film actor
-
కుంభమేళా మోనాలిసా.. మరో వీడియో వైరల్
ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో కుంభమేళా అత్యంత వైభవంగా జరుగుతోంది. దీనికి సంబంధించిన ఫొటోలు వీడియోలు వైరల్గా మారుతున్నాయి. కుంభమేళాలో కనిపించిన కొందరు వ్యక్తులు కూడా అందరి నోళ్లలో నానుతున్నారు. వారిలో ఒకరే కుంభమేళాలో పూసల దండలు అమ్మేందుకు వచ్చిన తేనెళ్ల మోనాలిసా. ఆమె తాజాగా మరో వీడియో విడుదల చేసింది.కుంభమేళా మోనాలిసా(Kumbh Mela Mona Lisa)కు సంబంధించిన పలు వీడియోలు, రీల్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్గా మారాయి. దీంతో ఆమె విధిరాత మారిపోయిందంటున్నారు. త్వరలోనే ఆమె సినిమాల్లో నటించనుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఆమె ‘డైరీ ఆఫ్ మణిపూర్’ అనే చిత్రంలో నటించనున్నదని, ఇందుకోసం ఆమె సంబంధిత ప్రాజెక్టుపై సంతకం చేసిందనే వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఇంతలో, తాజాగా మోనాలిసా మరో వీడియోను వీడుదల చేశారు. దీనిలో ఆమె సోషల్ మీడియాలో తనపై వస్తున్న వార్తలకు, ఊహాగానాలకు వివరణ ఇచ్చారు.#monalisabhosle video #MahaKumbh2025 pic.twitter.com/OgosaBMXeg— Narinder Saini (@Narinder75) February 2, 2025ఆ వీడియోలో మోనాలిసా మాట్లాడుతూ ‘హలో.. నేను మోనాలిసా. నేను రుద్రాక్ష దండలు అమ్మడానికి మహా కుంభమేళాకు వెళ్లాను. మహాదేవుని అనుగ్రహంతో పాటు అందరి ఆశీస్సులతో నేను రాత్రికి రాత్రే ప్రసిద్ధి చెందాను. నా పట్ల మీరు చూపిస్తున్న ప్రేమకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. మీ అందరి దయతోనే నాకు ‘ది డైరీ ఆఫ్ మణిపూర్’(‘The Diary of Manipur’) అనే సినిమాలో అవకాశం వచ్చింది. దీనికి డైరెక్టర్ సనోజ్ మిశ్రా. ఆయన మా ఇంటికి వచ్చి అగ్రిమెంట్ కుదుర్చుకుని వెళ్లారు. హీరోయిన్ కావాలనేది నా కోరిక. అది ఈరోజు నెరవేరబోతోంది. మీ అందరి ఆశీస్సులు ఇలాగే కొనసాగాలి. మీరందరూ నన్ను ఆశీర్వదించండి. ప్రస్తుతం నేను నటన నేర్చుకోబోతున్నాను. ఆ తరువాత సినిమాల్లో నటిస్తాను. మోనాలిసా లక్షలు సంపాదిస్తోందని సోషల్ మీడియాలో రాస్తున్నారు. ఎవరో నాకు కారు ఇచ్చారని కూడా రాశారు. ఇవన్నీ అబద్దాలే. అయితే సనోజ్ మిశ్రా జీ ముంబై నుండి వచ్చి నాకు సినిమా ఆఫర్ ఇచ్చారు. ఇకపై నేను ముందుకు సాగడానికి మీరందరూ నన్ను ఆశీర్వదించండి’ అని మోనాలిసా కోరారు.ఇది కూడా చదవండి: రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మహాకుంభ్ యాత్రికులు మృతి -
యంత్రాలు రీప్లేస్ చేస్తాయి!
‘‘మనందరం ఇప్పుడు ఏకతాటిపై నిలవక΄ోతే కచ్చితంగా మనల్ని యంత్రాలు రీప్లేస్ చేస్తాయి’’ అన్నారు సాగ్–ఆఫ్ట్రా (సీనియర్ యాక్టర్స్ గిల్డ్–అమెరికన్ ఫెడరేషన్ ఆఫ్ టెలివిజన్ అండ్ రేడియో ఆర్టిస్ట్స్) అధ్యక్షురాలు ఫ్రాన్ డ్రెస్చెర్. కొన్ని వారాలుగా సమ్మె చేస్తున్న డబ్లు్యజీఏ (రైటర్స్ గిల్డ్ ఆఫ్ అమెరికా)కి పూర్తి మద్దతు ప్రకటించారామె. ఈ సందర్భంగా ఆమె చేసిన వ్యాఖ్యలు వైరల్గా మారాయి. ‘‘నటీనటులు అణచివేతకు గురవుతున్నారు. వారికి తగిన గౌరవం దక్కడంలేదు. చిత్రపరిశ్రమలో ఏం జరుగుతుందనేది అందరికీ చాలా ముఖ్యం. ఎందుకంటే ఇక్కడ ఏం జరుగుతుందో మిగతా అన్ని రంగాల్లోని కార్మికులకు అదే జరుగుతోంది. యజమానులు అత్యాశకు ΄ోతున్నారు. యంత్రాలను నడిపించే సహాయకులను (కార్మికులను ఉద్దేశించి) మర్చి΄ోతున్నారు. వారు చేస్తున్న సేవలను గుర్తించడంలేదు. ఇది నిజంగా సిగ్గుపడాల్సిన విషయం. సీఈవోలకు ఏకంగా వందల మిలియన్ల డాలర్లలో అధిక వేతనాలు ఇవ్వడంవల్ల ఆర్థిక ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ఇక్కడ బాధితులు ఎవరంటే మేమే (కార్మికులు). వ్యా΄ారంలో ఉన్నవాళ్లు మా పట్ల వ్యవహరిస్తున్న తీరు షాకింగ్గా ఉంది’’ అని ఘాటుగా స్పందించారు ఫ్రాన్ డ్రెస్చెర్. తగ్గేదే లే... ‘‘ఏఐ వల్ల ముప్పే’’ అంటూ సమ్మెలో భాగంగా నినాదాలు చేస్తున్నారు. ఇప్పటికే ఏఐ న్యూస్ రీడర్స్ వచ్చిన నేపథ్యంలో ఏఐ వల్ల చిత్రపరిశ్రమలోనూ పెను మార్పు సంభవించే అవకాశం ఉందని హాలీవుడ్ కళాకారులు వా΄ోతున్నారు. అయితే ఏఐ వినియోగాన్ని తగ్గించాలన్న కళాకారుల డిమాండ్ని నిర్మాణ సంస్థలు వ్యతిరేకిస్తున్నాయి. అలాగే నటీనటుల వేతనాలు పెంపుకు కూడా నిర్మాతలు సుముఖత వ్యక్తపరచడంలేదన్నది హాలీవుడ్ టాక్. ఈ నేపథ్యంలో నటీనటులు కూడా తమ డిమాండ్లను ఆమోదించేవరకూ సమ్మె కొనసాగించే తీరాలనీ, తగ్గేదే లే అనే పట్టుదలతో ఉన్నారనీ సమాచారం. -
రోడ్డు ప్రమాదానికి గురైన 'సలార్' విలన్.. నేడు సర్జరీ
మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రమాదానికి గురయ్యారు. మరయూర్ బస్టాండ్లో ‘విలాయత్ బుద్ధ’ సినిమా షూటింగ్లో ఈ ఘటన చోటుచేసుకుంది. సినిమాకు సంబంధించి కొన్ని భారీ యాక్షన్ సీన్స్ షూట్ చేస్తుండగా.. ఆయనకు ప్రమాదం జరిగింది. KSRTC బస్సులో ఓ ఫైట్ సీన్ను షూట్ చేస్తుండగా ఆయన జారి కిందపడ్డాడు. దీంతో ఆయన కాలికి గాయం అయింది. వెంటనే ఆయనను చికిత్స కోసం కొచ్చిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. నేడు ఆయనకు ఆపరేషన్ చేయనున్నారు. ఈ ఆపరేషన్ తరువాత పృథ్వీరాజ్ సుమారు మూడు నెలలు రెస్ట్ తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. దీంతో ఆయన ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. (ఇదీ చదవండి: ప్రముఖ కమెడియన్ కుమారుడితో అర్జున్ కూతురు పెళ్లి) మరయూర్లో గంధపు చెక్కల వెలికితీతకు సంబంధించిన కథాంశంతో తెరకెక్కిన చిత్రం 'విలాయత్ బుద్ధ'. ఈ సినిమా షూటింగ్ కొన్ని నెలలుగా అదే ప్రాంతంలో జరుగుతోంది. ఇకపోతే తెలుగువారికి కూడా పృథ్వీరాజ్ సుపరిచితమే. పవన్, రానా నటించిన భీమ్లా నాయక్ ఒరిజినల్ వెర్షన్లో హీరోగా నటించింది ఆయననే.. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా రూపొందుతున్న సినిమా 'సలార్'లో ఆయన కీ రోల్ విలన్ పాత్రలో చేస్తున్నారు. ఇప్పటికే ఆయన ఫస్ట్ లుక్ను కూడా మేకర్స్ విడుదల చేశారు. (ఇదీ చదవండి: పెళ్లయిన 15 రోజులకే విడాకులు.. బుల్లితెర జంటపై సింగర్ విమర్శలు!) -
ఈశ్వర్ టూ ఆదిపురుష్.. ప్రభాస్ కటౌట్ చూస్తే దిమ్మతిరగాల్సిందే..
-
Vijay Devarakonda: ప్రతీ సినిమాలో కొత్త రకం బైక్
వెబ్డెస్క్ : రౌడీ హీరో విజయ్ దేవరకొండ యాట్యిట్యూడ్కు పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. పెళ్లి చూపుల్లో అమాయకంగా కనిపించిన విజయ్ దేవరకొండ ఆ తర్వాత వచ్చిన అర్జున్రెడ్డిలో నట విశ్వరూపమే చూపించాడు. ఎంతో మంది అభిమానాన్ని సంపాదించుకున్నారు. గీతగోవిందంలో భయస్తుడిలా కనిపించినా.. డియర్ కామ్రేడ్లో ఆవేశపరుడిగా మెప్పించాడు విజయ్. వింటేజ్ టూ విదేశీ పాత్ర ఏదైనా సరే తన ప్రతీ సినిమాలో యూత్ని ఎట్రాక్ట్ చేసే బైక్స్ వాడేస్తుంటాడు విజయ్ దేవరకొండ. వింటేజ్ నుంచి విదేశీ భైకుల వరకు తన సినిమాలో బైక్లకు ప్రత్యేక స్థానాన్ని కేటాయిస్తాడు. నెక్ట్స్ సినిమాలో విజయ్ ఏ బైక్ యూజ్ చేస్తాడా అని అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తుంటారు. తాజాగా బాలీవుడ్ ఏస్ వన్ ఫోటోగ్రాఫర్ దబు రత్నానీ ఫోటోషూట్లో ట్రంఫ్ బైక్తో కనిపించారు విజయ్ దేవరకొండ. ఇప్పటి వరకు విజయ్ చిత్రాల్లో రైడ్ చేసిన బైకులు.. వాటి ధరల ఎంతో చూద్దాం (ఎక్స్షోరూం) Yezdi 300, ధర రూ. 1.6 లక్షలు సుజికీ యాక్సెస్, ధర రూ. 74 వేలు రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ ధర రూ. 1.6 లక్షలు సీబీజెడ్ ఎక్స్ట్రీం ధర రూ. 81 వేలు రాయల్ఎన్ఫీల్డ్ కాంటినెంటల్ జీటీ రూ. 2.5 లక్షలు బొనవిల్లే స్పీడ్మాస్టర్ ట్రయంఫ్ రూ. 11.75 లక్షలు యమహా వైజెడ్ డర్ట్ బైక్ ధర రూ. 4 లక్షలు బీఎస్ఏ గోల్డ్స్టార్ ధర 2,000 యూరోలు బీఎండబ్ల్యూ జీ 310 ధర రూ. 2.90 లక్షలు బజాజ్ చేతక్ ధర రూ. 23,000 చదవండి : ఆడి నుంచి ఈ - ట్రోన్ ఎస్యూవీ -
విషాదం...ఆటోలో నటుడి మృతదేహం
సినిమాలపై మోజులు చాలామంది కన్నవారిని, ఉన్న ఊరిని వదిలి నగరాలకు వస్తారు. సినిమా అవకాశాల కోసం స్టూడియోల చుట్టూ కాళ్లు అరిగేలా తిరుగుతారు. చివరకు ఏదోలా సినిమా చాన్స్ వచ్చినా.. తర్వాత నిలదొక్కుకోలేక చాలామంది ప్రాణాలు కూడా తీసుకుంటారు. మరికొంత మంది రోడ్ల పక్కన, బస్టాండ్స్లో చాయ్, కూరగాయాలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తుంటారు. తెరపై వినోదాన్ని అందించే సినీనటులు.. నిజ జీవితంలో మాత్రం ఎన్నో కష్టాలు పడతారు. తాజాగా ఓ తమిళ నటుడు.. సినిమా అవకాశాలు రాక, రోడ్లుపై ఉంటూ.. చివరకు ఆటోలోనే మృతిచెందాడు. హృదయ విచారకర ఘటన చెన్నైలో చోటు చేసుకుంది. ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న తమిళ నటుడు విరుత్చకాకాంత్ బాబు ఆటోలోనే తనువు చాలించాడు. తమిళ హీరో భరత్ నటించిన ‘ప్రేమిస్తే’ సినిమాలో విరుత్చకాకాంత్ బాబు ఓ చిన్న పాత్రలో నటించాడు. ఆ సినిమా తర్వాత అతనికి పెద్దగా అవకాశాలు రాలేదు. దానికి తోడు అతని తల్లిదండ్రులు ఇటీవల మృతి చెందారు. దీంతో మానసికంగా కృంగిపోయిన విరుత్చకాకాంత్ బాబు.. కొద్ది రోజులుగా చెన్నైలోనే ఉంటున్నాడు. రూమ్ కిరాయిలు కట్టేందుకు డబ్బులు లేకపోవడంతో రోడ్ల పక్కన, బస్టాండ్లల్లో ఉంటూ సినిమా అవకాశాల కోసం తిరిగాడు. సినిమా అవకాశాలు లేక, తిండి దొరక్క చివరకు ఇలా ఒక ఆటోలో నిద్రిస్తున్న సమయంలో మృతి చెందాడు. -
రాజకీయాల్లో సినీ స్టార్ల ప్రాభవం అంతరించినట్లే!
సినిమాలంటే వెర్రెత్తిపోయే తమిళనాడులో కూడా ఎన్నికల సమరంలో రాజకీయ ప్రత్యర్థులను సినిమా సూపర్ స్టార్లు ఊడ్చిపారేసే కాలం ముగిసిపోయినట్లేనా? వెండితెర ఇలవేల్పు అయిన ఎన్టీరామారావును సీఎంగా గెలి పించిన ఆంధ్రప్రదేశ్లోనూ ఇదే పరిస్థితి నెలకొన్నదా? బహుశా రజనీకాంత్ దీన్ని గుర్తించే కాబోలు.. చివరి నిమిషంలో రాజకీయాల్లోకి రావడం నా వల్ల కాదనేశారు. రజనీకాంత్ను దాటి ముందుకెళ్లిన మరో సూపర్ స్టార్ కమలహాసన్ 2019 సార్వత్రిక ఎన్నికల్లో పెద్దగా ప్రభావం చూపనప్పటికీ తాజాగా తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. ఈ సంవత్సరం ఏప్రిల్–మే ఎన్నికల్లో అసెంబ్లీ స్థానాలను ఎక్కువగా గెల్చుకోకపోవచ్చు కానీ అగ్రస్థానంలో నిలబడాలని పోరాడుతున్న రెండు ప్రధాన ద్రావిడ పార్టీలలో ఏదో ఒక పార్టీకి కమల్ సమస్యలు సృష్టించవచ్చు. 2009లో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో మెగాస్టార్ చిరంజీవి పాత్రను గుర్తుంచుకోండి చాలు. తెలుగు మాట్లాడే ప్రాంతంలో రజనీకాంత్ కంటే చిరంజీవి ఎక్కువ క్రేజ్ ఉన్న సూపర్స్టార్. 2008లో ప్రజారాజ్యం పేరిట తన సొంత రాజకీయ పార్టీని ప్రారంభించి సీఎం అవ్వాలని తీవ్రంగా కృషి చేశారు. అయితే రియల్ లైఫ్కి రీల్ లైఫ్కి చాలా తేఢా ఉంటుంది. అందుకే ప్రజారాజ్యం పోటీ చేసిన 296 అసెంబ్లీ స్థానాల్లో 276 స్థానాలను కోల్పోయింది. చివరకు కులపరంగా మెజారిటీ ఉండే తన సొంత ఊరు పాలకొల్లులో ఓడిపోయి పరాభవాన్ని చవి చూశారు. చిరు రాజకీయ జీవితాన్ని చాలా సన్నిహితంగా చూసిన రజనీకాంత్ కీలక సమయంలో చాలా తెలివిగా తనదైన నిర్ణయం తీసుకున్నారు. చిరంజీవి తర్వాత తన పార్టీని కాంగ్రెస్లో కలిపేశారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ తర్వాత 2014లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్తోపాటు చిరంజీవి కూడా కనుమరుగైపోయారు. ఇప్పుడు తమిళనాడు విషయానికి వస్తే, కమల హాసన్ లోక్సభ ఎన్నికల్లో నాలుగు శాతం ఓట్ల షేరుకు పరిమితమైపోయారు. అయితే తమిళ రాజకీయ దిగ్గజాలైన కరుణానిధి, జయలలిత కన్నుమూసిన తర్వాత ఏర్పడిన రాజకీయ శూన్యాన్ని పూరించే విషయంలో సమీపానికి కూడా కమల్ చేరుకోలేకపోయారు. తమిళ రాజకీయాల్లో ఏర్పడిన శూన్యాన్ని ప్రస్తుత సీఎం ఎడపాడి పళనిస్వామి పూరించేశారని, అన్నాడీఎంకేపై పట్టు సాధించడమే కాకుండా ఒకమేరకు సత్పరిపాలనను అందిస్తున్నారన్న వాస్తవాన్ని గమనించడంలో కమల్ బహుశా విఫలమై ఉండవచ్చు. అదే సమయంలో డీఎంకే పార్టీ శ్రేణులపై ఎంకే స్టాలిన్ తన పట్టును స్థిరపర్చుకున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రజనీ కాంత్ చిట్టచివరలో రాజకీయాల్లోంచి వైదొలగాలని నిర్ణయించుకున్నారు. ఆయన రాజకీయ ప్రాభవాన్ని ఉపయోగించుకుని తమిళనాడులో భారీ స్థాయిలో ప్రవేశించాలనుకున్న బీజేపీ పథకాలకు కూడా రజనీ గండికొట్టారు. మరి కమలహాసన్ కానీ, ఆంధ్రప్రదేశ్లో పవర్స్టార్ పవన్ కల్యాణ్ కానీ రాజకీయంగా బలమైన పాత్ర పోషించగలరా? తెలుగు ప్రజలు దేవుడిగా భావించే ఎన్టీఆర్ సొంత రాజకీయ పార్టీని స్థాపించి కేవలం 9 మాసాల్లోనే అధికారాన్ని చేజిక్కించుకున్నారు. బలమైన కాంగ్రెస్ పార్టీని తుడిచిపెట్టేశారు. ఆ సమయంలో కాంగ్రెస్ అధిష్టానం ఆంధ్రప్రదేశ్ నాయకులను నిర్లక్ష్యంగా చూడటంతో జాతీయ పార్టీకి వ్యతిరేకంగా ఆంధ్రులను రెచ్చగొట్టిన ఎన్టీఆర్ ఆంధ్రుల ఆత్మగౌరవం పేరిట అధికారాన్ని కైవసం చేసుకున్నారు. ఈరోజు ఏపీ, తమిళనాడు రాష్ట్రాల్లో ప్రభుత్వం లోనూ, ప్రతిపక్షంలోనూ పాతుకుపోయిన రాజకీయ నేతలను పక్కకునెట్టి ఒక సినీ స్టార్ ఆవిర్భవించే పరిస్థితులు లేవనే చెప్పాలి. పెద్ద రాజకీయ పార్టీలు జరిపే రాజకీయ సమరంలో వోట్లను చీల్చివేసే తరహా పాత్ర పోషణకే ప్రస్తుతం చిత్రసీమ ప్రముఖులు పరిమితం కావచ్చు. సినిమాలంటే పిచ్చిప్రేమ చూపించే తమిళనాడులో, ఆంధ్రప్రదేశ్లో రాజకీయంగా కలలు పండించుకోవాలని చూస్తున్న ఏ సినిమా స్టార్కైనా ఇదే పరిస్థితి ఎదురుకావచ్చు. ఒక్కమాటలో చెప్పాలంటే తమిళనాడులో సినీ హీరోలు విజయవంతమైన రాజకీయ నేతలుగా మారే రోజులకు కాలం చెల్లిపోయినట్లే. లక్ష్మణ వెంకట కూచి వ్యాసకర్త రాజకీయ విశ్లేషకులు -
సినీ నటుడు నర్సింగ్ యాదవ్ కన్నుమూత
సాక్షి, హైదరాబాద్: సినీ నటుడు నర్సింగ్ యాదవ్ (52) కన్నుమూశారు. సోమాజిగూడ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం రాత్రి తుది శ్వాస విడిచారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో నటించిన ఆయన.. కామెడీ, విలన్ పాత్రల్లో నటించి మెప్పించారు. మైలా నరసింహ యాదవ్ను ఇండస్ట్రీలో అందరూ నర్సింగ్ యాదవ్ అని పిలుస్తారు. 1963 మే 15న హైదరాబాద్లో జన్మించిన ఆయనకు భార్య చిత్ర, కొడుకు రిత్విక్ యాదవ్ ఉన్నారు. 300లకు పైగా సినిమాల్లో నటించిన ఆయన కామెడీ విలన్గా, విలక్షణ నటుడిగా మంచి పేరు తెచ్చుకున్నారు. రజనీకాంత్ నటించిన బాషాలోనూ మంచి పాత్ర చేశారు. విజయనిర్మల దర్శకత్వం వహించిన హేమాహేమీలుతో ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు నర్సింగ్ యాదవ్. క్షణక్షణం, గాయం, ముఠామేస్త్రీ, మాస్, శంకర్ దాదా ఎంబీబీయస్, అనుకోకుండా ఒక రోజు, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, రేసుగుర్రం, పిల్లజమీందార్, సుడిగాడు, కిక్ తదితర చిత్రాల్లో ఆయన చేసిన కేరక్టర్లకు చాలా మంచి పేరు వచ్చింది. చిరంజీవి రీ ఎంట్రీ చిత్రం ఖైదీనెంబర్ 150లోనూ నటించారు. గత కొంతకాలంగా నర్సింగ్ యాదవ్కు డయాలసిస్ జరుగుతోంది. నర్సింగ్ యాదవ్ మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. -
సీఎం జగన్ను కలిసిన నటుడు అలీ
సాక్షి, తాడేపల్లి: దేశంలో ఉత్తమ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి నిలుస్తారని సినీ నటుడు అలీ అన్నారు. ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ను బుధవారం ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు. భేటీ ముగిసిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘మా నాయకుడిని మర్యాద పూర్వకంగా కలిశాను. కోవిడ్ సమయంలో సినిమా పరిశ్రమ గురించి సీఎం వాకబు చేశారు. ఇంకా షూటింగ్స్ మొదలు కావడానికి సమయం పడుతుందని చెప్పాను. చిన్న వయసులో ఆయన ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు. ఆయన ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తున్నారు. సహజంగా ఆయన మంచి చేస్తున్నపుడు విమర్శించేవారు విమర్శిస్తుంటారు. వారు చేయలేక పోయారు కాబట్టే ఈయనకి మంచి పేరు వస్తుందన్న అక్కసుతో విమర్శలు చేస్తున్నారు. ఎవరెన్ని విమర్శలు చేసినా దేశంలో బెస్ట్ సీఎంగా జగన్ నిలుస్తార’ని అలీ అన్నారు. 2019 అసెంబ్లీ ఎన్నికలకు ముందు అలీ.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. ఏపీ ఎన్నికల్లో రాష్ట్రమంతా పర్యటించి పార్టీ తరపున ఆయన విస్తృత ప్రచారం చేశారు. కరోనా సంక్షోభంతో దాదాపు ఆరు నెలల పాటు నిలిచిపోయిన సినిమా షూటింగ్లు ఇటీవల మళ్లీ ప్రారంభమయ్యాయి. థియేటర్లు ఇంకా తెరుచుకోలేదు. థియేటర్లు తెరిచేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వాలని సినిమా పరిశ్రమకు చెందిన వారు కోరుతున్నారు. (చదవండి: మంత్రి సీదిరి అప్పలరాజు సాహసం) -
దిబ్బరొట్టె.. వదిలితే ఒట్టే
కాగితం కంటే పల్చగా.. నాన్స్టిక్ పెనంలో నూనె వేయకుండా కాల్చే తెల్ల దోసెలు తినడానికి అలవాటు పడిన వారికి పాలకొల్లు దిబ్బరొట్టె గురించి చెబితే కడుపు నిండిపోతుందేమో. ఇంత మందాన, ఎర్రగా కాలిన ఆ దిబ్బ రొట్టె రుచే వేరు. బొగ్గుల కుంపటిపై పాత కాలం మూకుడు పెట్టి.. అందులో పిండివేసి.. దానిపై మూతవేసి.. ఆపైన ఎర్రటి నిప్పులు వేసి దోరగా కాల్చే మినప రొట్టెను ఓసారి రుచి చూస్తే.. లొట్టలేసుకుని మరీ తినాల్సిందే. సాక్షి ప్రతినిధి, ఏలూరు: పశ్చిమ గోదావరి పాలకొల్లు పేరు చెప్పగానే గుర్తొచ్చేది పంచారామ క్షేత్రాల్లో ఒకటైన క్షీరా రామలింగేశ్వరస్వామి క్షేత్రం. ఈ ప్రాంతం ఎందరో కళామతల్లి ముద్దుబిడ్డలకు జన్మస్థానం. నిప్పులపై కాల్చే మినప దిబ్బరొట్టెకూ పాలకొల్లు ప్రసిద్ధి. దీనిని ఒక్కసారి రుచి చూసిన వారు మళ్లీ మళ్లీ తినాలనుకుంటారు. ఇతర జిల్లాల నుంచి పాలకొల్లు వచ్చే ప్రతి ఒక్కరూ ‘పాలకొల్లు దిబ్బరొట్టె దొరికేదెక్కడ’ అని అడ్రస్ అడిగి మరీ వెళ్లి తింటుంటారు. పట్టణంలోని మారుతి థియేటర్ క్యాంటీన్లో కాల్చే దిబ్బరొట్టె గోదావరి జిల్లాల్లో బాగా ప్రాచుర్యం పొందింది. చింతామణి చట్నీ (శనగ పిండిని ఉడికించి.. తాలింపు వేసిన చట్నీ)తో ఆ రొట్టెను తింటే నాలుక చిమచిమలాడాల్సిందే. ఇలా కాలుస్తారు.. ముందుగా బొగ్గుల పొయ్యి (కుంపటి)లో బొగ్గులను వేసి నిప్పు రాజేస్తారు. దానిపై పాత కాలం నాటి మూకుడు పెట్టి అందులో కొంచెం నూనె వేస్తారు. ఆ తరువాత రవ్వ కలిపిన మినప పిండిని వేసి దానిపై మూత పెడతారు. ఆ మూతపై మరికొన్ని నిప్పులు వేసి రొట్టెల్ని కాలుస్తారు. ఒక్కో రొట్టె కాలడానికి సుమారు 20 నిమిషాలు పడుతుంది. వారంతా రుచిచూశారు.. పాలకొల్లు వచ్చిన ఏ సినిమా నటుడైనా మారుతీ హాల్ క్యాంటీన్కు వెళ్లాల్సిందే. ఈ థియేటర్ ప్రముఖ దర్శకుడు కోడి రామకృష్ణకు చెందినది. ఆయన పాలకొల్లులో ఏటా లలిత కళాంజలి నాటకోత్సవాలు నిర్వహించేవారు. ఈ కార్యక్రమాలకు పెద్దఎత్తున సినిమా నటులు హాజరయ్యేవారు. వారంతా ఇక్కడి దిబ్బరొట్టెను లొట్టలేసుకుని తినేవారు. మెగాస్టార్ చిరంజీవి మొదలుకొని ప్రముఖ దర్శకులు దాసరి నారాయణరావు, ధవళ సత్యం, రవిరాజా పినిశెట్టి వంటి వారంతా ఈ దిబ్బరొట్టె రుచి చూసిన వారే. నిత్యం 500 రొట్టెలకు పైనే.. ప్రతిరోజూ ఇక్కడ సుమారు 30 కేజీలు మినప్పప్పు నానబెడతారు. రోజుకు 500 రొట్టెలు పైనే అమ్ముతుంటారు. ఒక్కో రొట్టె ధర రూ.30. సగం రొట్టె ధర రూ.15. బొగ్గుల పొయ్యి (నిప్పుల కుంపటి) పైనే వీటిని కాలుస్తారు. ఉదయం 6 గంటలు మొదలు రాత్రి 9 గంటల వరకూ ఎప్పుడు చూసినా 20 పొయ్యిలపై వీటిని కాలుస్తూనే ఉంటారు. రొట్టె తినాలంటే నిప్పులపై కాలేవరకూ కనీసం అరగంట సేపు వేచి ఉండాల్సిందే. సెల్ఫ్ సర్వీస్ కావడం వల్ల ఈ క్యాంటీన్కు వచ్చే ప్రముఖులు, సామాన్యులు సైతం కార్లలోను, రోడ్డుపైనే నిలబడి భుజిస్తుంటారు. ఇప్పుడు పాలకొల్లులో వివిధ ప్రాంతాల్లో దిబ్బరొట్టె తయారు చేసే హోటళ్లు వెలిశాయి. అయితే, మారుతీ క్యాంటీన్లో వేసే దిబ్బరొట్టెకు ఉన్నంత గుర్తింపు వీటికి దక్కలేదు. ఆరు దశాబ్దాల చరిత్ర మారుతి థియేటర్ నిర్మించి 60 సంవత్సరాలు దాటింది. అప్పటినుంచీ ఇక్కడ దిబ్బరొట్టె ప్రాముఖ్యత సంతరించుకుంది. మా చిన్నతనంలో రొట్టెను నాలుగు ముక్కలు చేసి అమ్మేవారు. ఈ క్యాంటీన్ను 8 సంవత్సరాల క్రితం లీజుకు తీసుకున్నాను. ఇక్కడి రొట్టెకు గల ప్రాముఖ్యత దృష్ట్యా దిబ్బరొట్టెల్ని వేస్తూనే ఉన్నాం. – మట్టా విజయభాస్కర్, క్యాంటీన్ యజమాని -
అఖండ విజయం మిరాకిల్: అలీ
సాక్షి, విజయవాడ: అపార నమ్మకంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఆంధ్రప్రదేశ్ ప్రజలు గెలిపించారని సినీ నటుడు, వైఎస్సార్సీపీ నేత అలీ అన్నారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు తమపై ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని కోరారు. వైఎస్సార్సీపీ అఖండ విజయం సాధించడం మామూలు విషయ కాదని, మిరాకిల్ అని వర్ణించారు. కొత్త ఇంటికి నవధాన్యాలు ఎంత ముఖ్యమో కొత్త రాజధాని అమరావతికి వైఎస్సార్సీపీ నవతర్నాల పథకాలు అంతముఖ్యమని అన్నారు. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారోత్సవానికి అలీ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ ఆంధ్రప్రదేశ్కు కొత్త రూపు తీసుకొస్తారని ఆకాంక్షించారు. నవతర్నాలతో మంచి పాలన అందిస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. వైఎస్ జగన్ ప్రమాణస్వీకారోత్సవానికి వాతావరణం కూడా అనుకూలించిందన్నారు. జగన్ పాలనలో వర్షాలు సకాలంలో కురుస్తాయని అన్నారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి రావడంతో రాష్ట్ర ప్రజలు చాలా ఆనందంగా ఉన్నారని చెప్పారు. మైనార్టీలంతా వైఎస్ జగన్కు అండగా నిలబడ్డారని పేర్కొన్నారు. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
డైరెక్షన్ అంటే చాలా ఇష్టం
సాక్షి, చాగల్లు: దర్శకుడు అవుదామని చిత్ర పరిశ్రమకు వచ్చి నటుడిని అయ్యానని హీరో, హాస్యనటుడు సప్తగిరి అన్నారు. గణపతి నవరాత్రుల సందర్భంగా పశ్చిమగోదావరి జిల్లా చాగల్లు తెలగా సంఘం ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. తెలగా సంఘం వినాయకుడి ఆలయంలో పూజలు, అభిషేకాలు చేశారు. అనంతరం సప్తగిరి విలేకరులతో మాట్లాడుతూ తాను పరువు సినిమా ద్వారా చిత్రపరిశ్రమకు పరిచయమయ్యానని.. ఇప్పటివరకు 80 సినిమాల్లో హాస్యనటుడిగా నటించానని చెప్పారు. కమెడియన్గా మంచి గుర్తింపు లభించిందన్నారు. పరువు, ఎక్స్ప్రెస్ రాజా, ప్రేమకథా చిత్రం, మనం చిత్రాలు మంచి గుర్తింపును తెచ్చాయన్నారు. సప్తగిరి ఎల్ఎల్బీ, సప్తగిరి ఎక్స్ప్రెస్ సినిమాల్లో హీరోగా నటించానన్నారు. తొలుత సినీ ఇండస్ట్రీలో అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసినట్టు చెప్పారు. ఎ ఫిల్మ్ బై అరవింద్, బొమ్మరిల్లు, పరుగు చిత్రాలకు అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశానన్నారు. డైరెక్షన్ అంటే తనకు చాలా ఇష్టమని, డైరెక్టర్ అవుదామనే ఈ పరిశ్రమలోకి వచ్చానని చెప్పారు. నిర్మాత దిల్రాజు తననెంతగానో ప్రోత్సహించారన్నారు. ఎక్స్ప్రెస్ రాజాలో నటనకు నంది అవార్డు వచ్చిందని చెప్పారు. చిత్ర పరిశ్రమకు రావాలనుకునే యువత బాగా కష్టపడాలని, కష్టపడిన వారికి తగిన గుర్తింపు ఉంటుందన్నారు. టాలెంట్ చాలా మందికి ఉంటుందని, అయితే వ్యక్తిత్వం, మంచి గుణాలు ఉన్నవారు తప్పనిసరిగా విజయం సాధిస్తారన్నారు. తన సొంతూరు తిరుపతి అని చెప్పారు. ప్రేక్షకుల ఆదరాభిమానాలే నటులకు నిజమైన గుర్తింపు అన్నారు. చాగల్లులో దర్శకుడు వీవీ వినాయక్ నివాసంలో విలేకరుల సమావేశం నిర్వహించగా పెద్ద సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు. సప్తగిరిని చూసేందుకు ఆయనతో ఫొటోలు దిగేందుకు ఎగబడ్డారు. మాజీ సర్పంచ్ గండ్రోతు సురేంద్రకుమార్, జుట్టా కొండలరావు, గవర సర్వారాయుడు, తెలగా సంఘం పెద్దలు సప్తగిరి వెంట ఉన్నారు. -
రాజావారి ఇంటి దగ్గర...
