Hyderabad Vibes
-
7 నిమిషాల్లోనే సంపూర్ణ వర్కవుట్
అమెరికాకు చెందిన వ్యాయామ మనస్తత్వవేత్త క్రిస్ జోర్డాన్ ఈ హిట్ అనే వ్యాయామ కార్యక్రమాన్ని రూపొందించారు. ఇది కదలికలు కురవైన శరీరం తెచ్చిపెట్టే సమస్యలకు.. కేవలం 7 నిమిషాల్లో పరిష్కరించగలదని ఆయన చెబుతున్నారు. సొంత శరీర బరువును ఉపయోగించి సుపరిచితమైన కాలిస్టెనిక్ వ్యాయామాలను చేయడమే హై ఇన్టెన్సిటీ ఇంటర్వెల్ ట్రైనింగ్ (హెచ్ఐఐటీ) ఈ హిట్ ఫార్ములా. ప్రతి రౌండ్కూ మధ్య ఐదు సెకన్ల విశ్రాంతి తీసుకుంటూ చేసే హై ఇన్టెన్సిటీ ఇంటర్వెల్ ట్రైనింగ్ (హెచ్ఐఐటీ)గా దీనిని పేర్కొంటున్నారు. ఇందులో ప్రతి వ్యాయామం 30 సెకన్ల పాటు చేయాలి. ఒక భంగిమ నుంచి మరో భంగిమకు మారేటప్పుడు మధ్యన 5 సెకన్ల చొప్పున గ్యాప్ ఉండాలి.వాల్ సిటప్స్: గోడ దగ్గర వెనుకభాగంలో నిల్చుని కురీ్చలో కూర్చున్నట్లుగా కూర్చునే భంగిమ. ఓ రకంగా గోడకుర్చీ వేయడం అని చెప్పొచ్చు. అబ్ క్రంచ్: ప్రాథమిక క్రంచ్తో ప్రారంభించి, వెనుకభాగంలో చదునుగా ఉంచి పడుకోవాలి, మోకాళ్లను వంచి పాదాలను నేలపై ఉంచి చేయాలి.స్టెప్–అప్: దృఢమైన కుర్చీ లేదా బెంచ్కు ఎదురుగా నిలబడి, ఎడమ కాలితో ఓ సారి కుడికాలితో మరోసారి ప్రారంభించి చేయాలి. 30 సెకన్ల వ్యవధిలో వీలైనన్ని సార్లు చేయాలి.స్క్వాట్: పాదాలను భుజం–వెడల్పు వేరుగా చేసి కాలి వేళ్లను ముందుకు ఉంచి నిలబడాలి. ఈ భంగిమలో ఉన్నప్పుడు బరువులో ఎక్కువ భాగాన్ని మడమల మీద ఉంచాలి. 30 సెకన్ల పాటు ఇలా చేయాలి.ట్రైసెప్ డిప్: కుర్చీ లేదా బెంచ్ ముందు అంచున కూర్చుని, మన అరచేతులను అంచుపై ఉంచి దీనిని చేయాలి.ప్లాంక్: చాపపై బోర్లా పొట్టపై పడుకుని దీన్ని చేయాలి. ఈ భంగిమలో మన మోచేతులు మన వైపు దగ్గరగా, అరచేతులు కిందికి వేళ్లు ముందుకు ఎదురుగా ఉంటాయి.హై ‘నీస్’: 30 సెకన్ల పాటు ఉన్నచోటే పరుగెత్తడంగా దీన్ని చెప్పొచ్చు. ప్రతి అడుగుతో మోకాళ్లను వీలైనంత ఎత్తుకు పైకి తీసుకొస్తూ, అరచేతులను తాకడానికి మన మోకాళ్లను వేగంగా పైకి కందికి ఎత్తుతూ చేయాలి.లంజెస్: పాదాలను కలిపి నిలబడి, కుడి పాదం మీద ముందుకు సాగదీయాలి. ముందు, వెనుక మోకాలు రెండూ వీలైనంత 90–డిగ్రీల కోణానికి దగ్గరగా వంగి ఉండే వరకూ చేయాలి.సైడ్ ప్లాంక్లు: చాపపై కుడి వైపున పడుకుని, ఎడమవైపు పడుకుని చేసే వ్యాయామం. పుష్–అప్స్: నేలపై లేదా చాపపై ‘ప్లాంక్’ పొజిషన్Œలోకి వెళ్లి చేసే ప్రక్రియ. బరువును పాదాలకు బదులుగా మోకాళ్లపై ఉంచడం ద్వారా దీన్ని సులభతరం చేయవచ్చు. -
‘లైఫ్లో ఏమున్నా లేకున్నా హ్యాపీగా ఉండాలి బ్రో..’
‘లైఫ్లో ఏమున్నా లేకున్నా హ్యాపీగా ఉండాలి బ్రో..’ ఇలాంటి మాటలు నగరవాసుల రోజువారీ సంభాషణల్లో సర్వసాధారణంగా మారాయి. సంతోషాన్ని మించిన సంతృప్తి లేదనే ఆలోచన రోజురోజుకూ బలం పుంజుకుంటోంది. ఎన్ని కష్టనష్టాలున్నా సంతోషం కోసం వెతుకుతూనే ఉన్నారు. ఉన్నదాంట్లో హ్యాపీగా లైఫ్ గడిపేస్తున్నారు. పదేళ్ల క్రితం ఐఎమ్ఆర్బీ అధ్యయనంలో 190 పాయింట్లు దక్కించుకున్న చత్తీస్ఘడ్ తొలి స్థానంలో నిలిచింది. లక్నో, చెన్నై, బెంగళూర్లు ఆ తర్వాత స్థానాల్లో నిలిచాయి. మన హైదరాబాద్ 75 పాయింట్లను దక్కించుకుని 12వ స్థానంతో సరిపెట్టుకుంది. అయితే ఆ తర్వాత నిదానంగా తన స్థానాన్ని మెరుగుపరుచుకుంటూ వస్తోంది. 5 ఏళ్ల క్రితం గురుగ్రామ్ మేనేజ్మెంట్ డెవలప్మెంట్ ఇనిస్టిట్యూట్లో స్ట్రాటజీ ప్రొఫెసర్ డా.రాజేష్ పిలానియా టీమ్ ఇండియా హ్యాపీనెస్ రిపోర్ట్ రూపొందించింది. దీని కోసం 34 నగరాల్లో అధ్యయనం నిర్వహించగా.. లూథియానా, అహ్మదాబాద్, చండీగఢ్ సంతోషకరమైన నగరాలుగా అవతరించాయి. గురుగ్రామ్, విశాఖపట్నం, రాయ్పూర్ చివరి స్థానాలు దక్కించుకున్నాయి. ఢిల్లీ, ముంబై, కోల్కతా, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, పూణె, అహ్మదాబాద్ను టైర్–2 నగరాలుగా విభజించి నిర్వహించిన అధ్యయనంలో.. అహ్మదాబాద్, చెన్నై, హైదరాబాద్ మొదటి మూడు ర్యాంకులను కైవసం చేసుకున్నాయి. మొత్తంగా చూస్తే హైదరాబాద్ టాప్–10లో నిలిచింది. అప్పటి నుంచి హైదరాబాద్ 5 నుంచి 10లోపు ర్యాంకింగ్లో ఉంటూ హ్యాపీనెస్ రిపోర్ట్లో ప్రముఖంగా ఉంటోంది. కోవిడ్ తర్వాత కొలత మారింది.. ఈ అధ్యయనాలు విశ్లేషిస్తున్న ప్రకారం.. నగరాల్లోని హ్యాపీనెస్ ట్రెండ్స్లో కోవిడ్ ప్రభావం స్పష్టంగా కనిపించింది. అసలైన సంతోషానికి కొలమానం తెలిసి వచి్చంది. కరోనా మహమ్మారి కారణంగా అనూహ్యంగా ప్రపంచం స్తంభించిపోవడం ఉరుకులు పరుగుల జీవనంలోని డొల్లతనాన్ని పట్టిచి్చంది. దాంతో తమ తమ లక్ష్యాలకు అనుగుణంగా పనిచేస్తూనే సంతోషానికి కూడా తమ డైలీ రొటీన్లో తగిన ప్రాధాన్యత ఇవ్వడం పెరిగింది. విభిన్న రకాల హాబీలకు సానపెట్టడం, టూర్లకు, పిక్నిక్లకు వెళ్లడం మరింత ఎక్కువైంది. అంతేకాకుండా ఆధ్యాత్మిక భావనలు, తాతి్వక చింతనలూ పెరిగి ప్రశాంత జీవనం వైపు ఆలోచనలు మళ్లిస్తున్నారు. ట్రావెలింగ్.. ఫొటోగ్రఫీ.. ఎన్ని బాధ్యతలు ఉన్నాయి? ఎన్ని రకాల పనులు చేస్తూ ఉన్నాం అనేదాని కన్నా.. ఎంత సంతోషంగా ఉన్నాం.. అనేదే ముఖ్యమని నేను నమ్ముతాను. అందుకు అనుగుణంగానే నా లైఫ్స్టైల్ ఉంటుంది. ఒకప్పుడు ఫ్యాషన్ ఫొటోగ్రాఫర్గా కొంత కాలం పనిచేశాను. ఆ తర్వాత సినిమా నటుడిగా మారాక అదే ఫొటోగ్రఫీ నాకు సంతోషాన్ని అందించే హాబీగా మారింది. అలాగే ట్రావెలింగ్ కూడా నాకు చాలా ఆనందాన్ని అందిస్తుంది. – కృష్ణుడు, సినీనటుడు పాజిటివ్ మైండ్.. ఏదో ఒక రోజు అని కాదు.. ప్రతీ రోజూ సంతోషంగానే ఉంటాను. సంతోషం అనేది ప్రత్యేకంగా ఒక మార్గంలో తెచ్చుకోవడం అనేది కాదు. ముఖ్యంగా నేను దేనికీ టెన్షన్ పడను.. ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఏడవను.. హ్యాపీగా ఉండాలి అని నా మనసును ట్యూన్ చేసుకున్నాను కాబట్టి ఎప్పుడూ ఆనందంగా ఉంటాను. – సుధ, సినీ నటిమ్యూజిక్ కిక్.. రైడింగ్ బైక్.. కొన్ని హాబీస్ నాకు హ్యాపీనెస్ని అందిస్తాయి. అలాంటి వాటిలో మొదటిది మ్యూజిక్ అని చెప్పాలి. నా ఉదయం ఎప్పుడూ సంగీతంతో ప్రారంభిస్తా.. నచ్చిన మ్యూజిక్ వింటూ డే స్టార్ట్ చేస్తే ఆ కిక్కే వేరు. రోజులో ఏ మాత్రం డల్గా అనిపించినా నా చూపులు బైక్ మీదకు వెళ్తాయి. చిన్నప్పటి నుంచీ బైక్ రైడింగ్ బాగా ఇష్టం. – ప్రిన్స్, సినీనటుడు హ్యాపీ హార్మోన్లు.. కీలకం.. రోజువారి కొన్ని అలవాట్లు చేసుకుంటే మెదడు సంతోషకర హార్మోన్లను విడుదల చేస్తుంది. ఉదాహరణకుక్రమం తప్పకుండా ఎక్సర్సైజులు చేసే వారిలో ఎండార్ఫిన్స్ అనే హార్మోన్లు విడుదల అవుతాయి. వీటి వల్ల డిప్రెషన్, ఆందోళన వంటి ప్రతికూల భావాలు దరిచేరవు. అలాగే బరువు తగ్గడం, శరీరాన్ని సరైన ఆకృతిలో ఉంచుకోవడం లాంటి చిన్నా, పెద్దా లక్ష్యాలను మనం చేరుకోగలిగినప్పుడు ఫీల్గుడ్ హార్మోన్ డోపమైన్.. అధికంగా ఉత్పత్తి అవుతుంది. జీవితంలో మనకున్న వాటితో సంతృప్తి చెందడం, కృతజ్ఞతాభావం కలిగి ఉండటం కూడా మనసులో సానుకూల భావాలను నింపుతుంది. ఫలితంగా సెరటోనిన్ స్థాయి పెరిగి జీవితం ఆనందమయంగా కనిపిస్తుంది. మనసుకు దగ్గరైన వారితో సరదాగా గడపడం చేస్తే మెదడు ఆక్సిటోసిన్ను విడుదల చేస్తుంది. మూడ్ మెరుగుపరచడంలో ఆహారం పాత్ర కూడా కీలకం. వారంలో రెండుసార్లు 50 నుంచి 100 గ్రాముల వరకు డార్క్ చాక్లెట్ని తినడం వల్ల మనలో హ్యాపీ హార్మన్లు విడుదలవుతాయి. అయితే ఆ డార్క్ చాక్లెట్లో 70 నుంచి 85 శాతం కొకొవా మాత్రమే ఉండాలని గుర్తుంచుకోవాలి. ట్రిఫ్టోఫాన్ అధికంగా ఉండే టర్కీ కోడి, గుడ్లు, బాదంపప్పులు వంటి ఆహారాలతో సెరటోనిన్ ఉత్పత్తి పెరుగుతుంది. ఓమెగా3 ఫ్యాటీ యాసిడ్ అధికంగా ఉండే చేపలు కూడా డోపమైన్ స్థాయిల్ని పెంచి మూడ్ను మెరుగుపరుస్తాయి. వనజా శ్రీపెరంబుదూరు కౌన్సెలింగ్ సైకాలజిస్ట్ -
'విందోదయం': బ్రేక్ ఫాస్ట్లకు కేరాఫ్ ఈ టిఫిన్ సెంటర్లు..!
మంచి ఫుడ్ ఎంజాయ్ చేయడానికి ఇంటిల్లి పాదీ కలిసి పేరున్న రెస్టారెంట్/కేఫ్లకు లంచ్, డిన్నర్లకో వెళ్లడం తెలిసిందే. అయితే ప్రస్తుతం బ్రేక్ ఫాస్ట్ సమయం కూడా సిటిజనుల మీట్ అండ్ ఈట్లకు కేరాఫ్గా మారింది. లేట్నైట్స్లోనే బ్రేక్ఫాస్ట్ చేసే ప్లేసెస్ గురించి మాట్లాడుకుని ఉదయమే అక్కడ ప్రత్యక్షం అవుతున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ సిటీజనులు తమ బ్రేక్ ఫాస్ట్, అల్పాహారం కోసం తరచూ ఎంచుకునే వాటిలో ఇవీ.. టేస్టీ ఫుడ్ ఆస్వాదించి సంతృప్తిగా రోజును ప్రారంభించడం కన్నా మంచి రోజు ఏముంది? అద్భుతమైన వంటల వారసత్వానికి ప్రసిద్ధి చెందిన మన నగరం, రుచికరంగా రోజును కిక్స్టార్ట్ చేయడానికి అనేక ఎంపికలను అందిస్తుంది. దోసెలు, ఇడ్లీల వంటి సంప్రదాయ దక్షిణ భారతీయ ఇష్టమైన వాటి నుంచి ఆమ్లెట్లు, వాఫ్ఫల్స్ వంటి అంతర్జాతీయ వెరైటీల వరకు మన సిటీలోని అల్పాహార సమయం.. వైవిధ్యంగా ఉంటుంది. రుచులు అనుభవాల విందోదయాల కోసం అందుబాటులో కొన్ని.. కోఠిలోని సందడిగా ఉండే వీధుల్లో ఉన్న ప్రగతి టిఫిన్ సెంటర్ దక్షిణ భారత అల్పాహార ప్రియుల సందడితో నిండి ఉంటుంది. క్రిస్పీ దోసెలు, మెత్తటి ఇడ్లీలు, ఊతప్పమ్లకు ఈ సెంటర్ ప్రసిద్ధి చెందింది. ఇక్కడ హైలైట్ ఏమిటంటే ప్రతి వంటకంతో పాటు అందించే చట్నీలు. ఉదయం 7గంటల నుంచి 9 గంటలలోపు హనుమాన్ టేక్డి, హెచ్వీఎస్ రోడ్లో ఉన్న ఈ సెంటర్ను సందర్శించం అంటే నోరూరించే దక్షిణాది వంటకాలను ఆస్వాదించినట్లే.. సంప్రదాయ రుచులను కోరుకునే వారు గచ్చిబౌలిలోని ఇందిరానగర్లో ఉన్న ఉడిపి ఉపహార్కు చలో అంటున్నారు. ఇడ్లీలు, వడలు, దోసెలు, ఊతప్పమ్ వంటి అనేక రకాల దక్షిణ భారతీయ ప్రధాన వంటకాలను అందిస్తుంది. మెనూలో డబుల్ కా మీఠా, బొబ్బట్టు వంటి స్వీట్ ట్రీట్లు కూడా ఉన్నాయి. ఇది ఇక్కడ అల్పాహారం ఉదయం 7 నుంచి 10.30గంటల మధ్య అందుబాటులో ఉంటుంది.మాదాపూర్లోని హమ్మింగ్ బర్డ్ కేఫ్లో కేఫ్ స్టైలి ఆరోగ్యకరమైన అల్పాహారం కోరుకునే సిటిజనులు ఎంచుకుంటున్నారు. ఇక్కడ మష్రూమ్ ఆమ్లెట్ల నుంచి బ్రోకలీ చీజ్ ఆమ్లెట్ల వరకు రోజంతా అల్పాహారం అందించడం విశేషం. ఆహారం పోషకాలతో నిండిన సూప్లు, సలాడ్లతో పాటు కాఫీలూ ఎంజాయ్ చేయవచ్చు. మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 11.30 దాకా అందుబాటులో ఉంటుంది. పిజ్జాదోస, పాస్తా దోస, మంచూరియా దోస వంటి వెరైటీ ఆధునిక దక్షిణ భారత బ్రేక్ఫాస్ట్లను కోరుకునేవారు బంజారాహిల్స్లోని రాయల్ టిఫిన్ సెంటర్ను ఎంచుకుంటున్నారు. వీరి మెనూలో ఉప్మా ఊతప్పమ్ల వంటి క్లాసిక్స్ కూడా ఉన్నాయి. ఆహ్లాదకరమైన అలంకరణ, ప్రత్యేకమైన మెనూతో జూబ్లీహిల్స్లోని ది హోల్ ఇన్ ది వాల్ కేఫ్ అల్పాహార ప్రియులను ఆకట్టుకుంటోంది. ఇంగ్లిష్ బ్రేక్ ఫాస్ట్ వెరైటీల్లో.. వెజ్జీ పిజ్జా ఆమ్లెట్, గోల్డెన్ ఫ్రిటాటా మిక్స్ ఇక్కడ హైలైట్స్గా చెప్పాలి. స్వీట్ టూత్ ఉన్నవారు ఇక్కడి చాక్లెట్ వాఫ్ఫల్స్, బ్లూబెర్రీ చీజ్ వాఫ్ఫల్స్ తప్పనిసరిగా టేస్ట్ చేయాలి. ఉదయం 8.30గంటల నుంచి అందుబాటులో ఉంటుంది. సిటిజనులకు చిరపరిచితమైన పేరే మినర్వా కాఫీ షాప్. ఈ పేరు దక్షిణ భారతీయ వంటకాలకు పర్యాయపదంగా ఉంది. టమాటా చట్నీ రైతాతో కలిపిన రైస్ పొంగల్, నెయ్యితో నింపిన ఇడ్లీలు క్రిస్పీ దోసెలు ఇక్కడ స్పెషల్.. ఇక్కడి ఫిల్టర్ కాఫీ వావ్ అనిపిస్తుందంటారు కాఫీప్రియులు. ఉదయం 7గంటల నుంచి 11 గంటల వరకూ బ్రేక్ఫాస్ట్ సర్వ్ చేస్తారు. నగరంలోని దారుల్షిఫా, చట్టా బజార్లో ఉన్న హోటల్ నయాబ్ ఉదయం 5 గంటల నుంచే సంప్రదాయ అల్పాహారాన్ని అందిస్తుండటం ఎర్లీ బైకర్స్ను ఆకర్షిస్తోంది. బటర్ నాన్, లుక్మీతో పాటు భేజా ఫ్రై వంటి స్థానిక హైదరాబాదీ ప్రత్యేకతలతో బ్రేక్ ఫాస్ట్ చేయిస్తోంది. ఇరానీ చాయ్తో సహా మన అసలైన రుచులను ఇష్టపడేవారు నయాబ్ను సందర్శిస్తున్నారు. ఉదయం 4.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల దాకా ఇక్కడ బ్రేక్పాస్ట్ ప్రియుల సందడి కనిపిస్తుంది. (చదవండి: -
బెడ్కు జై.. భాగస్వామికి బై..
అంటూ అటూ ఇటూ కదులుతుండటంతో పక్కనే ఉన్న నాకు కూడా నిద్ర పట్టలేదు’ పొద్దున్నే ఆఫీస్లో తాను పడుతున్న కునికిపాట్ల కారణాన్ని కొలీగ్తో పంచుకున్నాడు నగరవాసి తరుణ్.. ‘మా భర్త నైట్ అంతా గురకపెడతారు.. దాంతో నాకు నిద్రే ఉండటం లేదు’ అంటూ ఫ్రెండ్ దగ్గర తన గోడు వెళ్లబోసుకుంది ఓ వివాహిత. ఇలాంటి సమస్యలతో నిద్రలేమికి గురవుతున్న కొందరు నగరవాసులు దీనికో పరిష్కారాన్ని ఎంచుకున్నారు. దాని పేరే స్లీప్ డివోర్స్.. పరస్పర అంగీకారంతో దూరదూరంగా నిద్రించడమే నిద్ర విడాకులు.. నాణ్యమైన రాత్రి నిద్ర కోసం దేశంలో 78% జంటలు ‘నిద్ర విడాకులు’ను ఎంచుకుంటున్నాయి. మార్చి 14న ప్రపంచ నిద్ర దినోత్సవం పురస్కరించుకుని నిద్రలేమి సమస్యకు పరిష్కారాలను అందించే రెస్మెడ్.. నగరంతో పాటు అంతర్జాతీయంగా నిర్వహించిన స్లీప్ సర్వే ఈ విషయాన్ని వెల్లడించింది. నిద్ర నాణ్యతను మెరుగుపరచడానికి జంటలు వేర్వేరు బెడ్లు/ బెడ్రూమ్లలో నిద్రించే ఈ పద్ధతి ఒకప్పుడు నిషిద్ధంగా లేదా వైవాహిక అసమ్మతికి సంకేతంగా పరిగణించేవి. అయితే ఇప్పుడు ఈ ధోరణి మెరుగైన ఆరోగ్యం, సంబంధాల సామరస్యానికి దోహదపడేదిగా గుర్తింపు పొందుతోంది. మంచి నిద్రతోనే.. మెరుగైన జీవనం.. ‘మనం ఏది సాధించాలన్నా తగినంత నిద్ర ఉండాలి. అది జీవితంలోని అనేక సమస్యలను పరిష్కరిస్తుంది’ అని హైటెక్ సిటీలోని కేర్ హాస్పిటల్స్లో కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ పల్మోనాలజిస్ట్గా సేవలు అందిస్తున్న డాక్టర్ సతీష్ సి రెడ్డి అంటున్నారు. ‘ఒక వైద్యుడిగా, రోగుల ఆరోగ్యం, ఉత్పాదకత మాత్రమే కాదు సంబంధాలపై కూడా నిద్రలేమి చూపించే దు్రష్పభావాలను నగరంలో పలువురిలో చూస్తున్నాను. చాలా మంది ప్రతిరాత్రి దాదాపు 7 గంటల పాటు నిద్రపోతున్నా, వారు వారానికి నాలుగు రాత్రులు మాత్రమే అధిక–నాణ్యత కలిగిన నిద్రను పొందుతున్నారు. నిద్ర ప్రాముఖ్యతను గుర్తించినా 22% మంది తమ నిద్ర సమస్యలకు సహాయం తీసుకోవాలని అనుకోరు’అని ఆయన చెప్పారు.నిద్ర విడాకులకు కారణాలు జంటల్లో ఇద్దరికీ ఉండే భిన్నమైన అలవాట్లు, స్క్రీన్ టైమ్, విభిన్న అవసరాలు, నిద్ర విధానాలు, గురక, గదిలోని ఉష్ణోగ్రత ప్రాధాన్యతలు, అతిగా కదిలే చంచలత్వం, నిద్ర రుగ్మతలు.. శారీరక సౌలభ్యం వంటి వివిధ కారణాలతో జంటలు ఈ విడాకులు తీసుకుంటున్నాయి. అలాగే మానసిక ఆరోగ్య సంబంధిత కారకాలు కూడా కీలక పాత్ర పోషిస్తాయి. ఉదాహరణకు ఒక భాగస్వామి శస్త్రచికిత్స నుంచి కోలుకుంటున్నట్లయితే లేదా దీర్ఘకాలిక నొప్పితో ఉన్నట్లయితే, విడివిడిగా నిద్రపోవడం వల్ల మరొకరి విశ్రాంతికి అంతరాయం కలగకుండా సహకరించినట్లు అవుతుందనే ఆలోచన.బలపడుతున్న బంధం.. ఇంటర్వెన్షనల్ పల్మోనాలజీ స్లీప్ మెడిసిన్ కన్సల్టెంట్, డాక్టర్ విశ్వేశ్వరన్ బాలసుబ్రమణియన్, (పల్మోనాలజీ–గోల్డ్ మెడల్) మాట్లాడుతూ జంటలు వ్యక్తిగత స్థలం, వ్యక్తిగత నిద్ర అవసరాలు సంబంధాల మధ్య సమతుల్యం చేయడానికి నిద్ర విడాకులను ఎంచుకుంటున్నారని అభిప్రాయపడ్డారు. నిద్ర నాణ్యతకు ప్రాధాన్యం ఇవ్వడం వాస్తవానికి, చాలా మంది జంటలకు, తమ సాన్నిహిత్యాన్ని మెరుగుపరచే ఒక మంచి మార్గంగా పయోగపడుతుందనీ ఇద్దరూ తమకు అవసరమైన విశ్రాంతిని పొందేలా సహకరిస్తుంది’ అని ఆయన చెప్పారు. గతంలో భావించినట్లు నిద్ర విడాకులు ఆప్యాయత లేదా ప్రేమ లేకపోవడాన్ని సూచించడానికి బదులు, ఇది ఒకరి వ్యక్తిగత విశ్రాంతికి మరొకరు ఇస్తున్న ప్రాధాన్యతను వెల్లడిస్తుందన్నారు.ప్రయోజనాలూ.. ప్రతికూలతలూ.. మెరుగైన నిద్ర నాణ్యత, తగ్గిన నిద్ర అంతరాయాలు, మెరుగైన సాన్నిహిత్యం, ఎక్కువ వ్యక్తిగత స్థలం, బలమైన రోగనిరోధక వ్యవస్థ, మెరుగైన మానసిక స్థితి, మెరుగైన పనితీరు, గుండె జబ్బులు వంటి దీర్ఘకాలిక పరిస్థితుల ప్రమాదాన్ని తగ్గించడం వంటివి నిద్ర విడాకుల ద్వారా పొందే ప్రయోజనాలు. కాగా.. కొన్ని ప్రతికూలతలు కూడా ఉన్నాయి. ‘చాలా మంది జంటలు నిద్ర విడాకుల నుంచి ప్రయోజనం పొందుతున్నప్పటికీ, ఇది కొన్నిసార్లు మానసిక, శారీరక సాన్నిహిత్యాన్ని తగ్గించే ప్రమాదం ఉంది. అలాగే దూరంగా నిద్రపోవడాన్ని ఇప్పటికీ సంబంధాల సమస్యకు సంకేతంగా చూస్తారు. కాబట్టి సామాజిక ఆక్షేపణలకు దారితీస్తుంది. ‘ఏది ఏమైనా ప్రస్తుత పరిస్థితుల్లో నిద్రలేమి కారణంగా రకరకాల సమస్యలకు గురవడం కన్నా.. నిద్ర విడాకులు, ఆరోగ్యకరమైన, ఆచరణాత్మక ఎంపిక’ అని డాక్టర్ బాలసుబ్రమణియన్ స్పష్టం చేశారు. -
'వాకింగ్ యోగా': జస్ట్ ఒకే వ్యాయామంతో..!
నడక, యోగా రెండూ దేనికవే ప్రత్యేకం. ఆరోగ్యకరమైన వ్యాయామ మార్గాలు. ప్రస్తుతం ఈ రెంటినీ మిళితం చేసిన సరి కొత్త వ్యాయామంగా అందుబాటులోకి వచ్చింది వాకింగ్ యోగా. అటు నడక ద్వారా లభించే ప్రయోజనాలతో పాటు.. ఇటు యోగా ఫలితాలను ఒకే వ్యాయామం ద్వారా అందుకునేందుకు ఇది సహకరిస్తుంది. ఇటీవల తెలంగాణలోని హైదరాబాద్ నగరంలో అనేక మందిని ఆకట్టుకుంటున్న ఈ వాకింగ్ యోగా విశేషాలివి..నడక మన ఆరోగ్యానికి మేలు చేస్తుంది. కానీ నడక– యోగా ఆ ప్రయోజనాలను మరింత ముందడుగు వేయిస్తుంది. ఆధునిక సౌకర్యాలు, పని విధానాల వల్ల చలన రహితంగా మారుతున్న శరీరాన్ని చురుకుగా కదపడానికి విభిన్న రకాలుగా సాగదీయడానికి, సరైన రీతిలో శ్వాస పీల్చుకోడానికి వీలుగా ఈ వాకింగ్ యోగా రూపుదిద్దుకుంది. ఇది నడిచేటప్పుడు మన శరీర భంగిమను మెరుగుపరచడానికి, నడకను మరింత ప్రయోజనకరంగా మార్చడానికి సహకరిస్తుంది. ఏదో నడిచాం అన్నట్టుగా కాకుండా అవగాహనతో నడవడం నేర్పిస్తుంది. ఇందులో ప్రతి అడుగు లోతైన శ్వాస, సున్నితమైన స్ట్రెచ్లతో కలిపి ఉంటుంది. భంగిమకు మేలు.. మనలో చాలా మంది మన శరీర భంగిమ ఎలా ఉంటుందో పట్టించుకోకుండా నడుస్తూ ఉంటారు. తద్వారా నడవడం వల్ల కలిగే ప్రయోజనాలను కోల్పోతుంటారు. వాకింగ్ యోగా భంగిమను మెరుగుపరుస్తుంది. చేతులు, కాళ్లు, మెడ.. వీటిని సరైన రీతిలో ఉంచేలా సహాయపడుతుంది. నిటారుగా నిలిచేలా, నడుము భాగం, వీపుతో నడకను అనుసంధానిస్తుంది. కండరాల మధ్య సమన్వయాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. కొందరికి అననుకూలం.. ఒక వ్యక్తి తమ నడకను మరింత విశ్రాంతిగా అదే సమయంలో మరింత ఉపయుక్తంగా మార్చే నడక యోగా టీనేజర్స్తో సహా అన్ని వయసుల వారికీ ఉపయుక్తమే. అయితే అనేక ప్రయోజనాలు ఉన్నప్పటికీ, ఇది అందరికీ అనుకూలం కాకపోవచ్చు. వేగవంతమైన నడక లేదా తీవ్రమైన వ్యాయామాలను ఇష్టపడే వ్యక్తులకు నప్పకపోవచ్చు. అలాగే, దీనికి ఏకాగ్రత, ఎక్కువ సహనం అవసరం. అది లేనివారు దీన్ని సాధన చేయడం కష్టం. నప్పుతుందో లేదో తెలుసుకోడానికి ఒక వారం పాటు దీనిని ప్రయత్నించి పరిశీలించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. మానసికంగానూ ఎంతో మేలు.. నడక యోగా ఒత్తిడిని తగ్గించడానికి విశ్రాంతిని అందించడానికి ఒక గొప్ప మార్గం. ఇది నడుస్తున్నప్పుడు లోతుగా శ్వాస తీసుకోవడం అలవాటు చేస్తుంది. తద్వారా ఆందోళనను, ప్రతికూల ఆలోచనలను తగ్గించి మనసును ప్రశాంతపరుస్తుంది. ఇది చురుకుగా ఉంటూనే మెదడుకు రిఫ్రెష్ బటన్ ప్రెస్ చేయడం లాంటిదని చెప్పొచ్చు. మనసు శరీరానికి క్రమబద్ధమైన అభ్యాసం ఇది. ఒత్తిడిని తగ్గించడానికి, మానసిక స్థితిని, ఏకాగ్రతను పెంచడానికి శరీరంపై అవగాహనను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. రోజుకు 5 నిమిషాలతో.. బాగా పరిచయం ఉన్న కాస్త ప్రశాంతంగా ఉండే ప్రదేశంలో రోజుకు ఐదు నిమిషాలతో ఈ వాకింగ్ యోగాని ప్రారంభించాలి. రోజుకు క్రమంగా ఐదు నిమిషాల చప్పున పెంచుకోవచ్చు. తద్వారా రొటీన్ వ్యవహారాలకు, వ్యాయామాలతో సర్దుబాటు కావడానికి కండరాలకు సమయాన్ని ఇవ్వాలి. ‘రోజుకు 20 నిమిషాలు వచ్చే వరకూ ఈ విధంగా పెంచుతూపోవాలి. ప్రతిరోజూ 20 నిమిషాలు కేటాయించలేకపోతే.. కనీసం వారానికి మూడు రోజులు 30 నిమిషాలు చేస్తే సరిపోతుందని నిపుణులు సూచిస్తున్నారు. 50 ఏళ్ల క్రితమే.. మైండ్ఫుల్ వాకింగ్ అనే ప్రక్రియను యోగా శిక్షకురాలు, యోగా ఫర్ పెయిన్ యాప్ సృష్టికర్త, లండన్కు చెందిన సోఫియా డ్రోజ్డ్ వ్యాప్తిలోకి తెచ్చారు. అయితే ఇదేమీ కొత్తది కాదని, దాదాపు 50 ఏళ్ల క్రితం.. అంటే 1970 ప్రాంతంలోనే రోజువారీ కార్యకలాపాలతో యోగా, బ్రీత్వర్క్లను కలిపే సాధనంగా ఇది ప్రప్రథమంగా వినియోగంలోకి వచ్చిందని డ్రోజ్డ్ అంటున్నారు. ప్రకృతితో మమేకం.. మైండ్ ఫుల్ వాక్.. దృష్టిని పూర్తిగా శ్వాస మీదే కేంద్రీకరిస్తూ.. ఆలోచనలు మరే విషయం మీదకూ మళ్లించకుండా శరీరాన్ని కదిలించడమే మైండ్ ఫుల్ నెస్. నడిచే సమయంలో ఈ ప్రక్రియను సాధన చేస్తే.. అద్భుత ప్రయోజనాలు లభిస్తాయి. అది కూడా ప్రకృతిలో మమేకమవుతూ చేయడం మరింత ప్రయోజనకరం. నడకను, యోగాను మేళవించడమే వాకింగ్ యోగా. మైండ్ ఫుల్ బ్రీతింగ్, మైండ్ ఫుల్ నేచర్ వాక్, పచ్చని గడ్డి మీద నడిచే బేర్ ఫుట్ వాక్, క్లౌడ్ గేజింగ్.. వంటివన్నీ ఇందులో భాగంగానే చెప్పవచ్చు. నగరంలో పలువురు వాకింగ్ యోగాను సాధన చేస్తున్నారు. – రీనా హిందోచా, యోగా శిక్షకురాలు (చదవండి: క్షణాల్లో తయారయ్యే ఈ మ్యాగీ నూడుల్స్ రెసిపీని కనిపెట్టిందెవరంటే..) -
Vinisha Reddy: వైద్య వృత్తిని వదిలి ఐఏఎస్ వైపు
ప్రస్తుతం యువతను సోషల్ మీడియా గురించి అడిగితే.. రీల్స్ గురించి, షార్ట్స్ గురించి చెబుతారు.. కానీ అదే సామాజిక మాధ్యమాల్లో ఒకటైన యూట్యూబ్ను వినియోగించుకుని గ్రూప్స్లో టాపర్గా నిలిచింది ఆ యువతి. ప్రతి నిమిషం అదే లక్ష్యంతో ఏకాగ్రతగా నిర్ధేశిత ప్రణాళికతో ముందుకు కదిలింది. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా మూడు ప్రభుత్వ పోటీ పరీక్షల్లో విజయం సాధించింది. ఆమె నగరానికి చెందిన డాక్టర్ వినీషా రెడ్డి.. యూట్యూబ్లో పోటీ పరీక్షల క్లాసులు వీక్షిస్తూ రికార్డును సృష్టించింది.. ఇటీవల తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) నిర్వహించిన గ్రూప్స్ పరీక్షలో మహిళా విభాగంలో అత్యధిక మార్కులు సాధించి వరుసగా టాపర్గా నిలిచారు వినీషా రెడ్డి. చదివింది వైద్య వృత్తి అయినప్పటికీ తల్లిదండ్రుల మాదిరిగా ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే పట్టుదలతో పోటీ పరీక్షలకు సిద్ధమయ్యారు. బీహెచ్ఎంఎస్ పూర్తి కాగానే డాక్టర్ ప్రాక్టీస్ వైపు మొగ్గు చూపకుండా 2022 నుంచి పోటీ పరీక్షలపై దృష్టి సారించారు. కోచింగ్ సెంటర్కు వెళ్లడం కంటే ఇంట్లోనే కూర్చోని ఆన్లైన్ క్లాసుల ద్వారా పోటీ పరీక్షలకు సిద్ధం అయితే సమయం వృథా కాదని తల్లిదండ్రులు సలహా ఇచ్చారు. చదివిన వైద్య వృత్తితో సంబంధం లేకుండా యూట్యూబ్లో సివిల్స్, గ్రూప్స్ వంటి పోటీ పరీక్షల టాపర్స్ ఇంటర్వ్యూలను వీక్షించారు. తద్వారా ఓ అంచనాకు వచ్చారు. గ్రూప్స్ నోటిఫికేషన్ వెలువడగానే దరఖాస్తు చేసుకుని యూ ట్యూబ్లో క్లాసులను వీక్షించారు. చక్కని ప్రణాళికతో రోజుకు ఎనిమిది గంటలు సమయం కేటాయించి సబ్జెక్టుల వారీగా క్లాసులు వింటూ తనకున్న అనుమానాలను నివృత్తి చేసుకున్నారు. మొదటి అటెంప్ట్ లోనే.. అనుకున్న లక్ష్యాన్ని చేరేలా చక్కని ప్రణాళికతో ప్రాక్టీస్ చేసినట్లు డాక్టర్ వినీషా రెడ్డి చెబుతున్నారు. టీజీపీఎస్సీ నిర్వహించిన సీడీపీవో పరీక్షలకు హాజరై స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించారు. గ్రూప్–1లో సైతం అత్యధిక మార్కులు సాధించారు. గ్రూప్–2 మహిళా విభాగంలో టాపర్గా నిలిచారు. తాజాగా టీజీపీఎస్సీ గ్రూప్–3 మహిళా విభాగంలోనూ మొత్తం 450 మార్కులకు గానూ 325.157 మార్కులు సాధించారు. 8వ జనరల్ ర్యాంకింగ్లో నిలిచారు. సివిల్స్ పరీక్షలతో ఐఏఎస్ కావాలన్నదే తన ముందున్న ఏకైక లక్ష్యమని వినీషారెడ్డి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. -
నవతరం.. నైపుణ్యం..
స్వతహాగా మహిళల హస్తాలు సృజనాత్మకత, కళాత్మకతను నింపుకుని ఉంటాయనేది నానుడి. ఇలాంటి మహిళలకు, వారి కళకు, కష్టానికి, ఆసక్తికి ప్రోత్సాహమందిస్తే అద్భుతాలు సృష్టిస్తారు. దీనిని నిజం చేసింది విమెన్ ఎంట్రప్రెన్యూర్కు మద్దతునిచ్చే రాష్ట్ర ప్రభుత్వ సంస్థ వీ హబ్. తెలంగాణలోని వివిధ జిల్లాలకు చెందిన టియర్–2, టియర్–3 ప్రాంతాలకు చెందిన మహిళలను వ్యాపారులుగా అభివృద్ధి చేసి, ఆదర్శ ఎమ్ఎస్ఎమ్ఈలుగా మార్చాలనే లక్ష్యంతో వీ హబ్ ఆధ్వర్యంలో ప్రాజెక్ట్ ఇన్ క్లూ్యజన్ ప్రోగ్రామ్ ప్రారంభించింది. ఇందులో భాగంగా మహిళా వ్యాపారాలకు మార్కెట్ అనుసంధానం, బిజినెస్ రిజి్రస్టేషన్స్, మెంటార్షిప్, ఆర్థిక స్వావలంబన మార్గాలను అందించడం దీని ముఖ్య ఉద్దేశం. ఇందులో భాగంగా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన 31 మంది మహిళలను నగరంలోని వీ హబ్ వేదికగా అభినందించి, వారి ఉత్పత్తులను ప్రదర్శించారు. ఈ 31 మంది మహిళల కృషి, పట్టుదల భవిష్యత్తు తరం వనితలకు స్ఫూర్తిగా నిలుస్తోంది. మహిళలకున్న ఆలోచనలను స్థిరమైన వ్యాపారాలుగా మార్చుతోంది వీ హబ్. దీని కోసం ‘ప్రాజెక్ట్ ఇన్క్లూజన్’ను ప్రారంభించింది. ఈ వేదికగా సదరు మహిళల వ్యాపారాభివృద్ధికి తోడ్పాటునందించే ఇతర సహకారాలను అందిస్తోంది. ఇందులో భాగంగా వారసత్వంగా కొనసాగిస్తున్న హస్తకళలు మొదలు అధునాతన జీవన శైలిని ప్రతిబింబించే గృహాలంకరణ ఉత్పత్తుల వరకూ అనువైన వేదికను రూపొందించారు. ఇందులో సహకారం పొందిన వారు సొంత బ్రాండ్ రూపొందించుకుని చేనేత వస్త్ర ఉత్పత్తులు, మోడ్రన్ ప్యాకింగ్తో చాక్లెట్ల తయారీ, హోమ్ ఫుడ్స్, కన్స్ట్రక్షన్ బిజినెస్, గానుగ నూనె తయారీ వంటి విభిన్న రంగాల్లో తమను తాము నిరూపించుకున్నారు. ఈ సందర్భంగా వీ హబ్ సీఈఓ సీతా పల్లబొల్లా మాట్లాడుతూ.. మహిళా వ్యాపారులకు వారి సామర్థ్యాన్ని చాటిచెప్పే ప్రణాళికను అనుసంధానించి కేవలం వ్యాపారాలను ప్రోత్సహిస్తూ, ఆర్థిక స్వయం ప్రతిపత్తికి తోడ్పడుతున్నాం అన్నారు. సెపె్టంబర్ 2024లో ప్రారంభమైన ప్రాజెక్ట్ ఇన్క్లూ్యజన్ కోసం 117 దరఖాస్తులు అందగా, ఇందులో 35 మంది మహిళలను ఎంపిక చేశాం. వీరిలో 31 మంది విజయవంతంగా కోర్సును పూర్తి చేశారని అన్నారు. ఈ గ్రాడ్యుయేషన్ తర్వాత వీరికి నిరంతర మెంటార్íÙప్ మార్గదర్శకత్వాన్ని అందిస్తూనే.. అర్హులైన వ్యాపారాలను అందించే వీ హబ్ ర్యాంప్ ఉమెన్ యాక్సిలరేషన్ ప్రోగ్రామ్లో చేర్చుతామని పేర్కొన్నారు.కళాత్మక జీవితం మంచి అనుభూతి.. జేఎస్ఎమ్ బ్రాండ్ పేరుతో జెల్ క్యాండిల్స్ తయారు చేస్తున్నాను. మార్కెట్లో లభించే ఒక ప్రత్యేకమైన జెల్ను కరిగించి వివిధ డిజైన్లలోని గాజు పాత్రల్లో నింపుతాను. వీటికి అదనపు ఆకర్షణగా జెల్లో పూలను, చిన్న మొక్కల కొమ్మలను అలంకరిస్తాను. క్యాండిల్ వెలిగించినప్పుడు మంచి సువాసన రావడానికి సుగంధ పరిమళాలను వినియోగిస్తాను. ఈ కళను ఒక కోర్సుగా నేర్చుకున్నాను. షాలిబండలో ఒక ప్రదర్శనలో నా స్టాల్ చూసిన వీ హబ్ బృందం ప్రాజెక్ట్ ఇన్క్లూ్యజన్లో నన్ను భాగం చేశారు. వీటిని ఆన్లైన్ వేదికగానూ అమ్ముతున్నాను. నచి్చన కళతో జీవితం ఎంతో సంతృప్తినిస్తోంది. – ఇమ్రానా నోషీన్, జేఎస్మ్ జెల్ క్యాండిల్స్కుల వృత్తితో అద్భుతాలు.. వారసత్వంగా వచి్చన కుల వృత్తితో వెండి ఉత్పత్తులను తయారు చేస్తున్నాం. దీనిని సిల్వర్ ఫిలిగ్రీ అంటారు. మా పూరీ్వకులు ప్రతిష్టాత్మక పెంబర్తి మెటల్ షీట్స్ తయారు చేసేవారు. వాటికి తోడుగా వినూత్నంగా ఈ వెండి సౌందర్య అలంకార ప్రతిమలను తయారు చేస్తున్నాను. కరీంనగర్ మెప్మా ద్వారా వీ హబ్కు చురుకున్నాను. ఈ వేదిక ద్వారా మార్కెటింగ్ ఎలా పెంచుకోవచ్చు, కస్టమర్లను ఎలా చేరుకోవచ్చు వంటి అంశాల్లో అవగాహన పెరిగింది. మా వద్ద రూ. వెయ్యి నుంచి లక్ష విలువ చేసే అందమైన, అరుదైన వస్తువులు లభిస్తాయి. – సరళ, కరీంనగర్.డీహైడ్రేట్ పళ్లతో డ్రైఫ్రూట్ చాక్లెట్లు.. చాకో మిస్టా బ్రాండింగ్తో హోమ్మేడ్ చాక్లెట్స్ తయారు చేస్తున్నాను. స్ట్రాబెర్రీ, మామిడి, పైనాపిల్ వంటి పళ్లను డీహైడ్రేట్ చేసి, వీటికి డ్రై ఫూట్స్ కలిపి చాక్లెట్స్ తయారు చేస్తాను. నేను హార్టీకల్చర్ నుంచి వచ్చాను.. ఈ ప్రయాణంలోనే చాక్లెట్ తయారీ పైన ఆసక్తి పెరిగింది. వీ హబ్ ప్యాకేజింగ్, డాక్యుమెంటేషన్, లైసెన్స్ రిజి్రస్టేషన్ వంటి అంశాల్లో సహకారం అందించింది. చాక్లెట్లలో ప్రిజర్వేటివ్స్, రంగులు వాడను. స్వచ్ఛమైన కోకో బటర్, పౌడర్, మిల్క్ పౌడర్ వంటివి వినియోగిస్తాను. దీనిని భవిష్యత్తులో పెద్ద బ్రాండ్గా మార్చి ఎగుమతి చేయాలనుంది. – కావ్య శ్రీ, చాకో మిస్టా వ్యవస్థాపకురాలురూరల్ టెక్ ప్రాజెక్టు చేయాలనుంది.. మహిళలకు తోడ్పాటునందించే ప్రాజెక్ట్ ఇన్క్లూ్యజన్లో భాగస్వామ్యం కావడం సంతోషంగా ఉంది. మా సంస్థ సీఎస్ఆర్ నిధులతో ఈ ప్రాజెక్టుకు సహకారం అందిస్తున్నాం. ఇక్కడి మహిళ కళ, కృషి సంతృప్తితో పాటు స్ఫూర్తిని నింపింది. ఈ ఫలితాలు అందించిన ఆనందంలో రూరల్ టెక్ అనే మరొక ప్రాజెక్టు చేపట్టాలనే కోరిక మొదలైంది. ఇది కార్యరూపం దాల్చడానికి వీ హబ్తో కలిసి పనిచేస్తాం. – సుజీవ్ నాయర్, రీ సస్టెయినబులిటీ గ్లోబల్ చీఫ్ హెచ్ఆర్ ఆఫీసర్మూలాల్లోంచి కళాకృతులు.. వారాహి హస్తకళ పేరుతో.. ఆదివాసీ ప్రాంతాల్లో లభించే ఎండిన సొరకాయలతో అందమైన ఇంటీరియర్ ఉత్పత్తులు తయారు చేస్తున్నాను. వీటిని గిరిజనులు సహజమైన మంచినీళ్ల బాటిల్గా వినియోగించేవారు. ఈ సొర బుర్రలపై వేడి చేసిన ఇనుపచువ్వలతో అందమైన డిజైన్లను రూపొందిస్తాను. దీని మధ్యలో లైట్ వెలుగుతుంది. గత మూలాలను ఈ తరానికి అందంగా మార్చి ఇస్తున్నాను. మంచి ఆదరణ లభిస్తోంది. వీ హబ్ నా ప్రయత్నాన్ని, కళను గుర్తించింది. సామాజికంగా వివిధ రంగాల ప్రజలతో అనుసంధానం చేస్తుంది. ఇందులో భాగంగానే బీఐసీసీఐ ఆధ్వర్యంలోని గ్రీన్ ఉద్యమకర్త అవార్డును పొందాను. గ్రామీణ కళాకృతులను విదేశాల్లోని వారికి చేరడం సంతోషాన్నిచి్చంది. – సింధూ, మొలుగు. -
హోలీ..జోష్ హైలీ
హోలీ సంబరాలకు హైటెక్ సిటీ, గచ్చిబౌలి, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, కూకట్పల్లి, నానక్రామ్గూడ, సికింద్రాబాద్ వంటి ప్రాంతాల్లో విశాలమైన వేదికలను ఏర్పాటు చేశారు. కొన్ని ఈవెంట్లలో చర్మానికి హాని చేయకుండా ఉండే రసాయనాలు లేని ఆర్గానిక్ రంగులను మాత్రమే అనుమతిస్తుండటం విశేషం. ఈ హోలీని మరింత సంబురంగా మార్చడానికి ముంబై,బెంగళూరు, ఢిల్లీ వంటి వివిధ నగరాల నుంచి ప్రముఖ డీజేలు నగరానికి చేరుకున్నారు. మరి కొందరు నిర్వాహకులు.. ఈ వేడుకల్లో వినూత్నంగా సాంస్కృతిక సంబరాలను నిర్వహించనున్నారు. దీని కోసం బ్యాండ్ బాజా, డోల్ దరువు, జానపద హొయలు పలికే డప్పులను నగరానికి ఆహా్వనించారు. \వందకు పైగా ఈవెంట్స్కు ఏర్పాట్లు రిస్టార్టులు, క్లబ్స్, పబ్లిక్ గ్రౌండ్స్లో భారీస్థాయిలో హోలీ వేడుకలు నిర్వహిస్తున్నారు. ఈ భారీ వేదికల్లో 5 వేల నుంచి 15 వేల మందికి సరిపడా సౌకర్యాలు, విశాల ప్రాంగణాలు సిద్ధం చేశారు. ఇలాంటి భారీ హోలీ ఫెస్టివల్స్ సుమారు 30 నుంచి 40 వరకు నిర్వహిస్తుండగా.. మొత్తం నగరంలో వందకు పైగా హోలీ పబ్లిక్ ఈవెంట్స్కు ఏర్పాట్లు చేశారు. ఇందులో పాల్గొనడానికి ఎంట్రీ పాస్ కోసం రూ.500 నుంచి రూ.5,000 వేలకు పైగా వసూలు చేసే ఈవెంట్స్ ఉన్నాయి. కొందరు నిర్వాహకులు రంగులను ఉచితంగా అందిస్తుంటే మరికొందరు రంగులతో పాటు ఫుడ్ – డ్రింక్స్ కూడా అందిస్తున్నారు. ముఖ్యంగా ఈవెంట్ ఆర్గనైజర్లు హోలీ లవర్స్ను ఆకర్షించడానికి పలువురు సినీతారలను, సోషల్ ఇన్ఫ్లుయెన్సర్లు, స్పోర్ట్స్ సెలబ్రెటీలను ముఖ్య అతిథులుగా ఆహా్వనిస్తున్నారు.60 ఫీట్ల ఎత్తయిన భారీ బ్యాక్గ్రౌండ్ స్టేజ్తో..లాత్మర్ హోలీ మీట్స్ టాలీవుడ్ పేరుతో నగరంలో అతిపెద్ద హోలీ సంబరాలను హైటెక్ ఎరీనాలో నిర్వహించనున్నారు. 60 ఫీట్ల ఎత్తయిన భారీ బ్యాక్గ్రౌండ్ స్టేజ్తో నగరంలో మొదటిసారి నిర్వహిస్తున్నారు. ఇందులో రంగుల సోయగాలతో పాటు సంగీతం, సెలబ్రెటీలతో అలరించనున్నారు. గచ్చిబౌలి ఫైనాన్షియల్ డి్రస్టిక్ట్లోని అంథమ్ వేదికగా నియాన్ హోలీ పార్టీ 2025కి ఘనంగా ఏర్పాట్లు చేశారు. బాలీవుడ్ బీట్స్తో లైవ్ మ్యాజిక్ ఉంటుంది. సుచిర్ ఇండియా ఆధ్వర్యంలో నగర శివార్లలోని హానీ బర్గ్ రిసార్ట్స్ వేదికగా హోలీ ఉత్సవ్ను నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. పదేళ్లుగా రంగ్ బర్సే..పదేళ్లుగా నగరంలో హోలీ సంబరాలను వినూత్నంగా నిర్వహిస్తున్నాం. ఈ సారి సిటీలోని యోలో ఎరీనాలో రంగ్ బర్సే 9.0 పేరుతో భారీ స్థాయిలో హోలీ ఫెస్టివల్ నిర్వహిస్తున్నాం. ఇందులో మ్యూజిక్తో పాటు రెయిన్ డ్యాన్స్ను ప్రత్యేకంగా ఏర్పాటు చేశాం. హోలీ థీం టీ షర్ట్తో పాటు స్పెషల్ డ్రింక్స్, మీల్ బాక్స్ అందిస్తున్నాం. మా ఫెస్టివల్లో కార్పొరేట్ ఉద్యోగులు, యూత్తో పాటు కుటుంబ సమేతంగా పాల్గొనే వారు ఎక్కువగా ఉన్నారు. సిటీలో హోలీ అంటే ట్రెండీ కల్చర్గా మారింది. దీనికి అనుగుణంగానే అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేశాం. 4 వేల మంది వరకు మా వేడుకల్లో పాల్గొంటారని అంచనా. – శరత్, రంగ్ బర్సే 9.0 నిర్వాహకులు మ్యూజిక్, డ్యాన్సింగ్తో పాటు బ్రుక్ ది పాట్ వంటి విభిన్న కార్యక్రమాలతో ఈ సంబరాలను ఏర్పాటు చేస్తున్నారు. సిటీలోని శ్రీపలాని కన్వెన్షన్ వేదికగా హోలీ మహోత్సవ్ 2.0 పేరుతో అతిపెద్ద ఓపెన్ ఎయిర్ ఫెస్టివల్ జరుపుతున్నారు. ఇందులో డీజే, లైవ్ డోల్, ఓపెన్ స్కై ఈవెంట్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఈ వేడుకల్లో బిగ్ బాస్ ఫేం అశ్వినీశ్రీ, శుభశ్రీ కలర్ఫుల్ గెస్టులుగా సందడి చేయనున్నారు.గచ్చిబౌలిలోని సంధ్య పార్కింగ్ గ్రౌండ్ వేదికగా టోస్ట్ టానిక్ ఆధ్వర్యంలో హోలీ కారి్నవాల్ 2.0ను ఏర్పాటు చేస్తున్నారు. వేడుకల్లో అర్జున్ విజయ్, డీజే ఆకాశ్, డీజే మణి, డీజే రిష్, బీజే రుమీ వంటి వారు లైవ్ డీజేతో ఉర్రూతలూగించనున్నారు. బేగంపేట్ హాకీ స్టేడియం వేదికగా రంగ్ బసంత్ 2025 సంబరాలను, ఫ్లిప్ సైడ్ అడ్వెంచర్ పార్క్ గచ్చిబౌలిలో హోలీ కలర్ ల్యాండ్ ఓపెన్ ఎయిర్ ఫెస్టివల్తో పాటు నగరంలోని వివిధ వేదికల్లో హోలీ సంబరాలను నిర్వహిస్తున్నారు. -
సమ్మర్ జోష్..
వేసవి వచ్చిందంటే చాలు.. అందరి చూపూ నగరంలోని వినోద వేదికలు, గేమింగ్ జోన్స్ తదితర ఎంటర్టైన్మెంట్ సెంటర్ల వైపు మళ్లుతోంది. ముఖ్యంగా విద్యార్థులకు వేసవి సెలవులు ఉండటంతో కుటుంబ సమేతంగా వివిధ ప్రాంతాలకు వెళ్లడానికి ఏర్పాట్లను చేస్తుంటారు. ఈ నేపథ్యంలో నగరంలోని పలు వినోద వేదికలు, అడ్వెంచర్ గేమ్ సెంటర్లు వినూత్న రీతిలో ఫన్ యాక్టివిటీస్ రూపకల్పన చేయడంతో పాటు అందంగా ఆధునీకరిస్తున్నారు. గేమ్స్, వినోద–విజ్ఞాన కార్యక్రమాలు, సాహస క్రీడలు, ముఖ్యంగా వేసవిలో ఇష్టపడే వాటర్ గేమ్స్ తదితర వేదికలు సమ్మర్ హంగామాకు సంసిద్ధమవుతున్నాయి. ఈ సందర్భంగా నగరంతో పాటు నగర శివార్లలోని ఈ కోవకు చెందిన వివిధ హాట్ స్పాట్స్ గురించి తెలసుకుందాం. నగరవాసులను అలరించడానికి ఎన్ని ఎంటర్టైన్మెంట్ వేదికలొచ్చినా.. ఆల్ టైం ఫేవరెట్ మాత్రం ట్యాంక్బండ్–నెక్లెస్ రోడ్. ఇక్కడి పరిసర ప్రాంతాల్లోని సందర్శనీయ ప్రాంతాలను తిలకించడానికి కుటుంబ సభ్యులతో పాటు యువత, చిన్నారులకు ప్రత్యేక గమ్యస్థానాలున్నాయి. అలా హుస్సేన్ సాగర్లో బోటింగ్తో పాటు చుట్టుపక్కల ఉన్న థ్రిల్ సిటీ పార్క్, ఎన్టీఆర్ గార్డెన్, బిర్లామందిర్, ప్రసాద్ ఐమాక్స్లు ఆకర్షిస్తుంటాయి. నెక్లెస్ రోడ్డులోని జలవిహార్ వేసవి ఎండలను చల్లబరచడానికి సిద్ధంగా ఉంటుంది. విద్యార్థులకు, యువతకు, పరిశోధకులకు విజ్ఞానాన్ని అందించే ప్రతిష్టాత్మక బిర్లా ప్లానిటోరియం వెరీ స్పెషల్. వీటితో పాటు ఈ మధ్య నిర్మించిన సెక్రటేరియట్, దేశంలోనే అతిపెద్ద అంబేద్కర్ విగ్రహం, దేశంలోనే అతిపెద్ద జాతీయ జెండా, అమరవీరుల స్థూపం, సైక్లింగ్ స్పాట్లు ప్రత్యేకం.ఆనందాన్ని పంచే.. మంచు.. సమ్మర్లో మండే ఎండలకు కాసింత చల్లని వాతావరణం ఉంటే చాలు అనుకుంటాం. అలాంటిది ఏకంగా మంచు ఎడారే నగరంలో పలకరిస్తే ఎలా ఉంటుంది. ఈ అనుభూతిని అందంచడానికి నగరంలోని వివిధ ప్రాంతాల్లో స్నో సెంటర్లు ఎదురుచూస్తున్నాయి. ఇక్కడ ప్రత్యేకంగా ఏర్రాటు చేసిన పెద్ద హాల్స్లో మంచు దిబ్బలు, ఐస్ స్కేటింగ్ వంటి వినూత్న కార్యక్రమాలతో అలరిస్తున్నాయి. ఇలాంటి సెంటర్లు నగరంలోని శరత్ సిటీమాల్, ట్యాంక్బండ్తో పాటు ఇతర ప్రాంతాల్లోనూ ఉన్నాయి. వీనుల విందు.. విడిది కేంద్రాలు.. నగరంలో ప్రస్తుతం ప్రధాన ఎంటర్టైన్మెంట్ జోన్స్ అంటే రిసార్టులే.. విందు, విడిది, వినోదం, కాలక్షేపం, నైట్ స్టే, వాటర్ గేమ్స్ వంటి సేవలతో అందరినీ ఆకర్షిస్తున్నాయి. ఈ రిసార్టుల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదేమో.. నగరానికి నలుదిక్కులా.. ఇటు శామీర్ పేట్ నుంచి అటు శంషాబాద్ వరకూ.. కొండాపూర్–గచ్చి»ౌలి నుంచి ఎల్బీనగర్ శివారు వరకూ వందల సంఖ్యలో రిసార్టులు ఉన్నాయి. ఈ తరంలో అత్యధికంగా ఔటింగ్ అంటే రిసార్టులేనని నగరవాసులు చెబుతున్నారు.సాహస క్రీడలు, వాటర్ గేమ్స్.. అనుభవాలతో పాటు అన్ని రకాల ఎంటర్టైన్మెంట్ ప్యాకేజీ వేదికలైన అమ్యూజ్మెంట్ పార్కులు సైతం నగరంలో ఈ సారి వేసవికి సరికొత్త హంగులతో సిద్ధంగా ఉన్నాయి. ఇందులో భాగంగా వండర్లా అమ్యూజ్మెంట్ పార్క్లో ఇంటర్స్టెల్లార్ ఎక్స్పీరియన్స్తో పాటు వర్చువల్ త్రీడీ స్క్రీనింగ్ హాల్స్ అలరించనున్నాయి. ఈ మధ్యనే విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న అధునాతన సాంకేతికతతో పనిచేసే రైడ్లను ఆవిష్కరించింది. దీంతో పాటు థ్రిల్ సిటీ వంటి సెంటర్లు సైతం అడ్వెంచర్కు కేరాఫ్ అడ్రస్గా నిలుస్తున్నాయి.అరుదైన మొక్కలకు వేదికగా.. ప్రపంచంలోని అరుదైన మొక్కలు, ఇతర వింతలు, విశేషాలతో ఈ మధ్యనే నగరంలో ఆవిష్కృతమైన ఎక్స్పీరియం ఎకో పార్క్ ఈ వేసవికి విద్యార్థులకు మంచి సందర్శనీయ వేదికగా నిలువనుంది. వివిధ రకాల మొక్కలు, అరుదైన వృక్షాలు, పర్యావరణ సంరక్షణతో ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యచకితులను చేస్తోంది.గేమింగ్ జోన్స్..నగర మాల్స్.. ప్రస్తుత తరుణంలో నగరం ఎక్కడ చూసినా మాల్స్తో నిండిపోయింది. ఒకప్పుడు బంజారాహిల్స్, హైటెక్ సిటీ వంటి ప్రాంతాలకు మాత్రమే పరిమితమైన పెద్ద పెద్ద మాల్స్ ప్రస్తుతం అన్ని ప్రాంతాలకూ విస్తరించాయి. మాల్స్ అంటే షాపింగ్ మాత్రమే కాదు.. పిల్లలను పెద్దలను అలరించే ఎన్నో ఫన్ యాక్టివిటీస్, గేమింగ్ జోన్స్ ఇతర కాలక్షేప కేంద్రాలకు నిలయాలుగా మారాయి. ఈ వేసవికి నగరంలోని మాల్స్ సైతం హాట్ స్పాట్లుగా మారనున్నాయి. ఎంటర్టైన్మెంట్ కింగ్.. ట్రెక్కింగ్ వేసవి సెలవులను ఆస్వాదించడానికి ప్రకృతితోపాటు సాహసం తోడైతే బాగుంటుందని చాలా మంది అనుకుంటారు. దీనికి చక్కని వేదిక ్రెక్కింగ్. ఈ ట్రెక్కింగ్ ఎంజాయ్ చేయడానికి నగరవాసులు అనంతగిరి హిల్స్ వంటి ప్రాంతాలను ఎంపిక చేసుకుంటున్నారు. పలువురు ట్రెక్కింగ్ నిర్వాహకులు కిలోమీటర్ల మేర ట్రెక్కింగ్ ట్రాక్తో పాటు పలు సాహస క్రీడలతో మధుర జ్ఞాపకాలను అందిస్తున్నారు. -
జర పైలం మరి.. నగరంలో మొదలైన వేసవి హడావుడి
చూస్తుండగానే వేసవికాలం వచ్చేసింది.. ఓ వైపు అప్పుడే మండుతున్న ఎండలు, మరో వైపు పరిశ్రమలు, వాహనాలు, ఏసీల నుంచి వెలువడే కాలుష్యం. వెరసి హైదరాబాద్ నగరంలో ఎప్పటిలానే సమ్మర్ ఎఫెక్ట్ కొనసాగనుంది. గతేడాది ఇదే మార్చ్ నెల్లో అత్యధికంగా 47.2 డీగ్రీ సెంటీగ్రేడ్ల ఎండలతో ఇబ్బందులకు గురిచేసింది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది కూడా మండే ఎండల నుంచి రక్షణకు ముందస్తు జాగ్రత్తలు తప్పనిసరి అంటున్నారు పర్యావరణ, ఆరోగ్య నిపుణులు. వేసవిలో ముఖ్యంగా ముసలివారు, చిన్నారులు అధిక సంఖ్యలో మృత్యువాత పడుతుండటం, ఎలాంటి వేసవి సంరక్షణా తీసుకోకుండా వివిధ కారణాలతో బయటకు వెళ్లే వారు సైతం తీవ్ర ఇబ్బందులు పడుతుంటారు. ఈ సందర్భంగా వేసవి నుంచి సంరక్షణను అందించే ప్రాథమిక పద్ధతులు, విధానాల గురించి పలు జాగ్రత్తలు.. వేసవిలో ప్రతి ఒక్కరికీ ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ నియమం నీరు. ఎట్టి పరిస్థితుల్లోనూ డీహైడ్రేషన్కు గురికాకుండా హైడ్రేట్ అవ్వాలని ఆరోగ్య నిపుణులు, ఫిట్నెస్ ఫ్రీక్స్ సూచిస్తున్నారు. శరీరంలో తగినంత నీటి శాతం ఉన్నంత వరకూ వేసవిలో ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోవచ్చు. లేని పక్షంలో ఆరోగ్య సమస్యలు తప్పవని వైద్యులు చెబుతున్నారు. నగర జీవితంలో తప్పని సరిగా మూడు, మూగున్నర లీటర్ల నీటిని, ఇతర పానియాలను తీసుకోవాల్సిన అవసరముంది. బయటికెళుతున్న సమయంలో వాటర్బాటిల్ మర్చిపోవద్దు. వడదెబ్బకు దూరంగా.. వేసవిలో ప్రధాన సమస్య వడదెబ్బ. ప్రతి ఏడాదీ వడదెబ్బతో ప్రాణాలు కోల్పోతున్న వారు కోకొల్లలు. వీలైనంత వరకూ ఎండలకు దూరంగా ఉండటం, ముఖ్యమైన పనులను ఉదయం, సాయంత్రాల్లో చేసుకోవడం ఉత్తమం. తరచూ ఎండలో ఉండేవారు తగినంత విశ్రాంతి, ఫ్యాన్ లేదా ఏసీలో ఉండేలా చూసుకోవాలి. ఎక్కువ దూరం వాహనాలపై ప్రయాణాలు చేసేవారు కళ్లద్దాలు, హెల్మెట్, టోపీలు తప్పనిసరిగా వినియోగించాలి. చిన్నారులైతే ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. సైక్లింగ్.. జర భద్రం.. ఈ మధ్య కాలంలో ఈజీ మొబిలిటీలో భాగంగా నగరంలో సైక్లిస్టుల సంఖ్య భారీగా పెరిగింది. అంతేకాకుండా స్కూల్స్, గ్రౌండ్స్కు వెళ్లే వారు సైతం సైక్లిల్ వినియోగిస్తున్నారు. సమ్మర్లో సైక్లిస్టులు జాగ్రత్తగా ఉండాలి. మధ్య మధ్యలో విశ్రాంతి, పానియాలు తీసుకోవడం శ్రేయస్కరం. మధ్యాహ్న సమయాల్లో సైక్లింగ్ అంత మంచిది కాదని నగరానికి చెందిన సైక్లింగ్ రైడర్ రవి తెలిపారు. సన్ర్స్కీన్తో మేలు.. మండే ఎండలకు కళ్లద్దాలు, తలకు టోపీ, హ్యండ్బ్యాగ్లో కర్చీప్ లేదా న్యాప్కిన్స్ తప్పనిసరి. ఎండవేడి నుంచి చర్మ సంరక్షణకు సన్స్క్రీన్ లోషన్స్, కూలింగ్ లోషన్స్ వాడటం కాస్త ఉపశమనాన్ని అందిస్తుంది. ఈ సమ్మర్ ముగిసేంత వరకూ ఫ్యాషన్ వేర్లో ప్రత్యేక శైలిని ఎంపిక చేసుకోవాలి. సమ్మర్ కేర్ కోసం మార్కెట్లో అందుబాటులోకి వచి్చన గార్మెట్స్ ఎంచుకోవాలి. చెమటను గ్రహించే దుస్తులు ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడతాయి. వేడికి దూరంగా ఈవీ.. ఈ మధ్య కాలంలో నగరంలో ఎలక్ట్రిక్ వాహనల సంఖ్య భారీగా పెరిగింది. ఈ వాహనదారులు చాలా జాగ్రత్తగా ఉండలాని నిపుణులు చెబుతున్నారు. ఈవీ వాహనాలను ఎండలో పార్క్ చేయకుండా నీడలో ఉంచాలి. ఎక్కువ దూరం ప్రయాణించినప్పుడు బ్యాటరీ, ఇంజిన్ వేడి కాకుండా మధ్యలో విరామం ఇవ్వాలి. లేదంటే అధిక వేడికి బ్యాటరీలు పేలిపోయే ప్రమాదముంది. టైర్లు అరిగిపోయిన వాహనాలు మరింత జాగ్రత్తగా నడపాలి. టైర్లు వ్యాకోచించడం, రోడ్డు పై డాంబర్ కరగడం వంటి కారణాలతో వాహనాలు స్కిడ్ అయ్యే ప్రమాదం ఉంది. నో బ్లాక్..ఫ్యాషన్ పేరుతో ఎండాకాలంలో నల్లటి దుస్తులు ధరించడానికి స్వస్తి చెప్పాలి. నల్లటి దుస్తులు, వస్తువులు, వాహనాలు అధిక వేడిని గ్రహించి ఆరోగ్యానికి హాని చేస్తాయి. దీనికి పరిష్కారంగా తెల్లటి దుస్తులు లేదా లైట్ కలర్స్ వేసుకుంటే మేలు. ముఖ్యంగా కాటన్ దుస్తులు, మెత్తని స్వభావం కలవి ఉత్తమ ఎంపిక.కాసింత స్మార్ట్గా.. నగర జీవనంలో గ్యాడ్జెట్లు సర్వసాధారణం. ఈ నేపథ్యంలో వాతావరణ ఉష్ణోగ్రతలను ఎప్పటికప్పుడు తెలియజేసే స్మార్ట్ వాచ్లు, ఇతర గ్యాడ్జెట్లు వాడటం మంచిది. శరీర ఉష్ణోగ్రత, గుండెపనితీరు, బ్లడ్ ప్రెజర్, న్యూట్రిషన్ తదితర అంశాలను తెలియజేసే గ్యాడ్జెట్లు, యాప్లు వినియోగించడం మేలని ఈ తరం మెడికల్ నిపుణులు సూచిస్తున్నారు.ఇంటి భోజనమే మేలు.. వేసవిలో కాసింతైనా ఆహార నియమాలను పాటించాలి. జంక్ఫుడ్, డీప్ ఫ్రైడ్ ఫుడ్, అధిక మసాలాలతో తయారు చేసిన ఆహారాన్ని తగ్గించాలి. తగినంత నీటిని తాగడంతో పాటు వాటర్మెలన్, షర్బత్ విభిన్న రకాల పండ్ల రసాలను తీసుకోవడం వల్ల శరీరం చల్లబడుతుంది. దీంతో పాటు అవసరమైన ప్రోటీన్లను, మినరల్స్ను అందిస్తాయి. సాధ్యమైనంత వరకూ ఇంటి భోజనానికే ప్రాధాన్యమివ్వాలని ప్రముఖ న్యూట్రిషనిస్ట్ హజర్ తెలిపారు. ఉక్కపోత, వేడి ఎక్కువగా ఉంటే కూలర్లు, ఏసీలను ఉపయోగించాలి. ఇంటీరియర్ ప్లాంట్స్ పెంచుకోవడం వల్ల వాతావరణం చల్లగా ఉంటుంది. -
వినోదం వికాసం
సాధారణ మనుషుల్లా కాకుండా ఆయనకు మూడో కన్ను ఉంటుంది.., అదే తన కెమెరా. ఈ కన్నుతో తాను చూసిన అద్భుతాలు, సామాజిక అంతరాలు వంటి విశేషాంశాలన్నింటినీ కెమెరాలో బంధిస్తాడు. అలా తను తీసిన ఫొటోలు భారత్తో పాటు విదేశాల్లోని ఫొటో ఎగ్జిబిషన్లలో ప్రదర్శించాడు. ఆయనే వినోద్ వెంకపల్లి. ఆయన ప్రయాణం తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, సామాజిక ఇతివృత్తాలను బంధించి ప్రపంచానికి పరిచయం చేశాడు. చదువుకుంది ఐఐటీ ఎని్వరాన్మెంటల్ ఇంజినీరింగ్, కానీ తన శోధన, పరిశోధన అంతా ఫొటోగ్రఫీనే. ఎందుకు అని ఎవరైనా అడిగితే.. అందులోనే సంతృప్తి దొరుకుతుందని చెబుతాడు. తన ఫొటోగ్రఫీ నైపుణ్యంతో క్యోటో వేదికగా జరగనున్న కేజీ ప్లస్ సెలెక్ట్ 2025 ఫొటో ఎగ్జిబిషన్కు అర్హత సాధించారు. ఇందులో పాల్గొనడానికి ప్రపంచవ్యాప్తంగా 10 మందికి మాత్రమే అవకాశముంటుంది. ఈ నేపథ్యంలో నగరానికి చెందిన వినోద్ తన అనుభవాలను, ప్రయాణాన్ని సాక్షితో పంచుకున్నారు. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే.. ఇంజినీరింగ్.. చెన్నైలో, ఎమ్టెక్ ఐఐటీ దన్బాగ్లో చేశాను. కానీ నా ఆలోచనలన్నీ సమాజం చుట్టూనే తిరిగేవి. ముఖ్యంగా సామాజిక సమస్యలు, ఇతివృత్తాలను పరిశోధించడం, ఫొటోలుగా బంధించడం ఇష్టం. వాటితో స్టోరీ టెల్లింగ్ ఇంకా ఇష్టం. దీని కోసం ఎంత దూరమైనా కెమెరా బుజాన వేసుకుని బైక్పై వెళుతుంటాను. కొన్ని రోజులు జాబ్ కూడా చేశాను.. కానీ సంతృప్తినివ్వలేదు. కెమెరాతో ఊర్లు తిరుగుతూ.. అక్కడి సంస్కృతులు, సంప్రదాయాలు, పండుగలు, జాతరలు, కష్టాలు, సంతోషాలను ఫొటోలుగా తీయడం మంచి అనుభూతినిచ్చేది. ఇలా 11 ఏళ్ల నుంచి ఫొటోగ్రఫీ, డాక్యుమెంటరీలతో నా సామాజిక బాధ్యతను నిర్వర్తిస్తున్నాను. ఈ ప్రయాణంలో కేజీ ప్లస్ సెలెక్ట్ 2025 ఫొటో ఎగ్జిబిషన్లో పాల్గోనుండటం సంతోషంగా ఉంది. ఏప్రిల్ 12 క్యోటోలో నా ఫొటోలను ప్రదర్శించనున్నాను. గతంలో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, కంబోడియా, తైవాన్, అమెరికా వంటి దేశాల్లో నిర్వహించిన ఎగ్జిబిషన్లలో ఫొటోలు ప్రదర్శితమయ్యాయి. ప్రయాణం నగరం నుంచే.. నగరంలోని ట్యాంక్బండ్ వంటి ప్రదేశాల్లో ఫొటోలు తీస్తూ మొదలు పెట్టిన ప్రయాణం తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాలకు చేరింది. చిన్నప్పటి నుంచి గ్రామీణ వాతావరణం ఏమీ తెలియదు. అమ్మా, నాన్న డాక్టర్లు. కానీ వారు నా సామాజిక బాధ్యతను ప్రేరేపించేవారు. అటువైపు నన్ను ప్రోత్సహించేవారు. ఈ ప్రయాణంలో నల్గొండ ఫ్లోరోసిస్పై పరిశోధనాత్మక ఫొటోగ్రఫీ చేశాను. దీని కోసం బైక్పై నల్గొండలోని ఫ్లోరైడ్ బెల్ట్కు వెళ్లేవాడిని. అంతేకాకుండా తెలంగాణలోని అప్పటి నీళ్ల కష్టాలను నా ఫొటోలతో చూపించాను. అరకులో మలేరియా వ్యాపించి ప్రజలు అవస్థలు పడుతున్నారనే విషయం తెలుసుకుని చేసిన ప్రాజెక్టు ఇంకా కళ్ల మందే మెదులుతోంది. మహబూబ్నగర్లో నీటి ఎద్దడికి ఇసుక చలిమల్లో ఓ చిన్నారి ముంతతో నీరు సేకరించిన ఘటన..నీటి ప్రధాన్యతను తెలియజేసింది. కరువు, సంక్షోభాలు, విపత్కర పరిస్థితులు, సామాజిక సమస్యలు, మానవీయ కోణాలు, వివక్ష, సాంఘిక అకృత్యాలను ఫొటోలుగా బంధిస్తూ వచ్చాను. క్రమంగా నమ్మకం కలిగింది.. హైదరాబాద్లో బోనాలు, ముంబైలో వినాయక చవితి, మహోకుంభ మేళా.. ఇలా సందర్భం ఏదైనా అక్కడి పరిస్థితులను చిత్రించాను. అమ్మ నాన్నలు నాస్తికులు.. కానీ ప్రజల్లో దేవుని పై నమ్మకం నన్ను ఆలోచింపజేసేది. నమ్మకం లేకుంటే మనిషి పరిస్థితులు ఏంటనే దిశగానూ శోధించాను. అప్పులు చేసి పంట వేసిన ఒక రైతు దేవుడి పై నమ్మకంతో తన జీవనాన్ని ఎలా ముందుకు సాగిస్తాడు.. ఆ నమ్మకమే లేకుంటే కష్టజీవుల మానసిక అవస్థలు ఎలా ఉంటాయో దగ్గరగా చూశాను. వివిధ వేదికల్లో.. నా ఫొటోలు ది న్యూయార్క్ టైమ్స్, ది గార్డియన్, ది వాషింగ్టన్ పోస్ట్, ఎమ్ఎస్ఎన్ సౌత్ ఆఫ్రికా, డైలీ మెయిల్, యాయూ న్యూస్ యూకే, నేషనల్ పోస్ట్, యూఎస్ న్యూస్ అండ్ వరల్డ్ రిపోర్ట్ వంటి వేదికల్లో ప్రచురితమయ్యాయి. నాకు విభిన్న కళల్లో ప్రావీణ్యముంది.. డ్రాయింగ్ వేస్తాను. శిల్పకళలోనూ ప్రావీణ్యముంది. మెటల్ ఫేస్ తయారు చేస్తాను. ఫొటోగ్రఫీకి బయటకు వెళ్లడానికి నాకు డబ్బులను అందించేది నా డ్రాయింగ్ మాత్రమే. నా ఫొటోల్లో బంధించలేని వాటిని బొమ్మలుగా వేసి ముంబై ఆర్ట్ ఫెయిర్లో ప్రదర్శిస్తే.. అన్నీ అమ్ముడు పోయాయి. ఫొటోగ్రఫీలో ప్రతిష్టాత్మక టోటో ఫొటోగ్రఫీ అవార్డ్, రెండు సార్లు తెలంగాణ స్టేట్ అవార్డులను అందుకున్నాను. ఇండియన్ ఫొటోగ్రఫీ ఫెస్టివల్లో సభ్యుడిని. సామాజిక అంశాల ఇతివృత్తంతో రెండు, మూడు డాక్యుమెంటరీలు, షార్ట్ఫిల్్మలు తీసే ప్రయత్నంలో ఉన్నాను. అది అమాయకత్వం కాదు.. ఆప్యాయత.. ఫొటోల కోసం గ్రామాలకు వెళ్లినప్పుడు అక్కడి ప్రజల స్వచ్ఛమైన మనస్తత్వం చూశాను. మొదట్లో ఆశ్చర్యపడేవాడిని. ఓ అవ్వ అన్నం పెట్టేది. ఒక పెద్దాయన తన ఇంట్లో ఆశ్రయం కలి్పంచేవారు. ఇలా పల్లె మట్టిలో అమ్మతనం నన్ను ఫొటోగ్రఫీలో మరింత లోతుగా తీసుకెళ్లింది. మొదట్లో అదంతా అమాయకత్వం అనుకున్నా.. కాదు ఆప్యాయత అని నెమ్మదిగా తెలుసుకున్నా. తోటి మనుషులకు వారిచ్చే విలువను తెలుసుకున్నా. అఫ్ఘాన్ వార్లో చనిపోయిన ప్రముఖ ఫొటోగ్రాఫర్ దాని‹Ùసిద్ధికీ (ఢిల్లీ) పలు విలువైన సూచనలిచ్చి ఫ్రీలాన్స్ ఫొటో జర్నలిస్టుగా మారేలా చేశారు. -
ఇంటికి గెస్ట్గా పొన్నంకి పిట్ట.. గొప్ప జ్ఞాపకం
విద్యార్థులకు ఆమె గణితం నేర్పాలనుకున్నారు. కానీ విధి లిఖితం ఆమెకు కొత్త రెక్కలు తొడిగింది. పక్షుల ప్రేమలో వేలమైళ్లు ప్రయాణించేలా చేసింది. ఐదేళ్లుగా విభిన్న రకాల పక్షులను గుర్తించారు. కాగా ఇప్పటి వరకూ 550కు పైగా జాతులను కెమెరాలో బంధించి రికార్డు సృష్టించారు. ఆమే హైదరాబాద్ (Hyderabad) నగరంలోని అమీన్పూర్ (Ameenpur) సమీపంలోని హెచ్ఎమ్టీ కాలనీలో నివసించే శ్యామల రూపాకుల (Syamala Rupakula).. పక్షి ప్రేమలో మునిగి తేలుతున్నారు. ఆ ప్రేమ ఆమెకు అనారోగ్యాలను దూరం చేయడం మాత్రమే కాదు.. కొత్త రికార్డులకు దగ్గర చేస్తోంది. – సాక్షి, సిటీబ్యూరో‘ఆన్లైన్లో మ్యాథ్స్ ట్యూటర్గా పనిచేసేదాన్ని. కొన్ని ఆరోగ్య సమస్యలు నన్ను బాధించాయి. దీంతో ఆ పని వదిలేయాల్సి వచ్చింది. అనుకోకుండా బర్డ్ వాచర్గా మారాను’ అంటూ ఏడేళ్ల నాటి గతం గుర్తు చేసుకున్నారు శ్యామల. దాదాపు రికార్డు స్థాయిలో 550 పక్షులను గుర్తించి నగర బర్డ్ వాచర్స్ (Bird Watchers) ప్రపంచంలో తనదైన ముద్రను వేసుకున్నారు. ఐటీ ఉద్యోగి అయిన భర్త బాలసుబ్రహ్మణ్యకుమార్ సహకారంతోనే తన హాబీని ఇంతగా ఆస్వాదించగలిగానని చెబుతున్నారు. ఆమె ప్రయాణానికి సంబంధించిన మరిన్ని విశేషాలు ఆమె మాటల్లోనే..బీజం పడింది అక్కడే.. తొలుత జంతువుల పట్ల ఆసక్తితో వన్యప్రాణుల సంరక్షణా కేంద్రాలకు (వైల్డ్లైఫ్ శాంక్చురీ) వెళ్లేదాన్ని. బర్డ్ వాచింగ్ చేసినా మా ఇంటి దగ్గర్లో ఉన్న అమీన్పూర్ లేక్ వరకు మాత్రమే పరిమితమయ్యేదాన్ని. అయితే పక్షులపై వీరాభిమానానికి తొలిసారి బీజం పడింది మంజీరా వన్య ప్రాణుల సంరక్షణా కేంద్రానికి వెళ్లినప్పుడు. అక్కడ నాకు పరిచయమైన షివాన్ మాధురి దంపతులు.. నా బర్డ్ వాచింగ్ ఆసక్తిని గమనించి హైదరాబాద్ పాల్స్ గ్రూప్ గురించి చెప్పి నన్ను కూడా జాయిన్ చేశారు. అక్కడి నుంచి బర్డింగ్ కమ్యూనిటీలో స్నేహితుల మార్గదర్శకత్వంలో సీరియస్ బర్డ్ వాచింగ్ ప్రయాణం ప్రారంభమైంది. తమిళనాడు వెళ్లా. నవంబరు నుంచి ఫిబ్రవరి మధ్యలో నెలకు ఒకటైనా సరే కాస్త దూరంగా ఉండే ప్రాంతాలకు వెళ్తా. కేరళ రెండు సార్లు, ఉత్తరాఖండ్ మూడు సార్లు, కర్ణాటకకు ప్రతి యేటా వెళుతుంటాను. ఇక వారాంతాల్లో నరసాపూర్, క్రిష్ణారెడ్డి లేక్, అనంతగిరి హిల్స్, ఉమామహేశ్వరం.. ఇలా ఎక్కడో ఒక ప్రాంతానికి వెళతాం. మన దేశంలో 1300లకుపైగా జాతులు ఉన్నాయి. ఇప్పటి వరకూ 550కి పైగా పక్షులను గుర్తించాను. మొత్తం అన్నీ గుర్తించాలనే లక్ష్యంగా పెట్టుకున్నాను.రావోయీ అభిమాన అతిథీ.. మా ఇంట్లోనే ఒక చిన్న తోట పెంచుతున్నాం. పక్షుల రాక కోసమే ఇంట్లో డ్రిప్ సిస్టమ్ ఉంది. నీళ్ల కోసం దాదాపు 12 రకాల పక్షులు వస్తాయి. రోజూ పొద్దున్న, సాయంత్రం వాటిని చూస్తుంటే మనసు నిండిపోతుంది. గత సీజన్లో బర్డర్స్ ఫేవరెట్గా పేర్కొనే పొన్నంకి పిట్ట (ఇండియన్ పిట్ట) మా ఇంటికి వచ్చి ఏకంగా 4 రోజుల పాటు ఉండడం మరచిపోలేని, మధుర జ్ఞాపకం. ఇవి సాధారణంగా హిమాలయాల నుంచి వస్తాయని చెబుతారు. యేటా అక్టోబరు, నవంబర్ నెల్లో వచ్చి ఎండలు ముదిరినప్పుడు వెళ్లిపోతాయి. అలాంటి పక్షి.. మా ఇంటి పెరట్లో కొన్ని రోజుల పాటు ఉండడం గొప్ప జ్ఞాపకం. ప్రతి పక్షికీ ఓ పేరుంటుంది. ఒక్క జాతిలోనే అరడజను రకాలు ఉంటాయి. వాటి రెక్కల రంగు, పరిమాణం.. వంటి వాటిని బట్టి మనం గుర్తు పెట్టుకోవాల్సి ఉంటుంది. అలా గుర్తు పెట్టుకోవడం మొదట్లో చాలా కష్టం అనిపించేది. ఇప్పుడు అలవాటైంది.చదవండి: సామాజిక స్ఫూర్తికి సెల్యూట్ఎంతో సంతృప్తినిస్తోంది.. ప్రస్తుతం నగరంలో చాలా మంది బర్డ్ వాచర్స్గా మారుతున్నారు. పలువురు నాకు కాల్ చేసి పక్షుల రాకపోకల గురించి సమాచారం అడుగుతుంటే.. వాళ్లకి సమాధానం ఇస్తుండడం నాకెంత సంతృప్తిని అందిస్తుందో.. అభిరుచులను పంచుకోడాన్ని మించిన ఆనందం ఏముంటుంది? పైగా పక్షులను ప్రేమించడం అంటే ప్రకృతిని ప్రేమించడమే.. నీటి నుంచి నింగి వరకూ ప్రతి చోటా ప్రత్యక్షమయే పక్షుల ద్వారా.. ప్రకృతిలోని అనువణువూ బర్డ్ వాచింగ్ మనకు పరిచయం చేస్తుంది. మరచిపోలేని జ్ఞాపకాలను అందిస్తుంది. -
అతిరథులు ఈ అతివలు..
ఈ సృష్టిలో శక్తి మంతమైనవి రెండే అంశాలున్నాయి.. అందులో ఒకటి ప్రకృతి, మరొకటి మగువ అని ఆనాడే ఓ ప్రఖ్యాత రచయిత చెప్పాడు. సమాజమంతా మహిళలను కీర్తిస్తూ.. మహిళా సాధికారత అంటూ గొంతెత్తుతున్నప్పటికీ.. తమ గౌరవాన్ని, గొప్పతనాన్ని కాపాడుకోడానికి ఆ తల్లులు నిరంతరం శ్రమిస్తూనే ఉన్నారు. నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం నేపథ్యంలో పలువురి స్ఫూర్తిదాయక మహిళల ఇతివృత్తాలను తెలుసుకుందాం.. సాహిత్యం.. సావాసం..తన ప్రయాణమంతా సాహిత్యంతోనే.. తన మనసంతా ప్రకృతిమయం. గొప్ప గొప్ప విషయాలు ఎక్కడో ఉండవు.. కాస్త తరచి చూస్తే మనచుట్టూనే, మన మధ్యే ఉంటాయంటారు ప్రముఖ రచయిత స్వర్ణ కిలారి. సామాజిక ఇతివృత్తాలతో పలు ప్రభావ వంతమైన కథలు, రచనలు, అనువాదం చేసిన స్వర్ణ కిలారి.. మహిళల ట్రావెలింగ్ అనుభవాలతో ఇంతియానం అనే పుస్తకానికి సంపాదకీయం రాశారు. విశ్వవ్యాప్త ప్రయాణాలు చేసిన మగువలు.. విభిన్న అంశాల పై వారి అనుభవాలు, ఆలోచనలకు అక్షరరూపం తీసుకొచ్చారు. మరికొద్ది రోజుల్లో ఇంతియానం 2.0 సైతం రాబోతోంది. ఈ నేపథ్యంలో తన స్ఫూర్తివంతమైన ఆలోచనలు ఆమె మాటల్లోనే..ది షూటింగ్ స్టార్ స్ఫూర్తితో..రచనలన్నా, సాహిత్యమన్నా నాకెంతో ఇష్టం. ఇందులో భాగంగానే నాకు బాగా నచ్చిన కొన్ని పుస్తకాలను తెలుగులోకి అనువాదం చేశాను. ఇందులో కేరళకు చెందిన బాల మేధావి క్లింట్ బయోగ్రఫీ లిప్తకాలపు స్వప్నం, ది గోట్ లైఫ్ అనే ప్రముఖ రచనను మేక బతుకు పేరుతో తెలుగులోకి అనువాదం చేశాను. వ్యక్తిగతంగా నల్ల బంగారం, 13 వంటి రచనలు చేశాను. ఒక రచన కోసం నార్త్ థాయ్లాండ్ వెళ్లిన సమయంలో.. ఉన్న కొద్ది ఆస్తిని అమ్మి ప్రపంచ యాత్ర చేసిన అమ్మాయి నవ్య నాథ్ రాసిన ది షూటింగ్ స్టార్ బుక్ చదివి ఆశ్చర్యపోయాను. ఇలా మన తెలుగువారి ట్రావెలాగ్స్తో మంచి పుస్తకం తీసుకురావాలని అప్పుడే నిర్ణయించుకుని పని ప్రారంభించాను. ఇందులో భాగంగా మన తెలుగు మహిళలు చేసిన అద్భుత ప్రయాణాలు, అనుభవాలు చూసి స్ఫూర్తిని పొందాను. ఇందులో ఒంటరిగా ప్రయాణలు చేసిన వారు ఎందరో ఉన్నారు. ఇంటి నుంచి బయటకి వచ్చి ఉద్యోగాలు చేయడమే గగనమైన తరుణంలో స్థానిక ఆదిలాబాద్, కాకినాడ అడవులు మొదలు.. విదేశాల్లోని దండకారణ్యాలు, నగరాలు, సంస్కృతులు ఎన్నెన్నో వింతలు, విశేషాలను ఆస్వాదించిన మహిళ ప్రయాణ కథలు నాకు జీవితకాల సంతృప్తినిచ్చాయి. ఇలా 45 మంది కథలతో మొదటి పుస్తకం ముద్రించాను. ప్రస్తుతం మరో 55 మంది వనితల ప్రయాణ కథలతో ఇంతియానం 2.0ను తీసుకురానున్నాను. ఆడవారి ట్రావెలాగ్ వినూత్నంగా, విభిన్నంగా ఉంటుంది. వారు చూసే కోణం, ఆస్వాదించే విధానం కాస్త భిన్నంగా ఉంటుంది. ఉమెన్ ట్రావెంలింగ్ అంత సులభం కూడా కాదు. సామాజికంగా, శారీరకంగా, మానసికంగా పలు అంశాలు సహకరించవు. ఈ సారి మహిళల సోలో కథలతో పాటు తల్లీ కూతుళ్లు వంటి వైవిధ్యాలున్నాయి. వ్యక్తిగతంగా నేను మెక్సికో, బాలి, శ్రీలంక, అమెరికా, భూటాన్ వంటి దేశాలు ప్రయాణించాను. నా రచన 13 కోసం ఉత్తర థాయిలాండ్ వెళ్లి అక్కడ చియాంగ్ రాయ్ గుహలో చిక్కుకున్న 13 మంది పిల్లల నిజజీవిత కథను, వ్యథను రాశాను. భవిష్యత్తులో మరిన్ని రచనలు చేయాలనుంది. – స్వర్ణ కిలారి, ప్రముఖ రచయిత్రి, హైదరాబాద్వైకల్యాన్ని జయించి.. తానోక దివ్యాంగురాలు.. చిన్నప్పటి నుంచి అందరిలానే తానూ వివక్షకు గురైంది. ముందే దివ్యాంగురాలివి, అందులోనూ అమ్మాయివి.. నువ్వేం చేయగలవు, నీ వల్ల ఏమీ కాదు అనే మాటల తూటాలు ఆమె మనసును విచి్ఛన్నం చేశాయి. ఎలాగైనా తనను తాను నిరూపించుకోవాలి, ఎవరి, జాలి, సహాయంపైన ఆధార పడకూడదని నిశ్చయించుకుని ఇంటిని వదిలి హైదరాబాద్ నగరానికి చేరుకుంది. సంపూర్ణంగా తన పనులు తాను చేసుకోలేకపోయినా, అందరిలా నడవలేకపోయినా.. కుంగిపోకుండా కంప్యూటర్ వర్క్ నేర్చుకుని, డీటీపీ వర్క్ చేసి తన ఖర్చుల వరకూ సంపాదించుకునేది. తానే కాదు తనలాంటి మరికొందరికి ఆశ్రయం ఇవ్వాలని ‘ఆద్య నిలయం ట్రస్ట్’ ఏర్పాటు చేసి మరి కొందరు మహిళా దివ్యాంగులకు ఉచితంగా ఆశ్రయం, ఆహారం, వసతులను అందిస్తోంది. ఈ క్రమంలో తమకు కూడా మగతోడు ఉంటే బాగుంటుంది.. వైకల్యం దేహానికే కానీ మనసుకు కాదు. అందరిలాగే తమకు కూడా అనుభూతులు, కోరికలు, ఇష్టాలు ఉంటాయని.. మిత్రుల సూచనతో మరో దివ్యాంగ వ్యక్తిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంది. అలా తను సతీష్ అనే దివ్యాంగుడినిపెళ్లి చేసుకోవడమే కాకుండా తనలాంటి మరికొందరికి పెళ్లిల్లు చేయిస్తోంది. మరికొందరికి బాసటగా.. దివ్యాంగులకు మొదటి వివక్ష వారి కుటుంబాల నుంచే మొదలవుతుంది. నువ్వేం చేయలేవు.. జీవితాంతం వారు పెట్టింది తింటూ ఇంట్లో ఓ మూలన కూర్చో అనే సందర్భాలే ఎక్కువ. ఇలాంటి తరుణంలో మా ఆత్మగౌరవాన్ని కాపాడుకుంటూ, మా కష్టంతో ముందుకు సాగుతున్నాం. ఇలా మరికొందరు దివ్యాంగులకు ఆశ్రయం ఇస్తూ ఒక కుటుంబంగా బతుకుతున్నాం. మా ప్రయాణంలో ఆర్థికంగా, సామాజికంగా, మానసికంగా తోడ్పాటును అందించిన వారు ఎందరో ఉన్నారు. నా పెళ్లిని సర్వ్ నీడి అనే స్వచ్ఛంద సంస్థ జరిపించింది. నా మొదటి పెళ్లి రోజు సందర్భంగా ఆత్మీయుల్లో ఒకరు డబ్బులు ఇచ్చి పార్టీ చేసుకోమన్నారు. ఆ డబ్బుతో నేను మరికొందరు దివ్యాంగుల జంటలకు పెళ్లి పరిచయ వేదిక ఏర్పాటు చేశాను. ఇప్పటి వరకూ ఐదు జంటలకు చేశాను. మరికొన్ని చేసే ప్రయత్నంలో ఉన్నాను. – క్రిష్ణప్రియ, ఆద్య నిలయం ట్రస్ట్, హైదరాబాద్ -
వీ ఆర్ వీగన్స్
కొన్ని సంవత్సరాలుగా వీగన్స్, వీగనిజంపై విస్తృతంగా అవగాహన పెరుగుతోంది. ముఖ్యంగా హైదరాబాద్ వంటి నగరాల్లో వీగనిజంకు సంబంధించిన అవగాహన కార్యక్రమాలు, ప్రాముఖ్యత తెలిపే సదస్సులు నిర్వహిస్తున్నారు. జంతు సంరక్షణ, మూగజీవాల హక్కుల కోసం పాటు పడటం వంటి అంశాలపై వీగన్లు, వీగన్ సంస్థలు విశేషంగా కృషి చేస్తున్నాయి. ఇందులో భాగంగా నగరం వేదికగా మెర్సీ ఫర్ యానిమల్స్ ఇండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రముఖ సినీతార దక్ష నాగర్కర్ భాగస్వామ్యంతో మొక్కల–ఆధారిత ఆహార జీవనాన్ని ప్రోత్సహించే అవగాహన ప్రచారాన్ని ప్రారంభించారు. స్వతాహ వీగన్ అయిన దక్ష నాగర్కర్ వీగనిజం ప్రాముఖ్యత, జంతువులపై హింస వద్దంటూ ఈ ప్రచారం ద్వారా తెలియజేస్తోంది. ఈ నేపథ్యంలో వీగనిజం గురించి, ప్రస్తుత తరుణంలో దాని ప్రాధాన్యత.. తదితర అంశాల గురించి ‘సాక్షి’తో పంచుకుంది. ప్రస్తుత మానవ జీవన విధానం జంతువులను అత్యంత హీనంగా హింసిస్తోంది. ముఖ్యంగా మాంసం కోసం 2, 3 నెలల జంతువులను కృత్రిమ విధానాలతో బలవంతంగా ఎక్కువ బరువు పెంచి సృష్టి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా డైరీ పామ్స్, ఫౌల్ట్రీ, పిగ్ ఫామ్స్లో కనీసం ఒక జంతువు స్వేచ్ఛగా తిరగకుండా కేజ్లలో బందించి వాటి ఉత్పత్తులను సేకరిస్తున్నారు. కొన్ని జంతువులైతే వాటి జీవిత కాలంలో సూర్యరశి్మకి కూడా చూడకుండా పెరుగుతున్నాయి. ఇది జీవవైవిధ్యానికి విరుద్దం. దేశంలో జనాభా పెరిగిపోయింది, ఇంతమందికి సరిపడా జంతు ఉత్పత్తులు అందించలేక, బ్యాలెన్స్ చేయలేక అనైతిక బ్రీడింగ్తో హింసిస్తున్నారు. ఈ సందర్భంగా ‘పవర్డ్ బై వెజ్జీస్‘ అంటూ కూరగాయలను మాత్రమే తినాలని ప్రచారం చేస్తున్నారు. ముఖ్యంగా ఫ్యాక్టరీలు, వాహనాల కాలుష్యం కన్నా ఫ్యాక్టరీ ఫార్మమింగ్తో ఎక్కువ కాలుష్యం జరుగుతోంది. ఇలాంటి తరుణంలో ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన కల్పించడం కోసం బాగా స్పందిస్తున్నారు. వారి జీవనంలో కొనసాగుతున్న ప్రాంతీయ వీగన్ వంటకాల విశిష్టతను తెలుసుకుంటున్నారు. కానీ నగరాల్లో మొక్కలకు కూడా ప్రాణం ఉంటుంది కదా అని వాదిస్తున్నారు. కానీ మొక్కల్లో స్టిమ్యులే మాత్రమే ఉంటుంది, జంతువుల్లో వలె నొప్పిని తెలియజేసే నాడీ వ్యవస్థ ఉండదని అందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. వీగన్స్ అంటే మాంసాన్ని మాత్రమే కాదు.. పాలు, పెరుగు, గుడ్లు వంటి జంతు పదార్థాలతో పాటు జంతు ఉత్పత్తులతో తయారు చేసిన బ్యాగ్లు, దుస్తులు ఏ ఇతర వస్తువులను వినియోగించరు. జంతువులకు వాటి స్వేచ్ఛను ఇవ్వడంతో పాటు హింసకు దూరం చేయడం అవసరం. నేను నటించిన జాంబిరెడ్డి సినిమా షూటింగ్ సమయంలో మా దర్శకులు ఒక మేకను ఎంత జాగ్రత్తగా, సురక్షితంగా చూసుకున్నారో చూసి సంతోషపడ్డాను. ఇటీవల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో జంతువుల హింసించకూడదనే అంశంపై కొత్త చట్టాలను వెలువరించారు. ఇందులో భాగంగా తెలంగాణ రాష్ట్రం కూడా జంతు పెంపకాలపై దృష్టి సారిస్తూ నియమాలను పాటిస్తుంది. సినిమాల విషయానికొస్తే త్వరలో మరో 2 సినిమాలు చేస్తున్నాను. తెలుగు ప్రజలకు దగ్గరవ్వడం చాలా సంతోషంగా ఉంది. – దక్ష నాగర్కర్జంతు సంరక్షణే లక్ష్యంగా 2016లో ప్రారంభించిన మెర్సీ ఫర్ యానిమల్స్ ఇండియా ఫౌండేషన్ దేశవ్యాప్తంగా కృషి చేస్తోంది. సంస్థ పోరాటంలో భాగంగా దేశవ్యాప్తంగా 22 రాష్ట్రాల్లో క్రూరంగా పందులను పెంచడం నిషేధించారు. ఇందులో తెలంగాణ రాష్ట్రం కూడా ఉంది. శాఖాహారం, మాంసాహారం ఉన్నట్లుగానే వీగన్ ఫుడ్కు కూడా లేబుల్ ఉండేలా మార్పు తీసుకొచ్చాం. జాన్ అబ్రహం, సోనాక్షి సిన్హ, సాక్షి మల్లిక్ మాదిరిగానే హైదరాబాద్లో వీగనిజం కోసం దక్షా నాగర్కర్ క్యాంపెయిన్ చేయడం సంతోషంగా ఉంది. ప్రస్తుతం ఒక జంతువును చంపితే రూ.50 ఫైన్ కట్టి హాయిగా తిరుగుతున్నారు. ఒక మనిషిని చంపితే ఎలాంటి చట్టం ఉంటుందో జంతు హత్యలపై కూడా కఠినమైన చట్టాలు తీసుకురావాలని ఉన్నత న్యాయస్థానాలకు విన్నవించాం. – నికుంజ్ శర్మ, సీఈఓ, మెర్సీ ఫర్ యానిమల్స్ ఇండియా -
సైకిల్ సవారీ..ఆరోగ్యం, పర్యావరణంపై పెరుగుతున్న అవగాహన..!
వ్యాయామాల అన్నింటిలోనూ అత్యుత్తమమైనది సైకిలింగ్. ఆరోగ్యానికీ ఇది ఎంతో మంచిది. ఓ వైపు ఆరోగ్యం.. మరోవైపు పర్యావరణ కాలుష్యం పట్ల పెరుగుతున్న అవగాహన వెరసి హైదరాబాద్నగర వాసుల్లో సైక్లింగ్ పట్ల ఆసక్తి పెరుగుతోంది. దీనికి తోడు వారాంతాల్లో గ్రూపులుగా మారి సైకిలింగ్ చేయడం ప్రస్తుతం హాబీగా మారింది. ఈ అలవాటు క్రమంగా విస్తరిస్తోంది. దీంతో విభిన్న రకాల సంస్థలు సైక్లిస్ట్ల కోసం రైడ్స్ నిర్వహిస్తుండడంతో తెలంగాణలోని హైదరాబాద్ నగరవాసులు భాగ్యనగర వీధుల నుంచి విదేశీ విహారాల వరకూ రైయ్ రైయ్ మంటూ సైకిల్పై సవారీ చేస్తున్నారు. ఎడా పెడా దూసుకొచ్చే బైక్స్, కార్స్, ఆటోల మధ్య తాదూరే సందు.. లేదు మెడకో డోలు అన్నట్టు ఉంది..భాగ్యనగరంలో సైకిల్ సవారీ. సరదా ఉంది కదా అని కిలోమీటర్ల కొద్దీ సైకిల్ తొక్కాలంటే ప్రత్యేక ట్రాక్స్ వెతుక్కోవాల్సిందే తప్ప.. నగర రోడ్లపై పరిస్థితులు మాత్రం అనుకూలంగా లేవనే విషయంలో ఎలాంటి సందేహం లేదు. నగరంలో సైకిల్ ట్రాక్స్ ఉన్నప్పటికీ అవి కొన్ని ప్రాంతాలకు మాత్రమే పరిమితం కావడంతో సైక్లిస్ట్స్ రైడింగ్ కోసం ప్రత్యేక మార్గాలను అన్వేషించక తప్పడం లేదు. ఈ క్రమంలోనే సైకిల్పై లాంగ్ జర్నీ చేయాలనుకునే నగరవాసుల కోసం విభిన్న రకాల రైడ్స్ అందుబాటులోకి వచ్చేశాయి. నైట్.. రైట్.. ట్రాఫిక్ రద్దీ తక్కువ ఉంటుంది కాబట్టి వారాంతపు సెలవుదినాలను ఎంచుకుంటున్నారు ఎక్కువ మంది సైక్లిస్ట్లు. తమ హాబీని ఎంజాయ్ చేయడం కోసం.. మరింత సౌకర్యంగా వీధుల్లో విహరించాలని రాత్రి సమయాల్లో జాయ్ రైడ్స్కి జై కొడుతున్నారు. ‘పగలు ట్రాఫిక్ రద్దీతో పాటు పొల్యూషన్ కూడా ఎక్కువ. అందుకే వీలైనంత వరకూ రాత్రిపూట సైక్లింగ్ చేస్తా’ అని చెప్పారు ఐటీ ఉద్యోగి సౌరభ్. సాధారణంగా ఈ నైట్ రైడ్స్ రాత్రి 7గంటల ప్రాంతంలో మొదలై పరిస్థితులు, పాల్గొన్నవారి ఆసక్తిని బట్టి.. 10 నుంచి 12గంటల వరకూ కొనసాగుతున్నాయి. శంషాబాద్ పరిసర ప్రాంతాల్లో రైడ్స్ ఏర్పాటు చేస్తున్నామని ప్రసిద్ధ క్రీడా పరికరాల ఉత్పత్తి కంపెనీ డెకథ్లాన్ ప్రతినిధి చరణ్ తెలిపారు. బ్రేక్ఫాస్ట్ రైడ్స్ షురూ.. నగరంలో ట్రాఫిక్ రద్దీ తక్కువ ఉండే ఉదయపు వేళల్లో బ్రేక్ ఫాస్ట్ రైడ్స్ షురూ అయ్యాయి. తెల్లవారుజామున మొదలై ఉదయం 8–9 గంటల లోపు ముగిసిపోయే ఈ తరహా రైడ్ పూర్తయిన అనంతరం ఏదైనా ప్రత్యేక రెస్టారెంట్ లేదా దాబాల్లో బ్రేక్ఫాస్ట్ చేస్తారు. ‘ఒకప్పుడు జిమ్లో కార్డియో వ్యాయామంలో భాగంగా ఎక్కువ సైకిల్ తొక్కేదానిని. అయితే దాని వల్ల కొన్ని ఆరోగ్య సమస్యలు వచ్చాయి. వైద్యుల సూచన మేరకు రోడ్స్ మీద సైక్లింగ్ను ఎంచుకున్నా’ అని సైక్లిస్ట్ నీలిమారాణి చెప్పారు. సుదూర ప్రాంతాలకూ రెడీ.. సైక్లింగ్పై ఉన్న ఇష్టం నగరవాసులను దూరాభారం లెక్కజేయనీయడం లేదు. నగరం నుంచి విభిన్న ప్రాంతాలకు లాంగ్రైడ్స్కూ వెనుకాడడం లేదు. ఈ విషయంలో బైకర్ క్లబ్స్తో వీరు పోటీపడుతున్నారని చెప్పొచ్చు. ‘కనీసం 100 నుంచి 250 కి.మీ వరకూ దూరంలో ఉండే గమ్యాలను చేరుకోడానికి నగరంలోని సైక్లిస్ట్లు ఆసక్తి చూపిస్తున్నారు. అందుకే తరచూ లాంగ్ రైడ్స్ ఏర్పాటు చేస్తున్నాం’ అని బైక్ అఫైర్స్ నిర్వాహకులు వివరించారు. విదేశాల్లోనూ.. రయ్ రయ్.. నగరం నుంచి విదేశాలకు వెళ్లి అక్కడి రోడ్స్పై రైడ్స్ చేయాలనుకునే ఆసక్తి కలిగిన నగరవాసుల కోసం అక్కడ సైక్లింగ్ ఈవెంట్స్ నిర్వహించే సంస్థలు అందుబాటులోకి వచ్చాయి. ‘మల్టీ డే బైస్కిల్ రైడ్స్ పేరిట విదేశాల్లో సైక్లింగ్ ఈవెంట్స్ నిర్వహిస్తున్నాం. నార్తర్న్ థాయ్లాండ్లో గత ఫిబ్రవరిలో ఒక రైడ్ నిర్వహించాం. పలువురు సిటిజనులు అందులో పాల్గొన్నారు. త్వరలో స్పెయిన్లోనూ ఈ తరహా రైడ్ నిర్వహించనున్నాం’ అని చెప్పారు బార్నోల్ అడ్వెంచర్స్ సంస్థ నిర్వాహకులు. పెడలింగ్.. ఈవెంట్స్.. నగరవాసుల్లో నైట్రైడ్స్ పట్ల పెరుగుతున్న ఆసక్తికి అనుగుణంగా డెకథ్లాన్, బైక్ అఫైర్స్ తదితర సంస్థలు ప్రత్యేక సైక్లింగ్ ఈవెంట్స్ నిర్వహిస్తున్నాయి. వాహనం ఉండి, సైక్లింగ్పై ఆసక్తి ప్రధాన అర్హతగా, వ్యక్తిగతంగా లేదా బృందాలుగా కూడా పాల్గొనేందుకు వీటిని నిర్వహిస్తున్నవారు సైక్లిస్ట్లకు అవకాశం కల్పిస్తున్నారు. ఈ తరహా రైడ్స్లో భాగంగా సైక్లిస్ట్లకు కొత్త కొత్త సైకిళ్ల గురించిన సమాచారం, వాహన నిర్వహణపై అవగాహన, ఆరోగ్యకరమైన అభిరుచిగా తీర్చిదిద్దుకోవడంపై మెళకువలు అందిస్తున్నారు. చిన్న చిన్న రైడ్స్ కోసం కెబీఆర్ పార్క్, నెక్లెస్ రోడ్ ఎంచుకునే వీరు.. రైడ్ ఈవెంట్స్కి శంకర్పల్లి నుంచి కోకాపేట్ టూ శంకర్పల్లి టౌన్, శంకర్ పల్లి నుంచి కంది రోడ్, మేడ్చల్ రోడ్/నాగ్పూర్ హైవే వంటివి ఎంచుకుంటున్నారు.బిగినర్స్.. సిగ్నేచర్.. ఆలోచనలు, ఆసక్తికి అనుగుణంగా విభిన్న రకాల ఈవెంట్ మేనేజర్స్ రైడ్స్ డిజైన్ చేస్తున్నారు. ప్రారంభకుల కోసం 15 నుంచి 20 కి.మీ వేగం పరిమితితో బిగినర్స్ రైడ్ నిర్వహిస్తున్నారు. ఈ తరహా రైడ్స్ కోసం 25 నుంచి 30 కి.మీ దూరాన్ని ఎంచుకుంటున్నారు. ఇటు ప్రారంభకులు అటు అలవాటైన వారు కాకుండా మధ్యస్థంగా ఉండే వారికి సిగ్నేచర్ రైడ్ నిర్వహిస్తారు. దీని కోసం సుమారు 70 కి.మీ దూరాన్ని నిర్ణయిస్తున్నారు. కనీసం 25 నుంచి 30 కి.మీ వేగంతో 80 నుంచి 100 కి.మీ దూరం ప్రయాణం చేసే రైడ్స్ని ఫాస్ట్ రైడ్స్గా పేర్కొంటున్నారు. ఇవి నైపుణ్యం కలిగిన వారికి ఏర్పాటు చేస్తున్నారు. (చదవండి: 'నా ఇన్స్పిరేషన్ మా అమ్మ'..!: సొనాలీ బెంద్రే) -
చారిత్రక వేదికపై.. సాంస్కృతిక పరంపర
భారతీయ నాట్యం, సంగీతరీతులను పరిరక్షించడానికి కళారూపాల ప్రదర్శన బాధ్యతను చేపట్టింది పరంపర ఫౌండేషన్. సాంస్కృతిక ప్రదర్శనలను ఆలయాలు, చారిత్రక ప్రదేశాల్లో ‘పరంపర గుడి సంబరాలు’ పేరుతో ఏర్పాటు చేస్తున్నారు నిర్వాహకులు శశిరెడ్డి, డాక్టర్ శ్రీనగి. చరిత్ర, సంస్కృతి, కళలను మేళవించి ఒక వేదికపై ప్రదర్శిస్తున్నారు. గడచిన పదేళ్ల కార్యక్రమాల్లో భాగంగా నేడు గోల్కొండ కోటలో ప్రదర్శన జరుగుతోంది. భరతనాట్య కళాకారిణి, ఢిల్లీలోని గణేశ నాట్యాలయ డైరెక్టర్ రమా వైద్యనాథన్ ‘నిమగ్న’ రూపకాన్ని ప్రదర్శిస్తున్నారు. ఈ సందర్భంగా ఆమె సాక్షితో మాట్లాడారు. – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి‘భరతనాట్యం ఒక సముద్రం. నాట్య గురువులు ఇచి్చన స్ఫూర్తి ఆ లోతులను చూడడానికి ఉపయోగపడింది. సముద్రం వంటి నాట్య సుగంధాన్ని విశ్వవ్యాప్తం చేయాలనుకున్నాను. ప్రపంచంలో ప్రతి ఒక్కరికీ నాట్యముద్రల గొప్పదనాన్ని పరిచయం చేయాలనేదే నా లక్ష్యం. అందుకే ప్రపంచవ్యాప్తంగా ప్రదర్శనలిస్తున్నాను. దేశ సంస్కృతిని, సంప్రదాయాన్ని ప్రపంచానికి తెలియజేయడానికి భరతనాట్యం మంచి మాధ్యమం. ఆ మాధ్యమమే నన్ను నడిపిస్తోంది. దేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ ప్రదర్శనలివ్వాలని ఉంది. ఫిబ్రవరి 27న వైజాగ్లో ప్రదర్శన ఇచ్చాను. ఇప్పుడు హైదరాబాద్ గోల్కొండ కోటలో ప్రదర్శనకు సిద్ధం అవుతున్నాను. మన సంస్కృతి, చరిత్రను రానున్న తరాలకు చేరవేయడానికి మా కళాకారులు ఎంత అవసరమో.. ఈ కార్యక్రమాలు నిర్వహించే సంస్థలు కూడా అంతే ముఖ్యం. సమాజంలో కళాభిమానులు ఎప్పుడూ ఉంటారు. కళను కళాకారుల నుంచి కళాభిమానులకు ప్రసరింపజేసే బాధ్యతను చేపట్టే వాళ్లు తక్కువ. కళాసాధన, కళాస్వాదన రెండూ మనిíÙని ఆధ్యాత్మిక మార్గంలోకి తీసుకెళ్లే ప్రభావవంతమైన మార్గాలు’ అన్నారు రమావైద్యనాథన్.ఇరవై మంది నాట్యకారులతో.. గోల్కొండ కోటలో ప్రదర్శించే ‘నిమగ్న’ రూపకంలో గురు స్తోత్రమ్, కామాక్షి, కాశీ, రఘువీర, రసలీల అనే ఐదు అంశాలుంటాయి. నేను స్వయంగా రూపొందించిన ఈ 90 రూపకంలో నాతోపాటు మరో ఇరవై మంది నాట్యకారులు పాల్గొంటారు. జాతీయ, అంతర్జాతీయ వేదికలపై నాట్యప్రదర్శనలిచి్చన రమావైద్యనాథన్.. సంగీత నాటక అకాడమీ, ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్, జోనల్ సెంటర్స్, స్టేట్ అకాడమీలు నిర్వహించే కార్యక్రమాల్లో ప్రదర్శనలిస్తారు. పాటా్నలో జరిగే రాజ్గిర్ మహోత్సవ్, త్రివేండ్రంలో సూర్య ఫెస్టివల్, కోణార్క్ ఫెస్టివల్, ఖజురహో ఫెస్టివల్ భరతనాట్యపు అడుగులతో పరిపూర్ణతనందించారు.అవార్డులు⇒ 2017, కేంద్ర ప్రభుత్వ సంగీత నాటక అకాడమీ అవార్డు ⇒ 2015, మధ్య ప్రదేశ్ ప్రభుత్వ కుమార్ గంధవ్ పురస్కారం ⇒ 2013, కేరళ ప్రభుత్వ కళాశ్రీ పురస్కారం ⇒ 2011, తమిళనాడు ప్రభుత్వ కలైమామణి అవార్డు ⇒ 1999, శ్రీలంక డిపార్ట్మెంట్ ఆఫ్ కల్చరల్ అఫైర్స్ ‘భారత రత్న’హైదరాబాద్కురెండోసారి! గతంలో ఒకసారి హైదరాబాద్లో ప్రదర్శన ఇచ్చాను. చారిత్రక ప్రదేశం గోల్కొండలో ప్రదర్శన ఇవ్వడం ఇదే మొదటిసారి. హైదరాబాద్ అందమైన నగరం. నాకు చాలా నచి్చంది. అందమైన సరస్సులు, పార్కులున్నాయి. ఆధునికతకు సంస్కృతి, కళలను అద్దితే అదే హైదరాబాద్ నగరం. – రమా వైద్యనాథన్ -
రంగరంగ వైభవంగా..
నిన్నా మొన్నటి దాకా సినిమాల ప్రభావంతో కుదేలైపోయిన నాటక రంగం.. ఇప్పుడు ఓ వైపు సినిమాలు, మరోవైపు ఓటీటీలు, ఇంకెన్నో డిజిటల్ వినోదాలూ.. విజృంభిస్తున్న ప్రస్తుత తరుణంలో వీటన్నింటినీ తట్టుకుంటూ నగరవాసుల్ని తన ప్రదర్శనల వైపు నడిపిస్తోంది. యువతరాన్ని ఆకట్టుకుంటూ కాలేజీ క్యాంపస్లతో పాటు కార్పొరేట్ కంపెనీల ఆడిటోరియమ్స్ దాకా నాటకాలు హల్చల్ చేస్తున్నాయి. ఈ సరికొత్త ఉత్సాహానికి కారణం.. ఆధునికులకు నచ్చే యూత్ కలర్స్ రంగరించి.. రంగస్థల ఈవెంట్స్ను సిటిజనులకు చేరువ చేయడంలో డ్రామానన్ వంటి సంస్థలు నగరానికి రావడం ఒక కారణంగా చెప్పొచ్చు. ఈశాన్య రాష్ట్రమైన మణిపాల్లో పాతికేళ్ల క్రితం 2000వ సంవత్సరంలో డ్రామనాన్(డ్రామాటిస్ట్ అనామిక) ఏర్పాటైంది. వృత్తి రీత్యా ఆర్కిటెక్ట్ ఆర్కే షెనాయ్, దివంగత చందన్ శతపతిలు స్థాపించిన ఈ థియేటర్ గ్రూప్.. పాతిక సంవత్సరాలుగా దేశవ్యాప్తంగా 450కి పైగా ప్రదర్శనలతో 70కి పైగా నాటకాలను విజయవంతంగా ప్రదర్శించింది. అనంతరం అర్బన్ ప్లానర్ అయిన ఆర్కే షెనాయ్ మన నగరానికి మకాం మార్చాక 2007లో డ్రామానాన్ హైదరాబాద్ చాప్టర్ ప్రారంభమైంది. అప్పటి నుంచి డ్రామనాన్ నగర థియేటర్ రంగంలో క్రియాశీలక పాత్ర పోషిస్తోంది. 2007లో భారతీయ విద్యాభవన్లో విలియం సెబ్రింగ్ రచించిన ‘ది ఒరిజినల్ లాస్ట్ విష్ బేబీ’తో ప్రారంభించి, ‘ఫూల్స్, ది గుడ్ డాక్టర్, పిజ్జాజ్ అండ్ డబుల్స్, ది లాస్ట్ రిసార్ట్, లవ్, లాస్ట్, 24 రూబుల్స్ లాస్ట్, అదర్ ఫాస్ట్ ఫుడ్స్.. ఇలా అనేక సొంత నాటకాలను సిటీలో ప్రదర్శించింది. ఆదరణ.. అవార్డ్స్.. 19 సంవత్సరాలుగా డ్రామనాన్ దేశవిదేశాలలో వివిధ ఉత్సవాల్లో ప్రదర్శనలు సమర్పించింది. గత 2015లో, బ్రాడ్వే ఆన్లైన్ మ్యాగజైన్ డ్రామనాన్ను దేశంలోని టాప్–20 థియేటర్ గ్రూపులలో ఒకటిగా పేర్కొంది. డ్రామనాన్ హైదరాబాద్ 2012, 2013లో ఐనా థియేటర్ పోటీల్లో, 2013లో షార్ట్ ప్లస్ స్వీట్ థియేటర్ పోటీల్లో గెలుపొంది సిటీ థియేటర్ సత్తా చాటింది. ప్రముఖ నటులు రజిత్ కపూర్ షెర్నాజ్ పటేల్ నటించిన రేజ్ ప్రొడక్షన్స్ ‘లవ్ లెటర్స్’ వంటి ప్రసిద్ధ నాటకాలను కూడా డ్రామనన్ నిర్మించింది.స్కిట్.. ఫైట్.. షురూ.. థియేటర్ ప్రేమికులు, ఔత్సాహిక నటీనటులను ప్రోత్సహించేందుకు ‘స్కిట్స్’ అనే 12 నిమిషాల షార్ట్ ప్లే కాంటెస్ట్ని డ్రామనాన్ ప్రారంభించింది. ఇందులో నగరానికి చెందిన వివిధ కార్పొరేట్ సంస్థలు, ఔత్సాహిక అనుభవజ్ఞులైన థియేటర్ గ్రూప్స్ పాల్గొంటున్నాయి. ఒక వార్షిక కార్యక్రమంగా మారిన ఈ పోటీల్లో అతుల్ కుమార్, రజిత్ కపూర్, షెర్నాజ్ పటేల్, అభిక్ మజుందార్ ప్రకాష్ కోవెలమూడి తదితర రంగస్థల ప్రముఖులు న్యాయనిర్ణేతలుగా వ్యవహరిస్తున్నారు. 1, 2 తేదీల్లో ప్రిలిమినరీ పోటీలు.. ఈ పోటీల్లో ఈ ఏడాది 24 టీమ్స్ పాల్గొంటున్నాయి. స్కిట్స్ కార్యక్రమం నుంచి ‘ఉత్తమ నటుడు’, ‘ఉత్తమ దర్శకుడు’, ‘ఉత్తమ ప్లే’, ‘ఉత్తమ ఒరిజినల్ స్క్రిప్్ట’, ‘ఉత్తమ పోస్టర్’, ‘ఉత్తమ ప్రచార వీడియో’, ‘ఆడియన్స్ ఛాయిస్ ప్లే’ వంటి పురస్కారాలు అందిస్తున్నారు. మొత్తం ప్రైజ్ మనీ రూ.1,20,000 వరకూ ఉంటుంది. ఈ పోటీలకు సంబంధించి ప్రాథమిక రౌండ్ స్కిట్లు 1, 2వ తేదీల్లో గచి్చ»ౌలిలోని సుప్రీమ్ ట్రాంపోలిన్ పార్క్ సమీపంలో ఉన్న ఎలైన్డ్ ఎంప్లాయీస్ కాలనీలోని రంగభూమి స్పేసెస్లో జరుగుతాయి. -
స్టెప్ టు ఫిట్..
