Flex Banner
-
పవన్కు కొత్త ట్విస్ట్.. అన్నా ఎన్నాళ్లీ అవమానాలు!
అన్నయ్యా.. మేము మొదటి నుంచీ చెబుతూనే ఉన్నాం కానీ నువ్వు విన్నావు కాదు.. మనం లేకుంటే వాళ్లకు కుర్చీ ఎక్కే ఛాన్స్ దక్కేనా?. అలాంటప్పుడు మనం గౌరవప్రదమైన సీట్లు తీసుకుని పోటీ చేద్దాం అంటే నువ్వు ఒప్పుకోలేదు.. జస్ట్ గుప్పెడు సీట్లు తీసుకుని వాటితో మనం చేసేదేం లేదు.మనం గేమ్లో అరటిపండులం అయిపోతాం తప్ప గేమ్ చేంజర్స్ కాలేం. వాళ్ళు ఆట ఆడుతుంటే మనం చూస్తూ ఊరుకోవాలి. ఈ ఖర్మ మనకు ఎందుకు అన్నయ్యా.. కలలు కనండి.. అవి నిజం చేసుకోవడానికి కృషి చేయండి అని అబ్దుల్ కలాం చెప్పారు కానీ ఆయన మన సొంత కలలు నెరవేర్చుకోవడానికి కష్టపడాలని చెప్పారు తప్ప వేరే వారి కలలు నిజం చేసేందుకు మనం శ్రమించాలని చెప్పలేదు.వాళ్ళు రాష్ట్రాన్ని భ్రష్టుపట్టిస్తారు.. పాలనను అస్తవ్యస్తం చేస్తారు .. ఆ ఫెయిల్యూర్స్ను నీ మీద నెట్టేస్తారు చూస్తూండండి.. ఏదైనా మంచి జరిగితే వాళ్ళ ఖాతాలో వేసుకుని.. తప్పులన్నిటికీ మనను నిందిస్తారు.. ఎందుకొచ్చిన దరిద్రం మనకు.. బయటకు వెళ్ళిపోదాం.. ప్రతిపక్షంలో ఉందాం ప్రభుత్వాన్ని ప్రశ్నిద్దాం.. మనకు ఈ అధికారం అనే లంపటం వద్దు.. అంటూ ఆవేదనతో జనసైనికులు కడపజిల్లాలో ఫ్లెక్సీలు కట్టారు.వాస్తవానికి పవన్ సపోర్ట్తోనే చంద్రబాబు మొన్నటి ఎన్నికల్లో గెలిచారని.. ఇంకా చెప్పాలంటే చంద్రబాబును ఏపీ ప్రజలు నమ్మడం లేదని.. ఆయన ఏనాడో విశ్వసనీయతను కోల్పోయారని.. కానీ కేవలం పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి వెనకుండి.. బాబు ఇచ్చిన హామీలకు తానూ బాధ్యుడిగా ఉంటూ వాటిని నెరవేర్చే బాధ్యతను నెత్తిన పెట్టుకుంటానని చెప్పడంతోనే ప్రజలు విశ్వసించి ఈ కూటమికి ఇంత భారీ మెజార్టీ ఇచ్చారని కేడర్ భావిస్తోంది. అయితే ఎన్నికల సమయంలో కనీసం యాభై సీట్లయినా తీసుకోకుండా కేవలం 21 సీట్లలో పోటీ చేయడం ద్వారా ప్రభుత్వంలో క్రియాశీలకంగా.. కీలకంగా ఉండలేని పరిస్థితి వస్తోందని కేడర్ లోలోన బాధ పడుతోంది.పైగా చంద్రబాబు.. పవన్ కళ్యాణ్ను సైతం అడుగడుగునా అవమానిస్తున్నారని.. మొన్నటి దావోస్ సభలకు సైతం డిప్యూటీ సీంఎను తీసుకుని వెళ్లలేదని.. కేవలం చంద్రబాబు.. లోకేష్ వెళ్లి ఆయనను పక్కనబెట్టేశారని.. తీరా అట్నుంచి ఇద్దరూ ఒట్టి చేతులతో వచ్చారని ఆ ఫ్లెక్సీల్లో స్పష్టంగా పేర్కొన్నారు. వారిమీద నమ్మకం లేకనే పెట్టుబడులు రాలేదని.. అదే పవన్ వెళ్లి ఉంటే పరిస్థితి ఇంకోలా ఉండేదని.. పవన్ను చూసి అయినా కనీసం నాలుగైదు కంపెనీలు వచ్చేవని అందులో ప్రత్యేకంగా పేర్కొన్నారు. అయినా అట్నుంచి వచ్చాక బాబును ఎలివేట్ చేస్తూ టీవీలు.. ఛానెళ్లలో ప్రోగ్రామ్లు నడుపుతున్నారని. కేడర్ ఆవేదన చెందుతోంది.తప్పులు చేసేది వాళ్ళు.. ఒప్పుకునేది మీరుతిరుమలలో తొక్కిసలాట వంటి ఘోరాలు జరిగినపుడు వారెవరూ తమకు సంబంధం లేనట్లు ఉంటారు.. మీరు మాత్రం నిజాయితీగా జనంలోకి వెళ్లి తప్పు ఒప్పుకుని క్షమాపణ చెబుతున్నారు. కానీ, ఆ ఘోరానికి కారణమైన చంద్రబాబు తాలూకా మనుషులు మాత్రం కనీసం చీమ కుట్టినట్టు అయినా భావించడం లేదు. మనం ప్రతిపక్షంలో ఉండి .. ప్రభుత్వాన్ని నిలదీస్తే బాగుండు.. అధికారంలో భాగమై ఎందుకూ విలువలేకుండా పోతున్నాం.. అంటూ ఏర్పాటైన ఫ్లెక్సీ ఇప్పుడు చర్చనీయాంశం అయింది.సగటు జనసైనికుడి ఆవేదన.. అంతర్మథనాన్ని ఆ ఫ్లెక్సీలో పాయింట్లుగా రాసి అందర్నీ ఆలోచింపజేస్తున్నారని అంటున్నారు. ఈ ఫ్లెక్సీ ఇప్పుడు జనసేన కేడర్ ఫోన్లలో సర్క్యులేట్ అవుతూ వారిని ఆలోచనలో పడేసింది. -సిమ్మాదిరప్పన్న. -
మహా బ్రాండ్ మేళా!
ప్రపంచంలోనే అతి పెద్ద ఆధ్యాత్మిక వేడుక మహా కుంభమేళా ఘనంగా ప్రారంభమైంది. 12 ఏళ్లకోసారి వచ్చే ఈ సంరంభానికి భక్తులు పోటెత్తనున్నారు. దీంతో ఈ భారీ కార్యక్రమంలో వ్యాపార అవకాశాలను వెతుక్కుంటున్నాయి కంపెనీలు. ఒకవైపు తమ ఉత్పత్తుల విక్రయాలపై దృష్టి పెడుతూనే మరోవైపు బ్రాండ్ని మరింతగా జనాల్లోకి తీసుకెళ్లేందుకు భారీగా కూడా ఖర్చు పెడుతున్నాయి. ఉత్తర్ ప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో 45 రోజుల పాటు సాగే మహా కుంభమేళాకు దాదాపు 40 కోట్ల మంది దీనికి హాజరవుతారని అంచనా. ఇందులో రూ. 2 లక్షల కోట్ల పైగా వ్యాపార అవకాశాలు ఉంటాయని స్వయంగా ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చెప్పారు. దీనితో ఆ అవకాశాలను అందిపుచ్చుకునేందుకు బడా బ్రాండ్లు మహా కుంభ మేళాకు క్యూ కట్టాయి. కోట్ల సంఖ్యలో మేళాకి వచ్చే భక్తుల దృష్టిని ఆకర్షించేందుకు పోటీపడుతున్నాయి. ఇందులో భాగంగా డాబర్ ఆమ్లా, వాటికా బ్రాండ్లు మహిళల కోసం చేంజింగ్ రూమ్లు ఏర్పాటు చేస్తున్నాయి. పిల్లల సంరక్షణ కోసం డాబర్ లాల్ తేల్ స్పెషల్ బేబీ కేర్ రూమ్లను ఏర్పాటు చేస్తున్నాయి. అటు ఆడియో కథల ప్లాట్ఫాంకు ఎఫ్ఎం ఈ కార్యక్రమం సందర్భంగా తమ ఓటీటీ యాప్ ‘భక్తి’ని ఆవిష్కరిస్తోంది. ఇందుకోసం టెంట్లు, కియోస్క్ లతో బ్రాండ్కి ప్రచారం చేస్తోంది. ఐటీసీ బ్రాండ్ బింగో! .. స్థానిక పాటలపై రీల్స్ చేస్తోంది. మదర్ డెయిరీ సంస్థ పాలు, పాల ఉత్పత్తుల విక్రయానికి 45 కియోస్క్ లు ఏర్పాటు చేస్తోంది. ఇక ఆతిథ్య రంగ సంస్థలు సైతం ఈ అవకాశాన్ని అందిపుచ్చుకునే పనిలో ఉన్నాయి. ఒనొరా హాస్పిటాలిటీ సంస్థ దాదాపు 175 లగ్జరీ టెంట్లు ఏర్పాటు చేస్తోంది. ఐటీడీసీ కూడా యోగా, మెడిటేషన్, సాంస్కృతిక కార్యక్రమాల్లాంటి ఫీచర్లతో లగ్జరీ టెంట్ల ద్వారా పర్యాటకులను ఆకర్షించే ప్రయత్నాల్లో ఉంది. మహా కుంభమేళాలో క్యాంపా తదితర ఉత్పత్తులను విస్తృతంగా అందుబాటులో ఉంచడంతో పాటు పలు సేవలు కూడా అందిస్తున్నట్లు రిలయన్స్ కన్జూమర్ ప్రొడక్ట్స్ (ఆర్సీపీఎల్) తెలిపింది. భక్తులు, పర్యాటకులు సేదతీరేందుకు క్యాంపా ఆశ్రమ్, ఆరామ్ స్థల్ మొదలైనవి ఏర్పాటు చేసినట్లు పేర్కొంది. హోర్డింగ్లకు రూ. పది లక్షలు ... కుంభమేళా సందర్భంగా కార్పొరేట్ కంపెనీలు దాదాపు రూ. 3,000 కోట్లు ఖర్చు చేయనున్నట్లు అంచనా. కార్యక్రమం ఆసాంతం హోర్డింగ్లు లేదా ఫ్లెక్స్ బోర్డ్లు కొనసాగించాలంటే రూ. 10 లక్షలు, ఎల్ఈడీ స్క్రీన్లపై 10 సెకన్ల ప్రకటనకు రూ. 5 లక్షలు ఖర్చు చేయాల్సి ఉంటుందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. మొత్తం 45 రోజుల పొడవునా ప్రచారం కోసం బ్రాండ్లు కనీసం రూ. 50 లక్షల నుండి రూ. 1 కోటి వరకు వ్యయం చేస్తుందని భావిస్తున్నారు. ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వమే ఈ కార్యక్రమంపై ఏకంగా రూ. 5,000 కోట్లు ఖర్చు పెడుతోంది. ప్రపంచవ్యాప్తంగా భక్తులు తరలిరానుండటంతో బ్రాండింగ్కి ఇది భారీ అవకాశంగా ఉంటుందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. → మహిళల కోసం డాబర్ ఆమ్లా, వాటికా చేంజింగ్ రూమ్స్ → డాబర్ దంత్ స్నాన్ జోన్స్, పిల్లల కోసం డాబర్ లాల్ తేల్ ప్రత్యేక సంరక్షణ గదులు → మదర్ డెయిరీ 45 కియోస్క్ లు → ‘భక్తి’ ఓటీటీ యాప్ను ప్రారంభిస్తున్న కుకు ఎఫ్ఎం → ఐటీడీసీ లగ్జరీ టెంట్లు→ మహా కుంభమేళా ప్రకటనల హక్కులను హైదరాబాద్కి చెందిన కంపెనీ శ్రేయాస్ మీడియా దక్కించుకుంది.– సాక్షి, బిజినెస్ డెస్క్ -
వైఎస్ జగన్ ఫ్లెక్సీలను తొలగించాలని మున్సిపల్ అధికారులకు ఆదేశాలు
-
ఆంధ్రప్రదేశ్లో పుష్ప-2కు రాజకీయ సెగ!
ఏపీలో ఊహించిందే జరుగుతోంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ను.. పవన కల్యాణ్ అభిమానులు టార్గెట్ చేశారు. చాలాకాలంగా పుష్ప-2 సినిమాను సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. దానికి అల్లు అర్జున్ అభిమానులు అంతే ఘాటుగా కౌంటర్లు ఇస్తున్నారు. సరిగ్గా ఇప్పుడు విడుదల ముందు.. ఈ వార్ తారాస్థాయికి చేరింది. ఏకంగా.. రాజకీయ మలుపులతో సినిమాను అడ్డుకుంటామనే స్థాయికి చేరింది. అల్లు అర్జున్ను టార్గెట్ చేసిన జనసేన నేతలు.. సినిమాను అడ్డుకుంటామంటూ వార్నింగ్ ఇస్తున్నారు. ఈ క్రమంలో.. పుష్ఫ-2 బెనిఫిట్ షో వేయడానికి వీల్లేదని గన్నవరం నియోజకవర్గం జనసేన సమన్వయకర్త చలమలశెట్టి రమేష్ బాబు హెచ్చరించాడు. అలాకాని పక్షంలో.. గురువారం సినిమా విడుదలను అడ్డుకుంటామని హెచ్చరించారు. ‘‘అల్లు అర్జున్ అహంకారంతో ఇష్టమొచ్చినట్లు ప్రవర్తిస్తున్నాడు. మెగాఫ్యామిలీలో ఎవరిని టచ్ చేసినా ఊరుకోం. వాళ్ల సంగతి చూస్తాం’’ అంటూ రమేష్ బాబు వార్నింగ్ ఇస్తున్నాడు. ఈ వ్యాఖ్యలు దుమారం రేపడంతో.. మెగా బ్రదర్, జనసేన నేత నాగబాబు రంగంలోకి దిగారు. రమేష్తో ఫోన్లో మాట్లాడారు. ఆ వెంటనే తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్లు రమేష్ ఓ వీడియో విడుదల చేశారు. అయితే ఈలోపే అల్లు అర్జున్ ఫ్యాన్స్ సైతం అంతే ప్రతిఘటనకు దిగారు. ఇక.. రాష్ట్రవ్యాప్తంగా జనసేన కవ్వింపు చర్యలకు దిగుతోంది. సోషల్ మీడియాలో అల్లు అర్జున్ను, పుష్ప 2 చిత్రాన్ని హేళన చేస్తూ ఎడిటింగ్ పోస్టర్లు, వీడియోలతో రెచ్చిపోతున్నారు. మరోవైపు.. పుష్ప 2 చిత్రానికి మద్దతుగా అభిమానులు భారీ కటౌట్లను రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేశారు. ఇంకోపక్క.. వైఎస్సార్సీపీ పేరిట పలుచోట్ల పోస్టర్లు వెలియడం గమనార్హం. అయితే.. వీటిని మెగా అభిమానులు, జనసేన కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు. పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తోన్న పిఠాపురంలో.. కొందరు గుర్తు తెలియని వ్యక్తులు పుష్ప-2 పోస్టర్లను చించేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. చాలా చోట్ల ఇలాంటి ఘటనలే చోటు చేసుకుంటున్నాయి. అనంతపురంలో జనసేన నేతలు అత్యుత్సాహం ప్రదర్శించారు. గుత్తిలో కేపీఎస్ థియేటర్ వద్ద ఫ్లెక్సీలను చించేశారు. తిరుపతి పాకాలలో రామకృష్ణ థియేటర్ వద్ద ఫ్లెక్సీ వివాదం రేగింది. చూడాలి.. రేపు ఇది ఇంకా ఎటు పోతుందో!.ఇక.. ఎన్నికల సమయంలో అల్లు అర్జున్.. స్నేహధర్మంతో నంద్యాల వైఎస్సార్సీపీ అభ్యర్థి శిల్పకు మద్దతుగా నిలిచారు. ఇది మెగా ఫ్యామిలీలో కొందరికి సహించలేదని.. ఫలితంగానే మెగా అభిమానులకు అల్లు అర్జున్ టార్గెట్ అయ్యారన్నది ఓపెన్ సీక్రెట్. -
సీఎం చంద్రబాబుకు ఘోర అవమానం
అల్లూరి సీతారామరాజు, సాక్షి: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఘోర అవమానం ఎదురైంది. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సంధ్యారాణి సోమవారం పర్యటించారు. అయితే.. మంత్రి సంధ్యారాణి పర్యటన సందర్భంగా టీడీపీ నేతలు, కార్యకర్తలు పలుచోట్ల ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. టీడీపీ నేతలు ఏర్పాటుచేసిన ఆ ఫ్లెక్సీల్లో సీఎం చంద్రబాబు ఫొటో కనిపించకపోవటం గమనార్హం. అయితే మంత్రి లోకేష్, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఫోటోలు పెట్టి.. ముఖ్యమంత్రి చంద్రబాబు ఫొటో పెట్టని వైనం కనిపించింది. దీంతో పాడేరులో ఫ్లెక్సీల ఏర్పాటు అంశం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. -
కొడాలి నాని పుట్టిన రోజు.. ఫ్లెక్సీలను అడ్డుకున్న పోలీసులు
-
ఏలూరుపాడులో రఘురామకృష్ణంరాజు దౌర్జన్యం
సాక్షి, పశ్చిమగోదావరి: ఏలూరుపాడులో టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు దౌర్జన్యానికి దిగారు. అంబ్కేదర్ ఫ్లెక్సీని రఘురామకృష్ణంరాజు చించేశారు. ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా దళిత సంఘాలు ఫ్లెక్సీని ఏర్పాటు చేయగా, రఘురామకృష్ణంరాజు తన అనుచరులతో వచ్చి చించేశారు. దీంతో రఘురామకృష్ణంరాజు తీరును వ్యతిరేకిస్తూ దళిత సంఘాలు నిరసన వ్యక్తం చేశాయి. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు.జగ్గయ్యపేటలో జనసేన, టీడీపీల మధ్య ఫ్లెక్సీ వార్ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో జనసేన, టీడీపీల మధ్య ఫ్లెక్సీ వివాదం రచ్చరచ్చగా మారింది. పాత మున్సిపల్ సెంటర్లో జనసేన ఫ్లెక్సీలు ఏర్పాటు చేసింది. ఫ్లెక్సీల్లో జగ్గయ్యపేట టీడీపీ ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ ఫోటో లేకపోవడంతో టీడీపీ కార్యకర్తలు గొడవకు దిగారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రంగంలోకి దిగారు.ఇదీ చదవండి: ఆ చర్చల సారాంశం చెప్పలేను: విశాఖ స్టీల్ప్లాంట్ సీఎండీ -
ఇదేం రూల్?.. విశాఖ ఎలక్షన్ కోడ్లో అధికారుల ఓవరాక్షన్
విశాఖపట్నం, సాక్షి: విశాఖపట్నంలో అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో అధికారులు వైఎస్సార్ విగ్రహాలకు ముసుగు వేశారు. కానీ, ఎన్టీఆర్ విగ్రహాలకు మాత్రం ముసుగు వేయకుండా వదిలేశారు. అంతే కాకుండా కూటమి నేతల ఫ్లెక్సీలను తొలగించకుండా వదిలిపెట్టారు. విశాఖ నగరంలో ఎక్కడికక్కడ కూటమి నాయకుల ఫ్లెక్సీలు దర్శనం ఇస్తున్నాయి.అధికార పార్టీ నేతలు ఒత్తిడితోనే వైఎస్సార్ విగ్రహాలకు ముసుగు వేశారని ఆరోపణలు వస్తున్నాయి. కూటమి నేతల ఫ్లెక్సీలు వదిలివేయడంపై వైఎస్సార్సీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. రాజకీయ నాయకుల ఫ్లెక్సీలు, బ్యానర్లు తొలగించాలని అధికారులకు కలెక్టర్ ఆదేశాలు ఇచ్చినా ఉద్యోగులు లెక్క చేయకపోవటం గమనార్హం. ఇక.. ఉద్యోగుల తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. -
జూ.ఎన్టీఆర్ ఫ్లెక్సీలు తీసేయండి
ఖైరతాబాద్ (హైదరాబాద్): ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా నెక్లెస్ రోడ్డులోని ఆయన ఘాట్ వద్ద నటుడు జూనియర్ ఎన్టీఆర్ ఫొటోతో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగించాలంటూ బాలకృష్ణ ఆదేశించడం వివాదానికి దారితీసింది. బాలకృష్ణ ఆదేశాలతో ఆయన అనుచరులు ఫ్లెక్సీలు తొలగించడం, జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు వాటిని తిరిగి ఏర్పాటు చేసేందుకు ప్రయత్నించడం, పోలీసులు అడ్డుకోవడంతో ఘాట్ వద్ద స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. వివరాలు ఇలా ఉన్నాయి. ఎన్టీఆర్కు కుటుంబసభ్యుల నివాళి గురువారం ఎన్టీఆర్ వర్ధంతి పురస్కరించుకుని ఎన్టీఆర్ ఘాట్లోని ఆయన సమాధి వద్ద కుటుంబ సభ్యులు, అభిమానులు ఘనంగా నివాళులర్పించారు. తెల్లవారు జామున జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్రామ్లు.. ఎన్టీఆర్ ఘాట్కు విచ్చేసి తాతకు నివాళులర్పించారు. అనంతరం ఎన్టీఆర్ కుమారు డు, సీనియర్ నటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ, నంద మూరి రామకృష్ణ, సుహాసినితో పాటు చంద్రబాబు సతీమణి భువనేశ్వరి నివాళులర్పించారు. అయితే ఈ సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ లోపల, ప్రవేశ ద్వా రం రెండువైపులా జూనియర్ ఎన్టీఆర్ అభిమాను లు.. ఎన్టీఆర్, జూనియర్ ఎన్టీఆర్లతో కూడిన భారీ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. తండ్రికి నివాళులర్పించి బయటకు వచ్చే క్రమంలో ఈ ఫ్లెక్సీలను చూసిన బాలకృష్ణ.. వెంటనే వాటిని తొలగించాలని ఆదేశించడంతో, ఆయన అనుచరులు జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలను తొలగించి కొన్నింటిని రోడ్డు ఫుట్పాత్పై, మరికొన్ని ఘాట్ పార్కింగ్ ప్రాంతంలో కనిపించకుండా పెట్టారు. జూ.ఎన్టీఆర్ ఫ్లెక్సీలకు పాలాభిషేకం తమ హీరో ఫ్లెక్సీలు తొలగించారన్న విషయం తెలుసుకున్న జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. బయట ఉంచిన ఫ్లెక్సీలను తిరిగి లోపల పెట్టేందుకు అనుమతించాలని పోలీసులను కోరారు. వారు అందుకు అనుమతించకపోవడంతో అభిమానులు ఘాట్ లోపల తొలగించకుండా వదిలేసిన జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలకు పూలమాల వేసి పాలాభిషే కం చేశారు. ఆ తర్వాత అక్కడికి వచ్చిన జూని యర్ ఎన్టీఆర్ అభిమానుల సంఘం అధ్యక్షుడు ఫుట్పాత్పై ఉంచిన రెండు ఫ్లెక్సీలను ఘాట్ లోపలికి తీసుకువచ్చారు. ఇది గమనించిన పోలీ సులు.. బయట ఉన్న ఫ్లెక్సీలు లోపలికి ఎందుకు తీసుకువచ్చారంటూ.. వెంటనే వాటిని యథా స్థానంలో పెట్టాలని ఆదేశించారు. వారు విన్పించుకోక పోవడంతో అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించారు. దీంతో అక్కడ కొద్దిసేపు ఉద్రి క్తత నెలకొంది. చివరకు పోలీసులు లోపలికి తీసుకువచ్చిన ఫ్లెక్సీలను తిరిగి బయట పెట్టించి వారిని అక్కడినుంచి పంపించి వేయడంతో ఉద్రి క్తత చల్లారింది. కాగా నివాళులర్పించిన అనంతరం బాలకృష్ణ మాట్లాడుతూ..తెలుగు బిడ్డ బొడ్డు కోయకముందే రాజకీయాలంటే ఏంటో తెలిపిన మహనీయుడు ఎన్టీఆర్ అని అన్నారు. సాహసోపేత పథకాల అమలుతో పేదవాడి ఆక లి తీర్చి, విప్లవాత్మక, సామాజిక మార్పులు తీసుకువచ్చిన గొప్ప నాయకుడని పేర్కొన్నారు. అందుకే ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచి పోయారని చెప్పారు. -
టీడీపీకి కేశినేని మరో షాక్.. బాబు ఫ్లెక్సీల తొలగింపు
సాక్షి, విజయవాడ: విజయవాడ ఎంపీ కేశినేని నాని.. టీడీపీ పార్టీకి మరో షాకిచ్చారు. రాజీనామా ప్రకటన అనంతరం కేశినేని భవన్పై టీడీపీ పార్టీ జెండాలు, బ్యానర్లను కేశినేని నాని తొలగించారు. చంద్రబాబు, ఎన్టీఆర్, కేశినేని నాని ఫోటోలతో ఉన్న ఫ్లెక్సీలను మంగళవారం తొలగించారు. వాటీ స్థానంలో కేశినేని నాని, ఆయన కుమార్తె శ్వేత ఫోటోలతో ఉన్న ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. కాగా టీడీపీ అధినేత చంద్రబాబుకు వరుస షాక్లు తగులుతున్నాయి. ఇప్పటికే టీడీపీ ఎంపీ కేశినేని నాని పార్టీకి రాజీనామా చేస్తానని ప్రకటించిన విషయం తెలిసిందే. మరోవైపు.. నాని బాటలో ఆయన కూతురు కూడా టీడీపీకి గుడ్బై చెప్పారు. కేశినేని శ్వేత తన విజయవాడ 11 డివిజన్ కార్పొరేటర్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు సోమవారం ప్రకటించారు. చదవండి: flash back: పిల్లి లేవని పొయ్యిపై చంద్రబాబు ఎసరు ! -
చంద్రబాబు సభలో జూ.ఎన్టీఆర్ ఫ్లెక్సీల కలకలం
సాక్షి, ఎన్టీఆర్ జిల్లా: తిరువూరు చంద్రబాబు సభలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు కలకలం రేపాయి. జూనియర్ ఎన్టీఆర్ సీఎం అంటూ టీడీపీ కార్యకర్తలు ఫ్లెక్సీలు ప్రదర్శించారు. ఎన్టీఆర్ ఫోటో ఉన్న బ్యానర్లు, జెండాలతో వచ్చిన టీడీపీ కార్యకర్తలు.. జూనియర్ ఎన్టీఆర్ సీఎం అంటూ జెండాలపై రాశారు. జూనియర్ ఎన్టీఆర్ సీఎం అంటూ రాసిన జెండాలను లాక్కొన్న టీడీపీ నేతలు పక్కన పడేశారు. టీడీపీ నేతల తీరుపై జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, టీడీపీ ఎంపీ కేశినేని నాని.. పార్టీ అధినేత చంద్రబాబుకు షాక్ల మీద షాక్లు ఇస్తున్నారు. తాజాగా కేశినేని భవన్ నుండి టీడీపీ జెండాను కేశినేని నాని తొలగించారు. మరోవైపు.. చంద్రబాబు సభలో కేశినేని నాని కోసం టీడీపీ నేతలు కుర్చీని కేటాయించారు. ఈ మేరకు చంద్రబాబు సభకు రావాలని కనకమేడలతో నిన్న(శనివారం) కేశినేని నానికి రాయబారం పంపించారు. కాగా, చంద్రబాబు ఆహ్వానాన్ని, రాయబారాన్ని కేశినేని లెక్క చేయలేదు. మరోవైపు.. చంద్రబాబు సభకు కేశినేని వర్గం, మద్దతుదారులు దూరంగా ఉన్నారు. ఇదీ చదవండి: చంద్రబాబుకు మరో షాకిచ్చిన కేశినేని నాని.. దెబ్బ అదుర్స్! -
ఎమ్మెల్సీ కవిత 'వర్సెస్' ఎంపీ అర్వింద్.. మాటల యుద్ధం కాస్త ఫ్లెక్సీల వార్ దాకా..
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: 'ఎన్నికల నేపథ్యంలో ఎమ్మెల్సీ కవిత, ఎంపీ అర్వింద్ మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుతోంది. కోరుట్ల నుంచి బీజేపీ తరుపున పోటీ చేస్తున్న ఎంపీ అర్వింద్ను బీఆర్ఎస్ కార్యకర్తలు కచ్చితంగా ఓడించనున్నట్లు కవిత వ్యాఖ్యానించారు. కేటీఆర్, కవిత కారణంగానే బీఆర్ఎస్ ఓడనుందని ఎంపీ అర్వింద్ పేర్కొన్నారు. ఆకుల లలితను ప్రత్యర్థి పార్టీలోకి పంపి కోవర్టు ఆపరేషన్ చేసేందుకు కవిత స్కెచ్ వేశారని ఆరోపించారు.' శాసనసభ ఎన్నికల ప్రచారం స్పీడందుకుంటున్న కొద్దీ నేతల మధ్య మాటల యుద్ధం మరింత ముదురుతోంది. నువ్వా నేనా అనే విధంగా నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్, ఎమ్మెల్సీ కవిత మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. గత పార్లమెంట్ ఎన్నిక ల్లో కవితపై అర్వింద్ విజయం సాధించినప్పటి నుంచీ ఈపోరు నడుస్తూనే వస్తోంది. పసుపు బోర్డు అంశంపై అర్వింద్, కవితతోపాటు ఇరు పార్టీల నాయకులు, కార్యకర్తలు సైతం పోటాపోటీ మాటలతో పాటు ఫ్లెక్సీల వార్కు దిగారు. మీరొక ఫ్లెక్సీ పెడితే మేము పది ఫ్లెక్సీలు పెడతాం అన్న రీతిలో ఈ వార్ నడిచింది. మాటల యుద్ధం మాత్రం ఎప్పటికప్పుడు కొనసాగుతూనే వచ్చింది. ఇదిలా ఉండగా తాజాగా ఎన్నికల నేపథ్యంలో ఈ మాటల యుద్ధం తారాస్థాయికి చేరుతోంది. ఇది రానురాను మరింత పెరుగుతోంది. కోరుట్ల నుంచి బీజేపీ తరుపున పోటీ చేస్తున్న ఎంపీ అర్వింద్ను బీఆర్ఎస్ కార్యకర్తలు కచ్చితంగా ఓడించనున్నట్లు కవిత తాజాగా వ్యాఖ్యానించారు. నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలోని అన్ని సెగ్మెంట్లలో తిరిగి బీజేపీ, కాంగ్రెస్లను ఓడిస్తామన్నారు. మరోవైపు అర్వింద్ మాత్రం బీఆర్ఎస్పై మాటల దాడిని తీవ్రతరం చేశారు. కవిత ప్రచారం చేస్తే బీజేపీకి మరింత మెజారిటీ వస్తుందని అర్వింద్ అన్నారు. బీఆర్స్కు కార్యకర్తలే ఓట్లు వేయరన్నారు. ఆకుల లలితను ప్రత్యర్థి పార్టీలోకి పంపి కోవర్టు ఆపరేషన్ చేసేందుకు కవిత స్కెచ్ వేశారన్నారు. కేటీఆర్, కవిత కారణంగానే బీఆర్ఎస్ ఓడనుందన్నారు. అభద్రతా భావంతో ఉన్న బీఆర్ఎస్ హిందువులను కులాల వారీగా విభజిస్తోందన్నారు. ఎక్కడా గెలవలేని కవిత ఎమ్మెల్సీ పదవి తీసుకున్నారన్నారు. అలాంటి కవిత వేరేవాళ్లను ఎలా గెలిపిస్తుందని అర్వింద్ అన్నారు. పైడి అంటే ఫ్లవర్ కాదు.. ఫైర్.. ఆర్మూర్ నియోజకవర్గంలో త్రిముఖ పోరు నెలకొంది. సిట్టింగ్ అభ్యర్థి జీవన్రెడ్డి ఇప్పటికే ఒక విడత ప్రచారం పూర్తి చేశారు. కులసంఘాల వారీగా ఆత్మీయ సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. అయితే బీజేపీ అభ్యర్థి పైడి రాకేష్రెడ్డి మాత్రం జీవన్రెడ్డిపై మాటల దాడి చేస్తున్నారు. పైడి అంటే ఫ్లవర్ కాదు.. ఫైర్ అని చెబుతున్నారు. జీవన్రెడ్డి సర్పంచ్లను బెదిరించినట్లు నన్ను బెదిరించాలంటే సాధ్యం కాదన్నారు. తాను గెలిస్తే జీవన్ మాల్ లీజ్ను రద్దు చేస్తానని చెబుతున్నారు. ఫాంహౌజ్, పైరవీల ధ్యాస జీవన్రెడ్డిదన్నారు. ఆర్మూర్ అంబేద్కర్ సెంటర్లో లైవ్ చర్చకు రావాలని రాకేష్రెడ్డి సవాల్ విసిరారు. ఆస్తుల చిట్టా బహిర్గతం చేసుకుందామన్నారు. ఎవరేమిటో తేల్చుకుందామన్నారు. నిజామాబాద్ అర్బన్లో బీఆర్ఎస్ అ భ్యర్థి గణేష్గుప్తా, బీజేపీ అభ్యర్థి ధన్పాల్ సూర్యనారాయణ సైతం మెల్లగా మాటల దాడి పెంచుతున్నారు. ఇవి చదవండి: 'ఓటు' ను కొన్ని సమయాల్లో వేరే పేర్లతో పిలుస్తారు.. అవేంటో తెలుసా..!? -
ఆఫీసర్లు వద్దన్నా కడుతున్నారు లోకేష్ హోర్డింగ్లు
-
తాడికొండ టీడీపీలో కాకరేపుతున్న వివాదం.. అక్కడ ఏం జరుగుతోంది?
సాక్షి, గుంటూరు జిల్లా: తాడికొండ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలో ఫ్లెక్సీల వివాదం కాకరేపుతోంది. చంద్రబాబు మేడికొండూరు పర్యటనలో నాయకుల మధ్య ఆధిపత్య పోరు బహిర్గతమయ్యింది. బాబు రాక సందర్భంగా టీడీపీ నేత తోకల రాజవర్థన్రావు ప్లెక్సీలు ఏర్పాటు చేయగా, మాజీ ఎమ్మెల్యే తెనాలి శ్రవణ్కుమార్ ఆ ప్లెక్సీలను తీయించివేశారు. ఈ వ్యవహారంపై ఆగ్రహించిన తోకల రాజవర్థన్రావు వర్గీయులు.. తెనాలి శ్రావణ్కుమార్తో పాటు అతని అనుచరులపై పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. చదవండి: ‘కోడెల మరణానికి చంద్రబాబే ప్రధాన కారణం’ -
మోదీ పర్యటన వేళ.. బీఆర్ఎస్ సరికొత్త ప్రచార అస్త్రం.. ‘ఇదే ఆహ్వానం..’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సెంటిమెంట్ నుంచి పుట్టుకొచ్చి రాష్ట్ర సాధన అనంతరం అధికారంలోకి వచ్చిన పార్టీ టీఆర్ఎస్. రెండు దఫాలు రాష్ట్రాన్ని పాలించే అవకాశాన్ని దక్కించుకున్న కె.చంద్రశేఖరరావు మూడో దఫా అసెంబ్లీ ఎన్నికలకు ముందు జాతీయ రాజకీయాలపై దృష్టి పెట్టారు. ఈక్రమంలో టీఆర్ఎస్ (తెలంగాణ రాష్ట్ర సమితి) కాస్తా బీఆర్ఎస్ (భారత్ రాష్ట్ర సమితి) అయింది. ఇప్పటికే కేంద్రంతో పలు అంశాలపై విభేదిస్తూ వచ్చిన కేసీఆర్.. జాతీయ రాజకీయాల్లోకి అడుపెట్టడంతో మరింత దూకుడు పెంచారు. ఇటీవల ఢిల్లీ లిక్కర్ కేసులో కవితను ఈడీ విచారించిన నేపథ్యంలో బీఆర్ఎస్, బీజేపీ నేతల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు నెలకొన్నాయి. తాజాగా టెన్త్ పేపర్ లీక్ కేసులో బండి సంజయ్ అరెస్టుతో రాజకీయంగా మరింత ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పరస్పర విమర్శలు, కేసులు, ఆరోపణలతో తెలంగాణ రాజకీయం రణరంగాన్ని తలపిస్తోంది. అటు సోషల్ మీడియాలో ప్రత్యర్థి పార్టీలకు కౌంటర్లు ఇస్తుండటం ఒక ఎత్తయితే, వాల్ పోస్టర్లు, ఫ్లెక్సీలతో సైతం వినూత్నంగా సెటైర్లు వేస్తుండటం గమనార్హం. (చదవండి: సికింద్రాబాద్-తిరుపతి ‘వందే భారత్’ రైలు ప్రత్యేకతలు, టికెట్ ధరలివే!) ఇక ప్రధాని మోదీ ఏప్రిల్ 8న హైదరాబాద్ వస్తుండటంతో బీఆర్ఎస్ మరో ప్రచార అస్త్రానికి తెరలేపింది. బీజేపీలోని కీలక నేతల వారసుల ఫోటోలతో హైదరాబాద్లో ఫ్లెక్సీలు వెలిశాయి. కమలం పార్టీ నేతలు పరివారానికే పట్టం కడుతున్నారంటూ విమర్శలు చేస్తున్నారు కారు పార్టీ నేతలు. ‘మీ పరివారం మీకు ఆహ్వానం పలుకుతోంది’ అంటూ సెటైరికల్ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. (చదవండి: కేసీఆర్ వస్తే మోదీ చేతులతో సన్మానం చేయిస్తా: బండి సంజయ్) -
చంద్రబాబు గో బ్యాక్ అంటూ పీలేరులో ఫ్లెక్సీలు
-
చిత్తూరు: రొంపిచర్లలో టీడీపీ కార్యకర్తల బరితెగింపు
రొంపిచెర్ల (చిత్తూరు జిల్లా): చిత్తూరు జిల్లా రొంపిచెర్లలో వైఎస్సార్సీపీ కార్యకర్తలపై టీడీపీ కార్యకర్తలు దాడులకు దిగారు. బీరు బాటిళ్లు, రాళ్లతో దాడి చేశారు. ఈ దాడిలో పలువురు వైఎస్సార్సీపీ కార్యకర్తలు గాయపడ్డారు. ఐదు రోజులక్రితం సోమలలో తెలుగుదేశం పార్టీ వర్గీయులు ఘర్షణలకు దిగారు. టీడీపీ కార్యకర్తలు రొంపిచెర్ల క్రాస్లో వైఎస్సార్సీపీ కార్యకర్తలు ఏర్పాటు చేసిన బ్యానర్లను తొలగించి చెప్పులతో కొట్టి కాల్చివేశారు. దీనిపై రొంపిచెర్ల సర్కిల్లో శనివారం ఉదయం ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. తిరిగి సాయంత్రం ఇరువర్గాలు రొంపిచెర్ల సర్కిల్కు చేరుకోగా.. వైఎస్సార్సీపీ కార్యకర్తలపై టీడీపీ కార్యకర్తలు విచక్షణరహితంగా దాడికి పాల్పడ్డారు. దీంతో రొంపిచెర్లలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. విషయం తెలుసుకున్న రొంపిచెర్ల ఎస్ఐ శ్రీనివాస్ పోలీసు బలగాలతో అక్కడికి చేరుకున్నారు. కొద్దిసేపటికి కల్లూరు, భాకరాపేట, పీలేరు, ఎర్రావారిపాళ్యెం స్టేషన్ల నుంచి పోలీసులు రొంపిచెర్లకు చేరుకుని.. పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. కాగా, దాడుల విషయం తెలుసుకున్న జెడ్పీటీసీ సభ్యుడు రెడ్డీశ్వర్రెడ్డి రొంపిచెర్ల చేరుకుని వైఎస్సార్సీపీ కార్యకర్తలకు ధైర్యం చెప్పారు. రొంపిచెర్ల మండలంలో ఉనికి కోసమే టీడీపీ ఘర్షణలకు పాల్పడుతోందని అన్నారు. చదవండి: (నాగబాబుకు మంత్రి ఆర్కే రోజా స్ట్రాంగ్ కౌంటర్) -
ఎల్లారెడ్డిపేటలో కేటీఆర్ కు వ్యతిరేకంగా ఫ్లెక్సీలు
-
హైదరాబాద్లో ‘మోదీ నో ఎంట్రీ’ ఫ్లెక్సీలు
బంజారాహిల్స్ (హైదరాబాద్): ప్రధాని మోదీ రాష్ట్ర పర్యటనను నిరసిస్తూ నగరంలో పలుచోట్ల ‘మోదీ నో ఎంట్రీ’ పేరుతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. తెలంగాణ యూత్ఫోర్స్ పేరుతో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో చేనేత ఉత్పత్తులపై 5 శాతం జీఎస్టీ విధించడం పట్ల నిరసన వ్యక్తం చేశారు. దీన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆయా చౌరస్తాల్లో ఏర్పాటుచేసిన ఈ ఫ్లెక్సీలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. -
మునుగోడులో పోస్టర్ వార్
చౌటుప్పల్ మండలంలో ఫ్లోరైడ్ రీసెర్చ్ అండ్ మిటిగేషన్ సెంటర్ ఏర్పాటుకు 2016లోనే హామీ ఇచ్చినా ఇప్పటివరకు అమలు చేయలేదంటూ.. ఇటీవల బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఫ్లెక్సీ పెట్టి, దాని ముందు సమాధిలా ఏర్పాటు చేశారు. అంతకుముందు బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి రూ.18 వేల కోట్లకు అమ్ముడు పోయారంటూ పోస్టర్లు వేశారు. సాక్షి ప్రతినిధి, నల్లగొండ: ఉప ఎన్నికల నేపథ్యంలో మునుగోడు నియోజకవర్గంలో ఫ్లెక్సీలు, బ్యానర్ల వార్ ఉధృతమైంది. మొన్నటివరకు ప్రజా సమస్యలను పరిష్కరించాలని, రోడ్డు వేస్తేనే మా ఊళ్లో ఓట్లు అడగాలని గ్రామాల్లో ప్రజలు ఫ్లెక్సీలు పెట్టారు. ఇప్పుడు రాజకీయ పార్టీల కార్యకర్తలు, నేతలు పరస్పర విమర్శలు, ఆరోపణలతో పోస్టర్లు వేసుకుంటున్నారు. మొన్నటివరకు బీజేపీ నేతలు, ఆ పార్టీ అభ్యర్థిని ఉద్దేశిస్తూ పోస్టర్లు వెలియగా.. తాజాగా టీఆర్ఎస్ నేతలను ఉద్దేశిస్తూ పోస్టర్లు పడ్డాయి. ఆగస్టు నుంచే పోస్టర్ల గోల షురూ.. మునుగోడు నియోజకవర్గంలో ఆగస్టు నెల నుంచే పోస్టర్ల గోల మొదలైంది. ఎన్నికల నోటిఫికేషన్ రాక ముందే కొన్ని గ్రామాల్లో సమస్యలు పరిష్కరించాలని బ్యానర్లు పెట్టగా.. మరికొన్ని గ్రామాల్లో మాకు డబ్బులు వద్దు రోడ్డే కావాలి అంటూ ఫ్లెక్సీలు కట్టారు. మరోచోట రోడ్డు వేస్తేనే మా గ్రామంలోకి రావాలంటూ ఊరి బయట ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. తర్వాత రాజగోపాల్రెడ్డిని విమర్శిస్తూ పోస్టర్లు వెలిశాయి. ‘మునుగోడు ప్రజలారా మేం మోసపోయాం.. మీరూ మోసపోకండి.. ఇట్లు దుబ్బాక, హుజూరాబాద్ ప్రజలు’అంటూ సెప్టెంబర్ 15న పోస్టర్లు కనిపించాయి. తర్వాత ‘రూ.18 వేల కోట్ల కాంట్రాక్టు పే’అంటూ రాజగోపాల్రెడ్డిపై పోస్టర్లు వేశారు. ఆ తర్వాత ఫ్లెక్సీలు, బొమ్మలతో సమాధులు, కాష్టాల వంటివీ జరిగాయి. తాజాగా శనివారం నాంపల్లి మండల కేంద్రం శివారులో కల్వకుంట్ల కుటుంబం పేరుతో సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత బొమ్మలతో ఫ్లెక్సీ పెట్టి.. కాష్టాన్ని పేర్చి తగలబెట్టారు. ఇదీ చదవండి: ఇదేందయ్యా ఇది.. మద్యం మత్తులో రెచ్చిపోయిన మునుగోడు యూత్.. వీడియో వైరల్ -
అమరావతి రైతుల మహాపాదయాత్రకు నిరసన సెగ
సాక్షి, పాలకొల్లు: పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గంలోని ప్రవేశించిన అమరావతి రైతుల పాదయాత్రకు నిరసన సెగ తగిలింది. అమరావతి రైతుల ముసుగులో టీడీపీ చేస్తోన్న పాదయాత్రపై పాలకొల్లు నియోజకవర్గం వైఎస్సార్సీపీ శ్రేణులు నిరసన ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. రాజధాని ముసుగులో వస్తున్న తెలుగుదేశం బినామీలు గో బ్యాక్.. గో బ్యాక్ అంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ''ఒక రాజధాని వద్దు.. మూడు రాజధానులు ముద్దు, వికేంద్రీకరణ ముద్దు.. ప్రాంతాల మధ్య చిచ్చు వద్దు, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలంటే.. మూడు రాజధానులుగా అమరావతి, కర్నూలు, విశాఖపట్నం కావాలి, రాజధాని ముసుగులో తెలుగుదేశం బినామీ నాయకులు గోబ్యాక్ గోబ్యాక్'' అంటూ ఫ్లెక్సీల్లో నినాదాలు ముద్రించారు. చదవండి: (స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా లేఖను అందించిన కరణం ధర్మశ్రీ) -
ఏపీలో ప్లాస్టిక్ ఫ్లెక్సీలు నిషేదం.. ఆ రోజు నుంచే అమల్లోకి
సాక్షి, విజయవాడ: ప్లాస్టిక్ ఫ్లెక్సీలపై నిషేదం విధిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిషేదం నవంబర్ 1 నుంచి అమలు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇకపై ప్లాస్టిక్ ఫ్లెక్సీలు ముద్రించడం, అంటించడం, రవాణాపైన నిషేదం విధించారు. ప్లాస్టిక్ ఫ్లెక్సీ ప్రింటింగ్ మెటీరియల్ ఇంపోర్ట్పైనా నిషేదం విధించారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగానే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. చదవండి: (ఏపీలో సీఎం జగన్ పాలన అద్భుతం: మంత్రి కేటీఆర్) -
CM Basavaraj Bommai: తెలంగాణ సర్కార్పై కర్ణాటక సీఎం ఆగ్రహం
బెంగళూరు: ‘40 పర్సెంట్ ప్రభుత్వానికి సుస్వాగతం’అని కర్ణాటక సీఎం గురించి హైదరాబాద్లో వేసిన ఫ్లెక్సీలపై సీఎం బసవరాజ బొమ్మై తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు. శనివారం తెలంగాణ విమోచన దినోత్సవంలో పాల్గొనడానికి బొమ్మై హైదరాబాద్కు వస్తారని తెలిసి ఈ ఫ్లెక్సీలు వెలిశాయి. ఆదివారం బెంగళూరులో బొమ్మై మీడియాతో మాట్లాడుతూ ఇలాంటి సంఘటనలతో రెండు రాష్ట్రాల మధ్య సంబంధాలు అస్తవ్యస్తంగా మారతాయని హెచ్చరించారు. తెలంగాణలో జరుగుతున్న అవినీతిని కర్ణాటకలో ప్రస్తావిస్తే ఎలా ఉంటుందని తెలంగాణ సీఎం కె.చంద్రశేఖర్రావును ప్రశ్నించారు. ఇదొక పథకం ప్రకా రం చేసిన కుట్ర, ఇలాంటి వాటితో రెండు రాష్ట్రాల మధ్య రాజకీయ సంబంధాలు నాశనమ వుతాయని, ఎవరూ కూడా ఇలా చేయరాదని సూచించారు. ఒక రాష్ట్రంపై ఆధార రహిత ఆరోపణలను చేయటం సరికాదన్నారు. తెలంగాణలో జరుగుతున్న పరిణామాలపై తాము ఫ్లెక్సీ వేస్తే ఎలా ఉంటుందని బొమ్మై ప్రశ్నించారు. కాగా, కర్ణాటకలో అన్ని పనుల్లో మంత్రులు 40 శాతం కమీషన్లు తీసుకుంటున్నారని కాంగ్రెస్ ఆరోపించడం తెలిసిందే. చదవండి: (మార్గదర్శికేసులో రామోజీకి సుప్రీంకోర్టు నోటీసులు) -
ఆప్ ఈవెంట్ను హైజాక్ చేసిన మోదీ! రాత్రికి రాత్రే ఏం జరిగింది?
