Gorantla Butchaiah Chowdary
-
బుచ్చయ్యకు ఈసారైనా దక్కేనా?
సాక్షి ప్రతినిధి, కాకినాడ: ఎన్నికలు ముగిశాయి. ఫలితాలు వెలువడ్డాయి. టీడీపీ అధికారం చేజిక్కించుకుంది. ఇప్పుడు ఆ పార్టీలో అందరి కళ్లూ కేబినెట్ కూర్పుపైనే ఉన్నాయి. మంత్రివర్గం ఎలా ఉండబోతోంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రాతిపదికన తీసుకుంటారా, సామాజిక సమతూకాల మాటేమిటి, కూటమిలో క్రియాశీలకమైన జనసేనకు లభించే ప్రాతినిధ్యం ఎంతవరకూ ఉంటుంది. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో చర్చ అంతా ఈ అంశాలపైనే జరుగుతోంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో అన్ని స్థానాల్లోనూ టీడీపీ, జనసేన అభ్యర్థులు గెలుపొందడంతో మంత్రివర్గంపై ఆశలు పెంచుకున్న వారి జాబితా చాంతాడులా మారుతోంది. పార్టీ సీనియర్లు ఈసారి కేబినెట్లో బెర్త్ ఖాయం చేసుకోవాలని లాబీయింగ్ చేయడంలో బిజీబిజీగా గడుపుతున్నారు. మంత్రివర్గంలో బెర్త్ కోసం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో సీనియర్లంతా రేసులో ఉన్నారు. పార్టీలో నంబర్ టుగా పేర్కొనే యనమల రామకృష్ణుడు సహా నిమ్మకాయల చినరాజప్ప, గోరంట్ల బుచ్చయ్యచౌదరి, జ్యోతుల నెహ్రూ, బండారు సత్యానందరావు పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. స్పీకర్, ఆర్థిక మంత్రిగా పనిచేసిన యనమల ప్రత్యక్ష రాజకీయాలకు దూరమై మండలిలో ప్రతిపక్ష నేతగా కొనసాగుతున్నారు. ఈసారి ఎన్నికల్లో ఆయన కుమార్తె దివ్య తుని నుంచి ఎన్నికయ్యారు. మండలి నుంచి మంత్రివర్గంలోకి యనమలకు బెర్త్ దక్కితే సరేసరి లేదంటే కుమార్తె దివ్య రేసులో ఉండటం ఖాయమంటున్నారు. గత చంద్రబాబు కేబినెట్లో ఉప ముఖ్యమంత్రి, హోం మంత్రిగా చేసిన పెద్దాపురం సిట్టింగ్ ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప కూడా మంత్రివర్గంలో ప్రాతినిధ్యాన్ని కోరుకుంటున్నారు. వివాదరహితుడనే పేరున్న చినరాజప్ప రెండో సారి ప్రయత్నాల్లో ఉన్నారు. దాదాపు మూడు దశాబ్దాలుగా మెట్ట ప్రాంత రాజకీయాల్లో చక్రం తిప్పిన జ్యోతుల నెహ్రూ ఈసారి బెర్త్ ఖాయం చేసుకోవాలనే పట్టుదలతో ఉన్నారు. మంత్రి అనిపించుకోవాలనే ఆత్రం ఎవరికి మాత్రం ఉండదని నెహ్రూ సన్నిహితులు చెబుతున్నారు. పార్టీ కాకినాడ జిల్లా అద్యక్షుడు నవీన్ ఇప్పటికే లోకేష్ను కలిసి వచ్చిన విషయాన్ని ప్రస్తావిస్తున్నారు.బుచ్చయ్యకు ఈసారైనా దక్కేనా?రాజమహేంద్రవరం రూరల్ నుంచి గెలుపొందిన సీనియర్ నాయకుడు గోరంట్ల బుచ్చయ్యచౌదరి పేరు కూడా కేబినెట్ రేసులో ప్రచారంలోకొచ్చింది. ఉమ్మడి తూర్పు గోదావరిలో అందరి కంటే సీనియర్ అయిన తనకు బెర్త్ ఖాయమనే ధీమాతో బుచ్చయ్యచౌదరి ఉన్నారు. దివంగత ఎన్టీఆర్ హయాంలోనే పౌర సరఫరాలు వంటి కీలక శాఖలు చేసిన తమ నేతకు ఈసారి మంత్రివర్గంలో చోటు కోసం గట్టి ప్రయత్నాలే చేస్తున్నామని అనుచరులు బాహాటంగానే చెబుతున్నారు. బుచ్చయ్యకు పోటీగా సిటీ ఎమ్మెల్యేగా ఎన్నిక అయిన ఆదిరెడ్డి వాసు కూడా రేసులో ఉన్నారు. ఆది నుంచీ సిటీ సీటు విషయంలో గోరంట్ల...ఆదిరెడ్డి వర్గాల మధ్య వైషమ్యాలు ఉన్న విషయం బహిరంగ రహస్యమే. ఈ నేపథ్యంలో వాసు కోటరీ లోకేష్ ద్వారా బెర్త్ కోసం పావులు కదుపుతున్నారు. ఇప్పటికే టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, చిన్న మావ అయిన అచ్చెన్నాయుడుతో చంద్రబాబుకు సిఫార్సు చేయించుకుంటున్నారు అని పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. వీరితోపాటు కొత్తపేట నుంచి బండారు సత్యానందరావు, ఎస్సీ, బీసీ కోటాలో అమలాపురం అయితాబత్తుల ఆనందరావు, కాకినాడ నుంచి వనమాడి కొండబాబు అమాత్య పదవి కోసం పావులు కదుపుతున్నారు.యనమల హవా నడుస్తుందా?మంత్రివర్గం కూర్పులో సామాజికవర్గాల సమతూకమే ప్రామాణికంగా ఉంటుందని పార్టీ నేతలు చెబుతున్నారు. ఈ లెక్కలను పరిగణనలోకి తీసుకుంటే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు కాపు, బీసీ, ఎస్సీ సామాజిక వర్గాల నుంచి మూడు బెర్త్లు ఖాయం కావచ్చనే ప్రచారం టీడీపీలో జరుగుతోంది. అదే నిజమైతే సీనియర్ల మధ్యనే పోటీ ప్రధానంగా ఉంటుందని నేతలు విశ్లేషిస్తున్నారు. ఉమ్మడి జిల్లా టీడీపీ రాజకీయాల్లో ఆది నుంచి యనమల, జ్యోతుల వర్గాలకు పొసగని పరిస్థితి. ఆది నుంచీ జ్యోతుల మంత్రి పదవికి మోకాలడ్డుతున్నది యనమల వర్గమేనని ఆయన సన్నిహితులు పేర్కొంటుంటారు. ఈసారి ఏమి జరుగుతుందో చూడాలంటున్నారు. గతంలో మాదిరి కేబినెట్ కూర్పులో యనమల హవా నడుస్తుందా లేదా మారిన సమీకరణలు ఎవరికి ప్లస్ అవుతాయో వేచి చూడాల్సిందేనంటున్నారు.కాపుల నుంచే పోటీ ఎక్కువప్రధానంగా కాపు సామాజికవర్గం నుంచి పోటీ ఎక్కువగా ఉండేటట్టు కనిపిస్తోంది. ఇటు టీడీపీ, అటు జనసేనలో ఈ సామాజికవర్గం నుంచి అమాత్య పదవిని ఆశిస్తున్నవారు ఎక్కువగా ఉన్నారు. ఉమ్మడి తూర్పుగోదావరిలో జనసేన అధ్యక్షుడు పవన్ పోటీ చేసిన పిఠాపురం సహా రాజోలు, పి.గన్నవరం, నిడదవోలు, కాకినాడ రూరల్, రాజానగరం స్థానాల్లో కాపు సామాజిక వర్గీయులు గెలుపొందారు. వీరిలో మొదటి ప్రాధాన్యంగా నిడదవోలు నుంచి గెలుపొందిన కందుల దుర్గేష్కు చాన్స్ లభించవచ్చునంటున్నారు. ఆవిర్భావం నుంచి పార్టీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడిగా దుర్గేష్పై పవన్కు ఉన్న గుడ్లుక్స్ కేబినెట్లో చోటుకు సానుకూల అంశంగా మారుతుందంటున్నారు. పవన్కల్యాణ్ ఉప ముఖ్యమంత్రి, హోం మంత్రి అంటూ జరుగుతోన్న ప్రచారమే నిజమైతే ఉమ్మడి జిల్లాలో కాపు సామాజికవర్గం నుంచి మరొకరికి అవకాశం లభించడం కష్టమేనంటున్నారు. ఉమ్మడి తూర్పున జనసేనలో ఎస్సీల నుంచి పవన్ ప్రతిపాదించాలనుకుంటే రాజోలులో గెలుపొందిన దేవ వరప్రసాద్ పేరు మొదటి వరుసలో ఉంటుందంటున్నారు. గత ఎన్నికల్లో రాష్ట్రంలో గెలుపొందిన ఏకై క రాజోలు చీకటిలో చిరుదీపంగా నిలిచిందంటూ పవన్ ఆ నియోజకవర్గం పార్టీకి ప్రత్యేకం అని చెప్పుకొచ్చారు. అందునా రిటైర్డ్ ఐఏఎస్గా, పార్టీ జనవాణి కార్యక్రమ కోఆర్డినేటర్గా వరప్రసాదరావు వైపే పవన్ మొగ్గు చూపుతారంటున్నారు. రాష్ట్ర పంచాయతీరాజ్ కమిషనర్గా చంద్రబాబు హయాంలో పనిచేయడంతో వరప్రసాదరావుకు అటు టీడీపీ నుంచి కూడా సానుకూలం అవుతుందంటున్నారు. టీడీపీలో ఎస్సీ సామాజికవర్గం నుంచి అమలాపురంలో గెలుపొందిన ఆనందరావు పేరు తెరమీదకు వచ్చింది. కానీ కాకినాడ జిల్లాకు పొరుగున ఉన్న పాయకరావుపేట నుంచి గెలిచిన అదే సామాజికవర్గానికి చెందిన వంగలపూడి అనితకు అవకాశం దక్కవచ్చునంటున్నారు. -
చెప్పుతో కొడతా!
రాజమహేంద్రవరం రూరల్: ‘జోడిచ్చుకుని కొడతా’నంటూ ఓ మహిళపై రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు గోరంట్ల బుచ్చయ్యచౌదరి విరుచుకుపడ్డారు. రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ పరిధిలోని 27వ డివిజన్ దుర్గాలమ్మ గుడి వీధిలో శుక్రవారం ఈ ఘటన చోటుచేసుకుంది. ఆ డివిజన్లో తన పెద్ద కుమార్తె కంఠంనేని శిరీష, టీడీపీ శ్రేణులతో కలిసి గోరంట్ల బుచ్చయ్యచౌదరి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. దుర్గాలమ్మ గుడి వీధిలో ప్రచారం చేస్తున్న సమయంలో పిల్లల నాగమణి అనే మహిళ ‘ఎన్నికలప్పుడే మీకు ప్రజలు గుర్తొస్తారా?’ అని మహిళ నిలదీసింది. ‘ఓయ్ అమ్మాయ్.. ఆగు’ అంటూ గోరంట్ల ఆమెను అడ్డుకోబోయారు.అయినా.. నాగమణి నిలదీయడం ఆపకపోవడంతో నిగ్రహం కోల్పోయిన గోరంట్ల ఒక్కసారిగా కోపోద్రిక్తుడై ‘జోడిచ్చుకుని కొడతాను’ అంటూ రెచ్చిపోయారు. దీంతో అక్కడున్న మహిళలంతా ఒక్కసారిగా తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేయడంతో అక్కడి నుంచి పార్టీ శ్రేణులతో కలసి బుచ్చయ్య వెనుతిరిగారు.ఓటమి భయంతోనే ఫ్రస్ట్రేషన్పదేళ్లుగా రాజమండ్రి రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్న గోరంట్ల బుచ్చయ్యచౌదరి ప్రజల సమస్యలు పట్టించుకున్న దాఖలాలు లేవు. దీంతో ఆయన ఏ ప్రాంతానికి వెళ్లినా ప్రజల నుంచి స్పందన కరువవుతోంది. దీంతో నియోజకవర్గంలోని టీడీపీ నాయకులందరినీ తాను తిరిగే గ్రామం లేదా డివిజన్కు తీసుకుని వచ్చి ప్రచారం చేస్తున్నారు. ఒకవైపు ప్రజల నుంచి స్పందన లేకపోగా.. ప్రచారంలో మహిళలు నిలదీస్తుండటంతో గోరంట్ల ఫ్రస్ట్రేషన్కు గురవుతున్నారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.అడుగడుగునా నిలదీతలేఅంతకు ముందు కూడా ఓ ఇంటివద్ద నలుగురు వ్యక్తులు.. ‘ఎన్నికల సమయంలోనే తమరికి ప్రజలు గుర్తొస్తారా’ అంటూ గోరంట్లను నిలదీశారు. ప్రజలకు ఏ అవసరం వచ్చినా పట్టించుకోలేనప్పుడు ఎందుకు ఓటెయ్యాలని ప్రశ్నించారు. దీంతో కోపోద్రిక్తుడైన గోరంట్ల.. తమకు ఓట్లు వెయ్యవద్దని నోరు పారేసుకున్నారు. అలాంటప్పుడు ప్రచారం ఎందుకు చేస్తున్నారని అక్కడి వారు అడగడంతో గోరంట్ల, ఆయన అనుచరుడు కురుకూరి కిషోర్ ప్రజలపై దౌర్జన్యానికి దిగారు. వారిని స్థానిక నేతలు, టీడీపీ నాయకులు పక్కకు తీసుకుని వెళ్లడంతో వివాదం సద్దుమణిగింది. గోరంట్ల కుమార్తె శిరీష 27వ వార్డులో ఎన్నికల ప్రచారం నిర్వహించినప్పుడు అక్కడి మహిళలు నిలదీయడంతో ఆమె అక్కడి నుంచి జారుకున్నారు. -
గోరంట్లను వెంటాడుతున్న భయం.. కారణం అదేనట..!
రాష్ట్రంలో ప్రతిష్టాత్మకమైన రాజమండ్రి రూరల్ అసెంబ్లీ స్థానానికి టీడీపీ అభ్యర్ధి విషయంలో క్లారిటీ వచ్చింది. అయితే క్షేత్ర స్థాయిలో పరిస్థితి ఎలా ఉంటుందోనని ఆ పార్టీ వర్గాలు మల్లగుల్లాలు పడుతున్నాయి. ఆఖరు నిమిషం వరకూ రాజమండ్రి రూరల్ స్థానానికి పోటీ పడిన దుర్గేష్ను పవన్ కళ్యాణ్- చంద్రబాబు నిడదవోలు వెళ్లాలని ఆదేశించడంతో దిక్కుతోచని పరిస్థితుల్లో ఆయన అయిష్టంగా అక్కడకు వెళ్లేందుకు ఒప్పుకున్నారు. తనకు రూట్ క్లియర్ అయిందని టీడీపీ సీనియర్ నేత గోరంట్ల భావిస్తున్నా, ఎన్నికల్లో జనసేన కార్యకర్తలు ఎంతమేర సహకరిస్తారోనని టీడీపీ నేతలను ఓటమి భయం పట్టి పీడిస్తుంది. తీవ్రంగా పోటీపడి, సామదాన భేధ దండోపాయాలు ఉపయోగించి మరీ రాజమండ్రి రూరల్ అసెంబ్లీ స్థానాన్ని టీడీపీ సీనియర్ నేత బుచ్చయ్య దక్కించుకున్నారు. అధికారికంగా పేరు వెల్లడించకపోయినా, దాదాపుగా రాజమండ్రి రూరల్ స్థానం ఆయనకు ఖరారైనట్టే. అయితే జనసేన అభ్యర్ధి దుర్గేష్తో పోటీ పడి మరీ ఈ స్థానాన్ని దక్కించుకున్న గోరంట్లకు ఇంకా స్థిమితంగా లేరట. కమ్మ సామాజికవర్గానికి చెందిన ఆయన కాపు సామాజికవర్గం హవా అత్యధికంగా ఉన్న రాజమండ్రి రూరల్ స్థానం నుంచి రెండు సార్లు విజయం సాధించారు. గత ఎన్నికల్లో కాపుసామాజికవర్గానికి చెందిన దుర్గేష్ స్వతంత్ర్య అభ్యర్ధిగా, ఆకుల వీర్రాజు వైఎస్ ఆర్ అభ్యర్ధిగా పోటీ పడ్డారు. దీంతో చాలావరకూ కాపు ఓట్లు చీలిపోయాయి. దుర్గేష్ 46 వేల ఓట్లు సాధించుకోగలిగారు. ఆకుల వీర్రాజు రెండో స్థానంలో నిలిచారు. విజయం బుచ్చయ్యకు దక్కింది. ఈసారి టీడీపీ-జనసేన పొత్తులో రాజమండ్రి రూరల్ స్థానానికి జనసేన జిల్లా పార్టీ అధ్యక్షుడు కందుల దుర్గేష్ పోటీ చేస్తారని అందరూ ఊహించారు. పవన్ కళ్యాణ్ కూడా తనకు భరోసా ఇచ్చారు కనుక రూరల్ స్థానం తనదేనని దుర్గేష్ భావించారు. అయితే అనూహ్యంగా ఆయనను నిడదవోలు వెళ్లాలని ఆదేశించడంతో అయిష్టంగా ఊ కొట్టారు. అయితే జనసేన క్యాడర్ మాత్రం దుర్గేష్ ను రాజమండ్రి రూరల్ స్థానం నుంచే పోటీ కి దింపాలని పలు ఆందోళనలు నిర్వహించింది. చంద్రబాబు-పవన్ కళ్యాణ్ వీటిని లక్ష్యపెట్టలేదు. దీంతో పదోసారి అసెంబ్లీ బరిలోకి దిగేందుకు బుచ్చయ్య చౌదరి సిద్దపడుతున్నారు. అయితే ఈసారి తమ నాయకుడు బరిలో ఉంటారని భావించిన జనసేన క్యాడర్ బుచ్చయ్యకు ఎంతమేర సహకరిస్తారన్న విషయంపై తీవ్ర సందిగ్ధత నెలకొంది. ఇప్పటికే ఆరుసార్లు శాసనసభ్యుడిగా ఎన్నికైన బుచ్చయ్య ఈసారి తమ అభ్యర్ధికి అవకాశం ఇస్తారని జనసేన కార్యకర్తలు భావించారు. ఏళ్ల తరబడి కష్టపడి పనిచేసిన దుర్గేష్ కు అవకాశం కల్పిస్తే గెలిపించుకోవాలని భావించారు. అయితే ఇపుడు పరిస్థితి పూర్తిగా మారిపోవడంతో బుచ్చయ్యకు మద్దతు ఇవ్వాలనే ఆలోచనపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. గతంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో సైతం పొత్తు లేకపోయినా, జనసేన-టీడీపీ నాయకులు కలిసే పనిచేశారు.అయినా పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. మరోవైపు పదేళ్లపాటు రూరల్ లో శాసనసభ్యుడిగా కొనసాగిన బుచ్చయ్యచౌదిరి పై టీడీపీ క్యాడర్ కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. గత ఐదేళ్లలో నియోజకవర్గంలో తమకిచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చలేదని స్థానికులకు కూడా బుచ్చయ్య అభ్యర్ధిత్వంపై గుర్రుగా ఉన్నారు. అవకాశం వస్తే కచ్చితంగా ఓడించాలనే ఆలోచనతో ఉన్నట్టు స్పష్టమవుతోంది. మరోవైపు, నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ అభ్యర్ధిగా వచ్చిన మంత్రి వేణుగోపాలకృష్ణ తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. పాత, కొత్త నాయకులను కలుపుకుంటూ నియోజకవర్గంలో ప్రతి గ్రామంలోను పర్యటిస్తున్నారు. మంత్రి వేణు రాజమండ్రి రూరల్ నియోజకవర్గానికి వచ్చిన తరువాత నాయకులు, కార్యకర్తల్లో కూడా నూతన ఉత్సాహం కలుగుతోంది. ఎక్కడిక్కడ అన్నివర్గాల ప్రజలతో సమావేశాలు నిర్వహిస్తూ, వారి బాగోగులు తెలుసుకుంటూ అందరినీ ఆకర్షిస్తున్నారు. రూరల్ నియోజకవర్గంలో విజయం సాధించడానికి తగిన ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇదీ చదవండి: వైఎస్సార్సీపీలో చేరబోతున్నా: ముద్రగడ -
Rajamahendravaram: సీటు తనకే దక్కేలా ఎమ్మెల్యే గోరంట్ల వ్యూహం
సాక్షి, రాజమహేంద్రవరం/నిడదవోలు: టీడీపీ, జనసేన అధినేతలు చంద్రబాబు, పవన్ కల్యాణ్ ప్రకటించిన ఉమ్మడి అభ్యర్థుల జాబితాపై విభేదాల అగ్గి రగిలింది. పొత్తు ధర్మం, విలువలు పాటించకుండా చంద్రబాబు స్వప్రయోజనాల కోసమే అన్నట్లు సీట్లు కేటాయించడం, జాబితా రూపొందించడంపై ఇరు పార్టీల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. నివురుగప్పిన నిప్పులా నిడదవోలు నిడదవోలు నుంచి తాను పోటీ చేస్తున్నట్టు జనసేన ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడు కందుల దుర్గేష్ స్వయంగా ప్రకటించారు. దీనికి అధినేత పవన్ కల్యాణ్ సైతం గ్రీన్సిగ్నల్ ఇచ్చారని చెబుతూ, ఇప్పటికే నిడదవోలులోని కొంతమంది జనసేన నాయకులతో దుర్గేష్ మాట్లాడారని, వారికి ఆయన వర్గీయులు సైతం ఫోన్ చేసి, నియోజకవర్గ సమాచారం సేకరిస్తున్నారని తెలిసింది. ఈ పరిణామంపై ఇప్పటికే ఆ టికె ట్ ఆశిస్తున్న అక్కడి టీడీపీ నేతలు చంద్రబాబుపై కస్సుమంటున్నారు. తమను కాదని స్థానికేతరులకు నిడదవోలు టికెట్ ఇస్తే టీడీపీకి మూకుమ్మడి రాజీనామాకు సైతం సిద్ధమని అల్టిమేటం జారీ చేస్తున్నా రు. ఉండ్రాజవరం మండలం వేలివెన్ను గ్రామంలోని టీడీపీ నిడదవోలు నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు ఇంటి వద్దకు ఆదివారం పెద్ద సంఖ్యలో కార్యకర్తలు చేరుకున్నారు. ఆయనకు అనుకూలంగా, చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నిడదవోలులో జనసేన, టీడీపీ మధ్య విభేదాలు నివురుగప్పిన నిప్పులా ఉన్నాయి. రాజకీయాలకు గుడ్బై చెప్పే యోచనలో బూరుగుపల్లి టీడీపీ నేత బూరుగుపల్లి శేషారావు నిడదవోలు టికెట్ ఆశిస్తున్నారు. ఇటీవల టీడీపీ నిర్వహించిన సర్వేలో సైతం ఆయనకు అనుకూలంగా వచ్చిందని ఆ పార్టీ శ్రేణులు చెప్పుకొంటున్నాయి. చంద్రబాబు సైతం భరోసా ఇవ్వడంతో ఆయన లక్షల రూపాయలు ఖర్చు చేస్తూ పార్టీ కార్యక్రమాల్లో తలమునకలవుతున్నారు. ఈ తరుణంలో కందుల దుర్గేష్కు ఈ సీటు కేటాయిస్తారన్న సమాచారం అందడంతో శేషారావు వర్గీయులు ఆందోళన చెందుతున్నారు. టికెట్ దక్కకుంటే ఆయన ప్రత్యక్ష రాజకీయాలకు గుడ్బై చెప్పే ఆలోచనలో సైతం ఉన్నట్లు చెబుతున్నారు. కుందులది మరో దారి నిడదవోలు స్థానం జనసేనకు కేటాయించారని టీడీపీ శ్రేణులు గుర్రుగా ఉంటే.. టీడీపీ టికెట్ ఆశిస్తున్న మరో నేత కుందుల సత్యనారాయణ విచిత్ర ప్రకటన చేశారు. టీడీపీ – జనసేన ఉమ్మడి అభ్యర్థిగా తనకు అవకాశం కల్పిస్తారని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. శేషారావు, సత్యనారాయణ మధ్య ఇప్పటికే వర్గ విభేదాలు నడుస్తున్నాయి. టీడీపీ కార్యక్రమాలు సైతం వారు వేర్వేరుగా చేస్తున్నారు. చంద్రబాబు జైలులో ఉన్న సమయంలో సైతం ఎవరికి వారే అన్న చందంగా నిరసన కార్యక్రమాలు చేపట్టారు. చేతిచమురు కూడా బాగానే వదిలించుకున్నారు. తాను కోట్ల రూపాయల పార్టీ ఫండ్ ఇచ్చానని, తనకు కాకుండా టికెట్ ఇతరులకు ఎలా ఇస్తారని కుందుల సత్యనారాయణ తన అనుచరుల వద్ద ప్రస్తావిస్తున్నట్లు తెలిసింది. ఇదిలా ఉండగా ఉమ్మడి అభ్యర్థిగా జనసేన నేత దుర్గేష్ పోటీ చేస్తే, ఆయనకు సహకరించేందుకు టీడీపీకి చెందిన కమ్మ సామాజికవర్గ నాయకులు ఆసక్తి చూపడం లేదు. భగ్గుమన్న జనసేన నేతలు దుర్గేష్కు రాజమహేంద్రవరం రూరల్ కేటాయించకపోవడంతో జనసేన నేతలు ఒక్కసారిగా భగ్గుమన్నారు. ఈ నెల 20న రాజమహేంద్రవరం వచ్చిన జన సేన అధినేత పవన్ కల్యాణ్ అంతర్గత సమావేశంలో ఈ సీటుపై దుర్గేష్కు భరోసా ఇచ్చారని, ఇది జరిగిన రోజుల వ్యవధిలోనే ఈ మార్పు చేయడం ఏమిటని దుర్గేష్ అనుచరులు ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. జనసేన పార్టీ గుర్తు ఉన్న స్టిక్కర్లు చించివేశారు. జెండా పీకేసి నిరసన తెలిపారు. దుర్గేష్కు రాజమహేంద్రవరం రూరల్ కేటాయించాలని డిమాండ్ చేశారు. చక్రం తిప్పిన గోరంట్ల రాజమహేంద్రవరం రూరల్ సీటును తిరిగి ఎలాగైనా దక్కించుకోవాలనే పట్టుదలతో టీడీపీ నేత, సిట్టింగ్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి చక్రం తిప్పారు. ఈ సీటు చేజారిపోయిందనుకున్న సమయంలో చంద్రబాబుతో పెద్ద ఎత్తున వాదనకు దిగి మరీ సాధించుకున్నారని అంటున్నారు. ఈ విషయమై పవన్ కల్యాణ్ సైతం రంగంలోకి దిగారు. దుర్గేష్ను శనివారం రాత్రి మంగళగిరికి పిలిపించారు. రూరల్ ఆశలు వదిలేసి, నిడదవోలు నుంచి పోటీ చేయాలని ఆయనకు పవన్ సూచించారు. చేసేది లేక దుర్గేష్ నిడదవోలు నుంచి పోటీకి సిద్ధమవుతున్నారు. -
రాజమండ్రి రూరల్ సీటుపై జనసేన వర్సెస్ టీడీపీ
-
రాజమండ్రిలో సైకిల్, గ్లాసు రచ్చ రచ్చ
రాజమండ్రిలో టీడీపీ-జనసేనల మధ్య రాజకీయం మరింత వేడెక్కిందనడం కంటే రచ్చకెక్కిందనడమే ఇక్కడ సరిపోతుంది. ప్రధానంగా సైకిల్ పార్టీ, గ్లాసు పార్టీలు ఇక్కడ సీటుపై ఒకరిపై ఒకరు కారాలు-మిర్యాలు నూరుకుంటూ సీటు మాదే అంటే మాది అంటూ.ప్రకటనలు చేసేస్తున్నారు. ఇందుకు కారణం రాజమండ్రి రూరల్ సీటు జనసేనదేనంటూ పవన్ కళ్యాణ్ తేల్చేయడమే.. ఇటీవల తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించిన పవన్.. రాజోలు, రాజనగరంలో జనసేన పోటీ చేస్తుందని ప్రకటించగా.. తాజాగా రాజమండ్రి రూరల్ కూడా జనసేనకేనని తేల్చేశారు. దానిలో భాగంగానే కందుల దుర్గేష్ జనసేన రాజమండ్రి రూరల్ అభ్యర్థిగా బరిలోకి దిగుబోతున్నానంటూ ప్రకటించి తెలుగుదేశం శ్రేణులకు షాకిచ్చారు. ఇదే విషయాన్ని టీడీపీ అధిష్టానంతో చర్చించి త్వరలో అధికారికంగా ప్రకటిస్తానని కూడా పవన్ తెలిపినట్లు దుర్గేష్ తెలిపారు. రాజమండ్రి రూరల్ టికెట్ నాదే పవన్ ఇచ్చిన హామీతో రాజమండ్రి రూరల్ టికెట్ నాదేనంటూ ఉబ్బితబ్బిబ్బి అయిపోతున్నారు కందుల దుర్గేష్. రాజమండ్రి టికెట్ తనదేనంటూ ప్రచారం కూడా మొదలు పెట్టేశారు. తనకు పవన్ కళ్యాణ్ క్లారిటీ ఇచ్చేసారని, ఇక్కడ నుంచి జనసేన తరఫున తాను బరిలో దిగుతున్నట్లు పేర్కొన్నారు. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వస్తుందని కూడా కందుల దర్గేష్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. నేను సీనియర్ని.. ఈ టికెట్ నాదే తాను జిల్లాలో సీనియర్ నాయకుడినని, జిల్లాలో పార్టీ వ్యవస్థాపకుడినని, టికెట్ తనదే అంటున్నారు గోరంట్ల బుచ్చయ్యచౌదరి. ‘ఇందులో ఎలాంటి వివాదం లేదు. పార్టీ టికెట్ నాకే. జనసేనకు మరో నియోజకవర్గం కేటాయిస్తాం. సర్దుబాటు వాళ్లిష్టం’ అంటూ గోరంట్ల అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్న గోరంట్ల తన సీటుకే ఎసరు పడుతుందా అనే డైలమాలో పడ్డారు. టీడీపీ నేతల్లో అసంతృప్తి రాజానగరం టికెట్ జనసేన ప్రకటించడంతో ఇప్పటికే అసంతృప్తిలో ఉన్న టీడీపీ నేతలు.. రాజమండ్రి రూరల్లో సైతం ఇదే పరిస్థితి వస్తుందా? అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా కమ్మ సామాజిక వర్గం మాత్రం.. పవన్ కళ్యాణ్ టికెట్లు ప్రకటనపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. రాజమండ్రి రూరల్ ,రాజానగరం స్థానాలు జనసేనకు ఇస్తే తమ సామాజిక వర్గం సీట్లు కోల్పోయేనట్లేనని అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. పవన్ టికెట్లను ఇచ్చుకుపోతూ ఉంటే చంద్రబాబు ఏం చేస్తున్నారనే ప్రశ్నలు కూడా తలెత్తున్నాయి. ఇది చంద్రబాబు ఇచ్చిన హామీతోనే పవన్ ఇలా చేస్తున్నారా? అనే అనుమానం కూడా వ్యక్తమవుతోంది. ఏది ఏమైనా రాజమండ్రి రూరల్ సీటుపై టీడీపీ-జనసేనల మధ్య రసవత్తర రాజకీయమే నడుస్తోంది. -
ఇంతకీ గోరంట్ల బుచ్చయ్య చౌదరికి సీటు ఉన్నట్టా? లేనట్టా?
టీడీపీలో చంద్రబాబు కంటే సీనియర్ నేత అయిన గోరంట్ల బుచ్చయ్య చౌదరి దిక్కుతోచని స్థితిలో ఉన్నారా? ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన బుచ్చయ్యకు ఇప్పుడు పోటీ చేయడానికి సీటే లేకుండా పోయిందా? రాజమండ్రి సిటీ, రాజమండ్రి రూరల్ సీట్లలో ఏదీ బుచ్చయ్యకు ఖాయం కాలేదా? ఈ రెండు సీట్లు ఎవరికి కేటాయించబోతున్నారు? సీనియర్ నేత బుచ్చయ్య చౌదరిని టీడీపీ అధ్యక్షుడు ఎందుకు పట్టించుకోవడంలేదు? ఇంతకీ బుచ్చయ్యకు సీటు ఉన్నట్టా? లేనట్టా? తెలుగుదేశం పార్టీ తరపున ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన గోరంట్ల బుచ్చయ్య చౌదరికి ఈసారి పోటీ చేసే స్థానం కోసం వెత్తుకోవల్సిన దుస్థితి ఏర్పడింది. టీడీపీ- జనసేన పొత్తులో భాగంగా బుచ్చయ్య సిటింగ్ సీటు రాజమండ్రి రూరల్ స్థానాన్ని జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు కందుల దుర్గేష్ కు కేటాయించాలని జనసేన నిర్ణయించుకుంది. 2019 ఎన్నికల్లో జనసేన తరపున పోటీ చేసిన దుర్గేష్ ఓటమి పాలైనా, 40 వేలకు పైగా ఓట్లు సంపాదించుకున్నారు. రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో అధికంగా ఉన్న కాపు సామాజికవర్గం కూడా దుర్గేష్ కు మద్దతుగా ఉందనే ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు ఇదే వ్యవహారం టీడీపీలో కలకలానికి కారణమవుతోంది. రాజమండ్రి రూరల్ తరపున తానే పోటీ చేస్తానని ఎప్పటికప్పుడు ప్రకటించుకుంటున్న బుచ్చయ్య చౌదిరికి చంద్రబాబు ఎటువంటి గ్యారెంటీ ఇవ్వలేదు. బుచ్చయ్య చౌదిరికి అడ్డాలాంటి కాతేరులో చంద్రబాబు సభ నిర్వహించినా, బుచ్చయ్య పేరును ప్రకటించలేదు. తర్వాత కూడా బుచ్చయ్యకు చంద్రబాబు నుంచి పోటీకి ఎటువంటి సిగ్నల్ రాలేదు. దీంతో పోటీ కోసం ఆశగా ఎదురుచూస్తున్న బుచ్చయ్య తీవ్ర ఆందోళనకు గురయ్యారు. రాజమండ్రి రూరల్ నియోజకవర్గాన్ని జనసేన నేత కందుల దుర్గేష్ కు కేటాయించినందున..రాజమండ్రి సిటీలో పోటీ చేసేందుకు బుచ్చయ్య సిద్ధపడుతున్నట్టు సమాచారం. అయితే రాజమండ్రి సిటీలో పోటీ చేయడానికి టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ భర్త ఆదిరెడ్డి వాసు ఎప్పుడో ఫిక్సయ్యారు. రాజమండ్రి సిటీ అసెంబ్లీ స్థానం తనదేనంటూ ఆదిరెడ్డి వాసు గతంలో సభపెట్టి మరీ ప్రకటించారు. ఇపుడు బుచ్చయ్య దృష్టి మళ్ళీ సిటీ నియోజకవర్గంపై పడటంతో ఆదిరెడ్డి వర్గంలో అలజడి రేగుతోంది. ఇప్పటికే ఆదిరెడ్డి, బుచ్చయ్య వర్గాలకు పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి. తాజా పరిణామాలతో ఇది మరింత పెరిగే అవకాశం కనిపిస్తుంది. మరోవైపు రాజానగరం నుండి కూడా బుచ్చయ్య పోటే చేసే అవకాశం లేకుండా పోయింది. రాజానగరం, రాజోలు స్థానాల్లో జనసేన అభ్యర్ధులు పోటీ చేస్తారని ఇప్పటికే పవన్ కళ్యాణ్ ప్రకటించారు. అటు రాజమండ్రి రూరల్ స్థానం కోల్పోయి, రాజానగరం దక్కక ఏం చేయాలో తెలియక బుచ్చయ్య వర్గం అయోమయంలో కూరుకుపోయింది. తన స్వంత నియోజకవర్గంలో పార్టీ అధ్యక్షుడి సభ ఏర్పాటు చేసినా, తన అభ్యర్ధిత్వాన్ని ప్రకటించుకోలేని స్థితి బుచ్చయ్య ఎదుర్కొన్నారు. గతంలో మండపేటలో సభ ఏర్పాటు చేసినపుడు అక్కడి సిట్టింగ్ ఎమ్మెల్యేవేగుళ్ల జోగేశ్వరరావు అభ్యర్ధిత్వాన్ని ప్రకటించిన చంద్రబాబు కాతేరు బహిరంగసభలో తన పేరు కూడా ప్రకటిస్తారని బుచ్చ్యయ్య ఎదురు చూశారు. అయితే చంద్రబాబు పొరపాటున కూడా బుచ్చయ్య పేరును ప్రకటించకపోవడంతో తమకు ఎక్కడి స్థానం దక్కుతుందో, అసలు పోటీ చేసే అవకాశం లభిస్తుందో లేదో తెలియక బుచ్చయ్య వర్గం మథనపడుతోంది. రాజమండ్రి రూరల్ నుండి వరుసగా రెండు సార్లు విజయం సాధించినా, సిట్టింగులకు మళ్లీ అవకాశం కల్పిస్తామని గతంలో చంద్రబాబు ప్రకటించినా, బుచ్చయ్యకు మాత్రం ఊరట లభించడం లేదు. త్యాగాలకు సిద్ధపడాలంటూ చంద్రబాబు ఇస్తున్న పిలుపునకు అర్ధం ఏమిటో, అది తమకే వర్తిస్తుందేమోనని బుచ్చయ్య అనుచరులు ఆందోళనకు గురవుతున్నారు. ఇదీ చదవండి: టీడీపీ చంద్రబాబు: ముందు నుయ్యి.. వెనుక గొయ్యి.. -
సీనియర్ నేతకు పొగ పెడుతున్న బాబు.. ఆ నియోజకవర్గం ఎంటీ?
గోదావరి జిల్లాల్లో అదొక కీలకమైన నియోజకవర్గం. పచ్చ పార్టీ నుంచి ఓ సీనియర్ నేత ఎప్పటినుంచో అక్కడ పోటీ చేస్తూ వస్తున్నారు. ఇప్పడు అక్కడ టీడీపీ సీనియర్ నేత మీదకు జనసేనను ఉసిగొలుపుతున్నారు చంద్రబాబు. జనసేన, టీడీపీల్లో ఎవరు పోటీ చేసినా ఈసారి అక్కడ గెలిచేది ఫ్యాన్ పార్టీయే. అయితే టీడీపీ, జనసేన సీటు ఆశిస్తున్న ఇద్దరూ పోటీ చేసేది మేమే అని ప్రచారం చేసుకుంటున్నారు. దీంతో ఇరు పార్టీల మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఇంతకీ ఆ నియోజకవర్గం ఎక్కడుందో చూద్దాం. రాజమండ్రి రూరల్ స్థానం విషయంలో తెలుగుదేశం, జనసేన పార్టీల మధ్య రసవత్తర పోటీ కొనసాగుతోంది. ఈ స్థానం ఈసారి తనదంటే తనదని టీడీపీ, జనసేన అభ్యర్ధులు పోటీ పడి ప్రచారం చేసుకుంటున్నారు. దీంతో పొత్తులో ఉన్న టీడీపీ- జనసేన పార్టీలు అసలీ స్థానానికి ఎవరిని అభ్యర్ధిగా ప్రకటిస్తారోనని రెండుపార్టీల క్యాడర్ ఆసక్తిగా ఎదురుచూస్తోంది. మరోవైపు ఇరువురు అభ్యర్ధులు పైకి అధిష్టానం మాటే శిరోధార్యమని చెపుతున్నా, తామే అభ్యర్ధులమంటూ క్యాడర్కు బహిరంగంగానే చెపుతున్నారు. అయితే రాజమండ్రిలో టీడీపీ తరపున ఆరుసార్లు గెలిచిన సిట్టింగ్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి చంద్రబాబు తనకు పొగ పెడుతున్నారనే విషయాన్ని అర్థం చేసుకుని సన్నిహితుల దగ్గర వాపోతున్నారు. గోరంట్ల బుచ్చయ్య చౌదిరి టీడీపీలో సీనియర్ నేత. మంత్రిగా, పొలిట్ బ్యూరో సభ్యుడిగా పనిచేసిన గోరంట్ల చంద్రబాబు కంటే కూడా సీనియర్. తనకు ఏ మాత్రం అన్యాయం జరిగిందని భావించినా, వెంటనే తీవ్ర స్థాయిలో పార్టీని, అధినేతను విమర్శిస్తూ అలిగి కావాల్సినంది సాధించుకోవడం ఆయనకు అలవాటు. వరుసగా రెండు సార్లు విజయం సాధించిన రాజమండ్రి రూరల్ స్థానాన్ని ఈసారి జనసేనకు కేటాయించాలని పార్టీ అధిష్టానం భావిస్తుండటం బుచ్చయ్య చౌదిరికి తీవ్ర మనస్తాపం కలిగిస్తోంది. ఓవైపు తానే అభ్యర్ధిని చెపుతున్నా, కచ్చితంగా ఈస్థానాన్ని జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు కందుల దుర్గేష్ కు కేటాయించారంటూ విస్తృతంగా ప్రచారం జరగడం బుచ్చయ్యకు మింగుడుపడటంలేదు. రాజమండ్రి రూరల్ స్థానం తనదేనంటూ జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు కందులు దుర్గేష్ ఎప్పటినుంచో నియోజకవర్గంలో ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రతి పదిరోజులకు ఒకసారి మీడియా సమావేశం నిర్వహించి రూరల్ స్థానం నుండి పోటీచేస్తానంటూ చెపుతున్నారు. టిక్కెట్ ఎవరికిచ్చినా సహకరిస్తామంటూనే పొత్తు ధర్మం ఒకటుంటుందని, దీనికోసం ఎంతటివారైనా త్యాగాలు చేయాల్సి వస్తుందని పరోక్షంగా బుచ్చయ్య చౌదిరికి సంకేతాలిస్తున్నారు. అసలే ఓవైపు రాజమండ్రి సిటీ నియోజకవర్గంలో తన ప్రమేయాన్ని పూర్తిగా తుడిచిపెట్టేసిన ఆదిరెడ్డి వర్గంపై తీవ్ర అసంతృప్తిగా ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యే బుచ్చయ్య ఇపుడు రూరల్ స్థానాన్ని కూడా పొత్తు పేరిట జనసేనకు కేటాయిస్తారంటూ జరుగుతున్న ప్రచారాన్ని సహించలేకపోతున్నారు. జనసేన నేత దుర్గేష్ మీడియా సమావేశం పెట్టిన మరుసటిరోజే ఆయన కూడా మీడియా సమావేశం నిర్వహించి, తాను రాజమండ్రి రూరల్ స్థానం నుండే పోటీ చేస్తానని ప్రకటిస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలకే టిక్కెట్లు ఇస్తామని చంద్రబాబు చెప్పిన మాటలు గుర్తు చేస్తున్నారు. గతంలో కూడా బుచ్చయ్యకు టిక్కెట్ రాదని ప్రచారం జరిగినా ఆఖరు నిమిషంలో ఆయనే అభ్యర్ధంటూ ప్రకటించిన సంఘటనలు ఉన్నాయి. దీంతో అసలు రాజమండ్రి రూరల్ స్థానాన్ని ఎవరికి కేటాయిస్తారో తెలియక అటు టీడీపీ, ఇటు జనసేన వర్గాలు అయోమయంలో కొట్టుమిట్టాడుతున్నాయి. అధిష్టానం ఆదేశిస్తే ఎక్కడ పోటీ చేయడానికైనా సిద్ధమని చెపుతూనే రాజమండ్రి సిటీ స్థానానికైనా రెడీ అంటూ ఆదిరెడ్డి వర్గానికి కూడా జలక్ ఇస్తున్నారు బుచ్చయ్య. సింహం బయటకు వచ్చేవరకేనంటున్న బుచ్చయ్య చౌదిరికి ఈసారి చంద్రబాబు నిజంగానే టిక్కెట్ ఇస్తారో లేక పక్కన పెట్టేస్తారో చూడాలి. చదవండి: ‘మోసానికి, అవినీతికి చంద్రబాబు బ్రాండ్ అంబాసిడర్’ -
నాకు టిక్కెట్ ఉండదనడానికి దుర్గేష్ ఎవరు?
రాజమహేంద్రవరం రూరల్: సిట్టింగ్ ఎమ్మెల్యేలకే టిక్కెట్ అని టీడీపీ అధిష్టానం ఎప్పుడో ప్రకటించిందని.. ఇప్పుడు ఉండదని చెప్పడానికి జనసేన నాయకుడు కందుల దుర్గేష్ ఎవరని రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మండిపడ్డారు. నగరంలోని తన నివాసంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ, జనసేన ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడు కందుల దుర్గేష్ చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయనతో తనకు వ్యక్తిగతంగా విభేదాలేవీ లేవని, జనసేన తమకు కేవలం మిత్రపక్షమేనని, టీడీపీ బలమైన పార్టీ అని అన్నారు. టీడీపీ నిర్ణయానికే కట్టుబడి ఉండాలన్నారు. రానున్న ఎన్నికల్లో అధిష్టానం ఎక్కడ టిక్కెట్ ఇచ్చినా అసెంబ్లీకి తాను పోటీ చేయటం ఖాయమని, ఎంపీగా మాత్రం పోటీ చేయనని చెప్పారు. అధిష్టానం నిర్ణయం మేరకు త్యాగానికి సిద్ధమని గోరంట్ల అన్నారు. -
టిడిపి సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి సీటుకు ఎసరు
-
ప్యాకేజీ స్టార్తో పొత్తు.. నన్ను పక్కన పెడతారా?
సాక్షి, రాజమహేంద్రవరం: టీడీపీ, జనసేన సమన్వయ భేటీలో తెలుగుదేశం సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్యచౌదరికి అవమానం జరిగిందా..? కీలక సమావేశంలో స్థానం కల్పించకపోవడం వెనుక వేరే మతలబు ఉందా? పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్నా జూనియర్లను అందలం ఎక్కించి ఆయన గుర్తింపును హరిస్తున్నారా? రాజమహేంద్రవరం రూరల్ అసెంబ్లీ నియోజకవర్గం జనసేనకు కేటాయించేందుకే ఇలా వ్యవహరిస్తున్నారా? అంటే అవుననే సమాధానం వస్తోంది రాజకీయ విశ్లేషకుల నుంచి. ఇదీ సంగతి.. స్కిల్ కుంభకోణంలో అరెస్టయి రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రిమాండ్ అనుభవిస్తున్న నేపథ్యంలో ఇటీవల టీడీపీ, జనసేన నేతల ఉమ్మడి సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇరు పార్టీల నుంచి 14 మంది సభ్యులతో కూడిన కమిటీ సుమారు 3 గంటల పాటు భేటీ అయింది. కమిటీలో పార్టీ వ్యవస్థాపక సభ్యుడిగా, పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కంటే సీనియర్ అయిన రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరికి చోటు లభించలేదు. ఒక్కమాటలో చెప్పాలంటే చేదు అనుభవమే ఎదురైంది. తన కంటే పార్టీలో జూనియర్లు నిమ్మల రామానాయుడు, తంగిరాల సౌమ్య, చివరకు కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి వచ్చిన వలస నేత పితాని సత్యనారాయణకు కూడా కమిటీలో స్థానం కల్పించడంతో బుచ్చయ్య అభిమానులు అగ్గిమీద గుగ్గిలమవుతున్నట్లు సమాచారం. సీనియర్ నేతకు తగిన గౌరవం, గుర్తింపు దక్కకపోవడంతో టీడీపీపై వీరి నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నట్లు తెలిసింది. 25 ఏళ్లకు పైగా ఎమ్మెల్యేగా వ్యవహరించిన వ్యక్తి పార్టీ బలోపేతం, ఉమ్మడి వ్యూహాలపై సలహాలు, సూచనలు ఇచ్చేందుకు కూడా పనికిరారా? అని ప్రశ్నిస్తున్నారు. పొత్తు సెగ తగిలిందా? టీడీపీ, జనసేన పొత్తు సెగ మొట్టమొదటిగా రూరల్ ఎమ్మెల్యే గోరంట్లకు తగిలిందన్న భావన టీడీపీ శ్రేణుల్లో నెలకొంది. పొత్తు కుదిరితే రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి స్థానం జనసేనకు కేటాయిస్తారన్న ప్రచారం ఆది నుంచీ సాగుతోంది. జనసేన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు కందుల దుర్గేష్ రూరల్ స్థానం నుంచి పోటీకి ఆసక్తి చూపుతున్నారు. అధినేత పవన్ ఆశీస్సులు పుష్కలంగా ఉన్నాయని, ఆరు నూరైనా రూరల్ స్థానం తనకే దక్కుతుందని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం టీడీపీ ఉన్న పరిస్థితుల్లో జనసేన అభ్యర్థనకు గ్రీన్సిగ్నల్ ఇవ్వక తప్పని పరిస్థితి. సీనియర్ నేత బుచ్చయ్యకు పార్టీలో సరైన ప్రాధాన్యం ఇవ్వకపోవడం ఈ ప్రచారానికి ఇది మరింత బలం చేకూరుస్తోంది. ఇదే జరిగితే బుచ్చయ్యకు భంగపాటు తప్పదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ములాఖత్లోనూ శృంగభంగమే సెంట్రల్ జైల్లో ఉన్న బాబుతో ములాఖత్లోనూ బుచ్చయ్యకు అవమానమే ఎదురైంది. పార్టీ అధినేతను జైలులో కలిసే అవకాశం ఒక్కసారి కూడా దక్కలేదు. తెలంగాణ, రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు చెందిన నేతలు బాబు కుటుంబ సభ్యులతో పాటు వెళ్లి ములాఖత్ అవుతున్నారు. స్థానికంగా ఉన్న, సీనియర్ నేతను ఒక్కసారి కూడా పిలవకపోవడంతో పార్టీ బుచ్చయ్యకు ఎంత ప్రాధాన్యంఇస్తోందో తేటతెల్లమవుతోందని ఆయన వర్గీయులు లోలోన మదనపడుతున్నారు. ఆది నుంచీ ఆధిపత్య పోరే.. బుచ్చయ్య, ఆదిరెడ్డి అప్పారావు వర్గాల మధ్య ఆది నుంచీ ఆధిపత్య పోరు కొనసాగుతూనే ఉంది. రూరల్ ఎమ్మెల్యే అయినా ఆయన దృష్టంతా సిటీపైనే ఉండేది. పార్టీలో సీనియరైనా తనను కాదని ఇతరులను ప్రోత్సహిస్తున్నారని ఆవేదన చెందేవారు. ఈ విషయాన్ని ఆయన అనేక సందర్భాలలో వెళ్లగక్కిన దాఖలాలు కూడా ఉన్నాయి. ఎప్పటికప్పుడు ఆదిరెడ్డి వర్గం సైతం ఆయనకు దీటుగా జవాబు ఇస్తూనే సిటీలో బలపడేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. నియోజకవర్గానికే పరిమితం చంద్రబాబు అరెస్టయి సెంట్రల్ జైలుకు వచ్చిన నాటి నుంచీ మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు కుటుంబానికి టీడీపీలో కొంత ప్రాధాన్యత పెరిగినట్లు ఆపార్టీ కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు. చంద్రబాబు జైలు జీవితం నేపథ్యంలో బాబు కుటుంబం రాజమహేంద్రవరంలోనే బస చేస్తోంది. చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ ఆయన సతీమణి భువనేశ్వరి, కోడలు బ్రాహ్మణిలు ఇక్కడి నుంచే ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నారు. వీటన్నింటీకీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ భర్త ఆదిరెడ్డి వాసు సారథ్యం వహిస్తున్నారు. లోకేష్ క్యాంప్ కార్యాలయం వద్ద కూడా ఈయన తన ముద్ర చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ పరిణామం బుచ్చయ్యకు మరింత భంగపాటుకు గురయ్యేలా చేస్తోంది. రూరల్ అసెంబ్లీ స్థానం లేకపోతే సిటీ టికెట్ ఆశిద్దామంటే అప్పారావు కుటుంబం ఏకు మేకు అయిందన్న చందంగా మారింది పరిస్థితి. చేసేది లేక బుచ్చయ్య చౌదరి చంద్రబాబు అరెస్టుకు నిరసనగా చేపట్టే కార్యక్రమాల్లో సింహభాగం తన నియోజకవర్గానికే పరిమితమయ్యారు. -
మాసివ్ హార్ట్ఎటాక్తోనే కుప్పకూలిన తారకరత్న!
