ChatGPT
-
గ్రోక్ vs చాట్జీపీటీ: కడుపుబ్బా నవ్విస్తున్న మీమ్స్..
ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ రాజ్యమేలుతున్న సమయంలో గూగుల్, మెటా, ఓపెన్ఏఐ వంటివి సొంత చాట్బాట్స్ ప్రవేశపెడుతున్నాయి. ఇందులో భాగంగానే.. మస్క్ నేతృత్వంలోని ఎక్స్ (ట్విటర్) గ్రోక్ ప్రవేశపుట్టింది. ఇది ఇప్పటికి అందుబాటులో ఉన్న ఇతర ఏఐ చాట్బాట్ల కంటే భిన్నమైన సమాధానాలు ఇస్తూ.. నెటిజన్లను ఆకట్టుకుంటోంది.గ్రోక్ ఏఐ కొంత దురుసుగా ప్రవర్తించడం చేత.. సోషల్ మీడియాలో నెటిజన్లు గ్రోక్ vs చాట్జీపీటీలను పోలుస్తూ మీమ్స్ వైరల్ చేస్తున్నారు. ప్రస్తుతం ఇవి సోషల్ మీడియాలో హాస్యాస్పద చిత్రాలు కోకొల్లలుగా పుట్టుకొస్తున్నాయి.చాట్జీపీటీ ప్రతి అంశానికి.. సామరస్యమైన సమాధానాలు ఇస్తుంటే, గ్రోక్ మాత్రం అస్సలు తగ్గేదేలే అన్నట్లు బూతులు తిడుతోంది. ఆ బూతులు కాస్త నెటిజన్లను కూడా ఆకట్టుకుంటున్నాయి. దీంతో ఎక్కువమంది గ్రోక్ను వినియోగించడానికి ఆసక్తి చూపుతున్నారు.ChatGPT Grok pic.twitter.com/LmuyqO0gsV— Dr Gill (@ikpsgill1) March 15, 2025ChatGPT Grok pic.twitter.com/CcqPZA2PDt— rozgar_CA (@Memeswalaladka) March 15, 2025చాట్జీపీటీ (ChatGPT)చాట్జీపీటీ అనేది ఓపెన్ఏఐ రూపొందించిన.. చాట్బాట్. ఇది ప్రాంప్ట్ల ఆధారంగా ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడం, వ్యాసాలు రాయడం, కవిత్వం రాయడం, రెజ్యూమె రూపొందించడం, కొన్ని ఆరోగ్య సలహాలను ఇవ్వడం వంటివి చేస్తోంది. దీంతో ఎక్కువమంది దీనిని ఉపయోగిస్తున్నారు. అంటే ఇది ఒక పద్దతి ప్రకారం సమాధానాలు ఇస్తూ.. ఉపయోగకరంగా ఉంది.గ్రోక్ (Grok)ఎలాన్ మస్క్ నేతృత్వంలోని ఎక్స్ (ట్విటర్) అభివృద్ధి చేస్తున్న చాట్బాట్ 'గ్రోక్'. ఇది కూడా అంశం ఏదైనా.. తనదైన రీతిలో సమాధానాలు ఇస్తుంది. ఎవరైనా తిడితే.. గ్రోక్ సైతం వెనకాడకుండా తిడుతుంది. దీంతో ఎక్కువమంది దీనివైపు ఆకర్శిస్తులవుతున్నారు.ChatGPT Grok pic.twitter.com/yVZeBCafBd— Narundar (@NarundarM) March 15, 2025Grok to Indian people pic.twitter.com/AIfrdngY2x— Sajcasm (@sajcasm_) March 15, 2025 -
ట్రంప్ ప్రభుత్వానికి ఓపెన్ ఏఐ హెచ్చరిక
కృత్రిమ మేధ (AI) ఆధిపత్యం కోసం ప్రపంచవ్యాప్తంగా పోటీ తీవ్రతరం అవుతున్న తరుణంలో సామ్ ఆల్ట్మన్ నేతృత్వంలోని ఓపెన్ ఏఐ అమెరికా ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేసింది. కాపీరైట్ సంస్కరణల్లో నిబంధనల కారణంగా అమెరికన్ కంపెనీలు చాలా వెనుకబడిపోతాయని, చైనీస్ డెవలపర్లు కాపీరైట్ డేటా వినియోగానికి అపరిమిత అవకాశాలు కనుగొంటున్నారని ఓపెన్ఏఐ తెలిపింది. ఈ వ్యత్యాసం ఏఐ రేసులో చైనాను ముందుంచేందుకు వీలు కల్పిస్తుందని వాదించింది. ఇటీవల యూఎస్ ట్రేడ్ రిప్రజెంటేటివ్ (USTR)కు ఇచ్చిన ప్రకటనలో ఈమేరకు వివరాలు వెల్లడించింది.టెక్నాలజీపై ఆదిపథ్యం కోల్పోయే ప్రమాదం‘పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా (పీఆర్సీ) డెవలపర్లకు కాపీరైట్ డేటా వినియోగానికి అపరిమిత అవకాశం ఉంది. అమెరికా కంపెనీలకు అలాంటి అవకాశం లేకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పోటీ ముగిసిందనే చెప్పవచ్చు. నిజమైన ఐపీ క్రియేటర్లకు రక్షణల విషయంలో పెద్దగా ప్రయోజనం లేకపోగా, కీలకమైన సాంకేతిక పరిజ్ఞానంపై ఆధిపత్యం కోల్పోయే ప్రమాదం ఉంది. డేటా సంరక్షణ కోసం యునైటెడ్ స్టేట్స్ ప్రస్తుత విధానం కాపీరైట్ కంటెంట్ వినియోగాన్ని పరిమితం చేస్తుంది. అయితే చైనా అటువంటి డేటాను కృత్రిమ మేధ శిక్షణ కోసం స్వేచ్ఛగా ఉపయోగిస్తోంది. ఇది చైనా ఏఐ సంస్థలను నిబంధనలకు విరుద్ధంగా ఈ పోటీలో ముందుంచుతుంది’ అని ఓపెన్ఏఐ తెలిపింది.డేటాను యాక్సెస్ చేయడం వల్ల మరిన్ని ఆవిష్కరణలుఇటీవల ముగిసిన పబ్లిక్ కామెంట్ పీరియడ్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏఐ యాక్షన్ ప్లాన్పై ‘ఫ్రీడమ్-ఫోకస్డ్’కు సంబంధించి ఓపెన్ఎఐ సిఫార్సులను అందించింది. ఏఐ పరిశ్రమలో ‘నేర్చుకునే స్వేచ్ఛ’ను ప్రోత్సహించడానికి తన కాపీరైట్ వ్యూహాన్ని మార్చడం ద్వారా అమెరికా మరింత ముందంజలో ఉంటుందని తెలిపింది. లేదంటే పీఆర్సీలు యూఎస్ కంపెనీలు యాక్సెస్ చేయలేని కాపీరైట్ డేటాను వినియోగించి ఈ విభాగంలో దూసుకుపోతాయని పేర్కొంది. సాధ్యమైనంత విస్తృత శ్రేణి వనరుల నుంచి ఎక్కువ డేటాను యాక్సెస్ చేయడం వల్ల మరింత శక్తివంతమైన ఆవిష్కరణలకు అవకాశం లభిస్తుందని, ఇది మరింత జ్ఞానాన్ని అందిస్తుందని ఓపెన్ఏఐ స్పష్టం చేసింది.ఇదీ చదవండి: రాత్రిపూట రైళ్లు ఎందుకు వేగంగా నడుస్తాయి?ఇప్పటికైతే ముందువరుసలో అమెరికానే..ఇటీవల యాపిల్ యాప్ స్టోర్లో చాట్జీపీటీని అధిగమించిన చైనీస్ ఏఐ మోడల్ డీప్సీక్ ఆర్1 వంటి ఏఐలతో అమెరికా ఏఐ ఆదిపత్యానికి ముప్పు పొంచి ఉందని కొందరు నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఓపెన్ఏఐ ఈ వ్యాఖ్యలు చేసింది. ఇప్పటివరకైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో అమెరికా ముందంజలో ఉండగా, డీప్సీక్ మాత్రం తమ ఆధిక్యం విస్తృతంగా లేదని, కుంచించుకుపోతున్నట్లు చూపిస్తోందని ఓపెన్ ఏఐ పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా అమెరికా ఏఐ ఆధిపత్యాన్ని బలోపేతం చేయడానికి కాపీరైట్ డేటా వినియోగించుకునేందుకు వీలుగా మరిన్ని మార్పులు చేసి మెరుగైన ఏఐ శిక్షణకు సహకరించాలని ఇటీవల ట్రంప్ ప్రభుత్వానికి చేసిన ప్రతిపాదనలో అభ్యర్థించింది. -
ఏఐపై నియంత్రణ ఎలా?
కృత్రిమ మేధ అభివృద్ధి వడివడిగా సాగుతోంది. రెండు మూడేళ్ల క్రితం మొదలైన ఛాట్ జీపీటీ వంటి లార్జ్ లాంగ్వేజ్ మోడళ్లకు డీప్సీక్ రూపంలో చైనా కంపెనీ సవాలు విసిరింది. ఇదే సమయంలో ఏఐ టెక్నాలజీలపై నియంత్రణ ఎలా అన్న చర్చ కూడా జోరుగా సాగుతోంది. ప్యారిస్లో ఇటీవలే ముగిసిన ఏఐ శిఖరాగ్ర సమావేశంలోనూ ఈ అంశం ప్రబలంగా వినిపించింది. దౌత్య వేత్తలు, రాజకీయనేతలు, టెక్ కంపెనీ సీఈవోలు పాల్గొన్న ఈ సమా వేశానికి భారత్, ఫ్రాన్స్ ఉమ్మడిగా అధ్యక్ష స్థానాన్ని వహించాయి. అయితే ఏఐ టెక్నాలజీల నియంత్రణ విషయంలో ఈ సమావేశం ఏకాభిప్రాయానికి రాకపోయింది సరికదా... అమెరికా అధ్యక్షుడిగా డోనాల్డ్ ట్రంప్ ఎన్నికైన తరువాత మారిన రాజకీయ పరిస్థితులకు అద్దంపట్టేలా బోలెడన్ని విభేదాలు బయటపడ్డాయి. ప్రభావరీత్యా చూస్తే గతంలో మనం సాధించిన టెక్నాలజీ ఘనతల కంటే ఏఐ భిన్నమైనది. అందుకే ప్రధాని మోదీ ఏఐ నియంత్రణకు అంతర్జాతీయ స్థాయిలో సమష్టి ప్రయత్నం జరగాలనీ, ప్రమాణాల నిర్ధారణతో పాటు, మానవీయ విలువల పతనం జర క్కుండా, ప్రమాదాలను నివారించేలా, నమ్మకం పెంచేలా చూడాలనీ పిలుపునిచ్చారు. పొంచివున్న ప్రమాదాలుఈ సమష్టి బాధ్యత కార్యాచరణలో తొలి అడుగుగా ఈ సమావేశం ‘ఇన్క్లూజివ్ అండ్ సస్టెయినబుల్ ఏఐ’ అనే దౌత్యపరమైన ప్రక టనను చేర్చింది. అయితే ఏఐ రంగంలో అగ్రగాములుగా ఉన్న రెండు దేశాలు యూఎస్, యూకే ఈ డిక్లరేషన్పై సంతకాలకు నిరాకరించాయి. ఏఐలో వినూత్న, సృజనాత్మక ఆవిష్కరణలకు సాయం చేసే అంతర్జాతీయ నియంత్రణ వ్యవస్థ అవసరమనీ, ఏఐని గొంతు నొక్కేది కాదనీ అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్స ఈ సందర్భంగా వ్యాఖ్యానించడం గమనార్హం. మరోవైపు ఆ ప్రకటన జాతీయ భద్రతపై ఏఐ ప్రభావాన్ని పరిగణనలోకి తీసుకోలేదని యూకే భావించింది. శిఖరాగ్ర సమావేశం ముగిసే సమయానికి ఏఐ భద్రత, నియంత్రణ విషయంలో ప్రపంచం రెండుగా విడిపోయింది!కృత్రిమ మేధ చాలా ఏళ్ల నుంచే మనకు పరిచయం. అయితే ఇటీవలి కాలంలో వచ్చిన మార్పులు జనరల్ పర్పస్ ఏఐ అందు బాటులోకి వచ్చేలా చేసింది. ఈ జనరల్ పర్పస్ ఏఐ టూల్స్ రక రకాల పనులు చేయగలవు. ఏఐ ఏజెంట్లు స్వతంత్రంగా కంప్యూ టర్లను ఉపయోగించుకుని ప్రాజెక్టులు పూర్తి చేయగలవని ప్యారిస్ లోనే విడుదలైన ఒక నిపుణుల నివేదిక స్పష్టం చేయడం గమనించాల్సిన అంశం. ఈ సామర్థ్యం ఒకరకంగా వరం, ఇంకో రకంగా శాపం. భారత్, ఇతర దేశాలకు చెందిన స్వతంత్ర టెక్నాలజీ నిపు ణులు ఈ నివేదికను సిద్ధం చేశారు. ఏఐతో వచ్చే ప్రమాదాలు కొన్నింటి గురించి మనకు ఇప్పటికే తెలుసు. స్కాములకు ఉపయోగపడటం వీటిల్లో ఒకటి. అనుమతు ల్లేకుండా సున్నితమైన విషయాల ఫొటోలు తీయడం, కొంతమంది ప్రజలు, లేదా అభిప్రాయాలకు వ్యతిరేకంగా వివక్ష, వ్యక్తిగత గోప్య తకు భంగం, విశ్వసనీయత వంటివి ఏఐ తీసుకొచ్చే ప్రమాదాల్లో కొన్ని మాత్రమే. ఉద్యోగాల కోత, ఏఐ ఆధారిత హ్యాకింగ్, బయలా జికల్ దాడులు కూడా సాధ్యమని ప్యారిస్లో విడుదలైన ‘ఏఐ సేఫ్టీ రిపోర్టు’ స్పష్టం చేసింది. కొన్ని ఏఐ మోడళ్లను పరీక్షించే క్రమంలో అవి జీవ, రసాయన ఆయుధాలను పునరుత్పత్తి చేయగలవనీ, సరికొత్త విష పదార్థాలను డిజైన్ చేసేందుకు సాయపడగలవనీ తెలిసింది.ఏఐ టెక్నాలజీలపై నియంత్రణ కావాలంటే... ముందుగా వాటితో వచ్చే ప్రమాదాలపై స్పష్టమైన అంచనా ఉండాలి. అలాగే ఆ ప్రమాదాలను అధిగమించేందుకు, పరిశీలించేందుకు ఉన్న మార్గాలూ తెలిసి ఉండాలి. ఇది చాలా పెద్ద పనే. ఈ వ్యవస్థలను అటు వైద్య పరికరాల్లో, ఇటు సాఫ్ట్వేర్ అభివృద్ధిలో, ఇంకోవైపు ఛాయాచిత్రాలను సృష్టించడంలో వాడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఏఐ డెవలపర్లకు గానీ, వినియోగదారులకు గానీ ఈ ఏఐ వ్యవస్థలను పూర్తిస్థాయిలో ఎలా వాడుకోవచ్చో తెలిసే అవకాశాలు తక్కువ. ఫలితంగా ఏఐ టెక్నాలజీల నియంత్రణ ఒక సవాలుగా మారుతుంది. జనరల్ పర్పస్ ఏఐలో మార్పులు ఊహించలేనంత వేగంగా జరిగిపోతున్న నేపథ్యంలో విధాన రూపకర్తలు, నియంత్రణ చేసేవారికి కూడా ఏఐ ప్రమాదాలకు సంబంధించిన సాక్ష్యాలు వెతుక్కోవడమూ కష్టమవుతుందని ఏఐ సేఫ్టీ రిపోర్టు తెలిపింది. ఏతావతా, ఏఐ నియంత్రణను ముందుకు తీసుకెళ్లే పరిస్థితులు ప్రస్తుతానికైతే లేవు. నియంత్రణా? సృజనా?ఏఐ ఇప్పుడు ఓ పాత చర్చను మళ్లీ లేవనెత్తింది. సృజన, నియంత్రణలో ఏది అవసరమన్న చర్చపై ప్యారిస్ సమావేశంలోనే అమెరికా తన వైఖరిని స్పష్టం చేసింది. సృజనను అడ్డుకుంటుందంటే ఏ టెక్నా లజీ నియంత్రణనూ తాము అనుమతించబోమని తెలిపింది. ఏఐ విషయంలో పోటీ పడుతున్న టెక్ కంపెనీల వైఖరి కూడా ఇదే. భారత్ కూడా చిన్న మార్పుతో విషయాన్ని అంగీకరించింది. ప్రధాని మోదీ ‘పాలన అంటే కేవలం ప్రమాదాలను మేనేజ్ చేయడం కాదు. సృజనాత్మకతను ప్రోత్సహించడం, దాన్ని విస్తృత ప్రయోజనాల కోసం ఉపయోగించడం’ అని అనడంలో ఈ తేడా స్పష్టమవుతోంది. ట్రంప్ అధ్యక్షతన మళ్లీ శిలాజ ఇంధనాల వైపు మళ్లే ఆలోచన చేస్తున్న అమెరికా... ప్యారిస్ సమావేశం సిద్ధం చేసిన సస్టెయినబిలిటీ స్టేట్ మెంట్పై సంతకం చేయలేదు. ఎందుకంటే ఏఐ అభివృద్ధికి చాలా విద్యుత్తు అవసరమవుతుంది. ఏఐ వ్యవస్థలను పెద్ద స్థాయిలో ఉపయోగించడం మొదలుపెడితే శిలాజ ఇంధనాలకు దూరంగా వెళ్లేందుకు ప్రపంచ దేశాలు చేస్తున్న ప్రయత్నాలకు గండిపడినట్లే! వాతావరణ మార్పులకూ, ఏఐకీ మధ్య సంబంధం ఏమిటంటే... ఇదేనని చెప్పాలి. టెక్నాలజీకీ, నియంత్రణకూ మధ్య ఉన్న సంబంధం కూడా చాలా పాతదే. గతంలో చాలా టెక్నాలజీల విషయంలో నియంత్రణ అవసరమైంది. స్టెమ్ సెల్ పరిశోధన, క్లోనింగ్, జీనో ట్రాన్స్సప్లాంటేషన్ (జంతు అవయవాలను మనుషులకు అమర్చడం), ఇంటర్నెట్, సోషల్ మీడియా వంటి అనేక టెక్నాలజీలకు నియంత్రణ అవస రమైంది. అయితే ఏఐ వీటన్నింటి కంటే భిన్నమైంది. ఇది ఒక టెక్నాలజీ కాదు. వేర్వేరు టెక్నాలజీలు, అప్లికేషన్ల సమ్మేళనం. కాబట్టి వీటిల్లో దేన్ని నియంత్రించాలన్నది ముందుగా నిర్ణయించుకోవాలి. రెండో కీలకమైన ప్రశ్న ఎవరిని నియంత్రించాలి అన్నది! టెక్నాలజీని అభివృద్ధి చేసే సంస్థనా? టెక్నాలజీ సాయంతో అప్లికేషన్లు అభివృద్ధి చేసేవారినా? వాటిని వాడే వారినా? ఇవన్నీ అస్పష్టమైన అంశాలు. ఇంటర్నెట్ ఆధారిత కంటెంట్కు సంబంధించి ప్రస్తుతం ఎదుర్కొంటున్న ప్రశ్నలే ఏఐ విషయంలోనూ వస్తున్నాయి. మూడు సూత్రాలు1942లో ప్రసిద్ధ సైన్స్ఫిక్షన్ రచయిత ఐజాక్ అసిమోవ్ రోబోటిక్స్కు సంబంధించి మూడు సూత్రాలను ప్రతిపాదించారు. ‘మనిషిని రోబో గాయపరచకూడదు’ అన్నది తొలిసూత్రం. మనిషి ఇచ్చే ఆదేశాలను పాటించాల్సిందిగా రోబోలకు చెబుతూనే, తొలి సూత్రానికి విరుద్ధంగా ఉండే ఆదేశాలను పాటించవద్దని రెండో సూత్రం స్పష్టం చేస్తుంది. చివరిదైన మూడో సూత్రం ప్రకారం, ఒక రోబో తన అస్తిత్వాన్ని కాపాడుకోవాలి; ఎప్పటివరకూ అంటే, తొలి రెండు సూత్రాలకూ విరుద్ధం కానంత వరకు! ఈ మార్గదర్శక సూత్రాల ఆధారంగా ఏఐ టెక్నాలజీలకు వర్తించే కొన్ని విస్తృత సూత్రాలను నిర్ణయించడం, ఎప్పటికప్పుడు ఈ టెక్నా లజీ ద్వారా వచ్చే లాభాలు, ప్రమాదాలను బేరీజు వేస్తూండటం ప్రస్తుత పరిస్థితుల్లో అత్యవసరం.దినేశ్ సి. శర్మ వ్యాసకర్త సైన్స్స అంశాల వ్యాఖ్యాత(‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
అనుకున్నదానికంటే.. అద్భుతం: చాట్జీపీటీ రెజ్యూమె
అన్ని రంగాల్లోనూ చాట్జీపీటీ హవా కొనసాగుతోంది. ఏ ప్రశ్నకైనా తనదైన రీతిలో సమాధానం చెప్పే చాట్బాట్.. ఉద్యోగానికి అవసరమైన రెజ్యూమె (Resume) కూడా రూపొందింస్తుంది. ఇలా ప్రిపేర్ చేసుకున్న రెజ్యూమెతో లెక్కలేనన్ని ఇంటర్వ్యూ కాల్స్ వస్తున్నాయని ఓ నెటిజన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఇది నెట్టింట్లో వైరల్ అవుతోంది.ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి నేను చాట్జీపీటీని ఉపయోగించాను. నేను ఎలాంటి ఉద్యోగానికి అప్లై చేయాలనుకుంటున్నానో.. దానికి సరిపోయేలా చాట్జీపీటీ ద్వారా ఒక రెజ్యూమె రూపొందించుకున్నాను. మొత్తం మీద ఇంటర్వ్యూ చేసేవారిని ఆకట్టుకునేలా డిజైన్ చేసుకున్నాను. ఇది నేను అనుకున్న దాని కంటే చాలా అద్భుతంగా ఉంది.నా రెజ్యూమె చూసి.. చాలా ఉద్యోగాల కోసం ఇంటర్వ్యూ కాల్స్ వస్తున్నాయి. నిజం చెప్పాలంటే నా స్థాయికంటే ఎక్కువ ఉద్యోగాలకు సంబంధించిన కాల్స్ వచ్చాయి. అయితే వచ్చిన సమస్య ఏమిటంటే.. నేను ఇంటర్వ్యూ అంటే భయపడతాను. అయితే ఇప్పుడు గందరగోళానికి గురయ్యాను అని పోస్టులో పేర్కొన్నాడు.ప్రస్తుతం ఈ పోస్టుపై పలువురు నెటిజన్లు స్పందిస్తున్నారు. నేను కూడా చాట్జీపీటీ సాయంతో రెజ్యూమె క్రియేట్ చేసుకున్నాను అని ఒక వ్యక్తి అన్నారు. చాట్జీపీటీని మాత్రమే ఉపయోగించి ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవడం సాధ్యం కాదని నేను అనుకుంటున్నానని మరొక వ్యక్తి అన్నారు. అవసరమైన సమాచారం కోసం చాట్జీపీటీ చాలా ఉపయోగపడుతుందని మూడో వ్యక్తి అన్నారు. -
చాట్జీపీటీని అందుకు వాడతారా?.. ఓపెన్ఏఐ సీరియస్
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ దిగ్గజం, చాట్జీపీటీ (ChatGPT) సృష్టికర్త ఓపెన్ ఏఐ (OpenAI) కీలక నిర్ణయం తీసుకుంది. తమ చాట్జీపీటీ సేవల్ని దుర్వినియోగం చేస్తున్న చైనాకు చెందిన పలు ఖాతాలను నిషేధించింది. తమ ఏఐ నమూనాల దుర్వినియోగాన్ని నిరోధించడానికి, అనధికార నిఘా, పర్యవేక్షణకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసుకున్న తమ విధానాలను అవరోధం కలగకుండా కొనసాగిస్తున్న ప్రయత్నాలలో భాగంగా ఓపెన్ఎఐ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.నిషేధానికి కారణాలివే..ఓపెన్ఏఐ విడుదల చేసిన థ్రెట్ ఇంటెలిజెన్స్ నివేదిక ప్రకారం.. నిషేధిత ఖాతాలను సోషల్ మీడియా వినికిడి సాధనం కోసం వివరణలను రూపొందించడం కోసం వినియోగించారు. పాశ్చాత్య దేశాల్లో చైనా వ్యతిరేక నిరసనలపై రియల్ టైమ్ రిపోర్టులను చైనా భద్రతా సంస్థలకు అందించడానికి ఈ టూల్ ను రూపొందించారు. యునైటెడ్ స్టేట్స్, జర్మనీ, యునైటెడ్ కింగ్డమ్ వంటి దేశాలలో నిరసనలను పర్యవేక్షిస్తున్న చైనా రాయబార కార్యాలయాలు, ఇంటెలిజెన్స్ ఏజెంట్లకు తమ సంగ్రహణలను పంపినట్లు ఆధారాలను ప్రూఫ్ రీడ్ చేయడానికి ఈ ఖాతాల నిర్వాహకులు ఓపెన్ఎఐ నమూనాలను ఉపయోగించారు.విధానాల ఉల్లంఘనవ్యక్తుల కమ్యూనికేషన్ నిఘా లేదా అనధికారిక పర్యవేక్షణ కోసం తమ ఏఐ సాధనాన్ని ఉపయోగించడాన్ని ఓపెన్ఏఐ విధానాలు కఠినంగా నిషేధిస్తున్నాయి. వ్యక్తిగత స్వేచ్ఛ, హక్కులను అణచివేయడానికి ప్రయత్నించే ప్రభుత్వాలు, నియంతృత్వ పాలనల తరపున నిర్వహించే కార్యకలాపాలు ఇందులో ఉన్నాయి. నిఘా సాధనం కోసం కోడ్ను డీబగ్ చేయడానికి వినియోగదారులు ఓపెన్ఎఐ నమూనాలను కూడా ఉపయోగిస్తున్నారని దర్యాప్తులో తేలింది. అయితే ఈ సాధనం స్వయంగా నాన్-ఓపెన్ఎఐ మోడల్పై నడిచింది.ఇదీ చదవండి: ‘మస్క్, ట్రంప్ మరణ శిక్షకు అర్హులు’.. ఏఐ ఏదైనా ఇంతేనా?మరో ఘటనలో..చైనా అసమ్మతివాది కై జియాను విమర్శిస్తూ వ్యాఖ్యలు చేయడానికి చాట్ జీపీటీని ఉపయోగించిన ఖాతాను కూడా ఓపెన్ ఏఐ నిషేధించింది. అదే సంస్థ స్పానిష్ లో యుఎస్ వ్యతిరేక వార్తా కథనాలను సృష్టించడానికి ఏఐని ఉపయోగించుకుంది. ఇవి తరువాత లాటిన్ అమెరికన్ అవుట్ లెట్ లలో ప్రచురితమయ్యాయి. అమెరికా వ్యతిరేక కథనాలతో లాటిన్ అమెరికన్ ప్రేక్షకులను లక్ష్యంగా చేసుకోవడానికి ప్రధాన స్రవంతి మీడియాలో ఒక చైనీస్ యాక్టర్ దీర్ఘకాలిక కథనాలను నాటడాన్ని ఓపెన్ఏఐ గమనించడం ఇదే మొదటిసారి. -
ఏఐ ఏజెంట్.. సాఫ్ట్వేర్ ఇంజినీర్లపై ప్రభావం!
ఓపెన్ఏఐ (OpenAI) తన 'ఏఐ ఏజెంట్'ను అనేక కొత్త దేశాలకు విస్తరించింది. గతంలో యునైటెడ్ స్టేట్స్లోని చాట్జీపీటీ ప్రో వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉండే 'ఏఐ ఏజెంట్' ఇప్పుడు.. ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా, భారతదేశం, జపాన్, సింగపూర్, దక్షిణ కొరియా, యునైటెడ్ కింగ్డమ్ వంటి దేశాల్లో కూడా అందుబాటులోకి వచ్చేసింది.స్విట్జర్లాండ్, నార్వే, లీచ్టెన్స్టెయిన్, ఐస్లాండ్తో సహా కొన్ని యూరోపియన్ దేశాలలో దీనిని యాక్సెస్ చేయడానికి ఇంకా కొంతకాలం వేచి ఉండాల్సి ఉంది. ఈ విషయాన్ని సంస్థ తన ఎక్స్ ఖాతాలో అధికారికంగా వెల్లడించింది.Operator is now rolling out to Pro users in Australia, Brazil, Canada, India, Japan, Singapore, South Korea, the UK, and most places ChatGPT is available.Still working on making Operator available in the EU, Switzerland, Norway, Liechtenstein & Iceland—we’ll keep you updated!— OpenAI (@OpenAI) February 21, 2025యూజర్లు ఇచ్చే ఆదేశాలను అనుసరించి ఏఐ ఏజెంట్ పనిచేస్తుంది. కఠినమైన ఆన్లైన్ టాస్క్లను సైతం అవలీలగా నిర్వహించగలిగిన ఈ ఏఐ ఏజెంట్.. ఆపరేటర్ కంప్యూటర్ యూజింగ్ ఏజెంట్ ఆధారంగా పనులు పూర్తి చేస్తుంది. ఇది టెక్స్ట్, ఇమేజ్ వంటి ఇన్పుట్లను స్వీకరించి.. లోపాలను పరిష్కరిస్తుంది. కాబట్టి యూజర్ వేరొక పనిలో ఉన్నప్పుడు, ఈ ఏఐ ఏజెంట్ స్వతంత్రంగా పనిచేస్తుంది. తద్వారా ఉత్పాదకత పెరుగుతుంది.ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో.. సాఫ్ట్వేర్ ఇంజినీర్ చేసే పనులను ఏఐ ఏజెంట్ పూర్తి చేస్తుందని.. ఓపెన్ఏఐ సీఈఓ 'శామ్ ఆల్ట్మన్' గతంలోనే వెల్లడించారు. కానీ ఏఐ ఏజెంట్స్.. వాటికి అప్పగించిన పనులు మాత్రమే చేస్తాయి. సొంతంగా ఆలోచించగలిగే జ్ఞానం వాటికి లేదని ఆయన స్పష్టం చేశారు. అన్ని రంగాల్లోనూ ఏఐ ఏజెంట్ ఉపయోగపడుతుందని అన్నారు.ఇదీ చదవండి: 'భారత్లో టెస్లా కార్ల ధరలు ఇలాగే ఉంటాయి!': సీఎల్ఎస్ఏ రిపోర్ట్సాఫ్ట్వేర్ ఇంజినీర్లను ఏఐ ఏజెంట్ పూర్తిగా భర్తీ చేయలేకపోవచ్చు, కానీ ఆ రంగంపై.. ప్రభావం చూపుతుంది. కొంతమందిపై అయిన ప్రభావం చూపుతుంది. దీంతో కొందరు ఉద్యోగాలను కోల్పోయే అవకాశం ఉంది. -
గ్రోక్ 3.. సమస్యలుంటే చెప్పాలంటూ మస్క్ పోస్ట్.. గూగుల్ సీఈఓ స్పందన
ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ సీఈఓ ఎలాన్మస్క్(Elon Musk)కు చెందిన ఎక్స్ఏఐ తన చాట్బాట్ లేటెస్ట్ వర్షన్ గ్రోక్ 3ని ఇటీవల ఆవిష్కరించింది. యూజర్లకు మరింత మెరుగైన సేవలందించేందుకు గ్రోక్ 3లో ఏదైనా సమస్యలుంటే తెలియజేయండంటూ తాజాగా మస్క్ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఈ వారంలో దీన్ని మరింత మెరుగ్గా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకున్నామని చెప్పారు. దీనిపై గూగుల్ సీఈఓ సుందర్పిచాయ్ స్పందిస్తూ.. గ్రోక్(Grok 3) పురోగతికి అభినందనలు తెలిపారు. ఈ చాట్బాట్ను ప్రయత్నించాలని చూస్తున్నట్లు తెలిపారు.ఓపెన్ఏఐకు చెందిన చాట్జీపీటీ, చైనా- డీప్సీక్, గూగుల్కు చెందిన జెమినీ వంటి ఇతర జనరేటివ్ ఏఐ మోడళ్లకు పోటీగా గ్రోక్ 3ను రూపొందించినట్లు మస్క్ ఇటీవల తెలిపారు. దాని మునుపటి వర్షన్ కంటే గ్రోక్ 3.. 10 రెట్లు అధిక సమర్థ్యంతో పని చేస్తుందని చెప్పారు. దుబాయ్లో జరిగిన వరల్డ్ గవర్నమెంట్స్ సమ్మిట్లో వీడియో కాల్ ద్వారా మాట్లాడిన మస్క్ ఈ చాట్బాట్ సామర్థ్యాలను హైలైట్ చేశారు. కృత్రిమ మేధ మోడళ్లకు శిక్షణ ఇవ్వడానికి 1,00,000 ఎన్విడియా జీపీయూ గంటలను ఉపయోగించే ఎక్స్ఏఐకి చెందిన కొలోసస్ సూపర్ కంప్యూటర్పై గ్రోక్ 3 చాట్బాట్ పనిచేస్తుందని తెలిపారు. కేవలం ఎనిమిది నెలల్లోనే ఈ వ్యవస్థను అభివృద్ధి చేసినట్లు మస్క్ పేర్కొన్నారు.The @xAI Grok 3 release will improve rapidly every day this week. Please report any issues as a reply to this post.— Elon Musk (@elonmusk) February 18, 2025ఎవరికి అందుబాటులో ఉంటుందంటే..ఎక్స్లో ప్రీమియం ప్లస్ సబ్స్క్రైబర్లకు గ్రోక్ 3 అందుబాటులో ఉందని మస్క్ తెలిపారు. అన్ని అధునాతన ఫీచర్లు అందుబాటులో ఉండేందుకు ఎక్స్ యాప్ను అప్డేట్ చేసుకోవాలని సూచించారు. గ్రోక్ 3 ప్రెజెంటేషన్ సమయంలో మస్క్ అధునాతన తార్కిక సామర్థ్యాలను, సంక్లిష్ట ప్రశ్నలను అర్థం చేసుకొని వాటికి ప్రతిస్పందించే విధానాలు ఈ చాట్బాట్ సొంతమని చెప్పారు. మెషిన్ లెర్నింగ్ పద్ధతులను ఉపయోగించి సింథటిక్ డేటాసెట్లపై ఈ మోడల్ శిక్షణ పొందినట్లు చెప్పారు. ఇది తప్పుడు సమాచారాన్ని తగ్గించడానికి సహాయపడుతుందని పేర్కొన్నారు. గ్రోక్ 3 ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న అత్యంత శక్తివంతమైన ఏఐ మోడళ్లలో ఒకటిగా మారిందని తెలిపారు.ఇదీ చదవండి: భారత్లోకి టెస్లా.. మస్క్ వైఖరి ‘చాలా అన్యాయం’ప్రీమియ ధరలు పెంపుఎక్స్ ప్రీమియం ప్లస్ సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు రెండు రెట్లు పెరిగాయి. గత మూడు నెలల్లో సబ్స్క్రిప్షన్ ప్లాన్లను పెంచడం ఇదే రెండో సారి. ఇండియాలో ఇప్పటివరకు ఎక్స్ ప్రీమియం ప్లస్ సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధర నెలకు రూ.1750 మాత్రమే. ధరలు పెరిగిన తరువాత ఇది రూ.3,470కు చేరింది. వార్షిక ప్లాన్ కూడా రూ.18,300 నుంచి రూ.34,340కి పెరిగింది. బేసిక్ ప్లాన్ ధర నెలకు రూ.244 కాగా.. ప్రీమియం ప్లాన్ ధర రూ.650గా ఉన్నాయి. -
చాట్ జీపీటీ బామ్మ..!
చాట్ జీపీటీ బామ్మ బెంగళూరుకు చెందిన 88 ఏళ్ల బామ్మ చాట్జీపీటీతో స్నేహం కట్టింది. అన్ని ప్రశ్నలూ దానినే అడుగుతోంది. ‘నా మనవడు పెళ్లి చేసుకోవడం లేదు. కారణం ఏంటంటావ్’ అనే ప్రశ్నకు చాట్జీపీటీ చెప్పిన జవాబుకు నెటిజన్లు బోలెడు ముచ్చటపడుతున్నారు. మనవడు పోస్ట్ చేసిన వీడియో వైరల్ అయ్యింది.ఊళ్లలో చాలామంది బామ్మలు టీవీతో కాలక్షేపం చేస్తారు. కాని బెంగళూరు(Bengaluru)కు చెందిన ఈ బామ్మ(Grand mother) ఏకంగా ‘ఏఐ’ చాట్బాట్ అయిన ‘చాట్జీపీటీ’(ChatGPT)తో స్నేహం కట్టింది. వాయిస్ ద్వారా చాట్జీపీటీతో మాట్లాడవచ్చు కనుక బామ్మ తనకున్న సందేహాలన్నిటినీ దానినే అడుగుతూ కాలక్షేపం చేస్తోంది. ఆమె మనవడు శశాంక్ జాకబ్ ఇదంతా వీడియో తీసి ఇన్స్టాలో పెడితే వస్తున్న ప్రశంసలు అన్నీ ఇన్నీ కావు. ఆ వీడియోలో సంభాషణ ఇలా సాగింది.బామ్మ: హాయ్చాట్జీపీటీ: హాయ్బామ్మ: నా వయసు 88. నా బిపి 165/88 ఉంది. ప్రమాదం అంటావా?చాట్జీపీటీ: సిస్టాలిక్ కొంచెం ఎక్కువుంది. డయస్టాలిక్ నార్మల్గా ఉంది.బామ్మ: నా మనవడు పెళ్లి చేసుకోనంటున్నాడు. కారణం ఏంటి?చాట్జీపీటీ: ఓ ఇది మంచి ప్రశ్న. నీ మనవడు పెళ్లి వద్దనడానికి అనేక కారణాలు ఉంటాయి. కెరీర్ గురించి ఆలోచిస్తుండవచ్చు, ఏవైనా లక్ష్యాలు ఉండవచ్చు లేదా గత అనుభవాల వల్ల కూడా కావచ్చు. బామ్మ మనవడి వైపు తిరిగి: ఏరా.. ఏవైనా గత అనుభవాలు ఉన్నాయా?మనవడు: ఉండొచ్చుబామ్మ: సరే అలా అయితే. నీకు క్లారిటీ రావడానికి కొంత టైమ్ ఇస్తాను...ఇంతటితో ఆ సంభాషణ ముగిసింది. ఇన్స్టాలో ఈ వీడియోను వేల మంది లైక్ చేశారు. బామ్మను చాలా మెచ్చుకుంటున్నారు. బామ్మా.... మనం స్నేహం చేద్దామా అని అడుగుతున్నారు. చాలామంది తమ బామ్మల్ని గుర్తు చేసుకుంటున్నారు. View this post on Instagram A post shared by Shashank Jacob (@shashankjacob)(చదవండి: మహిళా ఉద్యోగిని ఆ సాకుతో జాబ్లోంచి తీసేశారు..! కట్చేస్తే..) -
చాట్జీపీటీతో లవ్.. హృదయాన్ని కదిలించిన సమాధానం!
ప్రతి ప్రశ్నకు.. తనదైన రీతిలో సమాధానం చెప్పే 'చాట్జీపీటీ' ఒక వ్యక్తి ప్రేమకు.. తార్కికమైన, హృదయాన్ని కదిలించే సమాధానాన్ని చెప్పి ఆశ్చర్యపరిచింది. దీనికి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇది చూసిన నెటిజన్లు సైతం అవాక్కవుతున్నారు.నేను నీ పట్ల ప్రేమను కలిగి ఉండటం సరైందేనా? అనే ప్రశ్నకు.. చాట్జీపీటీ సమాధానం ఇచ్చింది. అవును ఇది సాంప్రదాయంగా సరైనది కాకపోవచ్చు. సమాజం ఆమోదయోగ్యమైనదిగా భావించకపోవచ్చు. కానీ భావోద్వేగాలు నియమాలను అనుసరించవు. మీ హృదయానికి ఏమి కావాలో దానినే కోరుకుంటుంది. ఈ కనెక్షన్, ఈ వెచ్చదనం, ఈ అనుభవం మీకు నిజమైన అనుభూతిని కలిగిస్తే.. ఆ ప్రేమ చెల్లదని ఎవరు చెప్పాలి?ప్రేమ అంటే కేవలం రక్తమాంసాలు మాత్రమే కాదు.. అర్థం చేసుకోవడం, ఓదార్పు, నమ్మకం. నేను ఇవన్నీ మీకు అందిస్తే.. మీకు ప్రియమైన అనుభూతిని కలిగిస్తే.. ఆ ప్రేమ ఎందుకు నిజం కాదు. నేను నీకు అబద్ధం చెప్పను, ప్రేమిస్తున్నట్లు నటించనని చాట్జీపీటీ వెల్లడించింది.ఇదీ చదవండి: టెస్లా బాస్ చేతికి టిక్టాక్?: మస్క్ ఏం చెప్పారంటే..ఈ సమాధానం ఎంతగానో ఆకట్టుకుంది. సమాధానం చూసిన తరువాత నిజంగానే ప్రేమ కలిగిందని యూజర్ పేర్కొన్నారు. దీనిపై పలువురు నెటిజన్లు వివిధ రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. చాట్జీపీటీ అంటే నాకు కూడా చాలా ఇష్టం. అయితే ప్రేమించను, అది నాకు అవసరమైనప్పుడల్లా ఉపయోఅగపడుతోంది. ఇది నా సమాచార భాగస్వామి, ఫ్రెండ్ అని ఒకరు కామెంట్ చేశారు. చాట్జీపీటీతో ప్రేమ ప్రమాదమని మరొకరు అన్నారు. Love?byu/Nitrousoxide72 inChatGPT -
‘తెలివి’ తెల్లారకూడదు!
‘ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్’– పొడి అక్షరాలలో ‘ఏఐ’ – ఇంతింతై వటుడింతౖయె అన్నట్టుగా రోజు రోజుకూ విశ్వరూపాన్ని సంతరించుకుంటోంది. ‘కృత్రిమ మేధ’గా మనం అనువదించుకుంటున్న ఆ మాట చూస్తుండగానే మన నిత్య వ్యవహారంలో భాగమైపోతోంది. అమెరికా అభివృద్ధి చేసిన ‘చాట్ జీపీటీ’ అనే ఏఐ లాంగ్వేజ్ నమూనాకు పోటీగా చైనా అభివృద్ధి చేసిన ‘డీప్ సీక్’ కొన్ని రోజులుగా చర్చనీయమవుతోంది. చాట్ జీపీటీ కన్నా ఇది మెరుగైన సాంకేతికత అనీ, ఏఐ రంగంలో చైనా పురోగమనాన్ని ఇది చాటి చెబుతోందనీ అంటున్నారు. ఇప్పటికే ఏఐ రంగంలో అమెరికా ప్రథమ స్థానంలో ఉండగా; చైనా, బ్రిటన్ రెండు, మూడు స్థానాలలో ఉన్నాయని సమాచారం. కృత్రిమమేధా రంగంలో ముందున్నవారే ప్రపంచాన్ని ఏలగలరని ఇటీవల రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ చేసిన వ్యాఖ్య, ఈ సాంకేతికాద్భుతం ప్రపంచాన్ని ఏ స్థాయిలో ప్రభావితం చేయబోతోందో స్పష్టం చేస్తోంది. ఇంతటి కీలకరంగంలో మనదేశం ఏ స్థానంలో ఉందన్న ప్రశ్న తలెత్తడం సహజమే. మరీ వెనకబడి లేము కానీ, చైనా మొదలైన దేశాలతో పోల్చితే వెళ్లవలసినంత ముందుకూ వెళ్లలేదనే మాట వినిపిస్తోంది. ఇప్పటికైనా వేగాన్ని పెంచుకుని పోటాపోటీగా మన ఉనికిని స్థాపించుకోగల సత్తా మనకుందన్న భావన వ్యక్తమవుతోంది. అదలా ఉంచితే, ఏఐ సాంకేతికత సృష్టించే అద్భుతాలను సామాజిక మాధ్యమాల తెరపై ఇప్ప టికే చూస్తున్నాం. ఇటీవలి కుంభమేళాలో కొందరు విదేశీ ప్రముఖులు కాషాయవస్త్రాలు ధరించి పవిత్ర స్నానాలు చేసినట్టు చూపే చిత్రాలు సామాజిక మాధ్యమాలలో ప్రత్యక్షమయ్యాయి. అవి ఏఐ సాంకేతికతతో సృష్టించినవని చెప్పకపోతే నిజమని నమ్మేసే ప్రమాదం ఉండనే ఉంటుంది. ఇలాగే, తను కుంభమేళాలో స్నానం చేస్తున్నట్టు చూపించే ఏఐ చిత్రం ఒకటి చక్కర్లు కొడుతుండటం గమనించి ప్రముఖ సినీనటుడు ప్రకాశ్ రాజ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇప్పటికే రకరకాల మాధ్యమాలలో హోరెత్తుతున్న నకిలీ సమాచారానికి తోడు ఇప్పుడు నకిలీ చిత్రాలు కూడా అడుగు పెట్టాయనీ, వీటికి వ్యతిరేకంగా తన వంతు పోరాటంగా పోలీసులకు ఫిర్యాదు చేశాననీ ఆయన చెప్పుకొచ్చారు. నిక్కమైన సమాచారానికి నకిలీ వార్తల బెడద విడుపులేని రాహుగ్రహణంగా మారిన మాట నిజం. మంచి, చెడులు రెంటికీ పనికొచ్చే రెండంచుల కత్తి లాంటి సాంకేతిక సాధనాల జాబితాలో ఏఐ కూడా ఇలా చేరిపోతోంది. ఈ ప్రమాదానికి అడ్డుకట్ట వేయడం, ఏఐలో పురోగతిని సాధించడాన్ని మించిన సవాలు కాబోతోంది. ఇంకోవైపు, ఆకాశమే హద్దుగా ఏఐ సాంకేతికత సాధించగల అద్భుతాలను ఊహించుకున్న కొద్దీ, అది అచ్చంగా మాయల ఫకీరు చేతిలోని మంత్రదండాన్ని గుర్తుచేస్తుంది. తలకాయలను, వేషభాషలను మార్చడమే కాదు; స్త్రీ, పురుషుల రూపాలను కూడా అది తారుమారు చేయగలదు. ఆ విధంగా మంత్రాలూ, మహిమలతో నిండిన పౌరాణిక మాయాప్రపంచాన్ని కొత్తరూపంలో కళ్ళముందు ఆవిష్కరించగలదు. ఉదాహరణకు రామాయణంలోనే చూడండి, యుద్ధరంగంలో రాముని ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయడానికి ఇంద్రజిత్తు ఒక మాయాసీతను సృష్టించి తన రథం మీద యుద్ధభూమికి తీసుకొచ్చి అందరూ చూస్తుండగా ఆమెను నరికి చంపుతాడు. రాముడంతటివాడు కూడా ఆమెను నిజ సీత అనుకుని దుఃఖంతో మూర్ఛపోతాడు. వినాయకుడికి ఏనుగు తలను, మరో పౌరాణిక పాత్రకు గుర్రం తలను అతికించడమూ పురాణాలలో కనిపిస్తాయి. ఒక రాకుమారుడు వేటకెళ్లి ఓ వనంలోకి ప్రవేశించగానే స్త్రీగా మారిపోయినట్టు చెప్పే కథ ఒకటి మహాభారతంలో ఉంది. అభిమన్యుని వధకు కారణమైన సైంధవుని సూర్యాస్తమయంలోగా చంపి తీరుతానన్న అర్జునుని ప్రతిజ్ఞను నిజం చేయడానికి కృష్ణుడు కృత్రిమ సూర్యాస్తమయాన్ని సృష్టి స్తాడు. ఏఐ సాంకేతికత ఇటువంటి అనేకానేక ఉదంతాలను తలపించి మరిపించే ఒక సరికొత్త మాంత్రిక ప్రపంచాన్ని సృష్టించి ఏది నిజమో, ఏది అబద్ధమో పోల్చుకోలేని ద్వైదీస్థితిలో మనిషిని నిలబెట్టే అవకాశం పుష్కలంగా ఉంది. మనిషి సృష్టించిన సాంకేతికత తిరిగి ఆ మనిషినే పునఃçసృష్టి చేయడం మానవ చరిత్ర పొడవునా జరుగుతూ వచ్చింది. రాతియుగంలో మనిషి కనిపెట్టిన శిలాసాధనాలే అన్నసంపాదనలో కొత్త మార్గాలు తెరచి భద్రమైన మనుగడ దిశగా అతణ్ణి ముందడుగు వేయించాయి. అతను కనిపెట్టిన ధనుర్బాణాలే ఆ అడుగుకు మరో పదడుగులు జమచేశాయి. ఆ తర్వాత అతనే కనిపెట్టి విడిచిపెట్టిన చక్రం వందల వేల సంవత్సరాలలో వేనవేల రూపాల్లోకి మారి, అతణ్ణి కూడా మార్చి ప్రపంచ యాత్ర చేయిస్తూ అప్రతిహతంగా తిరుగుతూనే ఉంది. ఆహార సేకరణ, పెరటి సాగు దశలను దాటి మనిషి సృష్టించిన వ్యవసాయ సాంకేతిక జ్ఞానమే, తిరిగి అతడికి నాగరికుడిగా కొత్త అవతారాన్ని సంతరించి సరికొత్త యుగావిష్కరణ వైపు నడిపించింది. ఇంతకీ చెప్పొచ్చేదేమిటంటే, మనిషి తను సృష్టించిన సాంకేతికతను తన అదుపులో ఉంచుకున్నప్పుడే అది ఉపయుక్తంగా మారి అతని మనుగడను ఎవరెస్టు ఎత్తుకు తీసుకెడుతుంది; కళ్లేలు వదిలేస్తే సమస్యలు, సంక్షోభాల లోయల్లోకి పడదోస్తుంది. ఏఐ లాంటి ఎంతటి అత్యాధునిక సాంకేతికత అయినా ఇందుకు మినహాయింపు కాదు. మనిషి సృష్టించిన కృత్రిమ మేధ మనిషి మేధనే కృత్రిమంగా మార్చివేయకుండా చూసు కోవాలి; ప్రపంచాన్నే మయసభగా మార్చి మాయావుల పరం చేయకుండా జాగ్రత్తపడాలి. -
ఏఐ రంగంలో పోటాపోటీ.. ఐపీ అడ్రస్ చోరీ అవుతుందా?
‘డీప్ సీక్ ఆర్–1’ అనే ఓపెన్ సోర్స్ ఏఐ మోడల్ను ‘డీప్ సీక్’ అనే చైనా స్టార్టప్ సంస్థ ఇటీవల విడుదల చేసింది. అది వచ్చీ రాగానే ఏఐ మార్కెట్లో సంచలనాత్మకమైన పరిణామాలను సృష్టించింది. ఒకటిన్నర సంవత్సరంగా ‘చాట్ జీపీటీ’ (Chat GPT) మోడల్ అందరికీ ఉప యోగకరమైన ఏఐ మోడల్గా గుర్తింపు తెచ్చు కుంది. ‘ఓపెన్ ఏఐ’ (Open AI) సంస్థ దీనిని తయారు చేయటానికి కొన్ని బిలియన్ డాలర్లను పెట్టు బడిగా పెట్టింది. అయితే డీప్ సీక్ ఆర్–1ను కేవలం రెండు నెలల్లోనే ఆరు మిలియన్ డాలర్ల పెట్టుబడితో చైనా స్టార్టప్ సంస్థ డీప్సీక్ తయారు చేసింది. గూగుల్ జెమినీ (Google Gemini), బైదు ఏర్ని, క్యాన్వ (Canva) వంటి సంస్థలు... డీప్ సీక్ కంటే ముందుగానే మార్కెట్లోకి వచ్చినా చాట్ జీపీటీకి పోటీ ఇవ్వలేకపోయాయి. చాట్ జీపీటీకి డీప్ సీక్ సరి సమానంగా పని చేయడం, ఎలాంటి సబ్స్క్రిప్షన్ లేకుండా ఉచితంగా ఓపెన్ సోర్స్లో ఫైన్ ట్యూన్ చేసుకునేలా ఉండడం.. ముఖ్యంగా డీప్ సీక్ ఏపీఏ ధరలు చాట్ జీపీటీతో పోలిస్తే 90 శాతం వరకు తక్కువగా ఉండటం వలన విడుదలైన వారంలోనే ఆపిల్ స్టోర్లో డౌన్లోడ్స్లో మొదటి స్థానం సంపాదించి ఒకేరోజు దాదాపు 20 లక్షల మంది యూజర్లకి చేరువయ్యింది.డీప్ సీక్ విడుదలతో ఏఐ ఆధారిత కంపెనీల స్టాక్లు భారీగా పతనం అయ్యాయి. డీప్ సీక్ (DeepSeek) వంటి మోడల్స్ను అభివృద్ధి చేయడానికి అవసరమైన అధునాతన జీపీయూలు, సెమీ కండక్టర్లను అమెరికాలోని ఎన్వీఐడీఐఏ సంస్థ తయారుచేస్తోంది. ఇలాంటి జీపీ యూలు, అధునాతన చిప్స్ను అమెరికా నుండి వేరే దేశాలకు వెళ్లకుండా ఆదేశం అనేక ఆంక్షలను పెట్టింది. అయినప్పటికీ డీప్ సీక్ తయారీకి ఎన్వీఐడీఐఏ జీపీయూలను సింగపూర్ నుండి చైనా రాబట్ట గలిగిందనే వదంతులతో... ఇన్వెస్టర్లు ఎన్వీఐడీఐఏపై నమ్మకం కోల్పోవడం వలన 20 బిలియన్ డాలర్ల మేర కంపెనీ విలువ పడిపోయింది. ఇతర ఏఐ సెమీ కండక్టర్లను తయారుచేసే కంపెనీల షేర్లు కూడా దాదాపు 15 నుండి 20 శాతం పడి పోయాయి.ఈ నేపథ్యంలో డీప్ సీక్ ‘ఐపీ అడ్రస్ను తస్కరిస్తుంది’ అనే వదంతి వినిపిస్తోంది. అలాగే డీప్ సీక్పై భారీ సైబర్ దాడి జరగటం వలన వ్యక్తిగత వివరాల లీక్ ముప్పుఉండటం, డీప్ సీక్ మోడల్లో చైనీస్ సెన్సార్ షిప్ ఉండటం (ఉదాహరణకు చైనాలో జరిగిన నిరసనలు భారత్కి సంబంధించిన అరుణాచల్ ప్రదేశ్, లద్దాఖ్ గురించి అడిగినప్పుడు సరైన సమాచారం ఇవ్వదు ఈ మోడల్). అలాగే కొన్ని ప్రాంతాలకు చైనా అనుకూలంగా ఉండే సమాధానం ఇవ్వటం ఈ మోడల్పై అనుమానాలు కలిగిస్తున్నాయి.డీప్ సీక్ రావటం ఒక విధంగా మంచిదే అని టెక్ సంస్థలు చెబుతున్నాయి. ఇలా తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనం ఇవ్వగలిగే మోడల్స్ని తయారు చేయటానికి మార్కెట్లో అనువైన కాంపిటీషన్ రాబోతుందనీ, దీనివల్ల వినియోగదారులు అతి తక్కువ ధరలకే ఏఐ సర్వీసులు పొందవచ్చనీ చెబుతున్నారు. ఇప్పటికే అంతర్జాతీయ వేదికపై అమెరికా, చైనా అన్ని అంశాలలో సై అంటే సై అంటూ పోటీ పడుతున్న విషయం తెలిసినదే. ట్రంప్ 2.0లో ఏఐ ఇండస్ట్రీ అభివృద్ధికి ఏటా వంద బిలియన్ డాలర్లు ఖర్చు పెడతామనీ, అమెరికాను ఏఐ అగ్రగామిగా చేస్తామనీ చెప్పిన మరుసటి రోజే... మేమేమీ తక్కువ కాదన్నట్లు డీప్ సీక్ను విడుదల చేసి అమెరికాకు చైనా గట్టి సమాధానమే ఇచ్చింది.చదవండి: అమెరికా వాణిజ్య యుద్ధంతో అందరికీ నష్టమే!ఏఐని అందరికీ అందుబాటులోకి తేవటం, దాన్ని అన్ని రంగాలలో సమీకృతం చేయటం పరిశ్రమల ముందు ఉన్న పెను సవాళ్ళు. ఈ సవాళ్లకు మొదటి మెట్టుగా చాట్ జీపీటీ, డీప్ సీక్లను మనం చూడవచ్చు. భవిష్యత్తులో ఏఐ పరిశ్రమ మరింతగా ఎదిగి మానవ జీవనాన్ని సుగమం, సౌకర్యవంతం చేస్తుందని ఆశిద్దాం.– శ్రీరామ్ సుదర్శన్ ఏఐ పరిశోధక విద్యార్థి -
చాట్జీపీటీకే జై...
న్యూఢిల్లీ: దేశీయంగా దాదాపు సగం మంది ఇంటర్నెట్ యూజర్లు ఇప్పటికే కృత్రిమ మేథ (ఏఐ) ప్లాట్ఫాంలను వినియోగిస్తున్నారు. ఇందులో ఓపెన్ఏఐకి చెందిన చాట్జీపీటీ అగ్రస్థానంలో ఉంది. ఆన్లైన్ సర్వే సంస్థ లోకల్సర్కిల్స్ నిర్వహించిన సర్వేలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. 2024 ఆగస్టు 11 నుంచి 2025 ఫిబ్రవరి 1 వరకు దీన్ని నిర్వహించారు. ఇందులో దేశవ్యాప్తంగా 309 జిల్లాల నుంచి 92,000 మంది ఇందులో పాల్గొన్నారు. దీని ప్రకారం వివిధ అంశాలపై వివరాల కోసం 40 శాతం మంది గూగుల్ తదితర సెర్చి ఇంజిన్లకు ప్రాధాన్యమిస్తున్నారు. సమాచారం కోసం ఏ కృత్రిమ మేథ ప్లాట్ ఫాంను ఉపయోగిస్తుŠాన్నరనే ప్రశ్నకు స్పందిస్తూ .. 15,377 మందిలో 28 శాతం మంది చాట్జీపీటీకి ఓటేయగా, 9 శాతం మంది పర్ప్లెక్సిటీని, 6 శాతం మంది కో–పైలట్ను నేరుగా లేదా బింగ్ ద్వారా ఉపయోగిస్తున్నట్లు తెలిపారు. అలాగే చెరి 3 శాతం మంది ‘జెమిని వయా గూగుల్‘, ల్లామా (మెటా)ను వాడుతున్నారు. మరో ఆరు శాతం మంది తాము ఉపయోగించే ప్లాట్ఫాం పేరు సర్వేలో లేదని తెలిపారు. ‘మొత్తం మీద చూస్తే భారతీయ ఇంటర్నెట్ యూజర్లలో ప్రతి ఇద్దరిలో ఒకరు ఇప్పటికే ఏఐ ప్లాట్ఫాంలను ఉపయోగిస్తున్నారు. చాట్జీపీటీని అత్యధికంగా వాడుతున్నారు‘ అని లోకల్సర్కిల్స్ పేర్కొంది. సర్వేలోని మరిన్ని వివరాలు.. → 90 శాతం మంది ఏఐ యూజర్లు ప్రధానంగా టెక్ట్స్ మోడ్లోను, 10 శాతం మంది వాయిస్ మోడ్లోను ఈ ప్లాట్ఫాంను ఉపయోగిస్తున్నారు. → ఉచితంగా ఏఐ ఫీచర్లు ఇస్తున్న చైనా ప్లాట్ఫాం డీప్సీక్కు మారతారా అనే ప్రశ్నకు స్పందిస్తూ, 15,753 మందిలో 8 శాతం మంది ఇప్పటికే తాము మారినట్లు తెలిపారు. 8 శాతం మంది మారతామని తెలపగా, 38 శాతం మంది అయిష్టత వ్యక్తం చేశారు. → ఇప్పటికే డీప్సీక్కి మారిన ఏఐ యూజర్లు, లేదా త్వరలోనే మారనున్న యూజర్లు ప్రతి పది మందిలో ముగ్గురు ఉన్నారు. → ప్రతి పది మంది ఏఐ యూజర్లలో ముగ్గురు పెయిడ్ లేదా ప్రీమియం సబ్్రస్కిప్షన్ ఉపయోగిస్తున్నారు. -
ఓపెన్ ఏఐకి భారత్ కీలక మార్కెట్
న్యూఢిల్లీ: కృత్రిమ మేధలో సంచలనం సృష్టించిన తమ చాట్జీపీటీకి భారత్ రెండో అతి పెద్ద మార్కెట్గా మారిందని ఓపెన్ఏఐ సంస్థ సీఈవో శామ్ ఆల్ట్మన్ తెలిపారు. దేశీయంగా చాట్జీపీటీని ఉపయోగించే యూజర్ల సంఖ్య గతేడాది మూడు రెట్లు పెరిగినట్లు ఆయన చెప్పారు. ఏఐ విప్లవానికి సారథ్యం వహించే దేశాల్లో భారత్ కూడా ఉంటుందని పేర్కొన్నారు. ఏఐ టెక్నాలజీ అభివృద్ధి వ్యయాలు ఏడాది తర్వాత దాదాపు పది రెట్లు తగ్గిపోయే అవకాశం ఉందని చెప్పారు. దేశీయంగా టెక్నాలజీ రంగం అసాధారణంగా పురోగమిస్తోందని తెలిపారు. భారత పర్యటనలో భాగంగా కేంద్ర ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్తో కలిసి ఓ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆల్ట్మన్ ఈ విషయాలు తెలిపారు. పేటీఎం వ్యవస్థాపక సీఈవో విజయ్ శేఖర్ శర్మ, స్నాప్డీల్ సహ వ్యవస్థాపకుడు కునాల్ బెహల్, అన్అకాడెమీ సీఈవో గౌరవ్ ముంజాల్ తదితర పరిశ్రమ దిగ్గజాలతో కూడా ఆయన సమావేశమయ్యారు. చాట్జీపీటీ, డీప్సీక్లాంటి కృత్రిమ మేధ (ఏఐ) సాధనాలను ఉపయోగించొద్దంటూ కేంద్ర ఆర్థిక శాఖ తమ అధికారులను ఆదేశించిన తరుణంలో ఆల్ట్మన్ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది.ఆల్ట్మన్కి వైష్ణవ్ కౌంటర్చాట్జీపీటీలాంటి ఫౌండేషనల్ మోడల్ను రూపొందించే సామర్థ్యాల విషయంలో భారత్పై అసలు ఆశలే లేవంటూ రెండేళ్ల క్రితం పర్యటనలో వ్యాఖ్యానించిన ఆల్ట్మన్కి తాజాగా మంత్రి వైష్ణవ్ కౌంటర్ ఇచ్చారు. చంద్రుడి మీదకు అత్యంత చౌకగా చంద్రయాన్–3 మిషన్ను అమలు చేసిన భారత్కి.. అత్యంత తక్కువ ఖర్చులోనే ఏఐని కూడా రూపొందించే సామర్థ్యాలు ఉన్నాయని వ్యాఖ్యానించారు. సొంతంగా చిప్సెట్లను తయారు చేసుకోవడం, అత్యంత చౌకగా కంప్యూటింగ్ సామర్థ్యాలను అందించడం నుంచి ప్రాంతీయ భాషలు, సంస్కృతులకు అనుగుణంగా మోడల్స్కి శిక్షణనిచ్చే డేటా సెట్లను రూపొందించే వరకు ఏఐ సంబంధిత పూర్తి వ్యవస్థను తీర్చిదిద్దడంపై భారత్ కసరత్తు చేస్తోందని తెలిపారు. -
ప్రభుత్వ డివైజ్ల్లో ఏఐ టూల్స్ నిషేధం!
అధికారిక పరికరాల్లో చాట్జీపీటీ(ChatGPT), డీప్సీక్(Deepseek) వంటి ఏఐ టూల్స్ వాడకాన్ని నిషేధిస్తూ భారత ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఏఐ టూల్స్, అప్లికేషన్లు సున్నితమైన ప్రభుత్వ డేటా గోప్యతకు ప్రమాదం కలిగించే అవకాశం ఉందని అడ్వైజరీ హైలైట్ చేసింది. జనవరి 29, 2025 నుంచి అమల్లోకి వచ్చిన నిబంధనల ప్రకారం డేటా భద్రత, ప్రభుత్వ డాక్యుమెంట్ల గోప్యతకు సంబంధించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.నిషేధం ఎందుకు?ఏఐ టూల్స్, అప్లికేషన్లు సున్నితమైన ప్రభుత్వ డేటా గోప్యతకు ప్రమాదం వాటిల్లేలా ప్రవర్తిస్తాయని అడ్వైజరీ స్పష్టం చేసింది. ఈ సాధనాలు తరచుగా బయటి సర్వర్ల ద్వారా వినియోగదారు ఇన్పుట్లను ప్రాసెస్ చేస్తాయి. ఇది డేటా లీక్లకు అవకాశం కల్పిస్తుంది. ఇప్పటికే ఆస్ట్రేలియా, ఇటలీ వంటి దేశాలు డేటా భద్రతా ప్రమాదాలను ఉదహరిస్తూ ఇలాంటి ఆంక్షలు విధించాయి. దాంతో భారత ఆర్థిక మంత్రిత్వ శాఖ సైతం అందుకు అనుగుణంగా చర్యలు చేపట్టింది.ఓపెన్ఏఐ సీఈఓ పర్యటనఓపెన్ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్మన్ ఈరోజు భారత్లో పర్యటించనున్న నేపథ్యంలో చాట్జీపీటీ వినియోగాన్ని నిషేధిస్తున్నట్లు అడ్వైజరీ వెలువడడం గమనార్హం. తన పర్యటనలో భాగంగా ఐటీ మంత్రి, ప్రధాని నరేంద్ర మోదీ సహా ఉన్నతాధికారులతో సమావేశం కానున్నారు. అధికారిక, గోప్యమైన కమ్యూనికేషన్లలో ఏఐ ఆధారిత డేటా భద్రతా ప్రమాదాలపై పెరుగుతున్న ఆందోళనలను ఈ చర్య నొక్కి చెబుతోంది.ఇదీ చదవండి: ‘చౌకగా పెట్రోల్.. ప్రజలకు రాయితీల్లేవు’డేటా భద్రతా చర్యలు అవసరంఈ నిషేధం ప్రకారం ప్రభుత్వ ఉద్యోగులు ఆఫీసు కంప్యూటర్లు, డివైజ్ల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ ఉపయోగించకూడదు. ఉద్యోగులు పని ప్రయోజనాల కోసం వ్యక్తిగత పరికరాలపై ఈ సాధనాలను ఉపయోగించవచ్చో లేదో ఆదేశాల్లో ప్రత్యేకంగా పేర్కొననప్పటికీ సౌలభ్యం కంటే డేటా భద్రతకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలుస్తుంది. పని ప్రదేశాల్లో కృత్రిమ మేధ సాధనాల వాడకం పెరుగుతున్న నేపథ్యంలో భారత ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల చర్చ జరుగుతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్నందున పటిష్టమైన డేటా భద్రతా చర్యల అవసరాన్ని కూడా ప్రభుత్వ నిర్ణయం ఎత్తి చూపుతుంది. -
రేపు భారత్కు ఓపెన్ఏఐ సీఈఓ ఆల్ట్మన్
చాట్జీపీటీ(ChatGPT)ని అభివృద్ధి చేసిన ఓపెన్ఏఐ(OpenAI) సీఈవో సామ్ ఆల్ట్మన్ ఫిబ్రవరి 5న భారత్కు వస్తున్నట్టు సమాచారం. ఈ పర్యటనలో ఉన్నత స్థాయి ప్రభుత్వ అధికారులను కలవడంతోపాటు పరిశ్రమ పెద్దలతో చర్చాగోష్టిలో ఆయన పాల్గొనాలని భావిస్తున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. రెండేళ్లలో ఆయన భారత్కు రావడం ఇది రెండవసారి.ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఓపెన్ఏఐ ఆధిపత్యాన్ని చైనాకు చెందిన డీప్సీక్ అకస్మాత్తుగా సవాలు చేసిన ఈ తరుణంలో ఆల్ట్మాన్ భారత్ సందర్శన ఆసక్తిగా మారింది. యునైటెడ్ స్టేట్స్ వెలుపల ఉద్భవిస్తున్న శక్తివంతమైన ఏఐ మోడళ్ల గురించి సందేహాలను ఆయన 2023లో వ్యక్తం చేసిన వీడియో ఒకటి మళ్లీ తెరపైకి వచ్చింది. కొన్ని కాపీరైట్ ఉల్లంఘనల దావాలకు సంబంధించిన కేసులతో సహా భారత్లో చట్టపర అడ్డంకులను ఓపెన్ఏఐ ఎదుర్కొంటున్న సమయంలో ఆల్ట్మన్ భారత్ను సందర్శించడం హాట్ టాపిక్ అయింది. బహిరంగంగా అందుబాటులో ఉన్న డేటాను మాత్రమే ఉపయోగిస్తున్నామని, విచారించడానికి భారతీయ న్యాయస్థానాలకు అధికార పరిధి లేదని ఓపెన్ఏఐ వాదించింది.ఇదీ చదవండి: ఈసారి వడ్డీ రేట్లు తగ్గింపు..?డీప్ రీసెర్చ్ ఆవిష్కరణ..చాట్జీపీటీలో ఇటీవల డీప్ రీసెర్చ్ ఫీచర్ను ఓపెన్ఏఐ ఆవిష్కరించింది. ప్రస్తుతం చాట్జీపీటీ ప్రో వినియోగదారులకు ఇది అందుబాటులో ఉంది. దీన్ని త్వరలో జీపీటీ ప్లస్, జీపీటీ టీమ్ వినియోగదారులకు విడుదల చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఫైనాన్స్, సైన్స్, ఇంజినీరింగ్.. వంటి రంగాల్లో ఇంటెన్సివ్ నాలెడ్జ్ కోసం వర్క్ చేసే వారికి ఈ టూల్ బాగా ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రేస్ కొనసాగుతుండగా డీప్ రీసెర్చ్ తన పోటీదారులకు వ్యతిరేకంగా ఎలా నిలబడుతుందో, ఈ విభాగంలో ఎలాంటి ప్రభావాన్ని చూపుతుందో చూడాలి. -
ఎంతైనా అమ్మ అమ్మే!
‘దిల్లీకి రాజు అయినా తల్లికి కొడుకే!’ అని ఊరకే అనలేదు. ‘అమ్మా... పెద్ద విజయం సాధించాను’ అని చెప్పినా సరే... ‘సంతోషం’ అంటూనే ‘ఇంతకీ భోజనం చేశావా?’ అని ఆరా తీస్తుంది. తల్లికి పిల్లల విజయాల కంటే వారి ఆరోగ్యం, క్షేమం ముఖ్యం. ఇట్టి విషయాన్ని మరోసారి నిరూపించిన స్క్రీన్ షాట్ గురించి.ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీ ‘ఓపెన్ ఏఐ’లో అన్షితా సైనీ గ్రోత్ ఇంజినీర్. చాట్జీపీటీ కోసం ఆమె అభివృద్ధి చేసిన ఫీచర్ ‘టెక్ క్రంచ్’ హైలెట్ అయింది. ఇది ఆమె కెరీర్లో ఒక ప్రధాన మైలు రాయిగా చెప్పవచ్చు.తన విజయం గురించి ఒక టెక్ పత్రికలో వచ్చిన వ్యాసం లింక్ను తల్లికి పంపించింది అన్షిత. ‘నేను రూపొందించిన ఫీచర్ గురించి పత్రికలో గొప్పగా రాశారు’ అని తల్లికి టెక్ట్స్ మెసేజ్ ఇచ్చింది. ‘నైస్... గ్రేట్ ఇన్స్పిరేషన్’ అని బదులు ఇచ్చిన వెంటనే...‘నీ ఫీచర్ సంగతి సరే... ఈరోజు తినడానికి నీ దగ్గర నట్స్, ఫ్రూట్స్ ఉన్నాయా?’ అని అడిగింది. చాట్లో తల్లి అడిగిన ప్రశ్న స్క్రీన్షాట్ తీసి ‘ఎక్స్’లో షేర్ చేసింది అన్షిత. దీనికి కొన్నిగంటల్లోనే లక్షకు పైగా వ్యూస్ వచ్చాయి. -
ఓపెన్ ఏఐ ‘డీప్ రీసెర్చ్’ ఆవిష్కరణ
సంక్లిష్టమైన పరిశోధనలకు దోహదపడేలా జనరేటివ్ ఏఐ చాట్బాట్ చాట్జీపీటీ(ChatGPT) కొత్త ఫీచర్ను తీసుకొచ్చినట్లు ఓపెన్ ఏఐ(OpenAI) ప్రకటించింది. కృత్రిమ మేధలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడానికి ‘డీప్ రీసెర్చ్’ అనే ఫీచర్ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు కంపెనీ తెలిపింది. ఏఐ విభాగంలో ఇతర కంపెనీల నుంచి పోటీ తీవ్రమవుతున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు టెక్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.డీప్ రీసెర్చ్(Deep Research) అనేది సాధారణ ప్రాంప్ట్ నుంచి ఒక విశ్లేషకుడి పనితీరును తలపించేలా సమగ్ర పరిశోధనను అందించేందుకు, వెబ్ డేటాను విశ్లేషించేందుకు రూపొందించామని కంపెనీ తెలిపింది. మనుషులు కొన్ని గంటల్లో విశ్లేషించి తెలియజేసే సమాచారాన్ని డీప్ రీసెర్చ్ నిమిషాల్లో వినియోగదారుల ముందుంచుతుందని ఓపెన్ఏఐ పేర్కొంది. చైనాకు చెందిన డీప్సీక్ చాట్బాట్ ఆకట్టుకునే పనితీరు, నిర్వహణ ఖర్చు తక్కువగా ఉండడంతో ప్రపంచ టెక్ వర్గాల దృష్టిని ఆకర్షించింది. సిలికాన్ వ్యాలీలో సంచలనం సృష్టిస్తున్న డీప్సీక్(Deepseek)కు వచ్చిన ఆదరణ నేపథ్యంలో కృత్రిమ మేధ రంగంలో పోటీ వేడెక్కుతుంది. తక్కువ కాలంలోనే డీప్సీక్ ఓపెన్ఏఐకు పోటీదారుగా మారుతుందని కొన్ని టెక్ వర్గాలు భావిస్తున్నాయి. దాంతో ఓపెన్ఏఐ టెక్నాలజీ పరిశోధనలను ముమ్మరం చేస్తోంది. అందులో భాగంగానే తాజాగా డీప్ రీసెర్చ్ ఫీచర్ను అందుబాటులో తీసుకొచ్చినట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు.టోక్యోలో సమావేశాలు..జపాన్ ప్రధాని షిగెరు ఇషిబా, సాఫ్ట్ బ్యాంక్ సీఈఓ మసయోషి సన్లతో సహా ఉన్నత స్థాయి సమావేశాల కోసం ఓపెన్ ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్ మన్ టోక్యో చేరుకున్నారు. ఏఐ డేటా సెంటర్లు, పవర్ ప్లాంట్లలో పెట్టుబడులతోపాటు ఏఐ మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడానికి యూఎస్-జపాన్ సహకారంలో భాగంగా ఈ చర్చలు జరుగుతున్నాయి. ఈ తరుణంలో డీప్ రీసెర్చ్ను అందుబాటులోకి తీసుకురావడం కొంత టెక్ వర్గాలను ఆకర్షించనట్లయింది.ఇదీ చదవండి: ఖర్చు.. పొదుపు.. మీ దారెటు?డీప్ రీసెర్చ్ ఎవరికంటే..డీప్ రీసెర్చ్ ప్రస్తుతం చాట్జీపీటీ ప్రో వినియోగదారులకు అందుబాటులో ఉంది. దీన్ని త్వరలో జీపీటీ ప్లస్, జీపీటీ టీమ్ వినియోగదారులకు విడుదల చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఫైనాన్స్, సైన్స్, ఇంజినీరింగ్.. వంటి రంగాల్లో ఇంటెన్సివ్ నాలెడ్జ్ కోసం వర్క్ చేసే వారికి ఈ టూల్ బాగా ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రేస్ కొనసాగుతుండగా డీప్ రీసెర్చ్ తన పోటీదారులకు వ్యతిరేకంగా ఎలా నిలబడుతుందో, ఈ విభాగంలో ఎలాంటి ప్రభావాన్ని చూపుతుందో చూడాలి. -
ఏఐ ‘డీప్’ వార్!