సాక్షి,న్యూఢిల్లీ: ఢిల్లీ ప్రభుత్వం నిర్వహించాల్సిన ఓ కార్యక్రమాన్ని కేంద్రం హైజాక్ చేసిందని ఆరోపించారు ఆప్ నేత, ఢిల్లీ మంత్రి గోపాల్ రాయ్. రాత్రికి రాత్రే పోలీసులు రంగంలోకి దిగి స్టేజీపై నరేంద్ర మోదీ పోస్టర్లు ఏర్పాటు చేశారని తెలిపారు. ఢిల్లీ ప్రభుత్వ కార్యక్రమాన్ని కాస్తా.. రాజకీయ కార్యక్రమంగా మార్చారని విమర్శించారు. ఈమేరకు మీడియా సమావేశంలో వ్యాఖ్యానించారు. 'కేజ్రీవాల్ ప్రభుత్వం చేపట్టిన వన మహోత్సం కార్యక్రమం ఆదివారంతో ముగుస్తుంది. ఈ సందర్భంగా ఓ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్, లెఫ్టినెంట్ గవర్నర్ హాజరుకావాల్సి ఉంది. కానీ ఏమైందో తెలియదు. శనివారం రాత్రి అనూహ్యంగా ప్రధాని కార్యాలయం ఆదేశాల మేరకు పోలీసులు రంగంలోకి దిగి స్టేజీపై మొత్తం మోదీ పోస్టర్లు ఏర్పాటు చేశారు. వాటిని తొలగిస్తే అరెస్టు చేస్తామని బెదిరించారు.' అని గోపాల్ రాయ్ పేర్కొన్నారు. పోలీసులు ఉంది ప్రజలకు భద్రత కల్పించడానికి గానీ, ప్రధాని మోదీ కోసం బ్యానర్లు కట్టేందుకు కాదని ధ్వజమెత్తారు. Delhi Govt के वन महोत्सव में CM @ArvindKejriwal को शामिल होना था लेकिन प्रधानमंत्री कार्यलय के आदेश पर Police ने मंच पर कब्ज़ा कर ज़बरदस्ती Modi जी की तस्वीर लगा दी और हटाने पर गिरफ़्तारी की धमकी दी मोदी जी दिल्ली Govt के कायर्क्रम में अपनी तस्वीर लगाकर क्या साबित करना चाहते? pic.twitter.com/B3Hdo5KCLr — AAP (@AamAadmiParty) July 24, 2022 ఢిల్లీ ప్రభుత్వాన్ని కేంద్రం అప్రతిష్ఠపాలు చేయాలని చూస్తోందని ఆరోపించారు గోపాల్ రాయ్. ఇప్పటికే తమ నేత సత్యేంద్ర జైన్పై తప్పుడు కేసు పెట్టి అరెస్టు చేశారని, డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాపై కూడా కుట్ర జరుగుతోందని అన్నారు. సీఎం కేజ్రీవాల్ సింగపూర్ పర్యటనకు వెళ్లకుండా అధికారిక ప్రక్రియ నిలివేశారని విమర్శించారు. చదవండి: 'ఆ రెస్టారెంట్ స్మృతి ఇరానీ కూతురిదే.. ఇదిగో సాక్ష్యం' -
మా ఫ్లెక్సీలు తొలగిస్తావా?
పుత్తూరు రూరల్: మా ఫ్లెక్సీలనే తొలగిస్తావా? అంటూ టీడీపీ నేతలు మున్సిపల్ కమిషనర్పైకి దూసుకెళ్లారు. పుత్తూరులో జరిగిన ఈ ఫ్లెక్సీల రాద్ధాంతం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. ఆదివారం ఉదయం 7 గంటల నుంచి మున్సిపల్ సిబ్బంది వైఎస్సార్ సర్కిల్ నుంచి ఫ్లెక్సీలను తొలగిస్తూ వస్తున్నారు. స్థానిక అంబేడ్కర్ సర్కిల్ వద్ద టీడీపీ వారు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగించడానికి ఉపక్రమించారు. విషయం తెలుసుకున్న తెలుగుదేశం పార్టీ నాయకులు అక్కడికి వచ్చి మున్సిపల్ సిబ్బందిని అడ్డుకున్నారు. కొంతసేపు రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు. అదే సమయానికి అక్కడికి వచ్చిన మున్సిపల్ కమిషనర్ కె.వెంకట్రామిరెడ్డిని టీడీపీ నాయకులు తమ ఫ్లెక్సీలను ఎలా తొలగిస్తారంటూ ప్రశ్నించారు. ఈ ఫ్లెక్సీల ఏర్పాటుకు ఎలాంటి అనుమతులు లేవన్నారు. అయినా 15 రోజులుగా గడువిచ్చామని, నేడు తొలగించాలని చెప్పారు. దీనిపై ఆగ్రహించిన టీడీపీ నేతలు కమిషనర్పైకి దూసుకెళ్తూ దుర్భాషలాడారు. ఈ సమయంలో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. అయినా కమిషనర్ అక్కడే నిలబడడంతో, కొంతసేపటికి టీడీపీ మండల పార్టీ అధ్యక్షుడు జీవరత్నంనాయుడు తమ ఫ్లెక్సీలకు చలానాలను కట్టి అనుమతి తీసుకుంటామని, అంత వరకు ఫ్లెక్సీలు యథాస్థానంలో ఉండాలని కోరారు. ఇందుకు కమిషనర్ సమ్మతించడంతో పరిస్థితి సద్దుమణిగింది. డీఎస్పీ యశ్వంత్ నేతృత్వంలోని పోలీస్ సిబ్బంది టీడీపీ నాయకులను అక్కడి నుంచి వాహనాల్లో ఎక్కించి పంపించేశారు. ఆ తర్వాత మున్సిపల్ సిబ్బంది అనుమతులు లేని ఫ్లెక్సీలను తొలగించారు. -
ఫ్లెక్సీల ఏర్పాటు కోసం టీడీపీ నాయకుల నిర్వాకం
చీపురుపల్లి: తారు రోడ్లు బాగోలేవంటూ టీడీపీ నాయకులు లేనిపోని ఆర్భాటం చేస్తారు. వారు చేసిన హడావుడికి తగ్గట్టుగా ఎల్లో మీడియా ప్రచారం చేస్తోంది. కానీ ఆశ్చర్యం ఏమిటంటే అదే తెలుగుదేశం నాయకులు సమావేశాల పేరిట ఏర్పాటు చేసే ఫ్లెక్సీల కోసం ఎంతో పటిష్టంగా ఉన్న బీటీ రోడ్లను ఇష్టారాజ్యంగా తవ్వేస్తున్నారు. చీపురుపల్లి పట్టణంలో ఆదివారం ఇదే సంఘటన జరిగింది. గరివిడి మండలంలోని కుమరాం పంచాయతీ సర్పంచ్ ముల్లు రమాదేవి టీడీపీలో చేరుతున్న సందర్భంగా పట్టణంలోని తారురోడ్లు తవ్వేసి ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. చక్కగా ఉన్న రోడ్లను తవ్వేసి ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంపై పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. చీపురుపల్లిలోని మూడు రోడ్ల జంక్షన్, గెడ్డమిల్లు, ఆంజనేయపురం, అగ్రహారం, గరివిడి, తదితర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. వీటి కోసం నాలుగైదు నెలల కిందట కోట్లాది రూపాయలు వెచ్చించి ఏర్పాటు చేసిన బీటీ రోడ్లను గోతులుగా మార్చేశారు. టీడీపీ మద్దతుతో గెలిచి.... గరివిడి మండలంలోని కుమరాం పంచాయతీ సర్పంచ్ ముల్లు రమాదేవి గత ఏడాది జరిగిన పంచాయతీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ మద్దతుతో గెలుపొందారు. ఆ పంచాయతీలో టీడీపీ మద్దతుదారు పోటీ చేయకుండా ముల్లు రమాదేవికి పార్టీ తరఫున పూర్తిస్థాయిలో మద్దతు తెలిపారు. దీంతో ఆమె గెలుపొందారు. ఇదంతా జరిగి చాలా కాలం గడిచిపోయింది. అయితే రమాదేవి ప్రస్తుతం టీడీపీలో చేరుతున్నారు. టీడీపీ మద్దతుతో గెలిచి మళ్లీ అదే పార్టీలో చేరడమేమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. -
టీఆర్ఎస్ నేతలకు షాక్.. ఫ్లెక్సీలపై పెనాల్టీలు
సాక్షి,హైదరాబాద్: గత ఏడాది మాదిరిగానే ఈసారీ టీఆర్ఎస్ ప్లీనరీని పురస్కరించుకొని పలువురు టీఆర్ఎస్ నేతలు నగరవ్యాప్తంగా ఫ్లెక్సీలు, బ్యానర్లు, హోర్డింగుల వంటివి భారీగా ఏర్పాటు చేశారు. వాటితో ప్రమాదాలు జరిగే ఆస్కారముందని, వెంటనే తొలగించాలని, వాటిని ఏర్పాటు చేసిన వారిపై నిబంధనల మేరకు చర్యలు తీసుకోవాలని సోషల్మీడియా ద్వారా పౌరుల నుంచి అందిన ఫిర్యాదులకు స్పందించిన ఈవీడీఎంలోని సెంట్రల్ ఎన్ఫోర్స్మెంట్సెల్(సీఈసీ) ఈ చలానాల జారీ ప్రారంభించింది. వాటిని తొలగించే బాధ్యత మాత్రం తమది కాదంటూ జోనల్, సర్కిల్ అధికారులదని పేర్కొంది. ట్విట్టర్ ద్వారా సీఈసీ ఖాతాకు అందిన ఫిర్యాదులకు స్పందిస్తూ.. ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ నుంచి పార్టీ డివిజన్ స్థాయి నాయకుల వరకు పెనాల్టీల ఈ– చలానాలు జారీ చేస్తున్నారు. నగరవ్యాప్తంగా వందలాది ఫ్లెక్సీలున్నప్పటికీ పౌరుల నుంచి అందిన ఫిర్యాదులకే పెనాల్టీలు వేయడంతో, పెనాల్టీలు పడనివి అంతకు ఎన్నో రెట్లు ఎక్కువగా ఉన్నాయని ప్రజలు చెబుతున్నారు. ► మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ పేరిట నగరంలోని జూబ్లీహిల్స్, కేబీఆర్పార్క్, పంజగుట్ట, నాంపల్లి, నారాయణగూడ, చాదర్ఘాట్, అంబర్పేట, తార్నాక, ప్యాట్నీ ఈస్ట్మారేడ్పల్లి, మెట్టుగూడ, తదితర ప్రాంతాల్లో వెలసిన ఫ్లెక్సీలపై అందిన ఫిర్యాదులకు ఈ– చలానాలు జారీ చేశారు. ఒక్కో ఫ్లెక్సీకి రూ. 5వేల వంతున చలానాలు జారీ అయ్యాయి. ► హైటెక్సిటీలో ఎర్రగుడ్ల శ్రీనివాస్ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలకు రూ. 50 వేల వంతున రెండింటికి లక్ష రూపాయల చలానాలు జారీ చేశారు. పార్టీ జనరల్ సెక్రటరీ పేరిట ఏర్పాటైన వాటికి, పలు ప్రాంతాల్లో ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, తదితర డివిజన్ నాయకులు ఏర్పాటు చేసిన వాటికి పెనాల్టీలు విధించా రు. బుధవారం సాయంత్రం వరకు తలసానిపై ఇరవైకి పైగా, పార్టీ జనరల్సెక్రటరీపై దాదాపు ఇరవై ఫ్లెక్సీలకు ఈచలానాలు జారీ చేశారు. ► టీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ సతీష్రెడ్డి హుస్సేన్సాగర్లో బోట్కు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలకు రూ. 50వేలు, రూ.15వేలు వంతున రెండు ఈ– చలానాలు జారీ అయ్యాయి. గచ్చిబౌలిలో హోర్డింగ్లు ఏర్పాటు చేసిన శేరిలింగంపల్లికి చెందిన షేక్హమీద్కు లక్ష రూపాయల వంతున రెండు ఈ– చలానాలు జారీ చేశారు. ఈచలానాల జారీ ఇంకా కొనసాగుతుండటంతో కచ్చితంగా ఎంత మొత్తం అనేది తెలియడానికి సమయం పట్టనుంది. తగ్గేదేలే.. ► పెనాల్టీలు వేసినా తాము తగ్గేది లేదని, పార్టీపై.. అగ్రనాయకులపై తమ అభిమానానికి ఎవరూ అడ్డుకట్ట వేయలేరన్నట్లుగా పలువురు నేతలు గ్రేటర్ వ్యాప్తంగా విస్తృతంగా ఫ్లెక్సీలు తదితరమైన వాటితో స్వాగతాలు పలికారు. పెనాల్టీలు పడినా సరే అధిష్టానం దృష్టిలో పడితే చాలన్నట్లుగా కొందరు వీటిని ఏర్పాటు చేశారు. ► ట్విట్టర్ వేదిక ద్వారా కొందరు పౌరులు టీఆర్ఎస్ నేతలనుద్దేశించి వ్యాఖ్యానాలు చేశారు. ఫ్లెక్సీలు పెట్టుకున్నంత మాత్రాన లీడర్లు కారు అని అన్న మీరే ఇలా వ్యవహరించారేం? అని ప్రశ్నించారు. మేం నిబంధనలు పాటించాలి కానీ మీ పార్టీ పాటించవద్దా అని పేర్కొన్నారు. బెంగళూర్లో ఫ్లెక్సీలు, గుట్కా, ప్లాస్టిక్ను పూర్తిగా నిషేధించారని పోస్ట్చేశారు. వాతావరణం ఎప్పుడు ఎలా ఉంటదో తెలియని నగరంలో ఒక్కసారిగా గాలిదుమారం వీస్తే రోడ్డున పోయే వారి పరిస్థితి ఏమిటని ప్రశ్నించిన వారూ ఉన్నారు. -
మంత్రి కేటీఆర్ వరంగల్ పర్యటనలో టీఆర్ఎస్ నేతలకు జరిమానాలు
-
కేటీఆర్ పర్యటన.. టీఆర్ఎస్ నేతలకు షాకిచ్చిన వరంగల్ కార్పొరేషన్
సాక్షి, వరంగల్: మున్సిపల్, ఐటీ శాఖల మంత్రి కె. తారకరామారావు పర్యటన నేపథ్యంలో వరంగల్ మున్సిపల్కార్పొరేషన్ టీఆర్ఎస్ నేతలకు షాకిచ్చింది. అనుమతి లేకుండా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసినవారికి భారీ ఫైన్ విధించింది. వరంగల్ మేయర్ గుండు సుధారాణికి బల్దియా అధికారులు ఏకంగా రూ.2 లక్షలు జరిమానా విధించారు. టీఆర్ఎస్ నాయకులు కేశవరావుకు రూ.50 వేల జరిమానా విధించారు. కాగా, నేడు కేటీఆర్ వరంగల్, హన్మకొండ జిల్లాల్లో పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంఖుస్థాపనలు చేయనున్నారు. మంత్రి రాక నేపథ్యంలో ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు భారీ ఏర్పాట్లు చేశారు. జెండాలు, తోరణాలు, బ్యానర్లతో మడికొండ నుంచి వరంగల్ వరకు రోడ్లన్నీ గులాబీమయం అయ్యాయి. -
ప్రమాదకరంగా కటౌట్లు..!
శంషాబాద్ రూరల్: జాతీయ రహదారి, గ్రామ రహదారులపై ఏర్పాటు చేసిన కటౌట్లు ప్రమాదకరంగా మారాయి. మండలంలోని ముంచింతల్ శివారులో ని శ్రీరామనగరంలో ఇటీవల 12 రోజుల పాటు జరిగిన సహస్రాబ్ది ఉత్సవాల నేపథ్యంలో ఆయా రోడ్డు మార్గాల్లో స్వాగత తోరణాలు ఏర్పాటు చేశారు. వివిధ గ్రామాల్లోనూ.. బెంగళూరు జాతీయ రహదారితో పాటు గొల్లూరు, ముచ్చింతల్, బుర్జుగడ్డతండా, పెద్దషాపూర్తండా, పీ–వన్ మార్గాల్లో ఉత్సవ నిర్వాహకులతో పాటు రాజకీయ పార్టీ నేతలు భారీగా కటౌట్లు ఏర్పాటు చేశారు. ఉత్సవాలు ముగిసి వారం దాటినా ఇప్పటిదాకా వాటిని తొలగించడంలేదు. కటౌట్లు ఎప్పుడు విరిగి పడతాయోనని వాహనదారులు, స్థానిక గ్రామ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. తొలగింపులో నిర్లక్ష్యం.. రహదారులపై ఏర్పాటు చేసిన కటౌట్లను తొలగింపులో అటు ఉత్సవ నిర్వాహకులు..ఇటు పంచాయతీ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. కటౌట్ల ఏర్పాటుతో ఉత్సవాల సమయంలో సందర్శకులకు కొంత వరకు అటు వెళ్లే మార్గాలను సూచనలకు ఉపయోగపడ్డాయి. కానీ పూర్తయినా వెంటనే వాటిని తొలగించే బాధ్యత పంచాయతీలపై ఉన్నా..వారు అటు వైపు కన్నెత్తి కూడా చూడడం లేదని స్థానిక ప్రజలు మండి పడుతున్నారు. వాహనదారులకు ఇబ్బంది.. బుర్జుగడ్డతండాకు వెళ్లే రోడ్డు మార్గంలో జాతీయ రహదారి వద్ద ఏర్పాటు చేసిన కటౌటు విరిగింది. ఇది ఎప్పుడు ఊడి కింద పడుతుందో తెలియడం లేదు. వీటితో పాటు చాలా చోట్ల ఉన్న కటౌట్లు వాహనదారులకు ఇబ్బందిగా మారాయి. -
టీడీపీ కార్యకర్తల బరితెగింపు !
కంచికచర్ల(కృష్ణా జిల్లా): వైఎస్సార్ సీపీ నాయకుల ఫ్లెక్సీను చింపేసిన సంఘటన సోమవారం గొట్టుముక్కల గ్రామంలో వెలుగులోకి వచ్చింది. నూతన సంవత్సరం, సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ మాజీ సర్పంచ్ గుదే రంగారావు, ఎంపీటీసీ సభ్యురాలు గుదే సరస్వతి వైఎస్సార్ సీపీ నేతల ఫొటోలతో ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. ఇది జీర్ణించుకోలేని ఆకతాయిలు రాత్రి వేళ ఫ్లెక్సీని చింపివేశారు. చదవండి: AP: బండారుపై తిరగబడ్డ జనం.. వెళ్లవయ్యా.. వెళ్లు! 2014లో గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ నాయకుడు, మాజీ వార్డు సభ్యుడు ఆలోకం కృష్ణారావును చిన్నపాటి వివాదానికి టీడీపీ కార్యకర్తలు హత్య చేశారు. గతంలో మాజీ ఎంపీటీసీ సభ్యుడు గుదే అక్కారావుపై టీడీపీ నాయకులు హత్య ప్రయత్నం చేశారు. ఫ్లెక్సీని టీడీపీ నాయకులే ధ్వంసం చేసి ఉంటారని వైఎస్సార్ సీపీ నాయకులు భావిస్తున్నారు. -
కాంగ్రెస్ పార్టీలో వర్గవిభేదాలు
-
కాంగ్రెస్ పార్టీలో వర్గవిభేదాలు.. ఎంపీ ఫ్లెక్సీని కత్తిరించిన దుండగులు..
సాక్షి, మేడ్చల్: కాంగ్రెస్ పార్టీలో మరోసారి వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. మేడ్చల్ జిల్లాలో కోమడిరెడ్డితో పేరుతో ఉన్న ఫ్లెక్సీలను గుర్తుతెలియని దుండగులు కత్తిరించారు. కొంపల్లిలో ఈ నెల 9,10 తేదీల్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో.. శిక్షణా తరగతులను నిర్వహించనున్నారు. ఈ క్రమంలో.. ఎంపీ కోమటిరెడ్డి పేరుతో కాంగ్రెస్ నాయకుడు మహిపాల్రెడ్డి హోర్డింగ్లను ఏర్పాటు చేశారు. ఈ హోర్డింగ్లను గుర్తుతెలియని ఆగంతకులు కత్తిరించారు. ప్రస్తుతం ఈ సంఘటన స్థానికంగా కలకలంగా మారింది. అంతర్గత విభేదాల కారణంగా సొంత పార్టీ నాయకులే ఈ ఘటనకు పాల్పడి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
తెలంగాణాలో ఫ్లెక్సీ ఇష్యూ
-
ప్రచారం నేతలది.. ఖర్చు జీహెచ్ఎంసీది.. ఎలాగంటారా?
బంజారాహిల్స్: రాజకీయ నేతలు రోడ్లకిరువైపులా, కూడళ్లలో ఏర్పాటు చేస్తున్న ఫ్లెక్సీలు ప్రజల పాలిట శాపంగా మారుతున్నాయి. ఫ్లెక్సీలు ఏర్పాటు చేసే క్రమంలో ఫుట్పాత్, రోడ్లను సైతం ఆక్రమిస్తుండటంతో పాదచారులు రోడ్డుపై నడవాల్సిన దుస్థితి నెలకొంది. ముఖ్యంగా బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసే క్రమంలో ఫుట్పాత్లపై పెద్ద పెద్ద కర్రలు పెడుతూ ఇబ్బందులకు గురి చేస్తున్నారు. కూడళ్లలో చెట్లను తొలగించి, గడ్డిని సైతం తవ్వి ఏర్పాటు చేస్తున్నారు. రహదారుల పక్కన ఏర్పాటు చేస్తున్న ఫ్లెక్సీలతో అప్పుడప్పుడూ ప్రమాదాలు జరుగుతున్నాయని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత వారం బంజారాహిల్స్ రోడ్ నెం. 12లోని అగ్రసేన్ చౌరస్తాలో భారీ వర్షంలో వెళ్తున్న ఓ వ్యక్తిపై ఫ్లెక్సీ పడగా ఈ ఘటనలో బాధితుడు పోలీసులకు కూడా ఫిర్యాదు చేశాడు. (చదవండి: Huzurabad Bypoll: మాట ముచ్చట: అయిలన్నా.. ఏం నడ్తందే?) సొంత నిధులతో.. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో ప్రతి రోజూ ఏదో ఒకటి కొత్త కటౌట్లు భారీ ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తూనే ఉంటారు. ఈ వ్యవహారంపై నెటిజన్లు మండిపడుతూ జీహెచ్ఎంసీ అధికారులు, మంత్రి కేటీఆర్ను ట్యాగ్ చేస్తూ నిలదీస్తున్నారు. ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్న వారికి జరిమానాలు విధిస్తున్నామంటూ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు చెప్పుకొస్తున్నారు. అయితే.. ఇంత వరకు ఎవరి దగ్గర కూడా జరిమానాలు వసూలు చేసినట్లు కనిపించడం లేదు. ఆ కార్యక్రమం పూర్తయిన తర్వాత మాత్రం డీఆర్ఎఫ్ బృందాలు వచ్చి వాటిని తొలగిస్తున్నారు. కటౌట్లు ఏర్పాటు చేసిన నేత వాటిని తొలగించే ఖర్చు నుంచి తప్పించుకుంటుండగా జీహెచ్ఎంసీ డీఆర్ఎఫ్ బృందం మాత్రం తమ సొంత సిబ్బందితో వేలాది రూపాయలు ఖర్చు చేస్తూ వాటిని తొలగిస్తుండటం విమర్శలకు దారి తీస్తోంది. కటౌట్ పెట్టిన నేత వాటిని తొలగించే బాధ్యత కూడా ఆయనే తీసుకోవాల్సి ఉండగా జీహెచ్ఎంసీ పుణ్యమా అంటూ తొలగించే ఖర్చులు మిగులుతున్నాయి. (చదవండి: రంగారెడ్డిలో విషాదం.. టీకా తీసుకున్న కాసేపటికే..) -
కిషన్ రెడ్డి సభ.. కార్పొరేటర్కు షాకిచ్చిన జీహెచ్ఎంసీ
సాక్షి, హైదరాబాద్: రామాంతాపూర్ కార్పొరేటర్ బండారు శ్రీవాణికి గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) షాకిచ్చింది. నిబంధనలు ఉల్లంఘించి ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారని రూ.80వేల జరిమానా విధించింది. శనివారం హైదరాబాద్లో కిషన్రెడ్డి జన ఆశీర్వాద యాత్రకు ఆమె ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. దీంతో జీహెచ్ఎంసీ భారీ జరిమానా విధించింది. -
కౌశిక్రెడ్డికి షాకిచ్చిన జీహెచ్ఎంసీ.. భారీ జరిమానా
సాక్షి, సిటీబ్యూరో: కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లో చేరుతున్న సందర్భంగా పాడి కౌశిక్రెడ్డి పేరిట ఐటీ కారిడార్తోపాటు నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, జెండాలపై పలువురు రాజకీయ నాయకులు, ప్రజలు జీహెచ్ఎంసీ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు బాధ్యులకు జరిమానా విధించాలని పదుల సంఖ్యలో ట్వీట్ చేశారు. దీనిపై ఈవీడీఎం స్పందించింది. ఫ్లెక్సీలు, జెండాలు, బ్యానర్లు, హోర్డింగులను తొలగించడమే కాకుండా జరిమానాలు విధిస్తున్నట్లు పేర్కొంది. ఈ విషయంలో ఎవరిపైనా ఎలాంటి పక్షపాతం లేదని, చట్టం మేరకు పారదర్శకంగా పనిచేస్తున్నామని ఈవీడీఎం డైరెక్టర్ విశ్వజిత్ వారికి సమాధానమిచ్చారు. ఆయా ప్రాంతాల్లోని ఫ్లెక్సీలకు కౌశిక్రెడ్డికి పెనాల్టీలు విధిస్తూ ఈవీడీఎంలోని సెంట్రల్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం ఈ–చలానాలు జారీ చేసింది. ఒక్కో ఫ్లెక్సీకి రూ.5 వేల నుంచి మొదలుకొని లక్ష రూపాయల వరకు పెనాల్టీలు విధించింది. మొత్తం 4.56 లక్షల జరిమానా విధించినట్లు సమాచారం. మీ ఫిర్యాదు పరిశీలించామని, త్వరలోనే పెనాల్టీ విధిస్తామని ట్విట్టర్ ద్వారా పోస్ట్ చేసిన వారందరికీ సమాధానాలు పంపింది. ఫ్లెక్సీలపై సీఎం కేసీఆర్తోపాటు కేటీఆర్, హరీష్రావు, సంతోష్కుమార్, కవిత తదితరుల ఫొటోలుండటంతో చట్టం అమలులో జీహెచ్ఎంసీ కళ్లు మూసుకుందని కాంగ్రెస్ నేతలు దాసోజు శ్రవణ్, అంజన్కుమార్యాదవ్ విమర్శించారు. కారెక్కిన కౌశిక్ రెడ్డి.. హుజూరాబాద్ కాంగ్రెస్ మాజీ నేత పాడి కౌశిక్ రెడ్డి టీఆర్ఎస్లో చేరిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ తెలంగాణ భవన్లో కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. కౌశిక్ రెడ్డికి సీఎం కేసీఆర్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కౌశిక్తో పాటు అతని అనుచరులు కూడా కారెక్కారు. -
శ్మశానానికి దారి చూపుతూ నాయకుల ఫ్లెక్సీలు.. సిగ్గుందా మీకు!
సాక్షి, బెంగళూరు : కోవిడ్ పేరుతో ప్రచారం పొందాలని ప్రయత్నించిన బీజేపీ నేతలు చివరకు నెటిజన్లతో చివాట్లు పెట్టించుకున్న సంఘటన నెలమంగలలో చోటుచేసుకుంది. కోవిడ్ మృతుల అంత్యక్రియల కోసం అధికారులు నెలమంగల తాలూకా గిడ్డేనహళ్లి వద్ద ఉచితంగా ఏర్పాట్లు చేశారు. ఇక్కడే పబ్లిసిటీ పిచ్చితో నాయకులు ప్రధాని నరేంద్రమోదీ, సీఎం యడియూరప్ప, రెవెన్యూ మంత్రి ఆర్ అశోక్, బీడీఏ అధ్యక్షుడు ఎస్ఆర్ విశ్వనాథ్ తదితరుల ఫొటోలతో సోమవారం ఫ్లెక్సీ తయారు చేయించి శ్మశానానికి దారి...అంత్యక్రియలకు వచ్చేవారికి ఉచితంగా నీరు, కాఫీ, భోజనం ఏర్పాటు చేశామంటూ ప్రచారం చేసుకున్నారు. విషయం కాస్త పార్టీ పెద్దలకు తెలియడంతో నెలమంగల బీజేపీ నాయకులకు క్లాస్ తీసుకున్నారు. దీంతో సాయంత్రం సమయానికి ఫ్లెక్స్ తీయించేశారు. బీడీఏ అధ్యక్షుడు ఎస్ఆర్ విశ్వనాథ్ క్షమాపణలు కూడా చెప్పుకొచ్చారు. అయితే అప్పటికే ఈ విషయం నెట్టింట్లో చక్కర్లు కొట్టడంతో జనాలు.. ప్రధాని, సీఎం పరువు తీసేశారంటూ చీవాట్లు పెడుతున్నారు.ఫ్లెక్సీల్లో ప్రధాని నరేంద్ర మోదీతో పాటు సీఎం నవ్వుతూ ఉన్న ఫోటోలు వేయడంతో నెటిజన్లు ‘మీకు సిగ్గు, మర్యాద ఏమైనా ఉందా.. కరోనాతో శవరాజకీయాలు చేస్తారా’ అంటూ బీజేపీ నాయకులను తీవ్రంగా విమర్శిస్తున్నారు. -
లిఫ్ట్ అడిగి స్కూటర్పై.. ప్రాణం తీసిన ఫ్లెక్సీ
సాక్షి, చెన్నై: స్కూటర్పై వెళ్తున్న ఓ మహిళ ఫ్లెక్సీ రూపంలో ప్రాణాలు కోల్పోయారు. పుదుకోట్టై జిల్లా తిరుబువనం సమీపంలోని కరంపకుడి అమ్మనిపేటకు చెందిన స్వామికన్ను భార్య విజయరాణి మేల్మెట్టనూరులోని బంధువుల ఇంటికి వెళ్లారు. తిరుగుపయనంలో ఎంతకు బస్సు రాకపోవడంతో అటు వైపు స్కూటర్లో వచ్చిన యువకుడ్ని లిఫ్ట్ అడిగారు. అతడు లిఫ్ట్ ఇవ్వడంతో ఇద్దరు స్కూటర్పై అమ్మని పేటకు బయలుదేరారు. మార్గ మధ్యంలో ఓ చోట రవిచంద్రన్ అనే వ్యక్తి తన తండ్రి మరణించడంతో నివాళులర్పించే రీతిలో ఓ ఫ్లెక్సీ ఏర్పాటు చేసి ఉండడం, అది గాలికి స్కూటర్పై పడడం చోటుచేసుకుంది. స్కూటర్ వెనుక ఉన్న విజయరాణిపై ఫ్లెక్సీ పడడంతో ఆమె రోడ్డుపై పడ్డారు. తీవ్రంగా గాయపడ్డ ఆమెను ఆస్పత్రికి తరలించగా మరణించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. రెండేళ్ల క్రితం చెన్నైలో అన్నాడీఎంకే వర్గాలు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ పడి రోడ్డుపై స్కూటర్లో వెళ్తున్న ఓ యువతి మరణించిన విషయం తెలిసిందే. -
కేటీఆర్ ఫైర్.. 20 వేల జరిమానా
ఎర్రగడ్డ : ఎవరు ఇక్కడ ఫ్లెక్సీ ఏర్పాటు చేసింది...నగరంలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయవద్దని చెప్పాం కదా...అయినా ఎందుకు ఏర్పాటు చేశారంటూ మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎర్రగడ్డ డివిజన్ పరిధిలోని సుల్తాన్నగర్బస్తీ ప్రాంతంలో శుక్రవారం మంత్రి కేటీఆర్ బస్తీ దవాఖానాను ప్రారంభించారు. ఇందుకోసం మద్యాహ్నం 12 గంటల సమయంలో అక్కడకు కేటీఆర్ కారు దిగగానే రోడ్డుకు అడ్డంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని చూసి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫ్లెక్సీని తొలగిస్తే తప్ప తాను బస్తీ దవాఖానాను ప్రారంభించేది లేదని అధికారులకు తెలిపారు. అప్పటికప్పుడు జీహెచ్ఎంసీ సర్కిల్–19 డీఎంసీ రమేష్ను, ఏఎంఓహెచ్ డాక్టర్ బిందును పిలిపించి వివరాలు తెలుసుకున్నారు. ఫ్లెక్సీని ఏర్పాటు చేయించిన స్థానిక కార్పొరేటర్ షహీన్ బేగంకు అప్పటికప్పుడు రూ.20 వేలు జరిమానాను విధించారు. ఇందుకు సంబంధించిన రసీదును అధికారులు కార్పొరేటర్కు అందజేశారు. అనంతరం మంత్రి కేటీఆర్ స్థానికంగా ఏర్పాటు చేసిన దవాఖానాను ప్రారంభించారు. నగర మేయర్ బొంతు రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు. -
‘బాబు ఇంత పతనమవుతాడనుకోలేదు’
సాక్షి, అమరావతి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబుపై మరోసారి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వైఎస్సార్ సీపీ కార్యకర్తలు ప్లెక్సీలు కట్టుకోవడంపై అభ్యంతరం తెలిపిన చంద్రబాబును ట్విటర్ వేదికగా దుయ్యబట్టారు. ఈమేరకు ఆయన బుధవారం ట్వీట్ చేస్తూ.. ‘వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఫ్లెక్సీలు కట్టుకోవద్దట. కళ్లలో నిప్పులు పోసుకుంటున్నాడు. నువ్వు నెలనెలా బిచ్చమేస్తేనే ప్రజలు బతుకుతున్నారనుకుంటున్నావా బాబూ? ఎవడబ్బ సొమ్మని ఫ్లెక్సీలు కడతారని చించుకుంటున్నావు. 14 ఏళ్లు సీఎంగా చేసినోడివి ఇంతగా పతనమవుతావని అనుకోలేదు’ అని మండిపడ్డారు.(ఏమైంది 40 ఇయర్స్ ఇండస్ట్రీకి..?: విజయసాయిరెడ్డి) మరో ట్వీట్లో.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి నాలుగు నెలల్లోనే రివర్స్ టెండర్ విధానంలో రూ.2000 కోట్ల ప్రజా ధనాన్ని ఆదా చేశారని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. బాబు అధికారంలో ఉంటే 15% ఎక్సెస్లు, నామినేషన్లతో పనులు కట్టబెట్టి రూ.15 వేల కోట్లు దోచుకునేవాడని విమర్శించారు. పరిపాలన అంటే లూటీ చేయడమే అతని ఫిలాసఫీ అని ఎద్దేవా చేశారు. ఇప్పుడు ఎవరేంటి అనేది ప్రజలకు తెలిసిపోయిందని ఆయన పేర్కొన్నారు. -
సీఎం ఫెక్ల్సీకి.. పెనాల్టీ!
సాక్షి, సిటీబ్యూరో: సీఎం బర్త్డే సందర్భంగా మొక్కలు నాటుదాం అంటూ పిలుపునిస్తూ ఫెక్ల్సీ ఏర్పాటు చేసినందుకు ఖైరతాబాద్ జోనల్ కమిషనర్(జెడ్సీ) ప్రావీణ్యకు సోమవారం జీహెచ్ఎంసీ ఈవీడీఎం విభాగం రూ.10 వేలు ఈ–చలానా జారీ చేసింది. గోల్కొండ కోట సమీపంలో సీఎం ఫోటోలతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తూ ఉల్లంఘనలకు పాల్పడ్డారని పేర్కొంటూ చలాన్లు జారీ చేశారు. దీనిపై కమిషనర్తో మాట్లాడి తదుపరి నిర్ణయం తీసుకుంటానని ప్రావీణ్య తెలిపారు. ఈ విషయంపై కమిషనర్ను సంప్రదించగా, బ్యానర్లు క్లాత్వా, ఫ్లెక్సీలా అనేది పరిశీలించి నిర్ణయం తీసుకుంటామన్నారు. తాము క్లాత్వి ఏర్పాటు చేయాల్సిందిగా అధికారులకు సూచించామన్నారు. ఒకవేళ ఫ్లెక్సీలైతే పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. కాగా గోల్కొండ కోట వద్ద ఇలాంటి ప్రచారం ఫెక్ల్సీలు ఏంటని ఓ సంస్థ ట్విట్టర్లో ఫిర్యాదు చేయడం వల్లే చలానా విధించారని తెలిసింది. -
కార్పొరేటర్కు రూ.5,000 జరిమానా
అమీర్పేట: రోడ్లపై ఫ్లెక్సీలు కట్టినందుకు జీహెచ్ఎంసీ అధికారులు అమీర్పేట కార్పొరేటర్ నామన శేషుకుమారికి రూ.5,000 జరిమానా విధించారు. సోమవారం మంత్రులు వేములు ప్రశాంత్రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ ఎస్ఆర్నగర్కు వచ్చిన సందర్భంగా వారికి ఆహ్వానం పలుకుతూ కార్పొరేటర్ పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి హాజరైన జోనల్ కమిషనర్ ముషారఫ్ అలీ ఫ్లెక్సీలు కట్టినందుకు గాను కార్పొరేటర్కు జరిమానా విధించారు. అందుకు సంబంధించిన రసీదును కార్పొరేటర్కు అందజేశారు. -
‘ఇంకెంత మంది శుభశ్రీలు చనిపోవాలి’
చెన్నై : అధికార పార్టీకి చెందిన హోర్డింగ్ కారణంగా మృతి చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ శుభశ్రీ ఉదంతం పట్ల నటుడు, మక్కల్ నీది మయ్యం అధినేత కమల్ హాసన్ తీవ్రంగా స్పందించారు. ప్రభుత్వ నిర్లక్ష్యం, రాజకీయ నాయకుల ప్రచారానికి ఇంకెంత మంది శుభశ్రీలు చనిపోవాలని ప్రశ్నించారు. శుక్రవారం కమల్ మీడియాతో మాట్లాడుతూ...’అసలు ఈ రాజకీయ నాయకులకు ఎక్కడ బ్యానర్లు పెట్టాలి. ఎక్కడ పెట్టాలో తెలియదా. కనీస ఇంగిత ఙ్ఞానం కూడా లేదు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ఇప్పటికే శుభశ్రీ, రఘు వంటి ఎంతో మంది మృత్యువాత పడ్డారు. వాళ్ల తల్లిదండ్రుల బాధ ఎలా ఉంటుందో మీకు తెలుసా. ఇద్దరు ఆడపిల్లల తండ్రిగా వారి వేదనను నేను అర్థం చేసుకోగలను. కానీ ప్రభుత్వంలో మాత్రం ఎటువంటి మార్పు లేదు. ఈ విషయాల గురించి వారిని ప్రశ్నించినా..నిజాలు మాట్లాడినా నాలుక కోస్తామని హెచ్చరిస్తారు. అటువంటి వాళ్లను అసలు పట్టించుకోవడమే మానేశాను. ప్రజా సమస్యల గురించి కచ్చితంగా ప్రశ్నించి తీరతా’ అని పేర్కొన్నారు.(చదవండి : నిషేధంతో బతుకు ప్రశ్నార్థకం) అదే విధంగా ప్రజలు కూడా ఇవన్నీ భరిస్తూ మౌనంగా ఉండాల్సిన అవసరం లేదని పేర్కొంటూ...‘ కలకాలం బానిసల్లా బతుకుదామని అనుకుంటే మీకంటే పిచ్చివాళ్లు ఎవరూ ఉండరు. పాలకులు మిమ్మల్ని బానిసల్లా చేసి ఆడుకుంటున్నారు. సాధారణ ప్రజల వల్ల ఏమతుందిలే అనే ధీమాతో ఉన్నారు. అయితే మీరంతా ఎంతో ధైర్యవంతులని, కొత్త నాయకత్వాన్ని ఎన్నుకుని వారికి బుద్ధి చెప్పి.. సరికొత్త నాయకులను ఎన్నుకుంటారని నాకు నమ్మకం ఉంది. ప్రభుత్వాన్ని ప్రశ్నించండి. కొత్త నాయకత్వాన్ని ఎన్నుకోండి అని కమల్ పిలుపునిచ్చారు. కాగా వారం రోజుల క్రితం పల్లావరం సమీపంలో బ్యానర్ మీద పడడం, వెనుక వచ్చిన లారీ మీదకి ఎక్కడంతో శుభశ్రీ అనే టెకీ మరణించిన విషయం విదితమే. దీంతో హైకోర్టు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేయడంతో అధికారులు పరుగులతో ఎక్కడికక్కడ బ్యానర్లు, ఫ్లెక్సీలను తొలగించే పనిలో పడ్డారు. అనుమతులు లేకుండా వాటిని ఏర్పాటు చేసిందుకు గాను 650 మందిపై కేసులు నమోదయ్యాయి. -
శుభశ్రీ మరణం.. నిషేధం అమల్లోకి!