మనలో చాలా మంది ఫిట్గా ఉండాలంటే కిలోమీటర్ల కొద్దీ జాగింగ్ చేయడం, గంటల తరబడి జిమ్కి వెళ్లడం.. కసరత్తులు చేయడం, బరువులు ఎత్తడం లేదా ఈత కొట్టడం వంటివి అవసరమని నమ్ముతారు. అయితే ఫిట్గా ఉండటానికి కేవలం వ్యాయామాలు మాత్రమే కాదు.. ఫిట్నెస్ ఎక్సర్సైజులతో పాటు డ్యాన్స్ కూడా అదే స్థాయిలో సహాయపడుతుంది. అయితే డ్యాన్స్లలో చాలా రకాలు ఉన్నాయి.. ఏది మంచిది అనుకోకండి.. ఏ డ్యాన్స్ చేసినా ఒక్కటే.. మరైతే ఏదైనా డ్యాన్స్ క్లాసెస్లో చేరాలా? అనే సందేహం రావచ్చు.. అబ్బే అదేం అవసరంలేదు.. ఏ డ్యాన్స్ క్లాస్లోనూ చేరకుండానే కేవలం ఇంట్లో చేసే నృత్యం ద్వారా కూడా తగినంత ఫిట్నెస్ సాధించవచ్చని తాజా అధ్యయనం స్పష్టం చేస్తోంది. రోజంతా అలసిపోయేలా పని చేసిన తర్వాత, షూస్, ట్రాక్స్ వగైరాలు ధరించి జిమ్కి వెళ్లడం చాలా మందికి కష్టం అనిపిస్తుంది. దీంతో గత కొంత కాలంగా నగరవాసుల్లో కూడా ఇంట్లోనే డ్యాన్స్ చేసే అలవాటు క్రమంగా పెరుగుతోందని ప్రముఖ డ్యాన్స్, ఎరోబిక్స్ శిక్షకులు బాబీ చెప్పారు. రోజువారీ ఫిట్నెస్ లక్ష్యాలను సాధించడానికి చాలామంది సులభమైన ఎంపికగా నడక లేదా జాగింగ్కి బదులు.. హోమ్ డ్యాన్స్ ఎంచుకుంటున్నారు. ఇది సరైనదేనని, వంటచేసేటప్పుడు రోజుకు కేవలం 20 నిమిషాల పాటు వంటగదిలో డ్యాన్స్ చేసినా అది ఫిట్గా ఉండేందుకు సరిపోతుందని తాజా అధ్యయనంతేల్చంది. స్టడీ ఏం చెబుతోంది.. బోస్టన్లోని నార్త్ ఈస్టర్న్ విశ్వవిద్యాలయంలోని పరిశోధకులు 18 నుంచి 83 సంవత్సరాల మధ్య వయసు గల వారిని ఎంచుకుని పరీక్షించారు. పరిశోధకులు వారు ఎంత ఆక్సిజన్ ఉపయోగిస్తున్నారు? వారి గుండెలు ఎంత వేగంగా కొట్టుకుంటున్నాయి? అనే రీతిలో పలురకాల టెస్టులు నిర్వహించారు. అనంతరం వ్యాయామ తీవ్రతను కూడా పరీక్షించారు. పాల్గొనే వారందరూ సహేతుకమైన ఆరోగ్యలాభాలు అందించే శారీరక శ్రమ స్థాయికి చేరుకున్నారని ఫలితాలు చూపించాయి. ఈ అధ్యయనానికి సారథ్యం వహించిన డాక్టర్ ఆస్టన్ మెక్కల్లౌగ్ మాట్లాడుతూ ‘తమంత తాము స్వేచ్ఛగా నృత్యం చేయడం ఆరోగ్యాన్ని మెరుగుపరిచే శారీరక శ్రమకు సరిపోతుందా అని పరీక్షిస్తే.. దీనికి అధ్యయనంలో ‘అవును’ అని సమాధానం వచి్చంది. ఏ తీవ్రతతో నృత్యం చేయాలో చెప్పకుండానే ఆరోగ్యాన్ని మెరుగుపరిచే స్థాయికి అందరూ చేయగలిగారు. వారు తమ సొంత సంగీతాన్ని ఆస్వాదించారు’ అని చెప్పారు.ఫిట్నెస్ రొటీన్లో భాగంగా.. నేషనల్ హెల్త్ సర్వీస్ ప్రకారం, ఎక్కువసేపు కూర్చోవడం లేదా పడుకోవడం నివారించాలి. ప్రతి వారం 150 నిమిషాల పాటు వ్యాయామం చేయాలి. దీనిని రోజువారీగా విభజించి ప్రతిరోజూ ఏదో ఒక కార్యాచరణ చేయాలి.. దానిలో హోమ్ డ్యాన్స్ను కూడా చేర్చుకోవచ్చు. ఇష్టమైన ట్యూన్లను ఎంచుకుని చేసే హోమ్ డ్యాన్స్ ఆహ్లాదకరమైన ప్రభావవంతమైన వ్యాయామం ఇది. ఫిట్నెస్ రొటీన్లో సరదా వ్యాయామాన్ని చేర్చే అద్భుతమైన మార్గం. అన్ని వయసుల, ఫిట్నెస్ స్థాయిల వారికి అందుబాటులో ఉంటుంది. గణనీయమైన ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది అంటున్నారు నిపుణులు. ఇంటి పనులతో సైతం.. ‘బాత్రూమ్ను ఎవరు శుభ్రం చేయాలి? వంటపని ఎవరు చేయాలి? వంటి విషయాలపై తర్జనభర్జనలు పడుతున్న జంటలకు పరిష్కారాలను చూపించే మార్గం అంటున్న ప్రముఖ సల్సా టీచర్ డానియెల్లా గోమ్స్ మాట్లాడుతూ.. ‘నృత్యాలతో పాటు ఇంటి పనులను చేయడం కూడా ఆహ్లాదకరమైన, ఆనందకరమైన మంచి అనుభవం’ అని చెబుతున్నారు. ఇంట్లో రిలాక్స్డ్గా కూర్చున్న సమయంతో మొదలుపెట్టి షవర్ బాత్ చేసే సమయం వరకూ.. నచి్చనట్టుగా రిథమిక్గా కాళ్లూ, చేతులూ కదుపుతూ ఇంటి నృత్యాన్ని అలవాటుగా మార్చుకోవచ్చని సూచిస్తున్నారు.ఒత్తిడికి సరైన పరిష్కారం..కేవలం ప్రొఫెషన్గా తీసుకునేవారికే అనుకోవడం సరైంది కాదు. ఆరోగ్యం, మానసికోల్లాసం కోరుకునే ప్రతి ఒక్కరికీ నృత్యం మంచి ఎంపిక. క్లాసెస్కు అటెండ్ అవ్వలేని సందర్భంలో మా విద్యార్థులకు ఇంట్లో కాసేపు నృత్యం చేయమని చెబుతాం. హోమ్ డ్యాన్స్ చేసేటప్పుడు సోఫాలు, టీపాయ్.. వంటివి అడ్డుగా లేకుండా చూసుకోవాలి. డ్యాన్స్ చేయడానికి కనీసం 5/5 అడుగుల స్థలం ఉండేలా చూసుకోవాలి. అలాగే 20 నిమిషాల నృత్యం చేయాలనుకుంటే కనీసం 2 నుంచి 3 నిమిషాల పాటు మెడ, భుజాలు, నడుము.. ప్రాంతాలపై ఒత్తిడి కలిగిస్తూ చేసే తేలికపాటి వార్మప్ వ్యాయామాలు చేయాలి. మ్యూజిక్ బీట్స్లో తీవ్రమైన మార్పు చేర్పులు ఉండే పాటలకన్నా ఒక రిథమిక్గా సాగే ట్యూన్స్ ఎంచుకోవడం మంచిది. నృత్యం పూర్తయిన తర్వాత 2 నిమిషాల పాటు కూల్ డవున్ స్ట్రెచ్ వ్యాయామాలు చేయగలిగితే బెటర్. – పృధ్వీ రామస్వామి, ఆరి్టస్టిక్ డైరెక్టర్, స్టెప్స్ డ్యాన్స్ ఇన్స్టిట్యూట్ ఇవిగో ఇలా.. ⇒ బాలీవుడ్, జుంబా లేదా ఫ్రీస్టైల్ కదలికలు అయినా, హార్ట్ బీట్ రేటును పెంచి కేలరీలను బర్న్ చేస్తాయి. ఇవి కార్డియో వ్యాయామానికి సమానం. ⇒ డ్యాన్స్లోని విభిన్న కదలికలు కాళ్లు, కోర్, చేతులు.. వీపుతో సహా బహుళ కండరాల సమూహాలను చైతన్యవంతం చేస్తాయి. మజిల్స్ బలోపేతం, టోనింగ్కి ఉపకరిస్తుంది. విభిన్న అవయవాల మధ్య సమన్వయం, చురుకుదనాన్ని మెరుగుపరుస్తుంది. ⇒ శారీరక ప్రయోజనాలకు మించి డ్యాన్స్ ఒత్తిడిని తగ్గించి మానసిక స్థితిని గణనీయంగా మెరుగుపరుస్తుంది. ⇒ నచ్చిన పాటలకు మొదలుకుని, జుంబా, హిప్హాప్, సల్సా, బ్యాలె వరకూ విభిన్న నృత్య రీతులను ఎంచుకోవచ్చు. ⇒కదలికలను గైడ్ చేయడానికి ఆన్లైన్ డ్యాన్స్ తరగతులు లేదా వీడియో ట్యుటోరియల్స్ వినియోగించవచ్చు. ⇒ఇష్టమైన సంగీతాన్ని ప్లే చేస్తూ.. జతగా స్నేహితులను లేదా కుటుంబ సభ్యులను కలుపుకోవచ్చు. సాధారణ దశలతో ప్రారంభించి నైపుణ్యంతో పాటు తీవ్రత పెంచాలి. ⇒నట్టింటి నృత్యం ఎన్నో రకాల ఉ్రత్పేరకంగా ఉంటుంది, ఎందుకంటే ఇందులో నియమాలు ఉండవు. కేవలం కదలికలు తప్ప ఇది భావోద్వేగాలను వ్యక్తపరచడంలో సహాయపడుతుంది. ఫుట్ ఫ్లెక్స్, పాయింట్, పాస్, రోండ్డిజాంబే (కాలు చుట్టూ) చైన్స్ (మలుపులు) వంటి కొన్ని సమకాలీన ప్రాథమిక అంశాలతో దీనిని స్టార్ట్ చేయవచ్చు. -
మా బీటే సపరేటు..
‘హాయ్ తెలుగు ట్రాక్ ప్లీజ్..’ కొన్నేళ్ల క్రితం ఈవెంట్స్, కేఫ్స్లో లైవ్ బ్యాండ్ని ఇలా అభ్యరి్థంచిన వ్యక్తిని.. మిగిలిన వాళ్లంతా ఎవరీ ఎర్రబస్సు అన్నట్టు చూసేవాళ్లు, బ్యాండ్ సభ్యులు నోటితో నవ్వేసి నొసటితో వెక్కిరించేవాళ్లు.. ఇదంతా గతం ఇప్పుడు క్లబ్లలో అత్యంత క్రేజీగా ఉండేనైట్స్ అంటే టాలీవుడ్ నైట్స్. బ్యాండ్ ఏదైనా సరే, ప్లేస్ ఏదైనా సరే ఏఆర్ రెహమాన్, ఇళయరాజా, డీఎస్పీ.. మ్యూజిక్ని వినిపించాల్సిందే.. తెలుగు ట్రాక్స్కి పేరొందిన కొన్ని నగర సంగీత బృందాల విశేషాలివి.. గరంలో తెలుగు లైవ్ మ్యూజిక్కు క్లాప్ కొట్టింది కాప్రిíÙయో. పేరొందిన ట్రాక్ల మాషప్లతో వీరు తెలుగు శ్రోతల మనసులు గెలుచుకున్నారు. నేటికీ సిటీ లైవ్ మ్యూజిక్ని ఈ బ్యాండ్ శాసిస్తోందని చెప్పొచ్చు. తరచూ తెలుగు సినీ ప్రముఖుల ప్రైవేట్ పారీ్టస్లో వీరు కనిపిస్తారు. దేశ విదేశాల్లోనూ ప్రదర్శనలిచి్చన ఈ బ్యాండ్ ఉరుములు నీ నవ్వులై, యమహానగరి కలకత్తా పురి, మధుర మీనాక్షి.. తదితర తెలుగు పాటలతో పాటు సొంత ట్యూన్స్తో ఎనిమిదేళ్లుగా నగర సంగీతాభిమానులను ఉర్రూతలూగిస్తోంది.మా థ్రియరీయే వేరు.. తొమ్మిది మంది సభ్యుల బ్యాండ్ థ్రియరీ, సితార్, తబలా వయోలిన్లతో రాక్ సంగీతానికి భారతీయ హంగులను జోడించడం ద్వారా ప్రత్యేకంగా ప్రసిద్ధి చెందింది. వీరి నుంచి రోజా, బొంబాయి వంటి సినిమాల్లో ప్రసిద్ధ వయోలిన్ ట్రాక్లను వినొచ్చు. పదేళ్ల క్రితం ప్రారంభమైన ఈ బ్యాండ్ తొలుత హిందీ, ఆంగ్ల సంగీతానికి పెద్ద పీట వేసినా.. ఇటీవలే తెలుగు, తమిళ సంగీతాన్ని కూడా అందిస్తోంది. ఫ్యూజన్ సంగీతాన్ని ఇష్టపడేవారికి థియరీ లైవ్ మ్యూజిక్ మంచి ఎంపిక. ఐఎన్సీఏ నుంచి బెస్ట్ లైవ్ యాక్ట్ బ్యాండ్ అవార్డును గెలుచుకోవడంతో పాటు 2018లో నగరంలో జరిగిన బ్రయాన్ ఆడమ్స్ ఈవెంట్లో వేదిక పంచుకోవడం, ఆ్రస్టేలియాలో సంగీత పర్యటన.. వంటివెన్నో వీరిని టాప్ బ్యాండ్స్లో ఒకటిగా మార్చాయి.పల్లె మసాలా.. రామ్ మిరియాల.. తెలుగు సినీ గీతాభిమానులకు చిరపరిచితమైన పేరు రామ్ మిరియాల. ఆయన తొలుత బ్యాండ్ చౌరస్తాలో ప్రధాన గాయకుడిగా పేరొందారు. సూపర్ హిట్ ప్రైవేట్ సాంగ్స్ అందించారు. అనంతరం సినిమాల్లోనూ రాణిస్తున్నారు. ప్రస్తుతం ఆయన సొంత బ్యాండ్ ఏర్పాటు చేసుకున్నారు. దాదాపు ప్రతి వారం నగరంలో ఎక్కడో ఒక చోట ఆయన బృందం ప్రదర్శన ఉంటుంది. డీజే టిల్లూ పేరు.. వీని స్టైలే వేరు.. దండకడియాల్.. వంటి ఆయన ట్రాక్లతో పాటు పల్లెదనానికి పట్టం గట్టే అనేక సొంత పాటలను కూడా వినిపిస్తారు. జానపదమిస్తా.. చౌరాస్తా.. గ్రామీణ, తెలుగు జానపదాలతో చౌరాస్తా ధ్వని చాలా ప్రత్యేకమైనది. వీరి సంగీత శైలి హృదయాన్ని తాకుతుంది. రెగె, జానపద, రెట్రో బ్లూస్ రాగాలను వీరి ద్వారా వినొచ్చు. మాయ, ఊరెళ్లిపోతా మామా, లక్ష్మమ్మో తదితర హిట్ సాంగ్స్ వీరి సొంతం. తమ రెగె స్టైల్ ట్రాక్లలో గోరేటి వెంకన్న పాటలు సహా ఉత్తేజపరిచే సంగీతానికి జీవం పోస్తారు. ముఖ్యంగా 80ల జానపద సంగీతాన్ని ఇష్టపడే వారికి నప్పే, నచ్చే బ్యాండ్ ఇది పార్టీస్కి డెక్కన్.. ‘హైదరాబాద్స్ పార్టీ బ్యాండ్’ అని పేరు తెచ్చుకుంది. డెక్కన్ ప్రాజెక్ట్ ఫంక్, బ్లూస్, రాక్, స్వింగ్ ప్రభావాలను మిక్స్ చేస్తుంది. ఈ బ్యాండ్ సభ్యులు కళాశాల చదువుల నుంచి స్నేహితుల బృందంగా కొనసాగుతున్నారు. ప్రైవేటు ఉద్యోగాలు చేస్తూనే తమ సంగీత కలలను సాకారం చేసుకుంటున్నారు. పెత్తరప్, కుర్రలు, హమ్మా హమ్మా.. ఇంకా ఎన్నో పాటలు వీరు అందిస్తారు. ఏడేళ్ల వయసున్న ఈ బ్యాండ్ చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా ప్రత్యేక ప్రదర్శన ఇవ్వడం విశేషం. అలాగే రామ్చరణ్ ఆస్కార్ పారీ్టలోనూ వీరు మ్యూజిక్ అందించారు. -
ఖేలో.. అమెరికన్ ఫ్లాగ్ ఫుట్బాల్
ఎన్నో విశిష్టతలున్న భాగ్యనగరం అంతర్జాతీయ క్రీడల్లోనూ తన ప్రశస్తిని కొనసాగిస్తుంది. ముఖ్యంగా క్రికెట్, టెన్నిస్ వంటి ప్రజాధరణ ఉన్న క్రీడలతో పాటు బ్యాడ్మింటన్ వంటి క్రీడలతో దేశానికి ఒలింపిక్స్ మెడల్స్ అందించిన ఘనత నగరానికి ఉంది. ఇదే కోవలో మరిన్ని అంతర్జాతీయ క్రీడలు నగరంలో రాణిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికన్ ఫుట్బాల్ సైతం ఈ మధ్య తన ప్రశస్తిని పెంచుకుంటుంది. నగరవాసులు అమెరికన్ ఫుట్బాల్పై ఆసక్తి పెంచుకుంటున్నారు. ఈ ఆదరణ దృష్ట్యా తెలంగాణ అమెరికన్ ఫుట్బాల్ అసోసియేషన్ ప్రారంభమై ఈ క్రీడ అభివృద్ధికి తోడ్పాటునందిస్తుంది. అమెరికన్ ఫుట్బాల్ క్రీడను నగరంతో పాటు రాష్ట్రంలో మరింత అభివృద్ధి చేసేందుకు అమెరికన్ ఫుట్బాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అనుబంధ సంస్థ అయిన తెలంగాణ అమెరికన్ ఫుట్బాల్ అసోసియేషన్ (టాఫా) కృషి చేస్తుంది. ఇందులో భాగంగా 2025–28 మధ్య కాలానికి అధ్యక్షుడిగా చాగన్ల బల్వీర్ందర్ నాథ్ను నియమించింది. తెలంగాణ రాష్ట్రంలో అమెరికన్ ఫుట్బాల్, ఫ్లాగ్ ఫుట్బాల్ ప్రోత్సహించి, ఒలింపిక్స్ వేదికల పై మన క్రీడాకారుల నైపుణ్యాలను ప్రదర్శించడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నారు. అమెరికా వంటి దేశాల్లో అత్యంత ప్రజాదరణ పొందిన క్రీడగా ఈ అమెరికన్ ఫుట్బాల్ ప్రసిద్ధి చెందింది. సాకర్, రగ్బీ నుంచి వచ్చిన ఈ గేమ్ 2022లో లీగ్ వార్షిక ఆదాయం 18.6 బిలియన్ డాలర్లుగా నమోదు చేసి ప్రపంచంలోనే విలువైనస్పోర్ట్స్ లీగ్లో భాగంగా చేరింది. రాష్ట్ర వ్యాప్త గుర్తింపు దిశగా..ఈ క్రీడను హైదరాబాద్తో పాటు రాష్ట్రవ్యాప్తంగా వృద్ధిలోకి తీసుకురావడమే లక్ష్యంగా కృషి చేస్తున్నాం. దీని కోసం ప్రత్యేకంగా అన్ని పట్టణాల్లో, జిల్లాల్లో శిక్షణా శిబిరాలను ఏర్పాటు చేసి, వారికి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అవకాశాలను కల్పిస్తాం. ఈ ప్రయత్నంలో భాగంగా అసోసియేషన్స్, క్లబ్స్ ఏర్పాటు చేయనున్నాం. మరో రెండేళ్లలో నగరంలోని గచ్చిబౌలి స్టేడియం వేదికగా అంతర్జాతీయ స్థాయి లీగ్ను నిర్వహించాలని ప్రణాళికలు రూపొందిస్తున్నాం. ఇందులో దాదాపు 22 దేశాలను భాగం చేస్తున్నాం. యూనివర్సిటీలు, కాలేజీలు, స్కూల్స్లో ఔత్సాహిక క్రీడాకారులకు, యువతకు ప్రత్యేక శిక్షణ అందించనున్నాం. టాఫా ప్రధాన కార్యదర్శి సుధాకర్ రావు నడిపల్లి, ఏఎఫ్ఎఫ్ఐ సీఈఓ సందీప్ చౌదరి వంటి దార్శనికుల ప్రణాళికలతో ముందుకు సాగుతున్నాం. త్వరలో రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి ప్రభుత్వ ప్రోత్సాహాన్ని అందించాలని కొరనున్నాం. – చాగన్ల బల్వీర్ందర్ నాథ్, టాఫా అధ్యక్షులు.అమెరికన్ ఫుట్బాల్ గేమ్లో కాంటాక్ట్, నాన్కాంటాక్ట్ అనే ఈ విభాగాల్లో పోటీ ఉంటుంది. నాన్ కాంటాక్ట్ విభాగంలోని ఫ్లాగ్ గేమ్ ఇక్కడ అభివృద్ధిలో ఉంది. రగ్బీలా ఇందులో మ్యాన్ పుల్లింగ్ ఉండదు. నేను 13 ఏళ్ల నుంచి ఈ గేమ్ ఆడుతున్నాను. అంతేకాకుండా ఇండియన్ ఫ్లాగ్ ఫుట్బాల్ కెప్టెన్గా వ్యవహరిస్తున్నాను. ఇప్పటి వరకూ తెలంగాణ రాష్ట్రం నాలుగు నేషనల్స్ గెలిచింది. 2028 ఒలింపిక్స్ లక్ష్యంగా ప్రస్తుతం సన్నద్ధమవుతున్నాం. ఇందులో స్థానిక క్రీడాకారులను భాగం చేసేందుకు టాఫా ఆధ్వర్యంలో కృషి చేస్తున్నాం. అంతర్జాతీయ స్థాయి మాదిరిగా ఇక్కడ కూడా ఈ క్రీడకు పాపులారిటీ తీసుకురానున్నాం. – జీవీ మణికంఠ రెడ్డి, ఇండియన్ ఫ్లాగ్ ఫుట్బాల్ కెప్టెన్ -
అందాల ఆతిథ్యం..! విశ్వసుందరి జన్మించిన నగరంలో పోటీలు..
నగరంలో ఫ్యాషన్, గ్లామర్ ప్రపంచం సరికొత్త సందడి పులుముకుంది. ఈవెంట్స్ రంగం ఉత్సాహంతో ఉరకలేస్తోంది. తొలిసారిగా మిస్ వరల్డ్ పోటీలు తెలంగాణ రాష్ణంలోని హైదరాబాద్ నగరంలో నిర్వహించనున్నట్లు నిర్వాహకులు ప్రకటించడమే ఈ సందడికి కారణం. ప్రపంచస్థాయి అందాల పోటీకి ఆతిథ్యం ఇచ్చే అవకాశం రావడం భాగ్యనగరంలోని ఫ్యాషన్ రంగానికి చెందిన ఔత్సాహికులకు కలర్ ఫుల్ కలలకు ఊతమిస్తోంది. ప్రపంచ సుందరి పోటీలకు ఆతిథ్యం ఇవ్వడం నగరానికి మరింత గ్లోబల్ లుక్ తెచి్చపెడుతోంది. మొత్తం 120 దేశాలు పాల్గొనే ఈ అతిపెద్ద ఈవెంట్ దాదాపు నెల రోజుల పాటు నగర కేంద్రంగా జరగడం వల్ల అంతర్జాతీయంగా ఖ్యాతి పొందనుంది. ముఖ్యంగా ఇప్పటి వరకూ జరగని స్థాయిలో అంతర్జాతీయ ఫ్యాషన్, మోడలింగ్ రంగాలను నగరం ఆకర్షిస్తోంది. తద్వారా నగరంలో ఔత్సాహిక యువతకు అవకాశాలు విస్తరిస్తాయి. అదే విధంగా నగరం, చుట్టుపక్కల చారిత్రక ప్రదేశాలు, సంప్రదాయ హస్తకళలు ప్రపంచం దృష్టికి రానున్నాయి. ఇప్పటికే పలు చిత్రాల ద్వారా అంతర్జాతీయ ఖ్యాతిని అందుకున్న నగరం టాలీవుడ్ పరిశ్రమకు సైతం మరింత ఊపునివ్వనుంది. గొప్ప విశేషం.. ఎందరో యువత కల.. హైదరాబాద్ దేశంలోనే ఓ గొప్ప నగరంగా ఎదుగుతోంది. ఫ్యాషన్ రంగానికి సంబంధించి ఇది ప్రారంభం మాత్రమే. ఇలాంటివెన్నో నిర్వహించగల సామర్థ్యం నగరానికి ఉంది. ఒకనాటి బ్యూటీ కాంటెస్ట్ విజేతగా.. ప్రపంచ వ్యాప్తంగా ఎందరో అందమైన యువతులకు మన నగరం వేదిక కావడాన్ని చూసే రోజు కోసం ఎంతో ఉది్వగ్నంగా ఎదురుచూస్తున్నాను. – శిల్పారెడ్డి, మాజీ మిసెస్ ఇండియా బ్యూటీ ఈవెంట్స్ కేంద్రంగా.. గత కొంత కాలంగా బ్యూటీ క్వీన్స్కు మాత్రమే కాదు బ్యూటీ ఈవెంట్స్కు సైతం చిరునామాగా మారుతోంది. నగరానికి చెందిన శిల్పారెడ్డి మొదలుకుని గత ఏడాది సుష్మ తొండేటి వరకూ మిసెస్ ఇండియా కిరీటాన్ని నగరవాసులు ఎందరో గెలుచుకున్నారు. ఇక మానసా వారణాసి వంటివారు మిస్ ఇండియా కిరీటాలను తీసుకొచ్చారు. పూనమ్ కౌర్, మధుశాలిని వంటి మిస్ హైదరాబాద్లు అనంతరం సినీతారలుగా రాణించారు. నగరంలోని కళాశాలల నుంచి క్లబ్స్ వరకూ బ్యూటీ కాంటెస్ట్లను నిర్వహిస్తున్నాయి.ఈ తరహా ఈవెంట్లకు మరింత ప్రొఫెషనలిజాన్ని మిస్ వరల్డ్ అందించడం తధ్యం. ఏదేమైనా విశ్వనగరంగా మారుతున్న హైదరాబాద్కు ప్రపంచ సుందరి పోటీలు రావడం సమయోచితం అని చెప్పాలి. (చదవండి: ఆరోగ్య ప్రయోజనాలందించే బెస్ట్ చట్నీలివే..!) -
ఇంటీరియర్.. ఇదో ట్రెండ్
ఈ తరం.. సాధారణ జీవనానికి భిన్నంగా.. వినూత్నమైన, విభిన్నమైన పంథాను, జీవనసరళిని కొనసాగించడం ట్రెండ్గా మారింది. ఇందులో భాగంగానే అధునాతనాన్ని అందిపుచ్చుకుంటూ నగర జీవనశైలికి కూడా అప్డేట్ అవుతూనే ఉంది. ప్రధానంగా ఇంటీరియర్ డిజైనింగ్ ఈ దశాబ్ద కాలంలో కొత్తపుంతలు తొక్కుతోంది. సామాన్య మధ్యతరగతి కుటుంబాలు మొదలు విలాసవంతమైన ఇళ్ల వరకు ఈ ట్రెండ్ కొనసాగుతోంది. నిత్యం ఉండే ఇంటిలో కనీసం ఏదో ఒక ప్రత్యేకత, ఆకర్షణీయ అంశం ఉండాలని కోరుకుంటున్నారు. ప్రొఫెషనల్గా, వ్యక్తిగతంగా అభిరుచికి తగ్గట్టు ఇంటిని మలుచుకుంటున్నారు. కొందరు కన్స్ట్రక్షన్ నుంచే ఇంటీరియర్ను ప్లాన్ చేసుకుంటున్నారు. ఇంటీరియర్ డిజైనింగ్ అనేది విలాసవంతమైన జీవనాన్ని కొనసాగించే వారి సంస్కృతి అని చాలా మంది భావిస్తుంటారు. కానీ ఇది మానమూలాల్లోనే ఉంది. దానికి అధునాతన సొగసులు ఈ మధ్య అద్దుతున్నారని ఓ ఇంటీరియన్ డిజైనర్ అంటున్నారు. గతంలో ఇళ్లలో అరుదైన పెయింటింగ్, పురాతనమైన వస్తువు లేదా ఇతర ఔరా అనిపించే వస్తువులతో అలంకరించుకునే వారు. నగర జీవనంలో ఈ సంస్కృతి అప్డేట్ అవుతూనే ఇంటీరియర్ డిజైనింగ్ మారిందని ఈ రంగంలోని నిపుణులు చెబుతున్నారు. ఈ మధ్య కాలంలో ఇంటీరియర్ డిజైనింగ్ అంటే.. విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న ఆకర్షణీయమైన వస్తువులు, స్థానికంగా లభించే అందమైన కళాకృతులు, వేలాడే లైట్లు, కిటికీల పరదాలు, టీ పాయ్ సొగసులు.. ఇలా ఇంటీరియర్కేది అనర్హం అనేంతలా ఎన్నెన్నో హంగులు అద్దుకున్నాయి.మోడ్రన్ క్రిస్టల్ ఆర్ట్స్పై ఆసక్తి ముఖ్యంగా ఇంటిలోపలికి రాగానే అవాక్కవ్వాలనేది అందరి ఆశ.. దీని కోసం అరుదైన గ్లాస్, బ్రాంజ్, పింగానీ ప్రతిమలను నగరంలో విరివిగా వాడుతున్నారు. దేశంలోని విభిన్న ప్రాంతాలకు చెందిన ఆదివాసీలు, గిరిజనులు తయారు చేసిన హ్యండ్మేడ్ కళాకృతులు, ఈ తరానికి చెందిన మోడ్రన్ క్రిస్టల్ ఆర్ట్స్ పైన ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. నూలు ధారాల అల్లికలతో నేసిన పరదాలు, డిజైన్స్, హ్యంగింగ్స్ వంటివి కూడా ఇష్టపడుతున్నారు. నగర అధునాతన జీవన శైలిలో దిగుమతి చేసుకున్న అరుదైన, అందమైన ఇంటీరియర్స్కు ఎంత ప్రాముఖ్యత ఉందో.. స్థానిక సహజ ఉత్పత్తులు, ఎకో ఫ్రెండ్లీ డిజైనింగ్ వేర్, ఆర్గానిక్ సౌందర్య వస్తువులు, అల్లికలు, చేతివృత్తుల వస్తువులకూ అంతకన్నా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుండటం విశేషం. ఇందులో భాగంగానే అంబానీ కుటుంబానికి చెందిన వ్యాపార సౌదం స్వదేశ్ స్టోర్స్, ఆదిత్య బిర్లాకు చెందిన జైపూర్ స్టోర్స్ వంటివి నగరంలో వెలిశాయి. ఇలాంటి అతిపెద్ద వ్యాపార సంస్థలకు హైదరాబాద్ నగరం కేంద్ర బిందువుగా మారడంలో.. నగరవాసుల ఇంటీరియర్ ఆసక్తి మరింత పెరిగింది.చిన్న చిన్న షాపులు హైదరాబాద్ నగరం ఘనమైన చరిత్రకు సాక్ష్యం. ఈ ప్రశస్తిని కొనసాగిస్తూనే ఇప్పటికీ కొందరు నగరవాసులు అరుదైన యాంటిక్ వస్తువులను తమ ఇళ్లలో ప్రదర్శిస్తున్నారు. ఈ వస్తువులను అమ్మడానికి నగరంలోని ఓల్డ్సిటీతో పాటు బంజారాహిల్స్, జూబ్లిహిల్స్ వంటి ప్రాంతాల్లో ప్రత్యేకంగా షాప్లు ఉన్నాయి. ఇందులో లక్షల్లో అమ్మే షాపులు మొదలు కేవలం రూ.వంద వస్తువులు సైతం లభించే చిన్న చిన్న షాపులున్నాయి. ఇంటీరియర్ మొక్కలను పెంచుతూ.. కాలుష్యరహిత వాతావరణంతో పాటు ఆహ్లాదమైన అనుభూతిని పొందాలనుకునే ప్రకృతి ప్రేమికులు తమఇళ్లలో ఇంటీరియర్ మొక్కలను పెంచుతూ తమ విభిన్న జీవనశైలిని ప్రదర్శిస్తున్నారు. ఇందులో చిన్న సైజు ఆర్కిడ్ మొక్కలు మొదలు పెద్దగా పెరిగే ఆర్నమెంటల్ మొక్కల వరకు ఉన్నాయి. మెయిన్ హాల్, టీ పాయ్, డైనింగ్ టేబుల్, హ్యాంగింగ్ మొదలు విభిన్న హంగులతో ఈ ఇంటీరియర్ డిజైనింగ్ మొక్కలు నగరంలో లభిస్తున్నాయి. ప్రత్యేక ఆసక్తితో..ఇంటీరియర్ డిజైన్ ప్రతి ఇంట్లో ఒక ముఖ్యమైన అంశంగా మారింది. వ్యక్తిగత శైలి, సౌకర్యాన్ని ప్రతిబింబించేలా ఇంటిని, పిల్లల గదులు, అతిథి గదులను అలంకరించడంలో ప్రత్యేక ఆసక్తిని చూపిస్తున్నారు. ఫరి్నచర్తో పాటు ఇండోర్ జలపాతాలు, బుద్ధుడు, వినాయక విగ్రహాలు.. ఆకర్షణీయమైన లైటింగ్, సుగంధ ధూపం కర్రలతో దైవిక వాతావరణం కోసం అలంకరించుకుంటున్నారు. టీవీ యూనిట్లు, ఖరీదైన సోఫాలు, డైనింగ్ టేబుళ్లు, ఆధునిక గృహాలను విలాసవంతంగా మార్చుకుంటున్నారు. – ఫిరోజ్ సయ్యద్, ఎంఅండ్పీ ఇంటీరియర్స్ వ్యవస్థాపకులు -
పర్యాటకంలో సత్తా చాటుతున్న భాగ్యనగరం
చార్మినార్, గోల్కొండ కోట, కుతుబ్ షాహీ టూంబ్స్ తదితర ల్యాండ్ మార్కుల ద్వారా అందివచి్చన గొప్ప సాంస్కృతిక వారసత్వం, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి నిలయంగా ప్రపంచ వేడుకలకు చిరునామాగా మారిన ఆధునిక తత్వం వెరసి ప్రపంచ పర్యాటకులకు నగరాన్ని గమ్యస్థానంగా మారుస్తున్నాయి. ఇవే కాకుండా భారీ సినిమాల తయారీ కేంద్రంగా కళలు, ప్రసిద్ధ వంటకాలు కూడా వృద్ధికి ఊతమిస్తున్నాయి. తాజాగా ప్రభుత్వం రూపొందించిన పర్యాటక పాలసీ నగరంతో పాటు రాష్ట్ర వ్యాప్త పర్యాటకాభివృద్ధికి మరింత దోహదం చేయనుంది. ఈ నేపథ్యంలో నగర పర్యాటక రంగ వృద్ధి విశేషాలపై ఓ విశ్లేషణ. నగర పర్యాటక అభివృద్ధిలో బిజినెస్ టూరిజమ్ కీలక పాత్ర పోషిస్తోంది. అంతర్జాతీయ కంపెనీలు, పెట్టుబడుల రాకతో ప్రపంచ స్థాయి వాణిజ్య సదస్సులు, సమావేశాలకు వేదికగా, వ్యాపార పర్యాటకానికి నగరాన్ని ప్రధాన గమ్యస్థానంగా మార్చాయి. అదే విధంగా శరవేగంగా వృద్ధి చెందుతున్న ఆరోగ్య వసతులు, కార్పొరేట్ ఆస్పత్రులు విదేశాలతో పోలిస్తే అందుబాటులోనే ఉన్న వైద్య సేవల వ్యయం నగరాన్ని ఆరోగ్య పర్యాటకానికి రాజధానిగా మారుస్తున్నాయి. మెట్రో టు.. ఎయిర్ ట్రా‘వెల్’.. నగర పర్యాటక వృద్ధికి నిదర్శనంగా నిలుస్తోన్న రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం 72 దేశీయ, 18 అంతర్జాతీయ ప్రయాణ గమ్యస్థానాలకు ప్రయాణ సౌకర్యాలను అందిస్తోంది. గత 2023–24లో నగరం నుంచి సుమారు 20లక్షల మంది అమెరికా, యుకేలకు ప్రయాణించారు. ఇందులో గణనీయమైన భాగం విద్యార్థులు, నిపుణులు ఉన్నారు. ప్రయాణికుల సంఖ్య 2021లో 8 లక్షల నుంచి 2022లో 12.4 లక్షలకు, 2023లో దాదాపు 21 లక్షలకు, 2024లో దాదాపు 25 లక్షలకు పెరిగింది. ఇది సుమారు 45.6% సమీకృత వార్షిక వృద్ధి రేటుగా సూచిస్తుంది. ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) డేటా ప్రకారం.. 2023 ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ 2024 వరకూ చూస్తే.. దేశంలోని టాప్ 5 మెట్రో నగరాల్లో ప్రయాణికుల రద్దీ పరంగా సిటీ అత్యధిక వృద్ధి సాధించింది. నగరం 11.7% పెరుగుదలను సాధించగా బెంగళూరు (10.1%) ముంబై (4%), కోల్కతా 9.7%, చెన్నై 3.3 శాతంతో వెనుకబడ్డాయి. ఫుల్.. హోటల్స్.. ప్రస్తుతం, రాష్ట్రంలో త్రీ స్టార్, ఫైవ్ స్టార్ హోటల్స్ పరంగా చూస్తే.. 7,500 గదులు అందుబాటులో ఉన్నాయని అంచనా. వీటిలో మన హైదరాబాద్ నగరంలోనే 5,000 వరకూ ఉన్నాయి. రాజధాని నగరంలో అడుగుపెట్టిన వారి సంఖ్య ఏడాదిలో 16 శాతానికి పైగా పెరిగిందని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. నగరంలోని ఐటీ కారిడార్లోని హోటళ్లు దాదాపు 80 శాతం ఆక్యుపెన్సీతో కళకళలాడుతున్నాయని తెలంగాణ హోటల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వెంకట రెడ్డి చెబుతున్నారు. దేశీయ పర్యాటకులు 2021–22లో 3.2 లక్షల మంది, 2022–23లో 6.07 లక్షల మంది తెలంగాణను సందర్శించారని, 89.84 శాతం పెరుగుదల నమోదు చేసిందని లెక్కలు చెబుతున్నాయి. ఇదే కాలంలో విదేశీ పర్యాటకులు 5,917 నుంచి 68,401 (10–56.01 శాతం)కి పెరిగారని గణాంకాలు చెబుతున్నాయి. ఈ వృద్ధిలో సింహభాగం నగరానికే దక్కుతుందనేది తెలిసిందే.రానున్నాయ్ ఆకర్షణలెన్నో.. ముంబయిలో జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్ను నెలకొల్పే ముందు వరకూ కూడా భారీ స్థాయి సమావేశాలకు నగరంలోని హెచ్ఐసీసీ ప్రముఖ గమ్యస్థానంగా ఉంది. అయితే ప్రతిపాదిత ఫ్యూచర్ సిటీలో 10,000 సీట్ల సామర్థ్యం గల కన్వెన్షన్ సెంటర్ను అభివృద్ధి చేయనున్నారు. ఇది ఎమ్ఐసీఎఫ్ సెగ్మెంట్లో నగరాన్ని తిరిగి అగ్రస్థానంలో ఉంచుతుందని ప్రభుత్వాధినేతలు చెబుతున్నారు. ఇటీవలే హుస్సేన్ సాగర్లో వాటర్ స్పోర్ట్స్ను ప్రారంభించారు. దుబాయ్ తరహా షాపింగ్ మాల్స్ సహా ఇంకా మరెన్నో ఆకర్షణలు నగర పర్యాటకానికి మరింత ఊపు తేనున్నాయి.నగరం వెలుపల కూడా.. నగరంలోని చారిత్రాత్మక కట్టడాలతో పాటు సాలార్ జంగ్ మ్యూజియం, నిజాం మ్యూజియం, లాడ్ బజార్ వంటివి హిస్టారికల్ టూరిజం వృద్ధికి దోహదం చేసే విశేషాలుగా నిలుస్తున్నాయి. ఇక నగరానికి కాస్త దూరంలోనే ఉన్న యాదాద్రి, బాసర, నల్గొండ, మెదక్, రామప్ప, ఆలంపూర్, వేములవాడ, కాళేశ్వరం.. వంటి చోట్ల స్పిరిట్యువల్ టూరిజం వృద్ధికి కారణంగా నిలుస్తున్నాయి. అలాగే పోచంపల్లి, గద్వాల్, నారాయణ పేట్ వంటివి సంప్రదాయ హస్తకళల పట్ల ఆసక్తి కలిగిన పర్యాటకులను ఆకట్టుకుంటున్నాయి. -
Hyderabad: మార్చి.. ఏమార్చి..
ఒకప్పుడు ఓ మామూలు కారు కొంటే, ఉంటే గొప్ప.. ఇప్పుడు ఖరీదైన కారు కొంటే.. అది అందరికన్నా భిన్నంగా ఉంటేనే గొప్ప.. రూ.లక్షలు, కోట్లు పెట్టి కారు కొనడం మాత్రమే కాదు దానిని మరింత స్టైల్గా చూపించాలనే తాపత్రయంతో కొందరు రకరకాలుగా అలంకరణలు చేస్తున్నారు. బైకర్స్ సైతం అంతే.. ఖరీదైన బైక్స్ కొనడంతో పాటు ‘మోడిఫైడ్’ మోజులో పోలీసు కేసుల బారిన పడుతున్నారు. గత నెల 11న మితిమీరిన వేగంతో కారు నడుపుతున్నందుకు ఓ మెర్సిడీస్ బెంజ్ కారుపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఆ కారు యజమాని అంతటితో సరిపుచ్చలేదు. ఒరిజినల్ రంగు అయిన పోలార్ వైట్ కలర్ నుంచి మెర్సిడీస్ను మల్టీకలర్ వాహనంగా మార్చినందుకు మరో కేసు నమోదు చేశారు. జూబ్లీహిల్స్ కారు యజమానితో పాటు మోడిఫికేషన్ చేసిన సదరు వర్క్షాపుపై కూడా మోటారు వాహన చట్టం సెక్షన్ 182–ఎ(1) కింద అభియోగాలు నమోదయ్యాయి. ఇక బైకర్స్ పైన ఇలాంటి కేసులకు కొదవే లేదు. తప్పు మాత్రమే కాదు ముప్పు కూడా.. ‘అనేక మంది వాహనదారులు చట్టాన్ని పాటించడం లేదు. ఇష్టానుసారం వాహనాల ఫీచర్లను మార్చుకుంటున్నారు. అలాంటి మార్పు చేర్పులు తప్పు మాత్రమే కాదు, ముప్పు కూడా’ అని నేషనల్ రోడ్ సేఫ్టీ కౌన్సిల్ సభ్యుడు డాక్టర్ కమల్ అంటున్నారు. వాహన తయారీదారులు నిర్దిష్ట మోడల్ను ఉత్పత్తి చేయడానికి అధికారుల నుంచి చట్టపరమైన అనుమతులు తీసుకుంటారు. అలా తయారైన మోడల్ను ట్యాంపరింగ్ చేయడం వల్ల వాహనం దాని ఒరిజినల్ కొలతలు, ఏరోడైనమిక్లను కోల్పోవచ్చు. తద్వారా అది నడిపేవారితో పాటు ఇతరులకూ ప్రమాదకరంగా మారవచ్చు’ అని నిపుణులు అంటున్నారు. ‘వాహనం రంగు మార్చడానికి చట్టపరమైన అనుమతి పొంది, రిజి్రస్టేషన్ సరి్టఫికెట్లో కొత్త రంగు ప్రతిబింబించాలి. బైకర్స్ తమ సైలెన్సర్లు, టెయిల్ ల్యాంపులను మారుస్తారు, ఈ మార్పులు ఇతరులకు అసౌకర్యాన్ని కలిగిస్తాయి’ అని ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ రోడ్ సేఫ్టీ ముఖ్య కార్యకర్త వినోద్ చెబుతున్నారు. ఏదైనా వాహనం ఇంటీరియర్స్ లేదా ఎక్స్టీరియర్స్ సవరించడం చట్టవిరుద్ధం. తస్మాత్ జాగ్రత్త.. వాహన మార్పుల వల్ల వాహనానికి ఏదైనా నష్టం జరిగితే తయారీదారు వారంటీ చెల్లదు. కార్ల యజమానులు తరచూ చేసే మార్పుల్లో లేతరంగు విండోస్ ఒకటి. దీని వల్ల విండోస్ 25% కంటే తక్కువ లైట్ ట్రాన్స్మిషన్ స్థాయిని కలిగి ఉండటం వల్ల ఇతర వాహనాలను గమనించే సామర్థ్యాన్ని అడ్డుకుంటుంది. మార్పుల వల్ల కొన్ని వాహనాల పనితీరు మందగిస్తుంది. కొందరు యజమానులు తమ వాహనాన్ని వీలైనంత మేర మోడిఫై చేస్తుంటారు. దీనివల్ల భారీగా నష్టపోయే ప్రమాదం ఉంది. సస్పెన్షన్ అప్గ్రేడ్లు, టర్బోచార్జ్ జోడించడం, స్పోర్ట్స్ సీట్లను ఇన్స్టాల్ చేయడం వంటి మార్పులు చేస్తుంటారు. ఇవి వాహన పనితీరును దెబ్బతీస్తాయి.మనం కొన్న కారే కానీ.. ఎంత చెట్టుకు అంత గాలి అన్నట్టే ఎంత డబ్బు ఉంటే అంత కారు కొనుక్కోవచ్చు తప్పులేదు. కానీ.. ఎంత ఖర్చు పెట్టి కొన్న కారైనా, బైక్ అయినా మన ఇష్టం వచ్చినట్టు మార్పులు, చేర్పులు చేసుకుంటామంటే చట్టం ఒప్పుకోదు. వాహనం రంగు కావచ్చు, రూపంలో కావచ్చు.. ఏవైనా మార్పు చేర్పులను చేయాలంటే ప్రాంతీయ రవాణా కార్యాలయం వాటిని ఆమోదించాలి. సరైన విధంగా డాక్యుమెంట్ చేయాలని అధికారులు చెబుతున్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కేసుల బారిన పడక తప్పదని హెచ్చరిస్తున్నారు. చట్టం ఏం చెబుతోంది..? వాహనంలో అనధికారిక మార్పులు చేసినట్లు తేలితే.. ఒక సంవత్సరం వరకూ జైలు శిక్షతో పాటు రూ.లక్ష వరకూ జరిమానా లేదా రెండూ విధించే అవకాశం ఉంటుంది. ఆర్టీఏ నుంచి అనుమతి లేకుండా మార్పులు చేసిన వాహనాలను సీజ్ చేసే అధికారం ఉందని ట్రాఫిక్ పోలీసులు స్పష్టం చేస్తున్నారు. వాహనాల రూపాన్ని, పనితీరును మెరుగుపరచడానికి కొన్నింటికి మాత్రమే అనుమతులు ఉంటాయి. దాని లోబడి అలాంటి మార్పులు చేసుకోవచ్చు. కార్లు లేదా మోటార్ సైకిళ్లకు అదనపు పరికరాలను అమర్చడం లేదా ధ్వనులను మార్పు చేయడం వంటివి మోటారు ట్రాఫిక్ చట్టాల ఉల్లంఘన కిందకే వస్తుందని అధికారులు చెబుతున్నారు.ఎలాంటి మార్పులూ చేయకూడదు.. ఓ వాహనాన్ని తయారీ దారుడు మార్కెట్లోకి పంపేముందు సంబంధిత శాఖల నుంచి అనుమతులు తీసుకుంటాడు. భద్రతతో పాటు ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకుని ఆ వాహనం బరువు, రూపం, తదితరాలను ఖరారు చేస్తారు. అలా వచి్చన వాహనానికి ఎలాంటి మార్పులూ చేయకూడదు. దీంతో పాటు నెంబర్ ప్లేట్స్, సైలెన్సర్స్ మార్చడం వంటివి చేయకూడదు. విండ్ షీల్డ్స్, విండో గ్లాసులకు బ్లాక్ ఫిల్మ్స్ తగిలించకూడదు. వీటిలో ఎటువంటి ఉల్లంఘనకు పాల్పడినా మోటారు వాహనాల చట్టం ప్రకారం చర్యలు ఉంటాయి. తీవ్రతను బట్టి జరిమానా, కేసు, ఛార్జిషిట్ వంటి చర్యలు ఉంటాయి. – జి.శంకర్రాజు, ఏసీపీ, నార్త్ జోన్ ట్రాఫిక్ విభాగం -
రైట్.. రైట్.. మిల్లెట్ డైట్
దేశ ప్రధాని నరేంద్ర మోదీ 2023ను అంతర్జాతీయ మిల్లెట్స్ సంవత్సరంగా ప్రకటించడం నుంచి తాము స్ఫూర్తి పొంది మిల్లెట్స్ నేషనల్ పోర్టల్(డబ్ల్యూ.డబ్ల్యూ.డబ్ల్యూ.మిల్లెట్ న్యూస్ డాట్కామ్) ఏర్పాటు చేశామని, దీనిని నగరంలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్స్ రీసెర్చ్ డైరెక్టర్ డాక్టర్ సి.తారా సత్యవతి అధికారికంగా ప్రారంభించారని పోర్టల్ నిర్వాహకులు బిజినెస్ మెంటర్, డిజిటల్ మార్కెటింగ్ ట్రైనర్ శ్రీనివాస్ సరకదం తెలిపారు. ఏకకాలంలో 100 మిల్లెట్ స్టోర్లను నగరం వేదికగా ప్రారంభించిన సందర్భంగా ఆయన సాక్షితో మాట్లాడుతూ తమ కార్యక్రమం వివరాలను ఇలా వెల్లడించారు. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే..ఆరోగ్య అవగాహన కోసం.. చిరుధాన్యాలు ఆరోగ్యానికి ఏ రకమైన ప్రయోజనాన్ని అందిస్తాయి? ఏ వ్యాధులను దూరం చేస్తాయి? తదితర విషయాలు తెలియజేసేందుకు హెల్త్ అండ్ న్యూట్రిషన్ అంబాసిడర్స్(హెచ్ఎన్ఏ) కౌన్సిల్ను స్థాపించాం.. ఇది ప్రస్తుతం 50 మంది వైద్యులను కలిగి ఉంది. ఈ సంవత్సరాంతానికి వెయ్యి మంది సభ్యులకు విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఈ కౌన్సిల్ మిల్లెట్ స్టోర్ యజమానులతో కలిసి పని చేస్తుంది. సహకారంలో భాగంగా.. మిల్లెట్ స్టోర్ యజమానులు పోషకాహార నిపుణులు వైద్యుల నుంచి నిరంతర మార్గదర్శకత్వాన్ని అందుకుంటారు. అలాగే.. స్టోర్ యజమానులకు అవసరమైన శిక్షణ, మద్దతు నిరంతరం అందిస్తాం. బీపీ, డయాబెటిస్, బీఎమ్ఐ అసెస్మెంట్లను కవర్ చేసే బేసిక్ హెల్త్ చెకప్ ట్రైనింగ్ సెషన్లను శనివారం నిర్వహించాం. ఈ సెషన్లను పోషకాహార నిపుణుడు ఓ.మనోజ ప్రకృతి వైద్యురాలు డాక్టర్ మోనికా స్రవంతి సారథ్యం వహించారు. కొత్త చిరుధాన్యాల గుర్తింపు.. దేశంలోని 50 అధిక–నాణ్యత గల మిల్లెట్ ఉత్పత్తులను మార్కెట్లోకి ప్రవేశపెట్టాం. ఇవి ఇప్పుడు కొత్తగా ప్రారంభించబడిన స్టోర్ల ద్వారా అందుబాటులో ఉంటాయి. పెద్దగా పెట్టుబడి పెట్టలేని వారు సైతం వ్యాపారులుగా మారడానికి వీలుగా, మిల్లెట్ స్టోర్ ఏర్పాటుకు ప్రారంభ పెట్టుబడిని తగ్గించగలిగాం. తమ వ్యాపారాన్ని కనీస పెట్టుబడి రూ.85 వేలతోనే ప్రారంభించవచ్చు. ఇందులో 50 మిల్లెట్ ఉత్పత్తులు, బిల్లింగ్ మెషిన్, ఆరోగ్య అవగాహన కంటెంట్ను ప్రదర్శించడానికి టీవీ సెటప్, బ్యానర్లు, బ్రోచర్లు, వెబ్సైట్, హెల్త్ చెకప్ కిట్ బ్రాండింగ్ మెటీరియల్ సైతం అందిస్తాం. 100 మిల్లెట్ స్టోర్ల ప్రారంభం.. తెలుగు రాష్ట్రాల్లో నెలకొల్పిన 100 మిల్లెట్ స్టోర్లను మాదాపూర్లోని మినర్వా హోటల్లో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో శనివారం లాంఛనంగా ప్రారంభించారు. కార్యక్రమానికి వర్ధమాన తారలు వేది్వక, వాన్యా అగర్వాల్లు హాజరయ్యారు. తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా మహిళా ఔత్సాహిక వ్యాపారులు 100 మంది పాల్గొన్నారు. మిల్లెట్ పోర్టల్తో కలిసి పనిచేస్తున్న వైద్యులు, రైతులు కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా పలు కొత్త మిల్లెట్ ఉత్పత్తులను విడుదల చేశారు. -
Student Tribe: స్టూడెంట్ ట్రైబ్..
మారుతున్న కాలానికి అనుగుణంగా అధునాతన సాంకేతికత, వినూత్న నైపుణ్యాలను అందిపుచ్చుకుంటోంది ఈతరం యువత. ఇటు చదువుకుంటూనే అటు భవిష్యత్ ప్రణాళికల గురించి మార్గ నిర్దేశం చేసుకుంటోంది. ఇలాంటి తరుణంలో విద్యార్థులకు అత్యున్నత భవిష్యత్తుకు దిశానిర్దేశం చేస్తోంది ‘స్టూడెంట్ ట్రైబ్‘. ఒక స్టార్టప్ లాంటి ఈ వేదిక ఏదైనా డిగ్రీ, ఆ పైన చదువులు చదువుతున్న విద్యార్థులకు ఈ తరం సాంకేతికతకు అనుగుణంగా నైపుణ్యాలను అందజేస్తూ.. మరోవైపు పరిశ్రమలో వారికి అవకాశాలను చేరువ చేస్తోంది. 6 లక్షలకుపైగా స్టూడెంట్ నెట్వర్క్తో విభిన్న వేదికల్లో విద్యార్థులకు అవగాహన అవకాశాలను కల్పిస్తోంది. స్టూడెంట్ ట్రైబ్ అనేది స్టూడెంట్ కమ్యూనిటీ ప్లాట్ఫామ్. ఈ వేదిక దాదాపుగా 6 లక్షలకు పైగా విద్యార్థులతో, రెండు తెలుగు రాష్ట్రాల్లో 500 పైగా కాలేజీలతో అనుసంధానమై ఉంది. సోషల్ మీడియా వేదిక ఇన్స్ట్రాగామ్లో 4.5 లక్షల ఫాలోవర్స్ ఉన్నారు. విద్యార్థులను నైపుణ్యాలకు అనువైన బ్రాండ్స్కు అనుసంధానం చేస్తోంది. గిగ్ వర్క్ ఇంటరీ్నíÙప్, వలంటీర్, ఫుల్టైమ్గా ఉపాధి అవకాశాలను కల్పిస్తోంది. విద్యార్థులు చదువుకుంటూనే సంపాదన, స్కిల్స్ మెరుగు పర్చుకోవడంతో పాటు సరి్టఫికెట్లు పొందవచ్చు. స్థిరమైన భవిష్యత్ వృద్ధికి అంతులేని అవకాశాలను సృష్టిస్తోంది. టెక్నాలజీ నుంచి మార్కెటింగ్, డిజైన్ వరకు ప్రతి అవకాశాన్ని దగ్గర చేరుస్తోంది. టైర్–2, టైర్–3 నగరాల్లో సేవలు అందించడంతో పాటు వారికి అవసరమైన నైపుణ్యాలు, అవకాశాలను అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. విద్యార్థులు సంపాదించిన డబ్బు అటు చదువు, ఇటు ప్యాకెట్ మనీకి ఉపయోగపడుతుంది. బ్రాండింగ్, ఉపాధి అవకాశాలు, నైపుణ్యం అభివృద్ధి అనే మూడు అంశాలపై సేవలు అందిస్తున్నారు. ప్రత్యేకంగా ఒక యాప్ ఆవిష్కరించి అవకాశాలు, వర్క్షాప్లు, వెబినార్స్ తదితర కార్యక్రమాల సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందులో పొందుపరుస్తున్నారు. ఆసక్తి కలిగిన విద్యార్థులు దరఖాస్తు చేసుకుంటారు. బీబీఏ, బీకాం, బీఎస్సీ, ఇంజినీరింగ్ వంటి ఏదైనా డిగ్రీ చేసిన విద్యార్థులు ఈ సేవలను ఉచితంగానే పొందవచ్చు.అవకాశాలకు పుష్పకవిమానం.. నేను 2024లో డిగ్రీ బీకాం పూర్తి చేశాను. డిగ్రీ చేస్తున్న సమయంలోనే స్టూడెంట్ ట్రైబ్ను ఫాలో అవుతున్నాను. దీనికి సంబంధించిన యాప్లో ఎప్పటికప్పుడు అవసరమైన అవకాశాలు, వర్క్షాప్స్ గురించి తెలుసుకున్నాను. ఇందులో భాగంగానే స్టూడెంట్ ట్రైబ్లో అకౌంట్ మేనేజర్గా ఫుల్టైమ్ జాబ్ పొందాను. నాలాంటి ఎంతోమంది విద్యార్థులకు ఈ వేదిక పుష్పక విమానంగా సేవలందిస్తోంది. – కీర్తనకార్పొరేట్ స్థాయి నైపుణ్యం విద్యార్థులు చదువుకుంటూనే అందుబాటులో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకునేలా ఈ వేదికను ప్రారంభించాం. వారి కోసం ప్రపంచంలోనే అతిపెద్ద ఏఐ యాకథాన్ నిర్వహించాం. ఇందులో ప్రముఖ సినీ తార సమంత వంటి సెలబ్రిటీలు పాల్గొన్నారు. ఈ మధ్యనే అప్ స్కిల్లింగ్ అనే వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించారు. జావా మెకానికల్ ఇంజినీరింగ్ వంటి విభిన్న నైపుణ్యలపై అవగాహన కల్పిస్తున్నాం. ఇందులో ప్రత్యేకంగా విద్యార్థినులకు కార్పొరేట్ స్థాయి నైపుణ్యాలను అందిస్తున్నాం. దీనికోసం వివిధ కార్పొరేట్ సంస్థలకు చెందిన నిపుణులు, ప్రతినిధులు, సీఈవోలను ఆహ్వానించి విద్యార్థులకు అనుసంధానం చేస్తున్నాం. ఇప్పటి వరకు రెండు బ్యాచ్లు పూర్తి చేసుకున్నాయి. ఏఐ, బ్లాక్చెయిన్ వెబినార్, మెకానికల్ ఇంజినీరింగ్ వర్క్షాప్స్, సైబర్ సెక్యూరిటీ, డిజిటల్ మార్కెటింగ్ వర్క్షాప్ వంటివి నిర్వహించాం. – చరణ్ లక్కరాజు, స్టూడెంట్ ట్రైబ్ వ్యవస్థాపకులు. -
వాలెంటైన్స్.. ఫ్యాషన్ టైమ్స్..
లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అనేది ఎంత వరకూ నిజం అనేది అలా ఉంచితే.. ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ బెస్ట్ ఇంప్రెషన్ అనేది మాత్రం ప్రేమికుల విషయంలో ఎల్లప్పుడూ నిజమవుతూనే ఉంటుంది. అలా మంచి ఇంప్రెషన్ సాధించే విషయంలో టాక్స్ నుంచి లుక్స్ దాకా దేని ప్రాధాన్యతనూ తీసిపారేయలేం. ఈ నేపథ్యంలో పరస్పరం ఇంప్రెస్డ్ అనిపించుకోవాలనే తహతహలాడే ప్రేమికుల కోసం నగరానికి చెందిన హామ్స్టెక్ ఫ్యాషన్ డిజైనింగ్ ఇన్స్టిట్యూట్ ఫ్యాక్టరీలు అందిస్తున్న సూచనలివి.. ప్రేమికుల రోజున ధరించడానికి రెడ్ కలర్ను మించిన డ్రెస్ మరొకటి ఉండదు. అయితే, ఈ ఏడాది కొంచెం భిన్నంగా ప్రయతి్నంచవచ్చు. లేస్తో డిజైన్ చేసిన యాసెంట్స్, రఫ్లెస్ లేదా స్లిట్స్ ఉన్న ఫిగర్–హగ్గింగ్ సిల్హౌట్స్, ఫ్లోయీగా ఉండే మిడి డ్రెస్లను ఎంచుకోవచ్చు. టైమ్లెస్గా, సొగసైన్ లుక్ కోసం స్ట్రాపీ హీల్స్, లైట్ వెయిట్ సింపుల్ జ్యువెలరీని ఈ డ్రెస్కు జత చేయవచ్చు. మేకప్కి సాఫ్ట్ బ్లష్ పింక్, మ్యూట్ రోజ్ టోన్స్ రొమాంటిక్ మీట్స్కి సరైనవి. మ్యాచింగ్ స్కర్ట్లు, శాటిన్ స్లిప్ డ్రెస్లు లేదా పేస్టెల్ రంగులలో నిట్సెట్తో బ్లేజర్లను ఎంచుకోవచ్చు. ఈ షేడ్స్ ఆధునికతకు అద్దం పడతాయి. హృదయాకారపు ఇయర్ హ్యాంగింగ్స్, అందమైన నెక్పీస్, చిక్ క్లచ్తో లుక్ కంప్లీట్ అవుతుంది. భాగస్వామి హృదయంలో శాశ్వతమైన ముద్ర వేయడానికి ఇష్టమైన పెర్ఫ్యూమ్ జోడించడం మర్చిపోవద్దు సీక్వెన్స్, మెటాలిక్ ఫాబ్రిక్లు ఈ సీజన్లో ఇప్పటికీ ట్రెండింగ్లో ఉన్నాయి. మెరిసే వెండి లేదా బంగారు రంగు దుస్తులు.. వాలెంటైన్స్ డే సందర్భంగా నిర్వహించే ఈవెనింగ్ పారీ్టలలో లుక్స్ని ప్రత్యేకంగా చూపుతాయి. ఆహ్లాదకరమైన వైబ్ కోసం, హార్ట్ ప్రింట్లు, పోల్కా డాట్స్ లేదా పూల నమూనాలను ప్రయతి్నంచవచ్చు. హై–వెయిస్టెడ్ ప్యాంటు లేదా స్కర్ట్తో జత చేసిన హార్ట్–ప్రింటెడ్ బ్లౌజ్ ఫన్నీగా అదే సమయంలో స్టైలిష్ గానూ ఉంటుంది. ప్రత్యామ్నాయంగా, లగ్జరీ టచ్ కోసం వెల్వెట్ ఫర్ వంటి అల్లికలతో ప్రయోగాలు చేయచ్చు.అబ్బాయిల కోసం.. టైమ్లెస్ సూట్: వాలెంటైన్స్డే రోజున మ్యాన్లీగా కనిపించడానికి పాలి‹Ù్డ లుక్ కోసం క్లాసిక్ బ్లాక్ లేదా నేవీ సూట్ను ఎంచుకోవాలి. రొమాంటిక్ ట్విస్ట్ జోడించాలనుకుంటే, బర్గండి లేదా డార్క్ రెడ్ కలర్ సూట్ను ఎంచుకోవచ్చు. ఇది స్టైలి‹Ùగా కనిపించడమే కాదు ఈ సందర్భానికి సరైనది.స్మార్ట్ క్యాజువల్ వైబ్స్ ముదురు జీన్స్ లేదా చినోస్తో క్రిస్పీ వైట్ షర్ట్ను జత చేయవచ్చు. మోడర్న్ లుక్ కోసం టైలర్డ్ బ్లేజర్ లేదా స్టైలిష్ లెదర్ జాకెట్తో లుక్ని పూర్తి చేయవచ్చు. ఈ లుక్ క్యాజువల్ డిన్నర్ లేదా డే టైమ్ డేట్కి అనువైనది. మోనోక్రోమాటిక్ మ్యాజిక్ ఈ సంవత్సరం మోనోక్రోమ్ దుస్తులు ఒక భారీ ట్రెండ్. విభిన్న టెక్స్చర్లతో ఆల్–బ్లాక్ ఎన్సెంబుల్ను ప్రయతి్నంచండి. బ్లాక్ టర్టిల్నెక్, టైలర్డ్ ట్రౌజర్లు, సొగసైన లెదర్ షూలు ఎంచుకోండి. ప్రత్యామ్నాయంగా, మృదువైన, ఆధునిక లుక్ కోసం బూడిద లేదా లేత గోధుమ రంగు షేడ్స్ ఎంపిక చేసుకోండి. ప్యాటర్న్లు, టెక్స్చర్లతో ఆడుకోవచ్చు. చారలు లేదా పూల ప్రింట్లు వంటి ప్యాటర్డ్ షర్టులతో దుస్తులకు అందమైన లుక్ను తీసుకురావచ్చు. ఆ లుక్ను సమతుల్యంగా ఉంచడానికి సాలిడ్–కలర్ ప్యాంటుతో జత చేయాలి. ఆత్మవిశ్వాసంతో యాక్సెసరైజ్ స్టైలిష్ వాచ్, లెదర్ బెల్ట్ లేదా పాకెట్ స్క్వేర్తో లుక్ను బ్రైట్గా మార్చేయవచ్చు. సందర్భానికి తగ్గట్టు టై లేదా సాక్స్ వంటి యాక్సెసరీలలో రెడ్ కలర్ను జోడించడానికి వెనుకాడవద్దు.ఇద్దరు కాదు ఒక్కరే.. అనిపించేలా..భాగస్వామితో కలిసి మ్యాచింగ్ డ్రెస్ ధరించాలని ప్లాన్ చేసుకుంటే.. ఒకేలాంటి దుస్తుల కంటే కాంప్లిమెంటరీ కలర్స్ లేదా థీమ్లపై దృష్టి పెట్టడం మంచిది. ఉదాహరణకు, ఇద్దరిలో ఒకరు రెడ్ కలర్ దుస్తులు ధరిస్తే మరొకరు టై, పాకెట్ స్క్వేర్ లేదా యాక్సెసరీల ద్వారా రెడ్ కలర్ను చేర్చవచ్చు. -
నీకోసం ఈ లోకం బహుమానం చేసేస్తా..
వీచే చిరుగాలిని వెలివేస్తా.. పారే నదినావిరి చేస్తా.. నేనున్న నేలంతా మాయం చేశా లేనేలేదే అవసరమే.. నువ్వే నాకు ప్రియవరమే.. నువ్వుంటే నా జతగా నేనుంటా ఊపిరిగా నువ్వైనా నమ్మవుగా చెలియా నేనెవరంటూ ఎవరూ గుర్తించరుగా నా ప్రేమవు నువ్వంటూ నీకోసం ఈ లోకం బహుమానం చేసేస్తా నువులేని లోకంలో నన్నే నే బలిచేస్తా నువ్వుంటే నా జతగా అంటూ రామజోగయ్య శాస్త్రి రచించిన పాటకు ఏఆర్ రెహ్మాన్ (AR Rahman) అందించిన స్వరాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి.. ఈ పాట వింటున్నప్పుడు ఎంత ఫీల్ ఉంటుందో.. ప్రేమికుల దినోత్సవానికి ముందు జరుపుకునే వాలంటైన్స్ వారంలో అంతటి ఫీల్ ఉంటుందని తెలుస్తోంది.. హైదరాబాద్ (Hyderabad) నగరంలో హడావుడి చూస్తోంటే.. వ్యాపార వర్గాల మొదలుకుని పర్యాటక రంగం వరకూ వాలంటైన్స్ డే (Valentine's Day) సందర్భంగా అనేక ప్యాకేజీలు ప్రకటిస్తున్నారు.. దీనికితోడు యువత హడావుడీ మామూలుగా లేదనేలా సందడి నెలకొంది. ఈ నేపథ్యంలో దీని గురించి మరిన్ని విశేషాలు.. ఫిబ్రవరి నెల మొదటి రెండోవారం మొదలైన దగ్గర నుంచి సోషల్ మీడియాలో వాలంటైన్స్ వీక్ (Valentine week) సందడి కనబడుతోంది. గత రెండు మూడు రోజులుగా ఎక్కుడ చూసినా ఇదే సందడి అన్నట్లుంది హడావుడి. అయితే ఈ వాలంటైన్ వీక్ కొత్తదేం కాదు.. ఈ సంస్కృతి ఎప్పటి నుంచో ఉంది. కానీ ఈ ప్రేమికుల వారం నగర సంస్కృతిలో మరింత భాగమైన సూచనలు కనిపిస్తున్నాయి. సోషల్ మీడియా వేదికగా వాలంటైన్స్ వీక్ సంబంధించిన పోస్టులు, రీల్స్ తెగ వైరల్ అవుతున్నాయి. యానిమేటెడ్, విఎఫ్ఎక్స్ వీడియోలు కాకుండా చాలమంది యువతరం స్వయంగా వీడియోలు చేసి నెట్టింట పెట్టడంతో వైరల్గా మారుతున్నాయి. దీనికి సంబంధించి వాలంటైన్ వీక్లో మొదటి రోజైన రోజ్ డే ప్రభావం అధికంగా కనిపించింది. ఈ నేపథ్యంలో సోమాజిగూడలోని ఓ ఫ్లవర్ బొకే షాపు యజమాని జలీల్తో ముచ్చటించగా.. ఈ నెల 6న చిన్న సైజు గులాబీ పువ్వుల కోసం చాల ఆర్డర్లు వచ్చాయని, అంతేకాకుండా రోజ్ డే అయిన 7వ తేదీన విడి రోజా పూలను అధిక సంఖ్యలో అమ్మానని చెప్పుకొచ్చాడు. సాధారణంగా బొకేలు తప్ప విడిగా ఒక్కొక్క గులాబీ పువ్వులు అంతగా అమ్ముడుపోవు.. ఈ రోజ్ డే ప్రభావమే దీనికి కారణమని ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశాడు.ప్రేమను పంచుకోవాలి కదా!ఏళ్ల తరబడి వాలంటైన్స్ వీక్ అని చెప్పుకోవడం, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం తప్ప వాస్తవంగా అంతగా జరుపుకోలేదు. కానీ ప్రస్తుతం ఈ సంస్కృతి మెల్లమెల్లగా పెరుగుతోంది. చాక్లెట్ డే రోజు చాక్లెట్ ఇవ్వడం, హగ్ డే రోజు హగ్ చేసుకోవడం, ప్రపోజ్ డే రోజు కచ్చితంగా తమ ప్రేమను మళ్లీ ఒకసారి వ్యక్తపరచడం.. ఇలా ఈ తరం ‘ప్రేమికుల వారాన్ని’ స్వయంగా ఆస్వాదిస్తున్నారు. విదేశాల్లోనో, స్థానికంగానో ఉండి కలవడానకి వీలుకాని ప్రేమికులు.. డెలివరీ యాప్స్లో గులాబీ పూలను, చాక్లెట్లను ఆయా ప్రత్యేక రోజుల్లో తమ భాగస్వాములకు డోర్ డెలివరీ చేస్తుండటం విశేషం. చదవండి: అంతా ప్రేమమయం...ఇందులో భాగంగా వాలంటైన్స్ వీక్లో టెడ్డీ డే, రోజ్ డే, చాక్లెట్ డే రోజున వీటి ఆర్డర్ల సంఖ్య నగరంలో భారీగా పెరిగిందని డెలివరీ సంస్థల యాజమాన్యాలు చెబుతున్న మాట. హగ్ డే, ప్రామిస్ డే వంటివి వర్చువల్ వేదికగా సరిపెట్టుకుంటున్నారు. తమ ప్రేమికుడు లేదా ప్రేమికురాలు ఇచ్చిన ఈ గిఫ్టులకు మంచి లవ్ మెలోడీ ట్రాక్ని జోడించి వాట్సాప్ స్టేటస్లు, ఇన్స్టా పోస్టులతో సందడి చేస్తున్నారు. అయితే ఈ వాలంటైన్స్ వీక్లో ప్రముఖ సోషల్ ఇన్ఫ్లుయెన్సర్లు, సెలిబ్రిటీలు కూడా ఉండటం విశేషం.ప్రేమికుల దినోత్సవం కోసం ప్యార్ బజార్..వాలంటైన్స్ డేని పురస్కరించుకుని ప్రముఖ ఆన్లైన్ విపణి.. అమెజాన్ ‘ప్యార్ బజార్’ పేరిట సరికొత్త ఫ్యాషన్ ఉత్పత్తులు, ఫోన్ యాక్సెసరీలను ప్రత్యేకంగా అందిస్తోంది. ఈ విషయాన్ని అమెజాన్ ఇండియా సెంట్రల్ షాపింగ్ ఎక్స్పీరియన్స్ డైరెక్టర్ జహీద్ ఖాన్ తెలిపారు. ఓ చక్కని రొమాంటిక్ డేట్ ఎంజాయ్ చేసేందుకు వీలైన ఉత్పత్తుల, గిఫ్ట్ ఆర్టికల్స్ జ్యువెలరీ మొదలుకుని, మనసును హత్తుకునేలా వాలంటైన్స్ డే కోసం ప్యార్ బజార్ విభాగంలో లభిస్తాయని వివరించారు.– సాక్షి, హైదరాబాద్ సిటీబ్యూరో -
మట్టితో మమేకం..
గ్రామాలు, పల్లెల జీవన విధానం.. స్వచ్ఛమైన ఆహారం, ప్రకృతితో సావాసం, సంస్కృతితో కలగలిసిన సంప్రదాయం, పలు వృత్తుల కలయిక ఇలా.. మనిషి జీవనానికీ పల్లెలకు ఎప్పుటి నుండో ఏర్పడిన బంధం.. వీటన్నింటికీ ప్రధానమైనది వ్యవసాయం.. అలా వ్యవసాయానికీ..పల్లె జీవన విధానానికీ ముడిపడినదే మట్టి.. అలాంటి మట్టితో మమేకమైన జీవన విధానంపై నగరంలో వినూత్న పద్ధతిలో ‘నైమిసం ఎర్త్ ఫెస్టివల్’ పేరుతో ఏర్పాటు చేసిన ప్రదర్శన సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంది. ఇందులో రాష్ట్ర వ్యాప్తంగా పలు సంస్థలు భాగస్వామ్యమయ్యాయి. పల్లెల్లోని సహజ జీవన విధానాలను తెలియజేస్తూ ప్రదర్శనలు ఏర్పాటు చేశాయి.. ఈ నేపథ్యంలో దీని గురించి మరిన్ని విశేషాలు.. సంప్రదాయ వృత్తులు, జీవన విధానాలు అంతరించిపోతున్న ప్రస్తుత తరుణంలో గతకాలపు సాంస్కృతిక జీవన వైవిధ్యం.. ప్రకృతితో మమేకమయ్యే జీవన విధానం.. కలగలిసి ఇవన్నీ ఒకే వేదికగా నగరవాసులకు పరిచయం చేస్తూ.. ప్రస్తుత తరం ఆ తరహా జీవనశైలిలో భాగస్వాములు కావలనే లక్ష్యంతో ‘నైమిసం ఎర్త్ ఫెస్టివల్ 2025’ ఏర్పాటు చేశారు. గచి్చ»ౌలిలోని ఇంజినీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా దీనికి వేదికైంది. జె. కృష్ణమూర్తి సెంటర్ నిర్వహించిన ఈ వినూత్న కార్యక్రమం నగరానికి సహజ జీవన విధానాన్ని, అందులోని మాధుర్యాన్ని, తన్మయత్వాన్ని రుచి చూపించింది. ఈ ఎర్త్ ఫెస్టివెల్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా వివిధ సంస్థలు, వ్యక్తులు ఏర్పాటు చేసిన స్టాల్స్ గతకాలపు జ్ఞాపకాలను, జీవన శైలిని ఇప్పటికీ కొనసాగిస్తున్న సుస్థిర విధానాలను అద్భుతంగా ప్రదర్శించారు. అలరించిన నృత్యాలు.. ఈ సందర్భంగా నిర్వహించిన గుస్సాడి నృత్యం అలరించింది. డబ్ల్యూడబ్ల్యూఎఫ్, సొసైటీ టు సేవ్ రాక్స్, యానిమల్ వారియర్స్, సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజ్ ఫర్ ఉమెన్ వంటి సంస్థలు పర్యావరణ పరిరక్షణ కోసం వినూత్న ఆలోచనలతో చేపట్టిన ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ ఉత్సవంలో వాన్వాడి ఫారెస్ట్ కలెక్టివ్ వ్యవస్థాపకులు ప్రొఫెసర్ అసీమ్ శ్రీవాత్సవ వంటి వక్తలు ప్రసంగాలు ఆకట్టుకున్నాయి.నేనొక చేనేతకారుడిని.. చిన్నప్పటి నుంచి బట్టలు నేయడం మాత్రమే తెలుసు. ఎంత గొప్ప భవిష్యత్తు ఉందన్నా మరో పనికి వెళ్లే ఆలోచన లేనివాళ్లం. ఎక్కువగా సిల్క్ చీరలు నేస్తాను. ఒక్కో చీర నేయడానికి నాలుగు రోజులు పడుతుంది. ఇలా నెల్లో 7, 8 చీరలు నేస్తాను. వినియోగించే దారం, డిజైన్ బట్టి ధర ఉంటుంది. అన్నీ పోనూ ఓ 12 వేల వరకూ మిగులుతుంది. గిట్టుబాటు ధరలు లేకపోవడం ప్రధాన సమస్య. అయినప్పటికీ మా వృత్తిలోనే మాకు సంతృప్తి. ముగ్గురు ఆడపిల్లు.. వారిని పీజీలో, డిగ్రీలో చేరి్పంచాను. – రామక్రిష్ణ, సంస్తాన్ నారాయణపురంమట్టి ఇళ్ల నిర్మాణంపై..100, 150 ఏళ్లపాటు ఘనంగా మనగలిగిన నాటి మట్టి ఇళ్లను మళ్లీ ఈ తరానికి అందించడమే లక్ష్యంగా నిలాలిన్ సంస్థను నా సహవ్యవస్థాపకురాలు యామినితో కలిసి ప్రారంభించాం. ఈ నివాసాల్లోని వైవిధ్యాన్ని, విశిష్టతను ఈ తరానికి తెలియజేస్తున్నాం. ఇందులో భాగంగా ఔత్సాహికులకు జనగామలో మరుతం లెరి్నంగ్ సెంటర్, ఒడిస్సాలో కమ్యూనిటీ సెంటర్, మహబూబ్నగర్లో మరో మట్టి ఇంటి ప్రాజెక్టు వంటివి చేపట్టాం. ఈ ఇళ్ల నిర్మాణంలో మట్టిలో దృఢత్వానికి ఆవు పేడ, ఫైబర్ రిచ్ వంటివి కలుపుతాం. స్థానికంగా నాటి మట్టి నిర్మాణం తెలిసిన వారి నైపుణ్యాలను వాడుతున్నాం. – ఐశ్వర్య, నిలాలిన్రసాయనాలు లేకుండా.. శాశ్వత వ్యవసాయంగా పిలుచుకునే పర్మాకల్చర్ విధానంలో పంటలు పండిస్తున్నాం. జహీరాబాద్ సమీపంలోని బిడకన్నె గ్రామంలో విభిన్న రకాల పంటలను ఎలాంటి రసాయనాలూ వేయకుండా పండిస్తున్నాం. నరన్న కొప్పుల ఆధ్వర్యంలోని అరణ్య సంస్థ ఈ వ్యవసాయంపై మరింత అవగాహన కల్పిస్తోంది. నాలాగే 500 మంది మహిళా రైతులు ఈ పర్మాకల్చర్ చేస్తున్నారు. తల్లిలాంటి భూమిని రసాయన మందులు వేసి చంపదల్చుకోలేదు. ఆవులు, బర్రెల పేడతో సహజ ఎరువును తయారు చేసుకుని పంటలు పండిస్తున్నాం. పొన్నగంటి, తోటకూర, దొగ్గల్ కూర, తడక దొబ్బుడు వంటి ఆరోగ్యకరమైన ఆకు కూరలు పండిస్తున్నాను. ఎకరంలో దాదాపు 20 రకాల కారగాయలు, ఇతర పంటలను పండించగలను. మందులతో పండిన పంటతో లభాలు ఎక్కువ వస్తాయేమో.. కానీ ఆరోగ్యం కోల్పోయి ఆస్పత్రుల్లో చేరాలి. కరోనా తరువాత ఈ వ్యవసాయం పై మరింత గౌరవం, నమ్మకం పెరిగింది. నా మనుమరాలి పెళ్లి కూడా చేశాను.. ఇంకా ఆరోగ్యంగా ఉన్నాను. మా పంటను ఇష్టపడే వారే మా వద్ద ప్రత్యేకంగా కొంటున్నారు. – తుల్జమ్మ, పర్మాకల్చర్ రైతుసంస్కృతులపై అవగాహన కోసం..సెంటర్ ఫర్ ఎంబారీ నాలెడ్జ్ పేరుతో ఒక సంస్థగా ఆనాటి జీవన విధానం, వ్యవసాయం, నివాసాలు, సంస్కృతులు, పద్ధతులను ఈ తరానికి చేరువ చేసే ప్రయత్నం చేస్తున్నాం. ఇందులో భాగంగా వర్క్షాపులు, కథలు, పాటలు, ప్రాజెక్టుల ద్వారా అవగాహన కల్పిస్తున్నాం. తరతరాల వారసత్వంగా వచ్చిన అద్భుత సంస్కృతిని కోల్పోతున్నాం. ఆరేళ్లుగా ఈ అంశాలపైనే కృషి చేస్తున్నాం. ఒక్కో అంశంలో నిపుణులైన ఒక్కొక్కరు బృందంగా ఏర్పడి పనిచేస్తున్నాం. ఒక అరుదైన గ్రామీణ సంగీత కళ లేదా వ్యాయిద్యాన్ని చెప్పుకోవచ్చు. మా ప్రయత్నంలో భాగంగా కొందరికి మట్టి ఇళ్లు కట్టించాం, కథలను చెబుతాం, అసక్తి ఉన్నావారిని ప్రత్యక్షంగా ఈ మూలాల్లోకి తీసుకెళ్లి చూపిస్తాం. నగరానికి సమీపంలోని చౌటుప్పల్ వంటి ప్రాంతాల్లోని గ్రామాలు మొదలు భద్రాచలం వంటి దూరప్రాంతాల్లోనూ మా ప్రాజెక్టును కొనసాగిస్తున్నాం. – ధీరజ్, సెంటర్ ఫర్ ఎంబారీ నాలెడ్జ్ఎర్త్ అండ్ ఆర్ట్ స్టూడియో.. ఇంటిని, గార్డెన్ను అందంగా అలంకరించే టెర్రకోట బొమ్మలు, మట్టి పాత్రలు, దారం అల్లికలు వంటివి తయారు చేస్తున్నాం. నగరంలోని కార్ఖానాలో ఎర్త్ అండ్ ఆర్ట్ అనే మా స్టూడియోలో స్టోన్ కారి్వంగ్, బ్లాక్ ప్రింటింగ్, రేడియం తదితర వర్క్షాపులను నిర్వహిస్తున్నాం. వీటికి అవసరమైన మట్టిని కర్ణాటక నుంచి ప్రత్యేకంగా తీసుకొస్తాం. ఆరి్టఫీíÙయల్ హంగుల కన్నా సహాజమైన కళతో రూపొందించిన ఈ ఉత్పత్తులు ఇంటికే కాకుండా జీవితానికీ సౌందర్యాన్నిస్తాయి. – ఫాతిమా ఖుజీమా, ఎర్త్ అండ్ ఆర్ట్ -
ఫిబ్రవరి.. ఈవెంట్ల ఝరి..
విదేశాల్లో చదువుకోవాలనుకుంటున్నారా, వినోదాన్ని ఆశిస్తున్నారా? ‘సంత’కెళ్లి కొనాలి అనుకుంటున్నారా? సంగీతాన్ని కోరుకుంటున్నారా? ఆల్ ఇన్ వన్ అన్నట్టుగా అన్నీ నగరంలోనే అన్నట్టు ఈ నెల మొత్తం విందు వినోదాల సంగమంగా మారనుంది నగరం. నవంబర్ నుంచి మొదలై అత్యధిక కార్యక్రమాలను అందించే వింటర్ సీజన్కు ముగింపు నెల కావడంతో ఫిబ్రవరి ఈవెంట్స్ ఫీవర్లో చిక్కుకుంది. వినోదాన్ని ఆస్వాదించే ఔత్సాహికుల నుంచి విద్యార్థుల వరకూ, వ్యాపారుల నుంచి క్రియేటర్స్ వరకూ.. అందరికీ ఉపకరించే ఈవెంట్స్కు నగరం ఆతిథ్యం ఇస్తోంది. నగరంలో సాధారణంగా చలికాలం అన్ని విధాలా.. అన్ని రకాల కార్యక్రమాలకు అనుకూలంగా ఉంటుంది. దీంతో వింటర్లో అత్యధిక సంఖ్యలో ఈవెంట్లు జరుగుతుంటాయి. అదే విధంగా ఫిబ్రవరి నెలతో వింటర్ ముగుస్తుంది కాబట్టి ఈ నెలలో ఈవెంట్లు హోరెత్తుతాయి. బాలీవుడ్ స్టార్ సింగర్ సోనూ నిగమ్ గత శనివారం (నిన్న) లైవ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. అదే విధంగా పలువురు గాయనీ గాయకులు కూడా ప్రదర్శనలు ఇవ్వనున్నారు. ఈ నేపథ్యంలో నగరంలో జరగనున్న కొన్ని విజ్ఞాన, వినోద కార్యక్రమాల విశేషాలివి..డెస్టినేషన్ యుఎస్ఏ.. అగ్ర విశ్వవిద్యాలయ ప్రతినిధులను కలవడానికి వీసాలకు సంబంధించిన సందేహాల నివృత్తికి.. సలహాలు, సూచనలను పొందడానికి ఈ ఈవెంట్ ఉపకరిస్తుంది. జీవితాన్ని మార్చగల విద్యావకాశాలను సూచిస్తుంది. విశ్వవిద్యాలయాల్లో చోటు సంపాదించడానికి విదేశీ ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోడానికి అవసరమైన సమగ్ర సమాచారాన్ని పొందడానికి సహకరిస్తుంది. – ఫిబ్రవరి 15, ఉదయం 9.30గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకూటెక్నాలజీ సభ –2025 సాంకేతిక విద్య పట్ల ఆసక్తి కలిగిన టెక్నాలజీ ఔత్సాహికులకు ఇది హాజరు కావాల్సిన కార్యక్రమం. డిజిటల్ గవర్నెన్స్, సైబర్ సెక్యూరిటీలతో పాటు అత్యాధునిక టెక్నాలజీ విశేషాలను కూడా ఇది కవర్ చేస్తుంది. వృత్తి నిపుణులు, విద్యార్థులు, పారిశ్రామిక వేత్తలకు ఉపకరిస్తుంది. సాంకేతిక భవిష్యత్తును అన్వేషించడానికి చక్కని అవకాశం. తేదీ: ఫిబ్రవరి 21 నుంచి 23 వరకూ స్థలం: నోవోటెల్ హైదరాబాద్ కన్వెన్షన్ సెంటర్గిఫ్ట్స్ అండ్ స్టేషనరీ ఇండియా ఎక్స్పో.. సంబంధిత వ్యాపారులైనా లేదా కార్పొరేట్ గిఫ్ట్స్, స్టేషనరీలో తాజా ట్రెండ్లపై ఆసక్తి కలిగి ఉన్నా, ఈ ఈవెంట్ సందర్శనీయ ఎంపిక. బహుమతులు, స్టేషనరీ పరిశ్రమలో అందుబాటులో ఉన్న తాజా ఉత్పత్తులు, సేవల గురించి తెలుసుకోవచ్చు. తేదీ : ఫిబ్రవరి 28 వరకూ.. స్థలం : హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్స్టార్టప్ పార్టీ.. స్టార్టప్ ప్రయాణంలో అవసరమైన, అర్థవంతమైన సమన్వయాన్ని ఈ కార్యక్రమం అందిస్తుంది. ప్యానెల్ చర్చలు–స్వీయ–ప్రమోషనల్ స్టార్టప్ ఈవెంట్స్లా కాకుండా స్టార్టప్ను తదుపరి స్థాయికి తీసుకెళ్లడానికి వీలుగా నైపుణ్యాలు అందించే దేశంలోని మొట్టమొదటి కాన్సెప్చువల్ స్టార్టప్ ఈవెంట్ ఇది. తేదీ : ఫిబ్రవరి 23 సమయం : మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6.30 వరకు స్థలం : హైటెక్ సిటీకుక్డుకూ ఫెస్ట్.. చిన్నారులకు విందు, వినోదం, విజ్ఞానాలను అందించే కార్యక్రమం ఇది. స్టోరీ టెల్లింగ్, రచయితలతో సంభాషణలు, హస్తకళలు, చేతి వృత్తుల పరిచయం, పప్పెట్ షోలు, వెంట్రిలాక్విజమ్, క్విజ్, బుక్ ఫెయిర్, ఫుడ్ ఫెస్టివల్స్, ఆటలు, పాటలు, నృత్యాలు.. వంటివి కలగలిపే కార్యక్రమం. తేదీ : ఫిబ్రవరి 15, 16 (రెండు రోజులు) సమయం : ఉదయం 11 గంటల నుంచి స్థలం : నిథిమ్ క్రికెట్ గ్రౌండ్స్, గచ్చిబౌలిహమ్రాహి.. ఓ గజల్ సాయంత్రం.. ప్రముఖ గాయకుడు హరిహరన్ నగరంలో సంగీతాభిమానులను అలరించనున్నారు. హమ్రాహి పేరుతో హిందీ, ఉర్దూ భాషల్లో సాగే గజల్ గానాలాపనతో నగరవాసులను మంత్రముగ్ధులను చేయనున్నారు. తేదీ : ఫిబ్రవరి 21, స్థలం : శిల్పకళావేదిక సమయం : సాయంత్రం 6.30 గంటల నుంచిది సాస్ ఎట్ స్కేల్ 2025.. భవిష్యత్తు పరిశ్రమను, కృత్రిమ మేధస్సు ఎలా రూపాంతరం చెందిస్తుందో తెలిపే ఈవెంట్ ఇది. ఏఐ నిపుణుల నుంచి నేర్చుకోడానికి సారూప్యత కలిగిన వ్యక్తులతో నెట్వర్క్ పెంచుకునేందుకు అవకాశం ఇస్తుంది. తేదీ : ఫిబ్రవరి 15 సమయం : ఉదయం 9.30 నుంచి సాయంత్రం 5.30 వరకు స్థలం : టీ–హబ్, నాలెడ్జ్ సిటీ రోడ్ప్రేమికుల రోజున సునీత.. వాలెంటైన్స్డే సందర్భంగా ప్రముఖ టాలీవుడ్ గాయని సునీత పాటల కార్యక్రమం నగరవాసులకు ఆహ్లాదాన్ని పంచనుంది. ప్రేమ చిత్రాల్లో వినసొంపైన టాప్ లవ్ సాంగ్స్తో ప్రేక్షకులను ఉర్రూతలూగించిన సునీత.. ప్రేమికుల దినోత్సవాన.. పాటల వాన కురిపించనున్నారు. తేదీ : ఫిబ్రవరి 14 సమయం : రాత్రి 9గంటల నుంచి స్థలం : అర్బన్ మాయాబజార్, ఎల్బీనగర్ -
ఆర్టిస్టిక్ .. ప్రేమ్..ఫ్రేమ్..
నగర రహదారుల్లోని గోడలు, అండర్ పాస్ వంతెనలు, ఫ్లై ఓవర్లు అద్భుతమైన చిత్రాలకు వేదికగా నిలుస్తున్నాయి. వాహన చోదకులు, పాదచారులు, అటుగా వెళ్లే ప్రయాణికులను ఈ గోడ చిత్రాలు అబ్బురపరుస్తున్నాయి. సుమారు రెండు లక్షల ఎస్ఎఫ్టీల విస్తీర్ణంలో పలు చిత్రాలకు ప్రాణం పోసిన యువ కళాకారుడు ప్రేమ్ ఇస్రమ్ ఫ్రేమ్స్ నగరానికి కొత్త సొబగులు అద్దుతున్నాయి. ములుగు జిల్లా గిరిజన తాండా నేపథ్యంలో ఈ ఫైన్ ఆర్ట్స్ విద్యార్థి చిత్రాలు నలుగురికీ స్ఫూర్తిని కలిగిస్తున్నాయి. ఇటీవలి కాలంలో నగరంలో ఎక్కడ చూసినా ఫ్లై ఓవర్లు, అండర్ పాస్ రోడ్లు అందంగా రూపుదిద్దుకుంటున్నాయి. రంగు రంగుల చిత్రాలు కొత్త సొబగులు అద్దుతున్నాయి. నగర సుందరీకరణలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం, జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో భాగ్యనగరాన్ని అందంగా తీర్చిదిద్దుతున్నారు. ఇందులో భాగంగానే పలువురు ఫైన్ ఆర్ట్స్ కళాకారులు గోడలపై తమ కళా నైపుణ్యాన్ని ప్రదర్శిస్తున్నారు. దీని కోసం దాదాపు 149 కోట్ల నిధులతో రోడ్లు, కూడళ్లు, వీధులను ప్రత్యేకంగా, అత్యంత సుందరంగా మారుస్తున్నారు. నగరానికి తలమానికమైన హైటెక్ సిటీ, కొండాపూర్, ఇతర ప్రధాన రహదారులు అందమైన పెయింటింగ్స్తో ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా శేరిలింగంపల్లి జోన్, హైటెక్ సిటీ వంటి ప్రాంతాల్లోని ఫ్లై ఓవర్లు, స్ట్రీట్ ఆర్ట్లో ఓ యువకుడి కళాత్మకత కృషి దాగి ఉంది. మాసబ్ ట్యాంక్లోని జేఎన్ఏఎఫ్యూ వేదికగా ఫైన్ ఆర్ట్స్ పూర్తి చేసిన ప్రేమ్ ఇస్రమ్ (27) కొన్ని ఫ్లై ఓవర్లకు అత్యాధునిక టెక్నాలజీని ప్రతిబింబించే రంగుల చిత్రాలతో హంగులను అద్దాడు.నాలుగు ఫ్లై ఓవర్లు.. హైటెక్ సిటీ నుంచి కూకట్పల్లి మార్గంలోని ఫ్లై ఓవర్పై సాఫ్ట్వేర్ టెక్నాలజీ, అధునాతన సాంకేతికత, ఈ తరం అధునాతన ఆలోచనలు ప్రతిబింబించే చిత్రాలు అబ్బురపరుస్తున్నాయి. దీనికి సమీపంలోని అయ్యప్ప సొసైటీ – 100 ఫీట్ రోడ్ అండర్ పాస్లో ‘బజార్స్ ఆఫ్ హైదరాబాద్’ థీమ్తో వేసిన పెయింటింగ్ విశేషంగా ఆకట్టుకుంటోంది. వీటన్నింటినీ తన బృందం (15 నుంచి 20 మంది)తో పూర్తి చేశానని, వీరందరూ కూడా తనతో చదువుకున్న జూనియర్స్, ఆర్ట్ ఫ్రెండ్స్ అని ప్రేమ్ తెలిపారు. ఒక ఫ్లై ఓవర్పూర్తి చేయడమే కష్టతరమైన నేపథ్యంలో దాదాపు 2 లక్షల ఎస్ఎఫ్టీల విస్తీర్ణంలో నాలుగు ఫ్లై ఓవర్లు కళాత్మకంగా సుందరీకరించానని పేర్కొన్నాడు. కొత్తగూడ అండర్పాస్లో ఇండియన్ ఆర్మీ లైఫ్స్టోరీని, అదే ప్రాంతంలోని ఫ్లై ఓవర్పై అడ్వెంచర్, ట్రావెలింగ్కు సంబంధించిన పెయింటింగ్స్ వేశానని వివరించారు.హాబీగా మొదలై.. ములుగు జిల్లా అటవీ ప్రాంతంలోని నార్లపూర్ అనే మారుమూల గ్రామం మాది. చిన్నప్పుడు ఆర్ట్ పై పెరిగిన మక్కువ ఈ ప్రయాణానికి కారణం. చిన్నతనంలో సమీపంలోని రోడ్లపై చాక్పీస్తో పెద్ద పెద్ద బొమ్మలు వేసి సంతోషపడే వాడిని. అదే హాబీగా మారి నగరాన్ని అందంగా మార్చే స్థాయికి రావడం ఆనందంగా ఉంది. సాధారణంగా ఆయిల్ పెయింటింగ్ పోట్రేట్స్ వేయడంలో అనుభవజు్ఞడిని.. గతంలో నల్గొండ జిల్లాలోని దేవరకొండలో ప్రభుత్వ ప్రాజెక్టులో భాగంగా చారిత్రాత్మక అంశాలతో స్ట్రీట్ ఆర్ట్ వేశాను. నగరంలోని నెహ్రూ ఆర్ట్ గ్యాలరీలో నా మూలాలైన ఆదివాసీల జీవన విధానం, సంస్కృతి సంప్రదాయాలపై వేసిన పెయింటింగ్స్తో ‘వేరియస్ ఇంప్రెషన్స్’ అనే ప్రత్యేక ప్రదర్శన చేశాను. – ప్రేమ్ ఇస్రమ్, ఫైన్ ఆర్ట్స్ విద్యార్థి -
భాగ్యనగరంలో బెంగాలీ రుచులు.. లొట్టలేస్తున్న ఆహార ప్రియులు
విభిన్న సంస్కృతుల సమ్మేళనం, విభిన్న రుచుల సంగమం హైదరాబాద్.. వారసత్వం పేర్చిన ఈ ఆహార సంస్కృతిలో దేశవ్యాప్తంగా అన్ని రుచులనూ నగరవాసులు ఆదరిస్తున్నారు, ఆస్వాదిస్తున్నారు. ఈ కల్చరల్ డైవర్సిటీలో తన ప్రశస్తి సువాసనలు నలుదిశలా వెదజల్లుతున్నాయి. అందుకు చక్కని వేదికైంది బెంగాలీ రుచులు (Bengali Recipes) ప్రదర్శన. నగరంలో బెంగాలీలు ఉన్నప్పటికీ దాదాపు 40 శాతం వరకూ స్థానికులు కూడా ఆదరణ చూపిస్తున్నారని హైటెక్ సిటీలోని ‘ఓ కలకత్తా’ రెస్టారెంట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఫిరోజ్ సాద్రి తెలిపారు. గత 25 సంవత్సరాలుగా బెంగాలీ రుచులను అందిస్తున్న ‘ఓ కలకత్తా’.. హైదరాబాద్ వేదికగా బెంగాలీ ఆహార సంస్కృతిని పెంచడంలో కీలకపాత్ర పోషిస్తోంది. ఈ నేపథ్యంలో నగరానికి బెంగాలీ ఫుడ్ కల్చర్ వచ్చిన తీరు, ఇక్కడ వినూత్నంగా అందుబాటులో ఉన్న వెరైటీ డిషెస్ గురించి ఫిరోజ్ సాద్రి వెల్లడించారు.– సాక్షి, సిటీబ్యూరో దేశాన్ని వందల ఏళ్లు పాలించిన బ్రిటిష్ వారు బెంగాల్ కేంద్రంగా ఎంచుకున్నారు.. ఎందరో ముస్లిం రాజవంశస్తులు పరిపాలించిన ప్రాంతం కూడా బెంగాల్. ఈ ఇద్దరికీ ప్రధాన కేంద్రం హైదరాబాద్ (Hyderabad). ఇలా సాంస్కృతిక పరిణామంలో నగరానికి బెంగాలీ ఆహారం వచ్చింది. బ్రిటిష్వారు స్పైసీ తక్కువ, తీపి ఎక్కువ ఇష్టపడతారు. ఇందులో భాగంగా వారు ప్రత్యేకంగా తయారుచేసుకున్న బెంగాలీ వెరైటీ అడాబ్ చిగిరీ. ఇది కొబ్బరి నీరు (Coconu Water), కొబ్బరి క్రీంతో తయారు చేసే అరుదైన వంటకం. ఈ వెరైటీ ‘ఓ కలకత్తా’లో లభిస్తుంది. దీనిని నగరవాసులు ఇష్టంగా ఆరగిస్తున్నారు. ఇదీ చదవండి: Ma Illu ట్విన్స్ విజేత, శ్వేత అనాథలు కాదు అంగరంగ వైభవంగా పెళ్లి! హిల్సా ఆఫ్ పాతూరి.. ఈ వెరైటీ మాన్సూన్ సీజన్లో మాత్రమే లభించే అరుదైన హిల్సా చేపతో తయారు చేస్తారు. దీనిలో మిలియన్ల సంఖ్యలో సన్నని ఎముకలుంటాయి. వీటన్నింటినీ సృజనాత్మకంగా తొలగించి, అరిటాకులో కొబ్బరిని కలిపి స్టీమ్ చేసి వడ్డించే వినూత్న వంటకం. ఇది కలకత్తా స్పెషల్, ఖరీదైనది కూడా. మాన్సూన్ సీజన్లో బ్రహ్మపుత్ర నదిలో బ్రీడింగ్ కోసం వలస వచ్చే అరుదైన చేప కావడమే దీని ప్రత్యేకత. మోచా.. అరటి పువ్వుతో ప్రత్యేకంగా తయారు చేసే కలకత్తా వంటకం. అరటి పువ్వులో పోషక విలువలుంటే చిన్న చిన్న పెటల్స్తో దీనిని తయారు చేస్తారు. ఆరోగ్యంతో పాటు రుచికరమైనదని చెఫ్ వెల్లడించారు. గోబిందో బోగ్.. బెంగాల్లో గోబిందో బోగ్ రైస్ను దేవుని ఆహారంగా భావిస్తారు (ఫుడ్ ఫర్ ది గాడ్). ఇది బెంగాల్లో తప్ప మరెక్కడా దొరకదు. సాధారణ బియ్యం, బాస్మతి బియ్యానికీ భిన్నంగా, రుచికరంగా ఉంటుంది. అత్యంత సాధారణమైన బెంగాలీ వంటకం ఈ రైస్ వెరైటీ. జర్నా ఘీ.. తెలుగువారి ఆహారంలో నెయ్యికి ఎంతో ప్రాధాన్యం ఉంది. అలాగే బెంగాలీలు కూడా ఆహార పదార్థాల్లో నెయ్యికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు. ఇందులో భాగంగానే ఫ్లేవర్ కోసం బెంగాలీలు జర్నా నెయ్యిని వాడతారు. ఇది ఒక్క స్పూన్తో మొత్తం రుచినే మార్చేస్తుంది. ఇవే కాకుండా ఇండియన్ చికెన్ కట్లెట్, రాయల్ మటన్ చాన్ప్,కోల్కతా బిర్యానీ, రాధూనీ మసాలా, రాధా తిలక్ రైస్, చానా పాతూరి, జాక్ ఫ్రూట్ టిక్కీ (స్పైసీ.. సూపర్ ఫుడ్), పెఫెటా చీజ్, మలాయీ కర్రీ, పెటాయ్ పరోటా, ఆమ్ఆచావో ఇలా.. విభిన్న రకాల బెంగాలీ రుచులతో ఓ కలకత్తాలో నోరూరిస్తుందని చెఫ్లు పేర్కొన్నారు. 1992లో ముంబై వేదికగా నాలుగు టేబుళ్లతో ‘ఓన్లీ ఫిష్’ పేరుతో అంజన్ ఛటర్జీ ప్రారంభించిన హోటల్ క్రమంగా హైదరాబాద్తో పాటు ఢిల్లీ, బెంగళూరు, కోల్కతా వంటి 8 ప్రాంతాలతో పాటు యూఏఈ, లండన్లో వండి వడ్డిస్తున్నారు. ఆమ్ అదా అల్లంనగరవాసులకు సరికొత్త బెంగాలీ రుచులను అందించడానికి కలకత్తా పరిసర ప్రాంతాల నుంచి ఆమ్ ఆదా అల్లంను పరిచయం చేశారని ఫిరోజ్ సాద్రి తెలిపారు. దీనిని మామిడి అల్లం అని పిలుస్తారు. దీంతో చేసే ఆమ్ ఆదా మాచ్కు నగరంలో ఆదరణ పెరుగుతోంది. మిస్టీ దహీ(దోయి) బెంగాల్ నుంచి ఎవరైనా హైదరాబాద్ వస్తున్నారంటే విమానంలో కూడా ఓ బాక్స్లో పార్సిల్ తెచ్చుకునే ప్రియమైన వెరైటీ ఈ మిస్టీ దహీ(దోయి). ఇది కూడా బెంగాలీ సిగ్నేచర్ వెరైటీ. మటన్ టిక్యాముస్లింలు ఎక్కువగా ఉండే కలకత్తాలో వారి ప్రత్యేక వంటకం ఇది. షాఫ్రాన్, రోజ్ వాటర్ సమ్మిళితంగా సంప్రదాయ వంటగా దీనిని చేస్తారు. దీనిని నగరవాసులు సైతం ఇష్టంగా తింటున్నారు. చదవండి: Birthright Citizenship మరోసారి బ్రేక్: భారతీయులకు భారీ ఊరట -
Stand-Up Comedy Show: నిలబడి.. నవ్వుల జడి..
‘ఈ రోజు వర్క్ ఫుల్ స్ట్రెస్ అనిపించింది బ్రో.. ఏదైనా మంచి స్టాండప్ కామెడీ షో ఉంటే చూడు పోదాం’ ఫ్రెండ్స్ ముచ్చట్లలో ఇలాంటివి సర్వసాధారణంగా మారాయి. ఇటీవల సిటీలో అత్యధికులకు స్టాండ్–అప్ కామెడీ చేరువైన పరిస్థితికి ఇవి నిదర్శనంగా నిలుస్తాయి. ఒక వ్యక్తి వేదికపై నుంచి జోకులు వేస్తూ ప్రేక్షకులను నవ్వించే స్టాండ్–అప్ కామెడీ. దాదాపుగా ఓ 15ఏళ్ల క్రితం నగరవాసులు ఎవరూ ఈ పదం విని ఉండరు.. గతేడాది అలా దూసుకువచ్చి సూపర్హిట్ కొట్టిన మిస్ శెట్టి.. మిస్టర్ పొలిశెట్టి సినిమా స్టాండప్ కామెడీ అంటే ఏంటో నగరవాసులకు మరింత పరిచయం చేసింది. ప్రస్తుతం నగరవ్యాప్తంగా అనేక మంది స్టాండ్ అప్ కామెడీ అంటే ఇష్టపడుతున్నారు. సాంకేతిక విప్లవంతో సోషల్ మీడియా పుణ్యమాని హాస్యం అందించే విభిన్న ప్లాట్ఫారమ్లు అందుబాటులోకి వచ్చాయి. తద్వారా హాస్యం పండించేవారు లక్షలాది మందికి చేరువ కావడానికి అవకాశాలు పెరిగాయి. యూట్యూబ్ ద్వారా రస్సెల్ పీటర్స్ వంటి హాస్య సమర్పకులు గణనీయమైన ఫాలోయింగ్ను సాధించారు. దాంతో చాలా మంది ఆ బాటను అనుసరించారు. ఇది స్టాండ్–అప్ కామెడీ కెరీర్గా వృద్ధి చెందేందుకు దారితీసింది. కామెడీకి స్వర్ణయుగం.. ఓ రకంగా 2010 సంవత్సరం నుంచి రెండేళ్ల కాలాన్ని కామెడీకి స్వర్ణయుగం అని పిలుస్తారు. ఎందుకంటే ఇది నేటి మేటి హాస్య సమర్పకులు అనేక మంది తమ ప్రదర్శనలు ఇవ్వడం ప్రారంభించిన సమయం. జాకీర్ ఖాన్, సపన్ వర్మ, కరుణేష్ తల్వార్ తదితరులు మన నగరంతో సహా పలుచోట్ల ఇచ్చిన ప్రదర్శనలు విజయవంతం అయ్యాయి. అమిత్ టాండన్, నీతి పల్టా అభిõÙక్ ఉప్మన్యు, అనుభవ్ సింగ్ బస్సీ, ఆకాష్గుప్తా, సమయ్ రైనా, హర్ష గుజారాల్ వంటివారు ఇప్పుడు సెలబ్రిటీలుగా మారిపోయారు. పాపులారిటీ కారణంగా కొందరు సినిమాల్లో అవకాశాలు కూడా దక్కించుకున్నారు. అదేవిధంగా కొందరు వివాదాస్పద హాస్యంతో వివాదాలకు చిరునామాగా మారడం, అలాంటి కమెడియన్ల షోలకు నగరంలో అనుమతి నిరాకరిస్తుండటం కూడా మనకు తెలిసిందే. సెలబ్రిటీలు సైతం.. ఓ వైపు స్టాండప్ కామెడీ అనేక మంది సాధారణ వ్యక్తుల్ని సెలబ్రిటీలుగా మారుస్తుంటే.. కొందరు సెలబ్రిటీలు తామే స్టాండప్ కామెడీకి జై కొడుతున్నారు. ‘నా దగ్గర చెప్పడానికి కొన్ని కథలు ఉన్నాయి, అవి తమాషాగా ఉండి స్టాండ్–అప్ కామెడీకి నప్పుతాయి. అందుకే 59 సంవత్సరాల వయస్సు గల స్టాండ్–అప్ కామిక్ని అనుకుంటున్నాను’ అని చెప్పారు సినీనటుడు అశిష్ విద్యారి్థ. ఇటీవలే స్టాండప్ కామెడీలోకి ప్రవేశించిన ఈయన నగరంలో తన కామెడీ ప్రదర్శన కూడా ఇచ్చారు. చిన్న చిన్న సమూహాల కోసం కేఫ్స్, రెస్టారెంట్స్, క్లబ్స్, పబ్స్, ఆఖరికి కార్పొరేట్ కంపెనీల్లో సైతం తరచూ వీరి షోస్ నిర్వహించడం పరిపాటిగా మారింది. ప్రత్యేకంగా గచి్చ»ౌలిలోని కామెడీ థియేటర్ తరహాలో పలు క్లబ్స్ కూడా ఏర్పాటయ్యాయి. ప్లేస్.. పబ్లిక్ని బట్టి.. క్లబ్స్లో ఒకలా, లాంజ్ బార్లయితే మరోలా, కేఫ్స్లో ఇంకోలా.. ఇలా ప్రదర్శించే చోటును బట్టి హాజరయ్యే ప్రేక్షకులను బట్టి స్టాండప్ కామెడీ స్క్రిప్ట్ మెటీరియల్ మారుతుంటుంది. అలాగే ఈ కమెడియన్స్లో కూడా రాజకీయాలకు కొందరు రిలేషన్షిప్స్, శృంగారభరిత హాస్యానికి కొందరు.. ఇలా ఒక్కొక్కరు ఒక్కో విధంగా స్పెషలైజ్డ్ అవుతున్నారు. నగరంలో పేరొందిన స్టాండప్ కమెడియన్స్ దాదాపుగా 25 మంది దాకా ఉంటారు. వీరికి ఇచ్చే రెమ్యునరేషన్ కూడా షోకి రూ.10 వేలు నుంచి మొదలవుతూ.. భారీగానే ఉంటోంది. రోజువారీ పని ఒత్తిడిలో పడి నవ్వలేకపోవడం అనే రోగానికి గురైన వారికి చికిత్స చేసి నవ్వడం అనే భోగాన్నిస్తూ నవ్వించే యోగులుగా మారారు స్టాండప్ కమెడియన్స్. ‘పని సంబంధిత ఒత్తిడిని ఎదుర్కోవడానికి ఈ ఆధునిక యుగంలో హాస్యం ఒక గొప్ప మార్గం’ అని చెన్నైకి చెందిన ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రెన్యూర్షిప్ అయిన ఎవామ్ డైరెక్టర్ సునీల్ విష్ణు.కె అంటున్నారు. జీవితం అత్యంత సంక్లిష్టమైంది దాన్ని వీలైనంత సరదాగా ఆహ్లాదకరంగా మనం మార్చాలి, హాస్యం లేకుండా జీవితం భరించలేనంత బోరింగ్గా అనిపిస్తుందని నమ్ముతున్నా అని ప్రస్తుతం దక్షిణాదిలోని అగ్రగామి కామెడీ షోస్ నిర్వాహక సంస్థ ఎవామ్ డైరెక్టర్ చెబుతున్నారు.కొలీగ్స్ని నవ్వించడమే.. కెరీర్గా మారిందిఅమెజాన్లో ఉద్యోగం చేస్తున్నప్పుడు కొలీగ్స్తో జోక్స్ వేసి సరదాగా నవ్వించడమే అలాగే ఓ సారి కంపెనీ పెట్టిన కాంటెస్ట్లో పాల్గొని కామెడీ షో చేస్తే అది హిట్ అవడం.. ఫైనల్గా నేను స్టాండప్ కమెడియన్గా మారడం.. జరిగింది. ప్రస్తుతం నగరంలోని పలు వెన్యూస్లో తరచూ కామెడీ షోస్ సమరి్పస్తున్నాను. విభిన్న రకాల అంశాలను మేళవించి నవ్వించడం నా శైలి. ఇతర మెట్రో నగరాల్లో బాగా వేళ్లూనుకున్న ఈ ప్రొఫెషన్ నగరంలో ఇప్పుడిప్పుడే పుంజుకుంటోంది. నా షోస్ ఎక్కువగా నగరంలోని అరోమలి కేఫ్, పక్కా లోకల్, కామెడీ థియేటర్.. తదితర చోట్ల ఉంటాయి. – సందేశ్ జానీ, స్టాండప్ కమెడియన్ -
నెహ్రూ జూ పార్కుకు కొత్త జాతులు
జూ.. ఈ పేరు చెబితేనే పిల్లల నుంచి పెద్దల వరకూ అదో వింత అనుభూతి కలుగుతుంది. ప్రకృతిలో మమేకమై సంచరించే వన్య ప్రాణులను చూస్తే ఒళ్లు పులకరిస్తుంది.. అలాంటి అనుభూతే నగరంలోని నెహ్రూ జూ పార్కులోనూ కనిపిస్తుంది. అయితే ఎప్పటి నుంచో ఉన్నదేగా! ఇప్పుడు ఆ సోదంతా ఎందుకు అనే సందేహం కలగక మానదు.. అదేనండి.. జంతు మార్పిడిలో భాగంగా నగరానికి కొత్త రకాల జాతులు, జంతువులు రానున్నట్లు అధికారులు చెబుతున్నారు. దీంతో నెహ్రూ జూపార్కు నగర వాసులకు కొత్త ఆకర్షణగా మారనుందని తెలుస్తోంది.. వీటిని దత్తత తీసుకునేందుకు ఇప్పటికే ఓ కార్పొరేట్ సంస్థ కూడా ముందుకొచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. ఇందులో భాగంగానే జూకు 16 దేశాల నుంచే కాకుండా దేశంలోని పలు జూల నుంచి కూడా కొత్త అతిథులు రానున్నాయి. నగరంలోని నెహ్రూ జంతు ప్రదర్శనశాలలోకి ఈ వేసవిలో కొత్త జంతువులు రానున్నాయి. ఇక్కడి వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా.. వాటి మనుగడకు ఇబ్బంది లేకుండా ఇప్పటికే ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఆసే్ట్రలియాలో మాత్రమే కనిపించే కంగారూలు త్వరలోనే భాగ్యనగరంలో కనువిందు చేయనున్నాయి. జంతు మార్పిడిలో భాగంగా రెండు కంగారూలు, అదే విధంగా చెక్ రిపబ్లిక్ నుంచి తెల్ల సింహం, థాయిలాండ్ జీబ్రాలు, ఆఫ్రికా చింపాంజీలు రానున్నాయి. వీటి మనుగడకు ఇబ్బంది లేకుండా ఇప్పటికే సంబంధిత జూ అధికారులు ఏర్పాట్లకు ప్రణాళికలు చేస్తున్నారు. దేశీయ జూల నుంచి.. దీంతో పాటు దేశీయ జూ పార్కుల నుంచి కూడా జంతు మార్పిడి ప్రక్రియలో భాగంగా పులులు, సింహాలు, మొసళ్లతో పాటు ఇతర జంతవులు కూడా సందర్శకులకు కనువిందు చేయనున్నాయి. కంగారూల సంరక్షణకు అయ్యే నిర్మాణ ఖర్చులను భరించేందుకు దుండిగల్లోని ఓ ఫార్మా కంపెనీ ముందుకొచ్చిందని అధికారులు చెబుతున్నారు. జంతు మార్పిడి పథకంలో భాగంగా జపాన్లోని ఓక్లాహోమా జూపార్కు కంగారూ జంతువులు రెండు నెలల్లో రానున్నాయని తెలిపారు. అనుమతి కోసం.. జపాన్లోని ఓక్లాహోమా గార్డెన్, హైదరాబాద్లోని నెహ్రూ జూపార్క్ మధ్య ఈ మేరకు ఇప్పటికే ఒప్పందాలు కుదిరాయని, కేంద్ర, రాష్ట్రాల అటవీ, పర్యావరణ శాఖ, సెంట్రల్ జూ అథారిటీ, విదేశీ వాణిజ్య వ్యహారాల డైరెక్టర్ జనరల్ అనుమతి లభించిన వెంటనే తరలింపు ప్రక్రియ ఉంటుందని అధికారులు చెబుతున్నారు. అయితే వేసవి సెలవులు ప్రారంభమయ్యే నాటికే కంగారు జంతువులు రంగప్రవేశం చేస్తాయని జూపార్క్ సంరక్షణాధికారి చెబుతున్నారు. మారి్పడి ఇలా.. రాజ్కోట్ జంతు ప్రదర్శనశాలకు చెందిన ఆసియా జాతి సింహం గతేడాది ఆగస్టులో వచ్చింది. రెండు జతల అడవి కుక్కలు, కొండ చిలువలు 2, మంగళూరు బయోలాజికల్ పార్కు నుంచి తీసుకొచ్చి, వీటికి బదులుగా ఒకటి మగ, మూడు ఆడ మూషిక జింకలను జూ పార్కు నుంచి ఇచ్చారు. పెద్ద ఎగ్రెట్ 3 మగ, 3 ఆడ, గ్రే పెలికాన్, ఆడ మంగళూర్ పిలికుల జూకు అందజేశారు. త్రివేండ్రం జూ నుంచి సౌత్ అమెరికా వైట్ రియా 2 జతలు, బ్రౌన్ రియా 2 జతలకు ఎగరని పక్షి జాతి, జత ఎలుగుబంటి, తొండ జాతి ఇగ్వానా సెంట్రల్ అమెరికన్ జత వచ్చాయి. జపాన్లోని ఓక్లాహోమా జూ నుంచి జత మీర్ క్యాట్ వచ్చాయి.. బదులుగా ఒక ఆడ ఆసియా సింహాన్ని ఇచ్చారు. కంగారూలు ఇక్కడ బతుకుతాయా? ఆ్రస్టేలియాలో ఎక్కువగా కనిపించే కంగారూలు.. ఆఫ్రికాలోని కలహారి ఎడారిలో జీవించే మీర్కట్ల కోసం జూ అధికారులు ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తోంది. ఇతర విదేశీ జంతువుల కోసం కూడా అక్కడి వాతావరణ ఏర్పాట్లు కల్పిస్తున్నారు. విదేశాల నుంచి వచ్చే జంతువులు భారత ఉపఖండం వాతావరణంలో బతకగలవా? లేదా? అనే విషయంపై జీవశాస్త్రవేత్తలు పెద్ద ఎత్తున పరిశోధనలు చేశారు. మన దేశంలోనూ కంగారూలు సంచరించినట్లు పురాతత్వ శాస్త్రవేత్తలు ఓ అవగాహనకు వచ్చారు. ఈ నేపథ్యంలో రెండేళ్ల కిందట.. ఇదే జపాన్ నుంచి రెండు కంగారూలను కోల్కతాలోని కనజావా జూపార్కుకు తీసుకొచ్చారు. ప్రత్యేకంగా పెంచిన గడ్డిని, వాటికి అనువైన వాతావరణాన్ని కల్పించడంతో కంగారూలు మనుగడ సాగిస్తున్నాయి. నెహ్రూ జూపార్కులోనూ అదే తరహా ఏర్పాటు చేస్తున్నారు.183 జాతులు.. 1,860 ప్రాణులు.. దాదాపు 380 ఎకరాల్లో విస్తరించిన నెహ్రూ జూపార్కులో ప్రస్తుతానికి 183 జాతులతో మొత్తం 1,860 జీవాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. జంతు మార్పిడిలో భాగంగా నెహ్రూ జూపార్కుకు రెండు హిప్పోపొటమస్లు, సింహం లాంటి తోకలు ఉండే రెండు ముకాన్, బూడిద రంగు తోడేలు, జిరాఫీల జంట, నాలుగు కింగ్ కోబ్రాలను తీసుకొచ్చారు.ప్రతిపాదనలు పంపించాం.. జంతు మారి్పడిలో భాగంగా ఈ ఏడాది జూకు కొత్త జంతువుల కోసం ప్రతిపాధనలు కేంద్ర కార్యాలయానికి పంపాము. ఇప్పటికే దేశీయ జూల నుంచి వివిధ రకాల జంతువులను తరలించాము. గత ప్రతిపాధనలతో పాటు కొత్త ప్రతిపాదనల్లో తెల్ల సింహాలు, జీబ్రా, చింపాంజీ, కంగారు జంతువులు తేనున్నాం. ప్రస్తుతం జూలో ఉన్న వన్యప్రాణుల ఆలనా పాలనా విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాం. వాతవరణ పరిస్థితులకు అనుగుణంగా ఏర్పాట్లు, ఆహారం అందజేస్తున్నాం. :::జె.వసంత, నెహ్రూ జూ పార్క్ క్యూరేటర్ -
అక్షరం..అపు రూపం..
