Harbhajan Singh
-
Ind vs Pak: టీమిండియా నుంచి మ్యాచ్ లాక్కోగలిగేది ఆ ఒక్కడే! కానీ..
భారత్ వర్సెస్ పాకిస్తాన్(India vs Pakistan) మ్యాచ్ అంటే క్రికెట్ ప్రేమికులకు పండుగే. ఇరుదేశాల సంబంధాల దృష్ట్యా ఈ జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్లు ఎప్పుడో నిలిచిపోయాయి. ఆసియా కప్, ఐసీసీ వంటి అగ్రశ్రేణి ఈవెంట్లలో మాత్రమే ముఖాముఖి తలపడుతున్నాయి.అందుకే దాయాదుల మధ్య పోరును వీక్షించేందుకు అభిమానులు వేయికళ్లతో ఎదురుచూస్తుంటారు. వారి నిరీక్షణకు ఫిబ్రవరి 23న తెరపడనుంది. చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy)లో భాగంగా దుబాయ్ వేదికగా ఆదివారం భారత్- పాక్ జట్లు తలపడనున్నాయి. ఈ నేపథ్యంలో టీమిండియా స్పిన్ దిగ్గజం హర్భజన్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.ఓవర్హైప్...‘‘ఇండియా- పాకిస్తాన్.. ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్కు ఓవర్హైప్ ఇస్తున్నారు. దీనికి ఇంతగా ప్రచారం అవసరం లేదు. ఓసారి పాకిస్తాన్ ప్రధాన బ్యాటర్ల గణాంకాలు పరిశీలించండి. బాబర్ ఆజం వాళ్ల స్టార్ బ్యాటర్. మరి టీమిండియాపై అతడి బ్యాటింగ్ సగటు కేవలం 31.టాప్ బ్యాటర్ అన్నప్పుడు కనీసం అతడి యావరేజ్ 50కి దగ్గరలో ఉంటే ప్రత్యర్థి జట్టుతో మ్యాచ్ సమయంలో ఎలివేషన్ ఇవ్వచ్చు. ఇక రిజ్వాన్ విషయానికొస్తే.. ఆటగాడిగా అతడంటే నాకు ఇష్టమే. స్వేచ్ఛగా బ్యాట్ ఝులిపిస్తాడు. కానీ భారత జట్టుపై అతడి బ్యాటింగ్ సగటు 25 మాత్రమే.టీమిండియా నుంచి మ్యాచ్ లాక్కోగలిగేది ఆ ఒక్కడే! అయితే, ఫఖర్ జమాన్ సంగతి వేరు. అతడు పాక్ జట్టు పూర్తిస్థాయి ఓపెనర్. టీమిండియా మీద బ్యాటింగ్ యావరేజ్ 46. కాబట్టి టీమిండియా నుంచి మ్యాచ్ లాక్కోగల సమర్థత అతడొక్కడికి మాత్రమే ఉంది. ఇక ఫాహీం ఆష్రఫ్ గురించి అంతగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు.కనీస పోటీ కూడా ఇవ్వదుఅతడి సగటు.. 12.5. కాబట్టి అతడి గురించి టీమిండియా పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. సౌద్ షకీల్ టీమిండియాపై సగటున 8 పరుగులు చేశాడు. పాకిస్తాన్ బ్యాటింగ్ లైనప్ చూసిన తర్వాత ఆ జట్టు భారత్కు కనీస పోటీ కూడా ఇస్తుందని అనిపించడం లేదు’’ అని హర్భజన్ సింగ్ చెప్పుకొచ్చాడు. కాగా బాబర్ ఆజం పాకిస్తాన్ తరఫున టాప్ వన్డే ప్లేయర్గా కొనసాగుతున్నాడు.అయితే, టీమిండియాపై మాత్రం బాబర్ ఆజం రికార్డు అంత గొప్పగా ఏమీ లేదు. ఇప్పటి వరకు భారత్తో ఆడిన ఎనిమిది మ్యాచ్లలో కలిపి సగటున 31.14తో 218 పరుగులు మాత్రమే చేశాడు. ఇందులో ఓ అర్ధ శతకం ఉంది. భారత్ వేదికగా వన్డే వరల్డ్కప్-2023 సందర్భంగా అతడు హాఫ్ సెంచరీ నమోదు చేశాడు.ఇదిలా ఉంటే.. చాంపియన్స్ ట్రోఫీకి ముందు టీమిండియా అద్బుత విజయం సాధించిన విషయం తెలిసిందే. సొంతగడ్డపై ఇంగ్లండ్తో వన్డే సిరీస్ను రోహిత్ సేన 3-0తో క్లీన్స్వీప్ చేసింది. మరోవైపు.. పాకిస్తాన్ మాత్రం స్వదేశంలో న్యూజిలాండ్-సౌతాఫ్రికాలతో జరిగిన త్రైపాక్షిక సిరీస్ను కివీస్కు సమర్పించుకుంది. చాంపియన్స్ ట్రోఫీ-2025లో పాల్గొనే భారత జట్టురోహిత్ శర్మ(కెప్టెన్), శుబ్మన్ గిల్(వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), రిషభ్ పంత్(వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, మహ్మద్ షమీ, అర్ష్దీప్ సింగ్, రవీంద్ర జడేజా, వరుణ్ చక్రవర్తి.చాంపియన్స్ ట్రోఫీ-2025కి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఎంపిక చేసిన జట్టుమహ్మద్ రిజ్వాన్ (కెప్టెన్), బాబర్ ఆజం, ఫఖర్ జమాన్, కమ్రాన్ గులాం, సౌద్ షకీల్, తయ్యబ్ తాహిర్, ఫాహీం అష్రఫ్, ఖుష్దిల్ షా, సల్మాన్ అలీ అఘా (వైస్ కెప్టెన్), ఉస్మాన్ ఖాన్, అబ్రార్ అహ్మద్, హ్యారీస్ రవూఫ్, మహ్మద్ హస్నైన్, నసీమ్ షా, షాహీన్ షా ఆఫ్రిది.చదవండి: CT 2025: కోహ్లి, హెడ్ కాదు!.. టాప్ రన్ స్కోరర్గా అతడే.. వికెట్ల వీరుడిగా ఆర్చర్! -
టీమిండియా ఆటగాళ్లతో స్నేహం వద్దు.. ఎందుకంటే: పాక్ మాజీ కెప్టెన్
భారత్- పాకిస్తాన్(India vs Pakistan) మ్యాచ్ అంటే ఇరు దేశాల అభిమానులకే కాదు.. క్రికెట్ ప్రపంచం మొత్తానికి ఆసక్తి. దాయాది దేశాల జట్లు నువ్వా- నేనా అన్నట్లు హోరాహోరీ తలపడుతుంటే చూడటానికి రెండు కళ్లు చాలవంటారు క్రికెట్ ప్రేమికులు.ఇక ఇరుదేశాల మధ్య పరిస్థితుల దృష్ట్యా కేవలం ఆసియా కప్(Asia Cup), ఐసీసీ మేజర్ టోర్నమెంట్లలో మాత్రమే భారత్- పాకిస్తాన్ ముఖాముఖి పోటీపడుతున్నాయి. ఇందులోనూ ఎక్కువ సందర్భాల్లో టీమిండియానే చిరకాల ప్రత్యర్థిపై పైచేయి సాధిస్తోంది. ఈ క్రమంలో ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy)లోనూ అదే ఫలితం పునరావృతం చేయాలని రోహిత్ సేన పట్టుదలగా ఉంది.స్నేహంగా మెలుగుతున్న ఆటగాళ్లు2017 చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకునే దిశగా అడుగులు వేస్తోంది. మరోవైపు.. డిఫెండింగ్ చాంపియన్ హోదాలో బరిలోకి దిగనున్న పాకిస్తాన్ కూడా వరుస విజయాలపై కన్నేసింది. అయితే, ఆటలో ప్రత్యర్థులే అయినా.. మైదానం వెలుపల మాత్రం ఇరు దేశాల ఆటగాళ్లు స్నేహభావంతోనే మెలుగుతున్నారు. నిన్నటితరం ఆటగాళ్లు హర్భజన్ సింగ్- షోయబ్ అక్తర్ చిన్నపిల్లల్లా మైదానంలోకి పరుగులు తీస్తున్న వీడియో ఒకటి తాజాగా వైరల్ కావడం ఇందుకు నిదర్శనం. View this post on Instagram A post shared by Shoaib Akhtar (@imshoaibakhtar) వారితో స్నేహం వద్దుఅయితే, పాకిస్తాన్ మాజీ కెప్టెన్ మొయిన్ ఖాన్ మాత్రం భారత్- పాక్ క్రికెటర్లను ఉద్దేశించి విచిత్ర వ్యాఖ్యలు చేశాడు. మైదానంలో టీమిండియా ఆటగాళ్లతో ఎక్కువగా స్నేహంగా మెలగవద్దని సూచించాడు. ప్రత్యర్థి జట్టుతో ఫ్రెండ్షిప్ చేస్తే దానిని వాళ్లు అడ్వాంటేజ్గా మలచుకుంటారని అభిప్రాయపడ్డాడు.నాకైతే అర్థం కావడం లేదు‘‘అసలు ఇటీవలి కాలంలో పాకిస్తాన్- ఇండియా మ్యాచ్ సమయంలో మన ఆటగాళ్లు ప్రవర్తిస్తున్న తీరు నాకు చిత్రంగా అనిపిస్తోంది. భారత బ్యాటర్లు క్రీజులోకి రాగానే మనవాళ్లు వెళ్లి.. వారి బ్యాట్ను పరిశీలించడం, వాళ్ల వెన్నుతట్టడం, స్నేహంగా మాట్లాడటం.. ఇదంతా ఏమిటో నాకైతే అర్థం కావడం లేదు.మాట్లాడాల్సిన అవసరమే లేదుమైదానం లోపల, వెలుపల ప్రొఫెషనల్గా ఉండాలి. వాళ్లతో అంత స్నేహంగా మెలగాల్సిన అవసరం లేదు. ఆటగాళ్లు అయినా.. కొన్ని హద్దులు ఉంటాయి. అసలు మైదానంలో టీమిండియా ఆటగాళ్లతో అసలు మాట్లాడాల్సిన అవసరమే లేదని మా సీనియర్లు చెప్పేవారు.ఎందుకంటే.. ప్రత్యర్థి జట్టుతో ఎక్కువ ఫ్రెండ్లీగా ఉంటే.. అది మన బలహీనతకు సంకేతంలా కనిపిస్తుంది’’ అని ఉష్నా షా పాడ్కాస్ట్లో మొయిన్ ఖాన్ చిత్రమైన వ్యాఖ్యలు చేశాడు. కాగా పాకిస్తాన్ వేదికగా ఫిబ్రవరి 19 నుంచి చాంపియన్స్ ట్రోఫీ-2025 మొదలుకానుంది.అయితే, భద్రతా కారణాల దృష్ట్యా టీమిండియా మాత్రం ఈ టోర్నీలో తమ మ్యాచ్లన్నీ దుబాయ్లో ఆడనుంది. తమ తొలి మ్యాచ్లో ఫిబ్రవరి 20న రోహిత్ సేన బంగ్లాదేశ్తో తలపడనుంది. అనంతరం ఫిబ్రవరి 23న పాకిస్తాన్ను ఢీకొట్టనుంది. అనంతరం.. లీగ్ దశలో చివరిగా మార్చి 2న న్యూజిలాండ్తో మ్యాచ్ ఆడుతుంది. చదవండి: T20 WC 2025: ప్రపంచకప్ ఫైనల్లో భారత్.. సెమీస్లో ఇంగ్లండ్ను మట్టికరిపించిందిలా! -
ఛాంపియన్స్ ట్రోఫీ సెమీస్కు చేరే జట్లు ఇవే.. అదేలా సాధ్యం భజ్జీ?
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy)కు సమయం అసన్నమవుతోంది. పాకిస్తాన్, యూఏఈ అతిథ్యమిస్తున్న ఈ మెగా టోర్నీ ఫిబ్రవరి 19 నుంచి ప్రారంభం కానుంది. ఈ మెగా ఈవెంట్లో కేవలం భారత్ ఆడే మ్యాచ్లు మాత్రమే దుబాయ్ వేదికగా జరగనుండగా.. మిగితా మ్యాచ్లన్నీ పాక్లోనే జరగనున్నాయి.ఈ టోర్నీ కోసం ఆతిథ్య పాక్ తప్ప మిగితా ఏడు దేశాల క్రికెట్ బోర్డులు తమ జట్ల వివరాలను ప్రకటించాయి. అయితే ఈ ఐసీసీ ఈవెంట్కు సమయం దగ్గర పడుతుండడంతో మాజీ క్రికెటర్లు సెమీస్, ఫైనల్కు చేరే జట్లను అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్(Harbhajan Singh) సైతం ఈ ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీ చేరే జట్లను అంచనా వేశాడు.ఛాంపియన్స్ ట్రోఫీలో ఆస్ట్రేలియా, భారత్, పాకిస్తాన్, న్యూజిలాండ్ నాలుగు జట్లు సెమీఫైనల్కు చేరుతాయని క్రిక్ట్రాకర్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో హర్భజన్ పేర్కొన్నాడు. అయితే ఇక్కడే భజ్జీ పప్పులో కాలేశాడు. ఎందుకంటే భజ్జీ ఎంచుకున్న జట్లలో మూడు టీమ్స్ ఒకే గ్రూపులో ఉన్నవి కావడం గమనార్హం.ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో మొత్తం 8 జట్లు పాల్గోంటున్నాయి. వాటిని రెండు గ్రూపులుగా విభజించారు. గ్రూపు-ఎలో బంగ్లాదేశ్, భారత్, పాకిస్తాన్ న్యూజిలాండ్.. గ్రూపు-బిలో దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, అఫ్గానిస్తాన్ ఉన్నాయి. ప్రతి గ్రూప్ నుండి మొదటి రెండు జట్లు మాత్రమే సెమీ-ఫైనల్కు చేరుకుంటాయి.కానీ భజ్జీ మాత్రం గ్రూపు-ఎ నుంచే మూడు జట్లు సెమీస్కు చేరుకుంటాయని అంచనావేశాడు. మ్యాథమెటికల్గా ఒకే గ్రూపు నుంచి మూడు జట్లు సెమీస్కు చేరడం సాధ్యం కాదు. దీంతో నెటిజన్లు హార్బజన్ను ట్రోలు చేస్తున్నారు. ఈ మెగా ఈవెంటలో భారత్ తమ తొలి మ్యాచ్లో దుబాయ్ వేదికగా ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్తో తలపడనుంది. ఆ తర్వాత ఫిబ్రవరి 23న అదే స్టేడియంలో దాయాది పాకిస్తాన్తో భారత్ అమీతుమీ తెల్చుకోనుంది.ఛాంపియన్స్ ట్రోఫీకి భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభమన్ గిల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, అర్ష్దీప్ సింగ్, యశస్వి జైస్వాల్, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా.ట్రావెలింగ్ రిజర్వ్స్: వరుణ్ చక్రవర్తి, ఆవేశ్ ఖాన్, నితీశ్ కుమార్ రెడ్డిచదవండి: #RavindraJadeja: 12 వికెట్లతో చెలరేగిన జడేజా.. పంత్ టీమ్ చిత్తు -
‘గంభీర్కు ఏం అవసరం?.. ఎవరి పని వాళ్లు చేస్తేనే బాగుంటుంది’
భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) తీసుకువచ్చిన ‘పది సూత్రాల’(BCCI 10-point policy) విధానాన్ని మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ విమర్శించాడు. ఇందులో మరీ కొత్త విషయాలేమీ లేవని.. అయినా.. హెడ్కోచ్కు వీటితో ఏం అవసరం అని ప్రశ్నించాడు. గౌతం గంభీర్(Gautam Gambhir) ఆటగాళ్ల విషయంలో అతిగా జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదంటూ పరోక్షంగా ఘాటు విమర్శలు చేశాడు.గంభీర్ సూచనల మేరకు!కాగా స్టార్లు... సీనియర్లు... దిగ్గజాలు... ఇలా జట్టులో ఎంత పేరు మోసిన క్రికెటర్లున్నా సరే... ఇకపై అంతా టీమిండియా సహచరులే! పెద్దపీటలు, ప్రాధామ్యాలంటూ ఉండవు. అందరూ ఒక జట్టే! ఆ జట్టే భారత జట్టుగా బరిలోకి దిగాలని బలంగా బోర్డు నిర్ణయించింది. హెడ్కోచ్ గంభీర్ సూచనల్ని పరిశీలించడమే కాదు... అమలు చేయాల్సిందేనని కృతనిశ్చయానికి వచ్చిన బీసీసీఐ ఇకపై ‘పటిష్టమైన జట్టుకు పది సూత్రాలు’ అమలు చేయబోతోంది. ఈ సూత్రాలను పాటించని క్రికెటర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని, వారి మ్యాచ్ ఫీజుల్లో కోత లేదంటే కాంట్రాక్ట్ స్థాయిల్లో మార్పులు, చివరగా ఐపీఎల్లో పాల్గొనకుండా దూరం పెట్టేందుకూ వెనుకాడబోమని బీసీసీఐ హెచ్చరించింది.పది సూత్రాలు ఇవేదేశవాళీ మ్యాచ్లు ఆడటం తప్పనిసరి చేసిన బీసీసీఐ.. టోర్నీలు జరుగుతుంటే బ్రాండ్–ఎండార్స్మెంట్లు కుదరవని కరాఖండిగా చెప్పింది. అదే విధంగా ప్రతి ఆటగాడు జట్టుతో పాటే పయనం చేయాలని సూచించింది. వ్యక్తిగత సిబ్బందికి కట్టుబాట్లు విధించడంతో పాటు.. ‘అదనపు’ లగేజీ భారాన్ని ప్లేయర్లపైనే మోపాలని నిర్ణయించింది. అంతేకాదు.. ఆటగాళ్లు కలసికట్టుగా ప్రాక్టీస్కు రావాలని, బోర్డు సమావేశాలకు కూడా తప్పక అందుబాటులో ఉండాలని పేర్కొంది.ఇక మ్యాచ్లు ముగిసిన తర్వాత కూడా ఇష్టారీతిన కాకుండా.. కలిసికట్టుగానే హోటల్ గదులకు వెళ్లాలని.. గదుల్లోనూ కలిసిమెలిసే బస చేయాలని చెప్పింది. కుటుంబసభ్యుల అనుమతికీ పరిమితులు విధించింది. అప్పుడూ ఇలాంటి నిబంధనలే ఉన్నాయిఈ నేపథ్యంలో దిగ్గజ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ స్పందిస్తూ.. ‘‘బీసీసీఐ ట్రావెలింగ్ పాలసీ(Travel Policy) గురించి మీడియాలో వచ్చిన కథనాలు చూసినప్పుడు.. నాకేమీ కొత్త విషయాలు కనిపించలేదు.సెంట్రల్ కాంట్రాక్ట్ ప్లేయర్గా నేను టీమిండియాకు ఆడుతున్న సమయంలోనూ ఇలాంటి నిబంధనలే ఉన్నాయి. బీసీసీఐ చెప్పినట్లుగా భావిస్తున్న పది సూత్రాలలో తొమ్మిది అప్పట్లోనే ఉన్నాయి. ముఖ్యంగా కుటుంబ సభ్యుల అనుమతి, ఒకే హోటల్లో బస చేయడం, ప్రాక్టీస్ అంశం.. ఇలా అన్నీ పాతవే. మరి వీటిని ఎప్పుడు ఎవరు మార్చారు?కొత్తవి అని మళ్లీ ఎందుకు చెబుతున్నారు. ఈ అంశంపై కచ్చితంగా దర్యాప్తు జరగాల్సిందే. అయినా, మేము టీమిండియాకు ఆడేటపుడు సెలవు లేదంటే మరేదైనా విషయంలో అనుమతి కావాల్సి వచ్చినపుడు బీసీసీఐకి నేరుగా మెయిల్ చేసేవాళ్లం. లేదంటే.. నేరుగానే పర్మిషన్ కోసం అర్జీ పెట్టుకునే వాళ్లం.ఎవరి పని వారు చూసుకుంటే మంచిదిఅయినా.. హెడ్కోచ్ ఈ విషయాల్లో ఎందుకు తలదూరుస్తున్నాడు? అతడి పని ఇది కాదు కదా! కేవలం మైదానంలో ఆటగాళ్లు ఎలా ఆడుతున్నారన్న అంశం మీదే అతడి దృష్టి ఉండాలి. మన జట్టులో ఇప్పుడు అదే లోపించింది. అడ్మినిస్ట్రేషన్ విషయాలను బీసీసీఐలో ఉన్న సమర్థులైన వ్యక్తులకు అప్పగించి.. ఎవరి పని వారు చూసుకుంటే మంచిది’’ అని భజ్జీ గంభీర్కు చురకలు అంటించాడు. ఆస్ట్రేలియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో 3-1తో ఓటమి విషయం.. ఇలాంటి చర్చల ద్వారా పక్కకు తప్పించాలని చూస్తున్నట్లు కనిపిస్తోందన్నాడు.చదవండి: ఫామ్లో ఉన్నా కరుణ్ నాయర్ను సెలక్ట్ చేయరు.. ఎందుకంటే: డీకే -
ఫామ్లో ఉన్నంత మాత్రాన కరుణ్ నాయర్ను సెలక్ట్ చేయరు: డీకే
విదర్భ కెప్టెన్ కరుణ్ నాయర్(Karun Nair) సూపర్ ఫామ్లో ఉన్నాడు. దేశవాళీ వన్డే టోర్నమెంట్ విజయ్ హజారే ట్రోఫీ తాజా ఎడిషన్లో అతడు పరుగుల వరద పారిస్తున్నాడు. ఇప్పటి వరకు ఈ టోర్నీలో ఎనిమిది మ్యాచ్లు ఆడిన 33 ఏళ్ల ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. ఏకంగా 752 పరుగులు సాధించాడు. ఇందులో ఐదు శతకాలు ఉండగా.. ఏడు ఇన్నింగ్స్లో అతడు నాటౌట్గా నిలవడం విశేషం.బ్యాటర్గా దుమ్ములేపుతూనే.. కెప్టెన్గానూ కరుణ్ నాయర్ అదరగొడుతున్నాడు. తన అద్భుత ప్రదర్శనతో విదర్భను విజయ్ హజారే ట్రోఫీ ఫైనల్కు చేర్చాడు. దేశీ వన్డే టోర్నీలో విదర్భ ఇలా టైటిల్ పోరుకు అర్హత సాధించడం ఇదే తొలిసారి కావడం విశేషం.అతడిని ఎంపిక చేయాలిఈ నేపథ్యంలో కరుణ్ నాయర్పై ప్రశంసల వర్షం కురుస్తోంది. అతడిని తిరిగి టీమిండియాలోకి తీసుకోవాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి. చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy) జట్టు ప్రకటనకు సమయం ఆసన్నమవుతున్న తరుణంలో.. కరుణ్ నాయర్ను ఈ ఐసీసీ టోర్నీకి ఎంపిక చేయాలని హర్భజన్ సింగ్ వంటి భారత మాజీ క్రికెటర్లు సూచిస్తున్నారు.ఈ క్రమంలో మరో టీమిండియా మాజీ క్రికెటర్ దినేశ్ కార్తిక్(Dinesh Karthik) మాత్రం భిన్నంగా స్పందించాడు. కరుణ్ నాయర్ అద్బుతమైన ఫామ్లో ఉన్నా.. అతడిని ఈ మెగా ఈవెంట్కు ఎంపిక చేయడం కుదరకపోవచ్చని అభిప్రాయపడ్డాడు. ఈ విషయం గురించి క్రిక్బజ్ షోలో మాట్లాడుతూ.. ‘‘ కరుణ్ నాయర్ ఆడుతున్న తీరు అమోఘం. అతడు ఊహకు అందని రీతిలో పరుగుల వరద పారిస్తున్నాడు.ఫామ్లో ఉన్నంత మాత్రాన సెలక్ట్ చేయరుఅందుకే ప్రతి ఒక్కరు ఇప్పుడు అతడి గురించే చర్చిస్తున్నారు. అయితే, నా అభిప్రాయం ప్రకారం.. కరుణ్ చాంపియన్స్ ట్రోఫీ-2025 ఆడే జట్టులో చోటు దక్కించుకోవడం కష్టమే. ఎందుకంటే.. సెలక్టర్లు ఇప్పటికే టీమ్ గురించి తుది నిర్ణయానికి వచ్చి ఉంటారు.ఏదేమైనా కరుణ్ నాయర్ గొప్ప ఆటగాడు. ఫాస్ట్ బౌలర్లు, స్పిన్నర్ల బౌలింగ్లో అద్భుతంగా ఆడగలిగే ఇన్ ఫామ్ బ్యాటర్ను ఎవరు మాత్రం కాదనుకుంటారు. అతడు గనుక తిరిగి జట్టులోకి వస్తే నాకూ సంతోషమే’’ అని డీకే పేర్కొన్నాడు.అయితే, ఇంగ్లండ్తో వన్డే సిరీస్కు కూడా కరుణ్ నాయర్ ఎంపికయ్యే అవకాశం లేదని దినేశ్ కార్తిక్ పేర్కొన్నాడు. యశస్వి జైస్వాల్ ఈ సిరీస్తో వన్డేల్లో అరంగేట్రం చేయడం ఖాయమని అభిప్రాయపడ్డాడు. చాంపియన్స్ ట్రోఫీలో జైసూ ఆడటం ఖాయం‘‘ఇంగ్లండ్తో టీ20 సిరీస్కు సెలక్టర్లు జైస్వాల్కు విశ్రాంతినిచ్చారు. ఆస్ట్రేలియాలో సుదీర్ఘ పర్యటన అనంతరం ఈ యువ ఆటగాడికి తగినంత రెస్ట్ అవసరం.ఈ విషయంలో సెలక్టర్లు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. వందకు వంద శాతం ఇంగ్లండ్తో వన్డే సిరీస్కు అతడిని ఎంపిక చేస్తారు. అంతేకాదు చాంపియన్స్ ట్రోఫీలోనూ ఆడిస్తారు. వన్డేల్లో అరంగేట్రం కదా అని ఆందోళన చెందాల్సిన పనిలేదు. అతడు అద్బుతంగా బ్యాటింగ్ చేయగలడు. ఇంగ్లండ్తో టీ20లలో ఆడనంత మాత్రాన అతడికి వచ్చే నష్టమేమీ లేదు’’ అని దినేశ్ కార్తిక్ చెప్పుకొచ్చాడు. కాగా టీమిండియా తరఫున టెస్టుల్లో, టీ20లలో అదరగొడుతున్న జైస్వాల్ ఇంత వరకు వన్డేల్లో మాత్రం అరంగేట్రం చేయలేదు.చదవండి: CT 2025: వన్డేల్లోనూ అదరగొడతాడు.. అతడిని సెలక్ట్ చేయండి: సెహ్వాగ్ -
అందుకే ఐదు సెంచరీలు కొట్టినా అతడిని పక్కన పెడుతున్నారా?
ఇటీవల ఆస్ట్రేలియా పర్యటనలో ఘోరంగా విఫలమైన టీమిండియాపై క్రికెట్ అభిమానుల విమర్శలు కొనసాగుతున్నాయి. జట్టు ఎంపికలో లోపాలు, ప్రధాన బ్యాటర్ల వైఫల్యం కారణంగానే 3-1తో ఓటమి ఎదురైందనే అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో కనీసం చాంపియన్స్ ట్రోఫీ-2025 టోర్నీకైనా సరైన జట్టును ఎంపిక చేయాలనే విజ్ఞప్తులు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో విదర్భ కెప్టెన్, స్టార్ బ్యాటర్ కరుణ్ నాయర్(Karun Nair) భారత క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాడు.ఐదు శతకాలు.. కరుణ్ నాయర్ రికార్డుల మోతదేశవాళీ వన్డే టోర్నమెంట్ విజయ్ హజారే ట్రోఫీలో కరుణ్ నాయర్ రికార్డుల మోత మోగిస్తున్న విషయం తెలిసిందే. ఆరు ఇన్నింగ్స్లో ఐదు శతకాలు బాదిన ౩౩ ఏళ్ళ ఈ ఆటగాడు సంచలనాత్మక ఫామ్తో దుమ్మురేపుతున్నాడు. తన కెరీర్ లోనే అద్భుతమైన ఫామ్తో టీమిండియా సెలక్టర్లకు సవాల్ విసురుతున్నాడు. ఈ నేపథ్యంలోనే చాంపియన్స్ ట్రోఫీ(ICC Champions Trophy 2025) టోర్నమెంట్లో అతడిని ఆడించాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి.కాగా కరుణ్ నాయర్ చివరగా ఏడేళ్ల క్రితం టీమిండియాకు ఆడాడు. ఇక విజయ్ హజారే టోర్నమెంట్ లో తన చివరి ఆరు ఇన్నింగ్స్లలో 122*, 112, 111, 163*, 44* మరియు 112* స్కోర్లతో అతడు ఇటీవల రికార్డు నెలకొల్పాడు. ఉత్తరప్రదేశ్తో జరిగిన మ్యాచ్లో 112 పరుగులకు అవుట్ కావడానికి ముందు, నాయర్ వరుసగా ఆరు ఇన్నింగ్స్ లో అజేయంగా నిలిచి 542 పరుగులు సాధించి 'లిస్ట్ ఎ' టోర్నమెంట్లలో రికార్డును సృష్టించాడు.న్యూజిలాండ్ మాజీ ఆల్ రౌండర్ జేమ్స్ ఫ్రాంక్లిన్ సాధించిన 527 పరుగుల నాటౌట్ రికార్డును నాయర్ తిరగ రాశాడు. కెప్టెన్ నాయర్ తన అద్భుతమైన బ్యాటింగ్తో విదర్భ సెమీఫైనల్స్కు చేరుకోవడంలో కీలక పాత్ర పోషించాడు.నాయర్ అద్భుతమైన ప్రదర్శన మరోసారి అతని పేరు క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశమైంది. నాయర్ను మళ్ళీ భారత్ జట్టులోకి తీసుకోవాలని చాలా మంది సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం విశేషం.ఇందులో భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ కూడా ఉండడం గమనార్హం. ఇంగ్లండ్తో 2016లో చెన్నై లో జరిగిన టెస్ట్లో ట్రిపుల్ సెంచరీ చేసిన తర్వాత నాయర్.. మరో మూడు టెస్టులు మాత్రమే ఆడాడు. ఆ తర్వాత అతడిని జట్టు నుంచి తప్పించారు. ఈ నేపథ్యంలో హర్భజన్ సింగ్ స్పందిస్తూ.. “నేను నాయర్ గణాంకాలను పరిశీలిస్తున్నాను. 2024-25లో అతడు ఆరు ఇన్నింగ్స్లు ఆడాడు. 5 ఇన్నింగ్స్లలో నాటౌట్గా నిలిచాడు, 120 స్ట్రైక్ రేట్తో 664 పరుగులు చేశాడు. అయినా నాయర్ను సెలెక్టర్లు ఎంపిక చేయడం లేదు. ఇది అన్యాయం” అని తన అధికారిక యూట్యూబ్ ఛానెల్లో వ్యాఖ్యానించాడు. కాగా 2024లో నాయర్ ఫస్ట్-క్లాస్ క్రికెట్లో కూడా రాణించాడు. 44.42 సగటుతో 1,466 పరుగులు సాధించాడు. అందులో నాలుగు సెంచరీలు, ఏడు అర్ధ సెంచరీలు ఉన్నాయి, వీటిలో 202* అత్యధిక స్కోరు ఉంది. ఇది కాక నాయర్ ఇంగ్లండ్ కౌంటీ క్రికెట్లో నార్తాంప్టన్షైర్తో ఆడి ఏడు మ్యాచ్ల్లో 48.70 సగటుతో 487 పరుగులు సాధించాడు. అందులో ఒక సెంచరీ, మూడు అర్ధ సెంచరీలు ఉన్నాయి. రోహిత్, కోహ్లీలను రంజీలు ఆడమంటున్నారు.. కానీ"చాలా మందిని కేవలం రెండు ఇన్నింగ్స్ ఆధారంగా ఎంపిక చేస్తారు. మరికొందరిని ఐపీఎల్లో ప్రదర్శన ఆధారంగా ఎంపిక చేస్తారు. కానీ జట్టు ఎంపికలో నాయర్ విషయంలో నియమాలు ఎందుకు భిన్నంగా ఉన్నాయి? రోహిత్(Rohit Sharma), కోహ్లీ ఫామ్లో లేని విషయం ప్రజలందరికీ తెలిసిందే. ఇందుకోసం వారిద్దరూ మళ్ళీ రంజీ ఆడాలని అభిమానులు కోరుతున్నారు. కానీ రంజీ ఆడుతూ పరుగులు చేస్తున్న వారిని ఎందుకు (సెలెక్టర్లు) విస్మరిస్తున్నారు?ట్రిపుల్ సెంచరీ తర్వాత నాయర్ ని ఎలా తొలగించారో నాకు ఎప్పుడూ అర్థం కాలేదు. అతనిలాంటి ఆటగాళ్ల గురించి ఎవరూ మాట్లాడకపోవడం బాధాకరం. ఒకొక్క ఆటగాడికి ఒక్కొక్క నియమాలు" ఉన్నాయని హర్భజన్ వ్యాఖ్యానించాడు. "నాయర్ భారత్ జట్టుతో ఇంగ్లండ్కు వెళ్ళాడు కానీ అతనికి తుది జట్టులో చోటు దొరకలేదు. అందుకే మీరు అతడిని పక్కన పెడుతున్నారా?ఐదవ టెస్ట్ కోసం టీం మేనేజిమెంట్ వాస్తవానికి భారత్ నుండి ఒక ఆటగాడిని పిలిపించింది. బహుశా అతను హనుమ విహారి అని అనుకుంటున్నాను. అతను నాయర్కు బదులుగా టెస్ట్ ఆడాడు. దీనికి కారణం నాకు చెప్పండి. వేర్వేరు వ్యక్తులకు వేర్వేరు నియమాలు... అలా ఉండకూడదు. ఎవరు పరుగులు చేస్తే మీరు అతన్ని ఆడించాలి. అతని (నాయర్)కి టాటూలు లేవు, ఫ్యాన్సీ బట్టలు వేసుకోడు. అందుకే మీరు అతన్ని ఎంచుకోలేదా? మరి అతను కష్టపడి పరుగులు సాధించడంలేదా?" అని హర్భజన్ ప్రశ్నించాడు. కాగా ఇటీవల బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ అయిదు మ్యాచ్ ల సిరీస్ లో భారత్ 1-౩ తేడాతో ఘోర పరాజయం చవిచూసిన సంగతి తెలిసిందే. మరోపక్క పేలవమైన ఫామ్తో ఈ పర్యటనలో ఘోరంగా విఫలమైన కెప్టెన్ రోహిత్ శర్మ ముంబై రంజీ మ్యాచ్ సన్నాహక క్యాంపు కి హాజరయ్యాడు. అయితే, మరో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి మాత్రం ఢిల్లీ తరఫున రంజీల్లో బరిలోకి దిగే అంశంపై నోరు విప్పలేదు. ఈ నేపథ్యంలో భజ్జీ ఈ మేరకు ఘాటు వ్యాఖ్యలు చేయడం గమనార్హం.చదవండి: అతడిని ఎందుకు సెలక్ట్ చేయలేదు?: భారత మాజీ క్రికెటర్ ఫైర్ -
ఆసీస్తో టెస్టుల్లో అతడిని ఆడించాల్సింది.. ద్రవిడ్ ఉన్నంత వరకు..