సాక్షి, చెన్నై: తమిళనాట బ్యానర్లు, ఫ్లెక్సీల నిషేధం వ్యవహారం డిజిటల్ ప్రింటింగ్ రంగంలో ఉన్న వారి బతుకును ప్రశ్నార్థకం చేసింది. ఏడు లక్షల మంది రోడ్డున పడే అవకాశం ఉందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. దీంతో డిజిటల్ ప్రింటింగ్ రంగాన్ని క్రమబద్ధీకరించి, అనుమతులు ఇచ్చిన చోట మాత్రమే బ్యానర్లు, ఫ్లెక్సీల ఏర్పాటుకు తగ్గ చర్యలు తీసుకోవాలన్న విజ్ఞప్తులు పెరిగాయి. ఈ నేపథ్యంలో వర్తక సంఘం నేత విక్రమరాజా నేతృత్వంలోని బృందం సీఎం పళనిస్వామిని కలిసి విన్నవించుకున్నారు. బ్యానర్లు, ఫ్లెక్సీలను నిషేధించాలని పలు దఫాలుగా హైకోర్టు హెచ్చరించినా, ఆగ్రహం వ్యక్తం చేసినా పట్టించుకున్న వాళ్లే లేరు. ఎక్కడ బడితే అక్కడ ఇష్టానుసారంగా ఫ్లెక్సీలు, బ్యానర్లు ప్రత్యక్షం అవుతూనే వచ్చాయి. ఈ పరిస్థితుల్లో ఐదు రోజుల క్రితం పల్లావరం సమీపంలో బ్యానర్ మీద పడడం, వెనుక వచ్చిన లారీ తొక్కించడం వంటి పరిణామంతో శుభశ్రీ అనే యువతి మరణించిన విషయం విదితమే. దీంతో హైకోర్టు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేయడంతో అధికారులు పరుగులతో ఎక్కడికక్కడ బ్యానర్లు, ఫ్లెక్సీలను తొలగించే పనిలో పడ్డారు. అనుమతులు లేకుండా వాటిని ఏర్పాటు చేసిందుకు గాను 650 మందిపై కేసులు కూడా పెట్టారు. ఈ క్రమంలో బ్యానర్లు, ఫ్లెక్సీలు నిషేధం అమల్లోకి వచ్చినట్టుగా పరిస్థితి మారింది. అలాగే, డీఎంకే సైతం తాము అనుమతి లేనిదే ఏర్పాటు చేయబోమని స్పష్టం చేస్తూ కోర్టులో ప్రమాణ పత్రం కూడా సమర్పించింది. దీంతో రాష్ట్రంలో ఉన్న డిజిటల్ ప్రింటింగ్ వర్గాల్లో ఆందోళన బయలు దేరింది. ఈ రంగాన్ని నమ్ముకుని ఏడు లక్షల మంది మేరకు ఉన్నారు. వీరందరి పరిస్థితి, ఇక రోడ్డున పడ్డట్టేనా అన్నట్టుగా మారింది. (చదవండి : ఫ్లెక్సీలపై ఇంత వ్యామోహమా ?) సీఎంతో భేటీ.. డిజిటల్ ప్రింటింగ్ను ఆదుకునే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి ఆ అసోషియేషన్లు విజ్ఞప్తి చేసే పనిలో పడ్డాయి. ఈ నేపథ్యంలో బుధవారం సీఎం పళని స్వామిని వర్తక సంఘాల నేత విక్రమరాజా నేతృత్వంలో ప్రతినిధులు కలిసి విజ్ఞప్తి చేశారు. ఆయనకు ఓ వినతి పత్రం అందజేశారు. స్మార్ట్ సిటీ పథకం మేరకు దుకాణాల తొలగింపు.. తాజాగా బ్యానర్లు, ఫ్లెక్సీల ఏర్పాటు నిషేధం అంశాలను గుర్తు చేస్తూ, డిజిటల్ ప్రింటింగ్ రంగంలో ఉన్న వారిని ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. డిజిటల్ ప్రింటింగ్ను క్రమబద్ధీకరించి, ఒకే గొడుగు కిందకు తీసుకురావాలని.. అదే విధంగా అనుమతి ఉన్న చోట మాత్రమే ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటుకు తగ్గట్టుగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. శుభశ్రీ కుటుంబానికి సాయం.. బ్యానర్ రూపంలో విగత జీవిగా మారిన శుభశ్రీ కుటుంబానికి పరామర్శలు వెల్లువెత్తుతున్నాయి. డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ ఆ కుటుంబాన్ని పరామర్శించారు. పార్టీ తరఫున రూ.5లక్షలు సాయం అందజేశారు. స్టాలిన్ మాట్లాడుతూ బ్యానర్లు, ఫ్లెక్సీల సంస్కృతికి డీఎంకే వ్యతిరేకమని, అయితే, నాయకులు, కార్యకర్తలు ఇష్టానుసారంగా ఏర్పాటు చేయడాన్ని కట్టడిచేసే విధంగా ముందుకుసాగామని తెలిపారు. ఇక, ఆ సంస్కృతికి పూర్తిగా వ్యతిరేకమని, ఇందుకు తగ్గట్టు తాము కోర్టుకు ప్రమాణపత్రం కూడా సమర్పించినట్టు పేర్కొన్నారు. -
హృదయాలను పిండేసిన శుభశ్రీ మరణం
సాక్షి ప్రతినిధి, చెన్నై: ‘ఇంటిలో పెళ్లి, జన్మదినం, వివాహ వార్షికోత్సవం, మరణం... ఒక్క మాటలో చెప్పాలంటే శుభం, అశుభం ఏది జరిగినా ఫ్లెక్సీలతో ఆర్భాటానికి పోతారా. భార్యాభర్తలు విడాకులు తీసుకునేపుడు మినహా అన్ని కార్యాలకు ఫ్లెక్సీలు, బ్యానర్లపై ఇంత వ్యామోహమా’ ఈ మాటలు అన్నది ఎవరో కాదు సాక్షాత్తు మద్రాసు హైకోర్టు న్యాయమూర్తులు. మహిళా ఇంజినీర్ శుభశ్రీ దారుణ మరణం రాష్ట్ర ప్రజల హృదయాలను పిండేసింది. ప్రజలు ప్రతిపక్షాల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ప్రజల ప్రాణాలంటే అధికారులకు అంతచులకనా అంటూ మద్రాసు హైకోర్టు సైతం తీవ్రంగా మండిపడింది. చెన్నై క్రోంపేట భవానీనగర్కు చెందిన శుభశ్రీ (23) దురైపాక్కంలోని ఒక ఐటీ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజినీరుగా పనిచేస్తోంది. గురువారం సాయంత్రం 3 గంటల సమయంలో విధులు ముగించుకుని తన బైక్లో ఇంటికి బయలుదేరారు. క్రోంపేట–దురైపాక్కం రేడియల్ రోడ్డు మార్గంలో పల్లికరణైలో ఆమె ప్రయాణిస్తుండగా అన్నాడీఎంకే ప్రముఖుడు జయగోపాల్ కుమారుని వివాహ వేడుక సందర్భంగా దారిపొడవునా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలలోని ఒకటి తెగి రోడ్డుపై పడడం శుభశ్రీ దానికింద ఇరుక్కోవడం, వెనుకనే వస్తున్న టాంకర్ లారీ ఆమెపై నుంచి వెళ్లి పోయి శుభశ్రీ ప్రాణాలు విడవడం క్షణాల్లో జరిగిపోయింది. పోలీసులు కేసు నమోదు చేసి ట్యాంకర్ లారీ డ్రైవర్ మనోజ్ (25)ను అరెస్ట్చేశారు. ప్రమాదం చోటుచేసుకోగానే జయశంకర్ పారిపోగా అతనిపై పోలీసులు కేసుపెట్టారు. కన్నీరుపెట్టిన రాష్ట్ర ప్రజలు ఒకరి వివాహ వేడుక మరొకరి ప్రాణాలు తీయడం, శుభశ్రీ ఉజ్వలభవిష్యత్తు టాంకర్ చక్రాల కిందనలిగిపోవడం రాష్ట్ర ప్రజల హృదయాలను కలచివేసింది. ఇదిలా ఉండగా, న్యాయవాదులు లక్ష్మీనారాయణన్, కణ్ణదాసన్...న్యాయమూర్తులు సత్యనారాయణన్, శేషసాయిల ముందు హాజరై ఈ దారుణ ఉదంతాన్ని వివరించారు. నిబంధనలకు విరుద్ధంగా అన్నాడీఎంకే నేత జయశంకర్ ఆర్భాటంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, ట్యాంకర్ డ్రైవర్ నిర్లక్ష్యం ఒక నిండు ప్రాణాన్ని హరించివేసిందని పేర్కొంటే కేసు నమోదు చేశారు. ప్రజల ఆస్తికి నష్టం కలిగించాడనే సెక్షన్ కింద జయశంకర్పై బలహీనమైన కేసును నమోదు చేశారని ఆరోపించారు. ఈ అన్యాయాన్ని కోర్టు సుమోటాగా స్వీకరించి విచారణ చేపట్టాలని వారు కోరారు. న్యాయమూర్తులు మాట్లాడుతూ ఫ్లెక్సీలు, బ్యానర్లు పెట్టడంపై ఇప్పటికే పలు ఆదేశాలను జారీచేశామని అన్నారు. అయితే అధికారులు అమలు చేయడం లేదు. మానవ రక్తం పీల్చే జలగల్లా తయారయ్యారు. మద్రాసు హైకోర్టు ఆదేశాలను ధిక్కరిస్తున్నారు. సచివాలయాన్ని హైకోర్టుకు మార్చాలనే ఆదేశాలు మినహా అన్నిరకాల ఆదేశాలు జారీచేశాం. రాజకీయ నేతల మెప్పు కోసం కార్యకర్తలు కట్టే ఫ్లెక్సీలు పెడుతున్నారు. ప్రాణాలు కోల్పోయిన వారికి రూ.2లక్షలు లేదా రూ.3లక్షలు నష్టపరిహారం ఇస్తున్నారేగానీ ఇలాంటి దయనీయ సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టడం లేదు. పల్లికరణైలో బ్యానర్లు, ఫ్లెక్సీలు కట్టేందుకు అనుమతించిన పోలీసు, కార్పొరేషన్ అధికారులు న్యాయస్థానంలో హాజరుకావాలని న్యాయమూర్తులు ఆదేశించారు. చదవండి: యువతిని బలిగొన్న బ్యానర్ అన్నాడీఎంకే, డీఎంకే ఆంక్షలు పార్టీ నిర్వహించే బహిరంగ సభలు, కార్యక్రమాలకు కట్ అవుట్, బ్యానర్లు ఏర్పాటు చేసే పార్టీ నేతలు, కార్యకర్తలపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నాడీఎంకే సమన్వయ కమిటీ కన్వీనర్ ఓ పన్నీర్సెల్వం, కో కన్వీనర్ ఎడపాడి పళనిస్వామి, డీఎంకే అధ్యక్షులు స్టాలిన్ హెచ్చరించారు. ముగిసిన అంత్యక్రియలు ప్రమాద వార్త అన్ని మాధ్యమాల్లో పెద్ద ఎత్తున ప్రచారం కావడంతో శుభశ్రీ ఇంటి వద్దకు పెద్ద సంఖ్యలో ప్రజలు చేరిపోయారు. పోస్టుమార్టం ముగిసిన తరువాత ఇంటికి చేరిన కుమార్తె మృతదేహాన్ని చూసి తల్లిదండ్రులు, బంధువులు కన్నీరుమున్నీరయ్యారు. శోకతప్త హృదయాల మధ్య శుక్రవారం సాయంత్రం శుభశ్రీ అంత్యక్రియలు ముగిసాయి. శుభశ్రీ ఫొటోల ముందు క్యాండిళ్లు వెలిగించి పలుచోట్ల ఘనంగా నివాళులర్పించారు. శుభశ్రీ కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. -
జనసేన కార్యకర్తల అరాచకం
సాక్షి, పశ్చిమగోదావరి : వీరవాసరంలో జనసేన కార్యకర్తలు అరాచకం సృష్టిస్తున్నారు. వీరవాసరంలో వినాయకచవితి సందర్భంగా గ్రామానికి చెందిన నూకల కనకారావు, మద్దాల సత్యనారాయణమూర్తి, నూకల కిరణ్, కందుల సురేష్ తదితరులు భీమవరం ఎమ్మెల్యే గ్రంధిశ్రీనివాస్, ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి తదితరులతో కూడిన ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. వీరవాసరం ఎస్బీహెచ్ సమీపంలో ఉన్న ఫ్లెక్సీని జనసేన కార్యకర్తలు బ్లేడ్లతో కోసి ధ్వంసం చేశారు. ఎన్నికల సమయంలోనూ జనసేన కార్యకర్తలు ఇస్టానుసారంగా వ్యవహరిస్తూ ఓటర్లను భయభ్రాంతులకు గురిచేశారు. పవన్ కల్యాణ్ పుట్టిన రోజు వేడుకలను పురస్కరించుకుని మోటార్ సైకిళ్ల సైలెన్సర్లు తీసి గట్టిగా కేకలు వేస్తూ, మనుషులపైకి దూసుకెళ్తూ ర్యాలీలు నిర్వహించారు. జన సైనికులు, కార్యకర్తలు చేస్తున్న ధ్వనికాలుష్యం, ఫ్లెక్సీ ధ్వంసం వంటి కార్యక్రమాలపై మండల ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫ్లెక్సీని బ్లేడ్లతో కోసి ధ్వంసం చేయడంపై మండల వైఎస్సార్సీపీ శ్రేణులు వీరవాసరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాయి. బాధ్యులను గుర్తించి విచారణ చేపడతామని వీరవాసరం ఎస్సై బి.మహేశ్వరరావు తెలిపారు. -
ఖాకీలకు ఫైన్
గోల్కొండ: అనుమతి లేకుండా ఫ్లెక్సీ ఏర్పాటు చేసిన గోల్కొండ పోలీసులకు బల్దియా అధికారులు జరిమానా విధించారు. గురువారం గోల్కొండ కోట బోనాల సందర్భంగా గోల్కొండ పోలీస్స్టేషన్ సిబ్బంది అమ్మవారి చిత్రంతో పాటు డీజీపీ, నగర పోలీస్ కమిషనర్తో పాటు ఇతర పోలీస్ ఉన్నతాధికారుల ఫొటోలతో కూడిన ఫ్లెక్సీని కోట వద్ద ఏర్పాటు చేశారు. ఈ విషయం బల్దియా అధికారులకు తెలియడంతో వెంటనే డిప్యూటీ కమిషనర్ పబ్లిక్ స్థలంలో ఫ్లెక్సీ ఏర్పాటు చేసినందుకు గోల్కొండ ఎస్హెచ్ఓకు రూ.10 వేల జరిమానా విధించారు. -
గ్రామాల్లో రగులుతున్న ఫ్లెక్సీల రగడ
సాక్షి, బాపట్ల(గూంటూరు) : గతంలో ఎన్నడూ లేని విధంగా బాపట్ల నియోజకవర్గంలో ఫ్లెక్సీలు చించే సంస్కృతికి తెరతీశారు. డెప్యూటీ స్పీకర్ కోన రఘుపతి నిర్వహిస్తున్న గ్రామసభల్లో భాగంగా ఆయా గ్రామాలకు వెళ్లేటప్పుడు స్వాగతం పలుకుతు ఆయా గ్రామాల్లోని పార్టీ నాయకులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను కొందరు స్వార్ధపరులు కావాలనే చింపుతూ గ్రామాల్లో రాజకీయ రగడకు చిచ్చుపెడుతున్నారు. గ్రామసభలకు ముందు రోజు కానీ, గ్రామసభల తర్వాత రోజైనా తప్పనిసరిగా ఆయా గ్రామాల్లోని ఫ్లెక్సీలు తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. బాపట్ల మండలంలోని హైదరపేట, గోపాపురం, కర్లపాలెం మండలంలోని చింతాయపాలెం, బుద్దాం గ్రామాల్లో ఇటీవల ఇదే రీతిలో ఫ్లెక్సీలు తొలగించారు. ఇదిలా ఉండగా తాజాగా ఆదివారం మండలంలోని పూండ్ల గ్రామంలో ఫ్లెక్సీలను చింపారని, గ్రామాల్లో అల్లర్లు సృష్టించేందుకు ప్రయత్నించే అవకాశాలుండాయంటూ పూండ్ల గ్రామానికి చెందిన కుమ్మరి నాగరాజు ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై సీఐ శ్రీనివాసరెడ్డిను వివరణ కోరగా గ్రామాల్లో ఫ్లెక్సీలు తొలగిస్తున్న మాట వాస్తవమే. అయితే అవి ఆకతాయిల చేష్టలా లేక కావాలనే కొందరు వ్యక్తులు ఇలా చేస్తున్నారే అనే కోణంలో విచారిస్తున్నాం. వీటికి కారకులైన వారిని మాత్రం కఠినంగా శిక్షిస్తాం అన్నారు. -
అవే తిప్పలు!
సాక్షి,సిటీబ్యూరో: మరో వారం రోజుల్లో రుతుపవనాలు సిటీని పలకరించనున్నాయి. ఈదురుగాలులు భారీగా వీచే ప్రమాదం పొంచి ఉంది.. ఈ తరుణంలో మెట్రో రైళ్లకు భారీ హోర్డింగ్లు, యూనిపోల్స్ వాటిపైనున్న ఫ్లెక్సీలు గండంలా పరిణమించాయి. ఈదురుగాలులు వీచిన ప్రతిసారి ఫ్లెక్సీలు ఎగిరిపోయి మెట్రో ఓవర్హెడ్ విద్యుత్ తీగలపై పడుతుండడంతో తరచూ రైళ్లకు బ్రేకులు పడుతున్నాయి. ఎల్భీనగర్–మియాపూర్, నాగోల్–హైటెక్సిటీ రూట్లలో ఇలాంటివి ఏకంగా 95 భారీహోర్డింగ్లు, యూనిపోల్స్ మెట్రో రైళ్లకు శాపంగా మారాయి. వీటిని తొలగించాలని కోరుతూ హైదరాబాద్ మెట్రో రైలు వర్గాలు బల్దియా అధికారులకు పలుమార్లు విన్నవించినప్పటికీ ఫలితం కనిపించడం లేదు. ఈ విషయమై బల్దియా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల ప్యారడైజ్–బేగంపేట్ మార్గంలో ఓ భారీ ఫ్లెక్సీ చిరిగి మెట్రో మార్గంలోని ఓవర్హెడ్ విద్యుత్ తీగలపై పడడంతో మెట్రో రైళ్లు 20 నిమిషాల పాటు నిలిచిపోయాయి. ఓవర్హెడ్ విద్యుత్ తీగలపై పడిన ఫ్లెక్సీలను తొలగించడం మెట్రో రైలు అధికారులకు కత్తిమీద సాములా మారింది. హైటెన్షన్ తీగలు కావడం ..25 కెవి విద్యుత్ ప్రసారం అవుతుండటంతో సుమారు 5 కి.మీ మార్గంలో విద్యుత్ సరఫరాను నిలిపివేయాల్సి వస్తోంది. దీంతో సుమారు 20–30 నిమిషాల పాటు అనేక వ్యయప్రయాసలకోర్చి ఫ్లెక్సీలను తొలగించాల్సి వస్తోందని మెట్రో అధికారులు పేర్కొంటున్నారు. దీంతో ఆయా రూట్లలో మెట్రో రైళ్లు తరచూ నిలిచిపోతుండడంతో ప్రయాణీకుల విలువైన సమయం సైతం వృథా అవుతుండడం గమనార్హం. అనుభవాల నుంచి పాఠాలు నేర్వని వైనం.. గతంలో తార్నాక, మెట్టుగూడా, అమీర్పేట్, బేగంపేట్ తదితర ప్రాంతాల్లో భారీ హోర్డింగ్లకున్న ఫెక్సీలు చిరిగిపోయి మెట్రో రైలు ఓవర్హెడ్ విద్యుత్ తీగలపై పడ్డాయి. దీంతో ఆయా మార్గాలపై అధ్యయనం చేసిన మెట్రో రైలు అధికారులు సుమారు 95 భారీ హోర్డింగ్లు, యూనిపోల్స్ను గుర్తించారు. వీటిని వేరొకచోటికి తరలించాలని బల్దియా అధికారులకు పలుమార్లు విన్నవించారు. అయితే సదరు అధికారుల నిర్లక్ష్యం కారణంగా మెట్రో రైళ్ల రాకపోకలకు తరచూ అంతరాయం ఏర్పడుతోంది. ప్రయాణీకుల విలువైన సమయం వృథా అవుతోంది. తక్షణం ఆయా రూట్లలో భారీ హోర్డింగ్లు, యూనిపోల్స్ను తొలగించాలని మెట్రో ప్రయాణీకులు,హెచ్ఎంఆర్ అధికారులు కోరుతున్నారు. గతంలో మున్సిపల్ మంత్రిగా పనిచేసిన కేటీఆర్ సైతం వీటిని తొలగించాలని బల్దియా యంత్రాంగానికి సూచించినప్పటికీ ఫలితం లేకపోవడం గమనార్హం. కాంబి టికెట్పై వీడని సందిగ్ధం... ఆర్టీసీబస్సులు, ఎంఎంటీఎస్ రైళ్లు, మెట్రో రైళ్లలో ప్రయాణించేందుకు వీలుగా కాంబిటికెట్ ప్రవేశపెట్టే అంశంపై ఆయా విభాగాలు మల్లగుల్లాలు పడుతున్నాయి. దీంతో కాంబిటిక్కెట్ అంశంపై నెలకొన్న సందిగ్ధం వీడడంలేదు. ఈ కాంబి టికెట్తో తమకు భారీగా నష్టం వాటిల్లుతుందని..ఇప్పటికే పీకల్లోతు కష్టాల్లో ఉండటంతో ఆర్టీసీ వర్గాలు విముఖంగా ఉన్నట్లు తెలిసింది. ఏడు కోట్లు దాటిన మెట్రోప్రయాణికులు.. మెట్రో ప్రయాణీకులు ఏడు కోట్ల మార్క్ను దాటారు. గ్రేటర్ నగరంలో 2017 నవంబరు 29 నుంచి మెట్రో రాకపోకలు ప్రారంభమయ్యాయి. నాటి నుంచి నేటి వరకు సుమారు ఏడు కోట్ల మంది మెట్రో రైళ్లలో రాకపోకలు సాగించినట్లు హెచ్ఎంఆర్ వర్గాలు తెలిపాయి. ప్రతివారం ఐదు వేల చొప్పున ప్రయాణికుల సంఖ్యలో పురోగతి ఉన్నట్లు పేర్కొన్నాయి. కాగా ప్రస్తుతం నాగోల్–హైటెక్సిటీ, ఎల్భీనగర్–మియాపూర్ రూట్లో నిత్యం 3 లక్షల మంది మెట్రో జర్నీ చేస్తున్నారని తెలిపాయి. అధికారుల అంచనాల ప్రకారం ఈ రెండు రూట్లలో నిత్యం 6 లక్షలమంది రాకపోకలు సాగిస్తారని మెట్రో ప్రారంభానికి ముందు అంచనా వేయగా..అందులో సగం మార్కును దాటకపోవడం గమనార్హం. ఈ ఏడాది చివర్లో జేబీఎస్–ఎంజీబీఎస్ రూట్లో వాణిజ్యకార్యకలాపాలు మెట్రో ప్రారంభించనున్నట్లు పేర్కొన్నాయి. లాస్ట్మైల్ కనెక్టివిటీకి అవే తిప్పలు.. ఇక మెట్రో స్టేషన్ల నుంచి తమ గమ్యస్థానాలకు చేరుకునేందుకు ప్రయాణీకులకు కష్టాలు తప్పడంలేదు. స్టేషన్లలో దిగి క్యాబ్లు, ఆటోల్లో ఇంటికి చేరుకునేందుకు రూ. వందల్లో ఖర్చు చేయాల్సి వస్తోంది. మెట్రో ఛార్జీలకంటే ఈ బాదుడు రెట్టింపు స్థాయిలో ఉంది. ఉదాహరణకు ఎల్భీనగర్ నుంచి మెట్రోరైలులో మియాపూర్ మెట్రో స్టేషన్లో దిగిన వ్యక్తి అక్కడి నుంచి లింగంపల్లికి క్యాబ్లో బయలుదేరితే సుమారు రూ.200 చెల్లించాల్సి వస్తోంది. మెట్రో టిక్కెట్ ఛార్జీ రూ.60 కాగా..క్యాబ్ చార్జీ అంతకు మూడింతలకు పైగానే ఉండడం గమనార్హం. గతంలో మెట్రో స్టేషన్ల నుంచి సమీప కాలనీలు, బస్తీలకు మెర్రీ గో అరౌండ్ బస్సులను నడపాలని నిర్మాణ సంస్థ ఎల్అండ్టీ ప్రతిపాదనలు సిద్ధం చేసినప్పటికీ ఆచరణలో సాధ్యపడలేదు. దీంతో సిటీజన్లకు లాస్ట్మైల్ కనెక్టివిటీ తిప్పలు తప్పడంలేదు. -
కమలంలో కలకలం
సికింద్రాబాద్/చిలకలగూడ: భారతీయ జనతా పార్టీలో విభేదాలు రచ్చకెక్కాయి. కేంద్ర మంత్రి కిషన్రెడ్డి నగరానికి వస్తున్న సందర్భంగా ఒక నాయకుడు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను మరో నాయకుడు చించేయడం ఇందుకు కారణమైంది. ఈ వ్యవహారం పోలీసు కేసుల వరకు వెళ్లింది. అసలే అంతంతమాత్రం కేడర్ కలిగిన పార్టీలో ఉన్న కొద్దిపాటి నాయకులు బజారున పడి ఫ్లెక్సీలు చించుకోవడం పట్ల కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తొలిసారి నగరానికి వస్తున్న సందర్భంగా చిలకలగూడ కూడలి నుంచి వారాసీగూడ వరకు గత ఎన్నికల్లో సికింద్రాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీచేసిన బండపల్లి సతీష్కుమార్ స్వాగత తోరణాలు ఏర్పాటు చేశారు. సదరు ఫ్లెక్సీల్లో తన ఫొటో లేదన్న కారణంగా సికింద్రాబాద్ నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జి రవిప్రసాద్గౌడ్, అతడి కుమారుడు సాయిగౌడ్ ఫ్లెక్సీలను కొడవళ్లతో చించేశారని బండపెల్లి సతీష్ చిలకలగూడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా తన అంతు తేలుస్తానని రవిప్రసాద్ బెదిరించినట్లు సతీష్ ఆరోపించారు. సాంకేతిక కారణాలతో అతడి ఫొటోను ఫ్లెక్సీలో పెట్టలేకపోయామని అంతమాత్రాన ఫ్లెక్సీలను చించివేయడం తగదన్నారు. కాగా గత ఎన్నికల్లో బండపెల్లి సతీష్కు పూర్తి సహకారం అందించానని రవిప్రసాద్గౌడ్ పేర్కొన్నాడు. సీనియర్ నాయకుడైన తన ఫొటోను ఫ్లెక్సీలో లేనందునే వాటిని చించివేసినట్లు తెలిపారు. తన ఇల్లు, కార్యాలయం ముందు తన ఫొటోలు లేని ఫ్లెక్సీలను కట్టిన బండపల్లి సతీష్ అనుచరులు తమను రెచ్చగొడుతున్నారన్నారు. బండపెల్లి సతీష్ ఫిర్యాదు మేరకు రవిప్రసాద్గౌడ్, సాయిప్రసాద్గౌడ్, సందీప్, ఉపేందర్లపై కేసులు నమోదు చేసినట్లు ఇన్స్పెక్టర్ బాలగంగిరెడ్డి తెలిపారు. -
మెట్రో రైళ్లకు ఫ్లెక్సీల గండం..
సాక్షి, సిటీబ్యూరో: మెట్రో రైళ్లకు ఫ్లెక్సీలు గండంగా మారాయి. తరచూ రాకపోకలకు అంతరాయం కలిగిస్తున్నాయి. ఈదురుగాలులు వీచినప్పుడు ఫ్లెక్సీలు ఎగిరిపోయి మెట్రో ఓవర్హెడ్ విద్యుత్ తీగలపై పడుతుండడంతో రైళ్లకు బ్రేకులు పడుతున్నాయి. ఇందుకు కారణమవుతున్న భారీ హోర్డింగ్లు, యూనిపోల్స్ ఎల్బీనగర్–మియాపూర్, నాగోల్–హైటెక్ సీటీ రూట్లలో ఏకంగా 95 ఉన్నాయి. వీటిని తొలగించాలని హైదరాబాద్ మెట్రో రైలు (హెచ్ఎంఆర్) అధికారులు ఇప్పటికే పలుమార్లు జీహెచ్ఎంసీకి విన్నవించినప్పటికీ ఫలితం లేకుండా పోతోంది. హోర్డింగ్లు, యూనిపోల్స్ను తరలించే విషయంలో బల్దియా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. తాజాగా ఆదివారం ఈదురు గాలులకు ఓ భారీ ఫ్లెక్సీ ఎగిరొచ్చి ప్యారడైజ్ – బేగంపేట్ మార్గంలోని మెట్రో ఓవర్హెడ్ విద్యుత్ తీగలపై పడింది. దీంతో మెట్రో రైళ్లు 20 నిమిషాలు నిలిచిపోయాయి. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఓవర్హెడ్ విద్యుత్ తీగలపై పడుతున్న ఫ్లెక్సీలను తొలగించడం మెట్రో రైలు అధికారులకు కత్తిమీద సాములా మారింది. ఇవి హైటెన్షన్ (25 కేవీ) తీగలు కావడంతో దాదాపు 5 కి.మీ మార్గంలో విద్యుత్ సరఫరా నిలిపేయాల్సి వస్తోంది. 20–30 నిమిషాలు శ్రమించి ఫ్లెక్సీలను తొలగించాల్సి వస్తోందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలా తరచూ జరుగుతుండడంతో అటు ప్రయాణికులు, ఇటు అధికారులు ఇబ్బందులకు గురవుతున్నారు. గతంలోనూ... గతంలో తార్నాక, మెట్టుగూడ, అమీర్పేట్, బేగంపేట్ తదితర ప్రాంతాల్లో భారీ హోర్డింగ్లకు ఉన్న ఫ్లెక్సీలు చిరిగిపోయి మెట్రో రైలు ఓవర్హెడ్ విద్యుత్ తీగలపై పడ్డాయి. దీంతో ఆయా మార్గాలపై అధ్యయనం చేసిన మెట్రో రైలు అధికారులు సుమారు 95 భారీ హోర్డింగ్లు, యూనిపోల్స్ను గుర్తించారు. వీటిని వేరొ చోటుకు తరలించాలని బల్దియా అధికారులకు విన్నవిస్తూ లేఖలు రాశారు. కానీ జీహెచ్ఎంసీ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ వాటికి స్పందించలేదు. దీంతో తరచూ మెట్రో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. ప్రయాణికుల విలువైన సమయం వృథా అవుతోంది. తక్షణం ఆయా రూట్లలో భారీ హోర్డింగ్లు, యూనిపోల్స్ను తొలగించాలని ప్రయాణికులు, హెచ్ఎంఆర్ అధికారులు కోరుతున్నారు. గతంలో మున్సిపల్ మంత్రిగా పని చేసిన కేటీఆర్ సైతంవీటిని తొలగించాలని బల్దియా యంత్రాంగానికి సూచించినప్పటికీ ఫలితం లేకపోవడంగమనార్హం. -
అమలు కాని ఎన్నికల కోడ్
సాక్షి, చాట్రాయి: ఎన్నికల కోడ్ సందర్భంగా గ్రామాల్లో రాజకీయ పార్టీలకు చెందిన ఫ్లెక్సీలు, ప్రభుత్వ పథకాల ఫ్లెక్సీలు, బోర్డులు తొలగించాలని ఎన్నికల కమిషన్ జారీ చేసిన ఆదేశాలు అధికారులకు కానరావడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. మండలంలోని చాలా గ్రామాల్లో ప్రభుత్వ ప«థకాలకు సంబంధించిన బోర్డులపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మంత్రుల ఫోటోలు దర్శనమిస్తున్నాయి. చాలా గ్రామాల్లో నిర్మించిన సీసీ రోడ్ల సమాచారం కోసం ఏర్పాటు చేసిన శిలాఫలకాలకు పసుపు రంగు వేశారు. ఆ రోడ్లు స్థానిక టీడీపీ నాయకులు ఏర్పాటు చేయడం, వేసిన పసుపు రంగు టీడీపీకీ చెందడంతో ఆ రంగును తొలగించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. -
ఫ్లెక్సీలు కళకళ.. కోడ్ వెలవెల!
సాక్షి, కోనాయపాలెం (చందర్లపాడు) : ఎన్నికల నగారా మోగింది. ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చింది. వచ్చే నెల 11న ఎలక్షన్స్ జరగనున్నాయి. అయినప్పటికీ కోనాయపాలెం గ్రామంలో తెలుగుదేశం పార్టీ బ్యానర్లు దర్శనమిస్తూనే ఉన్నాయి. జెడ్పీటీసీ సభ్యుడు వాసిరెడ్డి ప్రసాద్ ఇంటి ముందు పింఛన్లు, సంక్రాంతి కానుకలతో కూడిన బ్యానర్ను ఏర్పాటు చేశారు. హరిజనవాడలోని వాటర్ ట్యాంకు వద్ద, అంగన్వాడీ కేంద్రం వద్ద తెలుగుదేశం ప్రభుత్వం చేసిన పనుల వివరాల జాబితాను రాశారు. ఎలిమెంటరీ పాఠశాల (చిన్నైస్కూల్) వద్ద చంద్రబాబు, లోకేష్ బొమ్మలతో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు ప్రచార పట్టికలు దర్శనమిస్తున్నాయి. ఇవి గ్రామంలోని జనసమర్థం ఉండే ప్రధాన రహదారుల వెంబడి ఉన్నప్పటికీ అధికారులు వీటిని తొలగించలేదు. ఎన్నికల నియమావళికి లోబడి అధికారులు వ్యవహరిస్తారో లేదో చూడాల్సి ఉంది. ఒత్తిళ్లకు తలొగ్గి వీటిని తొలగించని పక్షంలో సంబంధిత అధికారులపై ఎలక్షన్ కమిషన్కు ఆధారాలతో సహా ఫిర్యాదు చేస్తామని గ్రామస్తులు చెబుతున్నారు. మరి వీటిని తొలగిస్తారో లేదో వేచిచూడాల్సి ఉంది. తోటరావులపాడులో ఇలా.. తోటరావులపాడు గ్రామ ఎంట్రన్స్లో హైస్కూల్కు వెళ్లే ప్రధాన మార్గానికి ఎన్టీర్ మార్గ్ పేరు పెట్టి పెద్ద ఆర్చిని నిర్మించారు. ఈ ఆర్చికి ఎన్టీఆర్, చంద్రబాబు, లోకేష్, తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యేలు దేవినేని వెంకటరమణ, తంగిరాల ప్రభాకరరావు ఫొటోలు ఏర్పాటు చేశారు. ఈ ఫొటోల డూమ్లలో లైటింగ్ ఏర్పాటు చేయడంతో పగలు, రాత్రి తేడా లేకుండా కాంతివంతంగా ప్రకాశిస్తున్నాయి. ఏటూరు గ్రామానికి వెళ్లే ఆర్అండ్బీ రహదారి వెంబడే ఈ ఆర్చి ఉండటం విశేషం. ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చినప్పటికీ అధికారులు ఈ ఆర్చికి అమర్చిన టీడీపీ నాయకుల ఫొటోలు కనపడకుండా ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం విశేషం. -
కోడ్ కూసినా తొలగని బాబు చిత్రాలు!
సాక్షి, కావలి: నియోజకవర్గంలో చంద్రబాబు చిత్రాలతో కూడిన ఫ్లెక్సీలు, హోర్డింగ్లు . ఆదివారం సాయంత్రం నుంచి ఎన్నికల నిబంధనలు అమల్లోకి వచ్చినా అధికారులు తొలగించలేదు. ఎన్నికల కమిషన్ స్పష్టంగా ప్రకటించినప్పటికీ, కావలిలోని అధికారులు మాత్రం సోమవారం సాయంత్రానికి కూడా టీడీపీ నాయకుల సేవల్లో ఉంటూ నిద్రమత్తు వీడలేదు. బాహాటంగా కనిపిస్తున్న చంద్రబాబు చిత్రాలతో కూడిన హోర్డింగ్లను తొలిగించే విషయంలో అధికారులు నిర్లక్ష్యంగా ఉన్నారు. దీంతో అసలు కావలిలో ఎన్నికల కోడ్ అమల్లో ఉందా లేదా అనే అనుమానాలు తలెత్తేలా పరిస్థితులు ఉన్నాయి. వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న కావలి రెవెన్యూ డివిజన్కు మొట్టమొదటిసారి ఐఏఎస్ అధికారి చామకూరు శ్రీధర్ను సబ్ కలెక్టర్గా నియమితులయ్యారు. ఆయన సారథ్యంలో కావలి అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే ఆయన కార్యాలయం ప్రవేశ ద్వారం వద్ద, ఆయన నివాసం ఉండే బంగ్లా ఎదురుగానే చంద్రబాబు హోర్డింగ్లు ఉన్నప్పటికీ వాటిని తొలిగించలేదు. ఐఏఎస్కు ఎంపికై మొట్టమొదటి పోస్టింగ్గా కావలి సబ్ కలెక్టర్గా బాధ్యతలు నిర్వహిస్తున్న చామకూరు శ్రీధర్ వ్యవహారశైలిపై తొలి నుంచి కూడా విమర్శలు, ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో నియోజకరవర్గం సంగతి పక్కన పెడితే ఆయన కార్యాలయంతో పాటు ఆయన చుట్టూ ఉన్న ప్రభుత్వ కార్యాలయాల వద్ద కూడా చంద్రబాబు హోర్డింగ్లు ఉన్నప్పటికీ వాటిని తొలిగించే పని చేయకపోవడం పట్ల అధికార వర్గాల్లోనే విస్మయం వ్యక్తమవుతోంది. -
కోడ్ కూత వినబడలేదా.!
సాక్షి ప్రతినిధి కడప: ఆదివారం సాయంత్రమే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. అధికారులంతా ఎన్నికల కమిషన్ నియమావళికి లోబడి విధి నిర్వహణ చేపట్టాలి. ఇకపై ఎన్నికలు ముగిసే వరకూ ప్రతి అడుగు నియమావళికి అనుగుణంగా ఉండాలి. కాగా ఎన్నికల కమిషన్కు దీటుగా జిల్లా యంత్రాంగం స్పీడు అందుకోలేకుంది. జిల్లా కేంద్రంలో ఇబ్బడి ముబ్బడిగా ప్రభుత్వ ప్రచార హోర్డింగ్లు దర్శనమిస్తున్నాయి. కేవలం ఓటర్లను ప్రలోభపర్చేందుకు ఏర్పాటు చేసినట్లుగా కన్పిస్తున్న హోర్డింగ్లు అలాగే తిష్ట వేశాయి. కడప నగరంలోని కోటిరెడ్డి సర్కిల్, సంధ్య సర్కిల్, ఆర్టీసీ బస్టాండ్, నాగరాజుపేట, అప్సర సర్కిల్, పాతబస్టాండ్, ఏడు రోడ్ల సర్కిల్ ఇలా నగరమంతా హోర్డింగ్లు హోరెత్తుతున్నాయి. తక్షణమే వాటిని తొలగించాల్సిన యంత్రాంగం ఆ దిశగా ప్రయత్నాలే చేపట్టకపోవడంపై ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. జిల్లా కేంద్రంలోనే కోడ్ అమలు తీరు ఇలా ఉంటే ఇక మారుమూల ప్రాంతాల్లో పరిస్థితి ఏమిటని ప్రజాస్వామిక వాదులు ప్రశ్నిస్తున్నారు. -
యథేచ్ఛగా టీడీపీ కోడ్ ఉల్లంఘన
సాక్షి, అమరావతి బ్యూరో/సాక్షి, నెట్వర్క్: సార్వత్రిక ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నా.. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో యథేచ్ఛగా కోడ్ ఉల్లంఘన జరుగుతోంది. ఈ విషయంలో చర్యలు తీసుకోవాల్సిన అధికారులు ఇంకా మొద్దు నిద్ర వీడడం లేదనే విమర్శలొస్తు న్నాయి. ఇప్పటికే పలు జిల్లాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉంది. ఆదివారం నుంచి సార్వత్రిక ఎన్నికల కోడ్ వచ్చి చేరింది. అయితే అధికారులు ఇంకా అధికార పార్టీ నేతల అడుగులకు మడుగులొత్తుతున్నారు. ప్రభుత్వ ప్రచార ప్రకటనల్లో సీఎం, మంత్రుల ఫొటోలు తొలగించాల్సి ఉన్నా తాత్సారం చేస్తున్నారు. ప్రతి నియోజకవర్గంలో ఇంకా సీఎం ఫొటోలతో కూడిన ఫ్లెక్సీలు దర్శనమి స్తున్నాయి. నిబంధనల మేరకు రాజకీయ నాయకుల విగ్రహాలకు ముసుగు వేయాల్సి ఉంది. ఇతర పార్టీల నాయకుల విగ్రహాలకు ముసుగు వేస్తున్న అధికారులు.. ‘అధికార’ పార్టీ నేతల విగ్రహాలకు మినహాయింపు ఇస్తున్నారనే ఆరోపణలొస్తున్నాయి. ప్రతిపక్ష పార్టీ ఫ్లెక్సీలు మాత్రమే తొలగింపు సీఎం చంద్రబాబు, రాష్ట్ర మంత్రులు, ఇతర పార్టీ నేతల ఫ్లెక్సీలను తొలగించడంలో అలసత్వం ప్రదర్శిస్తున్న ప్రభుత్వ యంత్రాంగం ప్రతిపక్ష వైఎస్సార్సీపీ నాయకుల ఫ్లెక్సీలు, బ్యానర్లను ఎమ్మెల్సీ కోడ్ వచ్చిన వెంటనే తొలగించారు. ప్రభుత్వ కార్యాలయాల్లో మహాత్మ గాంధీ, అంబేడ్కర్, రాష్ట్రపతి, గవర్నర్ ఫొటోలను మాత్రమే ఉంచి.. సీఎం, మంత్రి తదితరుల ఫొటోలను తొలగించాలి. కానీ ప్రభుత్వ కార్యాలయాల్లో ఇంకా ఫొటోలు దర్శనమిస్తుండడం గమనార్హం. అన్న క్యాంటీన్లలో మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్, ప్రస్తుత సీఎం చంద్రబాబు ఫొటోలను తొలగించే ధైర్యం అధికారులకు లేకపోయింది. మంత్రి ఆనందబాబు ఎన్నికల కోడ్ ఉల్లంఘన నిబంధనల ప్రకారం సంక్షేమ పథకాలకు సంబంధించిన పనిముట్లను లబ్ధిదారులకు అందజేయకూడదు. అయితే మంత్రి నక్కా ఆనందబాబు ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించి గుంటూరు జిల్లా యడవూరు మండలంలోని పదిహేను గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు ఆదివారం రాత్రే కుట్టు మిషన్లను పంపిణీ చేయించారు. ఈ సారి ఎన్నికల్లో టీడీపీ పార్టీ తరఫున మంత్రి నక్కా ఆనందబాబుకు ఓటెయ్యాలని హామీ తీసుకున్నారు. రోడ్ల నిర్మాణం.. గుంటూరు జిల్లాలో యథేచ్ఛగా కోడ్ ఉల్లంఘన జరుగుతూనే ఉంది. అధికార పార్టీ నాయకులు కొత్తగా రోడ్డు నిర్మాణ పనులు చేపట్టడం, మహిళలకు కుట్టుమిషన్లు పంపిణీ చేయడం తదితర కార్యక్రమాలు చేసేస్తున్నారు.ప్రభుత్వ పథకాలకు చెందిన హోర్డింగులు, స్టిక్కర్లు ఎప్పటిలాగే దర్శనమిస్తున్నాయి. శ్రీకాకుళం జిల్లాలో.. శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలంలోని పూండి–గోవిందపురం గ్రామంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల మంజూరుకు సంబంధించి ఎమ్మెల్యే గౌతు శ్యామసుందర శివాజీని అభినందిస్తూ టీడీపీ నేతలు సోమవారం సభ ఏర్పాటు చేశారు. పలాస ఎమ్మెల్యే శివాజీ కుమార్తె గౌతు శిరీష, ఆయన అల్లుడు వెంకన్న చౌదరి దర్జాగా సన్మాన కార్యక్రమంలో పాల్గొని ఎన్నికల సంఘానికి ఝలక్ ఇచ్చారు. కోటబొమ్మాళి మండలం కొత్తపేట కొండ పోరంబోకు స్థలంలో టీడీపీకి చెందిన కార్యకర్తలకు ఇళ్ల స్థలాల పట్టాలు ఇవ్వడమే కాకుండా పాత తేదీలతో పొజిషన్ సర్టిఫికెట్లు జారీ చేశారని కొత్తపేట మాజీ సర్పంచి ఆర్.ముకుందరెడ్డి టెక్కలి ఆర్డీవోకు ఫిర్యాదు చేశారు. వీరఘట్టం మండలంలో ‘బడికొస్తా’ పథకంలో భాగంగా 8, 9వ తరగతులు చదువుతున్న బాలికలకు గతంలో అందించాల్సిన సైకిళ్లను సోమవారం పంపిణీ చేశారు. చిత్తూరు జిల్లాలో .. తిరుమల తిరుపతి దేవస్థానంలో అధికారపార్టీ నాయకుల సిఫార్సు లేఖలకు అధికార యంత్రాంగం దర్శనాలు కల్పిస్తోంది. తిరుపతి నగరంలోని ఆర్టీసీ బస్సులపై ప్రభుత్వ సంక్షేమ పథకాలు, ప్రచారాలకు సంబంధించిన చిత్రాలు తొలగించలేదు. ఇక ఫైబర్నెట్ కేంద్రాల వద్ద ముఖ్యమంత్రి చిత్ర పటాలతో ఉన్న బ్యానర్లు, ఫ్లెక్సీలు ఇంకా తీయలేదు. తిరుచానూరు పంచాయతీ కార్యాలయం ఎదురుగా అన్న క్యాంటీన్ నిర్మాణ పనులను సోమవారం ప్రారంభించారు. మీకెందుకు సార్.. ‘పచ్చ’పాతం.. రాజమహేంద్రవరం నగరంలోని జాంపేట వైఎస్సార్సీపీ కార్యాలయం వద్ద పార్టీ బ్యానర్లపై పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి, దివంగతనేత వైఎస్ రాజశేఖరరెడ్డి చిత్రాలు ఉన్నాయంటూ బ్యానర్లు తొలగించాలని హడావుడి చేసిన అధికారులు.. టీడీపీ కార్యాలయం వద్ద స్వామి భక్తి ప్రదర్శించారు. అక్కడ సీఎం చంద్రబాబు, రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఫొటోలు ఉన్నప్పటికీ వాటి జోలికి వెళ్లకపోవడంపై జనం మండిపడుతున్నారు. టీడీపీ కార్యాలయంపైన చంద్రబాబు, గోరంట్ల ఫొటోలున్నా పట్టించుకోని అధికారులు ఏ అధికారీ పట్టించు‘కోడ్’.. కాకినాడ నగరంలోని జగన్నాథపురం వంతెన దిగువ భాగంలో ప్రభుత్వం బీసీ కులస్తులకు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలంటూ భారీ ఎత్తున ఫ్లెక్సీ బోర్డులు ఏర్పాటు చేశారు. అయినా కాకినాడ నగరపాలక అధికార యంత్రాంగం మాత్రం మొద్దు నిద్ర వీడడం లేదు. కర్నూలు జిల్లాలో.. ఆత్మకూరు పట్టణంలో టీడీపీ నాయకులు ఇళ్ల పట్టాలు ఇస్తామంటూ పేదలను పిలిపించుకుని స్థానిక మైనార్టీ కాలనీలో సోమవారం సమావేశం ఏర్పాటు చేశారు. ఈ విషయం తెలుసుకున్న తహసీల్దార్ భరత్కుమార్ అక్కడికి వెళ్లేలోపు అందరూ జారుకున్నారు. వెల్దుర్తి మండలం రామళ్లకోటలో సీబీఎన్ ఆర్మీ పేరుతో వాహనాలు వినియోగించి ప్రచారం చేపట్టారు. కొలిమిగుండ్లలో చెత్తబుట్టలు పంపిణీ చేసి..పట్టపగలే కోడ్ ఉల్లంఘించారు. -
టీడీపీ ప్రచారార్భాటం.. ప్రజలపైనే భారం
పశ్చిమగోదావరి , భీమవరం: అధికార పార్టీ ఆర్భాట ప్రచారం పట్ట ణాలు, గ్రామాల్లో మునిసిపల్, గ్రామ పంచాయతీ సిబ్బందికి ప్రాణసంకటంగా మారింది. విచ్చల విడిగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, బ్యానర్లు ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో వీటిని తొలగించాల్సిన బాధ్యత సిబ్బందిపై పడింది. రెండు రోజులుగా జిల్లా వ్యాప్తంగా పట్టణాలు, గ్రామాల్లో ప్రభుత్వ సిబ్బంది ప్రజావసరాలు తీర్చే పనులను పక్కన పెట్టి ఫ్లెక్సీలు, బ్యానర్లు తొలగించే చర్యలు చేపట్టారు. అడుగడుగునా అధికార పార్టీ ఫ్లెక్సీలు టీడీపీ ప్రభుత్వం కొన్నేళ్లుగా ప్రజలను ఆకట్టుకోవడానికి సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోంది. దీంతో తెలుగుతమ్ముళ్లు తామేమీ తక్కువ కాదంటూ పుట్టినరోజులు, పండుగల పేరుతో పట్టణాలు, గ్రామాల్లో అడుగడుగునా ఫ్లెక్సీలు, బ్యానర్లు కడుతున్నారు. దీనిలో భాగంగా ఇతరులు తమతో పోటీ పడకుండా ఉండడానికి ఇతర నాయకులు ఫ్లెక్సీలు, బ్యానర్లు కట్టకుండా అడ్డుకట్ట వేస్తున్నారు. దీనిలో భాగంగానే పాలకొల్లు పట్టణంలో ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, ఎమ్మెల్సీ అంగర రామ్మోహనరావు ఫ్లెక్సీలు కట్టకుండా అడ్డుకున్నారంటూ పెద్ద ఎత్తున వివాదం చెలరేగింది. ఈ పంచాయితీ ముఖ్యమంత్రి చంద్రబాబు వరకు వెళ్లింది. ఒక్క పాలకొల్లులోనే కాకుండా ఇటువంటి వివాదాలు జిల్లా వ్యాప్తంగా అనేకం చోటుచేసుకున్నాయి. నిబంధనలకు విరుద్దంగా ఎటువంటి పన్ను చెల్లించకుండా ఇష్టం వచ్చినట్లు ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నా చర్యలు తీసుకోవాల్సిన అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తూ నాయకుల మన్ననలు పొందేం దుకు పాకులాడుతున్నారు. విచ్చలవిడిగా ప్రధాన కూడళ్లు, రోడ్లు వెంబడి,రోడ్డు మలుపుల్లోను ఫ్లెక్సీలు, బ్యానర్లు కట్టడడంతో ఎదరు వచ్చే వాహనాలు కనిపించక ప్రమాదాలు జరిగిన సంఘటనలు అనేకం ఉన్నాయి. తొలగింపు భారం ప్రజలపైనే రాష్ట్ర ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు, చోటా మోటా నాయకులు తమ అవసరాలకు, ఆర్భాటాలు, పేరు ప్రతిష్టల కోసం ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, బ్యానర్లు ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన కారణంగా పూర్తిగా తొలగించాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. దీంతో రెండు రోజులుగా మునిసిపల్, పంచాయతీ సిబ్బంది ఇతర పనులను పక్కన పెట్టి మరీ వీటిని తొలగించే కార్యక్రమంలో నిమగ్నమయ్యారు. అలాగే కొన్ని చోట్ల ఏర్పాటు చేసిన దివంగత నేతల విగ్రహాలకు ముసుగులు వేస్తున్నారు. తొలగించిన ఫెక్సీలు, బ్యానర్లను తరలించడానికి మునిసిపాల్టీలు ,పంచాయతీలు ప్రజాధనాన్ని ఖర్చు చేస్తున్నాయి. ప్రజల అవసరాలు తీర్చాల్సిన సిబ్బంది రాజకీయ నాయకుల ఆర్భాటాల కోసం ఏర్పాటుచేసినవాటిని తొలగించే పనిలో నిమగ్నమయ్యారు. నిబంధనలకు విరుద్ధంగా ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటుచేసే వారి నుంచే ఖర్చును రాబట్టే చర్యలు తీసుకుంటే ఇష్టారాజ్యంగా కట్టేవారు అదుపులో ఉంటారని, అలా కాకుండా ప్రభుత్వ సిబ్బంది తొలగించడం వల్ల ఫ్లెక్సీలు, బ్యానర్లు తిరిగి దర్శనమిచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇప్పటికైనా అధికారులు ఎటువంటి అనుమతులు లేకుండా ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేసేవారిపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. సిబ్బందికి ప్రాణ సంకటం ఫ్లెక్సీలను విద్యుత్ తీగల దగ్గర, కాలువలు, డ్రెయిన్లు వెంబడి ఎతైన ప్రదేశాల్లోను ఏర్పాటు చేయడంతో వాటిని తొలగించడానికి సిబ్బంది తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఫ్లెక్సీలకు ఐరన్ గొట్టాలు వాడడం వల్ల పొరపాటున విద్యుత్ తీగలపై పడితే పెను ప్రమాదం తప్పదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అలాగే భారీ ఫ్లెక్సీలను ఎతైన ప్రాంతం నుంచి కిందకు దించడం, కాలువలు, డ్రెయిన్ల పక్కన తొలగించే సమయంలో ప్రమాదాలు సంభవించే అవకాశం ఉందని ఆందోళన చెందుతున్నారు. -
ప్రాణం తీసిన ఫ్లెక్సీ
శ్రీకాకుళం, పాలకొండ: ఆ కుటుంబానికి ఒక్కడే కుమారుడు.. డిగ్రీ వరకూ చదువుకుని స్వయం ఉపాధి పొందుతూ తల్లిదండ్రులకు చేదోడువాదోడుగా ఉంటున్నాడు. ప్రతి రోజు గ్రామం నుంచి పాలకొండ వచ్చి నెట్ సెంటర్ నడుపుతూ అందరి వద్ద మంచి పేరు సంపాదించుకున్నాడు. సరదాగా సాగిపోతున్న ఆ కుటుంబంలో ఫ్లెక్సీ తీరని శోకం మిగిల్చింది. చేతికి అందుకు వచ్చిన కుమారుడ్ని కాటికి తీసుకుపోయింది. పాలకొండ నగర పంచాయతీ పరిధిలోని కోటదుర్గమ్మ ఆలయం వద్ద గురువారం మధ్యాహ్నం విద్యుత్ షాక్కు గురై యువకుడు మృతి చెందగా, మరొకరికి గాయాలయ్యాయి. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వీరఘట్టం మండలం తలవరం గ్రామానికి చెందిన చందక వెంకటరావు, గౌరీశ్వరిల కుమారుడు చందక జగదీష్(30) డిగ్రీ చదువుకుని ఉపాధి కోసం కోటదుర్గమ్మ ఆలయం సమీపంలో మేడపై ఇంటర్నెట్ సెంటర్ నిర్వహిస్తున్నాడు. ఎప్పటిలాగే గురువారం షాపు వచ్చి పనులు చేసుకుంటున్నాడు. షాపునకు అడ్డంగా టీడీపీ నాయకులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని తొలగించేందుకు సిద్ధమయ్యాడు. అదే గ్రామానికి చెందిన స్నేహితుడు లావేటి ప్రసాద్ సహాయంతో ఫ్లెక్సీని తొలగిస్తుండగా పక్కనే ఉన్న 33 కేవీ విద్యుత్ లైన్ జగదీష్కు తాకింది. దీంతో అక్కడికి అక్కడే మేడపైన పడి మృతిచెందాడు. జగదీష్ను పట్టుకునేందుకు ప్రయత్నించిన ప్రసాద్కు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే స్పందించి ప్రసాద్ను పాలకొండ ఏరియా ఆస్పత్రికి తరలించారు. అతనికి ఎడమ చేయి వేళ్లు కాలిపోయి, వీపుపై బలమైన గాయాలు కావడంతో మెరుగైన చికిత్స కోసం శ్రీకాకుళం రిమ్స్కు తరలించారు. జగదీష్ మృతదేహాన్ని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. వైద్యులు రవీంద్రకుమార్ పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు మృతదేహం అప్పగించారు. ఎస్సై వాసునారాయణ కేసు నమోదు చేశారు. ఇష్టారాజ్యంగా ఫ్లెక్సీల ఏర్పాటు.. నగర పంచాయతీలో ఫ్లెక్సీలను ఇష్టారాజ్యంగా ఏర్పాటు చేశారు. టీడీపీ నాయకులు అయితే షాపులు, విగ్రహాలను కప్పి మరీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు. ఏ చిన్న కార్యక్రమం జరిగినా కోటదుర్గమ్మ ఆలయం కూడా కనిపించకుండా బ్యానర్లు కడుతున్నారు. దీంతో నిత్యం ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. -
శునకం కోసం..
