన్రెడ్డి (‘దళం’ఫేమ్). జార్జిరెడ్డిగా నటిస్తున్నది సందీప్ మాధవ్ (‘వంగవీటి’ ఫేమ్). ఇది హిట్ కొట్టేలా కనిపిస్తోంది. కొట్టాలి. విద్యార్థి ఉద్యమ నిర్మాత ఉస్మానియా విశ్వవిద్యాలయంలో 1970వ దశాబ్దారంభంలో ప్రగతిశీల విద్యార్థి ఉద్యమ నిర్మాణానికి జార్జిరెడ్డి రాజకీయ పునాదులు వేశాడు. ఆ క్రమంలోనే 1972లో 25 ఏళ్ల వయసులో క్యాంపస్లోని ఇంజినీరింగ్ కాలేజ్ హాస్టల్ బయట ప్రత్యర్థి శక్తుల చేతుల్లో హత్యకు గురయ్యాడు. ఓయూ క్యాంపస్లో సామాజికంగా అట్టడుగు విద్యార్థులను చైతన్య పరచిన చరిత్ర జార్జిరెడ్డిది. -
మహేష్ సినిమాను పక్కన పెట్టిన దర్శకుడు!
‘అర్జున రెడ్డి’ సినిమాతో సౌత్లో సెన్సేషన్ సృష్టించిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా. తొలి సినిమాతోనే జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న సందీప్, అదే సినిమా రీమేక్తో బాలీవుడ్ బాక్సాఫీస్ను షేక్ చేశాడు. అర్జున్ రెడ్డి రీమేక్గా తెరకెక్కిన కబీర్ సింగ్ హిందీలో దాదాపు 300 కోట్ల వసూళ్లు సాధించి ఈ ఏడాది బిగెస్ట్ హిట్స్లో ఒకటిగా నిలిచింది. అయితే అర్జున్ రెడ్డి హిట్ తరువాత సందీప్, మహేష్ బాబు హీరోగా ఓ సినిమా చేయాలని భావించాడు. సందీప్ చెప్పిన లైన్కు ఓకె చెప్పిన మహేష్ పూర్తి స్క్రిప్ట్ను సిద్ధం చేయాలని చెప్పాడు. ఈలోగా సందీప్ బాలీవుడ్ ప్రాజెక్ట్తో బిజీ కావటంతో మహేష్ మూవీ పనులు ఆగిపోయాయి. హిందీలో సూపర్ హిట్ రావటంతో సందీప్కు బాలీవుడ్ బడా నిర్మాణ సంస్థల నుంచి ఆఫర్లు వస్తున్నాయి. దీంతో మహేష్ మూవీని సందీప్ పక్కన పెట్టేసినట్టుగా వార్తలు వస్తున్నాయి. మహేష్ కూడా ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉండటంతో సందీప్ రెడ్డి వంగా, మహేష్ బాబు కాంబినేషన్లో మూవీ పట్టాలెక్కేందుకు చాలా సమయం పట్టే అవకాశం ఉంది. మహేష్ ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సరిలేరు నీకెవ్వరు షూటింగ్లో బిజీగా ఉన్నాడు. -
తమిళ అర్జున్ రెడ్డి రిలీజ్ డేట్ ఫిక్స్
టాలీవుడ్లో సంచలనం సృష్టించిన అర్జున్ రెడ్డి సినిమా బాలీవుడ్లోనూ ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. హిందీలో కబీర్ సింగ్ పేరుతో రిలీజ్ అయిన ఈ సినిమా దాదాపు 300 కోట్ల వసూళ్లు సాధించి ఈ ఏడాది బిగ్గెస్ట్ హిట్స్లో ఒకటిగా నిలిచింది. తాజాగా అర్జున్ రెడ్డి తమిళ రీమేక్ కూడా రిలీజ్కు రెడీ అయ్యింది. అర్జున్ రెడ్డి సినిమాను కోలీవుడ్లో ఆదిత్య వర్మ పేరుతో రీమేక్ చేస్తున్న సంగతి తెలసిందే. విక్రమ్ తనయుడు ధృవ్ హీరోగా పరిచయం అవుతున్న ఈ సినిమాకు ముందుగా బాల దర్శకత్వం వహించారు. అయితే బాల రూపొందించిన సినిమాతో నిర్మాతలకు సంతృప్తి కలగకపోవటంతో ఆ ప్రాజెక్ట్ను పక్కకు పెట్టి గిరీశయ్య దర్శకత్వంలో తిరిగి తెరకెక్కించారు. ఇటీవల షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ను ప్రకటించారు చిత్రయూనిట్. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసిన సెప్టెంబర్ 27న సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట. ధృవ్ సరసన బనిటా సందు హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాకు రధన్ సంగీతమందిస్తున్నాడు. -
మేబీ అది ప్రేమేనేమో!
మన ఉద్దేశం ఏదైనా అది అవతలి వాళ్లకు ఎలా అర్థమయిందో అదే మన అసలు ఉద్దేశం అవుతుంది! హృదయం అచ్చుయంత్రమై అందులోంచి మన ఉద్దేశాన్ని ప్రింట్ అవుట్ తీసి ఇచ్చినా కూడా ఎవరికి వాళ్లు అర్థం చేసుకున్నదే అచ్చులో ఉన్నది అవుతుంది తప్ప, అచ్చులో ఉన్నది అందరికీ ఒకేలా అర్థమవదు.-మాధవ్ శింగరాజు ‘కబీర్సింగ్’ దర్శకుడు సందీప్రెడ్డిఓ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ మిస్ఫైర్ అయినట్లే.. నాగపూర్లో ఓ యువతి హత్యపై ట్విట్టర్లో తాప్సీ పెట్టిన కామెంటు బ్యాక్ఫైర్ అయింది. ‘మేబీ అది కూడా ప్రేమేనేమో’ అని తాప్సీ సందీప్రెడ్డిపై సర్కాస్టిక్గా చేసిన ట్వీట్ ఏ కొద్దిమందికో అర్థమైనట్లుగా కనిపిస్తోంది. యావద్దేశ ప్రజలందరి ఐక్యూ లెవల్స్ ఒకలా ఉండనట్లే, వాళ్ల ఎత్తిపొడుపు లెవల్సన్నీ ఒకేలా ఉండవు. ఐక్యూ కన్నా ఎత్తిపొడుపు మోర్ కాంప్లికేటెడ్. పైన ఉండే వాళ్ల ఐక్యూను ఒకనాటికి కాకున్నా ఒకనాటికి కింద ఉండేవాళ్లు అందుకోగలుగుతారు. ఐక్యూ కన్నా ఇంకా ఎత్తున ఎత్తిపొడుపు ఉంటుంది కనుక అది ఏనాటికీ సామాన్యుల చేతికి అందదు. ఎంత ఐక్యూ ఉన్నా, ఎత్తిపొడుపును అర్థం చేసుకోలేకపోయారంటే వాళ్లూ సామాన్యుల కిందే లెక్క. ‘సర్కాజం’ అంటారు ఎత్తిపొడుపును ఇంగ్లిష్లో. నటి తాప్సీ ట్విట్టర్లో సర్కాస్టిక్గా చేసిన ఒక కామెంట్పై ఇప్పుడు నెట్లో ఆగ్రహావేశాలు రగులుకుంటున్నాయి. అర్థం కాకపోవడం వల్ల జరిగిన అనర్థం అది. అంత పీక్లో ఉంది మరి తాప్సీ సర్కాజం. నాగపూర్లో ఒక యువకుడు తన ప్రియురాలి క్యారెక్టర్ని శంకించి, ఆమె తలను మోది చంపేశాడు. దారుణమైన ఘటన. ఇద్దరూ ఫ్రెండ్స్. అతడి పేరు అష్రాఫ్ షేక్. ఆ అమ్మాయి ఖుషీ పరిహార్. ఆమె ఉండటం నాగపూర్లో. మోడలింగ్ అంటే ఇష్టం. లోకల్గా ఫ్యాషన్ షోలు చేస్తుంటుంది. అలా అష్రాఫ్ పరిచయం. అలాగే మరికొందరు పరిచయం. వాళ్లతో మాట్లాడొద్దంటాడు ఖుషీని. గత శనివారం పంధుర్న–నాగపూర్ హై వే మీద పోలీసులకు ఓ యువతి మృతదేహం ఉన్నట్లు సమాచారం అందింది. ముఖం గుర్తుపట్టలేని విధంగా ఉంది. సోషల్ మీడియాలో శోధించి ఆమెను, ఆమె ఫ్రెండ్ అష్రాఫ్నీ గుర్తించారు పోలీసులు. చంపింది తనేనని ఒప్పుకున్నాడు అష్రాఫ్. ఎందుకు చంపావు అంటే.. ‘వేరే మగాళ్లతో కూడా మాట్లాడుతోంది. తన క్యారెక్టర్ మంచిది కాదనిపించి చంపేశాను’ అన్నాడు. చంపడమే ఘాతుకం అనుకుంటే, క్యారెక్టర్ మంచిది కాదని చంపేయడం ఇంకా ఘాతుకం. ఈ ఘాతుకంపైనే తాప్సీ సర్కాస్టిక్గా చేసిన కామెంట్ బ్యాక్ ఫైర్ అయింది. ‘మేబీ అతడు ఆమెను పిచ్చిగా ప్రేమిస్తున్నాడేమో! మేబీ ఆ పిచ్చి ప్రేమతోనే అతడు ఆమెను చంపేశాడేమో!’ అని తాప్సీ ట్వీట్ చేశారు. ‘కబీర్ సింగ్’ డైరెక్టర్ సందీప్ రెడ్డిని ఎత్తిపొడవడం ఇది. అయితే ట్వీట్లో సందీప్ పేరు లేకపోవడంతో ఈ ఎత్తిపొడుపు ఎవరికీ అర్థమైనట్లు లేదు. అర్థంకాకపోవడం అర్థం చేసుకోలేనివాళ్ల తప్పైతే కాదు. ఈ ఒక్కచోట ఎత్తిపొడుపులో తన ఐక్యూ లెవల్స్ని తాప్సీ తగ్గించుకోవలసింది. సున్నితమైన సంగతి కదా. ఆమె సర్కాజం అర్థమైనవాళ్లకు కూడా తాప్సీ ఎవరికో భలే పంచ్ ఇచ్చారని మాత్రమే అనిపిస్తుంది. ఏ కొద్దిమందికో ఆమె సందీప్ని అంటున్నారని తెలుస్తుంది.. ఆయన ఇంటర్వ్యూపై జరుగుతున్న రగడను ఫాలో అవుతున్నవారికి. మిగతావాళ్లంతా నిజంగానే తాప్సీ.. ఆ చంపిన యువకుడిని సమర్థిస్తోందనే అనుకున్నారు. ట్రోలింగ్ మొదలుపెట్టారు. ‘కబీర్సింగ్’లో హీరో హీరోయిన్ని చెంపదెబ్బ కొట్టే సీన్ ఉంది. ఇలా స్త్రీ చెంపపై పురుషుడు చెయ్యి చేసుకునే సీన్లు సినిమాలు పుట్టినప్పటి నుంచీ ఉన్నాయి కానీ ఇది కొంచెం వేరుగా ఉంది. ఆ కొట్టడంలో ‘టాక్సిక్ మాస్క్యులినిటీ’ స్పష్టంగా కనిపిస్తోంది. సినిమా చూస్తున్న మగపిల్లల కండల్లోకి విషపూరిత పురుషత్వాన్ని ఇంజెక్ట్ చేసేశాడు డైరెక్టర్.. ప్రియుడి చేత ప్రియురాలిని ఫిజికల్గా అసాల్ట్ చేయించి! పైగా అలా కొట్టడాన్ని ప్రేమ అన్నాడు సందీప్రెడ్డి అనుపమా చోప్రాతో. ఆమె ఫిల్మ్ క్రిటిక్. ‘‘స్త్రీని తక్కువ చెయ్యడం కదా అది’’ అని అనుపమ అన్నప్పుడు.. ‘‘గాఢమైన ప్రేమలో ఇలాగే జరుగుతుంది. ఇలా జరగలేదంటే అక్కడేం లేనట్లు’’ అని సందీప్ అన్నాడు! ఆయన ఇలా అనడం చెంపదెబ్బ సీన్ కన్నా పెద్ద సీన్ అయింది! ఆయన చెప్పదలచుకున్నది ఏదో ఉంది. దాన్నే డెప్త్కి వెళ్లి మాట్లాడాడు. అంతే డెప్త్కి వెళ్లి తాప్సీ ఆయన్ని ఎత్తిపొడిచారు. ఇంటర్వ్యూలో ఆయన కామెంట్స్ మిస్ఫైర్ అయినట్లే, ట్విట్టర్లో తాప్సీ కామెంటు బ్యాక్ఫైర్ అయింది. దానిపై మళ్లొక ట్వీట్ పెట్టారు తాప్సీ. ‘‘ఎత్తిపొడుపును అర్థం చేసుకోలేనివాళ్లు దయచేసి నా ట్వీట్ను పట్టించుకోకండి. థ్యాంక్యూ, మీరెవరో నాకు తెలియకపోవడం మంచిదైంది’’ అని కామెంట్ పెట్టారు. సందీప్రెడ్డి అంతకుముందే తన మాటలపై వివరణ ఇచ్చారు. అది కొంచెం బెటర్ వెర్షన్లో ఉంది. అంటే.. అర్థం చేయించే భాషలో. ‘‘మీరు నా మాటల్ని పూర్తిగా అపార్థం చేసుకున్నారు. కబీర్సింగ్ తన ప్రియురాలిని కొట్టడం కొట్టినట్లు కాదు. ఒకరు లేకుండా ఒకరు ఉండలేనంతగా దగ్గరైనప్పుడు కోపాన్ని వ్యక్తం చేసే స్వేచ్ఛను తీసుకోకుండా ఉండలేకపోవడం అది. అమ్మాౖయెనా అంతే, అబ్బాౖయెనా అంతే’’ అని అన్నాడు. ఈ మాట ఎంతమందికి ఎంత మేరకు అర్థమైయిందో మరి. తాప్సీని, సందీప్నీ వదిలేద్దాం. అంతగా డెప్త్ లేని, అంతగా సర్కాజం లేని మనం కూడా నెత్తీనోరూ మొత్తుకుంటూనే ఉంటాం.. ‘నా ఉద్దేశం అది కాదు’ అని చెప్పడానికి. ముఖ్యంగా భార్యాభర్తలు, కుటుంబ సభ్యులు, బాగా దగ్గరి ఫ్రెండ్స్! ఉద్దేశాన్ని వేరేలా అర్థం చేసుకున్నారంటే.. ఉద్దేశాన్ని అర్థం చేసుకోలేకపోయారనో, అపార్థం చేసుకున్నారనో కాదు. మన ఉద్దేశం వేరేలా కూడా అర్థమయ్యేలా ఉందని. -
హమ్మయ్య.. షూటింగ్ పూర్తయ్యింది!