సాక్షి, చిత్తూరు: సినీ నటుడు, టీడీపీ నేత నందమూరి తారకరత్న పరిస్థితి ఇంకా క్రిటికల్గానే ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయనకు కుప్పం పీఈఏస్ మెడికల్ కాలేజీలో చికిత్స అందుతుండగా.. బెంగళూరు తరలించే ప్రయత్నాలు మొదలయ్యాయి. శుక్రవారం కుప్పంలో జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువ గళం పాదయాత్ర మొదలు సందర్భంగా.. ఆయన ఉన్నట్లుండి కుప్పకూలిన సంగతి తెలిసిందే. అయితే.. తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మీడియాకు వివరించారు. ‘తారకరత్నకు స్టంట్లు వేయలేదు. యాంజియోగ్రామ్ మాత్రమే పూర్తైంది. హార్ట్లో కుడి, ఎడమ వైపు 95 శాతం బ్లాక్స్ ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. కోలుకున్న తర్వాత స్టంట్స్ వేస్తారా?.. ఇతర ట్రీట్మెంట్లు అందిస్తారా? అనేది వేచిచూడాలి. తారకరత్నకు భారీగా గుండెపోటు వచ్చిందని, అయితే ఆస్పత్రిలో వైద్యులు 40 నిమిషాలపాటు తీవ్రంగా ప్రయత్నించడంతో పరిస్థితి కొంత మెరుగైందని తెలిపారాయన. బాలకృష్ణ రాకతో ఆయన రికవరీ కావడం ఆశ్చర్యంగా ఉందని, బాలకృష్ణే దగ్గరుండి చూసుకుంటున్నారని గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. తారకరత్నకు ప్రాణాపాయం తప్పిందని భావనలో ఉన్నామని బుచ్చయ్యచౌదరి చెప్పారు. అవసరమైతేనే మెరుగైన వైద్యం కోసం బెంగళూరుకు ఎయిర్లిఫ్ట్ చేస్తారు. ఇక పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పరిస్థితిపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారని వెల్లడించారు. నందమూరి అభిమానులు ఆందోళన చెందవద్దని, తారకరత్న ఆరోగ్యం మెరుగుపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారాయన. ఇక పరిస్థితిపై సీనియర్ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ స్పందించారు. తారకరత్నకు మాసివ్ హార్ట్ ఎటాక్ లెఫ్ట్ సైడ్ వచ్చిందని తెలిపారు. ఎడమ వైపు 90 శాతం బ్లాక్ అయ్యింది. అయితే మిగతా రిపోర్టులు నార్మల్గానే ఉన్నాయని బాలకృష్ణ వెల్లడించారు. డాక్టర్ల పర్యవేక్షణలో పరిస్థితి మెరుగవుతోందని, వైద్యులు కూడా సానుకూలంగా స్పందించారని చెప్పారు. అయినప్పటికీ బెంగళూరుకు తరలించే ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. పరిస్థితి పాజిటివ్గానే ఉందని, దేవుడి దయతో పాటు కుటుంబం సభ్యుల ప్రార్థనతో అతని ఆరోగ్యం మెరుగవుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే బాలకృష్ణ మాట్లాడుతున్న సమయంలో అభిమానులు గోల చేయడంతో.. ఆయన మండిపడ్డారు. అంతకు ముందు.. తారకరత్న పల్స్ సాధారణ స్థితికి చేరుకునేందుకు 45 నిమిషాల సమయం పట్టిందని వైద్యులు తెలిపారు. ఆయన కోలుకుంటారని భావిస్తున్నట్లు వైద్యులు ప్రకటించారు. ఇదిలా ఉంటే.. తారకరత్నను గ్రీన్ఛానల్ ద్వారా కుప్పం ఈపీఎస్ ఆస్పత్రి నుంచి బెంగళూరు మణిపాల్ ఆస్పత్రికి తరలించే ఏర్పాట్లు జరుగుతున్నట్లు సమాచారం. -
ఏం ఖర్మో.. లీడర్లని మారుస్తున్నా.. అక్కడ పార్టీ తలరాత మారడంలే!
అసలే పార్టీ పాతాళం వైపు చూస్తోంది. ఈ సీటు గెలుస్తామని ఏ జిల్లాలోనూ చెప్పేంత ధీమా కనిపించడంలేదు. కానీ పార్టీలో గ్రూపులు, కుమ్ములాటలు షరా మామూలే. ఏ నియోజకవర్గంలో చూసినా పచ్చ పార్టీలో తన్నులాటలు కామన్గా మారాయి. తూర్పుగోదావరి జిల్లాలో అయితే చంద్రబాబు పర్యటన సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలోనే తమ్ముళ్ళు తన్నుకున్నారు. కొవ్వూరు నియోజకవర్గం టీడీపీలో గొడవలకు కారణమేంటో చదవండి.. అనుకూలం x వ్యతిరేకం గతంలో తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉన్న తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరులో ప్రస్తుతం పార్టీ అంపశయ్యపైకి చేరింది. వంగల పూడి అనిత, కొత్తపల్లి జవహర్ అంటూ... నియోజకవర్గంలో నేతల్ని మారుస్తున్నా పార్టీ రాత మారడంలేదని అక్కడి కేడర్ ఆందోళన చెందుతోంది. మంత్రిగా ఉన్న కాలంలో జవహర్ రాజేసిన గ్రూపుల కుంపటి సెగలు నేటికీ చల్లార లేదు. మొన్న అమరావతి రైతుల యాత్ర సన్నాహక సమావేశంలో కుమ్ములాడుకున్న జవహర్ అనుకూల, వ్యతిరేక వర్గాలు.. మరోసారి చంద్రబాబు పర్యటన ఏర్పాట్ల సమావేశంలోనూ సేమ్ సీన్ రిపీట్ చేశాయి. నియోజకవర్గ నాయకులు బాబు పర్యటన ఏర్పాట్ల పై కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశం సజావుగా సాగుతున్న సమయంలో మాజీ మంత్రి కొత్తపల్లి జవహర్ సమావేశానికి వచ్చారు. జవహర్ ను చూసిన వ్యతిరేకవర్గం కేడర్ ఒక్కసారిగా ఆగ్రహానికి గురయ్యారు. కొవ్వూరు నియోజకవర్గంలో మాజీ మంత్రి జవహర్కు పని ఏంటంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బాబు దింపుడు కళ్లెం ఆశలు చంద్రబాబు హయాంలో జవహర్ మంత్రిగా పనిచేసినపుడు ఒక వర్గాన్ని దూరంగా పెట్టారు. తనవర్గం వారిని వారిపై రెచ్చగొట్టారు. అప్పటినుంచి కొందరు నేతలు, కార్యకర్తలు జవహర్ వ్యతిరేక వర్గంగా నియోజకవర్గంలో గట్టిగా పనిచేస్తున్నారు. గత ఎన్నికల్లో జవహర్కు కొవ్వూరు టిక్కెట్ రాకుండా చంద్రబాబు దగ్గర చక్రం తిప్పారు వ్యతిరేక వర్గం నాయకులు. తనవారి మాట కాదనలేక.. అప్పట్లో కొత్తపల్లి జవహర్ను చంద్రబాబు నాయుడు తిరువూరు స్థానానికి పంపించారు. పాయకరావుపేట ఎమ్మెల్యేగా పనిచేసి అక్కడ అక్కడ గ్రూప్ తగాదాల్లో కూరుకుపోయిన వంగలపూడి అనితను కొవ్వూరు నుండి పోటీ చేయించారు. ఘోర పరాజయం పాలైన వంగలపూడి అనిత ఎన్నికల అనంతరం కొవ్వూరు నియోజకవర్గం వైపు కన్నెత్తి చూడలేదు. దీంతో తిరిగి కొవ్వూరు నియోజకవర్గంలో పట్టు సాధించేందుకు పలుమార్లు జవహర్ ప్రయత్నించినా వ్యతిరేకవర్గం అడ్డుపడడంతో ఆయన ఆశలు అడియాశలే అవుతున్నాయి. చదవండి: (టికెట్కి వెల కడతారా?.. మా కుటుంబాన్ని కరివేపాకులా తీసేస్తారా?) గోరంట్లకు జవహర్ సెగ ప్రస్తుతం రాజమండ్రి జిల్లా ఇన్ఛార్జిగా జవహర్ కొనసాగుతున్నారు. కొవ్వూరు నియోజకవర్గంలో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు పర్యటన సందర్భంగా సమావేశం ఏర్పాటు చేశారు. పర్యటనకు ఇన్చార్జిగా నియమితులైన టిడిపి పోలిట్ బ్యూరో సభ్యుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి అధ్యక్షతన సమావేశం జరుగుతుండగా మాజీ మంత్రి కొత్తపల్లి జవహర్ రావడంతో ఒక్కసారిగా.. జవహర్ గోబ్యాక్ అంటూ పై నినాదాలు మొదలయ్యాయి. దీంతో జవహర్ అనుకూల వర్గం వారు వ్యతిరేకవర్గం వారితో ఘర్షణకు దిగారు. ఇరువర్గాల మధ్య గంట సేపు వాగ్వాదం జరిగింది. ఘర్షణను ఆపేందుకు ఎంత ప్రయత్నించినా ఎవరికీ సాధ్యం కాలేదు. నాయకులు, కార్యకర్తలతో గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతున్న సమయంలో సైతం గొడవ కంటిన్యూ అవుతుండటంతో బుచ్చయ్య చౌదరి వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇరువర్గాల మధ్య ఘర్షణ తారస్థాయికి చేరడంతో సమావేశాన్ని అర్థాంతరంగా ముగించారు. ఎన్నికకు ఏడాదిన్నర ముందే ఇలా ఉంటే.. తీరా అసలు సమయానికి పరిస్థితి ఎలా ఉంటుందోనన్న బెంగ ఇద్దరు బాబులకు పట్టుకుందని తెలుగు తమ్ముళ్లు అనుకుంటున్నారు. - పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్ feedback@sakshi.com -
తెలుగు తమ్ముళ్ల తన్నులాట!
కొవ్వూరు: టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన నిమిత్తం ఏర్పాటు చేసిన సన్నాహక సమావేశం తెలుగు తమ్ముళ్ల తన్నులాటకు దారి తీసింది. తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరులో లిటరరీ క్లబ్ కళ్యాణ మండపం ఇందుకు వేదికయ్యింది. టీడీపీ పొలిట్బ్యూరో సభ్యుడు, రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి సమక్షంలో ద్విసభ్య కమిటీ సభ్యులను వేదికపైకి ఆహ్వానించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కేఎస్ జవహర్ను వేదికపైకి ఆహ్వానించాలని కమిటీ సభ్యులకు బుచ్చయ్య చౌదరి సూచించారు. దీంతో ఆయన వ్యతిరేక వర్గీయులు జవహర్ గోబ్యాక్ అంటూ నినాదాలు ప్రారంభించారు. అదే సమయంలో జవహర్ వర్గీయులు గొంతెత్తారు. అరుపులతో సమావేశం రసాభాసగా మారింది. ఇరు పక్షాల మద్ధతుదారులు వేదికను చుట్టుముట్టి పరస్పరం నెట్టుకున్నారు. దీంతో మైక్ బాక్సులు, సోఫా సెట్లు కిందపడి పోయాయి. ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో బుచ్చయ్య చౌదరి, ద్విసభ్య కమిటీ సభ్యులు కంఠమణి రామకృష్ణ, జొన్నలగడ్డ సుబ్బరాయచౌదరి, ఇరుపక్షాలకు చెందిన ఇతర ముఖ్య నేతలతో రహస్యంగా గదిలో చర్చించారు. కాగా, ఇటీవల నిర్వహించిన అమరావతి పాదయాత్రలోనూ ఇరు పక్షాల మధ్య విభేదాలు వెలుగు చూశాయి. చర్చల అనంతరం బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ నాయకులంతా విభేదాలను పక్కన పెట్టి చంద్రబాబు యాత్రను విజయవంతం చేయాలని కోరారు. దీంతో జవహర్, ఆయన వర్గీయులు జిల్లా పార్టీ అధ్యక్షుడికి ఇచ్చే గౌరవం ఇదేనా అంటూ బుచ్చయ్య చౌదరిని ప్రశ్నించారు. దళితులంటే చిన్నచూపా అంటూ ఆయన వర్గీయులు కేకలు వేశారు. దళిత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి జిల్లా అధ్యక్షుడిగా ఉన్నందుకేనా వేదికపై పిలవలేదంటూ నిలదీశారు. జవహర్ వర్గీయులు ఆగ్రహంతో సభ ప్రాంగణం నుంచి నిష్క్రమించారు. ద్విసభ్య కమిటీ సభ్యుడు జొన్నలగడ్డ సుబ్బరాయచౌదరిని వెంట బెట్టుకుని జవహర్, ఆయన వర్గీయులు బుచ్చయ్య చౌదరి బయటికి వెళ్లిపోయారు. ప్రాంగణంలో బుచ్చయ్య చౌదరి కారుకు అడ్డంగా టీడీపీ కార్యకర్తలు బైఠాయించారు. బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ సమావేశంలో జరిగిన విషయాలను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. చంద్రబాబు దృష్టికీ తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. దీంతో పరిస్ధితి సద్దుమణిగింది. -
గోరంట్ల వెర్సెస్ ఆదిరెడ్డి.. సిటీ సీట్ హాట్ గురూ..!
సాక్షి, రాజమహేంద్రవరం: ఇది మల్లెల వేళయని...వెన్నెల మాసమని...తొందరపడి ఒక కోయిల ముందే కూసింది ..విందులు చేసింది...సుఖదుఃఖాలు సినిమాలో దేవులపల్లి రాసిన పాట ఇది.. టీడీపీలో యువ నాయకుడొకరు ఇదే పల్లవి అందుకున్నారు. దీనిపై రాజకీయంగా రసవత్తరమైన చర్చ సాగుతోంది. ఫలితంగా చాలా కాలంగా పార్టీలో రెండు వర్గాల మధ్య ఆధిపత్య పోరుకు మరోసారి తెర లేచింది. సార్వత్రిక ఎన్నికలకు ఇంకా రెండేళ్లు సమయం ఉంది. ఆ పార్టీలో ఎప్పుడూ హాట్ సీట్గా పేరున్న రాజమహేంద్రవరం సిటీ కోసం ఇప్పటి నుంచే పోరు మొదలైనట్టుగా కనిపిస్తోంది. కొన్నేళ్లుగా ఈ విషయంలో సిటింగ్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని మామ మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, పొరుగున అదే పార్టీకి చెందిన రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మధ్య ఆధిపత్య పోరు నడుస్తోన్న సంగతి బహిరంగ రహస్యమే. ప్రతి ఎన్నికల సందర్భంలో సిటీ నుంచి పోటీ చేయాలని ఆ పార్టీ సీనియర్ నాయకుడు, నాలుగు పర్యాయాలు ఎమ్మెల్యేగా ఉన్న గోరంట్ల ప్రయత్నిస్తూనే ఉంటారు. ఈయనకు పోటీగా ఆదిరెడ్డి అప్పారావు వర్గం టిక్కెట్టు కోసం పోటీ పడుతూ ఉంటుంది. ఇది పార్టీలో సహజ పరిణామంగానే చెప్పుకుంటారు. అటువంటిది సార్వత్రిక ఎన్నికలకు రెండేళ్ల సమయం ఉన్నా రాజమహేంద్రవరం సిటీ నుంచి తానే పోటీ చేస్తానని సిటింగ్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని భర్త.. ఆ పార్టీ నాయకుడు వాసు బుధవారం హఠాత్తుగా ప్రకటించారు. ఈ ప్రకటన వెనుక కారణమేమై ఉంటుందనే చర్చ జరుగుతోంది. అంటే ఇప్పటి నుంచే టీడీపీలో సీట్ల సిగపట్లు మొదలయ్యాయంటున్నారు. చదవండి: (Atmakur Byelection: బీజేపీ బేజార్.. అభ్యర్థి ఎంపికే మైనస్) ఆధిపత్య పోరు రాజమహేంద్రవరం జేకే గార్డెన్స్లో సిటీ నియోజకవర్గ పార్టీ సమావేశం సందర్భంగా ఎమ్మెల్యే భర్త వాసు బయటకు వచ్చి మీడియాకు ఈ విషయాన్ని తెలియజేశారు. గత కొంతకాలంగా ఆ పార్టీలో పరిణామాలే ఇందుకు కారణమని భావిస్తున్నారు. ఎమ్మెల్యే గోరంట్ల, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు వర్గాల మధ్య పచ్చ గడ్డి వేయకుండానే భగ్గుమనే వాతావరణం ఈ ప్రకటనతో కనిపిస్తోంది. గోరంట్ల రూరల్కు వెళ్లిపోయినా సిటీపైనే ఆయన దృష్టి ఉంది. పార్టీలో సీనియర్ అయిన తనను కాదని వేరేవారిని ప్రోత్సహించారనే ఆవేదన ఆయనలో మొదటి నుంచి ఉంది. ఈ విషయాన్ని ఆయన అనేక సందర్భాల్లో వెళ్లగక్కుతూనే ఉంటారు. ఏడాదిన్నర క్రితం సిటీలో తమ వర్గానికి చెందిన వారికి పదవుల్లో ప్రాతినిధ్యం లేకుండా చేశారనే ఆవేదనతో పార్టీ, రాజకీయాలకు దూరమవుతున్నట్టు మీడియాకు తెలియచేసి హైడ్రామా సృష్టించారు. చివరకు పార్టీ పదవులు తమ వారికి సాధించుకుని ఆధిపత్యాన్ని నిలబెట్టుకున్నారు. చదవండి: (జనసేన వారు 62 మంది.. టీడీపీ వారు 21 మంది) టీడీపీలో అంతర్యుద్ధం సిటీ నియోజకవర్గంలో తనకంటూ ఉన్న మాజీ కార్పొరేటర్లతో ఆదిరెడ్డి వర్గానికి పోటీగా గోరంట్ల పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఇవన్నీ నడుస్తోన్న క్రమంలోనే తన రాజకీయ వారసుడిగా సోదరుడు శాంతారామ్ తనయుడు రవిరామ్ను తెరమీదకు తీసుకువచ్చారు. అంతటితోనే ఆగకుండా సిటీలో తన పుట్టిన రోజు వేడుకలను విస్తృతంగా నిర్వహించి రాజకీయాలకు తానేమీ దూరం కాలేదని స్పష్టం చేశారు. ఇంతకంటే ముందుగానే గోరంట్ల వైరి పక్షమైన మాజీ ఎమ్మెల్సీ అప్పారావు కూడా రాజకీయ వారసుడిగా తనయుడు వాసును ప్రకటించడంతో టీడీపీలో అంతర్యుద్ధం మొదలైంది. నాటి నుంచి చాపకింద నీరులా సాగుతోన్న ఈ రెండు వర్గాల అంతర్గత పోరు వాసు తాజా ప్రకటనతో మళ్లీ తెరపైకి వచ్చింది. ప్రకటన వెనుక వ్యూహం వాసు ప్రకటన వెనుక రాజకీయ దూరాలోచన ఉందని పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. భవిష్యత్ రాజకీయ వ్యూహం ఉందంటున్నారు. వచ్చే ఎన్నికల్లో ఎంపీ స్థానానికి ఆదిరెడ్డి కుటుంబం నుంచి పోటీకి పెడతారని ఇటీవల ఆ పార్టీలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. దీనిని గోరంట్ల వర్గం భుజానకెత్తుకుని చేస్తోందని ఆదిరెడ్డి వర్గం అనుమానం వ్యక్తం చేస్తోంది. సిటీ కోసం ఆరాటపడుతోన్న గోరంట్ల వర్గం పనిగట్టుకుని చేస్తున్న ప్రచారాన్ని తిప్పికొట్టే వ్యూహంలో భాగంగానే వాసు తాజా ప్రకటన అంతరార్థమని తెలుస్తోంది. తాము ఎట్టి పరిస్థితుల్లోనూ సిటీ నుంచే పోటీ చేస్తామని, ఎంపీగా వెళ్లే ప్రసక్తే లేదని వాసు తేల్చి చెప్పారు. సిట్టింగ్ ఎమ్మెల్యే భవాని ఉండగా ఆమెను కాదని భర్త వాసు పోటీ చేస్తాననడం పార్టీలో చర్చనీయాంశంగా మారింది. ఆమె పనితీరు సమర్థవంతంగా లేదనా, లేక రాజకీయాల్లో రాణించలేక పోతున్నారనా.. వీటిలో ఏ కారణంతో వాసు పోటీకి సై అంటున్నారని నాయకులు గుసగుసలాడుకుంటున్నారు. గత ఎన్నికల్లో ఆమెను బలపరిచాను, వచ్చే సారి ఆమె నన్ను బలపరుస్తుంది అని వాసు మీడియా వద్ద ముక్తాయించడం గమనార్హం. దీనిపై గోరంట్ల వర్గం ఏ రకమైన రాజకీయ వ్యూహాలకు పదును పెడుతుందో వేచి చూడాల్సిందే. -
బాబుగారు.. మీకో దండం! దూరమవుతున్న లీడర్లు
సాక్షి, అమరావతి: తెలుగుదేశం పార్టీలో సీనియర్ నాయకులు ఇమడలేక సతమతమవుతున్నారా? దశ దిశా లేకుండా దిక్కులేని పక్షిలా సాగుతున్న పార్టీ ప్రయాణంతో తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతున్నారా? జనంతో సంబంధం లేకుండా నిత్యం మీడియాలో కనిపిస్తూ.. చంద్రబాబు, లోకేష్ భజన చేస్తూ పబ్బం గడుపుకునే నేతలకే ప్రాధాన్యం ఇస్తూ తమను అవమానిస్తుండడాన్ని తట్టుకోలేకపోతున్నారా? అంటే అవుననే అంటున్నారు.. రాజకీయ విశ్లేషకులు. విజయవాడ ఎంపీ కేశినేని నాని తాజా ఉదంతమే ఇందుకు నిదర్శనమని చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లో తాను ఎంపీగా పోటీ చేయబోనని, మరో అభ్యర్థిని చూసుకోవాలని కేశినేని నాని.. చంద్రబాబుకు స్పష్టంగా తేల్చిచెప్పడాన్ని బట్టి సీనియర్ నాయకుల్లో అసంతృప్తి ఏ స్థాయిలో ఉందో ఇట్టే తెలుసుకోవచ్చని అంటున్నారు. ఇటీవలే రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పార్టీ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. టీడీపీ నడుస్తున్న తీరు బాగోలేదంటూ ఆయన రాజీనామా చేయడానికి కూడా సిద్ధపడ్డారు. చంద్రబాబు జోక్యం చేసుకుని బుజ్జగించడంతో తాత్కాలికంగా తన నిర్ణయాన్ని బుచ్చయ్య వాయిదా వేసుకున్నారు. అయితే పార్టీ అధినాయకత్వం పట్ల ఆయన అభిప్రాయం మాత్రం మారలేదని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. అనంతపురంలో జేసీ దివాకర్రెడ్డి, ప్రభాకర్రెడ్డి సైతం పార్టీ తీరు పట్ల బహిరంగంగానే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తిరుపతి ఎంపీ ఉప ఎన్నిక సందర్భంగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఒక ప్రైవేటు సంభాషణలో టీడీపీ పని అయిపోయిందని, ‘పార్టీ లేదు.. బొక్కా లేదు’ అని వ్యాఖ్యానించడం కలకలం రేపింది. వీరే కాకుండా ఇంకా అనేక మంది సీనియర్ నాయకులు టీడీపీ మునిగిపోతున్న నావ అనే అభిప్రాయంతో ఉన్నట్లు ఆ పార్టీ వర్గాలే చర్చించుకుంటున్నాయి. చురుగ్గా లేని సీనియర్ నేతలు గతంలో టీడీపీలో క్రియాశీలకంగా పనిచేసిన నాయకులు ఎవరూ ప్రస్తుతం చురుగ్గా లేరు. టీడీపీ ప్రభుత్వ హయాంలో కీలక మంత్రిగా చక్రం తిప్పిన నారాయణ దాదాపు పార్టీకి దూరమయ్యారు. మరో మాజీ మంత్రి, విశాఖ నార్త్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు టీడీపీలో ఉన్నారో, లేదోననే పరిస్థితి ఉంది. రాజమండ్రి మాజీ ఎంపీ మురళీమోహన్ పార్టీకి దూరమయ్యారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు చక్రం తిప్పిన మంత్రులు, ఎంపీలు, ఇతర నేతల్లో నలుగురైదుగురు మినహా ప్రస్తుతం ఎవరు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. వారి నియోజకవర్గాల్లో సాక్షాత్తూ పార్టీ అధినేత చంద్రబాబు పర్యటించినా పట్టించుకోవడం లేదు. టీడీపీ తరఫున గెలిచిన 23 మంది ఎమ్మెల్యేల్లో నలుగురు (వల్లభనేని వంశీ, మద్దాళి గిరి, వాసుపల్లి గణేష్, కరణం బలరామకృష్ణమూర్తి) ఆ పార్టీకి దూరమయ్యారు. మిగిలిన ఎమ్మెల్యేల్లో సగం మంది గోడ దూకడానికి ఎప్పుడో సిద్ధమైనట్లు టీడీపీ వర్గాలే చెబుతున్నాయి. టీడీపీకి ఈ పరిస్థితి రావడానికి చంద్రబాబు వైఖరే ప్రధాన కారణంగా చెబుతున్నారు. ఆయన తన తనయుడు లోకేష్కి పెత్తనం అప్పగించడం సీనియర్లకు మింగుడుపడడం లేదు. తన భజన చేసే వారినే ఆయన ప్రోత్సహిస్తుండడం వారికి తీవ్ర ఆగ్రహం తెప్పిస్తోందంటున్నారు. -
బుచ్చిరాజ్యంలో.. ఆదిపత్య పోరు
వందల ఏళ్ల చరిత్ర కలిగి.. రాజరాజనరేంద్రుడు ఏలిన పురాతన రాజమహేంద్రవరం నగరంలో ఆధిపత్యం కోసం ఇద్దరు సామంతులు ‘ఎత్తుల’ కత్తులు దూస్తున్నారు. ఒక సామంతుడు ‘బుచ్చి’రాజు. మరొకరు ‘ఆది’రాజు. రాజులు పోయినా.. రాజ్యాలు పోయినా రాచరికపు వాసనలు వారిని వీడటం లేదు. బుచ్చిరాజును సైన్యంతో సహా పదేళ్ల క్రితమే పొరుగు రాజ్యానికి ఆదిరాజు తరిమేశారు. అప్పటి నుంచీ కోల్పోయిన రాజ్యంలో పట్టు సాధించాలనే ఆరాటంతో.. అవకాశం వచ్చినప్పుడల్లా అలక పాన్పు ఎక్కేస్తున్నారు బుచ్చిరాజు. వందిమాగధులతో రకరకాల తంత్రాలు పన్నుతున్నారు. దాదాపు నాలుగు దశాబ్దాల అనుభవంతో రాజకీయ మాయోపాయాలు పన్ని, ఆదిరాజును ఇరుకున పెట్టి, రాజ్యంలో పట్టు సాధించాలన్నది ఆయన వ్యూహం. సాక్షి,రాజమహేంద్రవరం: ఉత్తరాంధ్ర పరగణాల్లో ఒకప్పుడు చక్రం తిప్పిన ఆజానుబాహుడైన ఓ నాయుడికి స్వయానా బంధువైన ఆదిరాజు ఏమైనా తక్కువ తిన్నారా? బుచ్చిరాజు ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ తన రాజ్యంలో వేలు పెడితే యుద్ధం తప్పదని వేగుల ద్వారా బుచ్చిరాజుకు సందేశం పంపించారు. అలనాడు దుర్యోధనుడు చెప్పినట్టు ‘‘సూది మొన మోపినంత స్థలం కూడా వదులుకోన’’ని స్పష్టంగా చెప్పాడు. విషయం ఆ నోటా ఈ నోటా రాజ్యం నలుమూలలా పాకడంతో సామంతులు, ఆంతరంగికుల మధ్య మాటల యుద్ధమే నడుస్తోంది. భటుల ద్వారా ఇది తెలుసుకున్న బుచ్చిరాజు అగ్గిమీద గుగ్గిలమయ్యారు. అలాగని వందిమాగధులతో యుద్ధానికి సై అని సాహసించడం లేదు. తన రాజ్యంలోని సైనిక సంపత్తి, మంత్రాంగం సరిపోదనే కారణంతో.. అలకబూని.. రాజప్రసాదం తలుపులు తెరవకుండా మూడు రోజులుగా అంతఃపురానికే పరిమితమైపోయారు. ఈ తరహా రాజకీయ తంత్రం బుచ్చిరాజుకు కొత్తేమీ కాదు. రాజమహేంద్రవర రాజ్యాన్ని కోల్పోయిన గాయం ఇంకా మానకున్నా.. ‘చంద్ర’వంశ రాజదర్బార్లో కనీస మర్యాద కూడా దక్కడం లేదని ఏడు పదుల వయస్సులో ఉన్న ఈ సామంతరాజు కుమిలిపోతున్నారు. గతంలో కూడా ఇలానే కనీసం వయస్సుకు కూడా విలువ ఇవ్వడం లేదంటూ అంతఃపురంలో ఏకాంతంగా అంతర్మధనం చెందిన సందర్భాలు చాలానే ఉన్నాయని ఆంతరంగికులు గుసగుసలాడుకుంటున్నారు. దాదాపు పదేళ్లుగా అవమాన భారంతో రగిలిపోతున్న బుచ్చిరాజు కోల్పోయిన చోటే వెతుక్కోవాలనే సూత్రాన్ని అనుసరిస్తున్నట్టు కనిపిస్తోంది. కానీ ఆయన ఎత్తులు ఆదిరాజు రాజకీయ తంత్రం ముందు చిత్తవుతున్నాయి. భవిష్యత్లో రాజమహేంద్రవరంలోని 52 పరగణాలకు జరిగే పోరు కోసమే సామంతుల మధ్య ఇంతటి రాజ్యకాంక్ష నెలకొందనే చర్చ రాజదర్బారులో నడుస్తోంది. బుచ్చిరాజు రాజ్యంలోకి వచ్చే తొమ్మిది పరగణాలతో పాటు, మిగిలిన 43 పరగణాల్లో తన సుబేదారులకే పట్టు ఎక్కువ ఉండటంతో.. వారిని యుద్ధరంగంలోకి దింపాలనేది బుచ్చిరాజు వ్యూహం. అయినప్పటికీ ఆదిరాజు సిక్కో లు రాజుల బంధుత్వం దన్నుతో ధీమాగా ఉన్నారని ఆ రాజప్రసాదంలోని భటులు చెప్పుకొంటున్నారు. సామంతుల మధ్య సంధి కోసం ‘చంద్ర’వంశ రాజు పంపించిన దూతలు బుచ్చిరాజు అంతఃపురంలో గంటన్నర చర్చించినా చివరకు తలలు పట్టుకుని వచ్చిన దారినే పలాయనం చిత్తగించారు. పైకి మాత్రం సామంతుల మధ్య యుద్ధ వాతావరణం లేదని, బుచ్చిరాజుకు అసలు అసంతృప్తే లేదని చెప్పారు. ‘చంద్ర’వంశ సామంతులు నిమ్మకాయల చినరాజు, బెజవాడలో ‘గద్దె’నెక్కిన రామ్మోహనరాజు, రాజమహేంద్రవరం రాజ్యంలో గోదావరి అవతల ఒడ్డున ప్రజలకు చుక్కలు చూపించిన హర్రర్రాజు, అనపర్తి రెడ్డి రాజు వంటి దూతల సంధి విఫలమైంది. అసలు సామంతుల మధ్య చిచ్చు పెట్టిందే ‘చంద్ర’వంశ రాజు. సంధి కోసం వెళ్లిన దూతలు మధ్యలో అంతఃపురం బయట చెప్పుకొన్న మాటలను రహస్యంగా విన్న రాజభటులు బుచ్చిరాజు చెవిన వేశారు. నాడు పిల్లనిచ్చి, మంత్రిని చేసిన మామ రాజ్యాన్నే కూల్చేసి, సింహాసనం అధిíÙ్ఠంచి, ఇన్నేళ్లవుతున్నా.. తన వ్యతిరేక కూటమితో చేతులు కలిపిన బుచ్చిరాజును ఒకప్పటి ‘చంద్ర’వంశ రాజు ఇప్పటికీ వదిలిపెట్టలేదని వేగుల ద్వారా వచ్చిన సమాచారం. అందుకే ఈ సంధి యత్నాలు ‘చంద్ర’వంశ అంతఃపురం సాక్షిగా రక్తి కట్టిస్తున్న ఎత్తుగడగా కనిపిస్తున్నాయి. చక్రవర్తిగా బుచ్చిరాజు చలామణీ అయ్యే రోజుల్లో అతడికి ఆదిరాజు సామంతుడు కావడమే విచిత్రం. సామంతుల మ«ధ్య చిచ్చు చివరకు ఏ తీరానికి చేరుతుందోనని ఇరుగు, పొరుగు రాజ్యాల్లోని నాయకులు, ప్రజలు కోటగోడలెక్కి మరీ ఆసక్తిగా చూస్తున్నారు. -
అధిష్టానంపై ‘గోరంట్ల’ తీవ్ర అసంతృప్తి
సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం: తెలుగు దేశం పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చియ్య చౌదరి అధిష్టానంపై తీవ్ర అసంతృప్తి వెళ్లగక్కారు. పార్టీకి, ఎమ్మెల్యే పదవికి గోరంట్ల రాజీనా మా చేస్తున్నట్లు గురువారం సామాజిక మాధ్యమాల్లో విస్తృత ప్రచారం జరిగింది. ఈ సమాచారంపై మీడియా వద్ద స్పందించేం దుకు గోరంట్ల తొలుత నిరాకరించారు. సీని యర్ అయిన తనను పార్టీ అధిష్టానం అవ మానానికి గురిచేస్తోందనే ఆవేదనతో రాజమ హేంద్రవరంలో ఇంటికే పరిమిత మయ్యారు. విషయం తెలుసుకుని ఆ పార్టీ మరో ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప, మాజీమంత్రి జవహర్ ఆయనను బుజ్జగించే ప్రయత్నం చేశారు. చంద్రబాబుతో మాట్లాడి సర్దుబా టు చేస్తామని, గోరంట్ల రాజీనామా ప్రస్తావన రాలేదని, అసంతృప్తి మాత్రమేనని చిన రాజప్ప, జవహర్ ప్రకటించారు. అయినా.. అలక వీడని గోరంట్ల పార్టీలో తాను ఒంటరినని, చంద్రబాబును మాత్రం కలిసేది లేదని, నాయకులే కలుస్తారని స్పష్టంచేశారు. పార్టీ పదవులు, పీఏసీ చైర్మన్లో ప్రాధాన్యం ఇవ్వక పోవడంతో చంద్రబాబుపై గోరంట్ల తీవ్ర అసంతృప్తితో రాజీనామాకు సిద్ధపడుతు న్నట్లు సమాచారం. దీనిపై గోరంట్ల స్పందిస్తూ.. రాజీనామా విషయంపై వారం, పది రోజుల్లో స్పష్టతనిస్తానని చెప్పారు. -
టీడీపీలో ‘గోరంట్ల’ కలకలం: చంద్రబాబును కలవనని ప్రకటన
సాక్షి, తూర్పుగోదావరి: తెలుగుదేశం పార్టీలో గోరంట్ల బుచ్చయ్య చౌదరి వ్యవహారం కలకలం రేపింది. పార్టీలోని అంతర్గత వర్గ విభేదాలు ఆయన ప్రకటనతో ఒక్కసారిగా తారస్థాయికి చేరుకున్నాయి. ఆయన త్వరలో టీడీపీకి రాజీనామా చేస్తారనే వార్తలు గురువారం గుప్పుమన్నాయి. పార్టీలో సీనియర్ అయిన బుచ్చయ్య చౌదరి రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యేగా ఉన్నారు. తాజాగా ఆయన పార్టీ నాయకత్వంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా బుచ్చయ్య చౌదరి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘నేను చంద్రబాబును కలవను. నేను ఒంటరివాడిని. చంద్రబాబును నా వద్దకు వచ్చిన నాయకులు వెళ్లి కలుస్తారు. పార్టీ మనుగడ కోసమే ఇదంతా చేస్తున్నా. నేను ఏ నిర్ణయం తీసుకున్నా బహిరంగంగా మీకే చెబుతా. పార్టీ నిర్వహణలోని లోపాలను ఎత్తిచూపడమే లక్ష్యం’ అని తెలిపారు. ఇటీవల తన వర్గాన్ని అధిష్టానం పట్టించుకోవడం లేదని ఆయన ఆవేదన చెందారు. తన వ్యతిరేక వర్గం ఆదిరెడ్డికి ప్రాధాన్యత ఇవ్వడంపై విచారం వ్యక్తం చేశారు. చదవండి: కేంద్ర మంత్రి కిషన్రెడ్డికి గాయం -
టీడీపీ నాయకత్వంపై బుచ్చయ్య చౌదరి అసంతృప్తి
సాక్షి, తూర్పు గోదావరి: టీడీపీలో అంతర్గత వర్గ విభేదాలు తారస్థాయికి చేరుకున్నాయి. ఏకంగా టీడీపీ సీనియర్ ఎమ్మెల్యేనే పార్టీ నాయకత్వంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి పార్టీ నాయకత్వంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తన వర్గాన్ని అధిష్టానం పట్టించుకోవడం లేదని ఆయన ఆవేదన చెందారు. తన వ్యతిరేక వర్గం ఆదిరెడ్డికి ప్రాధాన్యత ఇవ్వడం పై విచారం వ్యక్తం చేశారు. కాగా, గత మార్చి నెలలో పార్టీ నాయకత్వ మార్పుపై బుచ్చయ్య చౌదరి సంచలనాత్మక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. టీడీపీ 40వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా రాజమండ్రిలో నిర్వహించిన వేడుకల్లో టీడీపీలో పెనుమార్పులు చోటుచేసుకోబోతున్నాయంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు పార్టీ వర్గాల్లో చర్చకు దారి తీశాయి. టీడీపీలో కొత్త నాయకత్వం రాబోతోందని ఆయన వ్యాఖ్యానించడం అప్పట్లో హాట్ టాపిక్ అయ్యింది. మరొకసారి టీడీపీపై గోరంట్ల బుచ్చయ్య చౌదరి సంచలన వ్యాఖ్యలు చేసిన తరుణంలో టీడీపీ నేతలు సతమతమవుతున్నారు.ఒకవైపు పలు ఎన్నికల్లో టీడీపీ చవిచూసిన ఓటమి నుంచి ఇంకా కోలుకోకపోవడం, మరోవైపు గత టీడీపీ హయాంలో జరిగిన అవినీతి ఉచ్చు బిగుసుకోవడంతో ఏం చేయాల్లో తెలియని డైలమాలో ఉన్నారు. -
టీడీపీ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి సంచలన వ్యాఖ్యలు
సాక్షి, తూర్పుగోదావరి: వరుసగా ఎదురవుతున్న ఘోర పరాజయాల నేపథ్యంలో టీడీపీ నిరాశ, నిస్పృహలతో కొట్టుమిట్టాడుతోంది. ఒకవైపు ఎన్నికల్లో ఓటమి నుంచి ఇంకా కోలుకోకపోవడం, మరోవైపు గత టీడీపీ హయాంలో జరిగిన అవినీతి ఉచ్చు బిగుసుకోవడంతో ఏంచేయాల్లో తెలియక టీడీపీ నేతలు సతమతమవుతున్నారు. పార్టీ బలహీనపడిన నేపథ్యంలో కొంతకాలంగా టీడీపీలో నాయకత్వ మార్పుపై తీవ్రస్థాయిలో చర్చ జరుగుతుంది. తాజాగా పార్టీ నాయకత్వ మారుపై టీడీపీ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి సంచలనాత్మక వ్యాఖ్యలు చేశారు. టీడీపీ 40వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా సోమవారం రాజమండ్రిలో నిర్వహించిన వేడుకల్లో టీడీపీలో పెనుమార్పులు చోటుచేసుకోబోతున్నాయంటూ ఆయన వెల్లడించారు. టీడీపీలో కొత్త నాయకత్వం రాబోతోందంటూ ఆయన చేసిన కీలక వ్యాఖ్యలపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. చదవండి: బీజేపీ - జనసేన పొత్తుపై మరోసారి సందిగ్ధం.. నామినేషన్ వేసిన వైఎస్సార్సీపీ అభ్యర్థి గురుమూర్తి -
టీడీపీ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరీ పీఏ అరెస్ట్
తూర్పు గోదావరి: రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పీఏ చిటికెల సందీప్ను పోలీసులు బుధవారం శ్రీశైలంలో అదుపులోకి తీసుకున్నారు. వివరాలు.. హుకుంపేట వినాయకుని విగ్రహానికి మలినం పూసిన ఘటనపై సోషల్ మీడియాలో మతవిద్వేషాలు రెచ్చగొట్టేలా ప్రచారం చేశాడని సందీప్పై ఆరోపణలు వచ్చాయి. అయితే ఇదే ఘటనలో పోలీసులు మొదట టీడీపీ నేత బాబుఖాన్ చౌదరిని అరెస్టు చేశారు. కానీ ఈ అంశంలో బుచ్చయ్య చౌదరీ పీఏ సందీప్ హస్తం ఉందని తెలుసుకున్న పోలీసులు అతన్ని అరెస్టు చేసేందుకు సిద్ధమవ్వగా అప్పటినుంచి అతను పరారీలో ఉన్నాడు. తాజాగా పరారీలో ఉన్న సందీప్ శ్రీశైలంలో ఉన్నట్లు తెలుసుకున్న పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. అనంతరం కోర్టులో హాజరుపరచగా.. కోర్టు సందీప్కు రిమాండ్ విధించింది. కాగా ఈ కేసులో మరికొందరిపై కూడా కేసు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. -
ఆ పోస్టు పెట్టించింది నేనే: గోరంట్ల
సాక్షి, రాజమహేంద్రవరం : వెంకటగిరిలో వినాయక విగ్రహానికి మలినం పూసిన ఘటనపై మత విద్వేషాలకు తావు లేకుండా చూడాలని చెప్పి, తన పీఏతో సోషల్ మీడియాలో పోస్టింగ్ పెట్టించానని రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి చెప్పారు. అయితే దాన్ని నేరంగా భావించి అతడిపై కేసులు పెట్టడం దారుణమన్నారు. తన నివాసంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఐ, ఎస్పీలకు ఫోన్ చేసి, నిందితులను త్వరగా పట్టుకోవాలని కోరినట్టు చెప్పారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి ఎమ్మెల్యే గోర్లంట పీఏ చిటికన సందీప్ను పోలీసులు మంగళవారం శ్రీశైలంలో అరెస్ట్ చేశారు. బొమ్మూరు స్టేషన్కు తీసుకువచ్చి మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా 15 రోజులు రిమాండ్ విధించారు. చదవండి: విగ్రహం మలినం కేసులో టీడీపీ నేత అరెస్టు చదవండి: శ్రీరాం.. నీ బండారం బయటపెడతా! -
పార్లమెంట్లో గళమెత్తిన గోరంట్ల మాధవ్
సాక్షి, అనంతపురం: ‘ఓ వైపు ప్రకృతి వైపరీత్యం, మరోవైపు గత ప్రభుత్వ వైఫల్యం.. కరువు జిల్లా ‘అనంత’లో రైతులు కుదేలయ్యారు. పదిమందికి అన్నం పెట్టే రైతు అన్నమో రామచంద్రా...అంటూ ఉపాధి లేక పొట్టకూటి కోసం ఇతర రాష్ట్రాలకు వలస వెళ్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేస్తే రైతులకు ఉపయోకరంగా ఉంటుంది’ అని హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ అన్నారు. గురువారం ఆయన పార్లమెంటులో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై మాట్లాడారు. జిల్లాలో నెలకొన్న కరువు, రైతుల దుస్థితి, అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై ఇంగ్లిషులో ప్రసంగించారు. తీవ్ర కరువుతో కొట్టుమిట్టాడుతున్న అనంతపురం జిల్లా అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని కోరారు. మహిళలు ఎంతో గౌరవింపబడుతున్న ఈ దేశంలో తీవ్ర కరువుతో పూటగడవక కొందరు వ్యభిచార గృహాలకు తరలిపోతుండగా...మరికొందరు ఉపాధి కోసం కుటుంబాలను వదిలి గల్ఫ్ దేశాలకు వెళ్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దుస్థితికి కారణం ఎవరని ప్రశ్నించారు..?. ఢిల్లీకి కూత వేటు దూరంలోనే వ్యభిచార గృహాలు నడుస్తున్నాయన్నారు. మరోవైపు బడికి వెళ్లాల్సిన పసి పిల్లలు రోడ్లుపై తిరుగుతూ కనిపిస్తున్నారన్నారు. నిర్బంధ ఉచిత విద్య చట్టాన్ని పక్కాగా అమలు చేయాలని కోరారు. లేదంటే పిల్లలు భవిష్యత్తులో జాతికి బరువుగా మారే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు. తీవ్రవాదులు, టెర్రరిస్టులుగా మారితే ఆరోజు వారిని అదుపు చేసేందుకు రూ.వంద ఖర్చు చేయాల్సి ఉంటుందన్నారు. అదే నేడు రూ.10 ఖర్చు చేసి బడిలో చేర్పిస్తే ప్రయోజనం ఉంటుందని ప్రభుత్వం ఆ దిశగా ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు. -
గోరంట్ల బుచ్చయ్య వర్సెస్ సోము వీర్రాజు
సాక్షి, కాకినాడ: తూర్పు గోదావరి జిల్లాకు సంబంధించి కాకినాడలో జరిగిన అధికారుల సమీక్షా సమావేశంలో టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు మధ్య మాటల యుద్ధం జరిగింది. ఏం మాట్లాడుతున్నవాంటే ఏం మాట్లాడుతున్నావని వాదించుకున్నారు. వైఎస్ఆర్ హయాంలో మంజూరైన ఇళ్లను ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన టీడీపీ పూర్తి చేయలేదని సోము వీర్రాజు అనగానే బుచ్చయ్య చౌదరి ఆవేశంతో ఊగిపోయారు. మిగిలిన సభ్యులు, మంత్రులు వీరిని శాంతింపజేశారు. -
అర్హులందరికీ నవరత్నాలు
సుపరిపాలన అందించడమే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి లక్ష్యమని, అర్హులందరికీ నవరత్నాలను అందిస్తామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి మాలగుండ్ల శంకర నారాయణ అన్నారు. శనివారం ఆయన జిల్లా అభివృద్ధి, సంక్షేమంపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. సాక్షి, అనంతపురం అర్బన్: ‘జిల్లా అభివృద్ధికి మీ అందరి సహకారం కావాలి. సుపరిపాలన పాలన అందించడమే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ధ్యేయం. ఆయన నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం అవినీతి రహిత సంక్షేమ పాలన అందించే దిశగా ముందుకెళుతోంది. ‘నవరత్నాల’ ఫలాలు అర్హులైన ప్రతి పేదవానికి అందాలి. ప్రజాప్రతినిధులు, అధికారులు సమష్టిగా పనిచేసి ప్రజా ప్రభుత్వ లక్ష్యాన్ని సాధిద్దాం’ అని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎం.శంకరనారాయణ పిలుపునిచ్చారు. జిల్లా అభివృద్ధి, సంక్షేమంపై కలెక్టర్ ఎస్.సత్యనారాయణ అధ్యక్షతన తొలిసారిగా జిల్లా అధికారులతో మంత్రి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐదేళ్లుగా ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారని, కరువుతో రైతులు పూర్తిగా నష్టపోయారన్నారు. ఈ నేపథ్యంలో పేదలు, రైతుల సంక్షేమమే లక్ష్యంగా ముఖ్యమంత్రి నిర్ణయాలు తీసుకుంటున్నారన్నారు. జిల్లా రైతులకు రూ.1,007 కోట్ల ఇన్పుట్ సబ్సిడీ ఈ క్రమంలోనే రైతులను ఆదుకునేందుకు 2014 నుంచి వారికి రావాల్సిన ఇన్పుట్ సబ్సిడీ రూ.2,000 కోట్లు ఇచ్చేందుకు తొలి కేబినెట్లోనే ఆమోదం తెలిపారన్నారు. ఇందులో జిల్లా రైతులకు రూ.1,007 కోట్లు అందనుందని తెలిపారు. పిల్లలను బడికి పంపే ప్రతి తల్లికి అమ్మఒడి ద్వారా రూ.15 వేలు, రైతు భరోసా ద్వారా పేద రైతులకు పెట్టుబడికి ఏటా రూ.12,500 ఇవ్వనున్నట్లు చెప్పారు. రైతుల పంటలకు గిట్టుబాటు ధర కల్పించేందుకు రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి, పకృతి వైపరిత్యాల కారణంగా పంట నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు రూ.4 వేల కోట్లతో పకృతి విపత్తుల నిధిని ఏర్పాటు చేయాలని నిర్ణయించారన్నారు. ప్రతి పేదవానికి ఇల్లు, వృద్ధులకు దశలవారీగా పింఛన్ రూ.3 వేలకు పెంపు, పింఛన్ అర్హత వయస్సు 65 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు తగ్గింపు, నిత్యావసరాలను ఇంటికే చేర్చడం, గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేసి నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పన దిశగా చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. ప్రతి 50 ఇళ్లకు ఒక వలంటీర్ నియామకం, ఉద్యోగులకు 27 శాతం ఐఆర్ (మధ్యంతర భృతి), సీపీఎస్ రద్దు, పారిశుద్ధ్య కార్మికులకు రూ.18 వేలు వేతనం, రూ.వెయ్యిదాటితే ఆరోగ్యశ్రీ వర్తింపజేయడం లాంటి కీలకమైన నిర్ణయాలు ముఖ్యమంత్రి తొలి కేబినెట్ సమావేశంలో తీసుకున్నారని గుర్తు చేశారు. తాగునీరు, వ్యవసాయం, విత్తన పంపిణీ, ఉద్యన పంటలు, తదితర అంశాలపై సమీక్షించారు.సమావేశంలో హిందూపురం ఎంపీ గోరంట్ల మాదవ్, ఎమ్మెలేలు వై.వెంకటరామిరెడ్డి, జొన్నలగడ్డ పద్మావతి, జేసీ ఎస్.డిల్లీరావు, జేసీ–2 హెచ్.సుబ్బరాజు, డీఆర్ఓ ఎం.వి.సుబ్బారెడ్డి, జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఉరవకొండలో నీటి ఎద్దడి ఉరవకొండ పట్టణంలో తొమ్మిది రోజులుగా నీటి సరఫరా లేదు. నిర్వహణ లోపం కారణంగా ఈ సమస్య వచ్చింది. వారంలోగా సమస్య పరిష్కరించాలి. పంటల బీమాలో మార్పు తేవాలి. వాతావరణ బీమా వల్ల రైతుకు ప్రయోజనం కలగడం లేదు. గ్రామం యూనిట్గా బీమా వర్తించేలా ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపించాలి. – పయ్యావుల కేశవ్, ఉరవకొండ ఎమ్మెల్యే ఎస్కేయూలో నీటి ఎద్దడి పరిష్కరించాలి శ్రీ కృష్ణ దేవరాయ విశ్వవిద్యాలయంలో నీటి ఎద్దడి అధికంగా ఉంది. వెంటనే నీటి సమస్యను పరిష్కరించాలి. నగర పాలక సంస్థలో ఉపాధ్యాయులకు సంబంధించి రూ.36 లక్షలు దుర్వినియోగమయ్యాయి. విచారణ చేసి వారి ఖాతాల్లో జమ చేయాలి. మధ్యాహ్న భోజన పథకం నిర్వహణకు కొన్ని పాఠశాల్లో నీటి సమస్య ఉంది. అలాంటి చోట ట్యాంకర్లు ఏర్పాటు చేయాలి. – కత్తినరసింహారెడ్డి, ఎమ్మెల్సీ రిజర్వాయర్తో శాశ్వత పరిష్కారం నియోజకవర్గానికి ఒక రిజర్వాయర్ ఏర్పాటు చేస్తే నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది. రూ.4 కోట్ల నుంచి రూ.5 కోట్లు వెచ్చించి జీడిపల్లి, పీఏబీఆర్ నుంచి పైప్లైన్ ద్వారా ఆత్మకూరు మండల కేంద్రానికి నీటిని ఇవ్వవచ్చు. పీఏబీఆర్ పైన్లైన్ ద్వారా కక్కలపల్లి, నారాయణపురం, రాజీవ్కాలనీ, ఇలా మరికొన్ని పంచాయతీలకు నీటిని ఇవ్వడం ద్వారా ఎద్దడి నివారించవచ్చు. – తోపుదుర్తి ప్రకాశ్రెడ్డి, రాప్తాడు ఎమ్మెల్యే జిల్లాలో పరిశ్రమలు ఏర్పాటు చేయాలి జిల్లాలో పరిశ్రమలు ఏర్పాటు జరగాలి. ప్రత్యేకంగా బెంగుళూరు, తదితర ప్రాంతాల్లోని పారిశ్రామికవేత్తలను ఒక చోటకు చేర్చి సదస్సు నిర్వహించాలి. తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి. ఆ దిశగా అధికారులు ప్రణాళిక సిద్ధం చేయాలి. బుక్కపట్నం, మారాల, చెర్లోపల్లి రిజర్వాయర్లలో డెడ్ స్టోరేజ్ ఉండేలా చూడాలి. ఇందుకు స్లూయిజ్ గేట్లు ఏర్పాటు చేయాలి. – దుద్దకుంట శ్రీధర్రెడ్డి, పుట్టపర్తి ఎమ్మెల్యే జేసీ నాగిరెడ్డి పథకం పూర్తి చేయాలి తాడిపత్రిలో తాగునీటి సమస్య అధికంగా ఉంది. పెన్నా, చిత్రావతిలో ఇసుక తోడేస్తున్నారు. దీంతో భూగర్భ జలాలు అడుగంటి బోర్లు ఎండిపోయాయి. ఇసుకు అక్రమ తవ్వకాలపై చర్యలు తీసుకోవాలి. అదే విధంగా జేసీ నాగిరెడ్డి పథకాన్ని యుద్దప్రాతిపదికన పూర్తి చేయాలి. – కేతిరెడ్డి పెద్దారెడ్డి, తాడిపత్రి ఎమ్మెల్యే తాగునీటి ఎద్దడి అధికం మా నియోజకర్గలోని 120 గ్రామాల్లో నీటి సమస్య ఉంది. హెచ్ఎన్ఎస్ఎస్ ద్వారా మడకశిర బ్రాంచ్ కెనాల్కు నీరు ఇవ్వకుండా తుమ్మలూరుకు తీసుకెళ్లడం ఏమిటి. శ్రీరామిరెడ్డి ప్రాజెక్టు ద్వారా నీరు అందించాలి. రోడ్డు విస్తరణలో భాగంగా బాలికల పాఠశాల కూల్చేశారు. – డాక్టర్ తిప్పేస్వామి, మడకశిర ఎమ్మెల్యే నీటి సమస్య తీవ్రంగా ఉంది మా నియోజకవర్గం పరిధిలో నీటి ఎద్దడి అధికంగా ఉంది. సత్యసాయి పైప్లైన్–2 ద్వారా నీటిని అందించాలి. సీపీడబ్లూ స్కీమ్ ద్వారా ట్యాంక్లు నింపాలి. నీటి ఎద్దడి అధికంగా ఉన్న గ్రామాల్లో తక్షణం నీరు సరఫరా చేయాలి. తీవ్ర వర్షాభావంతో మామిడి చెట్లు ఎండిపోతున్నాయి. – డాక్టర్ సిద్ధారెడ్డి, కదిరి ఎమ్మెల్యే శాశ్వత చర్యలు చేపట్టాలి జిల్లావ్యాప్తంగా నీటి సమస్య తీవ్రంగా ఉంది. పరిష్కారానికి శాశ్వత చర్యలు చేపట్టాలి. శింగనమల చెరువు చాలా పెద్దది. పైనున్న వారు నీటిని తమ ప్రాంతాలకు మళ్లిస్తుండడంతో ఈ చెరువుకు నీరు రావడం లేదు. ఈసారి తప్పకుండా చెరువు నింపాలి. బీసీ హాస్టల్ నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయాలి. – శమంతకమణి, ఎమ్మెల్సీ -
‘ఓటమిపై టీడీపీ ఆత్మవిమర్శ చేసుకోవాలి’
సాక్షి, అమరావతి : ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన టీడీపీ పార్టీ! ఓటమిపై ఆత్మవిమర్శ చేసుకోవాలని ఆ పార్టీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి సూచించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టెక్నాలజీ కొంప ముంచిందా..? నేల విడిచి సాము చేశామా..? అనే విషయాలను విశ్లేషించుకోవాలని తెలిపారు. తాను గతంలోనే పార్టీ పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేశానన్నారు. కానీ అప్పుడు తన మాటలు పట్టించుకోలేదన్నారు. రాష్ట్రంలో ఎన్నడూ లేనంతగా కులాల ప్రస్తావన వచ్చిందని, ఇదేమన్నా దెబ్బ తీసిందా..? అనే అంశంపైనా విశ్లేషిస్తామన్నారు. పార్టీ బాగు కోసం సూచనలు చేస్తామన్నారు. చంద్రబాబునాయుడే టీడీఎల్పీ నేతగా ఉండాలని కోరారు. చంద్రబాబు ముందుంటేనే తమకు ధైర్యం వస్తుందని పేర్కొన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి.. చంద్రబాబును ఇంటికొచ్చి ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించి ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు. ప్రమాణ స్వీకారానికి వెళ్లాలా..? వద్దా..? అనే అంశంపై ఆలోచిస్తామన్నారు. -
గోరంట్ల మాధవ్కు అక్కడ కూడా ఫ్యాన్స్!