టీ.నగర్ ,చెన్నై: కనిపించకుండా పోయిన శునకం ఆచూ కీ తెలపాలంటూ యజమాని ఫ్లెక్సీలు ఏర్పాటుచేశాడు. ఆచూకీ తెలిపిన వారికి నగదు బహుమతి అందజేయనున్నట్లు ప్రకటించాడు. కోయంబత్తూరు వడవల్లికి చెందిన దీపక్ (45) వ్యాపారం చేస్తుంటారు. ఈయన ఆరు నెలలుగా శునకాన్ని పెంచుకుంటూ వచ్చాడు. శునకం గత జనవరి 24 నుంచి కనిపించకుండా పోయింది. అనేక చోట్ల గాలించినా ఫలితం లేదు. దీపక్ ప్రస్తుతం దీని ఆచూకీ కోసం నగరమంతటా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశాడు. అంతేకాకుండా ఒక టెంపోలో శునకం ఫొటోతో కూడిన ఫ్లెక్సీ నగరమంతటా సంచరిస్తోంది. శునకం ఆచూకీ తెలిపిన వారికి నగదు అందజేయనున్నట్లు దీపక్ తెలిపాడు. -
ఫ్లెక్సీలతో డేంజర్!
సాక్షి, సిటీబ్యూరో: అందంగా ఆకర్షణీయంగా కనిపించే ఫ్లెక్సీల వెనక పర్యావరణానికి, మానవ ఆరోగ్యానికి ఏర్పడుతున్న ముప్పు ఆందోళన కలిగిస్తోంది. మహానగరం పరిధిలో వేలాదిగా ఉన్న హోర్డింగ్లతోపాటు, వివాహాది శుభకార్యాలకు సైతం పాలీ వినైల్ క్లోరైడ్(పీవీసీ)తో తయారుచేసిన బ్యానర్లు ఉపయోగించడం ఆనవాయితీగా మారింది. అయితే వీటిని తరచూ మార్చేసమయంలో పీవీసీ ఫ్లెక్సీల వ్యర్థాలను సాధారణ చెత్తతోపాటు పడవేసి ఆరుబయట తగులబెడుతుండడంతోనే అనర్థాలు తలెత్తుతున్నాయి. వీటి నుంచి వెలువడే పొగలో కేన్సర్కు కారణమయ్యే కార్సినోజెన్స్, డయాక్సీన్స్, వోలటైల్ ఆర్గానిక్ కాంపౌండ్స్ గాలిలో చేరి పీల్చే గాలిని కలుషితం చేస్తుండడం అనర్థాలు తెచ్చిపెడుతోంది. మహానగరం పరిధిలో నిత్యం సుమారు 4800 టన్నుల ఘనవ్యర్థాలు ఉత్పన్నమౌతుండగా..ఇందులోసుమారు 300 టన్నుల వరకు ఇలాంటి వ్యర్థాలున్నట్లు పీసీబీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అమ్మో పీవీసీ ఫ్లెక్సీలు.. గ్రేటర్ పరిధిలో పలు బహుళజాతి, వాణిజ్య సంస్థలు, దేశీయ కంపెనీలు, వినియోగ, విలాస వస్తువులకు చెందిన వాణిజ్య ప్రకటనలు అందరికీ కనిపించేలా ప్రదర్శించేందుకు వేలాదిగా హోర్డింగ్లున్నాయి. వీటన్నింటికీ జీహెచ్ఎంసీ నుంచి అనుమతులున్నాయి. ఇక్కడివరకు బాగానే ఉన్నా..వీటిపై వాణిజ్య ప్రకటనల నిమిత్తం అందంగా ఆకర్షణీయంగా కనిపించేలా అధిక గాఢత కలిగిన రంగులు, పాలీవినైల్ క్లోరైడ్స్(పీవీసీ)తో చేసిన ఫ్లెక్సీలను వినియోగిస్తున్నారు. వీటి ఆకర్షణ తగ్గకుండా వీటిని ప్రతీనెలా మార్చేస్తున్నారు. ఈ వ్యర్థాలను సాధారణ చెత్తతోపాటే పడవేస్తుండడంతోపాటు డంపింగ్యార్డులు, బహిరంగ ప్రదేశాల్లో వేసి తగులబెడుతున్నారు. వీటి నుంచి వెలువడుతోన్న విషవాయువులు పర్యావరణంలో కలుస్తున్నాయి. ఈ వాయువులను పీల్చినవారి కళ్లు, ముక్కు, గొంతు, ఊపిరితిత్తులు, మూత్రపిండాలు దెబ్బతినడంతోపాటు నాడీవ్యవస్థకు సంబంధించిన వ్యాధుల బారినపడుతున్నారు. ఈ పరిణామం దీర్ఘకాలం కొనసాగిన పక్షంలో కేన్సర్కు కారణమవుతాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. బెంగళూరు ఆదర్శం.. పీవీసీ ఫ్లెక్సీల స్థానంలో కాగితం, బట్ట(క్లాత్)తో తయారుచేసిన ఫ్లెక్సీలను వినియోగిస్తూ బెంగళూరు మహానగరం దేశంలోని పలు సిటీలకు ఆదర్శంగా నిలుస్తోంది. గ్రేటర్ పరిధిలోనూ ఇదే స్ఫూర్తితో ఇలాంటి విధానాన్ని కొనసాగించాలని నిపుణులు సూచిస్తున్నారు. దీంతో నగర పర్యావరణానికి మేలుజరగడంతోపాటు..సిటీజన్లు ప్రమాదకర వ్యాధుల బారిన పడకుండా కాపాడినవారవుతారని స్పష్టంచేస్తున్నారు. నిత్యజీవితంలో ఉపయోగించేపలు వస్తువులు విచ్ఛిన్నం అయితేలికగా పర్యావరణంలో కలిసేందుకు పట్టే సమయం ఇలా... వస్తువు పట్టే సమయం ప్లాస్టిక్ కవర్లు, బ్యాగులు, 200–1000 ఏళ్లు పీవీసీఫ్లెక్సీలు పేపర్ బ్యాగ్ ఒకనెల కాటన్సంచి 3 నెలలు ఫ్లైఉడ్ 13 ఏళ్లు పాలకార్టన్స్ 5 ఏళ్లు కార్డ్బోర్డ్ 2 నెలలు వార్తాపత్రికలు 1.5 నెలలు సిగరెట్ పెట్టె 10–12 ఏళ్లు లెదర్షూజ్ 25–40 ఏళ్లు పలుచటి స్టీల్క్యాన్ 50 ఏళ్లు రబ్బర్బూట్ సోల్ 50–80 ఏళ్లు అల్యూమినియం క్యాన్ 200–500 ఏళ్లు -
‘ప్రజల సొమ్ముతో బాబు సోకులు పడుతున్నాడు’
సాక్షి, పశ్చిమగోదావరి: చంద్రబాబు నియంతలా వ్యవహరిస్తూ.. మోదీ సభను అడ్డుకోవాలని ప్రయత్నిస్తున్నారంటూ బీజేపీ మాజీ ఎంపీ పైడికొండల మాణిక్యాల రావు ధ్వజమెత్తారు. గన్నవరం విమానాశ్రయం ఎదురుగా, రాష్ట్రవ్యాప్తంగా ‘నో ఎంట్రీ మోదీ’, ‘గో బ్యాక్ మోదీ’ అంటూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలపై ఆయన మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మోదీ సభను అడ్డుకోవడానికి చంద్రబాబు ఆర్టీసీ, ఆటో యూనియన్లను వాడుకుంటున్నారని ఆరోపించారు. ఈ నెల 11న ఢిల్లీలో చంద్రబాబు చేయబోయే ధర్మపోరాట దీక్షకు జనాలను తరలించడానికి.. ఇప్పటికే రెండు రైళ్లకు రూ.1.12 కోట్లు మంజూరు చేశారని మండిపడ్డారు. ప్రజా ధనంతో ఆర్టీసీ ద్వారా 7 నక్షత్రాల బస్సు కొనిపించుకున్న చంద్రబాబు.. సామన్య బస్సుగా ప్రజలను మభ్య పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల కష్టార్జితంతో చంద్రబాబు సోకులు పడుతున్నారంటూ విమర్శించారు. -
ఫ్లెక్సీల రగడ....
తిరుపతి రూరల్/ చంద్రగిరి: ఫ్లెక్సీల రగడ పచ్చని పల్లెల్లో చిచ్చుపెడుతోంది. అనధికారికంగా ఏర్పాటు చేస్తున్న ఫ్లెక్సీలను తొలగిం చాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేసినా, కిందిస్థాయి సిబ్బంది పట్టించుకోవడం లేదు. ఫలితంగా పల్లెల్లో దాడుల సంస్కృతి పెరిగిపోతోంది. ఫ్లెక్సీల రగడతో సీఎం సొంత మండలంలో ఉండగానే టీడీపీ నేత పులివర్తి నాని అనుచరులు రెచ్చిపోయారు. పార్టీ ఫ్లెక్సీలను కట్టారంటూ చిత్తూరు నుంచి రెండు సుమోల్లో వచ్చిన రౌడీలు వృద్ధుడిపై విచక్షణా రహితంగా దాడి చేసిన ఘటన మండల పరిధిలోని ముంగళిపట్టులో జరిగింది. బాధితుడి వివరాల మేరకు... దివంగత వైఎస్సార్పై ఉన్న అభిమానం, జగనన్న ప్రకటించిన నవరత్నాలకు ఆకర్షితుౖడై ముంగళిపట్టుకు చెందిన దామోదర నాయుడు సంక్రాంతి సందర్భంగా ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన హేమాంబర్ నాయుడు సోమవారం రాత్రి పాల కేంద్రం వద్దకు వెళ్తున్న దామోదర నాయుడును దుర్భాషలాడాడు. ఫ్లెక్సీలను తీసివేయాలని హెచ్చరించి, బెదిరించాడు. దాంతో హేమాంబర్ నాయుడుతోపాటు అతని బావమరిది, మరికొంత మంది దామోదర్ నాయుడు ఇంటికి వెళ్లి బెదిరించారు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం 11 గంటల సమయంలో దామోదర్ నాయుడు పొలం వద్దకు వెళుతుండగా అదే గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు రెండు సుమోల్లో రౌడీలను తీసుకొచ్చి, కర్రలతో విచక్షణ రహితంగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. ప్రయాణికులు అడ్డుకోకుంటే... ప్రాణాలు తీసేవాళ్లే సుమారు 15 మందితో కూడిన రౌడీ మూక దామోదర నాయుడుపై పడి, కర్రలతో తీవ్రంగా దాడి చేసింది. ఒకే వ్యక్తిని అంత మంది కలసి దాడి చేస్తున్న వైనాన్ని అటుగా వెళ్తున్న ప్రయాణికులు గమనించారు. పెద్ద ఎత్తున ప్రయాణికులు చేరుకుని అడ్డుకోవడంతో దామోదర నాయుడును వదిలేసి పారిపోయారు. ప్రయాణికులే అక్కడికి రాకుంటే దామోదర నాయుడును అంతమొందించేవారని, వారే తన ప్రాణాలు కాపాడారని దామోదర నాయుడు తెలిపాడు. గాయపడిన దామోదర నాయుడును పోలీసులు చంద్రగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. చిత్తూరు నుంచి రౌడీలు... దామోదర నాయుడును అంతమొందించాలనే వ్యూహంతో నాని అనుచరులు చిత్తూరు నుంచి ముంగలిపట్టుకు చేరుకున్నారు. అదే గ్రామంలోని స్థానిక టీడీపీ నాయకుల అండగా ఈ దారుణానికి పాల్పడినట్లు బాధితుడి కుటుంబ సభ్యులు చెబుతున్నారు. దాడి విషయం తెలుసుకున్న చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆస్పత్రికి చేరుకున్నారు. చికిత్స పొందుతున్న దామోదర నాయుడును పరామర్శించారు. ‘ఫ్లెక్సీలు తీయనన్నందుకు చావబాదారని, వారి వల్ల తనకు ప్రాణహాని ఉందని’ దామోదర నాయుడు, ఆయన కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమవుతూ ఎమ్మెల్యేకు తమ గోడు వెల్లబోసుకున్నారు. న్యాయం జరిగేంతవరకు అండగా ఉంటామని బాధితులకు ఎమ్మెల్యే భరోసా కల్పించారు. అనంతరం వైద్య పరీక్షలు చేసిన వైద్యులు రెండు ఎముకలు విరిగినట్లు గుర్తించారు. ఆయనను ఆస్పత్రి సిబ్బంది 108లో తిరుపతి రుయాకు తరలించారు. -
ముదురుతున్న కేసీఆర్ ఫ్లెక్సీ వివాదం
పశ్చిమగోదావరి, నరసాపురం: నరసాపురం బస్టాండ్ వద్ద తెలంగాణ ముఖ్యమంత్రిగా రెండోసారి ఎన్నికైన కేసీఆర్కు శుభాకాంక్షలు చెబుతూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ అంశం వివాదంగా మారుతోంది. అనుమతి లేదంటూ ఫ్లెక్సీని హఠాత్తుగా తొలగించారు. ఫ్లెక్సీ తొలగింపు సమయంలో పోలీసులు, కొందరు మునిసిపల్ సిబ్బంది, ఇద్దరు అధికారపార్టీకి చెందిన కౌన్సిలర్లు, ఆర్టీసీ డీఎం కూడా దగ్గరన్నట్టు స్థానికులు చెబుతున్నారు. మిగిలిన ఫ్లెక్సీలను అలాగే ఉంచి ఒక్క ఈ ఫ్లెక్సీనే ఎందుకు తొలగించారని ఫ్లెక్సీ ఏర్పాటు చేసిన వారు నిలదీయడంతో వివాదం పెద్దదవుతోంది. దీనికి సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఎన్నికైన మరునాడు బుధవారం బస్టాండ్ సెంటర్లో ప్రముఖ టెన్నిస్ క్రీడాకారుడు, హైదరాబాద్ సెటిలర్ అయిన సీహెచ్ చినరెడ్డప్ప ధవేజీ, అతని స్నేహితులు మేడిద రాము, బుడితి అనిల్ కలసి తెలంగాణ బాహుబలి కేసీఆర్కు శుభాకాంక్షలు అని స్లోగన్ ఇస్తూ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ఈ ఫ్లెక్సీ జనాన్ని బాగా ఆకర్షించింది. అయితే పోలీసులు వచ్చి ఎస్సై ఫ్లెక్సీ తీయించారని మేడిది రాము తెలిపారు. అయితే టౌన్ ఎస్సై మాత్రం ఫ్లెక్సీ మేం తీయించలేదని, మాకు సంబందం లేదని అంటున్నారు. మునిసిపల్ అధికారులు కూడా దీనిపై స్పందించడం లేదు. దీంతో ఈ అంశం వివాదంగా మారింది. ఇబ్బందికరంగా ఉండటం, ప్రజల నుంచి స్పందన రావడంతో టీడీపీ పెద్దలే తీయించి ఉంటారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై రెడ్డప్ప ధవేజీ మాట్లాడుతూ గతంలో మాయావతి ఫ్లెక్సీలు పెట్టారని, రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో పెట్టారన్నారు. అప్పుడు లేని ఇబ్బంది ఇప్పుడెందుకొచ్చిందని ప్రశ్నించారు. మునిసిపాలిటీ అనుమతి తీసుకుని మళ్లీ ఫ్లెక్సీ ఏర్పాటు చేస్తామన్నారు. తామేమీ ఎవరినీ కించరుస్తూ ఫ్లెక్సీ పెట్టలేదన్నారు. కేవలం శుభాకాంక్షలు మాత్రమే చెప్పామని అందులో తప్పేముందని ప్రశ్నించారు. -
ఫ్లెక్సీల వివాదం... వినికిడి కోల్పోయిన దళితుడు
చిత్తూరు , తిరుపతి రూరల్: నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేస్తున్న ఫ్లెక్సీలు పల్లెల్లో చిచ్చురేపుతున్నాయి. చట్టాలు కఠినంగా ఉన్నా అధికారానికి తొత్తులుగా మారిన అధికారుల నిర్లక్ష్యం వల్ల చట్టాలు సైతం అభాసుపాలౌతున్నాయి. చివరకు పల్లెల్లో ప్రశాంతత కరువౌతోంది. సోదరులుగా ఉన్న పల్లె వాసులు ఫ్లెక్సీల మహమ్మారి వల్ల స్టేషన్లు్ల, ఆస్పత్రుల చుట్టూ తిరగాల్సిన దుస్థితి ఎదురౌతోంది. ఫ్లెక్సీలను ఏర్పాటు చేసినందుకు దళితుడైన పుట్టా రవిపై పులివర్తి నాని అనుచరులు హత్యాయత్నం చేయడంతో అతను వినికిడి శక్తిని కోల్పోయాడు. జిల్లావ్యాప్తంగా ఫ్లెక్సీలను నిషేధించాలనే కలెక్టర్ ఆశయానికి సైతం కింది స్థాయి అధికారులు గండికొడుతున్నారు. వినికిడి కోల్పోయిన దళితుడు.. దీపావళి సందర్భంగా చంద్రగిరి మండలం మొరవపల్లిలో పార్టీలకు అతీతంగా ఫ్లెక్సీలను ఏర్పాటు చేసుకున్నారు. అందులో భాగంగానే హరిజనవాడకు చెందిన దళితుడు పుట్టా రవి సైతం దీపావళి శుభాకాంక్షలు తెలుపుతూ కాలనీలో ఫ్లెక్సీలను ఏర్పాటు చేశాడు. తమను ఎదిరించి ఫ్లెక్సీలు కడతావా? అంటూ కులం పేరుతో పులివర్తి నాని అనుచరులు 15 రోజుల క్రితం రవిపై హత్యాయత్నం చేశారు. అతను వెళ్తున్న బైక్ను కారుతో ఢీకొట్టారు. కిందపడిపోగానే కర్రలతో దాడి చేశారు. దాడిలో రవి చెవిపై కర్రతో బలంగా కొట్టారు. చావు బతుకుల్లో ఉన్న అతనిని దారినపోయే ప్రయాణికులు గుర్తించి ఆసుపత్రికి తరలించారు. గాయాలతో పాటు చెవికి బలంగా తగలడంతో కర్ణభేరి పగిలిపోయింది. రవి వినికిడి శక్తిని కోల్పోయాడు. తిరుపతిలో చికిత్స పొందుతున్న అతనికి రెండు రోజుల్లో అత్యవసరంగా శస్త్ర చికిత్స చేయాల్సిన అవసరం ఉందని వైద్యులు వెల్లడించారు. నిందితులపై చర్యలు ఏవీ? రవిని కులం పేరుతో దూషించడమే కాకుండా దాడితో హత్యాయత్నానకి పాల్పడిన పులివర్తి నాని అనుచరులు కాశింపెంట్ల మాజీ సర్పంచ్ గాలి సతీష్నాయుడు, కొమ్మినేని గిరి, శివ, పట్టాభిలపై పోలీసులు కేసు నమోదు చేసి చేతులు దులుపుకున్నారనే ఆరోపణలున్నాయి. దాడి జరిగి 15 రోజులు అవుతున్నా ఇంతవరకు నిందితులను అరెస్ట్ చేయకపోవటంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికార పార్టీ ఒత్తిళ్ల వల్లే పోలీసులు చర్యలకు వెనకడుగు వేస్తున్నారని దళిత సంఘాలు మండిపడుతున్నాయి. తన కుమారుడికి వినికిడి శక్తి పోవటానికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని రవి తల్లి రమక్క డిమాండ్ చేస్తున్నారు. -
హంగులు.. ఆర్భాటాలు
సాక్షి, కల్వకుర్తి టౌన్ : చట్టసభలకు ప్రజాప్రతినిధులను ఎన్నుకునే విధానంలో ఓటింగ్ ప్రధానమైంది. మారుతున్న కాలానికి అణుగుణంగా ఓటింగ్ విధానంలోనూ మార్పు సంతరించుకుంది. ఎన్నికల సంఘం సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటూ నూతన ఒరవడికి ఎన్నికల సంఘం శ్రీకారం చుట్టింది. ఒకప్పుడు ఎన్నికలకు బ్యాలెట్ బాక్సులు ఉపయోగించగా ఇటీవల కాలంలో ఈవీఎంలు వినియోగాన్ని ఎన్నికల సంఘం పెంచింది. ఈసారి ఎన్నికల్లో ఓటు కచ్చితత్వాన్ని ఓటరు తెలుసుకునేలా నూతనంగా వీవీ ప్యాట్(ఓటర్ వెరిఫైడ్ పేపర్ ఆడిట్ ట్రయల్) యంత్రాలను ఎన్నికల సంఘం తెలంగాణలో వినయోగిస్తోంది. 1950లో ఎన్నికల సంఘం ఏర్పాటు దేశంలో ఎన్నికలు సజావుగా, నిష్పపక్షపాతంగా నిర్వహించేందుకు స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన రాజ్యాంగబద్ద సంస్ధ భారత ఎన్నికల సంఘాన్ని 1950 జనవరి 25వ తేదీన ఏర్పాటుచేశారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ జాతీయ ఎన్నికల కమిషన్లో భాగమే. రాజకీయ పార్టీ గుర్తింపు, రద్దు, ఎన్నికల ప్రణాళిక, ప్రవర్తనా నియామవళి రూపకల్పన, ఓటరు జాబితా తయారీ, ఎన్నికల నిర్వహణ అంతా ఎన్నికల సంఘం ఆధీనంలో ఉంటుంది. ఈ మేరకు దేశంలో మొదటి సారిగా ఎన్నికలు 1951వ సంవత్సరంలో జరగగా ప్రజలు ఓటు వేసేందుకు బ్యాలెట్ విధానం అమలులో ఉండేది. ముద్రించిన బ్యాలెట్ పేపరుపై ఏ అభ్యర్ధిని ఎన్నుకుంటామో ఆ అభ్యర్థి గుర్తుపై ముద్ర వేసి బ్యాలెట్ బాక్స్లో వేసేవారు. ఆ తర్వాత నూతన సాంకేతిక పరిజ్ఞానంలో భాగంగా 2004 నుంచి ఈవీఎంలు అందుబాటులోకి వచ్చాయి. వీటి వినియోగంపై ఆరోపణలు రావటంతో ప్రస్తుతం రాబోయే ఎన్నికలలో ఈవీఎంలతో పాటుగా వీవీ ప్యాట్లను వినియోగిస్తోంది. రిగ్గింగ్కు చెల్లిన కాలం భారతదేశంలో మొదటిసారి నిర్వహించిన సాధారణ ఎన్నికల్లో బ్యాలెట్ బాక్సులను వినియోగించారు. ఈ విధానంలో అభ్యర్ధుల పేర్లు, పార్టీ గుర్తుతో ముద్రించిన పేపర్లు వాడేవారు. వాటిపై ఓటరుకు వచ్చిన అభ్యర్థి గుర్తు వద్ద స్టాంప్ చేసి ఆ బ్యాలెట్ పేపరును బ్యాలెట్ బాక్సులో వేసేవారు. ఓటింగ్ పక్రియ పూర్తయిన అనంతరం పేపర్ల(ఓట్ల)లెక్కింపు ఉండేది. ఈ విధానంలో రిగ్గింగ్కు ఎక్కువ అవకాశం ఉండేది. దొంగ ఓట్లు ఎక్కువగా పోలయ్యేవి. 1999 ఎన్నికలలో బ్యాలెట్ పత్రాల ముద్రణకు 7,700 టన్నుల కాగితం వాడారు. ఈవీఎంలు 2004 తర్వాత సార్వత్రిక ఎన్నికల్లో అన్ని చోట్ల ఓటింగ్ కోసం బ్యాలెట్ బాక్స్ల స్ధానంలో ఈవీఎం(ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్)లు అమలులోకి వచ్చాయి. అంతకుముందు రాజస్థాన్, ఢిల్లీ, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ఈవీఎంలను ప్రయోగాత్మకంగా వినియోగించారు. ఇక్కడ ఈ విధానం అమలు సఫలం కావటంతో 2004 నుంచి అన్ని చోట్ల ఈవీఎం ఓటింగ్ విధానం అమలులోకి వచ్చింది. దీని వలన బ్యాలెట్ పత్రాల ముద్రణ వలన జరిగే కాగితం వాడకం అరికట్టినట్లయ్యంది. ఈవీఎంలను భారత్ లిమిటెడ్, ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనే రెండు ప్రభుత్వరంగ సంస్ధలు తయారు చేశాయి. విద్యుత్ సరఫరా వ్యవస్ధ లేని చోట కూడా బ్యాటరీ సాయంతో పనిచేసే విధంగా వీటిని రూపొందించారు. ఒక్కో ఈవీఎంలో 1400 లోపు మంది ఓటర్లు ఓట్లు వేయొచ్చు. పోటీలో 64 మంది కంటే తక్కువగా ఉంటేనే ఈవీఎంలను వాడతారు. లేనిపక్షంలో బ్యాలెట్ విధానంలోనే ఎన్నికలు నిర్వహిస్తారు. వీవీ ప్యాట్లు రాష్ట్రంలో వచ్చే నెల 7న జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో కొత్త టెక్నాలజీని అందుబాటులోకి తెస్తోంది. ఈవీఎంలతో పాటుగగా వీవీప్యాట్ యంత్రాలను ఉపయోగించునున్నారు. ఈవీఎంల ద్వారా ట్యాంపరింగ్ జరుగుతోందని.. ఏ పార్టీకి ఓటు వేసిన అధికార పార్టీకే పడుతోందని కొన్ని రాజీకయ పార్టీల నాయకులు ఆరోపిస్తున్నాయి. దీంతో ఈవీఎంలతో పాటు వీవీప్యాట్లను వినయోగింలోకి తీసుకొస్తున్నారు. ఈ యంత్రం ద్వారా అభ్యర్థి ఎవరికి ఓటు వేశారో ఏడు సెకన్ల పాటు డిస్ప్లే కనిపిస్తుంది. మారుతున్న ప్రచార సరళి ఎన్నికల్లో అభ్యర్ధులు ఓటర్లను ఆకర్షించేందుకు ప్రచారం నిర్వహిస్తుంటారు. ఇంటింటికి తిరిగి ప్రచారం చేయటం, గోడలపై రాతలతో మొదలు పార్టీ కండువాలు, టోపీలు, జెండాలు, కరపత్రాలు, వాహనాలకు మైక్సెట్లతో ప్రచారం నిర్వహిస్తూ వస్తున్నారు. గతంలో గోడలపై రాతలు ఎక్కువగా కనిపించేవి. దీంతో పెయింటింగ్ కళాకారులకు చేతినిండా పని ఉండేది. సత్తు రేకుపై అభ్యర్థి పేరు గుర్తుతో అచ్చువేయించి, వాటిని గోడలపై అచ్చువేయటం ద్వారా పెయింటింగ్ చేయించాల్సిన అవసరం ఉండేది కాదు. పార్టీ కార్యాలయం భవనంపై తమ పార్టీ గుర్తులను ఏర్పాటు చేసి దానికి లైటింగ్ ఏర్పాటు చేసేవారు. పార్టీ చెండాలు పట్టుకొని అభ్యర్ధుల వెంట పార్టీ కార్యకర్తలు తిరగేవారు. నేటి సాంకేతిక యుగంలో ఫ్లెక్సీలు రాకతో పెయింటింగ్, లైటింగ్ కళాకారులకు వారికి పనిలేకుండా పోయింది. డిజిటల్ ప్రచారం ఇప్పుడంతా డిజిటల్ హవా నడుస్తోంది. రాజకీయ పార్టీల నాయకులు సైతం ప్రచారానికి టెక్నాలజీని ఉపయోగించుకుంటున్నారు. ఫేస్బుక్, వాట్సప్, ట్విట్టర్లను వేదికగా చేసుకుని ఓటర్లను ఆకర్షించే పనిలో పడ్డారు. మెసేజ్లు, వాట్సాప్, వాయిస్ కాల్స్ ద్వారా ఓటర్లకు ఫోన్ చేస్తున్నారు. వాల్ పెయింటింగ్ల స్థానంలో ఫ్లెక్సీలు వచ్చాయి. గతంలో భారీ కటౌట్లు ఏర్పాటు చేసేందుకు ఫ్లైవుడ్ వాడేవారు. దీనిపై అభ్యర్ధుల,నాయకుల బొమ్మలు వేసేవారు. ఇందుకు కొన్ని రోజుల సమయం పట్టేది. ప్రస్తుతం ఫ్లెక్సీలు అందుబాటులోకి రావటంతో ఎంత పెద్ద కటౌట్ అయినా క్షణాల్లో రెడీ అవుతోంది. -
సొంత పార్టీపై విజయశాంతి సంచలన వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్ : ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన ఫ్లెక్సి ఇప్పుడు వివాదాన్ని రాజేసింది. ఈ విషయంపై కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్ విజయ శాంతి మండిపడ్డారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 23 సోనియా గాంధీ రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఈ క్రమంలో సోనియాకు స్వాగతం చెబుతూ కాంగ్రెస్ పార్టీ ఓ ఫ్లెక్సి ఏర్పాటు చేసింది. కానీ దీనిలో ఒక్క మహిళా నాయకురాలి ఫోటో కూడా లేదు. దాంతో ఇతరులను విమర్శించే ముందు మనం ఏం చేస్తున్నామో ఆలోచించుకోవాలంటూ విజయశాంతి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్క మహిళా మంత్రి కూడా లేదంటూ టీఆర్ఎస్ని విమర్శించే మనం ఇప్పుడు చేసింది ఏంటంటూ ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన ఫ్లెక్సిలో ఒక్క మహిళా నాయకురాలి ఫోటో కూడా లేకపోవడం ఏంటని ప్రజలు ఆశ్చర్యపోతున్నారని తెలిపారు. చెప్పడానికే నీతులు పాటించడానికి కావా అంటూ జనాలు విమర్శిస్తున్నారని అన్నారు. ఈ సభలో మగవాళ్లు మాత్రమే ఉంటారా.. మహిళలు కూడా సభకు హాజరవుతారు కదా అంటూ విజయశాంతి ఒక ప్రెస్ నోట్ విడుదల చేశారు. సొంత పార్టీ నేతలనే విమర్శిస్తూ రాములమ్మ ఇలా మాట్లాడటం పట్ల కాంగ్రెస్ నాయకులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. -
దేవినేనీ.. ఇదేం పని!
అధికారాన్ని అడ్డుపెట్టుకుని ప్రతిపక్షం ఊసే లేకుండా చేయాలన్న లక్ష్యమో.. లేక ప్రతిపక్ష పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పట్ల రోజురోజుకీ ప్రజల్లో పెరుగుతోన్న ఆదరణకు భయమేస్తోందో.. మొత్తానికి జిల్లాలో తెలుగుదేశం పార్టీ నేతల్లో వణుకు మొదలైంది. ముఖ్యంగా భారీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమా తన నియోజకవర్గంలో ప్రతిపక్ష పార్టీ లేదని చూపడమే పనిగా పెట్టుకున్నట్లు కనిపిస్తోంది. దీంతో ఫ్లెక్సీల రాజకీయానికి తెరతీశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు చెందిన ఫ్లెక్సీ గానీ, హోర్డింగ్ గానీ కనిపించిందా.. అధికారులపై శివాలెత్తిపోతున్నారు. విచ్చలవిడిగా అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. సాక్షి, అమరావతిబ్యూరో : అత్త సొమ్ము అల్లుడి దానం అంటే ఇదే.. మైలవరం నియోజకవర్గంలో మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ప్రభుత్వ సొమ్మును యథేచ్ఛగా సొంత ప్రచారానికి దుర్వినియోగం చేస్తున్నారు. అదేమంటే.. ఇది ప్రభుత్వ పథకాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ మాత్రమేనని.. ఇందులో మంత్రి చేసుకుంటున్న సొంత ప్రచారం ఏదీ లేదని ఆయన అనుచరులు బుకాయిస్తున్నారు. సరే.. ప్రభుత్వ పథకాల కోసమే నియోజకవర్గంలో ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారనుకున్నా.. ఆయా శాఖల మంత్రుల ఫోటోలు ఆ ఫ్లెక్సీల్లో ఎందుకు కనిపించడం లేదన్న ప్రశ్నలకు ఎటువంటి సమాధానం లేని పరిస్థితి. కేవలం ముఖ్యమంత్రి, ఆయన కుమారుడు లోకేష్, మంత్రి దేవినేని ఉమాకు ముఖచిత్రాలు మినహా ఎవ్వరి ఫోటోలకు ఫ్లెక్సీలో చోటు లేకపోవడం గమనార్హం. వీటన్నింటిని ఏర్పాటు చేసిన యాడ్స్ కంపెనీకి నెలనెలా ప్రభుత్వమే లక్షలాది రూపాయలు చెల్లిస్తోంది. ప్రతిపక్ష నేతల ఫ్లెక్సీలు కనిపిస్తే శివాలే.. తెలుగుదేశం అధినేత వైఖరితో అధికారపార్టీపై ప్రజల్లో అసంతృప్తి పెరుగుతున్న నేపథ్యం.. అదే సమయంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఆదరిస్తుండటంతో మంత్రి దేవినేని ఉమా నియోజకవర్గంలో తనకు ప్రత్యర్థిగా ఉన్న ప్రతిపక్షనేతపై కత్తికట్టారు. ఎక్కడా వారికి సంబంధించిన ఫ్లెక్సీలు, హోర్డింగ్లు కనిపించకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇందుకు అధికార యంత్రాంగాన్ని పావుగా వాడేసుకుంటున్నారు. పొరపాటున ఆయన పర్యటిస్తున్న ప్రాంతంలో ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఫ్లెక్సీలు కనిపిస్తే అధికారులపై ఆయన శివాలెత్తిపోతున్నారు. అధికారులే దగ్గరుండీ.. దీంతో మంత్రికి జడిసి పంచాయతీ, మున్సిపాలిటీ, పోలీసు అధికారులు దగ్గరుండీ ప్రతిపక్ష నేతల ఫ్లెక్సీలు తొలగించేస్తున్నారు. మైలవరం, ఇబ్రహీంపట్నం పోలీసులకు ఈ పని నిత్యకృత్యంగా మారిందని చెప్పడం అతిశయోక్తి కాదు. ఇటీవల వెలగలేరు గ్రామంలో వైఎస్సార్సీపీకి చెందిన ఫ్లెక్సీ ఒకటి ఏర్పాటు చేయగా.. దానిని దగ్గరుండి పోలీసులు తొలగించడం జరిగింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఫ్లెక్సీలు కడితే వారిపై రౌడీ షీట్లు తెరుస్తామని బెదిరిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా.. జాతీయ రహదారులపై ఎలాంటి ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడానికి వీల్లేదు. ఎన్హెచ్ఐ నిబంధనల మేరకు ఏ పార్టీకి చెందిన ఫ్లెక్సీలు పెట్టినా నేరమే. పైగా ఎవరైనా ఏర్పాటు చేసినా వాటిని ఎన్హెచ్ఐ సిబ్బంది ఎప్పటికప్పుడు తొలగించేస్తారు. పదేపదే ఎవరైనా కావాలని పెడితే.. వారికి నోటీసులు జారీ చేసి చర్యలకు ఉపక్రమిస్తారు. అయితే హైదరాబాద్, జి.కొండూరు జాతీయ రహదారుల్లోని సెంటర్ మీడియన్పై ఏర్పాటు చేసిన విద్యుత్తు స్తంభాలపై దాదాపు 25 కిలోమీటర్ల మేర ప్రభుత్వ సొమ్ముతో ఫ్లెక్సీలు పెట్టారు. ఇది నిబంధనలకు విరుద్ధమని తెలిసినా ఎన్హెచ్ఐ అధికారులు అధికారపార్టీకి వత్తాసు పలుకుతున్నారు. అదేసమయంలో ప్రతిపక్ష పార్టీకి చెందిన ఫ్లెక్సీలు ఎక్కడైనా ఉంటే రాత్రిరాత్రే వచ్చి వాటిని తొలగించేస్తున్నారు. ‘మంత్రి ఉమాకు ఓటమి భయం పట్టుకుంది’ కొండపల్లి(ఇబ్రహీంపట్నం): రాష్ట్రమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుకు ఓటమిభయం పట్టుకుందని వైఎస్సార్ సీపీ ఎస్టీ సెల్ రాష్ట్ర నాయకుడు కాండ్రకొండ పెద్ద గురవయ్య అన్నారు. కొండపల్లిలో వైఎస్సార్ సీపీ బ్యానర్లు తొలగించటమే కాకుండా గోడలకు అంటించిన వాల్పోస్టర్లు కూడా అధికారులతో చించివేయించటం చూస్తుంటే ఈ విషయం స్పష్టంగా తెలుస్తుందన్నారు. కొండపల్లి పార్టీ కార్యాలయంలో వాల్పోస్టర్లు చించివేయటంపై గురువారం విలేకరుల సమావేశం నిర్వహించి మంత్రి చేష్టలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ సర్పంచి కాండ్రకొండ చినగురవయ్య, షేక్ షిలార్దాదా, అడపా దుర్గా ప్రసాద్, పల్లపోతు నాగేశ్వరరావు, వెంకటేశ్వరరావు, జాషువారాజు పాల్గొన్నారు. -
దళితుడిపై పులివర్తి నాని అనుచరుల దౌర్జన్యం
చిత్తూరు, తిరుపతి రూరల్: మొన్న వల్లివేడులో..రౌడీయిజం ఎక్కడ పుట్టిందో తెలుసా చిత్తూరులోనే. రౌడీయిజం పుట్టిన ఊరు నుంచి వచ్చానని పులివర్తి నాని హెచ్చరికలు..నిన్న....చంద్రగిరిలో..గాంధీని కాదు. అవసరం అయితే రెండు చెంపలు పగలుకొడతా... అంటూ మరోమారు బహిరంగ బెదిరింపులు.నేడు... అగ్రవర్ణాలు ఉన్న మా ప్రాంతంలో కులం తక్కువవాడివి నువ్వు ఫ్లెక్సీలు కడతావా? అంటూ సినీ ఫక్కీలో పులివర్తి నాని అనుచరులు వెంటాడి..వెంటాడి కాశింపెంట్ల పంచాయతీ మొరవపల్లి దళితవాడకు చెందిన పుట్ట రవిపై దాడికి తెగబడి చంపేందుకు యత్నం. ప్రశాంతంగా ఉన్న చంద్రగిరి నియోజకవర్గంలో చిత్తూరు సంస్కృతి విషపు మొక్కలా విస్తరిస్తోంది. మంగళవారం రాత్రి పులివర్తి నాని అనుచరులైన కాశింపెంట్ల మాజీ సర్పంచ్ గాలి సతీష్నాయుడు, కొమ్మినేని గిరి, శివ, పట్టాభి కలిసి రవిని కాశింపెంట్ల నుంచి పూతలపట్టు సర్కిల్ వరకు వెంటబడ్డారు. పూతలపట్టు–నాయుడుపేట జాతీయ రహదారి వెంట వేము కళాశాల సమీపంలో అతని స్కూటర్ను కారుతో ఢీకొట్టారు. కింద పడిన రవిపై విచక్షణారహితంగా దాడికి తెగబడ్డారు. పిడికిళ్లతో గుద్దుతూ, కాళ్లతో తన్నారు. ముక్కులో, నోట్లో నుంచి రక్తం కారింది. వందలాది మంది ప్రయాణికులు చూస్తుండగానే ఈ దాడి జరిగింది. కాపాడాలని రవి చేసిన ఆర్తనాదాలు ప్రయాణికులను కదిలిం చాయి. నాని అనుచరులపై ప్రయాణికులు తిరగబడ్డారు. అతన్ని కాపాడేందుకు రాళ్లను చేతుల్లోకి తీసుకున్నారు. దీంతో నాని అనుచరులు తలో దిక్కుకు పారిపోయారు. రుయాలో చికిత్స... తీవ్ర రక్తగాయాలతో ఉన్న రవిని వేము కళాశాల సిబ్బంది, ప్రయాణికులు పాకాలలోని పీహెచ్సీకి తరలించారు. ప్రాథమికి చికిత్స అనంతరం విచక్షణరహితంగా కొట్టడం వల్ల ముక్కులో, నోట్లో నుంచి రక్త కరుతుండటంతో పాటు శరీరం కమిలిపోయి, ఎముకలకు దెబ్బలు తగిలి అల్లాడుతున్న రవికి మెరుగైన చికిత్స నిమిత్తం తిరుపతి రుయా ఆసుపత్రికి తీసుకెళ్లాలని వైద్యులు సూచిం చారు. 108కు ఫోన్ చేసినా అందుబాటులోకి రాకపోవటంతో కుటుంబ సభ్యులు ప్రైవేటు వాహనంలో రుయా ఆసుపత్రికి తరలించారు. రాత్రంతా పేషెంట్తోనే ఎమ్మెల్యే చెవిరెడ్డి రుయాలో చికిత్స పొందుతున్న రవిని మంగళవారం రాత్రి చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్రెడ్డి పరామర్శించారు. దీపావళికి ఇంటి వద్ద ఫ్లెక్సీ కట్టుకున్నందుకు కులం పేరుతో దూషిస్తూ వెంటబడి చంపేందుకు ప్రయత్నించారని ఎమ్మెల్యేకు బాధితుడు కన్నీళ్లతో మొరపెట్టుకున్నాడు. చెవిరెడ్డి అతన్ని ఓదార్చాడు. ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. అవసరం అయితే మెరుగైన చికిత్స నిమిత్తం చెన్నైకు తీసుకెళ్తామన్నారు. మొరవపల్లికి వెళ్లి రవి కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఆసుపత్రికి వచ్చి రాత్రంతా ఉన్నారు. చంపుతామని నాని అనుచరులు బెదిరించిన మాటలు బాధితుడు సెల్ఫోన్లో రికార్డు అయింది. ఈ వాయిస్ రికార్డును బాధితుడు పోలీసులకు అందించినట్లు సమాచారం. దీంతో నాని అనుచరుల్లో అందోళన మొదలైంది. -
ఖబడ్దార్ తెలుగు తమ్ముళ్లంటూ జనసేన ఫ్లెక్సీలు
విజయవాడ: తెలుగు దేశం పార్టీ(టీడీపీ)ని తీవ్రంగా విమర్శిస్తూ విజయవాడ నగరంలో ఓ జనసేన ఫ్లెక్సీ బుధవారం వెలిసింది. టీడీపీపై ఉన్న వ్యతిరేకతను ఫ్లెక్సీల ద్వారా జనసేన కార్యకర్తలు ప్రదర్శించారు. ‘ పిచ్చి ముదిరిన పచ్చ పురాణం.. ఏం తమ్ముళ్లు వేధిస్తుందా..ఓటమి భయం, గుర్తుస్తోందా.. దశాబ్ధ ప్రతిపక్ష కాలం..!’ అంటూ ఫ్లెక్సీలో టీడీపీకి పాత జ్ఞాపకాలను గుర్తు చేశారు. 2009లో బెజవాడ గడ్డ మీద మీరు(చంద్రబాబు) జీరో..2014లో ఎలా అయ్యారు హీరో అని ప్రశ్నించారు. మీ నాయకుడి తంత్ర ఫలమా..? మా నాయకుడి కాళ్లు మొక్కిన ఫలమా..? అని తీవ్రంగా దుయ్యబట్టారు. 2019 ఓటమి భయంతోనే కాంగ్రెస్తో అక్రమ సంబంధం పెట్టుకున్నారని విమర్శించారు. ఈ సందర్భంగా ఎల్లోమీడియాను కూడా ఫ్లెక్సీలో తీవ్రంగా విమర్శించారు. 2019లో టీడీపీకి గట్టిగా బుద్ధి చెప్పకపోతే తాము జనసైనికులమే కాదని సవాల్ విసిరారు. తెలుగు తమ్ముళ్లూ గోదావరిలో మొదలైంది మీకు కౌంట్డౌన్ అంటూ అమరావతి జనసేన పార్టీ అధికార ప్రతినిధి మండలి రాజేష్ పేరిట ఫ్లెక్సీ వెలిసింది. రెండు మూడు రోజుల కిందట జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ను తీవ్రంగా విమర్శిస్తూ టీడీపీ నాయకులు కాట్రగడ్డ బాబు ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. దానికి కౌంటర్ గానే జనసైనికులు ఈ ఫ్లెక్సీ ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. రెండు రోజుల క్రితం పవన్ కల్యాణ్ను విమర్శిస్తూ తెలుగు దేశం నేతలు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ -
వారిది కన్నీరు.. వీరికి పన్నీరు!
