Chess
-
క్లాసికల్ అంటేనే ఇష్టం
న్యూఢిల్లీ: చదరంగంలో ఎన్ని ఫార్మాట్లు వచ్చినా... క్లాసికల్కు ఉన్న ప్రాధాన్యత వేరని ప్రపంచ చెస్ చాంపియన్ దొమ్మరాజు గుకేశ్ అన్నాడు. ఇటీవలి కాలంలో అన్నీ ఫార్మాట్లలో సత్తా చాటుతున్న గుకేశ్... తనకు స్వతహాగా సంప్రదాయ క్లాసికల్ గేమ్ అంటేనే ఎక్కువ ఇష్టమని వెల్లడించాడు. ‘ఏ ఫార్మాట్లో ఆడాలి అనే దాని గురించి పెద్దగా ఆలోచించను. ఫ్రీ స్టయిల్ ఉత్తేజకరమైన ఫార్మాట్... ఆడేటప్పుడు ఎంతో బాగుంటుంది. ఇప్పటి వరకు ఫ్రీస్టయిల్ విభాగంలో రెండు టోర్నీలు మాత్రమే జరిగాయి. ఇప్పుడే దానిపై వ్యాఖ్యానించడం తొందరపాటు అవుతుంది. ఫ్రీస్టయిల్ ఫార్మాట్ మరింత ఆదరణ పొందాలని కోరుకుంటున్నా. అదే సమయంలో క్లాసికల్ విభాగానికి ఉన్న ప్రాధాన్యత వేరు. ఘన చరిత్ర ఉన్న క్లాసికల్ విభాగంలో ప్రపంచ చాంపియన్షిప్ అన్నిటి కంటే అత్యున్నతమైంది. క్లాసికల్, ర్యాపిడ్, బ్లిట్జ్కు ఫ్రీస్టయిల్ అదనం. నేను అన్నింట్లో ఆడాలని అనుకుంటున్నా’ అని గుకేశ్ శనివారం ఓ కాన్క్లేవ్లో అన్నాడు. వచ్చే నెల 7–14 వరకు జరగనున్న పారిస్ అంచె ఫ్రీస్టయిల్ చెస్ గ్రాండ్స్లామ్ టూర్లో పాల్గొననున్నట్లు గుకేశ్ వెల్లడించాడు. ప్రపంచ నంబర్వన్ మాగ్నస్ కార్ల్సన్తో పాటు 12 మంది గ్రాండ్మాస్టర్లు పాల్గొంటున్న ఈ చెస్ గ్రాండ్స్లామ్ తొలి అంచె జర్మనీ పోటీల్లో విన్సెంట్ కెయిమెర్ విజేతగా నిలిచాడు. కెరీర్ తొలి నాళ్లలో ఎదుర్కొన్న ఆరి్థక కష్టాలను గుకేశ్ కాన్ క్లేవ్లో గుర్తుచేసుకున్నాడు. టోర్నమెంట్లలో పాల్గొనేందుకు డబ్బులు లేని సమయంలో తల్లిదండ్రుల స్నేహితులు అండగా నిలిచారని అన్నాడు. ‘ఒకప్పుడు పోటీలకు వెళ్లేందుకు తగినంత డబ్బు లేకపోయేది. కుటుంబ సభ్యులు ఎంతో ప్రయతి్నంచి నిధులు సమకూర్చేవారు. నిస్వార్ధపరమైన కొందరి సాయం వల్లే ఈ స్థాయికి వచ్చా. ఇప్పుడు ఆరి్థక ఇబ్బందులు తొలగిపోయాయి’ అని గుకేశ్ అన్నాడు. కొవిడ్–19 ప్రభావం తర్వాత దేశంలో చెస్కు మరింత ఆదరణ పెరిగిందని గుకేశ్ అభిప్రాయపడ్డాడు. ప్రస్తుతం ప్రపంచ అత్యుత్తమ 100 మంది చెస్ ప్లేయర్లలో భారత్ నుంచి 13 మంది ఉన్నారని అది చదరంగంలో మన ప్రగతికి చిహ్నమని గుకేశ్ అన్నాడు. వీరందరికీ దారి చూపింది విశ్వనాథన్ ఆనంద్ అని... ఆయన బాటలోనే మరింత మంది గ్రాండ్మాస్టర్లు వచ్చారని పేర్కొన్నాడు. దేశంలో చెస్కు మంచి ఆదరణ లభిస్తోందని... స్పాన్సర్లతో పాటు ప్రభుత్వాలు కూడా అండగా నిలుస్తున్నాయని గుకేశ్ వివరించాడు. -
అరవింద్... కొత్త చాంపియన్
న్యూఢిల్లీ: భారత చదరంగంలో నేటితరం సంచలన విజేతలతో పోల్చుకుంటే అరవింద్ చిదంబరం ఆలస్యంగా వికసించిన చాంపియన్. ఇప్పటికే టీనేజ్లోనే దొమ్మరాజు గుకేశ్, ఆర్.ప్రజ్ఞానంద, అర్జున్ ఇరిగేశి అంతర్జాతీయ చెస్ టోర్నీలు, ఎలో రేటింగ్స్లో సత్తా చాటుకున్నారు. కానీ 64 గడుల బరిలో అరవింద్ 25 ఏళ్ల వయసులో వార్తల్లోకెక్కాడు. ప్రాగ్ మాస్టర్స్ టోర్నీలో విజేతగా నిలువడం ద్వారా భారత్లో కొత్త చదరంగ చక్రవర్తిగా అవతరించాడు. వయసు రీత్యా అతను లేటే కావొచ్చు... కానీ లేటెస్ట్ చాంపియన్గా భారత క్రీడాఖ్యాతిని పెంచాడు. గుకేశ్, ప్రజ్ఞానంద, అర్జున్లతో కలిసి ఇప్పుడు నాలుగో స్తంభమయ్యాడు. విజేతగా మలచిన తల్లి మధురైలో పుట్టిన అరవింద్ పసిప్రాయంలోనే తండ్రిని కోల్పోయాడు. మూడేళ్ల వయసులోనే కన్నతండ్రి లోకాన్ని వీడితే... కన్నతల్లే అన్నీ తానై పెంచింది. జీవితబీమా (ఎల్ఐసీ) ఏజెంట్గా పనిచేస్తూ మదురై నుంచి చెన్నైకి మారి బతుకుబండిని లాగించింది. ఏడేళ్ల వయసులో తాత చెస్లో ఓనమాలు నేర్పితే అందులోనే కెరీర్ను ఎంచుకున్నాడు. విఖ్యాత వేలమ్మాళ్ స్కూల్లో విద్యనభ్యసించిన అరవింద్ చదువుకునే రోజుల్లో ఇప్పటి ప్రపంచ చాంపియన్ గుకేశ్కు సీనియర్. గుకేశ్ కూడా వేలమ్మాళ్ విద్యార్థే! ప్రాగ్ మాస్టర్స్లాంటి మేటి టోర్నీల్లో సాధారణంగా టాప్–20 ర్యాంకింగ్ ప్లేయర్లకు పాల్గొనే అవకాశముంటుంది. అంతకుమించి ర్యాంకుల్లో ఉంటే నిర్వాహకుల నుంచి వైల్డ్కార్డ్లాంటి ఎంట్రీలు ఉండాల్సిందే. అలా వచ్చిన అవకాశాన్ని అరవింద్ చక్కగా సద్వినియోగం చేసుకున్నాడు. 2013లో తొలి జీఎమ్ నార్మ్ భారత విఖ్యాత గ్రాండ్మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ 2013లో మాగ్నస్ కార్ల్సన్కు ప్రపంచ చెస్ చాంపియన్ కిరీటాన్ని కోల్పోయిన ఏడాదే పాఠశాల విద్యనభ్యసిస్తున్న అరవింద్ తొలి గ్రాండ్మాస్టర్ (జీఎమ్) నార్మ్ పొందాడు. అక్కడి నుంచి అతని ఆట మరో దశకు చేరడంతో 2015లో గ్రాండ్మాస్టర్ హోదా లభించింది. అడపాదడపా టోర్నీల్లో గెలుస్తున్నప్పటికీ 2019 అతని కెరీర్ను మలుపుతిప్పింది. భారత ఓపెన్లో క్లాసికల్, ర్యాపిడ్, బ్లిట్జ్ ఇలా మూడు విభాగాల్లోనూ అరవింద్ విజేతగా నిలిచి అరుదైన ఘనత సాధించిన ఆటగాళ్లలో ఒకడిగా నిలిచాడు. దాంతో పాటే తొలిసారి 2700 ఎలో రేటింగ్లోకి వచ్చేశాడు. ఇప్పుడు ప్రాగ్ టైటిల్తో లైవ్ వరల్డ్ ర్యాంకింగ్స్లో అరవింద్ 14వ స్థానంలో ఉన్నాడు. భారత్ తరఫున నాలుగో ర్యాంకర్గా ఎదిగాడు. -
Cappelle International Chess Championship: తెలంగాణ గ్రాండ్మాస్టర్కు కాంస్యం
న్యూఢిల్లీ: భారత గ్రాండ్మాస్టర్ రాజా రిత్విక్ కాపెల్ ఇంటర్నేషనల్ చెస్ చాంపియన్షిప్లో కాంస్య పతకంతో మెరిశాడు. ఫ్రాన్స్ వేదికగా జరిగిన ఈ చాంపియన్షిప్లో 7 పాయింట్లు సాధించిన తెలంగాణ స్టార్ ప్లేయర్ మూడో స్థానంలో నిలిచాడు. ఫ్రాన్స్ గ్రాండ్మాస్టర్ బోయెర్ మహెల్ పసిడి పతకం సాధించగా... భారత్కే చెందిన గ్రాండ్మాస్టర్ ఇనియాన్ పన్నీర్సెల్వం రజత పతకం దక్కించుకున్నాడు. 26 దేశాలకు చెందిన 533 మంది ప్లేయర్లు పాల్గొన్న ఈ టోర్నీలో రిత్విక్ 9 రౌండ్లలో 7 పాయింట్లు సాధించాడు. ఆరో సీడ్గా బరిలోకి దిగిన తెలంగాణ గ్రాండ్మాస్టర్ 6 గేమ్లు గెలిచి రెండింటిని ‘డ్రా’ చేసుకున్నాడు. ఒక గేమ్లో ఓటమి పాలయ్యాడు. కాపెల్ అంతర్జాతీయ చెస్ చాంపియన్షిప్లో కాంస్యం నెగ్గిన రాజా రిత్విక్ను తెలంగాణ చెస్ సంఘం కార్యదర్శి జయచంద్ర ప్రత్యేకంగా అభినందించారు. -
గుకేశ్కు చివరి స్థానం
హాంబర్గ్ (జర్మనీ): ఫ్రీస్టయిల్ గ్రాండ్స్లామ్ చెస్ టూర్ టోర్నమెంట్లో ప్రపంచ చాంపియన్, భారత గ్రాండ్మాస్టర్ దొమ్మరాజు గుకేశ్ నిరాశ పరిచాడు. శనివారం ముగిసిన ఈ టోర్నీలో గుకేశ్ ఆఖరి స్థానంతో సరిపెట్టుకున్నాడు. ప్లే ఆఫ్ పోరులో గుకేశ్ 0.5–1.5 పాయింట్ల తేడాతో అలిరెజా ఫిరౌజా (ఇరాన్) చేతిలో పరాజయం పాలయ్యాడు. క్వార్టర్ ఫైనల్లో ఫాబియానో కరువానా (అమెరికా) చేతిలో ఓడిన గుకేశ్... ప్లే ఆఫ్ రౌండ్లోనూ ఆకట్టుకోలేకపోయాడు. తొలి రౌండ్ను ‘డ్రా’చేసుకున్న గుకేశ్... రెండో రౌండ్లో తెల్ల పావులతో ఆడినా సత్తా చాటలేకపోయాడు. 30 ఎత్తుల్లో పరాజయం పాలయ్యాడు. ఓవరాల్గా విన్సెంట్ కైమెర్ (జర్మనీ) అగ్రస్థానం దక్కించుకోగా... ఫాబియా కరువానా (అమెరికా), మాగ్నస్ కార్ల్సన్ (నార్వే) వరుసగా ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచారు. ఆ తర్వాత వరుసగా జవోఖిర్ సిందరోవ్ (ఉజ్బెకిస్తాన్; 4వ స్థానం), హికారు నకమురా (అమెరికా; 5వ స్థానం), నొడ్రిబెక్ అబ్దుసత్తరోవ్ (ఉజ్బెకిస్తాన్; 6వ స్థానం), అలిరెజా ఫిరౌజా (7వ స్థానం) నిలిచారు. ఎనిమిది మంది గ్రాండ్మాస్టర్లు పాల్గొన్న ఈ టోర్నీలో గుకేశ్ ఎనిమిదో స్థానంతో ముగించాడు. ఈ టోర్నీ మొత్తంలో గుకేశ్ ఒక్క మ్యాచ్లోనూ విజయం సాధించలేకపోయాడు. -
చెస్ గ్రాండ్మాస్టర్ అర్జున్ ఇరిగేశి సంచలన వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: యువ ఆటగాళ్లు కెరీర్లో ఎదిగేందుకు ప్రోత్సాహకంగా ఇప్పటి వరకు అందిస్తున్న ఆర్దిక సహకారాన్ని ఆపి వేయాలని ఇటీవలే కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇకపై అంతర్జాతీయ ఈవెంట్లలో విజయాలు సాధిస్తేనే నగదు పురస్కారాలు లభిస్తాయి. చెస్లో గ్రాండ్మాస్టర్గా (జీఎం) మారితే రూ. 4 లక్షలు, ఇంటర్నేషనల్ మాస్టర్ (ఐఎం) సాధిస్తే రూ.1.5 లక్షలు ఇచ్చేవారు. అయితే వీటిని నిలిపివేయడం సరైన నిర్ణయం కాదని అగ్రశ్రేణి ఆటగాడు అర్జున్ ఇరిగేశి అభిప్రాయపడ్డాడు. ‘చెస్లో ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న వర్ధమాన ఆటగాళ్లకు ఈ సమస్య అర్థం కాకపోవచ్చు. కానీ వారిని ప్రోత్సహించే తల్లిదండ్రులకు మాత్రం ఈ నిర్ణయం తీవ్ర నిరాశ కలిగిస్తుంది. దీని వల్ల వారికి ఆర్దికపరమైన సమస్యలు వస్తాయి. డబ్బుల కోసం ప్రత్యామ్నాయాలు చూడాల్సి వస్తుంది. పిల్లలను ప్రోత్సహించాలనే ప్రేరణ తగ్గిపోతుంది. సరిగ్గా చెప్పాలంటే చెస్, చదువులో ఏదైనా ఎంచుకోవాల్సి వస్తే వారు ఆటను పక్కన పెట్టవచ్చు’ అని అర్జున్ వ్యాఖ్యానించాడు. -
ఫ్రీ స్టయిల్ చెస్ నాకౌట్కు గుకేశ్
హంబర్గ్ (జర్మనీ): భారత యువ గ్రాండ్మాస్టర్, ప్రపంచ చాంపియన్ దొమ్మరాజు గుకేశ్ ఫ్రీస్టయిల్ గ్రాండ్స్లామ్ చెస్ టూర్లో నాకౌట్కు అర్హత సాధించాడు. శనివారం క్వాలిఫయర్స్ చివరి మ్యాచ్లో స్టార్ ప్లేయర్ మాగ్నస్ కార్ల్సన్ చేతిలో ఓటమి పాలైనప్పటికీ గుకేశ్ ముందంజ వేశాడు. ఈ టోర్నీ మొత్తంలో 9 మ్యాచ్లు ఆడిన గుకేశ్ స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చలేకపోయాడు. ఒక్క మ్యాచ్లోనూ విజయం సాధించని భారత గ్రాండ్మాస్టర్... ఏడు మ్యాచ్లను ‘డ్రా’ చేసుకొని... మరో రెండు మ్యాచ్ల్లో ఓటమి పాలయ్యాడు. ఫలితంగా గుకేశ్ ఖాతాలో 3.5 పాయింట్లు చేరాయి. పది మంది ప్లేయర్లు పాల్గొంటున్న ఈ టోర్నీలో ఎనిమిదో స్థానంలో నిలవడం ద్వారా గుకేశ్ నాకౌట్లో అడుగుపెట్టాడు. క్వాలిఫయింగ్ దశ ముగిసే సరికి ఫ్రాన్స్ గ్రాండ్మాస్టర్ అలిరెజా ఫిరౌజా, ఉజ్బేకిస్తాన్కు చెందిన జవోకిర్ సిందరోవ్ చెరో 6.5 పాయింట్లతో తొలి రెండు స్థానాల్లో నిలిచారు. అమెరికా గ్రాండ్మాస్టర్ ఫాబియానో కరున (6 పాయింట్లు) మూడో స్థానం దక్కించుకోగా... మాగ్నస్ కార్ల్సన్ (నార్వే), హికారు నకమురా (అమెరికా) చెరో 5.5 పాయింట్లతో వరుసగా నాలుగో, ఐదో స్థానాల్లో నిలిచారు. జర్మనీకి చెందిన విన్సెంట్ కైమెర్ 4 పాయింట్లతో ఆరో ‘ప్లేస్’ దక్కించుకున్నాడు. ఉజ్బేకిస్తాన్కు చెందిన నొదిర్బెక్ అబ్దుసత్తోరోవ్, గుకేశ్ చెరో 3.5 పాయింట్లతో వరుసగా ఏడు, ఎనిమిదో స్థానాల్లో నిలిచారు. -
వరల్డ్ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్గా తెలుగు తేజం
భారత గ్రాండ్ మాస్టర్, తెలుగు తేజం కోనేరు హంపి ఫిడే మహిళల వరల్డ్ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్గా నిలిచింది. ఈ మెగా టోర్నీలో హంపి 8.5 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచి విజేతగా అవతరించింది. న్యూయార్క్లోని వాల్ స్ట్రీట్లో ఇవాళ (డిసెంబర్ 29) జరిగిన 11వ రౌండ్లో హంపి ఐరీన్ సుకందర్ను ఓడించింది. ఈ టోర్నీలో మరో భారత గ్రాండ్మాస్టర్ ద్రోణవల్లి హారిక ఐదో స్థానంతో సరిపెట్టుకుంది.👏 Congratulations to 🇮🇳 Humpy Koneru, the 2024 FIDE Women’s World Rapid Champion! 🏆#RapidBlitz #WomenInChess pic.twitter.com/CCg3nrtZAV— International Chess Federation (@FIDE_chess) December 28, 2024హంపి మహిళల వరల్డ్ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్గా నిలవడం ఇది రెండో సారి. 2019లో హంపి తొలిసారి వరల్డ్ ర్యాపిడ్ చెస్ టైటిల్ను నెగ్గింది. హంపికి ముందు చైనాకు చెందిన జు వెంజున్ మాత్రమే వరల్డ్ ర్యాపిడ్ చెస్ టైటిళ్లను ఒకటి కంటే ఎక్కువ సార్లు నెగ్గింది.పురుషుల విభాగం విజేతగా..వరల్డ్ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్ పురుషుల విభాగం విజేతగా రష్యాకు చెందిన 18 ఏళ్ల గ్రాండ్మాస్టర్ వోలోదర్ ముర్జిన్ నిలిచాడు. ముర్జిన్ 13 రౌండ్లలో 10 పాయింట్లు సాధించి ఛాంపియన్గా అవతరించాడు. ఈ టోర్నీలో భారత గ్రాండ్మాస్టర్ అర్జున్ ఇరిగేశి ఐదో స్థానంతో సరిపెట్టుకున్నాడు. తొమ్మిది రౌండ్లు పూర్తయ్యే వరకు అగ్రస్థానంలో నిలిచిన అర్జున్.. చివరి రౌండ్లలో వెనుకపడిపోయాడు. -
గుకేశ్ను సన్మానించిన రజనీకాంత్, శివకార్తికేయన్ (ఫోటోలు)
-
చదరంగంలో కొత్త రారాజు.. వరల్డ్ ఛాంపియన్గా గుకేష్ (ఫోటోలు)
-
ప్రపంచ చెస్ ఛాంపియన్గా భారతీయుడు
సింగపూర్ సిటీ: వరల్డ్ చెస్ ఛాంపియన్షిప్లో భారత్ చరిత్ర సృష్టించింది. భారత గ్రాండ్మాస్టర్ దొమ్మరాజు గుకేశ్ ప్రపంచ ఛాంపియన్గా అవతరించాడు. 14వ గేమ్లో గుకేశ్ ప్రస్తుత ఛాంపియన్, చైనాకు చెందిన డింగ్ లిరెన్ను ఓడించాడు. గుకేశ్ 18 ఏళ్ల వయసులోనే ప్రపంచ ఛాంపియన్గా నిలిచాడు. తద్వారా ఈ ఘనత సాధించిన అతి పిన్న వయస్కుడిగా రికార్డు నెలకొల్పాడు.THE EMOTIONS...!!! 🥹❤️- 18 Year Old Gukesh Dommaraju creating history by becoming the youngest ever champion. 🇮🇳 pic.twitter.com/LVkA8JMKM1— Mufaddal Vohra (@mufaddal_vohra) December 12, 2024విశ్వనాథన్ ఆనంద్ తర్వాత (2012) వరల్డ్ చెస్ ఛాంపియన్షిప్ టైటిల్ గెలుచుకున్న తొలి భారతీయుడిగా గుకేశ్ చరిత్ర సృష్టించాడు. గుకేశ్ అత్యంత చిన్న వయసులోనే గ్రాండ్ మాస్టర్ అయ్యాడు. వరల్డ్ చెస్ ఛాంపియన్షిప్ టైటిల్ కోసం పోటీ పడిన అతి పిన్న వయస్కుడిగానూ గుకేశ్ రికార్డు నెలకొల్పాడు. గుకేశ్ స్వస్థలం ఆంధ్రప్రదేశ్లోని తూర్పు గోదావరి జిల్లా. THE PRECIOUS MOMENT. 🥹- Gukesh hugging his father aftee creating history. ❤️pic.twitter.com/iLs5aNFIEW— Mufaddal Vohra (@mufaddal_vohra) December 12, 2024 -
చదరంగంలో చిచ్చర పిడుగు
మాటలు రాకముందే ఆటల వైపు ఆకర్షితుడైన ఆ చిన్నారి ఆసక్తిని గమనించిన తల్లిదండ్రులు... మెదడుకు పదును పెంచేందుకు పజిల్స్ను పరిచయం చేశారు. సులభమైన పజిల్స్ను పక్కన పెట్టిన ఆ బుడ్డోడు... సంక్లిష్టత పెరుగుతున్నకొద్దీ వాటిని ఆస్వాదించడం ప్రారంభించాడు. కుమారుడి ఉత్సాహాన్ని గుర్తించిన తల్లిదండ్రులు అతడికి చదరంగాన్ని పరిచయం చేయగా... అందులో అంచెలంచెలుగా ఎదుగుతూ ముందుకు సాగాడు. ఆరేళ్ల వయసులోనే భారత గ్రాండ్మాస్టర్లు దొమ్మరాజు గుకేశ్, ఇరిగేశి అర్జున్లాంటి మేటి స్టార్స్ను తన ప్రతిభతో కట్టిపడేసిన ఆ బుడతడు... ఎనిమిదేళ్ల వయసులోనే క్యాడెట్ విభాగంలో అండర్–8 ప్రపంచ ర్యాపిడ్, క్లాసికల్ ఫార్మాట్ చెస్ చాంపియన్షిప్లలో విజేతగా నిలిచి అబ్బురపరిచాడు. చదరంగంలో సంచలనాలు సృష్టిస్తున్న తెలంగాణ కుర్రాడు ఆదుళ్ల దివిత్ రెడ్డి ప్రస్థానంపై ప్రత్యేక కథనం. సాక్షి క్రీడావిభాగం ‘పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది’ అన్నట్లు హైదరాబాద్కు చెందిన ఆదుళ్ల దివిత్ రెడ్డి... చిన్నప్పటి నుంచే చదరంగంలో చిచ్చర పిడుగులా చెలరేగుతున్నాడు. ఎనిమిదేళ్ల వయసులోనే ప్రపంచ క్యాడెట్స్ చెస్ చాంపియన్షిప్ అండర్–8 ఓపెన్ కేటగిరీలో విజేగా నిలిచిన దివిత్ రెడ్డి.. అంతకుముందు వరల్డ్ క్యాడెట్ ర్యాపిడ్ చెస్ చాంపియన్షిప్లో స్వర్ణ పతకంతో సత్తా చాటాడు. ఇప్పటికే 1784 ఎలో రేటింగ్ పాయింట్లు ఖాతాలో వేసుకున్న దివిత్ రెడ్డి... భవిష్యత్తుపై భరోసా కల్పిస్తున్నాడు. రెండేళ్ల క్రితం హైదరాబాద్లో జరిగిన ఓ ఎగ్జిబిషన్ మ్యాచ్లో గ్రాండ్మాస్టర్లు దొమ్మరాజు గుకేశ్, అర్జున్ ఇరిగేశితో తలపడి తన ఎత్తులతో ఆకట్టుకున్న దివిత్ వారి నుంచి ప్రశంసలు అందుకున్నాడు. ప్రస్తుతం ప్రపంచ చాంపియన్షిప్ టైటిల్ కోసం డింగ్ లిరెన్ (చైనా)తో పోటీ పడుతున్న గుకేశ్... ‘ఈ అబ్బాయి చాలా బాగా ఆడుతున్నాడు. ఇతడి ఎత్తులకు ఆశ్చర్యం కలుగుతోంది’ అని కితాబు ఇచ్చాడంటే దివిత్ ప్రతిభ ఎలాంటిదో ఊహించుకోవచ్చు. తనకంటే మెరుగైన ర్యాంక్ ఉన్న ప్రత్యర్థులను కూడా అలవోకగా ఓడిస్తున్న దివిత్... భవిష్యత్తులో మరిన్ని సంచలనాలు నమోదు చేయడం ఖాయంగా కనిపిస్తోంది. సాఫ్ట్వేర్ ఇంజనీర్లైన తల్లిదండ్రులు పసిప్రాయం నుంచి దివిత్ను ప్రోత్సహించగా... వారి కృషికి తగ్గ ఫలితం దక్కినటైంది. ‘చిన్నప్పుడు దివిత్ పజిల్స్ నింపడాన్ని ఇష్టపడేవాడు. ఎంతో క్లిష్టమైన పజిల్స్ ఇచ్చినా సునాయాసంగా పూర్తి చేసేవాడు. దీంతో అతడిని స్థానికంగా ఒక పజిల్ ఇన్స్టిట్యూట్లో చేర్పించాం. అక్కడ కూడా ప్రతిభ చాటుకున్నాడు. దీంతో ఆన్లైన్ చెస్ కోచింగ్ ప్రారంభించాం’ అని దివిత్ తండ్రి మహేశ్ రెడ్డి వెల్లడించారు. విశాఖపట్నంకు చెందిన చెస్ కోచ్ పోలవరపు రామకృష్ణ శిక్షణలో మరింత రాటుదేలిన దివిత్... జాతీయ అంతర్జాతీయ పోటీల్లో సత్తా చాటాడు. ఆరేళ్ల ప్రాయంలోనే దివిత్ అండర్–8 జాతీయ చెస్ చాంపియన్షిప్లో పాల్గొన్నాడు. ‘నేను అతడిలో ప్రపంచ చాంపియన్ను చూశాను. ప్రోత్సహిస్తే ఫలితం ఉంటుందని ఆలోచించి... చదువుతో పాటు శిక్షణకు తగిన సమయం కేటాయించేలా చేశా. దీని కోసం నా భార్య ఉద్యోగాన్ని పక్కన పెట్టి పూర్తి స్థాయిలో దివిత్కు చేదోడుగా నిలిచింది. కోవిడ్–19 కారణంగా వచ్చిన లాక్డౌన్ ఒక విధంగా మాకు మేలు చేసింది. చిన్న వయసులోనే అతడి ఎత్తులు చాలా వ్యూహాత్మకంగా ఉండటం చూసి ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోయే వాళ్లు. దాన్నే కొనసాగిస్తూ విజయాలు సాధిస్తున్నాడు. గ్యారీ కాస్పరోవ్ అంటే దివిత్కు చాలా ఇష్టం. కాస్పరోవ్ తరహాలోనే అటాకింగ్ ఆటను ఇష్టపడతాడు. దాదాపు ఓడిపోయే స్థితి నుంచి కూడా తిరిగి పుంజుకోవడం దివిత్కు బాగా అలవాటు’ అని మహేశ్ రెడ్డి వివరించారు. ఈ ఏడాది 10 అంతర్జాతీయ టోర్నీల్లో పాల్గొన్న దివిత్ రెడ్డి సమీప భవిష్యత్తులో గ్రాండ్మాస్టర్ (జీఎం) హోదా దక్కించుకోవడం ఖాయమే అని మహేశ్ అన్నారు. అమెరికాకు చెందిన భారత సంతతి కుర్రాడు అభిమన్యు మిశ్రా 12 సంవత్సరాల 4 నెలల 25 రోజుల వయసులో గ్రాండ్మాస్టర్గా అవతరించి ఈ ఘనత సాధించిన పిన్న వయస్కుడిగా నిలవగా... ఇప్పుడు ఆ రికార్డును దివిత్ బద్దలు కొడతాడని మహేశ్ విశ్వాసం వ్యక్తం చేశారు. -
హరికృష్ణ, విదిత్ జట్టుకు టైటిల్
బెల్గ్రేడ్ (సెర్బియా): ప్రతిష్టాత్మక యూరోపియన్ చెస్ క్లబ్ కప్ (యూసీసీసీ) టీమ్ టోర్నమెంట్ ఓపెన్ విభాగంలో చెక్ రిపబ్లిక్కు చెందిన నోవీ బోర్ చెస్ క్లబ్ జట్టు విజేతగా నిలిచింది. 68 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ టోర్నీలో నోవీ బోర్ క్లబ్ జట్టు టైటిల్ నెగ్గడం ఇది మూడోసారి. 2013లో, 2022లోనూ ఈ జట్టుకు టైటిల్ లభించింది. ఆదివారం ముగిసిన ఈ టోర్నీలో మొత్తం 84 జట్లు పోటీపడ్డాయి. నిర్ణీత ఏడు రౌండ్ల తర్వాత నోవీ బోర్ క్లబ్ 13 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచి ట్రోఫీని కైవసం చేసుకుంది. ఆరు మ్యాచ్ల్లో నెగ్గిన నోవీ బోర్ జట్టు ఒక మ్యాచ్ ను ‘డ్రా’ చేసుకొని టోర్నీని అజేయంగా ముగించింది. ఆంధ్రప్రదేశ్ గ్రాండ్మాస్టర్, చెక్ రిపబ్లిక్లో స్థిరపడ్డ పెంటేల హరికృష్ణ, భారత గ్రాండ్మాస్టర్, మహారాష్ట్ర ప్లేయర్ విదిత్ సంతోష్ గుజరాతి నోవీ బోర్ జట్టుకు టైటిల్ దక్కడంలో కీలకపాత్ర పోషించారు. హరికృష్ణ 6 గేమ్లు ఆడి 3.5 పాయింట్లు సాధించగా... విదిత్ కూడా 6 గేమ్లు ఆడి 4 పాయింట్లు సంపాదించాడు. విన్సెంట్ కెమెర్ (జర్మనీ), డేవిడ్ నవారా (చెక్ రిపబ్లిక్), డేవిడ్ ఆంటోన్ గిజారో (స్పెయిన్), థాయ్ డాయ్ వాన్ ఎన్గుయెన్ (చెక్ రిపబ్లిక్), నీల్స్ గ్రాండెలియస్ (స్వీడన్), మాటెజ్ బార్టెల్ (పోలాండ్) విజేత జట్టులో ఇతర సభ్యులుగా ఉన్నారు. భారత నంబర్వన్, ప్రపంచ నాలుగో ర్యాంకర్ ఇరిగేశి అర్జున్ సభ్యుడిగా ఉన్న అల్కాలాయిడ్ క్లబ్ (నార్త్ మెసెడోనియా) 12 పాయింట్లతో రన్నరప్గా నిలిచింది. అర్జున్ 7 గేమ్లు ఆడి 5.5 పాయింట్లు స్కోరు చేశాడు. 11 పాయింట్లతో వాడోస్ చెస్ క్లబ్ (రొమేనియా) మూడో స్థానాన్ని దక్కించుకుంది. మహిళల విభాగంలో ప్రపంచ జూనియర్ చాంపియన్, భారత స్టార్ దివ్య దేశ్ముఖ్ సభ్యురాలిగా ఉన్న గరుడ అజ్కా బీఎస్కే క్లబ్ జట్టు 11 పాయింట్లతో రన్నరప్గా నిలిచింది. -
‘బంగారు తల్లి’ హారిక ద్రోణవల్లి.. అందమైన కుటుంబం (ఫొటోలు)
-
భారతీయ చదరంగం గురించి పలు ఆసక్తికర విషయాలు
భారతీయ చదరంగం (చెస్) గురించి పలు ఆసక్తికరమైన విషయాలు ఇక్కడ చూద్దాం. చదరంగం క్రీడ 6వ శతాబ్దంలో గుప్త సామ్రాజ్యంలో భారతదేశంలో ఉద్భవించిందని నమ్ముతారు. చదరంగాన్ని "చతురంగ" అని పిలిచేవారు. చతురంగ అంటే సైనికదళంలో నాలుగు విభాగాలు. పదాతిదళం, అశ్వికదళం, ఏనుగులు మరియు రథం.విశ్వనాథన్ ఆనంద్: మెరుపు పిల్లాడిగా పిలువబడే విశ్వనాథన్ ఆనంద్ 1988లో భారతదేశపు మొదటి గ్రాండ్మాస్టర్ అయ్యాడు. అతను ఐదుసార్లు ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ను గెలుచుకున్నాడు.చెస్ ఒలింపియాడ్ విజయం: ఇటీవలి కాలంలో చెస్ ఒలింపియాడ్స్లో విశేషంగా రాణిస్తున్న భారత్.. 2024 FIDE చెస్ ఒలింపియాడ్లో డబుల్ స్వర్ణం (ఓపెన్, మహిళలు) సాధించింది.రైజింగ్ స్టార్స్: రమేష్బాబు ప్రజ్ఞానంద, డి గుకేష్ వంటి యువ ప్రతిభావంతులు అంతర్జాతీయంగా అద్భుతాలు చేస్తున్నారు. గుకేష్ ఇటీవల FIDE క్యాండిడేట్స్ టోర్నమెంట్ను గెలుచుకున్నాడు.జాతీయ ఛాంపియన్షిప్లు: ఇండియన్ నేషనల్ చెస్ ఛాంపియన్షిప్ ప్రపంచంలోని పురాతన టోర్నమెంట్లలో ఒకటి. మొదటి ఎడిషన్ 1955లో జరిగింది.విద్యలో చదరంగం: పాఠ్యాంశాల్లో చెస్ను చేర్చడంలో విశ్వనాథన్ ఆనంద్ కీలకపాత్ర పోషించాడు. చెస్ విద్యార్థుల్లో వ్యూహాత్మక ఆలోచనా నైపుణ్యాలను మెరుగుపరుస్తుందని ఆనంద్ నమ్మాడు.చారిత్రక మైలురాళ్ళు: మాన్యువల్ ఆరోన్ 1961లో అంతర్జాతీయ మాస్టర్గా మారిన మొదటి భారతీయుడు.చదరంగం వేరియంట్లు: సాంప్రదాయ భారతీయ చెస్ వేరియంట్లు "శత్రంజ్" మరియు "చతురంగ" పలు ప్రత్యేక నియమాలను కలిగి ఉంటాయి.పాప్ సంస్కృతిలో చదరంగం: భారతీయ పాప్ సంస్కృతిలో చదరంగం గణనీయమైన ఉనికిని కలిగి ఉంది. సినిమా మరియు టీవీ కార్యక్రమాలు తరచుగా చెస్ను ప్రధాన ఇతివృత్తంగా ప్రదర్శిస్తాయి.గ్లోబల్ ఇన్ఫ్లూయెన్స్: చదరంగంలో భారత దేశం యొక్క సహకారం ప్రపంచవ్యాప్తంగా గుర్తించబడింది. భారత్ రికార్డు స్థాయిలో గ్రాండ్మాస్టర్లు, అంతర్జాతీయ మాస్టర్లను ఉత్పత్తి చేస్తుంది.చదవండి: బంగారం... మన చదరంగం -
చరిత్ర సృష్టించిన భారత్.. చెస్ ఒలంపియాడ్లో తొలిసారి స్వర్ణం
చెస్ ఒలింపియాడ్ ఓపెన్ విభాగంలో భారత్ తొలిసారి స్వర్ణ పతకం సాధించింది. హంగేరి రాజధాని బుడాపెస్ట్లో జరిగిన 45వ ఫిడే చెస్ ఒలింపియాడ్లో భారత పురుషుల జట్టు ఈ ఘనత సాధించింది. ఇవాళ (సెప్టెంబర్ 22) జరిగిన చివరి రౌండ్లో భారత్.. స్లొవేనియాపై విజయం సాధించి, బంగారు పతకాన్ని చేజిక్కించుకుంది. 97 ఏళ్ల ఈ టోర్నీ చరిత్రలో భారత్ స్వర్ణం కైవసం చేసుకోవడం ఇదే తొలిసారి. 2014, 2022 ఎడిషన్లలో భారత్ కాంస్య పతకాలు సాధించింది.And Team India checkmates history by bringing home GOLD for the first time in 97 years of the game!Heartiest congratulations to our unstoppable Grandmasters @DGukesh, @rpraggnachess, @ArjunErigaisi, @viditchess, and @HariChess on winning GOLD🥇at the 45th FIDE Chess Olympiad!… pic.twitter.com/FNOtQ9LCCs— Nitin Narang (@narangnitin) September 22, 2024స్లొవేనియాతో జరిగిన చివరి రౌండ్ పోటీల్లో అర్జున్ ఎరిగైసి భారత్కు తొలి విజయాన్ని అందించాడు. ఆ తర్వాత డి గుకేశ్, ఆర్ ప్రజ్ఞానంద వరుస విజయాలు సాధించి భారత్కు స్వర్ణ పతకం ఖరారు చేశారు. ఈ ఎడిషన్లో భారత్ ఒక్క రౌండ్లోనూ ఓడిపోకుండా అజేయ జట్టుగా నిలిచింది. ఆది నుంచి ఎనిమిది రౌండ్ల పాటు విజయాలు సాధించిన భారత్.. తొమ్మిదో రౌండ్లో డిఫెండింగ్ ఛాంపియన్ ఉజ్బెకిస్థాన్తో మ్యాచ్ను డ్రా చేసుకుంది. అనంతరం టాప్ సీడ్ యూఎస్ఏ, స్లొవేనియాపై విజయాలు సాధించి తిరిగి గెలుపు బాట పట్టింది. చదవండి: శెభాష్ టీమిండియా.. చదరంగంలో స్వర్ణ చరిత్రకు చేరువలో -
చరిత్రలో తొలిసారి..!
చరిత్రలో తొలిసారి ఇద్దరు భారత గ్రాండ్ మాస్టర్లు లైవ్ చెస్ ర్యాంకింగ్స్లో టాప్-5లో చోటు దక్కించుకున్నారు. చెస్ ఒలింపియాడ్లో తాజా ప్రదర్శనల అనంతరం అర్జున్ ఎరిగైసి, డి గుకేశ్ లైవ్ ర్యాంకింగ్స్లో నాలుగు, ఐదు స్థానాల్లో నిలిచారు. అర్జున్ ఖాతాలో 2788.1 పాయింట్లు ఉండగా.. గుకేశ్ ఖాతాలో 2775.2 పాయింట్లు ఉన్నాయి. 2832.3 పాయింట్లతో మాగ్నస్ కార్ల్సన్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. లైవ్ ర్యాంకింగ్స్ అనేవి రియల్ టైమ్లో అప్డేట్ అయ్యే రేటింగ్స్. ఫిడే నెలాఖర్లో ప్రచురించే రేటింగ్స్కు వీటికి వ్యత్యాసం ఉంటుంది.కాగా, బుడాపెస్ట్ వేదికగా జరుగుతున్న చెస్ ఒలింపియాడ్ 2024లో పాల్గొంటున్న భారత చెస్ ప్లేయర్లు వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. ఈ టోర్నీలో భారత పురుషులు, మహిళల జట్లు వరుసగా ఆరో విజయాన్ని నమోదు చేశాయి. సోమవారం జరిగిన మ్యాచ్లో భారత పురుషుల జట్టు 3-1తో ఆతిథ్య హంగేరిని ఓడించింది. ఈ టోర్నీలో అర్జున్ ఎరిగైసి వరుసగా ఆరో విజయాన్ని నమోదు చేయగా.. రిచర్డ్తో జరిగిన గేమ్ను గుకేశ్ డ్రాగా ముగించాడు. మహిళల జట్టు 2.5-1.5 తేడాతో అర్మేనియాపై విజయం సాధించింది.చదవండి: కొరియాను చిత్తు చేసిన భారత్.. ఆరోసారి ఫైనల్లో -
‘మహిళల టోర్నీల సంఖ్య పెంచాలి’
న్యూఢిల్లీ: మహిళల చెస్కు మన దేశంలో మరింత ప్రోత్సాహం అందించాలని, లేదంటే రాబోయే రోజుల్లో మంచి ప్లేయర్లు రావడం తగ్గిపోతుందని భారత అగ్రశ్రేణి చెస్ క్రీడాకారిణి, వరల్డ్ ర్యాపిడ్ మాజీ చాంపియన్ కోనేరు హంపి అభిప్రాయ పడింది. ఇందులో భాగంగా ఎక్కువ సంఖ్యలో టోర్నీలు నిర్వహించాలని ఆమె సూచించింది. ఇటీవలి కాలంలో గుకేశ్, ప్రజ్ఞానంద తదితరుల ఆటతో పురుషుల విభాగంలో చెస్కు ప్రాచుర్యం బాగా పెరిగింది. అయితే మహిళల విభాగంలో మాత్రం పరిస్థితి అలా లేదు. ఇప్పటికి 37 ఏళ్ల హంపి, 33 ఏళ్ల ద్రోణవల్లి హారికలే ప్రపంచ వేదికపై మన చెస్ను నడిపిస్తున్నారు. ‘మహిళా చెస్ ప్లేయర్ల శాతం చాలా తక్కువగా ఉంది. మనం మరిన్ని మహిళా టోర్నీలు నిర్వహించాలని నా అభిప్రాయం. ప్రతిభావంతులను గుర్తించి వారికి శిక్షణ ఇవ్వాల్సిన అవసరం ఉంది. చెస్ భవిష్యత్తు కోసం ఇది ఎంతో ముఖ్యం. లేదంటే ఇద్దరు, ముగ్గురికి మించి టాప్ ప్లేయర్లు ఉండరు. రాబోయే తరంపై దృష్టి పెట్టకపోతే చెస్ ఆటగాళ్లు వెలుగులోకి రావడం కష్టంగా మారి అంతరం చాలా పెరిగిపోతుంది. వచ్చే 10–15 ఏళ్లలో కూడా మీకు మంచి ఆటగాళ్లు కనిపించరు’ అని హంపి ఆందోళన వ్యక్తం చేసింది. చైనాను చూసి నేర్చుకోవాలి భవిష్యత్ ఆటగాళ్లను ఎలా తయారు చేసుకోవాలనే విషయంలో చైనాను చూసి భారత్ ఎంతో నేర్చుకోవాలని హంపి వ్యాఖ్యానించింది. సోవియట్ యూనియన్ విడిపోయిన తర్వాత చైనా చెస్లో పవర్హౌస్గా ఎదిగిన విషయాన్ని ఆమె గుర్తు చేసింది. ‘ఈ విషయంలోనే భారత్, చైనాకు మధ్య చాలా తేడా ఉంది. చైనాలో ఒకరి తర్వాత మరొకరు కొత్త ప్లేయర్ వెంటవెంటనే వచ్చేస్తుంటారు. ఒక అగ్రశ్రేణి ప్లేయర్ కెరీర్ ముగుస్తున్న దశలో కొత్త తరం ఆటగాళ్లు సిద్ధంగా ఉంటారు. మన దేశంలో మహిళల చెస్పై ఫెడరేషన్ మరింత దృష్టి పెట్టాలి’ అని హంపి పేర్కొంది. కోవిడ్ సమయంలో ఇతర క్రీడా పోటీలన్నీ దాదాపుగా రద్దు కాగా... ఆన్లైన్ టోర్నీల కారణంగా చెస్ మాత్రమే బాగా ప్రజాదరణ పొందిందని హంపి చెప్పింది. ‘కోవిడ్ సమయాన్ని సానుకూలంగా వాడుకున్న క్రీడ చెస్ మాత్రమే. ఆ సమయంలో పెద్ద సంఖ్యలో ఆన్లైన్ టోర్నీలు జరిగాయి. ఇతర పనులేవీ లేకపోవడంతో ప్రేక్షకుల సంఖ్య కూడా పెరిగింది. ఆ సమయంలో మన దేశంలో చెస్ దూసుకుపోయింది కెప్టెన్. ప్రజ్ఞానంద, అర్జున్ ఇరిగేశి లాంటివారు కూడా కోవిడ్ సమయంలో పెద్ద సంఖ్యలో టోర్నీలు ఆడారు. తర్వాతి రోజుల్లో ఇదే జోరును కొనసాగించి వారి రేటింగ్ను మెరుగుపర్చుకున్నారు’ అని హంపి విశ్లేíÙంచింది. సరైన ప్రాక్టీస్ లేకనే... తన కూతురి వయసు పెరుగుతుండటంతో చెస్కు ఎక్కువ సమయం కేటాయించలేకపోతున్నానని హంపి వెల్లడించింది. ‘పాపకు ఇప్పుడు ఏడేళ్లు. ఆమెకు ఏడాది వయసు ఉన్నప్పుడైతే ఇంట్లో అమ్మ దగ్గర వదిలి టోర్నీలకు వెళ్లిపోయేదాన్ని. ఇప్పుడు అలా సాధ్యం కావడం లేదు. స్కూల్ హోమ్వర్క్, ఆటలు... ఎక్కడైనా నేను తనతో ఉండాలని ఆమె కోరుకుంటోంది. దాంతో ప్రాక్టీస్కు సమయం లభించక టోర్నీలకు దూరమవుతున్నా. అయితే అమ్మగా మారిన తర్వాత నా ఆలోచనల్లో చాలా మార్పు వచ్చింది. అంతకుముందు చిన్నపాటి అంతరాయం వచ్చినా నా ఏకాగ్రత చెదిరిపోయేది. ఇప్పుడు అలా కాదు. గతంలో ఎలాగైనా గెలవాలనే లక్ష్యంతోనే ఆడేదాన్ని. ఇప్పుడు స్థితప్రజ్ఞత వచ్చింది’ అని ఈ ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ వివరించింది. ప్రస్తుతం బుడాపెస్ట్లో జరుగుతున్న ఒలింపియాడ్కు దూరంగా ఉన్న హంపి త్వరలో జరిగే గ్లోబల్ చెస్ లీగ్లో ముంబా మాస్టర్స్ తరఫున బరిలోకి దిగనుంది. ఆ తర్వాత కజకిస్తాన్లో జరిగే మహిళల గ్రాండ్ప్రి, టాటా స్టీల్ ర్యాపిడ్, బ్లిట్జ్ ఈవెంట్లలో ఆడుతుంది. -
గుకేశ్ ఖాతాలో ఏడో ‘డ్రా’
సెయింట్ లూయిస్: సింక్ఫీల్డ్ కప్ అంతర్జాతీయ క్లాసికల్ చెస్ టోర్నమెంట్లో భారత గ్రాండ్మాస్టర్లు దొమ్మరాజు గుకేశ్, ప్రజ్ఞానంద వరుసగా ఏడో ‘డ్రా’ నమోదు చేశారు. టాప్ సీడ్, ప్రపంచ మూడో ర్యాంకర్ ఫాబియానో కరువానా (అమెరికా)తో జరిగిన గేమ్ను గుకేశ్ 60 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకున్నాడు. ఇయాన్ నిపోమ్నిషి (రష్యా)తో జరిగిన గేమ్ను ప్రజ్ఞానంద 19 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించాడు. పది మంది మేటి గ్రాండ్మాస్టర్ల మధ్య తొమ్మిది రౌండ్లపాటు జరుగుతున్న ఈ టోర్నీలో అలీరెజా ఫిరూజా (ఫ్రాన్స్) ఐదు పాయింట్లతో ఒంటరిగా అగ్రస్థానంలో ఉన్నాడు. నాలుగు పాయింట్లతో కరువానా రెండో స్థానంలో నిలిచాడు. 3.5 పాయింట్లతో గుకేశ్, మాక్సిమి లాచెర్ (ఫ్రాన్స్), నొదిర్బెక్ అబ్దుసత్తరోవ్ (ఉజ్బెకిస్తాన్), వెస్లీ సో (అమెరికా), ప్రజ్ఞానంద సంయుక్తంగా మూడో స్థానంలో ఉన్నారు. -
జాతీయ ఓపెన్ చెస్ చాంపియన్ కార్తీక్ వెంకటరామన్
ఆద్యంతం అజేయంగా నిలిచిన ఆంధ్రప్రదేశ్ గ్రాండ్మాస్టర్ కార్తీక్ వెంకటరామన్ జాతీయ సీనియర్ చెస్ చాంపియన్గా అవతరించాడు. హరియాణాలోని గురుగ్రామ్లో జరిగిన ఈ టోర్నీ మంగళవారం ముగిసింది. నిర్ణీత 11 రౌండ్లకుగాను కార్తీక్తోపాటు సూర్యశేఖర గంగూలీ (పెట్రోలియం స్పోర్ట్స్ ప్రమోషన్ బోర్డు), నీలేశ్ సాహా (రైల్వేస్) 9 పాయింట్లతో ఉమ్మడిగా అగ్రస్థానంలో నిలిచారు. అయితే మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా ర్యాంకింగ్ను వర్గీకరించగా... కార్తీక్కు టైటిల్ వరించింది. కార్తీక్కు రూ. 6 లక్షలు ప్రైజ్మనీ లభించింది. అంతేకాకుండా 2025 ప్రపంచకప్ టోర్నీకి భారత్ తరఫున కార్తీక్ అర్హత సాధించాడు. సూర్యశేఖర గంగూలీ రన్నరప్గా నిలువగా, నీలేశ్ సాహా మూడో స్థానం దక్కించుకున్నాడు. మిత్రబా గుహ (రైల్వేస్)తో జరిగిన చివరిదైన 11వ రౌండ్ గేమ్లో నల్లపావులతో ఆడిన కార్తీక్ 58 ఎత్తుల్లో గెలిచాడు. కార్తీక్కిది రెండో జాతీయ టైటిల్. 2022లో అతను తొలిసారి జాతీయ చాంపియన్షిప్ టైటిల్ సాధించాడు. -
డింగ్ లిరెన్తో గుకేశ్ గేమ్ ‘డ్రా’
సెయింట్ లూయిస్ (అమెరికా): సింక్ఫీల్డ్ కప్ క్లాసికల్ చెస్ టోర్నమెంట్ను భారత యువ గ్రాండ్మాస్టర్ దొమ్మరాజు గుకేశ్ ‘డ్రా’తో ప్రారంభించాడు. ప్రస్తుత ప్రపంచ చాంపియన్ డింగ్ లిరెన్ (చైనా)తో జరిగిన తొలి రౌండ్ గేమ్ను గుకేశ్ 28 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించాడు. డింగ్ లిరెన్, గుకేశ్ మధ్య ఈ ఏడాది నవంబర్లో సింగపూర్ వేదికగా ప్రపంచ చాంపియన్షిప్ మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో వీరిద్దరు తలపడటం ఆసక్తిని కలిగించింది.భారత్కే చెందిన మరో గ్రాండ్మాస్టర్ ప్రజ్ఞానంద కూడా తన తొలి గేమ్ను ‘డ్రా’ చేసుకున్నాడు. నొదిర్బెక్ అబ్దుసత్తరోవ్ (ఉజ్బెకిస్తాన్)తో జరిగిన గేమ్ను ప్రజ్ఞానంద 36 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించాడు. మొత్తం పది మంది మేటి గ్రాండ్మాస్టర్లు ఫాబియానో కరువానా (అమెరికా), అలీరెజా ఫిరూజా (ఫ్రాన్స్), వెస్లీ సో (అమెరికా), అనీశ్ గిరి (నెదర్లాండ్స్), డింగ్ లిరెన్ (చైనా), ఇయాన్ నెపోమ్నిషి (రష్యా), మాక్సిమి వాచెర్ లెగ్రావ్ (ఫ్రాన్స్), నొదిర్బెక్ మధ్య తొమ్మిది రౌండ్లపాటు ఈ టోర్నీ జరుగుతోంది. -
భారత చెస్ చరిత్రలో చారిత్రక ఘట్టం
భారత చెస్ చరిత్రలో చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. ఫిడే రేటింగ్ లిస్ట్లో (ర్యాంకింగ్స్) తొలిసారి ముగ్గురు భారత గ్రాండ్మాస్టర్లు టాప్-10లో నిలిచారు.2024 జులై నెల ర్యాంకింగ్స్లో అర్జున్ ఎరిగైసి నాలుగో స్థానంలో, డి గుకేశ్ ఏడులో, ఆర్ ప్రజ్ఞానానంద ఎనిమిదో స్థానంలో నిలిచారు. భారతీయ చెస్ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ 11వ స్థానంలో నిలిచాడు. అరవింద్ చితంబరం ఏకంగా 18.5 ఎలో రేటింగ్ పాయింట్లు మెరుగుపర్చుకుని 44వ స్థానం నుంచి 29 స్థానానికి ఎగబాకాడు. జులై నెల పురుషుల రేటింగ్ లిస్ట్ టాప్ 100 జాబితాలో ఏకంగా పది మంది భారతీయులు (అర్జున్ ఎరిగైసి, డి గుకేశ్, ప్రజ్ఞానంద, విశ్వనాథన్ ఆనంద్, విదిత్ సంతోష్ గుజరాతీ, అరవింద్ చితంబరం, హరికృష్ణ పెంటల, నిహాల్ సరిన్, ఎస్ ఎల్ నారాయణన్, సద్వాని రౌనక్) ఉండటం గమనార్హం.మహిళల ర్యాంకింగ్స్ విషయానికొస్తే.. జులై నెల రేటింగ్ లిస్ట్ టాప్-14లో ముగ్గురు భారతీయులు ఉన్నారు. ద్రోణవల్లి హారిక రెండో స్థానాన్ని తిరిగి కైవసం చేసుకుంది. ఇటీవలే బాలికల జూనియర్ వరల్డ్ టైటిల్ను గెలిచిన దివ్య దేశ్ముఖ్ నాలుగు స్థానాలు మెరుగుపర్చుకుని 24వ స్థానం నుండి 20వ స్థానానికి ఎగబాకింది. -
ప్రతిష్టాత్మక చెస్ టైటిల్ను కైవసం చేసుకున్న అర్జున్ ఎరిగైసి
భారత టాప్ రేటెడ్ చెస్ గ్రాండ్మాస్టర్, వరల్డ్ నంబర్ 4 అర్జున్ ఎరిగైసి ప్రతిష్టాత్మక స్టెపాన్ అవగ్యాన్ మెమోరియల్ 2024 టైటిల్ను కైవసం చేసుకున్నాడు. ఆర్మేనియాలోని జెర్ముక్లో జరిగిన ఈ టోర్నీని అర్జున్ మరో రౌండ్ మిగిలుండగానే గెలుచుకున్నాడు. ఎనిమిదో రౌండ్లో తెల్ల పావులతో ఆడిన అర్జున్.. రష్యాకు చెందిన వోలోడర్ ముర్జిన్ను 63 ఎత్తులో చిత్తు చేశాడు. తద్వారా ఐదో స్టెపాన్ అవగ్యాన్ మెమోరియల్ టైటిల్ను సొంతం చేసుకున్నాడు. మొత్తం 10 మంది ఆటగాళ్లు పాల్గొన్న ఈ టోర్నీలో అర్జున్ ఆరు పాయింట్లు సాధించి అగ్రస్థానంలో నిలువగా.. రెండో స్థానంలో నిలిచిన ముగ్గురు ప్లేయర్లు 4.5 పాయింట్లు సాధించారు. నామమాత్రపు చివరి రౌండ్లో అర్జున్ లోకల్ బాయ్ మాన్యుయల్ పెట్రోస్యాన్తో తలపడతాడు.ఈ టోర్నీలో అర్జున్ నాలుగు విజయాలు, నాలుగు డ్రాలతో తొమ్మిది ఎలో రేటింగ్ పాయింట్లు సాధించి, ఓవరాల్గా తన రేటింగ్ పాయింట్ల సంఖ్యను 2779.9కు పెంచుకున్నాడు. ప్రస్తుతం ప్రపంచ ర్యాంకింగ్స్లో మాగ్నస్ కార్ల్సన్ (2831.8), హకారు నకమురా (2801.6), ఫాబియానో కరువానా (2795.6) టాప్-3లో ఉన్నారు. మూడో స్థానంలో ఉన్న ఫాబియానోకు అర్జున్కు కేవలం 16 రేటింగ్ పాయింట్లే తేడా ఉన్నాయి. -
వరల్డ్ చెస్ ఛాంపియన్షిప్ను కైవసం చేసుకున్న దివ్య
గుజరాత్లోని గాంధీ నగర్లో జరిగిన ప్రతిష్టాత్మక వరల్డ్ జూనియర్ (అండర్-20 అమ్మాయిల విభాగం) చెస్ ఛాంపియన్షిప్ పోటీల్లో భారత నంబర్ 3 క్రీడాకారిణి దివ్య దేశ్ముఖ్ విజేతగా నిలిచింది. 18 ఏళ్ల దివ్య.. ఫైనల్ రౌండ్లో బల్గేరియాకు చెందిన బెలొస్లావా క్రస్టేవాపై విజయం సాధించి వరల్డ్ ఛాంపియన్షిప్ను సొంతం చేసుకుంది. మొత్తం 11 పాయింట్లకు గానూ 10 పాయింట్లు సాధించిన దివ్వ టాప్ ప్లేస్లో నిలిచింది.ఈ పోటీలో దివ్య తెల్ల పావులతో బరిలోకి దిగింది. గత నెలలో షార్జా ఛాలెంజర్స్ టైటిల్ గెలిచిన తర్వాత దివ్యకు ఇది వరుసగా రెండో టైటిల్ కావడం విశేషం. వరల్డ్ ఛాంపియన్షిప్ పోటీల్లో దివ్య తర్వాతి స్థానంలో 20 ఏళ్ల ఆర్మేనియా క్రీడాకారిణి మరియమ్ నిలిచింది. మరియమ్ 11 పాయింట్లకు గాను 9.5 పాయింట్లు సాధించింది. మూడో స్థానంలో అజర్ బైజాన్కు చెందిన అయాన్ అల్లావెర్దియేవా నిలిచింది. ఈమె ఖాతాలో 8.5 పాయింట్లు ఉన్నాయి. భారత్కు చెందిన షుబి గుప్తా, రక్షిత రవి 8, 7.5 పాయింట్లతో నాలుగు, ఐదు స్థానాల్లో నిలిచారు. ఈ టోర్నీలో అజేయంగా నిలిచిన దివ్య రెండు డ్రాలు, తొమ్మిది విజయాలు సాధించి, తన ఎనిమిదో జూనియర్ టైటిల్ను కైవసం చేసుకుంది. -
ఐదేళ్ల వయసులోనే అబ్బురపరిచే ప్రతిభ.. అరుదైన ఘనత
సాక్షి, హైదరాబాద్: ఐదేళ్ల వయసులోనే ఓ చిచ్చర పిడుగు అద్బుతం చేసింది. కేవలం 9.23 నిమిషాల్లో 104 చెక్మేట్-ఇన్-వన్-మూవ్ పజిల్స్ను పరిష్కరించి వహ్వా అనిపించింది. చెస్ ప్రాడిజీ ఇషాని చక్కిలం ఈ ఘనత సాధించింది. ఇషాని నమోదు చేసిన ఈ ఫీట్ను వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్, లండన్ అధికారికంగా గుర్తించాల్సి ఉంది. కాగా ఇషాని.. రాయ్ చెస్ అకాడమీకి చెందిన ప్రతిభావంతులైన విద్యార్థిని. అసాధారణమైన నైపుణ్యం, దృఢ సంకల్పంతో చిన్న వయసులోనే ఈ అద్బుతం చేసింది. ఆమెలో దాగున్న ప్రతిభను గుర్తించిన తల్లిదండ్రులు శ్రీకాంత్- శ్రావ్య చక్కిలం విజయవంతంగా ముందుకు సాగేలా ప్రోత్సాహం అందిస్తున్నారు.రాయదుర్గంలో జరిగిన ఈ ఈవెంట్కు మంత్రి కొండా సురేఖతో పాటు బ్రిటిష్ డిప్యూటీ హై-కమిషనర్ గారెత్ విన్ ఓవెన్ కూడా హాజరయ్యారు. ఇషాని ప్రతిభకు ముగ్ధులై ఆమెను ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో చెస్ క్రీడాకారులు, కోచ్లు, ఇషాని బంధువులు, స్నేహితులు కూడా పాల్గొన్నారు. -
సక్సెస్కి ఏజ్తో సంబంధం లేదంటే ఇదేనేమో..! ఏకంగా ఫిడే చెస్..