తెలుగులో సంచనల విజయం సాధించిన అర్జున్ రెడ్డి సినిమాను కోలీవుడ్లో ఆదిత్య వర్మ పేరుతో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ముందుగా ఈ సినిమాను వర్మ పేరుతో బాలా దర్శకత్వంలో రూపొందించారు. అయితే నిర్మాతలకు అవుట్పుట్ నచ్చకపోవటంతో గిరీశయ్య దర్శకత్వంలో తిరిగి తెరకెక్కించారు. అయితే రెండో వర్షన్ విషయంలోనూ రకరకాల అనుమానలు వచ్చాయి. షూటింగ్ అనుకున్నట్టుగా సాగటం లేదని, ఆగిపోయిందన్న ప్రచారం కూడా జరిగింది. అయితే ఫైనల్ గా అర్జున్ రెడ్డి తమిళ రీమేక్ ఆదిత్య వర్మ షూటింగ్ పూర్తయ్యింది. చివరి షాట్కు సంబంధించిన వీడియోను చిత్రయూనిట్ విడుదల చేశారు. హీరో హీరోయిన్లపై చివరి షాట్ను చిత్రీకరించారు. ఈ షూటింగ్ జరుగుతుండగా చియాన్ విక్రమ్ కూడా అక్కడే ఉన్నారు. విక్రమ్ తనయుడు ధృవ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో బనిటా సంధు హీరోయిన్గా నటిస్తున్నారు. ఇప్పటికే నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు త్వరలో ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నారు చిత్రయూనిట్. View this post on Instagram Adithya Varma will always be the most beautiful thing that’s ever happened to me. He gave me a purpose, gave my life meaning, gave me clarity about myself and most importantly, taught me how to never give up. So much love for all the people in this video, especially the man in the last frame. Couldn’t have done it without you. #itsawrap 💫 A post shared by த்ருவ் (@dhruv.vikram) on Jul 15, 2019 at 4:54am PDT -
నెక్ట్స్ సూపర్ స్టార్తోనే!
తొలి సినిమాతోనే సంచలనం సృష్టించిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా. అర్జున్ రెడ్డి సినిమాతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన సందీప్, ఒక్క సినిమాతోనే జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్నాడు. ఆ సినిమాను బాలీవుడ్లో కబీర్సింగ్ పేరుతో రీమేక్ చేసి మరో బిగ్ హిట్ను తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం బాలీవుడ్లో కబీర్ సింగ్ ఫీవర్ నడుస్తోంది. ఇక సందీప్ తదుపరి ప్రాజెక్ట్పై చర్చ జరుగుతోంది. వరుసగా రెండు సినిమాలతో సెన్సేషన్ సృష్టించిన సందీప్ తన నెక్ట్స్ సినిమాను సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు. ఇప్పటికే మహేష్కు కథ వినిపించిన సందీప్ ఫైనల్ నేరేషన్కు సిద్ధమవుతున్నాడు. ఈ విషయాన్ని సందీప్ ధృవీకరించారు. ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో సరిలేరు నీకెవ్వరు సినిమాలో నటిస్తున్న మహేష్, ఆ సినిమా పూర్తయిన వెంటనే సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో నటించే అవకాశం ఉంది. -
క్రిటిక్స్పై అర్జున్ రెడ్డి దర్శకుడి సంచలన వ్యాఖ్యలు
తెలుగులో సంచలన విజయం సాధించిన అర్జున్ రెడ్డి సినిమాతో పరిచయం అయిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా. తొలి సినిమాతోనే టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిన సందీప్, అర్జున్ రెడ్డి రీమేక్తో బాలీవుడ్కు పరిచయం అయ్యాడు. షాహిద్ కపూర్ హీరోగా కబీర్ సింగ్ పేరుతో రిలీజ్ అయిన అర్జున్ రెడ్డి రీమేక్ బాలీవుడ్లోనూ సంచలనాలు నమోదు చేస్తుంది. అయితే ఈ సినిమాపై బాలీవుడ్ సినీ విమర్శకులు మాత్రం పెదవి విరుస్తున్నారు. ముఖ్యంగా సినిమాలో మహిళలను తక్కువగా చూపించారని, హీరో పాత్రను ఎలాంటి గమ్యం లేకుండా కేవలం ఓ తాగుబోతుగా, తన మీద కంట్రోల్ లేని వ్యక్తిగా చూపించారని విమర్శించారు. కానీ రివ్యూలతో సంబంధం లేకుండా కబీర్ సింగ్ 200 కోట్లకు పైగా వసూళ్లు సాధించి మరిన్ని రికార్డుల దిశగా దూసుకుపోతోంది. ఈ సందర్భంగా ఫిలిం కంపానియన్ యూట్యూబ్ చానల్తో మాట్లాడిన సందీప్ రెడ్డి వంగా క్రిటిక్స్పై సంచలన వ్యాఖ్యలు చేశాడు. తన సినిమాను విమర్శించే వారంతా సూడో స్త్రీవాదులంటూ విమర్శించాడు. వీళ్లంతా ఇండస్ట్రీకి పట్టిన చీడపురుగుంటూ ఘాటుగా స్పందించాడు. సినిమాలోని టెక్నికల్ అంశాలను చర్చించకుండా కొన్ని సీన్స్ను మాత్రమే విమర్శిస్తున్నారని ఓ ప్రముఖ ఎనలిస్ట్ పేరును కూడా ప్రస్తావించాడు సందీప్ రెడ్డి వంగా. అంతేకాదు కబీర్ సింగ్ను వైలెంట్ సినిమా అంటున్నారు, నా నెక్ట్స్ సినిమాతో వైలెంట్ సినిమా అంటే ఏంటో చూపిస్తా, ఆ సినిమా చూసాక ఈ క్రిటిక్స్ స్పందన ఎలా ఉంటుందో తెలుసుకోవాలనుందన్నారు. తొలి సినిమాతోనే బాలీవుడ్ ఎనలిస్ట్లపై విమర్శలు చేసిన సందీప్పై మీడియా ప్రముఖులు ఎలా స్పందిస్తారో చూడాలి. సందీప్ ఇంటర్య్వూపై స్పందించిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, ‘ సందీప్ రెడ్డి వంగా అమాయకత్వంతో కూడిన నిజాయితీ, నిజమైన ధైర్యం కలిగిన వ్యక్తి. కబీర్ సింగ్పై ఆయన తాజా ఇంటర్వ్యూ ఓ సంచలనం’ అంటూ ట్వీట్ చేశారు. I think @imvangasandeep is the most perfect mix of innocent honesty and truthful courage ..This interview of his,is as pathbreaking as his #KabirSingh https://t.co/ai1zb0P3iy pic.twitter.com/cqzYCpy91b — Ram Gopal Varma (@RGVzoomin) 7 July 2019 -
‘అర్జున్ రెడ్డి’ని మించేలా!
లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాతో సంచలనం సృష్టించిన నిర్మాత రాకేష్ రెడ్డి మరో సినిమాకు రెడీ అవుతున్నారు. ఈ సినిమాకు సంబంధించిన తొలి ప్రకటన తిరుమల నుంచి చేశారు. రచయిత చిన్న కృష్ణ ఈ సినిమాకు కథ అందిస్తున్నట్టుగా తెలిపారు. అర్జున్ రెడ్డిని మించే కథను చిన్న కృష్ణ అందించినట్టుగా తెలిపారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయన్న రాకేష్ రెడ్డి, వచ్చేనెలలో హీరో, దర్శకులను ప్రకటిస్తామన్నారు. గురువారం ఉదయం తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న రాకేష్ రెడ్డి, చిన్నికృష్ణలు ఈ ప్రకటన చేశారు. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాతో రాకేష్ రెడ్డి ఘన విజయాన్ని అందుకున్నారు. ఈ సినిమాకు విమర్శకుల ప్రశంసలతో పాటు వసూళ్లు కూడా భారీగా రావటంతో తదుపరి చిత్రంపై దృష్టి పెట్టారు. -
‘అర్జున్ రెడ్డి’ దర్శకుడికి బంపర్ ఆఫర్!
సంచలన విజయం సాధించిన అర్జున్ రెడ్డి సినిమాతో టాలీవుడ్కు పరిచయం అయిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా. తొలి సినిమా తోనే జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న సందీప్, అర్జున్ రెడ్డి రీమేక్గా తెరకెక్కిన కబీర్ సింగ్తో బాలీవుడ్కు పరిచయం అయ్యాడు. ఇటీవల విడుదలైన ఈ సినిమాకు డివైడ్ టాక్ వచ్చినా కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఇప్పటికే 150 కోట్ల కలెక్షన్లు సాధించిన ఈ సినిమా ఏడాది టాప్ 3 గ్రాసర్స్లో నిలుస్తుందంటున్నారు విశ్లేషకులు. కబీర్ సింగ్ సక్సెస్తో సందీప్కు ఓ బంపర్ ఆఫర్ వచ్చినట్టుగా తెలుస్తోంది. కబీర్ సింగ్ సక్సెస్ గురించి విన్న సల్మాన్ ఖాన్, సందీప్తో సినిమా చేసేందుకు ఇంట్రస్ట్ చూపిస్తున్నాడట. ఈ సినిమాను టీ సిరీస్ సంస్థ నిర్మించేందుకు రెడీ అవుతున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఈవార్తలపై సల్మాన్, సందీప్ల నుంచి ఎలాంటి అధికారిక ప్రకటనా రాలేదు. -
సిడ్నీలో ఎన్నారై అర్జున్ రెడ్డి మృతి
సాక్షి, హైదరాబాద్ : సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్న తెలంగాణ వాసి అర్జున్ రెడ్డి ఆస్ట్రేలియాలోని సిడ్నీలో గుండెపోటుతో మృతి చెందాడు. మంగళవారం మధ్యాహ్నం ఈ ఘటన చోటు చేసుకుంది. గుండెపోటుకు గురైన అర్జున్ రెడ్డిని ఆస్పత్రికి తరలించగా మార్గమధ్యలో మృతి చెందారు. హైదరాబాద్లోని హయత్నగర్కు చెందిన సామ అర్జున్ రెడ్డి(36) గత కొద్ది రోజులుగా ఆస్ట్రేలియాలో నివాసం ఉంటూ ఓ ప్రముఖ కంపెనీలో సాఫ్టవేర్గా పనిచేస్తున్నారు. మంగళవారం ఉదయం కుటుంబ సభ్యులకు ఫోన్ చేసిన మాట్లాడిన అర్జున్.. మధ్యాహ్నానికి గుండెపోటుతో మృతి చెందారు. అర్జున్ మృతి వార్త వినగానే అతని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. -
నాన్న ఎప్పుడూ నా వెనకుంటారు
నటుడికి తొలి సినిమా చాలా ముఖ్యం. ఏ అడ్డంకులు లేకుండా మంచి హిట్ సాధించాలనుకోవడం సహజం. అలాంటిది ఎంతో కష్టపడి తీసిన సినిమా బాగా రాలేదని మళ్లీ మొదటి నుంచి తీయాలని నిర్మాతలు అనుకుంటే? ఆ యాక్టర్ కాన్ఫిడెన్స్లో కచ్చితంగా డిస్ట్రబెన్స్ వస్తుంది. అయితే విక్రమ్ తనయుడు ధృవ్ విక్రమ్కి ఇలా జరిగినా కాన్ఫిడెన్స్ కోల్పోలేదు. ‘అర్జున్ రెడ్డి’ తమిళ రీమేక్ ద్వారా ఇండస్ట్రీకి పరిచయం కానున్నారు ధృవ్. మొదట బాలా దర్శకత్వంలో ఈ చిత్రాన్ని ‘వర్మ’ టైటిల్తో తీశారు. ఆ చిత్రాన్ని ఆపేసి, ‘ఆదిత్యవర్మ’ పేరుతో మళ్లీ షూటింగ్ మొదలుపెట్టి, పూర్తి చేశారు. ‘ఆదిత్య వర్మ’ పూర్తి కావడం వెనక తన తండ్రి సహకారం ఉందని భావోద్వేగంతో ధృవ్ రాసిన లేఖ సారాంశం ఈ విధంగా... ‘‘సెట్ను ప్రతిరోజూ సందర్శిస్తూ, మమ్మల్ని మా శక్తిమేరకు పని చేసేలా ప్రోత్సహిస్తూ,్త, మా అందరి విజన్ను ఎప్పటికప్పుడు గైడ్ చేస్తూ నన్ను ‘ఆదిత్య వర్మ’ను చేశారు మా నాన్న. నా మీద నాకున్న నమ్మకాన్ని కోల్పోనివ్వకుండా, నా వెనకే ఉంటూ, నాకన్నీ నేర్పిస్తూ ఉన్నావు, ఉంటావు కూడా నాన్నా! నువ్వు లేకుండా ఏదీ అంత సులువుగా జరిగేది కాదు. నన్నెవరో అడిగారు.. ‘సినిమాకు అంత కష్టపడ్డారు కదా, టీజర్లో మీ నాన్నగారి పేరెక్కడా? అని. ఆయన పేరు నా పేరు వెనక, ఆయనెప్పుడూ నా వెనక ఉంటారు’ అని బదులిచ్చాను. నువ్వు గర్వపడేలా చేస్తాను నాన్నా’’ అని పేర్కొన్నారు. ‘ఆదిత్య వర్మ’ టీజర్కు మంచి రెస్పాన్స్ వస్తోంది. -
కబీర్ సింగ్ సూపర్.. షాహిద్ కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్!
ముంబై: తెలుగులో సంచలన విజయం సాధించిన ‘అర్జున్రెడ్డి’ చిత్రం బాలీవుడ్లో ‘కబీర్ సింగ్’గా రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. షాహిద్ కపూర్, కియారా అద్వానీ జంటగా నటించిన ఈ సినిమా శుక్రవారం విడుదల కాబోతోంది. అయితే, ఒకరోజు ముందే ఈ సినిమా గల్ఫ్, మిడిల్ ఈస్ట్ దేశాల్లో విడుదలైంది. దీంతో అక్కడ ఈ సినిమాను చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియాలో తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. సినిమా అద్భుతంగా ఉందని, షాహిద్ కపూర్ కెరీర్లోనే బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన సినిమా ఇదని కితాబిస్తున్నారు. అయితే, మరికొంతమంది విజయదేవరకొండ ‘అర్జున్రెడ్డి’ సినిమాలాగే ఈ సినిమా కూడా చాలావరకు ఉందని, పెద్దగా మార్పులేమీ దర్శకుడు హిందీ వర్షన్లో చేయలేదని కామెంట్ చేస్తున్నారు. ప్రేమలో విఫలమైన ఓ వైద్య విద్యార్థి స్వీయ హననానికి పాల్పడుతూ.. ఏవిధంగా మారిపోయాడు? అతని ప్రేమకథ ఎలా కొలిక్కి వచ్చిందన్న నేపథ్యంతో తెరకెక్కిన ఈ సినిమాలో ఆద్యంతం షాహిద్ అద్భుతమైన పర్ఫార్మెన్స్ కనబరిచి ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టాడని గల్ఫ్ సినీ విమర్శకుడు ఉమైర్ సంధు ట్వీట్ చేశారు. ఒక అబ్బాయి, ఒక అమ్మాయి ప్రేమలో పడి.. అంతా సజావుగా సాగిపోయే సాధారణ ప్రేమకథ చిత్రం ఇది కాదని, బాలీవుడ్లో ఇప్పటివరకు ఇలాంటి ప్రేమకథా చిత్రాన్ని చూడలేదని, షాహిద్ అద్భుతంగా నటన కనబర్చగా.. దర్శకుడు సందీప్ వంగా సినిమాను చక్కగా తెరకెక్కించారని నెటిజన్లు కొనియాడుతున్నారు. ఆ ట్వీట్ ఇక్కడ చూడొచ్చు. Saw #KabirSingh at Censor Board ! What a BOMBASTIC Film ! @shahidkapoor Stole the Show all the way. What a Film ! 👏👏👏 — Umair Sandhu (@UmairFilms) June 19, 2019 #KabirSingh review: ⭐⭐⭐⭐1/2. First of all let us tell you, this is not a normal lovestory where a boy & a girl meets & they fall in love & eventually everything goes smooth. This story is something which Bollywood never witnessed. Stunning 2nd half which reveals heroin's part — AlwaysBollywood (@AlwaysBollywood) June 20, 2019 #KabirSingh is a must watch movie!!! @shahidkapoor 's best performance so far. Mind blowing.Aur @Advani_Kiara kya baath hai 😍 An absolutely trippy film. The audience is going to go mad. The background score just compliments everything. Superb Direction by Sandeep Reddy Vanga. — Mukesh Chhabra CSA (@CastingChhabra) June 20, 2019 Shahid Kapoor 👌👌👌👌👌👌👌👌 What an outstanding perfomance Boss. Mind still quaking.#KabirSingh — Z Aaris (@iamZaidaaris) June 20, 2019 -
తమిళ ‘అర్జున్ రెడ్డి’ మెప్పిస్తాడా!