బతుకులు పోయి వందలాది మంది ఏడుస్తుంటే.. నేతలు మాత్రం పొగడ్తలు కోరుకున్నారు. గ్రామాల్లో నీటితో పోటీ పడి కన్నీరు కురుస్తుంటే.. నాయకులు మాత్రం దాన్ని పన్నీరుగా మార్చుకున్నారు. తిత్లీ ధాటికి సగం జిల్లా సర్వనాశనమైన వేళ అధికార పార్టీ నాయకులు ప్రచార పర్వానికే పెద్ద పీట వేశారు. దాహమో రామచంద్రా.. అంటూ రోదిస్తున్న ప్రాంతాలకు నీటి కంటే ముందు ఫ్లెక్సీలు వెళ్లాయి. ఇళ్లు కోల్పోయి ఎవరు కరుణిస్తారా అని చేతులు జోడించి బాధితులు నిల్చుని ఉంటే వారి చేతుల్లో నిత్యావసరాలు కాకుండా పార్టీ ప్లకార్డులు దర్శనమిచ్చాయి. కరెంటు లేక తీవ్రంగా ఇబ్బందులు పడుతూ సాయం కోసం ఎదురుచూస్తూ ఉంటే థాంక్యూ.. అని చెప్పాలనే సూచనలు వినిపించాయి. టీడీపీ నాయకుల ప్రచార పిచ్చికి తిత్లీ ఓ మౌన సాక్ష్యమైంది. శ్రీకాకుళం, కాశీబుగ్గ : ప్రచారం.. టీడీపీ నాయకుల ప్రధాన ఆయుధం. ఆపత్కాలంలో కూడా నాయకులు ఈ సాధనాన్ని వదల్లేదు. తిత్లీ ధాటికి సిక్కోలు కకావికలమైన వేళ కూడా సీఎం నుంచి ఎమ్మెల్యేల వరకు ప్రచారంపైనే దృష్టి పెట్టారని సాక్షాత్తు బాధితులే సెలవిస్తున్నారు. తిత్లీ తుఫాన్లో అధికారికంగా అధికారులు, పార్టీ పరంగా నాయకులు, కార్యకర్తలు జన్మభూమి కమిటీ సభ్యులు తమకు తోచిన విధంగా పార్టీ ప్రచారానికి పాల్పడుతున్నారు. తిత్లీలో ప్రజలు బాధ పడుతుంటే రూ.కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్న తీరుపై జనం తీవ్రంగా అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. జిల్లాలో తిత్లీ తుఫాన్ సంభవించిన రెండో రోజుకు గ్రామాలకు, మారు మూల పల్లెలకు తాగునీరు అందక ముందే పార్టీ ఫ్లెక్సీలు చేరుకున్నాయంటే ముఖ్యమంత్రి ప్రచార పిచ్చి అర్థం చేసుకోవచ్చు. పలాసతో పాటు 13 మండలాలను తుఫాన్ ప్రభావిత ప్రాంతాలగా గుర్తించినప్పటికీ అత్యధికంగా ఉద్దానం ప్రాంతాలు దెబ్బతిన్నాయి. దీంతో ముఖ్యమంత్రి పలాసలో పాగా వేసినప్పటికీ ప్రచారానికి పరమావధిగా ప్రాధాన్యత ఇచ్చారు. అటు అధికారులు, ఇటు నాయకులు పలు శాఖలకు చెందిన యంత్రాంగాలతో కార్యక్రమాలు నిర్వహించినప్పటికీ «అధికంగా ప్రచారానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. రూ.కోట్ల ఖర్చు ముఖ్యమంత్రి పలాసలో ఉండగానే ఇంకా అనేక గ్రామాలకు విద్యుత్ అందజేయడానికి ముందే ఫ్లెక్సీలు, జెండాలు, ప్లకార్డులు, ఆర్టీసీ బస్సులకు పెయింటింగ్లు, కరపత్రాలు, ఒకటేమిటి అనేక రూపాల్లో ప్రచారం మొదలుపెట్టారు. నేటి నుంచి అందించనున్న పరిహారం నేరుగా ఖాతాల్లోకి పడుతున్నప్పటికీ ప్రచారం కోసం రూ.రెండు కోట్ల రూపాయలతో డమ్మీ చెక్కులను విడుదల చేశారు. ఇలా ఏ ఒక్క అవకాశం ఉన్నప్పటికీ ప్రచారానికే ప్రాధాన్యమిస్తున్నారు. జిల్లాలో ఉన్న హోర్డింగ్లు లక్షలు ఖరీదు అయినప్పటికీ వాటిపై, ఆర్టీసీ బస్సులపై, చెక్లపై ఇలా కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. ప్రభుత్వం అందిస్తున్న పరిహారంలో కొబ్బరి చెట్టుకు రూ.1500 ఇస్తున్నప్పటికీ దాన్ని రెట్టింపు చెయ్యమని వారు వేడుకుంటున్నా ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. ప్రభుత్వ కార్యక్రమం అయితే అధికారులతో ప్రచారం, కాకుంటే నాయకులతో ప్రచారం చేయాలనే ఆదేశాలు ఉన్నాయి. అన్ని రకాల ప్రకటన సామగ్రి ముఖ్యమంత్రి చేరుకునే ముందే వచ్చేస్తున్నాయి. ప్రచారానికి పెద్ద పీట.. బాధితులు నీరు అందని స్థితిలో ఉంటే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విశాఖ నుంచి పెద్ద ఫ్లెక్సీలు వేసుకుని ప్రచారం చేయడం ఎంతవరకని సబబని అడుగుతున్నాను. అధికారులు మీవెంట ఉన్నపుడు సహాయం ఎలా అందుతుంది. ముఖ్యంగా ప్రచారానికి ప్రాధాన్యత ఇచ్చి ఎవ్వరినీ ఆదుకోలేదు. – చింతాడ మాధవరావు, సున్నాడ -
నకిలీ ఫ్లెక్సీ ఫొటోలతో బట్టబయలైన టీడీపీ కుట్ర
వైఎస్ జగన్మోహన్రెడ్డిపై జరిగిన హత్యాయత్నాన్ని రాజకీయంగా పక్కదారి పట్టించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సూచనలతో అప్పటికప్పుడే పక్కా ఏర్పాట్లకు సీఎంఓ దిగింది. నిందితుడు శ్రీనివాసరావుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతో సంబంధముందని, ఆతడు వైఎస్ జగన్ అభిమాని అని నమ్మించేలా గ్రాఫిక్స్తో కూడిన ఫ్లెక్సీ ఫొటోలను చంద్రబాబు కార్యాలయం రూపొందింప చేసి మంత్రుల ద్వారా, తన పచ్చ మీడియా ద్వారా ప్రచారానికి తెరలేపింది. చంద్రబాబు సూచనల మేరకు మంత్రులు నక్కా ఆనందబాబు కాలువ శ్రీనివాసులు, గంటా శ్రీనివాసరావు, ఆదినారాయణరెడ్డి తదితరులు వరుసగా మీడియాతో మాట్లాడుతూ దాన్ని అమల్లో పెట్టారు. ప్రతిపక్షనేతపై జరిగిన హత్యాయత్నం ఘటనను ఖండించడానికి బదులు దాన్ని రాజకీయంగా పక్కదారి పట్టించడంపైనే వారి విమర్శలు సాగాయి. సినీనటుడు శివాజీ పేర్కొన్నట్లు ఆపరేషన్ గరుడలో భాగంగానే ఇది జరిగిందని, కేంద్రం కావాలని ఇలా చేస్తూ రాష్ట్రాన్ని అస్థిర పరిచేందుకు ఇలా చేస్తోందని ఆరోపణలకు దిగారు. మంత్రు లు నక్కా ఆనందబాబు, గంటా శ్రీనివాసరావులు నిందితుడు శ్రీనివాసరావు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభిమాని అని, అభిమానితోనే ఇలా చేయించుకున్నారంటూ ఘటనను వైఎస్సార్ కాంగ్రెస్పైకి నెట్టే కుట్రకు తెరలేపారు. హేపీ న్యూ ఇయర్, పొంగల్ అంటూ జగన్కు శుభాకాంక్షలు తెలియచేస్తూ ప్లెక్సీ కూడా కట్టించారని ఫోన్లో జగన్, నిందితుడు శ్రీనివాసరావు కలసి ఉన్నట్లుగా ఫోన్లో ఉన్న ఫొటోను చూపించారు. అయితే ఎప్పుడో పది నెలల క్రితంనాటి ఫ్లెక్సీ ఫొటో అంటూ మంత్రులు మీడియాకు విడుదల చేసిన ఫోన్లోని ఆ ఫొటో ఫ్లెక్సీకి సంబంధించినదిగా కాకుండా ఏదో గ్రాఫిక్స్తో రూపొందించినట్లుగా ఉండడంపై పలు సందేహాలు ఏర్పడుతున్నాయి. ఈ గ్రాఫిక్స్ ఫ్లెక్సీ ఫొటోలో గరుడ పక్షి బొమ్మ ముద్రించి ఉండడం విశేషం. హేపీ న్యూ ఇయర్ ఫ్లెక్సీల్లో గరుడ బొమ్మ ముద్రించరని, ప్రభుత్వమే దీన్ని గ్రాఫిక్స్లో పెట్టించి విడుదల చేసిందన్న అనుమానాలు బలపడుతున్నాయి. మరోపక్క విశాఖపట్నంలో పోలీసు అధికారులు కూడా ఘటన జరిగిన కొద్ది సమయంలోనే ఇదే గ్రాఫిక్స్తో కూడిన ఫొటోను చూపి శ్రీనివాసరావు జగన్ అభిమాని అని ప్రకటన చేయడం కూడా అనుమానాలను మరింత పెంచింది. ఇదంతా ప్రభుత్వ పెద్దలు ఒక పథకం ప్రకారం నడిపిస్తున్నారన్న చర్చ ప్రజల్లో సాగుతోంది. -
జెండాలు,ఫ్లెక్సీలతో నిండిపోయిన విజయనగరం
-
గుడివాడలో అధికార పార్టీ విడ్డూరం
నవ్విపోదురుగాక నాకేంటి సిగ్గు.. అన్నట్లుగా ఉంది గుడివాడ అధికార పార్టీ నేతల తీరు. వారు తానా అంటే తందానా.. అంటున్నారు ఇక్కడి పోలీసు అధికారి. అధికార పార్టీ నేతలు సెలవిచ్చిందే తడవుగా న్యాయాన్యాయాలతో పని లేకుండానే పోలీసు పవర్ను వినియోగిస్తున్నారు. గుడివాడలో చోటు చేసుకున్న ఈ వింత పరిస్థితిని చూసి జనం నవ్వుతుండగా పోలీసులు మాత్రం ఇదేం ఖర్మరా బాబూ.. అంటున్నారు. ‘సాక్షి’ సేకరించినవివరాలు ఇలా ఉన్నాయి. కృష్ణాజిల్లా, గుడివాడ : పట్టణంలోని మార్కెట్ సెంటర్లో టీడీపీ ఆధ్వర్యంలో వినాయక చవితి ఉత్సవాలు నిర్వహించారు. ఇందులో భాగంగా టీడీపీ నాయకుల ఫొటోలతో స్వాగత ఆర్చీ ఏర్పాటు చేశారు. టీడీపీ నేతల ఫ్లెక్సీలపై ఫొటోలను ఎవరైనా ఆకతాయిలు కోసేస్తారేమోనని పోలీసు రక్షణ కల్పించాలని అధికార పార్టీ నేతలు ఆదేశించినట్లు సమాచారం. దీంతో గుడివాడ పోలీసు ఉన్నతాధికారి ఆదేశాల మేరకు ఫ్లెక్సీలకు పదిహేను రోజులుగా రాత్రీ పగలు పోలీసు బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఆరుగురు పోలీసులతో బందోబస్తు... వినాయక చవితి ముందు రోజు ఫ్లెక్సీలతో టీడీపీ నేతలు స్వాగత ద్వారం ఏర్పాటు చేశారు. ఆరోజు నుంచి ఉదయం ఇద్దరు కానిస్టేబుళ్లు, మధ్యాహ్నం ఇద్దరు, రాత్రికి ఇద్దరు చొప్పున డ్యూటీలు వేశారు. అయితే ఉత్సవాలు ముగిసినా నిమజ్జనం జరిగి నాలుగు రోజులు దాటినా అధికార పార్టీ నేతల ఫ్లెక్సీలు అలాగే ఉన్నాయి. దీంతో ఫ్లెక్సీలకు ప్రతి రోజు పోలీసు బందోబస్తు మాత్రం తప్పటం లేదు. పగలు ఎండలో.. రాత్రి దోమలతో చెలగాటం... కాపలా కాస్తున్న పోలీసులకు పగలు ఎండ, రాత్రి దోమలతో చెలగాటం తప్పడం లేదు. రాత్రి సమయంలో నిద్ర పోకుండా కాపలా కాస్తున్నారు. ఎక్కడైనా మనుషులకు కాపలా కాస్తారు తప్ప, బ్యానర్లకు కూడా పోలీసులు కాపలా కాయటమేమిటని ప్రజలు నవ్వుకుంటున్నారు. అధికారం ఉందని ఇలా దుర్వినియోగం చేయటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాత్రి కాపలా ఉండే పోలీసులు దోమల బాధ తట్టుకోలేక ఏనాడో పాపం చేసుకున్నాం... లేకుంటే ఇదేం ఖర్మ.. అని ఆవేదన చెందుతున్నా రు. అధికార పార్టీ నేతలకే కాకుండా ఫ్లెక్సీలో ఉండే ఫోటోలకు కూడా పోలీసులు సేవలు చేయటం విడ్డూరంగా ఉందని అంటున్నారు. -
శుభవార్త : ఫ్లెక్సీ ఫేర్స్కు గుడ్ బై
సాక్షి, న్యూఢిల్లీ: రైల్వే ప్రయాణీకులకు శుభవార్త. ఫ్లెక్సీ రేట్ల విధానంలో రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఎంతో ఆర్భాటంగా ప్రారంభించిన ఫ్లెక్సీ రేట్ల విధానానికి గుడ్ బై చెప్పాలని రైల్వే శాఖనిర్ణయించింది. డైనమింక్ ప్రైసింగ్ పేరుతో ప్రస్తుతం 142 రైళ్ళలో అమల్లో ఉన్న ఫ్లెక్సీ ఫేర్స్ పాలసీని కొన్ని రైళ్లలో రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. వినియోగదారులపై ఛార్జీల భారంతోపాటు, ఈ విధానం ద్వారా డిమాండ్ బాగా పడిపోవడంతో ఈ నిర్ణయం తీసుకుంది. డైనమిక్ ప్రైసింగ్ పేరుతో అమలవుతున్న ఈపద్ధతిలో ఆశించిన ప్రయోజనం దక్కకపోగా ప్రీమియం రైళ్లలో డిమాండ్భారీగా క్షీణిస్తోంది. ముఖ్యంగా చార్జీలు విమాన టికెట్లను మించిపోవడంతో కనీసం 50 శాతం సీట్లు కూడా భర్తీ కావడం లేదు. దీంతో 40 రైళ్ళలో ఈ ఫ్లెక్సీ విధానాన్ని ఎత్తివేయనుంది. అయితే మిగిలిన 102 రైళ్ళలో ఫెక్లీ ఫేర్స్ అమలు కానున్నాయి. ప్రయాణానికి నాలుగు రోజులు ముందు, చివరి నిమిషంలో బుకింగ్లపై 50 శాతం వరకు డిస్కౌంట్ అందించనుంది. దీంతోపాటు 60శాతం కంటే తక్కువ బుకింగ్స్ ఉన్న రైలు టికెట్లపై గ్రేడెడ్ డిస్కౌంట్ కూడా ఉందని రైల్వే శాఖ వెల్లడించింది. ప్రయాణీకులను ఆకర్షించడంపై సాధించడంపై తాము దృష్టి కేంద్రీకరించామనీ, సరసమైన ధరల్లో రైల్వే ప్రయాణాన్ని తిరిగి వారికి అందుబాటులోకి తేవాలని భావించామని సీనియర్ రైల్వే అధికారి చెప్పారు. వినియోగదారుపై భారం మోపడం ద్వారా కాకుండా, సీట్ల అధిక వినియోగం ద్వారా ఆదాయాన్ని పెంచుకోవాలని యోచిస్తున్నామన్నారు. ఈ కొత్త విధానం సంబంధిత ప్రభుత్వ అధికారుల తుది ఆమోదం అనంతరం అమల్లోకి రానుందని చెప్పారు. కాగా 44 రాజధాని, 46 శతాబ్ది, 52 దురంతో రైళ్ళలో ప్రస్తుతం డైనిమిక్ ప్రైసింగ్ విధానం అమల్లో ఉంది. దురంతో రైళ్ళలో ఏసీతో పాటు నాన్ ఏసీ బెర్త్ లు కూడా ఉంటాయి.. మిగిలిన రైళ్ళలో అన్నీ ఏసీ బోగీలే. ధరలు భారీగా పెరగడంతో ప్రయాణీకులు, డిస్కౌంట్ ఆఫర్లు, తగ్గింపు రేట్లతో ఆకట్టుకుంటున్న విమాన ప్రయాణాలపై మొగ్గు చూపుతున్నారు. దీంతో ఆలస్యంగా కళ్ళు తెరిచిన రైల్వేశాఖ ఈ కొత్త విధానంలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టింది. -
ఆకాశమే హద్దుగా ఎగసిన ప్రజాభిమానం
-
కేటీఆర్ బర్త్ డే.. ఆర్భాటాలు బంద్..!
-
కేటీఆర్ బర్త్ డే.. ఆర్భాటాలు బంద్..!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు మంగళవారం 42వ వసంతంలోకి అడుగుపెట్టుబోతున్నారు. ఈ సందర్భంగా అభిమానులు ఆయనకు ఒక పాటను బహూకరించారు. కేటీఆర్ బర్త్డే సాంగ్ను ఎమ్మెల్యేశంభీపూర్ రాజు, నగర మేయర్ బొంతు రామ్మోహన్ ఆదివారం విడుదల చేశారు. ‘నీలాల మబ్బుల్లో సూర్యుడు.. నువ్వు తెలంగాణ నేల రాముడు’ అంటూ సాగే పాట అభిమానులను ఆకట్టుకుంటోంది. కాగా, తన జన్మదినం సందర్భంగా కటౌట్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేయొద్దని కేటీఆర్ అభిమానులు, శ్రేయోభిలాషులకు విజ్ఞప్తి చేశారు. కేటీఆర్ విజ్ఞప్తి మేరకు సచివాలయం వద్ద ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను మేయర్ బొంతు రామ్మోహన్ తీసేయించారు. ఇక కేసీఆర్ వారసుడిగా రాజకీయాల్లోకి అడుగుపెట్టిన కేటీఆర్ అనతి కాలంలోనే రాష్ట్ర రాజకీయాల్లో కీలక నేతగా ఎదిగారు. తనకు కేటాయించిన శాఖల్ని సమర్థవంతంగా నిర్వర్తిస్తూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. -
పుట్టినరోజున ఫ్లెక్సీలు, హోర్డింగ్లు వద్దు: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: తన పుట్టినరోజు సందర్భంగా ఫ్లెక్సీలు, హోర్డింగ్లు ఏర్పాటు చేయొద్దని మంత్రి కె.తారకరామారావు అభిమానులను కోరారు. జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఇప్పటికే నగరంలో అక్కడక్కడ పెట్టిన హోర్డింగ్లు, ఫ్లెక్సీలను తొలగించాలని జీహెచ్ఎంసీ కమిషనర్, మేయర్లను కోరారు. మంగళవారం తన పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ పత్రికలు, టీవీలకు ఇచ్చే ప్రకటనల ఖర్చును ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళంగా అందజేయాలని పిలుపునిచ్చారు. పూల బొకేలు, ఫ్లెక్సీలకు అయ్యే చిన్న మొత్తాలను సైతం సీఎం సహాయ నిధికి పంపించాలని కోరారు. హరితహారంలో భాగంగా ప్రతి ఒక్కరూ తన పుట్టిన రోజున మొక్కలు నాటాలని కోరారు. -
టీడీపీ నేతల మధ్య ఫ్లెక్సీల గొడవ.. ఎస్పీకి ఫిర్యాదు!
సాక్షి, అనంతపురం : ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో టీడీపీ నేతల మధ్య విభేదాలు ఒక్కొక్కటి బయటపడుతున్నాయి. తాజాగా మంత్రి లోకేష్ కర్నూల్ పర్యటనలో చేసిన వ్యాఖ్యలతో నేతల మధ్య చిచ్చురగులుకున్న విషయం తెలిసిందే. అనంతపురంలో టీడీపీ ఎంపీల నిరసన దీక్షలో ఫ్లెక్సీల గొడవ చోటుచేసుకుంది. టీడీపీ ఎమ్మెల్యే వరదాపురం సూరి ఫ్లెక్సీలను గుర్తు తెలియని వ్యక్తులు చించేశారు. కానీ సూరి అనుచరులు మాత్రం మంత్రి పరిటాల సునీత వర్గీయులపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఎమ్మెల్యే సూరి ఈ విషయంపై ఎస్పీకి ఫిర్యాదు చేశారు. అంతేకాక ఫ్లెక్సీలు తొలగించిన కొంతమందిని పోలీసులు తప్పించారని ఎమ్మెల్యే ఎస్పీ దృష్టికి తీసుకెళ్లారు. -
టీడీపీలో ఫ్లెక్సీ కలకలం
లబ్బీపేట(విజయవాడ తూర్పు): చంద్రబాబు ప్రభుత్వ తీరును ఎండగడుతూ ‘ఐదు కోట్ల ఆంధ్రులారా ఆలోచించండి’ అంటూ గురువారం విజయవాడలో వెలిసిన ఓ బ్యానర్ కలకలం సృష్టించింది. నిత్యం రద్దీగా ఉండే మహాత్మాగాంధీ రోడ్డులోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం వద్ద దీనిని ఏర్పాటు చేశారు. బ్యానర్లోని అంశాలన్నీ వాస్తవానికి దగ్గరగా ఉండటంతో.. మార్నింగ్ వాక్కు వచ్చిన పలువురు దీనిపై చర్చించుకోవడం కనపించింది. మరికొందరు ఫొటోలు తీసి సోషల్ మీడియాలో కూడా పోస్టు చేశారు. స్టేడియంలో సీఎం చంద్రబాబు సభ ఉండటంతో.. ఏర్పాట్లు పరిశీలించేందుకు అక్కడకు వచ్చిన అధికారులు ఈ బ్యానర్ను చూసి ఉలికిపాటుకు గురయ్యారు. వెంటనే మున్సిపల్ సిబ్బందిని పిలిపించి దానిని తొలగించారు. ప్రజలకు తెలుసులే! యూ టర్న్ తీసుకుని ప్రత్యేక హోదానే కావాలని అడగడంలో ఆంతర్యం ఏమిటో ప్రజలకు తెలుసంటూ చంద్రబాబును ఉద్దేశించి బ్యానర్లో పేర్కొన్నారు. రాజధాని భూ కేటాయింపులతో పాటు పట్టిసీమ, పోలవరం ప్రాజెక్టుల్లో వేల కోట్ల రూపాయల అవినీతి జరగడం నిజం కాదా అని ప్రశ్నించారు. వీటిపై సీబీఐ విచారణ కోరదామా? తెలుగుదేశం తమ్ముళ్లూ.. అని నిలదీశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన 600 హామీలు ఏమయ్యాయి? అని ప్రశ్నించారు. కులాల మధ్య చిచ్చుపెట్టింది కూడా మీరే కదా తమ్ముళ్లూ అని నిలదీశారు. వీటిపై ఆలోచించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. -
విజయవాడలో ‘ఫ్లెక్సీ’ కలకలం
సాక్షి, విజయవాడ: అధికార తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా విజయవాడలో వెలిసిన ఫ్లెక్సీలు రాష్ట్రంలో సంచలనంగా మారాయి. టీడీపీ తీరుకు నిరసనగా గుర్తు తెలియని వ్యక్తులు ఈ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. రాత్రికి రాత్రికి ప్రత్యక్షమైన ఈ హోర్డింగ్లతో నగరంలో ఒక్కసారిగా కలకలం రేగింది. దీంతో ఫ్లెక్సీ ఏర్పాటుపై అధికార పార్టీ నేతలకు సమాచారం అందడం.. అనంతరం మున్సిపల్ సిబ్బందితో వాటిని తొలగించడం చకాచకా జరిగిపోయాయి. ఫ్లెక్సీలో ఏముందంటే..? ప్రజలారా ఆలోచించడంటూ.. ‘కేంద్రం ఇచ్చిన స్పెషల్ ప్యాకేజీ నిధులు తీసుకుంటూ.. యూ టర్న్ తీసుకొని మళ్లీ హోదానే కావాలని అడగటంలో ఆంతర్యం ఏమిటో 5 కోట్ల ఆంధ్రులకు తెలుసులే!.. పట్టిసీమ, పోలవరం ప్రాజెక్టులలో వేల కోట్ల రూపాయల అవినీతి జరగడం నిజం కాదా?.. తెలుగు దేశం తమ్మూళ్లూ.. పోలవరం, పట్టిసీమ, రాజధాని భూముల కేటాయింపులపై సీబీఐ విచారణ కోరదామా? కేంద్ర ప్రభుత్వం ప్రజలకు ఉచితంగా ఇళ్లు ఇస్తుంటే.. రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల దగ్గర నుంచి అధిక డబ్బులు వసూలు చేయడం ఎంత వరకు కరెక్టు!.. కాల్ మనీ కేసుల విచారణ ఏమైంది..? ఎన్నికల సమయంలో ఇచ్చిన 600 హామీలు ఏమయ్యాయి తెలుగుదేశం తమ్మూళ్లూ! కులాల మధ్య చిచ్చు పెట్టింది మీరు కాదా తెలుగు దేశం తమ్మూళ్లూ?’ అని 5 కోట్ల మంది ఆంధ్రులు అని భారీ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. అయితే ఈ ఫ్లెక్సీలను ఎవరు ఏర్పాటు చేశారనే దానిపై స్పష్టత రాలేదు. కానీ ఈ బీజేపీ శ్రేణులే ఏర్పాటు చేశాయని టీడీపీ ఆరోపిస్తోంది. కాగా, గత కొంతకాలంగా నగరంలో బీజేపీ, టీడీపీల మధ్య ఫ్లెక్సీ ఫైట్ కొనసాగుతోంది. మూడు నెలల క్రితం కేంద్రంతో పాటు, ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా టీడీపీ నేత కాట్రగడ్డ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. విజయవాడలోనే ప్రత్యక్షమైన ఈ ఫ్లెక్సీల్లో కేంద్రం, ప్రధాని నరేంద్ర మోదీని విమర్శించారు. ఏపీకి కేంద్రం ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఏర్పాటు చేసిన ఆ హోర్డింగ్లపై అప్పట్లో బీజేపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. అయితే బయటకు బీజేపీపై విమర్శలు చేస్తూ అంతర్గతంగా బీజేపీతో అంటకాగుతున్న సీఎం చంద్రబాబు ఈ ఫ్లెక్సీలపై మండిపడ్డారు. మోదీని ఎవరూ దూషించొద్దని తెలుగు తమ్ముళ్లకు ఆదేశాలు జారీ చేశారు. చంద్రబాబు ద్వంద్వ వైఖరిని సొంత పార్టీ నాయకులతో పాటు ప్రతిపక్షాలు గర్హిస్తున్నాయి. ఫ్లెక్సీని తొలగిస్తున్న మున్సిపల్ సిబ్బంది.. గతంలో బీజేపీకి వ్యతిరేకంగా టీడీపీ నేత ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ -
విజయవాడలో టీడీపీ తీరుని విమర్శిస్తూ ఫ్లెక్సీ
-
‘బ్లేడు బ్యాచ్ బ్యానర్లు తీస్తే మంచిది’
సాక్షి, విజయవాడ : తెలుగుదేశం పార్టీ (టీడీపీ) నాయకుడు కాట్రగడ్డ బాబుపై బీజేపీ నాయకులు నిప్పులు చెరిగారు. కార్పోరేటర్గా కూడా పోటీ చేయలేని కాట్రగడ్డకు పురంధేశ్వరిని విమర్శించే స్థాయి లేదని బీజేపీ నగరాధ్యక్షుడు ఉమా మహేశ్వరరాజు మండిపడ్డారు. రాజకీయ అజ్ఞాని కాట్రగడ్డను టీడీపీ నాయకులే పక్కన పెట్టారని అన్నారు. రాజకీయాల్ని రాజకీయంగా చూడాలేగానీ, వ్యక్తిగత విమర్శలు తగవని హితవు పలికారు. అధిష్టానం దృష్టిలో పడడానికి ప్రధానిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ.. బ్యానర్లు కడుతున్నారని ధ్వజమెత్తారు. దొందలందరూ టీడీపీలోనే ఉన్నారని విమర్శించారు. ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తూ దొంగ దీక్షలు చేయడం వారికి మామూలేనని టీడీపీ నాయకులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. అదొక బ్లేడు బ్యాచ్ చేతిలో వెయ్యి రూపాయలు ఉంటే చాలు.. ముందూ వెనకా ఆలోచించకుండా ఓ బ్లేడు బ్యాచ్ దేశ ప్రధానిపై కూడా తలా తోకాలేని విమర్శలు చేస్తూ ఫ్లెక్లీలు ఏర్పాటు చేస్తారని విజయవాడ యువమోర్చా అధ్యక్షుడు రవీంద్ర ధ్వజమెత్తారు. కాట్రగడ్డకు కళ్లు నెత్తికెక్కాయని వ్యాఖ్యానించారు. బీజేపీ నాయకులపై విమర్శలు చేస్తున్నవారు దమ్ముంటే టీడీపీ మేనిఫెస్టోపై బహిరంగ చర్చకు రావాలని సవాలు విసిరారు. లేదంటే ఫ్లెక్సీలు తొలగించి నోరు మూసుకుని ఇంట్లో కూర్చోవాలని అన్నారు. -
ఫ్లెక్సీ ఎక్కిన అభిమానం.. ఫైన్ వేసిన అధికారం
బంజారాహిల్స్: స్వచ్ఛ హైదరాబాద్ లక్ష్యానికి తూట్లు పొడిస్తే ఎంతటివారికైనా శిక్ష తప్పదని నిరూపించారు గ్రేటర్ అధికారులు. తప్పు చేస్తే పైవారు.. తమ వారు అన్న వివక్ష వద్దని గతంలోనే మంత్రి కేటీఆర్ హెచ్చరించారు. ఇప్పుడు ఇదంతా ఎందుకంటే.. ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ నుంచి అధికార టీఆర్ఎస్ పార్టీలోకి మారిన దానం నాగేందర్కు ఆహ్వానం పలుకుతూ ఓ మాజీ కార్పొరేటర్ బంజారాహిల్స్లోని పలు ప్రాంతాల్లో ఫ్లెక్సీలు కట్టారు. ఇలా కట్టడం నిబంధనలకు విరుద్ధమని జీహెచ్ఎంసీ అధికారులు సదరు నేతకు నోటీసులతో షాక్ ఇచ్చారు. ఇది మంత్రి కేటీఆర్కు, జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్రెడ్డికి నచ్చలేదు. ఫ్లెక్సీలు బ్యానర్లపై నిషేధం ఉండగా ఇలా సొంత పార్టీ వారే నిబంధనలు ఉల్లంఘించడమేంటని వారు కింది స్థాయి అధికారులపై మండిపడ్డారు. తక్షణమే బాధ్యులపై జరిమానా విధించాలంటూ ఆదేశించారు. దీంతో దానంతో పాటు టీఆర్ఎస్లో చేరిన బంజారాహిల్స్ మాజీ కార్పొరేటర్ బి.భారతినాయక్కు నోటీసులు జారీ చేశారు. చేసిన తప్పుకు రూ.30 వేల జరిమానా చెల్లించాల్సిందేనంటూ అందులో పేర్కొన్నారు. దీంతో సదరు నాయకులు తెల్లమొహం వేశారు. దానం ఫ్లెక్సీలపై ఎవరెవరు ఆహ్వానం పలుకుతూ ఫొటోలు వేసుకున్నారో వారందరికీ జరిమానాలు వేస్తామని అధికారులు చెబుతున్నారు. అధికార పార్టీలో చేరితో ఇదోమి గోసరా దేవుడా అంటూ ఇప్పుడా నేతలు తల పట్టుకుంటున్నారు. మా కాలంలో ఇలా లేదు బాబు అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. -
ఫ్లెక్సీ ఏర్పాటుపై జరిమానా
సాక్షి, సిటీబ్యూరో: అనధికార ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేసిన వారిపై పెనాల్టీలు విధించాలన్న మేయర్ బొంతు రామ్మోహన్ ఆదేశాల మేరకు జీహెచ్ఎంసీ అధికారులు టీఆర్ఎస్ భవన్ వద్ద ఫ్లెక్సీ ఏర్పాటు చేసిన జి.నాగేంద్ర,వి.మోహన్రెడ్డిలకు చెరో రూ. 15వేల చొప్పున జరిమానా విధించారు. -
పవన్ ఫ్లెక్సీ కడుతూ కరెంట్ షాక్తో ఇద్దరు మృతి
-
పవన్ ఫ్లెక్సీ కడుతూ.. ఇద్దరు మృతి
విశాఖపట్నం : విశాఖపట్నం పాయకరావుపేటలో విషాదం చోటుచేసుకుంది. జనసేన అధ్యక్షుడు పవన్కళ్యాణ్ రాక సందర్భంగా 30 అడుగుల ఫ్లెక్సీని అభిమానులు తయారు చేపించారు. పవన్ అభిమానులు శివ, నాగ రాజులు ఫ్లెక్సీ కడుతుండగా ప్రమాదవశాత్తూ కరెంట్ వైర్లు తగిలి షాక్కు గురవ్వడంతో అక్కడికక్కడే మృతిచెందారు. వీరిద్దరు తుని, పాయకరావుపేట వాసులుగా గుర్తించారు. సూర్యమహల్ సెంటర్లో ఫ్లెక్సీ అమర్చుతుండగా ప్రమాదం చోటుచేసుకుంది. -
ఫ్లెక్సీ గండంతో ఆగిన మెట్రో రైలు
సాక్షి, హైదరాబాద్: మెట్రో రైళ్లకు హోర్డింగులు, వాటిపై ఏర్పాటుచేసిన వాణిజ్య ప్రకటనల ఫ్లెక్సీలు గండంలా పరిణమిస్తున్నాయి. తాజాగా గురువారం జేఎన్టీయూ వద్ద ఓ హోర్డింగ్కు ఉన్న ఫ్లెక్సీ చిరిగి మెట్రో రూట్లోని ఓవర్హెడ్ విద్యుత్ తీగలపై పడింది. దీంతో సాయంత్రం 5.35 నుంచి 6.05 వరకు మెట్రో రైలును నిలిపివేశారు. ఘటనపై హైదరాబాద్ మెట్రో రైలు మేనేజింగ్ డైరెక్టర్ ఎన్వీఎస్ రెడ్డి స్పందిస్తూ.. ఓ వాణిజ్య ప్రకటనకు సంబంధించిన ఫ్లెక్సీ మెట్రో ఓవర్హెడ్ విద్యుత్ తీగలపై పడటంతోనే రైలును 20 నిమిషాల పాటు నిలపాల్సి వచ్చిందన్నారు. ఈ ఘటనతో ఎలాంటి నష్టం వాటిల్లలేదని స్పష్టం చేశారు. కాగా నగర మెట్రో రైళ్లు ఆధునిక సాంకేతికతతో దూసుకెళ్తాయని గతంలో అధికారులు చెప్పినప్పటికీ.. ఎంఎంటీఎస్ తరహాలోనే రైళ్లను తరచూ నిలపాల్సి రావడం పట్ల ప్రయాణికులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ఖైరతాబాద్లో రైలు పట్టాలపైనున్న ఓవర్హెడ్ విద్యుత్ తీగలపై ఓ ఫ్లెక్సీ చిరిగిపడటంతో ఎంఎంటీఎస్ రైలును గంటపాటు నిలిపివేసిన విషయం తెలిసిందే. గతంలో నాగోల్– అమీర్పేట్ మార్గంలో రెండుసార్లు ఇలానే ఫ్లెక్సీలు చిరిగి పడటంతో మెట్రో రైళ్లను అరగంటపాటు నిలిపివేశారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే.. ప్రస్తుతం నాగోల్– అమీర్పేట్, మియాపూర్– అమీర్పేట్ మార్గంలో 18 మెట్రో రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి. వీటికి ఆనుకొని పలు హోర్డింగ్లు, ఫ్లెక్సీలు ఉన్నాయి. వీటిని తొలగించే విషయంలో జీహెచ్ఎంసీ, మెట్రో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంతోనే తరచూ ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. మరోవైపు ఈ ఏడాది ఆగస్టులో ఎల్బీనగర్– అమీర్పేట్, అక్టోబర్లో అమీర్పేట్– హైటెక్సిటీ మార్గంలోనూ మెట్రో రైళ్లు పరుగులు తీయనున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా మార్గాల్లో మెట్రో మార్గానికి ఆనుకొని ఉన్న భారీ హోర్డింగ్లు, ఫ్లెక్సీలను తక్షణం తొలగించాలని నిపుణులు, ప్రయాణికులు కోరుతున్నారు. -
కుర్తిరావల్చెర్వులో ఉద్రిక్తత
మల్దకల్(గద్వాల) : రైతుబంధు పథకంలో భాగంగా పెట్టుబడి సాయం చెక్కుల పంపిణీ కార్యక్రమ వేదిక వద్ద ఏర్పాటుచేసిన ఫ్లెక్సీలు వివాదానికి దారి తీశాయి. ఈ ఘటన జోగుళాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండలం కుర్తిరావల్చెర్వులో శుక్రవారం చోటు చేసుకోగా.. కాంగ్రెస్–టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పరస్పరం దాడులకు దిగారు. చివరకు పోలీసులు రంగంలోకి దిగి లాఠీచార్జ్ చేసి పరిస్థితిని చక్కదిద్దాల్సి వచ్చింది. ఎమ్మెల్యే రాకముందే... చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని కుర్తిరావల్చెర్వులో ఏర్పాటుచేశారు. అయితే, ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే డీ.కే.అరుణ రాకముందే టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి కృష్ణమోహన్రెడ్డి గ్రామానికి చేరుకుని ఇన్చార్జి జేసీతో కలిసి పలువురు రైతులకు చెక్కులు పంపిణీ చేశారు. ప్రొటోకాల్ ఉల్లంఘించి టీఆర్ఎస్ నాయకులతో ఎలా చెక్కులు పంపిణీ చేయిస్తారని డీసీసీ అధ్యక్షుడు పటేల్ ప్రభాకర్రెడ్డి అధికారులతో వారించారు. దీంతో ఇరు పార్టీ నాయకుల మధ్య కొంత వాగ్వాదం చోటు చేసుకుంది. వివాదానికి దారితీసిన ఫ్లెక్సీలు చెక్కుల పంపిణీ కేంద్రంలో టీఆర్ఎస్ నాయకులతో కూడిన ఫ్లెక్సీని ఏర్పాటు చేయగా.. బయట రైతుల ఆత్మహత్యలు, రైతు సమస్యలు పరిష్కరించడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని ఎండగడుతూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యాన ఓ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ఇది ప్రభుత్వ పథకానికి విరుద్ధంగా ఉందని ఆరోపిస్తూ టీఆర్ఎస్ కార్యకర్తలు కాంగ్రెస్ ఫ్లెక్సీని తొలగించారు. అనంతరం ఎమ్మె ల్యే డీకే.అరుణ గ్రామానికి చేరుకోగా ఆ ఫ్లెక్సీని పంపిణీ కేంద్రం ముందు మళ్లీ ఏర్పాటు చేయించారు. కార్యక్రమానికి తాను వస్తున్నారనే విషయం తెలిసి కూడా ఏ హోదా లేని వ్యక్తితో ఎలా చెక్కులు పంపిణీ చేయిస్తారని ఆమె అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం జెడ్పీ చైర్మన్ బండారి భాస్కర్ గ్రామానికి వచ్చారు. అక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. ఎమ్మెల్యే డీకే అరుణ సమక్షాన అధికారులు చూస్తుండగానే భాస్కర్ స్వయంగా ఆ ఫ్లెక్సీని చింపేశారు. దీంతో కాంగ్రెస్ కార్యకర్తలు ఆయనతో వాగ్వాదానికి దిగారు. ఆ తర్వాత పక్కనే ఉన్న టీఆర్ఎస్ నాయకులతో కూడిన ఫ్లెక్సీని వారు తొలగించారు. ఈ మేరకు కోపోద్రిక్తులైన టీఆర్ఎస్ కార్యకర్తలు ఫ్లెక్సీని తొలగించిన కాంగ్రెస్ కార్యకర్తలపై పిడిగుద్దులు కురిపిస్తూ మూకుమ్మడిగా దాడికి పాల్పడ్డారు. పరిస్థితి విషమించడంతో సీఐ వెంకటేశ్వర్లు పోలీసులతో కలిసి లాఠీచార్జ్ చేసి అందరినీ చెదరగొట్టారు. దీంతో సుమారు గంట పాటు గ్రామంలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఈ విషయం తెలుసుకున్న వెంటనే డీఎస్పీ సురేందర్రావు గ్రామానికి చేరుకుని ఇరుపార్టీల నాయకులకు సర్దిచెప్పారు. దాడి జరిగిన విషయాన్ని ఎమ్మెల్యే డీకే. అరుణ సంఘటనా స్థలం నుంచి ఫోన్ ద్వారా జిల్లా ఎస్పీ రెమా రాజేశ్వరికి ఫిర్యాదు చేశారు. అనంతరం జెడ్పీ చైర్మన్ బండారి భాస్క ర్, ఎమ్మెల్యే డీకే. అరుణ వేర్వేరుగా రైతులకు చెక్కులు పంపిణీ చేసి విలేకరులతో మాట్లాడారు. కార్యక్రమంలో ఇన్చార్జి జేసీ వేణుగోపాల్, మార్కె ట్ యార్డు చైర్పర్సన్ బండ్ల లక్ష్మీదేవి, తహసీల్దార్ వీరభద్రప్ప పాల్గొన్నారు. -
కాంగ్రెస్ టీఆర్ఎస్ మధ్య ఫ్లెక్సీల గొడవ
-
కడపలో టీడీపీ వెరైటీ ఫ్లెక్సీ
సాక్షి, కడప : నగరంలో తెలుగుదేశం నేతలు ఏర్పాటు చేసిన ఓ ఫ్లెక్సీ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రజా సమస్యలు తెలుసుకుంటూ, వారికి తగిన భరోసానిస్తూ ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజాసంకల్పయాత్ర చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే కడప తెలుగుదేశం నేతలు మాత్రం ప్రజాసంకల్పయాత్ర పేరుతో ర్యాలీ నిర్వహించనున్నట్లు ఫ్లెక్సీ కట్టి మరీ ప్రచారం చేసుకుంటున్నారు. తెలుగుదేశం నేతలు తాజాగా కడపలో ర్యాలీ నిర్వహించాలని భావించారు. ఇందులో జిల్లా టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. ఈ సందర్భంగా ఆయనకు స్వాగతం పలుకుతూ స్థానిక నేతలు 'ప్రజాసంకల్పయాత్రకు విచ్చేయుచున్న శ్రీనివాసరెడ్డికి స్వాగతం సుస్వాగతం' అంటూ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ఈ హోర్డింగ్ చూసిన కొందరు సొంత పార్టీ నేతలే ముక్కున వేలేసుకుంటున్నారు. ప్రతిపక్ష నేత చేపట్టిన పాదయాత్రను కాపీ కొట్టడం ఏంటో అంటూ గుసగుసలాడుకుంటున్నారు. -
ప్రత్తిపాడు టీడీపీలో కుమ్ములాట
సాక్షి ప్రతినిధి, కాకినాడ : తూర్పు గోదావరి జిల్లా ప్రత్తిపాడు టీడీపీలో విభేదాలు తీవ్ర రూపం దాల్చాయి. తాడోపేడో తేల్చుకోవడానికి సిద్ధమవుతున్నాయి. ‘నువ్వెంత అంటే నువ్వెంత’ అనే స్థాయికి వెళ్లిపోయాయి. పార్టీలోకి వచ్చి తమను అణగదొక్కుతున్నారని ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావుపై టీడీపీలో తొలినుంచీ ఉంటూ వస్తున్నవారు భగ్గుమంటున్నారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యే తమపై పెత్తనం చెలాయించడమేంటని పర్వత చిట్టిబాబు వర్గీయులు తిరుగుబాటుకు దిగారు. వారందరూ ఇప్పుడు రోడ్డెక్కారు. ఎమ్మెల్యే తీరును బాహాటంగానే దుయ్యబడుతున్నారు. జోక్యం చేసుకుంటున్న అధికారులను సైతం నిలదీస్తున్నారు. ఇదెక్కడికి వెళ్తుందో తెలియదు గాని ప్రత్తిపాడు టీడీపీలో మాత్రం ప్రస్తుతం కలహాల కాపురం నడుస్తోంది. ప్రత్తిపాడు నియోజకవర్గంలో టీడీపీకి పర్వత చిట్టిబాబు వర్గమే నాయకత్వం వహిస్తూ వస్తోంది. కానీ, ఎన్నికల అనంతరం ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు పార్టీ ఫిరాయించి టీడీపీలోకి వచ్చారు. దీంతో టీడీపీలో కుమ్మలాట మొదలయింది. పార్టీలోకి రావడమే తరువాయి పాత కాపులైన పర్వత చిట్టిబాబు వర్గీయులను అణగదొక్కడమే పనిగా ఎమ్మెల్యే వరుపుల పెట్టుకున్నారు. ఇప్పటికే పలుమార్లు పర్వత చిట్టిబాబు వర్గీయులు బయటపడ్డారు. ఎమ్మెల్యేపై ఫిర్యాదుకు సైతం దిగారు. పరిస్థితిలో మార్పు రాలేదు. పర్వత వర్గీయులకు అడుగడుగునా అవమానాలు ఎదురవుతున్నాయి. తాజాగా ఫ్లెక్సీల గొడవ... టీడీపీ అట్టహాసంగా చేపడతున్న పింఛన్ల పంపిణీలో తాజాగా అసమ్మతి బుసకొట్టింది. ఈ నెల 9న రౌతులపూడిలోను, 10న శంఖవరంలో జరిగిన కొత్త పింఛన్లు పంపిణీ కార్యక్రమం కోసం ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ లోపాలు టీడీపీలో మరింత అగ్గి రాజేశాయి. కొత్త పింఛన్లు పంఫిణీ కార్యక్రమానికి ఏర్పాటు చేసిన ఫ్లెక్సీపై తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు దివంగత మహానేత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు, దివంగత మాజీ ఎమ్మెల్యే పర్వత చిట్టిబాబు ఫొటోలను వేశారు. కానీ, అది ఎమ్మెల్యే వర్గీయులకు రుచించలేదు. వెనకుండి ఎన్టీఆర్, చిట్టిబాబు ఫొటోలపై స్టిక్కర్లను అంటించేలా చేయించారని దివంగత ఎమ్మెల్యే పర్వత చిట్టిబాబు వర్గానికి చెందిన పలువురు తెలుగు తమ్ముళ్లు తిరగబడ్డారు. ఇదంతా ఎమ్మెల్యే పనేనని, ఆయన చెబితేనే అధికారులు తొలగించారని తీవ్ర ఆవేదనకు గురయ్యారు. ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా తమ్ముళ్ల ఆందోళన ఎమ్మెల్యే తీరుతో విభేదిస్తున్న పర్వత చిట్టిబాబు వర్గీయుల తమ నాయకులకు జరిగిన అన్యాయాన్ని నిలదీసేందుకు బుధవారం రోడ్డెక్కారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయం వద్దకు వెళ్లి ఆందోళన చేశారు. జరిగిన అవమానికి బాధ్యులెవరని ఎంపీడీఓ ఎం.శ్రీనును నిలదీశారు. దీనికి సమాధానం చెప్పడానికి ఎంపీడీఓ మీనమేషాలు లెక్కిస్తున్నారంటూ అక్కడే కార్యాలయం ఎదుట ఆర్అండ్బీ రహదారిలో రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ముప్పైఏళ్లుగా పార్టీ జెండాను భుజాన పెట్టుకుని పార్టీకోసం తన ప్రాణాలను పణంగా పెట్టిన చిట్టిబాబును, పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ ఫొటోలపై మాసికను అంటించిడం తమను ఎంతగానో బాధించిందని, ఈ విషయంలో ఎవరి ఒత్తిడి వల్ల ఇలా చేశారో ఎంపీడీఓ చెప్పాలని వారంతా పట్టుబట్టారు. గత రెండేళ్లుగా ప్రభుత్వం అందిస్తున్న వివిధ సంక్షేమ పథకాల పంపిణీలో సమాన ప్రాధాన్యత ఇవ్వకుండా తీవ్ర వ్యత్యాసం చూపుతున్నారని, అయినా భరిస్తున్నామని, కాని తమ నాయకుల ఫొటోలపై మాసికలు వేయటం ఉద్దేశ్యపూర్వకంగా ఎమ్మెల్యే, ఆయన అనుచరుల అండతోపూ ఎంపీడీఓ ఈ చర్యలకు పూనుకున్నారని మండిపడ్డారు. దీంతో విషయం తెలుసుకున్న టీడీపీ నాయకుడు పర్వత చిట్టిబాబు సోదరుడు పర్వత రాజుబాబు, టీడీపీ నాయకులు బద్ది రామారావు తదితరులు వచ్చి ఆందోళనకారులతో చర్చలు జరిపారు. ఈ మేరకు ఎంపీడీఓ ఆందోళనకారుల వద్దకు వచ్చి బేనర్ ఏర్పాటులో ఏమైనా పొరపాట్లు జరిగితే సిబ్బంది లోపంతో జరిగింది తప్ప ఎలాంటి రాజకీయ ఒత్తిడిలు లేవని చెప్పుకొచ్చారు. -
యువకుడి ప్రాణాలు బలిగొన్న ఫ్లెక్సీ కర్రలు
మిర్యాలగూడ అర్బన్ : మున్సిపల్ శాఖ, ఐటీ శాఖమంత్రి కేటీఆర్ బహిరంగ సభలో గుర్తింపు తెచ్చుకోడానికి ఆ పార్టీ నాయకులు పోటాపోటీగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు ఓ యువకుడి నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నాయి. స్థానికులు, మృతుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం... పట్టణంలోని చింతపల్లి ఇందిరమ్మకాలనిలో నివాసముంటున్న బూతరాజు వేణు(25) తన ద్విచక్ర వాహనంపై అద్దంకి–నార్కట్పల్లి బైపాస్రోడ్డు మీదుగా చింతపల్లికి వెళుతున్నాడు. ఈ క్రమంలో హనుమాన్పేట ఫ్లై ఓవర్పై ఫ్లెక్సీకర్రల లోడుతో నిలిపిన టాటాఏసీ ఆటోను వెనుకనుంచి వచ్చి ఢీ కొట్టాడు. దీంతో ఆటోలో ఉన్న ఫ్లెక్సీ కర్రలు వేణు ఛాతిభాగంలో దిగాయి. దీంతో అతడు తీవ్ర గాయాలపాలయ్యాడు. 108సహాయంతో పట్టణంలోని ఏరియా ఆస్పత్రికి తరలించగా అతడి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్సకోసం హైదరాబాద్కు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. మృతుడికి 15రోజుల క్రితమే వివాహం.. కాగా బూతరాజు భిక్షం, యాదమ్మలకు కుమార్తె, ఇద్దరు కుమారులు వారిలో రెండోవాడైన వేణు పట్టణంలో ఎలక్ట్రికల్ హౌసింగ్ చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. గత నెల 14వ తేదీన డదేవులపల్లి గ్రామానికి చెందిన అనూషతో వివాహం అయింది. కాగా మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు టూటౌన్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
గన్నవరంలో కుమ్ములాటలు
సాక్షి ప్రతినిధి, కాకినాడ: టీడీపీలో కుమ్ములాటలు ఎక్కువయ్యా యి. నేతల మధ్య విభేదాలు పొడచూపుతున్నాయి. నియోజకవర్గాల వారీగా నువ్వానేనా అన్నట్టుగా కత్తులు దూసుకుంటున్నారు. కాకినాడ...రాజమహేంద్రవరం...అనపర్తి.....అమలాపురం....రాజోలు....తదితర నియోజకవర్గాల్లో కొనసాగుతున్న నేతల పోరు ఇప్పటికే రచ్చకెక్కింది. తాజాగా ఆ జాబితాలోకి పి.గన్నవరం చేరింది. ఇక్కడ టికెట్ విషయంలో అంతర్గత పోరు నడుస్తోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే పులపర్తి నారాయణమూర్తికి అసమ్మతి సెగ తాకింది. ఆయనకు ఎసరు పెట్టే నాయకులు నియోజకవర్గంలో తయారయ్యారు. అంతటితో ఆగలేదు సరికదా ఈసారి పులపర్తికి టికెట్ రాదని తెరపైకి వచ్చి విస్తృత ప్రచారం కూడా చేస్తున్నారు. దీంతో ఎమ్మెల్యే పులపర్తికి చిర్రెత్తికొచ్చింది. తనకు వ్యతిరేకంగా ప్రచారానికి ఒడిగొడుతున్న నాయకులపై అంతెత్తున లేస్తున్నారు. తన అనుయాయుల చేత ఎదురుదాడికి దిగుతున్నారు. ఇదెక్కిడికి దారితీస్తుందో తెలియదు గాని పి.గన్నవరం నియోజకవర్గంలో టీడీపీ నివురు గుప్పిన నిప్పులా ఉంది. ఎప్పుడు భగ్గుమంటుందో చెప్పలేని పరిస్థితి నెలకుంది. టికెట్ కోసం రగడ ఎన్నికలకు మరో ఏడాది ఉన్నప్పటికీ టికెట్ తమదేనంటూ పి.గన్నవరంలో ఆసక్తికరమైన పోరు నడుస్తోంది. దీంతో పార్టీలో వర్గ విభేదాలు నివురుగప్పిన నిప్పులా మారాయి. ప్రస్తుత ఎమ్మెల్యే పులపర్తి నారాయణ మూర్తికి పోటీగా ఎస్సీ, ఎస్టీ జిల్లా మానిటరింగ్ కమిటీ సభ్యుడు నేలపూడి స్టాలిన్బాబు రేసులోకి రావడంతో అంతర్గత పోరుకు తెరలేచింది. ఎమ్మెల్యే పులపర్తికి ఈ దఫా ఎన్నికల్లో టికెట్ రావడం కష్టమని, అతనికి ప్రత్యామ్నాయంగా వేరే వ్యక్తికి టికెట్ ఇస్తారని అసమ్మతి స్వరం ఊపందుకుంది. అందుకు తగ్గట్టుగా పులపర్తి వ్యతిరేక వర్గీయులు ప్రచారంలో స్పీడు కూడా పెంచారు. తన వర్గాన్ని పటిష్టం చేసుకోవడమే కాకుండా పులపర్తిని లక్ష్యంగా అసమ్మతి రాజకీయాలు నడుపుతున్నారు. అంతేకాకుండా తన రాజకీయ వ్యూహంలో భాగంగా ఎమ్మెల్యేకు ధీటుగా స్టాలిన్బాబు తన పుట్టిన రోజు వేడుకలు ఈసారి ఘనంగా నిర్వహించేందుకు యత్నించారు. తనదైన ముద్ర వేసుకోవడానికి వ్యూహ రచన చేశారు. దీంతో పరిస్థితులు ఎమ్మెల్యే పులపర్తికి తలనొప్పిగా పరిణమించాయి. స్టాలిన్ ఎత్తులకు ఎమ్మెల్యే పైఎత్తులు... నియోజకవర్గ పరిధిలో స్టాలిన్బాబు సమావేశాలు పెట్టి కార్యక్రమాలు నిర్వహించడం ఎమ్మెల్యేకు రుచించడలేదు. వ్యూహాత్మకంగా స్టాలిన్ నిర్వహించిన పుట్టిన రోజు వేడుకలలకు పార్టీ శ్రేణులు వెళ్లకుండా ఎమ్మెల్యే పులపర్తి ఎత్తుకు పైఎత్తులు వేశారు. స్టాలిన్ కార్యక్రమానికి వెళ్లడానికి వీలు లేదంటూ ఎమ్మెల్యే నారాయణమూర్తి, అతని కుమారుడు, జిల్లా తెలుగు యువత ఉపాధ్యక్షుడు పులపర్తి రవిబాబు హుకుం జారీ చేసినట్టు తెలిసింది. ఈ విషయంలో కొంతమేరకు విజయం సాధించారు. అంతేకాకుండా తనకు టికెట్ రాదని ప్రత్యర్థులు చేస్తున్న ప్రచారంపై కూడా తనదైన శైలిలో రాజకీయాలు నెరుపుతున్నారు. అందులో భాగంగా నియోజకవర్గ పరిధిలోని నాలుగు మండలాల్లో పార్టీ మండల కార్యకర్తల సమావేశాలు ఏర్పాటు చేసి, వ్యతిరేక ప్రచారానికి ఫుల్స్టాప్ పెట్టే విధంగా ఎమ్మెల్యే నారాయణమూర్తి తీర్మానాలు చేయించినట్టు తెలిసింది. వేరే వ్యక్తికి ఎవరికీ టికెట్ కేటాయించే అవకాశం లేదని, అలా జరుగుతున్న ప్రచారం అవాస్తవమని సమావేశాల్లో తీర్మానాలు చేయించినట్టు సమాచారం. అగ్గి రాజేసిన ఫ్లెక్సీల తొలగింపు... పులపర్తి, స్టాలిన్బాబు మధ్య చోటుచేసుకున్న విభేదాలకు ఫ్లెక్సీల తొలగింపు మరింత ఆజ్యం పోసినట్టయింది. స్టాలిన్బాబు పుట్టిన రోజు సందర్భంగా నియోజకవర్గ పరిధిలో పలుచోట్ల ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను గుర్తు తెలియని వ్యక్తులు చించి వేసి, వాటిని రాత్రికి రాత్రే తొలగించారు. పక్కా ప్లాన్ ప్రకారమే ఈ వ్యవహారం జరిగిందని, స్టాలిన్బాబు అంటే గిట్టని వారే ఈ పని చేయిస్తున్నారంటూ అతని వర్గీయులు ఆరోపిస్తున్నారు. పరోక్షంగా ఎమ్మెల్యే పులపర్తిని లక్ష్యం చేస్తూ మాటల దాడి చేస్తున్నారు. ప్రత్యర్థులు కౌంటర్ ఎటాక్ చేస్తున్నా ఫ్లెక్సీల తొలగింపు వెనక వారే ఉన్నారని స్టాలిన్ వర్గీయులు బల్లగుద్ది చెబుతున్నారు. ఈ విధంగా ప్రతి విషయంలో ఒకరిపై ఒకరు కత్తులు దూసుకుంటున్నారు. ఎమ్మెల్యే ఆధిపత్యానికి చెక్ పెట్టేలా స్టాలిన్ పావులు కదపగా, ఆదిలోనే తుంచేయాలని స్టాలిన్పై ఎమ్మెల్యే వ్యూహాత్మక ఎత్తుగడలు వేస్తున్నారు. ఈ విధంగా ఒక దాని తరువాత మరొకటిగా జరుగుతున్న పరిణామాలు టీడీపీలో కలకలం రేపుతున్నాయి.. ఇద్దరు నాయకుల మధ్య కొనసాగుతున్న వర్గ విభేదాలు పార్టీలో నెలకొన్న అంతర్గత కుమ్ములాటలకు దారితీశాయి. -
అఖిలేశ్ ఆఫీసు ముందు ఊహించని ప్లెక్సీలు
లక్నో : ఉప ఎన్నికల్లో విజయం సాధించిన అనంతరం ఉత్తరప్రదేశ్ సమాజ్వాది పార్టీ ప్రధాన కార్యాలయం వద్ద ఊహించని పోస్టర్లు వెలిశాయి. యూపీ మాజీ సీఎం ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్, మరో మాజీ సీఎం బీఎస్పీ అధినేత్రి మాయావతి ఫొటోలతో ఫ్లెక్సీలు పెట్టారు. అంతేకాదు, బీఎస్పీ వ్యవస్థాపకుడు కాన్షీరాం, ఎస్పీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్, మరో ఎస్పీ నేత అజాం ఖాన్ ఫొటోలు కూడా ఈ ఫ్లెక్సీల్లో పెట్టారు. మరింత ఆశ్చర్యకరంగా మాయావతి ఫొటో మాత్రం చాలా పెద్దగా వేశారు. పుల్పూర్, గోరఖ్పూర్లో తమకు విజయాన్ని అందించిన ప్రజలకు ధన్యవాదాలు అని పేర్కొంటూ ఎస్పీ కార్యకర్త అహ్మద్ లారీ ఈ ఫ్లెక్సీలు వేయించారు. ప్రస్తుత సీఎం యోగి ఆదిత్యనాథ్, డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య ఒకప్పుడు ప్రాతినిథ్యం వహించిన గోరఖ్పూర్, పుల్పూర్ నియోజవర్గాలను బీఎస్పీ సాయంతో బీజేపీని ఓడించి ఎస్పీ తమ కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ విజయం అనంతరం అఖిలేశ్ బీఎస్పీ అధినేత్రి మాయావతి వద్దకు వెళ్లి ధన్యవాదాలు కూడా చెప్పారు. ఈ నేపథ్యంలోనే కొత్తగా పోస్టర్లు వెలువడటం చర్చనీయాంశంగా మారింది. -
టీడీపీ, బీజేపీ మధ్య ఫ్లెక్సీ ఫైట్
-
టీడీపీ,బీజేపీ మధ్య అమరావతిలో ఫ్లెక్సీల రగడ
-
కాట్రగడ్డ బాబు ఫ్లెక్సీలపై బీజేపీ నేతల సీరియస్
సాక్షి, విజయవాడ: టీడీపీ, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా ఆ రెండు పార్టీల మధ్య ఫ్లెక్సీల వివాదం రాజుకుంది. విజయవాడలో టీడీపీ నేత కాట్రగడ్డ బాబు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలపై బీజేపీ ప్రజాప్రతినిధులు అభ్యంతరం వ్యక్తం చేశారు. బీజేపీని కించపరిచే చర్యలను టీడీపీ మానుకోవాలని హితవు పలికారు. బీజేపీ నేతలు సోము వీర్రాజు, విష్ణుకుమార్ రాజు, మాధవ్ సోమవారమిక్కడ మీడియా సమావేశంలో మాట్లాడారు. టీడీపీ నేతలు ఎక్కువ చేస్తే వాళ్ల అవినీతిపై నిలదీయాల్సి వస్తుందని హెచ్చరించారు. చంద్రబాబుకు అమిత్ షా ఫోన్ చేయడాన్ని టీడీపీ నేతలు అనుకూలంగా ప్రచారం చేసుకుంటున్నారని అన్నారు. చంద్రబాబు సహా ఎవరికీ బీజేపీ భయపడదని వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్సీ సోము వీర్రాజు మాట్లాడుతూ ...‘టీడీపీ అధికార ప్రతినిధి మమ్మల్ని గుడ్డలు విప్పి కొడతాం అంటున్నారు. వార్తా ఛానల్స్ చర్చా వేదికల్లో టీడీపీ వాళ్లు ఆ తీరుగా మాట్లాడటాన్ని ఏమంటారు?. అమిత్ షా ఫోన్ చేస్తే భయపడి ఫోన్ చేశారు అంటున్నారు. ప్రత్యేక హోదా పొడిగించలేదని బీజేపీ ఎంపీ హరిబాబు చెప్పారు. కేంద్ర పార్టీ కూడా స్పష్టం చేసింది. పవన్ కల్యాణ్ లాంటి కమిటీలు చాలా ఉంటాయి. జేఎఫ్సీ నివేదిక చూసి స్పందిస్తాం. నేను వార్డ్ మెంబర్గా పోటీ చేయలేదు. నన్ను ఎన్నో మాటలు అంటున్నారు. ఎన్నికల్లో ఓడినా 40ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నా. నాకు నోటు లేదు..ఓటు లేదు. నా అధిష్టానం ఆదేశిస్తే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తా. నాకు భిక్షగా వేసిన ఎమ్మెల్సీ వల్ల ఒరిగేది ఏమీలేదు. ఎప్పుడైనా వదులుకుంటా.’ అని స్పష్టం చేశారు. -
'ఈగ'లు మోత మోగిస్తున్నాయ్!