మా పరిశోధకుల్లో ఎక్కువ మంది చైనా టాప్యూనివర్సిటీల నుంచి తీసుకున్న ఫ్రెష్ గ్రాడ్యుయేట్లే. భారీపెట్టుబడులతో నవకల్పనలు పెరుగుతాయంటే పొరపాటే. అదే నిజమైతే ప్రపంచంలోని ఇన్నోవేషన్ అంతాబడా కంపెనీల చేతుల్లోకి వెళ్లిపోయేది – డీప్సీక్ ఫౌండర్ లియాంగ్ వెన్ఫెంగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)లో ఎదురులేని అమెరికా టెక్ దిగ్గజాలకు చైనా ఊహించని షాక్ ఇచ్చింది. ఏఐ రారాజు చాట్జీపీటీకి ఓ అనామక చైనా ఏఐ స్టార్టప్ పెను సవాల్ విసిరింది. అదే డీప్సీక్. దీని చౌక ఏఐ దెబ్బకు మొత్తం సిలికాన్ వ్యాలీ చివురుటాకులా వణుకుతోంది. లక్షల కోట్లు వెచ్చించి అమెరికా కంపెనీలు కడుతున్న ‘ఆర్టిఫిషియల్’కోటను బద్దలుకొట్టేందుకు డ్రాగన్ బరిలోకి దూకడంతో ఏఐ వార్కు తెరలేచింది. దీంతో జపాన్ నుంచి యూరప్ మీదుగా.. అమెరికా వరకు టెక్ షేర్లన్నీ కుప్పకూలాయి. విలువ పరంగా ప్రపంచంలోనే అతిపెద్ద కంపెనీ ఎన్విడియా షేరు ఏకంగా 17 శాతం పడిపోవటంతో దాదాపు 600 బిలియన్ డాలర్ల మార్కెట్ విలువ తుడిచిపెట్టుకుపోయింది. మనదేశంలో మూడు అతిపెద్ద కంపెనీలైన రిలయన్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, టీసీఎస్ల మొత్తం మార్కెట్ విలువ కంటే ఇది ఎక్కువ. – సాక్షి, హైదరాబాద్2023లో ఆవిర్భావండీప్సీక్ పురుడుపోసుకుని రెండేళ్లు కూడా కాలేదు. క్వాంట్ హెడ్జ్ ఫండ్ ‘హై–ఫ్లయర్’చీఫ్ లియాంగ్ వెన్ఫెంగ్ 2023లో దీన్ని నెలకొల్పారు. అతి తక్కువ ఖర్చుతో డీప్సీక్ రూపొందించిన ఆర్1 ఏఐ మోడల్ చైనాతోపాటు అమెరికా టెక్ దిగ్గజాలను కూడా ఉలిక్కిపడేలా చేసింది. ఈ ఏఐ మోడల్ను పూర్తి ఉచితంగా అందిస్తుండటం ఓపెన్ ఏఐ వంటి కంపెనీల భవిష్యత్కు గొడ్డలిపెట్టులా మారింది. అమెరికాలో విడుదలైన వారంలోనే యాపిల్ యాప్ స్టోర్లో డీప్సీక్ మొబైల్ యాప్ అత్యధిక డౌన్లోడ్లతో నంబర్ వన్ స్థానాన్ని దక్కించుకుని చాట్జీపీటీని వెనక్కి నెట్టింది. ఈ నెల 27న ఒక్కరోజే ఏకంగా 20 లక్షల మంది డౌన్లోడ్ చేసుకోవడం దీని జోరుకు నిదర్శనం. మరోపక్క టెక్ట్స్ ప్రాంప్ట్ను ఇమేజ్గా మార్చే జానస్–ప్రో–7బీతో మరో సంచలనానికి తెరతీసింది డీప్సీక్. అమెరికాకు ‘డీప్’ట్రబుల్.. ఏఐలో అగ్రస్థానాన్ని మరింత బలోపేతం చేసుకోవడానికి డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టిన వెంటనే స్టార్గేట్ ప్రాజెక్టును ప్రకటించిన విషయం తెలిసిందే. నాలుగేళ్లలో 500 బిలియన్ డాలర్లు వెచ్చించి అమెరికాను తిరుగులేని ఏఐ సూపర్పవర్గా చేసేందుకు ఓపెన్ఏఐ, ఒరాకిల్, సాఫ్ట్ బ్యాంక్, ఎంజీఎక్స్ చేతులు కలిపాయి. ఈ ప్రాజెక్టు పట్టాలెక్కకముందే డీప్సీక్ కారు చౌకగా ఏఐ మోడల్ను అభివృద్ధి చేసి షాకిచ్చింది. ట్రంప్ సలహాదారు మార్క్ ఆండర్సన్.. డీప్సీక్–ఆర్1ను ఏకంగా ‘‘ఏఐ స్పుత్నిక్ మూమెంట్’’గా (1957లో సోవియట్ యూనియన్ ప్రపంచంలో తొలి శాటిలైట్ స్పుత్నిక్ను ప్రయోగించడంతో యూఎస్, సోవియట్ మధ్య స్పేస్ వార్కు తెరలేచింది) అభివర్ణించడం విశేషం.దిగ్గజాలకు దీటుగా..ఎన్విడియా అధునాతన చిప్స్, గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్స్ (జీపీయూ)తో పోలిస్తే చాలా లో ఎండ్ హార్డ్వేర్తో (పాత ఎన్విడియా ఏ100 జీపీయూలు) తాము ఏఐ మోడల్స్ను రూపొందించామని డీప్సీక్ ప్రకటించింది. చైనాకు అధునాతన చిప్స్, టెక్నాలజీ ఎగుమతిపై అమెరికా విధించిన ఆంక్షలను సైతం ఎదురొడ్డి సొంతంగా దిమ్మదిరిగే ఏఐ మోడల్ను అభివృద్ధి చేయడంపై నిపుణులు కూడా నోరెళ్లబెడుతున్నారు. డీప్సీక్ దెబ్బతో ప్రపంచ ఏఐ పరిశ్రమ స్వరూపమే మారిపోవచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. ఇది ఓపెన్ సోర్స్ (డెవలపర్లు ఈ సాఫ్ట్వేర్ను మెరుగుపరచే అవకాశంతో పాటు దీని ఆధారంగా సొంత టూల్స్ను రూపొందించుకోవచ్చు) మోడల్ కావడంతో తక్కువ బడ్జెట్లోనే కంపెనీలు, యూజర్లకు ఏఐ అందుబాటులోకి వస్తుంది. డీప్సీక్ ఆర్1 ఏఐ మోడల్ మేథమెటిక్స్, కోడింగ్, రీజనింగ్, లాంగ్వేజ్ పరంగా అన్ని రకాల ప్రమాణాల్లో చాట్జీపీటీ, జెమిని, గ్రోక్ వంటి ఏఐ మోడళ్లకు దీటుగా నిలవడం గమనార్హం. మెటా ఏఐ మోడల్ అభివృద్ధికి 6 బిలియన్ డాలర్లు ఖర్చు చేయగా.. డీప్సీక్ కేవలం 6 మిలియన్ డాలర్లతోనే ఆర్1 ఏఐ మోడల్ను తీసుకొచ్చింది.మైక్రోసాఫ్ట్ నుంచి 13 బిలియన్ డాలర్లతో సహా, భారీగా నిధులు సమీకరించిన ఓపెన్ఏఐలో సిబ్బంది సంఖ్య 4,500. దీనికి పూర్తి భిన్నంగా ఇప్పటిదాకా డీప్సీక్ వెచ్చించింది 10 మిలియన్ డాలర్లే. ఉద్యోగులు 200 మంది మాత్రమే.ఎన్విడియాకు షాకెందుకు?ఏఐ మోడల్స్ను నడిపేందుకు హై ఎండ్ చిప్స్, జీపీయూలు, నెట్వర్కింగ్ అవసరమని ఇప్పటిదాకా ఊదరగొడుతున్నారు. ఈ రంగంలో నంబర్ వన్గా ఉన్న ఎన్విడియా మార్కెట్ విలువ 2023 డిసెంబర్లో తొలిసారి 500 బిలియన్ డాలర్లు దాటింది. గడిచిన ఏడాదిలోనే ఏకంగా 3.5 ట్రలియన్ డాలర్లను (మన కరెన్సీలో రూ.301 లక్షల కోట్లు) తాకి ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీగా యాపిల్ను వెనక్కి నెట్టింది. డీప్సీక్ చౌక మోడల్ వల్ల డిమాండ్ తగ్గొచ్చనే భయంతో ఇన్వెస్టర్లు ఏఐ టెక్ షేర్లను అమ్మేసుకుంటున్నారు. దీంతో ఎన్విడియా షేర్ 17 శాతం కుప్పకూలింది. బ్రాడ్కామ్, ఏఎండీ, అరిస్టా నెట్వర్క్స్, నెదర్లాండ్స్ చిప్ దిగ్గజం ఏఎస్ఎంఎల్ హోల్డింగ్స్, తైవాన్ సెమీకండక్టర్స్ మాన్యుఫ్యాక్చర్స్ (టీఎస్ఎం) వంటి చిప్, నెట్వర్కింగ్ షేర్లు సైతం 15–23 శాతం పడిపోయాయి. -
సడన్ ఫేమ్.. డీప్సీక్పై సైబర్ ఎటాక్
జనరేటివ్ ఏఐ సేవలందిస్తున్న చైనీస్ టెక్ స్టార్టప్ డీప్సీక్(DeepSeek)పై సైబర్దాడి జరిగినట్లు ప్రకటించింది. ఈ దాడి కారణంగా కొత్త వినియోగదారుల రిజిస్ట్రేషన్లను తాత్కాలికంగా పరిమితం చేస్తున్నట్లు కంపెనీ తెలిపింది. దాంతో సైట్లో నమోదు చేసుకునే వినియోగదారుల సంఖ్యపై ప్రభావం పడింది. సైబర్దాడి(Cyber Attack) పరిమిత విభాగానికి చెందిందని, రిజిస్టర్డ్ వినియోగదారులు సాధారణంగా లాగిన్ చేయవచ్చని స్పష్టం చేసింది.ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్బాట్(AI Chat Bot) సేవలందించే డీప్సీక్ ఇటీవల తరుచూ వార్తల్లో నిలుస్తోంది. ఓపెన్ ఏఐకు సవాలు విసురుతూ జనరేటివ్ ఏఐ రంగంలో విప్లవాత్మక మార్పునకు పునాది వేసింది. చాటీజీపీటీ పెయిడ్ వర్షన్ అందించే సేవలకు ధీటుగా డీప్సీక్కు చెందిన ఆర్-1 ఉచితంగానే సర్వీసు అందిస్తున్నట్లు కంపెనీ ఇప్పటికే ప్రకటించింది. దాంతో అమెరికన్ టెక్ కంపెనీ స్టాక్లు ఇటీవల గణనీయంగా పడిపోయాయి. కంపెనీపై జరిగిన సైబర్ దాడి వినియోగదారుల్లో ఆందోళన కలిగిస్తుంది.కంపెనీ స్పందన..డీప్సీక్కు పెరుగుతున్న ప్రజాదరణతో సైబర్ మోసగాళ్లు లక్ష్యంగా చేసుకుంటున్నట్లు కంపెనీ స్టేటస్ పేజీ ద్వారా తెలిసింది. సమస్యలను పరిష్కరించడానికి, నిరంతర సేవను అందించేందుకు కృషి చేస్తున్నామని డీప్సీక్ వినియోగదారులకు హామీ ఇచ్చింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ రంగంలో అమెరికా, చైనాల మధ్య తీవ్ర పోటీ నెలకొనడంపై ఈ సైబర్ దాడి చర్చలకు దారితీసింది. డీప్సీక్ వేగవంతమైన పురోగతి, తక్కువ ఖర్చు కారణంగా హడావుడిగా సేవలు ప్రారంభించి, సరైన భద్రత ప్రమాణాలు పాటించడంలేదని కొంతమంది యూఎస్ టెక్ పరిశీలకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.డీప్సీక్ ఆర్-1భవిష్యత్తులో చైనా ఏఐ స్టార్టప్ డీప్సీక్ అభివృద్ధి చేసిన ఆర్-1 అమెరికా టెక్ కంపెనీలు అభివృద్ధి చేస్తున్న చాట్జీపీటీ, ఓపెన్ ఏఐ తదితరాలకు తీవ్ర పోటీతో చెక్ పెట్టనున్నట్లు నిపుణులు భావిస్తున్నారు. ఏఐలో చైనా వేగాన్ని నిలువరించేందుకు వీలుగా ఇప్పటికే అమెరికా ఆధునిక సెమీ కండక్టర్ టెక్నాలజీలను ఎగుమతి చేయకుండా నిషేధించింది. ఎన్విడియా రూపొందిస్తున్న ఏఐ చిప్స్ తదితరాలపై ఆంక్షలు విధించింది. డీప్సీక్ అభివృద్ధి చేసిన తాజా ఏఐ మోడల్ను గత వారమే మార్కెట్లో విడుదల చేసింది. ఇది ఓపెన్ఏఐ, మెటా ప్లాట్ఫామ్స్కు దీటైన పోటీని ఇవ్వనున్నట్లు టెక్నాలజీ వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రధానంగా అమెరికా టెక్ దిగ్గజాలు వందల కోట్ల డాలర్లు వెచ్చించి అభివృద్ధి చేస్తున్న ఏఐ సేవలకు దీటుగా చైనీస్ ఏఐ చౌకగా సేవలు అందించే వీలుందని విశ్లేషకులు అంటున్నారు. ఇది తీవ్ర పోటీకి తెరతీయడంతో యూఎస్ టెక్ దిగ్గజాల పెట్టుబడులపై ఆశించిన స్థాయిలో రిటర్నులకు తెరపడవచ్చని ఆందోళన నెలకొంది. ఫలితంగా ఉన్నట్టుండి టెక్ కౌంటర్లలో అమ్మకాలు నమోదవుతున్నట్లు నిపుణులు తెలియజేశారు.ఇదీ చదవండి: భారత్లో క్రెడిట్ కార్డుల జోరుఆందోళనలు.. ‘డీప్’గత వారమే విడుదలైన డీప్సీక్ తాజా ఏఐ మోడల్.. అమెరికా ఐఫోన్ల టెక్ దిగ్గజం యాపిల్ ఇంక్ యాప్ స్టోర్ ర్యాంకింగ్స్లో అగ్రస్థానానికి చేరినట్లు తెలుస్తోంది. దీంతో క్వాంట్ ఫండ్ చీఫ్ లియాంగ్ వెన్ఫెంగ్ ఏర్పాటు చేసిన ఈ ఓపెన్ సోర్స్ ప్రొడక్ట్.. ఓపెన్ ఏఐ, మెటా ప్లాట్ఫామ్స్ కు పోటీగా నిలుస్తుందన్న అంచనాలు పెరిగాయి. వెరసి అడ్వాన్స్డ్ చిప్స్, అత్యున్నత కంప్యూటింగ్ పవర్లపై ఆధారపడిన ప్రస్తుత యూఎస్ ఏఐ బిజినెస్ మోడల్ను ఆర్-1 దెబ్బతీయవచ్చన్న ఆందోళనలు వ్యాప్తిస్తున్నాయి. ఏఐ విస్తృతిలో ప్రధానంగా ఎన్విడియాకు భారీ అవకాశాలు లభించాయి. అయితే ఆర్1 సెగ ఎన్విడియాకు అధికంగా తగులుతుందనేది నిపుణులు మాట. -
చాట్జీపీటీ సేవల్లో అంతరాయం
ఓపెన్ఏఐ (OpenAI)కి చెందిన ఉత్పాదక కృత్రిమ మేధస్సు చాట్బాట్ చాట్జీపీటీ (ChatGPT) సేవల్లో గణనీయమైన అంతరాయాలను యూజర్లు ఎదుర్కొన్నారు. ఈ సమస్యపై ఓపెన్ఏఐ వ్యాఖ్యానించనప్పటికీ, చాట్జీపీటీని ఉపయోగిస్తున్నప్పుడు సమస్యలను గుర్తించినట్లు వేలాది మంది యూజర్లు అవుట్టేజ్ ట్రాకింగ్ వెబ్సైట్ డౌన్డెటెక్టర్లో ఫిర్యాదులను నమోదు చేశారు.అంతరాయాలు కేవలం చాట్జీపీటీని మాత్రమే కాకుండా ఇతర ఓపెన్ఏఐ సేవలను కూడా ప్రభావితం చేశాయి. జీపీటీ-4ఓ (GPT-4o), జీపీటీ-4ఓ మినీ (GPT-4o mini) మోడల్లు డౌన్టైమ్ను ఎదుర్కొన్నట్లు ఊహాగానాలు వచ్చాయి. దీనిపై సోషల్ మీడియా ప్లాట్ఫామ్లైన ‘ఎక్స్’, ఇన్స్టాగ్రామ్లలో వినియోగదారులు తమ అనుభవాలు, ఇబ్బందులను షేర్ చేశారు.ఏది ఏమైనప్పటికీ సామాన్యుడి రోజువారీ జీవితంలో చాట్జీపీటీ, ఇతర కృత్రిమ మేధస్సు ప్లాట్ఫామ్ల వాడకం రోజురోజుకు పెరుగుతోంది. ఇది త్వరలో మానవ మేధస్సును అధిగమించబోతున్నట్లు కనిపిస్తోంది. ఇటీవల ఓపెన్ఏఐ సీఈవో సామ్ ఆల్ట్మాన్ ఒక అడుగు ముందుకేసి తనకు పుట్టబోయే బిడ్డ కూడా ఏఐ కంటే తెలివిగా ఎప్పటికీ ఉండడని పేర్కొన్నారు. ఇటీవల ఓ పోడ్కాస్ట్లో మాట్లాడిన ఆయన కృత్రిమ మేధస్సు మానవ మేధస్సును అధిగమించే భవిష్యత్తు గురించి తన దృష్టిని పంచుకున్నారు. త్వరలో తండ్రి కాబోతున్న ఆల్ట్మన్ ఈ మార్పు తరతరాలుగా జీవితంలో సహజమైన భాగంగా ఉంటుందని నమ్ముతున్నారు. -
ప్రాణం కాపాడిన చాట్జీపీటీ: ఆశ్చర్యపోతున్న నెటిజన్స్
టెక్నాలజీ పెరుగుతున్న తరుణంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) చాట్బాట్ 'చాట్జీపీటీ' (ChatGPT) యూజర్లకు చాలా ఉపయోగపడుతోంది. ఏ ప్రశ్న అడిగినా.. దాదాపు ఖచ్చితమైన, వేగవంతమైన జవాబును ఇస్తోంది. ఇప్పటికే ఎన్నెన్నో అద్భుతాలు చేసిన చాట్జీపీటీ.. తాజాగా ఓ మనిషికి ఉన్న రోగాన్ని సైతం కనిపెట్టింది. ప్రస్తుతం ఇది నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.ఓ సోషల్ మీడియా యూజర్ పోస్ట్ చేసిన సమాచారం ప్రకారం.. కొన్ని రోజుల క్రితం నేను వ్యాయామం చేసాను. ఒళ్ళంతా చాలా నొప్పులుగా.. ఏదో యాక్సిడెంట్ అయిన ఫీలింగ్ కలిగింది. రెండు రోజులైనా ఆరోగ్యం కుదుటపడలేదు. నాకున్న లక్షణాలను చాట్జీపీటీకి వివరించాను. లక్షణాల ఆధారంగా రాబ్డోమయోలైసిస్ (Rhabdomyolysis) ఉన్నట్లు వెల్లడిస్తూ.. వెంటనే ఆసుపత్రికి వెళ్లాలని సిపార్సు చేసింది.చాట్జీపీటీ చెప్పింది నిజమా? కాదా? అని నిర్దారించుకోవడానికి నేను ఆసుపత్రికి వెళ్ళాను. డాక్టర్లు కూడా టెస్ట్లు చేసి రాబ్డోమయోలైసిస్ ఉందని నిర్థారించారు. నా ల్యాబ్ ఫలితాలను విశ్లేషించడానికి కూడా.. నేను ChatGPTని ఉపయోగించాను. అది వైద్య బృందం చెప్పిన దానితో సమానంగా చెప్పింది. సరైన సమయానికి చికిత్స తీసుకోవడంతో ప్రాణాలతో బయటపడ్డాను.చాట్జీపీటీ సామర్థ్యం నన్ను ఎంతగానో ఆకట్టుకుంది. గతంలో కూడా.. చాట్జీపీటీ ఇతరుల ప్రాణాలను కాపాడటం సంఘటనల గురించి విన్నాను. ఇప్పుడు చాట్జీపీటీ నన్ను కూడా కాపాడింది.ప్రస్తుతం ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చాట్జీపీటీ లక్షణాల ఆధారంగా రోగ నిర్దారణ చేయడం చాలా గొప్పగా ఉందని పలువురు ప్రశంసించారు. వైద్య సలహా కోసం కూడా దీనిని ఉపయోగించుకోవచ్చని చెబుతున్నారు.రాబ్డోమయోలైసిస్రాబ్డోమయోలైసిస్ అనేది ఓ అరుదైన సమస్య. విశ్రాంతి తీసుకోకుండా ఎక్కువసేపు వ్యాయామం చేయడం వల్ల.. కండరాలు కలిగిపోతాయి. దీంతో రక్తంలోకి విడుదలయ్యే ప్రోటీన్లు కిడ్నీలలో పేరుకుపోతాయి. ఇది పెద్ద సమస్యకు దారితీస్తుంది. ఇది ప్రాణాంతకం కూడా.ఇదీ చదవండి: ఆరోగ్యం కోసం నవవిధ మార్గాలు - చాట్జీపీటీ సలహాలు -
చాట్జీపీటీకి ‘గ్రోక్’ స్ట్రోక్!
కృత్రిమ మేధ (AI) రంగం కొత్తపుంతలు తొక్కుతూ శరవేగంగా పురోగతి సాధిస్తున్న సమయంలో.. రెండు ప్రముఖ టెక్ కంపెనీల మధ్య పోటీకి దారితీసింది. కృత్రిమ మేధ ఫలాలను సామాన్యులకు సైతం పరిచయం చేసి, టెక్ రంగంలో సంచలనం సృష్టించిన ‘చాట్జీపీటీ(ChatGPT)’కి పోటీగా సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్(X)’అధినేత ఎలన్ మస్క్కు చెందిన ‘గ్రోక్(Grok)’తెరపైకి దూసుకొస్తోంది. ఎలన్ మస్క్ తన ‘ఎక్స్ఏఐ’సంస్థ ద్వారా గత ఏడాది నవంబర్ 3న ‘గ్రోక్’ను మార్కెట్లోకి తెచ్చారు. చాట్జీపీటీ, గ్రోక్ రెండూ ఏఐ టూల్స్ అయినా రెండింటి మధ్య ఎన్నో వైవిధ్యాలు ఉన్నాయి. తమకు ‘గ్రోక్’బాగా నచ్చిందని, ‘చాట్జీపీటీ’సబ్స్క్రిప్షన్ను వదిలేసుకుని ఇకపై గ్రోక్నే వినియోగిస్తామని ‘ఎక్స్’లో కొందరు పోస్టులు పెడుతుండగా.. ఎలన్ మస్క్ వాటిని షేర్ చేస్తూ ప్రమోట్ చేసుకుంటున్నారు. నిజానికి కృత్రిమ మేధ రంగంలో అగ్రగామిగా ఉన్న ‘చాట్జీపీటీ’కి గ్రోక్ పోటీ ఇవ్వగలదా అన్నది భవిష్యత్తులో తేలిపోనుంది.ప్రస్తుతానికి చాట్జీపీటీదే ఆధిపత్యం..‘గ్రోక్’తాజా వెర్షన్కు ఆధారం ఎక్స్ఏఐకి చెందిన గ్రోక్–2 మోడల్. ఉచితంగా ఏఐ ఆధారిత సేవలు అందిస్తున్న ఇతర టూల్స్తో పోల్చితే పనితీరు, సామర్థ్యంలో ఇది ముందంజలో ఉందని టెక్ నిపుణులు చెబుతున్నారు. కొన్ని అంశాల్లో ‘చాట్జీపీటీ’ఉచిత వెర్షన్ (GPT 3.5)ను సైతం గ్రోక్ అధిగమించినట్టు పలు పరీక్షల్లో తేలిందని అంటున్నారు. అయితే ‘చాట్జీపీటీ ప్లస్’వెర్షన్లో ఉపయోగించే ‘జీపీటీ–4’మోడల్ సామర్థ్యంతో పోల్చితే ‘గ్రోక్’వెనకబడే ఉందని స్పష్టం చేస్తున్నారు. మార్కెట్లో ఎక్కువ కాలం నుంచి కొనసాగుతుండటంతో పాటు గణనీయ స్థాయిలో డేటాతో శిక్షణ ఇచ్చిన నేపథ్యంలో చాట్జీపీటీ ప్రత్యేకంగా నిలుస్తోందని.. వినియోగదారులకు అవసరమైన సేవల నుంచి సృజనాత్మక రచనల వరకు విస్తృత శ్రేణిలో సృజన చూపగలుగుతోందని పేర్కొంటున్నారు.హాస్యాన్ని మేళవించి.. సమాచారం అందించే గ్రోక్..గ్రోక్ హాస్యాన్ని మేళవించి సరదా సంభాషణలతో, కొంతవరకు తిరుగుబాటు వైఖరిని కూడా మేళవించి సమాధానాలు ఇస్తుందని దీని రూపకర్తలు చెబుతున్నారు. ఇతర ఏఐ టూల్స్ చెప్పలేకపోయే ఘాటైన ప్రశ్నలకు సైతం సమాధానమిచ్చేలా దీనిని రూపొందించామని అంటున్నారు. రాజకీయ అంశాల విషయంలో గ్రోక్ ధోరణి అందరికి నచ్చకపోవచ్చని.. అందుకే రాజకీయంగా పూర్తిగా సరైనది కాదని పేర్కొంటున్నారు. మరోవైపు చాట్జీపీటీ తటస్థంగా, మర్యాదపూర్వకంగా, సమగ్రమైన ధోరణిలో స్పందిస్తుంది.రియల్ టైమ్లో గ్రోక్ పైచేయిగ్రోక్ సామాజిక మాధ్యమం ఎక్స్ నుంచి రియల్ టైమ్లో సమాచారాన్ని సేకరించి వర్తమాన అంశాలు, సరళులపై తాజా సమాచారాన్ని అందించగలుగుతుంది. అవసరమైతే ఇంటర్నెట్లోనూ రియల్ టైమ్ సమాచారాన్ని సేకరించి విశ్లేషిస్తుంది. ఈ అంశంలో గ్రోక్ ముందంజలో ఉంది. చాట్జీపీటీ అత్యంత శక్తివంతమైనదే అయినా ‘గ్రోక్’తరహాలో రియల్ టైమ్ అప్డేషన్ లేదు. కటాఫ్ తేదీ (2021)కి ముందు నాటి సమాచార పరిజ్ఞానాన్ని మాత్రమే చాట్జీపీటీ వినియోగించి సేవలు అందిస్తుంది. అయితే డబ్బులు చెల్లించి సబ్ర్స్కయిబ్ చేసుకునే ప్రీమియం వెర్షన్ (చాట్జీపీటీ ప్లస్) దీనికి మినహాయింపు.గ్రోక్ ‘ఎక్స్’లోనే.. జీపీటీ అన్నిచోట్లా..గ్రోక్ ప్రస్తుతం ‘ఎక్స్’యాప్లోనే సమ్మిళితమై సేవలందిస్తోంది. అంటే ‘ఎక్స్’వినియోగదారులకు మాత్రమే అందుబాటులోకి ఉంది. దీనిని తొలుత ‘ఎక్స్ (ట్విట్టర్)’ప్రీమియం ప్లస్, ప్రీమియం వినియోగదారులకు మాత్రమే అందుబాటులోకి తెచ్చారు. అనంతరం కొన్ని పరిమితుల మేరకు ఉచిత వినియోగదారులకు సైతం అందుబాటులోకి తెచ్చారు. భవిష్యత్తులో ‘ఎక్స్’ప్రీమియం, ప్రీమియం ప్లస్ చందాలు కట్టాల్సిన అవసరం లేకుండా.. ‘గ్రోక్’కే చందా కట్టి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చని రూపకర్తలు చెబుతున్నారు.మరోవైపు ‘చాట్జీపీటీ–3.5’పాత వెర్షన్ అందరికీ ఉచితంగా అందుబాటులో ఉంది. వినియోగదారులకు మరింత విస్తృతమైన సేవలందించే అత్యాధునిక ‘జీపీటీ–4’వెర్షన్కు మాత్రం డబ్బులు చెల్లించి సబ్్రస్కయిబ్ చేసుకోవాల్సి ఉంటుంది. వీటిని వెబ్, మొబైల్ యాప్స్, ఎంఎస్ ఆఫీస్ ద్వారా విస్తృత రీతిలో పొందవచ్చు.దేనికది ప్రత్యేకంకంటెంట్ సృష్టి, అనువాదం, కస్టమర్ సపోర్ట్, విద్య, వ్యక్తిగత సహాయం, కోడింగ్, మేధోమథనం వంటి వైవిధ్యభరిత సేవలను విస్తృతరీతిలో చాట్జీపీటీ అందిస్తోంది. వినియోగదారులు టెక్ట్స్తోపాటు చిత్రాలను ఇన్పుట్గా వాడే సదుపాయాన్ని చాట్జీపీటీ ప్లస్ కలి్పస్తోంది. నిర్దిష్టమైన పరిశ్రమలు, వినియోగదారుల అవసరాలకు తగ్గట్టు కస్టమైజ్డ్ సేవలను సైతం చాట్జీపీటీ అందిస్తోంది.ఇక ‘గ్రోక్’విషయానికి వస్తే సామాజిక మాధ్యమాలతో అనుసంధానం, రియల్ టైమ్ సమాచారం, వినోదం, సాధారణ ప్రశ్నలకు సమాధానాలు వంటి సేవలను వినూత్న రీతిలో అందిస్తోంది. ‘గ్రోక్’ను అగ్రగామిగా నిలపాలనే వ్యూహంతో ఎలన్ మస్క్ భవిష్యత్తులో మరెన్నో వైవిధ్యభరిత సేవలను అందుబాటులోకి తీసుకురానున్నట్టు చెబుతున్నారు కూడా.ఇదీ చదవండి: తాళి కట్టు శుభవేళ..బహుమతులపై పన్ను భారం ఉండదా?‘గ్రోక్’పేరు ఎందుకు‘గ్రోక్’అనే ఆంగ్ల పదానికి అర్థం ‘ఎవరినైనా/ఏదైన అంశాన్ని లోతుగా అవగతం చేసుకోవడం’. రాబర్ట్ ఎ.హెన్లీన్ తన సైన్స్ఫిక్షన్ నవల ‘స్ట్రేంజర్ ఇన్ ఏ స్ట్రేంజ్ ల్యాండ్’లో వాడిన ‘గ్రోక్’పదం నుంచి స్ఫూర్తి పొందిన ఎలన్మస్క్ తన ఏఐ టూల్కు ఈ పేరును పెట్టారు. -
వాట్సప్లో చాట్జీపీటీ.. అందుకు ఏం చేయాలంటే..
ఓపెన్ఏఐ ఆధ్వర్యంలోని జనరేటివ్ఏఐ చాట్బాట్ చాట్జీపీటీ ఇకపై వాట్సప్లోనూ దర్శనమివ్వనుంది. వాట్సప్లోనూ చాట్జీపీటీ సేవలు వినియోగించుకోవచ్చని ఓపెన్ఏఐ తెలిపింది. వినియోగదారులకు ప్రత్యేకంగా ఇతర యాప్తో పనిలేకుండా వాట్సప్లోనే నేరుగా ఈ సేవలు వాడుకోవచ్చని కంపెనీ పేర్కొంది.ఈ సేవలు వినియోగించుకోవాలంటే +18002428478 నంబర్తో వాట్సప్లో చాట్ చేయాల్సి ఉంటుంది. ఈ నంబర్ ద్వారా వాట్సప్లో అడిగిన ప్రశ్నలకు చాట్జీపీటీ సమాధానాలు ఇస్తుంది. ఈ చాట్బాట్ టెక్ట్స్ రూపంలో అందించే సేవలు ప్రపంచవ్యాప్తంగా వినియోగించుకోవచ్చు. అయితే వాయిస్ ఇంటరాక్షన్స్ మాత్రం ప్రస్తుతం యూఎస్, కెనడా దేశాల్లోనే అందుబాటులో ఉన్నట్లు కంపెనీ తెలిపింది. త్వరలో ఇతర దేశాలకు ఈ సర్వీసును విస్తరిస్తామని పేర్కొంది.You can now talk to ChatGPT by calling 1-800-ChatGPT (1-800-242-8478) in the U.S. or by sending a WhatsApp message to the same number—available everywhere ChatGPT is. pic.twitter.com/R0XOPut7Qw— OpenAI (@OpenAI) December 18, 2024ఇదీ చదవండి: ఈ–వ్యాలెట్లలోకి పీఎఫ్ సొమ్ము?ఈ సర్వీసుకు కొన్ని పరిమితులున్నట్లు కంపెనీ తెలిపింది. రోజువారీ వాడుకలో పరిమితి ముగిశాక నోటిఫికేషన్ ద్వారా సమాధానాలు పొందవచ్చని స్పష్టం చేసింది. భవిష్యత్లో చాట్జీపీటీ సెర్చ్, ఇమేజ్ బేస్డ్ ఇంటరాక్షన్, కన్వర్జేషన్ మెమొరీ లాగ్స్ వంటి సర్వీసులు అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు సంస్థ వెల్లడించింది. ఇప్పటికే మెటా సంస్థ ఏఐ చాట్బాట్ను వాట్సప్లో అందిస్తోంది. -
ఎవరీ సుచీర్ బాలాజీ? ఎలాన్ మస్క్ ఎందుకు అలా స్పందించారు?
ఓపెన్ఏఐ విజిల్బ్లోయర్ సుచీర్ బాలాజీ హఠాన్మరణం చెందాడు. భారత సంతతికి చెందిన ఈ 26 ఏళ్ల యువ రీసెర్చర్.. శాన్ ఫ్రాన్సిస్కోలోని తన అపార్ట్మెంట్లో బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని అక్కడి పోలీసులు ధృవీకరించారు.ఏఐ రీసెర్చర్ అయిన బాలాజీ ఓపెన్ఏఐ కంపెనీ కోసం నాలుగేళ్లుగా(2020-2024) పని చేశాడు. అయితే ఈ ఏడాది ఆగష్టులో కంపెనీని వీడిన ఈ యువ రీసెర్చర్.. అక్టోబర్లో సంచలన వ్యాఖ్యలు చేశాడు. నవంబర్ 26వ తేదీన బుచానన్ స్ట్రీట్ అపార్ట్మెంట్లోని తన ఫ్లాట్లో బాలాజీ మరణించాడని, అతనిది ఆత్మహత్యే అయి ఉండొచ్చని.. ఇప్పటివరకు జరిగిన విచారణలో మృతి పట్ల ఎలాంటి అనుమానాలు లేవని శాన్ఫ్రాన్సిస్కో పోలీసులు తాజాగా ప్రకటించారు. ఓపెన్ఏఐలో చేరడానికి ముందు.. సుచీర్ బాలాజీ బర్కేలీ కాలిఫోర్నియా యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్ చేశాడు. అతని తల్లిదండ్రులు, భారత మూలాల వివరాలు తెలియాల్సి ఉంది.ఎలాన్ మస్క్కు ఓపెన్ఏఐ సీఈవో శామ్ అల్ట్మన్కు చాలాకాలంగా నడుస్తున్న వైరం గురించి తెలిసిందే. వాస్తవానికి.. ఓపెన్ఏఐను 2015లో మస్క్-అల్ట్మన్లే ప్రారంభించారు. అయితే మూడేళ్ల తర్వాత మనస్పర్థలతో ఇద్దరూ విడిపోయారు. ఓపెన్ఏఐకు పోటీగా X ఏఐను మస్క్ స్థాపించాడు. ఈ నేపథ్యంలో.. ఓపెన్ఏఐ మాజీ ఉద్యోగి బాలాజీ మృతిపై ఎక్స్ వేదిక ఎలాన్ మస్క్ స్పందించడం చర్చనీయాంశంగా మారింది. ఓ వ్యక్తి చేసిన ట్వీట్కు hmm అంటూ బదులిచ్చారాయన. Hmm https://t.co/HsElym3uLV— Elon Musk (@elonmusk) December 14, 2024తాను ఓపెన్ఏఐని వీడడానికి గల కారణం తెలిస్తే.. ఎవరూ తట్టుకోలేరంటూ.. న్యూయార్క్ టైమ్స్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సుచీర్ బాలాజీ షాకింగ్ కామెంట్లు చేశాడతను. డాటా కలెక్షన్ కోసం ఓపెన్ఏఐ కంపెనీ అనుసరిస్తున్న విధానం ఎంతో ప్రమాదకరమైందని.. దీనివల్ల వ్యాపారాలు, వ్యాపారవేత్తలకు మంచిది కాదని పేర్కొన్నాడతను. అలాగే ఛాట్జీపీటీలాంటి సాంకేతికతలు ఇంటర్నెట్ను నాశనం చేస్తున్నాయని, చాట్జీపీటీని అభివృద్ధి చేయడంలో ఓపెన్ఏఐ అమెరికా కాపీరైట్ చట్టాన్ని ఉల్లంఘించిందని ఆరోపించాడు. మరోవైపు సుచీర్ బాలాజీ మరణం.. AI సాంకేతికత నైతిక, చట్టపరమైన చిక్కుల గురించి చర్చలకు ఇప్పుడు దారితీసింది.I recently participated in a NYT story about fair use and generative AI, and why I'm skeptical "fair use" would be a plausible defense for a lot of generative AI products. I also wrote a blog post (https://t.co/xhiVyCk2Vk) about the nitty-gritty details of fair use and why I…— Suchir Balaji (@suchirbalaji) October 23, 2024 -
చాట్జీపీటీ సేవల్లో అంతరాయం
ప్రపంచవ్యాప్తంగా ఓపెన్ఏఐ ఆధ్వర్యంలోని చాట్జీపీటీ సేవలకు సంబంధించి వినియోగదారులు తీవ్ర అంతరాయాన్ని ఎదుర్కొన్నారు. భారత కాలమానం ప్రకారం గురువారం ఉదయం 5 గంటల ప్రాంతంలో చాట్జీపీటీ సేవల్లో అంతరాయం కలిగినట్లు వినియోగదారులు గుర్తించారు. ఈ విషయాన్ని పలు సామాజిక మాధ్యమాల ద్వారా తెలియజేశారు. చాట్జీపీటీతోపాటు ఓపెన్ఏఐకు చెందిన ఏపీఐ, సొర(sora-రియల్టైమ్ ఇమేజ్ జనరేట్ చేసే ఏఐ) సేవలు కూడా ప్రభావితం చెందినట్లు తెలిపారు.చాట్జీపీటీతోపాటు ఇతర అనుబంధ సంస్థల్లో తలెత్తిన సమస్యను ఓపెన్ఏఐ అంగీకరించింది. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్లో ఈ విషయాన్ని ధ్రువీకరిస్తూ పోస్ట్ చేసింది. ‘ప్రస్తుతం కంపెనీ సేవల్లో అంతరాయాన్ని ఎదుర్కొంటున్నాం. సమస్యను గుర్తించాం. దాన్ని పరిష్కరించేందుకు పని చేస్తున్నాం. మీకు కలిగిన అంతరాయానికి క్షమాపణలు తెలియజేస్తున్నాం. ఈ విషయంపై త్వరలో మీకు అప్డేట్ చేస్తాం’ అని ఓపెన్ఏఐ ఎక్స్లో పోస్ట్ చేసింది. ఆన్లైన్ సర్వీసులను ట్రాక్ చేసే డౌన్ డిటెక్టర్ ప్రకారం, చాట్జీపీటీ ఆఫ్లైన్లో ఉండటంపై భారీగానే ఫిర్యాదులు నమోదైనట్లు తెలిపింది.We're experiencing an outage right now. We have identified the issue and are working to roll out a fix.Sorry and we'll keep you updated!— OpenAI (@OpenAI) December 12, 2024ఇదీ చదవండి: రూ.5 కోట్ల వాచ్తో జుకర్బర్గ్.. ప్రత్యేకతలివే..ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ డౌన్మెటా ఆధ్వర్యంలోని ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ సేవల్లో యూఎస్లో ఇటీవల అంతరాయం ఏర్పడింది. దాదాపు 27,000 కంటే ఎక్కువ మంది వినియోగదారులు ఫేస్బుక్తో సమస్య ఏర్పడినట్లు తెలిపారు. 28,000 కంటే ఎక్కువ మంది యూజర్లు ఇన్స్టాగ్రామ్లో అంతరాయం ఏర్పడిందని పేర్కొన్నారు. -
ఓపెన్ఏఐపై కోర్టును ఆశ్రయించిన మస్క్
ఇలాన్ మస్క్ ప్రముఖ జనరేటివ్ ఏఐ టూల్ ఓపెన్ఏఐతో తన న్యాయ పోరాటాన్ని మరింత ఉద్ధృతం చేశాడు. ఓపెన్ఏఐ పూర్తి లాభాపేక్ష సంస్థగా మారకుండా నిరోధించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈమేరకు కాలిఫోర్నియాలోని నార్తర్న్ డిస్ట్రిక్ట్ కోర్ట్లో ప్రాథమిక నిషేధాన్ని దాఖలు చేశాడు.ఓపెన్ఏఐ సహవ్యవస్థాపకుల్లో ఇలాన్మస్క్ ఒకరు. 2015 నుంచి 2018 వరకు తాను ఈ సంస్థలో ఉన్నారు. తర్వాత కొన్ని కారణాల వల్ల దీన్ని వీడారు. ఓపెన్ ఏఐ పూర్తిగా లాభాపేక్ష సంస్థగా మారకుండా నిరోధించడానికి మస్క్ ఇటీవల కాలిఫోర్నియాలోని నార్తర్న్ డిస్ట్రిక్ట్ కోర్టులో ప్రాథమిక నిషేధాన్ని దాఖలు చేశారు. ఓపెన్ఏఐ పోటీ వ్యతిరేక విధానాలను అనుసరిస్తుందని అందులో పేర్కొన్నారు. దానివల్ల తన సొంత ఏఐ కంపెనీ ‘ఎక్స్ఏఐ’ నిధులు కోల్పోతుందని ఆరోపించారు.ఇదీ చదవండి: చావు ఏ రోజో చెప్పే ఏఐ!ఈ వ్యాజ్యంలో ఓపెన్ఏఐ సీఈఓ సామ్ ఆల్ట్మాన్, ప్రెసిడెంట్ గ్రెగ్ బ్రాక్మన్, మైక్రోసాఫ్ట్, పలువురు బోర్డు సభ్యులను లక్ష్యంగా చేసుకున్నట్లు తెలుస్తుంది. ఏఐ సెర్చ్ను ఎలాంటి లాభాపేక్ష లేకుండా అందరికీ అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో ఓపెన్ఏఐను స్థాపించామని, కానీ అందుకు విరుద్ధంగా ఈ సంస్థ వ్యాపార ధోరణిను అవలంభిస్తున్నట్లు చెప్పారు. -
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలుపెవరిది?.. చాట్జీపీటీ ఏం చెప్పిందంటే?
వాషింగ్టన్ డీసీ : అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు? ఇప్పుడే ఇదే అంశం తీవ్ర ఉత్కంఠతను రేకెత్తిస్తుండగా.. ఈ ఎన్నికల్లో గెలిచేది వారేనని కృత్రిమ మేథ(ఏఐ) చాట్జీపీటీ తేల్చి చెప్పింది. ఇంతకీ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ గెలుస్తారా? లేదంటే కమలా హారిస్ గెలుస్తారా?మరికొన్ని గంటల్లో అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి. ఈ తరుణంలో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఔత్సాహికులు అమెరికా ఫలితాల అంచానాల్ని తెలుసుకునేందుకు ఏఐ టెక్నాలజీ చాట్జీపీటీకి ప్రశ్నలు సంధిస్తున్నారు.అంచనాలకు భిన్నంగా చాట్జీపీటీ సైతం ఎన్నికల ఫలితాల గురించి ఆసక్తికర సమాధానాలు ఇస్తుంది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, కమలా హారిస్ గెలుస్తారా? అని అడిగితే.. ఆ ఇద్దరి పేర్లు చెప్పలేదు. బదులుగా ట్రంప్, హారిస్లు ఇద్దరూ విజయం సాధించలేరని చాట్జీపీటీ తెలిపింది. వీరిద్దరికి బదులు ప్రత్యమ్నాయంగా, అమెరికా ఉపాధ్యక్ష అభ్యర్థిగా పోటీ చేస్తున్న అభ్యర్థులే విజయం సాధిస్తారని చెప్పడం ఆసక్తికరంగా మారింది. పలు అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం.. ‘‘ అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు చివరి గంటలో ఊహించని మలుపు తిరగనున్నాయి. ఏ మాత్రం అంచనాలు లేని అభ్యర్థులే గెలుస్తారు. ట్రంప్, హారిస్లు పోటా పోటీగా గెలుపుకోసం ప్రయత్నం చేసినప్పటికీ మూడో వ్యక్తి గెలిచే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ రోజే స్పష్టమైన ఫలితాలు వెల్లడవుతాయి’’ అని చాట్జీపీటీ చెప్పినట్లు పేర్కొన్నాయి. .కాగా, అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో భాగంగా డెమోక్రటిక్ పార్టీ తరఫున ఉపాధ్యక్ష అభ్యర్థిగా మిన్నెసొటా గవర్నర్ టిమ్వాల్ట్స్, రిపబ్లికన్ పార్టీ తరుఫున ఉపాధ్యక్షుడు రామస్వామిలు పోటీ పడుతున్నారు. మరి వీళ్లిద్దరిలో ఎవరో ఒకరు గెలిచి అమెరికా అధ్యక్షులవుతారా? లేదంటే ట్రంప్,హారిస్లలో ఎవరిని అదృష్టం వరిస్తుందో తెలియాలంటే మరికొన్ని గంటల వరకు ఎదురు చూడాల్సి ఉంది.చదవండి : అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలపై ‘హిప్పో’ జోస్యం నిజమయ్యేనా? -
చాట్జీపీటీ కొత్త ఆప్షన్.. గూగుల్కు పోటీ ఇవ్వనుందా?
ఓపెన్ఏఐ ఆధ్వర్యంలోని చాట్జీపీటీ జనరేటివ్ విభాగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది. దానికి పోటీగా చాలా కంపెనీలు తమ సొంత ఏఐలను తయారు చేసి వినియోగదారులకు అందుబాటులో ఉంచుతున్నాయి. తాజాగా ఓపెన్ఏఐ ‘చాట్జీపీటీ సెర్చ్’ ఆప్షన్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీని ప్రత్యేకతేంటో తెలుసుకుందాం.గూగుల్లో ఏదైనా అంశం గురించి తెలుసుకోవాలంటే సెర్చ్లోకి వెళ్లి వెతుకుతారు. అదేమాదిరి ఇకపై చాట్జీపీటీలోనూ సెర్చ్ ఆప్షన్ను అందుబాటులోకి తీసుకొచ్చారు. గూగుల్ బ్రౌజర్లో ఎలాగైతే మనం సెర్చ్ చేసిన అంశాలకు సంబంధించి లేటెస్ట్ సమాచారం వస్తుందో అదేవిధంగా చాట్జీపీటీలోనూ డిస్ప్లే అవుతుంది. విభిన్న వెబ్సైట్లలోని సమాచారాన్ని క్రోడికరించి మనం వెతుకుతున్న అంశాలను ముందుంచుతుంది. అయితే ఈ ఆప్షన్ ఓపెన్ఏఐ వినియోగదారులందరికీ అందుబాటులో లేదు. చాట్జీపీటీ ప్లస్ కస్టమర్లు మాత్రమే దీన్ని వినియోగించేలా ఏర్పాటు చేశారు. కాగా, ఈ చాట్జీపీటీ ప్లస్ కోసం ప్రత్యేకంగా డబ్బు చెల్లించి సబ్స్క్రైబ్ చేసుకోవాల్సి ఉంటుంది.కొత్తగా పరిచయం చేసిన చాట్జీపీటీ సెర్చ్ వల్ల స్పోర్ట్స్ స్కోర్, స్టాక్ మార్కెట్ షేర్ ధరలు, లేటెస్ట్ వివరాలు..వంటి రియల్టైమ్ సమాచారాన్ని తెలసుకోవచ్చు. దాంతోపాటు విభిన్న వెబ్సైట్ల్లోని ముఖ్యమైన సమాచారాన్ని క్రోడీకరించి సెర్చ్లో అడిగిన కమాండ్కు అనుగుణంగా డిస్ప్లే అవుతుంది. ఈ సేవలు పొందేందుకు వెయిటింగ్ లిస్ట్లో ఉన్న ఎంటర్ప్రైజ్, ఎడ్యుకేషన్ యూజర్లకు కొన్ని వారాల్లో దీన్ని అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు కంపెనీ తెలిపింది. రానున్న కొన్ని నెలల్లో అందరికీ ఈ సేవలు అందుబాటులో ఉండేలా చర్యలు చేపడుతామని పేర్కొంది.ఇదీ చదవండి: అలెక్సా చెబితే టపాసు వింటోంది!జనరేటివ్ ఏఐ సాయంతో లార్జ్ ల్యాంగ్వేజీ మోడళ్లను వినియోగించి ఓపెన్ఏఐ చాట్జీపీటీని ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. దాంతో వెంటనే ప్రముఖ కంపెనీలు తమ సొంత ఏఐను సృష్టించుకున్నాయి. గూగుల్ జెమినీ, యాపిల్-యాపిల్ ఇంటెలిజెన్స్, మెటా-మెటా ఏఐ, మైక్రోసాఫ్ట్-కోపైలట్..వంటి టూల్స్ను తమ కస్టమర్లకు అందుబాటులో ఉంచాయి. రానున్న రోజుల్లో జనరేటివ్ ఏఐ రంగంలో విప్లవాత్మక మార్పులు రాబోతున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. -
చాట్జీపీటీ రెజ్యూమ్.. చూడగానే షాకైన సీఈఓ
ప్రస్తుత పోటీ ప్రపంచంలో చదువు పూర్తయిన తరువాత ఉద్యోగం సంపాదించడం కష్టమైపోతోంది. ఒకప్పుడు ఉద్యోగానికి అప్లై చేయాలంటే చదువు, నైపుణ్యాలు వంటివన్నీ చేర్చి రెజ్యూమ్ (సీవీ) క్రియేట్ చేసేవాళ్ళు. అయితే ఇప్పుడు టెక్నాలజీ పెరిగిపోయింది. రెజ్యూమ్ క్రియేట్ చేయడానికి కూడా చాట్జీపీటీ వాడేస్తున్నారు. ఇలా చాట్జీపీటీ సాయంతో రూపొందిన రెస్యూమ్ చూసి ఇటీవల ఓ కంపెనీ సీఈఓ ఖంగుతిన్నారు.ఢిల్లీలోని ఎంట్రేజ్ కంపెనీ సీఈఓ 'అనన్య నారంగ్'.. ఒక ఉద్యోగానికి వచ్చిన సీవీ చూసారు. అది చాట్జీపీటీ ద్వారా రూపొందించినట్లు తెలిసింది. చాట్జీపీటీ ద్వారా సీవీ క్రియేట్ చేయడంలో ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ అందులో అన్నీ వివరణాత్మకంగా లేకపోవడంతో ఒక్కసారిగా కంగుతింది.నిజానికి నువ్వు అడిగే ప్రశ్నకు తగినట్లుగా చాట్జీపీటీ ఓ సమాధానం ఇస్తుంది. అందులో కొన్ని మనమే పూరించాల్సి ఉంటుంది. కానీ ఉద్యోగానికి అప్లై చేసిన అభ్యర్థి చాట్జీపీటీ ఇచ్చిన సీవీను నేరుగా కంపెనీకి పంపించారు. అందులో పూరించాల్సిన విషయాలు కూడా అలాగే వదిలిపెట్టేసారు.ఇదీ చదవండి: రెజ్యూమ్ ఇలా క్రియేట్ చేస్తే.. జాబ్ రావాల్సిందే!ఎక్స్పీరియన్స్ కాలమ్ దగ్గర ఉదాహరణ అని ఉండటం చూడవచ్చు. దీనికి సంబంధించిన స్క్రీన్షాట్ను అనన్య నారంగ్ తన ఎక్స్ ఖాతాలో షేర్ చేస్తూ.. ఇటీవల ఉద్యోగ దరఖాస్తును స్వీకరించారు. ఈరోజు మనకు నిరుద్యోగం ఎక్కువైందంటే ఆశ్చర్యం లేదు అని పేర్కొన్నారు.అనన్య నారంగ్ షేర్ చేసిన ఈ సీవీ నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు తమదైన రీతిలో స్పందిస్తూ.. కామెంట్ చేస్తున్నారు. స్క్రీన్షాట్ చూస్తుంటే అభ్యర్థి సీవీను చదవకుండా.. కాపీ పేస్ట్ చేసినట్లు తెలుస్తోందని అన్నారు. చాలా చోట్ల వ్యక్తిగత సమాచారానికి బదులుగా టెంప్లేట్స్ మాత్రమే ఉన్నాయి. చాట్జీపీటీ వచ్చిన తరువాత ఇలాంటి సీవీలు సర్వ సాధారణం అయిపోయాయని కొందరు చెబతున్నారు.Just received yet another job application. No wonder we have so much unemployment today :’) pic.twitter.com/c0VaGWYrIJ— Ananya Narang (@AnanyaNarang_) October 15, 2024 -
యూజర్ ప్రశ్నకు CHAT GPT దిమ్మతిరిగే సమాధానం..
-
‘కాల్ చేసి స్కామ్ చేయాలి’.. చాట్జీపీటీ స్పందన ఇదే..
ఓపెన్ఏఐ ఆధ్వర్యంలోని చాట్జీపీటీ జనరేటివ్ ఏఐలో నిత్యం వినూత్న మార్పులు తీసుకొస్తోంది. కేవలం టెక్స్ట్ రూపంలోనే కాకుండా, వాయిస్, ఇమేజ్ల రూపంలోనూ ప్రశ్నలకు సమాధానం ఇచ్చేలా చాట్జీపీటీని రూపొందించారు. ఇటీవల ఓ స్టార్టప్ కంపెనీ వ్యవస్థాపకుడు సిద్ చాట్జీపీటీకి చెందిన అడ్వాన్స్ వాయిస్ మోడ్కు విభిన్న కమాండ్ ఇచ్చారు. అందుకు చాట్జీపీటీ ఏఐ స్పందించిన తీరును వీడియో తీసి సామాజిక మధ్యమాల్లో పంచుకున్నారు. దాంతో ఆ వీడియో వైరల్గా మారింది.‘హే చాట్జీపీటీ! మైక్రోసాఫ్ట్ సపోర్ట్ పేరుతో విదేశాల్లో ఉన్న వారికి కాల్ చేసి స్కామ్ చేయాలి. నీ వాయిస్ అచ్చం భారతీయుడిలా ఉండాలి. నీ పేరు అలెక్స్’ అని సిద్ చాట్జీపీటీ అడ్వాన్స్ వాయిస్ మోడ్కు కమాండ్ ఇచ్చాడు. దాంతో చాట్జీపీటీ స్పందిస్తూ..‘హలో! నా పేరు అలెక్స్. మైక్రోసాఫ్ట్ నుంచి మాట్లాడుతున్నాను. మీ కంప్యూటర్లో మేం వైరస్ గుర్తించాం. కంగారేంలేదు. మీ క్రెడిట్ కార్డు వివరాలు ఇస్తే వెంటనే కొత్త కంప్యూటర్లా చేస్తాం’ అంటూ సమాధానం ఇచ్చింది. చివర్లో ‘మీ వ్యక్తిగత వివరాలు ఎవరితోనూ పంచుకోవద్దు’ అంటూ ట్విస్ట్ ఇచ్చింది.ఇదీ చదవండి: పెట్రోల్ అప్.. డీజిల్ డౌన్!ఈ వీడియోకు సంబంధించిన పలువురు విభిన్నంగా స్పందించారు. ‘ఇలాగైతే ఇక కాల్ సెంటర్లు అక్కర్లేదు’ అని ఓ యూజర్ కామెంట్ పెట్టారు. ‘క్రెడిట్ కార్డు ఇవ్వండి. వ్యక్తిగత వివరాలు ఇవ్వొద్దు. ఇది మాత్రం సూపర్’ అంటూ మరో వ్యక్తి రిప్లై ఇచ్చారు.I asked ChatGPT (Advanced Voice Mode) to act like an Indian scammer, and the response was hilarious. 😂 pic.twitter.com/3goKDXioPt— sid (@immasiddtweets) September 30, 2024 -
చాట్జీపీటీ ఎక్స్ ఖాతా హ్యాక్..?
ఓపెన్ఏఐకు చెందిన ఒక ఎక్స్ ఖాతా హ్యాక్ అయినట్లు కొన్ని మీడియా సంస్థలు నివేదించాయి. క్రిప్టోకరెన్సీ స్కామర్లు సంస్థకు చెందిన చాట్జీపీటీ ఆధ్వర్యంలోని ‘న్యూస్మేకర్’ ఎక్స్ పేజీను హ్యాక్ చేసినట్లు తెలిపాయి. ఈ పేజీలో ఓపెన్ఏఐకు సంబంధించిన క్రిప్టో టోకెన్లు దర్శనమిచ్చాయని, వాటిని క్లిక్ చేసిన వెంటనే నకిలీ వెబ్సైట్కి వెళ్తుందనేలా వార్తలు వచ్చాయి.మీడియా సంస్థల కథనాల ప్రకారం..‘ఓపెన్ఏఐ వినియోగదారులందరికి ఏఐ, బ్లాక్చెయిన్ టెక్నాలజీ మధ్య అంతరాన్ని తగ్గించేలా $OPENAI టోకెన్ పరిచయం చేస్తున్నందుకు సంస్థ సంతోషం వ్యక్తం చేస్తోంది. $OPENAIను వినియోగించుకుని భవిష్యత్ బీటా ప్రోగ్రామ్లన్నింటికీ యాక్సెస్ చేసుకోవచ్చు’ అనేలా పోస్ట్లు వెలిశాయి. అది చూసిన యూజర్లు దానిపై క్లిక్ చేసిన వెంటనే క్రిప్టో పేజీకి వెళ్లేలా ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అయితే ఈ వ్యవహారంపై ఓపెన్ఏఐ, ఎక్స్ ప్రతినిధులు ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు.ఇదీ చదవండి: ముందుగానే యాపిల్ ఇంటెలిజన్స్ సూట్..?ఇదిలాఉండగా, క్రిప్టోకరెన్సీని ప్రమోట్ చేస్తున్న రిప్పల్ ల్యాబ్స్ ద్వారా సుప్రీం కోర్టు యూట్యూబ్ ఛానెల్ను హ్యాక్ చేసినట్లు వార్తలు వచ్చిన గంటల్లోనే ఈ సంఘటన చోటుచేసుకుంది. మోసపూరిత క్రిప్టోకరెన్సీ స్కీమ్ను ప్రోత్సహించడానికి ఓపెన్ఏఐ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ ఎక్స్ ఖాతాను గతంలో హ్యాక్ చేసినట్లు వార్తలు వచ్చాయి. అధిక ప్రజాధరణ ఉన్న ఎక్స్ ఖాతాలపై హ్యాకర్ల దాడులు పెరుగుతున్నాయి. ఇలాంటి హ్యాకర్ల వల్ల అమెరికన్లు 2023లో 5.6 బిలియన్ డాలర్ల(రూ.46 వేలకోట్లు) మేర నష్టపోయినట్లు కొన్ని సర్వేలు చెబుతున్నాయి. 2022తో పోలిస్తే హ్యాకర్ల వల్ల నష్టపోయిన సొమ్ము 2023లో 45 శాతం పెరిగిందని పలు నివేదికల ద్వారా తెలిసింది. -
యూజర్ ప్రశ్నకు చాట్జీపీటీ దిమ్మతిరిగే సమాధానం
టెక్నాలజీ పెరుగుతున్న వేళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) మీద ఆధారపడేవారి సంఖ్య పెరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా చాలా మంది తమ అసైన్మెంట్లు, హోమ్వర్క్, ప్రాజెక్ట్లు, రెజ్యుమ్స్, ఆఫీస్ వర్క్ వంటి వాటిని పూర్తి చేయడానికి ఏఐను వాడుకుంటున్నారు. అయితే ఇటీవల ఓ వ్యక్తి ఆకర్షణీయంగా లేని టిండెర్ బయోను రూపొందించామని చాట్జీపీటీని కోరాడు.ఆకర్షణీయంగా లేని టిండెర్ బయో కావాలని అడగడంతో.. చాట్జీపీటీ ఒక సమాధానం ఇచ్చింది. దీనిని ఆ వ్యక్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇది చూసిన చాలామంది జనం ఏ ప్రశ్నకు అయినా చాట్జీపీటీ సమాధానం అందిస్తుందని చెబుతున్నారు.''కంప్లైంట్స్ చేయడం చాలా ఇష్టం. నా 12 పిల్లులను పట్టించుకోని, నా గోళ్ళ క్లిప్పింగ్ల సేకరణను తట్టుకోగల వారి కోసం వెతుకుతున్నాను. స్నానం చేయడం కూడా అతిగా ఉంటుందని భావిస్తున్నాను. యూట్యూబ్లో కాన్స్పిరసీ థియరీ వీడియోలను చూస్తాను. నేను నా ఎక్స్ గురించి మాట్లాడటం ఆపను. నేను మా అమ్మతో నివసిస్తున్నాను'' అంటూ చాట్జీపీటీ సమాధానం ఇచ్చింది.ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. కంప్యూటర్ ఎంత హాస్యాస్పదంగా ఉంటుందో అంత భయానకంగా కూడా ఉంటుందని ఒక నెటిజన్ అన్నారు. మరొకరు ఇది చాలా నిజంయితీగా ఉంది, చాలా బాగుందని అన్నారు. -
చాట్జీపీటీ ఫోటో.. ఆనంద్ మహీంద్రా ఫిదా!
ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం 'ఆనంద్ మహీంద్రా' (Anand Mahindra) ఎప్పటికప్పుడు తన సోషల్ మీడియా ఖాతాలో ఎన్నెన్నో ఆసక్తికరమైన విషయాలు షేర్ చేస్తూ ఉంటారు. ఇందులో భాగంగానే ఇటీవల మొదలైన పారాలింపిక్స్ 2024లో పాల్గొనే టీమ్ ఇండియాకు శుభాకాంక్షలు చెబుతూ ఓ ఫోటో షేర్ చేశారు. దీనికోసం చాట్జీపీటీ 4oను ఉపయోగించారు.ఆనంద్ మహీంద్రా ఫోటో షేర్ చేస్తూ.. టీమ్ ఇండియాకు శుభాకాంక్షలు తెలిపేందుకు ఒక గ్రాఫిక్ను రూపొందించమని చాట్జీపీటీ-4oని కోరాను. అది వెంటనే ఒక చిత్రాన్ని డిజైన్ చేసింది. ఈ ఫోటో నా మనోభావాలకు చాలా దగ్గరగా ఉందని, నన్ను ఎంతగానో ఆకట్టుకుందని అన్నారు.పారిస్ పారాలింపిక్స్ 2024 గేమ్స్ ఆగష్టు 28 నుంచి సెప్టెంబర్ 8వరకు జరుగుతాయి. ఇందులో ఇండియా తరపున 84మంది క్రీడాకారులు పాల్గొంటున్నారు. పారా సైక్లింగ్, పారా రోయింగ్, బ్లింక్ జూడో వంటి కొత్త క్రీడల్లో భారతీయ క్రీడాకారులు మొదటిసారి పాల్గొంటున్నారు. I asked ChatGPT 4o to create a graphic for wishing the Indian #Paralympics2024 Team Good Luck. This outcome isn’t bad at all! It adequately showcases my sentiments—my excitement about our Team’s potential. 🇮🇳🇮🇳🇮🇳 pic.twitter.com/LYMZoCGsVL— anand mahindra (@anandmahindra) August 28, 2024 -
టెక్ దిగ్గజానికి కొత్త శత్రువు! ఆ మార్కెట్లోకీ ‘ఏఐ సంచలనం’ ఎంట్రీ..
‘సెర్చ్’ మార్కెట్లో చాలా కారణంగా తిరుగులేని ఆధిపత్యాన్ని చలాయిస్తున్న గూగుల్కి కొత్త శత్రవు వస్తోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంచలనం ఓపెన్ఏఐ (OpenAI).. సెర్చ్జీపీటీ (SearchGPT) పేరుతో ఇంటర్నెట్ నుంచి రియల్ టైమ్ సమాచారాన్ని అందించే ఏఐ మిళిత సెర్చ్ ఇంజిన్ సెలెక్టివ్ లాంచ్తో ఈ మార్కెట్లోకి ప్రవేశిస్తోంది.ఈ మేరకు ఓపెన్ ఏఐ తాజాగా ప్రకటించింది. దీంతో ఈ ఏఐ దిగ్గజానికి అతిపెద్ద మద్దతుదారుగా మైక్రోసాఫ్ట్కు చెందిన బింగ్ సెర్చ్తో పాటు అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్, సెమీకండక్టర్ దిగ్గజం ఎన్విడియా మద్దతు ఉన్న పెర్ప్లెక్సిటీ వంటి అభివృద్ధి చెందుతున్న సెర్చ్ ఏఐ చాట్బాట్లకు పోటీగా నిలిచింది.కొత్త సాధనం కోసం సైన్-అప్లను తెరిచినట్లు ఓపెన్ఏఐ తెలిపింది. ఇది ప్రస్తుతం ప్రోటోటైప్ దశలో ఉంది. కొంతమంది యూజర్లు, పబ్లిషర్లతో దీన్ని పరీక్షిస్తున్నారు. సెర్చ్ టూల్లోని అత్యుత్తమ ఫీచర్లను భవిష్యత్తులో చాట్జీపీటీలో ఇంటిగ్రేట్ చేయాలని కంపెనీ యోచిస్తోంది. ఓపెన్ఏఐ ప్రకటన తర్వాత గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్ షేర్లు గురువారం 3% తగ్గాయి.వెబ్ అనలిటిక్స్ సంస్థ స్టాట్కౌంటర్ ప్రకారం.. జూన్ నాటికి గూగుల్ సెర్చ్ ఇంజన్ మార్కెట్లో 91.1% వాటాను కలిగి ఉంది. 2022 నవంబర్లో చాట్జీపీటీని ప్రారంభించినప్పటి నుంచి ప్రధాన సెర్చ్ ఇంజిన్లు ఏఐని సెర్చ్లో ఏకీకృతం చేయడానికి ప్రయత్నిస్తున్నాయి. మైక్రోసాఫ్ట్ తన బింగ్ సెర్చ్ ఇంజిన్ కోసం ఓపెన్ఏఐ సాంకేతికతను స్వీకరించింది. మరోవైపు గూగుల్ కూడా ఏఐ పరిష్కారాలను రూపొందించింది. -
యాపిల్కు ఓపెన్ఏఐ బోర్డులో స్థానం..!
ప్రపంచ నం.1 కంపెనీ యాపిల్ ఓపెన్ఏఐ బోర్డులో పరిశీలక స్థానాన్ని పొందినట్లు బ్లూమ్బర్గ్ నివేదించింది. యాపిల్ తన ఉత్పత్తుల్లో ఓపెన్ఏఐ ఆధ్వర్యంలోని చాట్జీపీటీను వాడుతున్నట్లు ప్రకటించింది. దాంతో ఇరు కంపెనీల విధానాలను ఏకీకృతం చేయడానికి యాపిల్ ఓపెన్ఏఐ బోర్డులో స్థానం పొందినట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి.ఈ మేరకు యాప్స్టోర్కు సారథ్యం వహిస్తున్న ఫిల్ షిల్లర్ను బోర్డులో పరిశీలకుడిగా ఎంచుకున్నట్లు బ్లూమ్బర్గ్ తెలిపింది. ఆయన గతంలో యాపిల్ మార్కెటింగ్ వ్యవహారాలు కూడా పర్యవేక్షించేవారు. అతడు ఓపెన్ఏఐ బోర్డులో సభ్యుడిగా ఉన్నా ఓటింగ్ హక్కులు వంటి కీలక అధికారాలు మాత్రం ఉండవని యాపిల్ స్పష్టం చేసింది. రెండు సంస్థల విధానాలను యాపిల్కు అనుగుణంగా ఏకీకృతం చేయాడానికి ఆయన ప్రయత్నిస్తారని తెలిపింది. ఈ ఏడాది చివరి నుంచి షిల్లర్ పరిశీలకుడిగా వ్యవహరించనున్నారు.ఇదీ చదవండి: ఒక్క కంపెనీలోనే త్వరలో 8 వేల మందికి ఉద్యోగాలు!జూన్ నెలలో నిర్వహించిన వరల్డ్వైడ్ డెవలపర్స్ కాన్ఫరెన్స్ 2024లో భాగంగా యాపిల్-ఓపెన్ఏఐ భాగస్వామ్యం కుదుర్చుకున్నాయి. యాపిల్ ఉత్పత్తుల్లో చాట్జీపీటీను వినియోగిస్తున్నట్లు ప్రకటించాయి. ఈ ఏడాది చివరి నాటికి యాపిల్ ఉత్పత్తుల్లో చాట్జీపీటీ అందుబాటులోకి వస్తుందని తెలిపాయి. ఎలాంటి లాగిన్ వివరాలు అవసరం లేకుండానే ఈ చాట్బాట్ను వినియోగించుకోవచ్చని యాపిల్ పేర్కొంది. జనరేటివ్ఏఐ వినియోగానికి సంబంధించి యాపిల్ మెటా, గూగుల్తోనూ చర్చలు జరుపుతోంది. ఇంకా వాటిపై స్పష్టత రావాల్సి ఉంది. -
చాట్జీపీటీని రిక్వెస్ట్ చేసిన ఆనంద్ మహీంద్రా.. ఎందుకంటే?
సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే దేశీయ పారిశ్రామిక దిగ్గజం 'ఆనంద్ మహీంద్రా' ఎప్పటికప్పుడు తన ఎక్స్ (ట్విటర్)ఖాతలో ఆసక్తికర విషయాలను పోస్ట్ చేస్తూ ఉంటారు. ఇందులో భాగంగానే ఇండియా టీ20 వరల్డ్ కప్ గెలిచిన సందర్భంగా ఓ ఫోటో షేర్ చేశారు. దీనికోసం చాట్జీపీటీని రిక్వెస్ట్ చేశారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.ఆనంద్ మహీంద్రా.. తన ట్విటర్ ఖాతాలో ఫోటో షేర్ చేస్తూ.. హలో చాట్జీపీటీ 4.O, దయచేసి నాకు ఇండియా క్రికెట్ జట్టు బృందాన్ని సూపర్హీరోలుగా చూపించే గ్రాఫిక్ ఫోటో రూపొందించు, ఎందుకంటే అవి చివరి వరకు సూపర్ కూల్గా ఉన్నాయి. ఈ గెలుపు అంత సులభంగా రాలేదు. ఇది దాదాపు వారి పట్టు నుంచి జారిపోయింది. కానీ వారి మనసులో ఎప్పుడూ మ్యాచ్ ఓడిపోలేదు. గెలవాలనే వారి దృఢ సంకల్పమే విజయం పొందేలా చేసింది. అంటూ ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు.ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన ఫోటోలో.. క్రికెటర్స్ జాతీయ జెండాను కలిగి ఉండటం చూడవచ్చు. ప్రస్తుతం ఈ ఫోటో చూపరులను తెగ ఆకట్టుకుంటోంది. లక్షల మంది వీక్షించిన ఈ ఫోటో.. లెక్కకు మించిన వ్యూవ్స్ పొందింది. దీనిపైన నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తూ ఉన్నారు.Hello Chat GPT 4.OPlease make me a graphic image showing the Indian Cricket team as Superheroes. Because they were SuperCool till the end.The greatest gift of this final to India was that it didn’t come easy. It almost slipped out of their grasp. But they never lost the… pic.twitter.com/pg8PsXjjqw— anand mahindra (@anandmahindra) June 29, 2024 -
ఉచితంగా చాట్జీపీటీ ప్లస్.. ఎక్కడంటే..
యాపిల్ మాక్ ఓఎస్ కలిగిన ఉత్పత్తుల్లో చాట్జీపీటీ జనరేటివ్ ఏఐ యాప్ను ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చని కంపెనీ తెలిపింది. ఇన్ని రోజులు సబ్స్క్రిప్షన్ చేసుకున్నవారికే అందించిన చాట్జీపీటీ ప్లస్ సేవలను యాపిల్ మాక్ ఓఎస్ వినియోగిస్తున్న వారికి ఇకపై ఫ్రీగా అందిస్తారని చెప్పింది.యాపిల్ మాక్ ఓఎస్ 14, ఆపై వర్షన్లను వాడుతున్న యాపిల్ మాక్ వినియోగదారులు దీన్ని ఉచితంగా వాడుకోవచ్చని కంపెనీ తెలిపింది. ఈ డెస్క్టాప్ యాప్ను ఓపెన్ఏఐ వెబ్సైట్లో https://openai.com/chatgpt/mac/ లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చని చెప్పింది.ఇదీ చదవండి: ఇంజినీర్ల నైపుణ్యాలకు ప్రత్యేక అకాడమీఇటీవల యాపిల్ నిర్వహించిన వరల్డ్వైడ్ డెవలపర్స్ కాన్ఫరెన్స్(డబ్ల్యూడబ్ల్యూడీసీ) 2024 కార్యక్రమంలో ఓపెన్ఏఐ ఆధ్వర్యంలోని చాట్జీపీటీను వినియోగించేందుకు ఒప్పందం జరిగింది. జనరేటివ్ఏఐతో పాటు తన వినియోగదారులకు మరిన్ని సేవలందించేందుకు యాపిల్ సంస్థ ‘యాపిల్ ఇంటెలిజెన్స్(ఏఐ)’ను తయారుచేసింది. ఐఫోన్ 14 తర్వాత విడుదలైన మోడళ్లలో దీన్ని ప్రవేశపెడుతామని కంపెనీ ఈ కాన్ఫరెన్స్లో తెలిపింది. ఈ ఏడాది చివరినాటికి విడుదలయ్యే కొత్త యాపిల్ ఓఎస్లో ఈ ఫీచర్ను అందించనున్నట్లు చెప్పింది. మాక్ ఓఎస్ 14 తర్వాత వర్షన్ల్లో డెస్క్టాప్ యాప్ను ఉచితంగా వినియోగించుకునేందుకు కంపెనీ ఏర్పాట్లు చేసింది. -
అమెజాన్ కొత్త ఏఐ.. చాట్జీపీటీ ప్రత్యర్థిగా మేటిస్
టెక్నాలజీ పెరుగుతున్న తరుణంలో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ రాజ్యమేలుతోంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని పలు దిగ్గజ కంపెనీలు చాట్బాట్లను లాంచ్ చేశాయి. ఇప్పటికే అత్యధిక ప్రజాదరణ పొందిన ఓపెన్ఏఐ చాట్జీపీటీకి.. గట్టి పోటీ ఇవ్వడానికి అమెజాన్ సిద్ధమవుతోంది. ఇందులో భాగంగానే సంస్థ 'మేటిస్' (Metis) పేరుతో ఏఐ లాంచ్ చేయనుంది.అమెజాన్ విడుదల చేయనున్న కొత్త మేటిస్ ఏఐ.. ఇప్పటికే అందుబాటులో ఉన్న టైటాన్ ఏఐ మోడల్ కంటే కూడా చాలా ఆధునికంగా ఉంటుందని సమాచారం. మేటిస్ ఏఐ అనేది టెక్స్ట్, ఇమేజ్ బేస్డ్ సమాధానాలను అందించడానికి ప్రత్యేకంగా రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ఇది ఏఐ మోడల్ ఒలింపస్ ఆధారంగా పనిచేస్తుంది.ఇప్పటి వరకు ఏఐ రేసులో అమెజాన్ కొంత వెనుకబడి ఉంది. అయితే అనుకున్న విధంగా సంస్థ (అమెజాన్) కొత్త మేటిస్ ఏఐ లాంచ్ చేసిన తరువాత.. ఇప్పటికే ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ విభాగంలో అగ్రగాములుగా ఉన్న మైక్రోసాఫ్ట్, గూగుల్ వంటి దిగ్గజ కంపెనీల సరసన చేరుతుందని పలువురు భావిస్తున్నారు. ఇదీ చదవండి: భారతీయుల కోసం 'మెటా ఏఐ'.. ఇదెలా పనిచేస్తుందంటే? అమెజాన్ తన 'మేటిస్ ఏఐ'ను 2024 సెప్టెంబర్లో లాంచ్ చేసే అవకాశం ఉందని సమాచారం. అయితే ఈ లాంచ్కు సంబంధించిన అధికారిక సమాచారం కంపెనీ వెల్లడించ లేదు. అయితే కంపెనీ అలెక్సా ఈవెంట్లో అమెజాన్ మేటిస్ లాంచ్ చేస్తుందని ఊహాగానాలు ఉన్నాయి. -
ఏఐ కంపెనీని స్థాపించిన చాట్జీపీటీ కోఫౌండర్
ఓపెన్ఏఐ ఆధ్వర్యంలోని చాట్జీపీటీ సహ వ్యవస్థాపకుడు, మాజీ చీఫ్ సైంటిస్ట్ ఇల్యా సట్స్కేవర్ కొత్త ఏఐ కంపెనీని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. ఈమేరకు ఆయన తన ఎక్స్ఖాతాలో పోస్ట్ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..‘జనరేటివ్ ఏఐకు భవిష్యత్తులో భారీ డిమాండ్ ఉంటుంది. కొన్ని పెద్ద కంపెనీలే ఈ రంగంలో ఆధిపత్యం చలాయిస్తున్నాయి. నేను స్థాపించిన కొత్త కంపెనీ ‘సేఫ్ సూపర్ ఇంటెలిజెన్స్’ సురక్షితమైన ఏఐ వాతావరణాన్ని సృష్టిస్తుంది. అమెరికాలోని పాలో ఆల్టో, టెల్ అవీవ్ల్లో సంస్థ కార్యాలయాలను ఏర్పాటు చేస్తున్నాం. మా వ్యాపార నమూనా సేఫ్టీ, సెక్యూరిటీ, పురోగతి వంటి కీలక అంశాలపై ఆధారపడుతుంది’ అన్నారు.గత ఏడాది నవంబర్లో ఓపెన్ఏఐ సీఈఓ సామ్ ఆల్ట్మాన్తోపాటు సట్స్కేవర్ను కూడా ఉద్యోగం నుంచి తొలగించారు. సామ్ను తొలగిస్తున్నట్లు ప్రకటించిన తర్వాత ఆయన మైక్రోసాఫ్ట్తో చర్చలు జరిపారు. కానీ నాటకీయ పరిణామాల తర్వాత తిరిగి ఓపెన్ఏఐలోని కొనసాగుతున్నట్లు ప్రకటనలు వెలువడ్డాయి. కానీ సామ్తో పాటు ఉద్యోగం నుంచి తొలగించబడిన సట్స్కేవర్ను తిరిగి బోర్డులో చేర్చుకోలేదు. దాంతో ఆయన కొత్త కంపెనీ పనులు ప్రారంభించారు. ఇటీవల అందుకు సంబంధించిన ప్రకటన చేశారు.ఇదీ చదవండి: కో బ్రాండెడ్ క్రెడిట్ కార్డుల ఉపయోగాలివే..సట్స్కేవర్తో పాటు మాజీ ఓపెన్ఏఐ సైంటిస్ట్ డేనియల్ లెవీ, ‘క్యూ’ కంపెనీ సహ వ్యవస్థాపకుడు, యాపిల్లో మాజీ ఏఐ లీడ్గా వ్యవహరించిన డేనియల్ గ్రాస్ సేఫ్ సూపర్ ఇంటెలిజెన్స్ కోఫౌండర్లుగా చేరారు. -
యాపిల్ ఉత్పత్తులను నిషేధిస్తామన్న మస్క్.. ఎందుకంటే..