‘సార్.. నా రాత ఒకప్పుడు ముత్యాలు పేర్చినట్టుండేది. ఇప్పుడు కోడి కెలికినట్టు ఉంటోంది’.. ‘మేడమ్.. ప్లీజ్, అర్జెంట్గా నా రైటింగ్ స్టైల్ బాగవ్వాలి.. లేకపోతే చెక్బుక్ మీద సంతకం కూడా సరిగా రావడం లేదు’.. ‘అమ్మో.. నాలుగు పేజీలు రాయాలట.. నా వల్ల కావడం లేదు. ఎప్పుడో కాలేజీ రోజుల్లో అంటే ఓకే. ఇప్పుడు రాయడం ఎంత కష్టంగా ఉందో’ ఇలాంటి అభ్యర్థనలతో హ్యాండ్ రైటింగ్ నిపుణులను సంప్రదిస్తున్నవారు నగరంలో పెరిగారు. చేతిరాత అధ్వాన్నంగా మారిందని కొందరు, నాలుగులైన్లు రాస్తే చేతులు నొప్పులు పుడుతున్నాయని మరికొందరు.. ఇలా రకరకాల సమస్యలను ఎదుర్కొంటూ నగరవాసులు రైటింగ్ డాక్టర్స్/ గ్రాఫాలజిస్ట్లను కలుస్తున్నారు. ‘గతంలో చిన్నపిల్లలు, కాలేజీ విద్యార్థులు మాత్రమే తమ రైటింగ్ స్కిల్స్ను మెరుగుపరచాలని వచ్చేవారు. ఇప్పుడు మధ్యవయస్కులు, ఉద్యోగస్తులు, గృహిణులు వస్తున్నారు’ అని చేతిరాత నిపుణులు డాక్టర్ రణధీర్ కుమార్ చెబుతున్నారు. ఇచ్చట నేను క్షేమం.. అచ్చట మీరు క్షేమంగా ఉన్నారని భావిస్తా.. ఇలా ఆప్యాయత ఉట్టిపడే అక్షరాలతో అల్లుకున్న అనుబంధాల లేఖలు లేవు. ‘తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు’ అంటూ చూపుల్ని పంచుకున్న ప్రేమలేఖలూ లేవు. ఎందుకంటే.. ఇప్పుడు చేతిరాతలే లేవు.. బుడిబుడి అడుగులు వేసే వయసులో పలక, బలపం చేతబట్టి ‘అ ఆ ఇ ఈ’ లను దిద్దడం నేర్చుకున్నాం. బలపం నుంచి పెన్సిళ్లు, పెన్నులు, కాగితాలు, పుస్తకాలు.. ఇలా అక్షరాలు ఆసీనులయ్యే ఆసనాలు, ఆవిష్కరించే సాధనాలు మారేకొద్దీ.. మన చేతిరాత మరింత మెరుగులు దిద్దుకుంది. మన చేతుల్లో నుంచి ఊపిరి పోసుకున్న గీత మన తలరాతను సైతం దిద్దగలిగింది. అంతటి చరిత్ర ఉన్న అక్షరం ఇప్పుడు వంకర్లు పోతోంది. రాత.. గీత తప్పుతోంది. చేతిరాత చెదిరి ‘పోయేకాలం’ వచ్చేసింది.. డిజిటల్ కోరల్లో చిక్కిన చేతిరాత.. చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. రాస్తున్నాం కానీ.. రాత ఏదీ.. మనం పేపర్ మీద పెన్ను పెట్టి ఎన్ని రోజులైంది? బహుశా కొన్ని నెలలు గడిచినా ఆశ్చర్యపోనక్కర్లేదేమో కదా? ఒక్కసారి సెల్ఫ్ చెక్ చేసుకుంటే మనకే అర్థమవుతుంది. చేతిరాతకు ఎంతగా దూరమవుతున్నామో.. ఒకప్పటికన్నా ఇప్పుడే మనం ఎక్కువగా రాస్తున్నాం. అయితే పెన్నుతోనో.. పెన్సిల్తోనో కాదు. కేవలం కీబోర్డ్తోనే అనేది అక్షర సత్యం. కంప్యూటర్ కావచ్చు, మొబైల్స్ కావచ్చు.. ఇవన్నీ చేతిరాత అంతాన్నే కోరుతున్నాయి. పచారీ సామాన్ల జాబితా నుంచి సమావేశంలో నోట్స్ రాసుకోవడం వరకూ.. పుట్టిన రోజు శుభాకాంక్షల నుంచి పోయిన రోజు సంతాప సందేశాల వరకూ అన్నీ టెక్ట్స్ మెసేజ్లో, మెయిల్స్, మరొకటో దీంతో రాయాల్సిన అవసరం రోజురోజుకూ తగ్గిపోతోంది. ఫలితంగా అష్టకష్టాలూ పడి నేర్చుకున్న ‘మనదైన’ చేతిరాత మనల్ని వీడిపోతోంది. చరిత్ర చూసుకుంటే చేతిరాత పత్రాలు సృష్టించిన ఎన్నో అద్భుతాలు కనిపిస్తాయి. ప్రేమలు అంకురించడం దగ్గర్నుంచి యుద్ధాలు ప్రారంభించడం వరకూ సమస్యలు పరిష్కరించడం దగ్గర్నుంచి శాంతి నెలకొల్పడం వరకూ సంచలనాలను సృష్టించడం దగ్గర్నుంచి స్వేచ్ఛా స్వాతం్రత్యాలు అందించడం వరకూ.. అన్నిట్లో చేతి రాత పత్రాల ప్రాధాన్యత మనకు స్పష్టంగా కనబడుతుంది.‘రైట్’ ఈజ్ బ్రైట్.. హ్యాండ్ రైటింగ్ బావున్నంత మాత్రాన నాలుగు మార్కులు పడితే పడతాయేమో.. అంతకు మించి ఏం లాభంలే.. అని తీసి పారేసే విషయం కాదిది. కార్పొరేట్ కంపెనీలు, బహుళజాతి సంస్థలు.. ఉద్యోగులను నియమించుకునే సమయంలో వారి విద్యార్హతలు, ప్రవర్తనా తీరుతెన్నులతో పాటు వ్యక్తి చేతిరాతను తద్వారా వ్యక్తిత్వాన్ని అంచనా వేస్తూ.. పనితీరును, సామర్థ్యాలను విశ్లేíÙంచి అనంతరం ఉద్యోగిగా అవకాశం ఇవ్వడం ఇప్పుడు నగరంలోని కార్పొరేట్ కల్చర్లో సర్వ సాధారణం. చేతిరాతను విశ్లేíÙంచేందుకు దాదాపు ప్రతి కంపెనీ ఒక గ్రాఫాలజిస్ట్ను అందుబాటులో ఉంచుకుంటోందంటే సంస్థలు ఈ విషయానికి ఇస్తున్న ఇంపార్టెన్స్ ఏమిటో తెలుస్తుంది.చేతిరాతతో చెప్పుకోదగ్గ విజయాలు.. చేతిరాత మార్చుకునే ప్రక్రియ మన జీవనశైలిని కూడా మార్చుకునేందుకు ఉపకరిస్తుందని గ్రాఫాలజిస్ట్లు చెబుతున్నారు. సహజంగా వచ్చే కొన్ని ప్రవర్తనాలోపాలను రాసే తీరుతో మార్చుకోచ్చని స్పష్టం చేస్తున్నారు. విద్యార్థులు రాయడం ద్వారానే చదవడం నేర్చుకుంటారు. కొన్ని పరిశోధనల ప్రకారం రాయడం అలవాటున్నవారి ఆలోచనలు, రాయడం అలవాటు లేనివారితో పోలిస్తే మరింత సృజనాత్మకంగా ఉంటాయి. అదే విధంగా కీబోర్డ్తో పోల్చుకుంటే రాసేటప్పుడు బ్రెయిన్ పనిచేసే తీరు భిన్న ఫలితాలు అందిస్తుంది. డైరీ రాయడం వల్ల ఒత్తిడి తగ్గుతుందని వ్యాధి నిరోధకత పెరుగుతుందని పరిశోధనల విశ్లేషణ.రాతే వ్యక్తిత్వానికి దిక్సూచి.. నిత్య జీవితంలో వాడకం తగ్గడం వల్ల మనం చేతిరాతను మర్చిపోతున్నాం. అకస్మాత్తుగా ఏదైనా అవసరం వస్తే అప్పటికప్పుడు నాలుగు లైన్లు రాయడానికి కూడా చాలా మంది ఇబ్బంది పడుతూ మమ్మల్ని సంప్రదిస్తున్నవారు ఇటీవల పెరిగారు. చేతిరాత మనిషి వ్యక్తిత్వానికి దిక్సూచి వంటిది. దాన్ని పోగొట్టుకోవడం తెలివైన పనికాదు. అవసరమైన చోట కంప్యూటర్లు వినియోగిస్తూనే రాతను కాపాడుకునే నేర్పును మనం అలవర్చుకోవాలి. – డా.రణదీర్కుమార్, గ్రాఫాలజిస్ట్సర్వే జనా ‘లిఖి’నో భవంతు.. డాక్మెయిల్ అనే బ్రిటిష్ కంపెనీ చేసిన సర్వే పరిశీలిస్తే.. ఆధునికుల్లో సగటున ఓ వ్యక్తి 41 రోజులకు నాలుగులైన్లు రాయాల్సిన అవసరం పడడం లేదట. అలాగే ప్రతి ముగ్గురిలో ఒకరికి ఆరు నెలలపాటు కలం పట్టే ఖర్మే పట్టడం లేదట. ప్రతి ఏడుగురిలో ఒకరు తమ హ్యాండ్ రైటింగ్ మారిన తీరు తమకే అవమానకరంగా మారిందన్నారు. గత కొంత కాలంగా తమ చేతిరాత గుర్తించదగిన రీతిలో మారిపోయిందని సర్వేలో పాల్గొన్నవారిలో సగం మంది చెప్పారు. ‘చేతిరాత అవసరం తగ్గుతున్నప్పటికీ, టెక్నాలజీతో సంబంధం లేకుండా కూడా కమ్యూనికేట్ చేయగల సామర్థ్యాలను ప్రజలు నిలబెట్టుకోవాల్సిందే’ అని డాక్మెయిల్ కంపెనీ డైరెక్టర్ బ్రాడ్వే వ్యాఖ్యానించడం గమనార్హం.చేజారనివ్వకుండా.. నిద్రకు ముందు ప్రతి రోజూ కాసేపైనా డైరీ రాయడం అలవాటుగా మార్చుకోండి. ఆలోచనలకు ఎప్పటికప్పుడు అక్షరరూపం ఇవ్వడానికి ప్రయతి్నంచండి. చిన్న చిన్న కథలు, ఉత్తరాలు స్వయంగా రాయండి. మన లక్ష్యాలను, కలలను తరచూ పేపర్పై పెడుతుండాలి. మనకు బాగా ఇషు్టలైనవారికి చేతిరాతతో శుభాకాంక్షలు పంపడం అలవాటు చేసుకోండి. రాయలేక పోతున్నా.. చదువుకునేటప్పుడు నా చేతిరాత చాలా బావుండేదని అందరూ మెచ్చుకునేవారు. ఉద్యోగంలో చేరాక రాయాల్సిన అవసరం తగ్గిపోయింది. మధ్య మధ్యలో సరదాగా ఏదైనా రాసినా, నా రాత నాకే నచ్చన మానేశాను. అనుకోకుండా ఈ మధ్యే ఒక కోర్సులో జాయిన్ అయ్యి, అక్కడ నోట్స్ రాసుకోడానికి నానా కష్టాలు పడ్డాను. పెన్ను సజావుగా కదలడానికి. దాదాపు నెలరోజులు పట్టింది. – సిహెచ్.వంశీ, సాఫ్ట్వేర్ ఇంజినీర్ -
సాగర తీరాన.. విరుల సరాగం
సాగరతీరాన ఎటూ చూసినా విభిన్న మొక్కల సోయగం.. దేశీ వెరైటీలు మొదలు విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న అరుదైన మొక్కలతో సందడిగా మారింది నెక్లెస్రోడ్ పీపుల్ ప్లాజా వేదికగా ఏర్పాటు చేసిన హార్టికల్చర్ షో. సాధారణ చామంతులు మొదలు ఇంపోర్టెడ్ ఆర్కిడ్స్, హోల్కోనియా వరకూ అన్నిరకాల మొక్కలు ఈ ప్రదర్శనలో కొలువుదీరాయి. ఇంటీరియర్, ఎక్ట్సీరియర్ అంటూ వినూత్న జీవనశైలికి హంగులద్దుతున్న నగరంలోని మొక్కల ప్రియులు ఈ హారీ్టకల్చర్ షోకు పరుగులు పెడుతున్నారు. ఇక్కడ 50 రూపాయలు మొదలు లక్షకు పైగా ధరల్లో మొక్కలు అందుబాటులో ఉన్నాయి. కాంక్రీట్ జంగిల్లా మారిపోతున్న నగర జీవనశైలిలో కాసింత సాంత్వన, విశ్రాంతి మొక్కలు ఎంతో అవసరం. అంతేకాకుండా పర్యావరణ సమతుల్యం, పరిరక్షణలో ఈ మొక్కలదే కీలక పాత్ర. వెరసి గత కొన్నేళ్లుగా నగర వాసులు గార్డెనింగ్, మిద్దెపంట, ఇంటీరియర్, ఎక్ట్సీరియర్ అంటూ విభిన్న రకాలుగా మొక్కల పెంపకం పై ఆసక్తి చూపిస్తున్నారు. ఇలాంటి తరుణంలో ప్రతి ఏటా నగరం వేదికగా నిర్వహించే హారీ్టకల్చర్ ప్రదర్శనకు ప్లాంట్ లవర్స్ తాకిడి క్రమంగా పెరుగతోంది. సాధారణ మొక్కలు మొదలు అరుదైన మొక్కలు, బోస్సాయ్ మొక్కలు, ఔషధ మొక్కలు, ఆర్నమెంటల్ తదితర మొక్కలు అమ్మకానికి వచ్చాయి. ఇందులో భోన్సాయ్, ఫైకస్ మొక్క లక్ష రూపాయలకు పైగా అమ్మకానికి రావడం విశేషం. అంతేకాదు థాయ్లాండ్ నుంచి దిగుమతి చేసిన కమేలియన్ మొక్క కూడా అక్షరాల లక్ష రూపాయలు పలకడం విశేషం. అరుదైన మొక్కలు.. ‘అరుదైన మొక్క స్టాగన్ ప్లింగ్ రకం ఈ సారి తీసుకొచ్చాం. ఇవి వాటి సైజుల ఆధారంగా 4 వందల నుంచి 8 వేల వరకూ అందుబాటులో ఉన్నాయి. డ్రిఫ్ట్ వుడ్తో ప్రత్యేకంగా తయారు చేసిన ఈ ఇంటీరియర్ మొక్కలకు పూసిన పూలు 6 నెలల వరకూ వాడిపోవు. ఇవన్నీ ఆర్కిడ్ జాతికి చెందినవి. పూణే నుంచి తీసుకొచి్చన ఈ వెరైటీ ఖరీదు 35 వేలు అని స్టాల్స్ నిర్వాహకులు చెబుతున్నారు. ప్రత్యేకంగా గ్రూమింగ్ చేస్తాం.. మా దగ్గర సీజనల్ చామంతి ప్రత్యేకం. వీటిని కాకినాడలోని గణపతి గార్డెన్స్లో ప్రత్యేకంగా గ్రూమింగ్ చేస్తాం. దాదాపు 6 నెలలు కష్టపడితే వందల పూలతో ఒక బంతిలా తయారవుతాయి. ఇందులో 25 రకాల రంగులు అందుబాటులో ఉన్నాయి. 3 వందల నుంచి 3 వేల వరకూ అందుబాటులో ఉన్నాయి. నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి నెలల్లో పూలతో అలరిస్తాయి. రెండు మొక్కలు తీసుకుంటే 500 వందల ఆఫర్తో అందిస్తున్నాం. – గణపతి గార్డెన్స్ నిర్వాహకులుగత మూడున్నరేళ్లుగా.. దేశవ్యాప్తంగా సేకరించిన విభిన్న మొక్కలు ఈ నర్సరీ మేళాలో అందుబాటులో ఉంచాను. ముఖ్యంగా కలకత్తా నుంచి తీసుకువచి్చన కమేలియాస్ ఈ సారి ప్రత్యేకం. అజేలియాస్ హైడ్రేంజియాస్, డేలియాస్ వంటి విభిన్న మొక్కలకు మంచి ఆదరణ పెరిగింది. డేలియాస్ పూల మొక్కల్లో అతిపెద్ద సైజు వెరైటీ మొక్కలు ఆకర్షణీయంగా ఉన్నాయి. ఇవి ఏప్రిల్ వరకూ పూలతో అలరిస్తాయి. నాటు కమేలియాస్ మా ప్రత్యేకం.. పెద్దవి రూ.2900 చిన్నవి రూ.1200 వరకూ అమ్ముతున్నాను. నగరంలోని కౌకూర్ వేదికగా గత మూడన్నరేళ్లుగా మొక్కలతో పాటు కాంప్రహెన్సివ్ స్టోర్గా మార్బుల్, సిరామిక్, హుడ్, ప్లాస్టిక్ తొట్లతో సేవలందిస్తున్నాం. – పాల్ చంద్రకాంత్, స్టాల్– బీ24, 2530 రకాల ఆర్కిడ్స్.. ఇందులో 30 రకాల వరకూ అందుబాటులో ఉన్నాయి. కటేలియా, ఫాక్స్టైల్, బ్యాండ్రియం, క్రీపర్స్, ఎయిర్ ప్లాంట్స్ తదితర వెరైటీలు బాగా అమ్ముడుపోతున్నాయి. వీటిని థాయ్లాండ్ నుంచి దిగుమతి చేసుకుని, వెస్ట్ గోదావరి తణుకు వేదికగా 7 ఎకరాల నర్సరీలో పెంచుతున్నాం. 7 వందల నుంచి 2500 వరకూ ధరల్లో అందుబాటులో ఉన్నాయి. – సంతో‹Ù. 450కు పైగా వెరైటీలు.. తెలంగాణలో అడీనియం బోన్సాయ్ మొక్కల్లో అన్ని వెరైటీలనూ అందిస్తున్నది ‘హైదరాబాద్ అడీనియం’ మాత్రమే. 450కు పైగా వెరైటీలు అందుబాటులో ఉంటాయి. బేబీ ప్లాంట్ నుంచి 30 ఏళ్ల అడీనియం మొక్కలు 250 నుంచి 50 వేల వరకూ అందుబాటులో ఉంటాయి. కేరళ నుంచి వాటర్ ప్లాంట్స్ తీసుకొచ్చాం. ముఖ్యంగా వాటర్ లిల్లీ, తామర పూలు మా ప్రత్యేకం. అంతేకాకుండా అలోకేíÙయా, హెల్కోనియా, కొలకేషియా తదితర రకాలు ఉన్నాయి. తామరలోనే ఎనిమిది రకాలకు పైగా ఉన్నాయి. మా వద్ద 6 వందల నుంచి 7 వేల వరకూ ధరలు ఉన్నాయి.జనప నారతో బ్యాగ్స్.. ఆంక్రో పెగ్రో సైన్సెస్ అనేది మా సంస్థ. మా వద్ద హెర్బల్, ఈకో ఫ్రెండ్లీ, ఆర్గానిక్ గ్రో బ్యాగ్లు అందుబాటులో ఉన్నాయి. ఎండాకాలంలో ఇవి మొక్కలకు అధిక రక్షణ ఇస్తాయి. బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఉండకుండా ఈ బ్యాగులు చూసుకుంటాయి. ఈ బ్యాగుల్లో రెండు రోజులకు ఒకసారి నీరు పోసినా సరిపోతుంది. వీటిని జనప నారతో తయారు చేస్తాం. – ప్రదీప్ -
ఆన్లైన్ షాపింగ్లో బిజీనా.. అయితే బీకేర్ఫుల్!
ఐరన్ మ్యాన్ 3 టీ షర్ట్ కావాలా.. ఆన్లైన్కు వెళ్లు, బ్లూటూత్ అవసరమా నెట్లో చూడు.. లంచ్కి వెజిటబుల్స్ లేవా జొమాటోలో ఆర్డర్ పెట్టు.. ఇది ప్రస్తుతం నగరంలో నడుస్తోన్న కొత్త రకమైన మానియాగా వైద్యులు చెబుతున్నారు.. నగరవాసుల ధోరణిలోనూ ఇదే ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. గృహిణులకు, విద్యార్థులకు, సమయాభావంతో షాపింగ్కు వెళ్లలేని వారికి అత్యంత సౌకర్యంగా ఉంటున్న ఈ షాపింగ్ ట్రెండ్.. తొండ ముదిరి ఊసరవెల్లి అయినట్టు కొందరిలో తీవ్రస్థాయి వ్యసనంగా మారడం ఆందోళనకర పరిణామం అని నిపుణులు చెబుతున్నారు. తొలుత దీనిని ‘కంపల్సివ్ బైయింగ్ డిజార్డర్’గా పేర్కొన్న సైకాలజిస్ట్స్.. ఇప్పుడు తీవ్రత దృష్ట్యా ఈ వ్యాధికి ఒనియోమానియా అని నామకరణం చేశారు. ఈ వ్యాధి బాధితులు పెరుగుతున్న నేపథ్యంలో జాగ్రత్తలు తప్పనిసరి అని స్పష్టం చేస్తున్నారు. ఇటీవల జర్మనీలోని హన్నోవర్ మెడికల్ స్కూల్ పరిశోధకులు ‘కంపల్సివ్ బైయింగ్ డిజార్డర్’ అని పేర్కొనే వ్యాధి ఆధునికుల్లో ముదురుతోందని గుర్తించారు. ‘దీనిని ప్రత్యేక మానసిక ఆరోగ్య స్థితిగా గుర్తించడానికి ఇది సరైన సమయం’ అని ఈ అధ్యయనానికి నాయకత్వం వహించిన ఆస్ట్రిడ్ ముల్లర్ అన్నారు. కాంప్రహెన్సివ్ సైకియాట్రి అనే జర్నల్లో ప్రచురించిన అధ్యయనం ప్రకారం, అభివృద్ధి చెందిన దేశాల్లో దాదాపు 5% మంది పెద్దలను సీబీడీ ప్రభావితం చేస్తోంది. ప్రతి 20 మందిలో ఒకరు దీని బారిన పడుతున్నారని ఇంటర్నేషనల్ బిజినెస్ టైమ్స్ వెల్లడించింది. వీరిలో ముగ్గురిలో ఒకరు తీవ్రమైన ఆన్లైన్ కొనుగోలు వ్యసనంతో బాధపడుతున్నారు. ఇప్పుడు దీనినే ఒనియోమానియాగా వ్యవహరిస్తున్నారు. ఒనియోమానియా అనేది గ్రీకు భాషలోని ‘ఒనియోస్‘ అనే పదం నుంచి ఉద్భవించింది, ఇది ‘ఉన్మాదం’, ‘పిచ్చితనం’ అనే దానిని సూచిస్తుంది. కంపల్సివ్ బైయింగ్ డిజార్డర్ (సీబీడీ) ముదిరి ఆరోగ్యంపై ప్రతికూల ఫలితాలకు దారితీసే స్థాయిని షాపింగ్ ద్వారా నిర్ధారిస్తారు. తక్షణ ఉత్సాహం కోసం.. ఆన్లైన్ షాపింగ్ వ్యసనపరులం అయ్యామా లేదా అనేదానికి సమాధానంగా వారం రోజుల్లో మనం ఎన్ని ప్యాకేజీలను రిసీవ్ చేసుకున్నాం? అనేది లెక్కిస్తే సరి అంటున్నారు కన్సల్టెంట్ క్లినికల్ సైకాలజిస్ట్ అంకుర్ సింగ్. ఆన్లైన్ షాపింగ్ వ్యసనాన్ని కంపల్సివ్ బైయింగ్ డిజార్డర్ దాటి ఒనియోమానియాగా పిలుస్తున్నామని, ఇది జీవితంలో ప్రతికూల పరిణామాలకు దారితీసే అతి పెద్ద ప్రవర్తనా సమస్య అని హెచ్చరించారు. ఈ ఆన్లైన్ షాపింగ్ తక్షణ ఆనందాన్ని ఉత్సాహాన్ని అందిస్తుందని అన్నారు. హార్మోన్లపై ప్రభావం.. కొనుగోలు వల్ల కలిగే ఉత్సాహంతో బాక్స్ను ఓపెన్ చేసిన మరుక్షణమే డోపమైన్ హోర్మోన్ విడుదలవుతుంది. ఇది మరింత షాపింగ్ చేయాల్సిన అవసరాన్ని తెస్తుందని అంకుర్ వివరించారు. దీంతో ఒత్తిడి, ఆందోళన, నిరాశ లేదా ఒంటరితనాన్ని ఎదుర్కోడానికి షాపింగ్ను ఒక మార్గంగా ఉపయోగించడం పెరుగుతోందని, చివరికి మరింత తీవ్ర ఒత్తిడికి దారి తీస్తోందని విశ్లేషించారు. షాపింగ్ నుంచి పొందిన తాత్కాలిక ఉపశమనం లేదా ఆనందాన్ని పదే పదే కోరుకోవడం, మాదకద్రవ్య దురి్వనియోగానికి సమానమైన వ్యసనాన్ని సృష్టించగలదని హెచ్చరించారు.నష్టాలెన్నో.. సాధారణ వ్యక్తిగత షాపింగ్ సరదా ఎవరికీ హానికరం, లేదా బాధించేది కాదని చాలా మంది భావించవచ్చు. అయితే, ఇది స్థూల ఆర్థిక ఒత్తిడికి దారితీస్తుంది. ప్రత్యేకించి భాగస్వాములిద్దరూ ఉమ్మడి ఆర్థిక ఖాతాను కలిగి ఉన్న సందర్భాల్లో.. ఇది కొనుగోళ్లను దాచిపెట్టమని ప్రేరేపిస్తుంది. ఇది నెమ్మదిగా అపరాధ భావం లేదా అవమానం, ఆందోళన, నిరాశ, ఆత్మగౌరవం లోపించడం వంటి భావనలను కలిగిస్తుంది. ఈ ప్రవర్తన సామాజిక ఒంటరితనానికి దారితీయవచ్చు. వ్యక్తులు తమ షాపింగ్ అలవాట్లపై నియంత్రణ కోల్పోవచ్చు. ఇది ఆకస్మిక నిర్ణయాలకు దారి తీస్తుందని, ప్రతికూల పరిణామాలు ఉన్నప్పటికీ ఆపలేకపోవడం వ్యాధి తీవ్రతకు చిహ్నమని, ఈ అలవాటు అనుబంధాలపై సైతం వ్యతిరేక ప్రభావం చూపిస్తుందని చెబుతున్నారు. అంతేకాకుండా భవిష్యత్తు పొదుపు వంటి దీర్ఘకాలిక లక్ష్యాలపైనా వ్యతిరేక ప్రభావం చూపిస్తుందని సూచిస్తున్నారు. ఇలా వదులుకోవాలి.. ⇒ ఆన్లైన్లో గడపడం కన్నా వ్యాయామం చేయడం, స్నేహితులతో ముచ్చట్లు వంటి ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిచాలి. ⇒ విచక్షణతో కూడిన ఖర్చుల కోసం కఠినమైన బడ్జెట్ను సెట్ చేసుకోవాలి. పరిమితుల్లో ఉండేలా ఖర్చులను నిర్ణయించుకోవాలి. ⇒ ప్రచార ఈ మెయిల్స్ నుంచి సబ్స్క్రిప్షన్స్ తీసేయడం, ఫోన్ వగైరా డివైజ్ల నుంచి షాపింగ్ యాప్లను తగ్గించేయాలి. ⇒ తరచూ షాపింగ్ వెబ్సైట్లను సందర్శించకుండా నియంత్రించుకోవాలి. ⇒ అవసరం లేని వస్తువులను జాబితా తయారు చేసి పొరపాటున కూడా అవి కొనుగోలు చేయవద్దని నిర్ణయించుకోవాలి. మొదటి పది ఇవే.. నగరవాసులు అత్యధికంగా ఈ–షాప్ చేస్తున్నవాటిలో అగ్రస్థానంలో పుస్తకాల కొనుగోలు ఉంటే, ఆ తర్వాత వరుసగా దుస్తులు, మూవీ టిక్కెట్స్, ప్రయాణ టిక్కెట్లు, యాక్సెసరీస్, కార్డ్స్, డిజిటల్ డివైజ్లు, ఫుట్వేర్, గృహోపకరణాలు, బ్యూటీ ప్రొడక్ట్స్.. వగైరా ఉన్నాయి. ఇక ప్రస్తుతం మన వాళ్లు తరచూ సందర్శిస్తున్న షాపింగ్ సైట్లలో.. స్నాప్ డీల్, అమెజాన్, ఇబే, మింత్ర, జెబాంగ్, ఫ్లిప్కార్డ్, షాప్క్లూస్, దేశీడైమ్, ఫ్యాషన్ ఎన్ యు.. వంటివి ఉన్నాయి.నగరమా బీకేర్ఫుల్.. కరోనా మహమ్మారితో లాక్డౌన్ వల్ల నగరవాసులు ఫిజికల్ స్టోర్లను విస్మరించి, ఆన్లైన్లో ఆర్డర్ చేసేలా అలవాటుపడ్డారు. పైగా నగరంలో ఒక చోటు నుంచి మరోచోటుకు రాకపోకలకు ఉన్న ట్రాఫిక్ ఇబ్బందులు..వంటివి దృష్టిలో పెట్టుకుని గత కొన్ని సంవత్సరాలుగా ఇ–కామర్స్ విపరీతంగా పెరిగింది. అంతేకాక స్మార్ట్ఫోన్ల వినియోగం ఆన్లైన్ షాపింగ్ విజృంభణకు ఆజ్యం పోసింది. ప్రస్తుతం ఆన్లైన్ షాపింగ్ పరంగా 5.73 శాతంతో నగరం దేశంలోనే ఐదో స్థానంలో ఉంది. కాగా రంగారెడ్డి జిల్లా తొమ్మిదో స్థానంలో ఉండడం గమనార్హం. నానాటికీ విస్తరిస్తున్న వ్యాపార వ్యూహాలను గమనిస్తే.. త్వరలోనే నగరం టాప్కి చేరినా ఆశ్చర్యపోనక్కర్లేదని, దీంతో పాటే వ్యసనబాధితుల సంఖ్యలోనే అగ్రగామి కావడం జరగవచ్చని నిపుణులు విశ్లేíÙస్తున్నారు. కేవలం పుస్తకాలే.. తొలుత దాదాపు 50 పుస్తకాలకు పైగా ఆన్లైన్ ద్వారానే కొన్నాను. అలా అలా ఇప్పుడు రెగ్యులర్ ఈ–షాపర్ అయిపోయా. కేవలం పుస్తకాలే కాకుండా టేబుల్స్, టెక్నికల్ ఎక్విప్మెంట్ కూడా ఆన్లైన్లోనే కొంటున్నాను. – నికుల్గుప్తాతక్కువ ధరలకు.. నగరంలోని షోరూమ్లు అందించే వాటికన్నా.. ఆన్లైన్ ద్వారానే ఎక్కువ లేటెస్ట్ వెరైటీలు దొరుకుతాయి. బర్త్డే లేదా పార్టీ, ఫంక్షన్కు తగినవి, లేటెస్ట్ ఫ్యాషనబుల్ గూడ్స్ ఇంటి నుంచే సులభంగా యాక్సెస్ చేయవచ్చు. అందుకే ప్రస్తుతం షాపింగ్లో దాదాపు 70 శాతం ఆన్లైన్ మీదే. – పూజానేతి -
రుచుల రివ్యూ.. సిటీకి క్యూ
విభిన్నమైన ఆహార పదార్థాలకు ప్రసిద్ధి చెందిన హైదరాబాద్... ప్రపంచం నలుమూలల నుంచి వచ్చే పర్యాటకులను చారిత్రక విశేషాల ద్వారా మాత్రమే కాకుండా చవులూరించే ఘుమఘమల ద్వారా కూడా ఆకర్షిస్తోంది. అలా వచ్చి వెళ్లేవారు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటున్న అనుభవాలు పలువుర్ని ఆకట్టుకుంటున్నాయి. సిటీ రుచులకు సంబంధించి ఉన్న అభిప్రాయాలపై చర్చోపచర్చలకు దారి తీస్తున్నాయి. నగరానికి ఉన్న గొప్ప వంటల వారసత్వం పుణ్యమాని.. మొఘలాయ్, తెలుగు హైదరాబాదీ రుచులను మిళితం చేసిన సిటీ ఫుడ్ వెరైటీ రుచులను ఇష్టపడే ఎవరికైనా ప్రత్యేకమైన అనుభవాన్ని అందిస్తుంది. బిర్యానీల నుంచి ఇరానీ చాయ్ వరకు, బిస్కెట్ల నుంచి డబుల్ కా మీఠా వరకూ.. ఆహార ప్రియులకు హైదరాబాద్ స్వర్గధామం. ఈ నేపథ్యంలో నగరాన్ని సందర్శించే చాలా మంది విదేశీ సందర్శకులు సిటీ ఫుడ్ని ఎంజాయ్ చేయడం సోషల్ మీడియాలో స్పందనను పంచుకోవడం కూడా పరిపాటిగా మారింది. స్కాట్లాండ్ సే ఆయే మేరా దోస్త్.. సాధారణంగా నగరాన్ని సందర్శించే విదేశీయులు మన రుచుల్ని పొగుడుతూనో, లేదా అరుదుగా బాగోలేదు అనో ఒక్క ముక్కలో తేల్చేస్తారు. అయితే తాజాగా ఒక (స్కాట్లాండ్) స్కాటిష్ ట్రావెలర్ మాత్రం భిన్నంగా స్పందించి సోషల్ మీడియాలో తన పోస్ట్ల ద్వారా సిటీ ఫుడీస్ని ఆకర్షించాడు. స్కాటిష్ అయిన హ్యూ అబ్రాడ్ అనే విదేశీయుడు నగరాన్ని సందర్శించాడు. నగర ప్రతిష్టను విశ్వవ్యాప్తం చేసిన ప్రసిద్ధ వంటకాలు రుచి చూశాడు. అనంతరం వీటిని అందిస్తున్న హోటల్స్ రెస్టారెంట్స్పై తనదైన రీతిలో వీడియో పోస్టులు చేశాడు. అయితే ఇవి ఏదో యథాలాపంగా చేసినట్టు కాకుండా ఈ పోస్టులు చాలా వరకూ వాస్తవానికి దగ్గరగా ఉన్నాయంటూ నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. రేటింగ్స్ సైతం.. హ్యూ అబ్రాడ్ తన వీడియోలలో హోటల్ షాదాబ్లో అందించే ప్రసిద్ధ హైదరాబాదీ బిర్యానీని తాను రుచి చూసినట్లు తెలిపాడు. ఆ రుచి అమోఘం అంటూ మెచ్చుకుని షాదాబ్ బిర్యానీకి 10/10 రేటింగ్ ఇచ్చాడు. అదే సమయంలో అనేక మంది ఇష్టంగా తినే నిమ్రా కేఫ్లోనిఉస్మానియా బిస్కెట్ రుచిని మాత్రం తీసిపారేశాడు. అదొక ‘డ్రై’గా అతను పోస్ట్లో పేర్కొన్నాడు. అలాగే షహ్రాన్ హోటల్ కబాబ్ల కోసం మొజాంజాహీ మార్కెట్ను సందర్శించాడు. అక్కడి బోటీ, కబాబ్ రుచికరమైందిగా అంటూనే.. అందులో ఒక కబాబ్ ముక్కలో వైర్ను కనుగొనడంతో తానిచ్చే రేటింగ్ నుంచి ఒక పాయింట్ తగ్గించాడు. అదేవిధంగా మొజాంజాహీ మార్కెట్లోని ఒక దుకాణంలో పిస్తా ఐస్క్రీమ్ను కూడా టేస్ట్ చేసి ‘నేను ఇప్పటి వరకు రుచి చూసిన వాటిలో అత్యంత నకిలీ పిస్తా’ ఇది అంటూ విమర్శించాడు. రుచి అతి కృత్రిమంగా ఉందని దానికి 3/10 రేటింగ్ ఇచ్చాడు. ఇంకా ఇరానీ చాయ్, బిస్కెట్లు, బుర్హాన్పూర్ ఖోవా జిలేబి, మిలన్ జ్యూస్ సెంటర్లోని షెహదూద్ మలై ఇంకా ఇతర స్ట్రీట్ ఫుడ్స్పై కూడా ఇలాగే రివ్యూలను, రేటింగ్స్ను రివ్యూ అందించాడు. లైక్స్.. కామెంట్స్.. స్కాట్లాండ్వాసి హ్యూ అబ్రాడ్ పోస్టులకు నగరవాసుల నుంచి మంచి స్పందన లభించింది. అనేక మంది ఈ వీడియోలను లైక్ చేశారు. అంతేకాకుండా ఆ వీడియోల శ్రేణి హైదరాబాదీల మధ్య పరస్పరం చర్చకు సైతం దారి తీసింది. చాలామంది స్థానికులు ఆ పోస్టుల్లో నిజాయితీ ఉందని ప్రశంసించారు. అయితే కొందరు మాత్రం అతను నగరంలోని మరింత ఉత్తమమైన, మరింత ప్రమాణాలు పాటించే ఆహార కేంద్రాలను సందర్శించలేదని అభిప్రాయం వ్యక్తం చేశారు. కొందరు సిటీ వంటకాల నిజమైన సారాన్ని అందించే మరికొన్ని వంటలు, వాటి చిరునామాలను సూచించారు. అంతేకాదు స్థానిక భాషలో విక్రేతలతో ఎలా సంభాíÙంచాలనే దానిపై చిట్కాలను కూడా అతడికి అందించారు. ఏదేమైనా మన రుచులపై విదేశీయుల అభిప్రాయాలకు దక్కుతున్న స్పందనకు స్కాటిష్ టూరిస్ట్ పోస్టులు అద్దం పట్టాయని చెప్పొచ్చు. -
సకలం.. సంగమం..
భాగ్యనరం వేదికగా మూడు రోజుల పాటు జరిగిన హైదరాబాద్ లిటరరీ ఫెస్ట్ ఆదివారంతో ముగిసింది. ఇందులో అనేక మంది మేధావులు, కవులు, కళాకారులు, ఎన్జీవోలు తమ అభిప్రయాలను తమ తమ కళలు, రచనలు, ప్రసంగాల ద్వారా సందర్శకులతో పంచుకున్నారు. ఓ రకంగా ఇది సకలం.. సంగమం అన్నట్లు.. సందర్శకులతో సందడిగా మారింది. ఈ ప్రదర్శన ఎంతో గొప్ప అనుభూతిని పంచిందని పలువురు సందర్శకులు చెబుతున్నారు. కాగా ఇందులో ప్రముఖులతో పాటు సినీ తారలు కూడా భాగస్వామ్యం కావడం గమనార్హం. నగరం వేదికగా నిర్వహించిన సాహితీ కళల సంగమం హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్ ముగిసింది. కేవలం కళలు, కవితలకు మాత్రమే కాదు సంగీత వేదికలు, సేవా సంస్థల కార్యక్రమాలు, ఇంకా మరెన్నో విశేషాలకు ఈ ఫెస్ట్ చిరునామాగా నిలిచింది. మూడు రోజుల పాటు సందర్శకులకు వైవిధ్యభరిత అనుభూతులు పంచిన ఈ ఈవెంట్లో తమతమ కళలు, కార్యక్రమాల ద్వారా పాల్గొన్నవారితో సాక్షి జరిపిన చిరు ముచ్చట..వారి అనుభూతులు వారి మాటల్లోనే.. ప్రముఖులకు చేరువగా.. నేను ఆర్ట్ కళాశాల విద్యార్థిని. మా పేరెంట్స్ వ్యవసాయం చేస్తారు. అక్కడ నేను చిన్ననాటి నుంచి చూసిన చాట తదితర వస్తువులు, వ్యవసాయ పరికరాలను ఉపయోగించి కళాత్మక వస్తువును తయారు చేశాను. హెచ్ఎల్ఎఫ్లో ఈ కళను ప్రదర్శించడంలో అనేక మంది ప్రముఖుల ప్రశంసలు లభించడం సంతోషాన్ని ఇచి్చంది. – అనూఖ్య, పెద్దపల్లి కరీంనగర్రాతి.. విలువ తెలిపేలా..తెలంగాణలోని రాతి శిలలు చాలా వైవిధ్యమైనవి. 2500 యేళ్ల నాటి అరుదైన, అపురూపమైనవి. వీటిని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ శిలలను పోగొట్టుకుంటే నీటి వనరులు, పక్షులతో సహా చాలా కోల్పోతాం. వీటిపై నగరవాసులకు అవగాహన లేదు. యేటా జరిగే హెచ్ఎల్ఎఫ్లో క్రమం తప్పకుండా పాల్గొంటాం. ఈ వేదిక ద్వారా యువతకు, ముఖ్యంగా విద్యార్థులకు అవగాహన కలి్పస్తున్నాం. – పద్మిని పటేల్, జాయింట్ సెక్రెటరీ, సేవ్ రాక్స్ సంస్థబంజారా కళకు గుర్తింపుగా.. మేం బంజారాలం. నేను ఫైన్ ఆర్ట్స్కి వచ్చాక బంజారా హస్తకళలు నేర్చుకున్నాను. క్రాఫ్ట్తో చిత్రం రూపొందించే ఆలోచనతో ఇది చేశాను. దీనిని గమనిస్తే బంజారా క్రాఫ్ట్, వస్త్రధారణ విలువ తెలుస్తుంది. కనెక్టింగ్ ఫ్యామిలీ.. అనే థీమ్తో తల్లిదండ్రులు మన కోసం చేసే త్యాగం ఎలాంటిది? దానిని మనం ఎలా గుర్తించాలి? అనే థీమ్తో ఈ కళారూపాన్ని తీర్చిదిద్దాను. బంజారా హస్తకళలను ఈ కార్యక్రమం ద్వారా అంతర్జాతీయ స్థాయికి పరిచయం చేయడం ఆనందంగా ఉంది. – నవీన్నాయక్, సంగాగుడి తాండా, మెదక్ జిల్లాపేదల విద్యకు అండగా..నిరుపేద విద్యార్థులకు ఖరీదైన విద్యను చేరువ చేయాలనే లక్ష్యంతో ఏర్పడిన ఎన్జీవో మాది. విదేశాల నుంచి తిరిగి వచి్చన మహిళ శోభ భన్సాలీ దీన్ని ప్రారంభించారు. ప్రైవేట్ స్కూల్స్లో ఉండే బుక్స్, ఇతర విశేషాలను ప్రభుత్వ పాఠశాలలు, కొన్ని చిన్నచిన్న ప్రైవేటు పాఠశాల విద్యార్థులకు పరిచయం చేయడం మా సంస్థ లక్ష్యం. దీనిలో భాగంగా.. స్టోరీ టెల్లింగ్ సెషన్, వర్క్షీట్స్, కలరింగ్ నిర్వహిస్తాం. మొబైల్ లైబ్రరీ ద్వారా పుస్తకాలను అందించడం, ఆంగ్ల భాషా ప్రావీణ్యం పెంపొందించడమే లక్ష్యం. నగరం చుట్టుపక్కల ప్రాంతాల నుంచి 53 పాఠశాలలకు చెందిన చిన్నారులు మా ద్వారా ప్రయోజనం పొందుతున్నారు. దీని ద్వారా మరింత మందికి చేరువవ్వాలనేదే లక్ష్యం. – రాజేశ్వరి, పుస్తకారానేషన్స్ రాక్ బీట్.. శ్రియా గుప్తా అనే కార్పొరేట్ ఉద్యోగిని క్రియేటివ్ ఆర్ట్ హౌస్ ప్రారంభించారు. ఇందులో ఉండే మేమంతా వీకెండ్స్లో మాత్రమే ఆరి్టస్టులం. మిగిలిన రోజుల్లో కార్పొరేట్ ఉద్యోగులం. వారాంతాల్లో రెండు రోజుల పాటు కళాత్మక హృదయాల కోసం పనిచేస్తాం. ఈ నేషన్స్రాక్ బీట్స్లో వివిడ్, ఇండి ఎక్స్ప్రెస్, రాగా.. తదితర పేర్లతో 7 బ్యాండ్స్ ఉన్నాయి. మా ఈవెంట్స్లో మ్యూజిక్, డ్యాన్స్, స్టోరీ టెల్లింగ్, పొయెట్రీ, స్టాండప్ కామెడీ.. ఉంటాయి. హెచ్ఎల్ఎఫ్లో వచ్చే యంగ్ బ్లడ్ కోసం ఏర్పాటైందే యంగిస్తాన్ నుక్కడ్.. హెచ్ఎల్ఎఫ్ ప్రారంభం నుంచీ పెర్ఫార్మ్ చేస్తున్నాం. – రజత్, సింగర్, గిటారిస్ట్మూగజీవుల దాహం తీరుస్తాం.. మాది ఏడబ్ల్యూబీపీ (యానిమల్ వాటర్ బౌల్ ప్రాజెక్ట్) ఎన్జీవో. లక్ష్మణ్ మొల్లేటి అనే హైదరాబాద్ వాసి దీనిని స్థాపించారు. జంతువులు, మూగజీవుల దాహార్తి తీర్చేందుకు అవసరమైన వాటర్ బౌల్స్ ఉచితంగా అందిస్తాం. కుక్కలు, ఆవులు వంటి జంతువులు దాహంతో అలమటిస్తూ ఉండడం మనం గమనిస్తాం. చెన్నై, ముంబయి తదితర నగరాల్లోనూ మా కార్యకలాపాలు నడుస్తున్నాయి. ఈ ఫెస్టివల్ ద్వారా మూగజీవుల సమస్యపై అవగాహన కలి్పస్తున్నాం. – ఏడబ్ల్యూబీపీ ప్రతినిధినా కళకు పట్టం కట్టింది.. కార్పెంటరీ కుటుంబానికి చెందిన వాడిని. ఉడ్ ఆర్టుగా సామాజిక స్థితిగతులు, జీవనశైలి, అలంకరణ, సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించేలా చెక్కాను. కళపై ఇష్టంతో పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్లో చేరాను. ప్రస్తుతం మాస్టర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ చదువుతున్నాను. గ్రామీణ ఇతివృత్తాలను, జీవనశైలిని విశ్వవ్యాప్తం చేయాలనేదే లక్ష్యం. ఈ ప్రయాణంలో నాన్నే నాకు స్ఫూర్తి. – సాయి కుమార్, లోయపల్లి, రంగారెడ్డి జిల్లాడిప్రెషన్ నుంచి పుట్టిన ప్యాషన్.. నా మెటీరియల్ శానిటరీ ప్యాడ్. ఎంబ్రాయిడరీ అనే మీడియంతో పీరియడ్స్ అనే అంశం పైనే ఈ ఆర్ట్ వర్క్ చేశాను. ఇంట్లో ఆ సమయాన్ని అంటరానిదిలా చూస్తుంటారు. అలాంటి సమయంలో మెనుస్ట్రువల్ డిప్రెషన్కు ఎంతగా గురవుతాం అనేది నేను వ్యక్తిగతంగా అనుభవించా. అది అందరికీ అర్థం కావాలనే ఉద్దేశ్యంతో అలాంటి బాధ మరెవరికీ రాకూడదనే హెచ్ఎల్ఎఫ్ ద్వారా ప్రచారం ప్రారంభించా. – సాహితి, జేఎన్ఎఫ్యూ ఫైన్ ఆర్ట్స్ విద్యార్థి -
అలనాటి స్మృతుల్లో.. అలా సాగిపోతూ..
శతాబ్దాల చారిత్రక అస్తిత్వం.. హైదరాబాద్ సాంస్కృతిక వైవిధ్యానికి ప్రతిరూపం. విభిన్న జీవన సంస్కృతుల సమాహారం పాతబస్తీ.. కుతుబ్షాహీల నుంచి ఆసఫ్జాహీల వరకు 400 ఏళ్ల నాటి చార్మినార్ మొదలుకొని ఎన్నెన్నో అద్భుతమైన చారిత్రక కట్టడాలు, మరెన్నో అందమైన ప్యాలెస్లు, మహళ్లు, దర్వాజాలు, దేవిడీలు, బౌలీలు, నవాబుల సమాధులు, పార్కులు ప్రపంచ చిత్రపటంలో పాతబస్తీ ఉనికిని సమున్నతంగా ఆవిష్కరిస్తాయి. హైదరాబాద్కు వచ్చే దేశవిదేశాలకు చెందిన పర్యాటకులు పాతబస్తీని సందర్శిస్తేనే ఆ పర్యటన పరిపూర్ణం అవుతుంది. అలాంటి పాతబస్తీలో ఇప్పుడు మెట్రో నిర్మాణానికి మార్గం సుగమమైంది. ఏ ఒక్క చారిత్రక కట్టడానికి విఘాతం కలిగించకుండా, వాటి ఔన్నత్యాన్ని చాటే విధంగా మెట్రో మెలికలు తిరగనుంది. చారిత్రక కట్టడాలను చుట్టేస్తూ మహాత్మా గాంధీ బస్స్టేషన్ నుంచి చాంద్రాయణగుట్ట వరకు 7.5 కిలోమీటర్ల మెట్రో కారిడార్ నిర్మాణానికి కార్యాచరణ మొదలైంది. ఈ మార్గంలో రోడ్డు విస్తరణ వల్ల చారిత్రక భవనాలకు ఎలాంటి ముప్పు లేకపోయినప్పటికీ కొన్ని చోట్ల వందేళ్లకు పైబడిన ఇళ్లు, హోటళ్లు, దుకాణాలు, స్కూళ్లు తదితర భవనాలు పాక్షికంగానో, పూర్తిగానో నేలమట్టం కానున్నాయి. సుమారు 1100 నిర్మాణాలను తొలగించాల్సి ఉంటుందని హైదరాబాద్ ఎయిర్పోర్ట్ మెట్రో రైల్ లిమిటెడ్ గుర్తించింది. ఇప్పటి వరకు 270 మంది తమ ఆస్తులు అప్పగించేందుకు స్వచ్ఛందంగా ముందుకు వచ్చినట్లు హెచ్ఏఎంఆర్ఎల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. ⇒ చదరపు గజానికి రూ.81 వేల చొప్పున ఆస్తులు కోల్పోనున్న వారిలో 170 మందికి సుమారు రూ.80 కోట్లు ఇప్పటి వరకు చెక్కులు పంపిణీ చేశారు. కానీ మెట్రో నిర్మాణంలో భాగంగా ఆస్తులను కోల్పోతున్న ఎంతోమంది పాతబస్తీవాసులుపూర్వీకుల నాటి భవనాలను కోల్పోవడంపై ఆందోళనకు గురవుతున్నారు. మెట్రో వల్ల తరతరాలుగా వారసత్వంగా వచ్చే భవనాలను కోల్పోవడం బాధగా ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మెట్రో నిర్మాణం నేపథ్యంలో పాతబస్తీలో ‘సాక్షి’ క్షేత్రస్థాయిలో పర్యటించింది. ఆ వివరాలతో ప్రత్యేక కథనం..చారిత్రక రహదారులపై మెట్రో కారిడార్.. ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయణగుట్ట వరకు మీరాలంమండి రోడ్డు మీదుగా దారుల్షిఫా, పురానీహవేలి, ఎతెబార్చౌక్, అలీజాకోట్ల, బీబీబజార్, సుల్తాన్షాహీ, హరి»ౌలి, శాలిబండ, అలియాబాద్, శంషీర్గంజ్, ఫలక్నుమా వంటి చారిత్రక రహదారిపైన మెట్రో కారిడార్ నిర్మించనున్నారు. ⇒ ఈ మార్గంలో దాదాపు 103 మతపరమైన, వారసత్వ, ఇతర సున్నితమైన నిర్మాణాలకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా మెట్రోనూ మళ్లించారు. చారి్మనార్కు 500 మీటర్ల దూరంలో మెట్రో రానుంది. ఇలా చారిత్రకకట్టడాలు ఉన్న చోట ఇంజినీరింగ్ పరిష్కారాలు, మెట్రో పిల్లర్ స్థానాల సర్దుబాటు వంటి చర్యలు చేపట్టారు. కానీ ఇదే రూట్లో ఎంతోమంది పాలు, పండ్లు, కూరగాయలు, నిత్యావసర వస్తువులను విక్రయించే కిరాణా దుకాణాలు, హోటళ్లు, పలు చోట్ల స్కూల్ భవనాలు ప్రభావితం కానున్నాయి. ప్రతి సంవత్సరం మొహర్రం సందర్భంగా బీబీకా ఆలం ఊరేగింపుతో ఎంతో సందడిగా ఉండే దారుల్ఫా స్వరూపం మారనుంది.⇒ ‘ఒకప్పుడు మా ఇల్లు 1200 గజాల్లో ఉండేది. 2002లో రోడ్డు విస్తరణ కోసం 131 గజాలు తీసుకున్నారు. ఇప్పుడు మెట్రో కోసం 700 గజాలు ప్రభావితమవుతోంది. పూరీ్వకుల నుంచి ఉన్న మా ఇంటి ఉనికిని కోల్పోతున్నాం.’ అని దారుల్íÙఫాకు చెందిన ఆబిద్ హుస్సేన్ తెలిపారు. మొహర్రం బీబీకాలం ఆలం సందర్భంగా ఏనుగు మా ఇంటికి వస్తుంది. రేపు మెట్రో వచి్చన తర్వాత అది సాధ్యం కాదు కదా’ అని ఆవేదన వ్యక్తం చేశారు. హెరిటేజ్ రోడ్లపై నుంచి కాకుండా ఇతర మార్గాల్లో మెట్రో నిర్మించాలన్నారు. ⇒ పాతబస్తీ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని.. నిజాం కాలం నాటి భవనాలు కోల్పోవడం బాధగా ఉంది. మాపూర్వీకులు ఎంతో ఇష్టంతో కట్టుకున్న ఇంట్లో మా తాత, మా నాన్న, ఇప్పుడు మేము కిరాణ జనరల్ స్టోర్ నడుపుతున్నాం. 280 చదరపు గజాలు ఉన్న మా ఇంటి నుంచి మెట్రో కోసం 65 చదరపు గజాల స్థలాన్ని కోల్పోతున్నాం. పాతబస్తీ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ఇష్టం లేకపోయినా ఒప్పుకోవాల్సి వచి్చంది. – సయీద్ బిన్ అహ్మద్ మహపూజ్, వ్యాపారిపాతకాలం నాటి ఇల్లు పోతోంది ట్రాఫిక్ రద్దీ దృష్ట్యా మెట్రోరైల్ ఎంతో అవసరం, పాతబస్తీ ప్రజలకు మెట్రో సదుపాయం రావడం ఆహ్వానించదగ్గదే.. కానీ పూరీ్వకుల నాటి ఇంటిని కోల్పోవాల్సి రావడం కష్టంగానే ఉంది. మా కళ్ల ముందే మా ఇంటిని కూల్చివేస్తుంటే చూడలేకపోతున్నాం. ఎంతో బాధగా ఉంది. – మహ్మద్ బీన్ అహ్మద్, ఇంటి యజమానిపరిహారం అవసరం లేదు హెరిటేజ్ రోడ్లపై నుంచి మెట్రో నిర్మించడం సరైంది కాదు.. దీనివల్ల మా ఇల్లు 700 గజాలు కోల్పోవాల్సి వస్తుంది. పరిహారం కోరుకోవడం లేదు. త్వరలో న్యాయం కోసం కోర్టుకు వెళ్తాను. ఎట్టిపరిస్థితుల్లోనూ మెట్రోకు స్థలం ఇవ్వను. – ఆబిద్హుస్సేన్, దారుల్ఫా జిగ్జాగ్ మెట్రో ఉంటుందా ప్రపంచంలో ఎక్కడైనా మెట్రో ప్రధానమైన మార్గాల్లో కట్టారు. కానీ పాతబస్తీ అందుకు విరుద్దం. ఇలాంటి జిగ్జాగ్ మెట్రో ఎక్కడా చూడలేదు. చాలావరకు చారిత్రక భవనాలను కాపాడుతున్నామంటున్నారు. కానీ స్పష్టత లేదు. – అనురాధారెడ్డి, ఇంటాక్ ఆ ఘుమఘుమలు మాయమేనా..? పాతబస్తీ పేరు వింటేనే కమ్మటి ఇరానీచాయ్, ఉస్మానియా బిస్కెట్లు, సమోసా, బన్మస్కా, పసందైన బిర్యానీ రుచులు ఘుమఘుమలాడుతాయి. ప్రతిరోజూ తెల్లవారు జాము నుంచే జనజీవనంతో బీబీబజార్, మొగల్పురా, షాలిబండ తదితర ప్రాంతాలు సందడిగా కనిపిస్తాయి. మెట్రో రాక వల్ల అనేక మార్పులు రానున్నాయి. బీబీబజార్లోని విక్టోరియా హోటల్ కనుమరుగవుతోంది. అలాగే ఎతేబార్చౌక్లోని ఏళ్ల నాటి ముఫీద్–ఉల్–ఆనమ్ స్కూల్, పురానీహవేలీలోని ప్రిన్సెస్ ఎస్సేన్ గరŠల్స్ హైసూ్కల్ తదితర విద్యాసంస్థలు ప్రభావితం కానున్నాయి. కొన్ని స్కూళ్లు పాక్షికంగా దెబ్బతింటాయి. పాతబస్తీ మెట్రోపైన మొదట్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఆ తర్వాత గత ప్రభుత్వ హయాంలోనే మార్గం సుగమమైంది. ‘అభివృద్ధిని అడ్డుకోవడం లేదు. కానీ పాతబస్తీ రూపురేఖలు, చిహ్నాలు మారిపోతాయనే బాధ మాత్రం తీవ్రంగా ఉంది.’ అని మీర్ యూసుఫ్ అలీ అభిప్రాయపడ్డారు. -
Hyderabad Literary Festival 2025: సాహిత్య సౌరభం..
హైదరాబాద్ నగరం ఒక్కసారిగా సాహితీ పరిమళాలను అద్దుకుంది. భారత్తో పాటు వివిధ దేశాలకు చెందిన సాహితీ ప్రముఖులు నగరంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్లో వాలిపోయారు. నగరంలోని టీ–హబ్, సత్వ నాలెడ్జ్ సిటీ వేదికలుగా భారీ స్థాయిలో ఏర్పాటు చేసిన ఈ ఫెస్ట్ శుక్రవారం ఉదయం రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రారంభించారు. శని, ఆదివారాల్లోనూ కొనసాగనున్న ఈ సాహితీ పండుగలో సాహిత్యం, సంస్కృతి, సైన్స్ అండ్ టెక్నాలజీ, అంతరించిపోతున్న భారతీయ భాషలు, పర్యావరణ పరిరక్షణ తదితర అంశాలపై ప్రత్యేక సదస్సులు, వర్క్షాప్స్, కళాప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. మొదటి రోజు కార్యక్రమాల్లో భాగంగా సాహితీ ప్రముఖులతో ప్రత్యక్ష చర్చా కార్యక్రమాలు, సదస్సులు నిర్వహించారు. ప్రారంభ ప్లీనరీలో ఏ లైఫ్ ఆఫ్ సినిమా పై సినీ ప్రముఖులు షభానా అజ్మీ, సాహితీవేత్త అమితా దేశాయ్తో చర్చించారు. అనంతరకార్యక్రమంలో అంతరించిపోతున్న సింధీ భాషపై ప్రముఖులు నందితా భవానీ, రితా కొఠారీ, సోనీ వాధ్వా చర్చించారు. అంతేకాకుండా ప్రత్యేకంగా కావ్యధార, స్టేజ్ టాక్స్, ఆర్ట్ వర్క్ షాప్స్, నన్హా నుక్కడ్ కార్యక్రమాలు, పరిశోధనా రంగ ప్రముఖులతో సైన్స్ అండ్ ది సిటీ సెషన్స్, రచయితలకు సంబంధించిన మీట్మై చర్చ నిర్వహించారు. ప్రత్యేకంగా ప్రదర్శిస్తున్న కళా ప్రదర్శనలు, నగరంలోని కొండరాళ్ల సంరక్షణపై ఏర్పాటు చేసిన ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకున్నాయి. కార్టూన్ స్పెషల్.. ఈ ఫెస్ట్లో భాగంగా ప్రముఖ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి బీపీ ఆచార్య ఆధ్వర్యంలోని అబ్ట్యూస్ యాంగిల్ కార్టూన్ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బీపీ ఆచార్య మాట్లాడుతూ.. ఇది నగర ఖ్యాతిని మరింత పెంచుతుందని, ఈ తరం ఆలోచనా విధానానికి స్ఫూర్తి నింపే వ్యక్తులు హాజరుకావడం సంతోషమన్నారు. తన కార్టూన్ పుస్తకంలో బ్యూరోకాట్ల ప్రయాణాన్ని, ఆలోచనా విధానాన్ని కార్టూన్ల రూపంలో తెలిపానన్నారు. ఫొటోలతో ప్రత్యేక చిత్ర ప్రదర్శనను ఏరాప్టు చేశారు. పుస్తకావిష్కరణలో ప్రముఖ రచయిత డా.దినేష్ శర్మ, రిటైర్ట్ ఐఏఎస్ అధికారి డా.ఎస్ఎన్ మోహంతి పాల్గొన్నారు.యాన్ యాక్సిడెంటల్ సూపర్ హీరో 2లోనే క్లైమాక్స్.. అనంతరం ప్రముఖ సినీతార హుమా ఖురేషి ముఖ్య అతిథిగా సాహితీవేత్త కిన్నెర మూర్తితో చర్చించారు. ఈ సందర్భంగా హుమా ఖురేషి రాసిన యాన్ యాక్సిడెంటల్ సూపర్ హీరో పుస్తకంలోని కొన్ని అంశాలను చదివి వివరించారు. ఈ పుస్తకం క్లైమాక్స్ త్వరలో రానున్న రెండో పుస్తకంలో ఉంటుందన్నారు. సినిమా ఎంపికలో కథే ప్రామాణికంగా చేస్తానని, యాక్షన్ కామెడీ వంటి చిత్రం చేయడం ఇష్టమని వెల్లడించారు. -
పిచ్చుక.. చేయాలి మచ్చిక..
పక్షిజాతుల మనుగడకు కేంద్ర బిందువులు కొలనులు, సరస్సులు, చెరువులు. గతంలో హైదరాబాద్ (Hyderabad) నగరంలో ఈ నీటి స్థావరాలకు కొదువలేకపోవడంతో వివిధ ప్రాంతాల నుంచి విభిన్న జాతుల పక్షులు సైతం వలస వచ్చేవి. కానీ ప్రస్తుత పట్టణీకరణ నేపథ్యంలో ఈ చెరువులు, కుంటలు మాయమవ్వడంతో పక్షి జాతుల మనుగడపై తీవ్ర ప్రభావం పడుతోంది. పిచ్చుకలను హౌస్ స్పారోస్ (Sparrow) అంటారు. అంటే ఇవి మనుషుల ఇళ్ల వద్దే చిన్న గూడు నిర్మించుకుని వాటి సంతతిని పెంచుకుంటాయి. పరోక్షంగా పిచ్చుకలను సాదు జంతువులుగానే పరిగణించవచ్చు. అయితే కాంక్రీట్ జంగిల్గా మారిన నగరంలో ఈ పిచ్చుకలను ఆదరించే వారు తక్కువయ్యారు. చెట్లపైన, అడవుల్లో కన్నా ఇంటి ఆవాసాల్లో, బస్టాండ్లలో, రైల్వేస్టేషన్లు, స్కూళ్లు, పార్కుల్లో, బాల్కనీల్లో ఇతర సురక్షిత ప్రాంతాల్లో ఇవి గూడు కట్టుకుంటాయి. ఆ అవకాశం నగరవాసులు ఇవ్వకపోవడంతో ఈ పిచ్చుకులు నగరాన్ని బహిష్కరిస్తున్నాయి. అక్కడక్కడ ఏసీ సందుల్లోనో, పార్కింగ్ ఏరియాలోనో గూళ్లు పెట్టుకున్నా సౌకర్యంగా లేవని నగరవాసులు వాటిని తొలగిస్తుండటం వీటి క్షీణతకు మరో కారణం. పరిరక్షించాల్సిన జాబితాలో.. పర్యావరణ పరిస్థితులను అంచనా వేయడంలో పక్షి జాతుల మనుగడను కూడా ప్రామాణికంగా తీసుకుంటారు. ఈ నేపథ్యంలో నగర జీవవైవిధ్యం (Bio Diversity) పూర్తిగా దెబ్బతింటోందని పలు సర్వేలు వెల్లడిస్తున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో ఈ పిచ్చుకల సంఖ్య భారీగా తగ్గపోయిందని ఆ రాష్ట్ర పక్షిగా పిచ్చుకను ఎంపిక చేసి వాటి సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు. నాసిక్లోని మొహమ్ముద్ దిలావర్ అనే పక్షి ప్రేమికుడు పిచ్చుకల సంరక్షణ కోసం చేసిన కార్యక్రమాల ఫలితంగా ప్రతి ఏడాదీ మార్చి 20న ప్రపంచ పిచ్చుకల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా చూస్తే ఐరోపాలోని పట్టణాలు, నగరాల్లో పిచ్చుకలు ఎక్కువగా కనిపిస్తాయి. ఒక సర్వేలో భాగంగా యూకేలో గ్రామీణ ప్రాంతాల్లో 47 శాతం, పట్టణ ప్రాంతాల్లో 60 శాతం పిచ్చుకలు తగ్గాయని వెల్లడించారు. ఈ కారణాలతో ఈ జాతిని పరిరక్షించాల్సిన జాబితాలో చేర్చబడింది. యూరోపియన్ కన్జర్వేషన్ కన్సర్న్ జాతుల జాబితాలో చేర్చారు. ‘బ్రింగ్ బ్యాక్ స్పారోస్’.. నగరంలో యానిమల్ వారియర్స్ కన్సర్వేషన్ సొసైటీ ఆధ్వర్యంలో పిచ్చుకల సంరక్షణ కోసం ఏడేళ్లుగా కృషి చేస్తున్నాం. ఇందులో భాగంగా ‘బ్రింగ్ బ్యాక్ స్పారోస్’ కార్యక్రమాన్ని ప్రారంభించి దాదాపు 4 వేల పక్షి గూళ్లను పంపిణీ చేశాం. మా అంచనా ప్రకారం ఓ 30 వేల వరకూ పిచ్చుకలను మళ్లీ నగరంలోని ఇళ్లలోకి రప్పించగలిగాం. ముఖ్యంగా అమీన్పూర్, కూకట్పల్లి, గచ్చిబౌలి, మాదాపూర్ వంటి ప్రాంతాల్లో ఎక్కువగా ఈ పిచ్చుకలను సంరక్షించగలిగాం. ఇందులో భాగంగా నగరంలోని పార్కులతో కూడా కలసి పనిచేయనున్నాం. వీటికి ప్రాణాధారాలైన చెరువులను, కుంటలను నగరవాసులు కలుషితం చేయడం ఇప్పటికైనా మానేయాలి. పూజా సామాగ్రి పేరుతో ప్లాస్టిక్, ఇతర కలుషితాలను చెరువుల్లో వేయడం పరిపాటిగా మారింది. – ప్రదీప్, సొసైటీ వ్యవస్థాపకులు.ఆహార కొరత కూడా.. నగర వాతావరణంలో వాటి ఆహార లభ్యత తగ్గిపోయింది. భారత దేశంలో అత్యంత సాధారణ పట్టణ పక్షులలో పిచ్చుక ఒకటి.. కానీ అంతరించిపోతున్నాయి. గ్రామీణ వాతావరణంలోనూ వీటి మనుగడ ప్రశ్నార్థకంగానే మారింది. పంటపొలాల కోసం వినియోగించే క్రిమిసంహారకాలూ ఈ పిచ్చుకలను బలిగొంటున్నాయి. చదవండి: గురుమూర్తి ఫోన్లో ఏముంది?.. వెలుగులోకి విస్తుపోయే విషయాలుగతంలో ఈ పిచ్చుకల ఉనికిని అంచనా వేయడానికి తెలుగురాష్ట్రాలతో పాటు, ఢిల్లీ, బెంగళూరు, తమిళనాడులో సర్వే చేశారు. ఇందులో భాగంగా తెలంగాణలోని యెల్లాంపేటలో బోన్ఫెరోని కాన్ఫిడెన్స్ ఇంటర్వెల్ విధానంలో చేసిన సర్వేలో భాగంగా వివిధ ట్రాన్సెక్ట్లలో పిచ్చుకల సాంద్రత హెక్టారుకు 15 నుంచి 335 వరకూ ఉందని నిర్ధారించారు. కానీ ఈ సంఖ్య ఇప్పటికి ఇంకా తగ్గిపోయింది. -
Numaish 2025: రెక్కలు తొడిగిన ఆశలు
వృద్ధులు చంటి పిల్లలతో సమానం అంటారు.. చంటి పిల్లలకు ఎలా అయితే అన్నీ చూడాలని ఆశ ఉంటుందో వయస్సు పెద్దపడిన వారికి కూడా ప్రతిదానిపై ఆసక్తి ఉంటుంది. సరిగ్గా ఇదే ఆలోచన చేసిన నగరానికి చెందిన దోబారా అనే ఎన్జీవో.. వారి కోసం అద్భుతమైన సేవా కార్యక్రమాన్ని నిర్వహించింది. నగరంలోని అపోలో హోంకేర్, గ్లెన్ఫీల్డ్ మల్లారెడ్డి తదితర ప్రైవేటు ఆస్పత్రులు, స్కూల్స్ను భాగం చేస్తూ నిరుపేద వృద్ధుల కోసం ప్రత్యేక నుమాయిష్ సందర్శనను ఏర్పాటు చేసింది. నాంపల్లి ఎగ్జిబిషన్ నిర్వాహకులు సైతం పూర్తి సహాయ సహకారాలు అందించడానికి సై అన్నారు. అయితే రోజువారీ వేళల్లో అయితే పెద్ద వయసు వారికి రద్దీలో, జనం మధ్యన ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం ఉందని.. మంగళవారం మధ్యాహ్నం ప్రత్యేకంగా 2గంటల నుంచీ సాయంత్రం రద్దీ మొదలయ్యే లోగా దీనిని పూర్తి అయేలా కార్యక్రమాన్ని డిజైన్ చేశారు. అనాధాశ్రమాల నుంచి.. నగరవ్యాప్తంగా 89 మంది వీల్చైర్స్ ఉప్పల్, చిక్కడపల్లి.. ఇలా నగరంలోని 12 ఓల్డేజ్ హోమ్స్, సీనియర్ సిటీజన్ అసోసియేషన్లకు చెందిన సభ్యులను సైతం ఈ కార్యక్రమంలో భాగస్వాముల్ని చేశారు. పెద్దలు అందరినీ కార్లలో గౌరవంగా తోడ్కొని వచ్చారు. అక్కడ నుంచి నడవలేని వారి కోసం దాదాపుగా 80కిపైగా వీల్ఛైర్లను సిద్ధం చేశారు. అంతేకాకుండా నర్సింగ్ స్కూల్స్కు సంబంధించిన విద్యార్థులను కూడా ఉంచారు. వీరి కోసం ప్రత్యేకంగా ఉచిత ట్రైన్ రైడ్స్ను నుమాయిష్ నిర్వాహకులు ఏర్పాటు చేశారు. అదే విధంగా వాహనాల కోసం ఉచిత పార్కింగ్ను కూడా కలి్పంచారు. ఫుడ్ ప్యాక్స్.. పిస్తా హౌజ్, షాజ్ మహమ్మూద్ అనే వాలంటీర్ల సహకారంతో ఫుడ్ ప్యాక్స్ అందించారు. అలాగే కొందరు దాతలు ఇచి్చన సహకారంతో వృద్ధులకు ఉపయోగపడే టవల్స్ వంటివి కొనుగోలు చేసి అందించారు.పెద్దలకు ప్రత్యేకంగా.. ఏడాదికో సారి నుమాయిష్ లాంటి ప్రదర్శనను తిలకించాలని అందరూ అనుకున్నట్టే సీనియర్ సిటిజన్స్ కూడా ఆశిస్తారు. అయితే ఆశించినట్టుగా చాలా మందికి జరగకపోవచ్చు. కొందరికైనా దీన్ని సాకారం చేద్దామనే ఆలోచనతో ఈ ‘సీనియర్ సిటిజన్స్ ఎట్ నుమాయిషి కార్యక్రమాన్ని నిర్వహించాం. ఒక సీనియర్ సిటిజన్గా పెద్దలకు సంబంధించిన జెరంటాలజీ సబ్జెక్ట్లో మాస్టర్స్ చేసిన వ్యక్తిగా ఇలాంటి కార్యక్రమాలు పెద్దవాళ్ల మనసుకు ఎంత సంతోషాన్ని అందిస్తాయనేది నాకు తెలుసు. – మతీన్ అన్సారీ, వ్యవస్థాపకులు, దోబారా స్వచ్ఛంద సంస్థ -
సాఫ్ట్వేర్.. కేరాఫ్ హైదరాబాద్..
దాదాపు మూడున్నర దశాబ్దాల క్రితం 1990లో, దేశంలో తన మొదటి కార్యకలాపాలను ప్రారంభించింది. నాటి నుండి విండోస్ సృష్టికర్త, టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ దేశంలో తన పాదముద్రను వేగంగా విస్తరిస్తోంది. నగరంతో పాటు అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, గురుగ్రామ్, ఢిల్లీ, నోయిడా, కోల్కతా, ముంబై, పూణేతో సహా 10 నగరాల్లో ఉన్నప్పటికీ.. మైక్రోసాఫ్ట్ మొత్తం ఉద్యోగుల సంఖ్యలో దాదాపుగా సగం మంది నగరంలోనే ఉండడం గమనార్హం. ఐటీ ఉద్యోగాలు, కార్యకలాపాలపైనే ఈ కథనం.. ఉద్యోగుల సంఖ్యలో మాత్రమే కాదు, హైదరాబాద్ చాలా కాలంగా మైక్రోసాఫ్ట్ ఇష్టపడే నగరంగా ముందంజలో ఉంది. నగరంలో మైక్రోసాఫ్ట్ ప్రయాణం 1998లో ఇండియా డెవలప్మెంట్ సెంటర్ (ఐడీసీ) స్థాపనతో ప్రారంభమైంది. ప్రస్తుతం అమెరికాకు ఆవల మైక్రోసాఫ్ట్కి ఉన్న అతిపెద్ద ఆర్ అండ్ డీ కేంద్రం ఏదంటే.. అది 54 ఎకరాలలో విస్తరించిన ఐడీసీ హైదరాబాద్ మాత్రమే. అడ్వాంటేజ్ తెలంగాణ ఒప్పందం.. తెలంగాణ ప్రభుత్వం మైక్రోసాఫ్ట్ గత ఏడాది జరిగిన తెలంగాణ గ్లోబల్ ఏఐ సమ్మిట్లో అడ్వాంటేజ్ తెలంగాణను ప్రారంభిస్తూ అవగాహనా ఒప్పందంపై సంతకం చేశాయి. ఈ ప్రోగ్రామ్ 2025 నాటికి 20 లక్షల మందికి ఏఐ నైపుణ్యాలను అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల తన విస్తరణ ప్రణాళికను ముందుకు తీసుకెళ్లేందుకు భారత పర్యటనలో భాగంగా ఇటీవలే హైదరాబాద్లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమావేశమైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన, జనరేటివ్ ఏఐ, క్లౌడ్ డెవలప్మెంట్తో సహా రాష్ట్ర సాంకేతిక ప్రాధాన్యతలపై చర్చించారు. ఏడాది వ్యవధిలో భారత్కు ఆయన రావడం ఇది వరుసగా రెండోసారి. దేశంలోని మొదటి మైక్రోసాఫ్ట్ తన ఓపెన్ ఏఐ కార్యాలయాన్ని కూడా నగరంలోనే ఏర్పాటు చేయవచ్చని భావిస్తున్నారు.మేకగూడలోనూ మైక్రోసాఫ్ట్.. మైక్రోసాఫ్ట్ తన మౌలిక సదుపాయాలను విస్తరించడానికి నగరాన్ని కేంద్రంగా మార్చుకుంది. దేశంలో ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్, డేటా సెంటర్లను నిర్మించడానికి మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ (ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్ ఇటీవల నగరానికి సమీపంలోని మేకగూడలో 181.25 కోట్లతో 25 ఎకరాల భూమిని కొనుగోలు చేసింది. గత సంవత్సరం, కూడా నగరంలో దాదాపు 267 కోట్ల రూపాయలతో 48 ఎకరాల భూమిని కొనుగోలు చేసింది. ఈ ప్రదేశాల్లో కొత్త డేటా సెంటర్ను అభివృద్ధి చేయాలని కంపెనీ యోచిస్తోంది.అనుకూల వాతావరణం.. మైక్రోసాఫ్ట్ ఇప్పటికే నగరంలో, పూణెలో నిర్వహిస్తున్న రెండు డేటా సెంటర్లలో ప్రస్తుతం 90 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. 2026 చివరి నాటికి ఈ సంఖ్య 289 మంది కావచ్చని సమాచారం. ‘హైదరాబాద్, పూణేలలో ఐటీకి మంచి మౌలిక సదుపాయాలు, అనుకూలమైన విధాన వాతావరణాలు ఉన్నాయి. అలాగే డేటా సెంటర్ పెట్టుబడులకు అనువుగా ఉండే టాలెంట్ కారిడార్లకు ఇవి సమీపంలో ఉన్నాయి’ అని అనరాక్లోని ఇండ్రస్టియల్, లాజిస్టిక్స్ డేటా సెంటర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ దేవి శంకర్ అంటున్నారు. ఇటీవలి తన భారత పర్యటన సందర్భంగా, మైక్రోసాఫ్ట్ ఏఐ చీఫ్ ముస్తఫా సులేమాన్ బెంగళూరు హైదరాబాద్ కార్యకలాపాలు తమ కంపెనీకి బలం అని పేర్కొన్నారు. -
నుమాయిష్.. సోషల్ జోష్..
కంటెంట్ క్రియేటర్లు, ఇన్ఫ్లుయెన్సర్లు పెద్ద ఎత్తున హైదరాబాద్లో సందడి చేస్తున్నారు. సాధారణంగా నగరంలో కొత్తగా ప్రారంభించిన కేఫ్ అయినా లేదా ఏదైనా ఆసక్తికరమైన ఈవెంట్ అయినా, ఇన్స్టా రీల్స్, యూట్యూబ్ వీడియోల్లో తక్షణమే ప్రత్యక్షమవుతుంది. అయితే వందల సంఖ్యలో వెరైటీ ఉత్పత్తులు, వేర్వేరు ప్రాంతాలకు చెందిన స్టాల్స్.. ఉండే నుమాయిష్ ఎగ్జిబిషన్ ఇన్ఫ్లుయెన్సర్లలో సోషల్ జోష్ నింపుతోంది.. దీంతో వీరికి చేతినిండా పని పెడుతోంది. ఈ క్రమంలో దీని గురించిన మరిన్ని విషయాలు.. హైదరాబాద్లోని నాంపల్లి మైదాన ప్రాంతం ఇప్పుడు కిక్కిరిసిన దుకాణాలతో, సందర్శకులతో కిటకిటలాడుతోంది. జనవరి 3న ప్రారంభమైన ఈ ఐకానిక్ ఈవెంట్ ఫిబ్రవరి 18, 2025 వరకూ సందర్శకులను అలరించనుంది. మరోవైపు ఈ 84వ ఆల్ ఇండియా ఇండ్రస్టియల్ ఎగ్జిబిషన్ ఈసారి సోషల్ మీడియా వేదికగా భారీ ప్రచారం అవుతోంది. విభిన్న రకాల కంటెంట్స్ చేసేందుకు వీలుండడంతో ఇది క్రియేటర్లకు గమ్యస్థానంగా మారింది. స్థానికులకు, సందర్శకులకు ఎల్లప్పుడూ ఇష్టమైన హైదరాబాద్ ఐకానిక్ వార్షిక ఫెయిర్ ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్లు, యూట్యూబర్ల ప్రవాహానికి నిలయంగా మారింది.రోజుకొకటి.. అదే వెరైటీ.. కొంతమంది కంటెంట్ క్రియేటర్స్.. ఒక్కో రోజును ఎగ్జిబిషన్లోని ఒక్కో విభాగాలకు అంకితం చేస్తున్నారు. ఉదాహరణకు, ఒక రోజు రుచికరమైన స్ట్రీట్ ఫుడ్ గురించి, మరొక రోజు సంప్రదాయ చేనేత స్టాల్స్ గురించి.. తర్వాతి రోజు రైడ్లు.. ఎంటర్టైన్మెంట్ జోన్లను ఇలా విభజిìæంచి చూపిస్తున్నారు. ఈ సమాచారం వీక్షకులకు వినోదాన్ని మాత్రమే కాకుండా నుమాయిష్ సందర్శనను ప్లాన్ చేయడంలో కూడా ఉపకరిస్తోంది. వీరి కంటెంట్కు సోషల్ మీడియాలో భారీ స్పందన లభిస్తోంది. నగరంతో పాటు దేశవ్యాప్తంగానూ అనేక మందిని ప్రభావితం చేస్తోంది. రీల్స్ కేరాఫ్గా.. ఆహార ప్రియుల సాహసాల నుంచి షాపింగ్ స్ప్రీల వరకూ.. ఫీడ్లో స్క్రోల్ చేయడానికి ఎల్లప్పుడూ ఏదో ఒక ప్రత్యేకతతో నుమాయిష్ షాపింగ్, ఆహార ఉత్పత్తులను మాత్రమే కాకుండా సృజనాత్మక సోషల్ మీడియా కంటెంట్ను కూడా అందిస్తుంది. ఈ విషయాన్ని శరవేగంగా వ్యాపిస్తుండడంతో నుమాయిష్ రీల్స్, వీడియోలకు కేరాఫ్గా మారింది. దీంతో ఇన్ఫ్లుయెన్సర్లు, సోషల్ మీడియా నిర్వాహకులతో ఎగ్జిబిషన్ సందడిగా మారుతోంది.అడుగడుగునా కెమెరాలు.. నుమాయి‹Ùలోని కలర్ఫుల్ స్ట్రీట్స్ మీదుగా నడుస్తుంటే.. సందడిగా ఉన్న స్టాల్స్కు ముందు పలు కెమెరాలను అమర్చడాన్ని గమనించవచ్చు. ఇన్స్టా, లేదా యూట్యూబ్ ద్వారా ఈ గ్రాండ్ ఎగ్జిబిషన్లోని ప్రతి మూలనూ కవర్ చేస్తూ ప్రతిరోజూ వందల సంఖ్యలో కంటెంట్ అప్లోడ్ చేస్తున్నారు. లక్నో చికన్ కారీ స్టాల్స్ నుంచి కాశ్మీరీ షాపుల వరకూ నోరూరించే ఫుడ్ కోర్ట్ నుంచి వినోద ప్రదేశంలో థ్రిల్లింగ్ రైడ్ల వరకూ దేనికదే వెరైటీగా కినిపిస్తోంది. దీంతో మెటీరియల్కు కొరత లేకపోవడం వీరికి మరింత ఉత్తేజాన్ని అందిస్తోంది.క్రేజీగా..మెన్ ఎట్ నుమాయిష్?.. ఈ సంవత్సరం ‘మెన్ ఎట్ నుమాయిష్’ పేరుతో ఓ రీల్ ఇంటర్నెట్లో క్రేజీగా మారింది. మగవాళ్లు తమ కుటుంబాలతో కలిసి షాపింగ్ ట్రిప్లలో చురుకుగా పాల్గొంటున్నట్లు చూపే ఈ రీల్ వేగంగా వైరల్ అయ్యింది. ఈ రీల్కి ఇన్స్టాలో ఒక్క రోజులో 1.5 మిలియన్లకు పైగా వీక్షణలు, 75,000 పైగా లైక్లు రావడం విశేషం. షాపింగ్ బ్యాగ్లను మోసుకుంటూ భార్యల్ని అనుసరించే భర్తలు, పిల్లలను ఎత్తుకుని ఆడిస్తుంటే మహిళలు షాపింగ్లో మునిగిపోవడం.. రీల్ని సూపర్ హిట్ చేశాయి. -
ఢిల్లీ రిపబ్లిక్ డే పరేడ్కు పిలుపు..
ఘనం.. వారిరువురూ వృత్తి రిత్యా నగిషీ కళాకారులు.. వారసత్వంగా వచ్చిన వృత్తిపై మామకారాన్ని పెంచుకున్నారు. అంతటితో ఆగకుండా తమ వృత్తికి కళాత్మకతను జోడించి వివిధ కళారూపాలను తీర్చిదిద్దారు. తమ కళతో అందరినీ మెప్పించి అనేకమందిని ఆకర్షించారు. తమలోని భిన్నమైన కళతో ప్రముఖుల నుంచి శభాష్ అనిపించుకుంటున్నారు. వారే హైదరాబాద్లోని అంబర్పేట డీడీ కాలనీలో నివసించే కృష్ణాచారి, గౌరిదేవి దంపతులు.. గత 30 ఏళ్లుగా వెండితో ఫిలిగ్రీ కళారూపాలను తయారు చేస్తూ తమదైన ముద్ర వేసుకున్నారు. వీరి కళను గుర్తించి కేంద్ర ప్రభుత్వం జాతీయ అవార్డులను అందించి అభినందించింది. వీరి ఫిలిగ్రీ కళలో చేస్తున్న కృషికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటిప్పుడు గుర్తించి పలు అవార్డులను అందించి సత్కరిస్తున్నాయి. గణతంత్ర వేడుకలకు.. ఫిలిగ్రీ కళలో వీరి ప్రతిభను గుర్తించి కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఢిల్లీలో నిర్వహించే గణతంత్ర వేడుకలకు వీరిని ఆహా్వనించింది. 2025 జనవరి 26న జరిగే వేడుకల్లో పాల్గొనాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం నుంచి ఇప్పటికే కబురు అందింది. ఈ నెల 23న ఢిల్లీకి చేరుకోవాల్సిందిగా కోరింది. దీంతో కృష్ణాచారి, గౌరిదేవి దంపతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దేశ గణతంత్ర వేడుకలకు తమను ప్రత్యేకంగా ఆహ్వానించడంతో ఎంతో గర్వంగా ఉందన్నారు. ఢిల్లీ వెళ్లడానికి తగిన ఏర్పాట్లు చేసుకుంటున్నామని వారు సాక్షితో వెల్లడించారు. వివిధ కళారూపాలు.. వెండితో గత 30 ఏళ్లుగా వివిధ కళారూపాలను రూపొందిస్తున్నామన్నారు. ప్రజలు, ప్రభుత్వ కార్యక్రమాల్లో అతిథుల జ్ఞాపికలు అందించేందుకు తమను సంప్రదించి ప్రత్యేక కళారూపాలను తయారు చేయించుకుని వెళ్తారన్నారు. వెండితో చార్మినార్, హైటెక్ సిటీ, చారిత్రాత్మక గుర్తులు, వీణ, రాట్నం, వెండి బుట్టలు వంటి కళారూపాలను రూపొందించామన్నారు. అవసరమైన వారికి తాము చెప్పిన రీతిలో అందిస్తామంటున్నారు. కళను గుర్తించి.. కృష్ణాచారి శ్రమ, కళను గుర్తించి 2006 అప్పటి రాష్ట్రపతి ప్రతిభపాటిల్ జాతీయ అవార్డు అందజేశారు. తన సతీమణ గౌరిదేవికి 2009లో అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ జాతీయ అవార్డు అందజేశారు. వీటితో పాటు రాష్ట్ర స్థాయిలో పలు అవార్డులను ఈ దంపతులు అందుకున్నారు. ఫిలిగ్రీ కళ తరపున రాష్ట్ర, దేశ బృందాల్లో వీరు చోటు సంపాదించుకుని తమదైన ముద్ర వేస్తున్నారు. మహేశ్వరం బీసీ హాస్టల్ విద్యార్థి గొల్ల అక్షయ్ మహేశ్వరం : దేశ రాజధాని ఢిల్లీలో జరిగే కర్తవ్య ఫరేడ్ విక్షించడానికి ప్రధాన మంత్రి యశస్వి పథకం కింద తెలంగాణ నుండి రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం బీసీ హస్టల్లో తొమ్మిదో తరగతి చదివే విద్యార్థి గొల్ల అక్షయ్ ఎంపికయ్యారు. వివిధ రంగాల్లో ఉత్తమ ప్రదర్శన కారులు, ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకుని ఆదర్శంగా నిలిచన వారిని, ఇలా తెలంగాణ రాష్ట్రం నుండి 31 మందిని ఎంపిక చేశారు. ఇందులో మహేశ్వరం బీసీ హస్టల్లో ఉంటూ స్థానిక బాలుర ఉన్నత పాఠశాలలో చదువుతున్న గొల్ల అక్షయ్ని ఎంపిక చేశారు. అక్షయ్ స్వగ్రామం కొల్పూరు, మండలం మగనూర్, నారాయణపేట్ జిల్లా. నీరుపేద కుటుంబానికి చెందిన అక్షయ్ తల్లి చిన్న తనంలో మరణించడంతో గొర్లకాపరి అయిన తండ్రి రంగప్ప కులవృత్తి చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. తన ఇద్దరి పిల్లలనూ 2021లో మహేశ్వరం బీసీ హస్టల్లో చేర్పించారు. అక్షయ్ చదువుల్లో ఉత్తమ ప్రతిభ కనభరుస్తున్నాడు. హస్టల్ వార్డెన్ కృష్ణ ప్రోత్సాహంతో ఓబీసీ, ఈబీసీ విద్యార్థులకు ప్రధాన మంత్రి యశస్వి పథకం కింద ఆర్థిక సాయాన్ని సంవత్సరానికి రూ.2 లక్షల ఉపకారవేతనం ప్రత్యేకంగా అందిస్తోంది. అక్షయ్ ఎంపిక పట్ల పాఠశాల ప్రధానోపాధ్యాయులు, హాస్టల్ వార్డెన్, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.మొయినాబాద్ నుంచి బాత్కు అశ్విని.. మొయినాబాద్ రూరల్ : రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం నుంచి బాత్కు అశ్విని ముఖ్య అతిథిగా ఆహా్వనితులయ్యారు. ఈ మేరకు ఢిల్లీ హోంశాఖ విడుదల చేసిన స్పెషల్ కేటగిరి తెలంగాణ జాబితాలో 31 మంది ప్రత్యేక అతిథుల పేర్లల్లో అశ్విని ఆహా్వనం పొందారు. వివిధ రంగాలు, ప్రభుత్వ పతకాల వినియోగదారుల జాబితాలో మొయినాబాద్ మాడల్ మండల సమైక్యకు చెందిన బాత్కు అశ్విని ఆహా్వనం పొందడంతో ఆమె హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
అభాగ్యులకు అమ్మలా..
మతిస్థిమితం కోల్పోయిన మానసిక వికలాంగులకు, అనాథలకు అండగా నిలుస్తోంది.. ఏ చిరునామా లేని అభ్యాగులకు ఓ కేరాఫ్ అడ్రస్గా మారింది.. రుచికరమైన భోజనం వడ్డించడంతో పాటు దుస్తులు, పడుకునేందుకు మంచం, దుప్పటి వంటి అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తోంది.. తమకు ఎవరూ లేరనే బాధ నుంచి అక్కడ ఉన్నవారంతా తమవారే అన్న భరోసా ఇస్తోంది.. కుల మత, భాషా బేధాలతో సంబంధం లేకుండా అభాగ్యులందరినీ చేరదీస్తోంది. అంతేకాదు అనాథ మృతదేహాలకు అంతిమ సంస్కారాలు నిర్వహిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది నాదర్గుల్లోని మాతృదేవోభవ అనాథ మానసిక దివ్యాంగుల ఆశ్రమం. – బడంగ్పేట్ఒక్కరితో 2018లో ప్రారంభమైన ఈ ఆశ్రమ సేవలు ప్రస్తుతం 150 మందికి చేరుకున్నాయి. మధ్య వయసులో మతి స్థిమితం కోల్పోయి.. జుట్టు, గడ్డాలు, మీసాలు పెరిగి గుర్తుపట్టలేని స్థితిలో అర్ధనగ్నంగా వీధుల్లో సంచరిస్తున్న వారితో పాటు నగరంలోని ప్రధాన రోడ్ల వెంట, డ్రైనేజీలు, చెత్త డబ్బాల పక్కన దీనంగా పడి ఉన్న అనాథలను ఆశ్రమానికి తరలిస్తున్నారు మాతృదేవోభవ సంస్థ నిర్వాహకులు. ఎర్రగడ్డ మానసిక వైద్యశాలకు తరలించి, మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు. కోలుకున్న వారిని తిరిగి ఇళ్లకు పంపుతున్నారు. ఇలా ఇప్పటి వరకు 280 మందికి పునర్జన్మను ప్రసాదించారు. ఆశ్రమ సేవలు గుర్తించిన సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు ఇక్కడికి విచ్చేసి వారు కూడా అభాగ్యులకు సేవలు అందిస్తుండటం విశేషం. పండగలు, పర్వదినాలు, పుట్టిన రోజులు ఇలా అన్ని సందర్భాల్లోనూ వారు భాగస్వాములు అవుతున్నారు.‘ఈయన పేరు డి.శివుడు. మహబూబ్నగర్ జిల్లా అడ్డాకుల మండలం పొన్నకల్ గ్రామం. ఆరేళ్ల క్రితం మతిస్థిమితం కోల్పోయి.. ఇంటి నుంచి బయటికి వచ్చాడు. ఊరే కాదు చివరకు జిల్లా సరిహద్దులు దాటుకుని చివరకు ఉప్పల్ చేరుకున్నాడు. రోడ్డు వెంట అనాథగా తిరుగుతున్న ఆయనను మాతృదేవోభవ ఆశ్రమ నిర్వాహకులు చేరదీశారు. ఎర్రగడ్డ మానసిక చికిత్సాలయానికి తరలించి వైద్యం అందించారు. కోలుకున్న తర్వాత బంధువులకు అప్పగించారు. ప్రస్తుతం ఇంటి వద్దే ఉంటూ వృద్ధాప్యంతో మంచం పట్టిన తల్లికి సపర్యలు చేస్తున్నాడు’ అనాథ శవాలకు అంతిమ సంస్కారాలు ఏదైనా ప్రమాదాల్లో చనిపోయిన అనాథ శవాలనే కాకుండా ఆశ్రమంలో ఉంటూ వృద్ధాప్యం, ఇతర అనారోగ్య కారణాలతో చనిపోయిన వారికి ఆయా మతాల సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. అంతిమ యాత్రలో మాతృదేవోభవ అనాథ ఆశ్రమం వ్యవస్థాపకుడు గిరితో పాటు అతడి భార్య ఇందిర, అమ్మ ముత్తమ్మ, కొడుకు అభిరాం, కూతురు లోహిత ఆ నలుగురిలా వ్యవహరిస్తున్నారు. ఇలా ఇప్పటి వరకు 60 మంది మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించారు. సేవలను గుర్తించిన పలు సంస్థలు గిరిని గౌరవ డాక్టరేట్తో పాటు 300 అవార్డులతో సత్కరించాయి. నాడు‘చిత్రంలోని ఈయన పేరు కావూరి నాగభూషణం. పశి్చమగోదావరి జిల్లా పొలమూరు మండలం నాగిళ్లదిబ్బ గ్రామం. ఆరు సంవత్సరాల క్రితం మతిస్థిమితం కోల్పోయి బంజారాహిల్స్ చేరుకున్నాడు. చినిగిన దుస్తులు, మాసిన గడ్డం, పెరిగిన జుట్టుతో తనలో తానే ఏదో మాట్లాడుకుంటూ.. తిరుగుతూ కని్పంచాడు. మాతృదేవోభవ ఆశ్రమం నిర్వాహకులు ఆయనను చేరదీసి, ఆస్పత్రికి తరలించారు. ఆరోగ్యం కుదుటపడిన తర్వాత కుటుంబ సభ్యుల వివరాలు తెలుపగా.. ఆశ్రమ నిర్వాహకులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఆ తర్వాత ఆయన్ను బంధువులకు అప్పగించారు. ప్రస్తుతం సొంత ఊరిలో రెండు ఆవులను చూసుకుంటూ కుటుంబ సభ్యులతో కలిసి వ్యవసాయం చేసుకుంటున్నాడు’ నేడు నాడు‘చిత్రంలో కనిపిస్తున్న ఇతడి పేరు వట్టేం రమేష్. ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం, శివపురం గ్రామం. నాలుగేళ్ల క్రితం మతిస్థిమితం కోల్పోయి ఇంటి నుంచి బయటకు వచ్చాడు. వివిధ ప్రాంతాలు తిరుగుతూ చివరకు నగరానికి చేరుకున్నాడు. మాతృదేవోభవ అనాథ ఆశ్రమ నిర్వాహకులు చేరదీసి ఆశ్రమం కల్పించారు. అతడికి మెరుగైన చికిత్సతో పాటు ప్రశాంత వాతావరణం కల్పించడంతో నాలుగేళ్లకు ఆరోగ్యం కుదుటపడింది. కుటుంబ వివరాలు తెలుసుకుని, చివరకు వారికి అప్పగించారు. ప్రస్తుతం సొంత భూమిలో వ్యవసాయం చేసుకుంటూ సంతోషంగా జీవిస్తున్నాడు’నేడు కొంత స్థలం కేటాయించాలి శాశ్వత భవనం లేకపోవడంతో ఖాళీ స్థలాన్ని అద్దెకు తీసుకుని తాత్కాలిక షెడ్లు వేసి, వాటిలో వసతి కలి్పస్తున్నాం. స్థలం కేటాయిస్తే మరింత మందికి సేవలు అందిస్తాం. ఆశ్రమంలో ఉన్న వాళ్లకు వృద్ధాప్య పెన్షన్ సహా ఆరోగ్యశ్రీకార్డు, రేషన్ బియ్యం ఉచితంగా అందజేయాలి. – గట్టు గిరి, ‘మాతృదేవోభవ’ఆశ్రమ వ్యవస్థాపకుడు -
ఫెస్ట్@ ఫామ్..
సంక్రాంతి తెలుగుదనానికి, స్వచ్ఛమైన పల్లె వాతావరణానికీ ప్రతీక. అందమైన రంగవల్లులు.. గొబ్బెమ్మలు.. భోగిమంటలు.. స్వచ్ఛమైన పిండివంటలు.. హరిదాసు పాటలు.. గంగిరెద్దుల విన్యాసాలతో వెల్లివిరిసే ఆనందోత్సాహాలతో సందడిగా జరుపుకుంటాం.. ఇలాంటి అందమైన వేడుకకు పల్లెను మించిన వేదిక మరొకటి ఉండదు. అందుకే నగరవాసులు ప్రతి పండుగకూ పల్లెకు పయనమవుతారు. సంవత్సరం పొడవునా చేసుకొనే రొటీన్ వేడుకలకు ఇది భిన్నం.. అయితే ఇటీవలి కాలంలో.. పల్లెకు వెళ్లలేని వారు ఫామ్హౌస్లలో సంక్రాంతి సంబరాలకు కుటుంబ సమేతంగా తరలివెళ్తున్నారు. దీంతో నగర శివారు ప్రాంతాల్లోని ఫామ్హౌస్లు సంక్రాంతి సందడికి వేదికవుతున్నాయి. బంధువులు, స్నేహితులతో కలిసి సంక్రాంతి విడిది కేంద్రాల్లో సరదాగా సేదదీరుతున్నారు. దీంతో నగర శివారులోని సిద్ధిపేట్, గండిపేట్, చేవెళ్ల, వికారాబాద్, కడ్తాల్ వంటి ప్రాంతాల్లోని ఫామ్హౌస్లలో సంక్రాంతి సందడి నెలకొంది..ఆ విశేషాలు.. సంక్రాంతి అంటే సరదగా సాగే వేడుక.. బంధువులు.. పిండి వంటలు.. ఆటలు.. పాటలు.. ముచ్చట్లు.. ఇలా చెప్పుకుంటూ పోతే అబ్బో చాలానే ఉన్నాయి.. ఓ రకంగా సంక్రాంతి సంబరాలు అంటే అంబరాన్ని తాకేలా ఉంటాయి.. దీంతో ఒత్తి జీవనానికి అలవాటుపడిన నగరవాసులు కనీసం రెండు మూడు రోజులు నగరానికి దూరంగా ఉండాలని భావిస్తున్నారు.. అందుకే ‘భోగి రోజు కంటే ముందే ఫామ్హౌస్కు చేరేవిధంగా ప్లాన్ చేసుకున్నాం’.. అని ఉప్పల్కు చెందిన సుధాకర్రెడ్డి చెబుతున్నారు. తెల్లవారు జామున నిద్రలేచి భోగిమంటలు వేసుకొని, అందమైన ముగ్గుల నడుమ వేడుకలు చేసుకోవడం గొప్ప అనుభూతిని కలిగిస్తుంది. ఈ తరహా వేడుకలు జరుపుకునే వారికోసం నగర శివారులోని ఫామ్ హౌస్లు వేదికలుగా మారుతున్నాయి.సకల సదుపాయాలు.. రోజుకు కనిష్టంగా రూ.3000 నుంచి గరిష్టంగా రూ.10,000 వరకూ అద్దెకు ఫామ్హౌస్లు లభిస్తున్నాయి. ఇందులో స్విమ్మింగ్ పూల్స్, క్రీడా ప్రాంగణాలు, కేర్టేకర్ వంటి హై సెక్యూరిటీతో సకల సదుపాయాలూ కలి్పస్తున్నారు. దీంతో ఇటీవల పల్లె వాతావరణాన్ని ఇష్టపడే వారు ఈ ఫామ్ హౌస్ల కేంద్రంగా వేడకలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో వీటికి డిమాండ్ పెరిగి యజమానులు అద్దెలు పెంచడం గమనార్హం.పతంగుల పండుగ.. సంక్రాంతి పండుగ రైతులకు ఎంత ముఖ్యమైనదో.. పిల్లలకూ అంతే ప్రధానమైనది. కాంక్రీట్ అరణ్యంలా మారిన నగరంలో పతంగులు ఎగరేయడం ఓ సవాల్. దీంతో విశాలమైన మైదానాలు, భవనాలపై నుంచి పతంగులు ఎగరేస్తారు. ఇది పూర్తి స్థాయి ఆనందాన్ని కలిగించదు.. అందుకే ఫామ్ హౌస్లలో పతంగుల పండుగకు ప్రత్యేక గుర్తింపు ఉంది. విశాలమైన పొలాలు, పచి్చక బయళ్లలో పిల్లలు గంటలతరబడి పతంగులతో కాలం గుడుపుతారు.. ‘పిల్లలకు ప్రకృతి, వ్యవసాయం, ఆహార ఉత్పత్తి గురించి తెలియజెప్పాలి. అందుకే ఫామ్ హౌస్లను ఎంపిక చేసుకున్నాం’ అని ఈసీఐఎల్కు చెందిన చంద్రశేఖర్ చెబుతున్నారు. ‘రియల్’ సంస్థల ప్రత్యేక ఏర్పాట్లు.. నగవాసుల ఆసక్తి, అభిరుచిని గుర్తించిన ‘రియల్’ సంస్థలు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నాయి. వెంచర్లో కొంత స్థలాన్ని పండుగ వాతావరణం ఉట్టిపడేవిధంగా డిజైన్ చేసి అద్దెకు ఇస్తున్నారు. ఇటు వెంచర్లకు ప్రచారం.. అటు ఆదాయం రెండూ సమకూరుతున్నాయి. తద్వారా గేటెడ్ కమ్యూనిటీలు, విల్లాలు, అపార్ట్మెంట్లలో ఉండే నగరవాసులు ఫామ్హౌస్ సంస్కృతికి ఆకర్షితులవుతున్నారు. -
Swami Vivekananda: గమ్యం.. చేరే వరకూ..!
‘లేవండి.. మేల్కోండి.. గమ్యం చేరేవరకూ ఆగకండి..’ ప్రపంచంలోని యువతకు స్వామి వివేకానంద ఇచి్చన మహోన్నతమైన సందేశం ఇది. అనేక రకాల వైఫల్యాలు, వైకల్యాల నడుమ బందీ అయిన జీవితాన్ని సమున్నతమైన లక్ష్యం, ఆశయం దిశగా ముందుకు నడిపించేందుకు యువతకు ఆయన ఒకే ఒక ఆయుధాన్ని అందజేశాడు. అదే ధైర్యం.. సాహసం.. నిస్వార్థంగా.. నిర్భయంగా జీవించడం. భయపడకుండా బతకడమే దైవత్వమని చెప్పారు. తమను తాము తెలుసుకోవడం ద్వారా మాత్రమే ఆ దైవత్వాన్ని ఆవిష్కరించడం సాధ్యమవుతుంది.‘గొర్రెల గుంపులో పెరిగితే సింహమైనా సరే తన సహజ లక్షణమైన ధీరత్వాన్ని కోల్పోతుంది. పిరికితనంతో బతుకుతుంది. తమ నిజస్వరూపాన్ని మరిచిపోతే యువత కూడా అలాగే భీరువులా బతకాల్సి వస్తుంది.’ అని వివేకానంద చెప్పిన మాటలను నేడు ఆయన జయంతి సందర్భంగా గుర్తుచేసుకుంటూ..మరిన్ని విశేషాలు.. స్వామి వివేకానంద 163వ జయంతి సందర్భంగా ఈ నెల 12న దేశవ్యాప్తంగా యువజన దినోత్సవంగా పాటించనున్నారు. రామకృష్ణమఠంలో ప్రత్యేక వేడుకలు నిర్వహించనున్నారు. జాతి నిర్మాణంలో యువశక్తి ఎంతో కీలకమైందనే సందేశాన్నిస్తూ ట్యాంక్బండ్ నుంచి రామకృష్ణ మఠం వరకూ ప్రదర్శన నిర్వహించనున్నారు. అనంతరం జరిగే నేషనల్ యూత్ డే వేడుకల్లో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు పాల్గోనున్నారు. ‘ఛేంజింగ్ యూత్ పవర్ ఫర్ నేషనల్ బిల్డింగ్’ అనే ఇతివృత్తంతో ఈ ఏడాది యువజన ఉత్సవాలు జరుగనున్నాయి. ఈ సందర్భంగా ‘సాక్షి’ ప్రత్యేక కథనం ఇది.. సృజన శక్తులన్నీ నీలోనే.. మనం బలహీనులం, అపవిత్రులం అని అనుకోవద్దు. ప్రతి ఒక్కరూ బలవంతులు, శక్తిసంపన్నులే. అనంతశక్తి మీలోనే దాగివుంది. జీవితంలోని ప్రతి సందర్భంలో ఆ శక్తిని ఎలా అభివ్యక్తం చేయాలో వివేకానందుడు ప్రబోధించాడు. ‘మీ సత్య స్వరూపాన్ని మీరు తెలుసుకోండి’ అన్నారు. నిద్రలో ఉన్న వ్యక్తి మేల్కొని స్వరూపజ్ఞానంతో కార్యాచరణ చేపట్టినప్పుడు గొప్ప శక్తి, తేజస్సు లభిస్తాయి. ఉత్కృష్టమైనదంతా అతన్ని వరిస్తుంది. ప్రతి ఒక్కరికీ వారి నిజస్వరూప జ్ఞానాన్ని తెలియజేయడమే ఔన్నత్యానికి మార్గం. పౌరుషాన్ని ప్రకటించడం అంటే దౌర్జన్యం, హింస వంటి వాటి కోసం శక్తియుక్తులను వినియోగించటం కాదు. సాధువర్తనం కలిగి ఉండడం. నిర్మాణాత్మకమైన, ఫలవంతమైన సర్వశక్తి స్వభావాన్ని కొనసాగించడం, అదే మనం చూపవలసిన నిజమైన పరాక్రమమని వివేకానంద బోధించారు. యువత తమలోని సృజనశక్తులను ఆవిష్కరించేందుకు ఆ బోధనలు ఎంతో స్ఫూర్తినిస్తాయని రామకృష్ణమఠం అధ్యక్షులు స్వామి బోధమయానంద చెప్పారు. ‘విశ్వ’ భావన ఉండాలి.. ప్రతి ఒక్కరూ ‘విశ్వవ్యాపిత భావన’ను కలిగి ఉండాలి. ‘పరిమితమైన నేను’ ‘నేను ఫలానా’, ‘ఇది నాది’ వంటి అనేక స్వార్థబంధాల వల్ల ఎంతో నష్టం జరుగుతుంది. ఈ ‘పరిమిత నేను’ నుండి విడివడి ‘విశ్వవ్యాపిత నేను’ అనే భావనతో తాదాత్మ్యం చెందితే ఎంతో అద్భుతంగా ఉంటుంది. ప్రతి మనిషి ఉన్నతమైన స్థానానికి చేరుకుంటాడు. ఇప్పుడు కావలసింది మనుషులు మాత్రమే అంటారు స్వామి వివేకానంద. బలవంతులు, చక్కటి నడవడిక కలిగినవాళ్లు, గొప్ప ఆత్మవిశ్వాసమున్న యువకులు కావాలని చెబుతారు. అలాంటివారు వంద మంది దొరికినా ప్రపంచం పూర్తిగా మారిపోతుందంటారు. అలాంటి యువత కావాలి ఇప్పుడు.నేషనల్ యూత్ డే..ఈ నెల 12న రామకృష్ణమఠంలోని వివేకానంద ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్సలెన్సీ సిల్వర్జూబ్లీ ఉత్సవాలతో పాటు, జాతీయ యువజన దినోత్సవం నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటలకు జరుగనున్న ఈ కార్యక్రమంలో స్వామి బోధమయానంద ‘ఛేంజింగ్ యూత్ ఫర్ నేషనల్ బిల్డింగ్’ పై తమ సందేశాన్ని ఇవ్వనున్నారు. రాష్ట్ర మంత్రి డి.శ్రీధర్బాబుతో పాటు చెన్నైకి చెందిన తుగ్లక్ మేగజైన్ సంపాదకులు ఎస్.గురుమూర్తి, పలువురు ప్రముఖులు పాల్గోనున్నారు. ఈ సందర్భంగా 18 అడుగుల ఎత్తైన స్వామి వివేకానంద మ్యూరల్ను ఆవిష్కరించనున్నారు.సహనమే సరైన లక్షణం..శాస్త్ర సాంకేతిక విజ్ఞానం ఎంతో అభివృద్ధి చెందింది. దీంతో ఏదైనా సాధించగలమనే విశ్వాసం పెరిగింది. కానీ అతి ముఖ్యమైన అంశం మరొకటి ఉంది. అదే సహనం. ఎందుకంటే సాంకేతిక పరిజ్ఞానం వల్ల చుట్టూ ఉన్న పరిస్థితులు మారాయి. కానీ వ్యక్తిగత శక్తిసామర్థ్యాలు కాదు. అనుకున్నదే తడవుగా అన్నీ జరిగిపోవాలనుకుంటారు, కానీ ప్రతికూలత ఎదురు కాగానే కుదేలయిపోతున్నారు. ప్రతికూలత ఎదురైనపుడు సహనంతో, ఓర్పుతో దానిని ఎదుర్కొనే సామర్థ్యం అలవర్చుకోవాలి. బంగారాన్ని గీటురాయి పరీక్షిస్తుంది. అలాగే మనిషి మానసిక స్థైర్యాన్ని ప్రతికూలతలు పరీక్షిస్తాయి. అందుకే వేచివుండాల్సిన సమయంలో నిరాశ నిస్పృహలకు లోనవకుండా ఓర్పుతో నిరీక్షించటం ఎంతో అవసరం. ‘అసహనం ప్రకటించటం వల్ల ఒనగూరే ప్రయోజనమేమీ లేదు. ఓర్పు వహించండి. విజయం తప్పక మిమ్మల్ని వరిస్తుంది’ అని చెప్పిన వివేకానందుడి మాటలను గుర్తుంచుకోండి. – స్వామి బోధమయానంద, రామకృష్ణమఠం అధ్యక్షులు -
వారసత్వ కట్టడాలు..ఘఢి చౌక్లు!
గొప్ప సాంస్కృతిక, వారసత్వ చరిత్ర కలిగిన హైదరాబాద్కు ఘడి చౌక్గానూ పేరుంది. చార్మినార్, గోల్కొండ వంటి వారసత్వ కట్టడాలకు నిలయమైన ఓల్డ్ సిటీ నుంచి సైబర్ టవర్స్, హైటెక్ సిటీ వంటి ఆధునిక నగరం మీదుగా.. నెట్ జీరో సిటీగా అభివృద్ధి చెందనున్న ఫ్యూచర్ సిటీకి విస్తరిస్తోంది. సిటీ ఏదైనా సరే అప్పటి సంస్కృతి, అభివృద్ధిని సూచించే విధంగా ఐకానిక్ ల్యాండ్ మార్క్లను నిర్మించడం ఆనవాయితీగా వస్తోంది. నాడు ఓల్డ్ సిటీలో క్లాక్ టవర్లు వారసత్వ గుర్తింపుగా నిలిస్తే.. నేడు ఐటీ పార్క్లు హైటెక్ సిటీ ల్యాండ్ మార్క్గా మారిపోయాయి. ఇక, రానున్న ఫోర్త్ సిటీ భవిష్యత్తు తరాలకు ప్రతీకగా నిలిచిపోయేలా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. ప్రసిద్ధ వారసత్వ కట్టడాలు, ప్రదేశాలతో నిండిన భాగ్యనగరంలో.. నిర్లక్ష్యానికి గురవుతున్న చారిత్రక కట్టడాల్లో క్లాక్ టవర్లు కూడా ఉన్నాయి. నిజాం కాలంలో ఈ ఐకానిక్ నిర్మాణాలు వారసత్వ చిహా్నలగా విరాజిల్లాయి. నాటి చరిత్రకు ఇవే కీలకమైన మైలురాళ్లు. సమయ పాలనతో పాటు నగరంలోని రద్దీ వీధుల్లో దిక్సూచిగా నిలిచేవి. విస్తరణలో క్రమేణా వీటి ప్రాముఖ్యత తగ్గింది. కానీ, రాతితో చెక్కిన చారిత్రక గుర్తులు నేటికీ పూర్వ వైభవం కోసం వేచిచూస్తున్నాయి.మోజమ్ జాహీ మార్కెట్.. మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ హయాంలో 1935లో మోజమ్ జాహీ మార్కెట్లో క్లాక్ టవర్ నిర్మించారు. మార్కెట్లో అత్యంత ఎత్తయిన నిర్మాణం ఇదే. రెండు అంతస్తులు, అష్టభుజి ఆకారంలో ఉంటుంది. మార్కెట్లోని అన్ని దిక్కుల నుంచి వీక్షించడానికి వీలుగా దీనిని ఏర్పాటు చేశారు. విక్రేతలు, దుకాణదారులు సమాయానికి బస చేసేవారు. ఒక్కో మతం.. ఒక్కో తీరు.. క్లాక్ టవర్లు దేనికవే ప్రత్యేకమైనవి.. చరిత్ర కలిగినవి. ఇవి గంటలను మాత్రమే కాకుండా భక్తి శ్రద్ధలు, రోజువారీ జీవిన విధానాన్నీ సూచిస్తాయి. వివిధ మతాల సంప్రదాయాలకు చిహ్నంగా నిలుస్తున్నాయి. క్రైస్తవ సంప్రదాయంలో చర్చిల పైన ఉన్న బెల్ టవర్లు ప్రార్థన గంటలను సూచిస్తాయి. ఇస్లామిక్ సంస్కృతిలో ప్రార్థనలకు పిలుపుగా సూచిస్తారు. మసీదు మినార్ల నుంచి మోగుతూ ఆ సమాజాన్ని ఏకంచేసే కాల గమనాన్ని సూచిస్తుంది. హిందూ ఆచారంలో గంటలు, శంఖాల శబ్దం ప్రజలను ప్రార్థనలకు మేల్కొలుపుతాయి.చౌమహల్లా ప్యాలెస్.. చౌమహల్లా ప్యాలెస్ పశ్చిమ దిక్కున ప్రధాన ద్వారం వద్ద ఉన్న టవరే ఖిలాఫత్ గడియారం. 1750లో నిర్మించిన టవర్ మూడు అంతస్తుల ఎత్తులో ఉంటుంది. మొఘల్ శైలికి చెందిన ఝరోకాలతో, హారాలజిస్ట్ నిపుణుల కుటుంబం ప్రతి వారం యాంత్రిక గడియారాన్ని మారుస్తూ ఉంటుంది. ఖిలాఫత్ గడియారం చారిత్రక మైలురాయిగా మాత్రమే కాదు.. నగర సాంస్కృతిక, ఆధ్యాతి్మక చిహ్నంగా గుర్తింపు పొందింది.జేమ్స్ స్ట్రీట్.. సికింద్రాబాద్ ఎంజీ రోడ్లో జేమ్స్ స్ట్రీట్ పోలీసు స్టేషన్లో క్లాక్ టవర్ ఉంది. 1900 ప్రారంభంలో బ్రిటిష్ వారు నిర్మించిన చారిత్రాత్మక టవర్. ఇది ఒకప్పుడు రాంగోపాల్పేట్ పోలీసు స్టేషన్కు నిలయంగా పనిచేసింది. దీని నిర్మాణానికి నిధులను అందించిన సేథ్ రాంగోపాల్ గౌరవార్థం ఆయన పేరే పెట్టారు. ఈ గడియారం వలస నిర్మాణ వారసత్వాన్ని సూచిస్తుంది.చార్మినార్.. చార్మినార్ పై ఉన్న నాలుగు గడియారాలు 1889లో ఆరో నిజాం మీర్ మహబూబ్ అలీఖాన్ హయాంలో ఏర్పాటయ్యాయి. లండన్ నుంచి తీసుకొచి్చన నాలుగు గడియారాలనూ చార్మినార్కు నాలుగు వైపులా ఆర్చ్ మధ్యలో అమర్చారు. ఈ గడియారం ముళ్లుల గుండా గాలి ప్రసరించినా ఖచి్చతమైన సమయాన్ని సూచిస్తాయి. నాలుగిటిలో గుల్జార్ హౌజ్కు ఎదురుగా ఉన్న గడియారం ఒక్కటే ప్రతి గంటకూ ఒకసారి మోగుతుంది. అయితే నాలుగు గడియారాలకూ ప్రతి 48 గంటలకు ఒకసారి కీ ఇవ్వాల్సి ఉంటుంది.మోండా మార్కెట్.. సికింద్రాబాద్లో సందడిగా ఉండే మోండా మార్కెట్లోని టవర్ పెద్దగా ప్రచారానికి నోచుకోలేదు. 1920–40 ప్రాంతంలో రైస్, ఆయిల్ మిల్లు వ్యాపారంలో ఉన్న సంపన్న డూండూ కుటుంబం దీనిని నిర్మించింది. విలాసవంతమైన ఆర్ట్ డెకో శైలిలో దీని నిర్మాణం వాణిజ్య కేంద్రాల వారసత్వాన్ని ప్రతిబింబిస్తుంది.మహబూబ్ చౌక్.. 1892లో సర్ అస్మాన్ జా ఈ టవర్ను నిర్మించారు. చార్మినార్కు పశ్చిమాన మహబూబ్ చౌక్లో చిన్న తోటలో టర్కిష్ శైలిలో దీన్ని నిర్మించారు. స్థానిక ప్రజలకు సమయాన్ని సూచించేందుకు ఉద్దేశించిన ఈ క్లాక్ 72 అడుగుల ఎత్తులో ఉంటుంది.సుల్తాన్ బజార్.. నగరంలోని పురాతన క్లాక్ టవర్లలో ఇదొకటి. 1865లో బ్రిటిష్ పాలనలో చాదర్ఘాట్లోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల వద్ద ఆధునిక డిజైన్తో దినిని నిర్మించారు. అయితే ఇతర క్లాక్ టవర్స్ లాగా దీనికి అలంకరణ ఉండదు. చతురస్రాకారంలో ఆ సమయంలో ముస్లిం రాజైన అసఫ్ జాహీ నిర్మించిన భవనాల తరహాలోనే దీనిని తీర్చిదిద్దారు. శాలిబండ.. ఈ గడియార స్థంభాన్ని రాజా రాయ్ రాయన్ ఘడియాల్ అని కూడా పిలుస్తారు. మూడో నిజాం సికిందర్ జా ఆస్థానంలో దఫ్తార్దార్ (రెవెన్యూ అధికారి) శాలిబండ ప్యాలెస్లో 1904లో ఈ క్లాక్ టవర్ను నిర్మించారు. యూరోపియన్ శైలిలో హిందు–అరబిక్, రోమన్, హిందీ, తెలుగు అంకెలు దీనిలో ఉంటాయి. టవర్ ప్రవేశ ద్వారం వద్ద గణేష్ ప్రతిమ ఉంటుంది. కాలక్రమేణా ప్యాలెస్ ధ్వంసమైనా.. క్లాక్ టవర్ అలాగే ఉంది. -
దొన్నె బిర్యానీ.. ఈ డిష్ వెరీ స్పెషల్
విభిన్న సంస్కృతుల సమ్మేళనం ‘హైదరాబాద్’లో ఒక్కో గల్లీ ఒక్కో ప్రత్యేకత సంతరించుకున్న విషయం విదితమే. ముఖ్యంగా ఆనాటి నుంచి విభిన్న రుచులకు సైతం భాగ్యనగరం కేంద్రంగా కొనసాగుతోంది. స్థానిక ఆహార వంటకాలు మొదలు విదేశాల కాంటినెంటల్ రుచుల వరకు మన నగరం విరాజిల్లోతోంది. ఈ ఆనవాయితీలో భాగంగానే ఈ మధ్య ‘దొన్నె బిర్యానీ’ సైతం నగరానికి చేరుకుంది.విశ్వవ్యాప్తమైన హైదరాబాద్ బిర్యానీ గురించి అందరికీ తెలుసు.. కానీ.. దొన్నె బిర్యానీ ఏంటనే కదా..?! ఇది కూడా దక్షిణాది ప్రత్యేక వంటకమే. కర్ణాటక, ప్రధానంగా బెంగళూరులో ఈ డిష్ వెరీ స్పెషల్. కొంత కాలంగా దొన్నె బిర్యానీ అక్కడక్కడా కనిపిస్తూనే ఉంది. అయితే బెంగళూరులో 90 ఏళ్లకు పైగా చరిత్ర ఉన్న శివాజీ మిలటరీ హోటల్ నగరంలోని మాదాపూర్కు విస్తరించింది. ఈ నేపథ్యంలో నగరంలో మరో కొత్త రుచి చేరిపోయిందని ఆహారప్రియులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.దక్షిణాది రుచులకు ఆదరణ.. బెంగళూరులోని ప్రముఖ శివాజీ మిలిటరీ హోటల్, నోరూరించే మాంసాహార వంటకాలకు ప్రసిద్ధి చెందింది. వందేళ్ల క్లబ్లో చేరబోతున్న ఈ ప్రముఖ భారతీయ హోటల్ మొదటిసారి మరో నగరంలో ఆవిష్కృతం అవడం, అది కూడా హైదరాబాద్ను ఎంచుకోవడంతో ఇక్కడి వైవిధ్యాన్ని మరింత పెంచుతోంది. కన్నడ వంటకాలు నగరంలో ఇది మొదటిసారి ఏమీ కాదు.. ఎస్ఆర్నగర్, మాదాపూర్, గచి్చ»ౌలి వంటి ప్రాంతాల్లో కన్నడ రుచులు ఇప్పటికే లభ్యమవుతున్నా.. పూర్తిస్థాయిలో అక్కడి రుచులకు ఆదరణ లభిస్తోందనడానికి ఇదో నిదర్శనం. దొన్నె బిర్యానీ, మటన్ ఫ్రై వంటి పలు వంటకాలకు ప్రసిద్ధి చెందిన శివాజీ హోటల్ హైదరాబాద్లోని మాదాపూర్ ప్రాంతంలో తమ సేవలను విస్తరించింది. 1935 నుంచి దక్షిణాదిలో తన ప్రత్యేకత పెంచుకున్న శివాజీ మిలిటరీ హోటల్ నగరవాసులకూ చేరువైంది. స్పైసీగా ఉండే మన హైదరాబాదీ బిర్యానీకి దొన్నె బిర్యానీ కాస్త బిన్నంగా ఉన్నప్పటికీ.. భౌగోళిక సమ్మేళనంలో భాగంగా ఇప్పటికే తెలుగు వారు సైతం ఈ బిర్యానీని రుచి చూస్తున్నారు. -
విహంగం.. వీక్షణం..
బైనాక్యులర్స్, కెమెరాలతో బర్డ్ లవర్స్ సిద్ధమవుతున్నారు. ఆకాశానికి ఎక్కుపెట్టిన చూపులతో విహంగాలను తీక్షణంగా వీక్షించనున్నారు. అరుదైన అందాలను కెమెరాలతో బంధించనున్నారు. బర్డ్ అట్లాస్ పేరిట సమగ్ర విహంగ విశేషవాహిని రూపకల్పనలో మేము సైతం అంటూ పాలు పంచుకోనున్నారు నగరంలోని పలువురు పక్షి ప్రేమికులు. నగరాలు కాంక్రీట్ జంగిల్స్గా మారిపోయిన పరిస్థితుల్లో జీవవైవిధ్యం కనుమరుగవుతోంది. అదే క్రమంలో ఎన్నెన్నో అరుదైన పక్షి జాతులు అంతరించిపోతున్నాయి. ఈ నేపథ్యంలో పర్యావరణ ప్రేమికుల ఆలోచనల్లో నుంచే బర్డ్ అట్లాస్ ఊపిరిపోసుకుంది. నగరాల్లో పక్షుల సంచారాన్ని గుర్తించడం, సమగ్ర వివరాలతో డేటాను మ్యాప్ రూపంలో తయారు చేయడం తద్వారా వాటి రక్షణకు తీసుకోవాల్సిన చర్యలను సిఫారసు చేయడం వంటి లక్ష్యాలతో రూపొందేదే బర్డ్ అట్లాస్. మొదట ఈ తరహా రాష్ట్ర వ్యాప్త బర్డ్ అట్లాస్ను రూపొందించిన ఘనత కేరళ సొంతం చేసుకోగా.. నగరాలకు సంబంధించి కొయంబత్తూర్, మైసూర్ మాత్రమే ఈ ప్రక్రియను పూర్తి చేశాయి. వాటి తర్వాత హైదరాబాద్ కూడా సిద్ధమై వాటి సరసన నిలిచేందుకుప్రయత్నిస్తోంది.. 700 మంది వాలంటీర్లు.. నగర జీవవైవిధ్యాన్ని అర్థం చేసుకోవడం, పరిరక్షించడంలో భాగంగా పక్షుల విశేషాలను ఒడిసిపట్టుకునేందుకు బర్డ్ అట్లాస్ రూపకల్పనలో నగరానికి చెందిన వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్, హైదరాబాద్ బర్డ్ పాల్స్, డెక్కన్ బర్డర్స్ సంస్థలు చేతులు కలిపాయి. నగరం, చుట్టుపక్కల లేక్స్, పార్క్స్ నుంచి ఔటర్ రింగ్ రోడ్లోని అడవులు, గడ్డి భూములు, చిత్తడి నేలలతో పాటు 180 సెల్స్ (పక్షుల జాడ కనిపించే ప్రాంతాలను) గుర్తించారు. ఆయా ప్రాంతాల్లో సర్వేలో పాల్గొనే వాలంటీర్ల రిజి్రస్టేషన్ ప్రక్రియ నవంబర్లో ప్రారంభం కాగా, గత డిసెంబర్లో పూర్తయ్యింది. ఇప్పటికి 700 మంది వాలంటీర్లుగా నమోదయ్యారు. వీరిని 90 లేదా 45 బృందాలుగా విభజించనున్నారు. జనవరి నెల మొత్తం ఈ వాలంటీర్లకు శిక్షణా కార్యక్రమం నిర్వహిస్తున్నారు.పక్షులపై పట్టణీకరణ ప్రభావం.. ‘బర్డ్ అట్లాస్లు శాస్త్రవేత్తలు, పర్యావరణ పరిరక్షకులు, విధాన నిర్ణేతలకు అమూల్యమైన సాధనాలు. అవి పక్షుల జనాభాలో మార్పులను విశ్లేషించడంలో సంతానోత్పత్తి స్థలాలు, వలసలను నిలిపివేసే ప్రదేశాలు తదితర కీలకమైన విషయాలను గుర్తించడంలో సహాయపడతాయి. ఈ డేటా పక్షి జనాభా క్షీణత లేదా మార్పులు వంటి ముఖ్యమైన పోకడలను వెల్లడిస్తుంది. తద్వారా జీవవైవిధ్యానికి హాని చేయకుండా నగరాభివృద్ధి, విస్తరణ జరిపేందుకు సహకరిస్తాయి అని వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్కు చెందిన ఫరీదా తంపాల్, హైదరాబాద్ బర్డ్ పాల్స్ ప్రతినిధి, ప్రాజెక్ట్ కో–ఆర్డినేటర్ శ్రీరామ్రెడ్డి, డెక్కన్ బర్డర్స్కు చెందిన సు«దీర్మూర్తి అంటున్నారు. ‘పక్షి జాతులను పట్టణీకరణ ఎలా ప్రభావితం చేస్తుందనే దానిపై అట్లాస్ అవగాహన అందిస్తుంది. భవిష్యత్తులో మానవ కార్యకలాపాలు, వాటిని ఎలా ప్రభావితం చేస్తాయో అంచనా వేయడంలో కూడా సహాయపడుతుంది’ అని వీరు స్పష్టం చేస్తున్నారు. నగర పర్యావరణ పరిరక్షణకు వీలు కలిగేలా వీరు చేపట్టిన బృహత్తర యత్నం విజయవంతం కావాలని.. ఆకాశహార్మ్యాలతో పాటు ఆకాశంలో విహరించే పక్షులు కూడా పెద్ద సంఖ్యలో మనకి కనువిందు చేయాలని కోరుకుందాం. మూడేళ్ల పాటు సాగనున్న వేట.. సంవత్సరానికి రెండు సార్లు–శీతాకాలంలో (ఫిబ్రవరి) వేసవిలో (జూలై) ఒకసారి.. ఇలా మూడు సంవత్సరాల పాటు పక్షుల సర్వేలను నిర్వహిస్తారు. తొలిగా వచ్చే ఫిబ్రవరిలో సర్వే ప్రారంభం అవుతుంది. టీమ్స్, వాలంటీర్ల వెసులుబాటును బట్టి ఆ నెల మొత్తం సర్వే కొనసాగుతుంది. అనంతరం మ్యాప్ తయారు చేస్తారు. ఇదే విధంగా మూడేళ్ల పాటు ఈ క్రతువు కొనసాగుతుంది. -
ప్రకృతి సోయగం.. కన్హా శాంతివనం..