తెలుగులో సంచలన విజయం సాధించిన అర్జున్ రెడ్డి సినిమాను తమిళ, హిందీ భాషల్లో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. హిందీలో షాహిద్ కపూర్ హీరోగా ఒరిజినల్ను తెరకెక్కించిన సందీప్ రెడ్డి వంగానే తెరకెక్కించాడు. కబీర్ సింగ్ పేరుతో శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. అయితే తమిళ రీమేక్ విషయంలో మాత్రం విమర్శలు వినిపిస్తున్నాయి. విక్రమ్ తనయుడు ధృవ్ విక్రమ్ హీరోగా పరిచయం అవుతున్న ఈ సినిమాకు ముందుగా బాలా దర్శకత్వం వహించారు. అయితే అవుట్పుట్ విషయంలో నిర్మాతలకు సంతృప్తి కలగకపోవటంతో అర్జున్ రెడ్డి సినిమాకు దర్శకత్వ శాఖలో పనిచేసిన గిరీశయ్య దర్శకత్వంలో తిరిగి రూపొందించారు. ఆదిత్య వర్మ పేరుతో రెడీ అవుతున్న ఈ సినిమా టీజర్ ఇటీవల రిలీజ్ అయ్యింది. అయితే ఈ సారి కూడా ఆదిత్య వర్మ ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయాడు. ముఖ్యంగా హీరో పాత్రకు ధృవ్ వయసు సరిపోలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మెడిసిన్, పీజీ పూర్తి చేసిన వ్యక్తిగా ధృవ్ కనిపించటంలేదంటున్నారు విశ్లేషకులు. నటన పరంగా మెప్పించినా లుక్ కన్విన్సింగ్గా లేకపోతే కష్టమే అంటున్నారు. మరి ఈ విమర్శల నేపథ్యంలో తమిళ అర్జున్ రెడ్డి ఎంతవరకు మెప్పిస్తాడో చూడాలి. -
ఇది షాహిద్ సినిమా కాదు!
విజయ్ దేవరకొండ, షాలినీ పాండే జంటగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన ‘అర్జున్ రెడ్డి’ సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ చిత్రం షాహిద్ కపూర్, కియారా అద్వాని జంటగా సందీప్ దర్శకత్వంలోనే ‘కబీర్సింగ్’ పేరుతో హిందీలో రీమేక్ అయింది. ఈ నెల 21న చిత్రం విడుదల కానున్న సందర్భంగా షాహిద్, కియారా చెప్పిన విశేషాలు. ► ‘కబీర్సింగ్’ చిత్రం కోసం తిరిగి కాలేజీకి వెళ్లడాన్ని ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా భయం వేసింది. ఎందుకంటే ఇందులో నేను దాదాపు పాతికేళ్ల కుర్రాడిలా కనిపించాలి. ఇప్పుడే వచ్చిన కొత్త హీరో అనే ఫీల్ని ఆడియన్స్కి కలగజేయాలి. ఈ సినిమాలోలా రియల్ లైఫ్లోనూ నేను ఎమ్బీబీఎస్ స్టూడెంట్ కావడంతో ఈజీ అయింది. టీజర్ చూసినవాళ్లు కాలేజీ స్టూడెంట్లానే ఉన్నారని చెప్పగానే ఆనందం అనిపించింది. అయితే ఈ చిత్రంలో కనిపిస్తున్నట్లు నా వయసు పాతికేళ్లు కాదు. ► తెలుగు ‘అర్జున్రెడ్డి’ సినిమా చూశారా? చూశాను. బాగా నచ్చింది. సినిమాలోని క్యారెక్టర్, ఎమోషనల్ థింగ్స్కి బాగా కనెక్ట్ అయ్యాను. ఈ ఫిల్మ్ మేకింగ్ని ఎంజాయ్ చేశాను. హీరోది చాలా గొప్ప పాత్ర. విజయ్ బాగా చేశాడు. ► ‘అర్జున్రెడ్డి’ అప్పుడు విజయ్ చేసింది తక్కువ సినిమాలు. మీరు 30కి పైగా సినిమాలు చేశారు కాబట్టి అంచనాలు ఉంటాయి. ప్రెషర్ ఏమైనా? ఇలాంటి సబ్జెక్ట్ను కొత్త హీరో అయితే డిఫరెంట్ ఎనర్జీతో చేస్తారు. అలాగే నాలాంటి ఎస్టాబ్లిష్డ్ యాక్టర్ ఇలాంటి క్యారెక్టర్ చేసినప్పుడు కూడా డిఫరెంట్గానే ట్రై చేస్తారు. అయితే ఎస్టాబ్లిష్డ్ యాక్టర్స్కు ఇలాంటి క్యారెక్టర్స్ చేయడం కొంచెం కష్టం అనిపించొచ్చు. ఎందుకంటే ఆల్రెడీ ఆడియన్స్ ఒకసారి సినిమా చూశారు. అంతకంటే ఎక్కువ పెర్ఫార్మెన్స్ ఇవ్వాలి. అయినా ఈ సినిమా వరకూ ఆడియన్స్ ఇందులోని క్యారెక్టర్ని చూస్తారు. మన గురించి అంతగా ఆలోచించరు. కథ అలాంటిది. అందుకే ఇది షాహిద్ కపూర్ సినిమా కాదు. కబీర్ సింగ్ సినిమా. అఫ్కోర్స్ ఈ పాత్ర చాలెంజింగ్ అని మాత్రం ఒప్పుకుంటాను. ► ఈ రీమేక్ ఆలోచన మీకు వచ్చిందా? ‘అర్జున్రెడ్డి’ని ఒకరు చూపించారు. చాలా బాగుందనిపించింది. అయితే మనం చేసి ఇప్పుడు స్పాయిల్ చేయడం ఎందుకు అనుకున్నా. కానీ ఎప్పుడైతే సందీప్రెడ్డి హిందీ రీమేక్ పట్ల ఇంట్రెస్ట్గా ఉన్నారని తెలిసిందో అప్పుడు చేయాలనిపించింది. అతని వర్క్ బాగా నచ్చింది. ఓ మంచి సినిమాని ఎక్కువమంది చూడాలని కోరుకునే మనస్తత్వం నాది. ఈ సినిమాను హిందీ ఆడియన్స్ నా వల్ల చూస్తారు అన్నప్పుడు నాకు హ్యాపీగా అనిపించింది. ► ‘కబీర్సింగ్’ ట్రైలర్ని ప్రభాస్ ప్రశంసించారు.. నాకు, ప్రభాస్కు హకీమ్ హెయిర్ స్టైలిష్గా ఉన్నారు. ప్రభాస్ గురించి చాలా విన్నాను. సో కైండ్. ట్రైలర్ని అభినందిస్తూ ప్రభాస్ నాతో మాట్లాడారు. తనతో మాట్లాడటం అదే ఫస్ట్ టైమ్. ► అర్జున్రెడ్డి, కబీర్సింగ్లకు పోలికలు పెడతారు. ఆ విషయం గురించి ఏమంటారు? పోలిక పెట్టకూడదు. ఎందుకంటే ఒకటి బాగుందంటే అది ఎప్పటికీ బాగున్నట్లే. దానికి ఆ గౌరవం ఇవ్వాలి. ‘అర్జున్ రెడ్డి’ బాగుంది. అలాంటప్పుడు ‘కబీర్సింగ్’తో పోలికపెట్టడం దేనికి? అర్జున్రెడ్డి నాకూ నచ్చింది. ఇప్పుడు ‘కబీర్..’ని ప్రేక్షకులు కొత్త సినిమా అనుకుని చూడాలి. ► ‘ఉడ్తా పంజాబ్, కబీర్సింగ్, కమీనే’.. ఇలా డార్క్ రోల్స్ ఎక్కువగా చేస్తున్నట్లున్నారు? డార్క్, లైట్ అని కాదు భిన్నమైన పాత్రలు చేయడానికి నేను ఇష్టపడతాను. కానీ అవుటాఫ్ ది బాక్స్ కంటెంట్ ఉన్న సినిమాలు చేసి ఆడియన్స్ని సర్ప్రైజ్ చేయడంలో ఉన్న ఫీల్ని ఎంజాయ్ చేయడానికి డిఫరెంట్ రోల్స్ చేయాలనుకుంటాను. ► ‘కబీర్ సింగ్’లో రొమాంటిక్ సీన్స్ ఎక్కువ. మరి మీ ఆవిడ మీరా దగ్గర పర్మిషన్ తీసుకున్నారా? నిజానికి ‘అర్జున్రెడ్డి’ సినిమా తనకు నచ్చింది. ఈ పాత్ర నీ కెరీర్కు ఫ్లస్ అవుతుందని తనే చెప్పింది. ఈ వృత్తిలో ఉన్న విషయాలను అర్థం చేసుకునే పరిణితి తనకు ఉంది. ► ‘కబీర్సింగ్’ లవ్లో ఫెయిలై, ఫైనల్లీ ప్రేమికురాలిని దక్కించుకుంటాడు. రియల్ లైఫ్లో మీకూ లవ్ ఫెయిల్యూర్స్ ఉన్నాయి కదా? అందరి జీవితాల్లో ఉన్నట్లే నా లైఫ్లోనూ కొన్ని లవ్ ఫేజెస్ ఉన్నాయి. అది కామన్ (నవ్వుతూ). ► కియారా అద్వానీ మాట్లాడుతూ – ‘‘హిందీ రీమేక్ ఒప్పుకోక ముందు ‘అర్జున్ రెడ్డి’ సినిమా చూశాను. సైన్ చేశాక మాత్రం చూడలేదు. ఎందుకంటే ఆ ప్రభావం నా నటన మీద పడే అవకాశం ఉంది. క్యారెక్టర్ని నా స్టైల్లో నేను చేయాలనుకున్నాను. కథానుగుణంగానే ఈ సినిమాలో రొమాంటిక్ సీన్స్ ఉంటాయి. ఇప్పుడు ప్రేమికులను తీసుకుందాం. వాళ్ల మధ్యమాటలతో పాటు రొమాన్స్ కూడా ఉంటుంది కదా. సినిమాలో షాహిద్, నేను ప్రేమికులం కాబట్టి మా మధ్య రొమాన్స్ ఉంటుంది. అవి లేకుండా ప్రేమ ఉండదు. షాహిద్ కపూర్ నటించిన కొన్ని సినిమాలు నేను చూశాను. అన్నింటికన్నా ‘కబీర్సింగ్’లో ‘ది బెస్ట్ పర్ఫార్మెన్స్’ ఇచ్చాడు. ఓ 25, 30 సినిమాలు చేశాక కాలేజీ సబ్జెక్ట్ చేయడం అంటే చిన్న విషయం కాదు. కొత్త హీరో అనిపించేలా చేశాడు. సందీప్ రెడ్డి అమేజింగ్ డైరెక్టర్ అనాలి. అసలు కథే వండర్ఫుల్ అంటే పాత్రలను ఆయన మలిచిన తీరూ అద్భుతమే. -
ఆదిత్య వర్మ రెడీ
‘అర్జున్ రెడ్డి’ తమిళ రీమేక్ పడాల్సిన ఇబ్బందులు పడింది. చూడాల్సిన చిక్కులు చూసేసింది. ఇక ఆడియన్స్ సినిమా చూడటమే తరువాయి. ఈ రీమేక్ ద్వారా విక్రమ్ కుమారుడు ధృవ్ విక్రమ్ హీరోగా పరిచయం అవుతున్నారు. తొలుత ఈ సినిమాని ‘వర్మ’ టైటిల్తో బాలా డైరెక్ట్ చేశారు. అవుట్పుట్ నచ్చలేదని నిర్మాణ సంస్థ మళ్లీ మొదటి నుంచి షూటింగ్ మొదలెట్టారు. ప్రస్తుతం వర్మ టైటిల్ను ‘ఆదిత్య వర్మ’గా మార్చి గిరీశయ్య దర్శకత్వం వహిస్తున్నారు. ఒరిజినల్ ‘అర్జున్ రెడ్డి’ డైరెక్షన్ డిపార్ట్మెంట్లో గిరీశయ్య పని చేయడం విశేషం. ఇందులో బన్నితా సంధు, ప్రియా ఆనంద్ కథానాయికలు. ఈ చిత్రం ఫస్ట్ లుక్ రిలీజ్ అయింది. టీజర్ ఆదివారం రిలీజ్ అయింది. ఈ సినిమా షూటింగ్ పూర్తయిందట. రిలీజ్కు ‘ఆదిత్య వర్మ’ రెడీ అంటోంది చిత్రబృందం. -
తమిళ ‘అర్జున్ రెడ్డి’ టీజర్ వచ్చేసింది!