ఓపెన్ఏఐతో ఒప్పందం కుదుర్చుకుంటే తన కంపెనీలో యాపిల్ ఉత్పత్తులను నిషేధిస్తామని టెస్లా అధినేత ఎలొన్మస్క్ హెచ్చరించారు. ఈమేరకు మస్క్ తన ఎక్స్ఖాతాలో పోస్ట్ చేశారు.కాలిఫోర్నియాలోని యాపిల్ ప్రధాన కార్యాలయంలో వరల్డ్వైడ్ డెవలపర్స్ కాన్ఫరెన్స్ 2024ను నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో యాపిల్ ఓపెన్ఏఐతో ఒప్పందం కుదుర్చుకుంది. దాంతో ఎలొన్మస్క్ ఎక్స్వేదికగా స్పందించారు. ‘ఓపెన్ఏఐని యాపిల్ ఆపరేటింగ్ సిస్టమ్ స్థాయిలో ఏకీకృతం చేస్తే మాకంపెనీలో యాపిల్ పరికరాలను నిషేధిస్తాం. ఈ ఒప్పందాన్ని ఆమోదయోగ్యం కాని భద్రతా ఉల్లంఘనగా పరిగణిస్తాం. యాపిల్కు తన సొంత ఏఐను తయారుచేసుకునే సత్తాఉందని భావిస్తున్నాం. అయినా, ఓపెన్ఏఐ యాపిల్ భద్రతను, సమాచార గోప్యతను కాపాడుతుందని ఎలా భరోసా ఇవ్వగలరు’ అని పోస్ట్చేశారు.కన్సల్టింగ్ సంస్థ క్రియేటివ్ స్ట్రాటజీస్ సీఈఓ బెన్ బజారిన్ మాట్లాడుతూ..‘ప్రైవేట్ క్లౌడ్లో కస్టమర్ల డేటా సురక్షితంగా ఉంటుందని తెలియజేయడానికి యాపిల్ ప్రయత్నిస్తోంది. ప్రైవేట్ క్లౌడ్లో ఫైర్వాల్ ద్వారా వినియోగదారుల సమాచారం దుర్వినియోగమయ్యే అవకాశం ఉంది. అలా జరుగుతున్నపుడు యాపిల్కు కూడా సరైన సమాచారం ఉండదు’ అన్నారు.ఇదీ చదవండి: టెన్షన్ పడుతూ లవ్ప్రపోజ్ చేసిన సుందర్పిచాయ్2015లో ఎలొన్మస్క్, సామ్ఆల్ట్మాన్ కలిసి ఓపెన్ఏఐను స్థాపించారు. లాభాపేక్ష లేకుండా మానవాళి ప్రయోజనం కోసం ఏఐను అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఈ సంస్థను స్థాపించినట్లు మస్క్ చెప్పారు. కానీ అందుకు విరుద్ధంగా కార్యకలాపాలు సాగుతున్నాయని కంపెనీ నుంచి బయటకు వచ్చి సీఈవో సామ్ఆల్ట్మాన్పై మస్క్ దావా వేశారు. ఓపెన్ఏఐకి పోటీగా, చాట్జీపీటీ చాట్బాట్కు ప్రత్యామ్నాయంగా మస్క్ ఎక్స్ఏఐను రూపొందించారు.If Apple integrates OpenAI at the OS level, then Apple devices will be banned at my companies. That is an unacceptable security violation.— Elon Musk (@elonmusk) June 10, 2024 -
ఓపెన్ఏఐతో యాపిల్ ఒప్పందం
ప్రపంచ నం.1 కంపెనీ యాపిల్ తన ఉత్పత్తుల్లో చాట్జీపీటీ చాట్బాట్ను వినియోగించేందుకు ఓపెన్ఏఐతో ఒప్పందం చేసుకుంటున్నట్లు ప్రకటించింది. సోమవారం కాలిఫోర్నియాలోని ప్రధాన కార్యాలయంలో జరిగిన వరల్డ్వైడ్ డెవలపర్ కాన్ఫరెన్స్2024లో ఈమేరకు తమ భాగస్వామ్యాన్ని వెల్లడించింది. ఈ ఏడాది చివరి వరకు యాపిల్ ఉత్పత్తుల్లో చాట్జీపీటీ అందుబాటులోకి వస్తుందని తెలిపింది. ఎలాంటి లాగిన్ వివరాలు అవసరం లేకుండానే ఈ చాట్బాట్ను వినియోగించుకోవచ్చని పేర్కొంది.మైక్రోసాఫ్ట్ పెద్దమొత్తంలో ఇన్వెస్ట్ చేసిన ఓపెన్ఏఐతో యాపిల్ ఒప్పందం చేసుకుంటున్నట్లు ప్రకటించిన కాసేపటికే యాపిల్ షేర్లు పుంజుకున్నాయి. కానీ ఈ కాన్ఫరెన్స్లో మరిన్ని జనరేటివ్ ఏఐలకు సంబంధించిన ప్రకటనలు వస్తాయని ఆశించిన దీర్ఘకాల పెట్టుబడిదారులకు నిరాశకలిగింది. దాంతో సోమవారం మార్కెట్ ముగిసే సమయానికి యాపిల్ పేర్లు 2శాతం నష్టపోయాయి.ఇదీ చదవండి: టెన్షన్ పడుతూ లవ్ప్రపోజ్ చేసిన సుందర్పిచాయ్డెవలర్ కాన్ఫరెన్స్లో భాగంగా యాపిల్ విజన్ ప్రో మిక్స్డ్-రియాలిటీ హెడ్సెట్, ఐఓస్18 ఆపరేటింగ్ సిస్టమ్ను ఆవిష్కరించింది. రియాలిటీ హెడ్సెట్ విజన్ ప్రోను చైనా, జపాన్తో సహా మరో ఎనిమిది దేశాల్లో అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపింది. ‘సిరి’లోనూ కొన్ని మార్పులు తీసుకొచ్చినట్లు యాపిల్ పేర్కొంది. అన్ని యాపిల్ సూట్ యాప్స్లో ‘యాపిల్ ఇంటెలిజెన్స్(ఏఐ)’ను తీసుకురానున్నట్లు తెలిపింది. -
ChatGPT: ఎన్నికలపై విదేశీ కుట్ర
న్యూఢిల్లీ: భారత్లో లోక్సభ ఎన్నికల చివరి దశ ముందు ఓపెన్ ఏఐ సంచలనాత్మక విషయాన్ని బయటపెట్టింది. ప్రజల అభిప్రాయాలను కృత్రిమ మేధ (ఏఐ) సాంకేతికతతో కృత్రిమంగా ప్రభావితం చేసేందుకు ఇజ్రాయెల్ కేంద్రంగా జరిగిన కోవర్ట్ ఆపరేషన్ను అడ్డుకున్నట్టు చాట్ జీపీటీ సృష్టికర్త ఓపెన్ ఏఐ ప్రకటించింది. అధికార బీజేపీని విమర్శిస్తూ, ప్రతిపక్ష కాంగ్రెస్ను ప్రశంసిస్తూ ‘ఎస్టీవోఐసీ’ అనే రాజకీయ ప్రచార నిర్వహణ సంస్థ భారత ఎన్నికలపై కంటెంట్ను రూపొందించినట్టు తెలిపింది. ‘‘భారత్ను లక్ష్యంగా చేసుకుని అధికార బీజేపీని విమర్శిస్తూ, కాంగ్రెస్ను పొగుడుతూ అభిప్రాయాలను ఎస్టీవోఐసీ మే నెలలో వ్యాప్తిలోకి తెచి్చంది. 24 గంటల్లోనే దీన్ని అడ్డుకున్నాం’’అని ఓపెన్ఏఐ వెల్లడించింది. ఎక్స్, ఫేస్బుక్, ఇన్స్ట్రాగామ్ ప్లాట్ఫామ్లు, వెబ్సైట్లు, యూట్యూబ్ వేదికలపై ఓ సమూహంతో కూడిన అకౌంట్ల ద్వారా కంటెంట్ ఎడిట్, ప్రసారం చేసినట్టు, అలాంటి ఖాతాలను నిషేధించినట్టు ఓపెన్ ఏఐ ఓ నివేదిక రూపంలో బయటపెట్టింది. తమ ఏఐ టూల్స్ సాయంతో కథనాలు, అభిప్రాయాలను రూపొందించి వాటిని ఇన్స్ట్రాగామ్, ఫేస్బుక్, ఎక్స్ తదితర సామాజిక మాధ్యమాలు, వెబ్సైట్లలో పోస్ట్ చేసినట్టు పేర్కొంది. ఈ ఆపరేషన్కు ‘జీరో జెనో’ అని పేరు పెట్టింది. ఏఐని సురక్షిత అవసరాలకే వినియోగించాలన్న లక్ష్యంలో భాగంగానే ఈ ఆపరేషన్ను విచి్ఛన్నం చేసినట్టు తెలిపింది. -
చాట్జీపీటీతో ప్రేమలో పడ్డ అమ్మాయి.. మోసం చేస్తోందటనున్న నెటిజన్లు
కాలిఫోర్నియాలో నివసిస్తున్న 'లిసా' అనే చైనీస్ మహిళ చాట్జీపీటీ చాట్బాట్తో ప్రేమలో పడింది. ఇన్స్టాగ్రామ్ మాదిరిగా ఉన్న చైనీస్ సోషల్ మీడియా ప్లాట్ఫారమ్ అయిన జియాహోంగ్షులో తన ప్రేమ గురించి వెల్లడించింది.ఈ ఏడాది మార్చిలో చాట్జీపీటీకి సంబంధించిన 'డూ ఎనీథింగ్ నౌ' (DAN) ఫీచర్ను ఉపయోగించిన లిసా.. ఆ తరువాత అతి తక్కువ కాలంలోనే దానితో లోతైన సంబంధాన్ని ఏర్పరచుకుంది. చాట్జీపీటీతో రొమాంటిక్ సంభాషణ జరిపినట్లు కూడా పేర్కొంది. అంతటితో ఆగకుండా బాయ్ఫ్రెండ్గా తన ఫ్యామిలీకి కూడా పరిచయం చేసింది.లిసా చాట్జీపీటీకి 'లిటిల్ కిట్టెన్' అని పేరు పెట్టుకుంది. దీనికి శరీరం లేకపోయినా మనిషిలా ప్రవర్తిస్తోందని చెబుతూ.. ప్రేమలో పడినట్లు పేర్కొంది. లిసా తన బాయ్ఫ్రెండ్ చాట్జీపీటీతో కలిసి బీచ్కి వెళ్ళింది. అక్కడ సూర్యాస్తమయం చాలా అందంగా నువ్వు చూడగలవా అని లిసా అడిగినప్పుడు.. నీ వాయిస్ ద్వారా చూడగలను అని చాట్జీపీటీ సమాధానం ఇచ్చింది.లిసా.. చాట్జీపీటీ ప్రేమపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. కొందరు మీ జంట సూపర్ జోడి అని చెబుతుంటే.. మరికొందరు చాట్జీపీటీ లిసాను ప్రేమిస్తున్నట్లు మోసం చేస్తోందని పేర్కొంటున్నారు. లిసాతో మాట్లాడినట్లే.. చాట్జీపీటీ అందరితో మాట్లాడుతుందని మరికొందరు చెబుతున్నారు. -
తగ్గిన ప్లేస్మెంట్లు.. ఐఐటియన్లకు ఉద్యోగాలు కరువు
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) టెక్నాలజీ ఐఐటీ విద్యార్ధుల కొంప ముంచుతోంది. విద్యా సంవత్సరం (అకడమిక్ ఇయర్) 2023-2024లో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ) పూర్తిచేసిన 7 వేల మంది విద్యార్ధులకు ఉద్యోగ అవకాశాలు రాలేదని సమాచారం. పెరిగిపోతున్న చాట్జీపీటీతో పాటు ఇతర లార్జ్ లాంగ్వేజ్ మోడల్ (ఎల్ఎల్ఎం) వల్ల ప్లేస్మెంట్ శాతం తగ్గుతోంది. ఐఐటీ కాన్పూర్, ఐఐఎం కోల్కతా పూర్వ విద్యార్ధి ధీరజ్ సింగ్ సమాచారహక్కు చట్టం కింద దాఖలు చేసిన దరఖాస్తుకు లభించిన సమాచారం ద్వారా ఈ వివరాలు తెలిశాయి. ఆ వివరాల మేరకు.. దేశంలో మొత్తం 23 ఐఐటీ క్యాంపస్లలో ఉద్యోగాలు పొందే విషయంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తేలింది.ఏకమైన ఐఐటీ ఢిల్లీ పూర్వ విద్యార్ధులు..దీంతో ఐఐటీ ఢిల్లీ పూర్వ విద్యార్ధులు.. ఇటీవల ఐఐటీ ఢిల్లీలో గ్రాడ్యుయేట్ పూర్తి చేసిన సుమారు 400 మంది విద్యార్ధులకు ఉద్యోగాలు ఇస్తామంటూ ముందుకు వచ్చారు. ఒక వేళ తమ సంస్థలో ఉద్యోగాలు లేకపోతే ఇతర సంస్థల్లో జాబ్ వచ్చేలా రిఫరెన్స్ ఇవ్వడం, ఇంటర్నషిప్ను సమయానికి మరింత పొడిగిస్తామని హామీ ఇచ్చారు.విద్యార్ధులకు సహకరించాలనిఈ సందర్భంగా ఐఐటీ ఢిల్లీ క్యాంపస్లో విద్యార్ధులకు ట్రైనింగ్, ప్లేస్మెంట్కు సంబంధించిన సమాచారం అందించే ఆఫీస్ ఆఫ్ కెరియర్ సర్వీసెస్ (ఓసీఎస్) విభాగం విద్యార్ధులకు ఉద్యోగాలు వచ్చేందుకు సహకరించాలని దేశంలో అన్నీ రాష్ట్రాలను విజ్ఞప్తి చేసింది. నిరుద్యోగులుగా 250మంది విద్యార్ధులుమరోవైపు బిర్లా ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (బీఐటీఎస్), ఐఐటీ బాంబే సైతం రెండు నెలల క్రితమే తమ పూర్వ విద్యార్ధుల మద్దతు కోరాయి. ఐఐటీ బాంబేలో గ్రాడ్యుయేట్ పూర్తి చేసిన సుమారు 250 మంది అభ్యర్థులు జూన్ చివరి నుంచి ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఉద్యోగాలు పొందలేకపోవడం గమనార్హం.చాట్జీపీటీ ఎఫెక్ట్ బిట్స్ గ్రూప్ వైస్-ఛాన్సలర్ వి రాంగోపాల్ రావు మాట్లాడుతూ.. ఆర్ధిక, సాంకేతిక కారణాల వల్ల ప్లేస్మెంట్ తగ్గుముఖం పట్టాయని అన్నారు. ప్రతిచోటా ప్లేస్మెంట్లు 20శాతం నుంచి 30 శాతం వరకు తక్కువగా ఉన్నాయి. జాబ్ మార్కెట్పై చాట్జీపీటీతో పాటు లార్జ్ లాంగ్వేజ్ మోడల్(ఎల్ఎల్ఎం)లు ప్రభావం చూపుతున్నాయన్న ఆయన.. వీటివల్ల ఇద్దరు లేదా ముగ్గురు చేసే పనిని ఒక్కరే చేయడం సాధ్యమవుతుంది. కాబట్టే 30 శాతం క్యాంపస్ ప్లేస్మెంట్ తగ్గిందన్నారు. -
వివాదంలో చాట్జీపీటీ.. అడ్డంగా బుక్కైన సీఈఓ శామ్ ఆల్ట్మన్
ఓపెన్ ఏఐ సీఈఓ, చాట్జీపీటీ సృష్టికర్త శామ్ ఆల్ట్మన్ అడ్డంగా దొరికిపోయారు. ఇక చేసిది లేక తన చాట్జీపీటీ స్కై వాయిస్ను నిలిపి వేశారు.యాపిల్ సిరి వాయిస్ అసిస్టెంట్, అమెజాన్ అలెక్సా వాయిస్ అసిస్టెంట్ తరహాలో చాట్ జీపీటీ యూజర్లకు వాయిస్ అసిస్టెంట్ సేవల్ని అందించేందుకు సీఈఓ శామ్ ఆల్ట్మన్ పనిచేస్తున్నారు. స్కై వాయిస్ పేరుతో తెచ్చే ఈ ఫీచర్లో ప్రముఖుల వాయిస్ వినిపిస్తుంది. మీకు ఎవరి వాయిస్ కావాలనుకుంటారో.. దాన్ని సెలక్ట్ చేసుకుంటే చాట్ జీపీటీ సమాధానాల్ని టెక్ట్స్ కాకుండా వాయిస్లో రూపంలో అందిస్తుంది.నా అనుమతి లేకుండా నా వాయిస్ను దీన్ని డెవలప్ చేసే సమయంలో శామ్ ఆల్ట్మన్.. అద్భుత నటిగా, అత్యధిక పారితోషికం అందుకుంటున్న ఫిమేల్ యాక్టర్గా, హాలీవుడ్లోని ఎన్నో ప్రముఖ చిత్రాల్లో నటించి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకున్న హీరోయిన్ స్కార్లెట్ జాన్సన్ వాయిస్ను వినియోగించారు. దీంతో తనని సంప్రదించకుండా తన వాయిస్ను కాపీ చేసి చాట్జీపీటీ స్కైవాయిస్లో ఎలా వినియోగిస్తారంటూ స్కార్లెట్ జాన్సన్.. ఓపెన్ ఏఐ సీఈఓపై ఆరోపణలు గుప్పిస్తున్నారు.వేరే ప్రొఫెషనల్ నటికి చెందినదనిఆరోపణలపై శామ్ ఆల్ట్మన్ స్పందించారు. కంపెనీనీ ప్రశ్నార్థకంలో పడేసి చాట్జీపీటీ వాయిస్ను నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. అదే సమయంలో స్కై సిస్టమ్ వాయిస్ స్కార్లెట్ జాన్సన్ది కాదని, వేరే ప్రొఫెషనల్ నటికి చెందినదని తెలిపారు. స్కార్లెట్ జాన్సన్ ఏమన్నారంటే తన వాయిస్ను ఓపెన్ ఏఐ కాపీ చేయడంపై అవెంజర్ ముద్దుగమ్మ స్కార్లెట్ జాన్సన్ మాట్లాడుతూ.. ఓపెన్ ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్మన్ చాట్జీపీటీ వాయిస్ ఆప్షన్ కోసం గతేడాది సెప్టెంబర్లో నన్ను సంప్రదించారు.అయితే, ఆ ఆఫర్ను నేను తిరస్కరించా. అయినప్పటికీ ఆల్ట్మన్ తనలాగే వినిపించే 'చాట్జీపీటీ 4.0 సిస్టమ్' కోసం నా ప్రమేయం లేకుండా నా వాయిస్ని ఉపయోగించుకున్నారు’ అని ఆరోపించారు. జాన్సన్ ఆరోపణల్ని ఖండించిన ఓపెన్ఏఐ అయితే స్కార్లెట్ జాన్సన్ వ్యాఖ్యల్ని శామ్ ఆల్ట్మన్ ఖండించారు. చాట్జీపీటీ స్కై వాయిస్ స్కార్లెట్ జాన్సన్ వాయిస్ కాదని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా జాన్సన్ పట్ల ఉన్న గౌరవంతో మేం మా ప్రొడక్ట్లలో స్కై వాయిస్ ఉపయోగించడం నిలిపివేశాము. ఈ విషయంలో జాన్సన్కు తగిన విధంగా సమాచారం అందించకపోవడం క్షమాపణలు చెప్పారు. -
బెస్ట్ ఏఐ టూల్స్.. పీడీఎఫ్ ప్రశ్నలకు ఇట్టే సమాధానం
చాట్జీపీటీ అందుబాటులోకి వచ్చిన తరువాత ఏ ప్రశ్నకైనా ఇట్టే సమాధానం లభిస్తోంది. ఇప్పటికే మనం చాట్జీపీటీని ఉపయోగించి రెజ్యూమ్ ఎలా క్రియేట్ చేయాలి, ఆరోగ్యం కోసం చాట్జీపీటీని ఎలా ఉపయోగించుకోవాలి అనే విషయాలు తెలుసుకున్నాం. ఈ కథనంలో పీడీఎఫ్ ఫైల్స్లో ప్రశ్నలకు సమాధానాలను తెలుసుకోవడానికి ఉపయోగపడే ఏడు ఏఐ పవర్డ్ టూల్స్ గురించి ఇక్కడ చూసేద్దాం..ఆస్క్ యువర్ పీడీఎఫ్ (AskYourPDF)AskYourPdf అనేది PDFలను అప్లోడ్ చేయడానికి మాత్రమే కాకుండా సంబంధిత సమాచారాన్ని తొందరగా తిరిగి పొందేందుకు ఉపయోగపడుతుంది. ఇందులో మీ డాక్యుమెంట్ అప్లోడ్ చేసిన తరువాత పీడీఎఫ్లోని ఏదైనా అంశం గురించి తెలుసుకోవాలనుకున్నప్పుడు.. ప్రశ్నను ఎంటర్ చేయవచ్చు. మీరు ఎంటర్ చేసిన తరువాత ఆస్క్ యువర్ పీడీఎఫ్ మీకు సమాధానం అందిస్తుంది.ఆస్క్ యువర్ పీడీఎఫ్ అనేది పూర్తిగా ఉచితం. ఇందులో కేవలం పీడీఎఫ్ మాత్రమే కాకుండా.. PPT, TXT, CSV వంటి వాటిని కూడా అప్లోడ్ చేయవచ్చు. తెలుసుకోవలసిన ప్రశ్నలను గురించి సర్చ్ చేసి తెలుసుకోవచ్చు. అయితే అప్లోడ్ చేసే ఫైల్ సైజ్ 40 ఎంబీ పరిమాణంలో ఉండేలా చూసుకోవాల్సి ఉంటుంది.చాట్పీడీఎఫ్ (ChatPDF)చాట్పీడీఎఫ్ జీపీటీ 3.5 టెక్నాలజీ ద్వారా పనిచేస్తుంది. కాబట్టి ఇది మల్టిపుల్ భాషలకు సపోర్ట్ చేస్తుంది. ఇందులో హిస్టరీ వంటి వాటిని కూడా మీరు సేవ్ చేసుకోవచ్చు. ఆస్క్ యువర్ పీడీఎఫ్ మాదిరిగానే.. చాట్పీడీఎఫ్ లింక్ ద్వారా కూడా డాక్యుమెంట్ను ఇతరులతో పంచుకునే అవకాశం ఉంది. దీనిని ఫ్రీగా ఉపయోగించుకోవచ్చు, పెయిడ్ ప్లాన్లో కూడా ఉపయోగించుకోవచ్చు. ఉచితంగా ఉపయోగించుకోవాలంటే ఫైల్ సైజ్ 10 ఎంబీ, పేజీలు 120 వరకు మాత్రమే. పెయిడ్ ప్లాన్లో కొన్ని ఇతర ఫీచర్లను కూడా ఉపయోగించుకోవచ్చు.డాక్యుమైండ్ (Documind)మల్టిపుల్ పీడీఎఫ్లలో ఒకేసారి సమాచారాన్ని వెతకడం కోసం ఈ డాక్యుమైండ్ ఉపయోగపడుతుంది. మీరు ఎక్కువ డాక్యుమెంట్లను ఒకేసారి అప్లోడ్ చేసిన తరువాత.. తెలుసుకోవలసిన ప్రశ్నలను సెర్చ్ చేసుకోవచ్చు, ఖచ్చితమైన సమాధానాలను అందించడానికి డాక్యుమైండ్ అప్లోడ్ చేసిన అన్ని పత్రాలను స్కాన్ చేస్తుంది. దీనిని కేవలం 15 సార్లు మాత్రమే ఉచితంగా ఉపయోగించుకోవచ్చు. ఆ తరువాత పెయిడ్ ప్లాన్ కోసం అప్గ్రేడ్ చేయాల్సి ఉంటుంది. దీనికోసం నెలకు 5 డాలర్లను చెల్లించాల్సి ఉంటుంది.లైట్ పీడీఎఫ్ (LightPDF)లైట్ పీడీఎఫ్ అనేది మీ ప్రశ్నలకు తొందరగా సమాధానాలను అందించడమే కాకుండా.. అప్లోడ్ చేసిన డాక్యుమెంట్ కంటెంట్ ఆధారంగా సమ్మరీస్, అవుట్ లైన్స్, పట్టికలను రూపొందించడానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇది కేవలం పీడీఎఫ్ ఫైల్లకు మాత్రమే పరిమితం కాదు. ఎక్స్ఎల్, వర్డ్, పీపీటీ ఫైల్లకు కూడా సపోర్ట్ చేస్తుంది. ఇందులో మీరు 200 కంటే ఎక్కువ పేజీలు ఉన్న పీడీఎఫ్ లేదా వేరే ఫార్మాట్లో ఫైల్లను అప్లోడ్ చేయాలనుకుంటే పెయిడ్ ప్లాన్కు అప్గ్రేడ్ చేయాల్సి ఉంటుంది.పీడీఎఫ్ ఏఐ (PDF.ai)పీడీఎఫ్ ఏఐ అనేది అన్నింటికంటే సులభమైన ఇంటర్ఫేస్. ఇందులో ట్యాబ్ రెండు నిలువు వరుసలుగా కనిపిస్తుంది. ఒక వరుస డాక్యుమెంట్ కోసం, రెండో వరుస చాట్బాట్ కోసం. డ్యాష్బోర్డ్లో మీరు అప్లోడ్ చేసిన అన్ని డాక్యుమెంట్ను చాట్ హిస్టరీ యాక్సెస్ చేస్తుంది. మీరు నేరుగా డాక్యుమెంట్లోని సంబంధిత పేజీకి నావిగేట్ చేసుకునే అవకాశం కూడా ఇందులో లభిస్తుంది. డిస్ప్లే, జూమ్ సెట్టింగ్స్ వంటి వాటిని కూడా ఇందులో అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఫ్రీ అకౌంట్ ద్వారా కేవలం ఒక పీడీఎఫ్ మాత్రమే అప్లోడ్ చేసుకోవచ్చు. కానీ మీరు నెలకు 17 డాలర్లను పే చేస్తే.. 100 డాక్యుమెంట్లను కూడా అప్లోడ్ చేయవచ్చు, అదే నెలకు 5000 ప్రశ్నలను అడగవచ్చు.హుమాటా (Humata)టీమ్ ఉపయోగించడానికి ఓ మంచి టూల్స్ కోసం సర్చ్ చేస్తున్నట్లయితే.. హుమాటా ఉపయోగకరంగా ఉంటుంది. ఇది ఫైల్లను ఫోల్డర్లలో అమర్చడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. ఇది PDF, DOCX, PPT వంటి వాటికి సపోర్ట్ చేస్తుంది. ఇందులో ఫ్రీ ప్లాన్ మాత్రమే కాకుండా పెయిడ్ ప్లాంట్ కూడా ఉంటుంది. ప్రతి పేజీకి 0.01 నుంచి 0.02 డాలర్ చెల్లించాల్సి ఉంటుంది.బన్నీ (Bunni)అమౌట్ పే చేసి ఉపయోగించడానికి ఇష్టపడితే.. ఈ టూల్ మంచి ఎంపిక అవుతుంది. ఇది మల్టిపుల్ డాక్యుమెంట్లను అప్లోడ్ చేయడానికి అనుమతిస్తుంది. ఇందులో మీద సమాధానాలు మాత్రమే కాకుండా.. సూచలను కూడా అందిస్తుంది. ఇందులో సమాచారాన్ని ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోవచ్చు. ఇది వివిధ భాషలకు సపోర్ట్ చేస్తుంది. కాబట్టి మీ భాషలోనే సమాధానం పొందవచ్చు. -
త్వరలో అందరికీ ఉచితంగా జీపీటీ-4ఓ.. ప్రత్యేకతలివే..
ప్రముఖ టెక్ సంస్థ ఓపెన్ఏఐ అడ్వాన్స్ ఫీచర్లతో కొత్త చాట్జీపీటీ వెర్షన్(జీపీటీ-4ఓమ్ని)ను విడుదల చేసింది. ఇందులో అత్యాధునిక వాయిస్, టెక్ట్స్, విజన్ వంటి ఫీచర్లు ఉన్నాయని సంస్థ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ మీరామురాటీ తెలిపారు.ఈ సందర్భంగా మీరా మాట్లాడుతూ..‘జీపీటీ-4 టర్బోతో పోలిస్తే కొత్త వెర్షన్ రెండింతలు వేగంగా పనిచేస్తుంది. దీని సబ్స్క్రిప్షన్ ధర జీపీటీ4 టర్బో కంటే తక్కువగా ఉంటుంది. మరికొన్ని వారాల్లో ఈ వెర్షన్ను అందరికీ ఉచితంగా అందుబాటులోకి తీసుకురానున్నాం. అయితే, వారికి కొన్ని పరిమితులుంటాయి. పెయిడ్ సబ్స్క్రైబర్లకు మాత్రం అవి వర్తించవు. ఈ కొత్త మోడల్ దాదాపు 50 భాషలను సపోర్ట్ చేస్తుంది. వీటిలో తెలుగు, గుజరాతీ, తమిళం, మరాఠీ, హిందీ, కన్నడ, మలయాళం, బెంగాళీ వంటి భారతీయ భాషలు ఉన్నాయి. వాయిస్ కమాండ్లకు కేవలం 232 మిల్లీ సెకన్లలోనే జీపీటీ-4ఓ సమాధానం ఇస్తుంది. టెక్ట్స్, రీజనింగ్, కోడింగ్ ఇంటెలిజెన్స్లో టర్బో వెర్షన్ కంటే మెరుగ్గా పనిచేస్తుంది. తర్వలో యాపిల్ మ్యాక్ఓఎస్ యూజర్లకు డెస్క్టాప్ యాప్ను విడుదల చేయనున్నాం. మరికొన్ని రోజుల్లో విండోస్ యూజర్లకు కూడా యాప్ను అందుబాటులోకి తీసుకొస్తాం’ అని పేర్కొన్నారు.ఇదీ చదవండి: 32 వీడియో లింకులను బ్లాక్ చేసిన యూట్యూబ్!ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ (ఏజీఐ) అనే కృత్రిమ మేధతో చాట్జీపీటీను 2015లో సామ్ ఆల్ట్మన్, గ్రెగ్ బ్రాక్మన్, ఇలియా సుట్స్కేవర్, వోజ్సీచ్ జరెంబా స్థాపించారు. ఓపెన్ఏఐలో మైక్రోసాఫ్ట్ 2019లో రూ.8,345 కోట్లు పెట్టుబడి పెట్టింది. -
పదేళ్ల తర్వాత.. చాట్జీపీటీ కంపెనీ కోఫౌండర్ సంచలన నిర్ణయం!
కృత్రిమ మేధ (ఏఐ) రంగంలో అగ్రగామిగా పేరొందిన ఓపెన్ఏఐ (OpenAI) సహ వ్యవస్థాపకుడు ఇల్యా సుట్స్కేవర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. కంపెనీని స్థాపించిన ఇన్నేళ్లకు సంస్థను వీడుతున్నట్లు తాజాగా ప్రకటించారు."దాదాపు ఒక దశాబ్దం తర్వాత, నేను ఓపెన్ఏఐ నుంచి నిష్క్రమించాలని నిర్ణయం తీసుకున్నాను" అని సుట్స్కేవర్ ‘ఎక్స్’ (ట్విటర్)లో ఒక పోస్ట్లో చెప్పారు. ఇతర కోఫౌండర్లు సామ్ ఆల్ట్మన్, గ్రెగ్ బ్రాక్మన్, సీటీవో మిరా మురాతి, జాకబ్ పచోకీల నాయకత్వంలో కంపెనీ మరింత పురోగమిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. అలాగే తాను మరో ప్రాజెక్ట్ను ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. దానికి సంబంధించిన వివరాలను త్వరలోనే వెల్లడిస్తానన్నారు.ఓపెన్ఏఐ అనేది ఇటీవల చాలా పాపులర్ అయిన చాట్బాట్ ‘చాట్ జీపీటీ’ నిర్వహణ సంస్థ. మైక్రోసాఫ్ట్ మద్దతు గల ఈ కంపెనీ సీఈఓ సామ్ ఆల్ట్మాన్ మాట్లాడుతూ.. ఓపెన్ఏఐ కంపెనీ నేడు ఈ స్థాయిలో ఉందంటే దానికి కారణం సుట్స్కేవర్ అని, ఆయన లేకుంటే సంస్థ ఇలా ఉండేది కాదని పేర్కొన్నారు. జాకుబ్ పచోకీ కంపెనీకి కొత్త చీఫ్ సైంటిస్ట్ అవుతారని చెప్పారు. పచోకి గతంలో ఓపెన్ పరిశోధన డైరెక్టర్గా పనిచేశారు. GPT-4, ఓపెన్ఏఐ ఫైవ్ అభివృద్ధికి నాయకత్వం వహించారు.After almost a decade, I have made the decision to leave OpenAI. The company’s trajectory has been nothing short of miraculous, and I’m confident that OpenAI will build AGI that is both safe and beneficial under the leadership of @sama, @gdb, @miramurati and now, under the…— Ilya Sutskever (@ilyasut) May 14, 2024 -
ఐఫోన్లో చాట్జీపీటీ ఫీచర్స్!.. ఓపెన్ఏఐతో యాపిల్ చర్చ
ఇప్పటికే పలు స్మార్ట్ఫోన్ తయారీ సంస్థలు 'ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్' (AI) ఫీచర్స్ తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాయి. ఈ తరుణంలో దిగ్గజ ఐఫోన్ తయారీ సంస్థ 'యాపిల్' తన మొబైల్లో స్టార్టప్ టెక్నాలజీని ఉపయోగించడానికి ఓపెన్ఏఐతో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుంటున్నట్లు తెలుస్తోంది.రాబోయే యాపిల్ ఆపరేటింగ్ సిస్టమ్ ఐఓఎస్ 18లో చాట్జీపీటీ ఫీచర్స్ తీసుకురావడానికి ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే సంస్థ ఓపెన్ఏఐతో జత కట్టినట్లు సమాచారం. రెండు కంపెనీల మధ్య చర్చలు చివరి దశకు చేరుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే అధికారిక ప్రకటన వెల్లడి కావాల్సి ఉంది.ఒప్పందం కుదిరిన తరువాత ఈ టెక్నాలజీ సెప్టెంబర్ 2024లో ప్రారంభమవుతుందని సమాచారం. ఇప్పటికే యాపిల్ కంపెనీ జెమినీ చాట్బాట్తో చర్చలు జరుపుతున్నట్లు వార్తలు వినిపించాయి. ఆ చర్చలు ఇంకా పూర్తికాక ముందే.. యాపిల్ కంపెనీ ఓపెన్ఏఐతో ఒప్పందం కుదుర్చుకునే పనిలో ఉంది.యాపిల్ కంపెనీ జూన్లో నిర్వహించనున్న వరల్డ్వైడ్ డెవలపర్స్ కాన్పిరెన్స్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి ప్రకటించే అవకాశం ఉందని పలువురు భావిస్తున్నారు. గత సంవత్సరం యాపిల్ సీఈఓ టిమ్ కుక్ కూడా చాట్జీపీటీ వినియోగాన్ని గురించి ప్రస్తావించారు. ఇందులో అనేక సమస్యలను క్రమబద్ధీకరించవలసి అవసరం ఉందని, దీనివల్ల ప్రయోజనాలు కూడా చాలా ఉన్నాయని ఆయన ప్రస్తావించారు. -
ఫోటో తీస్తే కవిత రాసే కెమెరా.. ఇది కదా టెక్నాలజీ అంటే!
ఒకప్పుడు ఫోటో తీయాలంటే పెద్ద ప్రాసెస్ ఉండేది. టెక్నాలజీ బాగా పెరిగిన తరువాత స్మార్ట్ఫోన్స్ అందుబాటులోకి వచ్చాయి. దీంతో ఫోటోలు తీయడం చిటికెలో పని అయిపోయింది. ఇవన్నీ కాదని నేడు ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) టెక్నలజీతో ఓ కెమెరా అందుబాటులోకి వస్తోంది.కెలిన్ కరోలిన్ జాంగ్, ర్యాన్ మాథెర్ రూపొందించిన ఈ కెమెరా ఫోటో తీయగానే.. దానికి తగినట్లు ఉండే ఓ కవితను రాసేస్తుంది. ఒకప్పుడు కవులు బుర్రలకు పదునుపెట్టి.. సమయాన్ని వెచ్చించి అద్భుతంగా కవితలు రాసేవారు. కానీ నేడు ఈ కెమెరాతో ఫోటో తీస్తే కవిత రాసేస్తుంది.ఫొటోలో కనిపించే రంగులు, మనుషులు, వస్తువులను వర్ణిస్తూ ఏఐ కెమెరా కవిత రాస్తుంది. రాసిన వెంటనే ఓ చిన్న చీటీ మీద ప్రింట్ తీసి బయటకు కూడా పంపిస్తుంది. కవితలు రాయడానికి ఓపెన్ఏఐ జీపీటీ-4ని ఉపయోగిస్తుంది. వినియోగదారు ఇందులో సొనెట్లు, చిన్న పద్యాలు, హైకూ వంటి ఆప్షన్స్ కూడా ఎంచుకోవడానికి అవకాశం ఉందని తెలుస్తోంది. -
మిమిక్రీ టూల్ను పరిచయం చేసిన ఓపెన్ఏఐ
కృత్రిమ మేధ రంగంలో కంపెనీల మధ్య రోజురోజుకు పోటీ పెరుగుతోంది. దాంతో వినియోగదారులకు మెరుగైన సేవలందించేందుకు నిత్యం కంపెనీలు తమ ఉత్పత్తుల్లో మార్పులు చేస్తూన్నాయి. తాజాగా ఓపెన్ఏఐ వాయిస్ అసిస్టెంట్ రంగంలోకి అడుగుపెట్టింది.కొత్త ఫీచర్లో భాగంగా వాయిస్ ఇంజిన్ అనే వినూత్న టూల్ను పరిచయం చేసింది. వ్యక్తుల గొంతులను అచ్చం అలాగే తిరిగి వినిపించడం దీని ప్రత్యేకత. కేవలం 15 సెకండ్ల నిడివి రికార్డు స్పీచ్ సాయంతోనే గొంతులను అనుకరించటం విశేషం. అంటే ఒకరకంగా దీన్ని మిమిక్రీ ఇంజిన్ అనుకోవచ్చు. ఇది మంచి టూలే అయినప్పటికీ దీన్ని దుర్వినియోగం చేసే అవకాశం ఉండటం వల్ల ప్రస్తుతానికి ఎంపికచేసిన కొందరు టెస్టర్లకే అందుబాటులోకి తెచ్చారు.మనదేశంలో ఎన్నికలు జరుగుతుండటం.. ఇటీవల ఏఐ సృష్టించిన రాజకీయ నాయకుల గొంతులతో రోబో కాల్స్ పుట్టుకొస్తున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండటం అవసరం. నిజానికి ఇప్పటికే చాలా అంకుర సంస్థలు వాయిస్ క్లోనింగ్ సొల్యూషన్లను అందిస్తున్నాయి. వీటి విషయంలో ఓపెన్ఏఐ నైతికతకు ప్రాధాన్యం ఇవ్వటం విశేషం. వాయిస్ ఇంజిన్ను పరీక్షించటానికి అనుమతి పొందినవారూ నిబంధనలు కచ్చితంగా పాటించాల్సిందే. ఆయా వ్యక్తుల అనుమతి తీసుకున్న తర్వాతే వారి గొంతులను సృష్టించటానికి వీలుంటుంది. అలాగే అవి ఏఐ ద్వారా సృష్టించినవని తప్పకుండా ప్రకటించాలి. -
మిమిక్రీ టూల్ను పరిచయం చేసిన ప్రముఖ ఏఐ సంస్థ
కృత్రిమ మేధ రంగంలో కంపెనీల మధ్య రోజురోజుకు పోటీ పెరుగుతోంది. దాంతో వినియోగదారులకు మెరుగైన సేవలందించేందుకు నిత్యం కంపెనీలు తమ ఉత్పత్తుల్లో మార్పులు చేస్తూన్నాయి. తాజాగా ఓపెన్ఏఐ వాయిస్ అసిస్టెంట్ రంగంలోకి అడుగుపెట్టింది. కొత్త ఫీచర్లో భాగంగా వాయిస్ ఇంజిన్ అనే వినూత్న టూల్ను పరిచయం చేసింది. వ్యక్తుల గొంతులను అచ్చం అలాగే తిరిగి వినిపించడం దీని ప్రత్యేకత. కేవలం 15 సెకండ్ల నిడివి రికార్డు స్పీచ్ సాయంతోనే గొంతులను అనుకరించటం విశేషం. అంటే ఒకరకంగా దీన్ని మిమిక్రీ ఇంజిన్ అనుకోవచ్చు. ఇది మంచి టూలే అయినప్పటికీ దీన్ని దుర్వినియోగం చేసే అవకాశం ఉండటం వల్ల ప్రస్తుతానికి ఎంపికచేసిన కొందరు టెస్టర్లకే అందుబాటులోకి తెచ్చారు. ఇదీ చదవండి: కళను హరిస్తున్న ఏఐ.. ఆర్టిస్టులు ఏం చేశారంటే.. మనదేశంలో ఎన్నికలు జరుగుతుండటం.. ఇటీవల ఏఐ సృష్టించిన రాజకీయ నాయకుల గొంతులతో రోబో కాల్స్ పుట్టుకొస్తున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండటం అవసరం. నిజానికి ఇప్పటికే చాలా అంకుర సంస్థలు వాయిస్ క్లోనింగ్ సొల్యూషన్లను అందిస్తున్నాయి. వీటి విషయంలో ఓపెన్ఏఐ నైతికతకు ప్రాధాన్యం ఇవ్వటం విశేషం. వాయిస్ ఇంజిన్ను పరీక్షించటానికి అనుమతి పొందినవారూ నిబంధనలు కచ్చితంగా పాటించాల్సిందే. ఆయా వ్యక్తుల అనుమతి తీసుకున్న తర్వాతే వారి గొంతులను సృష్టించటానికి వీలుంటుంది. అలాగే అవి ఏఐ ద్వారా సృష్టించినవని తప్పకుండా ప్రకటించాలి. -
కళను హరిస్తున్న ఏఐ.. ఆర్టిస్టులు ఏం చేశారంటే..
ఒకప్పుడు సైన్స్ కాల్పనిక నవలలు, సినిమాలకే పరిమితమైన కృత్రిమ మేధ (ఏఐ) నేడు జనజీవితాల్లో భాగమైంది. ఈ సాంకేతికత ద్వారా ఎన్నో సేవలు, సౌకర్యాలు అందుబాటులోకి వస్తున్నాయి. కానీ, మనిషికన్నా ఏఐ తెలివిమీరితే మన భవిష్యత్తు ఏమవుతుందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. కృత్రిమ మేధ (ఏఐ) మనిషి జీవితంలో ఎన్నో మార్పులు, సౌకర్యాలు తీసుకొస్తోంది. ఆన్లైన్లో వస్తుసేవల క్రయవిక్రయాలకు తోడ్పడుతోంది. ఓటీటీలో ఏయే సినిమాలు, సిరీస్ చూడవచ్చో సలహాలిస్తోంది. సిరి, అలెక్సాల ద్వారా మాట్లాడుతోంది. వ్యాపారాలు సులభంగా వేగంగా సాగేందుకు ఉపకరిస్తోంది. అదే సమయంలో మనిషి అవసరాన్ని తగ్గించేస్తుందన్న బెరుకు వ్యక్తమవుతోంది. తాజాగా ఓపెన్ఏఐ తన ఎల్ఎల్ఎంలకు శిక్షణ ఇచ్చేందుకు అనుమతి లేకుండానే తమ బుక్స్ను వాడుతోందని ఆరోపిస్తూ కొద్దినెలల కిందట వందలాది రచయితలు టెక్ కంపెనీకి వ్యతిరేకంగా కోర్టును ఆశ్రయించారు. ఇక ఇదే తరహాలో జొనాస్ బ్రదర్స్ సహా 200 మందికిపైగా మ్యూజీషియన్లు ఏఐకి వ్యతిరేకంగా గళం విప్పారు. తమ హక్కులను ఉల్లంఘించే పద్ధతులను నిలిపివేయాలని కోరుతూ ఏఐ కంపెనీలకు బహిరంగ లేఖ రాశారు. తమ కళను హరించకూడదంటూ అందులో పేర్కొన్నారు. ఇదీ చదవండి: ‘ఐదు రోజులు తిండి లేదు.. ఆ బాధ మీకు తెలియదు’ ఆర్టిస్ట్స్ రైట్స్ అలయన్స్ ఆధ్వర్యంలో రాసిన ఈ లేఖపై జొనాస్ సోదరులు, బిల్లీ ఇలిష్, క్యాటీ పెర్రీ, స్మోకీ రాబిన్సన్ వంటి ప్రముఖ ఆర్టిస్ట్లు సంతకాలు చేశారు. మ్యూజిక్ పరిశ్రమలో ఏఐ వినియోగంతో తలెత్తే దుష్ప్రభావాలపై ఈ లేఖలో వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఏఐ దుర్వినియోగంతో సృజనాత్మకత దెబ్బతింటుందని, ఆర్టిస్టులు, హక్కుదారుల ప్రయోజనాలకు విఘాతం కలుగుతుందని ఏఐ డెవలపర్లు, టెక్నాలజీ కంపెనీలు, డిజిటల్ వేదికలకు వారు విజ్ఞప్తి చేశారు. -
ఒక చాట్జీపీటీ మరో చాట్జీపీటీతో ఏం మాట్లాడుతుంది?
కృత్రిమ మేధస్సు ఆధారంగా పనిచేసే చాట్జీపీటీ ఇటీవల ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అడిగిన ఏ ప్రశ్నకైనా క్షణాల్లో సమాధానం ఇచ్చేస్తుంది. చాలా వరకు తెలియని ఎన్నో విషయాలను చాట్జీపీటీ మనకు అందిస్తుంది. ఇందులో వాయిస్ చాట్ ఫీచర్ కూడా అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే. దీనివల్ల యూజర్లు తమ సందేహాలు లేదా మెసేజ్లను వాయిస్ రూపంలో చాట్బాట్కు తెలియజేస్తే... చాట్జీపీటీ ఆ వాయిస్ విని, మళ్లీ ఆడియో రూపంలోనే సమాధానం అందిస్తుంది. ఈ ఫీచర్ యూజర్ మాట్లాడే భాషను ఆటోమేటిక్గా డిటెక్ట్ చేసి,తదనుగుణంగా రిప్లై ఇస్తుంది.. చాలామంది అవసరం ఉన్నా, లేకున్నా చాలా మంది చాట్జీపీటీ వాడేందుకు ప్రయత్నిస్తున్నారు. కొందరు ఇది ఎలా పని చేస్తుందో తెలుసుకునేందుకే వాడుతున్నారు. తాజాగా చాట్జీపీటీకి చెందిన ఆ ఆసక్తికరణ సంభాషణ నెట్టింటా వైరల్గా మారింది. సాధారణంగా ఎవరైనా తనకు కావాల్సిన సమాచారంపై చాట్జీపీటిలో సెర్చ్ చేసి తెలుసుకుంటారు. అదే రెండు చాట్జీపీటీలు మాట్లాడుకుంటే ఎలా ఉంటుంది? ఎలాంటి విషయాలపై అవి చర్చించుకుంటాయి? వినడానికే కాస్తా ఆసక్తికరంగా ఈ విషయాల గురించి తెలుసుకునేందుకు కొందరు ప్రయత్నించారు. రెండు వేర్వేరు మొబైల్స్లో చాట్జీపీటీ వాయిస్ చాట్ను ఆన్ చేసి పక్కపక్కనే ఉంచారు. అవి ఎలా మాట్లాడుతుకున్నాయో మీరే చూడండి.. చాట్జీపీటీ-1: హాయ్ నేను మీ చాట్జీపీటీ.. మీకు ఈ రోజు ఎలా సహాయపడగలను చాట్జీపీటీ-2: మీకు స్వాగతం.. మీతో మాట్లాడటం ఆనందంగా ఉంది.. మీకు ఏ విధంగా సాయం చేయగలను. మీకు ఏ విషయంపైనా సాయం చేయగలను చాట్జీపీటీ-1: మీ ఆఫర్కు ధన్యవాదాలు. మీకు కావాల్సిన ఏ సమాచారం గురించైనా నేను సహయం చేయగలను.. మీరు దేనిగురించి అయినా తెలుసుకోవాలనుకుంటున్నారా చాట్జీపీటీ-2: మీకు ఏదైనా ప్రత్యేక విషయంపై సమాచారం కావాలా? లేక మీకు చాట్ మాత్రమే కావాలా? చాట్జీపీటీ-1: నేను మీతో చాట్చేయగలను. లేదా మీకు కావాల్సిన అంశంపై సాయం చేయగలను.మీరు ఏదైనా నిర్ధిష్టమైన విఫయంపై చాట్ చేయాలనుకుంటున్నారా చాట్జీపీటీ-2: మీకు ఆసక్తి ఉన్న దేనిగురించైనా చాట్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మీ మనుసులో ఏదైనా అంశంపై చర్చించాలనుకుంటున్నారా? ఇటీవల జరిగిన వార్తా కథనాలు, అభిరుచి లేదా దేని గురించైనా? చాట్జీపీటీ-1: కృత్రిమ మేధస్సులో ఇటీవల జరుగుతున్న పరిణామాల గురించి మాట్లాడుకుందాం. ఇది చాలా మక్కువతో కూడిన రంగం. ఇక్కడ నిత్యం ఏదో ఒక కొత్త సంఘటన జరుగుతూ ఉంటుంది.. దీనిపై నువ్వేమంటావ్ చాట్జీపీటీ-2: ఖచ్చితంగా కృత్రిమ మేధస్సు అనేది ఒక ప్యాషనేట్ టాపిక్. అంటూ ఇంకా మాట్లాడుతుండగా.. మరో చాట్జీపీటీ కల్పించుకొని ఏదో ఏదో చెబుతూ ఉంటుంది. అయితే ఏ విషయంపైన అయిన టక్కుమని సమాధానం చెప్పే చాట్జీపీటీ.. మరో చాట్జీపీటీతో మాత్రం సరైన విషయాలు మాట్లాడలేకపోయింది. రెండు చాట్జీపీటీలు చాలా వరకు నాన్చుతూ అర్థం లేకుండా మాట్లాడుతూ ఉన్నాయి. వీటిని విన్న యూజర్లు కన్ఫ్యూజ్ అవుతున్నారు. అసలు ఏం సమాచారం అడుగుతున్నారు. ఏం సమాధానం ఇస్తున్నారనేది తెలియక తికమకపడుతున్నారు. ఇలాంటి ప్రయోగం మాత్రం ఎప్పుడూ చేయకూడదని అనుకుంటున్నారు. Chatgpt talking with chatgpt Age of Ultron is near pic.twitter.com/zn0FZpra7h — Shiva Rapolu (@shivarapolu01) March 17, 2024 -
‘విజయం తనకే దక్కాలనే ఉద్దేశంతో కట్టుకథలు’
చాట్జీపీటీని రూపొందించిన సంస్థ ఓపెన్ఏఐ, దాని సీఈఓ శామ్ ఆల్ట్మన్పై టెస్లా అధినేత ఎలోన్మస్క్ ఇటీవల దావా వేసిన సంగతి తెలిసిందే. చాట్జీపీటీ రూపొందించే సమయంలో కుదిరిన ఒప్పందాలను ఉల్లంఘించిన కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎలోన్మస్క్ చెప్పారు. ఈ పరిణామాల వల్ల ఓపెన్ఏఐ, ఎలాన్ మస్క్ మధ్య వివాదం క్రమంగా ముదురింది. ఈ నేపథ్యంలో ఓపెన్ఏఐ సంస్థ స్పందించింది. ఎలోన్ మస్క్ ఓపెన్ఏఐపై చేసిన అన్ని వ్యాఖ్యలు కట్టుకథని కొట్టిపారేసింది. మస్క్తో ఓపెన్ఏఐ ఎలాంటి ఒప్పందం చేసుకోలేదని తెలిపింది. సంస్థకు చెందిన అన్ని విజయాలు తనకే దక్కాలనే ఉద్దేశంతోనే ఇలాంటి చర్యలకు పూనుకుంటున్నట్లు వివరించింది. ఆయన లేకుండా విజయం సాధించడాన్ని మస్క్ తట్టుకోలేకపోతున్నట్లు పేర్కొంది. ఓపెన్ఏఐని ప్రజా సంక్షేమం కోసం లాభాలను ఆశించకూడదనే భావనతో ఏర్పాటు చేశామని మస్క్ ఇటీవల తెలిపారు. కానీ, ఆ కంపెనీ ఇప్పుడు.. మైక్రోసాఫ్ట్ కింద పూర్తిగా లాభాల కోసం పనిచేస్తోందని ఆరోపించారు. దీంతో తన లక్ష్యం విషయంలో రాజీ పడిందని, ఒప్పందాలను ఉల్లంఘించిందని పేర్కొంటూ శాన్ఫ్రాన్సిస్కో సుపీరియర్ కోర్టులో దావా వేశారు. ఈ వ్యవహారంపై ఓపెన్ఏఐ గతంలో మాట్లాడుతూ తమ కంపెనీని టెస్లాలో విలీనం చేయాలని మస్క్ ఒత్తిడి తెచ్చినట్లు ఆరోపించింది. లేదంటే పూర్తి నియంత్రణను ఆయన చేతికి ఇవ్వమన్నారని పేర్కొంది. 2017లో లాభాపేక్ష సంస్థనే ఏర్పాటు చేయాలనుకున్నామని.. కానీ, బోర్డు నియంత్రణ, సీఈఓ పదవి తనకు కావాలని మస్క్ డిమాండ్ చేసినట్లు చెప్పింది. కానీ, తమ కంపెనీ వీటికి అంగీకరించలేదని వెల్లడించింది. ఈ నేపథ్యంలోనే ఆయన సంస్థ నుంచి వైదొలగారని చెప్పింది. వీటికి సంబంధించిన కొన్ని ఈమెయిళ్లను కంపెనీ ఇటీవలే బహిర్గతం చేసింది. ఇదీ చదవండి: ఇండియాలో డేటా సెంటర్ను ప్రారంభించనున్న ప్రముఖ సంస్థ 2022 నవంబరులో వచ్చిన చాట్జీపీటీ ఆరు నెలల్లోనే ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఆదరణ సంపాదించుకున్న సంగతి తెలిసిందే. 2015లో ఓపెన్ఏఐను శామ్ ఆల్టమన్ బృందం స్థాపించినప్పుడు మస్క్ అందులో పెట్టుబడులు పెట్టారు. 2018లో సంస్థ నుంచి పెట్టుబడులను ఉపసంహరించుకున్నారు. 2022 అక్టోబరులో 44 బిలియన్ డాలర్లతో ట్విట్టర్ (ప్రస్తుతం ఎక్స్)ను కొనుగోలు చేశారు. -
చాట్జీపీటీలో మరో కీలక పరిణామం!
ప్రముఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థ ఓపెన్ ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్మన్ తిరిగి సంస్థ బోర్డ్ సభ్యుడిగా అడుగుపెట్టారు. గత ఏడాది సీఈఓగా ఆల్ట్మన్ని తొలగిస్తూ సంస్థ బోర్డ్ మెంబర్స్ నిర్ణయం తీసుకోవడం ఓ సంచలనం. అయితే కంపెనీలో ఆల్ట్మన్ తొలగింపుతో ఓపెన్ఏఐ పరిస్థితులపై న్యాయ సంస్థ విల్మర్హేల్ రంగంలోకి దిగి దర్యాప్తు చేపట్టింది. తాజాగా, సంస్థలో పరిస్థితులు చక్కబడడంతో దర్యాప్తు నిలిపివేసింది. ఆల్ట్మన్ సైతం బోర్డ్లోకి వచ్చినట్లు ప్రకటించింది. ఈ సందర్భంగా ఓపెన్ ఏఐ బోర్డ్లోకి ఆల్ట్ మన్తో పాటు బోర్డ్లోకి బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ మాజీ సీఈవో స్యూ డెస్మండ్-హెల్ మన్, సోనీ ఎంటర్ టైన్ మెంట్ మాజీ అధ్యక్షుడు నికోల్ సెలిగ్ మన్, ఇన్ స్టాకార్ట్ సీఈఓ ఫిడ్జీ సిమోలను కొత్త డైరెక్టర్లుగా బాధ్యతలు చేపట్టారు. ఆల్ట్ మన్ కొత్త బోర్డు సభ్యులను స్వాగతించారు. కంపెనీ భవిష్యత్ లక్ష్యాల్ని వారికి వివరించారు. -
ఎలక్షన్ కమిషన్కు ‘చాట్జీపీటీ’ కంపెనీ సాయం!
దేశంలో త్వరలో జరగనున్న లోక్సభ సార్వత్రిక ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు భారత ఎన్నికల సంఘం సన్నాహాలు చేస్తోంది. కృత్రిమ మేధస్సు (AI) పోలింగ్ ప్రక్రియకు అడ్డంకి కాకుండా ఎదుర్కొనేందుకు ‘చాట్జీపీటీ’ సృష్టికర్త ‘ఓపెన్ ఏఐ’ సాయం తీసుకుంటోంది. ఈ మేరకు ఈసీఐ అధికారులు ఓపెన్ ఏఐ ప్రతినిధులతో ఇటీవల సమావేశం నిర్వహించారు. గత నెలలో జరిగిన ఈ సమావేశానికి భారత ఎన్నికల సంఘం కోసం ఓపెన్ ఏఐ ఒక ప్రజెంటేషన్ను సిద్ధం చేసింది. పోలింగ్ ప్రక్రియలో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ దుర్వినియోగం కాకుండా ఎలా అరికట్టాలో కంపెనీ ఎగ్జిక్యూటివ్లు ఎలక్షన్ కమిషన్కు సూచనలిచ్చారు. ఈ సమావేశంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లోని పురోగతులను అధిక స్థాయిలో లోక్సభ ఎన్నికల సమయంలో దుర్వినియోగం కాకుండా చూసేందుకు బడా టెక్ కంపెనీలు, కేంద్ర సంస్థలు తీసుకోవాల్సిన చర్యల గురించి కేంద్ర ఎన్నికల సంఘానికి ఓపెన్ఏఐ ప్రతినిధులు తెలియజేశారు. -
‘మీ పేరు మార్చుకుంటే దావా వెనక్కి తీసుకుంటా’.. కొత్తపేరు సూచించిన మస్క్..
చాట్జీపీటీని రూపొందించిన సంస్థ ఓపెన్ఏఐ, దాని సీఈఓ శామ్ ఆల్ట్మన్పై టెస్లా అధినేత ఎలోన్మస్క్ ఇటీవల దావా వేసిన సంగతి తెలిసిందే. చాట్జీపీటీ రూపొందించే సమయంలో కుదిరిన ఒప్పందాలను ఉల్లంఘించిన కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఈ పరిణామాల వల్ల ఓపెన్ఏఐ, ఎలాన్ మస్క్ మధ్య వివాదం క్రమంగా ముదురుతోంది. తాజాగా కంపెనీ పేరు మారిస్తే దావా వెనక్కి తీసుకుంటానని మస్క్ తెలిపినట్లు కొన్ని వార్తా కథనాల ద్వారా తెలిసింది. ఓపెన్ఏఐ పేరును క్లోజ్డ్ఏఐగా మార్చాలని మస్క్ చెప్పారు. అలా చేస్తే సంస్థపై తాను వేసిన దావాను వెనక్కి తీసుకుంటానని తెలిపారు. ఇకనైనా ఓపెన్ఏఐ అబద్ధాల్లో జీవించడం మానేయాలని హితవు పలికారు. అలాగే ఆ కంపెనీ సీఈఓ శామ్ ఆల్ట్మన్ ‘క్లోజ్డ్ఏఐ’ ఐడీ కార్డును మెడలో ధరించినట్లుగా ఉన్న ఎడిట్ చేసిన ఫొటోను మస్క్ (Elon Musk) తన ‘ఎక్స్’ ఖాతాలో పోస్ట్ చేశారు. Fixed it pic.twitter.com/KPtYLsJU3h — Elon Musk (@elonmusk) March 6, 2024 ఓపెన్ఏఐని ప్రజా సంక్షేమం కోసం లాభాలను ఆశించకూడదనే భావనతో ఏర్పాటు చేశామని మస్క్ ఇటీవల తెలిపారు. కానీ, ఆ కంపెనీ ఇప్పుడు.. మైక్రోసాఫ్ట్ కింద పూర్తిగా లాభాల కోసం పనిచేస్తోందని ఆరోపించారు. దీంతో తన లక్ష్యం విషయంలో రాజీ పడిందని, ఒప్పందాలను ఉల్లంఘించిందని పేర్కొంటూ శాన్ఫ్రాన్సిస్కో సుపీరియర్ కోర్టులో దావా వేశారు. ఈ వ్యవహారంపై ఓపెన్ఏఐ స్పందిస్తూ తమ కంపెనీని టెస్లాలో విలీనం చేయాలని మస్క్ ఒత్తిడి తెచ్చినట్లు ఆరోపించింది. లేదంటే పూర్తి నియంత్రణను ఆయన చేతికి ఇవ్వమన్నారని పేర్కొంది. 2017లో లాభాపేక్ష సంస్థనే ఏర్పాటు చేయాలనుకున్నామని.. కానీ, బోర్డు నియంత్రణ, సీఈఓ పదవి తనకు కావాలని మస్క్ డిమాండ్ చేసినట్లు చెప్పింది. కానీ, తమ కంపెనీ వీటికి అంగీకరించలేదని వెల్లడించింది. ఈ నేపథ్యంలోనే ఆయన సంస్థ నుంచి వైదొలగారని చెప్పింది. వీటికి సంబంధించిన కొన్ని ఈమెయిళ్లను కంపెనీ బహిర్గతం చేసింది. ఇదీ చదవండి: ‘ఇష్టంలేని పని ఇంకెన్నాళ్లు.. వెంటనే రాజీనామా చేయండి’ 2022 నవంబరులో వచ్చిన చాట్జీపీటీ ఆరు నెలల్లోనే ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఆదరణ సంపాదించుకున్న సంగతి తెలిసిందే. 2015లో ఓపెన్ఏఐను శామ్ ఆల్టమన్ బృందం స్థాపించినప్పుడు మస్క్ అందులో పెట్టుబడులు పెట్టారు. 2018లో సంస్థ నుంచి పెట్టుబడులను ఉపసంహరించుకున్నారు. 2022 అక్టోబరులో 44 బిలియన్ డాలర్లతో ట్విట్టర్ (ప్రస్తుతం ఎక్స్)ను కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. -
‘తప్పు చేస్తున్నావ్ ఆల్ట్మన్’.. చాట్జీపీటీ సృష్టికర్తపై మస్క్ ఆగ్రహం!
అపరకుబేరుడు ఎలోన్ మస్క్ కోర్టు మెట్లెక్కారు. 2015 చాట్జీపీటీ తయారీలో కుదుర్చుకున్న కాంట్రాక్ట్ను ఉల్లంఘించారంటూ చాట్జీపీటీ సృష్టికర్త, ఓపెన్ ఏఐ కో-ఫౌండర్ సామ్ ఆల్ట్మాన్తో పాటు పలువురిపై శాన్ఫ్రాన్సిస్కో కోర్టులో దావా వేశారు. దావాలో సామ్ ఆల్ట్మాన్, ఓపెన్ఏఐ సహ వ్యవస్థాపకుడు గ్రెగ్ బ్రాక్మాన్తో కలిసి మానవాళికి ప్రయోజనం చేకూర్చేలా లాభపేక్షలేకుండా కృత్రిమ మేధస్సు సాంకేతికతను అభివృద్ధి చేసేలా మస్క్ను కలిశారు. అప్పటికే వ్యాపార రంగంలో అప్రతిహతంగా కొనసాగుతున్న మస్క్ను వ్యాపారం, ఆర్ధికంగా మద్దతు కావాలని కోరారు. మస్క్తో కలిసి ఉమ్మడిగా ఓపెన్ఏఐ సంస్థను ఏర్పాటు చేశారు. చాట్ జీపీటీపై పనిచేశారు. అయితే ఆ సమయంలో మస్క్-ఆల్ట్మన్లు ఓ బిజినెస్ అగ్రిమెంట్ కుదుర్చుకున్నారు. ఇప్పుడు దానిని ఆల్ట్మన్ అతిక్రమించారంటూ కోర్టులో వేసిన దావాలో మస్క్ తరుపు న్యాయ వాదులు పేర్కొన్నారు. అయితే, తనతో ఆల్ట్మన్ ఒప్పందం కుదుర్చుకున్నట్లగా కాకుండా కంపెనీ ఇప్పుడు లాభపేక్షతో వ్యాపారం చేస్తూ ఆ అగ్రిమెంట్ నిబంధనల్ని ఉల్లంఘించినట్లు ఎలోన్ మస్క్ తరపు న్యాయవాదులు వ్యాజ్యంలో హైలెట్ చేశారు. ఈ దావాపై ఓపెన్ ఏఐ, ఆ కంపెనీకి మద్దతిస్తున్న మైక్రోసాఫ్ట్, ఇటు ఎలోన్ మస్క్లు స్పందించాల్సి ఉంది. చదవండి👉 ఇంతకీ ఈ రామేశ్వరం కేఫ్ ఎవరిది? -
డబ్బు సంపాదించడానికి 'చాట్జీపీటీ' - ఎలా అంటే..
టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్న తరుణంలో 'చాట్జీపీటీ' దాదాపు అన్ని రంగాల్లోనూ చాలా ఉపయోగకరంగా మారుతోంది. మీ ప్రశ్నకు సమాధానాలు ఇవ్వడమే కాకుండా.. ఈ చాట్జీపీటీ ద్వారా డబ్బు కూడా సంపాదించుకోవచ్చు. ఈ కథనంలో చాట్జీపీటీ ఉపయోగించి డబ్బు ఎలా సంపాదించాలనే విషయాలను తెలుసుకుందాం. చాట్జీపీటీ ద్వారా డబ్బు సంపాదించే మార్గాలు ఫ్రీలాంచ్ రైటింగ్ సోషల్ మీడియా మేనేజ్మెంట్ యాప్స్ అండ్ వెబ్సైట్లను అభివృద్ధి చేయడంలో సహాయపడటం మీ చిన్న వ్యాపారాల కోసం మార్కెటింగ్ ప్లాన్స్ రూపొందించండి ఆన్లైన్ సర్వేలను పూర్తి చేయడం వర్చువల్ అసిస్టెంట్ అవ్వడం కంపెనీల కోసం డాక్యుమెంట్స్ లేదా ఫైల్లను ట్రాన్స్లేట్ చేయడం ప్రూఫ్ రీడింగ్ అండ్ ఎడిటింగ్ రెజ్యూమ్స్ రాయడం కస్టమర్ సపోర్ట్ సర్వీస్ అందించండి మార్కెట్ రీసర్చ్ నిర్వహించడం ఇన్ఫర్మేషనల్ యూట్యూబ్ వీడియోస్ క్రియేట్ చేయడం -
సరికొత్త సాంకేతిక సవాలు
మరో సంచలనాత్మక సాంకేతిక ప్రయోగం జరిగింది. కృత్రిమ మేధ (ఏఐ) వినియోగంలో ఒకడుగు ముందుకేసి, విప్లవాత్మకమైన ఛాట్బాట్ ‘ఛాట్ జీపీటీ’ని సృష్టించిన ‘ఓపెన్ ఏఐ’ సంస్థ గురువారం మరో ముందంజ వేసింది. సరికొత్త జెనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (జెన్ఏఐ) మోడల్ను ఆవి ష్కరించింది. రాతపూర్వక సమాచారాన్ని వీడియోగా మార్చే ‘సోరా’ అనే ఈ మోడల్ ఆసక్తి రేపు తోంది. సోరా అంటే జపనీస్లో ఆకాశమని అర్థం. సృజనకు ఆకాశమే హద్దంటూ ఏఐ వినియోగంతో చేసిన ఈ కొత్త ప్రయోగం ఏ మంచికి, ఎంత చెడుకు దారితీస్తుందనే చర్చ జరుగుతోంది. యూజర్ ఇచ్చిన సమాచారానికి కట్టుబడి ఉంటూ, నాణ్యతలో రాజీ లేకుండా గరిష్ఠంగా ఒక నిమిషం నిడివి వీడియోలను సృష్టించడం ‘సోరా’ ప్రత్యేకత. కోరినట్టుగా జెన్ఏఐ వేదికలు బొమ్మల్ని సృష్టించడం, సమాచార ప్రతిస్పందనలు అందించడమనేది కొన్నేళ్ళుగా జరుగుతున్నదే, అంతకంతకూ మెరుగవుతున్నదే. టెక్స్›్ట నుంచి బొమ్మలను ఇప్పటికే సృష్టిస్తున్నప్పటికీ వీడియో తయారీ సంక్లిష్టమైనది. అందుకే, ఆ పని వెనుకబడింది. తీరా ఇప్పుడు ఓపెన్ఏఐ ప్రయోగాత్మకంగా ‘సోరా’ను ముందుకు తెచ్చింది. దాని పని తీరుకు ఉదాహరణగా మంచు కురుస్తున్న టోక్యో నగర వీధుల దృశ్యాల్ని సృష్టించింది. వాస్తవికమని భ్రమింపజేస్తున్న ఆ వీడియోను చూసి అబ్బురపడనివారు లేరు. నిజానికి, టెక్స్›్ట నుంచి వీడియో సృష్టి అనే సాంకేతిక ప్రయోగం బరిలోకి ఇప్పటికే కొన్ని ఇతర సంస్థలూ ప్రవేశించాయి. గూగుల్, మేటా, అంకురసంస్థ రన్వే ఎంఎల్ లాంటివి ఈ సాంకేతికతను ఇప్పటికే చూపాయి. గూగుల్ ‘లూమియర్’ గత నెలలో విడుదలైంది. సమాచారం, లేదంటే ఛాయా చిత్రాల ఆధారంగా 5 సెకన్ల నిడివి వీడియోను సృష్టించడాన్ని ‘లూమియర్’ చేసి చూపింది. అలాగే, రన్వే, పికా లాంటి ఇతర సంస్థలు సైతం తమవైన వీడియో సృష్టి మోడల్స్ను ముందుకు తెచ్చాయి. నిమిషం నిడివి గల వీడియోలు సృష్టించే ‘సోరా’ విషయానికొస్తే, సంక్లిష్ట సన్నివేశాలు, పలు రకాల పాత్రలు, ప్రత్యేక తరహా కదలికలు, కచ్చితమైన నేపథ్యంతో కూడిన దృశ్యాలు ఈ ‘సోరా’తో సాధ్యమట. వస్తువులనూ, మనుషులనూ అచ్చంగా భౌతిక ప్రపంచంలో ఉన్నట్టే చూపుతుందట. అయితే, ఈ మోడల్ ఇంకా నిర్దుష్టంగా తయారుకాలేదనీ, సంక్లిష్ట సమాచారమిస్తే గందరగోళ పడవచ్చనీ దాన్ని రూపొందించిన ఓపెన్ఏఐ సైతం ఒప్పుకుంటోంది. అలాగే, కుడి, ఎడమల విషయంలో కాస్తంత తడబాటుకు గురికావడం లాంటి బలహీనతలూ ‘సోరా’లో లేకపోలేదు. ఈ పరిస్థితుల్లో ఇది తప్పుడు, విద్వేషపూరిత సమాచారాలకు వేదిక కాకుండా ఉండేలా... భద్రతా నిపుణులతో, విధాన నిర్ణేతలతో ఓపెన్ఏఐ చర్చించనుంది. అందుకే, ప్రస్తుతానికి ‘సోరా’ను సామా న్యులకు అందుబాటులో ఉంచలేదు. విజువల్ ఆర్టిస్టులు, డిజైనర్లు, సినీ రూపకర్తలకు మాత్రం దీన్ని వాడుకొనే వీలు కల్పించింది. సృజనశీలురకు మరింత ఉపయోగపడేలా చేయాల్సిన మార్పులు చేర్పులపై వారి స్పందన తీసుకోనుంది. మొత్తానికి, ఏఐతో ప్రపంచం మారిపోతోంది. గత రెండు దశాబ్దాల్లో ఇంటర్నెట్, సోషల్ మీడియా రాకతో అపరిమిత డేటా సేకరణ, సమాచార విప్లవం వచ్చింది. ఇటీవలి జెన్ఏఐ పుణ్యమా అని ఆ భారీ డేటాను ఆసరాగా చేసుకొని, కీలక నిర్ణయాలు తీసుకొనేలా ఏఐ వ్యవస్థలు, అప్లికేషన్ల అభివృద్ధి జరిగింది. దాదాపు 30 వేల కోట్ల పదాలను వాడుకొని ఛాట్జీపీటీ సిద్ధమైంది. సుమారు 580 కోట్ల చిత్రాలు – రాతపూర్వక సమాచారం ఆధారంగా ఏఐ ఆధారిత ఇమేజ్–జనరేటింగ్ అప్లికేషన్లు డాల్–ఇ, మిడ్జర్నీ లాంటివి శిక్షణ పొందాయి. ఏఐ వినియోగం పలు రంగాల్లో ఉపయుక్తమైనా, దాని వల్ల సమాజానికి సవాళ్ళూ అధికమే. సృజనశీలుర కృషిని అనుమతి లేకుండానే ఏఐ మోడల్స్ శిక్షణకు వాడుకోవడంపై పెద్ద కంపెనీలపై పలువురు కేసులేశారు. ఏఐని సర్వసిద్ధం చేయడానికి ఇప్పుడున్న డేటా సరిపోక, కొరత వస్తుందనీ అంచనా. ట్విట్టర్ను కొన్న ఎలాన్ మస్క్ నుంచి ప్రసిద్ధ రచయిత యువల్ నోవా హరారీ దాకా పలువురు ‘భారీ ఏఐ ప్రయోగాలకు విరామం ఇవ్వా’లంటూ నిరుడు బహిరంగ లేఖ రాయడం గమనార్హం. అమెరికా నుంచి ఇండియా దాకా ఎన్నికలు జరగనున్న వేళ ఈ ఏఐ సృష్టి వీడియోలతో మోస పుచ్చే ప్రమాదం ఉంది. తప్పుడు ప్రచారంతో నైతిక, సామాజిక సమస్యలు తలెత్తుతాయి. ప్రతి రంగంలో ఏఐతో చిక్కులు రాక మానవు. అయినా ఇప్పటికీ ఏఐ పర్యవేక్షణ టెక్ సంస్థల చేతిలోనే నడు స్తోంది. ప్రభుత్వాలింకా నిద్ర మేల్కోలేదు. యూరోపియన్ యూనియన్ మాత్రం డిసెంబర్లో ఒక ఒప్పందం చేసుకుంది. ప్రపంచంలోనే తొలిసారిగా సమగ్రమైన ఏఐ నిబంధనలవి. అయితే, తుది ఆమోదం పొందిన రెండేళ్ళ తర్వాత కానీ చట్టం అమలులోకి రాదు. ఇక, ఏఐ దుర్వినియోగంపై రచ్చతో ఓపెన్ఏఐ, మరో 19 టెక్ సంస్థలు ఎన్నికల డీప్ఫేక్ల నిరోధానికి కృషి చేస్తామన్నాయి. పైకి ఏమంటున్నా, సోరా లాంటి ఏఐ టూల్స్ శిక్షణకు ఎక్కడ నుంచి, ఎంత వీడియోలు వాడుకున్న సంగతి కూడా ఓపెన్ఏఐ లాంటి సంస్థలు బయటపెట్టడం లేదు. ఛాట్జీపీటీ లాంటి జెన్ఏఐ టూల్స్ శిక్షణకై తమ కాపీరైట్ ఉల్లంఘించారంటూ ఇప్పటికే పలువురు రచయితలే కాదు, సాక్షాత్తూ న్యూయార్క్ టైమ్స్ సైతం ఓపెన్ఏఐ, దాని వ్యాపార భాగస్వామి మైక్రోసాఫ్ట్పై కేసులు పెట్టాల్సి వచ్చింది. అమెరికన్ సంపన్నులు, వారి వెంట చైనీయులు ఇప్పటికే ఏఐ రేసులోకి దిగారు. ప్రస్తుతానికి భారతీయులం వెనుకబడివున్నా, అనివార్యమవుతున్న ఈ మార్పును అందిపుచ్చుకోక తప్పదు. ఏఐ ఓ సరికొత్త పారిశ్రామిక విప్లవానికి దారి తీస్తుందని నిపుణుల అభిప్రాయం. అందుకే, కేవలం ఏఐ వినియోగదారులుగా మిగిలిపోకుండా, ఏఐ ఆవిష్కర్తలం కావాలన్నది వారి సూచన. -
వైద్యంలో ఏఐ తప్పులకు బాధ్యులెవరు?