దొడ్డబళ్లాపురం : సీఐ ఉద్యోగానికి రాజీనామా చేసి కొత్తగా రాజకీయాల్లోకి వచ్చి మొదటిసారి ఎన్నికల్లో పోటీచేసి ఎంపీగా అఖండ విజయం సాధించిన గోరంట్ల మాధవ్కు కర్ణాటకలోనూ ఫ్యాన్స్ నీరాజనాలు పడుతున్నారు. గెలిచినా ఎటువంటి భేషజాలకు పోకుండా ఆచితూచి ఆయన చెబుతున్న మాటలు కూడా చాలామందికి నచ్చుతున్నాయి. ఇప్పటికే గోరంట్ల మాధవ్ గురించి కన్నడ పత్రికలు, మీడియా కూడా ప్రత్యేక కథనాలు ప్రచురించింది. ఆయన గెలుపు ఒక ఎత్తయితే.. గెలిచిన తరువాత పై అధికారులకు సెల్యూట్ చేసిన ఫోటోపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ‘గెలుపంటే ఇదీ...గొప్ప వ్యక్తి...గొప్పవాళ్లు ఇలాగే ప్రవర్తిస్తారు’ అంటూ ప్రశంసిస్తున్నారు. -
అది తప్పు.. సెల్యూట్ నేనే చేశా: గోరంట్ల మాధవ్
సాక్షి, అమరావతి : పోలీస్ ఉన్నతాధికారులు తనకు సెల్యూట్ చేసినట్లు సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం తప్పని హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ స్పష్టం చేశారు. తానే తన ఉన్నతాధికారులకు సెల్యూట్ చేశానన్నారు. శనివారం వైఎస్సార్సీపీ పార్లమెంటరీ సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘ప్రజలు అఖండ విజయం అందించడం చాలా సంతోషంగా ఉంది. ప్రజలు మాపై చాలా పెద్ద బాధ్యతను ఉంచారు. మన దరిద్రం పోవాలంటే ప్రత్యేక హోదా రావాలని, ఎంపీలంతా ఏకతాటిపై ఉండి పోరాడాలని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పార్టమెంటరీ సమావేశంలో దిశానిర్దేశం చేశారు. మిగతా పార్టీల ఎంపీలను కలుపుకొని ముందుకుసాగాలని సూచించారు. నియోజకవర్గాలకు వెళ్లి ప్రజా సమస్యలను అధ్యయనం చేయమని ఆదేశించారు. మా ఎంపీలమంతా ప్రత్యేక హోదానే ఎజెండాగా ముందుకుసాగుతాం. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధిస్తాం. బాపట్ల ఎంపీ నందిగం సురేశ్.. సార్ నేనిక్కడ కూలీకి వెళ్లాను.. అలాంటి నన్ను ఎంపీనీ చేశారు అంటూ కన్నీటి పర్యంతమవుతూ వైఎస్ జగన్కు కృతజ్ఙతలు తెలుపుతుంటే నాకు కన్నీళ్లు ఆగలేదు. పోలీస్ స్టేషన్ నుంచి పార్లమెంట్కు వెళ్లడం చాలా ఆనందంగా ఉంది’ అని గోరంట్ల మాధవ్ చెప్పుకొచ్చారు. పోలీస్ శాఖలో సీఐగా పనిచేసిన గోరంట్ల మాధవ్ తన పదవికి రాజీనామా చేసి హిందూపురం లోక్సభ నుంచి వైఎస్సార్సీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచిన విషయం తెలిసిందే. ఎంపీగా గెలిచిన ఆయనకు పోలీస్ ఉన్నతాధికారులు సెల్యూట్ చేశారని ఓ ఫొటో నెట్టింట హల్ చల్ చేస్తుంది. అయితే ఆ ఫొటోలో ఉన్నతాధికారులకు తానే మొదట సెల్యూట్ చేసినట్లు గోరంట్ల మాధవ్ తెలిపారు. -
వైఎస్ జగన్ వేవ్ వల్లే మేమంతా గెలిచాం
-
టీడీపీ కంచుకోట బద్దలు!
సాక్షి, అనంతపురం: తెలుగుదేశం పార్టీ కంచుకోట బద్దలైంది. ఆ పార్టీకి ఎదురులేని హిందూపురం పార్లమెంటు నియోజకవర్గాన్ని వైఎస్సార్సీపీ అభ్యర్థి గోరంట్ల మాధవ్ విజయకేతనం ఎగురవేశాడు. ఏకంగా 1.38 లక్షల ఓట్ల భారీ మెజార్టీతో గెలిచి రికార్డు సృష్టించాడు. గురువారం స్థానిక ఎస్కేయూ క్యాంపస్లో కౌంటింగ్ ప్రక్రియ సాగింది. ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో కౌంటింగ్ ప్రారంభమైంది. ఓవైపు పోస్టల్ బ్యాలెట్లు లెక్కిస్తూనే మరోవైపు ఈవీఎంలను లెక్కించారు. మొత్తం 25 రౌండ్లు సాగిన కౌంటింగ్ తొలిరౌండ్ నుంచే గోరంట్ల మాధవ్ తన సమీప అభ్యర్థి నిమ్మల కిష్టప్పపై స్పష్టమైన మెజార్టీ కనబరిచాడు. నిమ్మల కిష్టప్ప ఏదశలోనూ పోటీనివ్వలేకపోయాడు. తొలిరౌండులో 9184 ఓట్ల ఆధిక్యంతో గోరంట్ల మాధవ్ బోణీ చేశాడు. అప్పటి నుంచి తిరిగిచూడలేదు. మొత్తం 25 రౌండ్లు కౌంటింగ్ జరగగా టీడీపీ అభ్యర్థి నిమ్మల కిష్టప్ప 17వ రౌండులో 1090 ఓట్లు, 24వ రౌండులో 225 ఓట్లు ఆధిక్యత సాధించాడు. తక్కిన 23 రౌండ్లు వైఎస్సార్సీపీ ఆధిక్యత చాటింది. మొత్తం 13,23,991 ఈవీఎం ఓట్లు పోలయ్యాయి. వీటిలో వైఎస్సార్సీపీ అభ్యర్థి 6,98,422 ఓట్లు సాధించగా, టీడీపీ అభ్యర్థికి 5,60,113 ఓట్లు పోలయ్యాయి. కాంగ్రెస్ అభ్యర్థి కేటీ శ్రీధర్ 26,934 ఓట్లు సాధించాడు. ఇక నాల్గోస్థానంలో ‘నోటా’కు 17,320 ఓట్లు వచ్చాయి. అలాగే భారతీయ జనతాపార్టీ అభ్యర్థి మిట్టా పార్థసారథి 13,485 ఓట్లు సాధించాడు. ఇతరులు 7717 ఓట్లు దక్కించుకున్నారు. గోరంట్ల మాధవ్ రౌండు రౌండుకు మెజార్టీ పెరుగుతుండడంతో పార్టీ శ్రేణులు కౌంటింగ్ కేంద్రం ఆవరణలోనే ఆయన్ను హత్తుకుని గంతులేశారు. మెజార్టీపై చర్చ హిందూపురం ఎంపీ అభ్యర్థిగా గోరంట్ల మాధవ్ సాధిచిన మెజార్టీపై నియోజకవర్గంలోని అన్ని నియోజకవర్గాల ప్రజల్లో విపరీతమైన చర్చ జరిగింది. వైఎస్ రాజశేఖర్రెడ్డి ముఖ్యమంత్రి అయిన 2004 ఎన్నికల్లో ఉమ్మడి రాష్ట్రమంతా వైఎస్సార్ గాలి వీచింది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ హిందూపురం ఎంపీగా బరిలో నిలిచిన కర్నల్ నిజాముద్దీన్ కేవలం 1840 ఓట్లతో గట్టెక్కాడు. వైఎస్సార్ తనయుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి స్థాపించిన వైఎస్సార్సీపీ తరపున ఈ ఎన్నికల్లో బరిలో నిలిచిన గోరంట్ల మాధవ్ ఏకంగా 1,38,309 ఓట్లు మెజార్టీ సాధించడం చర్చనీయాంశమైంది. సామాన్యుడిని బరిలో దింపి.. హిందూపురం ఎంపీ అభ్యర్థిగా ఎవరూ ఊహించిన విధంగా వైఎస్సార్సీపీ సామాన్యుడైన మాధవ్ను బరిలో దింపింది. పోలీసుశాఖలో ఇన్స్పెక్టర్గా పనిచేస్తూ ఉద్యోగానికి రాజీనామా చేసి ఎన్నికల బరిలో నిలిచాడు. కురుబ కులానికి చెందిన మాధవ్ను పోటీలో పెట్టడంతో అధికార పార్టీ నాయకులు హేళన చేశారు. ఆర్థికంగా, రాజకీయంగా బలమైన నాయకుడైన నిమ్మల కిష్టప్ప విజయం నల్లేరుమీద నడకే అని అధికార పార్టీ భావించింది. అయితే వారి అంచనాలు పటాపంచలు చేస్తూ మాధవ్ వైఎస్సార్సీపీ జెండా ఎగురవేశారు. -
‘అతి సామాన్య’ విజయం..!
సాక్షి, అమరావతి: నాయకులకు జనం కష్టసుఖాలు తెలిసుండాలనేది వైఎస్సార్సీపీ అభిమతం. ఈ నేపథ్యమున్న ఏ నాయకుడికైనా ప్రజలు బ్రహ్మరథం పడతారన్న పార్టీ అధినేత నమ్మకం అక్షరాల రుజువైంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన అతి సామాన్యులు రాజకీయ దిగ్గజాలను ఢీ కొట్టారు. అంగ, అర్థ బలం ఉన్నవారిని సైతం అతి సామాన్య అభ్యర్థులు మట్టి కరిపించారు. అనంతపురం పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసిన తలారి రంగయ్య ఓ ప్రభుత్వోద్యోగి. డీఆర్డీఏలో పీడీగా పనిచేశారు. బీసీలకు పెద్దపీట వేయాలన్న వైఎస్ జగన్ ఆశయంతో ఉత్తేజితుడై ఎన్నికల్లోకొచ్చారు. టీడీపీ నేత జేసీ తనయుడు పవన్ను ఓడించారు. గుంటూరు జిల్లా బాపట్ల పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసిన నందిగం సురేష్ ఓ సాధారణ కార్యకర్త. టీడీపీ సిట్టింగ్ ఎంపీ మాల్యాద్రిని ఈ ఎన్నికల్లో ఓడించారు. అరకు ఎంపీగా పోటీ చేసిన గొడ్డేటి మాధవి ఓ సాధారణ గిరిజన మహిళ. ప్రత్యర్థిగా బరిలో ఉన్న కిశోర్ చంద్రదేవ్ రాజవంశీకుడు. కొన్ని దశాబ్దాలుగా రాజకీయాల్లో ఆరితేరిన వ్యక్తి. అయినా మాధవి ప్రజాభిమానం పొందింది. హిందూపురం ఎంపీగా వైఎస్సార్సీపీ తరఫున నిలిచిన గోరంట్ల మాధవ్ పోలీసు ఉద్యోగి. ప్రజాసేవ ద్వారానే ఫ్యాక్షన్ మూలాలు పెకిలించాలని భావించిన మాధవ్.. హిందూపురంలో ప్రత్యర్థి నిమ్మల కిష్టప్పను మట్టి కరిపించారు. చిత్తూరు పార్లమెంట్ స్థానం వైఎస్సార్సీపీ నుంచి పోటీ చేసిన రెడ్డప్ప సైతం ఓ సాధారణ కార్యకర్తే. ఆయన ఎన్ శివప్రసాద్పై గెలుపొందారు. ఎచ్చెర్లలో సాధారణ కార్యకర్త గొర్లె కిరణ్ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, మంత్రి కళా వెంకట్రావును ఓడించారు. పలాసలో ఓ సాధారణ వైద్యుడు అప్పలరాజు అధికార పార్టీ అభ్యర్థిని చిత్తు చేశారు. విజయనగరం జిల్లా ఎస్ కోటలో టీడీపీ కంచుకోటను రాజకీయాలకే కొత్త అయిన వైసీపీ అభ్యర్థి కలిదిండి శ్రీనివాస్ బద్దలు కొట్టారు. ఈ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థి కోళ్ల అప్పలనాయుడు ఏడుసార్లు, ఆయన కోడలు లలితకుమారి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఈ చరిత్రను శ్రీనివాస్ తిరగరాశారు. వైఎస్సార్సీపీలో సామాన్య నేతలైన పశ్చిమగోదావరి జిల్లా గోపాలపురం అభ్యర్థి ముప్పిడి వెంకట్రావ్, కృష్ణా జిల్లా పామర్రు అభ్యర్థి కైలే అనిల్కుమార్ ఘనమైన విజయం సాధించారు. కర్నూల్ జిల్లా నందికొట్కూర్లో మాజీ పోలీసు ఉద్యోగి ఆర్థర్ అధికార పార్టీని మట్టి కరిపించారు. ఇక రాజకీయ అనుభవం లేని అబ్బయ్య చౌదరి దెందులూరులో చింతమనేని ప్రభాకర్పై గెలుపొందారు. -
ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్యాయత్నం
సాక్షి, అనంతపురం : జిల్లాలోని గోరంట్లలో తీవ్ర విషాదం నెలకొంది. ఆస్తిపంపకాల విషయంలో గొడవపడి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. వీరిలో ఇద్దరు మృతి చెందగా, మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. నిన్న రాత్రి జరిగిన ఈ ఘటన ఆలస్యంగా ఈ రోజు వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తండ్రి ఆస్తి పంపకంలో గొడవపడిన గోరంట్లకు చెందిన రామకృష్ణమ్మ, ఆమె కుమారుడు వేణుగోపాల్, సోదరులు మోహన్, సోమశేఖర్ మంగళవారం రాత్రి ఊరి చివర గల స్మశానం వద్దకు చేరుకున్నారు. అనంతరం అక్కడ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈరోజు ఉదయం అటువైపుగా వెళ్లిన గ్రామస్తులు వారిని చూసి పోలీసులకు సమాచారం అందించాడు.సమాచారం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని వీరిని హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వీరిలో మోహన్, సోమశేఖర్ చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. రామకృష్ణమ్మ, వేణుగోపాల్ ల పరిస్థితి విషమంగా ఉందనీ, మరో 24 గంటలు గడిస్తే కానీ చెప్పలేమని స్పష్టం చేశారు. మరోవైపు ఈ వ్యవహారంపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
గుంటూరులో టీడీపీ నేత తనయుడి నిర్వాకం
సాక్షి, గుంటూరు: వారిద్దరూ బంధువులే. సాఫ్ట్వేర్ వ్యాపారాల్లో భాగస్వాములు కావడంతో డబ్బులు పెట్టుబడిగా పెట్టారు. అయితే వ్యాపార లావాదేవీల్లో తేడా రావడంతో పార్టనర్ కుటుంబ సభ్యులను సైతం కిడ్నాప్ చేయడానికి కూడా వెనకాడలేదు. గుంటూరుకు చెందిన ఓ టీడీపీ నేత తనయుడి నిర్వాకం ఇదీ. సమయానికి పోలీసులు రావడంతో బాధితులు సురక్షితంగా చెర నుంచి బయటపడ్డారు. వారం రోజులుగా నిర్బంధించి చిత్రహింసలు.. ఒంగోలుకు చెందిన తోట నిలయ్ సాఫ్ట్వేర్ ఉద్యోగి. గుంటూరులోని గోరంట్లకు చెందిన టీడీపీ మండల అధ్యక్షుడు యర్రంశెట్టి వేణుగోపాల్ కుమారుడు విజయ్తో కలిసి సాఫ్ట్వేర్ సంబంధిత వ్యాపారాలు చేస్తుంటాడు. నిలయ్, విజయ్ కుటుంబాలు బంధువులు కావడంతో ఇద్దరి మధ్య సఖ్యత కుదిరింది. ఓ యూనివర్సిటీ పరిధిలో సాఫ్ట్వేర్ సంబంధిత ప్రాజెక్టులున్నట్లు ఒంగోలుకు చెందిన ఆర్ఎంపీ నాగేశ్వరరావు చెప్పటంతో ముగ్గురూ కలసి పెట్టుబడులు పెట్టారు. అయితే ఈ ప్రాజెక్టులు బోగస్ అని తేలటంతో విజయ్ తన డబ్బులు తిరిగి ఇవ్వాలంటూ నిలయ్ని ఒత్తిడి చేశాడు. తాను కేవలం మధ్యవర్తిత్వం మాత్రమే చేశానన్న నిలయ్ నెల రోజులపాటు అదృశ్యమయ్యాడు. ఈ క్రమంలో అతడి కోసం గాలించిన విజయ్ ఒంగోలులో ఉన్న నిలయ్తోపాటు భార్య అలేఖ్య, అత్త మామలను బలవంతంగా తరలించి గుంటూరు శివారులోని ఒక ఇంట్లో గత నెల 29వ తేదీ నుంచి నిర్బంధించాడు. వారం రోజులుగా గదిలో ఉంచి చిత్ర హింసలకు గురిచేశాడు. పసిగట్టిన స్థానికులు 100కి సమాచారం అందించటంతో పోలీసులు శనివారం అర్ధరాత్రి బాధితులను కాపాడి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. నిండుగర్భిణి అని చూడకుండా వేధించారని అలేఖ్య పేర్కొంది. నిందితులు యర్రంశెట్టి వేణుగోపాల్, విజయ్కుమార్ను అరెస్టు చేసిన పోలీసులు కిడ్నాప్, హత్యాయత్నం కింద కేసులు నమోదు చేశారు. -
మీ కుమ్ములాటలే కొంపముంచుతున్నాయ్
సాక్షి, అమరావతి: పార్టీ నేతల మధ్య అంతర్గత కలహాలు, కుమ్ములాటలే టీడీపీ కొంప ముంచుతున్నాయని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. నేతల్లో అనైక్యతతోపాటు పోల్ మేనేజ్మెంట్లో వెనుకబడి పోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యకర్తలను కూడగట్టి ఎన్నికలకు వెళ్లకుండా ఇక్కడ మైకులు పట్టుకుని ఏవేవో మాట్లాడుతున్నారని శనివారం రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గం పరిధి నేతలతో నిర్వహించిన ఎన్నికల సమీక్ష సమావేశంలో మండిపడ్డారు. ‘అధికారంలోకి రావాల్సిన మనం మీ అహం, మీ తీరుతో ఇప్పుడు ఆలోచించాల్సిన పరిస్థితి వచ్చింది. కనీసం కార్యకర్తలను కూడా పట్టించుకోలేదు. మీరంతా సమష్టిగా వ్యవహరించకుండా ఇక్కడకు వచ్చి మైకుల్లో ప్రసంగాలు ఇస్తే ప్రయోజనమేంటి? పార్టీలో మీ అందరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్నాక, మీరు చెప్పిన వారికే టిక్కెట్లు ఇచ్చా. మీరంతా కలిసి పనిచేస్తే ఈరోజు ఇలా గెలుపుపై ఆలోచించాల్సిన అవసరం వచ్చేది కాదు’అని పార్టీ నేతలతో చంద్రబాబు పేర్కొన్నారు. గోరంట్ల, ఆదిరెడ్డిపై ఆగ్రహం ఎన్నికల్లో తమకు వ్యతిరేకంగా పనిచేశారని గోరంట్ల బుచ్చయ్యచౌదరి, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు వర్గాలు పరస్పరం ఫిర్యాదు చేసుకోవడంపై చంద్రబాబు ఫైర్ అయ్యారు. బూత్ స్థాయిలో ఓట్లు వేయించలేని వారు రాష్ట్ర స్థాయి నేతలుగా చలామణి అయిపోతే ఎలా? అని నిలదీశారు. ఇలాంటి నాయకులను పెట్టుకుని నేనేం చేయాలి? అని ప్రశ్నించారు. -
గోరంట్లలో రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి
-
రాజకీయాల్లో అరుదైన నేత వైఎస్ జగన్
సాక్షి, అనంతపురం:‘వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి రాజకీయాల్లో అత్యంత అరుదైన వ్యక్తి.. బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లింమైనార్టీల పట్ల చిత్తశుద్ధి ఉన్న నేత అని వైఎస్సార్సీపీ హిందూపురం పార్లమెంటు అభ్యర్థి గోరంట్ల మాధవ్ పేర్కొన్నారు. జగనన్నలో ఓ అంబేడ్కర్, జ్యోతిరావ్పూలే, పుచ్చలపల్లి సుందరయ్య, తరిమెల నాగిరెడ్డి తదితర మహానుభావుల్లో ఉండే వ్యక్తిత్వాన్ని చూశానన్నారు. ఆయన చేసే ప్రజాసేవను స్ఫూర్తిగా తీసుకొని వైఎస్సార్సీపీని రాజకీయ వేదికగా ఎంచుకున్నానన్నారు. తనకు ఎంపీగా అవకాశమిస్తే పార్లమెంట్లో అట్టడుగు వర్గాల సమస్యలపై గళం విప్పుతానని అంటున్న గోరంట్ల మాధవ్ .. ‘సాక్షి’తో మరిన్ని విశేషాలు పం చుకున్నాడు. ఆయన మాటాల్లోనే... తాను చాలా సాధారణ కుటుంబం నుంచి వచ్చా.. చిన్నప్పటి నుంచి అనేక కష్టాలు పడుతూ పెరిగా.. ఆ కసితోనే చదివి ఎస్ఐ ఉద్యోగం సాధించా.. ఎస్ఐ, సీఐగా పనిచేసినంత కాలం బాధితుల పక్షాన నిలిచానని ఆయన తెలిపారు. డిపార్ట్మెంట్లో చేసిన సేవే ఇప్పుడు జిల్లాలో ఎక్కడికి వెళ్లినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ముఖ్యంగా బడుగు, బలహీన, అట్టడుగు వర్గాలు అక్కున చేర్చుకుంటున్నారు. మరింత సేవ చేయాలనే... ఉద్యోగిగా ప్రజాసేవ చేసేందుకు పరిధి చాలా తక్కువ ఉంటుంది. అదే రాజకీయంలోకొస్తే సేవలు విస్త్రతం చేయొచ్చు. ఎంపీగా అవకాశం ఇస్తే బడుగు, బలహీన వర్గాల ఆలోచన విధానాన్ని రేపు పార్లమెంటులో ఆవిష్కరిస్తా. ఈ అవకాశం పోలీసుశాఖలో ఉంటే వస్తుందా?. యావత్తు దేశంలోని బీసీ, ఎస్సీ,ఎస్టీల ప్రతినిధిగా మాట్లాడొచ్చు. అందుకోసమే పోలీసు నుంచి రాజకీయాల్లోకొచ్చా. పూర్తిగా ప్రజల్లో మమేకమై ఉంటా. వందశాతం బాధితుల పక్షాన నిలబడే వ్యక్తిని. పక్కా నిజాయతీగా నిలిచే తత్వం. ఎన్నికలల్లో ఒక్క రూపాయి ఖర్చు చేయకుండా బరిలో నిలబడ్డా. కష్టంగాని, నష్టంగాని నమ్మిన వ్యక్తికి అండగా నిలిచే వ్యక్తిని. ఎప్పుడూ ప్రజల్లో ఉండే వ్యక్తిని. బలహీన వర్గాల పట్ల చిత్తశుద్ధి ఉన్న నాయకుడు నామినేటెట్ పోస్టులు, పనుల్లో బీసీ, ఎస్సీ,ఎస్టీ, మైనార్టీలకు 50 శాతం రిజర్వేషన్ కల్పించేలా చట్టబద్ధత చేస్తామని జగనన్న చెప్పడం చూస్తే దేశంలోనే బీసీలు ముఖ్యమంత్రులుగా ఉన్న రాష్ట్రాల్లో ఆ విధంగా ఆలోచించలేదు. వైఎస్ జగన్మోహన్రెడ్డిలో ఎంతో గొప్ప వ్యక్తిత్వముంది. జిల్లాలో జగన్మోహన్రెడ్డి సైని కుడిగా పని చేస్తానని చేరినరోజే చెప్పా. వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదరించి అక్కున చేర్చుకుని పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం కల్పించారు. అత్యంత సాధారణ కుటుంబం నుంచి వచ్చిన తనలాంటి వారికి ఎం పీగా పోటీ చేసే అవకాశం కల్పించడం నిజంగా అదృçష్టమే. జిల్లాలో బీసీలంతా జగన్కు రుణపడి ఉంటాం. రెండు సీట్లు గెలిచి అధినేతకు కానుకగా ఇస్తాం. -
ఫ్యాక్షన్ను రూపుమాపుతాం
సాక్షి, ఆత్మకూరు: పదేళ్ల పరిటాల కుటుంబ నియంత పాలనతో రాప్తాడు నియోజకవర్గ ప్రజలు విసిగిపోయారు. దాడులు, గొడవలు సృష్టించే వ్యక్తిని ఎమ్మెల్యేగా గెలిపించుకోవడానికి అడ్డదారులు తొక్కుతున్నారు. వైఎస్సార్సీపీకి ఒక్క అవకాశమిస్తే నియోజకవర్గంలో ఫ్యాక్షనిజాన్ని రూపుమాపి అభివృద్ధికి బాట వేస్తాం’ అని వైఎస్సార్సీపీ హిందూపురం ఎంపీ అభ్యర్థి గోరంట్ల మాధవ్, రాప్తాడు ఎమ్మెల్యే అభ్యర్థి తోపుదుర్తి ప్రకాష్రెడ్డి పేర్కొన్నారు. ఆత్మకూరు మండలం వేపచెర్ల, వేపచెర్ల ఎగువ తండా, దిగువ తండా గ్రామాల్లో బుధవారం వైఎస్సార్సీపీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో గోరంట్ల మాధవ్, తోపుదుర్తి ప్రకాష్రెడ్డి మాట్లాడుతూ వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే హంద్రీ – నీవా పిల్లకాలువల ద్వారా లక్ష ఎకరాలకు సాగునీరందిస్తామని హామీ ఇచ్చారు. పరిటాల పాలనలో రాప్తాడు నియోజకవర్గం ఎటుంటి అభివృద్ధికీ నోచుకోలేదని, ప్రజలు పనులు లేక వలసలు వెళ్లారని గుర్తు చేశారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే పోలీసులకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చి గ్రామాల్లో ఫ్యాక్షనిజం లేకుండా చే స్తామని చెప్పారు. ఎస్సీ, ఎస్టీలకు 2.50 ఎకరాల చొప్పున భూ పంపిణీ చేసి ఉచిత బోర్లు వేయిస్తామని హామీ ఇచ్చారు. నియోజకవర్గంలో 8 చిన్న రిజర్వాయర్లను ఏర్పాటు చేసి పిల్ల కాలువ ద్వారా సాగునీరు అందేలా చూస్తామని తెలియచేశారు. పీఏబీఆర్ కాలువ ద్వారా ప్రతి ఇంటికీ తాగు నీటిని అందజేస్తామన్నారు. రాష్ట్రం అభివృద్ధి బాటలో నడవాలంటే ఒక్క జగన్తోనే సాధ్యమన్నారు. నవరత్నాల కార్యక్రమం ద్వారా ప్రతి ఇంటికీ లబ్ధి చేకూరుతుందన్నారు. బీసీల ద్రోహి చంద్రబాబు బీసీల ద్రోహి చంద్రబాబునాయుడు అని వైఎస్సార్సీపీ హిందూపురం ఎంపీ అభ్యర్థి గోరంట్ల మాధవ్ విమర్శించారు. బీసీల అభ్యున్నతికి జగన్మోహన్రెడ్డి ఎంతో కృషి చేస్తున్నారన్నారు. బీసీ డిక్లరేషన్తో బీసీలందరికీ న్యాయం జరుగుతుందన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, రాప్తాడు నియోజకవర్గం సాగునీటితో సçస్యశ్యామలం కావాలన్నా ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి వైఎస్సార్సీపీ అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు. -
గోరంట్ల మాధవ్ నివాసంలో విషాదం
సాక్షి, అనంతపురం : వైఎస్సార్ సీపీ హిందుపురం లోక్సభ అభ్యర్థి గోరంట్ల మాధవ్ నివాసంలో విషాదం నెలకొంది. ఆయనకు పితృ వియోగం కలిగింది. గోరంట్ల మాధవ్ తండ్రి కురుబ మాధవస్వామి(85) శుక్రవారం అనారోగ్యంతో మృతి చెందారు. కర్నూలు జిల్లా పి.రుద్రవరంలో మాధవస్వామి అంత్యక్రియలు నిర్వహించనున్నారు. మరోవైపు మాధవ్ తండ్రి మృతి పట్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సంతాపం తెలిపింది. కాగా తీవ్ర ఉత్కంఠ నడుమ గోరంట్ల మాధవ్ నామినేషన్కు ఆమోదం లభించిన విషయం తెలిసిందే. ఎన్నికల్లో పోటీ చేసేందుకు వీలుగా గోరంట్ల మాధవ్ వీఆర్ఎస్కు దరఖాస్తు చేసుకోగా, దీనిని ఆమోదించాల్సిందిగా ట్రిబ్యునల్ తీర్పు వెలువరించినప్పటికీ.. చంద్రబాబు ప్రభుత్వం మాధవ్ ఎన్నికల్లో పోటీ చేయకుండా ఉండేందుకు తీవ్రంగా ప్రయత్నించింది. అందులో భాగంగా ట్రిబ్యునల్ తీర్పుపై స్టే ఇవ్వాల్సిందిగా హైకోర్టును ఆశ్రయించారు. అయితే ట్రిబ్యునల్ తీర్పుపై స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. దీంతో మాధవ్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ లభించింది. దీంతో ఆయన సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. -
పేరుకు సిక్.. రాజకీయ కిక్కు!
సాక్షి, అనంతపురం సెంట్రల్: తాను రాజకీయాల్లోకి వెళ్తున్నాను స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్ఎస్) ఆమోదించండి అని సీఐ గోరంట్ల మాధవ్ ఉన్నతాధికారులకు మొరపెట్టుకున్నారు. ఆమోదించకుండా ముప్పుతిప్పలు పెట్టారు. న్యాయపోరాటం చేయడంతో చివరకు వీఆర్ఎస్ను ఆమోదించారు. కేవలం ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరడం వలనే పోలీసు ఉన్నతాధికారులు తీవ్ర ఇబ్బందులకు గురి చేశారనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. అదే అధికారపార్టీతో అంటకాగితే పోలీసు ఉన్నతాధికారుల తీరు మరోలా ఉంటుందనేందుకు ఈ కానిస్టేబులే నిదర్శనం. కానిస్టేబుల్ నరసింహమూర్తి. ఈ పేరు వింటే పోలీసుశాఖలో ఎవరైనా గుర్తుపడుతారు. ప్రస్తుతం అనంతపురం రూరల్ పోలీసుస్టేషన్లో పోస్టింగ్ ఉంది. ఏనాడూ ఆయన మాత్రం స్టేషన్ మెట్లెక్కడు. నాలుగేళ్లుగా ఖాకీ వదిలి (అనధికారికంగా) ఖద్దరు తొడుక్కున్నాడు. అధికార టీడీపీతో అంటకాగుతుండడంతో అధికారులకు తెలిసినా కూడా పెద్దగా పట్టించుకోవడం లేదు. నాలుగేళ్లుగా డిపార్ట్మెంట్కు దూరంగా.. అధికారపార్టీకి దగ్గరగా ఉంటున్నాడు. కొద్దిరోజులు రావడం.. మళ్లీ సిక్లో వెళ్లిపోవడం జరుగుతోంది. ఓ వైపు ఉద్యోగం కాపాడుకుంటూనే మరో వైపు రాజకీయాల్లో రాణిస్తున్నాడు. అంతేకాదండోయ్ ఇటీవల హెడ్కానిస్టేబుల్గా పదోన్నతి పొందేందుకు కూడా అర్హత సాధించాడు. ఇటీవల శిక్షణ తీసుకొని వచ్చి మళ్లీ సిక్లో వెళ్లిపోయాడు. తాజాగా 2019 సార్వత్రిక ఎన్నికల్లో చాలా బిజీగా గడుపుతున్నాడు. అయితే రహస్యంగా కాదు. బహిరంగంగానే చెట్టాపట్టాలేసుకొని తిరుగుతుండడం గమనార్హం. తాజాగా గురువారం పుట్టపర్తిలో సీఎం చంద్రబాబునాయుడును కలవడం పోలీసుశాఖలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ విషయంపై అదనపు ఎస్పీ చౌడేశ్వరిని వివరణ కోరగా సిక్లో ఉన్న ఉద్యోగులు రాజకీయపార్టీల కార్యక్రమాల్లో పాల్గొనడం చట్ట విరుద్ధమని స్పష్టం చేశారు. -
గోరంట్ల మాధవ్ నామినేషన్కు ఆమోదం
-
గోరంట్ల మాధవ్ నామినేషన్కు ఆమోదం
సాక్షి, అనంతపురం: హిందూపురం లోక్సభ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గోరంట్ల మాధవ్ నామినేషన్కు ఆమోదం లభించింది. తీవ్ర ఉత్కంఠ రేపిన మాధవ్ నామినేషన్ను మంగళవారం ఎన్నికల అధికారులు ఆమోదించారు. ఎన్నికల్లో పోటీ చేసేందుకు వీలుగా గోరంట్ల మాధవ్ వీఆర్ఎస్కు దరఖాస్తు చేసుకున్న సంగతి తెలిసిందే. దీనిని ఆమోదించాల్సిందిగా ట్రిబ్యునల్ తీర్పు వెలువరించినప్పటికీ.. చంద్రబాబు ప్రభుత్వం మాధవ్ ఎన్నికల్లో పోటీ చేయకుండా ఉండేందుకు తీవ్రంగా ప్రయత్నించింది. అందులో భాగంగా ట్రిబ్యునల్ తీర్పుపై స్టే ఇవ్వాల్సిందిగా హైకోర్టును ఆశ్రయించారు. అయితే ట్రిబ్యునల్ తీర్పుపై స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. దీంతో మాధవ్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ లభించినట్టయింది. సోమవారం హిందూపురం లోక్సభ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మాధవ్ నామినేషన్ దాఖలు చేశారు. హైకోర్టు తీర్పు కాపీలను కూడా రిటర్నింగ్ అధికారులకు అందజేశారు. ముందు జాగ్రత్తగా ఆయన తన భార్య సునీతతో కూడా నామినేషన్ దాఖలు చేయించారు. ఈ రోజు అభ్యర్థుల నామినేషన్లను పరిశీలించిన ఎన్నికల అధికారులు మాధవ్ నామినేషన్ను ఆమోదించినట్టు ప్రకటించారు. అలాగే అనంతపురం లోక్సభ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తలారి రంగయ్య నామినేషన్కు కూడా ఎన్నికల అధికారులు ఆమోదం తెలిపారు. -
బీసీలంటే బాబుకు పడదంతే..!
సాక్షి, అమరావతి: తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు బీసీలకు బద్ధ వ్యతిరేకని మరోసారి రుజువైంది. అంతేకాదు బీసీలను ప్రతిపక్ష పార్టీ ప్రోత్సహించినా సహించరని స్పష్టమయ్యింది. హిందూపురం లోక్సభ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగిన గోరంట్ల మాధవ్ వీఆర్ఎస్ ఉదంతం ఇందుకు నిదర్శనం. ఎన్నికల్లో పోటీ చేసేందుకు వీలుగా గోరంట్ల మాధవ్ పెట్టుకున్న స్వచ్ఛంద పదవీ విరమణ పథకం (వీఆర్ఎస్) దరఖాస్తును, ఆ దరఖాస్తును ఆమోదించాల్సిందిగా ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పును అంగీకరించకుండా మొండికేయడం, చంద్రబాబుకు బీసీలంటే ఉన్న వ్యతిరేకతను స్పష్టం చేస్తోంది. మాధవ్ వారం పది రోజులుగా ఎక్కిన గడప ఎక్కకుండా తిరుగుతున్నా చంద్రబాబు మనసు కరగలేదు. పైగా ట్రిబ్యునల్ తీర్పుతో విభేదిస్తూ హైకోర్టుకు వెళ్లారు. అయితే అక్కడ బాబుకు చుక్కెదురయ్యింది. ట్రిబ్యునల్ తీర్పుపై స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. తనకు అనుంగు శిష్యుని మాదిరి వ్యవహరించిన ఏపీ ఎన్జీవోల సంఘం నేత అశోక్ బాబుకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చేందుకు ఆఘమేఘాల మీద కేసులన్నింటినీ పరిష్కరించిన చంద్రబాబు.. గోరంట్ల మాధవ్ను ఇబ్బందులకు గురిచేయడం తీవ్ర విమర్శలకు తావిచ్చింది. వాస్తవానికి మాధవ్ చాలా కాలం కిందటే వీఆర్ఎస్కు దరఖాస్తు చేసుకున్నారు. అయినా ఆయన వీఆర్ఎస్ను ఆమోదించకుండా కర్నూలు డీఐజీ నాగేంద్ర కుమార్ తొక్కిపట్టి తప్పించుకుతిరగడం అంతా సీఎం ఆదేశాల మేరకే జరుగుతోందనే విమర్శలు వచ్చాయి. వీఆర్ఎస్ను ఆమోదింపజేసుకోవడానికి ఓ బీసీ అభ్యర్థి పడిన కష్టం చూస్తుంటే ఆ వర్గాల పట్ల చంద్రబాబు ఎంత కక్షపూరితంగా వ్యవహరిస్తారో మరోసారి రుజువైందని బీసీ సంఘాలు పేర్కొన్నాయి. ఇప్పుడే కాదు.. ఎప్పుడూ అంతే చంద్రబాబు ఎప్పుడూ బీసీ వర్గాల వ్యతిరేకేనని పలువురు బీసీ సంక్షేమ సంఘాల నేతలు ధ్వజమెత్తుతున్నారు. గతంలో బాబు బీసీలకు వ్యతిరేకంగా వ్యవహరించిన ఉదంతాలను ఉదహరిస్తున్నారు. హైకోర్టు జడ్జీలుగా ఇద్దరు బీసీ న్యాయవాదులను కొలీజియం సిఫారసు చేస్తే వారు ఆ పదవికి అర్హులు కాదంటూ ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు సుప్రీంకోర్టుకు లేఖ రాసిన విషయాన్ని వారు గుర్తు చేశారు. అప్పట్లో ఈ వ్యవహారం తీవ్ర దుమారం రేపింది. బడుగు, బలహీనవర్గాల కోసమే తమ పార్టీ పుట్టిందని, తమకు ఆ వర్గాలే వెన్నెముక అంటూ చంద్రబాబు ఉత్తుత్తి కబుర్లు చెబుతారని, కానీ ఆయన మాటలకు, చేతలకు చాలా తేడా ఉంటుందని బీసీ నేతలు చెబుతున్నారు. తమకు న్యాయం చేయమని అడగడానికి వెళ్లిన నాయీ బ్రాహ్మణులను ’ఏయ్, నోర్మూయ్, తాట తీస్తా’ అంటూ అహంకార పూరితంగా బెదిరించారని గుర్తుచేశారు. కాపుల్ని బీసీలలో, బోయల్ని ఎస్టీలలో, రజకుల్ని ఎస్సీలలో చేరుస్తానని మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు అని విమర్శిస్తున్నారు. -
న్యాయమే గెలిచింది
సాక్షి, అనంతపురం సెంట్రల్: ధర్మం నిలిచింది...టీడీపీ నేతలు ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా న్యాయం గెలిచింది. కోర్టు మొట్టికాయలతో మేల్కొన్న కర్నూలు రేంజ్ డీఐజీ నాగేంద్ర కుమార్ సీఐ గోరంట్ల మాధవ్ వీఆర్ఎస్(స్వచ్ఛంద పదవీ విరమణ) ఆమోదిస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో వైఎస్సార్ కాంగ్రెస్పార్టీ హిందూపురం పార్లమెంట్ అభ్యర్థిగా గోరంట్ల మాదవ్ బరిలో నిలిచేందుకు మార్గం సుగమమైంది. అడుగడుగునా అడ్డంకులు బీసీ సామాజిక వర్గానికి చెందిన సీఐ గోరంట్లమాధవ్ కొన్ని నెలల క్రితమే రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించారు. వీఆర్ఎస్ ప్రకటించిన అనంతరం వైఎస్సార్ కాంగ్రెస్పార్టీలోకి చేరారు. ఈ క్రమంలోనే వై?ఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గోరంట్ల మాధవ్ను హిందూపురం ఎంపీ అభ్యర్థిగా ప్రకటించింది. దీంతో జిల్లాలోని టీడీపీ నాయకుల్లో కలవరం మొదలైంది. సీఐగా ఉంటూ విధి నిర్వహణలోనే అధికారపార్టీ నేతల ఆగడాలను ఎదురించిన వ్యక్తి.. రాజకీయాల్లో పోటీకి వస్తే తమకు పరాభవం తప్పదని కుట్రలు, కుయుక్తులకు తెరలేపారు. ముఖ్యంగా అనంతపురం ఎంపీ జేసీ దివాకర్రెడ్డి, హిందూపురం ఎంపీ నిమ్మల కిష్టప్ప, మంత్రి పరిటాల సునీతలు పథకం ప్రకారం మాధవ్ వీఆర్ఎస్ ఆమోదించకుండా ఉన్నతస్థాయిలో ఒత్తిళ్లు తీసుకొచ్చినట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తన వీఆర్ఎస్ ఆమోదించాలని మాధవ్... జిల్లా ఎస్పీ, డీఐజీ, డీజీపీలకు ధరఖాస్తులు చేసుకున్నా... పెండింగ్లో పెట్టారు. దీంతో గోరంట్ల మాధవ్ మాత్రం న్యాయపోరాటానికి దిగారు. తన వీఆర్ఎస్ ఎందుకు ఆమోదించకుండా అడ్డుపడుతున్నారని ఏపీ ట్రిబ్యునల్ను ఆశ్రయించారు. తాజాగా ఎలక్షన్ కమిషన్ ఆదేశాలతో సీఐ గోరంట్ల మాధవ్ వీఆర్ఎస్ను ఆమోదించాల్సి వచ్చింది. సీఐ మాధవ్ విషయంలో సీఎం చంద్రబాబు, జిల్లా టీడీపీ నేతలు వ్యవహరించిన తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. చంద్రబాబు.. నీచ రాజకీయాలు మానుకో: మాధవ్ వీఆర్ఎస్లో వెళ్లనీయకుండా అడ్డుపడిన సీఎం చంద్రబాబుపై వైఎస్సార్ కాంగ్రెస్పార్టీ హిందూపురం ఎంపీ అభ్యర్థి గోరంట్ల మాధవ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సోమవారం ఆయన వైఎస్సార్ సీపీ హిందూపురం ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన తర్వాత ప్రెస్క్లబ్లో విలేకరులతో మాట్లాడారు. న్యాయంగా పోరాడాలి, ప్రజా క్షేత్రంలో తేల్చుకోవాలే తప్ప.. నీచ రాజకీయాలు చేయడం తగదన్నారు. బడుగు బలహీన వర్గానికి చెందిన తనకు వైఎస్సార్సీపీ ఎంపీ టికెట్ ఇస్తే... ప్రజాక్షేత్రంలో పోటీ ఎదుర్కోలేని టీడీపీ నేతలు కుట్రలు, కుతంత్రాలు చేశారన్నారు. రెండు దశాబ్దాలుగా పోలీసు శాఖలో తాను పనిచేసినా...కేవలం ప్రభుత్వ ఒత్తిళ్ల మేరకు పోలీసు ఉన్నతాధికారులు కూడా తనను ఇబ్బందులకు గురిచేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తమది బీసీల పార్టీ అని చెప్పుకునే చంద్రబాబుకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే తన వ్యవహారంలో ఇలా వ్యవహరించరన్నారు. చంద్రబాబు బీసీల ద్రోహి అని ధ్వజమెత్తారు. బీసీల సంక్షేమాన్ని కోరుకునే వారంతా వైఎస్సార్ సీపీకి మద్దతు తెలపాలని కోరారు. -
గోరంట్లకు గ్రీన్ సిగ్నల్
సాక్షి, అమరావతి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హిందూపురం లోక్సభ అభ్యర్థి గోరంట్ల మాధవ్కు హైకోర్టులో ఊరట లభించింది. వివరాల్లోకి వెళితే వీఆర్ఎస్ కింద తనను రిలీవ్ చేయాలని కోరుతూ గత ఏడాది డిసెంబర్ 28న తాను పెట్టుకున్న దరఖాస్తుపై ఎటువంటి నిర్ణయం వెలువరించకుండా పెండింగ్లో పెట్టడాన్ని సవాలు చేస్తూ గోరంట్ల మాధవ్ ఏపీఏటీలో పిటిషన్ దాఖలు చేశారు.ఈ పిటిషన్పై ఏపీఏటీ విచారణ జరుపుతుండగానే, మాధవ్ వీఆర్ఎస్ దరఖాస్తును ప్రభుత్వం తిరస్కరించింది. దీనిని సవాలు చేస్తూ మాధవ్ ట్రిబ్యునల్లో ఓ అనుబంధ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై విచారణ జరిపిన ట్రిబ్యునల్ చైర్మన్ జస్టిస్ గోవిందరాజులు వెంటనే మాధవ్ను రిలీవ్ చేయాలని కర్నూలు డీఐజీని ఆదేశించారు. మాధవ్ పెట్టుకున్న వీఆర్ఎస్ దరఖాస్తును తిరస్కరిస్తూ జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేశారు. వెంటనే ఈ ఉత్తర్వులను అమలు చేయాలని ఆదేశించారు. ట్రిబ్యునల్ ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ హోంశాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీ, కర్నూలు డీఐజీలు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై సోమవారం జస్టిస్ సీతారామమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం, ట్రిబ్యునల్ ఉత్తర్వుల్లో జోక్యానికి నిరాకరించింది. ఆ ఉత్తర్వుల అమలును నిలుపుదల చేయడం ఇప్పుడు సాధ్యం కాదంది. అయితే స్వచ్ఛంద పదవీ విరమణ కోసం మాధవ్ పెట్టుకున్న దరఖాస్తు ఆమోదం, నామినేషన్ దాఖలుకు వీలుగా సర్వీసు నుంచి అతన్ని రిలీవ్ చేయడం.. ఈ వ్యాజ్యంలో తాము వెలువరించే తుది తీర్పునకు లోబడి ఉంటాయని న్యాయమూర్తులు జస్టిస్ ఎం.సీతారామమూర్తి, జస్టిస్ జె.ఉమాదేవితో కూడిన ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ (ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపించగా, మాధవ్ తరఫున సీనియర్ న్యాయవాది సి.వి.మోహన్రెడ్డి వాదనలు వినిపించారు. వీఆర్ఎస్ను ఆమోదించిన డీఐజీ ట్రిబ్యునల్ చెప్పినా పట్టించుకోని పోలీసు బాసులు హైకోర్టు తాజా తీర్పుతో ఆగమేఘాలపై స్పందించారు. ఎట్టకేలకు డీఐజీ కాంతిరాణ తాతా మాధవ్ వీఆర్ఎస్ను ఆమోదించారు. ఎంపీగా గెలిచి జగన్కు కానుకగా ఇస్తా: మాధవ్ హిందూపురం పార్లమెంట్ స్థానానికి వైఎస్సార్సీపీ తరఫున పోటీ చేసే అవకాశం కల్పించిన జగన్మోహన్రెడ్డికి రుణపడి ఉంటానని గోరంట్ల మాధవ్ అన్నారు. సోమవారం ఆయన హిందూపురం పార్లమెంట్ స్థానానికి వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. అనంతరం మాధవ్ విలేకరులతో మాట్లాడుతూ ఎన్నికల్లో గెలుపొంది ఎంపీ స్థానాన్ని జగన్కు కానుకగా ఇస్తానని చెప్పారు. -
‘చంద్రబాబు మోసాలపై బీసీలు అప్రమత్తంగా ఉండాలి’
సాక్షి, అనంతపురం: మంత్రి పరిటాల సునీత, ఎంపీ జేసీ దివాకర్రెడ్డి తన నామినేషన్ అడ్డుకోవాలని కుట్ర పన్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హిందూపురం ఎంపీ అభ్యర్థి, మాజీ పోలీసు అధికారి గోరంట్ల మాధవ్ ఆరోపించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. హైకోర్టు తీర్పు టీడీపీ ప్రభుత్వానికి చెంపపెట్టు అని అన్నారు. టీడీపీ నేతలు తన వీఆర్ఎస్ ఆమోదానికి అడ్డంకులు సృష్టించారని తెలిపారు. వెనుకబడిన వర్గాల రాజకీయ ఎదుగుదలను సీఎం చంద్రబాబు నాయుడు ఓర్వలేకపోతున్నారని విమర్శించారు. సామాన్యుడైన తనకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎంపీ టికెట్ ఇచ్చారని పేర్కొన్నారు. వైఎస్ జగన్ వల్లే బీసీల అభ్యున్నతి సాధ్యమని అన్నారు. చంద్రబాబు మోసాలపై బీసీలు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. కాగా, రాజకీయాల్లోకి చేరే ఉద్దేశంతో మాధవ్ వీఆర్ఎస్ దరఖాస్తు చేసుకున్నారు. మాధవ్ వైఎస్సార్సీపీలో చేరడంతో ఆయన వీఆర్ఎస్ ఆమోదం పొందకుండా ఏపీ ప్రభుత్వం కుట్ర పూరితంగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. అయితే మాధవ్ వీఆర్ఎస్ను ఆమోదించాలని ట్రిబ్యునల్ కూడా పేర్కొంది. కానీ ఏపీ ప్రభుత్వం దీనిపై హైకోర్టులో స్టే పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం ట్రిబ్యునల్ తీర్పును సమర్థించింది. హిందూపురం వైఎస్సార్సీపీ ఎంపీ అభ్యర్థులుగా గోరంట్ల మాధవ్, ఆయన భార్య సవిత సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. -
హిందూపురం వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్ధిగా గోరంట్ల నామినేషన్
-
హైకోర్టులో టీడీపీకి షాక్.. గోరంట్లకు ఊరట
-
టీడీపీకి చెంపపెట్టు.. గోరంట్లకు ఊరట
సాక్షి, అనంతపురం : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హిందూపురం ఎంపీ అభ్యర్థిగా బరిలో దిగనున్న మాజీ పోలీసు అధికారి గోరంట్ల మాధవ్ నామినేషన్ను అడ్డుకోవాలని ప్రయత్నించిన టీడీపీ ఆశలపై హైకోర్టు నీళ్లు చల్లింది. ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ గోరంట్ల మాధవ్ నామినేషన్కు గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. ఏపీ ప్రభుత్వం వేసిన స్టేపిటిషన్ను నిరాకరించిన హైకోర్టు గోరంట్ల నామినేషన్కు అనుమతి ఇచ్చింది. రాజకీయాల్లో చేరే క్రమంలో రెండు నెలల క్రితమే గోరంట్ల వీఆర్ఎస్కు దరఖాస్తు చేసుకున్నారు. కానీ ఏపీ ప్రభుత్వం ఆయన అభ్యర్థనను ఆమోదించకుండా పక్కనబెట్టింది. దీనిపై ట్రిబ్యునల్ తీర్పును వెలువరిస్తూ తక్షణమే మాధవ్ వీఆర్ఎస్ను ఆమోదించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. రాజకీయ కారణాలతో వీఆర్ఎస్ను నిలిపివేయడం సరికాదని ట్రిబ్యునల్ అభిప్రాయపడింది. ట్రిబ్యునల్ తీర్పుపై ఏపీ ప్రభుత్వం హైకోర్టులో స్టేపిటిషన్ వేసింది. కానీ హైకోర్టు ఆ పిటిషన్ను నిరాకరిస్తూ ట్రిబ్యునల్ తీర్పును సమర్థించింది. దీంతో ఆయన నామినేషన్ వేసేందుకు లైన్ క్లియర్ అయింది. హిందూపురం వైఎస్సార్సీపీ ఎంపీ అభ్యర్థులుగా గోరంట్ల మాధవ్, ఆయన భార్య సవిత ఈ రోజు (సోమవారం) నామినేషన్ దాఖలు చేశారు. (గోరంట్ల మాధవ్కు లైన్క్లియర్) -
నా నామినేషన్ తిరస్కరిస్తే నా భార్య పోటిలో..