తెలుగులో సంచలన విజయం సాధించిన అర్జున్ రెడ్డి సినిమాను తమిళ, హిందీ భాషల్లో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా హిందీ రీమేక్ జూన్ 21న ప్రేక్షకుల ముందుకు రానుండగా తమిళ వర్షన్ షూటింగ్ కూడా చివరి దశకు చేరుకుంది. తమిళ్లో ఆదిత్య వర్మ పేరుతో రిలీజ్ అవుతున్న ఈ సినిమాతో విక్రమ్ తనయుడు ధృవ్ విక్రమ్ హీరోగా పరిచయం అవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభించిన ఆదిత్యవర్మ యూనిట్ టీజర్ను రిలీజ్ చేశారు. పెద్దగా మార్పులు చేర్పులు చేయకుండా దాదాపు ఒరిజినల్ లానే తెరకెక్కించారు. సన్నివేశాలు హీరో యాటిట్యూడ్ లాంటివి యాజిటీజ్గా దించేశారు. టీజర్లో లుక్స్, యాక్టింగ్ పరంగా ధృవ్ ఆకట్టుకున్నాడు. ముందుగా ఈ సినిమాను సీనియర్ దర్శకుడు బాలా తెరకెక్కించగా అవుట్పుట్ నచ్చకపోవటంతో చిత్రయూనిట్ గిరీశయ్య దర్శకత్వంలో పూర్తి సినిమాను తిరిగి రూపొందించారు. ధృవ్ సరసన బనిటా సంధు హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాను ఈ4 ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై నిర్మిస్తున్నారు. -
మహేష్తో మూవీపై సందీప్ క్లారిటీ
ఇటీవల మహర్షి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో సరిలేరు నీకెవ్వరు చిత్రం చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఇటీవల లాంచనంగా ప్రారంభమైన ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. అనిల్ సుంకర, దిల్రాజు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో మహేష్కు జోడిగా రష్మిక మందన్న నటిస్తున్నారు. మహేష్ ‘సరిలేరు నీకెవ్వరు’ తరువాత చేయబోయే సినిమాపై కూడా చర్చ మొదలైంది. చాలా కాలంగా అర్జున్ రెడ్డి ఫేం సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో మహేష్ ఓ సినిమా చేయనున్నాడన్న టాక్ వినిపిస్తోంది. అయితే ఈ విషయంపై సందీప్ క్లారిటీ ఇచ్చాడు. ప్రస్తుతం అర్జున్ రెడ్డి బాలీవుడ్ రీమేక్ కబీర్ సింగ్ పనుల్లో బిజీగా ఉన్న సందీప్, ఇప్పటికే మహేష్కు కథ వినిపించినట్టుగా తెలిపాడు. లైన్ మహేష్కు నచ్చటంతో పూర్తి కథ సిద్ధం చేయమన్నారని, పూర్తి కథ చెప్పిన తరువాతే సినిమాపై క్లారిటీ వస్తుందని వెల్లడించారు. షాహిద్ కపూర్, కియారా అద్వానీ హీరో హీరోయిన్లుగా నటించిన కబీర్ సింగ్ జూన్ 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
ఆదిత్యవర్మగా ‘అర్జున్ రెడ్డి’
సాక్షి, న్యూఢిల్లీ : భారతీయ చలనచిత్ర పరిశ్రమలోనే కొత్త చరిత్రను సష్టించిన అలనాటి బెంగాలీ ‘దేవదాస్ (1935)’ చిత్రానికి, తెలుగులో వచ్చిన ఇప్పటి ‘అర్జున్ రెడ్డి’ చిత్రాలకే కాకుండా వాటిలో నటించిన దర్శక నటుడు ప్రమతేష్ చంద్ర బారువా (పీసీ బారువా)కు, విజయ దేవరకొండకు మధ్య పలు విషయాల్లో పోలికలు ఉన్నాయి. ఈ రెండు చిత్రాల్లో నటించిన హీరోలు రాత్రికి రాత్రి స్టార్ హీరోలయ్యారు. నాటి దేవదాస్, నేటి అర్జున్ రెడ్డి చిత్రాల్లో హీరోలిద్దరు భగ్న ప్రేమిక పాత్రలే. హదయాన్ని కలచివేస్తోన్న ప్రేమానుభూతులను మద్యం మత్తులో మరచిపోయేందుకు ప్రయత్నించే పాత్రలే. నాటి దేవదాస్ చిత్రంతో చలనచిత్రాలు కేవలం వినోదానికి మాత్రమే పరిమితమన్న భావన నుంచి సామాజిక స్పహ కూడా ఉంటుందన్న కొత్త భావాన్ని జనంలోకి తీసుకెళ్లింది. అలాగే అర్జున్రెడ్డి చిత్రానికి కూడా కాలేజీలు మన కళ్ల ముందు కనిపించే వాస్తవ పరిస్థితులకు అద్దం పట్టిందన్న ప్రశంస కూడా వచ్చింది. నాటి ‘దేవదాస్’ చిత్రంతో దాన్ని రాసిన ప్రముఖ బెంగాలీ కవి శరత్ చంద్ర చటోపాధ్యాయ్ పేరు కూడా బెంగాల్ రాష్ట్రంలో ఇంటింట తెల్సింది. అప్పటి వరకు పెద్దగా చిత్రాలను పట్టించుకోని శరత్ చంద్ర అప్పటి నుంచి దక్షిణ కోల్కతాలోని ‘న్యూ థియేటర్స్ స్టుడియో’కు తరచుగా వెళ్లడం ప్రారంభించారట. ఆ తర్వాత పీసీ బారువా అంటే దేవదాస్, దేవదాస్ అంటే పీసీ బారువాగా పేరు పడింది. దాంతో బారువా ఆ చిత్రాన్ని హిందీలో తీయాలనుకున్నారు. అయితే తన హిందీ ఉచ్ఛారణ బాగుండదని తలచి, అప్పటికే పాటలతో పరిచయమున్న కేఎల్ సైగల్ హీరోగా హిందీ ‘దేవదాస్’ తీశారు. అది కూడా ప్రేక్షకుల ప్రజాదరణ పొందడమే కాకుండా కమర్షియల్గా సక్సెస్ అయింది. ఆ తర్వాత అక్కినేని నాగేశ్వరరావు హీరోగా తెలుగులో వచ్చిన ‘దేవదాసు’ కూడా సూపర్డూపర్ హిట్టయింది. ఆ తర్వాత హిందీలోనే దిలీప్కుమార్, షారూక్ ఖాన్లు హీరోలుగా దేవదాస్ చిత్రాలు వచ్చాయి. నాటి బెంగాలీ దేవదాస్కు, అర్జున్రెడ్డి చిత్రాలకు మరో పోలిక కూడా ఉంది. అదే దేవదాస్ చిత్రం ద్వారా రచయిత శరత్ చంద్ర పేరు ఇల్లిళ్లు తెలిసిపోగా, అర్జున్రెడ్డి చిత్రం ద్వారా ఎవరికి తెలియని ఆ సినిమా కథా రచయిత ‘సందీప్ రెడ్డి వంగా’ గురించి తెలుగు ప్రేక్షకులకు తొలిసారి తెలిసింది. ఆయనకు అర్జున్రెడ్డి కథ రాయడానికి రెండేళ్లు పట్టగా, అది సినిమాగా రావడానికి మరో నాలుగేళ్లు (2017) పట్టింది. ఇప్పుడు అదే కథ ఆధారంగా హిందీలో షాహిద్ కపూర్ హీరోగా ‘కబీర్ సింగ్’ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా ఈనెల 21వ తేదీన విడుదలవుతోంది. మరోపక్క ఇదే కథతో ‘ఆదిత్య వర్మ’ చిత్రం తమిళంలో నిర్మాణం అవుతోంది. ఆ సినిమాలో ‘ధృవ్ విక్రమ్’ హీరోగా పరిచయం అవుతున్నారు. -
తమిళ ‘అర్జున్ రెడ్డి’ రెడీ!
టాలీవుడ్లో సెన్సేషన్ సృష్టించిన అర్జున్ రెడ్డి సినిమా తమిళ, హిందీ భాషల్లో రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే హిందీ రీమేక్ కబీర్ సింగ్ పేరుతో రిలీజ్కు రెడీ అవుతుండగా తమిళ అర్జున్ ఆదిత్మ వర్మ కూడా షూటింగ్ పూర్తి చేసుకుంది. ముందుగా ఈ సినిమాను సీనియర్ డైరెక్టర్ బాల దర్శకత్వంలో తెరకెక్కించారు. అయితే బాల దర్శకత్వంలో రూపొందిన సినిమా అవుట్పుట్ నిర్మాతలకు నచ్చకపోవటంతో పూర్తి సినిమాను పక్కన పెట్టేసి గిరీశయ్య దర్శకత్వంలో తిరిగి షూట్ చేశారు. 50 రోజుల పాటు నాన్స్టాప్గా షూటింగ్ చేసి సినిమాను పూర్తి చేశారు. ఈ సినిమాతో విక్రమ్ తనయుడు ధృవ్ హీరోగా పరిచయం అవుతుండగా బాలీవుడ్ బ్యూటీ బాణిత సంధు హీరోయిన్గా నటిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు త్వరలో ప్రారంభించనున్నారు. -
‘అర్జున్ రెడ్డి’ని చూసి సిగ్గుపడాలి : విజయ్ దేవరకొండ
టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్కు నాంధి పలికిన సినిమా అర్జున్ రెడ్డి. బోల్డ్ కంటెంట్తో సంచలన విజయం సాదించిన ఈ సినిమాతో విజయ్ దేవరకొండ సెన్సేషనల్ స్టార్గా పేరు తెచ్చుకున్నాడు. విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ సినిమాను ప్రస్తుతం తమిళ, హిందీ భాషల్లో రీమేక్ చేస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన విజయ్ దేవరకొండ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. నటుడిగా మీ గోల్స్ ఏంటీ అన్న ప్రశ్నకు సమాధానంగా ‘నేను కొన్నేళ్ల తరువాత అర్జున్ రెడ్డి సినిమా చూస్తే సిగ్గుపడాలి. కొన్ని సంవత్సరాల తరువాత కూడా నా కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ అర్జున్ రెడ్డే అంటే నటుడిగా నేను ఏ మాత్రం ఇంప్రూవ్ కాలేదని అర్ధం. నటుడిగా నేను ఇంకా ఎంతో సాధించాలి’ అన్నాడు. టాలీవుడ్తో పాటు దక్షిణాది భాషలన్నింటి మీద దృష్టి పెట్టిన విజయ్ దేవరకొండ ప్రస్తుతం డియర్ కామ్రేడ్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ఒకేసారి రిలీజ్ కానుంది. రష్మిక మందన్న హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాకు భరత్ కమ్మ దర్శకుడు. -
కబీర్సింగ్ డేట్ ఫిక్స్
విజయ్ దేవరకొండ, షాలినీపాండే జంటగా సందీప్రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అర్జున్రెడ్డి’. ఈ సినిమా ఎంత ఘనవిజయం సాధించిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. అందుకే ఈ సినిమాని ఇతర భాషల్లో రీమేక్ చేస్తున్నారు. హిందీలో షాహిద్ కపూర్ హీరోగా ‘కబీర్ సింగ్’ పేరుతో రీమేక్ చేస్తున్నారు. ‘అర్జున్రెడ్డి’కి దర్శకత్వం వహించిన సందీప్రెడ్డి వంగానే ‘కబీర్ సింగ్’ ని తెరకెక్కించడం విశేషం. భూషణ్ కుమార్, మురాద్ ఖేతాని, క్రిషణ్ కుమార్, అశ్విన్ వర్డే నిర్మించిన ఈ చిత్ర ట్రైలర్ను సోమవారం విడుదల చేశారు. ‘అర్జున్రెడ్డి’లోని అనుభూతిని ఎక్కడా మిస్ కాకుండా ‘కబీర్సింగ్’ తెరకెక్కించారని ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. జూన్ 21న ఈ సినిమాని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. తెలుగులో బ్లాక్బస్టర్గా నిలిచిన ఈ చిత్రం బాలీవుడ్లో ఎంతటి సెన్సేషన్ సృష్టిస్తుందే వేచి చూడాలి. -
ట్వీట్లోనూ అదే యాటిట్యూడ్
అర్జున్ రెడ్డి సినిమాతో సంచలన విజయం సాధించిన యంగ్ హీరో విజయ్ దేవరకొండ... తరువాత కూడా తనదైన యాటిట్యూడ్తో టాలీవుడ్లో స్టార్ గా ఎదుగుతున్నాడు. తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ తన మార్కెట్ పెంచుకునే పనిలో ఉన్న విజయ్ తన సినిమాల ప్రమోషన్ విషయంలోనూ అంతా తానే అయి వ్యవహరిస్తున్నాడు. త్వరలో రిలీజ్కు రెడీ అవుతున్న డియర్ కామ్రేడ్ సినిమాలోని సెకండ్ సింగిల్ ఆదివారం విడుదల కానుంది. అయితే విషయాన్ని తన ట్విటర్లో ప్రకటించిన విజయ్ ఏకంగా ఆ పాటను సాంగ్ ఆఫ్ ద ఇయర్ అనేశాడు. ఇప్పటికే రిలీజ్ అయిన తొలి పాటకు సూపర్బ్ రెస్పాన్స్ రావటంతో సెకండ్ సింగిల్ పై మంచి అంచనాలే ఉన్నాయి. అయితే పాట రిలీజ్ కాకముందే విజయ్ సాంగ్ ఆఫ్ ద ఇయర్ అని ప్రకటించటంపై భిన్న స్పందనలు వినిపిస్తున్నాయి. భరత్ కమ్మ దర్శకత్వంలో తెరకెక్కిన డియర్ కామ్రేడ్ జూలై 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. విజయ్ విద్యార్థి నాయకుడిగా నటిస్తున్న ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్. మైత్రీ మూవీ మేకర్స్, బిగ్ బెన్ సినిమాస్ సంస్థలు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. This Sunday. The 12th of May. You will experience what I call "The Song of the Year"#DearComrade pic.twitter.com/zZg2QTBTSu — Vijay Deverakonda (@TheDeverakonda) 9 May 2019 -
'డిగ్రీ కాలేజీ'లో విశృంఖలత్వం..
ముషీరాబాద్: ప్రస్తుతం విడుదలవుతున్న కొన్ని సినిమాలలో ఆశ్లీల దృశ్యాలు చాలా అభ్యంతరకరంగా ఉంటున్నాయిని, అర్జున్రెడ్డి, ఆర్ఎక్స్ 100 లాంటి సినిమాలతో మరింత అశ్లీలత పెరిగిందని, నేడు ‘డిగ్రీ కాలేజీ’ పేరుతో వస్తున్న సినిమాలో మరింత విశృంఖలత్వంతో కూడిన దృశ్యాలున్నాయని ప్రగతిశీల యువజన సంఘం (పీవైఎల్) నాయకులు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ సినిమా ఇటీవల ట్రైలర్ మూడు నిమిషాలే ఉందని, దానిని చూస్తేనే ఈ సినిమా ఎలా ఉండబోతుందో తెలుస్తోందన్నారు. బుధవారం పీవైఎల్ నాయకులు సెంట్రల్ బోర్డు ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్, రీజినల్ ఆఫీసర్ రాజశేఖర్కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ప్రగతిశీల యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.ప్రదీప్ మాట్లాడుతూ... సినిమాలలో వస్తున్న శృంగార విశృంఖలత్వం చూసి యువత చెడిపోయే ప్రమాదముందన్నారు. ఇలాంటివి భవిష్యత్తులో పునరావృతం కాకుండా చూడాలని సెన్సార్ బోర్డును డిమాండ్ చేశారు. పీవైఎల్ నాయకులు కె.రాజేందర్, డివిఎస్.కృష్ణ, ఎం.ఆంజనేయులు, రాకేశ్రెడ్డి, అశోక్, సమీర్, సాయి, సందీప్ పాల్గన్నారు. -
హిందీ ‘అర్జున్ రెడ్డి’ ట్రైలర్ వచ్చేస్తోంది!