‘ఈగ’ సినిమా ఇతివృత్తం ఏమిటి ? ప్రతీకారేచ్ఛతో రగిలిపోయి విలన్పై కక్ష తీర్చుకోవడం. ఒక మనిషిని నానా తిప్పలు పెట్టి ‘ఈగ’ను చూస్తేనే జడుసుకుని చచ్చేలా ప్రవర్తిస్తుంది. ఒక ఈగ చుట్టూ అల్లిన ఈ కథ ఔరా అనిపించక మానదు. అదే లక్షలాది ఈగలు ఒక గ్రామం మీద దాడి చేస్తే..? గ్రామంలోని చిన్నా పెద్దా, ముసలీ ముతకా అనే తేడా లేకుండా ఈగల బారిన పడితే వారి ఆందోళన అంతా ఇంతా కాదు. అసలు ఒక గ్రామం మీద ఇన్ని ఈగలు ఎలా దాడి చేస్తున్నాయి? పంట పొలాలు మొదలు, తినే భోజనం, తాగునీరు.. అన్నీ ఈగలమయం అయితే .. సమస్య ఎంత తీవ్రంగా ఉంటుందో ఈ కథనం చదివితే తెలుస్తుంది..! సాక్షిప్రతినిధి, నల్లగొండ : చిట్యాల మండలం ఎలికట్టె గ్రామం. ఒక్కసారిగా ఎగిరొచ్చి వాలిపోతున్న ఈగలు ఆ గ్రామ ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఊరికి కిలోమీటరు దూరంలో సుమారు డెబ్బై ఎకరాల్లో నెలకొల్పిన పౌల్ట్రీ ఫామ్స్తో ఈ సమస్య తలెత్తిందని గ్రామస్తులు పేర్కొంటున్నారు. 18 షెడ్లలో ఏర్పాటు చేసిన బాయిలర్ పౌల్ట్రీ ఫామ్స్లో గుడ్లను ఉత్పత్తి చేస్తున్నారు. ఇందులో సుమారు పది లక్షల కోళ్లను పెంచుతున్నారు. ఈ కోళ్లకు వేసే దాణాతోపాటు ఫామ్స్లో వ్యర్థాలతో ఈగలు వృద్ధి చెందాయని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఇంత పెద్దమొత్తంలో ఈగలు పుట్టుకురావడంతో అదే స్థాయిలో గ్రామ ప్రజలను అనారోగ్యం కూడా వెదుక్కుంటూ వచ్చింది. ఎలికట్టెలో అత్యధిక గౌడ కులస్తులు కులవృత్తి కల్లుగీతపై ఆధారపడి జీవిస్తున్నారు. వీరు తీసే కల్లు ఈగలతో నిండిపోయి ఎవరూ తాగలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో వారి జీవనభృతికీ ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ కోళ్ల ఫామ్స్ ఏర్పాటుతో మొదలైన ఈగల సమస్య ఎలికట్టెతో పాటు మునుగోడు మండలంలోని రత్తిపల్లి, ఊకొండి గ్రామాలనూ సతాయిస్తోంది. వీటి నివారణ చేపట్టాలని ఎలికట్టె గ్రామ ప్రజలు గడిచిన మూడు నెలలుగా విడత విడతలుగా ఆందోళన చేపట్టారు. కలెక్టర్, డీహెచ్ఎంఓ, ఎంపీడీఓలకు ఫిర్యాదు చేశారు. ఈనెల 19వ తేదీన ఎలికట్టె గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుట ఎలికట్టె, రత్తిపల్లి, ఊకొండి గ్రామస్తులు ఆందోళనకు దిగారు. సరైన అనుమతులు పొందకుండానే కోళ్ల ఫామ్ను నిర్మించారని, నిబంధనలకూ నీళ్లొదిలారన్నది గ్రామ ప్రజల ప్రధాన అభియోగం. నిద్రనటిస్తున్న యాజమాన్యం ! గ్రామం మొత్తం వ్యాపించిన ఈగలతో స్థానికులు సతమతమవుతున్నా కోళ్ల ఫామ్ యాజమాన్యం ఈగల నివారణకు ఎలాంటి చర్యలు తీసుకోవటం లేదని గ్రామస్థుల ఆరోపణ. ఈ నెల19న గ్రామస్తులు ఆందోళనతో చర్చలకు వచ్చిన కోళ్ల ఫామ్ యజమాని ఈగల నివారణకు చర్యలు తీసుకుంటామని పోలీసు అధికారుల సమక్షంలో మాటిచ్చారని గ్రామస్తులు చెప్పారు. రెండేళ్లుగా ఏమీ పట్టనట్లు వ్యవహరించడం వల్లే సమస్య జఠిలం అయ్యిందని వాపోతున్నారు. వాస్తవానికైతే, కోడిగుడ్ల ఫామ్ను నిత్యం శుభ్రం చేయాల్సి ఉంటుంది. ఏసీలు వాడాలి. ఫామ్ చుట్టూరా నీటి తొట్టెలు ఏర్పాటు చేయాలి. కోళ్లనుంచి వచ్చే వ్యర్ధాలను కంపోస్టు యార్డులకు తరలించాలి. ఫామ్స్లోనే కాకుండా స మీప గ్రామాల్లో దుర్వాసన రాకుం డా, ఈగలు పెరిగిపోకుండా మందుసులు స్ఫ్రే చేయాలి. కానీ.. ఇవేవీ వా స్తవంలో జరగకపోవడంతో ఒక్కో గ్రా మానికి సమస్య వ్యాప్తిచెందుతోంది. -
వైఎస్సార్ సీపీ ఫ్లెక్సీలపై టీడీపీ అక్కసు
ఆరిలోవ: ‘రహదారుల శంకుస్థాపన కార్యక్రమానికి ఎమ్మెల్యే వెలగపూడి వస్తున్నారు.. వైఎస్సార్సీపీ ఫ్లెక్సీలు తొలగించండి.. లేదంటే మేమే ఆ పని చేస్తాం’. ఇదీ ఒకటో వార్డు పైనాపిల్ కాలనీ జేఎన్ఎన్యూఆర్ఎం సముదాయంలో టీడీపీ నాయకులు అజమాయిషీ. ఇక్కడ రోడ్ల నిర్మాణానికి ఎమ్మెల్యే వెలగపూడి శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఈ కాలనీలో 416 నివాసాలున్నాయి. వాటిలో 80 శాతం టీడీపీకి చెందిన వారే ఉండేవారు. ఎమ్మెల్యే ఎటువంటి అభివృద్ధి పనులు చేపట్టడం లేదని సుమారు 70 శాతంపైగా కుటుంబాలు టీడీపీని వీడి వైఎస్సార్సీపీలో ఇటీవల చేరిపోయారు. దీంతో ఈ కాలనీలో ఎక్కడచూసినా వైఎస్సార్సీపీ ఫ్లెక్సీలు, ఆ పార్టీ జెండాలే రెపరెపలాడుతున్నాయి. శివరాత్రి, ఉగాది శుభాకాంక్షలు తెలుపుతూ వైఎస్సార్సీపీ తూర్పు నియోజకవర్గ సమన్యయకర్త వంశీకృష్ణ శ్రీనివాస్తోపాటు స్థానిక నాయకుల ఫొటోలతో ఎక్కడకక్కడ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే వచ్చి వాటిని చూస్తే తమపై ఆగ్రహం వ్యక్తం చేస్తారనే భయంతో స్థానిక టీడీపీ నాయకులు ఇక్కడ వైఎస్సార్సీపీ ఫ్లెక్సీలను తొలగించడానికి రెండురోజులుగా విశ్వప్రయత్నాలు చేశారు. దీంతో వైఎస్సార్సీపీ నాయకులు వారి ప్రయత్నానికి అడ్డుకట్టవేశారు. దీంతో టీడీపీ నాయకులు జీవీఎంసీ టౌన్ప్లానింగ్ అధికారులపై ఈ ఫ్లెక్సీలు తొలగించాలని ఒత్తిడి చేశారు. ఈ విషయం తెలుసుకొన్న వైఎస్సార్సీపీ నాయకులు జీవీఎంసీకి చలానా చెల్లించి టౌన్ప్లానింగ్ ఉన్నతాధికారుల నుంచి నెల రోజులకు అనుమతి తీసుకున్నారు. ఆ అనుమతి పత్రాలను ఇక్కడ ఏర్పాటు చేసిన రెండు ఫ్లెక్సీలపై అంటించారు. దీంతో టైన్ప్లానింగ్ సిబ్బంది కూడా వాటి జోలికి వెళ్లలేకపోయారు. చేసేదేమీలేక టీడీపీ నాయకులు తొలగింపు ప్రయత్నం విరమించుకున్నారు. ఇక్కడ వైఎస్సార్సీపీ ఫ్లెక్సీలు, జెండాలు చూసిన ఎమ్మెల్యే వెలగపూడి స్థానిక టీడీపీ నాయకులను ఆఫీసుకు పిలుపించుకొని ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. -
నీరుగారిన నిషేధం
బరంపురం: ప్రస్తుతం మానవ జీవితంలో ప్లాస్టి క్స్ విడదీయరాని భాగమైపోయాయి. ఉదయం బ్రష్ చేసుకోవడం నుంచే ప్లాస్టిక్స్ వాడకం మొదలవుతోంది. ఇక పాల ప్యాకెట్లు, కూరలు తెచ్చుకునే బ్యాగులు, చిన్నారులు స్కూలు కెవెళ్లేటపు డు లంచ్ బాక్స్లు, వాటర్ బాటిళ్లు, ఇంటి బయట అడుగు పెడితే అల్పాహారం, బోజనం, నీళ్లు, కాయగూరలు ఏది కొన్నా ప్లాస్టిక్ బ్యాగులతోనే మన చేతికందుతాయి. ఇటీవల కాలం లో ప్రచారం ఊపందుకోవడంతో ఫ్లెక్సీ బ్యాన ర్లు, బోర్డులు వెల్లువెత్తుతున్నాయి. ఇవి కూడా ప్లాస్టిక్స్ వినియోగించి రూపొందిస్తున్నవే. ఇంకా ప్రమాదకరమైన రసాయనాలు రంగులను వీటిపై పూస్తున్నారు. ఇవన్నీ పర్యావరణానికి పెను ప్రమాదాన్ని తెచ్చి పెడుతున్నాయని వివిధ సంస్థల వాదన. జిల్లాలో ప్లాస్టిక్ కారణంగా రకరకాల అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నవారు వేల సంఖ్యలో ఉండడం గమనార్హం. పదేళ్ల క్రితం వరకూ సరుకులు తెచ్చుకోవాలంటే కాగితం సంచులు, జనప నార సంచులు ఎక్కువగా వాడేవారు. వీటికన్నా తక్కువ ధరకే ప్లాస్టిక్ సంచులు అందుబాటులోకి రావడంతో అందరూ వీటిని ఉపయోగిస్తున్నారు. 20 మైక్రానుల కంటే తక్కువ మందం ఉన్న ప్లాస్టిక్ వాడకం సమస్త జీవజాలం ఉనికికి ముప్పుతెస్తుందని అంతర్జాతీయంగా పర్యావరణవేత్తలు రుజువుచేశారు. దీంతో కొన్ని దేశాలు ప్లాస్టిక్ వాడకంపై నిషేధం విధించాయి. అయినప్పటికీ నిషేధం అమలు కావడం లేదు. మన దేశంలో ప్రజాసంక్షేమమే తమ పరమావధి అంటూ భారీగా ఉపన్యాసాలు ఇచ్చే నేతలందరూ పర్యావరణానికి తూట్లు పొడితే ఈ ఫెక్సీ బ్యానర్లకు భారీగానే ప్రోత్సాహం ఇస్తుండడం విశేషం. ప్రస్తుతం జిల్లాలో పట్టణ, నగర ప్రాంతాల నుంచి గ్రామీణ ప్రాంతాల వరకూ లక్షల సంఖ్యలో ఇలాంటి ఫ్లెక్సీ బ్యానర్లు ఉన్నప్పటికీ ఏ అధికారి కూడా వీటిని పట్టించుకోవడం లేదు. ప్రమాదమని తెలిసినా.. పలువురు పరిశోధకులు అందించిన సమాచారం ప్రకారం ప్లాస్టిక్ సంచులు, ఇతర ప్లాస్టిక్ ఉత్పాదకాలు మట్టిలో కలవాలంటే అక్షరాలా లక్ష సంవత్సరాలు పడుతుంది. మనం తిని పారేసే అరటితొక్క 24 రోజుల్లో, కాగితంతో తయారుచేసిన వస్తువులు నెల రోజుల్లో, వస్త్రాలు రెండేళ్లలో, చర్మపు ఉత్పత్తులు 200 ఏళ్లలోగా భూమిలో కలిసిపోయే పరిస్థితిలేదని అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్లాస్టిక్స్ వల్ల కాలుష్య విషవలయంలో జన జీవితాలు విలవిలలాడుతున్నాయి. గంజాం జిల్లాలో ప్లాస్టిక్స్ వినియోగం ఏటా నలభై శాతం పెరుగుతోంది. అందులోని హెవీమెటల్స్ ఆహా రం ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తున్నాయి. ఫలితంగా నరాల బలహీనత ఏర్పడుతోంది. బ్యాగ్ల కోసం, ఫ్లెక్సీ బ్యానర్ల కోసం వినియోగించే రంగుల వలన సీసం, కాడ్మియంలు పిల్లల్లో ఎదుగుదలను, జ్ఞాపకశక్తిని హరించి వేస్తున్నాయి. నామమాత్రంగా తనిఖీలు ప్లాస్టిక్స్ వినియోగంపై ప్రపంచ వ్యాప్తంగా నిషేధం ఉన్నప్పటికీ ఈ జిల్లాలో మాత్రం ఒక్క శాతం కూడా అమలు కావడం లేదు. 20 మైక్రానుల కంటే తక్కువ మందం ఉన్న క్యారీ బ్యాగ్లు ఉపయోగించరాదని రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు అమలుచేసే స్థితిలో అధికారులు లేరు. తక్కువ మందం ఉండే క్యారీ బ్యాగ్ల తయారీ లాభసాటి కావడంతో ఉత్పత్తిదారులు వాటిని తయారుచేస్తూ ప్రజల ప్రాణా లతో చెలగాటమాడుతున్నారు. ఏదో నామమాత్రంగా బీఎంసీ ఆధ్వర్యంలో నగరంలో తూతూమంత్రంగా సోదాలు చేస్తూ చేతులు దులుపుకుంటున్నారు. ఇప్పటిౖMðనా అధికార యంత్రాంగం ప్లాస్టిక్స్ వినియోగం వల్ల కలుగుతున్న పర్యావరణ విషాదాన్ని గుర్తించి నిషేధంపై దృష్టి సారించా లని పలు స్వచ్ఛం, ప్రజా సంఘాలు కోరుతున్నారు. -
ఫ్లెక్స్ ఇంజిన్ బైక్స్ వస్తున్నాయి
సాక్షి, న్యూఢిల్లీ : ఫ్లెక్స్ ఇంజిన్ బైక్స్ త్వరలో భారత్ మార్కెట్లోకి రానున్నట్లు కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. రెండు బైక్స్ కంపెనీలు ఎలక్ట్రిక్, ఫ్లెక్స్ ఇంజిన్ బైక్లను భారత మార్కెట్లోకి తీసుకురానున్నట్లు వెల్లడించారు. జనవరి నెలాఖరులోగా బైక్స్ను మార్కెట్లోకి తెస్తామని రెండు కంపెనీలు చెప్పాయని తెలిపారు. ఏంటీ ఫ్లెక్స్ ఇంజిన్? రెండు రకాల ఇంధనాలను ఫ్లెక్స్ ఇంజిన్లో వినియోగించొచ్చు. పెట్రోల్, ఇథనాల్లతో ఫ్లెక్స్ ఇంజిన్ బైక్స్ నడుస్తాయి. పెట్రోల్ వినియోగాన్ని క్రమంగా తగ్గించాలనే వ్యూహంలో భాగంగా ఇథనాల్ను ప్రత్యామ్నాయంగా వినియోగించాలని కేంద్ర రవాణా మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. క్రూడ్ ఆయిల్ కోసం ప్రతి ఏటా రూ. 7 లక్షల కోట్లను ఖర్చుచేస్తున్నామని, ఇందులో కనీసం రూ. 2 లక్షల కోట్లను ఇథనాల్ వైపు మళ్లించినా వ్యవసాయ రంగానికి ఊతం ఇచ్చినట్లు అవుతుందని నితిన్ గడ్కరీ అభిప్రాయపడ్డారు. ఒక టన్ను వరి పొట్టు నుంచి 280 లీటర్ల ఇథనాల్ను ఉత్పత్తి చేయొచ్చని తెలిపారు. ఇథనాల్ కేవలం దిగుమతుల ప్రత్యామ్నాయం కాదని చెప్పుకొచ్చిన గడ్కరీ.. ఇథనాల్ కాలుష్య రహితం అని చెప్పారు. గోధుమ పొట్టు, వెదురు చెట్ల నుంచి ఇథనాల్ను ఉత్పత్తి చేయొచ్చు. ఇథనాల్ ఉత్పత్తి పెరిగేందుకు అందుకు అనుకూలమైన పంటలను వేయాలని చెప్పారు. అమెరికా, బ్రెజిల్, కెనడాల్లో మెర్సిడెజ్, బీఎండబ్ల్యూ, టయోటా కార్లు ఫ్లెక్స్ ఇంజిన్తో నడుస్తున్నాయని వెల్లడించారు. -
రజనీ ఫ్యాన్స్పై కత్తిదూసిన విజయ్ ఫ్యాన్స్
సాక్షి, చెన్నై: తమిళనాడు ఈరోడ్ జిల్లా గోపిషెట్టి పాళయమ్ సమీపంలో ఉన్న పారియూర్ కొండత్తు కాళియమ్మన్ ఆలయంలో ఆదివారం ఉత్సవాలు జరిగాయి. ఉత్సవ వేడుకల సందర్భంగా నంజకౌంటన్ పాళయమ్లో రజనీ అభిమానుల తరపున ఫ్లెక్సీ పెట్టారు. అదే ప్రాంతానికి చెందిన విజయ్ అభిమానులు రత్నవేల్ (27), ఇతని తమ్ముడు త్యాగు (25), సతీష్ (27). వీరు ముగ్గురు కలిసి రజినీ అభిమానులు జగదీషన్ (44), పళనిస్వామి (45)తో బ్యానర్ విషయంలో వాగ్వాదం ఏర్పడింది. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. అప్పుడు సతీష్, రత్నవేల్, త్యాగు వీరు రజనీ అభిమానులు పెట్టిన ఫ్లెక్సీ కాల్చివేసి, జగదీషన్, పళణిస్వామిపై కత్తితో దాడి చేశారు. ఫిర్యాదు మేరకు, గోపిషెట్టి పాళయం పోలీసులు విజయ్ అభిమానులు రత్నవేల్, సతీష్, త్యాగును అరెస్టు చేసి, కోర్టులో హాజరుపరచి జైల్లో ఉంచారు. -
ఎమ్మెల్యే చెవిరెడ్డిపై కేసు కొట్టివేత
సాక్షి, తిరుపతి: సీఎం చంద్రబాబు నాయుడు బ్యానర్లు, ఫ్లెక్సీ బోర్డులు తొలగించారన్న అభియోగం కింద చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డిపై నమోదైన కేసును కొట్టివేస్తూ తిరుపతి మూడో అదనపు జూనియర్ సివిల్ జడ్జి జస్టిస్ సాయికుమారి శుక్రవారం తీర్పు చెప్పారు. కేసులోని వివరాల మేరకు 2014 జనవరి 13న సంక్రాంతి పండుగకు సీఎం చంద్రబాబు నారావారిపల్లెకు వస్తున్నారన్న సందర్భంగా రెండు రోజులు ముందుగా చంద్రగిరి టీడీపీ నాయకుడు కె.ఇందుశేఖర్ మహిళా వర్సిటీ క్రాస్ నుంచి తుమ్మలగుంట రోడ్డు చాముండేశ్వరి దేవాలయం వరకు 99 ఫ్లెక్సీ బోర్డులు, బ్యానర్లను ఏర్పాటు చేశారు. వాటిని వైఎస్సార్సీపీకి చెందిన ఎమ్మెల్యే భాస్కర్రెడ్డి టీడీపీపై కోపంతో తొలగించారని ఆయన ఎంఆర్పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పటి డీఎస్పీ వెంకటరామానుజులు, ఎస్ఐ ఆదినారాయణరెడ్డి కేసు దర్యాప్తు చేసి ఎమ్మెల్యేపై కేసు నమోదు చేశారు. కేసు పూర్వాపరాలు పరిశీలించిన న్యాయమూర్తి దీన్ని తప్పుడు ఫిర్యాదుగా భావించి ప్రాసిక్యూషన్ సరైన సాక్షాధారాలతో నిరూపించకపోవడంతో ఎమ్మెల్యేపై కేసును కొట్టివేస్తూ తీర్పు చెప్పారు. -
కేటీఆర్ సీరియస్: ఆ ముగ్గురికి ఫైన్
సాక్షి, హైదరాబాద్: మలక్పేట పర్యటనలో ఫ్లెక్సీలు పెట్టడంపై మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మలక్పేటలోని నల్లగొండ చౌరస్తాలోని దివ్యాంగుల సహకార సంస్థ ఆవరణలో దివ్యాంగుల జాతీయ పార్క్ను ఏర్పాటు చేశారు. ఈ నేపధ్యంలో శుక్రవారం పార్క్ ప్రారంభోత్సవం సందర్భంగా స్థానిక నేతలు ఫ్లెక్సీలు పెట్టారు. అయితే ఫ్లెక్సీలు పెట్టడంపై కేటీఆర్ సీరియస్ అయ్యారు. ఫ్లెక్సీలు ఏర్పాటు చేసినందుకు స్థానిక కార్పొరేటర్ సునీతా రెడ్డికి రూ. 50 వేలు, నేతలు అస్లాం, నివాస్లకు ఒక్కొక్కరికి రూ. 25 వేల చొప్పున జరిమానా విధించాలని జీహెచ్ఎంసీ కమిషనర్ను మంత్రి ఆదేశించారు. ఫ్లెక్సీల నిషేదం ప్రతి ఒక్కరూ పాటించాలని ఆయన కోరారు. -
ఇదేమి చోద్యం..!
నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పులివెందులలోని ధ్యాన్చంద్ క్రీడామైదానంలో జన్మభూమి–మా ఊరు సభలో పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ నేతలు పట్టణంలో పార్టీ జెండాలు, తోరణాలు, ప్లెక్సీలతో పసుపు మయం చేశారు. వారు అత్యుత్సాహంతో జాతిపిత మహాత్మాగాంధీ విగ్రహాన్ని కూడా వదలలేదు. పట్టణంలోని ముద్దనూరురోడ్డు పాత జూనియర్ కళాశాల సర్కిల్లో ఉన్న గాంధీ విగ్రహం చుట్టూ పార్టీ జెండాలు, ప్లెక్సీలతో ముంచెత్తారు. జాతిపిత విగ్రహం కూడా సరిగా కనిపించడంలేదు. మహాత్ముని విగ్రహం చుట్టూ ఇలా ఒక పార్టీకి చెందిన జెండాలు, తోరణాలు ఏర్పాటు చేయడం ఏమిటని చూసిన వారు మండిపడుతున్నారు. – పులివెందుల -
సీఎం ఫొటో లేకుండా ఫ్లెక్సీల ఏర్పాటా..?
విజయగనరం / గుర్ల(చీపురుపల్లి): గుర్ల మండలానికి చెందిన టీడీపీ నేతలు నూతన సంవత్సర వేడుకలను పురస్కరించుకుని ఆదివారం ప్రధాన కూడళ్ల వద్ద ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. విచిత్రం ఏంటంటే ఆ ఫ్లెక్సీల్లో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు, సీఎం చంద్రబాబునాయుడు ఫొటో లేదు. ఇంకా విచిత్రం ఏంటంటే మంత్రులు, స్థానిక చిన్నా, చితకా నేతల ఫొటోలు కూడా ఉన్నాయి. దీంతో టీడీపీ నాయకులే అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. మరి కొందరేమో ఒక అడుగు ముందుకేసి టీడీపీ జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబు నాయుడు విఫలం అయ్యారా..? లేక ముఖ్యమంత్రిగా విఫలం అయ్యారా..? లేక కార్యకర్తల సంక్షేమాన్ని పట్టించుకోకుండా, తన సంక్షేమం కోసమే పని చేస్తున్నారని కార్యకర్తలు అనుకుంటున్నారా..? అన్న సందేహాలను వెలిబుచ్చుతున్నారు. ఈ మేరకే ఆయన ఫొటోలను ఫ్లెక్సీల నుంచి తొలగించి ఉండొచ్చని పేర్కొంటున్నారు. మండలం మొత్తం మీద ఈ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. దీనిపై టీడీపీ నాయకులు, కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేశారు. దీనిపై టీడీపీ నేతలను వివరణ అడగ్గా ముద్రణ సమయంలో జరిగిన పొరపాటే కారణమని పేర్కొన్నారు. -
టీడీపీలో తిరుగుబాటు
సాక్షి ప్రతినిధి, ఏలూరు, నిడదవోలు రూరల్: ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ అధికార పార్టీలో లుకలుకలు బయటపడుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో పోటీ చేద్దామనుకునే ఆశావాహులు ప్రస్తుత ఎమ్మెల్యేలపై తిరుగుబాటు ప్రకటిస్తున్నారు. కనీసం ఎమ్మెల్యే ఫొటోలు లేకుండా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి తాము పోటీలో ఉన్నామనే సంకేతాలు ఇస్తున్నారు. మరోవైపు నేతల తీరుపై అసంతృప్తిగా ఉన్న కార్యకర్తలూ గళమెత్తుతున్నారు. పశ్చిమగోదావరి జిల్లాలో దాదాపు సగం నియోజకవర్గాల్లో ఇదే దుస్థితి ఉంది. ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేలకు వచ్చే ఎన్నికల్లో సీట్లు రావన్న ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో అక్కడ ఆశావాహులు తమ పట్టు నిరూపించుకునే యత్నాలు చేస్తున్నారు. ఏలూరులో ఇలా.. ఏలూరులో తెలుగుదేశం పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. వెంకటాపురం ఉపసర్పంచ్ ఎన్నికను పార్టీ నుంచి బహిష్కరించిన రెడ్డి అప్పలనాయుడు వర్గం చేజిక్కించుకుంది. గతంలో ఈ ఎన్నికను పార్టీ నాయకులతో రభస సృష్టించి వాయిదా వేయించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత మాట వినని రెడ్డి అప్పలనాయుడిపై రౌడీషీటు తెరిపించారు. దీనికి ఏలూరు ఎమ్మెల్యేనే కారణం అంటూ రెడ్డి అప్పలనాయుడు ఆరోపించారు. అతనిపై రౌడీషీట్ ఎత్తివేయాలని కోరుతూ రెండురోజులుగా ఆందోళనలు నిర్వహిస్తున్నారు. రెడ్డి అప్పలనాయుడు వర్గాన్ని భయపెట్టి తమవైపు తిప్పుకోవాలని అధికార పార్టీ నేతలు చేసిన యత్నాలు ఫలించలేదు. ఆ వర్గంలో ఉన్న 11 మందిలో ఒక్కరు కూడా తెలుగుదేశం పార్టీవైపు వెళ్లలేదు. శనివారం జరిగిన ఉప సర్పంచ్ ఎన్నికకు తెలుగుదేశం పార్టీ సభ్యులు గైర్హాజరయ్యారు. దీంతో 11 మందితో ఉన్న రెడ్డి అప్పలనాయుడు వర్గానికి చెందిన వీరంగి నాగస్వప్న ఉపసర్పంచ్గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నిడదవోలులో ఫ్లెక్సీల రాజకీయం నిడదవోలు నియోజకవర్గంలోని నిడదవోలు, ఉండ్రాజవరం, పెరవలి మండలాల్లోని ఆయా గ్రామాల్లోని ప్రధాన కూడళ్లలో కొత్త సంవత్సర, సంక్రాంతి శుభాకాంక్షలు చెబుతూ టీడీపీ నాయకుడు కుందుల సత్యనారాయణ ఏర్పాటుచేసిన ఫ్లెక్సీలు టీడీపీ శ్రేణుల్లో చర్చకు దారితీసింది. ఆ ఫ్లెక్సీల్లో ఎన్టీఆర్, చంద్రబాబు, లోకేష్ ఫొటోలు మాత్రమే వేసి స్థానిక ఎంపీ మురళీమోహన్, ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు ఫొటోలు వేయకపోవడంతో సందేహాలు తలెత్తుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో తానే టీడీపీ అభ్యర్థిగా బరిలో దిగుతానని ఫ్లెక్సీలు పెట్టిన నాయకుడు తన అనుచరులతో చెప్పినట్లు తెలిసింది. టీడీపీ అధినేత తనకు ఎమ్మెల్యే టిక్కెట్టు ఇస్తానని హామీ ఇచ్చారని అందుకే ప్లెక్సీలు ఏర్పాటుచేశానని పార్టీ శ్రేణులకు చెబుతున్నట్లు సమాచారం. రాత్రికిరాత్రే ప్రధాన సెంటర్లలో ఎమ్మెల్యే ఫొటో లేకుండా ఫ్లెక్సీలు ఏర్పాటుచేయడం శేషారావు వర్గీయులకు మింగుడుపడటం లేదు. గత కొంతకాలంగా ఎమ్మెల్యే శేషారావుకూ వచ్చేసారి టిక్కెట్టు ఇవ్వకపోవచ్చని ఆ పార్టీ నేతలే చర్చించుకున్నారు. ఎమ్మెల్యే సైతం ఆర్వోబీ నిర్మాణానికి అనుమతులు రాకపోతే రాజకీయ సన్యాసం చేస్తానని పలుమార్లు ప్రకటించారు. కానీ ఇటీవల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ నిధులు రూ.201 కోట్లు ఆర్వోబీ నిర్మాణానికి మంజూరయ్యాయని ఎమ్మెల్యే స్వయంగా ప్రకటించారు. వాస్తవానికి కేంద్ర ప్రభుత్వం నుంచి ఆ నిధులు రావాల్సి ఉండటంతో సాంకేతిక అనుమతులు, టెండర్ల ప్రక్రియ పూర్తికావాలంటే మరో ఏడాదిపైనే సమయం పట్టే అవకాశాలు ఉన్నాయని, ఆర్వోబీ నిర్మాణమైతే ఆ క్రెడిట్ చంద్రబాబు, ఎంపీకి దక్కుతుంది తప్ప ఎమ్మెల్యేకు ఎందుకు దక్కుతుందని కొంతమంది ఆ పార్టీ నేతలే పెదవివిరుస్తున్నారు. గత ఎన్నికల్లో పెరవలి మండలంలో తాను సహకరించకపోతే శేషారావు ఓడిపోయేవాడని, వచ్చే ఎన్నికల్లో టీడీపీ గుర్తుపై తానే పోటీచేస్తానని ఫ్లెక్సీలు ఏర్పాటుచేసిన నాయకుడు ప్రకటించడంతో టీడీపీ శ్రేణులు అయోమయానికి గురవుతున్నారు. ఫ్లెక్సీల ఏర్పాటుపై ఎమ్మెల్యే వర్గం గుర్రుగా ఉన్నా, ఎమ్మెల్యే పనితీరుపై అసంతృప్తిగా ఉన్న నేతలు మాత్రం రహస్యంగా వెళ్లి ఫ్లెక్సీలు ఏర్పాటుచేసిన నాయకుడిని కలుసుకుని తమ మద్దతు తెలుపుతున్నారు. -
ఈగ.. యముడి మెరుపు తీగ
వాషింగ్టన్: దోమలు, బొద్దింకలు, ఇతర పురుగులు మన ఇంట్లోకి వస్తే వాటిని చంపడమో.. బయటకు తరమడమో చేస్తే గానీ మనకు నిద్రపట్టదు. అయితే ఇళ్లల్లోకి వచ్చే ఈగలను మనం అంతగా పట్టించుకోం. దీనికి కారణం అవి అంత ప్రమాదకరమైనవి కావని మనందరి అభిప్రాయం. కానీ మన అభిప్రాయం తప్పంటున్నారు శాస్త్రవేత్తలు. వివిధ జాతులకు చెందిన హానికరమైన బ్యాక్టీరియాలను వందల సంఖ్యలో మన ఇళ్లల్లోకి ఈగలు మోసుకొస్తాయని తాజా అధ్యయనంలో వెల్లడైంది. దీంతో పలు రకాల వ్యాధులు వ్యాప్తి చెందుతాయని అధ్యయనం హెచ్చరిస్తోంది. ముఖ్యంగా విహారయాత్రల్లో ఈగల గోల ఎక్కువగా ఉంటుంది.. అక్కడికి తీసుకెళ్లిన ఆహారం, ఇతర వంట పదార్థాలపై అవి వాలిపోతాయి. అయితే ఇలా ఈగలు వాలిన ఆహారాన్ని తినవద్దని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. అమెరికాలోని పెన్సిల్వేనియా స్టేట్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు సుమారు 116 ఈగ జాతులపై పరిశోధన చేశారు. దీనిలో భాగంగా ఈగల కాళ్లు, రెక్కలను పరిశీలించగా.. కాళ్లపై అధిక శాతం హానికరమైన సూక్ష్మజీవులు ఉన్నట్లు గుర్తించారు. ఈగలు వాలినప్పుడు ఇవి ఒకచోట నుంచి మరోచోటుకి వ్యాప్తి చెందుతున్నాయని వర్సిటీ పరిశోధకులు స్టీఫెన్ షుస్టెర్ వెల్లడించారు. ఈ పరిశోధన ఫలితాలు సైంటిఫిక్ రిపోర్ట్స్ జర్నల్లో ప్రచురితమయ్యాయి. -
నేను టీడీపీలో ఉన్నానా?
రాజమహేంద్రవరం సిటీ: ఇంటింటికీ టీడీపీ కార్యక్రమం వేదికగా నగర టీడీపీలో గ్రూపు విభేదాలు మరోసారి బయటపడ్డాయి. ఏకంగా వేదికపై నుంచే మేయర్ పంతం రజనీశేషసాయి ‘నేను పార్టీలోనే ఉన్నానా? లేదా? అర్థం కావడం లేదు’ అని అనడం సంచలనం రేపింది. స్థానిక 42వ డివిజన్లో ఇంటింటికీ టీడీపీ ముగింపు కార్యక్రమం ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా వేదికపైన, చుట్టుపక్కల ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. వేదికపై ఉన్న ఫ్లెక్సీలో తన ఫొటో పెట్టకపోవడంపై మేయర్ పైవిధంగా స్పందించారు. అనంతరం గోదావరి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (గుడా) చైర్మన్ గన్ని కృష్ణ మైకు అందుకొని ‘గౌరవం ఆపాదించుకుంటే రాదు. తమ పనుల ద్వారా సంపాదించుకోవాలి’ అని మేయర్నుద్దేశించి అన్నారు. తరువాత ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి మాట్లాడుతూ ‘పొరపాటు వల్ల ఫొటో వేయకపోవచ్చు. పెద్దగా పట్టించుకోకూడదు. మేయర్ తెలియనివారు ఉండరు’ అని అన్నారు. ముఖ్య అతిథిగా వచ్చిన డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప మాట్లాడుతూ, 30 ఏళ్లుగా పార్టీలో తన పేరు, ఫొటో గురించి పట్టించుకోలేదని, పదవులతో పార్టీకి గుర్తింపు తీసుకురావాలని అన్నారు. ఇటీవల గణేష్చౌక్ సమీపంలో ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి రాకుండానే ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, గన్ని కృష్ణ ఇంటింటికీ టీడీపీ ప్రారంభించారు. దీంతో వారిద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా జరిగిన ఘటనతో నగర టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల, ఎమ్మెల్సీ ఆదిరెడ్డి, గన్ని కృష్ణ, పంతం రజనీ శేషసాయి వర్గాలుగా విడిపోయినట్టుగా కనిపిస్తోంది. -
పగిలిపోని టచ్స్క్రీన్లు త్వరలో..