అనంతపురం: ‘తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు లీడర్ కాదు... మేనేజర్. ప్రజాక్షేత్రంలో నన్ను ఎదుర్కొనే ధైర్యంలేక వీఆర్ఎస్ను ఆమోదించకుండా అడ్డంకులు సృష్టిస్తున్నారు’ అని వెఎస్సార్సీపీ హిందూపురం పార్లమెంటు అభ్యర్థి గోరంట్ల మాధవ్ అన్నారు. ఆదివారం స్థానిక ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘2018 డిసెంబరు 18న నేను రాజీనామా చేశా. 2019 జనవరి 9 నుంచి వీఆర్ఎస్లో వెళ్లిపోతానని, తన రాజీనామా ఆమోదించాలంటూ అందులో స్పష్టంగా చెప్పా. రాజీనామా లేఖ జిల్లా ఎస్పీ నుంచి కర్నూలు డీఐజీ అక్కడి నుంచి డీజీపీకి వెళ్లింది. వెంటనే రిలీవ్ చేయాలంటూ డీజీపీ ఉత్తర్వులు ఇచ్చారు. ఇంటిలిజెన్స్ ఐజీ ఏబీ వెంకటేశ్వరావు ఒత్తిళ్ల మేరకు ఆ ఉత్తర్వులను అమలు చేయకుండా కర్నూలు డీఐజీ తొక్కి పెడుతున్నారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకే ఈ విధంగా వ్యవహరిస్తున్నారు. తనకు చేస్తున్న అన్యాయంపై ట్రిబ్యునల్ను ఆశ్రయించా. పరిశీలించిన ట్రిబ్యునల్ వెంటనే వీఆర్ఎస్ను ఆమోదించి నామినేషన్ దాఖలు చేసేందుకు అడ్డంకులు లేకుండా చూడాలంటూ డీఐజీకి ఆదేశాలు జారీ చేసింది. అప్పటి నుంచి డీఐజీ అందుబాటులో లేరు. దీనిపై మళ్లీ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేదిని కలిసి ఫిర్యాదు చేశా. స్పందించిన ఆయన ట్రిబ్యునల్ ఇచ్చిన ఉత్తర్వుల మేరకు గోరంట్ల మాధవ్ను రిలీవ్ చేయాలంటూ డీజీపీకి లేఖ రాశారు. అయినా ఇప్పటిదాకా ఆయన స్పందించలేదు. ప్రభుత్వం నాపట్ల కక్ష సాధిస్తోంది. ఇన్నిరోజులూ చంద్రబాబు బీసీల ముసుగు వేసుకుని మభ్యపెడుతూ వచ్చారు. వైఎస్సార్సీపీ హిందూపురం ఎంపీ టిక్కెట్ నాకు ఇచ్చిన తర్వాత టీడీపీకి ఓటమి తప్పదని వివిధ సర్వేల్లో తేలడంతో నన్ను ఇబ్బందులకు గురి చేయాలని చూస్తున్నారు. చంద్రబాబు బీసీలను అణగదొక్కుతున్నారనేందుకు ఈ ఉదంతమే నిదర్శనం. బీసీల పక్షపాతినని, బీసీ నాయకత్వాన్ని అభివృద్ధి చేస్తామరి చెప్పుకొనే చంద్రబాబు ముసుగు ఈ రోజు తొలగిపోయింది. అసలు రంగు బయపడింది. ఓటమికి చేరువలో ఉన్న చంద్రబాబుకు భయం పట్టుకుంది. వందశాతం ఓడిపోతామనే విషయం ఆయనకూ తెలుసు. ప్రజాక్షేత్రంలో వైఎస్సార్సీపీ అభ్యర్థులను ఎదుర్కొనే ధైర్యం లేక సమస్యలు సృష్టిస్తున్నారు. బడుగు, బలహీన వర్గాల ప్రజలు గమనించాలి’ అన్నారు. నేడు నామినేషన్ దాఖలు తన వద్ద ఉన్న ఉత్తర్వులతో సోమవారం నామినేషన్ దాఖలు చేస్తున్నానని, తన భార్య కూడా నామినేషన్ దాఖలు చేస్తోందని గోరంట్ల మాధవ్ తెలిపారు. సాంకేతిక కారణాల వల్ల తన నామినేషన్ తిరస్కరణకు గురైతే తన భార్య పోటీలో ఉంటారని చెప్పారు. నామినేషన్ దాఖలు కార్యక్రమానికి పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున తరలిరావాలని కోరారు. -
చంద్రబాబు తాచుపాముకంటే ప్రమాదకరం: గోరంట్ల
-
అందుకే నా భార్యతో నామినేషన్ వేయిస్తా : గోరంట్ల
సాక్షి, అనంతపురం : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని హిందూపురం లోక్సభ వైఎస్సార్సీపీ అభ్యర్థి గోరంట్ల మాధవ్ ఆరోపించారు. మూడు నెలల కిందట పోలీసు ఉద్యోగానికి వీఆర్ఎస్ ఇచ్చినా ఆమోదించడంలేదని మండిపడ్డారు. ఇంటిలిజెన్స్ డీజీ వెంకటేశ్వర్ రావు, కర్నూలు డీఐజీ చంద్రబాబు ఆదేశాలతో పనిచేస్తున్నారన్నారు. హిందూపురంలో గెలుస్తానని భావించే తనపై చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. రేపు(సోమవారం) హిందూపురం లోక్సభ స్థానానికి తాను, తన భార్య ఇద్దరం కలిసి నామినేషన్ వేస్తామని చెప్పారు. తన నామినేషన్ ఆమోందిచకపోతే తన భార్య పోటీ చేస్తుందని పేర్కొన్నారు. సంబంధిత కథనాలు పోలీస్ అధికారుల తీరు సిగ్గుచేటు మా నాన్న అప్పుడే హెచ్చరించారు : గోరంట్ల మాధవ్ రిలీవ్పై డీజీపీకి ఈసీ లేఖ -
మాధవ్ రిలీవ్పై డీజీపీకి ఈసీ లేఖ
సాక్షి, అమరావతి/అనంతపురం : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హిందూపురం ఎంపీ అభ్యర్థిగా బరిలో ఉన్న గోరంట్ల మాధవ్ వీఆర్ఎస్ను ఆమోదించి వెంటనే రిలీవ్ చేయాలంటూ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది శుక్రవారం డీజీపీకి లేఖ రాశారు. రాజకీయంగా తనను ఇబ్బందులు పెట్టాలనే ఉద్దేశంతో వీఆర్ఎస్ను ఆమోదించడంలేదని మూడు రోజుల కిందట గోరంట్ల మాధవ్ ఏపీ ట్రిబ్యునల్ను ఆశ్రయించారు. దీనిని పరిశీలించిన ట్రిబ్యునల్.. గోరంట్ల మాధవ్ వీఆర్ఎస్ను వెంటనే ఆమోదించి నామినేషన్కు అడ్డంకులు లేకుండా రిలీవ్ చేయాలంటూ కర్నూలు డీఐజీని ఆదేశించిన సంగతి తెలిసిందే. కానీ, రెండ్రోజుల నుంచి కర్నూలు డీఐజీ నాగేంద్రకుమార్ అందుబాటులో ఉండడంలేదు. ఈ నెల 25తో నామినేషన్ల గడువు ముగుస్తుంది. ఈ నేపథ్యంలో శుక్రవారం గోరంట్ల మాధవ్ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేదిని కలిసి ఫిర్యాదు చేశారు. రాజకీయ కుట్రతోనే తన వీఆర్ఎస్ ఆమోదించకుండా అడ్డంకులు సృష్టిస్తున్నారని, లేని కేసులు ఉన్నట్లు చూపించి పెండింగ్ పెట్టారని.. దీనిపై ట్రిబ్యునల్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిందని మాధవ్ ఎన్నికల అధికారికి వివరించారు. దీనిపై స్పందించిన ద్వివేది.. మాధవ్ను వెంటనే రిలీవ్చేసి నామినేషన్ దాఖలు చేసేందుకు ఎలాంటి అడ్డంకులు లేకుండా చూడాలని డీజీపీ ఠాగూర్కు లేఖ రాశారు. (ఖాకీలే శత్రువులు !) సీఎం ఒత్తిడి మేరకే ఆ ఇద్దరి కుట్ర కాగా, తనను ప్రజాక్షేత్రంలో ఎదుర్కొనే ధైర్యంలేకే టీడీపీ అడ్డదారుల్లో ఇబ్బందులు పెట్టాలని చూస్తోందని గోరంట్ల మాధవ్ ఆరోపించారు. తన వీఆర్ఎస్ ఆమోదం విషయంలో స్వయానా ముఖ్యమంత్రే జోక్యం చేసుకుని అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ఆయన ఒత్తిడి మేరకే ఇంటెలిజెన్స్ డీజీ ఏబీ వెంకటేశ్వరరావు, కర్నూలు రేంజ్ డీఐజీ నాగేంద్రకుమార్ రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల అధికారి ఇచ్చిన ఉత్తర్వుల మేరకు డీజీపీని కలుస్తానన్నారు. -
ఖాకీలే శత్రువులు !
సాక్షి, అనంతపురం : ‘గోరంట్ల మాధవ్.. ఇతను ఓ ప్రత్యేక పోలీసు.. ఎస్ఐగా ఉన్నపుడు ‘శివమణి’.. సీఐగా అయ్యాక ‘గబ్బర్సింగ్’... ‘అనంత’ వాసులు పెట్టిన ముద్దు పేర్లు ఇవి. సినిమా పేర్లలాగే ఇతని విధినిర్వహణ కూడా సినిమాటిక్గా ఉంటుంది. సర్కిల్తో పనిలేదు. వ్యక్తులస్థాయితో అసలు సంబంధం లేదు. మాధవ్ మనసుకు ఏది మంచి అనిపిస్తే అదే మంచి. చెడు అనిపిస్తే అదే చెడు. ఇదే అతనికి తెలిసిన ‘లా అండ్ ఆర్డర్’. మాధవ్ తీరు నచ్చి అతనికి అభిమానులుగా మారినవారూ కోకొల్లలు. శైలితో విభేదించి ధ్వేషించే వారూ ఉన్నారు. ఇవన్నీ తెలిసినా ‘నేనేరా పోలీస్’ అంటూ ‘మోనార్క్లా, ‘మొండిఘటం’లా డ్యూటీ చేశారాయన. ఇదే అతనికి స్పెషల్ క్రేజ్ తెచ్చిపెట్టింది. మరోవైపు ఇదే అతని కెరీర్లో మైనస్ కూడా అయింది. ధర్మవరంలో ఎస్ఐగా తనదైన శైలిలో డ్యూటీ చేశారు. అతనికి తొలి గుర్తింపు వచ్చింది అక్కడే. అప్పట్లో అక్కడ భరించలేక చిత్తూరుకు బదిలీ చేయించారు కొందరు రాజకీయనేతలు. ఆ తర్వాత మళ్లీ గుత్తి ఎస్ఐగా వచ్చారు. ఇక్కడా అదే తీరు. ఉన్నతస్థాయి లీడర్లపై కూడా చేయిచేసుకుని రచ్చ చేశారు. అక్కడా బదిలీ తప్పలేదు. ఆపై పరిగి ఎస్ఐగా బెల్ట్షాపులపై బీభత్సం చేసి షాపులను మూయించారు. రాజకీయనేతలంతా మాధవ్పై కన్నెర్ర చేశారు. కానీ మహిళలు మాత్రం స్టేషన్కు వచ్చి రెండు చేతులెత్తి ‘నువ్వు మా దేవుడివయ్యా!’ అంటూ మొక్కారు. కానీ ‘ఎక్సైజ్’ దెబ్బకు అనంతపురం ట్రాఫిక్లోకి వచ్చి పడ్డారు. తర్వాత సీఐగా ప్రమోషన్ వచ్చింది. వన్టౌన్ ఏరియాలో మద్యం దుకాణాలకు సరికొత్త నిబంధనలు రూపొందించి సీసీ కెమెరాలు పెట్టించారు. ఇది మద్యం సిండికేట్ జీర్ణించుకోలేకోయింది. ‘స్వచ్ఛ భారత్’ అంటూ టీబీ ఆస్పత్రి శుభ్రం చేయించి హోంమంత్రి చినరాజప్పతో సన్మానం అందుకున్నారు. ఇంతలోనే ‘అనంత’లో కేబుల్ ఇష్యూకూ సంబంధించి పరిటాల శ్రీరాంకు వార్నింగ్ ఇచ్చారు. హౌసింగ్బోర్డులోని ఓ స్థలానికి సంబంధించి జెడ్పీ చైర్మన్ చమన్ను హెచ్చరించారు. వారి దెబ్బకు ఏకంగా సీఐడీకి వెళ్లాడు. దాదాపు ఏడాదిపాటు మాధవ్ మాట ‘అనంత’లో వినిపించలేదు. తర్వాత త్రీటౌన్ సీఐగా మళ్లీ ‘అనంత’కు వచ్చాడు. ఇక్కడా అదే తీరు. ఏం మారలేదు. త్రీటౌన్ పరిధే కాదు... జిల్లా వ్యాప్తంగా వచ్చిన ఎవరు స్టేషన్కు వచ్చినా సమస్య విని జోక్యం చేసుకున్నారు. ఇది ఇతర పోలీసులకు మింగుడు పడలేదు. డీఎస్పీ, ఎస్పీ వరకూ దీనిపై ఫిర్యాదులు వెళ్లాయి. ఈ క్రమంలో నోట్లరద్దు ఘటన సమయంలో ఎస్ఐపై చేయి చేసుకున్నారని మాధవ్ ఓ వ్యక్తిపై చేయిచేసుకున్నారు. అప్పటికే అతని ఇమేజ్ తట్టుకోలేని పోలీసులు మాధవ్ను బాధ్యున్ని చేస్తూ వీఆర్కు పంపారు. తర్వాత కదిరి సీఐగా వచ్చిన తర్వాత కూడా ఎంపీ జేసీ దివాకర్రెడ్డి డీఎస్పీని, జిల్లా ఎస్పీని ఏకంగా పోలీసుశాఖను కొజ్జాలు అంటే రాష్ట్రవ్యాప్తంగా ఎవరూ స్పందించలేదు. కానీ మాధవ్ విలేకరుల సమావేశం పెట్టిమరీ ‘డిపార్ట్మెంట్ జోలికి వస్తే ఖబర్దార్ అంటూ హెచ్చరించారు. ‘అనంత’లోనే కాదు... ఎస్ఐగా కడప జిల్లాలో కూడా ఇదే తరహా డ్యూటీ చేశారు. ప్రజాసేవ చేయాలని రాజకీయాల్లోకి... ప్రజాస్వామ్యయుతంగా రాజకీయాల్లోకి రావాలని మాధవ్ తన ఉద్యోగానికి వీఆర్ఎస్ ఇచ్చారు. వైఎస్సార్సీపీలో చేరారు. కానీ అప్పటి వరకూ మాధవ్కు అండగా నిలిచి పోలీసులు ఒక్కసారిగా సహాయ నిరాకరణ చేశారు. కారణం ప్రభుత్వం చేతిలో కీలుబొమ్మలు కావడమే. కనీసం అరే.. మనోడు ఇన్నేళ్లు పోలీసుశాఖలో పనిచేశాడు. రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత గెలుపోటములు దైవాదీనం, కానీ కష్టపడి సంపాదించిన ఉద్యోగాన్నే త్యాగం చేస్తున్నాడు. కనీసం మనం రాజీనామా ఆమోదించేందుకు సహకరిద్దామని ఉన్నతాధికారులు ఆలోచించలేదు. ఎంతసేపు ఎలా మాధవ్ నామినేషన్ను ఆపాలని మాత్రమే ఆలోచిస్తున్నారు. పైకి గంభీరంగా కన్పిస్తున్న మాధవ్ లోలోల చాలా బాధపడుతున్నారు. ‘నేను – నా ఖాకీ చొక్కా.. అంటూ 22ఏళ్లకుపైగా నిక్కచ్చిగా డ్యూటీ చేశా. నా ఉద్యోగాన్ని నేను వదలుకుంటానన్నా ప్రభుత్వం అడ్డుపడుతోందని వేదనపడుతున్నారు. అతనిపై కుట్రలు ఎందుకు? రాజీనామా ఆమోదించండి? నామినేషన్కు అడ్డంకులు తొలగించండి అని న్యాయం స్థానం ఉత్తర్వులిచ్చినా పోలీసులు నిర్లక్ష్యం చేస్తున్నారు. ఇప్పుడు పోలీసులు పనిచేస్తోంది ప్రభుత్వం కనుసన్నల్లో కాదు. ఎలక్షన్ కమిషన్ అజమాయిషీలో. నిర్ణయాధికారం ప్రభుత్వానిది కాదు... ఎన్నికల కమిషన్దే. ప్రభుత్వ ఒత్తిడి ఉన్నన్ని రోజులు రాజీనామా ఆమోదించకుండా ఉన్న అధికారులు కనీసం ఇప్పుడైనా రాజీనామా ఆమోదించాలని మాధవ్తో పాటు ఆయన అభిమానులు కోరుతున్నారు. -
పోలీస్ అధికారుల తీరు సిగ్గుచేటు: గోరంట్ల మాధవ్
-
‘పోలీస్ అధికారుల తీరు సిగ్గుచేటు’
సాక్షి, అమరావతి: తనను విధుల నుంచి రిలీవ్ చేయాలని కోర్టు ఉత్తర్వులు ఇచ్చినా అమలు చేయకుండా కర్నూలు డీఐజీ తప్పించుకుని తిరుగుతున్నారని హిందూపురం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లోక్సభ అభ్యర్థి గోరంట్ల మాధవ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వంలో ఉన్న అధికారి తనను రిలీవ్ చేయకుండా ఉద్దేశ పూర్వకంగా తప్పించుకుని తిరగడం సిగ్గుచేటని విమర్శించారు. రాజకీయాల్లో చేరే క్రమంలో 2018, డిసెంబరు 30న గోరంట్ల మాధవ్ సీఐ ఉద్యోగానికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. రెండు నెలల క్రితమే వీఆర్ఎస్కి దరఖాస్తు చేసుకున్నారు. కానీ ఏపీ ప్రభుత్వం ఆయన అభ్యర్థనను ఆమోదించకుండా పక్కనబెట్టింది. దీంతో ఆయనకు నామినేషన్ విషయంలో అడ్డంకులు వచ్చే పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో తక్షణమే మాధవ్ వీఆర్ఎస్ను ఆమోదించాలని ట్రిబ్యునల్.. ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించిన విషయం తెలిసిందే. (మా నాన్న అప్పుడే హెచ్చరించారు : గోరంట్ల) అయినా కూడా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో శుక్రవారం ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేదిని కలిపి ఫిర్యాదు చేశారు. ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి గెలుపును సునాయాసం చేసేందుకే తనను రీలీవ్ చేయకుండా కాలయాపన చేస్తున్నారని, పోలీస్ అధికారులే ప్రజాస్వామ్యాన్ని అపహాస్యంపాలు చేయడం దుర్మర్గమన్నారు. ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు డైరెక్టన్లో డీఐజీ పని చేస్తున్నారని మాధవ్ ఆరోపించారు. ఐపీఎస్ అధికారులు రాజకీయ పార్టీల కోసం పనిచేయకూడదని, డీజీ, కర్నూలు డీఐజీ తీరును ఎన్నికల సంఘం దృష్టికి తీసుకుకెళ్లినట్లు మాధవ్ వెల్లడించారు. -
ఈ పురం ఎవరికి వరం
హిందూపురం లోక్సభ నియోజకవర్గం.. ఎన్నికలంటేనే రాష్ట్రం మొత్తం ఇటువైపు చూస్తుంది. ఎందుకంటే అనంతపురం జిల్లాలో ఈ సిగ్మెంట్ పరిధిలో ఉన్నహిందూపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచే టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్, ఆయన కుమారుడు బాలకృష్ణ ప్రాతినిథ్యం వహించారు. ప్రస్తుతం హిందూపురం లోక్సభ నియోజకవర్గంలో టీడీపీ తరఫున నిమ్మల కిష్టప్ప పోటీచేస్తుండగా వైఎస్సార్సీపీ నుంచి గోరంట్ల మాధవ్ బరిలో దిగారు. హిందూపురం తొలి ఎన్నికల్లో పెనుకొండ పార్లమెంటరీ నియోజకవర్గంగా ఉండేది. 1957లో ఆ స్థానంలో హిందూపురం అవిర్భవించింది. 1952 ఎన్నికల్లో కేఎంపీపీ అభ్యర్థి కేఎస్ రాఘవాచారిఇక్కడ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. ఆ తరువాత హిందూపురం స్థానానికి 15సార్లు ఎన్నికలు జరగ్గా.. కాంగ్రెస్, కాంగ్రెస్(ఐ), టీడీపీలు ఐదేసి సార్లు గెలుపొందాయి. మాజీ రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి ఇక్కడి నుంచి గెలిచాక లోక్సభ స్పీకర్ అయ్యారు. ఈ నియోజకవర్గం పరిధిలో రాప్తాడు, మడకశిర, హిందూపురం, పెనుకొండ, పుట్టపర్తి, ధర్మవరం, కదిరి అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. 2014 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి నిమ్మల కిష్టప్ప గెలుపొందారు. ఇక్కడ వరుసగా మూడోసారి పోటీ చేసిన అభ్యర్థి గెలిచిన సందర్భం లేదు. కిష్టప్ప వరుసగా రెండుసార్లు ఎంపీగా విజయం సాధించారు. టీడీపీకి ఎదురుగాలి.. పెచ్చుమీరిన విభేదాలతో టీడీపీ బలహీనపడింది. పెనుకొండలో ఎమ్మెల్యే బీకే పార్థసారథితో కిష్టప్పకు తీవ్ర విభేదాలున్నాయి. ఎంపీ నుంచి గెలవడం కష్టమని భావించి ఇప్పటికే అసెంబ్లీకి వెళ్లాలని ప్రయత్నించగా కుదర్లేదు. మరోవైపు ఈ పార్లమెంటరీ పరిధిలో మైనారిటీల ఓట్లు ఎక్కువ. అయితే టీడీపీ ఒక్క సీటు కూడా మైనారిటీలకు కేటాయించలేదు. పుట్టపర్తిలో పల్లె రఘునాథరెడ్డి అవినీతిపై సొంత పార్టీ నేతలే విమర్శలు చేస్తున్నారు. ఇక్కడ శ్రీధర్రెడ్డి దూసుకుపోతున్నారు. హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ నియోజకవర్గ బాగోగులను పూర్తిగా విస్మరించారు. ఇక్కడ మాజీ ఎమ్మెల్యే అబ్దుల్ఘనీ వైఎస్సార్ సీపీలో చేరారు. బాలయ్యపై రిటైర్డ్ ఐజీ ఇక్బాల్ బరిలోకి దిగారు. రాప్తాడులో మంత్రి సునీత కుటుంబ‘సామంత పాలన’పై తీర్పు ఇచ్చేందుకు ఓటర్లు సిద్ధమయ్యారు. ధర్మవరంలో ఎమ్మెల్యే వరదాపురం వ్యవహారంతో టీడీపీకి ఇబ్బందికర పరిణామాలు ఎదురవుతున్నాయి. చేనేత వర్గాలు ఎక్కువగా ఉన్న ధర్మవరంలో వైఎస్సార్ సీపీ అభ్యర్థి కేతిరెడ్డి దూసుకుపోతున్నారు. మడకశిరలో టీడీపీ తరఫున ఈరన్న, వైఎస్సార్ సీపీ తరఫున డాక్టర్ తిప్పేస్వామి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. వైఎస్ హయాంలో లేపాక్షి హబ్.. దివంగత సీఎం వైఎస్ హిందూపురం సమీపంలో ‘లేపాక్షి నాలెడ్జ్ హబ్’ ఏర్పాటు చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలతోపాటు పలు బహుళజాతి సంస్థలు పరిశ్రమలను ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చాయి. ఇందులోని పరిశ్రమలకు నీరందించేందుకు సోమశిల బ్యాక్ వాటర్ నుంచి పైపులైన్ నిర్మాణం చేపట్టారు. 25 శాతం పనులు పూర్తయ్యాయి. చంద్రబాబు ప్రభుత్వం వీటిలో ఏఒక్క సంస్థ పురోగతికి పాటు పడలేదు. పెద్ద పెద్ద సంస్థలంటూ శంకుస్థాపనలకే పరిమితం చేశారు. గోరంట్ల మాధవ్ సానుకూలతలు : పోలీసు అధికారిగా మంచి పేరుంది. ఎలాంటి అవినీతి ఆరోపణలు లేవు పార్లమెంట్ పరిధిలో ఎక్కువ శాతం ఓటర్లు ఉన్న కురుబ సామాజికవర్గం నేత కావడం. జిల్లాలో వైఎస్సార్సీపీ బలంగా ఉండడం. టీడీపీ అవినీతి, అక్రమాలు ప్రజలకు తెలియడం. నిమ్మల కిష్టప్ప సానుకూలతలు : రెండు సార్లు ఎంపీగా చేసిన అనుభవం.. ఆర్థికంగా అండదండలు అందించే అనుచరగణం వ్యతిరేకతలు: రెండు మార్లు ఎంపీగా చేసినప్పటికీ ఆ ప్రాంతానికి ఏమీ చేయలేదని ప్రజల్లో బలంగా ఉంది. అలాగే నేతల అవినీతి అక్రమాలు పెచ్చుమీరిపోయాయి చేనేత రుణాలు మాఫీ చేస్తానని చెప్పి రిక్తహస్తం చూపడం. – మొగిలి రవివర్మ, సాక్షి ప్రతినిధి, అనంతపురం -
మా నాన్న అప్పుడే హెచ్చరించారు : గోరంట్ల
సాక్షి, అనంతపురం : చంద్రబాబు చాలా ప్రమాదకరమైన వ్యక్తి అని తన తండ్రి హెచ్చరించారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హిందూపురం ఎంపీ అభ్యర్థి గోరంట్ల మాధవ్ అన్నారు. బుధవారం విలేకరులతో మాట్లాడుతూ.... తన నామినేషన్ విషయంలో ఈరోజు కోర్టు ఇచ్చిన తీర్పు చంద్రబాబు ప్రభుత్వానికి గొడ్డలి పెట్టు అని వాఖ్యానించారు. ‘ రాజకీయాల్లోకి వచ్చే ముందు జాగ్రత్తగా ఉండాలని మా నాన్న చెప్పారు. చంద్రబాబు వంటి ప్రమాదకరమైన వ్యక్తులను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. అన్నట్లుగానే నా అభ్యర్థిత్వాన్ని నాశనం చేయాలని చంద్రబాబు కుట్ర పన్నారు. నాపై గతంలో కొట్టి వేసిన కేసులను సాకుగా చూపి తప్పుడు ఆరోపణలు చేశారు. నాపై కేసులు ఉన్నాయంటూ కోర్టును తప్పుదారి పట్టించే ప్రయత్నం చేశారు’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.(చదవండి :గోరంట్ల మాధవ్కు లైన్క్లియర్) ఈసీకి ఫిర్యాదు చేస్తా.. తనను నామినేషన్ అడ్డుకునేందుకు కుట్ర పన్నిన వారిపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తానని మాధవ్ పేర్కొన్నారు. నిమ్మల కిష్టప్ప దమ్ముంటే గెలుపోటములలో తలపడాలని సవాల్ విసిరారు. బీసీలకు పెద్దపీట వేసే వైఎస్సార్ సీపీ నాయకుడిగా బీసీలను బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రజలపై చంద్రబాబు ఒలకబోస్తున్న కపట ప్రేమను అందరికీ తెలియజేస్తానని వ్యాఖ్యానించారు. కాగా రాజకీయాల్లో చేరే క్రమంలో 2018, డిసెంబరు 30న గోరంట్ల మాధవ్ సీఐ ఉద్యోగానికి రాజీనామా చేశారు. ఈ క్రమంలో రెండు నెలల క్రితమే వీఆర్ఎస్కు దరఖాస్తు చేసుకున్నారు. కానీ ఏపీ ప్రభుత్వం ఆయన అభ్యర్థనను ఆమోదించకుండా పక్కనబెట్టింది. దీంతో ఆయనకు నామినేషన్ విషయంలో అడ్డంకులు వచ్చే పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో తక్షణమే మాధవ్ వీఆర్ఎస్ను ఆమోదించాలని ట్రిబ్యునల్.. ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించిడంతో నామినేషన్కు మార్గం సుగమమైంది. -
గోరంట్ల మాధవ్కు లైన్క్లియర్
-
గోరంట్ల మాధవ్కు లైన్క్లియర్
సాక్షి, అమరావతి : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హిందూపురం ఎంపీ అభ్యర్థిగా బరిలో దిగనున్న మాజీ పోలీసు అధికారి గోరంట్ల మాధవ్ నామినేషన్ను అడ్డుకోవాలని ప్రయత్నించిన టీడీపీ ఆశలపై ట్రిబ్యునల్ నీళ్లు చల్లింది. తక్షణమే మాధవ్ వీఆర్ఎస్ను ఆమోదించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. రాజకీయ కారణాలతో వీఆర్ఎస్ను నిలిపివేయడం సరికాదని ట్రిబ్యునల్ అభిప్రాయపడింది. దీంతో ఆయన నామినేషన్ వేసేందుకు లైన్ క్లియర్ అయింది. ఈ క్రమంలో ఆయన నామినేషన్ దాఖలు చేసేందుకు అవకాశం లభించింది. కాగా బీసీలకు పెద్దపీట వేసేందుకు వైఎస్సార్ సీపీ ఏడు లోక్సభ స్థానాలు వారికి కేటాయించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పోలీసు అధికారిగా పనిచేసిన గోరంట్ల మాధవ్ ఎంపీ అభ్యర్థిగా అవకాశం దక్కించుకున్నారు. రాజకీయాల్లో చేరే క్రమంలో రెండు నెలల క్రితమే ఆయన వీఆర్ఎస్కు దరఖాస్తు చేసుకున్నారు. కానీ ఏపీ ప్రభుత్వం ఆయన అభ్యర్థనను ఆమోదించకుండా పక్కనబెట్టింది. దీంతో ఆయన నామినేషన్పై గందరగోళం నెలకొన్న సంగతి తెలిసిందే. -
‘ఆటలు సాగవనే గోరంట్లను అడ్డుకుంటున్నారు’
సాక్షి, హైదరాబాద్ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని చూస్తే చంద్రబాబు గుండెల్లో వణుకుపుడుతోందని ఆ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ అన్నారు. వైఎస్సార్సీపీ హిందూపురం ఎంపీ అభ్యర్థిగా గోరంట్ల మాధవ్ విజయం తథ్యమని తెలిసే టీడీపీ కుట్ర రాజకీయాలకు తెరలేపిందని మండిపడ్డారు. అనంతపురంలో టీడీపీ అరాచకాలు బయటకు వస్తాయనే.. ప్రభుత్వ ఉద్యోగానికి మాధవ్ సమర్పించిన రాజీనామా ఆమోదం పొందకుండా చేసి నామినేషన్ వేయకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ‘బీసీలకు సీట్లివ్వరు.. తమ పార్టీ సీట్లిచ్చినా అధికార మదంతో అడుగడుగునా ఆటంకాలు సృష్టిస్తారు’ అని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం ఆమె మీడియాతో మాట్లాడారు. నేరుగా ఢీకొట్టే సత్తాలేని బాబు.! ‘జనసేన పార్టీలో నాగబాబు చేరినట్టు వార్తలు వస్తున్నాయి. అది మీ యిష్టం. టీడీపీ అభ్యర్థులు గెలవడానికే జనసేన డమ్మీ అభ్యర్థులను బరిలోకి దింపుతోంది. చంద్రబాబు కూటమిలో కాంగ్రెస్, జనసేన, బీఎస్పీ, వామపక్షాలతో పాటు ఊరూ.. పేరూ లేని కేఏ.పాల్ పార్టీ కూడా చేరినట్టుంది. బాబుకు నేరుగా పోటీచేయడం.. కనీసం నేరుగా పొత్తులు పెట్టుకోవడం కూడా చేతకాదు. ఎప్పుడూ ముసుగు రాజకీయాలతో ప్రజల్ని మభ్యపెట్టాలని చూస్తుంటారు’ అని చంద్రబాబుపై వాగ్బాణాలు సంధించారు. (చదవండి : జగనన్నను సీఎంగా చూడాలన్నదే నాన్న కోరిక: వైఎస్ సునీతా రెడ్డి) వివేకా హత్యపై బాబు కట్టుకథలు ‘వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసును చంద్రబాబు రాజకీయం చేయాలని చూస్తున్నారు. వివేకాది అనుమానాస్పద మృతి అని తెలిసేవరకు పోలీసులకు సమాచారం ఇవ్వలేనదని బుకాయిస్తున్నారు. చంద్రబాబు అసత్య ఆరోపణలు చేస్తుంటే పోలీసులు ఎందుకు వాస్తవాలు వెల్లడించడం లేదు. తండ్రి హత్యకేసులో దోషులను శిక్షించడానికి నిష్పాక్షిక దర్యాప్తు చేయాలని ఆయన కూతురు వైఎస్ సునీత ఫిర్యాదు చేస్తే.. వక్రీకరణలు చేస్తారా. చనిపోయింది మామూలు వ్యక్తి కాదు. మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యేగా సేవలందించిన వ్యక్తి. కోతికి కొబ్బరిచిప్ప దొరికినట్టుగా చంద్రబాబు మాట్లాడుతున్నారు. లోకేశ్ పొరపాటుగానో, గ్రహపాటుగానో వివేకా మృతి విషయం తెలిసి ‘పరవశించా!’ అన్నారు. కానీ, లోకేశ్ మాటలను బాబు నిజం చేస్తున్నారు. సిట్ వేసి అది ఏం చేయాలో ఆయనే చెప్తున్నారు. వాస్తవాలు తొక్కిపట్టి దుష్ప్రచారం చేస్తున్నారు. ఇది నీచ రాజకీయం. వివేకానందరెడ్డిది ఓ పొలిటికల్ మర్డర్. ఎన్నికల దాకా హంతకులెవరో బయటపడకుండా చంద్రబాబు జాగ్రత్త పడుతున్నారు. దిగజారి మాట్లాడుతున్నారు. ప్రజలు మిమ్మల్ని క్షమించరు’ అని పద్మ హెచ్చరించారు. -
సామాన్యులే... మాన్యులు
వారంతా సాధారణ కార్యకర్తలు. కానీ, ప్రజా సేవలో అసాధారణ అవకాశం అందుకున్నారు. వైఎస్సార్సీపీ అండతో లోక్సభ టికెట్లు దక్కించుకుని బలమైన ప్రత్యర్థులతో ఢీకి సిద్ధమంటున్నారు. రాజ వంశీకుడిపై.. సాధారణ గిరిజన మహిళ గొడ్డేటి మాధవిని విశాఖ జిల్లా అరకు లోక్సభ నియోజకవర్గ అభ్యర్థిగా వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించగానే రాష్ట్రం యావత్తు ఆశ్చర్యపోయింది. ఎందుకంటే ఆమె ఇక్కడ ఎదుర్కొనబోయేది టీడీపీ అభ్యర్ధి రాజ వంశీకుడు, కేంద్ర మాజీ మంత్రి కిశోర్చంద్రదేవ్. అలాంటి నాయకుడిపై పోటీకి నిలిపినందున అసలీ మాధవి ఎవరనేది చర్చకు వచ్చింది. ఆమె కొన్ని నెలల క్రితం వరకు విశాఖపట్నం ఏజెన్సీ కొయ్యూరు మండలంలోని ప్రభుత్వ పాఠశాలలో కాంట్రాక్టు పీఈటీ. అరకు పరిధిలో అత్యధికంగా ఉన్న కొండ దొర తెగకు చెందిన సాధారణ గిరిజన మహిళ. పార్టీలోకి రావాల్సిందిగా ఇటీవల వైఎస్సార్సీపీ నుంచి మాధవికి ఆహ్వానం అందింది. వైఎస్ జగన్ పాదయాత్ర విశాఖపట్నం జిల్లా చేరినప్పుడు ఆమె పార్టీలో చేరారు. వెంటనే అరకు లోక్సభ నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించారు. అప్పటినుంచి చురుగ్గా వ్యవహరిస్తూ గిరిజనుల్లో గుర్తింపు సాధించారు. దీంతో ఇచ్చిన మాట నిలుపుకొంటూ, అత్యధిక సంఖ్యలో ఉన్న గిరిజనులకు గుర్తింపునిస్తూ వైఎస్ జగన్ ఆమెను ఎంపీ అభ్యర్థిగా ప్రకటించారు. అతి సామాన్యుడు నందిగం సురేష్... పార్టీలో సామాన్య కార్యకర్త. మాదిగ సామాజిక వర్గంలోని దిగువ మధ్య తరగతి కుటుంబానికి చెందినవారు. ఈయన్ని బాపట్ల లోక్సభ నియోజకవర్గ అభ్యర్థిగా వైఎస్సార్సీపీ ప్రకటించడం రాష్ట్ర రాజకీయాల్లో ఆశ్చర్యం, సంచలనం రెండూ రేపాయి. అయితే రాజధాని ప్రాంతంలో చంద్రబాబు ప్రభుత్వ భూ దందాలు, దోపిడీ, దౌర్జన్యాలకు వ్యతిరేకంగా నిబద్ధుడైన పార్టీ కార్యకర్తగా ఉద్యమాలు చేసిన సురేష్ను అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి గుర్తించి టికెట్ ఇచ్చారు. అంతేకాదు ఇడుపులపాయలో పార్టీ ఎంపీ అభ్యర్థుల జాబితాను సురేష్ ద్వారా విడుదల చేయించారు. ఎన్నికల్లో డబ్బు వెదజల్లి గెలిచే ఆలోచనలో ఉన్న టీడీపీ వర్గాలు ఈ పరిణామంతో అవాక్కయ్యాయి. దీనిని ఎలా తిప్పికొట్టాలో తెలియక దిక్కుతోచని స్థితిలో పడ్డాయి. దండెత్తిన సామాన్యుడు దువ్వాడ శ్రీనివాస్... శ్రీకాకుళం జిల్లాలో విచ్చలవిడి అవినీతి, అరాచకాలకు పాల్పడుతున్న కింజరాపు కుటుంబాన్ని సవాల్ చేస్తూ వైఎస్సార్సీపీ నిలిపిన అభ్యర్థి. సిట్టింగ్ ఎంపీ రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు కుటుంబం జిల్లాలో ఇసుక, గ్రానైట్, కాంట్రాక్టు దందాలతో యథేచ్ఛగా దోపిడీకి పాల్పడింది. తమను ఎదిరించేవారిపై దాడులతో బెంబేలెత్తించింది. వారితో పోలిస్తే దువ్వాడ శ్రీనివాస్ సామాన్యుడు. జిల్లాలో అత్యధికంగా ఉన్న కాళింగ సామాజిక వర్గానికి చెందిన నేత. దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశీస్సులతో జెడ్పీటీసీ సభ్యునిగా ఎన్నికై ఉపాధ్యక్షుడయ్యారు. అనంతరం జిల్లాలో థర్మల్ ప్లాంట్ల వ్యతిరేక ఉద్యమాలు నిర్వహించి ప్రజల్లో మంచి గుర్తింపు సాధించారు. తన వ్యాపారాలను కింజరాపు కుటుంబం దెబ్బతీసినా శ్రీనివాస్ వెనకడుగు వేయలేదు. 2014 ఎన్నికల్లో టెక్కలి నియోజకవర్గంలో అచ్చెన్నాయుడుపై స్వల్ప తేడాతో ఓడిపోయారు. కానీ, చిత్తశుద్ధితో పనిచేస్తున్న శ్రీనివాస్కు వైఎస్ జగన్ మరో పెద్ద అవకాశం కల్పించారు. మహారాజుపై పోటీకి రైతుబిడ్డ బెల్లాన చంద్రశేఖర్... విజయనగరం లోక్సభ స్ధానం వైఎస్సార్సీపీ అభ్యర్థి. రాజ కుటుంబానికి చెందిన అశోక్ గజపతి రాజుపై ఆయన పోటీ చేస్తున్నారు. సంపన్నుడైన అశోక్పై వైఎస్సార్ కాంగ్రెస్ సాధారణ రైతు బిడ్డ బెల్లాన చంద్రశేఖర్ను నిలపడం విశేషం. ఈయన విజయ నగరంతో పాటు ఉత్తరాంధ్రలో అత్యధికంగా ఉన్న తూర్పు కాపు సామాజిక వర్గానికి చెందిన నేత. మధ్య తరగతి కుటుంబం. సర్పంచ్ నుంచి అంచలంచెలుగా ఎదిగారు. 2014 ఎన్నికల్లో చీపురుపల్లి నుంచి వైఎస్సార్సీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. అయినా, పార్టీనే నమ్ముకుని ఉన్నారు. దీంతో వైఎస్ జగన్ ఆయనకు మరింత పెద్ద అవకాశం ఇచ్చారు. పోలీస్ పవర్ కొన్ని నెలల క్రితం వరకు సాధారణ సీఐగా ఉన్న గోరంట్ల మాధవ్ను హిందూపూర్ ఎంపీ అభ్యర్థ్ధిగా ప్రకటించడం రాజకీయాల్లో సంచలనం రేపింది. సిన్సియర్ పోలీస్ అధికారి. పోలీసు అధికారుల సంఘం ఉపాధ్యక్షుడిగా తమ గౌరవానికి భంగం కలిగిస్తే ఎంతటివారినైనా ఉపేక్షించేవారు కాదు. ఈ క్రమంలోనే అనంతపురం జిల్లాలో ఎంపీ జేసీ దివాకర్రెడ్డి కుటుంబ దౌర్జన్యాలు, అరాచకాలను అడ్డుకున్నారు. మీసం మెలేసి మరీ సవాల్ చేశారు. ఈ క్రమంలోనే ఉద్యోగానికి రాజీనామా చేసి ప్రజాజీవితంలోకి రావాలని భావించారు. వైఎస్సార్సీపీ అవకాశం కల్పించింది. ఆర్థికంగా, సామాజికంగా బలమైన వర్గాల ప్రభావం ఉండే జిల్లాలో బీసీ వ్యక్తికి ఎంపీ టికెట్ ఇవ్వడం సంచలనమైంది. -
ఓట్ల తొలగింపు కుట్ర బాబు,లోకేష్దే
అనంతపురం, కదిరి : రాష్ట్ర ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్న ఓట్ల తొలగింపు కుట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ పనే అని వైఎస్సార్సీపీ హిందూపురం పార్లమెంట్ సమన్వయకర్త గోరంట్ల మాధవ్ ఆరోపించారు. మంగళవారం తన స్వగృహంలో కదిరి సమన్వయకర్త డా.పెడబల్లి వెంకట సిద్ధారెడ్డితో కలిసి విలేకరులతో మాట్లాడారు. ‘చంద్రబాబు తన సుదీర్ఘ రాజకీయ అనుభవాన్ని ఏనాడూ ప్రజల కోసం, రాష్ట్ర ప్రయోజనాల కోసం వినియోగించలేదన్నారు. ఎప్పుడూ స్వార్థం కోసమే ఉపయోగించారన్నారు. ఓట్లు, సీట్లు తప్పా ఆయనకు ఇంకేమీ పట్టవు.. ఓటమి భయంతోనే వైఎస్సార్సీపీ సానుభూతిపరులైన ఓటర్లను జాబితా నుంచి తొలగిస్తున్నారన్నారు. ఓట్ల తొలగింపునకు ఐటీశాఖ ఉపయోగపడుతుందనే ఏపీలో లోకేష్బాబుకు ఐటీ మంత్రి పదవి కట్టబెట్టారని అన్నారు. హైదరాబాద్లోని ఐటీ గ్రిడ్ ద్వారా ఏపీ ప్రజల వ్యక్తిగత వివరాలు, ఏపార్టీకి సానుభూతి పరులు, బ్యాంకు ఖాతాల వివరాలు ఇవన్నీ బహిర్గతం కావడంతో తండ్రీ కొడుకులపై అనుమానాలు కలుగుతున్నాయన్నారు. ఉలుకెందుకు బాబూ?: ఏపీ ప్రజల వివరాలు బహిర్గతమైన విషయంపై తెలంగాణ ప్రభుత్వం విచారిస్తుంటే చంద్రబాబు ఎందుకు భుజాలు తడుముకుంటున్నారో అర్థం కావడం లేదని మాధవ్ అన్నారు. కచ్చితంగా ఇది చంద్రబాబు పన్నిన కుట్రేనన్నారు. ఐటీ గ్రిడ్ సీఈఓకు, లోకేష్బాబుకు సత్సంబంధాలు ఉన్నాయని తెలుస్తోందన్నారు. చంద్రబాబు కుట్రలు మరోసారి బహిర్గతమయ్యాయని గుర్తు చేశారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీకి 30 సీట్లు కూడా రావనే విషయం చంద్రబాబు గ్రహించే ఇలా ఓట్లను తొలగించే దుర్మార్గపు పనులకు పాల్పడుతున్నారని వారు మండిపడ్డారు. రెండు రోజులుగా చంద్రబాబు హడావుడి చూస్తుంటే ఐడీ గ్రిడ్కు, ప్రభుత్వానికి సంబంధం ఉందనే విషయం చెప్పకనే అర్థమవుతోందన్నారు. -
'అశోక'చక్రం.. 'దివాకర' అస్త్రం!