టీమిండియా వరుస వైఫల్యాలపై భారత మాజీ బౌలర్ హర్భజన్ సింగ్ స్పందించాడు. రాహుల్ ద్రవిడ్(Rahul Dravid) హెడ్కోచ్గా ఉన్నంతకాలం అంతా బాగానే ఉందని.. కానీ గత ఆరునెలల కాలంలో జట్టు ఇంతగా దిగజారిపోవడం ఏమిటని ప్రశ్నించాడు. మ్యాచ్ విన్నర్లుగా అభివర్ణిస్తూ జట్టుకు భారమైనా కొంతమందిని ఎందుకు కొనసాగిస్తున్నారో అర్థం కావడం లేదన్నాడు.ట్రోఫీ గెలిచిన తర్వాత ద్రవిడ్ గుడ్బైఇప్పటికైనా భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) సెలక్టర్లు కఠినంగా వ్యవహరించాలని భజ్జీ సూచించాడు. సూపర్స్టార్ ఆటిట్యూడ్ ఉన్నవారిని నిర్మొహమాటంగా పక్కనపెట్టాలని సలహా ఇచ్చాడు. కాగా టీ20 ప్రపంచకప్-2024(T20 World Cup 2024)లో టీమిండియా చాంపియన్గా నిలిచిన తర్వాత.. ద్రవిడ్ కోచింగ్ బాధ్యతల నుంచి వైదొలిగాడు. అతడి స్థానంలో మాజీ బ్యాటర్ గౌతం గంభీర్ హెడ్కోచ్ పదవిని చేపట్టాడు.ఘోర పరాభవాలుఅయితే, గౌతీ మార్గదర్శనంలో టీమిండియా ఇప్పటి వరకు చెప్పుకోగదగ్గ విజయాలేమీ సాధించకపోగా.. ఘోర పరాభవాలు చవిచూసింది. శ్రీలంక పర్యటనలో భాగంగా వన్డే సిరీస్ను ఆతిథ్య జట్టుకు కోల్పోవడంతో పాటు.. సొంతగడ్డపై న్యూజిలాండ్తో టెస్టుల్లో 3-0తో క్లీన్స్వీప్నకు గురైంది. తాజాగా ఆస్ట్రేలియా గడ్డపై బోర్డర్- గావస్కర్ ట్రోఫీ(Border Gavaskar Trophy)లోనూ పరాజయాన్ని మూటగట్టుకుంది.కంగారూల చేతిలో 3-1తో ఓడిపోయి.. పదేళ్ల తర్వాత తొలిసారి ఈ ప్రతిష్టాత్మక ట్రోఫీని ఆసీస్కు సమర్పించుకుంది. ఈ నేపథ్యంలో ఇంటా.. బయటా వైఫల్యాల పరంపర కొనసాగిస్తున్న టీమిండియాపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో హర్భజన్ సింగ్ స్పందిస్తూ.. సెలక్టర్లు కఠినంగా వ్యవహరించాల్సిన ఆవశ్యకతను గుర్తు చేశాడు. ‘స్టార్ల’ కోసం అభిమన్యు ఈశ్వరన్(Abhimanyu Easwaran) వంటి వాళ్లను బలిచేయవద్దని హితవు పలికాడు.ద్రవిడ్ ఉన్నంత వరకు అంతా బాగానే ఉండేదిఈ మేరకు.. ‘‘గత ఆరు నెలల్లో.. టీమిండియా శ్రీలంక చేతిలో ఓడిపోయింది. న్యూజిలాండ్ చేతిలో వైట్వాష్ అయింది. ఇప్పుడు ఆస్ట్రేలియా గడ్డపై 3-1తో సిరీస్ ఓటమిని చవిచూసింది. రాహుల్ ద్రవిడ్ ఉన్నంత వరకు అంతా బాగానే ఉండేది.అతడి మార్గదర్శనంలో టీమిండియా ప్రపంచకప్ గెలిచింది. కానీ... ఆ తర్వాత అకస్మాత్తుగా ఏమైంది? ప్రతి ఒక్క ఆటగాడికి తనకంటూ ఒక గుర్తింపు ఉంటుంది. ఒకవేళ కొంతమందిని మ్యాచ్ విన్నర్లుగా భావిస్తూ తప్పక ఆడించాలనుకుంటే.. కపిల్ దేవ్, అనిల్ కుంబ్లేలను కూడా జట్టులోకి తీసుకోండి. ఎందుకంటే.. భారత క్రికెట్లో వాళ్ల కంటే పెద్ద మ్యాచ్ విన్నర్లు ఎవరూ లేరు.అభిమన్యు ఈశ్వరన్ను ఆడించాల్సిందిఇప్పటికైనా బీసీసీఐ సెలక్టర్లు కఠిన వైఖరి అవలంభించాలి. సూపర్స్టార్ ఆటిట్యూడ్ను పక్కనపెట్టండి. అభిమన్యు ఈశ్వరన్ను ఆస్ట్రేలియా పర్యటనకు తీసుకువెళ్లారు. కానీ.. ఒక్క మ్యాచ్లోనూ ఆడించలేదు. ఒకవేళ అతడికి అవకాశం ఇచ్చి ఉంటే.. కచ్చితంగా సత్తా చాటేవాడు.సర్ఫరాజ్ ఖాన్ విషయంలోనూ ఇలాగే జరిగింది. తదుపరి ఇంగ్లండ్ పర్యటనలో టెస్టులు ఆడాల్సి ఉంది. అప్పుడు మాత్రం ప్రదర్శన బాగున్న ఆటగాళ్లనే ఎంపిక చేయండి. కీర్తిప్రతిష్టల ఆధారంగా సెలక్షన్ వద్దు’’ అంటూ హర్భజన్ సింగ్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలను ఉద్దేశించి పరోక్షంగా విమర్శలు చేశాడు. హిందుస్తాన్ టైమ్స్తో మాట్లాడుతూ ఈ మేరకు తన అభిప్రాయాలు పంచుకున్నాడు.కాగా ఆసీస్తో సిడ్నీలో ఆఖరిదైన ఐదో టెస్టులో ఓడిన టీమిండియా.. ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ 2025 ఫైనల్ రేసు నుంచి నిష్క్రమించింది. తదుపరి 2025-27 సీజన్లో తొలుత ఇంగ్లండ్ టూర్లో భాగంగా ఐదు టెస్టుల సిరీస్లో తలపడనుంది.చదవండి: CT 2025: శుబ్మన్ గిల్పై ‘వేటు’?.. అతడికి ప్రమోషన్? -
‘ధోనితో నాకు మాటల్లేవు.. పదేళ్లకు పైగానే అయింది.. అయినా అలాంటి వాళ్లకు’
‘‘లేదు.. నేను ధోనితో మాట్లాడటం లేదు. చెన్నై సూపర్ కింగ్స్కు ఆడినపుడు.. అప్పుడప్పుడు ఆట గురించి మాట్లాడుకునేవాళ్లం. అయితే, ధోనితో మనసు విప్పి మాట్లాడి పదేళ్లకు పైగానే అయింది. ఇందుకు నా దగ్గర ప్రత్యేక కారణమంటూ ఏదీ లేదు.ఎప్పుడూ నా గదికి వచ్చేవాడు కాదుబహుశా ధోని దగ్గర రీజన్ ఉండవచ్చు. అయితే, ఆ కారణం ఏమిటో నాకు మాత్రం తెలియదు. సీఎస్కేతో ఉన్నపుడు కూడా మైదానంలో మాత్రం అప్పుడప్పుడు మాట్లాడేవాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత అతడు ఎప్పుడూ నా గదికి వచ్చేవాడు కాదు. నేను కూడా అతడి గదికి వెళ్లేవాడిని కాదు.ధోని పట్ల నాకెలాంటి వ్యతిరేక భావం లేదు. కానీ అతడికి నా మీద ఏదైనా కోపం ఉందేమో! ఒకవేళ అదే నిజమైతే అతడు ఆ విషయం గురించి నాతో మాట్లాడవచ్చు. నేనెప్పుడూ అతడికి కనీసం కాల్ కూడా చేయలేదు. ఎందుకంటే.. నేను ఫోన్ చేసినపుడు లిఫ్ట్ చేసి మాట్లాడితేనే మరోసారి ఫోన్ చేయాలనిపిస్తుంది.అలాంటి వాళ్లతో నేనెందుకు మాట్లాడాలి?లేదంటే.. అటువంటి వాళ్లను నేను అస్సలు పట్టించుకోను. ఎందుకంటే బంధం అనేది రెండువైపులా ఉండాలి. మనం ఎదుటివారికి గౌరవం ఇస్తేనే.. మనకు కూడా గౌరవం దక్కుతుంది. నేను రెండుసార్లు ఫోన్ చేసినా.. అటువైపు నుంచి స్పందన లేకపోతే.. నేనెందుకు అలాంటి వ్యక్తితో మాట్లాడతా!’’ అంటూ టీమిండియా దిగ్గజ స్పిన్నర్ హర్భజన్ సింగ్ షాకింగ్ కామెంట్స్ చేశాడు.భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, మూడు ఐసీసీ టైటిళ్లు గెలిచిన మహేంద్ర సింగ్ ధోనితో తన అనుబంధం గురించి మాట్లాడుతూ ఈ మేర వ్యాఖ్యలు చేశాడు. తామిద్దరి మధ్య మాటలులేక దశాబ్దకాలం గడిచిందన్నాడు భజ్జీ. తాను మాట్లాడేందుకు ప్రయత్నించినా ధోని నుంచి స్పందన లేకపోవడంతో తాను కూడా అతడికి దూరంగా ఉండాలని నిశ్చయించుకున్నట్లు భజ్జీ తెలిపాడు.అదంతా నిజమేకాగా ధోని- భజ్జీ మధ్య విభేదాలున్నాయంటూ గతంలో ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. అయితే, తాజాగా క్రికెట్నెక్స్ట్తో మాట్లాడిన హర్భజన్ సింగ్ అదంతా నిజమేనని ధ్రువీకరించాడు. కాగా 2007లో ధోని సారథ్యంలో టీ20 ప్రపంచకప్ గెలిచిన జట్టులో.. అదే విధంగా.. ధోని కెప్టెన్సీలోనే 2011 వన్డే వరల్డ్కప్ గెలిచిన టీమిండియాలోనూ హర్భజన్ సింగ్ సభ్యుడు. అంతేకాదు.. 2018 నుంచి 2020 వరకు ధోని నాయకత్వంలో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున భజ్జీ ఆడటం గమనార్హం. అయితే, వీరిద్దరి బంధం బీటలు వారడానికి గల కారణంపై మాత్రం స్పష్టత లేదు. చదవండి: Asia Cup 2024: టీమిండియా ఓపెనర్ల ఊచకోత.. సెమీ ఫైనల్లో భారత్ -
‘గిల్ను బెంచ్కే పరిమితం చేయండి.. అతడికి మరొక్క ఛాన్స్ ఇవ్వాలి’
టీమిండియా- ఆస్ట్రేలియా మధ్య రెండో టెస్టు నేపథ్యంలో భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. స్టార్ బ్యాటర్ శుబ్మన్ గిల్ను మరికొన్నాళ్లపాటు బెంచ్కే పరిమితం చేయాలని భారత జట్టు యాజమాన్యానికి సూచించాడు. యువ ఆటగాడు ధ్రువ్ జురెల్కు మరొక్క అవకాశం ఇవ్వాలని బీసీసీఐకి విజ్ఞప్తి చేశాడు.గాయం వల్ల జట్టుకు దూరంకాగా బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్ ఆస్ట్రేలియాతో ఐదు టెస్టులు ఆడుతోంది. ఈ క్రమంలో పెర్త్లో జరిగిన తొలి మ్యాచ్కు రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ వ్యక్తిగత కారణాల వల్ల దూరంగా ఉండగా.. టెస్టుల్లో వన్డౌన్లో ఆడుతున్న గిల్ గాయం వల్ల జట్టుకు దూరమయ్యాడు.రిషభ్ పంత్ ఉన్నప్పటికీఈ నేపథ్యంలో రోహిత్ గైర్హాజరీలో యశస్వి జైస్వాల్తో కలిసి కేఎల్ రాహుల్ భారత ఇన్నింగ్స్ ఆరంభించాడు. మరోవైపు.. గిల్ లేకపోవడంతో.. రిషభ్ పంత్ ఉన్నప్పటికీ మరో వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్కు తుదిజట్టులో చోటు దక్కింది. అయితే, రెండో టెస్టుకు రోహిత్ శర్మ, గిల్ అందుబాటులోకి రావడంతో ఎవరిపై వేటు పడుతుందనే చర్చ నడుస్తోంది.ఈ నేపథ్యంలో భారత దిగ్గజ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ఇండియా టుడేతో మాట్లాడాడు. ‘‘కేఎల్ రాహుల్- యశస్వి జైస్వాల్లను ఓపెనింగ్ జోడీగా కొనసాగించాలి. కెప్టెన్ రోహిత్ శర్మ కోసం శుబ్మన్ గిల్ తన మూడోస్థానాన్ని త్యాగం చేయాల్సి ఉంటుంది. ఇక విరాట్ కోహ్లి నాలుగో స్థానంలో రాగా.. మిగతా స్థానాల్లో యథావిధిగా అందరూ కొనసాగాలి.గిల్ను బెంచ్కే పరిమితం చేయండి.. అతడికి మరొక్క ఛాన్స్ ఇవ్వాలిగిల్ మరికొన్నాళ్లు వేచి చూడాలి. నిజానికి జురెల్కు తొలి టెస్టులో అవకాశం ఇచ్చారు. కానీ అతడు పరుగులేమీ రాబట్టలేకపోయాడు. కాబట్టి అతడిని బెంచ్కే పరిమితం చేసే అవకాశం ఉంటుంది. అయినప్పటికీ.. గిల్ను ఓపెనింగ్ నుంచి ఐదో స్థానం వరకు ఎక్కడా ఆడించలేము కదా!ఇలాంటి క్లిష్ట పరిస్థితులు ఎదురవడం మంచిదే. బెంచ్ ఎంత పటిష్టంగా ఉందో తెలియజేస్తుంది. మేనేజ్మెంట్ గిల్ వైపు మొగ్గు చూపి జురెల్ను తప్పించవచ్చు. అయితే, నా అభిప్రాయం ప్రకారం జురెల్కు మరొక్క అవకాశం ఇవ్వాలి’’ అని భజ్జీ పేర్కొన్నాడు. ప్రాక్టీస్ మ్యాచ్లో గిల్ ఫిఫ్టీకాగా ఆసీస్-‘ఎ’ జట్టుతో రాణించిన జురెల్.. తొలి టెస్టులో మాత్రం నిరాశపరిచారడు. తొలి టెస్టులో రెండు ఇన్నింగ్స్లో వరుసగా 11, 1 పరుగులు చేశాడు. మరోవైపు.. ప్రైమ్ మినిస్టర్స్ ఎలెవన్తో పింక్ బాల్తో ప్రాక్టీస్ మ్యాచ్లో గిల్ ఫిఫ్టీ(రిటైర్డ్ హర్ట్) సాధించాడు.ఇక భారత్- ఆసీస్ మధ్య అడిలైడ్ వేదికగా డిసెంబరు 6 నుంచి రెండో టెస్టు జరుగనుంది. దీనిని పింక్ బాల్తో నిర్వహించనున్నారు. ఇక పెర్త్లో జరిగిన తొలి టెస్టులో ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా కెప్టెన్సీలో టీమిండియా అదరగొట్టింది. ఆస్ట్రేలియాను ఏకంగా 295 పరుగుల తేడాతో చిత్తుగా ఓడించి సిరీస్లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది. చదవండి: ప్రపంచంలోనే బెస్ట్ బౌలర్ బుమ్రా.. నా మనుమలకూ చెబుతా: సన్రైజర్స్ విధ్వంసకర వీరుడు -
అశ్విన్ అద్భుత స్పిన్నరే కానీ...
ముంబై: సీనియర్ ఆఫ్స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అద్భుత స్పిన్నరే అయినా... భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని వాషింగ్టన్ సుందర్ను సిద్ధం చేయాలని భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ అభిప్రాయపడ్డాడు. టెస్టు క్రికెట్లో 536 వికెట్లు పడగొట్టిన అశ్విన్... భారత్ నుంచి అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో అనిల్ కుంబ్లే (619) తర్వాత రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. ఆస్ట్రేలియాతో ‘బోర్డర్–గావస్కర్ ట్రోఫీ’ తొలి టెస్టులో అశ్విన్ను కాదని టీమ్ మేనేజ్మెంట్ సుందర్ను తుది జట్టులోకి ఎంపిక చేసింది. ఈ నేపథ్యంలో భజ్జీ మాట్లాడుతూ... ‘అశ్విన్ జాతీయ జట్టు తరఫున అద్భుత ప్రదర్శన కనబర్చాడు. అయితే ఇప్పుడతడి వయసు 38. అతడు ఆటకు వీడ్కోలు పలికే సమయానికి జట్టు సుందర్ను సిద్ధం చేసుకోవాలనుకుంటుండోచ్చు. అందుకే విదేశీ పిచ్లపై అనుభవజు్ఞడైన అశ్విన్ కంటే సుందర్కు అవకాశం ఇచ్చారు. పెర్త్లో ఆ్రస్టేలియాపై టీమిండియా విజయం సాధించడం చాలా ఆనందంగా ఉంది. అక్కడ ఆసీస్ అజేయమైన జట్టుగా కనిపించేది. అలాంటి చోట చక్కటి ఆటతీరుతో భారత జట్టు కంగారూలను కట్టడి చేసింది. ఇదే జోరు కొనసాగిస్తూ టీమిండియా 4–1తో సిరీస్ కైవసం చేసుకుంటుందనుకుంటున్నా’అని అన్నాడు. ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్కు చేరడం భారత్కు కొత్త కాదని... అయితే ఈసారి గెలవడం ముఖ్యమని భజ్జీ వ్యాఖ్యానించాడు. తొలి టెస్టులో రెగ్యులర్ కెపె్టన్ రోహిత్ శర్మ అందుబాటులో లేకున్నా... జస్ప్రీత్ బుమ్రా జట్టును అద్భుతంగా నడిపించాడని హర్భజన్ కొనియాడాడు. కోహ్లిని చూసి లబుషేన్ నేర్చుకోవాలి: పాంటింగ్ ఫామ్లేమితో సతమతమవుతున్న ఆ్రస్టేలియా ఆటగాళ్లు మార్నస్ లబుషేన్, స్టీవ్ స్మిత్కు... మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ కీలక సూచనలు చేశాడు. ఈ ఇద్దరూ భారత స్టార్ విరాట్ కోహ్లిని చూసి నేర్చుకోవాలన్నాడు. ‘పెర్త్ టెస్టులో లబుõÙన్ తీవ్రంగా తడబడ్డాడు. విభిన్నమైన వికెట్పై నాణ్యమైన బౌలింగ్ను ఎదుర్కోవడం ఎప్పుడూ కష్టమే. కానీ పరిస్థితులను మనకు అనుకూలంగా మలుచుకునేందుకు ప్రయత్నించడం ముఖ్యం. పెర్త్ రెండో ఇన్నింగ్స్లో కోహ్లి ఇదే చేశాడు. తొలి ఇన్నింగ్స్లో చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేకపోయిన విరాట్ రెండో ఇన్నింగ్స్లో పరిస్థితులపై పైచేయి సాధించాడు. కోహ్లి తన బలాలపై దృష్టి పెడతాడు. లబుషేన్, స్మిత్ అదే చేయాలి. వారి సామర్థ్యాన్ని నమ్మాలి’అని పాంటింగ్ వ్యాఖ్యానించాడు. బుమ్రా వంటి బౌలర్ను ఎదుర్కొనేందుకు మెరుగైన ప్రణాళికలతో బరిలోకి దిగాలని... లేకుంటే ఫలితాలు అనుకూలంగా రావని పాంటింగ్ అన్నాడు.మరోవైపు ఆసీస్ మాజీ పేసర్ జాన్సన్ భిన్నమైన అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఈ నెల 6 నుంచి అడిలైడ్ వేదికగా ప్రారంభం కానున్న రెండో టెస్టు నుంచి లబుషేన్ను తప్పించాలని అన్నాడు. గత కొన్నాళ్లుగా ఫామ్లోలేక ఇబ్బంది పడుతున్న లబుషేన్ దేశవాళీల్లో ఆడితే తిరిగి లయ అందిపుచ్చుకోవచ్చని సూచించాడు. -
శార్దూల్ ఎక్కడ?.. నితీశ్ను ఆడిస్తారా? అతడు కూడా గంగూలీలా..
ఆస్ట్రేలియతో టెస్టులకు ఎంపిక చేసిన భారత జట్టుపై టీమిండియా స్పిన్ దిగ్గజం హర్భజన్ సింగ్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. హార్దిక్ పాండ్యా, శార్దూల్ ఠాకూర్ వంటి సీనియర్ పేస్ ఆల్రౌండర్లను ఈ సిరీస్లో ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదని ప్రశ్నించాడు. ఐదు టెస్టులుటీమిండియాకు ఎంతో కీలకమైన ఈ పర్యటనలో యువకుడైన నితీశ్ కుమార్ రెడ్డిపై భారం మోపడం సరైన నిర్ణయం కాదని భజ్జీ అభిప్రాయపడ్డాడు. స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో 3-0తో క్లీన్స్వీప్నకు గురైన టీమిండియా.. ప్రస్తుతం ఆస్ట్రేలియాలో ఉంది. ప్రతిష్టాత్మక బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా అక్కడ ఐదు టెస్టులు ఆడనుంది. పెర్త్ వేదికగా శుక్రవారం నుంచి ఈ సిరీస్ మొదలుకానుంది. ఈ నేపథ్యంలో బుధవారం మీడియాతో మాట్లాడిన టీమిండియా బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ కీలక వ్యాఖ్యలు చేశాడు. టీ20లలో మెరుపులు మెరిపిస్తున్న ఆంధ్ర క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డి అరంగేట్రం చేయడం ఖాయమనే సంకేతాలు ఇచ్చాడు.నితీశ్ రెడ్డి ఆట చూడాల్సిందేనితీశ్ గురించి మోర్కెల్ ప్రస్తావిస్తూ.. ‘అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్ చేయగల సామర్థ్యం నితీశ్ సొంతం. ఈ పర్యటనలో అతడి ఆట చూసేందుకు ప్రతి ఒక్కరూ ఆసక్తిగా ఉన్నారు. నితీశ్ కుమార్ రెడ్డిలో ప్రతిభకు కొదవలేదు. అతడు ఆల్రౌండ్ సామర్థ్యం గల ఆటగాడు. అతడి బౌలింగ్లో పదును ఉంది.మనం ఊహించిన దానికంటే ఎక్కువ వేగంగా అతడి బంతి బ్యాట్ను తాకుతుంది. ఆస్ట్రేలియా పిచ్లపై అతడి బౌలింగ్ బాగా ఉపయోగపడుతుంది. స్వింగ్ బౌలింగ్కు అనుకూలమైన ఆసీస్ పిచ్లపై నితీశ్ మరింత ప్రమాదకారి కాగలడు. సరైన దిశలో వినియోగిస్తే అతడు ఉపయుక్త బౌలర్ అవుతాడు. ప్రతి బంతిని వికెట్ లక్ష్యంగా సంధించడం అతడి నైపుణ్యం.పేస్ ఆల్రౌండర్ స్థానాన్ని భర్తీ చేయడానికి నితీశ్కు ఇది చక్కటి అవకాశం. ప్రపంచంలోని ఏ జట్టయినా మంచి పేస్ ఆల్రౌండర్ ఉండాలని కోరుకుంటుంది. తమ పేసర్లకు మరింత విశ్రాంతి నివ్వగల ఆల్రౌండర్ లభిస్తే అంతకుమించి ఇంకేం కావాలి’ అని అన్నాడు.మరి శార్దూల్ ఠాకూర్ ఎక్కడికి వెళ్లాడు?ఈ నేపథ్యంలో మాజీ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ఓ యూట్యూబ్ చానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘‘టీమిండియాకు ప్రస్తుతం హార్దిక్ పాండ్యా వంటి ఆల్రౌండర్ అవసరం ఉంది. కానీ.. అతడిని జట్టులోకి తీసుకునే పరిస్థితి లేదు కాబట్టి.. నితీశ్ కుమార్ రెడ్డి రూపంలో ఆప్షన్ వెదుక్కున్నారు. మరి శార్దూల్ ఠాకూర్ ఎక్కడికి వెళ్లాడు?హార్దిక్ పాండ్యా ఏమయ్యాడు? వాళ్లిద్దరిని పరిమిత ఓవర్ల క్రికెట్కే పరిమితం చేద్దామనుకుంటున్నారు కదా! గత రెండు, మూడేళ్లుగా శార్దూల్పై మీరు నమ్మకం ఉంచారు. అతడికి అవకాశాలు ఇచ్చారు. కానీ ఇప్పుడు ఏమైంది? అకస్మాత్తుగా నితీశ్ను బౌలింగ్ చేయమంటూ తెరమీదకు తీసుకువచ్చారు’’ అని ఘాటు వ్యాఖ్యలు చేశాడు.నితీశ్ కూడా గంగూలీలాఇక నితీశ్ రెడ్డికి ఇదొక సువర్ణావకాశమన్న భజ్జీ.. మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ మాదిరి పేస్ దళానికి అదనపు బలంగా మారితే బాగుంటుందని సూచించాడు. పేసర్లకు విశ్రాంతినిచ్చేలా బౌలింగ్ చేయడంతో పాటు.. బ్యాటింగ్లోనూ సత్తా చాటితే ఉపయుక్తమని పేర్కొన్నాడు. ‘‘గంగూలీ మాదిరి.. కొన్ని ఓవర్లపాటు బౌలింగ్ చేసి.. నితీశ్ 1-2 వికెట్లు తీస్తే.. జట్టుకు అది ఒకరంగా బోనస్లా మారుతుంది’’ అని హర్భజన్ సింగ్ అభిప్రాయపడ్డాడు.టెస్టు అరంగేట్రం చేయడం ఖాయంకాగా ఐపీఎల్ ద్వారా వెలుగులోకి వచ్చి... టీ20ల్లో మెరుపుల ద్వారా టెస్టు జట్టులో స్థానం దక్కించుకున్న నితీశ్ కుమార్ రెడ్డి... ఆస్ట్రేలియాతో తొలి మ్యాచ్లో అంతర్జాతీయ టెస్టు అరంగేట్రం చేయడం దాదాపు ఖాయమైంది. షమీ వంటి సీనియర్ పేసర్ లేకపోవడంతో అతడి స్థానంలో సీమ్, బౌన్స్ను వినియోగించుకోగలగడంతో పాటు లోయర్ ఆర్డర్లో ధాటిగా బ్యాటింగ్ చేయగల సత్తా ఉన్నా నితీశ్ను తుది జట్టులోకి ఎంపిక చేసే చాన్స్ ఉంది. ఇదిలా ఉంటే.. టీమిండియా దిగ్గజ బ్యాటర్ గంగూలీ రైటార్మ్ మీడియం పేసర్ కూడా! తన కెరీర్లో గంగూలీ టెస్టుల్లో 32, వన్డేల్లో 100 వికెట్లు తీశాడు. ఇక హార్దిక్ ఫిట్నెస్ లేమి వల్ల కేవలం వన్డే, టీ20లకు పరిమితం కాగా.. శార్దూల్ ఇటీవలే గాయం నుంచి కోలుకుని రంజీల్లో ముంబై తరఫున ఆడుతున్నాడు.చదవండి: ICC: వరల్డ్ నంబర్ వన్గా హార్దిక్ పాండ్యా.. దూసుకువచ్చిన తిలక్ వర్మ.. ఏకంగా.. -
రంజీలు ఆడేవాళ్లు పనికిరారా?.. సెలక్టర్లపై హర్భజన్ సింగ్ ఫైర్!
టీమిండియా సెలక్టర్ల తీరును భారత మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ విమర్శించాడు. రంజీ ట్రోఫీలో అద్భుత ప్రదర్శన కనబరిచిన ఆటగాళ్లను పట్టించుకోకపోవడం దారుణమని మండిపడ్డాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) ప్రదర్శనల ఆధారంగానే జాతీయ జట్టును ఎంపిక చేస్తే ఆటగాళ్లు ఇకపై రంజీలు ఆడాల్సిన అవసరం లేదంటూ ఘాటు వ్యాఖ్యలు చేశాడు.మొట్టమొదటి క్రికెటర్గా ఆల్టైమ్ రికార్డుకాగా మధ్యప్రదేశ్కు చెందిన ఆల్రౌండర్ జలజ్ సక్సేనా ఫస్ట్క్లాస్ క్రికెట్లో పరుగుల వరద పారించడంతో పాటు వికెట్లు తీయడంలోనూ సత్తా చాటుతున్నాడు. ఇటీవలే అతడు రంజీ ట్రోఫీలో 6000 పరుగులు పూర్తి చేసుకోవడంతో పాటు 400 వికెట్ల మార్కు దాటాడు. తద్వారా రంజీ చరిత్రలో ఈ ఘనత సాధించిన మొట్టమొదటి క్రికెటర్గా ఆల్టైమ్ రికార్డు సృష్టించాడు.అయితే, 37 ఏళ్ల సక్సేనా ఇంత వరకు ఒక్కసారి కూడా టీమిండియాకు ఆడలేకపోయాడు. 2005లో సొంతరాష్ట్రం మధ్యప్రదేశ్ తరఫు ఫస్ట్క్లాస్ కెరీర్ ఆరంభించిన జలజ్.. పదకొండేళ్ల పాటు అదే జట్టుతో కొనసాగాడు. 2016-17 సీజన్ నుంచి కేరళకు ప్రాతినిథ్యం వహిస్తున్న జలజ్ సక్సేనా ఇటీవల ఉత్తరప్రదేశ్తో మ్యాచ్ సందర్భంగా ఈ అరుదైన ఫీట్ నమోదు చేశాడు.ఇంకేం చేస్తే అతడి పేరును సెలక్టర్లు పరిశీలిస్తారు?ఈ నేపథ్యంలో ఓ జర్నలిస్టు సోషల్ మీడియా వేదికగా జలజ్ సక్సేనా ఘనతను ప్రస్తావిస్తూ.. ‘‘రంజీ ట్రోఫీలో 400 వికెట్లు, 6000 పరుగులు. భారత్లోని జాతీయ టోర్నమెంట్లో ఈ ఘనత సాధించిన మొట్టమొదటి వ్యక్తి. అయినప్పటికీ ఇతడికి టీమిండియా తరఫున ఆడే అవకాశం లేదు.అతడొక చాంపియన్. నిలకడగా ఆడుతున్న ప్లేయర్. ఇంతకంటే.. ఇంకేం చేస్తే అతడి పేరును సెలక్టర్లు పరిశీలిస్తారు?’’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. సదరు జర్నలిస్టు పోస్టుకు భారత స్పిన్ దిగ్గజం హర్భజన్ సింగ్ స్పందించాడు.రంజీలు ఆడేవాళ్లు పనికిరారా?‘‘మీ మాటలతో నేను ఏకీభవిస్తున్నాను. కనీసం ఇండియా-‘ఎ’ జట్టుకైనా అతడిని ఎంపిక చేయాల్సింది. ప్రస్తుత కాలంలో రంజీ ఆడటం పనికిరాని విషయంగా మారిపోయిందా?.. ఐపీఎల్ నుంచే ఆటగాళ్లను సెలక్ట్ చేస్తున్నారు’’ అంటూ భజ్జీ టీమిండియా సెలక్టర్ల తీరును ఘాటుగా విమర్శించాడు.కాగా టీమిండియా ఇటీవల స్వదేశంలో ఘోర ఓటమిని మూటగట్టుకుంది. న్యూజిలాండ్తో మూడు మ్యాచ్ల టెస్టు సిరీస్లో 3-0తో వైట్వాష్కు గురైంది. తద్వారా సొంతగడ్డపై ఇలా మూడు మ్యాచ్ల టెస్టుల్లో క్లీన్స్వీప్ అయిన తొలి భారత జట్టుగా రోహిత్ సేన నిలిచింది. ఇక ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న భారత్-‘ఎ’ జట్టు సైతం రెండు మ్యాచ్ల అనధికారిక టెస్టు సిరీస్లో వైట్వాష్ దిశగా పయనిస్తోంది. చదవండి: Ind A vs Aus A: ఆసీస్ బౌలర్ల విజృంభణ.. భారత బ్యాటింగ్ ఆర్డర్ కుదేలు -
హర్భజన్ సింగ్,ఓవియా కొత్త సినిమా ప్రకటన.. పోస్టర్ చూశారా..?
భారత క్రికెట్ జట్టు మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్, నటి ఓవియా నటించిన తమిళ చిత్రం 'సేవియర్' ఫస్ట్ లుక్ పోస్టర్ను చిత్ర యూనిట్ తాజాగా విడుదల చేసింది. వెండితెరపై హర్భజన్ మరోసారి కనిపించనున్నడంతో ఆయన ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు. ప్రస్తుతం విడుదలైన పోస్టర్స్ను నెటిజన్లు షేర్ చేస్తున్నారు.ఈ చిత్రంలో నటి ఓవియా క్రికెటర్ హర్భజన్ సింగ్కు జోడీగా నటిస్తోంది. వీటీవీ గణేష్, జీబీ ముత్తు తదితరులు నటించిన ఈ చిత్రాన్ని దర్శకుడు జాన్ పాల్ రాజ్ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాను సెంటోవా స్టూడియో నిర్మిస్తుంది. తాజాగా చిత్రబృందం విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్లో తల్లి వర్ణ పాత్రలో నటి ఓవియా, డాక్టర్ జేమ్స్ మల్హోత్రాగా హర్భజన్ సింగ్ కనిపిస్తున్నారు. ఈ క్రమంలో జిబి ముత్తు, గణేశన్ పాత్రలను కూడా దర్శకుడు రివీల్ చేశాడు. ఈ చిత్రానికి సంబంధించిన ఇతర నటీనటులను త్వరలో ప్రకటించే అవకాశం ఉంది. ఈ చిత్రం పిల్లి-ఎలుక గేమ్ల సాగనుందని ప్రచారం జరుగుతుంది. ఒక రాత్రిలో జరిగే 12 హత్యల చుట్టూ సేవియర్ కథ తిరుగుతుందని తెలుస్తోంది. ఫ్రెండ్షిప్ సినిమా తర్వాత హర్భజన్, జాన్ పాల్ రాజ్ల కలయికలో ఇది రెండవ సినిమా కావడం విశేషం.తాజాగా నటి ఓవియా పర్సనల్ వీడియో అంటూ ఒకటి నెట్టింట వైరల్ అయింది. బిగ్బాస్తో గుర్తింపు తెచ్చుకున్న ఓవియా కొంత కాలం వరకు భారీగానే సినిమా ఛాన్సులతో బిజీగానే ఉండేది. ఆ తర్వాత పలు వివాదాల వల్ల అవకాశాలు తగ్గాయి. గత కొన్నాళ్లుగా సినిమా ఛాన్సులు లేకుండా ఉన్న ఓవియా ఇప్పుడు సేవియర్ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానుంది. View this post on Instagram A post shared by Harbhajan Turbanator Singh (@harbhajan3) -
‘ఆమె’ మగాడే.. సంచలన విషయాలు వెలుగులోకి!.. భజ్జీ రియాక్షన్
ఇమానే ఖలీఫ్(Imane Khelif).. ప్యారిస్ ఒలింపిక్స్-2024 సందర్భంగా ఈ అల్జీరియా బాక్సర్ పేరు చర్చనీయాంశమైంది. తాజాగా తను మరోసారి వార్తల్లోకి వచ్చింది. ఆమె.. ఆమె కాదు.. మగాడే.. అనే ఆధారాలు ఉన్నాయంటూ జాఫర్ ఐత్ ఔడియా అనే ఫ్రెంచి జర్నలిస్టు ఇమానే గురించి సంచలన విషయాలు బయటపెట్టారు.కౌమార దశలో తాను సంపాదించిన డాక్యుమెంట్లలో ఇమానే 5- ఆల్ఫా రెడక్టేస్ డెఫిషియెన్సీతో బాధపడుతోందని వెల్లడైందని పేర్కొన్నారు. అంతేకాదు... ఈ రిపోర్టులో ఇమానే హార్మోన్ థెరపీ చేయించుకుంటే లింగ నిర్ధారణ సులువవుతుందనే సిఫారసు ఉందని.. తన జెండర్ గుర్తింపునకు ఇది దోహదం చేస్తుందనే వివరాలూ ఉన్నాయన్నారు. కాగా 5- ఆల్ఫా రెడక్టేస్ డెఫిషియెన్సీ అనేది ఓ అరుదైన డిజార్డర్.ఒక వ్యక్తిలో పురుష అవయవాల్లో సరైన ఎదుగుదల లేకపోవడం వల్ల.. పుట్టుకతో బయోలాజికల్గా మహిళగా కనిపిస్తారు. అయితే, కౌమార దశలో మాత్రం పురుష అవయవాలు అభివృద్ది చెందుతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.అప్పుడు నిషేధంఇదిలా ఉంటే.. 2023లో ఇమానే ఖలీప్ జెండర్కు సంబంధించిన కథనం వెలుగులోకి వచ్చింది. ఆమెకు గర్భసంచి లేదని, పురుషులలో ఉండే XY క్రోమోజోమ్లు ఉన్నాయని.. ఫలితంగా ఇమానే బయోలాజికల్ మ్యాన్ అనే వార్తలు బయటకువచ్చాయి. ఈ క్రమంలో.. గత ఏడాది ఢిల్లీలో జరిగిన బాక్సింగ్ వరల్డ్ చాంపియన్షిప్లో పరీక్షల తర్వాత.. మహిళల విభాగంలో పాల్గొనకుండా ఆమెపై నిషేధం విధించారు.కానీ.. ప్యారిస్ ఒలింపిక్స్లో మాత్రం నిర్వాహకులు వుమెన్ కేటగిరీలోని 66 కేజీల విభాగంలో పాల్గొనే అవకాశం ఇమానేకు ఇచ్చారు. ఆమె పాస్పోర్టులో మహిళ అని ఉందనే కారణంగా.. ఈ మేరకు అనుమతించారనే వార్తలు విమర్శలకు తావిచ్చాయి. 46 సెకన్ల వ్యవధిలోనేఅందుకు తగ్గట్లుగానే.. తన మొదటి బౌట్లో ఇటలీకి చెందిన ఏంజెలా కెరీనీతో తలపడ్డ ఇమానే.. తన పంచ్లతో ప్రత్యర్థిని బెంబేలెత్తించింది. ఇమానే పంచ్లను తట్టుకోలేక ఏంజెలా కేవలం 46 సెకన్ల వ్యవధిలోనే ఆట నుంచి వైదొలిగింది.ఇలాంటి బాక్సింగ్ తన జీవితంలో చూడలేదంటూ ఏంజెలా ఏడ్చేసింది. ఈ క్రమంలో ఖలీఫ్ పంచ్లలో ఒక మగాడి తరహాలో తీవ్రత ఉండటమే అందుకు కారణమని ఆరోపణలు వచ్చాయి. అయితే, నిర్వాహకులు మాత్రం ఇమానేను ఈవెంట్లో కొనసాగించారు.బంగారు పతకం గెలిచిఈ నేపథ్యంలో ప్రత్యర్థులపై బలమైన పంచ్లతో పంజా విసిరిన 25 ఏళ్ల ఇమానే ఖలీఫ్ ఫైనల్ చేరడమే గాక.. బంగారు పతకం గెలిచింది. కానీ ఇమానేను ప్రశంసించేవారి కంటే.. ఆమె జెండర్ ఐడెంటిని ప్రస్తావిస్తూ విమర్శించిన వారే ఎక్కువయ్యారు. తాజాగా ఫ్రెంచి జర్నలిస్టు బయటపెట్టిన విషయాలతో ఆమె మగాడేనని.. మహిళా బాక్సర్లపై పోటీ పడిన ఇమానే పతకాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.పతకం వెనక్కి తీసుకోవాలిటీమిండియా దిగ్గజ స్పిన్ బౌలర్ హర్భజన్ సింగ్ కూడా ఈ జాబితాలో చేరాడు. ‘‘స్వర్ణ పతకాన్ని వెంటనే వెనక్కి తీసుకోండి. ఒలింపిక్స్ నిర్వాహకులు ఇలాంటివి ప్రోత్సహించడం సరికాదు’’ అని భజ్జీ ట్వీట్ చేశాడు. కాగా 1999 నుంచి మహిళా బాక్సర్లకు క్రోమోజోమ్ టెస్టులు నిర్వహించే బదులు.. వారి అధికారిక పత్రాలనే జెండర్ ప్రూఫ్లుగా అంతర్జాతీయ ఒలింపిక్స్ సంఘం ఆమోదిస్తోంది. ఇమానే ఖలీఫ్ వివాదంతో ఈ విషయం మరోసారి చర్చకు వచ్చింది.చదవండి: భార్యతో విడాకులు.. ‘మిస్టరీ గర్ల్’తో శిఖర్ ధావన్! వీడియో వైరల్Take the Gold back @Olympics This isn’t fair https://t.co/ZO3yJmqdpY— Harbhajan Turbanator (@harbhajan_singh) November 5, 2024 -
ధోని కంటే రోహిత్ బెటర్ కెప్టెన్: భారత స్పిన్ దిగ్గజం
మహేంద్ర సింగ్ ధోని.. టీమిండియాకు మూడు ఐసీసీ ట్రోఫీలు అందించిన కెప్టెన్. అతడి సారథ్యంలో భారత క్రికెట్ జట్టు టీ20 ప్రపంచకప్-2007, వన్డే వరల్డ్కప్-2011, చాంపియన్స్ ట్రోఫీ-2013 గెలిచింది. ఇక ఫ్రాంఛైజీ క్రికెట్లోనూ ఈ జార్ఖండ్ డైనమైట్.. 2008లో మొదలైన ఇండియన్ ప్రీమియర్ లీగ్లో ఆది నుంచి చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్కే)కు ఆడుతున్నాడు. సారథిగా సీఎస్కేను ఏకంగా ఐదుసార్లు ఐపీఎల్ చాంపియన్గా నిలిపాడు. మరోవైపు.. రోహిత శర్మ.. టీమిండియా ప్రస్తుత కెప్టెన్. ఇటీవలే టీ20 ప్రపంచకప్-2024 ట్రోఫీ గెలిచాడు. ఇక ఐపీఎల్లో ముంబై ఇండియన్స్కు సుదీర్ఘకాలం పాటు కెప్టెన్గా ఉండి.. ధోని కంటే ముందుగానే ఐదుసార్లు ఐపీఎల్ టైటిల్ గెలిచిన సారథిగా చరిత్రకెక్కాడు.ధోని కంటే రోహిత్ బెటర్ కెప్టెన్కాగా టీమిండియాలో ఇద్దరితో కలిసి, ఐపీఎల్లో ఈ ఇద్దరి కెప్టెన్సీలోనూ ఆడాడు టీమిండియా దిగ్గజ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్. ఈ నేపథ్యంలో ఇద్దరి నాయకత్వ శైలిని పోలుస్తూ తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ధోని కంటే రోహిత్ బెటర్ కెప్టెన్ అని తన మనసులోని మాట బయటపెట్టాడు. అందుకు గల కారణాన్ని వెల్లడిస్తూ..ధోని ఎవరితో మాట్లాడడు‘‘ఇద్దరిలో ఎవరు బెటర్ అంటే.. నేను ధోనిని కాదని రోహిత్ వైపే మొగ్గుచూపుతాను. ఎందుంకటే రోహిత్ ప్లేయర్స్ కెప్టెన్. ప్రతి ఒక్క ఆటగాడి దగ్గరికి వెళ్లి వాళ్లకు ఏం కావాలో అడిగి తెలుసుకుంటాడు. సహచరులతో అతడికి మంచి అనుబంధం ఉంటుంది.అయితే, ధోని కెప్టెన్సీ స్టైల్ వేరుగా ఉంటుంది. అతడు ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడడు. తన మౌనం ద్వారానే ఎదుటివారికి తన మనసులోని మాట చేరాలని భావిస్తాడు. ఇతరులతో ధోని సంభాషించే విధానం ఇలాగే ఉంటుంది’’ అని హర్భజన్ సింగ్ పేర్కొన్నాడు. రోహిత్ శర్మకు స్నేహితులే తప్ప.. అతడికి విరుద్ధంగా మాట్లాడేవారు ఒక్కరూ ఉండరని ఈ సందర్భంగా పేర్కొన్నాడు. స్పోర్ట్స్ యారీ ఇంటర్వ్యూలో భజ్జీ ఈ వ్యాఖ్యలు చేశాడు.చదవండి: Babar Azam: బాబర్ ఆజం సంచలన నిర్ణయం..Rohit Sharma is a better captain than MS Dhoni says Harbhajan Singh Full podcast at 9pm tonight, only on Sports Yaari YouTube Channel 🇮🇳pic.twitter.com/6tVAdJh6qx— Sushant Mehta (@SushantNMehta) October 2, 2024 -
అందుకు నువ్వే కారణమవుతావని కోహ్లితో చెప్పాను: భజ్జీ
ఆధునిక తరంలో అసాధారణ ప్రతిభతో ఉన్నత శిఖరాలకు చేరుకున్న అతికొద్ది మంది క్రికెటర్లలో విరాట్ కోహ్లి ముందు వరుసలో ఉంటాడు. అంతర్జాతీయ క్రికెట్లో సమకాలీన ఆటగాళ్లకు ఎవరికీ సాధ్యం కాని రీతిలో ఎనభై శతకాలు సాధించిన ఘనత ఈ రన్మెషీన్ సొంతం. టీమిండియా దిగ్గజం, వంద సెంచరీల ధీరుడు సచిన్ టెండుల్కర్ రికార్డును సమం చేయగల సత్తా ఉన్న ఏకైక బ్యాటర్.అయితే, కెరీర్ ఆరంభంలో అసలు తను జట్టులో స్థానం సుస్థిరం చేసుకోగలనా? లేదా అన్న సందిగ్దంలో కొట్టుమిట్టాడట కోహ్లి. భారత స్పిన్ దిగ్గజం హర్భజన్ సింగ్ ఈ విషయాన్ని వెల్లడించాడు. నిరాశలో కూరుకుపోయిన కోహ్లికి తాను చెప్పిన మాటలను తాజాగా గుర్తుచేసుకున్నాడు.తీవ్ర నిరాశకు లోనయ్యాడు‘‘కోహ్లి గురించి చెప్పాలంటే.. ముఖ్యంగా టెస్టుల్లో అతడి ప్రయాణాన్ని ముందుగా తెలుసుకోవాలి. అప్పుడు మేము వెస్టిండీస్ పర్యటనలో ఉన్నాము. ఫిడెల్ ఎడ్వర్డ్స్ తన బౌలింగ్తో కోహ్లిని చాలా ఇబ్బంది పెట్టాడు. ప్రతిసారి అతడే తన వికెట్ తీసుకున్నాడు. దీంతో కోహ్లి సహజంగానే తీవ్ర నిరాశకు లోనయ్యాడు.ఆత్మన్యూనతభావంతో కుంగిపోయాడు. అప్పుడు తను నా దగ్గరికి వచ్చి.. ‘నేను బాగానే ఆడుతున్నానా?’ అని అడిగాడు. నేను వెంటనే అందుకు బదులిస్తూ.. ‘ఒకవేళ టెస్టు క్రికెట్లో గనుక నువ్వు 10 వేల పరుగులు చేయకపోతే.. అందుకు నిన్ను నువ్వే నిందించుకోవాల్సి వస్తుంది’ అని చెప్పాను. అది కేవలం నీ తప్పే అవుతుందని చెప్పాను‘నీకు ఆ సత్తా ఉంది. అయినప్పటికీ నువ్వు ఆ మైలురాయి చేరుకోలేకపోయావంటే అందుకు కేవలం నువ్వే కారణం అవుతావు అని గుర్తుపెట్టుకొమ్మని కోహ్లితో అన్నాను’’’ అంటూ భజ్జీ నాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నాడు. ఆత్మవిశ్వాసంతో ఒక్కోమెట్టు ఎక్కుతూ కోహ్లి తారస్థాయికి చేరుకున్నాడని హర్షం వ్యక్తం చేశాడు.ప్రపంచ క్రికెట్లో తనకంటూ ప్రత్యేక గు ర్తింపుఇక ఫిట్నెస్, డైట్ విషయంలోనూ కోహ్లికి శ్రద్ధ ఎక్కువని.. అందుకే తను గుంపులో గోవిందలా కాకుండా ప్రపంచ క్రికెట్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించాడని భజ్జీ తెలిపాడు. కోహ్లి చాలా మొండివాడని.. అనుకున్న పని పూర్తి చేసేంతవరకు పట్టువదలడని పేర్కొన్నాడు. భారత క్రికెట్పై కోహ్లి చెరగని ముద్ర వేశాడంటూ భజ్జీ ప్రశంసలు కురిపించాడు. తరువార్ కోహ్లి పాడ్కాస్ట్లో మాట్లాడుతూ ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు. కాగా 2011లో వెస్టిండీస్తో మ్యాచ్ ద్వారా కోహ్లి టెస్టుల్లో అడుగుపెట్టాడు. రెండు ఇన్నింగ్స్లో కలిపి కేవలం 19 పరుగులే చేసి నిరాశపరిచాడు. అయితే, ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదిగిన కోహ్లి ప్రస్తుతం 8848 పరుగులతో కొనసాగుతున్నాడు. ఇందులో 29 సెంచరీలు ఉన్నాయి.చదవండి: Pak vs Ban: ఆలస్యమైతే అవుటే!.. భయంతో పాక్ క్రికెటర్ పరుగులు -
‘తీవ్ర మనోవేదనకు గురవుతున్నా’.. దీదీకి హర్భజన్ సింగ్ లేఖ
పశ్చిమ బెంగాల్ రాష్ట్ర రాజధాని కోల్కతా ఆర్జీ కార్ ఆస్పత్రిలో జరిగిన ఉదంతంపై ప్రముఖ భారత మాజీ క్రికెటర్, ఆమ్ ఆద్మీ ఎంపీ హర్భజన్ సింగ్ ఆవేదన వ్యక్తం చేశారు. రోజులు గడుస్తున్నా బాధితురాలి న్యాయం జరగకపోవడంపై మనోవేదనకు గురవుతున్నానంటూ పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి రెండు పేజీల లేఖ రాశారు. ఆర్జీకార్ ఆస్పత్రిలో ట్రైనీ డాక్టర్పై ఆగస్టు 9న దారుణం జరిగినా.. విచారణ మాత్రం కొలిక్కి రావడం లేదు. ఈ అంశంపై దేశ వ్యాప్తంగా తీవ్ర ఆగ్రహావేశాలు, నిరసనలు కొనసాగుతున్నాయి. సీఎం,గవర్నర్కు లేఖఈ నేపథ్యంలో హర్భజన్ సింగ్ సీఎం మమతా బెనర్జీ, గవర్నర్ సీవీ ఆనంద బోస్కు లేఖ రాశారు. ఆ లేఖలో ‘మనందరి మనస్సాక్షిని కదిలించిన చెప్పలేని హింస. ఒక వ్యక్తిపై జరిగిన ఘోరమైన నేరం కాదు ఇది. మన సమాజంలోని ప్రతి మహిళ, గౌరవం, భద్రతపై జరిగిన తీవ్రమైన దాడి. ఇది లోతుగా పాతుకుపోయిన సమస్యలకు ప్రతిబింబం. సమాజంలో అధికారులు, వ్యవస్థాగత మార్పులు, చర్యల తక్షణ అవసరాన్ని ఈ దుర్ఘటన గుర్తు చేస్తుందని పేర్కొన్నారు.దిగ్భ్రాంతిని గురి చేసిందిఆస్పత్రిలో వైద్యం అందిస్తూ ప్రాణం పోసే వైద్యుల పట్ల జరిగిన దారుణం దిగ్భ్రాంతిని గురి చేసిందని దీదీ రాసిన రెండు పేజీల లేఖలో ఆప్ ఎంజీ రాసిన లేఖలో తెలిపారు. రోజులు గడుస్తున్నా కఠిన చర్యలు తీసుకోకపోవడం వల్లే వైద్యులు, వైద్య సంఘాలు రోడ్లపై నిరసనకు దిగాయని అన్నారు. వారి (వైద్యుల) నిరసనల్ని సమాజం అర్ధం చేసుకుంది. న్యాయం కోసం వారు చేసే పోరాటానికి నేను మద్దతు ఇస్తున్నాను అని చెప్పారు. With deep anguish over delay in justice to the Kolkata rape and murder victim, the incident which had shaken the conscience of all of us, I have penned a heartfelt plea to the Hon'ble Chief Minister of West Bengal , Ms. @MamataOfficial Ji and Hon'ble @BengalGovernor urging them… pic.twitter.com/XU9SuYFhbY— Harbhajan Turbanator (@harbhajan_singh) August 18, 2024 ఈ దారుణానికి ఒడిగట్టిన నిందితుల్ని న్యాయస్థానం ముందుకు తీసుకురావడానికి పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం, సీబీఐ తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు.టీవీల్లో సర్వసాధారణమయ్యాయిదేశంలో ఎక్కడో ఒకచోట ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని, వార్తాపత్రికలు, టీవీల్లో సర్వసాధారణంగా మారాయని అన్న హర్భజన్ సింగ్..భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా ప్రభుత్వాలు సమగ్ర చర్యలు తీసుకోవాలని అని హర్భజన్ సింగ్ దీదీకి రాసిన లేఖలో డిమాండ్ చేశారు. -
పంజాబ్ జట్టుకు టీమిండియా క్రికెటర్ గుడ్బై
టీమిండియా వెటరన్ క్రికెటర్ మన్దీప్ సింగ్ కీలక ప్రకటన చేశాడు. పంజాబ్ జట్టుతో తన పద్నాలుగేళ్ల బంధం ముగిసిందని తెలిపాడు. ఇకపై తాను దేశవాళీ క్రికెట్లో త్రిపురకు ప్రాతినిథ్యం వహించనున్నట్లు వెల్లడించాడు. ఇన్నాళ్లు తనకు అండగా నిలిచిన టీమిండియా మాజీ క్రికెటర్లు యువరాజ్ సింగ్, హర్భజన్ సింగ్లకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపాడు.పరుగుల వరదపంజాబ్లోని జలంధర్లో 1991లో జన్మించిన మన్దీప్ సింగ్కు చిన్ననాటి నుంచే క్రికెట్పై మక్కువ. ఈ క్రమంలో బ్యాటర్గా ఎదిగిన అతడు.. 2010 అండర్ 19 వరల్డ్కప్లో భారత్ తరఫున టాప్ స్కోరర్గా నిలిచాడు. అదే ఏడాది.. పంజాబ్ తరఫున దేశవాళీ క్రికెట్లో అరంగేట్రం చేసిన మన్దీప్ సింగ్.. మూడు ఫార్మాట్లలో కలిపి 14 వేలకు పైగా పరుగులు సాధించాడు.ఇందులో 19 సెంచరీలు, 81 అర్ధ శతకాలు ఉండటం విశేషం. డొమెస్టిక్ క్రికెట్లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న క్రమంలో 2016లో టీమిండియా సెలక్టర్ల పిలుపు అందుకున్న మన్దీప్ సింగ్.. జింబాబ్వేతో టీ20 సిరీస్ సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. పంజాబ్కు టైటిల్ అందించిన కెప్టెన్టీమిండియా తరఫున మూడు టీ20 మ్యాచ్లు ఆడి 87 పరుగులు చేశాడు. అదే ఏడాది చివరిసారిగా భారత్కు ఆడిన ఈ రైట్హ్యాండ్ బ్యాటర్.. పంజాబ్ కెప్టెన్గానూ పనిచేశాడు. ఈ క్రమంలో దేశవాళీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ-2023లో పంజాబ్కు టైటిల్ అందించిన 32 ఏళ్ల మన్దీప్ సింగ్.. తన కెరీర్లో కొత్త అధ్యాయానికి నాంది పలుకుతున్నట్లు శనివారం ప్రకటించాడు. అందుకే జట్టును వీడుతున్నా కాగా పంజాబ్ క్రికెట్ అసోసియేషన్కు యువ ఆటగాళ్లకు పెద్దపీట వేయాలని భావిస్తోందని.. అందుకే జట్టుకు తన సేవలు ఇక అవసరం లేదని మన్దీప్ అన్నాడు. ఈ ఏడాది త్రిపుర జట్టుతో జతకట్టేందుకు సిద్దమైనట్లు తెలిపాడు. కాగా మరో పంజాబీ బ్యాటర్ జీవన్జ్యోత్ సింగ్ కూడా ఈసారి త్రిపురకు ప్రాతినిథ్యం వహించనున్నాడు. -
Ind vs SL: సెంచరీలు చేసినా పట్టించుకోరా?