లండన్: వేలు పోసి కొన్న స్మార్ట్ఫోన్ స్క్రీన్ పగిలిపోతే కలిగే ఆ బాధ వర్ణనాతీతం. త్వరలోనే ఈ బెంగ తీరనుంది. తక్కువ ధరలో.. ఫ్లెక్సిబుల్గా ఉండే స్మార్ట్ఫోన్స్ స్క్రీన్స్ అందుబాటులోకి రానున్నాయి. సిల్వర్, గ్రాఫీన్లతో పర్యావరణహిత స్క్రీన్లను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఈ స్క్రీన్లు తక్కువ విద్యుత్నే ఉపయోగించుకుంటాయని, ఇప్పుడున్న వాటికంటే వేగంగా స్పందిస్తాయని వారు పేర్కొన్నారు. ప్రస్తుతమున్న టచ్స్క్రీన్స్ తయారీలో వాడే ఇండియమ్ టిన్ ఆక్సైడ్ పెళుసుగా ఉండటంతోపాటు ధర కూడా ఎక్కువ. అలాగే ఇండియమ్ చాలా అరుదైన లోహం, దీనివల్ల పర్యావరణానికి కూడా హాని జరుగుతుందని తెలిపారు. సిల్వర్ కూడా అధిక ధరకే లభిస్తున్నా.. సిల్వర్ నానోవైర్లను గ్రాఫీన్కు జతచేయడం ద్వారా తక్కువ ధరకే ఈ నూతన స్క్రీన్ను తయారు చేసినట్టు బ్రిటన్లోని యూనివర్సిటీ ఆఫ్ ససెక్స్కు చెందిన శాస్త్రవేత్తలు వివరించారు. ఇంతకుముందే సిల్వర్ నానోవైర్లను టచ్స్క్రీన్స్లో ఉపయోగించినా.. ఎవరూ గ్రాఫీన్తో తయారు చేయలేదని వర్సిటీ పరిశోధకులు డాల్టన్ చెప్పారు. -
రాయచోటిలో తప్పిన పెనుప్రమాదం
రాయచోటి: వైఎస్సార్జిల్లా రాయచోటిలో ఘోర ప్రమాదం తప్పింది. ఇటీవల రంజాన్ సందర్భంగా పట్టణం నడిబొడ్డున తెలుగుదేశం పార్టీ నాయకులు షాది ముబారక్ కార్యక్రమానికి సంబంధించి 25X40 అడుగుల ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. ఆ ఫ్లెక్సీ బుధవారం అకస్మాత్తుగా విరిగి పడిపోయింది. విద్యుత్ వైర్లు అడ్డుగా ఉండడంతో అది వాటిపై పడింది. ఆ సమయంలో బస్సు షెల్టర్ వద్ద ఉన్న ప్రయాణికులు తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. అది వారిపై పడి ఉంటే పరిస్థితి ఏమిటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. వైర్లు తెగిపడిపోవడంతో పట్టణంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఈ ఫ్లెక్సీ ఏర్పాటుకు మున్సిపల్ అనుమతులు తీసుకోలేదని తెలుస్తోంది. మున్సిపల్ సిబ్బంది సహకారంతో పోలీసులు ఆ ఫ్లెక్సీని తొలగించే చర్యలు చేపట్టారు. -
ఫ్లెక్సీలు పెట్టినందుకు ఫైన్ వేయండి
సాక్షి ప్రతినిధి, వరంగల్: నిబంధనలకు విరుద్ధంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన వారిపై ఫైన్లు వేయాలని రాష్ట్ర పురపాల శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు వరంగల్ మున్సిపల్ కమిషనర్ శృతి ఓజాకు ట్వీటర్లో సూచించారు. టాస్క్ రీజినల్ సెంటర్ ప్రారంభోత్సవం, సీఎం కేసీఆర్ పర్యటన ఏర్పాట్ల కోసం శనివారం వరంగల్ నగరానికి మంత్రి కేటీఆర్ వస్తున్నారు. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, మేయర్ పేరుతో నగరంలో విరివిగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఫ్లెక్సీల కారణంగా ఏర్పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని గతేడాది రాష్ట్రవ్యాప్తంగా కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో వాటి ఏర్పాటును మంత్రి కేటీఆర్ నిషేధించారు. అదే మంత్రి పర్యటన సందర్భంగా ఆ పార్టీ నేతలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంపై వికాస్ డేనియల్ అనే యువకుడు ట్వీటర్ ద్వారా నేరుగా కేటీఆర్ను ప్రశ్నించాడు. శుక్రవారం మధ్యాహ్నం 3:26 గంటల సమయంలో ‘కేటీఆర్ సార్.. రేపు మీ పర్యటన సందర్భంగా వరంగల్లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఫ్లెక్సీల రద్దు నియమం అధికార పార్టీకి వర్తించదా?’ అని అడిగాడు. ఆ తర్వాత ట్వీట్లలో ‘ప్రధాన రహదారిపై 500 ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. తమ పేరుకు ప్రచారం కల్పించుకోవడం కోసం నాయకులు డబ్బు వృథా చేస్తున్నారు. మీరే ఫెక్ల్సీలపై బ్యాన్ విధించి, మీ పర్యటన సందర్భంగానే మళ్లీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం ఎంత వరకు కరెక్ట్ సార్?’ అంటూ ప్రశ్నించాడు. దీనికి స్పందించిన మంత్రి కేటీఆర్ సాయంత్రం 5 గంటలకు వికాస్ డేనియల్ ట్వీట్ను రీట్వీట్ చేస్తూ నగరంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగించాలని, వాటిని పెట్టిన వారికి పెనాల్టీ విధించాలని వరంగల్ మున్సిపల్ కమిషనర్కు ట్వీటర్ ద్వారా సూచించారు. కేటీఆర్ స్ఫూర్తినిచ్చారు: వికాస్ డేనియల్ ఫ్లెక్సీలు తొలగించాలంటూ మంత్రి కేటీఆర్ చేసిన ట్వీట్పై వికాస్ డేనియల్ సాయంత్రం 7:45 గంటల సమయంలో తిరిగి స్పందించారు. ‘త్వరగా స్పందించినందుకు థ్యాంక్స్ సార్, మీరు నిజమైన స్ఫూర్తి ఇచ్చారు’ అని ట్వీట్ చేశాడు. కేటీఆర్కు చెడ్డపేరు తెచ్చేందుకు తాను ట్వీట్ పెట్టలేదని, వాస్తవాలను మంత్రి దృష్టికి తీసుకెళ్లేందుకే ట్వీట్ చేసినట్లు తెలిపారు. పేపర్ ఫ్లెక్సీలు పెట్టాం: ఎమ్మెల్యే వినయ్ మంత్రి కేటీఆర్ పర్యటన సందర్భంగా తాము ఏర్పాటు చేసినవి పేపర్తో తయారుచేసిన ఫ్లెక్సీలని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ తెలిపారు. అలాగే, మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు ఫ్లెక్సీలను తొలగిస్తామని మేయర్ నన్నపునేని నరేందర్ తెలిపారు. Request Municipal Commissioner Warangal to ensure all these are removed immediately & people who set them up levied a penalty @MC_GWMC https://t.co/vSGMaVG63E — KTR (@KTRTRS) October 13, 2017 1/2-There are more than 500 small size flex kept on the main road.leaders waste so much of money just for the sake of getting name pic.twitter.com/xcZtxEIXps — Vikas Daniel (@Vikas_daniel) October 13, 2017 @KTRTRS sir this is in Warangal regarding your visit tomorrow, won't flex ban apply to ruling party? Just asking pic.twitter.com/27OuEj9kto — Vikas Daniel (@Vikas_daniel) October 13, 2017 -
ఫ్లెక్సీలపై.. రగడ
విజయనగరం మున్సిపాలిటీ : ప్రచారంపై ఉండే ఆరాటం రాజకీయ పార్టీల మధ్య స్పర్ధలకు కారణం అవుతోంది. దీనికి ప్రస్తుతం విజయనగరం వేధికగా నిలుస్తోంది. వివరాల్లోకి వెళ్తే.. విజయనగరం ఉత్సవాలు, పైడి తల్లమ్మ ఉత్సవాలకు జిల్లా కేంద్రం ప్రస్తుతం ఆతిథ్యం ఇస్తోంది. ఈ నెల 1 నుంచి 3 వరకు ఈ రెండు ఉత్సవాలను నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం, దేవాదాయ శాఖ ఏర్పాట్లు చేసింది. విజయనగరం ఉత్సవాలు ఆదివారం నుంచి ప్రారంభం కాగా, పైడతల్లి ఉత్సవాలు సోమవారం ఆరంభం కానున్నాయి. ఏటా ఈ ఉత్సవాలను తిలకించేందుకు ఏటా లక్షల సంఖ్యలో భక్తులు తరలివస్తుంటారు. సిరిమానోత్సవం రోజే 2.5 లక్షల మంది వస్తారని అంచనా. మిగిలిన రోజుల్లో కూడా పెద్ద ఎత్తున భక్తులు వస్తారని సమాచారం. పార్టీల మధ్య రగడ.. అయితే ప్రచారం విషయంలో టీడీపీ ఈ మధ్యకాలంలో వెనుకబడింది. వైఎస్సార్ సీపీ నాయకుల ఫొటోలతో వెలసిన అమ్మవారి ఫ్లెక్సీలను తొలగించేందుకు టీడీపీ నాయకులు ప్రయత్నిస్తుండడంతో రెండు పార్టీల మధ్య స్పర్ధలు నెలకొన్నాయి. దీంతో టీడీపీ పెద్దలు జిల్లా అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చి ఆ ఫెక్సీలు తొలగించేందుకు ఆదేశాలు జారీ చేయించారు. కలెక్టర్ ఆదేశాలతో మున్సిపల్ టౌన్ ప్లానింగ్ సిబ్బంది స్థానిక ఎత్తుబ్రిడ్జిపై ఉన్న వైఎస్సార్ సీపీ నాయకుల ఫ్లెక్సీలను తొలగించేందుకు ప్రయత్నించారు. విషయం తెలుసుకున్న వైఎస్సార్ సీపీ నాయకులు ప్రతిఘటించడంతో అధికారుల తీరును వ్యతిరేకించారు. గత నెలలో జిల్లాకు వచ్చిన మంత్రి నారా లోకేష్ ఫెక్సీలను తొలగించకుండా తమవి తొలగించడం ఏంటని అభ్యంతరం వ్యక్తం చేశారు. హైకోర్టు ఆదేశాలూ బేఖాతరే.. వాస్తవానికి ప్రధాన మార్గాల్లో ఫ్లెక్సీల ఏర్పాటును హైకోర్టు చాన్నాళ్ల క్రితమే నిషేధించింది. ఇలాంటి ఫెక్సీలు ఏర్పాటు చేసే వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. తర్వాత కాలంలో మున్సిపల్ కౌన్సిల్ ప్రత్యేక తీర్మాణం చేసింది. అయితే ఆ ఆదేశౠలను అధికార పార్టీ నాయకులే తర్వాత కాలంలో బేఖాతరు చేశారు. పాలకవర్గమే నిబంధనలకు నీళ్లోదిలేసింది. ఇష్టారాజ్యంగా ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తూ ఆ సంస్కృతి కొనసాగించడం గమనార్హం. తాజా పరిణామాల నేపథ్యంలో ముందు వెళితే నుయ్యి, వెనక్కి వెళితే గొయ్యి అన్న చందంగా తయారైంది అధికారుల పరిస్థితి. ఏం చేయాలో తెలియక వారు తలలు పట్టుకుంటున్నారు. పార్టీల అభ్యర్థన మేరకే.. హైకోర్టు ఆదేశాలు నిజమే. కానీ పార్టీల అభ్యర్థన మేరకు రెండు, మూడు రోజులు అనుమతిచ్చాం. కానీ రోజుల తరబడి వారు తొలగించడం లేదు. దీంతో మేము ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నాం. అమ్మవారి జాతర అనంతరం ఫ్లెక్సీల ఏర్పాటుపై నిర్ణయం తీసుకుంటాం. – హరిదాసు, మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారి. -
మీకోసం ఓ అరగంట
సెల్ఫ్ చెక్ మహిళ నిర్వహించే బాధ్యతలను లిస్ట్ రాస్తే దానికి అంతం ఉండకపోవచ్చు. రెండు చేతులతో లెక్కకు మించిన బాధ్యతలన్నీ నిర్వర్తిస్తుంటుంది. ఈ క్రమంలో నిర్లక్ష్యానికి లోనయ్యేది ఆరోగ్యమే. రోజుకు ఓ అరగంట టైమ్ తన కోసం కేటాయించుకోవడాన్ని కూడా మర్చిపోతుంటుంది. మరి మీరేం చేస్తున్నారు? 1. అన్ని పనులతోపాటు మీ ఎక్సర్సైజ్కు సమయాన్ని కేటాయిస్తున్నారు. ఎ. అవును బి. కాదు 2. వయసు, ఎత్తు, బరువుతోపాటుగా మీ వయసు, ఎత్తుకు ఉండాల్సిన బరువు ఎంతో మీకు తెలుసు. ఎ. అవును బి. కాదు 3. దేహం ఫ్లెక్సిబుల్గా ఉండడానికి, దీర్ఘకాలిక వ్యాధులకు దూరంగా ఉండడం కోసం రెగ్యులర్గా వ్యాయామం చేస్తున్నారు. ఎ. అవును బి. కాదు 4. ఏరోబిక్స్, జిమ్, యోగా క్లాసులకు వెళ్లడానికి సాధ్యం కానప్పుడు ఇంటి మెట్లనే వ్యాయామకేంద్రంగా చేసుకుంటారు. రోజుకు ఐదారుసార్లు మెట్లెక్కి దిగి 20 పుష్అప్స్ చేస్తే పూర్తి వ్యాయామం చేసినట్లే. ఎ. అవును బి. కాదు 5. క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తే స్ట్రెస్ రిలేటెడ్ హెడేక్ రాదని మీకు తెలుసు. ఎ. అవును బి. కాదు 6. రోజూ ఐదారు నిమిషాల సేపు క్రమబద్ధంగా ఊపిరితిత్తుల నిండా గాలి పీల్చుకుని నిదానంగా వదలడం ద్వారా శ్వాసకోశ వ్యవస్థ పని తీరును మెరుగుపరుచుకుంటున్నారు. ఎ. అవును బి. కాదు ‘ఎ’లు ఐదు దాటితే ఆరోగ్యాన్ని పట్టించుకుంటున్నారనే అనుకోవాలి. దీనిని కొనసాగించండి. ‘బి’లు ఎక్కువైతే... ఈ ధోరణి అంత మంచిది కాదని గుర్తించండి. వార్ధక్యంలో వచ్చే సమస్యలకు దూరంగా ఉండడానికి ముప్ఫయ్ల నుంచి జాగ్రత్తలు తీసుకోవాలి. -
మీకు సెంటిమెంట్స్ ఎక్కువా..?
సెంటిమెంట్స్ ప్రతివాళ్లకూ ఎంతో కొంతమేర ఉంటాయి. అవి సహజం కూడా. సెంటిమెంట్ల విషయంలో మీరు ఫ్లెక్సిబుల్గా ఉంటారో, పర్టిక్యులర్గా ఉంటారో చెక్ చేసుకోండి. 1. అర్జెంట్ పనిమీద వెళ్తున్నప్పుడు ఎవరైనా తుమ్మితే...ఆ పని నలుగురితో కలిసి వెళ్లాల్సినదైతే అలాగే సాగిపోతారు. అంతేగాని ఆగరు. ఎ. అవును బి. కాదు 2. మీరు రెగ్యులర్గా ముఖం చూసి లేచేవారి ముఖం చూడని రోజున ఏదైనా ప్రమాదం జరిగితే ఆ వేళ కనబడ్డ వారిని ద్వేషించరు. అది యాదృచ్ఛికం అని సర్దుకుపోతారు. ఎ. అవును బి. కాదు 3. ముహూర్తాలపై నమ్మకం ఉన్నా... మీరు బయల్దేరాలనుకున్న ఆ సమయం మీ ప్రయాణానికి అనువుగా లేకపోతే ఉన్న పరిస్థితులకు అనుగుణంగా సర్దుకుపోతారు. ఎ. అవును బి. కాదు 4. పరీక్ష విజయవంతంగా రాసేందుకు దోహదం చేస్తుందనే పెన్ను పైనగాని, షర్ట్పైగాని మీకు సెంటిమెంట్ ఉంటే... ఒకవేళ అందుబాటులో లేకపోతే కొత్తదానితో ప్రొసీడ్ అవ్వగలరు. ఎ. అవును బి. కాదు 5. పరీక్షలయ్యాక ఫలానా థియేటర్లో సినిమా చూడాలనే సెంటిమెంట్ ఉన్నా ఆ పూట టిక్కెట్లు దొరకకపోతే మీరు బాధపడరు. ఎ. అవును బి. కాదు 6. మీరు రోజూ పొద్దున్నే దినఫలాలు యథాలాపంగా చూస్తారు గాని... మళ్లీ అవి గుర్తుండవు. మీ రోజు గడిచిన తీరును దానికి ఆపాదించరు. ఎ. అవును బి. కాదు 7. పర్స్ వంటి వాటిపై సెంటిమెంట్ ఉన్నా, అది పూర్తిగా చిరిగిపోతే కొత్తది కొనుక్కుంటారు. ఎ. అవును బి. కాదు 8. విధి రాతను మీరు నమ్మినా, మీ ప్రయత్నాల వల్లనే మీకు విజయాలు లభిస్తాయని తెలుసు. పూర్తిగా విధినే నమ్ముకుని, మీరు చేయాల్సిన వాటిని గాలికి వదిలేయరు. ఎ. అవును బి. కాదు మీ సమాధానాల్లో ‘ఎ’లు ఆరుకు మించి వస్తే మీకు సెంటిమెంట్స్ ఉన్నా వాటికి మీరు బానిస కాదు. ‘బి’ సమాధానాలు ఆరు దాటితే మీరు సెంటిమెంట్లను బలంగా నమ్ముతారు. సెంటిమెంట్ ఆత్మవిశ్వాసం కలిగించేదిగా ఉండాలి గాని దినచర్యకు అడ్డంకిగా మారకూడదు. సెంటిమెంట్ స్థాయిని మించి మూఢనమ్మకంగా మారుతుంది. కాబట్టి ఒకవేళ మీలో సెంటిమెంట్స్ ఉన్నా మీ జీవితంలో వాటి జోక్యాన్ని మితిమీరనివ్వవద్దు -
ఆర్టీసీ బాదుడు
అనంతపురం న్యూసిటీ: రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ) దూర ప్రాంతాలకు నడుపుతున్న సర్వీసుల్లో పండుగ పూట టికెట్ చార్జీలు భారీగా పెంచింది. ప్రత్యేక బస్సుల్లో మాత్రమే టికెట్ ధర పెంచుతారు. అయితే అది మాటల వరకే పరిమితమైంది. రెగ్యులర్ సర్వీసుల్లోనూ టికెట్పై 50 శాతం మేర అదనంగా దండుకోనుంది. ఇదేమని అడిగితే ‘పండుగ పూట మామూలే కదా’ అని అంటోంది. అనంతపురం రీజియన్లోని 13 డిపోల నుంచి రెగ్యులర్ సర్వీసులు కాక 80 స్పెషల్ బస్సులు తిప్పనున్నారు. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, తిరుపతి, విజయవాడ, నెల్లూరు ప్రాంతాలకు అధిక సర్వీసులు పంపనున్నారు. అందుకోసం పలు ప్రాంతాల సర్వీసులను ఆర్టీసీ అధికారులు రద్దు చేశారు. ఫ్లెక్స్బుల్ ఫెయిర్ పేరుతో రెగ్యులర్ సర్వీసుల్లోనూ అదనంగా డబ్బులు వసూలు చేయనున్నారు. పండుగ సీజన్లో మామూలే.. రెగ్యులర్ సర్వీసుల్లో సాధారణ ధర మాత్రమే కేటాయించాం. స్పెషల్ సర్వీసుల్లో మాత్రం వన్ అండ్ ఆఫ్ ధర (టకెట్ ధరకు అదనంగా) వసూలు చేస్తాం. పండుల సీజన్లో మామూలే. వివిధ ప్రాంతాలకు వెళ్లే స్పెషల్ బస్సుల టికెట్ ధరలు ఇవే... సర్వీసు రెగ్యులర్ సర్వీసు ధర స్పెషల్ ధర హైదరాబాద్ రూ. 473 రూ. 682 చెన్నై రూ. 550 రూ. 807 బెంగళూరు రూ. 320 రూ. 459 బెంగళూరు(ఎక్స్ప్రెస్)రూ. 232 రూ. 330 విజయవాడ రూ. 620 రూ. 900 తిరుపతి(ఎక్స్ప్రెస్) రూ. 281 రూ. 409 -
మీరు బిగుసుకుపోయి ఉంటారా...?
సెల్ఫ్ చెక్ ప్రతికూల ఫలితాన్ని కొందరు తేలికగా తీసుకుంటే, మరికొందరు సీరియస్గా తీసుకుంటారు. ప్రత్యేకంగా ఉండాలనుకోవటం, బాగా పేరు తెచ్చుకోవాలనుకోవటం, ప్రయత్నించిన మొదటిసారే విజయాన్ని చేరుకోవాలనుకోవటం. ఇలా తమను తామే స్ట్రిక్ట్గా మలచుకుంటారు కొందరు. ఇక్కడ బాధ్యతలను విస్మరించమని చెప్పే ఉద్దేశం కాదు కాని అనవసరంగా టెన్షన్ పడకుండా ఉండటం అవసరం. మీరెలా ఉంటారు? ఫ్లెక్సిబుల్గా కాకుండా బిగుసుకుపోయి స్టిఫ్గా ఉంటారా? 1. నిర్ణయాలు మార్చుకోవలసి వచ్చినప్పుడు చాలా ఇబ్బందిగా ఫీలవుతారు (ఉద్యోగవ్యవహారాలు మొదలైనవి). ఎ. కాదు బి. అవును 2. అతి శుభ్రత పాటించాలనుకుంటారు. ఎ. కాదు బి. అవును 3. అంతగా ప్రాధాన్యం లేని పనులకు కూడ చాలా ప్రాధాన్యత ఇస్తారు. ఎ. కాదు బి. అవును 4. మీరనుకున్న పనులు పూర్తిచేయలేకపోతే (సమయం ఉన్నా కూడ) హడావిడి పడతారు. ఎ. కాదు బి. అవును 5. ఏదైనా కార్యక్రమం మీరు ఊహించిన విధంగా జరగకపోతే అప్సెట్ అవుతారు. ఎ. కాదు బి. అవును 6. మిమ్మల్ని ఎవరైనా అవసరానికి ఉపయోగించుకంటే (అడ్వాన్టేజ్) మనశ్శాంతి కోల్పోతారు. ఎ. కాదు బి. అవును 7. మీదగ్గర నుంచి ఇతరులు తీసుకున్న వస్తువులు సకాలంలో ఇవ్వకపోతే చాలా పెద్ద సీన్ చేస్తారు. ఎ. కాదు బి. అవును 8. ప్రతికూల పరిస్థితుల్లో కూడ మీ విధిని కాసేపు పక్కన పెట్టటం మీకు నచ్చదు. ఎ. కాదు బి. అవును 9. ఏదైనా తీసుకోవటమేకాని, ఇచ్చే మనస్తత్వం మీది కాదు. ఎ. కాదు బి. అవును 10. జరిగిపోయిన విషయాల గురించి పదేపదే ఆలోచిస్తారు. ఎ. కాదు బి. అవును ‘బి’ లు ఏడు దాటితే అవసరంలేనిదానికన్నా ఎక్కువగా స్పందించే తత్వం మీలో ఉంటుంది. దీనివల్ల ఎప్పుడూ టెన్షన్తో ఉంటారు. మీ చర్యలే మీకు విశ్రాంతిలేకుండా చేస్తుంటాయి. ‘ఎ’ లు ‘బి’ ల కన్నా ఎక్కువగా వస్తే మీలో ఫ్లెక్సిబులిటీ ఉంటుంది. పరిస్థితులకు తగినట్లు స్పందించటం వల్ల ఎప్పుడూ సంతోషంగా ఉంటారు. -
లోకేష్ ఫ్లెక్సీ కడుతుండగా..
సోమల: చిత్తూరు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. అధికార పార్టీ నాయకుల ఫ్లెక్సీలు కడుతున్న ఓ కార్యకర్త విద్యుధ్ఘాతానికి గురై మృతి చెందాడు. జిల్లాలోని సోమల మండలం కందూరు గ్రామంలో ఓ టీడీపీ కార్యకర్త మంత్రి లోకేష్ బాబు ఫ్లెక్సీలు కడుతుండగా ప్రమాదవశాత్తు కరెంట్షాక్ తగిలింది. దీంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. -
బీజేపీ ఫ్లెక్సీలు ధ్వంసం
పోలీసులకు ఆ పార్టీ పట్టణ అధ్యక్షుడు ఫిర్యాదు సీసీ కెమెరాలో నమోదైన దృశ్యాలు కేసు నమోదు చేస్తామంటున్న పోలీసులు అనకాపల్లి: అనకాపల్లి పరిధి బీజేపీ శ్రేణుల్లో అంతర్గత విబేధాలు ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి సిద్ధార్థనాథ్సింగ్ ఎదుట బహిర్గతమైన సంగతి విదితమే. ప్రధాని మోదీ మూడేళ్ల పాలనపై సంబరాలు జరుపుకుంటున్న తరుణంలో అనకాపల్లిలో చోటుచేసుకున్న పరిణామాలు ఆ పార్టీలో తీవ్ర కలకలాన్ని సృష్టిస్తున్నాయి. తమకు గౌరవమివ్వలేదంటూ జిల్లా బీజేపీ ఇన్చార్జి మళ్ల వెంకటరావు సిద్ధార్థనాథ్సింగ్ ఎదుట ఆదివారం అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన సర్దుబాటు చేశారు. ఈ నేపథ్యంలో సోమవారం తెల్లవారుజామున చోటుచేసుకున్న పార్టీ ఫ్లెక్సీలను చించివేయడం ఆ శ్రేణుల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. అనకాపల్లి పట్టణంలోని సుంకరమెట్ట జంక్షన్ వద్ద బీజేపీ నాయకులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని సోమవారం తెల్లవారుజామున 2–02గంటల సమయంలో చించివేస్తున్నట్టు సీసీ కెమెరాలో నమోదైన దృశ్యాలు సాక్షికి లభించాయి. 4 ఫ్లెక్సీలను గుర్తు తెలియని వ్యక్తులు చించివేశారంటూ పట్టణ బీజేపీ అధ్యక్షుడు కోలపర్తి శ్రీనుతోపాటు పలువురు అనకాపల్లి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు దర్యాప్తు చేపట్టిన అనకాపల్లి పోలీసులకు కీలకమైన సాక్ష్యాలు లభించాయి. ఇందులో భాగంగా జిల్లాకు చెందిన ఒక నేతతో అనకాపల్లి పోలీసులు మాట్లాడినట్టు సమాచారం. కాగా ఆ పార్టీకి చెందిన ఒక కీలకనేత సహకారంతోనే ఫ్లెక్సీలను చించివేశారని అనకాపల్లిలోని మరో వర్గం ఆరోపిస్తోంది. ఈ ఘటనను తాము తీవ్రంగా పరిగణిస్తున్నామని, మంగళవారం ఆందోళన చేపడతామని బీజేపీలోని మరొక వర్గం పేర్కొంది. ఫిర్యాదు మేరకు సీసీ కెమెరా దృశ్యాలను సేకరించగా కారులో నుంచి ఒక వ్యక్తి దిగి ఫ్లెక్సీలను చించివేస్తున్నట్టుగా నమోదైందని, కోర్టు అనుమతిని కోరామని, ఆదేశాల మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని పట్టణ సీఐ విద్యాసాగర్ తెలిపారు. -
ఏపీలో అవకాశాలు సద్వినియోగం చేసుకోండి
అమెరికా పర్యటనలో సీఎం సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్లో విస్తరణకు గల అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సీఎం చంద్రబాబు ప్రముఖ ఎలక్ట్రానిక్స్ మాన్యుఫ్యాక్చరింగ్ సర్వీస్ సంస్థ ఫ్లెక్స్ట్రానిక్స్కు సూచించారు. అమెరికా పర్యటనలో ఉన్న చంద్రబాబు తొలిరోజు ఫ్లెక్స్ట్రానిక్స్ సీఈఓ మైక్ మెక్నమరతో సమావేశమయ్యారు. విశాఖలో ఇప్పటికే తమ ఉనికి ఉందని, సీఎం ప్రతిపాదనలను పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని మైక్ తెలిపారు. అనంతరం చంద్రబాబు బృందం శాన్జోస్ విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి శాక్రమెంటో విమానాశ్రయంలో దిగి కాలిఫోర్నియా రాష్ట్ర గవర్నర్ జెర్రీ బ్రౌన్ అధికారిక నివాసానికి వెళ్లారు. వ్యవసాయ, పారిశ్రామిక, సాంకేతిక రంగాల్లో తమ రాష్ట్రానికి కాలిఫోర్నియా సహకారాన్ని ఆశిస్తున్నట్లు తెలిపారు. అనంతరం సెమీ కండక్టర్ ఇంటెక్చువల్ ప్రాపర్టీ (ఐపీ) సప్లయర్ ఏఆర్ఎం హోల్డింగ్స్ సీఈఓ సైమన్ అంథోనీ సెగర్స్, గూగుల్ వైఎస్ ప్రెసిడెంట్ టామ్ మూర్, టెస్లా సీఎఫ్ఓ దీపక్ ఆహుజాతోనూ సమావేశమయ్యారు. మోసెర్ అసోసియేట్స్తో రెండో రోజు పర్యటనలో ప్రముఖ ఆర్కిటెక్ట్ కంపెనీ ఎం మోసెర్ అసోసియేట్స్ గ్లోబల్ డైరెక్టర్ రస్సెల్ డ్రింకెర్ బాబు సమావేశమయ్యారు. అమరావతిలో నిర్మాణంలో భాగస్వామ్యం కావాలని చంద్రబాబు కోరగా పరిశీలిస్తామని రస్సెల్ హామీ ఇచ్చారు. అనంతరం ఐటీ కంపెనీ జోహూ సీఈఓ శ్రీధర్ వెంబుతో సీఎం సమావేశమయ్యారు. ఆ తర్వాత చైనా కార్ల కంపెనీకి సీఈఓగా ఉన్న పద్మశ్రీ వారియర్తో సమావేశమయ్యారు. అనంతరం చంద్రబాబు బృందం గూగుల్ ఎక్స్ కార్యాలయాన్ని సందర్శించింది. తమ కార్యకలాపాలపై గూగుల్ ఎక్స్ సీఈఓ అస్ట్రో టెల్లర్ ప్రజెంటేషన్ ఇచ్చారు. కాగాజీఎస్ఎల్వీఎఫ్–09 ప్రయోగం విజయవంతం కావడం పట్ల సీఎం చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. -
లోకేష్ ఫ్లెక్సీ ఘటనలో గాయపడిన యువకుడి మృతి
జీజీహెచ్ వద్ద నష్టపరిహారం కోసం ఆందోళన హోంమంత్రి రాజప్ప హామీతో శాంతించిన బంధువులు కాకినాడ క్రైం (కాకినాడ సిటీ) : రాష్ట్ర మంత్రి నారా లోకేష్ జిల్లా పర్యటన కోసం ఫ్లెక్సీ కడుతుండగా షార్ట్ సర్క్యూట్తో షాక్కు గురైన వ్యక్తి మంగళవారం రాత్రి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ మృతుడి బంధువులు చేపట్టిన ఆందోళన.. టీడీపీ వర్గాలను పరుగులు పెట్టించింది. కాకినాడ రూరల్ మండలం రమణయ్యపేట ఏపీఐఐసీ కాలనీకి చెందిన దున్న అనిల్కుమార్ (25) ఈ నెల 17న వాకలపూడిలో స్వాగత ఫ్లెక్సీ కడుతుండగా విద్యుత్ తీగలు తగిలి తీవ్ర కాలిన గాయాలతో కాకినాడ ప్రభుత్వాస్పత్రిలో చేరిన విషయం విదితమే. అతడిని హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప పరామర్శించి ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని హామీ కూడా ఇచ్చారు. మెరుగైన వైద్యం కోసం అతడిని అపోలో ఆస్పత్రికి తరలించారు. మృతదేహాన్ని పోస్ట్మార్టమ్ కోసం కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతునికి భార్య రామలక్ష్మి, ఏడాదిన్నర వయసు ఉన్న బాబు ఉన్నాడు. జీజీహెచ్ వద్ద బంధువుల ఆందోళన మృతి చెందిన అనిల్కుమార్ కుటుంబాన్ని ఆదుకోవాలని భవన నిర్మాణ కార్మికుల సంఘం, సీపీఐ పార్టీ ఆధ్వర్యంలో బుధవారం కాకినాడ జీజీహెచ్ పోస్ట్మార్టమ్ వద్ద బంధువులకు ఆందోళనకు దిగారు. మృతుని భార్య రామలక్ష్మికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని, రూ.10 లక్షల నష్ట పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ విషయంపై ప్రభుత్వం, హోంమంత్రి నుంచి స్పష్టమైన హామీ ఇచ్చేదాకా మృతదేహానికి పోస్ట్మార్టమ్ నిర్వహించడానికి వీల్లేదని బంధువులు భీష్మించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అమరావతిలో ఉన్న హోంమంత్రి రాజప్పకు స్థానిక నేతలు ఇక్కడ పరిస్థితిని వివరించారు. దీంతో ఆయన తరఫున తెలుగు యువత జిల్లా అధ్యక్షుడు కటంశెట్టి ప్రభాకర్ (బాబి)ని బంధువులతో చర్చించేందుకు పంపించారు. హోంమంత్రి నుంచి స్పష్టమైన హామీ కావాలని ఆయనకు బంధువులు స్పష్టంచేశారు. దీంతో సెల్ఫోన్ ద్వారా ఆందోళనకారులు, కుటుంబ సభ్యులతో హోంమంత్రి మాట్లాడారు. మృతుని కుటుంబానికి చంద్రన్న బీమా పథకం ద్వారా రూ.5 లక్షలు, ఎక్స్గ్రేషియా కింద రూ.5 లక్షలు ప్రభుత్వం అందజేస్తుందని హామీ ఇచ్చారు. మృతుని భార్య రామలక్ష్మికి ఉద్యోగం ఇచ్చేందుకు కృషి చేస్తానని తమకు హామీ ఇచ్చినట్లు సీపీఐ నగర కార్యదర్శి తోకల ప్రసాద్ తెలిపారు. హోంమంత్రి హామీ మేరకు అనిల్కుమార్ మృతదేహానికి పోస్ట్మార్టమ్ నిర్వహించేందుకు అంగీకరించారు. -
అవమానిస్తే..అందల మెక్కిస్తారా..!
-
కలెక్టర్ వర్సెస్ ఎమ్మెల్యేలు
-
ఫ్లెక్సీలు, పోస్టర్లు తొలగించండి
అనంతపురం అర్బన్ : ఎమ్మెల్సీ ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో భాగంగా రాజకీయ పార్టీల ఫ్లెక్సీలు, పోస్టర్లను తొలగించాలని అధికారులను జాయింట్ కలెక్టర్ బి.లక్ష్మీకాంతం ఆదేశించారు. శనివారం మునిసిపల్ కమిషనర్లు, తహశీల్దార్లతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. నగరాలు, పట్టణాలు, మండలాలు, గ్రామాల్లో ఎక్కడా ఫ్లెక్సీలు, పోస్టర్లు ఉండరాదన్నారు. సోమ, మంగళవారాల్లో మునిసిపాలిటీల్లో పర్యటించి, తనిఖీ చేస్తామన్నారు. ఎక్కడైనా ఎన్నికల నియమావళి ఉల్లంఘన జరిగితే కఠిన చర్యలు ఉంటాయని జేసీ హెచ్చరించారు. -
'నిందితులను కఠినంగా శిక్షిస్తాం'
విజయవాడ : వంగవీటి మోహనరంగా విగ్రహం ధ్వంసం కేసులో నిందితులను కఠినంగా శిక్షిస్తామని ఏపీ డీజీపీ సాంబశివరావు స్పష్టం చేశారు. విజయవాడలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ విగ్రహం ధ్వంసానికి సంబంధించి సీసీ ఫుటేజి ఆధారంగా విచారణ జరుపుతున్నామని చెప్పారు. సింగ్నగర్లో వంగవీటి రంగా విగ్రహం ధ్వంసం, కైకలూరులో ఫ్లెక్సీల చించివేత కేసులను తీవ్రంగా పరిగణిస్తున్నామన్నారు. అభిమానం వెర్రి తలలు వేయరాదని, గొడవలను ప్రొత్సహించే వారు తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని డీజీపీ హెచ్చరించారు. రాష్ట్రంలో బహిరంగ ప్రదేశాల్లో ఏర్పాటు చేసే ప్రతి విగ్రహానికీ, ఫ్లెక్సీకి భద్రత కల్పించలేమన్నారు. ఇకపై ఫ్లెక్సీలను కూడా రెగ్యులేట్ చేస్తామని డీజీపీ తెలిపారు. -
ప్రమాదాలకు నిలయాలు.. ఫ్లెక్సీలు
► హోర్డింగులు, ఫెక్లీలను పట్టించుకోని అధికారులు ► ప్రభుత్వ ఆదేశాలు బేఖాతరు.. పెద్దపల్లి(సుల్తానాబాద్ రూరల్) : సుల్తానాబాద్లో రాజీవ్రహదారి వెంట ఫ్లెక్సీలు,హోర్డింగ్లు ప్రమాదాలకు హేతువుగా మారాయి. ఆర్టీసీ బస్టాండ్ ముందు హోర్డింగ్లు, ఫ్లెక్సీలు ఆర్టీసీ డ్రైవర్లకు తలనొప్పులు తెచ్చిపెడుతున్నాయి. బస్సులు లోపలికి వెళ్లే దారిలో, బయటకు వచ్చే దారిలో హోర్డింగ్లు ఏర్పాటుచేయడం వల్ల డ్రైవర్లకు రాజీవ్రహదారి వెంట వెళ్లే వాహనాలు సరిగా కనబడక ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇలాంటి ఘటనే శుక్రవారం చోటుచేసుకుంది. రోడ్డు నుంచి వెళ్తున్న లారీని బస్సు ఢీకొనడం వల్ల బస్సులో ప్రయాణించే రాజయ్య అనే వ్యక్తి మృతి చెందాడు. గతంలోనూ పలు సందర్భాల్లో ప్రమాదాలు జరిగాయి. అధికారులు అనుమతిలేని ఫ్లెక్సీలు, హోర్డింగ్లను తొలగించాలని ఆర్టీసీ అధికారులకు, సంబంధిత శాఖల అధికారులకు ఎంతో కాలంగా కోరుతున్నా పట్టించుకోవడం లేదన్న విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.ఇప్పటికైనా ప్రమాదాలకు కారణమవుతున్న ఫ్లెక్సీలను హోర్డింగులను నిషేధించాలని ప్రజలు కోరతున్నారు. బస్టాండ్ మూసుకు పోయింది హోర్డింగ్లతో, ఫ్లేక్సిలతో బస్టాండ్ పూర్తిగా మూసుకుపోయింది. రోడ్డుకు అసలే వంపులో ఉన్న బస్టాండ్ హోర్డింగ్ల వల్ల కనబడడం లేదు. దీంతో బస్సు డ్రైవర్లకు, రాజీవ్ రోడ్డు వెంట వెల్లే వాహనాల డ్రైవర్లకు ఇబ్బంది కరంగా మారింది. ప్రయాణీకులకు అసౌకర్యంగా తయారైంది. వెంటనే అధికారులు దృష్టి సారించాలి. – దొడ్ల సతీష్, సుల్తానాబాద్ చౌరస్తా ప్రమాదాలకు నిలయమైంది ఒక వైపు హోర్డింగ్లు, మరోవైపు రాజీవ్రహదారిపై డివైడర్ల వల్ల స్థానిక బస్టాండ్ చౌరస్తా ప్రమాదాలకు నిలయంగా మారింది. ప్రయాణీకులు రోడ్డు దాటాలంటే జంకుతున్నారు. జిల్లాకు చెందిన ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ బస్టాండ్ పరిస్థితి గురించి దృష్టి సారించాలి. అనుమతి లేని హోర్డింగ్లను తొలగించడం లేదు. ఆర్టీసీ, స్థానిక అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు. –శేట్టి శ్రీనివాస్, సుల్తానాబాద్ తగు చర్యలు తీసుకుంటాం హోర్డింగ్ల గురించి తగు చర్యలు తీసుకుంటాం. సంబంధిత అధికారులను వీటిని తొలగించాల్సిందిగా ఆదేశించాం. ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యలను తీసుకుంటున్నాము, పోలీసు సిబ్బంది కూడా బస్టాండ్ వద్ద విధుల్లో ఉన్నారు. సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేసి ప్రత్యక్షంగా పరిస్థితిని సమీక్షించడం జరుగుతుంది. – జీవన్,ఎస్సై సుల్తానాబాద్ -
బాలకృష్ణ సినిమా ప్లెక్సీల కోసం చెట్లు నరికివేత
-
ఫ్లెక్సీలు బంద్
► హోర్డింగులకే పరిమితం ►నేటినుంచి పక్కాగా అమలు ► పటిష్టంగా ప్లాస్టిక్ నిషేధం ► నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానా ►ప్రత్యామ్నాయం చూపండి ►ఫ్లెక్సీ నిర్వాహకుల విజ్ఞప్తి రహదారులకు అడ్డుగా, ట్రాఫిక్ సమస్యలు తలెత్తేలా కట్టే ఫ్లెక్షీలు ఇకనుంచి కనిపించవు. తమ నేత వస్తున్నాడని రాజకీయ పార్టీలు, నాయకుడొస్తున్నాడని వివిధ సంఘాల నాయకులు పట్టణాలు, ఊళ్లను ఫ్లెక్సీలతో కుమ్మేయడం ఈ కొత్త సంవత్సరం నుంచి కుదరదు. ఫ్లెక్షీల ద్వారా తలెత్తుతున్న సమస్యలను దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కె.తారకరామారావు ఫ్లెక్సీలను నిషేధిస్తూ (హోర్డింగ్లకు మినహా) గతంలోనే నిర్ణయం తీసుకున్నారు. ఈ ఏడాది అంటే.. ఆదివారం నుంచి మంత్రి ఆదేశాలు పక్కాగా అమలులోకి రానున్నాయి. – సాక్షి, సిరిసిల్ల సాక్షి, సిరిసిల్ల : పర్యావరణానికి హానికరంగా మారిన ప్లాస్టిక్ను తరిమివేసే క్రమంలో ఫ్లెక్షీలనూ నిషేధిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కేవలం మున్సిపల్ అనుమతులున్న హోర్డింగ్లు, సైన్ బోర్డులకు తప్ప ఫ్లెక్షీలు ఏర్పాటు చేయడంపై నిషేధం విధించారు. సిరిసిల్ల పట్టణంలో 12, వేములవాడలో 4 హోర్డింగ్లకు మాత్రమే మున్సిపాల్టీల అనుమతి ఉంది. ఫ్లెక్సీల తయారీపై నిషేధిం విధించకున్నా .. హోర్డింగ్లు తప్ప బయట ఏర్పాటు చేస్తే జరిమానా విధిస్తామనే అధికారుల హెచ్చరికతో దాదాపు నిషేధం అమలు కానుంది. పటిష్టంగా ప్లాస్టిక్పై నిషేధం మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ సూచన మేరకు ప్లాస్టిక్రహిత జిల్లాగా మార్చేందుకు అధికారులు నడుం కట్టా రు. జిల్లాలోని సిరిసిల్ల, వేములవాడ మున్సిపాల్టీల్లో ప్లాస్టిక్, ఫ్లెక్షీల నిషేధాన్ని పగడ్బందీగా అమలు చేసేం దుకు చర్యలు చేపట్టారు. ఇప్పటికే ప్లాస్టిక్పై నిషేధం కొనసాగిస్తుండగా, నూతన సంవత్సరంలో మరింత పటిష్టంగా అమలు చేసేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నారు. సిరిసిల్ల మున్సిపల్ కమిషనర్ సుమన్ రావు నేతృత్వంలో ఎన్విరాన్ మెంట్ ఇంజినీరింగ్, శానిటరీ ఇన్ స్పెక్టర్, సంబంధిత వార్డు జవాన్, ఇద్దరు వర్కర్లతో కూడిన బృందం నిషేధం అమలు ఉల్లంఘించేవారిపై దాడులు చేపడుతోంది. గత మూడు నెలల్లో 12 సార్లు చేసిన దాడుల్లో రూ.1.10 లక్షల జరిమానాను వ్యాపారుల నుంచి వసూలు చేశారు. ప్లాస్టిక్ కవర్స్, గ్లాస్లు విక్రయిస్తూ తొలిసారి పట్టుబడిన దుకాణదారుకు రూ.2 వేలు, రెండోసారి పట్టుబడితే అదనంగా రూ.వేయి కలిపి జరిమానా విధిస్తారు. మూడు, నాలుగో సారైతే లైసెన్స్ రద్దు చేస్తారు. వేములవాడలోనూ పలు పర్యాయాలు తనిఖీలు చేపట్టారు. ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్ల స్థానంలో నాన్ వోవెన్ క్లాత్ బ్యాగ్స్ను మాత్రమే అనుమతినిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ప్రణాళికాబద్ధంగా ప్రచారం.. పా్లస్టిక్ రహిత సమాజం వైపు అడుగులు వేయాలంటే ప్రజలు, వ్యాపారుల సహకారం అత్యవసరమని గుర్తిం చిన అధికారులు.. ఆ దిశగా చర్యలు చేపట్టారు. ప్రణాళి కాబద్ధంగా ప్లాస్టిక్ నిషేధానికి విస్తృత ప్రచారం కల్పిం చేందుకు కొత్త సంవత్సరం మొదటి వారంలో వరుస కార్యక్రమాలు చేపట్టారు. పట్టణాల్లో ర్యాలీలు, పాఠశాలల్లో వ్యాసరచన, ఉపన్యాస పోటీలు, వ్యాపార, వాణి జ్య వర్గాలతో సమావేశాలు, ఆటోలకు మైక్ల ద్వారా కాలనీల్లో తిరుగుతూ ప్రచారం చేపట్టేందుకు నిర్ణయించారు. ప్రత్యామ్నయం చూపండి.. ఫ్లెక్షీలపై నిషేధాన్ని అమలు చేస్తుండడంపై నిర్వాహకులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఫ్లెక్షీల తయారీపై నిషేధం లేకున్నా.. అనుమతున్న హోర్డింగ్లు మిన హా ఇతర ప్రాంతాల్లో నిషేధించడంతో తమ వ్యాపారం పడిపోతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రూ.లక్షల్లో రుణాలు తీసుకుని, అప్పులు తెచ్చి ఫ్లెక్షీ వ్యాపారం చేసుకుంటున్న తమకు ప్రభుత్వ నిర్ణయం అశనిపాతంలా మారిందని ఆవేదన చెందుతున్నారు. ఫ్లెక్షీ దుకాణాలు సిరిసిల్లలో ఆరు, వేములవాడలో రెండు ఉన్నాయి. ఫ్లెక్షీలను నిషేధించడం సరికాదని, దీని వల్ల తాము ఉపాధి కోల్పోతున్నామని నిర్వాహకులు భిక్షపతి, మాదాసు రమేశ్ ఆవేదన చెందారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా వంద కుటుంబాలపై దీని ప్రభావం పడుతుందని ఆందోళన చెందారు. ప్రభుత్వం తన నిర్ణయం మార్చుకోకపోతే ప్రత్యామ్నాయ ఉపాధి చూపించాలని వారు కోరారు. ఇక ప్లాస్టిక్, ఫ్లెక్షీ రహితం పా్లస్టిక్, ఫ్లెక్షీ రహిత పట్టణంగా సిరిసిల్లను ప్రకటించాం. రాజకీయ పార్టీలు, మత, విద్యా, వ్యాపార సంస్థలు, సహకార, విద్యార్థి సంఘాలు, వ్యక్తులు ఎవరూ కూడా ఆదివారం నుంచి చౌరస్తాలు, ఎక్కడైనా ఫ్లెక్షీలు కట్టడం, ప్రదర్శించడం చేయరాదు. చనిపోయిన వారి చిత్రాలు, ఫొటలతో కూడిన ఫ్లెక్షీలు కూడా పెట్టొద్దు. వ్యాపారసంస్థలు, వ్యక్తులు ప్లాస్టిక్, పాలిథిన్ క్యారీ బ్యాగులు అమ్మడం, వాడడం చేయొద్దు. నిబంధనలు అతిక్రమిస్తే భారీ జరిమానా విధింస్తాం. నూతన సంవత్సరంలో వందశాతం ప్లాస్టిక్ రహిత పట్టణంగా తీర్చిదిద్దుతాం. ప్లాస్టిక్ నిషేధంపై ప్రచారాన్ని విస్తృతం చేశాం. ప్రజలు, వ్యాపారులు కూడా ఇందుకు సహకరించాలి. – బడుగు సుమన్ రావు, సిరిసిల్ల మున్సిపల్ కమిషనర్ -
రేపటి నుంచి ఫ్లెక్సీల నిషేధం
నల్లగొండ, నల్లగొండ టూటౌన్ :మున్సిపల్ పట్టణాల్లో ఫ్లెక్సీలను నిషేధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని, జనవరి ఒకటవ తేదీ నుంచి నల్లగొండ పట్టణంలో దానిని అమలు చేస్తున్నట్లు కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ పేర్కొన్నారు. అనుమతి లేకుండా ఫ్లెక్సీలు పెట్టొద్దని, నిబందనలు అతిక్రమిస్తే జరిమానాతో పా టు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. రాజకీయ నాయకులు సహకరించాలి : జేసీ ఫ్లెక్సీల నిషేధంపై రాజకీయ నాయకులు సహక రించాలని జేసీ నారాయణరెడ్డి కోరారు. శుక్రవా రం మున్సిపల్ కార్యాలయంలోని తన చాంబర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎట్టి పరిస్థితిలోనూ ఫ్లెక్సీలు పెట్టవద్దన్నారు. మున్సిపాలిటీ పరిధిలోని ప్రజల సమస్యల పరిష్కారం కోసం ప్రతి సోమవారం మున్సిపల్ కార్యాలయంలో గ్రీవెన్స్డే నిర్వహించి ఆర్జీలు స్వీకరిస్తామని తెలిపారు. స్వచ్ఛభారత్ కార్యక్రమంలో భాగంగా 900 మరుగుదొడ్లు ప్రారంభిం చామని, పనులు కొనసాగుతున్నాయని, నాలుగైదు రోజుల్లో పూర్తి కానున్నాయని పేర్కొన్నారు. పట్టణంలో సెప్టిక్ ట్యాంకులు లేని మరుగుదొడ్లు 1200 ఉన్నాయన్నారు. సెప్టిక్ ట్యాంకులు నిర్మిం చుకుంటే ప్రభుత్వం రూ.7 వేలు ఇస్తుందని తెలి పారు. ఇందుకు జనవరి 5వ తేదీలోగా ఆధార్ జీరాక్స్ ప్రతితో దరఖాస్తులు చేసుకోవాలని కోరారు. సెప్టిక్ ట్యాంకులు ఏర్పాటు చేసుకోకుంటే ఫిబ్రవరి నెల నుంచి తాత్కాలికంగా రేషన్ సరుకులు నిలిపి వేస్తామన్నారు. మున్సిపాలిటీ పరిధిలో ప్రతి సర్టిఫికెట్ వారం రోజుల్లోగా ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. పనుల కోసం ఎవరికీ ఒక్క రూపాయి కూడా డబ్బులు ఇవ్వవద్దని కోరారు. డబ్బులు అడిగితే వాట్సాప్ నంబర్ 9000020 940కు సమాచారం అందించాలని కోరారు. నేటితో ఎల్ఆర్ఎస్కు దరఖాస్తు గడువు ముగియనుందని, ఎవరైనా ప్లాట్లు కొనుగోలు చేస్తే శనివారంలోగా దరఖాస్తు చేసుకోవాలని కోరారు. విలేకరుల సమావేశంలో అసిస్టెంట్ కమిషనర్ అరుణకుమార్ చరణ్, డీఈ వెం కటేశ్వర్లు, ఏసీపీ ప్రసాదరావు పాల్గొన్నారు. -
నిషేధం అమలయ్యేనా..?