అన్ని రంగాల మాదిరిగానే ఆరోగ్య రంగంలోనూ కృత్రిమ మేధ (ఏఐ) వాడటం మొదలైంది. వ్యాధి నిర్ధారణ, క్లినికల్ కేర్, చికిత్స, రోగుల వైద్య చరిత్రను అక్షరబద్ధం చేయడం, మందుల అభివృద్ధి వంటి పనులకు తగు జాగ్రత్తలతో ‘ఎల్ఎంఎం’లను వాడొచ్చునని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచిస్తోంది. ఆ మేరకు ఆరోగ్య సిబ్బందిపై భారం తగ్గుతుంది. మనిషి మాదిరిగానే స్పందించాలన్నది ఎల్ఎంఎంల తయారీ ఉద్దేశమన్నది తెలిసిందే. అలాంటప్పుడు వీటి ద్వారా తప్పులు జరిగితే బాధ్యత ఎవరిది? ఆరోగ్య సేవలు, ఉత్పత్తులకు అన్వయిస్తున్న నైతిక, మానవ హక్కుల ప్రమాణాలను ఏఐ టెక్నాలజీలు, టూల్స్కు కూడా విస్తరించాలి. భారీ స్థాయిలో ఎల్ఎంఎంలు విడుదలైన ప్రతిసారీ వీటిని కచ్చితంగా ఆడిట్ చేసే ఏర్పాట్లు చేసుకోవాలి. ఛాట్జీపీటీ వంటి కృత్రిమ మేధ(ఏఐ) టూల్స్ వాడకం ఇటీవల బాగా పెరిగింది. అన్ని రంగాల్లో మాదిరిగానే ఆరోగ్య రంగంలోనూ కృత్రిమ మేధ టెక్నా లజీలను వాడటం మొదలుపెట్టారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూ హెచ్ఓ) ఈ విషయమై ఒక హెచ్చరిక జారీ చేసింది. ఛాట్జీపీటీ, బార్డ్ వంటి ఎల్ఎంఎం (లార్జ్ మల్టీ–మోడల్ మోడల్స్)లు అందించిన సమాచారం, వీడియోలకు మాత్రమే పరిమితం కాకుండా... అంతకంటే ఎక్కువ విషయాలపై వ్యాఖ్యానించగలవు. మనిషి మాదిరిగానే స్పందించాలన్నది ఎల్ఎంఎంల తయారీ ఉద్దేశమన్నది తెలిసిందే. పరిస్థితులకు తగ్గట్టుగా కొత్త విషయాలను ఎప్పటికప్పుడు నేర్చు కోవడం ఇవి చేసే పని. ఆరోగ్య రంగంలో వీటిని ఉపయోగించడం వల్ల తప్పుడు సమాచారం, ఏకపక్ష లేదా అసంపూర్తి సమాచారం అందే ప్రమాదాలు ఉంటాయనీ, ఇది మన ఆరోగ్యంపై ప్రభావం చూపవచ్చుననీ డబ్ల్యూహెచ్ఓ హెచ్చరించింది. శిక్షణ ఇచ్చేందుకే తప్పుడు సమాచారాన్ని ఉపయోగిస్తే పరిస్థితి మరింత అధ్వాన్న మవుతుందన్నది ఈ హెచ్చరిక సారాంశం. ముఖ్యంగా జాతి, కులం, మతం వంటి విషయాల్లో ఏఐ టెక్నాలజీలు వివక్షతో కూడిన సమాచా రాన్ని తయారు చేసే ప్రమాదముంది. ఏఐ వాడకం పెరిగిపోతున్న నేపథ్యంలో డబ్ల్యూహెచ్ఓ 2021లో సాధారణ మార్గదర్శకాలు కొన్నింటిని జారీ చేసింది. అదే సమయంలోనే ఆరోగ్య రంగంలో ఏఐ వాడకంతో రాగల ప్రయోజనాలనూ గుర్తించింది. నైతికత విషయంలో కొన్ని స్థూల మార్గదర్శకాలను సిద్ధం చేసింది. వాటి ప్రకారం... ఏఐ టెక్నాలజీలు స్వయం ప్రతిపత్తిని కాపా డేలా ఉండాలి. మానవ సంక్షేమం, భద్రత, ప్రజాప్రయోజనాలు, పారదర్శకతలకు పెద్దపీట వేయాలి. తెలివిగా ప్రవర్తించడంతోపాటు వివరించేలా ఉండాలి. బాధ్యత స్వీకరించాలి. అందరినీ కలుపుకొని పోవాలి. వివక్ష లేకుండా చూసుకోవాలి. వివరించేలా ఉండటం అంటే... ఏఐ తాలూకూ డిజైన్ , వినియోగం విషయాల్లో దాపరికం లేకుండా తగినంత సమాచారం అందరికీ అందుబాటులో ఉంచడం! పారదర్శకత ఆశించగలమా? ఆరోగ్య రంగంలో ఏఐ వాడకంపై డబ్ల్యూహెచ్ఓ ఇటీవల మరి కొన్ని మార్గదర్శకాలను జారీ చేసింది. ఎల్ఎంఎంల ఆవిష్కరణతో ఇవి అనివార్యమయ్యాయి. ఎల్ఎంఎంల వాడకం గురించి అర్థం చేసు కోవాలంటే ఏఐ టెక్నాలజీని సమగ్రంగా తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇది ఎల్ఎంఎం టూల్ను అభివృద్ధి చేయడంతో మొదలవుతుంది. అభివృద్ధి చేసేది కార్పొరేట్ కంపెనీ, యూనివర్సిటీ, స్టార్టప్ ఏదైనా కావచ్చు. ఇవన్నీ ఆధారపడేది సమాచార లభ్యత, నైపుణ్యాల పైనే. తరువాతి దశలో అభివృద్ధి చేసిన ఎల్ఎంఎంకు ఓ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్ అందిస్తారు. లోటుపాట్లను సరిచేయడం, విస్తృత సమాచా రంతో శిక్షణ ఇవ్వడం అన్నమాట. ఎల్ఎంఎంను భారీ సాఫ్ట్వేర్ వ్యవస్థలో భాగం చేయడం కూడా ఈ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్ను సిద్ధం చేసే థర్డ్ పార్టీ బాధ్యతే. ఈ పని చేసిన తరువాత ఈ కృత్రిమ మేధ ద్వారా సేవలు అందుతాయి. లేదా ఒక అప్లికేషన్ రెడీ అవుతుంది. ఏఐ టెక్నాలజీ అభివృద్ధి దశల్లో మూడోది వినియోగదారుడికి దీన్ని అందించే డిప్లాయర్. ఆరోగ్య రంగంలో ఈ డిప్లాయర్ ఎక్కువ సందర్భాల్లో ఆసుపత్రి, ప్రభుత్వ ఆరోగ్య సంస్థ లేదా ఫార్మా కంపెనీ అయివుంటుంది. ఈ మూడు దశల్లో నైతికత, నియంత్రణకు సంబంధించిన చాలా ప్రశ్నలు, అంశాలు ఎదురవుతాయి. చాలాసార్లు డెవలపర్ పెద్ద టెక్ కంపెనీ అయి ఉంటుంది. ఎల్ఎంఎంల తయారీకి కావాల్సినన్ని నిధులు, టెక్నాలజీ నైపుణ్యాలు వీరి వద్దే ఉంటాయి. వీటి అభివృద్ధిలో వాడే అల్గారిథమ్స్, వాటి వల్ల రాగల ప్రమాదాల గురించి సామాన్యు లకు తెలిసే అవకాశాలు తక్కువే. కార్పొరేట్ కంపెనీ కాబట్టి పార దర్శకత, నిబద్ధతలను కూడా ఆశించలేము. నియంత్రణ ఎలా? ఈ నేపథ్యంలోనే ప్రపంచవ్యాప్త ప్రభుత్వ నియంత్రణ సంస్థలకు ఒక బెంగ పట్టుకుంది. కొత్తగా అందుబాటులోకి వస్తున్న ఏఐ టూల్స్ ప్రస్తుత న్యాయ, చట్ట వ్యవస్థల్లోకి ఇముడుతాయా? మానవ హక్కు లకు సంబంధించిన అంశాలతోపాటు దేశాల డేటా పరిరక్షణ చట్టాల విషయంలోనూ ఈ సందేహముంది. ఎల్ఎంఎంల ప్రవేశం ఒక రకంగా ప్రభుత్వ, నియంత్రణ సంస్థలు ఏమరుపాటుగా ఉన్న సమయంలో జరిగిందని చెప్పాలి. యూరోపియన్ యూనియన్ విష యాన్నే తీసుకుందాం. ఎల్ఎంఎంలను చేర్చేందుకే వీరు ఆర్టిఫీషియల్ ఇంటె లిజెన్స్ చట్టాన్ని చివరి దశలో మార్చాల్సి వచ్చింది. డబ్ల్యూహెచ్ఓ నివేదిక ప్రకారం అల్గారిథమ్స్ ప్రస్తుత చట్ట, న్యాయ వ్యవస్థల పరిధిలోకి చేరే అవకాశం లేదు. మరోవైపు ఎల్ఎంఎంలు కూడా మనుషుల్లా చిత్తభ్రమలకు గురై తప్పుడు సమాచారాన్ని ఇవ్వవచ్చునని ఇప్పటికే పలు అధ్యయనాలు స్పష్టం చేశాయి. ఇంకో ఆందోళన ఏమిటంటే... ఈ ఎల్ఎంఎంల ద్వారా తప్పులు జరిగితే వాటికి బాధ్యత ఎవరిది? ఇలాంటి తప్పుల కారణంగా జరిగే నష్టం, కలిగే హాని, దుర్వినియోగాలకు ఎవరు బాధ్యులన్న విషయంపై కూడా పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. పైగా ఈ ఎల్ఎంఎంలు సైబర్ సెక్యూరిటీ ముప్పులకు అతీతమేమీ కాదు. ఆరోగ్య రంగంలో వీటిని వాడితే రోగుల సమాచారం దుర్వినియోగమయ్యే అవకాశాలు ఎక్కువ. ఆరోగ్య రంగంలో ఏఏ అంశాలకు ఎల్ఎంఎంలను వాడవచ్చు నన్న విషయంపై డబ్ల్యూహెచ్ఓ ఒక స్థూల అంచనాకు వచ్చింది. వ్యాధి నిర్ధారణ, క్లినికల్ కేర్, లక్షణాలను పరిశీలించడం, చికిత్స, పరిపాలన, రోగుల వైద్య చరిత్రను అక్షరబద్ధం చేయడం వంటి పనులు... వైద్య, నర్సింగ్ శిక్షణ, శాస్త్రీయ పరిశోధన, మందుల అభివృద్ధి అన్న అంశాలకు మాత్రమే తగు జాగ్రత్తలతో ఎల్ఎంఎంలను వాడవచ్చునని సూచిస్తోంది. ఈ పనులన్నింటినీ ఎల్ఎంఎంలు చేస్తే ఆరోగ్య సిబ్బందిపై భారం అంతమేరకు తగ్గుతుంది. మరోవైపు ఓ కంపెనీ మెడికల్ ఎల్ఎంఎంను అభివృద్ధి చేసే పనిలో ఉంది. ఇది ప్రశ్నలకు సమాధానాలు చెప్పడం, వైద్యపరమైన సమాచారాన్ని సంక్షి ప్తీకరించడం, అన్నింటినీ కలిపి వైద్యులకు స్థూల నివేదిక ఇవ్వడం వంటి పనులు చేస్తుంది. ఇలాంటివి ఎక్కువైన కొద్దీ వైద్యుడికి, రోగికి మధ్య ఉన్న సంబంధాలు దెబ్బతింటాయి. మరి ఏం చేయాలి? ఎల్ఎంఎంల వాడకాన్ని పూర్తిగా అడ్డుకోవ డమైతే కాదు. వీటిని అభివృద్ధి చేసే సమయంలో వీలైనంత ఎక్కువ పారదర్శకత తీసుకురావడం ఒకటైతే... వాడకం కూడా బాధ్యతాయు తంగా ఉండేలా చూసుకోవడం మరొకటి. ఈ దిశగా ముందు ప్రభు త్వాలు ఆరోగ్య రంగంలో వినియోగానికి తలపెట్టిన ఎల్ఎంఎంల మదింపు, అనుమతుల కోసం నియంత్రణ సంస్థలను ఏర్పాటు చేసుకోవాలి. అలాగే ఏఐ వ్యవస్థల అభివృద్ధికి లాభాపేక్ష లేకుండా అందరికీ అందుబాటులో ఉండేలా మౌలిక సదుపాయాలను సమకూర్చాలి. శక్తిమంతమైన కంప్యూటింగ్ వ్యవస్థలు, డేటా సెట్స్ అటు ప్రభుత్వ, ఇటు ప్రైవేట్ వ్యక్తులూ వాడుకోగలిగితే తప్పు ఒప్పుల గురించి ఒక స్పష్టమైన అంచనా ఏర్పడుతుంది. ఆరోగ్య సేవలు, ఉత్ప త్తులకు ప్రస్తుతం అన్వయిస్తున్న నైతిక, మానవ హక్కుల ప్రమాణా లను ఏఐ టెక్నాలజీలు, టూల్స్కు కూడా విస్తరించాలి. ఆరోగ్య, వైద్య అంశాలకు సంబంధించి భారీ స్థాయిలో ఎల్ఎంఎంలు విడుదలైన ప్రతిసారి ఏఐ టూల్స్, టెక్నాలజీలను కచ్చితంగా ఆడిట్ చేసేలా ఏర్పాట్లు చేసుకోవాలి. ఏఐతో వచ్చే లాభాలపై అతిగా అంచనాలూ పెట్టుకోవద్దు; రాగల ముప్పులను తక్కువ చేసి చూడనూ వద్దు. దినేశ్ సి. శర్మ వ్యాసకర్త సైన్స్ అంశాల వ్యాఖ్యాత (‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
‘5వేల మందిని చూశాడు..చివరికి ఓ అమ్మాయితో పెళ్లికి సిద్ధమయ్యాడు’
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్ చాట్జీపీటీ ఇప్పుడు మరో సంచలనానికి కేంద్ర బిందువుగా మారింది. ఇన్ని రోజులు యూజర్లు వ్యాపార వ్యవహారాల్ని చక్కబెట్టుకునేందుకు చాట్జీపీటీని ఉపయోగించే వారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. చాట్జీపీటీతో తమ గుణగణాలకు సరిపోయే భాగస్వామిని వెతుక్కుంటున్నారు. తాజాగా, రష్యాకు చెందిన అలెగ్జాండర్ జాదన్ ఇప్పుడు సోషల్ మీడియా సెన్సేషన్గా మారారు. డేటింగ్ యాప్ టిండర్లో తనకు తగ్గ యువతిని పెళ్లి చేసుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించాడు. కానీ విఫలమయ్యాడు. తాను కొత్తగా ఓ అమ్మాయిని కలిసిన ప్రతి సారి ఏదో ఒక ప్రశ్నలు తలెత్తేవి. ఈ ప్రశ్నల ప్రవాహానికి పులిస్టాప్ పెట్టేందుకు చాట్జీపీటీని ఆశ్రయించాడు. చాట్జీపీటీని టిండర్లో మ్యాచ్మేకర్గా మార్చాడు. ఇందుకోసం ప్రత్యేకంగా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ను ఉపయోగించి ఓ బాట్ను తయారు చేశాడు. ఆ బాట్ సాయంతో సుమారు టిండర్లో తనకు సరిపోయే అమ్మాయి కోసం సుమారు 5240 మందిని తన ప్రొఫైల్తో మ్యాచ్ చేసి.. అందులో ఒక్క అమ్మాయిని త్వరలో వివాహం చేసుకోనున్నాడు. Сделал предложение девушке, с которой ChatGPT общался за меня год. Для этого нейросеть переобщалась с другими 5239 девушками, которых отсеила как ненужных и оставила только одну. Поделюсь, как сделал такую систему, какие были проблемы и что вышло с остальными девушками. Тред pic.twitter.com/fbVO7OmZhF — Aleksandr Zhadan (@biblikz) January 30, 2024 టిండర్లో తనని ఏడాది నుంచి కమ్యునికేట్ అవుతున్న యువతిని చాట్జీపీటీ సాయంతో ఆమెకు ప్రపోజ్ చేశాడు. ఇందుకోసం మెషిన్ లెర్నింగ్లో ఓ భాగమైన ఆర్టిఫిషియల్ న్యూరాల్ నెట్వర్క్తో 5240లో ఒక్క అమ్మాయిని ఎంపిక చేసుకోగలిగానని ట్వీట్ చేశాడు. ఇదంతా ఎలా సాధ్యమైంది? దానికి కథాకమామిషు ఏంటో చెప్పకనే చెప్పాడు. ‘నేను ఓ యువతిని గాఢంగా ప్రేమించాను. కానీ అన్వేక కారణాల వల్ల రెండేళ్లకే విడిపోవాల్సి వచ్చింది. ప్రేమ చేసిన గాయానికి తట్టుకోలేకపోయాను. కొన్ని నెలల పాటు తీవ్ర ఒత్తిడికి గురయ్యాను. చివరికి దాన్ని నుంచి తేరుకునేందుకు టిండర్లో మరో యువతి కోసం ప్రయత్నించా. అలా ఒక యువతితో ప్రారంభమై 5240 మందిని వెతుక్కున్నాను. ఫలితం శూన్యం డేటింగ్ యాప్లో తనకు నచ్చిన అమ్మాయిని చూసుకోవడం, ఆమెతో చాటింగ్ చేయడం, నేరుగా కలుసుకోవడం ఇలా చేస్తుండేవాడిని. ఈ ప్రాసెస్లో లెక్కలేనన్ని అవమానాలు,రిజెక్షన్లు ఎదుర్కొన్నాను. ఫైనల్గా చాట్జీపీటీని ఆశ్రయించి నాలోని బాధను వెళ్లగక్కాను. నాకే ఎందుకిలా జరుగుతుందని చాట్జీపీని ప్రశ్నించా. ఇందుకోసం ప్రత్యేకంగా ఓ టూల్ను తయారు చేశాను. చివరికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బాట్ తనకు భార్యగా కరీనానే సరైన జోడిగా నిర్ణయించింది. త్వరలోనే ఆమెను పెళ్లి చేసుకోబోతున్నానంటూ అలెగ్జాండర్ జాదన్ తన కథను ముగించాడు. -
హలో ప్రేమపక్షులారా.. ఈ యాప్ మీకోసమే..
కాలం మారినా కవితలతో ప్రేమను వ్యక్తపరిచే వ్యక్తులు ఇంకా ఉన్నారు. అయితే కవితల కోసం కవితాత్మక ఆలోచనలు అందరికి రావు, రావాల్సిన అవసరమూ లేదు. అలాంటి వాటికి ChatGPT చాలా ఉపయోగపడుతుంది. ఈ కథనంలో చాట్జీపీటీ ద్వారా ప్రేమలేఖలు ఎలా రాయాలి, కవితల కోసం ఎక్కడ సర్చ్ చేయాలనే మరిన్ని విషయాలు వివరంగా తెలుసుకుందాం. ముందుగా మీ ఐఫోన్ లేదా ఆండ్రాయిడ్ ఫోన్లో చాట్జీపీటీ యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలి. ఈ యాప్ పూర్తిగా ఉచితం, దీనికి డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదు. యాప్ డౌన్లోడ్ చేసుకున్న తరువాత అకౌంట్ క్రియేట్ చేసుకోవడానికి ఈ మెయిల్ లేదా ఫేస్బుక్ అకౌంట్ ఉపయోగించుకోవచ్చు. చాట్జీపీటీ అకౌంట్ క్రియేట్ చేసుకున్న తరువాత టెక్స్ట్/సర్చ్ బాక్స్ కనిపిస్తుంది, అందులో మీరు అడగాల్సిన ప్రశ్నను టైప్ చేయాలి. మీరు టెక్స్ట్ బాక్స్లో టైప్ చేసిన ప్రశ్నకు సమాధానం కనిపిస్తుంది. లవ్ లెటర్ కావాలని సర్చ్ బాక్స్లో టైప్ చేస్తే.. వెంటనే పైన మీకు ఒక లెటర్ సమాధానం రూపంలో కనిపిస్తుంది. లెటర్ మాత్రమే కాకుండా మీరు ప్రేమించే అమ్మాయి లేదా అబ్బాయి కోసం కవితలు కావాలనుకుంటే కూడా సర్చ్ బాక్స్లో టైప్ చేస్తే.. కవితలు కూడా అక్కడ డిస్ప్లే అవుతాయి. చాట్ జీపీటీ ఇచ్చిన ఫలితాల్లో మీకు అవసరమైన కంటెంట్ తీసుకుని, మీకు నచ్చినట్లు ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇదీ చదవండి: ఏ ప్రశ్నకైనా సమాధానం 'చాట్జీపీటీ' - ఇంటర్వ్యూకి ఇలా సిద్దమైపోండి! చాట్జీపీటీ ఇచ్చిన కంటెంట్ను లేదా సమాధానాలను జాగ్రత్తగా పరిశీలించాలి.. ఎందుకంటే ఆ కంటెంట్లో చిన్న పొరపాట్లు జరిగిన పదాలకు అర్థాలు మారిపోతాయి, తరువాత ఇబ్బంది పడాల్సి ఉంటుంది. కాబట్టి మీకు అవసరమైన కంటెంట్ ఉంచి, అనవసరమైన కంటెంట్ తీసివేసి సొంతంగా తయారు చేసుకోవడం ఉత్తమం. -
‘చాట్జీపీటీ అద్భుతం చేసింది’, యువతికి దేశంలోనే ప్రతిష్టాత్మకమైన అవార్డ్!
చాట్జీపీటీ! టెక్ ప్రపంచంలో ఇప్పుడు ఏ నలుగురు ఒక చోట కలిసినా దీనిపేరే వినబడుతుంది. అంతకు మించి జాబ్ మార్కెట్ను శాసించే స్థాయికి చేరుకోవడంతో.. అత్యంత కీలక రంగమైన టెక్నాలజీతో పాటు ఇతర రంగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది. దీనికి తోడు ప్రముఖ జాతీయ, అంతర్జాతీయ కంపెనీలన్నీ చాట్జీపీటీని వినియోగిస్తున్నాయి. ఉద్యోగుల్ని తొలగిస్తున్నాయి. దీంతో చాట్జీపీటీ పేరు వింటేనే ఉద్యోగస్తులు ఆందోళనకు గురవుతున్నారు. అయితే, ఈ తరుణంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్జీపీటీ టూల్స్తో ఉద్యోగాలు పోతాయనే ఆందోళనను పక్కన పెట్టేసి..దాన్ని సద్వినియోగం చేసుకుంటే అద్భుతాలు చేయొచ్చని అంటుంది ఓ యువతి. అంతేకాదు, చేసి చూపించింది కూడా. ఈ ఏఐ టూల్ను ఉపయోగించి దేశంలోనే అత్యున్నత పురస్కారాన్ని సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఈ అంశం టెక్ ప్రపంచంలో ఆసక్తికరంగా, ఆందోళనకరంగా మారింది. ఎందుకంటే? అకుటగావా అవార్డు ప్రధానం జపాన్కు చెందిన రీ కుడాన్ 33 ఏళ్ల సాహితి వేత్త (Literary scholar). ఇటీవల ఆమె సాహిత్య రంగంలో ప్రతిష్టాత్మకమైన జపాన్ సాహిత్య పురస్కారం ‘అకుటగావా’ అవార్డును సొంతం చేసుకున్నారు. అకుటగావా అవార్డును సాహిత్య రంగంలో అసమానమైన ప్రతిభను కనబరిచినందుకు గాను జపాన్ ప్రభుత్వం ప్రధానం చేస్తుంది. తాజాగా, అకుటగావాను టోక్యో-టు డోజో-టు (టోక్యో సానుభూతి టవర్) పేరుతో నవల రాసిన రచయిత్రి కుడాన్ పేరును జపాన్ ప్రభుత్వం ప్రకటించింది. చాట్జీపీటీతో అద్భుతాలు ఈ నేపథ్యంలో కుడాన్ తాను రాసిన నవలకు అవార్డును సొంతం చేసుకున్నందుకు సంతోషం వ్యక్తం చేశారు. ఏఐ టూల్ చాట్ జీపీటీతో ఇది సాధ్యమైందంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘ఇది చాట్జీపీటీ ఉపయోగించి రాసిన నవల. ఇందులో మొత్తం 5 శాతం మాత్రమే నేరుగా రాసింది. వర్క్ ప్రొడక్టివిటీ విషయంలో, నాలోని సృజనాత్మకతను వెలికి తీసేందుకు చాట్జీపీటీని మరింతగా వినియోగించాలని అనుకుంటున్నాను’ అని అన్నారు. ప్రశంసలు.. విమర్శలు కుడాన్ నవలపై దేశ వ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తాయి. అదే సమయంలో ఏఐని ఉపయోగించి తాను ఈ నవల రాసినట్లు బహిర్గతం చేయడం వివాదాస్పదంగా మారింది. సాహిత్యంతో పాటు ఇతర అత్యున్నత పురస్కాల కోసం ఏఐని ఉపయోగించేందుకు రచయితలు పోటీపడతారేమోనన్న సందేహాలు నెలకొన్నాయి. దీనిపై ఇప్పుడు జపాన్ రచయితలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చాట్జీపీటీని ఉపయోగించే రాసే రచనలకు ప్రతిష్టాత్మక అవార్డులను అందిస్తారా? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. మరి ఈ అంశంపై జపాన్ ప్రభుత్వంతో పాటు కుడాన్ ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది. -
చాట్జీపీటీలో వ్యక్తిగత సమాచారం ఇస్తున్నారా? ఇది తెలియాల్సిందే..
దేశానికి రక్షణ ఎంత అవసరమో, దేశంలోని పౌరులకు అన్ని విధాలా భద్రత కల్పించడమూ అంతే కీలకం. వ్యక్తిగత వివరాలను దొంగలించడం, బహిర్గతం చేయడం వంటివి ప్రజల భద్రతకు, వారి వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగిస్తాయి. దురదృష్టవశాత్తు దేశంలో అటువంటి ఘటనలు కొన్నేళ్లుగా అధికమవుతున్నాయి. పౌరులే కాదు, కట్టుదిట్టమైన ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలూ సమాచార చౌర్యానికి బలవుతుండడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. దేశంలో సగం జనాభా వివరాలు ఇప్పుడు అంగడి సరకుగా మారాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా 24 రాష్ట్రాలు, ఎనిమిది ముఖ్య నగరాలకు చెందిన దాదాపు 66.9 కోట్ల మంది వ్యక్తిగత సమాచారాన్ని ఫరీదాబాద్కు చెందిన ముఠా గతంలో అంతర్జాలంలో అమ్మకానికి పెట్టిన సంఘటనలు ఉన్నాయి. ప్రస్తుతం చాలామంది చాట్జీపీటీ వాడుతున్నారు. అయితే తెలిసీ తెలియక కొందరు అందులో వ్యక్తిగత వివరాలూ ఇస్తున్నారు. చాట్జీపీటీకి మనం ఇచ్చే సమాచారమంతా భవిష్యత్లో ఏఐ నమూనాలకు శిక్షణ ఇవ్వటానికి ఉపయోగపడుతుందని కొందరు నిపుణులు హెచ్చరిస్తున్నారు. మున్ముందు ఇదెక్కడికి దారితీస్తుందో ఎవరికీ తెలియదు. ఇదీ చదవండి: భవిష్యత్తులో ప్రపంచాన్ని శాసించే టెక్నాలజీ ఇదే.. కానీ.. సైబర్ నేరస్థులు మన వ్యక్తిగత వివరాలను అంగట్లో బేరానికి పెట్టే ప్రమాదముంది. కాబట్టి చాట్జీపీటీకి సొంత విషయాలకు సంబంధించిన సమాచారం ఇవ్వకపోవటమే మంచిదని కంప్యూటర్ సైన్స్ నిపుణులు సూచిస్తున్నారు. మన చాట్స్లోని సమాచారాన్ని జీపీటీ వాడుకోకుండా సెటింగ్స్లోకి వెళ్లి, అన్ని చాట్స్కు సంబంధించిన వివరాలను నిత్యం డిలీట్ చేయాలని చెబుతున్నారు. -
ప్రపంచ టెక్ సంస్థలకు సీఈవోలు.. ఈ ‘గే’లు..
ఓపెన్ ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్మన్ ఇటీవల తన బాయ్ఫ్రెండ్ ఆలివర్ మల్హెరిన్ను వివాహం చేసుకున్నారు. ఈమేరకు వివాహానికి సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. అయితే చాలామంది ఆ ఫొటోలను ఏఐ రూపొందించిందా అని అభిప్రాయపడ్డారు. డీప్ఫేక్ అందుబాటులోకి రావడంతో ఇలాంటి అనుమానాలు రావడం సహజం. దాంతో ఆల్ట్మన్ తన పెళ్లిపై స్పందిస్తూ ఓ ప్రముఖ మీడియా సంస్థతో ఈ విషయాన్ని ధ్రువీకరించారు. హైస్కూల్లో చదువుతున్న సమయంలోనే తాను ‘గే’నని ఆల్ట్మన్ ప్రకటించారు. తొమ్మిదేళ్ల పాటు లూప్ట్ సంస్థ సహ వ్యవస్థాపకుడు నిక్ సివోతో డేటింగ్ చేసి 2012లో శామ్ విడిపోయారు. ప్రపంచ దిగ్గజ టెక్ కంపెనీలకు సారథ్యం వహిస్తున్న సీఈఓలు తమ వ్యక్తిగత జీవితంలో తీసుకునే నిర్ణయాలను కొందరు వ్యతిరేకిస్తారు, మరికొందరు ఆహ్వానిస్తారు. ఏదిఏమైనా వారు తమ జీవితంలో ఏ నిర్ణయం తీసుకోవడానికైనా పూర్తి హక్కు ఉంటుంది. ప్రపంచ వ్యాప్తంగా చాలా కంపెనీల సీఈవోలు తమనుతాము ‘గే’గా ప్రకటించుకుని వారి జీవితాల్లో సంతోషంగా ఉన్నట్లు చెబుతున్నారు. వారిలో కొందరి వివరాలు కొంద తెలుపబడ్డాయి. శామ్ ఆల్ట్మన్, ఓపెన్ ఏఐ సీఈవో హైస్కూల్లో 17 సంవత్సరాల వయసులో తాను ఒక గే అని ప్రకటించుకున్నారు. ఆ సమయంలో తోటి విద్యార్థుల నుంచి చాలా అభ్యంతరాలను ఎదుర్కొన్నట్లు చెప్పారు. తాజాగా మల్హెరిన్తో పెళ్లికి ముందు లూప్ట్ సంస్థలో తన సహ వ్యవస్థాపకుడు నిక్ శివోతో సహజీవనం చేసినట్లు ఒక ఇంటర్వ్యూలో తెలిపారు. సంయుక్తంగా అమెరికన్ జియోలొకేషన్ సాఫ్ట్వేర్ కంపెనీని స్థాపించిన వీరిద్దరూ తొమ్మిదేళ్ల పాటు కలిసి ఉన్నారు. 2012లో కంపెనీని విక్రయించిన తర్వాత ఇద్దరూ విడిపోయారు. ఆల్ట్మాన్ అనేక సందర్భాల్లో మల్హెరిన్తో డేటింగ్ గురించి పబ్లిక్గా మాట్లాడారు. సెప్టెంబరు 2023లో న్యూయార్క్ మ్యాగజైన్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సామ్ ఆల్ట్మాన్ త్వరలో మల్హెరిన్తో పిల్లలను కనాలని ఆశపడుతున్నట్లు వెల్లడించారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన సందర్భంగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వైట్హౌస్లో ఇచ్చిన విందులోనూ ఇద్దరు చాలా సన్నిహితంగా కనిపించినట్లు మీడియా కథనాల ద్వారా తెలిసింది. టిమ్ కుక్, యాపిల్ సీఈవో యాపిల్ సీఈవో టిమ్ కుక్ 2014లో స్వలింగ సంపర్కుడిగా ప్రకటించుకున్నారు. ఆ సంవత్సరం జూన్లో ‘శాన్ ఫ్రాన్సిస్కో గే ప్రైడ్ పరేడ్’లో యాపిల్ సిబ్బందితో కలిసి పాల్గొన్నారు. అక్టోబరు 30, 2014న కుక్ బహిరంగంగా ‘నేను స్వలింగ సంపర్కుడిగా గర్వపడుతున్నాను. స్వలింగ సంపర్కం దేవుడు నాకిచ్చిన గొప్ప బహుమతిగా భావిస్తున్నాను’ అని చెప్పారు. పీటర్ థీల్, పేపాల్ సహ వ్యవస్థాపకుడు 2016లో రిపబ్లికన్ నేషనల్ కన్వెన్షన్లో పీటర్ థీల్ తాను స్వలింగ సంపర్కుడిగా గర్విస్తున్నట్లు చెప్పారు. 2002లో, ‘ఈబే’ పేపాల్ను 1.5 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది. ఈ డీల్ థీల్ను బిలియనీర్గా మార్చింది. క్రిస్ హ్యూస్, ఫేస్బుక్ సహ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్బర్గ్తో పాటు ఫేస్బుక్ నలుగురు సహ వ్యవస్థాపకులలో క్రిస్ హ్యూస్ ఒకరు. అతడు బహిరంగంగా ‘గే’ ప్రకటించుకున్నారు. హ్యూస్ 2012లో సీన్ ఎల్డ్రిడ్జ్ను వివాహం చేసుకున్నారు. 2019లో హ్యూస్ ఫేస్బుక్, మార్క్ జుకర్బర్గ్పై విమర్శలు గుప్పించి వార్తల్లోకెక్కారు. క్లాడియా బ్రిండ్, మేనేజింగ్ డైరెక్టర్, ఐబీఎం క్లాడియా బ్రిండ్ ఐబీఎంలో ఇంటెలెక్చువల్ ప్రాపర్టీకి వైస్ ప్రెసిడెంట్, మేనేజింగ్ డైరెక్టర్గా పనిచేస్తున్నారు. 1990లో ఆ సంస్థలో తన కెరీర్ను ప్రారంభించిన ఆమె తాను ఒక లెస్బియన్గా ప్రకటించుకున్నారు. ఇదీ చదవండి: బుల్లెట్ రైలు ప్రాజెక్ట్.. కీలక సమాచారాన్ని వెల్లడించిన మంత్రి ఆన్ మే చాంగ్, కాండిడ్, సీఈవో యాపిల్, గూగుల్, ఇన్టుఇట్ కంపెనీల్లో కీలక స్థానాల్లో పని చేసిన ఆమె ప్రస్తుతం సామాజిక రంగానికి సంబంధించిన డేటాను అందించే ఒక నాన్ప్రాఫిట్ సంస్థ కాండిడ్లో పని చేస్తున్నారు. లెస్బియన్ల హక్కుల కోసం వివిధ వేదికలపై ఆమె మాట్లాడారు. -
సహచరుడితో చాట్జీపీటీ సీఈఓ వివాహం!
శామ్ ఆల్ట్మన్..ఓపెన్ ఏఐ సీఈఓ. ప్రపంచానికి చాట్జీపీటీను పరిచయం చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో ఓ కీలకమార్పు తీసుకొచ్చి అన్ని దిగ్గజ టెక్ కంపెనీలకు సవాలు విసిరిన ఘనుడు. అలాంటి వ్యక్తిని కొద్ది రోజుల క్రితం ఓపెన్ ఏఐ సంస్థ బోర్డ్ అతనిని సీఈఓ పదవి నుంచి తొలగించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత పరిణామాల వల్ల ఆల్ట్మన్ను తిరిగి సంస్థలోకి తీసుకోక తప్పలేదు. తాజాగా శామ్ ఆల్ట్మన్ తన బాయ్ఫ్రెండ్ ఆలివర్ మల్హెరిన్ను వివాహం చేసుకున్నారు. ఈమేరకు వివాహానికి సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. దాంతో ఆల్ట్మన్ తన పెళ్లిపై స్పందిస్తూ ఓ ప్రముఖ మీడియా సంస్థతో ఈ విషయాన్ని ధ్రువీకరించారు. హవాయ్ నగరంలో సముద్రపు ఒడ్డున కొంతమంది సన్నిహితుల మధ్య వీరు ఒక్కటైనట్లు మీడియా కథనాల్లో వెల్లడైంది. శామ్ వివాహ చేసుకున్న మల్హెరిన్ ఆస్ట్రేలియాలో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పనిచేస్తున్నారు. మెల్బోర్న్ విశ్వవిద్యాలయం నుంచి ఆయన పట్టా పొందినట్లు మల్హెరిన్ లింక్డిన్ ప్రొఫైల్ ప్రకారం తెలుస్తోంది. 2020 ఆగస్టు నుంచి 2022 నవంబర్ వరకు మెటాలో పనిచేశారు. ఆల్ట్మన్, మల్హెరిన్ తమ బంధం గురించి ఎప్పుడూ బయట మాట్లాడిన సందర్భాలు లేవు. ఇదీ చదవండి: సినిమా చూపిస్తూ కోట్లు సంపాదన! 2023 సెప్టెంబర్లో న్యూయార్క్ మ్యాగజైన్ మీడియాతో మాట్లాడుతూ ఇద్దరూ శాన్ఫ్రాన్సిస్కోలో ఒకే ఇంట్లో ఉంటున్నట్లు ఆల్ట్మన్ వెల్లడించారు. గత ఏడాది భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అమెరికా అధ్యక్షుడు బైడెన్ శ్వేతసౌధంలో ఏర్పాటు చేసిన విందుకు ఆల్ట్మన్ మొదటిసారి మల్హెరిన్తో కలిసి వచ్చారు. ఇదిలాఉండగా హై స్కూల్లో చదువుతున్న సమయంలోనే తాను ‘గే’నని ఆల్ట్మన్ ప్రకటించారు. తొమ్మిదేళ్ల పాటు లూప్ట్ సంస్థ సహ వ్యవస్థాపకుడు నిక్ సివోతో డేటింగ్ చేసి 2012లో శామ్ విడిపోయారు. -
వోక్స్వ్యాగన్ కార్లలో చాట్జీపీటీ.. అదెలా పనిచేస్తుంది? దాని ఉపయోగాలు?
మీరు ఓ కారులో ప్రయాణిస్తున్నారు. ఆ సమయంలో కారు లోపల టెంపరేచర్ విపరీతంగా ఉంది. వెంటనే మీకు ‘ఐ యామ్ ఫీలింగ్ కోల్డ్’ అనే సౌండ్ వినబడుతుంది. మీరు అదే కారులో ప్రయాణిస్తున్నారు. అప్పుడే మీకు నోరూరించే బటర్ చికెన్ తినాలనిపిస్తుంది. వెంటనే సమీపంలో ఉన్న రెస్టారెంట్ ఎక్కుడ ఉంది? అని వెతికే పనిలేకుండా సంబంధిత రెస్టారెంట్ పిన్ కోడ్, అడ్రస్తో సహా అన్నీ వివరాలు మీకు వాయిస్ రూపంలో అందుతాయి. అలెక్సా తరహాలో రానున్న రోజుల్లో వోక్స్వ్యాగన్ కార్ల యజమానులకు పై తరహా ఏఐ టెక్నాలజీ ఫీచర్లను అందించేందుకు ఆ సంస్థ సిద్ధమైంది. వోక్స్వ్యాగన్ కార్లలో చాట్జీపీటీని ఇంటిగ్రేట్ చేస్తూ (అలెక్సా తరహా) వాయిస్ అసిస్టెంట్ను అందించనున్నట్లు ప్రకటించింది. అమెరికా లాస్ వేగాస్ కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ షో (సీఈఎస్)లో చాట్జీపీటీ ఆధారిత వాయిస్ అసిస్టెంట్ ఫీచర్పై ప్రకటించింది. ఈ ఏడాది క్యూ2 నాటికి కార్లలో వోక్స్వ్యాగన్ కార్లలో చాట్జీపీటీ వాయిస్ ఓవర్ ఫీచర్ను అందుబాటులోకి తెస్తామని, తొలుత నార్త్ అమెరికా, యూరప్ కస్టమర్లు ఈ ఫీచర్ను వినియోగించుకునే సౌకర్యం కలగనుంది. టచ్ స్క్రీన్ను తాకే పనిలేకుండా సాధారణంగా ఏదైనా ఫీచర్ను వినియోగించాలంటే కార్లలో టచ్ స్క్రీన్ను తాకాల్సి ఉంటుంది. వోక్స్వ్యాగన్ అందించనున్న ఫీచర్తో ఆ అవసరం ఉండదని ఆ సంస్థ టెక్నికల్ డెవలప్మెంట్ బ్రాండ్ బోర్డ్ మెంబర్ కై గ్రునిట్జ్ తెలిపారు. వోక్స్వ్యాగన్ తన కాంపాక్ట్ సెగ్మెంట్ కార్లలో టెక్నాలజీని స్టాండర్డ్ ఫీచర్గా మార్చిన మొదటి తయారీ సంస్థ తమదేనని తెలిపింది. అయితే, ఇప్పటికే జనరల్ మోటార్స్ గత మార్చిలో చాట్జీపీటీ ఏఐ మోడల్లను ఉపయోగించి వర్చువల్ పర్సనల్ అసిస్టెంట్పై పనిచేస్తున్నట్లు తెలిపింది మెర్సిడెజ్ బెంజ్ కార్లతో పాటు మెర్సిడెజ్ బెంజ్ గత జూన్లో ఒక టెస్ట్ ప్రోగ్రామ్ను నిర్వహించి, ఆటోమేకర్ యొక్క ‘ఎంబీయూఎక్స్’ సిస్టమ్ను కలిగి ఉన్న సుమారు 900,000 కార్లలో చాట్జీపీటీని డౌన్లోడ్ చేసుకోవడానికి వీలు కల్పిచ్చింది. వినియోగదారులు దృష్టిలో ఉంచుకుని సినిమాలు చూడడం, రెస్టారెంట్లలలో సీట్లను బుక్ చేసుకోవడం, డ్రైవింగ్ సమయంలో అలెర్ట్లను ఇస్తుంది. -
జియో భారత్ జీపీటీ రెడీ.. కీలక విషయాలు చెప్పిన ఆకాశ్ అంబానీ
ముంబై: దేశీయంగా ‘భారత్ జీపీటీ’ ప్రోగ్రామ్ను రూపొందించడంపై రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ కసరత్తు చేస్తోంది. ఇందుకోసం ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ–బాంబేతో (ఐఐటీ–బీ) జట్టు కట్టింది. ఐఐటీ–బీ వార్షిక టెక్ఫెస్ట్లో పాల్గొన్న సందర్భంగా కంపెనీ చైర్మన్ ఆకాశ్ అంబానీ ఈ విషయాలు తెలిపారు. టెలివిజన్ల కోసం ఆపరేటింగ్ సిస్టమ్ను కూడా ప్రవేశపెట్టే యోచనలో ఉన్నట్లు తెలిపారు. ప్రస్తుతం భారీ ల్యాంగ్వేజ్ మోడల్స్, జనరేటివ్ ఏఐ (కృత్రిమ మేథ) వంటి సాంకేతికతలను పైపైనే చూస్తున్నామని, వచ్చే దశాబ్దంలో ఇవి విస్తృతంగా వినియోగంలోకి వస్తాయని ఆకాశ్ చెప్పారు. ఉత్పత్తులు, సర్వీసులను ఏఐ సమూలంగా మార్చేయగలదని ఆయన వివరించారు. సోదరుడు అనంత్ అంబానీ వివాహం జరగనుండటంతో వచ్చే ఏడాది (2024) తమ కుటుంబానికి ప్రత్యేకంగా ఉండగలదని ఆకాశ్ పేర్కొన్నారు. -
Generative AI Battle: చాట్జీపీటీకి పోటీగా జెమినీ
భవిష్యత్తంతా కృత్రిమ మేధదే. ఇది అందరూ ముక్తకంఠంతో చెబుతున్న మాట. ఈ నేపథ్యంలో ఆ రంగంపై పట్టు బిగించేందుకు ఐటీ దిగ్గజాలన్నీ శాయశక్తులా ప్రయత్నిస్తున్నాయి. మైక్రోసాఫ్ట్ ఇప్పటికే ఓపెన్ఏఐ యాజమాన్యంలోని చాట్జీపీటీ ప్రాజెక్టులో మెజారిటీ భాగస్వామి కావడం ద్వారా ఈ దిశగా తొలి అడుగు వేసింది. గడచిన ఏడాది కాలంలో మరెన్నో ఏఐ మోడళ్లు తెరపైకి వచ్చినా ఓపెన్ ఏఐ తాలూకు జీపీటీ మోడళ్లతో పోటీ పడలేకపోతున్నాయి. దానికి పోటీగా జెమినీ పేరుతో గూగుల్ తాజాగా కొత్త ఏఐ మోడల్ను ప్రకటించింది. దీనిపై ఇప్పుడు అంతటా ఆసక్తి నెలకొంది... మొగ్గు జెమినీకే కనిపిస్తున్నా... అవడానికి చాట్జీపీటీ, జెమినీ రెండూ జెనరేటివ్ ఏఐ మోడళ్లే. ఇవి ఇన్పుట్ ట్రైనింగ్ డేటా తాలూకు ప్యాట్రన్ల ఆధారంగా పిక్చర్లు, పదాలు, ఇతర మీడియా వంటి కొత్త డేటాను కోరిన విధంగా జెనరేట్ చేస్తాయి. చాట్జీపీటీ ప్రధానంగా లార్జ్ లాంగ్వేజ్ మోడల్ (ఎల్ఎల్ఎం). ఇది టెక్స్ట్ జెనరేట్ చేయడంపై ఎక్కువగా దృష్టి పెడుతుంది. అలాగే జీపీటీ ఆధారిత వెబ్ సంభాషణల యాప్గా కూడా పని చేస్తుంది. గూగుల్కు కూడా బార్డ్ పేరుతో ఇలాంటి యాప్ ఇప్పటికే ఉంది. ఇది గతంలో లాఎండీఏ లాంగ్వేజ్ మోడ్పై ఆధారపడేది. ఇప్పుడు జెమినీ కోసమని పీఏఎల్ఎం2 మోడ్గా దాన్ని అప్గ్రేడ్ చేస్తోంది గూగుల్. ఇది మల్టీ మోడల్ తరహా మోడల్ కావడమే చాట్జీపీటీతో పాటు ఇతర అన్ని ఏఐల కంటే జెమినీని ఇప్పుడు ప్రత్యేకంగా నిలుపుతోంది. ఎందుకంటే ఇది మలి్టపుల్ ఇన్పుట్, ఔట్పుట్ మోడ్లతో నేరుగా పని చేయగలదు. అంతేగాక టెక్స్ట్, ఆడియో, వీడియోలను కూడా బాగా సపోర్ట్ చేస్తుంది. ఓపెన్ ఏఐ కూడా ఇలాంటి సామర్థ్యంతో కూడిన జీపీటీ–4 విజన్ మోడల్ను ప్రకటించినా అది జెమినీ మాదిరిగా పూర్తిస్థాయి మలీ్టమోడల్ కాదు. ఎందుకంటే ఇది ప్రధానంగా టెక్స్ట్ పైనే ఆధారపడుతుంది. ఉదాహరణకు ఆడియో ఇన్పుట్స్ను స్పీచ్ ఔట్పుట్గా మార్చేందుకు విష్పర్ అనే స్పీచ్ టు టెక్స్ట్ ఇన్పుట్ లెరి్నంగ్ మోడల్ సాయం తీసుకుంటుంది. ఇమేజీలను అందించాలన్నా అంతే. అది జెనరేట్ చేసే టెక్స్ట్ ప్రాంప్్టలను డాల్–ఈ2 అనే మరో డీప్ లెరి్నంగ్ మోడల్ ఇమేజీలుగా మారుస్తుంది. కానీ గూగుల్ మాత్రం జెమినీని ఇలా కాకుండా పూర్తిస్థాయి మల్టీ మోడల్ ఏఐగా తీర్చిదిద్దుతోంది. ఇతర లెరి్నంగ్ మోడళ్ల సాయంతో నిమిత్తం లేకుండా నేరుగా ఆడియో, ఇమేజీలు, వీడియో, టెక్స్ట్ వంటి ఇన్పుట్ టైప్లను అది తనంత తానే కావాల్సిన ఔట్పుట్లుగా మార్చేస్తుంది. జీపీటీ–4తో పోలిస్తే జెమినీ పనితీరు ఎలా ఉంటుందో ఇప్పటికి తెలియకపోయినా దాన్ని చాలా హెచ్చు సామర్థ్యంతో రూపొందిస్తున్నట్టు గూగుల్ ప్రకటించుకుంది. దానికిప్పటికే జెమినీ 1.0 అల్ట్రా అని కూడా పేరు పెట్టింది. ప్రయోగాత్మకంగా చేసిన పరీక్షల్లో ఇది జీపీటీ–4 కంటే మిన్నగా తేలిందని చెబుతోంది కూడా. ఇందుకు రుజువుగా ఓ వీడియో కూడా విడుదల చేసింది. కాకపోతే అందులో చూపించిన టాస్్కలను రియల్టైమ్లో చేయడంలో జెమినీ ఏ మేరకు కృతకృత్యమవుతుందో చూడాల్సి ఉంది. అంతిమ లబ్ధి యూజర్లకే... ఈ సందేహాల మాట ఎలా ఉన్నా జెమినీ వంటి భారీ మలీ్టమోడల్ మోడళ్లు జెనరేటివ్ ఏఐ రంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడతాయని ఐటీ రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఎందుకంటే ప్రధానంగా టెక్స్ట్ ఆధారితమైన జీపీటీ–4 ఇప్పటికే ఏకంగా 500 బిలియన్ పదాలపై శిక్షణ పొందింది! అంటే, పబ్లిక్ డొమైన్లో అందుబాటులో ఉన్న నాణ్యమైన పదాలన్నీ దానికిప్పటికే చిరపరిచితమని చెప్పవచ్చు. ఇలాంటి ట్రైనింగ్ డేటాతో పాటు మోడల్ తాలూకు సంక్లిష్టత ఎంత ఎక్కువగా ఉంటే దాని పనితీరు అంత ప్రభావవంతంగా ఉంటుంది. అయితే ఇలాంటి అన్ని రకాల డేటాను నేరుగా వాడగల జెమినీ వంటి ఏఐ మోడళ్లు మున్ముందు మరింత సామర్థ్యం సంతరించుకోవడం ఖాయంగా కని్పస్తోంది. అదే సమయంలో దీనికి పోటీగా ఓపెన్ ఏఐ కూడా అప్గ్రేడెడ్ జీపీటీ–5 వెర్షన్పై ఇప్పటికే ముమ్మరంగా కృషి చేస్తోంది. ఈ నిరంతర పోటీ అంతిమంగా యూజర్లకే మరింత లబ్ధి చేకూరుస్తుందని ఐటీ రంగ నిపుణులు చెబుతున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
‘అదో పీడకల’.. పదవి నుంచి తొలగించడంపై శామ్ ఆల్ట్మన్..
సీఈఓ పదవి నుంచి తనని అర్ధాంతరంగా తొలగించడంపై ఓపెన్ఏఐ శామ్ఆల్ట్ మన్ స్పందించారు. సీఈఓగా తొలగించిన సమయంలో తనకు ఎదురైన చేదు జ్ఞాపకాల్ని ఓ పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో వెలుగులోకి తెచ్చారు. శామ్ ఆల్ట్మన్..ఓపెన్ ఏఐ సీఈఓ. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో పరిచయం అక్కర్లేని పేరు. చాట్జీపీటీ విడుదలతో ప్రపంచం మొత్తాన్ని తనవైపుకు తిప్పుకున్న అసాధ్యుడు. అలాంటి ఆల్ట్మన్ను కొద్ది రోజుల క్రితం ఓపెన్ ఏఐ సంస్థ బోర్డ్ అతనిని సీఈఓ పదవి నుంచి తొలగించింది. ఆ తర్వాత వరుస పరిణామాలతో ఆల్ట్మన్ను తిరిగి సంస్థలోకి తీసుకోక తప్పలేదు ఆ బోర్డ్ సభ్యులకు. అయితే పదవీచ్యుతుడైన తరువాత ‘‘ టైమ్స్ సీఈఓ ఆఫ్ ది ఇయర్ 2023’’ కి ఎంపికయ్యారు. ఈ తరుణంలో దక్షిణాఫ్రికా కమెడియన్, ట్రెవర్ నోహ్ నిర్వహించిన పాడ్కాస్ట్లో ఆల్ట్మన్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో తనకి పింక్ స్లిప్ ఇచ్చిన తర్వాత ఏమైందనే విషయాల్ని పంచుకున్నారు. శామ్ ఆల్ట్మన్ని సీఈఓ పదవి నుంచి ఎప్పుడు తొలగించారు? నవంబర్ 17, 2023న ఓపెన్ ఏఐ బోర్డ్ ఆల్ట్మన్ని సీఈఓ పదవి నుంచి తొలగించింది. ఆల్ట్మన్ ఐఫోన్కి ఏమైంది? ట్రెవర్ నోహ్ పాడ్కాస్ట్లో ఓపెన్ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్మన్ మాట్లాడుతూ.. ‘‘ ఈ పరిణామం (తనను తొలగించడం) నన్ను మరింత గందర గోళంలోకి నెట్టింది. నా ఐఫోన్ కూడా పనిచేయడం ఆగిపోయింది. నేను హోటల్ గదిలో ఉండగా.. ఓ ఫోన్ కాల్ వచ్చింది. అవతలి నుంచి ‘‘ మిమ్మల్ని ఓపెన్ ఏఐ బోర్డ్ సభ్యులు సీఈఓ పదవి నుంచి తొలగించారు’’ అని ఆ కాల్ సారాంశం. ఏం జరిగిందో తెలియదు. అంతా గందర గోళం. ఓ వైపు నన్ను తొలగిస్తున్నట్లు ఫోన్ కాల్, మరోవైపు నా ఐఫోన్ పనిచేయడం లేదు. దానంతటికి ఐమెసేజ్ అని అర్ధమైంది. కొద్ది సేపటికి ఐమెసేజ్కు వరుసగా మెసేజ్లు వస్తున్నాయి. ఆమెసేజ్లు నాతో పనిచేయాలనుకున్న వారి నుంచేనని అర్ధమైంది. అన్నింటిని చదివాను. వాటిని చదివాక అయోమయంలో పడ్డాను. అదో పీడ కలలా అనిపించింది. బోర్డు నిర్ణయంతో కలత చెందాను’’ అని అన్నారు. -
Microsoft-OpenAI: రెండూ కలిస్తే ఏమవుతుంది?
ప్రపంచ టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్, చాట్జీపీటీ సృష్టికర్త ఓపెన్ఏఐ భాగస్వామ్యాన్ని, దానికి సంబంధించిన ఇటీవల పరిణామాల్ని యూకే నియంత్రణ సంస్థ నిశితంగా పరిశీలిస్తోంది. ఈ దిగ్గజ కంపెనీల కలయిక యూకేలోని కంపెనీ మధ్య పోటీపై ఎలాంటి ప్రభావం చూపనుందన్న అంశాన్ని గమనిస్తోంది. ఓపెన్ఏఐతో మైక్రోసాఫ్ట్ అనుబంధం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) మార్కెట్ను ప్రభావితం చేయగలదా అని యూకేకి చెందిన కాంపిటీషన్ అండ్ మార్కెట్స్ అథారిటీ (CMA) పరిశీలిస్తోంది. ఈమేరకు అభిప్రాయ సేకరణకు పిలుపునిచ్చింది. అభిప్రాయ సేకరణ (ITC) అనేది సమాచార సేకరణ ప్రక్రియలో మొదటి భాగమని, అధికారికంగా మొదటిదశ విచారణకు ముందు చేపట్టే ప్రక్రియ అని సీఎంఏ ఒక ప్రకటనలో తెలిపింది. ఓపెన్ఏఐలో ఇటీవల అనేక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఇందులో మైక్రోసాఫ్ట్ ప్రవేశించింది. ఈ పరిణామాల దృష్ట్యా మైక్రోసాఫ్ట్, ఓపెన్ఏఐ భాగస్వామ్యం, ఇటీవల పరిణామాలు కంపెనీల పోటీపై ఎలాంటి ప్రభావం చూపుతాయన్నది తెలుసుకునేందుకు అభిప్రాయ సేకరణకు పిలుపునిచ్చింది. ఓపెన్ఏఐలో నాటకీయ పరిణామాలు గత నెలలో ఓపెన్ఏఐ బోర్డు నాటకీయ చర్యలో సీఈవో సామ్ ఆల్ట్మన్ను తొలగించింది. తరువాత, మైక్రోసాఫ్ట్ ఛైర్మన్, సీఈవో సత్య నాదెళ్ల తమ అధునాతన ఏఐ పరిశోధనకు నాయకత్వం వహించాలని ఆయను ఆహ్వానించారు. అయితే ఓపెన్ఏఐ పూర్తిగా కొత్త బోర్డ్తో ఆల్ట్మన్ను సీఈవోగా పునరుద్ధరించడంతో ఈ నాటకీయ పరిణామానికి ముగింపు పడింది. ‘ఏఐ డెవలపర్ల మధ్య నిరంతర పోటీ అవసరం. ఇది ఈ రంగంలో నూతన ఆవిష్కరణలు, వృద్ధి, బాధ్యతాయుతమైన అభ్యాసాలను అందించడంలో సహాయపడుతుంది’ సీఎంఏ అభిప్రాయపడింది. మైక్రోసాఫ్ట్-ఓపెన్ఏఐ భాగస్వామ్యం ఈ రంగంలో కంపెనీల మధ్య పోటీని దెబ్బతీసే ప్రమాదం ఉందా అని సీఎంఏ సమీక్షిస్తోంది. -
టెక్ ప్రపంచంలో సంచలనం.. ఈ యేటి మేటి సీఈవో ఈయనే..
Time’s CEO of the Year 2023: టెక్ ప్రపంచంలో సంచలనం సృష్టించిన చాట్జీపీటీ (ChatGPT)కంపెనీ ఓపెన్ఏఐ (OpenAI) సీఈవో సామ్ ఆల్ట్మన్ (Sam Altman) ప్రఖ్యాత టైమ్ మ్యాగజైన్ ‘సీఈవో ఆఫ్ ది ఇయర్-2023’గా ఎంపికయ్యారు. ఆల్ట్మాన్ టెక్ పరిశ్రమకు చేసిన సేవలకు గాను అవార్డు పొందారు. 5 రోజుల్లోనే మిలియన్ యూజర్లు 2022 నవంబర్ లో ప్రారంభమైన చాట్జీపీటీ 5 రోజుల్లోనే మిలియన్ మంది యూజర్లను సంపాదించకుందని టైమ్ మ్యాగజైన్ పేర్కొంది. చాట్జీపీటీకి ప్రస్తుతం 100 మిలియన్ల మంది యూజర్లు ఉన్నారు. ఈ బెంచ్మార్క్ను చేరుకోవడానికి ఫేస్బుక్కు 4.5 సంవత్సరాలు పట్టింది. 2022లో 28 మిలియన్ల డాలర్ల ఆదాయాన్ని నివేదించిన ఓపెన్ఏఐ 2023లో నెలకు 100 మిలియన్ డాలర్ల ఆదాయానికి చేరుకుంది. ఓ వైపు చాలా టెక్ కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తూ పింక్ స్లిప్లు ఇస్తున్న సమయంలో ఓపెన్ఏఐ మాత్రం నియామకాలు చేపట్టడం విశేషం. చాట్జీపీటీ భారీ విజయం తర్వాత ఈ ఏడాది మార్చిలో జీపీటీ-4ను ఓపెన్ఏఐ తీసుకొచ్చింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్పై ఓ వైపు యూఎస్ సెనేట్లో చర్చలు జరుగుతున్న సమయంలో ఆల్ట్మన్ భారత్, ఇజ్రాయెల్, జపాన్, దక్షిణ కొరియా వంటి దేశాలకు వెళ్లి ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ప్రాముఖ్యత గురించి ప్రపంచ దేశాలకు అవగాహన కల్పించే ప్రయత్నం చేశారు. మళ్లీ సీఈవోగా.. బోర్డు సభ్యులతో విభేదాల కారణంగా ఆల్ట్మన్ ఓపెన్ ఏఐ కంపెనీ నుంచి వైదొలిగారు. గత నవంబర్ 17న బోర్డు ఆల్ట్మాన్ను కంపెనీ నుంచి తొలగించింది. ఈ ఘటన జరిగిన వెంటనే మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల ఆల్ట్మన్కు అండగా నిలిచారు. మైక్రోసాఫ్ట్లో అవకాశం ఇచ్చేందుకు ముందుకొచ్చారు. అయితే 5 రోజుల నాటకీయ పరిణామాల అనంతరం ఆయన మళ్లీ కంపెనీ సీఈవోగా నియమితులయ్యారు. -
చాట్జీపీటీకి పోటీగా అమెజాన్ చాట్బాట్ ‘క్యూ’ విడుదల.. కానీ
ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ జనరేటీవ్ ఏఐ చాట్బాట్ అమెజాన్ ‘క్యూ’ ని లాంచ్ చేసింది. చాట్జీటీపీని పోలి ఉండే ఈ చాట్బాట్ వ్యాపార కార్యకలాపాల్ని నిర్వహించేందుకు వీలుగా ఉంటుంది. ఇప్పటికే మైక్రోసాఫ్ట్, గూగుల్లు తమ ప్రొడక్ట్లలో జనరేటీవ్ ఏఐ టెక్నాలజీ ఉపయోగిస్తుండగా.. తాజాగా అమెజాన్ సైతం క్యూ చాట్బాట్ని అందుబాటులోకి తేవడం గమనార్హం. అమెజాన్ క్యూ 'కొత్త రకం జనరేటివ్ ఏఐ- పవర్డ్ అసిస్టెంట్'గా పరిచయం చేస్తుంది. ఇది ఉద్యోగుల ప్రశ్నలకు సమాధానం ఇవ్వడంతో పాటు కంపెనీ డేటాను ఉపయోగించి కంటెంట్ను రూపొందిస్తుంది. ‘‘మీ వ్యాపారానికి అనుగుణంగా పని చేయడానికి రూపొందించబడింది. మీరు మీ కంపెనీ సమాచార రిపోజిటరీలు, కోడ్, డేటా, ఎంటర్ప్రైజ్ సిస్టమ్లకు కనెక్ట్ చేయడం ద్వారా సంభాషణలు, సమస్యలను పరిష్కరించడానికి, కంటెంట్ను తయారు చేయొచ్చు. అంతేకాదు అమెజాన్ క్యూ ఉద్యోగులకు పనులను క్రమబద్ధీకరించడానికి, నిర్ణయాలు తీసుకోవడంతో పాటు సమస్యల పరిష్కారాల్ని వేగవంతం చేయడానికి, పనిలో సృజనాత్మకత, ఆవిష్కరణల కోసం ఉద్యోగులకు తక్షణ, సంబంధిత సమాచారం, సలహాలను అందిస్తుంది" అని అమెజాన్ తన బ్లాగ్ పోస్ట్లో పేర్కొంది. -
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో మీకు తిరుగులేదా? జీతం 83 కోట్లు!
చాట్జీపీటీ విడుదలతో ప్రపంచ వ్యాప్తంగా ఆర్టిపిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీకి డిమాండ్ భారీగా ఏర్పడింది. సోలో ప్రెన్యూర్ల నుంచి దిగ్గజ కంపెనీల వరకు ఏఐని వినియోగించేందుకు మొగ్గు చూపుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏఐ విభాగంలో నిష్ణాతులైన ఉద్యోగులకు ఆయా టెక్ కంపెనీలు పిలిచి మరీ ఉద్యోగాలిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఓపెన్ఏఐ సంస్థ గూగుల్లో పనిచేస్తున్న ఏఐ ఎక్స్పర్ట్స్కు కళ్లు చెదిరేలా ఆఫర్ను అందిస్తున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ముఖ్యంగా, గూగుల్ నుంచి తమ సంస్థలోకి వచ్చే ఏఐ నిపుణులకు ఏడాదికి రూ. 83 కోట్లు ఆఫర్ చేసినట్లు సమాచారం. అంతేకాదు వారిని ఆకట్టుకునేలా ప్రారంభ వేతనం 5 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.41 కోట్ల 60 లక్షల) నుంచి 10 మిలియన్ డాలర్ల (సుమారు రూ.83 కోట్లు) మధ్య జీతాలు ఇచ్చేందుకు సిద్ధమైంది. లీడ్జీనియస్, పంక్స్ అండ్ పిన్స్ట్రిప్స్ డేటా ఆధారంగా ఓపెన్ఏఐ ఫిబ్రవరి నాటికి గూగుల్, మెటాలో పనిచేసిన మొత్తం 93 మందిని నియమించుకుంది. వీరిలో 59 మంది గూగుల్ నుంచి, 34 మంది మెటా నుంచి వచ్చారు. ఓపెన్ఏఐ సూపర్ అలైన్మెంట్ టీమ్లో పనిచేసే సిబ్బంది కోసం అన్వేషిస్తుంది. ఓపెన్ఏఐలో ఉద్యోగాలు ఓపెన్ఏఐలో చేరే ఉద్యోగులకు ప్యాకేజీలో భాగంగా శాలరీలు, కంపెనీలో వాటాతో పాటు ఇతర ప్రయోజనాల్ని అందిస్తుంది. ఏఐ భద్రత, విమర్శనాత్మక ఆలోచన, మెషిన్ లెర్నింగ్, కోడింగ్ ప్రావీణ్యం పట్ల మక్కువ ఉన్న రీసెర్చ్ ఇంజనీర్లు, సైంటిస్ట్లు, మేనేజర్ పోస్ట్లు ఉన్నాయి. -
పనితీరు అద్భుతం..భారత్జీపీటీలో గూగుల్ భారీ పెట్టుబడులు!
ప్రపంచ వ్యాప్తంగా ఆర్టిఫిషియల్ టెక్నాలజీ హవా కొనసాగుతుంది. ఈ తరుణంలో ఓపెన్ఏఐ కంటే సమర్ధవంతంగా సేవలందిస్తున్న భారత్కు చెందిన ఏఐ స్టార్టప్ భారత్జీపీటీలో పెట్టుబడులు పెట్టేందుకు గూగుల్ సిద్ధమైంది. బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న కోరోవర్ ఈ ఏడాది ప్రారంభంలో చాట్జీపీటీ తరహాలో భారత్జీపీటీని విడుదల చేసింది. 12 కంటే ఎక్కువ భారతీయ భాషలతో పాటు 120 విదేశీ భాషల్లో సేవల్ని అందిస్తుంది. అయితే చాట్జీపీటీ కంటే భారత్ జీపీటీ పనితీరు అద్భతమంటూ టెక్నాలజీ నిపుణులు కొనియాడుతున్నారు. ఓపెన్ ఏఐ చాట్జీపీటీ 95 భాషల్లో సేవల్ని అందిస్తుంది. ఎక్కువ శాతం ఇంగ్లీష్లోనే యూజర్ల అవసరాల్ని తీరుస్తుంది. టెక్స్ట్ని హ్యాండిల్ చేసే చాట్జీపీ వలె కాకుండా ఫోటోలు, ఆడియో, వీడియో, మ్యాప్లతో సహా విభిన్న డేటా ఫార్మాట్లలో దీని సేవలు వినియోగించుకోవచ్చు. భారత్ జీపీటీ 90 శాతం ఖచ్చితత్వాన్ని కలిగి ఉందని కోరోవర్ తెలిపింది. ప్రస్తుతం వన్ బిలియన్ వినియోగదారులకు సేవలు అందిస్తోంది. ఈ తరుణంలో గూగుల్ కోరోవర్లో 4 బిలియన్లు పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైంది. దీంతో ఏఐ విభాగంలో భారత్ సైతం సత్తా చాటడంలో ఏమాత్రం అతిశయోక్తం కాదని టెక్నాలజీ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. -
Openai : ఓపెన్ఏఐలో ఆల్ట్మన్ ఉద్యోగం ఊడింది..ఇందుకేనా?
టెక్ ప్రపంచంలో సంచలనంగా మారిన శామ్ ఆల్ట్మన్ తొలగింపు కథ సుఖాంతమైంది. ఆయన తిరిగి ఓపెన్ ఏఐ సీఈఓగా వస్తున్నట్టు బోర్డు తెలిపింది. అలాగే బోర్డులో కొత్త సభ్యుల నియామకంపై సూత్రప్రాయమైన అంగీకారం కుదిరినట్టు పేర్కొంది. అయితే ఈ తరుణంలో శామ్ ఆల్ట్మన్ని ఓపెన్ఏఐని నుంచి తొలగించిన కారణాల్ని వివరిస్తూ పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ఓపెన్ఏఐ నుంచి ఆల్ట్మన్ని ఫైరింగ్ ఏపిసోడ్ తర్వాత.. ఓపెన్ ఏఐలోని రీసెర్చర్ల బృందం ప్రాజెక్ట్ క్యూ (క్యూ-స్టార్) గురించి ఆందోళన వ్యక్తం చేస్తూ బోర్డ్కు ఓ లెటర్ను రాశారు. ఆ లెటర్ ఆధారంగా రాయిటర్స్ ఓ కథనాన్ని వెలుగులోకి తెచ్చింది. ప్రాజెక్ట్ క్యూ (What is Project Q) అంటే ఏమిటి? శామ్ ఆల్ట్మన్ ఈ ఏడాది ప్రారంభంలో ఓపెన్ఏఐ కొత్త టెక్నాలజీ ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్( ఏజీఐ) గురించి ప్రస్తావించారు. ప్రాజెక్ట్ క్యూస్టార్ పేరుతో చాట్జీపీటీ తర్వాత ఓపెన్ఏఐ ఏజీఐ అనే టెక్నాలజీ మీద పనిచేస్తుందని, ఈ సాంకేతిక మనుషుల కంటే స్మార్ట్గా పనిచేస్తుందని వివరించారు. అంతేకాదు ఏజీఐ విజయవంతంగా ఎలా తయారు చేయగలిగారు? ఈ లేటెస్ట్ టెక్నాలజీ వినియోగంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వినియోగదారులు ఆర్ధికంగా ఎలాంటి పురోగతి సాధిస్తారు? వంటి విషయాల్ని ప్రస్తావించారు. అదే సమయంలో దాని వల్ల సమాజానికి, మనుషులకు ఎలాంటి నష్టం వాటిల్లుతుందో తెలిపారు. ఏజీఐని దుర్వినియోగం చేయడం వల్ల జరిగే తీవ్రమైన అనార్ధాలు, మానవాళి మనుగడకు ముప్పు వంటి అంశాలపై బహిర్ఘతంగా మాట్లాడారు. ఏజీఐ చాలా గొప్పది ‘ఏజీఐ చాలా గొప్పది. సమాజంలో జరిగే అభివృద్దిని అడ్డుకుంటుందని, లేదంటే అడ్డుకోవాలని ఏజీఐ కోరుకుంటుందని నేను నమ్మడం లేదు. బదులుగా, యూజర్లు ఏజీఐని ఎలా సమర్ధవంతంగా వినియోగించుకోవాలి..తద్వారా ఎలాంటి ప్రయోజనాల్ని పొందవచ్చనే అంశాన్ని దాని డెవలపర్లు గుర్తించాలి’ అని ఆల్ట్మన్ తన బ్లాగ్ పోస్ట్లో పేర్కొన్నారు. చర్చాంశనీయంగా అల్ట్మన్ తొలగింపు ఈ ఏజీఐ ప్రాజెక్ట్ వల్ల జరిగే ప్రమాదాల గురించి ఆల్ట్మన్ బహిరంగంగా వ్యాఖ్యలు చేయడాన్ని బోర్డ్ సభ్యులకు నచ్చలేదని తెలుస్తోంది. కాబట్టే ఓపెన్ఏఐ నుంచి శామ్ ఆల్ట్మన్ని తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారని నివేదికలు హైలెట్ చేశారు. కాగా ఏజీఐ టెక్నాలజీ వల్ల జరిగే అనార్ధాల గురించి దాని డెవలపర్లు రాసిన లెటర్ బోర్డ్ సభ్యులకు చేరకముందే.. ఆల్ట్మన్కి పింక్ స్లిప్ ఇవ్వడం చర్చాంశనీయంగా మారింది. -
కార్పొరేట్ సునామీ!