శ్రీలంకలో పర్యటించనున్న భారత క్రికెట్ జట్టు ఎంపిక తీరుపై మాజీ ఆటగాడు హర్భజన్ సింగ్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. ప్రతిభ ఉన్న ఆటగాళ్లను ఎందుకు పక్కన పెట్టారో అర్థం కావడం లేదని సెలక్టర్ల విధానాన్ని విమర్శించాడు.కాగా టీ20 ప్రపంచకప్-2024లో చాంపియన్గా నిలిచిన తర్వాత టీమిండియా ద్వితీయ శ్రేణి జట్టు జింబాబ్వే పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా శుబ్మన్ గిల్ కెప్టెన్సీలో జరిగిన ఐదు మ్యాచ్ల సిరీస్ను 4-1తో గెలిచింది.ఇక ఈ టూర్ ద్వారానే ఐపీఎల్ వీరులు అభిషేక్ శర్మ, రియాన్ పరాగ్ వంటి వాళ్లు అరంగేట్రం చేశారు. తన రెండో అంతర్జాతీయ మ్యాచ్లోనే అభిషేక్ సెంచరీతో మెరవగా.. రియాన్ మాత్రం ఆకట్టుకోలేకపోయాడు.ఇదిలా ఉంటే.. జింబాబ్వే పర్యటన తర్వాత టీమిండియా శ్రీలంకతో ద్వైపాక్షిక సిరీస్కు సిద్ధమైంది. జూలై 27 నుంచి మూడు టీ20, మూడు వన్డే మ్యాచ్లు ఆడనుంది. ఇక ఈ సిరీస్ ద్వారానే టీమిండియా హెడ్ కోచ్గా గౌతం గంభీర్ ఎంట్రీ ఇవ్వనున్నాడు.ఈ నేపథ్యంలో గురువారం టీ20, వన్డే జట్లను ప్రకటించారు. ఇందులో అనూహ్యంగా రియాన్ పరాగ్ రెండు జట్లలో చోటు దక్కించుకోగా.. అభిషేక్ శర్మకు మాత్రం స్థానం దక్కలేదు.సెంచరీలు చేసినా పట్టించుకోరా?అదే విధంగా.. సంజూ శాంసన్కు వన్డేల్లో చోటివ్వలేదు సెలక్టర్లు. అంతేకాదు మేటి స్పిన్నర్ యజువేంద్ర చహల్ను కూడా పక్కనపెట్టేశారు.ఈ నేపథ్యంలో టీమిండియా దిగ్గజ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ఎక్స్ వేదికగా స్పందించాడు. ‘‘శ్రీలంకతో సిరీస్లకు ఎంపిక చేసిన జట్టులో యుజీ చహల్, అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ ఎందుకు భాగం కాలేకపోయారో నాకైతే అర్థం కావడం లేదు’’ అంటూ షాకింగ్ ఎమోజీ జతచేశాడు భజ్జీ.కాగా సంజూ శాంసన్ జింబాబ్వేతో సిరీస్లో ఆడగా.. లంకతో టీ20 జట్టులో మాత్రమే చోటు లభించింది. ఇక వన్డేల విషయానికొస్తే చివరగా.. సౌతాఫ్రికాతో మ్యాచ్ ఆడాడు.ఖేల్ ఖతమేనా?పర్ల్ వేదికగా గతేడాది డిసెంబరులో ఆడిన తన చివరి వన్డేలో సంజూ సెంచరీతో చెలరేగి టీమిండియాకు విజయం అందించాడు. అయినప్పటికీ ఈ కేరళ బ్యాటర్కు సెలక్టర్లు మొండిచేయి చూపడం గమనార్హం. దీనిని బట్టి అతడిని చాంపియన్స్ ట్రోఫీ-2025 టోర్నీకి కూడా పరిగణనలోకి తీసుకోరని సంకేతాలు ఇచ్చినట్లే అనిపిస్తోంది. ఈ నేపథ్యంలో చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్, కొత్త హెడ్ కోచ్ గౌతం గంభీర్పై విమర్శలు వస్తున్నాయి. ఇక ఈ ఐసీసీ ఈవెంట్కు ముందు టీమిండియా లంక, ఇంగ్లండ్లతో వన్డే సిరీస్లు ఆడనుంది.చదవండి: Ind vs SL: టీమిండియా అసిస్టెంట్ కోచ్లుగా వాళ్లిద్దరు.. దిలీప్ రీఎంట్రీ! -
ఇంత చెత్తగా వ్యవహరిస్తారా? యువీ, భజ్జీపై విమర్శలు
భారత ‘దిగ్గజ’ క్రికెటర్లు యువరాజ్ సింగ్, హర్భజన్ సింగ్, సురేశ్ రైనా తీరుపై పారాలింపిక్ కమిటీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. లెజెండ్స్ నుంచి ఇలాంటి అమానుషమైన, చెత్త ప్రవర్తనను ఊహించలేదంటూ ఘాటుగా విమర్శించింది.క్రికెట్ సెలబ్రిటీలుగా సానుకూల దృక్పథాన్ని వ్యాప్తి చేయాల్సింది పోయి.. ఇలా బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడం సరికాదని హితవు పలికింది. అనుచితంగా వ్యవహరించిన కారణంగా వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది.వరల్డ్ చాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ విజేతగా భారత్విషయం ఏమిటంటే.. ఇంగ్లండ్ వేదికగా వరల్డ్ చాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ లీగ్ను నిర్వహించారు. ఇందులో పాల్గొన్న ఇండియా చాంపియన్స్ జట్టుకు యువరాజ్ సింగ్ కెప్టెన్గా వ్యవహరించగా.. హర్భజన్ సింగ్, రాబిన్ ఊతప్ప, సురేశ్ రైనా తదితరులు సభ్యులుగా ఉన్నారు.ఇక ఈ టీ20 టోర్నీలో భారత్- పాకిస్తాన్ చాంపియన్స్ ఫైనల్కు చేరగా.. యువీ సేన గెలుపొందింది. వరల్డ్ చాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ 2024 అరంగేట్ర టైటిల్ కైవసం చేసుకుంది.ఈ సంతోషాన్ని సెలబ్రేట్ చేసుకునే క్రమంలో యువీ, భజ్జీ, రైనా కాస్త అత్యుత్సాహం ప్రదర్శించారు. ‘‘లెజెండ్స్ క్రికెట్లో పదిహేను రోజుల పాటు ఒళ్లు హూనమైంది. శరీరంలోని ప్రతీ అవయవం నొప్పితో విలవిల్లాడుతోంది’’ బాలీవుడ్ స్టార్ విక్కీ కౌశల్ పాట తౌబ.. తౌబకు తమ స్టెప్పులు ఇలాగే ఉంటాయంటూ కుంటుతూ నడుస్తున్నట్లుగా అభినయించారు.అనుచిత ప్రవర్తనఈ వీడియో వైరల్కాగా పారాలింపిక్ ఇండియా కమిటీ తీవ్రంగా స్పందించింది. ‘‘ఏమాత్రం సున్నితత్వం లేని అనుచిత ప్రవర్తన ఇది. క్రికెట్ స్టార్ సెలబ్రిటీలుగా సానుకూల దృక్పథంతో ముందుకు సాగేలా మీ ప్రవర్తన ఉండాలి.కానీ ఇతరుల వైకల్యాన్ని ఎత్తిచూపేలా ఇలా గంతులు వేయడం బాధ్యతారాహిత్యం. ఇదేమైనా జోక్ అనుకుంటున్నారా? దివ్యాంగుల పట్ల వివక్ష చూపడమే ఇది. ఇలాంటి చర్యలకు పాల్పడ్డందుకు వెంటనే క్షమాపణలు చెప్పండి’’ అని పారాలింపిక్ ఇండియా కమిటీ చురకలు అంటించింది.ప్రముఖ పారా అథ్లెట్, బ్యాడ్మింటన్ స్టార్ మానసి జోషీ సైతం యువరాజ్, భజ్జీ, రైనా తీరును తప్పుబట్టారు. అయితే, ఈ ముగ్గురిలో ఎవరూ కూడా తమపై వస్తున్న విమర్శలకు ఇంతవరకు స్పందించలేదు. అయితే, విమర్శల నేపథ్యంలో యువీ ఈ వీడియోను డిలీట్ చేయడం గమనార్హం.చదవండి: T20I Captain: టీమిండియా టీ20 కెప్టెన్గా వాళ్లిద్దరి మధ్యే పోటీ View this post on Instagram A post shared by Harbhajan Turbanator Singh (@harbhajan3) -
కోహ్లి, రోహిత్, ధోని కాదు.. ప్రపంచంలో వాళ్లే టాప్ బ్యాటర్స్: భజ్జీ
వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ 2024 టోర్నీ విజేతగా ఇండియా ఛాంపియన్స్ నిలిచిన సంగతి తెలిసిందే. ఈ విజయంలో భారత క్రికెట్ జట్టు మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ది కీలక పాత్ర. టోర్నీ ఆసాంతం తన స్పిన్ మయాజాలం ప్రదర్శించిన భజ్జీ.. ఇండియాకు తొట్ట తొలి టైటిల్ను అందించాడు.అయితే మ్యాచ్ అనంతరం మాట్లాడిన హార్భజన్కు ఓ మహిళా ప్రేజేంటర్ నుంచి ఓ అనూహ్య ప్రశ్న ఎదురైంది. వరల్డ్ క్రికెట్లో టాప్ త్రీ బ్యాటర్లను ఎంచుకోమని ఆమె భజ్జీని ప్రశ్నించింది. ఈ క్రమంలో హార్భజన్ ప్రస్తుతం తరంలోని ఒక్క క్రికెటర్కు కూడా తన టాప్ త్రీలో చోటు ఇవ్వలేదు.భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, వెస్టిండీస్ గ్రేట్ బ్రియాన్ లారా, దక్షిణాఫ్రికా లెజెండ్ జాక్వెస్ కల్లిస్ను తన వరల్డ్ టాప్ త్రీ బ్యాటర్లగా భజ్జీ ఎంచుకున్నాడు. అయితే భారత స్టార్ క్రికెటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలతో పాటు భారత్కు రెండు వరల్డ్కప్ టైటిల్స్ను అందించిన ధోనిని కూడా హార్భజన్ ఎంపిక చేయకపోవడం గమనార్హం.మరో భారత మాజీ క్రికెటర్ రాబిన్ ఉతప్ప కూడా తన టాప్-3 బ్యాటర్లలో విరాట్ కోహ్లి, రోహిత్ , ధోనిలకు చోటు ఇవ్వలేదు. అతడు కూడా సర్ వివియన్ రిచర్డ్స్, టెండూల్కర్, లారాలను తన టాప్-3 బ్యాటర్లగా ఎంచుకున్నాడు. View this post on Instagram A post shared by Shefali Bagga (@shefalibaggaofficial) -
44వ పడిలోకి అడుగుపెట్టిన భజ్జీ (ఫొటోలు)
-
T20 WC: ఈసారి ఫైనలిస్టులు ఈ జట్లే: భజ్జీ కామెంట్స్ వైరల్
పొట్టి క్రికెట్ తాజా ప్రపంచకప్ సమరం తుది అంకానికి చేరుకుంది. మరో రెండు నాలుగు రోజుల్లో వరల్డ్కప్-2024 టోర్నీకి తెరపడనుంది. ఇప్పటికే గ్రూప్-1 నుంచి టీమిండియా, అఫ్గనిస్తాన్.. అదే విధంగా గ్రూప్-2 నుంచి సౌతాఫ్రికా, ఇంగ్లండ్ సెమీ ఫైనల్ చేరిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలో తొలి సెమీస్ మ్యాచ్లో సౌతాఫ్రికా- అఫ్గనిస్తాన్ ట్రినిడాడ్ వేదికగా.. రెండో సెమీ ఫైనల్లో టీమిండియా- ఇంగ్లండ్ గయానా వేదికగా తలపడనున్నాయి. ఈ రెండు మ్యాచ్లు భారత కాలమానం ప్రకారం గురువారమే జరుగనున్నాయి.తొలి మ్యాచ్ ఉదయం ఆరు గంటలకు ప్రారంభం కానుండగా.. రిజర్వ్ డే కూడా ఉంది. ఇక రెండో సెమీ ఫైనల్ రాత్రి ఎనిమిది గంటలకు మొదలుకానుంది. ఈ మ్యాచ్కు మాత్రం రిజర్వ్ డే లేదు.కాగా చాలా మంది మాజీ క్రికెటర్లు ఊహించినట్లుగానే ఈసారి టీమిండియా, ఇంగ్లండ్, సౌతాఫ్రికా సెమీస్ చేరగా.. అనూహ్య రీతిలో అఫ్గనిస్తాన్ కూడా రేసులోకి దూసుకువచ్చింది. అందరి అంచనాలు తలకిందులు చేస్తూ ఆస్ట్రేలియాను వెనక్కి నెట్టి సెమీస్ బెర్తు ఖరారు చేసుకుంది.ఈ నేపథ్యంలో టీమిండియా స్పిన్ దిగ్గజం హర్భజన్ సింగ్ చేసిన వ్యాఖ్యలు వైరల్గా మారాయి. టీ20 ప్రపంచకప్-2024 ఫైనలిస్టులను అంచనా వేస్తూ.. ‘‘ఈసారి వాళ్లు కూడా ఫైనల్కు వస్తారనే అనిపిస్తోంది.ఏదేమైనా టీమిండియానే ట్రోఫీ గెలుస్తుంది’’ అని పేర్కొన్నాడు. అఫ్గనిస్తాన్ జట్టును ఉద్దేశించి భజ్జీ ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు. తుదిపోరులో భారత్తో అఫ్గన్ తలపడే అవకాశం ఉందని.. రోహిత్ సేన ఈ మ్యాచ్లో గెలుస్తుందని తన అభిప్రాయం వెల్లడించాడు. కాగా జూన్ 29న వరల్డ్కప్-2024 ఫైనల్ మ్యాచ్ జరుగనుంది. బార్బడోస్లోని బ్రిడ్జ్టౌన్లో గల కెన్సింగ్టన్ ఓవల్ మైదానం ఇందుకు వేదిక. -
పాకిస్తాన్ను వీడి.. ఇండియా హెడ్కోచ్గా వచ్చెయ్: భజ్జీ
పాకిస్తాన్ క్రికెట్ జట్టు ప్రధాన కోచ్గా బాధ్యతలు చేపట్టిన గ్యారీ కిర్స్టన్కు తొలి మెగా టోర్నీలోనే చేదు అనుభవం ఎదురైంది. టీ20 ప్రపంచకప్-2024లో పాక్ లీగ్ దశలోనే నిష్క్రమించింది.ఆతిథ్య అమెరికా, చిరకాల ప్రత్యర్థి టీమిండియా చేతిలో ఓడి పరాభవాన్ని మూటగట్టుకుంది. గ్రూప్-ఏలో మిగిలిన కెనడా, ఐర్లాండ్లపై గెలిచినా సూపర్-8 రేసులో అమెరికాతో పోటీ పడలేక ఇంటిబాట పట్టింది.గత టీ20 వరల్డ్కప్లో రన్నరప్గా నిలిచిన బాబర్ ఆజం ఈసారి ఇలా పూర్తిగా విఫలం కావడంతో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బాబర్- షాహిన్ ఆఫ్రిది మధ్య విభేదాలతో జట్టు రెండుగా చీలిందనే ఆరోపణలు వస్తున్నాయి.ఈ నేపథ్యంలో గ్యారీ కిర్స్టన్ సైతం జట్టులో ఐక్యత లోపించినందు వల్లే ఇలాంటి చెత్త ఫలితాలు వచ్చాయని ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. తాను ఎన్నో జట్లకు మార్గదర్శనం చేశానని.. అయితే, ఇంత చెత్త జట్టును చూడలేదని గ్యారీ మండిపడినట్లు తెలుస్తోంది.టీమిండియా కోచ్గా వచ్చెయ్ఈ క్రమంలో టీమిండియా స్పిన్ దిగ్గజం హర్భజన్ సింగ్ ఆసక్తికర ట్వీట్ చేశాడు. పాక్ను వదిలేసి కిర్స్టన్ ఇండియా హెడ్ కోచ్గా రావాలని ఆకాంక్షించాడు. ఈ మేరకు.. ‘‘అనవసరంగా నీ సమయాన్ని అక్కడ వృథా చేసుకోకు గ్యారీ.టీమిండియా కోచ్గా వచ్చెయ్. గ్యారీ కిర్స్టెన్.. అరుదైన వజ్రం, గొప్ప కోచ్లలో ఒకడు. మెంటార్, నిజాయితీ గల వ్యక్తి.. అంతేకాదు 2011 వరల్డ్కప్ గెలిపించిన కోచ్.2011 నాటి జట్టులో అందరికీ ప్రియమైన స్నేహితుడు కూడా! గ్యారీ ప్రత్యేకమైన వ్యక్తి’’ అని భజ్జీ ఎక్స్ వేదికగా తన మనసులోని భావాలు పంచుకున్నాడు. ఇందుకు సంబంధించిన ట్వీట్ వైరల్ కాగా.. నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు.గౌతం గంభీర్ పేరు ఖరారు!ఇప్పటికే రాహుల్ ద్రవిడ్ స్థానంలో టీమిండియా హెడ్కోచ్గా గౌతం గంభీర్ పేరు ఖరారు కాగా.. భజ్జీ ఇలా పోస్ట్ పెట్టడంలో అర్థమేంటని ప్రశ్నిస్తున్నారు. గంభీర్ను వ్యతిరేకిస్తూ.. విదేశీ కోచ్ వైపే మొగ్గుచూపాలని బీసీసీఐకి సంకేతాలు ఇస్తున్నాడా అని సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.కాగా సౌతాఫ్రికా మాజీ బ్యాటర్ గ్యారీ కిర్స్టన్ గతంలో టీమిండియా ప్రధాన కోచ్గా పనిచేశాడు. మహేంద్ర సింగ్ ధోని సారథ్యంలో 2011లో భారత్ వన్డే వరల్డ్కప్ గెలిచినపుడు అతడే కోచ్గా ఉన్నాడు. ఇక భజ్జీతో పాటు గంభీర్ కూడా ఈ జట్టులో సభ్యుడన్న విషయం తెలిసిందే.ఇదిలా ఉంటే.. వరల్డ్కప్-2024లో భారత జట్టు సూపర్-8కు చేరింది. ఇందులో భాగంగా అఫ్గనిస్తాన్తో గురువారం తమ తొలి మ్యాచ్ఆడనుంది.చదవండి: Suryakumar Yadav: వరల్డ్ నంబర్ వన్గా ఉన్నా.. సూర్య కీలక వ్యాఖ్యలు Don’t waste ur time there Gary .. Come back to Coach Team INDIA .. Gary Kirsten One of the rare 💎.. A Great Coach ,Mentor, Honest nd very dear friend to all in the our 2011 Team .. our winning coach of 2011 worldcup . Special man Gary ❤️ @Gary_Kirsten https://t.co/q2vAZQbWC4— Harbhajan Turbanator (@harbhajan_singh) June 17, 2024 -
T20 WC 2024: వరల్డ్కప్ తుదిజట్టులో పంత్కు నో ఛాన్స్!
టీ20 ప్రపంచకప్-2024 నేపథ్యంలో టీమిండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తుదిజట్టు ఎంపికలో అత్యుత్తమ ఫామ్ ఆధారంగానే ఆటగాళ్లను పరిగణనలోకి తీసుకోవాలని టీమిండియా మేనేజ్మెంట్కు సూచించాడు.కాగా వరల్డ్కప్-2024కు అమెరికా- వెస్టిండీస్ ఆతిథ్యం ఇస్తున్న విషయం తెలిసిందే. గ్రూపు-ఏలో ఉన్న భారత జట్టు లీగ్ దశలో తమ మ్యాచ్లన్నీ అమెరికాలోనే ఆడనుంది. ఇక ఇందుకోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి ఇప్పటికే 15 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది.రోహిత్ శర్మ సారథ్యంలోని ఈ టీమ్లో వికెట్ కీపర్ కోటాలో రిషభ్ పంత్, సంజూ శాంసన్ చోటు దక్కించుకోగా.. కేఎల్ రాహుల్కు మొండిచేయి ఎదురైంది. ఐపీఎల్-2024లో సంజూ రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్,బ్యాటర్గా అత్యుత్తమంగా రాణించి తన బెర్తును ఖరారు చేసుకోగా.. పంత్ ఐపీఎల్ తర్వాత నేరుగా దాదాపు ఏడాదిన్నర తర్వాత టీమిండియా తరఫున బరిలో దిగనున్నాడు.ఈ నేపథ్యంలో ప్రపంచకప్ ఆడే భారత తుదిజట్టులో పంత్ను కాదని సంజూ శాంసన్కు చోటిచ్చాడు హర్భజన్ సింగ్. స్టార్ స్పోర్ట్స్ షో గేమ్ ప్లాన్లో భాగంగా.. తన ప్లేయింగ్ ఎలెవన్ను ఎంచుకున్న భజ్జీ ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు.‘‘నా అభిప్రాయం ప్రకారం.. రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్తో కలిసి ఓపెనింగ్ చేయాలి. వన్డౌన్లో విరాట్ కోహ్లి రావాలి. ఆ తర్వాత సూర్యకుమార్ యాదవ్.అనంతరం సంజూ శాంసన్. అతడు మంచి ఫామ్లో ఉన్నాడు కాబట్టి తననే ఆడించాలి. ఇక ఆరో స్థానంలో హార్దిక్ పాండ్యా.. ఏడో నంబర్లో రవీంద్ర జడేజా. యజువేంద్ర చహల్ను కూడా తప్పకుండా ఆడించాలి.అతడితో పాటు ముగ్గురు సీమర్లు అర్ష్దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్.. వీళ్లంతా తుదిజట్టులో ఉండాలి’’ అని హర్భజన్ సింగ్ తన అభిప్రాయాలు పంచుకున్నాడు.అయితే, పిచ్ గనుక స్పిన్కు మరీ అంత అనుకూలంగా లేదని భావిస్తే.. అదనపు స్పిన్నర్ను వదిలేసి అతడి స్థానంలో శివం దూబేను ఆడించాలని భజ్జీ సూచించాడు. ఈ పేస్ ఆల్రౌండర్ జట్టుతో ఉంటే బ్యాటింగ్ ఆర్డర్ ఇంకాస్త పటిష్టంగా మారుతుందని పేర్కొన్నాడు. తన దృష్టిలో కుల్దీప్ యాదవ్ అదనపు స్పిన్నర్ మాత్రమేనని హర్భజన్ పేర్కొన్నాడు.చదవండి: T20 World Cup 2024: పొట్టి ప్రపంచకప్ విశేషాలు, రికార్డులు -
టీమిండియా చాంపియన్స్ కెప్టెన్గా యువరాజ్ సింగ్
ఈ ఏడాది మరో సరికొత్త టీ20 లీగ్ పురుడు పోసుకోనుంది. ఇంగ్లండ్ వేదికగా వరల్డ్ చాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ పేరిట టోర్నీ మొదలుకానుంది. బాలీవుడ్కు చెందిన ప్రముఖ సినీ, సంగీత సంస్థ ఇంగ్లండ్ క్రికెట్బోర్డు సాయంతో ఈ టోర్నమెంట్కు శ్రీకారం చుట్టింది.రిటైర్డ్ ప్లేయర్లు, నాన్- కాంట్రాక్ట్ ఆటగాళ్లు ఈ లీగ్లో భాగం కానున్నారు. టీమిండియా చాంపియన్స్ సహా ఆరు జట్లు ఇందులో పాల్గొననున్నాయి. జూలై 3 నుంచి 13 వరకు యూకేలో ఈ టీ20 టోర్నీ నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది.కెప్టెన్గా యువరాజ్ సింగ్ఈ క్రమంలో టీమిండియా చాంపియన్స్ తమ జట్టును ప్రకటించింది. సిక్సర్ల కింగ్, 2007(టీ20), 2011(వన్డే) వరల్డ్కప్స్ విజేత యువరాజ్ సింగ్ ఈ టీమ్కు కెప్టెన్గా ఎంపికయ్యాడు. సురేశ్ రైనా, పఠాన్ బ్రదర్స్, ఆర్పీ సింగ్ తదితరులు ఈ జట్టులో చోటు దక్కించుకున్నారు.కాగా టీమిండియాతో పాటు వరల్డ్ చాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ లీగ్లో ఆస్ట్రేలియా చాంపియన్స్, ఇంగ్లండ్ చాంపియన్స్, సౌతాఫ్రికా చాంపియన్స్, పాకిస్తాన్ చాంపియన్స్, వెస్టిండీస్ చాంపియన్స్ ఆడనున్నాయి.టీమిండియా చాంపియన్స్ జట్టు: యువరాజ్ సింగ్ (కెప్టెన్), సురేశ్ రైనా, ఇర్ఫాన్ పఠాన్, యూసుఫ్ పఠాన్, రాబిన్ ఉతప్ప, అంబటి రాయుడు, గురుక్రీత్ మాన్, హర్భజన్ సింగ్, రాహుల్ శర్మ, నమన్ ఓజా, రాహుల్ శుక్లా, ఆర్పీ సింగ్, వినయ్ కుమార్, ధవల్ కులకర్ణి.టీమిండియా చాంపియన్స్ షెడ్యూల్జూలై 2న ఇంగ్లండ్, జూలై 5న వెస్టిండీస్, జూలై 6న పాకిస్తాన్, జూలై 8న ఆస్ట్రేలియా, జూలై 10న సౌతాఫ్రికా చాంపియన్స్తో టీమిండియా చాంపియన్స్ తలపడనుంది. జూలై 12న సెమీస్ జరుగనుండగా.. జూలై 13న ఫైనల్కు ముహూర్తం ఖరారైంది.చదవండి: WC: పక్కా టీ20 టైప్.. న్యూయార్క్ పిచ్ వెనుక ఇంత కథ ఉందా? ద్రవిడ్తో కలిసి -
హార్దిక్ తప్పేం లేదు.. అంతా సీనియర్ల వల్లే: ముంబై మాజీ కెప్టెన్
‘‘ముంబై ఇండియన్స్ స్టార్ ఆటగాళ్లతో కూడిన జట్టు. నేను పదేళ్ల పాటు ఆ జట్టుకు ఆడాను. ముంబై మేనేజ్మెంట్ టీమ్ను చాలా బాగా చూసుకుంటుంది. అయితే, ఈసారి వాళ్లు తీసుకున్న నిర్ణయం బెడిసికొట్టింది. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకునే వారు కెప్టెన్ను మార్చారు. కానీ.. వాళ్లు అనుకున్నట్లుగా ఏదీ జరుగలేదు.జట్టు ఏకతాటిపై ఉన్నట్లు కనిపించలేదు. ఎవరికి వారే అన్నట్లు విడివిడిగా ఉన్నట్లు అనిపించింది. ముంబై లాంటి జట్టు ఇలా పేలవంగా ఆడటం నన్ను బాధించింది.కెప్టెన్ను మార్చాలనే నిర్ణయం సరైందే అయినా.. అందుకు మరో ఏడాది వేచి చూడాల్సింది. ఇందులో హార్దిక్ పాండ్యా తప్పేం లేదు. గుజరాత్ టైటాన్స్లో ఉన్నపుడు అతడి కెప్టెన్సీ అద్భుతంగా ఉంది.నిజానికి.. కెప్టెన్ ఎవరైనా.. సీనియర్లంతా కలిసి జట్టును ఒక్కటిగా ఉంచాల్సింది. కెప్టెన్లు వస్తారూ.. పోతారు. జట్టు మాత్రం ఒక్కతాటిపై ఉండాలి కదా!ఈసారి వాళ్లు జట్టులా ఆడినట్లు ఏ కోశానా కనిపించలేదు’’ అని టీమిండియా స్పిన్ దిగ్గజం హర్భజన్ సింగ్ అన్నాడు. ఐపీఎల్-2024లో ముంబై ఇండియన్స్ దారుణ వైఫల్యం పట్ల విచారం వ్యక్తం చేశాడు.కాగా ఈ సీజన్ ఆరంభానికి ముందు ముంబై ఇండియన్స్ రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి తప్పించి.. గుజరాత్ టైటాన్స్ నుంచి ట్రేడ్ చేసుకున్న హార్దిక్ పాండ్యాకు పగ్గాలు అప్పగించింది. దీంతో సొంత జట్టు అభిమానుల నుంచే తీవ్ర విమర్శలు ఎదుర్కొంది.అదే విధంగా హార్దిక్ పాండ్యాకు సైతం స్టేడియంలో, సోషల్ మీడియాలో అభిమానుల ఆగ్రహ జ్వాలల సెగ తగిలింది. అందుకు తగ్గట్లుగానే ముంబై వరుస మ్యాచ్లలో ఓడిపోవడం.. ఆఖరికి ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించిన తొలి జట్టుగా నిలవడంతో ఫ్యాన్స్ మరోసారి రెచ్చిపోయారు.ఇక ఓవరాల్గా ఈ ఎడిషన్లో ముంబై ఆడిన పద్నాలుగింట కేవలం నాలుగు మాత్రమే గెలిచి పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది. ఈ పరిణామాల నేపథ్యంలో ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ హర్భజన్ సింగ్ వార్తా సంస్థ ANIతో మాట్లాడుతూ పైవిధంగా స్పందించాడు.జట్టు రెండు వర్గాలుగా విడిపోవడానికి సీనియర్లే కారణమంటూ పరోక్షంగా రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్లను టార్గెట్ చేశాడు. హార్దిక్ పాండ్యాకు మద్దతు తెలిపే క్రమంలో భజ్జీ జట్టు వైఫల్యాలకు సీనియర్లను బాధ్యులుగా చూపే ప్రయత్నం చేశాడు.చదవండి: KKR vs SRH: ప్రమాదకారి.. ఫైనల్ చేరే తొలి జట్టు ఇదే: పాక్ లెజెండ్#WATCH | On Hardik Pandya's captaining Mumbai Indians in IPL 2024, former Indian cricketer Harbhajan Singh says "I have played with Mumbai Indians for 10 years. The team management is great but this decision has backfired them. The management was thinking about the future while… pic.twitter.com/pGNW5gIRF5— ANI (@ANI) May 21, 2024 -
IPL 2024: సన్రైజర్స్ ప్లే ఆఫ్స్ చేరదు.. ఆ నాలుగు జట్లే! ఫ్యాన్స్ ఫైర్
ఐపీఎల్-2024 ప్లే ఆఫ్స్ రేసు రసవత్తరంగా సాగుతోంది. లీగ్ దశ ముగింపునకు వచ్చినా టాప్-4 బెర్తులపై ఇంత వరకూ స్పష్టత రాలేదు. కోల్కతా నైట్ రైడర్స్, రాజస్తాన్ రాయల్స్ ఇప్పటికే ప్లే ఆఫ్స్ చేరగా.. మిగిలిన రెండు స్థానాల కోసం ఆసక్తికర పోటీ నడుస్తోంది.ప్రస్తుతం మూడో స్థానంలో ఉన్న చెన్నై సూపర్ కింగ్స్, సన్రైజర్స్ హైదరాబాద్ ఈ రేసులో ముందుండగా.. రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు కూడా ఆశలు ఇంకా సజీవంగానే ఉన్నాయి.చెన్నై ఇప్పటికి 13 మ్యాచ్లు ఆడి ఏడింట గెలిచి 14 పాయింట్లు(నెట్ రన్రేటు 0.528) సాధించగా.. పన్నెండు ఆడి ఏడింట గెలిచి 14 పాయింట్లతో ఉన్న సన్రైజర్స్ నెట్ రన్రేటు (0.406) పరంగా కాస్త వెనుకబడి ప్రస్తుతం నాలుగో స్థానంలో ఉంది.అతిపెద్ద సానుకూలాంశంఅయితే, రైజర్స్కు ఇంకా రెండు మ్యాచ్లు మిగిలి ఉండటం.. అది కూడా సొంతగడ్డపై జరుగనుండటం అతిపెద్ద సానుకూలాంశం. గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్తో మ్యాచ్లలో ఏదో ఒకటి గెలిచినా 16 పాయింట్లతో కనీసం నాలుగో స్థానం ఖరారు చేసుకుంటుంది.మరోవైపు.. ఆర్సీబీ ఖాతాలో 12 పాయింట్లే ఉన్నాయి. మిగిలింది ఇంకొక్క మ్యాచ్. అది కూడా సీఎస్కే(మే 18)తో! ఈ మ్యాచ్లో చెన్నైని కచ్చితంగా ఓడిస్తేనే ఆర్సీబీకి అవకాశం ఉంటుంది. లేదంటే ఇంటికి వెళ్లడమే తరువాయి!చెన్నై పరిస్థితి కూడా ఇంచుమించు ఇదే. ఓడితే ఇంటికే లేదంటే సన్రైజర్స్ మ్యాచ్ల ఫలితం తేలేవరకు వేచి చూడాలి. ఈ సమీకరణల నేపథ్యంలో ఎలా చూసినా సన్రైజర్స్ సీఎస్కే, ఆర్సీబీ కంటే ఓ మెట్టు పైనే ఉన్నట్లు స్పష్టమవుతోంది.రెండు మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ ఓడిపోతే పరిస్థితి ఏంటి?అయితే, టీమిండియా స్పిన్ దిగ్గజం హర్భజన్ సింగ్ మాత్రం సన్రైజర్స్ హైదరాబాద్ ఈసారి ప్లే ఆఫ్స్ చేరదంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. స్టార్ స్పోర్ట్స్ షోలో తన అభిప్రాయాలు పంచుకుంటూ.. చెన్నై సూపర్ కింగ్స్తో పాటు ఆర్సీబీ టాప్-4లో అడుగుపెడుతుందని జోస్యం చెప్పాడు.‘‘తదుపరి రెండు మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ ఓడిపోతే పరిస్థితి ఏంటి? ఐపీఎల్లో ఏదైనా జరగొచ్చు కదా! ఒకవేళ హైదరాబాద్ రెండు మ్యాచ్లూ ఓడి.. ఆర్సీబీ చెన్నై మీద గెలిస్తే.. అప్పుడు రెండు జట్ల ఖాతాలో 14 పాయింట్లే ఉంటాయి.రన్రేటు పరంగా సన్రైజర్స్ కంటే ఈ రెండు జట్లు మెరుగ్గానే ఉంటాయి. అందుకే నా టాప్ 4.. కేకేఆర్, రాజస్తాన్, చెన్నై, బెంగళూరు’’ అని హర్భజన్ సింగ్ చెప్పుకొచ్చాడు.భగ్గుమంటున్న ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్కాగా భజ్జీ వ్యాఖ్యలపై సన్రైజర్స్ హైదరాబాద్ అభిమానులు భగ్గుమంటున్నారు. విధ్వంసకర బ్యాటింగ్తో సొంతగడ్డపై చెలరేగే ప్యాట్ కమిన్స్ బృందాన్ని తక్కువ అంచనా వేయడమే గాకుండా.. అపశకునపు మాటలు మాట్లాడటం సరికాదంటూ ఫైర్ అవుతున్నారు. ఇక సన్రైజర్స్ గురువారం నాటి మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్తో తలపడనుంది. ఉప్పల్లోని రాజీవ్గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం ఇందుకు వేదిక.చదవండి: అతడి కంటే చెత్త కెప్టెన్ ఇంకొకరు లేరు.. పైగా హార్దిక్ను అంటారా?.. గంభీర్ ఫైర్ Ready to put on a show this evening 🧡💙#PlayWithFire #SRHvGT pic.twitter.com/o07Or5fu12— SunRisers Hyderabad (@SunRisers) May 16, 2024 -
Virat Kohli: ఆర్సీబీ కెప్టెన్గా మళ్లీ కోహ్లినే!