చుట్టూ ప్రకృతి అందాలు, విశాలమైన ఓపెన్ ఎయిర్ మందిరాలు, క్రీడా ప్రాంగణాలు, ఉచిత మెడిటేషన, వసతి సౌకర్యాలు, ప్రశాంతమైన వాతావరణం, అంతరించిపోనున్న మొక్క జాతుల నర్సరీ ఇది.. ప్రకృతి సోయగంగా విరాజిల్లుతున్న కన్హా శాంతి వనం.. 1,600 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో ఏర్పాటైన మందిరాల్లో లక్ష మంది ఒకే చోట, ఒకే సారి మెడిటేషన్ చేయడానికి అనువుగా మన హైదరాబాద్ కేంద్రంగా ఇది నిర్మితమైంది. నగర జీవనంలో ప్రతి ఒక్కరూ పలు రకాల ఒత్తిళ్లతో జీవితాన్ని నెట్టుకొస్తున్నారు. విద్యార్థి నుంచి ఉద్యోగి, వ్యాపారి, గృహిణి, వృద్ధుల వరకూ ఇలా అన్ని వయసుల వారు ఒత్తిడి బాధితులే. దీనిని అధిగమించేందుకు మెడిటేషన్ ఓ చక్కని పరిష్కారమని నిపుణులు చెబుతున్నారు. మానసిక సమస్యలను తగ్గించుకునేందుకు ప్రతి ఒక్కరూ మెడిటేషన్ ప్రాధాన్యతను గర్తించాలి..ఈ నేపథ్యంలో కన్హా శాంతి వనం గురించిన మరిన్ని విశేషాలు.. కన్హా శాంతి ఆశ్రమం పర్యావరణం, ఆధ్యాత్మిక ప్రదేశం. సరళమైన జీవనానికి డెస్టినేషన్గా నిలుస్తుంది. ఆరోగ్యం, వివిధ అంశాలను ప్రోత్సహించే ఇంటరాక్టివ్ ప్రోగ్రామ్స్తో పాటు ఆధ్యాతి్మక శిక్షణ అందుబాటులో ఉంటుంది. వృద్ధులకు వెల్నెస్ సెంటర్, ఆయుర్వేద, నేచురోపతి, వ్యవసాయ కళాశాలను ఏర్పాటు చేయనున్నారు. ఇక ప్రధానంగా మెడిటేషనకేంద్రం నిర్మాణంలోనే ఓ ప్రత్యేకత ఉంది. వాతావరణ పరిస్థితులను సమతుల్యం చేయడానికి మెడిటేషన్ ఫ్లోర్ కింద నీటిని నిల్వ చేస్తారు. కనీసం మూడు రోజుల నుంచి 15 రోజుల పాటు శిక్షణ ఉంటుంది. ఈ సమయంలో వసతి, భోజనం, అన్నీ ఉచితంగా అందజేస్తారు. వివిధ దేశాల నుంచి.. ఈ మెడిటేషన్ ఆశ్రమానికి ప్రపంచంలోని 162 దేశాల్లో శాఖలు ఉన్నాయి. వివిధ కళాశాల విద్యార్థులు ఇక్కడ వర్క్షాప్ నిర్వహించడం, రీ ట్రీట్ ప్రొగ్రాం ఏర్పాటు చేసుకుంటున్నారు. దీంతో పాటు వివిధ దేశాలు, రాష్ట్రాల నుంచి వచి్చన వారు ఇక్కడి మెడిటేషన్ తరగతుల్లో భాగస్వాములవుతున్నారు.ప్రముఖులు సైతం.. రెండేళ్ల నుంచి నగరంలో ఈ పేరు అందరి నోటా నానుతోంది.. దీంతో పాటు మరెన్నో ప్రత్యేకతలు కన్హా శాంతి వనం సొంతం కావడంతో రాష్ట్రపతి, ప్రధాన మంత్రి, ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, ఇతర ప్రముఖులు సైతం ఈ వనాన్ని సందర్శించిన వారిలో ఉన్నారు. పోస్టల్ పిన్ కోడ్ ఆధారిత సేవలు.. హార్ట్ఫుల్గా మెడిటేషన్లో శిక్షణ తీసుకోవాలనుకునే సులువైన పద్ధతిలో శిక్షకులు అందుబాటులో ఉండేలా ఏర్పాటు చేస్తున్నారు. హార్ట్ఫుల్నెస్ వెబ్సైట్లో తపాలా శాఖ పిన్కోడ్ నమోదు చేయగానే అక్కడ ఉండే శిక్షకుల వివరాలు అందుబాటులోకి వస్తాయి. దీని ద్వారా కన్హా శాంతి వనంలో వారంలో రెండు బ్యాచ్లకు మెడిటేషన్ శిక్షణ పొందవచ్చు.అబ్బురపరిచే ఆర్కిటెక్చర్.. కన్హా శాంతి వనం అబ్బురపరిచే ఆర్కిటెక్చర్కు అద్దం పడుతోంది. వర్షను నీటిని సైతం ఒడిసి పట్టేలా నిర్మాణాలు ఉన్నాయంటే ఆశ్చర్యం కలగక మానదు.. ప్రస్తుత కన్హా వనం ప్రాంతం రెండు దశాబ్దాల క్రితం నెర్రెలు వారిన నేలలు కనిపించేవి. నీటికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేవారు. కానీ నేడు ఈ వనంలో వర్షపు నీరు చుక్క కూడా వృథా కాకుండా చుట్టూ కృత్రిమ చెరువులు నిర్మించారు. వాటినే గార్డెన్, మొక్కలు, రన్నింగ్ వాటర్, ఇతర అవసరాలకు వినియోగిస్తారు. ఇలా చేరుకోవచ్చు.. నగరంలోని సికింద్రాబాద్, అఫ్జల్గంజ్, శంషాబాద్ తదితర ప్రాంతాల నుంచి ఆర్టీసీ బస్సు సరీ్వసులు నడిపిస్తోంది. సొంత వాహనాల్లో రావాలనుకునే వాళ్లు హైదరాబాద్–బెంగళూరు జాతీయ రహదారిపై తిమ్మాపూర్ వద్ద చేగూరు రోడ్డుకు తిరిగితే ఆశ్రమం చేరుకోవచ్చు. మొదటి సారి వచ్చాను.. నా మిత్రులు శాంతి వనానికి పోదామన్నారు. ఇక్కడి వాతావరణం, మెడిటేషన్ కేంద్రం, అన్నీ బాగున్నాయి. వనంలో వివిధ ప్రాంతాలను సందర్శించడానికి ఉచిత వాహనం ఏర్పాటు చేశారు. – వెంకటేశ్వరరావు, విశ్రాంత ఉద్యోగి, నాగోల్ట్రైనర్గా 24 ఏళ్ల నుంచి.. కనీసం మూడు రోజులు మెడిటేషన్ ట్రై చేయండి. మార్పు మీకే కనిపిస్తుంది. గుండె, మెదడు రెండూ కలసి పనిచేస్తే ఆరోగ్యం. ప్రస్తుతం గుండె మాట మెదడు వినే పరిస్థితి కనిపించడం లేదు. గత 24 ఏళ్లుగా మెడిటేషన్ ట్రైనర్గా పనిచేస్తున్నాను. బెంగళూరులో కొన్నాళ్లు, ఇక్కడ కొన్నాళ్లు శిక్షణ ఇస్తుంటాను. ఆన్లైన్లోనూ తరగతులు చెబుతాను. – సునీతా ప్రసాద్, మెడిటేషన్ ట్రైనర్ఇది సెక్యులర్ సిటీ.. కన్హా శాంతి వనంలో మెడిటేషన్ కోసం వచ్చే వారికి ఎలాంటి రుసుమూ వసూలు చేయడంలేదు. హైదరాబాద్ సెక్యులర్ సిటీ. సందర్శకుల్లో అన్ని వర్గాలనూ దృష్టిలో ఉంచుకుని ఉచిత శిక్షణ, వసతి సదుపాయం కల్పిస్తున్నాం. కేవలం రూ.10లకు భోజనం లభిస్తుంది. మూడు స్టార్ హోటల్స్ లోనూ భోజనం చేయవచ్చు. – కరుణాకర్, కన్హా శాంతివనం కో–ఆర్డినేటర్ -
విజువల్ వండర్.. సిటీలో వర్చువల్ పార్క్ల క్రేజ్
కృత్రిమ మేధకు ఆహ్వానం పలికిన ప్రస్తుత అధునాతన యుగంలో సాధ్యంకానిదంటూ ఏదీ లేదనేంతలా మారిపోయింది. ముఖ్యంగా ఈ అధునాతన జీవనశైలిలో వృత్తి వ్యాపారాలతో పాటుగా వినోదాత్మక కేంద్రాలు, ఊహాజనిత ప్రాంతాలన్నీ కళ్లముందుకొచ్చేశాయి. వర్చువల్ రియాలిటీ వేదికలుగా పిలుచుకునే ఈ విజువల్ వండర్లకు ఈ మధ్య ఆసక్తి, ఆదరణ విపరీతంగా పెరిగింది. కొన్నేళ్ల క్రితం విదేశాలకే పరిమితమైన ఈ వర్చువల్ వేదికలు ప్రస్తుతం నగరంలో సందడి చేస్తున్నాయి. ఈ ఊహాజనిత వర్చువల్ ప్రపంచంలో ప్రేక్షకులు డైనోసార్ పార్క్లోకి ప్రవేశించి ప్రత్యక్ష అనుభూతిని పొందవచ్చు.. నగరంలో వరుసగా వర్చువల్ పార్కులు ఏర్పాటవుతున్న తరుణంలో ఆ విశేషాలు కొన్ని.. వర్చువల్ రియాలిటీ ద్వారా వజువల్గా ఆయా ప్రాంతాల్లో ఉన్న అనుభూతి కలుగుతుంది. దీని ద్వారా ఎవరెస్టు అధిరోహించవచ్చు, వినీల ఆకాశంలో, అంతరిక్షంలో సంచరించవచ్చు. ఆ ప్రయాణమంతా మన కళ్ల ముందు నిజంగానే జరుగుతుందనే అద్భుత అనుభూతిని, ఆహ్లాదాన్ని అందిస్తున్నాయి ఈ వేదికలు. ఐతే గతంలో 1, 2 ఉన్నటువంటి ఈ వర్చువల్ రియాలిటీ వేదికలు క్రమంగా వాటి సంఖ్యను పెంచుకుంటున్నాయి. ఒక పెద్ద మాల్లోనో, అమ్యూజ్మెంట్ పార్క్లో ఒక భాగంగానో ఉన్న ఈ ఆశ్చర్యభరిత వేదికలు ప్రస్తుతం నగరంలో పదుల సంఖ్యలో ఏర్పాటవుతున్నాయి. గదిలో ఓ ప్రదేశం నుంచి ఎకరాల స్థలంలో ఏర్పాటు చేయడం విశేషం. వర్చువల్ రియాలిటీ అంటే..? ఇదొక మాయా ప్రపంచం.. సామాన్య మానవునికి సాధ్యం కాని సాహసాలను నిజం చేశామనే అనుభూతిని కల్పిస్తాయి. స్వయంగా దట్టమైన అడవిలోకి వెళ్లి డైనోసార్లతో ఫైటింగ్ చేయొచ్చు. అనకొండలతో ఆడుకోవచ్చు. మహాసముద్రాల అడుగున అద్భుత జీవజాతులను విక్షించే ఫీలింగ్ను పొందవచ్చు.. అంతేకాదు.. మనమే ఒక భీకర యుద్ధంలో పాల్గొంటే ఎలా ఉంటుందో మన కళ్లకు గంతలు కట్టినట్టుగా ఉండే వర్చువల్ హెడ్సెట్తో చూపిస్తుంది. అలా కాకుండా వర్చువల్ సాంకేతికతతో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన థియేటర్ వంటి ఒక 3డీ గదిలో అంతరిక్షాన్ని, ఏలియన్ ప్రపంచాన్ని నిజజీవితంలానే భ్రమింపజేస్తుంది. ఇప్పటి వరకూ మనిషి చూడని జల కన్యలు, గ్రహాంతర వాసులతో కలిసి మలన్ని నడిపిస్తుంది. ఇదంతా వాస్తవంగా జరుగుతుందనేలా మనకు అనిపించడమే ఈ వర్చువల్ రియాలిటీ ప్రత్యేకత. ఈ అనుభూతి కలి్పంచడంలో 3డీ, 4డీ, వీఆర్ ఎక్స్పీరియన్స్ వంటి అధునాతన సాంకేతికతలు కీలకంగా పనిచేస్తున్నాయి. మనిషి చూడని ప్రపంచంలోకి.. నగరం వేదికగా ఈ వర్చువల్ విజువల్ వండర్ను అందిస్తున్న వేదికల్లో వండర్లా అమ్యూజ్మెంట్ పార్క్ ఒకటి. ఇందులో గతంలో ప్రారంభించిన ఇంటర్స్టెల్లార్ వర్చువల్ షో.. ప్రేక్షకులను అంతరిక్షంలోకి, ఇక్కడి గ్రహాల పైకీ తీసుకెళుతుంది. మనమే ఒక వ్యోమగామిగా ఆ అందాలను, అద్భుతాలను ప్రత్యక్షంగా వీక్షించిన అనుభూతినిస్తుంది. శాటిలైట్ వ్యూతో పాటు జలాంతర్గాములు, అగ్ని పర్వతాలు, మంచుకొండలను చేధించుకుంటూ వెళ్లే ఈ వర్చువల్ ప్రయాణం మరో లోకంలోకి తీసుకెళుతుంది. లేజర్ గన్లతో వర్చువల్ గేమ్స్.. నెక్లెస్ రోడ్డులోని థ్రిల్ సిటీ థీమ్ పార్క్లో కూడా వర్చువల్ విజువల్ వండర్లను ప్రదర్శించే ప్రత్యేక షోలను ఏర్పాటు చేశారు. ఉత్కంఠను, సాహస కృత్యాలతో భయభ్రాంతులకు గురిచేసే ఈ వర్చువల్ ప్రదర్శన మరచిపోని అనుభూతిని అందిస్తుంది. దీంతో పాటు ప్రసాద్ ఐమ్యాక్స్ వేదికగా వర్చువల్ గేమింగ్ అందుబాటులో ఉంది. ఇందులో లేజర్ గన్లతో పబ్జీ, బీజీఎమ్ ఐ, ఫ్రీ ఫైర్ వంటి ఆన్లైన్ గేమ్స్ పోలిన వర్చువల్ రియాలిటీ గేమ్స్ ఎవరైనా ఆడవచ్చు. ఇవేకాకుండా ఇనార్బిట్ మాల్తో పాటు గచి్చ»ౌలి, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ వంటి ప్రాంతాల్లోని ప్రముఖ మాల్స్లో థ్రిల్ కలిగించే వర్చువల్ వేదికలు నగరవాసులను అలరిస్తున్నాయి. వీఆర్ కార్ రేసింగ్, షూటింగ్, ఎస్కేప్ రూమ్, కిడ్స్ జోన్ వంటివి వీక్షకులను అలరిస్తున్నాయి. అతిపెద్ద అమ్యూజ్మెంట్ పార్క్.. కొన్ని రోజుల క్రితమే తెలంగాణ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో కొండాపూర్లోని బొటానికల్ గార్డెన్ వేదికగా ఏకంగా 107 ఎకరాల విస్తీర్ణంలో అతిపెద్ద వర్చువల్ వైల్డ్ లైఫ్ సఫారీ పార్క్ ఏర్పాటు చేశారు. ఇది అతిపెద్ద వర్చువల్ అమ్యూజ్మెంట్ పార్క్గా అవతరించింది. ఇందులో ఎత్తయిన జలపాతాలు, దట్టమైన అడవులు, గిరిజన జాతి తెగల జీవితాలు, వన్యప్రాణులు, క్రూరమృగాలను దగ్గరగా చూపించే వర్చువల్ బస్ రైడ్ వంటి ఆశ్చర్యపరిచే వింతలు చూపిస్తున్నారు. ఇందుకోసం వీఆర్ ఎక్స్పీరియన్స్ సెంటర్లు, 3డీ సాంకేతికత, 360 ఇండోర్ థియేటర్, వర్చువల్ హెడ్సెట్ బస్ ప్రయాణాలను అందుబాటులో ఉంచారు. వైల్డ్ సఫారీ ఎలా ఉంటుందో వర్చువల్ వేదికగా కళ్ల ముందే చూపిస్తుండటం విశేషం.దశాబ్ద కాలం క్రితమే.. దశాబ్ద కాలం క్రితమే ట్యాంక్ బండ్ వేదికగా ఉన్న ఎన్టీఆర్ గార్డెన్స్లో 3డీ షో థియేటర్ ఉండేది. అప్పట్లో ఇలాంటి వేదికలు ఒకటీ, రెండు మాత్రమే ఉండేవి. కానీ ప్రస్తుతం మరింత అధునాతన సాంకేతికతతో 3డీ నుంచి రూపాంతరం చెందిన వర్చువల్ అద్భుతాలు నగరం నలుమూలలా ఆవిష్కృతమవుతున్నాయి. దీంతో పాటు ఈ వేదికలో మరో వర్చువల్ 3డీ గది.. ప్రేక్షకులను ఊహాజనిత డైనోసార్ యుగంలోకి తీసుకెళుతుంది. ఇందులో విభిన్న రకాల రాక్షస బల్లులతో పాటు విభిన్న రకాల జంతువులను దగ్గరగా చూడవచ్చు. -
సంతోషం..సంపూర్ణ బలం
సంపాదనకు కొదవలేకున్నా, సరదాలెన్నో అందుబాటులో ఉన్నా సంతోషం మాత్రం అల్లంత దూరంలో అందీ అందనట్టు ఊరిస్తూనే ఉంది. మన దేశం హ్యాపీ‘లెస్’లో ముందుందని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. దేశంలోని అనేక రకాల అనారోగ్యాలకు అంతుపట్టని మనోవ్యాధులకు ఇదే ప్రధాన కారణమని కూడా స్పష్టం చేస్తున్నాయి. హ్యాపీనెస్కి రానురానూ ప్రాధాన్యత పెరుగుతోంది. అదే క్రమంలో కొత్త సంవత్సరపు తీర్మానాల జాబితాలో సైతం సంతోషంగా జీవించడం ముందు వరుసలో చోటు దక్కించుకుంటోంది. ఈ నేపథ్యంలో సంతోషం గురించిన కొన్ని సంగతులు.. దేశాన్ని సంతోషభరిత దేశంగా మార్చడం కోసం ప్రపంచ సంతోష దినోత్సవం సందర్భంగా 2022లో మార్చి 20న హ్యాపీనెస్ ఇండియా ప్రాజెక్ట్ ప్రారంభించారు. అదేవిధంగా గుజరాత్ యూనివర్సిటీ ‘హ్యాపీనెస్ కౌన్సెలింగ్’ అనే కొత్త సరి్టఫికెట్ కోర్సును ప్రారంభించింది. వారాంతాల్లో నిర్వహించే ఈ మూణ్నెళ్ల కోర్సులో వేదాలు, ఉపనిషత్తుల బోధనలు, నృత్యం, సంగీతం, లాఫింగ్, ఆహారం ప్రసంగ చికిత్స ద్వారా ఒత్తిడిని నియంత్రించడంపై విద్యార్థులకు శిక్షణ ఇస్తారు. మధ్యప్రదేశ్లోనూ ‘సంతోష మంత్రిత్వ శాఖ’ను ప్రకటించారు. జీడీపీ ద్వారా కాకుండా ఆనందాన్ని అంచనా వేయడం ద్వారా రాష్ట్ర పురోగతిని అంచనా చేయడం కోసం ఈ శాఖ పనిచేస్తుంది. ఆ తర్వాత ‘ఆధ్యాత్మిక శాఖ’ ఏర్పాటు చేసి, దానితో ఈ శాఖను విలీనం చేశారు. ఆ రాష్ట్రం హ్యాపీనెస్ ఇండెక్స్ సర్వే సైతం నిర్వహిస్తోంది. దేశ రాజధాని ఢిల్లీలో ప్రభుత్వ పాఠశాలల్లో నర్సరీ నుంచి 8వ తరగతి వరకు ఈ అంశంపై పాఠ్యాంశాలు ప్రవేశపెట్టారు. అలాగే ఢిల్లీ యూనివర్సిటీ రామానుజన్ కాలేజ్, సెంటర్ ఆఫ్ ఎథిక్స్ అండ్ వర్చుస్ ఆధ్వర్యంలో స్కూల్ ఆఫ్ హ్యాపీనెస్ ఆరు నెలల కోర్సు అందిస్తోంది. భారత ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ జుడీషియల్ అకాడమీలలో సంతోషకరమైన తరగతులను ప్రతిపాదించారు. ‘ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలోని వెల్ బీయింగ్ రీసెర్చ్ సెంటర్, యుఎన్ సస్టెయినబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్స్ నెట్వర్క్ సంయుక్తంగా విడుదల చేసిన 2024 వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్లో 143 దేశాలలో భారతదేశం 126వ స్థానంలో నిలిచింది.’ సంతోషం ఎందుకు కోల్పోతున్నాం? సాంకేతిక జీవనశైలి మార్పుల ప్రభావం లేదా సామాజిక నిబంధనల ఒత్తిడితో సమస్యలను ఎదుర్కోవడం వల్ల దేశంలోని 1.3 బిలియన్ల మంది ఏదో ఒక రకంగా బాధపడుతున్నారు. హార్వర్డ్ యూనివర్సిటీ నిర్వహించిన ఒక అధ్యయనం ఫలితాలను విశ్లేíÙస్తే అనుబంధలేమి.. ఆనందమేదీ? స్నేహితులు కుటుంబ సభ్యులతో సన్నిహిత సంబంధాలు ఆనందానికి బాటలు వేస్తాయి. అవే జీవితంలోని అసంతృప్తుల నుంచి మనల్ని రక్షిస్తాయి. వయసు రీత్యా వచ్చే మానసిక శారీరక క్షీణతను ఆలస్యం చేస్తాయి. గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ పరిసరాలకు మార్పులు, న్యూక్లియర్ ఫ్యామిలీల వెల్లువ అనుబంధాల విచి్ఛన్నానికి కారణమయ్యాయి. చాలామంది కుటుంబ సభ్యులతో క్రమం తప్పకుండా టచ్లో ఉండటం లేదు. వీరిలో చాలా తక్కువ మందికి మాత్రమే నిజమైన స్నేహితులున్నారు. పనివేళలు ముగిశాక సోషలైజేషన్ తగ్గిపోయింది. సామాజిక మాధ్యమాల వల్ల ఏకాంతం.. మన దేశంలోని వృద్ధులే యువత కంటే సంతోషంగా ఉన్నారని వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ వెల్లడించడం గమనార్హం. యువత ఆనందం కోసం సాంకేతికతపై అధికంగా ఆధారపడటం దీనికో కారణం. మన మెదడులో పుట్టే డోపమైన్(ఆనందం, సంతృప్తికి ప్రేరణ అందించే రసాయనం)ని సోషల్ మీడియా అల్గారిథమ్లు తాత్కాలికంగా ప్రేరేపిస్తాయి. అందుకే ఆన్లైన్లో గడిపే సమయం చాలా బాగున్నట్టు అనిపిస్తుంది. ఇది ఆరోగ్యకరమైన భావోద్వేగ వికాసానికి బాటలు వేయదు. స్నేహితులతో ముఖాముఖి సంభాషణ ఇచ్చే సంతోషాన్ని, నిద్ర వల్ల కలిగే ఆనందాల్ని దూరం చేస్తుంది. యువతలో ఆందోళన.. యువతలో విజయం కోసం ఆకలి కొన్ని ప్రతికూల అంశాలతోనూ ముడిపడింది. ఏ విధంగానైనా సరే విజయం సాధించాలనే ఆతృత యువతలో ఆందోళనకు ఒత్తిడికి కారణమవుతోంది. వ్యక్తిగత లక్ష్యాలతో సామూహిక శ్రేయస్సు పట్ల ఆసక్తి పోయి స్నేహితులు కుటుంబ సభ్యుల మధ్య లోతైన సంబంధాలను కోల్పోవడం జరుగుతోంది ప్లస్.. మైండ్ఫుల్ నెస్.. ట్రాక్ యువర్ హ్యాపీనెస్ అనే ఐ ఫోన్ యాప్ ట్రాకర్ని ఉపయోగించి హార్వర్డ్ మనస్తత్వవేత్తలు మాథ్యూ కిల్లింగ్స్వర్త్ డేనియల్ గిల్బర్ట్ నిర్వహించిన పరిశోధన ప్రకారం, మనం పనిచేసే గంటల్లో 47% ఏం జరగడం లేదు? అనే దాని గురించే ఆలోచిస్తున్నాం. ప్రస్తుతం మన చుట్టూ ఉన్న పరిస్థితులు, పరిసరాలపై కాకుండా వేరే అంశాలపై ఆలోచిస్తున్నాం. ఈ తరహా పగటి డ్రీమింగ్ మనకు సంతోషాన్నివ్వదు. దీనికి మన సంప్రదాయ మార్గాలైన మైండ్ ఫుల్ నెస్ సాధన, మెడిటేషన్లలో పరిష్కారం లభిస్తుంది. కారణాలేవైనా.. సంతోషాన్వేషణ అయితే తప్పనిసరి అని తెలుస్తున్న నేపథ్యంలో కొత్త సంవత్సరారంభ వేళ.. సాక్షి పలువురు నిపుణులతో సంభాషించి.. సంతోషార్థుల కోసం పలు సూచనలను అందిస్తోంది.అంచనాలను మరచితేనే.. ఆనందం.. ఆనందం, దాని స్వచ్ఛమైన రూపంలో, బాహ్య పరిస్థితులపై ఆధారపడిన భావోద్వేగం కాదు. అంతర్గత సామరస్యం నుంచి ఉత్పన్నమయ్యే శాశ్వత స్థితి. నిజమైన ఆనందం కోరికల నుంచి విముక్తి పొందడం. దీని అర్థం ఆకాంక్షను కలిగి ఉండకూడదని లేదా అంకితభావంతో మన లక్ష్యాలను కొనసాగించక్కర్లేదని కాదు. మన కోరికలు, లక్ష్యాలు ఆకాంక్షలు ఉండటమే మనల్ని మనుషులుగా మారుస్తుంది. ఖచి్చతంగా లక్ష్యాల కోసం పని చేయండి. అయినప్పటికీ జరుగుతున్నది అంగీకరించి సంతోషంగా ఉండండి. ఎట్టి పరిస్థితుల్లోనూ తమ ఆనందాన్ని కాపాడుకోగలిగేవారే అత్యంత సంతోషకరమైన వ్యక్తులు అని నా ఆధ్యాత్మిక గురువు షాజహాన్పూర్కి చెందిన శ్రీరామ్ చంద్ర అంటారు. మన అంచనాలను తగ్గించుకోవడం ద్వారా, కోరికల చక్రం నుంచి మనల్ని మనం విడిపించుకుంటాం. అంతర్గతంగా నిజమైన ప్రశాంతత కనుగొంటాం. ఇది అంతర్గత శాంతికి అనంతమైన ఆనందానికి దారి తీస్తుంది. ఈ మార్గంలో జీవించడానికి అత్యుత్తమ సాధనం ధ్యానం. – కమలేష్ పటేల్ (దాజి), హార్ట్ఫుల్ నెస్ ఇన్స్టిట్యూట్ఆహారం.. ఆనందం.. జపనీస్ కల్చర్లో టీ సెర్మనీ అని ఉంటుంది. ఇది ఓ రకంగా టీ పార్టీ లాంటిది. ఇందులో పాల్గొన్న వారికి కప్స్లో కాకుండా బౌల్లో తేనీటిని ఇస్తారు. ఆ బౌల్ మీద విభిన్న రకాల జపనీస్ చిత్రాలు ఉంటాయి. టీ తాగేవారు చప్పుడు చేస్తూ తాగాలి.. ఆ బౌల్ మీద ఉన్న బొమ్మల్ని గుర్తించాలి. టీ రుచి గురించి మాట్లాడాలి. తయారు చేసిన వారికి ధన్యవాదాలు తెలియజేయాలి. ..ఇదంతా ఎందుకంటే.. ఆ మూమెంట్లో బతకడం అనేది అలవాటు కావాలని ఇలా చేస్తారు. బరువు తగ్గడం, పెరగడం, ఆరోగ్యం, అనారోగ్యం.. వీటన్నింటి చుట్టే మనం ఆలోచిస్తాం. కానీ ఆహారం అనేది అత్యంత భావోద్వేగ భరిత అంశం. సంస్కృతి సంప్రదాయాలతో మొదలుకుని అనేక రకాల అనుభూతులతో ఆహారం ముడిపడి ఉంటుంది. సంక్రాంతి సమయంలో అరిసెలు తినడం ఒక ప్రత్యేకమైన భావోద్వేగాన్ని కలిగిస్తుంది. అలాగే వినోదమైనా, విషాదమైనా వాటిలో విందులను భాగం చేయడం కూడా అలాంటిదే. ఆహారం అనేది మన మూడ్ని ఎలివేట్ చేస్తుంది కాబట్టే. ఒక రుచికరమైన పదార్థాన్ని చూడగానే తినాలనిపించడం, నోట్లో నీళ్లూరడం, అవి నోటిలోకి వెళ్లగానే ఆ రుచికి మనలో కలిగే స్పందనలు.. ఇవన్నీ కూడా ఫుడ్ ఇంపాక్ట్కి నిదర్శనాలు. తినేటప్పుడు కరకరమని సౌండ్ వచ్చే పదార్థాలు మరింత ఎక్కువ సంతృప్తిని అందిస్తాయని, అందువల్లే చిప్స్ వంటివి ఎక్కువగా తింటామని ఒక అధ్యయనం చెబుతోంది. పాలు మరుగుతున్నప్పుడు వచ్చే వాసన కూడా బ్రెయిన్ కెమికల్ని యాక్టివేట్ చేస్తుంది. ఇక పండ్లలో యాంటిఆక్సిడెంట్స్ ఒత్తిడిని తొలగించి మనసు తేలికైన భావన అందిస్తాయి. – డా.జానకి, న్యూట్రిషనిస్ట్కన్నీరు పెట్టుకో.. కష్టాల్ని మర్చిపో.. కష్టాలు, సమస్యలు లేకుండా మనిషి జీవితం ఉండదు. అవి మర్చిపోవడానికి దేవుడు ఇచి్చన వరం కన్నీరు. ఏడ్చిన తర్వాత మనసు తేలిగ్గా ఉంటుంది. ఏడుపు.. ఆరోగ్యానికి మదుపు.. క్రైయింగ్ పలు ఆరోగ్యకర లాభాలను అందిస్తుందనేది శాస్త్రీయంగా రుజువైన విషయం. అయితే ఆధునిక సమాజంలో బాధ వచి్చనప్పుడు రకరకాల కారణాల వల్ల దుఃఖాన్ని దిగమింగుకోవడం జరుగుతోంది. ఇది మరింతగా ఆరోగ్యానికి హాని చేస్తోంది. దానికి బదులుగా కాసేపు మనసారా ఏడవనిస్తే మనసుకు చాలా నిశి్చంతగా తేలికగా అనిపిస్తుంది. అది మనల్ని బాధాకరమైన అనుభవం నుంచి దూరంగా తీసుకెళుతుంది. ఏడుపు వల్ల మనసు మాత్రమే కాదు కళ్లు, కన్నీటి వాహికలు సైతం శుభ్రపడతాయి. సాధారణ కంటి సమస్యలకు వాడే ఐడ్రాప్స్కి ఇది మేలైన ప్రత్యామ్నాయం అని చాలా మందికి తెలీదు. అందుకే మనకు బాధ కలిగించిన వాటిని గుర్తు చేసుకుంటూ కనీసం వారానికో కుదరకపోతే కనీసం నెలకు ఒకసారైన తనివిదీరా కళ్లమ్మట నీళ్లు పెట్టుకోవాలి. – కమలేష్, క్రైయింగ్ అండ్ లాఫర్స్ క్లబ్ నిర్వాహకులుఆరోగ్యమే.. ఆనందం.. నూతన సంవత్సరంలో అడుగుపెడుతున్నాం. ఆరోగ్యాన్ని తీర్చిదిద్దుకోవడంపై దృష్టి పెట్టడానికి ఇంతకంటే మంచి సమయం లేదు. ఆరోగ్యాన్ని మించిన ఆనందం లేదు. చిన్నపాటి, స్థిరమైన మార్పులు దీర్ఘకాలం పాటు సంతృప్తికరమైన సంతోషకర జీవితాన్ని గడిపేందుకు సహాయపడతాయి. కాలుష్యం విజృంభిస్తోంది. పురుగు మందులు వాయు కాలుష్య కారకాల వల్ల హానికరమైన పదార్థాలు శరీరంలో పేరుకుపోయి దీర్ఘకాలిక వ్యాధులకు దారితీస్తాయి. కాలుష్యానికి వీలున్నంత దూరంగా జీవించే ప్రయత్నం చేయాలి. దీర్ఘకాలిక ఒత్తిడి బలహీనమైన రోగనిరోధక వ్యవస్థకు దారితీస్తుంది. ధ్యానం, యోగా లేదా శ్వాస సంబంధ వ్యాయామాలు వంటి ఒత్తిడిని తగ్గించే కార్యకలాపాలను దినచర్యలో చేర్చాలి. నాణ్యమైన నిద్ర లేకపోవడం వల్ల అలసటకు అనారోగ్యాలకు ఎక్కువ అవకాశం ఉంది. కాబట్టి ప్రతి రాత్రి 7–9 గంటల నాణ్యమైన నిద్రను లక్ష్యంగా పెట్టుకోండి. స్క్రీన్ సమయాన్ని పరిమితం చేయండి. ప్రాసెస్ చేసిన ఆహారాలు, ప్లాస్టిక్లు కొన్ని సౌందర్య సాధనాల్లో కనిపించే రసాయనాలు శరీర సహజ సమతుల్యతను దెబ్బతీస్తాయి. ఊబకాయం, కేన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయి. ప్రాసెస్ చేయని ఆహారాలను గుర్తించి వదిలిపెట్టాలి. చక్కెర, అనారోగ్య కొవ్వులు అధికంగా ఉన్నవి తగ్గించాలి. పండ్లు, కూరగాయలు, లీన్ ప్రోటీన్లు ఆరోగ్యకరమైన కొవ్వులను భోజనంలో చేర్చాలి. రెగ్యులర్ వైద్య పరీక్షల ద్వారా వ్యాధి తీవ్రంగా మారకముందే గుర్తించవచ్చు. తద్వారా జీవనశైలి ఆరోగ్య విధానాలపై సరైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు. – డా.సమత తుల్ల, జనరల్ ఫిజిషియన్నవ్వు నలభై విధాల రైటు.. బాహ్యంగా మనం కోరుకున్నది దక్కినప్పుడు సంతోషం వస్తుంది. అయితే ఎప్పుడూ మనం కోరుకున్నది దక్కుతుందని గ్యారెంటీ లేదు కాబట్టి ఆ మార్గంలో దీర్ఘకాల సంతోషానికి గ్యారెంటీ లేదు. మరో మార్గం మన అంతర్గతంగా పొందేది. పాడటం, నృత్యం చేయడం, ఆడుకోవడం, నవ్వుకోవడం వంటి వాటి వల్ల మనకు అంతర్గత ఆనందం వస్తుంది. దీని ద్వారా సెరటోనిన్, ఆక్సిటోసిన్ వంటి కొన్ని రకాల హ్యాపీ కెమికల్స్ ఉత్పత్తి జరుగుతుంది. పరిస్థితులు సంతోషం కలిగించకపోయినా నవ్వడం ద్వారా మూడ్ని మార్చుకోవచ్చు. ఇక్కడ నవ్వును మనం ఒక వ్యాయామంలా భావించాలి. మరికొందరితో కలిసినప్పుడు సులభంగా నవ్వడం సాధ్యం. సహజంగా పుట్టే నవ్వు వల్ల కలిగే లాభాలకు, నవ్వాలని కోరుకుని నవ్వడం ద్వారా వచ్చే ఆరోగ్య ఫలితాలకు మధ్య ఎటువంటి వ్యత్యాసం లేదని శాస్త్రీయంగా నిర్ధారణ అయింది. ఈ నేపథ్యంలోనే మా లాఫ్టర్ యోగా.. ద్వారా వేల సంఖ్యలో సభ్యులు హాయిగా ఆనందంగా నవ్వుతున్నారు. – డాక్టర్ మదన్ కటారియా, లాఫ్టర్ యోగా విశ్వవిద్యాలయం వ్యవస్థాపకుడు సంతోషం సహజ లక్షణం.. సంతోషం అనేది మన సహజ లక్షణం స్వాభావికం. కానీ రకరకాల ప్రభావాలతో దాన్ని మనం పోగొట్టుకుంటున్నాం. పసిపిల్లాడు.. 400సార్లు నవ్వుతాడు. కాస్త పెద్దయి రెండేళ్ల వయసుచ్చేసరికి 200 సార్లు నవ్వుతాడు. 16ఏళ్లు వచ్చేసరికి 16 సార్లే నవ్వుతాడని అధ్యయనాలు చెబుతున్నాయి. సంతోషం ప్రాణశక్తితో లింక్ అయి ఉంది. పిల్లల్లో ప్రాణశక్తి హైలెవల్లో ఉంటుంది. మన శ్వాస, భావోద్వేగాలకు సంబంధం ఉంది. మనం సంతోషంగా ఉంటే ఒక రకంగా శ్వాసిస్తాం. ఆగ్రహంగా ఉన్నప్పుడు మరో రకంగా శ్వాసిస్తాం. వీటి మధ్య వ్యత్యాసం పసిగడితే కోపం వల్ల కలిగే నష్టం అర్థమవుతుంది. అలాగే రేపేం జరుగుతుందో అనే ఆందోళనతో కాదు. ప్రస్తుతంతో ముడిపడి ఉన్నప్పుడు మాత్రమే సంతోషంగా ఉండగలం. దీనికి సుదర్శన క్రియ బాగా దోహదం చేస్తుంది. విజయం కోసం మనం సంతోషాన్ని పణంగా పెడుతున్నాం. కానీ చెదరని చిరునవ్వుతో ఉండటమే నిజమైన విజయం. ఇలా జరిగితే హ్యాపీగా ఉంటాను, అలా జరిగితే హ్యాపీగా ఉంటాను అనే ఆలోచనలతో ఉండొద్దు. చిన్నారులు ఎందుకు సంతోషంగా ఉంటారు? వారికి సంతోషంగా ఉండడానికి కారణాలు అక్కర్లేదు కాబట్టి.. మన మనసు జరిగినదో, జరగబోయేదో.. దాని గురించే ఆలోచిస్తుంది. ప్రాణాయామ, సుదర్శన క్రియలతో సంతోషాన్ని పెంచుకోవడం వీలవుతుంది. – పండిట్ రవిశంకర్, ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులుఆనందం.. ఆక్సిజన్.. ఆనందం అనేది పూర్తిగా వ్యక్తిగత విషయం. కాబట్టి ఎవరైనా సరే తమ సొంత జీవితాన్ని పరిశీలించి, ‘నా ఆనందం ఏమిటి, నా ఉద్దేశ్యం ఏమిటి, సామాజిక సేవ పట్ల నా ఆలోచన ఏమిటి? విశ్లేషించుకుని తన సొంత ఆనందాన్ని నిర్వచించుకోవాలి. మనం పని, డబ్బు సంపాదించే విధానం శారీరక మానసిక ఆరోగ్యం వీటి గురించే ఆలోచిస్తాం. అయితే మనం సంతోషంగా ఉన్నప్పుడు, మనం పనిలో మరింత మెరుగవుతామని ఉత్పాదకత పెంచగలుగుతామని సృజనాత్మకంగా ఉంటామని అధ్యయనాలు చెబుతున్నాయి. కాబట్టి అన్నింటికన్నా ముందు సంతోషంగా ఉండాలని నిర్ణయించుకోవాలి. ఒత్తిడి అనేది మన మొదటి సైలెంట్ కిల్లర్, సంతోషంగా ఉన్నప్పుడు ఒత్తిడి తగ్గుతుంది. ఒత్తిడి తక్కువగా ఉంటే ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. మనం సంతోషంగా ఉన్నప్పుడు, మంచి మూడ్లో ఉంటాం. ఇతరుల మాటలను వింటూ వారిని గౌరవిస్తాం. మంచి సంబంధాలు పెంచుకుంటాం. సంతోషంగా ఉన్నప్పుడు, పని మెరుగ్గా ఉంటుంది. సంబంధాలు మెరుగ్గా ఉంటాయి. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుందని అర్థం చేసుకోవాలి. – రాజేష్.కె.పిల్లానియా, ఇండియాస్ హ్యాపీనెస్ ప్రొఫెసర్ -
వెరైటీ డ్రెస్సింగ్తో సిద్ధమవుతున్న సిటీ యూత్
ప్రస్తుతం నగరంలో పార్టీ టైమ్ నడుస్తోంది. ప్రీ న్యూఇయర్ బాష్ నుంచి ఆఫ్టర్ నైట్స్ దాకా కొత్త సంవత్సరం వేడుకలు చలిగాలులు కమ్మిన నగరాన్ని సైతం హీటెక్కిస్తోంది. పారీ్టస్కి అటెండ్ అవడం ఒకెత్తయితే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా నిలవడం మరొకెత్తు. ఈ నేపథ్యంలో పలువురు డిజైనర్ల నుంచి సేకరించిన సూచనల సమాహారం ఇది.. పార్టీని బట్టి డ్రెస్సింగ్ ఎంచుకోవడం ఎప్పటి నుంచో నగరంలో కొనసాగుతున్న ట్రెండ్. అయితే ఇది కేవలం ఫ్యామిలీ గెట్ టు గెదర్ లాంటిదైతే.. ఒక రకంగా, ఉర్రూతలూగించే సందడితో ఉంటే.. మరో రకంగా ఆహార్యాన్ని తీర్చిదిద్దుకోండి అంటూ సూచిస్తున్నారు నగరంలోని ప్రముఖ డిజైనర్లు. వీరు అందిస్తున్న మరికొన్ని సూచనలు... ⇒ డ్రెస్సింగ్లో స్టైల్స్ ఎలా ఉన్నా విభిన్న రకాల యాక్సెసరీస్కు ప్రాధాన్యత ఇవ్వాలి. చంకీ బెల్ట్సŠ, ఫంకీ గాగుల్స్.. ఇలా నైట్ పారీ్టకి మరీ ముఖ్యంగా న్యూ ఇయర్ పార్టీకి నప్పేలా ఏదైనా ట్రై చేయవచ్చు. ⇒ మహిళలు ఈవెనింగ్ గౌన్స్ను ట్రై చేయవచ్చు. విభిన్న రకాల ఫ్యాన్సీ జ్యువెలరీకి చోటు ఇస్తే బాగుంటుంది. ⇒రకరకాల హెయిర్స్టైల్స్తో ప్రయోగాలు చేయడానికి ఇది సరైన సమయం. ముఖ్యంగా డ్రెస్సింగ్ సింపుల్గా సరిపెడితే.. ఇది మరింత అవసరం. అమ్మాయిలకు.. షార్ట్ స్కర్ట్స్, షార్ట్స్, వన్ పీస్ డ్రెస్లు బాగా పోష్ లుక్ ఇస్తాయి. టీనేజర్లకు వన్పీస్ డ్రెస్ బాగుంటుంది. ఫ్లోరల్ ప్రింట్లో వన్పీస్ డ్రెస్లు పర్ఫెక్ట్ పార్టీ కాస్ట్యూమ్గా పేర్కొనవచ్చు. ట్యాంక్ టాప్స్, ట్యూబ్ టాప్స్ మంచి లుక్కునిస్తాయి. పొరపాటున కేప్రీస్ వేసుకుంటే ఓల్డ్ఫ్యాషన్ అయిపోతుంది జాగ్రత్త. వన్ పీస్ విత్ ట్యూబ్ టాప్ సరికొత్తగా న్యూ లుక్తో బాగుంటుంది. చలిగాలికి రక్షణగా ఉలెన్ స్కార్ఫ్స్ బెటర్. లైట్ కలర్ టీ షర్ట్కు డార్క్ కలర్ టీ షర్ట్కు లైట్కలర్ స్కార్ఫ్ ఎంచుకోవాలి.యువకులకు.. షార్ట్స్ వేసుకోవచ్చు. లుంగీ స్టైల్లో వేసుకునే డ్రెస్ కూడా ఫంకీగా ఉండి బావుంటుంది. బ్లాక్, బ్రౌన్ టీషర్ట్తో క్యాజువల్ బ్లేజర్. రెడ్, పింక్ కలర్స్ ప్రస్తుతం లేటెస్ట్ ఫ్యాషన్. యువకులు ఇప్పుడు డ్రెస్సింగ్లో షేడ్స్ ఎంచుకునేటప్పుడు గోల్డ్ కలర్ కూడా బాగా వినియోగిస్తున్నారు. వైట్ కలర్ టీషర్ట్, రెడ్కలర్ జీన్స్, బ్రౌన్ కలర్ క్యాజువల్ బ్లేజర్/ఎల్లో కలర్ బ్లేజర్ కాంబినేషన్తో వావ్ అనిపిస్తారు. జాగ్రత్తలు మరవొద్దు.. ⇒ తప్పనిసరై దూరంగా ఉన్న వేడుకకు వెళ్లవలసి వస్తే.. కుటుంబ సమేతంగా, వీలైతే మరికొన్ని ఫ్యామిలీస్తో కలిసి వెళ్లడం మంచిది. ⇒పార్టీ ముగిసిన తర్వాత తిరిగి వచ్చే సమయాన్ని కూడా ముందుగానే నిర్ణయించుకుని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ⇒కొన్ని ఈవెంట్స్ నిర్వాహకులు రాత్రి పూట బస మరుసటి రోజు బ్రంచ్ కూడా కలిపి ప్యాకేజీలు అందిస్తున్నారు. వీలైతే అటువంటిది ఎంచుకోవడం మంచిది. ⇒కొందరు పికప్తో పాటు తిరిగి వెళ్లేటప్పుడు డ్రాప్ చేసేందుకు కూడా వాహన సౌకర్యం కూడా అందిస్తున్నారు. గమనించండి. అటు సంప్రదాయం.. ఇటు ఆధునికం.. ఓ వైపు సంప్రదాయాన్ని, మరోవైపు ఆధునిక పోకడల్ని మేళివింపుతో పారీ్టలకు హాజరవుతూనే హుందగా కనిపించాలని ఆశించే నగర మహిళలూ ఎక్కువే. పార్టీ సీజన్ పురస్కరించుకుని హామ్స్టెక్ ఫ్యాషన్ డిజైనింగ్ ఇన్స్టిట్యూట్ ఫ్యాక్టరీలు అందిస్తున్న సూచనలివే.. ⇒కలంకారీ ప్రింటెడ్ ఫ్యాబ్రిక్ని ఎంచుకోవచ్చు. పొడవాటి గౌన్కి సిల్క్ దుపట్టా జత చేయడం వల్ల లగ్జరీ లుక్ వస్తుంది. మోడ్రన్, క్లాసిక్ లుక్ని మేళవించిన ఈ అవుట్ ఫిట్ నప్పుతుంది. ⇒ఎంబ్రాయిడరీ అనేది ఒక ఆర్ట్. సరైన పద్ధతిలో రూపొందిన ఎంబ్రాయిడరీ నెట్ లెహెంగా.. ఆకర్షణీయంగా ఒదిగిపోతుంది. ⇒హ్యాండ్ ఎంబ్రాయిడరీతో ప్రత్యేకంగా రూపొందిన చీర భారతీయ వస్త్ర విశిష్టతకు అద్దం పడుతుంది. ⇒ఫార్మల్ కుర్తా సెట్స్, పార్టీ ఎతి్నక్ వేర్ కలిసిన కో–ఆర్డ్ సెట్స్ ధరించిన వారి ఫ్యాషన్ను అప్గ్రేడ్ చేస్తాయి. ఇవి సాయంత్రపు సందడికి, రోజువారీ యాక్టివిటీస్కీ అతికినట్టు సరిపోతాయి. ⇒ సంప్రదాయ బెనారస్ చీరల నుంచి మారి స్టైలిష్ రఫెల్ శారీస్ను ఎతి్నక్ వేర్కు జత చేయవచ్చు. వీటి ఎతి్నక్ శైలి, ఫ్రిల్డ్ బోర్డర్స్.. ప్రతి మహిళనీ అందంగా స్టైలిష్ గా చూపించగలవు.ట్రెండీ వేర్.. టేక్ కేర్.. ⇒ న్యూ ఇయర్ వేదికలకు వెళ్లేటప్పుడు.. ధరించిన దుస్తులను ఫ్యాషన్ స్టేట్మెంట్స్గా ఉంటూనే.. సౌకర్యంగానూ ఉండేలా జాగ్రత్తపడాలి. లేనిపక్షంలో ఇబ్బందులు తప్పవు ⇒షిఫాన్, సిల్క్, సీత్రూ తరహాలో గ్లామరస్ వస్త్రధారణకు ప్రాధాన్యం ఇచ్చినప్పుడు.. వీలున్నంత వరకూ సమూహాలతోనే పార్టీలకు హాజరవడం బెటర్. అలాంటి సందర్భాల్లో ఊరికి దూరంగా ఉన్న రిసార్ట్స్, క్లబ్స్ను కాకుండా కాస్త దగ్గరగా ఉన్నవే ఎంచుకోండి. ⇒అవుట్ డోర్ ఈవెంట్లకు హాజరయే సందర్భంగా రద్దీ ఎక్కువ ఉండే అవకాశం ఉంది కాబట్టి.. అందుకు తగ్గట్టుగా డ్రెస్ ఎంచుకోవాలి. ⇒ డ్రెస్సింగ్ ఎంపికలో చలి వాతావరణాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. పారీ్టలో పాల్గొని నృత్యాలు చేయడం, డ్రింక్స్ తీసుకోవడం జరిగితే అవే దుస్తులు అసౌకర్యంగా అనిపించవచ్చు కాబట్టి లేయర్స్గా దుస్తుల్ని ధరిస్తే మరింత మంచిది. వెరైటీ డ్రెస్సింగ్తో సిద్ధమవుతున్న సిటీ యూత్ ⇒కొత్త సందడి వేళ కొత్తగా కనిపించేందుకు ఆసక్తి ⇒జోష్ ఫుల్ ఈవెంట్స్లో యాక్సెసరీస్దే హవా ⇒చలిలో హీటెక్కిస్తున్న న్యూ ఇయర్ ప్రిపరేషన్స్ ⇒ స్టైలిష్ లుక్కి అ‘డ్రెస్’గా నిలిచేందుకు డిజైనర్ టిప్స్ -
కొంచెం ఇష్టం.. కొంచెం కష్టం..
స్క్రీన్ టైమింగ్ తగ్గాలి..చిన్న పిల్లల నుంచి పెద్ద వారి దాకా ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకూ మొబైల్ ఫోన్ లేనిదే గడవట్లేదు. కొత్త సంవత్సరంలో అయినా స్క్రీన్ టైమింగ్ తగ్గించుకోవాలని నిర్ణయించుకుంటే మంచిది. కళ్లతో పాటు, మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. ఈ నేపథ్యంలో స్క్రీన్ టైమింగ్ కాస్త తగ్గించుకుని ఆరోగ్యం కాపాడుకోవాలి.సైబర్ వలలో పడకుండా..సైబర్ నేరాలకు అంతులేకుండా పోతోంది. ఏ అవకాశం దొరికినా అందిపుచ్చుకునేందుకు సైబర్ నేరస్తులు ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో సైబర్ వలలో పడకుండా అప్రమత్తంగా ఉండేలా చూసుకోవాలి. సోషల్ మీడియాలో బ్యాంకు వివరాల గోప్యత పాటించడం, కొన్ని జాగ్రత్తలు వహించడం మనకే మంచిది.పొదుపు మంత్రం..ఆర్థిక వ్యవహారాల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించడం నేర్చుకుంటే మంచిది. ఇప్పుడు చేసే పొదుపే రేపు వచ్చే ఇబ్బందుల నుంచి బయటపడేస్తుందనే విషయాన్ని మర్చిపోకూడదు. దుబారా ఖర్చులు తగ్గించుకొని జాగ్రత్తగా ఖర్చు చేస్తూ పొదుపు మంత్రం పాటిస్తే ఎలాంటి ఒడిదుడుకులైనా ఎదుర్కొనే శక్తి మనకు ఉంటుంది. సంపాదనలో కొంత ఇన్సూరెన్స్లోనో, మ్యూచువల్ ఫండ్స్లోనో దాచుకోవడం మంచిది.డ్రగ్స్కు దూరం..ప్రస్తుతం డ్రగ్స్ వంటి మాదకద్రవ్యాలు, మత్తు పదార్థాలు సమాజానికి చీడపురుగులా తయారయ్యాయి. డ్రగ్స్ రహిత సమాజం కోసం మన వంతు కృషి చేద్దాం. డ్రగ్స్ తీసుకోవడమే కాదు.. దానికి బానిసైన వారిని దూరంగా ఉంచేందుకు ప్రయతి్నద్దాం. దీనిపై పోలీసులకు సహకరిద్దాం.పరులకు సహాయం.. పరులకు సాయం చేస్తే మనకు తిరిగి ప్రకృతి సహాయం చేస్తుంది. అందుకే ఉన్నదాంట్లో తోచినంత పరులకు, అవసరం ఉన్న వారికి సహాయం చేయాలనే ఆలోచన చేస్తే మంచిది. మీ టు డూ లిస్ట్ లో ఇది చేర్చుకోవడం మర్చిపోవద్దు. తద్వారా ఎదో ఒక రోజు మనం ఊహించని రీతిలో తిరిగి సహాయం అందుతుందని మర్చిపోవద్దు.హెల్త్ ఈజ్ వెల్త్..ఎంత సంపాదించినా సరైన ఆరోగ్యం లేకపోతే ఉపయోగం ఉండదు. ఉద్యోగం, సంపాదన వేటలో పడి ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయడం సరికాదు. సో ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ప్రతిరోజూ గంట సమయం కేటాయించడం ఎంతో ముఖ్యం. ఉదయం లేవగానే కొద్దిసేపు వ్యాయామం, చిన్నపాటి బరువులు ఎత్తడం, నడక వంటివి ఎంత ముఖ్యమో.. సరైన ఆహారం తీసుకోవడమూ అంతే ముఖ్యం.ప్రస్తుతం తరుణంలో ఉరుకుల, పరుగుల జీవన విధానంలో మనలో చాలా మందికి సామాజిక స్పృహ లేకుండా పోతోందని విశ్లేషకులు చెబుతున్న మాట..! ఇటీవల రోడ్ రేజ్ పెద్ద ఇబ్బందిగా పరిణమించింది. కనీసం ఓపిక లేకుండా ప్రజలు వ్యవహరిస్తున్నారు. రోడ్డుపై వెళ్తుండగా ఎవరితో అయిన ఘర్షణ జరిగితే కాస్త సంయమనం పాటించి.. చిన్న చిరునవ్వు చిందిస్తే ఎలాంటి సమస్యకూ తావులేకుండా ఉంటుంది. లేదంటే గొడవలు, ముష్టి యుద్ధాలకు దారితీసి తీవ్ర పరిణామాలకు దారి తీసే ప్రమాదం ఉందని గ్రహించాలి. మానసిక ఆరోగ్యంపై శ్రద్ధ.. ఒత్తిడి ప్రపంచంలో మానసిక ఆరోగ్యం ఎంతో ముఖ్యం. చిన్నవాటికే చిరాకు పడడం.. కోపం తెచ్చుకోవడం.. అసహనం వ్యక్తం చేయడం.. తగ్గించుకోవడం ఎంతో మంచిది. ఇందుకోసం యోగా, మెడిటేషన్ ప్రాక్టీస్ చేయడం ఆరోగ్యకరమైన అలవాటు. మానసిక ఆరోగ్యం బాగుంటేనే కుటుంబం, తద్వారా సమాజం బాగుంటుంది. ఫ్యామిలీ టైం.. ఎంత బిజీగా ఉన్నా కుటుంబంతో కొంత సమయం గడపడం మర్చిపోవద్దు. ఎందుకంటే ఎంత సంపాదించినా అది కుటుంబం కోసమే. ఇంతా చేసి కుటుంబానికి సమయం కేటాయించకపోతే కుటుంబ సభ్యులు మనల్ని మిస్ అవుతారనే విషయాన్ని మర్చిపోకూడదు. ప్రతిరోజు కాకపోయినా.. వారంలో ఒకసారి కలిసి కూర్చుని భోజనం చేయడం ఆరోగ్యకరమైన వాతావరణాన్ని కల్పిస్తుంది. ఒకరి గురించి ఒకరు ఆరా తీసుకునే వీలు కలుగుతుంది. ట్రాఫిక్ రూల్స్ విషయంలో.. ట్రాఫిక్ రూల్స్ పాటించే విషయంలో మిగతా నగరాల పౌరులతో పోల్చుకుంటే మనం వెనుకబడ్డట్టే. రూల్స్ పాటించడం వల్ల ప్రమాదాల నివారణకు దోహదం చేయవచ్చు. దీనిని మన వంతు బాధ్యతగా పాటించాలని ఇప్పటి నుంచే నిర్ణయం తీసుకుందాం.. మనలో ఈ చిన్న మార్పు 10 మందికి స్ఫూర్తిగా నిలిచి, సమాజాభివృద్ధికి దోహదం చేస్తుంది. టైం సెన్స్ ముఖ్యం.. మనం చిన్నప్పటి నుంచీ వినే మాట సమయపాలన. అయినా.. ఎన్నోసార్లు ఈ విషయాన్ని పట్టించుకోకుండా ఉంటాం. ఒక్క సెకండ్తో ఎన్నో మార్పులు జరగవచ్చు. ఒక్క నిమిషం వల్ల ఎన్నో ప్రమాదాల నుంచి బయటపడవచ్చు. సమయం పోతే తిరిగి రాదు.. అనే విషయాన్ని గుర్తిస్తే మంచిది. ఒలింపిక్స్లో ఎన్నో పతకాలు చేజారిపోయేదా ఆ సెకను తేడాతోనే అనే విషయం గ్రహించాలి. సమయం అనేది ఒక్కో వ్యక్తికి ఒక్కోలా ఉండదు.. ప్రతి ఒక్కరికీ ఒకే విధంగా ఉంటుంది. అందుకే విధిగా సమయపాలన పాటించడం అనేది వచ్చే ఏడాది మన డైరీలో భాగం కావాలి. అదే మనల్ని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్తుంది. ఆల్ ది వెరీ బెస్ట్. -
లీలా వినోదం..
ఎప్పటిలానే మన గ్లామర్ సిటీ నూతన సంవత్సరాన్ని ఘనంగా ఆహ్వానించడానికి సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో నగరంలో నిర్వహించనున్న ఇయర్ ఎండ్ వేడుకలకు వేదికలు రెడీ అయ్యాయి. ఇందులో లైవ్ మ్యూజిక్ సెటప్లు, సెలిబ్రిటీ గెస్టులు వంటి ఇతర వినోద కార్యక్రమాలకు సన్నాహాలు మొదలయ్యాయి. నగర యువత ఈ వేడుకలను ఎక్కడెక్కడ చేసుకోవాలో ఇప్పటి నుంచే ప్లాన్లు చేసుకోవడం మొదలుపెట్టేశారు. ఇప్పటికే పలువురు బుక్ మై షోలో పాస్లు రిజిష్టర్ చేసేసుకున్నారు. వీరి ఆసక్తి, ఆదరణను దృష్టిలో ఉంచుకుని ఇప్పటికే నిర్వాహకులు సైతం తమ ప్రణాళికలను సిద్ధం చేశారు. ఈ నేపథ్యంలో దీని గురించిన మరిన్ని విశేషాలు.. ఇప్పటికే నగరంలో నూతన సంవత్సరానికి స్వాగతం పలికేందుకు, ప్రస్తుత సంవత్సరానికి వీడ్కోలు పలికేందుకు యువత సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా కొన్ని థీమ్స్ను సైతం సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేస్తున్నారు పలువురు ఈవెంట్ ఆర్గనైజర్లు. ముఖ్యంగా సినీ తారలు, ప్రముఖ సింగర్స్, డ్యాన్సర్స్.. ఎవరు ఎక్కడ హాజరవుతున్నారనే సమాచారాన్ని సామాజిక మాధ్యమాల వేదికగా జోరుగా ప్రచారం జరుగుతోంది. ప్రత్యేకించి ఢిల్లీ, ముంబయి తదితర ప్రాంతాల నుంచి నగరానికి చేరుకున్న డీజే స్పెషలిస్టులు, లైవ్ మ్యూజిక్ స్పెషలిస్టులు వారి ప్రోమోలను వదులుతున్నారు. తెలుగు, ఇంగ్లీష్, హిందీ భాషలో లైవ్ బ్యాండ్లు ఏర్పాటు చేస్తున్నారు. అయితే.. ఈ ఈవెంట్లకు బుకింగ్స్ ప్రారంభం కావడమే కాదు కొన్నింటికి ఇప్పటికే సోల్డ్ ఔట్ బోర్డులు పెట్టడం విశేషం. స్టార్ గ్లామర్ ఈవెంట్స్.. వేడుకలు ఏవైనా సరే... అందులో గ్లామర్ ఉంటేనే వినోదమైనా, ఉల్లాసమైనా. ఈ నేపథ్యంలో ఇయర్ ఎండ్ వేడుకల నిర్వహణలో సెలిబ్రిటీలను భాగం చేస్తున్నారు నిర్వాహకులు. సాధారణంగా ఇటువంటి ఈవెంట్స్లో సినీతారలకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇందులో భాగంగానే నగరంలో పలు వేదికల్లో గ్రాండ్గా నిర్వహించే లైవ్మ్యూజిక్ కాన్సర్ట్లు, పబ్, రిసార్ట్, ఓపెన్ ఏరియా ఈవెంట్లలో పలువురు సినీతారలు, సింగర్లు తళుక్కున మెరవనున్నారు. ముఖ్యంగా ఈ ఏడాది న్యూ ఇయర్ సెలబ్రేషన్స్లో ప్రముఖ నటి శ్రీలీల, గాయకులు సునీత, రాకింగ్ సింగర్ రామ్ మిరియాల, తదితర టాలీవుడ్, బాలీవుడ్ సింగర్స్ నగరంలో ప్రేక్షకులకు తమ గాత్రంతో అలరించనున్నారు. డీజేల సందడి.. నూతన సంవత్సర వేడుకలకు సినిమా గ్లామర్ తోడైతే ఆ కిక్కేవేరబ్బా అంటోంది నగర యువత. తమకు నచి్చన భాష, హీరోల సినిమా పాటలు ఎక్కడ అందుబాటులో ఉన్నాయి అంటూ సామాజిక మాధ్యమాల్లో శోధిస్తున్నారు. తెలుగు లైవ్ కాన్సర్ట్స్కు ఎక్కువ మంది మొగ్గుచూపుతుండగా, ఉత్తర భారతం నుంచి వచ్చి ఇక్కడ నివాసం ఉంటున్నవారు మాత్రం హిందీ, ఇంగ్లి‹Ùకార్యక్రమాలను కోరుకుంటున్నారు. దీంతో ఈవెంట్ నిర్వాహకులు సైతం అందుకు అనుగుణంగానే కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ.. జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దీంతో నిపుణులైన డీజే ఆర్టిస్టులకు డిమాండ్ నెలకొంది. సాయంత్రం 8 గంటల నుంచి కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయని నిర్వాహకులు ప్రచారం చేస్తున్నారు.‘నై’ వేడుకల్లో శ్రీలీల... సాక్షి, సిటీబ్యూరో: నగరంలో నిర్వహించనున్న ఇయర్ ఎండ్ వేడుకలకు అప్పుడే గ్లామర్ వచ్చేసింది. ఆల్వేస్ ఈవెంట్స్, ఎస్వీ ప్రొడక్షన్స్ ఆధ్వర్యంలో ఈ నెల 31న నగరంలోని నోవోటెల్ వేదికగా నిర్వహించనున్న నై (ఎన్వైఈ) 2025 వేడుకల్లో టాలీవుడ్ గ్లామర్ క్వీన్ శ్రీలీల తన స్టెప్పులతో అలరించనున్నారు. ఈ ఈవెంట్ పోస్టర్ను శుక్రవారం నోవాటెల్ వేదికగా ఆవిష్కరించారు. ఇందులో ప్రముఖ యాంకర్ రవి, నటి సౌమ్య జాను పాల్గొని సందడి చేశారు. నిర్వాహకులు సుమంత్ మాట్లాడుతూ.. బాలీవుడ్ లైవ్ మ్యూజిక్, కలర్ఫుల్ వేదికతో పాటు టాప్ మోడల్స్తో నిర్వహిస్తున్న ఫ్యాషన్ షోతో నై (ఎన్వైఈ) 2025 వేదిక కానుందన్నారు. నిరావల్ లైవ్ బ్యాండ్ నగరానికి ప్రత్యేకంగా రానుందని, వేడుకల్లో ప్రముఖ సినీతార శ్రీలీల పాల్గొని అలరించనున్నారని తెలిపారు. ప్రత్యేకమైన ఎస్ఎఫ్ఎక్స్ ప్రదర్శనలతో, న్యూ ఇయర్ కౌంట్ డౌన్తో పాటు విభిన్న రుచుల ఆహారం, ప్రీమియం డ్రింక్స్, టాటూ, ఫొటో బూత్లు అందుబాటులో ఉంటాయని సహ నిర్వాహకులు వినోద్ పేర్కొన్నారు. అంతేకాకుండా పలువురు సెలిబ్రిటీలు ఇందులో భాగం కానున్నారని అన్నారు. నగరంలో పలు కార్యక్రమాలు..⇒ హెచ్ఐసీసీ నోవోటెల్లో నూతన సంవత్సర వేడుకలకు ప్రముఖ సినీ నటి శ్రీలీల హాజరుకానున్నారు. లైవ్ బ్యాండ్, డ్యాన్స్, బాలీవుడ్ డీజే, మ్యాజిక్షో, కిడ్స్ జోన్, ఫ్యాషన్ షో, తదితర కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నట్లు నిర్వాహకులు చెబుతున్నారు. ‘న్యూ ఇయర్ ఈవ్’ పేరిట రాత్రి 8 గంటల నుంచి కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. ఇంగ్లిష్, తెలుగు, హిందీ పాటలు ఉంటాయి. ⇒ ప్రిజమ్ క్లబ్ అండ్ కిచెన్లో రామ్ మిరియాల బ్యాండ్ అమృతం ‘ది ప్రిజమ్ సర్కస్ 4.0’ కార్యక్రమన్ని ఏర్పాటు చేస్తున్నారు. ⇒ ఎల్బి నగర్ ఇండోర్ స్టేడియంలో యూబీ ఎంటర్టైన్మెంట్స్ బ్యాండ్ కాప్రిసియోని ప్రత్యక్షంగా ప్రదర్శిస్తుంది. సంగీతం, ఎనర్జీ, ఉత్సాహంతో కూడిన విద్యుత్ వెలుగుల్లో నూతన సంవత్సరాన్ని స్వాగతించడానికి సిద్ధంగా ఉండండి. చార్ట్–టాపింగ్ హిట్లు, హై–ఎనర్జీ పెర్ఫార్మెన్స్ల మిక్సింగ్ ఉంటుందని నిర్వాహకులు చెబుతున్నారు. ⇒ బోల్డర్ హిల్స్లోని ప్రిజమ్ ఔట్ డోర్స్లో ప్రముఖ సింగర్స్ కార్తీక్, సునీత హాజరవుతున్నారు. ⇒ హైటెక్స్ ఎరీనాలో హైదరాబాద్ బిగ్గెస్ట్ న్యూ ఇయర్ బాష్ 2025 (ఓపెన్ ఎయిర్) కార్యక్రమానికి నేహ ఆర్ గుప్తా ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు. -
యువ 'కలం'..! ట్రెండ్ సెట్టర్స్గా యంగ్ రైటర్స్
రచన, సాహిత్యాన్ని అభిరుచిగా మలుచుకుంటే చాలు.. మన భవిష్యత్ ప్రయాణ మార్గాన్ని, అత్యుత్తమ లక్ష్యాలకు అదే చేర్చుతుందని ప్రముఖ సాహిత్యకారులు చెప్పే మాట. ఆనాటి తరం యువ రచయితలకు సాహిత్యాభిలాష ఎంత వరకూ తోడ్పాటునందించిందో అటుంచితే.. ఈ తరం యువ రచయితలకు మాత్రం గౌరవ ప్రస్తానాన్ని ప్రసాదిస్తోంది. ఈ తరం యువత సాహిత్యంలో విశేషంగా రాణించడమే దీనికి నిదర్శనం. అధునాతన పంథాతో, వినూత్న ఆలోచనలతో, సామాజిక అంశాలను ప్రస్తుత భాషా అనుకరణ పరిమితుల్లో రచిస్తూ.. తమ ప్రత్యేకతను చాటుకుంటున్నారు. యువ రచనలకు ఈ దశాబ్ద కాలాన్ని స్వర్ణయుగంగా చెప్పుకోవచ్చు. ప్రతి ఏడాదీ యువ రచయితల కొత్త పుస్తకాలు, నవలలు, కథానికలు, కవిత్వ సంపుటిలు విరివిగా ప్రచురితమవుతున్నాయి. ఇందులోనూ వినూతనత్వం ఏంటంటే.. ఈ అభిరుచి ఉన్న యువ ఔత్సాహికులకు అటు సినిమా రంగంలో, ఇటు కంటెంట్ డెవలప్మెంట్ వేదికల్లో ప్రధాన్యత పెరగడం. ఈ సందర్భంగా వీరంతా సోషల్ సెలబ్రెటీలుగా మారుతున్నారు. హైదరాబాద్ నగరం వేదికగా కొనసాగుతున్న నేషనల్ బుక్ ఫెయిర్(National Book Fair) నేపథ్యంలో అటువంటి యువ సాహిత్య కారులను ‘సాక్షి’ ప్రత్యేకంగా పలకరించింది. వారి అభిప్రాయాలు వారి మాటల్లోనే తెలుసుకుందాం. ప్రశ్నించే గొంతుకగా ఉండాలని..ర చన, సాహిత్యం అనేది నా ఆలోచనలను ప్రతిబింబించే సామాజిక వేదికలుగా భావిస్తాను. రాసే కథ అయినా, నవల అయినా సమాజహితమై, అసమానతలను ప్రశ్నించే గొంతుకగా ఉండాలని భావిస్తాను. అందులో భాగంగానే ఎర్రమల్లెలు అనే పుస్తకం రాశాను. మ్యారిటల్ రేప్ల పై ఈ రచన రాశాను. సాధారణంగా మల్లెలు తెల్లగా ఉంటాయి. కానీ అవి ఎందకు ఎర్రగా మారాయనే నిజజీవిత సామాజిక అంశాన్ని ప్రస్తావించాను. సాధారణంగా పెళ్లి జరిగిన తరువాత అందరి ఆడవారి జీవితాలూ ఒకేలా ఉండవు. ముఖ్యంగా సెక్స్ ఎడ్యుకేషన్పై అవగాహన లేకపోవడం దీనికి కారణం. నా పుస్తకానికి అన్ని వయసుల ఆడవారు, ముఖ్యంగా మగవారి నుంచి స్పందన లభిస్తోంది. నిజ జీవితంలో భార్యల విషయంలో భర్తలు ఎలా ప్రవర్తిస్తున్నారనే అంశంలో చాలా మంది రియలైజ్ అయ్యామని స్పందించడం చాలా సంతోషాన్నిచ్చింది. నేను సినిమాలకు రచనా సహకారం అందిస్తున్నాను. ఆల్ ఇండియా రేడియోలో డ్రామాలు రాస్తున్నాను. భవిష్యత్తులో మరిన్ని కథలు, నవలలు రాయనున్నాను. – రోజా రాణి దాసరి స్క్రీన్ రైటర్ అవ్వాలనే లక్ష్యంతో..మనుషుల్లోని సున్నితమైన భావోద్వేగాలైన ప్రేమ, అనురాగం, అభిమానం, ఆప్యాయత వంటి అంశాల్ని స్పృశిస్తూ రచనలు చేయడం నాకు ఇష్టం. ప్రస్తుతం ఈ ప్రపంచానికి వీటి అవసరం ఎంతో ఉందని నేను భావిస్తున్నాను. ఇందులో భాగంగానే ‘సరిజోడి’ అనే స్వచ్ఛమైన అచ్చ తెలుగులో ఒక నవల రాశాను. సిటీలో కొనసాగుతున్న బుక్ ఫెయిర్లో ఈ పుస్తకానికి మంచి ఆదరణ లభిస్తోంది. ఇది పాకిస్తానీ ముస్లిం అమ్మాయికి, హైదరాబాదీ వ్యాపారవేత్తకి మధ్య జరిగిన హృద్యమైన ప్రేమ కావ్యం. ఇది నా మొదటి నవల. భవిష్యత్తులో స్క్రీన్ రైటర్ అవ్వాలనే లక్ష్యంతో ఉన్నాను. ప్రస్తుతం నగరంలోని ఇఫ్లూ యూనివర్సిటీలో ఫిల్మ్ స్టడీస్ పై పీహెచ్డీ చేస్తున్నాను. ఈ మధ్య కాలంలో యువ రచయితల పుస్తకాలు పెరగడం సంతోషాన్ని ఇవ్వడంతో పాటు, పోటీతత్వాన్ని పెంచుతోంది. ఇందులో బాధ్యతాయుతమైన రచనలు, భాషను, సామాజిక, మానసిక విలువలను స్పృశించే రచనలు కూడా ఉండటం శుభపరిణామం. – దిలీప్. స్నేహితుల సహకారంతో..రచనల పరంగా 2012లో మొదలైన నా ప్రయాణం కేంద్ర యువ సాహిత్య అకాడమీ అవార్డు పొందే వరకూ సాగింది. మొదట్లో ఈ రచనా రంగంలోని స్నేహితుల సహకారంతో మొదటి పుస్తకాన్ని ప్రచురించాను. ఆ తరువాత ఆ కష్టాలను దాటుకుని అస్థిత్వం, కుల వృత్తులను, సామాజిక అంశాలను ప్రతిబింబించే కవిత్యం, కథలు రాశాను. నా రచనలు హిందీ, తమిళం, అస్సామీ, బంగ్లా వంటి భాషలతో పాటు ఫ్రెంచ్, స్పేయిన్ వంటి భాషల్లోకి తర్జుమా చేయడం గొప్ప గౌరవంగా భావిస్తాను. రెండు తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థుల కోసం సిలబస్ చేర్చడం కూడా మరింత సంతృప్తినిచ్చింది. ఈ ప్రయాణంలో వివిధ రాష్ట్రాల్లో దాదాపు 13 లిటరరీ ఫెస్టివల్స్లో వేదిక పంచుకోవడం, ఈ వేదికల పైన జాతీయ, అంతర్జాతీయ సాహిత్యకారులను కలుసుకోవడం, వారి అనుభవాలను ఆలోచనలను పంచుకోవడం నా విజయాలుగా భావిస్తాను. మరి కొద్ది రోజుల్లో ఇంగ్లిష్ కవిత్వం, కవిత్వ అనువాదం, మరో సంపాదకత్వంతో రానున్నాను. – రమేష్ కార్తీక్ మహిళా సాధికారత దిశగా..నా వృత్తి ప్రభుత్వ రంగ సంస్థలో మహిళా సాధికారత కోసం కృషి చేయడం. నా వృత్తిలో ఎదురైన అనుభవాలను ప్రవృత్తి అయినటువంటి రచనల ద్వారా సమాజానికి చేరువ చేస్తున్నాను. మొదటి సామాజిక సమస్యలపై కథలు రాస్తున్నాను. నా మొదటి పుస్తకం ఇసుక అద్దం. ఇది నా ప్రయాణానికి మంచి బాట వేసింది. ఈ మధ్యనే విడుదల చేసిన 2వ కథల పుస్తకం బల్కావ్ కూడా నా సామాజిక బాధ్యతను అక్షరాలుగా, పదాలుగా వివరిస్తుంది. ఒక సామాజిక అంశంపై లోతుగా పరిశోధించాకే, అందులోని నిజాలను నిక్కచ్చిగా చెప్పడానికే నా కలాన్ని వాడతాను. నా రచనలు నాకు సంతృప్తితో పాటు గౌరవాన్ని, గుర్తింపును ఇచ్చాయి. యండమూరి వీరేంద్రనాథ్ ఉగాది పురస్కారంతో పాటు, వాయిస్ ఆఫ్ తెలంగాణ వంటి అవార్డులు సైతం లభించాయి. ముఖ్యంగా 50 ఇన్స్పైరింగ్ ఉమెన్స్లో నాకు అవార్డు రావడం, దీని కోసం ప్రత్యేకంగా ప్రచురించిన పుస్తకంలో నా గురించి ప్రచురించారు. మరికొన్ని అద్భుతమైన కథలతో రానున్నాను. – శ్రీ ఊహ(చదవండి: వామ్మో..! అలాంటి ఉద్యోగాలు కూడా ఉంటాయా..? వింటే వెన్నులో వణుకురావాల్సిందే..!) -
రాష్ట్రపతి నిలయం చూసొద్దాం రండి
దేశ ప్రథమ పౌరుడు/పౌరురాలి దక్షిణాది అధికారిక నివాసం.. నగరంలో బ్రిటిష్ పాలనకు కేంద్రంగా కొనసాగిన రెసిడెన్సీ భవనం.. వీఐపీలు మినహా సామాన్యులకు ఎలా ఉంటుందో తెలిసేది కాదు. ప్రతి సంవత్సరం కేవలం వారం రోజులు మాత్రమే సామాన్యులకు సందర్శనకు అవకాశం ఉండేది.. కానీ ప్రస్తుత రాష్ట్రపతి ఆదేశాలతో బొల్లారంలోని రాష్ట్రపతి నిలయం సామాన్యులకు అందుబాటులోకి వచి్చంది. రాష్ట్రపతికి దక్కే రాజ¿ోగాలు, సుగంధ పరిమళాలు వెదజల్లే పూలతోటలు, వందల ఏళ్ల నాటి మర్రి చెట్లు, ఎండ ఆనవాళ్లు కూడా కానరాని పండ్ల తోటలు, మయూరాల కిలకిలారావాలు.. అలనాటి వ్యవసాయానికి కేంద్ర బిందువులైన మోట, మెట్ల బావులు.. గత రాష్ట్రపతులు వాడిన గుర్రపు బగ్గీ, వింటేజ్ బెంజీ కారు.. ఇలా చెప్పకుంటూ పోతే రాష్ట్రపతి నిలయం విశేషాలు ఎన్నెన్నో.. రాష్ట్రపతి విడిది చేసే ప్రత్యేక గదులు, మీటింగ్ హాల్స్, ప్రత్యేకంగా వంటచేసే కిచెన్, కిచెన్ నుంచి రాష్ట్రపతి ప్రధాన విడిది భవనానికి ఆహారాన్ని తీసుకెళ్లే సొరంగ మార్గం.. వాటితో పాటు ప్రతి శని, ఆదివారాల్లో సాయంత్రం వేళలో సాంస్కృతిక ప్రదర్శనలు సందర్శకులను ఆకట్టుకోనున్నాయి. ముఖ్యంగా విద్యార్థులకు విజ్ఞానంతో పాటు విహార అనుభూతి కల్గుతుంది. రాష్ట్రపతి శీతాకాల విడిది కోసం సామాన్యుల సందర్శనకు తాత్కాలిక బ్రేక్ పడగా, మళ్లీ అనుమతిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి నిలయంపై ప్రత్యేక కథనం.. మూడో అధికారిక నివాసం.. భారత రాష్ట్రపతి అధికారిక నివాసమైన ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్తో పాటు మరో రెండు అధికారిక నివాసాల్లో ఒకటి షిమ్లాలోని ‘ది రిట్రీట్ బిల్డింగ్’ కాగా సికింద్రాబాద్ కంటోన్మెంట్లోని ‘రాష్ట్రపతి నిలయం’ మూడోది. ఈ భవనం నిజాం నజీర్ ఉద్–దౌలా హయాంలో 1860లో నిర్మితమైంది. బొల్లారంలోని 97 ఎకరాల సువిశాల స్థలంలో 2,500 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ప్రధాన భవనం ఉంటుంది. కంటోన్మెంట్ పరిధిలోని చీఫ్ మిలటరీ ఆఫీసర్ నివాస స్థలంగా వినియోగించే ఈ భవనాన్ని రెసిడెన్సీ హౌజ్గా వ్యవహరించేవారు. 1948లో హైదరాబాద్ సంస్థానం విలీనం అనంతరం రాష్ట్రపతి దక్షిణాది తాత్కాలిక నివాసంగా మారింది. ఏడాది పొడవునా అనుమతి గతంలో రాష్ట్రపతి శీతాకాల విడిది అనంతరం రెండు లేదా మూడు వారాల పాటు మాత్రమే సాధారణ పౌరులకు రాష్ట్రపతి నిలయం సందర్శనకు అనుమతి ఉండేది. ప్రస్తుత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హయాంలో నిత్యం ప్రజల సందర్శనకు అవకాశం కల్పించారు. ప్రతిరోజూ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు, వారాంతాల్లో రాత్రి 7 గంటల వరకు సందర్శకులకు అనుమతి ఇస్తున్నారు. గతేడాది మార్చి నుంచి ఇప్పటి వరకు సుమారు 3 లక్షల మంది రాష్ట్రపతి నిలయాన్ని సందర్శించారు. విద్యార్థుల సందర్శనకు ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తున్నారు. ఈ నెల 29 నుంచి రాష్ట్రపతి నిలయంలో ఉద్యాన్ ఉత్సవ్ పేరిట పక్షం రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. 20 గదులు, సొరంగ మార్గం.. రాష్ట్రపతి నిలయంలోని ప్రధాన భవనం ప్రెసిడెంట్స్ వింగ్, ఫ్యామిలీ వింగ్తో పాటు ఏడీసీ వింగ్ పేరిట మూడు విభాగాలుగా ఉంటుంది. ఇందులో డైనింగ్ హాలు, దర్బార్ హాలు, మార్నింగ్ రూమ్, సినిమాల్ సహా మొత్తం 11 గదులుంటాయి. ప్రధాన భవనానికి కొంత దూరంలో ఉండే కిచెన్ ద్వారా ఆహారాన్ని డైనింగ్ హాలుకు తీసుకొచ్చేందుకు ప్రత్యేక సొరంగ మార్గం ఉంది. రాష్ట్రపతి ప్రధాన నివాస భవనంతో పాటు మరో 150 మంది వరకు సిబ్బంది ఉండేందుకు ప్రత్యేక వసతి సముదాయం ఉంది. రకరకాల పూలమొక్కలతో పాటు పండ్ల తోటలు ఉన్నాయి. 116 రకాల సుగంధ, ఔషధ మొక్కలతో కూడిన ప్రత్యేక హెర్బల్ గార్డెన్ ఈ ఆవరణలో ఉంది. మూడు మంచినీటి బావులు కూడా ఉన్నాయి. -
కొత్త ఉత్సాహం..!
కొత్త సంవత్సరం రాబోతోంది.. దీంతో నగర యువత కొత్త ఉత్సాహంతో పార్టీ ఎందుకుండదు పుష్పా.. ఉంటుంది అంటున్నారు. పబ్లు, రిసార్ట్లు, ఫామ్ హౌస్లు.. ఎక్కడైతేనేం న్యూ ఇయర్కు గ్రాండ్ వెల్కమ్ పలికేందుకు యువత, ఐటీ ఉద్యోగులు సిద్ధమైపోయారు. ఈవెంట్ మేనేజర్లు కూడా కొత్త ఏడాదికి వేడుకలను భారీ ఎత్తున ప్లాన్ చేస్తున్నారు. పాపులర్ సింగర్స్, డీజేలు, మ్యూజిక్ డైరెక్టర్లు, సినిమా సెలిబ్రిటీలతో ఈవెంట్లు, విందులు.. వినోదాలు.. సాంస్కృతిక కార్యక్రమాలు వంటి అనేక ఏర్పాట్లతో సెలబ్రేషన్స్ నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో దీనిపైనే ఈ కథనం..ఈసారి డిసెంబర్ 31న ఐటీ నిపుణులు, ఉన్నతోద్యోగులు ఐదారుగురు బృందంగా ఏర్పడి వేడుకలకు ప్లాన్ చేస్తున్నారు. దీంతో పాటు గేటెడ్ కమ్యూనిటీలోని రెండు మూడు ఫ్యామిలీలు కలిసి న్యూ ఇయర్ వేడుకలను సరికొత్తగా ప్లాన్ చేస్తున్నారు. హోటళ్లు, పబ్లు, క్లబ్లు నిర్వహించే పారీ్టల్లో పాల్గొని తిరుగు ప్రయాణంలో పోలీస్ తనిఖీలతో ఇబ్బందులు పడే బదులు.. శివారు ప్రాంతాల్లోని ఫామ్ హౌస్లు, విల్లాలు, వ్యక్తిగత గృహాలను అద్దెకు తీసుకొని పార్టీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. దీంతో డ్రంక్ అండ్ డ్రైవ్ వంటి సమస్యలు అసలే ఉండవనేది వారి వాదన. దీంతో పాటు పార్టీ జోష్ను మరుసటి రోజు సాయంత్రం వరకూ ఎంజాయ్ చేయొచ్చనే యోచనలో ఉన్నారని సమాచారం.ఈ వెంట్స్కి ఫుల్ డిమాండ్.. షామీర్పేట, శంషాబాద్, మెయినాబాద్, మేడ్చల్, కీసర వంటి శివారు ప్రాంతాల్లోని ఫామ్హౌస్, రిసార్టులు ఇప్పటికే బుక్ అయ్యాయి. దీంతో మిగిలిన వ్యక్తిగత గృహాలకు సైతం ఫుల్ డిమాండ్ ఏర్పడింది. ఇక ఈవెంట్స్ కూడా భారీగానే ప్లాన్ చేశారని, ఆయా ప్రాంతాల్లోని డిమాండ్ బట్టి పార్టీ వేడుకలకు ఒక్కో టికెట్ కనీసం రూ.5 వేల నుంచి రూ.15 వేల వరకూ ఉండొచ్చని అంచనా. సాధారణ రోజుల్లో ఫామ్హౌస్, రిసార్ట్లలో రోజుకు ఒక్క గది అద్దె రూ.15 వేల నుంచి రూ.30 వేలు ఉండగా.. న్యూ ఇయర్కు మాత్రం రూ.50 వేలపైనే చెబుతున్నారు.అద్దెకు విల్లాలు, వ్యక్తిగత గృహాలు.. శివరాంపల్లి, శామీర్పేట, భువనగిరి, కొల్లూరు వంటి ఔటర్ రింగ్ రోడ్కు చేరువలో నిర్మితమైన విల్లాలు, వ్యక్తిగత గృహాలను యజమానులు అద్దెకు ఇస్తున్నారు. ఈ తరహా ట్రెండ్ ఎప్పటి నుంచో ఉన్నప్పటికీ.. గతేడాతితో పోలిస్తే 20–30 శాతం అద్దె ఎక్కువగా వసూలు చేస్తున్నారని ఓ కస్టమర్ చెబుతున్నాడు. భారీగా అద్దెలు రావడంతో విల్లాలు, వ్యక్తిగత గృహాల నిర్మాణాలూ భారీగానే ఏర్పాటయ్యాయని, అయినా డిమాండ్ ఎక్కువగా ఉండడంతో రోజుకు అద్దె రూ.5 వేలుగా చెబుతున్నారని పేర్కొన్నారు. అదనపు చార్జీలతో మద్యం, ఫుడ్ ఇతరత్రా వాటిని కూడా ఫామ్హౌస్ నిర్వాహకులు ఏర్పాటు చేస్తున్నారని చెప్పారు. పోలీసు నిబంధనలివే.. పోలీసుల ముందస్తు అనుమతి లేకుండా న్యూ ఇయర్ వేడుకలను చేయకూడదు. వేడుకలకు హాజరయ్యే వారి గుర్తింపు కార్డులు, వివరాలను నమోదు చేయాలి. సీటింగ్ సామర్థ్యానికి మించి టికెట్లను విక్రయించకూడదు. కపుల్స్ కోసం నిర్వహించే పార్టీల్లో మైనర్లను అనుమతించకూడదు. డీజేలు కాకుండా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నిబంధన ప్రకారం 45 డిసెబుల్స్ కంటే తక్కువ సౌండ్స్ ఉన్న పరికరాలును మాత్రమే వినియోగించాలి. ఎంట్రీ, ఎగ్జిట్ ప్రాంతాలతో పాటు ప్రాంగణం ముందు ఉన్న రహదారిలో 50 అడుగుల దూరాన్ని కవర్ చేసేలా సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయాలి. అసభ్యకరమైన దుస్తులతో నృత్య ప్రదర్శనలు నిర్వహించకూడదు. పురుషులతో పాటు మహిళా సెక్యూరిటీ గార్డులను కూడా నియమించాలి. మైనర్లకు లిక్కర్ సరఫరా చేసినా లేదా మాదక ద్రవ్యాలను వినియోగించినా చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటారు.అనుమతులు తప్పనిసరి.. హోటళ్లు, రెస్టారెంట్లు, పబ్లు, ఫామ్హౌస్లు, రిసార్ట్లు, గేటెడ్ కమ్యూనిటీలలో న్యూ ఇయర్ వేడుకలను నిర్వహించే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలని ట్రై కమిషనరేట్ పోలీసు ఉన్నతాధికారులు సూచించారు. లిక్కర్ సరఫరా చేస్తే ఎట్టిపరిస్థితుల్లోనూ ఆబ్కారీ శాఖ అనుమతులు కూడా ఉండాల్సిందేనని, ప్రతి ఒక్కరూ నిబంధనలకు లోబడే ఈవెంటర్స్ నిర్వహించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. -
హార్ట్స్.. రైడింగ్..
గుర్రపు స్వారీ నేర్చుకోవడం అనేది నగరంలో ఒక నయా ట్రెండ్గా మారుతోంది. విద్యార్థి దశ నుంచే గుర్రమెక్కాలని టీనేజర్స్ తహతహలాడుతున్నారు. తల్లిదండ్రులు సైతం పిల్లల అభిరుచి, ఆసక్తులను గమనించి ఆ మేరకు ప్రోత్సహిస్తున్నారు. నగరంలోని కొంత మంది ఆర్థికంగా స్థిరపడిన కుటుంబాలు ఏకంగా గుర్రాన్ని కొనుగోలు చేసుకుని, ప్రత్యేకంగా శిక్షకుడిని నియమించుకుంటున్నారు. పిల్లలకు గుర్రపు స్వారీలో మెళకువలు నేరి్పస్తున్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. మరికొంత మంది మాత్రం శిక్షణా కేంద్రాలను ఆశ్రయిస్తున్నారు. దీంతో నగరంలో గుర్రపు స్వారీ శిక్షణా కేందాల సంఖ్య పెరుగుతోంది. పూర్తి స్థాయి శిక్షణ పొందిన ఇండియన్, బ్రిటిష్ బ్రీడ్ గుర్రాలకు స్థానికంగా గిరాకీ ఏర్పడింది. నగరానికి చెందిన పలువురు ఔత్సాహికులు బెంగళూరు, ఢిల్లీ, జైపూర్, జోథ్పూర్ తదితర ప్రాంతాల నుంచి రూ.లక్షలు వెచి్చంచి గుర్రాలను కొనుగోలు చేసి హైదరాబాద్కు తీసుకొస్తున్నారు. నగర శివారు ప్రాంతాల్లో ఫాం హౌస్లు, ఖాళీ ప్రదేశాల్లో ప్రత్యేకించి ఇసుకతో కూడిన మెత్తని నేలలను శిక్షణా కేంద్రాలుగా తయారు చేస్తున్నారు. శిక్షణ తీసుకునే వారు ప్రమాదవశాత్తూ కిందపడినా దెబ్బలు తగలకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. గుర్రం ఎక్కడం ఎలా, కుడి, ఎడమ ఎటు వైపు తిప్పాలంటే ఎలాంటి సంకేతాలు ఇవ్వాలి, గుర్రాన్ని ఆపడానికి ఏం చేయాలనే విషయాలు శిక్షకులు ముందుగానే పిల్లలకు బోధిస్తున్నారు. ఏడు వేల నుంచి.. హార్స్ రైడింగ్ అనుకున్నంత సులువైనదేమీ కాదు. ఇందుకు చాలా ఏకాగ్రత, దృష్టికేంద్రీకరణ ఉండాలి. ముఖ్యంగా గుర్రంపై కూర్చోవడమే ఓ పెద్ద సవాలుగా ఉంటుంది. కూర్చున్నాక అది ఎటు వెళుతుందనేదీ ముందుగానే పసిగట్టాల, మన దారిలోకి తెచ్చుకోగల నైపుణ్యాన్ని సాధించాలి. చాలా మంది పిల్లలు నెల నుంచి రెండు నెలల్లో అశ్వాన్ని అదుపులోకి తెచ్చుకోగలుగుతున్నారని శిక్షకులు చెబుతున్నారు. కాగా శిక్షణకు గానూ పెద్దవాళ్లకు రూ.10 వేల నుంచి రూ.15 వేలు, పిల్లలకు రూ.7 వేల నుంచి రూ.10 వేల వరకూ ఫీజు తీసుకుంటున్నారు. రిచ్మ్యాన్ గేమ్.. గుర్రపు స్వారీ అనేది రిచ్మ్యాన్ గేమ్. సామాన్యులకు గుర్రం కొనుగోలుచేయడం, పోషించడం, శిక్షణకు అవసరమైన విధంగా తీర్చిదిద్దడం, అనారోగ్య సమస్యలు వచి్చనప్పుడు దాన్ని బాగోగులు.. ఇలా అన్నీ ఖర్చుతో కూడుకున్న పనులే. ఆరోగ్యంగా ఉన్న గుర్రానికి నెలకు కనీసం రూ.25 వేలు, ఆపైనే వెచి్చంచాల్సి ఉంటుంది. జంతువులను మచి్చక చేసుకోవడం, వాటితో స్నేహంచేయడం, జాగ్రత్తగా చూసుకోవడంలో ఎంతో సంతృప్తినిస్తుందని పలువురు నిర్వాహకులు చెబుతున్నారు. జంతువుల నుంచి కొత్తవిషయాలు నేర్చుకునే అవకాశం ఉంటుందని ట్రైనర్స్ పేర్కొంటున్నారు.వారాంతంలో రైడ్స్..నగరంలోని కొన్ని క్లబ్లు వారాంతంలో ప్రత్యేకంగా హార్స్ రైడ్స్ నిర్వహిస్తున్నాయి. ప్రశాంతమైన ప్రకృతిలో గుర్రపు స్వారీ చేయడానికి ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్నారు. గ్రూప్ ఆఫ్ పీపుల్స్ కలుసుకుని, హాయిగా ఎంజాయ్ చేస్తున్నారు. గండిపేట్, ఎల్బీ నగర్, ఔటర్ రింగ్ రోడ్డు పరిసర ప్రాంతాల్లో తెల్లవారుజాము నుంచి హార్స్ రైడింగ్ కనిపిస్తోంది.ఇదో హాబీలా..పూర్తి స్థాయిలో శిక్షణ పొందిన గుర్రాలను మాత్రమే గుర్రపు స్వారీ నేర్చుకునేందుకు వచ్చేవారికి ఇస్తాం. మొత్తం 25 గుర్రాలు ఉన్నాయి. ఈ మధ్య కాలంలో 10 ఏళ్ల నుంచి 20 ఏళ్ల మధ్య వయసు్కలు ఎక్కువ మంది శిక్షణ తీసుకోడానికి వస్తున్నారు. ఉత్తర భారత దేశంలో గుర్రపు స్వారీకి ఎక్కువ డిమండ్ ఉంది. హైదరాబాద్లో ఇటీవల కాలంలోనే ఆ ట్రెండ్ మొదలైంది. ఇదొక హాబీలా మారిపోయింది. డిల్లీ, జైపూర్, జోథ్పూర్, ముంబయి, గుజరాత్ తదితర ప్రాంతాల్లో గుర్రపు క్రీడల పోటీలకు వెళుతుంటాం. – సయ్యద్ మాజ్, ట్రైనర్, క్రాస్ కంట్రీ క్లబ్ హైదరాబాద్నవాబుల కాలం నుంచే హైదరాబాద్లో గుర్రపు స్వారీకి ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇప్పుడదే క్రేజ్గా మారుతోంది. నగరంలో రాత్రి పూట పలువురు గుర్రాలపై సంచరిస్తున్న సందర్భాలూ కనిపిస్తున్నాయి. అయితే వారికి తిరిగేందుకు వాహనాలు అందుబాటులో లేక ఇలా వస్తున్నారనుకుంటే పొరపాటే.. అందరిలోకీ ప్రత్యేకంగా ఉండాలనే దృష్టితో కొందరు.. గుర్రపు స్వారీపై మక్కువతో మరికొందరు ఇలా చేస్తున్నామంటున్నారు. స్వారీ చాలా నేరి్పస్తుంది.. కరోనా లాక్డౌన్ సమయంలో గుర్రపు స్వారీ నేర్చుకున్నాను. శరీరంలోని కండరాల అమరిక, ఆత్మస్థైర్యం, పాజిటివ్ థింకింగ్, సెల్ఫ్ కంట్రోల్, జంతువుల పట్ల గౌరవం, వాటిని జాగ్రత్తగా కాపాడుకోవడం, క్లాస్, మీటింగ్, ఓపెన్ ప్లేస్ ఎక్కడైనా మాట్లాడగలిగే వాక్చాతుర్యం, ఇలా అన్నీ కలిపి ఒక ప్యాకేజీలా వచ్చాయి. నేర్చుకునేందుకు పూర్తిస్థాయిలో శిక్షణ పొందిన గుర్రం కొనుగోలు చేసుకున్నాం. దాన్ని నిర్వహణ కొద్దిగా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. వారాంతాల్లో రైడ్స్కి వెళుతుంటాం. ఆ గుర్రమే మనకు అన్నీ నేరి్పస్తుంది. – ఇషాన్ శర్మ, ఇంటర్ ద్వితీయ సంవత్సరం, మణికొండ -
ఆర్ట్ ఫుల్.. ఫెస్టివల్..
క్రిస్మస్ అంటే దయా, కరుణల జన్మదినం. ఇచ్చి పుచ్చుకోవడంలోని ఆనందం. అంతేనా.. క్రిస్మస్ అంటే కళాత్మకత కూడా అని నిరూపిస్తున్నారు సిటిజనులు. క్రీస్తు జన్మదినానికి కొన్ని రోజుల ముందుగానే నగరంలో మొదలయ్యే వేడుకలు ఆద్యంతం కళాత్మకతకు అద్దం పడతాయి. పండుగ సంప్రదాయాన్ని పాటిస్తూనే ఇటు వైవిధ్యానికీ అటు సృజనాత్మకతకు పెద్దపీట వేస్తాయి. ముఖ్యంగా క్రిస్మస్ చెట్టు, ఇతర అలంకరణలకు సంబంధించిన సందడి నెల రోజుల ముందునుంచే మొదలవుతుంది.. ఈ నేపథ్యంలో దీనిపై మరిన్ని విశేషాలు.. క్రిస్మస్ ముందు రాత్రి సమయంలో వచి్చ, అనుకోని విధంగా మంచి పిల్లలకు మాత్రమే బహుమతులు పంచే శాంటాక్లాజ్ పాత్రకు నేపథ్యం చర్చిఫాదర్ సెయింట్ నికోలస్ అని చరిత్ర చెబుతోంది. క్రిస్మస్ వేడుకల కోసం శాంటాక్లాజ్లను తయారు చేయడంలో నగరంలో వివిధ రకాల కొత్త పద్ధతులు, గెటప్స్ పుట్టుకొస్తూన్నాయి. ఎరుపు రంగు దుస్తుల్లో పొడవైన తెల్లని గెడ్డం, క్యాప్... ఈ మూడూ ప్రధానంగా తీసుకుని, మిగిలిన గెటప్స్కూ సృజనాత్మకతను జోడిస్తూ వెరైటీ ‘శాంటా’లను సృష్టిస్తూ పిల్లలను ఆకట్టుకుంటున్నారు. పండుగ బీట్.. డిజైనర్ ‘ట్రీ’ట్.. దాదాపు 15వ శతాబ్దపు ప్రాంతంలో క్రిస్మస్ రోజున కుటుంబ సభ్యులు తామే చెట్లు తయారు చేసి దాని చుట్టూ పరస్పరం ఇచ్చి పుచ్చుకునే బహుమతులను ఉంచేవారట. చిన్నా పెద్దా దాని చుట్టూ ఆడిపాడేవారట. వీటిని యులె ట్రీ అని కూడా పిలిచేవారట. అలా ఇది ఒక సంప్రదాయంగా స్థిరపడింది. సాధారణంగా ఈ చెట్టును పీవీసీతో లేదా ప్లాస్టిక్తో తయారు చేస్తారు. నగరంలో క్రిస్మస్ ట్రీ రూపకల్పనకు ఆకాశమే హద్దు అన్నట్టు డిజైనర్ ట్రీలు వచ్చేస్తున్నాయ్ ‘రెండు వారాల కిందటే కాలనీలో క్రిస్మస్ ట్రీని తయారు చేశాం. రోజుకో అలంకరణ జత చేస్తున్నాం. పండుగ రోజున దీన్ని అనూహ్యమైన రీతిలో అలంకరించి అందరినీ థ్రిల్ చేయనున్నాం’ అని కూకట్పల్లి నివాసి జెఫ్రీ చెప్పారు. ఎత్తు విషయంలోనూ ఇంతింతై అన్నట్టుగా.. క్రిస్మస్ ట్రీలు 3 నుంచి 30 అడుగుల వరకూ చేరుకున్నాయి. ‘సగటున మేం రోజుకు 20 క్రిస్మస్ చెట్లు అమ్ముతున్నాం. రూ.1000 నుంచి రూ.3000 వరకూ ధర ఉండేవి బాగా అమ్ముడవుతున్నాయి’ అని సికింద్రాబాద్లోని ఓ షాపు యజమాని చెప్పారు.స్టార్.. సూపర్.. అవతారపురుషుని రాకకు చిహ్నంగా ముందుగా ఒక ప్రత్యేకమైన నక్షత్రం ఉద్భవించింది. అందుకే ఈ వేడుకల్లో స్టార్కు చాలా ప్రాధాన్యత ఉంటుంది. నక్షత్రమార్గం అంటే దేవుని మార్గం. దేవుని వైపు దారి చూపించేదిగా దీన్ని భావిస్తారు. ఈ వేడుకల్లో భాగంగా నగరంలో రకరకాల లైట్ల వెలుతురులో మెరిసిపోయే స్టార్స్ క్రిస్మస్ సందడిని రెట్టింపు చేస్తున్నాయి.ప్రేమ సందేశమే ప్రధానం.. ఈ పండుగ వేడుకల్లో ప్రధానమైన శాంతాక్లజ్, ట్రీ, క్రిబ్.. వంటివన్నీ పండుగ విశిష్టతకు, సేవాభావపు ఔన్నత్యానికి అద్దం పట్టేవే. వీటిని నగరంలో ఎవరికి నచ్చినట్టు వారు అందంగా ఏర్పాటు చేస్తున్నారు. ఇది మంచిదే అయినా ఆయా విశేషాలు అందించే ప్రేమ సందేశాలను కూడా తెలుసుకోవడం, తెలియజెప్పడం అవసరం అంటున్నారు సికింద్రాబాద్లోని అమృతవాణి డైరెక్టర్ ఫాదర్ ఉడుముల బాలÔౌరి.విశేషాల క్రిబ్.. వెరైటీలకు కేరాఫ్ ఏసు జని్మంచిన స్థలానికి సంబంధించిన విశేషాలను తెలియపరిచే క్రిబ్.. 1223లో తొలిసారి సెయింట్ఫ్రాన్సిస్ అనే వ్యక్తి రూపకల్పన చేశాడంటారు. దీనినే నేటివిటీ సీన్ లేదా మ్యాంగర్ సీన్ వంటి పేర్లతోనూ పిలుస్తారు. పశువులపాకలో ఏసు పుట్టాడనేదానికి సూచికగా దీనిని అందంగా ఏర్పాటు చేస్తుంటారు. పలు జంతువులతో పాటు పేదలు, రాజులు ఇలా అందరూ ఉండే చోట కొలువుదీరేలా దీన్ని నెలకొల్పే విధానం ఆకట్టుకుంటుంది. గడ్డిని తెచ్చి పాకను వేసి చిన్నారి క్రీస్తును కొలువుతీర్చి.. ఇలా చక్కగా డిజైన్ చేసే క్రిబ్ నగర క్రిస్మస్ వేడుకల్లో ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. క్రిస్మస్ రోజుల్లో దాదాపు ఒకటి రెండు రోజుల పాటు సమూహాలుగా ఈ క్రిబ్ తయారీలో పాల్గొనడం కూడా చాలా మందికి నచ్చే విషయం. -
ఫిట్.. బాడీ సెట్..
కండలు తిరిగే దేహం అంటే యువతకు యమ క్రేజ్ ఉంటుంది. దీనికోసం జిమ్కు వెళ్లి కసరత్తులు చేస్తూ చెమటలు చిందిస్తుంటారు. కొందరు రెగ్యులర్గా వెళ్లి సిక్స్ ప్యాక్ వచ్చేంత వరకూ కష్టపడుతుంటారు. కండలు పెరిగేందుకు ప్రొటీన్ పౌడర్ వంటివి తీసుకుంటుంటారు. వీటివల్ల దుష్పరిణామాలు చాలానే ఉంటాయి. అయితే అథ్లెటిక్ బాడీ అంటే గత కొంతకాలంగా యువతలో క్రేజ్ పెరిగిపోతోంది. విల్లులా దేహాన్ని మలుచుకునేందుకు చాలా మంది ఇష్టపడుతున్నారు. ఈ దేహాన్నే మీసోమార్ఫ్ దేహం అని అంటుంటారు. ఉదయం, సాయంత్రం వేళల్లో గ్రౌండ్స్లో పరుగులు పెడుతూ.. వ్యాయామాలు చేస్తున్నారు. దీంతో ఫిట్నెస్తో పాటు మానసిక ఉల్లాసం, చక్కటి దేహాన్ని సొంతం చేసుకుంటున్నారు. నగరంలో చాలా ప్రాంతాల్లోని గ్రౌండ్స్లో యువత ఇటీవల ఫిట్నెస్ కోసం వ్యాయామాలు, కసరత్తులు చేస్తూ కనిపిస్తున్నారు. దీనికి పోటీ పరీక్షలైన ఆర్మీ, పోలీసులు, ఆరీ్పఎఫ్ వంటి నియామకాలు ఒక కారణమైతే.. స్పోర్ట్స్పై ఇంట్రెస్ట్తో కొందరు.. ఫిట్నెస్ మీద పెరిగిన అవగాహనతో మరికొందరు వ్యాయామాల భాటపడుతున్నారు. దీంతో ఉదయాన్నే లేచి గ్రౌండ్లో పరుగులు పెడుతున్నారు. అయితే గ్రౌండ్లో కసరత్తుల వల్ల ఎలాంటి లాభాలు ఉంటాయి..? ఎలాంటి కసరత్తులు చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి..? ఇలాంటి కొన్ని విషయాలు తెలుసుకుందాం..శరీర భాగాలపై సమానంగా.. జిమ్కు వెళ్లి కసరత్తులు చేయడం కన్నా రోజూ రన్నింగ్ చేయడం వల్ల శరీరం ఎదుగుదల బాగుంటుందని నిపుణులు చెబుతున్నారు. జిమ్లో ఒకే శరీర అవయవంపై మాత్రమే వర్క్లోడ్ పడుతుంటుంది. అదే గ్రౌండ్లో వర్కవుట్స్ వల్ల శరీరంలోని అన్ని భాగాలపై ఒకే విధంగా పనిచేస్తుంది. హెవీ వర్కవుట్స్ చేయడం వల్ల కండరాలకు గాయమయ్యే ప్రమాదం ఉంటుంది. అది దీర్ఘకాలికంగా ఉండే అవకాశాలూ ఎక్కువే. అయితే గ్రౌండ్లో వర్కవుట్స్ ద్వారా వచ్చిన ఫలితాలు చాలా కాలం వరకూ ఉంటాయి. అంటే కొంత కాలం కసరత్తులు ఆపేసినా కూడా పెద్దగా శరీరంలో మార్పులు రావు. అదే జిమ్ మధ్యలో ఆపేస్తే శరీరం మొత్తం మారిపోతుంది.ట్రైనింగ్ పద్ధతులు.. గ్రౌండ్లో చేసేందుకు సాధారణంగా పలు రకాల ట్రైనింగ్ పద్ధతులు ఉంటాయి. వెయిట్ ట్రైనింగ్, సర్క్యూట్ ట్రైనింగ్, ఇంటర్వెల్ ట్రైనింగ్, రెప్యుటేషన్ ట్రైనింగ్, క్రాస్ కంట్రీ ట్రైనింగ్ అనే రకరకాల పద్ధతులు ఉంటాయి. ఎలాంటి ఖర్చూ లేకుండా చక్కటి శరీరాకృతి పొందవచ్చు. బర్ఫీ, జంపింగ్ జాక్స్ వంటి ఎక్సర్సైజ్ల ద్వారా శరీరం మొత్తంపై ప్రభావం పడుతుంది. వీటి వల్ల కొవ్వు తగ్గి బరువు తగ్గుతుంది. రన్నింగ్తో జీవక్రియలు మెరుగుపడటమే కాకుండా, శ్వాసవ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది. గ్రౌండ్లో వర్కవుట్స్ చేసే వాళ్లు తప్పనిసరిగా బ్రీతింగ్ ఎక్సర్సైజ్లు చేయడం తప్పనిసరి. దీంతో రన్నింగ్ చేసే స్టామినా పెరుగుతుంది.ఎత్తు పెరిగే అవకాశం.. గ్రౌండ్లో కసరత్తులు, రన్నింగ్ చేయడం వల్ల 18 ఏళ్ల లోపు పిల్లల్లో ఎత్తు పెరుగుతారని చెబుతున్నారు. అదే ఆ వయసులో ఉన్న వారు జిమ్ చేస్తే ఎత్తు పెరగడం ఆగిపోతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. జిమ్లో ఉండే పరికరాలు అందరూ వాడటం వల్ల కొన్ని చర్మ సమస్యలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. కూల్డౌన్ పద్ధతులు తప్పనిసరి.. గ్రౌండ్లో రన్నింగ్ లేదా కసరత్తులు చేసిన తర్వాత బాడీ కూల్డౌన్, స్ట్రెచ్ ఎక్సర్సైజులు తప్పనిసరిగా చేయాలి. ఇది అలసిపోయిన కండరాలను యథాస్థితికి తీసుకొచ్చేందుకు పనికొస్తుంది. 30 ఏళ్లు దాటిన వాళ్లు ఎక్కువ కఠినమైన ఎక్సర్సైజులు చేయకపోవడం మంచిది. కండరాలపై స్ట్రెస్ పడకుండా చూసుకోవాలి. నిపుణుల పర్యవేక్షణలోనే కసరత్తులు చేయడం మంచిది. – కె.ధర్మేందర్, ఫిజికల్ డైరెక్టర్డైట్ చాలా ముఖ్యం.. గ్రౌండ్లో వర్కవుట్ చేసే వారికి డైట్ చాలా ముఖ్యం. శరీర తీరు, బరువు, చేసే వర్కవుట్ను బట్టి ఆహారం తీసుకోవాలి. కార్బొహైడ్రేట్స్ఉన్న ఆహారపదార్థాలు తగ్గించాలి. ప్రొటీన్స్ ఉన్న ఫుడ్ తీసుకుంటే కండరాలు పెరుగుతాయి. ఫైబర్ ఉన్న ఆహారపదార్థాలు తీసుకోవడం వల్ల జీర్ణక్రియ సరిగ్గా జరిగి, బరువు పెరగదు. నీరు కూడా అధికంగా తీసుకుంటుండాలి. వర్కవుట్ కన్నా ముందు కనీసం ఒక లీటర్ నీళ్లు (గోరు వెచ్చటి నీరు) తాగాలి. – వసుధ, క్లినికల్ న్యూట్రిషనిస్టు -
సందేహాలను నివృత్తి చేసే.. దుల్హా–దుల్హన్
గతంలో పెళ్లి జరగాలంటే వధూవరులను పెద్ద నాన్నలు, బాబాయ్లు, మామలు, పెద్దమ్మలు, మేనత్తలు అటు ఏడు తరాలు, ఇటు ఏడు తరాలు చూసి అబ్బాయి లేదా అమ్మాయి నచి్చతే వారి గుణగణాలు తెలుసుకొని కుటుంబ పరిస్థితి తెలుసుకొని పెళ్లి జరిపించేవారు. వివాహం జరిగిన తర్వాత భర్తతో ఎలా మసలుకోవాలి?, అత్తగారింట్లో ఎలా ఉండాలి? ఇలాంటివన్నీ అమ్మమ్మలు, తాతలు, నానమ్మలు కొత్తగా పెళ్లయిన వారికి చెప్పేవారు. ఇప్పుడు ఉమ్మడి కుటుంబాలు కరువై యాంత్రిక జీవనం కొత్తగా పెళ్లయిన వారినే కాకుండా పెళ్లికి ముందు కూడా వధూవరులను, పెళ్లి తర్వాత భార్యా, భర్తలను మనస్పర్థలకు గురిచేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే టోలిచౌకిలో నివసించే ఇలియాస్ షంషి అనే వ్యక్తి ‘దుల్హా–దుల్హన్’ కోర్సును అందుబాటులోకి తీసుకొచ్చాడు. దీని గురించిన మరిన్ని విశేషాలు..! టోలిచౌకి బాల్రెడ్డినగర్ కాలనీలో ఏర్పాటు చేసిన దుల్హా–దుల్హన్ ఫ్యామిలీ ఇన్స్టిట్యూట్కు మంచి స్పందన లభిస్తోంది. ఈ ఇన్స్టిట్యూట్లో కొత్తగా పెళ్లి చేసుకోబోయేవారు ఎలా ఉండాలి అనే దానిపై 15 అంశాల్లో నిర్వాహకుడు ఇలియాస్ షంషి శిక్షణ ఇస్తున్నారు. హైదరాబాద్లోనే కాకుండా బెంగళూరు, చెన్నై, గుజరాత్, ఢిల్లీ, కోల్కతాతో పాటు దుబాయ్, కెనడా, అమెరికాలో కూడా షంషి ప్రారంభించిన ఆన్లైన్ క్లాస్లకు మంచి రెస్పాన్స్ లభిస్తోంది. పెళ్లంటే ఏంటి?, పెళ్లిలో మంత్రాల అర్థం ఏంటి? వాటిని ఎలా అర్థం చేసుకోవాలి?, పెళ్లి ఎందుకు?, బాధ్యతలు, భర్తతో మనస్పర్థలు వస్తే వాటిని ఎలా పరిష్కరించుకోవాలి?, భార్య అంటే ఎలా ఉండాలి?, భర్త చేయాల్సినవి, చేయకూడనివి ఏంటి?, మీరు మంచి భర్తగా ఎలా ఉండొచ్చు తదితర అంశాలపై షంషి శిక్షణ ఇస్తున్నారు. సందేహాలను నివృత్తి చేస్తూ.. హోమ్ మేనేజ్మెంట్, భర్త మనసును ఎలా గెలుచుకోవాలి, భార్య మనసును ఎలా గెలుచుకోవాలి ఇలాంటివన్నీ ఈ ట్రైనింగ్లో భాగమయ్యాయి. పెళ్ళికి ముందు వధూవరులు వస్తే వారు అడిగే ప్రశ్నలకు సందేహాలను నివృత్తి చేస్తూనే పెళ్లి తర్వాత మంచి భర్తగా, లేదా మంచి భార్యగా ఎలా ఉండాలి అన్న అంశాలపై ఈ శిక్షణ కొనసాగుతున్నది.మంచి స్పందన మేం ఈ సంస్థను ఏర్పాటు చేసినప్పుడు స్పందన అంతంత మాత్రంగానే ఉండేది. రోజులు గడుస్తున్న కొద్దీ మా సంస్థకు రెస్పాన్స్ పెరుగుతోంది. అమెరికా, దుబాయ్, కెనడా తదితర ప్రాంతాల నుంచి కూడా మేం నిర్వహించే ఆన్లైన్ క్లాస్లకు అభ్యర్థులు హాజరవుతున్నారు. పెళ్లికి ముందు, పెళ్లి తర్వాత భార్యా, భర్తల బంధం ఎంత బలంగా ఉండాలో ఈ శిక్షణ ద్వారా సూచిస్తున్నాం. ఇప్పటి వరకూ వేలాది మందికి శిక్షణ ఇవ్వడం జరిగింది. మూడు నెలల పాటు ఈ ఆన్లైన్ శిక్షణ ఉంటుంది. అంతే కాదు బెస్ట్ మదర్ అనిపించుకోవడం ఎలా అన్నదానిపై కూడా మా శిక్షణ కొనసాగుతున్నది. ఇటీవల పెళ్లికి ముందే చిన్న చిన్న విషయాల్లో వధూవరులకు మనస్పర్థలు వచ్చి పెళ్లిళ్లు ఆగిపోతున్న ఘటనలూ చూస్తున్నాం. దుల్హన్ కోర్సులో ఈ విషయాలన్నింటికీ సమాధానాలు లభిస్తున్నాయి. యువతీ, యువకులకు వేర్వేరుగా ఈ క్లాసులు ఉంటాయి. ముఖ్యంగా భార్య, భర్తల బంధం బలంగా ఉండాలంటే ఎలా ఉండాలో చూపిస్తున్నాం. – ఇలియాస్, షంషీ, ట్రైనర్ ఫ్యామిలీ ఇన్స్టిట్యూట్ 2019లో ఏర్పాటు.. ప్రతిరోజూ పాతిక మంది వరకూ ఆన్లైన్ క్లాసులకు హాజరయ్యే ఈ ఫ్యామిలీ ఇన్స్టిట్యూట్ 2019లో ఏర్పాటైంది. ఇప్పటి వరకూ వేల సంఖ్యలో యువతీ, యువకులకు శిక్షణతో పాటు తగిన సూచనలు జారీ చేశారు షంషి. భార్యా, భర్తల మధ్య ఏదైనా గొడవ వస్తే వాటిని పరిష్కరించే దిశలోనే ఆయన అడుగులు వేస్తున్నారు. ఎవరికైనా ఇలాంటి సలహాలు, సంప్రదింపులు కావాలంటే తమ ఇన్స్టిట్యూట్లో జాయిన్ కావొచ్చు అని కూడా పేర్కొంటునారు. పెళ్లికి ముందు, పెళ్లి తర్వాత మేం చెప్పబోయే అంశాలు ఏమిటి అన్న దానిపై వివరిస్తూ స్పష్టంగా వెబ్సైట్లో పొందుపరిచారు. -
మనసుదోచే సొగశారీ..