చెస్ స్టార్ జియానా గార్గ్ అతి పిన్న వయస్కురాలైన చెస్ ఛాంపియన్. అతి చిన్న వయసులోనే అంతర్జాతీయ ఫిడే(ప్రపంచ చెస్ సమాఖ్య) రేటింగ్ పొంది అందర్నీ ఆశ్చర్యచకితుల్ని చేసింది. అంతేగాదు అత్యంత చిన్న వయసులో ఈ రేటింగ్ పొందిన చిన్నారిగా నిలిచి అందరి దృష్టిని ఆకర్షించింది. ఐదేళ్ల వయసులో అత్యున్నత అంతర్జాతీయ ప్రపంచ చెస్ సమాఖ్య రేటింగ్ని పొందిన మహిళా క్రీడాకారిణిగా రికార్డు సృష్టించింది. అమె చెస్ జర్నీ ఎలా సాగిందంటే..జియానా గార్గ్ సాధించిన ఫిడే చెస్ రెటింగ్ నిజంగా అసాధారణమైనది. అత్యధిక ఫీడే చెస్ రేటింగ్ సాధించిన ప్రపంచంలోనే అతి పిన్న వయస్కురాలు ఆమె. ఈ విజయాన్ని చూస్తే జియానాకు చదరంగం పట్ల ఉన్న ఇష్టం, అంకితభావం క్లియర్గా తెలుస్తోంది. ఆమె చెస్ నేర్చుకోవడం ప్రారంభించింది కేవలం నాలుగున్నరేళ్ల నుంచే..చాలా వేగంగా ఈ క్రీడలో అపార జ్ఞానాన్ని సంపాదించింది. ఈ విజయంలో జియాని గురువు నవీన్ బన్సాల్ పాత్ర ఎక్కువే ఉంది. చండీగఢ్ చెస్ అసోసీయేషన్ వైస్ ప్రెసిడెంట్ అయిన నవీన్ బన్సాల్ మొదట్లో ఇంత చిన్న వయసులో ఉన్న ఆ చిన్నారికి చెస్ నేర్పించడానికి చాలా సంకోచించాడు. ఎందుకంటే..?ఐదేళ్ల కంటే తక్కువ వయసు ఉన్న చిన్నారులకు చెస్ ఎట్టిపరిస్థితుల్లో నేర్పించరు. అందువల్ల ఆయన ముందుకు రాలేకపోయినా..జియానాలో ఉన్న ప్రతిభ ఆయన్ను ఆకర్షించింది. ఆమెకు చెస్ మెళుకువలు నేర్పించేలా చేసింది. అదీగాక జియానా అమ్మ కూడా తన కూతురు క్రమశిక్షణతో ఉంటుందని ఒప్పించేలా ఒక వీడియో కూడా తనకు పంపినట్లు తెలిపారు. ఐతే ఆమె కొన్ని నెలల శిక్షణలోనే చెస్అ డ్వాన్స్డ్ బ్యాచ్లో పదోన్నతి పొందింది. "తను నా ఉపన్యాసాలను వినేలా అత్యంత అధునాతన బ్యాచ్లో ఉంచి మరీ కోచింగ్ ఇప్పించాం. ఐతే ఆమె అనుహ్యంగా మంచి రేటింగ్ ఉన్న ఇతర పిల్లలతో సమానంగా పోటీ పడటం ప్రారంభించిదని గుర్తించి, ఆమెకు చక్కటి తర్ఫీదు ఇచ్చామని చెప్పారు". బన్సాలీ. ఆమె ఇంతలా చెస్పై అంకితభావంతో నేర్చుకునేలా దృష్టిసారించడంలో జియానా తల్లి పాత్ర అద్భుతమైనదని అన్నారు. తల్లిదండ్రులు సహకారం లేకుండా ఏ కోచ్ కూడా ఇంత చిన్న వయసులోనే చెస్ ఛాంపియన్లుగా తీర్చిదిద్దలేరని అన్నారు.జియానా చెస్ విజయాలు..జియానా గార్గ్ మ్యాట్రిక్స్ కప్ ఇంటర్నేషనల్ ఓపెన్ ఫైడ్ రేటెడ్ చెస్ టోర్నమెంట్ 2024, నేషనల్ అండర్-11 గర్ల్స్ చెస్ ఛాంపియన్షిప్-2023, మొదటి మ్యాట్రిక్స్ కప్ ఇంటర్నేషనల్ ఓపెన్ ఫైడ్ రేటింగ్ చెస్ టోర్నమెంట్ 2023, మొదటి లేట్ శ్రీ ధీరాజ్ సింగ్ మెమోర్ ఓపెన్ రఘువానిడే, రేటింగ్ టోర్నమెంట్ 2023 వంటి అనేక టోర్నమెంట్లలో పాల్గొంది. ఆమె తను గురువుల మార్గదర్శకత్వంలో చేసిన అచంచలమైన కృషి, అంకితభావాలకి నిదర్శనమే ఈ విజయాల పరంపర. అంతేగాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న చదరంగా ఔత్సాహికులకు స్పూర్తిగా నిలిచింది. పైగా ఈ పురాతన చెస్ క్రీడలో రాణించడానికి వయసు ఏ మాత్రం అడ్డంకి కాదని ప్రూవ్ చేసింది.(చదవండి: 'రజనీకాంత్ స్టైల్ దోసలు': చూస్తూనే ఉండిపోతారు..!) -
చెస్ ఆడటం వల్ల కలిగే ప్రయోజనాలు
చెస్ అనేది అనేక ప్రయోజనాలను అందించి, మేధో సంపత్తిని పెంపొందిచే మనోహరమైన క్రీడ. ఈ క్రీడను క్రమం తప్పకుండా ఆడటం వల్ల కలిగే కొన్ని ప్రయోజనాల గురించి ఇక్కడ తెలుసుకుందాం.దృక్కోణం పెరుగుతుంది: చెస్కు క్రమం తప్పకుండా ఆడటం వల్ల వ్యక్తుల యొక్క దృక్కోణం పెరుగుతుంది. ఇలా చేయడం వల్ల ఎదుటివారి కదలికలను సులువుగా పసిగట్టవచ్చు. సామాజిక సంబంధాలు మెరుగుపర్చుకోవడంలో చెస్ క్రీడ కీలకపాత్ర పోషిస్తుంది.జ్ఞాపకశక్తి మెరుగుపడుతుంది: ప్రతి రోజు కొంత సమయం పాటు చెస్ ఆడటం వల్ల జ్ఞాపకశక్తి మెరుగుపడుతుంది. చెస్ అనునిత్యం ఆడటం వల్ల దృశ్య నమూనాలను మరింత త్వరగా గుర్తిస్తారు.చురుకుదనం పెరుగుతుంది: చెస్ ఆడటంలో నైపుణ్యం కలిగిన వారు ఇతరులతో పోలిస్తే మానసిక చురకుదనం ఎక్కువగా కలిగి ఉంటారు. వీరి మానసిక స్థితి అథ్లెట్లు, కళాకారుల మాదిరిగా ఉంటుంది.ప్రణాళికా నైపుణ్యాలను పెంచుతుంది: చెస్ క్రమం తప్పకుండా ఆడటం వల్ల ప్రణాళికా నైపుణ్యం, దూరదృష్టి పెరుగుతాయి. ఆలోచనా సామర్థ్యం మెరుగుపడుతుంది.స్వీయ-అవగాహన పెరుగుతుంది: చెస్ ఆడటం వల్ల స్వీయ అవగాహన పెరుగుతుంది. దీని వల్ల మనల్ని మనం విశ్లేషించుకోవచ్చు. మన తప్పులు మనం తెలుసుకోగలుగుతాం.వృద్దాప్యంలో తోడ్పడుతుంది: మానసిక ఉత్తేజాన్ని కలిగించే చెస్ను క్రమం తప్పకుండా ఆడటం వల్ల వృద్దాప్యంలో ఎదురయ్యే మేధస్సు క్షీణత వంటి సమస్యల నుంచి తప్పించుకోవచ్చు.ఏకాగ్రత సాధించేందుకు దోహదపడుతుంది: చెస్ అనునిత్యం ఆడటం వల్ల ఏకాగ్రత లోపం సమస్య నుంచి బయటపడవచ్చని అధ్యయనాలు చెబుతున్నాయి.భయాందోళనలను తగ్గిస్తుంది: చెస్ ఆడే సమయంలో చూపే ఏకాగ్రత కారణంగా భయాందోళనలు తగ్గుతాయి.పిల్లల్లో జ్ఞాపకశక్తి, ఏకాగ్రత పెరుగుతాయి: చిన్నతనం నుంచి చెస్ ఆడటం అలవాటు చేసుకోవడం వల్ల జ్ఞాపకశక్తి, ఏకాగ్రత పెరుగుతాయి. -
ATA Convention 2024: అదరహో అన్నట్టుగా సాగుతున్న ‘ఆటా’ ఆటల పోటీలు
కన్వెన్షన్ అంటే సాంస్కృతిక, నృత్య, సాహిత్య, సంగీత కలాపాలు, కొత్త పరిచయాలు, ప్రముఖ వ్యక్తుల సందడి, మంచి ఆహారం, జ్ఞానాన్ని పెంపొందించే సదస్సుల వంటి ఎన్నో గొప్ప కార్యక్రమాల సమూహం. ఈ ఆటా (అమెరికన్ తెలుగు అసోసియేషన్) వారు మామూలు వాళ్ళు కాదండోయ్.. ఆటపాటలతో పాటు ఆరోగ్యమే మహా భాగ్యమన్న రీతిలో అమెరికాలోని పలు నగరాలలో మెగాఆటా కన్వెన్షన్(18వ) నిర్వహించనుంది.యూత్ కాన్ఫరెన్స్లో భాగంగా అసాధారణమైన ప్రతిభ, క్రీడాస్ఫూర్తి, సమాజ స్ఫూర్తిని ప్రదర్శించే థ్రిల్లింగ్ స్పోర్ట్స్ ఈవెంట్లను నిర్వహిస్తోంది. ఇందులో పాల్గొన్న వారికి.. అదే విధంగా ప్రేక్షకులకు చిరస్మరణీయమైన క్షణాలను అందిస్తోంది. బ్యాడ్మింటన్, వాలీబాల్, క్యారమ్స్, క్రికెట్, చెస్ వంటి పురుషులు / బాలురు మరియు మహిళలు / బాలికల కోసం చేస్తున్న వివిధ క్రీడలు వైవిధ్యభరితంగా, ఉత్సాహ పూరితంగా సాగడం ఆటా వారి బహుముఖ తత్వాన్ని తెలియజేస్తున్నాయి. ఈ కన్వెన్షన్ ఈవెంట్ జూన్ 7న మొదలుకానుంది. అందరూ ఆహ్వానితులే, మరిన్ని వివరాలకు, టికెట్లకు www.ataconference.org ని సందర్శించాలని ఆటా తెలిపింది.కాగా ఆటా స్పోర్ట్స్ టీమ్ నేతృత్వంలో సువానీలోని ఏబిసి సెంటర్లో జరిగిన ఆటా బ్యాడ్మింటన్ పురుషుల డబుల్స్ టోర్నమెంట్లో వివిధ విభాగాల్లో దాదాపు 160 రిజిస్ట్రేషన్లు జరిగాయి. ముఖ్యంగా ఇంటర్మీడియట్, ఓపెన్ సెమీఫైనల్స్, ఫైనల్స్లో పోటీ తీవ్రంగా ఉండటం క్రీడాస్ఫూర్తిని మరింత పెంచింది.ఇక షేఖరాగ్ పార్క్లో జరిగిన క్రికెట్ టోర్నమెంట్ సరే సరి.. అధిక సంఖ్యలో ఆటగాళ్లు పాల్గొనడం.. మునుపెన్నడూ లేనన్ని జట్లు ముందుకు రావడం వల్ల ప్రేక్షకుల ఆనందానికి అవధుల్లేకుండా పోయింది.అదే విధంగా... పలు రాష్ట్రాల నుండి దాదాపు 200 మందికి పైగా పిల్లలు, పెద్దలు పాల్గొన్న చదరంగం టోర్నమెంట్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇది చెస్ట్రోనిక్స్ ద్వారా సులభతరం చేయబడింది. ఆటా కన్వెన్షన్లో భాగంగా చెస్ టోర్నమెంట్ నిర్వహించడం ఇదే తొలిసారి కావడం విశేషం.ఫౌలర్ పార్క్ రెక్ సెంటర్లో జరిగిన ఆటా మహిళల పికిల్ 8బాల్ టోర్నమెంట్ అన్ని ఈవెంట్లలోకి హైలైట్ అని చెప్పవచ్చు. నీతూ చౌహాన్ నేతృత్వంలో ఆటా మహిళా స్పోర్ట్స్ టీమ్ నిర్వహించిన ఈ టోర్నమెంట్లో సింగిల్స్, డబుల్స్ విభాగాలు అన్ని స్కిల్ లెవెల్స్ ప్లేయర్లకు జరిగాయి.ఆటా మహిళల బ్యాడ్మింటన్ టోర్నమెంట్ విభిన్న నేపథ్యాలు మరియు నైపుణ్య స్థాయిల క్రీడాకారులను ఒకచోట చేర్చింది. ఈ ఈవెంట్ ప్రారంభ మరియు మధ్య స్థాయిలలో సింగిల్స్ మరియు డబుల్స్ విభాగాలను కలిగి ఉంది, పాల్గొన్న వారికి వ్యక్తిగతంగా, జట్టులో భాగంగా పోటీ చేసే అవకాశాన్ని అందించింది.స్పోర్ట్స్ కమిటీ ఛైర్ అనంత్ చిలుకూరి, ఉమెన్స్ స్పోర్ట్స్ ఛైర్ నీతూ మాట్లాడుతూ.. ‘‘ ఇటీవలి స్పోర్ట్స్ ఈవెంట్ల విజయంతో మేము చాలా సంతోషంగా ఉన్నాము. ఆటగాళ్ల ప్రతిభ, క్రీడాస్ఫూర్తి స్థాయి నిజంగా స్ఫూర్తిదాయకంగా ఉంది. ఈ ఈవెంట్లను అద్భుతంగా విజయవంతం చేసినందుకు క్రీడాకారులు, నిర్వాహకులు, వాలంటీర్లు, స్పాన్సర్లతో సహా పాల్గొన్న ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఇలాంటివి మున్ముందు మరిన్ని జరగబోతున్నాయి’’ అని తెలిపారు.కాగా స్పోర్ట్స్ కమిటీలు, రీజనల్ కోఆర్డినేటర్లు అనంత్ చిలుకూరి, నీతూ చౌహాన్, శ్రీకాంత్ పాప, వెంకట్ రోహిత్, రంజిత్ చెన్నాడి, హరికృష్ణ సికాకొల్లి, సుభాష్ ఆర్ రెడ్డి, , శ్రీనివాస్ పసుపులేటి, సతీష్ రెడ్డి అవుతు, దివ్య నెట్టం, సరిత చెక్కిల, వాసవి చిత్తలూరి వంటి ఎంతో మంది అంకితభావం మరియు కృషి వల్లే సాధ్యమైంది. ఖచ్చితమైన ప్రణాళిక మరియు పకడ్బందీగా అమలు చేయడం వల్ల అందరికీ గొప్ప అనుభూతిని మిగులుస్తోంది.ఆటా కాన్ఫరెన్స్ బృందం భవిష్యత్తులో మరింత ఆకర్షణీయమైన మరియు పోటీతత్వ స్పోర్ట్స్ ఈవెంట్లను నిర్వహించడం, సంఘంలో స్నేహపూర్వక మరియు ఆరోగ్యకరమైన పోటీని పెంపొందించడం కోసం ఎల్లప్పుడూ పరితపిస్తూ ఉంటుంది. బహుమతుల పంపిణీ కన్వెన్షన్ లో విచ్చేసిన ప్రముఖుల సమక్షంలో, భారీ జనసందోహం ముందు జరగబోతున్నది. అలానే, ఆటా వారు అందరికీ స్నాక్స్, బెవరేజెస్ మరియు భోజనం అందించారు. అందరూ తప్పకుండా రండి, కలిసి మెలిసి మన ఆటా కన్వెన్షన్ ని ఆడుతూ, పాడుతూ జరుపుకుందామని ఆటా పిలుపునిస్తోంది. -
శ్రీ సాంస్కృతిక కళాసారథి ఆధ్వర్యంలో లెర్న్ చెస్ అకాడెమీ వార్షిక చెస్ టోర్నమెంట్
సింగపూర్లో ప్రముఖ చెస్ శిక్షణ సంస్థ అయిన “లెర్న్ చెస్ అకాడమీ”(Learn Chess Academy) మే 1వ తేదీన వార్షిక చెస్ టోర్నమెంట్ నిర్వహించడం ద్వారా యువ చెస్ ప్రతిభను పెంపొందించే ప్రయత్నం చేసారు. ఈ టోర్నమెంట్లో 6 నుండి 15 సంవత్సరాల వయస్కులైన సుమారు 50 మంది విద్యార్థులు పాల్గొన్నారు. అండర్ 6, 8, 10, 12 ,13 ఏళ్ల పైబడినవారు ఇలా ఐదు విభాగాలలో పోటీపడ్డారుఅపార అనుభవం కలిగిన ప్రొఫెషనల్ చెస్ కోచ్ మురళి కృష్ణ చిత్రాద స్థాపించిన ఈ “లెర్న్ చెస్ అకాడమీ”, 15 సంవత్సరాల నుండి నిరంతరంగా చిన్న పిల్లలకు మరియు యువకులకు చదరంగం ఆటలో శిక్షణ ఇస్తోంది. ఈ టోర్నమెంట్ కేవలం పోటీకి మాత్రమే కాకుండా, విద్యార్థులు తమ వ్యూహాత్మక నైపుణ్యాలను ప్రదర్శించే వేదికగా కూడా నిలిచింది.ఈ కార్యక్రమం బహుమతి పంపిణీ కార్యక్రమంలో, టాటా ఇంటర్నేషనల్ సింగపూర్ ఛైర్మన్ , ఏసియన్ ఫార్మర్ రెసిడెంట్ డైరెక్టర్, ది సింగపూర్ ఇండియన్ డెవలప్మెంట్ అసోసియేషన్ (SINDA) టర్మ్ ట్రస్టీ, సింగపూర్ ఇండియన్ ఫైన్ ఆర్ట్స్ సొసైటీ (SIFAS) అధ్యక్షుడు, అయిన కె.వి.రావు గౌరవ అతిథిగా పాల్గొన్నారు. విశిష్ట అతిథిగా అనుజ్ ఖన్నా సోహమ్, AFFLE గ్రూప్ వ్యవస్థాపకుడు పాల్గొన్నారు.విద్యార్థుల విభిన్న ప్రతిభాపాటవాల ప్రదర్శనతో పాటు, వివిధ వినోదాత్మక కార్యక్రమాలతో, ఉత్సాహంగా జరిగింది. ముఖ్యంగా విద్యార్థులు చెస్ థీమ్ స్కిట్, రూబిక్స్ క్యూబ్ సొల్యూషన్ లాంటి, టాలెంట్ షో, ప్రత్యేకమైన క్యాలెండర్ గేమ్ , క్విజ్ ప్రత్యేక ఆకర్షణలుగా నిలిచాయి.యువతలో సమస్యా పరిష్కార నైపుణ్యాలను, నిర్ణయం తీసుకునే నైపుణ్యాలు అభివృద్ధి చేయడంలో చెస్ ప్రాముఖ్యతను మురళి కృష్ణ చిత్రాడ వివరించారు. "సౌందర్య కనగాల" యాంకరింగ్ ఆకట్టుకుంది.శ్రీ సాంస్కృతిక కళాసారథి అధ్యక్షులు రత్న కుమార్ కవుటూరు, సింగపూర్ తెలుగు సమాజం ఉపాధ్యక్షుడు డాక్టర్ నాగేష్ మరియు గోపి చిరుమామిళ్ల తదితర ప్రముఖులు విజేతలకు బహుమతులు అందజేసారు. -
విశ్వ వేదికపై భారత కీర్తి పతాకను రెపరెపలాడించిన చెస్ చిచ్చరపిడుగులు
భారత చెస్ చిచ్చరపిడుగులు విశ్వ వేదికపై భారత కీర్తి పతాకను రెపరెపలాడించారు. తెలంగాణకు చెందిన దివిత్ రెడ్డి అడుల్లా బాలుర అండర్-8 ర్యాపిడ్ పోటీల్లో స్వర్ణ పతకాన్ని (10/11), బ్లిట్జ్లో కాంస్యాన్ని (8.5/11)సాధించగా.. తమిళనాడుకు చెందిన శర్వానికా ఏ ఎస్ బాలికల అండర్-10 ర్యాపిడ్లో బంగారు పతకాన్ని (9/11), బ్లిట్జ్లో రతజ పతకాన్ని (9/11) సాధించింది. అతి చిన్న వయసులోనే అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటడంతో ఈ ఇద్దరు చిన్నారులపై ప్రశంసల వర్షం కురుస్తుంది. వీరిద్దరిని భావి భారత గ్రాండ్మాస్టర్లని చెస్ అభిమానులు కొనియాడుతున్నారు. దివిత్ రెడ్డి ప్రస్తుతం తెలంగాణ అండర్-7, అండర్-9 ఓపెన్ ఛాంపియన్గా ఉన్నాడు. శర్వానికా ఇటీవల జరిగిన కామన్వెల్త్ క్రీడల (2023-24) అండర్-10 బాలిక విభాగంలో గోల్డ్ మెడల్ సాధించింది. Victory for Bharat 🇮🇳 at the World Rapid & Blitz Cadet Chess 2024! Sharvaanica A S shines with Gold in U-10 Rapid & Silver in Blitz, while Divith Reddy Adulla seizes Gold in U-8 Rapid & Bronze in Blitz. Their moves are making history! Cheers to their success and the bright… pic.twitter.com/lTYp1QvuSr— Nitin Narang (@narangnitin) April 30, 2024 ర్యాపిడ్ అండర్-8 ఓపెన్లో ప్రపంచవ్యాప్తంగా 22 దేశాల నుంచి మొత్తం 59 మంది క్రీడాకారులు, అండర్-10 బాలికల విభాగంలో 19 దేశాల నుంచి 43 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. అండర్-8 ఓపెన్ బ్లిట్జ్లో 22 దేశాల నుంచి 51 మంది క్రీడాకారులు, అండర్-10 బాలికల బ్లిట్జ్ విభాగంలో 18 దేశాల నుంచి 41 మంది క్రీడాకారులు పాల్గొన్నారు.2024 ఏప్రిల్ 26 నుండి 28 వరకు అల్బేనియాలోని గ్రాండ్ బ్లూ FAFA రిసార్ట్లో (డ్యూరెస్) ఈ పోటీలు జరిగాయి. ఈ పోటీలను ఫిడే, అల్బేనియా చెస్ ఫెడరేషన్ నిర్వహించాయి. -
చెస్ గ్రాండ్మాస్టర్ల కర్మాగారంలా మారిన భారత్.. 1987లో ఒక్కరే.. ఇప్పుడు..!
ఇటీవలికాలంలో భారత దేశం చెస్ గ్రాండ్మాస్టర్ల కర్మాగారంలా మారింది. ప్రతి ఏటా దేశం నుంచి పెద్ద సంఖ్యలో గ్రాండ్మాస్టర్లు పుట్టుకొస్తున్నాడు. 1987వ సంవత్సరంలో భారత్ నుంచి కేవలం విశ్వనాథన్ ఆనంద్ మాత్రమే గ్రాండ్మాస్టర్గా ఉండేవారు. ఇప్పుడు ఆ సంఖ్య 84కు చేరింది.కొద్ది రోజుల కిందట జరిగిన ఫిడే క్యాండిడేట్స్ చెస్ టోర్నీలో ఐదుగురు భారత గ్రాండ్మాస్టర్లు పాల్గొనగా.. గుకేశ్ ఆ టోర్నీ టైటిల్ కైవసం చేసుకుని రికార్డుల్లోకెక్కాడు. 17 ఏళ్ల గుకేశ్ క్యాండిడేట్స్ టైటిల్ నెగ్గిన అతి పిన్న వయస్కుడిగా చరిత్ర సృష్టించాడు. చెస్ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ తర్వాత ఈ టైటిల్ నెగ్గిన రెండో భారత ప్లేయర్గా అరుదైన ఘనత సాధించాడు.24 ఏళ్లలో 81 మంది గ్రాండ్మాస్టర్లు..1999 వరకు భారత్ తరఫున ముగ్గురు గ్రాండ్మాస్టర్లు మాత్రమే ఉండేవారు. గడిచిన 24 ఏళ్లలో భారత్ నుంచి ఏకంగా 81 మంది గ్రాండ్మాస్టర్లు తయారయ్యారు. గ్రాండ్మాస్టర్ల సంఖ్య విషయంలో భారత్ ఐదో స్థానంలో ఉంది. ఫిడే ర్యాంకింగ్స్ టాప్-20లో ప్రస్తుతం నలుగురు భారత గ్రాండ్మాస్టర్లు ఉన్నారు.జూనియర్ల విభాగంలో టాప్-5 ర్యాంకింగ్స్ ఆటగాళ్లలో ఏకంగా ముగ్గురు (ప్రజ్ఞానంద, గుకేశ్, నిహల్ సరిన్) భారత ప్లేయర్లు ఉన్నారు. మహిళల విభాగంలో టాప్-20 ర్యాంకింగ్స్లో ముగ్గురు (ఆర్ వైశాలీ, ప్రజ్ఞానంద సోదరి) భారత ప్లేయర్లు ఉన్నారు.భారత గ్రాండ్మాస్టర్లు..విశ్వనాథన్ ఆనంద్ (తమిళనాడు)దిబ్యేందు బారువా (పశ్చిమ బెంగాల్)ప్రవీణ్ తిప్సే (మహారాష్ట)అభిజిత్ కుంటే (మహారాష్ట్ర)కృష్ణన్ శశికిరణ్ (తమిళనాడు)పెంటల హరికృష్ణ (ఆంధ్రప్రదేశ్) కోనేరు హంపీ (ఆంధ్రప్రదేశ్)సూర్య శేఖర్ గంగూలీ (పశ్చిమ బెంగాల్)సందీపన్ చందా (పశ్చిమ బెంగాల్) రామచంద్రన్ రమేష్ (తమిళనాడు) తేజస్ బక్రే (గుజరాత్ )మగేష్ చంద్రన్ పంచనాథన్ (తమిళనాడు)దీపన్ చక్రవర్తి (తమిళనాడు)నీలోత్పాల్ దాస్ (పశ్చిమ బెంగాల్)పరిమార్జన్ నేగి (ఢిల్లీ)గీతా నారాయణన్ గోపాల్ (కేరళ)అభిజీత్ గుప్తా (ఢిల్లీ)సుబ్రమణియన్ అరుణ్ ప్రసాద్ (తమిళనాడు)సుందరరాజన్ కిదాంబి (తమిళనాడు)ఆర్.ఆర్ లక్ష్మణ్ (తమిళనాడు)శ్రీరామ్ ఝా (ఢిల్లీ)దీప్ సేన్గుప్తా (పశ్చిమ బెంగాల్)బాస్కరన్ అధిబన్ (తమిళనాడు)ఎస్.పీ సేతురామన్ (తమిళనాడు)హారిక ద్రోణవల్లి (ఆంధ్రప్రదేశ్)లలిత్ బాబు (ఆంధ్రప్రదేశ్)వైభవ్ సూరి (ఢిల్లీ)ఎంఆర్. వెంకటేష్ (తమిళనాడు)సహజ్ గ్రోవర్ (ఢిల్లీ) విదిత్ గుజరాతీ (మహారాష్ట్ర)శ్యామ్ సుందర్ (తమిళనాడు)అక్షయ్రాజ్ కోర్ (మహారాష్ట్ర)విష్ణు ప్రసన్న (తమిళనాడు)దేబాషిస్ దాస్ (ఒడిషా 27)సప్తర్షి రాయ్ చౌదరి (పశ్చిమ బెంగాల్)అంకిత్ రాజ్పారా (గుజరాత్)చితంబరం అరవింద్ (తమిళనాడు)కార్తికేయ మురళి (తమిళనాడు)అశ్విన్ జయరామ్ (తమిళనాడు)స్వప్నిల్ ధోపడే (మహారాష్ట్ర)నారాయణన్ (కేరళ)శార్దూల్ గగారే (మహారాష్ట్ర)దీప్తయన్ ఘోష్ (పశ్చిమ బెంగాల్)ప్రియదర్శన్ కన్నప్పన్ (తమిళనాడు)ఆర్యన్ చోప్రా (ఢిల్లీ)శ్రీనాథ్ నారాయణన్ (తమిళనాడు)హిమాన్షు శర్మ (హర్యానా)అనురాగ్ మ్హమల్ (గోవా)అభిమన్యు పురాణిక్ (మహారాష్ట్ర)తేజ్కుమార్ (కర్ణాటక)సప్తర్షి రాయ్ (పశ్చిమ బెంగాల్)రమేష్బాబు ప్రజ్ఞానంద (తమిళనాడు)నిహాల్ సరిన్ (కేరళ)అర్జున్ ఎరిగైసి (తెలంగాణ)కార్తీక్ వెంకటరామన్ (ఆంధ్రప్రదేశ్)హర్ష భరతకోటి (తెలంగాణ)పి.కార్తికేయన్ (తమిళనాడు)స్టానీ (కర్ణాటక)విశాఖ (తమిళనాడు)డి గుకేష్ (తమిళనాడు)పి.ఇనియన్ (తమిళనాడు)స్వయంస్ మిశ్రా (ఒడిషా)గిరీష్ ఎ. కౌశిక్ (కర్ణాటక)పృథు గుప్తా (ఢిల్లీ)రౌనక్ సాధ్వని (మహారాష్ట్ర)జి. ఆకాష్ (తమిళనాడు)లియోన్ ల్యూక్ మెండోంకా (గోవా)అర్జున్ కళ్యాణ్ (తమిళనాడు)హర్షిత్ రాజా (మహారాష్ట్ర)రాజా రిథ్విక్ ఆర్ (తెలంగాణ)మిత్రభా గుహ (పశ్చిమ బెంగాల్)సంకల్ప్ గుప్తా (మహారాష్ట్ర)భరత్ సుబ్రమణ్యం (తమిళనాడు)రాహుల్ శ్రీవాత్సవ్ (తెలంగాణ)ప్రణవ్ (తమిళనాడు)ప్రణవ్ ఆనంద్ (కర్ణాటక)ఆదిత్య మిట్టల్ (మహారాష్ట్ర)కౌస్తవ్ ఛటర్జీ (పశ్చిమ బెంగాల్)ప్రాణేష్ (తమిళనాడు)విఘ్నేష్ (తమిళనాడు)సయంతన్ దాస్ (పశ్చిమ బెంగాల్)ప్రణీత్ వుప్పల (తెలంగాణ)ఆదిత్య సమంత్ (మహారాష్ట్ర)ఆర్ వైశాలి (తమిళనాడు)2022-2024 మధ్యలో వివిధ దేశాల్లో తయారైన గ్రాండ్మాస్టర్లు..2022🇮🇳 భారతదేశం: 8🇺🇸 USA: 5🇷🇺 రష్యా: 4🇩🇪 జర్మనీ: 3🇫🇷 ఫ్రాన్స్: 3🇺🇦 ఉక్రెయిన్: 3🇦🇿 అజర్బైజాన్: 2🇪🇸 స్పెయిన్: 2🇧🇾 బెలారస్: 2🇧🇬 బల్గేరియా: 2🇹🇲 తుర్క్మెనిస్తాన్: 1🇦🇹 ఆస్ట్రియా: 1🇨🇴 కొలంబియా: 1🇲🇪 మాంటెనెగ్రో: 1🇸🇰 స్లోవేకియా: 1 🁢 🁥🇳🇴 నార్వే: 1🇵🇱 పోలాండ్: 1🇱🇹 లిథువేనియా: 1🇻🇳 వియత్నాం: 1🇭🇷 క్రొయేషియా: 1🇮🇷 ఇరాన్: 1🇧🇷 బ్రెజిల్: 1🇲🇩 మోల్డోవా: 1🇦🇷 అర్జెంటీనా: 1🇸🇬 సింగపూర్: 1🇵🇾 పరాగ్వే: 1🇳🇱 నెదర్లాండ్స్: 1🇹🇷 టర్కీ: 12023🇮🇳 భారతదేశం: 7🇨🇳 చైనా: 3🇳🇱 నెదర్లాండ్స్: 2🇦🇲 అర్మేనియా: 2🇬🇷 గ్రీస్: 2🇭🇺 హంగేరి: 2🇺🇿 ఉజ్బెకిస్తాన్: 1🇯🇴 జోర్డాన్: 1🇦🇿 అజర్బైజాన్: 1🇹🇲 తుర్క్మెనిస్తాన్: 1🇨🇴 కొలంబియా: 1🇨🇺 క్యూబా: 1🇮🇷 ఇరాన్: 1🇷🇴 రొమేనియా: 1🇹🇷 టర్కీ: 1🇮🇱 ఇజ్రాయెల్: 1🇺🇸 USA: 1🇬🇪 జార్జియా: 1🇷🇺 రష్యా: 1🇫🇷 ఫ్రాన్స్: 1🇩🇪 జర్మనీ: 1🇩🇰 డెన్మార్క్: 1🇺🇦 ఉక్రెయిన్: 1🇹🇼 తైవాన్: 1🇮🇸 ఐస్లాండ్: 1🇸🇮 స్లోవేనియా: 1🇰🇿 కజకిస్తాన్: 1🇵🇱 పోలాండ్: 12024🇦🇹 ఆస్ట్రియా: 1🇵🇰 పాకిస్థాన్: 1🇪🇪 ఎస్టోనియా: 1 -
భారత నంబర్వన్గా అర్జున్
సాక్షి, హైదరాబాద్: కొన్నాళ్లుగా అంతర్జాతీయస్థాయిలో నిలకడగా రాణిస్తున్న తెలంగాణ చెస్ గ్రాండ్మాస్టర్ ఇరిగేశి అర్జున్ తన కెరీర్లో మరో మైలురాయిని అందుకున్నాడు. ఓపెన్ విభాగం క్లాసికల్ ఫార్మాట్లో అధికారికంగా భారత నంబర్వన్ ప్లేయర్గా అర్జున్ అవతరించాడు. ఏప్రిల్ నెలకు సంబంధించి అంతర్జాతీయ చెస్ సమాఖ్య (ఫిడే) విడుదల చేసిన క్లాసికల్ ఫార్మాట్ రేటింగ్స్లో 20 ఏళ్ల అర్జున్ 2756 పాయింట్లతో ప్రపంచ 9వ ర్యాంక్ను అందుకున్నాడు. ఈ క్రమంలో భారత చెస్ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ను అధిగమించి భారత టాప్ ర్యాంకర్గా వరంగల్ జిల్లాకు చెందిన అర్జున్ నిలిచాడు. విశ్వనాథన్ ఆనంద్ 2751 పాయింట్లతో ప్రపంచ 11వ ర్యాంక్లో ఉన్నాడు. గత ఏడాది సెపె్టంబర్ 1న తమిళనాడు గ్రాండ్మాస్టర్ దొమ్మరాజు గుకేశ్ తొలిసారి అధికారికంగా విశ్వనాథన్ ఆనంద్ను దాటి భారత కొత్త నంబర్వన్గా నిలిచాడు. ఆ తర్వాత ఆనంద్ మళ్లీ టాప్ ర్యాంక్కు చేరుకోగా... ఏడు నెలల తర్వాత అర్జున్ ప్రదర్శనకు ఆనంద్ మరోసారి భారత నంబర్వన్ స్థానాన్ని చేజార్చుకున్నాడు. ఆనంద్, పెంటేల హరికృష్ణ, గుకేశ్ తర్వాత ప్రపంచ టాప్–10 ర్యాంకింగ్స్లో చోటు సంపాదించిన నాలుగో భారతీయ చెస్ ప్లేయర్గా అర్జున్ గుర్తింపు పొందాడు. తాజా రేటింగ్స్లో మాగ్నస్ కార్ల్సన్ (నార్వే; 2830 పాయింట్లు), ఫాబియానో కరువానా (అమెరికా; 2803 పాయింట్లు), నకముర (అమెరికా; 2789 పాయింట్లు) వరుసగా తొలి మూడు ర్యాంక్ల్లో నిలిచారు. భారత్ నుంచి టాప్–100లో 10 మంది గ్రాండ్ మాస్టర్లు (అర్జున్–9, ఆనంద్–11, ప్రజ్ఞానంద –14, గుకేశ్–16, విదిత్–25, హరికృష్ణ–37, నిహాల్ సరీన్–39, నారాయణన్–41, అరవింద్ చిదంబరం–72, రౌనక్ సాధ్వాని–81) ఉన్నారు. -
ప్రజ్ఞానందకు రెండో విజయం
ప్రాగ్ మాస్టర్స్ అంతర్జాతీయ చెస్ టోర్నీలో భారత గ్రాండ్మాస్టర్ ప్రజ్ఞానంద రెండో విజయం నమోదు చేశాడు. భారత్కే చెందిన మరో గ్రాండ్మాస్టర్ విదిత్ సంతోష్ గుజరాతితో జరిగిన ఐదో రౌండ్ గేమ్లో ప్రజ్ఞానంద 52 ఎత్తుల్లో గెలిచాడు. డేవిడ్ నవారా (చెక్ రిపబ్లిక్)తో జరిగిన గేమ్లో భారత్కే చెందిన గ్రాండ్మాస్టర్ దొమ్మరాజు గుకేశ్ 61 ఎత్తుల్లో ఓడిపోయాడు. ఐదో రౌండ్ తర్వాత ప్రజ్ఞానంద, గుకేశ్ 2.5 పాయింట్లతో వరుసగా నాలుగో, ఐదో ర్యాంక్లో ఉన్నారు. -
ప్రజ్ఞానంద శుభారంభం... వైశాలి ఓటమి
భారత చెస్ సంచలనం ఆర్. ప్రజ్ఞానంద అంతర్జాతీయ వేదికపై తన జోరు కొనసాగిస్తున్నాడు. చెక్ రిపబ్లిక్లో జరుగుతున్న ప్రతిష్టాత్మక ప్రేగ్ మాస్టర్స్ చెస్ టోర్నమెంట్లో అతను విజయంతో మొదలు పెట్టాడు. బుధవారం జరిగిన తొలి రౌండ్ పోరులో ప్రజ్ఞానంద 41 ఎత్తులో జర్మనీ గ్రాండ్మాస్టర్ విన్సెంట్ కీమర్ను ఓడించాడు. ఇటాలియన్ ఓపెనింగ్తో మొదలు పెట్టిన భారత జీఎం అటాకింగ్ గేమ్ మొదలు కీమర్ డిఫెన్స్ పని చేయలేదు. ఈ మ్యాచ్ గెలిచే క్రమంలో ప్రజ్ఞానంద ‘లైవ్ రేటింగ్’లో విశ్వనాథన్ ఆనంద్ను దాటి భారత్ తరఫున అత్యధిక రేటింగ్ నమోదు చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఇతర భారత ఆటగాళ్లలో రిచర్డ్ ర్యాపో (రొమానియా)తో జరిగిన గేమ్ను డి. గుకేశ్...డేవిడ్ నవారా (చెక్ రిపబ్లిక్)తో జరిగిన గేమ్ను విదిత్ గుజరాతీ ‘డ్రా’ చేసుకున్నారు. చాలెంజర్ విభాగంలో అన్టోన్ కొరొ»ొవ్ (ఉక్రెయిన్)తో జరిగిన పోరులో భారత గ్రాండ్మాస్టర్ వైశాలి ఓటమిపాలైంది. -
గ్రాండ్మాస్టర్ను ఓడించిన పిన్న వయస్కుడిగా...