నవలలో నుంచి నడిచొచ్చిన సినిమా కథ ఇది. దృశ్యంలో కవిత్వం పలుకుతుంది. పాటల్లో దృశ్యం వినిపిస్తుంది. జాతీయ అవార్డ్లు దక్కించుకోవడంతో పాటు, ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (1984), ‘మాస్కో ఫిల్మ్ ఫెస్టివల్’, ‘ఏషియన్ ఫిల్మ్ఫెస్టివల్’లో ప్రదర్శితమైన ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాలివి. ఈ సినిమా పేరేమిటో చెప్పుకోండి చూద్దాం... ‘టుక్కు టుక్కు టుక్కు’ అని సౌండ్ చేస్తూ గోదావరిలో లాంచి పరుగెడుతుంది. లాంచీ లోపల ఉన్న వీరాస్వామి తన పక్కన ఉన్న నాంచారి కళ్లలోకి చూస్తూ అప్పటికప్పుడు కవిగా మారిపోయాడు...‘నాంచారి...ఇలా వెన్నెల్లో గోదారిని చూస్తుంటే నా గుండె ఐసుముక్కలా కరిగిపోతుందనుకో’వీరాస్వామి భావుకత్వానికి నాంచారికి మండిపోయింది. ‘‘ఎండమండి పోతుంటే వెన్నెలంటావేంటి?’’ కళ్లతోనే కడిగేసింది. అంతమాత్రనా వీరాస్వామి సైలెన్సైపోతాడా ఏమిటి? ‘‘నువ్వు నా పక్కన కూర్చుంటే ఈ వీరాస్వామికి ఎండే వెన్నెల. ఈ లాంచే ఊయల’’ అంటూ కవిత్వాన్ని కంటిన్యూ చేశాడు. ‘‘నువ్వు మాత్రం నా పక్కన కూర్చుంటే ఈ బల్ల ముళ్లకంప...ఆ రేవే వల్లకాడు’’ అని చురక వేసింది నాంచారి. సరే వీళ్ల సంగతి వదిలేద్దాం. అదిగో అటు చూడండి... అక్కడ ఎవరిదో తల ‘ఇంతై...అంతై’ అన్నట్లు సైజ్ పెరిగిపోతుంది. పక్కన కూర్చున్నాయన నాలిక అనే సుత్తితో తెగ బాదుతున్నాడు.... ‘‘అసలు వేదకాలం నుంచే మా పగటి వేషగాళ్లు వచ్చారు. ఆ తరువాత బుర్రకథల వాళ్లు వచ్చారు. ఆ తరువాత నాటకాల వాళ్లు వచ్చారు. ఆ తరువాత సినిమావాళ్లు వచ్చారు. ఆ తరువాత...’’ ఈ వాక్ దాడికి అడ్డుపడిన ఆ తలవాచినాయన... ‘‘అసలు రేవు ఎప్పుడూ వస్తుంది?’’ అడిగాడు దీనంగా. ఈయన దీనత్వాన్ని ఖాతరు చేయని ఆ మహాస్పీకరుడు ‘‘అడ్డుపడకండలా’’ అని విసుక్కున్నాడు. అంతే...ఆ తలవాచినాయనకు మహా కోపం వచ్చింది. అది ఇలా కట్టలు తెంచుకుంది... ‘‘పగటి వేషాలు కాదు...అసలు నువ్వు ఏ వేధవ వేషాలేస్తే నాకేంటటా? దురదగొండాకులా హింసిస్తున్నావు. అయ్యో...వర్జ్యంలో బయలుదేరవద్దని మా ఆవిడ చెప్పినా వినలేదు. కొరివితో తలగోక్కున్నాను...’’ ‘‘ఏంట్రా గొడవ’’ అని ఆరా తీశాడు అక్కడికి వచ్చిన వీరాస్వామి. ‘‘చూడండి వీరాస్వామిగారూ...’’ అని ఆ బాధితుడు ఏదో చెప్పేలోపే... ‘‘నాపేరు నీకెలా తెలుసు?’’ ఆశ్చరంగా అడిగాడు వీరాస్వామి. ‘‘తెలుసండీ...తెలుసు. మీ పేరే కాదు....మీ గురువు గురుమూర్తి. ఆయన కూతురు పేరు నాంచారి. మీలో కొత్తగా చేర్చుకున్న కుర్రాడి పేరు రాజా. రాత్రి నుంచే ఒకటే సొద. వద్దన్న కొద్దీ అన్నీ చెబుతాడు. బుర్ర హీటెక్కిపోయింది. గోదాట్లో మునిగి తేలితేగాని నా వివరాలు నాకు తెలియవు. అబ్బ...రేవొచ్చింది...నేను వెళ్తాను’’ అని ఒక లాంగ్జంప్ చేశాడు తలవాచినాయన. పొద్దు పొద్దున్నే లాంచీ దిగిన పగటివేషగాళ్లు రాజావారి ఇంటికి వెళ్లారు. తలుపులు ఇంకా మూసే ఉన్నాయి. ‘‘గొంతు ఎంత చించుకున్నా గుమ్మం తలుపులు తెరవరు’’ చిన్నగా విసుక్కోన్నాడు ట్రూప్లో కొత్తగా చేరిన రాజా. ‘‘ష్...తప్పుమంది. మన లాంచి పెందరాళే వచ్చింది. రాజావారు స్నానం చేసే వేళ ఇది’’ అని రాజా విసుగుపై నీళ్లు చల్లే ప్రయత్నం చేశాడు ట్రూప్ లీడర్ గురుమూర్తి. ‘‘ఆయన స్నానం సంగతి సరే....ఇంట్లో పనివాళ్లు ఉండరా? వాళ్లు ఏంచేస్తారు?’’ అమాయకంగా అడిగాడు రాజా. ‘‘కాళ్లకు గజ్జెలు కట్టుకొని గెంతులు వేస్తారు. రాజావారు స్నానం చేయడమంటే మామూలు విషయం కాదు. కొత్తోడివి నీకేం తెలుసు!’’ అంటూ ఇంచుమించు రాజా మీద కన్నెర్ర చేశాడు ట్రూప్ సీనియర్లలో ఒకౖడైన వీరాస్వామి. అయినప్పటికినీ మరో డౌటు అడగానే అడిగాడు రాజా... ‘‘ఇంతటి బంగ్లాలోనూ దాసీలు ఉండరా! వాళ్లేం చేస్తారు?’’ ‘‘రాణిగారు నిద్ర లేచే సమయంరా ఇది. దాసీలు ఆమె ఎటు వెళితే అటూ కాలు కింద పడకుండా... ముఖమల్ వస్త్రాలు పరుస్తారు’’ అని రాజా డౌటు తీర్చాబోయాడు గురుమూర్తి. రాజా చిటపటలాడుతుండగానే చందర్రాజావారు రానే వచ్చారు. నల్లటి కోటు ధరించి పైప్ పీలుస్తున్న ఆయనలో రాజఠీవి ఉట్టిపడుతోంది. ‘‘అయ్యగారికి దండలేట్రా’’ రాజాను మెల్లిగా గిల్లాడు గురుమూర్తి. ఉలుకూ లేదు. పలుకూ లేదు. పైగా అటువైపు తిరిగి అసహనంగా అటు ముఖం పెట్టాడు రాజా. ఇలాంటి దృశ్యం గతంలో ఎన్నడూ చూడనిది. చందర్రాజావారి దగ్గరికి వచ్చే కళాకారులు పొగడడమే తమ పని అన్నట్లుగా ఉంటారు. ‘‘ఇతడేమిటి నన్ను చూసి అలా కోపంగా ముఖం తిప్పుకున్నాడు!’’ తనలో తాను అనుకుంటూనే... ‘‘ఏం వీరాస్వామి బాగున్నావా?’’ అని అడిగారు. అంతే!వీరాస్వామి ఎక్కడికో వెళ్లిపోయాడు. ‘‘చూశావా! అంత పెద్ద రాజావారు నన్ను పేరు పెట్టి మరీ పిలిచారు’’ అన్నట్లు గర్వం నిండిన కళ్లతో గాలిలో గంతులు వేశాడు. ‘‘ఎవరు?’’ అంటూ రాజాను కళ్లతో చూపిస్తూ అడిగాడు చందర్రాజావారు. ‘‘కొత్తాడండీ’’ అని కళ్లతోనే రాజాను తేలిగ్గా తీసేస్తూ చందర్రాజావారికి సమాధానం ఇచ్చాడు వీరాస్వామి. ‘‘మా వాడు శివుడి వేషం కడితే చూడ్డానికి రెండు కళ్లు...’’ అని ట్రూప్ సభ్యుడొకరు రాజా గురించి కాస్త గొప్పగా చెప్పేలోపే ఆయన కాలు తొక్కాడు వీరాస్వామి. దీంతో ‘కళ్లు’ అనబోయి ‘కాళ్లు’ అని నోరుజారాడు ఆయన. ‘‘వేషాలతో తమ దర్శనం చేసుకుంటామండీ’’ అని చెప్పి రాజావారి దగ్గర సెలవు తీసుకున్నాడు గురుమూర్తి. ఆతరువాత... ‘‘అసలు ఆ పొగరేమిటి నీకు? రాజాగారికి దండమెట్టమంటే అంత ఇదై పోతున్నావు. ఆయన ఈ ఊరి వాళ్లకు దేవుడిలాంటి వాడు’’ అని చందర్రాజావారి గొప్పతనం, కీర్తి గురించి గురుమూర్తి ఘనంగా చెప్పబోతుండగానే రాజా అడ్డుపడి.... ‘‘ఊరి వాళ్లు ఎలా కొలిస్తే నాకేం. నేను దణ్ణం పెట్టను. గొప్పమనసు అని తెలిస్తే ముష్ఠివాడికి కూడా పాదాభివందనం చేస్తాను’’ అన్నాడు స్పష్టంగా... కోపంగా. -
వైఎస్ జగన్మోహన్రెడ్డి నా దేవుడు
నెల్లూరు(బృందావనం): వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తన దేవుడని ఆయన సిద్ధాంతమే తన సిద్ధాంతమని ప్రముఖ నటుడు పృథ్వీరాజ్ పేర్కొన్నారు. తన ఊపిరి ఆగేవరకు జగన్ వెంటనడుస్తానన్నారు. నెల్లూరు పురమందిరంలో ఆదివారం రాత్రి కళాంజలి సాంస్కృతిక సంస్థ, కళాంజలి కామెడీక్లబ్–నెల్లూరు ఆధ్వర్యంలో సినీ ‘హాస్యచక్రవర్తి’ టీవీ రమణారెడ్డి స్మారక అవార్డును ఆయన అందుకున్నారు. ఈ సందర్భంగా పృథ్వీరాజ్ మాట్లాడుతూ ఎందరో కళాకారులకు, నటులకు జన్మనిచ్చిన నెల్లూరులో హాస్యనట చక్రవర్తి టీవీ రమణారెడ్డి అవార్డును అందుకోవడం తన అదృష్టమని చెప్పారు. తాను జగన్కు మద్దతుపలికిన సమయంలో ఎన్నో బెదిరింపులు వచ్చాయని, అలాంటి వాటికి తాను భయపడబోనని చెప్పారు. జగన్లా తనకు గుండె ధైర్యమెక్కువన్నారు. తాను చెప్పిన థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ డైలాగ్ను సీఎం చంద్రబాబు కాపీకొట్టి ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ డైలాగ్ చెబుతున్నారని ఎద్దేవా చేశారు. తనకు అవార్డు అందచేసిన కళాంజలి సంస్థ నిర్వాహకుడు అనంత్కు పృథ్వీరాజ్ కృతజ్ఞతలు తెలిపారు. పృథ్వీరాజ్కు అవార్డును నెల్లూరు సిటీ, రూరల్ ఎమ్మెల్యేలు పి.అనిల్కుమార్, కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి అందజేసి, సన్మానించారు. పృథ్వీరాజ్కు రమణారెడ్డి స్మారక అవార్డును అందచేస్తున్న నెల్లూరు సిటీ, రూరల్ ఎమ్మెల్యేలు అనిల్కుమార్, కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి -
వివాదాస్పద సినిమా ఫస్ట్లుక్ పోస్టర్
ప్రముఖ అవార్డు గ్రహీత దర్శకుడు రహత్ కాజ్మీ దర్శకత్వంలో రూపొందుతున్న ‘లిహాఫ్’(మెత్తని బొంత) సినిమా తొలి పోస్టరు మాంటోలో జరుగుతున్న71వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో విడుదలయ్యింది. కాన్స్లో విడుదల చేసిన ఈ పోస్టర్లో ఒక ఎర్రని బొంత మీద ఇద్దరు మహిళల పాదాలు ఉన్నాయి. వాటిలో ఒకరి పాదాలకు బాగా అలకంరించిన మువ్వలు ఉండగా, మరొకరి పాదాలకు సాదా మువ్వలున్నాయి. ప్రముఖ ఉర్డూ రచయిత ఇస్మై చుగ్తాయి రచించిన వివాదస్పద పుస్తకం ‘లిహాఫ్’ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో తనిష్తా ఛటర్జీ రచయిత ‘చుగ్తాయి’ పాత్రలో నటిస్తుండగా, సోనల్ సెహగల్ ‘బేగమ్ జాన్’ పాత్రలో నటిస్తున్నారు. భర్త నిరాదరణకు గురైన మహిళ మానసిక సరిస్థితి ఎలా ఉంటుంది, ఆ సమయంలో ఆమెను ఎలాంటి విషయాలు ఆకర్షిస్తాయనే ఇతివృత్తంతో తెరకెక్కుతుంది ఈ సినిమా. స్వలింగ సంపర్కం నేపథ్యంలో ‘చుగ్తాయి’ రచించిన ఈ కథ లక్నోలో ప్రారంభమవుతుంది. ఈ కథనంతా బేగమ్ జాన్ చిన్న మేనకోడలు వివరిస్తుంది. అక్కడ ఒంటరిగా ఉంటున్న బేగమ్ జాన్, తన పరిచారికతో ఎలాంటి సంబంధాన్ని పెట్టుకున్నది, దాని పర్యావసనాలు ఏమిటనే నేపథ్యంలో సాగుతుంది. తనకు, పరిచారికకు మధ్య ఉన్న సంబంధం గురించి మేనకోడలికి తెలియడంతో బేగమ్ జాన్ ఆమెను చంపేస్తుంది. చుగ్తాయి రాసిన ‘లిహాఫ్’, అలానే ఆమె స్నేహితుడు సాదత్ హసన్ మంటో రాసిన పుస్తకం ‘బూ’ రెండింటిల్లోను అశ్లీలత ఎక్కువగా ఉందనే ఆరోపణలు ఎదుర్కొన్నాయి. ఈ చిత్రానికి కజ్మీ, తారిక్ ఖాన్, ఉత్పల్ ఆచార్య నిర్మాతలుగా వ్వవహరిస్తుండగా, ఆస్కార్ అవార్డు గ్రహిత మార్క్ బషేట్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. -
‘మేరా భారత్’ పోస్టర్ ఆవిష్కరణ
ఖమ్మంమయూరిసెంటర్ : వీధి బాలల జీవితాన్ని కళ్లకు కట్టేలా మేరా భారత్ మహాన్ షార్ట్ ఫిలిం నిర్మించడం అభినందనీయమని ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. మేరా భారత్ షార్ట్ ఫిలిం పోస్టర్ను శుక్రవారం తన క్యాంప్ కార్యాలయంలో ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ భారతదేశ చరిత్రను భావి తరాలకు తెలియచేస్తూ, స్ఫూర్తిదాయకమైన, సందేశాత్మకమైన షార్ట్ఫిలింలను నిర్మించాలని ఈ సందర్భంగా ఎంపీ వారికి సూచించారు. చిన్నారులతో షార్ట్ఫిలిం నిర్మించిన దర్శక నిర్మాతలను ఎంపీ అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని చిత్రాలను నిర్మించి ఉన్నతస్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు లింగాల కమలరాజు, కొప్పురావూరి వెంకటకృష్ణ, అజ్మీరా అశోక్నాయక్, ఫిలిం డైరెక్టర్ బేతంపూడి శ్రీకాంత్, నిర్మాత మండె రమణ నటీనటులు అశ్విన్, ప్రదీప్, కెమెరామెన్ లక్ష్మణాచారి తదితరులు పాల్గొన్నారు. -
రాజధాని అభివృద్ధికి సినీ నటులు కృషి చేయాలి
ఆత్మకూరు(మంగళగిరిటౌన్): రాజధాని అభివృద్ధికి సినీ రంగం కూడా కృషి చేయాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖా మంత్రి పత్తిపాటి పుల్లారావు పిలుపునించారు. శనివారం రాత్రి మంగళగిరి మండల పరిధిలోని ఆత్మకూరు గ్రామంలోని హ్యాపీ రీసార్ట్ ప్రాంగణంలో ఆంధ్రప్రదేశ్ చలనచిత్ర మండలి ఉగాది పురస్కారాల వేడుకల కార్యక్రమం కనులపండువగా నిర్వహించారు. చలన చిత్ర అవార్డుల కమిటి చైర్మన్ అంబటి మధుమోహనకృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న రాష్ట్ర మంత్రి పుల్లారావు మాట్లాడుతూ అమరావతి ప్రాంతంలో సినీ పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. తుళ్లూరు మండలంలోని అనంతవరం గ్రామం వద్ద మీడియా సిటి నిర్మిసామని ఇప్పటికే ముఖ్యమంత్రి ప్రకటించారని, విశాఖపట్టణంలో సినీ పరిశ్రమకు ప్రభుత్వం పలు ప్రోత్సాహాలను అందిస్తుందన్నారు. ఈ సదర్భంగా ప్రముఖ సినీనటుడు సత్యనారాయణ గురించి మాట్లాడుతూ సినీకళాకారునిగా, ఎంపిగా రాష్ట్రానికి ఎన్నో సేవలు చేశారని, నటనలో తనదైన శైలిలో సత్యనారాయణ తెలుగు పరిశ్రమలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారన్నారు. కైకాలకు జీవిత సాఫల్య పురస్కారం ప్రధానం... ప్రముఖ తెలుగు చలనచిత్ర నటుడు కైకాల సత్యనారాయణ 750 చిత్రాలలో విలక్షణపాత్రలను పోషించి, చిత్రసీమకు పేరు ప్రఖ్యాతలను తీసుకు వచ్చేందుకు తనదై శైలిలో విశేష కృషి చేశారని తెలిపారు. చలనచిత్ర అవార్డుల కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర మంత్రి పత్తిపాటి పుల్లారావు చేతులు మీదుగా సత్యనారాయణకు జీవిత సాఫల్య పురస్కారం అందించారు. సత్యనారాయణతో పాటు ఉత్తమ దర్శకులుగా గరుడవేగ చిత్ర దర్శకుడు ప్రవీణ్ సత్తార్, మళ్లీరావా చిత్ర దర్శకుడు గీతంనాయుడుకు, శేఖరం గారి అబ్బాయి చిత్రం దర్శకుడు అక్షిత్శ్రీనివాసన్, ఒక్కడే మిగిలాడు చిత్ర దర్శకుడు అజెయ్ ఆడ్రూస్లకు ఉత్తమ దర్శకులు అవార్డులను ప్రదానం చేవారు. ఉత్తమ నటులు రవివర్మ(గరుడవేగ), అప్పాజి(మళ్లిరావే), ఉత్తమ నటి సాయిసుధభీమిరెడ్డి(అర్జున్రెడ్డి), హిమజ(శతమానంభవతి), కల్పాలిత్(బహుబలి2), ఉత్తమ నిర్మాతలు రాహుల్యాదవ్(మళ్లీరావే), దిల్రాజు(ఫిదా), త్తమ గాయకురాలు సోని(బహుబలి2), సంగీత దర్శకులు శక్తీకార్తిక్(ఫిదా) ప్రత్యేక పురస్కారాలు సౌమ్యావేణుగోపాల్(కాటమరాయుడు), మనారాచోప్రా(రోగ్), మనాలీరాథోడ్(లేడీస్టైలర్), సోనీచరిస్టా(టాప్ర్యాంకర్)గా ఎంపికైయ్యారు. జీవిత సాఫల్య పురస్కారం స్వీకరిస్తున్న కైకాల -
వచ్చే ఎన్నికల్లో బరిలోకి : సినీ నటుడు
హుజూర్నగర్ : విద్య, వైద్యం, వ్యవసాయ రంగ అభివృద్ధికి పాలకులు కృషి చేయాలని ప్రముఖ సినీ నటుడు సుమన్ అన్నారు. ఆదివారం హుజూర్నగర్ పట్టణంలో ఆయన విలేకరులతో మట్లాడారు. తెలుగు రాష్ట్రాల్లో పాలన సాగిస్తున్న ప్రభుత్వాలు తాను కోరుకున్న విధంగా ప్రజలకు సేవలందిస్తే.. తాను వారికి మద్దతుగా ప్రచారం, ప్రత్యక్షంగా ఎన్నికల్లో పోటీ చేయడానికి స్ధిదమన్నారు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఎక్కడా లేనివిధంగా తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ వ్యవసాయ రంగానికి నిరంతర విద్యుత్ సరఫరా చేస్తూ చరిత్ర సృష్టించాడన్నారు. రైతులకు ఇన్సూరెన్స్ సౌకర్యాన్ని కూడా కల్పిస్తూ ఇటీవల నిర్ణయం ప్రకటించడం అభినందనీయమన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజల అభివృద్ధికి బాటలు వేయాలన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్రెడ్డి ప్రవేశపెట్టి అమలు చేసిన ఆరోగ్యశ్రీ పథకం ప్రజల ఆరోగ్యాలకు భరోసా కల్పించిందన్నారు. గ్రామీణ ప్రాంతాల బాలికలకు విద్యాభ్యాసం ఆధారంగా సైకిళ్లు, స్కూటీలు, ల్యాప్ట్యాప్లు అందజేయడంతో పాటు ఇతర ప్రోత్సాహకాలు కల్పించాలన్నారు. సమావేశంలో రోటరీక్లబ్ అధ్యక్షుడు కుక్కడపు కోటేశ్వరరావు, కార్యదర్శి కోతి సంపత్రెడ్డి, ఎన్.వెంకటేష్, లింగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
రాజకీయ ప్రవేశంపై రాజేంద్రుడి కామెంట్
పాలకొల్లు అర్బన్: రాజకీయాలు తనకు పడవని, తన 40 ఏళ్ల సినిమా కెరీర్లో అందర్నీ ఆనందింపజేయడమే ఇష్టమని నటకిరీటి డాక్టర్ రాజేంద్రప్రసాద్ అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో క్షీరపురి అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్ సంస్థ ఆయనను ‘జీవిత సాఫల్యతా పురస్కారం’తో ఘనంగా సత్కరించింది. టామీ సినిమాలో ఉత్తమ క్యారెక్టర్ ఆర్టిస్టుగా నంది అవార్డు అందుకున్నందుకు ఆయనకు ఈ పురస్కారం ఇచ్చింది. ఉత్తమ లఘుచిత్రం ‘క్రీమిలేయర్’ పాలకొల్లు అర్బన్: క్షీరపురి అంతర్జాతీయ లఘు చలన చిత్రోత్సవ పోటీల్లో ఉత్తమ లఘుచిత్రంగా స్కైవ్యూ క్రియేషన్స్, శ్రీకాకుళం కథా రచయిత విజయ్కుమార్ చిత్రీకరించిన ‘క్రీమిలేయర్’ ఎంపికైంది. ఈ చిత్రోత్సవం స్థానిక రామచంద్ర గార్డెన్స్లో శనివారం కోలాహలంగా సాగింది. ద్వితీయ ఉత్తమ చిత్రంగా మాజీ ఎంపీ చేగొండి హరరామ జోగయ్య నిర్మించిన ఇండియా ఈజ్ డెడ్, తృతీయ ఉత్తమ చిత్రంగా గోదావరి టాకీస్ చిత్రం, రాజమండ్రి కథా రచయిత సి.కల్యాణ్ రూపొందించిన ‘బి అలర్ట్’ ఎంపికయ్యాయి. విజేతలకు వరుసగా రూ.60 వేలు, రూ.40 వేలు, రూ.20 వేల నగదు పారితోషికాలతో పాటు షీల్డ్లు అందజేశారు. స్పెషల్ జ్యూరీ అవార్డులను ఇండియా ఈజ్ డెడ్లో ఇండియా పాత్రధారి చంద్రిక, పేరులో వికలాంగుడు పాత్రధారి సతీష్ సుంకర దక్కించుకున్నారు. స్పెషల్ జ్యూరీ చిత్రాలుగా మాతృదేవోభవ, హెల్మెట్ ఎంపికయ్యా యి. ఉత్తమ ఎడిటింగ్ మీ కోసమే లఘుచిత్రం ఫణిశ్రీ, ఉత్తమ కెమెరామెన్గా ఇండియా ఈజ్ డెడ్లో మోహన్చంద్, ఉత్తమ కథా రచయితగా బి అలర్ట్ కల్యాణ్, ఉత్తమ దర్శకుడిగా ఇండియా ఈజ్ డెడ్లో రాజేంద్రకుమార్ బహుమతులు అందుకున్నారు. జ్యూరీ కమిటీ సభ్యులుగా జనా ర్థన మహర్షి, ఎంవీ రఘు, పద్మిని, కె.వెంకట్రాజు, ఎ.బాబూరావు, కె.సురేష్, ఎన్. గోపాల్, డి.రవీంద్ర వ్యవహరించారు. -
నేటి డూడుల్ ఏంటో తెలుసా?
ప్రఖ్యాత గూగుల్ సంస్థ ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ది పొందిన వ్యక్తులను డూడుల్రూపంలో లోగోను తయారుచేసి వారిని గౌరవిస్తుంది. వారి పుట్టిన రోజున వీటిని ఆ ఒక్కరోజు డూడుల్గా గూగుల్లో దర్శనమిస్తుంది. ఈ రోజు(జనవరి 22)న ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన సెర్గీ ఐజిన్స్టైన్పై డూడుల్ చిత్రించి గౌరవించింది. నేడు ఆయన 120వ పుట్టిన రోజు. చిత్రరంగంలో ఫిల్మ్లతో సినిమాలను చిత్రీకరించడం ఈయనతోనే ప్రారంభమైంది. ఈయనను ఫాదర్ ఆఫ్ మోంటేజ్ టెక్నిక్ ఇన్ ఫిల్మ్మేకింగ్ అంటారు. అందుకే ఈయనను ఫిల్మ్లతో కూడిన లోగోను ఏర్పాటుచేసి డూడుల్గా పెట్టారు. ఫిల్మ్లతో కూడిన గూగుల్ అనే అక్షరాల నడుమ సెర్గీ ఈ రోజు మనకు దర్శనమిస్తాడు. మాంటేజ్ టెక్నిక్ అంటే...ఎడిటింగ్లో ఒక ప్రక్రియ. చిన్న చిన్న షాట్స్ను సమయానికి, స్పేస్, విషయానికి అనుగుణంగా ఉండేలా కుదించడం. ఈయన 1898 రిగాలో (ఇప్పటి లాత్వియాలో) జన్మించారు. ఆయన ఆర్కిటెక్చర్, ఇంజనీరింగ్ విద్యనభ్యసించారు. బోల్షివిక్ విప్లవంలో కూడా పాల్గొన్నారు. తరువాత ఆయనకు సినిమాలపై ఇష్టమేర్పడి మాస్కోకు వెళ్లాడు. ఈయన మొదటి సినిమా స్ట్రైక్ 1925లో విడుదలైంది. రష్యాలోని కార్మికులు ఫ్యాక్టరీ ముందు చేస్తున్న ధర్నా నేపథ్యంలో చిత్రీకరించాడు. ఇది ఒక సైలెంట్(మూకీ)సినిమా. అదే సంవత్సరంలో బాటిల్షిప్ పొటెమ్కిన్ అనే మరో చిత్రాన్ని విడుదలచేశాడు. రష్యా సైనికులు అమాయకపు పౌరులను హతమార్చిన సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తీశాడు. 1928లో అక్టోబర్ అనే సినిమాను విడుదలచేశాడు. 1917 అక్టోబర్ విప్లవం, రష్యా నియంతృత్వ పాలన ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమాపై అప్పటి పాలకులు కన్నెర్ర చేశారు. అయినా కానీ ఐజిన్స్టైన్ వెనక్కితగ్గకుండా ఇంకా ఎన్నో మరుపు రాని చిత్రాలను తీశారు. అలెగ్జాండర్ నెవస్కీ, ఇవాన్ ది టెర్రిబుల్ లాంటి సినిమాలెన్నో తీసి...1948లో గుండెనొప్పితో మరణించారు. -
ప్రముఖ నటుడు కన్నుమూత
కోల్కతా: ప్రముఖ బెంగాలీ నటుడు పార్థ ముఖోపాధ్యాయ సోమవారం కన్నుమూశారు. ఆయన వయస్సు 70 ఏళ్లు . గతకొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారని కుటుంబసభ్యులు తెలిపారు. చూడగానే పక్కింటి అబ్బాయిగా కనిపించే పార్థ 60వ దశకంలో ఎన్నో గుర్తుండిపోయే పాత్రలను పోషించారు. 1958లో 'మా' సినిమాతో బాలనటుడిగా అరంగేట్రం చేసిన ఆయన.. తపన్ సిన్హా తెరకెక్కించిన 'అతిథియా' సినిమాతో హీరోగా మారారు. రవీంద్రనాథ్ టాగోర్ కల్ట్ షార్ట్స్టోరీ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. అంతేకాకుండా తపన్ సిన్హా తెరకెక్కించిన 'అపోంజాన్' సినిమాలో కూడా హీరోగా కనిపించారు. బెంగాల్ లెజెండ్ హీరో ఉత్తమ్కుమార్ తమ్ముడు, కొడుకు పాత్రలకు ఆటోమేటిక్ చాయిస్గా పార్థ గుర్తింపు పొందారు. బాలిక బధూ (1967), ధోన్యి మెయే (1971), అగ్నిష్వర్ (1975), అమర్ పృథ్వీ (1985), బాగ్ బందీ ఖేలా (1975) పాపులర్ సినిమాల్లో ఆయన నటించాడు. ఎన్నో సినిమాల్లో గొప్ప అభినయాన్ని కనబర్చిన పార్థ ముఖోపాధ్యాయ బెంగాలీ సినీప్రేమికుల మదిలో ఎల్లప్పటికీ నిలిచి ఉంటారని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ట్విట్టర్లో నివాళులర్పించారు. -
హైదరాబాద్ ఫిల్మ్ క్యాపిటల్గా తయారవుతుంది : నవీన్ మిట్టల్
‘‘సినీ పరిశ్రమ అనగానే చాలా మంది ముంబైలో ఉన్న హిందీ పరిశ్రమ అనుకుంటున్నారు. భాగ్యనగరం ఫిల్మ్ హబ్ అవుతోంది. భారతదేశంలో సినిమాకి హైదరాబాద్ రాజధానిగా తయారవుతుంది’’ అని తెలంగాణ రాష్ట్ర సమాచార, ప్రజాసంబంధాల అధికారి నవీన్ మిట్టల్ అన్నారు. డిసెంబరు 1న హైదరాబాద్లో ‘ఇండీవుడ్ ఫిల్మ్ కార్నివాల్’ ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో నవీన్ మిట్టల్ మాట్లాడుతూ– ‘‘హైదరాబాద్లో సినిమాలు, సీరియల్స్ షూటింగ్తో పాటు సినిమా పరిశ్రమకు అవసరమైన అన్ని సౌకర్యాలతో కూడిన స్టూడియోలు, ల్యాబ్లు ఉన్నాయి. సినిమా రంగాన్ని మరింత ప్రోత్సహించాలని తెలంగాణ ప్రభుత్వం సింగిల్ విండో విధానం తీసుకొస్తోంది. ‘ఇండీవుడ్ ఫిల్మ్ కార్నివాల్’ గత ఏడాది కంటే ఈ ఏడాది మూడు రెట్లు గ్రాండ్గా జరగనుంది’’ అన్నారు. ‘‘సినిమా రంగంలో టెక్నాలజీ ఫాస్ట్గా మారుతోంది. ప్రజలు కూడా అప్డేట్ అవాల్సి ఉంది. ‘ఇండీవుడ్ ఫిల్మ్ కార్నివాల్’కి తెలంగాణ ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు అందిస్తోంది’’ అని తెలంగాణ రాష్ట్ర చలనచిత్ర అభివృద్ధి సంస్థ చైర్మన్ పి.రామ్మోహన్రావు అన్నారు. ‘‘డిసెంబరు 1 నుంచి 4వ తేదీ వరకు ‘ఇండీవుడ్ ఫిల్మ్ కార్నివాల్’ జరుగుతుంది. ఈ సమావేశానికి 50–60 దేశాల నుంచి ప్రతినిధులు హాజరవుతారు. ఈ ఏడాది తొలిసారి 22 విభాగాల్లో టాలెంట్ హంట్ నిర్వహిస్తున్నాం’’ అని ‘ఇండీవుడ్ ఫౌండర్, డైరెక్టర్ సోహన్ రాయ్ అన్నారు. -
కాలేజీ రోజులు
దర్శకుడు క్రిష్ వద్ద కో–డైరెక్టర్గా పని చేసిన రజినీకాంత్ ‘కాలేజ్ డేస్’ చిత్రంతో దర్శకునిగా మారారు. నూతన నటీనటులతో శ్రీలత నిర్మిస్తున్న ఈ సినిమా బుధవారం ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి పటేల్ కెమెరా స్విచ్చాన్ చేయగా, నిర్మాత మల్కాపురం శివకుమార్ క్లాప్ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డి స్క్రిప్ట్ని చిత్ర బృందానికి అందించారు. శ్రీలత మాట్లాడుతూ– ‘‘మా బ్యానర్లో ఇది రెండో సినిమా. మొదటి చిత్రాన్ని త్వరలో విడుదల చేస్తాం. కళాశాల నేపథ్యంలో మంచి సందేశంతో యూత్ని ఆకట్టుకునే విధంగా ‘కాలేజ్ డేస్’ ఉంటుంది’’ అన్నారు. ‘‘నా కథను నమ్మి శ్రీలతగారు దర్శకునిగా అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు. జూలై మొదటి వారంలో హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తాం’’ అన్నారు రజినీకాంత్. ఈ చిత్రానికి కెమెరా: ఎ.కె. ఆనంద్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : పి. ఈశ్వర్ రావు. -
సినిమాను కాపాడండి- సీనియర్ నటుడు
తమిళసినిమా: సినిమాను కాపాడండి అంటూ కేంద్ర మంత్రి అరుణ్ జెట్లీకి నటుడు కమలహాసన్ విజ్ఞప్తి చేశారు. కేంద్రప్రభుత్వం దేశ వ్యాప్తంగా ఒకే పన్ను విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ విధానం (జీఎస్టీ) జూలై 1న అమల్లోకి రానుంది. కాగా జీఎస్టీ పన్ను విధానాన్ని కోలీవుడ్ సినీ పరిశ్రమ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. కేంద్రం ఈ విషయం పునఃపరిశీలించి పన్ను శాతాన్ని తగ్గించని పక్షంలో తాను సినిమాను వదిలేస్తానని నటుడు కమలహాసన్ ఇటీవల దక్షిణ భారత సినీ వాణిజ్య మండలి సమావేశంలో పేర్కొన్న విషయం తెలిసిందే. కాగా జీఎస్టీ పన్ను విధానాన్ని తాము తప్పు పట్టడం లేదని, సినిమా టిక్కెట్లపై ఈ పన్ను విధానంతో 28శాతం అదనంగా భారం పడుతుందని, దీంతో ప్రాంతీయ భాషా చిత్రాలకు తీవ్ర ముప్పు కలుగుతుందని కమలహాసన్ అన్నారు. ఈ విషయంలో మంచి నిర్ణయం తీసుకోవాలని కౌన్సిల్ను వేడుకుంటున్నట్లు ఆయన ట్విట్టర్లో పేర్కొంటూ సినిమాను కాపాడాలని కేంద్రమంత్రి అరుణ్జెట్లీకి విజ్ఞప్తి చేశారు. -
టికెట్ వద్దా? ఆన్లైన్లో అమ్మెయ్!!