స్కిన్టైట్ జీన్సులు, ట్యునీక్సూ, కుర్తీస్, నీలెంగ్త్ స్కర్టులు, పొట్టి నిక్కర్లూ.. లాంటి మోడ్రన్ ట్యూన్స్తో ఓ వైపు మమేకమైన నగర మహిళలు మరోవైపు ఇంకా పాత రాగంలో ‘శారీ’గమ పాడేస్తోందంటే.. చీర కట్టు మహిమ ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు.. ఆధునిక కట్టుబాట్లు ఎలా ఉన్నా అప్పుడప్పుడూ సొగసిరి చీరకట్టి అన్న రీతిలో నగర మహిళలు తమ హుందాతనాన్ని ప్రదర్శిస్తున్నారు. డిసెంబర్ 21న శారీ దినోత్సవం నేపథ్యంలో దీనిపైనే ఈ కథనం.. – సాక్షి, సిటీబ్యూరో‘చీర కట్టుకుంటే ఆ డిగ్నిటియే వేరు. నెలకోసారన్నా.. వార్డ్రోబ్లో నుంచి శారీ తీయాల్సిందే’ అంటోంది ఓ పీఆర్ కంపెనీలో పనిచేసే వాణి. సిటీలో విభిన్న వృత్తి ఉద్యోగాలు చేసే మహిళలు, యువతులు వృత్తి, బాధ్యతల కారణంగా రోజువారీ వినియోగం అంత సులభం కాకపోవడంతో ‘చీరకట్టు’ వీరికి మరింత అపురూపంగా మారిపోయింది. దీంతో సెలవు దినాల్లో, కుటుంబ వేడుకల్లో ఇలా వీలైనన్ని సందర్భాల్లో తప్పనిసరిగా ఎంచుకునే వస్త్రధారణగా మారింది. ప్రత్యేక సందర్భం వస్తే చీరకట్టాలి అనే రోజుల నుంచి చీరకట్టు కోసం సందర్భాన్ని సృష్టించుకునేంత ఆసక్తి నగరమహిళల్లో పెరిగిపోతోంది.కట్టు తప్పుతోంది.. రోజుల తరబడి టాప్లూ, ట్రౌజర్లతో కాలక్షేపం చేస్తూ వచ్చి ఒక్కసారిగా చీర కట్టుకోవాలంటే ఇబ్బందే కదా. అందుకే చీరకట్టడంలో నేర్పరితనం ఉన్నవారి సేవల మీద నగర మహిళలు ఆధారపడుతున్నారు. ‘ఫంక్షన్స్కి శారీ కాకుండా డ్రెస్సులతో వెళితే గిల్టీ ఫీలింగ్ వస్తోంది. అలాగని చీరకట్టాలని ప్రయత్నిస్తే సరిగా కుదరడం లేదు. అందుకే నేను అవసరమైనప్పుడల్లా చీరకట్టే వారిని పిలిపించుకుంటాను’ అని జూబ్లీహిల్స్లో నివసించే ఉమ చెబుతున్నారు. ఈ ‘కట్టు’ ఇబ్బందుల నుంచి తప్పించుకోడానికి నిపుణులకు రూ.500 వరకూ చెల్లించడానికి పెద్దగా ఇబ్బంది పడడంలేదంటున్నారు ఆధునిక మహిళలు. ‘ఇటీవల చీర కట్టుకోవాలని ఆసక్తి బాగా పెరిగింది. అయితే మోడ్రన్ డ్రెస్సుల్లా నిమిషాల మీద వేసుకుని వెళ్లిపోడానికి కుదిరేది కాదు కదా. అందుకే అమ్మాయిలు మాత్రమే కాదు పెద్ద వయసు మహిళలు కూడా చీర కట్టుకోవడానికి మా సహకారం కోరుతున్నారు. అవసరమైన వారికి మేం ఇంటికే వెళ్లి సేవలు అందిస్తున్నాం’ అని చెబుతున్నారు శారీ డ్రేపర్గా రాణిస్తున్న సునీల.విభిన్న శైలిలో...చీరకట్టు విభిన్నరకాల శైలులు నగరంలో రాజ్యం ఏలుతున్నాయి. ‘జయప్రద స్టైల్, నూపుర్ స్టైల్, తానిదార్ స్టైల్.. ఇలా దాదాపు 35 రకాల శారీడ్రేపింగ్ స్టైల్స్ అందుబాటులో ఉన్నాయి. నా దగ్గరకు వచ్చే వారిలో అత్యధికులు నూపుర్స్టైల్ అడుగుతారు’ అని చెప్పారు శారీడ్రేపింగ్కు పేరొందిన సికింద్రాబాద్ వాసి జానీనులియా. నగరం విభిన్న సంస్కృతుల నిలయం కావడం, విభిన్న ప్రాంతాలకు చెందిన వారు ఇక్కడికి వచ్చి నివసిస్తుండడం, ఈ కుటుంబాల మధ్య రాకపోకలు పెరగడంతో.. ఇతర ప్రాంతాల కట్టు బొట్టూ నేర్చుకోవాల్సి రావడం తప్పడం లేదు. ఆ క్రమంలోనే మార్వాడి, గుజరాతీ, బెంగాలీ.. తదితర చీరకట్టు శైలిని స్థానిక మహిళలు అనుసరిస్తుండడం సాధారణంగా మారింది. విభిన్న శైలులను అనుసరించాలనుకునేవారికి స్టైల్ను బట్టి రూ.500 నుంచి రూ.2000 వరకూ రుసుముతో సేవలు అందించేవారు సైతం పుట్టుకొచ్చేశారు. బ్యూటీ విత్ డిగ్నిటీ..‘రెగ్యులర్ డ్రెస్సులంటే మొహం మొత్తేస్తోంది. మా కంపెనీలో ఏ చిన్న వేడుకైనా అందరూ చీరలు కట్టుకునే వస్తాం. ప్రత్యేకంగా ట్రెడిషనల్ డే వంటివి క్రియేట్ చేసుకుని మరీ చీరలు కడుతున్నాం’ అంటోంది సాఫ్ట్వేర్ ఉద్యోగిని భవ్యశ్రీ. మోడ్రన్ డ్రెస్సుల దగ్గర ఆచితూచి ఖర్చుపెట్టే అమ్మాయిలు చీర విషయానికి వచ్చేసరికి ఎంతైనా ఖర్చు పెట్టడానికి సిద్ధమవుతున్నారని నగరానికి చెందిన డిజైనర్ అవని చెబుతున్నారు. హఫ్ శారికే డిమాండ్..ఎన్ని రకాలు వచ్చినా నగరంలో అత్యధికుల్ని ఆకర్షిస్తున్నది మాత్రం హాఫ్‘శారీ’.. అంటే లంగా వోణి కాదు. లంగా వోణి లాంటి చీర అని అర్థం. అచ్చం హాఫ్శారీలా కనబడే శారీలు నగర మార్కెట్ను ముంచెత్తుతున్నాయి. వయసు తక్కువలా అనిపించేలా ఉండే వీటి పట్ల నగర మహిళలు ఆదరణ చూపుతున్నారని కలర్జ్ బ్యూటీ స్టూడియో నిర్వాహకురాలు శ్రావణీరెడ్డి చెప్పారు. అలాగే ధోతీ స్టైల్, గోచీ స్టైల్, లెహంగా స్టైల్.. ఇలా అనేక రకాల స్టైల్స్ నగరంలో సందడి చేస్తున్నాయి. ప్రొఫెషనల్ స్టెప్స్.. స్టైల్ టిప్స్విభిన్న రంగాల్లో ఉంటున్నవారు అందుకు తగ్గట్టుగా ఉండేందుకు చీరకట్టు కూడా ప్రత్యేకంగా ఉండేలా డిజైనర్లు సూచిస్తున్నారు. చీర మీద కొంగును సింగిల్స్టెప్ వేసే స్టైల్ని టీచర్ వృత్తిలో ఉన్నవారు ఎంచుకోవచ్చు. ఇదే స్టైల్లో పల్లు కొసని కుడి చేత్తో పట్టుకోవడం వల్ల డిజైన్ కొట్టొచి్చనట్టు కనబడుతుంది. హుందాగా కనిపించాలనుకున్నవారు డబుల్స్టెప్ను అనుసరించవచ్చు. ఇక అత్యధికులకు నప్పేది త్రీస్టెప్స్. పనులకు ఎలాంటి అడ్డంకీ రాకూడదనుకునే ఉద్యోగినులు, గృహిణులు.. అందరికీ ఇది ఓకె. కాస్త స్పైసీగా కనపడాలనుకుంటే మాత్రం ఫోర్స్టెప్స్, ఫైవ్స్టెప్స్.. ఇలా ఎంచుకోవాలి. పట్టు చీరలకు తప్పనిసరిగా ఆరు స్టెప్స్ ఉండాల్సిందే. అప్పుడే దానికి ఆకర్షణ. స్కూల్ డేస్ నుంచే కడుతున్నా.. శారీ కట్టడం స్కూల్ డేస్ నుంచే అలవాటు. అందుకే చీరకట్టు నాకు చాలా కంఫర్ట్బుల్ అనిపిస్తుంది. ఒక యాంకర్గా రకరకాల ప్రోగ్రామ్స్ కోసం రకరకాలుగా రెడీ అవుతుంటాను. అన్ని రకాల స్టైల్స్ ధరించడం అవసరం కూడా. అయితే నా మనసు ఎప్పటికీ చీరమీదే ఉంటుంది. రకరకాల బ్లౌజ్లు, జ్యువెలరీస్ జత చేసి వెరైటీ స్టైల్స్లో డ్రేప్ చేసుకోవచ్చు.. – మంజూష, యాంకర్ -
కళ్ల జోడు.. స్టైల్ చూడు
కళ్ల జోడు కొత్త మోడల్స్ అనునిత్యం నయా పుంతలు తొక్కుతున్నాయి. నలుగురిలో భిన్నంగా ఉండాలనుకునే యువత మార్కెట్లోకి కొత్త మోడల్ వచి్చందంటే దాన్ని మనం ధరించాల్సిందే అంటున్నారు. ఈ తరహా ట్రెండ్ ప్రధానంగా కళాశాలలకు వెళ్లే విద్యార్థులు, సాఫ్ట్వేర్, ఇతర ఉద్యోగుల్లో కనిపిస్తోంది. ఇందులో అత్యధిక శాతం మంది మాత్రం ఎప్పటికప్పుడు తమ కళ్లజోడు మారుస్తున్నారు. నగరవాసులు కొత్త మోడల్స్కు మారిపోతున్నారు. అందం, అభినయానికి అనుగుణంగా తమ కళ్లజోడు ఉండేలా సెట్ చేసుకుంటున్నారు.కళ్ల జోడు వల్ల చాలా లాభాలు ఉన్నాయి. నగరంలో ట్రాఫిక్ సమస్యలు, కాలుష్యం సమస్య వేధిస్తోంది. మోటారు సైకిల్పై, ప్రజారవాణా వ్యవస్థలో ప్రయాణాలు చేసేవారికి గాలిలోని ధూళి కణాలు కంట్లో పడి ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ఇటువంటి సమయంలో కంటికి రక్షణ, స్టైలిష్ కళ్ల జోడు కోసం నిత్యం వివిధ వెబ్సైట్లలో, ఆప్టికల్ దుఖాణాల్లో కొత్త మోడల్స్పై ఆరా తీస్తున్నారు. ఎండలో ప్రయాణాలు చేసేవారు ప్రమాదకరమైన సూర్య కిరణాల నుంచి రక్షణ కల్పించడం కోసం, రాత్రి వేళ డ్రైవింగ్ చేసే సమయంలో ఎదుటి వాహనాల వెలుతురు ప్రభావం మన కళ్లపై పడకుండా ఉండేందుకు యాంటీ గ్లేర్ గ్లాసెస్, కంప్యూటర్ ముందు కూర్చుని ఉద్యోగాలు చేసే యువత కంప్యూటర్ కిరణాల నుంచి రక్షణ కసం బ్లూలైట్ యాంటీ గ్లేర్ వంటి వివిధ రకాల ప్రత్యేకతలున్న గ్లాసెస్ వినియోగిస్తున్నారు. మరికొంత మంది మాత్రం కంటి సమస్యలతో కళ్లజోడు వినియోగిస్తున్నారు. చూపు మందగించడం, రీడింగ్ గ్లాసెస్, కళ్లు ఒత్తిడికి గురైనప్పుడు వచ్చే తలనొప్పిని తగ్గించడం కోసం కొన్ని రకాల లెన్స్ అందుబాటులో ఉన్నాయి.బ్రాండ్స్పై మోజు.. ప్రపంచంలో పేరెన్నిక కలిగిన పలు బ్రాండెడ్ గాగుల్స్ కంపెనీలు తమ ఉత్పత్తులను హైదరాబాద్ నగర ప్రజలకు అందుబాటులో ఉంచుతున్నాయి. అనునిత్యం కొత్త కొత్త మోడల్స్, ఆఫర్లతో ఆకట్టుకుంటున్నాయి. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మాదాపూర్, కేపీహెచ్బీ, హైటెక్సిటీ, రాయదుర్గం, శేరిలింగంపల్లి తదతర ప్రాంతాల్లో బ్రాండెడ్ గాగుల్స్ దుకాణాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే అచ్చం అలాగే కనిపించే లోకల్ బ్రాండ్స్ సైతం లభిస్తున్నాయి. ఈ రెండింటి మధ్య ధరల్లో మాత్రం భారీ వ్యత్యాసం కనిపిస్తోంది. చిన్న చిన్న దుకాణాల్లో గాగుల్స్ అడిగితే రూ.100కే లభిస్తున్నాయి. అదే మల్టీనేషన్ కంపెనీ బ్రాండ్ అయితే కనీసం రూ.5 వేలు ఆపైనే ఉంటాయి. వీటి మన్నికలోనూ స్పష్టమైన వ్యత్యాసం కనిపిస్తోందని కొనుగోలుదారులు పేర్కొంటున్నారు.సమస్య ఎక్కడ మొదలవుతోంది? నగరంలో యువత జీవన శైలి మారిపోతోంది. రాత్రి వేళ ఆలస్యంగా నిద్రపోవడం, మొబైల్ ఫోన్ స్క్రీన్ ఎక్కువ సమయం చూడటం, ఉద్యోగం, వ్యాపార లావాదేవీల్లో అవసరాల రీత్యా కంప్యూటర్, ల్యాప్టాప్, ట్యాబ్స్పై పనిచేయాల్సి రావడంతో కంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. దీంతో చాలామందిలో చూపు మందగించడం, కళ్లు ఎక్కువగా ఒత్తిడిగి గురై తలనొప్పి రావడం వంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు. చిన్నపిల్లల్లో సైతం ఈ తరహా లక్షణాలతో ఆస్పత్రులకు వస్తున్న బాధితులు ఉన్నారంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.బ్రాండ్స్ విషయంలో జాగ్రత్తలు తప్పనిసరి కాలుష్యం నుంచి కంటిని రక్షించుకోవడానికి గాగుల్స్ అవసరం. అయితే వాటిని నిపుణులైన వైద్యుల సూచనల మేరకు వినియోగిస్తే మంచిది. కంటి సమస్యలతో వచ్చేవారికి కళ్లజోడు రాయాల్సి వచి్చనప్పుడు కొత్త మోడల్స్ కావాలని కోరడం సహజంగా మారిపోయింది. కంటిపై ఒత్తిడి పెరగడం వల్ల దగ్గర, దూరం దృష్టి సమస్యలు, కళ్లు పొడిబారిపోవడం, తలనొప్పి రావడం, ఇంట్రాక్రీనియల్ ప్రెజర్ పెరగడం వల్ల ఇబ్బందులు తలెత్తుతాయి. బయటకు వెళ్లే సమయంలో సన్ ప్రొటెక్షన్, కంప్యూటర్పై పనిచేసేటప్పుడు నిపుణుల ఆదేశానుసారంగా లెన్స్ గ్లాసెస్ వాడుకోవాలి. ప్రతి 45 నిమిషాలకు ఒక 10 నిమిషాలైనా కంప్యూటర్, మొబైల్కు దూరంగా ఉండాలి. ఎక్కువ సార్లు కనురెప్పలను బ్లింక్ చేయాలి. కంట్లో ధూళి కణాలు పడితే నల్లగుడ్డుకు ప్రమాదం వాటిల్లుతుంది. కళ్లజోడు వినియోగించడంతో కంటి లైఫ్ టైం పెంచుకోవచ్చు. బ్రాండ్ విషయంలో కొద్దిగా జాగ్రత్తలు పాటించాలి. ఏదో ఒకటి కళ్లజోడే కదా చాలు అనుకుంటేనే ఇబ్బంది. – డా.పి.మురళీధర్ రావు, వైరియో రెటినల్ సర్జన్, మ్యాక్స్ విజన్, సోమాజిగూడ -
శీతల ప్రయాణం..
కొద్ది రోజుల క్రితం సాధారణ స్థాయిలో ఉన్న విమానయాన ధరలు అమాంతం రెట్టింపయ్యాయి. ముఖ్యంగా డిసెంబర్ 15 నుంచి 31 తేదీల్లో గతంతో పోల్చితే రెండింతలు, మూడింతల మేర పెరిగాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. నగర వాసుల్లో ప్రయాణాల పట్ల ఉన్న ఆసక్తే దీనికి కారణం. కాగా ప్రస్తుత నెలల్లో వరుసగా క్రిస్మస్, ఇయర్ ఎండ్, న్యూఇయర్, సంక్రాంతి వంటి పండుగల నేపథ్యంలో నగరవాసులకు భారీగా సెలవులు అందుబాటులోకి వచ్చాయి. దీంతో ట్రావెలింగ్ మంత్గా డిసెంబర్ను ఎంచుకుంటున్నారు. ప్రతి యేడాదీ డిసెంబర్ నెలలో ఏదో ఒక టూర్ వేయడం అందివచ్చిన సెలవులను వినియోగించుకోవడం నగర వాసులకు అలవాటే. ఇందు కోసం ముందస్తుగానే నగరంలోని ప్రయాణ ప్రేమికులు వారి ప్రయాణ గమ్యస్థానాలకు మార్గాలను సుగమం చేసుకున్నారు. యువత, టెకీలు ట్రావెలింగ్ ప్లాన్స్లో బిజీగా ఉన్నారు. ముఖ్యంగా డొమెస్టిక్ ప్రయాణాలు ఇప్పటికే సోల్డ్ ఔట్ బోర్డ్పెట్టే పరిస్థితులు కనిపిస్తున్నాయి. – సాక్షి, సిటీబ్యూరో.కొందరు ఐటీ ఉద్యోగులు, సాఫ్ట్వేర్ టెకీలు యేడాదంతా వారి సెలవులను వినియోగించకుండా తమ తమ విధులు నిర్వహిస్తుంటారు. దీంతో పాటు మరికొందరు టెకీలకు, కాల్ ఇంటర్నేషనల్ కాల్ సెంటర్ ఉద్యోగులకూ డిసెంబర్ నెలలో భారీగా సెలవులు ఉంటాయి. దీంతో ఆయా సెలవుదినాలను డిసెంబర్ డెస్టినేషన్ కోసమే వినియోగిస్తుంటారు.. నగరంలో విస్తరిస్తున్న ఐటీ ట్రెండ్తో గత కొన్నేళ్లుగా ట్రావెలింగ్ రంగంలోనూ భారీ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఓ వైపు మిగిలిపోయిన సెలవులు, మరోవైపు నగరంలోని విదేశాలకు చెందిన గ్లోబల్ కంపెనీల క్రిస్మస్ లీవ్స్ దీనికి ప్రామాణికం అవుతున్నాయి.వీటిని ఎంజాయ్ చేయడానికి ఇప్పటికే యుద్ధప్రాతిపధికన టీమ్ హెడ్లకు మెయిల్స్ పెట్టేయడం, ట్రావెల్ ఏజెన్సీలను సంప్రదించడం, పర్యాటక ప్రాంతాల్లో విడిది, విందు, వినోదం తదితరాలకు సన్నాహాలు పూర్తయ్యాయి. ఇది కొత్తేం కాకపోయినప్పటికీ.. ఈ కల్చర్ ఈ ఏడాది మరింత పుంజుకోవడం విశేషం. సాధారణ రోజుల్లో 4 నేల నుంచి 9 వేల వరకూ ఉండే దేశీయ విమాన చార్జీలు ప్రస్తుతం 14 నుంచి 20 వేలకు పైగా కొనసాగడం ఈ సంస్కృతి ప్రభావానికి నిదర్శనం. కన్యాకుమారి, కేరళ మొదలు.. మనాలి, డార్జిలింగ్ వంటి శీతల ప్రదేశాలకు బయలు దేరుతున్నారు. మరికొందరైతే స్విస్ దేశాలు, సింగపూర్, మలేషియా, బ్యాంకాక్ వంటి విదేశాలకు బుకింగ్లు మొదలెట్టారు. ఏడాదికి వీడ్కోలు.. పాత సంవత్సరానికి గుడ్ బై చెప్పడం, నూతన ఏడాదికి నూతనోత్సాహాన్ని పొందడం కోసం కూడా ట్రావెలింగ్ డెస్టినేషన్లనే ఎంచుకుంటున్నారు ఈ తరం యువత. ఇయర్ ఎండ్ వేడుకలకైతే గోవాలాంటి మ్యూజికల్ నైట్స్ కోసం పరితపిస్తున్నారు నగర వాసులు. ఇందులో భాగంగానే హైదరాబాద్ నుంచి నేరుగా గోవాకు వేసిన కొత్త రైలు సేవలు పొందడానికి ముందస్తుగానే బెర్త్ కరారు చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆలస్యంగా బుక్ చేస్తే ఈ చార్జీలు మరింత పెరిగిపోతాయని ఇప్పటికే చాలా టూర్స్ ప్లానింగ్, బుకింగ్ పూర్తయ్యాయని గూగుల్ చెబుతుంది. ఈ వేదికల్లో అవకాశం లేకపోతే ప్రైవేటు ట్రావెల్స్ను సైతం ఆశ్రయిస్తూ, సెల్ఫ్ డ్రైవింగ్కు సై అంటున్నారు. ఈ నేపథ్యంలో నగరంతో పాటు దేశంలోని వివిధ పర్యాటక ప్రాంతాల్లోని ట్రావెలింగ్ ఏజెన్సీలు, ఈవెంట్ ఆర్గనైజర్లు ముందస్తు పండగలు చేసుకుంటున్నారు.గోవా పార్టీలకు... యేడాది చివరి వేడుకలకు నగర యువత భారీగా ఆసక్తి చూపిస్తోంది. వీరిలో అత్యధికులు వెళ్లే ఏకైక డెస్టినేషన్ మాత్రం గోవానే. ఎందుకంటే..నగర కల్చర్లో భాగంగా పంబ్ పారీ్టలు, లైవ్ కాన్సర్ట్, డీజే మ్యూజిక్ వంటి ట్రెండ్స్ని ఆస్వాదించే వారు, ప్రకృతిని కోరుకునే వారు వేరు వేరుగా ఈస్ట్ గోవా, నార్త్ గోవాలను ఎంచుకుంటారు. తమకు అనుకూలమైన, అనువైన స్పాట్స్ను ముందస్తుగానే ఎంచుకుని అందుకు అనుగునంగా ప్రయాణాలకు టికెట్లను బుక్ చేసుకుంటున్నారు. ఈ లిస్ట్లో వైజాగ్, అరకు వ్యాలీ సైతం టాప్లోనే ఉన్నాయి.ఎతైన ప్రదేశాలకు.. ఇప్పటికే ఈ సీజన్లో దక్షిణాది రాష్ట్రాల్లోని కూర్గ్, ఊటీ, మున్నార్, వయనరాడ్, కొడైకెనాల్, ఇడుక్కి, యరక్కాడ్, కున్నూర్ వంటి హిల్ స్టేషన్స్కి భారీగా టికెట్లు బుక్ అయ్యాయని లోకల్ ట్రావెల్ ఏజెన్సీల నిర్వాహకులు చెబుతున్నామాట. దీంతోపాటు ఈ మధ్య కాలంలో మనాలి, డార్జిలింగ్, సిమ్లా, షిల్లాంగ్ వంటి చల్లటి ప్రకృతి ప్రాంతాలను ఆస్వాదించడానికి ఉవి్వళ్లూరుతున్నారు. ఈ ట్రిప్స్లో భాగంగానే నార్త్కు ఎక్కువగా ప్రయాణమవుతున్నారు. అంతేకాకుండా సాంస్కృతిక వైవిధ్యాన్ని తిలకించడానికి కేరళ, ఊటీ వంటి ప్రదేశాలను వారి గమ్యస్థానాలుగా చేర్చుకున్నారు. -
భాగ్యనగర్.. బిస్కెట్ కా ఘర్..
హైదరాబాద్ అంటే బిర్యానీ.. బిర్యానీ.. అంటే హైదరాబాద్.. ఈ రెండింటికీ మధ్య విడదీయరాని బంధం అలాంటిది. ఈ విషయం భాగ్యనగర వాసులతోపాటు ప్రపంచమంతా తెలిసిందే.. ఎందుకంటే దశాబ్దాల తరబడి బిర్యానీకి హైదరాబాద్ నగరం కేరాఫ్ అన్నట్టుగా మారింది. అయితే మన చవులూరించే చరిత్ర కేవలం బిర్యానీ మాత్రమే కాదు.. దీంతోపాటు పలు రకాల బిస్కెట్లకు కూడా గుర్తింపు ఉందని అంటున్నారు నగరానికి చెందిన బేకరీ నిర్వాహకులు. ఈ బిస్కెట్స్లో ఇరానీ చాయ్తో జోడీ కట్టేవి కొన్నయితే.. క్రిస్మస్ లాంటి పండుగల సందర్భంగా ఇచ్చిపుచ్చుకునే గిఫ్ట్ ప్యాకెట్స్గా మారేవి మరికొన్ని. అలాంటి కొన్నింటిపైనే ఈ కథనం.. నాటి నిజామ్ మీర్ ఉస్మాన్ అలీఖాన్ కాస్త సాల్ట్, కాస్త స్వీట్ కలగలిసిన రుచికరమైన ఈవెనింగ్ స్నాక్స్ కోసం చేసిన అన్వేషణే ఉస్మానియా బిస్కెట్కి ఊపిరిపోసిందని చరిత్ర చెబుతోంది. ఆయనే నిర్మించిన ఉస్మానియా ఆస్పత్రిలో రోగులకు అల్పాహారంగా కూడా ఇది వినియోగించారని చరిత్రకారులు చెబుతుంటారు. దేశంలోనే రాజ ప్రాసాదం నుంచి వచి్చన రాయల్ గుర్తింపు కలిగిన తొలి బిస్కెట్గా దీన్ని చెప్పొచ్చు. వెన్న, పంచదార, కస్టర్డ్ పౌడర్, సోడా, యాలకుల పొడి, కుంకుమ పువ్వు, పాల మేళవింపుతో ఈ బిస్కెట్ అప్పుడు రోగుల ఆరోగ్య పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని తయారైందట. తొలి రాయల్ బిస్కెట్.. కాగా ఈ రాయల్ బిస్కెట్ని నగర మార్కెట్కి పరిచయం చేసింది మాత్రం సుభాన్ బేకరీ. ఉస్మానియా బిస్కెట్ పేరుతో మార్కెట్లోకి విడుదలైన ఈ బిస్కెట్ను ఒక కప్పు ఇరానీ చాయ్తో ఆస్వాదించడం అప్పుడు.. ఇప్పుడూ.. ఎప్పుడూ హైదరాబాదీలకు నిత్యకృత్యం. హిస్టారికల్ టూటీ ఫ్రూటీ.. పురాతన హైదరాబాదీ బిస్కెట్గా గుర్తింపు పొందిన మరొకటి ఫ్రూట్ బిస్కెట్. ఇది రోజువారీ వినియోగం కన్నా.. ఇచ్చి పుచ్చుకునే బహుమతిగా టూటీ ఫ్రూటీ ప్యాక్ బాగా పేరొందింది. నగరవాసులు విదేశీ పర్యటనకు వెళ్లడానికి ముందుగా కరాచీ బేకరీ నుంచి పుట్టిన ఫ్రూట్ బిస్కెట్ను ప్యాక్ చేయించుకోవడం చాలా మందికి అలవాటు.వెనీలా రుచుల చంద్రవంక.. చంద్రవంక ఆకారంతో ఉంటుంది కాబట్టి ఈ బిస్కెట్కి ఆ పేరు పెట్టారు. ఇది తేలికపాటి తీపితో మధ్యకు విరిగిన ఆకృతి కలిగి ఉంటుంది. ఈ బిస్కెట్లను తరచూ వెనిలా లేదా పాలతో బేక్ చేసి, వాటికి సున్నితమైన, లలితంగా ఉండే రుచిని అందజేస్తారు. వీటినే టూటీ ఫ్రూటీ బిస్కెట్స్ అని కూడా అంటారు. వీటి ధరలు సుమారు కిలో రూ.400 నుంచి రూ.500 మధ్యలో ఉన్నాయి. చాయ్తో.. ఫైన్ బిస్కెట్.. నగరంలోని బేకరీలలో దీర్ఘకాల వారసత్వం కలిగిన మరొక హైదరాబాదీ ట్రీట్గా దీన్ని చెప్పొచ్చు. దీనిని పలుచని పొరలుగా వేయడం అనేది కొంత శ్రమతో కూడిన ప్రక్రియగా తయారీదారులు చెబుతారు. ఈ బిస్కట్లో పంచదార పాకం, కొద్దిగా మంచిగా పెళుసైన క్రస్ట్ ఉంటుంది. ఇది ఇరానీ చాయ్తో మరో చక్కని కాంబినేషన్. చాయ్లో ముంచినప్పుడు మెత్తగా మారి దానికి సరికొత్త తీపిని జోడిస్తుంది. ఇది కిలో రూ.300 నుంచి ఆపైన అందుబాటులో ఉన్నాయి. రుచికి దాసోహం ‘కారా’.. ఇది నగర టీ సంస్కృతి ప్రత్యేకతకు దోహదం చేసే మరో రుచికరమైన బిస్కెట్ ఖారా.æ వీటిని పిండి, వెన్నతో పాటు మరికొన్ని సుగంధ ద్రవ్యాల మిశ్రమంతో తయారు చేస్తారు. తరచుగా జీలకర్ర లేదా నువ్వులు కూడా ఈ మేళవింపులో చోటు చేసుకుంటాయి. ఇవి చాయ్ రుచికి మసాలాని జోడించి వైవిధ్యభరితమైన ఆస్వాదనను అందిస్తాయి. ఇది కిలో రూ.350 నుంచి రూ.400 మధ్య అందుబాటులో లభిస్తుంది.ఛాయ్ అండ్ ‘టై’.. సూపర్ భాయ్.. ప్రత్యేకమైన విల్లు–టై ఆకృతి ద్వారా ప్రసిద్ధి చెందిన ఈ బిస్కెట్లు కొంచెం గట్టిగా ఉంటాయి. ఇవి ఒక కప్పు ఇరానీ చాయ్కి అద్భుతమైన కాంబినేషన్గా చెప్పొచ్చు. వీటి తేలికైన, పొరలతో కూడిన రుచి తియ్యటి బిస్కెట్ల నుంచి వేరు చేస్తుంది. కిలో రూ.300 నుంచి రూ.350 వరకూ ఉంటుంది.బిస్కెట్ల చరిత్ర అ‘పూర్వం’.. బిర్యానీ కన్నా అతి పురాతన చరిత్ర కలిగిన బిస్కెట్లు మన నగరానికి ఉన్నాయి. అయితే చాలా మందికి వాటి విశేషాలు తెలియవు. బిస్కెట్స్లో మేం పరిచయం చేసిన ఉస్మానియా బిస్కెట్ విదేశాలకు సైతం ఎగుమతి అవుతుంది. చాంద్ బిస్కెట్, టై బిస్కెట్ వంటివి ఇప్పటికీ పలువురు రాజకీయ ప్రముఖులు సైతం రెగ్యులర్గా ఆర్డర్ చేస్తుంటారు. ముఖ్యంగా వింటర్ సీజన్లో ఛాయ్కి డిమాండ్ ఎక్కువ.. దీంతో పాటే ఖారా వంటి బిస్కెట్స్కి డిమాండ్ పెరుగుతుంది. – సయ్యద్ ఇర్ఫాన్, సుభాన్ బేకరీ టేస్ట్ ఎంజాయ్ చేయాలంటే.. ఈ బిస్కెట్ల ఒరిజినల్ టేస్ట్ని ఎంజాయ్ చేయాలంటే కొంత ఎంక్వయిరీ చేసుకుని వెళ్లాల్సిందే. ఎందుకంటే.. కొన్ని పాత బేకరీలు మాత్రమే వాటిని పాత పద్ధతిలో తయారు చేస్తున్నాయి. ‘1951లో మా తాత మొహమ్మద్ యాసీన్ ఖాన్ బేకరీని ప్రారంభించినప్పుడు, జనాదరణ పరంగా అగ్రస్థానంలో ఉస్మానియా బిస్కెట్ ఉండగా ఆ తర్వాతి స్థానాల్లో ఖారా బిస్కెట్, చాంద్ బిస్కెట్, ఫైన్ బిస్కెట్, టై బిస్కెట్ ఉండేవి. ఇవి అప్పట్లో ఎంతగా ప్రాచుర్యం పొందాయంటే, అవి లేకుండా అల్పాహారం, టీ సమయం మాత్రమే కాదు, పెళ్లి విందులు సైతం ఉండేవి కావు. ఇప్పటికీ వీటిని రెగ్యులర్గా వినియోగించేవాళ్ల వల్ల తగినంత డిమాండ్ ఉంది’ అని రోజ్ బేకరీ యజమాని ముజాఫర్ ఖాన్ అంటున్నారు. కాగా సోషల్ మీడియా ట్రెండ్స్తో మమేకమవుతున్న నేటి యువతకు హైదరాబాద్ సంప్రదాయ బిస్కెట్ల గురించి తెలియజేయాల్సిన అవసరం ఉంది అంటున్నారు నగరంలోని పలువురు బేకరీల నిర్వాహకులు. -
భలేవాడివి బాసు!
ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతత చాలా అవసరం. శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం బాగుంటేనే ప్రతిరోజూ ఆనందం ఉంటుంది. అసలే దూరాభారం ప్రయాణాలు, ట్రాఫిక్ చిక్కులు, టార్గెట్లు వంటి కారణాలతో అలిసిపోవడం సహజం.. అయితే మన రోజువారీ ఆరోగ్య పరిస్థితిని ఇలాంటి అనేక అంశాలు ప్రభావితం చేస్తుంటాయి. అన్నింటి కన్నా మనపై ఉన్న బాస్ ప్రవర్తనను బట్టే మన మానసిక ఆరోగ్యం ఆధారపడి ఉంటుందని తాజా పరిశోధనల్లో తేలింది. మనం పనిచేసే ప్రాంతం బాగుంటే మానసిక ప్రశాంతత ఉంటుందని మానసిక నిపుణులు, పరిశోధకులు చెబుతున్నారు. ఎందుకంటే రోజుకు కనీసం 9 గంటల పాటు ఆఫీస్లోనే గడపాల్సి వస్తుంది కాబట్టి.. అక్కడి వాతావరణం బాగుంటేనే మిగతా రోజంతా సులువుగా గడిచిపోతుందని పేర్కొంటున్నారు. పై అధికారి శాడిస్టు అయితే మానసిక ఆరోగ్యంతో పాటు మన పనితనం, భవిష్యత్తు, ఇతరులతో సంబంధాలు కూడా దెబ్బతింటాయని చెబుతున్నారు నిపుణులు. దీర్ఘకాలిక ప్రభావం.. ఆఫీస్లో బాస్ ప్రవర్తన సరిగ్గా లేకపోతే.. అది ఉద్యోగిపై స్వల్పకాలికంగా కాకుండా దీర్ఘకాలికంగా ప్రభావం చూపుతుందని మానసిక వైద్య నిపుణులు చెబుతున్నారు. ఎప్పుడూ నెగెటివిటీతో బాస్ మాట్లాడుతుంటే ఉద్యోగుల సొంత తెలివితేటలపైనే అనుమానం వస్తుంటుంది. వారిని వారే తక్కువ అంచనా వేసుకోవడంతో పనితీరు కూడా మందగిస్తుందని నిపుణులు చెబుతున్నారు. చివరకు ఉద్యోగంపై విరక్తి కలిగి రాజీనామా చేసేంత వరకూ వెళ్తుందని పేర్కొంటున్నారు. మోటివేషన్ ఉండాల్సిందే.. పని చేసే ప్రదేశంతో నెగెటివ్ వాతావరణం కన్నా మోటివేషన్ ఉంటే ఉద్యోగులు క్రియాశీలకంగా పనిచేస్తుంటారని, చేసిన పనికి మెచ్చుకోలు లేకపోయినా కనీసం కించపరిచేలా మాట్లాడటం, అందరి ముందు మందలించడం వంటి పనులు చేస్తే మానసిక వేదనకు గురై.. పని తీరు మందగిస్తుందని పేర్కొంటున్నారు. పనిచేసే ప్రదేశంలో ఆరోగ్యకరమైన పోటీతత్వం, స్వతంత్రత, చుట్టుపక్కల వారితో సత్సంబంధాలు ఉంటే ఉద్యోగులకు మోటివేషన్ వస్తుందని పేర్కొంటున్నారు. అప్పుడు పనితీరులో కూడా మెరుగుదల ఉంటుందని చెబుతున్నారు.ఎలా బయటపడాలి..?కర్కశమైన బాస్ కింద పనిచేసిన వారి మానసిక స్థితిని మళ్లీ తిరిగి పొందొచ్చని నిపుణులు సలహా ఇస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పనిచేయడం కన్నా అక్కడి నుంచి వెళ్లిపోయి వేరే ఉద్యోగం వెతుక్కోవడం మంచిదని సూచిస్తున్నారు. ఇక, పాత ఆఫీస్ జ్ఞాపకాలను మర్చిపోయి.. ఆత్మన్యూనత భావం నుంచి బయటపడటం కాస్త కష్టమైనా కూడా సాధించొచ్చని చెబుతున్నారు. మన శక్తి సామర్థ్యాలను గుర్తు చేసుకుని, మనం గతంలో సాధించిన విజయాలను నెమరువేసుకుంటూ ఉండాలని పేర్కొంటున్నారు. మన మంచి కోరే సహోద్యోగులతో మనం చేసిన పనిపై ఫీడ్బ్యాక్ తీసుకుంటూ ఉండాలని, చిన్న చిన్న లక్ష్యాలను నిర్దేశించుకుని, వాటిని పూర్తి చేస్తుంటే మళ్లీ మనలో కాని్ఫడెన్స్ పెరుగుతుందంటున్నారు. కొత్త స్కిల్స్ నేర్చుకుంటూ ఆత్మ స్థైర్యం సాధించాలని పేర్కొంటున్నారు. ఆఫీస్లో మన చుట్టూ ఉన్న వాతావరణాన్ని ప్రొఫెషనల్గా ఉండేలా చూసుకోవాలని సూచిస్తున్నారు.వ్యక్తిగత సంబంధాలపై ప్రభావం.. ‘ఎక్కువ కాలం ఇలాంటి వాతావరణంలో పనిచేయడంతో నేర్చుకునే తత్వం తగ్గిపోతుందని, కొత్త విషయాలు రూపకల్పన చేయడం, సృజనాత్మకత పెంచేందుకు దోహదపడే డోపమైన్ తగ్గుముఖం పట్టి.. కారి్టసాల్ స్థాయి పెరిగుతుందని ఢిల్లీకి చెందిన సైకోథెరపిస్టు డాక్టర్ చాందినీ చెబుతున్నారు. అద్భుతంగా ఎలా పని చేయాలా..? అని ఆలోచించడం మానేసి.. తన మీదికి రాకుండా ఏం చేయాలనే దానిపైనే దృష్టి సారిస్తారని ఆమె వివరించారు. ఆఫీస్ వాతావరణం చాలాకాలం పాటు సరిగ్గా లేకుంటే ఉద్యోగులకు వేరే వారితో సంబంధాలు దెబ్బతింటాయని, అలాగే వ్యక్తిగత జీవితంలో కూడా ఇబ్బందులు ఎదురవుతాయని మానసిక వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. దీంతో మత్తు పదార్థాలు తీసుకునే అలవాటు చేసుకుంటారని, అలాగే శారీరక ఆరోగ్యం కూడా దెబ్బతింటుందని హెచ్చరిస్తున్నారు.లీడర్షిప్ ముఖ్యం.. ఆఫీస్ వాతావరణం చెడిపోడానికి కారణాల్లో ప్రధానమైనది లీడర్షిప్ లేకపోవడం. బాస్ సరిగ్గా లేకపోవడం వల్లే ఇలాంటి పరిస్థితులు ఏర్పడుతాయని చెబుతున్నారు. బాస్కు నాయకత్వ లక్షణాలు లేకపోతే తాను చెప్పాలనుకున్న విషయాలు ఉద్యోగులకు వ్యక్తీకరించలేరు. దీంతో ఉద్యోగులకు ఉన్న సమస్యలు నేరుగా చెప్పుకోలేరు. పక్షపాత వైఖరి, అసాధ్యమైన టార్గెట్లు పెట్టడం కూడా వారి మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుందని చెబుతున్నారు. ఒత్తిడితో పాటు ఆందోళన పెరుగుతుందని పేర్కొంటున్నారు. తద్వారా ఆఫీస్ వాతావరణం పూర్తిగా చెడిపోతుందని హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ఐటీ రంగంలో ఇటీవల ఆత్మహత్యలు పెరుగుతున్న నేపథ్యంలో తాజా ఈ అధ్యయనం ప్రాధాన్యత సంతరించుకుంది.అనేక ఆరోగ్య సమస్యలు.. పనిచేసే ప్రదేశంలో బాస్ సపోర్టు ఉంటే ఉద్యోగులు వ్యక్తిగతంగా ఎదుగుదలకు ఉపయోగపడటమే కాకుండా సంస్థ పనితీరు కూడా బాగుంటుంది. ఏం చేసినా తప్పులు వెతకడం, విమర్శలు చేస్తుండటం వల్ల ఒత్తిడి, ఆందోళనకు గురవుతారు. ఆర్థిక పరిస్థితుల కారణంగా ఆ ఉద్యోగాన్ని వదిలి వెళ్లలేక, అక్కడే భరించలేక తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతుంటారు. ఈ పరిస్థితులను ఎవరికీ చెప్పుకోలేక నిద్రలేమి, హృద్రోగ సమస్యలు తలెత్తుతాయి. బాస్ ప్రవర్తనతో ఎలాంటి సమస్యలు వస్తున్నాయో కుదిరితే నేరుగా చెప్పి సమస్యలను పరిష్కరించుకోవాలి. నచ్చిన వారితో కాసేపు ప్రశాతంగా గడిపినా, ఫోన్లో మాట్లాడినా మనసులోని బరువు తగ్గి మానసిక ప్రశాంతత చేకూరుతుంది. – డాక్టర్ పి.హరీశ్, కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్ -
కాన్వాస్పై.. సిటీ లైఫ్వ్..
నగరవ్యాప్తంగా అర్బన్ స్కెచ్చర్ల ఈవెంట్లు లైవ్ స్కెచ్లతో జీవనశైలికి చిత్రరూపం హబ్సిగూడలోని సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ శాస్త్రవేత్తలకు గత నవంబరు 9న ఓ వైవిధ్యభరిత అనుభవం ఎదురైంది.. తమ ప్రాంగణంలోకి వచి్చన కొందరు ఔత్సాహిక చిత్రకారులు తమ ల్యాబ్స్ సహా పరిసరాలను బొమ్మలుగా గీస్తుంటే ఆసక్తిగా గమనించడం అంతకు ముందెన్నడూ ఎరుగని అనుభూతి. ‘ఇది మా 298వ స్కెచ్ంగ్ ట్రిప్. శాస్త్రవేత్తల పని చూసినప్పుడు ఎంతో అబ్బురం అనిపించింది. ఆ పని, పరిసరాలు మా కళకు స్ఫూర్తిని అందించాయి’ అంటూ అర్బన్ స్కెచ్చర్స్ ప్రాంతీయ అడ్మిన్స్లో ఒకరైన సయ్యద్ జీషన్ అహమద్ చెప్పారు. నగరాన్నే తమ కాన్వాస్గా మార్చుకుని వారాంతాల్లో లైవ్స్కెచ్ డ్రైవ్ నిర్వహిస్తున్న అర్బన్ స్కెచ్చర్స్ ఈ నెలలో 300వ మైలురాయిని చేరుకుంది. ఈ అరుదైన సందర్భాన్ని వీరు నెల రోజుల వేడుకగా మార్చారు. ‘ఒక రోజులో ఒకే ఈవెంట్ జరుపుకునే బదులు, నెల అంతటా నిర్వహించాలని అనుకున్నాం’ అని అర్బన్ స్కెచర్స్ సహ వ్యవస్థాపకుడు సాఫ్ట్వేర్ ఆర్కిటెక్ట్ ఫరాజ్ ఫర్షోరి చెప్పారు. స్కెచ్ వేద్దాం రా.. బొమ్మలు వేద్దాం రా.. అంటూ ఆహా్వనించే ఈ అర్బన్ స్కెచ్చర్స్ అనే గ్రూప్ అమెరికాలో గాబ్రియేల్ క్యాంపెనారియో అనే వ్యక్తి వాషింగ్టన్లో ప్రారంభించిన ఒక అంతర్జాతీయ వేదిక. నగరాల్లో తమకు నచి్చన ప్రదేశాన్ని ఎంచుకుని లైవ్ స్కెచ్ వేసే ఔత్సాహిక చిత్రకారుల నెలవు. నగరంలో ఈ గ్రూపు నవంబర్ 2017లో ట్యాంక్ బండ్లోని బోట్ క్లబ్ను స్కెచ్ చేయడంతో దాని మొదటి ఈవెంట్ నిర్వహించింది. అప్పటి నుంచి వివిధ ప్రదేశాల్లో వారానికో రెండు గంటల సెషన్ చొప్పున దాదాపు 30–60 మంది సభ్యులు నగర విశేషాలను కాగితంపై బంధిస్తున్నారు. వీరంతా బొమ్మలు గీశాక వాటిని ఆన్లైన్లో పోస్ట్ చేస్తారు. అలా వీరి అభిరుచి వివిధ రంగాలకు చెందిన వ్యక్తులను ఒకచోట చేర్చింది. ‘మాలో చాలా మంది ప్రొఫెషనల్స్ కాదు, దీనిని వారాంతపు అభిరుచిగా కొనసాగిస్తున్నవారు మాత్రమే’ అని ఫరాజ్ చెప్పారు. అర్బన్ స్కెచ్చర్స్కు చెందిన జీషన్ అహ్మద్ మాట్లాడుతూ.. ‘ఇషాక్, ఫరాజ్ ఫర్షోరీ ఆధ్వర్యంలో హైదరాబాద్ చాప్టర్ ఒక ఐదుగురు మాత్రమే హాజరైన చిన్న స్కెచ్ మీట్తో ప్రారంభమైంది, ఇప్పుడు 7–70 సంవత్సరాల వయసు గల ఎందరో సభ్యులకు విస్తరించింది’ అన్నారు. ‘ఇది కళ ద్వారా హైదరాబాద్ ఆత్మను సంగ్రహించే’ ప్రయత్నంగా ఫరాజ్ అభివరి్ణంచారు.కళాత్మక అనుబంధం.. ‘నా పరిసరాలను శ్రద్ధగా గమనించడానికి రికార్డ్ చేయడానికి ఇది గొప్ప మార్గం’ అన్నారు అమెరిగో ఎడ్యుకేషన్ కన్సల్టెంట్ డీ హు. తాను 2021లో వాషింగ్టన్లో ఉన్నప్పుడు అర్బన్ స్కెచ్చర్స్లో చేరారు. ప్రస్తుతం నగరంలో నివసిస్తున్న డీ హు కేఫ్లు, డాక్టర్ అపాయింట్మెంట్లకు కూడా తన స్కెచ్బుక్ తీసుకెళతారు. తాను స్కెచ్ గీసిన ప్రతి ప్రదేశం తన జీవితంలో భాగమే. ఇది ఫొటో తీయడం కంటే గాఢంగా అనిపిస్తుంది’ అంటూ చెప్పారామె. గత వారం అర్బన్ స్కెచ్చర్స్ వర్క్షాప్లో భాగమైన నరేష్ మాట్లాడుతూ, ‘నేను కళ ద్వారా ప్రపంచ సౌందర్యాన్ని కనుగొనాలని అనుకుంటున్నాను’ అని అన్నారు. ‘నాలాంటి ఆసక్తిగల కొత్త వ్యక్తులను కలవడం ద్వారా కొందరు స్నేహితులను సంపాదించుకున్నాను. ఇది నా దినచర్యకు భిన్నం.. ప్రశాంతతని అందించే కళాత్మక థెరపీలా అనిపిస్తుంది’ అన్నారు సుజిత. తన 12 ఏళ్ల కూతురితో ఈ ఈవెంట్కు హాజరైన మరో గృహిణి మాట్లాడుతూ.. ‘నా బిడ్డ కేవలం సోషల్ మీడియాతో మమేకం అయిపోవడం నాకు ఇష్టం లేదు. తను స్క్రీన్లకు మించిన జ్ఞాపకాలను పొందాలని కోరుకుంటున్నాను’ అన్నారు.ట్రిపుల్ సెంచురీ.. ఈవెంట్ల సందడి.. ఈ నెల తమ ఈవెంట్ల సంఖ్య 300కి చేరుకున్న సందర్భంగా వీరు మరింత తరచూ స్కెచి్చంగ్ ట్రిప్స్ ఏర్పాటు చేస్తున్నారు. గత ఆదివారం అబిడ్స్లో ఈ గ్లోబల్ కమ్యూనిటీ ఆఫ్ ఆరి్టస్ట్స్ సభ్యులు సండే బుక్ ఫెయిర్, తాజ్ మహల్ హోటల్, మొజామ్జాహి మార్కెట్లను స్కెచ్గా వేశారు. గత డిసెంబర్ 8న బంజారాహిల్స్లో జరిగిన స్కెచ్చింగ్ సెషన్లో లామకాన్, జీవీకే మాల్, సిటీ సెంటర్ షాపింగ్ ఏరియా కవర్ చేశారు. ఇక డిసెంబర్ 22లోపు.. ఓల్డ్ సిటీలో బారా గల్లి, హుస్సేనీ ఆలం, చారి్మనార్.. వీరి మెనూలో ఉన్నాయి.ఎవరైనా సరే వెల్కమ్.. ‘సమూహంలో చేరడానికి నైపుణ్యం స్థాయి ఏదీ అడ్డంకి కాదు. ప్రొఫెషనల్ ఆరి్టస్ట్ కానవసరం లేదు. అయితే ఇందులో పాల్గొనేవారు తమ సొంత స్టేషనరీని తీసుకురావాలని, ఎంచుకున్న ప్రదేశంలో కనిపించిన దేనినైనా సరే స్కెచ్గా గీయవచ్చు’ అని జీషన్ వివరించారు. వర్ధమాన చిత్రకారులు రాణించడంలో సహాయపడుతూ వాటర్ కలర్స్, స్కెచి్చంగ్, చార్క్కోల్ డ్రాయింగ్ వంటి ప్రాథమిక విషయాలపై ఉచిత వర్క్షాప్లను కూడా అర్బన్ స్కెచ్చర్స్ నిర్వహిస్తోంది. వారాంతాల్లో ఈ సెషన్లకు హాజరు కావాలనిఇ అనుకున్నవారు సోషల్ మీడియా పేజీల ద్వారా మరిన్ని వివరాలను తెలుసుకోవచ్చు. -
విదేశీ పండ్లకు పెరిగిన క్రేజ్
అమెరికా స్ట్రాబెర్రీ, న్యూజిలాండ్ కివీ, వాషింగ్టన్ యాపిల్, కాలిఫోర్నియా ద్రాక్ష, ఆస్ట్రేలియా ఆరెంజ్, థాయిలాండ్ డ్రాగన్ ఇలా అనేక రకాల విదేశీ పండ్లు ప్రసుత్తం నగర మార్కెట్లో దర్శనమిస్తున్నాయి. దీంతో విదేశీ పండ్ల రుచులను ఆస్వాదించడానికి నగర వాసులు ఆసక్తి చూపుతున్నారు. దీంతో రోజు రోజుకూ నగరంలో వీటి అమ్మకాలు భారీగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో సగటున రోజుకు 50–60 టన్నుల మేర అమ్మకాలు జరుగుతున్నాయని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. సుమారు 18 దేశాల నుంచి వివిధ రకాలు దిగుమతి చేసుకుంటున్నట్లు వ్యాపార వర్గాల చెబుతున్న మాట. కాగా ఈ మొత్తం ప్రక్రియలో అమ్మకాలు, దిగుమతులు గణనీయంగా పెరిగాయని, దీంతో విదేశీ పండ్ల విక్రయాల్లో నగరం దేశంలోనే మూడో స్థానంలో ఉందని తెలుస్తోంది.. ఒకప్పుడు స్థానికంగా దొరికే ఫలాలే సామాన్య, మధ్య తరగతి ప్రజలు కొనుగోలు చేసేవారు. వివిధ దేశాల నుంచి దిగుమతి చేసుకునే ఫలాలు ఎగువ మధ్య తరగతి వారు, లేదా ధనవంతులు మాత్రమే కొనుగోలు చేసేవారు. అయితే మారుతున్న పరిస్థితులు, గ్లోబల్ మార్కెటింగ్లో భాగంగా ప్రతిదీ సామాన్యులకు అందుబాటులకి వచి్చంది. పైగా వాటికి ఉన్న క్రేజ్ను దృష్టిలో పెట్టుకుని వ్యాపారులు వాటి అమ్మకాలు చేస్తున్నారు. ప్రస్తుతం ప్రపంచ దేశంలో అందుబాటులో ఉన్న అనేక రకాల పండ్లు నగర మార్కెట్లో అందుబాటులో అమ్మకాలు జరుగుతున్నాయి... మాల్స్ నుంచి లోకల్ మార్కెట్కి.. విదేశీ పండ్లు ఒకప్పుడు పెద్ద పెద్ద మాల్స్లోనో.. లేదా సూపర్ మార్కెట్స్లోనో అమ్మకాలు జరిగేవి... అయితే విదేశీ పండ్లు నగరంలో మాల్స్, ఫ్రూట్ షాప్స్ నుంచి తోపుడు బండ్లపై అమ్మకాలు జరుగుతున్నాయి. పైగా దేశీయ పండ్ల ధరలకు సమానంగా వీటిని విక్రయిస్తున్నారు. దీంతో అన్ని వర్గాల ప్రజలూ వీటిని కొనుగోలు చేస్తున్నారు. గతంలో ఏదో ఒక సీజన్లో మత్రమే దేశయ మార్కెట్లో అందుబాటులో ఉండేవి. ప్రస్తుతం వివిధ దేశాల పండ్లు అక్కడి సీజన్ల ప్రకారం మార్కెట్కు దిగుమతి అవుతున్నాయి. దీంతో యేడాది పొడవునా ఏదో ఒక దేశం నుంచి అన్ని రకాల పండ్లూ అన్ని సీజన్లలో లభ్యమౌతున్నాయి. దేశంలోనే మూడో స్థానంలో.. విదేశీ పండ్లుగా పేరుగాంచిన కివీ, స్ట్రాబర్రీ, బ్లాక్ బెర్రీస్, అవకాడో వంటి పళ్లు నగరంలో విరివిగా లభ్యమవుతున్నాయి. భారీగా అక్కడి నుంచి దిగుమతులు చేయడం ఒక కారణమైతే.. లోకల్ మార్కెట్తో పాటు ఇళ్ల వెంబడి కూడా అమ్మకాలు చేయడమే మరో కారణమని బాటసింగారం మార్కెట్ వ్యాపార వర్గాలు చెబుతున్నారు. నగరంతో పాటు ఇతర రాష్ట్రాలకూ, జిల్లాలకూ ఇక్కడి నుంచే ఎగుమతులు జరుగుతాయి. అందుకే రాష్ట్రంలోనే బాటసింగారం పండ్ల మార్కెట్కు అతి పెద్దదిగా పెట్టింది పేరు. అయితే విదేశీ పండ్ల వినియోగంలో ముంబయి, బెంగళూరు తర్వాత నగరం మూడో స్థానంలో నిలిచింది. దిగుమతులు ఇలా.. గ్రీన్ యాపిల్కు ఇటీవల అదరణ పెరిగింది. నెదర్లాండ్స్, అమెరికా, ఫ్రాన్స్, ఇటలీ నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. యాపిల్ పళ్లను వాషింగ్టన్, చైనా, న్యూజిల్యాండ్, చిలీ, బెల్జియం నుంచి ముంబాయి, చెన్నై పోర్టు ద్వారా నగరానికి దిగుమతవుతాయి. అవకాడో టాంజానియా నుంచి, కివీ పండ్లు న్యూజిల్యాండ్, ఇటలీ, ఇరాన్తో పాటు చైనా నుంచి వస్తాయి. ఇదే క్రమంలో వివిధ పళ్లు ఇతర దేశాల నుంచి దిగుమతవుతున్నాయి. ప్రతి ఫలం..ఔషధ గుణం.. ప్లమ్.. చూడడానికి పెద్ద రెగు పండు సైజులో యాపిల్ను పోలివుంటుంది. ఇందులో క్యాల్షియం, సీ, బీ విటమిన్లు, మెగీ్నíÙయంతో పాటు ఇతర పోషకాలు మొండుగా ఉంటాయి. కివీ ఫ్రూట్లో విటమిన్ సీ, కే, ఇ అధికంగా ఉంటాయి. ఇక డ్రాగన్ ఫ్రూట్లో విటమిన్ సీ, ఫాస్పరస్, క్యాల్షియం, ఫైబర్తో పాటు యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. వ్యాధి నిరోధక శక్తితో పాటు కేన్సర్ను నియంత్రిస్తుంది. చెర్రీలో కార్బోహైడ్రేట్లు, షుగర్, విటమిన్ సీ, పోటాషియం పుష్కలంగా లభిస్తాయి. స్ట్రాబెర్రీలో విటమిన్ సీ, క్యాల్షియం అధిక స్థాయిలో ఉంటుంది.ఆన్లైన్లోనే ఆర్డర్స్.. వివిధ దేశాల నుంచి ఇక్కడి వ్యాపారులు ఆయా సీజనల్ ఫ్రూట్స్ని ఆన్లైన్ ద్వారానే దిగుమతి చేసుకుంటారు.. అదెలా అంటే.. పెరిగిన సాంకేతిక పరిజ్ఞానం ద్వారా వాట్సాప్, మెయిల్ ద్వారా పండ్ల నమునా ఫొటోలు పంపిస్తారు. దీంతో వ్యాపారులు ఆన్లైన్లో అడర్ ఇస్తారు. విదేశాల నుంచి ముంబయికి దిగుమితి అవుతాయి. అక్కడి నుంచి ఫ్రీజర్ ట్రాన్స్పోర్ట్ ద్వారా నగరానికి వస్తాయి.మార్కెట్లో వివిధ దేశాల పండ్లు ప్రపంచ వ్యాప్తంగా లభించే దాదాపు 20 రకాల విదేశీ పండ్లు గడ్డిఅన్నారం మార్కెట్కు కమీషన్ ఏజెంట్ల ద్వారా దిగుమతి అవుతున్నాయి. గతం కంటే ప్రస్తుతం దిగుమతులు పెరిగాయి. ట్రేడర్స్కు రెఫ్రిజిరేటర్ చాంబర్లు ఏర్పాటు చేశాము. దేశంలోని ఇతర పండ్ల మార్కెట్లతో పోలిస్తే నగర మార్కెట్లో అన్ని సౌకార్యలూ ఉన్నాయి. – ఎల్ శ్రీనివాస్, గడ్డిఅన్నారం వ్యవసాయ మార్కెట్ కార్యదర్శిపెరిగిన అమ్మకాలు గతంతో పోలిస్తే విదేశీ పండ్ల అమ్మకాలు పెరిగాయి. దీంతోపాటు నగరం ప్రజలకు కూడా విదేశీ పండ్లపై ఆసిక్తి పెరిగంది. కరోనా అనంతరం ప్రజల్లో ఆరోగ్యంపై కూడా శ్రద్ధ పెరగడం మరో కారణం.. దిగుమతులు కూడా విరివిగా జరుగుతుండడంతో ధరలు కూడా దేశీ పండ్ల స్థాయిలోనే ఉంటున్నాయి. యాపిల్, కివీ, పియర్స్తో పాటు మరికొన్ని విదేశీ రకాల వైపు కొనుగోలుదారులు మొగ్గు చూపుతున్నారు. – క్రాంతి ప్రభాత్రెడ్డి, విదేశీ పండ్ల హోల్సేల్ వ్యాపారి -
స్లిమ్ సెట్.. డైట్ మస్ట్
ఆధునిక జీవన శైలిలో నగరవాసుల ఆహారపు అలవాట్లు వేగంగా మారిపోతున్నాయి. యువత నుంచి మొదలైతే వయోవృద్ధుల వరకు స్లిమ్తో పాటు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నారు. అధిక బరువు నుంచి ఉపశమనం పొందాలని, శరీరంలోని అనవసరమైన కొవ్వులు కరిగించాలని తినే ఆహారం తగ్గిస్తున్నారు. మరో వైపు వ్యాయామంపై ఎక్కువ దృష్టి పెడుతున్నారు. దీంతో నీరసించిపోవడం, ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. నిత్యం మనతోనే ఉండే వారు లావుగా ఉన్నావని ఎత్తిపొడుపు మాటలకు బాధపడి కొంతమంది.. అధిక బరువు ఉన్నారని పెళ్లికి నిరాకరించడం, కాలేజీ, ఉద్యోగ ప్రాంగణంలో ఆకర్షణీయంగా కనిపించాలని మరికొంత మంది.. ఇలా ఎవరి అవసరాలు వారికి ఉన్నాయి. అవే స్లిమ్ సెట్ ట్రెండ్ సెట్ చేస్తున్నాయి. నగరంలో సుమారు 60 శాతం మంది 30 నుంచి 50 ఏళ్ల వయసు ఉన్నవారే నాజూగ్గా కనిపించాలని ఆరాటపడుతున్నారంటే ఆశ్చర్యం లేదు. మరో 20 శాతం నుంచి 30 శాతం మంది 14 నుంచి 29 ఏళ్ల వయస్కులు ఉండగా, సుమారు 10 శాతం మంది 50 ఏళ్లు దాటిన వారు ఈ తరహా స్లిమ్ సెట్ కోసం ట్రై చేస్తున్నారు. ఆరోగ్యకరమైన లైఫ్ స్టైల్ కావాలనుకునేవారు పౌష్టికాహారం వైపు అడుగులు వేస్తున్నారు. ఇది మంచిదే.. అయితే.. ఎవరైనా సరే నిపుణుల సూచనలు ఆచరణాత్మకంగా పాటిస్తారో అక్కడే మెరుగైన ఫలితాలు సాధించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. మితంగా తింటున్నారు.. నాజూగ్గా కనిపించాలని చాలా మంది యువత తిండి తగ్గించేస్తున్నారు. దీనికి తోడు ప్రొసెసింగ్ ఫుడ్ ఎక్కువ తీసుకుంటున్నారు. శరీరంలో ఉన్న ఫ్యాట్ తగ్గించడానికి డైట్ యాక్టివిటీ తప్పనిసరిగా ఉండాలి. కొంత మంది ప్రత్యేకంగా నడుము, పొట్ట, చేతులు వంటి ఒక పార్ట్నే లక్ష్యంగా స్లిమ్ చేయాలనుకుంటున్నారు. వారంలో 750 గ్రాముల నుంచి ఒక కేజీ వరకు బరువు తగ్గితే ఆరోగ్యకరంగా ఉంటుంది. మనం సాధారణ పనులు చేసుకోవడానికి నిత్యం శరీరానికి శక్తి అవసరం. దానికి అవసరమైన ఆహారం తప్పనిసరిగా తీసుకోవాలి. ఆహారం తగ్గిస్తే దాని ప్రభావం కండలు (మజిల్)పై కనిపిస్తుంది. నీరసం వస్తుంది. ఏ పని చేసుకోవాలన్నా ఇబ్బందిగా ఉంటుంది. వివిధ సంస్థలు ఒక కేజీ బరువు తగ్గడానికి సుమారుగా రూ.వెయ్యి నుంచి రూ.1,500 వరకు తీసుకుంటున్నాయి. ప్రొటీన్ పౌడర్ వాడేస్తున్నారు.. చాలా మంది ఈ మధ్య కాలంలో భోజనానికి ప్రత్యామ్నాయంగా ప్రొటీన్ పౌడర్ తీసుకుంటున్నారు. ప్రొటీన్ డబ్బా బయట మార్కెట్లో రూ.650 నుంచి రూ.1,500 వరకు అందుబాటులో ఉన్నాయి. ఆ వ్యక్తి లైఫ్ స్టైయిల్, బాడీ ప్యాటర్న్ బట్టి ప్రొటీన్ పౌడర్ తీసుకోవాలి. ఎక్కువ తీసుకోవడం మంచిది కాదు. మూడు పూటలా మీల్ రీప్లేస్మెంట్ ఆరోగ్యానికి ప్రమాదకరమని నిపుణులు పేర్కొంటున్నారు. ఉదయం మొలకెత్తిన గింజలు, రాగి జావ, తృణధాన్యాలు, ఫైబర్ ఫుడ్ వంటివి తీసుకోవడం వల్ల మేలు జరుగుతుంది. అయితే ఏదైనా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు మాత్రం నిపుణుల సూచనల మేరకు తీసుకోవడం మంచిది. ఫ్లూయిడ్స్ తీసుకోవడం వల్ల శరీరంలోని వ్యర్థాలు పోతాయి. ఆ ఆలోచన చేయవద్దు డైట్ నిరంతర ప్రక్రియగా ఉండాలి. ఒక్కసారి స్లిమ్ అయిపోవాలి.. వేగంగా బరువు తగ్గిపోవాలనే ఆలోచన చేయవద్దు. అది ఒక్క రోజులో వచ్చే ఫ్యాట్ కాదు. మూడు నెలల పాటు హెల్దీ లైఫ్ స్టైల్కు అలవాటు పడాలి. వ్యక్తి శరీరానికి ప్రధానంగా ప్రొటీన్, కార్బొహైడ్రేట్స్, ఫ్యాట్, ఫ్రూట్స్, వెజిటబుల్స్ అవసరం. ఉదయం బాడీ డిటాక్సేషన్ కోసం నిమ్మరసం, జీరా నీరు, మెంతుల నీరు, దనియాలు, జీలకర్ర, కాంబినేషన్లో సూచిస్తాం. దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారికి ప్రత్యేక మెనూ ఉంటుంది. – బి.కవిత, పౌష్టికాహార నిపుణురాలు, హైదరాబాద్సుమారు 30 కేజీలు బరువు తగ్గాను అధిక బరువుతో ఇబ్బందిగా ఉండేది. వెయిట్ లాస్ కోసం 2023 నుంచి న్యూట్రిషన్ సూచనలు ఫాలో అవుతున్నాను. ఇప్పటి వరకు సుమారు 30 కేజీలు తగ్గాను. అప్పటి ఇప్పటికి చూస్తే మనకి స్పష్టమైన తేడా కనిపిస్తోంది. బరువుతో బాధపడే సమయంలో నెమ్మదిగా ఉండేది. ఇప్పుడు పిల్లలతో చురుగ్గా పనులు చేసుకోగలుగుతున్నాను. లుక్ వైజ్గా చాలా తేడా వచి్చంది. ఫీల్ గుడ్. – వై.నిషిత, కూకట్పల్లి -
వింటర్ చిల్స్..
వింటర్ అంటేనే వెచ్చని పార్టీల సీజన్. చల్లని వాతావరణంలో పుట్టే లేజీనెస్ను వేడి వేడి క్రేజీ పార్టీస్ ద్వారా తరిమికొట్టడం సిటీ పార్టీ లవర్స్కి అలవాటు. అందుకే డిసెంబర్ నెల వచ్చెరా అంటే పార్టీలకు వేళాయెరా అన్నట్టు ఉంటుంది. క్రిస్మస్ నుంచి సంక్రాంతి వరకూ వరుసగా హోరెత్తే వేడుకల్లో అటు పండుగలు ఇటు న్యూ ఇయర్ లాంటి సంబరాలు కలగలసి ఎక్కడలేని సందడినీ మోసుకొస్తాయి. ఇప్పటికే చలితో పాటు పారీ్టల సందడి కూడా సిటీని కమ్ముకుంది. ఈ నేపథ్యంలో నగరంలో క్రేజీగా మారిన కొన్ని పార్టీస్టైల్స్ గురించి.. నలుగురమూ కలిశామా.. తిన్నామా.. తాగామా.. తెల్లారిందా.. అన్నట్టు కాకుండా తాము నిర్వహించే పార్టీలకు ఆసక్తికరమైన థీమ్ జతచేయడం అనే అలవాటు నగరంలో ఎప్పటికప్పుడు కొత్త పుంతలు తొక్కుతోంది. తమ వేడుకని కొన్ని రోజుల పాటు టాక్ ఆఫ్ ది టౌన్గా మార్చాలని పార్టీ లవర్స్ ఆలోచిస్తున్నారు. అందుకు అనుగుణంగా వెరైటీ థీమ్స్ అన్వేíÙస్తున్నారు. దీంతో వెరైటీ పార్టీస్ పుట్టుకొస్తున్నాయి వాటిలో కొన్ని.. ట్విన్నింగ్.. స్టన్నింగ్.. తల్లీ కూతుళ్లు కావచ్చు, తండ్రీ కొడుకులు కావచ్చు.. భార్యాభర్తలు కూడా కావచ్చు.. కలిసి పుట్టకపోయినా కవలలం కాకపోయినా మేం ఇద్దరం కాదు ఒక్కరమే.. అనే భావన వచ్చేలా అనుబంధాన్ని ఆవిష్కరించే అవకాశాన్ని అందిస్తుందీ ట్విన్నింగ్ పార్టీ. ఇటీవల నగరంలో పలు చోట్ల దీనిని ఏర్పాటు చేస్తున్నారు. ఈ పార్టీకి వచ్చే అతిథులు జంటగా వస్తారు. ఒకే రంగు దుస్తులు ధరించడం దగ్గర నుంచి వారిద్దరి మధ్య అనుబంధాన్ని వీలున్నన్ని మార్గాల్లో వ్యక్తీకరించడమే ఈ పార్టీల్లో థీమ్. ఫ్యూజన్.. ఫన్.. భారతీయతను, పాశ్యాత్య రీతులను కలగలిపేదే ఫ్యూజన్ పార్టీ. వీటినే ఇండో వెస్ట్రన్ పారీ్టస్ అని కూడా పిలుస్తున్నారు. ఈ పార్టీలో వేడుక జరిగే ప్రదేశం అలంకరణ నుంచీ వస్త్రధారణ వరకూ ఫ్యూజన్ శైలి ప్రతిఫలిస్తుంది. ఉదాహరణకు లాంతర్లు, దీపాలు వంటి సంప్రదాయ వెలుగుల సరసనే ఎల్ఈడీ లైట్స్ అలంకరించడం.. అదే విధంగా అతిథులు లెహంగా, స్కర్ట్స్కు క్రాప్ టాప్స్ను జత చేయడం లేదా కుర్తా షర్ట్స్కు జీన్స్ కలపడం.. ఇలా ఉంటుంది. వంటకాల నుంచి కాక్టైల్స్ వరకూ విందు వినోదాలన్నీ భారతీయ, పాశ్చాత్య మేళవింపుతోనే ఉంటాయి. రాయల్టీ.. పార్టీ.. ఇండియన్ రాయల్టీ థీమ్తో నిర్వహించే పార్టీలో అంతా రిచ్ లుక్ ఉట్టిపడుతుంది. సిల్్క, వెల్వెట్, గోల్డ్, రెడ్ రాయల్ బ్లూ.. కలర్ ఫ్యాబ్రిక్తో పార్టీ ప్రదేశం అంతా అలంకరణతో మెరిసిపోతుంటుంది. వింటేజ్ క్యాండిల్బ్రాస్, రాయల్ థ్రోన్స్, గ్రాండ్ షాండ్లియర్స్.. వగైరాలతో రిచ్ టచ్ ఇస్తాయి. అతిథులు ఖరీదైన దేశంలో పేరొందిన ప్రాంతాల దుస్తులు, షేర్వానీ.. వగైరాలు ధరిస్తారు. వెండి ప్లేట్లలో విందు వడ్డిస్తుంటే.. అందుకు తగిన నేపథ్యంలో లైవ్ గజల్స్ తరహా సంగీతాలు వినిపిస్తుంటాయి. బాలీవుడ్.. స్టైల్.. నగరం టాలీవుడ్కి కేరాఫ్ అయినప్పటికీ.. పారీ్టస్ ఇచ్చిపుచ్చుకోడంలో బాలీవుడ్ స్టైల్ పారీ్ట.. అంటూ ఒకటి ఉంది తప్ప టాలీవుడ్ థీమ్ ఇంకా తెరకెక్కలేదు. ఈ పారీ్టలో బాలీవుడ్ పోస్టర్స్, ఫెయిరీ లైట్స్, క్లాసిక్ బాలీవుడ్ లైవ్ మ్యూజిక్.. ఏర్పాటు చేస్తారు. అక్కడ ఏర్పాటు చేసిన డ్యాన్స్ ఫ్లోర్పై బాలీవుడ్ హిట్స్కి అతిథులు తమ అభిమాన చిత్రంలోని స్టెప్స్ జత చేస్తారు. ఈ పార్టీలోనే బెస్ట్ డ్యాన్సర్, మోస్ట్ గ్లామరస్ అవుట్ ఫిట్.. తదితర సరదా అవార్డ్స్ కూడా ఉంటాయి. పూల్.. పారీ్టస్.. నగరంలోని స్టార్ హోటల్స్లో మాత్రమే కాదు కొందరి సొంత భవనాల్లోనూ కొందరికి స్విమ్మింగ్ పూల్స్ ఉన్నాయి. కేవలం స్విమ్మింగ్కు మాత్రమే కాదు పారీ్టలకు కూడా పూల్ కేరాఫ్గా మారింది. పూల్ దగ్గర నిర్వహించే పారీ్టస్ కోసం పూల్ ఆవరణం మొత్తం ఆక్వా థీమ్తో డెకరేట్ చేస్తున్నారు. ఈవెంట్ మొత్తం పూల్ దగ్గరే జరుగుతుంది. వాటర్ గేమ్స్, ఆక్వా డ్యాన్స్ తదితర సరదా ఆటలూ పూల్ రీడింగ్స్ వంటి ఆసక్తికరమైన సెషన్లూ ఉంటాయి. పూల్ పారీ్టలో భాగంగా పగలూ రాత్రీ లైట్ల ధగధగల మధ్య నీళ్లలో జలకాలాటలు ఉర్రూతలూగిస్తాయి. పాట్ లాక్.. ఫుడ్ క్లిక్.. చాలా కాలంగా వాడుకలో ఉన్న సంబరాల శైలి ఇది. అయినప్పటికీ దీనికి ఇంకా క్రేజ్ తగ్గలేదు. ఇంట్లోనే నిర్వహించుకోవడం, ఎన్నో రకాల ఇంటి వంటలు ఆస్వాదించే వీలుండడం ఈ పాట్లాక్ని బాగా క్లిక్ చేసింది. పాట్లాక్ కోసం ఒక వ్యక్తి హోస్ట్గా ఉంటే ఆ వ్యక్తి ఇంటికి అందరూ తమకు బాగా నచి్చన, వచి్చన వంటకాన్ని తయారు చేసి తీసుకెళతారు. అలా పెద్ద సంఖ్యలో పోగైన ఆహారపదార్థాలను రుచి చూస్తూ గేమ్స్, అంత్యాక్షరి వంటివాటితో సందడిగా గడిపేస్తారు. ఆరోగ్యకరం.. ఆర్గానిక్.. ఆహారంలో, ఆహార్యంలో ఇప్పటికే సహజత్వంవైపు సిటిజనులు భారీగా దృష్టి సారించిన సంగతి తెలిసిందే. ఇప్పుడీ పోకడ పారీ్టస్కి కూడా అంటుకుంది. ఎకో ఫ్రెండ్లీ లేదా ఆర్గానిక్ పార్టీలు షురూ అయ్యాయి. నగరంలో చాలా మందికి శివార్లలో పార్మ్ హౌజ్లు ఉన్న నేపథ్యంలో ఒక్కోసారి ఒక్కో ఫార్మ్ హౌజ్లో పార్టీ ప్లాన్ చేసుకుంటున్నారు. అక్కడ కాసేపు ఆటపాటలతో పాటు సహజ పద్ధతిలో తయారైన వంటకాలను ఆస్వాదించి పచ్చని ప్రకృతిలో సేదతీరి తిరిగి వస్తున్నారు. డెస్టినేషన్..ప్యాషన్.. ఉన్న ఊర్లో సెలబ్రేషన్స్ చేసుకోవడం ఎలా ఉన్నా.. ఊరు దాటి వెళ్లాం అంటే తెలియని ఫ్రీడమ్ ఫీలింగ్ వచ్చేసి ఆటోమెటిగ్గా సందడి మొదలైపోతుంది. డెస్టినేషన్ పారీ్టలు నగరంలో క్లిక్ అవడానకి కారణం అదే. ప్రస్తుతం బ్యాచిలర్ పారీ్టలు ఎక్కువగా డెస్టినేషన్ ఈవెంట్స్గా మారాయని నగరానికి చెందిన ఉత్సవ్ ఈవెంట్స్ నిర్వాహకులు రాజ్కిషోర్ అంటున్నారు. సిటీకి దగ్గరలో ఉన్న అనంతగిరి మొదలుకుని కాస్త దూరంలో ఉన్న లోనావాలా, దండేలి, మతేరన్ తదితర హిల్ స్టేషన్స్ వరకూ డెస్టినేషన్ పారీ్టస్ జరుగుతున్నాయి.ట్రెడిషనల్గా.. ట్రెండీగా.. సంక్రాంతి టైమ్లో ట్రెడిషనల్ పారీ్టస్ ఎక్కువగా జరుగుతుంటాయి. వేడుక అంతా సంప్రదాయబద్ధంగా జరుగుతుంది. ముగ్గులు, జానపద గీతాలు పాడడం, కల్చరల్ యాక్టివిటీస్ ఉంటాయి. వీటికి తమ టీనేజ్ పిల్లల్ని తీసుకు రావడానికి పార్టీ ప్రియులు ఇష్టపడుతున్నారని పార్టీ ఆర్గనైజర్ విశాల చెప్పారు. దీని వల్ల వారికి మన సంప్రదాయాలపై మక్కువ, అవగాహన ఏర్పడుతుందనే ఆలోచనే దీనికి కారణమన్నారు. -
ఫైన్ టూ షైన్..
ఫైన్ ఆర్ట్స్ కోర్సులు చదివితే ఉపాధి ఉంటుందో లేదోనన్న అనుమానాలు గతంలో చాలామందికి ఉండేవి. అయితే హైదరాబాద్లోని జవహర్లాల్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ కాలేజీలో ఏటా ప్రవేశాల కోసం వచ్చే దరఖాస్తులు చూస్తుంటే ఈ కోర్సులకు ఉన్న డిమాండ్ అర్థం అవుతుంది. ఇప్పుడు ఫైన్ ఆర్ట్స్లో కోర్సు చేసి, బయటకు వస్తే మంచి గుర్తింపు, గౌరవంతో పాటు ఉపాధి కూడా ఉంటుందని అనేక మంది విద్యార్థులు నిరూపిస్తున్నారు. కల్చరల్ ఎంట్రప్రెన్యూర్షిప్లో భాగంగా ఫైన్ ఆర్ట్స్ చేసిన విద్యార్థులు కలిసి చిన్నపాటి వ్యాపారం ప్రారంభిస్తున్నారు. ఇలాంటి వారికి పెట్టుబడులు పెట్టేందుకు చాలా మంది ముందుకు వస్తున్నారు. పైగా, చాలా పాఠశాలల్లో చిన్నప్పటి నుంచే చదువుతో పాటు పిల్లలకు ఫైన్ ఆర్ట్స్ నేరి్పంచేందుకు ముందుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో ఫైన్ ఆర్ట్స్ చేసిన వారిని టీచర్లుగా నియమించుకుంటున్నారు. దీంతో పిల్లల్లో సృజనాత్మకత పెంపొందడంతో పాటు మానసిక ఎదుగుదల కూడా పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.మారిన నగరవాసి అభిరుచి..మారుతున్న కాలానికి అనుగుణంగా సగటు నగరవాసి అభిరుచి కూడా మారుతోంది. దీంతో ఇంటి ఆవరణతో పాటు ఇంట్లో ప్రతి మూలనూ వినూత్నంగా, ఆహ్లాదకరంగా మలుచుకోవాలని చూస్తున్నారు. అందుకోసం అందమైన పెయింటింగ్స్, మంచి ఫొటోలతో పాటు చిన్నపాటి శిల్పాలను ఇంట్లో అలంకరణకు పెట్టుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలో ఫైన్ ఆర్ట్స్ వ్యాపారం నగరంలో అభివృద్ధి చెందుతోంది. కళలకు కాస్త టెక్నాలజీని జోడించి ముందుకు వెళ్తే ఈ రంగంలో ఎంతో ఎత్తుకు ఎదగొచ్చని పేర్కొంటున్నారు.కూడళ్ల వద్ద ఆకర్షణగా..భాగ్యనగరంతో పాటు రాష్ట్రంలోని పలు నగరాల్లోని కూడళ్ల వద్ద ఆకర్షణీయంగా ఉండేలా శిల్పాలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. నగరంలోని అనేక కూడళ్ల వద్ద ఆలోచింపజేసేలా శిల్పాలను రూపొందించారు. కేవలం శిలలతోనే కాకుండా వివిధ రకాల వ్యర్థాలతో వాటిని రూపొందించి పర్యావరణహితాన్ని సమాజానికి చాటుతున్నారు. జేఎన్ఏఎఫ్టీయూకు చెందిన పలువురు నగరాన్ని అందంగా తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. శిల్పకారుడు బుద్ధి సంతో‹Ù, స్ట్రీట్ ఆర్టిస్ట్ కిరీట్ రాజ్, స్ట్రీట్ ఆరి్టస్ట్ రెహమాన్, మురళి, మహేశ్ తదితరులు కలిసి నగరానికి కొత్త సొబగులు దిద్దేందుకు కృషి చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రారంభించిన నగర సుందరీకరణ కార్యక్రమాల్లో వీరు అనేకసార్లు భాగస్వాములయ్యారు.ప్రయోగాలు చేయడం ఇష్టం.. చిన్నప్పుడు డ్రాయింగ్స్, స్కెచ్లు వేస్తుండేవాడిని. ఇంటర్ తర్వాత జేఎన్ఏఎఫ్టీయూలో డిగ్రీ పూర్తి చేశాను. ఇక్కడికి వచ్చాక స్కల్ప్చరింగ్పై ఆసక్తి పెరిగింది. ఆ తర్వాత హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో మాస్టర్స్ చేశాను. కొత్తకొత్త మెటీరియల్స్తో శిల్పాలు చేయాలని కోరికగా ఉండేది. అందుకే రాళ్లతో పాటు ఈ–వేస్ట్, జాలీలు, పేపర్ గుజ్జు, రాళ్లు, నట్స్, బోల్ట్స్ వంటి వాటితో అనేక శిల్పాలను రూపొందించేవాడిని. లక్డీకాపూల్లోని నిరంకారి భవన్ వద్ద ఏర్పాటు చేసిన పుస్తక శిల్పం, బంజారాహిల్స్లోని జీవీకే మాల్ వద్ద ఏర్పాటు చేసిన శిల్పం, వరంగల్లోని ములుగురోడ్డు వద్ద ఏర్పాటు చేసిన గుర్రం శిల్పం, జూబ్లీహిల్స్ జర్నలిస్టు కాలనీ సర్కిల్ వద్ద ఏర్పాటు చేసిన పాలపిట్ట విగ్రహం నేను తయారు చేసినవే. చాలా మంది తమ ఇళ్లల్లో పెట్టుకునేందుకు అడిగి మరీ.. వారికి కావాల్సిన విధంగా తయారు చేయించుకుంటారు. – బుద్ధి సంతోష్ కుమార్, శిల్పకారుడునాన్నే నాకు స్ఫూర్తి.. మా నాన్న లారీ బాడీలు తయారు చేస్తుంటారు. ఆ ట్రక్కులపై పెయింటర్స్ వేసే పెయింటింగ్స్ చూస్తూ పెరిగాను. అప్పటి నుంచి వాటిని గీసేందుకు ప్రయత్నించేవాడిని ఆ క్రమంలోనే పెయింటింగ్స్పై ఆసక్తి పెరిగింది. అయితే నా స్కిల్స్ను మరింత పెంచుకునేందుకు ఫైన్ ఆర్ట్స్ కాలేజీలోచేరాను. ఆయిల్, ఆక్రెలిక్, వాటర్ కలర్స్, భిన్నమైన పెన్సిల్స్తో స్కెచ్లు వేయడం నేర్చుకున్నాను. పెయింటింగ్లో నాకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడం నా లక్ష్యం. – అబ్దుల్ రెహమాన్, స్ట్రీట్ ఆర్టిస్ట్ఆర్ట్ డైరెక్టర్గా చేస్తున్నా.. చిన్నప్పటి నుంచి బొమ్మలు గీయడం ఇష్టంగా ఉండేది. మా అన్నయ్య ఫణితేజ బొమ్మలను చూసి నేర్చకునేవాడిని. అదే ఇష్టంతో పెయింటింగ్లో బీఎఫ్ఏ, ఎంఎఫ్ఏ పూర్తి చేశాను. ఈ కోర్సుల ద్వారా ఆర్ట్లో నైపుణ్యం నేర్చుకున్నాను. ఆర్ట్ హిస్టరీలో పట్టు సాధించాను. ఆర్ట్ షోలు, గ్యాలరీల్లో పనిచేశాను. ఫైన్ ఆర్ట్స్లో వచి్చన అనుభవంతో సినిమా రంగంలో అడుగుపెట్టాను. ఇప్పుడు ఆర్ట్ డైరెక్టర్గా పనిచేస్తున్నాను. – కిరీటి రాజ్ మూసి, ఆర్టిస్ట్. -
స్వెట్టీస్.. స్టైల్..
నగరంలో చలికాలం ప్రారంభమైంది. చలికాలం వస్తుందంటే చాలు స్వెటర్ల కోసం నగరవాసి కళ్లు వెతుకుతుంటాయి. మార్కెట్లోకి స్టైలిష్ స్వెటర్లు కొనేందుకు చూస్తుంటారు. నవంబర్ రాగానే నగరంలో స్వెటర్ దుకాణాలు భారీగా వెలుస్తుంటాయి. ఈ ఏడాది కూడా నగరంలోని పలు ప్రాంతాల్లో స్వెటర్ దుకాణాలు వెలిశాయి. రంగురంగుల ఉన్ని దుస్తులతో పాటు రగ్గులు, దుప్పట్లు, టోపీలు, మఫ్లర్లు, చేతి గ్లౌజులు కొనేందుకు నగరవాసులు ఆసక్తి చూపుతున్నారు.నవంబర్ రెండో వారం నుంచి జనవరి మూడో వారం వరకూ నగరంలో చలికాలం ఉంటుంది. ప్రత్యేకంగా డిసెంబర్, జనవరి నెలలో నగర ఉష్ణోగ్రతలు 12.5 డిగ్రీల కనిష్ట స్థాయిలో నమోదు అవుతాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే ఈ ఏడాది నవంబర్ రెండో వారంలో చలి ప్రారంభమైంది. కానీ తుఫాను ప్రభావంతో చలి తీవ్రత తగ్గింది. ఈ వారం నుంచి చలి వాతావరణం మళ్లీ పుంజుకుంది. దీంతో స్వెటర్ల వ్యాపారాలు జోరుగా పెరిగాయి. నేపాల్ నుంచి వచ్చి.. చలికాలం ప్రారంభం కాగానే నేపాల్ వ్యాపారులు నగరానికి భారీగా తరలివచ్చి స్లాళ్లు ఏర్పాటు చేసుకుని మరీ అమ్మకాలు జరుపుతుంటారు. కోఠికి వెళ్లేవారు ఇలాంటి దుకాణాలను వరుసగా చూసే ఉంటారు. వీటితోపాటు నగరంలోని పలు ప్రాంతాల్లో రోడ్ల వెంబడి స్టాళ్లు ఏర్పాటు చేస్తారు. చాలా మంది నగర వాసులు ఇక్కడే కొనుగోలు చేస్తుంటారు. మూడు నెలల పాటు ఇక్కడే ఉండి విక్రయిస్తుంటామని, తమ ఉత్పత్తులకు ఇక్కడ డిమాండ్ ఉంటుందని నిర్వాహకులు చెబుతున్నారు. బ్రాండెడ్ దుకాణాలు సైతం.. ఇటీవల స్వెటర్ల వ్యాపారం రోడ్లపై నుంచి బ్రాండెడ్ షాపుల వరకూ చేరింది. గతంలో చేతితో తయారు చేసిన స్వెటర్లు మాత్రమే అందుబాటులో ఉండేవి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న పేరుందిన బ్రాండెడ్ కంపెనీలు తయారు చేస్తున్న స్వెటర్లను కొనుగోలు చేసేందుకు నగరవాసులు ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా పలు సినిమాల్లో హీరో, హీరోయిన్లు వేసుకుంటున్న స్వెటర్ల కోసం బ్రాండెడ్ దుకాణాల్లో వెతుకుతున్నారు. వారి అభిరుచిని బట్టి వ్యాపారులు కూడా బ్రాండెడ్ ఉన్ని దుస్తులను తెప్పిస్తున్నారు. ధర ఎక్కువైనా కూడా వాటిని కొనేందుకు ముందుకొస్తున్నారని వ్యాపారులు చెబుతున్నారు. తగ్గిన వ్యాపారం..నగరంలో ఏటా చలికాలం ప్రారంభానికి ముందు నుంచే పలువురు వ్యాపారులు తాత్కాలిక స్వెటర్ల షాపులు, రోడ్డుల పక్కన స్టాళ్లు ఏర్పాటు చేసి, మైదానాల్లో అమ్మకాలు చేస్తుండేవారు. అయితే ఈ ఏడాది నవంబర్ రెండో వారం నుంచి చలి ప్రారంభమైనప్పటికీ బంగాళాఖాతంలో తుపాన్ రావడంతో నగరంలో ఉష్ణోగ్రతలు పెరిగాయి. చలి తగ్గింది. తిరిగి డిసెంబర్ నెల్లో కూడా సైక్లోన్ రావడంతో ఉష్ణోగ్రతలు మళ్లీ పెరగడం ప్రారంభమయ్యాయి. దీంతో చలికాలం కోసం నగర వ్యాపారులు దేశ, విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న వివిధ రకాల స్వెటర్లతో పాటు ఇతర దుస్తువుల వ్యాపారం అనుకున్న స్థాయిలో జరగడంలేదని వ్యాపారులు ఆవేదన చెందుతున్నారు. స్టైల్ కోసం..చలిని తట్టుకోడంతో పాటు.. ధరించినప్పుడు హుందాగా కనబడేందుకు పలు స్వెటర్ తయారీ సంస్థలు వివిధ రకాల మోడల్స్ను రూపొందిస్తున్నాయి. ఇవి వినియోగదారులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయని పలువురు నిర్వాహకులు చెబుతున్నారు. ఏఎన్ఆర్, ఎనీ్టఆర్, చిరంజీవి లాంటి ఆ తరం నటులు సినిమాల్లో ధరించిన స్వెటర్లను అప్పట్లో వాడేవారని, ఇప్పుడు ఈ తరం హీరోలు, హీరోయిన్లు ధరించే స్వెటర్లను వాడేందుకు ఇప్పటి యువత ఆసక్తి చూపిస్తోందని పేర్కొంటున్నారు. కొంత మంది యువతీ యువకులు ఫలానా సినిమాల్లో హీరోహీరోయిన్ ధరించిన స్వెటర్ తయారు చేసి ఇవ్వాలని ఆర్డర్లు కూడా చేస్తుంటారని చెబుతున్నారు. ఉలెన్తో పాటు క్యాష్మిలన్ ఫ్యాబ్రిక్.. గతంలో ఉన్నితో తయారు చేసిన స్వెటర్లు ధరించేందుకు నగరవాసులు ఆసక్తి చూపేవారు. మందంగా ఉండే ఉన్ని దుస్తులను ధరించేందుకు ఇప్పుడు కొందరు ఆసక్తి చూపట్లేదు.. దీంతో తయారీదారులు తేలికగా ఉండే క్యాష్మిలన్ ఫ్యాబ్రిక్తో స్వెటర్లను తయారు చేస్తున్నారు. చలికాలంతో పాటు సాధారణ సీజన్లో కూడా ధరించేందుకు వీలుగా ఉండటంతో పాటు స్టైల్గానూ ఉంటున్నాయని యువత ఎక్కువగా ఈ ఫ్యాబ్రిక్తో తయారు చేసిన స్వెటర్లను వాడుతున్నారు. తేలికగా ఉండే చలిని తట్టుకునే స్వెటర్లు, గ్లౌజ్లతో పాటు సాక్స్ ఎక్కువగా అడుగుతున్నారు. – మహ్మద్ ఇల్యాస్ బుఖారీ, వ్యాపారి, మదీనా సర్కిల్సరసమైన ధరల్లో.. ఏటా కోఠిలో వెలిసే స్వెటర్ దుకాణాల్లో కొనుగోలు చేస్తుంటాం. తక్కువ ధరల్లో అందుబాటులో ఉంటాయి. డిజైన్స్తో పాటు మంచి నాణ్యమైనవి ఇక్కడ దొరుకుతాయని మేం వస్తుంటాం. పిల్లలతో పాటు పెద్ద వారికి కూడా ఇక్కడ లభిస్తుంటాయి. – మల్లికార్జున్, హైకోర్టు లాయర్ -
Cake Mixing: కేక్స్ మిక్స్..టేస్ట్ అదుర్స్..
డిసెంబర్ వచ్చిందంటే చాలు హైదరాబాద్ నగరం నూతనోత్సాహాన్ని పుంజుకుంటుంది. ఒకవైపు ఇయర్ ఎండ్, న్యూ ఇయర్ వేడుకలు, మరోవైపు క్రిస్మస్ సంబరాలతో నగరం అంతా పార్టీ మూడ్లో ఉంటుంది. ఇందులో భాగంగా నగరంలో ఇప్పటికే విభిన్న వేదికల్లో వినోద కార్యక్రమాలు, వేడుకలు మొదలయ్యాయి. కల్చరల్ డైవర్సిటీకి కేర్ ఆఫ్ అడ్రస్గా నిలిచే హైదరాబాద్లో సర్వమత సమ్మేళనంలో భాగంగా క్రిస్మస్ వేడుకలు సైతం ఘనంగా నిర్వహిస్తుంటారు. ప్రీ క్రిస్మస్ వేడుకల్లో భాగంగా కేక్ మిక్సింగ్ సందడి నెలకొంది. నూతన ఏడాదికి స్వాగతం పలికేందుకు ఇయర్ ఎండ్ వేడుకలకు కూడా సన్నద్ధం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో నిర్వహించే కేక్ మిక్సింగ్పైనే ఈ కథనం.. నగరంలో గత కొన్ని సంవత్సరాలుగా కేక్ మిక్సింగ్.. ట్రెండ్ కొనసాగుతోంది. మొదట్లో క్రిస్మస్ ఫ్రీ ఈవెంట్స్లో భాగంగా కేక్ మిక్సింగ్ నిర్వహించేవారు. కానీ ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరూ కేక్ మిక్సింగ్లో పాల్గొంటూ వినూత్న సంస్కృతికి నాంది పలుకుతున్నారు. నగరంలోని ఫైవ్ స్టార్ హోటల్స్, రిసార్ట్స్, ఎన్జీవోలు, విద్యా వ్యాపార సంస్థల్లో, ఇతర ఎంటర్టైన్మెంట్ వేదికలుగా కేక్ మిక్సింగ్ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ ఈవెంట్లలో పలువురు సెలబ్రిటీలు సైతం పాల్గొని సందడి చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఇప్పటికే నోవోటెల్ హైదరాబాద్, గోల్కొండ హోటల్, తాజ్ కృష్ణ, తాజ్ వివంత వంటి ఫైవ్ స్టార్ హోటల్స్తో పాటు ఇతర వేదికల్లో కేక్ మిక్సింగ్ వేడుకలు మొదలై కొనసాగుతూనే ఉన్నాయి.సెలిబ్రిటీల సందడి.. నగర జీవన శైలిలో భాగమైన ఈ కార్యక్రమాలకు సెలిబ్రిటీల నుండి కూడా మంచి ఆదరణ లభిస్తుంది. నిర్వాహకులు సైతం పలువురు సెలిబ్రిటీలు, సామాజికవేత్తలు, ఐకానిక్ వ్యక్తులను ఈ కేక్ మిక్సింగ్ వేడుకలకు ముఖ్య అతిథులుగా ఆహా్వనిస్తూ నగరవాసులను తమ వైపుకు తిప్పుకుంటున్నారు. ఇలా ఈ ఏడాది నగర వేదికగా ఇప్పటికే జరిగిన పలు వేడుకల్లో సినీ తారలు, సింగర్లు, స్పోర్ట్స్ స్టార్స్ పాల్గొని సందడి చేశారు.వివిధ రకాల డ్రై ఫ్రూట్స్.. ప్రీ క్రిస్మస్ వేడుకల్లో భాగంగా, కేక్ మిక్సింగ్, గ్రేప్ స్టాంపింగ్ ప్రధానంగా నిర్వహిస్తారు. ఈ కేక్ మిక్సింగ్లో దాదాపు 25 రకాల డ్రై ఫ్రూట్స్, పలు రకాల స్పైసెస్, రం, బ్రాందీ, విస్కీ లాంటి లిక్కర్ కలుపుతారు. ఇందులో వాడే పదార్థాల మిశ్రమం మంచి పోషకాలతో ఆరోగ్య ప్రదాయిని గానూ ఉంటున్నాయి. ఈ మిశ్రమాన్నంతా కొద్ది రోజులపాటు సోక్ (పులియ బెట్టడం) చేసి ఆ తరువాత ఫ్లమ్ కేక్ తయారు చేస్తారు. పాశ్చాత్య సంస్కృతిలో భాగంగా తయారు చేసిన ఈ ఫ్లమ్ కేక్ క్రిస్మస్ వేడుకల్లో అందరికీ ఫేవరెట్. కేక్ మిక్సింగ్లో చిన్నలు, పెద్దలు అందరూ కలిసి లిక్కర్తో డ్రై ఫ్రూట్స్ కలుపుతూ ఎంజాయ్ చేస్తారు.గ్రేప్ స్టాంపింగ్.. కేక్ మిక్సింగ్తో పాటు ఈ మధ్యకాలంలో గ్రేప్ స్టాంపింగ్ విరివిగా నిర్వహిస్తున్నారు. ఈ గ్రేప్ స్టాంపింగ్లో ఒక పెద్ద చెక్క బుట్టలో అధిక మొత్తంలో ద్రాక్ష పళ్లను వేసి సామూహికంగా వాటిని తొక్కుతూ ద్రాక్ష రసాన్ని తీసి దాని నుండి వైన్ తయారు చేస్తారు. ఈ వైన్ కూడా క్రిస్మస్ వేడుకల్లో ప్రధాన అంశమే ఇలాంటి సాంస్కృతిక వినోదపరమైన కార్యక్రమాలకు నగరంలోని యువత సాఫ్ట్ వేర్ ఉద్యోగులు కూడా అమితాసక్తి చూపిస్తున్నారు. ఈ నెలలో వీకెండ్ వచ్చిందంటే చాలు ఎక్కడెక్కడ ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయో తెలుసుకొని అందులో పాలుపంచుకుంటున్నారు. ఈ ఫొటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ సందడి చేస్తున్నారు. నూతనోత్సాహం కోసం.. కేక్ మిక్సింగ్ కూడా మన జీవన పరమార్థాన్ని తెలిపే ఓ వేడుకే. ఈ కేక్ మిక్సింగ్ లో కలిపే డ్రై ఫ్రూట్స్ నట్స్ సుగంధద్రవ్యాల లాగే మన అందరి జీవితాలు కలుపుగోలుగా అందంగా ఉండాలని అర్థం. అంతేకాకుండా ప్రతి ఏడాదీ నూతనోత్సాహాన్ని అందించడానికి ముందస్తు వేడుక. నగరంలో ఈ మధ్యకాలంలో ఈ సంస్కృతికి ఆదరణ బాగా పెరిగింది. – ఎస్పీ శైలజ, ప్రముఖ సింగర్, (ఈ మధ్య జరిగిన ఓ కేక్ మిక్సింగ్ వేడుకలో భాగంగా). -
క్రేజీ.. కేజే..
నికితా నాయర్ (26) ఆరేళ్లుగా విదేశాల్లో ఉంటూ రెండు నెలల క్రితం సిటీకి తిరిగి వచ్చారు. ఈ వెడ్డింగ్ కొరియోగ్రాఫర్ పాడడంలో ప్రొఫెషనల్ కాదు. కానీ ఆమె ఒంటరిగా కరోకే ఈవెంట్లకు వెళ్లి ఇతర క్రూనర్లతో కలిసి పాడడం ప్రారంభించి ఇప్పుడు రెగ్యులర్గా మారారు. ‘నేను ఆల్కహాల్ తాగను. నచ్చిన ఫుడ్ తిని నా హృదయానికి దగ్గరగా అనిపించిన పాటలు పాడతాను’ అని నాయర్ చెప్పారు. ఇలాంటి బాత్రూమ్ సింగర్స్ని బాల్రూమ్ సింగర్స్గా మారుస్తున్న క్రెడిట్ కరోకే జాకీ (కేజే)లకే దక్కుతుంది. – సాక్షి, సిటీబ్యూరోపాట మొదలవుతుంది.. సంగీతం వినబడుతుంటుంది. స్క్రీన్ మీద ఆ పాట సాహిత్యం కనబడుతుంటుంది. ప్రేక్షకుల్లో నుంచి కొన్ని చేతులు గాల్లోకి లేస్తాయి. ఆడియోలో గాత్రం మొదలయ్యే సమయానికి ఆ గాల్లోకి లేచిన చేతుల్లోని ఒక చేతిలో మైక్ పెడతాడు కేజే లేదా కరోకే జాకీ. ఆ సమయంలో అసలు గాయకుని గాత్రం స్థానంలో సదరు చేతి తాలూకూ వ్యక్తి గొంతు భర్తీ అవుతుంది. ఇలా మ్యూజిక్ ట్రాక్లో వాయిస్ని కట్ చేసి ఆ స్థానంలో మన వాయిస్ని కలిపి పాడడమే కరోకే సింగింగ్ అంటారు. ఇప్పుడు సిటీలో జరిగే పార్టీ ఈవెంట్స్లో ట్రెండీగా మారాయి ఈ కరోకే నైట్స్. ‘తాను డీప్ పర్పుల్, ది బీటిల్స్లోని రెట్రోలను, హిందీ పాట లేదా రాక్ వినడానికి ఇష్టపడతా’ అని నికితా నాయర్ చెప్పారు. ఒకప్పుడు ఇలా ఇష్టపడడం అనేది కేవలం వినడం వరకూ మాత్రమే పరిమితమైతే.. ఇప్పుడు అది పాడడం వరకూ చేరింది. ఆహారం, పానీయాలతో పాటుగా ముందుగా రికార్డ్ చేసిన ట్రాక్ల ద్వారా మైక్రోఫోన్లో పాడటం కొత్త సోషల్ నెట్వర్కింగ్ మంత్రంగా మారింది. నో డ్రింకింగ్ ఓన్లీ సింగింగ్.. ఇటీవలే బెంగళూరు నుంచి హైదరాబాద్కు వచ్చిన కోలిన్ డిసౌజా (28) మాట్లాడుతూ ‘నాకీ సరదా బెంగళూర్లో అలవాటైంది. డ్రింక్ చేయడానికి కాకుండా పాడటానికి మాత్రమే రెస్టో–బార్లను సందర్శిస్తాను. పాటల్ని కలిసి పాడే సమయంలో కొత్త పార్ట్నర్స్ లభిస్తుంటారు’ అన్నారు. నగరానికి చెందిన కరోకే జాకీ రోగర్ వైట్ ప్రకారం.. ‘తెలుగు పాటలకు ఇంకా పబ్స్, క్లబ్స్లో జరిగే కరోకే నైట్స్లో ప్రాచుర్యం పెరగలేదు. పాశ్చాత్య సంగీతానికే డిమాండ్. బ్రయాన్ ఆడమ్స్ రాసిన ‘సమ్మర్ ఆఫ్ 69’ బాన్ జోవి రాసిన ‘ఇట్స్ మై లైఫ్’ వంటి పాటలు కరోకే నైట్స్లో ప్రసిద్ధి చెందాయి. రెట్రో, రెగె, ఓల్డ్ రాక్ పాప్ శైలులతో గొంతు కలపడానికి అతిథులు ఇష్టపడతారు.’ప్రైవేట్ ఈవెంట్స్లోనూ.. పెళ్లిళ్లు, బర్త్డేలు తదితర వేడుకల్లోనూ ఇప్పుడు కరోకే సందడి బాగా పెరిగింది ‘గతంలో పబ్స్, క్లబ్స్కే పరిమితం అయినప్పటికీ ఇప్పుడు వివాహ వేడుకల్లో సంగీత్ వంటి కార్యక్రమాలతో పాటు కరోకే కూడా భాగం చేస్తున్నారు’ అని కేజే నోయల్ చెప్పారు. అయితే వీటిలో ఎక్కువగా తెలుగు, హిందీ పాటలకే పెద్ద పీట వేస్తున్నారని, అలాగే ఇలాంటి చోట అతిథులను పాడించడం అంత సులభం కాదని పలువురు కేజేలు అభిప్రాయపడుతున్నారు. కరోకే నైట్స్కి పేరొందిన ఓ క్లబ్కు సహ–యజమాని దీప్తి కే దాస్ మాట్లాడుతూ.. ‘కరోకే కాలం చెల్లిన డీజే నైట్ల కంటే ఎక్కువ ఇంటరాక్టివ్గా ఉంటుంది. ఆదివారం బ్రంచ్ తర్వాత యువత దీని కోసం బాగా వస్తారు. ఈ ట్రెండ్లో మమేకమవుతున్న కుటుంబాలు కూడా ఉన్నాయి. ఫ్యామిలీ మొత్తం కలిసి టేబుళ్లను రిజర్వ్ చేసుకుంటాయి. డైనింగ్తో పాటు సింగింగ్ని ఎంజాయ్ చేస్తున్నారు’ అని చెప్పారు. పుట్టి 20 ఏళ్లయినా..నైట్ పార్టీస్లో ఈ కరోకే ట్రెండ్ సిటీలో ఊపిరిపోసుకుని దాదాపు 20 ఏళ్లు కావస్తోంది. ఆనంద్ అనే డీజే తాను కేజేగా మారి ఈ ట్రెండ్కు బోణీ కొట్టారు. అప్పటి నుంచీ ఆయన మాత్రమే సిటీలో కేజేగా సుపరిచితులుగా ఉన్నారు. అయితే గత కొన్నేళ్లుగా కరోకే ట్రెండ్ బాగా పెరిగింది. దీంతో సిటీలో కేజేల సందడి కూడా పెరిగింది. ఎఫ్ అండ్ బీ నిపుణులు గఫNర్ మాట్లాడుతూ.. ‘ఇంతకుముందు, వారానికి రెండు కరోకే నైట్స్ ఉండేవి. ఇప్పుడు, నాకు కనీసం 10 వరకూ ఉంటున్నాయి’ అని చెప్పారు. -
టూరు.. భలే జోరు..
నగరంలో సగటు వ్యక్తి సమయం ఉద్యోగం, వ్యాపారం, ట్రాఫిక్ తంటాలతోనే సగం గడిచిపోతోంది. డిసెంబర్ వచ్చిందంటే ఉద్యోగులకు సెలవులకు ముగిరిపోయే సమయం ఆసన్నమైందని లెక్కలేసుకుంటారు. మరో వైపు క్రిస్మస్ సెలవులు.. దీంతో సెలవుల్లో ఎలా ఎంజాయ్ చేయాలా అని ప్లాన్ చేసుకుంటున్నారు. ఎత్తయిన కొండల్లో దాగిన సరస్సులు, భూమికి పచ్చని చీరకట్టినట్లుండే టీ, కాఫీ ఎస్టేట్లు, భూతల స్వర్గంలా పొగమంచు కమ్మిన ప్రాంతాలవైపు ఆకర్షితులవుతున్నారు. తమిళనాడు, కర్ణాటక, కేరళ, ఆంధ్రప్రదేశ్లోని పలు హిల్ స్టేషన్స్ తమ డెస్టినేషన్గా ఎంపిక చేసుకుంటున్నారు. ఆధ్యాత్మిక ప్రాంతాలకూ డిమాండ్ ఉందని టూర్ ఆపరేటర్లు పేర్కొంటున్నారు. 5 రోజుల నుంచి వారం రోజుల పాటు సాగే టూర్ రూ.8 వేల నుంచి రూ.15 వేల వరకూ ఛార్జ్ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లోని అరకు శీతాకాలంలో దట్టమైన పొగ మంచు, పచ్చని చెట్ల మధ్య సాగే ప్రయాణం.. రహదారులు, గుహల్లోంచి దూసుకుపోయే అద్దాల రైలు ప్రయాణం, రంగురంగుల పూల తోటలు, టీ, కాఫీ ఎస్టేట్స్, వంజంగి కొండపై నుంచి కనిపించే పొగ మంచు పొరలు కన్నులకు విందుగా అనిపిస్తుంది. దేశంలోనే అతి పెద్ద గుహలలో ఒకటైన బొర్రా గుహలు ఇక్కడ చూడొచ్చు. సుమారు 80 మీటర్ల లోతు గుహలో దిగొచ్చు. విశాఖపట్నంలో కైలాసగిరి, ఆర్కే బీచ్, అన్నవరం సత్యనారాయణ స్వామి దేవస్థానం, విజయవాడ దుర్గాదేవి దర్శనం చేసుకుని తిరిగి హైదరాబాద్ చేరుకుంటారు. మండువేసవిలో దట్టమైన మేఘాలు.. ప్రిన్సెస్ ఆఫ్ ది హిల్గా ప్రసిద్ధి చెందిన కొడైకెనాల్ తమిళనాడులోనే ఉంది. దట్టమైన అడవులు, ఎత్తయిన పర్వతాల నడుమ సాగే ప్రయాణం, సరస్సులు, జలపాతాలు, పిల్లర్ రాక్, బ్రయంట్ పార్క్ ఇక్కడి ప్రత్యేక ఆకర్షణలు. ఈ పర్వతాలపై మండే వేసవిలో సైతం దట్టమైన మేఘాలు మనల్ని కమ్మేస్తాయి. కొడైకెనాల్ల్లో ప్రయాణం చేస్తుంటే.. మేఘాల్లో తేలిన ఫీల్ ఉంటుంది. శీతాకాలంలో అయితే మంచు దుప్పటి కప్పేస్తుంది. ముచ్చటగొలిపే మున్నార్.. కేరళలోని మున్నార్ అంటే మూడు నదులు అని అర్థం. ప్రసిద్ధ ఎరవికులం జాతీయ పార్క్ మున్నార్ సమీపంలోనే ఉంటుంది. టీ ఎస్టేట్స్, మట్టుపెట్టి డ్యాం, ఆహ్లాదరకమైన గ్రీనరీ, ఎత్తయిన కొండలు చూడొచ్చు. ప్రకృతి ప్రేమికులకు ఈ ప్రాంతం నచ్చుతుంది. కేరళలోని మరో ప్రసిద్ధ పర్యాటక ప్రాంతం వయనాడ్. పడమర కనుమలు, వివిధ రకాల పక్షలు, జంతువులు, కొండల మధ్య ప్రయాణం ఆకట్టుకుంటుంది. చెంబ్రా, బాణాసుర సాగర్ డ్యాం పర్యాటకులకు డెస్టినేషన్గా నిలుస్తాయి. కూర్గ్లో ట్రెక్కింగ్.. కర్ణాటక రాష్ట్రంలోని కూర్గ్ ట్రెక్కింగ్ చేయాలనుకునే వారికి ఇది అనువైన ప్రదేశం. కనుచూపు మేరలో ఎటు చూసినా కాఫీ, మిరియాలు, యాలుకల తోటలతో సుమనోహరంగా ఉంటుంది. వైల్డ్ లైఫ్, అబ్బే జలపాతం, నగర్హోళె నేషనల్ పార్క్లు చూడదగ్గ ప్రదేశాలు. అదే సమయంలో నంది హిల్స్పై నుంచి సూర్యోదయం చూసేందుకు ప్రకృతి ప్రేమికులు పెద్దసంఖ్యలో వస్తుంటారు. బెంగళూరు సమీపంలోని ఈ కొండల్లో భోగనందీశ్వరాలయం ఉంటుంది. నంది కోట ప్రధాన ఆకర్షణ.క్వీన్ ఆఫ్ హిల్ స్టేషన్.. తమిళనాడులోని ఊటీని క్వీన్ ఆఫ్ హిల్ స్టేషన్గా పిలుస్తారు. స్థానికంగా ఉండే బొటానికల్ గార్డెన్, నీలగిరి కొండలు, పర్వతాల మధ్య సరస్సులు, పచ్చని తోటలు ప్రధాన ఆకర్షణలుగా నిలుస్తాయి. ఊటీని కొత్త జంటలు హనీమూన్ డెస్టినేషన్గా పిలుచుకుంటారు. ఈ ప్రాంతం సముద్ర మట్టానికి 2,240 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఊటీకి సమీపంలోనే కూనూర్ ఉంటుంది. ఇక్కడ డాలి్ఫన్ నోస్, ల్యాంబ్స్ రాక్, టీ ఎస్టేట్స్ చూడొచ్చు. ఐదు రోజుల ప్రయాణం అద్భుతం.. ఈ సీజన్లో హిల్ స్టేషన్స్ చూడటానికి బాగుంటాయని ఫ్రెండ్స్ టూర్ ప్లాన్ చేద్దామని అడిగారు. కొడైకెనాల్ డెస్టినేషన్. మధ్యలో కొన్ని దేవాలయాలు, ఇతర ప్రదేశాలను సందర్శించే విధంగా ప్రణాళిక సిద్ధం చేశారు. వెళ్లి రావడానికి 5 రోజులు పట్టింది. కొడైకెనాల్ ప్రయాణం మేఘాల్లో తేలినట్లుంది. మధ్యాహ్నం 12 అయినా అక్కడ రెండు మీటర్ల దూరంలో ఉన్న మనిషి కనిపించే పరిస్థితి లేదు. ఈ టూర్ మంచి అనుభూతినిచ్చింది. – సాయి హర్ష, మణికొండఆహ్లాదం.. ఆధ్యాత్మికం రెండూ..ఈ సీజన్లో వెకేషన్,ఆధ్యాత్మికం కలిపి మిక్సడ్ టూర్ ప్లాన్స్ ఉంటున్నాయి. గోవా, రామేశ్వరం, ఊటి, కొడైకెనాల్, పాండిచ్చేరి, మున్నార్, మదురై, అరుణాచలం, శభరిమలై వంటి ప్రదేశాలకు ఎక్కువ మంది ప్యాకేజీలు అడుగుతున్నారు. కొన్ని కుటుంబాలు వాహనం మాట్లాడుకుంటున్నారు. – భాస్కర్రెడ్డి, శ్రీసాయి టూర్స్ అండ్ ట్రావెల్స్ -
మరణానంతరం.. మరో చరిత్ర
మనిషి జన్మ వింతే.. అది తెలియకుంటే చింతే.. నీ నిర్మాణమే తెలుసుకోవా.. బతుకు అర్థం ఉంది. అది తెలియకుంటే వ్యర్థం.. జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ.. తస్మాదపరిహార్యే అర్థేన త్వం శోచితుమర్హసి.. (పుట్టినవానికి మరణం తప్పదు.. మరణించినవానికి పుట్టుక తప్పదు.. తప్పించుకోడానికి వీలులేని ఈ విషయంలో నువ్వు దుఃఖించడం తగదు.) – సాక్షి, సిటీబ్యూరో మనిషికి ప్రాణం పై ఉన్న మక్కువ లెక్క కట్టలేనిది.. మరణం అనేదే లేకుండా చేసేందుకు ఎంతో మంది శాస్త్రవేత్తలు ఎన్నో ప్రయోగాలు చేశారు.. దేవుడు రాసిన తలరాతను ఎవరూ మార్చలేరు. దాన్ని మార్చడం ఎవరి వల్ల కాదు. అయితే అమరులుగా ఉండాలనే ఆశ మనిíÙలో ఎప్పటికీ తగ్గదు. ఇదంతా ఎందుకు చెప్పుకోవడం అంటే.. అందరూ స్వార్థంగా ఉండరు. సమాజంలో ఎంతో నిస్వార్థంగా జీవించే వారూ ఉంటారు. వారి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.. చిన్న సహాయం చేస్తేనే ఏదో గొప్ప పని చేశాం అని చెప్పుకునే ఈ రోజుల్లో... అవయవదానం చేసే గొప్పవాళ్ళు కూడా ఉన్నారు. మరికొందరు ఇంకో అడుగు ముందుకేసి మొత్తం శరీరాన్ని దానం చేసే వారిని ఏమనాలో.. ఇలా నగరంలో ఎంతో మంది మరణానంతరం తమ భౌతికదేహాలను పరిశోధనల కోసం దానం చేసేందుకు ముందుకు వచ్చారు. మానవతా దృక్పథంతో.. దానాల్లో కెల్లా అన్నదానం గొప్పది అంటారు.. కానీ అన్నింటి కన్నా దేహాన్ని దానం చేయడం గొప్ప విషయం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దానం చేయడం అంత సులువైన విషయం కాదు. సామాజిక, సంప్రదాయ, ఆర్థిక, మానసిక సమస్యలు ఇందులో ముడిపడి ఉంటాయి. కుటుంబంతో పాటు.. బంధువుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతుంది. ముందుగా దేహాన్ని దానం చేయాలంటే పెద్ద మానసిక సంఘర్షణ ఎదుర్కోవాల్సి వస్తుంది. అవన్నీ దాటుకుని ముందడుగు వేయడం చాలా పెద్ద విషయం. కుటుంబ సభ్యులను ఒప్పించడం కూడా పెద్ద టాస్క్ అనే చెప్పొచ్చు. ఎన్జీవోల పాత్ర మరువలేనిది.. సాధారణంగా అవయవదానం, మృత దేహాలను దానం చేసే విషయంలో ఎన్జీవోలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. నగరంలోని పలు సంస్థలు ఈ దిశగా ప్రజలకు అవగాహన కలి్పస్తున్నాయి. ఎంతో మంది తమ అవయావాలు దానం చేసేందుకు కృషి చేస్తున్నాయి. దీంతో పాటు కడవర్ దానం చేయించడం అంత సులువైన పని కాదని పలువురు ఎన్జీవోల నిర్వాహకులు చెబుతున్నారు. చాలా వరకూ కనీసం పోస్ట్ మార్టం చేయించేందుకే విముఖత చూపిస్తారని.. అలాంటి సమాజంలో ఉన్న వారిని ఒప్పించడం ఇబ్బందికరమేనని పేర్కొంటున్నారు. చదువుకున్న వాళ్లలో ఎక్కువగా..దానం చేసిన దేహాన్ని కడవర్ అంటారు. దేహం దానం చేయడం ఎక్కువగా చదువుకున్న వారిలో కనిపిస్తుంది. సమాజంపై అవగాహన ఉండటం వల్ల కూడా చాలా మంది ముందుకు వస్తున్నారు.. పరిశోధనల కోసం..మాములుగా బ్రెయిన్ డెడ్ అయిన వారి శరీరాల నుంచి అవయవదానం చేస్తుంటారు. కానీ చనిపోయిన తర్వాత శరీరం అవయవ దానాలకు పనికి రాదు. అప్పుడు శరీరాన్ని మెడికల్ కాలేజీలకు దానం చేస్తారు. ఆ శరీరాన్ని ప్రయోగాలు చేసుకునేందుకు, పరిశోధనలు చేసేందుకు వినియోగిస్తారు. శరీరాన్ని దానం చేయాలంటే.. మరణానికి ముందు స్థానిక వైద్య కళాశాల, ఆస్పత్రి లేదా ఎన్జీవోతో ముందస్తు ఒప్పందం చేసుకోవాలి. సంబంధిత పత్రాలపై సంతకం చేయాల్సి ఉంటుంది. మరణించిన తర్వాత వారికి సమాచారం అందిస్తే అన్ని ఫార్మాలిటీలు పూర్తి చేస్తారు.. అయితే చనిపోయిన తర్వాత కూడా కుటుంబ సభ్యులు అందరూ.. ఒప్పుకుని సంతకాలు చేసి దానం చేయొచ్చు.అమ్మ కోరిక మేరకు..మరణానంతరం తన శరీరాన్ని ప్రయోగాల కోసం దానం ఇవ్వాలని అమ్మ అనుకునేది. కుటుంబ సభ్యులమంతా కలసి ఈ విషయంపై నిర్ణయం తీసుకున్నాం. ఆమె మరణించిన తర్వాత ఓ ఎన్జీవోకు ఫోన్ చేసి.. విషయం చెప్పాం. అయితే మా నిర్ణయాన్ని చాలా మంది వ్యతిరేకించారు. కర్మకాండలు జరిపించకపోతే పాపం అని చాలా మంది అన్నారు. కానీ ప్రయోగాల కోసం ఇస్తే ఎంతో మందికి జ్ఞానం వస్తుందని మేం నమ్మాం. ఎంతమంది ఏం అనుకున్నా ముందుకు వెళ్లాం. ఒకానొక సందర్భంలో మమ్మల్ని వేలేసినంత పని చేశారు. కానీ కొందరు మాత్రం మా నిర్ణయాన్ని స్వాగతించారు. అమ్మ ఎప్పుడూ దైవ చింతనలో ఉండేవారు. అధ్యాత్మికతలో మునిగిపోయేవారు. అయినా కూడా సంప్రదాయాలను పక్కన పెట్టి శరీర దానానికి ముందుకు వచ్చారు. ఆమెకు ఆమెనే గొప్ప బిరుదు సంపాదించుకున్నారు.. అదే కడవర్.. – మునిసురేశ్ పిళ్ళై, కడవర్ భారతమ్మ కుమారుడు అవగాహన పెరగడం వల్లే.. ఇటీవల సమాజంలో అవగాహన పెరగడంతో అవయవదానం చేసేందుకే చాలా మంది ముందుకు వస్తున్నారు. చదువుకుని.. సమాజంపై అవగాహన ఉన్న వాళ్లు అవయవ దానాన్ని అర్థం చేసుకుంటున్నారు. అలాగే సరైన కౌన్సెలింగ్ ఇచ్చి నలుగురికీ సహాయపడొచ్చని చెప్పడం వల్లే ఒప్పుకుంటున్నారు. అవయవ దానంతో నలుగురి జీవితాల్లో వెలుగులు నింపే అవకాశం వదులుకోవద్దు. ఇదే అసలైన సమాజ సేవ. – డాక్టర్ సందీప్ దవళ్ల, హెచ్వోడీ యూరాలజీ విభాగం, ఈఎస్ఐసీ -
సమాజం మా ఇజం!
నగరంలో వందల కొద్ది స్వచ్ఛంద సంస్థలు ఉన్నాయి. అనాథలు, వయోవృద్ధులు మొదలు.. జంతు, పర్యావరణ పరిరక్షణ, సామాజిక హక్కులు, మానవ హక్కులు, వికలాంగుల సేవ.. ఇలా విభిన్న అంశాల్లో సమాజ సేవ చేయడానికి ఎన్జీవోలను ఏర్పాటు చేశారు. అయితే ఈ సామాజిక సేవ ఒక సంస్థతోనో.. ఒక వ్యక్తితోనో సంపూర్ణంగా నిర్వహించలేం.. నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ అన్నీ వలంటీర్స్పై ఆధారపడి సేవలు కొనసాగిస్తున్నాయి. నగరం వేదికగా ఉన్న ఎన్జీవోల్లో సగానికి పైగా ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ వలంటీర్ల మద్దతుతో కొనసాగుతున్నవే.. ఎలాంటి లాభాపేక్ష లేకుండా నిస్వార్థంగా విభిన్న రంగాల్లో సేవలందిస్తున్నారు. నేడు ప్రపంచ వలంటీర్ దినోత్సవం నేపథ్యంలో నగరం వేదికగా సేవలందిస్తున్న విభిన్న సామాజిక సేవా విభాగాల్లోని విశేషాలు తెలుసుకుందాం.. కోటిన్నరకుపైగా జనాభా కలిగిన హైదరాబాద్లో వేల సంఖ్యలో అనాథలు, నిరాశ్రయులు సహాయం కోసం ఎదురుచూస్తున్నారు. ఇలాంటి వారికి సేవలందించడానికి ఎన్నో రకాల స్వచ్ఛంద సేవ సంస్థలు నిత్యం కృషి చేస్తున్నాయి. దాతల సహాయంతో కార్పొరేట్ కంపెనీల సీఎస్ఆర్ నిధులతో సామాజిక సేవ చేస్తున్న ఎన్జీవోలకు వలంటీర్ వ్యవస్థ వారధిగా పనిచేస్తుంది. ఇందులో అధిక శాతం యువతనే ఉండటం విశేషం. విద్యార్థులు, ఉద్యోగులుగా వ్యక్తిగత జీవితాన్ని కొనసాగిస్తున్న యువత హ్యాపీగా జీవితాన్ని అన్ని కోణాల నుంచి చూడాలన్న మంచి హృదయంతో వలంటీర్లుగా మారుతున్నారు. వారంలో ఒక రోజైనా లేదా రెండు, మూడు రోజులకు కాసింత సమయమైనా ఎన్జీవోలకు కేటాయిస్తూ తమవంతు బాధ్యత నిర్వర్తిస్తున్నారు. ఇందులో భాగంగా వీధుల్లో ఫుట్పాత్లపై ఉన్న అనాథలకు, అన్నార్తులను కలిసి వారి పరిస్థితులను తెలుసుకొని వృద్ధాశ్రమాల్లో, అనాథాశ్రమాల్లో చేరి్పంచడం లేదా తాత్కాలికంగా వారి ఆకలి తీర్చడానికి తమవంతు కృషి చేస్తున్నారు. ఈ వలంటీర్లు ఏదో ఒక ఎన్జీవోతో కలిసి తమ సేవలను కొనసాగిస్తున్నారు. అంతేగాకుండా చలికాలంలో దుప్పట్లు పంచడం, వర్షాకాలంలో రెయిన్ కోట్లు పంచడం, ఎండాకాలంలో నీళ్లు అందిస్తూ దాతృత్వాన్ని చాటుకుంటున్నారు. జంతువులకు బాసటగా.. నగరం వేదికగా జంతు ప్రేమికులకు ప్రత్యేకంగా సమూహాలు సైతం ఉన్నాయి. ఈ జంతువులకు కొన్ని ఎన్జీవోలతో కలిసి లేదా వారే ఒక సంఘంగా ఏర్పడి నగరంలోని నిరాదరణకు గురైన జంతువులు, సాధుజంతువుల సంరక్షణ కోసం కృషి చేస్తున్నారు. కొన్ని సందర్భాల్లో హింస, దాడులకు గురైనప్పుడు వాటికి కారణమైన వ్యక్తులను వ్యవస్థలను న్యాయపరంగా శిక్షించేందుకు కృషి చేస్తున్నారు. వీరంతా సోషల్ మీడియా వేదికగా వెబ్సైట్లో పేజీలు క్రియేట్ చేసుకుని తమ సేవలను కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగా పెట్స్ వేగన్స్ క్లబ్, బ్లూ క్రాస్ సొసైటీ వంటి పలు సంస్థలు పని చేస్తున్నాయి.రోగులకు సేవలందిస్తూ.. ప్రస్తుత తరుణంలో వివిధ కారణాలతో అత్యవసర పరిస్థితుల్లో ఉన్న రోగులకు రక్షణ అందించడం చాలా అవసరం. ఈ విషయంలో నగరం వేదికగా ఎంతోమంది స్వచ్ఛందంగా రక్తదానం చేస్తూ ప్రాణాలు కాపాడుతున్నారు. పెద్దఎత్తున రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేస్తున్నారు. సోషల్ మీడియాలో లేదా ఏదో ఒక స్వచ్ఛంద సంస్థ ఆహా్వనం మేరకు పలువురు వలంటీర్లు సదరు హాస్పిటల్స్కు వెళ్లి స్వచ్ఛందంగా రక్తదానం చేస్తున్నారు.పర్యావరణం.. మన హితం.. పర్యావరణ పరిరక్షణ కోసం పలువురు హౌస్ స్థాయిలో విభిన్న వేదికలుగా విశేష సేవలు అందిస్తున్నారు. వాతావరణంలో కాలుష్యాన్ని తగ్గించడం మొదలు కాలుష్యం పెరగడానికి కారణమైన మొక్కల నరకడానికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేస్తున్న వారు సైతం ఉన్నారు. తప్పనిసరి నరికేయాల్సి వచ్చిన మొక్కలను తిరిగి మళ్లీ పెంచేలా కృషి చేస్తుండటం విశేషం. పర్యావరణ సంరక్షణలో ప్లాస్టిక్ వాడకం తగ్గించడానికి దశాబ్ద కాలంగా కొన్ని సంస్థలు అందులోని వాళ్లు విశేషంగా కృషి చేస్తున్నారు. మూగజీవుల కోసం..సాటి మనుషులకే కాదు మూగజీవాలకు కూడా ప్రత్యేకంగా హక్కులున్నాయి. వాటి గురించి అందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. నా వంతు సామాజిక బాధ్యతగా జంతు సంరక్షణకు సంబంధించిన సేవా కార్యక్రమాలు చేస్తుంటాను. ఇందులో భాగంగా వీధి కుక్కలకు ఆహారం అందించడం, ఆదరణకు నోచుకొని జంతువులకు అనారోగ్య సమస్యలు ఉంటే వాటికి చికిత్స అందిస్తాం. ఈ మధ్యకాలంలో జంతువులపై దాడులు పెరిగిపోయాయి. వీటికి వ్యతిరేకంగా ఫైట్ చేయడమే కాకుండా హింసకు పాల్పడవద్దంటూ అవగాహన కల్పస్తున్నాం. – గౌతమ్ అభిష్క్, అనిమల్ యాక్టివిటీస్రక్తం అందేందుకు కృషి.. ప్రస్తుత జీవన విధానంలో ప్రమాదాలు కావొచ్చు.. ఇతర అనారోగ్య సమస్యలు కావొచ్చు.. అత్యవసర సమయంలో రక్తం అందక ప్రాణాలు కోల్పోయిన వారు వేలు, లక్షల సంఖ్యలో ఉన్నారు. సరైన సమయంలో సాటి మనుషులు స్పందించకపోవడంతో ప్రాణాలు కోల్పోతున్నారు. అలాంటి పరిస్థితి రాకూడదనే లక్ష్యంతో నేను వలంటీర్గా రక్తదానం చేస్తున్నాను. నేను రక్తదానం చేస్తూనే నా స్నేహితులను ఏకం చేసి నాలుగేళ్లలో దాదాపు నాలుగు వేల మందికి పైగా రక్తం అందించేలా కృషి చేశాను. – ముతీ ఉర్ రెహమాన్, హైదరాబాద్ -
ఫిట్.. సెట్..