క్లాసికల్ చెస్ ఫార్మాట్లో గ్రాండ్మాస్టర్ను ఓడించిన పిన్న వయస్కుడిగా భారత సంతతికి సింగపూర్ కుర్రాడు అశ్వథ్ కౌశిక్ (8 ఏళ్ల 6 నెలల 11 రోజులు) రికార్డు నెలకొల్పాడు. స్విట్జర్లాండ్లో జరిగిన బర్గ్డార్ఫర్ స్టాడస్ ఓపెన్ టోర్నీ నాలుగో రౌండ్లో అశ్వథ్ 45 ఎత్తుల్లో పోలాండ్కు చెందిన 37 ఏళ్ల గ్రాండ్మాస్టర్ జేసెక్ స్టోపాపై గెలిచాడు. ఈ క్రమంలో లియోనిడ్ (సెర్బియా; 8 ఏళ్ల 11 నెలల 7 రోజులు) పేరిట ఉన్న రికార్డును అశ్వథ్ బద్దలు కొట్టాడు. -
13 ఏళ్లకే గ్రాండ్మాస్టర్గా.. ది మాగ్నస్ ఎఫెక్ట్
‘అబ్బబ్బా! ఇలా ఇన్నేళ్లుగా ప్రపంచ చాంపియన్గా ఉండటం బోర్ కొట్టేస్తోందమ్మా! నా వల్ల కాదు. అవే విజయాలు, అవే టైటిల్స్. ఎప్పుడూ నేనే అంటే ఎలా? ఎవరైనా కొత్తవాళ్లు విజేతగా వస్తే బాగుంటుంది. అయినా ఎవరూ నన్ను ఓడించడం లేదు. ఇలా అయితే నేనే ఆడకుండా తప్పుకుంటా’.. సరిగ్గా ఇలాగే కాకపోయినా ఇదే అర్థంలో దిగ్గజ ఆటగాడు మాగ్నస్ కార్ల్సన్ దాదాపు ఏడాదిన్నర క్రితం చేసిన ఈ వ్యాఖ్య చెస్ ప్రపంచంలో సంచలనం సృష్టించింది. దాదాపు దశాబ్ద కాలం నుంచి ప్రపంచ చాంపియన్గా కొనసాగుతూ 32 ఏళ్ల వయసులోనే ఇంతటి వైరాగ్యం వచ్చేసిందా అన్నట్లుగా అతని మాటలు వినిపించాయి. అయితే ఈ ఆల్టైమ్ చెస్ గ్రేట్ అనుకోకుండా చేసిన వ్యాఖ్య కాదు ఇది. ఎందుకంటే అసలు పోటీ అనేదే లేకుండా తిరుగులేకుండా సాగుతున్న చెస్ సామ్రాజ్యంలో అతను రారాజుగా ఉన్నాడు. పేరుకు నంబర్వన్ మాత్రమే కాదు, ఒకటి నుంచి పది వరకు అన్ని స్థానాలూ అతడివే! ఆ తర్వాతే మిగతావారి లెక్క మొదలవుతుంది. నిజంగానే అతని సమకాలికులు కావచ్చు, లేదా కొత్తగా వస్తున్న తరం కుర్రాళ్లు కావచ్చు కార్ల్సన్ను ఓడించలేక చేతులెత్తేస్తున్నారు. ప్రపంచ చాంపియన్షిప్ మాత్రమే కాకుండా ఇతర మెగా టోర్నీల్లో కూడా అగ్రస్థానానికి గురి పెట్టకుండా రెండోస్థానం లక్ష్యంగానే అంతా బరిలోకి దిగుతున్నారు. ఇలాంటి సమయంలో తాను రాజుగా కంటే సామాన్యుడిగా ఉండటమే సరైనదని అతను భావించాడు. అందుకే క్లాసికల్ చెస్ వరల్డ్ చాంపియన్షిప్ టైటిల్ను నిలబెట్టుకునే ప్రయత్నం చేయకుండా తప్పుకుంటున్నానని ప్రకటించడం అతనికే చెల్లింది. చదరంగంలో లెక్కలేనన్ని రికార్డులు, ఘనతలు తన పేరిట నమోదు చేసుకున్న నార్వేజియన్ కార్ల్సన్ ప్రస్థానం అసాధారణం. 2013, చెన్నై. స్థానిక హీరో, దేశంలో చెస్కు మార్గదర్శి అయిన విశ్వనాథన్ ఆనంద్ తన వరల్డ్ చెస్ చాంపియన్షిప్ను నిలబెట్టుకునేందుకు సిద్ధమయ్యాడు. ఎదురుగా చాలెంజర్ రూపంలో 23 ఏళ్ల మాగ్నస్ కార్ల్సన్ ఉన్నాడు. ఆనంద్తో పోలిస్తే అతని ఘనతలు చాలా తక్కువ. పైగా అనుభవం కూడా లేదు. కాబట్టి అనూహ్యం జరుగుతుందని ఎవరూ ఊహించలేదు. కానీ అద్భుతాన్ని ఎవరూ ఆపలేకపోయారు. సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శించిన కార్ల్సన్ అలవోకగా ఆనంద్ను ఓడించి తొలిసారి విశ్వవిజేతగా నిలిచాడు. మొత్తం 12 రౌండ్ల పోరు కాగా 10వ రౌండ్కే చాంపియన్ ఖరారు కావడంతో తర్వాతి రెండు రౌండ్లు నిర్వహించాల్సిన అవసరం లేకపోయింది. ఇందులో 3 విజయాలు సాధించి 7 గేమ్లు డ్రా చేసుకున్న మాగ్నస్.. ప్రత్యర్థి ఆనంద్కు ఒక్క గేమ్లోనూ గెలిచే అవకాశం ఇవ్వలేదు. అలా మొదలైన విజయప్రస్థానం ఇప్పటి వరకు సాగుతూనే ఉంది. ఆ తర్వాత ఈ టైటిల్ను అతను మరోసారి నాలుగు సార్లు నిలబెట్టుకున్నాడు. వాస్తవం ఏమిటంటే స్వచ్ఛందంగా తాను వరల్డ్ చాంపియన్షిప్ నుంచి తప్పుకున్నా, ఆటపై ఇష్టంతో ఇతర టోర్నీల్లో పాల్గొంటున్న మాగ్నస్ను ఓడించేందుకు అతని దరిదాపుల్లోకి కూడా కనీసం ఎవరూ రాలేకపోతున్నారు. చైల్డ్ ప్రాడజీగా మొదలై... చదరంగంలో శిఖరానికి చేరిన కార్ల్సన్లోని ప్రతిభ చిన్నతనంలోనే అందరికీ కనిపించింది. పుట్టుకతోనే వీడు మేధావిరా అనిపించేలా అతని చురుకుదనం ప్రతి ఒక్కరినీ ఆకర్షించింది. రెండేళ్ల వయసులోనే 500 ముక్కల జిగ్సా పజిల్ను అతను సరిగ్గా పేర్చడం చూసి కుటుంబ సభ్యులంతా ఆశ్చర్యపోయారు. ఇక చాలామంది పిల్లలు ఇష్టపడే ‘లెగోస్’లోనైతే అతని సామర్థ్యం అసాధారణం అనిపించింది. 10–14 ఏళ్ల పిల్లల కోసం ఉద్దేశించిన పజిల్స్ను కూడా అతను నాలుగేళ్ల వయసులోనే సాల్వ్ చేసి పడేసేవాడు. అద్భుతమైన జ్ఞాపకశక్తి కూడా కార్ల్సన్ సొంతం. ఐదేళ్ల వయసులోనే ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు, రాజధానులు, పటాలు, జనాభావంటి సమాచారాన్ని అలవోకగా గుర్తు పెట్టుకొని చెప్పేవాడు. దీనిని సరైన సమయంలో గుర్తించడం అతని తల్లిదండ్రుల తొలి విజయం. తమవాడికి చెస్ సరిగ్గా సరిపోతుందని భావించిన వారు ఆ దిశగా కార్ల్సన్ను ప్రోత్సహించడంతో చదరంగ ప్రపంచం ఒక గొప్ప ఆటగాడిని చూడగలిగింది. ఆరంభంలో తన లోకంలో తాను ఉంటూ చెస్పై అంత ఆసక్తి ప్రదర్శించకపోయినా ఇంట్లో తన అక్కపై గెలిచేందుకు కనబరచిన పట్టుదల ఆపై చెస్పై అతడికి ప్రేమను పెంచింది. చెస్ పుస్తకాలు చదవడం మొదలుపెట్టిన తర్వాత దానిపై ఆసక్తి మరింత పెరిగింది. ఆపై 8 ఏళ్ల వయసులోనే నార్వే జాతీయ చెస్ చాంపియన్షిప్లో పాల్గొని సత్తా చాటడంతో అందరికీ అతని గురించి తెలిసింది. ఆపై చదరంగమే అతనికి లోకంగా మారింది. ఆ తర్వాత యూరోప్లోని వేర్వేరు వయో విభాగాల టోర్నీల్లో చెలరేగి వరుస విజయాలతో మాగ్నస్ దూసుకుపోయాడు. గ్రాండ్మాస్టర్గా మారి... 13 ఏళ్ల వయసు వచ్చేసరికి కార్ల్సన్ దూకుడైన ఆట గురించి అందరికీ తెలిసిపోయింది. రాబోయే రోజుల్లో అతను మరెన్నో సంచలనాలు సృష్టించడం ఖాయమని అంతా అంచనా వేశారు. అది ఎంత తొందరగా జరగనుందని వేచిచూడటమే మిగిలింది. నిజంగానే కేవలం ఏడు నెలల వ్యవధిలోనే మాగ్నస్ మూడు ఇంటర్నేషనల్ మాస్టర్స్ నార్మ్లు సాధించడంలో సఫలమయ్యాడు. అతని ప్రతిభ ఒక్కసారిగా అందరి దృష్టినీ ఆకర్షించింది. దాంతో ప్రఖ్యాత సంస్థ మైక్రోసాఫ్ట్ కార్ల్సన్కు స్పాన్సర్షిప్ ఇచ్చేందుకు ముందుకు వచ్చింది. తనపై ఉంచిన నమ్మకాన్ని ఈ నార్వే కుర్రాడు ఎప్పుడూ వమ్ము చేయలేదు. 14 ఏళ్లు కూడా పూర్తికాకముందే గ్రాండ్మాస్టర్గా మారి కెరీర్లో మరో మెట్టు ఎక్కాడు. అదే ఏడాది వరల్డ్ చాంపియన్షిప్లోనూ పాల్గొని ఈ ఘనత సాధించిన అతి పిన్నవయస్కుడిగా నిలిచాడు. ఫలితం సానుకూలంగా రాకపోయినా రాబోయే సంవత్సరాల్లో మాగ్నస్ సృష్టించబోయే సునామీకి ఇది సూచికగా కనిపించింది. శిఖరానికి చేరుతూ... సాధారణంగా చెస్లో గొప్ప ఆటగాళ్లందరూ భిన్నమైన ఓపెనింగ్స్ను ఇష్టపడతారు. ఓపెనింగ్ గేమ్తోనే చాలా వరకు ఆటపై పట్టు బిగించేస్తారు. కానీ మాగ్నస్ దీనిని పెద్దగా పట్టించుకోడు. మిడిల్ గేమ్లో మాత్రం అతనో అద్భుతం. దూకుడైన ఎత్తులతో ప్రత్యర్థిని ఉక్కిరిబిక్కిరి చేస్తూ కోలుకోలేకుండా చేయడంలో అతను నేర్పరి. ప్రాక్టీస్ కోసం కంçప్యూటర్లలో ఉండే ప్రోగ్రామింగ్ కంటే సొంత మెదడుకే ఎక్కువ ప్రాధాన్యమిస్తాడు. అపరిమిత సంఖ్యలో తనతో తానే మ్యాచ్లు ఆడుతూ సుదీర్ఘ సాధనతో నేర్చుకోవడం అతనికి మాత్రమే సాధ్యమైన కళ. ఈ ప్రతిభ అతడిని వేగంగా పైకి ఎదిగేలా చేసింది. తనకెదురైన ప్రతి ఆటగాడినీ ఓడిస్తూ వచ్చిన మాగ్నస్ 19 ఏళ్ల వయసులో తొలిసారి వరల్డ్ నంబర్వన్ ర్యాంక్ను సొంతం చేసుకొని శిఖరానికి చేరాడు. అదే ఏడాది అతని కెరీర్లో మరో కీలక క్షణం మరో దిగ్గజం గ్యారీ కాస్పరోవ్ను వ్యక్తిగత కోచ్గా నియమించుకోవడం. ప్రపంచ చెస్ చరిత్రలో అత్యంత విజయవంతమైన ఆటగాడు మరో యువ సంచలనానికి శిక్షణ ఇస్తే ఎలా ఉంటుందనేదానికి ఈ బంధం బలమైన ఉదాహరణ. కాస్పరోవ్తో కలసి ఎత్తుకు పైఎత్తులతో దూసుకుపోయిన ఈ యువ ఆటగాడు నాలుగేళ్ళలో తిరుగులేని ప్రదర్శనతో శిఖరానికి చేరుకున్నాడు. తర్వాతి రోజుల్లో కాస్పరోవ్ పేరిట ఉన్న ఘనతలన్నీ అతను చెరిపేయగలగడం విశేషం. అన్నీ అద్భుతాలే... 2013లో తొలిసారి ప్రపంచ చాంపియన్గా నిలిచిన కార్ల్సన్ 2014లో దానిని నిలబెట్టుకున్నాడు. ఈసారి కూడా విశ్వనాథన్ ఆనంద్పైనే అతను అలవోక విజయాన్ని అందుకున్నాడు. ఇక్కడ కూడా చివరి గేమ్ అవసరం లేకపోయింది. 2016 వరల్డ్ చాంపియన్షిప్లో మాత్రం సెర్జీ కర్యాకిన్ (రష్యా)తో అతనికి కాస్త పోటీ ఎదురైంది. 12 గేమ్ల తర్వాత ఇద్దరూ 6–6 పాయింట్లతో సమంగా నిలవగా, టైబ్రేక్లో విజయం అతని సొంతమైంది. నాలుగోసారి 2018లో ఫాబియానో కరువానా (అమెరికా)పై కూడా ఇదే తరహాలో 6–6తో స్కోరు సమం కాగా, టైబ్రేక్లో 3–0తో గెలిచి వరల్డ్ చాంపియన్గా కొనసాగాడు. 2021లోనైతే మాగ్నస్ ఆధిపత్యం మరింత స్పష్టంగా కనిపించింది. ఇయాన్ నెపొమాచి (రష్యా)తో జరిగిన సమరం పూర్తి ఏకపక్షంగా సాగింది. 14 రౌండ్ల పోరు కాగా 11 రౌండ్లు ముగిసేసరికి 7.5 పాయింట్లు సాధించి తన జగజ్జేత హోదాను మళ్లీ నిలబెట్టుకున్నాడు. బహుశా ఇదే ఫలితం తర్వాతి వరల్డ్ చాంపియన్షిప్కు దూరంగా ఉండేందుకు కారణమై ఉండవచ్చు. క్రికెట్లో మూడు ఫార్మాట్లలాగే చెస్లోనూ క్లాసికల్, ర్యాపిడ్, బ్లిట్జ్ ఫార్మాట్లు ఉన్నాయి. కార్ల్సన్ మూడింటిలో సాగించిన ఆధిపత్యం చూస్తే అతను ఏ స్థాయి ఆటగాడో అర్థమవుతుంది. క్లాసిక్లో 5 సార్లు విశ్వ విజేతగా నిలిచిన అతను 5 సార్లు ర్యాపిడ్లో, 7 సార్లు బ్లిట్జ్లో వరల్డ్ చాంపియన్గా (మొత్తం 17 టైటిల్స్) నిలవడం విశేషం. చెస్ చరిత్రలో గ్యారీ కాస్పరోవ్ (2851)ను అధిగమించి అతి ఎక్కువ యెల్లో రేటింగ్ (2882) సాధించిన ఆటగాడిగా కార్ల్సన్ను నిలిచాడు. వరుసగా పదేళ్ల పాటు విశ్వవిజేతగా నిలిచిన అతను వరుసగా 125 గేమ్లలో ఓటమి ఎరుగని ఆటగాడిగా తనకంటూ ప్రత్యేకతను సృష్టించుకున్నాడు. అతనిపై పెద్ద సంఖ్యలో వచ్చిన పుస్తకాలు, వీడియో డాక్యుమెంటరీలు కార్ల్సన్ ఆటలోని అద్భుతాన్ని మనకు చూపిస్తాయి. అధికారికంగా ప్రపంచ చాంపియన్ కాకపోయినా, అతను ఇంకా వరల్డ్ చెస్ను శాసిస్తూనే ఉన్నాడు. గత రెండేళ్లలో అతను సాధించిన విజయాలు, టైటిల్స్కు మరెవరూ దరిదాపుల్లోకి కూడా రాలేకపోయారు. ఇదే జోరు కొనసాగిస్తూ మున్ముందూ చెస్లో మాగ్నస్ లెక్కలేనన్ని ఘనతలు సాధించడం ఖాయం. -
తొమ్మిదేళ్ల వయసులోనే అద్భుతాలు చేస్తున్న చెస్ చిచ్చరపిడుగు
బెంగళూరుకు చెందిన చార్వి అనిల్ కుమార్ తొమ్మిదేళ్ల వయసులోనే చదరంగంలో అద్భుతాలు చేస్తుంది. ఆడుతూపాడుతూ తిరగాల్సిన వయసులో ఈ అమ్మాయి మేధావుల ఆటలో సంచలనాలు సృష్టిస్తుంది. అసాధారణ నైపుణ్యాలు కలిగిన ఈ అమ్మాయి ప్రపంచంలోనే అత్యధిక రేటింగ్ పొందిన మహిళా చెస్ (11 ఏళ్లలోపు) ప్లేయర్గా రికార్డు నెలకొల్పింది. 2022లో అండర్-8 ప్రపంచ ఛాంపియన్గా నిలవడం ద్వారా తొలిసారి వార్తల్లోకెక్కిన చార్వి.. ఆ పోటీల్లో అగ్రస్థానంలో నిలువడం ద్వారా 1900 ఎలో రేటింగ్ పాయింట్ల మార్కును అధిగమించి, ఈ ఘనత సాధించిన అతి పిన్న వయస్కురాలిగా రికార్డు సృష్టించింది. అనంతరం జరిగిన పలు అంతర్జాతీయ ఈవెంట్లలోనూ చార్వి తన విజయపరంపరను కొనసాగించింది. Meet 9-year-old Charvi Anilkumar, @Charvi_A2014 the highest-rated female #chess prodigy (under 11) in the world. The #Bengaluru girl made headlines in 2022 after she became the World Champion in the Under-8 category.https://t.co/Y0SvlIUH8X — South First (@TheSouthfirst) January 10, 2024 ఈ చెస్ చిచ్చరపిడుగు ఇండోనేషియాలోని బాలిలో జరిగిన ఆసియా యూత్ చెస్ ఛాంపియన్షిప్లో (అండర్ 8) ఏకంగా ఐదు బంగారు పతకాలు , ఓ రజత పతకం సాధించి, చెస్ ప్రపంచం మొత్తం నివ్వెరపోయేలా చేసింది. ఈ అద్భుత ప్రదర్శన కారణంగా చార్వికి ఉమెన్ క్యాండిడేట్ మాస్టర్ (WCM) బిరుదు దక్కింది. చార్వి.. 2022 అక్టోబర్లో తన మూడో మేజర్ టైటిల్ను సాధించి, చెస్ ప్రపంచంలో ప్రకంపనలు సృష్టించింది. శ్రీలంకలో జరిగిన కామన్వెల్త్ యూత్ చెస్ ఛాంపియన్షిప్లో చార్వి ఛాంపియన్గా నిలిచి హేమాహేమీల ప్రశంసలను అందుకుంది. తాజా ర్యాంకింగ్స్లో 1915 రేటింగ్ పాయింట్లు కలిగి, ఫిడే ర్యాంకింగ్స్లో (జూనియర్ బాలికల విభాగం) అగ్రస్థానంలో నిలిచిన చార్వి.. ఈ ఏడాది చివరికల్లా 2200 లేదా 2300 ఎలో రేటింగ్ పాయింట్లు సాధించాలని టార్గెట్ పెట్టుకున్నట్లు తెలిపింది. చార్వి ప్రస్తుతం బెంగళూరులోని క్యాపిటల్ పబ్లిక్ స్కూల్లో నాలుగో గ్రేడ్ చదువుతుంది. చార్వి.. ఆర్బి రమేశ్ వద్ద చెస్ ఓనమాలు నేర్చుకుంది. చార్వి తండ్రి అనిల్ కుమార్ బెంగళూరులోనే ఓ ఎంఎన్సీలో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పని చేస్తుండగా.. తల్లి అఖిల ఉద్యోగం మానేసి చార్వికి ఫుల్టైమ్ సపోర్ట్గా ఉంది. -
నైనా ఖాతాలో ఐదో విజయం
సాక్షి, హైదరాబాద్: జాతీయ అండర్–13 చెస్ చాంపియన్షిప్ బాలికల విభాగంలో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి నైనా గొర్లి వరుసగా ఐదో విజయం నమోదు చేసి అజేయంగా నిలిచింది. బుధవారం జరిగిన నాలుగో రౌండ్లో వైజాగ్కు చెందిన నైనా 60 ఎత్తుల్లో మీరా సింగ్ (ఢిల్లీ)పై, ఐదో రౌండ్లో 80 ఎత్తుల్లో ఆముక్త (ఆంధ్రప్రదేశ్)పై గెలిచింది. ఐదో రౌండ్ తర్వాత నైనా ఐదు పాయింట్లతో మరో ముగ్గురితో కలిసి ఉమ్మడిగా అగ్రస్థానంలో ఉంది. తెలంగాణకు చెందిన సంహిత పుంగవనం, బి.కీర్తిక 4.5 పాయింట్లతో సంయుక్తంగా రెండో స్థానంలో ఉన్నారు. ఓపెన్ విభాగంలో తెలంగాణ కుర్రాడు చల్లా సహర్ష ఐదో రౌండ్ తర్వాత 4.5 పాయింట్లతో మరో ఎనిమిది మందితో కలిసి రెండో ర్యాంక్లో ఉన్నాడు. -
‘గ్రాండ్మాస్టర్’ వైశాలి
చెన్నై: భారత చెస్ క్రీడాకారిణి వైశాలి రమేశ్బాబు తన కెరీర్లో కీలక మైలురాయిని అందుకుంది. తమిళనాడుకు చెందిన 22 ఏళ్ల వైశాలి శుక్రవారం ‘గ్రాండ్మాస్టర్’ హోదాను అందుకుంది. స్పెయిన్లో జరుగుతున్న ఎలోబ్రిగాట్ ఓపెన్ సందర్భంగా జీఎం గుర్తింపును దక్కించుకుంది. టోర్నీ తొలి రెండు రౌండ్లలో విజయం సాధించిన వైశాలి ఈ క్రమంలో 2500 ఎలో రేటింగ్ను దాటడంతో గ్రాండ్మాస్టర్ ఖాయమైంది. భారత్ తరఫున ఈ ఘనతను సాధించిన 84వ ప్లేయర్గా వైశాలి గుర్తింపు పొందగా...భారత్నుంచి జీఎంగా మారిన మూడో మహిళా ప్లేయర్ మాత్రమే కావడం విశేషం. ఇప్పటికే చెస్ ప్రపంచంలో సంచలన విజయాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న జీఎం ప్రజ్ఞానందకు వైశాలి స్వయంగా అక్క కావడం విశేషం. వైశాలికంటే నాలుగేళ్లు చిన్నవాడైన ప్రజ్ఞానంద 2018లోనే గ్రాండ్మాస్టర్ హోదా అందుకోగా... ఐదేళ్ల తర్వాతి వైశాలి ఈ జాబితాలో చేరింది. తద్వారా ప్రపంచ చెస్లో గ్రాండ్మాస్టర్లుగా నిలిచిన తొలి సోదర, సోదరి ద్వయంగా వీరిద్దరు నిలవడం చెప్పుకోదగ్గ మరో విశేషం. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో... చదరంగంపై ఆసక్తితోనే చిన్న వయసులోనే ఎత్తుకు పైఎత్తులు వేయడం ప్రారంభించిన వైశాలిని తల్లిదండ్రులు రమేశ్బాబు, నాగలక్ష్మి ప్రోత్సహించి ప్రొఫెషనల్ చెస్ వైపు మళ్లించారు. ఆ తర్వాత వరుస విజయాలతో ఆమె దూసుకుపోయింది. వరల్డ్ యూత్ చాంపియన్షిప్లో వైశాలి అండర్–12, అండర్–14 విభాగాల్లో విజేతగా నిలిచింది. 2020 చెస్ ఒలింపియాడ్లో తొలిసారి స్వర్ణపతకం గెలిచిన భారత జట్టులో వైశాలి సభ్యురాలిగా ఉంది. 2018లో ఆమె ఉమన్ గ్రాండ్మాస్టర్ హోదాను అందుకుంది. ఆ తర్వాత 2019 ఎక్స్ట్రాకాన్ ఓపెన్లో తొలి జీఎం నార్మ్, 2022లో ఫిషర్ మెమోరియల్ టోరీ్నలో రెండో జీఎం నార్మ్ సాధించిన వైశాలి ఈ ఏడాది ఖతర్ మాస్టర్స్లో మూడో జీఎం నార్మ్ను సొంతం చేసుకుంది. వరల్డ్ చాంపియన్షిప్ మ్యాచ్కు క్వాలిఫయింగ్గా పరిగణించే క్యాండిడేట్స్ టోర్నీకి వైశాలి అర్హత సాధించింది. పురుషుల విభాగంలో ఇదే టోర్నీకి ప్రజ్ఞానంద కూడా క్వాలిఫై అయ్యాడు. దాంతో ‘క్యాండిడేట్స్’ బరిలో నిలిచిన తొలి సోదర, సోదరి జోడీగా కూడా వీరు గుర్తింపు దక్కించుకున్నారు. భారత్నుంచి గ్రాండ్మాస్టర్ హోదా అందుకున్న తొలి మహిళగా ఆంధ్రప్రదేశ్కు చెందిన కోనేరు హంపి (2002లో) గుర్తింపు పొందగా...2011లో ఆంధ్రప్రదేశ్కే చెందిన ద్రోణవల్లి హారిక కూడా ఈ హోదాను సాధించింది. చెస్ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ ఈ సందర్భంగా వైశాలికి అభినందనలు తెలియజేశాడు. -
డబుల్ ధమాకా...
ఐల్ ఆఫ్ మ్యాన్ (యూకే): అంతర్జాతీయ వేదికపై భారత చెస్ క్రీడాకారులు ఆర్. వైశాలి, విదిత్ సంతోష్ గుజరాతి సత్తా చాటుకున్నారు. అంతర్జాతీయ చెస్ సమాఖ్య (ఫిడే) ఆధ్వర్యంలో ఐల్ ఆఫ్ మ్యాన్ దీవిలో జరిగిన స్విస్ గ్రాండ్ టోరీ్నలో ఓపెన్ విభాగంలో విదిత్ (మహారాష్ట్ర), మహిళల విభాగంలో వైశాలి (తమిళనాడు) చాంపియన్స్గా అవతరించారు. ఈ టోరీ్నలో టైటిల్ సాధించిన తొలి భారతీయ క్రీడాకారులుగా వీరిద్దరు గుర్తింపు పొందారు. నిర్ణీత 11 రౌండ్ల తర్వాత విదిత్ 8.5 పాయింట్లతో... వైశాలి కూడా 8.5 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచారు. విదిత్ ఏడు గేముల్లో గెలిచి, మూడు గేమ్లను ‘డ్రా’ చేసుకొని, మరో గేమ్లో ఓడిపోయాడు. వైశాలి ఆరు గేముల్లో నెగ్గి, ఐదు గేమ్లను ‘డ్రా’ చేసుకొని అజేయంగా నిలిచింది. చాంపియన్స్గా నిలిచిన విదిత్కు ట్రోఫీలతో పాటు 80 వేల డాలర్లు (రూ. 66 లక్షల 57 వేలు), వైశాలికి ట్రోఫీలతో పాటు 25 వేల డాలర్లు (రూ. 20 లక్షల 80 వేలు) ప్రైజ్మనీగా లభించాయి. ఈ టైటిల్స్తో ఓపెన్ విభాగంలో విదిత్... మహిళల విభాగంలో వైశాలి క్యాండిడేట్స్ టోరీ్నకి అర్హత సాధించారు. ఓపెన్, మహిళల విభాగాల్లో వేర్వేరుగా ఎనిమిది మంది ప్లేయర్ల మధ్య క్యాండిడేట్స్ టోర్నీ వచ్చే ఏడాది ఏప్రిల్లో 2 నుంచి 25 వరకు కెనడాలోని టొరంటోలో జరుగుతుంది. క్యాండిడేట్స్ టోరీ్నలో విజేతగా నిలిచిన వారు ఓపెన్ విభాగంలో ప్రస్తుత ప్రపంచ చాంపియన్ డింగ్ లిరెన్ (చైనా)తో... మహిళల విభాగంలో ప్రస్తుత వరల్డ్ చాంపియన్ జు వెన్జున్ (చైనా)తో ప్రపంచ చాంపియన్íÙప్ టైటిల్ కోసం తలపడతారు. -
FIDE Grand Swiss: అర్జున్కు మూడో గెలుపు
గ్రాండ్ స్విస్ అంతర్జాతీయ చెస్ టోర్నీలో తెలంగాణ గ్రాండ్మాస్టర్ ఇరిగేశి అర్జున్ మూడో విజయం నమోదు చేశాడు. యూకేలోని ఐల్ ఆఫ్ మ్యాన్లో జరుగుతున్న ఈ టోర్నీలో ఐదో రౌండ్ గేమ్లో తెల్లపావులతో ఆడిన అర్జున్ 68 ఎత్తుల్లో రినాత్ జుమాబయేవ్ (కజకిస్తాన్)పై గెలుపొందాడు. ఐదో రౌండ్ తర్వాత అర్జున్ నాలుగు పాయింట్లతో మరో ఇద్దరితో కలిసి ఉమ్మడిగా టాప్ ర్యాంక్లో ఉన్నాడు. -
భారత చెస్ జట్ల గెలుపు.. హంపి, హారిక, వంతిక, వైశాలి అద్భుతంగా ఆడి..
Asian Games 2023- Chess: ఆసియా క్రీడల టీమ్ చెస్ ఈవెంట్లో భారత పురుషుల, మహిళల జట్లు మూడో రౌండ్లో గెలుపొందాయి. ఇరిగేశి అర్జున్, ప్రజ్ఞానంద, గుకేశ్, పెంటేల హరికృష్ణలతో కూడిన భారత జట్టు 3–1తో కజకిస్తాన్ను ఓడించింది. మరోవైపు... కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక, వంతిక అగర్వాల్, వైశాలిలతో కూడిన భారత జట్టు 3.5–0.5తో ఇండోనేసియాపై గెలిచింది. మూడో రౌండ్ తర్వాత భారత మహిళల జట్టు ఆరు పాయింట్లతో టాప్ ర్యాంక్లో... ఐదు పాయింట్లతో భారత పురుషుల జట్టు రెండో ర్యాంక్లో ఉన్నాయి. భారత్, కొరియా మ్యాచ్ ‘డ్రా’ ఆసియా క్రీడల మహిళల హాకీ ఈవెంట్లో భారత జట్టు తొలి ‘డ్రా’ నమోదు చేసింది. ఆదివారం దక్షిణ కొరియాతో జరిగిన పూల్ ‘ఎ’ మూడో లీగ్ మ్యాచ్ను భారత్ 1–1 గోల్తో ‘డ్రా’ చేసుకుంది. కొరియా తరఫున చో హైజిన్ (12వ ని.లో), భారత్ తరఫున నవ్నీత్ కౌర్ (44వ ని.లో) ఒక్కో గోల్ చేశారు. ప్రస్తుతం మూడు మ్యాచ్ల తర్వాత భారత్, కొరియా ఏడు పాయింట్లతో సమంగా ఉన్నా... మెరుగైన గోల్స్ అంతరం కారణంగా భారత్ టాప్ ర్యాంక్లో, కొరియా రెండో ర్యాంక్లో ఉంది. లీగ్ దశ తర్వాత టాప్–2లో నిలిచిన జట్లు సెమీఫైనల్కు అర్హత సాధిస్తాయి. భారత్ తమ చివరి లీగ్ మ్యాచ్ను హాంకాంగ్తో మంగళవారం ఆడుతుంది. -
కళ్లు మూసుకొని... కళ్లు చెదిరే విజయం
ఎన్నో అద్భుత విజయాలు సాధించిన విజేతల అద్భుత విజయాలను డాక్యుమెంటరీలలో చూసిన తరువాత తాను కూడా ఏదైనా సాధించాలనుకుంది మలేసియాకు చెందిన పది సంవత్సరాల పునీత మలర్ రాజశేఖర్. ఈ చిన్నారికి చెస్ అంటే ఇష్టం. తాజాగా... కళ్లకు గంతలు కట్టుకొని కేవలం 45.72 సెకన్లలో చెస్బోర్డ్పై అత్యంత వేగంగా 32 పావులను సెట్ చేసి గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్లో చోటు సంపాదించింది. తండ్రి సహకారంతో నాలుగు నెలల పాటు కష్టపడి ఈ అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. -
చెస్లో త్రుటిలో చేజారిన పతకం
ఆసియా క్రీడల చెస్ ఈవెంట్ వ్యక్తిగత విభాగాల్లో భారత్ ఒక్క పతకం కూడా గెలవలేకపోయింది. మహిళల విభాగంలో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్మాస్టర్లు ద్రోణవల్లి హారిక ఆరు పాయింట్లతో నాలుగో స్థానంలో, కోనేరు హంపి 5.5 పాయింట్లతో ఏడో స్థానంలో నిలిచారు. ఎనిమిదో రౌండ్లో హంపితో జరిగిన గేమ్ను హారిక 35 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకుంది. చివరిదైన తొమ్మిదో రౌండ్లో హారిక 30 ఎత్తుల్లో జినెర్ జు (చైనా)పై గెలిచింది. ని ర్ణీత తొమ్మిది రౌండ్ల తర్వాత జినెర్ జు ఏడు పాయింట్లతో టాప్ ర్యాంక్లో నిలిచి స్వర్ణ పతకాన్ని దక్కించుకుంది. ఉమిదా ఒమనోవా (ఉజ్బెకిస్తాన్), హు ఇఫాన్ (చైనా) 6.5 పాయింట్లతో వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచి రజత, కాంస్య పతకాలను సొంతం చేసుకున్నారు. పురుషుల వ్యక్తిగత విభాగంలో భారత గ్రాండ్మాస్టర్లు విదిత్ సంతోష్ గుజరాతి, ఇరిగేశి అర్జున్ 5.5 పాయింట్లతో వరుసగా ఐదు, ఆరు స్థానాలతో సరిపెట్టుకున్నారు. వె యి (చైనా; 7.5 పాయింట్లు) స్వర్ణం, నొదిర్బెక్ (ఉజ్బెకిస్తాన్; 7 పాయింట్లు) రజతం, సిందరోవ్ (ఉజ్బెకిస్తాన్; 7 పాయింట్లు) కాంస్యం గెల్చుకున్నారు. -
Asian Games 2023 chess: శుభారంభం చేసిన కోనేరు హంపి, హారిక
చైనా వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత చెస్ గ్రాండ్మాస్టర్లు శుభారంభం చేశారు. ఆదివారం జరిగిన మహిళల వ్యక్తిగత విభాగంలో కోనేరు హంపి తొలి రెండు రౌండ్లలో విజయం సాధించింది. మొదటి రౌండ్లో ఇరాన్కు చెందిన అలీనాసబలమాద్రి మొబినాను ఓడించిన హంపి.. సెకెండ్ రౌండ్లో వియత్నాం గ్రాండ్ మాస్టర్ ఫామ్ లే థావో న్గుయెన్ను చిత్తు చేసింది. దీంతో మూడో రౌండ్కు హంపి అర్హత సాధించింది. అదేవిధంగా మరో భారత మహిళా గ్రాండ్ మాస్టర్ హారిక ద్రోణవల్లి కూడా తొలి రౌండల్లో గెలుపొందింది. తొలి రౌండ్లో యూఏఈకు చెందిన అలాలీ రౌడాపై విజయం సాధించిన హారిక.. రెండో రౌండ్లో సింగపూర్ గ్రాండ్మాస్టర్ కియాన్యున్ గాంగ్ను ఓడించింది. అయితే పురుషల చెస్ విభాగంలో మాత్రం మిశ్రమ ఫలితాలు వచ్చాయి. మొదటి రౌండ్లో విజయం సాధించిన భారత గ్రాండ్మాస్టర్ విదిత్ సంతోష్.. రెండో రౌండ్లో మాత్రం ఘోర ఓటమి చవిచూశాడు. రెండో రౌండ్లో కజికిస్తాన్కు చెందిన నోగర్బెక్ కాజీబెక్ ఎత్తులు ముందు విదిత్ చిత్తయ్యాడు. మరో గ్రాండ్ మాస్టర్ అర్జున్ కుమార్ ఎరిగైసి రెండో రౌండ్ను డ్రాతో సరిపెట్టుకున్నాడు. తొలిరౌండ్లో ఫిలిప్పీన్స్కు చెందిన పాలో బెర్సమినాను ఓడించిన అర్జున్.. రెండవ రౌండ్ గేమ్ను వియత్నాంకు చెందిన లే తువాన్ మిన్తో డ్రా చేసుకున్నాడు. ఇక సోమవారం(సెప్టెంబర్ 25) మధ్యాహ్నం పురుషులు, మహిళల వ్యక్తిగత విభాగానికి సంబంధించిన మూడు, నాలుగు రౌండ్ల చెస్ పోటోలు జరగనున్నాయి. భారత ఖాతాలో తొలి గోల్డ్మెడల్ ఇక ఈ ఆసియా క్రీడల్లో భారత్ ఖాతాలో తొలి బంగారు పతకం చేరింది. పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో భారత జట్టు స్వర్ణ పతకం సాధించింది. ఇప్పటివరకు మొత్తం 7 పతకాలను ఏషియన్ గేమ్స్లో భారత్ కైవసం చేసుకుంది. చదవండి: Asian Games 2023: ఆసియాక్రీడల్లో భారత్కు తొలి గోల్డ్ మెడల్.. -
ప్రజ్ఞానందకు మూడో స్థానం
ప్రతిష్టాత్మక టాటా స్టీల్ చెస్ ఓపెన్ బ్లిట్జ్ టైటిల్ను అలెగ్జాండర్ గ్రిషుక్ (రష్యా) గెలుచుకున్నాడు. కోల్కతాలో శనివారం ముగిసిన ఈ టోర్నీలో 12 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచాడు. రెండు సార్లు వరల్డ్ బ్లిట్జ్ చాంపియన్ అయిన గ్రిషుక్ ఈ టోర్నీ లోనూ సత్తా చాటాడు. మొత్తం టోర్నీ లో అతను ఒకే ఒక రౌండ్లో ఓడాడు. ఉజ్బెకిస్తాన్కు చెందిన అబ్దుస్సతరోవ్ రెండో స్థానం (11 పాయింట్లు) సాధించగా...భారత టీనేజ్ సంచలనం ఆర్.ప్రజ్ఞానంద (11)కు మూడో స్థానం దక్కింది. ఇతర భారత ఆటగాళ్లలో అర్జున్ ఇరిగేశి (4వ), పెంటేల హరికృష్ణ (6వ), విదిత్ గుజరాతీ (7వ), డి.గుకేశ్ (8వ) టాప్–10లో ముగించారు. నాలుగు రౌండ్లలో వరుసగా ఓటమి లేకుండా నిలిచినా...ఆ తర్వాత అబ్దుస్సతరోవ్, గ్రిషుక్, విదిత్ చేతుల్లో పరాజయం పాలు కావడంతో ప్రజ్ఞానంద వెనుకబడిపోయాడు. భారత నంబర్వన్ గుకేశ్ చివరి రోజు 9 రౌండ్లలో ఆరింటిలో ఓటమిపాలయ్యాడు. 18 ఏళ్ల ప్రజ్ఞానంద ఇటీవల జరిగిన ప్రపంచ కప్ చెస్ టోర్నీ ఫైనల్లో కార్ల్సన్ చేతిలో ఓడి రన్నరప్గా నిలిచాడు. -
ప్రజ్ఞానందకు మూడో స్థానం
కోల్కతా: టాటా స్టీల్ ఇండియా చెస్ ర్యాపిడ్ ఓపెన్ టోర్నీలో భారత యువ గ్రాండ్మాస్టర్ ప్రజ్ఞానంద మూడో స్థానాన్ని దక్కించుకున్నాడు. పది మంది మేటి గ్రాండ్మాస్టర్ల మధ్య నిర్ణీత తొమ్మిది రౌండ్లపాటు జరిగిన ఈ టోర్నీలో ప్రజ్ఞానంద, అలెగ్జాండర్ గ్రిషుక్ (రష్యా), విదిత్ సంతోష్ గుజరాతి (భారత్) ఐదు పాయింట్లతో సంయుక్తంగా మూడో స్థానంలో నిలిచారు. అయితే మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా ర్యాంకింగ్ను వర్గీకరించారు. ప్రజ్ఞానందకు మూడో ర్యాంక్, గ్రిషుక్కు నాలుగో ర్యాంక్, విదిత్కు ఐదో ర్యాంక్ లభించాయి. గురువారం జరిగిన చివరి మూడు రౌండ్లలో 18 ఏళ్ల ప్రజ్ఞానంద సహచరులు విదిత్, ఇరిగేశి అర్జున్లపై గెలిచి భారత నంబర్వన్ దొమ్మరాజు గుకేశ్ చేతిలో ఓడిపోయాడు. 4.5 పాయింట్లతో గుకేశ్ ఆరో స్థానంలో నిలిచాడు. 3 పాయింట్లతో అర్జున్ తొమ్మిదో స్థానంలో, పెంటేల హరికృష్ణ 2.5 పాయింట్లతో చివరిదైన పదో స్థానంలో నిలిచారు. 7 పాయింట్లతో ఫ్రాన్స్ గ్రాండ్మాస్టర్ మాక్సిమి వచీర్ లాగ్రెవ్ చాంపియన్గా అవతరించగా... 5.5 పాయింట్లతో తైమూర్ రజబోవ్ (అజర్బైజాన్) రన్నరప్గా నిలిచాడు. నేడు, రేపు బ్లిట్జ్ ఫార్మాట్లో టోర్నీ జరుగుతుంది. -
టాటా స్టీల్ ఇండియా చెస్ చాంప్ దివ్య
కోల్కతా: టాటా స్టీల్ ఇండియా చెస్ మహిళల ర్యాపిడ్ టోర్నమెంట్లో ఫేవరెట్స్ను బోల్తా కొట్టిస్తూ భారత యువతార దివ్య దేశ్ముఖ్ చాంపియన్గా అవతరించింది. మహారాష్ట్రకు చెందిన 17 ఏళ్ల దివ్య నిర్ణీత తొమ్మిది రౌండ్ల తర్వాత ఏడు పాయింట్లతో అగ్రస్థానాన్ని సొంతం చేసుకుంది. శనివారం జరిగిన చివరి మూడు గేముల్లో దివ్యకు మిశ్రమ ఫలితాలు లభించాయి. అనా ఉషెనినా (ఉక్రెయిన్)తో జరిగిన ఏడో గేమ్ను దివ్య 30 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకుంది. పొలీనా షువలోవా (రష్యా)తో జరిగిన ఎనిమిదో గేమ్లో దివ్య 41 ఎత్తుల్లో ఓడిపోయింది. చివరిదైన తొమ్మిదో గేమ్లో దివ్య 51 ఎత్తుల్లో భారత స్టార్ కోనేరు హంపిపై సంచలన విజయం సాధించి టైటిల్ను ఖరారు చేసుకుంది. జు వెన్జున్ (చైనా; 6.5 పాయింట్లు) రన్నరప్గా, షువలోవా 5.5 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచారు. భారత్కే చెందిన ద్రోణవల్లి హారిక 4.5 పాయింట్లతో నాలుగో స్థానాన్ని దక్కించుకోగా, వంతిక అగర్వాల్ ఐదో స్థానంలో, కోనేరు హంపి ఆరో స్థానంలో, సవితాశ్రీ ఎనిమిదో స్థానంలో నిలిచారు. ఇదే వేదికపై నేడు, రేపు బ్లిట్జ్ ఫార్మాట్లో టోర్నీ జరుగుతుంది. -
ఆనంద్ మహీంద్ర గిప్ట్కు: ప్రజ్ఞానంద రియాక్షన్ ఇదీ!
RPraggnanandhaa Reacts Parents Long Term Dream పారిశ్రామికవేత్త, బిలియనీర్ తన తల్లి దండ్రులకు ప్రకటించిన బహుమతిపై భారత చెస్ గ్రాండ్ మాస్టర్, ఫైడ్ చెస్ ప్రపంచ కప్ రన్నర్ అప్ ఆర్ ప్రజ్ఞానంద స్పందించారు. ఒక ఎలక్ట్రిక్ కారుకోసం కల గన్న తన అమ్మా నాన్నల చిరకాల వాంఛను ("లాంగ్ టర్మ్ డ్రీమ్") తీర్చినందుకు ధన్యవాదాలు సార్ అంటూ ప్రజ్ఞానంద ట్వీట్ చేశారు. తన కృతజ్ఞతను తెలియజేయడానికి పదాలు లేవు...చాలా ధన్యవాదాలు అంటూ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. ప్రజ్ఞానంద సాధించిన ఘనతకు గౌరవంగా అతని తల్లిదండ్రులకు ఆల్-ఎలక్ట్రిక్ SUVని బహుమతిగా ఇవ్వాలని ఆనంద్ మహీంద్రా నిర్ణయించిన సంగతి తెలిసిందే. (ప్రజ్ఞానంద తల్లిదండ్రులకు ఆనంద్ మహీంద్ర అదిరిపోయే గిఫ్ట్) కాగా పిల్లవాడి ఆసక్తిని గమనించి, ప్రోత్సహించిన ప్రజ్ఞానంద పేరెంట్స్ నాగలక్ష్మి రమేష్బాబులను ఆనంద్ మహీంద్ర అభినందించారు. ఇందులో భాగంగానే వారికి ఆల్ ఎలక్ట్రిక్ SUV XUV400ని ఇవ్వనున్నట్టు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. అంతేకాదు దేశంలో తల్లిదండ్రులు దీన్ని ప్రేరణగా తీసుకోవాలని కూడా ఆయన పిలుపునిచ్చారు. ఈ క్రమంలోనే మహీంద్ర ఆల్ ఎలక్ట్రిక్ SUV XUV400ని ప్రత్యేక ఎడిషస్ను ఆ దంపతులకు ఇవ్వనున్నామని మహీంద్రా గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, సీఈవో బదులిచ్చారు. దీంతో సోషల్ మీడియాలో వైరల్గా మారిన సంగతి తెలిసిందే. No words to express my Gratitude 🙏 Thankyou very much @anandmahindra sir and @rajesh664 sir It is a long term dream of my parents to own an EV car thanks for making it a reality! https://t.co/YWCK1D99ik — Praggnanandhaa (@rpragchess) August 29, 2023 Sky is the limit! @rpragchess and @GM_JKDuda showed us that the mind of a genius knows no bounds! #chess #mind pic.twitter.com/TWzvPefBNV — WR_Chess_Masters (@wr_chess) August 29, 2023 -
Chess World Cup 2023: రాజూ బంటూ అమ్మే
చదరంగంలో పావులు కదపాలంటే బుద్ధికి బృహస్పతిలా ఉండాలి. కాని ఆ బృహస్పతిని కని, పెంచడానికి అమ్మ అమ్మలా ఉంటే చాలు. అమ్మకు ఎత్తుకు పై ఎత్తు తెలియదు ప్రేమ తప్ప. తన బిడ్డను రాజు చేయాలనే తపన తప్ప. అందుకు తాను బంటుగా మారేందుకు సిద్ధం కావడం తప్ప. చెస్ వరల్డ్ కప్ 2023లో సంచలనంగా నిలిచిన ఆర్. ప్రజ్ఞానందకు రాజుగా, బంటుగా ఉంటూ తీర్చిదిద్దిన తల్లి నాగలక్ష్మి కథ ఇది. అజర్బైజాన్లో జరిగిన ‘చెస్ వరల్డ్ కప్ 2023’ ఫైనల్స్లో ఒక అడుగు దూరంలో టైటిల్ కోల్పోయాడు 18 ఏళ్ల ప్రజ్ఞానంద. అతడు ఓడినా గెలిచినట్టే. ప్రపంచ దేశాల నుంచి 206 మంది గ్రాండ్ మాస్టర్లు పాల్గొన్న ఈ భారీ వరల్డ్ కప్లో ఇంత చిన్న వయసులో రన్నరప్గా నిలవడం సామాన్యం కాదు. కాకలు తీరిన యోధులను ఓడించి మరీ ఈ స్థానాన్ని దక్కించుకోవడమే కాదు దాదాపు 66 లక్షల రూపాయల ప్రైజ్ మనీ గెలుచుకున్నాడు. భారతదేశం గర్వించేలా చెస్లో వెలుగులీనుతున్న ఈ కుర్రవాడి విజయం వెనుక అతని తల్లి నాగలక్ష్మి ఉంది. అందుకే చెస్ అభిమానులే కాదు దేశదేశాల గ్రాండ్ మాస్టర్లు కూడా ప్రజ్ఞానందకు వెన్నంటి వుంటూ తోడ్పాటునందిస్తున్న నాగలక్ష్మిని ప్రశంసిస్తున్నారు. ఆమెను చూసి ముచ్చట పడుతున్నారు. టీవీ అలవాటు మాన్పించడానికి చెన్నైలో స్థిరపడ్డ తెలుగు కుటుంబం రమేశ్ బాబు, నాగలక్ష్మిలకు కుమార్తె వైశాలి పుట్టాక ప్రజ్ఞానంద పుట్టాడు. ప్రజ్ఞానందకు నాలుగున్నర ఏళ్లు ఉన్నప్పుడు వైశాలి ఎక్కువగా టీవీ చూస్తున్నదని కూతురి ధ్యాస మళ్లించడానికి చెస్ బోర్డు తెచ్చి పెట్టింది నాగలక్ష్మి. వైశాలి చెస్ ఆడుతుంటే చిన్నారి ప్రజ్ఞా కూడా ఆడటం మొదలెట్టాడు. అతడు చెస్ నేర్చుకున్న పద్ధతి, అంత చిన్న వయసులో గెలుస్తున్న తీరు చూస్తే అతడు బాల మేధావి అని తల్లికి అర్థమైంది. మరోవైపు వైశాలి కూడా చెస్లో రాణించసాగింది. ఇక నాగలక్ష్మి తన జీవితాన్ని తన ఇద్దరు పిల్లల ఆట కోసం అంకితం చేయాలని నిశ్చయించుకుంది. అనుక్షణం వెన్నంటే ప్రజ్ఞానంద ఏడేళ్ల వయసుకే అండర్ సెవెన్లో జాతీయ టైటిల్ గెలిచాడు. పదేళ్ల వయసుకు ఇంటర్నేషనల్ ప్లేయర్ అయ్యాడు. 12 ఏళ్లకు గ్రాండ్ మాస్టర్ అయ్యాడు. అప్పుడైనా ఇప్పుడైనా ఉదయం నుంచి రాత్రి వరకూ చెన్నైలో వేరే దేశంలో అతని వెన్నంటే ఉంటుంది నాగలక్ష్మి. ‘ప్రజ్ఞా ఏ పోటీకి వచ్చినా తోడుండే నాగలక్ష్మి ఒక మూల కూచుని దేవుణ్ణి ప్రార్థిస్తూ కూచోవడం మా అందరికీ అలవాటైన దృశ్యం’ అంటాడు త్యాగరాజన్ అనే కోచ్. ఇతను చెస్లో ప్రజ్ఞాకు మొదటి పాఠాలు నేర్పాడు. ‘ఉదయం పది నుంచి సాయంత్రం 7 వరకూ చెస్ పాఠాలు నడిచేవి. ఆ తర్వాత రెండు మూడు గంటల హోమ్వర్క్ ఇచ్చేవాణ్ణి. ప్రజ్ఞానంద ఇల్లు చేరాక ఆ హోమ్వర్క్ అయ్యేవరకు నాగలక్ష్మి తోడు ఉండేదట. రాత్రి పదికి ఇంటి పనులు మొదలెట్టుకుని మళ్లీ ఉదయం ఆరు గంటలకు కొడుకు కోసం నిద్ర లేచేదట’ అని తెలిపాడు అతడు. చెస్ తెలియని అమ్మ కొడుకు చెస్లో ప్రపంచ విజేత స్థాయి ఆటగాడైనా నాగలక్ష్మికి ఇప్పటి వరకూ చెస్ ఆడటం తెలియదు. ‘మా అబ్బాయిని చూసుకోవడమే నాకు సరిపోతుంది. ఆట ఎక్కడ నేర్చుకోను’ అంటుందామె నవ్వుతూ. ప్రజ్ఞానంద శాకాహారి. బయటి ఆహారం తినడు. అందుకని ఏ ఊరికి ఆట కోసం బయలుదేరినా, విదేశాలకు ప్రయాణం కట్టినా నాగలక్ష్మి చేసే మొదటిపని లగేజ్లో ఒక ఇండక్షన్ స్టవ్వు, కుక్కరు, బియ్యం, మసాలాలు పెట్టుకోవడం. ‘ఎక్కడకు వెళ్లినా వాడికి వేడివేడి అన్నం, రసం చేసి పెడతాను. మైండ్ హాయిగా ఉండి బాగా ఆడాలంటే నచ్చిన ఆహారం తీసుకోవాలి’ అంటుంది నాగలక్ష్మి. చెస్ వరల్డ్ కప్ సెమీ ఫైనల్స్లో అమెరికా దిగ్గజ గ్రాండ్మాస్టర్ ఫాబియానో కరువానాను ఓడించి ప్రజ్ఞానంద ఫైనల్స్కు చేరినప్పుడు నాగలక్ష్మి కళ్లల్లో కనిపించి మెరుపును ఎవరో ఫొటో తీస్తే ఆ ఫొటో వైరల్ అయ్యింది. ‘మావాడు ఆట ఆడేంతసేపు వాడి కళ్లల్లో కళ్లు పెట్టి చూడను. ఎందుకంటే వాడి కళ్లు చూస్తే వాడి ఆట ఎలా సాగుతున్నదో నాకు తెలిసిపోతుంది. నాకు తెలిసిపోయినట్టుగా వాడికి తెలియడం నాకు ఇష్టం ఉండదు’ అంటుంది నాగలక్ష్మి. కార్ పార్కింగ్లో బంధువులు కూతురు, కొడుకు ఇంట్లో చెస్ ప్రాక్టీస్ చేస్తుంటే ఇంటిని వీలైనంత నిశ్శబ్దంగా ఉంచుతుంది నాగలక్ష్మి. వాళ్లింట్లో టీవీ పెట్టే ఎంతో కాలమైపోతూ వుంది. ‘మా ఇంటికి బంధువులొచ్చినా, స్నేహితులొచ్చినా కింద కార్ పార్కింగ్ దగ్గరే పలకరించి పంపేస్తాను... పిల్లలు డిస్ట్రబ్ కాకూడదని’ అంటుందామె. అందుకే సెమీ ఫైనల్స్ గెలిచిన ప్రజ్ఞాను అభినందిస్తూ రష్యా దిగ్గజం గ్యారీ కాస్పరోవ్ ‘నీకు మీ అమ్మ ఇచ్చే మద్దతు ప్రత్యేకమైనది’ అని ట్వీట్ చేశాడు. నాగలక్ష్మి లాంటి తల్లి ప్రేమకు పిల్లలు ఎప్పుడూ బంట్లే. వారి మనసులో ఆ తల్లి ఎప్పుడూ రాజే. -
ప్రజ్ఞానందపై ఆనంద్ మహీంద్రా ట్వీట్.. నువ్వు 'రన్నరప్' కాదు..
ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం.. మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ చైర్మన్ 'ఆనంద్ మహీంద్రా' (Anand Mahindra) ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ ఎన్నెన్నో ఆసక్తికరమైన అంశాలను ట్విటర్ వేదికగా పోస్ట్ చేస్తూ ఉంటాడు. ఇందులో భాగంగానే తాజాగా మరో ట్వీట్ చేసాడు. ఇది సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. చదరంగంలో (చెస్) అందరి ద్రుష్టి తనవైపు తిప్పుకున్న 'ప్రజ్ఞానంద' (Praggnanandhaa) ఫైనల్ స్టేజిలో రన్నర్గా నిలిచాడు. ఈ గేమ్లో కార్ల్సన్ అద్భుత విజయం సాధించి విన్నర్ టైటిల్ సొంతం చేసుకున్నారు. ఇదీ చదవండి: ఎవరీ 'మాయా టాటా'? లక్షల కోట్ల 'టాటా' సామ్రాజ్యానికి వారసురాలు ఈమేనా? దీనిపైన ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేస్తూ నువ్వు 'రన్నరప్' కాదు @rpragchess. ఇది మీ గొప్పతనానికి 'రన్-అప్' మాత్రమే. మరో సారి పోరాడటానికి అనేక యుద్దాలు నేర్చుకోవడం అవసరం అంటూ.. నువ్వు నేర్చుకున్నావు, మళ్ళీ పోరాడతావు మనమందరం మళ్ళీ అక్కడ ఉంటామని ట్వీట్ చేసాడు. దీనికి ఇప్పటికీ వేల సంఖ్యలో లైకులు వచ్చాయి, కొంతమంది నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ కూడా చేస్తున్నారు. You aren’t the ‘runner-up’ @rpragchess This is simply your ‘run-up’ to Gold and to greatness. Many battles require you to learn & live to fight another day. You’ve learned & you will fight again; and we will all be there again…cheering you on loudly. 🇮🇳👏🏽👏🏽👏🏽 #praggnanandha https://t.co/2L0U1cZD4E — anand mahindra (@anandmahindra) August 24, 2023 -
పోరాడి ఓడిన ప్రజ్ఞానంద.. జగజ్జేతగా కార్ల్సన్
బకూ (అజర్బైజాన్): ఫైవ్ టైమ్ వరల్డ్ చెస్ ఛాంపియన్, వరల్డ్ నంబర్ వన్ మాగ్నస్ కార్ల్సన్ (నార్వే) తన తొలి వరల్డ్కప్ టైటిల్ను కైవసం చేసుకున్నాడు. భారత యువ గ్రాండ్మాస్టర్ ప్రజ్ఞానందతో ఇవాళ (ఆగస్ట్ 24) జరిగిన ఫైనల్ టైబ్రేక్స్లో కార్ల్సన్ అద్భుత విజయం సాధించి జగజ్జేతగా అవతరించారు. 🏆 Magnus Carlsen is the winner of the 2023 FIDE World Cup! 🏆 Magnus prevails against Praggnanandhaa in a thrilling tiebreak and adds one more prestigious trophy to his collection! Congratulations! 👏 📷 Stev Bonhage #FIDEWorldCup pic.twitter.com/sUjBdgAb7a — International Chess Federation (@FIDE_chess) August 24, 2023 హోరాహోరీగా సాగిన టై బ్రేక్స్లో ప్రజ్ఞానంద తొలి గేమ్ కోల్పోగా.. రెండో గేమ్ను ఇరువురు డ్రాకు అంగీకరించడంతో కార్ల్సన్ విజేతగా నిలిచాడు. ప్రజ్ఞానంద రన్నరప్తో సరిపెట్టుకున్నాడు. టోర్నీ ఆధ్యాంతం దూకుడుగా ఆడిన ప్రజ్ఞానంద ఫైనల్లో కార్ల్సన్ ఎత్తుల ముందు చిత్తయ్యాడు. అంతకుముందు ఫైనల్లో భాగంగా జరిగిన రెండు గేమ్ల్లో కార్ల్సన్, ప్రజ్ఞానంద తలో గేమ్ గెలవడంతో టైబ్రేక్స్ ద్వారా విజేతను నిర్ణయించాల్సి వచ్చింది. Praggnanandhaa is the runner-up of the 2023 FIDE World Cup! 🥈 Congratulations to the 18-year-old Indian prodigy on an impressive tournament! 👏 On his way to the final, Praggnanandhaa beat, among others, world #2 Hikaru Nakamura and #3 Fabiano Caruana! By winning the silver… pic.twitter.com/zJh9wQv5pS — International Chess Federation (@FIDE_chess) August 24, 2023 Fabiano Caruana clinches third place in the 2023 FIDE World Cup and secures a ticket to the #FIDECandidates tournament next year, after prevailing against Nijat Abasov in the tiebreaks. Congratulations! 👏 📷 Stev Bonhage #FIDEWorldCup pic.twitter.com/Z35mDJJMwz — International Chess Federation (@FIDE_chess) August 24, 2023 -
36 ఏళ్ల ఆధిపత్యానికి తెర.. భారత చెస్లో 'నయా' కింగ్ ఆవిర్భావం
భారత చెస్లో కొత్త ఆధిపత్యం మొదలైంది. ఇన్నాళ్లు చెస్ పేరు చెబితే ముక్తకంఠంగా వినిపించే పేరు విశ్వనాథన్ ఆనంద్. దాదాపు 36 ఏళ్ల పాటు ఇండియాలో అత్యుత్తమ ర్యాంక్ చెస్ ప్లేయర్ విశ్వనాథన్ ఆనందే. కానీ అతని ఆధిపత్యానికి 17 ఏళ్ల గ్రాండ్మాస్టర్ డీ గుకేష్ చెక్ పెట్టాడు. తన గురువును మించిపోయిన గుకేష్ ఇండియాలో అత్యుత్తమ ర్యాంక్ సాధించి భారత చెస్ చరిత్రలో 'నయా కింగ్'గా అవతరించాడు. ఇంటర్నేషనల్ చెస్ ఫెడరేషన్ (ఫిడే) లైవ్ వరల్డ్ ర్యాంకింగ్స్ లో తొలిసారి ఒక ఇండియన్ ప్లేయర్ విశ్వనాథన్ ఆనంద్ను మించి రేటింగ్ సాధించాడు.వరల్డ్ కప్ లో భాగంగా తన రెండో రౌండ్ మ్యాచ్ లో అజర్బైజాన్ కు చెందిన మిస్రట్దిన్ ఇస్కాందరోవ్ పై విజయం సాధించాడు. 44 ఎత్తుల్లో గుకేష్ గెలవడంతో అతనికి 2.5 రేటింగ్ పాయింట్లు వచ్చాయి. దీంతో గుకేష్ లైవ్ రేటింగ్ 2755.9కి చేరింది. మరోవైపు ఆనంద్ 2754.0 రేటింగ్ పాయింట్లతో ఉన్నాడు. వరల్డ్ లైవ్ ర్యాంకింగ్స్ లో ప్రస్తుతం గుకేస్ 9వ స్థానంలో ఉండగా.. ఆనంద్ 10వ స్థానానికి పడిపోయాడు. అధికారిక ఫిడే రేటింగ్ లిస్టు ప్రకటించడానికి ఇంకా సమయం ఉన్నా.. గుకేష్ తన ఆధిపత్యం కొనసాగించే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయని ఫిడే ట్వీట్ చేసింది. "గుకేష్ ఇవాళ మళ్లీ గెలిచాడు. దీంతో లైవ్ రేటింగ్ లో విశ్వనాథన్ ఆనంద్ ను మించిపోయాడు. తర్వాతి ఫిడే రేటింగ్ లిస్ట్ అధికారికంగా ప్రకటించడానికి (సెప్టెంబర్ 1న) సుమారు నెల రోజుల సమయం ఉన్నా.. గుకేష్ టాప్ 10లో కొనసాగే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. అంతేకాదు అత్యధిక రేటింగ్ ఉన్న ఇండియన్ ప్లేయర్ గా కూడా నిలుస్తాడు" అని ఇంటర్నేషనల్ చెస్ ఫెడరేషన్ ట్వీట్ చేసింది. Gukesh D won again today and has overcome Viswanathan Anand in live rating! There is still almost a month till next official FIDE rating list on September 1, but it's highly likely that 17-year-old will be making it to top 10 in the world as the highest-rated Indian player!… pic.twitter.com/n3I2JPLOJQ — International Chess Federation (@FIDE_chess) August 3, 2023 ఇక విశ్వనాథన్ ఆనంద్ 1991లో తొలిసారి టాప్ 10లోకి వచ్చినా.. 1987 నుంచి ఇండియాలో అత్యధిక రేటింగ్ ప్లేయర్గా ఉన్నాడు. ఆనంద్ కన్నా ముందు 1986 జులైలో ప్రవీణ్ తిప్సే అత్యధిక రేటింగ్ ఉన్న ఇండియన్ ప్లేయర్ గా ఉన్నాడు. ఇప్పుడు గుకేష్ తన లీడ్ ఇలాగే సెప్టెంబర్ 1 వరకూ కొనసాగిస్తే ఆనంద్ను మించిన తొలి ప్లేయర్గా నిలుస్తాడు. చదవండి: 36 ఏళ్ల ఆధిపత్యానికి తెర.. భారత చెస్లో 'నయా' కింగ్ ఆవిర్భావం Yuzvendra Chahal: 'నిన్నెవరు వెళ్లమన్నారు.. వెనక్కి వచ్చేయ్'.. రూల్స్ ఒప్పుకోవు -
పవర్గ్రిడ్ చెస్ టోర్నీ విజేత కార్పొరేట్ సెంటర్
సాక్షి, హైదరాబాద్: పవర్గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఇంటర్ రీజినల్ చెస్ టోర్నమెంట్లో మహిళల టీమ్ విభాగంలో కమలేశ్ భూరాణి, హిమాన్షిలతో కూడిన కార్పొరేట్ సెంటర్ (సీసీ) జట్టు విజేతగా నిలిచింది. కార్పొరేట్ సెంటర్ జట్టు ఆడిన మూడు మ్యాచ్ల్లో గెలిచి అజేయంగా నిలిచింది. పవర్గ్రిడ్ సదరన్ రీజియన్–1 ఆధ్వర్యంలో మూడు రోజులపాటు హైదరాబాద్లో జరిగిన ఈ టోర్నీ ఆదివారం ముగిసింది. మహిళల టీమ్ విభాగంలో ఈస్టర్న్ రీజియన్–1కు రెండో స్థానం, నార్తర్న్ రీజియన్–2కు మూడో స్థానం లభించాయి. పురుషుల టీమ్ విభాగంలో బిశ్వజ్యోతి దాస్, అరుణ్ తివారీ, హృషికేశ్ సింగ్, బిజిత్ శర్మలతో కూడిన నార్త్ ఈస్టర్న్ రీజియన్ చాంపియన్గా నిలిచింది. నార్తర్న్ రీజియన్–1కు రెండో స్థానం, కార్పొరేట్ సెంటర్కు మూడో స్థానం దక్కాయి. పురుషుల వ్యక్తిగత విభాగంలో అంజన్ సేన్ (కార్పొరేట్ సెంటర్), బిశ్వజ్యోతి దాస్, గౌరవ్ కుమార్ (నార్తర్న్ రీజియన్–1) వరుసగా తొలి మూడు స్థానాల్లో... మహిళల వ్యక్తిగత విభాగంలో మీనాక్షి మలిక్ (నార్నర్త్ రీజియన్–1), హిమాన్షి, కమలేశ్ భూరాణి వరుసగా తొలి మూడు స్థానాల్లో నిలిచారు. పవర్గ్రిడ్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కె.శ్రీకాంత్ ముఖ్య అతిథిగా విచ్చేసి విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో సదరన్ రీజియన్–1 ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాజేశ్ శ్రీవాస్తవ, అలోక్ కుమార్ శర్మ (సీజీఎం–అసెట్ మేనేజ్మెంట్), సంజయ్ కుమార్ గుప్తా (సీజీఎం–ప్రాజెక్ట్స్), హరినారాయణన్ (సీజీఎం–హ్యూమన్ రిసోర్సెస్) తదితరులు పాల్గొన్నారు. -
భారత 83వ చెస్ గ్రాండ్మాస్టర్గా ఆదిత్య
మహారాష్ట్రకు చెందిన ఆదిత్య సామంత్ భారత చెస్లో 83వ గ్రాండ్మాస్టర్ (జీఎం)గా అవతరించాడు. స్విట్జర్లాండ్లో జరుగుతున్న బీల్ చెస్ ఫెస్టివల్లో ఆదిత్య జీఎం హోదా ఖరారు కావడానికి అవసరమైన 2500 ఎలో రేటింగ్ను అధిగమించడంతోపాటు చివరిదైన మూడో జీఎం నార్మ్ను సాధించాడు. 20 ఏళ్ల ఆదిత్య అబుదాబి మాస్టర్స్లో తొలి జీఎం నార్మ్, ఎల్ లోలోబ్రెగట్ ఓపెన్లో రెండో జీఎం నార్మ్ సాధించాడు. -
సంచలనం.. 17 ఏళ్ల కుర్రాడి చేతిలో విశ్వనాథన్ ఆనంద్ ఓటమి
భారత చెస్ దిగ్గజం.. ఐదుసార్లు చాంపియన్ విశ్వనాథన్ ఆనంద్కు షాక్ తగిలింది. భారత 17 ఏళ్ల గ్రాండ్ మాస్టర్ దొమ్మరాజు గుకేశ్ దిగ్గజంతో తలపడిన తొలి మ్యాచ్లోనే విజయం సాధించడం విశేషం. విషయంలోకి వెళితే.. క్రోయేషియా రాజధాని జగ్రెబ్లో జరుగుతున్న సూపర్ యునైటెడ్ ర్యాపిడ్ బ్లిట్జ్ క్రొయేషియా 2023 పోటీల్లో గుకేశ్, ఆనంద్ పోటీ పడ్డారు. ‘ఈ విజయం చాలా ప్రత్యేకమైనది. నాకు చాలా సంతోషంగా ఉంది. నేను బాగా ఆడతానని తెలుసు. అయితే. ఆనంద్ నుంచి గట్టి పోటీ ఎదురైంది. నేను ఎంతగానో ఆరాధించే ఆటగాడిపై విజయం చాలా స్పెషల్గా అనిపిస్తోంది’ అని గుకేశ్ అన్నాడు. అయితే.. 10 పాయింట్లు సాధించిన ఈ ఇద్దరూ నాలుగో స్థానంలో నిలిచారు. చెన్నైకి చెందిన గుకేశ్కి విశ్వనాథన్ ఆనంద్ అంటే చాలా ఇష్టం. అతడిని చూస్తూ పెరిగిన గుకేశ్ పెద్దయ్యాక చెస్ ప్లేయర్ కావాలనుకన్నాడు. అండర్ -13 చాంపియన్గా నిలిచాడు. అయితే.. ప్రపంచంలో అతి చిన్నవయసులోనే గ్రాండ్ మాస్టర్గా రికార్డు చేజార్చుకున్నాడు. అంతేకాదు ఈ ఏడాది జూన్ నెలలో వరల్డ్ నంబర్-1 మాగ్నస్ కార్లోసన్(Magnus Carlsen)ను ఓడించి మరోసారి ప్రపంచం దృష్టిని ఆకర్షించాడు. ఈరోజు ఆనంద్పై పైచేయి సాధించి తన ప్రతిభను చాటుకున్నాడు. చదవండి: #BjornBorg: 18 ఏళ్లకే సంచలనాలు.. 70వ దశకాన్ని శాసించిన టెన్నిస్ దిగ్గజం -
ఆనంద్ VS ఆనంద్: ఆనంద్ మహీంద్ర ట్వీట్, ఫోటోలు వైరల్
సాక్షి, హైదరాబాద్: టెక్ మహీంద్రా గ్లోబల్ చెస్ లీగ్ 2023 1వ ఎడిషన్ షురూ అయింది. ఈ సందర్భంగా పద్మభూషణ్ అవార్డు గ్రహీత, మహీంద్రా గ్రూప్ చైర్మన్, ఆనంద్ మహీంద్రా అరుదైన ఫోటోలను ట్వీపుల్తో షేర్ చేశారు. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న గ్లోబల్ చెస్ లీగ్ 2023 జూన్ 22న దుబాయ్లోగురువారం ప్రారంభమైంది. ప్రపంచంలోని అత్యుత్తమ చెస్ క్రీడాకారులందరూ ఇక్కడికి చేరారు.లీగ్ తొలి మ్యాచ్లో త్రివేణి కాంటినెంటల్ కింగ్స్ , అప్గ్రేడ్ ముంబా మాస్టర్స్ తలపడతాయి. ఆనంద్ VS ఆనంద్ గేమ్లో ఎవరు గెలుస్తారో గెస్ చేయండి.. కానీ గిఫ్ట్ ఏమీ ఉండదు. అయితే ఈ సందర్భం ఏంటో, తన క్లాసికల్ ఓపెనింగ్ ఏంటో చెప్పిన తొలి వ్యక్తిని మాత్రం కచ్చితంగా అభినందిస్తా అంటూ విజేత ఎవరో చెప్పకనే చెబుతూ చమత్కరించారు. 5 సార్లు ప్రపంచ ఛాంపియన్ విశ్వనాథన్ ఆనంద్తో చెస్ గేమ్ ఆడాటం విశేషంగా నిలిచింది. ఇదే విషయాన్ని ట్వీట్ చేస్తూ. చెస్ బేస్ ఇండియా ఈ లీగ్కు ఆరంభానికి సంబంధించిన ఫోటోలను ట్విటర్ హ్యాండిల్లో పోస్ట్ చేసింది. ఆనంద్ వెర్సస్ ఆనంద్ అంటూ ట్వీట్ చేసింది. కాగా ప్రపంచ చదరంగంలో భారతదేశానికి వన్నెతెచ్చిన క్రీడాకారుడు విశ్వనాథన్ ఆనంద్ అనడంలో ఎలాంటి సందేహంలేదు. రికార్డు విజయాలతో ఎంతోమందికి ప్రేరణగా నిలిచాడు. పిన్న ప్రాయంలోనే చెస్ క్రీడలో నైపుణ్యం సంపాదించి 14వ ఏటనే సబ్-జూనియర్ జాతీయ చెస్ చాంపియన్ షిప్ సాధించాడు. 2000లో తొలి సారిగా ఇండియాకు చెస్ ప్రపంచ చాంపియన్ షిప్ సాధించి పెట్టిన రికార్డును క్రీడా ప్రేమికులెవరూ మర్చిపోరు. చదరంగంలో చేసిన సేవలకు 5 సార్లు ప్రపంచ ఛాంపియన్ ఆనంద్ను భారత ప్రభుత్వం పద్మశ్రీ, పద్మభూషణ్ లాంటి అవార్డులతో ఘనంతా సత్కరించింది. The 1500 year old game, is ready to make #TheBigMove. The stage is set in Dubai, the modern marvel city of the world. @anandmahindra @tech_mahindra @FIDE_chess @DubaiSC @C_P_Gurnani @jagdishmitra @balanalaskank @gulf_titans @GangesGMs @SGAlpineWarrior @trivenickings @umumba… pic.twitter.com/8EkMTlIOJo — Tech Mahindra Global Chess League (@GCLlive) June 21, 2023 There will be NO prize for anyone who guesses who won the match…😊 (But I will applaud the first person who guesses which classical opening I used…) https://t.co/ghDTlbGxh5 — anand mahindra (@anandmahindra) June 22, 2023 -
షార్జా మాస్టర్స్ విజేత అర్జున్
ఆరంభ రౌండ్లలో తడబడ్డా... చివర్లో అనూహ్యంగా పుంజుకున్న తెలంగాణ గ్రాండ్మాస్టర్ ఇరిగేశి అర్జున్ షార్జా మాస్టర్స్ అంతర్జాతీయ చెస్ టోర్నీలో చాంపియన్గా అవతరించాడు. గురువారం ముగిసిన ఈ టోర్నీలో నిర్ణీత తొమ్మిది రౌండ్ల తర్వాత అర్జున్ 6.5 పాయింట్లతో అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. చివరి రౌండ్లో తెల్లపావులతో ఆడిన అర్జున్ 27 ఎత్తుల్లో నోదిర్బెక్ యాకుబోయెవ్ (ఉజ్బెకిస్తాన్)పై గెలిచాడు. ఎనిమిదో రౌండ్ తర్వాత మరో ఏడుగురితో కలిసి అర్జున్ సంయుక్తంగా ఆధిక్యంలో ఉన్నాడు. అయితే తొమ్మిదో రౌండ్లో అర్జున్ గెలుపొందగా... మిగతా ఆరుగురు ప్లేయర్లు తమ గేమ్లను ‘డ్రా’ చేసుకోవడంతో అర్జున్కు టైటిల్ ఖరారైంది. భారత్కే చెందిన దొమ్మరాజు గుకేశ్ ఆరు పాయింట్లతో మరో ఏడుగురితో కలిసి సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచాడు. అయితే మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా ర్యాంకింగ్ను వర్గీకరించగా గుకేశ్కు రెండో ర్యాంక్ లభించింది. విజేతగా నిలిచిన అర్జున్కు 10 వేల డాలర్లు (రూ. 8 లక్షల 27 వేలు) ప్రైజ్మనీగా లభించాయి. -
ఆలగడప బాలుడు.. భారత గ్రాండ్మాస్టర్
మిర్యాలగూడ అర్బన్ : మిర్యాలగూడ మండలంలోని ఆలగడప గ్రామానికి చెందిన ఉప్పల ప్రణీత్ చెస్లో గ్రాండ్మాస్టర్ సాధించాడు. భారతదేశం నుంచి ఈ గణత సాధించిన 82వ ఆటగాడిగా ప్రణీత్ నిలిచాడు. తెలంగాణ ఏర్పాటు తర్వాత రాష్ట్రం నుంచి 5వ గ్రాండ్ మాస్టర్ హోదా పొందాడు. చెస్లో గ్రాండ్మాస్టర్ (జీఎం) హోదా రావాలంటే మూడు జీఎం నార్మ్లు సాధించడంతో పాటు ఎలో రేటింగ్ పాయింట్లు 2500 దాటాలి. అయితే అజర్బైజాన్లో జరిగిన బకూ ఓపెన్లో టోర్నీలో ప్రణీత్ అద్భుత ప్రదర్శన కనబర్చాడు. గ్రాండ్మాస్టర్ హోదాకు కావాల్సిన 2500 ఎలో రేటింగ్ను అధిగమించిన ప్రణీత్ 15 ఏళ్ల వయస్సులో గ్రాండ్ మాస్టర్ హోదా దక్కించుకున్నాడు. ఉమ్మడి జిల్లా నుంచి తొలిసారి గ్రాండ్మాస్టర్ ఘనత సాధించిన ప్రణీత్కు పలు క్రీడా సంఘాలు, క్రీడాకారులు, ఆలగడప గ్రామస్తులు అభినందనలు తెలిపారు. హైదరాబాద్లో స్థిర నివాసం మిర్యాలగూడ మండలం ఆలగడప గ్రామానికి చెందిన ఉప్పల శ్రీనివాసచారి, ధఽనలక్ష్మి దంపతుల కుమారుడు ప్రణీత్. శ్రీనివాసచారి కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ (సీటీఓ)గా, ధనలక్ష్మి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో లెక్చరర్గా పని చేస్తున్నారు. కొనేళ్లు క్రితం వీరు హైదరాబాద్లో స్థిరపడ్డారు. ఆలగడపలో వీరికి సొంత ఇల్లు, భూ ములు ఉన్నాయి. ప్రతి పండుగకు, శుభకార్యాలకు, సెలవుల్లో స్వగ్రామానికి వస్తుంటారు. తల్లిదండ్రుల ప్రోత్సాహం.. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ప్రణీత్ చెస్లో రాణిస్తున్నాడు. ఆర్థికంగా అనేక ఇబ్బందులు వచ్చినా.. కుమారుడి కెరీర్ ఆగిపోవద్దనే ఉద్దేశంతో వారు ఫ్లాట్ను సైతం విక్రయించి ప్రణీత్ చెస్లో రాణించేందుకు అండగా నిలిచారు. విదేశాల్లో టోర్నీల శిక్షణ కోసం ఎంతో ఖర్చు పెడుతూనే ఉన్నారు. కొన్నిసార్లు ఓటమి ఎదురై ప్రణీత్కు నిరాశ కలిగినా.. పట్టుదలతో విజయాల వైపు సాగిపోయాడు. 2021 వరకు రామరాజు వద్ద శిక్షణ పొందిన ప్రణీత్, ప్రస్తుతం ఇజ్రాయిల్కు చెందిన కోచ్ విక్టర్ మెకలెవిస్కి వద్ద శిక్షణ తీసుకుంటున్నాడు. ప్రణీత్ సాధించిన విజయాలు ► అండర్–7లో రాష్ట్ర ఛాంపియన్గా నిలిచాడు. ► 2015లో ఢిల్లీలో జరిగిన అంతర్జాతీయ జీఎం టోర్నీలో 220 ఎలో రేటింగ్ పాయింట్లు సాధించి ఒకే ఛాంపియన్షిప్లో అత్యధిక పాయింట్లు గెలిచిన ఆటగాడిగా జాతీయ రికార్డు సృష్టించాడు. ► అదే ఏడాది ఆసియా ఛాంపియన్షిప్లో కాంస్య పతకం సాధించాడు. ► 2018లో అండర్–11లో ప్రపంచ నంబర్వన్గా నిలిచాడు. ► 2021లో అండర్–14 జాతీయ ఛాంపియన్గా నిలిచాడు. ► ఆసియా దేశాల ఆన్లైన్ చెస్ టోర్నీలో స్వర్ణం సాధించాడు. ఎంతో సంతోషంగా ఉంది చెస్ను ఆన్లైన్లో ఆడడం కంటే, నేరుగా బోర్డుపై ఆడడానికే ప్రాధాన్యమిస్తా. బిల్జ్, ర్యాపిడ్ కంటే క్లాసికల్ విభాగం అంటేనే నాకిష్టం. బలమైన ప్రత్యర్థిపై గెలుపుతో పాటు గ్రాండ్ మాస్టర్ హోదా కూడా దక్కింది. గ్రాండ్ మాస్టర్ హోదా సాధించినందుకు సంతోషంగా ఉంది. ఐదున్నరేళ్ల వయస్సులోనే చెస్ ఆడటం మొదలెట్టా. చిన్నప్పుడు టెన్నీస్ ఆడేవాడిని. ఈతలోను ప్రవేశం ఉంది కానీ ఓ రోజు నాన్న చెస్ ఆడతుండగా చూసి ఆసక్తి కలిగింది. నా ఇష్టాన్ని గమనించి అమ్మానాన్న నన్ను ప్రోత్సహించారు. కార్ల్సన్ను ఆరాధిస్తా. ఇక నా రేటింగ్ను 2800కు పెంచుకునేందుకు కృషి చేస్తున్నా. ప్రపంచ చాంపియన్గా నిలవడంతో పాటు ఒలింపిక్లో దేశానికి పతకం అందించడమే నా లక్ష్యం. – ఉప్పల ప్రణీత్, గ్రాండ్ మాస్టర్ -
Tepe Sigeman And Co 2023 R4: అర్జున్కు మూడో పరాజయం
టెపి సెగెమన్ ఓపెన్ అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్లో తెలంగాణ గ్రాండ్మాస్టర్ ఇరిగేశి అర్జున్ మూడో పరాజయం చవిచూశాడు. స్వీడన్లో సోమవారం జరిగిన ఐదో రౌండ్ గేమ్లో అర్జున్ 51 ఎత్తుల్లో జోర్డాన్ వాన్ ఫోరీస్ట్ (నెదర్లాండ్స్) చేతిలో ఓడిపోయాడు. భారత సంతతికి చెందిన అమెరికా గ్రాండ్మాస్టర్ అభిమన్యు మిశ్రా, భారత గ్రాండ్మాస్టర్ గుకేశ్ మధ్య జరిగిన గేమ్ 42 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగిసింది. ఐదో రౌండ్ తర్వాత గుకేశ్ మూడు పాయింట్లతో మూడో స్థానంలో, అర్జున్ రెండు పాయింట్లతో ఆరో స్థానంలో ఉన్నారు. -
అంతర్జాతీయ చెస్ టోర్నీలో సత్తా చాటుతున్న తెలంగాణ గ్రాండ్ మాస్టర్
టెపి సెగెమన్ ఓపెన్ అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్లో భారత యువ గ్రాండ్ మాస్టర్, తెలంగాణ ప్లేయర్ ఇరిగేశి అర్జున్ రెండో విజయం సాధించాడు. భారత్కే చెందిన మరో యువ గ్రాండ్మాస్టర్ దొమ్మరాజు గుకేశ్తో ఆదివారం స్వీడన్లో జరిగిన నాలుగో రౌండ్ గేమ్లో అర్జున్ 38 ఎత్తుల్లో గెలుపొందాడు. నాలుగు రౌండ్ల తర్వాత అర్జున్ రెండు పాయింట్లతో ఐదో స్థానంలో, గుకేశ్ 2.5 పాయింట్లతో మూడో ర్యాంక్లో ఉన్నారు. -
International Chess Tourney: ఆంధ్రప్రదేశ్ గ్రాండ్మాస్టర్కు కాంస్యం
సాక్షి, హైదరాబాద్: బుకారెస్ట్ గ్రాండ్ప్రి అంతర్జాతీయ ర్యాపిడ్ చెస్ టోర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్మాస్టర్ పెంటేల హరికృష్ణ కాంస్య పతకం సాధించాడు. రొమేనియాలో జరిగిన ఈ టోర్నీలో నిర్ణీత 10 రౌండ్ల తర్వాత మాక్సిమ్ చిగయెవ్ (రష్యా), డేనియల్ బొగ్డాన్ (రొమేనియా), హరికృష్ణ 8.5 పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచారు. అయితే మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా ర్యాంకింగ్ను వర్గీకరించారు. చిగయెవ్కు టాప్ ర్యాంక్ దక్కగా... బొగ్డాన్కు రెండో ర్యాంక్, హరికృష్ణకు మూడో ర్యాంక్ లభించాయి. హరికృష్ణ మొత్తం ఎనిమిది గేముల్లో గెలిచి, మరో గేమ్ను ‘డ్రా’ చేసుకొని, భారత్కే చెందిన యువ గ్రాండ్మాస్టర్ రౌనక్తో జరిగిన గేమ్లో ఓడిపోయాడు. -
రన్నరప్గా ఏపీ గ్రాండ్ మాస్టర్ కార్తీక్ వెంకటరామన్
సన్వే ఫార్మెన్టెరా అంతర్జాతీయ చెస్ టోర్నీలో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్మాస్టర్ కార్తీక్ వెంకటరామన్ రన్నరప్గా నిలిచాడు. స్పెయిన్లో ముగిసిన ఈ టోర్నీ లో నిర్ణీత 10 రౌండ్ల తర్వాత ఫెదోసీవ్ వ్లాదిమిర్ (రష్యా), కార్తీక్ వెంకటరామన్ (భారత్), ప్రణవ్ (భారత్), లియోన్ ల్యూక్ మెండోకా (భారత్) ఏడు పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచారు. విజేతను నిర్ణయించేందుకు ఈ నలుగురి మధ్య ప్లే ఆఫ్ గేమ్లను నిర్వహించారు. వ్లాదిమిర్, కార్తీక్ ఫైనల్ చేరగా.. ఫైనల్లో కార్తీక్పై నెగ్గి వ్లాదిమిర్ విజేతగా నిలిచాడు. -
భారతదేశ భవిష్యత్తుని మార్చేది ఇలాంటివారే: ఆనంద్ మహీంద్రా
సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే 'ఆనంద్ మహీంద్రా' ఇటీవల తన ట్విట్టర్ వేదికగా ఒక బాలుడి గురించి చెప్పుకొచ్చారు, ఇలాంటి వారే భారతదేశం భవిష్యత్తుని నిర్ణయిస్తారని వెల్లడించాడు, ఈ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇటీవల తమిళనాడులోని హోసూర్లో జరిగిన స్కూల్ చెస్ పోటీకి సుమారు 1600 మంది పిల్లలు హాజరయ్యారు, ఇందులో ఒక బాలుడు తాను ఈ పోటీల్లో పాల్గొనటానికి రాత్రి మొత్తం రెండు బస్సులలో ప్రయాణించి పోటీ ప్రాంతానికి చేరుకున్నారు. అయితే మ్యాచ్ జరగటానికి ముందు ఒక చిన్న కునుకు తీసాడు. జరగబోయే పోటీలో విజయం పొందటమే అతని లక్ష్యం. ఆనంద్ మహీంద్రా ఈ పోస్టుని తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా షేర్ చేశారు. దీనికి మండే మోటివేషన్ అంటూ క్యాప్సన్ కూడా ఇచ్చారు. ఇది ఎంతో మందిని ఆకర్షించింది. నిజానికి ఇలాంటివి ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తాయి. కొంత మంది ఈ పోస్ట్ చూసి కామెంట్స్ కూడా చేస్తున్నారు, ఇందులో పిల్లల నుంచి మనం చాలా విషయాలను నేర్చుకోవాలని, వారు అందరికి స్ఫూర్తిదాయకమని, ఆల్ ది బెస్ట్, ఛాంప్ అంటూ.. భారతదేశానికి కీర్తి తెచ్చే అంకితభావం కలిగి మేధావులు ఉంటారని మరికొందరు అన్నారు. A recent school chess competition in Hosur had 1600 kids from all over. This boy traveled all night by bus (changing buses twice) then walked from the depot. Took a nap before the match. Wants to be the next Magnus. Kids like him shape India’s future. He’s my #MondayMotivation pic.twitter.com/1WhlapiLCn — anand mahindra (@anandmahindra) February 27, 2023 -
ప్రపంచ చెస్ చాంపియన్ కార్ల్సన్పై విదిత్ విజయం
చెన్నై: ప్రొ చెస్ లీగ్లో భారత గ్రాండ్మాస్టర్ విదిత్ సంతోష్ గుజరా తి గొప్ప ఫలితం సాధించాడు. ప్రపంచ నంబర్వన్, ప్రపంచ చాంపియన్ మాగ్నస్ కార్ల్సన్ (నార్వే)పై విదిత్ గెలుపొందాడు. ఆన్లైన్లో జరుగుతున్న ఈ టోర్నీలో ఇండియన్ యోగిస్ జట్టు తరఫున పోటీపడుతున్న విదిత్ బ్లిట్జ్ గేమ్లో 58 ఎత్తుల్లో కెనడా చెస్బ్రాస్ జట్టు తరఫున ఆడుతున్న కార్ల్సన్పై విజయం సాధించాడు. 16 జట్లు పోటీపడుతున్న ఈ టోర్నీని లక్షా 50 వేల డాలర్ల ప్రైజ్మనీతో నిర్వహిస్తున్నారు. ఇటీవల కాలంలో కార్ల్సన్ను ఓడించిన నాలుగో భారత గ్రాండ్మాస్టర్ విదిత్ కావడం విశేషం. ప్రజ్ఞానంద, గుకేశ్, ఇరిగేశి అర్జున్ కూడా ఈ నార్వే దిగ్గజంపై వివిధ టోరీ్నలలో గెలుపొందారు. -
చదరంగంలో మిస్టర్ మేధావి.. తొలి గురువు ఎవరంటే?
ప్రతి ఆటకూ ఒకరు టార్చ్బేరర్ ఉంటారు... అతను నడిచిన బాట కొత్త తరానికి మార్గనిర్దేశనం చేస్తుంది.. అతను వేసిన దారి కొత్తవారి విజయాన్ని సులువు చేస్తుంది..ఆ ఆటగాడు ఇచ్చిన స్ఫూర్తి అందరికీ నమ్మకాన్ని కలిగిస్తుంది.. మేమూ సాధించగలమనే ధైర్యాన్ని ఇస్తుంది.. భారత్ చదరంగానికి సంబంధించి ఆ ఘనాపాటి విశ్వనాథన్ ఆనంద్.. మిగతా క్రీడల్లో మరో పేరు స్ఫురణకు రావచ్చేమో కానీ ఆనంద్ లేకుండా భారత చెస్ లేదు..ఇప్పుడు భారత్లో 79 మంది గ్రాండ్మాస్టర్లు.. మొదటివాడు మాత్రం మన ‘విషీ’.. ‘ఆనంద్లాంటి వ్యక్తులు చాలా అరుదు. రోజుకు 14 గంటలు కష్టపడితే చెస్లో నైపుణ్యం సంపాదించవచ్చు. కొన్ని విజయాలూ అందుకోవచ్చు. కానీ అత్యుత్తమ ఆటగాడిగా ఎదగాలంటే అసాధారణ, సహజ ప్రజ్ఞ ఉండాలి. అది ఆనంద్లో ఉంది. అందుకే ఆయన ఆ స్థాయికి చేరారు. మా అందరికీ స్ఫూర్తిగా నిలిచారు’.. ఆనంద్ తర్వాత భారత రెండో గ్రాండ్మాస్టర్గా గుర్తింపు తెచ్చుకున్న దివ్యేందు బారువా చేసిన వ్యాఖ్య ఇది. దశాబ్దాలుగా చదరంగంలో సాగుతున్న రష్యా ఆధిపత్యాన్ని ఆనంద్ బద్దలు కొట్టగలిగాడు. గ్యారీ కాస్పరోవ్, అనతొలి కార్పొవ్, వ్లదిమిర్ క్రామ్నిక్.. మొదలైన వారికి సవాల్ విసురుతూ ఆనంద్ శిఖరానికి చేరగలిగాడు. ఐదు సార్లు ప్రపంచ చాంపియన్గా తనకంటూ ప్రత్యేక అధ్యాయాన్ని లిఖించుకున్నాడు. చెస్ ఆటకు మన దేశం నుంచి అసలైన రాయబారిగా నిలిచాడు. ఆమె అండగా.. అమ్మ సుశీల ఆనంద్కు చెస్లో ఆది గురువు. 80ల్లో తల్లిదండ్రులకు ఏదైనా క్రీడలో ఆసక్తి ఉండి వారు అందులో ప్రోత్సహిస్తే అదే ఆటను ఎంచుకోవడం తప్ప సొంతంగా తమ ఇష్టాయిష్టాలను ప్రదర్శించే అవకాశం తక్కువ. అందులోనూ చెస్ అంటే ‘ఏం భవిష్యత్ ఉంటుంది?’ అన్నట్లుగానే ఉండేది. ఆనంద్ తల్లికి చదరంగం అంటే ఇష్టం ఉన్నా.. కొడుకును బలవంతపెట్టలేదు. కానీ ‘చైల్డ్ ప్రాడజీ’లాంటి తన కొడుకులో చురుకుదనాన్ని ఆమె గుర్తించింది. దానిని సరైన రీతిలో ఉపయోగించుకోవాలనే ఆనంద్ను చెస్లోకి తీసుకొచ్చింది. తానే గురువుగా మారి అన్నీ నేర్పించింది. తండ్రి కృష్ణమూర్తి కూడా ఎంతో ప్రోత్సహించాడు. ఉద్యోగరీత్యా తాను ఫిలిప్పీన్స్లో ఉండాల్సి వస్తే అక్కడకు వెళ్లాక సరైన రీతిలో శిక్షణ ఇప్పించాడు. ఆ కుర్రాడు తల్లిదండ్రుల నమ్మకాన్ని వమ్ము చేయలేదు. ఊహించినదానికంటే వేగంగా ఎదుగుతూ దూసుకుపోయాడు. మద్రాసులో ఆరేళ్ల వయసులో చెస్లో ఓనమాలు దిద్దుకున్న ఆనంద్ ఐదు పదులు దాటినా విశ్వవ్యాప్తంగా ఇప్పటికీ తనదైన ముద్రను చూపించగలుగుతున్నాడంటే అతని ఘనత ఎలాంటిదో అర్థమవుతోంది. వర్ధమాన ఆటగాడిగా ఎదుగుతున్న సమయంలో ‘లైట్నింగ్ కిడ్’ అంటూ చెస్ ప్రముఖులతో పిలిపించుకున్న విషీ.. ఆ తర్వాత చదరంగంలో తన విజయాలతో వెలుగులు విరజిమ్మాడు. వరుస విజయాలతో.. 14 ఏళ్ల వయసులో జాతీయ సబ్ జూనియర్ చాంపియ¯Œ గెలవడం మొదలు ఆనంద్కు ఎదురు లేకుండా పోయింది. ఆశ్చర్యకర రీతిలో అసలు అపజయాలు లేకుండా అతను పైపైకి దూసుకుపోయాడు. తర్వాతి ఏడాదే ఆసియా జూనియర్ చాంపియన్షిప్, 15 ఏళ్లకే ఇంటర్నేషనల్ మాస్టర్ నార్మ్ సాధించిన ఆటగాడిగా గుర్తింపు, 16 ఏళ్లకే జాతీయ సీనియర్ చాంపియన్, 18 ఏళ్ల వయసులో వరల్డ్ జూనియర్ చాంపియన్ .. ఈ జాబితా అలా సాగుతూ పోయింది. ఆనంద్ ఉన్నాడంటే చాలు ప్రత్యర్థులు రెండో స్థానానికి పోటీ పడేందుకు సిద్ధమైనట్లే అన్నట్లుగా పరిస్థితి ఉండేది! తన విజయాలు గాలివాటం కాదని, ఈ అసాధారణ ప్రతిభతో మున్ముందు తానేంటో చూపించగలననే నమ్మకం ఎట్టకేలకు 19వ ఏట వచ్చింది. 1988లో సొంత రాష్ట్రంలోని కోయంబత్తూర్లో జరిగిన శక్తి ఇంటర్నేషనల్ టోర్నీని గెలవడంతో ఒక కొత్త చరిత్ర నమోదైంది. భారతదేశపు తొలి గ్రాండ్మాస్టర్గా విశ్వనాథన్ ఆనంద్ అవతరించాడు. అక్కడ మొదలైన ఆ అగ్రస్థాయి ప్రస్థానం ఆల్టైమ్ గ్రేట్గా నిలిపింది. అందరికీ ఇష్టుడు.. ‘వై దిస్ నైస్ గై ఆల్వేస్ విన్ ’.. విశ్వనాథన్ ఆనంద్ గురించి చెస్ ప్రపంచంలో తరచుగా వినిపించే, అతనికి మాత్రమే వర్తించే వ్యాఖ్య! సాధారణంగానే చెస్ ఆటగాళ్లు బోర్డుపై మినహా బయట ఎక్కువగా దూకుడు ప్రదర్శించరు. కానీ ఆనంద్ వారందరికంటే మరో మెట్టు పైనుంటాడు. సుదీర్ఘ కెరీర్లో ఎన్నో హోరాహోరీ మ్యాచ్లలో ఆడినా ఏరోజూ అతను సంయమనం కోల్పోలేదు. విమర్శలు, ప్రతివిమర్శలు చేయలేదు. ఏర్పాట్లు, సౌకర్యాల విషయంలో ఫిర్యాదు చేయలేదు. అతని ఆటలాగే మాట, వ్యవహారశైలి కూడా ప్రశాంతంగా ఉంటుంది. తాను జూనియర్గా ఉన్న సమయంలో ఏర్పాట్లు బాగా లేవంటూ ఆటగాళ్లంతా మూకుమ్మడిగా టోర్నీని బహిష్కరిస్తే తాను మాత్రం ఎక్కడైనా ఆడేందుకు సిద్ధమని ఆనంద్ స్పష్టంగా చెప్పేశాడు. అదే నాలుగుసార్లు వరల్డ్ చాంపియన్గా నిలిచిన తర్వాత కూడా విమానాలు అనూహ్యంగా రద్దయితే రెండు రోజుల పాటు 2 వేల కిలోమీటర్లు రోడ్డు ద్వారా ప్రయాణించి మరీ ఇచ్చిన మాటకు కట్టుబడి అక్కడికి చేరుకున్న వెంటనే మ్యాచ్ ఆడాడు. నిర్వాహకులు కూడా అమితాశ్చర్యంతో ‘మ్యాచ్ను వాయిదా వేసేవాళ్లం కదా’ అన్నా వారికీ చిరునవ్వే సమాధానమైంది. రష్యా రాజకీయాల్లో కాలు పెట్టి తీవ్ర వివాదాస్పదుడిగా ముద్ర వేసుకున్న కాస్పరోవ్లా ఆనంద్ ఎప్పుడూ తన పరిధి దాటలేదు. ఇలాంటి వ్యక్తిత్వమే ఆనంద్కు ప్రపంచవ్యాప్తంగా అభిమానులను తెచ్చి పెట్టింది. సాధించిన ఘనతలెన్నో.. 2000, 2007, 2008, 2010, 2012లలో విశ్వనాథన్ ఆనంద్ వరల్డ్ చాంపియన్గా నిలిచాడు. 2007లో తొలిసారి ర్యాంకింగ్స్లో వరల్డ్ నంబర్వన్గా మారిన అతను సుదీర్ఘకాలం ప్రపంచ చెస్ను శాసించాడు. తన సమకాలికులు ఎందరికో సాధ్యం కాని రీతిలో 48 ఏళ్ల వయసులో అత్యంత వేగంగా సాగే ‘ర్యాపిడ్’ ఈవెంట్లో సత్తా చాటాడు. తన తరంలో అత్యుత్తమ ర్యాపిడ్ ఆటగాడిగా గుర్తింపు తెచ్చుకున్న అతను 2003, 2017లలో ఈ విభాగంలో విశ్వవిజేతగా నిలిచాడు. ర్యాపిడ్ కంటే కూడా వేగంగా క్షణాల వ్యవధిలో సాగే బ్లిట్జ్లో తన ముద్ర వేయడం ఆనంద్కే చెల్లింది. 2000లో వరల్డ్ బ్లిట్జ్ కప్ విజేతగా నిలవడం అతని సామర్థ్యాన్ని చూపించింది. టోర్నమెంట్ ఫార్మాట్, మ్యాచ్ ఫార్మాట్, నాకౌట్ ఫార్మాట్, ర్యాపిడ్ ఫార్మాట్లలో ప్రపంచ చాంపియన్గా నిలిచిన ఏకైక ఆటగాడు కావడం.. ఆనంద్ గొప్పతనాన్ని చెబుతుంది. వరల్డ్ చాంపియన్షిప్లు మాత్రమే కాదు కోరస్ ఇంటర్నేషనల్, టాటా స్టీల్, తాల్ మెమోరియల్, లినారెస్ చెస్లాంటి ప్రతిష్ఠాత్మక టోర్నీ విజయాలు అతని ఖాతాలో ఉన్నాయి. భారత ప్రభుత్వం నుంచి తొలి ‘ఖేల్రత్న’ పురస్కారంతో పాటు పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్లు అతనికి కంఠాభరణంగా మారాయి. ‘మై బెస్ట్ గేమ్స్ ఆఫ్ చెస్’ అంటూ తన అనుభవాలతో భారత్ చెస్కు కొత్త పాఠాలు నేర్పించిన ఆనంద్ కెరీర్ ఆద్యంతం స్ఫూర్తిదాయకం. - మొహమ్మద్ అబ్దుల్ హాది -
తెలుగు చతురంగ బలం
రాష్ట్రపతి చేతుల మీదుగా పురస్కారం. ప్రధానితో ముచ్చటగా మాటామంతీ.ఇలాంటి ఓ రోజును కలలోనైనా కలగనలేదు.బాలపురస్కార్ గ్రహీత అంతరంగం ఇది. నాలుగేళ్ళ చిరుప్రాయంలో చదరంగ ΄పావులు కదపడం నేర్చిన ఆ చిన్నారి... పదకొండవ ఏటనే ఉమెన్ ఫిడే మాస్టర్ టైటిల్ను సొంతం చేసుకుంది. రాష్ట్రపతి చేతుల మీదుగా గణతంత్రదినోత్సవ వేడుకల్లో భాగంగా బాలపురస్కార్ అవార్డును అందుకుంది. ఆ చిన్నారే ఆంధ్రప్రదేశ్ విశాఖకు చెందిన కొలగట్ల అలన మీనాక్షి. అమ్మ ఆడుకునేందుకు సరదాగా ఇచ్చిన చతురంగ బోర్డే ఆనతికాలంలో ఎత్తులకు పైఎత్తులు వేసి ఫిడే మాస్టర్ టైటిల్ సాధించే స్థాయికి ఎదిగిన క్రమాన్ని ఆమె ‘సాక్షి’తో పంచుకుంది. ప్రశ్న: చదరంగం ఆడటం ఎలా ప్రారంభమైంది? జవాబు: నాలుగేళ్లప్పుడు ఆమ్మ (అపర్ణ) సరదాగా ఆడుకోవడానికి బోర్డ్గేమ్స్తో ΄పాటు చదరంగం బోర్డ్ ఇచి్చంది. అది మాగ్నటిక్ బోర్డ్. చాలా సరదాగా వుండేది. ఆ తర్వాత గడుల్లో పావులు పెట్టి ఆనందపడేదాన్ని. అది గమనించిన అమ్మ శిక్షణకు తీసుకువెళ్ళింది. అలా వేసవి శిబిరంలో శిక్షణ΄÷ంది తొలిసారి స్థానిక టోరీ్నలో ΄ాల్గొంటే యంగెస్ట్ ప్లేయర్గా నిలిచాను. అప్పటినుంచి మరో ఏడాది ఆటపై దృష్టిపెట్టి ఐదున్నరేళ్లకే జిల్లా చాంపియన్గా నిలిచాను. ∙ఫిడే మాస్టర్గా ఎలా ఎదిగారు? బాలికల అండర్ 7 లో ఐదున్నరేళ్ళకే టోరీ్నల్లో ΄ాల్గొనడంతో ఫిడే రేటింగ్ మొదలైంది. క్రమంగా 2021లో ఎలో రేటింగ్ 1829కి చేరడంతో ఉమెన్ కాండిడేట్ మాస్టర్ టైటిల్ సాధించాను. ఇక అక్కడి నుంచి సీరియస్గానే టోరీ్నల్లో ΄ాల్గొనడం, రేటింగ్ పెంచుకోవడంతో గత డిసెంబర్లో ఉమెన్ ఫిడే మాస్టర్ టైటిల్ను సొంతం చేసుకున్నాను. స్పెయిన్లో ప్రపంచ చదరంగం క్యాంప్లో ఉండగా ఉమెన్ ఫిడే మాస్టర్ టైటిల్కు అర్హమైన ఎలోరేటింగ్ 2100 ΄ాయింట్లు సాధించాను. బాల పురస్కార్ అవార్డు వస్తుందని ఊహించారా? జనవరి 20వ తేదీ సాయంకాలం నాన్న(మధు)కి ఓ కాల్ వచి్చంది. ఆ కాల్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ మినిస్ట్రీ నుంచి. అర్జంట్గా వివరాలను పం΄ాలని అన్నారు. బాల పురస్కార్ అవార్డుకి ఎంపికయ్యానన్న విషయాన్ని అర్థం చేసుకోవడానికి ఐదారు నిమిషాలు పట్టింది. అంతే! గంటలో టికెట్స్ రావడం... మరుసటి రోజే ఢిల్లీకి పయనమవడం అంతా జరిగి΄ోయింది. అయితే రాష్ట్ర సంప్రదాయ దుస్తుల్లో రావాలన్నారు. రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు అందుకోవడం ఎలా ఉంది? అంత పెద్ద అవార్డు అందుకోవడం.. అదీ దేశ ప్రథమ΄పౌరురాలి చేతుల మీదుగా చిరు్ర΄ాయంలోనే తీసుకోవడం చాలా గర్వకారణం. రాష్ట్రానికి ప్రతినిధి కావడం ఒక మధురానుభూతి. ప్రధానమంత్రితో మాట్లాడారా? మోదీ గారు బాల పురస్కార గ్రహీతలందర్నీ కూర్చోబెట్టుకుని ముచ్చటించారు. నాతో ఆయన తెలుగులో మాట్లాడారు. ‘నేను చెప్పడం కాదు మీరు చెప్పండి’ అన్నారు. మాస్టర్ టైటిల్స్ సాధించడం వరకు నా అనుభవాన్ని చె΄్పాను. నాకు కొందరికి శిక్షణ ఇవ్వాలని ఉంది అంటే... ‘నీకు ఇంకా చాలా కెరీర్ ఉంది. మరిన్ని విజయాలను సొంతం చేసుకుని దేశానికి ఖ్యాతి తేవాలి’ అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఏమన్నారు? ‘ఇంత చిన్నవయస్సులోనే ఇన్ని టైటిల్స్ సొంతం చేసుకున్నావా’ అని ఆశ్చర్యపోయారు. ‘రాష్ట్రానికే గర్వకారణంగా నిలిచా’వని జగన్ సర్ అభినందించారు. మీ తదుపరి లక్ష్యం ఏమిటి? ప్రస్తుతం నేను ఆరోతరగతి చదువుతున్నాను. మార్చిలో పరీక్షలున్నాయి. పాఠశాలలోనూ చక్కటి ప్రోత్సాహం లభిస్తోంది. పరీక్షలనంతరం జూన్లో యూరప్ వెళదామని అనుకుంటున్నాను. రేటింగ్ను మెరుగుపరుచుకుని ఐఎం నార్మ్ సాధించడానికి ఎక్కువ టోర్నీలు ఆడవలసి ఉంటుంది. కొంతకాలం అక్కడుంటేనే అది సాధ్యం. నా తదుపరి లక్ష్యం ఉమెన్ ఇంటర్నేషనల్ మాస్టర్ (డబ్లు్య ఐఎం)... అంటూ నవ్వుతూ ఇంటర్వ్యూ ముగించింది అలన మీనాక్షి. ఈ చిన్నారికి ఆల్ ది బెస్ట్ చెప్పేద్దామా. – డాక్టర్ సూర్యప్రకాష్ మాడిమి, సాక్షి, విశాఖపట్నం ఎత్తులకు పై ఎత్తులు ► 2021 డిసెంబర్ 1న ఫిడే అండర్ 10 బాలికల చదరంగంలో ఉమెన్ కాండిడెట్ మాస్టర్ (డబ్లు్యసిఎం)గా ప్రకటించారు. ►అండర్10 బాలికల కేటగిరీలో 1829 ఎలో రేటింగ్తో ప్రపంచం రెండో రాంక్కు చేరింది. అదే ఏడాది సెర్బియాలో జరిగిన ఉమెన్ లీగ్ చెస్ చాంపియన్షిప్లోనూ జట్టు నాలుగోస్థానంలో నిలవడంలో చక్కటి ప్రతిభ. ► 2021లో నేషనల్ అండర్ 10 బాలికల చదరంగం చాంపియన్íÙప్. ►ఏషియన్ స్కూల్స్ అండర్ 7 క్లాసిక్లో స్వర్ణాన్ని సాధించగా... ర్యాపిడ్లో స్వర్ణాన్ని టైగా నిలిచింది. ► కామన్వెల్త్ అండర్ 8 బాలికల్లో ఆరోస్థానం. ► ప్రపంచ పాఠశాలల అండర్7 బాలికల క్లాసిక్ పోటీల్లో 13వ స్థానం. ► ఏషియన్ యూత్ – 8 బాలికల రాపిడ్ చెస్లో స్వర్ణాన్ని సాధించింది. వెస్ట్రన్ అసియన్ –8 బాలకల రాపిడ్, బ్లిజ్లలో స్వర్ణాలు. -
రిల్టన్ కప్తో పాటు గ్రాండ్మాస్టర్ హోదా దక్కించుకున్న తమిళ కుర్రాడు
స్టాక్హోమ్: తమిళనాడుకు చెందిన 16 ఏళ్ల ఎం.ప్రణేశ్ భారత 79వ చెస్ గ్రాండ్మాస్టర్గా గుర్తింపు పొందాడు. స్టాక్హోమ్లో జరిగిన రిల్టన్ కప్లో విజేతగా నిలిచిన ప్రణేశ్ టైటిల్ గెలుచుకోవడంతో పాటు గ్రాండ్మాస్టర్ హోదా కూడా సాధించాడు. ఈ టోర్నీకి ముందే అతను మూడు జీఎం నార్మ్లు పొందగా, ఇప్పుడు 2500 ఎలో రేటింగ్ పాయింట్లు (లైవ్) కూడా దాటాడు. ‘ఫిడే’ సర్క్యూట్లో తొలి టోర్నీ అయిన రిల్టన్ కప్లో ప్రణేశ్ 8 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచాడు. 136 మంది ఆటగాళ్లు పాల్గొన్న ఈ టోర్నమెంట్లో ఆడిన 9 గేమ్లలో అతను 8 గెలిచి ఒకటి ఓడాడు. తెలంగాణకు చెందిన రాజా రిత్విక్ 6 పాయింట్లతో ఎనిమిదో స్థానంలో నిలిచాడు. ప్రముఖ చెస్ కోచ్ ఆర్బీ రమేశ్ వద్ద ప్రణేశ్ శిక్షణ పొందుతున్నాడు. ‘అద్భుత ప్రదర్శన కనబర్చిన ప్రణేశ్కు నా అభినందనలు. మంచి స్కోరుతో అతను విజేతగా నిలిచాడు. మన దేశంలో గ్రాండ్మాస్టర్ల సంఖ్య వేగంగా పెరుగుతోంది’ అని దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ స్పందించారు. -
కార్ల్సన్కు ‘చెక్’
మయామి: ఎఫ్టీఎక్స్ క్రిప్టో కప్ అంతర్జాతీయ ర్యాపిడ్ చెస్ టోర్నీలో భారత యువ గ్రాండ్మాస్టర్ ఆర్. ప్రజ్ఞానంద రన్నరప్గా నిలిచాడు. వరల్డ్ నంబర్వన్, ప్రపంచ చాంపియన్ మాగ్నస్ కార్ల్సన్ (నార్వే)ను కంగు తినిపించినప్పటికీ ప్రజ్ఞానంద ఒక్క పాయింట్ తేడాతో రెండో స్థానానికి పరిమితమయ్యాడు. ఆఖరి రౌండ్ మ్యాచ్లో భారత ఆటగాడు 4–2తో కార్ల్సన్పై విజయం సాధించాడు. ఒక మ్యాచ్ నాలుగు గేములుగా జరిగే ఈ టోర్నీలో ఇద్దరు హోరాహోరీగా తలపడటంతో 2–2తో సమమైంది. ఈ దశలో విజేతను నిర్ణయించేందుకు బ్లిట్జ్లో రెండు టైబ్రేక్స్ను నిర్వహించగా రెండు గేముల్లోనూ ప్రజ్ఞానందే గెలిచాడు. అయితే ఓవరాల్గా నార్వే సూపర్ గ్రాండ్మాస్టర్ 16 మ్యాచ్ పాయింట్లతో టోర్నీ విజేతగా నిలువగా, భారత టీనేజ్ సంచలనం 15 పాయింట్లతో రన్నరప్తో సరిపెట్టుకున్నాడు. మేటి ర్యాంకింగ్ ఆటగాళ్లను కంగుతినిపించిన భారత ఆటగాడికి 5, 6వ రౌండ్ గేమ్ల్లో ఎదురైన ఓటములు ప్రతికూలమయ్యాయి. -
ప్రజ్ఞానంద మరో సంచలన విజయం.. ఈసారి ఎనిమిదో ర్యాంకర్పై..!