⇒ సినిమా, ట్రావెల్, ఈవెంట్స్ టికెట్లను విక్రయించే వీలు ⇒ సరికొత్త కాన్సెప్ట్తో ‘క్యాన్సెల్’ ప్రారంభం హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఆన్లైన్లో బస్సు, సినిమా, ఈవెంట్ల టికెట్లు కొనడం మనకు తెలిసిందే. ఒకవేళ ఆ టికెట్లు వినియోగించుకోలేకపోతే? ఆ టికెట్లు మనకు వద్దనుకుంటే..? క్యాన్సిల్ చేసినందుకు కొంత చార్జీ భరించాలి. కానీ, పైసా చార్జీ లేకుండా మనం వద్దనుకున్న టికెట్లను ఉచితంగానే అమ్మిపెడుతోంది క్యాన్సెల్.ఇన్. సరికొత్త ఆలోచనతో బెంగళూరు కేంద్రంగా గతేడాది ప్రారంభమైన ఈ సంస్థ విశేషాలను కో–ఫౌండర్ రఘురాం ‘సాక్షి స్టార్టప్ డైరీ’తో పంచుకున్నారు. ⇒ నేను, నవీన్, పవన్, సందీప్ నలుగురం స్నేహితులం. నవీన్ సింగపూర్లో పనిచేసేవాడు. తరచూ విదేశాలకు ప్రయాణించేవాడు. ఒకోసారి అనుకోకుండా ప్రయాణం రద్దయ్యేది. విమాన టికెట్లను క్యాన్సిల్ చేసిన ప్రతిసారీ జేబుకు చిల్లుపడేది. అది కంపెనీ డబ్బే అయినా మనసుకు బాధనిపించేది. కావాలనుకున్నప్పుడు ఆన్లైన్లో టికెట్స్ బుకింగ్ చేసుకున్నట్టుగా వద్దనుకున్నప్పుడు అలానే క్యాన్సిల్ చేసుకునే వీలుంటే బాగుండునని అనిపించేది. ఇదే విషయాన్ని మాతో చర్చించాడు. ఎవరో ఎందుకు మనమే ప్రారంభిస్తే పోలే... అనుకుని గతేడాది జనవరిలో క్యాన్సెల్.ఇన్ను ప్రారంభించాం. టెక్నాలజీ, మార్కెటింగ్కు రూ.15 లక్షల వరకు ఖర్చయింది. ⇒ చివరి క్షణంలో క్యాన్సిల్ అయిన టికెట్లను అమ్మి పెట్టడమే మా వ్యాపారం. అంటే మనకొద్దనుకున్న టికెట్లను క్యాన్సెల్ వేదికగా ఇతరులకు విక్రయించుకోవచ్చన్నమాట. దీంతో మన డబ్బులు మనకొచ్చేస్తాయి. సమయానికి ఇతరులకూ సాయం చేసినట్టవుతుంది. ప్రస్తుతం క్యాన్సెల్ వేదికగా ఈవెంట్లు, సినిమా, ట్రావెల్ టికెట్స్, గిఫ్ట్ ఓచర్లను విక్రయించుకోవచ్చు. ట్రావెల్ టికెట్స్లో బస్సు, ప్రైవేట్ వాహనాల టికెట్లు, టూర్ ప్యాకేజీలను విక్రయించుకోవచ్చు. ⇒ ప్రస్తుతం ఈ సేవలను ఉచితంగానే అందిస్తున్నాం. త్వరలోనే కొంత చార్జీ వసూలు చేసి ఆదాయార్జన ఆరంభిస్తాం. భవిష్యత్తులో హోటల్స్, విమాన టికెట్లు విక్రయిస్తాం కూడా. ఇప్పటికైతే లావాదేవీలు ఆశాజనకంగానే ఉన్నాయి. ⇒ దేశంలో ఆన్లైన్ టికెట్ పరిశ్రమ రూ.79 వేల కోట్లుగా ఉంది. ఇందులో క్యాన్సిలేషన్ వాటా 9 శాతం. అంటే రూ.7,110 కోట్లు. గిఫ్ట్ ఓచర్ల మార్కెట్ రూ.9 వేల కోట్లు. ఇందులో ఉపయోగించని ఓచర్లు 30 శాతం. అంటే రూ.3 వేల కోట్లు. వీటన్నిటినీ అందిపుచ్చుకోవాలన్నది మా ఉద్దేశం. అద్భుతమైన స్టార్టప్ల గురించి అందరికీ తెలియజేయాలనుకుంటే startups@sakshi.comకు మెయిల్ చేయండి... -
మెగా మూవీ షురూ!
అన్న చిరంజీవి–తమ్ముడు పవన్ కల్యాణ్ ఒకే వేదిక మీద కనిపిస్తే అభిమానులు పండగ చేసుకుంటారు. ఇక, ఒకే సినిమాలో కనిపిస్తే వాళ్లు పరమానందపడిపోతారు. చిరంజీవి నటించిన ‘శంకర్దాదా ఎంబీబీఎస్’లో ‘నా పేరే కాంచనమాల..’ పాటలో పవన్ కల్యాణ్ కాసేపు కనిపిస్తేనే, హ్యాపీ ఫీలయ్యారు. ఈ అన్నదమ్ములిద్దరూ ఒకే సినిమాలో హీరోలుగా నటిస్తే చూడాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఆ టైమ్ వచ్చే సింది. చిరు–పవన్ కాంబినేషన్లో కళాబంధు టి.సుబ్బరామిరెడ్డి ఓ భారీ చిత్రం నిర్మించనున్నారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందనుంది. ఈ విషయాన్ని గురువారం టీయస్సార్ అధికారికంగా ప్రకటించారు. మరిన్ని విశేషాలను టీయస్సార్ చెబుతూ– ‘‘చిరంజీవిగారి కమ్ బ్యాక్ మూవీ ‘ఖైదీ నెంబర్ 150’ చూశాక మళ్లీ సినిమాలు నిర్మించాలనిపించింది. ఇటీవల ఈ చిత్రబృందాన్ని సన్మానించి నప్పుడు చిరంజీవి–పవన్ కాంబినేషన్లో సినిమా తీస్తానని చెప్పాను. ఆ తర్వాత ఇద్దర్నీ ప్రత్యేకంగా కలసి డిస్కస్ చేశాను. నటించడానికి అంగీకరించారు. ఈ సినిమాకి దర్శకుడిగా త్రివిక్రమ్ బెస్ట్ అనుకున్నాను. అతనితో కూడా మాట్లాడాను. ఈ చిత్రాన్ని గ్రేట్ ప్రొడ్యూసర్ సి. అశ్వినీదత్తో కలసి నిర్మించబోతున్నా’’ అని చెప్పారు. గతంలో శోభన్ బాబుతో ‘జీవన పోరాటం’, చిరంజీవితో ‘స్టేట్ రౌడీ, రాజశేఖర్తో ‘గ్యాంగ్మాస్టర్’తో పాటు సంస్కృత సినిమా ‘భగవద్గీత’, పలు హిందీ చిత్రాలు నిర్మించారు టీయస్సార్. చాలా గ్యాప్ తర్వాత నిర్మాతగా ఈ మెగా మూవీ చేయనున్నారు. -
ఎస్సీ, ఎస్టీల అభివృద్ధిపై చిత్రాలు
రచయిత, దర్శకుడు, కేంద్ర సెన్సారు బోర్డు సభ్యుడు దిలీప్రాజా తెనాలి : షెడ్యూలు కులాల ఉప ప్రణాళిక, వివిధ ప్రభుత్వ పథకాలపై దళిత, గిరిజనులు అవగాహన కల్పించుకొని ఆయా కార్యక్రమాలతో అభివృద్ధిని సాధించాలనేది తన అభిమతంగా టీవీ చిత్రాల దర్శకుడు, కేంద్ర సెన్సారుబోర్డు సభ్యుడు దిలీప్రాజా వెల్లడించారు. దళిత, గిరిజనులకు సంబంధించిన ఎస్సీ ఉపప్రణాళికలోని వివిధ అంశాలపై తొమ్మిది ప్రచార చిత్రాలను, అన్ని పథకాల్లోని అంశాలు ప్రతిబింబించే విధంగా నృత్యరూపకంతో మరో చిత్రాన్ని ఇటీవలే ఆయన తీశారు. మొత్తం 10 ప్రచార చిత్రాలకు ఆయనే రచన, దర్శకత్వం వహించారు. డబ్బింగ్, మిక్సింగ్ తదితర నిర్మాణానంతర కాక్రమాలను పూర్తిచేసుకుని సెన్సారుకు వెళుతున్న సందర్భంగా శనివారం సాయంత్రం ఇక్కడి క్యాపిటల్ స్టూడియోలో విలేకరుల సమావేశంలో వివరాలను తెలియజేశారు. విద్యోన్నతి, అంబేద్కర్ ఓవర్సీస్, సిమెంటురోడ్లు/మంచినీరు, అత్యాచార నిరోధక చట్టం, భూమి కొనుగోలు పథకం, అంటరానితనం, కులాంతర వివాహాలు, నైపుణ్య శిక్షణ పేరుతో గల ఈ చిత్రాల్లో అనుభవజ్ఞులైన సినిమా నటులు అన్నపూర్ణ, వినోద్, నరసింహరాజు, బాలాజీ ఇతర టీవీ నటీనటులే కాకుండా స్థానిక ఔత్సాహిక, వర్ధమాన నటులతో తెనాలి, పరిసరాల్లోనే చిత్రీకరించినట్టు దిలీప్రాజా చెప్పారు. చిత్రాల నిర్మాణంలో ఎక్కడా రాజీ పడకుండా అన్నిరకాల సాంకేతిక హంగులను చేర్చినట్టు తెలిపారు. సెన్సారు అయిన అనంతరం వీటిని ప్రచారానికి వినియోగించే నిమిత్తం ప్రభుత్వానికి అందజేయనున్నట్టు వివరించారు. సమావేశంలో నిర్మాత ఆలూరి సుందరరామయ్య, షబ్బీర్ తదితరులు ఉన్నారు. -
‘పెద్ద’ ఇబ్బందుల్లో ఉన్నా సినిమాను ఆదరించారు
‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ హీరో నిఖిల్ కంబాలచెరువు (రాజమహేంద్రవరం) : పెద్ద నోట్లు రద్దై, డబ్బు మార్పిడికి ప్రజలు ఇబ్బందులు పడుతున్నా తన సినిమాను మాత్రం హిట్ చేశారని ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ సినిమా హీరో నిఖిల్ అన్నారు. మేఘనా ఆర్ట్స్ ప్రొడక్ష¯Œ్సపై నిర్మించిన ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ విజయం సా««ధించిన సందర్భంగా ఆ సినిమా యూనిట్ ఆ చిత్రాన్ని ప్రదర్శిస్తున్న ఊర్వశి థియేటర్కు గురువారం వచ్చింది. ఈ సందర్భంగా హీరో నిఖిల్ మాట్లాడుతూ, పెద్ద నోట్ల రద్దు కావడంతో చాలా సినిమాలు విడుదలకు నోచుకోలేక ఆగిపోయాయని, ఇటువంటి సమయంలో కూడా తన చిత్రాన్ని ఆదరించిన ఉభయ గోదావరి జిల్లాల ప్రేక్షకులను మరువలేనని అన్నారు. అనంతరం సినిమాలో తన నటన, హాస్యం ఎలా ఉందని ప్రేక్షకులను అడిగి తెలుసుకున్నారు. సినిమా దర్శకుడు వై.ఆనంద్ మాట్లాడుతూ, చిత్ర నిర్మాణంలో నాణ్యతపరంగా చాలా జాగ్రత్తలు తీసుకున్నామని చెప్పారు. సినిమా విజయం సాధించడం ఖాయమని ఊహించినా, ప్రస్తుత సంక్షోభంలో ఎలా ఉంటుందోనని తొలుత భయమేసిందన్నారు. యూనిట్ను చూసిన ప్రేక్షకులు కేరింతలు కొట్టారు. విజయయాత్రలో హీరోయిన్లలో ఒకరైన నందితా శ్వేత, నిర్మాత పీవీ రావు, సురేష్ మూవీస్ మేనేజర్ సత్తి రంగయ్య, ఎగ్జిబిటర్ రౌతు వెంకటేశ్వరావు, గెడ్డం శ్రీను ఉన్నారు. -
‘మామా..ఓ చందమామా’ షూటింగ్ సందడి
పసలపూడి(రాయవరం) : ఈస్ట్ వెస్ట్ ఎంటర్టైనర్స్ బ్యానర్పై రూపుదిద్దుకుంటున్న ’మామా..ఓ చందమామా’ సినిమా షూటింగ్ రాయవరం మండలం పసలపూడిలో జరుగుతోంది. హీరోగా సాయిరామ్ కార్తీక్, హీరోయి¯ŒSగా సనా మక్బుల్ఖాన్, ప్రతి నాయకుడిగా జీవా, ముఖ్యపాత్రల్లో నాగినీడు, దువ్వాసి మోహ¯ŒS తదితరులు నటిస్తున్నారు. ఈ సందర్భంగా సినిమా దర్శకుడు వెంకట్ మాట్లాడుతూ గ్రామీణ నేపథ్యంలో..ఆప్యాయతలు, అనుబంధాలు దూరమవుతున్న తరుణంలో వాటి విలువలను ఈ సినిమా తెలుపుతుందన్నారు. నేటి సమాజంలో జరిగే ఘటనలకు అద్దం పట్టే విధంగా సినిమా ఉంటుందన్నారు. జిల్లాలోని కోటిపల్లి, రామచంద్రపురం, కె.గంగవరం, దంగేరు తదితర ప్రాంతాల్లో రెండు షెడ్యూల్స్లో చిత్రీకరణ చేస్తామన్నారు. బొడ్డు శ్రీలక్ష్మి సమర్పణలో బొడ్డు వరప్రసాద్ నిర్మాతగా, మురళి సాధనాల సహ నిర్మాతగా నిర్మిస్తున్న సినిమాకు సంగీతాన్ని మున్నా కాశి అందిస్తున్నారని, ఆర్ట్ డైరెక్టర్గా ఉత్తరకుమార్ సూరిశెట్టి, కెమెరామ¯ŒSగా జి.ఎల్.బాబు, కో డైరెక్టరుగా నాగేంద్ర వ్యవహరిస్తున్నట్టు చెప్పారు. సినిమాకు అవసరమైన సెట్టింగ్లను పసలపూడి శివాలయం, సత్తి అనసూయమ్మ నిలయంలో వేసి చిత్రీకరణ చేస్తున్నారు. జీవా, దువ్వాసి మోహ¯ŒSలపై ఆదివారం పలు సన్నివేశాలను చిత్రీకరించారు. -
రావులపాలెంలో సినీ సందడి
రావులపాలెం : మండల పరిధిలోని వెదిరేశ్వరం శివారు కోసూరు నగర్ పంట చేల మధ్య మంగళవారం ప్రముఖ హీరో హీరోయిన్లు శర్వానంద్, లావణ్య త్రిపాఠీ నటిస్తున్న చిత్రం షూటింగ్ జరిగింది. వరి చేల మధ్య పల్లెటూరి వాతావరణంలో హాస్య సన్నివేశాలు చిత్రీకరించారు. హీరో శర్వానంద్తో పాటు కమెడీయన్లు షకలక శంకర్ తదితరులు ఈ సన్నివేశాల చిత్రీకరణలో పాల్గొన్నారు. సాయంత్రం వరకూ ఈ ఘాటింగ్ జరిగింది. సమీప ప్రాంతాలకు చెందిన అక్కడికి రావడంతో సినీ సందడి నెలకొంది. కాప్స్, ఎంటర్టైన్మెంట్ చిత్రం శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్పై నిర్మిస్తున్న ఈ చిత్రానికి అత్తారింటికి దారేది, నాన్నకు ప్రేమతో వంటి హిట్ చిత్రాలు నిర్మించిన బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారన్నారు. ఈ చిత్రంలో శర్వానంద్, లావణ్య త్రిపాఠీలు హీరో హీరోయిన్లు కాగా కోట శ్రీనివాసరావు, రవికిషన్, సప్తగిరి, షకలక శంకర్ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారన్నారు. ‘‘దర్శకుడిగా నాకు ఇది మొదటి చిత్రం. రచయితగా పలు చిత్రాలకు పని చేస్తున్నాను’ అని దర్శకుడు చింతాడ చంద్రమోహన్ తెలిపారు. ‘‘కోనసీమ అందాలు ఇక్కడి పంట చేలు కొబ్బరి తోటలు, గలగల పారే కాలువలు ఎంతో బాగున్నాయని హీరో శర్వానంద్ అన్నారు. ‘సినిమా ఘాటింగ్లకు తూర్పు గోదావరి జిల్లా నంబర్ వన్ ప్రాంతమని, జబర్దస్త్ షో ద్వారా నాకు మంచి గుర్తింపు వచ్చింది’’ కమెడీయన్ అని షకలక శంకర్ తెలిపారు. -
తిర్మలగిరిలో సినిమా షూటింగ్
హాలియా: హనుమాన్ బ్యానర్పై నిర్మిస్తున్న సినిమా షూటింగ్ శనివారం మండలంలోని తిర్మలగిరి, ఎల్లాపురం రాజవరం మేజర్ ప్రాంతాల్లో నిర్వహించారు. ఈ సందర్భంగా హీరో, హీరోయిన్లపై పలు సన్నివేశాలను చిత్రీకరించారు. అనంతరం దర్శకుడు లక్ష్మణ్ మాట్లాడుతూ పూర్తి స్థాయి గ్రామీణ వాతావరణంలో సినిమాను నిర్మిస్తున్నామని, మరో వారం రోజుల్లో షూటింగ్ పూర్తవుతుందన్నారు. ఇందులో హీరోగా హర్షవర్థన్రెడ్డి, హీరోయిన్లుగా రోహిణీ, దివ్యలు, కోడైరక్టర్గా నరేష్, కెమెరామెన్గా తౌర్యాలు వ్యవహరిస్తున్నారని తెలిపారు. సినిమాకు ఇంకా టైటిల్ ఖరారు చేయలేదని దర్శకుడు తెలిపారు. -
జాహ్నవిలో సినిమా షూటింగ్
సూర్యాపేట రూరల్: ఆర్ఎం మూవీ మ్యాకర్స్ బ్యానర్పై నిర్మిస్తున్న మరో దృశ్యం సినిమా షూటింగ్ గురువారం సూర్యాపేట మండలంలోని కేటీ అన్నారం రోడ్డులో గల జహ్నావి టౌన్షిప్లో నిర్వహించారు. ఈ సినిమాలో హీరోగా పచ్చిపాల గౌతమ్, హీరోయిన్గా శ్వేత నటిస్తున్నట్లు సినిమా నిర్వాహకులు తెలిపారు. సినిమా ఫోటోషాట్లో భాగంగా హీరో గౌతమ్, హీరోయిన్ శ్వేతలపై పలు సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ సినిమా హత్యలు, అత్యాచారాల నివారణకు తోడ్పడే విధంగా ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో డైరెక్టర్ కట్ల రాజేంద్రప్రసాద్, కో డైరెక్టర్ కోల మధుబాబు, నటీనటులు బోళ్ల స్వామిరెడ్డి, దొంతగాని సత్యనారాయణ పాల్గొన్నారు. -
రాజాపేటలో సినిమాషూటింగ్
రాజాపేట: మండలంలోని హరిష్రావ్ ఫామ్హౌజ్లో బుధవారం బీ ఫామ్హౌజ్ సినిమా షూటింగ్ నిర్వహించారు. ఎంఅండ్ఎస్ క్రియేషన్స్, లక్ష్మీ ఎంటర్టైన్మెంట్ ప్రజెంట్స్ వారి బీ ఫామ్హౌజ్ సినిమాలోని కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ ఎస్ పాల్ వివరాలను తెలిపారు. కథ, డైరక్టర్, నిర్మాత ఎస్ పాల్, కెమెరామెన్, స్క్రీన్ప్లే వీఎన్ రాజు, రణదీప్రెడ్డి, హీరో రిషి, అక్షయ్, హీరోయిన్ రమ్యారెడ్డిలు నటిస్తున్నట్లు తెలిపారు. వారం రోజులు క్రితం సినిమా షూటింగ్ ప్రారంభించినట్లు, ఈ సినిమా షూటింగ్ సన్నివేశాలను హైదరాబాద్లోని అమీర్పేట, చర్లపల్లి పరిసర ప్రాంతాల్లో చిత్రీకరిస్తున్నట్లు తెలిపారు. ఈ నినిమా మొత్తం హర్రర్, సెంటిమెంట్, క్రైం సన్నివేశాలల్లో మొత్తం 15 మంది పాత్రలు పోషిస్తున్నట్లు తెలిపారు. తనకు ఈ సినిమా మొదటిదని దీపావళి వరకు బీ ఫామ్హౌజ్ సినిమా రిలీజ్ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. -
నయీమ్ జీవితంతో మూడు సినిమాలు!
ఎప్పుడూ ఓ నాలుగు కళ్లు నేరాలు-ఘోరాలు, మాఫియా కార్యకలాపాలు ఎక్కడ జరుగుతున్నాయా? అని వెతుకుతుంటాయి. అందులో పోలీసులవి రెండు కళ్లు అయితే.. ఇంకో రెండు కళ్లు దర్శకుడు రామ్గోపాల్ వర్మవి. మాఫియా, ఇతర నేరాలను అరికట్టాలని పోలీసులు ఓ కన్నేస్తే, సదరు గ్యాంగ్స్టర్లపై సినిమా తీస్తే ఎలా ఉంటుందనే ఆలోచనతో వర్మ ఉంటారు. నిజజీవిత ఘటనలను వెండితెరపై ఆవిష్కరించడంలో వర్మ స్పెషలిస్ట్. హిందీలో ‘సత్య’, ‘కంపెనీ’, ‘సర్కార్’.. తెలుగులో ‘రక్త చరిత్ర’, ‘కిల్లింగ్ వీరప్పన్’ వంటి సినిమాలు తెరకెక్కించారు. ప్రస్తుతం వర్మ కన్ను గ్యాంగ్స్టర్ నయీమ్ మీద పడింది. ఇటీవల పోలీసుల ఎన్కౌంటర్లో మరణించిన నయీమ్ జీవిత కథను వెండితెరపై ఆవిష్కరిస్తానని వర్మ ట్వీటారు. ‘‘నక్సలైట్ నుంచి పోలీస్ ఇన్ఫార్మర్గా, ఆ తర్వాత గ్యాంగ్స్టర్గా మారిన ఆల్ టైమ్ క్రిమినల్ నంబర్వన్ నయీమ్ నేరచరిత్రకు సంబంధించిన పలు కథనాలు తెలుసుకున్నాను. అతడు చేసిన పనులు భయంకరమైనవి. ఒక్క సినిమాలో నయీమ్ కథ అంతటినీ చెప్పడం అసాధ్యం. అందుకే, మూడు సినిమాలు తీయాలని నిర్ణయించుకున్నాను’’ అని వర్మ పేర్కొన్నారు. నయీమ్ మరణించిన తర్వాత ప్రతి రోజూ సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. వర్మ దర్శకత్వంలో రాబోయే నయీమ్ ట్రయాలజీ ఇంకెన్ని సంచలనాలకు కేంద్రబిందువు అవుతుందో! -
అన్ని యాప్లెందుకు? బక్కర్ ఉంటే చాలు!
• ఆన్లైన్ సంస్థల రాయితీలు, కూపన్ల వివరాలందిస్తున్న బక్కర్ • బక్కర్తో ఈ-కామర్స్లకు నెలకు రూ.75 లక్షల వ్యాపారం • నెల రోజుల్లో లోకల్ షాపింగ్, రీచార్జ్ విభాగాల్లోకి విస్తరణ కూడా • 3 నెలల్లో రూ.6 కోట్ల నిధుల సమీకరణ • ‘స్టార్టప్ డైరీ’తో కో-ఫౌండర్ వెన్నెల మిర్యాల హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : వీకెండ్స్లో సినిమాకి వెళ్లాలి.. థియేటర్కు చేరుకోవడానికో క్యాబ్ కావాలి! రిటర్న్లో రెస్టారెంట్లో భోజనం చేయాలి.. ఇంటికొచ్చాక ఆన్లైన్లో షాపింగూ చేసేయాలి!! ...కానీ, ఇవన్నీ తక్కువ ధరలోనే కావాలండోయ్. ఆన్లైన్లో వెతికితే వేటికవే వేర్వేరుగా రాయితీలందించే కూపన్లు దొరుకుతాయ్. కానీ, ఒక్కో దానికోసం బోలెడంత సమయం వృథా. అసలు రాయితీలందించే యాప్లన్నీ ఒకే వేదికగా ఉంటే!! ఆ కిక్కే వేరు కదూ...! ఇదిగో అచ్చం ఇలాంటి యాపే ‘‘బక్కర్’’. ఈ యాప్ విశేషాలు, సేవల గురించి వెన్నెల మిర్యాల ‘సాక్షి స్టార్టప్ డైరీ’తో పంచుకున్నారు. నేను, రవనీత్ సింగ్, నిఖార్ అగర్వాల్ ముగ్గురం ట్రిపుల్ ఐటీ గ్రాడ్యుయేట్స్. బీటెక్ నాలుగో సంవత్సరంలో ప్రాజెక్ట్ వర్క్ చేయాలి. ఏ అంశాన్ని ఎంచుకోవాలనే విషయంపై బాగా ఆలోచించాం. ఆ సమయంలో మాకెదురైన అనుభవాన్నే ప్రాజెక్ట్ చేయాలనుకున్నాం. అదే బక్కర్ యాప్గా మారింది. అదెలాగంటే.. మీం వీకెండ్స్లో ఫుడ్యాప్ల ద్వారా రాయితీలపై ఆహారాన్ని తెప్పించుకొని తినేవాళ్లం. అయితే తక్కువ ధరకు, నాణ్యమైన ఫుడ్ ఏ సంస్థ ఆఫర్ చేస్తుందోనని తెలుసుకునేందుకు ఆన్లైన్లో గంటల కొద్దీ వెతికేవాళ్లం. ఆ సమయంలో మేం గ్రహించిందేంటంటే.. ఆన్లైన్లో రాయితీలను వెతికేందుకు ఎంత సమయం వృథా అవుతుందోనని! ‘‘ప్రతీ సంస్థకూ ఓ యాప్ ఉంటుంది.. రాయితీలూ ఉంటాయ్’’ కానీ, అవన్నీ ఒకే వేదికగా అందుబాటులో లేవని కూడా తెలిసింది. దీన్నే వ్యాపార సూత్రంగా మలుచుకొని రూ.2 లక్షల పెట్టుబడితో హైదరాబాద్ కేంద్రంగా గతేడాది డిసెంబర్లో క్రూగ్జియో ల్యాబ్స్ ప్రై.లి. పేరిట సంస్థను ప్రారంభించాం. ఈ సంస్థ ఆండ్రాయిడ్ యాపే ‘బక్కర్’! వినియోగదారులకు లాభపడేలా.. కంపెనీలకు తగిన మార్కెట్ చూపించేలా వివిధ సంస్థల యాప్లు, వాటికి ప్రత్యామ్నాయాలు, రాయితీలు, డిస్కౌంట్లు, ఆఫర్లనూ అందించే సంస్థలు.. ఇలా అన్నింటికీ ఒకే వేదికగా పొందే వీలు కల్పించడమే బక్కర్ పని. 4 విభాగాలు.. 22 సంస్థలు.. బక్కర్ యాప్లో లాగినయ్యాక.. కావాల్సిన సేవలను ఎంచుకోవాలి. వెంటనే ఆయా సేవలందిస్తున్న సంస్థలు, ధరలు, రాయితీల వివరాలొస్తాయి. నేరుగా అక్కడి నుంచే వాటిని బుకింగ్ చేసుకోవచ్చు. ప్రస్తుతం క్యాబ్స్, ఈ-కామర్స్, విమానాలు, కూపన్లు... నాలుగు విభాగాల్లో సేవలందిస్తున్నాం. ఫుడ్పాండా, స్విగ్గీస్, సాసోస్, ఓలా, ఉబర్, పేటీఎం, మొబీక్విక్, ఫ్రీచార్జ్, గ్రాబ్ఆన్, ఫ్లిప్కార్ట్, అమెజాన్ వంటి 22 సంస్థలు మాతో భాగస్వామ్యమయ్యాయి. నెలకు 50 వేల మంది బక్కర్ను వినియోగించుకుంటున్నారు. వచ్చే 6 నెలల్లో 5 లక్షల యూజర్లకు చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. మా యాప్ నుంచి జరిగే ప్రతి కొనుగోలు మీద 7-10 శాతం కమీషన్ కింద ఆయా సంస్థలు చెల్లిస్తాయి. నెలకు రూ.75 లక్షల జీఎంవీ.. ప్రస్తుతం నెలకు రూ.9-10 లక్షల వ్యాపారాన్ని చేరుకుంటున్నాం. బక్కర్ ద్వారా మా భాగస్వామ్య సంస్థలకు నెలకు రూ.75-80 లక్షల వ్యాపారం (జీఎంవీ) జరుగుతుంది. ఆగస్టులో రెండింతల వృద్ధిని చేరుకోవాలనేది లక్ష్యం. ప్రస్తుతం మా సంస్థలో ఆరుగురు ఉద్యోగులున్నారు. నెల రోజుల్లో లోకల్ షాపింగ్, రీచార్జ్ విభాగాల్లోకి విస్తరించనున్నాం. 6 నెలల్లో హోటల్స్, ట్రావెల్ (బస్సు, రైళ్లు) విభాగాలకు విస్తరించాలనేది లక్ష్యం. రూ.6 కోట్ల నిధుల సమీకరణపై దృష్టి.. ‘‘సీడ్రౌండ్లో భాగంగా గతేడాది డిసెంబర్లో కోటి రూపాయల నిధులను సమీకరించాం. 50కే వెంచర్స్, సింగపూర్, సిలికాన్వ్యాలీకి చెందిన ఇన్వెస్టర్లు ఈ పెట్టుబడులు పెట్టారు. ప్రస్తుతం రూ.6 కోట్ల నిధుల సమీకరణపై దృష్టిపెట్టాం. బెంగళూరు, ముంబైకి చెందిన పలువురు వీసీ)సంస్థలతో మాట్లాడుతున్నాం. మరో 3 నెలల్లో డీల్ను క్లోజ్ చేస్తాం’’ అని వెన్నెల వివరించారు. -
‘వనం–మనం’లో సినీతారలు
రాజమండ్రి : ఓడలరేవు బీవీసీ కళాశాలలో శుక్రవారం నిర్వహించిన ‘వనం–మనం’ కార్యక్రమానికి సినిమా గ్లామర్ అద్దుకుంది. హీరో భరత్, హీరోయిన్ శ్వేతాశర్మ ముఖ్య అతిథులుగా పాల్గొని కళాశాల ఆవరణంలో మొక్కలను నాటారు. వారితో పాటు విద్యార్థులు 500 మొక్కలను నాటారు. కళాశాల ప్రిన్సిపాల్ డీఎస్వీ ప్రసాద్, కొల్లు విష్ణుమూర్తి,నాతి లెనిన్బాబు, గిడుగు భాస్కరరావు పాల్గొన్నారు. -
పట్టపగలే దెయ్యం ఊయల ఊగితే..
న్యూయార్క్: అమెరికాలో ఓ వింత సంఘటన చోటుచేసుకుంది. కుటుంబంతో కలిసి టూర్ కి వెళ్లిన ఓ వ్యక్తి తమ పిల్లలను అక్కడి ఊయలలు ఊగనివ్వలేదు. కారణం ఏమిటో తెలుసా.. దెయ్యం. అవును ఆ ఊయలలో దెయ్యం ఊగుతోందంట. ఆ విషయం ఆ వ్యక్తి స్వయంగా తెలపడం కాకుండా ఆ వీడియోను కూడా పోస్ట్ చేశారు. ఇప్పటికే ఆ వీడియోను లక్షలమంది చూశారు. అమెరికాలోని రోడే ఐలాండ్ లో వార్విక్ అనే ప్రాంతంలో ఓ కుటుంబం సరదాగా గడిపేందుకు వెళ్లింది. అదే సమయంలో అదే కుటుంబంలోని ఓ మూడేళ్ల పాప బీచ్ ఒడ్డున ఉన్న ఊయల ఊగుతానని మారాం చేసింది. దీంతో ఆ కుటుంబం పాపను తీసుకునే ముందుకు రెండు అడుగులు వేయగా అనూహ్యంగా అందులో ఎవరు కూర్చోకుండానే ఆ ఊయల ఊగడం ప్రారంభించింది. దీంతో అవాక్కయిన ఆ పాప తండ్రి స్కాట్ పాపను వెళ్లనివ్వకుండా వీడియో తీయడం ప్రారంభించాడు. ఆ సమయానికి పెద్దగా గాలి ప్రభావం కూడా లేదని, ఊయలలో ఉన్న ఓ ఖాళీ కుర్చి ఎలా ఊగుతుందని ఆశ్చర్యపోయానని అతడు చెప్పాడు. పగలు కూడా దెయ్యాలు సంచరిస్తున్నాయా అనే గుండె ఆగినంత పనైందని అతడు తన అభిప్రాయం చెప్పాడు. -
ఆ పాత్ర చేయడం ఉత్తేజకరంగా ఉంది: అక్కినేని నాగార్జున
తిరుమల: 'ఓం నమో వేంకటేశాయః' చిత్రం ద్వారా శ్రీవేంకటేశ్వర స్వామివారి భక్తుడు హథీరాం పాత్రను చేస్తుండటం ఉత్తేజకరంగా ఉందని సినీహీరో అక్కినేని నాగార్జున అన్నారు. గురువారం ఉదయం ఆయన తన సతీమణి అమలతో కలిసి స్వామివారిని దర్శించకున్నారు. వీరి వెంట దర్శకుడు కే రాఘవేంద్రారావు, నిర్మాత ఎ.మహేశ్వరరెడ్డిలతో పాటు సాంకేతిక బృందం కూడా ఉన్నారు. చిత్ర నిర్మాణం ప్రారంభంకావడానికి ముందు చిత్రం విజవంతం కావాలని గర్భాలయ మూలమూర్తకి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయం వెలుపల నాగార్జన మీడియాతో మాట్లాడుతూ.. శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకుని చిత్రం పేరును 'ఓం నమో వేంకటేశాయః' గా ప్రకటించారు. అన్నమయ్య సినిమాలానే ఈ చిత్రంలో కూడా భక్తుడి పాత్ర పోషిస్తున్నట్లు తెలిపారు. ఈ నెల25 నుంచి షూటింగ్ ను ప్రారంభిస్తామన్నారు. అన్నమయ్య తర్వాత ఓం నమో వేంకటేశాయః చిత్రానికి దర్శకత్వం వహించడం అద్భుత అవకాశమని చెప్పారు. -
థ్రిల్లర్ సినిమాగా ఇందిరాగాంధీ ప్రసంగం..