‘జేసీ దివాకర్రెడ్డిపై సీఐ గోరంట్ల మాధవ్ ఎలాంటి వ్యక్తిగత దూషణలు చేయలేదు. డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ కూడా తప్పు చేయలేదని నిర్ధారించింది’– హైకోర్టు కౌంటర్ పిటీషన్లో జిల్లా ఎస్పీ అశోక్కుమార్ ‘ఎంపీ జేసీ దివాకర్రెడ్డిని గోరంట్ల మాధవ్ భయభ్రాంతులకు గురిచేసేలా మాట్లాడారు.’– మాధవ్పై నమోదు చేసిన ఎఫ్ఐఆర్లో పేర్కొన్న అంశం. 506 సెక్షన్కింద కేసు నమోదు ‘పోలీసులా? కొజ్జా నా కొడుకులా? ఏ జాతికి సంబంధించిన వాళ్లు వీళ్లు.’– గత ఏడాది సెప్టెంబర్ 16న ఎంపీ జేసీ వ్యాఖ్యలు పోలీసు శాఖ టీడీపీ చెప్పుచేతల్లో పని చేస్తుందనేందుకు ఇది తాజా ఉదాహరణ సాక్షి ప్రతినిధి, అనంతపురం: ఒక కాకి గాయపడితే.. వంద కాకులు అక్కడికి వచ్చి చేరడం చూశాం. అలాంటిది.. పోలీసు శాఖ పరువును, పోలీసుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తూ ఓ నేత చేసిన వ్యాఖ్యలపై స్పందించిన ఓ పోలీసుకు సొంత శాఖ నుంచే మద్దతు లభించని పరిస్థితి. టీడీపీ నేతలు ఏమి చేసినా, ఏమి మాట్లాడినా.. చివరకు పోలీసు శాఖ పరువును బజారున పడేస్తున్నా.. ఆ శాఖ ఉన్నతాధికారిగా ఎస్పీ కూడా చేష్టలుడిగి చూస్తుండటం సామాన్య ప్రజలను సైతం ఆలోచనలో పడేస్తోంది. జిల్లాలో అసలేం జరుగుతుందో పరిశీలిస్తే.. తానుఏం మాట్లాడినా చెల్లుబాటు అవుతుందని భావించిన జేసీ దివాకర్రెడ్డి గత ఏడాది సెప్టెంబర్ 16న ప్రభోదానంద ఆశ్రమం ఘటనలో భాగంగా దళిత సామాజిక వర్గానికి చెందిన డీఎస్పీ విజయ్కుమార్ను ‘నీయబ్బ చేతగాని నా కొడుకులు.. మీరు కనపడితే...(రాయలేని భాష)’ అని దారుణంగా మాట్లాడారు. ఈ విషయంలో ఎస్పీ అశోక్కుమార్ కూడా మౌనం వహించారు. ఇకపోతే తాడిపత్రిలో 2017 డిసెంబర్ 21న ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్రెడ్డి ఏకంగా పోలీసుస్టేషన్కు వెళ్లి విధుల్లో ఉన్న సీఐని ‘మీకు..(రాయలేని భాష) దమ్ములేదా? చేతకాకపోతే సెలవులో వెళ్లిపోండి? అన్నారు. జేసీ అనుచరుడు మునిసిపల్ వైస్ చైర్మన్ జిలాన్ ఏకంగా సీఐతో ‘మీ వద్ద లాఠీలు ఉంటే మా వద్ద కట్టెలు ఉన్నాయి. పది నిమిషాల సమయం ఇస్తున్నాం. ఆ తర్వాత ఏం జరుగుతుందో మాకే తెలీదు’ అని ఏకంగా బెదిరించి అల్టిమేటం జారీ చేశారు. అయినప్పటికీ సీఐ నుంచి ఎస్పీ దాకా ఎవ్వరూ స్పందించలేదు. ఎందుకంటే వీరంతా తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధులు. ఏమైనా ముందడుగు వేస్తే ‘బదిలీ అవుతుందేమోననే భయం’తో నిమ్మకుండిపోయారు. పోలీసుశాఖ పరువును కాపాడలేకపోయారు. కానీ సీఐ గోరంట్ల మాధవ్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి పోలీసులపై దుర్భాషలాడే వారికి హెచ్చరిక చేశారు. పోలీసుల్లో ఆత్మస్థైర్యం నింపారు. పోలీసులతో పాటు సాధారణ ప్రజలు కూడా ఆయనకు మద్దతు పలికి సమర్థించారు. ఖాకీ వదలగానే తప్పయిందా?: మాధవ్ వ్యాఖ్యలపై జేసీ దివాకర్రెడ్డి తాడిపత్రి స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కానీ పోలీసులు కేసు నమోదు చేయలేదు. పోలీసులపై జేసీ హైకోర్టులో రిట్ దాఖలు చేశారు. ఈ విషయంలో జిల్లా ఎస్పీ అశోక్కుమార్.. మాధవ్కు అండగా నిలిచారు. జేసీపై మాధవ్ ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని, కేసు నమోదు చేయలేమని చెప్పారు. కానీ మాధవ్ తన ఉద్యోగానికి డిసెంబర్ 29న వీఆర్ఎస్ ఇచ్చారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరే యోచనతో స్వచ్ఛంద ఉద్యోగ విరమణ చేశారు. వీఆర్ఎస్ ఇవ్వగానే అదే రోజు రాత్రి గతంలో జేసీపై మాధవ్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఎస్పీ చార్జ్ మెమో దాఖలు చేశారు. అయితే అందులో ఒకరోజు ముందు తేదీ అంటే డిసెంబర్ 28తో జారీ చేశారు. సెప్టెంబర్ 28న మాధవ్ వ్యాఖ్యలు చేశారు, అతనిపై కేసు నమోదు చేయాలని 29న జేసీ దివాకర్రెడ్డి ఫిర్యాదు చేశారు. కానీ మాధవ్ వీఆర్ఎస్ ఇచ్చిన రోజు చార్జ్ మెమో ఇచ్చారంటే ఎస్పీ స్థాయి అధికారే రాజకీయ ఒత్తిళ్లకు లొంగిపోయారనేది తెలుస్తోంది. ఆ తర్వాత మాధవ్ను ఎలా ఇబ్బంది పెట్టాలనే చర్చే టీడీపీ నేతలతో పాటు పోలీసుశాఖ ఉన్నతాధికారుల్లోనూ కొనసాగింది. అందుకే నిబంధనల మేరకు వీఆర్ఎస్ ఇచ్చినా, ఇప్పటి వరకూ దాన్ని పోలీసుశాఖ ఆమోదించ లేదని తెలుస్తోంది. మాధవ్పై ఎలాగైనా కేసు నమోదు చేయాలని.. లేదంటే ఎస్పీ ఆఫీసు ఎదుట ధర్నా చేస్తామని జేసీ దివాకర్రెడ్డి పోలీసులను బెదిరించారు. దీంతో ఇప్పటి వరకూ అండగా ఉండి, ఇప్పుడు కేసు నమోదు చేస్తే తప్పుడు సమాచారం ప్రజల్లోకి వెళుతుందని, తాడిపత్రి కోర్టులో ఓ పిటిషన్ వేస్తే కేసు నమోదు చేస్తామని ఓ పోలీసు ఉన్నతాధికారి సలహా ఇచ్చినట్లు సమాచారం. దీంతో నాలుగు రోజుల కిందట జేసీ కోర్టులో పిటిషన్ వేశారు. కోర్టు ఉత్తర్వులకు లోబడి వెంటనే పోలీసులు సెక్షన్ 506 కింద కేసు నమోదు చేశారు. హైకోర్టులో పిటిషన్ వేస్తే కౌంటర్ దాఖలు చేసిన ఎస్పీ, తాడిపత్రి కోర్టులో ఎందుకు కౌంటర్ దాఖలు చేయలేదనేది వేయి డాలర్న ప్రశ్న. కేవలం మాధవ్ వైఎస్సార్సీపీ హిందూపురం పార్లమెంట్ సమన్వయకర్తగా ఉండటం, జనాకర్షన కలిగిన నేతగా ఎదుగుతుండటంతో రాజకీయంగా ఎలాగైనా దెబ్బతీయాలనే లక్ష్యంతోనే అధికార పార్టీ పోలీసులను అడ్డుపెట్టుకుని ఈ తరహా కుట్రలు చేస్తున్నట్లు తెలుస్తోంది. పోలీసుశాఖలో తీవ్ర చర్చ విధి నిర్వహణలో ఉన్న గెజిటెడ్ ర్యాంకు అధికారులను సైతం ఇష్టానుసారం జేసీ బ్రదర్స్ దూషించినా ఉన్నతాధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేని పరిస్థితి. ఈ క్రమంలో పోలీసుశాఖ పరువును కాపాడేందుకు మాధవ్ చేసిన వ్యాఖ్యలపై పోలీసులే కేసు నమోదు చేయడం చర్చనీయాంశంగా మారింది. ఇదే సమయంలో పోలీసులపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన జేసీ బ్రదర్స్పై ఎందుకు కేసు నమోదు చేయలేదని పోలీసులతో పాటు సాధారణ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఉన్నతాధికారుల తీరు ఇలా ఉంటే, పోలీసులు ధైర్యంగా ఎలా పనిచేయగలరని సొంత శాఖలేనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జేసీపై కేసు నమోదు చేస్తే మహా అయితే రాజకీయ ఒత్తిళ్లతో బదిలీ బహుమానంగా వస్తుందని, కానీ పోలీసు పరువు నిలబడుతుందని చర్చ జరుగుతోంది. అలా కాకుండా పోలీసులపై దూషణలకు దిగిన వారిని వదిలిస్తే.. రేపు ఎంపీ, ఎమ్మెల్యే నుంచి ఎంపీటీసీ దాకా.. ఆపై రోడ్డున వెళ్లే రౌడీషీటర్ కూడా ఇదే వైఖరి అవలంబిస్తారని ఆందోళన వ్యక్తమవుతోంది. -
ఓటు కుట్రలకు చెక్ పెట్టండి
అనంతపురం అర్బన్: రాప్తాడు నియోజకవర్గం పరిధిలో ఓట్ల తొలగింపునకు భారీగా కుట్రకు పాల్పడుతున్నారు. ముఖ్యంగా వైఎస్సార్సీపీ ఓటర్లు, సానుభూతిపరుల లక్ష్యంగా అధికారపార్టీ ఈ చర్యలకు పాల్పుడతోందని, ఇందుకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని వైఎస్సార్ సీపీ హిందూపురం పార్లమెంట్ సమన్వయకర్త గోరంట్ల మాధవ్, రాప్తాడు నియోజకవర్గం సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్రెడ్డి కలెక్టర్ వీరపాండియన్కు విన్నవించారు. బుధవారం వారు కలెక్టర్ను ఆయన చాంబర్లో కలిసి ఫిర్యాదు చేయడంతోపాటు ఆధారాలను సమర్పించారు. నియోజకవర్గం పరిధిలో వైఎస్సార్సీపీకి చెందిన దాదాపు 14 వేల ఓట్లను తొలగించేందుకు సిద్ధమైనట్లు తెలిపారు. ఈ క్రమంలో ఓటర్లకు తెలియకుండా ఫారం–7లో దరఖాస్తు చేశారన్నారు. ఆ తర్వాత బీఎల్ఓపై ఒత్తిడి తీసుకొచ్చి వాటని ఆమోదింపజేసేలా కుట్రకు తెరతీశారన్నారు. ఓటు తొలగింపునకు సంబంధించి నోటీసు అందడంతో జరుగుతున్న కుట్ర వెలుగు చూసిందన్నారు. ప్రస్తుతం ఓట్ల తొలగింపునకు వచ్చి దరఖాస్తులన్నీ బోగస్వేనని చెప్పారు. ఈ చర్యకు ఎవరు పాల్పడ్డారో గుర్తించి చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే ఫారం–7 దరఖాస్తులన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించాలని, ఇంటింటికి వెళ్లి విచారణ చేయించాలని కోరారు. కలెక్టర్ను కలిసిన వారిలో జెడ్పీటీసీ సభ్యుడు వెన్నపూస రవీంద్రారెడ్డి, నాయకుడు హరినాథ్రెడ్డి, న్యాయవాది నరేంద్రరెడ్డి ఉన్నారు. -
'గోరంట్ల'ను కొండంత'జేసి'!
గోరంతను కొండంత చేస్తూ బీసీ సామాజిక వర్గానికి చెందిన వైఎస్సార్సీపీ హిందూపురం పార్లమెంట్ సమన్వయకర్త గోరంట్ల మాధవ్పై కక్ష సాధింపునకు ఎంపీ జేసీ దివాకర్రెడ్డి శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. తనను వ్యక్తిగతంగా మాధవ్ దూషించారని ఆరోపిస్తూ ఇప్పటికే ఆయన పోలీస్ స్టేషన్, హైకోర్టు మెట్లు ఎక్కారు. అయితే ఎక్కడా మాధవ్ తప్పు చేయలేదని తేలడంతో సోమవారం తాడిపత్రి కోర్టుకు వెళ్లి ప్రైవేటు కేసు నమోదు చేయాలని రిట్ దాఖలు చేశారు. దీంతో జేసీ, పోలీసుల మధ్య సమసిపోయిందనుకున్న వ్యవహారం మళ్లీ తెరపైకి వచ్చింది. సాక్షి ప్రతినిధి, అనంతపురం: ప్రభోదానంద ఆశ్రమ ఘటన వ్యవహారంలో అప్పటి డీఎస్పీ విజయ్కుమార్ను ఎంపీ జేసీ దివాకర్రెడ్డి పరుష వ్యాఖ్యలతో దూషించారు. మొత్తం పోలీసు వ్యవస్థ నైతిక స్థైర్యం దెబ్బతినేలా పోలీసులను ‘కొజ్జాలు’గా అభివర్ణించారు. దీనిపై రాష్ట్రవ్యాప్తంగా పోలీసులతో పాటు ఉద్యోగ వర్గాలు, సామాన్య ప్రజల్లోనూ జేసీపై తీవ్ర వ్యతిరేకత పెల్లుబికింది. ఈ ఘటన తర్వాత పోలీసు సంఘం తరఫున అప్పటి పోలీసు సంఘం జిల్లా అధ్యక్షుడు త్రిలోక్, కార్యదర్శి మాధవ్ విలేకరుల సమావేశం నిర్వహించారు. పోలీసులు నిజాయతీగా పనిచేస్తున్నారని, ఇటీవల పలు రాజకీయ పార్టీలకు చెందిన వ్యక్తులు కించపరిచేలా మాట్లాడుతున్నారని, చాలా సందర్భాల్లో ఇలాంటి వ్యాఖ్యలు చేసినా సంయమనం పాటించామని చెప్పారు. ఇకపై ఎవరైనా పోలీసులను కించపరిచేలా వ్యాఖ్యలు చేస్తే ‘నాలుక కోస్తాం’ అని మాధవ్ అన్నారు. ఎక్కడా కూడా జేసీ దివాకర్రెడ్డి పేరు ఉచ్ఛరించి విమర్శలు చేయలేదు. పైగా జరిగిన ఘటనపై కూడా విమర్శించలేదు. భవిష్యత్తులో ఎవరైనా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే సహించబోమనేలా మాట్లాడారు. అయితే తనను వ్యక్తిగతంగా దూషించారని జేసీ భావించి తాడిపత్రిపోలీసుస్టేషన్లో మాధవ్పై ఫిర్యాదు చేశారు. అందులో పేర్కొన్నట్లు మాధవ్ ఎక్కడా జేసీని వ్యక్తిగతంగా కించపరచలేదు. దీంతో పోలీసులు కేసు నమోదు చేయలేదు. పోలీసులపై హైకోర్టును ఆశ్రయించిన వైనం: పోలీసులు కేసు నమోదు చేయలేదని ఆరోపిస్తూ జేసీ హైకోర్టును ఆశ్రయించి రిట్ దాఖలు చేశారు. దీనిపై జిల్లా ఎస్పీ అశోక్కుమార్ కూడా కోర్టులో కౌంటర్ దాఖలు చేశారు. మాధవ్ వ్యాఖ్యలు పరిశీలించామని, ఎక్కడా జేసీని వ్యక్తిగతంగా బెదిరించడం, కించపరచడం చేయలేదని అందులో పేర్కొన్నారు. దీంతో పాటు న్యాయపరంగా చిక్కులు ఎదురుకాకుండా న్యాయసలహా కోసం ఈ అంశాన్ని ‘డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్’కు ఎస్పీ సిఫారసు చేశారు. మొత్తం వ్యవహారంలో కూడా గోరంట్ల మాధవ్, జేసీని ఉద్దేశించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. సొసైటీని ఉద్దేశించి జనరల్గా చేసిన వ్యాఖ్యలను, జేసీ తనకు ఎలా ఆపాదించుకుంటారని పోలీసుల తరఫు న్యాయవాదులు కూడా వాదించారు. దీంతో ఎంత ప్రయత్నించినా కేసు నమోదు చేయలేదనే భావనకు జేసీ వచ్చారు. వైఎస్సార్సీపీలో చేరిన తర్వాత తిరిగి కొత్త కుట్ర ఈ వ్యవహారం జరుగుతుండగానే గోరంట్ల మాధవ్ తన ఉద్యోగానికి స్వచ్ఛంద పదవీ విరమణ(వీఆర్ఎస్) చేసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. బీసీ సామాజిక వర్గానికి పెద్దపీట వేస్తూ ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి మాధవ్ను హిందూపురం పార్లమెంట్ సమన్వయకర్తగా నియమించారు. మాధవ్ నియామకంతో ఒక్కసారిగా టీడీపీ ఆత్మరక్షణలో పడింది. ప్రజల్లో మంచి క్రేజ్ ఉన్న మాధవ్ను రాజకీయంగా ఆదిలోనే దెబ్బతీయాలని టీడీపీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే హైకోర్టు పరిధిలో ఉన్న కేసును తిరిగి కింది కోర్టుకు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. సోమవారం ఉదయం జేసీ దివాకర్రెడ్డి తాడిపత్రి కోర్టుకు వెళ్లి మాధవ్పై ప్రైవేటు కేసు నమోదు చేయాలని ఫిర్యాదు చేశారు. నిజానికి పైకోర్టు పరిధిలో ఉన్న కేసులపై కింది కోర్టులను ఆశ్రయిస్తే వాటిని విచారణకు స్వీకరించరని న్యాయనిపుణులు అంటున్నారు. సీనియర్ రాజకీయ నాయకుడిగా ఈ విషయం జేసీకి స్పష్టంగా తెలుసు. అయినప్పటికీ కోర్టును ఆశ్రయించారంటే, అధికారాన్ని అడ్డుపెట్టుకుని మాధవ్ను కేసులో ఇరికించే కుట్రగా విపక్ష పార్టీ భావిస్తోంది. -
పేదలకు సేవకుడిగా ఉంటా..
కదిరి: ‘చాలా పేదరికం నుండి వచ్చాను. మా తాత గొంగడి భుజాన వేసుకొని గొర్రెలు మేపి నన్ను చదివించారు. పేదల కష్టాలు బాగా తెలుసు.. ఆ పేదలకు నా వంతు సేవలు అందించడం కోసమే రాజకీయాల్లోకి వచ్చా. వారికి సేవకుడిగా పనిచేస్తా. బడుగులకు వైఎస్సార్ సీపీ మంచి వేదిక. విధి నిర్వహణలో భాగంగా నేను జగన్ పాదయాత్రలో పాల్గొని పేదల పట్ల ఆయన చూపిన ప్రేమను కళ్లారా చూశాను. అందుకే ఈ పార్టీలో చేరాను’ అని వైఎస్సార్ సీపీ హిందూపురం పార్లమెంట్ సమన్వయకర్త కురుబ గోరంట్ల మాధవ్ అన్నారు. ఆ పార్టీ కదిరి సమన్వయకర్త డా.పెడబల్లి వెంకట సిద్దారెడ్డి సోమవారం గోరంట్ల మాధవ్ను నేరుగా ఆయన గృహంలో కలిసి సన్మానించారు. మాధవ్ నేతృత్వంలో హిందూపురం పార్లమెంట్ పరిధిలో పార్టీ మరింత బలోపేతమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాధవ్ మాట్లాడారు. తాను సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో ఉంటూ ఎల్ఎల్బీ పూర్తి చేసినట్లు వివరించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల్లో ఇప్పటికీ ఎంతోమంది ఆర్థిక ఇబ్బందులతో చదువులను మధ్యలోనే ఆపేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటి కష్టం ఇకపై ఎవ్వరికీ రాకుండా చూస్తానన్నారు. వైఎస్సార్ సీపీ అధికారంలోకి వస్తే పేదలందరికీ ఉన్నత చదువుల భాగ్యం కలుగుతుందని భరోసానిచ్చారు. ‘మీరు మీ పిల్లలను బడికి పంపినందుకు ప్రతి ఏటా ఆ తల్లి ఖాతాలో రూ15 వేలు జమచేస్తాను. మీ పిల్లలను ఇంజినీరింగ్ చదివిస్తారో, డాక్టర్ను చేయాలనుకుంటారో నాకు వదిలిపెట్టండి. వారి చదువులకయ్యే ఖర్చు మొత్తం నేనే భరిస్తాను’ అంటూ వైఎస్ జగన్మోహన్రెడ్డి తన పాదయాత్రలో ప్రజలకు ఇచ్చిన భరోసా నాలో స్ఫూర్తిని రగిలించాయి. అందుకే జగన్ మాటలకు బాగా ఆకర్షితుడినయ్యాను. ఆయనకు అభిమాని అయ్యాను. ఇదే నన్ను వైఎస్సార్సీపీలో చేరేందుకు కారణమైంది.’ అంటూ వివరించారు. టీడీపీ ఎంపీ జేసీ దివాకర్రెడ్డితో తనకు వ్యక్తిగత శత్రుత్వం ఏదీ లేదని స్పష్టం చేశారు. వైఎస్సార్సీపీ సిద్ధాంతాల మేరకే తాను వ్యవహరిస్తానని పేర్కొన్నారు. -
చంద్రబాబు పాలనంతా స్వార్థమే
అనంతపురం , పరిగి: సీఎం చంద్రబాబు పాలనంతా స్వార్థభరితమేనని రాజకీయ లబ్ధి కోసం నారా వారు ఎన్ని అబద్దాలు ఆడటానికి, మోసాలు చేయడానికైనా వెనుకాడబోరని వైఎస్సార్సీపీ హిందూపురం పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు మాలగుండ్ల శంకరనారాయణ మండిపడ్డారు. ఆదివారం పరిగి మండలంలోని ఊటుకూరులో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో నిన్ను నమ్మం బాబూ కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి హిందూపురం పార్లమెంట్ సమన్వయకర్త గోరంట్ల మాధవ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా శంకరానారాయణ మాట్లాడుతూ పసుపు కుంకుమ కార్యక్రమం పేరుతో మహిళలను చంద్రబాబు నిలువునా దగా చేస్తున్నారన్నారు. దఫాలుగా మహిళల ఖాతాల్లో డబ్బులు వేస్తామని మభ్యపెట్టి మోసం చేస్తున్నారన్నారు. కేవలం ఎన్నికల కోసమే చేస్తున్న కుయుక్తులు తప్ప మహిళలపై ఆయనకు ఎలాంటి ప్రేమలేదన్నారు. మహిళలకు ప్రజయోజనం చేకూర్చే సీఎం అయితే నాలుగున్నరేళ్లు నిద్రపోయారా అని ప్రశ్నించారు. రెండు దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్న స్థానిక ఎమ్మెల్యే బీకే పార్థసారథి మరోసారి దోచుకున్న అవినీతి సొమ్ముతో గెలవాలని చూస్తున్నారని శంకరనారాయణ ధ్వజమెత్తారు. ప్రజా సేవ చేసేందుకేరాజకీయాల్లోకి వచ్చా ప్రజలకు నేరుగా సేవలు చేయాలన్న కోరికతో రాజకీయాల్లోకి వచ్చానని, సంపాదనపై ఆశ లేదని వైఎస్సార్సీపీ హిందూపురం పార్లమెంట్ సమన్వయకర్త గోరంట్ల మాధవ్ అన్నారు. రాజకీయ నాయకుడిగా పరిగి మండలంలో అడుగు పెట్టిన ఆయనకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. యువకులు, ప్రజలు కేరింతలు పెడుతూ ఆయనకు ఘన స్వాగతం పలికారు. ‘బడుగు బలహీన వర్గాల నుండీ వచ్చాను.. వారికి అండగా నిలిచి అభివృద్ధికి చేయూత నివ్వడమే జీవిత లక్ష్యమని గోరంట్ల మాధవ్ స్పష్టం చేశారు. పోలీస్విధి నిర్వహణలో కూడా ఎప్పుడూ పేద ప్రజల పక్షానే నిలిచానన్నారు. ఎన్నో రాజకీయ ఒత్తిడులు, ఇబ్బందులకు గురయ్యానని చెప్పారు. ఉద్యోగ పరంగా పరిమితులు ఉంటాయని, రాజకీయపరంగా ప్రజాసేవకు పరిమితులుండవన్నారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా నిలిచిన వైఎస్ జగన్మోహన్రెడ్డి బాటలో నడిచి ప్రజల మన్ననలు పొందాలన్న ఆలోచనే ధ్యేయమన్నారు. కార్యక్రమంలో మండల కన్వీనర్ జయరాం, రాష్ట్ర బీసీ సెల్ కార్యదర్శి డీవీ రమణ, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి బాలాజీ, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు మారుతీశ్వరరావు, ప్రభు, బీఆర్ నారాయణ, చెన్నకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
బీసీలకు పెద్దపీట
బీసీల పార్టీగా చెప్పుకునే టీడీపీ క్రమంగా ఆ వర్గానికి దూరమవుతోంది. ఇదే సమయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బీసీలకు కీలక పదవులు కట్టబెడుతూ ఆ వర్గంలో చెరగని ముద్ర వేసుకుంటోంది. జిల్లాలోని రెండు పార్లమెంట్ స్థానాలకు సమన్వయకర్తలుగా బోయ, కురుబ సామాజిక వర్గాలకు చెందిన పీడీ తలారి రంగయ్య, గోరంట్ల మాధవ్కు స్థానం కల్పించింది. ఇకపోతే రాయదుర్గం, పెనుకొండ, కళ్యాణదుర్గం నియోజకవర్గాల సమన్వయకర్తలుగా కూడా బీసీ వర్గాలకు చెందిన కాపు రామచంద్ర, శంకరనారాయణ, ఉషాశ్రీలకు ప్రాతినిధ్యం కల్పించడం విశేషం. సాక్షి ప్రతినిధి, అనంతపురం: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హిందూపురం పార్లమెంట్ సమన్వయకర్తగా గోరంట్ల మాధవ్ను నియమిస్తూ ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. పోలీసు అధికారుల సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడుగా ఉన్న సీఐ గోరంట్ల మాధవ్ ఇటీవల తన ఉద్యోగానికి వీఆర్ఎస్ ఇచ్చి జగన్మోహన్రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. కురుబ సామాజిక వర్గానికి చెందిన మాధవ్ వెనుకబడిన వర్గాలతో పాటు అన్ని సామాజిక వర్గాల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. పోలీసు శాఖలో కూడా నిజాయతీ అధికారిగా, విధి నిర్వహణలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్నారు. పార్టీలో చేరిన కొద్దిరోజుల్లోనే ఆయనన్ను అత్యంత కీలకమైన, ప్రాధాన్యత కలిగిన పార్లమెంట్ సమన్వయకర్తగా నియమించడం విశేషం. బీసీలకు ప్రాధాన్యం: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లాలో బీసీలకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ పదవుల కేటాయింపులో పెద్దపీట వేస్తోంది. ఇప్పటికే అనంతపురం పార్లమెంట్ సమన్వయకర్తగా బోయ రంగయ్య కొనసాగుతున్నారు. హిందూపురం పార్లమెంట్ అధ్యక్షుడిగా, పెనుకొండ సమన్వయకర్తగా కురుబ శంకర్నారాయణ, కళ్యాణదుర్గం, రాయదుర్గం సమన్వయకర్తలుగా కురుబ ఉషాశ్రీచరణ్, కాపు రామచంద్ర(వీరశైవ లింగాయత్)లు కొనసాగుతున్నారు. ఈ క్రమంలో ‘పురం’ పార్లమెంట్ సమన్వయకర్తగా కురుబ సామాజిక వర్గానికి చెందిన గోరంట్ల మాధవ్ను నియమించడంతో బీసీలకు పార్టీలో మరింత సముచిత స్థానం, గౌరవం లభించినట్లయింది. ఇప్పటికే పార్టీ పదవుల్లోనూ అత్యంత కీలకమైన రాష్ట్ర ప్రధాన కార్యదర్శులుగా కూడా కురుబ సామాజిక వర్గానికి చెందిన కిష్టప్ప, రాగే పరుశురాంలు కొనసాగుతున్నారు. బీసీలకు జగన్ ఇచ్చిన గౌరవం ఇది: గోరంట్ల మాధవ్ హిందూపురం పార్లమెంట్ సమన్వయకర్తగా నన్ను నియమించిన మా పార్టీ అధ్యక్షులు జగన్మోహన్రెడ్డికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. అలాగే నాకు సహకరించిన జిల్లా ఇన్చార్జ్ పెద్దిరెడ్డి మిథున్రెడ్డి, పార్లమెంట్ అధ్యక్షులు శంకర్నారాయణ, అనంత వెంకట్రామిరెడ్డి, సమన్వయకర్తలకు ప్రత్యేక ధన్యవాదాలు. ఉద్యోగ జీవితం నుంచి రాజకీయాల్లోకి ప్రవేశించేందుకు నన్ను ప్రోత్సహించి, వెన్నంటే నిలిచిన కురుబ సోదరులతో పాటు బీసీలకు కృతజ్ఞతలు. మా అధినేత ఇచ్చిన బాధ్యతను నెరవేర్చేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తా. అనంతపురం జిల్లాలో మా పార్టీ జెండాను రెపరెపలాడించడమే పార్టీ నేతల ముందున్న ప్రథమ కర్తవ్యం. దీని కోసం సైనికుడిలా పోరాడతా. -
గోరంట్ల మాధవ్కు కీలక బాధ్యతలు
సాక్షి, అనంతపురం : హిందూపురం పార్లమెంట్ సమన్వయకర్తగా గోరంట్ల మాధవ్ను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నియమించింది. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. పోలీసు శాఖలో సీఐగా పనిచేసిన గోరంట్ల మాధవ్ ఇటీవలే వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారు. వైఎస్ జగన్ సుదీర్ఘ పాదయాత్రతో రాజకీయాలవైపు ఆకర్షితులైన ఆయన తన ఉద్యోగానికి రాజీనామా చేసి పార్టీలో చేరారు. కదిరి సీఐగా పనిచేసే సమయంలో పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన జేసీ దివాకర్ రెడ్డికి పోలీసుల పవరేంటో చూపిస్తానని గోరంట్ల మాధవ్ సవాల్ విసిరిన విషయం తెలిసిందే. తాడిపత్రిలోని ప్రభోదానంద ఆశ్రమ వివాద నేపథ్యంలో జేసీ.. పోలీసులు హిజ్రాల్లా వ్యవహరిస్తున్నారని కామెంట్ చేశారు. ఈ వ్యాఖ్యలకు తీవ్రంగా స్పందించిన గోరంట్ల మాధవ్.. నోరు అదుపులో పెట్టుకోవాలనీ, ఇష్టమొచ్చినట్టు మాట్లాడితే నాలుక కోస్తామని హెచ్చరించారు. ‘మేము మగాళ్లం’ అంటూ మీడియా ఎదుట మీసం తిప్పారు. అప్పట్లో ఈ వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. -
వైఎస్సార్సీపీలో చేరిన గోరంట్ల మాధవ్
-
ఎర్రగుంట్లలో వ్యక్తి దారుణహత్య
ఎర్రగుంట్ల : వ్యక్తి దారుణహత్యకు గురైన ఘటన ఎర్రగుంట్ల పట్టణ పరిధిలోని వేంపల్లి రోడ్డులో శనివారం చోటుచేసుకుంది. పెసల శ్రీనివాసరెడ్డి(54) అనే వ్యక్తి గొంతుకు గుడ్డచుట్టి గుర్తుతెలియని వ్యక్తులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. సీఐ వెంకటరమణ తెలిపిన వివరాల మేరకు...కమలాపురం మండలంలోని నల్లింగాయపల్లి శ్రీనివాసరెడ్డి సొంతూరు. పట్టణంలోని వేంపల్లి రోడ్డులోని విద్యుత్ సబ్ స్టేషన్ సమీపంలో శ్రీనివాసరెడ్డి నివసిస్తున్నారు. ఇతనికి తల్లిదండ్రులు లేరు. మద్యానికి అలవాడుపడిన శ్రీనివాసరెడ్డితో భార్య సుశీల ఐదేళ్ల క్రితం గొడవపడి ఇంటి నుంచి వెళ్లిపోయింది. కోర్డులో విడాకుల కేసు నడుస్తోంది. కమలాపురం మండలం ఎర్రగుడిపాడుకు చెందిన సుబ్బమ్మ, శ్రీనివాసరెడ్డి ఇంటిలో పనిమనిషిగా చేస్తుంది. రోజూ మాదిరిగానే శనివారం ఉదయం ఇంటిలో పనిచేయడానికి వచ్చింది. అప్పటికే ఇంటి గేటు తెరిచిఉండడంతో శ్రీనివాసరెడ్డిని పిలిచినా పలకలేదు. అయితే ఇంటిలోకి వెళ్లి చూడగా గొంతుకు టువాల్తో బిగించి ఉంది. అలాగే బీరువా తెరిచి ఉంది. వస్తువులన్నీ చెల్లాచెదురుగా పడిఉన్నాయి. పనిమనిషి విషయాన్ని మద్యం తీసుకువచ్చే బ్రాందీషాపు కిరణ్కు ఫోన్ చేసి చెప్పింది. కిరణ్ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఎర్రగుంట్ల సీఐలు వెంకటరమణ, కొండారెడ్డిలు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ సంఘటన స్థలంలో ఆదారాలు సేకరించారు. పనిమనిషి సుబ్బమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
వైఎస్సార్సీపీలో చేరిన గోరంట్ల మాధవ్
సాక్షి, హైదరాబాద్: అనంతపురం జిల్లాలో ఇటీవల వరకు సర్కిల్ ఇన్స్పెక్టర్ (సీఐ)గా పనిచేసిన గోరంట్ల మాధవ్ శనివారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. పదవికి రాజీనామా చేసి పార్టీలో చేరిన ఆయనకు ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పార్టీ కండువా వేసి సాదరంగా ఆహ్వానించారు. తర్వాత మాధవ్ మీడియాతో మాట్లాడుతూ రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజున వైఎస్సార్సీపీలో చేరడం ఆనందాన్ని కలిగిస్తోందన్నారు. బీసీలు, బలహీన వర్గాలకు రాజకీయాల్లో తగిన ప్రాధాన్యత కల్పించాలన్న ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ విధానాల పట్ల ఆకర్షితుడనై పార్టీలో చేరానని తెలిపారు. ఆయన పోరాట పటిమతో స్ఫూర్తిని పొందానని అన్నారు. కర్నూలు జిల్లాకు చెందిన మాధవ్ 1996 బ్యాచ్లో ఎస్ఐగా చేరి వైఎస్సార్, అనంతపురం జిల్లాల్లో పనిచేశారు. సీఐ పదవికి రాజీనామా చేసే నాటికి రాష్ట్ర పోలీసు అధికారుల సంఘం ఉపాధ్యక్షుడిగా ఉన్నారు. బాబు చేతిలో మళ్లీ మోసపోవద్దు.. నాలుగున్నరేళ్లపాటు ప్రజా వ్యతిరేక పాలన చేసి ఎన్నికలు మరో మూడు నెలల్లో వస్తున్నాయనగా సీఎం చంద్రబాబు ప్రజలకు, బీసీలకు తాయిలాలు ప్రకటిస్తున్నారని, వీటిని నమ్మి మరోసారి ప్రజలు మోసపోవద్దని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.క్రిష్ణప్ప విజ్ఞప్తి చేశారు. నిజంగా చంద్రబాబుకు ప్రజల పట్ల చిత్తశుద్ధి ఉంటే పాలనా పగ్గాలు చేపట్టినప్పుడే మేలు చేసేవారని ఇంతకాలం ఎందుకు మిన్నకున్నారనేది ప్రజలు గ్రహించాలన్నారు. బీసీలపై వైఎస్ జగన్కు నిజమైన ప్రేమ ఉందని, అందుకే బీసీల అధ్యయన కమిటీని వేశారని చెప్పారు. రాష్ట్రంలో ఉన్న 142 బీసీ కులాలను ఈ కమిటీ కలుసుకుని వారి సమస్యలను తెలుసుకుందని తెలిపారు. గుంటూరు జిల్లాలో టీడీపీకి ఝలక్ గుంటూరు జిల్లాలో అధికార పార్టీకి తీవ్ర షాక్ తగిలింది. టీడీపీ బీసీ, ఎస్సీ నేతలు పలువురు హైదరాబాద్లో వైఎస్ జగన్ సమక్షంలో పార్టీలో చేరారు. పార్టీ ఎస్సీ విభాగం అధ్యక్షుడు మేరుగ నాగార్జున ఆధ్వర్యంలో వారంతా జగన్ను కలిసి పార్టీలో చేరాలనే అభిలాషను వ్యక్తం చేశారు. భట్టిప్రోలు జడ్పీటీసీ సభ్యురాలు బండారు కుమారి, మండల తెలుగు యువత అధ్యక్షుడు బి.వెంకటేశ్వర్లు, జిల్లా చేనేత నాయకుడు మనోహర్, భట్టిప్రోలు పంచాయితీ మాజీ సర్పంచ్ కంభం మరియమ్మ తదితరులు వైఎస్సార్సీపీలో చేరారు. -
వైఎస్సార్సీపీలో చేరిన సీఐ గోరంట్ల మాధవ్
సాక్షి, హైదరాబాద్ : పోలీసు శాఖలో సీఐగా పనిచేసిన గోరంట్ల మాధవ్ శనివారం ప్రతిపక్షనేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. అనంతపురానికి చెందిన మాధవ్కు వైఎస్ జగన్ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. సీఐ మాధవ్తో పాటు ఆయన ప్రాంతానికి చెందిన పలువురు పార్టీలో చేరారు. వైఎస్ జగన్ సుదీర్ఘ పాదయాత్రతో రాజకీయాలవైపు ఆకర్షితులైన ఆయన తన ఉద్యోగానికి రాజీనామా చేసి పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరడం చాలా సంతోషంగా ఉందన్నారు. బడుగు, బలహీన వర్గాలకు పార్టీని చేరువ చేయడానికి కృషి చేస్తానని, అనంతపురం జిల్లాలో పార్టీని బలోపేతం చేస్తానన్నారు. కదిరి సీఐగా పనిచేసే సమయంలో పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన జేసీ దివాకర్ రెడ్డికి పోలీసుల పవరేంటో చూపిస్తానని గోరంట్ల మాధవ్ సవాల్ విసిరిన విషయం తెలిసిందే. తాడిపత్రిలోని ప్రభోదానంద ఆశ్రమ వివాద నేపథ్యంలో జేసీ.. పోలీసులు హిజ్రాల్లా వ్యవహరిస్తున్నారని కామెంట్ చేశారు. ఈ వ్యాఖ్యలకు తీవ్రంగా స్పందించిన సీఐ గోరంట్ల మాధవ్.. నోరు అదుపులో పెట్టుకోవాలనీ, ఇష్టమొచ్చినట్టు మాట్లాడితే నాలుక కోస్తామని హెచ్చరించారు. ‘మేము మగాళ్లం’ అంటూ మీడియా ఎదుట మీసం తిప్పారు. అప్పట్లో ఈ వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. -
మరోసారి బయటపడ్డ టీడీపీ,జనసేన మైత్రి
-
పవన్ కళ్యాణ్ను ఏమీ అనొద్దు!
సాక్షి, అమరావతి : చంద్రబాబు–పవన్ కళ్యాణ్ల రహస్య స్నేహం మరోసారి బయటపడింది. ముఖ్యమంత్రి చంద్రబాబుపై కక్ష సాధించేందుకే టీఆర్ఎస్ నేతలు వైఎస్ జగన్మోహన్రెడ్డికి మద్దతిస్తున్నారని గుంటూరు జిల్లా తెనాలిలో పవన్ ఇటీవల వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. తాజాగా పవన్ను విమర్శించొద్దని చంద్రబాబు టీడీపీ నేతలకు హుకుం జారీచేశారు. దీంతో వారి మధ్య ఉన్న లోపాయికారి ఒప్పందం బహిర్గతమైంది. టీడీపీ ఎమ్మెల్యేలు, నాయకులు, పార్టీ బాధ్యులతో శనివారం నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్లో మాట్లాడిన చంద్రబాబు.. పవన్ జోలికి వెళ్లొద్దని స్పష్టమైన సూచనలు చేశారు. ప్రధాని మోదీ, కేసీఆర్, జగన్లపైనే ఆరోపణలు చేయాలని, వారు ముగ్గురు ఒకటేనన్న ప్రచారాన్ని ముమ్మరంగా చేపట్టాలన్నారు. ఈ సమయంలో పార్టీ సీనియర్ నేత, రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి జోక్యం చేసుకుని పవన్ కూడా ఉన్నాడుగా అని గుర్తు చేయగా.. తాను చెప్పింది చేయాలని బుచ్చయ్యపై ఆగ్రహం వ్యక్తంచేశారు. దీంతో పవన్ ఇంతకాలం చంద్రబాబును, టీడీపీని పైకి తిడుతూ లోలోపల స్నేహం చేస్తున్నట్లు స్పష్టమైంది. 25 ఎంపీ, 150 ఎమ్మెల్యే స్థానాల్లో గెలవాలి కాగా, వచ్చే ఎన్నికల్లో 25 ఎంపీ, 150 అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించడమే లక్ష్యమని పార్టీ నేతలకు ముఖ్యమంత్రి చెప్పారు. కేసీఆర్, జగన్ తప్ప అందరూ కోల్కత వచ్చారని.. వారిద్దరూ మోడీ వెంట ఉన్నారని స్పష్టమైందన్నారు. ఫెడరల్ ఫ్రంట్ అనేది అసలు లేదని, అదొక శూన్యమని, పెద్ద సున్నా అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. మోదీకి మద్దతు కోసమే ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుచేశారని, అదసలు బీజేపీకి ప్రతిపక్షమే కాదన్నారు. టీఆర్ఎస్ నాయకులను ఆంధ్ర ద్వేషులుగా, వరంగల్లో తనపై రాళ్లేసిన వారితో జగన్ లాలూచీ పడినట్లు ప్రచారం చేయాలని నేతలకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. ఏపీకి స్పెషల్ ట్రీట్మెంట్ ఇచ్చామని బీజేపీ అనడం హాస్యాస్పదమన్నారు. ప్రతీ కార్యకర్త ఒక మొబైల్ మీడియా (సంచార మాధ్యమం)గా మారి ఈ విషయాలను ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేయాలని సీఎం ఆదేశించారు. కాగా, డబ్బులు ఖర్చుపెట్టే అభ్యర్థులను వైఎస్సార్ కాంగ్రెస్ వెతుకుతోందన్నారు. వైఎస్సార్సీపీ ప్రజాస్వామ్యాన్ని ధనస్వామ్యంగా చేస్తోందన్నారు. -
మాధవ్ హోరు... బీకే బేజారు!
సాక్షి ప్రతినిధి, అనంతపురం : కురుబలు రాజకీయంగా ఎదగకూడదన్నది టీడీపీ ఎమ్మెల్యే బీకే పార్థసారథి సిద్ధాంతం. ఆ సామాజిక వర్గంలో అన్నీ తానై వ్యవహరించాలన్నది ఆయన లక్ష్యం. కురుబ సామాజిక వర్గమంతా తనకే మద్దతు పలకాన్నది ఆయన ప్లాన్.. కానీ ఆదివారం నగరంలో జరిగిన కురుబ గర్జనలో ఇందుకు భిన్నమైన పరిస్థితి కనిపించింది. సీఐ మాధవ్ సభ ప్రాంగణానికి రాగానే జనం ఈలలతో హోరెత్తించారు. దీన్ని చూసి తట్టుకోలేని బీకే పార్థసారథి ప్రశాంతంగా సాగుతున్న ‘కురుబగర్జన’లో వివాదాన్ని రగిల్చారు. ఇంతకీ ఏం జరిగిందంటే... ఆదివారం జూనియర్ కాలేజీ మైదానంలో ‘కురుబగర్జన’లో సీఐ గోరంట్ల మాధవ్ కన్పించగానే 15 నిమిషాల పాటు ఈలలు, కేకలతో సభ హోరెత్తింది. మాధవ్ క్రేజ్ చూసి తట్టుకోలేక అక్కసుతో పెనుకొండ ఎమ్మెల్యే బీకే పార్థసారథి నోరుపారేసుకున్నారు. ఈ ఘటనతో ఒక్కసారిగా సమావేశంలో గందరగోళం ఏర్పడింది. చివరకు గర్జనకు ముఖ్య అతిథిగా వచ్చిన కర్ణాటక మాజీ సీఎం సిద్ధరామయ్య కూడా మాట్లాడకుండానే వెనుదిరిగారంటే పార్థసారథి సభను ఏరకంగా తప్పుదోవ పట్టించారో అర్థం చేసుకోవచ్చు. ఈ ఘటనలో పార్థసారథి వైఖరిని కురుబలు తీవ్రంగా తప్పుబడుతున్నారు. ఆయనకు బుద్ధి లేదు.. పిల్లాట ఆడతారు కురబ సమావేశం జరుగుతున్నపుడు మాధవ్ను వేదికపై పిలవలేదు. సమావేశం ప్రారంభమైన తర్వాత కులాభిమానంతో సామాన్య కురుబ వ్యక్తిగా సమావేశం చూడాలని మాధవ్ వేదిక ముందు కూర్చునేందుకు రాబోయారు. మాధవ్ కన్పించగానే జనాలు భూజాలపైకి ఎత్తుకుని ఈలలు, కేకలు వేస్తూ ‘కురుబల సింహం మాధవ్ జిందాబాద్’ అంటూ వేదిక వద్దకు తీసుకురాబోయారు. ఈ సమయంలోప్రసంగిస్తున్న కర్ణాటక మాజీ మంత్రి రేవణ్ణ ప్రసంగం ఆపి అలా చూస్తుండిపోయారు. అతను ఎవరని సిద్ధరామయ్య పక్కన వారిని అడిగి తెలుసుకున్నారు. జనాల ఆపకుండా ఈలలు, కేకలు వేయడంతో టీడీపీ ఎమ్మెల్యే పార్థసారథి తట్టుకోలేక తన అక్కసు వెళ్లగక్కారు. మైకు తీసుకుని ‘ఏయ్ ఏమయ్యా! మీరందరూ...సహకరించాలి. ఆయన్ను వదిలేయండి..కోతికి కళ్లుతాపితే ఎలా? బుద్ధిలేదా?’ అన్నారు. అయినా జనహోరు ఆగలేదు. ‘కురబ టైగర్ గోరంట్ల మాధవ్’ అంటూ నినాదాలు చేశారు. దీంతో సభకు వచ్చిన కురుబలను ‘మీరంతా అల్లరిమూకలా? ఆయనకు బుద్ధిలేదు, పిల్ల ఆట ఆడతారు, అతన్ని అవతలికి పొమ్మను. ఇట్టా రాజకీయాలు పనికిరావు, రేవణ్ణ మాట్లాడతారు, సహకరించండి’ అని బీకే అన్నారు. అయినప్పటికీ జనాలు స్పందించలేదు. బీకే పార్థసారథి తనపై పరుష వ్యాఖ్యలు చేసినా మాధవ్ హుందాగా అందరికీ నమస్కారం చేసి వెనుదిరిగారు. కానీ వేదికపై రావాలని జనాలు మళ్లీ పట్టుబట్టారు. దీంతో సీపీఐ జిల్లా కార్యదర్శి జగదీశ్ జోక్యం చేసుకుని మాధవ్ వేదికపైకి రావాలని పిలిచారు. అప్పుడు తిరిగి ప్రజలంతా మాధవ్ను భుజాలపై ఎత్తుకుని వేదిక వద్దకు తీసుకొచ్చారు. వేదిక ఎక్కిన మాధవ్ అభివాదం చేయగా... సభమొత్తం హోరెత్తింది. మాధవ్కున్న క్రేజ్ను సిద్ధరామయ్య, రేవణ్ణతో పాటు వేదికపై ఉన్నవారంతా అలా చూస్తూ ఉండిపోయారు. అనంతరం బీకే వ్యాఖ్యల నేపథ్యంలో సిద్ధరామయ్య వెళ్లిపోయారు. భోజనానికి వెళ్లారని, వస్తారని వేదికపై ఉన్నవారు చెప్పారు. బీకే పార్థసారథి కూడా వేదిక దిగి వెళ్లిపోవడంతో మాధవ్ కూడా వెళ్లిపోయారు. బీకే తీరుపై కురుబల ఆగ్రహం అయితే సాటి కురుబ వ్యక్తికి ఉన్న ప్రజాస్పందన చూసి ఎమ్మెల్యే బీకే∙ఓర్వలేకపోయారని, అలాంటపుడు కురబల్లో ఎక్కడ ఐక్యత ఉంటుందనీ, కురుబల్లో ఆయన తప్ప మరొకరు ఎదగకూడదనే వైఖరి బీకేలో ఉందని సభకు వచ్చినవారంతా చర్చించుకున్నారు. -
బుచ్చయ్యపై తమ్ముళ్ల గుస్సా
సాక్షి, రాజమహేంద్రవరం: ‘‘ఇళ్ల లబ్ధిదారులు ఎంపిక, ఫ్లాట్ల కేటాయింపు పారదర్శకంగా చేశాం. ఎవరికీ డబ్బులు ఇవ్వాల్సిన పనిలేదు. ఎవరైనా లంచాలు అడిగితే 1100కి ఫిర్యాదు చేయండి’’ అంటూ ఈ నెల 26వ తేదీన ఫ్లాట్ల కేటాయింపు పత్రాల పంపిణీ కార్యక్రమంలో రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి చేసిన వ్యాఖ్యలు పలువురు కార్పొరేటర్లలో ఆగ్రహావేశాలకు కారణమయ్యాయి. అందరికీ ఇళ్లు పథకంలో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, లబ్ధిదారుల వాటా, బ్యాంకు రుణం సహాయంతో జీ ప్లస్ 3 అపార్ట్మెంట్లు నిర్మించి ఇచ్చేందుకు పథకం రూపాందిం చారు. జిల్లాలో కాకినాడ, రాజమహేంద్రవ రం నగరపాలక సంస్థలు, పిఠాపురం, అమలాపురం, పెద్దాపురం, తుని, రామచంద్రపు రం, మండపేట, సామర్లకోట మున్సిపాలిటీల్లో 2015లో దాదాపు 21 వేల ఇళ్లను మంజూరు చేశారు. ఇందులో రాజమహేం ద్రవరం నగరపాలక సంస్థ వాటాగా 4,200 ఇళ్లు వచ్చాయి. దరఖాస్తుల స్వీకరణ అనంతరం 2016 మే నెలలో లబ్ధిదారులను ఎంపిక చేశారు. ఒక్కొక్కచోట ఒక్కోలా ఎంపిక ప్రక్రియ నిర్వహించారు. రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ పరిధిలో సుమారు 16 వేల మంది ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. నగరంలో ప్రభుత్వ భూమి లేకపోవడంతో రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గం పరిధిలోని బొమ్మూరు, తొర్రేడు, శాటిలైట్సిటీ ప్రాంతాల్లో 4,200 ఇళ్లను నిర్మిస్తున్నారు. ఫలితంగా స్థలం మా పరిధిలోనిదంటూ రూరల్ ఎమ్మెల్యే ఇళ్లలో వాటా తీసుకున్నారు. 2,400 ఇళ్లు నగరపాలక సంస్థలోని డివిజన్లకు, మిగతా 1,800 రూరల్ నియోజకవర్గంలోని లబ్ధిదారులకు ఇచ్చేలా నిర్ణయించారు. ఆ మేరకు 50 డివిజన్లలో డివిజన్కు 35 మంది చొప్పున లబ్ధిదారులను లాటరీ విధానంలో ఎంపిక చేశారు. ప్రజా ప్రతినిధులకు వాటాలు.. డివిజన్కు 35 ఇళ్ల చొప్పున 1,750 ఇళ్లకు లాటరీ తీయగా, రాజమహేంద్రవరం రూరల్లో ఏ విధంగా లబ్ధిదారులు ఎంపిక జరిగిందీ ఎవరికీ తెలియదు. లాటరీ అనంతరం అప్పటి కమిషనర్, ప్రజా ప్రతినిధులు ప్రతి కార్పొరేటర్కు తలా రెండు ఇళ్ల చొప్పున ఇచ్చారు. ఇవిగాక అధికార టీడీపీ కార్పొరేటర్లలో కొంతమందికి ఎంపీ మాగంటి మురళీమోహన్, ఎమ్మెల్యే గోరంట్ల, నగర ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ, ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు ఐదు ఇళ్లు చొప్పున ఇచ్చారు. వాటి లబ్ధిదారులను ఆయా కార్పొరేటర్లు ఎంపిక చేశారు. ఈ ఇళ్లను పలువురు రూ.50 వేల చొప్పున తీసుకుని ఇవ్వగా, మరికొందరు ఏమీ ఆశించకుండానే అర్హులైన వారిని సిఫార్సు చేశారు. నగదు వసూలు చేసే విషయమై పలుమార్లు గోరంట్ల బుచ్చయ్యచౌదరి అంతర్గత సమావేశాల్లో ప్రస్తావించారని సమాచారం. అయినా పట్టించుకోని పలువురు యథావిధిగా తమపని తాము చేసుకున్నారు. ఈ నేపథ్యంలో రెండేళ్ల తర్వాత ఫ్లాట్ల కేటాయింపు పత్రాల పంపిణీ చేసే సమయంలో లబ్ధిదారులు ముందు ఎమ్మెల్యే గోరంట్ల లంచాలు ఇవ్వొద్దంటూ బహిరంగ ప్రకటన చేయడంతో పలువురు కార్పొరేటర్లు గరంగరంగా ఉన్నారు. ఆ వ్యవహారాల సంగతేంటీ..? ఎమ్మెల్యే గోరంట్ల తమను ఉద్దేశించి తమ డివిజన్ ప్రజల ముందు మాట్లాడడంతో కార్పొరేటర్లు తీవ్ర అవమానంగా భావిస్తున్నారు. ఎన్నికల్లో ఖర్చు పెట్టవద్దని కూడా చెప్పవచ్చుగా అంటూ సమావేశంలోనే పలువురు పక్కవారి వద్ద వ్యాఖ్యానించారు. అక్కడ ఖర్చు పెట్టిన డబ్బు ఎలా తిరిగి రాబట్టాలో సెలవిస్తే వింటామని సమావేశంలో కూర్చున్న పలువురు కార్పొరేటర్ల భర్తలు వ్యాఖ్యానించారు. మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు హయాంలో ఆవరోడ్డులో కట్టిన ఇళ్లను గత ఏడాది పంపిణీ చేశారు. అక్కడ అనర్హులంటూ దాదాపు 600 మందికి మొండిచేయి చూపారు. ఆయా ఫ్లాట్లను గోరంట్ల బుచ్చయ్యచౌదరి అనుంగు అనుచరులు, కార్పొరేషన్లో పదవులు ఉన్నవారు గ్రౌండ్ ఫ్లోర్ రూ.6 లక్షలు, మొదటి అంతస్తు రూ.4 లక్షలు, రెండో అంతస్తు రూ.2.75 లక్షల చొప్పున విక్రయించుకున్నారని, మరి వాటి సంగతేంటని ప్రశ్నిస్తున్నారు. పోలీసు స్టేషన్లలో ఇన్స్పెక్టర్ల నియామకాలకు డబ్బులు వసూలు చేశారని ఆరోపిస్తున్నారు. ఇసుక ర్యాంపులు గుప్పెట్లో పెట్టుకుని రోజూ రూ.లక్షలు దండుకుంటున్న వైనంపై కూడా మాట్లాడాలని అధికార పార్టీ కార్పొరేటర్లు డిమాండ్ చేస్తున్నారు. తాము చేస్తే ఒప్పు.. ఇతరులు చేస్తే తప్పు అన్న చందంగా కార్యక్రమంలో ఎమ్మెల్యే గోరంట్ల మాట్లాడడంపై ప్రస్తుతం టీడీపీ కార్పొరేటర్లలో చర్చ జరుగుతోంది. ఇది ఎటు దారితీస్తుందో వేచి చూడాలి. మరో వైపు గోరంట్ల వ్యాఖ్యలు విన్న ఇతరులు.. ‘ఆవు చేలో మేస్తుంటే.. దూడ గట్టున మేస్తుందా?’ అంటూ చమత్కరించడం కొసమెరుపు. -
నాలుక కోస్తా అన్నావ్.. ఎక్కడికి రావాలి
-
నాలుక కోస్తా అన్నావ్.. ఎక్కడికి రావాలి: జేసీ
సాక్షి, అనంతపురం : ‘నాలుక కోస్తా అన్నావ్’... ఎక్కడికి రావాలని పోలీసు అధికారుల సంఘం కార్యదర్శి, కదిరి సీఐ గోరంట్ల మాధవ్పై టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మండిపడ్డారు. పోలీసులు కొజ్జాలు అంటూ జేసీ చేసిన వ్యాఖ్యలపై సీఐ మాధవ్ ఘాటుగా బదులిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జేసీ శుక్రవారం మీడియాతో మాట్లాడారు. దమ్ముంటే తన నాలుక కోయాలని, తనపైనే మీసాలు తిప్పుతావా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘నువ్వు ఉద్యోగం వదిలి రా.. నేను రాజకీయాలు వదిలి వస్తా.. తేల్చుకుందాం’ అని సవాల్ విసిరారు. ఈ నెల 25 తర్వాత తాను బయటకు వెళ్తున్నట్లు.. ఈ లోపు ఎక్కడికి రావాలో చెప్పు తాడోపేడో తెల్చుకుందామన్నారు. (చదవండి: జేసీ దివాకర్రెడ్డికి పోలీసుల తీవ్ర హెచ్చరిక) తాడిపత్రి ఘర్షణ సమయంలో పోలీసులు బాధ్యాతాయుతంగా వ్యవహరించలేదన్నారు. 200 మంది కర్రలతో దాడి చేస్తుంటే అడ్డుకోవాల్సిన పోలీసులు కొజ్జాల్లా పారిపోయారని, వారితో తను కూడా ఓ కొజ్జాలా పరుగెత్తినట్లు తెలిపారు. ఆడ, మగ కాని వారిని కొజ్జా అంటారని, ఈ పదం రాష్ట్ర వ్యాప్తంగా మాట్లాడుతారని, ఎవరైన బాధపడి ఉంటే క్షమాపణ చెబుతున్నానని తెలిపారు. తను ఏ ఒక్కరి పేరుతో ఆ పదాన్ని ఉచ్చరించలేదని, రక్షణ కల్పించాల్సిన పోలీసులు పరుగెత్తితే అలా అన్నానని చెప్పారు. ఈ విషయంలో తనది తప్పని నిరూపిస్తే పాదాభివందనం చేస్తానని, సీఐ మాధవ్ సినిమాల్లో హీరో సాయికుమార్లా మీసాలు తిప్పుతున్నాడని మండిపడ్డారు. ఈ సీఐ గతంలో తను చుట్టూ ఎన్నోసార్లు తిరిగాడన్నారు. అతనిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తానన్నారు. ప్రభోదానందస్వామి ఆశ్రమాన్ని తొలిగించాలని జేసీ డిమాండ్ చేశారు. విచారణ కమిటీకి ఇప్పటికే స్థానికులు అన్ని చెప్పారని, భక్తి భావంతో ప్రబోదానందస్వామి ఆశ్రమానికి ఒకసారి తను వెళ్లినట్లు స్పష్టం చేశారు. ఆయన డేరా బాబాతో సమానమని ఆరోపించారు. చదవండి: పోలీసులు హిజ్రాల్లా వ్యవహరిస్తున్నారు! -
జేసీ దివాకర్రెడ్డికి పోలీసుల తీవ్ర హెచ్చరిక
సాక్షి, అనంతపురం : పోలీసులు హిజ్రాల్లా వ్యవహరిస్తున్నారంటూ తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన టీడీపీ ఎంపీ జేసీ దివాకర్రెడ్డికి పోలీసులు గట్టి వార్నింగ్ ఇచ్చారు. జేసీ నోరు అదుపులో పెట్టుకోవాలనీ, ఇష్టమొచ్చినట్టు మాట్లాడితే నాలుక కోస్తామని పోలీసు అధికారుల సంఘం కార్యదర్శి గోరంట్ల మాధవ్ హెచ్చరించారు. ‘మేము మగాళ్లం’అంటూ మీడియా ఎదుట మీసం తిప్పారు. తమ ఆత్మస్థైర్యం దెబ్బ తీస్తే సహించేది లేదని పోలీసు అధికారులు మండిపడ్డారు. తలతిక్కగా మాట్లాడితే తగిన గుణపాఠం చెబుతామని అన్నారు. పోలీసులను హిజ్రాలతో పోల్చడం సభ్యసమాజానికే సిగ్గుచేటని జేసీ వ్యవహారంపై దుమ్మెత్తిపోశారు. అధికార అహంతో వ్యవహరిస్తే ఖబడ్దార్ అని అన్నారు. జేసీ అసభ్యకర వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలనీ, బేషరతుగా తమకు క్షమాపణలు చెప్పాలని గోరంట్ల మాధవ్, త్రిలోక్నాథ్, సూరీ డిమాండ్ చేశారు. కాగా, తాడిపత్రిలోని ప్రభోదానంద ఆశ్రమ నిర్వాహకులు తమ వర్గీయులపై దాడులు చేస్తోంటే పోలీసులు భయపడి పారిపోతున్నారనీ, హిజ్రాల్లా వ్యవహరిస్తున్నారని జేసీ ఆదివారం వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. చదవండి : పోలీసులు హిజ్రాల్లా వ్యవహరిస్తున్నారు! -
టీడీపీ ఎమ్మెల్యే తీరుపై దళిత నాయకుల ఆగ్రహం
-
బుచ్చయ్యా.. ఇదేం పద్ధతయ్యా!