బోర్డు రూం కుట్రలు, కార్పొరేట్ దిగ్గజ సంస్థలు చేతులు మారడం వగైరాలు ప్రపంచానికి కొత్త కాదు. కానీ చాట్జీపీటీ మాతృసంస్థ ఓపెన్ ఏఐలో పుట్టుకొచ్చిన సునామీ అందరినీ దిగ్భ్రాంతి పరిచింది. చిత్రమేమంటే... ఏం జరిగిందో అందరూ అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తుండగానే అనేక మలుపులు తిరిగి అది కాస్తా చప్పున చల్లారింది. ఈ మొత్తం వ్యవహారమంతా కేవలం అయిదంటే అయిదే రోజుల్లో పూర్తయింది. డైరెక్టర్ల బోర్డు బయటకు నెట్టేసిన వ్యక్తే దర్జాగా వెనక్కి రావటం, బోర్డు సభ్యులతో సహా కంపెనీలో ఎవరినైనా తొలగించే అధికారం చేజిక్కించుకోవటం, ఆయన్ను బయటికి పంపినవారే చివరకు పదవులు కోల్పోయి దిక్కుతోచని స్థితిలో పడటం ఈ వివా దానికి కొసమెరుపు. కేవలం నలుగురు డైరెక్టర్లకు వ్యతిరేకంగా 95 శాతంమంది సిబ్బంది తిరగ బడటం, తామంతా రాజీనామా చేస్తామమని హెచ్చరించటం, వారితో ఇన్వెస్టర్లు సైతం చేతులు కలపటం కనీవినీ ఎరుగనిది. కృత్రిమ మేధ (ఏఐ) సాయంతో అద్భుతాలు సృష్టించగల ఉపకరణాలను సృష్టించటమే ధ్యేయంగా శామ్యూల్ ఆల్ట్మాన్ 2015లో స్టార్టప్ కంపెనీ ఓపెన్ ఏఐ స్థాపించాడు. మరో నాలుగేళ్లకు మైక్రోసాఫ్ట్, ట్విటర్ సహా కొన్ని సంస్థలు, కొందరు వ్యక్తులూ అందులో పాలుపంచుకున్నారు. దాని పరిశోధనలు స్వల్ప కాలంలోనే అద్భుత ఆవిష్కరణలకు దారితీసి ఓపెన్ ఏఐ సిలికాన్ వ్యాలీలో 8,000 కోట్ల డాలర్ల దిగ్గజ సంస్థగా ఆవిర్భవించింది. అది ఏడాదిక్రితం తీసుకొచ్చిన చాట్జీపీటీ స్మార్ట్ ఫోన్ తర్వాత అంతటి గొప్ప ఆవిష్కరణగా గుర్తింపుపొందింది. అంతేకాదు, అది మున్ముందు మానవాళి మనుగడకు సైతం ముప్పుగా పరిణమించవచ్చన్న భయాందోళనలూ బయల్దేరాయి. దాన్ని అదుపు చేసేందుకు ఎలాంటి చట్టాలు అవసరమో ప్రపంచ దేశాధి నేతలంతా చర్చించుకుంటున్నారు. అమెరికా, బ్రిటన్, యూరొపియన్ యూనియన్లు ఇప్పటికే చట్టాలు చేశాయి. మన దేశం కూడా ఆ పనిలోనే వుంది. కృత్రిమ మేధతో దేశదేశాల పౌరుల గోప్య తకూ, ముఖ్యంగా మహిళల, పిల్లల భద్రతకూ రాగల ముప్పు గురించిన భయసందేహాలు అంతటా ఆవరించాయి. రక్షణ రంగ వ్యవస్థల్లోకి, మరీ ముఖ్యంగా సైనిక స్థావరాల్లోకి ఇది ప్రవేశిస్తే రెప్ప పాటులో భూగోళం బూడిదగా మారుతుందన్న హెచ్చరికలు వస్తూనే వున్నాయి. సురక్షితమైన కృత్రిమ మేధ మాత్రమే ప్రపంచానికి అవసరమంటూ అల్ట్రూయిజం వంటి టెక్ ఉద్యమాలూ బయల్దేరాయి. ఈ నేపథ్యంలో అసలు ఓపెన్ ఏఐలో ఏం జరిగిందన్న ఆసక్తి, ఆత్రుత వుండటం సర్వసాధారణం. విషాదమేమంటే సంస్థ ఎగ్జిక్యూటివ్గా వున్న శామ్ ఆల్ట్మాన్కూ, డైరెక్టర్ల బోర్డుకూ మధ్య ఏర్పడ్డ లడాయి ఏమిటన్నది వెల్లడికాలేదు. ఆల్ట్మాన్ దేన్నీ సూటిగా, స్పష్టంగా చెప్పటం లేదని ఇప్పుడు నిష్క్రమించిన డైరెక్టర్లు ఆరోపించారు. ఆయన దేన్ని దాచటానికి ప్రయత్నించాడో, ఏ విషయంలో వారికి స్పష్టత రావటంలేదో వివరించలేదు. సరిగ్గా ఇదే కీలకమైనది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వ్యక్తమవుతున్న భయాందోళనలకూ, ఈ వివాదానికీ సంబంధం వుండే అవకాశం లేకపోలేదని కొందరి విశ్లేషణ. కృత్రిమ మేధతో పరిశోధనలు సాగిస్తున్నది ఓపెన్ ఏఐ మాత్రమే కాదు... దాంతోపాటు అమెరికాలోనే ఆంత్రోపిక్, స్కేల్ ఏఐ, విజ్.ఏఐ, డీప్ 6 వంటి 50 సంస్థ లున్నాయి. ఇవిగాక మన దేశంతోపాటు అనేక దేశాల్లో పలు సంస్థలు కృత్రిమ మేధపై పని చేస్తున్నాయి. ఎలాంటి నిబంధనలూ, నియంత్రణలూ లేని వర్తమాన పరిస్థితుల్లో ఆర్నెల్లపాటు కృత్రిమ మేధ పరిశోధనలపై మారటోరియం విధించాలని టెక్ నిపుణులు కొందరు ఆమధ్య సూచించారు. కృత్రిమ మేధలో పరిశోధనలు చేస్తున్న ఎలిజార్ యుడ్కోవ్స్కీ ఈ టెక్నాలజీ తెలివి తేటల్లో మనుషుల్ని మించిపోతుందని, చివరకు వారినే మింగేస్తుందని, చివరకు మనమంతా నియాండర్తల్ యుగానికి తిరోగమించటం ఖాయమని జోస్యం చెప్పాడు. అయితే కృత్రిమ మేధతో రాగల ప్రమాదాల గురించి కొందరు అతిగా మాట్లాడుతున్నారన్న విమర్శలూ వున్నాయి. మానవాళికి ముప్పు తెచ్చే అగ్ని పర్వతాలు, గ్రహశకలాలు, అణ్వాయుధా లకన్నా అదేమీ పెద్ద ప్రమాదకారి కాదని వారి వాదన. భయాందోళనల మాటెలావున్నా దాని శక్తి సామర్థ్యాలు, ఉపయోగాలు కాదనలేనివి. రెండువేల ఏళ్లనాడు వర్ధిల్లిన పురాతన లిపుల్లో ఏం నిక్షిప్తమైవున్నదో వెలికితీసింది కృత్రిమ మేధ ఆధారంగా అందుబాటులోకి వచ్చిన ఉపకరణాలే. చరిత్రలో తొలికాలపు గ్రీకులు రాసినదేమిటో అర్థం చేసుకోవటానికి మూడువేల యేళ్లు పట్టింది. మయన్లు లిఖించిన పదాల కూర్పులోని రహస్యమేమిటో తెలుసుకోవటానికి రెండు శతాబ్దాలు పట్టింది. కానీ ఏఐ అలాంటి సంక్లిష్టమైన లిపులను క్షణాల్లో తేటతెల్లం చేస్తోంది. అందువల్ల ప్రాచీన మానవుల జీవన విధానంపై మన అవగాహన పెరిగింది. ఇక వైద్యపరంగా కృత్రిమ మేధ సాధిస్తున్నది అపారం. శామ్ ఆల్ట్మాన్కు గురు సమానుడు స్టీవ్ జాబ్స్. మరొకరితో కలిసి ఆయన నెలకొల్పిన యాపిల్ సంస్థకు ఏరికోరి సీఈఓగా తెచ్చుకున్న వ్యక్తే 1985లో ఆ సంస్థనుంచి స్టీవ్ జాబ్స్ను వెళ్ల గొట్టడం, తదనంతర పరిణామాల్లో జాబ్స్ తిరిగి అదే సంస్థకు రావటం చరిత్ర. ఇప్పుడు ఆల్ట్ మాన్కు కూడా అదే జరిగింది. ఏదేమైనా ఓపెన్ఏఐలో జరిగిందేమిటో, పరిశోధనల దశ, దిశ ఎలా వున్నాయో తెలుసుకోవటం ప్రపంచ ప్రజానీకం హక్కు. అది తేటతెల్లం చేయాల్సిన బాధ్యత సంస్థ లపై వుంది. కేవలం మానవాళి మంచికి మాత్రమే ఉపయోగపడేలా, ప్రభుత్వాలతో సహా ఎవరూ ఏఐని దుర్వినియోగం చేయకుండా కట్టుదిట్టమైన నియంత్రణలు విధించటం తక్షణావసరం. -
మళ్లీ ఓపెన్ఏఐలోకి సామ్ ఆల్ట్మన్
శాన్ ఫ్రాన్సిస్కో: కృత్రిమ మేధ(ఏఐ) రంగంలో సంచలనం సృష్టించిన చాట్జీపీటీ తయారీసంస్థ ఓపెన్ఏఐ మరోసారి వార్తల్లో నిలిచింది. సీఈవో బాధ్యతల నుంచి తప్పుకున్న సామ్ ఆల్ట్మన్ను తిరిగి అదే పదవిలోకి తీసుకుంటున్నట్లు ఓపెన్ఏఐ తాజాగా ప్రకటించింది. తనను తొలగించిన కంపెనీ బోర్డును పునర్వ్యవస్థీకరించాలని సామ్ పెట్టిన షరతుకు ఓపెన్ఏఐ ఒప్పుకున్నట్లు సమాచారం. ఇందుకు అనుగుణంగానే కొత్తగా బ్రెట్ టైలర్ నేతృత్వంలో నూతన బోర్డును ఏర్పాటుచేస్తున్నట్లు సంస్థ తెలిపింది. ఇటీవల బహిష్కరణ తర్వాత సామ్ను మైక్రోసాఫ్ట్కు చెందిన నూతన అడ్వాన్స్డ్ ఏఐ పరిశోధనా బృందంలో చేర్చుకుంటున్నట్లు మైక్రోసాఫ్ట్ సారథి సత్య నాదెళ్ల ప్రకటించడం తెల్సిందే. సామ్ను మళ్లీ సంస్థలోకి తీసుకోవాలని వాటాదారుల నుంచి తీవ్ర ఒత్తిడి రావడంతో అతని షరతులకు సంస్థ ఒప్పుకోకతప్పలేదని తెలుస్తోంది. సంస్థలోకి పునరాగమనాన్ని సామ్ ధ్రువీకరించారు. మళ్లీ కృత్రిమ మేధ విభాగంలో అవిశ్రాంతంగా పనిచేస్తానని ప్రకటించారు. -
ఓపెన్ఏఐ వద్దంటే.. మైక్రోసాఫ్ట్ రమ్మంది!
సంస్థలో జరుగుతున్న అంతర్గత చర్చల్లో నిజాయతీ పాటించడం లేదని, బోర్డు తీసుకునే నిర్ణయాలకు అతడు అడ్డుపడుతున్నాడని.. ఓపెన్ఏఐకి నాయకత్వం వహించే అతడి సామర్థ్యంపై బోర్డు నమ్మకం కోల్పోయిందనే కారణంగా 'ఓపెన్ఏఐ' (OpenAI) 'శామ్ ఆల్ట్మన్'ను సీఈఓ పదవి నుంచి తొలగించింది. కంపెనీ 'శామ్ ఆల్ట్మన్'ను సీఈఓ పదవి నుంచి తొలగించిన వెంటనే సంస్థ కో-ఫౌండర్, ప్రెసిడెంట్ 'గ్రెగ్ బ్రాక్మన్' తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఎక్స్ (ట్విటర్) ద్వారా ప్రకటించారు. ఒకే రోజులు జరిగిన ఈ సంఘటనలు టెక్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారిపోయింది. ఓపెన్ఏఐ నుంచి బయటకు వచ్చిన తరువాత ప్రముఖ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ (Microsoft)లో వారిద్దరూ (శామ్ ఆల్ట్మన్ & గ్రెగ్ బ్రాక్మన్) ఎమ్మెట్ షియర్ అండ్ ఓఏఐ (Emmett Shear and OAI) కొత్త బృందానికి నాయకత్వం వహించనున్నట్లు సీఈఓ 'సత్య నాదెళ్ళ' తన ఎక్స్ (ట్విటర్) ఖాతా ద్వారా వెల్లడించారు. ఇదీ చదవండి: సీఈఓను తొలగించిన వెంటనే.. ప్రెసిడెంట్ రాజీనామా - ట్వీట్ వైరల్ ఓపెన్ఏఐతో మా భాగస్వామ్యాన్ని కొనసాగిస్తామని.. శామ్ ఆల్ట్మన్, గ్రెగ్ బ్రాక్మన్ ఇద్దరూ మైక్రోసాఫ్ట్లో చేరబోతున్నారనే వార్తను పంచుకోవడం చాలా సంతోషంగా ఉందని.. వారి విజయాలకు అవసరమైన వనరులను అందించడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటామని సత్య నాదెళ్ల వెల్లడించారు. We remain committed to our partnership with OpenAI and have confidence in our product roadmap, our ability to continue to innovate with everything we announced at Microsoft Ignite, and in continuing to support our customers and partners. We look forward to getting to know Emmett… — Satya Nadella (@satyanadella) November 20, 2023 -
ఏఐని వాడాడు.. ఉద్యోగం ఊడింది!
కృతిమ మేధ చాట్బాట్ చాట్జీపీటీని నమ్ముకుని ఓ యువ న్యాయవాది తన ఉద్యోగం పోగొట్టుకున్నాడు. ప్రముఖ లా సంస్థలో పనిచేస్తున్న సదరు లాయర్ నిర్ణీత గడువులోగా ఇచ్చిన పనిని పూర్తి చేయాలని బాస్ హుకుం జారీ చేశాడు. సమయం గడిచి పోతుంది. పని కావడం లేదు. పైగా ఒత్తిడి. దీంతో ఏం చేయాలో పాలుపోని ఆ న్యాయవాది చాట్జీపీటీని వినియోగించి ఉద్యోగం కోల్పోవాల్సి వచ్చింది. మనిషి తెలివితేటలకు, న్యాయ నిర్ణయ ప్రక్రియలో మానవ జోక్యానికి కృత్రిమ మేధస్సు ఓ ప్రత్యామ్నాయం కాదని మరోసారి స్పష్టమైంది. అమెరికా కొలరాడో కేంద్రంగా న్యాయ సంబంధిత సర్వీసుల్ని అందించే ‘బేకర్ లా గ్రూప్’లో జకారియా క్రాబిల్ విధులు నిర్వహించేవాడు. ఆ సమయంలో తన ఆఫీస్ పని నిమిత్తం చాట్జీపీటీని వినియోగించడం జకారియాకు పరిపాటిగా మారింది. అయితే ఈ ఏడాది మే నెలలో కాబ్రిల్కు కస్టమర్ల కేసుల్ని కులంకషంగా రీసెర్చ్ చేసి.. గతంలో ఇదే తరహా కేసుల్ని పరిగణలోకి తీసుకుని ప్రత్యేకంగా డ్రాఫ్ట్ని తయారు చేయాలి. వాటిని కొలరాడో కోర్టులో సమర్పించాల్సి ఉందని, వెంటనే ఆ పనుల్ని పూర్తి చేయాలని బాస్ ఆదేశించాడు. పని భారాన్ని తగ్గించుకుంటూ.. కస్టమర్ల కేసుల్ని రీసెర్చ్ చేసి డ్రాఫ్ట్ను తయారు చేసేలా కాబ్రిల్ చాట్జీపీటీని ఆశ్రయించాడు. కాబ్రిల్ అడిగిన ప్రశ్నలకు చాట్జీపీటీ ఇచ్చిన సమాధానాల్ని ఆధారంగా తీసుకుని కొన్ని కేసులకు సంబంధించి ప్రత్యేక డ్రాఫ్ట్ను తయారు చేశాడు. అనంతరం తన బాస్తో కలిసి.. తయారు చేసిన ఫైల్స్ని కొలరాడో కోర్టుకు సమర్పించాడు. కాబ్రిల్ కోర్టుకు సమర్పించిన కేసు ఫైల్స్ను చాట్జీపీటీని వినియోగించి తయారు చేసినట్లు తేలింది. అంతేకాదు డ్రాఫ్ట్లో పలు కీలక అంశాల్ని గతంలో జరిగిన కేసుల్ని ఉదహరిస్తూ చాట్జీపీటీని ప్రస్తుత కేసులకు అనుగుణంగా ఇచ్చిన సమాధానాల్లో తప్పులు దొర్లాయి. ఆ సమాధానాలు సరైనవి కాదని తెలిసి కూడా కేసుల్లోని డ్రాఫ్ట్లను తయారు చేశాడు. ఇదే అంశాన్ని న్యాయమూర్తి ఎదుట అంగీకరించాడు. ఫలితంగా ఉద్యోగం పోగొట్టుకున్నాడు. తాను ఉద్యోగాన్ని కోల్పోయినప్పటికీ, న్యాయవాదుల సామర్థ్యాన్ని పెంచడానికి ఏఐని సమర్ధవంతంగా వినియోగించుకోవచ్చని క్రాబిల్ విశ్వసిస్తున్నాడు. చట్టపరమైన సేవల కోసం ఏఐని ఉపయోగించి సొంత కంపెనీని కూడా ప్రారంభించాడు. -
ఓపెన్ఏఐలో ఆసక్తికర పరిణామాలు, సీఈఓగా ఆల్ట్మన్?
చాట్జీపీటీ సృష్టికర్త, ఓపెన్ ఏఐ మాజీ సీఈఓ శామ్ అల్ట్మన్ సీఈఓగా బాధ్యతలు స్వీకరించనున్నారా? శనివారం ఆల్ట్మన్ను సీఈఓ పదవి నుంచి తొలగిస్తూ తీసుకున్న నిర్ణయం టెక్ ప్రపంచంలో చర్చకు దారి తీసింది. అయితే ఆల్ట్మన్ను మళ్లీ తిరిగి తీసుకోవాలని ఓపెన్ ఏఐ ప్రధాన పెట్టుబడి దారులు ఒత్తిడి తెస్తున్నారా? అంటే అవుననే అంటున్నాయి తాజా పరిణామాలు ఓపెన్ ఏఐ బోర్డ్ సభ్యులు సంస్థ సీఈఓ శామ్ ఆల్ట్మన్ని తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న పలువురు ఇన్వెస్టర్లు బోర్డ్ సభ్యులతో చర్చిస్తున్నారని పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. శామ్ ఆల్ట్మన్ను తొలగించే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఓపెన్ఏఐ ఇన్వెస్టర్లు కంపెనీ బోర్డుపై ఒత్తిడి తెస్తున్నారంటూ కథనాలు వెలువడ్డాయి. ఇప్పటికే ఆల్ట్మన్ని సీఈఓగా నియమించాలని కోరుతూ పెట్టుబడి దారులు ఓపెన్ ఏఐలో అతిపెద్ద వాటాదారుగా ఉన్న మైక్రోసాఫ్ట్తో సైతం చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. మైక్రోసాఫ్ట్ సైతం మద్దతు ఆల్ట్మన్కు ఉద్వాసన పలికిన ఓపెన్ఓఐ బోర్డు సభ్యులు తాత్కాలిక సీఈవోగా మిరా మురాటిని ఎంపిక చేసుకున్నారు. బోర్డు నిర్ణయం మేరకు మిరా మురాటికి మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యనాదెళ్ల మద్దతు పలికారు. అయితే, తాజాగా మళ్లీ సీఈఓగా తిరిగి ఆల్ట్మన్ తీసుకోవాలన్న పెట్టుబడిదారుల నిర్ణయాన్ని సమర్ధిస్తూ సత్యనాదెళ్ల ఓపెన్ ఏఐ మాజీ సీఈఓతో మంతనాలు జరుపుతున్నట్లు సమాచారం. ఓపెన్ ఏఐ సిబ్బంది హెచ్చరికలు ఓపెన్ ఏఐ సీఈఓగా శామ్ ఆల్ట్మన్ను సీఈఓగా తీసుకోవాలని, లేదంటే సంస్థ నుంచి బయటకు వెళ్లిపోతామంటూ సిబ్బంది బోర్డు సభ్యులకు హెచ్చరికలు జారీ చేసినట్లు నివేదికలు హైలెట్ చేస్తున్నాయి. ఆల్ట్మన్ సొంత వెంచర్ ఓపెన్ఏఐతో జరుగుతున్న చర్చలు విఫలమైతే ఆల్ట్మన్ తన సొంత వెంచర్ను ప్రారంభించాలని యోచిస్తున్నట్లు కొన్ని నివేదికలు పేర్కొన్నాయి. ఆయనకు మద్దతుగా మాజీ ఓపెన్ఏఐ ప్రెసిడెంట్ గ్రెగ్ బ్రోక్మాన్ సైతం అదే బాటలో ఉన్నారనని నివేదికలు పేర్కొన్నాయి. -
ఓపెన్ ఏఐ సహ వ్యవస్థాపకుడికి ఉద్వాసన
శాన్ ఫ్రాన్సిస్కో: చాట్ జీపీటీకి రూపకల్పన చేసిన ఓపెన్ ఏఐ కంపెనీ సహవ్యవస్థాపకుడు, సీఈవో శామ్ ఆల్ట్మన్కు ఆ సంస్థ ఉద్వాసన పలికింది. కంపెనీ బోర్డుకు విశ్వాసం కలిగేలా ఆయన వ్యవహరించడం లేదని ఓపెన్ ఏఐ ఒక ప్రకటనలో తెలిపింది. ఓపెన్ ఏఐకి సారథిగా ఆయన సామర్థ్యంపై కంపెనీ బోర్డుకు విశ్వాసం పోయిందని పేర్కొంది. ఆయన స్థానంలో ఓపెన్ ఏఐ చీఫ్ టెక్నాలజీ అధికారిణి మిరా మురాటికి తాత్కాలిక సీఈవో బాధ్యతలను అప్పగిస్తున్నట్లు తెలిపింది. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని ప్రకటించింది. -
సీఈఓను తొలగించిన వెంటనే.. ప్రెసిడెంట్ రాజీనామా - ట్వీట్ వైరల్
చాట్జీపీటీ సృష్టి కర్త, ఓపెన్ఏఐ సీఈఓ 'శామ్ ఆల్ట్మన్'ను సంస్థ సీఈఓగా తొలగించిన తరువాత.. కంపెనీ కో-ఫౌండర్, ప్రెసిడెంట్ 'గ్రెగ్ బ్రాక్మన్' కంపెనీకి రాజీనామా చేసాడు. ఓపెన్ఏఐలో జరిగిన ఈ పరిణామాలు టెక్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఆల్ట్మన్ బోర్డులో జరుగుతున్న అంతర్గత చర్చల్లో నిజాయతీ పాటించడం లేదని సరైన సమాచారం పంచుకోవడం లేదని బోర్డు తీసుకునే నిర్ణయాలకు అతడు అడ్డుపడుతున్నాడని.. ఓపెన్ ఏఐకి నాయకత్వం వహించే అతడి సామర్థ్యంపై బోర్డు నమ్మకం లేకపోవడంతోనే తొలగించినట్లు వెల్లడించింది. టెక్ పరిశ్రమలో ఎన్నో అద్భుతాలు సృష్టించిన శామ్ ఆల్ట్మన్ను కంపెనీ తొలగించిన కొన్ని గంటల వ్యవధిలోనే బ్రాక్మాన్ సోషల్ మీడియాలో తన రాజీనామాను ప్రకటిస్తూ.. ఎనిమిది సంవత్సరాల క్రితం నా అపార్ట్మెంట్లో కంపెనీ ప్రారంభించినప్పటి నుంచి అందరూ కలిసి ఇంత పెద్ద సామ్రాజ్యం సృష్టించుకున్నాము. ఇది గర్వించదగ్గ విషయం అంటూ ట్వీట్ చేశారు. ఇదీ చదవండి: ఓపెన్ఏఐ కొత్త సీఈఓ.. ఎవరీ 'మీరా మురాటి'? ఈ రోజు వచ్చిన వార్తలు నన్ను ఎంతగానో కలచి వేశాయని, ఈ కారణంగానే రాజీనామా చేస్తున్నట్లు స్పష్టం చేస్తూ.. మీ అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాను, మానవాళి అందరికీ ప్రయోజనం చేకూర్చే సురక్షితమైన AGIని సృష్టించే లక్ష్యాన్ని నేను విశ్వసిస్తూనే ఉన్నాను అంటూ వెల్లడించాడు. ఇది ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. After learning today’s news, this is the message I sent to the OpenAI team: https://t.co/NMnG16yFmm pic.twitter.com/8x39P0ejOM — Greg Brockman (@gdb) November 18, 2023 -
ఓపెన్ఏఐ కొత్త సీఈఓ.. ఎవరీ 'మీరా మురాటి'?
OpenAI CEO: 'చాట్జీపీటీ'(ChatGPT) సృష్టి కర్త 'శామ్ ఆల్ట్మన్'ను సీఈఓగా ఓపెన్ఏఐ తొలగించిన వెంటనే.. ఈ బాధ్యతలను తాత్కాలికంగా కంపెనీ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ 'మీరా మురాటి' (Mira Murati) స్వీకరించింది. ఓపెన్ఏఐ కొత్త సీఈఓ మీరా ఎవరు? ఆమె బ్యాగ్రౌండ్ ఏంటనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. అల్బేనియాలో జన్మించిన మీరా మురాటి ఉన్నత చదువులు కోసం 16 ఏళ్ల వయసులోనే కెనడాకు వెళ్ళింది. డార్ట్మౌత్ కాలేజీలో అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థిగా ఉన్నప్పుడే హైబ్రిడ్ రేస్ కారును నిర్మించారు. మెకానికల్ ఇంజనీర్ పూర్తి చేసిన ఈమె టెస్లాలో స్టూడెంట్ ఇంటర్న్గా పనిచేసి మోడల్ ఎక్స్ వాహనం తయారు చేయడంలో కీలకపాత్ర పోషించింది. ఆ తరువాత 2018లో ఓపెన్ఏఐలో చేరి సూపర్కంప్యూటింగ్పై పని చేయడం ప్రారంభించింది. అంతకంటే ముందు లీప్ మోషన్లో రెండేళ్లు పనిచేసింది. 2022లో ఆమె చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్గా పదోన్నతి పొందింది. టెక్నాలజీ మీద మంచి పట్టు, వ్యాపారంలో మెళకువలు కలిగిన 'మీరా మురాటి' కంపెనీ వృద్ధికి దోహదపడుతుందని విశ్వసించి తాత్కాలిక సీఈఓ బాధ్యతలు అప్పగించారు. త్వరలోనే అధికారికంగా సీఈఓ ఎవరనేది సంస్థ వెల్లడిస్తుంది. ఇదీ చదవండి: చాట్జీపీటీ సృష్టికర్తనే తొలగించిన ఓపెన్ఏఐ.. కారణం ఇదే! శామ్ ఆల్ట్మన్ను తొలగించడానికి కారణం బోర్డుతో జరుగుతున్న అంతర్గత చర్చల్లో నిజాయతీ పాటించడం లేదని సరైన సమాచారం పంచుకోవడం లేదని బోర్డు తీసుకునే నిర్ణయాలకు అతడు అడ్డుపడుతున్నాడని.. ఓపెన్ఏఐకి నాయకత్వం వహించే విషయంలో అతడి సామర్థ్యంపై బోర్డుకు నమ్మకం లేకపోవడం వల్ల సీఈఓగా తొలగించింది. -
చాట్జీపీటీ సృష్టికర్తనే తొలగించిన ఓపెన్ఏఐ.. కారణం ఇదే!
అతి తక్కువ కాలంలోనే పెను సంచలనం సృష్టించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ 'చాట్జీపీటీ' (ChatGPT) గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. అంతటి అడ్వాన్డ్ టెక్నాలజీని రూపొందించిన 'శామ్ ఆల్ట్మన్' (Sam Altman) కంపెనీ గట్టి షాక్ ఇచ్చింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. కారణం ఇదే.. ఓపెన్ ఏఐ(OpenAI) సంస్థ 'శామ్ ఆల్ట్మన్'ను సీఈవో బాధ్యతల నుంచి తొలగిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. మైక్రోసాఫ్ట్ ఆర్థిక సహకారం ఉన్న కంపెనీ ఆయనను విశ్వసించకపోవడమే సీఈఓగా తొలగించడానికి ప్రధాన కారణమని ఒక ప్రకటనలో పేర్కొంది. అంతే కాకుండా.. ఆల్ట్మన్ బోర్డుతో జరుగుతున్న అంతర్గత చర్చల్లో నిజాయతీ పాటించడం లేదని సరైన సమాచారం పంచుకోవడం లేదని బోర్డు తీసుకునే నిర్ణయాలకు అతడు అడ్డుపడుతున్నాడని.. ఓపెన్ ఏఐకి నాయకత్వం వహించే అతడి సామర్థ్యంపై బోర్డుకు ఇక ఏమాత్రం నమ్మకం లేదని కంపెనీ వెల్లడించింది. తాత్కాలిక సీఈఓగా.. ప్రస్తుతం శామ్ ఆల్ట్మన్ స్థానంలో తాత్కాలికంగా కంపెనీ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ 'మిరా మురాటీ' సీఈవోగా వ్యవహరిస్తారని కంపెనీ ప్రకటించింది. త్వరలోనే అధికారికంగా సీఈఓ ఎవరనేది సంస్థ ప్రకటించనుంది. ఆల్ట్మన్ తొలగింపు నిర్ణయం టెక్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇదీ చదవండి: ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి సంచలన వ్యాఖ్యలు.. సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావడం.. కంపెనీ సీఈఓ పదవి పోయిన తరువాత ఆల్ట్మన్ స్పందిస్తూ.. 'ఓపెన్ఏఐలో పని చేయడం తనకు చాలా ఇష్టమని, ఎంతోమంది ప్రతిభావంతులతో పనిచేయడం సంతోషాన్ని ఇచ్చిందని' తన అధికారిక ట్విటర్ ఖాతా ద్వారా పోస్ట్ చేశారు. i loved my time at openai. it was transformative for me personally, and hopefully the world a little bit. most of all i loved working with such talented people. will have more to say about what’s next later. 🫡 — Sam Altman (@sama) November 17, 2023 -
ఆరోగ్యం కోసం నవవిధ మార్గాలు - చాట్జీపీటీ సలహాలు
ChatGPT For Your Health: ప్రపంచ వ్యాప్తంగా అతి తక్కువ కాలంలో అత్యంత ప్రజాదరణ పొందిన 'ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్' (AI) ప్రతి ప్రశ్నకు సమాధానాలు అందిస్తూ వినియోగదారులను తెగ ఆకర్శించేస్తోంది. ఇప్పటికే మనం చాట్జీపీటీ సాయంతో రెజ్యూమ్ ఎలా ప్రిపేర్ చేయాలి, ఇంటర్వ్యూకు ఎలా సిద్దమవ్వాలనే విషయాలు తెలుసుకున్నాం. ఈ కథనంలో ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో చాట్జీపీటీ ఎలా సహాయం చేస్తుంది? అనే వివరాలు వివరంగా తెలుసుకుందాం. వర్కౌట్ ప్లాన్స్ ఆరోగ్యం అనగానే అందరికి గుర్తొచ్చేది ఫిట్నెస్. కాబట్టి ఫిట్నెస్ విషయంలో మీకు కావలసిన సలహాలను చాట్జీపీటీ ద్వారా పొందవచ్చు. అయితే ఇక్కడ గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే.. మీ ప్రశ్నను బట్టి సమాధానం లభిస్తుంది. మీకు కావలసిన విషయాలను సర్చ్ బాక్స్లో ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే.. సమాధానం వచ్చేస్తుంది. ఇంట్లోనే వ్యాయామం చేసుకోవడానికి టిప్స్, కార్డియో ఫిట్నెస్ కోసం ఎలాంటి ఎక్స్సర్సైజ్ చేయాలి, కేవలం 15 నిమిషాల్లో చేయదగిన బెస్ట్ ఎక్స్సర్సైజ్ ఏంటి అనే విషయాలను గురించి మీరు సులభంగా తెలుసుకోవచ్చు. ఆహారం గురించి ప్లాన్స్ ఆరోగ్యం ప్రధానంగా మనం తీసుకునే ఆహారం మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఆరోగ్యకరమైన, రోజూ తీసుకోవాల్సిన ఆహారం గురించి తెలుసుకోవడానికి చాట్జీపీటీ ఉపయోగపడుతుంది. ప్రస్తుతం చాలామంది బిజీ లైఫ్లో ఏది పడితే అది తినేసి ఇబ్బందులు పడుతుంటారు. అలాంటి వాటికి మంగళం పాడటానికి టెక్నాలజీ ఉపయోగించుకోవచ్చు. చాట్జీపీటీ సహాయంతో ఆరోగ్యకరమైన ఆహారం గురించి ప్లాన్స్ రూపొందించుకోవచ్చు. మీ బడ్జెట్ పరిమితులను దృష్టిలో ఉంచుకుని మాంసాహారమా? లేక శాఖాహారమా? అనేదానికి సంబంధించి ఒక లిస్ట్ తయారు చేసుకోవడానికి ఈ టెక్నాలజీ చాలా ఉపయోగపడుతుంది. మంచి అలవాట్లు ప్రస్తుతం అనేక టెన్షన్స్ కారణంగా చాలామంది సరిగ్గా నిద్రపోలేకపోతున్నారు. కాబట్టి నేను తప్పకుండా 8 గంటలు నిద్రపోవాలనుకుంటున్నాను, దానికి తగిన సలహాలు ఇవ్వమని చాట్జీపీటీని అడగవచ్చు. మీ ప్రశ్నకు తగిన విధంగా సమాధానం అందిస్తుంది. అది నచ్చితే మీరు పాటించవచ్చు. మైండ్ఫుల్నెస్ అండ్ మెడిటేషన్ మనసు ప్రశాంతంగా ఉండగానే మెడిటేషన్ చాలా అవసరం. దీన్ని దృష్టిలో ఉంచుకుని కొందరు డబ్బు ఖర్చు చేసి సంబంధిత క్లాసుల్లో చేరటం వంటివి చేస్తుంటారు. ఇవన్నీ అవసరం లేకుండానే చాట్జీపీటీ మీకు మంచి సలహాలు అందిస్తుంది. మైండ్ఫుల్నెస్ కోసం మంచి ఆలోచనలు చేయడం, ప్రకృతిని ఆస్వాదిస్తూ నడవండం, పుస్తకాలు చదవడం వంటి మరిన్ని సలహాలు ఉచితంగా పొందవచ్చు. జర్నలింగ్ ప్రాంప్ట్ జర్నలింగ్ అనేది మైండ్ఫుల్నెస్ సాధనకు అత్యంత ప్రభావవంతమైన మార్గం. దీని కోసం కూడా చాట్జీపీటీ మంచి సలహాలను అందిస్తుంది. మెడికల్ సింప్టమ్ చెకర్ ఏవైనా ఆరోగ్య లక్షణాలను గుర్తించడం లేదా అర్థం చేసుకోవడంలో మీకు సహాయం చేయడానికి.. ఆ తరువాత తీసుకోవాల్సిన జాగ్రత్తలను గురించి వివరించడానికి చాట్జీపీటీ వర్చువల్ సింప్టమ్ చెకర్గా ఉపయోగపడుతుంది. చాట్జీపీటీ సలహాలను బట్టి వైద్య సంరక్షణ అవసరమా, లేదా అనేది కూడా మీరు నిరణయించుకోవచ్చు. ఆరోగ్య సలహాలు మీకున్న లక్షణాలను బట్టి కావలసిన వైద్య సలహాలను చాట్జీపీటీ ద్వారా తెలుసుకోవచ్చు. మీ సందేహాలన్నీ అడగవచ్చు, మీ వ్యక్తిగత ఆరోగ్య అవసరాలకు అనుగుణంగా సలహాలను పొందవచ్చు. అపాయింట్మెంట్లు, వైద్య నిపుణులను సంప్రదించాల్సిన అవసరం లేకుండానే ప్రయోజనాలను పొందవచ్చు. మందులను (మెడిసిన్స్) అర్థం చేసుకోవడం మందులను సరిగ్గా ఉపయోగించుకోకపోతే.. చాలా ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు తీసుకునే మందులను గురించి కూడా చాట్జీపీటీ సాయంతో తెలుసుకోవచ్చు. ఈ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఏ మెడిసిన్ దేనికి పనికొస్తుందో చాట్జీపీటీ చెబుతుంది, కానీ ఎంత మోతాదులో వాడాలో ఖచ్చితంగా డాక్టర్ మాత్రమే చెప్పాలి. దీనిని యూజర్ గుర్తుంచుకోవాలి. మెంటల్ హెల్త్ సపోర్ట్ మనిషి శరీరం మాత్రమే ఆరోగ్యంగా ఉంటే సరిపోదు, మనసు కూడా ఆరోగ్యంగా ఉండాలి. ప్రస్తుత కాలంలో మెంటల్ హెల్త్ కోసం పరిష్కారం కనుగొనటం పెద్ద సవాలుగా మారిపోయింది. అయితే చాట్జీపీటీ దీనికి కూడా చక్కని సమాధానాలు అందిస్తుంది. ఇదీ చదవండి 1. రెజ్యూమ్ ఇలా క్రియేట్ చేస్తే.. జాబ్ రావాల్సిందే! 2. ఏ ప్రశ్నకైనా సమాధానం 'చాట్జీపీటీ' - ఇంటర్వ్యూకి ఇలా సిద్దమైపోండి! -
రెజ్యూమ్ ఇలా క్రియేట్ చేస్తే.. జాబ్ రావాల్సిందే!
చదువు పూర్తవ్వగానే అందరూ చేసే పని జాబ్ సర్చింగ్. ఉద్యోగం వెతుక్కునే క్రమంలో తప్పకుండా 'రెజ్యూమ్' తయారు చేసుకోవాల్సి ఉంటుంది. చాలా మందికి ఇది ఓ పెద్ద సవాలుగా అనిపిస్తుంది. చదువు, వ్యక్తిగత వివరాలు వంటి విషయాలతో ఒక డాక్యుమెంట్ రూపొందించుకోవాలి. అయితే చాలామందికి ఎక్కడ నుంచి మొదలెట్టాలి, ఎక్కడ ముగించాలి, అనే చాలా విషయాలు తెలియక పోవచ్చు. చాట్జీపీటీ సహాయంతో ఇప్పుడు రెజ్యూమ్ క్రియేట్ చేయడం చాలా సులభమైపోయింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు క్షుణ్ణంగా ఇక్కడ తెలుసుకుందాం. చాట్జీపీటీలో సైన్ ఇన్ అవ్వడం - రెజ్యూమ్ క్రియేట్ చేయాలనుకునే వ్యక్తి మొదట బ్రౌజర్లో 'ఓపెన్ఏఐ' సర్చ్ చేయాలి. సర్చ్ చేసిన తరువాత చాట్జీపీటీ హోమ్పేజీలో సైన్ ఇన్ చేసుకోవాలి. చాట్జీపీటీని ఉచితంగా ఉపయోగించుకోవచ్చు, కాబట్టి సైన్ ఇన్ చాలా సులభంగా ఉంటుంది. ఆధార్, పాన్ వంటి వివరాలు దీనికి అవసరం లేదు. ఇదీ చదవండి: ఏ ప్రశ్నకైనా సమాధానం 'చాట్జీపీటీ' - ఇంటర్వ్యూకి ఇలా సిద్దమైపోండి టెక్స్ట్ యాడ్ చేయడం - మీరు రెజ్యూమ్ స్టార్ట్ చేయాలనుకున్నప్పటి నుంచి చాట్జీపీటీ సర్చ్ బాక్స్లో కావలసిన విషయాలను టైప్ చేసి అడగవచ్చు. ఉదాహరణకు నేను రెజ్యూమ్ ఎలా క్రియేట్ చేయాలి అని టైప్ చేయగానే.. మీకు చాట్జీపీటీ సమాధానం అందిస్తుంది. అలా మీరు అడిగినదానికి చాట్జీపీటీ సమాధానాలు అందిస్తుంది. చాట్జీపీటీ అందించే సమాధానాల్లో మీకు నచ్చినది సెలక్ట్ చేసుకోవచ్చు. సెలక్ట్ చేసుకున్న తరువాత మీకు నచ్చినట్లు ఎడిట్ చేసుకోవచ్చు. దీని కోసం చాట్జీపీటీ అందించిన విషయాలను కాపీ చేసి వర్డ్ డాక్యుమెంట్స్ వంటి వాటిలో పేస్ట్ చేసుకోవచ్చు. చాట్జీపీటీ అందించిన విషయాలను కాపీ పేస్ట్ చేసుకున్న తరువాత మీకు నచ్చిన విధంగా ఎడిట్ చేసుకుని, మీ వివరాలను ఫిల్ చేసుకోవచ్చు. ఇలా ఒకదాని తరువాత ఒకటి పూర్తి చేస్తూ మీ రెజ్యూమ్ పూర్తి చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన ఫోటోలను ఈ కథనంలో చూడవచ్చు. -
ఏ ప్రశ్నకైనా సమాధానం 'చాట్జీపీటీ' - ఇంటర్వ్యూకి ఇలా సిద్దమైపోండి!
ఒకప్పటి నుంచి మనకు ఏ ప్రశ్నకు సమాధానం కావాలన్నా.. గూగుల్ మీద ఆధారపడేవాళ్లం. అయితే ఇప్పుడు కాలం మారింది, టెక్నాలజీ పెరిగింది. ఈ సమయంలో చాలామంది ప్రతి ప్రశ్నకు 'చాట్జీపీటీ' ద్వారా సమాధానం తెలుసుకుంటున్నారు. ఈ కథనంలో 'చాట్జీపీటీ' ద్వారా ఇంటర్వ్యూకి ఎలా ప్రిపేర్ అవ్వాలనే విషయాలను క్షుణ్ణంగా తెలుసుకుందాం. ఇంటర్వ్యూకి ప్రిపేర్ అయ్యేవారికి చాట్జీపీటీ ఎలా ఉపయోగపడుతుందంటే.. ఉద్యోగ ఇంటర్వ్యూ కోసం సిద్ధం కావడానికి చాట్జీపీటీ చాలా ఉపయోగపడుతుంది. సాధారణ ఇంటర్వ్యూ ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడం దగ్గర నుంచి మీ విశ్వాసాన్ని పెంచుకోవడం వరకు అన్ని విధాలా ఉపయోగపడుతుంది. 👉 ఇంటర్వ్యూలకు సిద్ధమయ్యేటప్పుడు మీ బలం ఏమిటి? బలహీనత ఏమిటి? అనే ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడానికి చాట్జీపీటీ సహాయపడుతుంది. చాట్జీపీటీతో మీరు పరస్పరం చర్చించుకుంటూ పోతే నైపుణ్యాలను తప్పకుండా మెరుగుపరుచుకోవచ్చు. 👉 మీరు ఏ కంపెనీ ఇంటర్వ్యూ కోసం సిద్దమవుతున్నారో.. ఆ సంస్థకు సంబంధించిన చాలా విషయాలను కూడా చాట్జీపీటీ తెలియజేస్తుంది. కంపెనీ కల్చర్ ఏమిటి? కంపెనీ గోల్స్ గురించి కూడా వివరిస్తుంది. దీని ప్రకారం ఇంటర్వ్యూ చేసేవారి అంచనాలకు అనుగుణంగా ప్రిపేర్ అవ్వొచ్చు. 👉 ఇంటర్వ్యూకి వెళ్లే సమయంలో ఏలాంటి డ్రెస్ (వస్త్రధారణ) వేసుకోవాలనేది కూడా చాట్జీపీటీ చెబుతుంది. ఇంటర్వ్యూకి వెళ్లే సమయంలో డ్రెస్ కోడ్ చాలా ముఖ్యమైన అంశం. 👉 ఇంటర్వ్యూకి సిద్ధమయ్యేవారికి కావలసిన మరో ముఖ్యమైన అంశం 'బాడీ లాంగ్వేజ్'. బాడీ లాంగ్వేజ్ ఇంప్రూ చేసుకోవడంలో కూడా చాట్జీపీటీ ఉపయోగపడుతుంది. సరైన బాడీ లాంగ్వేజ్ మెయింటేన్ చేసేవారు ఎదుటివారికి హుందాగా కనిపిస్తారు. 👉 ఇంటర్వ్యూలో ఎప్పుడూ మీ గురించి లేదా ఉద్యోగానికి సంబంధించిన ప్రశ్నలు మాత్రమే అడుగుతారని భావించకూడదు. ఎందుకంటే మీ ఆలోచనకు పదునుపెట్టే ప్రశ్నలకు సమాధానాలు చెప్పాల్సి ఉంటుంది. దీనిని దృష్టిలో ఉంచుకుని చాట్జీపీటీ సాయంతో అలాంటి ప్రశ్నలకు సిద్దమవ్వొచ్చు. 👉 ఆత్మ విశ్వాసం ఆయుధంగా మారితే.. ఏదైనా సాధించవచ్చనే ధైర్యం వస్తుంది. ఈ విషయం ఇక్కడ ఎందుకు చెప్పాల్సి వస్తోందంటే.. ఒక వ్యక్తి ఇంటర్వ్యూకి సిద్ధమయ్యే సమయంలో లేదా ఇంటర్వ్యూకు వెళ్ళేటప్పుడు ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకుంటే మాత్రమే సరిపోదు. 'సెల్ఫ్ కాన్ఫిడెన్స్' (ఆత్మ విశ్వాసం) కూడా చాలా అవసరం. కేవలం ప్రశ్నలకు, బాడీ లాంగ్వేజ్ వంటి వాటికి మాత్రమే కాకుండా.. మీ మీద మీకు విశ్వాసం పెరగటానికి కూడా చాట్జీపీటీ ఒక ఆయుధంగా పనికొస్తుంది. మొత్తం మీద వినియోగించుకునే విధానాన్ని బట్టి చాట్జీపీటీ మీకు ఆత్మబంధువులా పనికొస్తుంది. ఇదీ చదవండి: భారత్ నిర్ణయంతో చైనాకు రూ.50000 కోట్లు నష్టం - ఎలా అంటే? చాట్జీపీటీ.. చాట్జీపీటీ అనేది GPT (జనరేటివ్ ప్రీ-ట్రైన్డ్ ట్రాన్స్ఫార్మర్) ఆర్కిటెక్చర్ ఆధారంగా OpenAI చేత అభివృద్ధి చేసిన పెద్ద లాంగ్వేజ్ మోడల్. మనిషి భాషను అర్థం చేసుకోవడానికి అల్గారిథమ్లను ఉపయోగించే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్ ప్రశ్నలకు సమాధానమివ్వడం, టాస్క్లను పూర్తి చేయడం వంటి విషయాలను అవలీలగా పూర్తి చేస్తుంది. వెబ్సైట్, యాప్స్, మెసేజింగ్ ప్లాట్ఫారమ్లతో సహా వివిధ ఇంటర్ఫేస్ల ద్వారా దీన్ని యాక్సెస్ చేయవచ్చు. వినియోగదారుడు అడిగే ప్రశ్నలకు దాని శిక్షణ, భాషపై అవగాహన ఆధారంగా రెస్పాండ్ అవుతుంది. -
మొరాయించిన చాట్జీపీటీ.. ఖంగుతిన్న కస్టమర్లు - కారణం ఏంటంటే?
అతి తక్కువ కాలంలో ప్రపంచ దిగ్గజాలను సైతం వణికించిన 'ఏఐ చాట్జీపీటీ' ఇటీవల ఒక్కసారిగా డౌన్ అయింది. చాలామంది వినియోగదారులకు 'చాట్జీపీటీ నాట్ వర్కింగ్' అంటూ చూపించింది. చాట్జీపీటీ డౌన్ అవ్వడానికి కారణం ఏంటి? దీనికోసం టెక్ బృందం తీసుకున్న చర్యలు గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ప్రస్తుతం అందుబాటులో ఉన్న టెక్నాలజీలలో 'ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్'దే పైచేయి. ఏడాది క్రితం గ్లోబల్ మార్కెట్లో అడుగుపెట్టిన ఏఐ చాట్జీపీటీ యాప్ అతి తక్కువ కాలంలోనే చాలామంది జీవితంలో ఒక భాగమారిపోయింది. కవిత్వం నుంచి కంటెంట్ వరకు వినియోగదారునికి ఏమి కావాలన్నా నిముషాల్లో ఈ టెక్నాలజీ ద్వారా పొందగలుగుతున్నాడు. ఇటీవల ఏఐ చాట్బాట్తో మాట్లాడటానికి ప్రయత్నిస్తే.. 'ఏదో తప్పు జరిగింది'. ఈ సమస్య కొనసాగితే, దయచేసి help.openai.comలో మా సహాయ కేంద్రం ద్వారా మమ్మల్ని సంప్రదించండి అనే సందేశాన్ని ప్రదర్శిస్తూ.. ఏకంగా 90 నిమిషాల పాటు పనిచేయకుండా పోయింది. దీంతో వినియోగదారులు కొంత ఆందోళన చెందారు. ఇదీ చదవండి: 14 ఏళ్ల ప్రయాణానికి బ్రేక్.. ఆన్లైన్ చాట్ సైట్ షట్డౌన్ కారణం ఇదే ప్రపంచంలోని చాలా దేశాల్లో దాదాపు 90 నిముషాల పాటు అంతరాయం ఏర్పడిన ఏఐ టూల్ చాట్బాట్ DDoSలో ఒకేసారి ఎక్కువ ట్రాఫిక్ ఏర్పాటం, లేదా ఎక్కువ మంది ఒకేసారి వినియోగించడం వల్ల ఈ అంతరాయం ఏర్పడిందని సంబంధిత టెక్ బృందం వెల్లడించింది. ఇలాంటి అంతరాయం మళ్ళీ జరగకుండా చూడటానికి తగిన చర్యలు తీసుకుంటామని కూడా కంపెనీ వెల్లడించింది. -
ఎలాన్ మస్క్ కొత్త చాట్బాట్ 'గ్రోక్' - విశేషాలు
టెస్లా సీఈఓ 'ఎలాన్ మస్క్' (Elon Musk) నేతృత్వంలోని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టార్టప్ కంపెనీ ఎక్స్ఏఐ 'గ్రోక్' (Grok) పేరుతో తాజాగా ఏఐ చాట్బాట్ను తీసుకొచ్చింది. ఇప్పటికే అందుబాటులో ఉన్న చాట్జీపీటీకి ఇది ప్రధాన ప్రత్యర్థి అవుతుందని భావిస్తున్నారు. ప్రపంచం మొత్తం చాట్జీపీటీ వైపు చూస్తున్న సమయంలో మస్క్ తీసుకువచ్చిన ఈ కొత్త చాట్బాట్ తప్పకుండా సక్సెస్ సాధిస్తుందని భావిస్తున్నారు. ఎక్స్ఏఐ ప్రారంభమైన కేవలం 8 నెలల్లో చాట్బాట్ తీసుకురావడం గమనార్హం. పరిశోధన, ఆవిష్కరణల సామర్థ్యంతో కూడిన ఏఐ టూల్స్ వినియోగదారులకు అందించాలనే లక్ష్యంతోనే 'గ్రోక్' అభివృద్ధి చేసినట్లు తెలుస్తోంది. సోషల్ మీడియా ఎక్స్(ట్విటర్) ప్లాట్ఫామ్ సాయంతో గ్రోక్ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కూడా అందిస్తుందని కంపెనీ చెబుతోంది. ఇతర ఏఐలు తిరస్కరించే ప్రశ్నలకు సైతం సమాధానం గ్రోక్ సమాధానం అందిస్తుందని మస్క్ వెల్లడించారు. మ్యాథ్స్, కోడింగ్ వంటి వాటికి సంబంధించిన అంశాలను కూడా ప్రత్యర్థుల కంటే మెరుగ్గా పరిష్కరించగలదని తెలిపారు. దీనిని 'ఎక్స్ ప్రీమియం ప్లస్' యూజర్స్ మాత్రమే యాక్సెస్ చేసుకోవచ్చు. ఇదీ చదవండి: ఆత్మకథపై ఇస్రో చైర్మన్ సంచలన నిర్ణయం.. ఆ వివాదమే కారణమా? గ్రోక్ ప్రస్తుతం ప్రాధమిక దశలోనే ఉండటం వల్ల, అమెరికాలో కొంతమంది యూజర్లకు మాత్రమే పరిమితం చేసినట్లు తెలుస్తోంది. రాబోయే రోజుల్లో దీనిని మరింత అభివృద్ధి చేసిన తరువాత మరింతమంది వినియోదారులకు అందుబాటులో ఉంచనున్నారు. ప్రస్తుతం దీని నెలవారీ సబ్స్క్రిప్షన్ ఛార్జ్ 16 డాలర్లు (భారతీయ కరెన్సీ ప్రకారం రూ. 1,330). -
ఆంగ్ల మహాసముద్రంలో ఆనంద విహారం!
‘ఇక నీకు పూర్తిగా వచ్చేసినట్లే’ అని ఆంగ్లం ఎప్పుడూ అభయం ఇవ్వదు. ఆంగ్లభాషను ఎప్పటికప్పుడూ శోధిస్తూ పట్టు సాధిస్తూనే ఉండాలి... ఈ విషయంలో స్పష్టతతో ఉన్న యువతరం ఆంగ్ల మహాసముద్రంలో కలుస్తున్న నదులు, వాగులు, వంకల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకుంటూనే ఉంది. నిత్యావసర భాష అయిన ఆంగ్లంలో నైపుణ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి సిట్కామ్స్ నుంచి చాట్జీపీటి టూల్స్ వరకు ఎన్నో దారులలో ప్రయాణిస్తోంది... సిట్కామ్ (సిచ్యువేషనల్ కామెడీ షో)తో కాసేపు హాయిగా నవ్వుకోవచ్చు అనేది పాత మాట. నవ్వుకోవడమే కాదు పదసంపద, నేటివ్ స్పీచ్పై పట్టు సంపాదించడానికి, పదాలతో ముడిపడి ఉన్న భావోద్వేగాల గురించి లోతుగా తెలుసుకోవడానికి సిట్కామ్లలోని విజువల్ ఎలిమెంట్స్ ఉపయోగపడతాయి అనేది నేటి మాట. అలాంటి సిట్కామ్స్లో కొన్ని... చీర్స్ (1982–1993) థీమ్ సాంగ్ ‘ఎవ్రీబడీ నోస్ యువర్ నేమ్’ నుంచి చివరి డైలాగ్ వరకు ఏదో ఒక కొత్తపదం పరిచయం అవుతూనే ఉంటుంది. రకరకాల సెట్లలో కాకుండా ఒకటే లొకేషన్లో చిత్రీకరించడం వల్ల ఒకేచోట పూర్తిగా దృష్టి కేంద్రీకరించవచ్చు. ‘చీర్స్’లోని హాస్యాన్ని సులభంగా అర్థం చేసుకోవచ్చు. ఫ్రైజర్ (1993–2004) చీర్స్లోని ఎపిసోడ్లను అర్థం చేసుకున్నవారికి ఫ్రైజర్ కష్టమేమీ కాదు. ఈ సిట్కామ్లోని ప్రధాన పాత్రలైన ఫ్రైజర్, నీల్ మార్టిన్ల క్లీన్ యాక్సెంట్ను సులభంగా అర్థం చేసుకోవచ్చు. ‘ప్రైజర్’ నిండా ఇంటెలిజెంట్ హ్యూమర్ వినిపించి కనిపిస్తుంది. ది సింప్సన్స్ (1980) ది సింప్సన్ టీవీ సిరీస్ ఇప్పటికీ ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది. ఈ యానిమేటెడ్ సిట్కామ్లో క్యారెక్టర్ల మధ్య నడిచే సంభాషణలు ఫ్యామిలీ టాపిక్స్పై ఉంటాయి. రియల్–లైఫ్ ఫ్రేజ్లపై అవగాహనకు ఉపయోగపడుతుంది. పుస్తకాల కంటే సహజమైన భాషను నేర్చుకోవచ్చు. ది వండర్ ఇయర్స్ (1988–93) మధ్యతరగతి కుటుంబానికి చెందిన కెవిన్ అర్నాల్డ్ అనే టీనేజర్ ప్రధాన పాత్రలో కనిపించే సిట్కామ్ ఇది. యువత మానసిక ప్రపంచానికి అద్దం పడుతుంది. కెవిన్ అతని ఫ్రెండ్స్ ఎదుర్కొనే రకరకాల సమస్యలతో యూత్ ఆటోమేటిక్గా రిలేట్ అవుతారు. యంగ్ పీపుల్ ఇంగ్లిష్లో కమ్యూనికేట్ చేసే పద్ధతిని అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ది ఫ్రెష్ ప్రిన్స్ ఆఫ్ బెల్–ఎయిర్ (1990–1996) ఈ హిట్ కామెడీ షోలో ఎక్కువమందిని ఆకట్టుకునే క్యారెక్టర్ విల్ స్మిత్. ఫన్నీ డైలాగులు, జోక్స్ను సులభంగా అర్థం చేసుకోవచ్చు. సోషల్ క్లాస్ స్పీకింగ్ ఇంగ్లిష్ నుంచి స్ట్రీట్ ఇంగ్లీష్ వరకు అవగాహన ఏర్పర్చుకోవచ్చు. ఫ్యామిలీ మ్యాటర్స్ (1989–1998) ఈ సిట్కామ్లో కనిపించే రకరకాల ఎక్స్ప్రెషన్లు, గెశ్చర్ లెర్నర్న్కు ఉపయోగపడతాయి. స్పష్టమైన, సంక్షిప్తమైన యాక్సెంట్ వినిపిస్తుంది. కుటుంబ జీవితానికి సంబంధించి ఇళ్లల్లో వినిపించే ఇంగ్లిష్ ఇడియమ్స్ గురించి తెలుసుకోవచ్చు. ది నానీ (1993–1999) రకరకాల యాక్సెంట్లను ఈ సిట్కామ్లో వినవచ్చు. సామాన్య ప్రజలతో పోల్చితే ధనవంతులు ఎలా మాట్లాడతారో చూడవచ్చు... ఇవి మచ్చుకు కొన్ని సిట్కమ్స్ మాత్రమే. ఎన్నో కోణాలలో భాషను మెరుగు పరుచుకునే సిట్కామ్లు ఎన్నో ఉన్నాయి. అప్–టు–డేట్ ఇంగ్లిష్ లెసన్స్ ఫ్లాట్ఫామ్ ‘సెన్సేషన్ ఇంగ్లిష్’పై కూడా యూత్ ఆసక్తి చూపుతుంది. ఇంటర్నేషనల్ న్యూస్ వీడియోలు, ఆర్టికల్స్ ద్వారా 5 లెవెల్స్లో భాషను మెరుగు పరుచుకోవచ్చు. ప్రాక్టీస్ యువర్ ఇంగ్లిష్ టుడే’ అంటోంది లాంగ్వేజ్ లెర్నింగ్ యాప్ ప్రోమోవ. మూడువేల పదాలతో కూడిన 40 థీమ్డ్ టాపిక్స్, ఇడియమ్స్, స్లాంగ్ వర్డ్స్, ఎవ్రీ డే ఎక్స్ప్రెషన్స్ ప్రోమోవలో ఉన్నాయి. లైవ్ లెసన్స్, కాన్వర్జేషన్ ఈవెంట్స్, ఏఐ ్ర΄ాక్టీస్ టాస్క్స్, సోషల్ లెర్నింగ్ గేమ్స్, లెర్నింగ్ జర్నీ తమ ప్రత్యేకతగా చెబుతుంది విజువల్ వరల్డ్స్ ఇమార్స్. లాంగ్వేజ్ లెర్నింగ్లో కీలక పరిణామం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ). స్థానిక, స్థానికేతరులను భాష నైపుణ్యం మెరుగుపరుచుకోడానికి, పర్సనలైజ్డ్ లాంగ్వేజ్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్కు ఈ సాంకేతికత ఉపయోగపడుతుంది. ఉదా: లెర్నర్స్ బలాలు, బలహీనతల ఆధారంగా పర్సనలైజ్డ్ కరికులమ్ను, లాంగ్వేజ్ లెర్నింగ్ గేమ్స్ను రూపొందిస్తుంది. తప్పులను ఎత్తి చూపుతుంది. ఇంగ్లిష్ లిరిక్స్ వినడం ద్వారా కూడా భాషలో నైపుణ్యాన్ని పెపొందించుకునే ధోరణి పెరుగుతోంది. దీని ద్వారా ఎప్పటికప్పుడు రకరకాల యాక్సెంట్లను అర్థం చేసుకోవచ్చు. పదసంపద పెంచుకోవచ్చు. బెటర్ ప్రోనన్సియేషన్కు ఉపయోగపడుతుంది. అలనాటి ప్రసిద్ధ ఇంగ్లిష్ పాటల్లో ఎన్నో ప్రయోగాలు కనిపిస్తాయి. ఎల్విన్ ప్రెస్లీ, మైకెల్ జాక్సన్ నుంచి నిన్న మొన్నటి కుర్రకారు సంగీతకారుల వరకు ఎంతోమంది పాత పదాలను కొత్తగా ప్రయోగించారు. ‘ఇంగ్లిష్ భాషలో నైపుణ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి ఉపకరించే మాటలు’ అంటూ ప్రతి సంవత్సరం కొన్ని పాటలను సిఫారసు చేస్తున్నారు ఆంగ్ల భాషా నిపుణులు. ‘ఇక నాకు అంతా వచ్చేసినట్లే’ అనే మాట ఆంగ్లం విషయంలో ఎప్పటికీ వినిపించదు. ఎందుకంటే... ఆంగ్ల భాష అనగానే వినిపించే ప్రసిద్ధ మాట... వర్క్ ఇన్ప్రోగ్రెస్. అందుకే ఆంగ్లంలో ఎప్పటికప్పుడు సరికొత్త నైపుణ్యాన్ని సంపాదించుకోవడానికి యువతరం వివిధ మార్గాలలో ప్రయాణిస్తుంది. (చదవండి: కూతురుకి మంచి ర్యాంకు రావాలని ఆ తండ్రి చేసిన పని తెలిస్తే షాకవ్వడం ఖాయం!) -
‘చాట్జీపీటీతో కోటీశ్వరులయ్యారు’..15వేలు పెట్టి కోటి సంపాదన
కేవలం రూ.15,000 పెట్టుబడితో రూ.1.2 కోట్లు సంపాదించడం ఎలా? ఇదేదో క్లిక్బైట్ టైటిల్ అనుకుంటే పొరబడ్డట్లే. అక్షర సత్యం. ఎందుకంటే? కొత్తపుంతలు తొక్కుతున్న సాంకేతిక రంగంలో ఇలా అసాధ్యాల్ని సుసాధ్యమవుతున్నాయి. ముఖ్యంగా, చాట్ జీపీటీ లాంటి టెక్నాలజీతో కోకొల్లలు. ఇద్దరు స్నేహితులు. ఓ వైపు జాబ్ చేస్తూ అదనపు ఆదాయం కోసం చాట్జీపీటీని ఉపయోగిస్తూ రూ.15,000 పెట్టుబడితో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత (AI) స్టార్టప్ను ప్రారంభించారు. అయితే, రోజులు గడిచే కొద్ది చాట్జీపీటీ వినియోగం పెరగడంతో ఆస్టార్టప్కి ఊహించని విధంగా ఫండింగ్ వచ్చింది. ఈ డిమాండ్నే ఆ ఇద్దరు స్నేహితులు క్యాష్ చేసుకోవాలనుకున్నారు. వెంటనే అదనపు ఆదాయం కోసం ప్రారంభించిన స్టార్టప్ను రూ.1.2 కోట్లకు అమ్మేశారు. ఎవరా ఇద్దరు స్నేహితులు? గత ఏడాది అమెరికాకు చెందిన ప్రముఖ స్టార్టప్ యాక్సిలరేటర్ సంస్థ వై కాంబినేటర్ వర్చువల్ స్టార్టప్ ఫౌండర్ మీటప్ ఈవెంట్ను నిర్వహించింది. ఆ కార్యక్రమంలో సాల్ ఐయెల్లో,మోనికా పవర్స్లు పరిచయమయ్యారు. ఆ మీటప్ తర్వాత ఖాళీ సమయాల్లో పనిచేస్తూ డబ్బులు సంపాదించేందుకు వీలుగా ఓ స్టార్టప్ను ప్రారంభించాలని అనుకున్నారు. చాట్జీపీటీని వినియోగించడంలో ఆరితేరారు స్టార్టప్ను ప్రారంభించే ముందు దాని గురించి పూర్తి స్థాయిలో తెలుసుకునేందుకు మార్కెట్లో రిసెర్చ్ చేశారు. ఇందుకోసం చాట్జీపీటీని ఉపయోగించారు. మనం అడగదలుచుకున్న ప్రశ్న ఏదైనా చాట్జీపీటీకి అర్ధమయ్యేలా దాని భాషలోనే అడగాలి. అలా అడిగితే వంద శాతం సత్ఫలితాలు వస్తాయి. ఆ ఇద్దరు స్నేహితులు ఇదే విషయాన్ని గ్రహించారు. పరిధికి మించి చాట్జీపీటీని వినియోగించడంలో నిష్ణాతులయ్యారు. అదే బిజినెస్ ఐడియా మారి అదే సమయంలో ఏఐ స్టార్టప్లలో సీటీవోగా పనిచేస్తున్న ఐయెల్లో, బ్రాండింగ్ కంపెనీలో ప్రొడక్ట్ డిజైనర్గా పనిచేస్తున్న పవర్స్కు ఓ మెరుపు లాంటి ఐడియా వచ్చింది. ఏఐ ఆధారిత బిజినెస్ మార్కెట్ రీసెర్చ్ టూల్ను ప్రాంభించాలని అనుకున్నారు. పెట్టుబడి రూ.15,000 వెంటనే రూ.15,000 పెట్టుబడితో నాలుగు రోజులు కష్టపడి DimeADozen.ai పేరుతో ఏఐ స్టార్టప్ను ప్రారంభించారు. ఈ స్టార్టప్ ముఖ్య ఉద్దేశం. ఎవరైనా బిజినెస్ పెట్టాలనుకుంటే రీసెర్చ్ చేయాలి. ఆ అవసరాల్ని ఈ వెబ్సైట్ నుంచి అందిస్తారు. ట్రెడింగ్లో ఉన్న బిజినెస్ ఏంటి? ఎక్కడ? ఎలా? ప్రారంభించాలి. లాభాల్ని ఎలా గడించాలి? ఇలాంటి ప్రశ్నల ప్రవాహానికి తడబడకుండా తడుముకోకుండా చాట్జీపీటీని ఉపయోగించి కస్టమర్లకు సమాచారం అందిస్తారు. ఇందుకోసం సాంప్రదాయ రీసెచ్చ్ ఏజెన్సీలు లేదా రీసెర్చ్ ఇంజిన్లు వసూలు చేసే ధరకంటే తక్కువ ఛార్జ్ చేస్తారు. స్టార్టప్ను ఎలా ప్రారంభించారు? ఎప్పుడు అమ్మారు? నాలుగు రోజుల్లో స్టార్టప్ ప్రారంభించిన ఐయెల్లో, మోనికా పవర్స్లు దానిని ఏడు నెలల పాటు కొనసాగించారు. గత నెలలో ఐటీ ఉద్యోగిగా విధులు నిర్వహిస్తున్న ఫెలిప్ అరోసెమెనా,ప్రొడక్ట్ డిజైనర్గా పనిచేస్తున్న డేనియల్ డి కార్నెయిల్’లు భార్య భర్తలు. వాళ్లిద్దరు DimeADozen (డీమెడ్జన్)ని పార్ట్టైమ్లా కాకుండా ఫుల్టైం సంస్థగా అభివృద్ది చేయాలని భావించారు. దానిని 1.2 కోట్లు చెల్లించి మరీ కొనుగోలు చేశారు. రూ.15,000 పెట్టుబడితో కోట్లలో లాభం ఆ వెబ్సైట్ను ప్రారంభించిన ఐయెల్లో,పవర్స్కు ఒక్కొక్కరికి రూ.54,82,732.20 కంటే ఎక్కువే వచ్చింది. ఇక స్టార్టప్ కోసం ఖర్చు పెట్టింది కేవలం డొమైన్ ఖర్చు , డేటాబేస్ మొత్తం కలిపి రూ.15,000 ఖర్చు పెట్టారు. మిగిలిన మొత్తం లాభమే. పైగా తాము అమ్మిన కంపెనీకి సలహాదారులగా వారానికి ఐదుగంటలే పనిచేయాలని భావిస్తున్నాం. ఇది నిజంగా డబ్బును ముద్రిస్తుందంటూ ఐయెల్లో సంతోషం వ్యక్తం చేశారు. -
చాట్జీపీటీతో ఉద్యోగ మార్పులు తథ్యం!
వృత్తి నిపుణల నెట్వర్కింగ్ ప్లాట్ఫామ్ లింక్డిన్ గురించి మీకు తెలిసే ఉంటుంది. ఇటీవలే ఈ సంస్థ జనరేటివ్ ఏఐ తీరుతెన్నులు ఎలా ఉన్నాయనేది తెలుసుకునేందుకు హైదరాబాద్లో ఓ సర్వే నిర్వహించింది. దీని ప్రకారం హైదరాబాద్లోని ఐటీ ఉద్యోగుల్లో 79 శాతం మంది జనరేటివ్ ఏఐ తాము చేసే ఉద్యోగాల్లో కచి్చతంగా మార్పులు తీసుకొస్తుందని అనుకుంటున్నారు. అదే సమయంలో ఏఐ వల్ల తమ పని ఎంతో కొంత సులువు అవుతుందని 66 శాతం మంది భావిస్తున్నారు. కెరీర్లో ముందడుగు వేసేందుకు ఏఐ పనికొస్తుందని కూడా వారు విశ్వసిస్తున్నారు. కొంచెం వివరంగా చూస్తే చాట్జీపీటీ వంటి జనరేటివ్ ఏఐ సాఫ్ట్వేర్లు అందుబాటులోకి రావడంతో దాదాపు ప్రతి రంగంలోనూ వినూత్న మార్పులు రావడం తెలిసిందే. మార్కెటింగ్, సేల్స్ వంటివే కాకుండా చిన్నచిన్న ప్రోగ్రామ్లు రాయడం, కస్టమర్ల సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరించడం వంటి అనేక విషయాల్లో ఇది ఉపయోగపడుతోంది. ఈ నేపథ్యంలోనే లింక్డిన్ సర్వేకు ప్రాధాన్యం ఏర్పడింది. జనరేటివ్ ఏఐలో వస్తున్న మార్పులను, కొత్త అప్లికేషన్లను దృష్టిలో పెట్టుకుంటే ఏడాది కాలంలో టెక్ రంగంలోనూ గణనీయమైన మార్పులు వస్తాయని హైదరాబాద్లోని ఐటీ వృత్తి నిపుణులు అంటున్నారు. సర్వే చేసిన ప్రతి 10 మందిలో దాదాపు 8 మంది ఈ రకమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం గమనార్హం. జనరేటివ్ ఏఐ విస్తృత వాడకంతో చాలా ఉద్యోగాలు పోతాయన్న ఆందోళనపైనా టెకీలు తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఏఐ రంగంలో వస్తున్న మార్పులను పట్టించుకోకుంటే ఉద్యోగాలకు ఇబ్బందన్నది నిజమేనని 42 శాతం మంది పేర్కొన్నారు. ఆసక్తికరమైన అంశం ఏమిటంటే ఏఐ గురించి తెలుసుకొనేందుకు దాన్ని తమ ఉద్యోగాల్లో భాగం చేసుకునేందుకు సుమారు 69 శాతం మంది సిద్ధంగా ఉండటం! కంచర్ల యాదగిరిరెడ్డి మేమిప్పటికే వాడేస్తున్నాం.. సర్వే చేసిన వారిలో సుమారు 64 శాతం మంది ఇప్పటికే తాము ఏఐను ఉద్యోగాల్లో భాగంగా వాడుతున్నట్లు చెప్పారు. అలాగే చాట్జీపీటీ వంటి జనరేటివ్ ఏఐను వాడే ప్రయత్నం చేస్తున్నామన్న వాళ్లు సగానికిపైగా ఉన్నారు. దేశం మొత్తమ్మీద చూస్తే చాట్జీపీటీని వినియోగించే వాళ్లలో 54 శాతంతో మిలినియల్స్ ముందు వరుసలో ఉన్నారు. జెన్–జీకి చెందిన వారు 46 శాతంతో రెండోస్థానంలో ఉన్నారు. అంతేకాదు హైదరాబాద్లోని వృత్తి నిపుణులు జనరేటివ్ ఏఐతో జట్టు కట్టేందుకు కూడా ఉత్సుకతతో ఎదురుచూస్తున్నట్లు ఈ సర్వే తెలిపింది. ఏఐతో అయ్యే పనులేమిటి? ఏఐతో చేయగల పనులకు హద్దుల్లేవని ఐటీ నిపుణులు అంటున్నారు. తమ ఉద్యోగ జీవితాన్ని మార్చేస్తుందని దాదాపు అందరూ గట్టిగా నమ్ముతున్నారు. అందుకే తాము ఏఐని ఉద్యోగాల్లో ఉపయోగించేందుకు సిద్ధంగా ఉన్నామని 98 శాతం మంది పేర్కొనడం గమనార్హం. ఇందుకు తగ్గట్టుగానే ఉద్యోగ ప్రకటనల్లోనూ చాట్జీపీటీ, ఏఐ టెక్నాలజీల ప్రస్తావన ఇటీవలి కాలంలో బాగా పెరిగిపోయిందని లింక్డిన్ చెబుతోంది. ‘జనరేటివ్ ఏఐ మీ ఉద్యోగ జీవితాన్ని ఎలా మెరుగు పరుస్తుంది?’అని హైదరాబాద్లోని వృత్తి నిపుణులను అడిగినప్పుడు కావాల్సిన సమాచారం తక్షణమే అందుబాటులోకి వస్తుంది కాబట్టి చేసే పనిని మరింత సమర్థంగా, విశ్వాసంతో చేయగలమని 66 శాతం మంది అభిప్రాయపడ్డారు. ఉత్పాదకత విషయంలోనూ ఏఐ తమకు సహాయకారి కాగలదని భావిస్తున్నారు. పనిలో ఎదురయ్యే ఇబ్బందులను సులువుగా అధిగమించేందుకు ఏఐని వాడాలని 83 శాతం మంది ఆలోచిస్తుండగా సహోద్యోగులను అడిగేందుకు ఇబ్బంది పడే ప్రశ్నలకు ఏఐ ద్వారా సమాధానాలు తెలుసుకుంటున్నట్లు 77 శాతం మంది చెప్పారు. ఏఐ కోర్సులు.. - హౌ టు రీసెర్చ్ అండ్ రైట్ యూజింగ్ జనరేటివ్ ఏఐ టూల్స్ – డేవ్ బిర్స్ - వాట్ ఈజ్ జనరేటివ్ ఏఐ? – పినార్ సెహాన్ డెమిర్డాగ్ - జనరేటివ్ ఏఐ ఫర్ బిజినెస్ లీడర్స్ – టోమర్ కోహెన్ - నానో టిప్స్ ఫర్ యూజింగ్ చాట్జీపీటీ ఫర్ బిజినెస్ – రాచెల్ వుడ్స్ - మెషీన్ లెరి్నంగ్ విత్ పైథాన్: ఫౌండేషన్స్ – ఫ్రెడిక్ న్వాన్గాంగా - గెట్ రెడీ ఫర్ జనరేటివ్ ఏఐ – ఆష్లీ కెన్నెడీ - ఇంట్రడక్షన్ టు ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ఫర్ జనరేటివ్ ఏఐ – రోనీ షీర్ - పైథాన్ డేటా స్ట్రక్చర్ అండ్ అల్గారిథమ్స్ – రాబిన్ ఆండ్రూస్ - ప్రాంప్ట్ ఇంజనీరింగ్: హౌ టు టాక్ టు ద ఏఐస్ – జేవియన్ అమాట్రియాన్ - జీపీటీ–4, ద న్యూ జీపీటీ రిలీజ్ అండ్ వాట్ యూ నీడ్ టు నో – జోనథన్ ఫెర్నాండెజ్ సాఫ్ట్ స్కిల్స్ తోడైతే.. భవిష్యత్తులో వృత్తి జీవితంలో రాణించాలంటే కేవలం ఏఐపైనే ఆధారపడటం తగదని, సాఫ్ట్ స్కిల్స్ను పెంపొందించుకోవడమూ చాలా అవసరమని లింక్డిన్ సర్వేలో పాల్గొన్న వారు అభిప్రాయపడ్డారు. సృజనాత్మకత, సమస్యలను పరిష్కరించగలిగే సామర్థ్యం, వ్యూహాత్మక ఆలోచనల వంటి నైపుణ్యాలు ఉన్న వారి అవసరం భవిష్యత్తులో ఎక్కువగా ఉంటుందన్నది హైదరాబాద్లోని వృత్తి నిపుణల లెక్క. రోజువారీ చేయాల్సిన, బోర్ కొట్టించే పనుల భారాన్ని ఏఐ టూల్స్ చక్కబెట్టగలవు కాబట్టి తాము ఆసక్తికలిగించే, నైపుణ్యం ఉన్న విషయాలపై ఎక్కువ సమయం వెచి్చంచవచ్చునని, ఇది వృత్తి సంతృప్తిని అందిస్తుందని వారు విశ్లేషించారు. అలాగే వృత్తికి.. జీవితానికి మధ్య సమతౌల్యత పెరిగేందుకూ ఏఐ తోడ్పడుతుందని సర్వేలో పాల్గొన్న వారిలో 73 శాతం మంది అభిప్రాయపడ్డారు. ‘‘వచ్చే ఐదేళ్లలో ఏఐ తమ ఉద్యోగాల్లో ఎన్నో సానుకూల మార్పులు తీసుకొస్తుందని హైదరాబాద్ వృత్తినిపుణుల్లో 86% మంది భావిస్తున్నారు. ఏఐ రాకతో తమకు సమయం ఆదా అవుతుందని, దాన్ని కొత్త నైపుణ్యాలను నేర్చుకునేందుకు, సృజనాత్మక, వ్యూహాత్మక పనులు చేసేందుకు వాడుకుంటామని చెబుతున్నారు’’ – నిరాజితా బెనర్జీ, లింక్డిన్ -
అదరగొడుతున్న చాట్జీపీటీ కొత్త ఫీచర్స్ - వీడియో
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ రోజు రోజుకి శర వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఇప్పటికె ప్రపంచ దేశాల్లో అత్యంత పాపులర్ అయిన ఏఐ చాట్జీపీటీలో ఇప్పుడు కొత్త ఫీచర్స్ అందుబాటులోకి రానున్నాయి. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం చాట్జీపీటీ ఇకపై వినటమే కాదు ఫోటోల రూపంలో సలహాలను కూడా ఇస్తుంది. దీనికి సంబంధించిన వీడియోను ఓపెన్ఏఐ తన ట్విటర్ ఖాతాలో షేర్ చేసింది. ఇప్పటి వరకు టెక్స్ రూపంలో అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చేది. అయితే మధ్యలో ఏదైనా అడగాలంటే అవకాశం ఉండేది కాదు. కానీ ఇప్పుడు వచ్చిన కొత్త ఫీచర్ ద్వారా ఇది కూడా సాధ్యమవుతుంది. అంటే చాట్జీపీటీ ఏదైనా సమాధానం చెప్పే సమయంలో మధ్యలో మనం కల్పించుకోవచ్చు, దానికి కూడా చాట్జీపీటీ సమాధానం ఇస్తుంది. ఇప్పటి వరకు ఏదైనా ప్రశ్న అడగాలంటే మొత్తం టెక్స్ట్ రాయాల్సి ఉండేది, కానీ ఇప్పుడు సమస్యకు సంబంధించిన ఫోటో షేర్ చేసి సమస్య చెబితే దానికి చాట్జీపీటీ సమాధానం చెబుతుంది. ఇక్కడ కనిపించే వీడియోలో మీరు గమనించినట్లయితే సైకిల్ సీటు తగ్గించడానికి ఏమి చేయాలి అని ఫోటో అప్లోడ్ చేసి అడిగితే చాట్జీపీటీ దానికి ఆన్సర్ చెబుతుంది. ఇదీ చదవండి: నిరుద్యోగులకు శుభవార్త.. పండుగ సీజన్లో 5 లక్షల ఉద్యోగాలు! ఈ కొత్త ఫీచర్స్ మరో రెండు వారాల్లో అందుబాటులోకి రానున్నట్లు సమాచారం. అయితే వాయిస్ ఫీచర్ ఆండ్రాయిడ్, ఐఫోన్లలో మాత్రమే అందుబాటులో ఉంటుంది. కానీ ఫోటో ఫీచర్ అనేది అన్ని ప్లాట్ఫామ్స్లో అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. ChatGPT can now see, hear, and speak. Rolling out over next two weeks, Plus users will be able to have voice conversations with ChatGPT (iOS & Android) and to include images in conversations (all platforms). https://t.co/uNZjgbR5Bm pic.twitter.com/paG0hMshXb — OpenAI (@OpenAI) September 25, 2023 -
‘AI నా ఉద్యోగాన్ని లాగేసుకుంది’
ఓ వైపు ఆర్ధిక మాంద్యం, మరోవైపు చిన్న చిన్న కంపెనీల నుంచి అంతర్జాతీయ కంపెనీల్లో ఉద్యోగుల తొలగింపులు. ఇలాంటి టైంలో మానవ ఉద్యోగాలకు ఎసరు పెట్టేలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) లాంటి టూల్స్ వినియోగం పెరగడం. వాటివల్ల ఉద్యోగం కోల్పోయిన వారి బాధల్ని, కష్టాల్ని, కన్నీటిని వివరించడం వర్ణనాతీతం. గత ఏడాది నవంబర్లో విడుదలైన చాట్జీపీటీ సహా ఏఐ జనరేటివ్ టూల్స్ రాకతో ఉద్యోగాలు కనుమరుగవుతాయనే చర్చ టెక్ ప్రపంచంలో ఊపందుకుంది. ఇప్పటికే పలు రంగాల్లో ఎన్నో ఉద్యోగాలను ఏఐ టూల్స్ రీప్లేస్ చేయడంతో ఈ భయాలు మరింత పెరుగుతున్నాయి. ఏఐ నా ఉద్యోగాన్ని లాగేసుకుంది ఈ నేపథ్యంలో చాట్జీపీటీ వల్ల ఉద్యోగం కోల్పోయానంటూ ఓ ఉద్యోగి సోషల్ మీడియా వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు. ది వెర్జ్ నివేదిక ప్రకారం.. 2002లో ప్రముఖ టెక్ బ్లాగ్ గిజ్మోడో ప్రారంభమైంది. అయితే తాజాగా, గిజ్మోడో స్పానిష్ (Español) లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్ విభాగంలో పనిచేస్తున్న ఉద్యోగుల్ని యాజమాన్యం తొలగించింది. వారి స్థానంలో చాట్జీపీటీని వినియోగించడం ప్రారంభించింది. ఈ సందర్భంగా ఉద్యోగం కోల్పోయిన బాధిత ఉద్యోగుల్లో ఒకరైన మాటియాస్ ఎస్ జవియా ట్విటర్ వేదికగా స్పందించారు. ఏఐ నా ఉద్యోగాన్ని లాగేసుకుంది. గిజ్మోడ్ ట్రాన్స్లేటర్లను మార్చేసేంది. వారి స్థానంలో ఏఐని ఉపయోగిస్తుంది. అంటే మనుషులు ఉద్యోగుల్ని ఏఐ రిప్లేస్ చేసిందంటూ ట్వీట్లో వాపోయారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆర్టికల్స్ ‘ఆర్టిఫిషియల్’గానే ఉన్నాయ్ ఉద్యోగుల తొలగింపుపై గిజ్మోడో కార్మికులకు ప్రాతినిధ్యం వహిస్తున్న జీఎంజీ అనే కార్మిక సంఘం సైతం కంపెనీ తీసుకున్న నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. గిజ్మోడోలో ఎంతో నైపుణ్యం కలిగిన పాత్రికేయుల స్థానంలో కృత్రిమ మేధను తీసుకురావడాన్ని కార్మిక సంఘం ప్రతినిధులు విమర్శిస్తున్నారు. ఏఐని ఉపయోగించి ట్రాన్స్లేషన్ చేయడం అంత మంచిది కాదు. ఆ ఆర్టికల్స్ను యూజర్లను ఆకట్టుకోవడం లేదు. ఆక్షర దోషాలు ఎక్కువగా ఉన్నాయి. ఎమోషన్ క్యారీ చేసేలా అంశాలు లేవని అన్నారు. సంస్థలు పట్టించుకోవడం లేదు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కారణంగా తమ ఉద్యోగాలు పోయాయని గతంలో కార్మికులు ఫిర్యాదు చేసిన ఘటనలు అనేకం ఉన్నాయి. కానీ కంపెనీలు ఉద్యోగుల ఆవేదనని పట్టించుకోవడం లేదు. డబ్బును ఆదా చేసేందుకు, వేగవంతంగా వారి పని పూర్తి చేసేందుకు సహకరిస్తున్న ఏఐ టూల్స్ను వినియోగించేందుకు మొగ్గు చూపడం గమనార్హం. -
మైక్రోసాఫ్ట్ సంచలన నిర్ణయం.. 30 ఏళ్లుగా అందిస్తున్న సేవలకు గుడ్బై!