న్యూఢిల్లీః అత్యంత ధైర్య సాహసాలు కలిగిన దేశ మహిళ, భారత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ ప్రసంగం.. సినిమాగా రూపొందుతోంది. 40 ఏళ్ళ క్రితం 1975 జూన్ 25న భారత్ లో ఎమర్జెన్సీని విధించి... ఆరోజు రాత్రి ఆల్ ఇండియా రేడియోలో ఆమె ప్రసంగించారు. ఇప్పుడు ఆ ప్రసంగం ప్రముఖ బాలీవుడ్ థ్రిల్లర్ సినిమా 'సన్ పఛత్తర్' గా విడుదల కాబోతోంది. ఎమర్జెన్సీ పై నలభై ఏళ్ళ క్రితం ఇందిరాగాంధీ ఇచ్చిన ప్రసంగం ఓ కథా చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రానికి 'డిటెక్టివ్ బ్యోమకేష్ బక్షయ్' ఫేమ్ సందీప్ మాధవన్ భయంకరమైన (పానిక్) సౌండ్ ట్రాక్ ను అందించారు. ఆల్ ఇండియా రేడియోలో 1975 జూన్ 25న ఇందిరాగాంధీ ఇచ్చిన ప్రసంగంపై రూపొందుతున్న ఈ కథా చిత్రానికి సంబంధించిన అన్ని ఆడియో హక్కులను ఆల్ ఇండియా రేడియోనుంచి, వీడియో హక్కులను ఫిల్మ్ డివిజన్ ఆఫ్ ఇండియా నుంచి తీసుకుంటున్నట్లు చిత్ర నిర్మాత కబీర్ లోవీ ఓ ప్రకటనలో తెలిపారు. 'సన్ పఛత్తర్' సినిమాలో స్టార్ నటుడు కె కె మెనన్, ప్రవేశ్ రాణా, కీర్తి కుల్హారీలు నటిస్తుండగా, 'తమాన్ ఛే' ఫేమ్ నవనీత్ బెహల్ దర్శకత్వంలో ఈ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. -
అజిత్, శింబు అభిమానుల మధ్య గొడవ
తమిళసినిమా: సినీ నటుల మధ్య ఎలాంటి విభేదాలు ఉండవు. అలాంటివేమైనా ఉన్నా బయట పడకుండా జాగ్రత్త పడుతుంటారు. ఎక్కడై నా తారసపడ్డా చిరునవ్వులతో ఆలింగనం చేసుకుంటారు. తమ మధ్య మంచి స్నేహ బంధం ఉందంటారు. అయితే వారి అభిమానులు మాత్రం తరచూ గొడవలకు దిగుతుంటారు. ఒకరినొకరు దూషించుకుంటూ తలలు బద్దలు కొట్టుకుంటారు. ఆదివారం తిరుచ్చిజిల్లాలో సరిగ్గా ఇలాంటి సంఘటనే జరిగింది. వివరాలు...తిరుచ్చి జిల్లా, తిరువెరుంబూర్ భగవతీపురంలోని అమ్మన్ ఆలయంలో వారం రోజు లుగా ఉత్సవాలు జరుగుతున్నాయి. చివరి రో జు ఆదివారం రాత్రి పసుపు జలాలతో అభిషే కం నిర్వహించారు. ఆ సమయంలో అదే ప్రాం తానికి చెందిన నటుడు అజిత్, విజయ్ అభిమానులకు, నటుడు శింబు అభిమానులకు మధ్య పరస్పర వాగ్వాదం గొడవకు దారి తీసింది. దీంతో ఆ ప్రాంతానికి చెందిన శంకర్ అనే వ్యక్తి ముందుకు వచ్చి ఇరు వర్గాలకు నచ్చజెప్పి గొడవ సద్దుమణిగేలా చేశారు. అయితే జాఫర్ అనే వ్యక్తి అనూహ్యంగా శంకర్ మీద దాడి చేసి ఇనుప రాడ్డుతో కొట్టడంతో మళ్లీ గొడవ జరి గింది. గొడవల్లో ఆ ప్రాంతానికి చెందిన కరుప్పయ్య, చంద్రశేఖర్, పెరియసామి తదితర 8 మంది గాయాల పాలయ్యారు. వారిని స్థానికు లు తువాంగుడి ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చారు. దాడి చేసిన వారిపై తగిన చర్యలు తీసుకోవాలంటూ ఆ ప్రాంతానికి చెందిన 100 మందికిపైగా తిరువెరుంబూర్ పోలీస్స్టేషన్లో ఫిర్యా దు చేయడానికి వెళ్లారు. అయితే పోలీసులు వారి ఫిర్యాదును నిరాకరించడంతో మహిళలు పోలీస్స్టేషన్ను చుట్టి ముట్టి ఆందోళనకు దిగా రు. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. చివరికి పోలీసులు గ్రామస్తులతో చర్చలు జరిపి పరిస్థితి అదుపులోకి తెచ్చారు. -
అజహరుద్దీన్కు ఒక్కొక్కటిగా అర్థమవుతున్నాయా?
పాత గాయం సినిమా వేరు... జీవితం వేరు... సెలబ్రిటీ జీవితం వేరు... పబ్లిక్లోకి వచ్చి, సామాన్యుడిలా నిలబడడం వేరు.... మనకు నోటికొచ్చింది మీడియా మీట్లో చెప్పేసి వెళ్ళిపోవడం వేరు... ప్రత్యేక ఇంటర్వ్యూకు ఒప్పుకొని, అడిగిన ప్రశ్నకల్లా జవాబు చెప్పగలగడం వేరు. క్రికెటర్గా పేరు తెచ్చుకొని, భారత క్రికెట్ జట్టుకు సారథిగా కూడా వెలిగిన మహమ్మద్ అజహరుద్దీన్కు ఈ విషయాలన్నీ ఇప్పుడు ఒక్కొక్కటిగా అర్థమవుతున్నాయా? వరుస చూస్తుంటే, అలాగే అనిపిస్తోంది. అజహరుద్దీన్ జీవితంపై తాజాగా హిందీలో ‘అజహర్’ అనే సినిమా వస్తోంది. ఇమ్రాన్ హష్మీ ప్రధానపాత్ర పోషిస్తున్న ఈ చిత్రం ఈ శుక్రవారమే విడుదల కానుంది. ఈ సినిమా రిలీజ్ సందర్భంగా చిత్ర ప్రచారం కోసం అజహర్ ఇప్పుడు వరుసపెట్టి బోలెడన్ని ప్రెస్మీట్లలో మాట్లాడుతున్నారు. అడిగినవాడికి లేదనకుండా ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. అయితే అలాంటి ఒక ఇంటర్వ్యూ ఆయనకు కొరకరాని కొయ్యగా మారింది. అజహర్ క్రికెట్ ఆడుతున్న సందర్భంలో తలెత్తిన మ్యాచ్ ఫిక్సింగ్ వివాదం గురించి సదరు ఇంటర్వ్యూలో లోతైన ప్రశ్నలు వేశారట! మాల్కమ్ మార్షల్, కోట్నీ వాల్ష్ లాంటి ఫాస్ట్బౌలర్ల బౌలింగ్ను కూడా సమర్థంగా ఎదుర్కొన్న అజహర్ ఈ వాడి వేడి ప్రశ్నల బంతులకు మాత్రం చేతులెత్తేశారు. ఆ ఇంటర్వ్యూ నుంచి వాకౌట్ చేశారు. ఇంటర్వ్యూ చేస్తున్నవాళ్ళు పదే పదే అభ్యర్థించినా మళ్ళీ వచ్చి కూర్చోలేదు, ఇంటర్వ్యూ కొనసాగించలేదు. విచిత్రం ఏమిటంటే బౌన్సర్ల లాంటి ప్రశ్నల్ని ఎదుర్కోవాల్సి వస్తుందనే అనుమానంతో మరో న్యూస్ ఛానల్ నిర్వహించే ఒక పెద్ద టీవీ షోకు కూడా మన హైదరాబాదీ క్రికెటర్ నో చెప్పేశారట. ‘జవాబివ్వడానికి తడుముకోవాల్సి వచ్చే ప్రశ్నలు ఎవరైనా అడగడం ఆయనకు ఇష్టం లేదు. అందుకే, ఆ టీవీ షోకైనా, ఈ ఇంటర్వ్యూకైనా ఆయన దూరంగానే ఉండిపోయారు’ అని ఆంతరంగిక వర్గాలు చెప్పాయి. ఎంతైనా ఇంటర్వ్యూలో సంధించే లోతైన ప్రశ్నల్ని తట్టుకోవడం మైదానంలో క్రికెట్ ఆడినంత సులభం కాదని అజహరుద్దీన్ తాజాగా అనుభవంలోకి వచ్చినట్లుంది! -
అమెరికాను పక్కన పెట్టి ఇండియా బాటలో..
చెన్నై: హాలీవుడ్ చిత్రాలు ఇండియా బాటపడుతున్నాయి. వందల కోట్లు పెట్టి భారీ స్థాయిలో చిత్రాలు నిర్మించి వాటిని తొలుత తమ దేశాల్లో కాకుండా భారత్ లో విడుదల చేస్తున్నారు. మల్టీ ప్లెక్స్ ల హవా మొదలవడం.. హాలీవుడ్ చిత్రాల క్రేజ్ పెరగడంతో ఇక తమ చిత్రాలను తొలుత అత్యధిక వ్యాపార అవకాశాలు ఉన్న భారతీయ స్క్రీన్ లపైకే వదులుతున్నాయి. ఇటీవల జంగిల్ బుక్ చిత్రాన్ని నేరుగా ఇండియాలో విడుదల చేసినట్లుగానే ఇప్పుడు మరో హాలీవుడ్ చిత్రం 'ఎక్స్ మెన్ అపోకాలిప్స్' నేరుగా ఇండియాలో విడుదల చేస్తున్నారు. ఈ చిత్రానికి బ్రియాన్ సింగర్ దర్శకత్వం వహించారు. మే 20న సినిమాను ఇండియాలో విడుదల చేస్తున్నట్లు ఫాక్స్ స్టార్ స్టూడియో ప్రకటన చేసింది. 'ఎక్స్ మెన్ చిత్రాలకు ఇండియాలో భారీ స్థాయిలో ఫాలోయింగ్ ఉంది. ఆసియా దేశాలతో పోల్చుకుంటే ఇండియాలోనే ఎక్కువ. అందుకే అమెరికా కన్నా ఒక వారం రోజుల ముందుగానే ఇండియాలో విడుదల చేస్తున్నాం. ఇతర దేశాలకు దక్కని ఈ అవకాశం భారతీయులు ముందుగా ఉపయోగించుకోవాలి' అని ఫాక్స్ స్టార్ సీఈవో విజయ్ సింగ్ తెలిపారు. ఈ చిత్రం హిందీ, తమిళ, తెలుగు భాషల్లో డబ్బింగ్ చేశారు. -
'డబ్బు కోసం సినిమాల్లో నటించడం లేదు'
ముంబై: డబ్బుల కోసం తాను సినిమాల్లో నటించలేదని బాలీవుడ్ నటి స్వర భాస్కర్ అంది. డబ్బులు కావాలంటే మరో పనిచేసి సంపాదించేదాన్నని చెప్పింది. స్వర తాజాగా అశ్వినీ అయ్యర్ దర్శకత్వంలో ఓ చిత్రంలో నటించింది. ఈ చిత్రంలో ఆమె ఓ టీనేజ్ అమ్మాయికి తల్లిపాత్రలో నటించింది. 'నేను డబ్బుల కోసం ఇంతవరకూ ఏ సినిమాలోనూ నటించలేదు. నేను నటించిన సినిమాలు అభిమానుల హృదయాల్లో నిలిచిపోవాలి. అంతేకానీ ఓ ఇడియట్లా కనిపించాలని కోరుకోవడం లేదు. నేను చనిపోయినా గౌరవంగా గుర్తించుకోవాలి. అశ్వినీ అయ్యర్ చిత్రంలో నటించే అవకాశం వచ్చినపుడు తిరస్కరించాలని భావించా. అదే ఉద్దేశ్యంతో స్ర్కిప్ట్ చదివాను. ఆ తర్వాత తెలిసింది ఇది అద్భుతమైన స్ర్కిప్ట్ అని. ఈ పాత్ర చేయడం నటిగా నాకు సవాల్' అని స్వర చెప్పింది. -
అజిత్ తో అనుష్క మరోసారి..
అజిత్తో మరోసారి జత కట్టడానికి అందాల తార అనుష్క సిద్ధమవుతున్నారా? దీనికి కోలీవుడ్ నుంచి అవుననే సమాధానమే వస్తోంది. సూపర్స్టార్స్ రజనీకాంత్, కమలహాసన్ల తరువాత కోలీవుడ్లో అంతటి ఫాలోయింగ్ ఉన్న స్టార్స్ విజయ్, అజిత్లేనని ఏమాత్రం సందేహం లేకుండా చెప్పవచ్చు.అలాంటి వారితో జత కట్టడానికి ప్రముఖ నటీమణులు ఆశ పడుతుంటారు. అందుకు తమ ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటీవల నటి తమన్నా అలాంటి ప్రయత్నాన్నే చేసినట్లు ప్రచారం జరిగింది. తమన్నా అజిత్తో కలిసి వీరం చిత్రంలో నటించారు. ఆ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. అజిత్ వేదాళం తరువాత తన 57వ చిత్రానికి సిద్ధమవుతున్న విషయం తెలిసిందే.ఇందులో హీరోయిన్గా నటించాలన్న ఆకాంక్షను తమన్న వ్యక్తం చేసినట్లు సమాచారం. మరో సారి అజిత్తో నటిస్తానని తనే ఇటీవల వెల్లడించారు. దీంతో అజిత్ తాజా చిత్రంలో హీరోయిన్గా తమన్నా ఎంపికయ్యిందేమోన ని అనుకున్న వారూ లేక పోలేదు. అయితే అజిత్ తాజా చిత్రంలో నటించే అవకాశం తమన్నాకు దక్కే అవకాశం లేదని తెలుస్తోంది. ఆ అవకాశాన్ని స్వీటీ(అనుష్క)తన్నుకుపోయినట్లు తాజా సమాచారం.అనుష్క ఎన్నై అరిందాల్ చిత్రంలో తొలి సారిగా అజిత్ తో నటించారు. అయితే ఆ చిత్రంలో ఆయనతో అంతగా రొమాన్స్ చేసే అవకాశం లభించలేదు. అజిత్ 57వ చిత్రం మరోసారి ఫుల్ప్లెజ్డ్ హీరోయిన్గా నటించడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. వీరం, వేదాళం చిత్రాల దర్శకుడు శివనే అజిత్ తాజా చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. ఈ చిత్రం మే నెలలో సెట్పైకి రానున్నదని తెలుస్తోంది. వేదాళం చిత్రానికి సంగీత బాణీలు అందించిన అనిరుద్నే దీనికి సంగీతాన్ని అందించనున్నారు. అనుష్క ప్రస్తుతం బాహుబలి-2, ఎస్-3 చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. -
‘సినీటీవీ ప్రొడక్షన్ అసిస్టెంట్స్ యూనియన్లో అవినీతి’
తెలుగు సినీ అండ్ టీవీ ప్రొడక్షన్ అసిస్టెంట్స్ యూనియన్లో రూ.2 కోట్ల మేర నిధులు దుర్వినియోగమయ్యాయని సంఘ సభ్యులు సోమవారం బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. యూనియన్కు చెందిన రూ.2 కోట్లు క్యాన్సిలేషన్ చేసి యూనియన్ అధ్యక్షుడు సతీష్, ప్రధాన కార్యదర్శి ఎల్ రాజేంద్రప్రసాద్, కోశాధికారి పీవీవీ ప్రసాద్ ఇష్టానుసారంగా వ్యవహరించారని ఆరోపించారు. రూ.2 కోట్లతో నల్లగొండ జిల్లా మోత్కూరు గ్రామం వద్ద 35 ఎకరాల కొనుగోలు చేశారు. అయితే, ఈ భూమి ఎకరం విలువ రూ.3.30 లక్షలు మాత్రమే ఉండగా వారు మాత్రం రూ.5.30 లక్షలు వెచ్చించినట్లు తెలిపారు. యూనియన్ డబ్బును ఈ విధంగా దుర్వినియోగం చేశారని చెప్పారు.ఈ మేరకు ఫిర్యాదు పత్రంపై సంఘం సభ్యులు 60 మంది సంతకాలు చేయటంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మాజీ యూనియన్ ప్రధాన కార్యదర్శి కె. రాజేశ్వర్రెడ్డి తదితరులు పోలీసులను కలిసిన వారిలో ఉన్నారు. -
కశ్మీర్ కథాంశంగా విధు వినోద్ చోప్రా సినిమా
ఇటీవలి కాలంలో బాక్సాఫీస్ హిట్ను సాధించి.. ఎంతో ప్రేక్షకాదరణ పొందిన 'త్రీ ఇడియట్స్', 'పీకే' వంటి ప్రముఖ సినిమాల నిర్మాత.. విధు వినోద్ చోప్రా మరో ప్రత్యేక కథాంశంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. తన కొత్త చిత్రానికి కశ్మీర్ను కథాంశంగా ఎంచుకున్నఆయన... నూతన తన ప్రాజెక్టుపై కేంద్రమంత్రి జితేంద్ర సింగ్తో చర్చించారు. నిజానికి తన జీవితంలో ఎక్కువ భాగాన్ని జమ్మూ కశ్మీర్లోనే గడిపానని, పాఠశాల, కళాశాల విద్యను శ్రీనగర్లోనే పూర్తి చేశానని చోప్రా తెలిపారు. అందుకే ముఖ్యంగా కశ్మీరీ పండిట్ కమ్యూనిటీ దురవస్థ నేపథ్యాన్ని వర్ణిస్తూ చోప్రా చలనచిత్ర నిర్మాణం చేపట్టనున్నట్లు మంత్రి కార్యాలయం విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ సందర్భంలో చోప్రా, అతని సభ్యులు చెప్పిన విషయాలను ఎంతో ఓపిగ్గా విన్న మంత్రి జితేంద్ర సింగ్.. ప్రాజెక్టులోని ప్రధానాంశాలను క్లుప్తంగా ఓ నోట్ రూపంలో అందజేయాలని కోరారు. అంతేకాక ప్రభుత్వం నుంచి వారు కచ్చితంగా ఏం కావాలని కోరుకుంటున్నారో కూడా వివరంగా తెలపాలని సూచించారు. -
ఎస్ఎంకేకు కొత్త జట్టు
సాక్షి, చెన్నై: అఖిల భారత సమత్తువ మక్కల్ కట్చికి(ఎస్ఎంకే) కొత్త జట్టు ఎంపికైంది. ఆ పార్టీ అధ్యక్షుడిగా సినీ నటుడు శరత్కుమార్ మళ్లీ ఎంపికయ్యారు. ఆయన సతీమణి, నటి రాధిక శరత్కుమార్ ఆ పార్టీ మహిళా విభాగం ప్రధానకార్యదర్శిగా నియమితులయ్యారు. ఆదివారం తిరునల్వేలి వేదికగా జరిగిన పార్టీ సర్వసభ్య సమావేశంలో రానున్న ఎన్నికల్లో పొత్తు ఎవరితో అన్న అంశంపై చర్చించారు. సమత్తువ మక్కల్ కట్చిలో గత నెల ప్రకంపన బయ లు దేరిన విషయం తెలిసిందే. ఆ పార్టీ ప్రధాన కార్యదర్శితో పాటుగా పలువురు బీజేపీలో చేరడం, తదుపరి ఆ పార్టీ ఉపాధ్యక్షుడు, ఎమ్మెల్యే ఎర్నావూర్ నారాయణన్ తిరుగు బావుటా ఎగురవేయడంతో వివాదం రచ్చకెక్కింది. ఎస్ఎంకేను కైవసం చేసుకోవడం లక్ష్యంగా ఎర్నావూర్ నారాయణన్ తీవ్ర ప్రయత్నాలు చేస్తూ వస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఆదివారం తిరునల్వేలి వేదికగా ఆ పార్టీ సర్వ సభ్య సమావేశానికి శరత్కుమార్ పిలుపు నిచ్చారు. ఈ పిలుపునకు అమిత స్పందన వచ్చిందని చెప్పవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జిల్లాల అధ్యక్షులు, కార్యవర్గ కమిటీ, రాష్ట్ర నాయకులు తరలి రావడంతో ఎస్ఎంకే ను కైవసం చేసుకోవడం ఎవరి తరం కాదన్న ధీమా శరత్కుమార్లో నెలకొన్నట్టు అయింది. ఈ సమావేశం నిమిత్తం తూత్తుకుడి నుంచి తిరునల్వేలి కేటీసీ నగర్కు చేరుకున్న శరత్కుమార్కు పార్టీ వర్గాలు బ్రహ్మరథం పట్టారు. మళ్లీ అధ్యక్షుడిగా: పార్టీలో నెలకొన్న ప్రకంపనను చల్లార్చే దిశగా ఈ సమావేశ ఆరంభంలో కొత్త జట్టు ఎంపిక మీద శరత్కుమార్ దృష్టి పెట్టారు. పార్టీ నుంచి ముఖ్య పదవుల్లో ఉన్న వాళ్లు బయటకు వెళ్లడంతో, వారి స్థానాల్ని భర్తీ చేస్తూ, కొత్త జట్టును ప్రకటించారు. సర్వ సభ్య సమావేశం ఆమోదంతో పార్టీ అధ్యక్షుడిగా శరత్కుమార్ మళ్లీ ఎంపిక అయ్యారు. పార్టీ ప్ర ధాన కార్యదర్శిగా జయ ప్రకాష్, కోశాధికారిగా సుందరేషన్, ఉపాధ్యక్షుడిగా కాళిదా స్, సహాయ ప్రధాన కార్యదర్శులుగా ష ణ్ముగ సుందరం, పన్నీరు సెల్వం, ప్రిసీడి యం చైర్మన్గా సెల్వరాజ్, రాజకీయ సల హాదారుడిగా లారెన్స్ను ఎంపిక చేస్తూ శరత్కుమార్ ప్రకటించారు. ఇక పార్టీ మహిళా విభాగం ప్రధాన కార్యదర్శిగా రాధికను ఎంపిక చేశారు. అలాగే, ఇతర పదువులకు ఎంపికైన వారి వివరాల్ని ప్రకటించారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తు ఎ వరితో అన్న అంశంపై పార్టీ వర్గాల అభిప్రాయాల్సి శరత్కుమార్ సేకరించారు. డీఎంకే వైపు చూపా: అభిప్రాయ సేకరణ అనంతరం శరత్కుమార్ ప్రసంగిస్తూ, పార్టీ తొమ్మిదో ఏట అడుగు పెట్టిందని గుర్తు చేస్తూ, ఈ కాలంలో ఎంతో ప్రగతిని సాధించామన్నారు. రాష్ట్రంలో పొత్తులు కుదరడం లేదని గుర్తు చేస్తూ, అస్సలు ఎన్నికల ముందు పొత్తులు అవసరమా అని ప్రశ్నించారు.ఎ న్నికల అనంతరం పొత్తులు కుదిరి కూటమి ప్రభుత్వం ఏర్పడ్డప్పుడే ప్రజలకు న్యాయం జరుగుతుందని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలోని రాజకీయ పార్టీలన్నీ వారి వారి బలం ఏమిటో చాటుకోవాలంటే ఒంటరి సమరానికి సిద్ధం కావాలని పిలుపు నిచ్చారు. రాష్ట్రంలో ఎవరంటే, వాళ్లు తానే సీఎం ...తానే సీఎం అని చెప్పుకుంటున్నారని,అలాంటప్పుడు తాను కూడా ఓ కూటమి ఏర్పాటు చేసుకుని సీఎంగా ప్రకటించుకుంటానంటూ చమత్కరించారు. సీఎం కుర్చి కోసం పరుగు పందెం ఇక్కడ సాగుతున్నట్టుందని వ్యాఖ్యానిస్తూ, పార్టీ వర్గాల అభిప్రాయాల మేరకే తన నిర్ణయం ఉంటుందన్నారు. ఈసందర్భంగా తన ప్రసంగంలో ఆయన చేసిన వ్యాఖ్య డిఎంకే వైపుగా ఎస్ఎంకే చూస్తున్నదా..? అన్న ప్రశ్నను లేవ దీసినట్టు అయింది. ఇన్నాళ్లు నీడలో ఉన్నానని, సూర్య రశ్మి కోసం బయటకు వస్తున్నట్టుగా వ్యాఖ్యానించడంతో, డిఎంకే చిహ్నం ఉదయించే సూర్యుడిని ఉద్దేశించి ఆయన వ్యాఖ్యలు చేశారన్న భావనలో అక్కడున్న ప్రతి ఒక్కరిలోనూ బయలు దేరింది. ఇదే విషయంగా ఆయన్ను మీడియా కదిలించగా, అలాంటిది ఏమి లేదు అని, ఓ అంశాన్ని వివరించే క్రమంలో ఆ పదాన్ని వాడడం జరిగిందే గానీ, పొత్తుపై ఎలాంటి నిర్ణయం తీసుకోవడం లేదన్నారు. అవసరం అయితే, ఒంటరిగా ఎన్నికల్ని ఎదుర్కొనేందుకు సైతం పరిశీలన జరుపుతున్నట్టు సమాధానం ఇచ్చారు. పార్టీ వర్గాలు కీలక నిర్ణయాలు తీసుకునే అధికారం తనకు అప్పగించారని, త్వరలో మంచి ప్రకటన ఉంటుందన్నారు. -
సినిమా చూస్తూ.. గుండెపోటుతో వ్యక్తి మృతి
-
భాగ్యనగరం చాట్ భలే..
నాకు సినిమాలంటే చాలా ఇష్టం. తెలుగు సినిమాలంటే ఇంకా మరీనూ. అందులోనూ హైదరాబాద్లో షూటింగ్ అంటే చాలా చాలా ఇష్టం. ఇక్కడి థియేటర్స్లో సినిమాలు చూడటం అంటే మాటల్లో చెప్పలేనంత ఇష్టం. ఇన్ని ఇష్టాలతో పాటు మరొకటి.. ఇక్కడ దొరికే చాట్. మామూలుగా చాట్ అంటే.. ముంబైలోనే ఫేమస్. నేను అక్కడికి వెళ్లినప్పుడల్లా ఓ పట్టు పడతా. ఓసారి హైదరాబాదీ చాట్ టేస్ట్ చేశా. నాకైతే ముంబైలో దొరికే చాట్కన్నా భాగ్యనగరంలో దొరికే చాట్ భలేగా ఉందనిపించింది. ఇక, ఇక్కడివాళ్ల గురించి చెప్పాలి. వాళ్ల ప్రవర్తన చాలా స్వీట్గా ఉంటుంది. నాకిక్కడ చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్లతో కలిసి చాట్ తినడం, సినిమాలు చూడటం లాంటివి ఎప్పుడూ మిస్ కాను. ఓవరాల్గా చెప్పాలంటే హైదరాబాద్ నా సెకండ్ హోమ్ అయిపోయింది. - ఆదాశర్మ, సినీనటి -
మళ్లీ అవన్నీ చేస్తా!
ఆ రోజులే వేరు... మళ్లీ ఆ పాత రోజుల్లోకి వెళ్లే అవకాశం వస్తే... అని ఒక్కసారైనా అనుకోనివాళ్లు ఉండరు. ఈ మధ్య శ్రీయ కూడా అలానే అనుకున్నారు. కాలం వెనక్కి వెళితే తాను ఏమేం చేయాలనుకుంటున్నారో శ్రీయ చెబుతూ - ‘‘కాలేజీలో జాయినవుతా. బోల్డంత మందితో స్నేహం చేస్తా. కాలేజీ లైఫ్ని వీలున్నంతవరకూ ఎంజాయ్ చేస్తా. బాగా చదువుకుంటా. అలాగే, నేనెక్కడ మొదలయ్యానో మళ్లీ అక్కడికి వెళ్లాలనుకుంటా. అంటే... సినిమాల్లోకి రాకముందు నేను కొన్ని నృత్యప్రదర్శనలు ఇచ్చాను. అక్కణ్ణుంచే నా సినిమా కెరీర్ మొదలైంది. అందుకని మళ్లీ స్టేజి మీద డ్యాన్స్ చేయాలని ఉంది’’ అని పేర్కొన్నారు. మరి.. భవిష్యత్తులో ఏం చేయాలనుకుంటున్నారు? అనే ప్రశ్న శ్రీయ ముందుంచితే - ‘‘బ్లైండ్, డెఫ్ అండ్ డంబ్ చిల్డ్రన్ సహాయం కోసం ఏదైనా చేయాలనుకుంటున్నా. పుస్తకాలు చదవాలనుకుంటున్నా. అలాగే, విదేశాల్లో నివసించాలని ఉంది. ఆ దేశాల్లో ప్రజల జీవన విధానం ఎలా ఉందో తెలుసుకోవాలనుకుంటున్నా. ఇంకా చాలా చాలా అనుకుంటున్నా. అనుకున్నట్లు అన్నీ చేయగలిగితే బాగానే ఉంటుంది. చూద్దాం.. భవిష్యత్తు ఎలా ఉంటుందో?’’ అన్నారు. -
31 రోజులు... 25 సినిమాలు...