మయామి: ఎఫ్టీఎక్స్ క్రిప్టో కప్ అంతర్జాతీయ ర్యాపిడ్ చెస్ టోర్నీలో భారత యువ గ్రాండ్ మాస్టర్ ప్రజ్ఞానంద వరుసగా రెండో విజయం నమోదు చేశాడు. తొలి రౌండ్లో ప్రపంచ నాలుగో ర్యాంకర్ అలీరెజా ఫిరూజా (ఫ్రాన్స్)ను ఓడించిన 17 ఏళ్ల ప్రజ్ఞానంద... రెండో రౌండ్లో ఎనిమిదో ర్యాంకర్ అనీశ్ గిరి (నెదర్లాండ్స్)పై గెలిచాడు. నేపాల్ సంతతికి చెందిన అనీశ్ గిరితో జరిగిన రెండో రౌండ్ మ్యాచ్లో ప్రపంచ 89వ ర్యాంకర్ ప్రజ్ఞానంద 2.5–1.5తో నెగ్గాడు. తొలి మూడు గేమ్లు ‘డ్రా’ కాగా నాలుగో గేమ్లో ప్రజ్ఞానంద 81 ఎత్తుల్లో గెలిచి విజయాన్ని ఖాయం చేసుకున్నాడు. ఈ గెలుపుతో ప్రజ్ఞానందకు 7,500 డాలర్లు (రూ. 5 లక్షల 94 వేలు) ప్రైజ్మనీగా లభించాయి. ఎనిమిది మంది గ్రాండ్మాస్టర్ల మధ్య రౌండ్ రాబిన్ లీగ్లో ఈ టోర్నీ జరుగుతోంది. రెండో రౌండ్ తర్వాత ప్రపంచ చాంపియన్ కార్ల్సన్ (నార్వే), ప్రజ్ఞానంద ఆరు పాయింట్లతో టాప్ ర్యాంక్లో ఉన్నారు. -
ప్రజ్ఞానంద సంచలనం
మయామి: ఎఫ్టీఎక్స్ క్రిప్టో కప్ అంతర్జాతీయ ర్యాపిడ్ చెస్ టోర్నమెంట్లో భారత యువ గ్రాండ్మాస్టర్ ప్రజ్ఞానంద సంచలనంతో శుభారంభం చేశాడు. అమెరికా వేదికగా ఎనిమిది మంది మేటి గ్రాండ్మాస్టర్ల మధ్య లీగ్ పద్ధతిలో ఈ టోర్నీ జరుగుతోంది. తొలి రౌండ్ మ్యాచ్లో తమిళనాడుకు చెందిన 17 ఏళ్ల ప్రజ్ఞానంద 2.5–1.5తో ప్రపంచ నాలుగో ర్యాంకర్ అలీరెజా ఫిరూజా (ఫ్రాన్స్)పై గెలుపొందాడు. ఈ విజయంతో ప్రజ్ఞానందకు 7,500 డాలర్ల (రూ. 5 లక్షల 94 వేలు) ప్రైజ్మనీ లభించింది. ప్రపంచ చాంపియన్ మాగ్నస్ కార్ల్సన్ (నార్వే), లెవాన్ అరోనియన్ (అమెరికా), జాన్ క్రిస్టాఫ్ డూడా (పోలాండ్), లియెమ్ లీ (వియత్నాం), హాన్స్ నీమెన్ (అమెరికా), అనీశ్ గిరి (నెదర్లాండ్స్) కూడా ఈ టోర్నీలో ఆడుతున్నారు. -
9 నెలల గర్భంతో కాంస్య పతకం.. శభాష్ అంటున్న క్రీడాలోకం
చెస్ ఒలింపియాడ్లో కాంస్యం గెలిచిన భారత మహిళల ‘ఎ’ జట్టులో ద్రోణవల్లి హారిక కూడా సభ్యురాలు. ప్రస్తుతం 9 నెలల గర్భవతి అయిన హారిక...ఒక దశలో టోర్నీలో ఆడటం సందేహంగా మారింది. అయితే ఇప్పుడు విజేతగా నిలిచిన జట్టులో భాగం కావడం పట్ల ఆమె చాలా ఆనందంగా ఉంది. ‘18 ఏళ్ల క్రితం 13 ఏళ్ల వయసులో భారత మహిళల చెస్ టీమ్ తరఫున తొలి సారి ఆడాను. ఇవి నాకు 9వ ఒలింపియాడ్. దేశం తరఫున పతకం సాధించి పోడియంపై నిలవాలని ఎన్నో సార్లు కలలు కన్నాను. ఇప్పుడు ఇది సాధ్యమైంది. ప్రస్తుతం నేను 9 నెలల గర్భవతిగా ఉన్న సమయంలో ఇది దక్కడం చాలా ఉద్వేగంగా అనిపిస్తోంది. భారత్లో ఒలింపియాడ్ జరుగుతుందని తెలిసిన తర్వాత డాక్టర్ను సంప్రదిస్తే ఆరోగ్యంగా ఉంటే ఆడవచ్చని సూచించారు. అప్పటినుంచి చెస్ చుట్టే నా ప్రపంచం తిరిగింది. ప్రతీ అడుగులో ఆటపైనే దృష్టి పెట్టాను. పార్టీలు, వేడుకలు, బేబీ షవర్స్లాంటివేమీ లేవు. ఏదైనా పతకం గెలిచిన తర్వాతే అనుకున్నా. బాగా ఆడేందుకు ప్రతీ రోజు కష్టపడ్డా. గత కొన్నేళ్లుగా ఇలాంటి గెలుపు క్షణం కోసమే ఎదురు చూశా. ఇప్పుడు ఆ రోజు రానే వచ్చింది. భారత మహిళల జట్టుకు తొలి ఒలింపియాడ్ పతకం లభించింది’ అని హారిక తన సంతోషాన్ని భావోద్వేగంతో వెల్లడించింది. -
చెస్ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్కు కీలక పదవి
భారత చెస్ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ అంతర్జాతీయ చెస్ సమాఖ్య (ఫిడే) ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. ప్రస్తుత అధ్యక్షుడు అర్కడి వొర్కోవిచ్ రెండోసారి అధ్యక్షుడయ్యారు. విఖ్యాత చెస్ గ్రాండ్మాస్టర్ ఆనంద్ ‘ఫిడే’ కార్యవర్గంలోకి రావడం పట్ల వొర్కోవిచ్ హర్షం వ్యక్తం చేశారు. ‘ఆనంద్కు ప్రపంచ వ్యాప్తంగా పాపులారిటీ వుంది. ఇకపై ‘ఫిడే’ భవిష్యత్తుకు అతని సేవలు కీలకమవుతాయి’ అని అన్నారు. -
వైరల్: చదరంగ స్థలం
చదరంగం చదరపు బల్ల రంగస్థలం అయితే... రాజు, రాణి, సిపాయిలకు ప్రాణం వస్తే... ‘అహో!’ అనిపించే దృశ్యం కనువిందు చేస్తే... ‘అద్భుతం’ అనిపిస్తుంది. ‘చతురంగం’ వీడియో ద్వారా ఆ అద్భుతాన్ని ప్రపంచానికి చేరువ చేశారు కలెక్టర్ కవితారాము... ప్రపంచంలోని చదరంగ ప్రేమికుల దృష్టి ఇప్పుడు చెన్నైపై ఉంది. అక్కడ జరుగుతున్న ఆటల గురించి తెలుసుకోవడం ఒక ఎత్తు అయితే, సాంస్కృతిక కళారూపాలు మరో ఎత్తు. ‘చెస్ ఒలింపియాడ్–2022’ ప్రమోషన్లో భాగంగా వచ్చిన ‘చతురంగం’ అనే వీడియో ఇప్పుడు సోషల్మీడియాలో వైరల్ అవుతోంది. ‘దృష్టి మరల్చనివ్వని అద్భుతదృశ్యాలు’ అని వేనోళ్లా పొగుడుతున్నారు నెటిజనులు. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఈ వీడియో గురించి ట్విట్టర్ వేదికగా ప్రశంసించారు. పుదుకొటై్ట కలెక్టర్ కవితారాము ఈ ‘చతురంగం’ నృత్యరూప కాన్సెప్ట్ను డిజైన్ చేయడంతో పాటు కొరియోగ్రఫీ చేయడం విశేషం. కవితారాము స్వయంగా శాస్త్రీయ నృత్యకారిణి. ఎన్నో నృత్యప్రదర్శనలు ఇచ్చారు. ‘నృత్యంతో పాతికసంవత్సరాల నుంచి అనుబంధం ఉంది. చెస్ ఒలింపియాడ్ను ప్రమోట్ చేయడానికి ఒక వీడియో రూపొందించాలనే ప్రతిపాదన వచ్చినప్పుడు కాన్సెప్ట్ కొత్తగా ఉండాలి, దృశ్యపరంగా అద్భుతం అనిపించాలి అనుకున్నాను. అందులో భాగంగానే ఆటకు, నృత్యాన్ని జత చేసి చతురంగంకు రూపకల్పన చేశాము’ అంటుంది కలెక్టర్ కవితారాము. ఈ వీడియోలో క్లాసిక్, ఫోక్, మార్షల్ ఆర్ట్స్ ఫామ్స్ను ఉపయోగించారు. నేపథ్య సంగీతం ఆకట్టుకుంటుంది. సందర్భాన్ని బట్టి పసుపు, నీలిరంగు లైటింగ్ను వాడుకోవడం బాగుంది. పుదుకొటై్ట సంగీత కళాశాలకు చెందిన ప్రియదర్శిని నలుపువర్ణ రాణి, చెన్నై అడయార్ మ్యూజిక్ కాలేజికి చెందిన సహన శ్వేతవర్ణ రాణి వేషాలలో వెలిగిపోయారు. ‘మహిళాదినోత్సవం సందర్భంగా ప్రియదర్శిని నృత్యాన్ని చూశాను. చతురంగం వీడియో గురించి ఆలోచిస్తున్నప్పుడు ఆమె గుర్తుకువచ్చింది. ఇక సహన నృత్యం గురించి నాకు తెలుసు. ఎప్పటి నుంచో ఆమెతో పరిచయం ఉంది. ఇద్దరూ తమదైన నృత్యప్రతిభతో చతురంగంకు వన్నె తెచ్చారు’ అంటోంది కవితారాము. చదరంగంపై పావుల సహజ కదలికలను దృష్టిలో పెట్టుకొని మొదట్లో నృత్యాన్ని రూపొందించాలనుకున్నారు. అయితే దీని గురించి చర్చ జరిగింది. క్రియేటివ్ లిబర్టీ తీసుకుంటూనే బాగుంటుంది అనే అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు ఎక్కువమంది కళాకారులు. దీంతో నృత్యరీతులకు సృజనాత్మకతను జోడించారు. నలుపువర్ణ రాణి, శ్వేతవర్ణ రాజును ఓడించడంతో వీడియో ముగుస్తుంది. ఇది యాదృచ్ఛిక దృశ్యమా? ప్రతీకాత్మక దృశ్యమా? అనే సందేహానికి కలెక్టర్ కవితారాము జవాబు... ‘కావాలనే అలా డిజైన్ చేశాం. అంతర్లీనంగా ఈ దృశ్యంలో ఒక సందేశం వినిపిస్తుంది. తెలుపు మాత్రమే ఆకర్షణీయం, అందం అనే భావనను ఖండించడానికి ఉపకరించే ప్రతీకాత్మక దృశ్యం ఇది. దీనిలో జెండర్ కోణం కూడా దాగి ఉంది.’ -
చెస్ ఒలింపియాడ్లో భారత జట్ల హవా
Chess Olympiad 2022: చెన్నై వేదికగా జరుగుతున్న ప్రతిష్టాత్మక చెస్ ఒలింపియాడ్లో భారత జట్ల హవా కొనసాగుతుంది. స్వదేశంలో తొలిసారి జరుగుతున్న ఈ మెగా ఈవెంట్లో భారత గ్రాండ్మాస్టర్లు పరాజయం అన్నది లేకుండా దూసుకెళ్తున్నారు. ఓపెన్, మహిళల విభాగాల్లో భారత జట్లు వరుసగా మూడో విజయాలు సాధించి ‘హ్యాట్రిక్’ నమోదు చేశాయి. ఆదివారం జరిగిన మూడో రౌండ్ మ్యాచ్ల్లో (ఓపెన్ విభాగంలో) తెలుగు యువ కెరటాలు హరికృష్ణ, అర్జున్ ఇరిగైసి సత్తచాటడంతో భారత్ ‘ఎ’ 3–1తో గ్రీస్పై విజయం సాధించింది. దిమిత్రోస్పై హరికృష్ణ విజయం సాధించగా, అర్జున్.. మాస్తోవసిల్స్ను చిత్తు చేశాడు. భారత ‘బి’.. స్విట్జర్లాండ్పై (4–0) ఏకపక్ష విజయం నమోదు చేయగా.. భారత్ ‘సి’ 3–1తో ఐస్లాండ్పై నెగ్గింది. మహిళల విషయానికొస్తే.. భారత్ ‘ఎ’ 3–1తో ఇంగ్లండ్పై.. భారత్ ‘బి’ 3–1తో ఇండోనేసియాపై.. భారత్ ‘సి’ 2.5–1.5తో ఆస్ట్రియాపై గెలుపొందాయి. -
పాలస్తీనా చిన్నది... టోర్నీలోనే పిన్నది
చెన్నైకొచ్చిన 8 ఏళ్ల పాలస్తీనా పాప రాండా సెడార్. అసలు ‘ఎత్తు’ వేయకుండానే ఈ ‘చెస్ ఒలింపియాడ్’ పుస్తకాల్లోకెక్కింది. చెన్నై మెగా ఈవెంట్లో ఆడుతున్న అతిపిన్న వయస్కురాలిగా ఘనత పొందింది. ఐదేళ్ల పసిప్రాయంలో తండ్రి దగ్గర ఏదో ఆటవిడుపుగా నేర్చుకున్న చదరంగంలో అసాధారణ ప్రావీణ్యం సంపాదించింది. మూడేళ్లు తిరిగేసరికే పాలస్తీనా మహిళల చాంపియన్షిప్లో రెండో స్థానంలో నిలిచి... ఈ ఒలింపియాడ్లో ఆడే జాతీయ జట్టుకు ఎంపికైంది. మయన్మార్ అమరవట్టి... మన కుట్టి! భారత సంతతికి చెందిన 11 ఏళ్ల మయన్మార్ అమ్మాయి కూడా చెన్నైలో ప్రత్యర్థులకు చెక్ పెట్టేందుకు వచ్చింది. ఎన్నో ఏళ్లుగా మయన్మార్ అబ్బాయిలే ‘పావులు’ కదుపుతున్న చెస్ ఒలింపియాడ్ చరిత్రలో తొలిసారి అమ్మాయిల జట్టు ఆడుతోంది. అరంగేట్రం చేస్తున్న అమ్మాయిల బృందంలో ఉన్న మిన్ అమరవట్టి తన మూలాలున్న చోట ఘనాపాఠిగా నిలిచేందుకు తహతహలాడుతోంది. చదవండి: Chess Olympiad 2022: భారత్పై విషం చిమ్మిన పాకిస్తాన్.. -
విశాఖకు చెస్ ఒలింపియాడ్ టార్చ్ (ఫొటోలు)
-
చెస్ బోర్డు మాదిరి బ్రిడ్జ్... ఎక్కడుందో తెలుసా!: వీడియో వైరల్
చెన్నై: 44వ ఫిడే చెస్ ఒలింపియాడ్ జూలై 28న చెన్నైలోని మహాబలిపురంలో ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా చెన్నై నగరంలోని నేపియర్ బ్రిడ్జ్కి చెస్ బోర్డులా పేయింట్ వేశారు. ఈ బ్రిడ్జ్ ప్రయాణికులను అత్యద్భుతంగా ఆకట్టుకుంటోంది. వందేళ్ల చెస్ ఒలింపియాడ్ చరిత్రలో తొలిసారిగా భారత్ ఆతిథ్యమివ్వనుంది. ఈ ఏడాది ఈ ఒలింపియాడ్ ఈవెంట్కి సుమారు 2 వేల మంది దాక క్రీడాకారులు పాల్గొనే అవకాశం ఉంది. ఈ మేరకు ఐఏఎస్ అధికారిణి సుప్రియా సాహు ఈ బ్రిడ్జ్ తాలుకా వీడియోని పోస్ట్ చేస్తూ...భారతదేశానికి చెందిన చెస్ రాజధాని చెన్నై గగ్రాండ్ చెస్ ఒలింపియాడ్ 2022కి ఆతిథ్యం ఇవ్వడానికి సిద్ధంగా ఉందని, ఐకానిక్ నేపియర్ బ్రిడ్జ్గా చెస్ బోర్డులా అలంకరిచండబడిందని ట్వీట్ చేశారు. దీంతో నెటిజన్లు వావ్ వాటే స్పీరిట్ నమ్మా చెన్నై అంటూ ప్రశంసిస్తూ ట్వీట్ చేశారు. Chennai the Chess Capital of India is all set to host the grand, Chess Olympiad 2022.The iconic Napier Bridge is decked up like a Chess Board.Check it out 😊 #ChessOlympiad2022 #ChessOlympiad #Chennai pic.twitter.com/wEsUfGHMlU — Supriya Sahu IAS (@supriyasahuias) July 16, 2022 (చదవండి: కరోనాతో ఆస్పత్రిలో చేరిన పన్నీర్సెల్వం) -
అర్జున్రెడ్డి, తరుణ్రెడ్డి.. వీళ్లిద్దరూ మామూళ్లోలు కాదండోయ్!
సాక్షి,దుండిగల్: వారు పిల్లలు కాదు.. చిచ్చర పిడుగులు.. ఒక్కసారి ఆటలోకి దిగితే వార్ వన్ సైడ్ కావాల్సిందే. ప్రత్యర్థుల అంచనాలను తలకిందులు చేయడంలో ఈ అన్నదమ్ములు దిట్ట. చెస్ ఆటలో ఎదుటివారి ఎత్తులకు పైఎత్తులు వేస్తూ చిత్తు చేయడంలో వీరు దిట్ట. ఈ సోదరుల ఆట తీరును చూసిన వారు సంభ్రమాశ్చర్యాలకు లోనవుతారనడంలో అతిశయోక్తి లేదు. రాష్ట్ర స్థాయిలోనే కాదు జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో ఇప్పటికే ఎన్నో సంచలన విజయాలు తమ ఖాతాలో వేసుకుని పతకాలు సాధించిన పన్నేండేళ్ల అర్జున్రెడ్డి, పదహారేళ్ల తరుణ్రెడ్డి అన్నతమ్ముళ్లపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం. కుటుంబ నేపథ్యం.. ► ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నంకు చెందిన ఆదిరెడ్డి సత్యత్రినాథ్ కొన్నేళ్ల క్రితం కుటుంబంతో సహా ఇక్కడి వచ్చి మేడ్చల్ జిల్లా నిజాంపేటలో స్థిరపడ్డాడు. ఇతడికి తరుణ్రెడ్డి, అర్జున్రెడ్డి ఇద్దరు కుమారులు ఉన్నారు. వీరు కొల్లూరులోని గార్డియం స్కూల్లో 10, 7 తరగతి చదువుతున్నారు. అయితే పుట్టిన రోజున సందర్భంగా బంధువుల్లో ఒకరు తరుణ్రెడ్డికి చెస్ బోర్డును కానుకగా ఇచ్చారు. ► అప్పటి నుంచి చెస్ ఆడటం వ్యాపకంగా పెట్టుకున్న తరుణ్రెడ్డి ఆటలో ఆరి తేరాడు. అతడికి తమ్ముడు అర్జున్ తోడయ్యాడు. వీరి పట్టుదలని గమనించిన తండ్రి త్రినాథ్ కోచింగ్ ఇప్పించడంతో ఈ ఇద్దరు అన్నతమ్ముళ్లు నేడు అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్నారు. తరుణ్రెడ్డి సాధించిన ఘనత.. ► థాయ్ల్యాండ్లో అంతర్జాతీయ ఆసియా యూత్ చెస్ చాంపియన్షిప్–2018లో అండర్–12 ఒపెన్ బ్లిడ్జ్లో టీమ్ బంగారు పతకం. ► శ్రీలంకలోని కొలంబోలో జరిగిన ఏషియన్ యూత్ చెస్ చాంపియన్షిప్–2019 అండర్–14 ఒపెన్ క్లాసిక్లో టీమ్ బంగారు, ఒపెన్ బ్లిడ్జ్లో టీమ్ రజతం, ఒపెన్ బ్లిడ్జ్లో వ్యక్తిగతంగా 10వ స్థానం. రాష్ట్ర స్థాయిలో జరిగిన పలు టోర్నమెంట్లో పతకాలు సాధించాడు. అర్జున్రెడ్డి సాధించిన విజయాలు.. ► జాతీయ స్థాయిలో మహారాష్ట్ర నాగ్పూర్ నేషనల్ స్కూల్స్ చెస్ చాంపియన్షిప్– 2017 అండర్–7 ఒపెన్లో బంగారు పతకం. ► ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయవాడలో జరిగిన నేషనల్ చెస్ చాంపియన్షిప్–2017 అండర్–7 విభాగం ఒపెన్లో 5వ స్థానం. ► హర్యానా నేషనల్ చెస్ చాంపియన్షిప్– 2017 అండర్–9 ఒపెన్లో 4వ స్థానం. ► అంతర్జాతీయ స్థాయిలో థాయ్ల్యాండ్లో జరిగిన ఆసియా యూత్ చెస్ చాంపియన్షిప్–2018 అండర్–8 విభాగంలో ఒపెన్ ర్యా పిడ్లో వ్యక్తిగత బంగారు, ఒపెన్ సాండర్డ్లో వ్యక్తిగత కాంస్యం, ఒపెన్ బ్లిడ్జ్లో నాల్గవ స్థా నం, ఒపెన్ ర్యాపిడ్లో టీమ్ బంగారు, ఒపె న్ స్టాండర్జ్లో టీమ్ రజతం, ఒపెన్ బ్లిడ్జ్లో టీమ్ బంగారు పతాలు సాధించాడు. ► న్యూఢిల్లీలో జరిగిన కామన్వెల్త్ చెస్ చాంపియన్షిప్–2018 అండర్–8 విభాగం ఒపెన్లో కాంస్యం. ► గుజరాత్లో జరిగిన నేషనల్ చెస్ చాంపియన్షిప్–2019 అండర్–9 ఒపెన్లో రజతం. ► ఢిల్లీలో జరిగిన నేషనల్ చెస్ చాంపియన్షిప్–2019 అండర్–11 ఒపెన్లో 6వ స్థానం. ► శ్రీలంకలోని కొలంబోలో జరిగిన ఏషియన్ యూత్ చెస్ చాంపియన్షిప్–2019 అండర్–10 విభాగం ఒపెన్ బ్లిడ్జ్లో వ్యక్తిగత కాంస్యం, ఒపెన్ బ్లిడ్జ్లో టీమ్ బంగారు, ఒపెన్ క్లాసిక్లో 6వ స్థానంలో నిలిచాడు. ► శ్రీలంకలో జరిగిన ఏషియన్ స్కూల్స్ చెస్ చాంపియన్షిప్–2021 అండర్–11లో ఒపెన్ ఆన్లైన్లో 9వ స్థానం. ► ముంబాయిలో జరిగిన ఇంటర్నేషనల్ జూనియర్ చెస్ టోర్నమెంట్–2021 అండర్–13 లో 7వ స్థానం, ఒపెన్లో మొదటి స్థానంలో నిలిచాడు. ► కర్నాటకలో జరిగిన నేషనల్ చెస్ చాంపియన్ షిప్–2022 అండర్–12 ఒపెన్లో రజతంతో పాటు రాష్ట్ర స్థాయిలో జరిగిన పలు పోటీ ల్లో విజేతగా నిలిచాడు. ఇండియన్ చెస్ ఫెడ రేషన్లో అర్జున్రెడ్డి మూడో ర్యాంక్లో ఉన్నాడు. చదవండి: ప్రియునితో భార్య రాసలీలలు.. అత్త ఛాలెంజ్.. ఆ అల్లుడు రెడ్హ్యాండెడ్గా పట్టుకుని -
ఢిల్లీ ఓపెన్ చెస్ చాంప్ అర్జున్
సాక్షి, హైదరాబాద్: ఆద్యంతం నిలకడగా రాణించిన భారత యువతార, తెలంగాణ గ్రాండ్మాస్టర్ ఎరిగైసి అర్జున్ మరో టైటిల్ను సొంతం చేసుకున్నాడు. న్యూఢిల్లీలో మంగళవారం ముగిసిన ఢిల్లీ ఓపెన్ అంతర్జాతీయ చెస్ టోర్నీలో వరంగల్ జిల్లాకు చెందిన 18 ఏళ్ల అర్జున్ చాంపియన్గా అవతరించాడు. తెలంగాణకే చెందిన మరో గ్రాండ్మాస్టర్ హర్ష భరతకోటి మూడో స్థానాన్ని దక్కించుకోగా... తమిళనాడు గ్రాండ్మాస్టర్ డి.గుకేశ్ రన్నరప్గా నిలిచాడు. ఇటీవల అర్జున్ జాతీయ సీనియర్ చెస్ చాంపియన్షిప్ టైటిల్ను కూడా సొంతం చేసుకున్నాడు. నిర్ణీత 10 రౌండ్ల తర్వాత అర్జున్, గుకేశ్, హర్ష భరతకోటి 8.5 పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచారు. అయితే మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా ర్యాంకింగ్ను వర్గీకరించారు. అర్జున్కు ‘టాప్’ ర్యాంక్ ఖాయమవ్వగా... గుకేశ్కు రెండో స్థానం, హర్షకు మూడో స్థానం లభించాయి. ఈ టోర్నీలో అర్జున్ అజేయంగా నిలిచాడు. మొత్తం 10 గేముల్లో అతను ఏడింటిలో గెలిచి, మూడింటిని ‘డ్రా’ చేసుకున్నాడు. విజేతగా నిలిచిన అర్జున్కు రూ. 4 లక్షలు ... రన్నరప్ గుకేశ్కు రూ. 3 లక్షల 50 వేలు.. మూడో స్థానం పొందిన హర్షకు రూ. 3 లక్షలు ప్రైజ్మనీగా లభించాయి. మంగళవారం జరిగిన చివరిదైన పదో రౌండ్ గేముల్లో అర్జున్ 58 ఎత్తుల్లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్మాస్టర్ కార్తీక్ వెంకటరామన్ను ఓడించగా... గుకేశ్ 58 ఎత్తుల్లో అభిజిత్ గుప్తా (భారత్)పై, హర్ష 71 ఎత్తుల్లో సేతురామన్ (భారత్)పై నెగ్గారు. ఆంధ్రప్రదేశ్ గ్రాండ్మాస్టర్ ఎం.ఆర్.లలిత్ బాబు 7.5 పాయింట్లతో ఆరో ర్యాంక్లో నిలిచాడు. -
చదరంగపు బాలరాజు
టీవీ కార్టూన్ షోలు తెగ చూస్తున్న పాపను దాని నుంచి దూరం చేయడానికి తల్లితండ్రులు అనుకోకుండా చేసిన ఓ అలవాటు ఆ పాపతో పాటు మూడేళ్ళ వయసు ఆమె తమ్ముడి జీవితాన్నీ మార్చేసింది. కాలగతిలో చదరంగపు క్రీడలో అక్క గ్రాండ్ మాస్టర్ అయితే, తమ్ముడు ఇంటర్నేషనల్ గ్రాండ్ మాస్టర్గా ఎదిగాడు. ఏకంగా ఇప్పుడు ప్రపంచ ఛాంపియన్నే ఓడించి, అబ్బురపరిచాడు. సరైన సమయంలో సరైన మార్గదర్శనం చేస్తే పిల్లలు ఏ స్థాయికి ఎదగగలరో, ఇంటిల్లపాదినే కాదు... ఇండియాను ఎంత గర్వించేలా చేస్తారో చెప్పడానికి ప్రత్యక్ష సాక్ష్యం – తమిళనాడుకు చెందిన టీనేజ్ అక్కాతమ్ముళ్ళు వైశాలి, ప్రజ్ఞానంద. ఇంటా, బయటా తెలిసినవాళ్ళంతా ప్రగ్గూ అని పిలుచుకొనే పదహారేళ్ళ ఆర్. ప్రజ్ఞానంద చదరంగంలో తన ఆరాధ్యదైవమైన వరల్డ్ ఛాంపియన్ మ్యాగ్నస్ కార్ల్సన్ను సోమవారం తెల్లవారుజామున ఓడించి సంచలనం రేపాడు. క్లాసికల్, ర్యాపిడ్, ఎగ్జిబిషన్ – ఇలా ఏ ఫార్మట్ గేమ్లలోనైనా కలిపి మన విశ్వనాథన్ ఆనంద్, తెలుగు తేజం పెంటేల హరికృష్ణ తరువాత కార్ల్సన్ను ఓడించిన మూడో భారత క్రీడాకారుడిగా ప్రగ్గూ చరిత్ర సృష్టించాడు. నార్వేకు చెందిన కార్ల్సన్ అయిదుసార్లు ప్రపంచ ఛాంపియన్. కొంతకాలంగా ప్రపంచ చదరంగానికి మకుటం లేని మహారాజు. అలాంటి వ్యక్తిని ఓడించడం ఆషామాషీ కాదు. అరవై నాలుగు గడులు... మొత్తంగా చకచకా 39 ఎత్తులు... అంతే.... కార్ల్సన్కు చెక్ పెట్టి, ప్రగ్గూ నమ్మలేని విజయాన్ని నమోదు చేశాడు. వరుసగా మూడు విజయాలు సాధించిన ప్రపంచ విజేతకు బ్రేకులు వేశాడు. ఆన్లైన్లో సాగే ర్యాపిడ్ చెస్ పోటీ ‘ఎయిర్థింగ్స్ మాస్టర్స్’ ప్రారంభ విడతలోనే ఈ అద్భుతం ఆవిష్కృతమైంది. 31 ఏళ్ళ కార్ల్సన్పై గతంలో విశ్వనాథన్ ఆనంద్ 19 సార్లు, హరికృష్ణ 2 సార్లు గెలిచారు. వారి కన్నా అతి పిన్న వయసులోనే, కార్ల్సన్ వయసులో సగమున్న బుడతడైన ప్రగ్గూ ఈ ఘనత సాధించడం గమనార్హం. ప్రపంచ ఛాంపియన్ను ఓడించి, చదరంగంలో అగ్రశ్రేణి వరుసను అటుదిటు చేసిన ఈ బాలమేధావి అమాయకంగా అన్నమాట మరింత కాక రేపింది. ప్రపంచ ఛాంపియన్పై జరిగే మ్యాచ్ కోసం ప్రత్యేకించి వ్యూహమేమీ అనుకోలేదనీ, ఆస్వాదిస్తూ ఆడానే తప్ప మరేమీ చేయలేదనీ ఈ టీనేజర్ అనడం విశేషం. ఆట మొదలుపెట్టే అవకాశం ఉంటుంది కాబట్టి తెల్లపావులతో ఆడేవారికి ఓ రకంగా సానుకూలత ఉంటుందని భావించే చెస్లో నల్ల పావులతో ఆరంభించి, ఈ కీలక మ్యాచ్లో నెగ్గాడీ బాలరాజు. మొత్తం 16 మంది ఆటగాళ్ళ మధ్య 15 రౌండ్ల పాటు జరిగే టోర్నీ ఇది. ఇందులో ఈ మ్యాచ్కు ముందు ప్రగ్గూ ప్రపంచ అగ్రశ్రేణి చెస్ ఆటగాళ్ళు పదిమందిలో నలుగురితో తలపడి, రెండు విజయాలు, ఒక డ్రా, ఒక పరాజయంతో తన ప్రతిభను క్రీడాలోకం ఆగి, చూసేలా చేశాడు. ఆత్మీయుల మొదలు విశ్వనాథన్ ఆనంద్, దిగ్గజ క్రికెటర్ సచిన్, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ దాకా విభిన్న రంగాల ప్రముఖుల ప్రశంసలు పొందాడు. కరోనా కాలంలో చెస్ పోటీల క్యాలెండర్ తారుమారై, నిరాశలో పడి, కాస్తంత వెనకపట్టు పట్టిన ఈ చిచ్చరపిడుగుకు ఇది సరైన సమయంలో దక్కిన భారీ విజయం. కోచ్ ఆర్బీ రమేశ్ చెప్పినట్టు ప్రతిభావంతుడైన ప్రగ్గూలో ఆత్మవిశ్వాసం పెంచి, సుదీర్ఘ ప్రస్థానానికి మార్గం సుగమం చేసే విజయం. శ్రీనాథ కవిసార్వభౌముడు అన్నట్టే ‘చిన్నారి పొన్నారి చిరుత కూకటినాడె...’ ప్రగ్గూ తన సత్తా చూపడం మొదలుపెట్టాడు. ముచ్చటగా మూడేళ్ళకే అక్కను చూసి ఆడడం మొదలుపెట్టిన ఈ బుడతడు 2013లో వరల్డ్ అండర్–8 కిరీటధారి అయ్యాడు. పదేళ్ళ, పదినెలల, 19 రోజుల వయసుకే 2016లో ఇంటర్నేషనల్ గ్రాండ్ మాస్టరయ్యాడు. అప్పటికి ఆ ఘనత సాధించిన అతి పిన్నవయస్కుడిగా గిన్నిస్ రికార్డ్స్లోకి ఎక్కాడు. మొత్తం మీద ఇప్పుడు చరిత్రలో పిన్న వయసు గ్రాండ్ మాస్టర్లలో అయిదోవాడిగా నిలిచాడు. భారత కాలమానంలో బాగా పొద్దుపోయి, రాత్రి 10 దాటాకెప్పుడో మొదలయ్యే తాజా టోర్నీ కోసం నిద్ర వేళల్ని మార్చుకోవడం సహా పలురకాల సన్నాహాలు చేసుకున్నాడు ప్రగ్గూ. చెన్నై శివార్లలోని పాడి ప్రాంతంలో మధ్యతరగతి నుంచి వచ్చిన ఈ బాల మేధావికి చెస్, బ్యాంకు ఉద్యోగం చేసే పోలియో బాధిత తండ్రి, ప్రతి టోర్నీకీ సాయంగా వచ్చే తల్లి, చెస్లో ప్రవేశానికి కారణమైన 19 ఏళ్ళ అక్క, కోచ్ రమేశ్... ఇదే ప్రపంచం. గత ఏడాది ‘న్యూ ఇన్ చెస్ క్లాసిక్’ పోటీలో సైతం వరల్డ్ ఛాంపియన్ కార్ల్సన్పై పోటీని డ్రా చేసిన ఘనుడీ బాలుడు. భారత ఆటగాళ్ళలో 16వ ర్యాంకులో, ప్రపంచంలో 193వ ర్యాంకులో ఉన్న ఇతను చెస్లో భారత ఆశాకిరణం. ఒకప్పుడు తానూ ఇలాగే చిన్న వయసులోనే, ఇలాంటి మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చినవాడే కావడంతో విశ్వనాథన్ ఆనంద్ ఈ బాల మేధావిని అక్కున చేర్చుకొన్నారు. వరల్డ్ ఛాంపియన్పై గెలుపు లాంటివి భారత ఆటగాళ్ళకు అప్పుడప్పుడు కాకుండా, తరచూ సాధ్యం కావాలంటే ప్రగ్గూ లాంటి వారికి ఇలాంటి సీనియర్ల చేయూత అవసరం. 1988లో ఆనంద్ తొలి ఇండియన్ గ్రాండ్ మాస్టరయ్యారు. అప్పటి నుంచి చెస్ పట్ల పెరిగిన ఆసక్తితో, 73 మంది మన దేశంలో గ్రాండ్ మాస్టర్లు ఎదిగొచ్చారు. మూడు దశాబ్దాల పైగా దేశంలో చదరంగానికి ప్రతీకగా మారిన 51 ఏళ్ళ ఆనంద్ పరంపర ప్రగ్గూ మీదుగా అవిచ్ఛిన్నంగా సాగాలంటే... ప్రభుత్వాలు, క్రీడా సమాఖ్యలు, దాతల అండదండలు అతి కీలకం. ఇలాంటి మాణిక్యాలను ఏరి, సానబడితే, ప్రపంచ వేదికపై రెపరెపలాడేది మన భారత కీర్తి పతాకమే. -
హంపి ఖాతాలో నాలుగో విజయం
పోలాండ్లో జరుగుతున్న ప్రపంచ మహిళల ర్యాపిడ్ చెస్ చాంపియన్షిప్లో డిఫెండింగ్ చాంపియన్, ఆంధ్రప్రదేశ్ గ్రాండ్మాస్టర్ కోనేరు హంపి నాలుగో విజయం నమోదు చేసింది. సోమవారం జరిగిన ఐదో గేమ్లో హంపి 24 ఎత్తుల్లో జూలియా (చెక్ రిప బ్లిక్)పై, ఆరో గేమ్లో 29 ఎత్తుల్లో మార్టా మిచ్నా (జర్మనీ)పై, ఏడో గేమ్లో 45 ఎత్తుల్లో పావ్లీడు (గ్రీస్)పై నెగ్గింది. ఏడో రౌండ్ తర్వాత హంపి 5.5 పాయింట్ల తో మరో ఐదుగురితో కలిసి సంయుక్తంగా రెండో స్థానంలో ఉంది. -
చెస్లో ఫిడే మాస్టర్... వేదాంత్ పనేసర్..
ముంబైకు చెందిన వేదాంత్ పనేసర్ చదరంగంలో ప్రతిష్టాత్మకమైన ఫిడే మాస్టర్ (ఎఫ్ఎం) టైటిల్ను గెలుచుకున్నాడు. ముంబయిలోని విలేపార్లేలోని ఎన్ఎం కాలేజీ విద్యార్ధి అయిన వేదాంత్, ఇప్పటికే 17 జాతీయ చెస్ చాంఫియన్షిప్లతో పాటుగా కామన్వెల్త్ కాంస్య పతకమూ గెలుచుకున్నాడు. ఫెడరేషన్ ఇంటర్నేషనల్ డెస్ ఇచెక్స్ (ఫిడే) ఈ ప్రతిష్టాత్మకమైన ఫిడే మాస్టర్ (ఎఫ్ఎం) టైటిల్ను ప్రకటించింది. గ్రాండ్ మాస్టర్ (జీఎం) మరియు ఇంటర్నేషనల్ మాస్టర్ (ఐఎం) టైటిల్స్ తరువాత అత్యంత ప్రతిష్టాత్మకమైన గుర్తింపు ఇది. ఈ గుర్తింపు పొందడానికి స్థిరమైన ఆటతీరు ప్రదర్శిస్తూ, అంతర్జాతీయ పోటీలలో 2300 లేదా అంతకు మించిన ఫిడే రేటింగ్ పొందాల్సి ఉంటుంది. చెస్ చాంఫియన్గా వేదాంత్ 2380 ఫిడే రేటింగ్ పొందాడు. ఈ రేటింగ్ పొందడానికి ఎన్ఎం కాలేజీ కార్యాచరణ ఎంతగానో తోడ్పడింది. వేదాంత్ లాంటి ప్రతిభావంతులను గుర్తించి, తగిన శిక్షణ అందించడంలో ఎన్ఎం కాలేజీ అత్యంత కీలక పాత్రపోషించింది. చిన్నప్పటి నుంచీ చెస్ అంటే ఇష్టంతో కలిగిన వేదాంత్ తాను గెలవడంతో పాటు ఇతరులకు సైతం ఈ గేమ్ నైపుణ్యాలను అందించేందుకు ముందుంటాడు. లాక్డౌన్ సమయంలో తను స్వయంగా ఆన్లైన్ చెస్ టోర్నమెంట్ నిర్వహించడంతో పాటుగా ప్రతిభావంతులకు తగిన ప్రోత్సాహమూ అందించాడు అలా వచ్చిన ఆదాయాన్ని సైతం పిఎం కేర్ ఫండ్స్కు అందించాడు. ఫిడే మాస్టర్ టైటిల్ పొందిన వేదాంత్ ఇప్పుడు ఇంటర్నేషనల్ మాస్టర్(ఐఎం) టైటిల్కు ఒక్క అడుగు దూరంలో ఉన్నాడు. చదవండి: SA Vs IND: కోహ్లి.. ఎలా ఆడాలో రాహుల్ని చూసి నేర్చుకో: భారత మాజీ క్రికెటర్ -
వచ్చే ఏడాది భారత చెస్ లీగ్
న్యూఢిల్లీ: భారత్ వేదికగా చదరంగ క్రీడలో కూడా ఫ్రాంచైజీ తరహా లీగ్ టోర్నీని నిర్వహించాలని అఖిల భారత చెస్ సమాఖ్య (ఏఐసీఎఫ్) నిర్ణయించింది. వచ్చే ఏడాది జూన్లో దీనికి శ్రీకారం చుట్టనున్నారు. చెస్ లీగ్లో మొత్తం ఆరు జట్లు ఉంటాయి. ఒక్కో జట్టులో ఇద్దరు సూపర్ జీఎంలు, ఇద్దరు భారత జీఎంలు, ఇద్దరు మహిళా జీఎంలతో పాటు ఇద్దరు జూనియర్లు (బాలుర, బాలికల విభాగం నుంచి ఒక్కొక్కరు చొప్పున) ఉంటారు. రెండు వారాల పాటు డబుల్ రౌండ్ రాబిన్ లీగ్ పద్ధతిలో దేశంలోని రెండు నగరాల్లో టోర్నీని నిర్వహిస్తారు. టాప్–2 జట్లు ఫైనల్లో తలపడతాయి. టోర్నీ నిర్వహణ, ప్రచారం, మార్కెటింగ్ కోసం ‘గేమ్ ప్లాన్ స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్’ అనే సంస్థకు హక్కులు ఇచ్చామని ప్రకటించిన ఏఐసీఎఫ్ అధ్యక్షుడు సంజయ్ కపూర్... ఫ్రాంచైజీల ఎంపిక, ఆర్థికపరమైన అంశాలకు సంబంధించి ఇతర పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తామన్నారు. -
చరిత్ర సృష్టించిన కార్ల్సన్.. వరుసగా నాలుగోసారి
దుబాయ్: 64 గళ్లపై మరోసారి తన ఆధిపత్యాన్ని చాటుకుంటూ నార్వే దిగ్గజ ప్లేయర్ మాగ్నస్ కార్ల్సన్ వరుసగా నాలుగోసారి ప్రపంచ చాంపియన్గా నిలిచాడు. రష్యాకు చెందిన ‘చాలెంజర్’ ఇయాన్ నిపోమ్నిషితో జరిగిన ప్రపంచ క్లాసికల్ చెస్ చాంపియన్షిప్ మ్యాచ్లో మరో మూడు గేమ్లు మిగిలి ఉండగానే కార్ల్సన్ విశ్వ కిరీటాన్ని హస్తగతం చేసుకున్నాడు. శుక్రవారం జరిగిన 11వ గేమ్లో నల్ల పావులతో ఆడిన కార్ల్సన్ 49 ఎత్తుల్లో గెలుపొందాడు. దాంతో నిర్ణీత 14 గేమ్ల ఈ చాంపియన్ షిప్ మ్యాచ్లో కార్ల్సన్ 7.5–3.5తో ఆధిక్యంలోకి వెళ్లి టైటిల్ను ఖరారు చేసుకున్నాడు. తదుపరి మూడు గేముల్లో నిపోమ్నిషి గెలిచినా కార్ల్సన్ స్కోరును సమం చేసే అవకాశం లేకపోవడం... కార్ల్సన్కు టైటిల్ ఖాయం కావడంతో మిగతా మూడు గేమ్లను నిర్వహించకూడదని నిర్ణయం తీసుకున్నారు. 2014, 2016, 2018లలో కూడా ప్రపంచ చాంపియన్గా నిలిచిన 30 ఏళ్ల కార్ల్ సన్కు ఈసారీ తన ప్రత్యర్థి నుంచి పోటీ ఎదురుకాలేదు. వరుసగా మొదటి ఐదు గేమ్లు ‘డ్రా’గా ముగిసినా... 136 ఎత్తులు, 7 గంటల 45 నిమిషాలపాటు జరిగిన ఆరో గేమ్లో కార్ల్సన్ గెలిచి బోణీ కొట్టాడు. ఆ తర్వాత ఏడో గేమ్ ‘డ్రా’కాగా... ఎనిమిదో గేమ్లో, తొమ్మిదో గేమ్లో కార్ల్సన్ విజయం సాధించాడు. అనంతరం పదో గేమ్ ‘డ్రా’ అయింది. అయితే 11వ గేమ్లో మళ్లీ కార్ల్సన్ గెలిచి నిపోమ్నిషి కథను ముగించాడు. విజేత కార్ల్సన్కు 12 లక్షల యూరోలు (రూ. 10 కోట్ల 28 లక్షలు)... రన్నరప్ నిపోమ్నిషికి 8 లక్షల యూరోలు (రూ. 6 కోట్ల 85 లక్షలు) ప్రైజ్మనీగా లభించాయి. క్లాసికల్ ఫార్మాట్లోనే కాకుండా ర్యాపిడ్, బ్లిట్జ్ ఫార్మాట్లలోనూ కార్ల్సన్ ప్రస్తుతం ప్రపంచ చాంపియన్గా ఉన్నాడు. -
World Chess Championship: కార్ల్సన్ మళ్లీ గెలిచాడు
దుబాయ్: ప్రపంచ చెస్ చాంపియన్షిప్లో డిఫెండింగ్ చాంపియన్ మాగ్నస్ కార్ల్సన్ జోరు మీదున్నాడు. చాలెంజర్ నిపోమ్నిషి (రష్యా)తో మంగళవారం జరిగిన తొమ్మిదో గేమ్లో కార్ల్సన్ నల్లపావులతో ఆడుతూ 39 ఎత్తుల్లో గెలిచాడు. ఈ చాంపియన్షిప్లో కార్ల్సన్కిది మూడో విజయం. గత రెండు విజయాలు కార్ల్సన్కు తెల్లపావులతో ఆడినపుడు లభించాయి. తొమ్మిదో గేమ్ను ప్రారంభించే అవకాశం భారత యువ గ్రాండ్మాస్టర్ ప్రజ్ఞానందకు దక్కింది. నిపోమ్నిషి తరఫున ప్రజ్ఞానంద తెల్లపావులతో తొలి ఎత్తును వేసి గేమ్ను ప్రారంభించాడు. మొత్తం 14 గేమ్లు జరిగే ఈ చాంపియన్షిప్లో తొమ్మి ది గేమ్ల తర్వాత కార్ల్సన్ 6–3తో ఆధిక్యంలో ఉన్నాడు. నేడు పదో గేమ్ జరగనుంది. -
World Championship Game 8: కార్ల్సన్కు రెండో విజయం
Magnus Carlsen: ప్రపంచ చెస్ చాంపియన్షిప్లో డిఫెండింగ్ చాంపియన్ మాగ్నస్ కార్ల్సన్ (నార్వే) రెండో విజయం నమోదు చేశాడు. నిపోమ్నిషి (రష్యా)తో దుబాయ్లో ఆదివారం జరిగిన ఎనిమిదో గేమ్లో తెల్లపావులతో ఆడిన కార్ల్సన్ 46 ఎత్తుల్లో గెలుపొందాడు. ఎనిమిది గేమ్లు ముగిశాక కార్ల్సన్ 5–3 పాయింట్లతో ఆధిక్యంలో ఉన్నాడు. సోమవారం విశ్రాంతి దినం తర్వాత తొమ్మిదో గేమ్ మంగళవారం జరుగుతుంది. చదవండి: Ind Vs Nz: అక్షర్.. పటేల్.. రవీంద్ర.. జడేజా.. ఫొటో అదిరింది! ఇదేదో సర్ఫ్ యాడ్లా ఉందే! -
వ్యాఖ్యాతగా విశ్వనాథన్ ఆనంద్
Viswanathan Anand Commentary Role.. భారత చెస్ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ కొత్త పాత్రలో కనిపించనున్నాడు. గతంలో ఐదుసార్లు విశ్వవిజేతగా నిలిచిన ఆనంద్ ఈనెల 24 నుంచి దుబాయ్లో జరిగే ప్రపంచ చెస్ చాంపియన్ షిప్ మ్యాచ్కు అధికారిక వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నాడు. డిఫెండింగ్ చాంపియన్ కార్ల్సన్ (నార్వే), నెపోమ్నియాచి (రష్యా) ప్రపంచ టైటిల్ కోసం తలపడనున్నారు. గతంలో ఆన్లైన్ టోర్నీలకు వ్యాఖ్యాతగా పనిచేసిన ఆనంద్ ఈసారి గెలుపోటముల టెన్షన్ లేకుండా ప్రపంచ చాంపియన్షిప్ మ్యాచ్ కోసం వెళ్తుండటం సరదాగా ఉందన్నాడు. -
AICF: చెస్కు ‘ఎంపీఎల్’ అండ.. కోటితో మొదలుపెట్టి..
న్యూఢిల్లీ: భారత క్రికెట్ టీమ్కు కిట్ స్పాన్సర్గా వ్యవహరిస్తున్న ‘ఎంపీఎల్ స్పోర్ట్స్’ ఇప్పుడు మరో క్రీడకు చేయూతనిచ్చేందుకు ముందుకు వచ్చింది. చదరంగానికి తాము అండగా నిలుస్తామంటూ అఖిల భారత చెస్ సమాఖ్య (ఏఐసీఎఫ్)తో ఒప్పందం చేసుకుంది. వచ్చే ఐదేళ్లలో జరిగే అన్ని జాతీయ చాంపియన్షిప్లకు తాము స్పాన్సర్షిప్ అందిస్తామని ప్రకటించింది. ఇందులో భాగంగా మొదటి ఏడాది రూ. 1 కోటితో మొదలు పెట్టి ప్రతీ ఏటా ఈ మొత్తాన్ని 20 శాతం పెంచుతారు. అండర్–7 స్థాయినుంచి జరిగే అన్ని జాతీయ టోర్నీలకు ఎంపీఎల్ సహకారం లభిస్తుంది. దీర్ఘకాలిక ప్రాతిపదికన చెస్కు స్పాన్సర్షిప్ అందించేందుకు గత కొన్నేళ్లలో ముందుకు వచ్చిన తొలి కార్పొరేట్ సంస్థ ఎంపీఎల్ మాత్రమే కావడం విశేషం. చదవండి: IPL 2021: ఫైనల్కు ముందు కేకేఆర్కు బిగ్ షాక్! The All India Chess Federation (AICF) signed a historic agreement with MPL Sports Foundation for a sponsorship amount of One Crore towards the sponsorships for Indian National Championships for the next five years with a 20% increase every year. @PlayMPL pic.twitter.com/viIjlfUr27 — All India Chess Federation (@aicfchess) October 14, 2021 -
‘గ్రాండ్మాస్టర్’ రాజా రిత్విక్
సాక్షి, హైదరాబాద్: ప్రతి చెస్ క్రీడాకారుడు గొప్ప ఘనతగా భావించే గ్రాండ్మాస్టర్ (జీఎం) టైటిల్ హోదాను తెలంగాణ కుర్రాడు రాజవరం రాజా రితి్వక్ అందుకున్నాడు. హంగేరిలోని బుడాపెస్ట్లో జరుగుతున్న వెజెర్కెప్జో గ్రాండ్మాస్టర్ (జీఎం) చెస్ టోర్నమెంట్లో 17 ఏళ్ల రాజా రితి్వక్ జీఎం హోదా ఖరారు కావడానికి అవసరమైన 2500 ఎలో రేటింగ్ పాయింట్ల మైలురాయిని దాటాడు. బుడాపెస్ట్లోనే గత వారం జరిగిన టోరీ్నలో రితి్వక్ విజేతగా నిలిచి మూడో జీఎం నార్మ్ను సాధించాడు. అయితే అప్పటికి అతని ఎలో రేటింగ్ 2496గా ఉండటంతో గ్రాండ్మాస్టర్ హోదా ఖరారు కాలేదు. ఈనెల 15న మొదలైన వెజెర్కెప్జో టోర్నీలో 2496 ఎలో రేటింగ్తో బరిలోకి దిగిన రితి్వక్ నాలుగో రౌండ్లో ఫినెక్ వచ్లావ్ (చెక్ రిపబ్లిక్)పై 57 ఎత్తుల్లో గెలిచాడు. దాంతో అతని ఖాతాలో ఐదు ఎలో పాయింట్లు చేరి రేటింగ్ 2501కు చేరింది. ఫలితంగా ఇప్పటికే మూడు జీఎం నార్మ్లను సాధించిన రితి్వక్ జీఎం టైటిల్ ఖరారు కావడానికి అవసరమైన 2500 రేటింగ్ను కూడా అందుకోవడంతో భారత్ తరఫున 70వ గ్రాండ్మాస్టర్ అయ్యాడు. వరంగల్ జిల్లాకు చెందిన రాజా రిత్విక్ ఆరేళ్ల ప్రాయంలో చెస్ పట్ల ఆకర్షితుడయ్యాడు. రితి్వక్ తండ్రి ఆర్.శ్రీనివాసరావు యూనివర్సిటీ స్థాయిలో చెస్ ఆడారు. తొలుత వరంగల్లో స్థానిక కోచ్ బొల్లం సంపత్ వద్ద ఓనమాలు నేర్చుకున్న రిత్విక్ ఆ తర్వాత హైదరాబాద్లోని కె.నరసింహా రావు వద్ద తన ఆటతీరుకు మెరుగులు దిద్దుకున్నాడు. గత నాలుగేళ్లుగా ఎన్.వి.ఎస్. రామరాజు వద్ద శిక్షణ తీసుకుంటున్న రిత్విక్ ప్రస్తుతం సికింద్రాబాద్లోని భవాన్స్ శ్రీ రామకృష్ణ విద్యాలయంలో 12వ తరగతి చదువుతున్నాడు. పతకాల పంట... 2012లో కామన్వెల్త్ చాంపియన్íÙప్లో అండర్–8 విభాగంలో రజతం సాధించి అందరి దృష్టిని ఆకర్షించిన రితి్వక్ అటునుంచి వెనుదిరిగి చూడలేదు. 2013లో, 2015లో ఆసియా స్కూల్స్ టోరీ్నలో.. 2018లో ఆసియా యూత్ చాంపియన్íÙప్లో స్వర్ణ పతకాలు సాధించాడు. 2017 జూన్లో జాతీయ అండర్–13 చాంపియ న్íÙప్లో చాంపియన్గా అవతరించిన రిత్విక్ అదే ఏడాది అక్టోబర్లో జరిగిన జాతీయ అండర్–17 చాంపియన్షిప్లోనూ విజేతగా నిలిచాడు. ఓవరాల్గా రితి్వక్ ఇప్పటివరకు జాతీయస్థాయిలో మూడు స్వర్ణాలు, రెండు రజ తాలు... అంతర్జాతీయస్థాయిలో 10 స్వర్ణాలు, రెండు రజతాలు, ఒక కాంస్యం సాధించాడు. గ్రాండ్మాస్టర్ హోదా సంపాదించినందుకు చాలా ఆనందంగా ఉంది. ఈ టైటిల్తో మరింత ఉత్సాహంతో ముందుకు సాగుతాను. 2600 ఎలో రేటింగ్ అందుకోవడమే నా తదుపరి లక్ష్యం. భవిష్యత్లో ఏనాటికైనా వరల్డ్ చాంపియన్ కావాలన్నదే నా జీవిత లక్ష్యం. –రాజా రిత్విక్ తెలంగాణ నుంచి గ్రాండ్మాస్టర్ అయిన మూడో ప్లేయర్ రిత్విక్. గతంలో హర్ష భరతకోటి, ఎరిగైసి అర్జున్ ఈ ఘనత సాధించారు. తెలుగు రాష్ట్రాల నుంచి గ్రాండ్ మాస్టర్ హోదా పొందిన ఎనిమిదో ప్లేయర్ రిత్విక్. గతంలో పెంటేల హరికృష్ణ, కోనేరు హంపి, హారిక, లలిత్బాబు, కార్తీక్ వెంకటరామన్ (ఆంధ్రప్రదేశ్) ఈ ఘనత సాధించారు. -
చెస్ ఒలింపియాడ్: అగ్ర స్థానంలో భారత్
చెన్నై: ‘ఫిడే’ ఆన్లైన్ చెస్ ఒలింపియాడ్లో భారత్ గురువారం ఆడిన మూడు మ్యాచ్ల్లోనూ గెలిచి అగ్ర స్థానంలోకి దూసుకెళ్లింది. మాజీ ప్రపంచ చాంపియన్, గ్రాండ్మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ నేతృత్వంలోని భారత్ నాలుగో రౌండ్లో 5–1తో చైనాపై, ఐదో రౌండ్లో 4–2తో అజర్బైజాన్పై, ఆరో రౌండ్లో 3.5–2.5తో బెలారస్పై విజయం సాధించింది. చైనాతో జరిగిన మ్యాచ్లో కోనేరు హంపి ఓడిపోగా... పెంటేల హరికృష్ణ సహా మరో నలుగురు గెలుపొందారు. అజర్బైజాన్తో జరిగిన పోరులో హంపి గెలుపొందగా, ఆనంద్, ద్రోణవల్లి హారిక ‘డ్రా’ చేసుకున్నారు. బెలారస్తో మ్యాచ్లో ఆనంద్, భక్తి కులకర్ణి విజయం సాధించారు. చదవండి: సౌరవ్ గంగూలీపై ‘బయోపిక్’ -
‘చెస్’లో కలిసిపోయారు!