రాజమహేంద్రవరం రూరల్: మనల్ని విడిచి వెళ్లిపోయిన మహనీయుల సేవలు ప్రతి నిత్యం మనకు గుర్తుండాలని వారి విగ్రహాలను ఏర్పాటు చేసుకుంటాం. పేరుకు అది విగ్రహమే అయినా ఆ మహానుభావుల ప్రతిరూపాన్ని అందులో చూసుకుంటాం. వారి విగ్రహాల వద్దకు వెళ్లినప్పుడు నమస్కరించి పూలమాలలు వేసి, గౌరవాభిమానాలను చాటుకుంటాం. కానీ, తూర్పుగోదావరి జిల్లాలో రాజమహేంద్రవరం రూరల్ టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి భిన్నంగా వ్యవహరించారు. రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్ విగ్రహంపై తన మోచేతిని ఆనించి ఫొటోలకు పోజులిచ్చారు. రాజమహేంద్రవరం రూరల్ మండలం రాజవోలు గ్రామంలో సోమవారం జరిగిన టీడీపీ కార్యక్రమంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. ఈ ఫొటో మంగళవారం సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. విషయం తెలుసుకున్న పలువురు దళిత సంఘాల నాయకులు గోరంట్ల తీరును తప్పుపడుతున్నారు. వెనుకబడిన వర్గాలకు బీఆర్ అంబేడ్కర్ దైవంతో సమానమని పేర్కొంటూ.. అటువంటి మహనీయునిపట్ల టీడీపీ సీనియర్ నేత గోరంట్ల వ్యవహరించిన తీరుపై వారు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తంచేస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఆర్టీసీ చైర్మన్ వర్ల రామయ్య తదితర నేతలు దళితులపై తమ మాటల్లో చులకన భావం చూపిస్తే.. గోరంట్ల అంబేడ్కర్ విగ్రహంపట్ల అవమానకరంగా వ్యవహరించి, తన నైజాన్ని బయట పెట్టుకున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి నక్కా రాజబాబు అన్నారు. అంబేడ్కర్ విగ్రహం వద్దకు ఏ స్థాయి నాయకుడు వచ్చినా వినయంతోనే వస్తారన్నారు. కానీ, గోరంట్ల మాత్రం తన దర్పాన్ని ప్రదర్శించే విధంగా వ్యవహరించారన్నారు. ఇందుకు ఆయన బహిరంగంగా క్షమాపణ చెప్పాలని రాజబాబు డిమాండ్ చేశారు. -
బీజేపీ తొత్తులు ఏం సమాధానం చెబుతారు..?
సాక్షి, అమరావతి : దేశ రక్షణ కోసం కొనుగోలు చేస్తున్న విమానాల్లోనూ అవకతవకలు జరిగాయని టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆరోపించారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఒక్కో యుద్ధ విమానాన్ని రూ.1650 కోట్లు పెట్టి కొనుగోలు చేస్తున్నారని చెప్పారు. రాఫెల్ ఒప్పందంలో రూ. 28 వేల కోట్ల అవినీతి జరిగిందని, ఇందులో బీజేపీ వాటా ఎంతని ప్రశ్నించారు. దేశ భద్రతకు ముప్పు వాటిల్లేలా బీజేపీ వ్యవహరిస్తోందని విమర్శించారు. ‘గుజరాత్ రాష్ట్రంలో జీఎస్పీఎల్ పెట్టి ఆ రాష్ట్రాన్ని మోసం చేయలేదా..? నష్టాల్లో ఉన్న జీఎస్పీఎల్ సంస్థను ఓఎన్జీసీకి ఎలా కట్టబెట్టారు..? జీఎస్పీఎల్ ఒప్పందంలో వచ్చిన డబ్బుతో గుజరాత్ ఎన్నికల్లో పబ్బం గడుపుకున్నది వాస్తవం కాదా..? రాష్ట్రానికి చేసే న్యాయం చేయకపోగా టీడీపీపై అవినీతి ఆరోపణలు చేస్తారా..? ఈ విషయాలపై స్థానిక బీజేపీ తొత్తులు ఏం సమాధానం చెబుతార’ని ప్రశ్నించారు. కనీస ఇంగితం లేకుండా రాష్ట్ర బీజేపీ నేతలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రాష్ట్రానికి ఇవ్వాల్సిన నిధులను బీజేపీ జేబులో నుంచి అడగడం లేదని, తన పబ్బం గడుపుకోవడం కోసం ప్రాంతీయ తత్వాన్ని బీజేపీ రెచ్చగొడుతోందని విమర్శించారు. అన్నాడీఎంకే ఎంపీలను సస్పెండ్ చేసి లోక్సభలో అవిశ్వాసంపై చర్చ ఎందుకు పెట్టడం లేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో జరుగుతోన్న అభివృద్ధి బీజేపీ నేతల కళ్లకు కనపడడం లేదా..? అని ఎద్దేవా చేశారు. సెస్సుల ద్వారా వస్తోన్న డబ్బును సక్రమంగా వినియోగించడం లేదని ధ్వజమెత్తారు. రైతు రుణ మాఫీకి నిధులు ఇవ్వని మోదీ, బ్యాంకులను దోచుకుంటోన్న వారిని రక్షిస్తున్నారని విమర్శనాస్త్రాలు సంధించారు. -
టీడీపీ-బీజేపీ ఫైట్; తెరపైకి గోద్రా అల్లర్లు
సాక్షి, రాజమండ్రి: నాలుగేళ్లు ఉమ్మడిగా అధికారాన్ని పంచుకున్న టీడీపీ-బీజేపీలు ఇప్పుడు బద్ధశత్రువుల్లా కలహించుకుంటున్నవేళ గోద్రా అల్లర్ల వ్యవహారం మళ్లీ చర్చకు వచ్చింది. 2002నాటి గోద్రా అల్లర్లకు బాధ్యుడిగా ఆరోపణలు ఎదుర్కొన్న (అప్పటి గుజరాత్ సీఎం) నరేంద్ర మోదీని ఏపీలో అడుగుపెట్టనివ్వబోనని చంద్రబాబు శపథం చేయడం తెలిసిందే. ఆ తర్వాత 2014 ఎన్నికల్లో ఇరువురు నేతలూ కలిసిపోయి, కేంద్రంలో, ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వాలను ఏర్పాటు చేశారు. కానీ, నాటి బాబు వ్యాఖ్యలను మోదీ ఇప్పటికీ గుర్తుపెట్టుకున్నారని, ఆ కక్షతోనే ఏపీకి అన్యాయం చేస్తున్నారని టీడీపీ నేతలు వాదిస్తున్నారు. రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆదివారం రాజమండ్రిలో మీడియాతో మాట్లాడుతూ గోద్రా అల్లర్లను ప్రస్తావించారు. ‘‘గోద్రాలో మైనారిటీల ఊచకోతను చంద్రబాబు ఖండించారు. అప్పటి నుంచే బాబుపై మోదీ కక్ష పెంచుకున్నారు’’ అని గోరంట్ల వ్యాఖ్యానించారు. ఎన్డీఏ కూటమిలో చేరి టీడీపీ నష్టపోయిందని, కేంద్రంలో టీడీపీకి పనికిమాలిన శాఖలు దక్కితే, ఏపీలో మాత్రం బీజేపీకి ముఖ్యమైన శాఖలు ఇచ్చామని అన్నారు. వీర్రాజుకు కౌంటర్: టీడీపీపై ఎడతెగని విమర్శలు చేస్తోన్న బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజుపైనా గోరంట్ల ఫైరయ్యారు. ‘‘వార్డు మెంబర్గా కూడా గెలవలేని వీర్రాజు.. ఇవాళ మాపై విమర్శలు చేస్తున్నారు. ఆయనకు దమ్ముంటే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి రాజమండ్రి రూరల్లో నాపై పోటీకి రావాలి. రాజమండ్రిలో అమిత్ షా సభ పెడితే వ్యాపారులను బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు గుంజిన ఘనత వీర్రాజుది’’ అని మండిపడ్డారు. -
చదువుల విప్లవం తీసుకువస్తా: జగన్
సాక్షి, కర్నూలు : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మళ్లీ వైఎస్ఆర్ సువర్ణయుగం తీసుకు వస్తామని ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. పిల్లలు చదువుకుంటేనే జీవితాలు మారుతాయని, పిల్లలను బడికి పంపిస్తే ప్రతి తల్లికి రూ.15 వేలు ఇస్తానని, వైఎస్ఆర్ను గుర్తు తెచ్చేలా చదువుల విప్లవం తీసుకు వస్తానని ఆయన తెలిపారు. ప్రస్తుతం ఫీజు రీయింబర్స్మెంటే కాకుండా స్కాలర్ షిప్లు కూడా రావడం లేదన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక... ఫీజు రీయింబర్స్మెంట్ ఎంత ఉన్నా తమ ప్రభుత్వం చదివిస్తుందన్నారు. అంతేకాకుండా మెస్ బోర్డింగ్ ఫీజులు కూడా చెల్లిస్తామని తెలిపారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా ఆయన ఆదివారం కోడుమూరు నియోజకవర్గం గోరంట్లలో బీసీ సంఘం ప్రతినిధులు సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ... ‘బీసీల ఆత్మీయ సమ్మేళనం జరుపుకోవడం ఆనందంగా ఉంది. ఎన్నికల్లో ఇచ్చిన ఒక్క హామీని కూడా చంద్రబాబు నెరవేర్చలేదు. కురువలను బీసీల నుంచి ఎస్టీల్లో చేరుస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. వాల్మీకులు, బోయలను కూడా ఎస్టీలో చేరుస్తామని, రజకులను ఎస్సీలుగా గుర్తిస్తామని చంద్రబాబు చెప్పారు. ఆయన ఇప్పటివరకూ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. ఎన్నికల్లో హామీలిచ్చి మోసం చేయడం ధర్మమేనా?. ఎన్నికల ముందు కరెంటు బిల్లులు తగ్గిస్తామని చెప్పారు. చంద్రబాబు సీఎం కాకముందు రేషన్ షాపుల్లో 9 రకాల వస్తువులు ఉండేవి. ఇప్పుడు రేషన్ షాపుల్లో బియ్యం తప్ప ఏమీ ఇవ్వడం లేదు. నాలుగేళ్లలో ఒక్క ఇల్లు అయినా చంద్రబాబు కట్టించారా?. జాబు రావాలంటే బాబు రావాలన్నారు. జాబు రాకపోతే నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. జాబులేదు, నిరుద్యోగ భృతి లేదు. బీసీల మీద నిజమైన ప్రేమ ఉన్న నాయకుడు వైఎస్ఆర్. వైఎస్ఆర్ హయాంలో బీసీల పిల్లలు ఉన్నత చదవులు చదువుకున్నారు. ఎన్నికలొస్తే బీసీలంటే చంద్రబాబు వల్లమాలిన ప్రేమ చూపిస్తారు. ఎన్నికల ముందు ఓ మాట, అయ్యాక మరో మాట మాట్లాడటం ఆయనకు అలవాటే. చంద్రబాబు లాంటి వారి వల్ల రాజకీయ వ్యవస్థ విశ్వసనీయత కోల్పోయింది. రాజకీయ వ్యవస్థలో మార్పు రావాలి. పాదయాత్రలో నా దృష్టికొచ్చే ప్రతి సమస్యను పరిష్కరిస్తా. రెండే రెండు పేజీల మేనిఫెస్టో తీసుకువస్తా. అందులోని ప్రతి అక్షరాన్ని తుచ తప్పకుండా అమలు చేస్తా.’ అని హామీ ఇచ్చారు. -
నేను టీడీపీలో ఉన్నానా?
రాజమహేంద్రవరం సిటీ: ఇంటింటికీ టీడీపీ కార్యక్రమం వేదికగా నగర టీడీపీలో గ్రూపు విభేదాలు మరోసారి బయటపడ్డాయి. ఏకంగా వేదికపై నుంచే మేయర్ పంతం రజనీశేషసాయి ‘నేను పార్టీలోనే ఉన్నానా? లేదా? అర్థం కావడం లేదు’ అని అనడం సంచలనం రేపింది. స్థానిక 42వ డివిజన్లో ఇంటింటికీ టీడీపీ ముగింపు కార్యక్రమం ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా వేదికపైన, చుట్టుపక్కల ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. వేదికపై ఉన్న ఫ్లెక్సీలో తన ఫొటో పెట్టకపోవడంపై మేయర్ పైవిధంగా స్పందించారు. అనంతరం గోదావరి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (గుడా) చైర్మన్ గన్ని కృష్ణ మైకు అందుకొని ‘గౌరవం ఆపాదించుకుంటే రాదు. తమ పనుల ద్వారా సంపాదించుకోవాలి’ అని మేయర్నుద్దేశించి అన్నారు. తరువాత ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి మాట్లాడుతూ ‘పొరపాటు వల్ల ఫొటో వేయకపోవచ్చు. పెద్దగా పట్టించుకోకూడదు. మేయర్ తెలియనివారు ఉండరు’ అని అన్నారు. ముఖ్య అతిథిగా వచ్చిన డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప మాట్లాడుతూ, 30 ఏళ్లుగా పార్టీలో తన పేరు, ఫొటో గురించి పట్టించుకోలేదని, పదవులతో పార్టీకి గుర్తింపు తీసుకురావాలని అన్నారు. ఇటీవల గణేష్చౌక్ సమీపంలో ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి రాకుండానే ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, గన్ని కృష్ణ ఇంటింటికీ టీడీపీ ప్రారంభించారు. దీంతో వారిద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా జరిగిన ఘటనతో నగర టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల, ఎమ్మెల్సీ ఆదిరెడ్డి, గన్ని కృష్ణ, పంతం రజనీ శేషసాయి వర్గాలుగా విడిపోయినట్టుగా కనిపిస్తోంది. -
వైద్యో నారాయణో ‘హరీ’
– జిల్లాలో ఆర్ఎంపీల ఆగడాలు – ప్రాణాలు కోల్పోతున్న అమాయకులు – తాజాగా గోరంట్లలో చిన్నారి మృతి – హద్దుదాటి వైద్యం చేస్తున్న వైనం – సాక్షి పరిశీలనలో బట్టబయలు – నిర్లక్ష్యం వీడని వైద్య ఆరోగ్యశాఖ ఇక్కడ కన్పిస్తున్నది అనంతపురంలోని ఎర్రనేల కొట్టాలలో ఉన్న స్నేహ మెడికల్ షాప్. ఇందులోనే ప్రథమ చికిత్స కేంద్రం ఉంది. ఇక్కడే ఫ్యాన్సీ స్టోర్ కూడా నిర్వహిస్తున్నారు. ఆదివారం ఓ వ్యక్తి అనారోగ్యంగా ఉందని వస్తే ఇదిగో ఇలా బెంచీపైనే సెలైన్ ఎక్కించారు. కాసులకు కక్కుర్తి పడి ‘హద్దులు’దాటి వైద్యం చేశారు. వాస్తవానికి ఆర్ఎంపీ, పీఎంపీలు ప్రథమ చికిత్స మాత్రమే చేయాలి. సూది మందు, సెలైన్లు ఎక్కించకూడదు. కానీ ఎవరూ దీన్ని పట్టించుకోవడం లేదు. అనంతపురం మెడికల్: గోరంట్ల మండలం మల్లాపల్లి పంచాయతీ బూగానిపల్లికి చెందిన శంకర, రాధమ్మ దంపతుల కూతురు శ్రావణి (3)కి గత శుక్రవారం రాత్రి జ్వరం వచ్చింది. మరుసటి రోజు ఉదయం గోరంట్లలోని లక్ష్మీ వెంకటేశ్వర ప్రథమ చికిత్స కేంద్రానికి తీసుకెళ్లారు. పాపను ఇతర ఆస్పత్రులకు రెఫర్ చేయాల్సిన ఆ ఆర్ఎంపీ ఇంజెక్షన్ వేసి పంపాడు. సాయంత్రమైనా పరిస్థితిలో మార్పు రాకపోవడంతో మరోసారి అదే ఆర్ఎంపీ వద్దకు వెళ్లారు. అప్పటికే చిన్నారి పరిస్థితి విషమంగా ఉండడంతో హిందూపురం తీసుకెళ్లాలని సూచించగా మార్గంమధ్యలోనే శ్రావణి మృతి చెందింది. ఉదయం ఇంజెక్షన్ వేసినప్పటి నుంచి పాప ఆరోగ్యం క్షీణించిందని, మృతికి వైద్యుడే కారణమంటూ కుటుంబ సభ్యులు ఆందోళన చేశారు. ఆ తల్లి కడుపుకోత మాటల్లో చెప్పలేనిది. వైద్యం కోసం వెళ్తే ప్రాణాలు నైవేద్యంగా పెట్టాల్సి వస్తోంది. తెలిసీ తెలియని పరిజ్ఞానంతో ఆర్ఎంపీలు హద్దుదాటి వైద్యం చేస్తుండడంతో అమాయకులు బలవుతున్నారు. వైద్యో నారాయణో హరి అని ఆస్పత్రి మెట్లెక్కితే ప్రాణాలు ‘హరీ’ అంటున్నాయి. జిల్లాలో ఆర్ఎంపీ, పీఎంపీల ధనదాహం తారస్థాయికి చేరుతోంది. నిబంధనల మేరకు ఆర్ఎంపీ క్లినిక్లలో ప్రథమ చికిత్స మాత్రమే చేయాలి. సూది మందు, సెలైన్లు ఎక్కించకూడదు. కానీ అడిగేవారు లేకపోవడంతో ఏకంగా అత్యవసర కేసులను ఎల్లవేళలా చూస్తామని బోర్డులే పెట్టేస్తున్నారు. గోరంట్లలో ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో ఆదివారం అనంతపురంలోని పలు ‘క్లినిక్’లను ‘సాక్షి’ పరిశీలించగా అసలు బండారం బయటపడింది. అంతా కాసుల కక్కుర్తే ప్రైవేట్ ఆస్పత్రులు, డయాగ్నస్టిక్ సెంటర్లతో చేసుకున్న ముందస్తు ఒప్పందాలతో తమ వద్దకు వచ్చే వారిని ఆర్ఎంపీలు భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. పరీక్షల పేరుతో ల్యాబ్లకు, మెరుగైన వైద్యం పేరుతో ప్రైవేట్ ఆస్పత్రులకు కాసుల పంట పండించి అందినకాడికి వెనకేసుకుంటున్నారు. క్లినిక్లలోనే మందుల దుకాణాలు నిర్వహిస్తూ నిబంధనలను అతిక్రమిస్తున్నారు. చాలా ప్రాంతాల్లో ఏకంగా పడకలను సైతం ఏర్పాటు చేసుకుని సెలైన్లు ఎక్కిస్తున్నారు. ప్రథమ చికిత్సను మరచి అన్ని రకాల వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయడంతో పాటు సొంతంగా మందులు రాసివ్వడం, వారే విక్రయించడం, రక్త, వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. ఇలాంటివి అనంతపురం నగరంలోనే 50కి పైగా ఉన్నాయి. గుంతకల్లు, హిందూపురం, తాడిపత్రి, కళ్యాణదుర్గం, రాయదుర్గం, పెనుకొండ, కదిరి, గుత్తి, పుట్టపర్తి వంటి పట్టణాలే కాకుండా మండల కేంద్రాలు, మేజర్ పంచాయతీల్లోనూ ఆర్ఎంపీలు ఆడిందే ఆటగా సాగుతోంది. వైద్య ఆరోగ్యశాఖ పనితీరుపై విమర్శలు ఆర్ఎంపీలు ధనార్జనే ధ్యేయంగా ముందుకెళ్తుంటే కట్టడి చేయాల్సిన వైద్య ఆరోగ్యశాఖ తమకేమీ పట్టనట్టు వ్యవహరిస్తోంది. ఎక్కడికక్కడ మామూళ్లు అందుతుండడంతోనే చూసీ చూడనట్లు వెళ్తున్నారన్న విమర్శలున్నాయి. జిల్లా వ్యాప్తంగా 2 వేలకు పైగా ఆర్ఎంపీలు ఉన్నా నెలలో ఒక్కసారి కూడా తనిఖీలు చేసిన దాఖలా లేదు. ఫిర్యాదులు వస్తున్నా పట్టించుకునే తీరిక లేకుండా గడుపుతున్నారు. అనంతపురం నగరంలోని ఎర్రనేలకొట్టాల, సోమనాథ్నగర్, సాయినగర్, రాజీవ్కాలనీ, పాతూరు తదితర ప్రాంతాల్లోని క్లినిక్లు ఇష్టారాజ్యంగా వైద్యం చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా చాలా చోట్ల మందుల దుకాణాల నిర్వాహకులు ఆర్ఎంపీలకు ఒక గదిని కేటాయించి ప్రజలకు ఉచిత ఓపీ పేరుతో మందుల కొనుగోళ్లను ప్రోత్సహిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. ఆకస్మిక తనిఖీలు చేయాలని, నిబంధనలకు విరుద్ధంగా వైద్యశాలలు నిర్వహిస్తుంటే మూసివేయాలన్న ఉత్తర్వులు ఉన్నా అమలు కావడం లేదు. చర్యలు తీసుకుంటాం ఆర్ఎంపీలు ఫస్ట్ ఎయిడ్ మాత్రమే చేయాలి. ఇంజెక్షన్లు, సెలైన్స్ ఎక్కించకూడదు. క్లినిక్లలో బెడ్స్ ఉండకూడదు. పేరుకు ముందు డాక్టర్ అని రాసుకోకూడదు. జిల్లా వ్యాప్తంగా ఆర్ఎంపీల వైద్యంపై నిఘా ఉంచాలని మెడికల్ ఆఫీసర్లకు ఆదేశాలు ఇచ్చాం. గోరంట్ల ఘటన బాధాకరం. అధికారులు వెళ్లి విచారణ చేపట్టారు. గుత్తిలో కూడా ఓ క్లినిక్పై ఫిర్యాదు వచ్చింది. దాడులు చేసి చర్యలు తీసుకుంటాం. – డాక్టర్ వెంకటరమణ, డీఎంహెచ్ఓ -
ఇంజక్షన్ వికటించి చిన్నారి మృతి
ఆర్ఎంపీ నిర్లక్ష్యం వల్లేనంటూ బాధితుల ఆందోళన గోరంట్ల(సోమందేపల్లి) : గోరంట్ల పట్టణంలో ఆర్ఎంపీ వేసిన ఇంజక్షన్ వికటించి చిన్నారి మృతి చెందినట్లు తల్లిదండ్రులు, బంధువులు ఆందోళనకు దిగారు. బూగానిపల్లికి చెందిన రాధమ్మ, శంకర దంపతులు తమ కుమార్తె శ్రావణి (3)కి జ్వరం వస్తుండటంతో గోరంట్లలోని శ్రీలక్ష్మీ వెంకటేశ్వర క్లినిక్కు తీసుకెళ్లారు. ఆర్ఎంపీ పెద్దన్న ఇంజక్షన్ వేసి పంపించాడు. స్వగ్రామానికి చేరుకున్న కొద్దిసేపటికే చిన్నారి పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో తల్లిదండ్రులు వెంటనే క్లినిక్కు వెళ్లారు. తమ చేతకాదని, హిందూపురం ఆస్పత్రికి తీసుకెళ్లండని ఆర్ఎంపీ సలహా ఇచ్చాడు. అయితే అప్పటికే శ్రావణి మృతి చెందడంతో తల్లిదండ్రులతో పాటు బంధువులు క్లినిక్ ముందు ధర్నాకు దిగారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ఆందోళనకారులతో చర్చించి ఆందోళన విరమింపజేశారు. తనవద్దకు వచ్చే వారికి డోస్ ఎక్కువగా ఉండే మందులు, ఇంజక్షన్లు ఇస్తుంటారని ఆర్ఎంపీపై ఆరోపణలు ఉన్నాయి. చిన్నారి మృతిపై కొందరు పెద్దమనుషులు జోక్యం చేసుకుని పంచాయితీ చేసినట్లు సమాచారం. -
కాళ్లు పట్టుకునే సంస్కృతి టీడీపీదే
వైఎస్ జగన్ ప్రధానిని కలిస్తే తప్పేంటి? వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు శంకరనారాయణ గోరంట్ల (సోమందేపల్లి) : ‘ఓటుకు కోట్లు’ కేసు నుంచి గట్టెక్కేందుకు తెలంగాణ సీఎం కేసీఆర్ మొదలు ఢిల్లీ పెద్దల వరకూ అందరి కాళ్లు పట్టుకున్న నైజం చంద్రబాబుదని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు ఎం.శంకరనారాయణ విమర్శించారు. పదేళ్ల పాటు ఉమ్మడి హక్కు ఉన్న హైదరాబాద్ను వదిలి రావడంతో పాటు ప్రత్యేక హోదాను చంద్రబాబు తాకట్టు పెట్టారని అన్నారు. రాష్ట్ర ప్రయోజనాలు ఆకాంక్షిస్తూ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రధాని మోదీని కలిస్తే తప్పేమిటని ఆయన ప్రశ్నించారు. రైతులకు ఇన్పుట్ సబ్సిడీ, పంటల బీమా అందించాలని గోరంట్ల తహసీల్దార్ కార్యాలయం ఎదుట సోమవారం రైతు ధర్నా చేపట్టారు. ఈసందర్భంగా శంకరనారాయణ మాట్లాడుతూ బ్యాంకులకు టోకరా వేసిన కేంద్ర మంత్రి సుజనాచౌదరి, రాష్ట్ర మంత్రి గంటా ఆ కేసుల నుంచి తప్పించుకోవడానికి ఎవరి కాళ్లు పట్టుకున్నారో? ఆ పార్టీ నేతలే చెప్పాలన్నారు. రెయిన్ గన్స్తో రక్షక తడుల పేరుతో దాదాపు రూ. 300 కోట్లు ఖర్చు చేసి జిల్లాలో కరువును తరిమేశానని గొప్పలు చెప్పిన బాబు... ఒక్క ఎకరా పంటను కూడా కాపాడలేకపోయారన్నారు. గత ఏడాది పంట సాగు ద్వారా రైతులు రూ. 4 వేల కోట్లు నష్టపోతే, వారికి కనీసం రూ.వెయ్యి కోట్ల మేర ఇన్పుట్ సబ్సిడీ ప్రకటించలేదన్నారు. వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జిల్లా నుంచి కరువును శాశ్వతంగా పారదోలేందుకు హంద్రీ-నీవా ప్రాజెక్ట్ ద్వారా కృష్ణా జలాలను అందించారని గుర్తు చేశారు. ఈ మూడేళ్లలో హంద్రీ-నీవా పథకాన్ని పూర్తిగా నిర్వీర్యం చేయడమే కాక, పట్టిసీమ ప్రాజెక్ట్ల్లో రూ.వందల కోట్లను కమీషన్ల రూపంలో దండుకున్న ఘనత చంద్రబాబుదేనని విమర్శించారు. గొల్లపల్లి రిజర్వాయర్ నుంచి పెనుకొండ పట్టణానికి పైపులైన్ ద్వారా తాగునీటిని అందిస్తామంటూ ఎమ్మెల్యే బీకే పార్థసారథి ఇస్తున్న హామీల్లో ఎంత మాత్రం వాస్తవం లేదన్నారు. పర్సెంటేజీల కోసం పాకులాడుతూ జిల్లాలో పారిశ్రామికాభివృద్ధికి ఎంపీ నిమ్మల కిష్టప్ప, ఎమ్మెల్యే బీకే పార్థసారథి గండికొడుతున్నారని విమర్శించారు. ఇసుకను అక్రమంగా కర్ణాటకకు తరలించి రూ. కోట్లు ఆర్జిస్తున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ మండల కన్వీనర్లు ఫకృద్దీన్, మేదర శంకర, సింగిల్విండో అధ్యక్షుడు గంపల రమణారెడ్డి, శంకర్రెడ్డి, రఘురామిరెడ్డి, రాజేంద్రప్రసాద్, సీనియర్ నాయకులు బూదిలి వేణుగోపాల్రెడ్డి, నాగలూరు బాబు, శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు. -
బుచ్చయ్యచౌదరికి మంత్రి పదవి ఎలా ఇస్తా?
అమరావతి: మంత్రి పదవి ఇవ్వలేదని గోరంట్ల బుచ్చయ్యచౌదరి రచ్చ చేయడం సరికాదని , అసలు ఆయనకు పదవి ఇవ్వడం ఎలా సాధ్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రివర్గంలో ఇప్పటికే ఆయన సామాజిక వర్గానికి చెందిన వారు చాలామంది ఉన్నారని, ఆ విషయం తెలిసి కూడా బహిరంగంగా వ్యాఖ్యలు చేసి పార్టీ పరువును బజారుకు ఈడ్చారని ఆయన అసంతృప్తిని వ్యక్తం చేశారు. చంద్రబాబు నిన్న రాత్రి ఉండవల్లిలోని తన నివాసంలో తూర్పు గోదావరి జిల్లా టీడీపీ సమన్వయ సమావేశం నిర్వహించారు. విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసిన సమాచారం మేరకు... మంత్రి పదవి ఇవ్వలేదని రాజీనామా చేయడం సరికాదని అన్నారు. సమావేశానికి బుచ్చయ్య చౌదరి గైర్హాజరైనా, ఆయన గురించి చంద్రబాబు చాలా సమయం మాట్లాడారు. జిల్లాలో పార్టీ పరిస్ధితుల గురించి విశ్లేషించిన ఆయన.. నేతల మధ్య సమన్వయం లేదంటూ మంత్రి యనమల రామకృష్ణుడు, జ్యోతుల నెహ్రూ గురించి ప్రస్తావించినట్టు తెలిసింది. మరోవైపు మంత్రి పదవి దక్కకపోవడంతో అసంతృప్తిగా ఉన్న బుచ్చయ్య చౌదరి మరోసారి ఉద్వేగానికి లోనయ్యారు. రాజకీయాల్లో పదవులు శాశ్వతం కాదని, విలువలే ముఖ్యమన్నారు. అధికారంలో ఉన్నవారు ప్రలోభాలకు గురి చేయడం సర్వసాధారణమైందన్నారు. కొందరు రాజకీయాన్ని వృత్తిగా భావిస్తూ తప్పుడు పనులు చేస్తున్నారని మండిపడ్డారు. వచ్చే నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశానికి తాను వస్తానో, రానో తనకు తెలియదన్నారు. టీడీపీలో జరుగుతున్న చర్యలకు నిరసనగానే ప్రధాన కార్యదర్శి పదవికి రాజీనామా చేశానని బుచ్చయ్య చౌదరి స్పష్టం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో పార్టీ ఫిరాయింపులు, ప్రలోభాలు పరాకాష్టకు చేరాయని ఆయన ధ్వజమెత్తారు. -
పాపం.. పెద్దోళ్లు..!
► పార్టీలు మారినా ఫలితం లేదాయే : జ్యోతుల ► సిద్ధాంతకర్తనైనా గుర్తింపు రాకపోయే : గోరంట్ల ► ఇద్దరు సీనియర్ నేతల అంతర్మథనం ► జిల్లా టీడీపీలో అసమ్మతి సెగలు ► రాజీలు కుదిర్చినా ససేమిరా... ఒకరు పలు పార్టీలకు వ్యూహకర్త ... ఇంకొకరు తెలుగు దేశం పార్టీ ఆవిర్భావ సమయంలోనే పురుడు పోసిన సిద్ధాంత కర్త. ఇందులో ఒకరు జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ...ఇంకొకరు రాజమహేంద్రవరం శాసన సభ్యుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి. ఏ పార్టీలోనూ జ్యోతులకు స్థిరత్వం లేక చంచల స్వభావంతో ఎటు గాలివీస్తే అటు అడుగులు వేయడంతో ఆ అడుగులు ఎక్కడా బలంగా నిలదొక్కుకోలేని దుస్థితి. ‘ఉన్నది వదిలేవు ...లేనిది కోరేవు ... ఒక పొరపాటుకి యుగములు వగచేవు’ అంటూ ఓ సినీ రచయిత గీతా విలాపంలా తయారయింది నెహ్రూ పరిస్థితి. ఇక గోరంట్ల వ్యథ మరో విధంగా ఉంది. టీడీపీ సిద్ధాంత కర్తల్లో ఒకరినైన నన్నా విస్మరించేదంటూ చిందులు తొక్కుతున్నారు. పార్టీ అధినేత ఎన్టీ రామారావునే అత్యంత క్రూరంగా బయటకు పంపించేసి ... ఆయన మరణానికి కారణమైన ‘బాబు’ దగ్గరా ఆ సుద్దులంటూ ఆయన అనుచరులే గుసగుసలాడుకుంటున్నారు. వీరి ఎదుగుదలను వెనుకనుంచి అడ్డుకున్నది యనమలేనని అనుచర వర్గం ఆగ్రహంతో ఉంది. సాక్షి ప్రతినిధి, కాకినాడ : కొన్ని సందర్భాల్లో తీసుకునే నిర్ణయాలు కొందరు నేతలను అత్యున్నత స్థాయికి తీసుకుపోతుంటాయి. మరికొందరినైతే రాజకీయంగా అధఃపాతాళానికి నెట్టేస్తాయి. ఇందులో రెండో రకం నాయకుడిగా జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూను చెప్పుకోవచ్చు. రాజకీయాల్లో మూడు దశాబ్దాల చరిత్ర కలిగి అపారమైన అనుభవం ఉన్న జ్యోతుల కూడా రాజకీయాల్లో ఒక దాని తరువాత మరొకటి తప్పటడుగులే వేశారు. టీడీపీ సైకిల్ చక్రాన్ని వదిలేసి ప్రజారాజ్యం పార్టీలో చేరి ఓటమి అనంతరం మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశయాలతో ముందడుగు వేస్తున్న వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్లో చేరారు. ఆ రోజు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పేరును జగ్గంపేటలోనే జగన్మోహన్రెడ్డి ప్రకటించి నెహ్రూకు అత్యధిక ప్రాధాన్యతనిచ్చారు. నమ్మి వచ్చిన నెహ్రూకు టిక్కెట్టు ఇచ్చి ఎమ్మెల్యేను చేశారు. జగన్మోహన్రెడ్డి అంతటితోనే సరిపెట్టకుండా శాసనసభా పక్ష ఉప నేతను చేసి నెహ్రూ గౌరవాన్ని ఇనుమడింప జేశారు. ఇంతా చేస్తే టీడీపీకి ఫిరాయించేశారు. అందుకు మంత్రి పదవా లేక, ఇంకేమైనా ప్రలోభాలు కారణమయ్యాయో తెలియదుగానీ నమ్మి ఒక మెట్టుపైకి తీసుకువెళ్లిన పార్టీని నడిసంద్రంలో ముంచేశారు. ఆ ప్రభ ఏదీ...? ఆవిర్భావం నుంచి ఉన్న టీడీపీని వీడకుండానైనా ఉండాల్సింది. ఎంతకాలం తాను ఆ పార్టీలో ఉన్నా సొంత పార్టీలో ప్రత్యర్థి యనమల రామకృష్ణుడు ఉన్నంత కాలం ఇక మంత్రి పదవి అనేది అందని ద్రాక్ష అనే నిర్థారణకు వచ్చి టీడీపీని వీడి బయటకు వచ్చేశారు. ఆ పార్టీని వీడి బయటకు వస్తే వచ్చారు, ఆ తరువాత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరి మంచి నిర్ణయమే తీసుకున్నారని నేతలు అభిప్రాయపడ్డారు. అటువంటి పార్టీని కాదనుకుని నెహ్రూ బయటకు వెళ్లి మరో తప్పటుడుగు వేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సారథిగా జిల్లాలో ఏమూలకు వెళ్లినా ప్రజలు, పార్టీ నేతలు వెన్నంటి నిలిచేవేవారు. అటు నియోజకవర్గంలో ఇటు జిల్లా అంతటా చక్రం తిప్పే పరిస్థితి. అటువంటిది తిరిగి టీడీపీకి వెళ్లాక నియోజకవర్గ నాయకుడిగానే మిగిలిపోయారు. మెట్ట ప్రాంతంలో ఏలేరు కోసం ఎన్నో ఉద్యమాలు చేసిన నెహ్రూ అదే ఏలేరుకు నీరు సరఫరా చేసే పురుషోత్తపట్నం ప్రాజెక్టుకు పిఠాపురంలో సీఎం శంకుస్థాపన కార్యక్రమంలో అందరిలో ఒకరిగా మిగిలిపోయారు. అందరికంటే చివర్లో మాట్లాడే అవకాశం ఇచ్చినప్పుడే నెహ్రూ స్థాయిని ఏ రకంగా తగ్గించేశారోనని ఆ రోజే మెట్ట నేతల మధ్య గుసగుసలు వినిపించాయి. పాపం సిద్ధాంతకర్త...? నెహ్రూ పరిస్థితి ఇలా ఉండగా మంత్రి పదవి రాలేదని పార్టీ పదవికి రాజీనామా చేసిన ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరిని బుజ్జగించేందుకు ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప సోమవారం చేసిన యత్నాలు బెడిసికొట్టాయి. గోరంట్లకు మద్ధతుగా నగరపాలక సంస్థ సమావేశాన్ని బహిష్కరించిన టీడీపీ కార్పొరేటర్లు రెండు రోజుల్లో రాజీనామాలకు కూడా సిద్ధపడతామని ప్రకటించడం వెనుక ఆంతర్యమేమిటై ఉంటుందా అని పార్టీలో చర్చ నడుస్తోంది. మంత్రి పదవిపై ఆశలు పెంచుకుని నిరాశ చెందిన మరో ఎమ్మెల్యే తోట త్రిమూర్తులను విలేకర్లు కలిసిన సందర్భంలో ఆయన కాస్త వేదాంత «ధోరణిలో మాట్లాడినట్టుగా కనిపించింది. ‘మంత్రి పదవి ఆశిస్తాం, కానీ అధినేత పెట్టుకున్న ప్రమాణాలకు ఫిట్ అవ్వలేకపోయి ఉండవచ్చునని’ చెప్పుకు రావడం గమనార్హం. బాబు తీరుపై కొందరు బయటపడగా ... లోలోన అంతర్గతంగా గుర్రుగా ఉన్న మరికొందరు భవిష్యత్తులో ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే. నీడలా యనమల టీడీపీలో మంత్రి కాకుండా అడ్డుపడ్డ నాయకుడే తాజా మంత్రివర్గ విస్తరణలో సైతం మోకాలడ్డటంతో తాను తీసుకున్న తప్పుడు నిర్ణయాలు ఎంత పనిచేశాయనే నిర్వేదం తప్ప నెహ్రూ చేయగలిగిందేముంటుందని అనుచరులే సముదాయించుకుంటున్నారు. పార్టీ మారిన దగ్గర నుంచి ఆయన నియోజకవర్గ రాజకీయాలకే పరిమితమైపోయారు. జిల్లా స్థాయిలో టీడీపీ కార్యక్రమాలు జరిగినా నలుగురిలో ఒకరిగానే మిగిలే వారు. ఈ రకంగా ఒక దాని వెంట మరొకటి వేసిన తప్పటడుగులు మూడు దశాబ్దాల రాజకీయ అనుభవం కలిగిన నేత ఉనికినే సవాల్ చేశాయి. నెహ్రూలో ఉన్న మునుపటి పోరాట పటిమ ఇప్పుడు కూడా ఉంటాదనుకుంటే పొరపాటే. వయస్సు కూడా ఇందుకు సహకరించాలి. తాజా విస్తరణలో ఛాన్స్ వస్తేగిస్తే పూర్వపు ప్రాభవాన్ని తిరిగి పొందవచ్చునన్న నెహ్రూ ఆశలపై చంద్రబాబు నీళ్లు చల్లడంతో రాజకీయ భవిష్యత్తు అంధకారమై నిర్వేదంలో ఉన్నారంటున్నారు. నెహ్రూను బుజ్జగించేందుకు గోదావరి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ లేదా రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ ఆశ పెడుతున్నారని పార్టీలో చర్చ నడుస్తోంది. ఈ పదవులేవీ తమ నాయకుడి ప్రతిష్టను పెంచలేవనే అభిప్రాయంతో జ్యోతుల అనుచరవర్గం అభిప్రాయపడుతోంది. పదవుల పందేరంపై భగ్గుమంటున్న రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి సహా రాష్ట్రంలో పలువురు నేతల స్పందనలను గమనిస్తూ కిం కర్తవ్యం ఏమిటా అని నెహ్రూ అనుచరవర్గం తర్జనభర్జనపడుతోంది. -
మంత్రి పదవి రాలేదని...