నెలంతా పండగే కొత్త ఏడాదిలో... కొత్త రిలీజ్ల సందడి మిన్నంటుతోంది. ఈ ఒక్క జనవరిలో ఏకంగా 25 సినిమాలు రిలీజవుతున్నాయి. బాబాయ్, అబ్బాయ్ సహా పెద్ద హీరోలు ముగ్గురు బాక్సాఫీస్ బరిలో నిలిచారు. పల్లెటూరి కథలు, పెళ్ళి కథలు, యాక్షన్ డ్రామాలు, రియల్ లైఫ్ స్టోరీలు - ఇలా ఎటు చూసినా వైవిధ్యమైన కథలతో ఈ నెలంతా రిలీజ్ల పండుగ అనిపిస్తోంది. కాస్త అటూ ఇటుగా రూ. 200 నుంచి 300 కోట్ల మొత్తాన్ని తెలుగు సినీ పరిశ్రమ పణంగా ఒడ్డుతోంది. కొత్త ఏడాది మొదలైంది. మళ్ళీ కొత్త సినిమాల సందడీ మొద లైంది. ఈసారి కొత్త రిలీజుల తాకిడి ఎలా ఉందంటే, మునుపెన్నడూ లేనంతగా ఒకే రోజున నాలుగైదు సినిమాలు రిలీజవుతున్నాయి. కొత్త ఏడాది తొలి రోజునే ఏకంగా మూడు స్ట్రెయిట్ తెలుగు సినిమాలు (రామ్ ‘నేను... శైలజ’, నాగశౌర్య ‘అబ్బాయితో అమ్మాయి’, హార్రర్కామెడీ ‘చిత్రం భళారే విచిత్రం’) రిలీజయ్యాయి. అదే రోజున మరో రెండు సినిమాలు కూడా రిలీజ్ ప్లాన్ చేశాయి. కానీ, ఆఖరు నిమిషంలో అనివార్య కారణాల వల్ల ఆగాయి. అందులో ఒకటి ‘కిల్లింగ్ వీరప్పన్’ రేపు గురువారం నాడు రిలీజవుతోంది. ఇక, ఆ మరునాడే 8వ తేదీన హాలీవుడ్ డబ్బింగ్ సినిమా ‘బొంబి బెల్లె’, యానిమేషన్ చిత్రం ‘ఛోటా బీమ్’ సహా ఏకంగా 8 చిత్రాలు రిలీజవడానికి పోటీపడుతున్నాయి. ఆఖరి నిమిషంలో కొన్ని ఆగినా, అందులో సగమైనా కనీసం హాళ్ళలో పలకరించే సూచనలున్నాయి. సంక్రాంతి పుంజులు... బాబాయ్, అబ్బాయ్ వెరసి, పదిహేను రోజుల ముందే తెలుగు సినిమాకు సంక్రాంతి వచ్చేసినట్లుంది. ఈసారి సంక్రాంతికి ఊళ్ళలోనే కాదు... సినిమాహాళ్ళ లోనూ స్టార్ కోడిపుంజుల మధ్య పోటాపోటీగా జరగనుంది. ‘నాన్నకు ప్రేమతో...’ అంటూ చిన్న ఎన్టీయార్ ఈసారి సంక్రాంతి సినిమా సందడికి జనవరి 13న తెర తీస్తున్నారు. అబ్బాయ్ అలా అంటుంటే, బాబాయ్ బాలకృష్ణ ఆ మరునాడే భోగి పండుగకి (ఈసారి జనవరి 14న వచ్చింది) ‘డిక్టేటర్’గా వస్తున్నాడు. నందమూరి వంశం నుంచి ఇద్దరు పెద్ద హీరోలు ఒకే సీజన్లో ఇలా పోటీపడడం అభిమాను లతో పాటు సినీ పరిశ్రమలో అందరి మధ్య చర్చనీయాంశమైంది. రెండూ భారీ చిత్రాలే కావడంతో హాళ్ళలో పోరాటమూ భారీగానే మారనుంది. ఇక, జనవరి 14నే యువ హీరో శర్వానంద్ - మేర్లపాక గాంధీల కాంబినేషన్లో ‘ఎక్స్ప్రెస్ రాజా’ రిలీజ్కు సిద్ధమవుతోంది. ‘మనం’ తరువాత బుల్లితెరపైనే తప్ప, వెండితెరపై కనిపించని నాగార్జున ఎట్టకేలకు ‘సోగ్గాడే చిన్ని నాయనా’ అనిపించుకుంటూ, ఈ సంక్రాంతికి జనవరి 15న వస్తున్నారు. తమిళనాట యువ హీరోగా పేరు తెచ్చుకున్న తెలుగు కుర్రాడు విశాల్ కొత్త తమిళ చిత్రం ‘కథకళి’. తమిళులకు కూడా సంక్రాంతి (పొంగల్) పెద్ద పండుగ కావడంతో, అక్కడ ఆ చిత్రం జనవరి 14న రిలీజ్ కానుంది. ‘కథకళి’ పేరుతోనే తయారవుతున్న తెలుగు డబ్బింగ్ కూడా లెక్క ప్రకారమైతే, ఏకకాలంలో తెలుగునాటా రిలీజ్ కావాలి. ఇప్పటికే థియేటర్ల కోసం సినిమాల మధ్య తొక్కిసలాట పరిస్థితి ఉండడంతో ‘కథకళి’ ఒక్కవారం ఆలస్యంగా జనవరి 21న రానుందని పరిశ్రమ వర్గాల కథనం. మూకుమ్మడిగా మీడియవ్ు రేంజ్ చిత్రాలు సంక్రాంతి పండుగ అయిపోయినా, హాళ్ళలో పండుగ వాతావరణం తగ్గేలా లేదు. ప్రేక్షకుల మాటెలా ఉన్నా, సంక్రాంతి మరుసటి వారం కూడా కొత్త సినిమాలతో హాళ్ళు ఫుల్గా ఉండడం ఖాయం. నందినీ రెడ్డి దర్శకత్వంలో నాగశౌర్య నటిస్తున్న ‘కళ్యాణ వైభోగమే’ను జనవరి 21న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇక, మదన్ దర్శకత్వంలో ఆది హీరోగా ఆయన తండ్రి - సీనియర్ నటుడు సాయికుమార్ స్వయంగా నిర్మించిన ‘గరం’, మరో చిన్న సినిమా కూడా 22న రిలీజ్ కావడానికి సిద్ధమవుతున్నాయి. ఇక, జనవరిలో ఆఖరి శుక్రవారమైన 29న రాజ్తరుణ్ ‘సీతమ్మ అందాలు - రామయ్య సిత్రాలు’, కన్నడ అనువాద చిత్రం ‘బొంబాయి మిఠాయి’, సిద్ధార్థ - త్రిష - హన్సిక తదితరులు నటించిన తమిళ ‘అరణ్మణై-2’కు అనువాదం ‘చంద్రకళ-2’, మరో చిన్న చిత్రం ‘నిలువవే వాలు కనుల దానా...’ రిలీజ్కు ప్లాన్ చేస్తున్నాయి. సగటున ప్రతివారం 5 రిలీజ్లు లెక్కచూస్తే, అయిదు శుక్రవారాలున్న ఈ జనవరి నెలలో ఏకంగా పాతిక సినిమాల దాకా రిలీజవుతున్నాయి. అంటే, సగటున ప్రతి వారం అయిదేసి సినిమాలన్నమాట! ఫిబ్రవరి, మార్చిల్లో కూడా చాలా సినిమాలు సిద్ధమవు తున్నాయి. సునీల్ హీరోగా వస్తున్న ‘కృష్ణాష్టమి’, బెల్లంకొండ శ్రీనివాస్ ‘స్పీడు న్నోడు’, త్రివిక్రమ్ దర్శకత్వంలో నితిన్ నటిస్తున్న ‘అ...ఆ’ లాంటివి ఆ జాబితాలో ఉన్నాయి. ఇన్ని రిలీజ్లు చూసి, తీసిన సినిమాలు తీసినట్లు రిలీజైపోతున్నాయను కుంటే పొరపాటే. అన్ని కార్యక్రమాలూ పూర్తి చేసుకొని, సరైన రిలీజ్ డేట్ కోసం, తగినన్ని థియేటర్ల కోసం ఎదురు చూస్తున్న సినిమాలు చాలానే ఉన్నాయి. సినిమా ఎన్ని వారాలు ఆడుతుందన్న మాట దేవుడెరుగు, అసలు ఏ వారం రిలీజ్ చేయగలుగుతామో తెలియని పరిస్థితి ఇప్పుడు దర్శక, నిర్మాతల్లో నెలకొంది. ‘‘ప్రతివారం ఇన్నేసి సినిమాలు రిలీజవుతుంటే హాళ్ళూ ఖాళీ ఉండట్లేదు. ప్రేక్షకులకూ ఊపిరి పీల్చుకొనే గ్యాప్ రావడం లేదు. ఈ గందర గోళం మధ్యలో ఎప్పుడు మా సినిమా రిలీజ్ చేస్తే బాగుంటుందో తెలియడం లేదు’’ అని దాదాపు నెలన్నర క్రితమే అన్ని పనులూ పూర్తి చేసుకొని, రిలీజ్కు సిద్ధమైన ఒక యువ హీరో సినిమా తాలూకు నిర్మాత ఆంతరంగికంగా వాపోయారు. దాంతో, ఇప్పుడు డిస్ట్రిబ్యూషన్ - ఎగ్జిబిషన్ సెక్టార్ల మిత్రులు, మీడియా శ్రేయోభిలాషులు ఎవరు కనిపించినా దర్శక, నిర్మాతలు ‘సినిమా ఎప్పుడు రిలీజ్ చేస్తే బెటర్ అంటారూ’ అని అడుగు తున్నారంటే అతిశయోక్తి కాదు. డిజిటల్ చిత్రనిర్మాణ విధానం వచ్చాక ఔత్సాహికులు ఎక్కువై, చిత్రనిర్మాణం గణనీయంగా పెరిగింది. దాంతో, రిలీజ్ల దగ్గర అవస్థలూ పెరిగాయి. నిర్మాణం పూర్తయినా, రిలీజ్కు నోచుకోని సినిమాలు పదులకొద్దీ పెరిగాయి. అయినా సరే, గత 2015లో ఏకంగా 172 స్ట్రెయిట్ చిత్రాలూ, 73 డబ్బింగ్లూ కలిపి మొత్తం 245 సినిమాలు తెలుగు ప్రేక్షకుల్ని పలకరిం చాయి. అంటే, ప్రతివారం 4 నుంచి 5 కొత్త రిలీజులు వచ్చాయన్న మాట! సీజన్లు మారిపోయాయోచ్... ఇన్ని సినిమాల నిర్మాణం, రిలీజ్లతో ఇప్పుడు సినిమాల సీజన్ కూడా మారిపోయింది. ఒకప్పుడు సంక్రాంతి, సమ్మర్, దసరా, దీపావళి లాంటి కొన్నే వరుస రిలీజ్లకు సీజన్లు. కానీ, ఇప్పుడు ఆ రూల్స్ మారిపోయాయి. క్రిస్మస్, జనవరి ఫస్ట్ మొదలు ఒకప్పుడు పరీక్షల వల్ల సినిమా కలెక్షన్లకు బ్యాడ్ సీజన్లు అనుకున్న ఫిబ్రవరి, మార్చిల్లో కూడా ఎక్కిడి తొక్కిడిగా సినిమాలు హాళ్ళకు క్యూలు కడుతున్నాయి. కానీ, రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఉన్న హాళ్ళు 1800 చిల్లరే. ఫలితంగా, సినిమా బాగుంటే సరే... లేదంటే ఈ శుక్ర వారం రిలీ జయ్యే కొత్త సినిమా కోసం గత శుక్రవారం రిలీజైన సిని మాలు హాళ్ళు ఖాళీ చేయాల్సి వస్తోంది. దాంతో, కోట్ల కొద్దీ వ్యాపారం కొన్ని వారాలకే హారతి కర్పూ రమవుతోంది. ఎవరికి మోదం... ఎవరికి ఖేదం... కానీ, నాలుగు సెలవులుంటే చాలు... ప్రతి ఒక్కరూ దాన్ని తమ సినిమా రిలీజ్తో వసూళ్ళకు ఎడ్వాంటేజ్గా మార్చుకోవాలని చూస్తున్నారు. ఎవరూ ఎవరినీ ఆపే, ఆగే పరిస్థితి లేదు. పెద్ద హీరోల, భారీ సినిమాలన్నీ ఒకేసారి రావడంతో చిన్నవాటికి హాళ్ళూ అంతంతే. ఇగోలు వదిలి, కూర్చొని మాట్లాడుకొని సర్దుబాటు చేసుకొనే వాతావరణం లేకపోయేసరికి ఒకరి సినిమాను మరొకరు కిల్ చేస్తున్నారనిపిస్తోంది. ‘‘‘ఒకప్పుడు సంక్రాంతి పండుగ సీజన్ అంటే పంట చేతికొచ్చి, రైతుల చేతుల్లో డబ్బులు ఆడతాయి. సినిమాలు ఆడేందుకు మంచి సీజన్ అనుకొనే వాళ్ళం. కానీ, ఇప్పుడు సినిమాల లైఫ్ పదిరోజులకే పరిమితమవడంతో లెక్కలు మారాయి. ఏ పది రోజుల్లో మూడు, నాలుగు సెలవులంటే అప్పుడు రిలీజ్ చేసేస్తున్నాం. దాంతో, చిన్నా, పెద్దా అన్ని సినిమాలూ ఆ సెలవులు కలిసొచ్చేలా ఒకేసారి రిలీజవుతున్నాయి. అందుకే ఈ హడావిడి.’’ - కె.ఎల్. దామోదర్ ప్రసాద్, ప్రముఖ నిర్మాత - తెలుగు ఫిల్మ్చాంబర్ గౌరవ కార్యదర్శి ఈ పరిస్థితుల్లో చిత్ర నిర్మాణ, పంపిణీ, ప్రద ర్శన రంగాలకు ప్రాతినిధ్యం వహించే ‘తెలుగు ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్’ కొత్త రిలీజ్లను క్రమబద్ధీకరించి, అన్ని సినిమాలకూ హాళ్ళు అందుబాటులో ఉంచడానికి ప్రయత్నిస్తోంది. రెండు నెలల క్రితం కొందరు నిర్మాతలు, డిస్ట్రి బ్యూటర్లు, ఎగ్జిబిటర్లతో ఒక ప్రత్యేక కమిటీ వేసింది. ‘‘ఇవాళ చిత్రనిర్మాణం కన్నా రిలీజ్ ఎక్కువ టెన్షన్గా మారింది. అందుకే, అందరినీ చైతన్యం చేసి, ఎవరికీ నష్టం కలగకుండా చేయా లని శాయశక్తులా ప్రయత్నిస్తున్నాం’’ అని నిర్మాత -ఛాంబర్ గౌరవ కార్యదర్శి దామోదర్ ప్రసాద్ చెప్పారు. ఈ ఒక్క జనవరిలో సుమారు 200 కోట్ల పైగా పణంగా ఒడ్డుతున్న తెలుగు పరిశ్రమలో అలాంటి ప్రయత్నాలు సఫలమైతే ఎంత బాగుండు! చిత్రం: నాన్నకు ప్రేమతో, తారాగణం: చిన్న ఎన్టీయార్, రకుల్ప్రీత్ సింగ్, నిర్మాత: భోగవల్లి ప్రసాద్, దర్శకత్వం: సుకుమార్, ఇతివృత్తం: రివెంజ్ ఫార్ములా ఫ్యామిలీ డ్రామా, రిలీజ్: జనవరి 13 చిత్రం: డిక్టేటర్, తారాగణం: బాలకృష్ణ, అంజలి, సోనాల్ చౌహాన్ నిర్మాతలు: ఈరోస్ ఇంటర్నేషనల్, దర్శకత్వం: శ్రీవాస్ ఇతివృత్తం: యాక్షన్ డ్రామా, రిలీజ్ డేట్: జనవరి 14 చిత్రం: సోగ్గాడే చిన్ని నాయనా, తారాగణం: నాగార్జున, రమ్యకృష్ణ, లావణ్యా త్రిపాఠీ, నిర్మాత: అక్కినేని నాగార్జున, దర్శకత్వం: కల్యాణ్కృష్ణ కురసాల, ఇతివృత్తం: ఆత్మ చుట్టూ తిరిగే ఫ్యామిలీ డ్రామా, రిలీజ్: జనవరి 15 చిత్రం: సీతమ్మ అందాలురామయ్య సిత్రాలు, తారా గణం: రాజ్తరుణ్, అర్తన, నిర్మాతలు: ఎస్.శైలేంద్రబాబు,కేవీ శ్రీధర్రెడ్డి, హరీష్ దుగ్గిశెట్టి, దర్శకత్వం: శ్రీనివాస్ గవిరెడ్డి, ఇతివృత్తం: యూత్ ఎంటర్ టైనర్, రిలీజ్: జనవరి 29 చిత్రం: ఎక్స్ ప్రెస్ రాజా, తారాగణం: శర్వానంద్, సురభి, నిర్మాతలు: వంశీ, ప్రమోద్, దర్శకత్వం: మేర్ల పాక గాంధీ ఇతివృత్తం: యూత్ఫుల్ ఎంటర్టైనర్, రిలీజ్: జనవరి 14 చిత్రం: కళ్యాణ వైభోగమే, తారాగణం: నాగశౌర్య, మాళవికా నాయర్, నిర్మాత: దామోదర్ ప్రసాద్, దర్శకత్వం: నందినీరెడ్డి ఇతివృత్తం: యూత్ ఓరియంటెడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్, రిలీజ్: జనవరి 22 చిత్రం: గరం, తారాగణం: ఆది, ఆదాశర్మ, నిర్మాత: పి.సురేఖ, దర్శకత్వం: మదన్, ఇతివృత్తం: యాక్షన్ డ్రామా, రిలీజ్: జనవరి 22కి ప్లాన్ చిత్రం: కథకళి, తారాగణం: విశాల్, కేథరిన్ థెరిస్సా, రెజీనా, దర్శకత్వం: పాండ్యరాజ్, ఇతివృత్తం: యాక్షన్ డ్రామా, రిలీజ్ డేట్: జనవరి 21 చిత్రం: కిల్లింగ్ వీరప్పన్, తారాగణం: సందీప్ భరద్వాజ్, శివరాజ్కుమార్, దర్శకత్వం: రావ్ుగోపాల్వర్మ, ఇతివృత్తం: వీరప్పన్ రియల్ లైఫ్ స్టోరీ, రిలీజ్ డేట్: జనవరి 7 - రెంటాల -
'పద్మభూషణ్' కోసం నటి లాబీయింగ్!
పద్మభూషణ్ పురస్కారం కోసం అలనాటి బాలీవుడ్ నటి ఆశా పరేఖ్ తన వద్ద లాబీయింగ్ చేసిందని కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. ఈ మధ్యకాలంలో అవార్డులకు తమ పేర్లను సిఫారసు చేయాలని పలువురు వ్యక్తులు తనను వెంటాడుతున్నారని ఆయన చెప్పారు. ' పద్మభూషణ్ పురస్కారం కోసం తన పేరు సిఫారసు చేయాలని ఆశా పరేఖ్ నన్ను కోరింది. మా అపార్ట్మెంట్లో లిఫ్ట్ పనిచేయడం లేదు. అందువల్ల 12 అంతస్తుల ఎక్కి వచ్చి మరీ ఆమె నన్ను వ్యక్తిగతంగా కలిసింది. ఇది నాకేమీ మంచిగా అనిపించలేదు' అని గడ్కరీ పేర్కొన్నారు. శనివారం నాగ్పూర్లో ఓ వేడుకలో పాల్గొన్న ఆయన ఈ మేరకు విస్మయకర విషయాలు తెలిపారు. భారత సినిమా పరిశ్రమకు అపారమైన సేవలందించిన తాను పద్మభూషణ్ పురస్కారానికి పూర్తిగా అర్హురాలని ఆశా పరేఖ్ తనకు చెప్పిందని గడ్కరీ తెలిపారు. -
శింబుపై పిటిషన్లు ఉపసంహరణ
చె న్నై : నటుడు శింబుపై దాఖలైన కోర్టు కేసులు ఒక్కొక్కటి ఉపసంహరించుకోవడం విశేషం. బీప్ సాంగ్ పాటతో మహిళల్ని అవమానించారంటూ నటుడు శింబు,సంగీత దర్శకుడు అనిరుద్లపై పెద్ద దుమారమే రేగుతున్న విషయం తెలిసిందే.పలు మహిళా సంఘాలు ఆందోళనకు దిగడంతో పాటు కోవై,చెన్నై లలో పలు పోలీసు కేసులు నమోదయ్యాయి.అంతే కాదు శింబు వ్యవహారం కోర్టుల వరకూ వెళ్లింది. ఒక్క సైదాపేట కోర్టులోనే శింబుపై మూడు పిటిషన్లు దాఖలయ్యాయి. ఆయన ముందస్తు బెయిల్ కేసు మద్రాసు హైకోర్టులో విచారణలో ఉంది. దానిపై జనవరి4 న విచారణ జరగనుంది. శింబుపై దాఖలైన పీఎంకే పార్టీకి చెందిన నాయకుడు చెన్నై సైదాపేట కోర్టులో దాఖలు చేసిన పిటిషన్ను ఇప్పటికే ఉపసంహరించుకున్నారు. మరో రెండు పిటిషన్లను బుధవారం ఉపసంహరించుకోవడం విశేషం. శింబు,అనిరుద్లపై విడుదలై చిరుతై పార్టీకి చెందిన దక్షిణ చెన్నై న్యాయవాదుల సంఘం కార్యదర్శి వక్ శీల్ కాశీ చెన్నై,సైదాపేట కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్పై బుధవారం 9వ మెట్రో పాలిటిన్ కోర్టు న్యాయమూర్తి దిలీప్ అలెక్ప్ సమక్షంలో విచారణకు వచ్చింది. పిటిషన్దారుడు కాశీ హాజకై పిటిషన్ను ఉపసంహరించుకుంటున్నట్టు తెలిపారు. అదేవిధంగా కేకే.నగర్కు చెందిన విడుదలై చిరుతై పార్టీ కార్యదర్శి పుదియవన్ అలియాస్ లక్ష్మణన్ శింబు, అనిరుద్లపై దాఖలు చేసిన పిటిషన్ మంగళవారం సైదాపేట 23వ మెట్రోపాలిటిన్ కోర్టులో న్యాయమూర్తి సురేష్ సమక్షంలో విచారణకు రాగా ఆ కేసును పిటిషనర్ ఉపసంహరించుకుంటున్నట్లు తెలిపారు. దీంతో ఇప్పటికి శింబుపై మూడు కోర్టు కేసులు ఉపసంహరించుకోవడం గమనార్హం.శింబు తల్లి వీడియోలో కన్నీటి ఘోష తరువాత ఇలాంటి పరిణామాలు చోటు చేసుకోవడం గమనార్హం.ఇక హైకోర్టు తీర్పు ఎలా ఉంటుందన్నదే ప్రస్తుతం జరుగుతున్న వాడీవేడి చర్చ. -
సల్మాన్ హీరో..చరణ్ ప్రొడ్యూసర్
-
ఆ వీడియో చూస్తే చాలు...
కాంక్రీట్ ప్రపంచం.. ఉరుకులు.. పరుగుల జీవితాలు.. తెల్లారింది మొదలు పొద్దుగూకే వరకూ హడావిడి. ప్రతిరోజూ ఒకేలా సాగుతున్న పనితో బోర్ కొట్టేస్తోందా? ఉద్యోగంలోనూ కొత్తదనం కనిపించడం లేదా? వర్క్ మీద ధ్యాస పెట్టలేక పోతున్నారా? అటువంటి పరిస్థితి నుంచి బయటపడాలంటే కొత్త విషయాలను తెలుసుకోవడం ఎంతో అవసరం. అందుకు ఒక్కటే మార్గం అని చెప్తున్నారు. ప్రముఖ ఫ్రీలాన్స్ ఫిల్మ్ మేకర్... బాతుల్ కాప్సీ. ఆయన సృష్టించి యూట్యూబ్ లో పోస్ట్ చేసిన వీడియో చూస్తే చాలట. అందులో మీకు అద్భుతం ఏమీ కనిపించకపోయినా జీవితం పట్ల మీ అవగాహనే పూర్తిగా మారిపోతుందని చెప్తున్నారు. మరి మీరూ ఆ మార్పును కోరుకునేవారైతే ఇంకెందుకాలస్యం... ఆ వీడియో చూసేయ్యండి. -
'ఇళ్లు కొనే స్థోమత ఉందిగా.. ఇదేం పని'
న్యూఢిల్లీ: బాలీవుడ్ నటుడు ఆదిత్య పచోలికి సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసింది. ఇంటి యజమానిని ఎందుకు వేధిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. డిసెంబర్ 31లో ఆయన అద్దెకు ఉంటున్న భవనాన్ని ఖాళీ చేసి యజమానికి అప్పగిచాలని స్పష్టం చేసింది. దీంతోపాటు ఇప్పటి వరకు చెల్లించాల్సిన అద్దె మొత్తాన్ని రెండు వారాల్లోగా ఆ మహిళా యజమానురాలికి చెల్లించాలని ఆదేశించింది. ఒక ఇళ్లు కొనుగోలు చేసుకోగలిగే స్థోమత ఉండి కూడా ఇలా ప్రవర్తించడం ఏమాత్రం గర్హనీయం కాదని, ఆయనది అంగీకరించకూడని ప్రవర్తన అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. 'మీరు చాలా పెద్ద మనిషి. ఒక ఫ్లాట్ కూడా కొనుగోలు చేయగలరు. మీ పద్దతి ఏమాత్రం అంగీకరించదగినది కాదు' అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. -
నేను రాజకీయాల్లోకి రాకూడదా?
కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టించే గుజరాతీ భామ నమిత. అభిమానులను మచ్చాన్స్(బావలు) అంటూ ముద్దుగా పిలుస్తూ కవ్వించే ఆమె ఏ కార్యక్రమానికి వెళ్లినా అక్కడ సందడి చేస్తుంది. ఈ సుందరి కొంతకాలంగా తమిళసినిమాలకు దూరం కావడంతో అభిమానులు కలత చెందారు. అందుకు కారణం ఆమె స్థూలకాయమే. చాలా ఒత్తిడికి గురైన నమిత ఇప్పుడు మళ్లీ చిక్కి చక్కగా తయారైంది. ప్రస్తుతం సినిమాల్లో నటిస్తున్నారు. సినీ, వ్యక్తిగత విషయాల గురించి నమితతో ‘సాక్షి’ భేటీ.. - తమిళ సినిమా ప్ర : రీఎంట్రీ మలయాళంలో అయినట్లున్నారే? జ : నేనెక్కడికి వెళ్లినా, ఏ సినిమాతో రీఎంట్రీ అయినా తమిళనాడు బావల మనసుల్లో పదిలంగా ఉండిపోతాను. శరీరం లావెక్కడంతో నటించడానికి ఎవరూ పిలవలేదు. కొంచెం పరిచయం ఉన్నవాళ్లు కూడా ఎక్కడ అవకాశాలు అడుగుతానో అని తప్పించుకుతిరుగుతున్నారు. అప్పుడే ఇక విషయం అర్థమైంది. నేను చాలా చాలా బరువెక్కాను. నాలో ఉన్న ఈ లోపాన్ని సరిదిద్దుకుంటే సరిపోతుందిగా అని ఆలోచించాను. ఎక్సర్సైజ్ ద్వారా 94 కిలోల బరువున్న నేను 76కు తగ్గాను. స్లిమ్గా తయారవడంతో మలయాళంలో పులిమురుగన్ అనే చిత్రంలో నటించే అవకాశం వచ్చింది. ప్ర : భోజనం ఫుల్గా లాగించేవాళ్లా? జ : అవును. తమిళంలో నేను నటించిన చివరి చిత్రం ఇళంజన్. అది విడుదలై సుమారు ఐదున్నరేళ్లు అవుతోంది. ఈ మధ్యలో అవకాశాలు లేకుండా ఖాళీగా కూర్చోలేదు. తెలుగు, కన్నడ భాషలలో నటిస్తూనే ఉన్నాను. నాకు నచ్చిన తమిళంలో సక్సెస్ కాలేకపోయాననే చింత వెంటాడుతూనే ఉండేది. అలా ఒత్తిడికి లోనై ఆహార నియమాలను పక్కన పెట్టి బిరియాని, పిజ్జా, ఐస్క్రీమ్, అన్నం అంటూ ఏదిపడితే అది లాగించేశాను. ఆ తర్వాత చూసుకుంటే బరువు సరాసరిగా పెరిగిపోయింది. చాలా భయపడిపోయాను. అప్పుడే బరువు తగ్గాలని నిర్ణయించుకున్నాను. ఆ ప్రయత్నంతోనే ఇదిగో ఇలా స్లిమ్గా తయారయ్యాను. ప్ర : నిర్మాతగా మారనున్నారట? జ : ఇది నిజంగా జోకే. ఎవరు ప్రచారం చేస్తున్నారు ఇలాంటి వదంతులను. నాకు చిత్ర నిర్మాణ ఆలోచనే లేదు. సినిమా డిస్ట్రిబ్యూషన్ ఎలా చెయ్యాలో తెలియదు. నాకు తెలిసిందల్లా నటన ఒక్కటే. అది సరిగా చేస్తే చాలని భావిస్తాను. ప్ర : బాక్సింగ్ నేర్చుకున్నారట? జ : ఇంట్లో ఖాళీగా కూర్చోవడం నాకు ఇష్టం ఉండదు. అలాంటి సమయాల్లో ఏదో ఒకటి నేర్చుకోవాలనుకుంటాను. అలా స్టంట్ క్లాస్కు వెళ్లి బాక్సింగ్ నేర్చుకున్నాను. ఆ తర్వాతే నాకు తెలియకుండానే నాలో ధైర్యం పెరిగింది. అంతేకాదు యాక్షన్ కథా చిత్రాల్లో నటించాలనే కోరిక పెరిగింది. అలాంటి అవకాశం కోసం ఎదురు చూస్తున్నాను. ప్ర : తమిళనాడు నచ్చిందా? జ : చాలా బాగా నచ్చేసింది. అందుకేగా గుజరాత్ నుంచి వచ్చేసి చెన్నైలో సెటిల్ అయిపోయాను. ఇకపై ఇదే నా పుట్టినిల్లు. ఇప్పుడు గుజరాత్లో ఏయే పండుగలు చేసుకుంటున్నారన్నది కూడా మరచిపోయాను. తమిళనాడులో జరుపుకునే పండుగలన్నీ నాకు తెలుసు. నాకు బాగా నచ్చిన పండుగ పొంగల్. ఈ పొంగల్ను ఏదైనా పల్లెటూరుకెళ్లి జరుపుకోవాలనుకుంటున్నాను. ప్ర : రాజకీయరంగ ప్రవేశం ఆలోచనలో ఉన్నారట? జ: ఏం నేను రాజకీయాల్లోకి రాకూడదా? భారత దేశంలో ఇప్పుడున్న రెండు పెద్ద రాజకీయ పార్టీల వారు నన్ను తమ పార్టీలో చేరమని రాయబారం పంపుతున్నారు. వారికి నేనింకా ఏమీ చెప్పలేదు. ఏదో ఒక రోజు కచ్చితంగా నేను రాజకీయ రంగ ప్రవేశం చేస్తా. ఏ పార్టీలో చేరతానన్నది మీకు అప్పుడే తెలుస్తుంది. ప్ర : సరే పెళ్లి సంగతేమిటి? జ : దాంతో ఇప్పుడు అవసరం లేదు. ఇప్పటివరకూ నేనెవరినీ ప్రేమించలేదు. ఇకపై ఏమి జరుగుతుందో తెలియదు. -
ప్రజల్లోకి ప్రతికూల సందేశం వెళ్తుంది
పాట్నా : బీహార్ ప్రధాని నరేంద్ర మోదీ ర్యాలీ చివరి నిమిషంలో రద్దు కావడంపై బీజేపీ ఎంపీ, బాలీవుడ్ నటుడు శత్రుఘ్న సిన్హా స్పందించారు. మోదీ ర్యాలీ చివరి నిమిషంలో రద్దు అవడం ప్రజలలో ప్రతికూల సందేశం వెళ్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అటు పార్టీలో ఇటు ఎన్నికల్లో పలు సమస్యలు చుట్టుముట్టాయని అవి తొలగిపోవాలని ఆకాంక్షించారు. అయితే బీహార్ బీజేపీ శాఖలో కొంత మంది నాయకులు నియంతల్లా వ్యవహారిస్తున్నారని ఆయన ఆరోపించారు. నిత్యవసర వస్తువల ధరలు ఆకాశాన్ని తాకడంపై శత్రుఘ్న సిన్హా కొంత ఆందోళన వ్యక్తం చేశారు. కందిపప్పు ధర కేజీ రూ.200 చేరుకోవడంపై నిరసన తెలిపారు. ధరలను సామాన్యుడికి అందుబాటులోకి తీసుకువచ్చేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆయన కేంద్ర ప్రభుత్వానికి సూచించారు. ఇటీవల ఉల్లి ధర సామాన్యుడిని ఎంత కలవరానికి గురి చేసిందో సిన్హా ఈ సందర్బంగా గుర్తు చేశారు. ఈ మేరకు శనివారం సిన్హా ట్విట్ట్ చేశారు. బీహార్ ఎన్నికల్లో బాలీవుడ్ హీరోలతో బీజేపీ ప్రచారం చేస్తున్న విషయం తెలిసిందే. అయితే శత్రుఘ్న సిన్హాను మాత్రం పార్టీ పక్కన పెట్టింది. దీనిపై ఆయన ఆ పార్టీ నేతలపై ఒకింత ఆగ్రహాంతో ఉన్నారు. బీహార్లో రెండో విడత పోలింగ్ అక్టోబర్ 16వ తేదీన జరగగా... ఆదే రోజు బాక్సర్, పాలిగంజ్, వైశాలీలో ప్రధాని మోదీ ర్యాలీలు నిర్వహించవలసి ఉంది. అయితే ఆ ర్యాలీలు చివరి నిమిషంలో రద్దు అయింది. మూడో విడత పోలింగ్ 28వ తేదీన ఆయా ప్రాంతాల్లో జరగనుంది. ఇంత ముందుగా ర్యాలీ నిర్వహించడం వల్ల ప్రయోజనం ఉండదని ఆ పార్టీ నాయకత్వం భావించి... ఈ ర్యాలీలు రద్దు చేసినట్లు సమాచారం. -
క్లైమాక్స్ మిస్సయింది!