లక్నో: చెస్లో ఏళ్లతరబడి రెండు పాలక వర్గాల గందరగోళానికి, వైరానికి తెరపడింది. ఇపుడు దేశమంతా ఒకే పాలకవర్గం చెస్ వ్యవహారాలను చక్కబెట్టనుంది. అఖిల భారత చెస్ సమాఖ్య (ఏఐసీఎఫ్), భారత చెస్ సంఘం (సీఏఐ) విలీనానికి సై అన్నాయి. ఇది రాష్ట్ర సంఘాలకే కాదు... ఆటగాళ్లకు కూడా కచ్చితంగా శుభవార్తే! ఎన్నో ఏళ్లుగా అటు ఏఐసీఎఫ్, ఇటు సీఏఐ మేమంటే మేమే అధికారిక జాతీయ సమాఖ్య అంటూ వివాదాలు సృష్టించాయి. దీంతో అధికారిక టోరీ్నలేవో, గుర్తింపులేని టోరీ్నలేవో తెలుసుకోవడం చెస్ ప్లేయర్లకు కష్టంగా ఉండేది. దీనివల్ల ఎన్నో జాతీయ టోరీ్నలు సజావుగా సాగలేదు. అంతర్జాతీయ టోరీ్నలైతే ఇటువైపే కన్నెత్తి చూడని పరిస్థితి. ఇప్పుడు వైరివర్గాలు కలిసిపోయేందుకు అంగీకరించడంతో భారత్లో టోరీ్నల నిర్వహణ సజావుగా సాగే అవకాశముంది. చెస్ అభివృద్ధికి విలీన ప్రక్రియ దోహదం చేస్తుందని ఏఐసీఎఫ్ అధ్యక్షుడు సంజయ్ కపూర్ ఈ సందర్భంగా వెల్లడించారు. కింగ్స్టన్: పాకిస్తాన్, వెస్టిండీస్ జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్టు రెండో రోజు ఆటను వర్షం ఆటంకపరిచింది. దీంతో శనివారం తొలి సెషన్ పూర్తిగా రద్దయ్యింది. తొలి రోజు ఆరంభంలో తడబడిన పాకిస్తాన్ అనంతరం బాబర్ ఆజమ్ (75; 13 ఫోర్లు), ఫవాద్ అలమ్ (76; 11 ఫోర్లు) అర్ధ సెంచరీలతో కోలుకుంది. ఆట ముగిసే సమయానికి 4 వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసింది. -
12 ఏళ్ల 4 నెలల 25 రోజుల వయస్సు.. ప్రపంచ రికార్డు!
బుడాపెస్ట్ (హంగేరి): ప్రపంచ చెస్ చరిత్రలో గ్రాండ్మాస్టర్ (జీఎం) హోదా పొందిన పిన్న వయస్కుడిగా భారత సంతతికి చెందిన అమెరికా చిన్నారి అభిమన్యు మిశ్రా రికార్డు నెలకొల్పాడు. వెజెర్కెప్కో జీఎం టోర్నీలో భాగంగా తొమ్మిదో రౌండ్లో అభిమన్యు మిశ్రా 55 ఎత్తుల్లో భారత గ్రాండ్మాస్టర్ లియోన్ ల్యూక్ మెండోంకాపై గెలుపొంది గ్రాండ్మాస్టర్ హోదాకు అవసరమైన మూడో జీఎం నార్మ్ను దక్కించుకున్నాడు. అభిమన్యు జీఎం హోదా 12 ఏళ్ల 4 నెలల 25 రోజుల వయస్సులో అందుకొని రష్యాకు చెందిన సెర్గీ కర్జాకిన్ (12 ఏళ్ల 7 నెలలు) పేరిట 2002 నుంచి ఉన్న ఈ రికార్డును బద్దలు కొట్టాడు. ఇక్కడ చదవండి: జొకోవిచ్ జోరు -
‘ఆనంద్ను మోసం చేసి గెలిచాను.. నన్ను క్షమించండి’
ముంబై: ఆ ఆటగాడు చెస్లో ఐదుసార్లు ప్రపంచ ఛాంపియన్గా నిలిచాడు. చెస్ ప్రపంచంలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించాడు. అలాంటి ఆటగాడిపై ఓ వ్యాపారవేత్త గెలచాడంటే నమ్మగలమా? కానీ ఇది నిజమే. అయితే దానికి వెనుక దాగున్న అసలు నిజాలు బయటపడ్డాయి. ఆదివారం జరిగిన ఓ ఛారిటీ మ్యాచ్లో జెరోదా కంపెనీ కో ఫౌండర్ నిఖిల్ కామత్ ఆడిన చెస్ గేమ్లో విశ్వనాథ్ ఆనంద్ను ఓడించాడు. ఈ విజయం చాలా మందిని షాక్కు గురి చేసిందనే చెప్పాలి. కాగా కోవిడ్ సహాయ నిధి కోసం విరాళాలు సేకరించడానికి చెస్ కింగ్ విశ్వనాథన్ ఆనంద్, పలువురు సెలబ్రిటీలతో చెస్ గేమ్స్ ఆడారు. అందులో ఆమిర్ ఖాన్, రితేష్ దేశ్ముఖ్లాంటి బాలీవుడ్ ప్రముఖులు కూడా ఉన్నారు. తాజాగా నిఖిల్ కామత్ తన విజయంపై స్పందిస్తూ.. ఈ విజయం వెనుక అసలు కారణాన్ని బట్ట బయలు చేశాడు. అతను తన ట్విటర్లో.. ‘ నేను విశ్వనాథ్ ఆనంద్ని కలుసుకోవాలని, మాట్లాడాలని కలలు కనేవాడిని. ఈ కలను సాకారం చేసినందుకు అక్షయ్పాత్రకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అందరూ నేను ఆనంద్పై విజయం సాధించానని అనుకుంటున్నారు. కానీ గేమ్ను చూస్తున్న నిపుణులు, కంప్యూటర్ల సాయం ద్వారా ఈ ఆటను గెలిచాను. ఇలా చేసినందుకు నన్ను క్షమించాలని’ ట్వీట్ చేశాడు. ఓ చారిటీ మ్యాచ్లో ఇలా మోసం చేసి గెలవడం దురదృష్టకరమని, ఇలా జరిగి ఉండాల్సింది కాదని ఆలిండియా చెస్ ఫెడరేషన్ సెక్రటరీ భరత్ చౌహాన్ అన్నారు. It is ridiculous that so many are thinking that I really beat Vishy sir in a chess game, that is almost like me waking up and winning a 100mt race with Usain Bolt. 😬 pic.twitter.com/UoazhNiAZV — Nikhil Kamath (@nikhilkamathcio) June 14, 2021 చదవండి: గుర్రంతో పోటీపడి పరుగులు తీస్తున్న ధోని.. -
ఇంత చిన్న వయసులో ఎంత తెలివో.. అల్లు అర్హ వీడియో వైరల్
అల్లు అర్జున్ ముద్దుల తనయ అల్లు అర్హ గురించి ప్రత్యేకంగా ఇంట్రడక్షన్ అవసరం లేదు. నాలుగేళ్ల ఈ చిన్నారి ముద్దు ముద్ద మాటలు, అల్లరి చేష్టలతో అందరినీ ఆకట్టుకుంటోంది. అంతేకాదు ఈ వయసులోనే తనకంటూ ప్రత్యేకమైన క్రేజ్ను సంపాదించుకుంది. కాగా ఈ చిన్నారి చేష్టలను అప్పుడప్పుడు అల్లు అర్జున్, స్నేహా రెడ్డి ఇద్దరు తమ తమ సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటూ ఉంటారు. తాజాగా స్నేహారెడ్డి అర్హకు సంబంధించిన ఓ వీడియోను తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసుకున్నారు. ఆ వీడియోలో అర్హ.. చెస్ ఆడాటానికి సిద్ధం అవుతూ.. పావులను సెట్ చేసుకుంటూ కనిపిస్తుంది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ వీడియో చూసిన బన్నీ ఫ్యాన్స్ అర్హ చెస్ కోసం పావులను సిద్ధం చేయడం చూసి ఆమెను అభినందిస్తున్నారు. ఇంత చిన్న వయస్సులోనే అర్హకు ఎంత తెలివో.. సో క్యూట్ అంటూ కామెంట్ చేస్తున్నారు. ఇక బన్నీ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆయన సుకుమార్ దర్శకత్వంలో ‘పుష్ప’సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రాబోతున్న ఈ సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. కరోనా సెకండ్ వేవ్ కారణంగా షూటింగ్లు నిలిచిపోవడంతో ఈ సినిమా విడుదల కూడా వాయిదా పడే అవకాశం ఉంది. View this post on Instagram A post shared by Allu Sneha Reddy (@allusnehareddy) చదవండి: నాగచైతన్య కార్ల కలెక్షన్స్ చూస్తే కళ్లు తిరగడం ఖాయం! సింగిల్ అంటు కన్నుకొట్టిన వనితపై నెటిజన్ ఫైర్, నటి చురకలు -
కరోనా బాధితులతో చెవిరెడ్డి ‘క్యారమ్స్’
చంద్రగిరి (చిత్తూరు జిల్లా): కరోనా బాధితులకు ప్రభుత్వ విప్, చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్రెడ్డి అండగా నిలుస్తున్నారు. ఇప్పటికే బాధితుల కోసం పడకలు ఏర్పాటు చేసి, కిట్లు అందించి.. తగిన సాయం చేసిన చెవిరెడ్డి తాజాగా వారితో కలిసి చెస్, క్యారమ్స్ ఆడారు. బాధితులతో మాట్లాడి వారిలో ఆత్మస్థైర్యం నింపారు. శనివారం ఉదయం చిత్తూరు జిల్లా చంద్రగిరిలోని కోవిడ్ కేర్ సెంటర్ను చెవిరెడ్డి సందర్శించారు. మధ్యాహ్నం వరకు బాధితులతోనే గడిపారు. వార్డులన్నీ పరిశీలించారు. కోవిడ్ కిట్లతో పాటు ఆహారం, వైద్య సేవలు, పారిశుధ్యం గురించి బాధితులను అడిగి తెలుసుకున్నారు. వారి ఆరోగ్య పరిస్థితుల గురించి వాకబు చేశారు. అక్కడే చెస్, క్యారమ్స్ ఆడుతున్న కరోనా బాధితులతో కలసి చెవిరెడ్డి కూడా ఆడారు. అనంతరం వైద్యులు, పారిశుధ్య కార్మికులు, ఇతర సిబ్బందితో ఆయన మాట్లాడారు. విపత్కర పరిస్థితుల్లో ప్రజలకు సేవ చేస్తున్నందుకు అభినందించారు. కరోనా గురించి భయపడవద్దని.. ధైర్యంగా ఉండాలని చెవిరెడ్డి భాస్కర్రెడ్డి సూచించారు. సీఎం జగన్ నేతృత్వంలోని ప్రభుత్వం కరోనా బాధితులను అన్ని విధాలుగా అండగా ఉంటోందని చెప్పారు. -
Chess Boxing: చెస్తో చెక్.. బాక్సింగ్ కిక్..
సాక్షి సెంట్రల్ డెస్క్: చెస్ అంటే స్మార్ట్.. బాక్సింగ్ అంటే స్ట్రాంగ్.. రెండూ కలిపితే చెస్ బాక్సింగ్.. స్మార్ట్ అండ్ స్ట్రాంగ్. ఓ రకంగా చెప్పాలంటే సూపర్ హీరోలన్న మాట. చెస్కు, బాక్సింగ్కు లింకేమిటని ఆశ్చర్యపోవద్దు. కొన్నేళ్లుగా నడుస్తున్న సరికొత్త ట్రెండ్ ఇది. ప్రపంచవ్యాప్తంగా మెల్లగా చెస్ బాక్సింగ్కు క్రేజ్ పెరుగుతోంది. జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీలు కూడా జరుగుతున్నాయి. మన దేశంలోనూ జాతీయ స్థాయిలో పోటీలు నిర్వహిస్తున్నారు. మంచి తెలివితేటలతో పాటు శారీరకంగా కూడా బలంగా ఉంటే చెస్ బాక్సింగ్ చాంపియన్ కావొచ్చు. మరి ఈ చెస్ బాక్సింగ్ సంగతేంటో తెలుసుకుందామా? తెలివి, బలం కలిస్తే.. పేరుకు తగ్గట్టుగానే చెస్ బాక్సింగ్ మిశ్రమ క్రీడ. చెస్, బాక్సింగ్ రెండింటి నిబంధనలు పాటిస్తూ.. చెస్ బోర్డు మీద, బాక్సింగ్ రింగ్లో తలపడాల్సి ఉంటుంది. భూమ్మీద అత్యంత తెలివైన, బలమైన మహిళ, పురుషుడు ఎవరనేది తేల్చే ఆటే చెస్ బాక్సింగ్ అని దీని రూపకర్త లీప్ రూబింగ్ చెప్తుండేవారు. సైంటిఫిక్ ఫిక్షన్ నుంచి ఆచరణలోకి.. నెదర్లాండ్స్కు చెందిన లీప్ రూబింగ్ అనే క్రీడాకారుడు 2003లో చెస్ బాక్సింగ్కు రూపకల్పన చేశాడు. 1992లో విడుదలైన సైన్స్ ఫిక్షన్ నవల ‘ఫ్రాయిడ్ ఈక్వేటర్’ నుంచి స్ఫూర్తి పొంది చెస్ బాక్సింగ్కు రూపం పోశాడు. ఆ నవలలో ‘ఫ్యూచర్ బాక్స్’ అనే డివైజ్ ఉంటుంది. అందులో పెద్ద చెస్ బోర్డుపై హీరో, విలన్లు పోరాడుతారు. చెస్ బాక్సింగ్ తొలి మ్యాచ్ నెదర్లాండ్స్లోని ఆమ్స్టర్డామ్లో జరిగింది. మ్యాచ్లు జరిగేదెలా? ప్రతి గేమ్లో వరుసగా మొదట చెస్ రౌండ్, తర్వాత బాక్సింగ్ రౌండ్, మళ్లీ చెస్, బాక్సింగ్.. ఇలా జరుగుతూ వస్తాయి. ఇలా గరిష్టంగా 11 రౌండ్ల వరకు ఆడుతారు. లేదా మధ్యలోనే విజేత ఎవరో తేలిపోతుంది. ప్రత్యర్థిని బాక్సింగ్లో నాకౌట్ చేసిగానీ, చెస్లో చెక్మేట్ పెట్టిగానీ గెలవొచ్చు. లేదా నిర్ణీత సమయాన్ని మించి తీసుకోవడం, జడ్జి నిర్ణయం ఆధారంగా కూడా విజేతలను ప్రకటిస్తారు. చెస్ రౌండ్ 4 నిమిషాలు, బాక్సింగ్ రౌండ్ 3 నిమిషాలు ఉంటాయి. చెస్ రౌండ్లలో ఎలాంటి ఫలితం తేలకుండా డ్రా అయితే.. బాక్సింగ్ పాయింట్ల ఆధారంగా గెలుపు ఎవరిదో నిర్ధారిస్తారు. బాక్సింగ్ పాయింట్లు కూడా సమానంగా వస్తే.. చెస్లో నల్ల పావులతో ఆడినవారిని విజేతగా ప్రకటిస్తారు. మన దేశంలో చెస్ బాక్సింగ్ చెస్ బాక్సింగ్ మన దేశంలో కూడా కొన్నేళ్లుగా ప్రాచుర్యంలోకి వస్తోంది. కేంద్ర ప్రభుత్వం 2011లో ‘చెస్ బాక్సింగ్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా (సీబీఓఐ)ని ఏర్పాటు చేసింది. కోల్కతాకు చెందిన ప్రముఖ కిక్ బాక్సింగ్ మాస్టర్, మార్షల్ ఆర్ట్స్ నిపుణుడు సెన్సీ మోంటు దాస్ నేతృత్వంలో సీబీఓఐని స్థాపించారు. మోంటు దాస్ 2020 జూన్లో ప్రపంచ చెస్ బాక్సింగ్ ఆర్గనైజేషన్ అధ్యక్షుడిగా కూడా ఎన్నికయ్యారు. ఇప్పటిదాకా చాంపియన్లు వీరే.. చెస్ బాక్సింగ్లో ప్రస్తుతం లైట్, మిడిల్ వెయిట్, హెవీ వెయిట్ కేటగిరీల్లో చాంపియన్ షిప్లు నిర్వహిస్తున్నారు. వీటిలో గెలిచిన ఆటగాళ్లు వారి ముద్దుపేర్లతో బాగా పాపులర్ అయ్యారు. ప్రస్తుతం చెస్ బాక్సింగ్లో ప్రముఖ ఆటగాళ్లు వీరే.. జర్మనీకి చెందిన ఫ్రాంక్ స్టోల్ట్ (యాంటీ టెర్రర్), 2008లో వరల్డ్ చాంపియన్. రష్యాకు చెందిన నికోలాయ్ సెర్గీవిచ్ (ది చైర్మన్), 2012 నుంచీ వరల్డ్ చాంపియన్. కెనడాకు చెందిన సీయాన్ మూనీ (ది మెషీన్), మిడిల్ వెయిట్లో 2015 నుంచీ చాంపియన్. భారత్కు చెందిన జీత్ పటేల్, అమెచ్యూర్ వరల్డ్ చాంపియన్–2017 ► ‘ప్రపంచంలో నంబర్ వన్ తెలివైన ఆటను.. నంబర్ వన్ పోరాట క్రీడను కలిపితే వచ్చిందే.. చెస్ బాక్సింగ్’’ – చెస్ బాక్సింగ్ రూపకర్త లీప్ రూబింగ్ ► ‘చెస్ బాక్సింగ్ చాలా కష్టం. అటు బాక్సింగ్లో ప్రత్యర్థిని ఎదుర్కొంటూ, దెబ్బలు తగులుతూ ఉంటే.. ఇటు ప్రశాంతంగా, సహనంతో చెస్ ఆడాల్సి ఉంటుంది. మనసు, శరీరం రెండింటినీ ఒకే సమయంలో నియంత్రణలో ఉంచుకోవాల్సి ఉంటుంది’’ – చెస్ బాక్సింగ్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు మోంటు దాస్ -
చెస్ మాస్ట్రో విశ్వనాథన్ ఆనంద్ తండ్రి కన్నుమూత
సాక్షి, న్యూఢిల్లీ: ప్రముఖ చెస్ క్రీడాకారుడు విశ్వనాథన్ ఆనంద్ తండ్రి విశ్వనాథన్ (92 ) ఇక లేరు. స్వల్ప అనారోగ్యంతో గురువారం కన్నుమూశారు. మాజీ జనరల్ మేనేజర్ (సదరన్ రైల్వే) విశ్వనాథన్కు ముగ్గురు సంతానం. ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. ఐదుసార్లు ప్రపంచ చెస్ ఛాంపియన్ అయిన ఆనంద్ ప్రపంచ ఛాంపియన్గా నిలవడంతో విశ్వనాథన్ పాత్ర ఎంతో ఉంది. తన పరిమితమైన సాలరీతోనే ఆనంద్కు ఏలోటూలేకుండా చూసుకున్నారు. దేశ విదేశాల్లో పలుపోటీల్లో పాల్గొనేలా శ్రద్ధ వహించారు. నిరాడంబరమైన జీవితం, ఉన్నత విలువలను పాటించిన ఆయన తన కుమారుడు ఆనంద్ కూడా అదే బాటలో పయనించేలా కృషి చేశారు. ఆనంద్ చెస్లో ఈ స్థాయికి చేరడంలో విశ్వనాథన్ పాత్ర ఎంతో ఉందని ఆనంద్ భార్య అరుణ ఆనంద్ చెప్పారు. అదృష్టవశాత్తూ ఆనంద్ అన్ని వరల్డ్ చాంపియన్షిప్ విజయాలను విశ్వనాథన్ కళ్లారా చూశారన్నారు.. తన భర్త ఉన్నతికి ఆయన ఎపుడూ గర్వపడేవారని, అలాగే చివరివరకు ప్రౌడ్ రైల్వే ఉద్యోగిగా ఉన్నారని ఆమె నివాళులర్పించారు. కాగా ఆనంద్ తల్లి సుశీలా విశ్వనాథన్ 2015, మేలో మరణించిన సంగతి తెలిసిందే. -
వారెవ్వా చహల్.. ముగ్గురిని ఒక్కడే ఆడేసుకున్నాడు
చెన్నై: ఆర్సీబీ స్పిన్నర్ యజ్వేంద్ర చహల్ తోటి క్రికెటర్లను ఆటపట్టించడంలో ఎప్పుడు ముందుంటాడు. మొన్న కైల్ జేమిసన్తో కలిసి డబ్ల్యూడబ్ల్యూఈ స్టార్ అండర్టేకర్ను ఇమిటేట్ చేసిన వీడియో వైరల్గా మారిన సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి ఆర్సీబీ సహచరులైన ఏబీ డివిలియర్స్, మహ్మద్ సిరాజ్, సుందర్లతో చెస్ ఆడిన చహల్ ముగ్గురికి ఒకేసారి చెక్ చెప్పాడు. దీంతో ఆశ్చర్యపోవడం వారి వంతైంది. దీనికి సంబంధించిన ఫోటోను చహల్ తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశాడు. నా కింగ్ ఫామ్లో ఉన్నాడు.. అందుకు ముగ్గురికి ఒకేసారి చెక్ చెప్పా. అంటూ క్యాప్షన్ జతచేశాడు. అంతేగాక చిన్నప్పటి నుంచి చెస్ ఆడడం వల్ల ఇప్పుడు మైదానంలో మ్యాచ్ ఆడేటప్పుడు ఓపిక ఎంత అవసరమనేది నేర్చుకున్నానంటూ తెలిపాడు. అయితే చహల్ క్రికెటర్ కాకముందు చెస్ క్రీడాకారుడిగా ఉన్నాడు. అండర్ 12 చెస్ విభాగంలో చహల్ పలుసార్లు చాంపియన్గా కూడా నిలిచాడు. అయితే కెరీర్లో ఒక స్టేజ్ దాటాకా తనకు ఇష్టమైన చెస్ను వదిలేసి క్రికెట్ను కెరీర్గా ఎంచుకున్నాడు. అంతకముందు చహల్ తన భార్య ధనశ్రీ వర్మతో కలిసి టేబుల్ టెన్నిస్ ఆడిన వీడియోనూ ఆర్సీబీ ఆటగాడు కెఎస్ భరత్ తన ఇన్స్టాలో షేర్ చేయడంతో వైరల్గా మారింది. కాగా ముంబై ఇండియన్స్పై విజయంతో ఈ సీజన్లో భోణీ కొట్టిన ఆర్సీబీ తన తర్వాతి మ్యాచ్ను ఏప్రిల్ 14న చెన్నై వేదికగా ఎస్ఆర్హెచ్తో ఆడనుంది. చదవండి: నేనే కోహ్లినైతే వారి బదులు అశ్విన్, జడ్డూలను తీసుకుంటా.. జాన్సన్ను ఆడించి ముంబై తప్పు చేసింది: స్టైరిస్ View this post on Instagram A post shared by srikar bharat (@konasbharat) -
ఆసియా అండర్-14 ఆన్లైన్ చెస్లో ప్రణీత్కు స్వర్ణం
సాక్షి, హైదరాబాద్: ఆసియా అండర్-14 ఆన్లైన్ చెస్ చాంపియన్షిప్లో భారత్ ‘బి’ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన తెలంగాణ కుర్రాడు వి. ప్రణీత్ వ్యక్తిగత విభాగంలో స్వర్ణ పతకాన్ని సాధించాడు. తొలి బోర్డుపై ఆడిన ప్రణీత్ మొత్తం తొమ్మిది గేముల్లో ఏడింటిలో గెలిచి, ఒక ‘డ్రా’ చేసుకొని, మరో గేమ్లో ఓడిపోయాడు. 7.5 పాయింట్లతో ప్రణీత్ అగ్రస్థానంలో నిలిచి వ్యక్తిగత స్వర్ణాన్ని అందుకున్నాడు. టీమ్ విభాగంలో భరత్ సుబ్రమణ్యం, రాహిల్, సాహిల్ డే, దేవ్ షా, సౌహార్దో బసక్లతో కూడిన భారత్ ‘ఎ’ జట్టు 15 పాయింట్లతో చాంపియన్గా అవతరించింది. 14 పాయింట్లతో ఇరాన్ ‘ఎ’ రన్నరప్గా... వి.ప్రణీత్, తన్మయ్ జైన్, కదమ్ ఓం మనీశ్, రోహిత్, శ్రేయస్లతో కూడిన భారత్ ‘బి’ జట్టుకు మూడో స్థానం లభించింది. మొత్తం 32 ఆసియా దేశాలు ఈ టోరీ్నలో పాల్గొన్నాయి. -
మంచు లక్ష్మీ కూతురు వరల్డ్ రికార్డ్
డైలాగ్ కింగ్ మోహన్ బాబు తనయ, ప్రముఖ నటి మంచు లక్ష్మీ కూతురు విద్యా నిర్వాణ మంచు ఆనంద్ అరుదైన రికార్డ్ ని సాధించింది. `యంగెస్ట్ చెస్ ట్రైనర్`గా నోబెల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో స్థానం సంపాదించుకుంది. డిసెంబర్ 19న నొబెల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రతినిథి డా. చోకలింగం బాలాజి సమక్షంలో జరిగిన పరీక్షల్లో ఉత్తీర్ణురాలై ఈ రికార్డ్ సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా మంచు లక్ష్మి మాట్లాడుతూ.`చెస్ అనేది కేవలం ఆట మాత్రమే కాదు అదొక లైఫ్ స్కిల్ అని నేను నమ్ముతాను. అందుకే విధ్యకి చిన్న వయసులోనే చెస్ ట్రైనింగ్ ఇప్పించాను. కాని రెండు వారాల్లోనే తన కోచ్ కార్తిక్ నా దగ్గరకు వచ్చి చెస్ చాలా బాగా ఆడుతుంది ఈ రికార్డ్కి మనం అప్లై చేద్దాం అని చెప్పారు. ఇప్పుడే వద్దు సార్ ఇంకా కొన్ని రోజుల తర్వాత చూద్దాం అన్నాను. కానీ విధ్యా నిర్వాణ ఇంత చిన్న వయసులోనే `యంగెస్ట్ చెస్ ట్రైనర్`గా నొబెల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో స్థానం అందుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. తన తల్లిగా ఎంతో గర్వంగా ఉంద’ని లక్ష్మీ అన్నారు.‘సో ఫ్రౌడ్ ఆఫ్ యూ మై యాపిల్’ అంటూ తన ఆనందాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. మోహన్ బాబు మాట్లాడుతూ.. `నాకు చెస్ ఆడడం ఇప్పటికీ తెలీదు. అటువంటిది మా మనవరాలు విధ్యా నిర్వాణ చెస్ నేర్చుకుంటుంది అని లక్ష్మీ చెప్పినప్పుడు ఎందుకమ్మా ఇవన్ని చక్కగా చదువుకోనివ్వు అని అన్నాను. లేదు డాడి తను చాలా ఆసక్తిగా ఉంది అని చెప్పింది. ఇంత చిన్న వయసులో నా మనవరాలు ఈ రికార్డు సాధించడం సంతోషాన్ని కలిగిస్తోంది’అని అన్నారు. -
వైశాలి సంచలనం... ప్రపంచ ఏడో ర్యాంకర్పై విజయం
అంతర్జాతీయ చెస్ సమాఖ్య (ఫిడే) ఆధ్వర్యంలో జరుగుతున్న మహిళల స్పీడ్ చెస్ ఆన్లైన్ రెండో గ్రాండ్ప్రి చాంపియన్షిప్లో భారత మహిళా గ్రాండ్మాస్టర్ (డబ్ల్యూజీఎం) ఆర్.వైశాలి సంచలనం సృష్టించింది. బుధవారం జరిగిన తొలి రౌండ్లో చెన్నైకి చెందిన 19 ఏళ్ల వైశాలి 6–4 పాయింట్ల తేడాతో ప్రపంచ ఏడో ర్యాంకర్, 2016 ప్రపంచ ర్యాపిడ్, బ్లిట్జ్ చాంపియన్ అనా ముజిచుక్ (ఉక్రెయిన్)పై గెలిచి క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. మరోవైపు ఆంధ్రప్రదేశ్ గ్రాండ్మాస్టర్ ద్రోణవల్లి హారిక పోరాటం తొలి రౌండ్లోనే ముగిసింది. హారిక 4–7 పాయింట్ల తేడాతో అనా ఉషెనినా (ఉక్రెయిన్) చేతిలో ఓడిపోయింది. -
ఆ పోటీకి ఎంట్రీ ఫీజు లేదు..
సాక్షి, సిటీబ్యూరో: ఆ పోటీకి ఎంట్రీ ఫీజు లేదు. అలాగని అందరూ పాల్గొనేద్దాం అంటే కుదరదు. ప్రస్తుతం దేశాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా మహమ్మారిపై పోరాటానికి గాను నిధుల సేకరణ నిమిత్తం ఏర్పాటైన పీఎం కేర్స్కు తప్పనిసరిగా విరాళం ఇవ్వాల్సిందే. విరాళమే పోటీలో పాల్గొనేందుకు అర్హతగా పలువురు టీనేజీ ఔత్సాహిక చదరంగం క్రీడాకారులను ఆకట్టుకున్న ఈ ఆన్లైన్ టోర్నమెంట్లో 80 మంది పాల్గొనగా కేపీహెచ్బీ నివాసి రవితేజ గెలుపొందారు. కొంత కాలంగా చెస్ పోటీల్లో రాణిస్తున్న రైల్వే ఉద్యోగి రవితేజ పంచుకున్న విశేషాలు తన మాటల్లోనే... ఎన్ని పోటీల్లో గెలిచినా...లాక్ డౌన్ టైమ్లో గెలవడం, అది కూడా ఒక మంచి పనిలో భాగం కావడం ఆనందంగా ఉంది నాకు ఈ పోటీలో వచ్చిన ప్రైజ్ మనీ కూడా నేను పీఎంకేర్స్ ఫండ్కే అందజేశా. ప్రధాన మంత్రి ఆధ్వర్యంలో కరోనా నివారణ కోసం ఏర్పాటైన పిఎమ్ కేర్స్ ఫండ్కు తమ వంతుగా ఏదైనా చేయాలని ఆలోచించిన యువ చెస్ క్రీడాకారులు ముంబయికి చెందిన అండర్ 17 చెస్ ఛాంపియన్ వేదాంత్ పనేశర్ , అంతర్జాతీయ స్థాయి ఆటగాళ్లు. ఆదర్శ్ త్రిపాఠి (14), యష్ శ్రీవాస్తవ (17)లు గత 7వ తేదీన ఈ ఆన్లైన్ టోర్నమెంట్ను దాదాపు 2గంటల పాటు నిర్వహించారు. వీరు ఏర్పాటు చేసిన ది చెస్టర్ గ్రూప్ ఆధ్వర్యంలో జరిగిన ఈ పోటీలో పాల్గొనేందుకు ఎటువంటి ఫీజూ వసూలు చేయకుండా వారిని నేరుగా పీఎమ్ కేర్స్ ఫండ్కు విరాళం ఇవ్వమన్నారు. అలా అందించిన తర్వాత దానిని స్క్రీన్ షాట్ తీసి పోటీ నిర్వాహకులకు పంపిన తర్వాతే పోటీలో పాల్గొనేందుకు అవకాశం కల్పించారు. ముంబయ్, నాగ్పూర్, నోయిడా నగరాలతో పాటు మన హైదరాబాద్ నుంచి కూడా ఇందులో పలువురు పాల్గొన్నారు. క్రీడాకారులు ఫీజు రూపంలో రూ.1.05లక్షలు నేరుగా పిఎం కేర్స్ ఫండ్లో జమచేశారు. ఈ టోర్నమెంట్లో కేటగిరీల వారీగా గెలుపొందిన 20 మందికి బహుమతులు కూడా నిర్వాహకులు సొంత ఖర్చులతో అందించారు. -
బ్రేక్లోనూ బిజీ
ఖాళీ సమయంలో ఏదైనా కొత్త కళ నేర్చుకోవడం ఉత్తమమని అంటున్నారు హీరోయిన్ కాజల్ అగర్వాల్. కరోనా వైరస్ కారణంగా అందరూ ఇళ్లకే పరిమితమైన సంగతి తెలిసిందే. షూటింగ్స్ అన్నీ క్యాన్సిల్ అయ్యాయి. అందరూ స్వీయ గృహనిర్భందంలో ఉంటున్నారు. ఈ ఖాళీ సమయాన్ని ఎలా గడుపుతున్నారు? అనే ప్రశ్నకు కాజల్ అగర్వాల్ బదులిస్తూ – ‘‘ఖాళీగా ఉండటం కన్నా ఏదో ఒక కొత్త కళను నేర్చుకోవడానికే నేను ఇష్టపడతాను. నేను నేర్చుకుంటున్న కొత్త విషయం నాకు నా లైఫ్లో ఉపయోగపడొచ్చు, పడకపోవచ్చు. కానీ టైమ్ వేస్ట్ చేయడం కన్నా ఏదో ఒక కొత్త పనిని సాధన చేయడం ఉత్తమం అని నా భావన. ప్రస్తుతం నేను చెస్ నేర్చుకుంటున్నాను. మార్షల్ఆర్ట్స్ (‘ఇండియన్ 2’ సినిమా కోసం) కోసం మరింత సమయాన్ని కేటాయించగలుగుతున్నాను. మనలో లోపాలుంటే సరిచేసుకోవడానికి ఈ ఖాళీ సమయం ఉపయోగపడుతుంది. గ్యాప్ కూడా మంచికే. ఈ బ్రేక్లోనూ ఏదో ఒకటి చేస్తూ బిజీగానే ఉన్నాను’’ అని పేర్కొన్నారు. ప్రస్తుతం ‘మోసగాళ్ళు’, ‘ఇండియన్ 2’, ‘ముంబైసాగ’ చిత్రాల్లో నటిస్తున్నారామె. -
చెక్ మేట్
పని లేని మెదడు పిచ్చి పిచ్చి ఆలోచనలకు కొలువు అంటారు. కానీ ఆ అవకాశం ఇవ్వకుండా మెదడుకి మేత పెట్టారు దేవరకొండ బ్రదర్స్. చెస్ బోర్డ్ తీసి ఒకరికొకరు చెక్ పెట్టుకున్నారు. కరోనా కారణంగా సినిమా షూటింగ్స్ లేకపోవడంతో స్టార్స్ అందరూ ఇంట్లోనే ఉంటున్నారు. తమ హాబీలతో కాలక్షేపం చేస్తున్నారు. విజయ్ దేవరకొండ ఆయన తమ్ముడు ఆనంద్ దేవరకొండ కూడా ఇంటి పట్టునే ఉంటున్నారు. ఈ ఖాళీ సమయంలో సరదాగా చెస్ ఆడుతున్న ఫొటోను షేర్ చేశారు. -
ప్రపంచ మాజీ చాంపియన్పై హంపి విజయం
సెయింట్ లూయిస్ (అమెరికా): కెయిన్స్ కప్ అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్మాస్టర్, మహిళల విభాగంలో భారత నంబర్వన్ కోనేరు హంపి మూడో విజయం నమోదు చేసింది. ప్రపంచ మాజీ చాంపియన్ అలెగ్జాండ్రా కొస్టెనిక్ (రష్యా)తో జరిగిన ఆరో రౌండ్ గేమ్లో హంపి 61 ఎత్తుల్లో గెలుపొందింది. ఆంధ్రప్రదేశ్కే చెందిన మరో గ్రాండ్మాస్టర్ ద్రోణవల్లి హారిక ఖాతాలో నాలుగో ‘డ్రా’ చేరింది. ప్రపంచ చాంపియన్ జూ వెన్జున్ (చైనా)తో జరిగిన ఆరో రౌండ్ గేమ్ను హారిక 40 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించింది. పది మంది అగ్రశ్రేణి క్రీడాకారిణుల మధ్య తొమ్మిది రౌండ్లపాటు జరుగుతున్న ఈ టోర్నీలో ఆరో రౌండ్ తర్వాత హంపి, జూ వెన్జున్ నాలుగు పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్నారు. హారిక మూడు పాయింట్లతో ఏడో స్థానంలో ఉంది. -
తెలంగాణ రాష్ట్ర చెస్ జట్టులో ఉమేశ్, కీర్తి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర అమెచ్యూర్ ఓపెన్ చెస్ సెలక్షన్ టోర్నమెంట్లో కె. ఉమేశ్, జి. కీర్తి మెరుగైన ప్రతిభ కనబరిచి రాష్ట్ర జట్టుకు ఎంపికయ్యారు. వీరిద్దరితో పాటు అభిరామ్ ప్రమోద్, అంకిత గౌడ్ కూడా జాతీయ చెస్ చాంపియన్షిప్లో పాల్గొనే రాష్ట్ర జట్టులో చోటు దక్కించుకున్నారు. ఎల్బీ స్టేడియంలో జరిగిన ఈ సెలక్షన్స్లో నిర్ణీత 8 రౌండ్ల అనంతరం బాలుర విభాగంలో ఉమేశ్ 7 పాయింట్లతో చాంపియన్గా నిలిచాడు. అభిరామ్ 6.5 పాయింట్లతో రన్నరప్ ట్రోఫీని అందుకున్నాడు. బాలికల కేటగిరీలో కీర్తి 6 పాయింట్లతో, అంకిత 5.5 పాయింట్లతో తొలి రెండు స్థానాలను దక్కించుకుని రాష్ట్ర జట్టుకు ఎంపికయ్యారు. ఈ టోర్నీలో తొలి 13 స్థానాల్లో నిలిచిన పురుషులకు, తొలి 8 స్థానాలను దక్కించుకున్న మహిళలకు రూ. 1000 ప్రైజ్మనీగా అందజేశారు. చివరిదైన ఎనిమిదో రౌండ్లో వినోద్ (6)పై ఉమేశ్ (7), ధ్రువ (6)పై అభిరామ్ (6.5), అంకిత (5.5)పై అద్వయ్ (6.5), నేత్ర (5)పై సుబ్బరాజు (6), అధ్వర శిరీష్ (5)పై కీర్తి (6), రోహిత్ (5)పై సత్యనారాయణ (6), గౌతమ్ (5)పై సూర్య (6), రవితేజ (5)పై సంకేత్రెడ్డి (6), శశాంక్ (5)పై విఘ్నేశ్ (6), జ్ఞానిత(4.5) శ్రీధన్వి (5.5), బ్రహ్మానందం (4)పై హర్షిత (5.5)పై గెలుపొందారు. -
అర్జున్కు రజతం
సాక్షి, హైదరాబాద్: జాతీయ అండర్–9 ఓపెన్ చెస్ చాంపియన్షిప్లో తెలంగాణ క్రీడాకారులు ఆదిరెడ్డి అర్జున్, ఆకుల సుహాస్ మెరుగైన ప్రదర్శన కనబరిచారు. గుజరాత్లోని అహ్మదాబాద్లో జరిగిన ఈటోర్నీలో అర్జున్ రన్నరప్గా నిలిచి రజత పతకాన్ని సాధించగా... సుహాస్ కాంస్యాన్ని అందుకున్నాడు. టోర్నీలో నిర్ణీత 11 రౌండ్ల అనంతరం అర్జున్, సుహాస్ 9 పాయింట్లతో సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచారు. మెరుగై టై బ్రేక్ ఆధారంగా ర్యాంకుల్ని వర్గీకరించగా అర్జున్ రెండో స్థానంలో, సుహాస్ మూడో స్థానంలో నిలిచారు. తమిళనాడుకు చెందిన జి. ఆకాశ్ 9.5 పాయింట్లతో చాంపియన్షిప్ను కైవసం చేసుకున్నాడు. అర్జున్, సుహాస్లిద్దరూ 8 గేముల్లో గెలిచి, మరో రెండు గేముల్ని డ్రాగా ముగించారు. చెరో గేమ్లో ఓడిపోయారు. -
ఆగస్టు వినోదం
కబడ్డీ కూత, యాషెస్ సిరీస్, కరీబియన్ క్రికెట్తో ఆగస్టు ‘మస్తు మజా’ అందించనుంది. పనిలో పనిగా హైదరాబాద్లో షటిల్ రాకెట్లు సమరాన్ని చూపించనున్నాయి. గత నెలలో మొదలైన ప్రొ కబడ్డీ లీగ్ ఏడో సీజన్ పోటీలు ఈ ఆగస్టులో ఆరు నగరాల్లో కూతపెడతాయి. యాషెస్ సిరీస్తో పాటు, విండీస్లో భారత్ పర్యటన క్రికెట్ పంట పండించనుంది. ఏస్లతో యూఎస్ ఓపెన్, కార్ల స్పీడ్తో హంగేరి గ్రాండ్ప్రి ‘రయ్ రయ్’మనిపిస్తుంది. అలా ఈ ఆగస్టు ఆటలతో ‘అటెస్ట్’ అయిపోయింది. క్రికెట్ వెస్టిండీస్లో భారత్ పర్యటన తొలి టి20: ఆగస్టు 3 రెండో టి20: ఆగస్టు 4 మూడో టి20: ఆగస్టు 6 తొలి వన్డే: ఆగస్టు 8 రెండో వన్డే: ఆగస్టు 11 మూడో వన్డే: ఆగస్టు 14 తొలి టెస్టు: ఆగస్టు 22–26 రెండో టెస్టు: ఆగస్టు 30–సెప్టెంబరు 3 బ్యాడ్మింటన్ ఆగస్టు 6–11: హైదరాబాద్ ఓపెన్ టోర్నీ ఆగస్టు 19–25: ప్రపంచ సీనియర్ చాంపియన్షిప్ (స్విట్జర్లాండ్) షూటింగ్ ఆగస్టు 15–22: ప్రపంచకప్ షాట్గన్ టోర్నీ (ఫిన్లాండ్) ఆగస్టు 28–సెప్టెంబర్ 2: ప్రపంచకప్ రైఫిల్, పిస్టల్ షూటింగ్ టోర్నీ (రియో డి జనీరో) ఫార్ములావన్ ఆగస్టు 4: హంగేరి గ్రాండ్ప్రి యాషెస్ సిరీస్ తొలి టెస్టు: ఆగస్టు 1–5 బర్మింగ్హామ్ రెండో టెస్టు: ఆగస్టు 14–18 లార్డ్స్ మూడో టెస్టు: ఆగస్టు 22–26 లీడ్స్ న్యూజిలాండ్లో శ్రీలంక పర్యటన తొలి టెస్టు: ఆగస్టు 14–18 రెండో టెస్టు: ఆగస్టు 22–26 తొలి టి20: ఆగస్టు 31 టెన్నిస్ ఆగస్టు 26–సెప్టెంబర్ 8: యూఎస్ ఓపెన్ గ్రాండ్స్లామ్ టోర్నీ రెజ్లింగ్ ఆగస్టు 12–18: ప్రపంచ జూనియర్ చాంపియన్ షిప్ (ఎస్తోనియా) ప్రొ కబడ్డీ లీగ్–7 సీజన్ మ్యాచ్లు ఆగస్టు 2–31 చెస్ ఆగస్టు 15–19: ప్రపంచ క్యాడెట్ (అండర్–8, 10, 12) ర్యాపిడ్, బ్లిట్జ్ చాంపియన్షిప్ (బెలారస్) ఆగస్టు 20–సెప్టెంబర్ 2: ప్రపంచ క్యాడెట్ (అండర్–8, 10, 12) చాంపియన్షిప్ (చైనా) హాకీ ఆగస్టు 17–21: టోక్యో ఒలింపిక్స్ టెస్ట్ ఈవెంట్ హాకీ టోర్నీ – సాక్షి క్రీడావిభాగం -
గుప్తాకు గ్రాండ్మాస్టర్ హోదా
న్యూఢిల్లీ: భారత 64వ గ్రాండ్మాస్టర్(జీఎం)గా ఢిల్లీకి చెందిన ప్రీతు గుప్తా అవతరించాడు. పోర్చుగల్లో జరుగుతున్న పోర్చుగీస్ లీగ్–2019 చెస్ టోర్న మెంట్ ఐదో రౌండ్లో అంతర్జాతీయ మాస్టర్ లెవ్ యంకెలెవిచ్ను ఓడించిన ప్రీతు.. జీఎం హోదాకు అవసరమైన 2500 ఎలో రేటింగ్ను సంపాదించాడు. తొమ్మిదేళ్ల వయసులోనే చదరంగంలో ప్రవేశించిన గుప్తా 15 ఏళ్లకే జీఎం హోదా పొంది ఈ ఘనత సాధించిన అతిపిన్న వయస్కుల్లో ఒకడిగా నిలిచాడు. జీఎం హోదాకు కావాల్సిన మూడు నార్మ్ల్లో మొదటిది జిబ్రా ల్టర్ మాస్టర్స్లో, రెండోది బైయిల్ మాస్టర్స్లో గతేడాది సాధించిన గుప్తా.. మూడోది, చివరిదైన నార్మ్ను ఈ ఏదాది ఫిబ్రవరిలో పోర్టికో ఓపెన్లో అందుకున్నాడు. జీఎం హోదా సాధించిన గుప్తాను భారత దిగ్గజ చెస్ క్రీడాకారుడు విశ్వనాథన్ ఆనంద్ ట్విట్టర్ వేదికగా అభినందించాడు. -
చాంపియన్ కార్తీక్ సాయి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఓపెన్ చెస్ చాంపియన్షిప్లో సీహెచ్ కార్తీక్ సాయి విజేతగా నిలిచాడు. స్ఫూర్తి చెస్ అకాడమీ, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో ఎల్బీ స్టేడియంలో జరిగిన ఈ టోర్నమెంట్లో నిర్ణీత 8 రౌండ్ల అనంతరం 7 పాయింట్లతో కార్తీక్ సాయి, పి. అభినవ్, సాయ్పురి శ్రీథన్ సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచారు. అయితే మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా కార్తీక్ చాంపియన్గా నిలవగా... అభినవ్, శ్రీథన్ వరుసగా రెండు, మూడు స్థానాలతో సరిపెట్టుకున్నారు. చివరిదైన ఎనిమిదో రౌండ్లో శ్రీహిత్రెడ్డిపై కార్తీక్సాయి, విశ్వక్సేన్పై అభినవ్, నరేన్పై శ్రీథన్, సుశాంత్పై బషిక్ ఇమ్రోస్, నటురా బేతిపై సుబ్బరాజు గెలుపొందారు. పోటీల అనంతరం జరిగిన బహుమతి ప్రదాన కార్యక్రమంలో శాట్స్ ఎండీ ఎ. దినకర్ బాబు ముఖ్య అతిథిగా విచ్చేసి విజేతలకు ట్రోఫీలను అందజేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర చెస్ సంఘం కార్యదర్శి కేఎస్ ప్రసాద్, ఉపాధ్యక్షుడు కేఏ శివ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
430కు కొన్నాడు. 6కోట్లకు అమ్ముడుపోయింది!