సొగసైన శరీరాకృతి అందరూ కోరుకుంటారు. అయితే దానికి మన వంతుగా ఎలాంటి ప్రయత్నం చేస్తున్నామన్నదే ముఖ్యం. ఎవరైనా నిత్యం వ్యాయామం చేస్తూ, జిమ్ ట్రైనర్స్ సూచనలు పాటిస్తే మెరుగైన ఆకృతిని సొంతం చేసుకోవచ్చు. దీనికి ఆహారపు అలవాట్లు, శరీరతత్వం, ఉద్యోగ సమయం, ఆరోగ్యం పరిస్థితులు, తదితర అంశాలు సైతం శరీరంపై ప్రభావం చూపిస్తాయి. నగరంలో యువత, మహిళలు అధిక శాతం మంది జిమ్ బాట పడుతున్నారు. ఇందులో కొంత మంది ప్రాథమిక వ్యాయామానికే పరిమితం అవుతుండగా, మరికొంత మంది మాత్రం తమ శరీరంలోని వివిధ అవయవాలకు సంబంధించిన ప్రత్యేక వ్యాయామాలపై దృష్టి పెడుతున్నారు. ట్రైనర్స్ ఏం చెబుతున్నారు? ఎలాంటి డైట్ పాటించాలి? తెలుసుకుందాం..! నగర యువత అత్యధిక శాతం మంది తమ శరీరాకృతిని ఆరు పలకల ఆకృతిలోకి మార్చుకోడానికి ఆసక్తి చూపిస్తున్నారు. పొట్ట ప్రదేశంలో అనవసరమైన కొవ్వులను కరిగించుకోడానికి ఆబ్డామిన్ స్ట్రెచ్చెస్, క్రంచెస్ వంటి వ్యాయామాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. దీంతో పొట్ట భాగం సరైన ఆకృతిలోకి వస్తోంది. జంపింగ్ స్వా్కట్స్ చేయడం వల్ల బరువుని తగ్గించుకోవచ్చు. ఎత్తుకు సరిపడేంతగా సన్నబడడం, షోల్డర్స్ను అభివృద్ధి చేయడంపై దృష్టిసారిస్తున్నారు. శరీరంలో వృధాగా పేరుకుపోయే కొవ్వులు, కేలరీలను కరిగించేందుకు బర్పీస్ చేస్తే మంచి ఫలితాలు పొందవచ్చు. మౌంటెనింగ్, క్లైంబింగ్స్ వంటివి ఫ్లాట్ స్టొమక్ని అందిస్తాయి. డంబెల్స్తో డిఫరెంట్ సెట్స్.. చూడచక్కని షోల్డర్స్ కోసం డంబెల్స్తో వర్కౌట్ చేయాలి. బెంచ్ ప్రెస్ చేయడం వల్ల గుండె భాగంపై ప్రభావం కనిపిస్తుంది. చెస్ట్ కండరాలు స్పష్టమైన అమరికతో ఆకర్షిణీయంగా తయారవుతాయి. వీపు వైపు బలంగా, ఫిట్గా ఉండాలంటే పుల్ డౌన్, నడుము బలంగా తయారవడానికి డెడ్ లిఫ్ట్ వర్కౌట్ చేయాలి. ప్లాంక్ ఫోశ్చర్పై పరుగు తీస్తే గుండె కొట్టుకునే సామర్థ్యాన్ని పెంచుతుంది. ఈ వ్యాయామాలు ముఖ్యంగా భుజాలు, గుండె భాగం, కాళ్లపై ప్రభావం చూపిస్తాయి. మజిల్స్ బలంగా తయారై, శరీరాన్ని ఫ్లెక్సిబిలిటీగా ఉంచుతుంది. మహిళలను వేధిస్తున్న అధిక బరువు.. ఇటీవలి కాలంలో జిమ్లకు వస్తున్న మహిళల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. పిల్లలు పుట్టిన తరువాత మహిళలు బరువు పెరుగుతున్నారు. ఇంట్లో సరైన వ్యాయామం లేకపోవడంతో వివిధ ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని పేర్కొంటున్నారు. బెల్లీఫ్యాట్ తగ్గించుకోవడం, గుండె భాగం ఫిట్గా ఉండటం, నడుము బలంగా తయారు కావడానికి వ్యాయామాలు చేస్తున్నారని ట్రైనర్స్ పేర్కొంటున్నారు.శరీరం దృఢంగా ఉండాలంటే.. శరీరం దృఢంగా, బలంగా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకోవడం సహజం. అయితే బిజీ సిటీ లైఫ్లో ఆహారపు అలవాట్లు, కాలుష్యం, నిద్ర అనేక అంశాలు శరీర పటుత్వంపై ప్రభావం చూపిస్తాయి. సరైన వ్యాయామం చేయకుంటే అనేక వ్యాధులకు మనం ఆహ్వానం పలికినట్లే అవుతుంది. శరీరం ఫిట్గా ఉండేందుకు క్రాస్ ఫీట్, బరీ్పస్, జంపింగ్ తదితర వ్యాయామాలు చేయడం మంచిది. శరీర కండరాలు సరైన ఆకృతిలో పెరగాలన్నా, ఆరోగ్యంగా ఉండాలన్నా ఆహారపు క్రమశిక్షణ అవసరం. బయట చిరు తిళ్లు, నూనె వంటకాలకు దూరంగా ఉండాలని జిమ్ ట్రైనర్స్ సూచిస్తున్నారు.శరీరం ఫిట్గా తయారైంది.. రెండేళ్లుగా నిత్యం జిమ్ చేస్తున్నాను. వారంలో కనీసం మూడు రోజులు 60 నుంచి 70 కిలో మీటర్ల వరకూ పరుగెత్తుతాను. గతంలో కిడ్నీలో స్టోన్స్, అల్సర్, ఛాతీలో నొప్పి వంటి సమస్యలు బాధించేవి. వ్యాయామం చేయడం మొదలు పెట్టిన తర్వాత సుమారు 20 కిలోల వరకూ బరువు తగ్గాను. ఇప్పుడు శరీరం ఫిట్గా తయారైంది. వచ్చే ఏడాది జనవరిలో జరిగే రాష్త్ర స్థాయి పరుగు పోటీల్లో పాల్గొనేందుకు అర్హత సాధించాను. – శ్రీశైలంగౌడ్, బండ్లగూడక్రమశిక్షణ అవసరం.. యువతలో ఎక్కువ మంది జిమ్ చేసే సమయంలో శరీరాకృతి కోసం అడుగుతున్నారు. పెద్దలు సాధారణ వ్యాయామాలపై దృష్టిసారిస్తున్నారు. మహిళలు సన్నబడటం, బెల్లీ ఫ్యాట్, బరువు తగ్గించుకోడానికి ఆసక్తి చూపిస్తున్నారు. డైట్ పాటించాలి. మాంసాహారానికి దూరంగా ఉండాలి. కూరగాయలు ఎక్కువ మోతాదులో తీసుకోవాలి. ప్రతి రోజూ కనీసం అరగంట సమయం నడక, పరుగు తీయడం మంచిది. – సద్దాం, జిమ్ ట్రైనర్ -
కేకుపుట్టించే టేస్ట్!
ప్రయాణం చేస్తూనే అల్పాహారం తీసుకోవాలనుకున్న ఓ యువ ప్రొఫెషనల్ దీని కోసం అరటి వాల్నట్ కేక్ తయారు చేసుకుంటాడు. బిజీగా ఉండే ఓ మోడ్రన్ మదర్.. చిన్నపిల్లల స్నాక్ బాక్స్ కోసం తన ప్యాంట్రీలో నిల్వ చేసిన ఫ్రూట్ పుడ్డింగ్ కేక్ని బయటకు తీసి రెడీగా ఉంచుతుంది. ఇలా ఉదయాన్నే తీసుకునే అల్పాహారం నుంచి రాత్రి పూట ఆస్వాదించే బ్రౌనీస్ వరకూ.. కేక్స్ నగరవాసుల వేగవంతమైన డైలీ రొటీన్లో భాగం అయిపోయాయి. ఇక న్యూఇయర్ని, క్రిస్మస్లను మోసుకొచ్చే డిసెంబర్ నెలలో అయితే కేక్ల సందడికి హద్దే ఉండదని చెప్పాలి. కేకుల వినియోగంలో సౌలభ్యంతో పాటు వాటి రుచి కారణంగా చాలా మందికి ఆహారపరంగా ప్రాధాన్యత జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాయి. లాక్డౌన్ సమయంలో ఇళ్లకే పరిమితమైన సిటిజనులు హోమ్ బేకింగ్ను అలవాటు చేసుకున్నారు. అలా పదుల సంఖ్యలో పుట్టుకొచి్చన హోమ్ బేకర్స్.. ఆన్లైన్ వేదికగా అనేక మందికి వీటిని చేరువ చేశారు. దీంతో ఈ డెజర్ట్ సిటిజనులకు మరింత ఇష్టమైన ఆహారంగా మారింది. హాట్ కేక్.. ఈట్ రైట్.. సిటీలో విరివిగా వినియోగంలో ఉన్నవాటిని ప్యాకేజ్డ్ కేకులు: ఆరి్టసానల్ కేక్లుగా విభజించవచ్చు. వీటిలో స్పాంజ్ కేక్లు, కప్ కేక్లు, చీజ్ కేక్లు, కేక్ పాప్స్ వంటివి వేగంగా తినే పని ముగించాలనుకునేవారికి ఇష్టమైనవిగా మారాయి. దీనికి తోడు పలు బ్రాండ్స్ మార్కెట్లోకి ప్రవేశపెడుతున్న వివిధ రుచులు ఆకట్టుకునే ప్యాకేజ్లతో మరింతగా ఆదరణ దక్కించుకుంటున్నాయి. ప్లెయిన్ స్పాంజ్ కేకులు, ఫ్రాస్టెడ్ ఐసింగ్, స్విస్ రోల్స్, ఫ్రూట్ ఫిల్డ్ మఫిన్ల వరకు అందుబాటులో ఉన్న అనేక రకాల ప్యాకేజ్డ్ కేక్లకు డిమాండ్ బాగా ఉంది. గులాబ్ జామూన్, రస్మలై కేకులు లేదా ఫిర్ని తిరమిసు ఇలా బ్రెడ్ తయారీదారులు మన రుచులతో పాశ్చాత్య డెజర్ట్లను చొప్పిస్తున్నారు. పండుగలకూ పసందే.. పుట్టిన రోజులు లేదా వివాహాలతో పాటు కేక్ సంప్రదాయం భారతీయ పండుగలకు కూడా విస్తరించింది. రాఖీ, దీపావళి భాయ్ దూజ్ వంటి పండుగలు సంప్రదాయ స్వీట్లు – బహుమతులతో పాటు కేక్లను బహుమతిగా ఇచ్చే వారి సంఖ్య పెరుగుతోంది. సంప్రదాయ స్వీట్లు ఇప్పటికీ పెద్ద ఎత్తున ఆదరణ పొందుతున్నప్పటికీ, కేక్ను బహుమతిగా ఇవ్వడం అనేది కూడా క్రమక్రమంగా ఊపందుకుంటోంది. అలా ఇచ్చి పుచ్చుకోవాలనుకునేవారి కోసం రిచ్ ప్లమ్ కేక్, విక్టోరియన్ ప్లమ్ కేక్, చాకొలెట్ ఐసింగ్ కేక్, వెనీలా ఐసింగ్ కేక్, పైనాపిల్, స్ట్రాబెర్రీ, బట్టర్ స్కాచ్, బ్లాక్ ఫారెస్ట్ కేకులతో పాటు ఫ్రెష్ ఫ్రూట్ కేక్, క్యారామిల్ కేక్, చాకొలెట్ ఆల్మండ్ కేక్.. వంటì వెన్నో.. సిటీ మార్కెట్లో సందడి చేస్తున్నాయి. ఊపుతెచ్చిన.. ఈ–కామర్స్ఇ–కామర్స్ ప్లాట్ఫారమ్ల వల్ల కొన్ని గంటల్లో ఫ్యాన్సీ కేక్లను పంపడం/స్వీకరించడం çసర్వసాధారణమైపోయింది. కేక్ గిఫ్టింగ్ కోసం ఈ ప్లాట్ఫారమ్ల ద్వారా కొనుగోలు చేసి, బహుమతిగా పంపే సౌలభ్యంతో కేక్ల విక్రయాల్లో 12–15% పెంపునకు ఈ సైట్లు కారణమయ్యాయని అంచనా. ప్రముఖ ఆన్లైన్ బేకరీ రిటైల్ చైన్ అయిన విన్నీ విక్రయాల తీరు రాఖీ, భాయ్ దూజ్ లేదా దీపావళి వంటి పండుగల సమయంలో డిమాండ్కు అద్దం పడుతోంది. ఏతావాతా ప్లాట్ఫారమ్ల వెల్లువ కేక్ గిఫ్టింగ్ మార్కెట్ వృద్ధికి గణనీయంగా దోహదపడింది. రాఖీ, భైదూజ్ దీపావళి వంటి పండుగల సమయంలో కేక్ విక్రయాల దాదాపు 20% వృద్ధి రేటును చూసింది. సోషల్.. సోస్టైల్.. డిజైనర్ కేక్స్ హవాకు సోషల్ మీడియా ఆజ్యం పోస్తోంది. ఆకర్షణీయమైన వెరైటీలను సోషల్ వేదికలపై ఇన్ఫ్లుయెన్సర్లు, ఫుడ్ బ్లాగర్లు తాజా కేక్ డిజైన్లను క్రమం తప్పకుండా ప్రదర్శిస్తున్నారు. తద్వారా ప్రత్యేక సందర్భాలకు తగ్గట్టుగా డిజైన్ చేసిన కేక్ల వైపు వినియోగదారుల చూపు మళ్లేలా చేస్తున్నారు. పరిశ్రమ నివేదికల ప్రకారం, సోషల్ మీడియా ప్రభావం వల్ల దేశంలో కేక్ మార్కెట్ కొన్ని సంవత్సరాలుగా 20శాతం వరకూ పెరుగుతోందట.సందర్భమేదైనా.. సందడి కేక్స్దే.. ఒకప్పుడు కేక్స్ను కేవలం బర్త్డేలకు మాత్రమే ఎక్కువగా వినియోగించేవారు. క్రిస్మస్, న్యూ ఇయర్లతో పాటు ఇప్పుడు ఇవి విభిన్న సందర్భాలకు విస్తరించాయి. చిన్నారుల పుట్టిన రోజుల్ని ప్రతినెలా జరపడం దగ్గర నుంచీ వివాహ వార్షికోత్సవాల దాకా అలాగే కొత్తగా జాబ్లో చేరడం దగ్గర నుంచీ ప్రమోషన్స్, పదవీ విరమణ దాకా.. ఇలా అనేకానేక సందర్భాలకు కేక్స్ను వినియోగించడం జరుగుతోంది. పైనాపిల్ కేక్, బటర్స్కాచ్ కేక్, ఛీజ్ కేక్, బిస్కోటి కేక్.. తదితర వెరైటీలకు ఫుల్ డిమాండ్ ఉంది. – సయ్యద్ ఇర్ఫాన్, సుభాన్ బేకరీ -
సినివారం.. లఘు చిత్రాల సమాహారం..
సినిమా.. సినిమా.. అంటూ జీవితాన్ని సైతం అంకితం చేసి ఈ రంగంలో రాణించడానికి, వెండి తెరపైన తమకంటూ ప్రత్యేకంగా ఓ పేజీ రాసుకోవాలని తపించే, పరితపించే సినిమా ప్రేమికులెందరో. విభిన్న కళల సమాహారం సినిమా. కథకుడు, దర్శకుడితో మొదలై.. నటీనటులు, ప్లేబ్యాక్ సింగర్స్, మ్యూజిక్, కొరియోగ్రఫీ, ఆర్ట్, వీఎఫ్ఎక్స్, డబ్బింగ్.. ఇలా విభిన్న కళాకారుల సమిష్టి కృషి సినిమా. ఈ వేదికపై తమ పేరును చూసుకోవాలన్నా, వారి చిరకాల ఆకాంక్షను నెరవేర్చుకోవాలన్నా ఎక్కడో సాయం అందాలి.ఇప్పుడిప్పుడే సినీ రంగం వైపు అడుగులేస్తున్న ఔత్సాహికుల కళాత్మకతను, సృజనాత్మకతను గుర్తించే వారుండాలి..?! సినిమానే లక్ష్యంగా లఘుచిత్రాలు రూపొందిస్తూ, బిగ్ స్క్రీన్ కోసం ప్రయత్నిస్తున్న సినీపిపాసులను ఆదరించే ప్రోత్సాహం అవసరం.. ఇలాంటి వారందరినీ సగర్వంగా ప్రపంచానికి పరిచయం చేస్తోంది ‘సినివారం’. తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో నగరం నడిబొడ్డున కొలువుదీరిన రవీంధ్రభారతి వేదికగా ప్రతి శనివారం నిర్వహిస్తున్న ‘సినివారం’ ఈ తరం సినీ ప్రేమికులకు స్వర్గధామం. ఉత్తమ షార్ట్ ఫిలింస్ నిర్మించే వారిని గుర్తించి వారి ప్రయాణానికి రెడ్ కార్పెట్ వేస్తోంది రవీంద్రభారతిలోని పైడి జయరాజ్ ప్రివ్యూ థియేటర్ ‘సినివారం’. – సాక్షి, సిటీబ్యూరోవినీలాకాశంలాంటి సినీ ప్రపంచంలోకి అడుగులేసిన యువతరానికి గుర్తింపునివ్వాలనే లక్ష్యంతో 2016 నవంబర్ నెలలో పురుడుపోసుకుంది ‘సినీవారం’. సృజనాత్మకత ఉండి, సినిమాపై ప్రేమతో మొదటి ప్రయత్నంగా లఘు చిత్రాలు రూపొందిస్తున్న తెలంగాణ యువత ఎందరో. వారందరికీ ఒక అవకాశంతో పాటు, సినిమా రంగానికి వారి సృజనాత్మకతను తెలియజేసేది ఆ షార్ట్ఫిల్మ్ మాత్రమే. అనంతరం దానిపై సినీ రంగ ప్రముఖులతో చర్చిస్తుంది ఈ సినీవారం. ఇందులో భాగంగా ఈ ఎనిమిదేళ్లలో కొన్ని వందల లఘు చిత్రాలు ఈ తెరపై ప్రదర్శితమయ్యాయి. వీటిని రూపొందించిన సినీ ప్రేమికులకు నేరుగా అవకాశాలు లభించాయి. నూతన తెలంగాణలో సినీ ప్రేమికులకు ఇదొక అవకాశాల పుష్పక విమానం. నైపుణ్యాలను గుర్తించి.. లోపాలను సవరిస్తూ.. తెలంగాణకు సినిమా కొత్త కాదు. ఆ రోజుల్లోనే బాలీవుడ్లో తనదైన ముద్ర వేసుకున్న మొదటి తరం సినీ రంగ ప్రముఖులు.. పైడి జయరాజ్. ఆయన గౌరవార్థం రవీంద్రభారతిలోని థియేటర్కు పైడి జయరాజ్ ప్రివ్యూ థియేటర్ అని నామకరణం చేశారు. ఈ థియేటర్లోనే ఈ తరం యువకులు తీసిన లఘు చిత్రాలను క్రమం తప్పకుండా ప్రతి శనివారం సాయంత్రం 4 గంటల నుంచి 9 గంటల వరకూ ప్రదర్శిస్తున్నారు. కరీంనగర్, మహబూబ్ నగర్, ఖమ్మం, ఆదిలాబాద్, హైదరాబాద్.. ఇలా తెలంగాణలోని విభిన్న ప్రాంతాల్లో యువతరం తీసిన షార్ట్ ఫిల్మŠస్, డాక్యుమెంటరీలను ఈ వేదికపై ప్రదర్శించి వారికి ఒక గుర్తింపునిస్తోంది రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ. ఈ ప్రయత్నంలో వారి నైపుణ్యాలను, లోపాలను ఇదే వేదికపై తెలియజేసేలా ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన నిర్మాతలు, సినీ ప్రముఖులు, నిపుణులు, ప్రముఖ సినీ విమర్శకులతో చర్చా గోష్టిని నిర్వహిస్తున్నారు. అనంతరం వారికి సినిమా అవకాశాలు లభించేలా ఒక దారిని చూపిస్తోంది.మహామహులంతా ఇక్కడి నుంచే.. పెళ్లి చూపులు, ఈ నగరానికి ఏమైంది వంటి హిట్ చిత్రాలతో ఫేమస్ డైరెక్టర్గా గుర్తింపు పొందిన తరుణ్ భాస్కర్, మెయిల్ సినిమాతో చిన్న సినిమాకు పెద్ద గుర్తింపు తీసుకొచ్చిన ఉదయ్ గుర్రాల, దొరసాని ఫేం కేవీఆర్ మహేంద్ర వంటి ఈ తరం సినీ దిగ్గజాలు తమ మొదటి సినీ ప్రయత్నాలను ఈ సినీవారం వేదికగానే ప్రదర్శించారు. ఇలా దర్శకులు, నటులు, సినీ రచయితలతో పాటు సిని పరిశ్రమకు అవసరమయ్యే విలువైన ముడిసరుకు కొంతమేర ఈ సినీవారం వేదికగా సమకూరుతోంది. ఇక్కడ ప్రదర్శించే లఘుచిత్రాలు ప్రధానంగా తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలు, తెలంగాణ పోరాటాలు, యధార్థగాథలతో పాటు నేటి మోడ్రన్ కమర్షియల్ సినిమాల నాణ్యతను పరిచయం చేస్తున్నాయి. క్రియేటివిటీకి కేరాఫ్ అడ్రస్... పదేళ్ల కృషికి నిదర్శనం ఇది.. ప్రస్తుత సినిమాల్లో తెలంగాణ నేపథ్యమున్న కళాకారులు, కథలు, సినిమాలు, టెక్నీషియన్లు వారి విజయాలు..!! ఈ లక్ష్యం నిర్దేశించుకునే 2016లో ‘సినివారం’ను ప్రారంభించాం. గతంలో ముంబైలోని బాలివుడ్ కమర్షియల్ సినిమాలకు కేంద్రం. కానీ అక్కడి మరాఠీ సినిమాలు కూడా వాటి ప్రత్యేకతను, ప్రాధాన్యతను, ప్రశస్తిని కొనసాగించాయి. అలాగే హైదరాబాద్లోనూ తెలుగు సినిమా సైతం తన వైవిధ్యాన్ని, విశిష్టతను ప్రదర్శించాలనే లక్ష్యంతో ఈ వినూత్న ప్రయత్నానికి నాంది పలికాం. ఇందులో భాగంగా కళ, నైపుణ్యాలు, సృజనాత్మకత ఉండి, అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న యువతకు అద్భుత వేదికను నిర్మించాం. ఈ సినివారం వేదికగా ఇప్పటి వరకూ దాదాపు 27 మంది ఈ తరం దర్శకులు పరిచయమయ్యారు. అంతేకాకుండా 24 క్రాఫ్టŠస్కు చెందిన నిపుణులు గుర్తింపును, అవకాశాలను పొందారు. ఇలాంటి ఔత్సాహికుల కోసం ఇక్కడ వారి షార్ట్ ఫిల్మ్ ప్రదర్శనతో పాటు వర్క్షాప్లు, శిక్షణా తరగతులు, అవగాహనా సదస్సులు, ఇంటరాక్టివ్ సెషన్స్ తదితర కార్యక్రమాలను నిర్వహిస్తున్నాం. ఒక ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ అందించే సేవలన్నీ ఇక్కడ అందించే ప్రయత్నం చేస్తున్నాం. ఇటీవలే సినిమాల్లో ఆర్టిఫిషియల్ ఇంటలీజెన్స్ (ఏఐ) ప్రాధాన్యత పైన వర్క్షాప్ నిర్వహించాం. సినిమా రంగంలోని అధునాతన మార్పులపై ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తున్నాం.భవిష్యత్లోనూ ఈ తరం సినిమా ప్రేమికులకు మరిన్ని అవకాశాలను భాషా సాంస్కృతిక శాఖ అందిస్తుంది. – మామిడి హరిక్రిష్ణ, తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు -
కుంచె గీసిన చిత్రం..
నగరంలోని పలు కూడళ్లు రంగులద్దుకుంటున్నాయి. విభిన్న కళాకృతులతో ఫ్లై ఓవర్ పిల్లర్లు, అండర్ పాస్ గోడలు కలర్ ఫుల్ పెయింటింగ్స్తో కళకళలాడుతున్నాయి. ఒక్కో సెంటర్కు ఒక్కో రకమైన థీమ్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. గత రెండు నెలలుగా కళాకారులు తమ ప్రతిభతో ఎంతో అందమైన కళాఖండాలను తీర్చిదిద్దుతున్నారు. ఆ దారిన పోయే ప్రయాణికులను ఇవి ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. పర్యావరణం, ఆరోగ్యం, నగర, గ్రామీణ ప్రజల జీవన శైలి, జంతువులు, పక్షులు, క్రీడలు ఇలా విభిన్న రంగాలకు చెందిన చిత్రాలు నడయాడినట్లు దర్శనమిస్తున్నాయి. ఇందులో కళాకారులతో పాటు, ఫైన్ ఆర్ట్స్ విద్యార్థులు సైతం పాలుపంచుకుంటున్నారు. ఎల్బీనగర్ నుంచి లింగంపల్లి వరకూ.. మెహిదీపట్నం నుంచి సికింద్రాబాద్ వరకూ.. హైటెక్ సిటీ నుంచి ఉప్పల్ సచివాలయం వరకూ.. ఇలా ఎటు చూసినా వంతెనల పిల్లలర్ల మీద, వంతెనల గోడలపైనా ఇటీవల కాలంలో కొత్త సొబగులద్దుకుంటున్నాయి. రేవంత్ సర్కార్ వచ్చిన తరువాత వాల్ పెయింటింగ్స్తో నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దాలని ఆదేశించింది. దీంతో జీహెచ్ఎంసీ అధికారులు కార్యాచరణలోకి దిగారు. ప్రతి ఫ్లై ఓవర్ వంతెన, అండర్ పాస్ గోడలు, పిల్లర్లకు అందమైన ఆకృతుల్లో చిత్రాలకు ప్రాణం పోస్తున్నారు. ఒక్కో సెంటర్లో ఒక్కో రకమైన థీమ్తో చిత్రాలు వేస్తున్నారు. ఎల్బీ నగర్ కూడలిలో వంతెన పిల్లర్లకు ఓ వైపు సంప్రదాయ నృత్యాలు, మైరో వైపు పాప్ డ్యాన్సర్స్ చిత్రాలు తీర్చిదిద్దారు. ఫ్లెక్సీ ప్రింటింగ్తో ముప్పు..ఒకప్పుడు ఆర్టిస్టులకు చేతినిండా పని ఉండేది. దీంతో బ్యానర్లపై రాతలు రాయడం, గోడలపై చిత్రాలు వేయడం, రాజకీయ, సినీ ప్రముఖుల కటౌట్లను సిద్ధం చేయడం, వివిధ సందర్భాల్లో ఆరి్టస్టులకు చేతినిండా పని దొరికేది. దీంతో గతంలో ఫైన్ ఆర్ట్స్ నేర్చుకోవాలనే ఆలోచన ఎక్కువ మందిలో కనిపించేది. అయితే ఇటీవలి కాలంలో మార్కెట్లోకి డిజిటల్ ఫ్లెక్సీ ప్రింటింగ్ అందుబాటులోకి రావడంతో తక్కువ ఖర్చు, వేగంగా పని పూర్తవుతుండడంతో పలువురు దీనిపై మక్కువ చూపుతున్నారు. దీంతో పెయింటింగ్ ఆరి్టస్టులకు ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతున్నాయని పలువురు కళాకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆదాయం, ఉపాధి మార్గాలపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని వాపోతున్నారు.36 ఏళ్లుగా ఇదే వృత్తి..1988లో ఆరి్టస్టుగా ప్రయాణం మొదలు పెట్టాను. ప్రభుత్వం వాల్ పెయింటింగ్స్కు అవకాశం కల్పించడం సంతోషంగా ఉంది. కళాకారులకు పని దొరుకుతుంది. రోజుకు రూ.2 వేలు ఇస్తున్నారు. జీహెచ్ఎంసీ అధికారులు ఏ రకమైన పెయింటింగ్స్ వేయాలని సూచిస్తే వాటినే చిత్రిస్తున్నాం. ఈ పని ఎన్నాళ్లు ఉంటుందో తెలీదు. పదేళ్ల క్రితం వరకూ చేతినిండా పని ఉండేది. ఫ్లెక్సీ ప్రింటింగ్ వచ్చిన తరువాత నెలలో కొన్ని రోజులు పనిలేక ఖాళీగా ఉండాల్సి వస్తోంది. – అశోక్, కళాకారుడు, హయత్నగర్ఆరు నెలలు పని కలి్పంచాలి.. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ పని కల్పించినట్లు సంవత్సరంలో కళాకారులకు కనీసం ఆరు నెలలు పనికల్పించే విధంగా చట్టం చేయాలి. ఒకప్పుడు ఫైన్ ఆర్ట్స్ అంటే సమాజంలో డిమాండ్ ఉండేది. ఫ్లెక్సీలు వచ్చాక క్రమంగా పని తగ్గుతోంది. పదో తరగతి చదివి ఆరి్టస్టుగా స్థిరపడ్డాను. ఇప్పుడు నెలలో 20 రోజులు పని ఉంటే పది రోజులు ఖాళీగా ఉండాల్సి వస్తోంది. ప్రభుత్వమే కళాకారులను ఆదుకుని జీవనోపాధి చూపించాలి. – సత్యం, కళాకారుడు, హయత్నగర్ -
రేర్ బర్డ్స్.. నో వర్డ్స్..
రాష్ట్రానికి, నగరానికి ఏడాది పొడవునా వలస పక్షుల రాకపోకలు ఉంటాయి. సమ్మర్లో కొద్దిగా మాత్రమే వస్తాయి. అయితే వర్షాకాలం నుంచి పెరుగుతూ.. వింటర్లో బాగా ఎక్కువగా 2, 3 రెట్లు ఎక్కువగా పక్షులు వలస వస్తాయి. ఒకప్పుడు ఇలాంటి వలస పక్షులకు నగరంలో చాలా స్పాట్స్ ఉన్నాయి. కానీ కాలక్రమంలో లేక్స్ కనుమరుగవుతుండడం వల్ల వీటికి ఆవాసాలు దొరకడం లేదు. చిరునామాలివే.. నగరం చుట్టు పక్కల పక్షుల వీక్షణకు వీలు కల్పించే ప్రదేశాలు చాలా ఉన్నాయి. ఒకప్పుడు అమీన్పూర్లేక్, జనవాడ వైపు గండిపేట్లేక్, మోకిలా వంటి ప్రాంతాల్లో విపరీతంగా కనిపించేవి. ఇప్పుడు బాగా తగ్గిపోయాయి. ఇప్పటికీ కాలుష్య కాసారాలుగా మారిన లేక్స్లో కూడా పక్షలు కనిపిస్తున్నాయి. వాటిని కాలుష్యరహితంగా మారిస్తే మరింత బాగా పెరుగుతాయి. సంజీవయ్య పార్క్ దగ్గర కూడా బోలెడు పక్షులు, డక్స్ ఉంటాయి. నగరంలో ప్రస్తుతం పక్షులు చూడాలంటే కెబిఆర్ పార్క్, బొటానికల్ గార్డెన్స్, సంజీవయ్య పార్క్లలో చూడొచ్చు. చుట్టుపక్కల చెరువుల్లో.. నగరం చుట్టుపక్కల అయితే.. అనంతగిరి హిల్స్ బెస్ట్. అక్కడకు వెళ్లినప్పుడల్లా ఒక్కోసారి ఒక్కో ఆశ్చర్యకరమైన పక్షి కనబడుతుందని పక్షి ప్రేమికులు అంటున్నారు. అదే కాక ఉస్మాన్సాగర్, కొడకంచి లేక్, కృష్ణారెడ్డి పేట్ చెరువు.. మంజీరా వైల్డ్లైఫ్ శాంక్చురీ, పోచారం వైల్డ్లైఫ్ శాంక్చురీ, నర్సాపూర్ రిజర్వ్ ఫారెస్ట్, సింగూర్ డ్యామ్ కూడా బర్డ్స్కి కేరాఫ్ అడ్రెస్గా చెప్పొచ్చు. ఇటీవల సిటీలోని కొన్ని గేటెడ్ కమ్యూనిటీల్లోని కాలనీ పార్క్స్లో కూడా బాగా పెరుగుతున్నాయి.సీజన్ స్పెషల్స్ ఇవే.. వానాకాలం మన సమీపానికి వచ్చే పక్షుల్లో రెయిన్ క్వాయిల్, పెయింటెడ్ ఫ్రాంకొలిన్, జాకొబిన్ కుకూ (దీనినే మాన్సూన్ బర్డ్ అని కూడా పిలుస్తారు. ఇది రుతుపవనాల ప్రారంభ సమయంలో వస్తుంది) వంటివి ఉన్నాయి. ఇవి మంజీరాలేక్, యంకతల.. వంటి సరస్సులు, పచ్చని పచి్చక బయళ్లలో కనిపిస్తాయి. ఇక శీతాకాలంలో వచ్చేవాటిలో వర్డియర్ ఫ్లై క్యాచర్, ఇండియన్ బ్లూ రాబిన్, బార్ హెడెడ్ గూస్ (ఇది సరస్సుల దగ్గర బాగా కనిపిస్తుంది. ప్రస్తుతం మంజీరాలేక్ దగ్గర దీనిని చూడొచ్చు. విదేశాల నుంచి హిమాలయాల మీదుగా ఈ పక్షి నగరానికి చేరుతుందట)తొలిసారిగా బర్డ్స్ పై బుక్.. మనకి చాలా చోట్ల పక్షులు కనిపిస్తాయి. కానీ అవేంటో వాటి ప్రత్యేకతలేమిటో తెలీదు. ఈ నేపథ్యంలో కొన్ని కామన్ బర్డ్స్ తీసి ఒక గైడ్లాగా ఇస్తే బాగుంటుందనీ, స్టూడెంట్స్కి ఫారెస్ట్ డిపార్ట్మెంట్స్ వాళ్లకి ఇస్తే ఉపయుక్తంగా ఉంటుందనే ఆలోచనతో తొలిసారిగా మన రాష్ట్రంలో పక్షుల వెరైటీలపై ఒక పుస్తకం రూపొందింది. రాష్ట్రంలో 430పైగా వెరైటీ పక్షులు ఉంటాయి. ఇందులో 252 రకాల పక్షుల ఫొటోలు, వాటి పేర్లు, విశేషాలు ఉంటాయి. రెగ్యులర్గా అనంతగిరికి ట్రెక్కింగ్కి వెళ్తుంటారు. అలాంటివారికి ఇవి ఇస్తే ఉపయుక్తం. ప్రభుత్వ పాఠశాలలకు, కళాశాలల విద్యార్థులకు లక్ష కాపీల వరకూ ఉచితంగా పంపిణీ చేయాలనే ఆలోచన చేస్తున్నారు. అమెరికా నేర్పిన అలవాటుగతంలో ఒకసారి అమెరికాలో కొంతకాలం ఉండాల్సి వచ్చింది. ఆ సమయంలో నేనున్న ప్రాంతానికి దగ్గరలో పెద్ద అడవి ఉండేది. అక్కడ రంగు రంగుల పక్షుల్ని కళ్లార్పకుండా చూడడం అలవాటైంది. ఇక్కడకు వచ్చాక సిటీలో పక్షులును అన్వేషిస్తూ.. సంజీవయ్య పార్క్కు తరచూ వెళ్లేవాడిని. ప్రస్తుతం విభిన్న ప్రాంతాలకు వెళ్లి పక్షుల్ని చూడడం ఒక నిత్యకృత్యం. ఈ అభిరుచితోనే హైదరాబాద్ బర్డింగ్ పాల్స్ ప్రారంభించాం. తాజాగా బర్డ్స్ మీద బుక్ లాంచ్ చేశాం. అంతేకాకుండా జనవరి నుంచి బర్డ్ అట్లాస్ పేరుతో వైవిధ్యభరిత కార్యక్రమం చేపడుతున్నాం. నగరం చుట్టుపక్కల విభిన్న ప్రాంతాల నుంచి దీనికి కంట్రిబ్యూట్ చేస్తున్నారు. ఏ పక్షి ఎప్పుడు ఎలా కనిపిస్తుంది? అనేది రికార్డ్ చేసి ఒక మ్యాప్ తయారు చేయాలని ఆలోచన. అయితే దీన్ని పూర్తి చేయడానికి కనీసం ఏడాది పడుతుంది. – హరికృష్ణ, హైదరాబాద్ బర్డింగ్ పాల్స్ -
ఐటీ జాబ్స్.. పిటీ లైఫ్
సాఫ్ట్వేర్ జాబ్స్ ఈ తరానికి ఎయిమ్స్ అండ్ డ్రీమ్స్.. మారుతున్న అధునాతన సాంకేతికత, మోడ్రన్ లైఫ్ స్టైల్లో తాము కూడా భాగస్వాములు కావాలనే ఆశయంతో టెకీలుగా మారుతున్న యువకులెందరో.. ఐదంకెల జీతం, ఐదు రోజులు మాత్రమే పని, సామాజిక హోదా, గుర్తింపు, గౌరవం.. ఇలా ఎన్నెన్నో ఆశలతో అక్షయపాత్ర వంటి సాఫ్ట్వేర్ పల్లకీలోకి అడుగెడుతున్నారు. కానీ.. ఒక్కసారి ఈ రంగంలోకి వచ్చాక వారి జీవన శైలి వారు అనుకున్నట్టుగానే ఉంటుందా..? సామాజికంగా, సౌకర్యాల పరంగా వైరల్ అవుతున్న రీల్స్లా ఉన్నప్పటికీ, వారి వ్యక్తిగత జీవితం ఆ రీల్స్కు వచ్చే కామెంట్ల మాదిరిగా మారింది. మానసిక ఒత్తిడి, శారీరక అనిశ్చితి, ఆర్టిఫిషియల్ ఆర్భాటాలు..! నాణానికి మరో కోణం వంటి ఈ అవస్థల పరిష్కారానికి నగరంలో వెల్నెస్ సెంటర్లు సైతం వెలుస్తున్నాయి. సాఫ్ట్వేర్ ఉద్యోగాల్లో శారీరక శ్రమ లేకుండా సాఫ్ట్గా కొనసాగుతున్నప్పటికీ.. మానసికంగా ఒత్తిడి మాత్రం పీక్స్లో ఉంటుందని టెకీల మాట. సాఫ్ట్వేర్లు, ఐటీ ఉద్యోగుల దైనందిన జీవితం.. కొత్త ప్రాజెక్ట్లు, ప్రాజెక్ట్ డెవలప్మెంట్లు, పైప్లైన్ ప్రాసెస్, డిప్లాయిమెంట్, అజైల్ ప్రాసెస్, బెంచ్, టెస్టింగ్, క్వాలిటీ అష్యూరెన్స్ తదితర నైపుణ్యాల మధ్య అందమైన దయనీయంగా కొనసాగుతుంది. ఐదు రోజుల పని, వారానికి రెండు రోజులు సెలవులు. ఇంకేం.. హాయిగా ఎంజాయ్ చేయవచ్చని అనుకుంటాం.. కానీ క్రెడిట్ బిల్లులు, ఈఎంఐ పేమెంట్స్, రీఫండబుల్ అకౌంట్స్ చెక్ చేసుకుని, సెట్ చేసుకునేలోపు సోమవారం వస్తుందని ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి తెలిపారు. ఆఫీసులోనైనా, వర్క్ ఫ్రమ్ హోమ్ ఐనా, హైబ్రిడ్ ఐనా.. ఒత్తడి మాత్రం తప్పదంటున్నారు గచ్చిబౌలికి చెందిన ఐటీ ప్రొఫేషనల్ గౌతమీ. జాబ్ రాక ముందు ఒక అవస్థ, వచ్చాక దానిని కాపాడుకోవడానికి మరో అవస్థ.. వీటి మధ్య టార్గెట్ రీచ్ కావడానికి, సొల్యూషన్స్ క్లియర్ చేయడానికి ల్యాప్ట్యాప్ పైన చేసే యుద్ధం మరో ప్రపంచ యుద్ధాన్ని గుర్తు చేస్తుందని యువ సాఫ్ట్వేర్ నరేష్ తెలిపారు. ఇక బెంచ్పై ఉన్న వారి పరిస్థితి వివరించడానికి మరో జావా లాంగ్వేజ్ తయారు చేయాలని స్టీఫెన్ మాట. అసహజ జీవనానికి వేదికలుగా.. అందమైన అద్దాల గ్లోబల్ భవనాల్లోని ఈ సాఫ్ట్వేర్ల ఒత్తిడి వారి జీవితాల పైన పెద్ద ప్రభావమే చూపిస్తుందని ఆరోగ్య నిపుణలు ఎప్పటి నుంచో హెచ్చరిస్తూనే ఉన్నారు. ముఖ్యంగా మానసిక ఒత్తిడి వారి హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ను విపరీతంగా పెంచుతుంది. విభిన్న ఆరోగ్య సమస్యలకు ఇది మూల కారణమని నిపుణుల మాట. పనివేళల్లో దాదాపుగా కూర్చొనే ఉండటంతో ఉబకాయం, మధుమేహం పక్క సీట్లోనే ఎదురు చూస్తుంది. వెన్ను నొప్పులు, నరాల బలహీనత ఇలా తదితర సమస్యలకు ఈ హైటీ ఒత్తిడి కారణమవుతోంది. దీనికి తోడు నైట్ డ్యూటీలు సహజ జీవన విధానానికి ఆటంకంగా మారిందిన అంతర్జాతీయ ఆరోగ్య సర్వేలు, అధ్యయనాలు వెల్లడించాయి. ఇలాంటి సమస్యలు పెరుగుతున్న సమయంలో వీరికి సాంత్వన, సహకారం అందించడానికి విభిన్న రకాల వెల్నెస్ సెంటర్లు ఆవిష్కృతమైతున్నాయి. మానసిక ఒత్తిడిని తగ్గించడానికి, అంతర్గత స్థిరత్వాన్ని అందిపుచ్చుకోవడానికి మెడిటెషనల్ కోర్సులు సైతం అందుబాటులోకి వస్తున్నాయి. యోగా, మ్యూజిక్, ధ్యానం.. మీరు సాఫట్వేర్ ఉద్యోగా..?! ఐతే మీ కోసమే మా ఈ సెషన్ అంటూ సోషల్ మీడియా యాడ్. ధ్యానం, యోగా సమ్మిళితంగా వినూత్న కోర్స్ అది. ఒత్తిడిమయమైన యువకులకు ఇదో ఉపశమనం. నగర శివార్లలో పచ్చని పారవశ్యంలో ఏర్పాటు చేసిన మరో బైండ్ మ్యాజిక్ సెంటర్. ఇక్కడ వారు నిర్వహించే సైకలాజికల్ సెషన్స్ మెదడుపై ఒత్తిడిని తగ్గించడమే కాకుండా మరింత చురుకుగా పనిచేసేలా చేస్తుంది. ఇలాంటి వారికి స్పిర్చువల్ మ్యూజిక్ హీలింగ్ సెంటర్లు కూడా ఎంతో మేలు చేస్తున్నాయి. ఏరోబిక్స్, జుంబా వంటి ఫిట్నెస్ సెంటర్లు సైతం ఈ అవస్థలకు కాసింత చెక్ పెడుతున్నాయని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ఈ రంగంలోని అనారోగ్య సమస్యలకు ఎర్గనామిక్స్ అనే ప్రత్యేక మెడికల్ సేవలు సైతం ఉన్నాయి. ఈ మధ్య ఈ సేవలు మరింత ఆదరణ పొందుతున్నాయి. ఎన్షూర్ ఫర్ క్యూర్.. సాఫ్ట్వేర్ రంగంలోని ఉద్యోగులు అధిక సమయం కంప్యూటర్లు, ల్యాప్టాప్ల ముందు కూర్చునే పని చేయాలి. నగరంతో పాటు దేశంలోని ఈ రంగంలో దాదాపు 64 శాతం మంది సెడెంటరీ డెస్క్ జాబ్లలో ఉన్నవారే. ఇటీవలి ప్రముఖ అధ్యయనం ప్రకారం ఇలాంటి ఉద్యోగాల వలన ప్రపంచవ్యాప్తంగా 540 మిలియన్లకు పైగా ప్రజలను నడుము నొప్పి ప్రభావితం చేస్తుంది. 25 సంవత్సరాల్లో ఈ పరిస్థితి రెట్టింపు అయ్యింది. శరీరానికి మూలస్థంభమైన వెన్నెముక ప్రస్తుత ఆధునిక జీవనశైలిలో భాగంగా అధిక ఒత్తిడిని, భారాన్ని భరిస్తోంది. ఈ సమస్య అనతికాలంలోనే విభిన్న ఆరోగ్య సమస్యలకు దారితీస్తోంది. ఈ తరుణంలో సంరక్షణ కోసం ఎన్షూర్ హెల్తీ స్పైన్ అనే విధానాన్ని ప్రవేశ పెట్టాం. ఈ అవస్థలు ఎదుర్కొంటున్న వారికి ప్రివెంటివ్ స్పైన్, స్పోర్ట్స్ హెల్త్ సెంటర్గా సాధారణ, సరళమైన పద్ధతులు రూపొందించాం. కోర్ కండరాలను బలోపేతం చేయడానికి ప్లాంక్స్, బ్రిడ్జెస్ వంటి వంటి వ్యాయామాలు.. ఫ్లెక్సిబుల్, బ్యాలెన్స్ కోసం మైండ్ఫుల్ మూవ్మెంట్స్ పద్ధతులు నిర్వహిస్తున్నాం. వెన్నుముక అవస్థలకు ఎర్గోనామిక్ వర్క్స్పేస్తో చెక్ పెట్టవచ్చు. – నరేష్ పగిడిమర్రి, ఎన్షూర్ హెల్తీ స్పైన్ సీఈఓ. -
రీడ్.. రైట్.. రైట్
ఈ మధ్య మంచి సినిమా వచ్చింది చూశావా బ్రో.. ఇన్స్టాలో కొత్త రీల్ ట్రెండింగ్లో ఉంది తెలుసా మచ్చా.. యూట్యూబ్లో ఓ వీడియో వైరల్ అవుతోంది సెండ్ చేయాలా? ఈ తరం యువతను కదిపితే వారి నోటివెంట ఎక్కువగా వచ్చే మాటలు. మనలో చాలా మంది ఇలాగే మాట్లాడతారు కూడా. అదే ఏదైనా పుస్తకం గురించి చెప్పామనుకోండి.. పుస్తకమా.. పుస్తకం చదివే టైం ఎక్కడుంది.. అయినా ఈ రోజుల్లో పుస్తకాలు ఎవరు చదువుతారు చెప్పండి! అంటూ తిరిగి ప్రశ్నిస్తుంటారు. నిజమే పుస్తక పఠనం ఈ తరం యువతలో తగ్గిపోయిందని అనుకుంటారు. కానీ మనలో చాలా మంది ఈ ట్రెండ్స్ని ఫాలో అవుతూనే ఏదో ఒక పుస్తకాన్ని చువుతూ ఉంటారు. మరికొందరైతే పుస్తకాలంటే పడి చచి్చపోతుంటారు. తెలుగుతో పాటు ఇంగ్లిష్ పుస్తకాలను తెగ చదివేస్తున్నారు. ఇన్స్టా, ఫేస్బుక్, యూట్యూబ్ మాత్రమే చూసే ఈ తరం యువతీ, యువకుల్లో చాలా మంది పుస్తకాలు చదివే వాళ్లు కూడా ఉన్నారా అని మనలో కొందరికి డౌటనుమానం? అయితే అదంతా వట్టి అపోహేనని ఏటా జరిగే హైదరాబాద్ బుక్ ఫెయిర్కు వచ్చే స్పందన రుజువు చేస్తోంది. వేలాది మంది యువత ఈ ఫెయిర్లో లక్షల సంఖ్యలో పుస్తకాలను కొనుగోలు చేస్తున్నారు. ఒకప్పుడు బుక్ ఫెయిర్లో అమ్మకాలు ఎలా ఉన్నాయో ఇప్పటికీ అలానే కొనసాగుతున్నాయని చెబుతున్నారు నిర్వాహకులు. నవలలకు ప్రాధాన్యం.. పుస్తకాలు చదివే వారిలో ఎక్కువగా నవలలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. పొట్టి వీడియోలు, షార్ట్ న్యూస్ లాగే పొట్టి కథలు చదివేందుకు ఇష్టపడుతున్నారు. తక్కువ నిడివిలో చెప్పాల్సిన విషయాన్ని చెప్పేసే నవలలకు యువత ఎక్కవగా అట్రాక్ట్ అవుతోంది. ఇక, వచన కవిత్వంపై కూడా యూత్ మనసు పారేసుకుంటోంది. దీంతో పాటు ప్రముఖుల ఆత్మకథలు చదివేందుకు చాలా మంది యువతీ, యువకులు ఆసక్తి కనబరుస్తున్నారు. ఒకప్పుడు ఇంగ్లిష్ లో నవలలు చదివేందుకు కాలేజీ విద్యార్థులు మొగ్గు చూపేవారు. కానీ ఇప్పుడు మాతృభాష అయిన తెలుగు పుస్తకాలు చదివేందుకు ప్రయతి్నస్తున్నారు. మరీ ముఖ్యంగా చిన్నప్పటి నుంచి ఇంగ్లిష్ మీడియంలో చదువుకున్న వారు తెలుగు పుస్తకాలు చదివేందుకు ఆసక్తి చూపుతున్నారు.పాఠకులు పెరుగుతున్నారు.. 1990లలో పుస్తకాలు బాగా హిట్ అయ్యేవి. ఇప్పుడు ఆ పరిస్థితి మారింది. ఎంత ఆసక్తిగా ఉన్నా కూడా పుస్తకాలు చదివే వారు తక్కువయ్యారని చాలా మంది అంటుంటారు. కానీ పుస్తకాలు చదివేవారు బాగానే పెరిగారు. ఓ సినిమా బాగుంటే ఎలా చూస్తున్నారో.. మంచి కథ.. విభిన్న కథనంతో పుస్తకాలు మార్కెట్లోకి వస్తే కళ్లకద్దుకుని చదివే వారి సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. ఇటీవల వచ్చిన ‘అమ్మ డైరీలో కొన్ని పేజీలు’ అనే పుస్తకం దాదాపు లక్ష కాపీలు అమ్ముడుపోవడమే ఇందుకు నిదర్శనం. నిజ జీవితంలో జరిగే ఉదంతాలనే ఆసక్తిగా రాస్తే పుస్తకాలు చదువుతారని ఆ పుస్తక రచయిత నిరూపించారనడంలో అతిశయోక్తి లేదు. ఇలాంటి పుస్తకాలు చదివిన తర్వాత చాలా మంది ఏదైనా మంచి పుస్తకం ఉంటే చెప్పండి బ్రదర్ అని తెలిసిన వారిని ఇప్పటి యువతీ, యువకులు అడుగుతున్న సందర్భాలు కోకొల్లలు.రచయితలుగానూ రాణిస్తూ.. ఇటీవలి కాలంలో పుస్తకాలు రాసేందుకు కూడా యువత ఆసక్తి కనబరుస్తోంది. ముఖ్యంగా మాతృభాషపై మమకారంతో తమకు సాధ్యమైనంత వరకూ రచనలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. కొందరు హాబీగా ఖాళీ సమయాల్లో రచనలు చేస్తుండగా.. కొందరు మాత్రం రచనను కెరీర్గా ఎంచుకుంటున్నారు. మంచి కథతో వస్తే పాఠకులు ఆదరిస్తారనే నమ్మకం పెరగడంతో, మంచి కథలు రాసేందుకు ప్రయతి్నస్తున్నారు. అందరికీ పుస్తకాలు అచ్చు వేయించుకునే పరిస్థితి ఉండకపోవచ్చు. అందుకే చాలా మంది సామాజిక మాధ్యమాల్లో చిన్న చిన్న కథలు రాస్తూ తమ అభిరుచిని చాటుకుంటున్నారు. ఇలా రాస్తూ.. రాస్తూ.. పుస్తకాలు ప్రచురించేసి, ఆదరణ పొందుతున్న వాళ్లూ లేకపోలేదు. ఇక, పుస్తకాలు, సోషల్ మీడియాలో రాస్తూ సినిమాల్లో గేయ రచయితగా, స్క్రిప్ట్ రైటర్గా కూడా వెళ్లేందుకు దారులు వెతుక్కుంటున్నారు.వెలకట్టలేని అనుభూతి.. పుస్తక పఠనం ఎప్పటికీ వన్నె తరగనిది. సామాజిక మాధ్యమాలు తాత్కాలికమే. పుస్తకాలు చదివితే ఏదో వెలకట్టలేని అనుభూతి కలుగుతుంది. సోషల్ మీడియాలో సమయాన్ని వృథా చేసుకునే బదులు మంచి పుస్తకం చదివితే కొత్త ప్రపంచాన్ని చూసిన వాళ్లమవుతాం. – డాక్టర్ మల్లెగోడ గంగాప్రసాద్, రచయితఅవినాభావ సంబంధం చిన్నప్పటి నుంచే చిన్న చిన్న కథలు, వ్యాసాలు రాయడం అలవాటు. తెలుగుపై మమకారంతో తెలుగులో పీజీ చేశాను. ప్రస్తుతం ఉస్మానియా యూనివర్సిటీలో తెలంగాణ రచయిత్రుల కథా సాహిత్యం– స్త్రీ జీవన చిత్రణ అనే అంశంపై పీహెచ్డీ చేస్తున్నాను. పుస్తక పఠనంతో భాషను మెరుగుపరుచుకోవచ్చు. నిజ జీవితానికి దగ్గరగా ఉండే కథలు ఆసక్తిగా ఉంటాయి. – పెద్దపల్లి తేజస్వి, పరిశోధక విద్యారి్థని, ఓయూబంగారు భవితకు బాట.. పుస్తక పఠనం యువత బంగారు భవితకు బాటలు వేస్తుంది. సాహిత్య పఠనం ద్వారా సామాజిక స్పృహ కలుగుతుంది. పుస్తకం చదువుతుంటే ఎంతో మందితో సాన్నిహిత్యంగా ఉన్నట్టు అనిపిస్తుంది. భావ వ్యక్తీకరణ, భాషా నైపుణ్యం, ఏకాగ్రత, ఓర్పు, సహనం పెరుగుతుంది. – రావెళ్ల రవీంద్ర, యువ రచయిత -
క్రేజీ.. డీజే..
అర్ధరాత్రి సమయం..చిమ్మ చీకట్లని. పట్ట పగలుగా మార్చే రంగురంగుల విద్యుత్ కాంతుల్లో.. ఓ వైపు ఛీర్స్తో హుషారు.. మరోవైపు చిందుల జోరు.. ఆ సమయంలో తోడు లేకుండా అమ్మాయిలు బయటకు వెళ్లడమే సరికాదని నొక్కి వక్కాణించే సంప్రదాయ వాదుల చెవులకు చిల్లులు పడే సంగీతంతో కదం తొక్కుతున్నారు ఆధునిక యువతులు. డీజేలుగా.. మేల్ డామినేషన్కు గండికొడుతూ శరవేగంగా ముందుకు దూసుకొస్తున్నారు. ‘మనసుకు నచ్చిన సంగీతం.. వయసుకు తగ్గ వినోదం.. మంచి ఫ్రెండ్స్. ఇన్ని అందించే రంగాన్ని వదిలేసి సాదా సీదా ఉద్యోగం ఎందుకు చేయాలి?’ అని ప్రశ్నింస్తున్నారు అఖిల. ఉద్యోగం అంటే మంచి ఆదాయం వస్తుంది కదా..అంటే..! ‘నేను ఎంచుకున్న కెరీర్లో అంతకన్నా ఎక్కువ సంపాదనే ఇప్పుడు వస్తుంది’ అంటూ స్పష్టం చేశారు. సాయంత్రం ఆరు దాకా అఖిల.. ఆరు దాటాక డీజే బ్లాక్.ఎవరూ డేర్ చేయని రోజుల్లోనే.. దాదాపు పదేళ్ల క్రితమే ఈ రంగంలోకి వచ్చారు లీనా. నగరంలోని సికింద్రాబాద్లో నివసించే ఈ సింథీ యువతి.. డిగ్రీ పూర్తి చేసి ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు కూడా చేశారు. అనంతరం కొన్ని షోస్ చేశారు.. చిన్న చిన్న ఉద్యోగాలు చేసి ఆ తర్వాత ఫుల్టైమ్ డీజేయింగ్ను ఎంచుకున్నారు. ‘ఏవీ మనసుకు నచ్చలేదు. అదే నా కెరీర్ను ఇటు మార్చింది’ అంటూ చెప్పారు డీజే లీనా. ఫ్రీలాన్స్ డీజేగా సిటీలోని సగం పైగా క్లబ్స్లో ఇప్పటికే తన మ్యూజిక్ వినిపించానంటున్న లీనా.. బాలీవుడ్ అంటే తనకు ప్రేమ అనీ, అందుకే ఆ సంగీతాన్ని ప్లే చేయడానికి తాను ఇష్టపడతానని అంటున్నారు. అమ్మాయిలు ఈ రంగంలోకి ఎక్కువగా రాకపోవడానికి కుటుంబ సభ్యుల నుంచి మద్దతు దొరకకపోవడమే కారణమంటున్నారు లీనా.. తాను కూడా అతి కష్టం మీద కుటుంబ సభ్యులను ఒప్పించగలిగానని చెబుతున్నారు.ట్రెడిషనల్ ఫ్యామిలీలో.. ట్రెండీగా.. ‘నేను ఇక్ఫాయ్లో బీబీఏ పూర్తి చేశాను. సొంతంగా బిజినెస్ చేయాలనేది నా ఆలోచన. అయితే చిన్నప్పటి నుంచీ డీజేయింగ్ అంటే ఇష్టం. ఫ్రెండ్స్తో క్లబ్స్కి వెళ్లినప్పుడు కేవలం డీజే మ్యూజిక్ కోసమే వెళ్లేదాన్ని’ అంటూ గుర్తు చేసుకున్నారు అఖిల. మహబూబ్ నగర్కు చెందిన ఓ పూర్తి సంప్రదాయ కుటుంబంలో పుట్టిన అఖిల.. 2018లో డీజే స్కూల్లో చేరాలని నిర్ణయించున్నారు. అప్పుడు ఇంట్లో వాళ్ల నుంచి చెప్పుకోదగ్గ ప్రతిఘటననే ఎదుర్కొన్నారు. ‘ఫ్యామిలీ వద్దు అన్నప్పటికీ మనసు మాటే విన్నాను. ఒక ప్రోగ్రామ్కి కేవలం రూ.1000తో ప్రారంభించి.. ఇప్పుడు అంతకు పదింతలు తీసుకునే స్థాయికి చేరాను’ అంటూ సగర్వంగా చెప్పారామె. అమ్మాయిల భద్రత విషయం గురించి మాట్లాడినప్పుడు.. ‘మా చుట్టూ బౌన్సర్స్ ఉంటారు. ఇప్పటిదాకా చిన్న చేదు అనుభవం కూడా నాకు ఎదురుకాలేదు’ అంటూ చెప్పారామె. భవిష్యత్తులోనూ డీజేగా కొనసాగుతానని, మరిన్ని టాప్ క్లబ్స్లో తన మ్యూజిక్ని వినిపిస్తానని బాలీవుడ్ ట్య్రాక్స్కి పేరొందిన ఈ డీజే బ్లాక్ చెబుతున్నారు.‘ఫ్లో లో.. ‘జో’రుగా.. ‘మా నాన్న వాళ్లది వరంగల్. అయితే నేను నార్త్లోనే పెరిగాను. ప్రస్తుతం సిటీలో సెటిలయ్యా’ అంటూ చెప్పారు ఫ్లోజో. డిగ్రీ పూర్తి చేశాక.. కొన్ని కార్పొరేట్ ఉద్యోగాలు చేశా. అయితే చిన్నప్పటి నుంచీ సంగీతం పై ఉన్న ఇష్టంతో డీజేసూ్కల్లో చేరి కోర్సు పూర్తి చేసి డీజేగా మారాను అంటూ చెప్పారు ఫ్లోజో. ప్రస్తుతం నగరంలో టాప్ డీజేల్లో ఒకరుగా ఉన్న ఈ అమ్మాయి తొలుత లిక్విడ్స్లో రెసిడెంట్ డీజేగా ప్లే చేశానని, కొంత కాలం తర్వాత ఫ్రీలాన్స్ డీజేగా మారి, పలు అవార్డ్స్ కూడా అందుకున్నానని వివరించారు. థాయ్ల్యాండ్ వంటి అంతర్జాతీయ వేదికలపైనా, గోవా వంటి పార్టీ సిటీల్లోనూ ప్లే చేశానంటున్న ఫ్లోజోకి తన పేరు స్టైలి‹Ùగా ఉండడంతో మార్చుకోవాల్సిన అవసరం రాలేదన్నారు. ఈ కెరీర్లో అటు ఆనందం, ఇటు ఆదాయం రెండూ బాగుంటాయంటున్న ఫ్లోజో.. ఆరేడేళ్లలోనే కారు, ఫ్లాట్ కొనగలిగానని సంతోషంగా చెప్పారు. ఇదీ చదవండి: గేలి చేసినచోటే గెలిచి చూపించిన మగువలు! -
నట్టింటి నుంచి.. నెట్టింటికి..
పెళ్లంటే పందిళ్లు.. సందళ్లు.. తప్పెట్లు.. తాళాలు.. తలంబ్రాలు.. అని సినీ గేయ రచయిత ఆత్రేయ పాట అందరికీ తెలిసిందే.. అయితే ఆ పాటలో చెప్పిన విధంగా పెళ్లివారి నట్టింట్లో అచ్చం అలాంటి సందడే కొనసాగేది. అయితే ప్రస్తుతం ట్రెండ్ మారింది.. పెళ్లి సందడి నట్టింట్లో నుంచి నెట్టింట్లోకి చేరింది. దీంతో రకరకాల ఆధునిక పోకడలు ఈ తతంగంలో కనిపిస్తున్నాయి. స్వతంత్ర దేశంలో చావు కూడా పెళ్లి లాంటిదేరా బ్రదర్ అని మరో కవి అన్నట్లు సామాజిక మాధ్యమాల వేదికగా ట్రెండ్ అయ్యే విధంగా తతంగం నడుస్తోంది. పెళ్లిచూపులు, ఎంగేజ్మెంట్, ప్రీ వెడ్డింగ్ మొదలు, పెళ్లి అనంతరం జరిగే తతంగాల వరకూ అన్నీ సోషల్ వేదికగా షేర్ చేసుకుంటున్నారు. పెళ్లిలో నేటి ఆధునిక పోకడలపైనే ఈ కథనం.. నేటి తరానికి ప్రతిదీ సెలబ్రేషనే.. సామాజిక మాధ్యమాల్లో పెళ్లి సంబరాలు అంబరాన్నంటేలా చేసుకుంటున్నారు. పెళ్లి పనులు ప్రారంభమైనప్పటి నుంచి ప్రీవెడ్డింగ్, పెళ్లి వేడుకలు, పోస్ట్ వెడ్డింగ్, సీమంతం ఇలా ఒక్కటేమిటి ప్రతి సందర్భాన్నీ వీడియోలు, ఫొటోలు తీసుకుని భద్రపరుచుకుంటున్నారు. తరతరాలు గుర్తుండిపోయేలా విభిన్నంగా, వినూత్నంగా తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. వాటికి సంబంధించిన పొట్టి వీడియోలను యూట్యూబ్, ఇన్స్ట్రాగామ్ వంటి సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటున్నారు. అయితే ఇటీవల సరికొత్త ట్రెండ్ వచి్చంది. అదేంటంటే.. పెళ్లి చూపులకు సంబంధించిన వీడియోలను కూడా సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటున్నారు. ఈ వీడియోలు తాజాగా ఫుల్ ట్రెండింగ్లో ఉంటున్నాయి. సంతోషాన్ని పంచుకునేందుకు.. ఇటీవల తమ జీవితంలో జరిగే ముఖ్యమైన అంశాలను ప్రపంచంతో పంచుకోవడం అలవాటైంది. ముఖ్యంగా సామాజిక మాధ్యమాల్లో వీడియోల రూపంలో పెడుతున్న వారు ఎక్కువ అవుతున్నారు. ఒకప్పుడు పెళ్లిచూపులకు సంబంధించిన అంశాలను చాలా గోప్యంగా ఉంచేవారు. అంతా సెట్ అయిన తర్వాత కానీ బయట ప్రపంచానికి తెలియనిచ్చేవారు కాదు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. జీవితంలో జరిగే ప్రతి ముఖ్యమైన ఘట్టాన్నీ గుర్తుంచుకునేందుకు ప్రయతి్నస్తున్నారు. పెళ్లి చూపుల కోసం పెళ్లి కొడుకు కారు దిగిన దగ్గరి నుంచి పెళ్లి చూపులు జరుగుతున్న తతంగం మొత్తాన్నీ వీడియోలు తీసుకుంటున్నారు. అటు పెళ్లి కొడుకు, ఇటు పెళ్లి కూతురు నవ్వుతూ సిగ్గు పడుతుంటే అదో మరపురాని అనుభూతిగా మిగిలిపోతుందనడంలో అతిశయోక్తి లేదు. పెళ్లి కూతురు తరపు వాళ్లు, పెళ్లి కొడుకు తరపు బంధువులు ఈ సందర్భంగా సరదాగా జరిపే మాటామంతీ కూడా సోషల్ మీడియాలో పెడుతున్నారు. కొందరు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు ఈ సంభాషణలను ఆధారంగా చేసుకుని ఎన్నో ఫన్నీ వీడియోలు తీస్తూ నవ్వులు పూయిస్తున్నారు. కామెంట్ల వెల్లువ.. పెళ్లి చూపులకు సంబంధించిన వీడియోలను చక్కగా ఎడిటింగ్ చేసి, సూటయ్యే పాటలను బ్యాక్గ్రౌండ్లో సెట్చేసి అప్లోడ్ చేస్తున్నారు. పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు సరదాగా మాట్లాడుకుంటున్న సందర్భాన్ని కూడా వీడియోలు తీస్తున్నారు. రెండు, మూడేళ్లుగా కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో ఈ తరహా వీడియోలు తెగ పాపులర్గా ఉండేవి. ఇటీవల కాలంలోనే మన దగ్గర కూడా ఇలా పెళ్లి చూపుల వీడియోలు తీసి ఇన్స్ట్రాగామ్ వంటి వేదికల్లో పోస్టు చేస్తున్నారు. దీంతో మన దగ్గర కూడా ఈ రీల్స్ వైరల్ అవుతున్నాయి. ఈ రీల్స్ చూసిన వీక్షకులు కూడా నూతన వధూవరులకు కామెంట్ల రూపంలో శుభాకాంక్షలు చెబుతూ పాజిటివ్గా స్పందిస్తున్నారు. పెళ్లి కాని యువతీ, యువకులు మాత్రం ఈ వీడియోలను చూస్తుంటే ‘పెళ్లి చేసుకుంటే బాగుండూ అనిపిస్తోంది’ అంటూ కామెంట్లు పెడుతూ నవ్వులు పూయిస్తున్నారు. మొత్తానికీ ఈ ఏడాది పెళ్లి చూపుల వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయనే చెప్పుకోవచ్చు. జాగ్రత్త అంటున్న నిపుణులు.. ఇటీవల చాలావరకూ ప్రీవెడ్డింగ్, హల్దీ, మెహందీ, పోస్టు వెడ్డింగ్, బేబీ బంప్ వీడియోలు షూట్ చేసుకోవడం కామన్గా మారిపోయింది. అయితే ఏదైనా కానీ మితి మీరనంత వరకే మంచిదని నిపుణులు చెబుతున్నారు. సోషల్ మీడియా మోజులో పడి అతిగా ప్రవర్తిస్తే వ్యక్తిగత జీవితంతో పాటు సమాజంలో కూడా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని పేర్కొంటున్నారు. గతంలో సెన్సేషన్ కోసమో.. వినూత్నంగా, విభిన్నంగా చేయాలనే ఉద్దేశంతోనో వెరైటీగా షూటింగ్స్ చేసి విమర్శలు కొని తెచ్చుకున్న వారూ లేకపోలేదు. దీంతో సామాజిక మాధ్యమాల్లోని ఫొటోలు, వీడియోలు నేటి టెక్నాలజీ కారణంగా మిస్ యూజ్ అయిన సందర్భాలనూ చూస్తూనే ఉన్నాం.. -
స్టార్స్.. ఫిట్నెస్ ట్రైనర్స్..
ఆరోగ్యం కావాలనుకునే అందరికీ వ్యాయామం అవసరమే. అందుకోసం చాలా కసరత్తులు చేయాలి. దీంతో పాటు ఆహార నియమాలూ కఠినంగా ఉండాలి. సరైన న్యూట్రిషన్ తీసుకున్నప్పుడే సరైన వ్యాయామం చేయగలం. అయితే సినిమా తారలకు సంబంధించి వ్యాయామ అవసరాలు విభిన్నం. ఆరోగ్యంతో పాటు వారు పోషించే పాత్రలు వ్యాయామ శైలులను, అంతేకాదు వ్యాయామ శిక్షకులనూ నిర్ధేశిస్తాయి. అందుకే అందరికీ శిక్షణ ఇవ్వడం ఒక ఎత్తయితే.. సెలిబ్రిటీలకు శిక్షణ ఇవ్వడం మరో ఎత్తు అంటారు స్టార్ ట్రైనర్స్. ఈ నేపథ్యంలో నగరంలో సెలబ్రిటీ ట్రైనర్స్గా పేరొందిన కొందరి పరిచయం.. నగరంలోని సెలబ్రిటీ ట్రైనర్గా పేరొందిన వారిలో ముందు వరుసలో ఉంటారు కుల్దీప్ సేథ్.. జూబ్లీహిల్స్లో ఉన్న ఆయన జిమ్ ఎప్పుడు చూసినా సెలబ్రిటీల రాకపోకలతో కళకళలాడుతూ ఉంటుంది. మెగాస్టార్ చిరంజీవి దగ్గర నుంచి ‘చిరుత’నయుడైన రామ్ చరణ్ దాకా శిక్షణ ఇచ్చారాయన. విజయ్ దేవరకొండ, ఆర్ఎక్స్ 100 ఫేమ్ కార్తికేయ, అందాల ‘రాశి ఖన్నా’, రషి్మక.. తదితర తారలు ఎందరినో చెక్కిన శిల్పిగా పేరు తెచ్చుకున్నారు.సమంత..సత్తా.. అఖిల్కూ ఆయనే.. నటి సమంత తన ‘నాగిన్ మొబిలిటీ డ్యాన్స్’ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసినప్పుడు వర్కవుట్ వీడియో వైరల్ అయ్యింది. ఆమె వ్యక్తిగత శిక్షకుడు ఫిట్నెస్ ట్రైనర్ జునైద్ షేక్. అతని గురువు ముస్తఫా అహ్మద్ల ఆలోచనే ఇది. దేశంలోనే అత్యంత డిమాండ్ ఉన్న ఫిట్నెస్ ట్రైనర్లలో ఒకరైన జునైద్, స్పెషల్ వర్కవుట్ల రూపకల్పనకు ప్రసిద్ధి చెందారు. ఆయన క్లయింట్లలో అఖిల్ అక్కినేని, మోడల్–డిజైనర్ శిల్పా రెడ్డి మాత్రమే కాదు బాలీవుడ్ స్టార్స్ హృతిక్ రోషన్, రణ్వీర్ సింగ్ తదితరులు కూడా ఉన్నారు.ఎన్టీఆర్కూ లాయిడ్.. సినిమా అవసరాలను బట్టి ట్రైనర్స్ని మార్చడం స్టార్స్కు తప్పనిసరి. ఆర్ఆర్ఆర్ సినిమాలోని గిరిజన యోధుడిగా తన పాత్రకు తగిన టార్జాన్ లాంటి శరీరాకృతిని సాధించడానికి జూనియర్ ఎన్టీఆర్ సెలబ్రిటీ ఫిట్నెస్ కోచ్ లాయిడ్ స్టీవెన్స్నే ఎంచుకున్నాడు. అదే విధంగా తాజాగా రాజమౌళి సినిమా చేస్తున్న మహేష్ బాబు అందులోని పాత్రకు తగ్గట్టు తన రూపాన్ని మార్చుకోడానికి లాయిడ్ ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. గతంలో లాయిడ్ జాన్ అబ్రహం, రణ్వీర్ సింగ్ వంటి బాలీవుడ్ స్టార్స్కి శిక్షణ ఇచ్చారు.మహేష్కి మినాష్.. ఫిట్నెస్ ట్రైనర్ మినాష్ గాబ్రియేల్ గత ఐదేళ్లుగా మహేష్ బాబుతో కలిసి పని చేస్తున్నాడు. ‘ఒకరోజు స్ట్రెంగ్త్ ట్రైనింగ్, ఒకరోజు కార్డియో ఇలా షూట్ ముగిసిన తర్వాత రోజూ సాయంత్రం పూట శిక్షణ ఉంటుంది’ అని మినాష్ అంటున్నారు. ప్రతిరోజూ దాదాపు 60 నిమిషాల పాటు కఠినమైన కసరత్తులు చేసే మహేష్ సెట్లో, సెట్ వెలుపల కూడా ఒక పర్ఫెక్షనిస్ట్ అనీ, గాయాలతో పోరాడడం, వాటిని అధిగమించడం, అద్భుతమైన ఆకృతిని పొందడం..సాధ్యం. ప్రస్తుతం మహేష్ వయసు వెనక్కు వెళుతోంది’ అంటూ తన సూపర్స్టార్ స్టూడెంట్ని ప్రశంసిస్తారాయన.అనసూయ.. ఆర్జీవి.. అరవై ఏళ్లొచి్చనా ఇంకా ఫిట్గా కనిపించే దర్శకుడు రామ్గోపాల్ వర్మకు ఫిట్నెస్ శిక్షకునిగా పనిచేశారు విజయ్ గంధం. అలాగే యాంకర్, నటి అనసూయ, నాగేంద్రబాబు.. తదితరులకూ శిక్షణ అందించారు. ‘ఇప్పుడు నటీనటులకు మాత్రమే కాదు దర్శక నిర్మాతలకు సైతం ఫిట్నెస్ మీద పూర్తి అవగాహన, ఆసక్తి ఏర్పడింది. క్రమశిక్షణతో తమను తాము తీర్చిదిద్దుకుంటున్నారు’ అంటారు విజయ్ గంధం. గత కొంత కాలంగా అనేక అగ్రస్థాయి బ్రాండెడ్ జిమ్స్లో ట్రైనర్గా పనిచేసిన విజయ్.. టాలీవుడ్ తారలు మాత్రమే కాకుండా నగరంలో పలువురు వ్యాపార ప్రముఖులకూ ట్రైనర్గా పేరొందారు.వారి ఆసక్తినిబట్టే.. ‘తెరపై తారలు పోషించాల్సిన పాత్రలు, వారి ఇష్టాలు, శరీర తీరుతెన్నులకు అనుగుణంగా వర్కవుట్లను సృష్టించడానికి ఇష్టపడతాను, ఉదాహరణకు హీరో అఖిల్ అక్కినేని క్రీడా అభిమాని. క్రికెట్ను ఎక్కువగా ఇష్టపడతాడు. దీన్ని దృష్టిలో ఉంచుకుని, ఆయన వర్కవుట్లు చాలా వరకూ క్రీడల చుట్టూ డిజైన్ చేశా. అదే విధంగా కొందరికి సైక్లింగ్, బ్యాడ్మింటన్ అంటే చాలా ఇష్టం. నేను అలాంటి ఆసక్తులను దృష్టిలో పెట్టుకుని పని చేస్తాను. వ్యాయామం సరదాగా ఉండాలి తప్ప బాధపెట్టకూడదు. సమంత చూడడానికి సున్నితంగా కనిపిస్తుంది. కానీ వర్కవుట్ చేసే టైమ్లో బలమైన శక్తిగా మారుతుంది. అందుకే ఆమె నా ఫేవరెట్ క్లయింట్.’ – జునైద్ షేక్, ఫిట్నెస్ ట్రైనర్ -
సరికొత్త.. పెట్ కల్చర్
పెట్ అండ్ పెట్ లవర్స్.., సిటీలో ఈ పదాలకు ఒక క్రేజ్ ఏర్పడింది. మనుషులే కాకుండా వారి జీవితాల్లో సాధు జంతువులను మమేకం చేసుకుని, ఆతీ్మయతను పెంచుకుంటూ ఆనందానికి, ఆహ్లాదానికి, సాన్నిహిత్యానికి కేరాఫ్ అడ్రస్గా నిలుస్తున్నారు. అయితే మొదటి నుంచి పెట్స్ అంటే కేవలం కుక్కలు, పావురాలు, పిల్లులను ఎక్కువగా పెంచుకునే వారు. కానీ మారుతున్న అధునాతన జీవన శైలికి అనుగుణంగా వినూత్నంగా విభిన్న రకాల పెట్స్ను పెంచుకుంటున్నారు. ఈ వెరైటీ పెట్స్లో పక్షుల నుంచి పాముల వరకూ ఎన్నో రకాల డొమెస్టిక్ పెట్స్ను సాకుతున్నారు. ఈ వెరైటీల్లో ఎక్కువగా ఇంపోర్టెడ్ పెట్స్ ఉంటున్నాయి. వీటి ఖరీదు సైతం అధికంగానే ఉంటుంది. పాతిక వేల నుంచి రూ.2 లక్షలకు పైబడి వెరైటీ పెట్స్ సిటీలో సరికొత్త కల్చర్గా మారింది. నగరవాసుల్లో పెరిగిపోతున్న సాధు జంతువుల పెంపకం ఒక హబీ మాత్రమే కాదు.., ఇదొక సంస్కృతిగా మారింది. సాధారణ కుక్కల నుంచి మొదలై విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న బల్లులు, తొండలు వంటివి ఈ కల్చర్లో భాగమైపోయాయి. గతంలో జర్మన్ షెఫర్డ్, ల్యాబడార్స్, గోల్డెన్ రిట్రైవర్, రాట్ వీలర్, పొమోనేరియన్, హచ్డాగ్ వంటి వాటిని ఇష్టంగా పెంచుకునే వారు. చౌ చౌ, షిట్జూస్ వంటి పప్పీస్కూ ఈ మధ్య ఆదరణ బాగా పెరిగింది. ఈ వెరైటీ డాగ్స్ సుమారు 75 వేల నుంచి లక్షల రూపాయల్లో లభిస్తున్నాయి. పిల్లులకూ ప్రేమికులు.. కరోనా అనంతరం కొన్ని కారణాల వల్ల పెంపుడు జంతువుల ధరలు కాస్త తగ్గినట్లు పెట్స్ నిపుణులు తెలిపారు. ప్రస్తుతం డాగ్స్తో పాటు బ్రిటిష్ షార్తైర్స్, రాగ్డాల్స్, మైన్ కూన్స్ వంటి విభిన్న రకాల పిల్లులను సైతం పెంచుతున్నారు. ఈ వెరైటీ పెట్స్ పై ఆసక్తి, అవగాహన పెరగడంతో ఈ మధ్య కాలంలో డాగ్ ఫో, క్యాట్ షోలు నగరంలో విరివిగా జరుగుతున్నాయి. పక్షులకు భారీ క్రేజ్.. నగరంలో రిచ్ కల్చర్లో భాగంగా పక్షులను పెట్స్గా పెంచుకుంటున్నారు. ఇందులో భాగంగా ఆఫ్రికన్ గ్రే ప్యారెట్, మకావ్ వంటి పక్షులకూ క్రేజ్ పెరిగింది. ఇలువంటి విభిన్న రకాల పక్షులు సుమారు 20 వేల నుంచి 2 లక్షల వరకూ ధరల్లో లభిస్తున్నాయి. అయితే సాధారణంగా హంసలు అంటే చాలా మందికి ఇష్టం, కొందరు వీటిని తమ గార్డెన్లోని కొలనుల్లో పెట్స్గా పెంచుకుంటున్నారు. ఈ మధ్య కాలంలో బ్లాక్ స్వాన్ (నలుపు హంసలు) లకు డిమాండ్ పెరిగింది. వాటి నాణ్యతను బట్టి ఈ బ్లాక్ స్వాన్స్ జోడీ మార్కెట్ విలువ 5 లక్షల నుంచి 10 లక్షలు ఉండటం గమనార్హం. ఇవే కాకుండా అందమైన పావురాలు, అ్రస్టిచ్తో పాటు విభిన్న రకాల చిట్టి పొట్టి జాతి పక్షులకూ ఆదరణ పెరిగింది.విల్లాల్లో వింతగా.. నగరవాసులు విల్లాల్లో ఇంకొంచెం ముందడుగేసి సరీసుృపాల(పాకేవి–రెప్టైల్స్)ను కూడా పెంచేసుకుంటున్నారు. వీటినీ పెట్స్ జాబితాలో చేర్చేస్తున్నారు. వీటిలో ఎక్కువగా కొన్ని రకాల జాతుల తొండలు, బల్లులు, పాములను విల్లాలు, ఫామ్హౌస్లలో పెంచుకోవడం ట్రెండ్గా మారుతోంది. ఈ తరహా కల్చెర్కు పలువురు జంతుప్రేమికులు ఇష్టపడుతున్నారు. అనుమతులు తప్పనిసరి.. జంతు ప్రేమికులు ఎలా పడితే అలా.. వేటిని పడితే వాటిని.. పెంచుకోడానికి వీల్లేదు. సాధు జంతువులుగా గుర్తించబడుతున్నప్పటికీ వాటన్నింటినీ పెంచుకోడానికి అనుమతులు లేవని పెట్స్ నిపుణులు చెబుతున్నారు. అటవీ, జంతు సంరక్షణ శాఖ ఆధ్యర్యంలో కొన్ని రకాల వైల్డ్ యానిమల్స్ను పెంచకూడదు. వాటి సహజత్వాన్ని కోల్పోడానికి కారణమవుతుంది కాబట్టి, ఆహారం కూడా అందించకూడదని నిబంధనలు చెబుతున్నాయి. ప్రత్యేకంగా కొన్ని రకాల పక్షులు, జంతువులకు మాత్రం సంబంధిత శాఖ అనుమతులతో తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేయించుకుని పెంచుకోవచ్చని సూచించారు. సంస్కృతికి ప్రతిబింబంగా.. మన సంస్కృతి, సంప్రదాయాలకు అద్దం పట్టేలా మరి కొందరు పుంగనూరు ఆవులను పెంచుకుంటున్నారు. ఇవే కాకుండా.. ఇంటీరియర్ అందాలను పంచే ఫిష్ ఆక్వేరియమ్లో అరుదైన చేపలు పెంచడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇందులో గోల్డ్ ఫిష్ వంటి రకాలను అమితంగా ఇష్టపడుతున్నారు. కొందరైతే వాస్తు కోసం కూడా ప్రత్యేకంగా ఎంపిక చేసిన చేపలను పెంచడం విశేషం. -
ఆరు పదులకు అందాల కిరీటం
వయసు శరీరానికి మాత్రమే.. మనసుకు కాదని ప్రతి మహిళకూ తెలియజేయాలనే లక్ష్యంతో తాను అందాల పోటీలో పాల్గొన్నానని, అందులో విజయం సాధించానని హైదరాబాద్ నగరానికి చెందిన విద్యావేత్త డాక్టర్ విజయ శారదరెడ్డి తెలిపారు. బ్యాంకాక్లో జరిగిన మిస్సెస్ ఆసియా ఇంటర్నేషనల్ పోటీల్లో క్లాసిక్ మిసెస్ ఇంటర్నేషనల్ 2024 కిరీటాన్ని ఆమె కైవసం చేసుకున్నారు. ఈ సందర్భంగా బంజారాహిల్స్లోని ప్రసాద్ ల్యాబ్స్లో విలేకరులతో మాట్లాడారు. ఆరు పదుల వయసు దాటినా, తాను ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతున్నానని, అపరిమిత శక్తి సామర్థ్యాలు ఉండి కూడా బలహీనులమని భావిస్తూ ఇంటికే పరిమితమవుతున్న మహిళలను ప్రోత్సహించేందుకు, స్ఫూర్తి నింపేందుకు తాను ప్రయత్నిస్తున్నానని తెలిపారు. బ్యాంకాక్లో జరిగిన పోటీల్లో రత్న మెహెరా మిసెస్ ఆసియా రన్నరప్, మిసెస్ ఎలిగాన్స్, మిసెస్ పాపులారిటీ విభాగంలో పథకాలను సాధించారు. మణికొండలో మీట్–గ్రీట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. రాష్ట్ర, దేశ స్థాయిలో విజయం సాదించిన తాను ఈ సంవత్సరం ఆసియా స్థాయిలో పోటీ పడి ఒకే వేదికపై మూడు పథకాలు సాదించటం ఆనందంగా ఉందన్నారు. ఆసియా స్థాయిలో 18 మందితో పోటీ పడి విజేతగా నిలిచానన్నారు. పేద పిల్లల విద్య, వికాసానికి సేవా చేస్తున్నానని, చేనేత కార్మికులకు తోడుగా నిలుస్తున్నానని అన్నారు. -
కుట్టు.. ఫొటో ఆకట్టు..
మనలో చాలా మంది జీవితంలో మరపురాని సందర్భాలను పదిలపరుచుకుంటారు. కొందరు వీడియోల రూపంలో దాచుకుంటే మరికొందరు ఫొటోల రూపంలో భద్రపరుచుకుంటారు. పుట్టిన పిల్లలకు సంబంధించి ప్రతి నెలా, ప్రతి సంవత్సరం విభిన్నంగా ఫొటో షూట్స్ చేసుకుంటున్నారు. అందరిలాగే మనం ఎందుకు ఉండాలని కొందరు వినూత్నంగా ఆలోచిస్తున్నారు. ఒకప్పుడు బ్లాక్ అండ్ వైట్ ఫొటోలు ఉండేవి కదా.. మళ్లీ ఆ రోజుల్లోకి వెళ్తున్నారు. అలా సాధారణ బ్లాక్ అండ్ వైట్ ఫొటోలకు కొత్త సొబగులు అద్దుతూ సరికొత్తగా ప్రజెంట్ చేస్తున్నారు. బ్లాక్ అండ్ వైట్ ఫొటోలకు చేతులతో ఎంబ్రాయిడరీ వర్క్ చేస్తూ కొత్త లుక్ తీసుకొస్తారు. చీరలకు, జాకెట్లకు, డ్రెస్లకు ఎంబ్రాయిడరీ వర్క్స్ తరహాలోనే.. ఫొటోలకు ఎంబ్రాయిడరీ ఏంటని ఆశ్చర్యపోయేలా వర్క్ చేస్తున్నారు. అవును ఈ సరికొత్త ట్రెండ్ గురించే ఈ కథనం... ఫొటోలపై హ్యాండ్ ఎంబ్రాయిడరీ ఇటీవల నగరంలో ఫేమస్ అవుతోంది. చాలా ఏళ్ల నుంచి ముంబై, బెంగళూరు వంటి నగరాల్లో ఈ పనితీరు ట్రెండింగ్లో ఉండగా, తాజాగా మన నగరంలోకి వచి్చంది. పెళ్లి ఫొటోలు, బర్త్డే ఫొటోలు, బేబీ బంప్ సందర్భంగా తీసిన ఫొటోలను ఫ్రేమ్స్ రూపంలో ఇంట్లో పెట్టుకోవాలనుకునే వారు.. నార్మల్గా కాకుండా ఇలా ఎంబ్రాయిడరీ వర్క్తో ఫొటోలకు డిఫరెంట్ లుక్ తీసుకొచ్చి తగిలించుకోవాలని అనుకుంటున్నారు. దీంతో ఫొటోలకే కాకుండా ఇంటికి కూడా సరికొత్త కళ వస్తోందని కస్టమర్లు అంటున్నారని నగరానికి చెందిన ఓ ఫొటోగ్రాఫర్ చెబుతున్నాడు. ఎంబోజ్ వంటి ప్రింటింగ్తో కూడా ఇలాంటి ఎఫెక్ట్ తీసుకురావొచ్చని, అయితే దానికన్నా ఎంబ్రాయిడరీకే కస్టమర్లు మొగ్గు చూపుతున్నారని తెలిపాడు. ముఖ్యంగా ఇంట్లో తగిలించుకునే ఫొటో ఫ్రేమ్స్ విషయంలో ఎక్కువ మంది ఇలాగే అడుగుతున్నారని పేర్కొన్నాడు. ఎలా చేస్తారు..? సాధారణంగా పెళ్లి ఫొటోలు లేదా ప్రత్యేక అకేషన్లలో దిగిన ఫొటోలను బ్లాక్ అండ్ వైట్ లేదా కలర్లో ప్రింట్ చేస్తారు. మనకు కావాల్సిన పరిమాణంలో ప్రింట్ తీసుకున్నాక.. మనకు కావాల్సిన మోడల్లో ఎంబ్రాయిడరీ చేయించుకోవచ్చు. కలర్ ఫొటోల వెనుక తెలుపు రంగులో ఫొటో పేపర్ను అతికించి, దానిపై ఫ్రేమ్ మాదిరిగా, ఫ్లవర్స్ లేదా మరేదైనా మనకు కావాల్సిన డిజైన్ హ్యాండ్తో ఎంబ్రాయిడరీ చేస్తుంటారు. లేదంటే బ్లాక్ అండ్ వైట్ ఫొటోలపై వేసుకున్న డ్రెస్ కానీ, ధరించిన పూల దండలు, నగలను మాత్రమే హైలైట్ చేస్తూ రంగురంగుల దారాలతో అల్లుతారు. దీంతో ఫొటోకు సరికొత్త కళ వస్తుందని చెబుతున్నారు. కాస్త సమయం పట్టినా.. సాధారణంగా ఫొటో ఎడిటింగ్, ప్రింటింగ్ నిమిషాల్లో అయిపోతుంది. కానీ ఎంబ్రాయిడరీకి కాస్త ఎక్కువ సమయమే పడుతుంది. సైజును బట్టి.. ఫొటోపై కుట్టాల్సిన ఎంబ్రాయిడరీని బట్టి సమయం తీసుకుంటున్నారు. ఒక్క ఫొటో పూర్తి చేసేందుకు కనీసం నాలుగైదు గంటల సమయం పడుతుందని ఓ షాప్ నిర్వాహకుడు వివరించాడు. సాధారణ ఫొటోలతో పోలిస్తే కాస్త ఖరీదు ఎక్కువ అయినా గిఫ్ట్లు ఇచ్చేందుకు ఫొటో ఎంబ్రాయిడరీని ఎంచుకుంటున్నారని చెబుతున్నాడు.బహుమతులకు పర్ఫెక్ట్.. ఫొటో ఎంబ్రాయిడరీ కాన్సెప్ట్ నగరంలో కొత్తగా వచి్చంది. ఎంబోజ్, గ్లిట్టర్ వంటి ఫొటో ప్రింటింగ్ టెక్నాలజీని ఆల్బమ్లు రూపొందించేందుకు ఎక్కువగా వాడుతుంటాం. వీటితో ఆల్బమ్కు, ఫొటోలకు మంచి లుక్ వస్తుంటుంది. అయితే ఫొటో ఎంబ్రాయిడరీని ఆల్బమ్లో పెట్టడం కాస్త కష్టం. అందుకే చాలా మంది ఫొటో ఫ్రేమ్స్ చేయించుకునేందుకు ఫొటో ఎంబ్రాయిడరీ గురించి అడుగుతున్నారు. ముఖ్యంగా ఏదైనా ఫంక్షన్, పెళ్లి వంటి శుభకార్యాల్లో గిఫ్ట్గా ఇచ్చేందుకు దీన్ని ఎంచుకుంటున్నారు. చూసేందుకు బాగుండటమే కాకుండా రిచ్గా, సరికొత్తగా ఉంటోందని చెబుతున్నారు. :::బీసు విష్ణుప్రసాద్, ఫొటోగ్రాఫర్ ::: సాక్షి, సిటీబ్యూరో -
నేచర్.. లవర్స్
నిత్యం తీరిక లేని నగర జీవన విధానం.. మానసిక ఒత్తిడి, శారీరక శ్రమ, అసహజ ఆహారం.. ఈ కాంక్రిట్ జంగిల్లో ఆరోగ్యకరమైన జీవన విధానానికి అనువైన ఒక్క అంశం కూడా లేకపోవడం దుదృష్టకరం, అనివార్యం. అలా అని అనారోగ్యాన్ని ఎవరు కోరుకుంటారు.., కాసింతైనా వ్యాయామం, జాగింగ్ ఇంకేవో ఫిట్నెస్ క్రియలకు నగరవాసులు ఆసక్తి చూపిస్తుండటం విధితమే. అయితే.. ఈ మధ్య కాలంలో ఫిట్నెస్ కోసం సహజ వాతావరణాన్ని కోరుకుంటున్నారు. ఫిట్నెస్, వ్యాయామం ఇలా ఎవైనా సరే జిమ్లోనే వెతుక్కునే వారు. ఈ సంస్కృతిలో భాగంగా నగరంలో ప్రతి ఏరియాకు కనీసం ఒకటి, రెండైనా జిమ్లు వెలిశాయి. కానీ.. నేచురాలిటీ, పచ్చని ప్రకృతి పారవశ్యాన్ని కోరుకునే నగరవాసులు ఈ మధ్య పెరిగిపోతున్నారు. వీరి ఆలోచనలు, అవసరానికి తగిన కొన్ని నేచురల్ స్పాట్స్ను సైతం ఎంపిక చేసుకుని.. ఆరోగ్య, ఆహ్లాదం, ఆనందం పొందుతున్నారు. ఇందులో భాగంగా నగరం నలుమూలలా ఉన్న పార్కులు, ఉద్యానవనాలు ఇతర ప్రాంతాల గురించి ఓ లుక్కేద్దామా..?!! హిల్ పార్క్.. కేబీఆర్ చుట్టంతా కాంక్రిట్ జంగిల్.. ఎడతెరిపిలేని వాహనాల రద్దీ.. పొగతో వాయు కాలుష్యం, వాహనాల శబ్దాలతో శబ్ద కాలుష్యం. ఇలాంటి నెగిటివిటీ మధ్య కొలువైన పచ్చని పారవశ్యంతో, అద్భుతమైన జీవవైవిధ్యంతో కొలువై ఉన్న మినీ ఫారెస్ట్ కేబీఆర్ పార్క్. ప్రకృతిలో జాగింగ్ అనగానే సిటీజనులకు మొదట గుర్తొచ్చేది కేబీఆర్ పార్క్ మాత్రమే.. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మాదాపూర్, హైటెక్ సిటీ, గచ్చిబౌలి వంటి తదితర ప్రాంతాలకు చెందిన వ్యాయామ–ప్రకృతి ప్రియుల స్వర్గధామంలా మారింది కేబీఆర్ పార్క్. సువిశాలమైన విస్తీర్ణం, నెమళ్లు, కుందేళ్లు, పక్షులతో ప్రకృతి పారవశ్యాన్ని పంచడంతో పాటు.. నగర రద్దీకి అనుగుణంగా పార్కింగ్కూ అవకాశం ఉండటంతో ఈ హైటెక్ పీపుల్స్ అంతా ఈ పార్క్ బాట పడుతున్నారు.ప్రకృతి పారవశ్యం.. కృత్రిమ హంగులుప్రకృతి అందాలకు తోడు కృత్రిమ హంగులకు తోడైన జాగింగ్ స్పాట్ కాజాగూడ పెద్ద చెరువు. ఈ మధ్య కాలంలో ఈ చెరువు పూడిక తీసి, చుట్టూ అదనపు ఆకర్షణలతో పాటు విశాలమైన రోడ్లు సైతం వేయడంతో.. సమీప ప్రాంతాలకు చెందిన జాగింగ్ ఔత్సాహికులు ఈ వేదికపై వాలిపోతున్నారు. ఇక్కడ పెద్దగా కమర్షియల్ భవనాలు, ట్రాఫిక్ రద్దీ వంటి సమస్యలు లేకపోవడంతో జనాలు ఎక్కువగానే వస్తున్నారు. ఇక్కడ ఏర్పాటు చేసిన ఆకర్షణీయమైన బొమ్మలతో సెల్ఫీ స్పాట్గానూ మారింది. దీనికి సమీపంలోనే కొంత కాలం క్రితమే అభివృద్ధి చేసి జాగింగ్, వ్యాయామం వంటి ప్రియులకు అనువైన ప్రదేశంగానూ మారింది ‘మల్కం చెరువు’. ఇక లండన్, సిడ్నీని తలపించే రాయదుర్గం, మాదాపూర్ మధ్యలో కొలువైన అందాల చెరువు ‘దుర్గం చెరువు’. పొద్దున్నే వాహనాల రాకపోకలు ప్రారంభమైనప్పటికీ ఇక్కడ జాగింగ్ను ఎంజాయ్ చేసేవారు ఎందరో.. కేబుల్ బ్రిడ్జ్ దీనికి అదనపు ఆకర్షణ. కొండాపూర్ సమీపంలో ఎప్పటి నుంచో ప్రకృతి ప్రియులను జాగింగ్కు పిలుస్తున్న వనాలు బొటానికల్ గార్డెన్, పాలపిట్ట పార్క్. పాలపిట్ట పార్క్లో ప్రత్యేకంగా సైక్లింగ్ ట్రాక్ కూడా ఉండటం విశేషం.వందల ఎకరాల్లో.. సువిశాల వాతావరణంలో.. నగర శివారుల్లోనే కాదు.. నగరంలో మధ్యలో వందల ఎకరాల్లో ఆవరించి ఉన్న ప్రకృతి సంపద ఉస్మానియా యూనివర్సిటీ. ఎన్నో ఏళ్లుగా నగరవాసులకు జాగింగ్, వ్యాయామం, యోగా, క్రీడలకు కేంద్రంగా సేవలందిస్తోంది ఉస్మానియా క్యాంపస్. చుట్టుపక్కల నుంచి దాదాపు 10, 15 కిలోమీటర్ల నుంచి సైతం ఇక్కడి వాతావరణం కోసం నగరవాసులు వస్తుంటారు. నగరం నడి»ొడ్డున, అసెంబ్లీ ఆనుకుని ఉన్న పబ్లిక్ గార్డెన్ కూడా నగరవాసులతో ఏళ్లుగా మమేకమైపోయింది. దీంతో పాటు నారాయణగూడ, హిమాయత్నగర్కు సమీపంలోని మోల్కోటే పార్క్ కూడా ఉదయం–సాయంత్రం వాకర్లకు అనువైన ప్రదేశంతో పాటు అద్భుతమైన వాతావరణాన్ని అందిస్తోంది. జలగం వెంళరావుపార్క్, నెహ్రూ పార్క్ ఇలా నగరం నలుమూలలా అక్కడక్కడా విశాలమైన విస్తీర్ణంలో ఉన్న ఎన్నో పార్కులు నగరవాసుల ఆరోగ్య సంరక్షణలో కీలక పాత్ర పోషిస్తున్నాయి.మినీ ఫారెస్ట్.. జింకల సందడిరెసిడెన్షియల్ ఏరియా ఎక్కువగా ఉన్న బోడుప్పల్ వంటి ప్రాంతాలవాసులకు ప్రశాంతత అందిస్తోంది స్థానిక ‘శాంతి వనం’. వాకింగ్, జాగింగ్, రన్నింగ్ వంటి అన్ని వ్యాయామాలకు అనువైన విశాల అటవీ ప్రాంతం ఉండటం దీని ప్రత్యేక. ఇక్కడ ఒక కిలోమీటర్, అంతకు మించి వాకింగ్ ట్రాక్లు కూడా ఉన్నాయని స్థానికులు తెలిపారు. ఎల్బీనగర్ దాటుకుని నగర శివార్లలో కనుచూపుమేర పచ్చని చీర కట్టుకుని ఉదయాన్నే జాగింగ్కు ఆహ్వానిస్తోంది నారపల్లి సమీపంలోని ‘నందనవనం’. జింకలు, నెమళ్లు, అరుదైన పక్షిజాతులు ఇక్కడ దర్శమిస్తూ మరింత ఉత్సాహం, ఆహ్లాదాన్ని అందిస్తున్నాయి. నగరవాసులను ఆకర్షించడానికి ఇందులో బల్లలు, హట్స్, ముఖ్యంగా తీగల వంతెనలను సైతం నిర్మించారు. -
ఈ నగరానికి ఏమైంది?
ఈ నగరానికి ఏమైంది.. రాత్రుళ్లు నిద్రపోరేంటి.. ఓ వైపు నైట్ షిఫ్ట్స్, మరోవైపు టైం పాస్.. ఈ అలవాట్లకి చరమగీతం పాడకుంటే ముప్పు తప్పదని హెచ్చరిస్తున్నారు వైద్యు నిపుణులు.. నగర ప్రజలను ప్రస్తుతం ప్రధానంగా వేధిస్తున్న సమస్య నిద్రలేమి తనం. ఇందుకు ఆలస్యంగా నిద్రపోవడమే ముఖ్యమైన కారణం. సగటున నగరవాసుల ఆన్స్క్రీన్ సమయం రాత్రుళ్లే ఎక్కువగా ఉంటుందని పలు సర్వేలు తేటతెల్లం చేస్తున్నాయి. ఇందులో నైట్ షిఫ్ట్స్ ఓ భాగమైతే.. రాత్రుళ్లు రోడ్లపై షికార్లు, రకరకాల గ్యాడ్జెట్లు వినియోగిస్తూ అర్ధరాత్రి వరకూ టైంపాస్ చేయడం మరో కారణం. దీంతో నగరజీవి ప్రశాంతమైన నిద్రకు దూరమవుతున్నాడని నిపుణులు చెబుతున్న మాట. రాత్రంతా ఉద్యోగాలు, అర్థరాత్రి దాటేంత వరకూ పర్యాటక ప్రాంతాల్లో రకాల ఈవెంట్స్, ఇంటికి చేరుకున్నా అర్థరాత్రి దాటేంత వరకూ మొబైల్ ఫోన్లో చాటింగ్, టైంపాస్ వెరసి నగర జీవికి నిద్రను దూరం చేస్తున్నాయి. రానురానూ ఉదయం ఆలస్యంగా లేవడం, రాత్రి ఆలస్యంగా నిద్రపోవడం నగర ప్రజల జీవన శైలిగా మారిపోతోంది. ఉద్యోగం, పాఠశాల విద్యార్థులు, గృహిణులు, యువత ఇలా ఏ ఏజ్ గ్రూపువారిదైనా దాదాపు ఇదే దినచర్యగా మారుతోంది. ఇబ్బడి ముబ్బడిగా పెరిపోయిన గ్యాడ్జెట్స్ వినియోగం సగటు నగరవాసిని నిద్రకు దూరంచేస్తున్నాయి.రాత్రిళ్లే.. సరైన సమయమట!.. కుటుంబ సభ్యులతో బయటకు వెళ్లేందుకు నగర ప్రజలకు రాత్రి వేళల్లోనే సమయం దొరుకుతుందని ఎక్కువ మంది అభిప్రాయపడుతున్నారు. రోజు వారీ విధులు ముగించుకుని ఇంటికి చేరాక కాసేపు కుటుంబ సభ్యులు, స్నేహితులతో గడిపేందుకు ఇదే సరైన సమయమని చెబుతున్నారు. దీంతో అర్థరాత్రి వరకూ నగరంలోని ప్రముఖ ప్రాంతాలైన ట్యాంక్బండ్, ఎన్టీఆర్ మార్గ్కి వెళ్లి సేదతీరుతున్నారు. మరికొందరైతే హోటల్స్, మ్యూజిక్, డ్యాన్స్, ఇతర ఈవెంట్స్తో అర్థరాత్రి వరకూ ఎన్జాయ్ చేస్తున్నారు. సినిమా షోలు సైతం రాత్రి 11.30 గంటలకు మొదలయ్యే థియేటర్లు ఉన్నాయి. నగరంలో పబ్ కల్చర్ కూడా భారీగా పెరిగింది. మాదాపూర్, జూబ్లిహిల్స్, రా>యదుర్గం, హైటెక్ సిటీ, కేపీహెచ్బీ, మెహిదీపట్నం తదితర ప్రదేశాల రహదారులు అర్థరాత్రి జన సంచారంతో కిటకిటలాడుతున్నాయి. పగలు ట్రాఫిక్ ఇబ్బందులకు భయపడి రాత్రిళ్లు బయటకు వెళ్లి, చల్లని వాతావరణంలో పర్యాకట ప్రాంతాలను చుట్టివస్తున్నారు.పెరిగిన ఆన్ స్క్రీన్ టైం.. మహానగరంలో విద్యార్థి దశ నుంచే టీవీ, మొబైల్ ఫోన్లకు ఎక్కువ సమయం అతుక్కపోతున్నారు. ఆపై యువత, ఉద్యోగులు విధి నిర్వహణలో కంప్యూటర్, ల్యాప్టాప్ల ముందే సగం కాలం గడిపేస్తున్నారు. దీంతో రోజులో మొబైల్ వాడకం 4 గంటలుగా నమోదవుతోంది. దీనికి తోడు టైంపాస్ కోసం పిచ్చి పిచ్చి యాప్స్లో రీల్స్, వీడియోలు చూస్తూ కాలం గడిపేస్తున్నారు. దీంతో నిద్రపై తీవ్ర ప్రభావం పడుతోందని నిపుణులు పేర్కొంటున్నారు. కళ్లపై తీవ్ర ప్రభావం..నిద్ర లేమి వల్ల శరీరం, కళ్లు, మెదడుపై ఒత్తిడి పెరుగుతుంది. కళ్లు పొడిబారిపోవడం, చూపు మందగించడం, కళ్లు ఎర్రగా మారడం, మధుమేహం, రక్తపోటు, థైరాయిడ్, మానసిక రోగాలు వచ్చే అవకాశం ఉందని వైద్యులు పేర్కొంటున్నారు. ఎక్కువ సమయం స్క్రీన్ చూడాల్సి వస్తే వైద్యుల సూచన మేరకు కళ్లజోడు వినియోగించడం మంచిదని నిపుణులు పేర్కొంటున్నారు. చిన్న పిల్లలు ఎక్కువ సమయం స్క్రీన్ చూడటం వల్ల చూపు మందగిస్తుంది. మెల్లకన్ను వచ్చే అవకాశాలు ఉన్నాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. నిద్రలేమి వల్ల శారీరకంగా, మానసికంగా ఒత్తిడికి గురవుతారని చెబుతున్నారు.ప్రశాంతమైన నిద్ర అవసరం ప్రస్తుత కాలంలో గ్యాడ్జెట్స్ లేకుండా జీవితం లేదు. అయితే అతిగా వినియోగించడం వల్ల కన్ను, మెదడుపై ఒత్తిడి పెరుగుతోంది. దీని వల్ల సైడ్ ఎఫెక్ట్స్ మొదలవుతాయి. మనకు మానసిక, శారీరక ప్రశాంతతకు సరైన నిద్ర అవసరం. అందుకే మొబైల్ చూసే సమయంలో కనీసం 25 సెంటీమీటర్ల దూరంలో చూడాలి. రాత్రి వేళల్లో వెళుతురు లేకుండా మొబైల్ చూడొద్దు. కంప్యూటర్పై పనిచేసే ఉద్యోగులు ప్రతి గంటకు పది నిమిషాలు కంటికి రెస్ట్ ఇవ్వాలి. కను రెప్పలు ఎక్కువ మూసి, తెరుస్తుండాలి. సరైన నిద్ర ఉన్నప్పుడే శరీరం, మొదడు రీఫ్రెష్ అవుతుంది. మెలుకువ వచ్చిన తరువాత ఫ్రెష్గా వర్క్ ప్రారంభిస్తే మంచి ఫలితాలు ఉంటాయి. – జీవీ రమణకుమార్, నేత్ర వైద్యుడు -
బీ ది మెన్.. బీ ది బ్రేవ్!
మాతృదినోత్సవం.. బాలల దినోత్సవం.. మహిళా దినోత్సవం.. ఇలా ఎన్నో రోజులు.. పండుగలను ఎంతో ఘనంగా జరుపుకొంటుంటాం. పురుషుల కోసం కూడా ప్రత్యేకంగా ఓ రోజు ఉంది. అదే ఏటా నవంబర్ 19న అంతర్జాతీయంగా జరుపుకోవాలని అందరూ సంకల్పం చెప్పుకొన్నారు. కానీ మహిళా దినోత్సవం మాదిరిగా పురుషుల దినోత్సవానికి పెద్దగా ప్రత్యేకత ఉండదు. వాస్తవానికి చాలాకాలం నుంచి పురుషులకూ అంకితమైన రోజు ఒకటి ఉందని చాలా మందికి తెలియదు. అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి చాలా ఏళ్ల చరిత్ర ఉన్నట్టే.. పురుషుల దినోత్సవానికీ ఓ చరిత్ర ఉంది. 1969 నుంచే అంతర్జాతీయ పురుషుల దినోత్సవం అనే కాన్సెప్ట్ మనుగడలో ఉంది. పైగా మిగతా దినోత్సవాలను గొప్పగా జరిపే మగవాళ్లు తమ కోసం ప్రత్యేకంగా ఉన్న రోజును మాత్రం పెద్దగా పట్టించుకోరని చెప్పుకోవచ్చు. ఎంతసేపూ మిగతా వారి గురించి ఆలోచిస్తారే తప్ప తమ గురించి ఆలోచించుకోరు. అందుకే వారి త్యాగాన్ని గుర్తిస్తూ.. పురుషులకు ఈ రోజును కేటాయించారు. ఏటా నవంబర్ 19న అంతర్జాతీయ స్థాయిలో ప్రపంచ పురుషుల దినోత్సవం జరుపుతారు. 1992 ఫిబ్రవరి 7న ప్రొఫెసర్ థామస్ ఓస్టర్ ఈ రోజును ప్రారంభించినా.. ట్రినిడాడ్, టొబాగో దేశస్తులు ప్రాచుర్యంలోకి తీసుకొచ్చారు. దక్షిణ ఐరోపాకు చెందిన మాల్టా దీవిలో ఈ ఉత్సవాన్ని 1994 ఫిబ్రవరి 7 నుంచి క్రమం తప్పకుండా జరుపుతున్నారు. ఐక్యరాజ్య సమితి ఆమోదంతో మొదట 1999లో ట్రినిడాడ్ టొబాగోకు చెందిన వైద్యుడు డాక్టర్ డ్రైరోమ్ టీలక్సింగ్ అంతర్జాతీయ పురుషుల దినోత్సవాన్ని పునఃప్రారంభించారు. ఈ రోజున ప్రపంచంలోని మగవారంతా.. మగవారిని మెచ్చుకుంటారు. వారి శ్రమ, కృషిని ప్రశంసిస్తారు. మగవారి ద్వారా ఈ ప్రపంచం ఎలా ముందుకు వెళ్తున్నదో చర్చిస్తారు. సమాజంలో మగవాళ్ల పాత్ర ఎలా ఉందో చెప్పుకుంటారు. అలాగే సమాజానికి మేలు చేసిన గొప్ప గొప్ప పురుషులను ఈ రోజున కీర్తిస్తారు. వారిని రోల్ మోడల్స్గా భావిస్తూ.. వారు సమాజానికి చేసిన సేవల్ని చెబుతారు. మన దగ్గర పుట్టి 18 ఏళ్లు.. భారత దేశంలోని పురుషుల హక్కుల సాధనా సంస్థ సేవ్ ఇండియన్ ఫ్యామిలీ (సిప్) నవంబర్ 19, 2007న దేశంలో మొదట ఈ వేడుకను నిర్వహించారు. అప్పటికే 498 చట్టం కోరల్లో చిక్కుకుని విలవిల్లాడుతున్న పురుషుల పుణ్యమానీ ఈ కార్యక్రమం విజయవంతం కావడంతో అప్పటి నుంచీ దీన్ని ఏటా కొనసాగిస్తూ వస్తున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా సేవ్ ఇండియన్ ఫ్యామిలీకి దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ శాఖలు ఉన్నాయి. పురుషుల హక్కుల కోసం సిప్ ఆధ్వర్యంలో 24/7 కాల్ సెంటర్ అందుబాటులోకి తీసుకురావడంతో పాటు అనేక అంశాల్లో పురుషుల హక్కుల గురించి సిప్ ఉద్యమిస్తోంది.పెరుగుతున్న డ్రాప్ అవుట్స్.. అన్ని విషయాల మాదిరిగానే చుదువులోనూ గత కొంత కాలంగా మగపిల్లల్లో డ్రాప్ అవుట్స్ పెరిగిపోతున్నారు. ఆర్థిక స్థితిగతులు, కుటుంబ పోషణ భారం వంటి కారణాలు, మగపిల్లాడు ఎలాగైనా బతికేస్తాడు.. అనే నిర్లక్ష్యంతో చదువుకు దూరమవుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. దీనికితోడు మగవారిపై జరిగే గృహహింసను ఎవరూ పట్టించుకోరు. నూటికి 80 శాతం ఘటనలు వెలుగు చూడవు అంటే అతిశయోక్తి లేదు.చుట్టుముడుతున్న ఆరోగ్య సమస్యలు..పెరుగుతున్న ఖర్చులు, ఆర్థిక భారాలు మగవారిని మానసిక బలహీనులుగా మారుస్తున్నాయి. ఎప్పుడు ఊడతాయో తెలియని ఉద్యోగాలు, మరోవైపు పెరుగుతున్న ఖర్చులు, అటూ ఇటూ కాని జీతాలు వంటి సమస్యలతో అనేక రోగాలపాలవుతున్నారు. దీంతో బీపీ, మధుమేహం, గుండె జబ్బులు తదితర ఆరోగ్య సమస్యలతో పురుషులు సతమతమవుతున్నారు. అయినా ముఖంపై చెదరని చిరునవ్వుతో కుటుంబ బాధ్యతలను నెత్తిన వేసుకుని బాధ్యగా మెలిగే మగవారికి హ్యాపీ మెన్స్ డే.. అనేక ఒత్తిళ్లు అధిగమిస్తూ.. రకరకాల వేధింపుల సంగతి పక్కనపెడితే..ఉద్యోగాలు, వ్యాపారాలు, పని ప్రదేశాల్లో వీరు ఎదుర్కొనే ఒత్తిళ్లు తక్కువేమీ కాదు.. మహిళలు చెప్పుకున్నంత తేలికగా మగవారు బయటపడలేరు. దీంతో పాటు కుటుంబ భారం, ఆర్థిక పరిస్థితులు వంటి ఇతరత్రా ఒత్తిళ్ల కారణంగా మానసికంగా పురుషులు అంతకంతకూ బలహీనులుగా మారుతున్నారని పలు సర్వేలు చెబుతున్నాయి. అందుకే ఆత్మహత్యల విషయంలో మహిళల కన్నా పురుషుల్లోనే 3 రెట్లు ఎక్కువ కనిపిస్తుంది. వెలుగు చూడనివెన్నో... ఎక్కడ చూసినా మహిళాభివృద్ధి, సంక్షేమం గురించే మాట్లాడుతుంటాం. పురుషుల హక్కులు, వారి రక్షణ గురించి చివరికి పురుషులే పట్టించుకోరు. ఎవరైనా ముందడుగేసి చెప్పుకున్నా..! చిన్నచూపు చూస్తారు. లేదా సమాజంలో గౌరవం పోతుందని బయటపెట్టని, వెలుగు చూడని ఘటనలు లేకపోలేదు. ఈ విషయాన్ని పలు అంతర్జాతీయ, జాతీయ సంస్థల సర్వేలు సైతం తేటతెల్లం చేస్తున్నాయి. చిన్న వయసులో బాలల పై జరిగే లైంగిక దాడుల్లో ఆడపిల్లలపై జరిగే దాడులు 45 శాతం కాగా, మగ పిల్లలపై జరిగేవి 55 శాతంగా నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. వీటిపై ఎవరూ మాట్లాడరు. -
ఇంపైన ఆర్ట్.. ఇకెబనావో
ప్రపంచంలోని అద్భుతమైన ప్రకృతిని కళ్లకు కట్టినట్లు చూపించే ఇకెబనా కళకు హైదరాబాద్లో విశేష ఆధరణ లభిస్తోంది. జపాన్కు చెందిన ఈ కళ ప్రస్తుతం నగరంలో ట్రెండ్గానూ మారుతోంది. పర్యాటక ప్రాంతాలు, స్టార్ హోటల్స్, ఉన్నత శ్రేణి కుటుంబాల గృహాలంకరణ, శుభకార్యాలు, ఈవెంట్స్ ఇలా పలు సందర్భాల్లో ప్రత్యేకమైన ఇకెబనా అలంకరణకు ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో నగరంలోని కళాకారులకు చేతినిండా పని ఉంటుంది. ఉపాధి కోణంలోనే కాకుండా అధిక సంఖ్యలో సంపన్న వర్గాల కుటుంబాలకు చెందిన మహిళలు తమ గృహాలంకరణ కోసం ఈ కళను నేర్చుకుంటున్నారు. ఇందుకోసం దేశ, విదేశాల నుంచి ప్రత్యేకమైన పూలను దిగుమతి చేసుకుంటారు. దీంతోపాటు మన పెరట్లో లభించే పూలు, మొక్కలతో సులభమైన పద్దతుల్లో అద్భుతమైన కళాకృతులను తయారు చేస్తున్నారు. ఇటీవలి కాలంలో భాగ్యనగరంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాల నుంచి, స్టార్ హోటల్స్ వంటి ప్రదేశాల్లో ప్రాచుర్యం పొందుతున్న కళ ఇకెబనా. అయితే అధిక శాతం మంది తమ ఇంటిని అలంకరించుకోవడంలోనూ ఈ కళకు పదుపు పెడుతున్నారు. దీంతో పాటు పలువురు తమ ఆర్థికి స్థితిగతులకు సాయపడుతుందని, ఈ ఆకృతులు మనస్సుకు ఎంతగానో ప్రశాంతత ఇస్తున్నాయని మరి కొందరు ఈ కళపై మక్కువ పెంచుకుంటున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో లభించే ప్రతి వస్తువుతోనూ ఈ ఆర్ట్లో అలంకరించొచ్చు. ప్రత్యేకించి ఈ వస్తువులే ఉండాలన్న నిబంధనలేమీ లేవు. వృథాను అరికట్టే కళ.. వివిధ ఆకృతుల కోసం చెట్లను కొట్టేయడం, పూలను వృథా చేయడం వంటివాటికి స్వస్తిపలకాలని, ఉన్న వాటితోనే కనువిందైన ఆకృతులను తయారు చేయవచ్చంటున్నారు పలువురు ఆర్టిస్టులు. జపాన్కు చెందిన ఇకెబనా ఆర్ట్కు సుమారు 100 ఏళ్ల చరిత్ర ఉంది. హైదరాబాద్లో గత 35 ఏళ్లుగా ఈ కళకు మంచి ఆదరణ లభిస్తోంది. కరోనా సమయంలో కాస్త నెమ్మదించినా, ప్రస్తుతం కళాకారులకు డిమాండ్ పెరిగింది. జపాన్కు చెందిన ది ఒహరా స్కూల్ ఆఫ్ ఇకెబానా సరి్టఫికెట్ కోర్సులు హైదరాబాద్లో అందుబాటులో ఉన్నాయి. దేశంలో సబ్ గ్రాండ్ మాస్టర్లు నలుగురు ఉండగా అందులో ఓ ప్రముఖ మాస్టర్ మన హైదరాబాద్కు చెందిన వ్యక్తి రేఖారెడ్డి కావడం గమనార్హం.ఆకులు, పూలతో సులువుగా.. నగరంలో ఇకెబనా ఆర్ట్కు ఆదరణ పెరుగుతోంది. చాలా మంది హాబీ కోసం నేర్చుకుంటున్నారు. కళ విలువ తెలుసుకుంటున్నారు. ఆకులు, పూలతో ఇంత సులువుగా తయారు చేసిన ఆకృతులతో మనస్సుకు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. ప్రకృతిని ఎలా ఆస్వాదించొచ్చనేది తెలుస్తుంది. మన సంప్రదాయం ప్రకారం ప్రకృతిలోని చెట్టు, పుట్టలను పూజిస్తాం. జపానీస్ కూడా అలాగే చేస్తారని పలువురు ఆరి్టస్టులు చెబుతున్నారు.ఇంటికోసం..ఇష్టంగా.. ‘ఇండియన్ రీసెర్చ్ అసిస్టెంట్ షిప్ దొరకాలన్నా చాలా కష్టమైన టాస్క్ ఉండేది. హారీ్టకల్చర్ డిపార్ట్మెంట్లో ఈ ఆర్ట్ ఒక భాగం. ఆ క్లాస్కి రీసెర్చ్ అసిస్టెంట్గా పనిచేశాను. ఎన్ని గంటలు పనిచేస్తే దానికి అన్ని డబ్బులు వచ్చేవి. ప్రిపరేషన్ మెటీరియల్, క్లాస్లో సాయం వంటివి చేస్తుండేదాన్ని.. 2019లో హైదరాబాద్ వచ్చేశాక ఇక్కడ జరిగే కార్యక్రమాల్లో పాల్గొంటున్నా. నాకు సమయం చిక్కినపుడు ఇష్టమున్న ఆర్ట్ని ఇంట్లోనే ఎరేంజ్ చేస్తుంటాను. ఊరెళ్లినపుడు జొన్నలతో తయారు చేస్తాను. దేనితో అయినా ఈ ఆర్ట్ తయారు చేయొచ్చు. ఇంటిని అందంగా తయారు చేయడం, ఆహ్లాదకరమైన వాతావరణం క్రియేట్ చేస్తుంటాను. నేను నేర్చుకున్న తొలినాళ్లలో పూలు కొనుగోలుచేసి కళాకృతిని తయారు చేసేదాన్ని.. అయితే ఇది అంత సులువు కాదు. ప్రస్తుతం ఫ్లవర్ షాపులు అందుబాటులోకి వచ్చాయి. అవసరానికి మనకు పూలు దొరుకుతున్నాయి. అలా కాకుండా మన దగ్గర ఉన్న వాటితోనే మంచిగా డిజైన్ చేయొచ్చన్నది అలవాటైంది. మా నాన్నకి గార్డెనింగ్ ఇష్టం. ఎక్కడైనా కొంత మెటీరియల్ తెచ్చేవారు. దాన్ని నేను వినియోగించేదాన్ని’ అని చెప్పుకొచ్చారు నగరానికి చెందిన ఆరి్టస్ట్ దివ్య. 50 శాతం ఫీజు రాయితీ.. ఇకెబనా ఆర్ట్ని ఇంజినీరింగ్ చదివే సమయంలోనే నేర్చుకున్నాను. ఎప్పటికైనా ఉపయోగపడుతుందన్నారు. కోర్సుపూర్తి చేసి, జపాన్ నుంచి సరి్టఫికెట్స్ తీసుకున్నాను. వారాంతాల్లో, లేదా కుదిరినప్పుడు ఇంట్లో కళాకృతులు తయారు చేయడం అలవాటుగా మారింది. ఎగ్జిబిషన్స్ జరిగినపుడు పాల్గొనడం, మా గురువుకు సహకరించడం చేశాను. ఉన్నత విద్య కోసం యూఎస్ వెళ్లిపోయాను. మాస్టర్స్ ఇన్ మేనేజ్మెంట్ ఇన్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ కోర్సులో రీసెర్చ్ అసిస్టెంట్ స్కాలర్ కోసం హార్టీకల్చర్ విభాగం అధికారులు నాకున్న సరి్టఫికెట్స్, ఎగ్జిబిషన్ ఫొటోలు చూసి ఇంప్రెస్ అయ్యారు. ఉద్యోగం ఇచ్చారు. నాకున్న ఇకెబనా ఆర్ట్ సరి్టఫికెట్తో కోర్సు ఫీజులో సుమారు 50 శాతం తగ్గించారు. ఇది పెద్ద ఊరట కల్పించింది. – దివ్య, హైదరాబాద్ఏటా ఐదురోజుల వర్క్ షాప్..ఇకెబనా ఆర్ట్ను ఇంట్లోనే నేర్చుకోవచ్చు. నా దగ్గర వైద్యులు, లాయర్లు, ప్రొఫెసర్లు, గృహిణులు, చాలా మంది నేర్చుకున్నారు. కళకు ఉన్న ప్రాముఖ్యత ఇటీవలె తెలుస్తోంది. చెట్లను కాపాడటం, అందుబాటులో ఉన్న వనరులతో గ్రీనరీని తయారు చేస్తాం. ప్రస్తుతం అందరూ నేర్చుకుంటారు. ఈ కళకు గుర్తింపు తెచ్చేందుకు ఏటా 5 రోజుల వర్క్ షాప్ నిర్వహిస్తాను. ఐదేళ్ల నుంచి 18 ఏళ్ల వరకూ అందరూ వచ్చి నేర్చుకుంటారు. చివరల్లో మినీ ఎగ్జిబిషన్ మాదిరి ఏర్పాటు చేస్తాం. ఆకులు, పూలను గౌరవించడం నేర్చుకుంటారు. ఇదొక హాబీ, కమర్షియల్ కాదు. చెట్లను కట్ చేయకుండా ఎండిన కొమ్మలతోనూ కళను ప్రోత్సహించొచ్చు.– రేఖారెడ్డి, హైదరాబాద్ చాప్టర్స్ అధ్యక్షురాలు. -
ప్యాడెల్ టెన్నిస్ ఆడేద్దాం..!