హ్యూమర్ ఫ్లస్ ఈ సంవత్సరం చేపల చెరువుల మీద గుర్నాధానికి భారీ నుంచి అతి భారీ లాభాలు వచ్చాయి. ఈ సంతోషంలో తన చిరకాల కోరిక ఒకటి గుర్తుకు వచ్చింది. సినిమా తీయాలనేది అతని చిన్నప్పటి కోరిక. తాను అమితంగా ఇష్టపడే ‘మిస్సమ్మ’ సినిమాను రిమేక్ చేయాలనుకొని రంగంలోకి దిగాడు. తన స్వగ్రామం పేరునే తన నిర్మాణ సంస్థకు పెట్టుకొని మురిసిపోయాడు.‘మునుగుడు పాలెం టాకీస్’....అబ్బో అదిరిపోయింది అనుకున్నాడు ఒకటికి రెండుసార్లు. థాయ్లాండ్లోని ‘షంగ్రీ-ల’ బీచ్ హోటల్లో స్టోరీ డిస్కషన్ను మొదలైంది. దీనికోసం హైదరాబాద్, అమరావతి ఉభయ రాష్ట్రాల నుంచి పెద్ద రచయితలను, పెద్ద రచయిత కావాలనుకుంటున్న చిన్న రచయితలను, పనిలో పనిగా ఘోస్టు రచయితలను కూడా తీసుకువచ్చాడు గుర్నాధం. ‘‘మిస్సమ్మ సినిమానే కదా మనం రిమేక్ చేస్తుంది. దీనికి స్టోరీ డిస్కషన్ ఎందుకు? కథను చెడగొట్టకుండా ఉన్నదున్నట్లు తీస్తేనే మంచిది’’ అన్నాడు సీనియర్ రచయిత కళ్లజోడు సవరిస్తూ. ‘‘ఉన్నదున్నట్లు తీస్తే రీమేక్ చేయడం ఎందుకు? పాత సినిమానే మళ్లీ విడుదల చేస్తే సరిపోతుంది. మన స్టైల్లో కథ ఉండాలనే ఈ స్టోరీ డిస్కషన్ ఏర్పాటు చేశాను’’ అన్నాడు రాబోయే కాలంలో కాబోయే టాప్ ప్రొడ్యూసర్ గుర్నాథం. మొదట యువ రచయిత ఇడ్లీ ఈశ్వర్నాథ్ కథ చెప్పడం మొదలు పెట్టాడు... ‘‘పాత మిస్సమ్మ సినిమాలో చిన్నప్పుడు సావిత్రి మిస్ అవుతుంది. మన సినిమాలో మాత్రం హీరో చిన్నప్పుడు పుష్కరాల్లో మిస్ అవుతాడు. ఇక అప్పటి నుంచి అతని పేరు మిస్సయ్యగా స్థిరపడిపోతుంది. మిస్సయ్య కోసం కోటీశ్వరుడైన అతని తండ్రి ప్రకాశ్రాజ్ వెదకని చోటు ఉండదు. పదహారు సంవత్సరాల తర్వాత... మిస్సయ్య ఆచూకీ కోసం పేపర్లో ప్రకటన ఇస్తాడు. ‘మిస్సయ్య...మోస్ట్ వాంటెడ్’ ప్రకటన చూసి ‘నేనే మిస్సయ్యను’ అంటూ ఒకడు వస్తాడు. ఎడమకాలు మీద చింతగింజంత పుట్టుముచ్చ చూసి, తన కొడుకే అని డిసైడై పోయి ఆనందంలో మునిగిపోతాడు ప్రకాశ్రాజ్. కథలో ట్విస్ట్ ఏమిటంటే, నెల తిరిగే లోపే ‘వాడు మిస్సయ్య కాదు...నేనే అసలు మిస్సయ్యను’ అంటూ డజను మంది మిస్సయ్యలు వస్తారు. పుట్టుమచ్చలు సేమ్ టు సేమ్. ప్రకాశ్రాజ్ తల పట్టుకుంటాడు. అసలు మిస్సయ్య ఎవరు అనేదే క్లైమాక్స్’’ ‘‘బానే ఉందిగానీ, ఆ ఒరిజినల్ మిస్సయ్యను ఎలా కనిపెట్టారు అనేది నువ్వే చెబితే ఓ పనై పోతుంది’’ అన్నాడు సీనియర్ రచయిత విసుగ్గా. ‘‘మీరు ఎన్నో సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలకు రాశారు కదా...మీరు చెబితేనే బాగుంటుంది’’ అని బాంబును సీనియర్పై వేసి చేతులు దులుపుకున్నాడు జూనియర్. వారం రోజుల పాటు క్లైమాక్స్ కోసం చర్చలు జరిగాయి...నో ఫలితం! నిర్మాత గుర్నాధానికి చిర్రెత్తిపోయింది.‘‘మీరెవరూ వద్దయ్య...హాలివుడ్ ఫేమస్ స్క్రీన్ప్లే రైటర్ డేవిడ్ రాబ్సన్ డూప్సన్ను పిలిపిస్తున్నాను. పోతే పోయింది డబ్బు!’’ అని అన్నంత పని చేశాడు నిర్మాత.డబ్బు కట్టలు బ్యాగులో సర్దుకుంటూ ‘‘కథ ఏంటి?’’ అని అడిగాడు రాబ్సన్ డూప్సన్. నిర్మాత టకటకమని కథ చెప్పి...‘‘గంటలో స్క్రీన్ప్లే చెప్పేస్తారని మీకు పేరు. మా సినిమా క్లైమాక్స్ కోసం మాత్రం ఎంత టైమ్ తీసుకున్నా ఫరవాలేదు’’ అన్నాడు గుర్నాథం. ‘‘అయిదు నిమిషాల్లో చెప్పేస్తా...నీకేమైనా అభ్యంతరమా?’’ పొడవాటి సిగరెట్ ముట్టిస్తూ అన్నాడు డూప్సన్. ‘‘అంత కంటే భాగ్యమా’’ మెలికలు తిరిగాడు గుర్నాథం. ‘‘వెరీ సింపుల్...ఇప్పుడు ఎలా అనుకున్నారో అలాగే సినిమా తీసి విడుదల చేయండి. దీనికి ‘మిస్సయ్య...ది బిగినింగ్’ అని పేరు పెట్టండి. శుభం కార్డుకు బదులు... అసలైన మిస్సయ్య ఎవరో పార్ట్-2 ‘మిస్సయ్య...ది కన్క్లూజన్’లో చూడండి అని వేయండి. సినిమా హిట్ అయితే పార్ట్-2 గురించి, క్లైమాక్స్ గురించి ఆలోచిద్దాం. హిట్ కాకపోతే మాత్రం వేరే సినిమా గురించి ఆలోచిద్దాం’’ అని టైమ్ చూసుకున్నాడు డూప్సన్. తన టైమ్ బాగలేదని డిసైడైపోయాడు గుర్నాథం! -
వ్యవసాయదారుల చిత్రం 49ఓ
వ్యవసాయం, వ్యవసాయదారుల ఇతివృత్తంగా తెర కెక్కించిన చిత్రం 49ఓ అని ఆ చిత్ర కథానాయకుడు గౌండ్రమణి తెలిపారు. నిర్మాత శివబాలన్ నిర్మించిన ఈ చిత్నానికి ఆరోగ్యన్ కథ, కథనం, మాటలు, దర్శకత్వం బాధ్యతల్ని నిర్వహించారు. సుమారు 39 ఏళ్ల తరువాత సీనియర్ హాస్యనటుడు గౌండ్రమణి కథానాయకుడిగా రీఎంట్రీ అవుతున్న చిత్రం 49ఓ. ఈ చిత్రం ఈ నెల 17న తెరపైకి రానుంది. కాగా సంగీత దర్శకుడు కే సంగీతబాణీలు కట్టిన ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం ఆదివారం సాయంత్రం చెన్నైలోని ప్రసాద్ల్యాబ్లో జరిగింది. చిత్ర ఆడియోను నటుడు సత్యరాజ్, శివకార్తికేయన్లు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చిత్ర హీరో గౌండ్రమణి మాట్లాడుతూ ఐటమ్ సాంగ్స్, ఆరు ఫైట్స్, పాటలు అంటూ చిత్రాలు వస్తున్న ఈ రోజుల్లో వ్యవసాయం గురించి చిత్రం చేయడానికి ముందుకొచ్చిన నిర్మాత శివబాలన్ను అభినందించాలన్నారు. వ్యవసాయం, వ్యవసాయదారులు లేకుంటే ఈ లోకమే లేదు అని చెప్పే చిత్రమే 49ఓ అని వివరించారు. అలాంటి వ్యసాయాన్ని కాలరాసే ప్రయత్నాలు జరుగుతున్నారన్నారు. కొందరు రియల్టర్లు వ్యవసాయ పొలాల్లో పెద్ద పెద్ద కట్టడాలను కట్టేస్తున్నారన్నారు. అలాంటి వారికి పంట భూముల్ని విక్రయించవద్దు అని హితవు పలికారు. రైతులు కొందరు వ్యవసాయం లాభించడం లేదని పొలాలను అమ్ముకుంటున్నారని తెలిపారు. ఒక ఏడాది పంటలు పండకపోయినా మరో ఏడాది పండుతాయని, పొలాల్ని అమ్ముకోవద్దని చెప్పే చిత్రం 49ఓ అని తెలిపారు. -
నారాయణమూర్తి సినిమాలో గద్దర్
-
బాబుకు ప్రత్యేక హోదాపై శ్రద్ధ లేదు
సాక్షి,హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పుష్కరాలపై చూపిన శ్రద్ధ ప్రత్యేకహోదా సాధనపై చూపించడం లేదని ఏపీకి ప్రత్యేక హోదా, ఇతర కేంద్ర హామీల సాధన సమాఖ్య అధ్యక్షుడు, సినీనటుడు శివాజీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గురువారం హైదరాబాద్లో మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు కారెం శివాజీ అధ్యక్షతన జరిగిన ప్రత్యేకహోదా సాధన సమాఖ్య సమావేశంలో సినీనటుడు శివాజీ మాటాడారు. ప్రజలు నమ్మి చంద్రబాబుకు రాష్ట్రాన్ని అప్పగిస్తే.. సమస్యలను పూర్తి గా పక్కన పెట్టేసి పదవుల కోసం పబ్బం గడుపుకోవడం తప్పితే చేసిందేమి లేదని విమర్శించారు. ప్రత్యేక హోదా విషయంలో ప్రధాని మోదీపై ఒత్తిడి తెచ్చేందుకు ఎందుకు వెనుకాడుతున్నారో అర్థం కావడం లేదన్నారు. ప్రతి పక్షం మాట్లాడితే సీబీఐ కొరడా తీస్తున్నారని ఆరోపించారు. హోదా సాధనకు ప్రధాని మోదీపై ఒత్తిడి తేవాల్సిన బాధ్యత జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్పైనా ఉందన్నారు. వైఎస్సార్సీపీ ధర్నాకు సాధన మద్దతు.. ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలంటూ వైఎస్సార్సీపీ వచ్చే నెల 10న ఢిల్లీలో నిర్వహించనున్న ధర్నాకు కేంద్ర హామీల సాధన సమాఖ్య మద్దతు ప్రకటిస్తున్నట్లు ఆ సమాఖ్య గౌరవాధ్యక్షుడు చలసాని శ్రీనివాసరావు తెలిపారు. ఎస్ఎఫ్ఐ చేపట్టిన బస్సు యాత్రకు పూర్తి మద్దతు పలికారు. వచ్చే నెల 5న ఏలూరులో తలపెట్టిన ర్యాలీని జయప్రదం చేయాల్సిందిగా కోరారు. అడ్హాక్ కమిటీ ఎన్నిక..: ప్రత్యేక హోదా, ఇతర కేంద్ర హామీల సాధన సమాఖ్య అడ్హాక్ కమిటీ అధ్యక్షుడిగా సినీనటుడు శివాజీ ఎన్నికయ్యారు. కమిటీ గౌరవాధ్యక్షుడిగా ఆంధ్రమేధావుల వేదిక అధ్యక్షుడు చలసాని శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శిగా సదాశివరెడ్డిలను ఎన్నుకున్నారు. తన సహా ఏపీలోని విద్యార్థి, ఉద్యోగ, కార్మిక సంఘాల జేఏసీలతో పాటు రైతు, ప్రజా, కుల సంఘాల నేతలందరూ కన్వీనర్లుగా ఉంటారని కారెం శివాజీ వెల్లడించారు. -
ఈ వారం యూట్యూబ్ హిట్స్
ట్రైలర్: స్టీవ్ జాబ్స్ నిడివి: 2 ని. 40 సె. హిట్స్: 28,70,219 స్టీవ్ జాబ్స్పై బయోగ్రఫికల్ డ్రామా ఫిల్మ్ వస్తోంది. అక్టోబర్లో విడుదల కానున్న ఈ ‘స్టీవ్ జాబ్స్’ చిత్రానికి ‘స్లమ్డాగ్ మిలియనీర్’ ఫేం డానీ బోయెల్ దర్శకత్వం వహించారు. జర్మన్-ఐరిష్ నటుడు మైఖేల్ ఫాస్బెండర్ స్టీవ్ జాబ్స్గా నటించారు. ‘‘ట్రైలర్లో మైఖేల్ను చూస్తే అచ్చంగా స్టీవ్ జాబ్స్ను చూస్తున్నట్లుగానే ఉంది’’ అంటున్నారు సినీ విశ్లేషకులు. ట్రైలర్లో వినిపిస్తున్న డైలాగులు ప్రేక్షకులలో సినిమా పట్ల ఆసక్తి రేపుతున్నాయి. డ్యాన్స్ వీడియో: చానింగ్ టటమ్ నిడివి: 30 సె. హిట్స్: 23,52,261 హాలీవుడ్ డ్యాన్స్ ఫిల్మ్ ‘సెట్ అప్’తో నటుడు, నృత్యకారుడు చానింగ్ టటమ్కు వచ్చిన పేరు ఇంతా అంతా కాదు. అతని నృత్యరీతులు ప్రేక్షకులను అబ్బురపరిచాయి. అభిమానులు అతడిని ‘మెగాస్టార్’ అని, ఈ కాలపు ‘జెన్ కెల్లీ’ అని కూడా అంటున్నారు. చానింగ్ సరికొత్త నృత్యరీతుల వీడియో యూట్యూబ్లో ఆబాలగోపాలాన్నీ ఆకట్టుకుంటోంది. 30 సెకండ్లలో 7 డ్యాన్స్ స్టెప్లు వేసి ప్రేక్షకులను సంభ్రమాశ్చర్యాలలో ముంచెత్తాడు చానింగ్. ట్రైలర్: ఆల్ ఈజ్ వెల్ నిడివి: 2 ని. 49 సె. హిట్స్: 15,13,813 ‘ఓ మై గాడ్’ ఫేమ్ ఉమేశ్ శుక్లా దర్శకత్వంలో రానున్న ‘ఆల్ ఈజ్ వెల్’ పోస్టర్లు ఆసక్తికరంగా ఉన్నాయి. ఆగస్ట్లో విడుదల కానున్న ఈ చిత్రంలో రిషి కపూర్, అభిషేక్ బచ్చన్లు తండ్రీ కొడుకులుగా నటించారు. ఉమేశ్ శుక్లా సినిమాలో బోలెడు కామెడీ ఉంటుంది. నవ్విస్తూనే మనల్ని ఆలోచనల్లోకి తీసుకువెళతాడు దర్శకుడు. ‘త్రీ ఇడియట్స్’ సినిమాలోని ఫేమస్ డైలాగ్ ‘ఆల్ ఈజ్ వెల్’. ఈ డైలాగ్లాగే సినిమా హిట్ అవుతుందా? లేదా? అనేది చూద్దాం. ట్రైలర్: క్యాలెండర్ గర్ల్స్ నిడివి: 1 ని. 31 సె. హిట్స్: 2,16,837 నిజజీవిత సంఘటనల ఆధారంగా సినిమాలు తీయడంలో మాధుర్ బండార్కర్ దిట్ట. ఈ దర్శకుడు ఇప్పుడు ఫేమస్ క్యాలెండర్లకు పోజులు ఇచ్చే మోడల్స్పై ‘క్యాలెండర్ గర్ల్స్’ సినిమా తీశాడు. ఈ సినిమా కోసం ఆయన ఎంతో గ్రౌండ్వర్క్ చేశాడట. క్యాలెండర్ మోడల్స్ వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితాన్ని సినిమా ప్రతిబింబిస్తుంది. బికినీలతో నిల్చున్న అందాల బొమ్మల పోస్టర్ యూట్యూబ్లో హల్చల్ చేస్తోంది. సినిమా ఆగస్ట్ 7న విడుదల కానుంది. టీజర్: స్నోడెన్ నిడివి: 1 ని. 27 సె. హిట్స్: 3,25,687 లూకె హర్డింగ్ ‘ది స్నోడెన్ ఫైల్స్’ పుస్తకం ఆధారంగా ఇప్పుడు ‘ది స్నోడెన్’ పేరుతో హాలివుడ్ సినిమా రూపుదిద్దుకుంటోంది.ఆలివర్ స్టోన్ దర్శకత్వం వహించారు. ‘ది స్నోడెన్’కు సంబంధించి తాజా టీజర్లో ఎలాంటి దృశ్యాలూ కనిపించవు. అమెరికా జాతీయ జెండా మాత్రం కనిపిస్తుంది. జెండాపై ఉన్న తెలుపు భాగంలో ‘నిఘా నీడలో... అందరికీ న్యాయం, స్వేచ్ఛ’ అనే క్యాప్షన్ ఒకటి ఆకర్షణీయంగా మెరుస్తుంటుంది. ట్రైలర్: మసాన్ నిడివి: 2 ని. 32 సె. హిట్స్: 12,01,474 కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ‘మసాన్’ చిత్రానికి అనూహ్యమైన స్పందన లభించింది. దర్శకుడు నీరజ్కు ఇది తొలి సినిమా. ఒక చిన్న పట్టణంలో నలుగురు సాధారణ వ్యక్తుల జీవితం ఆధారంగా ఈ కథ నడుస్తుంది. రీచా చద్దా అభినయానికి మంచి పేరు వస్తోంది. సామాజిక వాస్తవాల ఆధారంగా మరిన్ని సినిమాలు తీయాలనుకుంటున్నాడు నీరజ్. ‘మసాన్’కు ఇప్పటికే మీడియాలో మంచి ప్రచారం లభించింది. సినిమా జూలై 24న విడుదల కానుంది. -
పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు
ఈరోజు మీతో పాటు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు: రాజ్బబ్బర్ (నటుడు); ముకేష్ ఖన్నా (టీవీ, సినీ నటుడు) ఈ రోజు పుట్టిన వారి సంవత్సర సంఖ్య 1. ఇది సూర్యునికి సంబంధించిన సంఖ్య కాబట్టి వీరికి ఇది ల్యాండ్ మార్క్ ఇయర్గా చెప్పవచ్చు. వీరికి ఈ ఏడాది నూతనోత్సాహం, ధైర్యం, తెగువ, ఏదైనా చేయగలననే ఆత్మవిశ్వాసం కలుగుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి, అవివాహితులకు వివాహం, కొత్త పరిశ్రమలు, కొత్త వ్యాపారాలు చేయాలనుకునే వారి కోరిక నెరవేరుతుంది. కొత్త స్నేహాలు, కొత్త బంధుత్వాలు ఏర్పడతాయి. వాటి వలన కొన్ని ప్రయోజనాలు కలుగుతాయి. కష్టపడి పని చేయాలనే మనస్తత్వం ఉండటం వల్ల ఆర్థికాభివృద్ధి, అదృష్టం కలిసి వస్తాయి. ఈ సంవత్సరం పెట్టిన పెట్టుబడి భవిష్యత్తులో ఎంతో లాభాన్ని తెచ్చిపెడుతుంది. విద్యార్థులు కష్టపడి చదివి తమ లక్ష్యాలను చేరుకోగలుగుతారు. క్రీడాకారులకు, రాజకీయ నాయకులకు పేరు ప్రతిష్ఠలతోపాటు సన్మానాలు జరుగుతాయి. అయితే అహంభావం వృద్ధి చెందటం వల్ల సన్నిహితులు, స్నేహితులు దూరమయ్యే పరిస్థితి కనిపిస్తోంది. అందువల్ల సంయమనంతో వ్యవహరించడం మంచిది. లక్కీ నంబర్స్: 1,4,5,9; లక్కీ డేస్: మంగళ, బుధ, ఆదివారాలు; లక్కీ కలర్స్: గ్రీన్, రోజ్, ఆరంజ్, రెడ్, పర్పుల్. సూచనలు: ఆదిత్య హృదయ పారాయణం చేయడం, లక్ష్మీ అష్టోత్తరం పఠించడం, శివారాధన, నేత్రదానాన్ని ప్రోత్సహించడం, వృద్ధాశ్రమంలో సేవ చేయడం - డా. మహమ్మద్ దావూద్, జ్యోతిష, సంఖ్యాశాస్త్ర నిపుణులు -
ప్రత్యేక హోదా ప్రజల హక్కు
వైవీయూ : ప్రత్యేక హోదాతోనే వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి సాధ్యమని, అందుకు ఉద్యమించడమే మార్గమని ఆంధ్ర రాష్ట్ర పరిరక్షణ సమితి అధ్యక్షుడు, విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ లక్ష్మణ్రెడ్డి పేర్కొన్నారు. కడప నగరంలోని వైఎస్ఆర్ మెమోరియల్ ప్రెస్క్లబ్లో గురువారం ఇన్సాఫ్ స్టూడెంట్ ఫెడరేషన్ (ఐఎస్ఎఫ్) జిల్లా అధ్యక్షుడు నాగేంద్రకుమార్రెడ్డి అధ్యక్షతన ‘రాష్ట్రానికి ప్రత్యేక హోదా - రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీ’ అంశంపై నిర్వహించిన రౌండ్టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. రాయలసీమతో పాటు వెనుకబడిన ఉత్తరాంధ్ర జిల్లాలు, ప్రకాశంతో కలిసి 8 జిల్లాలకు తొలుత ప్రత్యేక హోదా ప్రకటించాలన్నారు. అప్పుడే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ప్రకటిస్తే విజయవాడ, విశాఖపట్టణం లాంటి అభివృద్ధి చెందిన ప్రాంతాలకే ప్రభుత్వ రంగ సంస్థలు, పరిశ్రమలు తరలిపోతాయన్నారు. దీని వలన మళ్లీ కోస్తా ప్రాంతమే అభివృద్ధి చెందుతుంది తప్ప రాయలసీమకు ఎటువంటి ప్రయోజనం ఉండదన్నారు. ముఖ్యమంత్రి, ప్రతిపక్షనేత, పీసీసీ అధ్యక్షుడు ఇలా అందరూ రాయలసీమ ప్రాంతానికి చెందిన నాయకులే ఉన్నప్పటికీ రాయలసీమకు న్యాయం జరగడం లేదన్నారు. అధికారం వద్దు.. అభివృద్ధి కావాలన్నది కోస్తా ప్రాంతం వారి నినాదమన్నారు. సీమ ప్రాంతం నాయకులు మాత్రం అధికారం కోసం అభివృద్ధి అక్కడే చేస్తామంటుండటం శోచనీయమన్నారు. కోస్తాంధ్రతో సమానంగా రాయలసీమను అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు. శివరామకృష్ణన్ కమిటీ నివేదిక ప్రకారం అత్యంత వెనుకబడిన ప్రాంతాలు రాయలసీమ, ఉత్తరాంధ్ర అన్నారు. ఈ ప్రాంతాలు అభివృద్ధి అయ్యేవరకు ఈ ప్రాంతాలకే నిధులు కేటాయించాలన్నారు. ఇతర విద్యాసంస్థలు, వైద్యశాలలతో పాటు హైకోర్టును రాయలసీమలో ఏర్పాటు చేయాలన్నారు. రాజధాని, ఎయిమ్స్తో పాటు అన్ని రకాల సంస్థలను కోస్తా ప్రాంతానికే పరిమితం చేస్తున్నారన్నారు. రాజధాని అవసరాల కోసం పట్టిసీమను నిర్మిస్తున్నారన్నారు. బయటకు మాత్రం సీమకు నీటిని అందించేందుకు అని చెబుతున్నా అందులో కోస్తా వారి ప్రయోజనాలే దాగి ఉన్నాయన్నారు. పట్టిసీమ జీఓలో ఎక్కడా రాయలసీమకు సంబంధించిన అంశం లేదన్నారు. రాత పూర్వకంగా హక్కు లేకుంటే రాబోయే రోజుల్లో ఏవిధంగా పట్టిసీమపై హక్కు ఉంటుందన్నారు. పట్టిసీమ నిర్మాణంరాయలసీమ ప్రజల నోట్లో దుమ్ముకొట్టడానికేనని విమర్శించారు. రాయలసీమను ఎందుకు అభివృద్ధి చేయాలి.. ఓట్లు వేసిన కోస్తా ప్రాంతానికే మేలు చేస్తానని ముఖ్యమంత్రి అనడం దుర్మార్గమన్నారు. రాజకీయాలు వేరు, అభివృద్ధి వేరని, పాలకులు ఓట్లు, సీట్లతో సంబంధం లేకుండా అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయాలన్నారు. ఇప్పటికైనా హైదరాబాద్లో చేసిన తప్పును పునరావృతం కాకుండా అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి జరిగేలా పాలకులు చర్యలు తీసుకోవాలని కోరారు. సమైక్యాంధ్ర కోసం తీవ్రంగా పోరాడింది రాయలసీమ ప్రాంతవాసులైతే.. ఫలాలు పొందింది మాత్రం కోస్తావారన్నారు. ఆ ప్రాంత ప్రజలు ఎంతో చైతన్యవంతులని మళ్లీ అభివృద్ధి చెందిన తర్వాత రాయలసీమ వారిని వెనక్కి వెళ్లమంటే పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. ఒకప్పుడు చిన్న పట్టణంగా ఉన్న విశాఖలో విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని పోరాడి తెచ్చామన్నారు. నేడు కడప ఉక్కు ఆంధ్రుల హక్కు అని పోరాటం చేయాలన్నారు. యువత సైతం పదవులు ఆశించకుండా రాజకీయాల్లోకి రావాలని ఆహ్వానించారు. ఉద్యమం ద్వారానే ప్రత్యేకహోదా సాధ్యమవుతుందని దీనికి యువత ముందు వరుసలో నిలవాలని ఆకాంక్షించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అన్నది రాష్ర్ట ప్రజల హక్కు అని సినీ నటుడు శివాజీ పేర్కొన్నారు. ప్రాంతీయ విభేదాలు పక్కనపెట్టి ప్రత్యేక హోదా కోసం కృషి చేయాలన్నారు. రాయలసీమ ప్రాంతానికి చెందిన నలుగురు నేతలు సీఎంగా పని చేసినా ఈ ప్రాంతం అభివృద్ధి చెందలేదన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం పాలక, ప్రతిపక్షం కలిసికట్టుగా కృషి చేయాలన్నారు. ఉద్యమం గురించి పట్టించుకోకుండా ఉంటే తనకు ఇప్పటికే పదవి వచ్చి ఉండేదని, దానిని కాదనుకుని ప్రత్యేక హోదా సాధించేందుకు ప్రజల్లో చైతన్యం నింపడానికి పోరుబాట పట్టానన్నారు. ఆర్థిక లోటు, రాజధాని లేకపోవడం తదితర అంశాలను పరిగణలోకి తీసుకుని వెంటనే ప్రత్యేక హోదా ప్రకటించాలని కోరారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడ్డ వెంటనే ప్రత్యేక హోదాపై అఖిల పక్షం ఏర్పాటు చేస్తానని ముఖ్యమంత్రి ప్రకటించారన్నారు. ఏడాది గడిచినా ఇపుడు దాని గురించి పట్టించుకోలేదన్నారు. ఇప్పటికైనా అఖిలపక్షం ఏర్పాటుచేసి ఢిల్లీకి పంపి ప్రత్యేకహోదాను సాధించాలన్నారు. దీనికి అవసరమైతే పొలిటికల్ జేఏసీ ఏర్పాటు చేసి సాధించుకుంటామని తెలిపారు. ప్రత్యేక హోదాపై లక్ష్మణ్రెడ్డి వ్యాఖ్యలపై సినీనటుడు వివరణ ఇచ్చే ప్రయత్నం చేయగా స్థానిక బీజేపీ నాయకుడు సానపురెడ్డి రవిశంకర్రెడ్డి అడ్డుచెప్పారు. రాయలసీమకు అన్యాయం జరిగిందని లక్ష్మణ్రెడ్డి చెప్పిన మాటలను ఖండించడం తగదని వాగ్వాదానికి దిగారు. దీంతో సినీనటుడు శివాజీ తనకు ప్రాంతీయ భేదాలు లేవని చెప్పారు. తాను పుట్టింది గుంటూరులో అని ఇల్లు తిరుపతిలో కట్టుకున్నానన్నారు. హైదరాబాద్లో సైతం తనను ఆదరిస్తున్నారని వివరించారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎస్యూ రాష్ట్ర అధ్యక్షుడు రవిశంకర్రెడ్డి, ఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కోటేశ్వరరెడ్డి, టీడీపీ నాయకుడు దుర్గాప్రసాద్, బార్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు రాఘవరెడ్డి, కాంగ్రెస్ నాయకుడు సత్తార్, ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షుడు ఇంతియాజ్ అహ్మద్, వైఎస్ఆర్ సీపీ నాయకుడు పి. ప్రతాప్రెడ్డి, ప్రజా సంఘాల నాయకులు శివనాయక్, రంగనాథరెడ్డి, ఆర్ఎస్ఎఫ్, ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ, ఎన్ఎస్యూఐ, ఆర్ఎస్యూ, ఆటోయూనియన్ నాయకులు జాకీర్, షరీఫ్, ఐఎస్ఎఫ్ నాయకులు గంగిరెడ్డి, తరుణ్కుమార్, రాజ, సిద్ధయ్య, శ్రీనివాసులు, సందీప్, అజీమ్, రమణ తదితరులు పాల్గొన్నారు. ప్రత్యేకహోదాపై మహానాడులో ఎందుకు తీర్మానం చేయలేదు? రాష్ట్ర విభజనకు సీపీఎం తప్ప అన్ని పార్టీలు ఏదో ఒక రకంగా అంగీకరించాయి. విభజన చట్టం ప్రకారం రాష్ట్రానికి ఇవ్వాల్సిన ప్రత్యేక హోదాపై మీనమేషాలు తగదు. చిత్తశుద్ధి వుంటే తెలుగుదేశం పార్టీ మహానాడులో ప్రత్యేకహోదాపై ఎందుకు తీర్మానం చేయలేదు? ప్రత్యేకహోదా వస్తేనే అత్యంత వెనుకబడిన రాయలసీమ ప్రాంతం అభివదిృ చెందుతుంది. 90 శాతం గ్రాంట్ల రూపంలో నిధులు వచ్చే అవకాశం ఉంది కనుక విభజన చట్టంలోని అన్ని అంశాలను ఐక్యంగా సాధించుకోవాలి. - రవిశంకర్రెడ్డి, సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు రాజ్యాంగ సవరణ చేసైనా ప్రత్యేకహోదా కల్పించాలి ప్రత్యేకహోదా విషయంలో ఏవైనా సాంకేతిక ఇబ్బందులు ఉంటే రాజ్యాంగ సవరణ చేసైనా ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కల్పించాలి. వందల సార్లు రాజ్యాంగ సవరణ చేసిన నాయకులు ఈ విషయంలో చిత్తశుద్ధి ఉంటే సవరణ చేసి హోదాను ఇవ్వాలి. ప్రస్తుతం కేవలం స్వార్థ రాజకీయాలు నడుస్తున్నాయన్నాయి. శివరామకృ్ణన్ కమిటీ చెప్పిన విధంగా అత్యంత వెనుకబడిన రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీని వెంటనే ప్రకటించాలి. - పోచంరెడ్డి సుబ్బారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ, కడప -
కోడూరు ప్రజల అభిమానం మరవలేను
-
కోడూరు ప్రజల అభిమానం మరవలేను
రాజ్యసభ సభ్యుడు, సినీ నటుడు చిరంజీవి రైల్వేకోడూరు, అర్బన్ : రైల్వేకోడూరు ప్రజల అభిమానాన్ని తాను మరవలేనని సినీ నటుడు, రాజ్యసభ సభ్యుడు చిరంజీవి పేర్కొన్నారు. శనివారం ఆయన పట్టణంలోని శివాలయం సర్కిల్లో ఉన్న శ్రీకృష్ణదేవరాయల విగ్రహాన్ని ఆవిష్కరించారు. 2010లోనే ఈ విగ్రహాన్ని చిరంజీవి చేతులమీదుగా ఆవిష్కరించాలని నిర్వాహకులు భావించారు. చిరంజీవికి సమయం లేకపోవడంతో ఎట్టకేలకు శనివారం ఆయన చేతుల మీదుగా ఆవిష్కరింపజేశారు. రేణిగుంట విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గంలో వచ్చిన ఆయన పట్టణంలో అభిమానులకు అభివాదం చేస్తూ విగ్రహం వద్దకు వచ్చారు. విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం మాట్లాడుతూ శ్రీకృష్ణదేవరాయులు పరిపాలనాధ్యక్షుడని ఆయన పరిపాలనలో రాజ్యం సస్యశ్యామలంగా ఉండేదన్నారు. ఆయన అడుగుజాడల్లో అందరం నడవాలన్నారు. అభిమానుల కోరిక మేరకు తన 150వ సినిమాను ఆగస్టులో ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నామని ప్రకటించారు. ఈ కార్యక్రమానికి పార్టీలకు అతీతంగా హాజరైన వారందరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు. -
సమ్మరమే
సినిమాకి హీరో దేవుడంతటివాడు... కాదు... దేవుడే! హీరోని ఏ వరం అడిగినా ‘ఓకే టేకిట్’ అంటాడు బోళాశంకరుడిలా! అందుకే అతగాడు హీరో. ఈ ఎండాకాలంలో హీరోని ఇండస్ట్రీ ఏమి అడుగుతుంది? చల్లని హిట్ ఇవ్వు స్వామీ అని వేడుకుంటుంది. ఇస్తారా? ఇవ్వకపోతే సమ్మర్లో మాడి మసైపోతుంది ఇండస్ట్రీ. దట్ ఈజ్ ద ప్రాబ్లమ్ అవర్ హీరో ఈజ్ ఫేసింగ్! ఈ సమ్మర్లో హీరోగారు సప్తసముద్రాలు దాటి విలన్ని పంచ్లు కొట్టి, హీరోయిన్ మీద పంచ్లు విసిరి, సినిమా ఇండస్ట్రీ బ్యాడ్ టైమ్ని పటాపంచ్లు చేసి హిట్ కొడతాడా? అన్నదే క్లైమాక్స్ సీన్. 150 కోట్ల లాసులు... 500 కోట్ల స్టేకులు... 8 వీక్స్ టైము... దేఏఏఏవుడా! ఇరవై సినిమాలు... 500 కోట్లు... కేవలం అరవై రోజులు!! మే నెల సెకండాఫ్ నుంచి జూలై ఫస్టాఫ్ దాకా రెండు నెలల కాలంలో వచ్చే సినిమాల రిజల్ట్తో ఇండస్ట్రీ భవిష్యత్తు ముడిపడి ఉంది. బాలకృష్ణ ‘లయన్’ మొదలు గుణశేఖర్ ‘రుద్రమదేవి’, రాజమౌళి ‘బాహుబలి’ దాకా పదుల కోట్ల పెట్టుబడితో, ప్రతిష్ఠాత్మకంగా తయారైన అనేక భారీ చిత్రాలు విడుదల కానున్నాయి. మీడియమ్ రేంజ్ సినిమాలు సహా 20 కొత్త చిత్రాలు పలకరించనున్నాయి. ఒక్కముక్కలో పణంగా ఒడ్డుతున్న 500 కోట్ల సాక్షిగా తెలుగు ఇండస్ట్రీ వసూళ్ళ వర్షం కోసం ఎదురుచూస్తోంది. సక్సెస్ దాహార్తిలో సినిమా ఈ ఏడాదిలో ఇప్పటి వరకు తెలుగులో ‘యూనివర్సల్ హిట్స్’ ఎన్ని అంటే, వెతుక్కోవాల్సి వస్తోంది. నిర్మాణ, పంపిణీ, ప్రదర్శక రంగాలు మూడింటికీ తృప్తినిచ్చిన సినిమాగా కల్యాణరామ్ ‘పటాస్’ రీజనబుల్గా పే చేసింది. డబ్బింగ్ల సంగతికొస్తే - కొత్త ఏడాదికి శ్రీకారం చుట్టిన ధనుష్ ‘రఘువరన్ బి.టెక్’, ఇటీవలి లారెన్స్ ‘గంగ’ డబ్బులు తెచ్చాయని ఇండస్ట్రీ వర్గాల మాట. ‘‘గత డిసెంబర్లో వచ్చిన రజనీకాంత్ ‘లింగ’ నుంచి వరుస ఫ్లాపులే. ఎగ్జిబిటర్, డిస్ట్రిబ్యూటర్, ప్రొడ్యూసర్, అతను డబ్బులు వెనక్కి ఇవ్వాల్సిన ఫైనాన్షియర్ - ఇలా అందరూ పెట్టిన పెట్టుబడులు వెనక్కి రాక కష్టాల్లో ఉన్నారు. ఒక్క మాటలో తెలుగు సినిమా ‘ఫైనాన్షియల్ స్లంప్’లో ఉంది. ఇండస్ట్రీకిప్పుడు మంచి హిట్ రూపంలో టానిక్ కావా’’లని ‘లయన్’ నిర్మాత రుద్రపాటి రమణారావు వ్యాఖ్యానించారు. ఫస్టాఫ్లో... గత ఏడాదే బెటర్! లాస్ట్ ఇయర్ ఫస్ట్హాఫ్ ఇంత దారుణంగా లేదు. మహేశ్బాబు ‘1’ లాంటివి బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టినా, ‘లెజెండ్’, ‘రేసుగుర్రం’ లాంటి బాక్సాఫీస్ హిట్లతో ఇండస్ట్రీ కళకళలాడింది. ‘‘ఫ్లాపులొచ్చినా, కొన్ని సూపర్హిట్లు, కొన్ని సక్సెస్లతో గత ఏడాదే బ్యాలెన్స్ అయింది. ఈ ఏడాది ఇప్పటి దాకా రూ. 125 కోట్ల పైగా నష్టపోయాం. పరిశ్రమ బ్యాడ్షేప్లో ఉంది’’ అని నిర్మాతల మండలి గౌరవ కార్యదర్శి టి. ప్రసన్నకుమార్ అభిప్రాయపడ్డారు. అందుకే, టాలీవుడ్కి ఇది చాలా క్లిష్టమైన కాలం. రానున్న రెండు నెలల్లో సగటున ప్రతి పది రోజులకూ ఒక భారీ చిత్రం రానుంది. ముఖ్యంగా ప్రతిష్ఠాత్మకంగా తీస్తున్న డిఫరెంట్ జానర్ చిత్రాలైన గుణశేఖర్ ‘రుద్రమదేవి’, రాజమౌళి ‘బాహుబలి’ మీద ఇప్పుడు అందరి కళ్ళూ ఉన్నాయి. అందరి కళ్ళూ అటువైపే! ఏళ్ళ తరబడి నిర్మాణంలో ఉండి, ఇంకా రిలీజ్కు రెడీ కాకపోవడంతో, ఈ చిత్రాల నిర్మాణ వ్యయం, వ్యాపారం వగైరా గురించి ఎవరూ కచ్చితమైన గణాంకాలు చెప్పలేకపోతున్నారు. అయితే, సినీవ్యాపార వర్గాల అంచనా ప్రకారం కేవలం ఈ రెండు సినిమాల మీదే దాదాపు రూ. 200 నుంచి 260 కోట్ల పైచిలుకు సొమ్మును పణంగా ఒడ్డుతున్నారు. ‘‘ఒక సగటు భారీ తెలుగు సినిమాకయ్యే ఖర్చు కన్నా రెట్టింపు వ్యయంతో ‘బాహుబలి’ తయారవుతోంది. ఒక్క తెలుగు వెర్షన్ మీదే వంద కోట్ల పైగా స్టేక్ ఉంటుంది’’ అని సినీ వ్యాపారంలో మూడు దశాబ్దాల పైచిలుకు అనుభవజ్ఞుడు ఒకరు వివరించారు. అలాగే, కాకతీయ వీరనారి రుద్రమదేవి చారిత్రక గాథ ఆధారంగా గుణశేఖర్ తీస్తున్న తొలి తెలుగు స్టీరియోస్కోపిక్ 3డి చిత్రం ‘రుద్రమదేవి’ కూడా 60 కోట్ల పైచిలుకు పెద్ద పందెం. ఇక, మహేశ్బాబు, రవితేజ, రామ్, కల్యాణరామ్ లాంటి పేరున్న హీరోలు, పూరీ జగన్నాథ్ లాంటి ప్రముఖ దర్శకులు కూడా ఈ అరవై రోజుల సినీ మారథాన్లో కీ-ప్లేయర్స్. అందుకే, ఏలూరుకు చెందిన ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ ఎల్.వి.ఆర్. అన్నట్లు, ‘‘ఈ రెండు నెలల్లో రానున్న భారీ బడ్జెట్ చిత్రాలు అటు ప్రేక్షకులకూ, ఇటు పరిశ్రమకూ కొత్త ఎనర్జీని ఇవ్వాలి. అలా ఇవ్వగలిగితేనే పరిశ్రమ మళ్ళీ కళకళలాడుతుంది.’’ అది ‘లయన్’తో మొదలవుతుందనీ, వరుస హిట్లతో ఈ రెండు నెలల్లో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ కొత్త ఉత్సాహం పుంజుకుంటుందనీ పరిశ్రమ వర్గీయుల ఆశ. స్పెక్యులేటివ్ బిజినెస్ అయిన సినిమా పయనించేది ఎప్పుడూ ఇలాంటి ఆశల గుర్రం మీదే కదా! - రెంటాల జయదేవ హై స్టేక్స్ బాక్సాఫీస్ జూదం పెట్టినఖర్చు, చేస్తున్న వ్యాపారం, ప్రింట్స్, పబ్లిసిటీ కలుపుకొని, పరిశ్రమ భారీగా పణం ఒడ్డుతున్న చిత్రాల్లో కొన్ని... బాహుబలి: *150 - 200 కోట్లు (అన్ని భాషల్లో కలిపి) (జూలై 10న) రుద్రమదేవి: *60 కోట్లు (జూన్) మహేశ్బాబు ‘శ్రీమంతుడు’: 60 కోట్లు (జూలై 17 రిలీజ్) లయన్: *35 కోట్లు (మే 14) రవితేజ ‘కిక్2’: *45 కోట్లు (జూన్) రామ్ ‘పండగ చేస్కో’: 22-25 కోట్లు (మే 29) కల్యాణ్రాం ‘షేర్’: *20 కోట్లు (జూన్) చార్మి ‘జ్యోతిలక్ష్మీ’: *12 కోట్లు (జూన్) సందీప్ కిషన్ ‘టైగర్’: *7.5 కోట్లు (మే 22) అల్లరి నరేశ్ ‘జేమ్స్బాండ్’: *8-10 కోట్లు (జూన్) మోసగాళ్ళకు మోసగాడు: *6-7 కోట్లు (మే 22) సూర్య ‘రాక్షసుడు’: *14 కోట్లు (మే చివర) నాగశౌర్య ‘జాదూగాడు’: *4 కోట్లు (జూన్) ఈ అంకెలన్నీ సినీ వ్యాపార వర్గాల భోగట్టా సెలవుల సీజన్ వేస్ట్ చేశారు! ‘‘ఇవాళ నిర్మాతలు సరైన ప్లానింగ్ లేక, ఈ వేసవి సెలవుల సీజన్ను చాలా వృథా చేశారు. తీరా వేసవి సెలవులైపోతుండగా, ఇప్పుడు పెద్ద సినిమాల సీజన్ మొదలవుతోంది. ఈ సినిమాల విజయం మీదే కొన్ని వందల కోట్ల డబ్బు ఆధారపడి ఉంది.’’ - సత్య రంగయ్య, ప్రముఖ సినీ ఫైనాన్షియర్ ఎవరి దగ్గరా డబ్బులు లేవు! ‘‘ఈ ఏడాది ఇప్పటి దాకా డిజప్పాయింట్మెంటే! ఓవర్ బడ్జెట్ వల్లే ఫ్లాపవుతు న్నాయి. ఎగ్జిబిటర్స్ డబ్బుల్లేక, ఫుల్ పేమెంట్ చేయడం లేదు. దాని మీద ఆధారపడ్డ డిస్ట్రిబ్యూటర్ డబ్బు కట్టడం లేదు. దాంతో ప్రతి రిలీజ్కూ కష్టమే.’’ - తేజ, ఎగ్జిబిటర్, డిస్ట్రిబ్యూటర్, దర్శక, నిర్మాత -
పొగను పొమ్మంటున్నారు...