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు.. 2008 నుంచి ఇప్పటి దాకా.. ఇంత వరకు ఒక్కసారి కూడా ఐపీఎల్ టైటిల్ గెలవలేదు. అయినప్పటికీ ఆ జట్టుకు ఉన్న అభిమాన గణం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆర్సీబీకి ఉన్నంత విశ్వసనీయమైన ఫ్యాన్ బేస్ మరే జట్టుకు లేదంటారు.నాయకుడి స్థానం నుంచి వైదొలిగిఇంతటి క్రేజ్కు కారణం టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి అన్న విషయం తెలిసిందే. ఇక్కడే తన ఫ్రాంఛైజీ క్రికెట్ మొదలుపెట్టిన ఈ రన్మెషీన్.. ఇప్పటికీ ఆ జట్టుతోనే కొనసాగుతున్నాడు. ఈ క్రమంలోనూ కెప్టెన్గానూ బాధ్యతలు చేపట్టిన కోహ్లి పనిఒత్తిడిని తగ్గించుకుని.. కేవలం బ్యాటింగ్పై ఫోకస్ చేసే క్రమంలో నాయకుడి స్థానం నుంచి 2021 తర్వాత తప్పుకొన్నాడు.గత రెండు సీజన్లుగా సౌతాఫ్రికా స్టార్ ఫాఫ్ డుప్లెసిస్ ఆర్సీబీ కెప్టెన్గా కొనసాగుతుండగా.. కోహ్లి ఓపెనింగ్ బ్యాటర్గా సేవలు అందిస్తున్నాడు. అయితే, అతడి సారథ్యంలో గతేడాది ఆరో స్థానంతో ముగించిన ఆర్సీబీ.. ఐపీఎల్-2024 ఆరంభంలో వరుస ఓటములు చవిచూసింది.వరుసగా ఐదు విజయాలు సాధించితర్వాత తిరిగి పుంజుకుని వరుసగా ఐదు విజయాలు సాధించి.. ప్రస్తుతానికి ప్లే ఆఫ్స్ ఆశలు సజీవం చేసుకుంది. అయితే, కేజీఎఫ్గా ప్రసిద్ధి పొందిన ఆర్సీబీ బ్యాటింగ్ త్రయం కోహ్లి, గ్లెన్ మాక్స్వెల్, ఫాఫ్లలో కేవలం కోహ్లి ఒక్కడే రాణిస్తున్నాడు.ఇప్పటి వరకు ఈ ఎడిషన్లో ఆడిన 13 మ్యాచ్లలో కలిపి 661 పరుగులు చేసిన కోహ్లి ఆరెంజ్ క్యాప్ హోల్డర్గా కొనసాగుతున్నాడు. అయితే, జట్టును ప్లే ఆఫ్స్ చేర్చడం మాత్రం కష్టంగా మారింది.ఈ నేపథ్యంలో టీమిండియా స్పిన్ దిగ్గజం, ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ హర్భజన్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వచ్చే సీజన్లో విరాట్ కోహ్లిని మళ్లీ కెప్టెన్గా ప్రకటించాలని ఆర్సీబీ మేనేజ్మెంట్కు సూచించాడు.ఆర్సీబీకి కోహ్లి కూడా అలాగేఈ మేరకు.. "ఈసారి వాళ్లు(ఆర్సీబీ గనుక ) ప్లే ఆఫ్స్నకు అర్హత సాధించకపోతే.. భారత క్రికెటర్ను కెప్టెన్గా తీసుకురావాలి. అయినా ఎవరో ఎందుకు? మళ్లీ కోహ్లినే కెప్టెన్ను చేస్తే సరిపోతుంది కదా! చెన్నై జట్టు మీద ధోని ప్రభావం ఎంత ఉంటుందో.. ఆర్సీబీకి కోహ్లి కూడా అలాగే!బలమైన నాయకుడు. జట్టును ఎలా ముందుకు నడిపించాలో అతడికి తెలుసు. ప్రస్తుతం వాళ్లు దూకుడుగానే ఆడుతున్నారు. కోహ్లి సారథిగా వస్తే మరింత బాగుంటుంది. విరాట్ కోహ్లి తిరిగి ఆర్సీబీ పగ్గాలు చేపడితే చూడాలని ఉంది" అని భజ్జీ స్టార్ స్పోర్ట్స్ షోలో వ్యాఖ్యానించాడు.చదవండి: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు: ధోని ఫ్యాన్స్పై సంచలన వ్యాఖ్యలు -
ధోని గురించి నిజాలు ఇవే! మాజీ క్రికెటర్లకు కౌంటర్
పంజాబ్ కింగ్స్తో ఆదివారం నాటి మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ మహేంద్ర సింగ్ ధోని తొమ్మిదో స్థానంలో బ్యాటింగ్కు రావడంపై క్రీడా వర్గాల్లో చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ విషయంలో మాజీ క్రికెటర్లు హర్భజన్ సింగ్, ఇర్ఫాన్ పఠాన్ తదితరులు ధోని నిర్ణయాన్ని తప్పుబడుతూ ఘాటు విమర్శలు చేశారు.జట్టుకు అవసరమైనపుడు ధోని బ్యాటింగ్ చేయడానికి సుముఖంగా లేనపుడు తుదిజట్టు నుంచి కూడా తప్పుకోవాలంటూ భజ్జీ వ్యాఖ్యానించాడు. ధోని ఇలాంటి తప్పు చేస్తాడని అసలు ఊహించలేదంటూ కామెంట్ చేశాడు. అతడికి బదులు జట్టులో మరో అదనపు పేసర్ను తీసుకోవాలని సూచించాడు.మరోవైపు.. ఇర్ఫాన్ పఠాన్ సైతం.. 42 ఏళ్ల పైబడినా బ్యాటింగ్ చేయగల సత్తా ధోనికి ఉందని.. జట్టు ప్రయోజనాల దృష్ట్యా కనీసం 4-5 ఓవర్ల పాటు తలా క్రీజులో ఉండాలని సలహా ఇచ్చాడు.ఇదిలా ఉంటే.. పంజాబ్తో అంతకు ముందు మ్యాచ్లోనూ ధోని డారిల్ మిచెల్తో కలిసి పరుగు తీసేందుకు వెనుకాడగా.. అదృష్టవశాత్తూ అతడు రనౌట్ ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. అయితే, ఆ మ్యాచ్లో సీఎస్కే ఓడిపోగా.. ధోని తీరుపై విమర్శలు వచ్చాయి.ఈ రెండు సందర్భాల్లోనూ ధోనిని తప్పుబట్టిన వాళ్లకు అతడి అభిమానులు చురకలు అంటిస్తున్నారు. ఈ నేపథ్యంలో ధోని ఇలా చేయడానికి ఇదే కారణమంటూ ఆసక్తికర వార్త తెరమీదకు వచ్చింది.మోకాలి గాయం కారణంగా ఇబ్బంది పడుతున్న ధోని.. వికెట్ కీపర్గా సేవలు అందించే క్రమంలో ఎక్కువ సేపు బ్యాటింగ్ చేయకుండా ఉండాలని నిర్ణయించుకున్నాడన్నది దాని సారాంశం.ఇందుకు సంబంధించి సీఎస్కే వర్గాలు టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ.. ‘‘మేము మా ద్వితీయ శ్రేణి జట్టుతోనే ఎక్కువగా ఆడుతున్నాం. ధోనిని విమర్శించే వాళ్లకు అతడు చేస్తున్న త్యాగాల గురించి ఏం తెలుసని మాట్లాడుతున్నారు.జట్టు కోసం అతడు ఎంతగానో పరితపిస్తాడు. మోకాలి నొప్పి వేధిస్తున్నా అవసరమైనపుడు బ్యాటింగ్ చేస్తున్నాడు’’ అని పేర్కొన్నాయి. కాగా ఐపీఎల్-2024లో కెప్టెన్సీ పగ్గాలను రుతురాజ్ గైక్వాడ్కు అప్పగించిన ధోని.. ఆటగాడిగా కొనసాగుతున్నాడు.ఇప్పటికే అదనపు వికెట్ కీపర్ డెవాన్ కాన్వే జట్టుకు దూరమయ్యాడు. ఈ క్రమంలో ధోనినే కీపింగ్ బాధ్యతలు నిర్వర్తించాల్సి ఉంది. అయితే, మోకాలి నొప్పి తీవ్రం కాకుండా చూసుకునేందుకే బ్యాటింగ్ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నట్లు సమాచారం. కాగా ఈ సీజన్లో సీఎస్కే ఇప్పటి వరకు ఆడిన 11 మ్యాచ్లలో సీఎస్కే ఆరు గెలిచి పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతోంది. మిగిలిన మూడు మ్యాచ్లలో గెలిచి ప్లే ఆఫ్స్లో అడుగుపెట్టాలని పట్టుదలగా ఉంది. -
ధోని జట్టులో అవసరమా?: ‘తలా’పై సంచలన వ్యాఖ్యలు
ఐపీఎల్-2024లో పంజాబ్ కింగ్స్తో మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ మహేంద్ర సింగ్ ధోని విషయంలో చేసిన ప్రయోగం బెడిసికొట్టింది. తొమ్మిదో స్థానంలో అతడు బ్యాటింగ్కు వచ్చిన నేపథ్యంలో మేనేజ్మెంట్తో పాటు ధోని నిర్ణయాన్ని విశ్లేషకులు తప్పుబడుతున్నారు.ఈ నేపథ్యంలో టీమిండియా స్పిన్ దిగ్గజం హర్భజన్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ధోని బ్యాటింగ్ చేయడానికి సుముఖంగా లేనపుడు తుదిజట్టు నుంచి కూడా తప్పుకోవాలంటూ ఘాటు విమర్శలు చేశాడు. కాగా తన టీ20 కెరీర్లో ధోని తొలిసారి తొమ్మిదో స్థానంలో బ్యాటింగ్కు వచ్చాడు.పంజాబ్ కింగ్స్తో ఆదివారం నాటి మ్యాచ్లో బౌలింగ్ ఆల్రౌండర్లు మిచెల్ సాంట్నర్, శార్దూల్ ఠాకూర్ వరుసగా ఏడు, ఎనిమిదో స్థానాల్లో బరిలోకి దిగగా.. వారి తర్వాత వచ్చిన ధోని గోల్డెన్ డకౌట్గా వెనుదిరిగాడు.తుదిజట్టులో ధోని అవసరమా?పంజాబ్ పేసర్ హర్షల్ పటేల్ బౌలింగ్లో బౌల్డ్ అయి పెవిలియన్ చేరాడు. ఈ నేపథ్యంలో హర్భజన్ సింగ్ మాట్లాడుతూ.. ‘‘ఎంఎస్ ధోని ఒకవేళ తొమ్మిదో స్థానంలో బ్యాటింగ్ చేయాలనుకుంటే.. అతడు అసలు ఆడనేకూడదు.అలాంటపుడు ధోని బదులు తుదిజట్టులో మరో అదనపు ఫాస్ట్ బౌలర్ను తీసుకోవడం మంచిది. నిజానికి ఏ స్థానంలో బ్యాటింగ్ చేయాలన్నది ధోని స్వతహాగా తీసుకున్న నిర్ణయమే అయి ఉంటుంది.అలా చేయడం ద్వారా తన జట్టును ప్రమాదంలోకి నెట్టాడు. ధోని కంటే ముందు శార్దూల్ ఠాకూర్ బ్యాటింగ్ రావడం ఏమిటి? ఠాకూర్ ఎప్పుడైనా హిట్టింగ్ ఆడాడా?ధోని కావాలనే చేశాడు.. నాకైతే నచ్చలేదుధోని అనుమతి లేకుండా జట్టులో ఏమీ జరుగదు. కానీ ధోని ఈరోజు ఎందుకు ఇలాంటి తప్పు చేశాడో అర్థం కావడం లేదు. తొమ్మిదో స్థానంలో బ్యాటింగ్ చేయాలన్న ధోని నిర్ణయం నాకైతే అస్సలు నచ్చలేదు’’ అని భజ్జీ కుండబద్దలు కొట్టాడు.డెత్ ఓవర్లలో సీఎస్కే ఎక్కువ పరుగులు రాబట్టాలనుకుంటే ధోని కచ్చితంగా ఏడో స్థానంలో బ్యాటింగ్కు వస్తేనే బాగుంటుందని హర్భజన్ సింగ్ ఈ సందర్భంగా అభిప్రాయపడ్డాడు.రవీంద్రుడి మాయాజాలం కాగా ధర్మశాల వేదికగా పంజాబ్తో ఆదివారం నాటి మ్యాచ్ సీఎస్కే 28 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆల్రౌండర్ రవీంద్ర జడేజా(26 బంతుల్లో 43 పరుగులు, 3/20) వల్లే ఈ గెలుపు సాధ్యమైంది. ఇక ఫినిషింగ్ స్టార్ ధోని ఇప్పటి వరకు ఆడిన తొమ్మిది ఇన్నింగ్స్లో కలిపి 110 పరుగులు చేశాడు.చదవండి: అచ్చా.. అలాగా?: కోహ్లిపై గావస్కర్ కామెంట్స్.. వసీం అక్రం కౌంటర్The reactions say it all! #IPLonJioCinema #TATAIPL #PBKSvCSK pic.twitter.com/owCucgYN8d— JioCinema (@JioCinema) May 5, 2024 -
T20: రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్గా సంజూ శాంసన్!
‘రోహిత్ శర్మ తర్వాత పరిమిత ఓవర్ల క్రికెట్లో టీమిండియా కెప్టెన్ హార్దిక్ పాండ్యానే.. అంతెందుకు టీ20 వరల్డ్కప్-2024లోనూ జట్టును అతడే ముందుకు నడిపిస్తాడు’’.. చాన్నాళ్లుగా విశ్లేషకుల మాట. అయితే, వన్డే వరల్డ్కప్-2023 తర్వాత సీన్ కాస్తా మారింది. గాయం కారణంగా మెగా టోర్నీకి దూరమైన ఈ పేస్ ఆల్రౌండర్.. ఐపీఎల్-2024లో గుజరాత్ టైటాన్స్ నుంచి ముంబై ఇండియన్స్కు వచ్చి కెప్టెన్గా బాధ్యతలు చేపట్టాడు. రోహిత్ శర్మ స్థానాన్ని భర్తీ చేస్తూ ముంబై పగ్గాలు అందుకున్నాడు. ఈ నేపథ్యంలో.. బీసీసీఐ మాత్రం ఈసారి పొట్టి ప్రపంచకప్లో రోహిత్ శర్మనే టీమిండియాకు సారథ్యం వహిస్తాడని ప్రకటించింది. ఇక ఐపీఎల్ పదిహేడో ఎడిషన్ మొదలైన తర్వాత సీన్ పూర్తిగా మారింది. హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ వైఫల్యాల కారణంగా ముంబై ఇండియన్స్ పేలవ ప్రదర్శన కనబరుస్తోంది. ఇప్పటి వరకు ఆడిన ఎనిమిదింట కేవలం మూడు మాత్రమే గెలిచింది. రాజస్తాన్ రాయల్స్ చేతిలో సోమవారం నాటి మ్యాచ్తో ఐదో పరాజయం నమోదు చేసింది. ఇదిలా ఉంటే.. రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ మాత్రం తన జట్టును విజయపథంలో ముందుకు నడిపిస్తున్నాడు. సంజూ శాంసన్ (PC: IPL) ఇప్పటి దాకా రాయల్స్ ఎనిమిది మ్యాచ్లు ఆడి ఏడు విజయాలతో ప్రస్తుతం పట్టికలో అగ్రస్థానంలో ఉంది. మరోవైపు.. వికెట్ కీపర్ బ్యాటర్గానూ సంజూ అదరగొడుతున్నాడు. ఎనిమిది మ్యాచ్లలో కలిపి అతడు 314 పరుగులు సాధించాడు. ముంబైతో మ్యాచ్లో సెంచరీ వీరుడు యశస్వి జైస్వాల్(60 బంతుల్లో 104)తో కలిసి సంజూ(28 బంతుల్లో 38) ఆఖరి వరకు అజేయంగా నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఈ నేపథ్యంలో టీమిండియా స్పిన్ దిగ్గజం హర్భజన్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘ఫామ్ తాత్కాలికం.. క్లాష్ శాశ్వతం అని యశస్వి జైస్వాల్ ఇన్నింగ్స్ మరోసారి నిరూపించింది. ఇక వికెట్ కీపర్ బ్యాటర్ గురించి ప్రత్యేకంగా చర్చ అవసరం లేదు. టీ20 ప్రపంచకప్ నేపథ్యంలో భారత జట్టులో నేరుగా అడుగుపెట్టే అర్హత అతడికి ఉంది. అంతేకాదు రోహిత్ శర్మ తర్వాత టీమిండియా తదుపరి కెప్టెన్గా సంజూ శాంసన్ ఎదుగుతాడనడంలో మీకేమైనా అనుమానాలున్నాయా?’’ అంటూ కేరళ బ్యాటర్ సంజూ శాంసన్ పొట్టి ఫార్మాట్లో టీమిండియా కెప్టెన్ కావాలని ఆకాంక్షించాడు. అసలు జట్టులో చోటు దక్కుతుంతా అన్న సందేహాల నడుమ ఊహించని విధంగా కెప్టెన్ కావాంటూ అంటూ కామెంట్ చేశడు. కాగా వరల్డ్కప్-2024 నేపథ్యంలో రిషభ్ పంత్, కేఎల్ రాహుల్, సంజూ శాంసన్ మధ్య పోటీ నెలకొన్న తరుణంలో భజ్జీ ఇలా సంజూకు ఓటు వేశాడు. మరి మీ ఓటు ఎవరికి?! Yashasvi Jaiswal’s knock is a proof of class is permanent . Form is temporary @ybj_19 and there shouldn’t be any debate about Keepar batsman . @IamSanjuSamson should walks in to the Indian team for T20 worldcup and also groomed as a next T20 captain for india after rohit . koi… — Harbhajan Turbanator (@harbhajan_singh) April 22, 2024 THAT 💯 moment! ☺️ Jaipur is treated with a Jaiswal special! 💗 Scorecard ▶️ https://t.co/Mb1gd0UfgA#TATAIPL | #RRvMI | @ybj_19 pic.twitter.com/i0OvhZKtGI — IndianPremierLeague (@IPL) April 22, 2024 -
కోహ్లి, ధోని గురించే మాట్లాడాలా?... అతడూ ఓ లెజెండ్
రాజస్తాన్ రాయల్స్ ఓపెనర్ జోస్ బట్లర్పై టీమిండియా స్పిన్ దిగ్గజం హర్భజన్ సింగ్ ప్రశంసలు కురిపించాడు. అతడొక ప్రత్యేకమైన, అసాధారణ ఆటగాడు అంటూ ఈ ఇంగ్లండ్ కెప్టెన్ను ఆకాశానికెత్తాడు. ఐపీఎల్-2024లో భాగంగా రాజస్తాన్ రాయల్స్ మంగళవారం కోల్కతా నైట్ రైడర్స్తో తలపడింది. ఈడెన్ గార్డెన్స్లో ఆఖరి బంతి వరకు నువ్వా- నేనా అన్నట్లుగా సాగిన మ్యాచ్లో బట్లర్ రాజస్తాన్ను గెలిపించాడు. కేకేఆర్ విధించిన 224 పరుగుల భారీ లక్ష్యం ముందున్న వేళ.. 14 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి కేవలం 128 పరుగులే చేసిన తరుణంలో పట్టుదలగా నిలబడిన బట్లర్.. ఒత్తిడిలోనూ సంచలన ఇన్నింగ్స్తో మెరిశాడు. Another Last Over Thriller 🤩 A Jos Buttler special guides @rajasthanroyals over the line and further extends their lead at the 🔝 🙌 🙌 Scorecard ▶️ https://t.co/13s3GZLlAZ #TATAIPL | #KKRvRR pic.twitter.com/d3FECR81X1 — IndianPremierLeague (@IPL) April 16, 2024 అజేయ శతకం(60 బంతుల్లో 107)తో చెలరేగిన ఈ ఓపెనింగ్ బ్యాటర్.. ఆఖరి ఓవర్ చివరి బంతికి సింపుల్గా సింగిల్ తీసి రాజస్తాన్ను విజయతీరాలకు చేర్చాడు. ఫలితంగా రాజస్తాన్ ఖాతాలో ఆరో విజయం నమోదైంది. ఈ నేపథ్యంలో హర్భజన్ సింగ్ మాట్లాడుతూ బట్లర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కోహ్లి, ధోని గురించే ఎందుకు మాట్లాడాలి? ‘‘అతడొక ప్రత్యేకమైన ఆటగాడు. వేరే లెవల్ అంతే! బట్లర్ ఇలాంటి ప్రదర్శనతో ఆకట్టుకోవడం ఇదే మొదటిసారి కాదు. గత కొన్నేళ్లుగా అతడు ఇదే పని చేస్తున్నాడు. మున్ముందు కూడా చేస్తాడు. అసాధారణమైన ప్రతిభ అతడి సొంతం. అయితే, బట్లర్ భారత ఆటగాడు కాదు కాబట్టి మనం అతడి గురించి ఎక్కువగా మాట్లాడుకోం. ఒకవేళ ఇదే సెంచరీ గనుక విరాట్ కోహ్లి చేసి ఉంటే.. కనీసం రెండు నెలల పాటు అతడిని ప్రశంసిస్తూ మాట్లాడుతూ ఉండేవాళ్లం. అంతెందుకు ధోని కొట్టిన మూడు.. నాలుగు సిక్సర్ల గురించి కూడా మనం పెద్ద ఎత్తున చర్చిస్తాం. అతడొక లెజెండ్ మన ప్లేయర్ల గురించి సెలబ్రేట్ చేసుకున్నట్లుగానే బట్లర్ గురించి కూడా సంబరాలు చేసుకోవాలి. ఎందుకంటే అతడొక క్రికెట్ లెజెండ్’’ అని హర్భజన్ సింగ్ జోస్ బట్లర్పై ప్రశంసల వర్షం కురిపించాడు. కాగా ఐపీఎల్లో బట్లర్కు ఇది ఏడో సెంచరీ. ఆర్సీబీ స్టార్ విరాట్ కోహ్లి(8) తర్వాత అత్యధిక సెంచరీలు సాధించిన రెండో బ్యాటర్గా బట్లర్ కొనసాగుతున్నాడు. ఇక ఈ సీజన్లో ఇప్పటి వరకు ఆడిన ఆరు మ్యాచ్లలో కలిపి 250 పరుగులు చేశాడు. చదవండి : ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నాం.. మాకు దొరికిన విలువైన ఆస్తి అతడు! var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4381453179.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
అతడు బాగా అలిసిపోయాడు.. కొన్ని మ్యాచ్లకు రెస్ట్ ఇవ్వండి: భజ్జీ
ఐపీఎల్-2024లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ తన స్ధాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతున్నాడు. ఈ ఏడాది సీజన్లో తొలి మ్యాచ్ నుంచే సిరాజ్ దారుణంగా విఫలమవుతున్నాడు. వికెట్లు విషయం పక్కన పెడితే రన్స్ను కూడా భారీగా సమర్పించుకుంటున్నాడు. గురువారం ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో సైతం సిరాజ్ పూర్తిగా తేలిపోయాడు. ముంబైతో మ్యాచ్లో 3 ఓవర్లు బౌలింగ్ చేసిన సిరాజ్ వికెట్ ఏమీ తీయకుండా ఏకంగా 37 పరుగులిచ్చాడు. ఈ ఏడాది సీజన్లో ఇప్పటివరకు 6 మ్యాచ్లు ఆడిన ఈ హైదరాబాదీ 57. 25 సగటుతో కేవలం 4 వికెట్లు మాత్రమే పడగొట్టాడు. ఈ నేపథ్యంలో మహ్మద్ సిరాజ్ను ఉద్దేశించి భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సిరాజ్ బాగా ఆలిసిపోయాడని, అతడికి కొన్ని మ్యాచ్లకు విశ్రాంతి ఇవ్వాలని ఆర్సీబీ మెనెజ్మెంట్ను భజ్జీ సూచించాడు. "మహ్మద్ సిరాజ్ మానసికంగా, ఫిజికల్గా బాగా ఆలసిపోయినట్లు కన్పిస్తున్నాడు. అతడికి ప్రస్తుతం విశ్రాంతి అవసరం. అతడు గత కొంత కాలంగా విశ్రాంతి లేకుండా క్రికెట్ ఆడుతున్నాడు. సిరాజ్ ఐపీఎల్కు ముందు ఇంగ్లండ్తో నాలుగు టెస్టు మ్యాచ్లు ఆడాడు. నేనే ఆర్సీబీ మేనేజ్మెంట్లో భాగమైతే అతడికి రెండు మ్యాచ్లకు విశ్రాంతి ఇస్తాను. ఏమి జరుగుతుందో తను ఆర్ధం చేసుకోవడానికి అతడికి ఆ సమయం ఉపయోగపడుతోంది. సిరాజ్ అద్బుతమైన బౌలర్ అని మనకు తెలుసు. ఫార్మాట్తో సంబంధం లేకుండా కొత్త బంతితో వికెట్లు తీయడం అతడి స్పెషల్. కచ్చితంగా ముంబైతో మ్యాచ్ అతడికి పీడ కలవంటింది. కానీ సిరాజ్కు రెస్ట్ ఇస్తే అద్భుతంగా కమ్బ్యాక్ ఇస్తాడని నేను నమ్ముతున్నాను. గతంలో నేను కూడా ఇటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నానని" స్టార్ స్పోర్ట్స్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో హర్భజన్ సింగ్ పేర్కొన్నాడు. -
కోహ్లి, ధోని కాదు.. ఐపీఎల్ సూపర్స్టార్ అతడే: భజ్జీ
‘‘మొదటి రోజు నుంచి ఇప్పటి దాకా అతడి బౌలింగ్లో ఎంతో వైవిధ్యం కనిపిస్తోంది. తప్పుల నుంచి పాఠాలు నేర్చుకోవడంలో అందరికంటే తనే ముందుంటాడు. ప్రతి రోజూ ఏదో ఒక కొత్త విషయం నేర్చుకుంటూనే ఉంటాడు. ఈరోజు ఐదు వికెట్లు తీసినా సరే.. మళ్లీ రేపటి కోసం కొత్తగా సంసిద్ధమవుతాడు. తన వీడియోలన్నీ మరోసారి చూసుకుంటాడు. ఎక్కడ లోపాలున్నాయి.. వాటిని సరిచేసుకుని మరింత మెరుగ్గా ఎలా ఆడాలన్న అంశం మీదే దృష్టి పెడతాడు. కూల్గా.. కామ్గా ఉంటాడు. తన పని తాను చేసుకుంటూ పోతాడు. ముఖ్యంగా ఒత్తిడిలో మరింత గొప్పగా రాణిస్తాడు. చాలా మంది విరాట్ కోహ్లి, ఎంఎస్ ధోని గురించి మాట్లాడుతూ ఉంటారు. ఇది బ్యాటర్ల గేమ్ కాబట్టి అలా మాట్లాడతారు. కానీ నిజానికి సూపర్స్టార్ల గురించి మాట్లాడాల్సి వస్తే నా దృష్టిలో ఐపీఎల్ సూపర్ స్టార్ అతడే. ఒంటిచేత్తో మ్యాచ్లు గెలవగల సత్తా ఉన్నవాడు. అతడిలా మ్యాచ్ను మలుపు తిప్పి గెలిపించిన బ్యాటర్లు ఎంత మంది ఉన్నారు? మహా అయితే.. ఓ నలుగురు.. ఐదుగురు బ్యాటర్ల పేర్లు చెప్తారేమో! అదే బౌలర్ల విషయానికొస్తే.. కేవలం బుమ్రా ఒక్కడి పేరే వినిపిస్తుంది. కొంతమంది లసిత్ మలింగ పేరు కూడా చెప్పవచ్చు. ఏదేమైనా ఎంత ఎదిగినా కొత్తగా ఏదో ఒక విషయం నేర్చుకుంటూ రోజురోజుకు మరింత మెరుగవ్వాలన్న తపన ఉండటం గొప్ప విషయం. బుమ్రా అత్యంత నిరాడంబరంగా.. కఠిన శ్రమకోరుస్తూ.. సింపుల్గా ఉండటం తనకే చెల్లింది. యువకులందరికీ తను ఆదర్శం. గొప్ప పాఠం’’ అని టీమిండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్.. భారత ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రాను ఆకాశానికెత్తాడు. ప్రస్తుతతరం బౌలర్లలో బుమ్రాను మించిన ఆటగాడు మరొకరు లేరంటూ ఈ ముంబై ఇండియన్స్ స్టార్ను భజ్జీ కొనియాడాడు. విరాట్ కోహ్లి, ధోని వంటి బ్యాటర్ల కంటే మ్యాచ్ను ఒంటిచేత్తో గెలిపించగల బుమ్రానే తన దృష్టిలో నిజమైన ఐపీఎల్ సూపర్ స్టార్ అని ప్రశంసించాడు. కాగా ఐపీఎల్-2024లో భాగంగా ఆర్సీబీతో గురువారం నాటి మ్యాచ్లో బుమ్రా విశ్వరూపం ప్రదర్శించిన విషయం తెలిసిందే. 5/21తో దుమ్ములేపిన బుమ్రా ఆర్సీబీ బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. సంచలన ప్రదర్శనతో ముంబై ఇండియన్స్ను గెలిపించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. ఈ నేపథ్యంలో ముంబై మాజీ కెప్టెన్ హర్భజన్ సింగ్ ఈ మేరకు వ్యాఖ్యలు చేయడం గమనార్హం. కాగా ఐపీఎల్ తాజా సీజన్లో ముంబై ఇండియన్స్ ఇప్పటి వరకు ఐదింట మొదటి మూడు మ్యాచ్లు వరుసగా ఓడింది. ఢిల్లీ క్యాపిటల్స్పై విజయంతో బోణీ కొట్టి.. తాజాగా ఆర్సీబీని ఏడు వికెట్ల తేడాతో చిత్తు చేసింది. ఇక ఐపీఎల్-2024లో బుమ్రా ఇప్పటి వరకు ఆడిన ఐదు మ్యాచ్లలో కలిపి పది వికెట్లు పడగొట్టి ప్రస్తుతం పర్పుల్ క్యాప్ తన దగ్గరపెట్టుకున్నాడు. చదవండి: Rohit Sharma: అప్పటి వరకు కెప్టెన్ రోహిత్ శర్మనే! var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4301451426.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); We have seen this one, it's a classic 🤌#IPLonJioCinema #TATAIPL #MIvRCB pic.twitter.com/spSGO73CwH — JioCinema (@JioCinema) April 11, 2024 Boom Boom Bumrah!@Jaspritbumrah93 comes into the attack and gets the big wicket of Virat Kohli. Live - https://t.co/7yWt2uizTf #TATAIPL #IPL2024 #MIvRCB pic.twitter.com/1QbRGjV2L0 — IndianPremierLeague (@IPL) April 11, 2024 -
పాండ్యా ఒక్కడిని అలా వదిలేశారు.. ఆటగాళ్లపై మండిపడ్డ భజ్జీ
ముంబై ఇండియన్స్ ఆటగాళ్ల తీరుపై ఆ జట్టు మాజీ కెప్టెన్ హర్భజన్ సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. మేనేజ్మెంట్ నిర్ణయం ఏదైనా.. దానిని అంగీకరించాలని సూచించాడు. సమిష్టిగా ముందుకు వెళ్తేనే అనుకున్న ఫలితాలు రాబట్టగలరని పేర్కొన్నాడు. జట్టులోని ప్రతి ఒక్క ఆటగాడు కెప్టెన్కు సహకరించాల్సిన అవసరం ఉందని భజ్జీ చురకలు అంటించాడు. కాగా ఐపీఎల్-2024 నేపథ్యంలో గుజరాత్ టైటాన్స్ నుంచి హార్దిక్ పాండ్యాను ట్రేడ్ చేసుకున్న ముంబై ఇండియన్స్ అతడిని కెప్టెన్గా నియమించిన విషయం తెలిసిందే.ఐదుసార్లు జట్టును చాంపియన్గా నిలిపిన రోహిత్ శర్మపై వేటు వేసి ముంబై ఫ్రాంఛైజీ తీసుకున్న ఈ నిర్ణయాన్ని అభిమానులు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. పాండ్యాను అవమానపరిచేలా హేళన చేస్తూ ఆగ్రహం వెళ్లగక్కుతున్నారు.ఇక రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా వంటి సీనియర్ ఆటగాళ్ల పట్ల పాండ్యా వ్యవహరిస్తున్న తీరు వారి కోపాన్ని మరింత ఎక్కువ చేస్తోంది. అదే విధంగా.. పాండ్యా తీసుకుంటున్న నిర్ణయాల వల్ల జట్టు ఇప్పటి వరకు ఆడిన మూడు మ్యాచ్లలో మూడూ ఓడిపోవడం విమర్శలకు ఆస్కారం ఇచ్చింది.𝙄𝙣 𝙎𝙩𝙮𝙡𝙚 😎Riyan Parag's innings help @rajasthanroyals reach 🔝 of the table 💪#RR are the 2️⃣nd team to win an away fixture this season 👏👏Scorecard ▶️ https://t.co/XL2RWMFLbE#TATAIPL | #MIvRR pic.twitter.com/ZsVk9rvam1— IndianPremierLeague (@IPL) April 1, 2024ఈ క్రమంలో రాజస్తాన్ రాయల్స్తో మ్యాచ్లో పరాజయం తర్వాత హార్దిక్ పాండ్యా ఒక్కడే డగౌట్లో కూర్చుని ఉండటం.. జట్టులోని విభేదాలను బయపెట్టింది. మిగతా ఆటగాళ్లంతా డ్రెసింగ్ రూంకి వెళ్లిపోగా పాండ్యా ఒంటరిగా అక్కడే ఉన్న ఫొటోలు వైరల్ అయ్యాయి.ఈ నేపథ్యంలో టీమిండియా స్పిన్ దిగ్గజం హర్భజన్ సింగ్ స్పందించాడు. ‘‘ఉద్దేశపూర్వకంగా చేస్తున్నారో.. లేదంటే యాధృచ్చికంగా అలా జరుగుతుందో తెలియదు కానీ.. జట్టులోని చాలా మంది అతడిని కన్ఫ్యూజ్ చేస్తున్నారు.ముఖ్యంగా పెద్ద తలకాయలు.. కెప్టెన్గా పాండ్యా స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఇవ్వడం లేదని అర్థమవుతోంది. డ్రెసింగ్ రూం వాతావరణం కూడా సరిగ్గా లేనట్లు కనిపిస్తోంది. ఏ కెప్టెన్కు అయినా ఇలాంటివి కఠిన సవాళ్లే. ఆ విజువల్స్ అస్సలు బాగాలేవు. పాండ్యా ఒక్కడినే అలా వదిలేశారు. ఒక ఫ్రాంఛైజీకి ఆడుతున్న ఆటగాళ్లు కెప్టెన్ తమ వాడే అని కచ్చితంగా అంగీకరించాలి. మేనేజ్మెంట్ తీసుకున్న నిర్ణయాన్ని గౌరవిస్తే బాగుంటుంది.ఈ ఫ్రాంఛైజీకి ఆడిన వ్యక్తిగా చెబుతున్నా.. ప్రస్తుతం అక్కడ వాతావరణం గందరగోళంగా ఉన్నట్లు కనిపిస్తోంది’’ అని భజ్జీ స్టార్ స్పోర్ట్స్ షోలో తన అభిప్రాయాలు పంచుకున్నాడు. కాగా 2012లో ముంబై ఇండియన్స్కు హర్భజన్ సింగ్ కెప్టెన్గా వ్యవహరించాడు.చదవండి: #Mayank Yadav: ఐపీఎల్ హిస్టరీలో తొలి ఫాస్ట్ బౌలర్గా మయాంక్ సంచలన రికార్డు -
పాండ్యా ఒక్కడిని అలా వదిలేశారు.. ఆటగాళ్లపై మండిపడ్డ భజ్జీ
ముంబై ఇండియన్స్ ఆటగాళ్ల తీరుపై ఆ జట్టు మాజీ కెప్టెన్ హర్భజన్ సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. మేనేజ్మెంట్ నిర్ణయం ఏదైనా.. దానిని అంగీకరించాలని సూచించాడు. సమిష్టిగా ముందుకు వెళ్తేనే అనుకున్న ఫలితాలు రాబట్టగలరని పేర్కొన్నాడు. జట్టులోని ప్రతి ఒక్క ఆటగాడు కెప్టెన్కు సహకరించాల్సిన అవసరం ఉందని భజ్జీ చురకలు అంటించాడు. కాగా ఐపీఎల్-2024 నేపథ్యంలో గుజరాత్ టైటాన్స్ నుంచి హార్దిక్ పాండ్యాను ట్రేడ్ చేసుకున్న ముంబై ఇండియన్స్ అతడిని కెప్టెన్గా నియమించిన విషయం తెలిసిందే. ఐదుసార్లు జట్టును చాంపియన్గా నిలిపిన రోహిత్ శర్మపై వేటు వేసి ముంబై ఫ్రాంఛైజీ తీసుకున్న ఈ నిర్ణయాన్ని అభిమానులు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. పాండ్యాను అవమానపరిచేలా హేళన చేస్తూ ఆగ్రహం వెళ్లగక్కుతున్నారు. ఇక రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా వంటి సీనియర్ ఆటగాళ్ల పట్ల పాండ్యా వ్యవహరిస్తున్న తీరు వారి కోపాన్ని మరింత ఎక్కువ చేస్తోంది. అదే విధంగా.. పాండ్యా తీసుకుంటున్న నిర్ణయాల వల్ల జట్టు ఇప్పటి వరకు ఆడిన మూడు మ్యాచ్లలో మూడూ ఓడిపోవడం విమర్శలకు ఆస్కారం ఇచ్చింది. 𝙄𝙣 𝙎𝙩𝙮𝙡𝙚 😎 Riyan Parag's innings help @rajasthanroyals reach 🔝 of the table 💪#RR are the 2️⃣nd team to win an away fixture this season 👏👏 Scorecard ▶️ https://t.co/XL2RWMFLbE#TATAIPL | #MIvRR pic.twitter.com/ZsVk9rvam1 — IndianPremierLeague (@IPL) April 1, 2024 ఈ క్రమంలో రాజస్తాన్ రాయల్స్తో మ్యాచ్లో పరాజయం తర్వాత హార్దిక్ పాండ్యా ఒక్కడే డగౌట్లో కూర్చుని ఉండటం.. జట్టులోని విభేదాలను బయపెట్టింది. మిగతా ఆటగాళ్లంతా డ్రెసింగ్ రూంకి వెళ్లిపోగా పాండ్యా ఒంటరిగా అక్కడే ఉన్న ఫొటోలు వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలో టీమిండియా స్పిన్ దిగ్గజం హర్భజన్ సింగ్ స్పందించాడు. ‘‘ఉద్దేశపూర్వకంగా చేస్తున్నారో.. లేదంటే యాధృచ్చికంగా అలా జరుగుతుందో తెలియదు కానీ.. జట్టులోని చాలా మంది అతడిని కన్ఫ్యూజ్ చేస్తున్నారు. ముఖ్యంగా పెద్ద తలకాయలు.. కెప్టెన్గా పాండ్యా స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఇవ్వడం లేదని అర్థమవుతోంది. డ్రెసింగ్ రూం వాతావరణం కూడా సరిగ్గా లేనట్లు కనిపిస్తోంది. ఏ కెప్టెన్కు అయినా ఇలాంటివి కఠిన సవాళ్లే. ఆ విజువల్స్ అస్సలు బాగాలేవు. పాండ్యా ఒక్కడినే అలా వదిలేశారు. ఒక ఫ్రాంఛైజీకి ఆడుతున్న ఆటగాళ్లు కెప్టెన్ తమ వాడే అని కచ్చితంగా అంగీకరించాలి. మేనేజ్మెంట్ తీసుకున్న నిర్ణయాన్ని గౌరవిస్తే బాగుంటుంది. ఈ ఫ్రాంఛైజీకి ఆడిన వ్యక్తిగా చెబుతున్నా.. ప్రస్తుతం అక్కడ వాతావరణం గందరగోళంగా ఉన్నట్లు కనిపిస్తోంది’’ అని భజ్జీ స్టార్ స్పోర్ట్స్ షోలో తన అభిప్రాయాలు పంచుకున్నాడు. కాగా 2012లో ముంబై ఇండియన్స్కు హర్భజన్ సింగ్ కెప్టెన్గా వ్యవహరించాడు. చదవండి: #Mayank Yadav: ఐపీఎల్ హిస్టరీలో తొలి ఫాస్ట్ బౌలర్గా మయాంక్ సంచలన రికార్డు var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4301451426.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
కోహ్లి వస్తే వేటు పడేది నీ మీదే సర్ఫరాజ్! తాడోపేడో తేల్చుకో..