ప్రాచీన కాలానికి చెందిన ఓ చదరంగం పావు.. లండన్లో జరిగిన వేలంపాటలో ఏకంగా రూ. 6.3 కోట్లకు అమ్ముడుపోయింది. సుమారు 900 ఏళ్ల కిందటి లెవిస్ చెస్మ్యాన్ పావును 1964లో ఓ వ్యక్తి కేవలం ఐదు పౌండ్ల (రూ. 430)కి కొనుగోలు చేశాడు. లండన్ సౌత్బైలో మంగళవారం జరిగిన వేలంపాటలో ఓ గుర్తుతెలియని బిడ్డర్ ఈ పావును 7.35 లక్షల పౌండ్ల (రూ. 6.3 కోట్ల)కు సొంతం చేసుకున్నాడు. సైనిక యోధుడి రూపంలో ఉన్న ఈ పావు 8.8 సెంటీమీటర్ల పొడవు ఉంది. 12వ శతాబ్దానికి చెందిన వార్లస్ అనే సముద్ర జంతువు దంతంతో ఈ పావును తయారు చేశారు. నార్సె యోధుల రూపంలో లెవిస్ చెస్మ్యేన్ పావులు ఉంటాయి. యూరోపియన్ చరిత్రలో వైకింగ్ శకానికి (క్రీ.శ. 800 నుంచి 1066 మధ్యకాలం) చెందిన ఈ కాలపు కళాకృతులు ఎంతో విశిష్టమైనవి. వీటికి మార్కెట్లో గొప్ప ధర పలుకుతుంది. రూర్క్ (చదరంగంలో ఏనుగు)ను తలపిస్తున్న ఈ పావును స్కాటిష్ ప్రాచీన కళాకృతుల డీలర్ వద్ద మొదట కనుగొన్నారు. ఇలాంటి చదరంగం పావులు 1831లో స్కాట్లాండ్లోని ఇస్లే ఆఫ్ లెవిస్లో పెద్ద ఎత్తున లభించాయి. మొత్తం ఐదు సెట్ల చెస్ పావులు అక్కడ దొరికాయి. వాటి నుంచి అదృశ్యమైన ఈ చెస్పావు.. కాలక్రమంలో అనేకమంది చేతులు మారుతూ.. చివరకు గత మంగళవారం లండన్లో వేలంపాటకు వచ్చినట్టు భావిస్తున్నారు. 1964లో ఎడిన్బర్గ్కు చెందిన డీలర్ తమ నుంచి ఈ చెస్ పావును రూ. 430కి కొనుగోలు చేసినట్టు స్కాటిష్ డీలర్ కుటుంబం ప్రతినిధి తాజాగా మీడియాకు తెలిపారు. -
రాష్ట్ర స్థాయి చెస్ టోర్నీ బ్రోచర్ విడుదల
సాక్షి, హైదరాబాద్: పడాల లక్ష్మమ్మ, భూమా గౌడ్ స్మారక తెలంగాణ రాష్ట్ర ఓపెన్ చెస్ టోర్నమెంట్కు సంబంధించిన బ్రోచర్ను సోమవారం విడుదల చేశారు. తెలంగాణ రాష్ట్ర చెస్ సంఘం (టీఎస్సీఏ) కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో సంఘం ఉపాధ్యక్షుడు కేఏ శివప్రసాద్, కార్యదర్శి కేఎస్ ప్రసాద్ బ్రోచర్ను ఆవిష్కరించారు. ఎల్బీ స్టేడియం వేదికగా ఈనెల 13, 14 తేదీల్లో ఈ టోర్నీని నిర్వహిస్తారు. విజేతకు రూ. 30,000 ప్రైజ్మనీ అందజేయనున్నారు. వివరాలకు www. chesstelangana.com వెబ్సైట్లో లేదా ప్రశాంత్ గౌడ్ (88010 00222, 88010 00666)ను సంప్రదించాలి. -
అకీరాపై ధ్రువ గెలుపు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర అండర్–25 ఓపెన్ చెస్ చాంపియన్షిప్లో ధ్రువ వరుసగా మూడో విజయాన్ని నమోదు చేశాడు. రాష్ట్ర చెస్ సంఘం కార్యాలయంలో శనివారం జరిగిన మూడోరౌండ్ గేమ్లో అకీరా సౌమ్యనాథ్పై ధ్రువ గెలుపొందాడు. ఇతర బోర్డుల్లో విశ్వతేజపై బిపిన్ రాజ్, శ్రీ చరణ్పై శిబి శ్రీనివాస్, శ్రేయపై నాగ సాయి, శ్రీకాంత్పై పవన్ తేజ నెగ్గారు. మూడో రౌండ్ అనంతరం 3 పాయింట్లతో ధ్రువ, బిపిన్ రాజ్, నాగ సాయి, శిబి శ్రీనివాస్, పవన్ తేజ, నికుంజ్, సాయి అచ్యుత్ సంయుక్తంగా తొలి స్థానంలో నిలిచారు. ఏడు రౌండ్ల పాటు జరుగనున్న ఈ టోర్నీలో తొలి నాలుగు స్థానాల్లో నిలిచిన క్రీడాకారులు తెలంగాణ రాష్ట్ర జట్టుకు ఎంపికవుతారు. జాతీయ యూత్ చెస్ చాంపియన్షిప్లో ఈ జట్టు తెలంగాణకు ప్రాతినిధ్యం వహిస్తుంది. -
హంపికి నాలుగో స్థానం
పెంగ్షుయ్ (చైనా): ప్రపంచ మాస్టర్స్ మహిళల చెస్ చాంపియన్షిప్ బ్లిట్జ్ ఈవెంట్లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్మాస్టర్ కోనేరు హంపి త్రుటిలో కాంస్య పతకాన్ని చేజార్చుకుంది. 16 మంది మేటి క్రీడాకారిణులు పాల్గొన్న ఈ టోర్నీలో నిర్ణీత 22 రౌండ్లు ముగిశాక హంపి 13 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచింది. ఆంధ్రప్రదేశ్కే చెందిన మరో గ్రాండ్మాస్టర్ ద్రోణవల్లి హారిక 11.5 పాయింట్లతో ఆరో స్థానాన్ని సంపాదించింది. చైనా గ్రాండ్మాస్టర్ లీ టింగ్జి 15 పాయింట్లతో చాంపియన్గా అవతరించింది. -
2022 ఆసియా క్రీడల్లో చెస్
న్యూఢిల్లీ: ఆసియా క్రీడల్లో చెస్ మెడల్ ఈవెంట్గా పునరాగమనం చేయనుంది. వరుసగా 2006 దోహా... 2010 గ్వాంగ్జూ ఆసియా క్రీడల్లో పతకాంశంగా ఉన్న చెస్ను ఆ తర్వాతి రెండు ఆసియా క్రీడల్లో నిర్వహించలేదు. అయితే 2022లో చైనాలోని హాంగ్జౌలో జరిగే ఆసియా క్రీడల్లో చెస్ను మళ్లీ ప్రవేశ పెడుతున్నట్లు ఈ క్రీడల నిర్వాహక కమిటీ అధికారికంగా ఆసియా చెస్ సమాఖ్యకు సమాచారం ఇచ్చింది. 2022లో సెప్టెంబర్ 10 నుంచి 25 వరకు ఆసియా క్రీడలు జరుగుతాయి. -
అజర్బైజాన్తో భారత్ మ్యాచ్ ‘డ్రా’
అస్తానా (కజకిస్తాన్): ప్రపంచ టీమ్ చెస్ చాంపియన్ షిప్ ఓపెన్ విభాగంలో భారత పురుషుల జట్టు నాలుగో ‘డ్రా’ నమోదు చేసింది. అజర్బైజాన్ జట్టుతో మంగళవారం జరిగిన ఏడో రౌండ్ మ్యాచ్ను భారత జట్టు 2–2తో ‘డ్రా’ చేసుకుంది. ఆధిబన్–అర్కాదిజ్; కృష్ణన్ శశికిరణ్–గాదిర్ గుసెనోవ్; సూర్యశేఖర గంగూలీ–ఎల్తాజ్ సఫారీలి; సేతురామన్–అబాసోవ్ నిజాత్ల మధ్య జరిగిన నాలుగు గేమ్లు ‘డ్రా’గా ముగిశాయి. ఏడో రౌండ్ తర్వాత భారత్ పది పాయింట్లతో మూడో స్థానంలో ఉంది. 12 పాయింట్లతో రష్యా అగ్రస్థానంలో... 11 పాయింట్లతో ఇంగ్లండ్ రెండో స్థానంలో ఉన్నాయి. మహిళల విభాగంలో భారత జట్టు మూడో విజయం సాధించింది. అమెరికాతో జరిగిన మ్యాచ్లో భారత మహిళల జట్టు 4–0తో నెగ్గింది. అబ్రామ్యాన్ తతేవ్పై ఇషా కరవాడే; కాటరీనాపై సౌమ్య స్వామినాథన్; యిప్ కారిస్సాపై పద్మిని రౌత్; సబీనాపై భక్తి కులకర్ణి గెలిచారు. ఏడో రౌండ్ తర్వాత భారత్ ఎనిమిది పాయింట్లతో ఐదో స్థానంలో ఉంది. -
చాంపియన్ అభిరామ్ ప్రణీత్
సాక్షి, హైదరాబాద్: బ్రిలియంట్ ట్రోఫీ ఓపెన్ చెస్ టోర్నమెంట్లో తక్షశిల పబ్లిక్ స్కూల్ (లాలాపేట్) విద్యార్థి అభిరామ్ ప్రణీత్, జేకే రాజు చాంపియన్లుగా నిలిచారు. దిల్సుఖ్నగర్లో జరిగిన ఈ టోర్నీ జూనియర్స్ కేటగిరీలో నిర్ణీత 6 రౌండ్లకు గానూ 6 పాయింట్లు సాధించిన అభిరామ్ ప్రణీత్ టైటిల్ను అందుకున్నాడు. ఆదివారం జరిగిన చివరి గేమ్లో ఆరుష్పై ప్రణీత్ గెలుపొందాడు. 5 పాయింట్లతో కోవిద్ కుశాల్ రన్నరప్గా నిలవగా... ఆలకంటి విశ్వ మూడోస్థానాన్ని దక్కించుకున్నాడు. ఓపెన్ కేటగిరీలో 5.5 పాయింట్లు స్కోర్ చేసిన జేకే రాజు చాంపియన్షిప్ను కైవసం చేసుకున్నాడు. అమిత్పాల్ సింగ్ (5 పాయింట్లు), షణ్ముఖ వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచారు. టోర్నీలో జాహ్నవి శ్రీలలిత ‘బెస్ట్ ఉమన్’, ఎం. రామ్మోహన్ రావు ‘బెస్ట్ వెటరన్’ అవార్డులను గెలుచుకున్నారు. తెలంగాణ రాష్ట్ర చెస్ సంఘం ఉపాధ్యక్షుడు కేఏ శివప్రసాద్ విజేతలకు ట్రోఫీలను అందజేశారు. ఇతర వయో విభాగాల విజేతల వివరాలు అండర్–14 బాలురు: 1. శ్రీయాన్ రెడ్డి, 2. జె. శ్రీరామ్; బాలికలు: 1. కె. సాత్విక. అండర్–12 బాలురు: 1. కోవిద్ కుషాల్, 2. విశ్వ; బాలికలు: 1. కె. తన్మయి, భవిష్య రెడ్డి. అండర్–10 బాలురు: 1. వి. అభిరామ్, 2. సత్య పృథ్వీ; బాలికలు: 1. జి. శరణ్య, 2. రిమితా రెడ్డి. అండర్–8 బాలురు: 1. ధ్రువ్, 2. శ్రీ రేవంత్ కుమార్; బాలికలు: 1. ఐశ్వర్య, 2. అనయా. అండర్–6 బాలురు: 1. ఎం. గురుదేవ్, 2. హర్తేజ్పాల్ సింగ్; బాలికలు: 1. ఎన్. హరిణి. , , -
చాంప్స్ ఆదిత్య, నిశ్చల్
సాక్షి, హైదరాబాద్: బ్రిలియంట్ ట్రోఫీ చెస్ టోర్నమెంట్లో ఆదిత్య వరుణ్, టి. నిశ్చల్ చాంపియన్లుగా నిలిచారు. దిల్సుఖ్నగర్లోని బ్రిలియంట్ గ్రామర్ స్కూల్ వేదికగా జరిగిన ఈ టోర్నీ ఓపెన్ కేటగిరీలో ఆదిత్య, జూనియర్స్ విభాగంలో నిశ్చల్ అగ్రస్థానాన్ని దక్కించుకున్నారు. ఓపెన్ కేటగిరీలో నిర్ణీత 6 రౌండ్లు ముగిసేసరికి ఓక్ వుడ్ ఇంటర్నేషనల్ స్కూల్ (కొత్తపేట్)కు చెందిన ఆదిత్య వరుణ్ 6 పాయింట్లతో విజేతగా నిలిచాడు. చివరి రౌండ్లో దువ్వాల సురేశ్ (5)పై ఆదిత్య విజయం సాధించాడు. 5 పాయింట్లతో కె. త్రిష, సురేశ్ సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచారు. అయితే మెరుగైన టైబ్రేక్ స్కోర్ ఆధారంగా త్రిష రన్నరప్గా నిలవగా, సురేశ్ మూడోస్థానంతో సరిపెట్టుకున్నాడు. జూనియర్స్ కేటగిరీలో నిశ్చల్, డి. నిగమశ్రీ, పురుషోత్తం, ఎస్. బాబు 5 పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచారు. టైబ్రేక్ స్కోర్ ఆధారంగా ర్యాంకింగ్ను వర్గీకరించగా నిశ్చల్ అగ్రస్థానంలో... నిగమశ్రీ,, పురుషోత్తం వరుసగా రెండు, మూడు స్థానాలను దక్కించుకున్నారు. అనంతరం జరిగిన టోర్నీ ముగింపు కార్యక్రమంలో జాతీయ మాజీ ప్లేయర్ పి. రమాదేవి ముఖ్య అతిథిగా విచ్చేసి విజేతలకు బహుమతులను అందజేశారు. ఇతర వయో విభాగాల విజేతల వివరాలు అండర్–14 బాలురు: 1. బి. పురుషోత్తం, 2. శ్రీగణేశ్ చరణ్; బాలికలు: 1. హాసిత, 2. ఎన్. అక్షయ; అండర్–12 బాలురు: 1. సీహెచ్ మోక్షజ్ఞ, 2. ఎం. శ్రీ జీవన్; బాలికలు: 1. నిగమశ్రీ, 2. వేద శ్రుతి. అండర్–10 బాలురు: 1. ఎస్. బాబు, 2. ఎ. హిమాన్షు; బాలికలు: 1. కె. నిత్యశ్రీ, 2. మీనా. అండర్–8 బాలురు: 1. డి. పార్థివ్, 2. వి. సంతోష్ కుమార్. అండర్–6 బాలురు: 1. కె. ద„Š , 2. పి. సాయి జయంత్. -
హారిక... మరో ‘డ్రా’
సెయింట్ లూయిస్ (అమెరికా): కెయిన్స్ కప్ అంతర్జాతీయ మహిళల చెస్ టోర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్మాస్టర్ ద్రోణవల్లి హారిక వరుసగా నాలుగో ‘డ్రా’ నమోదు చేసింది. అంతర్జాతీయ మాస్టర్ (ఐఎం) ఎలిజబెత్ పెట్జ్ (జర్మనీ)తో జరిగిన నాలుగో గేమ్ను తెల్ల పావులతో ఆడిన హారిక 31 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించింది. పది మంది మేటి క్రీడాకారిణుల మధ్య జరుగుతున్న ఈ టోర్నీలో నాలుగో రౌండ్ తర్వాత హారిక రెండు పాయింట్లతో ఐదో స్థానంలో ఉంది. 3.5 పాయింట్లతో ప్రపంచ మాజీ చాంపియన్ అలెగ్జాండ్రా కొస్టెనిక్ (రష్యా) అగ్రస్థానంలో ఉంది. -
ఓవరాల్ చాంప్ సాధు వాస్వాని
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర చెస్ సంఘం (టీఎస్సీఏ) స్కూల్ పిల్లల చెస్ టోర్నీలో సాధు వాస్వాని ఇంటర్నేషనల్ స్కూల్ జట్టు సత్తా చాటింది. కొంపల్లిలో జరిగిన ఈ టోర్నమెంట్లో ఓవరాల్ చాంపియన్షిప్ టైటిల్ను కైవసం చేసుకుంది. మొత్తం 130 మంది చిన్నారులు పాల్గొన్న ఈ టోర్నీని తరగతుల వారీగా నిర్వహించారు. బహుమతి ప్రదాన కార్యక్రమంలో సాధు వాస్వాని ఇంటర్నేషనల్ స్కూల్ ప్రిన్సిపాల్ కంచన్ దులాని, యూనిసెంట్ స్కూల్ ప్రిన్సిపాల్ సీవీ రమాదేవి ముఖ్యఅతిథులుగా విచ్చేసి విజేతలకు ట్రోఫీలను అందజేశారు. విజేతల వివరాలు మొదటి తరగతి బాలురు: 1. గురుదేవ్, 2. రిషిత్; బాలికలు: 1. మంజరి; రెండో తరగతి బాలురు: 1. సాయి అనీశ్, 2. వైభవ్; బాలికలు: 1. రుషిత, 2. సాత్విక. మూడో తరగతి బాలురు: 1. చరణ్, 2. ధ్రువ్ కుమార్; బాలికలు: 1. సిద్ధిక, 2. టియా బేడీ; నాలుగో తరగతి బాలురు: 1. అనీశ్, 2. రిత్విక్; బాలికలు: 1. చైత్ర; ఐదో తరగతి బాలురు: 1. ప్రణీత్, 2. త్రిశాంక్; బాలికలు: 1. హర్షిత, 2. సొనాల్ సింగ్; ఆరో తరగతి బాలురు: 1. ప్రణయ్, 2. సూర్యప్రతాప్; బాలికలు: 1. సేవిత విజు, 2. ప్రణీత. ఏడో తరగతి బాలురు: 1. హేమంత్, 2. నీల్ జాన్ వివేక్; బాలికలు: 1. కీర్తి, 2. వేద. ఎనిమిదో తరగతి బాలురు : 1. ప్రభంజన్, 2. మిహిర్; బాలికలు: 1. యజ్ఞ ప్రియ, 2. శ్రీచరిత. తొమ్మిదో తరగతి బాలురు: 1. ఎన్. రోహిత్, 2. శ్రీ గణేశ్. -
అంతర్జాతీయ చెస్కు వ్లాదిమిర్ క్రామ్నిక్ వీడ్కోలు
ప్రపంచ మాజీ చాంపియన్, రష్యా స్టార్ ప్లేయర్ వ్లాదిమిర్ క్రామ్నిక్ అంతర్జాతీయ చెస్కు వీడ్కోలు పలికాడు. 43 ఏళ్ల క్రామ్నిక్ 2000లో దిగ్గజం గ్యారీ కాస్పరోవ్ను ఓడించి క్లాసికల్ విభాగంలో విశ్వవిజేతగా అవతరించాడు. ఆ తర్వాత రెండుసార్లు ప్రపంచ టైటిల్ను నిలబెట్టుకున్న అతను చెస్లోని అన్ని ప్రముఖ టోర్నమెంట్లలోనూ విజేతగా నిలిచాడు. 1996లోనే నంబర్వన్ ర్యాంక్ను సొంతం చేసుకున్న క్రామ్నిక్ ప్రస్తుతం ఏడో ర్యాంక్లో ఉన్నాడు. ‘ప్రొఫెషనల్ చెస్కు గుడ్బై చెప్పాలని రెండు నెలల ముందే నిర్ణయం తీసుకున్నాను. చెస్కు ప్రాచుర్యం కల్పించే కార్యక్రమాలపై మరింత దృష్టి పెట్టేందుకే ఆటకు వీడ్కోలు పలికాను’ అని క్రామ్నిక్ తెలిపాడు. -
‘పద్మశ్రీ’తో మరింత ఉత్సాహం: హారిక
సాక్షి, హైదరాబాద్: ఊహించని సమయంలో కేంద్ర ప్రభుత్వం ద్వారా ‘పద్మశ్రీ’ పురస్కారం రావడంపట్ల ఆంధ్రప్రదేశ్ చెస్ గ్రాండ్మాస్టర్ ద్రోణవల్లి హారిక సంతోషాన్ని వ్యక్తం చేసింది. అంతర్జాతీయస్థాయిలో మరిన్ని గొప్ప విజయాలు సాధించేందుకు ఈ అవార్డు నూతనోత్సాహాన్ని ఇస్తుందని ఆమె వ్యాఖ్యానించింది. ప్రస్తుతం స్పెయిన్లోని జిబ్రాల్టర్ ఓపెన్ టోర్నమెంట్లో పాల్గొంటున్న ఆమె ఆలస్యంగానైనా పద్మశ్రీ పురస్కారం వచ్చినందుకు ఆనందంతో ఉన్నానని తెలిపింది. ‘గత రెండేళ్లుగా ఈ అవార్డు కోసం దరఖాస్తు చేశాను. చివరి నిమిషంలో నా పేరు లేదని తెలుసుకొని నాతోపాటు తల్లిదండ్రులు నిరాశకు లోనయ్యారు. అయితే ఏనాటికైనా ఈ పురస్కారం వస్తుందని వారికి చెప్పి దీని కోసం వేచి చూడొద్దని కోరాను. ఈసారి అవార్డు వస్తుందని ఊహించని సమయంలో నా పేరు కూడా జాబితాలో ఉండటంతో అమితానందం కలిగింది. ఈ పురస్కారం నాలో మరింత బాధ్యతను పెంచింది. నా జీవిత లక్ష్యమైన ప్రపంచ చాంపియన్షిప్ స్వర్ణాన్ని అందుకునే దిశగా మరింత పట్టుదలతో కృషి చేసేందుకు కావాల్సిన విశ్వాసాన్ని ఇచ్చింది. నేనీస్థాయికి చేరుకోవడానికి సహాయపడిన వారందరికీ కృతజ్ఞతలు చెబుతున్నాను’ అని 28 ఏళ్ల హారిక పేర్కొంది. -
స్పోర్ట్స్ క్యాలెండర్ 2019
గతేడాది భారత క్రీడారంగం కొత్త శిఖరాలను అధిరోహించింది. క్రికెట్లోనే కాకుండా ఆర్చరీ, బ్యాడ్మింటన్, రెజ్లింగ్, అథ్లెటిక్స్, టెన్నిస్... ఒకటేంటి బరిలోకి దిగిన ప్రతీ అంతర్జాతీయ ఈవెంట్లో మనోళ్లు మెరిపించారు. మెగా టోర్నీల పరంగా గత సంవత్సరం ఫుట్బాల్ ప్రపంచకప్, కామన్వెల్త్ గేమ్స్, ఆసియా క్రీడలు, యూత్ ఒలింపిక్స్... ఇతర క్రీడాంశాల్లో ప్రపంచకప్లతో ఏడాది పొడవునా సందడి నెలకొంది.ఇదే ఊపును కొనసాగించేందుకు 2019 కూడా సిద్ధమవుతోంది. 2020 టోక్యో ఒలింపిక్స్కు ఏడాది మాత్రమే ఉండటంతో భారత్కు పతకావకాశాలు ఉన్న ఈవెంట్స్లో సన్నాహాలు మొదలుకానున్నాయి. మరోవైపు రెండు దశాబ్దాల తర్వాత మళ్లీ వన్డే క్రికెట్ ప్రపంచకప్నకు ఆతిథ్య మిచ్చేందుకు ఇంగ్లండ్ ముస్తాబవుతోంది. ఈ నేపథ్యంలో 2019లో జరిగే ప్రధాన ఈవెంట్స్తో కూడిన స్పోర్ట్స్ క్యాలెండర్ మీ కోసం... క్రికెట్ ►జనవరి 3–7: భారత్ గీ ఆస్ట్రేలియా, నాలుగో టెస్టు (సిడ్నీ) ►జనవరి 12: భారత్ గీ ఆస్ట్రేలియా, తొలి వన్డే (సిడ్నీ) ►జనవరి 15: భారత్ గీ ఆస్ట్రేలియా, రెండో వన్డే (అడిలైడ్) ►జనవరి 18: భారత్ గీ ఆస్ట్రేలియా, మూడో వన్డే (మెల్బోర్న్) ►జనవరి 23: భారత్ గీ న్యూజిలాండ్, తొలి వన్డే (నేపియర్) ►జనవరి 26: భారత్ గీ న్యూజిలాండ్, రెండో వన్డే (మౌంట్ మాంగనీ) ►జనవరి 28: భారత్ గీ న్యూజిలాండ్, మూడో వన్డే (మౌంట్ మాంగనీ) ►జనవరి 31: భారత్ గీ న్యూజిలాండ్, నాలుగో వన్డే (హామిల్టన్) ►ఫిబ్రవరి 3: భారత్ గీ న్యూజిలాండ్, ఐదో వన్డే (వెల్లింగ్టన్) ►ఫిబ్రవరి 6: భారత్ గీ న్యూజిలాండ్, తొలి టి20 (వెల్లింగ్టన్) ►ఫిబ్రవరి 8: భారత్ గీ న్యూజిలాండ్, రెండో టి20 (ఆక్లాండ్) ►ఫిబ్రవరి 10: భారత్ గీ న్యూజిలాండ్, మూడో టి20 (హామిల్టన్) ►ఫిబ్రవరి 24: భారత్ గీ ఆస్ట్రేలియా,తొలి వన్డే (మొహాలి) ►ఫిబ్రవరి 27: భారత్ గీ ఆస్ట్రేలియా, రెండో వన్డే (హైదరాబాద్) ►మార్చి 2: భారత్ గీ ఆస్ట్రేలియా, మూడో వన్డే (నాగ్పూర్) ►మార్చి 5: భారత్ గీ ఆస్ట్రేలియా, నాలుగో వన్డే (ఢిల్లీ) ►మార్చి 8: భారత్ గీ ఆస్ట్రేలియా, ఐదో వన్డే (రాంచీ) ►మార్చి 10: భారత్ గీ ఆస్ట్రేలియా, తొలి టి20 (బెంగళూరు) ►మార్చి 13: భారత్ గీ ఆస్ట్రేలియా, రెండో టి20 (వైజాగ్) ►మార్చి–ఏప్రిల్: భారత్లో జింబాబ్వే పర్యటన (టెస్టు, మూడు వన్డేలు) ►జూలై–ఆగస్టు: వెస్టిండీస్లో భారత్ పర్యటన (2 టెస్టులు, 3 వన్డేలు, 3 టి20లు) ►అక్టోబర్: భారత్లో దక్షిణాఫ్రికా పర్యటన (3 టెస్టులు) ►నవంబర్: భారత్లో బంగ్లాదేశ్ పర్యటన (2 టెస్టులు, 3 టి20లు) ►డిసెంబర్: భారత్లో వెస్టిండీస్ పర్యటన (3 వన్డేలు, 3 టి20లు) బ్యాడ్మింటన్ ►జనవరి 13: పీబీఎల్ ఫైనల్ (బెంగళూరు) ►జనవరి 15–20: మలేసియా మాస్టర్స్ వరల్డ్ టూర్ సూపర్–500 టోర్నీ (కౌలాలంపూర్) ►జనవరి 22–27: ఇండోనేసియా మాస్టర్స్ వరల్డ్ టూర్ సూపర్–500 టోర్నీ (జకార్తా) ►మార్చి 6–10: ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ వరల్డ్ టూర్ ►సూపర్–1000 టోర్నీ (బర్మింగ్హామ్) ►మార్చి 26–31: ఇండియా ఓపెన్ వరల్డ్ టూర్ ►సూపర్–500 టోర్నీ (న్యూఢిల్లీ) ఏప్రిల్ 2–7: మలేసియా ఓపెన్ వరల్డ్ టూర్ ►సూపర్–750 టోర్నీ (కౌలాలంపూర్) ►ఏప్రిల్ 9–14: సింగపూర్ ఓపెన్ వరల్డ్ టూర్ ►సూపర్–500 టోర్నీ (సింగపూర్) ►మే 19–26: సుదిర్మన్ కప్ ►(గ్రేడ్–1 టీమ్ టోర్నీ; నానింగ్, చైనా) ►జూలై 16–21: ఇండోనేసియా ఓపెన్ వరల్డ్ టూర్ ►సూపర్–1000 టోర్నీ (జకార్తా) ►జూలై 23–28: జపాన్ ఓపెన్ వరల్డ్ టూర్ ►సూపర్–750 టోర్నీ (టోక్యో) ►జూలై 30–ఆగస్టు 4: థాయ్లాండ్ ఓపెన్ వరల్డ్ టూర్ ►సూపర్–500 టోర్నీ (బ్యాంకాక్) ►ఆగస్టు 19–25: ప్రపంచ చాంపియన్షిప్ ►(గ్రేడ్–1 టోర్నీ; బాసెల్, స్విట్జర్లాండ్) ►సెప్టెంబర్ 17–22: చైనా ఓపెన్ వరల్డ్ టూర్ ►సూపర్–1000 టోర్నీ (చాంగ్జౌ) ►సెప్టెంబర్ 24–29: కొరియా ఓపెన్ వరల్డ్ టూర్ ►సూపర్–500 టోర్నీ (సియోల్) ►అక్టోబర్ 15–20: డెన్మార్క్ ఓపెన్ వరల్డ్ టూర్ ►సూపర్–750 టోర్నీ (ఒడెన్స్) ►అక్టోబర్ 22–27: ఫ్రెంచ్ ఓపెన్ వరల్డ్ టూర్ ►సూపర్–750 టోర్నీ (పారిస్) ►నవంబర్ 12–17: హాంకాంగ్ ఓపెన్ వరల్డ్ టూర్ ►సూపర్–500 టోర్నీ (హాంకా>ంగ్) ►నవంబర్ 5–10: చైనా ఓపెన్ వరల్డ్ టూర్ ►సూపర్–750 టోర్నీ (ఫుజౌ) ►డిసెంబర్ 11–15: వరల్డ్ టూర్ ఫైనల్స్ టోర్నీ (గ్వాంగ్జౌ) టెన్నిస్ ►జనవరి 14–27: ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్స్లామ్ టోర్నీ ►ఫిబ్రవరి 1–2: డేవిస్ కప్ ►క్వాలిఫయర్స్ ►మార్చి 3–17: ఇండియన్ వెల్స్ మాస్టర్స్ ►సిరీస్–1000 టోర్నీ ►మార్చి 20–31: మయామి ఓపెన్ మాస్టర్స్ ►సిరీస్–1000 టోర్నీ ►ఏప్రిల్ 4–5: డేవిస్ కప్ గ్రూప్–2 మ్యాచ్లు ►ఏప్రిల్ 14–21: మోంటెకార్లో ఓపెన్ ►మాస్టర్స్ సిరీస్–1000 టోర్నీ ►మే 5–12: మాడ్రిడ్ ఓపెన్ మాస్టర్స్ సిరీస్–1000 టోర్నీ ►మే 12–19: రోమ్ ఓపెన్ మాస్టర్స్ సిరీస్–1000 టోర్నీ ►మే 26–జూన్ 9: ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్స్లామ్ టోర్నీ ►జూలై 1–14: వింబుల్డన్ గ్రాండ్స్లామ్ టెన్నిస్ టోర్నీ ►ఆగస్టు 5–11: మాంట్రియల్ ఓపెన్ మాస్టర్స్ సిరీస్–1000 టోర్నీ ►ఆగస్టు 11–18: సిన్సినాటి ఓపెన్ మాస్టర్స్ సిరీస్–1000 టోర్నీ ►ఆగస్టు 26–సెప్టెంబర్ 8: యూఎస్ ఓపెన్ గ్రాండ్స్లామ్ టోర్నీ ►సెప్టెంబర్ 13–15: డేవిస్ కప్ గ్రూప్–1, 2 మ్యాచ్లు ►అక్టోబర్ 6–13: షాంఘై ఓపెన్ మాస్టర్స్ సిరీస్–1000 టోర్నీ ►అక్టోబర్ 28–నవంబర్ 3: పారిస్ ఓపెన్ మాస్టర్స్ సిరీస్–1000 టోర్నీ ►నవంబర్ 10–17: ఏటీపీ ఫైనల్స్ (సీజన్ ముగింపు టోర్నీ) ►నవంబర్ 18–24: డేవిస్ కప్ ఫైనల్ ఫార్ములావన్ ►మార్చి 17: ఆస్ట్రేలియా ►గ్రాండ్ప్రి (మెల్బోర్న్) ►మార్చి 31: బహ్రెయిన్ గ్రాండ్ప్రి (సాఖిర్) ►ఏప్రిల్ 14: చైనా గ్రాండ్ప్రి (షాంఘై) ►ఏప్రిల్ 28: అజర్బైజాన్ గ్రాండ్ప్రి (బాకు) ►మే 12: స్పెయిన్ గ్రాండ్ప్రి (బార్సిలోనా) ►మే 26: మొనాకో గ్రాండ్ప్రి (మోంటెకార్లో) ►జూన్ 9: కెనడా గ్రాండ్ప్రి (మాంట్రియల్) ►జూన్ 23: ఫ్రెంచ్ గ్రాండ్ప్రి (మార్సెలి) ►జూన్ 30: ఆస్ట్రియా గ్రాండ్ప్రి (స్పీల్బెర్గ్) ►జూలై 14: బ్రిటిష్ గ్రాండ్ప్రి (సిల్వర్స్టోన్) ►జూలై 28: జర్మనీ గ్రాండ్ప్రి (హాకెన్హీమ్) ►ఆగస్టు 4: హంగేరి గ్రాండ్ప్రి (బుడాపెస్ట్) ►సెప్టెంబర్ 1: బెల్జియం గ్రాండ్ప్రి (స్పా ఫ్రాంకోర్చాంప్స్) ►సెప్టెంబర్ 8: ఇటలీ గ్రాండ్ప్రి (మోంజా) ►సెప్టెంబర్ 22: సింగపూర్ గ్రాండ్ప్రి (సింగపూర్ సిటీ) ►సెప్టెంబర్ 29: రష్యా గ్రాండ్ప్రి (సోచి) ►అక్టోబర్ 13: జపాన్ గ్రాండ్ప్రి (సుజుకా) ►అక్టోబర్ 27: మెక్సికో గ్రాండ్ప్రి (మెక్సికో సిటీ) ►నవంబర్ 3: యూఎస్ గ్రాండ్ప్రి (టెక్సాస్) ►నవంబర్ 17: బ్రెజిల్ గ్రాండ్ప్రి (సావోపాలో) ►డిసెంబర్ 1: అబుదాబి గ్రాండ్ప్రి (అబుదాబి) చెస్ ►జనవరి 9–16: ఢిల్లీ ఓపెన్ గ్రాండ్మాస్టర్స్ టోర్నీ ►ఏప్రిల్ 1–10: ఆసియా యూత్ చాంపియన్షిప్ (శ్రీలంక) ►సెప్టెంబర్ 9–అక్టోబర్ 2: వరల్డ్ కప్ ►అక్టోబర్ 1–13: ప్రపంచ యూత్ చాంపియన్షిప్ (నాగ్పూర్) ►అక్టోబర్ 14–26: ప్రపంచ జూనియర్ అండర్–20 చాంపియన్షిప్ (న్యూఢిల్లీ) ఆర్చరీ ►ఏప్రిల్ 22–28: వరల్డ్ కప్ స్టేజ్–1 (కొలంబియా) ►మే 6–12: వరల్డ్ కప్ స్టేజ్–2 (చైనా) ►మే 20–26: వరల్డ్ కప్ స్టేజ్–3 (టర్కీ) ►జూన్ 10–16: ప్రపంచ చాంపియన్షిప్ (నెదర్లాండ్స్) ►జూలై 1–7: వరల్డ్ కప్ స్టేజ్–4 (జర్మనీ) హాకీ ►జూన్ 6–16: అంతర్జాతీయ హాకీ సమాఖ్య పురుషుల సిరీస్ ఫైనల్ టోర్నీ (భారత్) ►జూన్ 15–23: అంతర్జాతీయ హాకీ సమాఖ్య ►(ఎఫ్ఐహెచ్) మహిళల సిరీస్ ఫైనల్ టోర్నీ (జపాన్) ఫుట్బాల్ ►జనవరి 5–ఫిబ్రవరి 1: ►ఆసియా కప్ (యూఏఈ) ►మే 23–జూన్ 15: వరల్డ్ కప్ అండర్–20 టోర్నీ (పోలాండ్) ►జూన్ 7–జూలై 7: మహిళల వరల్డ్ కప్ (ఫ్రాన్స్) ►జూన్ 14–జూలై 7: కోపా అమెరికా కప్ (బ్రెజిల్) ►జూన్ 15–జూలై 13: ఆఫ్రికా నేషన్స్ కప్ (కామెరూన్) ►అక్టోబర్ 5–27: వరల్డ్ కప్ అండర్–17 టోర్నీ (పెరూ) అథ్లెటిక్స్ జనవరి 20: ముంబై మారథాన్ ►మార్చి 17: ఆసియా రేస్ వాకింగ్ చాంపియన్షిప్ (జపాన్) ►మార్చి 30: వరల్డ్ క్రాస్కంట్రీ చాంపియన్షిప్ (డెన్మార్క్) ►ఏప్రిల్ 15: బోస్టన్ మారథాన్ ►ఏప్రిల్ 28: లండన్ మారథాన్ ►మే 3: డైమండ్ లీగ్ మీట్–1 (దోహా) ►మే 18: డైమండ్ లీగ్ మీట్–2 (షాంఘై) ►మే 30: డైమండ్ లీగ్ మీట్–3 (స్టాక్హోమ్) ►జూన్ 6: డైమండ్ లీగ్ మీట్–4 (రోమ్) ►జూన్ 13: డైమండ్ లీగ్ మీట్–5 (ఓస్లో) ►జూన్ 16: డైమండ్ లీగ్ మీట్–6 (మొరాకో) ►జూన్ 30: డైమండ్ లీగ్ మీట్–7 (అమెరికా) ►జూలై 5: డైమండ్ లీగ్ మీట్–8 (స్విట్జర్లాండ్) ►జూలై 12: డైమండ్ లీగ్ మీట్–9 (మొనాకో) ►జూలై 20: డైమండ్ లీగ్ మీట్–10 (లండన్) ►ఆగస్టు 18: డైమండ్ లీగ్ మీట్–11 (బర్మింగ్హామ్) ►ఆగస్టు 24: డైమండ్ లీగ్ మీట్–12 (పారిస్) ►ఆగస్టు 29: డైమండ్ లీగ్ మీట్–13 (జ్యూరిక్) ►సెప్టెంబర్ 6: డైమండ్ లీగ్ మీట్–14 (బెల్జియం) ►సెప్టెంబర్ 27–అక్టోబర్ 6: ప్రపంచ చాంపియన్షిప్ (దోహా) టేబుల్ టెన్నిస్ ►ఏప్రిల్ 5–7: ►ఆసియా కప్ (జపాన్) ►ఏప్రిల్ 21–28: ప్రపంచ సీనియర్ వ్యక్తిగత చాంపియన్షిప్ (హంగేరి) ►సెప్టెంబర్ 2–7: ఆసియా జూనియర్ ►చాంపియన్షిప్ (మంగోలియా) ►సెప్టెంబర్ 17–22: ఆసియా ►సీనియర్ చాంపియన్షిప్ (ఇండోనేసియా) ►నవంబర్ 24–డిసెంబర్ 1: ప్రపంచ జూనియర్ ►చాంపియన్షిప్ (థాయ్లాండ్) రెజ్లింగ్ ►జనవరి 23–26: ►డేవ్ షుల్జ్ స్మారక టోర్నీ (కొలరాడో స్ప్రింగ్స్, అమెరికా) ►ఏప్రిల్ 23–28: ఆసియా సీనియర్ చాంపియన్షిప్ (చైనా) ►జూలై 9–14: ఆసియా జూనియర్ చాంపియన్షిప్ (లెబనాన్) ►ఆగస్టు 12–18: ప్రపంచ జూనియర్ చాంపియన్షిప్ (ఎస్తోనియా) ►సెప్టెంబర్ 14–22: ప్రపంచ సీనియర్ చాంపియన్షిప్ (కజకిస్తాన్) ►అక్టోబర్ 28–నవంబర్ 3: ప్రపంచ అండర్–23 చాంపియన్షిప్ (హంగేరి) వెయిట్లిఫ్టింగ్ ►మార్చి 8–15: ప్రపంచ యూత్ చాంపియన్షిప్ (అమెరికా) ►ఏప్రిల్ 20–30: ఆసియా చాంపియన్షిప్ (చైనా) ►జూన్ 1–8: ప్రపంచ జూనియర్ చాంపియన్షిప్ (ఫిజీ) ►జూలై 9–14: కామన్వెల్త్ జూనియర్, యూత్, సీనియర్ చాంపియన్షిప్ (సమోవా) ►సెప్టెంబర్ 18–27: ప్రపంచ సీనియర్ చాంపియన్షిప్ (థాయ్లాండ్) ►అక్టోబర్ 20–27: ఆసియా జూనియర్, యూత్ చాంపియన్షిప్ (ఉత్తర కొరియా) షూటింగ్ ►ఫిబ్రవరి 20–28: వరల్డ్ కప్ రైఫిల్, స్టల్ (న్యూఢిల్లీ) ►మార్చి 15–26: వరల్డ్ కప్ షాట్గన్ (మెక్సికో) ►ఏప్రిల్ 5–16: వరల్డ్ కప్ షాట్గన్ (యూఏఈ) ►ఏప్రిల్ 21–29: వరల్డ్ కప్ రైఫిల్, పిస్టల్ (చైనా) ►మే 7–18: వరల్డ్ కప్ షాట్గన్ (కొరియా) ►మే 24–31: వరల్డ్ కప్ రైఫిల్, పిస్టల్ (జర్మనీ) ►జూన్ 30–జూలై 10: ప్రపంచ షాట్గన్ చాంపియన్షిప్ (ఇటలీ) ►ఆగస్టు 13–23: వరల్డ్ కప్ షాట్గన్ (ఫిన్లాండ్) ►ఆగస్టు 26–సెప్టెంబర్ 3: వరల్డ్ కప్ రైఫిల్, పిస్టల్ (బ్రెజిల్) ►అక్టోబర్ 8–15: వరల్డ్ కప్ ఫైనల్స్ షాట్గన్ (యూఏఈ) -
ఆసియా చెస్ చాంప్ పద్మిని
మకాటి (ఫిలిప్పీన్స్): అజేయ ప్రదర్శనతో భారత చెస్ అంతర్జాతీయ మాస్టర్ (ఐఎం) క్రీడాకారిణి పద్మిని రౌత్ ఆసియా చాంపియన్గా అవతరించింది. నిర్ణీత తొమ్మిది రౌండ్లపాటు జరిగిన ఈ టోర్నీలో పద్మిని మొత్తం ఏడు పాయింట్లు సాధించి కియాన్యున్ గాంగ్ (సింగపూర్)తో కలిసి సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచింది. అయితే మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా ర్యాంకింగ్ను వర్గీకరించగా పద్మినికి టైటిల్ లభించింది. కియాన్యున్ గాంగ్ రన్నరప్గా నిలిచింది. ఒడిశాకు చెందిన 24 ఏళ్ల పద్మిని ఐదు గేముల్లో గెలిచి, నాలుగు గేమ్లను ‘డ్రా’ చేసుకుంది. ఓపెన్ విభాగంలో భారత ఆటగాళ్లకు నిరాశ ఎదురైంది. సూర్యశేఖర గంగూలీ నాలుగో స్థానంలో నిలువగా... ఆంధ్రప్రదేశ్ గ్రాండ్మాస్టర్ ఎం.ఆర్.లలిత్ బాబు ఎనిమిదో స్థానంతో సంతృప్తి పడ్డాడు. తాజా ఘనతతో పద్మిని... 37 ఏళ్ల చరిత్ర కలిగిన ఆసియా చెస్ చాంపియన్షిప్లో మహిళల విభాగంలో విజేతగా నిలిచిన ఎనిమిదో భారతీయ క్రీడాకారిణిగా గుర్తింపు పొందింది. గతంలో రోహిణి ఖాదిల్కర్ (1981, 1983), అనుపమ గోఖలే (1985, 1987) రెండేసి సార్లు ఈ టైటిల్ నెగ్గగా... భాగ్యశ్రీ థిప్సే (1991), కోనేరు హంపి (2003), తానియా సచ్దేవ్ (2007), ద్రోణవల్లి హారిక (2011), భక్తి కులకర్ణి (2016) ఆసియా చాంపియన్స్గా నిలిచారు. -
రజతం నెగ్గిన అర్జున్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ తొలి గ్రాండ్మాస్టర్ (జీఎం) ఎరిగైసి అర్జున్ మరోసారి అంతర్జాతీయ వేదికపై సత్తా చాటుకున్నాడు. టర్కీలో ఆదివారం ముగిసిన ప్రపంచ యూత్ అండర్–16 చెస్ ఒలింపియాడ్లో టీమ్, వ్యక్తిగత విభాగాల్లో రజత పతకాలు సొంతం చేసుకున్నాడు. అర్జున్, ఇనియన్ పనీర్సెల్వం, సంకల్ప్ గుప్తా, కౌస్తవ్ చటర్జీ, దివ్య దేశ్ముఖ్లతో కూడిన భారత బృందం ఈ మెగా ఈవెంట్లో రన్నరప్గా నిలిచింది. నిర్ణీత తొమ్మిది రౌండ్ల తర్వాత భారత జట్టు 14 పాయింట్లతో రెండో స్థానాన్ని సంపాదించింది. భారత్ ఏడు మ్యాచ్ల్లో గెలిచి, రెండింటిలో ఓడిపోయింది. స్లొవేనియా ‘ఎ’, టర్కీ, ఉక్రెయిన్, అర్మేనియా, రష్యా, అజర్బైజాన్, ఇరాన్లపై నెగ్గిన భారత బృందం... బెలారస్, ఉజ్బెకిస్తాన్ జట్ల చేతుల్లో ఓడిపోయింది. 16 పాయింట్లతో ఉజ్బెకిస్తాన్ టైటిల్ సొంతం చేసుకోగా... 13 పాయింట్లతో చైనా మూడో స్థానాన్ని పొందింది. వ్యక్తిగతంగా టాప్ బోర్డు–1లో ఆడిన 15 ఏళ్ల అర్జున్ తొమ్మిది గేమ్ల ద్వారా ఏడు పాయింట్లు సంపాదించి రెండో స్థానంలో నిలిచి రజత పతకాన్ని దక్కించుకున్నాడు. వరంగల్కు చెందిన అర్జున్ ఆడిన తొమ్మిది గేముల్లో ఐదింటిలో గెలిచి, నాలుగింటిని ‘డ్రా’గా ముగించాడు. అలీరెజా (ఇరాన్–8 పాయింట్లు) స్వర్ణం, నికోలజ్ (జార్జియా) కాంస్యం కైవసం చేసుకున్నారు. -
మెరిసిన హరికృష్ణ
సాక్షి, హైదరాబాద్: పలువురు మేటి క్రీడాకారులు పాల్గొన్న చైనా చెస్ లీగ్లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్మాస్టర్, భారత స్టార్ చెస్ ప్లేయర్ పెంటేల హరికృష్ణ అదరగొట్టాడు. చైనాలోని షెన్జెన్ నగరంలో ముగిసిన ఈ లీగ్లో హరికృష్ణ సభ్యుడిగా ఉన్న షాంఘై చెస్ క్లబ్ ఓవరాల్ చాంపియన్గా నిలిచి టైటిల్ను సొంతం చేసుకోవడం విశేషం. హరికృష్ణకు ఓవరాల్గా ఉత్తమ ప్లేయర్ పురస్కారంతోపాటు ఉత్తమ విదేశీ ప్లేయర్ అవార్డు కూడా లభించాయి. 12 జట్ల మధ్య 22 రౌండ్లపాటు జరిగిన ఈ లీగ్లో షాంఘై క్లబ్ 38 పాయింట్లతో అగ్రస్థానాన్ని దక్కించుకుంది. 17 మ్యాచ్ల్లో గెలిచిన షాంఘై జట్టు నాలుగు మ్యాచ్లను ‘డ్రా’ చేసుకొని, మరో మ్యాచ్లో ఓడిపోయింది. ఈ లీగ్లో విజయానికి రెండు పాయింట్లు, ‘డ్రా’ చేసుకుంటే ఒక పాయింట్ కేటాయించారు. హరికృష్ణ మొత్తం 19 గేమ్లు ఆడి 16.5 పాయింట్లు సాధించాడు. 14 గేముల్లో గెలిచిన అతను, ఐదు గేమ్లను ‘డ్రా’ చేసుకున్నాడు. షాంఘై జట్టులో హరికృష్ణతోపాటు ఆంధ్రప్రదేశ్కే చెందిన మరో గ్రాండ్మాస్టర్ ద్రోణవల్లి హారిక, మత్లకోవ్ మాక్సిమ్ (రష్యా), వాంగ్ పిన్, ని షికిన్, జు వెన్జున్, లూ యిపింగ్, జు యి, ని హువా (చైనా) సభ్యులుగా ఉన్నారు. -
శభాష్... హర్ష
నిరీక్షణ ముగిసింది. హైదరాబాద్ చెస్ క్రీడాకారుడు హర్ష భరతకోటి అనుకున్నది సాధించాడు. భారత్ నుంచి 56వ గ్రాండ్మాస్టర్ (జీఎం)గా అవతరించాడు. ఎరిగైసి అర్జున్ తర్వాత తెలంగాణ నుంచి ఈ ఘనత సాధించిన రెండో ప్లేయర్గా గుర్తింపు పొందాడు. ఆగస్టులో అబుదాబి మాస్టర్స్ టోర్నీలో హర్ష మూడో జీఎం నార్మ్ సంపాదించినా... జీఎం హోదా ఖాయం కావడానికి అవసరమైన 2500 రేటింగ్ పాయింట్లు ఆ సమయానికి అతని ఖాతాలో లేకపోవడంతో జీఎం టైటిల్ రాలేదు. ఆ తర్వాత ప్రపంచ జూనియర్ చాంపియన్షిప్లో తొమ్మిదో స్థానంలో నిలిచిన హర్ష తన రేటింగ్ పాయింట్లను 2492కు పెంచుకున్నాడు. తాజాగా గుజరాత్ ఓపెన్ అంతర్జాతీయ గ్రాండ్మాస్టర్స్ టోర్నీలో హర్ష వరుసగా నాలుగో విజయం సాధించి మరో 8 రేటింగ్ పాయింట్లు సంపాదించాడు. ఈ క్రమంలో జీఎం టైటిల్ ఖరారు కావడానికి అవసరమైన 2500 పాయింట్ల మైలురాయి దాటి తన స్వప్నాన్ని సాకారం చేసుకున్నాడు. సాక్షి, హైదరాబాద్: చెస్ను కెరీర్గా ఎంచుకున్న వారందరూ ఏనాటికైనా గ్రాండ్మాస్టర్ (జీఎం) కావాలని లక్ష్యంగా పెట్టుకుంటారు. అయితే మేధో క్రీడ అయిన చెస్లో ఈ ఘనత సాధించడానికి ఎంతో కష్టపడాల్సి ఉంటుంది. ఎన్నో ప్రతికూలతలు ఉన్నా... కష్టాన్ని ఇష్టంగా మలచుకుంటే ఏదీ అసాధ్యం కాదు. కాస్త ఆలస్యమైనా అనుకున్న లక్ష్యాన్ని అందుకుంటాం. హైదరాబాద్ చెస్ ప్లేయర్ హర్ష భరతకోటి విషయంలో అదే జరిగింది. గత ఆగస్టులోనే జీఎం హోదా దక్కాల్సినా... అవసరమైన రేటింగ్ పాయింట్లు లేకపోవడంతో ఈ ఘనత అందుకోలేకపోయాడు. అయితేనేం తన ఆటతీరుకు మరింత పదునుపెట్టి... తనకంటే మేటి ఆటగాళ్లను మట్టికరిపించి... రెండు నెలల వ్యవధిలోనే 2500 మైలురాయిని అందుకున్నాడు. గ్రాండ్మాస్టర్ (జీఎం) అయ్యాడు. అహ్మదాబాద్లో జరుగుతున్న గుజరాత్ ఓపెన్ అంతర్జాతీయ గ్రాండ్మాస్టర్స్ టోర్నమెంట్లో 18 ఏళ్ల హర్ష వరుసగా నాలుగో విజయం సాధించాడు. తజకిస్తాన్ గ్రాండ్మాస్టర్, 2651 రేటింగ్ ఉన్న ఫారూఖ్ అమనతోవ్తో జరిగిన గేమ్లో నల్లపావులతో ఆడుతూ 32 ఎత్తుల్లో గెలిచి సంచలనం సృష్టించాడు. అంతకుముందు హర్ష మూడో రౌండ్లో పరాబ్ రిత్విజ్ (భారత్)పై 48 ఎత్తుల్లో... రెండో రౌండ్లో రక్షిత రవి (భారత్)పై 32 ఎత్తుల్లో... తొలి రౌండ్లో చంద్రేయి హజ్రాపై గెలిచాడు. నాలుగో రౌండ్ తర్వాత హర్ష నాలుగు పాయింట్లతో మరో ఐదుగురితో కలిసి సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్నాడు. ఒక్కో మెట్టు ఎక్కుతూ... తొమ్మిదేళ్ల ప్రాయంలో చెస్ ఆడటం ప్రారంభించిన హర్ష రెండేళ్లు తిరిగేలోపు జాతీయ జూనియర్ చాంపియన్షిప్లో కాంస్య పతకం సాధించాడు. కోచ్ ఎన్వీఎస్ రామరాజు వద్ద శిక్షణ తీసుకుంటున్న హర్ష క్రమం తప్పకుండా తన ఆటతీరుకు మెరుగులు దిద్దుకున్నాడు. అటాకింగ్ గేమ్ను ఇష్టపడే ఈ హైదరాబాద్ అబ్బాయి గేమ్ పరిస్థితిని బట్టి వెంటవెంటనే వ్యూహాలు మార్చి ఫలితాన్ని తారుమారు చేయగల సమర్థుడు. ఏడేళ్లుగా చెస్లో ఉన్న హర్ష ఇప్పటివరకు 25 మంది కంటే ఎక్కువ మంది గ్రాండ్మాస్టర్లను ఓడించాడు. 2017 అక్టోబరులో ‘ఐల్ ఆఫ్ మ్యాన్’ టోర్నీలో తొలి జీఎం నార్మ్ పొందిన హర్ష... ఈ ఏడాది ఏప్రిల్లో జరిగిన దుబాయ్ ఓపెన్లో రెండో జీఎం నార్మ్... ఆగస్టులో అబుదాబి మాస్టర్స్ టోర్నీలో మూడో జీఎం నార్మ్ సంపాదించాడు. హర్ష భరతకోటి ముఖ్య విజయాలు ∙2011: జాతీయ జూనియర్ చాంపియన్షిప్లో కాంస్యం. ∙2012: ఆసియా జూనియర్ చాంపియన్షిప్ అండర్–12 ర్యాపిడ్ విభాగంలో స్వర్ణం. ∙2012: కామన్వెల్త్ చాంపియన్షిప్ అండర్–12 విభాగంలో స్వర్ణం. ∙2013: జాతీయ జూనియర్ అండర్–13 చాంపియన్షిప్లో స్వర్ణం. 2014: ఆసియా యూత్ చాంపియన్షిప్లో రజతం ∙2016: ఆసియా యూత్ చాంపియన్షిప్లో కాంస్యం ∙2017: జాతీయ జూనియర్ చాంపియన్షిప్లో స్వర్ణం ∙2017: ఆసియా జూనియర్ చాంపియన్షిప్లో బ్లిట్జ్ విభాగంలో రజతం ∙2017: ‘ఐల్ ఆఫ్ మ్యాన్’ టోర్నీలో తొలి జీఎం నార్మ్ ∙2018: కఠ్మాండూ ఓపెన్లో స్వర్ణం ∙ 2018: దుబాయ్ ఓపెన్లో రెండో జీఎం నార్మ్ ∙2018: అబుదాబి మాస్టర్స్ టోర్నీలో మూడో జీఎం నార్మ్. ‘గ్రాండ్మాస్టర్ అయినందుకు చాలా ఆనందంగా ఉంది. నా కలను సాకారం చేసుకునేందుకు పదేళ్లుగా శ్రమిస్తున్నాను. నేనీస్థాయికి చేరుకోవడం వెనుక కోచ్ ఎన్వీఎస్ రామరాజు కృషి ఎంతో ఉంది. ఆటపరంగానూ, ఆర్థికంగానూ ఆయన నాకెంతో సహాయం చేశారు. జీఎం లక్ష్యం నెరవేరడంతో మున్ముందు నా రేటింగ్ను మరింత పెంచుకుంటాను. 2700 రేటింగ్ను అందుకోవడమే లక్ష్యంగా ముందుకు సాగుతాను. ఈ క్రమంలో ఎవరైనా స్పాన్సర్లు ఆర్థికంగా అండగా నిలవాలని కోరుకుంటున్నాను.’ – ‘సాక్షి’తో హర్ష -
భారత జట్ల శుభారంభం
బటూమి (జార్జియా): ప్రతిష్టాత్మక చెస్ ఒలింపియాడ్లో భారత పురుషుల, మహిళల జట్లు శుభారంభం చేశాయి. సోమవారం జరిగిన తొలి రౌండ్లో భారత పురుషుల జట్టు 3.5–0.5తో ఎల్ సాల్వడార్ జట్టుపై... భారత మహిళల జట్టు 4–0తో న్యూజిలాండ్పై విజయం సాధించాయి. తొలి మ్యాచ్లో విశ్వనాథన్ ఆనంద్, ద్రోణవల్లి హారికలకు విశ్రాంతి ఇచ్చారు. పురుషుల జట్టు తరఫున పెంటేల హరికృష్ణ 33 ఎత్తుల్లో జార్జి ఎర్నెస్టో గిరోన్పై, విదిత్ 23 ఎత్తుల్లో రికార్డో చావెజ్పై, ఆధిబన్ 30 ఎత్తుల్లో డానియల్ ఎరియాస్పై నెగ్గగా... కార్లోస్ బర్గోస్తో జరిగిన గేమ్ను శశికిరణ్ 52 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకున్నాడు. మహిళల జట్టు తరఫున కోనేరు హంపి 36 ఎత్తుల్లో హెలెన్ మిలిగన్పై, తానియా సచ్దేవ్ 67 ఎత్తుల్లో వ్యాన్లా పున్సాలన్పై, ఇషా కరవాడే 37 ఎత్తుల్లో జాస్మిన్ జాంగ్పై, పద్మిని రౌత్ 36 ఎత్తుల్లో నికోల్ కిన్పై గెలిచారు. ఈ విజయాలతో భారత జట్లకు రెండేసి పాయింట్లు లభించాయి. -
అమ్మ బహుమతే ప్రపంచ స్థాయికి ప్రేరణ