నగరపాలక సంస్థ బడ్జెట్ సమావేశం బహిష్కరణ గోరంట్లకు టీడీపీ కార్పొరేటర్ల సంఘీభావం కోరం లేకపోవడంతో వాయిదా వేసిన మేయర్ నగరాన్ని అభివృద్ధి చేయాలని ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని టీడీపీ ప్రజాప్రతినిధులు తమ స్వప్రయోజనాలకు వాడుకోవడంతో నగర పాలక సంస్థ అభివృద్ధిపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరికి మంత్రి పదవి దక్కనందున టీడీపీ కౌన్సిలర్లు మూకమ్మడిగా నగర పాలక సంస్థ బడ్జెట్ సమావేశానికి డుమ్మా కొట్టారు. దీంతో బడ్జెట్ సమావేశం సోమవారం నిర్వహించిన నగర పాలక సంస్థ బడ్జెట్ సమావేశం వాయిదా పడింది. ఆనం కళాకేంద్రం ఎదురుగా ఉన్న పార్టీ కార్యాలయంలో సమావేశమై బహిష్కరణ వ్యూహానికి పదును పెట్టారు., సీనియారిటీని గుర్తించడంలో సీఎం చంద్రబాబు అనుసరించిన తీరుకు నిరసనగా గోరంట్లకు సంఘీభావం ప్రకటిస్తూ పార్టీ కార్యాలయంలోనే ఉండిపోయారు. నగర పాలక సంస్థ సమావేశానికి హాజరైన గోరంట కాసేపు ఉండి.. టీడీపీ సభ్యులు లేకపోవడం చూసి ఆయన కూడా పార్టీ కార్యాలయానికి వెళ్లిపోయారు. బడ్జెట్ సమావేశం జరిగేలా చూడాలన్న సూచనకు వారు ససేమిరా అన్నారు. నగర ప్రగతికి ఎంతో కీలకమైన బడ్జెట్లను కాదని అలకబూనడం విచారకరమని విపక్షం మండిపడింది. సాక్షి, రాజమహేంద్రవరం : టీడీపీలోని అంతర్గత రాజకీయాలు నగర పాలక సంస్థపై పడింది. రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరికి మంత్రివర్గ విస్తరణలో చోటు దక్కకపోవడం, పార్టీ పదవికి ఆయన రాజీనామా చేయడం సోమవారం నిర్వహించిన నగరపాలక సంస్థ బడ్జెట్ సమావేశంపై ప్రభావం చూపింది. నగరపాలక సంస్థ సముదాయంలోని క్రొవిడి లింగరాజు మందిరంలో నిర్వహించ తలపెట్టిన బడ్జెట్ సమావేశం కోరం లేక వాయిదా పడింది. ఈ సమావేశానికి టీడీపీ కార్పొరేటర్లు హాజరుకాలేదు. వైఎస్సార్ సీపీ కార్పొరేటర్లు ఆరుగురు, స్వతంత్రులు నలుగురు, బీఎస్పీ ఒకరు, బీజేపీకి చెందిన కార్పొరేటర్ ఒకరు మాత్రమే సమావేశానికి హాజరయ్యారు. తొలుత కోరం లేనందున మేయర్ పంతం రజనీశేషసాయి గంటపాటు సమావేశాన్ని వాయిదా వేశారు. తర్వాత నగర ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ, ఎమ్మెల్సీ ఆదిరెడ్ది అప్పారావు సమావేశానికి వచ్చారు. తిరిగి 11:30 గంటలకు సభను ప్రారంభించిన మేయర్ అప్పడు కూడా కోరం లేకపోవడంతో సభను వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. తిరిగి ఎప్పుడు ఏర్పాటు చేసేది కమిషనర్ వి.విజయరామరాజు తెలియజేస్తారని చెప్పారు. ఇది రెండో సారి... సమావేశాన్ని బహిష్కరించిన టీడీపీ కార్పొరేటర్లు నగరపాలక సంస్థ బడ్జెట్ సమావేశం రెండోసారి వాయిదా పడినట్లయింది. మార్చి 31న ఈ సమావేశం వాయిదా పడిన విషయం విదితమే. ఎమ్మెల్యేలు అసెంబ్లీ సమావేశాల్లో ఉన్నందున ఈ సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్టు అప్పట్లో ప్రకటించారు. ముక్కిపోయిన సమోసా పెడతారా? సభ్యులు, అధికారులు, మీడియా వారికి పెట్టిన సమోసాలు ముక్కిన వాసన రావడంతో స్వతంత్ర కార్పొరేటర్ నండూరి వెంకటరమణ అధికారులను ప్రశ్నించారు. ‘మీకు ఎలాంటి సమోసాలు కావాలి’అని అధికారులు అడగడంతో నండూరి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏడాదిలో జరిగే నాలుగు సమావేశాలల్లో స్నాక్స్, టీ కోసం రూ.10 లక్షలు ఖర్చు చేస్తున్నారని, ఆ నిధులకు లెక్కలు చెప్పాలని నిలదీశారు. నిధుల వినియోగంపై లెక్కా పత్రం లేకుండా చేస్తున్నారని ఆరోపించారు. నగర బడ్జెట్ను తాకట్టు పెట్టారు.. ఆర్థిక సంవత్సరం ముగిసినా కూడా వ్యక్తిగత ప్రయోజనాల కోసం నగరపాలక సంస్థ బడ్జెట్ను టీడీపీ కార్పొరేటర్లు తాకట్టు పెట్టారని ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ ఫ్లోర్ లీడర్ మేడపాటి షర్మిలారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరికి మంత్రి పదవి ఇవ్వకపోవడాన్ని నిరసిస్తూ బడ్జెట్ సమావేశాన్ని బహిష్కరించడంతో.. నగర అభివృద్ధిపై వారి చిత్తశుద్ధిని తెలియజేస్తోందని అన్నారు. బడ్జెట్ సమావేశం వాయిదా పడిన తర్వాత కార్పొరేటర్లు గుత్తుల మురళీధర్రావు, మజ్జి నూకరత్నం, పిల్లి నిర్మల, బాపన సుధారాణి, బొంతా శ్రీహరిలతో కలిసి ఆమె విలేకర్లతో మాట్లాడారు. నిబంధనల ప్రకారం కోరం లేదని సభను వాయిదా వేసిన పాలకులు.. మార్చి 31లోపు బడ్జెట్ను ఆమోదించాలన్న నిబంధనలు తెలియదాని ప్రశ్నించారు. ఇప్పటికే మూడు రోజుల పాటు ఎలాంటి చెల్లింపులు చేయలేదని కమిషనర్ చెబుతున్నారని పేర్కొన్నారు.యీ సమావేశం తిరిగి ఎప్పడు నిర్వహించేదీ చెప్పలేదని, అప్పడువరకూ నగరపాలక సంస్థలో లావాదేవీలు పూర్తిగా నిలిచిపోతాయన్నారు. మెజారిటీ ఉందన్న భావనతో టీడీపీ కార్పొరేటర్లు ఇలా చేయడం భావ్యం కాదని సూచించారు. స్వప్రయోజనాల కోసం ఐదు లక్షల మంది నగర ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెట్టారని విమర్శించారు. -
టీడీపీ నేతల మధ్య ప్రోటోకాల్ వివాదం
రాజమండ్రి: టీడీపీ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదిరి సాక్షిగా టీడీపీ నేతల మధ్య ప్రోటోకాల్ వివాదం తలెత్తింది. ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు వచ్చేలోపే ఉగాది వేడుకలు పూర్తి కావడంతో అసంతృప్తి వ్యక్తం చేశారు. దీనిపై ఆయన డిప్యూటీ మేయర్ వాసిరెడ్డి రాంబాబు నిలదీయడంతో, ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ సందర్భంగా ఇరువర్గాల మధ్య వాగ్వివాదం గట్టిగానే జరిగింది. అయితే నేతల మధ్య రగడ జరిగినా గోరంట్ల బుచ్చయ్య మాత్రం స్పందించలేదు. కాగా ఇటీవలే ఆదిరెడ్డి టీడీపీలో చేరిన విషయం తెలిసిందే. అయితే ఆయన రాకపై స్థానిక నేతలు అసంతృప్తిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో మళ్లీ ప్రొటోకాల్ వివాదం రాజేసినట్లు అయ్యింది. -
టీడీపీ నేతల మధ్య ప్రోటోకాల్ వివాదం
-
గోరంట్లలో గోవింద నామస్మరణ
- అశేషజన భక్తజన వాహిని మధ్య మాధవుడి రథోత్సవం కోడుమూరు రూరల్ గోరంట్లలో వెలసిన శ్రీలక్ష్మీమాధవస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం సాయంత్రం అశేష జనవాహిని మధ్య రథోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తుల గోవిందనామస్మరణతో గోరంట్ల గ్రామం మారుమోగిపోయింది. కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాష్రెడ్డి, డీసీసీ జిల్లా అధ్యక్షుడు లక్కసాగరం లక్ష్మిరెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించి రథోత్సవాన్ని ప్రారంభించారు. జిల్లా నలుమూలల నుంచే కాకుండా అనంతపురం, మహబూబ్నగర్ జిల్లా, కర్ణాటక రాష్ట్రం నుంచి లక్షమందికిపైగా భక్తులు తరలివచ్చి స్వామిని దర్శించుకున్నారు. సీఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలో కోడుమూరు, గూడూరు, సి.బెళగల్ ఎస్ఐలు సిబ్బందితో బందోబస్తు నిర్వహించారు. -
గోరంట్లలో వ్యక్తి ఆత్మహత్య
గోరంట్ల (సోమందేపల్లి) : గోరంట్లలోని రావికుంట వద్ద హమాలీ వెంకటరాముడు(55) అనే వ్యక్తి బుధవారం చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్ఐ వెంకటేశ్వర్లు తెలిపారు. అనారోగ్య కారణాలతో ఈ అఘాయిత్యానికి ఒడిగట్టినట్లు తెలుస్తోందన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పెనుకొండ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వివరించారు. కాగా మృతునికి భార్యా, పిల్లలు ఉన్నారు. -
గోరంట్ల సవాల్ను స్వీకరించిన ఉండవల్లి
రాజమండ్రి: గోరంట్ల బుచ్చయ్య విసిరిన సవాల్ను రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్కుమార్ స్వీకరించారు. ఈ మేరకు అరుణ్ కుమార్ మంగళవారం ఆయనకు బహిరంగ లేఖ రాశారు. స్పెషల్ ప్యాకేజీ ఏమిటో ఇప్పటివరకూ ఎవరికీ అర్ధం కాలేదు. మీకు తెలిసి ఉంటే అదేమిటో నాకు అవగతపర్చగలరని లేఖలో పేర్కొన్నారు. ఇవే కాకుండా , మీరు ప్రెస్మీట్లో ప్రస్తావించిన అన్ని విషయాలపైనా చర్చకు సిద్ధమని లేఖ ద్వారా అంగీకారం తెలిపారు. దయచేసి సమయం, స్థలం నిర్ధారించి తనకు తెలపాలని ఉండవల్లి కోరారు. ‘పట్టిసీమ’ పధకం ఏవిధంగా నిరుపయోగ పధకమైందో ప్రభుత్వం అధికారికంగా ప్రకటించిన గణాంక వివరాలతో మీ ముందు ఉంచటానికి సిద్ధంగా ఉన్నానని లేఖ ద్వారా బుచ్చయ్య చౌదరీకి ఉండవల్లి తెలిపారు. -
విద్యుదాఘాతంతో వలస కూలీ మృతి
గోరంట్ల (సోమందేపల్లి) : ఉపాధి కోసం పొరుగు రాష్ట్రానికి వెళ్లిన ఓ యువకుడు విద్యుదాఘాతంతో మృతి చెందాడు. ఆలస్యంగా వెలుగుచూసిన ఈ సంఘటన వివరాలిలా ఉన్నాయి. గోరంట్ల మండలం మందలపల్లి పంచాయతీ బూచేపల్లికి చెందిన తలారి చంద్రశేఖర్ (26) స్థానికంగా పనులు లేకపోవడంతో ఉపాధి కోసం కర్ణాటకలోని మాలూరుకు వలస వెళ్లాడు. అక్కడ ఓ కోళ్లఫారంలో పని చేస్తున్నాడు. శనివారం రాత్రి అతను పని చేస్తుండగా విద్యుదాఘాతానికి గురై మృతి చెందాడు. మృతుడి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. -
తెగనమ్ముకున్నారు.. దగా చేశారు
రూ.20 వేలు దండుకుని ఇళ్లున్న వారికే ఇళ్లు జనచైతన్య యాత్రలో గోరంట్లను నిలదీసిన మహిళ ఎక్కువ మాట్లాడితే ఏ పథకమూ రాదని బెదిరించిన ఎమ్మెల్యే సాక్షి, రాజమహేంద్రవరం : ‘20 ఏళ్లుగా ఇక్కడే ఉంటున్నాం. ఇళ్ల కోసం ఎన్నో సార్లు దరఖాస్తులు పెట్టుకున్నాం. ఇప్పటి వరకూ రాలేదు. ఇళ్లు ఉన్నవారికే ఇళ్లు ఇచ్చారు. ఒక్కొక్కరి వద్దా రూ.20 వేలు తీసుకున్నారు. అర్హులమైన మాకు అన్యాయం చేశారు’ అంటూ ఓ మహిళ రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరిని నిలదీశారు. టీడీపీ జనచైతన్య యాత్రల్లో భాగంగా ఎమ్మెల్యే గోరంట్ల శుక్రవారం 20వ డివిజ¯ŒS ఆల్కాట్తోటలో పర్యటించారు. ఉదయం 11 గంటలకు యాత్ర ప్రారంభించిన గోరంట్ల అనుచరులతో సందుగొందుల్లో నడుచుకుంటూ వెళ్లిపోతున్నారు. ఈ క్రమంలో ఓ మహిళ ఎమ్మెల్యేకు ఎదురుగా వచ్చి 20 ఏళ్ల నుంచి ఇక్కడే ఉంటున్నామని, ఎన్ని సార్లు దరఖాస్తులు పెట్టినా ఇళ్లు రాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే ఇళ్లు ఉన్న వారి వద్ద డబ్బులు తీసుకుని ఇళ్లు ఇచ్చారని తీవ్ర స్థాయిలో ఆరోపించారు. తన హయాంలో 30 వేల ఇళ్లు నిర్మించానని గోరంట్ల చెప్పబోతుండగా అడ్డుకున్న ఆ మహిâ¶ళ అనర్హులకే ఎక్కువగా ఇచ్చారని వ్యాఖ్యానించారు. దీంతో రెచ్చిపోయిన గోరంట్ల ‘ఎక్కువగా మాట్లాడితే భవిష్యత్లో ఏ ప్రభుత్వ పథకాలూ రావు. చదువుకున్నదానివి పద్ధతిగా మాట్లాడు. అనర్హులు ఎవరో చెప్పు’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వారెవరో అందరికీ తెలుసని, మీరు తెలుసుకోవాలంటే ఆధార్, విద్యుత్ బిల్లులు పరిశీలించవచ్చని ఆ మహిళ సమాధానమిచ్చారు. లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయాలంటూ ఎమ్మెల్యే అక్కడ నుంచి వెళ్లిపోయారు. మరో వృద్ధురాలు తాను టీడీపీకే ఓటు వేశానని, ఇల్లు వచ్చిందంటూ చెప్పి తనతో డ్యాన్సులు చేయించి, ఫొటోలు కూడా తీశారని, కానీ ఇల్లు ఇవ్వలేదని ఎమ్మెల్యేను నిలదీశారు. దీంతో ఉక్కిరిబిక్కిరైన ఎమ్మెల్యే త్వరలో మరో మూడువేల ఇళ్లు వస్తున్నాయని, వాటిలో ఇస్తానంటూ యాత్రను ముగించారు. రెండు నెలల నుంచి రేష¯ŒS దూరప్రాంతం నుంచి తెచ్చుకోవాల్సి వస్తోందని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. డివిజ¯ŒSలోని డ్రైనేజీల్లో సిల్ట్ను తరచూ తొలగించక మురుగు రోడ్లపై పారుతూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నామన్నారు. -
ఇంటి పని కోసం.. ఇంత పని చేశారు!
సోమందేపల్లి (గోరంట్ల) : పాలసముద్రం సమీపంలో ఈ నెల 14న కర్నూలు జిల్లా వెలుగోడుకు చెందిన సిమెంట్ లారీ డ్రైవర్ ఓబుళేసు (50) దారుణ హత్య కేసును గోరంట్ల పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు. నిందితులైన వడ్డె పురుషోత్తం (25), అతని సోదరుడు వడ్డె మనోహర్ (28), సి.రామాంజినేయులు (30), నవాబ్కోటకు చెందిన వెంకట్రాముడు (28)ను పోలీసులు అరెస్టు చేశారు. సోమవారం స్థానిక పోలీస్ స్టేషన్లో పుట్టపర్తి రూరల్ సీఐ శ్రీధర్, గోరంట్ల ఎస్ఐ వెంకటేశ్వర్లు వివరాలు వెల్లడించారు. గోరంట్లకు చెందిన వడ్డే మనోహర్ ఇల్లు కట్టుకోవడానికి సిమెంట్ అవసరమైంది. దీంతో అతని వద్ద డబ్బులు కూడా లేకపోవడంతో తన సోదరుడైన వడ్డే పురుషోత్తంకు విషయం తెలిపాడు. గతంలో పురుషోత్తం సిమెంట్ లారీ డ్రైవర్గా కర్ణాటకలోని పెద్ద బళ్లాపురంలో పనిచేస్తూ ఉండేవాడు. సిమెంట్ లారీలను అపహరించి, సిమెంట్ బస్తాలు ఎత్తుకెళ్లొచ్చని మాట్లాడుకున్నారు. పథకం ప్రకారం ఈ నెల 13న పులివెందుల పట్టణ సమీపంలోని గంగమ్మ గుడి వద్దకు ఇద్దరు అన్నదమ్ములతో పాటు గోరంట్లకు చెందిన వారి స్నేహితుడైన రామాంజనేయులను కూడా వెంట తీసుకెళ్లారు. ముందుగా అనుకున్నట్లుగానే రామాంజినేయులతోపాటు నవాబ్ కోటకు చెందిన వెంకట్రాముడును కూడా కలుపుకుని వాటా ఇస్తామని నమ్మబలికారు. గంగమ్మ గుడి వద్ద ఆగి ఉండగా పులివెందుల వైపు నుంచి సిమెంట్ లారీ వచ్చి సమీపంలోని హోటల్ వద్ద ఆగింది. డ్రైవర్ భోజనం చేస్తుండగా వడ్డే మనోహర్ డ్రైవర్ను పరిచయం చేసుకున్నాడు. తాము గోరంట్లకు వెళ్లాలని, వెళ్లేందుకు బస్సులు లేవు.. లారీలో గోరంట్లకు వస్తామని చెప్పారు. దీంతో లారీ డ్రైవర్ ఓబుళేసు వారి మాటలు నమ్మి లారీలో తీసుకెళ్లేందుకు అంగీకరించాడు. పథకం ప్రకారం ముందుగా అనుకున్నట్లు తలుపుల మండలం బట్రేపల్లి వద్ద లారీ డ్రైవర్ను హతమార్చి సిమెంట్ బస్తాలు తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. అక్కడ పరిస్థితులు అనుకూలించకపోవడంతో కోరేవాండ్లపల్లి వద్ద మనోహర్ డ్రైవర్ ఓబుళేసుపై దాడి చేశారు. వెంటనే పక్కనే ఉన్న పురుషోత్తం లారీ డ్రైవర్ ఓబుళేసును పక్కకు లాగి, డ్రైవింగ్ సీటులో కుర్చోని లారీని నడుపుతుండగా మనోహర్, రామాంజినేయులు విచక్షణ రహితంగా ఓబులేషును చితకబాదారు. ఈ సమయంలో తనను వదిలేసి సిమెంట్ బస్తాలు తీసుకెళ్లాలని మృతుడు ఓబుళేసు వారిని వేడుకున్నాడు. అవసరమైతే తమపై పోలీసులకు ఫిర్యాదు చేస్తాడని భావించి, అతన్ని హతమార్చారు. అనంతరం లారీలో ఉన్న 660 సిమెంట్ బస్తాలను కొండతిమ్మంపల్లి గ్రామానికి చెందిన పలువురికి కొన్ని విక్రయించారు. మరికొన్ని ముందస్తుగా ఒప్పందం చేసుకున్న నవాబ్కోటకు చెందిన వెంకట్రాముడు తోటలో నిల్వ ఉంచారు. అయితే ఈనెల 14న లారీని పాలసముద్రం సమీపంలో మృతదేహంతో పాటు వదిలివెళ్లారు. విషయం తెలుసుకున్న పోలీసులు విచారణ చేపట్టగా లారీ వద్ద మూడు జతల చెప్పులు కనిపించాయి. వాటి ఆధారంగా విచారణ జరపగా నిందితులు పట్టుబడ్డారు. నిందితులను పుట్టపర్తి మండలం పాతార్లపల్లి వద్ద అరెస్టు చేశారు. నిందితులను కోర్టుకు హాజరు పరుస్తున్నామని సీఐ శ్రీధర్ తెలిపారు. రూ.2.70 లక్షలు విలువగల 660 బస్తాలతోపాటు ద్విచక్రవాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. -
గోరంట్ల మాధవ్పై వేటు
- మాధవ్రెడ్డిపై దాడి వ్యవహారం - వీఆర్కు పంపుతూ ఐజీ ఉత్తర్వులు అనంతపురం : అనంతపురం త్రీటౌన్ సీఐ గోరంట్లమాధవ్ను వీఆర్కు పంపారు. ఈ మేరకు రాయలసీమ ఐజీ శ్రీధర్రావు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి మాధవరెడ్డి నగదు మార్పిడి కోసం ఈనెల 13న అనంతపురంలోని సాయినగర్లో ఉన్న స్టేట్బ్యాంక్ వద్దకు వెళ్లారు. ఈయన ఎస్ఐ జనార్దన్పై చేయి చేసుకున్నారనే నెపంతో సీఐ గోరంట్ల మాధవ్ రెచ్చిపోయారు. గొడ్డును బాదినట్లు చావబాదారు. ఈ ఘటనను చిత్రీకరించిన కొందరు సోషల్ మీడియాలో ఉంచారు. రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద దుమారం రేగింది. పోలీసుల తీరుపై విమర్శలొచ్చాయి. ఈ నేపథ్యంలో సీఐ గోరంట్లమాధవ్ను బాధ్యుణ్ని చేస్తూ వీఆర్కు పంపారు. -
స్టేషన్కు తరలించి ధర్డ్ డీగ్రీ ప్రయోగించారు
-
రోడ్డు ప్రమాదంలో యువకుడికి గాయాలు
గోరంట్ల : పట్టణంలోని కదిరి–హిందూపురం రహదారిలోని హెచ్పీ పెట్రోల్ బంక్ వద్ద శనివారం సాయంత్రం ద్విచక్రవాహనం అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఓడీసీ మండలం నాయనికోటకు చెందిన యువకుడు ప్రసన్నకు తీవ్ర గాయాలయ్యాయి. ద్విచక్రవాహనంలో బెంగుళూరు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.క్షతగాత్రున్ని స్థానికులు 108లో ఆస్పత్రికి తరలించారు. -
గర్భిణీ అనుమానాస్పద మృతి
గోరంట్ల : గోరంట్లకు చెందిన నిండు గర్భిణి అరుణకుమారి(20) అనుమానాస్పద స్థితిలో మరణించారు. కట్నం కోసం భర్తే హత్య చేశాడని హతురాలి తల్లిదండ్రులు ఆరోపించారు. పోలీసులు, హతురాలి తల్లిదండ్రుల కథనం మేరకు... నెల్లూరుకు చెందిన వట్టి శివశంకర్, సుజాత దంపతుల కుమార్తె అరుణకుమారిని అనంతపురం జిల్లా గోరంట్లకు చెందిన చేనేత కార్మికుడు శ్రీనివాసులు ఏడాదిన్నర కిందట ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వారు గోరంట్ల ఆంజనేయకాలనీలో నివసిస్తున్నారు. అత్తమామలు జీవనోపాధి కోసం చేనేత మగ్గాన్ని ఏర్పాటు చేయించారు. వారి సంసారం కొంతకాలం సజావుగా సాగినా, ఆ తరువాత కట్నం కోసం భర్త వేధించడం మొదలుపెట్టాడు. దీంతో అరుణ తల్లిదండ్రులు అల్లుడి కోరిక మేరకు స్కూటీని కొనిచ్చారు. అయితే ఆమె గర్భిణి కావడంతో అడిగినంత కట్నం ఇస్తారని భావించి చిత్రహింసలు పెట్టడం తీవ్రం చేశాడని అరుణ తల్లిదండ్రులు ఆరోపించారు. ఈ క్రమంలో బుధవారం రాత్రి దంపతుల మధ్య ఘర్షణ జరిగిందని, అల్లుడే తమ కుమార్తెను హత్య చేశాడని వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఐదు నెలలు గర్భిణీ కావడంతో వాంతులు అధికం కావడంతో ఆస్పత్రికి తరలించామని స్థానికులను నమ్మించారని వారు ఆరోపించారు. స్థానిక తహశీల్దార్ హసీనా సుల్తానా ఆధ్వర్యంలో పంచనామా నిర్వహించారు. భర్త శ్రీనివాసులను స్థానిక ఎస్ఐ వెంకటేశ్వర్లు అదుపులోకి తీసుకున్నారు. సమాచారం తెలుసుకున్న ధర్మవరం సబ్ డివిజన్ ఇన్చార్జ్ డీఎస్పీ ముక్కా శివరామిరెడ్డి గురువారం రాత్రి గోరంట్లకు చేరుకుని విచారణ చేపట్టారు. -
విద్యుదాఘాతంతో కాడెద్దుల మృతి
– ఇద్దరికి గాయాలు – రూ.1.80లక్షల నష్టం గోరంట్ల : విద్యుదాఘాతంతో కాడెద్దులు మతి చెందగా, మరో ఇద్దరు వ్యక్తులు గాయపడిన సంఘటన బుధవారం పట్టణంలో చోటు చేసుకొంది. బాధితులు, స్థానికులు వెల్లడించిన వివరాల మేరకు పట్టణంలోని పులేరు రోడ్డులో విశ్వేశ్వర రెడ్డి అనే వ్యక్తి గహా నిర్మాణాన్ని చేపట్టారు. నిర్మాణ సామగ్రిని నిల్వ చేసుకునేందుకు ఓ బంకు(ఐరన్షీట్) నాగరాజు అనే ఎద్దుల బండిని కిరాయికి తీసుకున్నారు. బంకును తరలించే క్రమంలో కూరగాయల సంత సమీపంలో 11 కేవీ విద్యుత్ వైర్లు బంకుకు తగిలి విద్యుత్ ప్రవహించడంతో బండి యజమాని చాకలి నాగరాజు, విశ్వేశ్వరరెడ్డిలు ఒక్కసారిగా కిందికి దూకేశారు. వీరికి స్వల్ప గాయాలయ్యాయి. అయితే బండిని లాగుతున్న ఎద్దుల మాత్రం విద్యుత్ షాక్తో విలవిలలాడుతూ అక్కడిక్కడే మతి చెందాయి. ఎద్దులను చాకలి నాగరాజు రూ. 1.80 వేల ఖరీదుతో కొనుగోలు చేశాడని, వ్యవసాయ పనుల ఉన్నప్పుడు వ్యవసాయం తర్వాత బాడుగలకు వెళ్లుతూ జీవనం సాగించేవాడని స్థానికులు తెలిపారు. బాధిత రైతు కుటుంబసభ్యులు విలపించిన తీరు అందరిని కలిచి వేసింది. రెవెన్యూ, విద్యుత్, పశుసంవర్ధక శాఖ అధికారుల సంఘటనస్థలాన్ని పరిశీలించారు. అనంతరం పశువైద్యాధికారి డాక్టర్.కిషోర్ మతి చెందిన ఎద్దులకు పోస్టుమార్టం నిర్వహించారు. -
అందరూ కలిసి పనిచేయాల్సిందే..
టీడీపీ సమన్వయకర్తల సమావేశంలో జిల్లా పరిశీలకులు గోరంట్ల బుచ్చయ్యచౌదరి ఒంగోలు సబర్బన్: పార్టీలో కొత్త నేతలు, పాత నేతలు అన్న తేడా ఉండదు. పార్టీలోకి వచ్చిన తరువాత అందరూ ఒక్కటే. పాత వాళ్లతో కొత్త నేతలు, కొత్త వాళ్లతో పాత నేతలు కలగలిసి పోవాల్సిందేనంటూ పార్టీ జిల్లా పరిశీలకులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. టీడీపీ సమన్వయకర్తల సమావేశం అనంతరం జిల్లా పార్టీ పరిశీలకులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి మీడియాతో మాట్లాడారు. పార్టీలో పాత, కొత్త అన్న తేడా ఏమీ ఉండదని అందరినీ కలుపుకు పోవటమే పార్టీ నాయకుల నైజంగా ఉండాలన్నారు. అందరం కలిసి పనిచేసుకు పోదాం, సమస్యలు ఉంటే అధిష్టానం దృష్టికి తీసుకురావాలి. కష్టపడే కార్యకర్తలకు పార్టీలో గుర్తింపు ఉంటుందని పేర్కొన్నారు. ఐదు రోజుల్లో సాగరు జలాలు జిల్లాకు చేరుకోనున్నాయని చెప్పారు. ప్రతినెలా రెండో వారంలో సమావేశాలు.. జిల్లా ఇన్చార్జ్ మంత్రి రావెల కిషోర్బాబు మాట్లాడుతూ రానున్న రోజుల్లో జిల్లాలో పార్టీ కంచుకోటలా మారనుందని పేర్కొన్నారు. అభివృద్ధి కార్యక్రమాలను గ్రామస్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆయన పార్టీ నాయకులకు పిలుపునిచ్చారు. మరో మంత్రి శిద్దా మాట్లాడుతూ వచ్చేనెల రెండో వారంలో నియోజకవర్గ స్థాయి సమన్వయ కమిటీ సమావేశాలు నిర్వహిస్తున్నామన్నారు. ఇక ప్రతి నెలా రెండోవారంలో ఇదే విధంగా నియోజకవర్గాల్లో సమన్వయ కమిటీ సమావేశాలు నిర్వహిస్తామని వివరించారు. పట్టిసీమ ద్వారా తూర్పు ప్రకాశంలోని పర్చూరు నియోజకవర్గంలో 80 వేల ఎకరాలకు సాగునీరు అందించనున్నట్లు వివరించారు. జిల్లాలో రైతులకు 790 రెయిన్ గన్లు పంపిణీ చేశామని పేర్కొన్నారు. జిల్లా పార్టీ అధ్యక్షుడు దామచర్ల జనార్దన్ మాట్లాడుతూ నియోజకవర్గాల్లో నాయకుల మధ్య ఎలాంటి విభేదాలు లేకుండా చూస్తామన్నారు. సమావేశానికి చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్, కనిగిరి ఎమ్మెల్యే కదిరి బాబూరావులు గైర్హాజరయ్యారు. సమావేశానికి ఎమ్మెలు, నియోజకవర్గ ఇన్చార్్జలు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు. -
దద్దరిల్లిన గోరంట్ల
గోరంట్ల : తరగతి గదిలో బండ మీద పడి చిన్నారి తన్మయసాయి (4) మృతికి కారణమైన పాఠశాలను సీజ్ చేయడంతో పాటు నిబంధనలకు విరుద్ధంగా ఉన్న ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి, మహిళా, రాజకీయ పక్షాల నాయకులు డిమాండ్ చేశారు. తరగతి గదిలో బ్లాక్ బోర్డుగా వినియోగిస్తున్న నల్లబండ మీద పడి పట్టణానికి చెందిన చిన్నారి తన్మయసాయి బుధవారం మృతి చెందిన విషయం తెలిసిందే. దీంతో గురువారం పట్టణంలో వివిధ సంఘాల ఆధ్వర్యంలో విద్యార్థులు భారీ ఎత్తున ర్యాలీ, ధర్నాలు చేపట్టారు. విద్యార్థి సంఘాల నాయకులు రాంప్రసాద్నాయక్, సురేంద్ర యాదవ్, ఎస్ఎఫ్ఐ నాయకులు సతీష్, వెంకటేష్, గంగాధర్తో పాటు మహిళ సంఘం నాయకురాలు పావని రమాదేవి, యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షుడు లక్ష్మినారాయణ యాదవ్, సీఐటీయూ జిల్లా కార్యదర్శి రమేష్ మాట్లాడుతూ పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే చిన్నారి మృతి చెందిందన్నారు. పాఠశాల నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ధర్మవరం డీఎస్పీ వేణుగోపాల్ ఆందోళన కారులతో చర్చించారు. డీఈఓ ఇక్కడికి వస్తే తాము ఆందోళన విరమిస్తామన్నారు. దీంతో ఆయన డీఈఓతో మాట్లాడి గోరంట్లకు వస్తున్నట్లు తెలపగా ఆందోళన విరమించారు. అనంతరం డీఈఓ శాంతినికేతన్ పాఠశాలలో సంఘటన స్థలాన్ని పరిశీలించి సీజ్ చేసి, గుర్తింపును రద్దు చేస్తున్నట్లు వెల్లడించారు. ఎమ్మెల్యే బీకే పార్థసారథి చిన్నారి తన్మయసాయి కుటుంబానికి ఎక్స్గ్రేషియా కోసం జిల్లా కలెక్టర్తో చర్చించి రూ.2 లక్షలు మంజూరు చేసినట్లు తెలిపారు. కన్నీటి సంద్రమైన సూరగానిపల్లి పుట్టపర్తి అర్బన్: మండలంలోని సూరగానిపల్లి కన్నీటి సంద్రమైంది. గోరంట్ల పట్టణంలో ప్రైవేటు పాఠశాల శాంతినికేతన్లో బుధవారం బండ పడి మృతి చెందిన తన్మయసాయి మృతదేహం గురువారం ఉదయం 11 గంటలకు గ్రామానికి చేరుకుంది. చిన్నారిని కడసారి చూడడానికి గ్రామస్తులు తరలివచ్చారు. గడపగడపకూ కార్యక్రమంలో భాగంగా వైఎస్సార్సీపీ సమన్వయకర్త దుద్దుకుంట శ్రీధర్రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి డీఎస్ కేశవరెడ్డి, సహకార సంఘం అధ్యక్షుడు ఏవీ రమణారెడ్డి, కన్వీనర్లు ఇంటికి వెళ్లి చిన్నారి తల్లితండ్రులు వెంకటేసు, గిరిజను ఓదార్చారు. -
చెరువులో పడి వ్యక్తి మృతి
పాలసముద్రం చెరువులో పడి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన మంగళవారం వెలుగు చూసింది. రాగిమేకులపల్లికి చెందిన సుబ్బరాయప్ప(58) సోమవారం ఉదయం పాలసముద్రం చెరువులో బహిర్భూమికి వెళ్లిన సమయంలో ఫిట్స్ రావడంతో చెరువులో పడి మృతి చెందాడు. అయితే కుటుంబ సభ్యులు తొలుత బంధువుల ఊరు వెళ్లి ఉంటాడని అనుకున్నారు. అయితే మంగళవారం చెరువులో శవం ఉన్నట్లు గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వారు వెళ్లి శవాన్ని వెలికితీయించారు. మృతుడి కుమారుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు స్థానిక ఎస్ఐ వెంకటేశ్వర్లు తెలిపారు. -
గోరంట్ల కాన్వాయ్ ఎదుట తమ్ముళ్ళ వీరంగం
ఎమ్మెల్యే శంకుస్థాపన చేసిన శిలాఫలకం ధ్వంసం తొర్రేడు (రాజమహేంద్రవరం రూరల్) : పార్టీలో సముచితస్థానం కల్పించడంతోపాటు తగిన గుర్తింపు ఇవ్వకపోవడంతో తెలుగు తమ్ముళ్ళు రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి కాన్వాయ్ను అడ్డుకున్నారు. ఆయన శంకుస్థాపన చేసిన శిలాఫలకాన్ని ధ్వంసం చేసిన సంఘటనతో తొర్రేడు గ్రామంలో సోమవారం రాత్రి ఉద్రిక్తత చోటుచేసుకుంది. తొర్రేడు గ్రామం ఎస్సీపేటలో సోమవారం రాత్రి మంచినీటి పథకానికి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి శంకుస్థాపన చేశారు. ఈ విషయాన్ని కనీసం పార్టీ నాయకులకు తెలియజేయకుండా శంకుస్థాపన చేయడం ఏమిటని టి.డి.పి.నాయకుడు మెప్పిలి అయ్యన్న, ఇతర నాయకులు సొసైటీ కార్యాలయం వద్ద ఎమ్మెల్యే కాన్వాయ్ను అడ్డుకున్నారు. పార్టీలో పనిచేసేవారికి గుర్తింపు ఇవ్వరా అంటూ నిలదీశారు. సుమారు పది నిమిషాలపాటు తెలుగు తమ్ముళ్ళు వీరంగం చేశారు. ఎమ్మెల్యే గోరంట్లను అక్కడ నుంచి సొసైటీ కార్యాలయంలో జరుగుతున్న కార్యక్రమానికి మరో వర్గం నేతలు, కార్యకర్తలు తీసుకుని వెళ్ళిపోయారు. అనంతరం ఎస్సీపేటలో శంకుస్థాపన శిలాఫలకాన్ని ధ్వంసంచేశారు.దీంతో వీరిపై పోలీసులు కేసు నమోదు చేసేందుకు సమాయత్తమవుతున్నారు. -
సీమాంధ్రను దగా చేస్తే చూస్తూ ఊరుకోం
కేంద్రం సీమాంధ్రను దగా చేయాలనుకుంటే సహించేదిలేదని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, గుంటూరు జిల్లా పరిశీలకుడు గోరంట్ల బుచ్చయ్యచౌదరి హెచ్చరించారు. ఆదివారం గుంటూరులోని శ్రీవెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో ఆదివారం జరిగిన మినీ మహానాడులో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర విభజన విధానాన్ని మొట్టమొదటిసారిగా తెరమీదకు తెచ్చింది బీజేపీయేనన్నారు. కాకినాడ సభలో ఒక ఓటు... రెండు రాష్ట్రాల ప్రతిపాదన చేసింది ఆ పార్టీయేనని, విభజన సమయంలో రాజ్యసభలో ఏపీకి పదేళ్లు ప్రత్యేక హోదా కావాలని డిమాండ్ చేసిందని గుర్తుచేశారు. వార్డు మెంబర్గా కూడా గెలవని సోము వీర్రాజును ఎమ్మెల్సీని చేస్తే కనీసం మిత్రధర్మాన్ని పాటించకుండా విమర్శలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. మిడిమిడి జ్ఞానంతో అవాకులు, చవాకులు పేలుతున్నారని విమర్శించారు. వైజాగ్లో హుద్హుద్ తుపాను సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటించి వెయ్యి కోట్లు ప్రకటిస్తే ఇచ్చింది కేవలం రూ. 535 కోట్లు మాత్రమేనన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ రాష్ట్రాన్ని ఆదుకోవాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదాతోపాటు, ప్యాకేజీ ప్రకటించాలని డిమాండ్ చేశారు. విభజన చట్టంలో ఇచ్చిన అన్ని హామీలను నెరవేర్చాల్సిన బాధ్యత బీజేపీపైనే ఉందన్నారు. -
నేను మంత్రినయ్యా.. మరి మీరు..?
- ఏపీ టీడీపీ ఎమ్మెల్యేలతో తలసాని శ్రీనివాస్యాదవ్ సాక్షి,హైదరాబాద్: ఏపీ, తెలంగాణ రాష్ట్రాల శాసనసభా సమావేశాలు ఒకేసారి జరుగుతుండడంతో తరచూ తెలంగాణ, ఏపీ ప్రజాప్రతినిధులు అసెంబ్లీ లాబీల్లో కలుసుకుంటున్నారు. ఒకప్పటి టీడీపీ నేత, ఇప్పటి టీఆర్ఎస్ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్, ఏపీ టీడీపీ ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, కళా వెంకట్రావులు మంగళవారం లాబీలో ఎదురుపడ్డారు. ఈ సందర్భంలో టీఆర్ఎస్లో చేరిన తనకు మంత్రి పదవి వచ్చిందని.. ఏపీలో అధికారంలో ఉండి కూడా మీకు మంత్రి పదవులు రాలేదని తలసాని అన్నారు. దానికి ఏం సమాధానం చెప్పాలో తెలియక టీడీపీ నేతలు చిరునవ్వులు చిందిస్తూ అక్కడ్నుంచి వెళ్లిపోయారు. -
‘కోర్టు చెప్పినా.. రోజాను రానివ్వం’
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యురాలు రోజా సస్పెన్షన్ను ఎత్తివేయాలని న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలు యథాతథంగా అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా లేదని అధికార పార్టీ ఎమ్మెల్యేలు స్పష్టం చేశారు. స్పీకర్ తీర్పులో జోక్యం చేసుకునే అధికారమే న్యాయవ్యవస్థలకు లేదని వారన్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి మాట్లాడుతూ, అవసరమైతే రూల్స్ను కూడా మార్చే అధికారం తమకు ఉందని, దాన్ని కోర్టులు ప్రశ్నించడానికి వీల్లేదన్నారు. గతంలో లోక్సభ స్పీకర్ సోమనాథ్ చటర్జీ కొంత మంది ఎంపీలను సస్పెండ్ చేసినప్పుడు, న్యాయస్థానం అభ్యంతరం చెప్పిందని, ఆ సందర్భంగా అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేసి, దీనిపై చర్చించారని తెలిపారు. రోజా విషయంలో కోర్టు తీర్పు ఇచ్చినా సభలో చర్చించిన తర్వాత ఆమె వ్యవహారంలో నిర్ణయం తీసుకుంటామన్నారు. వాళ్ళు ధర్నాలు చేసినా న్యాయం జరగదు రోజా సస్పెన్షన్ను ఎత్తివేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్ని ఆందోళనలు చేసినా ఎంతమాత్రం న్యాయం జరగదని టీడీపీ ఎమ్మెల్యే బోండ ఉమామహేశ్వరరావు అన్నారు. రోజాను చూస్తే తమ పార్టీ ఎమ్మెల్యేలు వణికిపోతున్నారని, ఈ నేపథ్యంలో కోర్టు తీర్పుపై అసెంబ్లీలో చర్చించాల్సిన అవసరం ఉందన్నారు. న్యాయస్థానం రోజా సస్పెన్షన్ను ఎత్తివేయాలని మాత్రమే ఆదేశించిందని, ఆమెను అసెంబ్లీలోకి అనుమతించమని ఎక్కడ చెప్పలేదని వ్యాఖ్యానించారు. సోమవారం అసెంబ్లీలో దీనిపై చర్చించి, ఓ నిర్ణయం తీసుకుంటామని స్పీకర్ చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. అది మా ఏకగ్రీవ నిర్ణయం రోజాను సస్పెండ్ చేయాలన్నది శాసనసభ ఏకగ్రీవ నిర్ణయమని, న్యాయస్థానం సస్పెన్షన్ ఎత్తివేయమని ఆదేశించినా, దీనికి అసెంబ్లీ ఒప్పుకోవాల్సి ఉంటుందని అధికార పార్టీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు చెప్పారు. దేశంలో ఇలాగే ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసిన దాఖలాలున్నాయని చెప్పిన ఆయన... ఎథిక్స్ కమిటీ నిర్ణయం లేకుండానే జరిగిందా అన్న ప్రశ్నకు సమాధానం చెప్పలేకపోయారు. కారణాలు ఏవైనా రోజా విషయంలో సభలో చర్చించాల్సిందే అన్నారు. -
'చరిత్రలోకి వెళ్లాల్సిన అవసరం లేదు'
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై అధికార సభ్యుల ఎదురుదాడి కొనసాగుతోంది. విపక్ష నేత సంధించిన ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరైన అధికార సభ్యులు తమకు అలవాటైన ఎదురుదాడి విద్యను ప్రదర్శించారు. నోటికి వచ్చినట్టు ఇష్టానుసారంగా మాట్లాడారు. వ్యక్తిగత విమర్శలకు దిగారు. సీఎం చంద్రబాబుతో సహా మంత్రులు సవాళ్ల మీద సవాళ్లు విసురుతూ రెచ్చగొట్టేందుకు ప్రయత్నించారు. అవిశ్వాసం తీర్మానంపై వైఎస్ జగన్ మాట్లాడుతుండగా అధికార ఎమ్మెల్యేలు పదే పదే అడ్డుపడ్డారు. సోలార్ కుంభకోణంలో భారీ అవినీతి జరిగిందని వైఎస్ జగన్ ఆరోపించగానే టీడీపీ నేతలు మూకుమ్మడిగా ఎదురుదాడికి దిగారు. ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ... వైఎస్ జగన్ పై వ్యక్తిగత విమర్శలు చేశారు. గతంలో చెప్పిన విషయాలను మళ్లీ చెప్పే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా స్పీకర్ జోక్యం చేసుకుని చరిత్రలోకి వెళ్లాల్సిన అవసరం లేదంటూ గోరంట్లను మందలించారు. తర్వాత కూడా గోరంట్ల తనదైన శైలిలో ప్రసంగం కొనసాగించారు. -
నీటి యాతన
వేసవికి ముందే తాగునీటి తిప్పలు గుంటూరు నగరం గొంతెండుతోంది నిలిచిన గుంటూరు చానల్ సరఫరా శివారు ప్రాంతాలకు అరకొర నీటి సరఫరా వేసవిపై దృష్టిసారించని ఉన్నతాధికారులు గుంటూరు: నగర జనాభా 6.5 లక్షలు ఉంటుంది. నగర పాలక సంస్థలో విలీనమైన పది గ్రామాల జనాభా 1.5 లక్షలు ఉంటుంది. మొత్తం కలిపి 8 లక్షల జనాభా. అయితే ఈ జనాభాకు ప్రతిరోజూ 120 ఎంఎల్డీల నీటిని సరఫరా చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా నగరానికి కృష్ణానది నుంచి మంచినీటిని సరఫరా చేస్తున్నారు. వాస్తవానికి గుంటూరు చానల్ నుంచి తక్కెళ్ళపాడు మంచినీటి కేంద్రానికి అక్కడి నుంచి నగరానికి మంచినీటిని సరఫరా చేస్తారు. రెండు పైపులైన్ల ద్వారా 90 ఎంఎల్డీల నీటిని సరఫరా చేయాల్సి ఉంటుంది. అలాగే సంగం జాగర్లమూడి నుంచి 27 ఎంఎల్డీల నీరు, వెంగళాయపాలెం ద్వారా 3 ఎంఎల్డీల నీరు సరఫరా చేయాల్సి ఉంటుంది. ఇంత వరకు బాగానే ఉన్నా ప్రస్తుతం కృష్ణానదిలో నీటి సమస్య ఏర్పడడంతో గుంటూరు చానల్ ద్వారా సరఫరా ఆగిపోయింది. దీంతో ప్రకాశం బ్యారేజీ నుంచి ఉండవల్లి వద్ద ఉన్న పంపింగ్ కేంద్రం ద్వారా మంగళగిరి పంపింగ్ కేంద్రం మీదుగా ప్రతిరోజూ 40 ఎంఎల్డీల నీటిని సరఫరా చేస్తున్నారు. సంగం జాగర్లమూడి నుంచి 16 ఎంఎల్డీల నీరు, వెంగళాయపాలెం ద్వారా 3 ఎంఎల్డీల నీరు మొత్తం 59 ఎంఎల్డీల నీరు మాత్రమే సరఫరా అవుతుంది. దీంతో ప్రజలకు మంచినీటి సమస్యలు తప్పడం లేదు. అదే సమయంలో విలీనగ్రామాలైన గోరంట్ల, బుడంపాడు, అంకిరెడ్డిపాలెం, చౌడవరం, పొత్తూరు గ్రామాల్లో చెరువులు పూర్తిస్థాయిలో నింపలేదు. దీంతో ఆయా గ్రామాల్లో సైతం తీవ్ర నీటి సమస్య నెలకొంది. గుంటూరు చానల్కు క్రాస్బండ ... వాస్తవానికి నగరంలో ప్రతి వేసవిలో అంటే ఏప్రిల్ నుంచి జూన్ వరకు నీటి సమస్య ఏర్పడుతోంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని గుంటూరు చానల్కు క్రాస్బండ ఏర్పాటు చేసి 5 అడుగుల మేర నీటిని స్టోరేజ్ చేసి ప్రజలకు సరఫరా చేస్తారు. అయితే గత ఏడాది నవంబర్ నుంచే కృష్ణానదిలో నీటి సమస్య ఏర్పడడంతో అధికారులు గుంటూరు చానల్కు క్రాస్బండ పనులు పూర్తిచేస్తున్నారు. ఐదు అడుగుల మేర నీటిని నిల్వ చేసే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. మరోవైపు తెనాలి పట్టణానికి మంచినీటిని సరఫరా చేసే పైపులైన్కు నగరానికి మంచినీటిని సరఫరా చేసే పైపులైన్ను అనుసంధానం చేయడం ద్వారా నగరంలో మంచినీటి సమస్య తలెత్తకుండా చూస్తామని అధికారులు చెబుతున్నారు. మంచినీటి సమస్యలు ఎదుర్కొంటున్న ప్రాంతాలు ... నగరంలోని మంగళదాస్నగర్, శ్రీనగర్, పాతగుంటూరు, రైలుపేట, కొత్తపేట, ఆర్టీసీ కాలనీ, కొరిటెపాడు, ఆంజనేయ కాలనీ, శ్యామలానగర్, ఇలా అనేక ప్రాంతాల్లోని ప్రజలు నెల రోజులుగా మంచి నీటి కోసం నరకయాతన పడుతున్నారు. నిత్యం నీటి కోసం పడిగాపులు కాయాల్సిన దుస్థితి.ఏ సమయంలో నీరు వస్తాయో అర్థం కాక అక్కడి ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. కొత్తపేటలోని గణేశ్వరరావువీధి, మంగళబావి సందు, గరువు ప్రాంతాల్లో సంవత్సరం నుంచి నీరు సక్రమంగా సరఫరా కావడంలేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. పాతగుంటూరు పరిధిలోని సుద్దపల్లిడొంక, లక్ష్మీనగర్, పాములకాలనీ, ప్రగతినగర్ ప్రాంతాల గురించి చెప్పాల్సిన పనిలేదు. వీధి కుళాయిల వద్ద తెల్లవారు జాము నుండే బిందెలతో క్యూలో నిలబడాల్సిన పరిస్థితి. నందివెలుగు రోడ్డులోని వినోభానగర్, రాహుల్గాంధీనగర్, ఆర్టీసీ కాలనీ శివార్లులోనూ నీటి ఎద్దడి తలెత్తుతోంది. పేద, మధ్యతరగతి ప్రజలు సైతం డబ్బులు వెచ్చించి మరీ తాగునీటిని కోనుగోలు చేయాల్సిన దుస్థితిని నగరపాలక సంస్థ అధికారులు ఏర్పరిచారని దుయ్యబడుతున్నారు. -
కరెన్సీ కలకలం
* రూ.40కు రూ.100 నోటు * యథేచ్ఛగా నకిలీ నోట్ల చెలామణి! గోరంట్ల(పెనుకొండ) : గోరంట్ల కేంద్రంగా నకిలీ నోట్ల వ్యాపారం జోరుగా సాగుతోంది. పొరుగున ఉన్న కర్ణాటక నుంచి ఇక్కడకు నకిలీ నోట్లు పెద్ద ఎత్తున వస్తున్నట్లు సమాచారం. గోరంట్లలోని ఆరు క్రియాశీలక కేంద్రాలకు తొలుత నకిలీ కరెన్సీ చేరుతోంది. అక్కడి నుంచి ఈ అక్రమ వ్యాపారాన్ని జిల్లా వ్యాప్తంగా విస్తరిస్తున్నట్లు తెలుస్తోంది. రూ. 40 అసలు నోటు ఇస్తే రూ. 100 నకిలీ నోటు ఇస్తున్నారు. దీంతో చాలా మంది గ్రామీణులు, యువత ఈ అక్రమ వ్యాపారం వైపు ఆకర్షితులవుతున్నారు. ఏకంగా దుబాయ్ నుంచే ఇక్కడకు నకిలీ కరెన్సీ దిగుమతి అవుతోందన్న ఆరోపణలున్నాయి. ఫైనాన్స్, చీటి నిర్వాహకుల ద్వారా నకిలీ నోట్లు మార్కెట్లోకి చెలామణి అవుతోందన్న విమర్శలున్నాయి. వీటిలో రూ. 500, రూ.1000 నోట్లే అధికంగా ఉండడం గమనార్హం. దీనిపై స్థానిక ఎస్ఐ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ... నకిలీ నోట్ల చెలామణిపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు చెప్పారు. -
పదిమంది పేకాట రాయుళ్ల అరెస్ట్
గోరంట్ల (అనంతపురం) : గ్రామ శివారులోని వ్యవసాయ క్షేత్రాల్లో పేకాట ఆడుతున్న పదిమందిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ. 47 వేల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన అనంతపురం జిల్లా గోరంట్ల మండలం భగవంతంపల్లి గ్రామ శివారులో శనివారం చోటుచేసుకుంది. -
అసెంబ్లీలో రెచ్చిపోయిన గోరంట్ల
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ శాసనసభలో టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మరోసారి రెచ్చిపోయారు. 'కాల్ మనీ' సెక్స్ రాకెట్ వ్యవహారంపై చర్చ సందర్భంగా ప్రతిపక్ష వైఎస్సార్ సీపీ సభ్యులను నోటికి వచ్చినట్టు తిడుతూ ఊగిపోయారు. సభను అడ్డుకోవడమే పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. తాము కూడా సభను అడ్డుకోగలమని అన్నారు. విపక్ష సభ్యులను ఎలా దారికి తేవాలో తమకు తెలుసునన్నారు. ప్రతిపక్ష సభ్యులను సస్పెండ్ చేసైనా సభ జరిగేలా చేయాలని డిమాండ్ చేశారు. 'సభను అడ్డుకోవడం మాకు చేతనవును. మాకూ అధికారం ఉంది. మేము ఏమైనా చేయగలం. మిమ్మల్ని ఏం చేయాలో మాకు తెలుసు. ఇక ముందు సభకు అడ్డుపడకుండా విపక్ష సభ్యులపై స్పీకర్ చర్యలు తీసుకోవాలి. వారిని సస్పెండ్ చేసైనా సభను నడపండి' అని గోరంట్ల అన్నారు. -
అసెంబ్లీలో రెచ్చిపోయిన గోరంట్ల
-
మీడియా ప్రతినిధులకు సంస్కారం లేదు: గోరంట్ల
కాకినాడ : తూర్పుగోదావరి జిల్లా పరిషత్ సమావేశం గురువారం కాకినాడలో ప్రారంభమైంది. ప్రారంభమైన కొద్దిసేపటికే సమావేశం రసాభాసగా మారింది. ఈ సమావేశానికి జిల్లాలోని ఎమ్మెల్యేలంతా హాజరయ్యారు. అయితే సమావేశం ప్రారంభంకాగానే రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే, టీడీపీ నాయకుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి మీడియా ప్రతినిధులపై విరుచుకుపడ్డారు. సంస్కారం లేదంటూ మీడియా ప్రతినిధులపై గోరంట్ల తన ఆగ్రహన్ని వ్యక్తం చేశారు. గోరంట్ల వ్యాఖ్యలపై మీడియా ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో సభలో తీవ్ర గందరగోళనం నెలకొంది. ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని అటు గోరంట్ల... ఇటు మీడియా ప్రతినిధులకు సర్థి చెప్పేందుకు యత్నించారు. గోరంట్ల తీరుకు నిరసనగా తాము సభ నుంచి వాకౌట్ చేస్తున్నట్లు మీడియా ప్రతినిధులు ప్రకటించారు. ఆ వెంటనే వారు అక్కడి నుంచి వెళ్లిపోయారు. మీడియా ప్రతినిధులకు పలువురు ఎమ్మెల్యేలు మద్దతు తెలిపారు. -
జగన్ కోలుకోవాలంటూ గంగమ్మకు పూజలు
గోరంట్ల (అనంతపురం) : రాష్ట్ర శ్రేయస్సు దృష్ట్యా ప్రత్యేక హోదా కోసం నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆరోగ్యం కుదుట పడాలని ఆ పార్టీ నాయకులు అనంతపురం జిల్లా గోరంట్లలోని ఏటి గంగమ్మ దేవాలయంలో సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అదే విధంగా జగన్ దీక్ష విజయవంతం కావాలని గంగమ్మను వేడుకున్నారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు పలువురు మాట్లాడుతూ... రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా తన ఆరోగ్యాన్ని సైతం లెక్క చేయకుండా దీక్ష చేస్తున్న తమ నాయకుడిపై కేవలం చంద్రబాబు మెప్పు కోసం, తమ పదవులను కాపాడుకోనేందుకు మంత్రులు లేని పోని ఆరోపణలు చేయడం మానుకోవాలన్నారు. ప్రత్యేక హోదా విషయంలో మాట మార్చిన బీజేపీని నిలదీస్తే కేంద్ర ప్రభుత్వంలో చలనం వస్తుందన్నారు. -
4 ఇసుక లారీలు సీజ్
గోరంట్ల (అనంతపురం) : అక్రమంగా ఇసుకను తరలిస్తున్న నాలుగు లారీలను పోలీసులు సీజ్ చేశారు. అనంతపురం జిల్లా గోరంట్లలో పోలీసులు శుక్రవారం సాయంత్రం ప్రధాన రహదారిపై వాహనాలు తనిఖీ చేస్తుండగా వైఎస్సార్ జిల్లా నుంచి బెంగళూరుకు తరలిస్తున్న ఈ లారీలను పోలీసులు సీజ్ చేశారు. పోలీసులు లారీ నిర్వాహకులపై ఇసుక అక్రమ రవాణా కేసు నమోదు చేశారు. -
సిమెంట్ లారీ దొంగల అరెస్ట్
గోరంట్ల (అనంతపురం) : ఓ సిమెంట్ లారీని కొట్టేసిన ఇద్దరు దొంగలను అనంతపురం జిల్లా గోరంట్ల పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. ఈ నెల 14 న గోరంట్ల మండలం గుమ్మయ్యగారిపల్లి క్రాస్రోడ్డు వద్ద ఆగి ఉన్న సిమెంట్ లారీతో దొంగలు పరారయ్యారు. దీనిపై యజమాని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు ప్రారంభించారు. లారీని దొంగిలించిన చౌడప్ప, మహేశ్లను అరెస్ట్ చేసి లారీని స్వాధీనం చేసుకున్నారు. -
మహిళ దారుణ హత్య
అనంతపురం (గోరంట్ల) : అనంతపురం జిల్లా గోరంట్ల మండలం బూదిలిగొల్లపల్లి సమీపంలోని అక్కమ్మదొన ప్రాంతంలో గుర్తుతెలియని ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. మహిళ వయసు సుమారు 40 నుంచి 45 మధ్య ఉంటుంది. ఆనవాళ్లు దొరక్కుండా ముఖం మీద పెట్రోలు పోసి కాల్చారు. అనంతరం ఆమెను ఉపాధి హామీ పనుల్లో తీసిన గుంతల్లో పడేసి చెత్తవేశారు. మంగళవారం అటుగా వచ్చిన వారికి ఆమె శవం కనపడటంతో పోలీసులకు సమాచారం అందించారు. -
500 ట్రాక్టర్ల ఇసుక సీజ్
అనంతపురం: అధికార తెలుగుదేశం పార్టీ నేతల అవినీతి మరోసారి బయటపడింది. అనంతపురం జిల్లా గోరంట్లలో టీడీపీ నేతలు అక్రమంగా తరలిస్తున్న ఇసుకను అధికారులు సోమవారం సీజ్ చేశారు. కళ్యాణ మంటపం నిర్మాణానికి 500 ట్రాక్టర్ల ఇసుకను హిందూపురం ఎంపీ నిమ్మల కిష్టప్ప బంధువు యువశేఖర్ ఇంటి వద్ద నిల్వ ఉంచారు. అక్రమంగా నిల్వ ఉంచారని సమాచారం తెలుసుకున్న వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ఎం.శంకరనారాయణ అధికారులకు ఫిర్యాదు చేశారు. అక్రమంగా నిల్వ ఉంచిన ఇసుకను రెవెన్యూ అధికారులు సీజ్ చేశారు. -
'క్వశ్చన్ అవర్ అందరి హక్కు'
హైదరాబాద్: శాసనసభలో ప్రశ్నోత్తరాలు నిర్వహించాల్సిందేనని టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. క్వశ్చన్ అవర్ అందరి హక్కు అని వ్యాఖ్యానించారు. క్వశ్చర్ అవర్ అందరి హక్కు అని అన్నారు. రోజు మాదిరిగా ప్రశ్నోత్తరాలు నిర్వహించాలని సూచించారు. ప్రశ్నోత్తరాల సమయాన్ని దుర్వినియోగం చేయడం దుర్మార్గం అని పేర్కొన్నారు. మంగళవారం శాసనసభలో ప్రత్యేకహోదాపై చర్చకు విపక్ష వైఎస్సార్ సీపీ సభ్యులు పట్టుబట్టారు. ఈ సందర్భంగా మాట్లాడిన బుచ్చయ్య చౌదరి... ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై వ్యక్తిగత ఆరోపణలకు దిగారు. ప్రశ్నోత్తరాలకు విపక్ష సభ్యులు సహకరించాలని కోరారు. -
దోస్తీ మే సవాల్!