Ind vs Eng 2nd Test: యువ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ను ఉద్దేశించి టీమిండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఒకవేళ ఈ ముంబై ఆటగాడికి తుదిజట్టులో గనుక చోటు దక్కితే తప్పక సద్వినియోగం చేసుకోవాలని సూచించాడు. అలా కాని పక్షంలో.. సర్ఫరాజ్ మళ్లీ జట్టులో చోటు దక్కించుకోవడం కష్టంగా మారుతుందని భజ్జీ అభిప్రాయపడ్డాడు. కాగా ఇంగ్లండ్తో రెండో టెస్టు సందర్భంగా.. దేశవాళీ క్రికెట్ పరుగుల హీరో సర్ఫరాజ్ను బీసీసీఐ సెలక్టర్లు టీమిండియాకు ఎంపిక చేసిన విషయం తెలిసిందే. వైజాగ్ టెస్టులో ఆడేనా? ఇంగ్లండ్ లయన్స్ తరఫున భారత్- ఏ జట్టుకు ఆడుతూ అదరగొట్టిన ఈ రైట్హ్యాండ్ బ్యాటర్ తొలిసారి ప్రధాన జట్టుకు ఎంపికయ్యాడు. రవీంద్ర జడేజా, కేఎల్ రాహుల్ గాయాల కారణంగా జట్టుకు దూరమైన నేపథ్యంలో సౌరభ్ కుమార్, వాషింగ్టన్ సుందర్లతో కలిసి టీమిండియాలో స్థానం సంపాదించాడు. ఈ నేపథ్యంలో.. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఎట్టకేలకు అతడి పేరును సెలక్టర్లు పరిగణనలోకి తీసుకోవడంతో అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై హర్భజన్ సింగ్ స్పందిస్తూ.. ‘‘సర్ఫరాజ్ ఖాన్ తన మొదటి అవకాశంలోనే ప్రభావం చూపగలగాలి. ఎందుకంటే విరాట్ కోహ్లి గనుక తిరిగి వస్తే సర్ఫరాజ్పైనే ముందుగా వేటు పడుతుంది. తాడోపేడో తేల్చుకోవాల్సిన స్థితిలో కాబట్టి వచ్చిన అవకాశాన్ని వృథాగా పోనివ్వకూడదు. ఎంతో కఠిన శ్రమకోర్చి దేశవాళీ క్రికెట్లో పరుగుల వరద పారించి ఎట్టకేలకు ఇక్కడిదాకా వచ్చాడు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ తొలి అవకాశంలోనే తనదైన ముద్ర వేయాలి’’ అని ఆకాంక్షించాడు. తొలి ప్రయత్నంలోనే తాడోపేడో తేల్చుకోవాల్సిన పరిస్థితిలో సర్ఫరాజ్ ఉన్నాడని అభిప్రాయపడ్డాడు. ఇదిలా ఉంటే.. వ్యక్తిగత కారణాల దృష్ట్యా తొలి రెండు టెస్టుల నుంచి వైదొలిగిన కోహ్లి జట్టుతో తిరిగి చేరతాడా? లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. ఇంగ్లండ్తో రెండో టెస్టుకు భారత జట్టు(అప్డేటెడ్): రోహిత్ శర్మ (కెప్టెన్), శుబ్మన్ గిల్, యశస్వి జైస్వాల్, శ్రేయస్ అయ్యర్, కేఎస్ భరత్ (వికెట్ కీపర్), ధృవ్ జురెల్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, ముకేశ్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), అవేశ్ ఖాన్, రజత్ పాటిదార్, సర్ఫరాజ్ ఖాన్, వాషింగ్టన్ సుందర్, సౌరభ్ కుమార్. చదవండి: Ind vs Eng: బుమ్రా విషయంలో ఫోక్స్ చేసిందేమిటి? ఇదేనా మీ ‘క్రీడా స్ఫూర్తి’? -
అయోధ్యకు వెళ్లి తీరతా.. ఏం చేస్తారో చేసుకోండి: హర్భజన్ సింగ్
Ayodhya Ram Mandir Ceremony: తాను అయోధ్య రామ మందిర ‘ప్రాణ ప్రతిష్ట’ కార్యక్రమానికి వెళ్లితీరతానని టీమిండియా మాజీ క్రికెటర్, ఆప్ ఎంపీ హర్భజన్ సింగ్ కుండబద్దలు కొట్టాడు. ఎవరు అవునన్నా.. కాదన్నా తన నిర్ణయంలో ఎలాంటి మార్పు ఉండదని స్పష్టం చేశాడు. ఇలాంటి పుణ్యకార్యాలను రాజకీయాలకు అతీతంగాచూడాలని పార్టీలకు హితవు పలికాడు. వ్యక్తిగతంగా తాను దేవుడిని విశ్వసిస్తానని.. ఈ విషయంలో ఎవరికైనా ఏమైనా అభ్యంతరాలు ఉంటే తాను పట్టించుకోనని భజ్జీ పేర్కొన్నాడు. కాగా జనవరి 22న అయోధ్య రామ మందిరంలో శ్రీరాముడి ప్రతిష్టాపన జరుగనున్న విషయం తెలిసిందే. అయితే, బీజేపీ ఈ కార్యక్రమాన్ని రాజకీయం చేస్తోందంటూ విమర్శిస్తున్న ప్రతిపక్షాలు.. తాము ఈవెంట్ను బాయ్కాట్ చేస్తామంటూ ప్రకటనలు చేస్తున్నాయి. జనవరి 22 తర్వాత వెళ్తా: కేజ్రీవాల్ ఈ నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ(ఆమ్) చీఫ్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్పందిస్తూ.. ‘‘వాళ్లు(రామ జన్మభూమి తీర్ధ క్షేత్ర ట్రస్టు) నాకొక లేఖ పంపించారు. ఆతర్వాత మేము వాళ్లకు ఫోన్ చేసి విషయం ఏమిటని కనుక్కున్నాం. ఈ కార్యక్రమానికి మర్యాదపూర్వకంగా నన్ను ఆహ్వానించేందుకు వస్తామని చెప్పారు. కానీ ఎవరూ రాలేదు. అయినా, మరేం పర్లేదు. అయితే, అక్కడికి చాలా మంది వీఐపీలు, వీవీఐపీలు వస్తారని ఆ లేఖలో వాళ్లు స్పష్టంగా పేర్కొన్నారు. భద్రతా కారణాల దృష్ట్యా ఆహ్వానం అందుకున్న ఒక్క వ్యక్తిని మాత్రమే లోపలికి అనుమతిస్తామని చెప్పారు. ఇది భక్తిభావానికి సంబంధించిన విషయం. ఎవరి మతాచారాలకు అనుగుణంగా వారు నడుచుకుంటారు. దీనిని రాజకీయం చేయాల్సిన అవసరం లేదు’’ అని పేర్కొన్నారు. అయితే, తాను తన భార్యాపిల్లలు, తల్లిదండ్రులతో అయోధ్యకు వెళ్లాలనుకుంటున్నాను గనుక జనవరి 22 తర్వాత అక్కడికి వెళ్తానని కేజ్రీవాల్ చెప్పడం కొసమెరుపు. వాళ్లే వెళ్లడం లేదు కదా మరోవైపు.. ఢిల్లీ ఆరోగ్య శాఖా మంత్రి సౌరభ్ భరద్వాజ్ మాత్రం శంకరాచార్యల వ్యాఖ్యలను సమర్థిస్తూ.. ‘‘అంతటి వ్యక్తులే అక్కడికి వెళ్లడం లేదు’’ అని పేర్కొన్నారు. అదే విధంగా.. రామ మందిరం దేశ ప్రజలందరిదని... ఇందులో బీజేపీ పెత్తనం ఏమిటని ప్రశ్నించారు. అయోధ్యకు వెళ్లి తీరతా.. ఏం చేస్తారో చేసుకోండి ఈ నేపథ్యంలో హర్భజన్ సింగ్ ఏఎన్ఐతో మాట్లాడుతూ.. ‘‘అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి ఎవరు వెళ్తారు? ఎవరు వెళ్లడం లేదన్న అంశాలతో నాకు సంబంధం లేదు. ఒకవేళ కాంగ్రెస్ లేదంటే ఇతర పార్టీలు వెళ్లవద్దని నిర్ణయించుకుంటే అది వాళ్లిష్టం. నేను మాత్రం కచ్చితంగా అక్కడికి వెళ్తా. వ్యక్తిగా ఆ దేవుడి మీద నాకు నమ్మకం ఉంది. నేను అయోధ్యకు వెళ్లడంలో ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే నేనేమీ చేయలేను. నా విషయంలో వాళ్లు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా నేను పట్టించుకోను’’ అని పరోక్షంగా సొంత పార్టీకే సవాల్ విసిరాడు. కాగా భజ్జీ పంజాబ్ నుంచి ఆప్ ఎంపీగా రాజ్యసభకు ప్రాతినిథ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. #WATCH | On opposition parties declining invitation to Ayodhya Ram Temple ‘Pran Pratishtha’ ceremony, former Cricketer and Rajya Sabha MP Harbhajan Singh says, " It is our good fortune that this temple is being built at this time, so we all should go and get the blessings.… pic.twitter.com/YUAplDGMNk — ANI (@ANI) January 19, 2024 వాళ్లకు ఆహ్వానాలు కాగా అయోధ్య రామమందిర ప్రారంభోత్సవానికి క్రికెటర్లు వెంకటేశ్ ప్రసాద్, సచిన్ టెండుల్కర్, మహేంద్ర సింగ్ ధోని, విరాట్ కోహ్లి, రవిచంద్రన్ అశ్విన్ తదితరులకు ఆహ్వానాలు అందాయి. చదవండి: IND A Vs Eng Lions: భారత జట్టులో తిలక్, రింకూలకు చోటు: బీసీసీఐ ప్రకటన -
అతడి వల్లే ఆస్ట్రేలియా, ఇంగ్లండ్లో టెస్టులు గెలిచాం.. కానీ: భజ్జీ
సౌతాఫ్రికాతో తొలి టెస్టులో టీమిండియా ఘోర పరాజయంపై భారత మాజీ బౌలర్ హర్భజన్ సింగ్ స్పందించాడు. ఈ సిరీస్కు జట్టు ఎంపిక చేసిన విధానం అస్సలు బాగోలేదంటూ పెదవి విరిచాడు. విదేశీ గడ్డపై రాణించగల సత్తా ఉన్న ఇద్దరు సీనియర్ ఆటగాళ్లు అజింక్య రహానే, ఛతేశ్వర్ పుజారాలను పక్కన పెట్టి తప్పుచేశారని విమర్శించాడు. కాగా సఫారీ గడ్డపై తొలి టెస్టు సిరీస్ విజయం నమోదు చేయాలన్న రోహిత్ సేనకు ఆదిలోనే చుక్కెదురైన విషయం తెలిసిందే. బాక్సింగ్ డే మ్యాచ్లో టీమిండియా ఇన్నింగ్స్ 32 పరుగుల తేడాతో ఓడిపోయింది. దీంతో రెండు మ్యాచ్ల సిరీస్లో 0-1తో వెనుకబడటంతో పాటు సిరీస్ గెలిచే అవకాశాన్ని కోల్పోయింది. ఈ నేపథ్యంలో.. సెంచూరియన్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ ఫలితంపై స్పందించిన భారత మాజీ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ జట్టు కూర్పుపై విమర్శలు గుప్పించాడు. తన యూట్యూబ్ చానెల్ వేదికగా మాట్లాడుతూ.. ‘‘అజింక్య రహానేను సెలక్ట్ చేయలేదు. ఏ కారణం లేకుండానే ఛతేశ్వర్ పుజారాను తప్పించారు. వీరిద్దరు ఎలాంటి పిచ్లపైనైనా పరుగులు రాబట్టగల సమర్థులు. పుజారా రికార్డులు గమనిస్తే.. కోహ్లి మాదిరే జట్టు కోసం అతడు ఎంతో కష్టపడ్డాడు. అయినా.. అతడిని ఎందుకు ఎంపిక చేయలేదో నాకైతే అర్థం కావడం లేదు. నిజానికి టెస్టు క్రికెట్లో పుజారా కంటే అత్యుత్తమమైన బ్యాటర్ మనకూ ఎవరూ లేరు. అతడు నెమ్మదిగా ఆడతాడన్నది వాస్తవం.. అయితే, మ్యాచ్ చేజారిపోకుండా కాపాడగలుగుతాడు. కేవలం అతడి కారణంగానే టీమిండియా ఆస్ట్రేలియా, ఇంగ్లండ్లలో టెస్టు మ్యాచ్లు గెలిచిన సందర్భాలు ఉన్నాయి. మూడు రోజుల్లోనే ముగిసిన ఈ మ్యాచ్లో టీమిండియా ఒక్కసారి కూడా ఆకట్టుకోలేకపోయింది. టాస్ ఓడి తొలి ఇన్నింగ్స్లో 245 పరుగులకే ఆలౌట్ అయింది. కేఎల్ రాహుల్ సెంచరీ వల్లే ఈమాత్రం సాధ్యమైంది. ఇక రెండో ఇన్నింగ్స్లో మరీ 131 పరుగులే చేసింది. ఒకవేళ కోహ్లి కాంట్రిబ్యూషన్ గనుక లేకపోయి ఉంటే పరిస్థితి మరింత దిగజారేది. నిజానికి ఈ మ్యాచ్లో తొలి ఇన్నింగ్స్లోనే టీమిండియా ఓటమి దాదాపుగా ఖరారైపోయింది’’ అంటూ భజ్జీ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. కాగా సౌతాఫ్రికాతో టెస్టు మొదటి ఇన్నింగ్స్లో రాహుల్ 101 పరుగులు చేయగా.. కోహ్లి రెండో ఇన్నింగ్స్లో 76 రన్స్ తీశాడు. ఇక ఇరు జట్ల మధ్య జనవరి 3 నుంచి రెండో టెస్టు ఆరంభం కానుంది. చదవండి: Ind A Vs SA A: ఐదు వికెట్లు తీసిన ఆవేశ్.. తిలక్, అక్షర్ అర్ధ శతకాలు! టాప్ స్కోరర్ అతడే -
చిత్తైన గంభీర్ జట్టు.. ఫైనల్లో హర్భజన్ టీమ్
లెజెండ్స్ లీగ్ 2023 ఎడిషన్ తుది అంకానికి చేరింది. ఫైనల్లో తలపడబోయే జట్లేవో తేలిపోయాయి. క్వాలిఫయర్-1లో విజయం సాధించడం ద్వారా అర్బన్రైజర్స్ హైదరాబాద్ ఫైనల్కు చేరింది. నిన్న (డిసెంబర్ 7) జరిగిన క్వాలిఫయర్-2లో గౌతమ్ గంభీర్ నేతృత్వంలోని ఇండియా టైగర్స్ను ఓడించడం ద్వారా హర్భజన్ సింగ్ సారథ్యంలోని మణిపాల్ టైగర్స్ టైటిల్ పోరుకు అర్హత సాధించింది. క్వాలిఫయర్-2లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇండియా క్యాపిటల్స్.. కెవిన్ పీటర్సన్ (27 బంతుల్లో 56; 2 ఫోర్లు, 5 సిక్సర్లు) చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది. మెక్క్లెనెగన్, తిసార పెరీరా తలో 3 వికెట్లు తీసి క్యాపిటల్స్ పతనాన్ని శాశించారు. అనంతరం బరిలోకి దిగిన మణిపాల్ టైగర్స్ 18.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. అసేల గుణరత్నే (39 నాటౌట్), కొలిన్ డి గ్రాండ్హోమ్ (38 నాటౌట్) బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్లు ఆడి టైగర్స్ను విజయతీరాలకు చేర్చారు. టైగర్స్ ఇన్నింగ్స్లో చాడ్విక్ వాల్టన్ (33), ఏంజెలో పెరీరా (35) కూడా రాణించారు. క్యాపిటల్స్ బౌలర్లలో ఫిడేల్ ఎడ్వర్డ్స్, ఇసురు ఉడాన, దిల్హర ఫెర్నాండో, ఈశ్వర్ పాండే తలో వికెట్ పడగొట్టారు. టోర్నీ ఫైనల్ మ్యాచ్ డిసెంబర్ 9న జరుగనుంది. టైటిల్ కోసం అర్బన్ రైజర్స్ హైదరాబాద్, మణిపాల్ టైగర్స్ తలపడతాయి. -
హర్భజన్ మాయాజాలం.. కలిస్, గేల్ మెరుపులు వృధా
లెజెండ్ లీగ్ క్రికెట్ 2023 ఎడిషన్లో భాగంగా గుజరాత్ జెయింట్స్తో నిన్న (నవంబర్ 20) జరిగిన మ్యాచ్లో మణిపాల్ టైగర్స్ 10 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన టైగర్స్.. హ్యామిల్టన్ మసకద్జ (37), తిసార పెరీరా (32), రాబిన్ ఉతప్ప (23) ఓ మోస్తరు స్కోర్లు చేయడంతో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. జెయింట్స్ బౌలర్లలో రజత్ భాటియా 3, ట్రెంట్ జాన్స్టన్ 2, ఎమ్రిట్, ఈశ్వర్ చౌదరీ, లడ్డా తలో వికెట్ పడగొట్టారు. అనంతరం ఓ మోస్తరు లక్ష్య ఛేదనకు దిగిన జెయింట్స్.. పర్వీందర్ అవానా (3-0-19-4), హర్భజన్ సింగ్ (4-1-14-2), తిసార పెరీరా (2-0-6-2) ధాటికి 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 163 పరుగులకే పరిమితమైంది. క్రిస్ గేల్ (24 బంతుల్లో 38; 7 ఫోర్లు, సిక్స్), జాక్ కలిస్ (42 బంతుల్లో 56; 8 ఫోర్లు), పార్థివ్ పటేల్ (26 బంతుల్లో 35; 4 ఫోర్లు, సిక్స్) జెయింట్స్ను గెలిపించేందుకు విఫలయత్నం చేశారు. లీగ్లో భాగంగా ఇవాళ (నవంబర్ 21) సథరన్ సూపర్ స్టార్స్, అర్బన్రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడనున్నాయి. -
IND VS SL: వైరలవుతున్న షమీ సెలబ్రేషన్స్.. హర్భజన్ను ఉద్దేశించి కాదు..!
వన్డే వరల్డ్కప్-2023లో భాగంగా శ్రీలంకతో నిన్న (నవంబర్ 2) జరిగిన మ్యాచ్లో మొహమ్మద్ షమీ (5-1-18-5) అదిరిపోయే ఐదు వికెట్ల ప్రదర్శనతో టీమిండియా విజయంలో కీలకపాత్ర పోషించిన విషయం తెలిసిందే. ఈ ఐదు వికెట్ల ప్రదర్శనతో పలు రికార్డులు కొల్లగొట్టిన షమీ.. ఈ ఘనత సాధించిన అనంతరం వినూత్న రీతిలో సంబురాలు చేసుకున్నాడు. ఈ మ్యాచ్లో షమీ తన ఐదో వికెట్ సాధించగానే బంతి తలపై రుద్దుకుంటూ డ్రెస్సింగ్ రూమ్వైపు సైగలు చేశాడు. తన ప్రదర్శన ఎవరికో అంకితం ఇస్తున్నట్లుగా షమీ సైగలు ఉన్నాయి. "Look at this Harbhajan Singh" Lord Shami the record breaker 🔥#ICCMensCricketWorldCup2023 #INDvSL #Shami #MohammedShami #IndianCricketTeam #HarbhajanSingh #ICCWorldCup2023 #viratkholi #ShubmanGill #ShreyasIyer #Siraj #MohammedSiraj pic.twitter.com/M3VtXgU4Nt — Meet Makwana (@MeetMakzz) November 2, 2023 ఈ ప్రదర్శనతో షమీ హర్భజన్ సింగ్ రికార్డును (వన్డేల్లో భారత్ తరఫున అత్యధికసార్లు ఐదు వికెట్ల ఘనత) బ్రేక్ చేయడంతో భజ్జీని ఉద్దేశించే ఈ సైగలు చేశాడని అంతా అనుకున్నారు. హిందీ వ్యాఖ్యాతలు సైతం ఇదే అన్నారు. అయితే మ్యాచ్ అనంతరం షమీ తాను చేసుకున్న సెలబ్రేషన్స్పై వివరణ ఇచ్చాడు. తాను సైగలు చేసింది భజ్జీని ఉద్దేశించి కాదని తేల్చి చెప్పాడు. తన కెరీర్ ఎత్తుపల్లాల్లో అండగా నిలిచి, తాను స్కిల్స్ డెవలప్ చేసుకోవడంలో సాయపడిన టీమిండియా బౌలింగ్ కోచ్ పరస్ మాంబ్రేను ఉద్దేశించి సదరు సంబురాలు చేసుకున్నానని వివరణ ఇచ్చాడు. తన ఐదు వికెట్ల ప్రదర్శనను మాంబ్రేకు అంకితం ఇస్తున్నాని చెప్పడానికి అలా సైగలు చేశానని తెలిపాడు. మాంబ్రేకు తలపై జట్టు ఉండదు కాబట్టి, అలా సైగలు చేశానని చెప్పుకొచ్చాడు. ఇదే విషయాన్ని మ్యాచ్ అనంతరం శుభ్మన్ గిల్ కూడా చెప్పాడు. కాగా, లంకపై ఐదు వికెట్ల ప్రదర్శనతో చెలరేగిన షమీ పలు రికార్డులను సొంతం చేసుకున్నాడు. ఇందులో వరల్డ్కప్లో భారత్ తరఫున అత్యధిక వికెట్ల రికార్డు (14 మ్యాచ్ల్లో 45) ప్రధానమైంది కాగా.. వన్డేల్లో భారత్ తరఫున అత్యధికసార్లు (4) ఐదు వికెట్ల ఘనత, వరల్డ్కప్లో అత్యధికసార్లు (3) ఐదు వికెట్ల ఘనత, వరల్డ్కప్లో అత్యధికసార్లు (7) నాలుగు అంతకంటే ఎక్కువ వికెట్లు తీసిన ఘనత వంటి పలు ఇతర రికార్డులు కూడా ఉన్నాయి. ఇదిలా ఉంటే, వాంఖడే వేదికగా శ్రీలంకతో నిన్న జరిగిన మ్యాచ్లో టీమిండియా 302 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. ఈ గెలుపుతో భారత్ అధికారికంగా సెమీస్కు చేరింది. ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. గిల్ (92), కోహ్లి (88), శ్రేయస్ (82) రాణించడంతో నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 357 పరుగులు చేసింది. లంక బౌలర్లలో దిల్షన్ మధుష్క 5 వికెట్లతో సత్తా చాటాడు. అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన లంకేయులను భారత పేసర్లు దారుణంగా దెబ్బకొట్టారు. మొహమ్మద్ షమీ (5-1-18-5), మొహమ్మద్ సిరాజ్ (7-2-16-3), జస్ప్రీత్ బుమ్రా (5-1-8-1), రవీంద్ర జడేజా (0.4-0-4-1) ధాటికి శ్రీలంక 19.4 ఓవర్లలో 55 పరుగులకే ఆలౌటైంది. లంక ఇన్నింగ్స్లో ఏకంగా ఐదుగురు డకౌట్లు కాగా..14 పరుగులు చేసిన కసున్ రజిత టాప్ స్కోరర్గా నిలిచాడు. -
న్యూజిలాండ్తో మ్యాచ్.. హార్దిక్ స్ధానంలో అతడే సరైనోడు: హర్భజన్
వన్డే ప్రపంచకప్-2023లో బాగంగా టీమిండియా ఆక్టోబర్ 22న ధర్మశాల వేదికగా న్యూజిలాండ్తో తలపడేందుకు సిద్దమైంది. ఇప్పటికే ధర్మశాలకు చేరుకున్న ఇరు జట్లు ప్రాక్టీస్లో మునిగితేలుతున్నాయి. అయితే ఈ మ్యాచ్కు టీమిండియా స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ గాయం కారణంగా కారణంగా దూరమయ్యాడు. ఈ నేపథ్యంలో కివీస్తో మ్యాచ్కు హార్దిక్ స్ధానంలో ఎవరని ఆడించాలన్నది భారత జట్టు మేనెజ్మెంట్కు తల నొప్పిగా మారింది. కొంతమంది హార్దిక్ స్ధానాన్ని ఇషాన్ కిషన్తో భర్తీ చేయాలలని కొంతమంది సూచిస్తుంటే.. మరి కొంతమంది సూర్యకుమార్ యాదవ్ను తీసుకోవాలని అభిప్రాయపడుతున్నారు. తాజాగా ఇదే విషయంపై భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ తన అభిప్రాయాలను వెల్లడించాడు. న్యూజిలాండ్తో మ్యాచ్లో టీమిండియా రెండు మార్పులతో బరిలోకి దిగాలని భజ్జీ సూచించాడు. ధర్మశాలలో బంతి ఎక్కువగా స్వింగ్ అయ్యే అవకాశం ఉన్నందుకున్న పేసర్ మహ్మద్ షమీని జట్టులోకి తీసుకోవాలని హర్భజన్ సలహా ఇచ్చాడు. అదే విధంగా హార్దిక్ పాండ్యా స్ధానంలో సూర్యకుమార్ యాదవ్కు అవకాశం ఇవ్వాలని హర్భజన్ తెలిపాడు. "న్యూజిలాండ్తో మ్యాచ్కు ముందు హార్దిక్ పాండ్యా గాయపడటం భారత జట్టుకు పెద్ద ఎదురుదెబ్బ. అతడకి బ్యాట్తో పాటు బంతితో అద్భుతంగా రాణించగల సత్తా ఉంది. కివీస్తో మ్యాచ్కు హార్దిక్ స్ధానంలో సూర్యకుమార్ యాదవ్ను జట్టులోకి తీసుకోవాలి. సూర్య జట్టుకు మంచి ఫినిషింగ్ అందించగలడు. అదే విధంగా శార్థూల్ ఠాకూర్కు ఆల్ రౌండర్ సామర్థ్యాల కారణంగానే జట్టులో అవకాశమిస్తున్నారు. కానీ అతడు బౌలింగ్ పరంగా అంతగా అకట్టుకోలేకపోయాడు. కాబట్టి అతడి స్ధానంలో మహమ్మద్ షమీని తీసుకురావాలి. ఎందుకంటే అతడు తన 10 ఓవర్ల కోటాను అద్బుతంగా పూర్తి చేయగలడు" ఆజ్టాక్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో హర్భజన్ సింగ్ పేర్కొన్నాడు. చదవండి: WC 2023: నెదర్లాండ్స్ చేతిలో చిత్తుగా ఓడిన సౌతాఫ్రికాకు మరో షాక్! -
WC: ఎవరిని తప్పిస్తారో తెలియదు.. అతడు మాత్రం ప్రతి మ్యాచ్ ఆడాల్సిందే!
ICC ODI World Cup 2023: వన్డేలకు పనికిరాడు.. అసలు ప్రపంచకప్-2023 జట్టుకు అతడిని ఏ ప్రాతిపదికన ఎంపిక చేశారు? టీ20 ఫార్మాట్లో నెంబర్ 1 అయినంత మాత్రాన జట్టులో చోటిస్తారా? అంటూ అన్ని వైపుల నుంచి విమర్శలు.. అయినప్పటికీ వరుస అవకాశాలు దక్కించుకుంటున్నాడు టీమిండియా బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్. హెడ్కోచ్ రాహుల్ ద్రవిడ్ సైతం.. తాము కచ్చితంగా సూర్యకు మద్దతునిస్తాం.. అండగా నిలుస్తాం.. వరల్డ్కప్ జట్టుకు అతడిని ఎంపిక చేయడం వెనుక మా ప్లాన్లు మాకున్నాయి అని స్వయంగా చెప్పిన విషయం తెలిసిందే. తీవ్ర ఒత్తిడిలో ఆసీస్తో సిరీస్ బరిలో దీంతో విమర్శలు రెట్టింపయ్యాయి. ఈ ముంబై బ్యాటర్ కోసం వన్డేల్లో మెరుగైన రికార్డు ఉన్న సంజూ శాంసన్ వంటి ప్రతిభ గల క్రికెటర్లను పక్కనపెడుతున్నారనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఇలాంటి తరుణంలో తీవ్ర ఒత్తిడి నేపథ్యంలో.. ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ బరిలో దిగాడు సూర్య. వరుస హాఫ్ సెంచరీలు తొలి మ్యాచ్లో 49 బంతుల్లో 50 పరుగులు సాధించిన అతడు.. రెండో వన్డేలో మాత్రం విశ్వరూపం ప్రదర్శించాడు. 24 బంతుల్లోనే ఫిఫ్టీ సాధించాడు. పటిష్ట ఆసీస్తో మ్యాచ్లో వరుసగా నాలుగు సిక్సర్లతో చెలరేగి తన ఆట స్థాయి ఏమిటో చూపించాడు. ఇండోర్లో ఆరో స్థానంలో బ్యాటింగ్కు వచ్చి మొత్తంగా 37 బంతులు ఎదుర్కొన్న అతడు 6 ఫోర్లు, 6 సిక్స్ల సాయంతో 72 పరుగులతో అజేయంగా నిలిచాడు. తనదైన రోజు ఫార్మాట్లకు అతీతంగా అద్భుతంగా రాణించగలనని నిరూపించుకున్నాడు. తుదిజట్టులో మొదటి పేరు తనదే ఉండాలి ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ సూర్యకుమార్ యాదవ్ను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశాడు. భారత్ వేదికగా జరుగనున్న వన్డే వరల్డ్కప్-2023లో టీమిండియా ప్రతీ మ్యాచ్లోనూ అతడిని ఆడించాలని మేనేజ్మెంట్కు విజ్ఞప్తి చేశాడు. ‘‘సూర్యకుమార్ యాదవ్ ప్రతీ మ్యాచ్ ఆడాల్సిందే. అయితే, అతడిని ఎవరి స్థానంలో ఆడిస్తారో నాకు తెలియదు. తుదిజట్టులో మొదటి పేరు మాత్రం తనదే అయి ఉండాలి. ఆ తర్వాతే మిగతా ఆటగాళ్ల సెలక్షన్ గురించి ఆలోచించాలి. ఐదో నంబర్లో సూర్యనే ఆడాలి మ్యాచ్ స్వరూపానే మార్చగల ఇన్నింగ్స్ ఆడగల సత్తా అతడి సొంతం. తను మెరుగ్గా ఆడిన రోజు మ్యాచ్ ఏకపక్షంగా మారిపోతుంది. అలాంటి సమయంలో తనకంటే మెరుగైన స్ట్రైక్రేటు నమోదు చేయగల బ్యాటర్ మరొకరు ఉండరు. హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజాలను మనం ఫినిషర్లుగా చూస్తాం. నా దృష్టిలో మాత్రం సూర్యకుమార్ యాదవ్ ఐదో నంబర్లో బ్యాటింగ్ చేస్తే బాగుంటుంది. సూర్య కంటే బెటర్ ప్లేయర్ ఏ జట్టులోనూ లేడు’’ అని భజ్జీ.. సూర్యపై ప్రశంసల వర్షం కురిపించాడు. కాగా కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్ మిడిలార్డర్లో కీలకంగా మారిన వేళ సూర్యను ఉద్దేశించి హర్భజన్ సింగ్ ఈ మేరకు వ్యాఖ్యలు చేయడం గమనార్హం. చదవండి: వరల్డ్కప్కు జట్టును ప్రకటించిన శ్రీలంక.. స్టార్ ఆటగాడు రీ ఎంట్రీ 6⃣6⃣6⃣6⃣ The crowd here in Indore has been treated with Signature SKY brilliance! 💥💥#TeamIndia | #INDvAUS | @IDFCFIRSTBank | @surya_14kumar pic.twitter.com/EpjsXzYrZN — BCCI (@BCCI) September 24, 2023 -
అశ్విన్కు నో ఛాన్స్.. తుది జట్టులో అతడే! భజ్జీ అంచనా తలకిందులు
Ind vs Aus 1st ODI: వన్డే వరల్డ్కప్-2023కి ముందు టీమిండియా ఆస్ట్రేలియాతో సిరీస్కు సిద్దమైంది. కంగారూ జట్టుతో మూడు వన్డేల సిరీస్ను శుక్రవారం ఆరంభించనుంది. పంజాబ్లోని మొహాలీలో గల పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ ఐఎస్ బింద్రా స్టేడియంలో తొలి మ్యాచ్ ఆడేందుకు సన్నద్ధమైంది. ఈ క్రమంలో ఇప్పటికే దాదాపు ఏడాదిన్నర తర్వాత వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ వన్డే జట్టుకు ఎంపికయ్యాడు. ఆసియా కప్-2023 సూపర్-4లో బంగ్లాదేశ్తో మ్యాచ్ సందర్భంగా గాయపడ్డ అక్షర్ పటేల్ స్థానంలో ఆసీస్తో ఆడే జట్టులో చోటు దక్కించుకున్నాడు. అయితే, తుది జట్టులో అశూకు స్థానం ఉంటుందా? లేదంటే వాషింగ్టన్ సుందర్ వైపు మొగ్గు చూపుతారా అనే చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆసీస్తో తొలి వన్డేలో సుందర్ ఆడే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని పేర్కొన్నాడు. భజ్జీ అంచనా తలకిందులు ‘‘బ్యాటింగ్ ఆర్డర్లో ఎనిమిదో స్థానంలో వాషింగ్టన్ సుందర్ లేదంటే రవిచంద్రన్ అశ్విన్ ఆడతారు. అయితే ఇద్దరిలో ఎవరికి ఆ ఛాన్స్ వస్తుందనేదే ప్రశ్న. నా అభిప్రాయం ప్రకారం.. వాషింగ్టన్ సుందర్కే అవకాశం వస్తుంది. ఎందుకంటే.. ఆసియా కప్ ఫైనల్ ఆడేందుకు అతడిని పిలిపించారు. కానీ అక్కడ అతడికి ఆడే ఛాన్స్ రాలేదు. కాబట్టి ఈసారి పరీక్షించే అవకాశం ఉంది’’ అని భజ్జీ అభిప్రాయపడ్డాడు. కాగా అక్షర్ పటేల్ గాయం నేపథ్యంలో ప్రపంచకప్ జట్టులో ఆఫ్ స్పిన్నర్ అశ్విన్కు చోటు దక్కే అవకాశాలున్న నేపథ్యంలో హర్భజన్ సింగ్ ఈ మేరకు వ్యాఖ్యలు చేయడం గమనార్హం. అయితే, భజ్జీ అంచనా తలకిందులైంది. తుది జట్టులో అశ్విన్కు స్థానం దక్కగా.. వాషింగ్టన్ సుందర్కు మొండిచేయి ఎదురైంది. ఇక సెప్టెంబరు 24, 27 తేదీల్లో టీమిండియా- ఆస్ట్రేలియా మధ్య మలి రెండు వన్డేలు జరుగనున్నాయి. తొలి రెండు మ్యాచ్లకు రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యాలకు విశ్రాంతినిచ్చిన నేపథ్యంలో కేఎల్ రాహుల్ జట్టును ముందుండి నడిపించనున్నాడు. ఇదిలా ఉంటే.. అక్టోబరు 5 నుంచి ప్రపంచకప్-2023 టోర్నీ ఆరంభం కానుంది. ఆసీస్తో తొలి వన్డేకు భారత తుది జట్టు శుభ్మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, శ్రేయాస్ అయ్యర్, లోకేష్ రాహుల్ (కెప్టెన్), ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా (వైస్ కెప్టెన్), రవిచంద్రన్ అశ్విన్, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ. -
కోలీవుడ్ను నమ్మి క్లీన్ బోల్డ్ అయిన 5 మంది స్టార్ క్రికెట్ ఆటగాళ్లు
కొందరు భారత్ ప్రముఖ క్రికెటర్లు సినిమా రంగంలో రానించాలనే కోరికతో తమిళ చిత్రసీమలో అగ్రస్థానాన్ని కైవసం చేసుకోవాలని కలలు కంటూ.. తొలి సినిమాతోనే క్లీన్ బౌల్డ్ కావడమే కాకుండా సినిమా పరిశ్రమలోకి వచ్చినంత వేగంగానే చెన్నై వదిలి వెళ్లిపోయారు. అలాంటి ఐదుగురు సెలబ్రిటీల గురించి చూద్దాం. భారత్లో క్రికెట్కు అభిమానుల సంఖ్య ఎక్కువగానే ఉంది. ముఖ్యంగా తమిళనాడులో క్రికెటర్లకు ఉన్న ప్రాధాన్యతను తెలుసుకుని కొందరు క్రికెటర్లు తమిళ చిత్రసీమలోకి హీరోలుగా అడుగుపెట్టినా.. విజయావకాశాలను అందిపుచ్చుకోలేకపోయారు. (ఇదీ చదవండి: లారెన్స్ తన కూతురిని దాస్తున్నాడా? ఆయనకు అంత పెద్ద కూతురు ఉందా?) తమిళ సినీ పరిశ్రమలో కనిపించిన ఐదుగురు క్రికెట్ సెలబ్రిటీలకు కొంతమేరకు నష్టం తెచ్చింది. కానీ అందరికంటే భారత మాజీ కెప్టెన్ ధోనీనే ఎక్కువగా నష్టపోయాడని చెప్పవచ్చు. మరోవైపు సినిమాల్లో నటించి సక్సెస్ కాకపోవడంతో ఆ క్రికెటర్లకు అవకాశాలు రాలేదు. కొన్ని నెలల క్రితం విడుదలైన ఎల్జీఎం అనే చిత్రాన్ని క్రికెటర్ ధోనీ నిర్మించాడు. ఎనిమిది కోట్ల వ్యయంతో రూపొందిన ఈ చిత్రంలో హరీష్ కళ్యాణ్ హీరోగా నటించగా ఇవానా హీరోయిన్గా నటించింది. నదియా, యోగిబాబు తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రం ఇటీవల విడుదలై మిశ్రమ సమీక్షలను అందుకుంది. అలాగే, ఇప్పటి వరకు ఈ చిత్రాన్ని OTTకి విక్రయించడానికి ధోని కష్టపడుతున్నట్లు వార్తలు వచ్చాయి. అదే విధంగా ఈ సినిమా వల్ల ధోని సంస్థ నష్టపోయింది. మొదటి ప్రొడక్షన్ LGM ఫ్లాప్ కావడంతో, ధోని తన తదుపరి చిత్రం గురించి ఆలోచిస్తాడా? అనేది కూడా పెద్ద ప్రశ్నగా మారింది. నటులుగా అరంగేట్రం చేసిన క్రికెట్ దిగ్గజాలు ఈ జాబితాలో క్రికెటర్ సదాగోపన్ రమేష్ మొదటి స్థానంలో ఉన్నాడు. 1999 సెప్టెంబరులో అతను వన్డే క్రికెట్లో మొదటి బంతికే వికెట్ తీసిన తొలి భారతీయ క్రికెటర్గా గుర్తింపు పొందాడు. కానీ ఆయన కేవలం 19 టెస్ట్ మ్యాచ్లతో పాటు 24 వన్డేలు మాత్రమే ఆడారు. 2011లో దర్శకుడు యువరాజ్ దయాళన్ దర్శకత్వంలో 'బొట్ట బొట్టి' తమిళ చిత్రంలో హీరోగా నటించాడు. ఈ చిత్రం ఒక చిన్న గ్రామంలో క్రికెట్ మ్యాచ్ చుట్టూ కేంద్రీకృతమై, హాస్య కథాంశం ఆధారంగా రూపొందించబడింది. ఆ సినిమా ఆశించిన విజయం సాధించకపోవడంతో ఆదిలోనే సినీ పరిశ్రమకు దూరమయ్యాడు. అతని తర్వాత నటుడు హర్భజన్ సింగ్ ఇటీవలే 'ఫ్రెండ్షిప్' సినిమాతో హీరోగా తెరంగేట్రం చేశాడు. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. అదే విధంగా, ప్రముఖ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ కూడా కోలీవుడ్లో నటించాడు. చియాన్ విక్రమ్ నటించిన 'కోబ్రా' చిత్రంలో పోలీసు అధికారి పాత్రను పోషించాడు. సినిమాలో అతని పాత్ర ఆకట్టుకునేలా ఉన్నప్పటికీ 'కోబ్రా' సినిమా ఘోర పరాజయం అయింది. దీంతో ఇర్ఫాన్ పఠాన్ కూడా సినిమాల నుంచి కనిపించకుండా పోయాడు. అతని తర్వాత క్రికెటర్ శ్రీశాంత్ కూడా గత సంవత్సరం విఘ్నేష్ శివన్ దర్శకత్వం వహించిన 'కథు వాకిల్ దౌ కాదల్'లో చిన్న పాత్రలో నటించాడు. ఈ సినిమాలో ఆయన నటించిన సన్నివేశాలను ఎక్కువగా కట్ చేయడంతో ఆయన పాత్రకు స్కోప్ లేకుండా పోయింది. అలా ఆయన కూడా మరోసారి తమిళ చిత్రసీమలో అడుగుపెట్టలేదు. (ఇదీ చదవండి: విశాల్ 'మార్క్ ఆంటోనీ' సినిమాపై బ్యాన్ విధించిన కోర్టు) సినిమా అంటే తెలుగు ప్రేక్షకలకు చాలా మక్కువ.. అందుకే భాష, ప్రాంతంతో సంబంధం లేకుండా జైలర్,జవాన్,విక్రమ్ వంటి సినిమాలకు టాలీవుడ్లో భారీగా కలెక్షన్స్ వచ్చాయి. అలా ధోనీ నిర్మించిన మొదటి సినిమా టాలీవుడ్ నుంచి అయి ఉండుంటే కచ్చితంగా విజయవంతం అయి ఉండేదని పలువురు అభిప్రాయ పడ్డారు. ధోనీ తన LGM ప్రొడక్షన్ నుంచి తర్వాత నిర్మించబోయే సినిమా తెలుగు నుంచే ఉంటుందని వార్తలు వస్తున్నాయి. -
ఆరోజు నేను- ధోని కాదు.. భజ్జీ గెలిపించాడు! వెటకారమెందుకు గంభీర్? బుద్ధుందా?