ఎప్పుడైనా ప్యాడెల్ టెన్నిస్ గురించి విన్నారా? టెన్నిస్ గురించి తెలుసు.. బ్యాడ్మింటన్ గురించి తెలుసు.. ఇంకా స్క్వాష్ గురించీ తెలుసు కానీ కొత్తగా ప్యాడెల్ టెన్నిస్ అంటే ఏంటి అనుకుంటున్నారా..? అవును ఇది చాలా కొత్త గేమ్.. కాకపోతే చాలా ట్రెండీ గేమ్. మెక్సికోలో పుట్టిన ఈ గేమ్ ప్రపంచవ్యాప్తంగా సుపరిచితమే. కానీ మన హైదరాబాదీయులకు మాత్రం ఇది కాస్త కొత్త గేమ్ అనే చెప్పుకోవచ్చు. కానీ ఇటీవల కాలంలో ప్యాడెల్ టెన్నిస్పై నగరవాసుల్లో ముఖ్యంగా యువతలో ఆసక్తి పెరుగుతోంది. ఇప్పుడిప్పుడే ప్యాడెల్ టెన్నిస్ నేర్చుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలో అసలు ప్యాడెల్ టెన్నిస్ అంటే ఏంటి? సాధారణ టెన్నిస్కు, ప్యాడెల్ టెన్నిస్కు మధ్య వ్యత్యాసాలేంటి? ఎలా ఆడుతారు..? ఇలా ఎన్నో విషయాలు తెలుసుకుందాం..! ప్యాడెల్ టెన్నిస్ కూడా టెన్నిస్ లాంటి ఆటనే. 1969లో మెక్సికోకు చెందిన ఎన్రిక్ కార్క్యూరా అనే క్రీడాకారులు ఈ గేమ్ కనిపెట్టాడు. టెన్నిస్, స్క్వాష్ ఆటల కలయికనే ఈ ప్యాడెల్ టెన్నిస్. టెన్నిస్లో ఉన్నట్టే అన్ని రూల్స్ ఉంటాయి. కోర్టు, రాకెట్, వాడే బాల్ ఇలా చాలా విషయాల్లో కాస్త వ్యత్యాసాలు ఉన్నాయి. సాధారణంగా టెన్నిస్ కోర్టులు పెద్ద పరిమాణంలో, ఓపెన్గా ఉంటాయి. అయితే ప్యాడెల్ టెన్నిస్ కోర్టులు మాత్రం కాస్త చిన్న పరిమాణంలో మూసేసి ఉంటాయి. 20 మీటర్ల పొడవుతో, 10 మీటర్ల వెడల్పుతో ఉంటాయి. అదే టెన్నిస్ కోర్టులు మాత్రం 23 మీటర్ల పొడవు, 11 మీటర్ల వెడల్పుతో ఉంటాయి. ప్యాడెల్ గేమ్లో కాస్త ఫన్నీ అనిపించే అంశం ఏంటంటే.. చిన్నప్పుడు డబుల్ స్టెప్ ఔట్ అనుకునేవాళ్లం కదా.. అలాగే ఇక్కడ కూడా ఒక్కసారి వెనుక ఉన్న గోడకు తగిలి.. మరోసారి కోర్టులో బౌన్స్ అయినా కూడా ఆట కొనసాగించవచ్చు. చాలా మంది గోడకు బంతి తగిలేలా చేసి స్ట్రాటజీలా ఆడుతుంటారు. అదే టెన్నిస్లో మాత్రం ఒకసారే బౌన్స్ కావాల్సి ఉంటుంది. ఇక, వెనుక గోడలకు తగిలితే ప్రత్యరి్థకే పాయింట్ దక్కుతుంది. ఇదో సోషల్ గేమ్..ప్యాడెల్ టెన్నిస్ను సోషల్ గేమ్ అంటుంటారు. ఎందుకంటే దీన్ని కచి్చతంగా ఇద్దరు ఆటగాళ్లు జట్టుగా ఆడాల్సి ఉంటుంది. అదే టెన్నిస్ మాత్రం సింగిల్స్, డబుల్స్ కూడా ఆడొచ్చు. ఇక, రాకెట్ విషయంలో టెన్నిస్కు, ప్యాడెల్ టెన్నిస్కు చాలా తేడా ఉంటుంది. టెన్నిస్ రాకెట్లో స్ట్రింగ్స్ ఉంటాయి. అదే ప్యాడెల్ టెన్నిస్ రాకెట్లో స్ట్రింగ్స్ ఉండవు. పొడవు విషయంలో కూడా టెన్నిస్ రాకెట్ కన్నా ప్యాడెల్ రాకెట్ చిన్నగా ఉంటుంది. వెడల్పు ఎక్కువగా ఉంటుంది. అయితే వాడే బాళ్లు చూడటానికి ఒకేలా కనిపించినా.. కాస్త తేడా ఉంటుంది. టెన్నిస్ బాల్స్ గట్టిగా ఉంటాయి. అదే ప్యాడెల్ టెన్నిస్ విషయంలో కాస్త మెత్తగా, తక్కువ పీడనంతో ఉంటాయి. ఆడే విధానంలో కూడా రెండు గేమ్స్ మధ్య చాలా వ్యత్యాసాలు ఉంటాయి. ముఖ్యంగా బాల్ సరీ్వంగ్ విషయంలో చాలా రూల్స్ ఉంటాయి.ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్.. మనదేశంలో క్రికెట్ తర్వాత దాదాపు అదే స్థాయిలో ఆదరణ పొందుతోన్న గేమ్ టెన్నిస్ అని చెప్పుకోవచ్చు. అయితే ప్యాడెల్ టెన్నిస్ ఆడుతున్నా.. చూస్తున్నా కూడా చాలా ఫన్ ఉంటుంది. ఉత్కంఠతో పాటు ఎంటర్టైన్మెంట్ పక్కా అంటున్నారు ప్యాడెల్ టెన్నిస్ శిక్షకులు. హైదరాబాద్లో కూడా పలు అకాడమీలు ఈ ప్యాడెల్ టెన్నిస్ నేరి్పస్తున్నారు.ఇప్పుడే ట్రెండ్ అవుతోంది.. హైదరాబాద్లో ఇప్పుడిప్పుడే ప్యాడెల్ టెన్నిస్ గురించి అవగాహన పెరుగుతోంది. నేర్చుకునేందుకు యువత, పిల్లలు ఆసక్తి చూపిస్తున్నారు. టెన్నిస్తో పోలిస్తే ప్యాడెల్ టెన్నిస్ గురించి చాలా మందికి తెలియదు. ప్యాడెల్ టెన్నిస్లో ఫిట్నెస్తో పాటు ఏకాగ్రత కూడా పెరుగుతుంది. కొన్ని మెళకువలతో నేర్చుకుంటే ప్యాడెల్ టెన్నిస్ ఆడటం సులువే. – ఎన్.జగన్నాథం, టెన్నిస్ ట్రైనర్ -
డార్క్ ఫాంటసీ..
నగరం నిద్రపోవడం మర్చిపోయి చాన్నాళ్లైంది.. అయ్యో.. ఇదేదో స్లీప్ డిజార్డరో, మానసిక రుగ్మతో కాదు. ఇదో అధునాతన జీవనశైలి. నగర యువత డార్క్ ఫాంటసీకి అలవాటుపడుతోంది.. అర్ధరాత్రుళ్లయినా హైదరాబాద్ రోడ్లు అలసిపోవు, ఆఫీసులు ముగిసినా ఆహ్లాదానికి విసుగు రాదు. నగరానికున్న ఎన్నో విశిష్టతల్లో సిటీ నైట్ లైఫ్ ఒకటి. అది కూడా ఎదో ఒక ప్రాంతానికే పరిమితం కాదు. నగరానికి నలుమూలలా ఫేవరెట్ స్పాట్లున్నాయి. సెంట్రల్ హైదరాబాద్ నెక్లెస్ రోడ్ మొదలు లండన్ను తలపించే మాదాపూర్ స్ట్రీట్స్ వరకూ నైట్ లైఫ్ ఒక అనుభూతి, ఒక ఎమోషన్. ఆ అర్ధరాత్రి రంగుల హరివిల్లుపై ఓ లుక్కేద్దామా..?!! ఒకప్పుడు రాత్రి తొమ్మిది దాటిందంటే ఎదో టీవీ షో చూస్తూనో, డిన్నర్ చేస్తూనో లేదా ఆ పాటికే నిద్రపోవడమో జరిగేది. కానీ.. ప్రస్తుతం పగలు ఓ రోజు, రాత్రి మరో రోజు అనేలా మారింది. అలా అందరికీ కాకపోయినప్పటికీ సగానికి పైగా యువతకు ఇప్పుడిదే ట్రెండ్ అయ్యింది. అర్ధరాత్రి వరకూ ఆహ్లాదం కోసం సిటీ రైడ్ వేయడం సర్వసాధారణమైపోయింది. దీనికి తోడు నగరంలోని పలు చోట్ల అర్ధరాత్రి వరకూ ఇరానీ ఛాయ్ నుంచి హైదరాబాద్ బిర్యానీ వరకూ అందుబాటులో ఉండటం ఓ కారణం. ముఖ్యంగా సాఫ్ట్ వేర్, ఐటీ ఉద్యోగుల షిఫ్టింగ్ విధానంతో ఈ నైట్ కల్చర్ మరింత పెరిగింది. అలా అని హైటెక్ సిటీ, మాదాపూర్, గచ్చి»ౌలి, ఫైనాన్షియల్ డి్రస్టిక్ట్ వంటి ప్రాంతాల్లో మాత్రమే ఈ సందడి ఉందనుకుంటే పొరపాటే. ఓల్డ్సిటీ మొదలు ట్యాంక్ బండ్, సికింద్రాబాద్ నుంచి ఎయిర్ పోర్ట్ రోడ్ వరకూ ఈ నిశాచర జీవితం అంతులేని ఆహ్లాదానికి, యువత సంతోషాలకు వేదికలుగా నిలుస్తున్నాయి. వినోదం కోసం విహారం.. మాదాపూర్ టూ హైటెక్సిటీ రోడ్. రాత్రి 10, 11 గంటలు దాటినా ఇక్కడి టిఫిన్ల కోసం 10 నిమిషాలైనా ఆగాల్సిందే. అంత మంది అక్కడికి చేరుకుంటారు. రాత్రి 12 గంటలైనా ట్యాంక్ బండ్ రోడ్ జాతరలా ఉంటుంది. ఇప్పుడిది కేక్ కటింగ్ స్పాట్గా మారింది. ఈ మధ్య కాలంలో సంబంధిత అధికారులు ఇక్కడ కేక్ కటింగ్ నిషేదించినా బర్త్డే పార్టీల సందడి అంతగా తగ్గనే లేదు. ఇక నెక్లెస్ రోడ్, ప్రసాద్ ఐమ్యాక్స్, ఈట్ స్ట్రీట్ రోడ్లో పాత ఆనవాయితే. అయితే కొత్తగా సెక్రటేరియేట్, భారీ అంబేద్కర్ విగ్రహం, అమరవీరుల స్థూపం నైట్సెల్ఫీ స్పాట్గా మారింది.నైట్ ఈటింగ్.. నగరంలోని ఛాయ్ ప్రేమికుల కోసం వీధి వీధినా చాయ్ స్టాల్స్ ఉన్న నంగతి తెలిసిందే. కానీ రాత్రి సమయంలో చాయ్ తాగాలంటే ఐతే నీలోఫర్లో తాగాలి.. లేదా చార్మినార్ నిమ్రా కేఫ్లో తాగాల్సిందే, సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టాల్సిందే. ముజాంజాహి మార్కెట్ వేదికగా రాత్రి వెన్నెలలో చల్లని ఐస్క్రీం తినడం మరో స్పెషల్. ఇక ఫ్లేవర్ ఆఫ్ హైదరాబాద్ ‘బిర్యానీ’ అంటే షాదాబ్ నుంచి ప్యారడైస్ వరకూ.., మేఫిల్ నుంచి కేఫ్ బాహర్ వరకూ ఎక్కడంటే అక్కడ దొరుకుతుంది. కాక్టేల్కు మించిన కిక్.. క్లబ్లు, పబ్బులు, బార్లు, రెస్టారెంట్లు.. ఒకటా రెండా.. నగరంలో విహరించాలంటే ఎన్నో కారణాలు, ఎన్నెన్నో అనుభవాలు. ఈ మధ్య కాలంలో ఐతే దుర్గం చెరువు పై రంగురంగుల లైట్లతో నైట్ రెయిన్ బోను తలపించే కేబుల్ బ్రిడ్జ్ పై సెల్ఫీ దిగడమో, రీల్స్ చేయడమో ఒక ట్రెండ్గా మారింది. ఎంతలా అంటే.. కేబుల్ బ్రిడ్జ్ పై ట్రాఫిక్ పెరగిపోయి అవస్థలు పడేంతలా. అందుకే సీసీ టీవీ కెమెరాలతో కట్టడి చేస్తున్నారు. రాత్రిళ్లు మాదాపూర్, గచ్చి»ౌలి మధ్య బైక్ రైడ్ చేయడం ఈ తరం యూత్కు ఒక సరదా. అంతేకాదు.. ఏకంగా శంషాబాద్లోని ఎయిర్ పోర్ట్కు ఓ రైడ్ వేసి అక్కడే పిజ్జానో, బర్గరో తిని.. మర్చిపోకుండా మళ్లీ ఓ సెల్ఫీ దిగడం కూడా స్పెషల్ అచీవ్మెంట్. కొండాపూర్ నుంచి ఎల్బీ నగర్ వరకూ.. బొల్లారం నుంచి ఆరాంఘర్ వరకూ అర్ధరాత్రిళ్లు అనుమతులకు అనుగుణంగా నిర్వహిస్తున్న ఫుడ్స్టాల్, ఐస్క్రీం పార్లర్లలో సందడి చేయడం నగరవాసులకొక హాబీలా మారింది. అయితే ఈ సంస్కృతి ఆరోగ్యానికి హానికరం ఐనప్పటికీ.. మిక్స్డ్ కాక్టేల్కు మించిన కిక్ ఇస్తుందనేది నైట్ లైఫ్ లవర్స్ అభిప్రాయం. -
1500 కళాకారులు.. 350 ఎగ్జిబిట్స్, 100 స్పీకర్స్, 12 దేశాలు
సాక్షి, హైదరాబాద్: రెండేళ్లకోసారి ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ‘లోక్ మంథన్’ వేడుకలకు సర్వం సిద్ధమైంది. భారతీయ జానపద సాంస్కృతిక ఉత్సవాలను ఈ నెల 21 నుంచి 24 వరకు నిర్వహించనున్నారు. కార్యక్రమానికి దేశం నలుమూలల నుంచి ప్రముఖులు, సుమారు 2 వేల మందికి పైగా జానపద కళాకారులు తరలి రానున్నారు. ఇప్పటికే ప్రీ లోక్ మంథన్ పేరిట అవగాహన సదస్సులను, ప్రచార కార్యక్రమాలను చేపట్టారు. దేశంలో విశిష్టమైన ప్రజాస్వామ్య వ్యవస్థ అమలులో ఉండేదని, విదేశీయుల దండయాత్రల కారణంగా గ్రామీణ ప్రజలకంటే పట్టణవాసులు ఉన్నతులుగా భావించే వివక్ష ఏర్పడిందని, ఈ నేపథ్యంలో గ్రామీణ విజ్ఞానం నిర్లక్ష్యానికి గురైందని లోక్ మంథన్ నిర్వాహకులు భావిస్తారు. అందుకే ప్రకృతి జానపదుల గొప్పతనాన్ని లోకానికి చాటిచెప్పే లక్ష్యంతోనే ‘లోక్ మంథన్’ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. జానపదుల విశ్వాసాలు, జీవన విధానం, దృక్పథం, వేల ఏళ్లుగా సమాజాన్ని ఏలిన వ్యవస్థల వివరాలను వెలికి తీసుకురావాలనేదే లోక్మంథన్ ఉద్దేశం. ప్రజ్ఞా భారతి ఆధ్వర్యంలో ఈ లోక్మంథన్ వేడుకలు ఇప్పటి వరకు రాంచీ, భోపాల్, గువాహటి, తదితర నగరాల్లో ఘనంగా జరిగాయి. భాగ్యనగరం వేదికగా.. ఈ బృహత్తర కార్యక్రమానికి హైదరాబాద్ నగరం వేదిక కానుంది. సంగీతం, నృత్యం, కళలు, క్రీడలు, ఆహారం, ఆరోగ్యం, ఆధ్యాత్మికత తదితర అంశాలపై సమాలోచనల సమాహారమే లోక్మంథన్. అర్మేనియా, లూథియానా వంటి దేశాల మూల సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే పలు కళా ప్రదర్శనలు, సమాలోచనలు చేసేందుకు వేలాది మంది తరలిరానున్నారు. బాలి నుంచి పద్మశ్రీ గ్రహీత వాయన్ దిబియా తన బృందంతో కలిసి రామాయణ ఇతిహాసం ప్రదర్శించనున్నారు.చదవండి: ఒత్తయిన జుట్టు.. ఒత్తిడితో ఫట్టునగరీకరణ కారణంగా అస్తిత్వాన్ని మరిచిపోతున్న నేటి తరానికి భారతీయ సామాజిక జీవిత మూలాలను తెలియజేసే ప్రయత్నమే లోక్ మంథన్. మన వ్యవస్థలో మొదటి నుంచి అడవి బిడ్డల సంస్కృతి, సంప్రదాయాలకు ప్రముఖ స్థానం ఉండేది. కానీ కాలక్రమేణా ఆ సంస్కృతి మరుగునపడింది. దీంతో అసలైన భారతీయతను నగర ప్రజలకు తెలియజేసేందుకు దేశంలోని వివిధ నగరాల్లో లోక్ మంథన్ నిర్వహిస్తున్నారు. హైదరాబాద్లో జరిగే ఈ లోక్మంథన్కు దేశ విదేశాలకు చెందిన వందలాది మంది కళాకారులు, మేధావులు, పరిశోధకులు హాజరుకానున్నారు.మనది అడవి బిడ్డల సంస్కృతి నగర ప్రజలు కెరీర్ వైపు, ఆధునికత వైపు విస్తారంగా పరుగులు తీస్తున్నారు. సమాజాన్ని ప్రభావితం చేస్తున్న ఈ సమూహానికి.. మన సమాజం మూలాలను గుర్తు చేసే ప్రయత్నమే లోకమంథన్. మన భారతీయల వ్యవస్థలో మొదటి నుంచీ అడవి బిడ్డల సంస్కృతి, సంప్రదాయాలకు ముఖ్యమైన స్థానం ఉండేది. కానీ కాలక్రమేణా అది మరుగున పడిపోయింది. అందుచేత అసలైన భారతీయతను నగర ప్రజలకు తెలియచెప్పేందుకు దేశంలోని వివిధ నగరాలలో లోక మంథన్ నిర్వహిస్తున్నాం. – నందకుమార్, ప్రజ్ఞా ప్రవాహ్ అఖిల భారతీయ కన్వీనర్ -
ఒత్తయిన జుట్టు.. ఒత్తిడితో ఫట్టు
కాఫీ నుంచి కాలుష్యం దాకా.. కాదేదీ కాటుకు అనర్హంకొన్ని ప్రాంతాల్లో దొరికే నీళ్లు సైతం కారణమేఅవగాహన పెంచుకొని అలవాట్లు మార్చుకోవాలి జుట్టు రక్షణకు పలు సూచనలు చేస్తున్న వైద్యులుఆధునిక సాంకేతిక మార్పులతో పాటు నగరవాసుల జీవనశైలి మార్పులు కూడా హెయిర్కి టెర్రర్గా మారుతున్నాయి. బిజీ లైఫ్లో పట్టించుకోని, మార్చుకోలేని అలవాట్లు సిటిజనుల కేశ సంపదను కొల్లగొడుతున్నాయి. సమయానికి తినడం తప్ప సమతుల్య ఆహారాన్ని తీసుకోవడం తగ్గిపోతోంది. జంక్ ఫుడ్ వినియోగంతో కేశాల ఆరోగ్యానికి అత్యవసరమైన ఐరన్, జింక్, బయోటిన్ అందడం లేదు. కాబట్టి ఆహారంలో తప్పనిసరిగా గుడ్లు, చేపలు, పాలకూర వంటి ఆకుకూరలు, గింజలు, లీన్ ప్రోటీన్లు ఉండేలా చూసుకోవాలి. మంచినీళ్లు 2 నుంచి 3 లీటర్లు తాగాలి. ఒమెగా ఫ్యాటీ యాసిడ్స్ లభించే డ్రైఫ్రూట్స్, నట్స్ తీసుకోవాలి. స్టైలింగ్.. కిల్లింగ్.. జుట్టు పొడిబారడానికి హెయిర్ డ్రైయర్లు, స్ట్రెయిట్నెర్లు ఉపయోగించడం వల్ల జుట్టు విరిగిపోతోంది. పోనీటెయిల్స్ లేదా బ్రెయిడ్స్ వంటి బిగుతు హెయిర్ స్టైల్స్తో ట్రాక్షన్ అలోపేసియా అనే పరిస్థితికి గురై జుట్టు రాలిపోతుంది. కాబట్టి హీట్–ఫ్రీ స్టైలింగ్ పద్ధతులను, స్టైలింగ్ చేసేటప్పుడు హీట్ ప్రొటెక్షన్ ఉత్పత్తులను ఉపయోగించాలి. జుట్టు షాఫ్ట్లపై ఒత్తిడి తగ్గించడానికి వదులుగా ఉండే కేశాలంకరణను ఎంచుకోవాలి. ఫ్యాషన్ కోసం పెరమ్స్, రిలాక్సర్ల మితిమీరిన రంగుల వినియోగం, రసాయన చికిత్సలతో జుట్టు నిర్మాణం బలహీనపడుతోంది. అలవాట్లు.. జుట్టుకు పోట్లు.. నగర యువతలో పెరిగిన ధూమపానం, ఆల్కహాల్ వినియోగం రెండూ కేశాలకు నష్టం కలుగజేస్తున్నాయి. ఈ అలవాట్లతో రక్తనాళాలు కుంచించుకుపోవడం వల్ల చక్కని హెయిర్ కోసం ఖచి్చతంగా ధూమపానం మానేయడంతో పాటు మద్యపానాన్ని బాగా తగ్గించడం అవసరం. ఉపరితలం.. ఇలా క్షేమం.. తల ఉపరితలం(స్కాల్ప్) తరచుగా నగరవాసులు నిర్లక్ష్యం చేస్తున్నారు. ఇది జుట్టుకు హాని చేస్తోంది కాబట్టి స్కాల్ప్ను శుభ్రంగా తేమగా ఉంచుకోవడం అవసరం. అవసరాన్ని బట్టి హెయిర్ ఫోలికల్స్ను పోషించడానికి ఉత్తేజపరిచేందుకు అందుబాటులో ఉన్న ఉత్పత్తులను ఉపయోగించవచ్చు. కదలికతో కేశాలకు మేలెంతో.. కూర్చుని పనిచేయడం, ఎక్కడకు వెళ్లాలన్నా వాహనాల వినియోగం.. ఇలా కదలికలు తగ్గిపోతున్న నగరవాసుల నిశ్చల జీవనశైలి రక్తప్రసరణ లోపానికి దారి తీస్తోంది. తలపై భాగానికి రక్త ప్రసరణ లేకపోవడం కేశాల ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తోంది. రక్త ప్రసరణను మెరుగుపరచడానికి శారీరక శ్రమ అవసరం. నీళ్లూ.. నష్టమే.. సిటీలో కొన్ని ప్రాంతాల్లో సాల్ట్స్ ఎక్కువగా ఉండే హార్డ్ వాటర్తో స్నానం చేస్తున్నారు. దీంతో తలలో ఉండే సహజమైన నూనెలు ఆవిరై తల ఉపరితలం పొడిబారి కేశాలు దెబ్బతింటాయి.నిద్రలేమీ.. ఓ సమస్యే..దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల విషయంలో నిర్లక్ష్యం హెయిర్పై దు్రష్పభావం చూపిస్తోంది. గుర్తించిన థైరాయిడ్ వంటి వ్యాధులు లేదా గుర్తించలేని హార్మోన్ల అసమతుల్యత వంటివి.. జుట్టుపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయి. ఆరోగ్య సమస్యలను గుర్తించడం తగిన చికిత్స పొందడం అవసరం. అలాగే నిద్రలేమి సిటీలో సర్వసాధారణమైపోయింది. ఇది జుట్టు పెరుగుదల వంటి శరీరపు సహజ ప్రక్రియలను నిరోధిస్తోంది. ప్రతి రాత్రి 7–9 గంటల నాణ్యమైన నిద్ర తప్పనిసరి. వ్యాధులుంటే.. నష్టమే.. థైరాయిడ్ వంటి దీర్ఘకాలిక రుగ్మతలు మాత్రమే కాకుండా హార్మోన్ల అసమతుల్యత వంటివి కేశాలకు హాని చేస్తాయి. కాబట్టి అంతర్లీన ఆరోగ్య సమస్యలను గుర్తించి, ఆరోగ్య సంరక్షణ నిపుణులను సంప్రదించాలి. లక్ష్యసాధన కోసం పరుగుతో దీర్ఘకాలిక మానసిక ఒత్తిడి జుట్టు ఆరోగ్యంపై పడుతోంది. ఒత్తిడికి విరుగుడుగా ధ్యానం, యోగా బ్రీతింగ్ వ్యాయామాలు చేయాలి. కారణాలెన్నో.. జాగ్రత్తలు తప్పనిసరి.. మన జుట్టులో 80శాతం ఎదిగే దశలో ఉంటే 12 నుంచి 13శాతం విశ్రాంతి దశ, మరో 7 నుంచి 8శాతం మృత దశలో ఉంటుంది. అనారోగ్యపు అలవాట్ల వల్ల గ్రోత్ దశలో ఉండాల్సిన 80శాతం 50 శాతానికి అంతకంటే తక్కువకు పడిపోయి డీలోజన్ ఫేజ్ అనే దశకు చేరి హెయిర్ ఫాల్ జరుగుతుంది. రోజుకు 60 నుంచి అత్యధికంగా 100దాకా వెంట్రుకలు ఊడటం సాధారణం కాగా.. ఈ సంఖ్య 200కి చేరితే తీవ్రమైన హెయిర్ఫాల్గా గుర్తిస్తాం. నివారణ కోసం సల్ఫేట్ ఫ్రీ షాంపూల వాడకం, వారానికి ఒక్కసారైనా హెయిర్ కండిషనర్ గానీ హెయిర్ మాస్క్ గానీ వాడటం అవసరం. అలాగే కాలుష్యం బారిన పడకుండా అవుట్డోర్ వెళ్లినప్పుడు మహిళలు చున్నీ, స్కార్ఫ్ మగవాళ్లైతే హెల్మెట్ వంటివి తప్పనిసరి. జాగ్రత్తలు తీసుకున్నా కేశాల ఆరోగ్యం సరిగా లేదంటే తప్పనిసరిగా వైద్యుల్ని సంప్రదించాలి. :::డా.జాన్వాట్స్, డెర్మటాలజిస్ట్, సీనియర్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ -
ఇండియన్ ట్రెడిషన్..ఫ్యాషన్ వాక్..
భారతీయ సంస్కృతికి అద్దం పట్టే రీతిలో సాగిన ఫ్యాషన్ వాక్ ఔరా అనిపించింది. ఆయా రాష్ట్రాల వస్త్రధారణతో సాగిన క్యాట్ వాక్ అందరినీ ఆకట్టుకుంది. తెలంగాణ రాష్ట్రం, హైదరాబాద్లోని రాయదుర్గంలోని ఎఫ్డీడీఐ ఆడిటోరియంలో ప్రధాని నరేంద్ర మోదీ భావజాలమైన వారసత్వ చేనేత వ్రస్తాలను ప్రోత్సహించేందుకు చేపట్టిన అవతరణ్–2024లో భాగంగా బుధవారం ఫ్యాషన్ వాక్ నిర్వహించారు. ఎఫ్డీడీఐ(ఫుట్వేర్ డిజైన్ డెవలప్మెంట్ ఇనిస్టిట్యూట్)లోని ఫ్యాషన్ డిజైన్ విభాగం రెండో సంవత్సరం విద్యార్థులు ఫ్యాషన్ వాక్ నిర్వహించారు. ఆయా రాష్ట్రాల్లో వివిధ పేర్లతో పిలిచే చీర కట్టు, పంచెకట్టుతో ర్యాంప్పై విద్యార్థులు మెరిశారు. యువతులు వివిధ రాష్ట్రాల సంప్రదాయాలను కళ్లకు కట్టినట్లు ప్రదర్శించారు. సాంఘిక సంస్కరణల చుట్టూ ఉండే సంప్రదాయ కథలలో భారతీయ సంస్కృతిని ప్రతిబింబించే రీతిలో వ్రస్తాలను డిజైన్ చేశారని ఎఫ్డీడీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎన్.తేజ్ లోహిత్రెడ్డి పేర్కొన్నారు. నిఫ్ట్ అసోసియేట్ ప్రొఫెసర్ మధుప్రియ ఝా ఠాకూర్, ఎల్జీఏడీ సీనియర్ ఫ్యాకల్లీ సి.వేణుగోపాల్ న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు. బెస్ట్ డిజైనర్, బెస్ట్ మోడల్ను ఎంపిక చేయనున్నారు. (చదవండి: చందమామ లేదు.. యూట్యూబ్ ఉంది..!) -
బాల్యమొక స్ఫూర్తి
బాల్యం అనేది ప్రతీ ఒక్కరి జీవితానికి భవిష్యత్ పాఠశాల. చిన్నారులు ఎదిగే క్రమంలో వారి ఆలోచనలపై చూపించే ప్రభావమే వారి జీవిత గమ్యాలను నిర్దేశిస్తాయి. పిల్లల చిన్నప్పటి అభిరుచులే వారి లక్ష్యాలుగా మార్పు చెందుతాయి. ఈ ప్రయాణంలో కొందరు చిన్నారులు చదువులపై ఆసక్తి కనబరిస్తే మరి కొందరు సంగీతం, క్రీడలు, డాన్స్, పెయింటింగ్, సాహస కృత్యాలు ఇలా తదితర అంశాలపై మక్కువ చూపుతుంటారు. ఒకవైపు వారి చదువులను కొనసాగిస్తూనే ఇలాంటి ఎక్స్ట్రా కరిక్యులం యాక్టివిటీస్లో రాణిస్తుంటారు. పసిప్రాయంలోనే ఇలాంటి విభిన్న రంగాల్లో అత్యుత్తమ నైపుణ్యాలతో రాణించిన కొందరు చిన్నారులను చిల్డ్రన్స్ డే సందర్భంగా ‘సాక్షి’ పలకరించింది. బాల్యం నుంచే తమకంటూ కొన్ని లక్ష్యాలు నిర్దేశించుకుని అటు చదువులను ఇటు వారి ప్రయత్నాలను కొనసాగిస్తూ స్ఫూర్తిగా నిలుస్తున్న బాలతారల ఆలోచనలను తడిమి చూద్దామా..? చిన్న వయసులో..పిట్ట కొంచెం కూత ఘనం అనే సామెతకు అచ్చు గుద్దినట్టు ఈ పాప సరిపోతుందనడంలో అతిశయోక్తి లేదు. ఎందుకంటే 9 ఏళ్ల వయసులోనే తన కంటే నాలుగేళ్లు పెద్ద వాళ్లతో తలపడి, గెలుపొంది ఔరా అనిపించుకుంటోంది. బ్యాడ్మింటన్ ఆటలో అద్భుతాలు సృష్టిస్తోంది లట్టాల శాన్వి. నగరంలోని మణికొండకు చెందిన శాని్వకి చిన్నప్పటి నుంచే తల్లిదండ్రులు బ్యాడ్మింటన్లో శిక్షణ ఇప్పిస్తున్నారు. ప్రస్తుతం 4వ తరగతి చదువుతున్న శాని్వ.. ఆటపై పూర్తిగా ఫోకస్ పెట్టేందుకు చదువు కూడా మానేసింది. రోజులో కనీసం 8 గంటల పాటు ఆటపైనే శ్రద్ధ పెడుతూ ప్రాక్టీస్ చేస్తోంది. ఒలంపిక్స్లో దేశం తరఫున ఆడి బంగారు పతకాన్ని సాధించడమే తన జీవిత లక్ష్యమని చెబుతోంది. ఇటీవల అసోంలో జరిగిన జాతీయస్థాయి అండర్–13 ర్యాంకింగ్ టోర్నమెంట్లో సింగిల్స్, డబుల్స్ విభాగంలో మెయిన్ డ్రాకు అర్హత పొంది సంచలనం సృష్టించింది.హైదరాబాద్నునంబర్ వన్ స్థానంలో.. అతి సాధారణ కుటుంబం మాది. మేము ముగ్గురం అక్కాచెల్లెళ్లం. మేము ఏది చేసినా మా కుటుంబానికి గుర్తింపు రావాలి. మా అమ్మా నాన్నలకు మంచి పేరు తేవాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. నగరంలోని యాచ్ క్లబ్ ఆధ్వర్యంలో సుహేమ్ షేక్ అందిస్తున్న సహకారంతో ఈ సెయిలింగ్లో రాణించాను. వైఎఐ నార్త్ ఈస్ట్ రేగట్ట 2023 ఆప్టిమిస్టిక్ విభాగంలో గోల్డ్ మెడల్ సాధించాను. వైఎఐ సికింద్రాబాద్ యూత్ క్లబ్ రేగట్ట 2023లో సిల్వర్ పతకం సాధించాను. వైఏఐ యూత్ నేషనల్లో ఆప్టిమిస్టిక్ విభాగంలో కాంస్యం గెలుపొందాను. మా ప్రయత్నంలో భాగంగా ఇప్పటికే జాతీయ స్థాయిలో హైదరాబాద్ను నంబర్ వన్ స్థానంలో తీసుకువచ్చారు. నాతోపాటు నా సహోదరి కూడా సేలింగ్లోనే జాతీయ స్థాయిలో పలు పతకాలను సాధించింది. – లహరి, జాతీయస్థాయి సెయిలర్టీం ఇండియాకు ఆడటమే..క్రికెట్ అంటే నాకు చాలా ఇష్టం.. ప్రస్తుతం నేను హిమాయత్నగర్లోని స్లేట్ ది స్కూల్లో 6వ తరగతి చదువుతున్నాను. బాగ్లింగంపల్లిలోని స్పాట్ లైట్ అకాడమీలో క్రికెట్లో శిక్షణ తీసుకుంటున్నాను. ఈ మధ్యనే స్కూల్ గేమ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకు అండర్–17 విభాగంలో ఎంపికయ్యాను. ఇండియన్ క్రికెట్ టీమ్కు ఆడటమే లక్ష్యంగా క్రికెట్లో రాణిస్తున్నాను. సిటీలో జరిగిన పలు టోర్నమెంట్లలో మంచి స్కోర్ సాధించాను. అందరిలా కాకుండా విభిన్న క్రీడల్లో రాణించడానికి నాన్న అందించే ప్రోత్సాహం మాటల్లో చెప్పలేను. ఇటు చదువులు, అటు క్రికెట్లో సమస్వయం చేసుకుంటూ ముందుకు సాగడానికి నాన్న విశేషంగా కృషి చేస్తున్నాడు. – వరీష సలార్ సినిమాతో గుర్తింపు.. ప్రతి విషయాన్ని వినూత్నంగా ఆలోచించడం నాకిష్టం. చిన్నప్పటి నుంచి విభిన్న కళల్లో ఆసక్తి కనబర్చేవాడిని. అనంతరం సినిమాలు, నటనపై మక్కువ పెరిగింది. ఏ చిన్న ఆడిషన్స్ ఉన్నా వెళ్లేవాడిని. ఈ ప్రయత్నంలో పలు మంచి ప్రాజెక్టుల్లో చైల్డ్ ఆర్టిస్ట్గా నటించే అవకాశం వచి్చంది. ప్రముఖ సినీ హీరో అజిత్, త్రిష నటించిన గుడ్, బాడ్, అగ్లీ సినిమా, ప్రభాస్ సలార్ వంటి సినిమాలు మంచి గుర్తింపునిచ్చాయి. మరికొద్ది రోజుల్లో రానున్న వరుణ్ తేజ్ సినిమా మట్కాలో మంచి రోల్ చేస్తున్నారు. అంతేగాకుండా జగపతిబాబు తదితర టాలీవుడ్ స్టార్స్తో మరికొన్ని ప్రాజెక్ట్లు చేస్తున్నాను. సినిమాలతో పాటు చదువులోనూ రాణిస్తున్నాను. సినిమాల ప్రభావం నా చదువులపై పడకుండా చూసుకుంటున్నాను. భవిష్యత్తులో వైవిధ్యమైన క్యారెక్టర్లు చేసే మంచి హీరోగా రాణించాలని ఉంది. – కార్తికేయ దేవ్, ప్రముఖ చైల్డ్ ఆర్టిస్ట్హ్యాపీగా.. సాగుతున్న కెరీర్ ఓరి దేవుడా, సలార్ సినిమాలతో పాటు పలు వెబ్ సిరీస్లో చైల్డ్ ఆరి్టస్ట్గా నటించాను. ప్రభాస్ వంటి ప్యాన్ ఇండియన్ స్టార్తో సినిమా చేయడం చాలా సంతోషంగా ఉంది. సినిమాలతో పాటు చదువు, క్రీడల్లోనూ ముందంజలో ఉన్నాను. సినిమాలతో మొదలై కెరీర్ హ్యాపీగా ముందు సాగుతోంది. సామాజిక బాధ్యతలను ప్రతిబింబించేలా, చిన్నారుల హక్కులను తెలియజేసేలా మంచి ప్రాజెక్టులను చేసే యోచనలో ఉన్నాను. ప్రస్తుతం మరో రెండు పెద్ద ప్రాజెక్టుల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటిస్తున్నాను. మ్యాథ్స్ ఇంగ్లిష్ సబ్జెక్ట్ అంటే చాలా ఇష్టం. అంతేగాకుండా సంగీతంపైన కూడా ఆసక్తి. నేను పాటలు చాలా బాగా పాడగలను. – ఫర్జానా, చైల్డ్ ఆర్టిస్ట్ -
మిసెస్ ఆసియాకు భారత్ తరపున మన హైదరాబాదీ..!
ప్రఖ్యాత క్లాసిక్ మిసెస్ ఆసియా ఇంటర్నేషల్ పేజెంట్ 2024లో భారత్ తరపున తెలంగాణ రాష్ట్రం, హైదరాబాద్ నగరానికి చెందిన ప్రముఖ విద్యావేత్త డాక్టర్ ఏ విజయ శారదా రెడ్డి ప్రాతినిధ్యం వహించనున్నారు. ఈ ప్రతిష్టాత్మక పోటీ ఈ నెల 13 నుంచి 19 వరకూ థాయ్లాండ్లోని బ్యాంకాక్లో జరగనుంది. ఈ ఏడాది మిసెస్ ఇండియా టైటిల్ను కైవసం చేసుకున్న విజయ గతేడాది మిసెస్ ఇండియా– తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ టైటిల్ను సూపర్ క్లాసిక్ కేటగిరిలో సొంతం చేసుకోవడంతో జాతీయ వేదికపై తనదైన ముద్ర వేశారు. తాజాగా అంతర్జాతీయ స్థాయిలో ప్రాతినిధ్యం వహించడం ఆమె అసాధారణ ప్రతిభ, మహిళలను ప్రేరేపించే కృషికి సాక్ష్యంగా నిలుస్తోంది. ఎన్నో రంగాల్లో విజయకేతాలను ఎగురవేసిన విజయ రెండు సార్లు గిన్నిస్ వరల్డ్ రికార్డులు పొందడమే కాకుండా విద్య, వ్యాపార రంగాల్లో ఆమె చేసిన కృషికి జాతీయ, అంతర్జాతీయ అవార్డులు వరించాయి. ఈ నేపథ్యంలో మిసెస్ ఆసియా ఇంటర్నేషనల్ పేజెంట్ 2024లో ఆమె పాల్గొనడం దేశానికే గర్వకారణంగా పేర్కొనవచ్చు. అందం, విజ్ఞానంలో ఉన్నత శిఖరాలు అధిరోహించారు. ఈ కాంటెస్టులో ఆసియా ఖండంలోని వివిధ దేశాలకు చెందిన వారు తమ ప్రతిభను ప్రదర్శించనున్నారు. (చదవండి: శీతాకాలంలో గుండె ఆరోగ్యం కోసం తీసుకోవాల్సినవి..!) -
భాగ్యనగరాన్ని.. కమ్మేస్తున్న క్లౌడ్స్..
దేశంలోనే కాదు యావత్ ప్రపంచంలో.. విభిన్న ఆహార రుచులకు కేంద్రమైన నగరాల్లో హైదరాబాద్ కూడా ప్రముఖమైనది. ప్రస్తుత కాంటినెంటల్ వంటకాలే కాదు నిజాం కాలం నాటి స్థానిక సాంస్కృతిక వంటకాలతోనూ మన భాగ్యనగరం ‘బౌల్ ఆఫ్ డెలీíÙయస్ డిష్’గా గుర్తింపు పొందింది. ఇందులో భాగంగా నగరంలో స్థానిక వంటకాలతో పాటు వివిధ ప్రాంతాలకు చెందిన రుచులు కూడా ఆదరణ పొందుతున్నాయి. ఈ రుచుల కోసమే ప్రత్యేకంగా రెస్టారెంట్లు కూడా వెలిశాయి. అయితే కరోనా అనంతరం ఈ రంగంలో పెను మార్పులు వచ్చాయి. ముఖ్యంగా క్లౌడ్ కిచెన్. ఇంటి నుంచి బయటికి వెళ్లకుండా ఫుడ్ ఆర్డర్ పెట్టుకోవడంతో మొదలైన ఈ కల్చర్.. వెళ్లే అవకాశమున్నా ఆన్లైన్ లోనే ఆర్డర్ పెట్టేంతగా మార్పు చెందింది. నగరంలో విభిన్న రుచులు విభిన్న సంసంస్కృతుల సమ్మేళనానికి నిదర్శనంగా నిలుస్తుంది. హైదరాబాద్ బిర్యానీ మొదలు ఇక్కడి స్ట్రీట్ ఫుడ్ వరకూ అన్ని రుచులూ ఆన్లైన్, డిజిటల్ వేదికగా ఒక్కొక్క ఆర్డర్తో అందుబాటులో ఉన్నాయి. ఇందులో స్థానిక వంటకాలే కాదు చైనీస్, కొరియన్, మొగలాయి, కరాచి వంటి రుచులను అందించే రెస్టారెంట్లు తమ డోర్ స్టెప్ సేవలను అందిస్తున్నాయి. వీరికి వారధులుగా స్విగ్గీ, జొమాటో వంటి ఆన్లైన్ వేదికలు ఉన్నాయన్న విషయం విధితమే. అయితే.. ఈ కోవలోకి స్టార్ రెస్టారెంట్లు కాస్త విముఖతను ప్రదర్శించాయి. నాణ్యత, బ్రాండ్ వాల్యూ విషయంలో ఈ సేవలు అందించలేదనేది నిపుణుల మాట. కానీ ప్రస్తుతం నగరంలోని టాప్ 5 స్టార్ హోటల్స్, రెస్టారెంట్లు సైతం క్లౌడ్కిచెన్కు ఆసక్తి చూపిస్తున్నాయి. వాటి పాకశాస్త్ర నైపుణ్యాలతో నాణ్యత, ప్యాకింగ్, బ్రాండ్ వాల్యూ వంటి అంశాల్లో చాలా జాగ్రత్తలు తీసుకుని మరీ ఈ సేవలు ప్రారంభిస్తున్నాయి. విలాసవంతమైన జీవితాల్లో ఈ లోటును పూడ్చడానికి స్టార్ హోటళ్ల యాజమాన్యం ముందుకు వస్తున్నాయి. ముఖ్యంగా గమనించాలి. జూబ్లిహిల్స్, హైటెక్ సిటీ వంటి ప్రాంతాల్లో స్టార్ హోటళ్ల డిజిటల్ ఫుడ్ సేవలు ఊపందుకున్నాయి. అందరూ అదే దారిలో.. డైనింగ్తో పాటు ఈ క్లౌడ్ కిచెన్లో కూడా మంచి లాభాలు వస్తుండటంతో పలు రెస్టారెంట్లు ఈ డిజిటల్ ఇన్నోవేషన్కు సై అంటున్నాయి. కానీ స్టార్ హోటళ్లు మాత్రం అంతగా ఆసక్తి చూపించలేదు. అయితే గత కొంత కాలంగా 5 స్టార్ హోటళ్లు సైతం క్లౌడ్ కిచెన్ను ప్రారంభించాయి. వాటి బ్రాండ్ వాల్యూను కొనసాగిస్తూనే, పాకశాస్త్ర నైపుణ్యాలను డిజిటల్ వేదికతో అనుసంధానం చేస్తూ సేవలందిస్తున్నాయి. ఇక క్లౌడ్ కిచెన్ సేవలను నగరవాసులు ఆస్వాదిస్తున్న తీరు అద్భుతం. ఈ నేపథ్యంలో వారికి మా సేవలను సైతం అందంచాలనే లక్ష్యంతో ఐటీసీ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఫుడ్టెక్ సేవలు ప్రారంభించాం. స్విగ్గీ, జొమాటో వంటి వేదికలతో అనుసంధానమై మా పసందైన రుచుల పండుగను ఆహార ప్రియుల వద్దకే చేర్చుతున్నాం. ముఖ్యంగా మా ప్రయత్నంలో అధిక–నాణ్యత భోజనాన్ని అందించడంతో పాటుగా పర్యావరణహితమైన ప్యాకింగ్ను కొనసాగిస్తున్నాం. డిజిటలీకరణతో అద్భుత ఫలితాలు ఫుడ్, హోటల్స్ రంగంలో అధునాతన డిజిటలీకరణ అద్భుత ఫలితాలను అందిస్తుంది. ఫుడ్ సేఫ్టీ ప్రోటోకాల్స్లో పాకశాస్త్ర నిపుణులైన స్టార్ హోటల్ చెఫ్లు, కిచెన్ మేనేజర్లు విశేషమైన శిక్షణ ఉండటంతో ఈ విధమైన క్లౌడ్ కిచెన్కు మంచి ఆదరణ లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ప్రధానంగా వివిధ దశల్లో ఆహార పదార్థాల తనిఖీ, తయారీ విధానంలోనూ అధునాతన సాంకేతికత వినియోగించడంతో పాటు శాటిలైట్ కిచెన్లలో ఉపయోగించే యాప్లు ఈ వంటలకు మరింత నాణ్యతను, ఖచి్చతత్వాన్ని పెంపొందిస్తున్నాయి. ఈ ఫుడ్ టెక్ సేవలలో సుస్థిరతే ప్రధాన లక్ష్యంగా స్టార్ హోటల్స్ ప్యాకింగ్ను వినూత్నంగా చేపడుతున్నాయి. పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ, మారే ఉష్ణోగ్రతలు ఆహారాన్ని పాడు చేయకుండా స్పిల్లేజ్ ప్రూఫ్ కంటైనర్లను ఉపయోగిస్తుండటం విశేషం. ఫుడ్ లవర్స్ అభిరుచికి అనుగుణంగా.. నగరంలోని ఫుడ్ లవర్స్ ఇష్టపడే రుచులకు అనుగుణంగా, మా నాణ్యతా ప్రమాణాలను పెంచుకుంటూ 3 రకాల సేవలను అందుబాటులోకి తీసుకువచ్చాం. ఇందులో భాగంగా ప్రముఖ మాస్టర్ చెఫ్లచే రూపొందించబడిన దాల్ మఖీ్న, కబాబ్లు, ర్యానీలతో సహా గౌర్మెట్ నార్త్ ఇండియన్ వంటకాలను అందించడానికి ‘ఐటీసీ మాస్టర్ చెఫ్ క్రియేషన్స్’, ఆరోగ్యానికి హితమైన మిల్లెట్ కిచిడీ, ఇంటి వంటలను తలపించే చపాతీలు, అన్నం వంటి వాటికోసం ‘ఐటీసీ ఆశీర్వాద్ సోల్ క్రియేషన్స్’, క్రోసెంట్స్, బేగెల్స్, గౌర్మెట్ బ్రెడ్లు వంటి బేకరీ ఐటమ్స్ కోసం ‘ఐటీసీ సన్ఫీస్ట్ బేక్డ్ క్రియేషన్స్’ సేవలు ఉన్నాయి. ఈ మూడు రకాల సేవలను హైదరాబాద్తో పాటు బెంగళూరు, చెన్నైలోని 19 క్లౌడ్ కిచెన్లలో ప్రారంభించాం. – రోహిత్ భల్లా, ఫుడ్ టెక్ బిజినెస్ హెడ్, ఐటీసీ లిమిటెడ్. -
Foreign Students: వుయ్ ఆర్ విదేశీ
భాగ్యనగరం.. రోజూ వేలాది మంది నగరానికి వస్తుంటారు. వారందరికీ హైదరాబాద్ పట్నం.. ఓ కల్పతరువులా మారుతోంది. ఎవరు వచి్చనా అందరినీ ఆదుకుంటుంది.. ఆదరిస్తుంటుంది. ఇలా రాష్ట్రంలోని గ్రామాలు, పట్టణాలు, వేరే రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర దేశాల నుంచి కూడా ఎంతో మంది వస్తుంటారు. వారందరినీ హైదరాబాద్ అక్కున చేర్చుకుంటోంది.. వ్యాపారం, పర్యాటకం కోసమే కాకుండా పై చదువుల కోసం కూడా ఇక్కడికి వస్తున్నారు. వీరందరినీ అమ్మలా ఆదరిస్తోంది భాగ్యనగరం.. వారంతా ఇక్కడి సంస్కృతి, సంప్రదాయాలు, భాషపై ఎంతో మక్కువ చూపిస్తున్నారు. మన సంస్కృతిని అలవర్చుకుంటున్నారు. ఇక్కడి వారితో స్నేహం చేస్తూ.. కలిసిమెలిసి జీవనం సాగిస్తున్నారు. వేర్వేరు దేశాల నుంచి.. వేర్వేరు సంస్కృతుల నుంచి తమ కలలను సాకారం చేసుకునేందుకు ఎల్లలు దాటి ఇక్కడికి వచ్చిన కొందరు విదేశీ విద్యార్థుల మనోగతం తెలుసుకుందాం.. దేశం కాని, దేశం.. భాష కాని భాష.. అనుకోకుండా కొందరు.. ఇష్టంతో కొందరు ఇలా ఎంతో మంది భాగ్యనగరం గడ్డపై అడుగుపెట్టారు. కొత్త వాతావరణం, కొత్త మనుషులు, కొత్త ఆహారం ఇక్కడి పరిస్థితులు ఎలా ఉంటాయోనన్న భయం.. అనుమానం.. వాటన్నింటినీ భాగ్యనగరం ప్రజలు, వాతావరణం పటాపంచలు చేశాయి. కొత్త, వింత అనుకున్న సంస్కృతి, సంప్రదాయమే ఇప్పుడు వారికి ఎంతో ఇష్టంగా మారిపోయింది. ఈ సంస్కృతిలో భాగమవుతున్నారు. ఎలాంటి భయం లేకుండా మాతృభూమిపై ఉన్నట్టుగా స్వేచ్ఛగా జీవిస్తున్నారు. తెలుగుతో పాటు ఉర్దూ భాషలపై మమకారం పెంచుకుని వాటిని నేర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇక్కడి పర్యాటక ప్రదేశాలను చూసి మురిసిపోతున్నారు. ఎంతోమంది స్నేహితులు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, ఉస్మానియా యూనివర్సిటీ, నిజాం కాలేజీల్లో విదేశీ విద్యార్థులకు డిగ్రీ, పీజీ కోర్సులను ఆఫర్ చేస్తున్నాయి. ఈ కోర్సుల్లో చేరేందుకు వేలాది మంది ఇక్కడికి వచ్చి కాలేజీల్లో చేరుతున్నారు. నిజాం కాలేజీలోనే దాదాపు 300 మంది విద్యార్థులు ఏటా వస్తున్నారని చెబుతున్నారు. ఇక, వేరే కాలేజీలు, యూనివర్సిటీలు కలిపి 2 వేలకు పైగా విద్యార్థులు ఏటా వస్తున్నారు. నిబద్ధతతో నేర్చుకుంటారు.. ఇక్కడికి వచ్చే విదేశీ విద్యార్థులు పాఠాలను ఎంతో నిబద్ధతతో నేర్చుకుంటారు. ఏటా వందలాది మంది విద్యార్థులు వివిధ దేశాల నుంచి వస్తుంటారు. ఇక్కడ చదువుకుని వెళ్లిన వారు వారి బంధువులకు కూడా ఈ కాలేజీ గురించి చెప్పి ఇక్కడికి పంపిస్తుంటారు. అక్కడికి వెళ్లిన తర్వాత వారు మంచి ఉద్యోగాలు సాధించామని ఫోన్ చేసి చెబుతుంటారు. ఇక్కడి పిల్లలతో కలిసిపోతుంటారు. విదేశీ విద్యార్థులకు కాలేజీలో ఎలాంటి ఇబ్బందులూ రాకుండా మేం చూసుకుంటాం. – ప్రొ.మహ్మద్ అబ్దుల్ అలీ, విదేశీ విద్యార్థలు కో–ఆర్డినేటర్, నిజాం కాలేజీ ఫీజులు కాస్త తక్కువ.. తమ దేశాలతో పోలిస్తే ఇక్కడ ఫీజులు కాస్త తక్కువగా ఉండటమే కాకుండా, చదువు కూడా క్వాలిటీ ఉంటుందనే ఉద్దేశంతో ఇక్కడికి వస్తున్నారు. సుడాన్, తుర్కెమెనిస్తాన్, యెమెన్, సోమాలియా వంటి దేశాల నుంచి ఎక్కువగా వస్తుంటారని నిజాం కాలేజీ విదేశీ విద్యార్థుల కో–ఆర్డినేటర్ మహ్మద్ అబ్దుల్ అలీ తెలిపారు. స్థానిక విద్యార్థులు కూడా విదేశీ విద్యార్థులతో కలివిడిగా ఉంటూ, వారికి ఏ అవసరం ఉన్నా కూడా సాయపడుతున్నారు. భాష సమస్య ఉన్నా కూడా అందరూ కలిసిమెలిసి ఉంటామని, ఇంగ్లి‹Ùలో కమ్యూనికేట్ అవుతుంటామని నిజాం కాలేజీలోని పలువురు విదేశీ విద్యార్థులు పేర్కొన్నారు. తమకు ఇక్కడి వారు చాలా మంది స్నేహితులు ఉన్నారని, సెలవులు ఉన్నప్పుడు వారితో హైదరాబాద్లోని సందర్శనీయ ప్రదేశాలకు వెళ్లి వస్తుంటామని వివరించారు.సంస్కృతి చాలా ఇష్టం..హైదరాబాద్ సంస్కృతి అంటే చాలా ఇష్టం. మట్టిగాజులు, మెహందీ మా దేశంలో ఎవరూ వేసుకోరు. కానీ నాకు వాటిపై ఎంతో ఇష్టం పెరిగింది. అందుకే ఎప్పుడూ మెహందీ పెట్టుకుంటాను. గాజులు వేసుకుంటాను. ఇక్కడి సంస్కృతి, సంప్రదాయాల గురించి ఫ్రెండ్స్ను అప్పుడప్పుడూ అడిగి తెలుసుకుంటాను. భారత్కు ముఖ్యంగా హైదరాబాద్ రావడం చాలా సంతోషంగా ఉంది. – దుర్సుంజెమల్ ఇమ్రుజకోవా, బీఏ ఫస్ట్ ఇయర్, నిజాం కాలేజీ, తుర్క్మెనిస్తాన్సొంతూర్లో ఉన్నట్టే.. ఇక్కడ చదువుకున్న ఓ బంధువు నిజాం కాలేజీ గురించి చెబితే ఇక్కడ చేరాను. మొదట్లో ఇక్కడి వాతావరణం, ఆహరంతో కాస్త ఇబ్బంది పడేదాన్ని. కానీ ఇప్పుడు అలవాటైంది. స్టూడెంట్స్, ప్రొఫెసర్స్ చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. స్నేహితులతో కలిసి ఓ ఫ్లాట్లో ఉంటాం. మా వంట మేమే చేసుకుంటాం. అప్పుడప్పుడూ ఇక్కడి స్నేహితులతో కలిసి బయటకు వెళ్లి.. హైదరాబాద్ రుచులను ఆస్వాదిస్తుంటాం. చారి్మనార్, గోల్కొండ కోట వంటి ప్రదేశాలకు చాలాసార్లు వెళ్లాం. – మహ్రీ అమన్దుర్దీయువా, బీఏ థర్డ్ ఇయర్, నిజాం కాలేజీ, తుర్క్మెనిస్తాన్చాలా సంతోషంగా ఉంది.. ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంది. మొదట్లో కాస్త ఇబ్బంది పడినా.. ఇప్పుడు అంతా సెట్ అయ్యింది. ఇక్కడి వారితో పాటు మా దేశం నుంచి వచి్చన ఫ్రెండ్స్తో టైం పాస్ చేస్తుంటాం. ఇక్కడి ఫుడ్, కల్చర్ చాలా నచి్చంది. – అనస్, బీఏ ఫస్ట్ ఇయర్, సూడాన్ -
వెదురు బ్రష్లు ఎప్పుడైనా చూశారా..?
సహజ సిద్ధంగా లభించే వెదురుతో తయారు చేసిన బ్రష్లు ఎప్పుడైనా చూశారా.. వినడానికి కాస్త కొత్తగా అనిపించినా ఈ రకం బ్రష్లు చాలా కాలంగా వినియోగంలో ఉన్నాయి. ఉదయం లేచి ప్లాస్టిక్తో తయారైన బ్రష్లు వినియోగిస్తున్నంతగా వెదురు బ్రష్లకు ప్రచారం లభించలేదు. అయితే గత కొన్నేళ్లుగా ప్రకృతి ప్రేమికులు మాత్రం ప్లాస్టిక్ వినియోగాన్ని నియంత్రించేందుకు వెదురు బ్రష్ల పట్ల అవగాహన కల్పిస్తున్నారు. ప్లాస్టిక్ బ్రష్ల స్థానంలో వెదురు వస్తువులను అందుబాటులోకి తెస్తున్నారు. పార్కులు, వాకింగ్ ట్రాక్లు, తదితర ప్రదేశాల్లో తమవంతు కృషి చేస్తున్నారు. హైదరాబాద్లో ఇప్పటి వరకూ సుమారు 30 వేల మంది ఇలా ప్లాస్టిక్ నుంచి వెదురు బ్రష్లకు మారినట్లు పేర్కొంటున్నారు.హైదరాబాద్ నగరంలోని కేబీఆర్ పార్కు, యూసఫ్గూడ, కృష్ణకాంత్ పార్కు, మన్సూరాబాద్ పెద్దచెరువు, పీర్జాగూడ, భాగ్యనర్ నందనవనం పార్కు తదితర ప్రదేశాల్లో విశ్వ సస్టైనబుల్ ఫౌండేషన్ సభ్యులు వెదురు బ్రష్ల వినియోగం గురించి అవగాహన కల్పిస్తున్నారు. అంతేకాకుండా ఎక్స్చేంజ్ కార్యక్రమంలో సేకరించిన ప్లాస్టిక్ బ్రష్లను విశాఖలోని రివర్స్ ఇంజినీరింగ్ ప్లాంట్కు తరలించి, పెట్రోల్, డీజిల్, కిరోసిన్ తయారీకి వినియోగిస్తారని నిర్వాహకులు చెబుతున్నారు. ప్రతి శనివారం, ఆదివారం ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకూ ఈ టూత్ బ్రష్ల ఎక్స్చేంజ్ కార్యక్రమం ఉంటుంది. హైదరాబాద్తో పాటు బెంగళూరులోనూ ఈ తరహా కార్యక్రమాలను చేపడుతున్నారు. మనమూ ఈ తరహా వెదురు బ్రష్లను ట్రై చేద్దామా.. సామాజిక బాధ్యతగానే..బ్రష్ అనేది నిత్యం ప్రతి ఒక్కరూ వినియోగించే వస్తువు. అయితే మార్కెట్లో ఎక్కువగా ప్లాస్టిక్తో తయారు చేసినవి ప్రాచుర్యంలో ఉన్నాయి. ఫలితంగా ఎలాంటి దుష్ప్రభావాలు ఉన్నాయి, వాటి స్థానంలో ప్రత్యామ్నాయంగా ఏం చేయాలనేది చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. ప్రతి రెండు నెలలకు ఒక బ్రష్ పడేసినా కోట్ల బ్రష్లు వ్యర్థాల్లో కలిసిపోతున్నాయి. వాటిని నియంత్రించాలన్నదే మా ఆలోచన. మేం వ్యాపార ధోరణతో కాకుండా సామాజిక బాధ్యతగా ఈ ప్రమోషన్ వర్క్ చేస్తున్నాం. శనివారం కేబీఆర్ పార్కు దగ్గర ఏర్పాటు చేసిన స్టాల్కు వాకర్స్ వచ్చి విషయం అడిగి తెలుసుకున్నారు. చాలా మంది మేమూ మారతాం అంటున్నారు. బ్రష్లను తీసుకుంటున్నారు. – అనూప్కుమార్, వాలంటీర్, విశ్వ సస్టైనబుల్ ఫౌండేషన్ -
HYD: వ్యాలీ ఆఫ్ స్పోర్ట్స్
హైదరాబాద్ అంటే బిర్యానీ, బాహుబలి, బ్యాడ్మింటన్..!! గతంలో అప్పటి రాష్ట్రపతి నగరానికి విచ్చేసిన సందర్భంలో అన్న మాటలివి. అంటే నగరంలో అంతర్జాతీయ క్రీడలు అంతటి ప్రశస్తిని సాధించుకున్నాయి. బ్యాడ్మింటన్ మాత్రమే కాదు హాకీ, టెన్నిస్, క్రికెట్, చెస్, రన్నింగ్ ఈ మధ్య కాలంలో రెజ్లింగ్ వంటి విభిన్న క్రీడాంశాల్లో హైదరాబాద్ క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయిలో రాణించారు. అనాదిగా కొనసాగుతున్న ఈ ఆనవాయితీని ప్రస్తుత తరం క్రీడాకారులు కూడా కొనసాగిస్తున్నారు. ఇప్పటికే గుర్తింపు పొందిన క్రీడల్లోనే కాకుండా తమకంటూ ప్రత్యేక గుర్తింపును పొందేందుకు వినూత్న క్రీడలు, అథ్లెటిక్స్ను ఎంచుకుని ఆయా విభాగాల్లో రాణిస్తున్నారు. ఈ నేపథ్యంలో భవిష్యత్తు తరం దృష్టి సారించిన క్రీడలు, అందులోని ప్రత్యేకతలను ఓసారి తెలుసుకుందామా..!! అంతర్జాతీయ క్రీడలకు హైదరాబాద్ నగరానికి ఆనాటి నుంచే అవినాభావ సంబంధముంది. దేశ ఖ్యాతిని ప్రపంచదేశాల సరసన అగ్ర స్థానంలో నిలబెట్టిన హైదరాబాదీయులు, ఇక్కడ శిక్షణ పొందిన క్రీడాకారులు ఎందరో ఉన్నారు. క్రికెట్లో అజహరుద్దిన్, వెంకటపతిరాజు, వీవీఎస్ లక్ష్మణ్, మిథాలీరాజ్ ప్రస్తుతం మహ్మద్ సిరాజ్, టెన్నిస్లో సానియా మీర్జా, బ్యాడ్మింటన్లో పీవీ సింధూ, సైనా నేహ్వాల్, రన్నింగ్లో పీటీ ఉష, చెస్లో ద్రోణవ్లలి హారిక, రెజ్లింగ్లో నిఖత్ జరీనా ఇలా ఒక్కొక్కరూ ఒక్కో క్రీడలో అత్యత్తమ నైపుణ్యాలను కనబర్చి ఆయా క్రీడాంశాల్లో భారత్కు అంతర్జాతీయ స్థాయి గుర్తింపును తీసుకొచ్చారు. అదే విధంగా వ్యక్తిగతంగానూ చరిత్రలో తమకంటూ కొన్ని పేజీలను రాసుకుని భవిష్యత్ తరాలకు స్ఫూర్తిగా నిలిచారు. ఇదే తరహాలో ఈ తరం క్రీడాకారులు ఇప్పటికే గుర్తింపు పొందిన క్రీడలు కాకుండా వినూత్నంగా ఎంపిక చేసుకుని ఒలింపిక్స్ స్థాయిలో క్రీడా నైపుణ్యాలను కనబరుస్తున్నారు. సెయిలింగ్ టాప్.. స్కేటింగ్ రాక్.. ప్రస్తుత తరం.. హైదరాబాదీ క్రీడాకారులు ఆర్చరీ పై ప్రత్యేక దృష్టి సారించారు. నగరం వేదికగా ఈ వారసత్వ క్రీడపై పలువురు ఆసక్తి కనబరుస్తున్నారు. అంతేకాకుండా ఈ సారి జరిగిన ఒలింపిక్స్లో తెలుగు కుర్రాడు ధీరజ్ ఆర్చరీలో నాలుగో స్థానంలో నిలిచి భవిష్యత్ ఆర్చరీని శాసించేది మేమేనని హింట్ ఇచ్చాడు. నగరం వేదికగా 150 మంది ఆర్చరీ అథ్లెట్లు ఉన్నారని ఓ అంచనా. జాతీయ స్థాయిలో హైదరాబాద్ ఆర్చరీ టీం ద్వితీయ స్థానంలో ఉందని క్రీడారంగ నిపుణులు పేర్కొన్నారు. 2028 ఒలింపిక్సే లక్ష్యంగా ఈ క్రీడాకారులు సన్నద్ధమవుతున్నారు.రోయింగ్లోనూ రాణిస్తూ..ఇదే కోవలో రోయింగ్ కూడా రాణిస్తుంది. రోయింగ్ క్రీడాకారులు జాతీయ స్థాయిలో తమ సత్తా చాటుతున్నారు. అంతాగా ప్రచారంలోకి రాకపోయినప్పటికీ.. స్కేటింగ్లో కూడా హైదరాబాదీలు అంతర్జాతీయ స్థాయిలో మెడల్స్ సాధిస్తున్నారు. వీటితో పాటు రైఫిల్ షూటింగ్లో కూడా నగరవాసులు గురి పెట్టారు. ఇప్పటికే నేషనల్స్లో పతకాలు సాధించడమే కాకుండా గ్లోబల్ వేదికపై మరోసారి గురి చూసి షూట్ చేయడానికి సన్నద్ధమౌతున్నారు. మరో వైపు స్విమ్మింగ్లోనూ మనం ముందంజలో ఉన్నాం. గత ఐదేళ్లలో నగరానికి చెందిన స్విమ్మర్లు జాతీయ స్థాయిలో పతకాల పంట పండిస్తున్నారు. అయితే వినూత్నంగా పికిల్ బాల్ వంటి సరికొత్త క్రీడలను నగరవాసులు తెరపైకి తీసుకొస్తున్నారు. సెయిలింగ్లోనూ..దీంతో పాటు సెయిలింగ్లోనూ హైదరాబాద్ భవిష్యత్ ఆశాకిరణంగా కనిపిస్తుంది. ఈ ఏడాది నేషనల్స్లో హైదరాబాదీ సెయిలర్స్ గోవర్ధన్, దీక్షిత కొమురవెళ్లి వంటి సెయిలర్స్ టాప్–1లో కొనసాగుతుండటం విశేషం. అంతేకాకుండా ప్రతీ కొంగర వంటి నావికులు ఒలింపిక్సే లక్ష్యంగా శిక్షణ పొందుతున్నారు.నూతనోత్సాహంతో గుర్తింపు.. క్రీడలో రాణించాలనే తపనకు నూతనోత్సాహాన్ని, అంతకు మించిన గుర్తింపును తెస్తున్నారు. ఇందులో భాగంగానే సెయిలింగ్లో ఎంతో శ్రమించి జాతీయ. అంతర్జాతీయ స్థాయిలో రాణించాను. వైఏఐ జూనియర్ నేషనల్స్ 2022 ఆప్టిమిస్టిక్ బాలికల విభాగంలో కాంస్యం, మాన్సూన్ రేగట్టా 2023 ఇదే విభాగంలో బంగారు పతకంతో వివిధ జాతీయ స్థాయి పోటీల్లో పతకాలను సాధించాను. పీవీ సింధూ, సానిమా మీర్జాలాగే నేను అంతర్జాతీయ స్థాయి పతకాలను సాధించి దేశానికి, నగరానికి గుర్తింపు తీసుకురావాలనే లక్ష్యంతో ఉన్నాను. :::దీక్షిత కొమురవెళ్లినా విద్యార్థులే నిదర్శనం.. రానున్న కాలంలో ఆర్చరీలో హైదరాబాద్ క్రీడాకారులు టాప్లో ఉంటారనడంలో ఎలాంటి సందేహం లేదు. దీనికి నిదర్శనం నా విద్యార్థులే.. నా వద్ద శిక్షణ పొందుతున్న విద్యార్థులు జాతీయ స్థాయిలో టాప్ 2లో ఉన్నారు. 2028 ఒలింపిక్సే లక్ష్యంగా ఇద్దరు అమ్మాయిలు, ముగ్గురు అబ్బాయిలను సన్నద్ధం చేస్తున్నాను. :::రాజు, ప్రముఖ కోచ్, ఆర్చరీ నేషనల్ చాంపియన్:::సాక్షి, సిటీబ్యూరో -
Wedding trends: పెళ్లి వేళ.. చిత్రకళ..
నగరానికి చెందిన ఆలేటి సాయిరాం ప్రమోధిని రెడ్డి, పటేల్ నర్సింహారెడ్డి తమ పెళ్లి వేడుకను ప్రత్యక్షంగా చిత్రీకరించడానికి ఒక పెయింటర్ను నియమించుకున్నారు. ప్రత్యక్ష ప్రసారం అందించే లైవ్ టెలికాస్ట్ గురించి విన్నాం కానీ.. లైవ్ పెయింటింగ్ వినలేదు అనుకుంటే మీరింకా వెడ్డింగ్ ట్రెండ్స్లో అప్డేట్ కాలేదన్నమాటే.. వధూవరులు ఓవైపు రంగుల కలల్లో తేలిపోతుంటే.. మరోవైపు సప్తవర్ణాల చిత్ర ‘కళ’ ఆ ఇద్దరి అనుబంధం సాక్షిగా పెళ్ళి వేడుకను అల్లుకుపోతోంది. ఫొటోగ్రఫీ మామూలేగానీ.. లైవ్ పెయింటింగ్ పెడుతున్నారా లేదా..? అని వెడ్డింగ్ ప్లానర్స్ను అడిగే రోజులు వచ్చేశాయంటే.. ఇప్పుడు, వివాహ వేడుకల్లో చిత్రకళకు పెరుగుతున్న అర్థం చేసుకోవచ్చు. అడ్డుతెరతో ఆరంభం.. పెళ్లి వేడుకల సమయంలో వధూవరుల మధ్య ఉంచే అడ్డుతెరను కళాత్మకంగా రూపొందించడంతో ఓ రకంగా పెళ్లిళ్లలో చిత్రకళకు ప్రాధాన్యత మొదలైందని చెప్పొచ్చు. ఆ తర్వాత అతిథుల పోట్రైట్లు గీసి రిటర్న్ గిఫ్టŠస్గా ఇవ్వడం వంటివి ఒకటొకటిగా ఆరి్టస్టులను వెడ్డింగ్స్కు దగ్గర చేశాయి. టర్మరిక్ ఆర్ట్.. ఓ వైవిధ్యం.. ఇటీవలి కాలంలో పెళ్లిళ్లలో కొత్త ఆర్టిస్టిక్ ట్రెండ్గా సందడి చేస్తోంది టర్మరిక్ ఆర్ట్. దీనిలో భాగంగా చిత్రకారులు వధూవరుల రూపాలను కాన్వాస్పై ఇని్వజబుల్గా ప్రత్యేకమైన విధానంలో చిత్రిస్తారు. ఆ తర్వాత దాన్ని పెళ్లి వేడుకల్లో ప్రదర్శిస్తారు. వచి్చన అతిథులంతా దాని దగ్గరకు వెళ్లి అక్కడే ఉన్న రంగులను చేతులకు అద్దుకుని హస్తముద్రలు ఆ కాన్వాస్ పై వేస్తూ ఉండగా.. వధూవరుల రూపాలు దానిపై ప్రత్యక్షమవ్వడం ఓ ఆసక్తికరమైన వర్ణ వైవిధ్యం. ప్రత్యక్ష.. పెయింటింగ్.. పెళ్లి వేడుకలో ఓ వైపుగా కూర్చుని వధూవరులకు సంబంధించిన ముఖ్య ఘట్టాలను చిత్రించడం కూడా ఇప్పుడు ట్రెండ్గా మారింది. పెళ్లికూతురును పెళ్లి బుట్టలో తీసుకువెళ్లడం, దంపతులు ఒకరి తలపై ఒకరు జీలకర్ర–బెల్లం ఉంచడం, మంగళసూత్రం కట్టడం, సంప్రదాయ ఆటలు ఆడడం వంటి అపురూప సందర్భాలను ఒడిసిపట్టుకోవడానికి వీడియో, ఫొటోగ్రాఫర్ల తరహాలో ఆరి్టస్టులు కూడా ఇప్పుడు తలమునకలవుతున్నారు. ఔత్సాహిక ఆరి్టస్టులకు డిమాండ్.. పెళ్లిళ్ల సీజన్ కావడంతో యువ ఆరి్టస్ట్ కీర్తన షెడ్యూల్ ఫుల్ బిజీగా మారిపోయింది. ‘దంపతులు మా కళాకృతిని చూసిన ప్రతిసారీ ఆనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుని మురిసిపోతారు’ అని కీర్తన చెప్పింది. ఆమె గత ఏడాది ఒక పెళ్లి సమయంలో వధూవరుల మధ్య ఉంచే అడ్డు తెరను అందంగా చిత్రించింది. ఆ తర్వాత నవంబర్లో తన మొదటి ప్రత్యక్ష (లైవ్) వెడ్డింగ్ పెయింటింగ్ను రూపొందించింది. అవి సోషల్ మీడియా ద్వారా ఆదరణకు నోచుకోవడంతో ఇప్పటి వరకూ నగరంతో పాటు బెంగళూరు, విజయవాడ, ఖమ్మం, కరీంనగర్లో మొత్తం 60 అడ్డుతెర చిత్రాలు, 13 వివాహ వేడుకల లైవ్ పెయింటింగ్ వర్క్స్ను తన ఖాతాలో వేసుకుంది. ‘ఒక పెయింటింగ్ ఫొటోకు దొరకని వివరాలను క్యాప్చర్ చేస్తుంది. దీంతో పాటు మానవ స్పర్శ కూడా అందులో ఉంది’ అంటోంది సిటీకి చెందిన ఆర్టిస్ట్ రేష్మ. లైవ్ ఈవెంట్ పెయింటింగ్కు పేరొందిన ఈ యువతి.. ‘కొన్నిసార్లు మండపం దగ్గర లేదా స్క్రీన్ ముందు ఆరి్టస్టులు వారికి కేటాయించిన స్థలంలో కూర్చుంటారు. వేడుక జరుగుతున్నప్పుడు చూస్తూ స్కెచ్/పెయింట్ చేస్తారు. ఆ క్షణాలలో అక్కడి భావోద్వేగాలు, జ్ఞాపకాల కోసం ప్రధాన సన్నివేశాలను చిత్రించడానికి వాటర్ కలర్లను ఎక్కువగా వినియోగిస్తారు. అయితే ఈవెంట్, డెకర్ స్నాప్షాట్ కోసం యాక్రిలిక్లను కూడా వాడతారు. ప్రస్తుతం ఈ తరహా ఆర్ట్వర్క్ల ధర 20,000 నుంచి రూ.2 లక్షల వరకూ ఉంటుంది అదే విధంగా అవుట్స్టేషన్ నుంచి రప్పించే పేరొందిన ఆరి్టస్ట్ అయితే ప్రయాణ వసతి ఖర్చులను కూడా క్లయింటే భరించాలి.కష్టమే కానీ.. గొప్ప సంతృప్తి..సాధారణంగా ఆరి్టస్ట్కి ఏకాగ్రత చాలా ముఖ్యం. అయితే పెళ్లిలో మన వర్క్స్ చూస్తూ వ్యాఖ్యానిస్తూ లేదా ప్రశ్నలు అడుగుతూ వచ్చిన వారు అంతరాయం కలిగిస్తూ ఉంటారు. ధ్యాస చెదరకుండా ఉండాలి. అదే సమయంలో అతిథులతో మర్యాదగా ప్రవర్తించాలి. కష్టమే అయినా గొప్ప సంతృప్తి ఇందులో లభిస్తుంది. – సత్యవర్షి, ఆర్టిస్ట్యువ చిత్రకారులకు ప్రోత్సాహకరం.. ప్రస్తుతం నేను లైవ్ వెడ్డింగ్ పెయింటింగ్తో పాటు టర్మరిక్ ఆర్ట్ వర్క్ కూడా అందిస్తున్నాను. ఈ లైవ్ వెడ్డింగ్ ఆర్ట్ ట్రెండ్ మాలాంటి ఔత్సాహిక చిత్రకారులకు బాగా ప్రోత్సాహకరంగా ఉంటోంది. పెళ్లి వేడుకల్ని నేరుగా చూస్తూ చిత్రించడం అనేది సరదాగా ఉంటుంది. అదే సమయంలో అది ఒక సవాల్ కూడా. – గ్రీష్మ, ఆర్టిస్ట్ -
Paragliding: పారా హుషార్..
సాధారణంగా పారాగ్లైడింగ్ అనేది పర్యాటకప్రాంతాల్లో మాత్రమే ఉంటుందనే అపోహ చాలా మందిలో ఉంది. పైగా అది నేర్చుకుంటే ఏం వస్తుందిలే అన్న భావన కూడా ఉంది. అయితే మనకు పారాగ్లైడింగ్ గురించి కనీసం అవగాహన లేని సమయం నుంచే ఇందులో మెళకువలు నేర్చుకుని నగర యువతకు చుక్కానిగా నిలుస్తున్నారు హైదరాబాదీ ప్రభు సుకుమార్ దాస్. చిన్నతనం నుంచే గ్లాలో ఎగరాలనే తన కోరికను పారాగ్లైడింగ్తో సాకారం చేసుకున్నాడు.రెక్కలు తొడిగి... ప్రయాణాలు అంటే ఇష్టంతో ముందుగా బుల్లెట్ బైక్పై ఐదు దేశాలు తిరిగాడు. అదే సమయంలో పారాగ్లైడింగ్ గురించి తెలుసుకుని, నేర్చుకున్నాడు. అప్పటి నుంచి దేశ విదేశాల్లో పారాగ్లైడింగ్లో అద్భుతాలు సృష్టించాడు. పారాగ్లైడింగ్ చేస్తూ ఈజిప్టులోని గ్రేట్ పిరమిడ్స్, బ్రెజిల్లోని రియో క్రీస్ట్ విగ్రహం, అట్లాంటిక్ సముద్రంతో పాటు అమెజాన్ నది, నైలు నది, ఎర్ర సముద్రంపై ఎగిరిన తొలి భారతీయుడిగా రికార్డులకెక్కారు. రాహుల్గాంధీ భారత్ జోడో యాత్ర సందర్భంగా కర్ణాటక నుంచి రాజస్థాన్ వరకూ పాదయాత్రను ఎగురుకుంటూ ఫాలో అయ్యారు. దీంతో రాహుల్ గాంధీ తనను ప్రత్యేకంగా అభినందించారని సుకుమార్ సంతోషం వ్యక్తం చేశారు.ఎంతో మందికి శిక్షణ..పారాగ్లైడింగ్ చేస్తే వచ్చే అనుభూతి వేరని చెబుతున్న సుకుమార్.. వందలాది మందికి ఇందులో శిక్షణ ఇచ్చాడు. పారాగ్లైడింగ్లో కూడా మంచి భవిష్యత్తు ఉందని, ఎంతోమంది పారాగ్లైడింగ్లో శిక్షణ తీసుకుని విదేశాల్లో రాణిస్తున్నారని పేర్కొన్నాడు. అందుకే ఇప్పుడు చాలామంది పారాగ్లైడింగ్ నేర్చుకునేందుకు ముందుకు వస్తున్నారని చెబుతున్నాడు. మహబూబ్నగర్ జిల్లాకు చెందిన కొందరు ఆదివాసీ పిల్లలకు పారాగ్లైడింగ్లో ఉచితంగా తర్ఫీదునిచ్చాడు. వారంతా నేషనల్ పారామోటార్ చాంపియన్íÙప్లో పాల్గొన్నారని, అప్పుడు వారి కళ్లల్లో చూసిన ఆనందం తనకు ఎంతో సంతృప్తినిచి్చందని సుకుమార్ చెబుతున్నాడు. ఎంతోమంది కలలను నిజం చేయడంలో ఉన్న ఆనందం మరెక్కడా దొరకదని పేర్కొంటున్నాడు. భవిష్యత్తులో ఎగిరే పోలీసులు..విపత్తుల వేళ పారాగ్లైడింగ్ చేసే వారికి ఎంతో డిమాండ్ ఉంటుందని సుకుమార్ చెబుతున్నాడు. భవిష్యత్తులో ఎగిరే పోలీసులు కూడా వస్తారని అంటున్నాడు. ఇప్పటికే తాము నేవీ, ఆర్మీ, ఎయిర్ఫోర్స్ బలగాలకు శిక్షణ ఇచ్చామని గుర్తు చేశారు. రాష్ట్రంలో కూడా పలువురు పోలీసులకు శిక్షణ ఇచ్చానని వివరించాడు. ఇక, తెలంగాణతో పాటు ఏపీ, కర్ణాటక తదితర రాష్ట్రాలో ప్రత్యేక పండుగల సందర్భంగా పారాగ్లైడింగ్ చేస్తూ వాటి ప్రత్యేకతను ప్రజలకు తెలియజేసేలా సుకుమార్ ఎన్నో కార్యక్రమాలు చేశాడు. ముఖ్యంగా తెలంగాణ అవతరణ దినోత్సవం, బతుకమ్మ, సంక్రాంతి పండుగల వేళ పారాగ్లైడింగ్తో వాటి ప్రాముఖ్యత తెలిసేలా చేశాడు. ఇక, మైసూరులో జరిగే దసరా ఉత్సవాల సందర్భంగా చేసే పారాగ్లైడింగ్లో ఏటా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంటాడు. -
ప్రతి నిమిషం.. సినిమా ధ్యాసే..
చిత్ర పరిశ్రమలో దర్శకత్వ విభాగంలో సక్సెస్ కావాలంటే, అందులోనూ ఓ మహిళ ఆ స్థాయిలో అవ్వాలంటే సామర్థ్యంతో పాటు సృజనాత్మకత తప్పనిసరి. సమకాలీన అంశాలను అర్థవంతంగా తెరకెక్కిస్తేనే ప్రేక్షకాదరణ పొందుతుంది. అలాంటిది హాలీవుడ్ చిత్ర పరిశ్రమలో నిలదొక్కుకోవాలంటే ఎంతో అంకితభావం, చిత్తశుద్ధితో పాటు ధైర్యసాహసాలు కావాలి. ఒకటి కాదు రెండు కాదు వందలాది అంతర్జాతీయ అవార్డ్లతో ఔరా అనిపిస్తోంది మన తెలుగమ్మాయి లక్ష్మీ నిమిషా గుమ్మడి. తాజాగా ఆమె ప్రొడక్షన్ డిజైనర్గా రూపొందించిన ‘డాస్ బ్రోస్ ఫోర్స్’ ఫీచర్ ఫిల్మ్ అత్యంత ప్రతిష్టాత్మకమైన 78వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో పోటీలో నిలిచింది. ఇది చాలదూ.. హాలీవుడ్లో లక్ష్మీ సత్తా ఏంటో చెప్పేందుకు!? హైదరాబాద్లోని సంఘమిత్ర స్కూల్, ఓబుల్ రెడ్డి పబ్లిక్ స్కూల్లో +12 వరకూ చదివిన లక్ష్మీ.. ఆ తర్వాత కర్నాటకలోని మణిపాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్, కాలిఫోరి్నయాలోని అమెరికన్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ (ఏఎఫ్ఐ)లో ‘ప్రొడక్షన్ డిజైన్’లో ఎంఎస్ పూర్తి చేసింది. సమకాలీన డిజైన్స్తో సాంస్కృతిక అంశాలను మిళితం చేసే సామర్థ్యం ఈమె సొంతం. తెర వెనక పాత్రల గురించి తెలిసి.. చిన్నతనంలో సినిమాలు చూసేటప్పుడు క్యారెక్టర్స్లో లీనమై అతిగా భావోద్వేగానికి లోనయ్యేదానినని తరుచూ స్నేహితులు ఆమెను ఆటపట్టించేవారు. చిన్నతనం నుంచే తనపై సినిమాల ప్రభావం ఉండటంతో నటి కావాలని అనుకునేది. ఆ వయసులో తెరవెనక దర్శకులు, సినిమాటోగ్రాఫర్లు, నిర్మాతల పాత్ర గురించి ఆలోచించే స్థాయిలేదు కానీ, పెద్దయ్యాక సినిమా మేకింగ్ గురించి తెలిసిన తర్వాత ఆమె ఆసక్తి నటన నుంచి ప్రొడక్షన్ వైపు మళ్లింది.ఉత్తమ ఫీచర్ ఫిల్మ్ ‘తహనన్’.. అమెజాన్ ప్రైమ్లో ప్రసారం అవుతున్న ‘తహనాన్’ అనే ఫీచర్ ఫిల్మ్ లక్ష్మీ రూపొందించిందే. దీనికి లాస్ ఏంజిల్స్లోని కల్వర్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఉత్తమ చలనచిత్ర అవార్డ్ వరించింది. అమెరికాలో మ్యూజిక్ వీడియోలు, వాణిజ్య ప్రకటనలు కూడా ఈమె రూపొందిస్తోంది. టేలర్ స్విఫ్ట్సŠ, ఫోర్ట్నైట్, రెడ్ క్రిస్మస్, రోబోట్, ఎలిఫెంట్ ఇన్ ది డార్క్, స్టక్ వంటి ఎన్నో మ్యూజిక్ వీడియోలకు లక్ష్మీ పనిచేసింది. అలాగే ఎల్రక్టానిక్ ఉపకరణాల సంస్థ డీఈఎక్స్ వంటి పలు బహుళ జాతి కంపెనీలకు వాణిజ్య ప్రకటనలు రూపొందించింది.తెలుగు చిత్రం రిలీజ్.. ఈజిప్ట్, ఫ్రాన్స్, పోర్చుగల్, జర్మనీ, ఇస్తాంబుల్, యూకే వంటి ప్రపంచవ్యాప్తంగా నిర్వహించిన 50 ఫిల్మ్ ఫెస్టివల్స్లో 15 అంతర్జాతీయ అవార్డ్లు లక్ష్మీ సొంతం. తాజాగా ‘డాస్ బ్రోస్ ఫోర్స్’ చిత్రం వచ్చే ఏడాది మేలో జరగనున్న ప్రతిష్టాత్మక కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో పోటీలో నిలిచింది. అర్జున్ ది స్టూడెంట్, మీన్ గోల్స్, ది హల్కైన్ డేస్, బాడీ చెక్ వంటి ఎన్నో ఫీచర్, షార్ట్ ఫిల్మŠస్ను రూపొందించింది. ఇండియాతో పాటు కెనడా, గ్రీస్, టర్కీ, అమెరికా, ఫ్రాన్స్, యూకే వంటి దేశాల్లోని ఫిల్మ్ ఫెస్టివల్స్లో అవార్డ్లను దక్కించుకుంది. రవికుమార్ వాసు దర్శకత్వంలో శివకుమార్ రామచంద్ర వరపు కథానాయకుడిగా తెరకెక్కిన తెలుగు చలనచిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది. -
కల నెరవేర్చే..అమ్మ అభిమానిక..
తాను నృత్యకారిణిగా కొనసాగాలని, తన కూతురిని కూడా గొప్ప కళాకారిణిగా చూడాలని ఓ కన్నతల్లి ఆరాటం.. మూడేళ్ల వయసులోనే కూతురికి శిక్షణ.. చదువుల వేటలో మార్గాలు వేరుపడినా.. వేర్వేరు రంగాల్లో రాణింపు.. అయినా కూతురితో కలిసి ప్రదర్శన ఇవ్వాలనే ఆ తల్లి ఆశ మాత్రం చిరంజీవిగా ఉండడం.. చివరకు ఆ ఆకాంక్ష జయించడం.. బహుశా కీర్తిశేషులు కళాతపస్వి కె.విశ్వనాథ్ ఉండి ఉంటే ఇదో భావోద్వేగ భరిత వెండితెర కథగా మారి ఉండేదేమో.. హైదరాబాద్ నగరంలోని ఓ ఉన్నత కుటుంబానికి చెందిన తల్లీ కూతుళ్లు కలిసి సమర్పించనున్న సంప్రదాయ నృత్య ప్రదర్శన నేపథ్యం ఆసక్తికరమైనదిగా మారింది.. ‘ఇది అమ్మ చిరకాల ఆకాంక్ష. నాతో కలిసి నృత్య ప్రదర్శన ఇవ్వాలని తను ఎప్పటి నుంచో ఆశపడుతోంది’ నగరంలో ఒక మోడల్గా, ఫిట్నెస్ ట్రైనర్గా, ఈవెంట్ మేనేజర్గా చిరపరిచితమైన అభిమానిక.. మన హైదరాబాద్కి చెందిన అమ్మాయే. ఆమె అకస్మాత్తుగా నృత్యకారిణిగా మారడం వెనుక కారణాన్ని ‘సాక్షి’తో పంచుకున్నారు. హైదరాబాద్కి చెందిన అభిమానిక అమ్మతో కలిసి అడుగులు..ప్రస్తుతం హైకోర్ట్లో సీనియర్ లాయర్గా ఉన్న దువ్వూరి వత్సలేంద్రకుమారి తొలి అడ్వకేట్ జనరల్ దువ్వూరి నరసరాజు కుమార్తె.. తను మూడేళ్ల వయసు నుంచే నటరాజు రామకృష్ణ దగ్గర శిష్యరికం చేసి నాట్య ప్రదర్శనలు ఇస్తూ వచ్చారు. న్యాయవాదిగా మారినా నాట్యాభిరుచిని కొనసాగించారు. తన కూతురు అభిమానిక కూడా తనలాగే గొప్ప నాట్యకారిణి కావాలని మూడేళ్ల వయసులోనే ఆమెకు కూడా తానే గురువుగా మారి శిక్షణ ప్రారంభించారు. ఆ తర్వాత తన కుమార్తె కూడా ప్రదర్శనలు ఇస్తుంటే తన ఆకాంక్ష నెరవేరుతోందని మురిసిపోయారు. అయితే ఆ తల్లి ఒకటి తలిస్తే.. కాలం మరొకటి తలచింది. చదువుల వేటలో అభిమానిక నాట్యపిపాస అటకెక్కింది. బీటెక్ టాపర్గా నిలిచినా.. వ్యక్తిగత అభిరుచి మేరకు ఫిట్నెస్ ట్రైనర్గా మోడల్గా, ఈవెంట్ మేనేజర్గా విజయవంతంగా కొనసాగుతున్నారు అభిమానిక.. ఇప్పుడు తల్లి ఆకాంక్షకు తలొగ్గారు. పాతికేళ్ల తర్వాత.. మారిన ప్రయాణం‘నేను నాట్యానికి పాతికేళ్లుగా దూరమైనా అమ్మ తన ఆశకు మాత్రం దూరం కాలేదు. తరచూ నాకు గుర్తు చేస్తూనే ఉన్నారు. అమ్మ పట్టుదలతో కొన్ని రోజుల్లోనే మళ్లీ నా చిన్ననాటి నాట్య పిపాస తిరిగి ఊపిరి పోసుకుంది. ఇప్పుడు సంపూర్ణమైన ఇష్టంతో నెలల తరబడి కఠినమైన సాధన ద్వారా అమ్మతో కలిసి ప్రదర్శనకు సిద్ధమవుతున్నా.. నిజం చెప్పాలంటే అమ్మ నాట్యానికి నేనో అభిమానిని’ అంటూ భావోద్వేగంతో చెప్పారు అభిమానిక. ‘నృత్యకారిణిగా, న్యాయవాదిగా రెండు పడవల ప్రయాణం విజయవంతంగా కొనసాగిస్తూ వచ్చాను. ఎందరినో శిష్యురాళ్లుగా, నృత్యకారిణులుగా తయారు చేశాను. 2017లో పేరిణిలో తొలి మహిళా నృత్యకారిణిగా ప్రదర్శన ఇచ్చి భారత్ వరల్డ్ రికార్డ్ దక్కించుకున్నాను. వ్యక్తిగతంగా ఎన్ని సాధించినా.. నా కూతురుతో కలిసి నాట్య ప్రదర్శన ఇవ్వాలనేది నా చిరకాల వాంఛ’ అన్నారు వత్సలేంద్ర కుమారి. వయసు పైబడకుండానే.. ‘కేవలం కలిసి నృత్యం చేయడమే కాదు తనతో ధీటుగా చేయాలి కదా.. అందుకే వయసు మరీ పైబడకుండానే చేయాలని అనుకున్నా. ఏమైతేనేం.. ఇన్నాళ్లకు నా కల నెరవేరుతోంది’ అంటూ ఆనందంగా చెప్పారు వత్సలేంద్ర కుమారి.. ఇప్పటిదాకా తల్లీ కూతుర్లు కలిసి నృత్య ప్రదర్శన ఇవ్వడం అనేది లేదని, అది తామిద్దరూ సాధించనుండడం గర్వంగా ఉందన్నారు. కూచిపూడి, భరతనాట్యం మేలు కలయిక లాంటి ఆంధ్రనాట్యం నటరాజ రామకృష్ణ ప్రారంభించారని, ఇటీవల అంతగా ప్రాభవానికి నోచుకోని ఈ నాట్యాన్ని అందరికీ చేరువ చేయాలనేదే తన లక్ష్యమని చెప్పుకొచ్చారు. View this post on Instagram A post shared by ABHIMANIKA 🇮🇳 Fashion & Fitness Coach (@abhimanika) (చదవండి: ‘బైక్ పింక్ సర్వీస్': ఓన్లీ మహిళా డ్రైవర్లే..!) -
కాస్ ప్లే వేదికగా కామిక్ కాన్ 2024
అంతర్జాతీయ వేదికపై గుర్తింపు పొందిన ప్రతి కళనూ, సృజనాత్మకతను, అధునాతన హంగులను అందిపుచ్చుకోవడంలో హైదరాబాద్ నగరం ఎల్లప్పుడూ ముందుంటుంది. ఇందులో భాగంగానే గ్లోబల్ వేదికగా ప్రసిద్ధి చెందిన కాస్ ప్లేను నగరానికి పరిచయం చేయడంలో భాగంగా ప్రతిష్టాత్మక ‘కామిక్ కాన్ 2024’ ఈవెంట్ను నిర్వహిస్తున్నారు. సిటీలోని హైటెక్స్ వేదికగా ఈ నెల 15, 16, 17 తేదీల్లో కామిక్ కాన్ కాస్ ప్లే వేడుకలను ఘనంగా నిర్వహించనున్నారు. ఈ ఫెస్ట్లో కామిక్ కాన్ ఫేం సౌరభ్ సింగ్ రావత్తో పాటు దేశంలోని వివిధ నగరాల నుంచి కాస్ ప్లే సెలబ్రిటీలు సందడి చేయనున్నారు. గత కొంత కాలంగా నగరంలో కూడా కాస్ ప్లే ప్రత్యేక ఆదరణ పొందడమే కాకుండా దీని కోసం ఫ్యాన్ బేస్ కూడా పెరుగుతోంది. సిటీలో కూడా జోహైర్ ఖాన్ వంటి పలువురు కామిక్ కాన్ సెలబ్రిటీలుగా గుర్తింపు పొందారు. ది హైదరాబాద్ కాస్ ప్లేయర్స్ క్లబ్ నిర్వాహకులలో ఒకరు స్థానికంగా జరగనున్న కామిక్ కాన్ ఫెస్ట్కు నేతృత్వం వహిస్తున్నారు. ఫ్యూచర్ ఫేం కాస్ ప్లే.. నగరంలో కామిక్ ఫెస్ట్ జరగనున్న నేపథ్యంలో కాస్ ప్లేలో భాగస్వామ్యం పంచుకునే వారికి స్పైడర్ మ్యాన్, బ్యాట్ మ్యాన్ వంటి విభిన్న డిజైన్ మేకింగ్, క్రియేటివ్ ఆర్ట్ వర్క్స్ రూపొందించడం ప్రధానాంశం. ఈ క్రియేటివిటీ పైన అవగాహన కలి్పంచడం కోసం కొన్ని రోజుల క్రితమే కామిక్ కాన్ ఫేం సౌరభ్ సింగ్ రావత్ నగరంలో కాస్ ప్లే వర్క్షాప్ నిర్వహించారు. ఉర్పీ జావేద్ వంటి ప్రముఖుల కోసం ఐకానిక్ కాస్ట్యూమ్లను రూపొందిస్తూ, టాప్ గ్లోబల్ బ్రాండ్లతో సౌరభ్ పని చేస్తుండటం విశేషం. ఈ వర్క్షాప్లో నగరంలోని ఔత్సాహికులు పాల్గొని ఆకర్షణీయ కాస్ ప్లే కళపై పట్టు సాధించారు. సాధారణ వస్తువులు వినియోగించి.. సాధారణ వస్తువులు వినియోగిస్తూ కాస్ ప్లే డిజైనింగ్, ఆర్ట్ వర్క్ పై అవగాహన పెంచుకున్నారు. అయితే నగరంలో స్పోర్ట్స్, సినిమాలు, ఫ్యాషన్, గేమింగ్ తరహాలో కాస్ ప్లే కూడా తన భవిష్యత్ ప్రణాళికలను సిద్ధం చేసుకుంటుందనడానికి ‘కామిక్ కాన్ 2024’ వంటి ఈవెంట్స్ నిదర్శనంగా నిలుస్తున్నాయని ఈ రంగంలోని నిపుణులు చెబుతున్నారు. -
అపురూపాలు.. ఆనవాళ్లు..
ఆ ఆటలో ఒకరు స్టాచ్యూ అంటే మరొకరు అలా విగ్రహంలా నిలుచుండి పోతారు. ఎప్పటిదో అయిన ఈ చిన్నారుల ఆట అందరికీ సుపరచితమే. సందర్శకుల్ని అలా బొమ్మలా నిలిచి ఉండేలా చేసే అరుదైన అద్భుత చిది్వలాస రూపాలకు నగరం చిరునామాగా మారింది. శిల్పారామం, శిల్పకళావేదిక.. వంటి అపురూప శిల్ప కేంద్రాలు, రాజీవ్గాం«దీ, మహాత్మా గాందీలతో పాటు పలువురు ప్రముఖ నేతల విగ్రహాలు అడుగడుగునా దర్శనమిస్తాయి. ఇక 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహంతో పాటు శివార్లలో ఉన్న సమతామూర్తి, మరికొన్ని రోజుల్లో దర్శనమివ్వనున్న తెలంగాణ తల్లి.. వీటితో నగరం సంపూర్ణ స్టాచ్యూ సిటీగా అవతరించనుంది.నగరంలో పలు కూడళ్లలో స్వాతంత్య్ర సమరయోధులు, అమరవీరుల విగ్రహాలు ఉన్నాయి. ఇక మూడు దశాబ్దాల క్రితమే ట్యాంక్ బండ్ మీద నెలకొన్న పంచలోహ శిల్పాల గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు. వీటన్నింటికీ తోడుగా.. ఇటీవల ఒక్కొక్కటిగా ఆవిష్కృతమవుతున్న ఆకృతులు నగర శిల్ప కళా‘భాగ్యాన్ని’పరిపుష్టం చేస్తున్నాయి. అప్పుడెప్పుడో నీటిపై నిలిచిన బుద్ధ విగ్రహం సందర్శకులకు తప్పనిసరి సందర్శనీయ స్థలం కాగా.. ఇప్పుడు మరికొన్ని దానితో సరితూగుతూ ఏర్పాటవుతున్నాయి. ఈ నేపథ్యంలో సిటీలోని కొన్ని ఆసక్తికరమైన శిల్పాకృతుల గురించి.. ఓ రౌండప్..కెప్టెన్కి సలామ్.. హబ్సిగూడలో రద్దీగా ఉండే రహదారి మధ్య దివంగత కెపె్టన్ రాపోలు వీర రాజా రెడ్డి నిలువెత్తు విగ్రహం మనకు కనిపిస్తుంది. ఆయన 25 సంవత్సరాల వయసులో జమ్మూ కాశీ్మర్లోని రాజౌరి జిల్లాలో జరిగిన సైనిక ఆపరేషన్లో వీర మరణం పొందారు. నగరానికి చెందిన ఈ అమరవీరుని స్మారక చిహ్నం ఆయన నివసించిన ప్రాంతంలోనే ఏర్పాటు చేశారు.వీరత్వానికి ప్రతిరూపం.. అరుదైన నేపథ్యం ఉమేష్ చంద్ర శిల్పాకృతి సొంతం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నక్సల్స్ నిర్మూలనకు కృషి చేసిన ధైర్యసాహసాలు కలిగిన పోలీసు అధికారి చదలవాడ ఉమే‹Ùచంద్రను ‘కడప టైగర్’గా కూడా పిలుస్తారు. ఆయన నిజాం కళాశాల, ఉస్మానియా విశ్వవిద్యాలయ పూర్వ విద్యార్థి కూడా. గత 1999 సెపె్టంబరు 4న ఎస్ఆర్ నగర్ జంక్షన్లో నక్సలైట్ల దాడిలో ప్రాణాలు కోల్పోయారు. అదే స్థలంలో ఆయన విగ్రహం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేశారు.వ్యక్తిత్వ వికాస ‘జ్ఞాన్’భూమి..ఇది భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు నివాళులరి్పంచేందుకు నిర్మించబడి చక్కటి నిర్వహణలో ఉన్న ఉద్యానవనం ఖైరతాబాద్లోని నెక్లెస్ రోడ్లో ఉంది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, వివిధ వ్యక్తిత్వ లక్షణాలను ప్రదర్శించే ఆరు ప్రత్యేకమైన అందమైన శిల్పాలు ఇక్కడ ఉన్నాయి.‘బౌద్ధ’సాగర్... జిబ్రాల్టర్ రాక్పై హుస్సేన్ సాగర్ మధ్యలో ఉన్న తెల్లటి గ్రానైట్తో రూపొందింది గౌతమ బుద్ధ విగ్రహం.. నగర పర్యాటకులు తప్పక సందర్శించి తీరాల్సిన ప్రదేశాలలో ఒకటి. సందర్శకులు ఫెర్రీ రైడ్ ద్వారా అలలపై తేలియాడుతూ ఆ ఎత్తైన విగ్రహం చేరకోవచ్చు. బుద్ధుని అందాన్ని పెంచే లైటింగ్ ఆకర్షణీయంగా ఉంటుంది. సూర్యుడు అస్తమించే సమయం సందర్శనకు ఉత్తమ సమయం.. సాగర్ ప్రక్కనే ఉన్న ట్యాంక్ బండ్ మీది విగ్రహ సముదాయం ప్రముఖులు ఎందరినో మనకు పరిచయం చేస్తుంది.యూనిటీ.. కేరాఫ్ సిటీ.. ప్రపంచంలోనే అతిపెద్దదైన సమతా మూర్తి ఆకృతిని ప్రధానమంత్రి ఆవిష్కరించారు. మొత్తంగా 216 అడుగుల ఎత్తైన విగ్రహం, సమానత్వం రూపంగా పేర్కొంటారు. కూర్చున్న భంగిమలో ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన లోహపు విగ్రహం. ప్రముఖ ఆధ్యాతి్మక వేత్త రామానుజాచార్యుల విగ్రహం రంగారెడ్డి జిల్లాలోని ముచి్చంతల్లో ఉంది. భాగ్యనగరాన.. బంగారు తెలంగాణ ‘తల్లి’.. సచివాలయం ఎదురుగా అమరవీరుల స్మృతి జ్యోతిలో ఏడున్నర అడుగుల తెలంగాణ తల్లి స్వర్ణ విగ్రహం ఏర్పాటు చేశారు. ఇంత ఎత్తయిన గోల్డెన్ స్టాచ్యూ దేశంలో మరెక్కడా లేదు. తెలంగాణ ప్రజలకు మాత్రమే కాకుండా సందర్శకులకు కూడా ఈ విగ్రహ సందర్శన గొప్ప అనుభూతిని అందిస్తుందని శిల్పి రమణారెడ్డి అంటున్నారు. పైన పేర్కొన్నవి కాకుండా, నగరంలో మొజామ్జాహి మార్కెట్, మైండ్స్పేస్ ఇతర ప్రాంతాల్లో గుర్తించదగిన ఇతర కళాఖండాలూ ఉన్నాయి. థాట్ ఫుల్.. ఎంప్టీ.. ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేసే స్టాచ్యూ ఆఫ్ ఎంప్టీనెస్.. కళాఖండం నగర శివార్లలోని ఖాజాగూడ సరస్సు సమీపంలో ఏర్పాటు చేశారు. తల కిందికి వేలాడదీసి మొండెం వద్ద బోలుగా ఉన్న వ్యక్తి విగ్రహం ఇది. ఇది రొమేనియన్ కళాకారుడు ఆల్బర్ట్ గైర్గీ నుంచి ప్రేరణ పొందిన కపిల్ కపూర్చే చేతుల మీదుగా దీని పునఃసృష్టి జరిగింది. -
భాగ్యనగరం.. సంగీత సాగరం
నగరవాసుల కళాభిరుచిలో సంగీతం ఏనాటి నుంచో ఇమిడిపోయి ఉంది. అందుకే నగరంలో ఐటీ, స్పోర్ట్స్, ఫ్యాషన్, సినిమా ఎంతో ఫేమస్.. ఇటీవల వాటికి సరి సమానంగా సంగీతం కూడా కొనసాగుతోంది. వీకెండ్స్ అంతా సిటీలో లైవ్ మ్యూజిక్ ఈవెంట్స్, ప్రముఖ మ్యూజిక్ బ్యాండ్స్ ప్రదర్శనలతో ఆకట్టుకుంటున్నారు. వీటికి తోడు నెలలో కనీసం ఒకటి రెండు అయినా పెద్ద మ్యూజిక్ కన్సర్ట్స్ జరుగుతున్నాయి. ఇందులో భాగంగానే కొన్ని రోజుల క్రితమే గచి్చ»ౌలి స్టేడియం వేదికగా జరిగిన దేవిశ్రీప్రసాద్ లైవ్ మ్యూజిక్ షో గ్రాండ్ సక్సెస్ అయ్యింది. గచి్చ»ౌలి వంటి స్టేడియంలో ఈ షో నిర్వహించినప్పటికీ టికెట్స్ దొరకక ఎంతోమంది బయట ఉండిపోయారు. నగరంలో ఈ తరహా సంగీత షోలకు అంతటి ఆదరణ ఉంది. గతంలో ఎల్బీ స్టేడియం వేదికగా ప్రముఖ బాలీవుడ్ సింగర్ అర్మాన్ మాలిక్ నిర్వహించిన లైవ్ మ్యూజిక్ షో పరిస్థితి అంతే. కొన్ని నెలల క్రితం శిల్పకళా వేదికగా ప్రముఖ టాలీవుడ్ సింగర్ సునీత నిర్వహించిన సంగీత కచేరీతో హాల్ మొత్తం నిండిపోయింది. సిటిజనుల ఈ సంగీత అభిరుచికి అనుగుణంగా మరికొందరు అతిపెద్ద ప్రదర్శనలకు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ సంగీత ప్రదర్శనలో యువత అమితాసక్తితో పాల్గొంటున్నారు.చిత్రాంజలి.. స్వరాలునగరంలో పెరిగుతున్న ఈ మ్యూజిక్ కల్చర్కు అనుగుణంగా ఈ నెలలో పలు అతిపెద్ద ఈవెంట్స్ నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్ వేదికగా ప్రముఖ సింగర్ ప్రతీక్ కుహాద్ పాప్, రొమాంటిక్ పాటలతో భారీ మ్యూజిక్ షో నిర్వహించనున్నారు. నగరంలోని లునో లాంచ్ బార్ అండ్ కిచెన్ వేదికగా ప్రముఖ టాలీవుడ్ సింగర్ గీతామాధురి ఆధ్వర్యంలో లైవ్ మ్యూజిక్ షో ప్లాన్ చేశారు. ఇందులో బాలీవుడ్ ఫోక్ రీజినల్ ఫ్యూజన్ పాటలతో సంగీత ప్రియులను అలరించనున్నారు. అంతే కాకుండా ప్రిజం పోడియం వేదికగా తాయిక్కుడం బ్రిడ్జి హైదారాబాద్ పేరుతో ఎలక్ట్రిఫయ్యింగ్ మ్యూజిక్ తో ఫోక్, ఇండియన్ పాప్, రాక్ మ్యూజిక్ షో జరగనుంది. ఇవే కాకుండా డిసెంబర్లో శిల్పకళా వేదికగా ఇండియన్ సింగింగ్ సెన్సేషన్ ఫీహు అండ్ ఆవిర్భవ్ లైవ్ షో జరుగుతుంది. ఈ షో కోసం నగర వాసులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇదే వేదికగా చిత్రామృతం పేరుతో ప్రముఖ సింగర్ చిత్ర లైవ్ పాటల సందడి జరగనుంది. అయితే బుక్ మై షో వేదికదా ఈ షోలకు సంబంధించిన టికెట్స్ ఇప్పటికే హౌస్ ఫుల్ అయిపోవడం విశేషం. మ్యూజిక్ లవర్స్ కోసమే.. ఈ మ్యూజిక్ కన్సర్ట్ కల్చర్ పాశ్చాత్యంగా నార్త్ ఇండియాకు వచి్చనప్పటికీ.. దీనిని అందిపుచ్చుకోవడంలో హైదారాబాద్ ముందుంది. గతంలో ఇయర్ ఎండ్ వేడుకల్లో, హోలీ సంబరాల్లో ఇతర ప్రత్యేక సందర్భాల్లో మ్యూజిక్ ఫెస్ట్లు ఎక్కువగా జరిగేవి. కానీ ప్రస్తుతం.. కేవలం సంగీత ప్రియులను అలరించడం కోసమే ఈ ఈవెంట్స్ నిర్వహిస్తున్నారు. ఈ ప్రయత్నంలో ఈవెంట్ ఆర్గనైజర్లు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటి వరకూ సిటీలో దివంగత ఎస్పీ బాల సుబ్రమణ్యం, ఇళయరాజా, డీఎస్పీ, సునీత, కార్తీక్ తదితర దక్షిణాది మ్యూజిక్ స్టార్ల ఈవెంట్లు మంచి ఆదరణ పొందాయి.ప్రతీక్ సంగీత ప్రదర్శన.. 8న ప్రముఖ ఫోక్–పాప్ గాయకుడు, పాటల రచయిత రాజస్తాన్కు చెందిన ప్రతీక్ కుహాడ్ నగరానికి వస్తున్నారు. మాదాపూర్లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో ఆయన ఈనెల 8వ తేదీన ప్రదర్శన ఇవ్వనున్నారు. ఐ ట్యూన్స్ ఇండియన్ ఇండీ ఆల్బమ్ ఆఫ్ ది ఇయర్, బెస్ట్ ఇండియన్ యాక్ట్ ఎట్ ది ఎంటీవీ యూరప్ మ్యూజిక్ అవార్డ్స్ వంటి పురస్కారాలు అందుకున్న ఘనత ప్రతీక్ సొంతం. ఆయన ప్రదర్శన రాత్రి 6 గంటల నుంచి 10గంటల వరకూ కొనసాగుతుంది. -
శాండ్విచ్.. పోషకాలు రిచ్..
శాండ్విచ్ నగరంలో అత్యంత క్రేజీ స్నాక్స్లో ఒకటి. అల్పాహారం, భోజనం లేదా సాయంత్రం స్నాక్గా లేదా లైట్ డిన్నర్గా కూడా తీసుకోగలిగిన ఏకైక ఫుడ్ ఐటమ్. దీంతో నగరంలో ఫుడ్ లవర్స్కి మాత్రమే కాదు యువత నుంచి ముసలి వారి వరకూ, ఉద్యోగుల నుంచి లైట్ ఫుడ్ని తీసుకునేవారి వరకూ బాగా దగ్గరైన ఫుట్ ఐటమ్గా చెప్పుకోవచ్చు. రకరకాల ఫ్లేవర్స్లో అందుబాటులో ఉండే ఈ రుచికరమైన శాండ్విచ్ పోషకాహారంగా కూడా పేరొందింది. బ్రిటిష్ పాలకుడు జాన్ మోంటాగు 18వ శతాబ్దంలో రెండు బ్రెడ్ ముక్కల మధ్యలో మటన్ స్లైసెస్ ఉంచి సర్వ్ చేయమని సిబ్బందిని ఆదేశించాడట. దాని వల్ల తాను అవి తింటూనే పేకాట ఆడు కోవచ్చని ఆయన భావించాడట. అలా పుట్టిన శాండ్విచ్ ఆ తర్వాత క్రమంలో విశ్వవ్యాప్తంగా ప్రాచుర్యంలోకి వచి్చంది. మన భాగ్యనగరంలోనూ సిటిజనులకు ఫేవరెట్ ఫుడ్ ఐటమ్గా అవతరించింది. తయారీ సులువుగా ఉండడంతో పాటు అందుబాటు ధరల్లో ఉండటం కూడా శాండ్విచ్ పాప్యులర్ అవ్వడానికి ప్రధాన కారణం.. కనీసం రూ.100 మొదలుకుని రూ.600 దాకా కూడా నగరంలో విభిన్న రకాల శాండ్విచ్లు అందుబాటులో ఉన్నాయి.ట్రెడిషన్స్ను కలుపుకుంటూ టేస్టీగా.. బ్రిటీష్ డచ్ జాతీయులు యూరోపియన్ బ్రెడ్–మేకింగ్ పద్ధతులను మన నగరం స్వీకరించి సంప్రదాయ మసాలా దినుసులు. నాన్, రోటీ వంటి స్థానిక ఫ్లాట్బ్రెడ్లను కూడా ఉపయోగించి సరికొత్త శాండ్విచ్ రుచులను సృష్టించింది. ‘టిక్కా మసాలా వంటి మన సంప్రదాయ రుచులు శాండ్విచ్లలో చేర్చారు’ అని మకావు రెస్టారెంట్ హెడ్ చెఫ్ రవి చెబుతున్నారు. ‘కేఫ్కి వెళ్లినప్పుడు, ప్రతి ఒక్కరూ వెరైటీ కోసం చూస్తారు. అందుకే సోర్డౌ శాండ్విచ్ల నుంచీ క్రోసెంట్ బన్స్ వరకూ మెనూలో చేరుతున్నాయి’ అని చెఫ్ ఫ్రాన్సిస్ అభిప్రాయపడ్డారు. స్థానిక అభిరుచులకు గ్లోబల్ ట్రెండ్ మిళితం చేసి అవొకాడో లేదా పెస్టోతో ఓపెన్–ఫేస్డ్ శాండ్విచ్లను కూడా ఇక్కడి కేఫ్స్ పరిచయం చేశాయి. మారుతున్న ఆధునికుల అభిరుచికి అనుగుణంగా వీగాన్ శాండ్విచ్లు కూడా అందుబాటులోకి వచ్చాయి.బ్రేక్ఫాస్ట్ నుంచి డిన్నర్ వరకూ..శాండ్విచ్లను చాలా సులభంగా ఇంట్లో సైతం వేగంగా తయారు చేయవచ్చు. ఉదయం బ్రేక్ ఫాస్ట్ నుంచి మిడ్ డే స్నాక్స్గానూ, సాయంత్రం టీ టైమ్ దాకా ఎనీ టైమ్ శాండ్విచ్ బెస్ట్ కాంబినేషన్.. నచి్చన కూరగాయలను లేదా విభిన్న రకాల మేళవింపులను దీనికి జతగా ఉపయోగించవచ్చు. రుచికరమైన సాస్లు, చీజ్లతో పాటు కార్బోహైడ్రేట్స్, ప్రొటీన్, ఫైబర్ మేళవింపునకు అనుకూలం కావడంతో ఆరోగ్యకర పోషకాహారంగానూ ప్రాచుర్యం పొందింది.ఇంట్లోనే.. రుచికరంగా..రుచికరమైన శాండ్విచ్ చేయడానికి ఎల్లప్పుడూ చీజ్, బ్రెడ్ రెండూ కలపడం మంచిది. సోర్డోఫ్ బ్రెడ్, చీజ్ తాజా దోసకాయ ముక్కలతో దోసకాయ–చీజ్ శాండ్విచ్, సాయంత్రం టీ సమయంలో తినాలనిపిస్తే, బ్రెడ్ మష్రూమ్లను ఉపయోగించి మష్రూమ్ శాండ్విచ్ తయారు చేయవచ్చు. దీనికి వెల్లుల్లి, చిల్లీ ఫ్లేక్స్, ఒరేగానో, మోజారెల్లా చీజ్, బ్రెడ్ స్లైసెస్, మసాలా దినుసులు జోడించవచ్చు. మొక్కజొన్న, బ్రోకలీ, బెల్ పెప్పర్స్, టొమాటోలు వంటి తాజా కూరగాయల కలయికతో ఇంట్లో తయారుచేసిన స్ప్రెడ్లు, సాస్లతో వెజ్ శాండ్విచ్ తయారు చేయవచ్చు. ఇదే విధంగా చికెన్, ఎగ్స్ రకరకాల మేళవింపులతో నాన్వెజ్ వెరైటీలూ తయారు చేసుకోవచ్చు. సూప్స్ నుంచి తేనీటీ దాకా పీనట్ బటర్ నుంచి జామ్ దాకా ఏ కాంబినేషన్లోనైనా అమరిపోతాయి. రోస్ట్ చికెన్, మస్టర్డ్ శాండ్విచ్ స్పినాచ్ అండ్ కార్న్, రోస్టెడ్ వెజిటబుల్ అండ్ ఛీజ్ వంటి ఫిల్లింగ్స్తో ఇంట్లో వీట్ బ్రెడ్తో కూడా చేసుకోవచ్చు.నగరం నలువైపులా.. నగరంలో దాదాపు అన్ని కేఫ్స్, రెస్టారెంట్స్, బేకరీల్లో రుచికరమైన శాండ్విచ్ వెరైటీలు లభిస్తాయి. అలా చెప్పుకోదగ్గ వాటిలో కొన్ని ఎగ్ బటర్తో బేక్ చేసిన ఫ్రెంచ్ బ్రెడ్ మెల్ట్ శాండ్విచ్లు ప్యాటీ మెల్ట్ పేరుతో మాదాపూర్లోని సిగుస్తా అందిస్తుండగా, గండిపేటలోని బృందావన్ కాలనీలోని కేఫ్ శాండ్విచో, అలాగే బంజారాహిల్స్ రోడ్ నెం 14లో ఉన్న రోస్టరీ కేఫ్, మాదాపూర్లోని బేక్లోర్, నగరంలో పలు చోట్ల ది బేక్ ఫ్యాక్టరీ, అమెరికన్ శాండ్విచ్లకు పేరొందిన హిమాయత్ నగర్లోని కింగ్ అండ్ కార్డినల్, సింధి కాలనీలోని చత్వాలా, కొండాపూర్లోని శాండ్విచ్ స్క్వేర్, జూబ్లీహిల్స్ లోని కోర్ట్యార్డ్ కేఫ్స్ కూడా శాండ్విచ్లకు పేరొందాయి. ఇక శాండ్ విచ్ ఈటరీ పేరుతో నగరంలో పలు ప్రాంతాల్లో ప్రత్యేకించిన ఔట్లెట్స్ ఫుడ్ లవర్స్కి చిరునామాగా మారాయి. ‘మాంసం లేదా చీజ్తో నిండిన బ్రెడ్ లేదా పేస్ట్రీ కలయికలు, మసాలా దినుసులు ధరించడం పురాతన కాలం నుండి ఆనందించబడింది’ అని ఫ్యూ డెసర్ట్, బార్ మరియు కిచెన్లో ఎగ్జిక్యూటివ్ చెఫ్ జో ఫ్రాన్సిస్ వివరించారు. గిన్నిస్ రికార్డ్స్లో శాండ్విచ్..ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన శాండ్విచ్ కూడా ఉంది. గిన్నిస్ రికార్డుల ప్రకారం.. పేరొందిన అంతర్జాతీయ చెఫ్ జోయ్ కాల్డరోన్ తయారు చేసిన గ్రిల్డ్ ఛీజ్ శాండ్ విచ్ 214 డాలర్లు అంటే దాదాపు భారతీయ కరెన్సీలో రూ.17వేల ఖరీదు చేస్తుందట. న్యూయార్క్లోని 3 రెస్టారెంట్స్లో మాత్రమే ఇది అందుబాటులో ఉంది. షాంపేన్ తదితర ఖరీదైన వాటిని ఇందులో మేళవించడమే దీనికి కారణమట. -
మాటే మంత్రం.. తడబడే మాటకు తర్ఫీదు ఇస్తున్నారు
మాటలే మంటలు రేపుతాయి.. చెలరేగిన మంటలను నోటి మాటలే చల్లార్చుతాయి. నోట్ల కట్టల కంటే నోటి మాటకే పదునెక్కువ. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది. ఇందులో ప్రతి ఒక్కటీ తీసిపడేయలేని నిత్యసత్యాలే. మనం మాట్లాడే మాటకున్న విలువను తెలియజేసే సామెతలు. మనిషికి ఉన్న 64 కళల్లో వాక్చాతుర్యం ఒకటి. మాటలే కదా ఎన్నయినా మాట్లాడతాం అనుకుంటే పొరపడినట్లే.. మైక్ పట్టుకుని నలుగురిలో అనర్గళంగా మాట్లాడటం అందరికీ సాధ్యం కాదు. ప్రపంచంలో 514 రకాల భయాలు ఉండగా.. అందులో ప్రథమ స్థానంలో పబ్లిక్ స్పీచ్ నిలిచింది. రెండో స్థానంలో మరణం ఉందని అమెరికాకు చెందిన పలు సర్వే సంస్థలు తెలియజేస్తున్నాయి. నలుగురిలో ప్రసంగించాలంటే.. మనసులో ఏదో తెలియని భయం. మైక్ పట్టుకున్న చేతికి వణుకు మొదలవుతుంది. వీటిని అధిగమించిన వారికే ఏ రంగంలోనైనా ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది. మనలో చాలా మందికి ఎన్నో చెప్పాలని మనసులో ఉంటుంది. అయితే బయటకు చెప్పడానికి మాటలు రావడంలేదు అంటారు. అధికారం కోసం రాజకీయ నాయకులు, ఉద్యోగం, పదోన్నతి కోసం ఇంటర్వ్యూను ఎదుర్కొనాల్సిన అభ్యర్థులు, విద్యార్థులు, తమ ఉత్పత్తులను మార్కెటింగ్ చేసుకోవడంలో వ్యాపార సంస్థలు, తాను తీసుకున్న కేసును గెలిపించడం కోసం న్యాయవాది తదితర రంగాల్లోని వ్యక్తులకు వాక్చాతుర్యం ఎంత ముఖ్యమో అందరికీ తెలిసిందే. ఇటువంటి వారిలో అవసరమైన వారికి మాటలు నేరి్పంచడానికి నగరంలో పదుల సంఖ్యలో శిక్షణ కేంద్రాలు ఏర్పాటవుతున్నాయి. ఏ రంగంలోని వారికైనా సమయం, సందర్భానుసారం మాట్లాడే మెళకువలు నేర్పిస్తామంటున్నారు. ఆ భయం ఎందుకు? వేదికపై మైక్ పట్టుకుని మాట్లాడాలంటే భయంతో కాళ్లు చేతులు ఎందుకు వణుకుతున్నాయి. నలుగురిలో మాట్లాడాలంటే మాట ఎందుకు తడబడుతోంది. మనసులోని భావాన్ని చెప్పడంలో వెనుకాడటానికి కారణం.. ఇలా ఎన్నో ప్రశ్నలకు అనుభవం లేకపోవడం, సిగ్గు, బిడియం మొదలైనవి కారణాలుగా కనిపిస్తున్నాయి. ఈ కారణాలే మాటల తడబాటుకు కారణాలట. ఒక్కోసారి నలుగురిలో నవ్వులపాలవుతున్నారు. ఆ భయం పోవాలంటే ఏం చేయాలనే అంశాలపై ఫోకస్ చేస్తున్నారు. బృందాలుగా ఏర్పాటు చేసి ఒక అంశంపై చర్చలు పెడుతున్నారు. మైక్ పట్టుకుని తనకు నచి్చన అంశంపై ధారాళంగా మాట్లాడాలని ఆహా్వనిస్తున్నారు. మనసులో మాటను స్వేచ్ఛగా ప్రకటించేందుకు అవసరమైన టిప్స్ ఇస్తున్నారు. నాలుగు రోజుల నుంచి 10 రోజుల పాటు శిక్షణ ఇస్తున్నారు. దీనికి రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకూ ఫీజు తీసుకుంటున్నారు.ఆకట్టుకున్నవారికే అందలం..మాట్లాడే సబ్జెక్ట్పై పట్టుండాలి. చెప్పే మాటల్లో కొత్తదనం కనిపించాలి. మాట్లాడే సమయంలో హావభావాలు, శారీరక కదలికలు ఇతరులను ఆకర్షించాలి. మన మాటలకు ఎదుటి వ్యక్తి ఫీలింగ్స్ పసిగట్టాలి. సందర్భానుసారం అందరినీ ఆకట్టుకునేందుకు ప్రయతి్నంచాలి. ఈ అంశాల్లో పట్టున్న వారిని మాత్రమే ప్రజలు ఆదరిస్తారు. నాయకుడనే కిరీటం అందిస్తారు. అధికారం కట్టబెడతారు.మాటలతోనే గుర్తింపు.. తొలినాళ్లలో నలుగురిలో మాట్లాడటానికి ఇబ్బందిపడాల్సి వచ్చేది. దీన్ని అధిగమించేందుకు శిక్షణ తీసుకున్నాను. ప్రొఫెషన్ పరంగా ఇప్పుడు వేలాది మంది ఉన్న సభల్లో డయాస్పై అనర్గళంగా మాట్లాడగలుగుతున్నాను. టీవీ షోల్లో పాల్గొంటున్నా. ఎదుటి వ్యక్తి ఎలా చెబితే వింటాడో మనం గుర్తించగలగాలి. మన ఆలోచనలను వరుసక్రమంలో పెట్టుకోవాలి. సందర్భానుసారం ఆకట్టుకునే విధంగా మాట్లాడితే మనకు ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది. – పల్లవి, సైకాలజిస్టు, హైదరాబాద్సెల్ఫ్ కాని్ఫడెన్స్ పెరిగింది.. పబ్లిక్ స్పీచ్ అందరికీ అవసరమే. ఉద్యోగంలో భాగంగా కాన్ఫరెన్స్లో మాట్లాడాల్సి ఉంటుంది. గతంలో అనుకున్నంత గొప్పగా మాట్లాడలేకపోయాననే ఆలోచన ఉండేది. శిక్షణ తీసుకున్నప్పుడు చాల విషయాలు నేరి్పంచారు. సెల్ఫ్ కాని్ఫడెన్స్ మన కెరీర్కు ఎంతగానో ఉపయోగపడుతుంది. స్పీచ్కి సబ్జెక్ట్ ఎంత ముఖ్యమో.. ఆరంభం, ముగింపు రెండూ అంతే ముఖ్యం. – కిరణ్రెడ్డి, పోలీసు పీఆర్ఓ, సైబరాబాద్మాటలు వెనక్కి వచ్చేవి.. నాకు కమ్యూనికేషన్ ఫీల్డ్ అంటే ఇష్టం. పది మందిలో మాట్లాడాలంటే నా మనసులో మాటలు వెనక్కి వచ్చేవి. ట్రైనింగ్లో చేరినప్పుడు ఎలా ఉంటుందోనని భయపడ్డాను. లెక్చర్ ఇస్తారని ఊహించుకున్నాను. ఇక్కడ ప్రాక్టికల్గా నేరి్పస్తున్నారు. మైక్ ముందు ఐదు నిమిషాలు మాట్లాడితే బోలెడు తప్పులుండేవి. వాటిని సరిదిద్దుకుంటున్నా. పది నిమిషాలు మాట్లాడగలుగుతున్నాను. – సింధుశ్రీ, విద్యారి్థనిఅవకాశాలు కోల్పోతున్నారు.. ఆకట్టుకునే విధంగా మాట్లాడటం తెలియక చాలామంది అవకాశాలు కోల్పోతున్నారు. 15 ఏళ్ల విద్యార్థి నుంచి 70 ఏళ్ల వయసు వారికీ వాక్చాతుర్యం అవసరం. స్కిల్ అనేది జీవితాంతం ఉంటుంది. ఎక్కువగా రాజకీయ నాయకులు, విద్యార్థులు, ఉద్యోగులు వస్తున్నారు. సుమారు 800 బ్యాచ్లలో ఐదువేల మందికిపైగా శిక్షణ ఇచ్చాం. శిక్షణ అనంతరం తమలో మార్పు కనిపించింది అంటున్నారు.– దన్నారపు కల్పన, మీడియా జంక్షన్ డైరెక్టర్ -
శారీ.. ఫర్ ఎవర్
నగరం ఓ మినీ ఇండియా. నార్త్, సౌత్, నార్త్ ఈస్ట్తో పాటు మధ్య భారతం, పశి్చమ, వాయువ్య భారతం అంతా కనిపిస్తుంది. నోరు విప్పి మాట్లాడిన తరవాత భాషను బట్టి వారిది ఏ రాష్ట్రమో తెలుస్తుంది. కానీ మహిళల వస్త్రధారణ మౌనంగా మాట్లాడుతుంది. ఇండియన్ ఫ్యాషన్ అవుట్ ఫిట్లో చీరది ప్రత్యేకమైన స్థానం. చీరలకు అతి పెద్ద షోకేస్ హైదరాబాద్ నగరం. వెస్టర్న్ ప్యాటర్న్స్ ఎన్ని వచి్చనా వాటిని స్వాగతిస్తూనే ఉంది. పాతికేళ్ల కిందట ఒక టేబుల్ వేసుకుని కాటన్ వస్త్రం మీద అందమైన డిజైన్లను అద్దడంతో చీర కొత్త పుంతలు తొక్కింది. అప్పటి వరకూ చేనేతకారులు తరతరాల సాదా మోడల్స్ దగ్గరే ఉన్నారు. సూరత్లోని టెక్స్టైల్ మిల్స్ ఒక డిజైన్ రూపొందిస్తే ఆ డిజైన్లో వేలాది చీరలు దేశమంతటా విస్తరించేవి. అలాంటి సమయంలో ఒక చీరకు అద్దిన డిజైన్ మరో చీరలో ఉండకూడదని, వేటికవే వినూత్నంగా ఉండాలని మహిళా డిజైనర్లు చేసిన ప్రయోగం సక్సెస్ అయ్యింది. ప్రతిదీ యూనిన్గా ఉండాలని కోరుకునే మహిళలకు ఈ ప్రయోగం ఓ వరంలా కనిపించింది. డిజైనర్లు రూపొందించిన డిజైన్లకే పరిమితం కాకుండా సొంత డిజైన్లు గీసి మరీ చేయించుకోవడం మొదలైంది. క్రమంగా అద్దకం ఓ ట్రెండ్ అయ్యింది. చీరను ట్రెండ్ నుంచి పక్కకు పోనివ్వకుండా కాపాడుకుంటూనే ఉంది మెట్రో ఫ్యాషన్. పాతికేళ్లుగా హైదరాబాద్ ఫ్యాషన్ ట్రెండ్ని గమనిస్తున్న ప్రముఖ డిజైనర్ గాయత్రి రెడ్డి చెబుతున్న మాట ఇది. నేతలో క్రియేటివిటీ.. చీర మీద అద్దిన డిజైన్ హైలైట్ కావడానికి డిజైన్ అవుట్ లైన్ ఎంబ్రాయిడరీ చేయడం మరో ప్రయోగం. అక్కడి నుంచి మగ్గం వర్క్ మొదలైంది. చీరతోపాటు బ్లౌజ్కు ఎంబ్రాయిడరీ, చీర కంటే బ్లౌజ్కు పెద్ద ఎంబ్రాయిడరీ, బ్లౌజ్కు హైలైట్ కావడానికి ప్లెయిన్ చీర కాంబినేషన్ వంటి ప్రయోగాలన్నీ సక్సెస్ అయ్యాయి. ఇదే సమయంలో మహిళా డిజైనర్లు తమ క్రియేటివిటీని చేనేత వైపు మళ్లించారు. పోచంపల్లి, ఇకత్ నుంచి నారాయణపేట, ఉప్పాడ, ధర్మవరం, వెంకటగిరి, పాటూరు వంటి నేతలన్నింటికీ ఫ్యాషన్ లుక్ తెచ్చారు. దాంతో ఫ్యాషన్ ప్రపంచాన్ని చేనేత శాసించేంతగా డిజైన్లు పాపులర్ అయ్యాయి. పట్టు చీరల బరువు తగ్గించడంలో విజయవంతమయ్యారు. దాదాపు క్రేప్ మాదిరి తేలిగ్గా ఉంటోందిప్పుడు.వాతావరణం మారింది నగరంలో ఏడాదిలో పది నెలలు చల్లని వాతావరణం ఉండేది. ఈ పాతికేళ్లలో బాగా మార్పులు వచ్చాయి. ఏడాదిలో పది నెలలు వేడిగా ఉంటోంది. వెదర్కు అనుకూలంగా ఉండేటట్లు డిజైనర్ శారీస్ కాటన్లో తీసుకురావడం కొత్త తరం మహిళలు చీరపై మోజు పడడానికి ఓ కారణం. చీర కట్టే రోజులు తగ్గినా.. కొనడం మాత్రం తగ్గలేదు. ప్రతి ఫంక్షన్కీ ఓ కొత్త చీర కొనే ట్రెండ్ వచ్చేసింది. సాఫ్ట్వేర్ ఉమర్స్ పారీ్టలకు చీరలో మెరిసిపోతున్నారు. రోజూ చుడీదార్ ధరించే వాళ్లు కూడా బర్త్డే పార్టీ, గెట్ టు గెదర్ వంటి వాటికి చీర కడుతున్నారు. చీర చుట్టూ ఫ్యాషన్..పాతికేళ్ల క్రితం హైదరాబాద్లో నూటికి 70 నుంచి 80 శాతం మహిళలు రోజూ చీరలే ధరించేవారు. క్రమంగా 2015 నాటికి 40 శాతానికి పరిమితమైంది. వర్కింగ్ ఉమెన్స్, డాక్టర్లు, లెక్చరర్లు చీరలతోనే డ్యూటీ చేశారు. ఇప్పుడిది పాతిక శాతం మాత్రమే ఉంది. ఆధునిక వనితల వార్డ్రోబ్లో చుడీదార్, జీన్స్ డైలీ వేర్ స్థానాన్ని ఆక్రమించాయి. కానీ చీర మాత్రం దూరం కాలేదు. తనను తాను మార్చుకుంటూ ఎప్పటికప్పుడు ఫ్యాషనబుల్గా మారుతోంది చీర. అందుకే శారీఫ్యాషన్ ఎప్పటికీ తెరమరుగు కాదు. – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
అవుట్ ఫిట్.. వ్యాయామం హిట్..