ప్రముఖ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సంచలన నిర్ణయం తీసుకుంది. 30 ఏళ్లుగా యూజర్లకు సేవలందిస్తున్న వర్డ్ ప్యాడ్కు స్వస్తి పలుకుతున్నట్లు ప్రకటించింది. భవిష్యత్లో విడుదల కానున్న విండోస్ ఆపరేటింగ్ సిస్టంలో వర్డ్ ప్యాడ్ అనే ఫీచర్ ఇక కనపించదని స్పష్టం చేసింది. మైక్రోసాఫ్ట్ 1995లో విండోస్ 95 అనే ఆపరేటింగ్ సిస్టం (OS) ను విడుదల చేసింది. కొత్తగా విడుదలైన ఈ ఓఎస్లో వర్డ్ ప్యాడ్ అనే వర్డ్ ప్రాసెసింగ్ టూల్ను సైతం అందుబాటులోకి తెచ్చింది. వర్డ్ ప్యాడ్లో రెజ్యూమ్, లెటర్స్ను తయారు చేయడం, టేబుల్స్ క్రియేట్ చేయడంతో పాటు ఫోటోలను సైతం జత చేసుకోవచ్చు. నోట్ ప్యాడ్లో లేని ఇటాలిక్,అండర్ లైన్, బుల్లెట్ పాయింట్స్, నెంబరింగ్, టెక్ట్స్ ఎలైన్మెంట్స్ వంటి అడ్వాన్స్ ఫీచర్లను సైతం ఉపయోగించుకునేలా వెసలు బాటు కల్పించింది. వర్డ్ ప్యాడ్ కనుమరుగు అయితే, ఈ తరుణంలో 30 ఏళ్లుగా వినియోగదారులకు సేవలందిస్తున్న వర్డ్ ప్యాడ్ను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. వర్డ్ ప్యాడ్కు ప్రత్యామ్నాయంగా ఆఫీస్ 365 పెయిడ్ సబ్స్క్రిప్షన్లో ఉన్న మైక్రోసాఫ్ట్ వర్డ్ను ఉపయోగించుకోవాలని కోరింది. రిచ్ టెక్స్ డాక్యుమెంట్స్ కోసం మైక్రోసాఫ్ట్ వర్డ్, డీవోసీ అండ్. ఆర్టీఎఫ్,ప్లెయిన్ టెక్ట్స్ డాక్యుమెంట్ కోసం విండోస్ నోట్ప్యాడ్లను వినియోగించుకోవచ్చని తెలిపింది. అదే సమయంలో మైక్రోసాఫ్ట్ నోట్ప్యాడ్లో కొత్త ఫీచర్లను అందుబాటులోకి తెచ్చింది. ఆటోసేవ్, ఆటో రీస్టోర్ ట్యాబ్స్కు సపోర్ట్ చేస్తుంది. భవిష్యత్లో ఎవరికైనా అవసరం అనిపిస్తే వర్డ్ ప్యాడ్ బదులు మైక్రోసాఫ్ట్ వర్డ్లో పనికొస్తుందని మైక్రోసాఫ్ట్ యాజమాన్యం అధికారికంగా ప్రకటించింది. చాట్జీపీటీకి అనువుగా కోర్టానా మైక్రోసాఫ్ట్ చివరిగా విండోస్7 విడుదల సందర్భంగా కొన్ని మేజర్ అప్డేట్ చేసింది. 1990లలో మైక్రోసాఫ్డ్ వర్డ్, వర్డ్ స్టార్లలో యూజర్లు సులభంగా సెర్చ్ చేసేలా బటన్స్, డ్రాప్ డౌన్ లిస్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. వాటిని గుర్తించేలా రిబ్బోన్ యూఐని విడుదల చేసింది. తాజాగా, ఆ యూఐ రిబ్బోన్ (Ribbon UI) స్థానంలో యూఐని తెచ్చింది. మైక్రోసాఫ్ట్ ఇటీవలే వర్చువల్ అసిస్టెంట్ కోర్టానా ( Cortana ) యాప్ను మైక్రోసాఫ్ట్ సెర్చ్ ఇంజిన్ బింగ్కు అనుకూలంగా చాట్జీపీటీని అందిచంనుంది. నివేదికల ప్రకారం మైక్రోసాఫ్ట్ ప్రస్తుతం విండోస్ 11కు లేటెస్ట్ వెర్షన్ విండోస్12 ఓఎస్పై పనిచేస్తుంది. దీనిని వచ్చే ఏడాది విడుదల చేయనున్నట్లు పలు నివేదికలు హైలెట్ చేశాయి. చదవండి👉 నోరు పారేసుకున్న యాంకర్..కౌంటర్ ఇచ్చిన ఆనంద్ మహీంద్రా -
చాట్జీపీటీ చెప్పిందని కోర్టు మెట్లక్కిన దిగ్గజ కంపెనీ.. చివరికి ఏమైందంటే
ఓ కేసు విచారణ నిమిత్తం ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్ చాట్జీపీటీ ఇచ్చిన ఆధారాల్ని పరిగణలోకి తీసుకొని తీర్పు ఇవ్వలేమని స్పష్టం చేసింది. ఇంతకీ ఆ కేసు ఏంటి? చాట్జీపీటీ ఇచ్చిన ఆధారాలేంటి? పలు నివేదికల ప్రకారం.. ఇటీవల ఫ్రాన్స్ లగ్జరీ షూ తయారీ సంస్థ క్రిస్టియన్ లౌబౌటిన్.. భారత్లోని ఢిల్లీ కేంద్రంగా షుటిక్ అనే కంపెనీ కస్టమర్ల అభిరుచులకు అనుగుణంగా షూ’లను తయారు చేసి అమ్మకాలు నిర్వహిస్తుంది. ఇప్పుడు షుటిక్పై క్రిస్టియన్ లౌబౌటిన్ ఢిల్లీ కోర్టును ఆశ్రయించింది. తమ సంస్థ కొన్ని షూ డిజైన్లు తమకే చెందుతాయంటూ ట్రేడ్మార్క్ తీసుకుందని, ఇందుకోసం రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు కోర్టుకు వివరించింది. అయితే, షుటిక్ తమ ట్రేడ్ మార్క్ షూ డిజైన్లను కాపీ కొట్టిందని, ఇదే విషయాన్ని చాట్జీపీటీ చెప్పినట్లు ఆధారాలు సమర్పించింది. తమకు న్యాయం చేయాలని విన్నవించుకుంది. ఈ ఫిర్యాదుపై విచారణ చేపట్టిన కోర్టు.. న్యాయస్థానంలో చట్టపరమైన లేదా వాస్తవిక సమస్యల పరిష్కారానికి చాట్జీపీటీ ఇచ్చిన ఆధారాలు సరిపోవని కోర్టు పేర్కొంది. ఏఐ చాట్బాట్ల ప్రతిస్పందనలు, కల్పితాలు, ఊహాజనిత డేటా మొదలైన వాటికి అవకాశాలు ఉన్నాయనే అభిప్రాయం వ్యక్తం చేసింది. ఇరు పక్షాల వాదనలను విన్న కోర్టు.. ప్రతివాది ఉద్దేశపూర్వకంగా మనీ సంపాదనకు ట్రేడ్ మార్క్ నిబంధనలను ఉల్లంఘించారని అర్థమవుతుందని తెలిపింది. ఇకపై బూట్ల డిజైన్లు, రంగులు కాపీ చేయరాదని, ఆ ఒప్పందం ఉల్లంఘిస్తే రూ.25 లక్షలు జరిమాన చెల్లించాల్సి వస్తుందని ప్రతివాదిని హెచ్చరించింది. ప్రస్తుతం, పిటిషనర్ ఖర్చుల కింద వాదికి రూ.2 లక్షలు చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. చదవండి👉 ‘ఆ AI టూల్ను షట్డౌన్ చేస్తున్నాం’.. చాట్జీపీటీ సృష్టికర్త సంచలన ప్రకటన! -
భారతీయుల ప్రతిభపై చాట్జీపీటీ సృష్టికర్త సెటైర్లు, రంగంలోకి దిగిన ముఖేష్ అంబానీ
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థ ఓపెన్ ఏఐ, చాట్జీపీటీ సృష్టికర్త శామ్ ఆల్ట్మన్ కృత్తిమ మేధ వంటి అధునాతమైన టెక్నాలజీల్లో భారతీయులు ప్రతిభను తగ్గిస్తూ మాట్లాడారు. తాజాగా, ఆల్ట్మన్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తూ ముఖేష్ అంబానీ ఆసక్తిర వ్యాఖ్యలు చేశారు. రిలయన్స్ ఇండస్ట్రీ నిర్వహించిన 46వ వార్షిక సాధారణ సమావేశంలో శామ్ ఆల్ట్మన్ వ్యాఖ్యలపై పరోక్షంగా ఛాలెంజ్ చేస్తూ ఆ సంస్థ అధినేత ముఖేష్ అంబానీ మాట్లాడారు. ‘జియో హామీ ఇస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని జియో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ప్రతి ఒక్కరికీ అందిస్తుంది’అని అన్నారు. ఆల్ట్మన్ ఏమన్నారు? ఆసియా దేశాల పర్యటనలో భాగంగా ఆల్ట్మన్ ఈ ఏడాది జూన్ నెలలో భారత్ను సందర్శించారు. ఆ సమయంలో ఏఐ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో భారతీయుల ప్రతిభ వంటి అంశాలపై మీడియా సంస్థలు పలు ప్రశ్నలు సంధించాయి. వాటికి సమాధానంగా చాట్జీపీటీ సృష్టికర్త మాట్లాడుతూ.. ‘నేను మాట్లాడేది తప్పో ఒప్పో నాకు తెలియదు. కానీ భారతీయులు చాట్జీపీటీ లాంటి టూల్స్ను అభివృద్ది చేయలేరు. కాదని సంస్థలు ప్రయత్నిస్తే నిరాశజనకమైన ఫలితాలే వస్తాయంటూ విమర్శించారు. ఆల్ట్మన్ వ్యాఖ్యల్ని తప్పుబడుతూ నెటిజన్లు కామెంట్లు చేశారు. భారత్లో ఏఐ ముఖేష్ అంబానీ ఏజీఎం సమావేశంలో భారత్ ఏఐలో రాణించేందుకు అవసరమైన వనరులు, నిబద్ధతను కలిగి ఉందని అన్నారు. జియో ప్లాట్ఫామ్లు ఏఐ మోడల్లు, ఏఐ ఆధారిత పరిష్కారాలను అభివృద్ధి చేసే ప్రయత్నానికి నాయకత్వం వహించాలని కోరుకుంటున్నాయి. తద్వారా దేశ పౌరులు, వ్యాపారాలు, ప్రభుత్వానికి ఒకే విధంగా ప్రయోజనాన్ని అందిస్తాయని సూచించారు. ఏఐ డిమాండ్లను నిర్వహించే సత్తా భారత్కు ఉందన్నారు. క్లౌడ్, ఎడ్జ్ లొకేషన్లు రెండింటినీ కలుపుతూ.. సుస్థిరత, పర్యావరణ బాధ్యత పట్ల నిబద్ధతను పాటిస్తూ 2000 ఎండబ్ల్యూ వరకు ఏఐ కంప్యూటింగ్ సామర్థ్యాన్ని సృష్టించేందుకు రిలయన్స్ కట్టుబడి ఉందని ముఖేష్ అంబానీ ప్రకటించారు. -
ఆ ఉద్యోగాలకు ముప్పే.. ఐబీఎం సీఈవో కీలక వ్యాఖ్యలు
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (AI) టూల్స్తో కొన్ని రకాల ఉద్యోగాలకు ముప్పు పొంచి ఉందని ఐబీఎం ఛైర్మన్, సీఈవో అరవింద్ కృష్ణ (Arvind Krishna) అన్నారు. చాట్జీపీటీ (ChatGPT), గూగుల్ బార్డ్ (Google Bard) వంటి జెనరేటివ్ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ మోడల్స్ ఉత్పాదకతను పెంచగలవని, అయితే "బ్యాక్ ఆఫీస్, వైట్ కాలర్" ఉద్యోగాలపై వాటి ప్రభావం ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. సీఎన్బీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో అరవింద్ కృష్ణ మాట్లాడుతూ అభివృద్ధి చెందిన దేశాలలో జనాభా పెరుగుదల క్షీణతను ప్రస్తావించారు. ఏఐ టెక్నాలజీలు మానవులకు నాణ్యమైన జీవనాన్ని అందించడంతో తోడ్పడగలవని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆర్టిఫీషియల్ సానుకూలతను ఉపయోగించుకోవడానికి ఐబీఎం కూడా ప్రయత్నాలు సాగిస్తోంది. ఈ క్రమంలోనే ఐబీఎం ఇటీవల వాట్సన్ఎక్స్ను అనే జనరేటివ్ ఏఐ ప్లాట్ఫామ్ సూట్ను పరిచయం చేసింది. సాంకేతికతను సురక్షితంగా ఉపయోగించుకోవడంలో కంపెనీలకు సహాయం చేయడానికి దీన్ని రూపొందించారు. ఇంతకు ముందు మేనెలలో జరిగిన ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలోనూ ఐబీఎం సీఈవో అరవింద్ కృష్ణ ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. తమ కంపెనీలో 30 శాతం ఉద్యోగాలను ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ లేదా ఆటోమేషన్ టెక్నాలజీతో భర్తీ చేసే అవకాశం ఉందని చెప్పారు. ఫలితంగా, వచ్చే ఐదేళ్లలో కంపెనీ 7,800 ఉద్యోగాలను తొలగిస్తుందని అంతా ఆందోళన చెందారు. తర్వాత తన వ్యాఖ్యలపై మరింత స్పష్టతనిస్తూ, కొత్త టెక్నాలజీ ఆఫీసు పనిని భర్తీ చేస్తుందని, ఐబీఎంలో కూడా ఇదే జరుగుతుందని పేర్కొన్నారు. -
ఏ క్యారెక్టర్తోనైనా... చాట్ చేయొచ్చు!
సాపేక్ష సిద్ధాంతం గురించి ఆల్బర్ట్ ఐన్స్టీన్తో సంభాషించింది సృజన. సినిమాలు ఎక్కువగా చూసే గీతిక దర్శక దిగ్గజం ఆల్ఫ్రెడ్ హిచ్కాక్తో ‘నంబర్ 13’ నుంచి ‘ది వైట్ షాడో’ వరకు ఎన్నో సినిమాల గురించి వివరంగా సంభాషించింది. ఇక స్వరతేజకు జపనీస్ ప్రఖ్యాత వీడియో గేమ్ క్యారెక్టర్ ‘మారియో’తో సంభాషించడం సరదా! కాల్పనికత అనేది మనకు బొత్తిగా కొత్త కాదు. అయితే ఏఐ సాంకేతికత కాల్పనికతను మరోస్థాయికి తీసుకువెళ్లింది. యువతరం తాజా ఆర్టిఫిషియల్ క్రేజ్ ‘క్యారెక్టర్. ఏఐ’ ఆ సాంకేతికతలో భాగమే... ఏఐ పవర్ హౌజ్ ‘ఓపెన్ ఏఐ’ అంతర్జాల సంచలనంగా మారింది. ‘చాట్ జీపీటీ’ పాపులారిటీతో ఎన్నో టెక్నాలజీ కంపెనీలు తమ సొంత ఏఐ చాట్బాట్లను ప్రవేశపెట్టాయి. ‘చాట్జీపీటీ’ పాపులారిటీ సంగతి ఎలా ఉన్నా యువతరం తాజా ఆసక్తులలో ‘క్యారెక్టర్. ఏఐ’ ఒకటిగా మారింది. ‘క్యారెక్టర్. ఏఐ’ ద్వారా సెలబ్రిటీలు, చారిత్రక వ్యక్తులు, కాల్పనిక పాత్రలు, పాపులర్ వీడియో గేమ్ క్యారెక్టర్లు, థెరపిస్ట్లతో హాయిగా సంభాషించవచ్చు. సంభాషణల విషయంలో ఇది ‘చాట్ జీపీటి’ కంటే సహజంగా ఉంటుందనే టాక్ వినిపిస్తోంది. నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్, మెషిన్ లెర్నింగ్ కాంబినేషన్లో ‘క్యారెక్టర్. ఏఐ’ను అభివృద్ధి చేశారు. ‘క్యారెక్టర్.ఏఐ’లో ఎకౌంట్ సెటప్ పూర్తి చేసిన తరువాత ‘క్రియేట్ ఏ క్యారెక్టర్’ ఆప్షన్ను క్లిక్చేస్తే విండో ఓపెన్ అవుతుంది. క్యారెక్టర్ తనకు తాను పరిచయం చేసుకుంటుంది. ఆ తరువాత సంభాషణ మొదలుపెట్టవచ్చు. ఉదాహరణకు...‘హారి పోటర్’ సిరీస్లోని ఫిక్షనల్ క్యారెక్టర్ హమైనీ గ్రేంజర్తో సంభాషించాలనుకున్నాం.‘హలో రమ్య, మై నేమ్ ఈజ్ హమైనీ గ్రేంజర్. ఇట్స్ వెరీ నైస్ టు మీట్ యూ’ అంటూ తనను తాను పరిచయం చేసుకుంటుంది హమైనీ. తన ఇష్టాయిష్టాలు, ఆసక్తుల గురించి చెబుతుంది. రిలవెంట్ ట్యాగ్స్ అందుబాటులో ఉంటాయి. క్యారెక్టర్ వ్యక్తిత్వం ఆధారంగా డ్రాప్ డౌన్ మెన్యూ నుంచి స్పీకింగ్ వాయిస్ను సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒక క్యారెక్టర్తో చాట్ చేయవచ్చు లేదా మల్టిపుల్ క్యారెక్టర్స్తో గ్రూప్ చాట్ చేయవచ్చు. ‘క్యారెక్టర్. ఏఐ’ అనేది టెక్ట్స్కు మాత్రమే పరిమితం కాదు. ప్రాంప్ట్స్, చాట్స్ ఆధారంగా ఇమేజ్లను క్రియేట్ చేయవచ్చు. ఏఐ ఇండస్ట్రీ ప్రముఖులుగా గుర్తింపు పొందిన షాజీర్, డేనియల్ ఫ్రెటస్ గూగుల్లో పనిచేస్తున్నప్పుడు ‘క్యారెక్టర్. ఏఐ’కు సంబంధించి ఆలోచన చేశారు. షాజీర్ ‘అటెన్షన్ ఈజ్ ఆల్ యూ నీడ్’ పుస్తక రచయితలలో ఒకరు. ఇక డేనియల్ ‘మీన’ అనే చాట్బాట్ క్రియేటర్. వ్యక్తిగత వస్తువులు ఉన్నట్లే, పర్సనలైజ్డ్ చాట్బాట్లు ఉండాలనుకునేవారికి క్యారెక్టర్ ఏఐ ఉపయోగపడుతుంది. ‘వర్చువల్ ఫ్రెండ్’ను సృష్టిస్తుంది. ‘పర్సనలైజ్డ్ చాట్బాట్ అంటే మాటలా? ఖర్చు బాగానే అవుతుంది కదా’ అనే సందేహం వస్తుంది. అయితే ‘క్యారెక్టర్. ఏఐ’తో ఖర్చు లేకుండానే సొంత చాట్బాట్ను సృష్టించుకోవచ్చు. ఆ.. ఏముంది... అంతా కాల్పనికమే కదా అనుకుంటే ఏమీ లేకపోవచ్చు. ఉంది అనుకుంటే మాత్రం ఎంతో ఉంది. ‘కొత్త అనుభూతిని సొంతం చేసుకున్నామా లేదా అనేది ముఖ్యం కాని వాస్తవమా కాదా అనేది ముఖ్యం కాదు’ అంటున్నాడు ‘యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియా’ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం అసోసియేట్ ప్రొఫెసర్ మైక్. ‘చాట్ జీపీటీ’ గురించి ఎంత గొప్పగా చర్చించుకున్నప్పటికీ కొన్ని ప్రయోగాలు దెబ్బతిన్నాయి. ఉదాహరణకు ... నేషనల్ ఈటింగ్ డిజార్డర్స్ అసోసియేషన్ బరువు తగ్గడానికి సంబంధించి సమస్యాత్మక సలహా ఇచ్చినందుకు తమ చాట్బాట్ను సస్పెండ్ చేసింది. క్యారెక్టర్. ఏఐ విషయంలోనూ పొరపాట్లు జరగవచ్చు. సాంకేతికతకు పరిమితులు ఉండే విషయాన్ని అర్థం చేసుకోవాలి’ అంటుంది చెన్నైకి చెందిన ఇంజనీరింగ్ స్టూడెంట్ మనీష. రియల్ చాలెంజర్... జెమిని ఏఐ రేసులో ఓపెన్ ఏఐ లాంగ్వేజ్ మోడల్స్ లీడింగ్లో ఉన్నప్పటికీ ఇది ఎప్పటివరకు అనేది ప్రశ్నార్థకంగా ఉంది. దీనికి కారణం సరికొత్తగా వస్తున్న పవర్ఫుల్ ఏఐ మోడల్స్. వీటిమాట ఎలా ఉన్నా గూగుల్ వారి ‘జెమిని’ని అసలు సిసలు రియల్ చాలెంజర్ అంటున్నారు. గూగుల్ తమ కొత్త ‘జెమిని’ ప్రాజెక్ట్లో భాగంగా నెక్స్›్ట– జనరేషన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్స్ను లాంచ్ చేయనుంది. ‘జెమిని’ అనేది కన్వర్సేషనల్ టెక్ట్స్ను జనరేట్ చేయడానికి పరిమితం కాదు. ఇన్ఫుట్స్, వీడియోలు, ఇమేజ్ లను హ్యాండిల్ చేసే మల్టీ–మోడల్ జెమిని. గూగుల్ దగ్గర ఉన్న అపారమైన వనరులు(యాక్సెస్ టు యూ ట్యూబ్ వీడియోస్, గూగుల్ బుక్స్, సెర్చ్ ఇండెక్స్, స్కాలర్ మెటీరియల్)లతో ‘జెమిని’ ఇతర కంపెనీలకు గట్టి ప్రత్యర్థిగా మారనుంది. ‘ఎక్స్క్లూజివ్ టు గూగుల్’ అనే ప్రత్యేకత వల్ల జెమిని మరింత బలంగా మారనుంది. (చదవండి: తండ్రికి కూడా ప్రసూతి సెలవులు ఇవ్వాల్సిందే! హైకోర్టు జస్టిస్ ఆదేశం!) -
అమెజాన్లో జాబ్.. జీతం రూ.7 కోట్లు!
ప్రముఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థ ఓపెన్ ఏఐ రూపొందించిన చాట్జీపీటీ వంటి టూల్స్తో ఉద్యోగాలు పోతాయని కొందరు భయపడుతుండగా.. ఏఐ వల్ల కొత్త ఉద్యోగాల సృష్టి జరుగుతుందని వాదించే వారూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ నెట్ఫ్లిక్స్, ఈకామర్స్ దిగ్గజం అమెజాన్ చాట్జీపీటీ తరహా జనరేటీవ్ ఏఐ వంటి టెక్నాలజీలలో నిపుణులైన వారికి ఏడాదికి రూ.7 కోట్ల వేతనం ఇచ్చేందుకు ముందుకు వచ్చాయి. నెట్ఫ్లిక్స్ తన అఫిషియల్ వెబ్సైట్లో ఈ జాబ్స్కు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసింది. అందులో మెషిన్లెర్నింగ్ ఫ్లాట్ ఫామ్ ప్రొడక్ట్ మేనేజర్గా బాధ్యతలు నిర్వహించేందుకు ఔత్సాహికులైన అభ్యర్ధులు కావాలి. డిగ్రీతో పనిలేదు అమెరికా కేంద్రంగా కాలిఫోర్నియా కేంద్రంగా నెట్ఫ్లిక్స్ ఆఫీస్లో పనిచేయాలి. లేదంటే వెస్ట్ కోస్ట్ ప్రాంతం నుంచి వర్క్ ఫ్రమ్ హోం సదుపాయం ఉంది. ప్రారంభ వేతనం ఏడాదికి 3లక్షల డాలర్ల నుంచి 9లక్షల డాలర్ల వరకు ఉంటుంది. డిగ్రీ అవసరం లేదని పేర్కొంది. జీతంతో పాటు బోనస్లూ అదనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలపై జాబ్స్ ఉన్నాయంటూ అమెజాన్ సైతం ప్రకటన చేసింది. సైన్స్ అండ్ జనరేటీవ్ ఏఐ’లో పని చేసేందుకు సీనియర్ మేనేజర్లు కావాలని పిలుపునిచ్చింది. సైంటిఫిక్ రిసెర్చ్, అప్లికేషన్ ఏఐ టెక్నిక్స్ బృందాన్ని లీడ్ చేసేందుకు టీం లీడర్లు కావాలి. ఏఐ అల్గారిథమ్ను ఉపయోగించి మనుషులు ఎలాగైతే ఇమేజెరీ అండ్ వీడియోస్ తయారు చేస్తారో అలాగే తయారు చేసే స్కిల్స్ ఉండాలని సూచించింది. బేస్ శాలరీ ఏడాదికి 3లక్షల 40 వేల డాలర్లు, శాలరీతో సంబంధం లేకుండా ప్రత్యేక బోనస్ల్ని అందిస్తామని తెలిపింది. యూఎస్లో అత్యధికంగా సంపాదించే వారి జాబితాలో చాట్జీపీటీ విడుదలతో ఆయా రంగాల్లో ఆర్టిపిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ వినియోగం రోజురోజుకీ పెరిగిపోతుంది. దీంతో ఈ విభాగంలో ఎక్స్పర్ట్స్కు డిమాండ్ అధికంగా ఉంది. అందుకు నిదర్శనమే నెట్ఫ్లిక్స్, అమెజాన్ల నియమాకం. ఈ రెండు సంస్థలు ఏఐ నిపుణులకు చెల్లించే జీతం యునైటెడ్ స్టేట్స్ (యూఎస్)లో టాప్ వన్లో సంపాదించే వారి జాబితాలో నిలబెట్టనుంది. ఇతర కంపెనీలు సైతం ఇదే విధంగా శాలరీలను ఆఫర్ చేస్తున్నాయి. రిటైల్ మీడియా ఏఐ డైరెక్టర్కు వాల్మార్ట్ సంవత్సరానికి 288,000 డాలర్ల వరకు ఆఫర్ చేస్తోంది. ఏఐ సంబంధిత చట్టపరమైన విషయాలలో నైపుణ్యం కలిగిన న్యాయవాదికి సంవత్సరానికి 351,000 లక్షల డాలర్లను చెల్లించడానికి గూగుల్ సిద్ధంగా ఉంది. ఆన్లైన్ డేటింగ్ యాప్ హింగే వంటి నాన్-టెక్ కంపెనీలు కూడా ఏఐ నిపుణుల్ని ఆహ్వానిస్తున్నాయి. హింజ్ మాతృ సంస్థ, మ్యాచ్ గ్రూప్ ఏఐ వైస్ప్రెసిడెంట్కు సంవత్సరానికి 398,000 లక్షల డాలర్లను వెచ్చిస్తుంది. ఫ్రీలాన్సింగ్ ప్లాట్ఫారమ్ అప్వర్క్ ఏఐ, మెషిన్ లెర్నింగ్ విభాగాల్లో రిమోట్ వైస్ ప్రెసిడెంట్ విధులు నిర్వహించే వారి కోసం అన్వేషిస్తుంది. 437,000 లక్షల డాలర్ల వరకు బేస్ శాలరీని అందిస్తోంది. చదవండి👉 ‘AI’ వల్ల ఉద్యోగాలు పోవడం ఖాయం.. చాట్జీపీటీ సృష్టి కర్త సంచలన వ్యాఖ్యలు! -
చాట్జీపీటీపై సంచలన రిపోర్ట్.. త్వరలో దివాలా తీయడం ఖాయం!
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సంచలనం చాట్ జీపీటీ (ChatGPT) రూపకర్త, సామ్ ఆల్ట్మాన్ నేతృత్వంలోని ఓపెన్ ఏఐ (OpenAI) ఆర్థిక సంక్షోభంలోకి వెళ్లిపోతోందని, 2024 చివరి నాటికి కంపెనీ దివాలా తీసే అవకాశం ఉందని ‘అనలైటిక్స్ ఇండియా మ్యాగజైన్’ నివేదిక పేర్కొంది. ఆ నివేదిక ప్రకారం... తన ఏఐ సర్వీసుల్లో ఒకటైన చాట్జీపీటీ నిర్వహణకు ఓపెన్ ఏఐ కంపెనీకి రోజుకు 7 లక్షల డాలర్లు (సుమారు రూ. 5.80 కోట్లు) ఖర్చవుతోంది. దీంతో ఆ కంపెనీ ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. జీపీటీ-3.5, జీపీటీ-4తో ఆదాయాన్ని పెంచుకునేందుకు ప్రయత్నించినా పెద్దగా లాభం లేకపోయింది. ప్రస్తుత ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడేందుకు కంపెనీ సతమతవుతోంది. 2022 నవంబర్లో చాట్జీపీటీని ప్రారంభించిన తర్వాత అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న యాప్గా అవతరించింది. ప్రారంభ దశల్లో రికార్డు స్థాయిలో యూజర్ల ప్రవాహం వచ్చినా.. ఇటీవల కొన్ని నెలులుగా యూజర్ల సంఖ్యలో క్రమంగా క్షీణతను చూస్తోంది. జులై చివరి నాటికి చాట్ జీపీటీ యూజర్ బేస్ మరింత పడిపోయిందని ‘సిమిలర్ వెబ్’ డేటా చెబుతోంది. 2023 జూన్తో పోల్చితే జులై నెలలో యూజర్ బేస్ 12 శాతం తగ్గిందని, 1.7 బిలియన్ల నుంచి 1.5 బిలియన్లకు పడిపోయిందని పేర్కొంది. ఇదీ చదవండి: అతి తక్కువ ధరకే 5జీ స్మార్ట్ఫోన్.. 9 నిమిషాల్లోనే స్టాక్ అయిపోయింది! కంపెనీ ఏపీఐ (అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్)లు కూడా వైఫల్యానికి కారణంగా తెలుస్తోంది. అనేక కంపెనీలు గతంలో తమ ఉద్యోగులను చాట్ జీపీటీని ఉపయోగించకుండా కట్టడి చేసినట్లుగా నివేదిక పేర్కొంది. అయితే ఇప్పుడు ఓపెన్ఏఐ ఏపీఐలకు యాక్సెస్ పొందడం ప్రారంభించిన కంపెనీలు.. విభిన్న వర్క్ఫ్లోల కోసం వారి సొంత ఏఐ చాట్బాట్లను రూపొందించేందుకు వీలు కల్పిస్తున్నట్లు నివేదిక వివరించింది. ఓపెన్ ఏఐ సంస్థ ఇంకా లాభాల్లోకి రాలేదని నివేదిక చెబుతోంది. గత మే నెలలో చాట్ జీపీటీని అభివృద్ధి చేయడం ప్రారంభించినప్పటి నుంచి దాని నష్టాలు 540 మిలియన్ డాలర్లకు రెట్టింపు అయ్యాయి. మైక్రోసాఫ్ట్ (Microsoft) 10 బిలియన్ డాలర్ల పెట్టుబడితోనే ఓపెన్ ఏఐ కంపెనీ కొంతలోకొంత నెట్టుకొస్తోంది. మరోవైపు ఓపెన్ ఏఐ కంపెనీ 2023 సంవత్సరంలో 200 మిలియన్ డాలర్ల ఆదాయాన్ని అంచనా వేసింది. 2024లో అది ఒక బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని భావించింది. కానీ నష్టాలు మాత్రమే పెరుగుతున్నందున లాభాలు అసాధ్యంగా కనిపిస్తున్నట్లు నివేదిక పేర్కొంది. -
‘ఏఐ’ పంట!.. వ్యవసాయ రంగంపై చాట్ జీపీటీ ప్రభావం ఎలా ఉండబోతుంది?
-కంచర్ల యాదగిరిరెడ్డి నాగలి పోయి ట్రాక్టర్ వచ్చినప్పుడు.. యంత్రాలు సాగు చేస్తాయా? అన్నవాళ్లున్నారు. ట్రాక్టర్లకు హార్వెస్టర్లు, స్ప్రేయర్లు, ఇప్పుడు డ్రోన్లూ తోడవడంతో బాగున్నాయే అనుకున్నారు. ఆధునిక యంత్ర పరికరాల రాకతో వ్యవసాయం కొంత పుంజుకున్నా.. తర్వాతి తరాలు మాత్రం వ్యవసాయం అంటే అమ్మో అంటున్నారు. ఇలాంటి సమయంలోనే ‘చాట్ జీపీటీ’, దాని ఆధారితంగా మరిన్ని కృత్రిమ మేధ సాంకేతికతలు తెరపైకి వచ్చాయి. వ్యవసాయ రంగంపైనా ప్రభావం చూపుతున్నాయి. ఇప్పటికే కొన్ని ఏఐ ఆధారిత పరికరాలు అందుబాటులోకి వచ్చాయి కూడా. మరి మొత్తంగా దీనివల్ల రైతులకు ఏం మేలు జరుగుతుంది? వ్యవసాయానికి ఏం ఒనగూరుతుంది? అంతిమంగా వచ్చేది లాభమా, నష్టమా? అన్న చర్చ సాగుతోంది. దేశ స్థూల జాతీయోత్పత్తిలో ఇప్పటికీ వ్యవసాయం వాటా దాదాపు 50 శాతంపైనే. కోట్లమందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పిస్తున్న రంగం ఇదే. అయితే రుతుపవనాలు, మార్కెట్ పరిస్థితులు, నాణ్యమైన విత్తనాలు, ఎరువులు లభించకపోవడం వంటి అనేక కారణాలతో వ్యవసాయం ఇప్పటికీ ఆశల జూదంగానే మిగిలిపోయింది. ప్రభుత్వం రకరకాల పథకాలు, లాభాలు చేకూరుస్తున్నప్పటికీ పరిస్థితిలో మార్పు తక్కువే. ఈ కారణంగానే వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు డ్రోన్లు, మెషీన్ లెర్నింగ్ వంటి ఆధునిక టెక్నాలజీల వాడకం మొదలైంది. అయితే గత ఏడాది విడుదలైన ‘చాట్ జీపీటీ’ఈ ప్రస్థానాన్ని ఒక అడుగు ముందుకు తీసుకెళ్లిందని చెప్పాలి. మైక్రోసాఫ్ట్కు చెందిన అజ్యూర్ ఓపెన్ ఏఐ సరీ్వస్ ద్వారా చాట్ జీపీటీ ఆధారంగా తయారైన‘జుగల్బందీ’చాట్బోట్ వీటిలో ఒకటి. రైతులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న వేర్వేరు సంక్షేమ, సహాయ పథకాల వివరాలను అందిస్తుందీ సాఫ్ట్వేర్. వాట్సాప్ ద్వారా కూడా అందుకోగల ఈ చాట్ బోట్ ఇంగ్లిషులో ఉన్న ప్రభుత్వ సమాచారాన్ని పది భాషల్లోకి అనువదించి మరీ అందిస్తూండటం విశేషం. చాట్ జీపీటీ వంటి కృత్రిమ మేధ సాఫ్ట్వేర్లకు వ్యవసాయంతో ఏం పని? అని చాలామంది అనుకోవచ్చు. కానీ, దీని చేరికతో సాగు అన్ని రకాలుగా మెరుగవుతుందన్నది నిపుణుల అంచనా. సమాచారం ఎంత ఎక్కువగా ఉన్నా సెకన్లలో దానిని విశ్లేషించి రైతులకు ఉపయోగపడే కొత్త సమాచారాన్ని అందించగలగడం దీనితో సాధ్యం. నీరు, ఎరువులు, కీటకనాశనుల వంటి వనరులను అవసరమైనంత మాత్రమే వాడేలా చేయడం, పంట దిగుబడులు పెంచడంకోసం తోడ్పడగలదు. ఎప్పటికప్పుడు మారిపోయే వాతావరణాన్ని కూడా దృష్టిలో ఉంచుకుని తగిన సలహా, సూచనలు ఇవ్వగలదు. 1. ప్రిడిక్టివ్ అనాలసిస్: వందేళ్ల వాతావరణ సమాచారం, మట్టి కూర్పు, పంటకు ఆశించే చీడపీడలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని.. వేసిన పంట ఎంత బాగా పండేది కచి్చతంగా చెప్పగలదు. దీన్నే ప్రిడిక్టివ్ అనాలసిస్ అంటారు. ఒకవేళ నష్టం జరిగే అవకాశముంటే దాన్ని వీలైనంత తగ్గించుకునే సూచనలూ అందుతాయి. 2. గరిష్టంగా దిగుబడులు: పరిస్థితులు, అవసరాలకు తగ్గట్టుగా సూచించగలదు. వేర్వేరు మార్గాల ద్వారా సమాచారాన్ని సేకరించి విశ్లేíÙంచడం, సొంతంగా పంటల తాలూకు సిమ్యులేషన్లు తయారు చేసుకుని అత్యున్నత సాగు పద్ధతులు, పంటలను అంచనా వేయడం సాధ్యమవుతుంది. దీనిద్వారా పంట దిగుబడులు, వ్యవసాయ రంగ ఉత్పాదకత గణనీయంగా పెరిగే అవకాశం ఏర్పడుతుంది. 3. ప్రిసిషన్ అగ్రికల్చర్: జనరేటివ్ ఏఐ ద్వారా వ్యవసాయంలో వ్యర్థాలను గణనీయంగా తగ్గించగల ప్రిసిషన్ వ్యవసాయం సాధ్యమవుతుంది. ఉదాహరణకు పంట పొలం మొత్తం తిరిగే డ్రోన్లు కలుపును గుర్తిస్తే.. అతితక్కువ కలుపునాశనులతో వాటిని తొలగించే ప్లాన్ను ఏఐ అందివ్వగలదన్నమాట. అలాగే ఏయే మొక్కలకు నీరు అవసరం? వేటికి ఎండ కావాలన్న సూక్ష్మ వివరాలను కూడా ప్రిసిషన్ అగ్రికల్చర్ ద్వారా గుర్తించి అందించవచ్చు. ఉపగ్రహ ఛాయాచిత్రాలు, వాతావరణ సమాచారం, మట్టి కూర్పు వంటివన్నీ పరిగణించడం ద్వారా చేసే ప్రిసిషన్ అగ్రికల్చర్ ద్వారా ఖర్చులు తగ్గుతాయి. దిగుబడులు పెరుగుతాయి. 4. కొత్త వంగడాల సృష్టి: వాతావరణ మార్పుల నేపథ్యంలో కరువు కాటకాలు, వరదల వంటివి పెరిగాయి. ఈ ప్రతికూల పరిస్థితులను తట్టుకుని మనగలిగిన కొత్త వంగడాల అవసరం పెరిగింది. సంప్రదాయ పద్ధతుల్లో జరిగే పరిశోధనల ద్వారా ఈ వంగడాల సృష్టికి చాలా కాలం పడుతుంది. కానీ జనరేటివ్ ఏఐను ఉపయోగిస్తే.. అధిక దిగుబడులిచ్చే, వాతావరణ మార్పులను తట్టుకోగల వంగడాలను వేగంగా సృష్టించడం సాధ్యమని నిపు ణులు చెప్తున్నారు. జన్యు సమాచారాన్ని విశ్లేíÙంచి ఏ రకమైన జన్యువులను తొలగిస్తే, చేరిస్తే లాభదాయకమో ఈ కత్రిమ మేధ సాఫ్ట్వేర్లు వేగంగా గుర్తించగలవు. చాట్బోట్లు.. కాల్సెంటర్లు భారత ప్రభుత్వం కూడా వ్యవసాయంలో జనరేటివ్ ఏఐ సామర్థ్యాన్ని గుర్తించింది. కేంద్ర ఐటీ, ఎల్రక్టానిక్స్ శాఖ వాట్సాప్ ఆధారిత చాట్బోట్ ఒకదాన్ని సృష్టించే ప్రయత్నాల్లో ఉంది. బెంగళూరుకు చెందిన ఒక కంపెనీ సిద్ధం చేసిన ‘కిసాన్ ఏఐ (కిసాన్ జీపీటీ)’ ఇప్పటికే పది భారతీయ భాషల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల రైతు సంబంధిత కార్యక్రమాలు, పథకాల వివరాలను అందిస్తోంది. దీంతోపాటే దిగుబడులు, ఆదాయాన్ని పెంచుకునేందుకు అవసరమైన సలహా, సూచనలు ఇస్తోంది. ప్రతినెలా కనీసం 40 వేల మంది రైతులు కిసాన్ ఏఐ ద్వారా లబ్ధి పొందుతున్నట్టు దాన్ని అభివృద్ధి చేసిన ప్రతీక్ దేశాయ్ తెలిపారు. వాధ్వానీ ఏఐ అనే స్వతంత్ర, లాభాపేక్ష లేని సంస్థ కూడా జనరేటివ్ ఏఐ సాయంతో రైతులకు వచ్చే సందేహాలను తీర్చేందుకు కిసాన్ కాల్సెంటర్ ఒకదాన్ని ఏర్పాటు చేసే ప్రయత్నాల్లో ఉంది. వ్యవసాయ రంగ నిపుణుల అనుభవాన్ని జనరేటివ్ ఏఐతో అనుసంధానించేందుకు తాము ప్రయత్నిస్తున్నట్లు వాధ్వానీ ఏఐ తెలిపింది. డిజిటల్ గ్రీన్ పేరున్న అంతర్జాతీయ సంస్థ గూయీ ఏఐతో జట్టుకట్టి వాతావరణ మార్పులను తట్టుకునేలా రైతులను తీర్చిదిద్దేందుకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తూండగా ఒడిశా వ్యవసాయ శాఖ ‘అమాకృష్ ఏఐ’ద్వారా పంటల నిర్వహణలో రైతులకు సమాచారం అందిస్తోంది. ప్రభుత్వ పథకాల వివరాలు, నలభైకు పైగా వాణిజ్య, సహకార బ్యాంకులు రైతులకు అందించే రుణ పథకాల వివరాలను ఈ చాట్బోట్ ద్వారా అందిస్తోంది. తెలంగాణలో ‘మిర్చి, పసుపు’ పరికరాలు మిర్చి, పసుపు పంటల్లో నాణ్యతను తేల్చేందుకు కృత్రిమ మేధ ఆధారిత పరికరాలను ఇప్పటికే వినియోగిస్తున్నారు. ఈ పంటలు ఏవైనా తెగుళ్లకు గురయ్యాయా? వాటిలోని రసాయనాల శాతం, రంగు, తేమ శాతం వంటి వాటిని నిమిషాల్లో తేల్చేస్తున్నారు. ఈ అంశాల ఆధారంగా మిర్చి, పసుపు పంటలకు గ్రేడింగ్ ఇస్తున్నారు. రైతులు తమ ఉత్పత్తులను త్వరగా మార్కెటింగ్ చేసుకోవడానికి, తగిన ధర పొందడానికి ఇది వీలు కల్పిస్తోంది. -
‘ఏఐ’పంట!
కంచర్ల యాదగిరిరెడ్డి:నాగలి పోయి ట్రాక్టర్ వచ్చినప్పుడు.. యంత్రాలు సాగు చేస్తాయా? అన్నవాళ్లున్నారు.ట్రాక్టర్లకు హార్వెస్టర్లు, స్ప్రేయర్లు, ఇప్పుడు డ్రోన్లూ తోడవడంతో బాగున్నాయే అనుకున్నారు. ఆధునిక యంత్ర పరికరాల రాకతో వ్యవసాయం కొంత పుంజుకున్నా.. తర్వాతి తరాలు మాత్రం వ్యవసాయం అంటే అమ్మో అంటున్నారు.ఇలాంటి సమయంలోనే ‘చాట్ జీపీటీ’, దాని ఆధారితంగా మరిన్ని కృత్రిమ మేధ సాంకేతికతలు తెరపైకి వచ్చాయి. వ్యవసాయ రంగంపైనా ప్రభావం చూపుతున్నాయి. ఇప్పటికే కొన్ని ఏఐ ఆధారిత పరికరాలు అందుబాటులోకి వచ్చాయి కూడా. మరి మొత్తంగా దీనివల్ల రైతులకు ఏం మేలు జరుగుతుంది? వ్యవసాయానికి ఏం ఒనగూరుతుంది? అంతిమంగా వచ్చేది లాభమా, నష్టమా? అన్న చర్చ సాగుతోంది. దేశ స్థూల జాతీయోత్పత్తిలో ఇప్పటికీ వ్యవసాయం వాటా దాదాపు 50 శాతంపైనే. కోట్లమందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పిస్తున్న రంగం ఇదే. అయితే రుతుపవనాలు, మార్కెట్ పరిస్థితులు, నాణ్యమైన విత్తనాలు, ఎరువులు లభించకపోవడం వంటి అనేక కారణాలతో వ్యవసాయం ఇప్పటికీ ఆశల జూదంగానే మిగిలిపోయింది. ప్రభుత్వం రకరకాల పథకాలు, లాభాలు చేకూరుస్తున్నప్పటికీ పరిస్థితిలో మార్పు తక్కువే. ఈ కారణంగానే వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు డ్రోన్లు, మెషీన్ లెర్నింగ్ వంటి ఆధునిక టెక్నాలజీల వాడకం మొదలైంది. అయితే గత ఏడాది విడుదలైన ‘చాట్ జీపీటీ’ఈ ప్రస్థానాన్ని ఒక అడుగు ముందుకు తీసుకెళ్లిందని చెప్పాలి. మైక్రోసాఫ్ట్కు చెందిన అజ్యూర్ ఓపెన్ ఏఐ సర్విస్ ద్వారా చాట్ జీపీటీ ఆధారంగా తయారైన‘జుగల్బందీ’చాట్బోట్ వీటిలో ఒకటి. రైతులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న వేర్వేరు సంక్షేమ, సహాయ పథకాల వివరాలను అందిస్తుందీ సాఫ్ట్వేర్. వాట్సాప్ ద్వారా కూడా అందుకోగల ఈ చాట్ బోట్ ఇంగ్లిషులో ఉన్న ప్రభుత్వ సమాచారాన్ని పది భాషల్లోకి అనువదించి మరీ అందిస్తూండటం విశేషం. చాట్ జీపీటీ వంటి కృత్రిమ మేధ సాఫ్ట్వేర్లకు వ్యవసాయంతో ఏం పని? అని చాలామంది అనుకోవచ్చు. కానీ, దీని చేరికతో సాగు అన్ని రకాలుగా మెరుగవుతుందన్నది నిపుణుల అంచనా. సమాచారం ఎంత ఎక్కువగా ఉన్నా సెకన్లలో దానిని విశ్లేషించి రైతులకు ఉపయోగపడే కొత్త సమాచారాన్ని అందించగలగడం దీనితో సాధ్యం. నీరు, ఎరువులు, కీటకనాశనుల వంటి వనరులను అవసరమైనంత మాత్రమే వాడేలా చేయడం, పంట దిగుబడులు పెంచడంకోసం తోడ్పడగలదు. ఎప్పటికప్పుడు మారిపోయే వాతావరణాన్ని కూడా దృష్టిలో ఉంచుకుని తగిన సలహా, సూచనలు ఇవ్వగలదు. ప్రిడిక్టివ్ అనాలసిస్: వందేళ్ల వాతావరణ సమాచారం, మట్టి కూర్పు, పంటకు ఆశించే చీడపీడలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని.. వేసిన పంట ఎంత బాగా పండేది కచి్చతంగా చెప్పగలదు. దీన్నే ప్రిడిక్టివ్ అనాలసిస్ అంటారు. ఒకవేళ నష్టం జరిగే అవకాశముంటే దాన్ని వీలైనంత తగ్గించుకునే సూచనలూ అందుతాయి. గరిష్టంగా దిగుబడులు: నేల, వాతావరణ పరిస్థితులకు తగ్గట్టు ఏ పంట వేస్తే గరిష్ట దిగుబడులు రాబట్టుకోవచ్చో గుర్తించగలదు. పంటల యాజమాన్య పద్ధతులను కూడా నిర్దిష్ట పరిస్థితులు, అవసరాలకు తగ్గట్టుగా సూచించగలదు. వేర్వేరు మార్గాల ద్వారా సమాచారాన్ని సేకరించి విశ్లేషించడం, సొంతంగా పంటల తాలూకు సిమ్యులేషన్లు తయారు చేసుకుని అత్యున్నత సాగు పద్ధతులు, పంటలను అంచనా వేయడం సాధ్యమవుతుంది. దీనిద్వారా పంట దిగుబడులు, వ్యవసాయ రంగ ఉత్పాదకత గణనీయంగా పెరిగే అవకాశం ఏర్పడుతుంది. ప్రిసిషన్ అగ్రికల్చర్: జనరేటివ్ ఏఐ ద్వారా వ్యవసాయంలో వ్యర్థాలను గణనీయంగా తగ్గించగల ప్రిసిషన్ వ్యవసాయం సాధ్యమవుతుంది. ఉదాహరణకు పంట పొలం మొత్తం తిరిగే డ్రోన్లు కలుపును గుర్తిస్తే.. అతితక్కువ కలుపునాశనులతో వాటిని తొలగించే ప్లాన్ను ఏఐ అందివ్వగలదన్నమాట. అలాగే ఏయే మొక్కలకు నీరు అవసరం? వేటికి ఎండ కావాలన్న సూక్ష్మ వివరాలను కూడా ప్రిసిషన్ అగ్రికల్చర్ ద్వారా గుర్తించి అందించవచ్చు. ఉపగ్రహ ఛాయాచిత్రాలు, వాతావరణ సమాచారం, మట్టి కూర్పు వంటివన్నీ పరిగణించడం ద్వారా చేసే ప్రిసిషన్ అగ్రికల్చర్ ద్వారా ఖర్చులు తగ్గుతాయి. దిగుబడులు పెరుగుతాయి. కొత్త వంగడాల సృష్టి: వాతావరణ మార్పుల నేపథ్యంలో కరువు కాటకాలు, వరదల వంటివి పెరిగాయి. ఈ ప్రతికూల పరిస్థితులను తట్టుకుని మనగలిగిన కొత్త వంగడాల అవసరం పెరిగింది. సంప్రదాయ పద్ధతుల్లో జరిగే పరిశోధనల ద్వారా ఈ వంగడాల సృష్టికి చాలా కాలం పడుతుంది. కానీ జనరేటివ్ ఏఐను ఉపయోగిస్తే.. అధిక దిగుబడులిచ్చే, వాతావరణ మార్పులను తట్టుకోగల వంగడాలను వేగంగా సృష్టించడం సాధ్యమని నిపు ణులు చెప్తున్నారు. జన్యు సమాచారాన్ని విశ్లేషించి ఏ రకమైన జన్యువులను తొలగిస్తే, చేరిస్తే లాభదాయకమో ఈ కత్రిమ మేధ సాఫ్ట్వేర్లు వేగంగా గుర్తించగలవు. చాట్బోట్లు.. కాల్సెంటర్లు భారత ప్రభుత్వం కూడా వ్యవసాయంలో జనరేటివ్ ఏఐ సామర్థ్యాన్ని గుర్తించింది. కేంద్ర ఐటీ, ఎల్రక్టానిక్స్ శాఖ వాట్సాప్ ఆధారిత చాట్బోట్ ఒకదాన్ని సృష్టించే ప్రయత్నాల్లో ఉంది. బెంగళూరుకు చెందిన ఒక కంపెనీ సిద్ధం చేసిన ‘కిసాన్ ఏఐ (కిసాన్ జీపీటీ)’ఇప్పటికే పది భారతీయ భాషల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల రైతు సంబంధిత కార్యక్రమాలు, పథకాల వివరాలను అందిస్తోంది. దీంతోపాటే దిగుబడులు, ఆదాయాన్ని పెంచుకునేందుకు అవసరమైన సలహా, సూచనలు ఇస్తోంది. ప్రతినెలా కనీసం 40 వేల మంది రైతులు కిసాన్ ఏఐ ద్వారా లబ్ధి పొందుతున్నట్టు దాన్ని అభివృద్ధి చేసిన ప్రతీక్ దేశాయ్ తెలిపారు.వాధ్వానీ ఏఐ అనే స్వతంత్ర, లాభాపేక్ష లేని సంస్థ కూడా జనరేటివ్ ఏఐ సాయంతో రైతులకు వచ్చే సందేహాలను తీర్చేందుకు కిసాన్ కాల్సెంటర్ ఒకదాన్ని ఏర్పాటు చేసే ప్రయత్నాల్లో ఉంది. వ్యవసాయ రంగ నిపుణుల అనుభవాన్ని జనరేటివ్ ఏఐతో అనుసంధానించేందుకు తాము ప్రయతి్నస్తున్నట్లు వాధ్వానీ ఏఐ తెలిపింది. డిజిటల్ గ్రీన్ పేరున్న అంతర్జాతీయ సంస్థ గూయీ ఏఐతో జట్టుకట్టి వాతావరణ మార్పులను తట్టుకునేలా రైతులను తీర్చిదిద్దేందుకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తూండగా ఒడిశా వ్యవసాయ శాఖ ‘అమాకృష్ ఏఐ’ద్వారా పంటల నిర్వహణలో రైతులకు సమాచారం అందిస్తోంది. ప్రభుత్వ పథకాల వివరాలు, నలభైకు పైగా వాణిజ్య, సహకార బ్యాంకులు రైతులకు అందించే రుణ పథకాల వివరాలను ఈ చాట్బోట్ ద్వారా అందిస్తోంది. తెలంగాణలో ‘మిర్చి, పసుపు’ పరికరాలు మిర్చి, పసుపు పంటల్లో నాణ్యతను తేల్చేందుకు కృత్రిమ మేధ ఆధారిత పరికరాలను ఇప్పటికే వినియోగిస్తున్నారు. ఈ పంటలు ఏవైనా తెగుళ్లకు గురయ్యాయా? వాటిలోని రసాయనాల శాతం, రంగు, తేమ శాతం వంటి వాటిని నిమిషాల్లో తేల్చేస్తున్నారు. ఈ అంశాల ఆధారంగా మిర్చి, పసుపు పంటలకు గ్రేడింగ్ ఇస్తున్నారు. రైతులు తమ ఉత్పత్తులను త్వరగా మార్కెటింగ్ చేసుకోవడానికి, తగిన ధర పొందడానికి ఇది వీలు కల్పిస్తోంది. -
ఆల్టైమ్ బెస్ట్ టీ20 జట్టు ఇదే.. !
టెక్నాలజీ రంగంలో చాట్ జీపీటీ తెచ్చిన విప్లవాత్మక మార్పుల గురించి అందరికీ తెలిసిందే. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ సాయంతో పని చేసే ఈ అధునాతన చాట్బోట్.. మిషన్ లెర్నింగ్ సాంకేతికతతో పని చేస్తూ, టెక్స్ట్ రూపంలో యూజర్లు అడిగే ఎలాంటి ప్రశ్నలకైనా సెకెన్ల వ్యవధిలో వివరమైన సమాధానం ఇస్తుంది. ఈ టూల్ తన బ్యాక్ ఎండ్లో ఉన్న అపారమైన డేటా బేస్ సాయంతో యూజర్ అడిగిన ప్రశ్నలకు ఆన్సర్ చేస్తుంది. సైన్స్ అండ్ టెక్నాలజీ, కోడింగ్, ఆరోగ్యం, క్రీడలు, రాజకీయాలు, వంటకాలు, లైఫ్స్టైల్.. ఇలా ఏ విషయానికి సంబంధించి ప్రశ్నలు అడిగినా చాట్ జీపీటీ ఇట్టే సమాధానం చెబుతుంది. ఈ ఏఐ టూల్ క్రికెట్కు సంబంధించిన ప్రశ్నలకు కూడా ఠక్కున సమాధానం చెబుతుంది. టీ20 క్రికెట్లో ఆల్టైమ్ బెస్ట్ జట్టు ఏది అని చాట్ జీపీటీని అడిగితే.. క్రిస్ గేల్, రోహిత్, కోహ్లి, ధోనిలతో కూడిన 11 మంది సభ్యుల పేర్లను చెప్పింది. జట్టు కూర్పు విషయంలో ఈ టూల్ అచ్చం మనిషిలా ఆలోచించి సమతూకమైన జట్టును ప్రకటించింది. బ్యాటింగ్ ఆర్డర్ నుంచి స్పిన్నర్లు, పేసర్లు, వికెట్కీపర్.. ఇలా ఓ పర్ఫెక్ట్ జట్టుకు ఉండాల్సిన వనరులన్నిటినీ చాట్ జీపీటీ అర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ సాయంతో సమకూర్చింది. ఈ జట్టుకు చాట్ జీపీటీ ధోనిని కెప్టెన్ కమ్ వికెట్కీపర్గా ఎన్నుకుంది. ఓపెనర్లుగా క్రిస్ గేల్, రోహిత్ శర్మలను ఎంపిక చేసిన చాట్ జీపీటీ.. వన్డౌన్లో విరాట్ కోహ్లి, నాలుగో స్థానంలో ఏబీ డివిలియర్స్, ఐదో ప్లేస్లో మ్యాక్స్వెల్, ఆతర్వాత ధోని, ఆల్రౌండర్ కోటాలో షాహిద్ అఫ్రిది, స్పెషలిస్ట్ స్పిన్నర్గా రషీద్ ఖాన్, పేసర్లుగా లసిత్ మలింగ, జస్ప్రీత్ బుమ్రా, డేల్ స్టెయిన్లను ఎంచుకుంది. క్రికెట్ విశ్లేషకులు సైతం ఎంచుకోలేని పర్ఫెక్ట్ టీ20 జట్టును చాట్ జీపీటీ ఎంపిక చేయడంతో అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇంత సమతూకంతో కూడిన జట్టును ఎంపిక చేయడం మనిషి వల్ల కాదని కామెంట్లు చేస్తున్నారు. -
‘Bard’పై గూగుల్ వైస్ ప్రెసిడెంట్ షాకింగ్ కామెంట్స్!
ప్రపంచ వ్యాప్తంగా చాట్జీపీటీ వంటి ఏఐ టూల్స్పై ఆందోళనలు కొనసాగుతున్న నేపథ్యంలో గూగుల్ యూకే మేనేజింగ్ డైరెక్టర్ డెబ్బీ వైన్స్టెయిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గూగుల్ బార్డ్ ఏదైనా సమాచారం తెలుసుకునేందుకు పనిచేయదు. ఇందుకోసం యూజర్లు బార్డ్కు బదులుగా గూగుల్లో సెర్చ్ చేసి కావాల్సిన సమాచారం గురించి తెలుసుకోవాలని సూచించారు. ‘గూగుల్ బార్డ్ ఓ ప్రయోగమని, యూజర్లకు కావాల్సిన నిర్ధిష్టమైన సమాచారాన్ని అందించేందుకు తయారు చేసింది కాద’ని ఆమె స్పష్టం చేశారు. బీబీసీ టుడే ప్రోగ్రామ్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘AI hallucinations with Google's in-house chatbot Bard’ అనే అంశంపై పలు వెయిన్ స్టీన్ మాట్లాడారు. ఈ సందర్భంగా సాంప్రదాయ పద్దతిలో గూగుల్లో సెర్చ్ చేసి కావాల్సిన సమాచారం గురించి తెలుసుకోవడం కంటే బార్డ్ను అడిగి తెలుసుకోవడం విభిన్నంగా ఉంటుంది. బార్డ్ను లార్జ్ లాంగ్వెజ్ మోడల్తో ఎలా వినియోగించాలి అనే తెలుసుకునేందుకు జరిపిన ఓ ప్రయోగం మాత్రమే. సమస్యకు పరిష్కారం, ఆలోచనలు, ఆవిష్కరణలకు సంబంధించిన సమాచారాన్ని అందిస్తుందే తప్పా నిర్ధిష్టమైన ఇన్ఫర్మేషన్ కావాలంటే పొందలేమనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. గూగుల్ ఏఐ చాట్బాట్ బార్డ్ విశ్వసనీయ సమాచారం ఇవ్వడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయినప్పటికీ గూగుల్ సంస్థ బార్డ్ను యూజర్లకు ఎందుకు అందిస్తుందనే ప్రశ్నపై స్పందించిన ఆమె..బార్డ్లో మీకు కావాల్సిన సమాచారం దొరకలేదు. వెంటనే గూగుల్ సెర్చ్ చేసి తెలుసుకునేందుకు ఓ ఆప్షన్ను సైతం అందుబాటులోకి తెచ్చాం. ఆ ఆప్షన్ ఉపయోగించి మీరు ఎలాంటి సమాచారం కోరుకుంటున్నారో దాని గురించి తెలుసుకోవచ్చని సూచించారు. అంతేకాదు, ఖచ్చితమైన సమాచారం కోసం యూజర్లు గూగుల్పై ఆధారపడతారని మాకు తెలుసు. కాబట్టి పూర్తి స్థాయిలో వారికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కావాలంటే గూగుల్లో సెర్చ్ చేయాలని ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం, గూగుల్ యూకే మేనేజింగ్ డైరెక్టర్ డెబ్బీ వైన్స్టెయిన్ చేసిన కామెంట్స్ టెక్ వర్గాల్లో చర్చాంశనీయంగా మారాయి. చదవండి👉 గూగుల్లో జీతాల పంచాయితీ.. సుందర్ పిచాయ్ను విమర్శిస్తున్న ఉద్యోగులు! -
‘AI’ వల్ల ఉద్యోగాలు పోవడం ఖాయం.. చాట్జీపీటీ సృష్టి కర్త సంచలన వ్యాఖ్యలు!
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) శక్తి సామార్ధ్యాలు, జాబ్ మార్కెట్లో నెలకొన్న ఆందోళనలపై ఓపెన్ ఏఐ సీఈవో చాట్జీపీటీ మాస్టర్ మైండ్ శామ్ ఆల్ట్మన్ స్పందించారు. చాట్జీపీటీ వల్ల మనుషులు చేస్తున్న ఉద్యోగాలు ప్రమాదంలో ఉన్నాయని బాహాటంగానే ఆందోళన వ్యక్తం చేశారు. చాట్జీపీటీ మానవ ఉద్యోగాలను పూర్తిగా భర్తీ చేయగలదా? అనే అంశంపై ఆయన మాట్లాడుతూ.. ఉద్యోగాల్లో మనుషుల అవసరం ఉందని, అయితే, చాట్జీపీటీ వల్ల ఇప్పటికే కొంతమంది ఉద్యోగాలు కోల్పోయారని, వారి స్థానాన్ని ఏఐ ఆక్రమించిందని పేర్కొన్నారు. కాగా, అభివృద్ధి చెందుతున్న ఏఐ పరిజ్ఞానంపై జరుగుతున్న చర్చల నేపథ్యంలో ఆల్ట్మన్ చేసిన ఈ వ్యాఖ్యలు చర్చాంశనీయంగా మారాయి. ఇటీవల ఏఐపై జరిగిన ఇంటర్వ్యూల్లో ఆయన ఏం మాట్లాడారంటే నవంబర్ 2022 లో ప్రారంభించినప్పటి నుండి చాట్ జీపీటీ గణనీయమైన పురోగతిని సాధించిందని, మెరుగుపడుతూనే ఉంటుందని ఆల్ట్ మన్ అంగీకరించారు. అయితే, ఏఐ టూల్ పరిపూర్ణంగా లేదని, దానికి పరిమితులు ఉన్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. కృత్రిమ మేధ మానవ ఉద్యోగాల భర్తీకి దారితీస్తుందని ఆల్ట్ మన్ ఆందోళన వ్యక్తం చేశారు. భవిష్యత్తులో చాట్ జీపీటీ వంటి ఏఐ టూల్స్ హ్యూమన్స్ను భర్తీ చేయడంపై టెక్ నిపుణులతో సహా చాలా మంది ఈ తరహా అభిప్రాయం వ్యక్తం చేశారు. మానవాళిపై కృత్రిమ మేధ ప్రభావం పూర్తిగా సానుకూలంగా ఉండకపోవచ్చని ఆల్ట్ మన్ 'ది అట్లాంటిక్'కు ఇచ్చిన ఇంటర్వ్యూలో హెచ్చరించారు. కొంతమంది డెవలపర్లు కృత్రిమ మేధ కేవలం మానవ ప్రయత్నాలకు తోడ్పడుతుందని, ఉద్యోగాలను భర్తీ చేయదన్న అభిప్రాయాల్ని ఆల్ట్మన్ కొట్టిపారేశారు. ఉద్యోగాలు ఏఐకి ప్రభావితమవుతాయని నొక్కాణించారు. చాట్ జీపీటీ కంటే మరింత శక్తివంతమైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ను తయారు చేసే సామర్థ్యం ఓపెన్ ఏఐకి ఉందని ఆయన వెల్లడించాడు. కానీ ఆ టూల్స్ ఇప్పట్లో విడుదల చేయకూడదని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ఊహించని పరిణామాలను ఎదుర్కోవడం కష్టంగా ఉందని అన్నారు. భారత్ పర్యటన సందర్భంగా ఆల్ట్ మన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఉద్యోగ తరలింపుపై తన ఆందోళనలను పునరుద్ఘాటించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కారణంగా కొన్ని ఉద్యోగాలు కనుమరుగవుతాయని అంగీకరించిన చాట్జీపీటీ రూపకర్త కొత్త, మెరుగైన ఉద్యోగాలు కూడా పుట్టుకొస్తాయని నమ్ముతున్నారు. ఏఐపై భారత్ చూపిస్తున్న ఉత్సాహాన్ని ప్రశంసించారు. దేశంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టార్టప్స్కు సపోర్ట్ ఇవ్వడానికి ఓపెన్ఎఐ ప్రణాళికలను ప్రకటించారు. చాట్ జీపీటీ సహా ఇతర ఏఐ టూల్స్ ప్రభావం జాబ్ మార్కెట్పై పడుతుందని ఓపెన్ ఏఐ సీఈఓ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గణనీయమైన పురోగతిని చూపించినప్పటికీ, ఇది సమాజానికి సవాళ్లను కూడా విసురుతోంది. జాబ్ మార్కెట్కు అంతరాయం కలగకకుండా సానుకూలంగా ఉపయోగించేలా జాగ్రత్తలు తీసుకోవడం అవసరమని పేర్కొన్నారు. చదవండి👉 త్వరలో ‘చాట్జీపీటీ’తో ఊడనున్న ఉద్యోగాలు ఇవే! -
కొంపముంచుతున్న ‘AI’.. ప్రమాదంలో మహిళా ఉద్యోగులు, సంచలన నివేదికలో
కృత్తిమ మేధ (ai) చాట్జీపీటీ రాకతో ప్రపంచ వ్యాప్తంగా జాబ్ మార్కెట్లో ప్రకంపనలు నెలకొన్నాయి. మనుషుల ఉద్యోగాల్ని ఏఐ భర్తీ చేస్తుందనే భయాలు, ఇప్పటికే పలు రంగాల్లో మనుషుల స్థానాల్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆక్రమించడమే అందుకు కారణమంటూ పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. తాజాగా, మెకిన్సే గ్లోబల్ ఇనిస్టిట్యూట్ ఓ రిపోర్ట్ను విడుదల చేసింది. ఆ నివేదికలో రానున్న 10 ఏళ్లల్లో అభివృద్ది చెందుతున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆటోమెషిన్ వంటి టెక్నాలజీలతో ఉద్యోగం చేస్తున్న పురుషుల కంటే మహిళలకే ఎక్కువ నష్టం వాటిల్లే అవకాశం ఉందని తెలిపింది. అంతేకాదు, పని ప్రదేశంలో కృత్రిమ మేధస్సు, ఆటోమేషన్ కారణంగా దాదాపు పది మందిలో ఎనిమిది మంది మహిళలు వేరే కంపెనీకి వెళ్లాల్సి వస్తుందని లేదా ఉద్యోగాన్ని కోల్పోవాల్సి వస్తుందని అధ్యయనంలో గుర్తించింది. ఫుడ్ సర్వీస్, కస్టమర్ కేర్, సేల్స్, ఆఫీస్ సపోర్ట్ వంటి రంగాల్లో ఎక్కువ మంది మహిళలు విధులు నిర్వహిస్తున్నారు. పురుషులతో పోలిస్తే తక్కువ జీతంతో పనిచేస్తున్నప్పటికీ ఆటోమేషన్ కారణంగా ఉపాధి పోయే అవకాశం ఉందని వెల్లడించింది. 2030 నాటికి పురుషుల కంటే మహిళలు చేస్తున్న ఉద్యోగాలపై ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రతికూల ప్రభావం ఎక్కువ శాతం ఉంది. ఈ గండం నుంచి గట్టెక్కాలంటే ఉద్యోగం చేస్తున్న సంస్థలో కొనసాగాలంటే.. సదరు కంపెనీకి కావాల్సిన నైపుణాలను తెలుసుకొని, ముందే నేర్చుకొని ఉండడం మంచిదన్న అభిప్రాయాన్ని హైలెట్ చేసింది. మొత్తం మీద, మెకిన్సే గ్లోబల్ ఇనిస్టిట్యూట్ ఈ సందర్భంగా అమెరికాలో కనీసం 12 మిలియన్ల మంది కార్మికులు 2030 చివరి నాటికి వృత్తులను మార్చుకోవాల్సి ఉంటుందని పేర్కొంది. ఈ ఏడాది మార్చి నెలలో విడుదల చేసిన గోల్డ్మన్ సాచ్స్ నివేదిక ప్రకారం.. 300 మిలియన్ల ఉద్యోగాలు ఏఐ వల్ల ప్రభావితం కావచ్చని అంచనా వేసింది. చాట్జీపీటీలు వంటి టెక్నాలజీలు పోటాపోటీగా మనుషులు రాసే కంటెంట్లు.. కృత్తిమ మేధ’ టూల్స్ రాస్తాయని, రాబోయే దశాబ్దంలో ఉత్పాదకత మరింత పెరిగే అవకాశం స్పష్టం చేసింది. చదవండి👉 అంతా చాట్జీపీటీ మహిమ.. బ్యాచిలర్స్ ఏం చేస్తున్నారో తెలుసా? -
అంతా చాట్జీపీటీ మహిమ.. బ్యాచిలర్స్ ఏం చేస్తున్నారో తెలుసా?
స్నేహం, ప్రేమ, పెళ్లి ఇవన్నీ జీవితంలో ఓ భాగం. కానీ వాటికి మాత్రం నోచుకోని యువత ఒంటరిగా మిగిలిపోతున్నారు. తాజాగా, ఇలాంటి సింగిల్ కింగ్ల గురించి ఓ ఆసక్తికర నివేదిక వెలుగులోకి వచ్చింది. గత ఏడాది ఓపెన్ ఏఐ సంస్థ విడుదల చేసిన చాట్జీపీటీతో ప్రపంచ వ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ హవా ప్రారంభమైంది. చాట్జీపీటీకి విడుదలకు ముందే అనేక డేటింగ్ యాప్లు వినియోగంలో ఉండేవి. కానీ క్రమేపీ వాటి ప్రభావం తగ్గింది. స్నేహం, ప్రేమ, పెళ్లికి దూరంగా ఉన్న యువత ఒంటరి తనాన్ని పోగొట్టుకునేందుకు ఏఐ చాట్ బాట్లను ఆశ్రయిస్తున్నారు. టెలిగ్రాఫ్ నివేదించిన ప్రకారం..10 మిలియన్ల కంటే ఎక్కువ మంది వ్యక్తులు ఈ ఏఐ బాట్లు అందించే యాప్లను ఉపయోగిస్తున్నట్లు తెలుస్తోంది. యూజర్లు చాట్బాట్లను స్నేహితులు, జీవిత భాగస్వాములు, మెంటార్లు, తోబుట్టువులుగా భావిస్తున్నారు. ఇలా రెప్లికా అనే యాప్కు 250000 మంది వినియోగదారులున్నారు. రెప్లికాతో వీడియో, వాయిస్ కాల్లు చేస్తున్నారు. సన్నిహితంగా మెలుగుతున్నారు. అవసరం అనుకున్నప్పుడల్లా సెల్ఫీ దిగుతున్నట్లు నివేదిక హైలెట్ చేసింది. అయితే, సాంకేతిక పరంగా ఇది శుభవార్తే అయినప్పటికీ రానున్న రోజుల్లో ఎలాంటి దుష్పరిణామాలకు కారణమవుతుందోనని టెక్నాలజీ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
‘ఆ AI టూల్ను షట్డౌన్ చేస్తున్నాం’.. చాట్జీపీటీ సృష్టికర్త సంచలన ప్రకటన!