సినిమా చూద్దామని థియేటర్కు వెళ్తే.. ‘ఈ నగరానికి ఏమైంది..’ అంటూ ప్రకటనలు, సిగరెట్ డబ్బా కొంటే.. దానిపై పొగచూరిన ఊపిరితిత్తులు.. మొత్తానికి ధూమపానం అరికట్టడానికి ప్రభుత్వం తీసుకుంటున్న ఇలాంటి చర్యలు మెరుగైన ఫలితాలు ఇస్తున్నాయి. నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే (ఎన్ఎఫ్హెచ్ఎస్) ప్రకారం.. ధూమపానాన్ని మనవాళ్లు కాస్త దూరంగా ఉంచుతున్నారని తేలింది. పాన్, గుట్కా, బీడీ వంటి పొగాకు ఉత్పత్తులతో పోలిస్తే.. సిగరెట్ల విషయంలో ప్రజలు కాస్త సీరియస్గా ఆలోచించడం మొదలైందని సర్వే సారాంశం. గ్రామీణ భారతం, పట్టణ భారతం వారీగా చేసిన సర్వే ఫలితాలు సిగరెట్ సమస్యకు ప్రజలు చెక్ పెడుతున్నారని తెలిపాయి. యావత్ భారతంలో పొగాకు ఉత్పత్తుల కోసం వెచ్చించే మొత్తం పెరిగింది. ఇదే సమయంలో పెరుగుదల నిష్పత్తి కొంత తగ్గడం గుడ్డిలో మెల్ల. నేషనల్ శాంపిల్ సర్వే ఆఫీస్ (ఎన్ఎస్ఎస్వో) డాటా ప్రకారం 2004-05 గ్రామీణ భారతం నెల వారీగా పొగాకు ఉత్పత్తులపై రూ.15.09 ఖర్చు చేస్తే.. అదే సమయంలో పట్టణ భారతం రూ.16.84 పొగాకుపై తగిలేసింది. ఇక 2009-10కి వచ్చే సరికి ఈ ఖర్చు గ్రామీణ భారతంలో రూ.20.41 ఉంటే, పట్టణ భారతంలో రూ.21.43గా నమోదైంది. అయితే గతంతో పోలిస్తే సిగరెట్లపై ఖర్చు చేసే మొత్తం నిష్పత్తి కొంత తగ్గిందని తెలిసింది. ఈ లెక్కన పొగచూరిన బతుకులు తమకొద్దనే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతుండటం.. ఆహ్వానించదగ్గ పరిణామం. -
హాలీవుడ్లో... బొమ్మల బాపు
సినిమా స్క్రిప్ట్ల్లో బాపు సినిమా స్క్రిప్ట్ ప్రత్యేకమైనది. ఇంచక్కా ప్రతి సన్నివేశానికి బొమ్మలు వేసి స్క్రిప్టు బుక్లో ముందే సినిమా చూపిస్తారు. ఇలా చాలా తక్కువ మంది మాత్రమే బొమ్మలతో స్క్రిప్ట్లు తయారు చేసుకుంటారు. ‘ఇన్సెప్షన్’ నుంచి ఇటీవలి ‘ఇంటర్స్టెల్లార్’ చిత్రాల దాకా హాలీవుడ్లో తనదైన ముద్ర వేసిన దర్శకుడు క్రిస్టఫర్ నోలన్. ఈ దిగ్దర్శకుడు కూడా స్క్రిప్ట్ను స్కెచ్లుగా మార్చే కళాకారుడే. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. ట్రైబె కా చిత్రోత్సవాల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న క్రిస్టఫర్ మాట్లాడుతూ ‘‘మూలకథ కూడా రాసుకోను. అంతా స్కెచ్ వర్కే ఉంటుంది. దీంతో కథలో తర్వాత ఏం జరుగుతుంది అన్న విషయంపై నాకు పూర్తి అవగాహన ఉంటుంది. ఇదే నా శైలి. నా ‘మెమొంటో’ చిత్రానికి మాత్రమే స్క్రిప్ట్ రాసుకున్నాను. మిగతా వాటన్నిటికీ ఇలస్ట్రేషన్స్ వేసుకున్నా’’ అని చెప్పారు. -
భవిష్యత్తులో పెళ్లిళ్లు ఉండవు! - పూరి జగన్నాథ్
‘‘మగాడు, ఆడది ఇద్దరూ ఒకరు లేకుండా ఒకరు బతకలేరు. ఇద్దరూ కలిసి అస్సలు బతకలేరు. అందుకే ఇక భవిష్యత్తులో పెళ్లిళ్లు అనేవి ఉండవు. ఫ్రెండ్స్ మాత్రమే ఉంటారు’’ అని దర్శకుడు పూరి జగన్నాథ్ అన్నారు. నందు, ఐనెకా సోటీ జంటగా రామ్గోపాల్వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘365 డేస్’. డీవీ క్రియేషన్స్ పతాకంపై డి.వెంక టేశ్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం పాటల వేడుక హైదరాబాద్లో జరిగింది. పాటల సీడీని పూరి జగన్నాథ్ ఆవిష్కరించారు. రామ్గోపాల్వర్మ మాట్లాడుతూ- ‘‘ఒక జంట భావోద్వేగాల ఆధారంగా ఈ సినిమా స్క్రీన్ప్లే రాసుకున్నాను. ఒక రకంగా చెప్పాలంటే నా అభిప్రాయాన్నే రాశాను. చాలా మంది అడుగుతూ ఉంటారు.. నీ పెళ్లి ఎందుకు ఫెయిలైందని. నా సమాధానం ఒక్కటే . నాకు మంచి భార్య దొరికింది. నా భార్యకు మాత్రం చెడ్డ భర్త దొరికాడు. అదే కారణం. ఇది నాకెంతో ప్రత్యేకమైన సినిమా. ఎలాంటి క్రైమ్ లేని చిత్రం’’ అన్నారు. ఈ వేడుకలో రామ్గోపాల్వర్మ తల్లి సూర్యవతి, వీవీ వినాయక్, కోన వెంకట్, చార్మి, నందు, అనైకా సోటీ, ఉత్తేజ్ తదితరులు పాల్గొన్నారు. -
కళాకారులు ప్రతిపక్ష పాత్ర పోషించాలి
⇒ కష్టజీవుల పక్షాన నిలిచిన కానూరి తాత ⇒ సంస్మరణ సభలో సినీ నటుడు ఆర్. నారాయణమూర్తి ఖమ్మం మయూరిసెంటర్ : కేంద్రంలో, రాష్ట్రంలో నిజమైన ప్రతిపక్షంగా కళాకారులు వ్యవహరించాలని సినీ నటుడు ఆర్.నారాయణమూర్తి అన్నారు. బుధవారం ఖమ్మంలోని పోట్ల రామనర్సయ్య విజ్ఞానకేంద్రంలో ఆవుల వెంకటేశ్వర్లు అధ్యక్షతన అరుణోదయ వ్యవస్థాపకులు కానూరి వెంకటేశ్వరరావు సంస్మరణ సభను నిర్వహించారు. హాజరైన నారాయణ మూర్తి మాట్లాడుతూ ఉద్యమాల ఖిల్లా ఖమ్మం జిల్లాలో కానూరి తాత వీరమరణం పొందారన్నారు. ఆయన 99 సంవత్సరాల కాలంలో ప్రజా సాంస్కృతిక కేంద్రాలకు జీవితాన్ని త్యాగంచేశారని అన్నారు. సినిమా జీవితం వందేళ్లయితే 75 ఏళ్లు సాంస్కృతిక రంగానికి సేవ చేశారన్నారు. ఏఎన్ఆర్, మిక్కిలినేని లాంటి ఎంతోమంది సీనియర్ నటులతో కలిసి పనిచేశారని పేర్కొన్నారు. ఆయన తుది శ్వాస వరకు ఎర్రజెండా నీడన పనిచేశారని, ఆయన కృష్ణా జిల్లాలోని ఒక దేవాలయంలో భజన పాటలు, కీర్తనల స్ఫూర్తితో తెలంగాణ సాయుధ పోరాటంలో పాటలు పాడి ప్రజలను ఉత్తేజ పరిచారని పేర్కొన్నారు. ప్రపంచంలోనే ఇన్ని సంవత్సరాల పాటు కళారంగానికి సేవ చేసిన అరుదైన వ్యక్తి కానూరి తాత అని కొనియాడారు. అమెరికా అధ్యక్షుడు ఒబామా మన దేశానికి వస్తున్న సమయంలో కూడా ఆయన రాకకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమాల్లో కానూరి తాత పాల్గొన్నారని గుర్తుచేశారు. మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూసేకరణ చట్టాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్చేశారు. పేదలు ఎప్పుడైతే ప్రజా ప్రతినిధులు అవుతారో అప్పుడే నిజమైన ప్రజాస్వామ్యమన్నారు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని అంటున్న రాహుల్ గాంధీ వారి ప్రభుత్వం రైతుల గురించి ఎందుకు మాట్లాడలేదన్నారు. చాయ్వాలా అని చెప్పుకునే ప్రధాని మోదీ విదేశీ పెట్టుబడి దారులకు రెడ్కార్పెట్ పరుస్తున్నారని విమర్శించారు. దీంతో కులవృత్తులు నిర్వీర్యం అయ్యాయన్నారు. సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి పోటు రంగారావు, రాయల చంద్రశేఖర్, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య నాయకులు నాగన్న, కృష్ణ మాట్లాడారు. తొలుత కానూరి చిత్రపటానికి ఆర్. నారాయణమూర్తి. సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి పోటు రంగారావు, రాయల చంద్రశేఖర్, అరుణోదయ సాం స్కృతిక సమాఖ్య నాయకులు నాగన్న, రామారావు, కృష్ణ, నాయకులు సివై. పుల్లయ్య, బి. వెంకన్న పూల మాల వేసి నివాళి అర్పించారు. విప్లవోద్యమ సాంస్కృతిక నేత అని అరుణోదయ కళాకారులు పాట లు పా డారు. అనంతరం అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య ప్రచురించిన ప్రజా సాంస్కృతిక ఉద్యమకేతనం అనే పుస్తకాన్ని నారాయణ మూర్తి ఆవిష్కరించారు. -
ఈవినింగ్ విత్ షార్ట్ఫిల్మ్స్
రెండున్నర గంటల పెద్ద సినిమాలో కనిపించని ఎన్నో భావాలు పొట్టి చిత్రంలో తొంగిచూస్తున్నాయి. క్రియేటివిటీకి కేరాఫ్గా నిలుస్తున్న నేటి యువత సామాజిక స్పృహను కలిగించే చిత్రాలు తీసి శభాష్ అనిపించుకుంటోంది. అలాంటి చిత్రాలను కొన్నింటిని ఎంపిక చేసి బంజారాహిల్స్ రోడ్నంబర్ 1లోని లామకాన్లో ఈ రోజు రాత్రి 7 గంటలకు ప్రదర్శించనున్నారు. ‘ఎ షార్ట్ ఈవినింగ్ విత్ ఫిల్మ్స్-17’ పేరుతో ఆక్టోపస్ స్టూడియోస్ ఈ చిట్టి చిత్రాల ఈవెంట్ను నిర్వహిస్తోంది. ప్రవేశం ఉచితం. -
నన్ను నేను పనిలో నిమగ్నం చేసుకుంటున్నాను
అవిశ్రాంతం -అరవై తర్వాత రాళ్లపల్లి వెంకట నరసింహారావు... ఇంత పొడవు పేరు చెబితే అయోమయం కలుగుతుంది. రాళ్లపల్లి... అనగానే చక్కటి ఉచ్ఛారణ, స్పష్టమైన హావభావాల వ్యక్తీకరణతో అనేక పాత్రలు కళ్ల ముందు మెదులుతాయి. నాటకరంగ నేపథ్యమే తనను ఇంత వరకు నడిపించిందని చెప్పే రాళ్లపల్లి ‘చెడ్డసినిమా ఉంటుందేమో కానీ చెడ్డ నాటకం ఉండదంటారు. రాబోయే ఆగస్టు 15వ తేదీతో డెబ్బైలోకి అడుగు పెట్టనున్న ఆయన అరవై ఏళ్లు దాటిన తర్వాత కూడా జీవితాన్ని ‘అవిశ్రాంతం’గా మలుచుకున్న వైనం ఆయన మాటల్లోనే... ‘‘అరవై ఐదేళ్లు దాటిన తర్వాత వృత్తిలో కొంత విరామం దొరికినట్లయింది. అప్పటి వరకు ఏడాదికి 365 రోజులు పని చేసిన స్థితి నుంచి నా పని వారానికి మూడు రోజులకే పరిమితమైంది. అది నేను తెచ్చుకున్న విరామం కాదు. ఇండస్ట్రీలో కొత్త నీరు ప్రభావంతో వచ్చిన విరామం. విద్యార్థి అవతారమెత్తి ఆ ఖాళీని బిజీగా మలుచుకున్నాను. 2011లో మాస్టర్ ఆఫ్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ కోర్సులో చేరాను. డిస్టింక్షన్లో పాసయ్యాను కూడా. ఇప్పుడు ఎం.ఫిల్ చేస్తున్నాను. రిటన్ టెస్ట్ పూర్తయింది. థీసిస్ సమర్పించాల్సి ఉంది. ఆ తర్వాత పీహెచ్డి చేద్దామనుకుంటున్నాను. అరవై ఆరేళ్ల విద్యార్థి! ఇన్నేళ్లు నటించిన తర్వాత ఇంక నటన గురించి చదువుకోవడమేంటి- అని విచిత్రంగా అనిపిస్తుందేమో కానీ, విద్యార్థిదశను ఆస్వాదించాను. ఈ తరం యువతతో కలిసి చదువుకోవడం నాకూ- వారికీ పరస్పరం ఉపయుక్తంగానే సాగింది. గతంలో సాంఘిక నాటకాలు రాసిన నేపథ్యం ఉండడంతో నటన, ఉచ్చారణ, అభినయం వంటి అంశాలలో పాఠాలు చెప్పగలిగినంత పట్టు వచ్చింది. ఏదైనా అంశం మీద ఉపన్యసించగలిగిన సామర్థ్యం అలవడింది. నాటకం చూడాలి లేదా చదవాలి! నా దైనందిన జీవితం ఎప్పుడూ ఉదయం ఐదూ ఐదున్నరకే మొదలవుతుంది. పూజ, ధ్యానం తర్వాత ఉపాహారం. ఏదైనా ఓ నాటకాన్ని తీసుకుని చదవడం, మిత్రులను సంప్రదించి నాటక ప్రదర్శన, సాధన గురించి ప్రణాళికలు సిద్ధం చేసుకోవడంలో మునిగిపోతాను. భోజనం తర్వాత ఓ అరగంట సేపు టీవీ చూస్తాను. సాయంత్రమైతే రవీంద్రభారతిలోనో, తెలుగు విశ్వవిద్యాలయం థియేటర్లోనో ప్రదర్శించే నాటకాలకు ఆహ్వానాలు సిద్ధంగా ఉంటాయి. మూడు రోజుల కిందట కూడా జ్యోతిరావు ఫూలే మీద నాటకం చూశాను. 1966లో రాష్ట్రపతి భవన్లో రాష్ర్టపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి ఎదుట ‘మృచ్ఛకటికం’ నాటకాన్ని ప్రదర్శించడం... వంటి తీపి జ్ఞాపకాలను గుర్తు చేసుకోవడానికి ఈ విరామమే తగిన సమయం. నాటకానికి టికెట్టు కొనడమా! థియేటర్ ఆర్ట్స్ విద్యార్థులు ప్రదర్శించే నాటకాలకు తప్పకుండా వెళ్తుంటాను. మిత్రబృందంతో కలిసి నాటకాలు ప్రదర్శిస్తుంటాను. నేను పదిసార్లు అమెరికాకు వెళ్లాను. ప్రతిసారీ ఏదో ఒక నాటకాన్ని చూసేవాడిని. మన దగ్గర టికెట్ కొని నాటకం చూసే అలవాటే లేదు. అలాగని నాటకానికి ఆదరణ తగ్గలేదు. కళాపోషకులు ఆసక్తి కొద్దీ ప్రదర్శిస్తే చూసే వాళ్లు మాత్రం ఉన్నారు. గత ఏడాది యాంకర్ ఝాన్సీ మొదలైన వాళ్లం కన్యాశుల్కం నాటకాన్ని ప్రదర్శించినప్పుడు చాలా మంది వచ్చారు. అలాగే ఒంగోలులో నాటక ప్రదర్శనకు రాత్రి తొమ్మిదికి మొదలైనా సరే ప్రేక్షకులు ఉన్నారు. సమాజానికి సందేశాన్నిచ్చే నాటకం ప్రధానస్రవంతిలోకి రావాలని కోరుకుంటూ పని చేసుకుపోవడం మా వంతు. ఇంకా నాటకాలు వేయడం వల్ల మేము నాటకరంగానికి చేస్తున్న మేలు ఏమీ ఉండదు. ఇదంతా మమ్మల్ని మేము పనిలో నిమగ్నం చేసుకుని సంతోషంగా ఉండడానికే. కళాకారులకు ప్రోత్సాహంగా... పేదరికంలో ఉన్న రంగస్థల నటులకు సన్మానం చేసి పదివేల నుంచి పాతిక వేల వరకు నగదు బహుమతినివ్వడం అనే ఓ వ్యాపకాన్ని పెట్టుకున్నాను. మిత్రుల సహకారంతో ఎనిమిదేళ్లుగా ఆగస్టు 15వ తేదీన నా పుట్టిన రోజు నాడు ఒకరికి బహుమతి ఇస్తున్నాను. మందుల వంటి కనీస ఖర్చులకు ఇబ్బంది పడుతున్న వారికి నా శక్తి కొద్దీ నేను అందిస్తున్న చిన్న ఆసరా. నాకు చేతనైంది నటించడం... నేర్పించడం నేను మూడు వేల నాటకాలు వేశాను, ఏడు వందలకు పైగా సినిమాలు చేశాను. నాకు చేతనైంది నటించడం, ఎలా నటించాలో నేర్పించడం, చక్కటి కథను ఆసక్తికరమైన కథనంతో తీర్చిదిద్దడం వంటివే. బహుశా అవే నన్ను అవిశ్రాంతంగా ఉంచుతూ నన్నింకా బతికిస్తున్నాయేమో! (నవ్వు) - వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి ఫొటోలు:రాజేశ్ రెడ్డి ముగింపు లేని కథ, మారని సంసారం, జీవన్మృతుడు నాటకాలను రాశారు. వరవిక్రయం నాటకాన్ని సమకాలీన పరిస్థితులకు అనుగుణంగా మార్చి పాతికకు పైగా ప్రదర్శనలిచ్చారు. -
విలన్గా రాణించాలనే వచ్చా
హీరోగానూ పేరు రావడం అదృష్టం సినీనటుడు మోహన్బాబు విశాఖపట్నం: సినిమాల్లో విలన్గా రాణించాలనే కోరికతోనే తన ఊరి నుంచి హైదరాబాద్ సిటీకి వచ్చానని సినీ నటుడు, నిర్మాత ఎం.మోహన్బాబు చెప్పారు. తనది మధ్యతరహా కుటుంబమని, పుట్టుకతో తనకు ఆస్తులు లేవని చెప్పిన ఆయన భగవంతుని దయతో సినీ రంగంలో విభిన్న పాత్రలు పోషించి హీరోగా, నిర్మాతగా ఎదిగానన్నారు. టీఎస్సార్ శివరాత్రి ఉత్సవాల్లో పాల్గొనడానికి విశాఖ వచ్చిన ఆయన సోమవారం విలేకరులతో మాట్లాడుతూ... నిర్మాతగా కొన్ని సినిమాలు తీసి జీరో అయ్యానని... భగవంతుని దయతో ‘అల్లుడుగారు’ సూపర్ డూపర్ హిట్ అయి తనను హీరోగా, నిర్మాతగా నిలబెట్టిందన్నారు. కె.రాఘవేందర్రావు దర్శకత్వంలో దేవత, కొండవీటి సింహం, అల్లుడుగారులాంటి హిట్ చిత్రాలలో నటించానన్నారు. విలన్ కావాలని కోరుకున్నా హీరోగా కూడా ప్రేక్షకులు ఆదరించడం తన అదృష్టమన్నారు. హుద్హుద్ తుపాను కలచివేసింది హుద్హుద్ తుపాన్ తనను కలచి వేసిందని, విశాఖ ప్రజలను ఆదుకోవడానికి తనవంతు సాయంగా రూ.30 లక్షలు తన కుమారుడు మనోజ్కుమార్తో పంపించానని చెప్పారు. మనోజ్, అతని అభిమానులు ఆ డబ్బులతో బాధితులకు అవసరమైన సాయం అందించారని మోహన్బాబు చెప్పారు. తన విద్యాసంస్థల సిబ్బంది అందించిన ఒక నెల జీతాన్ని త్వరలో ముఖ్యమంత్రి సహాయనిధికి అందచేస్తానన్నారు. త్వరలోనే తన ఇంజనీరింగ్ సంస్థ విద్యార్థులతో విశాఖలో అవసరమైన చోట మొక్కలు నాటే కార్యక్రమం చేపడతానన్నారు. -
అందమైన సందేశం
‘వీడు మరీ వయొలెంట్గా ఉన్నాడు. పువ్వులు, అమ్మాయిలను చూపించండర్రా...’ హీరోనుద్దేశించి ఓ సినిమాలో డైలాగ్. అమ్మాయిల విషయం పక్కకు పెట్టేస్తే... పువ్వులతో ప్రశాంతత కచ్చితంగా వచ్చి తీరుతుంది. దానికి సంగీతం, నాట్యం లాంటివి తోడైతే మనసు మరింత ఆహ్లాదంగా మారుతుంది. ఈ విషయాన్ని వరల్డ్ బుద్ధిస్ట్ కల్చర్ ట్రస్ట్ చెబుతోంది. ఇటీవల బిర్లా సైన్స్ సెంటర్లో జరిగిన ‘యాన్ ఈవెనింగ్ ఆఫ్ జపనీస్ కల్చర్, ఇకెబెనా వర్క్షాప్’లతో నిత్యం బిజీగా ఉండే నగరవాసులకు ప్రశాంతతను చేకూర్చుకోవడమెలాగో చేసి చూపించింది.. ప్రతి ఒక్కరూ ప్రశాంతంగా జీవించాలనే కాన్సెప్ట్తో 1996లో వరల్డ్ బుద్ధిస్ట్ కల్చర్ ట్రస్ట్ ఏర్పాటైంది. దీని వ్యవస్థాపకుడు దుబూమ్ తుల్కూ. టిబెటన్ అయిన ఈయన హర్యానాలో ఉంటున్నారు. మొదటి నుంచి సంస్కృతి, కళలను అభిమానించే దుబూమ్... వాటిని జీవన విధానానికి జోడించి ప్రశాంతంగా బతకడమెలాగో చెబుతున్నారు. అందుకే దేశమంతటా ‘ఇకెబానా, డ్యాన్స్ థీమ్స్’తో కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ‘ఎప్పుడూ ఎవరికీ హాని కలిగించే పని చేయకూడదు’ అంటాడాయన. ప్రకృతితో మమేకం ఒక్కో పువ్వుది ఒక్కో అందం. ఒక్కో ఆకుది ఒక్కో ఆకృతి. అందమైన ఆకులను, పరిమళించే పువ్వులను ఒక్కచోట చేర్చితే... వర్ణించడానికి మాటలు చాలవు. అదే ఇకెబెనా. ప్రకృతి ప్రతిబింబించేలా అమర్చే అందమైన కళ. ఫ్లవర్వాజ్ లేదా మరేదైనా ట్రే, పాత్రలో పూలను అందంగా అలంకరించే పద్ధతి. కేవలం అలంకరణే కాదు.. దాని ద్వారా ఆనందం పొందడమెలాగో చేసి చూపించారు జపాన్ కళాకారులు. మయూమీ మెజెకీ.. ఇకెబెనా ప్టైల్ నిపుణురాలు. 18 ఏళ్ల వయసులోనే ఇకెబెనా నేర్చుకున్న ఈమె... ప్రస్తుతం జపాన్లోని ఇకెబెనా స్కూల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. యకుమోగోటో అనే సంగీత వాయిద్యాన్నీ అద్భుతంగా వాయిస్తుంటారు. ఇకెబెనా పూల అలంకరణ ద్వారా ఆనందం, అభినందనవంటి భావాలను వ్యక్తపరచొచ్చని చెప్పారామె. ‘పూల అలంకరణ అంటే మామూలే అనుకున్నాను. కానీ, ఇక్కడకు వచ్చాక తెలిసింది ఈ పని ద్వారా ఎంత ప్రశాంతత పొందవచ్చో’ అని ఇక్కడ నేర్చుకోవడానికి వచ్చిన ఆంజనేయులు చెబుతున్నాడు. - నిఖితా నెల్లుట్ల ఫొటోలు: ఎన్.రాజేష్రెడ్డి -
పీర్ పోరాటం
ప్రపంచ నాటక రచయితలలో ప్రముఖ పేరు ఇబ్సెన్. ఆయన రాసిన నాటకాల ప్రభావం భారతీయ నాటక, సినిమా రంగాలపై నేటికి కనిపిస్తుంది. మోడ్రన్ డ్రామా ఆద్యుడైన ఇబ్సెన్ నాటకం ‘పీర్గింట్’ని 5 భాషలు, 5 రీతుల్లో నగరంలో ప్రదర్శించనున్నారు. ‘ఇబ్సెన్ బిట్వీన్ ట్రెడిషన్ అండ్ కాంటెంపర్నిటీ’ పేరుతో ఈ ఫెస్టివల్ని రాయల్ నార్వేజియన్ ఎంబస్సీ, తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ, హైదరాబాద్ యూనివర్సిటీ డిపార్ట్మెంట్ ఆఫ్ థియేటర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. తెలుగు ‘పీర్’ ప్లేతో ఈ ఫెస్టివల్ గురువారం ప్రారంభమైంది. ఆధునిక నాటకాలకు ఆద్యుడు హెన్రిక్ ఇబ్సెన్. నార్వే జానపద కథను ఇబ్సెన్ ‘పీర్’ నాటకంగా మలిచారు. ఆ నాటకాన్ని క్లాసికల్, కాంటెంపరరీ, లోకల్, ఒరిజినల్... ఇలా రకరకాలుగా చూపించే ప్రయోగమే ఈ ఫెస్టివల్ థీమ్. పీర్గింట్ ప్లే ఇబ్సెన్ రాసిన ‘పీర్’కి అడాప్టేషన్. ఇబ్సెన్ రాసిన డైలాగులను అలాగే వుంచుతూ నేటి కాలమాన పరిస్థితుకు అనుగుణంగా నేటి తరానికి ఆయన నాటకాలను దగ్గర చేసేందుకు ప్రయత్నిస్తోంది టీటర్జోకర్ అనే నార్వే థియేటర్ కంపెనీ. ఈ ఒరిజినల్ నాటకాన్ని ప్రదర్శించడానికి 4 గంటలు పడుతుంది. 2012లో జరిగిన ‘ఇబ్సెన్ ఇంటర్నేషనల్ ఫెస్టివల్’లో ప్రదర్శించడానికి నాటకాన్ని ఒక గంటకు కుదించి కొత్త తరహాలో రూపొందించారు. నాటి నుంచి నేటి వరకు నార్వేలో కొన్ని వందల సార్లు ఈ నాటకాన్ని ప్రదర్శించారు. నాటకం క్లుప్తంగా... తండ్రి దురలవాట్ల వలన ఆస్తి నష్టపోయిన కొడుకు పీర్. ఎలాగైనా పూర్వవైభవం పొందాలని ప్రయత్నిస్తాడు. ఈ క్రమంలో సాగే కథ మిగతా నాటకం. ఈ కథనంలో అతని ప్రేమ వ్యవహారాలు, ప్రయాణాలు ఆసక్తికరంగా వుంటాయి. అయితే ‘నార్వే కథను, ఆ భాషను, ఇక్కడి వారు ఎలా అర్థం చేసుకోగలరు’ అంటే, ఎక్స్ప్రెషన్ని మించిన భాష లేదనేదే వారి సమాధానం. ‘కథను ఏ మాత్రం మార్చకుండా రెగ్యులర్ లైఫ్లో కనిపించే ఫోన్, ఫ్లైట్, కాసినో, కారు లాంటి అనేక మోడరన్ లైఫ్ యుటిలిటీస్ని ఇందులో జొప్పించాం. లాంగ్వేజ్ పాతదే వుంచినా, ఈ వస్తువులు చూసి ఏం జరుగుతుందో అర్థం చేసుకోవటం సులభం. విదేశాల్లో ఈ నాటకాన్ని ప్రదర్శించటం ఇదే మొదటిసారి’ అని నాటక దర్శకులలో ఒకరైన యాంగ్వే మార్కుస్సేన్ తెలిపారు. ఐదు రోజుల ఫెస్ట్... ఈ ఫెస్టివల్లో పీర్ ప్లేను 5 భాషల్లో.. ఈ నెల 12 నుంచి 16 తేదీల్లో ప్రదర్శిస్తున్నారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో 12న తెలుగులో చిందుభాగవతం, 14 మలయాళ కుడియాట్టం, 15న కన్నడ యక్షగానం, 16న తమిళంలో తెరుకుట్టు. రవీంద్రభారతిలో 13 సాయంత్రం 7 గంటలకు నార్వేయిన్ ప్లే.. ‘పీర్గింట్’. - ఓ మధు -
బాధ్యతతోనే రాజకీయాల్లోకి: పవన్ కల్యాణ్
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: తనకు రాజకీయాలంటే ఆసక్తి లేదని, బాధ్యత కారణంగానే అందులోకి వెళ్లాల్సివచ్చిందని సినీనటుడు పవన్ కల్యాణ్ అన్నారు. జీఎంఆర్ గ్రూప్ ఆధ్వర్యంలోని వరలక్ష్మి ఫౌండేషన్, నైరేడ్, ఆస్పత్రి తదితర సంస్థల పనితీరును చూసేందుకు సంస్థ అధినేత గ్రంథి మల్లికార్జునరావుతో కలిసి మంగళవారం ఆయన రాజాం వచ్చారు. ఈ సందర్భంగా జీఎంఆర్ ఐటీలో విద్యార్థులనుద్దేశించి ఆయన మాట్లాడుతూ సినిమాల్లో మాట్లాడింది వేరు, నిజ జీవితంలో జరుగుతున్నది వేరని చెప్పారు. జీవితంలో అన్నీ చూశానని, సమాజం అంటే విసుగొస్తోందని, ఓ దశలో ఈ దేశం వదిలి వెళ్లిపోవాలనుకున్నానని వెల్లడించారు. హృదయం ఒప్పుకోలేదని, మనసు మార్చుకుని, ఎన్ని కష్టాలెదురైనా పోరాడుతున్నానన్నారు. ఈ పోరాటానికి తన ఒక్కడి శక్తి సరిపోదని, పదిమంది కలిస్తే ఏదైనా సాధించవచ్చన్నారు. ప్రధాని మోదీ పిలుపునిచ్చిన స్వచ్ఛభారత్ తనకు ఎంతో నచ్చిందని చెప్పారు. ఆ నినాదం మోదీ ఇచ్చారని కాకుండా, నిత్య జీవితంలో అందరూ పాటించాల్సిందేనన్నారు. కార్యక్రమానికి పెద్దసంఖ్యలో విద్యార్థులు, ప్రజలు హాజరయ్యారు. -
మనసున్న మారాజుకు నివాళి
ప్రముఖ నిర్మాత, దర్శకుడు జగపతి ఆర్ట్స్ అధినేత వీబీ రాజేంద్రప్రసాద్ మృతితో తెలుగుచలన చిత్ర పరిశ్రమ ఒక గొప్ప మానవతా వాదిని, ఉద్దండులైన ఓ సినిమా ప్రముఖుడిని కోల్పోయి నట్లయింది. తన సొంత బ్యానర్ జగపతి ఆర్ట్స్ ద్వారా దసరా బుల్లోడు, బంగారుబుల్లోడు, ఆరాధన, అన్నపూర్ణ, అంతస్తులు, ఆత్మ బలం వంటి ఎన్నో బ్లాక్బస్టర్ చిత్రాలను అందించడమేగాక, తన వారసత్వంగా జగపతిబాబు రూపంలో ఓ ప్రతిభా సంపన్నుడైన నటున్ని తెలుగు సినిమా ప్రపంచంపై ఆవిష్కరించుకున్న ఘనత వీబీది అనడంలో ఎలాంటి సందేహంలేదు. ముఖ్యంగా సినిమా జీవి తంలో ఎన్నో ప్రసిద్ధమైన అవార్డులను సొంతం చేసుకున్నప్పటికీ రఘుపతి వెంకయ్య జీవితకాల సాఫల్య పురస్కారం ఆయనకెంతో సంతృప్తినిచ్చి ఉంటుంది. అదేవిధంగా ఫిలింనగర్లో ‘దైవసన్ని ధానం’ అనే పూజా మందిర నిర్మాణంలో కీలకపాత్ర పోషించి అదే దేవస్థానం సన్నిధిలోనే తన శేషజీవితాన్ని చాలా సుఖప్రదంగా, శాంతి సౌభాగ్యాలతో గడిపి తన జీవితానికి ఒక గొప్ప సార్థకతను సంత రింపజేసుకున్నారు. ఏది ఏమైనా తెలుగు సినిమా పరిశ్రమ ఓ పేరు మోసిన విశిష్ట వ్యక్తిని వీబీ రాజేంద్రప్రసాద్ రూపంలో కోల్పోయి నట్లయింది. తెలుగు సినిమా ప్రపంచంలో మనసున్న మారాజుగా పేరొందిన ఆయనకు కన్నీటి నివాళి. - బుగ్గన మధుసూదనరెడ్డి బేతంచెర్ల, కర్నూల్ జిల్లా -
ఈ ఏడాది వీరిది!