Harbhajan Won The Match, Dhoni And I...": Gambhir: ‘‘ధోనితో కలిసి నేను మెరుగైన భాగస్వామ్యం నమోదు చేసిన మాట వాస్తవమే. అయితే, ఆరోజు నేను టీమిండియాను గెలిపించలేదు. హర్భజన్ ఆ పని చేశాడు. కానీ.. ఛేజింగ్లో ఏ బ్యాటర్ అయితే తన పరుగుతో లక్ష్యం పూర్తి చేశాడో అతడే జట్టును గెలిపించినట్లు భావించడం సహజం. నేను కూడా అదే నమ్ముతాను’’ అని టీమిండియా మాజీ ఓపెనర్ గౌతం గంభీర్ అన్నాడు. 2010 నాటి ఆసియా కప్ టోర్నీలో టీమిండియా- పాకిస్తాన్ మ్యాచ్ సంగతుల ప్రస్తావన నేపథ్యంలో ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు. అయితే, గౌతీ వ్యాఖ్యలపై టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని అభిమానులు మండిపడుతున్నారు. ధోని ఫ్యాన్స్ ఆగ్రహం ‘‘ఇది వెటకారమా? లేదంటే ఒక్కో సందర్భంలో ఒక్కోలా మాట్లాడటం నీకు అలవాటా? కాస్తైనా బుద్ధి ఉండాలి’’ అని సోషల్ మీడియా వేదికగా ఫైర్ అవుతున్నారు. కాగా ఆసియా వన్డే కప్-2023లో భాగంగా శ్రీలంక వేదికగా టీమిండియా తమ తొలి మ్యాచ్లో శనివారం పాకిస్తాన్తో తలపడిన విషయం తెలిసిందే. ఆ క్రెడిట్ భజ్జీకే ఇవ్వాలి ఈ మ్యాచ్ సందర్భంగా బ్రాడ్కాస్టర్ స్టార్ స్పోర్ట్స్ 2010 నాటి దాయాదుల పోరు దృశ్యాలను ప్లే చేసింది. ఈ క్రమంలో కామెంటేటర్ గంభీర్.. నాడు టీమిండియాను గెలిపించిన ఘనత హర్భజన్ సింగ్కే ఇవ్వాలని పేర్కొన్నాడు. కాగా ఆనాడు డంబుల్లా మ్యాచ్లో.. పాకిస్తాన్ 49.3 ఓవర్లలో 267 పరుగులకు ఆలౌట్ అయింది. ఈ క్రమంలో టీమిండియా 49.5 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 271 పరుగులు చేసి మూడు వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్లో 83 పరుగులతో ఓపెనర్ గంభీర్ అదరగొట్టగా.. కెప్టెన్ ధోని 56 పరుగులతో రాణించాడు. అయితే, ఆఖరి వరకు అజేయంగా నిలిచిన ఆఫ్ స్పిన్నర్ భజ్జీ విన్నింగ్ రన్ తీశాడు. ధోని విన్నింగ్స్ సిక్సర్ను తక్కువ చేసే విధంగా దీంతో పాకిస్తాన్పై భారత్ గెలుపొందగా.. గంభీర్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు వచ్చింది. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ గంభీర్ పైవిధంగా కామెంట్ చేశాడు. అయితే, కొంతకాలం క్రితం.. ‘‘2011 వరల్డ్కప్ ఈవెంట్లో మనం యువరాజ్ సింగ్ ఇవ్వాల్సినంత క్రెడిట్ ఇవ్వలేదు. జహీర్ ఖాన్, సురేశ్ రైనా, మునాఫ్ పటేల్.. సచిన్ టెండుల్కర్ అందరూ రాణించారు. కానీ ఎవరూ దాని గురించి మాట్లాడలేదు. మీడియా మొత్తం ఎంఎస్ ధోని సిక్సర్ గురించే కోడైకూసింది. వ్యక్తిగత ఆరాధన మత్తులో పడి జట్టును మరిచిపోయింది’’ అని గంభీర్ రెవ్స్పోర్ట్స్తో వ్యాఖ్యానించాడు. దీంతో గౌతీ అప్పటి.. ఇప్పటి వ్యాఖ్యలను పోలుస్తూ మిస్టర్ కూల్ ధోని ఫ్యాన్స్ ఓ ఆట ఆడుకుంటున్నారు. చదవండి: 3 గోల్డెన్ క్యాచ్లు డ్రాప్.. ఫోర్లు, సిక్సర్లతో రెచ్చిపోయిన నేపాల్ ఓపెనర్ Here’s the much talked about clip of Gautam Gambhir’s commentary last night. Gautam Gambhir was the POTM in the 2010 Asia Cup Final between India and Pakistan. He says “Actually, it wasn’t me who won the match for the team. There was a partnership between me and Dhoni, but I… pic.twitter.com/NfwwmN4rMZ — Vibhor (@dhotedhulwate) September 3, 2023 "Dhoni finishes off in style!" 🇮🇳🏆 Happy birthday to the man who hit the winning runs in the 2011 @cricketworldcup final, @msdhoni! pic.twitter.com/X0s7Jo7cWp — ICC Cricket World Cup (@cricketworldcup) July 7, 2018 -
'ఎందుకు ఛాన్స్ ఇవ్వలేదు.. అతడి కంటే జట్టులో తోపులు ఎవరూ లేరు'
ఆసియాకప్-2023కు 17 మంది సభ్యులతో కూడిన భారత జట్టును బీసీసీఐ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆసియాకప్తో స్టార్ ఆటగాళ్లు కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ రీ ఎంట్రీ ఇవ్వనుండగా.. యువ ఆటగాడు తిలక్ వర్మకు కూడా ఈ జట్టులో చోటు దక్కింది. అయితే ఈ జట్టులో స్టార్స్పిన్నర్ యజువేంద్ర చాహల్కు చోటు దక్కలేదు. చహల్కు బదులగా కుల్దీప్ యాదవ్కు సెలక్టర్లు అవకాశమిచ్చారు. ఇక ఆసియాకప్ జట్టు నుంచి చహల్ను పక్కన పెట్టడాన్ని టీమిండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ తప్పుబట్టాడు. వైట్ బాల్ క్రికెట్లో చాహల్ అత్యుత్తమ బౌలర్ అని, అతడికి చోటు దక్కకపోవడం తనకు ఆశ్చర్యం కలిగించందని హర్భజన్ అన్నాడు. "యుజ్వేంద్ర చాహల్ జట్టులో లేకపోవడం భారత్కు తీరని లోటు. ఎందుకంటే ఆసియాకప్కు ఎంపిక చేసిన జట్టులో లెగ్ స్పిన్నర్ ఒక్కరు కూడా లేరు. లెగ్ స్పిన్నర్కు మ్యాచ్ను మలుపు తిప్పే సత్తా ఉంటుంది. వైట్బాల్ క్రికెట్లో భారత జట్టులో చాహల్ కంటే మెరుగైన స్పిన్నర్ మరొకడు లేడు. అతడు గత కొన్ని మ్యాచ్ల్లో బాగా రాణించకపోవచ్చు. అంత మాత్రాన అతడు మంచి బౌలర్ కాకుండా పోడు. ప్రస్తుత పరిస్థితుల్లో జట్టుకు అతడి సేవలు చాలా అవసరం. అతడికి జట్టులోకి వచ్చేందుకు దారులు ఇంకా మూసుకుపోలేదని నేను అనుకుంటున్నాను. వరల్డ్కప్ భారత్లో జరగనుంది. కాబట్టి చాహల్ను కచ్చితంగా పరిగణలోకి తీసుకోవాలి. చాహల్ మ్యాచ్ విన్నింగ్ స్పిన్నర్. అతడు ఫామ్లో లేడని నాకు తెలుసు. కానీ జట్టుతో లేకపోతే అతడి ఆత్మవిశ్వాసం దెబ్బతింటుందని" అని హర్భజన్ తన యూట్యూబ్ ఛానల్లో పేర్కొన్నాడు. చదవండి: Asia Cup 2023: ఆసియాకప్లో భారత్దే పై చేయి.. ఫైనల్లో ఒక్కసారి కూడా తలపడని దాయాదులు! -
రెచ్చిపోయిన శ్రీశాంత్.. చెలరేగిన పాక్ బౌలర్లు
యూఎస్ మాస్టర్స్ టీ10 లీగ్ 2023లో టీమిండియా మాజీ పేసర్ శ్రీశాంత్ చెలరేగిపోయాడు. మోరిస్విల్లే యూనిటీ తరఫున బరిలోకి దిగిన శ్రీశాంత్.. టెక్సస్ ఛార్జర్స్తో ఇవాళ (ఆగస్ట్ 23) జరిగిన మ్యాచ్లో 2 ఓవర్లలో కేవలం 12 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. అతనికి సౌతాఫ్రికా మాజీ టెస్ట్ బౌలర్ డేన్ పైడ్ట్ (2/15), విండీస్ నవీన్ స్టివర్ట్ (1/5) తోడవ్వడంతో టెక్సస్ ఛార్జర్స్ నిర్ణీత 10 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 109 పరుగులకు పరిమితమైంది. ✌️wickets in his first over for Sreesanth 💪#MVUvTXC #CricketsFastestFormat #USMastersT10 #T10League #SunshineStarsSixes pic.twitter.com/Pm5kAUyimb — US Masters T10 (@USMastersT10) August 23, 2023 ఛార్జర్స్ ఇన్నింగ్స్లో ఇంగ్లండ్ మాజీ డారెన్ స్టీవెన్స్ 18 బంతుల్లో 36 పరుగులతో టాప్ స్కోరర్గా నిలువగా.. బెన్ డంక్ (15), తిసాక పెరీరా (12), ఉపుల్ తరంగ (13) తలో చేయి వేశారు. మహ్మద్ హఫీజ్ (8), ముక్తర్ అహ్మద్ (2), సోహైల్ తన్వీర్ (6) సింగిల్ డిజిట్ స్కోర్లకే ఔటయ్యారు. Difference maker in his first outing with the ball 💪 Hafeez, take a bow! 🙇♂️🙇♀️#MVUvTXC #CricketsFastestFormat #USMastersT10 #T10League #SunshineStarsSixes pic.twitter.com/tKfJDx0U2G — US Masters T10 (@USMastersT10) August 23, 2023 K̶e̶y̶ Massive wickets 🤝 Professor Hafeez@MHafeez22#MVUvTXC #CricketsFastestFormat #USMastersT10 #T10League #SunshineStarsSixes pic.twitter.com/erlsKDVEBu — US Masters T10 (@USMastersT10) August 23, 2023 చెలరేగిన పాక్ బౌలర్లు.. 110 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన మోరిస్విల్లే యూనిటీ.. పాక్ బౌలర్లు మహ్మద్ హఫీజ్ (2-0-10-3), సోహైల్ తన్వీర్ (2-0-8-2), విండీస్ బౌలర్ ఫిడేల్ ఎడ్వర్డ్స్ (2-0-10-2), లంక బౌలర్ తిసార పెరీరా (2-0-16-1) చెలరేగడంతో నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి కేవలం 75 పరుగులకే పరిమితమైంది. షెహన్ జయసూర్య (22) టాప్ స్కోరర్గా నిలువగా.. మిగతా బ్యాటర్లలో కోరె ఆండర్సన్ (16 నాటౌట్) ఒక్కడే రెండంకెల స్కోర్ చేశాడు. ఫలితంగా టెక్సస్ ఛార్జర్స్ 34 పరుగుల తేడాతో మోరిస్విల్లేను ఓడించింది. -
అశ్విన్-జడేజాల ముంగిట వరల్డ్ రికార్డు.. మరో 3 వికెట్లు తీస్తే..!
భారత స్పిన్ ద్వయం రవిచంద్రన్ అశ్విన్-రవీంద్ర జడేజాల కోసం ఓ వరల్డ్ రికార్డు కాసుకు కూర్చుంది. ఈ స్పిన్ ద్వయం విండీస్తో జరుగుతున్న రెండో టెస్ట్ నాలుగో రోజు మరో 3 వికెట్లు పడగొడితే టెస్ట్ క్రికెట్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన స్పిన్ ద్వయంగా రికార్డుల్లోకెక్కుతుంది. ఈ ఇద్దరు కలిసి ఇప్పటివరకు టెస్ట్ల్లో 49 మ్యాచ్ల్లో 498 వికెట్లు పడగొట్టారు. వీరికి ముందు భారత మాజీ స్పిన్ ద్వయం అనిల్ కుంబ్లే-హర్భజన్ సింగ్ 54 మ్యాచ్ల్లో 501 వికెట్లు పడగొట్టారు. టెస్ట్ క్రికెట్ చరిత్రలో అత్యధిక వికెట్లు సాధించిన స్పిన్ ద్వయం రికార్డు కుంబ్లే-భజ్జీ జోడీ పేరిట ఉంది. విండీస్తో నేటి మ్యాచ్లో అశ్విన్-జడేజా ఇద్దరు కలిసి మరో 3 వికెట్లు పడగొడితే, కుంబ్లే-భజ్జీ జోడీని వెనక్కునెట్టి టెస్ట్ల్లో అత్యధిక వికెట్లు తీసిన స్పిన్ ద్వయం రికార్డును వారి ఖాతాలో వేసుకుంటారు. ఓవరాల్గా టెస్ట్ల్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన జోడీ రికార్డు ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలింగ్ పెయిర్ జేమ్స్ ఆండర్సన్-స్టువర్ట్ బ్రాడ్ పేరిట ఉంది. వీరిద్దరు కలిసి 137 టెస్ట్ల్లో 1034 వికెట్లు పడగొట్టారు. వీరి తర్వాత షేన్ వార్న్-గ్లెన్ మెక్గ్రాత్ ద్వయం ఉంది. వీరు 104 మ్యాచ్ల్లో 1001 వికెట్లు సాధించారు. ఈ జాబితాలో ప్రస్తుతం కుంబ్లే-భజ్జీ జోడీ 11వ స్థానంలో.. అశ్విన్-జడేజా జోడీ 12వ స్థానంలో ఉన్నాయి. ఇదిలా ఉంటే, రెండో టెస్ట్ మూడో రోజు ఆట ముగిసే సమయానికి విండీస్ తొలి ఇన్నింగ్స్లో 5 వికెట్ల నష్టానికి 229 పరుగులు చేసింది. కెప్టెన్ క్రెయిగ్ బ్రాత్వైట్ (75), తేజ్నరైన్ చంద్రపాల్ (33), కిర్క్ మెక్కెంజీ (32), జెర్మైన్ బ్లాక్వుడ్ (20), జాషువ డిసిల్వ (10) ఔట్ కాగా.. అలిక్ అథనేజ్ (37), జేసన్ హోల్డర్ (11) క్రీజ్లో ఉన్నారు. భారత బౌలర్లలో జడేజా 2, ముకేశ్ కుమార్, సిరాజ్, అశ్విన్ తలో వికెట్ పడగొట్టారు. అంతకుముందు భారత్ తొలి ఇన్నింగ్స్లో 438 పరుగులకు ఆలౌటైంది. 500వ అంతర్జాతీయ మ్యాచ్ ఆడుతున్న విరాట్ కోహ్లి (121) సెంచరీతో కదంతొక్కగా.. యశస్వి (57), రోహిత్ (80), జడేజా (61), అశ్విన్ (56)అర్ధసెంచరీలతో రాణించారు. విండీస్ బౌలర్లలో కీమర్ రోచ్, వార్రికన్ చెరో 3 వికెట్లు.. హోల్డర్ 2, గాబ్రియల్ ఓ వికెట్ పడగొట్టారు. -
రోహిత్, కోహ్లి, హార్దిక్ స్టార్లు! సింగిల్స్ సేవ్ చేయడం.. రనౌట్లపై కూడా కాస్త..
ICC ODI World Cup 2023: ‘‘మనకు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా లాంటి ఎంతో మంది స్టార్ క్రికెటర్లు ఉన్నారు. అయితే వీరితో పాటు మిగతా ఆటగాళ్లు, మేనేజ్మెంట్ కూడా ఒకే లక్ష్యంతో సమష్టిగా ముందుకు సాగాలి. మన జట్టులో లోపమేమిటో నాకైతే అర్థం కావడం లేదు. 2015, 2019 వరల్డ్కప్ టోర్నీల్లో సెమీ ఫైనల్స్ వరకు వచ్చాము. కానీ రెండు సందర్భాల్లోనూ ఐసీసీ ట్రోఫీ మాత్రం గెలవలేకపోయాం. ఒకవేళ ఒత్తిడిని జయించలేకే ఇలా చిత్తైపోతున్నామా అనిపిస్తోంది. ఇలాంటి మెగా ఈవెంట్లలో కీలక ఆటగాళ్లతో పాటు మిగిలిన వాళ్లంతా కూడా కలిసి వస్తేనే ఒత్తిడిని అధిగమించగలుగుతాం. ముగ్గురూ.. నలుగురూ రాణించినంత మాత్రాన ప్రయోజనం ఉండదు. అనుకున్న ఫలితాలు రాబట్టే వీలు కూడా ఉండదు’’ అని టీమిండియా దిగ్గజ స్పిన్నర్ హర్భజన్ సింగ్ అభిప్రాయపడ్డాడు. దశాబ్ద కాలంగా నో ట్రోఫీ! కాగా దశాబ్ద కాలంగా ఐసీసీ టైటిల్ గెలవలేదన్న అపఖ్యాతిని మూటగట్టుకున్న టీమిండియాకు.. ఆ అప్రతిష్టను చెరిపివేసుకునేందుకు వన్డే ప్రపంచకప్-2023 రూపంలో మంచి అవకాశం వచ్చింది. సొంతగడ్డపై ఈ మ్యాచ్ జరుగనుండటం రోహిత్ సేనకు మరింత సానుకూలాంశంగా మారింది. అక్టోబరు 5 నుంచి మొదలుకానున్న ఈ మెగా టోర్నీలో భాగంగా తమ తొలి మ్యాచ్లో ఆస్ట్రేలియాను ఢీకొట్టనుంది. ఆసీస్తో తొలి మ్యాచ్ అక్టోబరు 8న చెన్నై వేదికగా ఈ మ్యాచ్ జరుగనుంది. ఈ నేపథ్యంలో భజ్జీ మాట్లాడుతూ.. ఒకరో ఇద్దరో మాత్రమే రాణిస్తే ట్రోఫీ గెలవలేమని.. జట్టు మొత్తం సమష్టిగా రాణిస్తేనే టైటిల్ సాధించగలమని పేర్కొన్నాడు. అదే విధంగా పెద్ద పెద్ద విషయాలపై మాత్రమే దృష్టి సారించకుండా.. చిన్న చిన్న లోపాలు, తప్పిదాలను సరిచేసుకోవడం అత్యంత ముఖ్యమన్నాడు. సింగిల్ సేవ్ చేయడం కూడా ‘‘సింగిల్ సేవ్ చేయడం, దొరికిన అవకాశాలను అందిపుచ్చుకుంటూ రనౌట్లు చేయడం వంటివి చిన్న విషయాలుగా అనిపించినా అవే ఒక్కోసారి మ్యాచ్ ఫలితాలను మార్చివేసేంతంగా ప్రభావం చూపుతాయి. జట్టంతా కలిసికట్టుగా ఆడితే అనుకున్న ప్రణాళికలను అమలు చేయవచ్చు’’ అంటూ హర్భజన్ సింగ్ న్యూస్24 స్పోర్ట్స్తో తన అభిప్రాయాలు పంచుకున్నాడు. చదవండి: టీమిండియా సెలెక్టర్లకు విషమ పరీక్ష.. ఛాలెంజ్ విసురుతున్న మరో ఓపెనర్! ఆరోజు రోహిత్ భార్య అన్న మాట జీవితంలో మర్చిపోలేను: తిలక్ వర్మ తండ్రి దీనస్థితిలో ధోని సొంత అన్న? బయోపిక్లో ఎందుకు లేడు? అయినా అతడితో.. -
Ind vs WI: అశ్విన్ అరుదైన ఘనత.. మూడో భారత బౌలర్గా చరిత్ర
West Indies vs India, 1st Test: వెస్టిండీస్తో తొలి టెస్టు సందర్భంగా టీమిండియా ప్రధాన స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అరుదైన మైలురాయిని చేరుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక వికెట్లు తీసిన మూడో భారత బౌలర్గా చరిత్రకెక్కాడు. కాగా టీమిండియా ప్రస్తుతం వెస్టిండీస్ పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ముందుగా రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్లో భాగంగా డొమినికా వేదికగా జూలై 12న తొలి మ్యాచ్ ఆరంభమైంది. టాస్ గెలిచిన ఆతిథ్య జట్టు తొలుత బ్యాటింగ్ ఎంచుకోగా భారత స్పిన్నర్ అశ్విన్ విండీస్ బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. ఓపెనర్లు క్రెగ్ బ్రాత్వైట్(20), తేజ్నరైన్ చందర్పాల్(12)లను అవుట్ చేసి ఆరంభంలోనే షాకిచ్చాడు. అల్జారీ జోసెఫ్ను అవుట్ చేయడం ద్వారా అదే విధంగా.. టెయిలెండర్లు అలిక్ అథనాజ్(47), అల్జారీ జోసెఫ్(4), వారికన్(1) వికెట్లు కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. మొత్తంగా ఐదు వికెట్లతో రాణించి తొలిరోజు ఆటలో టీమిండియా పైచేయి సాధించేందుకు సహకరించాడు. ఇదిలా ఉంటే.. అల్జారీ జోసెఫ్ను అవుట్ చేయడం ద్వారా ఇంటర్నేషనల్ కెరీర్లో అశూ 700వ వికెట్ సాధించాడు. కుంబ్లే, భజ్జీ తర్వాత తన 271వ మ్యాచ్ సందర్భంగా ఈ అరుదైన మైలురాయిని చేరుకున్నాడు. తద్వారా దిగ్గజ స్పిన్నర్ అనిల్ కుంబ్లే, ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ తర్వాత 700 వికెట్ల క్లబ్లో చేరిన మూడో భారత బౌలర్గా నిలిచాడు. కాగా కుంబ్లే తన అంతర్జాతీయ కెరీర్లో మొత్తంగా 403 మ్యాచ్లలో 956 వికెట్లు పడగొట్టి అగ్రస్థానంలో ఉన్నాడు. 16వ స్థానంలో ఇక భజ్జీ 711 వికెట్లతో రెండో స్థానంలో కొనసాగుతుండగా.. అశూ త్వరలోనే అతడి రికార్డును బద్దలుకొట్టే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే.. అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో శ్రీలంక స్పిన్ దిగ్గజం ముత్తయ్య మురళీధరన్ 1347 వికెట్లతో ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నాడు. ఈ జాబితాలో అశూ(702 వికెట్లు) 16వ స్థానంలో కొనసాగుతున్నాడు. చదవండి: Ind Vs WI: మనం తప్పు చేశామా అని పశ్చాత్తాపపడేలా చేశాడు! తొలిరోజే కోహ్లిని టీజ్ చేసిన ఇషాన్ కిషన్.. వీడియో వైరల్ -
వెస్టిండీస్తో తొలి టెస్టు.. ఆ ఇద్దరికీ నో ఛాన్స్! ఆంధ్ర ఆటగాడి వైపే మొగ్గు
దాదాపు నెల రోజుల విరామం తర్వాత భారత జట్టు తిరిగి మైదానంలో అడుగుపెట్టనుంది. డొమినికా వేదికగా జూలై 12 నుంచి జరగనున్న తొలి టెస్టులో వెస్టిండీస్తో తలపడేందుకు టీమిండియా అన్ని విధాల సిద్దమైంది. 10 రోజుల ముందే కరీబియన్ గడ్డపై అడుగు పెట్టిన రోహిత్ సేన.. ఈ సిరీస్ కోసం తీవ్రంగా శ్రమించింది. డబ్ల్యూటీసీ సైకిల్ 2023-25లో తొలి విజయమే లక్ష్యమే భారత జట్టు బరిలోకి దిగనుంది. ఈ క్రమంలో విండీస్తో తొలి టెస్టుకు టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్ను భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ఎంచుకున్నాడు. తన ఎంచుకున్న జట్టులో ఆల్ రౌండర్లు శార్దూల్ ఠాకూర్, అక్షర్ పటేల్కు చోటు దక్కలేదు. అదే విధంగా యువ ఆటగాడు యశస్వీ జైశ్వాల్కు భజ్జీ చోటిచ్చాడు. మరోవైపు వికెట్ కీపర్గా కిషన్కు కాకుండా ఆంధ్ర వికెట్ కీపర్ బ్యాటర్ శ్రీకర్ భరత్ వైపే భజ్జీ మొగ్గు చూపాడు. హర్భజన్ సింగ్ తన యూట్యూబ్ ఛానల్లో మాట్లాడుతూ.. "వెస్టిండీస్తో జరిగే తొలి టెస్టులో భారత ఇన్నింగ్స్ను రోహిత్ శర్మ, శుబ్మన్ గిల్ ప్రారంభించాలి. మూడో స్ధానంలో యువ ఆటగాడు జైశ్వాల్కు అవకాశం ఇవ్వాలి. అయితే చాలా మంది ఓపెనర్గా గిల్ను కాకుండా జైశ్వాల్ను పంపాలని అభిప్రాయపడుతున్నారు. నావరకు అయితే అది సరైన నిర్ణయం కాదు. ఎందుకంటే గిల్ ఓపెనర్ వచ్చి ఎన్నో అద్భుతమైన ఇన్నింగ్స్లు ఆడాడు. అతడు ఆ స్ధానాన్ని పదిలం చేసుకున్నాడు. కాబట్టి అతడి స్ధానాన్ని మార్చి ఏకగ్రాతను దెబ్బ తీయవద్దు. ఇక నాలుగు, ఐదు స్ధానాల్లో వరుసగా కోహ్లి, రహానే బ్యాటింగ్కు వస్తారు. అందులో ఎటువంటి మార్పు ఉండదు. ఇక ఆరో స్థానంలో రవీంద్ర జడేజా వస్తాడు. ఏడో నెంబర్లో కేఎస్ భరత్ లేతా అశ్విన్ ఆడతారు. ఒకవేళ అశ్విన్ను ముందుగా పంపితే భరత్ 8వ స్థానంలో ఆడతాడు. ఆ తర్వాత మహమ్మద్ సిరాజ్ ఉంటాడు. అదే విధంగా దేశీవాళీ క్రికెట్లో అద్భుతంగా రాణించిన జయదేవ్ ఉనద్కట్కు అవకాశం ఇవ్వాలి. జట్టులో ఐదో పేసర్గా ముఖేష్ కుమార్ను తీసుకోవాలి" అని చెప్పుకొచ్చాడు. హర్భజన్ ఎంచుకున్న జట్టు: రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, అజింక్యా రహానే, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, శ్రీకర్ భరత్, మహమ్మద్ సిరాజ్, జయదేవ్ ఉనద్కత్, ముఖేష్ కుమార్ చదవండి: Ind vs WI: జట్టు కోసం ఎంతో చేశాడు.. కానీ పాపం! వాళ్లు కూడా విఫలమయ్యారు.. అయినా.. -
ప్రపంచంలో టాప్ 5 బెస్ట్ ప్లేయర్స్ వీరే.. కోహ్లి, రోహిత్కు నో ఛాన్స్!
ఇంగ్లండ్-ఆస్ట్రేలియా మధ్య యాషెస్ సిరీస్ రసవత్తరంగా సాగుతోంది. తొలి రెండు టెస్టుల్లో ఇంగ్లండ్ ఓటమిపాలైనప్పటికీ.. ఆసీస్కు మాత్రం చెమటలు పట్టించింది. ఓ వైపు టీ20 క్రికెట్కు ఆదరణ పెరగడంతో టెస్టు క్రికెట్ కనమరుగై అయిపోతుందని అంతా భావిస్తున్నారు. ఇటువంటి సమయంలో ఇంగ్లండ్, ఆసీస్ మాత్రం రెడ్ బాల్ క్రికెట్కు సరికొత్త అర్ధాన్ని చెబుతున్నాయి. ఈ క్రమంలో ప్రస్తుతం ప్రపంచంలోని అత్యుత్తమ టెస్ట్ క్రికెటర్లు ఎవరు అనే చర్చ సోషల్ మీడియాలో మరోసారి మొదలైంది. తాజాగా భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ ప్రపంచంలోని టాప్ ఫైవ్ టెస్ట్ క్రికెటర్లను ఎంచుకున్నాడు. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే భజ్జీకి ఓ ప్రశ్న ఎదురైంది. " ప్రస్తుతం ప్రపంచటెస్టు క్రికెట్లో ఐదుగురు బెస్ట్ ప్లేయర్స్ ఎవరు? స్కిల్స్ మాత్రమే కాకుండా గేమ్ ఛేంజర్స్, మ్యాచ్ విన్నర్లు, కీలక సమయాల్లో బాగా ఆడినవారిని పరిగణలోకి తీసుకుని చెప్పండి" అని ఓ ట్విటర్ యూజర్ ప్రశ్నించాడు. అందుకు బదులుగా భజ్జీ.. ఆస్ట్రేలియా స్టార్ ఆటగాళ్లు నాథన్ లయాన్, స్టీవ్ స్మిత్, టీమిండియా యువ సంచలనం రిషబ్ పంత్, మరో భారత ఆల్రౌండర్ రవీంద్ర జడేజా, ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ను ఎంచుకున్నాడు. కాగా భజ్జీ ఎంచుకున్న టాప్ ఫైవ్ ప్లేయర్స్లో భారత స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి, కెప్టెన్ రోహిత్ పాటు నెం.1 టెస్టు బౌలర్ రవిచంద్రన్ అశ్విన్కు చోటుదక్కపోవడం గమానార్హం. చదవండి: IND vs WI: వెస్టిండీస్తో టెస్టు సిరీస్.. ఇషాన్ కిషన్ అరంగేట్రం! ఆంధ్ర ఆటగాడికి నో ఛాన్స్ -
WTC Final: కేఎస్ భరత్పై నమ్మకం లేదు..!
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2021-23 ఫైనల్కు ముందు టీమిండియా మేనేజ్మెంట్కు ఓ విషయం పెద్ద సమస్యగా మారింది. ఫైనల్ మ్యాచ్లో వికెట్కీపర్గా ఎవరిని ఎంపిక చేయాలనే విషయంపై వారు తలలు పట్టుకుని కూర్చున్నారు. ఈ విషయంపై విశ్లేషకులు, మాజీలు, అభిమానులు ఎవరికి తోచిన సలహాలు వారు ఇస్తున్నారు. అయినా మేనేజ్మెంట్ ఎటూ తేల్చుకోలేకపోతుంది. తాజాగా ఇదే విషయమై టీమిండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ మరోసారి స్పందించాడు. తొలుత భారత వికెట్కీపర్గా కేఎస్ భరత్ బెటర్ అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన భజ్జీ.. తాజాగా తన యూట్యూబ్ ఛానల్తో మాట్లాడుతూ మాట మార్చాడు. భరత్తో పోలిస్తే ఇషాన్ కిషన్ బెటర్ ఆప్షన్ అవుతాడని అభిప్రాయపడ్డాడు. 4 మ్యాచ్ల్లో కేవలం 101 పరుగులు చేసిన భరత్పై అంత నమ్మకం కలగడం లేదని, అతని కంటే ధాటిగా బ్యాటింగ్ చేయగల ఇషాన్ను ఆడించడమే సమంజసమని అన్నాడు. ఇషాన్కు రిషబ్ పంత్లా అగ్రెసివ్గా ఆడే సామర్థ్యం ఉందని, అతను ఇంత వరకు టెస్ట్ అరంగేట్రం చేయలేదని కారణం చూపి ఆడించకపోతే టీమిండియాకే లాస్ అవుతుందని తెలిపాడు. పైగా ఇషాన్ ఇటీవల ముగిసిన ఐపీఎల్లో మంచి టచ్లో ఉన్నాడని, ఐదు, ఆరు స్థానాల్లో అతను బరిలోకి దిగితే రెండో కొత్త బంతితో ఆడుకుంటాడని పేర్కొన్నాడు. వికెట్కీపింగ్ విషయానికొస్తే తన ఓటు భరత్కే అయినప్పటికీ.. అందుకోసం ఓ బ్యాటర్ను కోల్పోలేమని చెప్పుకొచ్చాడు. ఫైనల్గా డబ్ల్యూటీసీ ఫైనల్కు తన ఛాయిస్ ఇషానే అని చెప్పకనే చెప్పాడు. ఇదిలా ఉంటే, డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ ఓవల్ మైదానం వేదికగా జూన్ 7 నుంచి 11 వరకు జరుగనున్న విషయం తెలిసిందే. చదవండి: WTC Final IND VS AUS: ఐసీసీ ఫైనల్స్లో ఎవరెన్ని గెలిచారు..? -
ఆ ఇద్దరికి టీమిండియాకు ఆడే అవకాశం ఇవ్వండి.. బీసీసీఐకి హర్భజన్ విజ్ఞప్తి
టీమిండియా మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ ఇద్దరు యువ క్రికెటర్ల కోసం బీసీసీఐని అభ్యర్ధించాడు. ఐపీఎల్-2023లో అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తున్న కేకేఆర్ రింకూ సింగ్, రాజస్థాన్ యశస్వి జైస్వాల్లను లేట్ చేయకుండా టీమిండియాలోకి తీసుకోవాలని భజ్జీ కోరాడు. ఇప్పటికిప్పుడు రింకూ, యశస్విలను నేరుగా ఫైనల్ ఎలెవెన్లో (టీమిండియా) ఆడించాలని కోరడం లేదని, వారిని జట్టుకు దగ్గరగా తీసుకెళ్లాలన్నదే తన విజ్ఞప్తి అని తెలిపాడు. వారిరువురికి ప్రస్తుతమున్న ఫామ్లో అవకాశాలు కల్పిస్తే సత్తా చాటుతారని, సెలెక్టర్లు వేచి చూసే ధోరణిని అవలంభిస్తే, అది వారితో పాటు టీమిండియాకు కూడా నష్టంగా పరిణించబడుతుందని అభిప్రాయపడ్డాడు. ఆటగాళ్లు రాణిస్తున్నప్పుడు వారిని వ్యవస్థలో భాగం చేయాలని, నేరుగా వారిని తుది జట్టులో ఆడించకపోయినా, జట్టుకు దగ్గర చేస్తే ఖచ్చితంగా వారు తమలోని టాలెంట్ను మరింత మెరుగపర్చుకుంటారని అన్నాడు. కాగా, ఐపీఎల్ ప్రదర్శనల కారణంగా ఆటగాళ్లు టీమిండియా తలుపులు తట్టడం ఇది కొత్తేమీ కాదు. సూర్యకుమార్ యాదవ్, మహ్మద్ సిరాజ్, హార్ధిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రా లాంటి స్టార్లు సైతం ఇదే వేదికగా వెలుగులోకి వచ్చి నేడు టీమిండియాలో సుస్థిర స్థానాలు సంపాదించుకున్నారు. ఈ ఐపీఎల్ సీజన్లో భీకర ఫామ్లో ఉన్న కొద్ది మంది ఆటగాళ్లను మాజీలు, విశ్లేషకులు టీమిండియాకు రెకమెండ్ చేస్తున్నారు. వారిలో అత్యధిక భాగం రింకూ, యశస్విలను మద్దతు పలుకుతున్నారు. ఐపీఎల్ ప్రదర్శన కారణంగానే అజింక్య రహానే భారత టెస్ట్ జట్టులో చోటు సంపాదించడంతో ఈ వేదికపై సత్తా చాటి టీమిండియాలోకి ఎంట్రీ ఇవ్వాలని చాలామంది యువ ఆటగాళ్లు ఉవ్విళ్లూరుతున్నారు. వీరితో యశస్వి జైస్వాల్ (13 మ్యాచ్ల్లో 575 పరుగులు), రింకూ సింగ్ (13 మ్యాచ్ల్లో 407 పరుగులు) ముందువరుసలో ఉన్నారు. చదవండి: నీకు బౌన్సర్లు వేయడం మాత్రమే వచ్చా? నాపై రాహుల్ సీరియస్ అయ్యాడు: సిరాజ్ -
అతడు అద్బుతంగా రాణిస్తున్నాడు.. టీమిండియా రీ ఎంట్రీ పక్కా!