♦ అమలాపురంలో రచ్చకెక్కిన మిత్రభేదం ♦ టీడీపీ అవినీతిపై ధ్వజమెత్తిన బీజేపీ ♦ అభివృద్ధి నిరోధకులని ‘దేశం’ ప్రత్యారోపణ ♦ ఆర్డీఓ కార్యాలయం వద్ద పోటాపోటీ ధర్నాలు సాక్షి ప్రతినిధి, కాకినాడ : ఓ వైపు ఆదివారం స్నేహితుల దినోత్సవం జరగనుండగా అంతకు ఓ రోజు ముందే మిత్రపక్షాలైన బీజేపీ, టీడీపీలు అమలాపురంలో కత్తులు దూసుకున్నాయి. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీడీనీ అధికారంలోకి వచ్చే వ్యూహంతోనే ఈ రెండు పార్టీలూ మిత్రపక్షాలయ్యాయి. అటువంటి పక్షాల మధ్య జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో విభేదాలు రగులుకున్నారుు. తాజాగా కోనసీమ కేంద్రం అమలాపురంలో రెండు పార్టీల నేతలు ‘బస్తీ మే సవాల్’ అంటూ జబ్బలు చరుచుకుని రోడ్డెక్కాయి. మిత్రపక్షాలకు చెందిన రాజమండ్రి సిటీ, రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యేలు డాక్టర్ ఆకుల సత్యనారాయణ (బీజేపీ), గోరంట్ల బుచ్చయ్యచౌదరి (టీడీపీ)ల మధ్య నిన్నమొన్నటి వరకు పచ్చగడ్డి వేస్తే భగ్గున మండే పరిస్థితి. పుష్కరాల్లో సైతం వీరి మధ్య అంతరం తగ్గలేదు. బీజేపీకే చెందిన ఎమ్మెల్సీ సోము వీర్రాజు కూడా పుష్కరాల పనుల్లో అవినీతి జరిగిందని నిప్పులు చెరిగింది టీడీపీ ఎమ్మెల్యే, ఎంపీల పైనేనంటున్నారు. రాజమండ్రిలో టీడీపీ, బీజేపీల మధ్య నెలకొన్న విభేదాలు ఇప్పుడు అమలాపురాన్ని తాకాయి. బీజేపీ నేతలు నేరుగా అక్కడి టీడీపీ ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావుపై అవినీతి అస్త్రాలు సంధించడమే కాక శనివారం ధర్నా కూడా చేపట్టారు. ఇందుకు పోటీగా టీడీపీ నేతలు కూడా ధర్నాకు దిగారు. చాలా కాలం నుంచే అంతర్గత పోరు అల్లవరం మండలం ఓడలరేవులో ఓఎన్జీసీ ప్లాంట్ విస్తరణ కోసం300 ఎకరాల భూ సేకరణలో టీడీపీ నాయకులు అవినీతికి పాల్పడ్డారనేది బీజేపీ ప్రధాన ఆరోపణ. ఇందులో ప్రధాన పాత్ర అధికారపార్టీకి చెందిన అమలాపురం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావుదేనంటోంది. ఆయనను టీడీపీ నుంచి సస్పెండ్ చేయాలంటూ ఆ పార్టీ అధినేత, సీఎం చంద్రబాబుకు ఫిర్యాదు కూడా చేశారు. అల్లవరం మండలానికి చెందిన రాష్ట్ర పశుగణాభివృద్ధి సంస్థ చైర్మన్ యాళ్ల దొరబాబుకు, ఎమ్మెల్యే ఆనందరావుకు మధ్య అంతర్గత పోరు చాలా కాలంగా కొనసాగుతున్నా ఇప్పుడు రెండు పక్షాలు అధికారంలో ఉండటంతో తారాస్థాయికి చేరుకుంది. గతంలో అల్లవరం మండలంలో ఫ్లెక్సీల ఏర్పాటు విషయమై తలెత్తిన వివాదానికి ఓఎన్జీసీ భూ సేకరణపై అవినీతి ఆరోపణలతో అగ్నికి ఆజ్యం పోసినట్టయింది. అవినీతిపై విచారణకు డిమాండ్ అల్లవరం మండలంలో ఇటీవల జరిగిన పుష్కర ఘాట్ల నిర్మాణంలో అవినీతికి కూడా ఎమ్మెల్యే ఆనందరావే కారణమని బీజేపీ నేతలు ఆరోపించారు. అవినీతిని నిరసిస్తూ వారు ఆర్డీఓ కార్యాలయం వద్ద శనివారం ఉదయం, వారికి పోటీగా టీడీపీ నాయకులు సాయంత్రం ధర్నాలకు ఉపక్రమించారు. అవినీతికి సం బంధించి అధిపార పార్టీ నాయకుల పైనా, వారికి అండగా నిలిచిన అధికారులపైనా విచారణ చేయాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. దొరబాబుతో పాటు రాష్ట్ర బీజేపీ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే మానేపల్లి అయ్యాజీ వేమా వంటి నాయకులు ఆందోళనలో ముందుండటం గమనార్హం. టీడీపీ కూడా హడావిడిగా ప్రతి ఆందోళనకు దిగి కమలనాథులకు సవాల్ విసిరింది. ఆర్డీవో కార్యాలయం వద్ద పోటీ ధర్నా చేపట్టి ఎమ్మెల్యేపై బీజేపీ నాయకుల ఆరోపణలను ఖండించింది. నియోజవర్గ అభివృద్ధిని అడ్డుకుంటున్నారని ఆరోపించింది. బీజేపీ నాయకులవి దళిత వ్యతిరేక విధానాలని నిరసించింది. మిత్రపక్షాల మధ్య రగిలిన విభేదాలు, ఆరోపణలు, ప్రత్యారోపణలు ఏ పరిణామానికి దారి తీస్తాయో వేచి చూడాల్సిందే. -
'పంకజ పాత్రను బుచ్చయ్య పోషిస్తున్నారు'
రాజమండ్రి: తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో క్రైస్తవులకు స్మశానవాటిక నిర్మించాలని మాజీ ఎంపీ హర్షకుమార్ డిమాండ్ చేశారు. ఈ నెల 10లోపు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దీనిపై ప్రకటన చేయాలని, లేకపోతే ఆమరణ దీక్ష చేపడుతానని హెచ్చరించారు. టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అవినీతికి పాల్పడుతున్నారని హర్షకుమార్ ఆరోపించారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మహారాష్ట్ర మంత్రి పంకజ ముండే పాత్రను రాజమండ్రిలో బుచ్చయ్య చౌదరి పోషిస్తున్నారని విమర్శించారు. కోట్ల రూపాయల విలువైన సుందరీకరణ పనులను నామినేషన్ పద్ధతిలో కేటాయించి అవినీతిమయం చేస్తున్నారని హర్షకుమార్ అన్నారు. -
'ప్రత్యేక హోదా కోసం బిచ్చం ఎత్తుకోం'
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కోసం తాము బిచ్చం ఎత్తుకోవడం లేదని టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు ప్రత్యేక హోదాకు 14వ ఆర్థిక సంఘం సిఫార్సు చేయలేదని కేంద్ర ప్రణాళికా శాఖ మంత్రి ఇంద్రజిత్ సింగ్ లోక్సభలో ప్రకటించిన నేపథ్యంలో బుచ్చయ్య చౌదరి స్పందించారు. ఇదో దుర్దినమని, ఏపీ హక్కుల కోసం తాము పోరాడుతామని చెప్పారు. ఏపీ సీపీఐ కార్యదర్శి రామకృష్ణ ఇదే విషయంపై మాట్లాడుతూ కేంద్రం రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకపోవడం దారుణమని విమర్శించారు. కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ప్రత్యేక హోదా కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకువెళ్లాలని రామకృష్ణ సూచించారు. -
'రోజాను ఏడాది పాటు సస్పెండ్ చేయండి'
హైదరాబాద్ : వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే రోజాను కనీసం ఓ సంవత్సరం పాటు సస్పెండ్ చేస్తూ సభ బాగుంటుందని టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. స్పీకర్ను ఫ్యాక్షనిస్ట్ అంటున్న ఆమెపై సస్పెన్షన్ వేటు వేయాలన్నారు. గురువారం అసెంబ్లీలో బడ్జెట్పై చర్చ జరుగుతున్న సమయంలో ప్రతిపక్ష, అధికార సభ్యుల మధ్య మాటల యుద్ధం జరిగింది. ఈ సందర్భంగా గోరంట్ల... పనికిరాని నాయకురాలు ... సభా గౌరవానికి భంగం కలుగుతోంది. మహిళలను గౌరవించే సంస్కృతి ఉంది. అయితే రోజా వాడే పదజాలం, వ్యవహరించే తీరు బాధాకరం' అన్నారు. పనిలో పనిగా గోర్లంట బుచ్చయ్య చౌదరి ...ప్రతిపక్ష నేత వైఎస్ జగన్పై విరుచుకుపడ్డారు. ప్రతిపక్ష నాయకుడు బాధ్యతను విస్మరిస్తున్నారని, సభలో ఇష్టరాజ్యంగా వ్యవహరిస్తున్నారంటూ మండిపడ్డారు. విపక్ష సభ్యులు స్పీకర్పై దండయాత్ర చేయటం క్షమించరాని నేరమన్నారు. స్పీకర్కు వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు క్షమాపణ చెప్పాలని గోరంట్ల బుచ్చయ్య చౌదరి డిమాండ్ చేశారు. -
స్కూల్ బస్సు బోల్తా: విద్యార్థులకు గాయాలు
అనంతపురం : అనంతపురం జిల్లా గోరంట్ల మండలం మల్లెల గ్రామంలో స్కూల్ బస్సు ప్రమాదానికి గురైంది. బుధవారం ఉదయం విద్యార్థులతో వొనవోలు నుంచి గోరంట్ట వెళ్తున్న జ్ఞానేశ్వర్ స్కూల్ బస్సు అదుపు తప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో నలుగురు విద్యార్థులకు, బస్సు డ్రైవర్ కు గాయాలయ్యాయి. మిగిలిన విద్యార్థులు క్షేమంగా బయటపడ్డారు. స్తానికులు వెంటనే స్పందించి గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. పోలీసుల సంఘటనాస్థలికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
బుచ్చయ్య దూషణల పర్వం
అసెంబ్లీలో వైఎస్, రోజాలపై అనుచిత వ్యాఖ్యలు సాక్షి, హైదరాబాద్: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి, వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రోజా మీద టీడీపీ సభ్యుడు గోరం ట్ల బుచ్చయ్య చౌదరి అనుచిత వ్యాఖ్యలు చేశా రు. అసెంబ్లీలో గందరగోళ పరిస్థితులు ఏర్పడటానికి, అధికార, విపక్ష సభ్యుల మధ్య తీవ్ర వాగ్వివాదానికి కారణమయ్యారు. సోమవారం రుణమాఫీపై చర్చ సందర్భంగా.. రైతుల కష్టాలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వైఎస్సార్సీపీ సభ్యుడు విశ్వేశ్వరరెడ్డి విమర్శించారు. అనంతపురం జిల్లాలో సాధారణ వర్షపాతం 500 మిల్లీమీటర్లు కాగా, ఈ ఏడాది 172 మిల్లీమీటర్లే నమోదైనా జిల్లాలోని 4 మండలాలను కరువు ప్రాంతాల జాబితాలో చేర్చకపోవడాన్ని తప్పుబట్టారు. ఆయన ప్రసంగం కొనసాగుతుండగానే మైక్ కట్ చేసి.. టీడీపీ సభ్యుడు గోరంట్ల బుచ్చ య్య చౌదరికి స్పీకర్ అవకాశం ఇచ్చారు. దీనికి నిరసనగా విపక్ష సభ్యులు స్పీకర్ పోడియం వద్దకు వెళ్లారు. ప్రసంగం ప్రారంభించిన గోరంట్ల.. రోజా సినిమాలు, టీవీల్లో విలన్ వేషాలు వేశారని, అందుకే సభలో కూడా విలన్ వేషాలు వేస్తున్నారంటూ దూషించారు. చంద్రబాబుకు ముని శాపం ఉందని జగన్ అన్నారని, వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రాణా లు గాల్లో ఉన్నప్పుడే గాల్లో కలిసిపోయాయని దూషించారు. బుచ్చయ్య దూషణల పర్వంపై వైఎస్సార్సీపీ సభ్యులు తీవ్రంగా ప్రతిస్పందించారు. తన గురించి అనుచిత వ్యాఖ్యానాలు చేసినందున తనకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని రోజా స్పీకర్ పోడియం వద్ద నిలబడి గట్టిగా డిమాండ్ చేశారు. సభలో గందరగోళ పరిస్థితులు నెలకొనడంతో 344 నిబంధన కింద జరిగిన ఈ చర్చకు మంత్రి సమాధానం ఇవ్వకుండానే స్పీకర్ సభను అర్ధాంతరంగా సాయంత్రానికి వాయిదా వేశారు. సభ వాయిదా తర్వాత వైఎస్సార్సీపీ సభ్యులు గోరంట్లతో వాగ్వాదానికి దిగారు. అయితే పత్రికల్లో రాయలేని భాషలో రోజాను గోరంట్ల దూషించారు. ఆమె కంటతడి పెట్టడంతో వైఎస్సార్సీపీ సభ్యులు కూడా ఎదురుదాడి చేశారు. కౌరవ సభలా వ్యవహరించారు: జగన్ సభ తిరిగి నాలుగు గంటలకు ప్రారంభం కాగానే రోజా తన ఆవేదనను సభ ముందుంచే ప్రయత్నం చేశారు. సభ్య సమాజం తలదించుకునేలా టీడీపీ సభ్యులు వ్యవహరించడాన్ని సభాపతి కూడా ఖండించకపోవడం దారుణమన్నారు. దీనికి ఆగ్రహించిన సభాపతి కోడెల శివప్రసాదరావు ‘హోల్డ్ యువర్ టంగ్’ అంటూ రోజాను వారించారు. ఆ సమయంలో ఎవరేం మాట్లాడారో విన్పించలేదని, సీసీ కెమెరాలను పరిశీలించి నిర్థారణకు వస్తానని చెప్పారు. మంత్రి యనమల రామకృష్ణుడు కల్పించుకుని సభలోనే కాదని, సభ అయిపోయి అందరూ వెళ్ళిపోయాక ఎవరేం మాట్లాడుకున్నారో కూడా టేపుల్లో పరిశీలించాలని కోరారు. దీనిపై ప్రతిపక్ష నేత జగన్మోహన్రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సభలో ఓ మహిళా సభ్యురాలు తనకు అవమానం జరిగిందని కన్నీరు పెడితే, కనీసం క్షమాపణ కూడా చెప్పకపోతే, మనమంతా ఎమ్మెల్యేలమేనా? అన్న అనుమానం కలుగుతోందన్నారు. ఒక ఆడకూతురికి అవమానం జరిగిందంటే కనీసం స్పందించడం లేదని, కౌరవ సభలా వ్యవహరించారని, కౌరవులకు పట్టిన గతే పడుతుందని, అన్నీ దేవుడే చూసుకుంటాడని అన్నారు. -
అతివలంటే ఇంత అలుసా?
సాక్షి ప్రతినిధి, కాకినాడ : తెలుగుదేశం పార్టీలోనే కాదు.. జిల్లాలోనూ గోరంట్ల బుచ్చయ్య చౌదరి సీనియర్ నేత. అయిదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఒకసారి మంత్రి పదవినీ నిర్వర్తించారు. అన్ని సందర్భాల్లో ఆయన విజయంలో మహిళా ఓటర్ల పాత్ర కీలకమంటే అతిశయోక్తి కాదు. అంతటి సీనియర్ నేత మహిళల పట్ల అనుచితంగా వ్యవహరిస్తుండడం పట్ల జిల్లాలో మహిళా లోకం విస్తుబోతోంది. ఆడపడుచుల పట్ల ఎవరైనా అనుచితంగా వ్యవహరిస్తే.. మందలించాల్సిన వ్యక్తి.. తానే తోటి శాసనసభ్యురాలిని కించపరచడాన్ని జిల్లావ్యాప్తంగా మహిళా సంఘాల నాయకులు నిరసిస్తున్నారు. శాసనసభలో వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే రోజాపై సోమవారం బుచ్చయ్య అనుచితంగా ప్రవర్తించడం పట్ల జిల్లా అంతటా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రోజా అసెంబ్లీలో గౌరవప్రదంగా, హుందాగా వ్యవహరిస్తూ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతుంటే సహించలేకే.. బుచ్చయ్య ఇటువంటి వాఖ్యలకు పాల్పడుతున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. గతంలో కూడా గోరంట్ల రాజమండ్రిలో పేద మహిళల పట్ల అనుచితంగా వ్యవహరించారని, ఆ సందర్భంగా చేదు అనుభవాన్ని చవి చూశారని మహిళా సంఘాల నేతలు గుర్తు చేస్తున్నారు. బుచ్చయ్య మాటలకు రోజా కన్నీటి పర్యంతం అయిన వైనం చూసి, రాజకీయాల్లో సీనియర్ అయి ఉండి అధికార పార్టీ నేతకు ఇదేం సంస్కారం అంటూ మండి పడుతున్నారు. గతంలోనూ ఇలానే అనుచితంగా.. ఈ ఏడాది ఆరంభంలో జరిగిన వరుస ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడక ముందు రాజమండ్రిలో నిర్మించిన పేదల గృహాలను లబ్ధిదారులకు అందచేస్తున్న సమయంలో గోరంట్ల వాటిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. సుమారు ఎనిమిదేళ్లుగా సొంత ఇంటి కల అందని ద్రాక్షగా మారిన తరుణంలో ఇళ్ల పంపిణీకి అధికాారులు రంగం సిద్ధం చేస్తే వాటిని అడ్డుకోనేందుకు తన బలగంతో పాటు గోరంట్ల చేసిన ప్రయత్నాన్ని మహిళలు అడ్డుకున్నారు. ఈ సందర్భంలో కూడా మహిళల పట్ల బుచ్చయ్య చౌదరి దురుసుగా వ్యవహరించిన తీరు ఆ సందర్భంలో ఆడపడుచులకు ఆగ్రహం తెప్పించింది. అప్పట్లో గోరంట్ల మహిళా లబ్ధిదారుల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేశారు. అది సహించలేక మహిళల తిరగబడ్డారు. నిజంగా దుమ్మెత్తి పోయడమే కాక చెప్పులు చూపించి మరీ తరిమి కొట్టారు. సొంత పార్టీ మహిళల పట్లా అంతే.. రాజమండ్రి నగర పాలక సంస్థ ఎన్నికల్లో కూడా కార్పొరేటర్ల టిక్కెట్టు ఇస్తానని మహిళా అభ్యర్థులకు ఆశపెట్టి తర్వాత వేరొకరికి కట్టబెట్టిన సందర్భంలో పలువురు గోరంట్ల ఇంటికి వెశ్లి మరీ ఆవేదన వ్యక్తం చేశారు. శాపనార్థాలు పెట్టారు. ఆ తర్వాత కార్పొరేషన్లో మహిళా కో ఆప్షన్ సభ్యుల ఎంపికలో కూడా గోరంట్ల చివరి క్షణం వరకూ ఓ మైనారిటీ మహిళకు అవకాశం కల్పిస్తానని చెప్పారు. గంపెడాశతో సమావేశ మందిరం వద్దకు కూడా వచ్చిన తర్వాత మరొకరికి ఇవ్వడంతో ఆ మహిళ కంటతడి పెట్టింది. బుచ్చయ్య బహిరంగంగా తనను అవమాన పరిచారని ఆవేదన వ్యక్తం చేసింది. ఇలా.. పలు సందర్భాల్లో గోరంట్ల మహిళల పట్ల అనుచిత వైఖరిని గుర్తు చేసుకుంటున్న వారు.. సోమవారం నాటి సంఘటనను బట్టి ఆయన తీరు మారలేదని దుయ్యబడుతున్నారు. -
'లక్ష ఎకరాల భూసేకరణ.. దోపిడీలో భాగమే'
హైదరాబాద్:ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని నిర్మాణం కోసం చేపట్టిన లక్ష ఎకరాల భూసేకరణ కార్యక్రమం దోపిడీలో ఒక భాగమేనని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే ఆళ్లగడ్డ రామకృష్ణారెడ్డి(ఆర్కే) విమర్శించారు. సోమవారం అసెంబ్లీలో సీఆర్డీఏ బిల్లు చర్చ సందర్భంగా మాట్లాడిన ఆళ్లగడ్డ.. రాజధాని కమిటీలో పచ్చచొక్కాలే కనబడుతున్నాయని మండిపడ్డారు. లోప భూయిష్టమైన బిల్లును సరిచేయాలని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. సింగపూర్ కు దోచి పెట్టడానికే చంద్రబాబు పన్నిన కుట్ర అని ఆళ్లగడ్డ అభిప్రాయపడ్డారు. అసలు శివరామకృష్ణన్ కమిటీని పట్టించుకోకుండా రాజధాని నిర్మాణం చేపడుతున్నారని తెలిపారు. భూములు ఇవ్వకపోతే బలవంతంగా లాక్కుంటున్నారన్నారు. మూడు పంటల పండే ప్రాంతంలో రాజధాని నిర్మాణం చేయవద్దని ఆర్కే తెలిపారు. రైతుల అసంతృప్తి బయటపడుతుందని చంద్రబాబు తిరగలేదన్నారు. -
క్షమాపణ కూడా అడగకపోతే ఎలా?
-
రికార్డులు చూసి తప్పు ఎవరిదో నిర్ణయిద్దాం: స్పీకర్
-
క్షమాపణ కూడా అడగకపోతే ఎలా?
హైదరాబాద్: తమ పార్టీ ఎమ్మెల్యే ఆర్కే రోజాపై టీడీపీ నేత గోరంట్ల బుచ్చయ్యచౌదరి అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తప్పుబట్టారు. తోటి మహిళా శాసనసభ్యురాలిని అవహేళన మాట్లాడితే అసెంబ్లీలో ఉండడానికి మనం అర్హులమా, కాదా అని మనల్ని మనమే ప్రశ్నించుకోవాలని జగన్ అన్నారు. అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యేను స్పీకర్ కనీసం క్షమాపణ కూడా అడగకపోతే ఈ సభలో తమకు ఏ రకంగా న్యాయం జరుగుతుందని ప్రశ్నించారు. గోరంట్లతో క్షమాపణ చెప్పించాలని తాము డిమాండ్ చేస్తే... సభ ముగిసిన తర్వాత ఏం మాట్లాడుకున్నారో చూస్తామనడం ఆశ్చర్యంగా ఉందన్నారు. రోడ్డు పొడుగునా ఏం జరుగుతుందో అది కూడా చూసుకుంటూ పోదామా అని ప్రశ్నించారు. ఆడకూతురితో సభలో కన్నీళ్లు పెట్టించిన గోరంట్ల క్షమాపణ చెప్పిన తర్వాతే ఇతర విషయాలు చర్చిద్దామన్నారు. అయితే సీఆర్డీఏ బిల్లుకు తాము అడ్డుపడుతున్నామని ప్రభుత్వం బురద చల్లుతుందన్న కారణంతో సీఆర్డీఏ బిల్లుపై చర్చకు .జగన్ అంగీకరించారు. దీంతో గోరంట్ల వ్యాఖ్యలపై దుమారానికి తెరపడింది. -
రికార్డులు చూసి తప్పు ఎవరిదో నిర్ణయిద్దాం: స్పీకర్
హైదరాబాద్:అసెంబ్లీ రికార్డులు చూసి తప్పు ఎవరిదో నిర్ణయిద్దామని స్పీకర్ కోడెల శివప్రసాద రావు స్పష్టం చేశారు. అసెంబ్లీ సమావేశాలు సాక్షిగా సోమవారం టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి నగరి ఎమ్మెల్యే రోజాపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సందర్భంలో స్పీకర్ పై విధంగా స్పందించారు. అసెంబ్లీలో తనను తిట్టడమే కాకుండా.. మాట్లాడకుండా చేశారని రోజా స్పీకర్ కు వద్దకు తీసుకువెళ్లారు. దీంతో స్పీకర్ మాట్లాడతూ.. అసెంబ్లీ రికార్డులు ఆధారంగా తప్పు ఎవరిదో నిర్ణయిద్దామని తెలిపారు. సభాధిపతిపై ఆరోపణలు చేయడం సమంజసం కాదని కోడెల తెలిపారు. టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మరోసారి శాసనసభలో నోటిదురుసు ప్రదర్శించిన సంగతి తెలిసిందే. ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ సభ్యులపై అభ్యంతకర వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ దూషించారు. వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు రౌడీయిజం చేస్తున్నారంటూ ఒంటికాలిపై లేచారు. మహిళా ఎమ్మెల్యే రోజాపై వ్యక్తిగత దూషణలకు దిగారు. రోజా లేడీ విలన్ లా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు.దీంతో వాయిదా పడిన సభ తిరిగి సాయంత్రం నాలుగు గంటలకు ప్రారంభమైంది. సభ ఆరంభమైన అనంతరం కూడా ఇరు పార్టీల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. -
అసెంబ్లీలో కంటతడి పెట్టిన రోజా
-
గోరంట్ల బుచ్చయ్య చౌదరి నోటిదురుసు..!
-
బాబు ఆదేశాలతోనే అనుచిత వ్యాఖ్యలు: రోజా
హైదరాబాద్:ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలతోనే టీడీపీ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి తనపై అనుచిత వ్యాఖ్యలు చేశారని నగరి ఎమ్మెల్యే రోజా విమర్శించారు. అసెంబ్లీలో ప్రజా సమస్యలపై సమాధానం చెప్పలేక అధికారపక్షం వ్యక్తిగత దూషణలకు దిగుతోందని ఆమె మండిపడ్డారు. అసెంబ్లీలో తనకు మాట్లాడే అవకాశాన్ని స్పీకర్ కూడా ఇవ్వలేదన్నారు. చంద్రబాబు భస్మాసురుడిలా వ్యవహరిస్తున్నారని రోజా ఎద్దేవా చేశారు. ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజల తలపై చేయిపెట్టి మోసం చేయాలని చూస్తున్నారన్నారు. ప్రజలు తిరగబడి చంద్రబాబు నెత్తిన ఆయన చేయినే పెట్టించి భస్మం చేస్తారని రోజా స్పష్టం చేశారు. ఓడిపోయిన నేతలను, దొంగలకు ప్రభుత్వ కమిటీల్లో అవకాశం కల్పిస్తున్నారన్నారు. తనపై ఉన్న కేసులపై కోర్టు నుంచి స్టే తెచ్చుకోకపోతే చంద్రబాబు జీవితాంతం జైల్లోనే ఉండాల్సి వచ్చేదన్నారు. చంద్రబాబు చీకట్లో చిదంబరం కాళ్లు పట్టుకుని కాంగ్రెస్ తో చేతులు కలిపి తనపై కేసులు రాకుండా చూసుకున్నారని రోజా అన్నారు. సభ్య సమాజం తలదించుకునేలా టీడీపీ ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారన్నారు. రుణమాఫీ, ఫీజు రీయింబర్స్ మెంట్, యానిమేటర్ల సమస్యలపై ప్రభుత్వం వద్ద సమాధానం లేదన్నారు. అందుకే డాక్టర్ వైఎస్ఆర్ ను, వైఎస్ జగన్ ను లక్ష్యంగా చేసుకుని తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారని రోజా దుయ్యబట్టారు. బుచ్చయ్య చౌదరి తన సీనియారిటీని ప్రక్కన పెట్టి తోటి ఎమ్మెల్యే అయిన తనపై వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. చంద్రబాబు కనుసన్నల్లోనే ఇదంతా జరుగుతుందన్నారు. చంద్రబాబుతో బుచ్చయ్య చౌదరి మాట్లాడిన తరువాతే ఆయన అలాంటి మాటలు వాడారని.. ఒకసారి అసెంబ్లీ రికార్డులను పరిశీలిస్తే ఇది స్పష్టమవుతుందని రోజా తెలిపారు.అసెంబ్లీ సాక్షి చంద్రబాబు అసత్యాలు చెప్తున్నారని.. ఆయన దేవుడే అయితే ఐకేపీ యానిమేటర్లను ఎందుకు అరెస్టు చేస్తున్నారని నిలదీశారు. -
అసెంబ్లీలో కంటతడి పెట్టిన రోజా
హైదరాబాద్: టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మరోసారి శాసనసభలో నోటిదురుసు ప్రదర్శించారు. ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ సభ్యులపై అభ్యంతకర వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ దూషించారు. వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు రౌడీయిజం చేస్తున్నారంటూ ఒంటికాలిపై లేచారు. మహిళా ఎమ్మెల్యే రోజాపై వ్యక్తిగత దూషణలకు దిగారు. రోజా లేడీ విలన్ లా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. పచ్చి బూతులు మాట్లారని ధ్వజమెత్తారు. సభలో తనకు జరిగిన అవమానంపై మాట్లాడేందుకు అవకాశమివ్వాలని రోజా ప్రాధేయపడినా స్పీకర్ కనిరించలేదు. గోరంట్ల వ్యాఖ్యలతో నొచ్చుకున్న రోజా సభలో కంటతడి పెట్టారు. రోజాపై అభ్యంతకర వ్యాఖ్యలు చేసిన బుచ్చయ్య చౌదరి క్షమాపణ చెప్పాలని వైఎస్సార్ సీపీ సభ్యులు డిమాండ్ చేశారు. ఇంతలోనే స్పీకర్ సభను వాయిదా వేశారు. సభ వాయిదా తర్వాత కూడా వైఎస్సార్ సీపీ, టీడీపీ సభ్యుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. -
ముదిరిన మిత్రభేదం
సాక్షి, రాజమండ్రి : రాష్ట్ర రాజకీయాల్లో రాజమండ్రి సెంటిమెంట్ బలంగానే ఉంది. అనేక పార్టీలు పలు కీలక కార్యక్రమాలను, ప్రభుత్వాలు పథకాలను ఇక్కడి నుంచే ప్రారంభించిన దాఖలాలున్నాయి. ఇప్పుడు రాష్ట్రంలో బీజేపీ, టీడీపీల స్నేహబంధం విచ్ఛిన్నానికీ ఈ నగరమే శ్రీకారం చుట్టనుందా అన్న అనుమానం తలెత్తుతోంది. ఇక్కడి సిటీ, రూరల్ నియోజకవర్గాల్లో చెరొకటీ గెలుచుకున్న ఆ పార్టీలు ఆది నుంచే ఎడమొహం పెడమొహంగా ఉంటున్నాయి. బీజేపీకి చెందిన సిటీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ, టీడీపీకి చెందిన రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరిల మధ్య లోపాయకారీగా రగులుతూ వచ్చిన చిచ్చు ఇసుక రీచ్ల పుణ్యమా అని ఇప్పుడు ర చ్చకెక్కింది. ఈ పరిణామాలతో రెండు పార్టీల శ్రేణులూ శత్రువుల్లా మారినట్టు కనిపిస్తోంది. బీజేపీ నేతలు శనివారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ‘పట్టణ వ్యవహారాల్లో మీ జోక్యం ఎందుకని’ గోరంట్లను ప్రశ్నించారు. తమ ఎమ్మెల్యే జోలికి వస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా పుష్కరాలు సజావుగా సాగాలంటే కేంద్రం నిధులు ఇవ్వక తప్పదన్నారు. ‘మాకు మెజారిటీ ఉన్నా మిమ్మల్ని కలుపుకొంటున్నాం’ అని గుర్తు చేశారు. కాగా టీడీపీ నేతలు బీజేపీ నాయకుల మాటల్ని తిప్పికొట్టేందుకు సిద్ధమవుతున్నారు. గోరంట్ల అనుచరులు ఆయనతో సమాలోచనలు జరుపుతున్నట్టు సమాచారం. ఈ పరిణామాలు రానున్న రోజుల్లో ఇరు పార్టీల మధ్య దూరం పెంచుతాయని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఇలా మొదలయ్యాయి మిత్రభేదాలు.. సిటీ టిక్కెట్ ఆశించి భంగపడ్డ గోరంట్ల అధిష్టానం వద్ద పట్టుబట్టి రూరల్ టిక్కెట్ సంపాదించారు. అయితే సిటీపై కూడా పట్టు సాధించాలని ముందు నుంచీ పావులు కదుపుతూనే ఉన్నారు. సిటీ ఎమ్మెల్యేతో పాటు కార్యక్రమాలకు హాజరవుతూ తన చర్యలను సమర్థించుకున్నారు. తాను సిటీ టీడీపీ ఇన్చార్జినంటూ నగరపాలక సంస్థ కార్యక్రమాల్లో జోక్యం చేసుకుంటున్నారు. తమ పార్టీ కార్పొరేటర్లతో తరచూ సమావేశమవుతూ సిటీ ప్రాంత పరిపాలనలో కూడా జోక్యం చేసుకుంటుండడం సిటీ ఎమ్మెల్యే ఆకులకు రుచించడంలేదు. పలు సందర్భాల్లో ‘నీకు రాజకీయాలు కొత్త.. నేను సీనియర్ను’ అని ప్రజావేదికల వద్ద కూడా ప్రస్తావిస్తుండడం’ అటు బీజేపీ నేతల్లో, ఎమ్మెల్యేలో వ్యతిరేకతకు దారి తీసింది. గతంలో ఎమ్మెల్యేలుగా ఉన్నప్పుడు దివంగత నేతలు జక్కంపూడి రామ్మోహనరావు, ఏసీవై రెడ్డిలతో కూడా గోరంట్ల ఇదే వైఖరి అవలంబించారని, కానీ మిత్రపక్షమైన తమతోనూ ఇదే వైఖరి ఏమిటని నేడు బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. కాగా మిత్రపక్ష ఎమ్మెల్యేలు కలిసికట్టుగా రానున్న పుష్కరాలకు నగరాన్ని అభివృద్ధి చేస్తారనుకున్న నగర ప్రజలకు నిరాశే మిగులుతోంది. గతంలో ఏడాది ముందు నుంచి పుష్కర ఏర్పాట్లు చేశారు. పుష్కరాలకు ఇంకా ఏడు నెలలు గడువు లేకపోయినా చేపట్టాల్సిన పనులపై ప్రభుత్వం అంచనాకు కూడా రాలేదు. గోదావరి పుష్కరాలకు అంతా తానై వ్యవహరించాలని చూస్తున్న గోరంట్ల వైఖరి మిత్రభేదాన్ని రానున్న రోజుల్లో మరింత జటిలం చేస్తుందని, ఈ ప్రభావం పుష్కరాలపై పడుతుందని నగర వాసులు నిట్టూరుస్తున్నారు. -
రాజీనామా చేస్తానంటున్న టీడీపీ ఎమ్మెల్యే
పులపర్తి, నామనల మధ్య విభేదాలు రాంయపునకు అనుమతించకుంటే పదవికి రాజీనామా చేస్తానంటున్న ఎమ్మెల్యే ఆ వ్యవహారంలో తన ప్రమేయం లేదని పార్టీ నాయకులకు జెడ్పీ చైర్మన్ వివరణ! సాక్షి ప్రతినిధి, కాకినాడ :ఇసుక రీచ్లపై ఆధిపత్య పోరు తెలుగుదేశం పార్టీలో దుమారాన్ని రేపుతోంది. నిన్నగాక మొన్న రాజమండ్రి కుమారి టాకీస్ వద్ద గోదావరిలో ఇసుక తవ్వకాన్ని డ్వాక్రా మహిళలకు కేటాయించే విషయమై రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే డాక్టర్ ఆకుల సత్యనారాయణ (బీజేపీ), రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి మధ్య పరోక్షంగా అగ్గి రాజేసింది. ఇక్కడ ఇసుక తవ్వకాలపై టీడీపీ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోందని, అన్ని అర్హతలున్నా తమకు అప్పగించలేదని ఉల్లితోట మహిళా సమాఖ్య ఆందోళనకు దిగింది. తవ్వకాలను ప్రారంభించేందుకు వచ్చిన సిటీ ఎమ్మెల్యే ఆకులను మహిళలు నిలదీశారు. కావాలనే గోరంట్ల వర్గీయులకు ఇక్కడ తవ్వకాలు కట్టబెట్టారని మహిళా సంఘాలు, ఆకుల వర్గీయులు ఆరోపిస్తున్నారు. రాజమండ్రిలో రాజుకున్న అగ్గి ఇంకా చల్లారకుండానే టీడీపీకి చెందిన పి.గన్నవరం ఎమ్మెల్యే పులపర్తి నారాయణమూర్తి, జెడ్పీ చైర్పర్సన్ నామన రాంబాబుల మధ్య ఇసుక జగడం మొదలైంది. కోనసీమలోని పి.గన్నవరం ఇసుక ర్యాంపునకు అనుమతి రాకపోవడమే వీరి మధ్య వివాదానికి కారణమైంది. పి.గన్నవరం అక్విడెక్టుకు ప్రమాదం సంభవిస్తుందని అధికారులు ఇక్కడ తవ్వకాలకు అనుమతి నిరాకరించారు. అయితే కావాలనే ర్యాంప్ను నిలిపివేశారంటూ ఎమ్మెల్యే పులపర్తి ర్యాంపునకు అనుమతి విషయాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ర్యాంపునకు అనుమతి ఇవ్వకుంటే పదవికి రాజీనామా చేసేందుకు సైతం వెనుకాడేది లేదని పరోక్షంగా హెచ్చరించారని సమాచారం. అధికారుల అభ్యంతరం మాటున.. కోనసీమలోని ఐదు నియోజకవర్గాల్లో కొత్తపేట పరిధిలోని రావులపాలెం తరువాత పి.గన్నవరం పరిధిలో ఇసుక తవ్వకాలు అత్యధికంగా ఉండే పి.గన్నవరం, లంకల గన్నవరం, ముంజువరం కలిపి ఒక ప్యాకేజీ. బోట్స్మెన్ సొసైటీ పేరున వేలంలో దక్కించుకుని ఇక్కడ ఇసుక తవ్వకాలు జరుపుతుంటారు. గత ఏడాది పడవలు వెళ్లే అవకాశం లేదని మొర పెట్టుకోవడంతో ర్యాంపు వేసేందుకు అనుమతి ఇచ్చారు. విజయవాడకు చెందిన బడా వ్యాపారులు బోట్స్మెన్ పేరున ఇక్కడ ఇసుక వ్యాపారం చేపట్టారు. అడ్డూఅదుపులేకుండా, నిబంధనలు తుంగలో తొక్కి ఇసుక తవ్వకాలు చేపట్టడంతో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. అక్విడెక్టుకు 500 మీటర్లలోపు ఇరువైపులా తవ్వకాలు చేయరాదనే నిబంధనలు ఉండగా, పాటదారులు 200 మీటర్ల సమీపంలో ఇసుక తవ్వారనే ఆరోపణలు ఉన్నాయి. ఎల్.గన్నవరంలో డ్రెడ్జర్ తరహా మోటార్లతో ఇసుక తవ్వగా ఇరిగేషన్ హెడ్వర్క్స్ అధికారుల అభ్యంతరంతో తవ్వకాలు నిలిచిపోయాయి. ఇవే కారణాలతో ఈ ఏడాది తవ్వకాలకు అనుమతి ఇవ్వలేదు. అయితే అనుమతి ఇవ్వకుండా కొర్రీలు వేయడం వెనుక జెడ్పీ చైర్పర్సన్ నామన పాత్ర ఉందని ఎమ్మెల్యే పులపర్తి గట్టిగా నమ్ముతున్నారు. అధికారుల అభ్యంతరాలను సాకుగా చూపి నామన తవ్వకాలను అడ్డుకున్నారని పులపర్తి వర్గీయులు ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉండగా, శనివారం కాకినాడలో జరిగిన జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశానికి వచ్చిన పులపర్తి.. గన్నవరం రీచ్కు అనుమతి నిరాకరించడంపై మైన్స అధికారులను నిలదీశారు. దీనిపై పరిశీలనకు అధికారులను పంపుతానని కలెక్టర్ ఆయనకు హామీ ఇచ్చారు. ఆధిపత్య పోరే అసలు కారణం.. ఇసుక రీచ్ వ్యవహారంలో వీరి వివాదం తెరపైకి వచ్చినా అసలు కారణం ఆధిపత్య పోరేనని పార్టీ శ్రేణులు అంటున్నాయి. మామిడికుదురు మండలానికి చెందిన నామన టీడీపీ ఆవిర్భావం నుంచి పి.గన్నవరం నియోజకవర్గంలో క్రియాశీలక నేతగా వ్యవహరిస్తున్నారు. లోక్సభ దివంగత స్పీకర్ జీఎంసీ బాలయోగి హయాం నుంచి టీడీపీ ముఖ్యనేతలతో నామన మంచి సంబంధాలనే కొనసాగిస్తున్నారు. నామనతో సమానంగానే పులపర్తి కూడా ఆ నియోజకవర్గంలో పార్టీ వ్యవహారాలు చూస్తూ వస్తున్నారు. పి.గన్నవరం నియోజకవర్గం ఎస్సీలకు రిజర్వు కావడంతో పులపర్తికి మరోసారి ఎమ్మెల్యే అయ్యే అవకాశం దక్కింది. అదృష్టం కలిసివచ్చి నామన జెడ్పీ చైర్పర్సన్ అయ్యారు. ఇక అప్పటి నుంచే వీరి మధ్య ఆధిపత్య పోరు ప్రారంభమై ఇప్పుడు ఇసుకరీచ్ వ్యవహారంలో బహిర్గతమైంది. పి.గన్నవరం కేంద్రంగా రెండు అధికార కేంద్రాలు ఏర్పడటంతో ఇవన్నీ సహజమేనని పార్టీ నేతలు తేలిగ్గా తీసుకుంటున్నా పార్టీ శ్రేణులు మాత్రం ‘అడకత్తెరలో పోక చెక్క’...సామెతగా నలిగిపోతున్నారు. ఒకపక్క ఎమ్మెల్యే, మరోపక్క జెడ్పీ చైర్పర్సన్ ఎవరి పక్కన నిలవాలనేది తేల్చుకోలేక తలలుపట్టుకుంటున్నారు. ఇసుకరీచ్లో తవ్వకాలకు అనుమతి రాకపోవడంలో తన ప్రమేయం లేదని నామన పార్టీ నేతలకు వివరణ ఇచ్చినట్టు సమాచారం. అయితే ఈ విషయంలో తాడోపేడో తేల్చుకుంటానంటున్న ఎమ్మెల్యే ఆమరణ దీక్ష చేస్తానంటూ హెచ్చరించడం వారి మధ్య విభేదాలు తారస్థాయికి చేరాయనడానికి నిదర్శనం. పార్టీ నాయకత్వం ఈ వివాదాన్ని ఏరకంగా పరిష్కరిస్తుందో వేచి చూడాల్సిందే. -
నా నియోజకవర్గంలోకి రావద్దు: బుచ్చయ్య
-
నా నియోజకవర్గంలోకి రావద్దు: బుచ్చయ్య
రాజమండ్రి : రాజమండ్రిలో ఇసుక వ్యవహారం టీడీపీ, బిజెపీల కార్యకర్తల మధ్య చిచ్చు రేపింది. దాంతో అర్బన్ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ, రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరీల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఇసుక ర్యాంప్ను బుచ్చయ్య చౌదరి ప్రారంభించడాన్ని ఉల్లికోట మహిళా సంఘం సభ్యులు అడ్డుకున్నారు. వివరాల్లోకి వెళితే కుమారి టాకీస్ ఇసుక ర్యాంపు రూరల్ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి చేతుల మీదుగా ప్రారంభించేందుకు వెంకటేశ్వర సొసైటీ ఏర్పాట్లు చేసింది. అయితే ఈ విషయం తెలుసుకున్న సిటీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఘటనా స్థలానికి వచ్చిన ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ అర్బన్ ఏరియాలోని ర్యాంపు విషయంలో రూరల్ ఎమ్మెల్యే జోక్యం చేసుకోవడం ఏంటని ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఇరువురి ఎమ్మెల్యేల మధ్య తీవ్ర వాగ్వివాదం జరిగింది. తన ఏరియాలో జరుగుతున్న వ్యవహారాల్లో అర్బన్ ఎమ్మెల్యే జోక్యం చేసుకున్నారంటూ బుచ్చయ్య బాహాటంగా విమర్శలకు దిగారు. తన నిమోజకవర్గంలోకి అడుగు పెట్టవద్దని బుచ్చయ్య ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆకులను హెచ్చరించారు. దీంతో ఇద్దరు ఎమ్మెల్సేలతో పాటు కార్యకర్తల మధ్య కూడా వాగ్వాదం పెరిగింది. ఒక దశలో ఇరు వర్గాలకు చెందిన కార్యకర్తలు తోపులాటకు దిగారు. కాగా టీడీపీ ఆవిర్భావం నుంచి రాజమండ్రి నగరంలో గోరంట్ల అనుబంధం కేడర్తో మమేకమైన విషయం తెలిసిందే. అయితే ఇటీవలి ఎన్నికల్లో సీట్ల సర్ధుబాట్లలో భాగంగా టీడీపీ రాజమండ్రి అర్బన్ సీటును బీజేపీకి కేటాయించింది. అధికారికంగా గోరంట్ల రూరల్ నియోజకవర్గానికి చెందడంతో నగర పార్టీ దేశం కేడర్ నగర ఎమ్మెల్యే ఆకులతో సయోధ్యగా లేదు. దాంతో శాసన సభ్యులుగా ఎన్నికైన నాటి నుండి వారిద్దరి మధ్య ప్రోటోకాల్ విషయంలో చాలాసార్లు వివాదం చోటుచేసుకుంది. -
రోడ్డు ప్రమాదంలో ఆరుగురి మృతి.
-
రోడ్డు ప్రమాదంలో ఆరుగురి మృతి
-
రోడ్డు ప్రమాదంలో ఆరుగురి మృతి
అనంతపురం జిల్లాలో బుధవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. గోరంట్ల మండలం గుమ్మయ్యగారి పల్లె దగ్గర ఆటోను లారీ ఢీ కొట్టింది.ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందగా నలుగురు గాయపడ్డారు. మృతుల్లో ఐదుగురు మహిళలు ఉన్నారు. పెడబల్లికి చెందిన నాగమ్మ, షరీవమ్మ, సుగుణ, వెంకటమ్మ, నాగమణితో పాటు డ్రైవర్ విజయకుమార్ కూడా మరణించారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. కర్ణాటకలోని సాగేపల్లికి కూరగాయలు తీసుకెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతులంతా పెడపల్లి గ్రామానికి చెందినవారు. మృతులంతా కూలీలని తెలుస్తోంది. పనుల కోసం పొద్దున్నే ఆటోలో బయల్దేరిన కూలీలు.. లారీ ఢీకొట్టడంతో అక్కడికక్కడే మరణించారు. వాళ్ల కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. -
నగరంలో చొరబాటు తగునా?
- గోరంట్ల తీరుపై టీడీపీ, బీజేపీల్లో నిరసన - రూరల్ నుంచి గెలిచాక సిటీలో ఆధిపత్యమేమిటంటున్న నేతలు సాక్షి, రాజమండ్రి : శాసనసభలో రాజమండ్రి నుంచి చాలా కాలం ప్రాతినిధ్యం వహించిన గోరంట్ల బుచ్చయ్య చౌదరి.. అనంతరం ఇక్కడి నుంచి వలస వెళ్లాల్సి వచ్చినా నగరంపై పెత్తనం తనదేనంటున్నారు. మొన్నటి ఎన్నికల్లో రూరల్ నియోజకవర్గం నుంచి గెలిచినా నగరాధిపత్యం తనదేననడం అటు తెలుగుదేశంలోని నగర నాయకులకు, ఇటు సిటీ నియోజకవర్గంలో గెలుపు జెండా ఎగరేసిన మిత్రపక్షమైన బీజేపీ నేతలకు కొరుకుడు పడడం లేదు. రూరల్ ఎమ్మెల్యే అయినా సిటీలోనూ తనదే హవా అనడాన్ని వారు నిరసిస్తున్నారు. అసెంబ్లీ సమావేశాల అనంతరం తన నియోజక వర్గంలో తొలిసారిగా గురువారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసిన గోరంట్ల బుచ్చయ్య చౌదరి, అదేరోజు సాయంత్రం రాజమండ్రి సిటీలోని తన నివాసంలో సమావేశం ఏర్పాటు చేసి కార్పొరేటర్లను రప్పించుకున్నారు. ‘ఇక నుంచి ఇక్కడ, అక్కడ అంతా నా ఇష్టం. కాదంటే మీకే నష్టం’ అంటూ పరోక్షంగా హెచ్చరించారు. రాజమండ్రి రూరల్ నియోజకవర్గ సమావేశంలోనూ గోరంట్ల చేసిన వ్యాఖ్యలు వివాదాలకు తెరలేపేవిగా ఉన్నాయి. సిటీ ఎవడబ్బ సొత్తు కాదని, తాను పార్టీలో సీనియర్ గనుక అంటూ, అక్కడా ఇక్కడా తానే పర్యవేక్షిస్తానని స్వపక్షమైన టీడీపీలోని ప్రత్యర్థివర్గానికి, మిత్రపక్షమైన బీజేపీకి సవాలు విసిరినట్టు వ్యాఖ్యానించారు. గోరంట్ల తీరుతో బీజేపీ నేతలు ఆగ్రహంగా ఉన్నట్టు సమాచారం. గతంలోనూ అధికారిక కార్యక్రమాల్లో కూడా సిటీ ఎమ్మెల్యే డాక్టర్ ఆకుల సత్యనారాయణకు పోటీగా గోరంట్ల పాల్గొనడాన్ని వారు నిరసించారు. ఈ నేపథ్యంలో గోరంట్ల తాజా వ్యాఖ్యలు బీజేపీ శ్రేణుల్లో, ఆకుల వర్గీయుల్లో అసంతృప్తికి ఆజ్యం పోశాయి. ఇప్పటికే ‘మీ పార్టీ పరంగా మీరేమైనా చేసుకోండి. అధికారిక కార్యక్రమాల్లో మాత్రం హద్దులు గుర్తించండి’ అంటున్న బీజేపీ నేతలు గోరంట్ల కర్రపెత్తనంపై కన్నెర్ర చేస్తున్నారు. ‘బాబు’ను బ్లాక్మెయిల్ చేస్తున్నారు : గన్ని కాగా రాజమండ్రి టీడీపీలో గోరంట్లతో చిరకాలంగా ఉప్పునిప్పులా ఉంటున్న మరో సీనియర్ నేత, పార్టీ అధికార ప్రతినిధి గన్ని కృష్ణ.. రూరల్కు వెళ్లినా నగరం తన కనుసన్నల్లోనే ఉండాలన్న ఆయన వైఖరి పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. సిటీలో ఇతర నేతలను ఎదగకుండా చేసేందుకే గోరంట్ల ఇటువంటి ధోరణి అవలంబిస్తున్నారని గన్ని వర్గీయులు ఆరోపిస్తున్నారు. సమావేశాల్లో సిటీ, రూరల్ నియోజక వర్గాల అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రస్తావించడం, తాను సీనియర్ నాయకుడినని, రెండు చోట్లా మాట్లాడే హక్కు తనకే ఉందని చెప్పుకోవడం అభ్యంతరకరమంటున్నారు. గోరంట్ల ‘నేనొక్కడినే’ అన్నట్టు.. కార్పొరేటర్లు, ఇతర నేతల వద్ద వ్యాఖ్యానించడం పట్ల గన్ని ఆగ్రహంగా ఉన్నారు. గోరంట్ల తీరుపై పరోక్షంగా విరుచుకుపడ్డారు. శాసనమండలిలో ప్రభుత్వ విప్ చైతన్యరాజు శుక్రవారం రాజమండ్రిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశానికి హాజరైన గన్ని కొందరు నేతలు ముందు టిక్కెట్ ఇవ్వలేదని, తర్వాత మంత్రి పదవి ఇవ్వలేదని పార్టీ అధినేత చంద్రబాబు నాయుడినే బ్లాక్ మెయిల్ చేస్తున్నారని వ్యాఖ్యానించారు. ఈ సమావేశానికి గోరంట్ల హాజరుకాకపోవడం చర్చనీయాంశమైంది.