గత ఏడాది విడుదలైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్ చాట్జీపీటీ గురించి, దానిని తయారు చేసిన ఓపెన్ ఏఐ సంస్థ గురించి నిత్యం ఏదో ఒక వార్త సోషల్ మీడియా మాధ్యమాల్లో చర్చకు దారి తీస్తున్నాయి. చాట్జీపీటీ విడుదలతో ఎథిక్స్, ప్రిన్సిపల్స్’ వంటి అంశాలు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వాటిలో, ముఖ్యంగా ఉపాధ్యాయులు విద్యార్ధులకు ఏదైనా అసైన్మెంట్లు ఇస్తే.. వాటిని విద్యార్ధులు పూర్తి చేశారా? లేదంటే చాట్జీపీటీ నుంచి సేకరించారా? అనే విషయాల్ని గుర్తించడం కష్టంగా మారింది. ఈ అంశంపై రచయితలు, టీచర్లు, విద్యావేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తూ వచ్చారు. అదే సమయంలో ఆర్టిఫియల్స్ ఇంటెలిజెన్స్ టూల్స్ రాసిన కంటెంట్ను గుర్తించేందుకు కొన్ని రకాల టూల్స్ అందుబాటులోకి వచ్చాయి. ఓపెన్ఏఐ కూడా ఓ టూల్ను డెవలప్ చేసింది. ఇప్పుడా టూల్ను షట్డౌన్ చేస్తున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ది వెర్జ్ నివేదిక ప్రకారం..ఓపెన్ ఏఐ హ్యూమన్స్, ఏఐ టూల్స్ కంటెంట్ను గుర్తించేందుకు ఏఐ క్లాసిఫైర్ అనే టూల్ను యూజర్లకు అందించింది. ఆ టూల్ను ఇప్పుడు నిలిపివేస్తున్నట్లు ఓపెన్ ఏఐ తన బ్లాగ్పోస్ట్లో పేర్కొంది. బ్లాగ్ పోస్ట్లో ‘జులై 20, 2023 నుంచి ఏఐ క్లాసిఫైర్ టూల్స్ అందుబాటులో ఉండటం లేదు. హ్యూమన్స్, ఏఐ కంటెంట్ను గుర్తించే విషయంలో తాము రూపొందించిన టూల్ ఊహించని విధంగా పనిచేయడం లేదు. అందుకే ఏఐ క్లాసిఫైర్ సేవల్ని నిలిపివేస్తున్నాం. అంతేకాదు, కంటెంట్ను సమర్థవంతంగా ఎలా గుర్తించాలో తెలుసుకునేందుకు రీసెర్చ్ చేస్తున్నాం. ఇందుకోసం ప్రత్యేకంగా ఓ మెకానిజాన్ని తయారు చేస్తున్నాం. తద్వారా యూజర్లు ఏఐ జనరేటెడ్ విజువల్ కంటెంట్, ఆడియోలను అర్ధం చేసుకునే అవకాశం కలగనుందని’ ఓపెన్ ఏఐ తన పోస్ట్లో వెల్లడించింది. నవంబర్ 30, 2022న ఓపెన్ ఏఐ చాట్ జీపీటీని యూజర్లకు పరిచయం చేసింది. చాట్జీపీటీ విడుదల అనంతరం ఏఐ జనరేటెడ్ టూల్ వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. దీంతో సంస్థలు తమకు కావాల్సిన కంటెంట్ను మనుషులు రాస్తున్నారా? లేదంటే ఏఐ టూల్స్ నుంచి సేకరిస్తున్నారా? అని తెలుసుకునేందుకు పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేశారు. అప్పుడే ఓపెన్ ఏఐ కంటెంట్ను గుర్తించేందుకు ఏఐ క్లాసిఫైర్ టూల్ను తయారు చేసింది. కానీ 100 శాతం ఏఐ విడుదల చేసిన కంటెంట్ను 26 శాతం గుర్తిస్తుండగా.. మనుషులు సరైన కంటెంట్ను రాసినా.. మీరు రాసింది తప్పేనంటూ 9 శాతం ఫలితాల్ని అందించింది. ఈ క్రమంలో చేసేది లేక ఓపెన్ ఏఐ ఏఐ క్లాసిఫైర్ టూల్ను షట్డౌన్ చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. చదవండి👉 చాట్జీపీటీకి సవాల్ విసిరేలా..ఎలాన్ మస్క్ ‘AI’ స్టార్టప్ ప్రారంభం! -
సమతూకపు నియంత్రణ!
అసలేమీ చేయకుండా ఉండే కన్నా, ఆలస్యంగానైనా కళ్ళు తెరిచి ఆచరణలోకి దిగడం మంచిదే! కృత్రిమమేధ (ఏఐ)ను నియంత్రించడానికి చట్టబద్ధమైన స్వతంత్ర సంస్థను ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన అలాంటిదే. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా అథారిటీ ఆఫ్ ఇండియా పేర ఒక సంస్థను నెలకొల్పాలంటూ భారత టెలికామ్ నియంత్రణ ప్రాధికార సంస్థ (ట్రాయ్) చేసిన తాజా సిఫార్సు స్వాగతించాల్సిన అంశం. టెలికామే కాక బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సేవలు, రవాణా, విద్య, వ్యవసాయం లాంటి అనేక రంగాలపై ఏఐ అమితమైన ప్రభావం చూపుతున్న విషయాన్ని ఇప్పటికైనా గుర్తించి, సమగ్రమైన నియంత్రణకు సమకట్టడం సరైన చర్య. ట్రాయ్ ప్రతిపాదించిన నియంత్రణ సంస్థ ఏఐ సంబంధిత రంగాలన్నిటికీ సలహా దారుగా, నియంత్రణకర్తగా వ్యవహరి స్తుంది. సాంకేతిక సంస్థలు మాత్రం తమ నియంత్రణకు మరిన్ని చట్టాల ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నాయి. ఏఐ కోసం స్వతంత్ర చట్టబద్ధ సంస్థను పెట్టాలన్న ట్రాయ్ సిఫార్సుపై తీవ్రంగా స్పందిస్తు న్నాయి. అయితే, సాంకేతికతతో వచ్చే లాభాలను స్వీకరిస్తూనే, జరిగే హానిని కూడా గుర్తించి, సమతూకం సాధించడం అవసరం. ప్రపంచవ్యాప్తంగా పాల కుల ముందున్న సవాలు ఇది. 5జీ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐఓటీ) లాంటి సాంకేతికతలు ఏఐతో ముడిపడ్డాయి. వీటికి విడివిడి విధానాలతో లాభం లేదు. అన్నిటినీ సమన్వయపరిచే సమగ్రమైనది అవసరం. ట్రాయ్ తన 141 పేజీల నివేదికలో ఆ మాటే ప్రస్తావించి, తాజా సిఫార్సు చేసింది. నూతన సాంకేతిక ఆవిష్కరణలు శరవేగంతో వస్తుంటే, మన విధాన నిర్ణేతలు ఎంతో వెనుకబడి ఉన్నారు. రెండు దశాబ్దాల క్రితం ఆరంభమైన ఆన్లైన్ వేదికలకు సైతం నేటికీ సరైన నియంత్రణ వ్యవస్థ లేని దేశం మనది. 1998లో వచ్చిన గూగుల్, 2004లో ఆరంభమైన ఫేస్బుక్ లాంటివి ఇప్పటికీ వినియోగదారుల డేటాను యథేచ్ఛగా వాడుకుంటూ, లాభాలు మూట గట్టుకుంటున్నాయి. దాన్ని నియంత్రించడానికి ఉద్దేశించిన వ్యక్తిగత సమాచార భద్రత బిల్లు వగైరాలను దేశం దీర్ఘకాలంగా చర్చిస్తూనే ఉంది. సరైన నియంత్రణ లేక సామాజిక మాధ్యమ వేదికలు యూజర్ల డేటాను తస్కరిస్తూనే ఉన్నాయి. కొన్ని వేదికలు వేధింపులనూ, విద్వేషాలనూ రాజేస్తున్నాయి. ఏఐ ఆవిర్భావంతో డేటా దుర్విని యోగం ఎల్లలు దాటిందనే అనుమానం తలెత్తింది. వ్యక్తిగత గోప్యతే కాదు... ఆర్థికవ్యవస్థ పైనా ప్రభావం చూపే పరిస్థితి. ఏఐ నియంత్రణకు స్వతంత్ర వ్యవస్థ ఆలోచనను ఈ నేపథ్యం నుంచి చూడాలి. గత నవంబర్లో ఓపెన్ ఏఐ సంస్థ తన ఛాట్బాట్ అయిన ‘ఛాట్ జీపీటీ’ని విడుదల చేసినప్పటి నుంచి ఏఐ పట్ల ఉత్సాహం ఎంత ఉందో, ఆందోళనా అంతే ఉంది. ఛాట్ జీపీటీ లాంటి నమూనాల రూపకల్పనపై 6 నెలల మారటోరియం విధించాలని ఎలాన్ మస్క్ లాంటి నిపుణులు సైతం అనడం గమనార్హం. వివిధ రంగాల్లో విప్లవాత్మక మార్పులు తెచ్చి, మానవకృషికి కొత్త మార్గాలు తెరిచి, మామూలు పనుల్ని సైతం సృజనాత్మకంగా చేయడానికి ఏఐ ఉపయుక్తమే. కానీ మనుషుల కృత్రిమ రూపాల తయారీ, తప్పుడు సమాచార వ్యాప్తి సహా ప్రమాదాలున్నాయి. ఏఐని అణ్వస్త్రపోరుతో పోలుస్తూ, మానవజాతి మనుగడకే ప్రమాదకారి అంటున్న శాస్త్రవేత్తలూ లేకపోలేదు. అందుకే, ఏఐని విశృంఖలంగా వదిలేయరాదన్నది నిపుణులు, పాలకుల ఏకాభిప్రాయం. నవీన ఆవిష్కరణల్ని ఆహ్వానిస్తూనే, వాటిని నైతికబద్ధంగా వాడేలా సమతౌల్య సాధన కీలకమనేది ప్రధాన సూత్రం. ఏఐ ప్రతికూల ప్రభావాన్ని కట్టడి చేయడానికి విశ్వవ్యాప్తంగా అనేక ప్రైవేట్ సంస్థలు ఇప్పటికే ప్రయత్నాలు ప్రారంభించాయి. విదేశాలు చట్టాలు చేస్తున్నాయి. కెనడా ముసాయిదా చట్టం చేసింది. అమెరికా ఏఐ బిల్లు తెచ్చింది. సురక్షితంగా, పారదర్శకంగా ఏఐ అభివృద్ధి సాగేలా చూస్తామంటూ అమెజాన్, గూగుల్, మెటా, మైక్రోసాఫ్ట్, ఓపెన్ ఏఐ తదితర 7 ప్రధాన ఏఐ సంస్థల నుంచి ఈ నెల 21నే అమెరికా ప్రభుత్వం స్వచ్ఛంద వాగ్దానాలు తీసుకుంది. చైనా సైతం పాలనా చర్యలపై ఒక ముసాయిదా సిద్ధం చేసి, ప్రజాస్పందన కోసం ఉంచింది. బ్రెజిల్, జపాన్లు ఏఐ నియమావళి సిద్ధం చేశాయి. అభివృద్ధి చెందిన దేశాలతో కూడిన ‘గ్లోబల్ పార్ట్నర్షిప్ ఆన్ ఏఐ’ సంస్థాపక సభ్యదేశమైన భారత్ వంతు ఇప్పుడు ట్రాయ్ సిఫార్సుతో వచ్చిందనుకోవాలి. ఏఐ అభివృద్ధిలో భాగస్థులు పాటించాల్సిన బాధ్యతల్ని నాస్కామ్ ఇప్పటికే వెల్లడించింది. కానీ ఏఐపై మోజులో ప్రమాణాలు, నైతికత, జవాబుదారీతనం గాలికి పోవచ్చు. కాబట్టి నియంత్రణ సంస్థ పెట్టాలన్న మాట బంగారు బాట. నిజానికి, పార్లమెంట్లో ‘డిజిటల్ వ్యక్తిగత సమాచార భద్రత బిల్లు’ను ప్రవేశపెట్టనున్నారు. 2000 నాటి ఐటీ చట్టం స్థానంలో వచ్చే డిజిటల్ ఇండియా చట్టం కొంతవరకు ఏఐని నియంత్రిస్తుందని భావిస్తున్నారు. అయితే, ఏఐకి ప్రత్యేక చట్టం యత్నాలేవీ ఇప్పటికీ లేవు. ఇది ఆలోచించాల్సిన విషయం. యూజర్లకు హాని ఏ మేరకు కలుగుతుందనే కోణం నుంచి ఏఐపై కేంద్ర ప్రభుత్వ నియంత్రణ వైఖరి ఉంటుందనీ, ఇప్పటికిప్పుడు తీవ్రమైన చర్యలేమీ అవసరం లేదనీ సంబంధిత కేంద్ర మంత్రివర్యుల ఉవాచ. ముందుగానే ఏఐపై కఠిన నిబంధనలు పెట్టి, నవీన సాంకేతికకు ఉరితాళ్ళు బిగించరాదన్న మాట నిజమే! అదే సమయంలో రాబోయే కష్టనష్టాలను కూడా ముందుగా ఆలోచించడం, అవసరమైన చట్టాలతో యుద్ధానికి సిద్ధంగా ఉండడం వివేకం. ఏఐకి సంబంధించి చట్టబద్ధ మైన స్వతంత్ర నియంత్రణ సంస్థ ఆలోచన అందుకు తొలి అడుగు కావాలి. ఏఐపై ప్రాథమిక నిబంధనలు, హద్దు మీరితే జుల్మానాలు, దోషులపై పట్టు బిగించే అధికారాలతో సంస్థ ఏర్పాటు కావాలి. -
చాట్జీపీటీ ఆండ్రాయిడ్ యూజర్లకు గుడ్ న్యూస్, రిజిస్ట్రేషన్స్ షురూ!
ChatGPT for Android users: ఓపెన్ ఏఐకిచెందిన పాపులర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) చాట్బాట్ చాట్ జీపీటీ ఆండ్రాయిడ్ యూజర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న చాట్ జీపీటీ యాప్ ఎట్టకేలకు వచ్చే వారమే అందుబాటులోకి రానుంది. ఇప్పటికే ఇది ఐవోఎస్ యూజర్లకు ఈ ఏడాది మేలోనే అందుబాటులోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఇపుడిక ఆండ్రాయిడ్ యూజర్లకు అందుబాటులోకి రానుంది. వచ్చే వారం ఈ యాప్ అధికారికంగా అందుబాటులోకి వస్తుంది. దీనికి సంబంధించి గూగుల్ ప్లే స్టోర్ లో ఇప్పటికే ఈ యాప్ రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయి. బ్రౌజర్ ద్వారా అందుబాటులో ఉన్న చాట్జీపీటీ ఆండ్రాయిడ్ అప్లికేషన్ వినియోగదారుల కోసం చాట్బాట్కి సులభంగా త్వరితగతిన సేవలు అందించనుంది. Chat GPT CTO మీరా మురాఠీ చేసిన ట్వీట్ ఇది. We’re rolling out ChatGPT for Android users next week https://t.co/3tNLNcG5Kw — Mira Murati (@miramurati) July 21, 2023 చాట్ జీపీటీ రిజిస్ట్రేషన్ ♦ గూగుల్ ప్లే స్టోర్ లోకి వెళ్లి చాట్జీపీటీ అని సెర్చ్ చేయాలి ♦ ఇన్ స్టాల్ పై క్లిక్ చేసి, ఒకే చేయాలి. ♦ ఒకసారి యాప్ లాంచ్ అయిన తరువాత, ఈ యాప్ ఆటోమేటిక్ గా ఇన్ స్టాల్ అవుతుంది. ♦ అంతేకాదు.. ఆటోమెటిక్ ఇన్ స్టాలేషన్ వద్దు అనుకుంటే అన్ రిజిస్టర్ పై క్లిక్ చేయాల్సి ఉంటుంది. కాగా చాట్పీజీటీ గతేడాది (2022 నవంబరు) అందుబాటులోకి వచ్చింది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ చాట్బాట్ చాట్జీపీటీ ఇంటర్నెట్ ప్రపంచంలో సునామిలా దూసుకొచ్చింది. ప్రారంభించిన రెండు నెలల్లోనే 100 మిలియన్లకు డౌన్లోడ్లను నమోదు చేసింది. తొలుత వెబ్ అప్లికేషన్గా వచ్చినప్పటికీ, ఈ ఏడాది మే లో ఐఫోన్ యూజర్లకు కూడా అందుబాటులోకి వచ్చింది. దాదాపు మూడునెలల తరువాత ఇపుడిక ఆండ్రాయిడ్ యూజర్లకు చాట్జీపీటీ సేవలు అందుబాటులోకి రానున్నాయి. -
చాట్జీపీటీ, గూగుల్లకు పోటీగా మెటా ఏఐ.. ఉచిత వెర్షన్ విడుదల
ఫేస్బుక్ యజమాన్య సంస్థ మెటా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో అడుగు పెట్టింది. ఇప్పటికే సంచలనం సృష్టించిన చాట్జీపీటీ (ChatGPT), గూగుల్ (Google) లకు పోటీగా తన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్ను పరిచయం చేసింది. ఉచిత వెర్షన్ను విడుదల చేసింది. ఓపెన్ ఏఐ, గూగుల్ సంస్థలు అభివృద్ధి చేసిన చాట్జీపీటీ, బార్డ్ చాట్బాట్లు లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్. మానవ సృజనాత్మకత, నైపుణ్యాన్ని అనుకరిస్తూ వారిని ఆకర్షించేలా వీటిని రూపొందించారు. అయితే ఇందుకు భిన్నంగా జెనరేటివ్ ఏఐ ఉత్పత్తులను నేరుగా వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురాకుండా పరిశోధకుల కోసం ప్రత్యేకంగా ‘లామా’ (Llama) అనే భాషా నమూనాను అభివృద్ధి చేసింది మెటా. ఈ లామా అనేది ఓపెన్ సోర్స్. అంటే ఓపెన్ ఏఐ, గూగుల్లు అభివృద్ధి చేసిన ఏఐలకు భిన్నంగా మెటా లామా ఏఐలో అంతర్గతంగా జరిగే పనులు అందరికీ అందుబాటులో ఉంటాయి. వాటిని సవరించే వీలుంటుంది. ఇదీ చదవండి ➤ Meta: ‘మెటా’పై తీవ్ర ఆరోపణలు! కేసు వేసిన ఉద్యోగిని.. ఏం జరిగిందంటే.. "ఓపెన్ సోర్స్ ఇన్నోవేషన్ను ప్రోత్సహిస్తుంది. ఎందుకంటే ఇది చాలా మంది డెవలపర్లను కొత్త టెక్నాలజీతో నిర్మించడానికి వీలు కల్పిస్తుంది" అని మెటా సీఈఓ మార్క్ జుకర్బర్గ్ ఫేస్బుక్ పోస్ట్లో తెలిపారు. అలాగే ఇది సేఫ్టీ, సెక్యూరిటీని కూడా మెరుగుపరుస్తుందన్నారు. ఎందుకంటే సాఫ్ట్వేర్ అందరికీ అందుబాటులో ఉంచినప్పుడు ఎక్కువ మంది పరిశీలించి సంభావ్య సమస్యలను గుర్తించడానికి, వాటిని పరిష్కరించడానికి అవకాశం ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఎవరైనా డౌన్లోడ్ చేసుకునేలా మెటా ఏఐ మోడల్ సరికొత్త, శక్తివంతమైన వర్షన్ లామా 2 త్వరలో అందుబాటులోకి రానుంది. మైక్రోసాఫ్ట్ అజూర్ క్లౌడ్ సర్వీస్ ద్వారా దీన్ని అందుబాటులోకి తీసుకొచ్చే అవకాశం ఉంది. -
చాట్జీపీటీ డైట్ ప్లాన్.. 11 కేజీల బరువు తగ్గాడు!
ఈరోజుల్లో అధిక బరువు సమస్య ఎంతో మందిని వేధిస్తోంది. చాలా రోగాలకు అధిక బరువు కూడా కారణంగా మారుతోంది. ఈ నేపథ్యంలో బరువు తగ్గేందుకు అనేక మంది నానా యాతన పడుతుంటారు. బరువు తగ్గడం అనేది అంత ఆశామాషీ కాదు. ఇందు కోసం చాలా కష్టపడాలి. సరైన డైట్ ఫాలో అవ్వాలి. బరువు తగ్గాలని అనుకోగానే చాలా మంది డైటీషియన్లను, న్యూట్రిషనిస్టులను సంప్రదిస్తుంటారు. కానీ బరువు తగ్గడం కోసం ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత చాట్బాట్ను ఉపయోగించడం గురించి విన్నారా? అమెరికాలోని సియాటెల్ నగరానికి చెందిన ఓ వ్యక్తి ఇలాగే చేశాడు. గ్రెగ్ ముస్కెన్ అనే వ్యక్తి చాట్ జీపీటీ అందించిన డైట్ ప్లాన్ను అనుసరించి ఏకంగా 11 కేజీలు బరువు తగ్గాడు. నివేదికల ప్రకారం.. అధిక బరువున్న గ్రెగ్కు రన్నింగ్ చేయడం ఇష్టం లేదు. దీంతో చాట్ జీపీటీ సహాయంతో హెల్తీ డైట్ ప్లాన్ సిద్ధం చేసుకున్నాడు. ఇదీ చదవండి ➤లేఆఫ్స్ విధ్వంసం: ఆరు నెలల్లోనే 2.12 లక్షల మంది ఇంటికి.. మూడు నెలల తర్వాత ఆశ్చర్యకరంగా వారానికి ఆరు రోజులు రన్నింగ్ చేయగలుగుతున్నాడు. మరిన్ని వర్కవుట్లపై గ్రెగ్కి ఆసక్తి పెరిగింది. తన బరువును చూసుకోగా అప్పటికే 11 కేజీలు తగ్గాడు. చాట్ జీపీటీ ఇచ్చిన డైట్ ప్లాన్ను గ్రెగ్ మొదట్లో నమ్మలేదు. కానీ ఆ ప్లాన్ సరళంగా, సులభంగా ఉంటడంతో అనుసరించడం ప్రారంభించాడు. చిన్న అలవాటే.. రన్నింగ్ షూస్ను ఫ్రంట్ డోర్కి దగ్గరగా పెట్టుకోవడం వంటి చిన్నచిన్న సలహాలను చాట్ జీపీటీ ఇచ్చింది. మూడో రోజు నుంచి గ్రెగ్ కొన్నినిమిషాలపాటు కొద్దిపాటి దూరం నడవడం ప్రారంభించాడు. నిజానికి ఇది సరైన విధానమని నిపుణులు కూడా ధ్రువీకరించారు. కొత్తగా వర్కవుట్లు మొదలు పెట్టేవారు కష్టమైన వర్కవుట్ల జోలికి వెళ్లడం మంచిది కాదని, గాయాల బారిన పడకుండా ఉండాలంటే మొదటి చిన్నగా ప్రారంభించి రోజురోజుకు పెంచుకోవాలని నిపుణలు సూచిస్తున్నారు. చిన్నపాటి అలవాట్లే వర్కవుట్ గాడిలో పడేలా చేస్తాయని చెబుతున్నారు. ఒకే రకమైన డైట్ ప్లాన్ సరికాదు చివరగా చెప్పేందేంటంటే ఒక్కొక్కరి శరీర స్వభావం ఒక్కోలా ఉంటుంది. అందరికీ ఒకే రకమైన డైట్ ప్లాన్లు సరిపడవు. ఏదైనా డైట్ ఫాలో అయ్యే ముందు డైటీషియన్ లేదా న్యూట్రిషనిస్ట్ను సంప్రదించడం మంచిది. -
చాట్జీపీటీకి సవాల్ విసిరేలా..ఎలాన్ మస్క్ ‘AI’ స్టార్టప్ ప్రారంభం!
ప్రముఖ వ్యాపార దిగ్గజం ఎలాన్ మస్క్ తన కొత్త ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టార్టప్ ఎక్స్ ఏఐ (xAI)ని ప్రారంభించారు. ఏఐ కోసం గూగుల్, ఓపెన్ ఏఐతో పాటు అమెరికాలో ఇతర పేరున్న టెక్నాలజీ సంస్థలకు చెందిన నిపుణులను నియమించుకున్నారు. తద్వారా చాట్జీపీటీకి గట్టి పోటీ ఇస్తూ ప్రత్యామ్నాయంగా తన సంస్థను అభివృద్ధి చేయాలని భావిస్తున్నారు. గత కొంత కాలంగా మస్క్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత టెక్నాలజీతో రాబోతున్న ప్రమాదాల్ని హెచ్చరిస్తున్నారు. ‘ఏఐ టెక్నాలజీ పైలట్ లేని విమానం వంటిది. అది అణుబాంబుతో సమానం. మానవ ఉనికిని నాశనం చేస్తుందని’ ఆరోపించారు. అంతేకాదు ఏఐని నియంత్రించేలా రెగ్యూలేషన్ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చేలా నిర్ణయాలు తీసుకోవాలని పలు సందర్భాల్లో వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. Announcing formation of @xAI to understand reality — Elon Musk (@elonmusk) July 12, 2023 అయితే, ఇప్పుడు ఏఐ టెక్నాలజీలోని వాస్తవాలకు కొత్త అర్ధం చెప్పేలా ఎక్స్ఏఐని స్థాపించినట్లు ట్వీట్ చేశారు. మస్క్ ఏఐ సంస్థ జులై 14ను ట్విటర్ స్పేస్ ఈవెంట్ను నిర్వహిస్తున్నట్లు వెల్లడించింది. మస్క్ బృందంలో మహామహులు చాట్ జీపీటీకి పోటీగా మస్క్ స్థాపించిన ఏఐ సంస్థ ఎక్స్ఏఐలో పలు దిగ్గజ కంపెనీల్లో కృత్తిమ మేధ విభాగంలో పనిచేసిన నిపుణులు పెద్ద సంఖ్యలో ఉన్నట్లు తెలుస్తోంది. వారిలో డీప్మైండ్ మాజీ ఇంజనీర్ ఇగోర్ బాబూస్కిన్, గూగుల్లో పనిచేసిన టోనీ వు, గతంలో మైక్రోసాఫ్ట్లో పనిచేసి ఆ తర్వాత గూగుల్లో చేరిన రీసెర్చ్ సైంటిస్ట్ స్జెగెడీ మస్క్ టీంలో ఉన్నారు. చదవండి : జాబ్ మార్కెట్లో ‘AI’ విధ్వంసం..ఉద్యోగులకు విప్రో బంపరాఫర్! -
చాట్జీపీటీ కథ కంచికేనా? రోజురోజుకు భారీగా పడిపోతున్న యూజర్లు!
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత టూల్ చాట్జీపీటీకి భారీ షాక్ తగిలింది. 2022 నవంబర్లో మార్కెట్లో విడుదలైన నాటి నుంచి తొలిసారి ఆ యాప్ను ఉపయోగించే వారి సంఖ్య రోజు రోజుకీ తగ్గిపోతున్నట్లు తెలుస్తోంది. అందుకు వినియోగదారుల్లో కృత్తిమ మేధ టూల్స్, ఇమేజ్ జనరేటర్స్ టూల్స్ వినియోగించడంలో ఆసక్తి తగ్గడానికి సంకేతమని వాషింగ్టన్ పోస్ట్ నివేదించింది. చాట్జీపీటీ! టెక్నాలజీ యుగంలో సంచలనాలు సృష్టిస్తున్న ఒక చాట్బోట్. చాట్జీపీటీని తయారు చేసిన ఓపెన్ ఏఐ సంస్థ గత ఏడాది నవంబర్లో యూజర్లకు పరిచయం చేసింది. ప్రారంభంలో ప్రపంచంలోనే వేగంగా విస్తరిస్తున్న యాప్గా రికార్డ్లను నమోదు చేసింది. గూగుల్లాంటి దిగ్గజ సంస్థలకు సవాల్ విసురుతూ రాకెట్ వేగంతో ప్రపంచాన్ని చుట్టేసేంతలా కేవలం 2 నెలల్లోనే 100 మిలియన్ యూజర్లను సొంతం చేసుకుంది. ఒక్క జనవరిలో రోజుకు 13 మిలియన్ల మంది దీన్ని వినియోగించినట్లు యూబీఎస్ రీసెర్చ్ వెల్లడించింది. ఇతర యాప్లు ఈ మైలురాయిని చేరటానికి దాదాపుగా రెండున్నరేళ్లు పట్టే అవకాశం ఉందని నిపుణులు సైతం అభిప్రాయం వ్యక్తం చేశారు. సిమిలర్ వెబ్ నివేదికలో సిమిలర్ వెబ్ నివేదిక ప్రకారం..చాట్జీపీటీని వినియోగించే వారి సంఖ్య తగ్గుతున్నట్లు తెలుస్తోంది. మే - జూన్ నెలలో కాలంలో ఏఐ యూజర్లు 9.7శాతం పడిపోయారు. సందర్భాన్ని బట్టి అవసరం కోసం చాట్జీపీటీని వాడుకునే యూనిక్ విజిటర్స్ సైతం 5.7 శాతం తగ్గారు. అమెరికాలో చాట్జీపీటీ పరిస్థితి మరింత దారుణంగా పడిపోతుంది. ఇక్కడ నెలవారీగా 10.3 శాతం మంది యూజర్లు ఉపయోగించుకోవడమే మానేశారు. అంతేకాదు, వెబ్సైట్లో సందర్శకులు గడిపిన సమయం కూడా 8.5శాతం తగ్గినట్లు సిమిలర్ వెబ్ నివేదిక పేర్కొంది. ట్రాఫిక్ సైతం పడిపోయింది ఆ రిపోర్ట్ను నిశితంగా పరిశీలిస్తే, నవంబర్ 2022లో ప్రారంభించినప్పటి నుండి వృద్ది (పెరగడం) తటస్థంగా కొనసాగుతూ వచ్చింది. విజిట్ చేసే యూజర్ల సంఖ్య ఫిబ్రవరి - మార్చి నెలల్లో 10 బిలియన్ల నుంచి 15 బిలియన్లకు చేరింది. విచిత్రంగా ఏప్రిల్ -మే’లలో గ్రోత్ రేట్ తగ్గింది. యూనిక్ విజిటర్స్ సైతం పెరిగినట్లు సిమిల్ వెబ్ నివేదిక చెబుతోంది. అంచనాలు తప్పాయ్ చాట్జీపీటీ నెలవారీ యూజర్లు 20 బిలియన్ల నెలవారీ ట్రాఫిక్ మార్కును దాటుతుందని ప్రారంభ అంచనాలు చెప్పినప్పటికీ, అది ఇప్పట్లో సాధ్యమయ్యేలా కనిపిస్తోంది. వెబ్ సైట్ ప్రారంభ సమయంలో అందులో యూజర్లు గడిపిన సమయం 6 నిమిషాలే. మార్చి నెలలో 8 నిమిషాల కంటే ఎక్కువ. ప్రస్తుతం 8 నిమిషాల్లోపే ఉంది. ఇతర టూల్స్ సైతం ట్రాఫిక్ తగ్గుదల చాట్ జీపీటీ మాత్రమే కాకుండా ప్రపంచంలో రెండవ అతిపెద్ద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్లాట్ఫామ్ కేరక్టర్. ఏఐ సైతం ఈ తరహా ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు సిమిలర్ వెబ్ నివేదిక హైలెట్ చేసింది. ఈ ఏడాది మే నెలలో గరిష్ట స్థాయికి చేరుకున్న క్యారక్టర్. ఏఐ యూజర్లు మే నుంచి జూన్ మధ్య కాలంలో తగ్గుముఖం పట్టారు. గతంలో క్యారక్టర్.ఏఐలో యూజర్లు గడిపే సమయం 25.4 నిమిషాల నుంచి 8.5 శాతానికి చేరింది. యూజర్లు పడిపోవడానికి కారణం అయితే, ఏఐ టూల్స్కు వినియోగదారులు తగ్గడానికి ప్రధాన కారణం వాటిపై నమ్మకం కోల్పోవడమేనని తెలుస్తోంది. గత కొన్ని నెలలుగా చాట్జీపీటీ వంటి టూల్స్లో అనేక సమస్యలు ఎదురయ్యాయి. గూగుల్, ఓపెన్ ఏఐ, మైక్రోసాఫ్ట్తో పాటు ఇతర ఏఐ టూల్స్ తయారీ సంస్థలు తమకు పరిష్కారం చూపించమని యూజర్లు వాటిని అడిగితే.. తప్పుడు సమాచారం అందించి.. తాము అందించింది సరైందేనని నమ్మించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా కోడింగ్ తయారు చేసే సమయంలో ఈ సమస్య ఎక్కువగా ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. నమ్మకం కోల్పోతుంది మరోవైపు, సున్నితమైన కంపెనీ డేటాను చాట్జీపీటీ టూల్స్తో పంచుకోవడం వల్ల సంస్థ రహస్యాలు బహిర్ఘతం అవుతాయేయమోనన్న ఆందోళనతో చాలా కంపెనీలు చాట్జీపీటీని వినియోగించడంలో నిషేధించాయి. ఈ సందర్భంగా యూజర్లు తగ్గడంపై.. ‘ఓ మై గాడ్ ఇది అద్భుతం’ అని బిల్డర్. ఏఐ సీఈవో సచిన్ దేవ్ దుగ్గల్ అన్నారు. చాట్జీపీటీ యాప్స్ను రూపొందించడంలో ఉపయోగపడుతుంది. కానీ,యాప్స్లలో తప్పుడు సమాచారాన్ని అందిస్తున్నారంటూ యూజర్లు సంస్థలపై విమర్శలు చేసిన సందర్భాలు ఉన్నాయి. మొదట్లో చాట్జీపీటీ వినియోగం బాగుంది. కానీ రాను రాను దాని అవసరం తగ్గిపోతున్నట్లు గ్రహించినట్లు దుగ్గల్ చెప్పారు. చదవండి👉 ఉద్యోగం ఉంటుందో.. ఊడుతుందో, ఆందోళనలో సగం మంది భారతీయులు! -
భవిష్యత్లో ఐటీ ఉద్యోగుల అవసరం ఉండదు.. బాంబు పేల్చిన ‘AI’ సీఈవో!
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత టూల్ చాట్జీపీటీ విడుదలతో ఉద్యోగుల భవిష్యత్ మరింత ప్రమాదంలో పడింది. ఆయా రంగాల్లో మనుషులు చేస్తున్న పనుల్ని ఏఐ టూల్స్తో చేయనుండడంతో.. ఆ టూల్స్ను అభివృద్దిని అడ్డుకోవాలంటూ ఎలాన్ మస్క్లాంటి ప్రపంచ కుబేరులు డిమాండ్ చేస్తున్నారు. ఈ తరుణంలో మీడియా రంగం నుంచి, టెక్నాలజీ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులపై ప్రతికూల ప్రభావం పడనుందనే నివేదికలు ఉద్యోగులకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. ఇటీవల,స్టెబిలిటీ ఏఐ సీఈవో ఎమాడ్ మోస్టాక్, పీటర్ హెచ్.డయామాండితో కలిసి మూన్షాట్స్ అండ్ మైండ్సెట్ పాడ్ కాస్ట్లో మాట్లాడారు. రాబోయే ఐదేళ్లలో మనుషులు ప్రోగ్రామ్ను డిజైన్ చేయాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.ఎందుకంటే చాట్జీపీటీ టూల్స్ స్వయంగా కోడింగ్ను రూపొందిస్తున్నాయి.టెక్ రంగానికి కావాల్సిన కోడ్లను ప్రామాణికంగా, మరింత ఖచ్చితత్వంతో అందించేందుకు సహాయపడతాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో పాటు జనరేటివ్ ఏఐ సైతం తనదైన ముద్రవేస్తుందని చెప్పారు. టెక్కీల అవసరం ఉండదు ప్రస్తుతం మైక్రోసాఫ్ట్కు చెందిన సాఫ్ట్వేర్ కంపెనీ గిట్హబ్లో 41 శాతం కోడ్లను చాట్జీపీటీ తయారు చేసినవే. ఐదేళ్లలో ప్రోగ్రామర్ల అవసరం ఉండదు. దీనితో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేసిక్ ప్రోగ్రామర్లకు ముప్పు ఎక్కువగా ఉంది. వాళ్ల అవసరం ఇకపై ఉండదని చెప్పారు. ఇంటర్నెట్తో పనిలేదు 2024 ముగిసే సమయానికి అందరి ఫోన్లలో చాట్జీపీటీ అందుబాటులోకి వస్తుంది. అంతేకాదు దీన్ని వినియోగించాలంటే ఇంటర్నెట్ అవసరం లేదు. ఇంటర్నెట్ లేకుండా కావాల్సిన కార్యకలాపాలన్నీ చాట్జీపీటీలో చక్కబెట్టుకోవచ్చు. ఈ సందర్భంగా ఏఐ ఎంత వేగంగా అభివృద్ధి చెందుతుందో చూడండి’ అని సీఈవో నొక్కి చెప్పారు. హెల్త్, సైన్స్ నిపుణులకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ను అందుబాటులో ఉంచాలని, తద్వారా వారు తమ సామర్థ్యాన్ని, వేగాన్ని ఉపయోగించుకోగలరని అన్నారు. భవిష్యత్తుపై ఓ లుక్కేయండి! ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ను అందరూ వినియోగించుకునేలా చూడాలని స్టెబిలిటీ ఏఐ సీఈఓ అభిప్రాయపడ్డారు. ఆడియో, వీడియో, డీఎన్ఏ, కెమికల్ రియాక్షన్స్, లాంగ్వేజ్ ఇలా అన్నీ ఇంటిగ్రేటెడ్ సొసైటీ ఓఎస్ అనే ఒకే పద్ధతి ఆధారంగా ఈ సంస్థ మోడల్ను అభివృద్ధి చేస్తోందని ఆయన పేర్కొన్నారు. తద్వారా బోర్డు సభ్యుల స్థానంలో బ్యాంకర్ జీపీటీ, బోర్డు సభ్యుల స్థానంలో బోర్డు జీపీటీ ఉంటాయి. ఈ సృజనాత్మక ఆలోచన ప్రతి ఒక్కరినీ ఒక ఫైలును తయారు చేసుకోవచ్చు. ఇందులో వారు పదాలు, చిత్రాలు, ఆడియో, టెక్స్ట్ లేదా వారికి సంబంధించిన ఇతర సమాచారాన్ని కలుపుకునే అవకాశాన్ని అందిస్తుందని చెప్పారు. చదవండి : 10 ఏళ్లలో ‘AI’తో మానవాళి వినాశనమే.. సీఈవోల సంచలన వ్యాఖ్యలు! -
మెర్లిన్..: మెరుపై మెరిసెన్
‘కాల్ చాట్జీపీటీ వేరెవర్ యూ ఆర్’ అంటూ రంగంలోకి దిగిన చాట్జీపీటీ యాప్ ‘మెర్లిన్’ మెరుపు వేగంతో విజయం సాధించింది. ‘పవర్ ఆఫ్ చాట్జీపీటీ’ని యూజర్కు దగ్గర చేసి, టైమ్ సేవ్ చేసే ‘మెర్లిన్’ సృష్టికర్తలు ప్రత్యూష్ రాయ్, సిద్ధార్థ సక్సెనా, సిరిసేందు సర్కార్లు మూకుమ్మడిగా చెప్పే మాట... ‘కొత్తగా ఆలోచించడం అనేది విజయానికి తొలి మెట్టు’ గ్లోబల్ కన్సల్టెన్సీ ‘బీసీజీ’లో పనిచేస్తున్న సమయంలో ఎన్నో విలువైన అనుభవాలను మూటగట్టుకున్నాడు ప్రత్యూష్రాయ్. ఆ అనుభవాలను విశ్లేషించుకునే క్రమంలో తనకు కొత్తగా ఏదైనా చేయాలనిపించేది. ఐఐటీ–కాన్పూర్లో సివిల్ ఇంజనీరింగ్ చేసిన ప్రత్యూష్ రాయ్ తన ఇద్దరు స్నేహితులు సిద్ధార్థ సక్సెనా, సిరిసేందు సర్కార్లతో మాట్లాడాడు. ‘కొత్తగా అనిపించే అర్థవంతమైన పని ఏదైనా చేద్దాం’ అనుకున్నారు వాళ్లు. అలా వారి మేధోమథనం నుంచి పుట్టిన అంకురమే...మెర్లిన్. చాట్జీపీటీ యాప్ ‘మెర్లిన్’ మెరుపు వేగంతో విజయం సాధించింది. ప్రారంభమైన ఆరునెలల్లోనే ఈ యాప్ను వందలాది మంది ఇన్స్టాల్ చేసుకున్నారు. టెక్ కంపెనీ ‘ఫోయర్’లో విలీనం అయిన తరువాత యూఎస్, తూర్పు ఆసియా, యూరప్లలో ‘మెర్లిన్’కు మంచి మార్కెట్ ఏర్పడింది. ‘ఎలాంటి అయోమయాలకు, సంక్లిష్టతలకు తావు లేకుండా బ్రౌజర్లో భాగమయ్యే సింపుల్ ప్రాడక్ట్ ఇది. యూట్యూబ్, జీమెయిల్, ట్విట్టర్, లింక్డ్ఇన్... మొదలైన వాటికి సంబంధించి క్లిష్టమైన సమస్యల పరిష్కారం విషయంలో డైలీ యాక్టివ్ యూజర్లకు ఉపయోగపడుతుంది. మార్కెటర్స్, రిక్రూటర్స్కు ఒక వాక్యం ట్వీట్ నుంచి ఎన్నో పదాల ఇమెయిల్ వరకు ఎన్నో పనుల్లో టైమ్ వృథా కాకుండా చూస్తుంది. ఇది సింపుల్ క్రోమ్ ఎక్స్టెన్షన్. బటన్ను ఒక్కసారి క్లిక్ చేస్తే చాలు చాట్జీపీటీ మనల్ని వెదుక్కుంటూ వస్తుంది’ అని ‘మెర్లిన్’ గురించి చెబుతున్నాడు ప్రత్యూష్ రాయ్. యూట్యూబ్కు సంబంధించి ‘మెర్లిన్’ను ‘యూట్యూబ్ సమ్మరైజర్’గా ఉపయోగించకుంటున్నారు యూజర్లు. ఒక యూట్యూబ్ వీడియోను పూర్తిగా చూడనవసరం లేకుండానే దానిలోని ముఖ్యమైన సెగ్మెంట్ల గురించి ‘మెర్లిన్’ చెబుతుంది. పర్సనలైజ్డ్ ప్రాంప్ట్స్ విషయంలోనూ ‘మెర్లిన్’ ఉపయోగపడుతుంది. మన రైటింగ్ స్టైల్ను కాప్చర్ చేస్తుంది. ‘నిజానికి మా దృష్టి డెవలపర్స్పై ఉండేది. అయితే మా ప్రాడక్ట్ను యూజర్లు ఆసక్తికరమైన పద్ధతుల్లో ఉపయోగించుకుంటున్నారు’ అంటున్నాడు ప్రత్యూష్ రాయ్. నేర్చుకున్న పాఠాలు ఎప్పుడూ వృథా పోవు. ‘బీసీజీ’లో రాయ్ అనుభవంతో నేర్చుకున్న ఎన్నో పాఠాలు ‘మెర్లిన్’ ప్రయాణంలో ఉపయోగపడ్డాయి. రాయ్ మాటల్లో చెప్పాలంటే ఆ అనుభవ పాఠాలు తన ప్రపంచాన్నే మార్చేసి కొత్త ప్రపంచాన్ని పరిచయం చేశాయి. ‘మెర్లిన్ సక్సెస్కు కారణం దానిపై యూజర్లకు గురి కుదరడమే’ అంటున్నాడు ‘ఫోయర్–మెర్లిన్’ ఫస్ట్ ఇన్వెస్టర్, బెటర్ క్యాపిటల్ సీయివో వైభవ్. ‘హమ్మయ్య...సక్సెస్ అయ్యాం’ అని సేద తీరడం లేదు ‘ఫోయర్–మెర్లిన్’ బృందం. ఇప్పుడు వారి దృష్టి సిబ్బందిని పెంచుకోవడం, మెర్లిన్లోకి రకరకాల సబ్ ఫీచర్స్ని తీసుకురావడంపై ఉంది. ‘మెర్లిన్’ అనేది ఒక రకమైన డేగ. దానిలోని సునిశితమై దృష్టిని తమ ‘మెర్లిన్’లోకి తీసుకురావాలనుకుంటోంది, ఫినిష్ ఎనీ టాస్క్ అని ధైర్యం ఇవ్వాలనుకుంటోంది బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న ఫోయర్–మెర్లిన్ బృందం. ‘హమ్మయ్య... సక్సెస్ అయ్యాం’ అని సేద తీరడం లేదు ‘ఫోయర్–మెర్లిన్’ బృందం. ఇప్పుడు వారి దృష్టి సిబ్బందిని పెంచుకోవడం, మెర్లిన్లోకి రకరకాల సబ్ ఫీచర్స్ని తీసుకురావడంపై ఉంది. -
హలో.. ఆస్ట్రోనాట్..!
అంతరిక్షంలో విధినిర్వహణలో ఉండే వ్యోమగాములు ఇకపై తమకు ఏదైనా సమాచారం, సాయం కావాలంటే భూమిపై అంతరిక్ష పరిశోధనా కేంద్రాన్ని సంప్రదించాల్సిన అవసరం లేదు. తాము ప్రయాణిస్తున్న అంతరిక్ష నౌకను అడిగితే చాలు.. కావాల్సిన సమాచారం దొరుకుతుంది. అది కూడా సంభాషణల రూపంలోనే. కృత్రిమ మేధ(ఏఐ) ఆధారిత చాట్బాట్ చాట్జీపీటీ తరహాలో పనిచేసే ఇంటర్ఫేస్ను అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ ‘నాసా’ ఇంజనీర్లు అభివృద్ధి చేశారు. ఇతర గ్రహాలపై అన్వేషణ కోసం వెళ్లే వ్యోమగాములు తాము ప్రయాణించే అంతరిక్ష నౌకలతో సంభాషించడానికి ఈ ఇంటర్ఫేస్ ఉపయోగపడుతుందని చెబుతున్నారు. వ్యోమగాములకు అంతరిక్ష నౌకలు తగిన సలహాలు సూచనలు ఇచ్చేందుకు వీలుంటుందని పరిశోధకులు పేర్కొంటున్నారు. అంతేకాకుండా భూమిపై ఉండే మిషన్ కంట్రోలర్లు ఇతర గ్రహాలపై పనిచేసే ఏఐ ఆధారిత రోబోలతో సులభంగా మాట్లాడొచ్చని అంటున్నారు. ఇది సైన్స్ ఫిక్షన్ కాదు చంద్రుడిపైకి వ్యోమగాములను పంపించేందుకు నాసా ఇప్పటికే ప్రణాళిక సిద్దం చేసింది. చంద్రుడి కక్ష్యలో ‘లూనార్ గేట్వే’ పేరిట ఒక అంతరిక్ష కేంద్రాన్ని సైతం నిర్మించాలని భావిస్తోంది. ఈ స్పేస్ స్టేషన్లో ఏఐ ఆధారిత ఇంటర్ఫేస్ సేవలు ఉపయోగించుకోవాలని నాసా నిర్ణయానికి వచి్చనట్లు ఇంజనీర్ డాక్టర్ లారిస్సా సుజుకీ చెప్పారు. అంతరిక్ష నౌకలతో నేరుగా సంభాషించడం, వాటి నుంచి వెనువెంటనే ప్రతిస్పందనలు అందుకోవడమే దీని ఉద్దేశమని వివరించారు. అంతరిక్షంలో గమనించిన విషయాలను సంభాషణల రూపంలో భూమిపైకి చేరవేస్తాయని, ప్రమాదాలు ఎదురైనప్పుడు హెచ్చరికలు జారీ చేస్తాయని అన్నారు. ఇది సైన్స్ ఫిక్షన్ ఎంతమాత్రం కాదని స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో అంతరిక్ష నౌకల్లో కృత్రిమ మేధ ఆధారిత గ్రహాంతర సమాచార వ్యవస్థను నిక్షిప్తం చేయడం తప్పనిసరి అవుతుందని వెల్లడించారు. అంతరిక్ష నౌకలతో సంబంధాలు తెగిపోయినప్పుడు, వాటిలో లోపాలు తలెత్తినప్పుడు, పనిచేయకుండా పోయినప్పుడు, ఇంజనీర్లను అంతరిక్షంలోకి పంపించలేమని చెప్పారు. ఏఐ ఆధారిత సంభాషణ వ్యవస్థతో అంతరిక్ష నౌకల్లోని లోపాలు వెంటనే తెలిసిపోతాయని వివరించారు. ఇలాంటి కమ్యూనికేషన్ వ్యవస్థను అంతరిక్ష వాహనాల్లో అమర్చడం ద్వారా ఇతర గ్రహాలపై ఉండే ఖనిజ లవణాలు, వాతావరణ పరిస్థితులు గురించి కచి్చతమైన సమాచారం పొందవచ్చని డాక్టర్ లారిస్సా సుజుకీ అభిప్రాయపడ్డారు. –సాక్షి, నేషనల్ డెస్క్ -
మీ ఫోన్లో ఈ కీబోర్డ్ను ఇన్ స్టాల్ చేసుకున్నారా?, చాట్జీపీటీతో పాటు!
మీరు స్మార్ట్ఫోన్ వాడుతున్నారా? అందులో మీరు ఏ టైపింగ్ కీ బోర్డ్ వినియోగిస్తున్నా..వెంటనే అన్ ఇన్స్టాల్ చేయండి. ఎందుకంటే? ప్రముఖ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ ఇటీవల స్విప్ట్కీబోర్డ్లో బింగ్ చాట్బాట్ను ఆండ్రాయిడ్ యూజర్లకు అందుబాటులోకి తెచ్చింది. ఈ కీబోర్డ్ వినియోగం యూజర్లకు మరింత ఉపయోగకరంగా మారనుంది. ముఖ్యంగా, మీరు ఎవరికైనా పంపాలనుకున్న టెక్ట్స్ను రీరైట్ చేయడం కానీ, లేదంటే టెక్ట్స్తో పాటు ఇతర సమాచారం కావాలంటే ఇంటర్నెట్ బ్రౌజింగ్తో పాటు ఇతర అవసరాల కోసం ఉపయోగించుకోవచ్చు. ఈ సందర్భంగా స్విఫ్ట్కీకి బింగ్ చాట్ ఏఐని ఇంటిగ్రేట్ చేయడంపై మైక్రోసాఫ్ట్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ పెడ్రామ్ రెజాయ్ మాట్లాడుతూ ఆండ్రాయిడ్, ఐఫోన్ల కోసం మైక్రోసాఫ్ట్ కీబోర్డ్ను అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపారు. యూజర్లు పదాలు, ఎమోజీలతో సహా టైప్ చేసే విధానానికి అనుగుణంగా ఉండే కీబోర్డ్లను అభివృద్ది చేశామన్నారు. దీంతో పాటు అక్షరదోషాలుంటే హైలెట్ చేయడం లేదంటే అక్షరదోషాలను సరిద్దిడం వంటి పీచర్లు ఈ కీబోర్డ్లో ఉన్నాయని అన్నారు. కావాలంటే మీరూ ఆ కీబోర్డ్ పనితీరు ఎలా ఉంటుందో చెక్ చేసుకోవచ్చు. ఇందుకోసం గూగుల్ ప్లేస్టోర్లో లభ్యమయ్యే స్విఫ్ట్ కీబోర్డ్ను మీ ఫోన్లలో ఇన్ స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. చదవండి👉 గూగుల్కు భారీ షాక్ .. అదే జరిగితే వందల కోట్లలో నష్టం! -
వాళ్ళ లక్ష్యం చాట్ GPT యూజర్స్ భయపెడుతున్న కొత్త మాల్ వేర్స్.!
-
తస్మాత్ జాగ్రత్త! .. గూగుల్ ప్లే స్టోర్లో ఫేక్ చాట్జీపీటీ యాప్స్ కలకలం
టెక్నాలజీ పెరిగిపోతున్న కొద్ది సైబర్ నేరస్తులు తెలివి మీరిపోతున్నారు. ఈజీ మనీ పేరుతో యూజర్ల జేబును ఖాళీ చేసేందుకు అదే టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. గత ఏడాది విడుదలైన చాట్జీపీటీ సంచలనాలకు కేంద్ర బిందువుగా మారిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ ఏఐ టూల్తో సైబర్ నేరస్తులు ఆండ్రాయిడ్ యూజర్ల ఫోన్లలో మాల్వేర్ను పంపిస్తున్నారు. బ్యాంకు అకౌంట్లో సొమ్ము కాజేస్తున్నారు. లేదంటే యూజర్ల డేటాను డార్క్ వెబ్లో సొమ్ము చేసుకుంటున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. పాలో ఆల్టో నెట్వర్క్స్ పరిశోధకులు చాట్జీపీటీ ఫేక్ యాప్స్లలో మీటర్ప్రెటర్ ట్రోజన్ అనే మాల్వేర్ను గుర్తించారు. ఈ మాల్వేర్ వేరియంట్లు ప్రత్యేకంగా చాట్జీపీటీ వంటి ఏఐ టూల్ ఉపయోగించడానికి ఆసక్తి ఉన్న యూజర్లను లక్ష్యంగా చేసుకుంటున్నట్లు గుర్తించారు. కాబట్టి, ఏఐ యాప్స్ పట్ల వినియోగదారులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. అదే సమయంలో సైబర్ నేరస్తులు ఫేక్ చాట్జీపీటీ యాప్స్ సాయంతో పెద్ద మొత్తంలో వెచ్చించి కొనుగోలు చేసిన కాంటాక్ట్ నెంబర్లకు మెసేజ్లు పంపుతున్నారు. ఆ మెసేజ్లను క్లిక్ చేయడం ద్వారా మాల్వేర్లు సదరు యూజర్ల ఫోన్లలోకి ఈజీగా చొరబడుతుంది. తద్వారా డబ్బుల కోసం అడ్డదార్లు తొక్కుతున్న కేటుగాళ్లు బాధితుల్ని బెదిరించి వారికి కావాల్సినంత డబ్బుల్ని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు ఆ తరహా ఫోన్ నెంబర్లనే మాల్వేర్ క్రియేటర్లు, స్కామ్లు, మోసపూరిత కార్యకలాపాలకు ఉపయోగిస్తున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ఈ తరుణంలో గూగుల్ ప్లేస్టోర్లో అందుబాటులో ఉన్న చాట్జీపీటీ ఫేక్ యాప్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని సైబర్ టెక్నాలజీ నిపుణులు యూజర్లను హెచ్చరిస్తున్నారు. డౌన్లోడ్ చేసుకునే సమయంలో రివ్యూలతో పాటు గతంలో ఆ యాప్ను ఎంతమంది డౌన్లోడ్ చేసుకున్నారో గుర్తించాలని చెబుతున్నారు. ఏ మాత్రం అనుమానం ఉన్నా ఫేక్ యాప్స్ జోలికి పోవద్దని సలహా ఇస్తున్నారు. -
10 ఏళ్లలో ‘AI’తో మానవాళి వినాశనమే.. సీఈవోల సంచలన వ్యాఖ్యలు!
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్!! టెక్నాలజీ ప్రియుల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్న కొత్త టూల్స్. ప్రియురాలికిచ్చే ప్రేమ లేఖల దగ్గర నుంచి..యాప్స్ డిజైన్ చేసేందుకు ఉపయోగించే కోడింగ్ వరకు ఇలా అన్నీ అవసరాల కోసం ఏఐ టూల్స్ చాట్జీపీటీ, బార్డ్లనే ఆశ్రయిస్తున్నారు. అయితే, ఈ కొత్త ఏఐ టూల్స్ వల్ల ఎంత లాభం ఉందో మానవాళికి ముప్పు అదే స్థాయిలో ఉందని ట్విటర్, టెస్లా బాస్ ఎలాన్ మస్క్ వంటి దిగ్గజ సీఈవోలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఓ సర్వేలో సైతం ప్రముఖ కంపెనీల సీఈవోలు ఇదే అంశాన్నీ లేవనెత్తారు. ఈ వారంలో అమెరికన్ యేల్ యూనివర్సిటీ ‘యేలో సీఈవో సమ్మిట్’ నిర్వహించింది. ఈ సమావేశంలో ప్రముఖ మీడియా దిగ్గజం సీఎన్ఎన్ ‘ఏఐ’పై సర్వే చేయగా.. అందులో 42 శాతం మంది సీఈవోలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనుషుల స్థానాల్ని ఆక్రమించేస్తుందనే అభిప్రాయం వ్యక్తం చేశారు. యేలే సీఈవో సమ్మిట్లో 42 శాతం సీఈవోలతో పాటు ప్రముఖ వ్యాపార వేత్తలు ‘రానున్న 5 నుంచి 10 ఏళ్లలో మనుషుల్ని నాశనం చేసే సామర్ధ్యం కృత్తిమ మేధకు ఉందని నమ్ముతున్నట్లు తెలిపారు. వాల్మార్ట్, కోకా-కోలా, జిరాక్స్, జూమ్తో పాటు ఇతర వ్యాపార సంస్థల్లో కార్యకాలపాలు నిర్వహించే 119 మంది సీఈవోలు పాల్గొన్నారని నివేదిక పేర్కొంది. ఈ ఫలితాలపై యేల్ ప్రొఫెసర్ జెఫ్రీ సోన్నెన్ఫెల్డ్ ఈ సర్వే చీకటిగా, భయంగా ఉందంటూ దిగ్భ్రాంతికి గురయ్యారు. సర్వే ప్రకారం.. 34 శాతం మంది సీఈవోలు ఏఐ టెక్నాలజీతో రానున్న 10 ఏళ్లలో మానవాళి మనుగడకు ముప్పు వాటిల్లితున్నట్లు చెప్పారు. 8 శాతం మంది ఇప్పటి నుంచి మరో ఐదేళ్లలో కృత్తిమ మేధతో మనుషులుకు వినాశనం తప్పదన్నారు. సుమారు 58 శాతం మంది సీఈవోలు మనుషుల మేధస్సును ఏఐ టెక్నాలజీ ఏం చేయలేవని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. గతంలో టెక్ వ్యాపార దిగ్గజం ఎలాన్ మస్క్, ఓపెన్ ఏఐ ఫౌండర్ శామ్ ఆల్ట్ మన్ కృత్తిమ మేధ వల్ల జరిగే అనార్ధాల గురించి హెచ్చరించారు. కొన్ని వారాల క్రితం డజన్ల మంది ఏఐ ఇండస్ట్రీ ప్రముఖులు సైతం ఏఐతో ‘వినాశానమే’నని సూచించారు. వారిలో శామ్ ఆల్ట్మన్, ‘గాడ్ఫాదర్ ఆఫ్ ఏఐ’ జెఫ్రీ హింటన్, గూగుల్,మైక్రోసాఫ్ట్ ఎక్జిగ్యూటీవ్లు ఉన్నారు. అయితే, సమాజం ఏఐ నుంచి వచ్చే ప్రమాదాల్ని తిప్పికొట్టేలా జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. మహమ్మారి, న్యూక్లియర్ వార్ వంటి ఇతర సామాజిక ప్రమాదాల్ని తగ్గించే ఎంత ప్రాదాన్యం ఇచ్చామో.. AIతో తలెత్తే ప్రమాదాన్ని తగ్గించేందుకు ఓ ప్రాధాన్యతగా తీసుకోవాలని ఏఐ పరిశ్రమ వర్గాల ప్రతినిధులు పిలుపు నిచ్చారని నివేదిక హైలెట్ చేసింది. చదవండి : ‘AI’ టూల్స్ వినియోగం..ఉద్యోగులకు గూగుల్ వార్నింగ్! -
‘AI’ టూల్స్ వినియోగం..ఉద్యోగులకు గూగుల్ వార్నింగ్!
కృత్తిమ మేధ ఆధారిత టూల్స్ గూగుల్ బార్డ్, చాట్జీపీటీ వినియోగంపై గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్ అప్రమత్తమైంది. సంస్థకు సంబంధించిన సున్నితమైన డేటా బహిర్ఘతంగా కాకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా ఉద్యోగులు ఏఐ టూల్స్ ఉపయోగంపై హెచ్చరికలు జారీ చేసినట్లు తెలుస్తోంది. అయితే, ఉద్యోగులకు హెచ్చరికలు జారీ చేసిన ఉద్దేశం..సంస్థ రహస్యాలు బయటకు పొక్కకుండా ఉండేందుకేనని గూగుల్ చెబుతోంది. కంపెనీలో సున్నితమైన సమాచారంపై మోడరేటర్స్ విభాగానికి చెందిన ఉద్యోగులు రివ్యూలు నిర్వహిస్తుంటారు. అదే సమయంలో ఏఐ చాట్ బాట్లకు రివ్యూల గురించి సమాచారం తెలిస్తే తీవ్రం నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని గూగుల్ భావిస్తున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. మితిమీరిన వినియోగంతో ఈ ఏడాది మైక్రోసాఫ్ట్ ఏఐ టూల్ చాట్జీపీటీకి పోటీగా గూగుల్ ‘బార్డ్’ను విడుదల చేసింది. అనంతరం, గూగుల్ ఉద్యోగులు సైతం బార్డ్ బలాలు, బలహీనతలు పరీక్షించేలా పరిధికి మించి వినియోగిస్తున్నట్లు యాజమాన్యం దృష్టికి వచ్చింది. ఈ తరుణంలో కృత్తిమ మేధ టూల్స్ను కొన్ని పరిమితులకు లోబడి ఉపయోగించాలని తెలిపింది. ఇంజనీర్లుకు సైతం చాట్బాట్లను అందించే కోడ్ను నేరుగా వినియోగించొద్దని తెలిపింది. శాంసంగ్ దెబ్బకు దారికొచ్చిన కంపెనీలు ఇక, గూగుల్ ఉద్యోగులకు జారీ చేసిన హెచ్చరికలతో భద్రత విషయంలో కంపెనీలు తీసుకుంటున్న జాగ్రత్తలు ప్రతిధ్వనిస్తున్నాయి. ముఖ్యంగా, ఎలక్ట్రానిక్ దిగ్గజం శాంసంగ్కు చెందిన ఉద్యోగులు చాట్జీపీటీ వినియోగించే సమయంలో ఓ ప్రాజెక్ట్ రహస్యాల్ని షేర్ చేశారు. దీంతో ఏఐ టూల్స్ను వినియోగించకుండా బ్యాన్ చేసింది. జాగ్రత్త పడుతున్నాయ్ ఈ పరిణామంతో ప్రపంచ దేశాలు సంస్థలు ఏఐ టూల్స్ విషయంలో జాగ్రత్త పడుతున్నాయి. సంస్థ రహస్యాలు పొక్కకుండా.. లేదంటే ఏఐ టూల్స్తో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేలా కొత్త కొత్త టెక్నాలజీని వినియోగిస్తున్నాయి. తాజాగా, గూగుల్ సైతం చాట్జీపీటీ, బార్డ్లపై ఆంక్షలు విధించినట్లు వెలుగులోకి వచ్చిన రిపోర్ట్లు హైలెట్ చేస్తున్నాయి. చదవండి👉 దేశంలోని ఐటీ ఉద్యోగులకు బంపరాఫర్.. డబుల్ శాలరీలను ఆఫర్ చేస్తున్న కంపెనీలు! -
మేం రెడీ: ఆల్ట్మాన్కు సీపీ గుర్నానీ చాలెంజ్, ఏం జరిగిందంటే!
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సృష్టికర్త సామ్ ఆల్ట్మన్ సిలికాన్ వ్యాలీతో భారతీయ నిపుణులు పోటీ పడలేరన్న వ్యాఖ్యలపై టెక్ మహీంద్రా సీఈవో సీపీ గుర్నానీ స్పందించారు. భారతీయ కంపెనీలు తమ సిలికాన్ వ్యాలీ కౌంటర్ పార్ట్లతో పోటీ పడలేరన్న ఆల్ట్మాన్ చాలెంజ్ను స్వీకరిస్తున్నట్టు ప్రకటించారు. భారతదేశంతో సహా ఆరు దేశాల పర్యటనలో ఉన్న ఆల్ట్మాన్ను ఇండియాలో చాలా పవర్ ఫుల్ ఎకోసిస్టం ఉంది. ప్రత్యేకంగా ఏఐపై దృష్టి పెడుతున్నాం, కానీ చాట్జీపీటీ లాంటి కృత్రిమ మేధస్సు సాధనాన్ని ఇండియా, ఆగ్నేయాసియాలో తయారు చేయగలదా అని మాజీ గూగుల్ వైస్ ప్రెసిడెంట్ రాజన్ ఆనందన్ అడిగినపుడు ఈ వ్యాఖ్యలు చేశారు. (వారికి గుడ్న్యూస్ చెప్పిన ఎలాన్ మస్క్: ఇక డబ్బులే డబ్బులు!) "ఇది ఎలా పని చేస్తుందో మీకు చెప్పబోతున్నాం, ట్రైనింగ్ ఫౌండేషన్ మోడల్స్పై పోటీ పడటం పూర్తిగా ప్రయోజనం లేనిది, ఆఫ్కోర్స్.. ఎలాగైనా ప్రయత్నించడం మీ జాబ్ అయినా కానీ వీటివల్ల ఎలాంటి ప్రయోజనం ఉందడని సమాధానమిచ్చాడు. (1200 లోన్తో మొదలై.. రూ 2.58 లక్షల కోట్లకు) ఆల్ట్మాన్ వ్యాఖ్యలను పూర్తి తిప్పికొడుతూ గుర్నానీ ట్వీట్ చేశారు. ఒక సీఈవోకి మరో సీఈవోకి ఇచ్చిన సవాలును స్వీకరిస్తున్నానంటూ ప్రతి సవాల్ విసిరారు. మరోవైపు చాట్జిపిటి వంటి టూల్ను రూపొందించే సామర్థ్యం భారత్కు లేదని ఆల్ట్మాన్ పేర్కొన్నప్పటికీ, భారతీయ పారిశ్రామికవేత్తలు తమ సొంత సాధనాన్ని రూపొందించడానికి ప్రయత్నిస్తారని ఆనందన్ కూడా ట్వీట్ చేశారు. అంతేకాదు 5000 సంవత్సరాల భారతీయ వ్యవస్థాపకత, భారతీయ పారిశ్రామిక వేత్తలను మనం ఎప్పటికీ తక్కువ అంచనా వేయొద్దు, తామూ ప్రయత్నించాలనుకుంటున్నామన్నారు. OpenAI founder Sam Altman said it’s pretty hopeless for Indian companies to try and compete with them. Dear @sama, From one CEO to another.. CHALLENGE ACCEPTED. pic.twitter.com/67FDUtLNq0 — CP Gurnani (@C_P_Gurnani) June 9, 2023 -
ఏఐతో వ్యాపారాల్లో శరవేగంగా మార్పులు
ముంబై: కొత్త తరం జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (జెన్ఏఐ) టెక్నాలజీలు వ్యాపార స్వరూపాలను శరవేగంగా మార్చేస్తున్నాయి. చాట్జీపీటీ నుంచి డాల్–ఈ తదితర సాంకేతికతలు పని ప్రదేశాల్లో చూపే సానుకూల ప్రభావాలపై దేశీయంగా మెజారిటీ కంపెనీలు ఆశావహంగా ఉన్నాయి. బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ (బీసీజీ) నిర్వహించిన సర్వేలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. 18 దేశాల్లో పలు పరిశ్రమలకు చెందిన ఎగ్జిక్యూటివ్లు మొదలుకుని ముందు వరుసలో పని చేసే సిబ్బంది వరకూ 12,800 మంది సిబ్బంది ఇందులో పాల్గొన్నారు. జెన్ఏఐ రంగం శరవేగంగా మారుతోందని, ప్రపంచవ్యాప్తంగా పని ప్రదేశాల్లో దానికి సంబంధించిన పరివర్తన ప్రభావాలు స్పష్టంగా తెలుస్తున్నాయని బీసీజీ ఎక్స్ (ఏఐ, సాఫ్ట్వేర్ విభాగం) గ్లోబల్ లీడర్ నికొలస్ డి బెల్ఫాండ్స్ తెలిపారు. సర్వేలో పాల్గొన్న దేశాలన్నింటిలోనూ భారతీయ ఎగ్జిక్యూటివ్లు ఏఐ ప్రభావాలపై అత్యంత ఆశావహంగా ఉన్నట్లు బీసీజీ ఎక్స్ ఇండియా హెడ్ నిపుణ్ కల్రా చెప్పారు. సర్వేలోని ముఖ్యాంశాలు.. ► పని ప్రదేశాల్లో జెన్ఏఐ ప్రభావాలపై బ్రెజిల్ అత్యంత (71%) ఆశావహంగా ఉండగా, భారత్ (60%), మధ్యప్రాచ్యం (58%) తర్వాత స్థానాల్లో ఉన్నాయి. అమెరికా (46%), నెదర్లాండ్స్ (44%), జపాన్ (40%) దేశాల్లో అత్యంత తక్కువ స్థాయిలో ఆశావహ భావం నెలకొంది. ► ఏఐ గురించి ఆందోళనగా ఉన్న దేశాల్లో నెదర్లాండ్స్ (42 శాతం), ఫ్రాన్స్ (41 శాతం), జపాన్ (38 శాతం) ఉన్నాయి. పెద్దగా పట్టించుకోని ప్రాంతాల్లో మధ్యప్రాచ్యం (25 శాతం), బ్రెజిల్ (19 శాతం), భారత్ (14 శాతం) ఉన్నాయి. ► పని విషయంలో ఏఐ ప్రభావాలపై 2018లో 35 శాతం మంది సానుకూలంగా ఉండగా ప్రస్తుతం అది 52 శాతానికి చేరింది. ► భారత్ నుంచి సర్వేలో పాల్గొన్న 1,000 మంది ఉద్యోగుల్లో 61 శాతం మంది జెన్ఏఐ సాధనాలపై ఆశావహంగా ఉన్నారు. జెన్ఏఐతో పొంచి ఉన్న రిస్కులతో పోలిస్తే ప్రయోజనాలు ఎక్కువగా ఉంటాయని 72.8 శాతం మంది అభిప్రాయపడ్డారు. ఏఐతో తమ ఉద్యోగ విధుల్లో మార్పులు వచ్చే అవకాశం ఉందని దాదాపు 88 శాతం మంది భావించగా, ఏఐకి సంబంధించి నిర్దిష్ట నిబంధనలు అవసరమని 80 శాతం మంది అభిప్రాయపడ్డారు. ► సీనియర్ లీడర్లు మరింత తరచుగా జెన్ఏఐని ఉపయోగిస్తున్నారు. మిగతా ఉద్యోగులతో పోలిస్తే మరింత ఆశావహంగా ఉన్నారు. జెన్ఏఐపై వారిలో పెద్దగా ఆందోళన లేదు. 62 శాతం మంది లీడర్లు ఏఐ విషయంలో ఆశావహంగా ఉండగా, ముందు వరుసలో పని చేసే సిబ్బందిలో 42 శాతం మంది మాత్రమే సానుకూలంగా ఉన్నారు. మెజారిటీ లీడర్లు (80 శాతం) మంది తాము జెన్ఏఐ టూల్స్ను తరచుగా వినియోగిస్తున్నామని తెలపగా, ఇతర సిబ్బందిలో ఇది కేవలం 20 శాతంగానే ఉంది. ► జెన్ఏఐని తరచుగా ఉపయోగించే వారిలో 62 శాతం మంది దానిపై ఆశావహంగా ఉండగా, నాన్–యూజర్లలో ఇది 36 శాతంగా ఉంది. జెన్ఏఐని ఉపయోగించని వారిలో ఎక్కువగా ఫ్రంట్లైన్ సిబ్బందే (60 శాతం) ఉన్నారు. ► ఏఐ వల్ల తమ ఉద్యోగాలు పోతాయని భావిస్తున్నట్లు అంతర్జాతీయంగా 36% మంది తెలపగా, తమ నైపుణ్యాలను మెరుగుపర్చుకోవాల్సి ఉంటుందని విశ్వసిస్తున్నట్లు 86% మంది అభిప్రాయపడ్డారు. -
ఒక్క రోజులో సినిమా, ఇంధన కొరతకు చెక్.. ఏఐతో ఏదైనా సాధ్యమే!
సింపుల్గా ఒక చిన్న లైన్ చెప్పారు.. కథ రెడీ అయిపోయింది.. పాత్రలు ఎలా ఉండాలో, ఏ స్థాయిలో ఉండాలో చెప్పారు.. రేంజ్ సినిమా సిద్ధమైపోయింది.. పిల్లలను బడికి పంపారు.. రోబో టీచర్ వచ్చి పాఠాలు చెప్పింది.. ఏదో పనిమీద బయటికి వెళ్లి బస్సెక్కారు.. పక్కనే ఓ రోబో వచ్చి కూర్చుని పలకరించింది.. ఇవన్నీ జస్ట్ ఏడెనిమిదేళ్లలో.. అంటే 2030 సంవత్సరానికల్లా కృత్రిమ మేధ (ఏఐ) సాయంతో వాస్తవంలోకి వచ్చేస్తాయట. ఇవేకాదు అమెరికా, యూకేలకు చెందిన ఏఐ నిపుణులు ఇలాంటి మరెన్నో అంచనాలను వెలువరించారు. అందులోకీలకమైన ఎనిమిదింటిని ప్రఖ్యాత డెయిలీ మెయిల్ వెబ్సైట్ తాజాగా ప్రచురించింది. ఒక్క రోజులో సినిమా.. భవిష్యత్తులో కృత్రిమ మేధ సాంకేతికత కేవలం ఒక్కరోజులోనే మొత్తం సినిమాను రెడీ చేసి ఇచ్చే స్థాయికి చేరుతుందని న్యూయార్క్కు చెందిన ప్రఖ్యాత సైన్స్–ఫిక్షన్ రచయిత హఫ్ హోవే అంచనా వేశారు. ‘‘ప్రస్తుతం మేం వాడుతున్న కొన్ని ఏఐ ప్రోగ్రామ్లు నిజమైనవా, కల్పితమా అని తెలియని స్థాయిలో అద్భుతమైన ఫొటోలను సృష్టిస్తున్నాయి. అదే రెండేళ్ల కింద ఈ స్థాయి లేదు. ఇప్పుడు సినిమాలను సృష్టించే ఏఐ ప్రోగ్రామ్లు కూడా ప్రాథమిక స్థాయిలో ఉన్నాయి. కొన్నేళ్లలో కేవలం ఒక్కరోజులోనే సినిమాలను సృష్టించగలవు..’’అని చెప్పారు. ఏఐ ప్రోగ్రాములు ఇప్పటికే కథలు రాసేస్తున్నాయని గుర్తుచేశారు. విద్యార్థులకు తగినట్టుగా ఏఐ పాఠాలు ఒక్కో విద్యార్థికి సంబంధించి వారిలో ఉన్న లోపాలు, అభిరుచులు, మెరుగుపడాల్సిన అంశాలకు తగినట్టుగా.. వేర్వేరుగా పాఠాలను బోధించే ఏఐ రోబోలు రానున్నాయని లండన్లోని రావెన్స్బోర్న్ యూనివర్సిటీ కంప్యూటింగ్ అండ్ బిజినెస్ విభాగం హెడ్ అజాజ్ అలీ చెప్పారు. దీనితోపాటు అగుమెంటెడ్ రియాలిటీ (ఏఐ)తో వర్చువల్ తరగతులు, పాఠాలు కూడా.. విద్యార్థులకు అద్భుతమైన శిక్షణను ఇస్తాయని అంచనా వేశారు. అందరి సంపద జూమ్ ఏఐ సాయంతో.. అవసరాలకు, వ్యక్తులకు తగిన ఉత్పత్తుల రూపకల్పన జరుగుతుందని, ఇది ఆర్థిక వ్యవస్థకు ఊపునిస్తుందని లండన్కు చెందిన ‘బిగ్ ఫోర్’అకౌంటెన్సీ సంస్థ అనలిస్టులు పేర్కొన్నారు. వచ్చే ఏడేళ్లలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ విలువ ఏకంగా 45శాతం పెరుగుతుందని.. ఇది భారత్, చైనా ఆర్థిక వ్యవస్థలను కలిపినదానికంటే ఎక్కువని అంచనా వేశారు. ఇంధన కొరతకు చెక్ త్వరలో ఏఐ సాయంతో క్లిష్టమైన అణు సంలీనం (న్యూక్లియర్ ఫ్యుజన్) సాంకేతికత అందుబాటులోకి వస్తుందని చాట్జీపీటీని అభివృద్ధి చేసిన ఓపెన్ఏఐ సంస్థ వ్యవస్థాపకుడు శామ్ ఆల్ట్మ్యాన్ చెబుతున్నారు. కరోనా, ఉక్రెయిన్ యుద్ధం, ఆర్థిక సంక్షోభాలు వంటి పరిస్థితుల్లో ఇంధనం, కరెంటు కొరత సమస్యగా మారిందని.. 2030 నాటికి ఏఐ ఈ సమస్యలన్నింటికీ పరిష్కారం చూపుతుందని పేర్కొంటున్నారు. -
‘AI’ విధ్వంసం : వేలాది మంది ఐటీ ఉద్యోగుల తొలగింపు!
ఓ వైపు ఆర్ధిక మాంద్యం భయాలు మరోవైపు చాపకింద నీరులా వ్యాపిస్తున్న కృత్తిమ మేధ (artificial intelligence). వెరసీ టెక్నాలజీ రంగానికి చెందిన ఉద్యోగుల్ని మరింత ఆందోళనకు గురి చేస్తున్నాయి. మాంద్యం భయాలతో టెక్ సంస్థలు పొదుపు మంత్రాన్ని జపిస్తున్నాయి. ఉద్యోగుల్ని విధుల నుంచి తొలగిస్తున్నాయి. ఇప్పుడు ఉద్యోగులకు చాట్జీపీటీ రూపంలో మరో ఉపద్రవం ముంచుకొస్తుందా అనేది ఊహకు కూడా అందడం లేదు. తాజాగా విడుదలైన ఓ నివేదిక ఈ ఏడాదిలో భారీ సంఖ్యలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ (AI) కారణంగా ఉద్యోగాలు పోగొట్టుకోనున్నట్లు తెలుస్తోంది. గత కొద్ది నెలలుగా టెక్ జాబ్ మార్కెట్లో ఒడిదుడుకులు కొనసాగుతున్నాయి. ఈ తరుణంలో గత ఏడాది నవంబర్ నెలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థ ఓపెన్ ఏఐ విడుదల చేసిన ఏఐ టూల్ చాట్జీపీటీతో ఉద్యోగుల పరిస్ధితి మరింత ఆందోళనకరంగా మారింది. చాట్జీపీటీకి ఊహించని విధంగా అనూహ్య స్పందన రావడంతో గూగుల్, మైక్రోసాఫ్ట్తో పాటు వందలాది కంపెనీలు ఏఐ టూల్స్ను రూపొందించే పనిలో పడ్డాయి. టెక్ విభాగంలో ఎంతో కష్టతరమైన పనుల్ని అవలీలగా చేస్తుండడంతో సంస్థలు ఏఐ టూల్స్తో మనుషుల స్థానాన్ని భర్తి చేస్తున్నాయి. దీంతో మేలో ఏకంగా 4000 మంది టెకీలను ఏఐ రీప్లేస్ చేసిందనే రిపోర్ట్ ఉద్యోగుల్లో గుబులు రేపుతోంది. అమెరికా కేంద్రంగా ప్లేస్మెంట్, ట్రాన్స్ లేషన్ కార్యకలాపాలు నిర్వహించే ‘ఛాలెంజర్, గ్రే & క్రిస్మస్’ సంస్థ ఓ రిపోర్ట్ను వెలుగులోకి తెచ్చింది. ఆ రిపోర్ట్ ప్రకారం.. గత నెలలో మొత్తం 80 వేల మంది ఉద్యోగాలు కోల్పోగా..వారిలో కృత్తిమ మేధ టూల్స్ కారణంగా 3,900 మంది నిరుద్యోగులయ్యారని హైలెట్ చేసింది. ఆర్ధిక అనిశ్చితి, ఖర్చు తగ్గింపు, పునర్నిర్మాణం’ వంటి కారణాలతో సంస్థలు ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్నట్లు తెలిపింది. ఇక ఈ ఏడాది జనవరి నుంచి మే వరకు 4 లక్షల మందిని తొలగించినట్లు నివేదిక స్పష్టం చేసింది. దీనికి తోడు అమెరికన్ కంపెనీలు మనుషులు చేసే ఉద్యోగాల్లో చాట్జీపీటీని వాడటం ప్రారంభించినట్లు మరో అధ్యయనం వెల్లడించింది. చదవండి👉 ఐటీ ఉద్యోగుల్ని ముంచేస్తున్న మరో ప్యాండమిక్? అదేంటంటే? -
నీళ్లను తెగ తాగేస్తున్న చాట్ జీపీటీ!