ఐపీఎల్-2023లో కేకేఆర్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి తన అద్భుత ఫామ్ను కొనసాగిస్తున్నాడు. ఈ మెగా ఈవెంట్లో భాగంగా సోమవారం పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో మూడు వికెట్లతో వరుణ్ చక్రవర్తి చెలరేగాడు. ఈ మ్యాచ్లో తన నాలుగు ఓవర్ల కోటాలో 26 పరుగులిచ్చి మూడు కీలక వికెట్లు సాధించాడు. ఇక ఈ ఏడాది సీజన్లో ఇప్పటివరకు 11 మ్యాచ్లు ఆడిన వరుణ్.. 17 వికెట్లు పడగొట్టాడు. ఇక ఈ క్యాష్ రిచ్ లీగ్లో అద్భుత ప్రదర్శన కనబరుస్తున్న వరుణ్ చక్రవర్తిపై టీమిండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ప్రశంసల వర్షం కురిపించాడు. వరుణ్ చక్రవర్తి ప్రస్తుతం అద్భుతమైన ఫామ్లో ఉన్నాడని, తిరిగి భారత జట్టులోకి ఎంట్రీ ఇస్తాడని భజ్జీ కొనియాడాడు. "నేను వరుణ్తో కలిసి కేకేఆర్ తరపున ఆడినప్పుడు అతడు తీవ్రమైన మోకాలి నొప్పితో బాధపడుతున్నాడు. ఆసమయంలో అతడు ఇంజెక్షన్లు తీసుకుంటూ, ఐస్ ప్యాక్లు వేసుకుంటూ టోర్నీ మొత్తం కొనసాగాడు. అయినప్పటికీ అతడు ఆ సీజన్లో అద్భుతంగా బౌలింగ్ చేశాడు. వరుణ్ టీమిండియాకు ఎంపికైనప్పుడు కూడా మోకాలి నొప్పితో బాధపడుతున్నాడు. ఓ సందర్భంలో అతడితో నేను మాట్లాడినప్పుడు బరువు తగ్గించుకోమని సలహా ఇచ్చాను. ఎందుకంటే బరువు కారణంగా అతని మోకాలిపై చాలా ఒత్తిడి పడుతుంది. అతడు బరువు తగ్గాడు. ఇప్పుడు ఎటువంటి సమస్య లేకుండా బౌలింగ్తో పాటు ఫీల్డింగ్ కూడా అద్భుతంగా చేస్తున్నాడు. కాబట్టి వరుణ్ కచ్చితంగా టీమిండియాలోకి రీ ఎంట్రీ ఇస్తాడు" అని స్టా్ర్ స్పోర్ట్స్ షోలో హర్భజన్ సింగ్ పేర్కొన్నాడు. చదవండి: IPL 2023: ఆర్సీబీతో ముంబై కీలకపోరు.. తిలక్ వర్మ బ్యాక్! అతడు కూడా -
ధోని కోపంతో బ్యాట్ విరగ్గొట్టాడు: హర్భజన్ సింగ్
ప్రపంచ క్రికెట్లో టీమిండియా మాజీ సారధి ఎంఎస్ ధోని.. "కెప్టెన్ కూల్"గా పేరు గాంచిన సంగతి తెలిసిందే. చాలా మ్యాచ్ల్లో ధోని తన ప్రశాంతతతోనే భారత జట్టుకు అద్భుతమైన విజయాలను అందించాడు. ధోని తన చర్యలతో ఎంతోమంది యువ కెప్టెన్లకు ఆదర్శంగా నిలిచాడు. అటువంటి ధోని ఓ సందర్భంలో తన ప్రశంతతనను కోల్పోయి బ్యాట్ విరగ్గొట్టాడంట. ఈ విషయాన్ని భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ వెల్లడించాడు. వీరిద్దరూ చాలా కాలం పాటు కలిసి భారత జట్టుకు ఆడిన విషయం విధితమే. జార్ఖండ్లో ఓ ప్రాక్టీస్ మ్యాచ్ సందర్భంగా ధోని తన బ్యాట్ను విరగ్గొట్టినట్లు భజ్జీ తెలిపాడు. "జార్ఖండ్లో మేము రెండు జట్లుగా విడిపోయి ఇంట్రాస్వ్కాడ్ మ్యాచ్ ఆడుతున్నాం. ఈ మ్యాచ్లో ధోని జట్టు చాలా వెనుకబడింది. ధోని ఆఖరిలో బ్యాటింగ్ వచ్చాడు. ఈ క్రమంలో తన జట్టు వెనుకబడడంతో ధోని కోపంతో ఊగిపోయాడు. తన బ్యాట్ని నెలకేసి కొట్టాడు. దీంతో బ్యాట్ హ్యాండిల్ విరిగిపోయింది" అని సీఎస్కే, కేకేఆర్ మ్యాచ్ సందర్భంగా హర్భజన్ పేర్కొన్నాడు. ఇక ఈ ఏడాది సీజన్లో వరుస విజయాలతో దూసుకుపోతున్న సీఎస్కే.. పాయింట్ల పట్టికలో అగ్ర స్థానంలో నిలిచింది. ఇప్పటి వరకు 7 మ్యాచ్లు ఆడిన సీఎస్కే 5 మ్యాచ్ల్లో విజయం సాధించింది. చదవండి: IPL 2023: ఢిల్లీతో మ్యాచ్.. సన్రైజర్స్ జట్టులో కీలక మార్పులు! 8 కోట్ల ఆటగాడికి నో ఛాన్స్! -
ఒక్క బంతి కూడా వేస్ట్ చేయలేదు... ఇది బాలేదు అని చెప్పడానికి ఏమీలేదు!
IPL 2023 CSK Vs SRH: టీమిండియా ఆల్రౌండర్, చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ రవీంద్ర జడేజాపై భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ప్రశంసలు కురిపించాడు. సన్రైజర్స్ హైదరాబాద్తో మ్యాచ్లో అద్భుతంగా బౌలింగ్ చేశాడని, తన బౌలింగ్లో ఎలాంటి లోపాలు లేవని కొనియాడాడు. కాగా ఐపీఎల్-2023లో భాగంగా చెన్నైలోని చెపాక్ వేదికగా సీఎస్కే- ఎస్ఆర్హెచ్ మధ్య శుక్రవారం మ్యాచ్ జరిగింది. అదరగొట్టిన బౌలర్లు సొంతమైదానంలో టాస్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్కు దిగిన హైదరాబాద్ జట్టును సీఎస్కే బౌలర్లు దెబ్బకొట్టారు. ఓపెనర్ హ్యారీ బ్రూక్(18)ను అవుట్ చేసి ఆకాశ్ సింగ్ బ్రేక్ ఇవ్వగా.. రవీంద్ర జడేజా.. అభిషేక్ శర్మ(34), రాహుల్ త్రిపాఠి(21), మయాంక్ అగర్వాల్(2) రూపంలో మూడు కీలక వికెట్లు తీశాడు. మహీశ్ తీక్షణ మార్కరమ్ వికెట్ తన ఖాతాలో వేసుకోగా.. మతీశ పతిరణ క్లాసెన్ను అవుట్ చేశాడు. జడ్డూ సూపర్ స్పెల్ ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు నష్టపోయిన సన్రైజర్స్ 134 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనకు దిగిన చెన్నై 18.4 ఓవర్లలోనే 3 వికెట్ల నష్టానికి 138 పరుగులు సాధించి గెలుపొందింది. 4 ఓవర్ల బౌలింగ్ కోటాలో 22 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీసి, జట్టు గెలుపులో కీలక పాత్ర పోషించిన జడేజా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలిచాడు. ఒక్క బంతి కూడా వేస్ట్ చేయలేదు ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం హర్భజన్ సింగ్ స్టార్ స్పోర్ట్స్ షోలో మాట్లాడుతూ.. ‘‘ఈరోజు రవీంద్ర జడేజా కనీసం ఒక్క బంతి కూడా వేస్ట్ చేయలేదు. కచ్చితత్వం(లైన్ అండ్ లెంగ్త్ విషయంలో)తో బౌలింగ్ చేశాడు. తన బౌలింగ్లో పరుగులు రాబట్టాలంటే బ్యాటర్లు ఏదో ఒక ప్రయోగం చేయాల్సిన పరిస్థితి కల్పించాడు. పరుగులు సాధించేందుకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా.. బ్యాటర్లను తన ట్రాప్లో పడేసి వికెట్లు పడగొట్టాడు’’ అని జడ్డూ ఆట తీరును భజ్జీ ప్రశంసించాడు. తన బౌలింగ్లో ఈ అంశం బాలేదని చెప్పడానికి ఏమీ లేదంటూ కొనియాడాడు. కాగా రైజర్స్తో మ్యాచ్లో మూడు వికెట్లతో మెరిసిన స్పిన్ ఆల్రౌండర్ జడేజాకు బ్యాటింగ్ చేయాల్సిన అవసరమే రాలేదు. సీఎస్కే వర్సెస్ ఎస్ఆర్హెచ్ మ్యాచ్ స్కోర్లు సన్రైజర్స్ హైదరాబాద్- 134/7 (20) చెన్నై సూపర్ కింగ్స్- 138/3 (18.4). చదవండి: ఇదే నా చివరి ఐపీఎల్ కావొచ్చు.. అతడు అద్భుతం! నేను ఎప్పటికీ మర్చిపోను: ధోని పేరుకే ఆల్రౌండర్.. జట్టులో ఎందుకు ఉన్నాడో తెలియదు! తీసి పడేయండి Of a match-winning three-wicket haul, an energetic Chennai crowd and getting used to Bowling Coach duties 🙌🏻😎 No shortage of smiles in this post-match conversation ft. @imjadeja & @DJBravo47 😃 - By @RajalArora Full Interview 🎥🔽 #TATAIPL | #CSKvSRHhttps://t.co/fgZ81tMi1F pic.twitter.com/PdFcwOaYd7 — IndianPremierLeague (@IPL) April 22, 2023 -
కోహ్లి, బాబర్, సూర్య కాదు.. అతడే ప్రపంచ నెం1 ఆటగాడు!
ఐపీఎల్-2023లో బుధవారం చెపాక్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో 3 పరుగుల తేడాతో రాజస్తాన్ రాయల్స్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఆల్రౌండ్ ప్రదర్శన కనబరిచిన రాజస్తాన్.. సీఎస్కే కంచుకోటను బద్దలు కొట్టింది. ఆఖరి ఓవర్లో సీఎస్కే విజయానికి 21 పరుగులు అవసరమవ్వగా.. సందీప్ శర్మ అద్భుతంగా బౌలింగ్ చేసి రాజస్తాన్కు సంచలన విజయాన్ని అందించాడు. ధోని స్ట్రైక్లో ఉన్నప్పటికీ సందీప్ శర్మ మాత్రం యార్కర్లతో ఎటువంటి అవకాశం ఇవ్వలేదు. అతడే వరల్డ్ నెం1 బ్యాటర్.. ఇక మెగా ఈవెంట్లో అదరగొడుతున్న రాజస్తాన్ రాయల్స్ స్టార్ ఓపెనర్ జోస్ బట్లర్పై భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ప్రశంసల వర్షం కురిపించాడు. బట్లర్ వరల్డ్ నెం1 బ్యాటర్ అని భజ్జీ కొనియాడాడు. కాగా బట్లర్ అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. ఇప్పటి వరకు 4 మ్యాచ్లు ఆడిన జోస్.. 204 పరుగులతో ఆరెంజ్ క్యాప్ రేస్లో మూడో స్థానంలో ఉన్నాడు. "బట్లర్ను ఏమని ప్రశంసించాలో కూడా తెలియడం లేదు.. అతడు వైట్బాల్ క్రికెట్లో అద్భుతమైన ఆటగాడు. అతడు క్రీజును తనకు తగ్గట్టుగా ఉపయోగించుకుంటాడు. జోస్కు మంచి బ్యాటింగ్ టెక్నిక్ కూడా ఉంది. స్పిన్నర్లను కూడా అతడు సమర్ధవంతంగా ఎదుర్కొగలడు. నా వరకు అయితే ప్రస్తుత ప్రపంచ క్రికెట్లో అతడే నెం1 బ్యాటర్ అని" హర్భజన్ స్టార్ క్రికెట్ స్పోర్ట్స్ లైవ్ షోలో పేర్కొన్నాడు. కాగా ప్రపంచ టీ20 క్రికెట్ను శాసిస్తున్న బాబర్ ఆజం, సూర్యకుమార్ యాదవ్, కోహ్లి, రిజ్వాన్ పేరులను భజ్జీ ప్రస్తావించకపోవడం గమనార్హం. చదవండి: IPL 2023: గిల్ క్లీన్ బౌల్డ్.. ప్రీతీ జింటా రియాక్షన్ సూపర్! వీడియో వైరల్ -
‘రింకూ నా కుమారుడి లాంటివాడు’; అతడంటే అందరికీ ఇష్టమే! ఎందుకంటే?
IPL 2023 GT Vs KKR- Rinku Singh: ‘‘రింకూ సింగ్ గురించి చాలా మందికి పూర్తిగా తెలియకపోవచ్చు. అయితే కేకేఆర్లో మాత్రం అతడు ప్రతి ఒక్కరికి ఎంతో ఇష్టమైన ఆటగాడు. తను ఎన్నో ఏళ్లుగా జట్టుతో కొనసాగుతున్నాడు. ప్రతిఒక్కరు అతడిని ఇష్టపడతారు. గారాబం చేస్తారు. అంతెందుకు ఖాన్ సాబ్(షారుక్ ఖాన్) అయితే ఓ రోజు మాట్లాడుతూ.. ‘రింకూ నా కుమారుడి లాంటివాడు’’ అన్నాడు. అతడిపై అందరూ ఎందుకంత ప్రేమను కురిపిస్తారంటే.. తనకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు తన ఒంట్లోని ప్రతి రక్తపు బొట్టును.. అణువణువులో దాగున్న శక్తిని ధారబోస్తాడు’’ అంటూ టీమిండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్.. కోల్కతా నైట్ రైడర్స్ స్టార్ రింకూ సింగ్ను ఆకాశానికెత్తాడు. రింకూతో మామూలుగా ఉండదు ఆట పట్ల రింకూ అంకితభావం అమోఘమంటూ కొనియాడాడు. కాగా డిపెండింగ్ చాంపియన్ గుజరాత్ టైటాన్స్తో ఆదివారం నాటి మ్యాచ్లో రింకూ అద్భుత ఇన్నింగ్స్ ఆడిన విషయం తెలిసిందే. ఆఖరి ఓవర్లో వరుసగా ఐదు సిక్స్లు బాది జట్టును విజయతీరాలకు చేర్చాడు. మై బేబీ రింకూ ఈ నేపథ్యంలో రింకూ సింగ్పై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ క్రమంలో కేకేఆర్ సహ యజమాని షారుక్ ఖాన్ సైతం మై బేబీ రింకూ అంటూ ప్రేమను కురిపించాడు. ఇక కేకేఆర్ మాజీ ప్లేయర్ సైతం రింకూ ఇన్నింగ్స్ గురించి స్పందిస్తూ తన యూట్యూబ్ చానెల్ వేదికగా మాట్లాడాడు. ‘‘అంతటి ఒత్తిడిలోనూ రింకూ వరుసగా ఐదు సిక్సర్లు బాదాడు. కఠిన పరిస్థితుల్లో ఇలాంటి ఇన్నింగ్స్ ఆడటం మామూలు విషయం కాదు. తను ఒక్క బంతిని మిస్ చేసినా.. మ్యాచ్ చేజారిపోయేది. కానీ తను అలా కానివ్వలేదు’’ అంటూ భజ్జీ ప్రశంసించాడు. మనసులు గెలిచాడు తన అద్భుత ఇన్నింగ్స్తో రింకూ అందరి మనసులు గెలిచాడని కొనియాడాడు. భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు చేరి అత్యుత్తమ ప్లేయర్గా నిలుస్తాడని విశ్వాసం వ్యక్తం చేశాడు. కాగా పేద కుటుంబానికి చెందిన రింకూ.. అనేక కష్టనష్టాలకోర్చి క్రికెటర్గా ఎదిగాడు. దేశవాళీ క్రికెట్లో సత్తా చాటిన లెఫ్టాండ్ బ్యాటర్ రింకూను కేకేఆర్ కొనుగోలు చేయగా.. ఐపీఎల్లో అతడికి అవకాశం వచ్చింది. చదవండి: 4 ఓవర్లలో 69 పరుగులు; తలెత్తుకో చాంపియన్.. కేకేఆర్ ట్వీట్ వైరల్! ఎవరీ యశ్ దయాల్? IPL 2023: ఇంజక్షన్లు తీసుకున్నా.. అద్భుత ప్రభావం.. త్వరలోనే కలుస్తా 𝗗𝗲𝘁𝗲𝗿𝗺𝗶𝗻𝗮𝘁𝗶𝗼𝗻, 𝗘𝘅𝗰𝗲𝗹𝗹𝗲𝗻𝗰𝗲, 𝗖𝗹𝗮𝘀𝘀: All captured in a moment to savour 🙌 Seek your Monday Motivation from this conversation ft. man of the moment @rinkusingh235 & @NitishRana_27 👏👏 - By @Moulinparikh Full Interview🔽 #TATAIPLhttps://t.co/X0FyKmIjAD pic.twitter.com/FtVgYQJQ5H — IndianPremierLeague (@IPL) April 10, 2023 -
26 బంతుల్లో బౌండరీ, 10 సిక్సర్లతో వీరవిహారం
లెజెండ్స్ క్రికెట్ ట్రోఫీ-2023లో భాగంగా పట్నా వారియర్స్తో ఇవాళ (మార్చి 27) జరిగిన మ్యాచ్లో చండీఘడ్ ఛాంప్స్ 91 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఛాంప్స్.. పునీత్ కుమార్ (26 బంతుల్లో 78 నాటౌట్; ఫోర్, 10 సిక్సర్లు), భాను సేథ్ (21 బంతుల్లో 43; 6 సిక్సర్లు), గౌరవ్ తోమర్ (43 బంతుల్లో 86; 7 ఫోర్లు, 6 సిక్సర్లు) సిక్సర్ల సునామీ సృష్టించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 229 పరుగుల భారీ స్కోర్ చేసింది. అనంతరం బరిలోకి దిగిన పట్నా వారియర్స్.. ఛాంప్స్ బౌలర్ల ధాటికి 18.5 ఓవర్లలో 138 పరుగులకే ఆలౌటై, ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. ఛాంప్స్ బౌలర్లు పర్వీన్ థాపర్ 3, గౌరవ్ తోమర్, రమన్ దత్తా, తిలకరత్నే దిల్షన్ తలో 2 వికెట్లు, ముకేశ్ సైనీ ఓ వికెట్ పడగొట్టారు. వారియర్స్ ఇన్నింగ్స్ 9వ నంబర్ ఆటగాడు ప్రవీణ్ గుప్తా (21) టాప్ స్కోరర్గా నిలిచాడు. ఇదిలా ఉంటే, మొత్తం 6 జట్టు పాల్గొంటున్న లెజెండ్స్ క్రికెట్ ట్రోఫీ-2023లో చండీఘడ్ ఛాంప్స్ వరుస విజయాలతో దూసుకుపోతుంది. ఈ జట్టు ఇప్పటివరకు ఆడిన 3 మ్యాచ్ల్లో విజయం సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. ఛాంప్స్ తర్వాత ఇండోర్ నైట్స్ (4 మ్యాచ్ల్లో 3 విజయాలతో 6 పాయింట్లు) రెండులో, వైజాగ్ టైటాన్స్ (3 మ్యాచ్ల్లో 2 విజయాలతో 4 పాయింట్లు), గౌహతి అవెంజర్స్ (3 మ్యాచ్ల్లో ఓ విజయంతో 2 పాయింట్లు), పట్నా వారియర్స్ (3 మ్యాచ్ల్లో ఓ విజయంతో 2 పాయింట్లు), నాగ్పూర్ నింజాస్ (4 మ్యాచ్ల్లో 4 పరాజయాలు) వరుసగా 3 నుంచి 6 స్థానాల్లో ఉన్నాయి. కాగా, ఈ టోర్నీలో దేశీయ ఆటగాళ్లతో పాటు పలువురు దేశ, విదేశీ స్టార్లు కూడా పాల్గొంటున్నారు. రాస్ టేలర్, తిలకరత్నే దిల్షాన్, ఇర్ఫాన్ పఠాన్, మాంటీ పనేసర్, ఉపుల్ తరంగ, సనత్ జయసూర్య, సురేశ్ రైనా, హర్భజన్ సింగ్, వీరేంద్ర సెహ్వాగ్ తదితర ఇంటర్నేషనల్ స్టార్లు వివిధ టీమ్లకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. -
స్టువర్ట్ బిన్నీ ఊచకోత.. రిచర్డ్ లెవి విధ్వంసం
లెజెండ్స్ క్రికెట్ ట్రోఫీ-2023లో భాగంగా వైజాగ్ టైటాన్స్, నాగ్పూర్ నింజాస్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ ఆధ్యంతం ఉత్కంఠభరితంగా సాగింది. హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్లో వైజాగ్ టైటాన్స్ పరుగు తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన టైటాన్స్ వీరేంద్ర సెహ్వాగ్ (18 బంతుల్లో 27; 6 ఫోర్లు), నిక్ కాంప్టన్ (45 బంతుల్లో 58; 7 ఫోర్లు, సిక్స్), మల్కన్ సింగ్ (33 బంతుల్లో 38; 4 ఫోర్లు), స్టువర్ట్ బిన్నీ (18 బంతుల్లో 49 నాటౌట్; 3 ఫోర్లు, 5 సిక్సర్లు) చెలరేగడంతో నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. స్టువర్ట్ బిన్నీ ఆకాశమే హద్దుగా చెలరేగి ఎడాపెడా బౌండరీలు సిక్సర్లు బాదాడు. అనంతరం బరిలోకి దిగిన నింజాస్ రిచర్డ్ లెవి విధ్వంసకర ఇన్నింగ్స్తో విరుచుకుపడినప్పటికీ గెలవలేకపోయింది. ఈ ఇన్నింగ్స్లో 44 బంతులు ఎదుర్కొన్న లెవి 7 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో 94 పరుగులు చేసి ఔటయ్యాడు. లెవికి మరో ఎండ్ నుంచి సహకారం లభించకపోవడంతో నింజాస్ ఓటమిపాలైంది. అభిమన్యు ఖోద్ (42) పర్వాలేదనిపించినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఆఖరి ఓవర్లో నింజాస్ గెలుపుకు 10 పరుగులు అవసరం కాగా.. 8 పరుగులు మాత్రమే వచ్చాయి. ఆఖరి ఓవర్ అద్భుతంగా బౌల్ చేసిన స్టువర్ట్ బిన్నీ.. హర్భజన్ సింగ్ను కట్టడి చేయగలిగాడు. ఆఖరి బంతికి సిక్సర్ అవసరం కాగా, భజ్జీ బౌండరీతో సరిపెట్టుకున్నాడు. -
సురేశ్ రైనా విశ్వరూపం.. 45 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో..!
లెజెండ్స్ లీగ్ క్రికెట్-2023 (LLC Masters) పూర్తయిన వెంటనే మరో లెజెండ్స్ క్రికెట్ టోర్నీ ప్రారంభమైంది. ఘాజియాబాద్ వేదికగా జరుగుతున్న ఈ టోర్నీలో నిన్న (మార్చి 22) ఇండోర్ నైట్స్, నాగ్పూర్ నింజాస్ జట్లు తలపడగా.. ఇండోర్ నైట్స్ 11 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇండోర్ నైట్స్.. ఫిల్ మస్టర్డ్ (39 బంతుల్లో 53; 6 ఫోర్లు, 2 సిక్సర్లు), సురేశ్ రైనా (45 బంతుల్లో 90 నాటౌట్; 10 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపు హాఫ్ సెంచరీలతో చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 209 పరుగుల భారీ స్కోర్ చేసింది. After LLC Masters, Suresh Raina joined the Indore Knights squad to participate in the ongoing Legends Cricket Trophy.#SureshRaina #LLCMasters #LegendsLeagueCricket #CSK https://t.co/olITh4nprx — CricTracker (@Cricketracker) March 23, 2023 నింజాస్ బౌలర్లలో కుల్దీప్ హుడా 4 వికెట్లు పడగొట్టగా.. ప్రిన్స్ 2 వికెట్లు దక్కించుకున్నాడు. అనంతరం బరిలోకి దిగిన నింజాస్ను కుల్దీప్ హుడా (42 బంతుల్లో 77; 7 ఫోర్లు, 5 సిక్సర్లు) గెలిపించేందుకు విశ్వప్రయత్నాలు చేసినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. బౌలింగ్లో చెలరేగిన హుడా బ్యాటింగ్లోనూ విజృంభించి తన జట్టును గెలిపించేందుకు విఫలయత్నం చేశాడు. నిర్ణీత ఓవర్లు పూర్తయ్యే సరికి నింజాస్ 7 వికెట్లు కోల్పోయి 198 పరుగులకు పరిమితం కావడంతో 11 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఇండోర్ బౌలర్లలో కపిల్ రాణా 3, రాజేశ్ ధాబి 2, జితేందర్ గిరి, సునీల్ చెరో వికెట్ పడగొట్టారు. నింజాస్ ఇన్నింగ్స్లో రిచర్డ్ లెవి (13), వీరేంద్ర సింగ్ (15), అభిమన్యు (13), రితేందర్ సింగ్ సోధి (11) విఫలం కాగా.. సత్నమ్ సింగ్ (32), ప్రిన్స్ పర్వాలేదనిపించాడు. టీమిండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ నేతృత్వంలో బరిలోకి దిగిన నింజాస్కు ఈ టోర్నీలో ఇది తొలి ఓటమి. ఈ టోర్నీలో దేశీయ ఆటగాళ్లతో పాటు పలువురు దేశ, విదేశీ స్టార్లు కూడా పాల్గొంటున్నారు. రాస్ టేలర్, తిలకరత్నే దిల్షాన్, ఇర్ఫాన్ పఠాన్, మాంటీ పనేసర్, ఉపుల్ తరంగ, సనత్ జయసూర్య, సురేశ్ రైనా, హర్భజన్ సింగ్, వీరేంద్ర సెహ్వాగ్ తదితర ఇంటర్నేషనల్ స్టార్లు వివిధ టీమ్లకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. -
"నాటు నాటు" స్టెప్పులతో అదరగొట్టిన టీమిండియా క్రికెటర్లు
RRR సినిమాలోని నాటు నాటు పాటకు ఆస్కార్ రావడంతో యావత్ ప్రపంచానికి ఈ పాట ఫోబియా పట్టుకుంది. ఎక్కడ చూసినా జనాల ఈ పాటకు స్టెప్పులేస్తూ దర్శనిమిస్తున్నారు. సోషల్మీడియా మాధ్యమాల్లో అయితే ఈ పాటకు ఉన్న క్రేజ్ వేరే లెవెల్లో ఉంది. సామాన్యుల దగ్గరి నుంచి సెలబ్రిటీల వరకు అందరూ నాటు నాటు పాటకు కాలు కదుపుతున్నారు. తాజాగా ఇద్దరు టీమిండియా మాజీలు కూడా ఈ పాటకు స్టెప్పేసి ఇరగదీశారు. Those are some sweet feet, I tell you what! 😍@IndMaharajasLLC @harbhajan_singh @ImRaina #LegendsLeagueCricket #SkyexchnetLLCMasters #LLCT20 #YahanSabBossHain #IMvsWG pic.twitter.com/Kv9y1ss6bs — Legends League Cricket (@llct20) March 15, 2023 లెజెండ్ లీగ్ క్రికెట్-2023లో భాగంగా వరల్డ్ జెయింట్స్తో నిన్న (మార్చి 15) జరిగిన మ్యాచ్లో ఇండియా మహారాజాస్ ఆటగాళ్లు హర్భజన్ సింగ్, సురేశ్ రైనా నాటు నాటు పాటకు చిందేసి అభిమానులను ఉర్రూతలూగించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్మీడియాలో వైరలవుతోంది. సీఎస్కే మాజీ క్రికెటర్లను అభిమానులు రామ్చరణ్, తారక్లతో పోలుస్తూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. మ్యాచ్ విషయానికొస్తే.. ఇండియా మహారాజాస్తో జరిగిన మ్యాచ్లో వరల్డ్ జెయింట్స్ 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన మహారాజాస్.. సురేశ్ రైనా (41 బంతుల్లో 49; 2 ఫోర్లు, 3 సిక్సర్లు), బిస్లా (36), ఇర్ఫాన్ పఠాన్ (25) ఓ మోస్తరుగా రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 136 పరుగులు చేసింది. వరల్డ్ జెయింట్స్ బౌలర్లు బ్రెట్ లీ (3-0-18-3), పోఫు (4-0-22-2), టీనో బెస్ట్ (4-0-27-2) చెలరేగారు. అనంతరం బరిలోకి దిగిన వరల్డ్ జెయింట్స్.. క్రిస్ గేల్ (46 బంతుల్లో 57; 9 ఫోర్లు, సిక్స్) వీరవిహారం ధాటికి 18.4 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. గేల్కు షేన్ వాట్సన్ (26), సమిత్ పటేల్ (12) సహకరించారు. మహారాజాస్ బౌలర్లలో యుసఫ్ పఠాన్ (4-0-14-2), ప్రవీణ్ తాంబే (4-0-22-1), హర్భజన్ సింగ్ (4-0-29-1) పొదుపుగా బౌలింగ్ చేయడంతో పాటు వికెట్లు పడగొట్టి తమ జట్టును గెలిపించేందుకు విఫలయత్నం చేశారు. ఈ మ్యాచ్లో ఇండియా మహారాజాస్ జట్టుకు హర్భజన్ సింగ్ నాయకత్వం వహించాడు. గంభీర గైర్హాజరీలో భజ్జీ ఈ బాధ్యతలు చేపట్టాడు. లీగ్లో మహారాజాస్ ఇప్పటిదాకా ఆడిన 4 మ్యాచ్ల్లో మూడింటిలో ఓడిపోయి ఒక మ్యాచ్లో గెలవగా.. వరల్డ్ జెయింట్స్ 3 మ్యాచ్ల్లో 2 విజయాలు, ఓ పరాజయం.. ఆసియా లయన్స్ 3 మ్యాచ్ల్లో 2 విజయాలు, ఓ ఓటమిని ఎదుర్కొన్నాయి. టోర్నీలో ఆఖరి లీగ్ మ్యాచ్లో ఇవాళ (మార్చి 16) వరల్డ్ జెయింట్స్, ఆసియా లయన్స్ తలపడనున్నాయి. -
క్రిస్ గేల్ వీరవిహారం.. వయసు పెరుగుతున్నా తగ్గేదేలేదంటున్న యూనివర్సల్ బాస్
విండీస్ విధ్వంసకర యోధుడు, యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ వయసు పెరుగుతున్నా ఏ మాత్రం తగ్గడం లేదు. బాస్.. గతంలో బంతిని ఎలా చెడుగుడు ఆడేవాడో ఇప్పుడు అదే రీతిలో చెలరేగుతున్నాడు. గేల్ 43 ఏళ్ల వయసులోనూ యువకుల తరహాలో భారీ షాట్లు ఆడి ఔరా అనిపిస్తున్నాడు. లెజెండ్స్ లీగ్ క్రికెట్-2023 సీజన్లో భాగంగా నిన్న (మార్చి 15) ఇండియా మహారాజాస్తో జరిగిన మ్యాచ్లో గేల్ మెరుపు ఇన్నింగ్స్ ఆడి పాత రోజులు గుర్తు చేశాడు. అంతేకాక అతని జట్టు వరల్డ్ జెయింట్స్ను ఒంటిచేత్తో గెలిపించాడు. It’s the man with the moves!🏏👏 Ladies and Gentlemen, @henrygayle is the @officialskyexch Legend of the match! 🎉🔥#LegendsLeagueCricket #SkyexchnetLLCMasters #LLCT20 #YahanSabBossHain pic.twitter.com/eht1CY7rP6 — Legends League Cricket (@llct20) March 15, 2023 వివరాల్లోకి వెళితే.. ఇండియా మహారాజాస్తో జరిగిన మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన వరల్డ్ జెయింట్స్.. బ్రెట్ లీ (3-0-18-3), పోఫు (4-0-22-2), టీనో బెస్ట్ (4-0-27-2) చెలరేగడడంతో ప్రత్యర్ధిని 136 పరుగులకే కట్టడి చేసింది. మహారాజాస్ టీమ్లో సురేశ్ రైనా (41 బంతుల్లో 49; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) పరుగు తేడాతో హాఫ్ సెంచరీ మిస్ చేసుకోగా.. బిస్లా (36), ఇర్ఫాన్ పఠాన్ (25) ఓ మోస్తరుగా రాణించారు. What a solid display!!! @WorldGiantsLLC pic.twitter.com/JYzOxr7K2q — Legends League Cricket (@llct20) March 15, 2023 అనంతరం బరిలోకి దిగిన వరల్డ్ జెయింట్స్.. క్రిస్ గేల్ (46 బంతుల్లో 57; 9 ఫోర్లు, సిక్స్) వీరవిహారం ధాటికి 18.4 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. గేల్కు షేన్ వాట్సన్ (26), సమిత్ పటేల్ (12) సహకరించారు. మహారాజాస్ బౌలర్లలో యుసఫ్ పఠాన్ (4-0-14-2), ప్రవీణ్ తాంబే (4-0-22-1), హర్భజన్ సింగ్ (4-0-29-1) పొదుపుగా బౌలింగ్ చేయడంతో పాటు వికెట్లు పడగొట్టి తమ జట్టును గెలిపించేందుకు విఫలయత్నం చేశారు. ఈ మ్యాచ్లో ఇండియా మహారాజాస్ జట్టుకు హర్భజన్ సింగ్ నాయకత్వం వహించాడు. గంభీర గైర్హాజరీలో భజ్జీ ఈ బాధ్యతలు చేపట్టాడు. Giants on top! A statement by the defending champions as we are close to the finals! 💪🏏@WorldGiantsLLC @henrygayle @AaronFinch5 @ShaneRWatson33 @BrettLee_58 @RossLTaylor #LegendsLeagueCricket #SkyexchnetLLCMasters #LLCT20 #YahanSabBossHain pic.twitter.com/mvLoF2Ruos — Legends League Cricket (@llct20) March 15, 2023 లీగ్లో మహారాజాస్ ఇప్పటిదాకా ఆడిన 4 మ్యాచ్ల్లో మూడింటిలో ఓడిపోయి ఒక మ్యాచ్లో గెలవగా.. వరల్డ్ జెయింట్స్ 3 మ్యాచ్ల్లో 2 విజయాలు, ఓ పరాజయం.. ఆసియా లయన్స్ 3 మ్యాచ్ల్లో 2 విజయాలు, ఓ ఓటమిని ఎదుర్కొన్నాయి. టోర్నీలో ఆఖరి లీగ్ మ్యాచ్లో ఇవాళ (మార్చి 16) వరల్డ్ జెయింట్స్, ఆసియా లయన్స్ తలపడనున్నాయి. Points Table Update after Match Day 5. Table has been toppled from top to bottom! World Giants made a huge jump to the top spot after today’s win with the Lions shifting down to second, and the Maharajas drops to third consequently.#SkyexchnetLLCMasters #YahanSabBossHain pic.twitter.com/hDHT1I9uVO — Legends League Cricket (@llct20) March 15, 2023 .@harbhajan_singh is still the @rariohq Boss Cap Holder for the most wickets!#LegendsLeagueCricket #SkyexchnetLLCMasters #LLCT20 #YahanSabBossHain pic.twitter.com/EnVV0j2Rad — Legends League Cricket (@llct20) March 15, 2023 .@GautamGambhir still holds his ground as the @rariohq Boss Cap Holder for the highest runs. #LegendsLeagueCricket #SkyexchnetLLCMasters #LLCT20 #YahanSabBossHain pic.twitter.com/3zKKssdcka — Legends League Cricket (@llct20) March 15, 2023 Grind, Giggles, and Greatness! Gayle! ⚡💪💥 The legend of the match spills the tea on today's performance, daily routine secrets, and getting ready for tomorrow's showdown! @henrygayle#LegendsLeagueCricket #SkyexchnetLLCMasters #LLCT20 #YahanSabBossHain pic.twitter.com/SwpRB1gopG — Legends League Cricket (@llct20) March 15, 2023 -
కెప్టెన్ మారాడు.. వాళ్ల రాత మారింది: టీమిండియా మాజీ స్పిన్నర్ ప్రశంసలు
BGT 2023- India vs Australia, 3rd Test: ‘‘ఈ టెస్టు ఆసాంతం వాళ్లు అద్భుతంగా ఆడారు. ఆస్ట్రేలియా అంటే ఆస్ట్రేలియాలానే ఆడింది. వీళ్లు మొదటి రెండు టెస్టులు ఓడారంటే నమ్మశక్యం కాకుండా ఉంది. కెప్టెన్ మారాడు.. వాళ్లు గడ్డు పరిస్థితుల నుంచి బయటపడ్డారు’’ అంటూ టీమిండియా మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ స్మిత్ బృందంపై ప్రశంసలు కురిపించాడు. అంచనాలు తలకిందులు ఇండోర్లో టీమిండియాతో జరిగిన మూడో టెస్టులో ఆస్ట్రేలియా 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. తద్వారా ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ 2021-23 సీజన్లో ఫైనల్ చేరిన తొలి జట్టుగా నిలిచింది. కాగా బోర్డర్- గావస్కర్ ట్రోఫీ తొలి రెండు టెస్టుల్లో ఓడిన ఆసీస్.. మూడో టెస్టులో మాత్రం అంచనాలు తలకిందులు చేసింది. ఆ తర్వాత ఇదే రెండోసారి ప్యాట్ కమిన్స్ వ్యక్తిగత కారణాల వల్ల స్వదేశానికి తిరిగి వెళ్లగా.. కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన స్టీవ్ స్మిత్కు అదృష్టం కలిసివచ్చింది. 2017లో భారత గడ్డపై ఆసీస్కు తొలి విజయం అందించిన స్మిత్ సారథ్యంలోనే తాజా మ్యాచ్లోనూ జట్టు గెలవడంతో లక్కీ చార్మ్గా ఆసీస్ ఫ్యాన్స్ కొనియాడుతున్నారు. ఇక స్మిత్ కెప్టెన్సీలో నాథన్ లియోన్ 11 వికెట్ల ప్రదర్శనకు తోడు ఉస్మాన్ ఖవాజా రాణించడంతో ఆస్ట్రేలియాకు ఈ విజయం సాధ్యమైన విషయం తెలిసిందే. టీమిండియాను ఒత్తిడిలోకి నెట్టారు ఈ నేపథ్యంలో స్టార్ స్పోర్ట్స్ షోలో మాట్లాడిన టీమిండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కెప్టెన్రాగానే ఆసీస్ తలరాత మారిందన్నాడు. ‘‘స్మిత్ కెప్టెన్సీ అద్బుతంగా ఉంది. స్పిన్నర్ల సేవలను అతడు పూర్తిగా వినియోగించుకున్నాడు. ఇండియా టాస్ గెలిచినప్పటికీ ఆస్ట్రేలియా ప్రతి సెషన్లోనూ అదరగొట్టింది. తమ అద్భుత బౌలింగ్తో తొలి రోజు నుంచే టీమిండియాపై ఒత్తిడి పెంచింది. వికెట్ల మీద వికెట్లు తీస్తూ ఆధిపత్యం కొనసాగించింది’’ అని స్మిత్ కెప్టెన్సీపై ప్రశంసలు కురిపించాడు. చదవండి: IND vs AUS: వాళ్లిద్దరి వల్లే ఇలా! ఏదేమైనా పుజ్జీ భయపెట్టాడు.. సిరీస్ డ్రా చేసుకుంటాం: స్మిత్ Ind Vs Aus: వాళ్లేమో పరితపించిపోయారు.. మీరేమో ఇలా! అదే టీమిండియా కొంపముంచింది! -
టెస్టుల్లోనే కాదు వన్డేలకూ అతడే వైస్ కెప్టెన్! అవసరమా? అప్పుడు జరిగింది చాలదా?