టాలీవుడ్లో సంచలన విజయం సాధించిన అర్జున్ రెడ్డి సినిమా బాలీవుడ్లో రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. ఒరిజినల్ వర్షన్ను డైరెక్ట్ చేసిన సందీప్ రెడ్డి వంగా ఈ సినిమాకు కూడా దర్శకత్వం వహిస్తున్నాడు. కబీర్ సింగ్ పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో షాహిద్ కపూర్, కియారా అద్వానీలు హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇటీవల షూటింగ్ పూర్తి చేసుకున్న ఈసినిమా ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఇప్పటికే ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభించిన చిత్రయూనిట్ ఇటీవల టీజర్ను రిలీజ్ చేశారు. అర్జున్ రెడ్డి స్టైల్లోనే కట్ చేసిన టీజర్కు బాలీవుడ్లో సూపర్బ్ రెస్సాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్కు ముహూర్తం ఫిక్స్ చేశారు చిత్రయూనిట్. ఈ నెల 13న కబీర్ సింగ్ ట్రైలర్ రిలీజ్ కానుంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి జూన్ 21న సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. Trailer out on 13th May! #KabirSingh@Advani_Kiara @imvangasandeep @itsBhushanKumar @MuradKhetani #KrishanKumar @ashwinvarde @TSeries @Cine1Studios @KabirSinghMovie pic.twitter.com/RnrRsAtibv — Shahid Kapoor (@shahidkapoor) 8 May 2019 -
అర్జున్రెడ్డి విడుదలకు సిద్ధం
సినిమా: అర్జున్రెడ్డి ఈ పేరు తెలుగు సినీరంగంలో సంచలనం సృష్టించింది. ఇప్పుడు తమిళంలోకి రానుంది. విజయ్దేవరకొండ నటించిన తెలుగు చిత్రం అర్జున్రెడ్డి. ఈ చిత్రం తెలుగులోనే కాకుండా తమిళనాట విడుదలై వసూళ్ల వర్షం కురిపించింది. కాగా అదే విజయ్దేవరకొండ నేరుగా తమిళంలో నటించిన నోటా చిత్రం మంచి పేరు తెచ్చుకుంది. ఆయన హీరోగా నటించిన మరో తెలుగు చిత్రం ద్వారక. ఈ చిత్రానిప్పుడు అర్జున్రెడ్డి పేరుతో తమిళంలోకి శ్రీ లక్ష్మీజ్యోతి క్రియేషన్స్ పతాకంపై ఏఎన్.బాలా అనువదిస్తున్నారు. ఈ చిత్రం గురించి ఆయన తెలుపుతూ ఇందులో విజయ్దేవరకొండకు జంటగా పూజాజవేరి నటించగా, ఇతరు ముఖ్య పాత్రల్లో ప్రకాశ్రాజ్, బాహుబలి ప్రభాకర్, మురళీశర్మ, సురేశ్వాణి పృథ్వీరాజ్ నటించారన్నారు. అర్జున్రెడ్డి పూర్తి వినోదభరితంగా సాగే కథా చిత్రంగా ఉంటుందన్నారు. చిత్రాన్ని సమ్మర్ స్పెషల్గా త్వరలోనే విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు. అర్జున్రెడ్డి కుటుంబ సమేతంగా చూసి ఆనందించే చిత్రంగా ఉంటుందని నిర్మాత తెలిపారు. దీనికి శ్యామ్ కే.నాయుడు ఛాయాగ్రహణం, సాయి కార్తీక్ సంగీతాన్ని అందించారు. -
జెట్ స్పీడులో తమిళ ‘అర్జున్ రెడ్డి’
టాలీవుడ్లో సంచలన విజయం సాధించిన అర్జున్ రెడ్డి సినిమాను ఇతర భాషల్లో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే హిందీ రీమేక్ షూటింగ్ పూర్తి చేసుకొని నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. తాజాగా తమిళ అర్జున్ రెడ్డికి సంబంధించిన అప్డేట్ ఒకటి ఆసక్తికరంగా మారింది. ముందుగా బాల దర్శకత్వంలో ఈ రీమేక్ చిత్రీకరించారు. కానీ అవుట్ పుట్ నచ్చకపోవటంతో ఆ వర్షన్ పూర్తిగా పక్కన పెట్టేసి కొత్తగా కొత్త దర్శకుడితో సినిమా మొత్తం రీషూట్ చేస్తున్నారు. అర్జున్ రెడ్డి ఒరిజినల్ వర్షన్కు దర్శకత్వ శాఖలో పని చేసిన గిరీశయ్య దర్శకత్వంలో ఆదిత్య వర్మ పేరుతో ఈ రీమేక్ తెరకెక్కుతోంది. ఇటీవల ప్రారంభమైన ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే 65 శాతానికి పైగా పూర్తయినట్టుగా తెలుస్తోంది. విక్రమ్ తనయుడు ధృవ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో బనితా సందు హీరోయిన్ నటిస్తోంది. రథన్ సంగీతమందిస్తున్నాడు. అన్నికార్యక్రమాలు పూర్తి చేసి జూన్లో సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. -
ఫారిన్లో పాట
తెలుగు సెన్సేషన్ ‘అర్జున్ రెడ్డి’ తమిళ రీమేక్ ‘ఆదిత్యవర్మ’లో విక్రమ్ తనయుడు ధ్రువ్ విక్రమ్ నటిస్తున్న విషయం తెలిసిందే. గిరీశాయ దర్శకత్వంలో రూపొందుతోంది. హిందీ చిత్రం ‘అక్టోబర్’ ఫేమ్ బన్నితా సాంధు ఈ చిత్రంలో హీరోయిన్గా నటిస్తున్నారు. నటి ప్రియా ఆనంద్ ఓ కీలక పాత్రలో కనిపిస్తారు. ముకేశ్ మెహతా నిర్మిస్తున్నారు. ఈ సినిమా సాంగ్ షూటింగ్ ప్రస్తుతం పోర్చుగల్లో జరుగుతోంది. ‘‘చాలా వేగంగా చిత్రీకరణ జరుగుతోంది. పోర్చుగల్లో సాంగ్ షూట్ చేస్తున్నాం. 65 శాతం సినిమా పూర్తయింది. ఈ మధ్యే సినిమా ప్రారంభించాం. అంతలోనే 65 శాతం పూర్తి చేశాం. రికార్డు టైమ్’’ అన్నారు సినిమాటోగ్రఫర్ రవి. కె. చంద్రన్. ఇది వరకు ‘అర్జున్రెడ్డి’ తమిళ రీమేక్ ధ్రువ్ హీరోగా బాల దర్శకత్వంలో ‘వర్మ’ పేరుతో ప్రారంభమై, రిలీజ్కి రెడీ అయిన విషయం తెలిసిందే. కాకపోతే అవుట్పుట్ తాము ఆశించినట్లుగా రాలేదని భావించిన ఈ4 ఎంటర్టైన్మెంట్స్ సంస్థ వారు సినిమా మొత్తాన్ని రీ–షూట్ చేస్తున్నట్లు ప్రకటించారు. ‘ఆదిత్య వర్మ’గా టైటిల్ని మార్చారు. పూర్తయిన సినిమాని మళ్లీ మొదలుపెట్టి, తీయడం అరుదుగా జరుగుతుంటుంది. ఈ చిత్రాన్ని జూలైలో విడుదల చేయాలనుకుంటున్నారు. -
కబీర్ సింగ్కు ప్రభాస్ ప్రశంసలు
‘అర్జున్ రెడ్డి’ హిందీ రీమేక్ ‘కబీర్ సింగ్’ టీజర్ ఇటీవల రిలీజైంది. కబీర్ సింగ్గా నటించిన షాహిద్ కపూర్కు అభినందనలు కురిపిస్తోంది బాలీవుడ్. టీజర్లో షాహిద్ను చూసి మన ‘బాహుబలి’ ప్రభాస్ కూడా ఫ్లాట్ అయిపోయారట. షాహిద్ను పర్సనల్గా అభినందించారట కూడా. షాహిద్కు, ప్రభాస్కు కనె„ý న్ ఎక్కడ కుదిరిందీ అనుకుంటున్నారా? ఇద్దరి హైయిర్ స్టైలిస్ట్ ఒక్కరే. ప్రభాస్ ‘సాహో’ సినిమాకు హెయిర్ స్టైలిస్ట్గా వ్యవహరిస్తున్నారు హకీమ్ అలీ. షాహిద్ పర్సనల్ హెయిర్ స్టైలిస్ట్ కూడా ఇతనే. ‘సాహో’ షూటింగ్ టైమ్లో ‘కబీర్ సింగ్’ టీజర్ రిలీజ్ అయింది. టీజర్ చూసిన ప్రభాస్, ‘సాహో’ బృందం చాలా బావుందని మాట్లాడుకోవడం హకీమ్ అలీ చెవిలో పడింది. వెంటనే షాహిద్కు కాల్ చేసి ఫోన్ ప్రభాస్ చేతిలో పెట్టారట. ‘‘టీజర్ చాలా బావుందని సుమారు 7 నిమిషాల పాటు షాహిద్, ప్రభాస్ మాట్లాడుకున్నారు’’ అని హకీమ్ అలీ పేర్కొన్నారు. ‘కబీర్ సింగ్’ జూన్ 21న రిలీజ్ కానుంది. తెలుగు వెర్షన్ను డైరెక్ట్ చేసిన సందీప్ రెడ్డి హిందీ రీమేక్ను డైరెక్ట్ చేశారు. కియారా అద్వానీ హీరోయిన్. -
అప్పుడు టెంపర్ రీమేక్లో.. ఇప్పుడు అర్జున్ రెడ్డి రీమేక్లో..
-
హిందీ ‘అర్జున్ రెడ్డి’ టీజర్ వచ్చేసింది!
టాలీవుడ్ లో సంచలన విజయం సాధించిన బోల్డ్ మూవీ అర్జున్ రెడ్డి. విజయ్ దేవరకొండ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కిన ఈసినిమా ఎన్నో వివాదాల మధ్య విడుదలై భారీ వసూళ్లు సాధించింది. అంతేకాదు ప్రముఖుల ప్రశంసలు కూడా దక్కటంతో ఇతర భాషల్లో ఈ సినిమాను రీమేక్ చేస్తున్నారు. ముఖ్యంగా బాలీవుడ్లో అర్జున్ రెడ్డి రీమేక్పై భారీ హైప్ క్రియేట్ అయ్యింది. కబీర్ సింగ్ పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ఒరిజినల్ వర్షన్కు దర్శకత్వం వహించిన సందీప్ రెడ్డి వంగా దర్శకుడు. షాహిద్ కపూర్ హీరోగా నటిస్తుండగా కియారా అద్వానీ హీరోయిన్ పాత్రలో అలరించనుంది. సినీ 1 స్టూడియోస్, టీ సిరీస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా జూన్ 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా టీజర్ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. టీజర్ దాదాపు అర్జున్ రెడ్డి స్టైల్లో ఉంది. షాహిద్ లుక్స్తో పాటు సీన్స్, డైలాగ్స్ అన్ని అర్జున్ రెడ్డినే దించేసినట్టుగా అనిపిస్తుంది. మరి టాలీవుడ్లో సంచలనం సృష్టించిన అర్జున్ రెడ్డి, బాలీవుడ్ ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటాడో చూడాలి. -
అర్జున్ రెడ్డితో బాలీవుడ్ ప్రీతి
టాలీవుడ్ లో సంచలన విజయం సాధించిన బోల్డ్ లవ్ స్టోరి అర్జున్ రెడ్డి. విజయ్ దేవరకొండ, శాలినీ పాండే హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా తెలుగు ఇండస్ట్రీలో ట్రెండ్ సెట్ చేసింది. దీంతో తమిళ, హిందీ భాషల్లోనూ ఈ సినిమాను రీమేక్ చేస్తున్నారు. తెలుగు వర్షన్కు దర్శకత్వం వహించిన సందీప్ రెడ్డి వంగా హిందీ వర్షన్ తెరకెక్కిస్తున్నాడు. కబీర్ సింగ్ పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో షాహిద్ కపూర్, కియారా అద్వానీ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. తాజాగా తెలుగు అర్జున్ రెడ్డి విజయ్, హిందీ ప్రీతి కియారాలు ఓ ఈవెంట్లో కలిసి దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ముంబైలో జరిగిన హిందుస్థాన్ టైమ్స్ ఇండియాస్ మోస్ట్ స్టైలిష్ అవార్డ్స్ ఈవెంట్లో విజయ్, కియారా అద్వాని కలిశారు. బాలీవుడ్ టాప్ స్టార్లు పాల్గొన్న ఈ కార్యక్రమంలో విజయ్ దేవరకొండ హాటెస్ట్ స్టైలిస్ట్గా అవార్డు అందుకున్నాడు. విజయ్ తోపాటు షారూఖ్ ఖాన్ దంపుతులు, అక్షయ్ కుమార్, రణవీర్ సింగ్, కరీనా కపూర్, కత్రినా కైఫ్ లతో పాటు మరికొంతమంది బాలీవుడ్ యంగ్ స్టార్స్ ఈకార్యక్రమంలో సందడి చేశారు. This ones for you @imvangasandeep When Preeti Met Arjun 😎 Hey Rowdy! @TheDeverakonda pic.twitter.com/zxQaQbNoTV — Kiara Advani (@Advani_Kiara) 30 March 2019 -
‘అర్జున్ రెడ్డి’ రీమేక్లో స్టార్ డైరెక్టర్
టాలీవుడ్లో సంచలన విజయం సాధించిన అర్జున్ రెడ్డి సినిమాను కోలీవుడ్లో ధృవ్ విక్రమ్ హీరోగా రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. బాలా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ రీమేక్ నిర్మాతలకు నచ్చకపోవటంతో పూర్తి సినిమాను గిరీశయ్య దర్శకత్వంలో మరోసారి తెరకెక్కిస్తున్నారు. కొత్త తెరకెక్కిస్తున్న రీమేక్లో నటీనటులను కూడా మార్చేశారు చిత్రయూనిట్. తాజా సమాచారం ప్రకారం ఈ రీమేక్లో హీరోగా తండ్రి పాత్రలో సౌత్ స్టార్ డైరెక్టర్ గౌతమ్ మీనన్ నటిస్తున్నారట. ఇటీవల ఆర్థిక సమస్యల కారణంగా తాను నిర్మించిన సినిమాలన్నీ ఆగిపోవటంతో గౌతమ్ మీనన్ పూర్తి నటన మీద దృష్టిపెట్టాడు. ఇప్పటి వరకు గెస్ట్ రోల్స్లో మాత్రమే కనిపించిన గౌతమ్, అర్జున్ రెడ్డి రీమేక్లో మాత్రం ఇంపార్టెంట్ రోల్లో కనిపించనున్నాడు. ఆదిత్య వర్మ పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ధృవ్ సరసన బానిటా సంధు హీరోయిన్గా నటిస్తుండగా ప్రియా ఆనంద్, అన్బులు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. -
‘అర్జున్ రెడ్డి’లాంటి వాడైతే ప్రేమిస్తా!