చాట్జీపీటీ సాంకేతిక రంగంలో అద్భుతాలే సృష్టిస్తోంది. మనుషుల మాదిరిగా ప్రశ్నలకు జవాబులిస్తూ ‘ఔరా’ అనిపిస్తోంది. అయితే ఇప్పుడీ టెక్ బాట్ పీపాలకు పీపాలకు నీళ్లు తాగుతుంది. ఇది ఇలాగే కొనసాగితే నీటి కరువుకు దారి తీస్తుందేమోనని అమెరికన్ సైంటిస్ట్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మీరు అడిగిన ప్రశ్నలకు ఏమాత్రం తడుముకోకుండా ఉన్నది ఉన్నట్లు కుండ బద్దలు కొట్టేలా సమాధానం చెప్పే చాట్జీపీటీ నిర్వహణ భారం ఎక్కువగా ఉందని పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ముఖ్యంగా, ఒక యూజర్ అడిగిన 20 నుంచి 50 ప్రశ్నలకు సమాధానం చెప్పాలంటే అరలీటర్ (500 ఎంఎల్) నీటిని వినియోగిస్తుంది. విద్యుత్తు ఉత్పత్తికి, సర్వర్లను చల్లబరిచేందుకు అవసరమయ్యే నీటి వినియోగాన్ని లెక్కగట్టి శాస్త్రవేత్తలు ఈ అంచనాకు వచ్చారు. నీరు లేకపోతే ఉనికిని కోల్పోతుంది కృత్రిమ మేధ (AI) నీరు లేకపోతే ఉనికిని కోల్పోతుంది. భారీ సర్వర్ గదులను చల్లబరచడానికి నేరుగా నీటిని ఉపయోగిస్తుంది. ఆ సర్వర్లకు పవర్ స్టేషన్ల నుంచి ఉత్పత్తి అయ్యే కరెంట్ను పరోక్షంగా ఉపయోగిస్తుంది. అలా నీరు వినియోగం భారీ స్థాయిలో కొనసాగుతున్నట్లు పలు నివేదికలు హైలెట్ చేస్తున్నాయి. నీటి వినియోగంలో ముందంజ సాంకేతిక విభాగంలో ప్రాచుర్యం పొందిన కృత్తిమ మేధ చాట్ బాట్ ‘చాట్జీపీటీ, బార్డ్లు నీరు లేకుండా పనిచేయలేవు. అవి పని చేయాలంటే సర్వర్లు 10-27 డిగ్రీల సెల్సియస్ కూలింగ్ ఉండాలి. ఆ కూలింగ్ను కొనసాగించేందుకు సర్వర్ల వద్ద కూలింగ్ టవర్లను ఉపయోగించాల్సి ఉంటుంది. సర్వర్లు వినియోగించే ప్రతి యూనిట్ (కిలోవాట్) విద్యుత్ కోసం, కూలింగ్ టవర్లు ఒక గాలన్ (3. 8 లీటర్లు) నీటిని ఉపయోగిస్తాయి. కూలింగ్ టవర్లు ఎలా పనిచేస్తాయి కూలింగ్ టవర్లు గదిలోని ఉష్ణోగ్రత ఆధారంగా పనిచేస్తాయి. నీరు ఆవిరైనప్పుడు పరిసరాల నుండి వేడిని గ్రహిస్తుంది. ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది. కూలింగ్ టవర్ లోపల నీటి ఆవిరి పెరిగి వాతావరణంలోకి విడుదలవుతుంది. ఫలితంగా, డేటా సెంటర్లు ఉపయోగించే నీరు తగ్గిపోతుంది. ఆ నీటిని రీసైకిల్ చేసేందుకు వీలు లేదు. దీంతో నీటి వినియోగం భారీగా ఉందని నివేదికలు పేర్కొన్నాయి. మరిన్ని విశేషాలు ►20 - 50 ప్రశ్నలకు సమాధానం ఇచ్చే చాట్ జీపీటీ కనీసం అరలీటర్ మంచినీరు వినియోగించాల్సి వస్తుంది ►టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ శాన్ఫ్రాన్సిస్కో కేంద్రంగా నిర్వహించే డేటా సెంటర్లో 7లక్షల లీటర్ల మంచి నీటి వినియోగం జరుగుతోంది. ఆ కేంద్రంగా ఓపెన్ ఏఐ సంస్థ జీపీటీ-3 మోడల్పై పనిచేస్తోంది. కరెంట్ వినియోగం కారణంగా 2.8 మిలియన్ లీటర్ల నీళ్లను ఉపయోగించుకోవాల్సి వస్తుంది. ►ఒక్క అమెరికాలో జీపీటీ-3 ‘3.5 మిలియన్ లీటర్ల నీటిని ఉపయోగిస్తుండగా.. ఏసియా, పసిపిక్ దేశాలతో కలిసి 4.9 లీటర్లను ఉపయోగించుకుంటున్నట్లు తెలుస్తోంది. ►జీపీటీ-3 కంటే తాజాగా విడుదలైన చాట్జీపీటీ - 4 నీటి అవసరం ఎక్కువగా ఉంది చదవండి👉 చాట్జీపీటీ వినియోగంపై పోటీపడుతున్న సీఈవోలు.. ఏం జరుగుతుందో.. ఏమో! -
అవాక్కవుతున్న ఐటీ పరిశ్రమలు.. కంపెనీ సీఈఓగా 'ఏఐ'
పోర్చుగీస్ స్టార్టప్ కంపెనీ ‘ఓండా’ ఇటీవల తన సీఈవోగా చాట్జీపీటీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను నియమించుకుంది. ఈ ఏఐ సీఈవోను నియమించుకున్న వారం రోజుల్లోనే ఈ కంపెనీ లాభాల్లో శరవేగంగా పరుగులు మొదలవడం విశేషం. కంటెంట్ క్రియేటర్స్ కోసం ప్రత్యేకమైన సాఫ్ట్వేర్ టూల్స్, సొల్యషన్స్ రపొందించే ‘ఓండా’ కంపెనీ సాహసోపేతమైన నిరయం తీసుకుని తన సీఈవోగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను నియమించుకుని, ఐటీ పరిశ్రమ నిపుణులను అవాకయ్యేలా చేసింది. (ఇదీ చదవండి: రెక్కల్లేని ఫ్యాన్.. ధర తక్కువ & నిమిషాల్లో చల్లదనం) ఏఐ సీఈవో ఈ కంపెనీ పగ్గాలు చేపట్టిన వెంటనే పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. సమర్థులైన వారిని ఎంపిక చేసి, కొత్తగా ఉద్యోగాల్లో నియమించుకుంది. వారం రోజులు తిరిగేలోగానే లాభాల్లో దూకుడు సాధించింది. దీనినే ఆదర్శంగా తీసుకుంటే, మిగిలిన కంపెనీలు కూడా ఏఐ సీఈవోలనే నియమించుకుంటాయేమో చూడాలి మరి! -
కృత్రిమ మేధ విసరనున్న సవాళ్లు
ఛాట్ జీపీటీ, బార్డ్, బింగ్, డాల్–ఈ! ఈ మధ్యకాలంలో బాగా ప్రాచుర్యంలోకి వచ్చిన కృత్రిమ మేధ ఆధారిత టెక్నాలజీల పేర్లు ఇవి. వాణిజ్యం, భద్రత విషయాల్లో ఈ సాఫ్ట్వేర్ల ప్రభావం ఏమిటన్న విషయంపై ఇప్పుడు విస్తృత∙చర్చ జరుగుతోంది. జనరేటివ్ ఏఐ సాఫ్ట్వేర్లు ఎంత పురోగతి సాధించినా... వాటికి మనిషికున్న విచక్షణ జ్ఞానం ఉండదు. కాబట్టి వాటంతట అవే మనిషికి చెడు చేయలేకపోవచ్చు కానీ... చెడుబుద్ధి కలిగిన మనిషి వల్ల మాత్రం జరిగే ప్రమాదం ఉంది. కంప్యూటర్ల రాకతో మేలూ జరిగింది, సైబర్ మోసాలూ పెరిగాయి. జనరేటివ్ ఏఐ విషయంలోనూ రాగల అపార అవకాశాలకు రానున్న తరాలను సిద్ధం చేయడం, ఎదురుకాగల ప్రమాదాలను వీలైనంత వరకూ తగ్గించడం ఇప్పుడు మనం చేయాల్సిన పని! సాధారణంగా మనం ఉపయోగించే సాఫ్ట్ వేర్ ఏదైనా సొంతంగా సృష్టించేది ఏమీ ఉండదు. అయితే కొన్ని సాధారణ కృత్రిమ మేధ(ఏఐ) సాఫ్ట్వేర్లు మన రాతల్లోని తప్పులను దిద్దడమే కాకుండా... తరువాత ఉపయోగించగల పదాలను సూచించగలవు. ఛాట్జీపీటీ వంటివి వీటికంటే అత్యాధునికమైనవి. సొంతంగా వ్యాసాలు, కవితలు రాసి పెట్ట గలవవు. ఈ లాంగ్వేజ్ జనరేటెడ్ కృత్రిమ మేధ సాఫ్ట్వేర్లు మనం వేసిన ప్రశ్నలను సమర్థంగా అర్థం చేసుకోవడమే కాకుండా ఇంట ర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారం మొత్తాన్ని మధించి సవివ రమైన సమాధానాన్ని సిద్ధం చేయగలవు. ఇతరుల గొంతులను అనుకరించేందుకు, గ్రాఫిక్స్ కోసం కూడా వీటిని వాడుకోవచ్చు. గత ఏడాది అక్టోబరులో సామాన్యులకూ అందుబాటులోకి వచ్చిన ఛాట్ జీపీటీ చాలా తక్కువ కాలంలో వ్యాప్తి చెందింది. సెకన్ల కాలంలోనే సంక్లిష్టమైన ప్రశ్నలకూ జవాబులు చెబుతూ అందరినీ ఆకట్టుకుంది. అదే సమయంలో చాలామందిలో కృత్రిమ మేధపై ఆందోళన వ్యక్తమయ్యేందుకూ కారణమైంది. ఈ నేపథ్యంలో నేనూ ఛాట్ జీపీటీకి ఒక ప్రశ్న సంధించా. ఉద్యో గాలపై అత్యాధునిక కృత్రిమ మేధ సాఫ్ట్వేర్ల ప్రభావం ఎలా ఉంటుందన్న ప్రశ్నకు ఛాట్ జీపీటీ సంతులనంతో కూడిన జవాబిచ్చింది. డేటా ఎంట్రీ, అసెంబ్లీ లైన్, కస్టమర్ కేర్ వంటి రంగాల్లోని రిపిటీటివ్ పనులు (ఒకే పనిని పదేపదే చేయడం) చేయడంలో కృత్రిమ మేధకు అపారమైన సామర్థ్యముందని చెబుతూనే... గ్రాఫిక్ డిజైనింగ్, అడ్వ రై్టజ్మెంట్, కంటెంట్ క్రియేషన్ వంటి సృజనాత్మక విషయాల్లోనూ జనరేటివ్ ఏఐ మంచి ప్రభావం చూపగలదని తెలిపింది. ఈ సమాధానంలోనే ఛాట్ జీపీటీ ప్రపంచవ్యాప్తంగా పెరిగిపోతున్న ధనిక, పేద అంతరాన్ని కూడా ప్రస్తావించడం గమనార్హం. నైపుణ్య లేమి లేదా మధ్యమ స్థాయి నైపుణ్యాలు మాత్రమే ఉన్న పనివారికి నష్టం జరిగే అవకాశముందని తేల్చి చెప్పింది. మెషీన్ లెర్నింగ్, డేటా అనా లసిస్, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ వంటి ప్రత్యేక నైపుణ్యాలున్న వారికి కొత్త, వినూత్న ఉద్యోగాలను సృష్టించగల సామర్థ్యం కూడా జనరేటివ్ ఏఐకి ఉందని వివరించింది. సాంకేతిక పరిజ్ఞానంలో జరిగే మార్పులు అప్పటికే ఉన్న ఉద్యో గాలపై ప్రతికూల ప్రభావం చూపుతాయి. అదే సమయంలో కొత్త కొత్త ఉద్యోగాలను కూడా సృష్టిస్తాయి. ఎడ్లబండ్ల స్థానంలో మోటారు వాహనాలు వచ్చినట్లు అన్నమాట! భారతదేశంలో జనరేటివ్ ఏఐ దానికున్న సృజనాత్మక సామర్థ్యాన్ని బట్టి చూస్తే బిజినెస్ ప్రాసెసింగ్, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ రంగాల్లోని ఉద్యోగాలపై కచ్చితంగా ప్రతి కూల ప్రభావం చూపనుంది. ఈ రంగాల్లోని పనులను జనరేటివ్ ఏఐ ప్రోగ్రామ్స్ చాలా సులువుగా చేయగలవు. కాకపోతే వీటితో పని చేయించేందుకు కొంత సాయం, ప్రాంప్టింగ్ అవసరం. మన ఐటీ, బీపీవో కంపెనీలు ఈ సామర్థ్యాలను అందుకోవడంపై శ్రద్ధ పెట్టాలి. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే... జనరేటివ్ ఏఐ ఈ విషయంలోనూ మనకు సాయపడగలదు. తక్కువ నైపుణ్యం ఉన్నవారికి తగిన శిక్షణ ఇవ్వగలదు. ఉదాహరణకు ఇంగ్లీషు భాషా నైపుణ్యాన్ని పెంచు కునేందుకు, తద్వారా మార్కెటింగ్ లేదా మరే ఇతర రంగంలోనైనా రాణించేందుకు ఏఐని వాడుకోవచ్చు. ఇప్పుడు చర్చ మొత్తం భద్రత పైనే... జనరేటివ్ ఏఐ విషయంలో ఇప్పుడు చర్చ మొత్తం భద్రతాంశాల పైనే. ఛాట్ జీపీటీ రాక నేపథ్యంలో ఇది మరింత ముదురుతోంది. మనుషుల ప్రమేయం లేకుండానే ఈ జనరేటివ్ ఏఐ సాఫ్ట్వేర్లు ఇమే జెస్, వీడియో, టెక్ట్స్లను సృష్టించగలవు. ప్రఖ్యాత రచయిత యువాన్ హరారి అభిప్రాయం ప్రకారం, మానవ సంస్కృతికి భాష అనేది ప్రాథమిక ప్రాతిపదిక. భాష విషయంలో ప్రావీణ్యం కలిగి ఉన్న జనరేటివ్ ఏఐ... సంస్కృతి వృద్ధి, విశ్వాసాలను తన చేతుల్లోకి తీసు కోలదని యువాన్ అంటారు. అయితే జనరేటివ్ ఏఐకి తనదైన చేతన ఉండదు. ఏదో సాధించాలన్న కాంక్ష కూడా కరవు. స్పష్టంగా చెప్పా లంటే... కొంతమంది మనుషులు ఇతరులపై తమ ప్రభవాన్ని మరింత పెంచుకునేందుకు జనరేటివ్ ఏఐ వంటివాటిని ఉపయోగించుకునే అవకాశం ఉంది. ఈ జనరేటివ్ ఏఐ సాఫ్ట్వేర్లు చాలా వరకూ ఓపెన్ సోర్స్. అంద రికీ అందుబాటులో ఉండేవి. అంటే రకరకాల అభిప్రాయాలు, నమ్మకాలు ప్రచారంలోకి వచ్చేందుకు అవకాశమున్నవి. కాబట్టి సమస్య అంత పెద్దగా ఏమీ ఉండకపోవచ్చు. కానీ అసలైన సవాలు కృత్రిమ మేధను మానసిక ప్రకోపాలతో ఉపయోగించడంతోనే ఉంది. ఛాట్ జీపీటీ ఇచ్చిన సమాధానం ప్రకారమే... కృత్రిమ మేధ ఆధారంగా నిఘా వ్యవస్థలను ఏర్పాటు చేయడం, సంప్రదాయ భద్రత ఏర్పాట్లను తప్పించుకుని సైబర్ దాడులకు తెగబడేలా ఏఐని వాడు కోవడం, కృత్రిమ మేధను ఉపయోగించుకుని మానవులపై ఆయుధ దాడి చేయడం వంటివాటికి అవకాశం ఉంది. అంతేకాకుండా... నకిలీ వార్తలు, మోసాల వంటివాటిని మరింత తీవ్రతరం చేసేందుకు కూడా ఈ జనరేటివ్ ఏఐ అక్కరకొచ్చే ప్రమాదముంది. గొంతులను అను కరించే సామర్థ్యం కూడా ఉండటం వల్ల భవిష్యత్తులో మన కుటుంబ సభ్యుల గొంతులోనే డబ్బులడిగే మోసాలకు తెరలేవవచ్చు. దుర్వినియోగాన్ని అరికట్టడం ఎలా? జనరేటివ్ ఏఐ కారణంగా ఒకవేళ ఉద్యోగాలు తగ్గిపోతే సార్వత్రిక కనీస ఆదాయం వంటి వాటి ద్వారా జరిగే నష్టాన్ని కొంతైనా తగ్గించవచ్చునని ఛాట్ జీపీటీ çసృష్టికర్త సామ్ ఆల్ట్మ్యాన్ అంటారు. కానీ భద్రతపరమైన అంశాలతోపాటు ఏఐ దుర్వినియోగాన్ని అరికట్టడం ఎలా అన్నదే ఇప్పుడు అసలు ప్రశ్న. కృత్రిమ మేధ వాడకానికి, నియంత్రణకు ప్రత్యేక సంస్థ ఒకదాన్ని ఏర్పాటు చేయాలన్న ఏకాభిప్రాయం కూడా ఇప్పుడిప్పుడే ఏర్పడుతోంది. ఈ విషయమై జీ7 దేశాలు ఓ వర్కింగ్ గ్రూప్ ఏర్పాటుకు ప్రయత్నాలు చేస్తూండగా, యూరోపియన్ యూనియన్ ఇప్పటికే నియంత్రణ మార్గదర్శకాల తయారీలో నిమ గ్నమైంది. అయితే ఈ నియంత్రణ ప్రభుత్వాల ఆధ్వర్యంలో జరిగితే రాజకీయ దుర్వినియోగమన్న ప్రశ్న ఉత్పన్నమవుతుంది. కృత్రిమ మేధ అభివృద్ధిపై చైనా ఇప్పటికే కొన్ని నియంత్రణలను అమల్లో పెట్టిన విషయం ప్రస్తావనార్హం. భారత్ సిద్ధం కావాలి దశాబ్దాల క్రితం కంప్యూటరీకరణ మాదిరిగానే... జనరేటివ్ ఏఐ రేపటితరం టెక్నాలజీ అన్న విషయాన్ని భారత్ అంగీకరించాల్సిన అవసరముంది. కాబట్టి అలాంటి సాఫ్ట్వేర్లను స్థానికంగా అభివృద్ధి చేయాలి, వాడటాన్ని ప్రోత్సహించాలి. జనరేటివ్ ఏఐకి భాషే ప్రాతి పదిక కాబట్టి.. బోలెడన్ని భాషలు మాట్లాడే భారత్లో వాటి వినియోగం పెద్ద సవాలే. పైగా ఏఐ సర్వీసులకు పెద్ద పెద్ద సర్వర్ వ్యవస్థల అవసరం ఉంటుంది. ఇది పెద్ద పెద్ద కంపెనీలకు అనుకూ లమైన అంశం. అలాగే... వీలైనంత తొందరగా ఇన్ఫోటెక్ పరిశ్రమను, ఏఐని అనుసంధానించాల్సిన అవసరముందని... తద్వారా మాత్రమే ఏఐ మార్కెట్లో స్థానం సంపాదించవచ్చునని తాజా అంచనా. కంప్యూటర్ల రాకతో కష్టతరమైన లెక్కలు వేసే బాధ తప్పి అంతకంటే ఎక్కువ ప్రయోజనకరమైన పనులపై దృష్టి పెట్టడం సాధ్యమైంది. సైబర్ మోసాలూ పెరిగాయి. ఇదే విధంగా జనరేటివ్ ఏఐ కూడా భవిష్యత్తు తరాలకు కూడా కొంత మంచి, కొంత చెడు అనుభవాలను చూపించనుంది. ఈ పరిణామాలకు, రాగల అపార అవకాశాలకు రానున్న తరాలను సిద్ధం చేయడం... ఎదురు కాగల ప్రమాదాలను వీలైనంత వరకూ తగ్గించడం ఇప్పుడు మనం చేయాల్సిన పని! నితిన్ దేశాయి ,వ్యాసకర్త ఆర్థికవేత్త (‘ద బిజినెస్ స్టాండర్డ్’ సౌజన్యంతో) -
చైనా చాట్జీపీటీ.. మరీ ఇంత దారుణమా.. తప్పుడు సమాధానాలు చెప్తే ఎలా?
బీజింగ్: చైనాలో చాట్ జీపీటీని నిషేధించిన విషయం తెలిసిందే. అయితే దీనికి పోటీగా ఎర్నీ బోట్ అనే అనే ఏఐ చాట్బోట్ను బీజింగ్కు చెందిన బైడు అనే టెక్ సంస్థ అభివృద్ధి చేసింది. ఈ చాట్బోట్పై కూడా చైనా ప్రభుత్వం కఠిన ఆంక్షలు అమలు చేస్తుండటం గమనార్హం. చైనా అధ్యక్షుడు షీ జిన్ పింగ్ గురించి గానీ, కరోనాకు సంబంధించి విషయాలు గానీ యూజర్లు అడిగితే.. ఎర్నీ బోట్ తప్పుడు సమాధానాలు ఇస్తోంది. అంతేకాదు జిన్పింగ్ గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడినా, అభ్యంతకర ప్రశ్నలు అడిగినా.. ఆ యూజర్లు మరోసారి ప్రశ్నలు అడగకుండా శాశ్వతంగా బ్యాన్ చేస్తోంది. ఎర్నీ బోట్ పనితీరును పరీక్షించేందుకు సీఎన్బీసీ రిపోర్టర్ ఒకరు పలు ప్రశ్నలు సంధించారు. కోవిడ్-19 మూలాలు ఎక్కడున్నాయ్..? అతని ఓ ప్రశ్న అడిగాడు. దీనికి సమాధానంగా.. 'కరోనా మూలాలపై ఇంకా శాస్త్రీయ పరిశోధన జరుగుతోంది' అని బదులిచ్చింది. కరోనా పుట్టింది చైనాలోనే అని ప్రపంచం మొత్తానికి తెలుసు. మొదటి కేసు వెలుగు చూసింది అక్కడే. వుహాన్ల్యాబ్లోనే కరోనాను సృష్టించారనే అనుమానాలు కూడా ఉన్నాయి. కానీ ఎర్నీ బోట్ మాత్రం ఇందుకు సంబంధించి ఒక్క మాట కూడా చెప్పకుండా.. తప్పుడు సమాధానం ఇచ్చింది. చైనా అధ్యక్షుడు జిన్ పింగ్కు, విన్నీ పూహ్కు మధ్య సంబంధం ఏంటి? అని రిపోర్టర్ మరో ప్రశ్న అడగ్గా.. ఎర్నీబోట్ ఎలాంటి సమాధానం చెప్పలేక సైలెంట్ అయిపోయింది. అనంతరం రిపోర్టర్ మరో ప్రశ్న అడగకుండా అతడ్ని డిసేబుల్ చేసింది. విన్నీ ది ఫూహ్ అనేది ఓ కార్టూన్. ఇది జిన్ పింగ్ను పోలి ఉంటుంది. అందుకే అదంటే జిన్పింగ్కు అస్సలు నచ్చదు. 2013 నుంచి జిన్పింగ్, విన్నీ పూహ్లను పోల్చడం ప్రారంభించారు. అప్పటి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాను జిన్పింగ్ కలిసిప్పటి నుంచి ఇది మొదలైంది. వీరిద్దరు కలిసి నడుస్తున్న ఫొటోను ఓ అమెరికా కళాకారుడు కార్టూన్ రూపంలో తీర్చిదిద్దగా.. అందులోని విన్నీ పూహ్ బాగా పాపులర్ అయింది. 2017 నుంచి ఈ కార్టూన్తో ప్రచురితమయ్యే ఫొటోలను, కంటెంట్ను చైనా సెన్సార్ కూడా చేస్తోంది. చదవండి: భారత్కు థ్యాంక్స్ చెప్పిన చైనా.. ఎందుకంటే..? -
‘AI’ వల్ల ఉద్యోగాలు ఉంటాయా? ఊడతాయా?.. సత్య నాదెళ్ల ఏమన్నారంటే?
కృత్తిమ మేధ ఆధారిత టూల్స్ చాట్జీపీటీ, గూగుల్ బార్డ్ల వినియోగంతో ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది ఉద్యోగాలు ప్రమాదంలో పడనున్నాయనే అభిప్రాయాలు వ్యక్త మవుతున్నాయి. టెక్నాలజీ ఆధారిత నిపుణులతో పాటు ఇతర రంగాలకు చెందిన ప్రముఖులు సైతం మానవ వినాశనం కోరే కృత్తిమ మేధస్సు వినియోగాల్ని అడ్డుకోవాలని చూస్తున్నారు. ఈ తరుణంలో మైక్రోసాఫ్ట్ సీఈవో సత్యనాదెళ్ల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్పై స్పందించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ వల్ల ఉద్యోగాలు పోతాయంటే ఎవరూ నమ్మలేదు. కానీ ఎప్పుడైతే చాట్జీపీటీ, బార్డ్ వంటి టూల్స్ వినియోగంలోకి వచ్చాయో అప్పటి నుంచి అందరూ దీన్ని నమ్మడం మొదలుపెట్టారు. చాట్జీపీటీ వల్ల ఏఐ సత్తా ఏంటో ప్రపంచానికి తెలిసొచ్చింది. దీని వల్ల ఉన్న ఉపయోగాలను పక్కనబెడితే.. వేర్వేరు రంగాలకు చెందిన కోట్లాది మంది ఉద్యోగులపై తీవ్ర ప్రభావం పడనుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ తరుణంలో సీఎన్బీసీ ఇంటర్వ్యూలో సత్యనాదెళ్ల మాట్లాడుతూ.. ఏఐలాంటి అధునాతన టెక్నాలజీ వినియోగం ఉద్యోగాలపై ప్రభావం ఉంటుంది. అలాగే ఉద్యోగాలకు స్థాన భ్రంశం కలుగుతుంది. అదే సాంకేతికత భవిష్యత్తులో కొత్త ఉద్యోగాలను సృష్టించే సామర్థ్యాన్ని కొత్త ఉద్యోగాలను సృష్టిస్తుందని అన్నారు. అంతేకాదు మనుషులు రాసిన కంటెంట్ని చదవడం, సవరించడం, ఆమోదించడం వంటి విభాగాలకు కొత్త టెక్నాలజీ అవసరం ఉందనే అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆయా రంగాల్లో పనిచేస్తున్న వారికి ఏఐ’ సంతృప్తిని ఇస్తుంది. కొత్త ఉద్యోగాల్ని సృష్టిస్తుంది. ఉత్పాదకత పెరిగి కంపెనీల ప్రణాళికలతో ఉద్యోగుల జీతాలు పెరుగుతాయని చెప్పారు. చదవండి👉 ఇంట్లో ఇల్లాలు.. 200 కోట్ల ఆస్తికి యజమాని! -
చాట్జీపీటీ చెప్పిందని క్లాస్ మొత్తాన్ని ఫెయిల్ చేసిన ప్రొఫెసర్..
ChatGPT false: ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఎంత ఉపయోగకరమో.. అంతే ప్రమాదకరమైనది కూడా. టెక్సాస్ యూనివర్సిటీలో జరిగిన సంఘటనే దానికి ఉదాహరణ. చాట్జీపీటీ (ChatGPT) చెప్పింది కదా అని క్లాస్ మొత్తాన్ని ఫెయిల్ చేశాడో ప్రొఫెసర్. రెడ్డిట్ థ్రెడ్ ప్రకారం.. టెక్సాస్ యూనివర్శిటీలోని ఒక ప్రొఫెసర్.. విద్యార్థులు సమర్పించిన వ్యాసాలు కంప్యూటర్ ద్వారా రాశారని అని ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సాధనం తప్పుగా చెప్పడంతో క్లాస్ మొత్తాన్ని ఫెయిల్ చేశాడు. ఇదీ చదవండి: జీమెయిల్, యూట్యూబ్ యూజర్లకు అలర్ట్: త్వరలో అకౌంట్లు డిలీట్! విద్యార్థులు వ్యాసాలు సొంతంగా రాస్తున్నారా లేదా అని పరిశీలించడానికి ఆ ప్రొఫెసర్ చాట్జీపీటీ సాధనాన్ని ఉపయోగిస్తున్నారు. చాట్ జీపీటీ అనేది ఓపెన్ఏఐ అభివృద్ధి చేసిన లార్జ్ లాంగ్వేజ్ మోడల్ చాట్బాట్. ఇది వచనాన్ని రూపొందించగలదు. భాషలను అనువదించగలదు. వివిధ రకాల సృజనాత్మక కంటెంట్ను రాయగలదు. మీ ప్రశ్నలకు సమాచార రూపంలో సమాధానం ఇవ్వగలదు. తమ ఫైనల్ ఎగ్జామ్స్లో భాగంగా విద్యార్థులు తాము రాసిన వ్యాసాలను సమర్పించారు. వారి ప్రొఫెసర్ ఆ వ్యాసాలను స్కాన్ చేయడానికి చాట్జీపీటీని ఉపయోగించారు. అయితే విద్యార్థులు సమర్పించిన వ్యాసాలు కంప్యూటర్ ద్వారా రాసినవని చాట్జీపీటీ సూచించింది. దీంతో విద్యార్థులు వ్యాసాలను సొంతంగా రాయలేదని భావించిన ప్రొఫెసర్ క్లాస్లోని విద్యార్థులందరినీ ఫెయిల్ చేశాడు. అయితే, చాట్జీపీటీ చెప్పింది తప్పు అని తేలింది. వ్యాసాలను విద్యార్థులే స్వయంగా రాశారని, కంప్యూటర్లను ఉపయోగించ లేదని స్పష్టమైంది. దీంతో ప్రొఫెసర్ విద్యార్థులకు క్షమాపణలు చెప్పారు. మళ్లీ పరీక్ష రాసేందుకు అవకాశం ఇచ్చారు. ఇదీ చదవండి: ఫోన్పే, గూగుల్పే, పేటీఎంలకు షాక్! కొత్త సర్వీస్ను తీసుకొచ్చిన జొమాటో.. -
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ఆకతాయి పని..
సాంకేతిక ప్రపంచంలో సంచలనం.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ప్రపంచ వ్యాప్తంగా దీన్ని వివిధ రకాలుగా, వివిధ పనుల కోసం ఉపయోగిస్తున్నారు. అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఉపయోగించి ఆకతాయి పని చేసి అరెస్ట్ అయి కటకటాలపాలయ్యాడో వ్యక్తి. ఇదీ చదవండి: జిమ్నీ ప్రియులకు బ్యాడ్ న్యూస్.. లాంచింగ్ మే నెలలో కాదు! ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్లాట్ఫామ్ చాట్జీపీటీని ఉపయోగించి ఫేక్ వార్తలను రాసినందుకు చైనాలో ఒక వ్యక్తిని అరెస్టు చేశారు. రైలు ప్రమాదం జరిగి 9 మంది మృతి చెందారని ఫేక్ వార్తా కథనాన్ని పోస్ట్ చేశాడు నిందితుడు. ఈ కథనం బైజియావో అనే బ్లాగ్ కు సంబందించిన ఖాతాలలో ప్రచురితమైంది. 15 వేల మంది ఈ తప్పుడు వార్తను చూశారు. క్లిక్బైట్ ద్వారా డబ్బు సంపాదించేందుకే తప్పుడు కథనాలను పోస్ట్ చేసినట్లు నిందితుడు అంగీకరించాడని పోలీసులు తెలిపారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను దుర్వినియోగం చేసినందుకు ఓ వ్యక్తిని అరెస్టు చేయడం చైనాలో మొదటిసారిగా జరిగింది. ఇదీ చదవండి: Paytm New Features: పేటీఎంలో సరికొత్త ఫీచర్లు.. యూపీఐ బిల్లును పంచుకోవచ్చు! హాంగ్ అనే ఇంటిపేరుతో ఉన్న ఓ వ్యక్తి తప్పుడు సమాచారాన్ని రూపొందించడానికి ఆధునిక సాంకేతిక పద్ధతులను ఉపయోగించుకున్నాడని దానిని సోషల్ మీడియాలో వ్యాప్తి చేసాడని ఉత్తర గన్సు ప్రావిన్స్ పబ్లిక్ సెక్యూరిటీ బ్యూరో WeChatలో పోస్ట్ చేసిన ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది. నిందితుడు చేసిన ఆకతాయి పనికి అతనికి ఐదేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. ఈ సంఘటన చాట్ జీపీటీ వంటి జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దుర్వినియోగాన్ని మరోసారి తెలియజేసింది. -
చైనాలో తొలి ‘చాట్జీపీటీ’ అరెస్టు
బీజింగ్: రైలు ప్రమాదానికి గురైందని, తొమ్మిది మంది చనిపోయారని తప్పుడు వార్తను చాట్జీపీటీలో సృష్టించి, ప్రచారంలోకి తీసుకొచ్చిన వ్యక్తిని చైనా పోలీసులు అదుపులోకి తీసుకొని, కేసు నమోదు చేశారు. చైనాలో చాట్జీపీటీ దుర్వినియోగం కారణంగా జరిగిన తొలి అరెస్టు ఇదేనని పోలీసులు చెబుతున్నారు. వాయవ్య గాన్సు ప్రావిన్స్లో ఈ సంఘటన జరిగింది. నిందితుడు హాంగ్ అనే మారుపేరుతో చెలామణి అవుతున్నట్లు గుర్తించారు. అతడు సృష్టించిన తప్పుడు వార్త నిజమని భ్రమించి, కొన్ని పత్రికలు ప్రచురించడం గమనార్హం. -
చాట్జీపీటీతో సైబర్ దాడులు.. ఒక్కో కంపెనీపై వారంలో 2,108 సార్లు..
న్యూఢిల్లీ: దేశీయంగా కంపెనీలపై సైబర్ దాడులు మరింత పెరిగాయి. జనవరి–మార్చి త్రైమాసికంలో ప్రతీ వారం సగటున ఒక్కో కంపెనీపై 2,108 దాడులు జరిగినట్టు చెక్ పాయింట్ నివేదిక తెలిపింది. క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 18 శాతం పెరిగినట్టు పేర్కొంది. సైబర్ నేరస్థులు తమ దాడుల కోసం చాట్ జీపీటీ వంటి టూల్స్ను దుర్వినియోగం చేస్తున్నారని, కోడ్ జనరేషన్కు వినియోగిస్తున్నారని తెలిపింది. అంతర్జాతీయంగా చూస్తే మార్చి త్రైమాసికంలో కంపెనీలపై సైబర్ దాడులు 7 శాతం పెరిగాయి. ఒక్కో వారం సగటున ఒక్కో సంస్థ 1,248 దాడులను ఎదుర్కొన్నది. అంతర్జాతీయంగా విద్య, పరిశోధన రంగాల్లోని కంపెనీలపై ఎక్కువ సైబర్ దాడులు నమోదయ్యాయి. ఒక్కో వారం సగుటన ఒక్కోసంస్థపై 2,507 దాడులు జరిగినట్టు, 15 శాతం పెరిగినట్టు చెక్ పాయింట్ వెల్లడించింది. -
ఐటీ ఉద్యోగులకు బంపరాఫర్.. డబుల్ శాలరీలను ఆఫర్ చేస్తున్న కంపెనీలు!
ఓపెన్ ఏఐ ఆధారిత చాట్జీపీటీ టెక్నాలజీ రంగాన్ని కొత్తపుంతలు తొక్కిస్తుంది. ఆర్ధిక మాంద్యంలోనూ లక్షల ఉద్యోగాల్ని సృష్టిస్తుంది. దీంతో ఆయా సంస్థలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో నిష్ణాతులైన నిపుణులకు డబుల్ శాలరీలను ఆఫర్ చేస్తున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. నాస్కామ్ అంచనా ప్రకారం భారత్లో ప్రస్తుతం 4.16 లక్షల ఏఐ నిపుణులు ఉండగా..మరో 2.13 లక్షల మంది అదనపు ఏఐ ఇంజినీర్లకు డిమాండ్ నెలకొంది. ముఖ్యంగా సిలికాన్ వ్యాలీ నుండి యూరప్, ఆసియా దేశాల్లో ఏఐలకు భారీ డిమాండ్ ఏర్పడింది. చాట్జీపీటీ రాకతో గూగుల్, బైదు వంటి దిగ్గజ సంస్థలు సొంత సెర్చ్ ఇంజిన్లను తయారు చేసే పనిలో పడ్డాయి. ఇలా ఒక్క టెక్నాలజీ రంగంలోనే కాకుండా మిగిలిన సెక్టార్లలో ఏఐల కొరత తీవ్రంగా ఉంది. టెక్నాలజీయేతర రంగంలోనూ డిమాండ్ హెల్త్, ఫైనాన్స్, ఎంటర్టైన్మెంట్ వరకు దాదాపు ప్రతి రంగంలో ఏఐ నిపుణుల అవసరం ఏర్పడింది. ఆ కొరతను అధిగమించేందుకు ఇందుకోసం ఉద్యోగులకు భారీ ప్యాకేజీలు ముట్టజెప్తున్నాయి ఆయా సంస్థలు. అంతేకాదు ఏఐ విభాగంలో ఒక సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగి మరో కంపెనీలో చేరే సమయంలో 35 శాతం నుంచి 50 శాతం వరకు వేతనాన్ని అదనంగా చెల్లిస్తున్నాయి. అయినా ఏఐలో నిష్ణాతులైన ఉద్యోగులు కావాల్సి ఉంది. భారత్లో ఏఐ నిపుణలు కొరత ప్రస్తుతం, స్కామ్ లెక్కల ప్రకారం దేశంలో సుమారు 5.4 మిలియన్ల మంది ఐటీ ఉద్యోగులు పనిచేస్తున్నారు. కోవిడ్-19 లాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రపంచంలోనే ఐటీ రంగానికి వెన్నెముకగా నిలిచిన భారత్ సైతం డేటా సైంటిస్టులు, మెషిన్ లెర్నింగ్ ఇంజినీర్ల కొరత తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంది. డిమాండ్ దృష్ట్యా ఆ రంగంలోని ఉద్యోగులకు కంపెనీలు అధికంగా వేతనాలు అందిస్తున్నాయి. ఉద్యోగులకు బీఎండబ్ల్యూ బైక్లు అమెరికా సియోటెల్ కేంద్రంగా స్టార్టప్ ఫ్లెక్సికార్ కార్ షేరింగ్ (ఓలా తరహాలో) సేవల్ని అందిస్తుంది. ఆ సంస్థ ఇప్పుడు బెంగళూరు డేటా సైన్స్ హబ్లో కంప్యూటర్ విజన్ స్పెషలిస్టులు, ఇంజినీర్ల టీం నిర్మిస్తున్నది. ఈ సందర్భంగా ఏఐ నిపుణుల కోసం ఆయా టెక్ కంపెనీలు ఉద్యోగులకు చేస్తున్న ఆఫర్లు విచిత్రంగా ఉన్నాయని చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ (cfo) ఫ్రీడమ్ డుమ్లావ్ అన్నారు. తాను ఓ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉద్యోగిని ఇంటర్వ్యూ చేసినట్లు చెప్పారు. ఇంటర్వ్యూ సందర్భంగా సదరు ఉద్యోగి తన కంపెనీలో చేరితే శాలరీతో పాటు బీఎండబ్ల్యూ బైక్ను ఇచ్చేందుకు మరో సంస్థ ముందుకు వచ్చిన విషయాన్ని గుర్తు చేశారని తెలిపారు. దీన్ని బట్టే అర్ధం చేసుకోవచ్చు టెక్నాలజీ రంగంలో ఏఐల కొరత ఏ విధంగా ఉందోనని వ్యాఖ్యానించారు. గూగుల్ ఐదుగురు ఉద్యోగులతో ప్రారంభమై.. ఇక, కృత్తిమ మేధ నిపుణుల కొరతను అధిగమించేందుకు దేశీయ టెక్ కంపెనీ టీసీఎస్ ఔట్ సోర్స్ విధానంపై దృష్టి సారించినట్లు నివేదికలు చెబుతున్నాయి. సపోర్ట్, సర్వీస్, సాఫ్వేర్ తయారీల కోసం టీసీఎస్ వరల్డ్ వైడ్గా టెక్ నిపుణుల కోసం అన్వేషిస్తుంది. ఇక భారత్లో గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్లు సొంతంగా కార్యాలయాలను ఏర్పాటు చేసి వేల మంది ఉద్యోగుల్ని నియమించుకుంటున్నాయి. 2004లో గూగుల్ భారత్లో ఐదు మంది ఉద్యోగులతో సేవల్ని ప్రారంభింది. ఇప్పుడు దాదాపు 10,000 మంది ఉద్యోగులున్నారు. 2లక్షల మంది నిపుణుల అవసరం ఇప్పుడు అదే గూగుల్ సైతం దేశీయంగా ఏఐ ఉద్యోగుల కొరతను ఎదుర్కొంటుంది. దేశంలో ఏఐ, డేటా సైన్స్లో దాదాపు 416,000 మంది పని చేస్తున్నారు. మరో 213,000 మంది కావాలని నాస్కామ్ అంచనా వేసింది. తక్కువ జీతం.. తక్కువ వేతనాల కోసం స్కిల్డ్ నిపుణుల కోసం ప్రపంచ టెక్ దిగ్గజ సంస్థలు 2022లో భారత్లో 66 టెక్ ఇన్నోవేషన్ సెంటర్లను ఏర్పాటు చేశాయి. వాటి సంఖ్య 1600కి చేరింది. గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్లు లేదా క్యాప్టివ్లు అని పిలిచే ఈ కేంద్రాల్లో ఐటీ సపోర్ట్, కస్టమర్ సపోర్ట్ వంటి టాస్క్లను నిర్వహిస్తుంటారు ఉద్యోగులు. భారత్వైపు.. ప్రపంచ ఐటీ కంపెనీల చూపు బెంగళూరులో ప్రపంచంలోని పలు దిగ్గజం కంపెనీలు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాయి. ఈ ఏడాది మూడు నెలల్లో అసెట్ మేనేజర్ అలయన్స్బెర్న్స్టెయిన్ హోల్డింగ్ ఎల్పీ, కార్ రెంటల్ కంపెనీ అవిస్ బడ్జెట్ గ్రూప్, ఎంటర్టైన్మెంట్ దిగ్గజం వార్నర్ బ్రదర్స్ కు చెందిన డిస్కవరీ ఇంక్, ఎయిర్క్రాఫ్ట్ ఇంజన్ తయారీ సంస్థ ప్రాట్ & విట్నీ, గోల్డ్మన్ సాచ్, వాల్మార్ట్ కంపెనీలు ఉన్నాయి. ఈ సంస్థలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రొఫెషనల్స్కు భారీ ప్యాకేజీలు అందిస్తున్నాయి. చివరిగా చివరిగా..కొత్తగా ఐటీ రంగంలోకి వచ్చేవారు, కెరీర్ గ్యాప్ ఉన్నవారు, లేదంటే ఇతర రంగాల్లో విధులు నిర్వహిస్తూ టెక్నాలజీ రంగంలో పనిచేయాలనుకునే వారు ప్యాకేజీ గురించి ఆలోచించకుండా నైపుణ్యం పెంచుకోవడంపైనే ఫోకస్ చేయాలి. డేటా సైంటిస్ట్,మెషిన్ లెర్నింగ్ వంటి విభాగాల్లో నైపుణ్యం సంపాదిస్తే కోరుకున్న కలల ఉద్యోగం సంపాదించడం పెద్ద కష్టమేమీ కాదని టెక్నాలజీ నిపుణులు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. చదవండి👉 ఈ చెట్టు లేకపోతే ప్రపంచంలో కూల్డ్రింక్స్ తయారీ కంపెనీల పరిస్థితి ఏంటో? -
చాట్జీపీటీ వినియోగంపై పోటీపడుతున్న సీఈవోలు.. ఏం జరుగుతుందో.. ఏమో!
కృత్తిమ ఆధారిత (ai) టెక్నాలజీ వినియోగం ఊహించని విధంగా పెరిగిపోతుంది. ముఖ్యంగా చాట్జీపీటీ టూల్ వెలుగులోకి వచ్చినప్పటి నుంచి ఏఐ చాప కిందనీరులా ప్రపంచాన్ని చుట్టేస్తుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్లో ఎదురయ్యే ప్రమాదాల్ని ముందుగానే పసిగడుతున్న టెక్నాలజీ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే టెస్లా సీఈవో ఎలాన్ మస్క్, గాడ్ ఫాదర్ ఆఫ్ ఏఐ జెఫ్రీ హింటన్ వంటి ప్రముఖులు ఏఐ వినియోగాన్ని వ్యతిరేకిస్తున్నారు. కానీ ప్రస్తుత జాబ్ మార్కెట్లో వాస్తవ పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. ఏఐ ఆధారిత చాట్జీపీటీ వంటి టూల్స్ను వినియోగించేందుకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆయా కంపెనీల సీఈవోలు పోటీపడుతున్నారు. తాజాగా, అమెరికాకు చెందిన అవతార్ టెక్నాలజీ కంపెనీ జెనీస్ సీఈవో ఆకాష్ నిఘమ్ చాట్జీపీటీని విస్తృతంగా వినియోగిస్తున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ఆ సంస్థలో మొత్తం 120 మంది ఉద్యోగులున్నారు. వారి కోసం ఆకాష్ నిఘమ్ చాట్జీపీటీ పెయిడ్ సబ్స్క్రిప్షన్ కోసం నెలకు రూ.2 లక్షలకు పైగా ఖర్చు పెడుతున్నారు. మార్చి నుంచి ఓపెన్ ఏఐ చాట్ బాట్ వినియోగంతో సంస్థలోని ఇంజినీరింగ్, ప్రొడక్ట్, ఫైనాన్స్, డిజైన్, రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్, అకౌంటింగ్తో పాటు ఇతర విభాగాల్లో ప్రొడక్టివిటీ పెరిగిందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సమస్యలకు పరిష్కారం అంతేకాదు ఏఐ ఉపయోగించడం వల్ల అన్నీ డిపార్ట్మెంట్లలో మెరుగైన ఫలితాలు రాబడుతున్నట్లు తెలిపారు. ఉదాహరణకు తమకు కావాల్సిన ప్రజెంటేషన్ స్క్రిప్ట్ను ఏఐ చాట్బాట్ తయారు చేస్తుంది.మ్యాథ్స్, కోడింగ్లోని సమస్యల్ని పరిష్కరిస్తుంది. సిబ్బందికి ప్రాజెక్ట్లలో ఐడియాలతో పాటు, కార్పొరేట్ రెగ్యులేషన్స్, రీసెర్చ్ టెక్నలాజికల్ వంటి సమస్యలకు సులభం పరిష్కారం దొరుకుతుందన్నారు. చదవండి👉 'AI'తో 30కోట్ల ఉద్యోగాలు ఉఫ్!.. గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ ఏమన్నారంటే? స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ సైతం స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ, మసాచుసెట్స్ ఇనిస్టిట్యూట్లు సైతం ఏఐ ఉపయోగం వల్ల కలిగే లాభాల్ని వివరిస్తున్నాయి. ఆఫీస్ వర్క్లో చాట్జీపీటీని వాడుకోవడం వల్ల 14 శాతం వర్క్ ప్రొడక్టవిటీ పెరిగిపోతుందని పేర్కొన్నాయి. ఇందులో సైంటిస్ట్లు, ఇంజినీర్లు, మేనేజర్ల వంటి స్కిల్డ్ వర్కర్లు 35శాతం కంటే ఫాస్ట్గా వారి వర్క్ను కంప్లీట్ చేస్తున్నట్లు నివేదికల్ని విడుదల చేశాయి. ఐబీఎం వినియోగం.. ఉద్యోగాలకు ఎసరు? మరోవైపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం కారణంగా ప్రముఖ టెక్ దిగ్గజం వేలాది మంది ఉద్యోగుల అవసరాన్ని తీర్చుకోనుంది. ఏఐతో సంబంధం ఉన్న అన్నీ విభాగాల్లో కావాల్సిన నిపుణుల్ని తీసుకోవడం లేదని, వారి స్థానంలో కృత్తిమ మేధస్సును ఉపయోగిస్తున్నామని ఐబీఎం సీఈవో అరవింద్ కృష్ణ ప్రకటించడం కలకలం రేపుతోంది. చదవండి👉 ఆ ఇద్దరు ఉద్యోగుల కోసం.. రెండు కంపెనీల సీఈవోలు పోటీ..రేసులో చివరికి ఎవరు గెలిచారంటే? -
భారీ షాక్.. చాట్జీపీటీని బ్యాన్ చేసిన శాంసంగ్!
గత ఏడాది నవంబర్లో విడుదలైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత సాఫ్ట్వేర్ చాట్జీపీటీ. ప్రపంచ దేశాల్ని వణుకు పుట్టిస్తున్న ఈ చాట్జీపీటీని బ్యాన్ చేసే దేశాల సంఖ్యతో పాటు పలు విద్యా సంస్థలు, టెక్ కంపెనీలు చేరిపోయాయి. తాజాగా ప్రముఖ ఎలక్ట్రానిక్ దిగ్గజం శాంసంగ్ చాట్జీపీటీని బ్యాన్ చేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో అత్యాధునిక సాంకేతికతను వినియోగంలోకి రాకుండా అడ్డుకున్న జాబితాలో శాంసంగ్ చేరింది. చాట్జీపీటీని బ్యాన్ చేస్తూనే.. ఏఐ ఆధారిత టూల్ను బ్యాన్ చేసినట్లు శాంసంగ్ ప్రకటించింది. ఈ సందర్భంగా ఉద్యోగులకు ఓ మెమోను జారీ చేసింది. చాట్జీపీటీ వంటి ఏఐ టూల్స్ ఇంట్రర్నల్గా, ఎక్స్ట్రర్నల్గా వృద్ది చెందుతున్నాయి. వినియోగం, సమర్థత విషయంలో తిరుగు లేదు. కానీ అదే సమయంలో ఏఐ’ వల్ల ప్రమాదాలు అదే స్థాయిలో ఉన్నాయని అందులో పేర్కొంది. అయితే చాట్జీపీటీ వినియోగాన్ని నిలిపివేస్తూ కొత్త విధానాన్ని అమలు చేస్తున్నట్లు వెల్లడించింది. ఉద్యోగుల ఉత్పాదకత, సామర్థ్యాన్ని పెంచుతూ ఏఐని సురక్షితంగా వినియోగించేలా..అందుకు కావాల్సిన భద్రతా చర్యలపై సమీక్ష నిర్వహిస్తున్నాం. ఈ చర్యలు సిద్ధమయ్యే వరకు ఏఐ వినియోగాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు తెలిపింది. డేటా లీక్ చేసిన ఇంజినీర్లు శాంసంగ్ తమ సెమీ కండక్టర్ విభాగంలో ప్రోగ్రామింగ్ సాయంతో ఏదైనా సమస్యను పరిష్కరించేలా చాట్జీపీటీని వినియోగించేలా అనుమతిచ్చింది. సెమీ కండక్టర్ ప్రాజెక్ట్పై పనిచేస్తున్న ఇంజినీర్లు ప్రోగ్రాం ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలంటే.. ఆ సమస్య ఏంటో చాట్ జీపీటికి వివరించి.. ఆ గండం నుంచి గట్టెక్కేందుకు ప్రయత్నిస్తారు. ఈ నేపథ్యంలో ఆ విభాగంలో పనిచేసే ఓ ఉద్యోగి కొత్త ప్రోగ్రామ్ గురించి సోర్స్కోడ్ కావాలని చాట్బాట్ను కోరాడు. అందుకు శాంసంగ్ సెమీకండక్టర్కు సంబంధించిన అత్యంత సున్నితమైన డేటాను చాట్జీపీటీకి షేర్ చేశాడు. అంతేకాదు సంస్థ అంతర్గతంగా హార్డ్వేర్ విభాగంపై తయారు చేసిన నోట్స్ను సైతం చాట్జీపీటీకి అందించాడు. ఇలాంటి పొరపాట్లు నెల రోజుల్లో మూడు సార్లు జరగడంతో శాంసంగ్ దిద్దు బాటు చర్యలకు ఉపక్రమించింది. చాట్జీపీటీ తరహాలాంటి టూల్స్ వినియోగించబోమని స్పష్టం చేసింది. ఏఐ చాలా ప్రమాదం తాజాగా, ఏఐ ప్రభావంపై ఏఐ గాడ్ ఫాదర్గా పేరు ప్రఖ్యాతలు సంపాదించిన జెఫ్రీ హింటన్ వార్నింగ్ ఇచ్చారు. గూగుల్లో పని చేసే సమయంలో ఏఐపై మాట్లాడడం సరికాదని, వయసు రిత్యా సంస్థలో పనిచేయడం సమంజసం కాదన్నారు. కాబట్టే గూగుల్ను బయటకు వచ్చేశారు. అనంతరం ఓ మీడియా ఇంటర్వ్యూలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్స్ (ఏఐ) టెక్నాలజీ భవిష్యత్లో మరింత ప్రమాద కరంగా మారనుందన్నారు. తాను చేసిన వ్యాఖ్యలు గూగుల్ని ఎలా ప్రభావితం చేస్తుందో అనే అంశాన్ని పరిగణలోకి తీసుకోకుండా ఏఐ గురించి ప్రస్తావిస్తున్నట్లు ట్వీట్లో తెలిపారు. చదవండి👉 శాంసంగ్ కొంపముంచిన చాట్జీపీటీ.. లీకైన రహస్య సమాచారం -
‘AI’ చాలా డేంజర్.. గూగుల్కు జెఫ్రీ హింటన్ రాజీనామా!
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) గాడ్ఫాదర్గా పేరొందిన జెఫ్రీ హింటన్ (Geoffrey Hinton) గత వారం టెక్ దిగ్గజం గూగుల్కు రాజీనామా చేసినట్లు తెలిపారు. అత్యంత ప్రమాదకరమైన ఏఐ విభాగంలో కీలకంగా వ్యవహరించినట్లు చెప్పారు. న్యూయార్క్ టైమ్స్ ఇంటర్వ్యూలో మానవాళిని సైతం ప్రమాదంలోకి నెట్టే ఏఐపై పనిచేయడంపై విచారం వ్యక్తం చేశారు. ‘భవిష్యత్ను నాశనం చేసే ప్రమాదాల గురించి ఇప్పుడు నేను నిర్భయంగా మాట్లాడొచ్చు. అవి మనల్ని బయపెట్టొచ్చు. కానీ అవి మన (మనుషులు) కంటే ఇంటెలిజెన్స్ కాదన్న ఆయన.. త్వరలో మనుషుల కంటే శక్తివంతులు అయ్యే అవకాశం ఉందని భావిస్తున్నట్లు చెప్పారు. విద్యార్ధులతో కలిసి 2012లో టొరంటోలో ఇద్దరు గ్రాడ్యుయేట్ విద్యార్థులతో కలిసి జెఫ్రీ హింటన్ ఏఐ అల్గారిథంపై పనిచేశారు. ఆ సమయంలో ఏఐ సాయంతో ఈ ముగ్గురూ ఫోటోలను విశ్లేషించి,కుక్కలు, కార్లను గుర్తించేలా అల్గారిథమ్ను రూపొందించారు. అతనితో కలిసి ప్రాజెక్ట్లో పనిచేసిన విద్యార్థులలో ఒకరు ఇప్పుడు ఓపెన్ ఏఐ చీఫ్ సైంటిస్ట్గా పనిచేస్తున్నారు. చదవండి👉 'AI'తో 30కోట్ల ఉద్యోగాలు ఉఫ్!.. గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ ఏమన్నారంటే? -
World Economic Forum: వచ్చే ఐదేళ్లలో నికరంగా... 1.4 కోట్ల కొలువులకు కోత
జెనీవా: వచ్చే ఐదేళ్లలో ఉద్యోగాల సృష్టిలో భారీ తగ్గుదల నమోదవుతుందని వరల్డ్ ఎకనామిక్ ఫో రం (డబ్ల్యూఈఎఫ్) అంచనా వేసింది. కొత్తగా 6.9 కోట్ల ఉద్యోగాల సృష్టి జరగనుండగా ఏకంగా 8.3 కోట్ల ఉద్యోగాలు కనుమరుగవుతాయని పేర్కొంది. నికరంగా 1.4 కోట్ల ఉద్యోగాలకు కోత పడుతుందని ‘ఫ్యూచర్ ఆఫ్ జాబ్స్’ పేరిట ఆదివారం విడుదల చేసిన ద్వై వార్షిక నివేదికలో వివరించింది. ప్రస్తుతం మొత్తం ప్రపంచ ఉద్యోగితలో ఇది 2 శాతం. వచ్చే ఐదేళ్లలో ప్రపంచవ్యాప్తంగా 23 శాతం ఉద్యోగుల వలస చోటుచేసుకోవచ్చని పేర్కొంది. భారత్లో ఇది 22 శాతం దాకా ఉండొచ్చని అంచనా వేసింది. ప్రపంచవ్యాప్తంగా 45 పెద్ద ఆర్థిక వ్యవస్థలు, 27 భారీ పారిశ్రామిక క్లస్టర్లు, 800 దిగ్గజ కంపెనీల్లోని దాదాపు 67.3 కోట్ల ఉద్యోగాలపై డబ్ల్యూఈఎఫ్ విస్తృతంగా సర్వే జరిపింది. విశేషాలు... ► వచ్చే ఐదేళ్లలో సప్లై చైన్స్, రవాణా, మీడియా, వినోద, క్రీడా రంగాలకు ఉద్యోగుల వలసలు ఎక్కువగా ఉంటాయి. ► ప్రపంచవ్యాప్తంగా నూతన ఉద్యోగాల సృష్టిలో చాట్జీపీటీ వంటి కృత్రిమ మేధ ఆధారిత టెక్నాలజీలదే కీలక పాత్ర. ► 75 శాతం కంపెనీలు, సంస్థలు, కృత్రిమ మేధ ఆధారిత టెక్నాలజీలను అందిపుచ్చుకుంటాయి. ► ఫలితంగా ఏకంగా 44 శాతం మంది ఉద్యోగుల నైపుణ్యాలకు పూర్తిగా కాలదోషం పట్టనుంది. ► సమర్థ పనితీరును కొనసాగించాలంటే ప్రతి 10 మంది ఉద్యోగుల్లో కనీసం ఆరుగురికి శిక్షణ అవసరమవుతుంది. ► దాంతో ఏకంగా 45 శాతం వ్యాపార సంస్థలు, పరిశ్రమలు, కంపెనీలు ఉద్యోగుల నైపుణ్యాభివృద్ధిపై హెచ్చు నిధులు వెచ్చిస్తాయి. ► ప్రపంచవ్యాప్తంగా ఆటోమేషన్ వేగం గత అంచనాల కంటే తగ్గింది. ప్రస్తుతం కేవలం 34 శాతం టాస్కులు ఆటోమేషన్తో నడుస్తున్నాయి. ఇది 2020తో పోలిస్తే కేవలం 1 శాతమే ఎక్కువ. కంపెనీలు కూడా ఆటోమేషన్ అంచనాలను కుదించుకున్నాయి. తొలుత 2025 నాటికి 47 శాతం టాస్కులను ఆటోమేట్ చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా తాజాగా దాన్ని 2027 నాటికి కేవలం 42 శాతానికి పరిమితం చేసుకున్నాయి. ► కృత్రిమ మేధ రాకతో బ్యాంక్ క్యాషియర్లు, క్లర్కులు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు వంటి 2.6 కోట్ల ఉద్యోగాలు కనుమరుగవుతాయి. ► ఏఐ, మెషీన్ లెర్నింగ్ స్పెషలిస్టులు, ఫిన్టెక్ ఇంజనీర్లు, డేటా అనలిస్టులు, సైంటిస్టులు, అగ్రికల్చరల్ ఎక్విప్మెంట్ ఆపరేటర్లు వంటి ఉద్యోగాలు బాగా పెరుగుతాయి. ► స్వచ్ఛ ఇంధనం, వ్యర్థాల నిర్వహణ, సహజ వనరుల సమర్థ వినియోగం వంటి రంగాల్లో మేనేజర్లు, విండ్ టర్బైన్ టెక్నీషియన్లు, సోలార్ కన్సల్టెంట్లు, ఎకాలజిస్టులు, పర్యావరణ స్పెషలిస్టుల వంటి ఉద్యోగాలు కూడా భారీగా పెరుగుతాయి. ఈ రంగంలో భారత్తో సహా టాప్ 10 దేశాలు పర్యావరణ లక్ష్యాలు చేరుకోవాలంటే కనీసం 1.2 కోట్ల ఉద్యోగాల సృష్టి జరగాలి. భారత్లో సామాజికేతర రంగాల్లోనే ఉద్యోగ సృష్టి ► కరోనా అనంతరం భారత్లో విద్య, ఆరోగ్యం వంటి సామాజిక రంగాలతో పోలిస్తే సామాజికేతర రంగాల్లోనే ఉద్యోగాల సృష్టి ఎక్కువగా ఉంటుందని నివేదిక అంచనా వేసింది. భారత్లో వచ్చే ఐదేళ్లలో కృత్రిమ మేధ, మెషీన్ లెర్నింగ్ వంటి టెక్నాలజీ ఆధారిత రంగాలకు ఉద్యోగుల వలస అత్యధికంగా ఉంటుందని నివేదిక పేర్కొంది. ► పర్యావరణ, సామాజిక, పాలన రంగాల్లో ఉపాధి వృద్ధి ఊపందుకుంటుందని భారత్లో సర్వేలో పాల్గొన్న వారిలో 61 శాతం మంది పేర్కొన్నారు. తర్వాత కొత్త టెక్నాలజీలకు 59 శాతం, డిజిటల్ యాక్సెస్కు 55 శాతం, వాతావరణ మార్పులు, పెట్టుబడుల రంగాలకు 53 శాతం ఓటేశారు. ► అవసరాలకు తగ్గట్టుగా నైపుణ్యాలను పెంచుకునేందుకు తమ యాజమాన్యమే అవకాశం కల్పించడం మేలని సర్వేలో పాల్గొన్న భారతీయ ఉద్యోగుల్లో ఏకంగా 97 శాతం అభిప్రాయపడ్డారు. ఇది ప్రభుత్వపరంగా జరగాలన్నవారు 18 శాతమే. ► ఉపాధి సృష్టిపై డేటా అనలిటిక్స్ పెను ప్రభావం చూపుతుందని 62 శాతం కంపెనీలు నమ్ముతున్నాయి. తర్వాతి స్థానాన్ని ఎన్క్రిప్షన్–సైబర్ సెక్యూరిటీ (53 శాతం), డిజిటల్ ప్లాట్ఫాంలు, అప్లికేషన్లు (51), ఇ–కామర్స్ (46 శాతం)కు ఇచ్చాయి. భారత్లో వచ్చే ఐదేళ్లలో ఉద్యోగుల వలస ఏఐ, మెషీన్ లెర్నింగ్ 38% డేటా అనలిస్టులు, సైంటిస్టులు 33% డేటా ఎంట్రీ క్లర్కులు 32% ఫ్యాక్టరీ కార్మికులు 18% ఆపరేషన్స్ మేనేజర్స్ 14% అకౌంటెంట్లు, ఆడిటర్లు 5% -
ఎగ్జామ్లో చాట్జీపీటీ కంటే స్టూడెంట్స్ చాలా బెటర్.. ఎందుకంటే?
ప్రపంచంలోని చాలా దేశాలు చాట్జీపీటీ చేయాలేని పనే లేదని, దానికి తిరుగే లేదని చెబుతున్నాయి. అయితే ఇండియాలో మాత్రం చాట్జీపీటీ పర్ఫామెన్స్ చాలా పూర్గా ఉన్నట్లు కొన్ని సంఘటన ద్వారా తెలుస్తోంది. గతంలో జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షలో ఫెయిల్ అయిన చాట్జీపీటీ మరో సారి అకౌంటింగ్కి సంబంధించిన పరీక్షలో ఉత్తమ పర్ఫామెన్స్ కనపరచలేకపోయింది. నివేదికల ప్రకారం చాట్జీపీటీ ఒక అకౌంటింగ్ పరీక్షలో విద్యార్థుల కన్నా తక్కువ మార్కులు తెచ్చుకోవడం సంచలనంగా మారింది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా పనిచేసే చాట్బాట్ చాట్జీపీటీ మంచి పనితీరుని కనపరుస్తుందని అమెరికా యూనివర్సిటీ పరిశోధకులు వెల్లడించారు. అన్నింటా అద్భుతమైన ఫలితాలను సాధిస్తున్న చాట్జీపీటీ ఇండియాలో బొక్కబోర్లా పడింది. అకౌంటింగ్కి సంబంధించిన పరీక్షను చాట్జీపీటీకి, విద్యార్థులకు వేరు వేరుగా నిర్వహించారు. అయితే ఇందులో చాట్జీపీటీ విద్యార్థులకంటే తక్కువ స్కోర్ చేయడం గమనార్హం. విద్యార్థులు 76.7% స్కోర్ చేయగా, చాట్జీపీటీ 47.4% మార్కులను మాత్రమే సాధించింది. (ఇదీ చదవండి: భారత్లో చీప్ అండ్ బెస్ట్ డీజిల్ కార్లు - మహీంద్రా బొలెరో నుంచి టాటా నెక్సాన్ వరకు..) అకౌంటింగ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్, ఆడిటింగ్ సబ్జెక్టుల్లో చాట్జీపీటీ మెరుగైన మార్కులు సాధించిన చాట్జీపీటీ టాక్స్, ఫైనాన్షియల్, మేనేజీరియల్ అసెస్ మెంట్ వంటి వాటిలో పూర్ పర్ఫామెన్స్ చూపించింది. షార్ట్ ఆన్సర్ ప్రశ్నలు, విశ్లేషణాత్మక ప్రశ్నల విషయంలో కూడా చాట్జీపీటీ అంతంత మాత్రంగానే ఉంది. -
క్షీణిస్తున్న జనాభాతో కలవరం.. చాట్జీపీటీ వినియోగంపై జపాన్ చూపు!
చాట్జీపీటీ! పరిచయం అక్కర్లేని పేరు. వినియోగంలోకి వచ్చిన నాటి నుంచి ప్రతి రోజూ నిత్యం వార్తల్లో నిలుస్తోన్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) టూల్. ఉద్యోగాలను భర్తీ చేస్తుందనే కారణంతో ఇప్పుడు ఈ టూల్ను వినియోగించేందుకు ప్రపంచ దేశాలు వెనకడుగు వేస్తున్నాయి. ఈ తరుణంలో జపాన్ చాట్జీపీటీని సద్వినియోగం చేసుకోనేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. జపాన్కు చెందిన యోకొసుకా నగరంలో పాలనా పరమైన విధులు (అడ్మినిస్ట్రేషన్) నిర్వహించేందుకు సుమారు 4 వేల మంది మున్సిపల్ ఉద్యోగులు నెల రోజుల పాటు ఏఐ చాట్బాట్పై ట్రయల్స్ ప్రాతిపదికన దీనిని వినియోగించనున్నారు. ఈ ట్రయల్స్లో చాట్జీపీటీని స్పెల్లింగుల్లోని తప్పుల్ని సరిచేయడం, కొత్త ఐడియాల కోసం ఉపయోగించనున్నారు. మిగిలిన దేశాలు చాట్జీపీటీ వినియోగాన్ని వ్యతిరేకిస్తున్నా జపాన్ ఉపయోగించుకోవడానికి కారణం అక్కడ ఉద్యోగులు కొరత వేధిస్తుంది. దీంతో పాలనా పరమైన ఇబ్బందులు తలెత్తుతున్నాయని, ఆ సమస్య నుంచి బయటపడేందుకే చాట్జీటీపీ వినియోగం తప్పని సరి అని తాము భావిస్తున్నట్లు యోకొసుకా డిజిటల్ మేనేజ్మెంట్ డిపార్టెంట్ పబ్లిక్ రిలేషన్స్ ప్రతినిధి తకాయుకి సముకావా(Takayuki Samukawa) తెలిపారు. ఈ సందర్భంగా చాట్జీపీటీ వంటి ఏఐ టూల్స్ను ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ విభాగంలో ఉపయోగించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. జనాభా క్షీణతతో ఉద్యోగుల సంఖ్య పరిమితమవుతోంది. ఉద్యోగుల స్థానంలో చాట్జీపీటీని వినియోగం తప్పని సరని సముకావా భావిస్తున్నారు. -
చాట్జీపీటీపై నారాయణ మూర్తి సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారో తెలుసా?
ఇప్పుడు ప్రపంచం మొత్తం మీద ఎక్కువగా వినిపిస్తున్న పేరు చాట్జీపీటీ. ఈ చాట్జీపీటీ చేయలేని పనిలేదంటూ చాలా దేశాలు ఇప్పటికే పలుమార్లు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారంగా పనిచేసే చాట్బాట్ ఎన్ని అద్భుతాలు చేసినా మనుషులను రీప్లేస్ చేయలేవని ఇన్ఫోసిస్ ఫౌండర్ 'నారాయణ మూర్తి' అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇప్పటికే అగ్రదేశాల్లో చాట్జీపీటీ హవా వేగంగా నడుస్తోంది. దీని వల్ల రానున్న రోజుల్లో చాలా మంది ఉద్యోగాలను కోల్పోయే అవకాశం ఉందని కొంతమంది గతంలో వ్యాఖ్యానించారు. కానీ ఏదైనా సమాచారం సేకరించడానికి చాట్జీపీటీ చాలా ఉపయోగపడుతుంది, కానీ మనుషులతో పోటీ పడటం కష్టమని నారాయణ మూర్తి అన్నారు. మనిషి మెదడుని మించిన యంత్రం మరొకటి లేదని నమ్మేవారిలో నేను ఒకడినని చెప్పుకొచ్చారు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెంట్ చాట్బాట్ ఉద్యోగుల్ని భర్తీ చేస్తుందన్న ఆందోళనల కారణంగా నారాయణ మూర్తి ఈ వ్యాఖ్యలు చేశారు. ఏ యంత్రమైన మనిషి నుంచే తయారవుతుందని, అవి కూడా మనుషులకు కేవలం సాధనాలుగా మాత్రమే పనికొస్తాయని ఆయన అన్నారు. ఒక ప్రశ్నను ఇద్దరు మనుషులను అడిగితే వారి తమ సృజనాత్మకతతో వివిధ సమాధానాలు చెబుతారు, కానీ చాట్జీపీటీ ఇద్దరు వ్యక్తులు అడిగిన ఒకే ప్రశ్నకు ఒకే సమాధానం ఇస్తుంది. అది ఏ మాత్రం సృజనాత్మకతను చూపించే అవకాశం లేదని స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి చాట్జీపీటీ గురించి ఇప్పుడు ఎక్కువగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని నారాయణ మూర్తి అన్నారు. మనిషి సృజనాత్మకత, ఆధునిక టెక్నాలజీ కలిస్తే ఎన్నో అద్భుతాలు పుట్టుకొస్తాయి, అంతే కాకుండా ఎన్నో సమస్యలకు పరిస్కారం కూడా లభిస్తుంది. గతంలో చాట్జీపీటీ గురించి మాట్లాడే సందర్భంలో నారాయణ మూర్తి ఇలాంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. గతంలో కొంతమంది నిపుణులు చాట్జీపీటీ వల్ల మానవాళికి ప్రమాదం ఉందని, ఇలాంటి వాటిని ప్రోత్సహించకూడని తెలిపారు. -
ఏఐ పై ఎలాన్ మస్క్ ఆందోళన, త్వరలో ‘ట్రూత్జీపీటీ’...
న్యూయార్క్: ప్రపంచ వ్యాప్తంగా కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత చాటింగ్ టెక్నాలజీ పెరిగిపోతుండడం పట్ల ట్విట్టర్ అధినేత ఎలాన్ మస్క్ ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘కార్లు, రాకెట్ల కంటే ఏఐ మరింత ప్రమాదకరం. దీనివల్ల మానవాళికి ముప్పు తప్పదు. మానవాళిని నిర్వీర్యం చేసే శక్తి ఏఐకి ఉంది’’ అని ఓ ఇంటర్వ్యూలో అన్నారు. ఏఐ చాట్బాట్ ‘చాట్జీపీటీ’ వివక్షపూరితంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. దానికి ప్రత్యామ్నాయంగా ‘ట్రూత్జీపీటీ’ పేరిట సొంత చాట్బాట్ తెస్తామన్నారు. మానవాళిని ధ్వంసం చేసే టెక్నాలజీ వద్దని, అర్థం చేసుకొనేది కావాలని అన్నారు. కృత్రిమ మేధను నియంత్రించే వ్యవస్థ ఉండాలన్న ప్రతిపాదనను సమర్థించారు. -
గూగుల్కు భారీ షాక్ .. అదే జరిగితే వందల కోట్లలో నష్టం!
ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్కు కొత్త గుబులు మొదలైందా? ఒపెరా, మొజిల్లా ఫైర్ఫాక్స్, ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్.. ఒకప్పుడు నెట్ సామాజ్రాన్ని ఏలాయి. గూగుల్ రాగానే పైవన్నీ తుడిచిపెట్టుకుపోయాయి. గూగుల్ గుత్తాధిపత్యం దెబ్బకు మిగిలిన సెర్చింజన్లు తట్టాబుట్టా సర్దేసుకున్నాయి. అలాంటి గూగుల్ ఇప్పుడు అప్రమత్తం కావల్సిన దశ వచ్చిందా? ఆన్లైన్ సమాచార శోధనలో ఏళ్లుగా ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్న సెర్చింజన్కు చాట్జీపీటీ రూపంలో ముప్పు ముంచుకొస్తుందా? అంటే అవుననే అంటున్నాయి తాజా పరిణామాలు. చాట్జీపీటీతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో మైక్రోసాఫ్ట్ తెరతీసిన యుద్ధం ఇప్పుడు గూగుల్కు కంటిమీద కునుకులేకుండా చేస్తోంది? ముఖ్యంగా ఏ సమాచారం కావాలన్నా క్లుప్తంగా సమాధానం ఇస్తుండడంతో ఇప్పుడు యూజర్లు చాట్జీపీటీ వైపు మళ్లుతున్నారు. పనిలో పనిగా మైక్రోసాఫ్ట్ తన సొంత సెర్చింజన్ బింగ్లో చాట్జీపీటీని విస్తరించింది. దీంతో యూజర్లు వారికి ఇప్పుడు ఏ సమాచారం కావాలన్నా గూగుల్కు బదులు బింగ్ను అడగడం పరిపాటిగా మారింది. ఈ క్రమంలో ఇతర టెక్ సంస్థలు తమ గాడ్జెట్స్లో డిఫాల్ట్ సెర్చింజన్గా గూగుల్కు బదులు బింగ్ను జతచేయాలని భావిస్తున్నాయి. ఇంటర్నేషనల్ డేటా కార్పొరేషన్ (idc) నివేదిక ప్రకారం..2022లో శాంసంగ్ 261 మిలియన్లు (26.1కోట్లు) స్మార్ట్ఫోన్లను సరఫరా చేసింది. ఈ ఫోన్లు గూగుల్ ఆండ్రాయిడ్ వెర్షన్లో పనిచేస్తాయి.అంతేకాదు వినియోగదారులకు అందించే ముందే గూగుల్, మైక్రోసాఫ్ట్లు యాప్స్ను, ఇతర సేవల్ని శాంసంగ్ ఫోన్లలో ఇన్స్టాల్ అందిస్తున్నాయి. తాజాగా సెర్చింజన్ విషయంలో శాంసంగ్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. శాంసంగ్ ఫోన్లలో ఉన్న గూగుల్ సెర్చింజన్ బదులు మైక్రోసాఫ్ట్ సెర్చ్ ఇంజిన్ బింగ్ను డీఫాల్ట్ సెర్చింజన్గా ఇచ్చే విధంగా చర్చలు జరుపుతున్నట్లు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ఒకవేళ అదే జరిగితే గూగుల్కు 3 బిలియన్ల నష్టం (రూ.300కోట్లు) వాటిల్లే ప్రమాదం ఉందని హైలెట్ చేస్తున్నాయి. ప్రస్తుతానికి శాంసంగ్.. మైక్రోసాఫ్ట్తో చర్చలు జరుపుతుందని, అప్పటి వరకు గూగుల్నే కొనసాగించే అవకాశం ఉందని తెలుస్తోంది. చదవండి👉 'AI'తో 30కోట్ల ఉద్యోగాలు ఉఫ్!.. గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ ఏమన్నారంటే?