India Vs Australia 2023: ‘‘అతడి ఆటతీరును ఒక్కసారి గమనించండి. అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్నాడు. టెస్టుల్లోనే కాదు.. వన్డేల్లో కూడా అతడిని వైస్ కెప్టెన్ చేయాలి. టీమిండియా వైస్ కెప్టెన్గా ఇంతకంటే బెటర్ ఆప్షన్ ఇంకొకటి దొరకదు’’ అని టీమిండియా మాజీ బౌలర్ హర్భజన్ సింగ్ అన్నాడు. బోర్డర్- గావస్కర్ ట్రోఫీ సిరీస్లో ఆకట్టుకుంటున్న స్టార్ ఆల్రౌండర్ రౌండర్ రవీంద్ర జడేజాను వైస్ కెప్టెన్ చేయాలని మేనేజ్మెంట్కు సూచించాడు. ప్రతి మ్యాచ్లోనూ జడ్డూ తుదిజట్టులో ఉంటే మెరుగైన ఫలితాలు రాబట్టవచ్చని అభిప్రాయపడ్డాడు. భీకర ఫామ్లో ఉన్న జడేజా ఆస్ట్రేలియాతో స్వదేశంలో టెస్టు సిరీస్లో స్పిన్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా సూపర్ ఫామ్ కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. బంతితోనూ, బ్యాట్తోనూ మ్యాజిక్ చేస్తూ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. గాయం కారణంగా చాలాకాలం జట్టుకు దూరమైన జడేజా.. పునరాగమనంలో ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నాడు. నాగ్పూర్, ఢిల్లీ టెస్టుల్లో అద్భుతంగా రాణించి రెండింటిలోనూ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచి సత్తా చాటాడు. ఈ నేపథ్యంలో రవీంద్ర జడేజాపై హర్భజన్ సింగ్ ప్రశంసలు కురిపించాడు. ఇప్పటికే కేఎల్ రాహుల్ను వైస్ కెప్టెన్సీ నుంచి తప్పించినట్లు బీసీసీఐ సంకేతాలు ఇచ్చిన వేళ.. జడేజాకు ఆ బాధ్యతలు ఇవ్వాలని సూచించాడు. కేవలం టెస్టులకు కాదు.. వన్డేల్లో కూడా కేవలం టెస్టులకే పరిమితం కాకుండా.. వన్డేల్లోనూ రోహిత్ శర్మకు డిప్యూటీగా నియమించాలని భజ్జీ విజ్ఞప్తి చేశాడు. ఈ మేరకు తన యూట్యూబ్ చానెల్లో మాట్లాడుతూ.. ‘‘తుది జట్టులో తప్పకుండా చోటు దక్కించుకునే ఆటగాడిని వైస్ కెప్టెన్ చేస్తే బాగుంటుంది. స్వదేశంలో, విదేశాల్లోనూ రాణించగల ప్రతిభ జడేజా సొంతం. అందుకే అతడిని తప్పకుండా వైస్ కెప్టెన్ చేయాలి. సీనియర్గా ఎల్లప్పుడూ జట్టుకు సేవలు అందిస్తూ ఉంటాడు’’ అని హర్భజన్ సింగ్ చెప్పుకొచ్చాడు. అప్పుడేం జరిగిందో చూశాం కదా! అయితే, విశ్లేషకులు, అభిమానులు మాత్రం భజ్జీ సూచనపై మిశ్రమంగా స్పందిస్తున్నారు. ‘‘జడ్డూ అద్భుత ఆల్రౌండర్ అనడంలో సందేహం లేదు. అయితే, అతడి నెత్తిపై కెప్టెన్సీ, వైస్ కెప్టెన్సీ వంటి బాధ్యతలు పెడితే కచ్చితంగా ఒత్తిడికి లోనవుతాడు. ఐపీఎల్లో చెన్నై సూపర్కింగ్స్ సారథిగా ఎలా వైఫల్యం చెందాడో చూశాం కదా! మధ్యలోనే కెప్టెన్సీ పగ్గాలు వదిలేయడంతో ధోని మళ్లీ ఆ బాధ్యతలు స్వీకరించాల్సి వచ్చింది. అసలే ఈసారి వన్డే వరల్డ్కప్. ఇలాంటి సమయంలో జడ్డూకు అదనపు బాధ్యతలు అప్పగించడం బాగుండేదేమో పాజీ! అతడిని స్వేచ్ఛగా వదిలేస్తేనే అద్భుతంగా రాణించగలడు’’ అని అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉంటే... ఇప్పటికే పరిమిత ఓవర్ల క్రికెట్లో రోహిత్ శర్మ వారసుడిగా పేస్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా పేరు దాదాపు ఖరారైన విషయం తెలిసిందే. రోహిత్ గైర్హాజరీలో ఇప్పటికే పలు టీ20 సిరీస్లు గెలిచిన హార్దిక్.. ఆస్ట్రేలియాతో స్వదేశంలో జరుగనున్న మొదటి వన్డేకు సారథిగా ఎంపికయ్యాడు. వరల్డ్కప్-2023లో అతడు మరింత కీలకం కానున్నాడు. చదవండి: నీకోసమే నాన్నా.. ఎంత పనిజేసినవ్ కొడుకా! వీడియో వైరల్ Ind Vs Aus: ఏదో ఒకటి చేయండి.. లేదంటే పోటుగాళ్లు కాదు.. పొట్లం అయిపోతారు! -
'రాహుల్ కూడా మనిషే.. కొంచెం ఆలోచించి మాట్లాడండి'
టీమిండియా స్టార్ ఓపెనర్ కేఎల్ రాహుల్ ఫామ్ కోల్పోయి తీవ్ర ఇబ్బంది పడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రాహుల్కు కొంత మంది మద్దతుగా నిలుస్తుంటే.. మరి కొంత మంది తీవ్ర విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఇదే విషయంపై మాజీ క్రికెటర్లు వెంకటేశ్ ప్రసాద్, ఆకాశ్ చోప్రా మధ్య మాటల యుద్దం కూడా నడిచింది. రాహుల్కి ఫేవరెటిజం వల్లే జట్టులో చోటు దక్కుతుందని వెంకటేశ్ ప్రసాద్ విమర్శించాడు. అందుకు బదులుగా రాహుల్ను టార్గెట్ చేస్తూ వ్యక్తిగత ఎజెండాతో మాట్లాడుతున్నారంటూ వెంకటేశ్ ప్రసాద్కు ఆకాష్ చోప్రా చురకలు అంటించాడు. ఇక తాజాగా ఇదే విషయంపై టీమిండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. ఆటగాడు పేలవ ఫామ్లో ఉన్నప్పుడు మన అభిప్రాయాలను వెల్లడించవచ్చు కానీ, అదే పనిగా విమర్శలు చేయడం సరికాదు అని హర్భజన్ అన్నాడు. "ఏ ఆటగాడైనా బాగా రాణించకపోతే ముందుగా బాధపడేది ఆ ఆటగాడు, అతని కుటుంబ సభ్యులే. మనమందరం ఆ క్రికెటర్లను ఇష్టపడతాం. కాబట్టి వాళ్లు సరిగా ఆడకపోతే మనకు కోపం రావడం సహజం. కానీ ఒకే ఆటగాడిని టార్గెట్ చేసి మరి విమర్శలు చేయకూడదు. అలా చేయడంతో ఆ ప్లేయర్ మెంటాలిటీ దెబ్బ తింటుంది. రాహుల్ స్థానంలో మీరుంటే ఏం చేసేవాళ్లు? అతడు పరుగులు చేయడానికి ప్రయత్నించడం లేదని అనుకుంటున్నారా? అతడు టీమిండియాకు అద్భుతమైన ఆటగాడు. అదే విధంగా అతడు అద్భుతమైన కమ్బ్యాక్ కూడా ఇస్తాడు" అని యూట్యూబ్ ఛానల్లో హర్భజన్ పేర్కొన్నాడు. చదవండి: ChatGPT: రాహుల్ను తప్పించాలా? అదీ మరీ..! నీకున్న పాటి బుద్ధి వాళ్లకు లేదు! -
BGT 2023: వైస్ కెప్టెన్ హోదా తొలగింపు.. రాహుల్పై వేటు! దేశవాళీ క్రికెట్ ఆడితేనే..
India vs Australia Test Series- KL Rahul: బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండు టెస్టుల్లోనూ టీమిండియా వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్ పూర్తిగా విఫలమయ్యాడు. రెండు మ్యాచ్లలో ఈ ఓపెనింగ్ బ్యాటర్ చేసిన మొత్తం పరుగులు 38. పరిమిత ఓవర్ల క్రికెట్లో డబుల్ సెంచరీ, సెంచరీలు సాధించి మంచి ఫామ్లో ఉన్న యువ ఓపెనర్ శుబ్మన్ గిల్ను కాదని అనుభవానికే పెద్ద పీట వేసింది మేనేజ్మెంట్. రాహుల్ను తప్పించాల్సిందే! సీనియర్ అయిన రాహుల్ వైపే మొగ్గు చూపింది. అయితే, గత కొంతకాలంగా నిలకడలేమి ఫామ్తో సతమతమవుతున్న ఈ కర్ణాటక బ్యాటర్ తన వైఫల్యం కొనసాగించాడు. దీంతో అతడిని జట్టు నుంచి తప్పించాలంటూ డిమాండ్లు వెల్లువెత్తాయి. వైస్ కెప్టెన్ ట్యాగ్ తీసేసి ఇకనైనా రాహుల్ను పక్కనపెట్టి.. గిల్కు అవకాశం ఇవ్వాలని అభిమానులు సోషల్ మీడియా వేదికగా విజ్ఞప్తి చేశారు. రాహుల్ పట్ల ఉన్న ప్రేమ(ఫేవరెటిజం) కారణంగానే ప్రతిభ ఉన్న ఆటగాళ్లను తొక్కేస్తుందంటూ బీసీసీఐని విమర్శించారు. వైస్ కెప్టెన్ హోదా లేదిక! ఈ నేపథ్యంలో ఢిల్లీ టెస్టు తర్వాత మిగిలిన రెండు మ్యాచ్లకు భారత జట్టు ఇదేనంటూ బీసీసీఐ ఆదివారం ప్రకటించింది. జయదేవ్ ఉనాద్కట్ చేరిక మినహా తొలి రెండు టెస్టులకు ఉన్న జట్టునే యథాతథంగా కొనసాగించిన బోర్డు.. కేఎల్ రాహుల్కు ఉన్న వైస్ కెప్టెన్ హోదాను మాత్రం తొలగించడం గమనార్హం. అందుకే ఇలా చేశారన్న భజ్జీ ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. రాహుల్ను వైస్ కెప్టెన్గా తొలగించడం.. శుబ్మన్ గిల్కు తుదిజట్టులో చోటిస్తున్నామని చెప్పడానికి సూచిక అని పేర్కొన్నాడు. ఈ మేరకు ఇండియా టుడేతో మాట్లాడిన భజ్జీ.. ‘‘ఇప్పటిదాకా అతడు వైస్ కెప్టెన్గా ఉన్నాడు. అయితే, బోర్డు తాజాగా ప్రకటించిన జట్టులో ఆ ట్యాగ్ తొలగించారు. తదుపరి టెస్టుల్లో రాహుల్కు బదులు శుబ్మన్ గిల్ను ఆడిస్తామని చెప్పేందుకే ఇలా చేయడానికి కారణం అని నేను భావిస్తున్నా. వన్డే, టీ20లలో గిల్ భీకరమైన ఫామ్లో ఉన్నాడు. సూపర్హీరోగా ఎదిగాడు. కాబట్టి తనకు తప్పక అవకాశం ఇస్తారనుకుంటున్నా. దేశవాళీ క్రికెట్ ఆడితేనే ఇక రాహుల్ విషయానికొస్తే.. అతడు అవుటైన తీరు గమనిస్తే బ్యాటింగ్లోపాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. తను కీలక ఆటగాడు. కాబట్టి కచ్చితంగా స్కోరు చేయాల్సి ఉంటుంది. కానీ ఇలా ప్రతిసారి విఫలమైతే కష్టం. తను వరల్డ్క్లాస్ క్రికెటర్ అనడంలో సందేహం లేదు. అయితే, ప్రస్తుతం ఫామ్లేమితో ఇబ్బందులు పడుతున్నాడు. కొన్నాళ్లు దేశవాళీ క్రికెట్ ఆడితే పూర్వవైభవం పొందే అవకాశం ఉంది’’ అని హర్భజన్ సింగ్ అభిప్రాయపడ్డాడు. ఇక టీమిండియా ఈ సిరీస్లో ఇప్పటికే 2-0తో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఆస్ట్రేలియాతో మిగిలిన రెండు టెస్టులకు భారత జట్టు రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్, శుబ్మన్ గిల్, ఛతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లి, కేఎస్ భరత్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, మమ్మద్ సిరాజ్, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, ఉమేష్ యాదవ్, జయదేవ్ ఉనాద్కట్. చదవండి: Jadeja-Lyon: 'నీడలా వెంటాడుతున్నావా?'.. ఆసీస్ స్పిన్నర్ను 24 గంటలు ఫాలో అయిన జడేజా Ind Vs Aus: ఆసీస్ను చిత్తు చేసి.. ప్రధానమంత్రి సంగ్రహాలయను సందర్శించిన టీమిండియా.. వీడియో వైరల్ -
ఆస్ట్రేలియాతో తొలి టెస్టు.. భారీ రికార్డుపై కన్నేసిన అశ్విన్
నాగ్పూర్ వేదికగా ఆస్ట్రేలియాతో జరగనున్న తొలి టెస్టుకు ముందు టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ను ఓ అరుదైన రికార్డు ఊరిస్తోంది. తొలి టెస్టులో అశ్విన్ మరో ఏడు వికెట్లు సాధిస్తే.. ఆస్ట్రేలియాపై టెస్టుల్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన రెండో భారత బౌలర్గా నిలుస్తాడు. ఈ క్రమంలో భారత దిగ్గజం హర్భజన్ సింగ్(95) అశ్విన్ అధిగిమిస్తాడు. ఇప్పటివరకు ఆస్ట్రేలియాపై 18 టెస్టులు ఆడిన అశ్విన్ 89 వికెట్లు సాధించాడు. కాగా ఈ అరుదైన ఘనత సాధించిన జాబితాలో 111 వికెట్లతో భారత స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లే తొలి స్థానంలో ఉన్నాడు. ఇక మూడో స్థానంలో అశ్విన్ కొనసాగుతుండగా.. కపిల్దేవ్(79), రవీంద్ర జడేజా(63) వికెట్లతో వరుసగా నాలుగు ఐదు స్థానాల్లో ఉన్నారు. ఇక ఓవరాల్గా ఈ సిరీస్లో అశ్విన్ మరో 23 వికెట్లు పడగొడితే.. అనిల్ కుంబ్లే రికార్డును కూడా బ్రేక్చేసే అవకాశం ఉంది. ఆస్ట్రేలియాతో తొలి రెండు టెస్ట్లకు భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్, శుభ్మన్ గిల్, చతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమర్ యాదవ్, కేఎస్ భరత్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), అశ్విన్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, ఉమేశ్ యాదవ్, జయదేవ్ ఉనద్కత్ టెస్టు సిరీస్ షెడ్యూల్.. ఫిబ్రవరి 9-13 వరకు తొలి టెస్ట్, నాగ్పూర్ ఫిబ్రవరి 17-21 వరకు రెండో టెస్ట్, ఢిల్లీ మార్చి 1-5 వరకు మూడో టెస్ట్, ధర్మశాల మార్చి 9-13 వరకు నాలుగో టెస్ట్, అహ్మదాబాద్ చదవండి: BGT 2023: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో డబుల్ సెంచరీలు చేసిన భారత ఆటగాళ్లు వీరే -
భారత్ గెలవాలంటే.. రాహుల్ ఓపెనర్గా వద్దు! అతడే సరైనోడు
ఫిబ్రవరి9 నుంచి నాగ్పూర్ వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య జరగనున్న తొలి టెస్టుతో బోర్డర్-గవాస్కర్ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తొలి టెస్టులో భారత ఓపెనర్గా ఎవరిని పంపాలన్న డిబేట్ ప్రస్తుతం క్రీడావర్గాల్లో నడుస్తోంది. కొంతమంది రోహిత్ జోడీగా యువ ఆటగాడు శుబ్మన్ గిల్ను పంపాలని సూచిస్తుంటే.. మరి కొంతమంది కేఎల్ రాహుల్కు అవకాశం ఇవ్వాలని అభిప్రాయపడుతున్నారు. ఇక ఇదే విషయంపై టీమిండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. శుబ్మన్ గిల్ని ఓపెనర్గా ఆడించడమే కరెక్ట్ అంటూ హర్భజన్ అన్నాడు. కాగా తొలి టెస్టుకు టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ గాయం కారణంగా దూరమైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో గిల్ను మిడిలార్డర్లో ఆడించాలని జట్టు మెనేజెమెంట్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో హర్భజన్ సింగ్ మాట్లాడూతూ.. "టెస్టు సిరీస్లలో ఓపెనింగ్ భాగస్వామ్యం చాలా కీలకం. నా వరకు అయితే ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్లో భారత ఓపెనర్లుగా రోహిత్, శుబ్మన్ గిల్ ఉంటే బాగుంటుంది. గిల్ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. ఇక రాహుల్ కూడా స్టార్ క్రికెటర్ అనడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే రాహుల్ ప్రస్తుతం ఫామ్లో లేడు. కాబట్టి గిల్ను రోహిత్ జోడిగా పంపాలి. ఈ సిరీస్ మొత్తం మ్యాచ్ల్లో అతడికి అవకాశం ఇవ్వాలి. గిల్ తన అద్భుత ఫామ్ను కొనసాగిస్తే టీమిండియా సిరీస్ గెలవడం పెద్ద కష్టమేమేమీ కాదు అని అతడు పేర్కొన్నాడు. చదవండి: IND vs AUS: కోహ్లి, స్మిత్ మధ్య తీవ్ర వాగ్వాదం.. ఏం జరిగిందంటే? వీడియో వైరల్ Steve Smith: భారత్లో టెస్టు సిరీస్ గెలవడం.. యాషెస్ విజయం కంటే గొప్పది! అంతేగా.. -
టీ20 జట్టు కోచ్గా ద్రవిడ్ కంటే అతనే బెటర్..!
టీమిండియా కోచ్ పదవిపై టీమిండియా మాజీ స్పిన్నర్, ప్రస్తుత ఎంపీ హర్భజన్ సింగ్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. భారత టీ20 జట్టు కోచ్గా తన మాజీ సహచరుడు ఆశిష్ నెహ్రా అయితే బెటర్గా ఉంటుందని అభిప్రాయపడ్డాడు. ప్రస్తుత హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ను తక్కువ చేయాలన్నది తన ఉద్దేశం కాదని, నెహ్రా అయితే టీ20 జట్టు కోచ్ పదవికి పూర్తి న్యాయం చేయగలడని భావిస్తున్నానని మనసులో మాటను బయటపెట్టాడు. నెహ్రాకు పొట్టి ఫార్మాట్పై మంచి పట్టు ఉందని, కెరీర్ చరమాంకంలో అతను టీ20ల్లో అద్భుతంగా రాణించాడని, కేవలం ఇదే కారణంగానే ద్రవిడ్ బదులు నెహ్రాకు తను ఓటు వేస్తానని చెప్పుకొచ్చాడు. మూడు ఫార్మాట్లకు ముగ్గురు వేర్వేరు కోచ్ల ప్రతిపాదన తెరపైకి వస్తున్న నేపథ్యంలో.. తన అభిప్రాయాన్ని మాత్రమే వెల్లడించానని, ఇందులో ఎవ్వరినీ కించపరచాలన్నది తన ఉద్దేశం కాదని అన్నాడు. ఒకవేళ బీసీసీఐ ముగ్గురు కోచ్ల ప్రతిపాదనకు అంగీకారం తెలిపితే.. ద్రవిడ్తో పాటు నెహ్రాకు అవకాశం కల్పిస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డాడు. సుదీర్ఘ ఫార్మాట్లో అపార అనుభవమున్న ద్రవిడ్ను భారత టెస్ట్ జట్టు కోచ్గా, నెహ్రాను టీ20 టీమ్ కోచ్గా నియమిస్తే..భారత్కు రెండు ఫార్మాట్లలో తిరుగుండదని అన్నాడు. ఇదే సందర్భంగా సీనియర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్పై కూడా భజ్జీ స్పందించాడు. మొదటి మూడూ స్థానాల్లో వచ్చే వీరు స్ట్రయిక్ రేట్ మరింత పెంచుకోవాలని, తద్వారా 4, 5 స్థానాల్లో వచ్చే బ్యాటర్లపై ఒత్తిడి తగ్గుతుందని సూచించాడు. కాగా, టీ20 వరల్డ్కప్-2022లో భారత్ సెమీస్లో నిష్క్రమించాక కోచ్తో సహా జట్టు మొత్తాన్ని ప్రక్షాళన చేయాలని అభిమానులు, విశ్లేషకులు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. 2024 టీ20 వరల్డ్కప్ నేపథ్యంలో ఇప్పటినుంచే కొత్తవారికి అవకాశం కల్పించేందుకు సీనియర్లను ఈ ఫార్మాట్ నుంచి తప్పించాలని, కోచ్గా ద్రవిడ్ కూడా ఈ ఫార్మాట్కు సూట్ కావట్లేదని అభిమానులు చర్చించుకుంటున్నారు. -
ఆందోళన కలిగిస్తున్న హిట్మ్యాన్ ఫామ్.. ఇకనైనా చెలరేగాలి..!
Harbhajan Singh: వరల్డ్కప్-2022లో సూపర్ ఫామ్ ప్రదర్శిస్తూ, గ్రూప్-2లో అగ్రస్థానంలో నిలిచి సెమీస్కు చేరిన టీమిండియా.. నవంబర్ 10న జరిగే సెమీఫైనల్లో ఇంగ్లండ్తో తలపడనుంది. ఇప్పటివరకు జరిగిన మ్యాచ్ల్లో జట్టుగా అన్ని విభాగాల్లో రాణించిన టీమిండియా.. ఇకపై నాకౌట్ దశలో విషమ పరీక్ష ఎదుర్కోనుంది. సెమీస్లో ఇంగ్లండ్, ఫైనల్కు చేరితే న్యూజిలాండ్ లేదా పాకిస్తాన్ లాంటి పటిష్టమైన జట్లను టీమిండియా ఢీకొట్టాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఓ విషయం టీమిండియాను, అభిమానులకు తీవ్రంగా కలవరపెడుతుంది. అదే కెప్టెన్ రోహిత్ శర్మ ఫామ్. గతకొంతకాలంగా అడపాదడపా ఫామ్లో ఉన్న హిట్మ్యాన్.. ప్రస్తుత ప్రపంచకప్లోనూ ఆశించిన స్థాయి ప్రదర్శన కనబర్చలేక ఉసురూమనిపించాడు. ఆడిన 5 మ్యాచ్ల్లో (4, 53, 15, 2, 15 పరుగులు) కేవలం ఒక్క హాఫ్ సెంచరీ మాత్రమే చేసి అటు అభిమానులను, ఇటు జట్టు యాజమాన్యాన్ని ఆందోళనకు గురి చేస్తున్నాడు. ఇదే అంశాన్ని తాజాగా టీమిండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ప్రస్తావించాడు. భజ్జీ.. రోహిత్ పేలవ ఫామ్పై ఘాటుగా స్పందించాడు. ఇప్పటివరకు విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, గత రెండు మ్యాచ్లుగా కేఎల్ రాహుల్ రాణిస్తున్నారు కాబట్టి బ్యాటింగ్ విభాగంలో టీమిండియాకు ఎలాంటి కష్టాలు ఎదురుకాలేదని, ప్రతి మ్యాచ్లో వారు ఆదుకుంటారని ఆశించలేమని, ఇకనైనా హిట్మ్యాన్ ఫామ్లోకి రాకపోతే టీమిండియాకు కష్టాలు తప్పవని హెచ్చరించాడు. సెమీస్లో ఎదుర్కొనబోయే ప్రత్యర్ధితో అంత ఈజీ కాదని.. రోహిత్ చెలరేగితేనే వారిపై విజయం సాధించగలమని అలర్ట్ చేశాడు. ప్రస్తుతం రోహిత్ చాలా చెత్త ఫామ్లో ఉన్నాడని, సెమీస్కు ఇంకా సమయం ఉంది కాబట్టి, దానిపై వర్కవుట్ చేయాలని సూచించాడు. రోహిత్ గతంలో చాలా సందర్భాల్లో ఇలాంటి గడ్డు పరిస్థితులను ఎదుర్కొన్నాడని, ఇంగ్లండ్తో మ్యాచ్లో అతను తప్పక చెలరేగుతాడని విశ్వాసం వ్యక్తం చేశాడు. కాగా, నవంబర్ 9న జరిగే తొలి సెమీస్లో న్యూజిలాండ్-పాకిస్తాన్లు.. ఆమరుసటి రోజు (నవంబర్ 10) జరిగే రెండో సెమీఫైనల్లో భారత్-ఇంగ్లండ్ జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ రెండు మ్యాచ్ల్లో గెలిచిన జట్ల మధ్య నవంబర్ 13న ఫైనల్ జరుగుతుంది. -
రాహుల్ను పక్కన పెట్టి.. అతడిని జట్టులోకి తీసుకోండి! మార్పులు చేయకపోతే..
T20 World Cup 2022- Team India: టీ20 ప్రపంచకప్-2022 టోర్నీలో ముందుకు వెళ్లాలంటే టీమిండియా కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పదని భారత మాజీ బౌలర్ హర్భజన్ సింగ్ అన్నాడు. సెమీస్కు నేరుగా దూసుకుపోవాలంటే తుది జట్టులో మార్పులు అనివార్యమని అభిప్రాయపడ్డాడు. పేలవ ఫామ్ కొనసాగిస్తున్న కేఎల్ రాహుల్ను పక్కన పెట్టడం సహా బౌలర్ల మార్పు విషయంలోనూ పలు సలహాలు ఇచ్చాడు ఈ మాజీ ఆఫ్ స్పిన్నర్. సూపర్-12లో భాగంగా తొలుత పాకిస్తాన్, తర్వాత నెదర్లాండ్స్పై విజయం సాధించిన రోహిత్ సేన.. దక్షిణాఫ్రికాతో మ్యాచ్లో మాత్రం ఓటమి పాలైంది. సెమీస్లో గట్టి పోటీదారుగా ఉన్న ప్రొటిస్ చేతిలో ఆదివారం నాటి మ్యాచ్లో ఐదు వికెట్ల తేడాతో పరాజయం చెందింది. మరోసారి విఫలం ఇక ఈ మ్యాచ్లో భారత ఓపెనర్ కేఎల్ రాహుల్ మరోసారి వైఫల్యం చెందిన విషయం తెలిసిందే. పాక్, డచ్ జట్లతో మ్యాచ్లో సింగిల్ డిజిట్ స్కోరుకే పరిమితమైన ఈ కర్ణాటక బ్యాటర్.. 9 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. మరో ఓపెనర్, కెప్టెన్ రోహిత్ శర్మ సైతం 15 పరుగులకే వెనుదిరిగాడు. దీంతో భారమంతా మిడిలార్డర్పై పడింది. ఈ క్రమంలో సూర్యకుమార్ యాదవ్ 68 పరుగులతో రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి టీమిండియా కనీసం 133 పరుగులు చేయగలిగింది. రాహుల్ పరిస్థితి ఇలా ఉంటే.. దినేశ్ కార్తిక్ సైతం ఇప్పటి వరకు తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయాడు. మరోవైపు.. సీనియర్ స్పిన్నర్ అశ్విన్.. సౌతాఫ్రికాతో మ్యాచ్లో ధారాళంగా పరుగులు సమర్పించుకున్నాడు. 4 ఓవర్ల కోటా పూర్తి చేసి 43 పరుగులు ఇచ్చి ఒక వికెట్ మాత్రమే తీయగలిగాడు. రాహుల్ గొప్ప ఆటగాడే కానీ ఈ నేపథ్యంలో స్పోర్ట్స్ తక్తో మాట్లాడిన హర్భజన్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘‘మేనేజ్మెంట్ కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పదు. కేఎల్ రాహుల్ గొప్ప ఆటగాడే. తను మ్యాచ్ విన్నర్ కూడా! కానీ.. తన పేలవ ఫామ్ ఇలాగే కొనసాగితే భారీ మూల్యం చెల్లించకతప్పదు. కార్తిక్ గాయపడినట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికైనా రిషభ్ పంత్ను తుది జట్టులోకి తీసుకుంటే బాగుంటుంది. రోహిత్ శర్మతో కలిసి రిషభ్ పంత్ ఓపెనింగ్ చేయడం బెటర్’’ అని భజ్జీ అభిప్రాయపడ్డాడు. అతడిని ఎందుకు పక్కనపెట్టారు? అదే విధంగా రవిచంద్రన్ అశ్విన్ స్థానంలో యజువేంద్ర చహల్ను తీసుకుంటే ఉపయోగకరంగా ఉంటుందని హర్భజన్ సూచించాడు. టీ20 క్రికెట్లో ప్రపంచంలోనే అత్యుత్తమ బౌలర్గా ఉన్న చహల్ కన్నా ప్రస్తుతం జట్టులో మరో లెగ్ స్పిన్నర్ లేడని చెప్పుకొచ్చాడు. ఇప్పటికే తనను తాను నిరూపించుకున్న మ్యాచ్ విన్నర్ చహల్కు అవకాశం ఇవ్వాలని భజ్జీ విజ్ఞప్తి చేశాడు. చదవండి: #OnThisDay: నాడు నిరాశపరిచిన సచిన్.. ఆకాశమే హద్దుగా చెలరేగిన ధోని! మిస్టర్ కూల్ తుపాన్ ఇన్నింగ్స్ చూశారా! T20 WC 2022: టీమిండియా మిగిలిన రెండు మ్యాచ్లు గెలిస్తేనే! పాక్ దింపుడు కల్లం ఆశలు.. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4911494512.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
కోహ్లి ఫ్యాన్స్కు కనువిందు.. రోహిత్ ఒక్కడే కాదు.. యువీ, భజ్జీ కూడా..!
విరాట్ వీరోచిత పోరాటం కారణంగా నిన్న (అక్టోబర్ 23) పాక్తో జరిగిన ఉత్కంఠ సమరంలో టీమిండియా 4 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. పొట్టి క్రికెట్ చరిత్రలో మరపురానిదిగా మిగిలిపోయే ఈ సమరంలో ఎన్నో మలుపులు, మరెన్నో రికార్డులు నమోదవ్వడంతో పాటు అంతకుమించిన ఆసక్తికర దృశ్యాలు క్రికెట్ ప్రేమికులకు మధురానుభూతులను మిగిల్చాయి. మ్యాచ్ అనంతరం కోహ్లి కళ్లు చెమర్చడం, రోహిత్.. విరాట్ను భుజంపైకి ఎత్తుకుని విజయ గర్వంతో గర్జించడం, భావోద్వేగంతో హార్ధిక్ కంటతడి పెట్టడం, సునీల్ గవాస్కర్ డ్యాన్స్ చేయడం.. ఇలా చాలా సన్నివేశాలు భారత క్రికెట్ అభిమానుల మదిలో చిరస్థాయిగా నిలిచిపోతాయి. https://t.co/23cs2byVka pic.twitter.com/itACHggGiX — Chaitanya (@chaitu_20_) October 23, 2022 వీటిలో హిట్మ్యాన్.. కోహ్లిని భుజంపై ఎత్తుకున్న సన్నివేశం ప్రేక్షకులకు విశేషంగా ఆకట్టుకుంది. ఈ సన్నివేశాన్ని చూసిన రోహిత్, విరాట్ ఫ్యాన్స్ సంతోషంతో ఉప్పొంగిపోతున్నారు. టీమిండియా కృష్ణార్జునులు, ట్రిపుల్ ఆర్ రామ్-భీమ్ అంటూ సోషల్మీడియాను హోరెత్తిస్తున్నారు. రోహిత్-విరాట్ను ఎత్తుకున్న సన్నివేశం సోషల్మీడియాలో ట్రెండ్ అవుతున్న నేపథ్యంలో రెండు పాత వీడియోలు ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. అవేంటంటే.. పాక్పై విక్టరీ అనంతరం రోహిత్.. కోహ్లిని ఎలా ఎత్తుకున్నాడో అచ్చం అలానే గతంలో యువరాజ్ సింగ్, హర్భజన్ సింగ్లు కోహ్లిని ఎత్తుకున్నారు. 2014లో సౌతాఫ్రికాపై కోహ్లి మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ (72 నాటౌట్) అనంతరం యువీ.. కోహ్లిని మైదానం మొత్తం ఎత్తుకుని తిరిగాడు. మొహాలీ వేదికగా 2016లో కోహ్లి ఆడిన చారిత్రక ఇన్నింగ్స్ (82 నాటౌట్)కు ఫిదా అయిన భజ్జీ కూడా కోహ్లిని రెండు చేతులతో ఎత్తుకుని అభినందించాడు. పై మూడు సందర్భాలకు సంబంధించిన సన్నివేశాలను ఓ నెటిజన్ ఎడిట్ చేసి ట్విటర్లో పోస్ట్ చేశాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్మీడియాను షేక్ చేస్తుంది. కోహ్లి ధమాకా ఇన్నింగ్స్ నుంచి ఇంకా తేరుకోని ఫ్యాన్స్ ఈ వీడియోను చూసి తెగ ముచ్చటపడిపోతున్నారు. చదవండి: ద్రవిడ్ను వెనక్కు నెట్టిన కోహ్లి.. ఇక మిగిలింది ఐదుగురే..! -
Ind Vs Pak: పాక్తో తొలి మ్యాచ్.. పంత్, అశ్విన్, హుడాకు నో ఛాన్స్!
T20 World Cup 2022- India Vs Pakistan- Predicted India Playing XI: క్రికెట్ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న టీమిండియా- పాకిస్తాన్ మ్యాచ్కు సమయం ఆసన్నమవుతోంది. టీ20 వరల్డ్కప్-2022 టోర్నీ నేపథ్యంలో ఆస్ట్రేలియాలోని ప్రఖ్యాత మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ వేదికగా ఆదివారం (అక్టోబరు 23) ఈ హై వోల్టేజ్ మ్యాచ్ జరుగనుంది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ ఆఫ్ స్పిన్నర్ భారత తుది జట్టును అంచనా వేశాడు. చిరకాల ప్రత్యర్థితో పోరులో ఐదుగురు బ్యాటర్లు, ఒక ఆల్రౌండర్, ఇద్దరు స్పిన్నర్లు, ముగ్గురు పేసర్లతో రోహిత్ సేన బరిలోకి దిగాలని సూచించాడు. ఇక జస్ప్రీత్ బుమ్రా గైర్హాజరీ నేపథ్యంలో మరో సీనియర్ పేసర్ మహ్మద్ షమీ బాధ్యత మరింత పెరిగిందన్న భజ్జీ.. అతడు పూర్తిస్థాయిలో ఫిట్నెస్ సాధించడం సానుకూల అంశమని పేర్కొన్నాడు. నా తుది జట్టు ఇదే ఈ మేరకు హర్భజన్ సింగ్ స్టార్ స్పోర్ట్స్ షోలో మాట్లాడుతూ.. ‘‘రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, దినేశ్ కార్తిక్, అక్షర్ పటేల్ తుది జట్టులో ఉండాలి. యుజీ చహల్కు కూడా వారితో పాటు చోటు దక్కాలి. ఇక అర్ష్దీప్ సింగ్, భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమీలకు కూడా చోటు ఇవ్వాలి’’ అని అభిప్రాయపడ్డాడు. అదే విధంగా.. దీపక్ హుడా, రవిచంద్రన్ అశ్విన్, హర్షల్ పటేల్లకు ఆరంభ మ్యాచ్లలో ఆడే అవకాశం రాదని అభిప్రాయపడ్డాడు. ఇక అక్షర్ పటేల్ రాకతో బ్యాటింగ్ ఆర్డర్ మరింత బలపడిందన్న హర్భజన్ సింగ్.. టీ20 ఫార్మాట్లో బ్యాటింగ్ విషయంలో అశ్విన్పై ఆధారపడలేమని.. అందుకే అతడికి అవకాశం రాకపోవచ్చని వ్యాఖ్యానించాడు. కాగా ఆర్పీ వర్సెస్ డీకే నేపథ్యంలో రిషభ్ పంత్ను కాదని అనువజ్ఞుడైన వికెట్ కీపర్ బ్యాటర్ దినేశ్ కార్తిక్ వైపే భజ్జీ మొగ్గుచూపడం విశేషం. పాక్తో మ్యాచ్కు భజ్జీ ఎంచుకున్న జట్టు: రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, దినేశ్ కార్తిక్, అక్షర్ పటేల్, యజువేంద్ర చహల్, అర్ష్దీప్ సింగ్, భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమీ. టీ20 వరల్డ్కప్-2022 బీసీసీఐ ప్రకటించిన భారత జట్టు రోహిత్ శర్మ(కెప్టెన్), కెఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, రిషభ్ పంత్ (వికెట్-కీపర్), దినేష్ కార్తీక్ (వికెట్-కీపర్), హార్దిక్ పాండ్యా, రవిచంద్రన్ అశ్విన్, యజువేంద్ర చహల్, అక్షర్ పటేల్, భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, అర్ష్దీప్ సింగ్, మహ్మద్ షమీ. పాకిస్తాన్ బాబర్ ఆజం (కెప్టెన్), షాదాబ్ ఖాన్, ఆసిఫ్ అలీ, హైదర్ అలీ, హారీస్ రవూఫ్, ఇఫ్తికర్ అహ్మద్, ఖుష్దిల్ షా, మహ్మద్ హస్నైన్, మహ్మద్ నవాజ్, మహ్మద్ రిజ్వాన్, మహ్మద్ వసీం, నసీమ్ షా, షాహీన్ షా ఆఫ్రిది, షాన్ మసూద్, ఉస్మాన్ ఖాదిర్. స్టాండ్బై ప్లేయర్స్: ఫఖర్ జమాన్, మహ్మద్ హరీస్, షానవాజ్ దహానీ చదవండి: Rishabh Pant: అలీ బౌలింగ్లో ఒంటిచేత్తో వరుసగా రెండు సిక్స్లు.. పాక్తో మ్యాచ్ అంటేనే.. European T0 League: కిందా మీదా పడి చివరకు ఎలాగోలా! var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4911494512.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
భజ్జీ మాటలే నిజమయ్యాయి.. పీసీఏ అధ్యక్ష పదవికి రాజీనామా
పంజాబ్ క్రికెట్ అసోసియేషన్(పీసీఏ)లో అక్రమాలు ఎక్కువయ్యాయంటూ టీమిండియా మాజీ క్రికెటర్ హర్బజన్ సింగ్ ఇటీవలే పేర్కొన్న సంగతి తెలిసిందే. బోర్డు సభ్యులు పేర్లు బయటపెట్టకుండా హర్భజన్ చేసిన వ్యాఖ్యలు పంజాబ్ క్రికెట్లో కలకలం రేపింది. పీసీఏ చీఫ్ అడ్వైజర్గా ఉన్న భజ్జీ చేసిన వ్యాఖ్యలే తాజాగా నిజమయ్యాయి. పీసీఏ అధ్యక్షుడిగా ఉన్న గుల్జార్ ఇందర్ సింగ్ చహల్ బుధవారం రాత్రి తన పదవికి రాజీనామా చేశాడు. పీసీఏలో గుల్జార్ అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. గుల్జార్ సహా అతని బృందం పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడినట్లు తెలుస్తోంది. కాగా మే నెలలో పీసీఏ అధ్యక్షుడిగా ఎన్నికైన గుల్జార్కు ఆ పదవి మూణ్నాళ్ల ముచ్చటగానే మిగిలిపోయింది. తనపై వచ్చిన ఆరోపణలు నిజమని తేలడంతో పదవికి రాజీనామా చేస్తున్నట్లు గుల్జార్ చహల్ పేర్కొన్నారు. ఇక హర్భజన్ రాసిన లేఖలో ఏముందంటే.. ''ప్రస్తుత పీసీఏ అధ్యక్షుడు అధికారాన్ని అడ్డం పెట్టుకుని అక్రమాలకు పాల్పడుతున్నాడని గడిచిన వారం పది రోజులుగా పంజాబ్ క్రికెట్ ప్రేమికులు, స్టేక్ హోల్డర్ల నుంచి పలు ఫిర్యాదులు అందుకుంటున్నా.ఇది పారదర్శకత,క్రీడా స్ఫూర్తికి విరుద్ధమని నాకు అనేక ఫిర్యాదులు అందుతున్నాయి. ఓటింగ్ హక్కులతో దాదాపు 150 మంది సభ్యులను చేర్చుకోవడానికి పీసీఏ తీవ్రంగా ప్రయత్నిస్తుందని తెలుస్తున్నది. ఇది బీసీసీఐ రాజ్యాంగానికి విరుద్ధం. అంతేగాక పీసీఏ మార్గదర్శకాలు, పారదర్శకత ఉల్లంఘన కిందికే వస్తుంది.. ఈ వ్యవహారానికి సంబంధించి ఇదివరకే బీసీసీఐ అంబుడ్స్మెన్ కు ఫిర్యాదులు కూడా అందినట్టు తెలుస్తున్నది. పీసీఏలో ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తులు తమపై వచ్చిన ఆరోపణలను కప్పిపుచ్చుకోవడానికి, అక్రమాలను దాచడానికి కనీసం సాధారణ సమావేశాలకు కూడా పిలవకుండా ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారు. వారి స్వప్రయోజనాల కోసం క్రీడా స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు'' అంటూ పేర్కొన్నాడు. చదవండి: పంజాబ్ క్రికెట్ అసోసియేషన్కు భజ్జీ వార్నింగ్.. -
పంజాబ్ క్రికెట్ అసోసియేషన్కు భజ్జీ వార్నింగ్..
టీమిండియా మాజీ క్రికెటర్.. ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ హర్భజన్ సింగ్ పంజాబ్ క్రికెట్ అసోసియేషన్(పీసీఏ)కు వార్నింగ్ ఇచ్చాడు. బీసీసీఐ నిబంధనలు ఖాతరు చేయకుండా పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ చీఫ్ గుల్జారీందర్ చాహల్ అక్రమాలకు పాల్పడుతున్నాడని పేర్కొన్నాడు. అధికారాన్ని గుప్పిట్లో ఉంచుకుని అక్రమాలకు పాల్పడితే సహించేది లేదని హెచ్చరించాడు. పంజాబ్ క్రికెట్ అసోసియేషన్.. పంజాబ్, కేంద్ర పాలిత ప్రాంతమైన చండీగఢ్ లకు గవర్నింగ్ బాడీగా వ్యవహరిస్తున్నది. మాజీ క్రికెటర్, నటుడు గుల్జారీందర్ చాహల్ పీసీఏ చీఫ్ కాగా ఇంద్రజిత్ సింగ్ బింద్రా చైర్మెన్ గా ఉన్నాడు. హర్భజన్ సింగ్ పీసీఏలో చీఫ్ అడ్వైజర్ గా ఉన్నాడు. ఈ నేపథ్యంలోనే భజ్జీ పీసీఏకు బహిరంగ లేఖ రాశాడు.''ప్రస్తుత పీసీఏ అధ్యక్షుడు అధికారాన్ని అడ్డం పెట్టుకుని అక్రమాలకు పాల్పడుతున్నాడని గడిచిన వారం పది రోజులుగా పంజాబ్ క్రికెట్ ప్రేమికులు, స్టేక్ హోల్డర్ల నుంచి పలు ఫిర్యాదులు అందుకుంటున్నా.ఇది పారదర్శకత,క్రీడా స్ఫూర్తికి విరుద్ధమని నాకు అనేక ఫిర్యాదులు అందుతున్నాయి. ఓటింగ్ హక్కులతో దాదాపు 150 మంది సభ్యులను చేర్చుకోవడానికి పీసీఏ తీవ్రంగా ప్రయత్నిస్తుందని తెలుస్తున్నది. ఇది బీసీసీఐ రాజ్యాంగానికి విరుద్ధం. అంతేగాక పీసీఏ మార్గదర్శకాలు, పారదర్శకత ఉల్లంఘన కిందికే వస్తుంది.. ఈ వ్యవహారానికి సంబంధించి ఇదివరకే బీసీసీఐ అంబుడ్స్మెన్ కు ఫిర్యాదులు కూడా అందినట్టు తెలుస్తున్నది. పీసీఏలో ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తులు తమపై వచ్చిన ఆరోపణలను కప్పిపుచ్చుకోవడానికి, అక్రమాలను దాచడానికి కనీసం సాధారణ సమావేశాలకు కూడా పిలవకుండా ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారు. వారి స్వప్రయోజనాల కోసం క్రీడా స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు''అని పేర్కొన్నాడు. చదవండి: '110 శాతం ఫిట్గా ఉన్నా.. టీమిండియాతో పోరుకు సిద్ధం' 'అసలు ధోనిలానే లేడు.. ఎవరు తయారు చేశారో కానీ!'