అలాంటి వాడైతే కచ్చితంగా ప్రేమిస్తానంటోంది ‘ప్రీతి’ అలియాస్ శాలినిపాండే. ఎక్కడో ఉత్తరాదిలో పుట్టిర ఈ అమ్మడు ప్రస్తుతం సౌత్లో క్రేజీ హీరోయిన్గా పేరు తెచ్చుకుంటున్నారు ప్రీతి. టాలీవుడ్లో వచ్చిన ‘అర్జున్రెడ్డి’ చిత్రం విజయం సాధించడంతో ప్రస్తుతం వరుస చిత్రాలతో బిజీ అయ్యారు శాలినిపాండే. ‘100 శాతం కాదల్’ చిత్రంతో తమిళ పరిశ్రమకు పరిచయం అవుతున్న శాలినిపాండే ఆ చిత్రం విడుదల కాకముందే మరో రెండు మూడు చిత్రాల్లో నటించే అవకాశాన్ని దక్కించుకున్నారు. ‘100 శాతం కాదల్’ తెలుగులో మంచి విజయాన్ని సాధించిన ‘100% లవ్’ చిత్రానికి రీమేక్ అన్నది గమనార్హం. జీవీ.ప్రకాశ్కుమార్ హీరోగా ఈ చిత్రంలో హీరోగా నటిస్తున్నారు. దీంతో పాటు జీవాకు జంటగా గొరిల్లా, విజయ్ ఆంటోని సరసన అగ్ని సిరగుగళ్ చిత్రాల్లోనూ నటిస్తున్నారు శాలిని పాండే. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాల గురించి ముచ్చటించారు శాలిని పాండే. సినిమాలంటే చిన్నప్పటి నుంచే చాలా ఇష్టం అని పేర్కొన్నారు. చదుకుంటున్నప్పుడే సినిమాల్లో నటించాలన్న ఆసక్తి కలిగిందని చెప్పిందన్నారు. అయితే తాను నటించడం తన తండ్రికి అసలు ఇష్టం లేదని తెలిపారు. వేరేదన్నా ఉద్యోగం చేసుకోమని ఒత్తిడి చేశారని, దీంతో తాను ముంబై వెళ్లి సినిమా అవకాశాల వేటలో పడ్డానని చెప్పింది. ఆ సమయంలో తినడానికే చాలా కష్ట పడ్డానని అన్నారు. అలా కొన్ని నెలల తరువాతనే తెలుగు చిత్రం అర్జున్రెడ్డి కోసం నిర్వహించిన ఆడిషన్లో ఎంపికై నటించే అవకాశాన్ని పొందినట్లు తెలిపారు. అప్పుడు కూడా ముద్దు సన్నివేశాల్లో, హీరోతో సన్నిహితంగా ఉండే సన్నివేశాల్లో నటింపజేయరాదని దర్శకుడికి తన తండ్రి షరతులు విధించారని చెప్పుకొచ్చారు. అలాంటిది ఆ చిత్రం విడుదలై సక్సెస్ కావడంతో ప్రశంసల వర్షం కురిపించారని అన్నారు. ఇకపోతే ప్రేమ గురించి అడుగుతున్నారని, నిజ జీవితంలో ‘అర్జున్రెడ్డి’ లాంటి వ్యక్తి లభిస్తే కచ్చితంగా ప్రేమిస్తానని చెప్పారు శాలిని పాండే. ‘అర్జున్రెడ్డి’ చిత్రం తరువాత చాలా అవకాశాలు వచ్చాయని చెప్పింది. అదే విధంగా రెండేళ్ల సినీ జీవితంలో చాలా నేర్చుకున్నానని అన్నారు. గ్లామరస్గా ఫొటోలు దిగి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడం తనకు ఇష్టం ఉండదని తెలిపారు. నటుడు కమలహాసన్, దర్శకుడు మణిరత్నంలకు వీరాభిమానినని చెప్పుకొచ్చారు శాలిని పాండే. ఇక తిండి విషయంలో ఎలాంటి నియమాలు లేవని, వారానికి ఐదు రోజులు మాత్రం శారీరక కసరత్తులు చేస్తానని చెప్పారు. పుస్తకాలు బాగా చదువుతానని, స్నేహితులు తక్కువేనని నటి శాలినిపాండే చెప్పుకొచ్చారు. -
అర్జున్ రెడ్డి జోడి.. రిపీట్!
టాలీవుడ్లో సెన్సేషనల్ స్టార్గా ఎదిగిన విజయ్ దేవరకొండ తన మార్కెట్ను మరింత విస్తరించుకునే పనిలో ఉన్నాడు. అందుకే తన తదుపరి చిత్రాలను బహు భాషా చిత్రాలుగా రూపొందించే ప్రయత్నాల్లో ఉన్నాడు. ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న డియర్ కామ్రేడ్ను నాలుగు భాషల్లో రిలీజ్ చేస్తున్నట్టుగా వెల్లడించారు. ఆ తరువాత కూడా ఓ ట్రై లింగ్యువల్ సినిమా చేసే ఆలోచనలో ఉన్నాడు విజయ్. క్రాంతి మాధవ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రొమాంటిక్ డ్రామాతో పాటు తమిళ దర్శకుడు ఆనంద్ అన్నామలై దర్శకత్వంలో తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో ఓ సినిమా చేసేందుకు ఓకె చెప్పాడు. భారీ బడ్జెట్తో స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో విజయ్ బైక్ రేసర్గా కనిపించనున్నాడు. ఈ సినిమాలో విజయ్ దేవరకొండకు జోడిగా అర్జున్ రెడ్డి ఫేం షాలిని పాండే నటించనున్నారు. అర్జున్ రెడ్డి సినిమాతో హిట్ కాంబినేషన్ అనిపించుకున్న విజయ్, షాలినిల జోడి మరోసారి తెర మీదకు వస్తుండటం ఫిలిం నగర్లో హాట్ టాపిక్ అయ్యింది. -
వర్మ కాదు... ఆదిత్యవర్మ
తెలుగు హిట్ ‘అర్జున్రెడ్డి’ తమిళ రీమేక్ ‘వర్మ’ చిత్రం షూటింగ్ మొత్తం పూర్తయింది. అవుట్పుట్ నచ్చక మళ్లీ ఈ సినిమా తీయాలని నిర్మాతలు అనుకున్న విషయం తెలిసిందే. హీరో విక్రమ్ తనయుడు ధృవ్ హీరోగా ‘వర్మ’ను ప్రారంభించారు. రీషూట్ చేయాలనుకున్న తర్వాత హీరోగా ధృవ్నే ఉంచారు కానీ దర్శకుడు బాలా స్థానంలో గిరీశాయ అనే దర్శకుడిని తీసుకున్నారు. హీరోయిన్గా బన్నితా సాదును తీసుకున్నారు. రవి. కె చంద్రన్ను కెమెరామెన్గా తీసుకున్నారు టీమ్. తాజాగా ఈ సినిమాకు ‘ఆదిత్యవర్మ’ అనే టైటిల్ను ఖరారు చేయడంతో పాటు ధృవ్ లుక్ను కూడా రిలీజ్ చేశారు. ఇక చిత్రదర్శకుడు గిరీశాయ గురించి చెప్పాలంటే... తెలుగు ‘అర్జున్రెడ్డి’ సినిమాకు ఈయన అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేశారట. అలాగే తెలుగు ‘అర్జున్రెడ్డి’ చిత్రానికి సంగీతం అందించిన రధన్నే ‘ఆదిత్యవర్మ’కు మ్యూజిక్ అందించబోతుండటం విశేషం. ఈ సినిమా షూటింగ్ను త్వరగా కంప్లీట్ చేసి జూన్లో విడుదల చేయాలనుకుంటున్నారు. -
వర్మ ప్రేయసి
తెలుగు హిట్ ‘అర్జున్రెడ్డి’ తమిళ రీమేక్ ‘వర్మ’తో హీరో విక్రమ్ తనయుడు ధృవ్ హీరోగా పరిచయం కానున్న సంగతి తెలిసిందే. బాలా దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఇక విడుదల కావడమే ఆలస్యం అనుకుంటున్న సమయంలో ‘తూచ్.. అవుట్పుట్ నచ్చలేదు’ అంటూ నిర్మాతలు మళ్లీ తీయడానికి రెడీ అయిపోయారు. ధృవ్నే హీరోగా ఈ సినిమా మొత్తాన్ని రీ–షూట్ చేయనున్నట్లు ఓ ప్రకటన విడుదల చేసిన విషయం గుర్తుండే ఉంటుంది. దర్శకుడు, హీరోయిన్ ఇతర తారాగణం స్థానంలో కొత్తవారు ఉంటారు. ఈ కొత్త వెర్షన్కు గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించనున్నారనే ప్రచారం జరుగుతోంది. అయితే పాత వెర్షన్లో హీరోయిన్గా నటించిన మేఘా చౌదరి స్థానంలో బన్నితా సాంధును ఎంపిక చేశారు టీమ్. ఈ విషయాన్ని నిర్మాతలు ధృవీకరించారు. ఇంతకుముందు వరుణ్ ధావన్ హీరోగా వచ్చిన బాలీవుడ్ చిత్రం ‘అక్టోబర్’లో హీరోయిన్గా నటించారు బన్నిత. ఇప్పుడు కోలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. ‘అక్టోబర్’ చిత్రంలో నటించడానికి ముందు వాణిజ్య ప్రకటనల్లో కనిపించారామె. 2016లో గాయకుడు కిశోర్ కుమార్ ‘ఏక్ అజ్నబీ హసీనా’ అనే పాటను రీ–క్రియేట్ చేసిన మ్యూజిక్ వీడియోతో ఫేమస్ అయ్యారు బన్నిత. -
అర్జున్ రెడ్డి రీమేక్కు హీరోయిన్ ఫిక్స్!
టాలీవుడ్ సెన్సేషనల్ హిట్ అర్జున్ రెడ్డి సినిమాను కోలీవుడ్లో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తయినా బాలా దర్శకత్వంలో తెరకెక్కిన అవుట్పుట్తో నిర్మాతలు సంతృప్తిగా లేకపోవటంతో సినిమాను మరోసారి కొత్త టీంతో తెరకెక్కించే పనిలో ఉన్నారు. త్వరలో షూటింగ్ ప్రారంభం కానుంది. ఇంకా దర్శకుడి పేరు ఫైనల్ చేయని ఈ సినిమాలో హీరోయిన్ను కూడా మార్చేస్తున్నారు. మేఘా చౌదరి స్థానంలో బాలీవుడ్ నటి అక్టోబర్ ఫేం బనితా సందు నటించనుంది. ఈ విషయాన్ని ప్రముఖ బాలీవుడ్ ఎనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ట్విటర్ ద్వారా వెల్లడించారు. విక్రమ్ తనయుడు ధృవ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాకు అర్జున్ రెడ్డి సినిమాకు డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పని చేసిన గిరీషయ్య ఈ సినిమాకు దర్శకత్వం వహించే అవకాశం ఉన్నట్టుగా ప్రచారం జరుగుతోంది. CONFIRMED... #October leading lady Banita Sandhu to star in #Tamil remake of #ArjunReddy... Dhruv Vikram, son of Chiyaan Vikram, to essay the title role. pic.twitter.com/QPM4FYenuT — taran adarsh (@taran_adarsh) 16 February 2019 -
నేనే తప్పుకున్నాను
‘‘దర్శకుడు బాలా రూపొందించిన ‘వర్మ’ చిత్రం మాకు సంతృప్తికరంగా లేదు. సినిమాను మళ్లీ మొదటి నుంచి చిత్రీకరించాలనుకుంటున్నాం’’ అని ‘అర్జున్ రెడ్డి’ తమిళంలో రీమేక్ చేస్తున్న ఈ4 ఎంటర్టైన్స్మెంట్స్ సంస్థ పేర్కొంది. అయితే బాలా లాంటి దర్శకుడుని తప్పించడమేంటి? అనే కామెంట్స్ వినిపించాయి. ఈ విషయంపై బాలా అధికారిక ప్రకటన విడుదల చేశారు. ‘‘నిర్మాతలు ఇచ్చిన అబద్ధపు స్టేట్మెంట్ల వల్ల నేను వివరణ ఇవ్వాల్సివస్తోంది. ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవాలన్నది నా సొంత నిర్ణయమే. ధృవ్ విక్రమ్ భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని ఈ విషయాన్ని ఇక్కడితో ఆపేద్దామని అనుకుంటున్నాను’’ అని పేర్కొన్నారు. ‘వర్మ’ కొత్త ప్రాజెక్ట్ను దర్శకుడు గౌతమ్ మీనన్ టేకప్ చేస్తారని టాక్. -
‘వర్మ’ వివాదంపై స్పందించిన బాలా
టాలీవుడ్ సెన్సేషనల్ హిట్ ‘అర్జున్ రెడ్డి’ సినిమాను తమిళంలో వర్మ పేరుతో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో విక్రమ్ వారసుడు ధృవ్ హీరోగా పరిచయం అవుతున్నాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా అవుట్పుట్ ఆశించిన స్థాయిలో లేకపోవటంతో నిర్మాతలు సినిమాను రీషూట్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. బాలా ఇచ్చిన ఫస్ట్ కాపీ సంతృప్తిగా లేకపోవటంతో మరో దర్శకుడితో సినిమాను రీ షూట్ చేస్తున్నామని వెల్లడించారు. అయితే ఈ విషయంపై దర్శకుడు బాలా స్పందించారు. ప్రాజెక్ట్ నుంచి తనను ఎవరూ తప్పించలేదని. తానే ప్రాజెక్ట్ ను వదిలి బయటకు వచ్చేశానని తెలిపారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసిన బాలా అందుకు సాక్ష్యాలుగా నిర్మాణ సంస్థతో చేసుకున్న అగ్రిమెంట్ కాపీలను కూడా విడుదల చేశారు. ధృవ్ విక్రమ్ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఈ వివాదాన్ని ఇక్కడితో ముగించాలనుకుంటున్నాను అంటూ ఓ ప్రకటన విడుదల చేశారు. -
వివాదాస్పద చిత్రంలో జాన్వీ?
వివాదాస్పద చిత్రంలో నాయకిగా అతిలోకసుందరి శ్రీదేవి వారుసురాలు జాన్వీకపూర్ నటించనుందా? జాన్వీ కోలీవుడ్ ఎంట్రీ గురించి ఇటీవల చాలానే చర్చ జరుగుతోంది. ఆమె తండ్రి, బాలీవుడ్ నిర్మాత బోనీకపూర్ హిందీ చిత్రం పింకూను తమిళంలో రీమేక్ చేయబోతున్న విషయం తెలిసిందే. అజిత్ కథానాయకుడిగా నటించబోతున్న ఈ చిత్రంలో ఒక అతిథి పాత్ర ద్వారా జాన్వీ కోలీవుడ్కు పరిచయం కానుందనే ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో జాన్వీ గురించి మరో సంచలన వార్త ప్రచారంలోకి వచ్చింది. వర్మ చిత్ర వ్యవహారం తెలిసిందే. తెలుగు సంచలన విజయాన్ని సాధించిన అర్జున్రెడ్డికి రీమేక్గా తమిళంలో బాలా దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని విడుదల చేయడం లేదని, మళ్లీ పూర్తిగా రీషూట్ చేయనున్నట్లు ఆ చిత్ర నిర్మాత ఇటీవల వెల్లడించిన విషయం తెలిసిందే. నటుడు విక్రమ్ వారసుడు ధ్రువ్ కథానాయకుడిగా పరిచయం అవుతున్న చిత్రం ఇది. అతని తొలి చిత్రమే ఇలా అవడం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. వర్మ చిత్రాన్ని తెరకెక్కించింది సాధారణ దర్శకుడు కాదు. తమిళ సినీ చరిత్రలో గుర్తుండిపోయే చిత్రాలను అందించిన జాతీయ అవార్డులను తమిళ సినిమాకు అందించిన దర్శకుడు బాలా. అలాంటి దర్శకుడిని ఇది అవమానించే చర్చగా భావిస్తూ పలువురు దర్శకులు ఆయనకు మద్దతుగా గొంతు విప్పుతున్నారు. ఈ వివాదం ఎటు దారి తీస్తుందో తెలియదు. వర్మ చిత్ర నిర్మాత మాత్రం ఆ చిత్రాన్ని రీషూట్ చేయడానికి ప్రయత్నాలు చేసేస్తున్నారు. ఈ చిత్రానికి దర్శకత్వం వహించడానికి దర్శకుడు గౌతమ్మీనన్, 96 చిత్రం ఫేమ్ సీ ప్రేమ్కుమార్, మలయాళ సినీ దర్శకుడు అల్ఫోన్స్ పుత్రన్, బిజాయ్ నంబియార్లతో చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. మరి వీరిలో ఎవరిని ఎంచుకుంటారో చూడాలి. ఇకపోతే వర్మ చిత్రంలో ధృవ్నే మళ్లీ నటిస్తాడని నిర్మాతలు పేర్కొన్నారు. అతనికి జంటగా నటించిన బెంగాలీ బ్యూటీ మేఘా చౌదరి పరిస్థితినే అర్థం కావడం లేదు. ఆమె పాత్రలో ఇప్పుడు శ్రీదేవి వారసురాలు జాన్వీని నటింపజేసే ప్రయత్నాలు జరుగుతున్నట్లు తాజా సమాచారం. మరి ఆ ప్రయత్నాలు ఫలిస్తాయా? జాన్వీ వివాదాస్పదంగా మారిన అర్జున్రెడ్డి రీమేక్లో నటించడానికి అంగీకరిస్తుందా? అన్నది వేచి చూడాలి. -
ప్రేమలో పడిపోయా : విజయ్ దేవరకొండ
అర్జున్ రెడ్డి సినిమాతో సెన్సేషనల్ స్టార్గా ఎదిగిన విజయ్ దేవరకొండ రోజు రోజుకి తన ఫ్యాన్ బేస్ని పెంచుకుంటూ పోతున్నాడు. కేవలం ఒక సెక్షన్కే పరిమితమై పోకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తున్నాడు. యూత్లోనే కాదు చిన్నారుల్లోనే విజయ్కి మంచి ఫాలోయింగ్. తాజాగా ఫిలడెల్ఫియాలో ఉంటున్న ఇద్దరు తెలుగు చిన్నారులు విజయ్ దేవరకొండకు గురంచి మాట్లాడుతున్న వీడియోపై ఈ యంగ్ హీరో స్పందించాడు. డియర్ కామ్రేడ్ షూటింగ్ లో గాయపడిన విజయ్ ఫోటోను చూస్తూ ‘విజయ్ దేవరకొండ డాక్టర్ దగ్గరికి వెళ్లు’అంటూ ఇద్దరు చిన్నారు ముద్దు ముద్దుగా మాట్లాడిన వీడియోను వారి కుటుంబ సభ్యులు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియోపై స్పందించిన విజయ్ ‘ప్రేమలో పడ్డా.. నాకు డాక్టర్ అవసరం లేదు. మిమ్మల్ని కలవాలనుంది. కలుస్తారా?’ అంటూ రిప్లై ఇచ్చాడు. వెంటనే స్పందించిన చిన్నారుల తండ్రి ‘మా పిల్లలు నిన్ను కలిసేందుకు ఉత్సాహంగా ఉన్నారు. ఈ శనివారం మేం హైదరాబాద్ వస్తున్నాం’ అంటూ ట్వీట్ చేశారు. I Just fell in ❤ Vijay Konda doesn't need a doctor, but he would love to meet you two. Will you? https://t.co/82jhgz1Drl — Vijay Deverakonda (@TheDeverakonda) 7 February 2019 -
కోలీవుడ్కూ అర్జున్రెడ్డిగా..