రాష్ట్ర వ్యాప్తంగా ఫ్లెక్సీలను నిషేధించాలని మంత్రి కేటీఆర్ ఆదేశం మున్సిపాలిటీల్లో నిర్దిష్ట ఆంక్షల రూపకల్పన పాలిథిన్ కవర్ల వాడకాన్నే అరికట్టలేని స్థితిలో మున్సిపాలిటీలు మంచిర్యాల : ఎంపీ పుట్టిన రోజుకు శుభాకాంక్షలు చెపుతూ అడుగడుగునా ఫ్లెక్సీలు.. మంత్రి పర్యటనకు వస్తున్నారంటే నాయకులు ఉన్నా లేకపోయినా ఫ్లెక్సీలు మాత్రం స్వాగతం చెపుతాయి. పెళ్లిళ్లు, శుభాకార్యాలకు అభినందనలు మొదలు మరణించిన వారికి సంతాపాలు కూడా – మిగతా 2లోu ఫ్లెక్సీలతోనే చెప్పే ఆనవాయితీ వచ్చింది. ఈ నేపథ్యంలో మున్సిపల్ శాఖ మంత్రి కె.తారకరామారావు ఇటీవల కరీంనగర్లో చేసిన ‘ఫ్లెక్సీలపై నిషేధం’ ప్రకటన చర్చనీయాంశమైంది. పర్యావరణానికి హాని కలిగించే ఫ్లెక్సీలను ఇష్టానుసారంగా ఏర్పాటు చేయడాన్ని కొత్త సంవత్సరం నుంచి నిషేధిస్తున్నట్లు ప్రకటించారు. అంటే జనవరి ఒకటి నుంచి మున్సిపాలిటీల అనుమతి లేకుండా ఏర్పాటు చేసే ఫ్లెక్సీలను సిబ్బంది నిర్ధాక్షిణ్యంగా తొలగిస్తారన్న మాట. ఈ ఫ్లెక్సీలను ఏ ర్పాటు చేసే వారిపై కేసులు నమోదు చేసేందుకు కూడా విధివిధానాలను రూపొందిస్తున్నట్లు స మాచారం. ఈ నేపథ్యంలో జిల్లాలోని మంచిర్యా ల, బెల్లంపల్లి, మందమర్రి మున్సిపాలిటీలలో ఫ్లెక్సీలపై యుద్ధానికి కమిషనర్లు సిద్ధమవుతున్నారు. అయితే.. పర్యావరణానికి పెను ముప్పు గా పరిణమించిన పాలిథిన్ కవర్లపై ఇప్పటికే ఆం క్షలు ఉన్నప్పటికీ అతి తక్కువ మైక్రాన్లు గల ప్రమాదకరమైన నలుపు, తెలుపు పాలిథిన్ కవర్లను జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లో యథేచ్ఛగా వినియోగిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఫ్లెక్సీలపై ఆంక్షలు, నిషేధం ఏ విధంగా అమలు చేస్తారో చూడాల్సిందే..! పర్యావరణ హరణ... : ఫ్లెక్సీల ఏర్పాటు ప్ర క్రియ పదేళ్లలో తీవ్రంగా పెరిగిపోయింది. దుకాణాల బోర్డులు మొదలుకొని అన్ని వేడుకలకు, సమావేశాలకు ఫ్లెక్సీలు తప్పనిసరిగా మారిపోయాయి. ఇక రాజకీయ నాయకులు వస్తే పట్ట ణం, గ్రామాల్లో ఎక్కడపడితే అక్కడ కార్యకర్తలు, అభిమానులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం పరిపాటిగా మారింది. ఇటీవలి కాలంలో జన్మదిన శుభాకాంక్షల ఫ్లెక్సీలు అడ్డగోలుగా ఏర్పాటు చే స్తున్నారు. అయితే.. రహదారులకు అడ్డంగా, చౌరస్తాల్లో వీటిని ఉంచడంతో పట్టణాల సుందరీకరణ దెబ్బతింటోంది. మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు ఎవరైనా నగరానికి, పట్టణాలకు వస్తే స్వాగత ఫ్లెక్సీలు అడ్డగోలుగా ఏర్పాటు చేసి నానా హంగామ చేస్తుంటారు. ఒక ఫ్లెక్సీ 250 మైక్రాన్ల మందం ఉండటంతో ఇది భూమి లో కరిగిపోవడం కష్టం. దీంతోపాటు వీటికి ఉపయోగించే రసాయనాల వల్ల పర్యావరణానికి విఘాతం కలిగిస్తాయని భావించి ప్రభుత్వం వాటిని నిషేధించాలనే నిర్ణయానికి వచ్చింది. పక్కాగ అమలయ్యేనా.. : పర్యావరణాన్ని కాపాడే లక్ష్యంతో భూమిలో కరిగిపోని పాలిథిన్ కవర్లను దేశ వ్యాప్తంగా ప్రభుత్వం నిషేధించిం ది. రాష్ట్రంలో కూడా ఈ నిషేధం అమలులో ఉన్నప్పటికీ, జిల్లాలోని మున్సిపాలిటీల్లో పాలిథిన్ కవర్ల తయారీ, వాడకం ఆగలేదు. ప్రమాదం త క్కువగా ఉండే 40 మైక్రాన్లకు పైబడిన పాలిథిన్ కవర్లను మాత్రమే వినియోగించాలన్న నిబంధనలను అక్కడక్కడ మాత్రమే పాటిస్తున్నారు. పట్టణాల్లో చెత్తా చెదారం, మురుగు కాలువల్లో చూ స్తుంటే సింహభాగం పాలిథిన్ సంచులే ఉంటా యి. ఈ నేపథ్యంలో ఫ్లెక్సీలపై నిషేధం ఎంత వరకు అమలవుతుందనే ప్రశ్న అంతటా వినిపిస్తోంది. జిల్లా వ్యాప్తంగా అధికార టీఆర్ఎస్ పార్టీ ప్రాబల్యమే ఎక్కువ కాగా, ఫ్లెక్సీల వినియోగంలో కూడా ఆ పార్టీ నాయకులు, కార్యకర్తల పాత్రే ఎక్కువ. ఈ తరుణంలో ఫ్లెక్సీల నిషేధం ఎంతవరకు అమలవుతుందో చూడాలి. యూనిట్లకు దెబ్బ.. : మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాల్లోని మంచిర్యాల, బెల్లంపల్లి, మందమర్రి, లక్సెట్టిపేట, చెన్నూరు, ఆసిఫాబాద్, కాగజ్నగర్లలో కలిపి ఫ్లెక్సీల తయారీ యూనిట్లు 16 ఉన్నాయి. ఇందులో 13 మంచిర్యాల జిల్లాలోనే ఉండడం గమనార్హం. ఈ యూనిట్ల మీద 300ల కు పైగా కుటుంబాలు ఆధారపడి ఉపాధి పొందుతున్నట్లు ఫ్లెక్సీ యూనిట్ల సంఘం చెబుతోంది. యజమానులతోపాటు అందులో పనిచేసే ఆపరేటర్లు, వెల్డర్లు, డిజైనర్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేసే పనివారందకీ ఇవే జీవనాధారం. వీటిని నిషేధిం చడంతో యూనిట్లలో పని చేసేవారు ఉపాధి కో ల్పోవాల్సి వస్తుందని వారు ఆందోళన చెందుతున్నారు. ఈ మేరకు ఇప్పటికే రాష్ట్ర ఫ్లెక్సీ యూనిట్ల సంఘం తరఫున కోర్టును ఆశ్రయించారు. ‘అనుమతి లేకుండా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడాన్ని జనవరి 1 నుంచి నిషేధించాలని ప్రభుత్వం నిర్ణయించిందని, మంచిర్యాల మున్సిపాలిటీలో ఇప్పటికే అమలు చేస్తున్నామని’ మున్సిపల్ కమిషనర్ వెంకన్న తెలిపారు. -
రైల్వే ప్రయాణికులకు ఆకర్షణీయ ఆఫర్లు
న్యూఢిల్లీ: మెయిల్, ఎక్స్ప్రెస్ రైళ్లలో భర్తీకాని సీట్లను నింపేందుకు రైల్వే శాఖ గురువారం తగ్గింపు ఆఫర్లు ప్రకటించింది. రిజర్వేషన్ చార్ట్ తుది ఖరారు అనంతరం మిగిలిపోయే సీట్లపై బేసిక్ చార్జీలో 10 శాతం తగ్గింపునిస్తామని ఒక ప్రకటనలో పేర్కొంది. ఏసీ, స్లీపర్ క్లాస్తో సహా అన్ని రిజర్వ్ సీట్లకు ఈ తగ్గింపు వర్తిస్తుందని, జనవరి 1, 2017 నుంచి ఆరు నెలలు పాటు తగ్గింపు కొనసాగుతుందని తెలిపింది. రాజధాని, దురంతో, శతాబ్ది ఎక్స్ ప్రెస్ రైళ్లలో తాత్కాల్ కోటాలో 10 శాతం సీట్లు తగ్గించినట్టు వెల్లడించింది. రెండు వారాలకొకసారి తాత్కాల్ కోటాపై జోనల్ రైల్వే చీఫ్ కమర్షియల్ మేనేజర్ సమీక్ష జరుపుతారని, ఒకవేళ తాత్కాల్ టికెట్లకు డిమాండ్ ఎక్కువగా ఉంటే 30 శాతం వరకు పెంచుతారని వివరించింది. న్యూఢిల్లీ-అజ్మీర్ శతాబ్ది ఎక్స్ ప్రెస్, మైసూర్-చెన్నై సెంట్రల్ శతాబ్ది ఎక్స్ ప్రెస్ రైళ్లలో రూ. 140 వరకు తగ్గింపు ఇవ్వనున్నట్టు రైల్వే శాఖ ప్రకటించింది. -
పాతిపెట్టిన మృతదేహం వెలికితీత
పరిగి(పెనుకొండ రూరల్): పరిగి మండలం కొడిగేపల్లికి చెందిన శ్యామల(28) మృతదేహాన్ని గురువారం వెలికితీశారు. మూడు నెలల కిందట జరిగిన స్టౌ ప్రమాదంలో ఆమె గాయపడగా 108లో హిందూపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో అప్పట్లో బెంగళూరుకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె చనిపోగా, పోలీసులకు సమాచారం ఇవ్వకుండా మృతదేహాన్ని పూడ్చిపెట్టారు. హిందూపురం ఆస్పత్రి వైద్యులు ఆందించిన రిపోర్టు ఆధారంగా పోలీసులు గురువారం గ్రామానికి వెళ్లి విచారించారు.శ్యామల మృతి చెందినట్లు తెలుసుకున్న పోలీసులు తహశీల్దార్ సుబ్బారెడ్డికి సమాచారం అందించారు. ఆయన సమక్షంలో పంచనామా నిర్వహించారు. ఆ తరువాత పాతిపెట్టిన మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం చేయించారు. -
రైల్వే ‘ఫ్లెక్సీ ఫేర్’లో స్వల్ప మార్పులు
న్యూఢిల్లీ: డిమాండ్కు అనుగుణంగా ధరలను నిర్ణయించే విధానం (ఫ్లెక్సీ ఫేర్)లో రైల్వే స్వల్ప మార్పులు తీసుకురానుంది. సెప్టెంబర్ 9న అమల్లోకి వచ్చిన ఈ విధానం ద్వారా రాజధాని, దురంతో, శతాబ్ది రైళ్ల టిక్కెట్ కొంటే సాధారణ ధర కన్నా గరిష్టంగా 50 శాతం వరకు ఎక్కువ చార్జీ వసూలు చేస్తున్నారు. త్వరలోనే దీనిని 40 శాతానికి తగ్గించనున్నట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ 9 నుంచి అక్టోబర్ 31 మధ్య ఆ రైళ్లలో 5,871 బెర్తులు ఖాళీగా మిగిలిపోవడంతో రైల్వే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఫ్లెక్సీ ఫేర్ ప్రకారం రాజధాని, శతాబ్ది, దురంతో రైళ్లలో ప్రతి 10 శాతం సీట్లు బుక్ అవుతున్న కొద్దీ మిగిలిన సీట్లకు చార్జీ 10 శాతం మేర పెరుగుతుంది. -
అనుమతిలేని ఫ్లెక్సీలపై గరం..గరం..
► బాధ్యులపై చర్య తీసుకోవాలని సభ్యుల డిమాండ్ ► ఆక్రమణలను ప్రోత్సహించవద్దని ఆదేశం ► స్టాండింగ్ కమిటీ ► సమావేశంలో నిర్ణయం కరీంనగర్ కార్పొరేషన్ : ఫ్లెక్సీలను నిషేధించి మూడు నెలలు గడుస్తున్నా నగరంలో విచ్చలవిడిగా దర్శనమిస్తున్నాయని, అధికారులు ఏం చేస్తున్నారని స్టాండింగ్ కమిటీ సమావేశంలో సభ్యులు నిలదీశారు. అధికారుల అలసత్వంపై మండిపడ్డారు. నగరపాలక సంస్థ కార్యాలయంలో మేయర్ రవీందర్సింగ్ అధ్యక్షతన గురువారం స్టాండింగ్ కమిటీ సమావేశం జరిగింది. సభ్యులు పలు అంశాలపై చర్చించారు. ప్లాస్టిక్ నిషేధంలో భాగంగా ఫ్లెక్సీలను ఏర్పాటు చేయొద్దని నిర్ణరుుంచామని, అధికారుల నిర్లక్ష్యంతో నగరంలో మళ్లీ కనిపిస్తున్నాయని సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార, విపక్ష పార్టీలనే తేడా లేకుండా ఎవరూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన తొలగించాలని సూచించారు. 57 అంశాల ఎజెండాలో 53 అంశాలకు ఆమోదం తెలిపారు. అంకెలు తప్పులుగా ముద్రించిన 4 అంశాలను పక్కనబెట్టారు. అదే విధంగా రోడ్లకు ఇరువైపులా ఆక్రమణలను తొలగించకపోవడంతో తీవ్ర ట్రాఫిక్ సమస్య ఏర్పడుతుందని వెంటనే గుడారాలు తొలగించాలన్నారు. సభ్యులు ఏవీ రమణ, లంక రవీందర్, ఎడ్ల సరిత, కట్ల విద్య, కమిషనర్ ఎం.వెంకటేశం, అధికారులు పాల్గొన్నారు. నాణ్యతలేని లైట్లు బిగించవద్దు : మేయర్ నాణ్యతలేని లైట్లు సరఫరా అవుతున్నాయని, థర్డ్పార్టీ క్వాలిటీ చేరుుంచాలని నగర మేయర్ రవీందర్సింగ్ అధికారులను ఆదేశించారు. కార్పొరేషన్ విద్యుత్ విభాగంలో గురువారం తనిఖీలు చేపట్టారు. నాణ్యతలేని లైట్లు వారంలోపే పాడవుతున్నాయని కార్పొరేటర్ల నుంచి ఫిర్యాదులు అందుతున్నాయన్నారు. ఈ సమస్య తిరిగి ఉత్పన్నం కాకుండా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. నకిలీ మెటీరియల్ పంపించే ఏజెన్సీలను బ్లాక్లిస్టులో పెట్టాలని తెలిపారు. రానున్న రోజుల్లో అన్ని స్తంభాలకు లెడ్ బల్బులు బిగించాలని సూచించారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
ఫ్లెక్సీ వివాదంపై వైఎస్ఆర్ సీపీ నేతల ఫిర్యాదు
తాడేపల్లిగూడెం: దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు పేరిట ఇటీవల ఆయన అభిమానులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయగా.. వాటికి పోలీసులను రెండు షిఫ్టుల్లో కాపలా పెట్టారు. అదే ప్రాంతంలో నివాసం ఉంటున్న వైఎస్సార్సీపీ తాడేపల్లిగూడెం నియోజకవర్గ సమన్వయకర్త కొట్టు సత్యనారాయణ పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయబోగా.. మంత్రి, ఆయన అనుచరులు అడ్డుకుని దాడులకు పాల్పడ్డ విషయం తెలిసిందే. ఈ ఫ్లెక్సీల వివాదంపై పశ్చిమగోదావరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆళ్ల నాని, ఎమ్మెల్యే మేకా శేషుబాబు, మాజీ ఎమ్మెల్యేలు కొట్టు సత్యనారాయణ, కారుమురి నాగేశ్వరరావు, ఉంగుటూరు కన్వినర్ పుప్పాల వాసుబాబు జిల్లా ఎస్పీని కలిసి ఫిర్యాదుచేశారు. ఫ్లెక్సీల వివాదానికి సంబంధించిన వీడియో ఫుటేజీని ఎస్పీకి అందజేశారు. మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణపై అక్రమంగా హత్యాయత్నం కేసు, ఎస్సీ, ఎస్టీ కేసు బనాయించారని.. ఈ ఘటనపై నిష్పక్షపాతంగా విచారణ జరపాలని వైఎస్ఆర్ సీపీ నేతలు ఎస్పీని కోరారు. -
ధర్మవరంలో కొనసాగుతున్న 144 సెక్షన్
ధర్మవరం: అనంతపురం జిల్లా ధర్మవరం పట్టణంలో పోలీసు నిషేధాజ్ఞలు కొనసాగుతున్నాయి. దీపావళిని పురస్కరించుకుని మంత్రి పరిటాల సునీత వర్గీయులు పట్టణంలో ఏర్పాటు చేసిన పోస్టర్లో స్థానిక ఎమ్మెల్యే సూర్యనారాయణ ఫొటో లేకపోవటంతో బుధవారం ఆయన వర్గీయులు గొడవకు దిగారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారటంతో డీఎస్పీ వేణుగోపాల్ 144వ సెక్షన్ విధిస్తున్నట్లు ప్రకటించారు. బుధవారం రాత్రి పట్టణంలో 120 మంది పోలీసు సిబ్బంది పహారా కాశారు. గురువారం ఉదయం ప్రశాంత పరిస్థితులు ఏర్పడటంతో ఇద్దరు సీఐలు, 20 మంది కానిస్టేబుళ్లు బందోబస్తు విధుల నిర్వహణలో ఉన్నారు. నవంబర్ 2వ తేదీ వరకు 144వ సెక్షన్ అమల్లో ఉంటుందని డీఎస్పీ తెలిపారు. -
పరిటాల సునీత వర్సెస్ ఎమ్మెల్యే సూరి
ధర్మవరంలో ఫ్లెక్సీ పంచాయితీ సునీత ఫ్లెక్సీని తొలగిచేందుకు సూరి అనుచరుల యత్నం అడ్డుకున్న పరిటాల వర్గం పోలీసు స్టేషన్ ఎదుటే ముష్టియుద్ధం పట్టణంలో ఉద్రిక్తత, 144 సెక్షన్ అమలు టీడీపీలో వర్గపోరు మరోసారి రచ్చకెక్కింది. ఇన్నాళ్లూ చాపకింద నీరులా దాగి ఉన్న తమ్ముళ్ల అసహనం బుధవారం ధర్మవరంలో జరిగిన ఘటనతో బట్టబయలైంది. కేవలం ఓ ఫ్లెక్సీ కోసం మంత్రి పరిటాల సునీత, ధర్మవరం ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ(వరదాపురం సూరి) అనుచరులు బాహాబాహీకి దిగడంతో పట్టణంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ధర్మవరం : స్థానిక పట్టణ పోలీస్స్టేషన్ ఎదుట దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ మంత్రి పరిటాల సునీత, ఆమె తనయుడు పరిటాల శ్రీరామ్ల ఫొటోలతో బత్తలపల్లి మండలం గంటాపురానికి చెందిన జగ్గు అనే టీడీపీ నాయకుడు ఫ్లెక్సీని ఏర్పాటు చేశాడు. అయితే ఆ ఫ్లెక్సీలో స్థానిక ఎమ్మెల్యే వరదాపురం సూర్యనారాయణ ఫొటో వేయించలేదు. ఇది చూసిన ఎమ్మెల్యే అనుచరులకు ఆగ్రహం కట్టలు తెంచుకుంది. తమ నాయకుడు ఫొటో లేని ఫ్లెక్సీ అక్కడ ఉంచరాదని భావించి దాన్ని తొలగించేందుకు ప్రయత్నించారు. అదే సమయంలో అక్కడే ఉన్న గంటాపురం, సి.బత్తలపల్లి, ఓబుళనాయునిపల్లి గ్రామాలకు చెందిన పరిటాల వర్గీయులు ఫ్లెక్సీ తొలగింపును అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గీయుల మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట జరిగింది. ఈ క్రమంలో ఇరువర్గాలవారు తమ అనుచరులను పోలీస్ స్టేషన్ వద్దకు పిలిపించుకున్నారు. దీంతో భారీఎత్తున జనాలు గుమికూడారు. అనంతరం ఎమ్మెల్యే అనుచరులు మరోసారి మంత్రి ఫ్లెక్సీలు తొలగించేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో ఇరువర్గాలవారు పోలీసుల ఎదుటే ముష్టి యుద్ధానికి దిగారు. ఒకరి చొక్కాలు ఒకరు చించుకొని, పిడిగుద్దులు గుద్దుకున్నారు. ఈ క్రమంలో వరదాపురం సూరీ వర్గీయులు ఫ్లెక్సీని కొంతమేర చించేశారు. దీంతో పరిటాల వర్గీయులు ఫ్లెక్సీ ఎదుటే ౖబైఠాయించారు. ‘తాము ఇక్కడే కాపలాగా కూర్చుంటాం, ఎవరు వస్తారో చూస్తాం’ అంటూ ఫ్లెక్సీ ఎదుటే బైఠాయించారు. ఈ ఘర్షణ పెద్దది కావడం... జనం భారీగా గుమిగూడడంతో ఏం జరుగుతుందో తెలియక పట్టణవాసులంతా భయబ్రాంతులకు గురయ్యారు. ప్రేక్షక పాత్రలో పోలీసులు పోలీసు స్టేషన్ ఎదుటే అధికార పార్టీ నేతలు బాహాబాహికి దిగడంతో...పట్టణంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో ధర్మవరం డీఎస్పీ వేణుగోపాల్ డివిజన్ పరిధిలోని పోలీసులందరినీ ధర్మవరానికి పిలిపించారు. అయినప్పటికీ ఇరువర్గాల వారూ అధికార పార్టీ నేతలే కావడంతో ఎవరికీ ఏమీ చెప్పలేక పోలీసులు కూడా ప్రేక్షక పాత్ర వహించారు. దీంతో రెచ్చిపోయిన సునీత, సూరి వర్గం పోలీసుల ఎదుటే వీధి రౌడీల్లా కొట్టుకున్నారు. ఈ ఘటన జరుగుతుండగానే స్థానిక కళాజ్యోతి సర్కిల్లో ఏర్పాటు చేసిన మరో ఫ్లెక్సీకి వరదాపురం సూరి వర్గీయులు నిప్పు పెట్టారు. దీంతో పోలీసులు ఇరువర్గాలకు నచ్చచెప్పే ప్రయత్నం చేసినా ఎవరూ వారి మాట పట్టించుకోలేదు. పట్టణంలో 144 సెక్షన్ ఫ్లెక్సీ వివాదం తీవ్రమైన నేపథ్యంలో డీఎస్పీ వేణుగోపాల్ పట్టణంలో 144 సెక్షన్ విధించారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. గురువారం కూడా 144 సెక్షన్ కొనసాగుతోంది. అలాగే పరిటాల సునీత ఫ్లెక్సీలకు పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. -
మంత్రి ఫ్లెక్సీలకు పోలీసుల కాపలా!
తాడేపల్లిగూడెం: మంత్రులకు పోలీసులు భద్రత కల్పించడం సాధారణ విషయం. ఇందుకు భిన్నంగా దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు తన పేరిట అభిమానులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలకు పోలీసు కాపలా పెట్టించుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం బస్టాండ్ ఎదుట వీధిలో నివాసం ఉంటున్న మంత్రి.. తన ఇంటికి వెళ్లే మార్గంలో గల ఫ్లెక్సీలకు నలుగురు పోలీసులను కాపలా ఉంచారు. రెండు షిఫ్టుల్లో మొత్తం 8 మంది పోలీసులు ఆ ఫ్లెక్సీల వద్ద డ్యూటీ చేస్తున్నారు. అదే వీధిలో నివాసం ఉంటున్న వైఎస్సార్సీపీ తాడేపల్లిగూడెం నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ జన్మదినోత్సవం సందర్భంగా ఆయన అభిమానులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయబోగా.. మంత్రి, ఆయన అనుచరులు అడ్డుకున్నారు. ప్రతిష్ట కోసమో లేక మరేదైనా కారణమో తెలియదు గానీ.. తన పేరిట ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలకు ఇలా పోలీసు కాపలా ఏర్పాటు చేసుకున్నారు. ఇది చూసిన వారంతా ‘మంత్రా.. మజాకా’ అనుకుంటున్నారు. -
ఫ్లెక్సీ వివాదానికి హత్యాయత్నం కేసా
ఫ్లెక్సీల వివాదంలో తాడేపల్లిగూడెం పోలీసులు చూపిన అత్యుత్సాహంపై కోర్టు మొట్టికాయలు వేసింది. ఈనెల 19వ తేదీ మాజీ ఎమ్మెల్యే, వైఎస్ఆర్సీపీ నాయకుడు కొట్టు సత్యనారాయణ పుట్టినరోజు. ఆ సందర్భంగా కొందరు అభిమానులు ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ ఫ్లెక్సీలు ఏర్పాటుచేయగా, స్థానిక మంత్రి పైడికొండల మాణిక్యాలరావు, ఆయన అనుచరులు వాటిని తీయించేశారు. ఆ సందర్భంగా జరిగిన చిన్నపాటి గొడవపై పోలీసులు కేసు నమోదుచేశారు. కొట్టుపై సెక్షన్ 307 (హత్యాయత్నం) కేసు నమోదుచేసి ఆయనను అరెస్టుచేసిన పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టారు. చిన్నపాటి ఫ్లెక్సీ వివాదానికి 307 సెక్షన్ కింద కేసు నమోదు చేసిన వైనాన్ని కొట్టు సత్యనారాయణ తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దాంతో పోలీసుల తీరును తప్పుబట్టిన కోర్టు.. సెక్షన్ 307ను 324గా మార్చాలని ఆదేశించింది. న్యాయమూర్తి ఆదేశాలతో సెక్షన్ 307ను 324గా పోలీసులు మార్చారు. అనంతరం కొట్టు సత్యనారాయణకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. -
ఫ్లెక్సీ వివాదానికి హత్యాయత్నం కేసా
-
ఫ్లెక్సీల వివాదంలో పోలీసుల అత్యుత్సాహం
ఏలూరు: ఫ్లెక్సీల వివాదంలో తాడేపల్లిగూడెం పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. ఈ వివాదంలో మాజీ ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణను పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. సత్యనారాయణ అరెస్ట్ను నిరసిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పోలీస్ స్టేషన్ వద్ద ధర్నాకు దిగారు. మంత్రి పైడికొండల మాణిక్యాలరావు ఒత్తిడి మేరకే సత్యనారాయణను అరెస్ట్ చేశారంటూ వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సీఐని బండ బూతులు తిట్టిన మంత్రి మాణిక్యాలరావును వదిలి.. సత్యనారాయణను అరెస్ట్ చేయడమేంటంటూ వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. -
ఆ సీఐ సంగతి చూస్తా..
► తాడేపల్లిగూడెంలో మంత్రి మాణిక్యాలరావు బూతు పురాణం ► ఫ్లెక్సీ వివాదంలో ఇదీ తీరు సాక్షి ప్రతినిధి, ఏలూరు: ఓ సీఐ సంగతి తేలుస్తానంటూ దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు తాడేపల్లి గూడెంలో బూతు పురాణానికి పాల్పడి విమర్శలపాలయ్యారు. అసభ్య పదజాలం తో విరుచుకుపడ్డారు. తాడేపల్లిగూడెం పట్టణంలో బుధవారం తెల్లవారు జామున వైఎ స్సార్సీపీ, బీజేపీ శ్రేణుల మధ్య ఫ్లెక్సీ ఏర్పాటు చేసే విషయమై వివాదం చోటుచేసుకుంది. మాజీ ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ పుట్టిన రోజు కావడంతో వైఎస్సార్ సీపీ శ్రేణులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ బస్టాండ్ సమీపంలో ఫ్లెక్సీ పెట్టారు. దీనిపై బీజేపీ నేతలు వారితో ఘర్షణకు దిగారు. కాసేపటికి అక్కడకు చేరుకున్న మంత్రి మాణిక్యాలరావు కొవ్వూరు డీఎస్పీ వెంకటేశ్వరరావుపై విరుచుకుపడ్డా రు. వివాదం ముదరడానికి స్థానిక సీఐ చేతకాని తనమే కారణమంటూ బూతు పురా ణం అందుకున్నారు. ‘నేను ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయడా. వాడి సంగతి చూస్తా’ అంటూ రెచ్చిపోయారు. ఆ సీఐపై సీఎంకు ఫిర్యాదు చేస్తానని, తక్షణమే ఆయన్ని సస్పెండ్ చేయాలన్నారు.కాగా మంత్రి ఆదేశాల నేపథ్యంలో పోలీసులు వైఎస్సార్ సీపీ నియోజకవర్గ కన్వీనర్ కొట్టు సత్యనారాయణతో పాటు మరికొందరిపై కేసులు నమోదు చేశారు. -
కొత్త ప్రి-పెయిడ్ ప్లాన్ను ఆవిష్కరించిన వొడాఫోన్
ఒకే ప్యాక్తో అన్ని సేవలు న్యూఢిల్లీ: ప్రముఖ టెలికం కంపెనీ వొడాఫోన్ తాజాగా కొత్త ప్రి-పెయిడ్ ప్లాన్ ‘ఫ్లెక్స్’ను ఆవిష్కరించింది. వాయిస్ కాల్స్, డేటా, ఎస్ఎంఎస్, రోమింగ్ వంటి పలు అంశాలను కోరుకుంటోన్న యూజర్లకి ఈ ప్యాక్ అనువుగా ఉంటుందని కంపెనీ పేర్కొంది. అంటే ఈ ప్యాక్ ద్వారా వినియోగదారులు వాయిల్స్ కాల్స్, డేటా, రోమింగ్, ఎస్ఎంఎస్లకు వివిధ రకాల రీచార్జ్లు చేసుకోవాల్సిన అవసరం ఉండదు. అన్నింటికీ ఒకే రీచార్జ్ సరిపోతుంది. సాధారణ రీచార్జ్కు ఇది కాస్త భిన్నం ప్రస్తుత రీచార్జ్కి కొత్త ఫ్లెక్స్ ప్లాన్లో రీచార్జ్కి కొంత తేడా ఉంటుంది. అంటే మనం సాధారణంగా రూ.50తో రీచార్జ్ చేసుకుంటే రూ.42 వస్తుందనుకోండి. అయితే ఈ కొత్త ప్లాన్లో రీచార్జ్ చేసుకుంటే మనకు ‘ఫ్లెక్స్’ అనే యూనిట్లు వస్తాయి. ఒక ఫ్లెక్స్ యూనిట్.. 1 ఎంబీ డేటా/ఒక ఎస్ఎంఎస్/ఒక ఇన్కమింగ్ కాల్ (రోమింగ్)కు సమానంగా ఉంటుంది. కొన్ని సర్వీసుల (ఎస్టీడీ, రోమింగ్లో ఉన్నప్పుడు ఔట్గోయింగ్ కాల్స్ వంటివి) ధర ఒక ఫ్లెక్స్ యూనిట్ కన్నా ఎక్కువగా ఉండొచ్చు. వొడాఫోన్ ఫ్లెక్స్ ప్లాన్లో మనం ఏ సర్వీసులను ఉపయోగించినా కూడా వాటికయ్యే వ్యయం ఫ్లెక్స్ యూనిట్ల రూపంలో మన అకౌంట్ నుంచి కట్ అవుతుంది. రూ.118తో 325 ఫ్లెక్స్ యూనిట్లు ఒక యూజర్ వొడాఫోన్ ఫ్లెక్స్ ప్లాన్ కింద రూ.118లతో రీచార్జ్ చేసుకుంటే 325 ఫ్లెక్స్ యూనిట్లను పొందొచ్చు. ఇక రూ.204తో 700 యూనిట్లను, రూ.304తో 1,200 యూనిట్లు, రూ.395తో 1,750 యూనిట్లను పొందొచ్చు. అలాగే రూ.42తో రీచార్జ్ చేసుకుంటే 105 యూనిట్లు, రూ.53తో చేసుకుంటే 138 యూనిట్లు వస్తాయి. కాగా ప్యాక్ వాలిడిటీ 28 రోజులుగా ఉంది. ఒక నెలలో మిగిలిన యూనిట్లను తర్వాతి నెలకు బదిలీ చేసుకోవచ్చు. -
ఫ్లెక్సీల్లోనూ వివక్ష
హిందూపురం టౌన్ : హిందూపురం పురపాలక సంఘంలో అధికార పార్టీకి ఓ న్యాయం, ప్రతిపక్ష పార్టీలకు మరో న్యాయం జరుగుతోంది. దీనికి నిదర్శనం ఇందిరమ్మ సర్కిల్లోని టీడీపీకి చెందిన వారి ఫ్లెక్సీలే. వాటిని అధికారులు తొలగించాల్సి ఉంది. అయితే కేవలం వైఎస్సార్సీపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన ఫ్లెక్సీలు మాత్రమే తొలగించి టీడీపీ నాయకుల ఫ్లెక్సీలను అలాగే వదిలేశారు. ఈ ఫ్లెక్సీలు ఆస్పత్రికి వెళ్లే వారికి ఇబ్బంది కలిగిస్తున్నా తొలగించకపోవడం గమనార్హం. ఈ విషయంపై పట్టణ ప్రణాళిక అధికారి తులసీరాంను అడగ్గా రెండు నెలలుగా స్మార్ట్ పల్స్ సర్వేలో బిజీగా ఉన్నామని చెప్పారు. కాగా అధికార పార్టీకి చెందిన ఫ్లెక్సీలకు పురపాలికకు శిస్తు చెల్లించడం లేదన్నారు. -
నిషేధం ఉత్తమాటే
ప్రధాన కూడళ్ల నిండా ప్లెక్సీలు పట్టించుకోని అధికారులు కరీంనగర్ కార్పొరేషన్ :‘పురపాలక మంత్రి కేటీఆర్ ఆదేశాలు తూచా తప్పకుండా పాటిస్తాం. నా పుట్టిన రోజున కూడా ఎవరూ ఫ్లెక్సీలు కట్టవద్దు. ఒక వేళ తెలియక ఏర్పాటు చేసినా వాటిని తొలగించండి’.. అంటూ నగర మేయర్ రవీందర్సింగ్ ఈనెల 5న నగరపాలక టౌన్ప్లానింగ్ అధికారులను ఆదేశించారు. మేయర్ ఆదేశాలు మాత్రం నగరంలో ఎక్కడ అమలుకావడం లేదు. ఎక్కడపడితే అక్కడ ఫ్లెక్సీలు దర్శనమిస్తూనే ఉన్నాయి. నగరంలోని కూడళ్లు ఫ్లెక్సీలతో నిండిపోతున్నాయి. రోడ్డుపై ఎవరైనా చిరువ్యాపారి చిన్నపాటి డేరా వేస్తే హల్చల్ చేసే అధికారులు నిషేధిత ఫ్లెక్సీల గురించి పట్టించుకోవడం లేదు. ఈనెల 1న జిల్లా కేంద్రంలో జరిగిన రాష్ట్రస్థాయి మున్సిపాలిటీల సదస్సులో తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగా కరీంనగర్ నగరపాలక సంస్థ వేగంగా స్పందించింది. మున్సిపాలిటీకి వచ్చే ఆదాయాన్ని సైతం లెక్కచేయకుండా కేవలం ఐదు రోజుల్లోనే ఫ్లెక్సీలను నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే క్షేత్రస్థాయిలో మాత్రం అమలు కావడం లేదు. ప్రతి రోజు ముఖ్య కూడళ్లలో ఫ్లెక్సీలు దర్శనమిస్తూనే ఉన్నాయి. నిషేధించిన ఫ్లెక్సీలను ఏర్పాటు చేసిన వారిపై ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంతో వారిది ఇష్టారాజ్యమే అవుతుంది. ఒకరిని చూసి ఇంకొకరు అన్నట్లు ఎవరికి వారు కూడళ్లలో తవ్వకాలు చేపడుతూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తూనే ఉన్నారు. అయినా అధికారుల్లో స్పందన కరువైంది. చిన్న చిన్న వారిపై ప్రతాపం చూపించడం తమ పని అన్నట్లు కార్పొరేషన్ సిబ్బంది వ్యవహరిస్తున్నారు. ప్లాస్టిక్తో ప్రమాదం ఫ్లెక్సీలను ప్లాస్టిక్తోనే తయారు చేస్తారు. ప్లాస్టిక్తో నష్టాలు జరుగుతన్నాయనే ఉద్దేశ్యంతోనే పాలిథీన్ కవర్లతోపాటు ఫ్లెక్సీలను నిషేధిస్తూ మున్సిపాలిటీల సదస్సుతో కేటీఆర్ నిర్ణయించారు. సీఎం కేసీఆర్ బొమ్మ ఉన్నా సరే ఫ్లెక్సీని తొలగించాల్సిందేనంటూ ఆదేశించారు. ప్లాస్టిక్ భూమిలో వెయ్యేళ్లు కూడా కలవదు. దీంతో వర్షపు నీరు భూమిలో ఇంకదు. ప్లాస్టిక్ కాల్చిస్తే వెలువడే విషవాయువులతో కేన్సర్ వంటి ప్రమాదకర జబ్బులు వస్తాయి. వీటిని దృష్టిలో ఉంచుకొని ప్లాస్టిక్పై పూర్తిస్థాయి నిషేధం వైపు ప్రభుత్వం అడుగులు వేస్తోంది. మున్సిపాలిటీల్లో మాత్రం అమలుకు నోచడం లేదు. పలుకుబడి ఉంటే చాలు నగరంలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకోవాలంటే పలుకుబడి ఉంటే చాలు. ఎవరి అనుమతి అక్కర లేదు. నిషేధం ఉన్నా యథేచ్ఛగా ప్రధాన కూడళ్లలో ఏర్పాటు చేసుకోవచ్చు. ప్లెక్సీల్లో స్థానిక ప్రజాప్రతినిధుల ఫొటోలు పెడితే ఇక ఆ ఫ్లెక్సీలను ఎలా తొలగిస్తారనే ధీమాతో కూడళ్లలో పచ్చని గడ్డిని తవ్వి మరీ కర్రలు పాతి ఏర్పాటు చేస్తున్నారు. ఇదంతా అధికారులకు తెలిసే జరుగుతుందనే ప్రచారం ఉంది. రాత్రి ఏర్పాటు చేస్తే మళ్లీ రాత్రి వరకు అంటే 24 గంటల పాటు వాటిని తొలగించకుంటే చాలని సిబ్బందితో మాట్లాడు‘కొంటున్నట్లు’ తెలిసింది. నిషేధం పక్కాగా అమలు చేస్తాం – రవీందర్సింగ్, నగర మేయర్ నగరపాలక సంస్థలో ప్లెక్సీలు ఏర్పాటు చేయడాన్ని నిషేధించాం. పక్కాగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. అయినప్పటికీ ఫ్లెక్సీలు కడుతున్నారంటే అధికారులు పట్టించుకోవడం లేదని తెలుస్తోంది. ఫ్లెక్సీలో ఎవరి ఫొటో ఉన్నా తొలగించాలని చెప్పాం. ఇక నుంచి ప్రత్యేక పర్యవేక్షణ ఉంటుంది. -
సీఎం, హరీశ్, కడియం చిత్రపటాల ఫ్లెక్సీ దహనం
జనగామ : జనగామ జిల్లాకు అన్యాయం చేసి న సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్రావు, డిప్యూ టీ సీఎం కడియం శ్రీహరి చిత్రlపటాలు ఉన్న ఫ్లెక్సీని సోమవారం దహనం చేశారు. జేఏసీ నాయులు తీగల సిద్దూగౌడ్, నాగారపు వెంకట్, పిట్టల సత్యం, బండి రాకేష్ కుమార్, ఆలేటì సిద్దిరాములు ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. జిల్లా ఏర్పాటుకు అన్ని అర్హతలున్న జనగామకు అన్యాయం చేసి చరిత్రను కనుమరుగు చేస్తున్నారని మండిపడ్డారు. -
మాజీ మంత్రి మోపిదేవి ఫ్లెక్సీల చించివేత
రేపల్లె: పుష్కరాల నిర్వహణలో పూర్తిగా విఫలమైన టీడీపీ నియోజకవర్గ ప్రజా ప్రతినిధి, ఆయన అనుచర గణం రోజుకొక కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. మోర్తోటలో గతంలో నిర్వహించిన అభివృద్ధి పనులకు ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని తొలగించడం, పెనుమూడి గ్రామంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగించడంతో సరి పెట్టుకోని టీడీపీ నాయకులు మరో అడుగు ముందుకు వేశారు. ప్రజా ప్రతినిధుల ఆజ్ఞలతో చేశారో, కావాలని చేశారోగానీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ ఫ్లెక్సీకి సమీపంలో అభిమానులు ఏర్పాటు చేసిన వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మోపిదేవి వెంకట రమణారావు ఫొటోతో కూడిన భారీ కటౌట్ను కోసి చించివేశారు. దీంతో పాటు పట్టణంలో బస్టాండ్ సెంటరులో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని కూడా కోసివేయడంతో వైఎస్సార్ సీపీ అభిమానులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి చిల్లర వ్యవహారాలకు పాల్పడటం సరైన విధానం కాదంటూ మండిపడుతున్నారు. -
రోజుకు రూ. 46 వేల సంపాదన!!
ఉద్యోగాలు చేసుకుంటే ఏమొస్తుంది.. హాయిగా ఫ్రీలాన్సింగ్ చేసుకుంటే మేలు కదా అంటున్నారు చాలామంది. బుద్ధి పుట్టినప్పుడు పని చేయొచ్చు.. లేదంటే ఎక్కడికైనా వారం పదిరోజుల పాటు అలా తిరిగి రావచ్చు, ఎవరికీ సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం లేదు.. ఒకళ్ల గురించి భయపడనక్కర్లేదు.. దానికితోడు పారితోషికం కూడా జీతం కంటే బాగానే వస్తుందని నిపుణులు చెబుతున్నారు. అలా ఫ్రీలాన్సింగ్ చేసుకునేవాళ్లు రోజుకు ఏకంగా రూ. 46 వేల వరకు కూడా సంపాదిస్తున్నారట. 'ఫ్లెక్సింగ్ ఇట్' అనే సంస్థ చేసిన సర్వేలో ఈ విషయం తెలిసింది. ఐదేళ్లలోపు అనుభవం ఉన్నవాళ్లయితే రోజుకు రూ. 8వేలు, 5 నుంచి 10 ఏళ్ల వరకు అనుభవం ఉన్నవాళ్లయితే రోజుకు రూ. 19వేలు, 20 ఏళ్లకుపైగా అనుభవం ఉన్నవాళ్లు రోజుకు రూ. 46 వేల వరకు ఫ్రీలాన్సింగ్లో సంపాదిస్తున్నారట. ఫ్రీలాన్సింగ్లో అవకాశాల కోసం ఎదురుచూసే ప్రొఫెషనల్స్కు, వాళ్లతో పని చేయించుకోవాలని చూసే సంస్థలకు మధ్య వారధిగా 'ఫ్లెక్సింగ్ ఇట్' సంస్థ పనిచేస్తుంది. దాదాపు 2,500 మంది ప్రొఫెషనల్స్ నుంచి సేకరించిన సమాచారం ప్రకారం పై వివరాలను ఈ సంస్థ ప్రకటించింది. 2016 జనవరి నుంచి ఆరు నెలల పాటు ఈ డేటా సేకరించారు. ఐదేళ్ల వరకు అనుభవం ఉన్నవారిలో ఉత్పాదక రంగం, ఆర్థిక రంగం, సేల్స్ లాంటి రంగాల్లో ఫ్రీలాన్సర్లకు అత్యధికంగా చెల్లిస్తున్నారు. 20 ఏళ్ల అనుభవం ఉన్నవారిలో ఎక్కువగా ఫైనాన్స్, జనరల్ మేనేజ్మెంట్, స్ట్రాటజీ, హ్యూమన్ రిసోర్సెస్ లాంటి రంగాలలో ఎక్కువ చెల్లింపులు వస్తున్నాయి. ఐటీ సేవలు, ప్రొఫెషనల్ సేవలు, ఈ కామర్స్ లాంటి రంగాలలో ఫ్రీలాన్సర్లకు అవకాశాలు బాగున్నట్లు తెలుస్తోంది.