ఇది ఎప్పుడూ ఉండేదే అయినా, మళ్లీ మళ్లీ ఉత్సాహాన్నిచ్చేది కూడా! కొన్ని తలపోతల్ని తవ్వుకోవడం, వచ్చిన దారిని వెనుదిరిగి చూసుకోవడం! తెలుగువారి చరిత్రకు సంబంధించీ ఈ సంవత్సరం ప్రత్యేకమైన మైలురాయి. మనం రెండు రాష్ట్రాలుగా ‘కలిసిపోయాం’! ఘటనాఘటనల్ని అటుంచితే, ఈ సంవత్సరాన్ని తమదిగా చేసుకున్న వ్యక్తులు వీళ్లు. కొన్నిసార్లు ప్రగతి వ్యక్తిగతమైనదే అయినా అది నేలంతటికీ వర్తిస్తుంది. అందుకే ఈ ‘2014లో విస్మరించలేని వ్యక్తుల’ జాబితా! అయితే, కైలాశ్ సత్యార్థి లాంటివాళ్లు ఈ ఏడాది నోబెల్ శాంతిబహుమతి గెలుచుకున్నప్పటికీ ఈ జాబితాలో చేర్చలేదు. కేవలం తెలుగువాళ్లకే పరిమితమయ్యాం. అలాగే వీళ్లను ప్రజెంట్ చేయడంలో ప్రాధాన్యాల క్రమం పాటించలేదు. ఇంకో ముఖ్యవిషయం ఏమిటంటే, ఇది పరమప్రమాణం కాదు, సాధికారికం కూడా కాదు. ఈ జాబితాలోని లోటుపాట్లని మానవ పరిమితిగా పరిగణించండి. సత్య నాదెళ్ల సాఫ్ట్వేర్ దిగ్గజం అమెరికా సాఫ్ట్వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ మూడు దశాబ్దాల పైగా చరిత్రలో ముచ్చటగా మూడో సీఈవోగా పగ్గాలు చేపట్టి సంచలనం సృష్టించాడు సత్య నాదెళ్ల. అనంతపురం జిల్లా బుక్కాపురం నుంచి మొదలైన సత్యనారాయణ నాదెళ్ల ప్రస్థానం... హైదరాబాద్ పబ్లిక్ స్కూల్, మణిపాల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మీదుగా మైక్రోసాఫ్ట్ దాకా సాగింది. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ చదివిన సత్య 1992లో మైక్రోసాఫ్ట్లో చేరి, అంచెలంచెలుగా సీఈవో స్థాయికి ఎదిగాడు. ఏడాదికి రూ. 520 కోట్ల ప్యాకేజీ అందుకుంటున్న నాదెళ్ల... ప్రపంచవ్యాప్తంగా 50 మంది అత్యుత్తమ సీఈవోలతో ఫార్చూన్ మ్యాగజైన్ రూపొందించిన జాబితాలో 38వ స్థానం దక్కించుకున్నాడు. ‘క్లౌడ్’ లాంటి కొంగొత్త విభాగాల్లో మైక్రోసాఫ్ట్కి పూర్వ వైభవం తెచ్చిపెట్టే దిశగా వ్యూహాలు రచిస్తున్నాడు. సానియా మీర్జా టెన్నిస్ అంబాసిడర్ ఒకానొకదశలో టెన్నిస్కు వీడ్కోలు చెబుదామని భావించిన సానియా మీర్జా ఈ యేడు నేలకు కొట్టిన రబ్బరు బంతిలా ఎగిసింది. కెరీర్లోనే అత్యుత్తమ ఆటతీరును ప్రదర్శించింది. సీజన్ తొలి గ్రాండ్స్లామ్ టోర్నీ ఆస్ట్రేలియన్ ఓపెన్లో మిక్స్డ్ డబుల్స్లో రన్నరప్గా నిలిచిన సానియా... సీజన్లో చివరి గ్రాండ్స్లామ్ టోర్నీ యూఎస్ ఓపెన్లో బ్రూనో సోరెస్ (బ్రెజిల్)తో కలిసి మిక్స్డ్ డబుల్స్లో టైటిల్ సాధించింది. అంతేకాకుండా కారా బ్లాక్ (జింబాబ్వే)తో మూడు టైటిల్స్ నెగ్గడంతోపాటు, మరో నాలుగు టోర్నీల్లోనూ రన్నరప్గా నిలిచింది. సీజన్ ముగింపు టోర్నీ అయిన ప్రతిష్టాత్మక ‘డబ్ల్యూటీఏ ఫైనల్స్’లో విజేతగా నిలువడం ద్వారా గొప్ప విజయాన్ని నమోదు చేసుకుంది. తెలంగాణ రాష్ట్ర ‘బ్రాండ్ అంబాసిడర్’గా నియామకం తర్వాత సానియా ఆట ఉన్నత శిఖరానికి చేరుకుందంటే అతిశయోక్తి కాదు. ఆసియా క్రీడల్లో మిక్స్డ్ డబుల్స్లో స్వర్ణ పతకం సాధించడం, అంతర్జాతీయ ప్రీమియర్ టెన్నిస్ లీగ్ (ఐపీటీఎల్)లో ఇండియన్ ఏసెస్ జట్టుకు టైటిల్ దక్కడంలో కీలకపాత్ర పోషించడం, ఐక్యరాజ్యసమితి (యూఎన్) దక్షిణాసియా గుడ్విల్ అంబాసిడర్గా నియామకం... ఇలా ఈ ఏడాది సానియాకు పూర్వ వైభవాన్ని రప్పించింది. కొలకలూరి ఇనాక్ సముచిత గౌరవం ఆచార్య కొలకలూరి ఇనాక్ సాహితీ రంగానికి చేసిన సేవలకుగానూ భారతప్రభుత్వం ఈ ఏడాది ‘పద్మశ్రీ’తో సత్కరించింది. గుంటూరు జిల్లా వేజండ్లలో జన్మించిన ఇనాక్ సాహిత్యంలో, దళిత స్పృహ, స్త్రీవాద చైతన్యం, విప్లవభావాలు అన్నీ ఉంటాయి. అయినా ఆయన ఏ సంస్థలోనూ సభ్యుడు కాడు. ఆయన నేలలో వేరూనిన చెట్టు! గ్రామీణ జీవితంలోని సాంఘిక వివక్షతలను వివిధ ప్రక్రియల్లో ప్రశ్నించారు. ఇనాక్ కథలు ఇంటర్మీడియెట్ విద్యార్థులకు పాఠ్యాంశాలుగా ఉన్నాయి. ఇనాక్ కథలను అన్ని భారతీయ భాషల్లోకి అనువదించిన సాహిత్య అకాడెమీ ఆయన రచనలను ‘ఆధునిక సాహిత్యంలో క్లాసిక్స్’గా అభివర్ణించింది. ఇనాక్ తిరుపతి శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం వైస్ చాన్స్లర్గా పనిచేశారు. కె.చంద్రశేఖరరావు ‘ప్రత్యేక’ సాధకుడు తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు రాజకీయంగా కూడా సత్తా చాటారు. జూన్ 2న ఏర్పాటైన తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా ఎన్నికై రికార్డు సృష్టించారు. ప్రత్యేక తెలంగాణ లక్ష్యంతో రాజకీయ పార్టీని ఏర్పాటు చేసి, ఉద్యమానికి నేతృత్వం వహిస్తూ ఆ లక్ష్య సాధనలో విజయవంతం కావడం, తెలంగాణకు ముఖ్యమంత్రిగా ఎన్నికవ్వడం ద్వారా కేసీఆర్ డబుల్ సక్సెస్ సాధించారని చెప్పవచ్చు. తెలంగాణ ఉద్యమ నేపథ్యం, ప్రత్యేక తెలంగాణ సాధన అంశాలు ఈసారి సార్వత్రిక ఎన్నికలను ప్రభావితం చేశాయి. అయితే తెలంగాణ వచ్చింది మా వల్లనే, ప్రత్యేక తెలంగాణ మా అధినేత్రి చలువే... అంటూ ఎన్నికలకు వెళ్లిన కాంగ్రెస్కు కాలం కలిసిరాలేదు. భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీల పొత్తు కూడా తెలంగాణలో వర్కవుట్ కాలేదు. కేసీఆర్ నేతృత్వంలోని గులాబీదళమే సంపూర్ణ ఆధిక్యత సాధించింది. పీవీ రామ్ప్రసాద్ రెడ్డి ఫోర్బ్స్ ఎంట్రీ ఫార్మా దిగ్గజం, అరబిందో ఫార్మా సహ వ్యవస్థాపకుడు పీవీ రామ్ప్రసాద్ రెడ్డి దాదాపు నాలుగేళ్ల విరామం తర్వాత మరోసారి ఫోర్బ్స్ కుబేరుల జాబితాలో చోటు దక్కించుకున్నాడు. ఫోర్బ్స్ ఇండియా ఆయన సంపదను 1.8 బిలియన్ డాలర్లుగా లెక్కగట్టింది. కంపెనీ షేరు ధర ఏకంగా మూడు రెట్లు పెరగడం ఇందుకు కారణం. తయారీ ప్రక్రియల్లో లోపాల మూలంగా 2011లో విధించిన ఆంక్షలను అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ యూఎస్ఎఫ్డీఏ తాజాగా ఎత్తివేయడం ఇందుకు దోహదపడింది. అమెరికాలోనూ, యూరప్లోనూ కంపెనీ అమ్మకాలు గణనీయంగా పెరిగాయి. కె.నిత్యానంద రెడ్డితో కలిసి రామ్ప్రసాద్ 1986లో అరబిందో ఫార్మాను ప్రారంభించాడు. కంపెనీ ప్రస్తుతం హృద్రోగం, మధుమేహం, హెచ్ఐవీ మొదలైన వాటి చికిత్సలో ఉపయోగించే ఔషధాలను 125 పైగా దేశాల్లో విక్రయిస్తోంది. ఇటీవలే అమెరికాకు చెందిన న్యూట్రాస్యూటికల్ సంస్థ నాట్రోల్ను కొనుగోలు చేసింది. రామ్గోపాల్వర్మ నిరంతర వ్యాఖ్యా స్రవంతి ఫ్లోకామ్ టెక్నాలజీతో కేవలం పాతిక వేల రూపాయలతో సినిమా తీయొచ్చని ‘ఐస్క్రీమ్’తో నిరూపించాడు దర్శకుడు రామ్గోపాల్వర్మ. సినిమా నిర్మాణంలో మూస విధానాలు ఉండకూడదని నిర్మొహమాటంగా వెల్లడించాడు. వైజాగ్లో కాదు... కరీంనగర్లో సినిమా ఇండస్ట్రీని డెవలప్ చేస్తానని నిర్భయంగా ప్రకటించాడు. కేసీఆర్, పవన్కల్యాణ్పై పాజిటివ్గానూ, నెగిటివ్గానే కాదు, చివరకు దేవుళ్ల మీద కూడా తనవైన వ్యాఖ్యానాలు చేయడం ద్వారా వార్తల్లో నిలిచాడు. మహమ్మదాలీ బేగ్ థియేటర్ ఐకన్ నాటక రంగ సేవలకుగాను భారతప్రభుత్వం మహమ్మదాలీ బేగ్ను ఈ ఏడాది ‘పద్మశ్రీ’తో గౌరవించింది. ఆయన తండ్రి ఖాదర్ అలీ బేగ్ నాటకాన్ని ముంబైలో చూసిన పృథ్వీరాజ్ కపూర్ ‘నీ చేతుల్లో నాటకరంగం భవిష్యత్తు పదిలంగా ఉంటుంది’ అన్నారు. దురదృష్ట వశాత్తూ ఖాదర్ అలీ బేగ్ 46 ఏళ్ల వయసులోనే మరణించాడు. తండ్రి అందించిన నాటకరంగపు కాగడాను కుమారుడు చేబూనాడు! తండ్రి పేరు మీద ఖాదర్ అలీ బేగ్ థియేటర్ ఫౌండేషన్ స్థాపించి, ‘నాటకరంగ పునరుజ్జీవన వారసత్వాన్ని కొనసాగిస్తున్న అరుదైన నమూనా’గా ఫ్రాన్స్ దేశపు సమున్నత గౌరవం పొందాడు. నాటకరంగంలో అత్యుత్తమ సేవలు అందించిన వారికి కెనడా ప్రభుత్వం అందజేసే అవార్డునూ టొరొంటోలో అందుకున్నాడు. ఈ సందర్భంగా స్వీయ దర్శకత్వంలో జీవితభాగస్వామి నూర్బేగ్తో కలసి నటించిన ‘కులీదిలోంకీ షాహ్జాదా’ను ప్రదర్శించాడు. నారా చంద్రబాబు నాయుడు మళ్లీ ముఖ్యమంత్రి ‘విభజనానంతర’ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికల్లో అనూహ్య ఫలితాలు వచ్చాయి. పదేళ్లుగా ప్రతిపక్షంలో ఉండిన తెలుగుదేశం పార్టీ అధికారాన్ని చేజిక్కించుకొంది. ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు విభజన తర్వాత నూతన రూపు రేఖలతో ఏర్పడిన ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రి అయ్యారు. వ్యూహాత్మకంగా ఎన్నికల ముందు భారతీయ జనతా పార్టీతో జతకట్టడం, పవన్ కల్యాణ్ కలిసి రావడం తెలుగుదేశం పార్టీకి అనుకూలాంశాలుగా నిలిచాయి. రైతుల రుణమాఫీ హామీ కూడా చంద్రబాబు సారథ్యంలోని టీడీపీని గద్దెనెక్కించడంలో కీలకపాత్ర పోషించింది. 175 సీట్లలో 102 సీట్లు ఆ పార్టీ గెలుచుకోగలిగింది. అయితే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కన్నా తెలుగుదేశం పార్టీకి అదనంగా లభించింది ఐదు లక్షల పైచిలుకు ఓట్లు మాత్రమే అయినప్పటికీ దశాబ్దంగా అధికారంలో లేని పార్టీని విజయపుగట్టుకు చేర్చడంలో చంద్రబాబు కృతకృత్యులయ్యారు. డాక్టర్ కె.శ్రీనాథ్ రెడ్డి ప్రజారోగ్యం... ఆయనకు భాగ్యం! దేశంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన వైద్య సంస్థ ‘ఎయిమ్స్’లో కార్డియాలజీ విభాగపు అధిపతి లాంటి అసామాన్యమైన హోదాను కూడా వదులుకున్నారు శ్రీనాథ్రెడ్డి. ప్రజలకు అవసరమైన ప్రాథమిక ఆరోగ్య వసతులూ అందని అసౌకర్యాలను గుర్తించి, ‘పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా’ పేరిట స్వచ్ఛంద సంస్థను ప్రారంభించారు. ప్రజారోగ్యం కోసం అవసరమైన నిపుణుల తయారీ, వాళ్లకు అవసరమైన శిక్షణ, అందుకోసం కావాల్సిన 80 సంస్థలను నెలకొల్పడం వంటి బృహత్తర కార్యక్రమాలను చేపట్టారు. వాటికిగానూ భారత ప్రభుత్వం నుంచి ‘పద్మభూషణ్’ గౌరవం పొందిన ఈ వైద్యమణిని బ్రిటన్ రాణి రెండో ఎలిజబెత్ ‘రాయల్ ఆనర్’తో సత్కరించారు. హైదరాబాద్లో బాల్యాన్ని గడిపిన శ్రీనాథ్రెడ్డికి తండ్రి బోధించిన స్వామి వివేకానంద సూక్తులే స్ఫూర్తి! నాగార్జున ‘మా’లో ఎవరు కోటీశ్వరుడు? అమితాబ్ బచ్చన్కి చెల్లుబాటయినట్టుగా అందరికీ కాదు. వెండితెరపై సూపర్స్టార్గా రాణిస్తూ, బుల్లితెర మీదికి జంప్ చేయడమంటే ఓ మెట్టు దిగినట్టే! అమితాబ్ మాత్రం ‘కౌన్ బనేగా కరోడ్పతి’తో పదిమెట్లు పైకి ఎక్కి చూపించాడు. నాగార్జున కూడా సేమ్ టూ సేమ్. మరికొన్ని సినిమాలు చేస్తే, వంద సినిమాలు పూర్తి చేసుకొనే దశలో ఉన్న నాగ్ ‘మా’ టీవీ కోసం ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ షో చేయడమంటే ఒక రకంగా రిస్కే. కానీ 2014లో నాగ్ అవలీలగా బుల్లితెరను ఆక్రమించాడు. ఇన్నేళ్లూ వెండితెరపై మన్మథుడిలా ప్రకాశించిన నాగ్, బుల్లితెరపై కొత్త గెటప్తో సరికొత్త ఇమేజ్ తెచ్చుకున్నాడు. సాకేత్ మైనేని భవిష్యత్కు భరోసా వైజాగ్కు చెందిన 27 ఏళ్ల సాకేత్కు ఈ ఏడాది ఎన్నో తీపి జ్ఞాపకాలను మిగిల్చింది. భారత డేవిస్ కప్ జట్టులో స్థానం, ఏటీపీ చాలెంజర్ టోర్నీలో మూడు డబుల్స్ టైటిల్స్, రెండు ఐటీఎఫ్ సింగిల్స్ టైటిల్స్, ఆరు ఐటీఎఫ్ డబుల్స్ టైటిల్స్, ఆసియా క్రీడల్లో మిక్స్డ్ డబుల్స్లో సానియా మీర్జాతో కలిసి స్వర్ణ పతకం, సనమ్ సింగ్తో కలిసి పురుషుల డబుల్స్లో రజతం, చాంపియన్స్ టెన్నిస్ లీగ్ (సీటీఎల్)లో పుణే మరాఠాస్ జట్టు టైటిల్ సాధించడంలో కీలకపాత్ర... ఇలా సాకేత్ భారత టెన్నిస్ భవిష్యత్కు భరోసా కల్పించాడు. 6 అడుగుల 4 అంగుళాల ఎత్తు, 90 కేజీల బరువున్న ఈ ఆజానుబాహుడు పదునైన సర్వీస్లకు పెట్టింది పేరు. ఆటలోనే కాదు చదువులోనూ సాకేత్ మేటి. ఇంటర్మీడియెట్ పూర్తయ్యాక అమెరికాలోని అలబామా యూనివర్సిటీ నుంచి స్పోర్ట్స్ స్కాలర్షిప్ రావడంతో అక్కడకు వెళ్లాడు. చదువు పూర్తయ్యాక 2011లో భారత్కు తిరిగి వచ్చిన వెంటనే ఇండియన్ ఫ్యూచర్స్ టోర్నీలో సింగిల్స్తోపాటు డబుల్స్ విభాగంలోనూ విజేతగా నిలిచి వెలుగులోకి వచ్చాడు. నలిమెల భాస్కర్ బహుభాషా అనువాదకుడు కరీంనగర్ వాసి నలిమెల భాస్కర్ ఈ సంవత్సరం కేంద్ర సాహిత్య అవార్డు పొందారు. ప్రముఖ మలయాళ రచయిత పునతిల్ కున్అబ్దుల్లా నవల ‘స్మారక శిలగళ్’ను నలిమెల తెలుగులోకి ‘స్మారక శిలలు’గా అనువదించారు. ఈ పుస్తకమే అవార్డుకు ఎంపికైంది. గ్రంథాలయాలే తరగతి గదులుగా భాస్కర్ భారతీయ భాషల్లో పట్టు సంపాదించారు. తాను తెలుగులో స్వయంగా ‘మంద’ కథను రాసి మరో 13 భారతీయ భాషా కథలను మూలభాష నుంచి అనువాదం చేసి భారతీయ కథలుగా పాఠకులకు అందించారు. దాదాపు మూడు దశాబ్దాలపాటు బోధనా వృత్తిలో ఉండి స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు. తెలంగాణ మాండలీకంపై ఇతోధిక కృషి చేస్తున్న నలిమెల భాస్కర్ నేషనల్ బుక్ట్రస్ట్ సలహామండలి సభ్యుడు. మత్స సంతోషి పేదరికాన్ని లిఫ్ట్ చేసింది నేపథ్యం ఎలాంటిదైనా పట్టుదలతో కృషి చేస్తే విజయం వరిస్తుందని విజయనగరం జిల్లాలోని నెల్లిమర్ల మండలం కొండవెలగడ గ్రామానికి చెందిన 20 ఏళ్ల మహిళా వెయిట్లిఫ్టర్ మత్స సంతోషి నిరూపించింది. అరకొర సౌకర్యాల నడుమ సాధన చేసిన సంతోషి ఈ ఏడాది స్కాట్లాండ్లోని గ్లాస్గో నగరంలో జరిగిన కామన్వెల్త్ గేమ్స్లో 53 కేజీల విభాగంలో రజత పతకం సాధించింది. ఆమెకు కోచ్ చల్లా రాము మార్గదర్శకుడిగా నిలిచాడు. ఆమె గెలిచింది పేదరికాన్ని కూడా. ఎందుకంటే జూట్ మిల్లులో కార్మికుడైన సంతోషి తండ్రి తన సంపాదనలో ఎక్కువ భాగం తన కూతురు సాధనకే వినియోగించాడు. భారత్ తరఫున పలుమార్లు జూనియర్, యూత్ విభాగాల్లో ఆసియా, కామన్వెల్త్ పోటీల్లో పాల్గొన్న సంతోషి పలు పతకాలు సాధించింది. అందరి అంచనాలను నిజం చేస్తూ కామన్వెల్త్ గేమ్స్లో రజత పతకం నెగ్గి భవిష్యత్పై మరిన్ని ఆశలు పెంచింది. శ్రీధర్ కోట ఎగరడానికి కొత్త రెక్కలు రైట్ బ్రదర్స్ విమానాన్ని ఆవిష్కరించి వందేళ్లు గడచిపోతున్నా, దాని మౌలిక డిజైన్లో వచ్చిన మార్పులు దాదాపు శూన్యం. అదే ఆకారం, అవే పొడవైన రెక్కలు! అవసరాన్నిబట్టి ఆకారాన్ని మార్చుకునే రెక్కల ఫ్లాప్స్ (రెక్కల వెనుక భాగంలో పైకి, కిందకూ కదులుతూ ఉండే నిర్మాణాలు) రూపొందించారు శ్రీధర్ కోట! వీటిని అమర్చుకుంటే, ఇంధన ఖర్చు 12 శాతం వరకూ, టేకాఫ్, ల్యాండింగ్ల సమయాల్లోని శబ్దం 40 శాతం వరకూ తగ్గుతాయి. ‘అడాప్టివ్ కంప్లయింట్ ట్రెయిలింగ్ ఎడ్జ్’ పేరుతో శ్రీధర్ అభివృద్ధి చేసిన టెక్నాలజీని అమెరికా వాయుసేన ఇటీవలే విజయవంతంగా పరీక్షించింది. మన బేగంపేట విమానాశ్రయం నుంచి పైకి ఎగిరే విమానాల్ని చూస్తూ... 1980లో ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి మెకానికల్ ఇంజినీరింగ్ పూర్తి చేసిన శ్రీధర్ ఆ తరువాత అమెరికాలో స్థిరపడ్డారు. అందె శ్రీ ‘రాష్ట్ర’ గీత రచయిత తెలంగాణ రాష్ట్ర సాధన కోసం వివిధ సంస్థలు, రాజకీయ పక్షాలు ఉద్యమించిన సందర్భంలో అంద్శై గీతం ‘జయజయహే తెలంగాణ’ సంకల్పశక్తిని ఇనుమడింపజేసింది. రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత ఈ గీతం రాష్ట్రగీతంగా అధికార హోదా పొందింది. గీత కర్త అంద్శైవరంగల్ జిల్లా రేబర్తిలో జన్మించారు. ‘గడ్డిపూల బొడ్డుతాడు తెంపుకుని నేలపై పడ్డాన’ంటారు. సుమతీ శతకం, వేమన శతకాల్లా తెలంగాణ ప్రజలు పాడుకునే ‘వరకవుల’ పద్యాలు ఆయనను ప్రకృతి కవిని చేశాయి. అందె ఎల్లయ్య అనే పూర్వనామాన్ని శృంగేరీ పీఠానికి చెందిన శంకర్ మహరాజ్ అంద్శై మార్చారు. ఆలమందలు కాస్తూ అపురూప వాక్కులమ్మను ఉపాసించిన అంద్శై జక్కిరెడ్డి మల్లారెడ్డి, మహ్మద్ మునీర్ సేట్ వంటి సహృదయులు ఆదరించారు. తెలంగాణ రాష్ట్రగీతం గురించి చెబుతూ- మొలకెత్తగానే విత్తనం చనిపోతుంది, కొన్నేళ్లుగా ప్రజల నాల్కలపై నునుపు తేలిన ఆ పాట నాది కాదు వారిదే అంటారు. తనను కొడుకుగా పెంచి పెద్దచేసిన బిరుదురాజు రామకృష్ణ ‘ఇది తెలంగాణకు మాత్రమే కాదు, తెలుగు నేలకు జాతీయ గీతం’ అని అభినందించారు. అలేఖ్య పుంజల కూచిపూడి గౌరవం పేరుకు తగ్గ శాస్త్రీయ నృత్యకారిణి పద్మశ్రీ అలేఖ్యా పుంజల. ఈ సంవత్సరం కోణార్క్ ఉత్సవంలో కూచిపూడి నృత్యాన్ని ప్రదర్శించే అపూర్వ గౌరవాన్ని పొందారు. (గురు గంగాధర్ ప్రధాన్ 1986లో కోణార్క్ డ్యాన్స్ అండ్ మ్యూజిక్ ఫెస్టివల్ను ప్రారంభించారు. ప్రపంచశ్రేణి నృత్యకారులు, గాత్ర-వాద్య సంగీతకారులు ఒరిస్సాలోని కోణార్క నాట్యమండపంలో పాల్గొనడం జీవన సాఫల్యంగా భావిస్తారు.) భరతనాట్యం-కూచిపూడి రెండు శాస్త్రీయ నృత్యాల్లోనూ నిపుణురాలైన అలేఖ్య తాను కూచిపూడి పక్షపాతిని అంటారు. అభినయానికి, భావవ్యక్తీకరణకు కూచిపూడిలో అదనపు ఆస్కారం ఉంటుందంటారు. పురావస్తుశాస్త్రం ఆధారంగా శిల్పాలలో నృత్యకళ అంశంపై పరిశోధన చేసిన అలేఖ్య తెలుగు విశ్వవిద్యాలయంలో సీనియర్ అధ్యాపకురాలు, నాట్యవిభాగం అధిపతి. సంగీత-నాటక అకాడెమీ పురస్కార గ్రహీత. కాంటెపరరీ జర్మన్ డ్యాన్సర్- ఇండియన్ క్లాసికల్ డ్యాన్సర్’ల అభినయపూర్వక ప్రదర్శన ‘యు అండ్ మి’ని హైద్రాబాద్, జర్మనీలలో ప్రదర్శించారు. వినోద్ చౌదరి రాపర్ల ఇన్స్టలేషన్ ఆర్ట్ పరిచయ కర్త ఒక అపురూపమైన చిత్రకళా ప్రదర్శనను చూడబోతున్నాం అనుకున్న కళాభిమానులు ఆ గదిలోకి వెళ్లి బిక్కమొగం వేశారు. కళ ఏమీ కనపడదే! కాని, ఆ గది వింతగా ఉంది. చిందరవందరగా ఉంది. గోనె సంచులు. దుమ్మెత్తి పోసుకునే దినపత్రికల క్లిప్పింగులు. ప్లాస్టిక్ కుర్చీలు. ఒక పాతకాలపు కుర్చీ. పైన నెమలి ఈకలు. సిల్క్ వస్త్రం. ఏమిటది? ‘ద గోల్డెన్ చైర్’ పేరుతో గుంటూరుకు చెందిన వినోద్ చౌదరి ఏర్పాటు చేసిన ఇన్స్టలేషన్ ఆర్ట్! ఒకానొక అంశాన్ని బలంగా చెప్పేందుకు త్రీడైమన్షన్స్ స్థలంలో అనేక వస్తువుల అమరికతో ఏర్పాటు చేసే వస్తు సముదాయమే ఈ కళ! మహాభారతం చరిత్ర కాదనీ, వర్తమానం కూడాననీ, భవిష్యత్తు బాగుండాలంటే కుర్చీపై కూర్చునేవారిని ఎంపిక చేసుకోవడంలో జాగరూకత పాటించాలనీ గోల్డెన్ చైర్ చెబుతుంది. తన లైఫ్ క్యాన్వాస్లో పెళ్లికి చోటులేదనీ, కళతోనే సహజీవనమనీ అంటాడు. చైన్నైలో సినిమాలకు ఆర్ట్ వర్క్ చేశాడు. ఇటీవలే తన చిత్రాలను ప్రదర్శిస్తోన్న అమెరికాలోని న్యూజెర్సీ మ్యూజియంను సంద ర్శించి వచ్చాడు. సంపూర్ణేశ్బాబు ఆల్మోస్ట్ స్టార్ ఫేస్బుక్, ట్విట్టర్ తదితర సామాజిక మాధ్యమాల ప్రచారంతో వెండితెరపై ఉవ్వెత్తున ఎగిసిన కెరటం సంపూర్ణేశ్బాబు. తెలుగు చిత్ర సీమలో పేరుకు పోయిన పలు విధానాలను, రొడ్డకొట్టుడు కథాంశాలను, మూస పాత్రలను పరిహసిస్తున్న రీతిలో దర్శకుడు స్టీవెన్ శంకర్ చేసిన ‘హృదయ కాలేయం’ సినిమాతో సంపూర్ణేశ్బాబు రాత్రికి రాత్రి దాదాపు ‘స్టార్’గా అవతరించాడు. చిత్రమైన మాటతీరు, నిర్లక్ష్యపు శారీరక భాషతో సంపూర్ణేశ్ బాక్సాఫీస్కి పనికొచ్చే మూలకంగా మారాడు. సంపూర్ణేశ్తో నటుడు మంచు విష్ణు ‘పోకిరి రిటర్న్స్’ నిర్మిస్తుండడం విశేషంగా చెప్పుకోవాలి. మంజులతా కళానిధి అన్నదాత సుఖీభవ! ఛారిటీ బిగిన్స్ ఎట్ హోమ్, అంటారు. అలా ఇంటిదగ్గర మొదలయ్యే దాతృత్వానికి కాస్తంత సోషల్ మీడియా గాలి కూడా తగిలిందంటే ఎనలేని గుర్తింపు వస్తుంది. ఫేస్బుక్, యూట్యూబ్ వంటి సైట్ల ద్వారా సెలబ్రిటీల మధ్య ‘ఐస్ బకెట్’ ఛాలెంజ్ విజయవంతమైన విరాళ కార్యక్రమంగా నిలిస్తే, దాని స్ఫూర్తితో ‘రైస్ బకెట్ ఛాలెంజ్’ ప్రారంభించారు హైదరాబాద్కు చెందిన మంజులతా కళానిధి. ఒక బకెట్ పరిమాణంలోని బియ్యాన్ని అన్నార్థులకు అందజేస్తున్న ఫొటోను తన ఫేస్బుక్ పేజ్లో పోస్ట్ చేసి, అందరూ అలాంటి దాన కార్యక్రమాన్ని చేపట్టాలని సవాలు విసిరారు ఆమె. వేల మంది మంజులత ఐడియాను అభినందిస్తూ లైక్ కొట్టగా, అనేక మంది బకెట్టుడు బియ్యాన్ని ఇవ్వడమో, ఆ పరిమాణపు బియ్యాన్ని వండివడ్డించడమో చేశారు. ఎంవైఎస్ ప్రసాద్ మన శాస్త్రవేత్త చంద్రయాన్, మామ్, తాజాగా జీఎస్ఎల్వీ మార్క్-3... భారత అంతరిక్ష ప్రయోగాల వరుస విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు ఎంవైఎస్ ప్రసాద్! భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో)లో దాదాపు 37 ఏళ్ల అనుభవాన్ని గడించిన ప్రసాద్ ఎలక్ట్రానిక్స్ రంగంలో కాకినాడ ఇంజినీరింగ్ కాలేజీ నుంచి ఇంజినీరింగ్ పట్టా (1974) అందుకున్నారు. ఆ తరువాత బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్లో శాటిలైట్ కమ్యూనికేషన్స్ అంశంపై స్నాతకోత్తర విద్యనభ్యసించారు. భారత దేశం తొలిసారి విజయవంతంగా ప్రయోగించిన లాంచ్ వెహికల్ ఎస్ఎల్వీ 3 అభివృద్ధిలోనూ ప్రసాద్ పాలుపంచుకున్నారు. 2013 నుంచి శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ అంతరిక్ష కేంద్రం డెరైక్టర్గా పదవీబాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఎస్ ఎస్ రాజమౌళి త్వరలో విడుదల వరుస విజయాల పరుసవేది అనిపించుకున్న రాజమౌళి ‘ఈగ’ సినిమా 2012 జూలై 6న విడుదలైంది. అప్పటి నుంచీ ఆయన ‘బాహుబలి’ అనే అతి పెద్ద కలను నెరవేర్చుకునే ప్రయత్నంలోనే ఉన్నాడు. ప్రచారార్భాటాలకు దూరంగా నిర్మాణం జరుగుతున్నా కూడా, ఈ సినిమాకు సంబంధించిన రకరకాల గాసిప్లతో ఈ దర్శకుడు ఏడాదంతా మీడియాలో మార్మోగుతూనే ఉన్నాడు. బడ్జెట్, గెటప్స్, కాస్టింగ్, గ్రాఫిక్స్... ఇలా 24 శాఖల పరంగానూ ‘బాహుబలి’ వార్తల్లో నిలవడానికి ఆయన ఇమేజే కారణం! రాచపాలెం చంద్రశేఖర్ రెడ్డి సాహిత్యానికి రాచమర్యాద తెలుగు సాహిత్య లోకంలో నిబద్ధతగల విమర్శకుడిగా గుర్తింపు ఉన్న ప్రముఖ రచయిత ఆచార్య రాచపాలెం చంద్రశేఖర్ రెడ్డికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. ‘మన నవలలు-మనకథానికలు’ పేరుతో చంద్రశేఖర్ రెడ్డి రచించిన విమర్శనా గ్రంథానికి అవార్డు దక్కింది. దేశవ్యాప్తంగా సాహిత్యానికి విశేష సేవలు అందించిన 24 మంది ప్రముఖులకు ప్రతియేటా సాహిత్య అకాడమీ అవార్డులను ఇస్తుంది. చిత్తూరు జిల్లా తిరుపతి మండలం కుంట్రపాకం గ్రామానికి చెందిన రాచపాలెం శ్రీ కృష్ణదేవరాయ, శ్రీ వెంకటేశ్వర, యోగి వేమన విశ్వవిద్యాలయాల్లోని తెలుగు శాఖల్లో వివిధ హోదాల్లో పనిచేసి పదవీవిరమణ పొందారు. ప్రస్తుతం ఆయన సీపీ బ్రౌన్ భాషాపరిశోధన కేంద్రానికి ప్రధాన బాధ్యతల్లో ఉన్నారు. మాలావత్ పూర్ణ సద్దనపల్లి ఆనంద్కుమార్ శిఖరమంత విజయం! ఎవరెస్ట్ ప్రపంచంలోనే అతి ఎత్తై శిఖరం. మరి దాన్ని అధిరోహిస్తే ఆ శిఖరమంతటి పేరు ప్రఖ్యాతులు సొంతమవుతాయి. అలాంటి ఖ్యాతిని అతి చిన్న వయసులోనే సంపాదించుకొన్నారు మాలావత్ పూర్ణ (13), సద్దనపల్లి ఆనంద్కుమార్(18). పూర్ణ అయితే ఎవరెస్ట్ను అధిరోహించిన అత్యంత పిన్నవయస్కురాలిగా కూడా రికార్డు సృష్టించింది. సాంఘిక సంక్షేమ విద్యాలయాల్లో అభ్యసిస్తున్న ఈ సాహస వీరులకు తెలుగుజాతి నీరాజనాలు పట్టింది. 29,035 అడుగుల ఎత్తున జాతీయ పతాకాన్ని ప్రతిష్టించిన వీళ్లను చూసి భారతజాతి మొత్తం గర్వించింది. నిజామాబాద్ జిల్లాకు చెందిన పూర్ణ, ఖమ్మం జిల్లాకు చెందిన ఆనంద్... ట్రైనర్ శేఖర్ మార్గదర్శకత్వంలో ఈ అరుదైన ఘనత సాధించారు. క్రమశిక్షణ, నిబద్ధత, ఆత్మవిశ్వాసం లాంటి పదాలు మాత్రమే పూర్ణ, ఆనంద్ల సాహసాన్ని అర్థంచేసుకోవడానికి సరిపోవేమో! కిడాంబి శ్రీకాంత్ చైనా గడ్డపై తెలుగు బిడ్డ గర్జన మెదడువాపు జ్వరంతో ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడి... నెమ్మదిగా కోలుకొని... నమ్మశక్యంకాని విజయంతో ‘తెలుగు రాకెట్’ పదునెంతో చూపించాడు కిడాంబి శ్రీకాంత్. 21 ఏళ్ల ఈ యువతార ఏమాత్రం అంచనాలు లేకుండా చైనా గడ్డపై చమక్కుమనిపించాడు. ‘బ్యాడ్మింటన్ సచిన్’లా పేరొందిన చైనా సూపర్స్టార్ లిన్ డాన్ను అతని సొంతగడ్డపైనే ఓడించి, బ్యాడ్మింటన్ ప్రపంచాన్నే నివ్వెరపరిచాడు. 2007లో మొదలైన చైనా ఓపెన్ ప్రీమియర్ సూపర్ సిరీస్ టైటిల్ నెగ్గడం ద్వారా ఈ హైదరాబాద్ యువకుడు దాన్ని నెగ్గిన తొలి భారతీయ క్రీడాకారుడిగా గుర్తింపు పొందాడు. (సాక్షి స్పోర్ట్స్, బిజినెస్, ఎడ్యుకేషన్, సైన్స్, సినిమా, పొలిటికల్, హెల్త్, కల్చరల్ డెస్కుల సహకారంతో)