సినిమా: టాలీవుడ్లో క్రేజీ కథానాయకుడిగా వెలుగొందుతున్న యువ నటుడు విజయ్దేవరకొండ. అక్కడ ఈయన సినీ జీవితంలో అర్జున్రెడ్డి చిత్రం ఒక మైలురాయిగా నిలిచిపోతుంది. అంత సంచలన విజయాన్ని ఆ చిత్రం సాధించింది. ఇప్పుడు అదే చిత్రం విక్రమ్ వారసుడు ధ్రువ్ హీరోగా రీమేక్ అవుతున్న విషయం తెలిసిందే. ఆ తరువాత విజయ్దేవరకొండ నటించిన గీతగోవిందం చిత్రం కూడా ఘన విజయాన్ని సాధించింది. ఆయన నటించిన మరో చిత్రం ద్వారకా. ఇందులో విజయ్దేవరకొండకు జంటగా నటి పూజాజవేరి నటించింది. ఇతర ముఖ్య పాత్రల్లో ప్రకాశ్రాజ్, బాహుబలి ప్రభాకర్, మురళీశర్మ, సురేఖవాణి పృథ్వీరాజ్ నటించారు. శ్రీనివాస రవీంద్ర కథ, కథనం, దర్శకత్వం బాధ్యతలను నిర్వహించిన ఈ చిత్రానికి శ్యామ్ కే.నాయుడు ఛాయాగ్రహణం, సాయ్కార్తీక్ సంగీతాన్ని అందించారు. ఇప్పుడీ చిత్రాన్ని జీఆర్.వెంకటేశ్ భాగ్య హోమ్స్ సంస్థ సమర్పణలో శ్రీలక్ష్మీజ్యోతి క్రియేషన్స్ పతాకంపై ఏఎన్.బాలాజి తమిళ ప్రేక్షకులకు అర్జున్రెడ్డి పేరుతో అందించనున్నారు. ఈయన ఇంతకు ముందు నంబర్ 1, బిజినెస్మెన్, హలో వంటి చిత్రాలను అనువదించారు. అర్జున్రెడ్డి చిత్రం గురించి ఆయన తెలుపుతూ ఈ చిత్రం తెలుగులో ద్వారకా పేరుతో రూపొంది మంచి విజయాన్ని సాధించిందన్నారు. తెలుగులో విజయ్దేవరకొండ నటించిన అర్జున్రెడ్డి చిత్రం సంచలన విజయాన్ని సాధించిందని తెలిపారు. అదేవిధంగా ఆయన నోటా చిత్రంతో నేరుగా కోలీవుడ్కు ప్రేక్షకులకు దగ్గర అయ్యారని, తాజాగా తమ అర్జున్రెడ్డి తమిళ ప్రేక్షకులు మెచ్చే చిత్రంగా ఉంటుందని చెప్పారు. ప్రేమ, యాక్షన్ అంటూ కమర్శియల్ ఫార్ములాలో తెరకెక్కిన అర్జున్రెడ్డి చిత్రం తమిళ ప్రేక్షకుల మధ్య మంచి ఆదరణను పొందుతుందనే నమ్మకం ఉందని చెప్పారు. ఈ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని త్వరలోనే భారీ ఎత్తున నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు నిర్మాత బాలాజి తెలిపారు. -
బిచ్చగాళ్లు లేని సమాజాన్ని చూడాలి
అర్జున్రెడ్డి, నేహా దేశ్పాండే జంటగా కె.ఎస్. నాగేశ్వరరావు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘బిచ్చగాడా మజాకా’. ‘బ్రేకప్ లవ్స్టోరీ’ అనేది ఉపశీర్షిక. ఎస్.ఎ. రెహమాన్ సమర్పణలో బి. చంద్రశేఖర్ నిర్మించిన ఈ సినిమా ఫిబ్రవరి 1న విడుదలవుతోంది. ఈ సందర్భంగా కె.ఎస్.నాగేశ్వరరావు మాట్లాడుతూ– ‘‘బిచ్చగాళ్లు లేని సమాజం కోసం ఓ యువకుడు సాగించిన పోరాటం ఎలాంటి మలుపులు తిరిగింది? అది తన ప్రేమకథను ఎలా ప్రభావితం చేసింది అన్నదే ఈ చిత్ర కథాంశం. హైదరాబాద్ నగరాన్ని బిచ్చగాళ్లు లేని నగరంగా చేయాలని ప్రభుత్వం తలపెట్టిన యజ్ఞానికి బాసటగా నిలిచే చిత్రమిది. అనాథ అయిన అర్జున్ బిచ్చగాళ్లు లేని సమాజం కోసం ఏం చేశాడన్నది తెరపైనే చూడాలి. శ్రీవెంకట్ పాటలకు చక్కని స్పందన వచ్చింది. చదలవాడ శ్రీనివాసరావు నిర్మిస్తున్న ‘లవ్ ఈజ్ బ్లైండ్’ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాను. 70 శాతం పూర్తయింది’’ అన్నారు. సుమన్ మాట్లాడుతూ– ‘‘నాగేశ్వరరరావు కథ చెప్పగానే విభిన్నంగా ఉందనిపించింది. సుమన్ ఓ వెరైటీ పాత్ర చేయగలడు అని ఈ సినిమాతో పేరొస్తుంది. మంచి విలన్ పాత్రలు ఇస్తే చేయడానికి రెడీ. నేటి జనరేషన్లో రాజమౌళి మాత్రం విలన్ని ఎంతో గొప్పగా చూపిస్తున్నారు. ‘బాహుబలి’లో హీరో ప్రభాస్ కాదు.. రానా. ఆయన పాత్ర అంత బాగుంది’’ అన్నారు. -
సినిమా షూటింగ్లో ప్రమాదం.. వ్యక్తి మృతి
డెహ్రాడూన్ : షాహిద్ కపూర్ హీరోగా తెరకెక్కుతున్న బాలీవుడ్ సినిమా ‘కబీర్ సింగ్’ టీమ్ విషాదంలో మునిగిపోయింది. టాలీవుడ్ సెన్సేషన్ మూవీ అర్జున్ రెడ్డికి ఈ సినిమా రీమేక్ అన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా ముస్సోరీలో షూటింగ్ జరుపుకొంటోంది. ఇందులో భాగంగా అక్కడి ఫైవ్స్టార్ హోటల్లో బస చేస్తోంది. ఈ క్రమంలో రామ్ కుమార్(35) అనే క్రూ మెంబర్ ప్రమాదవశాత్తు జనరేటర్లో చిక్కుకుని చనిపోయాడు. జనరేటర్లో నీటి లెవల్ చెక్ చేస్తున్న సమయంలో అతడి మఫ్లర్ జనరేటర్ ఫ్యాన్కు చిక్కుకోవడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. కాగా రామ్ కుమార్ మృతి పట్ల కబీర్ సింగ్ యూనిట్ సంతాపం వ్యక్తం చేసింది. ఈ ఘటన గురించి నిర్మాతలు మాట్లాడుతూ.. ‘ఈ ఘటన మమ్మల్ని ఎంతగానో కలచివేసింది. రామ్ కుమార్ కుటుంబానికి సానుభూతి తెలుపుతున్నాం. అతడి కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటాం’ అని హామీ ఇచ్చారు. ఇక అర్జున్ రెడ్డి డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఈ సినిమాతో బాలీవుడ్లో దర్శకుడిగా ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. సినీ1 స్టూడియోస్, టీ సిరీస్ ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో షాహిద్ సరసన ‘భరత్ అనే నేను’ ఫేం కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తున్నారు. -
‘అర్జున్ రెడ్డి’ బ్యూటీకి బాలీవుడ్ ఆఫర్
2017లో రిలీజ్ అయిన అర్జున్ రెడ్డి సినిమా ఎంతటి ఘనవిజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాతో విజయ్ దేవరకొండ సెన్సేషనల్ స్టార్గా మారిపోయాడు. దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కూడా స్టార్ హీరోలతో సినిమాలో ఓకె చేయించుకొని ఫుల్ బిజీ అయ్యాడు. అయితే హీరోయిన్గా నటించిన షాలిని పాండేకు మాత్రం ఆశించిన స్థాయిలో అవకాశాలు రాలేదు. ప్రస్తుతం 100% లవ్ తమిళ రీమేక్తో పాటు కల్యాన్ రామ్ హీరోగా తెరకెక్కుతున్న 118 సినిమాల్లో నటిస్తున్న ఈ బ్యూటీకి ఓ బాలీవుడ్ మూవీలోనూ నటిస్తున్నట్టుగా తెలుస్తోంది. బాలీవుడ్ సీనియర్ నటుడు పరేష్ రావల్ తనయుడు ఆదిత్య హీరోగా తెరకెక్కుతున్న బాంఫాడ్ సినిమాలో షాలిని హీరోయిన్గా సెలెక్ట్ అయ్యింది. ప్రముఖ దర్శకుడు అనురాగ్ కశ్యప్ నిర్మిస్తున్న ఈ సినిమాతో రంజన్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. -
ఈ బుడ్డోడు ఇప్పుడు సెన్సేషనల్ స్టార్..!
ఈ ఫోటోలో ఉన్న కుర్రాడిని గుర్తు పట్టారా..? ఎక్కడో చూసినట్టుగా ఉంది కదు. అవును ఆ కుర్రాడు ఇప్పుడు టాలీవుడ్లో సెన్సేషనల్ స్టార్. ఒక్క సినిమాతోనే ఇండస్ట్రీ ఆలోచననే మార్చేసిన హీరో. తన యాటిట్యూడ్తో అమ్మాయిల మనసు గెలుచుకున్న రౌడీ. ఆ హీరో ఎవరో కాదు యంగ్ హీరో విజయ్ దేవరకొండ. అర్జున్ రెడ్డి సినిమాతో సెన్సేషనల్ స్టార్గా గుర్తింపు తెచ్చుకున్న విజయ్ చిన్ననాటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. 1999లో ఓ టీవీ సీరియల్లో షావుకారు జానకితో కలిసి విజయ్ నటించిన వీడియోను ఓ అభిమాని విజయ్ దేవరకొండను ట్యాగ్ చేస్తూ తన సోషల్ మీడియ పేజ్లో పోస్ట్ చేశాడు. వెంటనే స్పందించిన విజయ్ దేవరకొండ వీడియోను పోస్ట్ చేసిన వారికి కృతజ్ఞతలు తెలియజేశాడు. వరుస విజయాలతో మంచి ఫాంలో ఉన్న విజయ్ దేవరకొండ ప్రస్తుతం డియర్ కామ్రేడ్ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు. My childhood trends so much 😂 that little fellow is also a star - even I am watching it on loop. Whoever found this you made my mum's day, mine and so many others. https://t.co/EEE9Rkq6uo — Vijay Deverakonda (@TheDeverakonda) 21 January 2019 -
క్రైమ్ డ్రామాలో సూపర్ స్టార్..!
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం మహర్షి సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు. మహేష్ 25 సినిమాగా తెరకెక్కుతున్న ఈ మూవీలో పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమా తరువాత సుకుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు ఓకె చెప్పాడు మహేష్. వీరిద్దరి కాంబినేషన్లో తెరకెక్కనున్న సినిమా రొమాంటిక్ డ్రామా అన్న ప్రచారం జరుగుతోంది. అయితే సుకుమార్ సినిమా తరువాత అర్జున్ రెడ్డి ఫేం సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో నటించేందుకు మహేష్ ఓకె చెప్పినట్టుగా టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం అర్జున్ రెడ్డి సినిమాను బాలీవుడ్లో కబీర్ సింగ్ పేరుతో రీమేక్ చేస్తున్న సందీప్ రెడ్డి వంగా.. మహేష్ కోసం డిఫరెంట్ స్టోరీని సిద్ధం చేశాడట. మహేష్ ఇంతవరకు చేయని క్రైమ్ డ్రామా తరహా కథను సూపర్ స్టార్ కోసం రెడీ చేశాడట. ఇప్పటికే కథ విన్న మహేష్ ఓకె చేశాడన్న ప్రచారం జరుగుతోంది. అన్ని అనుకున్నట్టుగా జరిగితే సుకుమార్ సినిమా తరువాత సందీప్ సినిమానే పట్టాలెక్కే అవకాశం ఉంది. -
ప్లే బాయ్గా ‘అర్జున్ రెడ్డి’..!
సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ ఇప్పుడు టాలీవుడ్లో హాట్ ఫేవరెట్గా మారిపోయాడు. ఇప్పటికే కోలీవుడ్ ఎంట్రీ కూడా ఇచ్చిన ఈ యంగ్ హీరో టాలీవుడ్లో వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఇటీవల గీత గోవిందంలో మరో ఘనవిజయాన్ని అందుకున్న విజయ్ ప్రస్తుతం డియర్ కామ్రేడ్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా తరువాత ‘మళ్లీ మళ్లీ ఇది రాని’ రోజు ఫేం క్రాంతి మాధవ్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు. ఈ సినిమాలో విజయ్ మరో డిఫరెంట్ రోల్లో కనిపించనున్నాడు అన్న టాక్ వినిపిస్తోంది. రాశీఖన్నా, కేథరిన్ థ్రెస్సా, ఐశ్వర్య రాజేష్లు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో విజయ్ దేవరకొండ ప్లేబాయ్ తరహా పాత్రో కనిపించనున్నాడట. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా షూటింగ్ ఫిబ్రవరిలో ప్రారంభం కానుంది. -
‘అర్జున్ రెడ్డి’ నటితో విశాల్ పెళ్లి!