చిత్తూరు, తిరుపతి సిటీ :ఎనిమిదేళ్ల ప్రాయంలో ఆ బాలుడికి తల్లి ఇచ్చిన పుట్టినరోజు బహుమతి ప్రపంచ స్థాయి క్రీడాకారునిగా ఎదిగేందుకు ప్రేరణ కలిగింది. ఆ ప్రేరణతోనే తిరుపతికి చెందిన 19 ఏళ్ల కార్తీక్ వెంకట్రామన్ చెస్ ఆటలో ‘గ్రాండ్ మాస్టర్’ (2,520 రేటింగ్) స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. మరో ఏడాది లోపు ‘సూపర్ గ్రాండ్ మాస్టర్’ రేటింగ్ తెచ్చుకోవాలన్నదే తన ముందున్న లక్ష్యమని తన మనసులోని మాటను చెప్పుకొచ్చాడు. చెస్ ఆటలో ఊహకందని ఎత్తులు వేస్తూ.. తనకంటే మెరుగైన బ్లిడ్జ్, ర్యాపిడ్, క్లాసికల్ విభాగాల్లో ఉన్న ఆటగాళ్లను చిత్తుచేస్తూ విజయాలను సొంతం చేసుకుంటూ వచ్చాడు. తాజాగా ఈ నెల 4 నుంచి 16వ తేది వరకు టర్కీలో జరిగిన చెస్ ప్రపంచ స్థాయి జూనియర్ చాంపియన్ షిప్ పోటీల్లో పాల్గొని 4వ గ్రాండ్ మాస్టర్ స్థానం దక్కించుకున్నాడు. ప్రస్తుతం తిరుపతిలోని ఒక ప్రయివేట్ డిగ్రీ కళాశాలలో బీకాం ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. కార్తీక్ వెంకట్రామన్ ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలు వెల్లడించాడు. సాక్షి : మీ కుటుంబ నేపథ్యమేంటి..? కార్తీక్ : మా తల్లిదండ్రులు ప్రవీణకుమారి, వెంకట్రామన్ పాకాల మండల కేంద్రంలోని సత్యమ్మగుడి వీధిలో నానమ్మ, తాతయ్యతో కలసి ఉండేవారు. అమ్మానాన్న మా చదువుల కోసం తిరుపతికి వచ్చి స్థిరపడ్డారు. నాన్న విజయభారతి టీవీఎస్ షోరూం, విజయభారతి టాటా కార్ల షోరూం అధినేతగా ఉన్నారు. అమ్మ గృహిణి. చెల్లాయి అనూష 10వ తరగతి చదువుతోంది. సాక్షి : చెస్ ఆటలో మీకు ప్రేరణ ఎవరు..? కార్తీక్ : నాకు ఏనిమిదేళ్ల వయసు వరకు చెస్ ఆటంటేనే తెలియదు. అమ్మ తన భర్తడే గిఫ్ట్గా చెస్ బోర్డును ఇచ్చింది. గేమ్ నియమనిబంధనలు చెప్పింది. అప్పట్నుంచి చెస్పై మక్కువ పెంచుకున్నా. సాక్షి : ఆ తర్వాత చెస్ ఆటలో ఎవరి వద్ద శిక్షణ తీసుకున్నారు..? కార్తీక్ :చెస్పై నాకున్న ఇంట్రస్ట్ చూసి నాన్న మొదట చెస్ సీనియర్ కోచ్ ఇంజం శివకేశవులు వద్ద కొన్ని నెలల పాటు శిక్షణ ఇప్పించారు. అనంతరం నవీన్ అనే కోచ్ చెస్ ఆటలో మెళకువలు నేర్పించి ప్రొత్సహించారు. తదుపరి మరింత మెరుగైన శిక్షణ కోసం వైజాగ్ నుంచి పి.రామకృష్ణ అనే కోచ్ను పిలిపించి 15 రోజుల పాటు శిక్షణ ఇప్పించారు నాన్న. ఆ తరువాత నేనే ఆటలోని మెళకువలను నేర్చుకుంటూ స్కూల్ గేమ్స్ స్థాయిలోనే చెస్ టోర్నమెంట్లకు వెళ్లేవాడిని. 5వ తరగతిలోనే టోర్నమెంట్లకు వెళుతూ 1606 ఇంటర్నేషనల్ ర్యాంకింగ్ తెచ్చుకున్నా. 7, 8, 9 తరగతుల సమయంలో చెస్ ఆటపైనే పూర్తిగా ఫోకస్ పెట్టా. ఆ సమయంలో రాష్ట్ర స్థాయి పోటీలకు వెళ్లి 1950 ఇంటర్నేషనల్ ర్యాకింగ్ సాధించా. 10వ తరగతి బెంగళూరులోని స్టాండర్డ్ ఇంటర్నేషనల్లో చది వాను. అప్పటికే 2,305 రేటింగ్లో ఉన్నా. అనంతరం తమిళనాడులోని వేళమ్మాల్ కళాశాలలో ఇంటర్మీడియట్ ఎంఈసీ గ్రూప్ చదివి 95 శాతం పైగా(1141/1200) మార్కులు సాధించా. అటు చదువులోనూ, ఇటు చెస్లోనూ రాణిస్తూ వచ్చా. సాక్షి : ఇతర దేశాల ఆటగాళ్లతో మీ ఆటతీరు..? కార్తీక్ :మనదేశ ఆటగాళ్లు, యూరప్, యూఎస్, టర్కీ ఆటగాళ్ల ఆటతీరులో చాలా వ్యత్యాసం ఉంటుంది. మన ఆటగాళ్లు సేఫ్, పొజిషనల్గా ఆడుతారు. అదే వాళ్లైతే అగ్రస్సివ్గా, అటాకింగ్ స్టైల్లో ఆడతారు. సాక్షి : ఇతర దేశాల ఆటగాళ్లను ఎలా ఎదుర్కొంటారు..? కార్తీక్ : ఇతర దేశాల ఆటగాళ్లతో ఆడేటప్పుడు ముందుగా వారి ఆటతీరును ఆన్లైన్లో పరిశీలిస్తా. అందుకు సంబంధించిన బుక్స్ చదువుతా. ఇతర దేశాల్లో పోటీలు ఉన్నçప్పుడు ప్రతిరోజు అయిదారు గంటల పాటు ప్రాక్టీస్ చేస్తా. సాక్షి : చెస్కు ఆదరణ ఉందంటారా..? కార్తీక్ : మన రాష్ట్రంలో చెస్ ఆటలో అప్కమింగ్ ప్లేయర్స్ రావటం లేదు. అండర్–19లో ఇంటర్నేషనల్ ప్లేయర్స్ కొద్దిమంది మాత్రమే ఉన్నారు. చెస్ క్రీడను ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. సాక్షి : 5వ గ్రాండ్మాస్టర్గా నిలిచినందుకు ఎలా ఫీలవుతున్నారు? కార్తీక్: ఆంధ్రప్రదేశ్ నుంచి గ్రాండ్మాస్టర్ హోదాలో హరికృష్ణ, కోనేరు హంపి, హారిక, లలిత్బాబు సరసన 5వ ప్లేయర్గా నిలవడం సంతోషంగా ఉంది. సాక్షి : గ్రాండ్మాస్టర్ హోదాలో సీఎంను కలిశారా..? కార్తీక్ : లేదు. త్వరలో సీఎం చంద్రబాబునాయుడును కలవనున్నాం. చెస్ జిల్లా, రాష్ట్ర అసోషియేషన్ ప్రతినిధులతో కలసి వెళ్లేందుకు సిద్ధం అవుతున్నాం. సీఎం క్రీడలను బాగా ప్రోత్సహిస్తున్నారు. ప్రభుత్వ ప్రోత్సాహం ఉంటే ఏడాదిలోపే సూపర్ గ్రాండ్ మాస్టర్ హోదా సాధిస్తాననే నమ్మకం ఉంది. సాక్షి : క్రీడాకారులకు మీరిచ్చే సూచనలు..? కార్తీక్ : ఆటలో ఓటమి చెందినా నిరుత్సాహ పడకూడదు. ఆటను మరింత మెరుగుపరచుకోవాలి. ఆటలోని తప్పులను సరిదిద్దుకుని ముందుకెళ్లాలి. మనదేశంలో టోర్నమెంట్లు తక్కువ. అదే యూరప్ లాంటి దేశాల్లో టోర్నమెంట్లు ఎక్కువగా నిర్వహిస్తారు. ఇతర రాష్ట్రాల్లో ఇంటర్నేషనల్ ఆటగాళ్లను అసోషియేషన్లు, ప్రభుత్వాలు ప్రొత్సహిస్తున్నాయి. మన రాష్ట్రంలో ఆటగాళ్లను మరింత ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. జీఎం టైటిల్కు సంబంధించిన వివరాలు.. ♦ 2017 ఆగస్టులో బార్సిలోనాలో జరిగిన అంతర్జాతీయ ఓపెన్ చెస్ పోటీల్లో తొలి జీఎంను కైవసం చేసుకున్నాడు. ♦ 2018లో జూన్ ఒడిశాలోని భువనేశ్వర్లో జరిగిన కిట్ అంతర్జాతీయ టోర్నమెంట్లో ప్రథమ స్థానం సాధించి రెండవ జీఎం నార్మ్ సాధించాడు. ♦ ఈ ఏడాది ఆగస్టు 16న ఇటలీలో జరిగిన స్పిలిమ్బర్గ్ ఓపెన్లో 6 పాయింట్లు సాధించి 3వ జీఎం నార్మ్ కూడా పొంది గ్రాండ్మాస్టర్ హోదా సొంతం చేసుకున్నాడు. ♦ ఈ నెల 4 నుంచి 16వ తేది వరకు టర్కీ దేశంలో జరిగిన ప్రపంచ స్థాయి జూనియర్ చాంపియన్షిప్ పోటీల్లో 4వ గ్రాండ్మాస్టర్ స్థానం కైవసం చేసుకున్నాడు. కార్తీక్ సాధించిన విజయాలు.. ♦ అండర్–13 రాష్ట్ర చాంపియన్, అండర్–17 2017లో జాతీయ స్థాయిలో ద్వితీయ స్థానం ♦ అండర్–17 జాతీయ స్థాయి స్కూల్ గేమ్స్లో బంగారు పతకం ♦ అండర్–19 జాతీయ స్కూల్ గేమ్స్ పోటీల్లో సిల్వర్ మెడల్ ♦ ఏపీ స్టేట్ అండర్–9 గ్రూపులో ద్వితీయ స్థానం సాధించిన పతకాలు.. ♦ 2019లో తిరుపతి జూనియర్ చాంబర్ ఆధ్వర్యంలో చైల్డ్ ప్రాడిజీ అవార్డు ♦ 2010లో గోవాలో జరిగిన ఏపీ ఇన్ నేషనల్ స్కూల్ గేమ్స్ పోటీల్లో కాంస్య పతకం ♦ 2010లో శ్రీలంకలో జరిగిన ఏషీయన్ స్కూల్ గేమ్స్లో అండర్–11 విభాగంలో బంగారు పతకం సాధించి పోలెండ్లో జరిగిన అంతర్జాతీయ పోటీలకు అర్హత సాధించాడు. ♦ శ్రీలంకలో జరిగిన టీమ్ ఏషియన్ స్కూల్ గేమ్స్లో టీమ్ మెడల్ సాధించి సింగపూర్లో జరిగిన అంతర్జాతీయ పోటీలకు అర్హత ♦ 2018 జూలైలో జరిగిన కామన్వెల్త్ గేమ్స్లో గోల్డ్ మెడల్ -
గ్రాండ్మాస్టర్స్ చెస్ టోర్నీ షురూ
సాక్షి, హైదరాబాద్: ఏఐసీఎఫ్ అంతర్జాతీయ మహిళల గ్రాండ్మాస్టర్స్ చెస్ టోర్నమెంట్ గురువారం ఘనంగా ప్రారంభమైంది. గచ్చిబౌలిలోని ‘నిథమ్’ వేదికగా జరుగుతోన్న ఈ టోర్నీని తెలంగాణ క్రీడా కార్యదర్శి బుర్రా వెంకటేశం, భారత గ్రాండ్ మాస్టర్ ద్రోణవల్లి హారిక ప్రారంభించారు. ఈనెల 16 వరకు జరుగనున్న ఈ మెగా టోర్నీలో భారత్ నుంచి ఆరుగురు జాతీయ స్థాయి క్రీడాకారులు పాల్గొంటున్నారు. వీరితో పాటు మంగోలియా, వియత్నాం, కజకిస్థాన్, ఉక్రెయిన్లకు చెందిన ఆరుగురు అంతర్జాతీయ క్రీడాకారులు టైటిల్కోసం పోటీ పడుతున్నారు. ఈ టోర్నీ తొలి అంచె పోటీలు ముంబైలో జరుగగా, రెండో అంచె పోటీలకు భాగ్యనగరం ఆతిథ్యమిస్తోంది. టోర్నీ మెత్తం ప్రైజ్మనీ రూ. 7,50,000 కాగా విజేతకు రూ. 1,60,000 అందజేస్తారు. రన్నరప్కు రూ. 1,30,000, మూడోస్థానంలో నిలిచిన వారికి లక్ష రూపాయలు ప్రైజ్మనీగా ఇవ్వనున్నారు. టోర్నీ ప్రారంభోత్సవం సందర్భంగా అర్జున అవార్డు గ్రహీత, తెలుగు తేజం ద్రోణవల్లి హారికను క్రీడా కార్యదర్శి బుర్రా వెంకటేశం, ‘శాట్స్’ చైర్మన్ ఎ. వెంకటేశ్వర్ రెడ్డి సత్కరించారు. అనంతరం బుర్రా వెంకటేశం మాట్లాడుతూ క్రీడలకు తెలంగాణ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతను ఇస్తుందని అన్నారు. -
హారిక బృందం పసిడి మెరుపులు
హమెదాన్ (ఇరాన్): భారత మహిళల చెస్ నంబర్వన్, ఆంధ్రప్రదేశ్ గ్రాండ్మాస్టర్ ద్రోణవల్లి హారిక ఆసియా నేషన్స్ కప్ చెస్ టోర్నమెంట్లో పసిడి మెరుపులు మెరిపించింది. ఒకే రోజు రెండు స్వర్ణాలతోపాటు రజతం, కాంస్య పతకాలు దక్కించుకుంది. శుక్రవారం ముగిసిన ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్లో హారిక మహిళల బ్లిట్జ్ ఈవెంట్లో టీమ్, వ్యక్తిగత విభాగాల్లో స్వర్ణ పతకాలు గెలిచింది. దాంతోపాటు స్టాండర్డ్ ఈవెంట్ టీమ్ విభాగంలో కాంస్యం, వ్యక్తిగత విభాగంలో రజతం సొంతం చేసుకుంది. హారికతోపాటు ఇషా కరవాడే, వైశాలి, పద్మిని రౌత్, ఆకాంక్ష భారత జట్టులో సభ్యులుగా ఉన్నారు. తొలుత ఏడు రౌండ్ల స్టాండర్డ్ విభాగంలో భారత్ ఎనిమిది పాయింట్లు సాధించి మూడో స్థానంలో నిలిచింది. ఏడు మ్యాచ్లు ఆడిన భారత బృందం మూడు విజయాలు సాధించి... మరో రెండింటిని ‘డ్రా’ చేసుకొని, మరో రెండింటిలో ఓడిపోయింది. 13 పాయింట్లతో చైనా స్వర్ణం, 11 పాయింట్లతో వియత్నాం రజతం గెల్చుకున్నాయి. స్టాండర్డ్ విభాగంలో బోర్డు–1పై బరిలోకి దిగిన హారిక తాను ఆడిన ఆరు గేముల్లోనూ విజయం సాధించి ఆరు పాయింట్లతో సారాసదత్ (ఇరాన్)తో సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచింది. అయితే మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా సారాసదత్కు స్వర్ణం, హారికకు రజతం ఖాయమయ్యాయి. బోర్డు– 3పై ఇషా కరవాడే, బోర్డు–4పై పద్మిని రౌత్, బోర్డు– 5పై ఆకాంక్ష కాంస్య పతకాలు దక్కించుకున్నారు. ఇక బ్లిట్జ్ విభాగంలో భారత మహిళల జట్టు ఆరు మ్యాచ్ల్లో గెలిచి, మరో మ్యాచ్ను ‘డ్రా’గా ముగించి అజేయంగా నిలిచింది. నిర్ణీత ఏడు రౌండ్ల తర్వాత 13 పాయింట్లతో చాంపియన్గా అవతరించింది. ఈ విభాగంలోనూ బోర్డు–1పై బరిలోకి దిగిన హారిక ఐదు పాయింట్లతో టాప్ ర్యాంక్ పొంది పసిడి పతకాన్ని కైవసం చేసుకుంది. ఓపెన్ విభాగంలో రజతం... మరోవైపు ఓపెన్ విభాగంలో ఆధిబన్, సేతురామన్, కృష్ణన్ శశికిరణ్, సూర్యశేఖర గంగూలీ, అభిజిత్ గుప్తాలతో కూడిన భారత పురుషుల జట్టు స్టాండర్డ్ విభాగంలో 10 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. నిర్ణీత ఏడు రౌండ్లకుగాను భారత్ నాలుగు మ్యాచ్ల్లో గెలిచి, రెండింటిని ‘డ్రా’ చేసుకొని, మరో మ్యాచ్లో ఓడి రజత పతకాన్ని దక్కించుకుంది. 13 పాయింట్లతో ఇరాన్ గ్రీన్ స్వర్ణం కైవసం చేసుకుంది. వ్యక్తిగత విభాగంలో సేతురామన్ (బోర్డు–2), కృష్ణన్ శశికిరణ్ (బోర్డు–3) పసిడి పతకాలు సంపాదించగా... ఆధిబన్ (బోర్డు–1) రజతం గెల్చుకున్నాడు. -
సైలెంట్ కిల్లర్
యశస్వికి వినికిడి లోపం. ఏ శబ్దాలకూ స్పందించదు. కానీ చదరంగంలోని గుర్రపు డెక్కల చప్పుళ్లు, ఏనుగుల ఘీంకారాలు, భటులు పరుగులు తీస్తున్న ధ్వనులు.. అవన్నీ చక్కగా వినిపిస్తాయి. ఇటీవలే ప్రపంచ చెస్ పోటీలలో పాల్గొని, జూనియర్స్ విభాగంలో కాంస్య పతకం కూడా సాధించింది. ఊళ్లో ఘనస్వాగతం పొందింది. యశస్వి కర్ణాటకలోని బంత్వాల్ గ్రామ బాలిక. పదో తరగతి చదువుతోంది. ఈ నెలలో యూకే లోని మాన్చెస్టర్లో జరిగిన అంతర్జాతీయ బధిరుల చెస్ పోటీలలో పాల్గొని కాంస్య పతకం సాధించింది. యశస్వి తల్లి యశోద స్కూల్ టీచర్. తండ్రి తిమ్మప్ప ల్యాబ్ టెక్నీషియన్. మెడల్ సాధించుకొచ్చిన యశస్వికి తను చదువుకున్న కాడేశ్వల్య హైస్కూల్ యాజమాన్యం ప్రత్యేకంగా స్వాగతం పలికినప్పుడు ఈ తల్లిదండ్రులు పుత్రికోత్సాహంతో పులకించిపోయారు. ‘‘ఇది మా అమ్మాయి పాల్గొన్న మొట్టమొదటి అంతర్జాతీయ పోటీ. జాతీయ స్థాయిలో రెండుసార్లు అవార్డులు అందుకుంది. ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో గెలిచినందుకు చాలా సంతోషంగా ఉంది’’ అన్నారు. అక్కకూ వినిపించదు! పెద్దమ్మాయి యతిశ్రీ (20) ప్రస్తుతం పుత్తూరులో బీకాం చదువుతోంది. ఆమె కూడా బధిరురాలే. ‘‘యతిశ్రీకి ఏడాదిన్నర వయసు ఉన్నప్పుడు, ఆమె శబ్దాలకు స్పందించడంలేదని గ్రహించాను. అప్పటికి తనకు కేవలం 20 శాతం మాత్రమే వినికిడి శక్తి ఉంది. నేను టీచర్ని కావడం వల్ల, ముందుగా నేను చదువుతున్న పాఠశాలలోనే చేర్పించి, ఆ తరవాత దగ్గరలో ఉన్న పాఠశాలలో చదివించాను. పెద్దయ్యాక కూడా దగ్గరలోనే ఉన్న కాలేజీలోనే చేర్పించాను. యతిశ్రీ చాలా చక్కగా భరతనాట్యం చేస్తుంది. బొమ్మలు కూడా వేస్తుంది. రకరకాల పోటీలలో ఎన్నో బహుమతులు సాధించింది’’ అని పెద్ద కూతురు గురించి కూడా గొప్పగా చెబుతారు యశోద. ‘ఎలారా దేవుడా’ అనుకున్నారుమొదట్లో ఈ దంపతులు, భగవంతుడు తమను చిన్నచూపు చూశాడనే భావనలో ఉండేవారు. రెండో అమ్మాయి యశస్వి పుట్టినప్పుడు ఆ అమ్మాయికి బాగానే వినిపిస్తుందనుకున్నారు. ఒక నెల అయ్యాక,యశస్వికి కూడా వినపడట్లేదని తెలిసిపోయింది. దాంతో హతాశులయ్యారు. ‘‘డాక్టరుకి చూపించినా ప్రయోజనం లేకపోయింది. యతిశ్రీ కంటే యశస్వికి ఇంకా బాగా తక్కువగా వినిపిస్తుంది. కానీ చాలా తెలివైనది. చదువులో 90 శాతం మార్కులు సాధించేది’’ అంటారు యశోద. పిల్లలు ఎన్ని విజయాలు సాధించినా, వారికి వైక ల్యం ఉంటే అది తల్లిదండ్రులకు బాధను కలిగిస్తుంది. అందుకే ఆ తల్లి శని ఆదివారాలలో యశస్విని స్పీ^Œ థెరపీ కోసం మంగళూరుకు తీసుకెళ్లేవారు. యశస్వికి చదువుతో పాటు చదరంగం మీద కూడా మక్కువ ఏర్పడింది. ముందుగా ఇంట్లోవారితో ఆడి, ఆ తరవాత స్కూల్లో ఆడింది. ఆమె ఆటలోని నేర్పరితనాన్ని గమనించిన టీచర్లు పుత్తూరులోని జీనియస్ చెస్ స్కూల్లో చేర్పించారు. బాధను మరిపించింది. చెస్ పోటీల కోసం ఈ ఏడాది జూన్ 25వ తేదీన యశస్వి ఢిల్లీ చేరుకుంది. జూలై ఆరవ తేదీన ఇంగ్లండ్ వెళ్లే వరకు ఢిల్లీలో బాగా ప్రాక్టీస్ చేసింది. ‘‘ఈ సాధన యశస్వికి ఒక మంచి అనుభవం. ఇంటి నుంచి దూరం వెళ్లడం ఇదే మొదటిసారి. మేం కూడా తన వెంట వెళ్లాలనుకున్నాం. కానీ కుదరలేదు. భగవంతుడి దయ వల్ల అన్నీ సాఫీగా జరిగిపోయాయి. మల్లి హందా అనే అమ్మాయితో కలిసి భారతదేశం తరఫున బాలికల విభాగంలో ఆడి వచ్చింది మా అమ్మాయి. జూనియర్స్ వ్యక్తిగత విభాగంలో కాంస్య పతకం సాధించింది. మేం పడిన బాధంతా మరచిపోయాను. మా పిల్లలిద్దరూ చక్కగా రాణిస్తున్నందుకు ఇప్పుడు మాకు ఆనందంగా ఉంది’’ అంటారు యశోద. – రోహిణి -
చాంప్స్ జాహ్నవి, ప్రణీత్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర అండర్–11 చెస్ చాంపియన్షిప్లో జాహ్నవి శ్రీ లలిత, ప్రణీత్ ఉప్పల చాంపియన్లుగా నిలిచారు. ఎల్బీ స్టేడియంలో జరిగిన ఈ పోటీల్లో బాలికల విభాగంలో 5.5 పాయింట్లతో జాహ్నవి, సేవితా విజు తొలి స్థానం కోసం పోటీపడ్డారు. అయితే మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా జాహ్నవి విజేతగా నిలవగా, సేవిత రన్నరప్తో సరిపెట్టుకుంది. నేత్ర, నాగలక్ష్మి వరుసగా మూడు, నాలుగు స్థానాల్లో నిలిచి తెలంగాణ రాష్ట్ర బాలికల జట్టుకు ఎంపికయ్యారు. బాలుర విభాగంలో నిర్ణీత ఏడు రౌండ్లకుగానూ ఏడు పాయింట్లు సాధించిన ప్రణీత్ అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. చిద్విలాస్ (6 పాయింట్లు) రన్నరప్గా నిలిచాడు. వీరిద్దరూ రాష్ట్ర బాలుర జట్టుకు ఎంపికయ్యారు. ఈ జట్లు కరైకుడిలో ఈనెల 28న జరిగే జాతీయ అండర్–11 చెస్ చాంపియన్షిప్లో తెలంగాణకు ప్రాతినిధ్యం వహిస్తాయి. -
చాంప్స్ ప్రణీత, సంకేత్రెడ్డి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర చెస్ సంఘం (టీఎస్సీఏ) ఆధ్వర్యంలో జరిగిన హైదరాబాద్ జిల్లా అండర్–11 చెస్ సెలక్షన్ టోర్నీలో ప్రణీత ప్రియ, సంకేత్ రెడ్డి చాంపియన్లుగా నిలిచారు. టీఎస్సీఏ కార్యాలయం వేదికగా జరిగిన ఈ టోర్నీ బాలికల విభాగంలో 4 పాయింట్లతో ప్రణీత అగ్రస్థానంలో నిలిచింది. ఆమె తలపడిన అన్ని మ్యాచ్ల్లోనూ విజయం సాధించింది. ఎస్. అనీష్క, జి. ఇషాన్వి, జి. శరణ్య వరుసగా రెండు, మూడు, నాలుగు స్థానాల్లో నిలిచి హైదరాబాద్ జిల్లా జట్టుకు ఎంపికయ్యారు. బాలుర విభాగంలో నిర్ణీత 5 రౌండ్లకుగానూ 5 పాయింట్లు సాధించి సంకేత్ విజేతగా నిలిచాడు. ఎస్. చిద్విలాస్ రెండోస్థానాన్ని దక్కించుకోగా... కె. అవనీశ్, విశ్వ తర్వాతి స్థానాలను సాధించారు. తొలి నాలుగు స్థానాల్లో నిలిచిన ఈ నలుగురూ హైదరాబాద్ జిల్లా బాలుర జట్టులో చోటు దక్కించుకున్నారు. ఈ జట్లు రాష్ట్ర స్థాయి చెస్ చాంపియన్షిప్లో హైదరాబాద్కు ప్రాతినిధ్యం వహిస్తాయి. -
రెండో స్థానంలో లలిత్బాబు
సాక్షి, హైదరాబాద్: కామన్వెల్త్ చెస్ చాంపియన్షిప్లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్మాస్టర్ ఎం.ఆర్ లలిత్బాబు సంయుక్తంగా రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. ఢిల్లీలోని లీలా అంబియెన్స్ కన్వెన్షన్ హోటల్లో జరుగుతోన్న ఈ టోర్నీలో ఏడు రౌండ్లు ముగిసేసరికి 5.5 పాయింట్లతో లలిత్ మరో నలుగురితో కలిసి రెండో స్థానంలో నిలిచాడు. ఆదివారం జరిగిన ఏడో రౌండ్లో మాజీ జాతీయ చాంపియన్ జి. ఆకాశ్పై లలిత్బాబు విజయం సాధించాడు. సంకల్ప్ గుప్తా, దేబాశిష్ దాస్, పి. కార్తీకేయన్, నుబర్షా షేక్ కూడా 5.5 పాయింట్లతో ఉన్నారు. ఆరు పాయింట్లు సాధించిన వైభవ్, నితిన్ ప్రస్తుతం ఉమ్మడిగా అగ్రస్థానంలో ఉన్నారు. -
శ్రీశ్వాన్కు రజతం
సాక్షి, హైదరాబాద్: జాతీయ అండర్–13 జూనియర్ చెస్ చాంపియన్షిప్లో తెలంగాణ కుర్రాళ్లకు రెండు పతకాలు లభించాయి. గుజరాత్లో శుక్రవారం ముగిసిన ఈ చాంపియన్షిప్లో ఓపెన్ విభాగంలో ఎం.శ్రీశ్వాన్ (9.5 పాయింట్లు) రజతం... జి. ఆదిత్య వరుణ్ (9 పాయింట్లు) కాంస్యం సాధించారు. నిర్ణీత 11 రౌండ్ల తర్వాత శ్రీశ్వాన్ 9.5 పాయింట్లతో ఆర్యన్ (ఢిల్లీ)తో కలసి సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచాడు. అయితే మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా ర్యాంక్ను వర్గీకరించగా ఆర్యన్ విజేతగా... శ్రీశ్వాన్ రన్నరప్గా నిలిచారు. -
చాంప్స్ హిమాన్షు, జ్ఞానిత
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ర్యాంకింగ్ చెస్ టోర్నమెంట్లో హిమాన్షు అగర్వాల్, జ్ఞానిత నేత చాంపియన్లుగా నిలిచారు. ఎల్బీ స్టేడియం లో జరిగిన ఈ టోర్నీ అండర్–15 బాలుర విభాగంలో నిర్ణీత 5 రౌండ్లు ముగిసేసరికి 4.5 పాయింట్లతో హిమాన్షు, సూర్య సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచారు. అయితే మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా హిమాన్షు విజేతగా నిలవగా, సూర్య రన్నరప్తో సరిపెట్టుకున్నాడు. బాలికల విభాగంలో 3 పాయింట్లతో జ్ఞానిత తొలిస్థానాన్ని దక్కించుకుంది. పి. శ్రేయ రన్నరప్గా నిలిచింది. ఇతర వయో విభాగాల విజేతల వివరాలు అండర్–13 బాలురు: 1. ఓజస్, 2. కె. పవన్, 3. అజితేశ్; బాలికలు: 1. సాయిచరిత వరేణ్య, 2. అమృత వర్షిణి. అండర్–11 బాలురు: 1. సంకేత్, 2. అర్జున్, 3. వి. ఆరుశ్; బాలికలు: 1. ఊర్జ, 2. ఇషాన్వి, 3. ఆస్మా బేగం. అండర్–9 బాలురు: 1. శ్రీకృష్ణ ప్రణీత్, 2. కె. నితిక్, 3. సాయి శ్రీతేశ్; బాలికలు: 1. ఆర్. లక్ష్మి సమీరాజ, 2. హర్షిత, 3. నాగ కార్తీక. అండర్–7 బాలురు: 1. శ్రవణ్, 2. అయాన్, 3. సాయి సిద్ధాంత్; బాలికలు: 1. కీర్తిక, 2. అక్షయ, 3. ఫణిశ్రీ. -
పెళ్లి పీటలెక్కనున్న ద్రోణవల్లి హారిక...
భారత స్టార్ చెస్ క్రీడాకారిణి, ఆంధ్రప్రదేశ్ గ్రాండ్మాస్టర్ ద్రోణవల్లి హారిక పెళ్లి కూతురు కానుంది. సివిల్ ఇంజనీర్ అయిన కార్తీక్ చంద్రతో ఈనెల 18న హైదరాబాద్లో హారిక వివాహ నిశ్చితార్థ కార్యక్రమం జరగనుంది. ఆగస్టు 19న పెళ్లి జరుగుతుంది. 2008లో జూనియర్ ప్రపంచ చాంపియన్గా అవతరించిన హారిక... 2011లో గ్రాండ్మాస్టర్ (జీఎం) హోదా సంపాదించింది. కామన్వెల్త్, ఆసియా చాంపియన్గా కూడా నిలిచిన హారిక 2012, 2015, 2017 ప్రపంచ చాంపియన్షిప్లలో కాంస్య పతకాలు సాధించింది. -
చాంప్స్ వశిష్ట రమణ, నందిత
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అంతర్ జిల్లా చెస్ చాంపియన్షిప్కు వశిష్ట రమణ, వి. నందిత, సశ్య, శ్రీనిథ్ ఎంపికయ్యారు. బాలాపూర్లోని విస్రా జూనియర్ కాలేజిలో నిర్వహించిన అండర్–7, అండర్–15 రంగారెడ్డి చెస్ టోర్నీలో విజేతలుగా నిలిచిన వీరు అంతర్ జిల్లా చెస్ చాంపియన్షిప్కు అర్హత సాధించారు. మంగళవారం ముగిసిన ఈ పోటీల్లో అండర్–7 బాలుర విభాగంలో శ్రీనిథ్ విజేతగా నిలవగా... ఉదయ్ రెండో స్థానంతో సరిపెట్టుకున్నాడు. బాలికల విభాగంలో సశ్య అగ్రస్థానంలో నిలిచింది. అండర్–15 బాలుర విభాగంలో వశిష్ట రమణ విజేతగా, అమన్ జాషువ రన్నరప్గా నిలిచారు. పవన్ కుమార్, శ్రీరామ్, సోహైల్ వరుసగా మూడు, నాలుగు, ఐదో స్థానాలు దక్కించుకున్నారు. బాలికల విభాగంలో వి. నందిత టైటిల్ నెగ్గగా... సాయి శ్రీ చరిత వరేణ్య రన్నరప్గా నిలిచింది. స్నేహ సాయి శ్రావణి, మమత శ్రీ వరుసగా మూడు, నాలుగో స్థానాల్లో నిలిచారు. వీరు ఈ నెల 8 నుంచి 10 వరకు అబిడ్స్లోని డైమండ్ జూబ్లీ హైస్కూల్లో నిర్వహించనున్న తెలంగాణ అంతర్ జిల్లా చెస్ టోర్నీలో పాల్గొననున్నారు. -
ఆనంద్కు తొలి విజయం
ఆల్టిబాక్స్ నార్వే ఓపెన్ అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్లో వరుసగా ఆరు ‘డ్రా’లు నమోదు చేసిన తర్వాత... భారత గ్రాండ్మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ ఖాతాలో తొలి విజయం చేరింది. నార్వేలోని స్టావెంజర్ నగరంలో జరుగుతోన్న ఈ టోర్నీలో మంగళవారం జరిగిన ఏడో రౌండ్లో ఆనంద్ 40 ఎత్తుల్లో మాక్సిమి వాచియెర్ లాగ్రేవ్ (ఫ్రాన్స్)పై గెలుపొందాడు. బుధవారం జరిగే ఎనిమిదో రౌండ్లో ఫాబియానో కరువానా (అమెరికా)తో ఆనంద్ తలపడతాడు. -
విదేశీ గ్రాండ్మాస్టర్కు అర్జున్ షాక్
మేయర్స్ కప్ అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్లో తెలంగాణ కుర్రాడు ఎరిగైసి అర్జున్ శుభారంభం చేశాడు. ముంబైలో సోమవారం మొదలైన ఈ టోర్నీ తొలి రోజు ఆడిన మూడు గేముల్లోనూ అతను విజయం సాధించాడు. రెండో రౌండ్లో (ఎఫ్ఎం) ఫిడే మాస్టర్ హోదా ఉన్న అర్జున్ ఏకంగా విదేశీ గ్రాండ్మాస్టర్ (జీఎం)కే చెక్ పెట్టాడు. అమెరికాకు చెందిన రసెట్ జియటెడినోవ్ను అర్జున్ 43 ఎత్తుల్లో ఓడించాడు. అంతకుముందు తొలి రౌండ్లో అర్జున్ 34 ఎత్తుల్లో శాంతారామ్ (భారత్)పై, మూడో రౌండ్లో 49 ఎత్తుల్లో సంజీవ్ నాయర్ (భారత్)పై నెగ్గాడు. -
అర్జున్కు శాట్స్ చైర్మన్ అభినందన
సాక్షి, హైదరాబాద్: కోల్కతా ఓపెన్ అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్లో రాణించిన తెలంగాణ కుర్రాడు ఎరిగైసి అర్జున్ను బుధవారం శాట్స్ చైర్మన్ ఎ. వెంకటేశ్వర్ రెడ్డి అభినందించారు. భవిష్యత్లో మరెన్నో గొప్ప విజయాలను సొంతం చేసుకోవాలని ఆకాంక్షించారు. కోల్కతాలో జరిగిన ఈ టోర్నీలో నిర్ణీత 9 పాయింట్లకుగానూ 7 పాయింట్లు సాధించి ఐదో స్థానంలో నిలిచాడు. ఇందులో భాగంగా తనకన్నా ఎంతో మెరుగైన ఆటగాళ్లపై విజయాలు సాధించి తొలి జీఎం నార్మ్ను సాధించాడు. ఈ సందర్భంగా శాట్స్ చైర్మన్ను కలిసిన అర్జున్... మెరుగైన టోర్నీల్లో పాల్గొనేందుకు ప్రభుత్వం తరఫు నుంచి ఆర్థిక సహాయం అందించాలని విజ్ఞప్తి చేశాడు. అతని వినతిపై శాట్స్ చైర్మన్ సానుకూలంగా స్పందించారు. -
ఒక రాజు ఒక రాణి
అరవై నాలుగు గడుల ఆటలో వారి ప్రేమ తొలి అడుగు వేసింది. ఇప్పుడు ఆ బంధం బలపడి ఏడడుగులు వేసేందుకు సిద్ధమైంది. ఒకరి ఎత్తుకు మరొకరు పైఎత్తులు వేసే చదరంగం ఆడుతూనే వారిద్దరు ఒకరి ప్రేమకు మరొకరు చిత్తయ్యారు. దేశం వేరు, సంస్కృతి వేరు. కానీ ఆటతో మొదలైన పరిచయం జీవితకాలపు అనుబంధంగా మారేందుకు మాత్రం అలాంటివేమీ హద్దుగా మారలేదు. భాగ్యనగరానికి, బెల్గ్రేడ్కు మధ్య ఉన్న ఆరు వేల మైళ్ల దూరాన్ని చెరిపేస్తూ వారిద్దరు పరిణయంతో ఒకటి కాబోతున్నారు. భారత చెస్ గ్రాండ్మాస్టర్ (జీఎం) తెలుగు తేజం పెంటేల హరికృష్ణ, సెర్బియా క్రీడాకారిణి నాడ్జ స్టొయానొవిక్ మధ్య సాగిన ప్రేమ కథ ఇది. భారత్కు చెందిన ఒక అంతర్జాతీయ స్థాయి ఆటగాడు విదేశీ వనితను వివాహమాడటం ఇటీవలి కాలంలో ఇదే కావడం విశేషం. సాక్షి, హైదరాబాద్: చెస్ గ్రాండ్మాస్టర్ పెంటేల హరికృష్ణ మార్చి 3న వివాహం చేసుకోబోతున్నాడు. వధువు సెర్బియా దేశానికి చెందిన నాడ్జ స్టొయానొవిక్. హరికృష్ణ 2745 రేటింగ్తో ప్రస్తుతం ప్రపంచ ర్యాంకింగ్స్లో 20వ స్థానంలో ఉన్నాడు. నాడ్జ గతంలో సెర్బియా జాతీయ జూనియర్ చెస్ చాంపియన్గా నిలిచింది. ఆ తర్వాత యూరోపియన్ చెస్ యూనియన్లో ఆర్బిటర్, మీడియా మేనేజర్గా పని చేస్తోంది. చెస్ సర్క్యూట్లో మొదలైన వీరిద్దరి పరిచయం ఇప్పుడు పెళ్లి దాకా చేరింది. ఈ నేపథ్యంలో తమ ప్రేమ వివాహం గురించి ‘సాక్షి’తో హరికృష్ణ స్వయంగా చెప్పిన విశేషాలు అతని మాటల్లోనే... ‘చెస్ క్రీడాకారుడిగా ప్రపంచ వ్యాప్తంగా అనేక పెద్దా, చిన్నా టోర్నీలలో నేను పాల్గొంటుంటాను. సాధారణంగా యూరప్ కేంద్రంగా చుట్టుపక్కల ఉండే దేశాల్లోనే ఇవి ఎక్కువగా జరుగుతుంటాయి. ఈ క్రమంలో కొంత మందిని తరచుగా కలవడం, వారిలో కొందరు ఆత్మీయ స్నేహితులుగా మారిపోవడం సహజం. ఈ తరహాలో చెస్ సర్క్యూట్లో కలిగిన పరిచయం తెలుగు కుర్రాడినైన నా పెళ్లి ఒక సెర్బియా అమ్మాయితో జరగడం వరకు వెళుతుందని అసలు ఎప్పుడూ ఊహించలేదు. ఉమెన్ ఫిడే మాస్టర్ (డబ్ల్యూఎఫ్ఎం) అయిన నాడ్జ యుగొస్లేవియా దేశంగా ఉన్నప్పుడు జాతీయ జూనియర్ చాంపియన్గా నిలిచింది. దాదాపు ఏడేళ్ల క్రితం మేమిద్దరం తొలిసారి పరిచయమయ్యాం. అయితే ఆ తర్వాత మేం పెద్దగా కలుసుకోలేదు. కొంత విరామం వచ్చేసింది. నిజంగా ప్రేమ మొదలైంది మాత్రం దాదాపు రెండేళ్ల క్రితమే. ఆ సమయంలోనే ఒకరి గురించి మరొకరం బాగా తెలుసుకున్నాం. చెస్ గురించి మాట్లాడటం మొదలు పెట్టి ఇష్టా ఇష్టాల వరకు వెళ్లడంతో తెలీకుండానే దగ్గరయ్యాం. నాడ్జకు ప్రయాణాలు చేయడం, కొత్త సంస్కృతులు గురించి తెలుసుకోవడం చాలా ఇష్టం. అదే క్రమంలో ఆమె అప్పటికీ భారత్ గురించి చాలా చదివేసింది. ఇది కూడా నాకు కలిసొచ్చింది. దాంతో ఆమెతో స్నేహంతోనే ఆగిపోకుండా మరింత ముందుకు వెళ్లాలని నిర్ణయించుకొని నేనే పెళ్లి గురించి ప్రతిపాదించాను. ఆమె వెంటనే ఎలాంటి సమాధానం ఇవ్వలేదు. తల్లిదండ్రులతో చర్చించి కొన్ని నెలల తర్వాత ఓకే చెప్పింది. అప్పుడు నేను మా అమ్మానాన్నలతో ఈ విషయం చెప్పాను. సహజంగానే వెంటనే ఆమోదం ఏమీ లభించలేదు. జీవన శైలి, ఇతర సంప్రదాయాల గురించి వారు బాగా ఆలోచిస్తారు కాబట్టి ఎలాంటి నిర్ణయానికి రాలేదు. దాంతో మెల్లిగా ఒప్పించే ప్రయత్నం చేశాను. సరిగ్గా చెప్పాలంటే నా ప్రయత్నంకంటే కాలమే వారు అంగీకరించేలా చేసింది. దాదాపు ఏడాదిన్నర తర్వాత నా పెళ్లికి వారు ఒప్పుకున్నారు. నాడ్జ ఆ తర్వాత మా అమ్మా నాన్నలతో మాట్లాడటం, ఇక్కడి విషయాలు, తెలుగు సంస్కృతి గురించి అన్నీ తెలుసుకోవడం జరుగుతూ పోయింది. మన పెళ్లి వీడియోలు కొన్ని చూపించి సంప్రదాయాల గురించి వివరించాను. అంతా కుదురుతున్న తర్వాతే పెళ్లి తేదీని ఖరారు చేశారు. హైదరాబాద్లో పెళ్లికి ఆమె తల్లి, సోదరుడు, చెల్లితో పాటు కొందరు ఫ్రెండ్స్ వస్తున్నారు. అనారోగ్యంతో తండ్రి మాత్రం రావడం లేదు. చెస్ ప్రపంచంలో దాదాపు అందరికీ మా ప్రేమ గురించి తెలుసు. వారంతా మమ్మల్ని ప్రత్యేకంగా అభినందించారు. టోర్నీ కారణంగా విశ్వనాథన్ ఆనంద్ పెళ్లికి రాలేకపోతున్నా... ఆయన సతీమణి అరుణ మాత్రం వస్తున్నారు. అనేక మంది భారత, విదేశీ చెస్ ఆటగాళ్లు కూడా హాజరవుతున్నారు. పెళ్లి తర్వాత సెర్బియా రాజధాని బెల్గ్రేడ్లో విందు జరిగే అవకాశం ఉంది. తరచుగా టోర్నీల్లో పాల్గొనడం కోసం నేను ప్రస్తుతం చెక్ రిపబ్లిక్ రాజధాని ప్రాగ్లో స్థిర నివాసం ఏర్పరచుకున్నాను. వివాహానంతరం అక్కడికే వెళ్లిపోతాను. నాడ్జ ఇప్పుడిప్పుడే తెలుగు నేర్చుకుంటోంది. కలిసి చాలా తెలుగు సినిమాలు చూశాం. ఆమెకు పవన్ కళ్యాణ్ అంటే చాలా అభిమానం. ఇష్టపడిన వ్యక్తితో నా ప్రేమ చివరకు పెళ్లి దాకా చేరడం చాలా సంతోషంగా ఉంది.’ -
చాంప్స్ సృజన్ కీర్తన్, అద్వైత
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర చెస్ చాంపియన్షిప్లో హైదరాబాద్ క్రీడాకారులు ఎస్. సృజన్ కీర్తన్, అద్వైత శర్మ పురుషుల, మహిళల విభాగాల్లో చాంపియన్లుగా నిలిచారు. తద్వారా జాతీయ చెస్ టోర్నీలో పాల్గొనే రాష్ట్ర జట్టులో చోటు దక్కించుకున్నారు. వీరితో పాటు పురుషుల విభాగంలో రెండో స్థానంలో నిలిచిన ఎం. విశ్వనాథ్ (కరీంనగర్), డి. నాగ శశాంక్ (మూడో స్థానం, రంగారెడ్డి), వెటరన్ ప్లేయర్ వి. దివాకర్ (నాలుగో స్థానం, హైదరాబాద్), పి. షణ్ముఖ తేజ (ఐదో స్థానం, హైదరాబాద్) కూడా రాష్ట్ర జట్టుకు ఎంపికయ్యారు. మహిళల విభాగంలో తొలి ఐదు స్థానాల్లో నిలిచిన కె. అద్వైత శర్మ, పి. యజ్ఞప్రియ (హైదరాబాద్), వి. చైతన్య (రంగారెడ్డి), టి. విజ్ఞశ్రీ (రంగారెడ్డి), టి. జయశ్రీ తరణి ప్రియ (రంగారెడ్డి) తెలంగాణకు ప్రాతినిధ్యం వహించనున్నారు. ఫిబ్రవరి 7 నుంచి భువనేశ్వర్లో జాతీయ స్థాయి చెస్ టోర్నీ జరుగుతుంది. -
సంయుక్త ఆధిక్యంలో విశ్వనాథన్ ఆనంద్
ప్రతిష్టాత్మక టాటా స్టీల్ మాస్టర్స్ చెస్ టోర్నమెంట్లో ఐదు రౌండ్లు ముగిశాక భారత దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ 3.5 పాయింట్లతో సంయుక్తంగా ఆధిక్యంలో కొనసాగుతున్నాడు. నెదర్లాండ్స్లోని విక్ ఆన్ జీ పట్టణంలో జరుగుతున్న ఈ టోర్నీలో వీ యి (చైనా)తో జరిగిన ఐదో రౌండ్ గేమ్ను ఆనంద్ 29 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకున్నాడు. ప్రస్తుతం ఆనంద్తోపాటు అనీశ్ గిరి (నెదర్లాండ్స్), మమెదైరోవ్ (అజర్బైజాన్) 3.5 పాయింట్లతో ఉమ్మడిగా అగ్రస్థానంలో ఉన్నారు. -
ఆనంద్కు కాంస్యం
రియాద్: భారత చెస్ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ ఈ ఏడాదిని గొప్పగా ముగించాడు. మూడు రోజుల క్రితం ప్రపంచ ర్యాపిడ్ చాంపియన్షిప్లో విజేతగా నిలిచిన ఆనంద్... అదే వేదికపై జరిగిన ప్రపంచ బ్లిట్జ్ చాంపియన్షిప్లో కాంస్య పతకాన్ని సాధించాడు. శనివారం ముగిసిన ఈ మెగా ఈవెంట్లో 48 ఏళ్ల ఆనంద్ నిర్ణీత 21 రౌండ్లు పూర్తయ్యాక 14.5 పాయింట్లతో సెర్గీ కర్జాకిన్ (రష్యా)తో కలిసి సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచాడు. అయితే మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా ర్యాంక్ను వర్గీకరించగా కర్జాకిన్కు రెండో స్థానం, ఆనంద్కు మూడో స్థానం లభించాయి. ఒక్కొక్కటి మూడు నిమిషాల నిడివిగల 21 గేముల్లో ఆనంద్ తొమ్మిదింటిలో గెలిచి... 11 ‘డ్రా’ చేసుకున్నాడు. మరో గేమ్లో ఓడిపోయాడు. 16 పాయింట్లతో మాగ్నస్ కార్ల్సన్ (నార్వే) టైటిల్ సాధించాడు. -
కార్ల్సన్కు ఆనంద్ షాక్
రియాద్: ప్రపంచ ర్యాపిడ్ చెస్ చాంపియన్షిప్లో భారత గ్రాండ్ మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ తన మ్యాజిక్ చూపించాడు. ప్రపంచ చాంపియన్ మాగ్నస్ కార్ల్సన్ (నార్వే)కు షాకిచ్చాడు. బుధవారం ఓపెన్ విభాగంలో జరిగిన తొమ్మిదో రౌండ్ గేమ్లో నల్లపావులతో ఆడిన ఆనంద్ 34 ఎత్తుల్లో కార్ల్సన్ను చిత్తు చేశాడు. తర్వాత వాంగ్ హావో (చైనా)తో జరిగిన పదో రౌండ్ గేమ్ను 23 ఎత్తుల్లో డ్రా చేసుకున్నాడు. 10 రౌండ్లు ముగిసే సరికి ఆనంద్ 7.5 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచాడు. అంతకుముందు పొంక్రటోవ్ (రష్యా)తో జరిగిన ఆరో రౌండ్ గేమ్, మెక్షానే (ఇంగ్లండ్)తో జరిగిన ఏడోరౌండ్ గేమ్, ఫెడసీవ్ (రష్యా)తో జరిగిన ఎనిమిదోరౌండ్ గేమ్లను ఆనంద్ డ్రా చేసుకున్నాడు. ఆంధ్రప్రదేశ్ గ్రాండ్ మాస్టర్ పెంటేల హరికృష్ణ బుధవారం జరిగిన ఐదు గేముల్లో ఒక మ్యాచ్లో గెలిచి, మూడు మ్యాచ్ల్ని డ్రా చేసుకున్నాడు. మమెదేవ్ (అజర్బైజాన్)తో జరిగిన పదోరౌండ్ గేమ్ను 51 ఎత్తుల్లో కోల్పోయి 6 పాయింట్లతో 37వ స్థానంలో నిలిచాడు. మహిళల విభాగంలో ద్రోణవల్లి హారిక 7 పాయింట్లతో తొమ్మిదో స్థానంలో ఉంది. ఆమె రెండు గేముల్లో గెలిచి మరో రెండింటినీ డ్రా చేసుకుంది. ఎనిమిదో రౌండ్లో రష్యన్ ప్రత్యర్థి చేతిలో ఓటమి పాలైంది. -
యాచకుడిగా మారిన క్రీడాకారుడు
శరవేగంగా ఆలోచించాలి. ఎత్తులకు పై ఎత్తులు వేయాలి. ఎదుటివాడి తెలివికి చెక్ చెప్పాలి. అప్పుడే విజయం. అది జీవితమైనా, చదరంగం ఆటైనా... అయితే చదరంగంలో అవలీలగా గెలిచిన ఓ క్రీడాకారుడు జీవిత సమరంలో మాత్రం కూలబడి, ఓడిపోయాడు. పతకాలు, పురస్కారాలు అందుకున్న అదే చేయి ఇప్పుడు చిల్లర కోసం యాచిస్తోంది. సాక్షి, హైదరాబాద్ (తార్నాక): ఎం.వై రాజు. ప్రతిభ కలిగిన చదరంగ క్రీడాకారుడు.. రెండు వేల రేటింగ్ కలిగిన ప్రతిభాశాలి. జాతీయ స్థాయిలో ఎన్నో అవార్డులతో పాటు బంగారుపతకం కూడా అందుకున్న ఆటగాడు. నగరంలో ఎక్కడ చెస్ టోర్నమెంట్ జరిగినా అక్కడ ప్రత్యక్షమయ్యేవాడు. ఒకప్పుడు రైల్వేలో మంచి ఉద్యోగం.. చదరంగంలో రాణింపు.. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. జీవితంలో అన్నీ కోల్పోయాడు. ఆటకూ దూరమయ్యాడు. నాఅన్నవారే లేక యాచకుడిగా మారాడు. కుటుంబ నేపథ్యం... రాజు ఒంగోలులో 1969లో పుట్టారు. తండ్రి ప్రభుత్వ ఉద్యోగి కావడంతో తరచూ బదిలీల కారణంగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఆయన విద్యాభ్యాసం సాగింది. నగరంలోని సిటీ కాలేజ్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. రాజుకు చిన్ననాటి నుంచే చదరంగం అంటే అమితాసక్తి. ఈ విషయాన్ని గమనించిన తండ్రి రాజును బాగా ప్రోత్సహించారు. రూ.3 లక్షలు విలువ చేసే చదరంగం పుస్తకాల్ని అప్పట్లో కొనిచ్చారు. అదే స్ఫూర్తితో ఎదిగిన రాజు జాతీయస్థాయిలో క్రీడాకారుడిగా రాణించారు. ఆ ప్రతిభతోనే 1993లో దక్షిణ మధ్య రైల్వేలో ఉద్యోగం సాధించారు. గాడితప్పిన జీవితం.. చదరంగంలో జాతీయ స్థాయి క్రీడాకారుడిగా వెలిగిన రాజు జీవితం తల్లిదండ్రుల మరణంతో ఒక్కసారిగా గాడితప్పింది. అతడ్ని దురలవాట్ల వైపు మళ్లించింది. క్రీడను నిర్లక్ష్యం చేశాడు. విధులకు గైర్హాజరుకావడంతో ఉద్యోగం పోయింది. యాచకుడిగా మార్చింది. చదరంగంలో నేటికీ రాజే... మానసిక పరిస్థితి అంతబాగాలేకున్నా కూడా రాజు చదరంగంలో నేటికీ రాజే. నగరంలో ఎక్కడ పోటీలు జరిగినా అక్కడకు వెళ్లి క్రీడలో గెలిచి ప్రైజ్మనీని తన ఖర్చులకు వినియోగిస్తున్నట్లు రాజు ‘సాక్షి’కి తెలిపారు. క్రీడా ప్రస్థానం.. ► 1988 రాజమండ్రిలో జరిగిన జాతీయ జూనియర్ చెస్ పోటీల్లో పాల్గొని ఒక్క పాయింట్లో చాంపియన్షిప్ను కోల్పోయాడు. ► 1992 నగరంలో జరిగిన ఇంటర్ యూనివర్సిటీ చెస్పోటీల్లో బంగారు పతకం. ► 1992 కోల్కతాలో జరిగిన నేషనల్ చెస్ పోటీల్లో జాతీయ అవార్డు. ► 2000 నగరంలో జరిగిన ఆల్ ఇండియా చెస్ పోటీల్లో గోల్డ్మెడల్. ప్రస్తుతం.. రాజు నాలుగేళ్లుగా తార్నాక చౌరస్తాలోని గణపతిఆలయంలో యాచకుడిగా జీవితాన్ని గడుపుతున్నాడు. ఆయన ఆరోగ్యపరిస్థితిపై ఆందోళన చెందిన కొందరు మిత్రులు రెండు నెలల క్రితం వైద్యపరీక్షలు చేయించారు. స్కీజోఫ్రోనియాతో బాధపడుతున్నట్లు వైద్యులు తేల్చారు. మెరుగైన వైద్యం చేయించేందుకు మిత్రులంతా ఓ గ్రూప్గా ఏర్పడి సాయంమందించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వం ముందుకు వచ్చి రాజుకు వైద్యసాయమందించాలని స్నేహితులు కోరుతున్నారు. -
ఆ క్రికెటర్ కొడుకుతో చెస్ ఆడినా..!
సోషల్ మీడియాలో విమర్శల వర్షం ఈ మధ్య క్రికెటర్లు, సినిమా స్టార్లు ఏం పోస్టు చేసినా.. అయినదానికి కానిదానికి వారికి కించపరిచడం, పరిహాసించడం సోషల్ మీడియాలో సర్వసాధారణంగా మారింది. ముఖ్యంగా మతం పేరిట విమర్శలు చేయడం, కించపరచడం నిత్యకృత్యంగా కనిపిస్తోంది. మొన్నటికిమొన్న భార్యతో దిగిన ఫొటోను పోస్టు చేసినందుకు క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్పై కొందరు మతం పేరిట ఆగ్రహం వ్యక్తం చేశారు. సూర్యనమస్కారం చేస్తున్న ఫొటోను పోస్టు చేసినందుకు మరో క్రికెటర్ మహమ్మద్ కైఫ్పై పలువురు మండిపడ్డారు. ఇవి తమ మతానికి విరుద్ధమంటూ విద్వేషం వెళ్లగక్కారు. తాజాగా క్రికెటర్ కైఫ్.. తన కొడుకు చెస్ ఆడుతున్న క్యూట్ ఫొటోను పోస్టు చేసినా.. విమర్శలు తప్పలేదు. ఓ మంచి విషయాన్ని ఆయన షేర్ చేసుకున్నా.. కొందరు మాత్రం మతకోణంలో విపరీత అర్థాలు తీసి విమర్శలు చేశారు. ఇస్లాం మతంలోని నిబంధనలు ప్రస్తావిస్తూ ఆయన తీరును తప్పుబట్టారు. 'ఇస్లాం ప్రకారం చెస్ ఆడటం నిషేధం. నేను మంచి చెస్ ఆటగాడిని కానీ చెస్ ఆడకూడదని హదీత్లో చదివిన తర్వాత చెస్ ఆడటం మానేశాను' అని నెటిజన్ అభిప్రాయపడగా.. 'మరోసారి ఖూరాన్' చదవమంటూ మరొకరు కైఫ్ను తప్పుబట్టారు. ఈమేరకు ఆయన పోస్టుపై పలు వ్యతిరేక, విద్వేష వ్యాఖ్యలు వెల్లువడ్డాయి. మరోవైపు ఇంకొందరు నెటిజన్లు మాత్రం కైఫ్ చర్యను స్వాగతించారు. ఈ విషయంలో కైఫ్ పోస్టుపై అనుకూల, ప్రతికూల వ్యాఖ్యలు వెల్లువెత్తాయి. -
25, 26 తేదీల్లో చెస్ టోర్నీ
విజేతకు10 వేల నగదు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రస్థాయి చెస్ టోర్నమెంట్ పోటీలు ఈ నెల 25, 26 తేదీల్లో సూర్యాపేటలో జరుగనున్నాయి. పట్టణంలోని బాలుర హైస్కూల్లో ఈ పోటీలు నిర్వహించనున్నట్లు తెలంగాణ చెస్ సంఘం కార్యదర్శి ఆనంచిన్ని వెంకటేశ్వర్ రావు తెలిపారు. విజేతగా నిలిచిన వారికి ట్రోఫీతో పాటు రూ. 10 వేల నగదు, రన్నరప్కు రూ. 3,500, కాంస్య పతక విజేతకు రూ. 2,500 నగదు బహుమతి అందజేయనున్నట్లు ఆయన చెప్పారు. తెలంగాణ వ్యాప్తంగా చెస్లో ప్రతిభ ఉన్న క్రీడాకారులను ప్రోత్సహిం చేందుకు ఇలాంటి టోర్నీలను క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నట్లు వెంకటేశ్వర్రావు తెలిపారు. ఈ టోర్నీలో పాల్గొనాలనుకునే బాలబాలికలు సూర్యపేట జిల్లా చెస్ సంఘం కార్యదర్శి పారుపల్లి చంద్రశేఖర్ (94913–29171)ను సంప్రదించవచ్చు.