హైదరాబాద్కు చెందిన వ్యాపారవేత్త కూతురు అనీషాతో హీరో విశాల్ వివాహం చేయబోతున్నామని ఇటీవల ఆయన తండ్రి, నిర్మాత జీకే రెడ్డి ప్రకటించిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి విశాల్ పెళ్లి చేసుకోబోయే అనీషా ఎలా ఉంటుందోనని తెలుసుకోవడానికి అభిమానులు, సినీ ప్రేక్షకులు తెగ ఆసక్తి కనబరిచారు. అయితే వారందరి కోసం సంక్రాంతి పండగ రోజున తమ వివాహ బంధానికి సంబంధించిన ప్రకటన చేశారు అనీషా. విశాల్తో కలిసి దిగిన ఓ ఫొటోను ఆమె సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అనీషా విషయానికి వస్తే.. హైదరాబాద్ బిజినెస్మేన్ విజయ్ రెడ్డి, పద్మజల కుమార్తె అయిన ఆమె.. అర్జున్ రెడ్డి, పెళ్లి చూపులు వంటి చిత్రాల్లో నటించారు. అర్జున్ రెడ్డి సినిమాలో ఆమె కీర్తి పాత్రని పోషించారు. ఇకపై ఆమె సినిమాల్లో కొనసాగే అవకాశం లేనట్టుగా తెలుస్తోంది. ఈ సందర్భంగా విశాల్పై తనకున్న ఇష్టాన్ని, నమ్మకాన్ని కూడా ఆమె వెల్లడించారు. గతంలో తన పెళ్లి గురించి వచ్చిన వార్తలపై విశాల్ స్పందిస్తూ.. ‘నా పెళ్లి గురించి ఇలాంటి వార్తలు ఎలా సృష్టిస్తారో అర్థం కావడం లేదు. ఇది మంచిది కాదు. ఇది నా వ్యక్తిగత జీవితం. నా పెళ్లి గురించి అధికారికంగా ప్రకటించడం కంటే సంతోషం ఎముంటుంది.. త్వరలోనే ఆ వివరాలు ఆనందంగా ప్రకటిస్తాన’ని ట్విటర్లో పేర్కొన్న సంగతి తెలిసిందే. View this post on Instagram Happy Sankranti! To the start of something new. Thank you all for everything you've done; Been a part of my growth, my learning, my observations, my inspiration, my truth, my hurt, my strength, my reason or all that has brought me to where I am today, who I am today. Soon enough, I will be on a new journey and I yearn to live up to all of my dreams and goals and the challenges I have put up for myself. I finally found somebody to go down the path of life with, loving him and life with true passion. I look up to this man for all that he stands for and for all of his heart. I vow to give back to him, the families and the people around with this step forward. I vow to be the best that I can be, intention towards collective learning, love and moral value. #LoveAlways A post shared by Anisha Alla (@bluewatermelon17) on Jan 15, 2019 at 4:13am PST -
ఆ బయోపిక్లో విజయ్ దేవరకొండ లేడట..!
అర్జున్ రెడ్డి సినిమాతో సెన్సేషన్ సృష్టించిన విజయ్ దేవరకొండ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. బాలీవుడ్లో కూడా విజయ్కి మంచి క్రేజ్ రావటంతో బాలీవుడ్ ఎంట్రీపై కూడా కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా కపిల్ దేవ్ జీవితకథ ఆధారంగా తెరకెక్కుతున్న ‘83’ సినిమాలో విజయ్ అతిథి పాత్రలో కనిపించనున్నాడన్న ప్రచారం జరిగింది. అయితే తాజాగా ఈ విషయంపై చిత్రయూనిట్ క్లారిటీ ఇచ్చారు. 83లో విజయ్ దేవరకొండ నటించటం లేదని తెలుస్తోంది. బాలీవుడ్కు ఎంట్రీ ఇస్తే హీరోగానే ఇవ్వాలన్న ఆలోచనలో ఉన్న విజయ్, కపిల్ బయోపిక్ ఆఫర్కు నో చెప్పటంతో ఆ పాత్రకు తమిళ యువ కథానాయకుడు జీవాను తీసుకున్నారు. కబీర్ ఖాన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను ఎన్టీఆర్ బయోపిక్ నిర్మాతల్లో ఒకరైన విష్ణు ఇందూరి నిర్మిస్తున్నారు. -
అర్జున్ రెడ్డి దర్శకుడితో ఎన్టీఆర్..!
ఒక్క సినిమాతోనే క్రేజీ డైరెక్టర్గా మారిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా. తొలి సినిమా అర్జున్ రెడ్డితోనే సందీప్ అందరి దృష్టిని ఆకర్షించాడు. విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన అర్జున్ రెడ్డి సంచలన విజయం సాదించటంతో పాటు సినీ ప్రముఖులు స్టార్ హీరోల ప్రశంసలు సాధించింది. దీంతో సందీప్తో సినిమాలు చేసేందుకు హీరోలు దర్శకులు క్యూ కట్టారు. ప్రస్తుతం అర్జున్ రెడ్డి సినిమాను కబీర్ ఖాన్ పేరుతో బాలీవుడ్లో రీమేక్ చేస్తున్న సందీప్, ఇంత వరకు తెలుగు సినిమాను ప్రకటించలేదు. కొద్ది రోజులుగా మహేష్ బాబు హీరోగా సందీప్ సినిమా ఉంటుదన్న టాక్ గట్టిగా వినిపించింది. అయితే తాజా సమాచారం ప్రకారం సందీప్.. ఎన్టీఆర్ హీరోగా ఓ సినిమాను ప్లాన్ చేస్తున్నాడట. ఇప్పటికే ఎన్టీఆర్కు కథ కూడా వినిపించాడన్న ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఎన్టీఆర్.. రాజమౌళి దర్శకత్వంలో రామ్చరణ్తో కలిసి ఆర్ఆర్ఆర్ (వర్కింగ్ టైటిల్)లో నటిస్తున్నాడు. ఈ సినిమా పూర్తయిన తరువాత సందీప్ సినిమా ఉండే చాన్స్ ఉంది. -
బాలీవుడ్ సినిమాకు నో చెప్పిన విజయ్ దేవరకొండ
అర్జున్ రెడ్డి సక్సెస్తో జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్న టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ. వరుస విజయాలతో సూపర్ ఫాంలో ఉన్న ఈ క్రేజీ హీరో బాలీవుడ్ సినిమాలో ఆఫర్కు నో చెప్పినట్టుగా తెలుస్తోంది. విజయ్ క్రేజ్ దృష్య్టా త్వరలోనే బాలీవుడ్ ఎంట్రీ కాయం అన్న ప్రచారం జరుగుతోంది. అనుకున్నట్టుగానే ఓ బాలీవుడ్ క్రేజీ ప్రాజెక్ట్ కోసం విజయ్ దేవరకొండను సంప్రదించారట. బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో కపిల్ దేవ్ బయోపిక్ను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ ఆ జనరేషన్కు చెందిన ఓ క్రికెటర్ పాత్రకు విజయ్ను సంప్రదించారు. అయితే బాలీవుడ్ లో హీరోగానే ఎంట్రీ ఇచ్చే ఆలోచనలో ఉన్న విజయ్ క్యారెక్టర్ రోల్స్ చేయటం కరెక్ట్ కాదన్న ఆలోచనలో సున్నితంగా తిరస్కరించినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం డియర్ కామ్రేడ్ షూటింగ్లో బిజీగా ఉన్న విజయ్ దేవరకొండ చేతిలో మరిన్ని క్రేజీ ప్రాజెక్ట్లు ఉన్నాయి. -
‘అర్జున్ రెడ్డి’ దర్శకుడికి నో చెప్పిన శర్వా
సినీరంగం సక్సెస్ వెంటే పరిగెడుతుంది. అందుకే ఒక్క హిట్ ఇచ్చిన దర్శకుడు వెంటనే బిజీ అయిపోతాడు. అదే ఓ బ్లాక్ బస్టర్ హిట్ ఇస్తే ఆ దర్శకుడి రేంజే మారిపోతుంది. అలా టాలీవుడ్కు సెన్సేషన్ ఎంట్రీ ఇచ్చిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా. తొలి చిత్రం అర్జున్ రెడ్డితో జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్నాడు సందీప్. ఈ సినిమా సక్సెస్తో అర్జున్ రెడ్డి హిందీ రీమేక్ ఆఫర్తో పాటు సూపర్ స్టార్ మహేష్ బాబుతోనూ సినిమా చేసే చాన్స్కొట్టేశాడు. అయితే ఇంత క్రేజ్ ఉన్న దర్శకుడికి నో చెప్పాడు యంగ్ హీరో శర్వానంద్. అసలు అర్జున్ రెడ్డి సినిమా శర్వానంద్ చేయాల్సింది. కథ నచ్చినా కొన్ని కారణాలవల్ల శర్వా ఆ సినిమా చేయలేదు. అయితే తరువాత మరో కథతో సందీప్.. శర్వాను కలిసినా ఆ ప్రాజెక్ట్కు కూడా నో చెప్పాడట శర్వానంద్. ప్రస్తుతం పడి పడి లేచే మనసు సినిమా ప్రమోషన్లో భాగంగా శర్వానంద్ ఈ విషయాన్ని వెల్లడించాడు. తనకు కథ నచ్చటంతో పాటు. ఆ క్యారెక్టర్లో తాను కంఫర్టబుల్గా ఫీల్ అయితేనే నటిస్తానని క్లారిటీ ఇచ్చాడ శర్వానంద్. శర్వానంద్, సాయి పల్లవి హీరో హీరోయిన్లుగా హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన పడి పడి లేచే మనసు ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. అందమైన ప్రేమకథగా తెరకెక్కిన ఈ సినిమా ఆడియో ఇప్పటికే మంచి సక్సెస్ సాధించటంతో సినిమా మీద కూడా భారీ అంచనాలే ఉన్నాయి. -
ఫోర్బ్స్ జాబితాలో విజయ్ దేవరకొండ
అర్జున్ రెడ్డి సినిమాతో టాలీవుడ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసిన యంగ్ హీరో విజయ్ దేవరకొండ. తరువాత కూడా గీత గోవిందం, టాక్సీవాలా సినిమాలతో అదే జోరు కంటిన్యూ చేస్తున్న విజయ్ తాజాగా ఫోర్బ్స్ జాబితాలోనూ చోటు సంపాదించుకున్నాడు. 2018లో అత్యధిక ఆదాయాన్ని పొందిన సెలబ్రిటీల లిస్ట్ను రిలీజ్ చేసింది ఫోర్బ్స్. ఈ లిస్ట్లో 14 కోట్ల ఆదాయంతో 72 వ స్థానంలో నిలిచాడు విజయ్ దేవరకొండ. ఇంత తక్కువ కాలంలో ఫోర్బ్స్జాబితాలో స్థానం సంపాదించడం కూడా ఓ రికార్డ్గానే చెపుతున్నారు ఫ్యాన్స్. ఈ లిస్ట్ సౌత్ నుంచి అగ్రస్థానంలో సూపర్ స్టార్ రజనీకాంత్ నిలవగా పవన్ కల్యాణ్, విజయ్, ఎన్టీఆర్, విక్రమ్, మహేష్ బాబు, సూర్య, విజయ్ సేతుపలి లాంటి తారలు ఉన్నారు. ఈ లిస్ట్లో లేడీ సూపర్ స్టార్ నయనతారకు కూడా చోటు దక్కటం విశేషం. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ 253.25 కోట్ల ఆదాయంతో తొలిస్థానంలో నిలవగా విరాట్ కోహ్లీ 228.09 కోట్లతో తరువాతి స్థానంలో నిలిచాడు. -
బాలీవుడ్కి అతిథిగా..!
టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ తన మార్కెట్ను మరింత విస్తరించుకునేందుకు రెడీ అవుతున్నాడు. అర్జున్ రెడ్డి తరువాత గీత గోవిందం, టాక్సీవాలా లాంటి సక్సెస్లతో మెప్పించిన విజయ్ నోటా సినిమాతో కోలీవుడ్ ఎంట్రీ కూడా ఇచ్చేశాడు. అదే జోరులో బాలీవుడ్లో కూడా అడుగుపెట్టేందుకు రెడీ అవుతున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. అర్జున్ రెడ్డి సినిమా బాలీవుడ్లో రీమేక్ అవుతుండటంతో అక్కడ కూడా విజయ్కు మంచి క్రేజ్ వచ్చింది. అయితే ఇప్పట్లో బాలీవుడ్ లో హీరోగా ఆలోచన చేసే ఆలోచన విజయ్కు లేదని తెలుస్తోంది. కానీ త్వరలో ఓ బాలీవుడ్ సినిమాలో విజయ్ కనిపించనున్నాడట. ఓ భారీ చిత్రంలో విజయ్ అతిధి పాత్రలో కనిపించటం కన్ఫామ్ అయ్యిందన్న టాక్ వినిపిస్తోంది. అంతేకాదు ఈ సినిమా 2020లో రిలీజ్ కానుందన్న ప్రచారం జరుగుతోంది. మరి విజయ్ నటిస్తున్న ఆ బాలీవుడ్ మూవీ ఎదో తెలియాలంటే అఫీషియల్ ఎనౌన్స్మెంట్ వరకు వెయిట్ చేయాల్సిందే. -
బాలీవుడ్ ‘అర్జున్ రెడ్డి’ సెకండ్ లుక్
విజయ్ దేవరకొండ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కిన సెన్సేషనల్ హిట్ సినిమా అర్జున్ రెడ్డి. ఈ సినిమాను బాలీవుడ్లో షాహిద్ కపూర్ హీరోగా రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. సందీప్ దర్శకత్వంలోనే తెరకెక్కుతున్న ఈసినిమాకు కబీర్ సింగ్ అనే టైటిల్ను ఫిక్స్ చేశారు. ఇప్పటికే సినిమాలో షాహిద్ కపూర్కు సంబంధించిన రఫ్ లుక్ స్టిల్స్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. షాహిద్ గుబురు గడ్డంతో ఉన్న స్టిల్స్కు ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు. తాజాగా మరో లుక్కు సంబంధించిన స్టిల్స్ ఇప్పుడు వైరల్గా మారాయి. సినిమాలో కాలేజ్కు సంబంధించిన సీన్స్లో షాహిద్ క్లీన్ షేవ్తో కనిపించాడు. ప్రస్తుతం ఆ సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. క్లీన్ షేవ్తో ఇంటెన్స్గా కనిపిస్తున్న షాహిద్ లుక్కు సూపర్బ్ రెస్పాన్స్ వస్తోంది. టీ సిరీస్, సినీ 1 స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో భరత్ అనే నేను ఫేం కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి సినిమాను 2019 జూన్ 21న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. విక్రమ్ తనయుడు ధృవ్ హీరోగా బాల దర్శకత్వంలో అర్జున్ రెడ్డి తమిళ రీమేక్ వర్మ షూటింగ్ కూడా చివరి దశకు చేరుకుంది.