ఎన్ని గంటలు చేయాలి? ఏం డైట్ తీసుకోవాలి? సరిగా వర్కవుట్ చేస్తున్నానా లేదా? వ్యాయామం చేయాలనుకునే/ చేసే వారిలో ఎన్నో సందేహాలు.. మరి డ్రెస్ సంగతేంటి? వ్యాయామానికి తగ్గ అవుట్ ఫిట్ ధరిస్తున్నానా?అనేది ఆలోచించకపోతే ఇబ్బందులు తప్పవని చెబుతున్నారు వ్యాయామ నిపుణులు. దీనిపై నగరానికి చెందిన వ్యాయామ నిపుణులతో కలిసి హామ్స్టెక్ ఫ్యాషన్ అండ్ డిజైనింగ్ ఇన్స్టిట్యూట్కు చెందిన డిజైనర్లు అందిస్తున్న సూచనలివి.. నిశ్చల జీవనశైలి, ఎక్కువ గంటలు కూర్చోడం వల్ల వచ్చే మధుమేహం, రక్తపోటు గుండె సమస్యలు వంటి జీవనశైలి వ్యాధులను ఎదుర్కోడంలో రెగ్యులర్ వ్యాయామం అవసరం. ఇది ఎండార్ఫిన్స్ను రిలీజ్ చేసి ఒత్తిడిని తగ్గించి మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. మంచి నిద్రనిస్తుంది. అయితే వర్కవుట్ సమయంలో సరైన యాక్టివ్ వేర్ ఉంటేనే ఇవన్నీ సాధ్యం. అనుచితమైన జిమ్వేర్ వ్యాయామాలకు అవసరమైన కండరాల సపోర్ట్ని అందించవు. మన ఫిట్నెస్ లక్ష్యాలకు సహకరించవు. జిమ్ వేర్.. టేక్ కేర్.. వ్యాయామ సమయంలో సరైన యాక్టివ్వేర్ ఉత్సాహం పెంచడంతో పాటు అధిక చెమట, దుర్వాసనల నుంచి రక్షిస్తుంది. గాయాలను నివారించి శరీర ఉష్ణోగ్రతను నిర్వహిస్తుంది. రక్త ప్రసరణను మెరుగుపరచి పనిచేసే కండరాలకు ఆక్సిజన్ను అందించడంతో పాటు సామర్థ్యం మేరకు వ్యాయామాలు చేసేలా ఏకాగ్రతను మెరుగుపరుస్తుంది. సులభమైన కదలికలకు సహకరిస్తూ బరువులు ఎత్తడంలో సహాయపడి కండరాల పునరుద్ధరణను సులభతరం చేస్తుంది.శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడానికి శరీరం నుంచి తేమ ఆవిరైపోవాలి. కాబట్టి తేమను సులభంగా ఆరబెట్టడానికి, చెడు వాసనను నిరోధించడానికి చల్లగా, సౌకర్యవంతంగా ఉంచడానికి మైక్రోఫైబర్తో కూడిన ఫ్యాబ్రిక్ను ఎంచుకోవాలి. పాలియెస్టర్, స్పాండెక్స్, పాలీ–డ్రై, నైలాన్ కూడా మంచివే. 👉 కొన్నిరకాల దుస్తులు అంటువ్యాధులు, దద్దుర్లు, దురదలకు దారితీయవచ్చు. శరీరపు సహజ ఉష్ణోగ్రతను దెబ్బతీసి, డీ హైడ్రేషన్, అలసట లేదా బరి్నంగ్ సెన్సేషన్కు దారితీస్తాయి. 👉 వేసవి కాలంలో సౌకర్యవంతమైన, చల్లదనాన్నిచ్చే దుస్తులు, వర్షాకాలంలో అంటువ్యాధులు, అలెర్జీలు, చర్మ వ్యాధులను నివారించడానికి పొడిగా, తాజా అనుభూతిని కలిగించే దుస్తులను ఎంచుకోవాలి. శీతాకాలంలో వెచ్చగా ఉంచేవి, అవుట్డోర్ వ్యాయామ సమయంలో లేయర్లలో దుస్తులు ధరించడం వల్ల శరీర ఉష్ణోగ్రతను అనుసరించి ఒక్కో లేయర్ను తొలగించొచ్చు. 👉 గుండె ఆరోగ్యానికి, శక్తికి రన్నింగ్, సైక్లింగ్ వంటి కార్డియోవాస్క్యులర్ వ్యాయామాలు అవసరం. రన్నింగ్, జాగింగ్ చేసేవారి కోసం లైట్ వెయిట్ స్వెట్ అబ్సార్బింగ్, టీషర్ట్స్, షార్ట్స్, బి రన్నింగ్ అండ్ కార్డియో హెచ్ఆర్ఎక్స్ తదితర బ్రాండ్స్ అందిస్తున్నాయి. 👉కీళ్ల మధ్య సమన్వయం, బ్యాలెన్సింగ్కి యోగా, స్ట్రెచ్ ఎక్సర్సైజ్లు ఉపకరిస్తాయి. దీనికి యోగా ఫ్లెక్సిబులిటీ, బ్లిస్ క్లబ్ వంటి బ్రాండ్స్ హై స్ట్రెచ్ లెగ్గింగ్స్, తేమను పీల్చుకునే స్పోర్ట్స్ బ్రాల తదితర అవుట్ఫిట్స్ను అందిస్తున్నాయి. జీవమే బ్రాండ్ కూడా ఫ్లెక్సిబులిటీ, సౌకర్యంగా ఉండే స్ట్రెచ్బుల్ యోగా గేర్ను అందుబాటులోకి తెచ్చింది. 👉 బ్రీతబుల్ ఫ్యాబ్రిక్స్కి, మన దేశపు నేలకు తగ్గట్టుగా మెత్తగా ఉండే కుషన్ కలిగిన షూస్ని ప్యూమా ఇండియా అందిస్తోంది. యోగాతో పాటు స్ట్రెంగ్త్ ట్రైనింగ్కి ఉపకరించే లైట్ వెయిట్, ఎకో ఫ్రెండ్లీ దుస్తుల్ని ప్రయోగ్ తయారు చేస్తోంది. 👉 స్టైలిష్ అత్లీజర్, ఫ్యాషన్, ఫంక్షన్ రెండింటి మేలి కలయికతో డి.అథ్లీజర్ అం ఆల్ డే యాక్టివ్ వేర్ను లులులెమన్ ఇండియా అందిస్తోంది. తేలికపాటి వ్యాయామాలతో పాటు రోజువారీ ఉపకరించే దుస్తులను నష్ యాక్టివ్ సమరి్పస్తోంది. 👉 చేసే వ్యాయామంపై అవగాహనతో పాటు ధరించే అవుట్ఫిట్పై కూడా జాగ్రత్తలు అవసరం. ప్రస్తుతం పలు రకాల బ్రాండ్స్, ఏ వ్యాయామ శైలికి తగ్గట్టుగా ప్రత్యేకంగా డిజైన్ చేసిన దుస్తులను అందిస్తున్నాయి. వాటిలో నుంచి లేదా తామే ప్రత్యేకంగా డిజైన్ చేయించుకున్న కస్టమైజ్డ్ దుస్తులను ఫిట్నెస్ లవర్స్ వినియోగించుకోవచ్చు. – హామ్స్టెక్ ఫ్యాషన్ డిజైనింగ్ ఇన్స్టిట్యూట్ ఫ్యాకల్టీ అవుట్ ఫిట్.. ఇంపార్టెంట్వ్యాయామం చేసే సమయంలో సరైన అవుట్ ఫిట్ ధరించడం అనేది చాలా ఇంపార్టెంట్. ఆ విషయంలో ఇప్పుడు చాలా మందిలో అవగాహన పెరిగింది. చెమట ఎక్కువ పడుతుంది కాబట్టి జిమ్ వర్కవుట్కి డ్రై ఫిట్ పేరిట అందుబాటులోకి వచ్చిన దుస్తులు, అదే విధంగా యోగ డ్రెస్సింగ్కు వచ్చేటప్పటికి ఫ్లెక్సిబుల్ ఫ్యాబ్రిక్ వినియోగిస్తున్నారు. జాగింగ్ చేసేవారికి జాగర్స్ సూట్స్, సైక్లింగ్కి స్కిన్ టైట్ ప్యాంట్ ఇలా వర్కవుట్ స్టైల్ని బట్టి ప్రత్యేక దుస్తులు అందుబాటులోకి వచ్చేశాయి. – విజయ్ గంధం, ఫిట్నెస్ ట్రైనర్ -
కొండపల్లి బొమ్మలకు.. మార్వలెస్ టచ్
ఈ తరం యువతకు అధునాతన ఆవిష్కరణల పై ఉన్న ఆసక్తి.. మన మూలాలను అన్వేషించడంపై ఉండదని తరచూ వింటుంటాం. కానీ నగరానికి చెందిన అభినవ్ సాయి అనే 23 ఏళ్ల యువకుడు తన సృజనాత్మకతతో సాంస్కృతిక వైభవానికి అధునాతన హంగులను అద్దుతూ రెండు తరాలకూ మధ్య వారధిలా నిలుస్తున్నాడు. కళ పరంగా ఎంతో విశిష్టత ఉన్నప్పటికీ ఆదరణకు దూరమవుతున్న కొండపల్లి బొమ్మలకు అధునాతన హంగులతో మళ్లీ ప్రాణం పోస్తున్నాడు. వోక్సన్ యూనివర్సిటీ వేదికగా తను చదువుకున్న విజ్ఞానాన్ని సాంస్కృతిక పునరుజ్జీవనానికి ఆద్యం పోస్తున్నాడు. ఇలా కొండపల్లి బొమ్మకు తాను రూపొందించిన మోడ్రన్ జాయింట్ టెక్నాలజీకి పేటెంట్ సైతం లభించింది. తాను అందించిన ప్రొడక్ట్ డిజైన్ నేపథ్యంతో స్వయంగా రూపొందించిన యానిమేటెడ్ షార్ట్ ఫిల్మ్ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుతో పాటు ఐదు నేషనల్ అవార్డులను పొందింది. అంతేకాకుండా తన స్టార్టప్ ‘క్యాపిబరో’ ఆధ్వర్యంలో హాలీవుడ్ లెగో టాయ్స్ తరహాలో రూపొందించిన కల్కి మూవీ టాయ్స్ వినూత్న ఆవిష్కరణను తలపిస్తున్నాయి. ఇలా కొండపల్లి బొమ్మలు మొదలు తన సినిమా ప్రయాణం ఈ తరానికి స్ఫూర్తి దాయకమే. ఆ విశేషాలు అభినవ్ మాటల్లోనే తెలుసుకుందాం...!! చిన్నప్పటి నుంచి క్రియేటివ్ పెయింటింగ్, రాక్ స్కల్ప్చరింగ్, మినియేచర్ స్కల్ప్చర్ వంటి సృజనాత్మకత కళలు అంటే ఇష్టం. ఇలా కళాత్మక ప్రయోగాల్లో భాగంగానే నేను 7వ తరగతి (12 ఏళ్ల వయసులో..) చదువుతున్నప్పుడే ఫ్రెండ్స్తో నా మొదటి షార్ట్ఫిల్మ్ తీశాను. అప్పటికీ నాకు ఎడిటింగ్ అంటే కూడా సరిగా తెలీదు. ఐ మూవీస్ యాప్ సహాయంతో దానిని పూర్తిచేశాను. అలా బ్లాక్ అండ్ వైట్ సినిమా, థ్రిల్లర్, యానిమేషన్, ఫ్యాషన్ తదితర వేరియేషన్స్తో 50 షార్ట్ఫిల్్మ్స చేశాను. ఈ క్రియేటివిటీ, ఐడియాలజీతోనే నగరంలోని వోక్సెన్ యూనివర్సిటీలో ఆర్ట్స్ ఆండ్ డిజైనింగ్లో గ్రాడ్యుయేషన్లో చేరాను. వోక్సెన్ వేదికగా తెలుగు సంస్కృతిలో విశిష్టత కలిగిన కొండపల్లి బొమ్మలపైన పరిశోధనలు చేశాను. నా క్రియేటివిటీలో భాగంగా కొండపల్లి బొమ్మకు యాక్షన్ మూమెంట్ ఉండేలా మార్పు చేశాను. డెమోక్రసీ డెత్ ఆఫ్ ఆర్ట్స్..నా గ్రూప్ ప్రాజెక్ట్లో భాగంగా టాయ్కథాన్ అనే కాంపిటీషన్లో పలు ఆసక్తికర విషయాలను తెలుసుకున్నాను. ముఖ్యంగా 95 శాతం ట్రెడిషనల్ బొమ్మల విషయంలో ప్రచారం వేరు, వాస్తవికత వేరు. ఆన్లైన్లో కూడా ఔట్డేటెడ్ సమాచారం ఉంటుంది. కొండపల్లి బొమ్మలకు ఎంతో విశిష్టత ఉంది. 400 ఏళ్ల క్రితం రాజస్థాన్ నుంచి రాజుల కళాభిరుచిలో భాగంగా తెలుగు నేలకు వచ్చి ఇక్కడే స్థిరపడిపోయింది. తేలికైన తెల్లపొనిక చెక్కతో చేస్తారు. కానీ వాటికి ప్రస్తుతం అంతగా మార్కెట్ లేదు. ఒకప్పుడు 6 అడుగుల వరకూ ఉంటే ఇప్పుడు 4, 5 ఇంచులకు మారిపోయాయి. సహజసిద్ధమైన రంగులు వినియోగించేవారు. ప్రస్తుతం అవి వాడట్లేదు. ఎయిర్ పోర్ట్లు, పెద్ద షాపింగ్ మాల్స్లో అమ్మే బుట్ట బొమ్మలు కూడా కొండపల్లి బొమ్మలు అనుకుంటారు చాలమంది. ఇలాంటి అంశాల వెనుకున్న కారణాలను నా పరిశోధనలో తెలుసుకున్నారు.యూనివర్సిటీ ప్రోత్సాహంతో పేటెంట్ ఒక స్పైడర్ మ్యాన్ బొమ్మలా మన కొండపల్లి చెక్క బొమ్మలు కూడా కదిలేలా డిజైన్ చేశాను. ప్రయోగంలో మా యూనివర్సిటీ అందించిన ప్రోత్సాహంతో నాకు పేటెంట్ రైట్స్ లభించాయి. హాలీవుడ్లో టాయ్స్టిక్ స్టార్టజీ బాగా ఆదరణ పొందింది. బార్బీ వంటి బొమ్మలను రూపొందించి వాటి మార్కెట్ కోసం భారీ సినిమాలను సైతం నిర్మిస్తారు. ఈ కోణంలోనే నా ప్రొడక్ట్ డిజైన్ నేపథ్యంలో తీసిన యానిమేటెడ్ షార్ట్ ఫిల్మ్ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుతో పాటు మరో ఐదు నేషనల్ అవార్డులు పొందింది. మరో 10 నేషనల్ అవార్డులకు ఎంపికైంది. ఈ విభాగంలో ఆస్కార్కు నామినేట్ అయ్యే అవకాశాన్ని తృటిలో కోల్పోయింది. 3డీ డిజైన్.. గ్లిమ్స్తో యానిమేషన్..హాలీవుడ్ లెగో టాయ్స్లాగే.. ప్రతిష్టాత్మకంగా నిర్మించిన తెలుగు సినిమా ‘కలి్క’ సినిమాలోని బుజ్జీ కారు, ప్రభాస్ తదితర పాత్రధారులను నా స్టార్టప్ ‘క్యాపిబరో’ ఆధ్వర్యంలో స్కెచ్ వేసి, 3డీ డిజైన్తో కొండపల్లి క్రాఫ్ట్ మెన్తో బొమ్మలు చేయించాను. అంతేకాకుండా కల్కి గ్లిమ్స్ ఆధారంగా యానిమేటెడ్ వీడియో చేశాను. ఈ విషయం తెలుసుకుని కల్కి నిర్మాత స్వప్న, దర్శకులు నాగ్ అశ్విన్ నా క్రియేటివిటీని అభినందించారు. వారితో కలిసి ఒక ప్రాజెక్టులా ఈ బొమ్మలను తయారు చేయాలని ప్లాన్ చేశాం. కానీ సినిమా విడుదల బిజీ నేపథ్యంలో కుదరలేదు. నా క్రియేటివిటీతో దర్శకునిగా సినిమాలు చేయాలని ఉంది. ఇప్పటి వరకూ తొమ్మిది కమర్షియల్ సినిమా స్క్రిప్్టలు రెడీ చేశాను. ఇందులో ఒక కథ ప్రముఖ దర్శకులు సుకుమార్కు నచ్చి చర్చలు జరుగుతున్నాయి. తన సుకుమార్ రైటింగ్స్ ఆధ్వర్యంలో నా సినిమా తీయడానికి ప్రయత్నం చేస్తున్నాను. -
స్నేక్ ఫ్రెండ్స్..
పాము అంటే ఎవరికి భయం ఉండదు చెప్పండి.. ఎక్కడైనా కనిపిస్తే చాలు భయంతో పరుగులు పెడుతుంటాం. ఇక ఇంట్లోకి వచి్చందంటే కథ వేరేలా ఉంటుంది. భయానికి చెమటలతో సగం తడిచిపోతుంటాం. ఇంకొందరైతే తెగ హడావుడి చేసి ఎలాగైనా చంపేయాలని చూస్తుంటారు. కానీ వీరు మాత్రం పాములు కనిపిస్తే చాలు ప్రేమగా వాటిని పట్టుకుంటారు. వాటికి ఎలాంటి హానీ కలగకుండా జాగ్రత్తగా తీసుకెళ్లి దగ్గర్లోని అడవుల్లో వదిలేస్తుంటారు. ఇంతకీ వాళ్లెవరా అని ఆలోచిస్తున్నారా? వాళ్లే ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్స్.. వీరి గురించి మరిన్ని విశేషాలు.. ఎవరి ఇంటికైనా పాములు వచ్చాయని ఫోన్ చేస్తే చాలు క్షణాల్లో వాలిపోయి.. పాములను చాలా జాగ్రత్తగా పట్టుకుని సురక్షిత ప్రాంతాల్లో వదిలిపెడతారు. ఏటా దాదాపు 10 వేల నుంచి 12 వేల వరకూ పాములను పట్టి.. వేరే ప్రాంతాల్లో విడిచిపెడుతున్నారు. ఇటు మనుషుల ప్రాణాలతో పాటు పాములను కూడా కాపాడుతూ రియల్ హీరోలుగా నిలుస్తున్నారు ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్స్ సొసైటీ సభ్యులు. వర్షాకాలంలో ఎక్కువ..సాధారణంగా పాములు బొరియల్లో తలదాచుకుంటాయి. వర్షాకాలంలో ఆ బొరియల్లోకి వరద నీరు చేరుతుండటంతో బయటకు వస్తాయి. అప్పుడు ఎక్కడికి వెళ్లాలో తెలియక అప్పుడప్పుడూ ఇళ్లల్లోకి వస్తుంటాయి. అంతేకాకుండా నాళాల పక్కన ఉన్న ప్రాంతాల్లోని ఇళ్లల్లోకి కూడా పాములు చేరుతుంటాయి. అంతేకానీ మనకు ఎలాంటి హానీ తలపెట్టబోవని ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్స్ సంస్థ నిర్వాహకులు చెబుతున్నారు. వాటికి మనం హాని చేస్తున్నామని అనిపిస్తేనే అవి కాటేస్తాయని పేర్కొంటున్నారు. స్వచ్ఛందంగా సేవలు.. ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్స్ సంస్థను 1995లో రాజ్కుమార్ కానూరి స్థాపించారు. పాములు జీవవైవిధ్యానికి ఎంతో కీలకమని, వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఆయన చెబుతుండేవారు. ఒకరిద్దరితో ప్రారంభమైన ఈ సంస్థలో.. ఇప్పుడు ఏకంగా 150 మంది వలంటీర్లు ఉన్నారు. పాములపై ప్రేమ.. పాములను పట్టుకోవాలని ఆసక్తి ఉన్న ఉద్యోగులు, స్టూడెంట్స్ తమకు ఉన్న ఖాళీ సమయాల్లో స్నేక్ క్యాచింగ్ చేసేందుకు ముందుకు వస్తుంటారు. స్నేక్ క్యాచింగ్ అంటే ఆసక్తి ఉన్న వారు ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్స్ సంస్థను సంప్రదిస్తే.. వారికి 6 నెలల పాటు శిక్షణ ఇస్తున్నారు. ఎక్కడైనా పాము గురించి సమాచారం అందగానే దగ్గరలో ఉన్న వలంటీరు అక్కడికి వెళ్లి వాటిని రక్షిస్తారు. జీవ వైవిధ్యానికి ముఖ్యం.. ప్రకృతిలో అన్ని జీవులకూ సమాన హక్కులు ఉంటాయని, ఏ ప్రాణినీ చంపే అధికారం ఎవరికీ లేదని ఈ సంస్థ వాళ్లు చెబుతున్నారు. కాకపోతే పట్టణీకరణ కారణంగా భవన నిర్మాణ కార్యకలాపాలు పెరుగుతుండటంతో పాములు, ఇతర జంతువుల ఆవాసాలైన అడవులను నరికేస్తున్నారని, ఈ నేపథ్యంలో వాటికి ఆవాసం లేకపోవడంతో ఇళ్ల్లల్లోకి వస్తున్నాయని పేర్కొంటున్నారు. ఇక, పాములు జీవవైవిధ్యానికి, మనిషి జాతి మనుగడకు చాలా కీలకమని, వాటిని కాపాడుకుంటే భవిష్యత్తు తరాలు సుస్థిరంగా ఉంటాయని చెబుతున్నారు. ఆహార భద్రతలో కూడా పాములు కీలక పాత్ర పోషిస్తాయని సంస్థ ప్రతినిధులు అంటున్నారు. అందుకే పాములపై తాము పరిశోధనలు చేస్తున్నామని ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్స్ సొసైటీ నిర్వాహకులు చెబుతున్నారు. ఇందుకోసం సంస్థలో పరిశోధనా విభాగం ఉందని, వాళ్లు ఎప్పటికప్పుడు కొత్త రకం పాముల గురించి పరిశోధనలు చేస్తుంటామని వివరించారు. ఈ విషయంలో అటవీ శాఖ, జూపార్కు అధికారులు తమకు ఎంతో మద్దతు ఇస్తుంటారని చెబుతున్నారు.అవగాహన అవసరం..పాములన్నీ విషపూరితం కాదు.. ఎవరికీ హాని చేయని పాములు కూడా ఉంటాయి. వాటిని చూసి అనవసరంగా భయపడి వాటిని చంపొద్దని ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్స్ వలంటీర్లు చెబుతున్నారు. పాముల గురించి ప్రజల్లో మరింత అవగాహన రావాలనే ఉద్దేశంతో ఏటా దాదాపు 200 నుంచి 300 వరకూ అవగాహనా కార్యక్రమాలు చేస్తుంటామని వివరించారు. పాము కాటు వేసినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కూడా అవగాహన కలి్పస్తుంటామని పేర్కొంటున్నారు. దీంతో పాటు అడవుల్లో అరుదైన జాతి పాములను కాపాడేందుకు తాము కృషి చేస్తున్నామని వివరించారు. ఔషధ గుణాలున్నాయంటూ కొన్ని పాములను అనవసరంగా చంపి, విదేశాలకు ఎగుమతి చేస్తుంటారని, ఇలాంటి వారి గురించి తమ దృష్టికి వస్తే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించి.. అక్రమ వ్యాపారాలకు అడ్డుకట్ట వేసేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. ఆ తృప్తి వేరు.. పాములు పట్టాలంటూ రోజూ చాలా మంది ఫోన్ చేస్తుంటారు. రెస్క్యూ చేసిన పాముల్లో దాదాపు 50 శాతం విషపూరితమే. కొన్నిసార్లు వాటిని పట్టే సమయంలో వలంటీర్లు కూడా ఇబ్బందులు పడుతుంటారు. ఎంతగా శిక్షణ తీసుకున్నా.. ఫీల్డ్లోకి వచ్చేసరికి కొన్ని సవాళ్లు ఉంటాయి. వాటిని అధిగమిస్తూ.. సమస్యలను ఎదుర్కొంటూ ముందుకు వెళ్తుంటాం. పాములను జాగ్రత్తగా పట్టుకున్న తర్వాత.. ఇంటి యజమానుల కళ్లల్లో కృతజ్ఞతాభావం మాకు ఎంతో సంతృప్తిని ఇస్తుంది. మేం చేస్తున్న పనిలో ఆ క్షణం తృప్తినిచ్చే క్షణం. – అవినాష్ విశ్వనాథం, జనరల్ సెక్రటరీ, ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్స్ సొసైటీ -
సీతాఫల్.. వెరైటీస్ ఫుల్
ఈ సీజన్లో సీతాఫలం రుచి చూడని వాళ్లు అరుదేనేమో... పండ్లలో ఇప్పటికీ పూర్తిస్థాయిలో అమృతం లాంటి రుచిని కోల్పోకుండా అందించే ఏకైక ఫలంగా సీతాఫలాన్ని చెప్పుకోవచ్చు. దాదాపు అందరికీ అందుబాటు ధరల్లోనే ఉండే ఈ ఫలం.. ఇప్పుడు నగర మార్కెట్లో సందడి చేస్తోంది. మరోవైపు ఈ సీజన్లో సీతాఫలాన్ని ఆధారం చేసుకుని రుచులను వడ్డించే రెస్టారెంట్స్, ఐస్క్రీమ్ పార్లర్స్ సైతం నగర వాసులకు వెరైటీలను అందించేందుకు సిద్ధమైపోతున్నాయి. కాదే ఫలమూ తినడానికి అనర్హం అన్నట్టే.. కాదే ఫలమూ మేళవింపునకు అనర్హం అంటున్నారు నగరంలోని చెఫ్స్. సీతాకాలంలో విరివిగా లభ్యమయ్యేది సీతాఫలం. ఇది తీపి, క్రీము గుజ్జుతో కూడిన ఉష్ణమండల ఫలం ఇది. ఈ పండులో విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉన్నందున గణనీయమైన పోషక విలువలను కలిగి ఉంటుంది. రోగ నిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. ఆరోగ్యకరమైన చర్మాన్ని అందిస్తుంది. జీర్ణక్రియను సైతం మెరుగుపరుస్తుంది. అయితే మ్యాంగో సీజన్లో మామిడి పండ్లను వంటకాలలో విరివిగా జత చేసే నగర నలభీములు.. సీతాఫలంతోనూ పలు రకాల వంటకాలు తయారు చేస్తూ నోరూరించడం ఆహార ప్రియులకు సుపరిచితమే.ఆరోగ్యానికి మేలు.. ఉపవాసం సమయంలో ప్రత్యేక ట్రీట్గా కూడా దీనిని వడ్డిస్తారు. రబ్దీ పాలలోని కాల్షియం ప్రొటీన్ కంటెంట్ ఎముకల ఆరోగ్యానికి మేలు చేస్తుంది, దీనికి బాదం, పిస్తాలను గారి్న‹Ùగా ఉపయోగిస్తారు. కాబట్టి అవసరమైన కొవ్వు, ఆమ్లాలు, విటమిన్–ఈ లను ఇవి అందిస్తాయి. ఒక లీటరు పాలు, పావు కిలో బెల్లం, అర టీస్పూన్ యాలకుల పొడి, సీతాఫలం గుజ్జు ఒక కప్పుతో చేసిన ఈ రబ్దీని కూల్గా సర్వ్ చేసుకోవచ్చు. మరెన్నో రుచులు.. ఇవే కాకుండా పలు రెస్టారెంట్స్లో కస్టర్డ్ యాపిల్ ఖీర్, కుల్పీ తదితరాలను కూడా తయారు చేస్తున్నారు. కస్టర్డ్ యాపిల్తో ఫుడింగ్ కూడా చేస్తున్నారు. ఫిర్ని అనే నార్త్ ఇండియన్ డిజర్ట్ కూడా దీన్ని జోడిస్తున్నారు. కస్టర్డ్ యాపిల్ పల్ప్ను వేడి వేడి జిలేబీ తదితర స్వీట్స్పై దీన్ని జతచేసి సర్వ్ చేయడం కూడా కొన్ని రెస్టారెంట్స్లో పరిపాటిగా మారింది.స్వీట్ విత్ ఫ్రూట్.. రబ్దీ అనేది భారతీయ వంటకాల్లో ఒక క్లాసిక్ డెజర్ట్, ఇది చాలా కాలం నుంచి వండి వడ్డిస్తున్నారు. సంప్రదాయ పండుగలు లేదా ప్రత్యేక సందర్భాల్లో, విందు వినోదాల చిహ్నంగా దీనిని వడ్డిస్తారు. రబ్దీకి సీతాఫలాన్ని జోడించడం వల్ల ప్రత్యేకమైన రుచిని మాత్రమే కాకుండా మరిన్ని బలవర్ధకాలు సంతరించుకుని ఉత్తమ పోషకాహారంగా మారుతోంది. పండుకు సహజంగా ఉండే తీపి దీనికి చక్కెర అతిగా జత చేయాల్సిన అవసరాన్ని తగ్గిస్తుంది, వంటకాన్ని ఆరోగ్యకరమైనదిగా చేస్తుంది. ఈ సీజన్లో వచ్చే కర్వా చౌత్, దీపావళి తదితర పండుగల సమయాల్లో కుటుంబ సమేతంగా ఆస్వాదించేందుకు ఈ డెజర్ట్ బాగా వినియోగిస్తారు. ఐస్క్రీమ్స్ షురూ.. నగరంలో పలు ఐస్క్రీమ్ పార్లర్స్ ఈ సీజన్లో సీతాఫల్ ఐస్క్రీమ్స్ విక్రయాలకు పేరొందాయి. సీజనల్ పండ్లతో చేసిన ఐస్క్రీమ్స్ను అందించడంలో పేరొందిన నేచురల్స్లో ఇప్పటికే సీతాఫల్ ఐస్క్రీమ్స్ అందుబాటులోకి వచ్చాయి. అదే విధంగా క్రీమ్స్టోన్ తదితర పేరున్న పార్లర్స్లోనూ ఇవి అందిస్తున్నారు.. ఇక పాతబస్తీలో అచ్చమైన ఆర్గానిక్ ఐస్క్రీమ్స్కు దశాబ్దాల నాటి నుంచి కేరాఫ్గా ఉన్న ఫేమస్ ఐస్క్రీమ్స్ కూడా సీతాఫల్ హిమ క్రీముల్ని అందిస్తోంది. నగరంలోని అబిడ్స్లో ఉన్న నార్సింగ్ భేల్పురి జ్యూస్ సెంటర్ సైతం ఈ వంటకాలకు పేరొందింది. సీతాఫల్ మలాయ్ పేరుతో ఈ ఫుడ్ అవుట్లెట్ అందించే సీజనల్ రుచి ఫుడ్ లవర్స్కి చిరపరిచితమే. ఇలా అనేక రకాలుగా సిటీలోని సీతాఫల ప్రియుల్ని రారమ్మని ఆహా్వనించేందుకు ఓ వైపు రుచిని మరోవైపు ఆరోగ్య ఫలాన్ని అందించేందుకు రెస్టారెంట్స్, ఐస్క్రీమ్ పార్లర్స్, కేఫ్స్ పోటీపడుతున్నాయ్. -
టెకీ.. ఆరోగ్యం రిస్కీ..
ఎండ కన్నెరుగని శరీరాలు ఎండ్లెస్ సమస్యల చిరునామాలుగా మారుతున్నాయి. ఆరు అంకెల జీతాలు అందుకునే జీవితాలు అనారోగ్యాలకు గురవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఐటీ ఉద్యోగుల ఆరోగ్య పరిస్థితులపై ఆందోళన పెరుగుతోంది. దీనికి పని ఒత్తిడి కారణం ఒకటైతే.. హైబ్రిడ్, వర్క్ ఫ్రమ్ హోం సైతం మరో కారణంగా పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఈ ఆదోళన నేపథ్యంలో పలు కంపెనీలు.. కార్యాలయ ఆవరణల్లో మార్పులకు కారణమవుతున్నాయి. నగరంలో దాదాపు తొమ్మిది లక్షల మంది పైగా ఐటీ ఉద్యోగులు ఉన్నారు. వీరు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను నడిపించే చోదకశక్తిగా మారినప్పటికీ ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోలేకపోతున్నారు. తద్వారా రానున్న సంవత్సరాల్లో 30 ఏళ్లు 40 ఏళ్ల వయస్సు ఉద్యోగుల్లో నాన్–కమ్యూనికబుల్ డిసీజెస్ (ఎన్సిడి)లో భారీ పెరుగుదల కనిపించనుంది. నగరానికి చెందిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ (ఎన్ఐఎన్) పరిశోధకులు మాదాపూర్లోని హైటెక్ సిటీలోని ఐటీ సెక్టార్లో ఇటీవల వర్క్ప్లేస్ వెల్నెస్ స్టడీ వెల్లడించిన విషయం ఇది. ఈ అధ్యయనం న్యూట్రియెంట్స్ జర్నల్లో ప్రచురితమైంది. అంతర్గత అధ్యయనాల్లోనూ.. ఇదే విధంగా పలు సంస్థలు నిర్వహిస్తున్న అంతర్గత అధ్యయనాల్లోనూ ఇలాంటి ఫలితాలే వస్తున్నాయి. ఎస్ఓఐ హెల్త్కేర్ అనే ఒక వెల్నెస్ సంస్థ జరిపిన అధ్యయనంలో అత్యధికంగా టెక్ ఉద్యోగులు మెడనొప్పి, హైపర్ టెన్షన్, లోయర్ బ్యాక్ పెయిన్, సరై్వకల్ స్పాండిలైటిస్తో బాధపడుతున్నారని తేల్చింది. అలాగే కార్పల్ టన్నెల్ సిండ్రోమ్.. అనే చేతులకు సంబంధించిన సమస్యతో, లోయర్ బ్యాక్కి కాళ్లకు కలిపి నొప్పులు అందించే సాక్రోలియక్ జాయింట్ డిస్ఫంక్షన్తో పలువురు ఇబ్బంది పడుతున్నారని స్పష్టం చేసింది. టెక్నోపార్క్ అంతర్గతంగా చేయించుకున్న అధ్యయనం ఇది. ఫలితం అంతంతే.. గత ఐదు సంవత్సరాల్లో, చురుకైన జీవితం ద్వారా ఆరోగ్యవంతమైన జీవనాన్ని ప్రోత్సహించడంలో అనేక స్వచ్ఛంద సంస్థలు, కంపెనీల హెచ్ఆర్ విభాగాలతో కలిసి పాలుపంచుకుంటున్నాయి. అయినప్పటికీ కరోనా కారణంగా చాలా మంది ఉద్యోగులు మరింత నిశ్చల జీవనశైలికి అలవాటు పడ్డారని ఐటీ రంగ నిపుణులు అంటున్నారు. ‘చురుకైన జీవనశైలిని అలవర్చుకునే విషయంలో కొన్ని సంవత్సరాలుగా సానుకూల మార్పులు కనిపిస్తున్నాయి. జిమ్లో వర్కవుట్ చేయడం, రన్నింగ్, యోగా సెషన్లు, నడకలను ప్రోత్సహిస్తూ, ఆరోగ్యకరమైన జీవనంపై అవగాహనా సదస్సులు నిర్వహిస్తున్నాం. అయితే, ఇంకా చాలా పనులు చేయాల్సి ఉంది’ అని హైదరాబాద్ రన్నర్స్ వ్యవస్థాపక అధ్యక్షుడు రాజేష్ వెచ్చా చెబుతున్నారు.ఒత్తిడి ఫుల్.. శ్రమ నిల్.. నగర ఐటీ రంగంలో నిమగ్నమైన ఉద్యోగుల్లో ఎక్కువ మంది నిశ్చల జీవనశైలి కావడంతో శారీరక శ్రమ తక్కువ. మరోవైపు తీవ్ర పని ఒత్తిడి. ఈ కారణంగా సాఫ్ట్వేర్ ఉద్యోగులు గుండె జబ్బులు, రక్తపోటు, మధుమేహం, పక్షవాతం, దీర్ఘకాలిక కిడ్నీ, గుండె సంబంధిత సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితులు కొనసాగితే 26 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల మధ్య వయసు్కల్లో మెటబాలిక్ సిండ్రోమ్ (ఎంఇటీఎస్)కు అంతిమంగా నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్కు దారితీసే అవకాశం ఉందని అధ్యయనం హెచ్చరించింది. మగవారిలో 90 సెం.మీ లేదా అంతకంటే ఎక్కువ, మహిళల్లో 80 సెం.మీ లేదా అంతకంటే ఎక్కువ నడుము చుట్టుకొలత, ట్రైగ్లిజరైడ్స్ (టీజీ) స్థాయిలు 150 మి.గ్రా/డీఎల్ లేదా అంతకంటే ఎక్కువ, హై డెన్సిటీ లైపోప్రొటీన్ స్థాయి వంటివి ప్రమాద సంకేతాలుగా హెచ్చరించింది. ఆ అలవాట్లతో చేటు.. రోజుకు సగటున ఎనిమిది గంటలపైనే కూర్చుని ఉంటున్నారు. ఇదే కాకుండా తరచూ బయట, రెస్టారెంట్స్లో తినడం, వేళలు పాటించకపోవడం, తాజా పండ్లు, కూరగాయల వినియోగం స్వల్పంగా ఉండడం, పని ఒత్తిడితో తరచూ భోజనాన్ని మానేయడం, ఎయిర్ కండిషన్డ్ గదుల్లో ఉండడం.. వంటివి హానికరంగా మారుతున్నాయి. మొత్తం ఐటి ఉద్యోగుల్లో 20శాతం మంది మాత్రమే వారానికి 150 నిమిషాల పాటు శారీరక శ్రమ చేస్తున్నారు. మరోవైపు వర్చువల్ వర్క్ వారి పాలిట హానికరంగానే పరిణమిస్తోంది. వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్ మానసిక, శారీరక ఆరోగ్యానికి సమస్య తెచ్చిపెడుతోంది. ఈ నేపథ్యంలో కంపెనీలు దిద్దుబాటు చర్యలు ముమ్మరం చేసినట్టు తెలుస్తోంది.వాటిలో కొన్ని.. 👉వర్క్ ఫ్రమ్ హోమ్ ద్వారా సమస్యలు వస్తున్నప్పటికీ చాలా మంది దాన్నే ఎంచుకున్నారని ఈ పరిస్థితుల్లో పలు సంస్థలు ఉద్యోగిని బట్టి ఉద్యోగాన్ని, వర్క్ప్లేస్ని డిజైన్ చేసే ఎర్గోనామిక్స్ను పరిచయం చేస్తున్నాయి. 👉 ప్రతి 10 నిమిషాలకూ ఒకసారి కళ్లు బ్లింక్ చేయాలి లేదా సిస్టమ్ నుంచి బ్రేక్ తీసుకోవాలని టీసీఎస్ నోటిఫికేషన్స్ ఇస్తోంది. 👉 టెక్నోపార్క్ కంపెనీ.. తమ ప్రాంగణంలో వాక్ వే, యోగా సెంటర్స్.. వంటివి ఏర్పాటు చేసింది. అలాగే ఓపెన్ జిమ్, జాగింగ్ ట్రాక్, ఫుట్ బాల్ టర్ఫ్ వంటివి ప్లాన్ చేస్తోంది. 👉 కాలుష్యరహిత స్మార్ట్ బైక్స్ను ఇన్ఫోపార్క్ అందిస్తోంది. అలాగే వాటర్ ఫ్రంట్ వాక్ వే, జాగింగ్ ట్రాక్, స్విమ్మింగ్ పూల్ సైతం ప్లాన్ చేస్తోంది. 👉 జుంబా క్లాసెస్ నిర్వహిస్తున్న సైబర్ పార్క్.. త్వరలో ఫుట్ బాల్ టర్ఫ్ ఏర్పాటు చేయనుంది. -
లాంగ్వేజ్ ఫర్ ఎర్న్.. విదేశీ భాష.. విజయాలు లెస్స
కొత్త భాషలు నేర్చుకోవడం కొన్నేళ్ల క్రితం వరకూ కేవలం హాబీగా భావించేవారు. అయితే, ప్రపంచీకరణతో విదేశీ భాషా నైపుణ్యం ఆదాయమార్గంగా కూడా అవతరించింది. దీంతో వయసుతో సంబంధం లేకుండా నగరవాసుల్లోనూ విదేశీ భాషలపై ఆసక్తి పెరుగుతోంది. సంపాదన కోసమో, మరేదైనా లక్ష్యాలతోనో సీరియస్గా ఫారిన్ లాంగ్వేజెస్కు జై కొడుతున్నారు. ప్రస్తుతం ఫ్రెంచి, రష్యన్, స్పానిష్ చైనీస్ అరబిక్ వంటి అనేక విదేశీ భాషలు బాగా డిమాండ్లో ఉన్నాయి. ఇటీవలే కొరియన్ వెబ్సిరీస్, మ్యూజిక్కూ పెరిగిన ఆదరణ కొరియన్ భాషా పరిజ్ఞానంపై యువత ఆసక్తిని పెంచింది. విదేశీ భాషని అధ్యయనం చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. మన రెస్యూమ్ను బలోపేతం చేయడంతో పాటు పర్యాటక రంగంలో, గైడ్స్గా ఇతరత్రా రంగాల్లో రాణించడానికి, ట్రావెల్, బ్లాగులను తయారు చేయడం తదితర ఎన్నో రంగాల్లో ఉపాధి అవకాశాలను అందిస్తోంది. అంతేకాకుండా ప్రపంచం నలుమూలలకూ కమ్యూనికేట్ చేయగలిగేలా చేస్తుంది. విదేశీ విశ్వవిద్యాలయలో ప్రవేశాలకు కూడా ఉపయుక్తం అవుతున్నాయి.. ప్రస్తుతం వర్క్ కల్చర్, ఆన్లైన్ ప్లాట్ఫారమ్లకు మారడంతో విదేశీ భాషా నైపుణ్యాలతో ఫ్రీలాన్సర్గా అవకాశాలు పెరిగాయి. ఓటీటీ తదితర వేదికల విజృంభణతో అనువాదకులకు భారీగా డిమాండ్ పెరగడం కూడా విదేశీ భాషలను క్రేజీగా మార్చింది. ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో అనేక ఉద్యోగ అవకాశాలతో జాతీయ, అంతర్జాతీయ బ్యాంకులు దేశ విదేశాలలో రాయబార కార్యాలయాలు, హై–కమిషన్లలో విదేశీ భాషా ఉపాధ్యాయులుగా కొనసాగడానికి వీలైన కోర్సులకు డిమాండ్ సంతరించుకుంటున్నాయి. ఫ్రెంచ్ పట్ల ఆసక్తి.. ప్రపంచవ్యాప్తంగా 30 కోట్ల మంది పైగా మాట్లాడే ఫ్రెంచ్ అత్యధికంగా మాట్లాడే భాషగా ఆరో స్థానంలో ఉంది. ఇది ఫ్రాన్స్, కెనడాతో సహా 29 దేశాల్లో అధికారిక భాష. ఫ్యాషన్, హాస్పిటాలిటీ, టూరిజంలో కెరీర్కు ఉపకరించే ఫ్రెంచ్ నేర్చుకోవడానికి విశ్వవ్యాప్తంగా విలువైన భాష. శిక్షణా తరగతులు..ఈ నేపథ్యంలో విదేశీ భాష నేర్చుకోవడంలో సహాయపడే అనేక అకాడమీలు, సంస్థలు నగరంలో వెలుస్తున్నాయి. ఆయా భాషల కోర్సు వ్యవధి సాధారణంగా ఆరు నుంచి 12 నెలల్లో పూర్తి చేసి ప్రొఫెషనల్ డిగ్రీని అందుకుంటారు. అయితే అనర్గళంగా మాట్లాడడం, చదవడం, రాయడం అర్థం చేసుకోవడంపై పూర్తి పట్టు సాధించేందుకు మరింత వ్య«వధి అవసరం అవుతుందని శిక్షకులు అంటున్నారు. ఇవి కాకుండా ఒక విద్యార్థి ఆ భాష చరిత్ర, భాష సంస్కృతి సంబంధిత దేశాల ప్రజలు, అర్థం చేసుకునే పద్దతి, ఆ భాష యాస, డిక్షన్ గురించి కూడా నేర్చుకుంటేనే పూర్తి అవగాహన వస్తుందని సూచిస్తున్నారు. విద్యార్థులు పదో తరగతి తర్వాత సరి్టఫికెట్ డిప్లొమా స్థాయి కోర్సు లేదా పన్నెండో తరగతి పూర్తి చేసిన తర్వాత విదేశీ భాషలో డిప్లొమా, అండర్ గ్రాడ్యుయేట్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సును అభ్యసించవచ్చు. నగరంలో ఇంగ్లిష్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్శిటీ, హైదరాబాద్, జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం, ఢిల్లీ విశ్వవిద్యాలయాలు వంటివి విదేశీ భాషల్లో సర్టిఫికెట్ కోర్సులను అందిస్తున్నాయి. అలాగే పలు ఆన్లైన్ లెరి్నంగ్ ప్లాట్ఫారమ్లలో విదేశీ భాషా కోర్సులను సులభంగా యాక్సెస్ చేయవచ్చు. స్పాని‹Ù.. జోష్.. దాదాపు 50 కోట్ల మందికి పైగా మాట్లాడే వారితో స్పానిష్ ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా మాట్లాడే భాషలలో రెండో స్థానంలో ఉంది. స్పానిష్ మాట్లాడే దేశాలతో మన దేశానికి ఇటీవల పెరుగుతున్న వాణిజ్యం దృష్ట్యా నేర్చుకోవడానికి అత్యధికులు ఆసక్తి చూపిస్తున్నారు. ప్రత్యేకించి అంతర్జాతీయ వ్యాపారం, ఆతిథ్యం పర్యాటక రంగంలో ఆసక్తి ఉన్న వారికి ఇది బెస్ట్. విన్.. జపాన్.. సాంకేతిక హబ్ హోదా, భారతదేశంతో బలమైన వాణిజ్య సంబంధాలు కలిగిన జపాన్ జపనీస్ అత్యధికులు కోరుకునే భాషగా మార్చాయి. ప్రపంచవ్యాప్తంగా 13 కోట్ల మందికి పైగా మాట్లాడే ఈ భాష సాంకేతికత, యానిమేషన్, గేమింగ్లో కెరీర్ను ఎంచుకున్న సిటీ యూత్ ఎంపికగా మారింది.జర్మన్కు జై.. ప్రపంచవ్యాప్తంగా 10 కోట్ల మందికి పైగా, యూరోపియన్ యూనియన్లో అత్యధికంగా మాట్లాడే భాష జర్మన్. జర్మన్ నేర్చుకోవడం ఇంజినీరింగ్, సాంకేతిక రంగాల్లో విభిన్న అవకాశాలకు తలుపులు తెరుస్తోంది.ఇదీ..ఇటాలియన్.. యూరోపియన్ యూనియన్లో అత్యధికంగా మాట్లాడే నాల్గో భాష ఇది. పర్యాటక కేంద్రంగా మరియు ఫ్యాషన్ మరియు డిజైన్కు కేంద్రంగా ఇటలీకి ఉన్న ప్రాచుర్యంతో ఫ్యాషన్, డిజైన్, హాస్పిటాలిటీలో కెరీర్ను లక్ష్యంగా చేసుకున్న సిటీ విద్యార్థులకు రైట్ ఛాయిస్గా నిలుస్తోంది. మాండరిన్.. మంచిదే.. మనదేశపు అతిపెద్ద వ్యాపార భాగస్వామిగా చైనాను దృష్టిలో ఉంచుకుంటే.. అంతర్జాతీయ వ్యాపారం, దౌత్యం పర్యాటక రంగం కోసం మాండరిన్ నేర్చుకోవడం అవసరంగా మారింది. కో అంటే కొరియన్.. ప్రపంచవ్యాప్తంగా 75 కోట్ల మందికి పైగా మాట్లాడే కొరియన్కు నగరంలో బాగా డిమాండ్ ఉంది. ఆసియాలో మనదేశానికి మూడో అతిపెద్ద వాణిజ్య భాగస్వామి కొరియా కావడం సాంకేతిక, వినోద పర్యాటక రంగాల్లో ఈ భాషా నైపుణ్యానికి డిమాండ్ పెంచుతోంది.గ్రేస్.. పోర్చుగీస్.. బ్రెజిల్ పోర్చుగల్తో సహా ఎనిమిది దేశాల్లో మాట్లాడేది పోర్చుగీస్. ఈ దేశాలతో మనకు విస్తరిస్తున్న సంబంధాల కారణంగా పోర్చుగీస్ భాషలో ప్రావీణ్యం అనేది భవిష్యత్తు విజయాలకు బాట వేస్తుంది.పలు భాషల్లో ప్రావీణ్యం కోసం.. విదేశీ భాషా పరిజ్ఞానం వల్ల ఉపాధి అవకాశాలతో పాటు మరెన్నో ప్రయోజనాలను యువత ఆశిస్తున్నారు. గతంలో పదుల సంఖ్యలో మాత్రమే విద్యార్థులు కనిపించేవారు. ఇప్పుడు ఆ సంఖ్య వందలకు చేరింది. కెనడాలో ఉండే భారతీయులు కూడా ఆన్లైన్ ద్వారా మాకు స్టూడెంట్స్గా ఉన్నారు. నేర్చుకోవడం అనేది ఇలా సులభంగా మారడం కూడా విదేశీ భాషల పట్ల ఆసక్తిని పెంచుతోంది. – ఎం.వినయ్కుమార్, అసిస్టెంట్ ప్రొఫెసర్, ఫ్రెంచ్ భాషా విభాగం, ఉస్మానియా వర్సిటీ -
Younus Farhan: క్లౌడ్ ఫొటోగ్రఫీ.. ఓ మేఘ సందేశం
ఎల్లప్పుడూ నిశ్శబ్దంగా ఉండే మేఘాన్ని ఎప్పుడైనా పలకరించారా..?? ఒంటరిగా ఉండే ఆకాశంతో ఫ్రెండ్షిప్ చేశారా..?? అసలు ఆకాశం మేఘాల ఆకారంలో మనతో మాట్లాడుతుందని మీకు తెలుసా..? ప్రకృతి పంపిన సందేశం మేఘాలని మీకసలు తెలుసా...?? అయితే ఇవన్నీ నాకు తెలుసు అంటున్నారు నగరానికి చెందిన ప్రముఖ క్లౌడ్ ఫొటోగ్రాఫర్ యూనస్ ఫర్హాన్. మేఘంలో అమోఘం కనిపిస్తుంది అతడికి. స్కై కాన్వాస్పై నేచర్ చేసిన సిగ్నేచర్ను అతడి కెమెరా ఇట్టే బంధిస్తుంది. తను క్లిక్మనిపించే మేఘాల ఫొటోల్లో ఓ సందేశం ఉంటుంది. ఆత్మీయత, పర్యావరణం, సమానత్వం, జంతువులు, వింతలు, విశేషాలు.. ఇలా ఎన్నో.. ఎన్నెన్నో.. అతడి క్లౌడ్ ఫొటోగ్రఫీలో నిక్షిప్తమై ఉంటాయి. 2011లో మన భారత దేశానికి క్రికెట్ వరల్డ్ కప్ వస్తుందనే మేఘ సందేశాన్ని 3 నెలల ముందే క్లిక్మనిపించి అందరితో ఔరా అని అనిపించుకున్నారు. స్కూల్ కిటికీలోంచి కనిపించిన మేఘంతో మొదలైన తన ఫ్రెండిషిప్ ప్రకృతి సందేశానికి మేఘాలు వారధులని నిరూపించే వరకు వచి్చందని యూనస్ ఫర్హాన్ అంటున్నారు. ఇప్పుడు అతడి మనసంతా మేఘావృతమైంది. అసలు అతని ప్రయాణమేంటో.. ఆయన చెప్పే మేఘ సందేశమేంటో ఆయన మాటల్లోనే తెలుసుకుందామా..!? మేఘంతో నా సాన్నిహిత్యంచిన్నతనంలో 3 నుంచి 7వ తరగతి వరకు నల్లగొండలోని ఓ బోర్డింగ్ స్కూల్లో చదువుకున్నాను. అప్పుడు నాకున్న ఏకైక ఫ్రెండ్ మేఘం. అలా కదులుతూ వెళ్లే మేఘాలు నన్ను ఆకర్షించేవి. వాటి ప్రయాణంలో ఏదో అర్థం ఉందనిపించేది. వాటితో అలా మొదలైన నా స్నేహం 8వ తరగతిలో నాన్నకు ఉన్న చిన్న కీప్యాడ్ ఫోన్తో ఫొటోలు తీయడం నుంచి మరింత పెరిగింది. హాబీగా మొదలైన క్లౌడ్ ఫొటోగ్రఫీ కెరీర్గా మారింది. మొదట్లో మేఘాల్లో దాగి ఉన్న జంతువుల ఆకారాలను గుర్తించి క్లిక్మనిపించేవాడిని. అనంతరం అవే మేఘాలు నాకు చెప్పే కథలను ఫొటోలు తీయడం వరకూ సాగింది. ముఖ్యంగా 2011లో భారత్ వరల్డ్ కప్ గెలిచే కన్నా 3 నెలల ముందే.. వరల్డ్ కప్ ఆకారమున్న మేఘాలు నాకు ఆకాశంలో కనిపించాయి. వాటిని క్లిక్మనిపించాను. ఆ తరువాత అదే నిజమైంది. భారత్ వరల్డ్ కప్ గెలిచింది. అప్పుడు నా ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారి నాకు గుర్తింపునిచ్చాయి. ఆ సమయంలో నన్ను మొదట గుర్తించింది ‘సాక్షి’దినపత్రికనే. సాక్షి టీవీ స్టూడియోకు ఆహ్వానించి నా అభిరుచిని అభినందించింది. అనంతరం తెలంగాణ స్వరాష్ట్ర ఉద్యమం కొనసాగుతున్న సమయంలో, 2013 జూన్ 27న ఆకాశంలో తెలంగాణ రాష్ట్రాన్ని పోలిన మేఘం కనిపిస్తే, ఫొటో తీశాను. నాకు ముందే అందించిన మేఘ సందేశంలా దానిని భావించాను. ఇలా ఎన్నో విషయాలను నేను మేఘంలోనే వెతుక్కుంటాను. నార్కోటిక్స్ డే ప్రచారంగా.. నేను మొదటిసారి ఫ్లైట్లో ప్రయాణిస్తున్నప్పుడు ప్రకృతిలోని ప్రతీ జీవి సమానం అనే సందేశాత్మకంగా ఉన్న మేఘాన్ని బంధించాను. ధూమపానం ఆరోగ్యానికి హానికరం అని సందేశమున్న క్లౌడ్ షేప్ను కూడా ఫొటో తీశాను. వరల్డ్ నార్కోటిక్స్ డే రోజు నేను తీసిన ఫొటోను సంబంధిత శాఖ అధికారులు అధికారికంగా ఆవిష్కరించారు. అంతేకాకుండా పోలీసు శాఖకు చెందిన వీసీ సజ్జనార్, సీవీ ఆనంద్, మహేష్ భగత్ వంటి అధికారులు ఈ ఫొటో పోస్టర్లను ప్రత్యేకంగా ఆవిష్కరించి అభినందించారు. బయోడైవర్సిటీ, పర్యావరణం, జంతువులకు సంబంధించి నేను తీసిన పలు మేఘాల ఫొటోలు నన్ను ప్రపంచానికి పరిచయం చేశాయి. భాషా సాంస్కృతిక శాఖ ప్రోత్సాహం సోషల్ మీడియాలో నా క్లౌడ్ ఫొటోగ్రఫీ గురించి తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ నా ఫొటోలకు సముచిత స్థానాన్ని కలి్పంచారు. రవీంద్ర భారతిలో మొదటి క్లౌడ్ ఫొటోగ్రఫీ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసేందుకు ప్రోత్సాహం అందించారు. అనంతరం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ లిటరరీ ఫెస్టివల్లో, ఇతర కాలేజీల్లో ఫొటో ఎగ్జిబిషన్లు ఏర్పాటు చేశాను. మేఘాల్లో దాగి ఉన్న జంతువుల ఫొటోలు నచ్చి నగరంలోని జవహర్లాల్ నెహ్రూ జులాజికల్ పార్క్ వారు ఆహా్వనించగా అక్కడ కూడా ప్రదర్శించాను. మైసూర్ యూనివర్సిటీ, బెంగుళూరు యూనివర్సిటీలో కూడా క్లౌడ్ ఫొటోగ్రఫీ ఎగ్జిబిషన్లు ఏర్పాటు చేశాను. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి చేరాలి2009 నుంచి ఇప్పటి వరకు దాదాపు 9 వేల సందేశపు మేఘాలను నా కెమెరాలో బంధించాను. నేను ఫొటోగ్రఫీలో ఎలాంటి కోర్సులు చేయలేదు. ప్రకృతి తన సందేశాన్ని సమాజానికి అందించడానికి నన్నొక వారధిలా మార్చుకుందని నమ్ముతాను. ప్రస్తుతం మాస్టర్స్ హిస్టరీ చేస్తున్నాను. తెలంగాణతోపాటు అరబ్ దేశాలు, అమెరికా వంటి దేశాలను పర్యటించి క్లౌడ్ ఫొటోలను తీయాలి. ఈ మేఘసందేశాన్ని ఒక సబ్జెక్ట్ లేదా థియరీలా ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ఆవిష్కృతం చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నాను. – యూనస్ ఫర్హాన్ క్లౌడ్ ఫొటోగ్రాఫర్ -
సీటీ చెఫ్.. టేస్ట్కి కేరాఫ్
చారిత్రకంగా విభిన్న రకాల వంటకాలకు ప్రసిద్ధి చెందిన మన నగరం విశ్వనగరిగా మారే క్రమంలో అంతర్జాతీయ రుచులకూ కేరాఫ్గా మారుతోంది. ఈ నేపథ్యంలోనే నగరం పాకశాస్త్ర ప్రావిణ్యులు, నలభీముల నిలయంగా వర్ధిల్లుతోంది. ఒకప్పుడు స్టార్ హోటల్స్కు మాత్రమే పరిమితమైన చెఫ్ అనే పదం.. ఇప్పుడు రెస్టారెంట్స్, కేఫ్స్, ఆఖరికి ఇంటి వంటకు పేరొందిన హోమ్ చెఫ్స్ దాకా కూడా విస్తరించింది. ఈ నేపథ్యంలో నగరంలో కొంతకాలంగా భోజనప్రియులకు సేవలు అందిస్తున్న కొందరు చెఫ్స్ పరిచయం.. శంషాబాద్ విమానాశ్రయంలో ఉన్న నోవోటెల్ హైదరాబాద్ ఎగ్జిక్యూటివ్ చెఫ్గా ప్రస్తుతం సేవలు అందిస్తున్న అమన్న రాజు.. సిటీలోని టాప్ చెఫ్స్లో ఒకరు. ఆయన 2012లో జరిగిన సిఒపి 11 ఇంటర్నేషనల్ క్లైమేట్ మీటింగ్లో ఆహార తయారీ బృందానికి సారథ్యం వహించినందున ఆయన పాకశాస్త్ర నైపుణ్యం గ్లోబల్ స్టాండర్డ్స్ను అందుకుంది. లాస్ ఏంజిల్స్లోని ఐకాన్ ప్రధాన కార్యా లయం ప్రశంసలు మొదలుకుని 2014లో అకార్ చెఫ్ అవార్డు రాయల్ కరీబియన్ నుంచి క్యులినరీ సీ అవార్డ్స్తో సహా ప్రతిష్టాత్మకమైన పురస్కారాలు పొందారు. రాడిసన్ బ్లూ ప్లాజా, నోవాటెల్ హైదరాబాద్ కన్వెన్షన్ సెంటర్, హాలండ్ అమెరికా క్రూయిస్ లైనర్స్ వంటి ప్రసిద్ధ హాస్పిటాలిటీ సంస్థల్లో పనిచేశారు. దేశ ప్రధాని నరేంద్రమోదీ టైగర్ రిజర్వ్ సందర్భంగా ఒకసారి, అలాగే ఎన్నికల ప్రచారంలో మరోసారి ప్రత్యేక చెఫ్గా వండి వడ్డించిన ఘనత కూడా ఆయన దక్కించుకున్నారు. విజయాలు ‘అమేయం’.. 2 దశాబ్దాల కెరీర్లో పలు అవార్డులు గెలుచుకున్న చెఫ్ అమేయ్ మరాఠే. సన్–ఎన్–సాండ్ హోటల్స్, సెయింట్ వంటి కొన్ని అగ్ర బ్రాండ్లతో అలాగే నగరంలోని లార్న్ హోటల్స్, హార్డ్ రాక్ ఇంటర్నేషనల్, ఇన్వెన్యూ హాస్పిటాలిటీ, ఓహ్రీస్ – ప్యారడైజ్లకూ సేవలు అందించారు. ప్రస్తుతం చెఫ్ అమేయ్.. హాస్పిటాలిటీ పరిశ్రమలో కన్సలి్టంగ్లో ఉన్నారు. అలాగే సొంతంగా జేఎస్ అమేయ్ ఫుడ్స్ను నిర్వహిస్తున్నారు. యువతను ఈ రంగం వైపు ప్రోత్సహిస్తూ తెలంగాణ చెఫ్స్ అసోసియేషన్కు వైస్ ప్రెసిడెంట్గా ఉన్నారు.ప్రస్తుతం వివాహ భోజనంబు రెస్టారెంట్కు సేవలు అందిస్తున్న అనుభవజ్ఞులైన చెఫ్ యాదగిరి నగరంలో చెఫ్స్ పదుల నుంచి వందలు వేలకు చేరుతున్న పరిస్థితుల్లో.. చెఫ్ కమ్యూనిటీలో యూనిటీ తీసుకువచ్చి సంఘటితం చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. హ్యాండ్స్ ఇన్ హాస్పిటాలిటీ చెఫ్స్ అసోసియేషన్ తరఫున పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా చెఫ్స్ కాలనీకి రూపకల్పన చేయడం, యువతను హోటల్ మేనేజ్మెంట్ రంగం వైపు ఆకర్షించేందుకు సీనియర్ చెఫ్స్కి గుర్తింపును ఇచ్చేందుకు పలు కార్యక్రమాలు నిర్వహించడం, ప్రత్యేక ఆర్టిఫిషియల్ రంగులు తదితర అనారోగ్యకర ముడి పదార్థాల వినియోగాన్ని రూపుమాపేందుకు కృషి చేయడంతో పాటు గ్రామాల్లో నిరుపేదలకు ఉపకరించే పలు సేవా కార్యక్రమాలు సైతం ఆయన తమ సంస్థ తరఫున నిర్వహిస్తున్నారు.మాస్టర్ చెఫ్.. జన్మతః విశాఖపట్టణానికి చెందిన మహేష్ నగరంలో స్థిరపడి 22 సంవత్సరాల నుంచి చెఫ్గా ఉన్నారు. నగరంలో, బెంగుళూర్లో షెరటెన్ గ్రాండ్ గ్రూప్ ఆధ్వర్యంలోని రెస్టారెంట్స్లో సేవలు అందిస్తున్నారు. వెస్టిన్, మారియట్ హోటల్స్లో చేశాను. అమెరికాలో చేశాను. దేశంలో 35 రెస్టారెంట్స్లో చేశాను. విదేశాల్లో కూడా చాలా పేరొందిన రెస్టారెంట్స్లో చేశాను. 2010లో మారియట్ గ్లోబల్ రైజింగ్ స్టార్ చెఫ్స్ ఆఫ్ ద ఇయర్గా ఏసియాలో బెస్ట్ ఎగ్జిక్యూటివ్ చెఫ్ తదితర పురస్కారాలు దక్కించుకున్నారు. చెఫ్ అనే పదం అంటేనే తనకెంతో ప్రేమ అంటూ మెడమీద పచ్చ»ొట్టు సైతం పొడిపించుకున్న మహేష్.. ఆ ప్రేమతోనే దాదాపు 1,000 మందికిపైగా చెఫ్స్ను తయారు చేశానని సగర్వంగా చెబుతారు.క్రూయిజ్ నుంచి సిటీ దాకా... దశాబ్దంన్నరగా సిటీలో సేవలు అందిస్తున్న చెఫ్ నరేష్ ముంబైలోని ఐటీసీ గ్రాండ్ మరాఠా వంటి భారీ హోటళ్లు, క్రూయిజ్ లైనర్స్లలో కూడా పనిచేశారు. గ్రాండ్ హయత్ రీసార్ట్ అండ్ స్పా, ఫ్లోరిడా ఐడా క్రూయిజ్లో తనదైన ముద్ర వేశారు. హల్సియోలో సౌస్ చెఫ్గా వంటగది. కొత్త రకం వంటకాలను సృష్టించడంలో బిజీగా ఉన్నారు. మాదాపూర్లోని సి–గుస్తా రెస్టారెంట్ను నిర్వహిస్తున్న హల్సియోన్ ఫుడ్కు కార్పొరేట్ చెఫ్గా నరేష్ సేవలు అందిస్తున్నారు. టైమ్స్ దినపత్రిక ఆధ్వర్యంలో 2019 సంవత్సరపు ఉత్తమ చెఫ్ని గెలుచుకున్నారు. -
ఫుల్ ట్రెండ్ వేగన్ డైట్
చాలామందికి ముక్క లేనిదే ముద్ద దిగదు. కొందరు మాత్రం మాంసాహారం ముట్టరు. కొందరేమో కొన్ని ప్రత్యేక వారాల్లో నాన్వెజ్ తినరు. కానీ మరికొందరు మరీ ప్రత్యేకం.. ఎందుకంటే వారు నాన్వెజ్ మాత్రమే కాదు.. కనీసం జంతువుల నుంచి తయారైన ఉత్పత్తులే తినరు. వారినే ఇప్పుడు వేగన్స్ అంటున్నారు. ఇటీవల వేగనిజం కాన్సెప్్టకు చాలామంది ఆకర్షితులవుతున్నారు. ఖచి్చతంగా పాటిస్తున్న వారి సంఖ్య భారీగా పెరుగుతున్నారు. అసలు వేగనిజం అంటే ఏంటి.. అసలు అటువైపు ప్రజలు.. ముఖ్యంగా యువత ఎందుకు మొగ్గు చూపుతున్నారని పరిశీలిస్తే పర్యావరణ పరిరక్షణ, జీవహింసకు దూరంగా ఉండాలని చాలామంది పేర్కొంటున్నారు. పర్యావరణ, జంతు ప్రేమికుల్లో వేగన్గా మారాలన్న ఆలోచనలు పెరుగుతున్నాయి. తీసుకునే ఆహారంలో పోషకాలు కావాలంటే ఒక్క మాంసాహారమే తినాల్సిన అవసరం లేదు. శాఖాహారంలోనూ శరీరానికి అవసరమైన విటమిన్లు, పోషకాలు, ప్రోటీన్లు లభిస్తాయని గట్టిగా నమ్ముతున్నారు. దీనికి సంబంధించిన స్టడీస్ ఆధారాలను ముందుంచుతున్నారు. జంతువుల నుంచి వచ్చే ముడిసరుకు ఆధారంగా తయారయ్యే ఉత్పత్తుల వలన కలిగే లాభాలు ఏంటి, వాటికి శాఖాహారపరంగా ప్రత్యామ్నాయాలను ఎలా సమకూర్చుకోవాలనే ఆలోచనలకు పదును పెడుతున్నారు.మాంసాహారం వల్ల తలెత్తే ఆరోగ్య సమస్యలకు ఎక్కువగా వినియోగించే కోడినే ఉదాహరణగా చూపిస్తున్నారు. ఒక కోడి పెరగడానికి ఎన్ని రోజులు పడుతుంది. వేగంగా పెరగడానికి ఇస్తున్న స్టెరాయిడ్స్ వంటివి మానవ శరీరంపై ఎలాంటి దుష్ప్రభావాలు చూపిస్తాయనే అంశాలను వివరిస్తున్నారు. అలాగే ప్రతి విషయంలోనూ ప్రస్తుత పరిస్థితుల్లో మాంసాహారం వల్ల రోగాలు కొనుక్కునట్లే అవుతుందని అభిప్రాయపడుతున్నారు. ఇటువంటి వాటికి దూరంగా ఉండి, ప్రకృతి సిద్ధమైన శాఖాహారం తీసుకోవడానికే ఇష్టపడుతున్నారు. నగరంలో పూర్తిగా కాకపోయినా వారంలో ఒకటి రెండు రోజులైనా పూర్తిస్థాయి వేగన్గా మారిపోవాలని కోరుకుంటున్నారు. గత రెండేళ్లలో ఇటువంటి వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. వీళ్లకు అనుగుణంగా నగరంలోని పలు ప్రైమ్ ప్రాంతాల్లో వేగన్స్ ఫుడ్ స్టాల్స్ ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నారు. పూర్తి శాఖాహార ఉత్పత్తులు అక్కడ లభిస్తున్నాయి.జీవన విధానంలో మార్పు కోరుకున్నా.. ఒక కోడి లేదా మేక పెరగాలంటే కనీసం మూడు నెలల నుంచి రెండు మూడేళ్లు పడుతుంది. దాన్ని ఒక్క రోజులో తినేస్తారు. ఆ జంతువు పెరగడానికి ఎన్ని ప్రకృతి వనరులు కావాలి. అంటే రెండేళ్ల రిసోర్సెస్ను ఒక్క పూటలో ఆరగించేస్తున్నామన్నమాట. మాంసం తింటేనే ప్రోటీన్లు అంటారా.. వాటికి ఎక్కడి నుంచి ప్రోటీన్ వస్తుందో అదే ఆహారం మనం తీసుకుంటే సరిపోతుంది కదా.. వేగన్గా మారడానికి ప్రకృతి, జీవహింస మాత్రమే కాదు. నా జీవన విధానంలో మార్పు కోరుకున్నా.. ఆచరిస్తున్నా. ప్రతివారం చెరువుల్లో ప్లాస్టిక్ వ్యర్థాల తొలగింపు, పక్షుల సంరక్షణకు కార్యక్రమాలకు సమయం కేటాయిస్తా. – వినయ్, ఆర్కిటెక్ట్ఆరేళ్ల నుంచి ఆచరిస్తున్నాను నాకు జీవహింస చేయడం నచ్చదు. అందుకే వాటి నుంచి వచ్చే ఉత్పత్తులకు దూరంగా ఉంటాను. కాల్షియం కోసం పాలు తాగుతున్నాం.. నువ్వులు వినియోగిస్తే మన శరీరానికి అవసరమైన కాల్షియం వస్తుంది. పాలు కావాలంటే సోయాబ్సీన్తో తయారు చేసుకోవచ్చు. శాఖాహారంలోనూ పోషకాలన్నీ లభిస్తాయి. మాంసాహారమే కాదు లెదర్ బెల్టు, పర్సు, బూట్లు, జంతువుల నుంచి వచ్చే ఏ వస్తువులను వినియోగించను. సిల్క్ తయారు చేయడానికి లక్షల పురుగులను చంపాల్సి వస్తుంది. సిల్క్ వస్తువులకు దూరం. చికెన్ వంటి వంటకాలతో ఆరోగ్య సమస్యలు తెచ్చుకుంటున్నారు. ఆరేళ్ల నుంచి పూర్తిగా మారిపోయాను. – అఖిల్, హైదరాబాద్ -
హ్యాపీ వెడ్డింగ్.. నగరంలో పెళ్లి సందడి మొదలు
గ్రేటర్లో పెళ్లి సందడి మొదలైంది. వచ్చే నెల నుంచి వివాహ ముహూర్తాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో నగరంలోని కన్వెన్షన్ సెంటర్లు, బాంకెట్ హాళ్లు, కమ్యూనిటీ సెంటర్లకు డిమాండ్ ఏర్పడింది. మరోవైపు వధూవరులు పెళ్లి షాపింగ్లతో నగరంలోని జ్యువెలరీ షోరూమ్లు, షాపింగ్ మాళ్లలో రద్దీ మొదలైంది.. అంగరంగ వైభవంగా వివాహ వేడుకలను తీర్చిదిద్దేందుకు వెడ్డింగ్ ప్లానర్లు, అలంకరణ డిజైనర్లు తమ పనుల్లో బిజీగా ఉన్నారు. ముహూర్తాలు ఇవే.. దీపావళి తర్వాతి నవంబర్ 12 నుంచి ఫిబ్రవరి వరకూ వివాహాలకు శుభ ముహూర్తాలని పండితులు చెబుతున్నారు. నవంబర్ 12, 13, 17, 22, 23, 25, 26, 28, 29 తేదీల్లో వివాహాలకు శుభ ముహూర్తాలుగా ఉన్నాయి. అలాగే డిసెంబర్ 3, 4, 5, 9, 10, 11, 14, 15 తేదీలు కూడా శుభప్రదమే. దీంతో నగరంలో పెళ్లి హడావుడి మొదలైంది.హాళ్లు.. హౌస్ఫుల్.. ఓ వైపు పెళ్లి సందడి.. మరోవైపు నూతన సంవత్సర వేడుకలు కూడా రానుండటంతో చాలా మంది వివాహ కుటుంబాలు ఒకటి రెండు నెలల ముందే రిసార్ట్స్, హోటళ్లలోని ఫంక్షన్ హాళ్లను బుకింగ్ చేసుకున్నారు. కన్వెన్షన్ సెంటర్లు, కమ్యూనిటీ హాళ్లలో బుకింగ్స్ జోరుగా సాగుతున్నాయి. కొంపల్లి, శామీర్పేట, తుర్కపల్లి, తిమ్మాపూర్, షాద్నగర్, మొయినాబాద్, చేవెళ్ల, ఘట్కేసర్ వంటి శివారు ప్రాంతాల్లోని కన్వెన్షన్ సెంటర్లు, రిసార్ట్లతో పాటు బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, నానక్రాంగూడ, గచి్చ»ౌలి వంటి ప్రధాన నగరంలోని స్టార్ హోటళ్లలోని బాంకెట్, పార్టీ హాల్స్ అన్నీ ఇప్పటికే హౌస్ఫుల్ అయ్యాయి. కూరగాయల ధరలు పెరగడంతో.. కూరగాయల ధరలు పెరుగుదల కూడా పెళ్లింట భారంగా మారింది. టమోట, బెండకాయ, ఉల్లిగడ్డ, మిర్చిలతో పాటు వంట నూనె, పన్నీర్ వంటి ఆహార ఉత్పత్తుల ధరలు భారీగా పెరిగాయి. దీంతో ఫుడ్ క్యాటరర్స్ ప్లేట్కు రూ.350 నుంచి రూ.1,500 వరకూ చార్జ్ చేస్తున్నారు. ఇక మాంసాహార భోజనమైతే అంతకుమించి అన్నట్లు ఉంది. థీమ్స్, కాన్సెప్ట్లతో బిజీ.. ఉన్నత వర్గాల కుటుంబాలు, ఉద్యోగస్తులైన వధూవరులు ప్రత్యేకమైన థీమ్లు, కాన్సెప్్టలతో మండపాల అలంకరణ కోరుతున్నారు. ప్రీ–వెడ్డింగ్ ఫొటో షూట్లకూ ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో ఆయా పెళ్లి వేడుకలు, ఫొటో షూట్లు వైభవంగా, సజావుగా జరగడానికి ఈవెంట్, వెడ్డింగ్ ప్లానర్లు, ఫొటో గ్రాఫర్లు బిజీ బిజీలో గడుపుతున్నారు. మరోవైపు కళ్యాణ మండపాల నిర్వాహకులు సుమారు 300 నుంచి 700 మంది అతిథులు హాజరయ్యేలా వేడుకలను సిద్ధం చేస్తున్నారు. ఇందుకోసం బాంకెట్ హాల్, పార్టీ లాన్స్, కన్వెన్షన్ సెంటర్ల అద్దె రోజుకు రూ.లక్ష నుంచి రూ.10 లక్షల వరకూ వసూలు చేస్తున్నాయి.ప్రీ వెడ్డింగ్ షూట్స్ షురూ.. వివాహ వేదికలు లగ్జరీగా ఉండాలని వధూవరులు భావిస్తున్నారు. ఖర్చుకు వెనకాడట్లేదు. వారి అభిరుచులకు తగ్గట్టుగా, సంప్రదాయాలను ప్రతిబింబించేలా మండపాలు, వేదికలు ఉండేలా అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారు. లావెండర్, వింటేజ్ వంటి థీమ్లతో ప్రాంగణాలను అద్భుతంగా అలంకరిస్తున్నారు. ఇక ప్రీ–వెడ్డింగ్ షూట్స్తో ప్రొఫెషనల్ ఫొటోగ్రాఫర్లు బిజీగా ఉన్నారు. హైదరాబాద్లో చారి్మనార్, గోల్కొండ కోట, రామోజీ ఫిల్మ్ సిటీ, చౌమోహల్లా ప్యాలెస్, తారమతి బారాదరి, బొటానికల్ గార్డెన్, కుతుబ్షాయి టూంబ్స్ వంటి ప్రాంతాల్లో ప్రీ–వెడ్డింగ్ షూట్స్తో సందడి నెలకొంది. దీంతో పాటు ఫుడ్ క్యాటరర్స్, మెహందీ ఆరి్టస్ట్లు, ఫొటోగ్రాఫర్లు, బాజా భజంత్రీలకు ఫుల్ డిమాండ్ ఏర్పడింది.శానిటైజేషన్, భద్రతకే అధిక ప్రాధాన్యం..పెళ్లి సీజన్తో పాటు న్యూ ఇయర్ కూడా రానుండటంతో రిసార్ట్లోని వెడ్డింగ్ జోన్స్, హోటళ్లలోని బాంకెట్, పార్టీ లాన్స్కు డిమాండ్ ఎక్కువగా ఉంది. అతిథులకు వేడుకల్లో ఎలాంటి ఇబ్బందులూ కాకుండా శానిటైజేషన్, భద్రతా ఏర్పాట్లను చేస్తున్నారు. ఈ తరహా ఈవెంట్ సెంటర్లు ఇప్పటికే చాలా వరకూ బుక్ అయ్యాయి. – డాక్టర్ కిరణ్, సీఈఓ, సుచిరిండియా గ్రూప్ -
హల్లో ప్లీజ్ హియర్..
ఇంట్లో, ఆఫీసుల్లో ల్యాప్టాప్స్ పట్టుకుని చెవులకు హెడ్ఫోన్స్ పెట్టుకుని పనిచేయడం, రోడ్డు మీద డ్రైవింగ్ చేసేటప్పుడు ఇయర్ బడ్స్ పెట్టుకుని సంగీతాన్ని ఆస్వాదించడం.. ఇవి సరిపోవన్నట్టు వీకెండ్స్లో పబ్స్, క్లబ్స్లో చెవులు చిల్లులు పడే మ్యూజిక్ హోరులో మునిగి తేలడం.. ఇవన్నీ నగరంలో టీనేజర్లు, యువత జీవనశైలిలో రొటీన్ పనులు. అయితే నేడు వీరు అనుసరిస్తున్న ఈ రకమైన పద్ధతులు రేపటి వారి వినికిడి లోపానికి కారణం కానున్నాయా? అంటే.. అవుననే సమాధానం ఇస్తున్నాయి అధ్యయనాలు. ఈ నేపథ్యంలో దీనిపై మరిన్ని విశేషాలు.. సురక్షితం కాని శ్రవణ పద్ధతులు అవలంబిస్తుండడం వల్ల ఒక బిలియన్ కంటే ఎక్కువ మందికి వినికిడి లోపం వచ్చే ప్రమాదం ఉందని తాజా పరిశోధనలో తేలింది. వీరిలో కూడా అత్యధికులు యువత, టీనేజర్లే కానుండడం ఆందోళనకరం. అమెరికాలోని శాన్ఫ్రాన్సిస్కోలో జరిగిన ఈ పరిశోధన ఫలితాలు బిఎమ్జె గ్లోబల్ హెల్త్ జర్నల్లో ప్రచురించారు. దీని ప్రకారం, పరిమితికి మించి స్మార్ట్ఫోన్లు, హెడ్ఫోన్లు ఇయర్బడ్లు వంటి వ్యక్తిగత శ్రవణ పరికరాలు (పర్సనల్ లిజనింగ్ డివైజెస్/పిఎల్డిలు) ఉపయోగించడం, పెద్దగా ధ్వనించే సంగీత వేదికలు యువత వినికిడి సామర్థ్యాన్ని దెబ్బతీస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా 24 శాతం టీనేజర్లు, 48 శాతం మంది యుక్తవయసు్కలు పరిమితికి మించి చెవులుకు పనిపెడుతున్నారని పరిశోధనలో తేలింది. ఈ సంఖ్యల ఆధారంగా, పరిశోధకులు ప్రపంచవ్యాప్తంగా 0.67, 1.35 బిలియన్ల మంది మధ్య, యుక్తవయసు్కలు వినికిడి లోపానికి గురయ్యే ప్రమాదం ఉందని కూడా పరిశోధకులు లెక్కగట్టారు.పరిమితి మీరుతున్నారు..గతంలో వెలువడిన ఓ పరిశోధన ఫలితాల ప్రకారం పీఎల్డీ వినియోగదారులు తరచూ 105 డెసిబుల్స్ కంటే ఎక్కువ వాల్యూమ్లను ఎంచుకుంటారు. వినోద వేదికలలో సగటు ధ్వని స్థాయిలు 104 నుండి 112 డెసిబుల్స్మించి ఉంటాయి.. అయితే వైద్యులు అనుమతించిన స్థాయి పెద్దలకు 80 డెసిబుల్స్. పిల్లలకు 75 డెసిబుల్స్ మాత్రమే కావడం గమనార్హం. ‘ప్రభుత్వాలు, స్వచ్ఛందసంస్థలు సురక్షితమైన వినికిడి మార్గాలను ప్రోత్సహించడం ద్వారా నష్ట నివారణకు ప్రాధాన్యత ఇవ్వడం అత్యవసరం’ అని ఈ సందర్భంగా పరిశోధకులు అభిప్రాయపడ్డారు.టిన్నిటస్ సమస్యే ఎక్కువ.. నన్ను కలిసిన నగరవాసుల్లో కొందరికి చిన్న వయసులోనే వినికిడిలోపాలతో పాటు టిన్నిటస్ అనే ఒక సమస్య పెరుగుతోందని కూడా గుర్తించాం. టిన్నిటస్ అంటే ఫోన్ రింగింగ్, ఇతర శబ్దాలు పదే పదే తలలో, చెవుల్లో గింగురుమనే ఫాంటమ్ సెన్సేషన్స్. కొంత మంది దీని వల్ల తీవ్రమైన అసౌకర్యానికి గురవుతున్నారు. అలాగే మరి కొందరు దీర్ఘకాలిక చెవినొప్పి అనుభవిస్తున్నారు. తీవ్రమైన శబ్దాలు, తద్వారా కలిగే అసౌకర్యాన్ని నిర్లక్ష్యం చేస్తే శాశ్వత వినికిడి లోపానికి దారి తీస్తాయి. అంతేకాదు వినికిడి సమస్యలు డిప్రెషన్, డిమెన్షియా, మతిమరుపు వ్యాధుల తీవ్రత పెరగడానికి కూడా కారణం అవుతాయి. – డా.ఎమ్.ప్రవీణ్కుమార్, ఇఎన్టీ వైద్యులు -
ఆపరేషన్.. ట్రాన్స్ ప్లాంటేషన్..
‘శ్రీశైలం రహదారిలో ఓ స్థల యజమాని తన ప్లాట్లో అడ్డుగా ఉన్న రెండు మర్రి చెట్లను కొట్టేసి రోడ్డు పక్కన నిర్జీవంగా పడేశాడు. ఇది చూసిన వృక్ష ప్రేమికులు వందేళ్ల వయసు ఉన్న ఈ చెట్లను కాపాడుకోవాలని భావించారు. మరి, అంత పెద్ద చెట్లు తరలించాలంటే భారీ క్రెయిన్, పెద్ద లారీ, కారి్మకులు అవసరం. వీటి ఖర్చు కోసం సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. దీంతో అమెరికాలో ఉంటున్న నాల్గో తరగతి అమ్మాయి స్పందించింది. చెట్లు తరలించేందుకు అయ్యే ఆర్థిక సహాయాన్ని అందించింది. అంతే ఈ చెట్లను అక్కడి నుంచి మణికొండలోని ఓ ప్రైవేటు పాఠశాలకు తరలించారు. ప్రస్తుతం ఆ చెట్టు స్కూల్ విద్యార్థులకు నీడనిస్తూ హాయిగా ఉంది.’ ‘ఓ ప్రభుత్వ బాలికల పాఠశాలలో భారీ వర్షానికి చీమ చింతకాయ చెట్టు కూలిపోయింది. ఆ చెట్టును ఎలాగైనా కాపాడాలని ప్రిన్సిపాల్ భావించారు. భారీ క్రెయిన్ సహాయంతో 300 మంది స్కూల్ విద్యార్థులు చూస్తుండగా ఆ చెట్టును తిరిగి భూమిలో పాతారు. ఇక అక్కడి నుంచి ప్రతి ఏటా జులై 23న స్కూల్ విద్యార్థులు, టీచర్లందరూ ఆ చెట్టుకు రాఖీ కడుతూ పండుగ చేసుకోవడం ఆనవాయితీగా మారింది.’ ఇలా ఒకటీ రెండూ కాదు కొత్త సచివాలయం, కూకట్పల్లిలో ఫోరం మాల్ బ్రిడ్జి నిర్మాణ సమయంలో అడ్డుగా ఉన్న వందలాది వృక్షాలను వాటా ఫౌండేషన్ దత్తత తీసుకుంది. వాటిని భారీ క్రెయిన్లు, లారీలతో వేరే చోటుకు తరలించింది. ఇప్పటి వరకూ 2,500కు పైగా వృక్షాలను వేరే చోటుకు తరలించింది. 2010 నుంచి హైదరాబాద్లో వాటా ఫౌండేషన్ చెట్ల దత్తత, తరలింపు సేవలను అందిస్తుంది. 10 మంది వలంటీర్లు ఉన్న ఈ ఫౌండేషన్ ఇప్పటివరకూ కేపీహెచ్బీ, ఎల్బీనగర్, గచి్చ»ౌలి, తెల్లాపూర్ వంటి నగరం నలువైపులా సుమారు 2,500 వృక్షాలను దత్తత తీసుకుంది. ఒక చోటు నుంచి వేరే చోటుకు చెట్టును తరలించేందుకు అవసరమైన జేసీబీ, క్రెయిన్, భారీ లారీ, కార్మికులు ఇతరత్రా ఖర్చులను చెట్లను దత్తత తీసుకునే వాళ్లు భరిస్తుంటారు. ఒకవేళ వాళ్లు చెట్టును మాత్రమే నిర్వహణ చేస్తాం.. ఖర్చు భరించలేం అంటే క్రౌండ్ ఫండింగ్ ద్వారా నిధులు సమీకరించి చెట్టును తరలిస్తారు. చెట్టు రూట్ ప్యాకింగ్, కొమ్మలు కత్తిరించడం, జేసీబీ, క్రెయిన్, పెద్ద లారీ వంటి వాహనాల ఏర్పాటు తదితరాల కోసం ఒక్క చెట్టును తరలించేందుకు 3 వారాల సమయం పడుతుంది.సచివాలయంలోని చెట్లు ఫామ్హౌస్కు.. కొత్త సచివాలయం నిర్మాణ సమయంలో అక్కడున్న వేప, సుబాబుల్, మర్రి, రావి, పెల్టోఫోరం, కొబ్బరు, కానుగ, గుల్మోహర్, రాయల్ ఫామ్, బాదం, చింత, నేరేడు వంటి చాలా చెట్లను కొట్టేశారు. వీటిలో వంద ఏళ్ల నాటి చెట్లను వేరే చోటుకు తరలించేందుకు వాటా ఫౌండేషన్ ముందుకొచ్చింది. 18 మర్రి చెట్లను శంషాబాద్లోని ఓ ప్రైవేట్ ఫామ్హౌస్లోకి తరలించారు. ఈ ఖర్చు మొత్తం ఆ ఫామ్హౌస్ యజమానే భరించారు. కూకట్పల్లిలో ఫోరం మాల్ దగ్గర బ్రిడ్జి నిర్మాణం సమయంలో అక్కడున్న వంద చెట్లను కొట్టేశారు. వీటిలో 70 వృక్షాలను మణికొండ స్మశానం, క్రికెట్ మైదానం చుట్టూ నాటారు.ఫామ్హౌస్, ఆఫీసుల్లో ఏర్పాటు.. రాజకీయ, సినీ, క్రీడా ప్రముఖుల ఇళ్లతో పాటు శామీర్పేట, చేవెళ్ల, గండిపేట, మహేశ్వరం, ఘట్కేసర్ వంటి నగరం నలువైపులా ఉన్న ఫామ్హౌస్లో ఇంటీరియర్ కోసం ఈ పెద్ద చెట్లను వినియోగి స్తున్నారు. ప్రముఖ దర్శకులు తమ ఫామ్హౌస్లో 3 మర్రి, 25 రావి చెట్లను ఏర్పాటు చేసుకున్నారు. పలు ప్రైవేట్ కంపెనీలు వారి కార్యాలయం చుట్టూ, ప్రధాన మార్గాలకు ఇరువైపులా ఈ చెట్లను ఏర్పాటు చేసుకుంటున్నారు. నీళ్లు పోస్తే సరిపోదు..వృక్షాలను ఎండాకాలంలో తరలించ కూడదు. రూట్ ప్యాకింగ్ చేసిన తర్వాత వేర్లు బలంగా, ఏపుగా పెరిగేందుకు ఎరువులు వేస్తారు. చెట్టు కొమ్మలు కత్తిరించి, చెదలు పట్టకుండా పెస్టిసైడ్స్ పూస్తారు. భూమిలో నుంచి చెట్టను తీసిన తర్వాత గంట వ్యవధిలోపు తిరిగి నాటాలి. లేకపోతే మనుగడ సాగించలేవు. చెట్టును ట్రాన్స్లొకేట్ చేసిన తర్వాత రెండేళ్ల పాటు దాని బాగోగులు చూసుకోవాలి. కేవలం నీళ్లు పోయడంతోనే సరిపోదు. చాలా మంది చెట్టుకు ఆకులు రాగానే నీళ్లు పోయడం ఆపేస్తారు.అనుమతిలో జాప్యమెందుకు? రాత్రికి రాత్రే దొంగతనంగా చెట్లు కొట్టేస్తే అడిగేవాళ్లు ఉండరు. కానీ చెట్లు సేవ్ చేస్తామని ముందుకొచ్చే వారికి అనుమతి ఇచ్చేందుకు 2–3 నెలల సమయం తీసుకుంటున్నారు. ఇది సరైనది కాదు. దీంతో స్థల యజమాని ఆగలేక చెట్లను కొట్టేసి రోడ్ల మీద పడేస్తున్నారు. నగరంలో చెట్ల సంరక్షణ కమిటీ ఉన్నా తూతూ మంత్రంగా పనిచేస్తోంది. – ఉదయ్ కృష్ణ, కో–¸ûండర్, వాటా ఫౌండేషన్ -
ఫెస్టివ్ లుక్.. ఫ్యాషన్ క్లిక్..
వరుసగా రెండు పెద్ద పండుగలు వచ్చేస్తున్నాయి. పుట్టినరోజులు, నైట్ పార్టిలు, వార్షికోత్సవాలు తదితర సందర్భాల్లో ధరించే దుస్తులతో నగరవాసులు అత్యాధునిక ఫ్యాషన్కు కేరాఫ్ అ‘డ్రెస్’లా మారిపోతారు. అయితే పండుగల సందర్భం మాత్రం పూర్తిగా విభిన్నం. తమ ఫెస్టివల్ లుక్ మోడ్రన్గా మెరిపించడంతో పాటు ట్రెడిషన్కు కేరాఫ్గా కూడా చూపించాలని తపిస్తారు. అలాంటి ఫ్యాషన్ ప్లస్ ట్రెడిషన్ ప్రియులైన నగర యువత కోసం నగరానికి చెందిన హామ్స్టెక్ ఫ్యాషన్ డిజైనింగ్ ఇన్స్టిట్యూట్ ఫ్యాకల్టీ పలు సూచనలు అందిస్తోంది. ఇటీవల గ్లోబల్ ఫ్యాషన్ ట్రెండ్ ద్వారా శారీ డ్రేపింగ్ స్టైల్స్ ప్రభావితమవుతున్నాయి. ముందుగా కుట్టిన చీరలు, ధోతీ స్టైల్ ప్యాంట్ తరహా చీరలు, కేప్ స్టైల్ డ్రేప్స్.. వంటి వినూత్న పద్ధతులు ప్రాచుర్యం పొందుతున్నాయి. ఈ స్టైల్స్లో అసిమెట్రికల్ కట్స్, స్ట్రక్చర్డ్ సిల్హౌట్లతో సహా పాశ్చాత్య ఫ్యాషన్ మేళవింపులతో విభిన్న రకాల మోడళ్లు మార్కెట్ను ముంచెత్తుతున్నాయి. ఇవి సంప్రదాయ చీరల్ని అత్యాధునికంగా మారుస్తాయి. వీటితోపాటు అనేక రకల సంప్రదాయ దుస్తులు ఫ్యాషన్ ప్రియులను ఆకర్షిస్తున్నాయి..డిజైనర్స్ సూచనలు.. పండుగ సీజన్లో స్టైలి‹Ùగా, సౌకర్యవంతంగా ఉండటానికి లైమ్ గోటా పట్టి ఉన్న చందేరి కార్డ్ సూట్ సెట్ను ఎంచుకోవచ్చు. ఇది మోనోక్రోమాటిక్ లుక్స్కి రంగురంగుల వైబ్స్ని జోడిస్తుంది. ఎంబ్రాయిడరీ చేసిన ఐవరీ కో–ఆర్డ్ షరారా పండుగ దుస్తులకు పర్ఫెక్ట్ క్లాసిక్ చిక్ రూపాన్ని అందిస్తుంది. బ్లేజర్లు కార్పొరేట్ స్టైల్కి మాత్రమే పరిమితం అనుకుంటారు. కానీ, ఇటీవల ఆల్–టైమ్ ఫేవరెట్గా మారాయి. ఒక ఎంబ్రాయిడరీ బ్లేజర్ను డ్రేప్డ్ స్కర్ట్ లేదా ధోతీ ప్యాంట్తో మేళవించాలి. నడుముకు బెల్ట్తో ఏ సమయంలోనైనా ఈ డ్రెస్ బెస్ట్ ఎంపికగా నిలుస్తుంది. ఈ నవరాత్రి రోజుల్లో మస్టర్డ్ షరారా చీర ధరిస్తే చాలా స్టైలి‹Ùగా, తేలికగా, సౌకర్యవంతంగా ఉంచుతుంది. డ్రేప్డ్ బాటమ్తో సెట్ చేసే డ్రెస్సులు ఇటీవల ట్రెండ్లో ఉన్నాయి. పర్ఫెక్ట్ ఈవెనింగ్ వేర్ కోసం డ్రేప్డ్ స్కర్ట్, ఎంబ్రాయిడరీ క్రేప్తో జత చేయాలి. అదనపు డోస్ కోసం సీక్వెన్స్ జుతీస్ బెస్ట్. పేస్టెల్, బ్రైట్ కలర్స్తో ఓ సరికొత్త చిక్ కాంబినేషన్. ఈ ఆఫ్–వైట్– పింక్ కేడియా టాప్, షెల్– మిర్రర్ ఎంబ్రాయిడరీ వర్క్ చేసిన షార్ట్ అవుట్ఫిట్తో ప్రకాశవంతమైన పసుపు ధోతీతో జతగా ధరించవచ్చు. ఆధునిక– సంప్రదాయాల సమ్మేళనంతో డిజైన్ చేసిన ఫ్లోరల్ ఎంబ్రాయిడరీ ప్యాటర్న్ ఉన్న స్కార్లెట్ సిల్క్ లెహెంగా పలాజో సెట్ ధరిస్తే..కలల రూపం సొంతమవుతుంది.. సల్వార్ కమీజ్ అందంగానూ, సౌకర్యవంతంగానూ ఉంటుంది. ప్రకాశవంతమైన రంగులతో కాటన్ ఫ్యాబ్రిక్ ఉన్నవి ఎంచుకోవచ్చు. వివాహాలు, పండుగలు.. వంటి ప్రత్యేక సందర్భాల్లో చనియా చోళీ ధరిస్తారు. వీటికి ఆధునిక ఉపకరణాలు, ఆభరణాలను జత చేస్తున్నారు. పిల్లల కోసమైతే తక్కువ బరువున్న ఆభరణాలను ఎంచుకోవాలి. పిల్లల దుస్తులను సొంతంగా లేదా ఒకదానితో ఒకటి సమన్వయం చేసుకోవచ్చు. పిల్లలతో సరిపోలే దుస్తులను ధరించడం వల్ల యూనిక్ ఫ్యామిలీ అనిపించుకోవచ్చు. పిల్లల దుస్తులు సౌకర్యంతో పాటు భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలి. పండుగ వేడుకల్లో డ్యాన్స్ చేసేటప్పుడు జారిపడకుండా ఉండేలా పొడవును, సౌకర్యాన్ని నిర్ధారించుకోవాలి. ప్రమాదాన్ని కలిగించేలా పదునైన ఉపకరణాలు, ఆభరణాలకు దూరంగా పెట్టాలి. పురుషుల కోసం.. ఎతి్నక్వేర్తో పండుగ లుక్ను మార్చుకోవాలని భావిస్తే.. కుర్తా కరెక్ట్. ఏ సందర్భానికైనా నప్పే కాలాతీత ఫ్యాషన్గా కుర్తాను ఎంచుకోవచ్చు. సరైన రీతిలో ఫిట్ అయ్యే కుర్తా–పైజామా ఎల్లప్పుడూ స్టైలిష్ లుక్ని అందిస్తాయి. ఇంకొంచెం కొత్తగా కనిపించాలంటే.. కుర్తాకి నెహ్రూ జాకెట్ని జత చేయవచ్చు. మొత్తంగా మెరిపించే సత్తా ఈ కాంబినేషన్కి ఉంది. అదే విధంగా షేర్వానీలు కూడా వేడుకలకు నప్పే ఎంపికలు. పండుగలకు ఇవి సరైన ఛాయిస్. అలాగే దీపావళి పారీ్టలకు కూడా కరెక్ట్గా నప్పుతాయి. ఎరుపు రంగు షేడ్.. సంప్రదాయ పండుగల్లో చాలా అర్థవంతమైన వర్ణంగా పేర్కొంటారు. నేవీబ్లూ, బ్లాక్, వైట్, ప్లమ్, ఆలివ్ గ్రీన్.. కూడా నప్పే ఎంపికలే. యాక్సెసరీస్... భారీ ఆభరణాలను ఉపయోగించే బదులు బ్యాంగిల్స్, జూకాలు (చెవిపోగులు), బిందీలు, హెయిర్పిన్ వంటి తక్కువ బరువున్న వాటిని యాక్సెసరీస్గా ఎంచుకోవాలి. -
బ్యూటీ విత్ నేచర్!
అందం అంటే.. ఒకప్పుడు ఆడవారి సొంతం అనే భావన ఉండేది. కానీ ఇప్పుడు పురుషులు, స్త్రీలు అనే తేడా లేకుండా అందరూ అందంగా ఉండేందుకు తాపత్రయపడుతున్నారు. నగరంలో సౌందర్య సాధనాల మార్కెట్ భారీగా నడుస్తోంది. అయితే ఇప్పుడున్న యువత తాము వాడుతున్న బ్యూటీ ప్రొడక్ట్స్పై చాలా కచి్చతత్వంగా ఉంటున్నారు. ఎంతలా అంటే ప్రతి ఉత్పత్తిలో ఉన్న పదార్థాలను తరచి తరచి చూస్తున్నారు. వాటి గురించి గూగుల్లో వెతికి అవి తమపై ఎలా ప్రభావితం చేస్తాయి.. తమ శరీర తత్వానికి ఎలా సరిపోతాయి.. వాటిని వాడితే ఎంత ప్రమాదకరం వంటి అంశాలను తెలుసుకుంటున్నారు. మరికొందరు కెమికల్స్ తక్కువగా ఉండే హెర్బల్ ఉత్పత్తులను మాత్రమే వాడేందుకు మొగ్గు చూపుతున్నారు. ఇంకొందరైతే ప్యూర్ నేచురల్ ప్రొడక్ట్స్ కోసం ప్రయత్నిస్తున్నారు. యువతలో పెరుగుతున్న అవగాహన చర్మ సౌందర్యంతో పాటు, కేశ సంరక్షణ విషయంలో చాలా ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుత కాలంలో జుట్టు రాలిపోవడం సర్వసాధారణంగా మారింది. ఇక చర్మం కూడా నిగనిగలాడాలని, తెల్లగా ఉండాలని అనేక సౌందర్య సాధనాలను వాడుతున్నారు. అయితే వాటిలో కూడా కెమికల్స్ లేని నేచురల్ ప్రొడక్ట్స్ వాడితే భవిష్యత్తులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండబోవని నిర్ధారణ చేసుకున్న తర్వాతే వాటి జోలికి వెళ్తున్నారు. ముఖానికి వాడే ఉత్పత్తుల దగ్గరి నుంచి జుట్టుకు వాడే నూనెల వరకూ దాదాపు సహజసిద్ధంగా ఉండేలా చూసుకుంటున్నారు. ఉదాహరణకు కొబ్బరినూనె దుకాణాల్లో కొనడం కన్నా ఎక్కడైనా నేచురల్గా దొరుకుతుందేమోనని ఆన్లైన్లో వెతుకుతున్నారు. కోల్డ్ ప్రెస్స్డ్ కొబ్బరినూనె, ఆముదం నూనె కొనేవారి సంఖ్య కూడా పెరుగుతోంది. ఇలా ప్రతి సౌందర్యసాధనం సహజసిద్ధంగా ఉండేలా జాగ్రత్త పడుతున్నారు.కాస్త జాగ్రత్త మరి.. సహజసిద్ధంగా తయారు చేసిన ఉత్పత్తులు బాగానే పనిచేసినా.. గుడ్డిగా ఏదీ నమ్మకూడదని డెర్మటాలజిస్టులు హెచ్చరిస్తున్నారు. ఎవరికి ఎలాంటివి పనిచేస్తాయో.. ఎవరి శరీర తత్వానికి ఎలాంటి రెమెడీలు వాడితే బాగుంటుందో తెలుసుకున్న తర్వాతే వాడటం మంచిదని చెబుతున్నారు. ముందు మన చర్మ తత్వం, జుట్టు సాంద్రత తెలుసుకోవాలని పేర్కొంటున్నారు. కాగా, అన్ని వస్తువులు, అన్ని ఔషధాలూ అందరికీ సరిపోవని, ఎవరికి ఎలాంటివి వాడితే మంచిదో ఓ అవగాహనకు రావాలంటున్నారు. ఏదైనా సమస్యను ఎదుర్కొంటున్నప్పుడు ఒకసారి డెర్మటాలజిస్టును సంప్రదించి, దాని గురించి వారితో చర్చిస్తే మంచిదని సూచిస్తున్నారు. నిర్మొహమా టంగా వాడాలనుకుంటున్న ఉత్పత్తుల గురించి చెప్పి.. వారి సలహా మేరకు వాడాలని పేర్కొంటున్నారు. లేదంటే ఎంతకాలం ఎలాంటి ప్రొడక్ట్స్ వాడినా ప్రయోజనం ఉండకపోవచ్చని, అనవసరంగా సమయంతో పాటు డబ్బులు వృథా చేసుకోవద్దని హెచ్చరిస్తున్నారు. కొన్ని సార్లు చెట్టు నుంచి తీసిన పసరు వంటివి కూడా ఎంత మోతాదులో వాడుతున్నామో తెలియకుండా వాడితే దుష్పరిణామాలు ఉంటాయని, ఏదీ మోతాదుకు మించి వాడటం సరికాదని చెబుతున్నారు.అందరికీ అన్నీ సెట్ కావు.. ఇన్ఫ్లుయెన్సర్లు చెప్పిన రెమెడీలు అందరి చర్మతత్వం, కేశాలకు సరిపడకపోచ్చు. అందుకే ఏదీ గుడ్డిగా నమ్మడం సరికాదు. మనకు ఎలాంటి రెమెడీలు సరిపోతాయో చూసుకున్న తర్వాతే వాడటం మంచిది. ఏదైనా దీర్ఘకాలిక సమస్య ఉన్పప్పుడు హోం రెమెడీలు వాడటం అస్సలు మంచిది కాదు. సమస్య మరింత పెరిగే ప్రమాదం ఉంటుంది. ఏ సమస్యకైనా 60 శాతం మేర చికిత్స అవసరం పడుతుంది. 20 శాతం నేచురల్ ఉత్పత్తులు వాడటం వల్ల మెరుగవుతుంది. మరో 20 శాతం మేర రోజువారీ ఆహారపు అలవాట్లు, జీవన విధానంలో మార్పులు చేసుకుంటే మంచి ఫలితాలు వస్తాయి. హోం రెమెడీలతో సమస్యలను తీవ్రతరం చేసుకుని మా వద్దకు చాలామంది వస్తుంటారు. అందుకే నిపుణులను సంప్రదించాకే ఏది వాడాలనే దానిపై నిర్ణయం తీసుకోవాలి. – డాక్టర్ లాక్షనాయుడు, కాస్మెటిక్ డెర్మటాలజీ, ఏస్తటిక్ మెడిసిన్ఇన్స్టాలో వీడియోలు చూసి..సమాజంపై సోషల్ మీడియా ప్రభావం ఎంతగా ఉందో మనకు తెలిసిందే. ఇటీవల సౌందర్యాన్ని పెంపొందించేవంటూ.. పూర్వ కాలంలో పెద్దవాళ్లు వాడే వారంటూ పలు రకాల మొక్కల గురించి సామాజిక మాధ్యమాల్లో తెగ వీడియోలు చేస్తున్నారు. కొందరేమో వంటింట్లో సౌందర్యసాధనాలు అంటూ వీడియోలు పెడుతున్నారు. వాటివల్ల సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా నేచురల్గా అందంగా కనిపిస్తారని, చర్మ సమస్యలు తగ్గుతాయని, జుట్టు రాలిపోకుండా.. ఒత్తుగా పెరుగుతుందని సూచిస్తున్నారు. దీంతో చాలా మంది వీడియోలను చూసుకుంటూ ఇంట్లోనే సహజసిద్ధంగా ఉత్పత్తులను తయారుచేసుకుంటున్నారు. మళ్లీ పూర్వకాలంలోకి వెళ్తున్నారని చెప్పొచ్చు. -
ఓల్డేజ్.. ఓల్టేజ్..
చిన్న కుర్రాడిలాగా ఏంటీ ఆ డ్యాన్సులు? అంటూ ఎవరైనా ఆక్షేపించినా వెనకడుగు వేయనక్కర్లేదు. ఎందుకంటే డ్యాన్సులు చేస్తే వృద్ధుల్లో కుర్రతనం ఇనుమడిస్తుందని, వృద్ధాప్య ప్రభావం కనుమరుగవుతుందని సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. వృద్ధాప్యంపై యుద్ధంలో మిగిలిన అన్నిరకాల శారీరక వ్యాయామాల కన్నా డ్యాన్స్ ది బెస్ట్ అని తేల్చడం విశేషం. సిటీలోని ప్రతి డ్యాన్స్ స్టూడియో తమ నేమ్ బోర్డులో ఫిట్నెస్ అనే పదాన్ని చేర్చుకుంటున్న నేపథ్యంలో పెద్దవాళ్లు సైతం డ్యాన్సర్లుగా మారేందుకు ఇలాంటి సర్వే ఫలితాలు తోడ్పడనున్నాయి. వృద్ధాప్యాన్ని జయించడంలో శారీరక శ్రమను మించిన ప్రత్యామ్నాం లేదు. దీనిని ఇప్పుడిప్పుడే ఆధునికులు గుర్తిస్తున్నారు. జిమ్లు, యోగాసనాలు.. వగైరా ఎన్నో వ్యాయామ శైలులు.. ఒక్కో వ్యాయామం ద్వారా ఒక్కో రకమైన ప్రయోజనం. అదే క్రమంలో నృత్యం ద్వారా వృద్ధాప్యాన్ని జయించవచ్చని అధ్యయనాలు చెబుతున్నాయి.స్టడీ ఇదీ.. ఫలితం ఇదీ.. అన్ని వ్యాయామాలూ ఆరోగ్యానికి ఉపయోగపడేవే అయినా నృత్యం వల్ల వృద్ధాప్య సమస్యలకు చాలా మంచిదని ఫ్రంటియర్స్ ఇన్ హ్యూమన్ న్యూరోసైన్స్ జర్నల్లో ప్రచురించిన తాజా పరిశోధన నిర్ధారించింది. వయసు పరంగా మీదపడే శారీరక మానసిక సమస్యలను ఎదుర్కోడంలో ఎండ్యురెన్స్ట్రైనింగ్, డ్యాన్సింగ్ రెండింటి మధ్యా వ్యత్యాసాన్ని పరిశీలించినప్పుడు డ్యాన్స్ మరింత లాభదాయకమని తేలిందని పరిశోధనకు సారథ్యం వహించిన జర్మన్ సెంటర్ ఫర్ న్యూరో డీజెనరేటివ్ డిసీజెస్కు చెందిన డాక్టర్ కేథరిన్ అంటున్నారు. సగటున 68 ఏళ్ల వయసున్న వందలాది మందికి 18 నెలల పాటు నృత్య శిక్షణ, ఎండ్యురెన్స్, ఫ్లెక్సిబిలిటీ ట్రైనింగ్ ఇచ్చారు. అయితే వీరిలో నృత్యాన్ని ఎంచుకున్నవారి బ్రెయిన్లోని హిప్పో క్యాంపస్ ప్రాంతంలో మరింత ఆరోగ్యకరమైన వృద్ధి కనిపించింది. వృద్ధాప్య ప్రభావాన్ని పెంచి తత్సంబంధిత అల్జీమర్స్ తరహా వ్యాధుల్ని దరిచేర్చడంలో కీలకం ఈ ప్రాంతమే. ఈ పరిశోధన ఫలితాలను అనుసరించి బ్రెయిన్పై యాంటీ ఏజింగ్ ప్రభావాలను చూపే సరికొత్త ఫిట్నెస్ ప్రోగ్రామ్ను జిమ్మిన్ (జామ్మింగ్, జిమ్నాస్టిక్) అనే పేరుతో శబ్దాలను (మెలొడీస్, రిథిమ్) పుట్టించే ఒక కొత్త పద్ధతిని వీరు రూపొందించారు.నృత్యం ఆరోగ్యకరం.. ప్రతి ఒక్కరూ ఎంత కాలం వీలైతే అంత కాలం స్వతంత్రంగా, ఆరోగ్యవంతంగా జీవించాలని కోరుకుంటారు. శారీరక శ్రమ దీనికి ఉపకరిస్తుంది. దీనిలో నృత్యం భాగమైతే శరీరానికి, మైండ్కి కొత్త సవాళ్లను, చురుకుదనాన్ని అందించడం అనివార్యం అని నగరానికి చెందిన డ్యాన్స్ మాస్టర్ బాబీ అంటున్నారు. ముఖ్యంగా వృద్ధాప్యంలో ఉన్నవారికి ఇది మరింత మేలు చేస్తుందనేది తమ వద్ద శిక్షణకు వస్తున్నవారి విషయంలో రుజువైందన్నారు.ఇవీ తెలుసుకోండి.. శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి. అవయవాల పనితీరు మెరుగుపడుతుంది. అలాగే సంతోషకారక హార్మోన్లు విడుదల అవుతాయి అని ఆ్రస్టేలియాలోని క్వీన్స్ లాండ్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ (క్యుయుటి) కూడా నిర్ధారించింది. 👉అంతర్గత ఆరోగ్య సమస్యలున్నవారికి నృత్యాలు సరిపడవు. కాబట్టి నృత్యాన్ని ఎంచుకునే ముందు ఫ్యామిలీ డాక్టర్ అభిప్రాయం తీసుకోవడం అవసరం. 👉 సోలో డ్యాన్సింగ్ సులభమైనది, పెద్దలకు బాగా నప్పుతుంది. అదే విధంగా ఓరియంటల్ డ్యాన్స్, బాలె డ్యాన్స్, ఇండియన్ డ్యాన్స్, ట్యాప్ డ్యాన్స్.. వంటివి చేయవచ్చు. 👉మోకాలు, హిప్, కాలి మడమ నొప్పులు.. వంటివి ఉన్నవారి కోసం సీటెడ్ డ్యాన్స్ కూడా ఉంది. 👉బాల్ రూమ్ డ్యాన్స్నే సీనియర్స్ బాగా ఇష్టపడతారు.. ఎందుకంటే ఇవి కపుల్ డ్యాన్స్ క్లాసెస్ కావడంతో పెద్దలకు చాలా ఉపయుక్తం. – ఈ డ్యాన్సుల్లో ఇతరులతో సోషలైజింగ్ ఉంటుంది కాబట్టి, ప్రాధాన్యత కలిగిన వారిమే అనే అభిప్రాయంతో హుషారు వస్తుంది. 👉పెద్దల్లో ట్యాంగో, క్విక్ స్టెప్, వియన్నీస్ వాల్ట్జ వంటివి జ్ఞాపకశక్తి వృద్ధి చెందేందుకు దోహదం చేస్తాయి. 👉 చా– చా– చా, రుంబా, సాంబా, ప్యాసో.. వంటి విదేశీ నృత్యాలు చూడడానికి కాస్త సులభంగా అనిపించినా చేసేందుకు కొంత సంక్లిష్టంగా ఉంటాయి. అలాగే వీటికి మరింత శారరీక సామర్థ్యం అవసరం కాబట్టి వీటిని ఎంచుకోకపోవడమే ఉత్తమం. 👉లైన్ డ్యాన్సింగ్ పెద్ద వయసులో ఉన్నవారికి అత్యంత ఆదరణ పొందుతోన్న నృత్యశైలి. అమెరికాలో ఇది బాగా పాపులర్. ఈ నృత్యంలో డ్యాన్సర్లు ఒకరితో ఒకరు టచ్ చేయాల్సిన అవసరం ఉండదు. -
ఫీల్ గుడ్.. స్ట్రీట్ ఫుడ్!
స్ట్రీట్ ఫుడ్ అనగానే ఠక్కున గుర్తొచ్చే ప్లేస్ చార్మినార్. ఎంత రాత్రి అయినా సరే చార్మినార్ దగ్గరికి వెళ్తే చాలు ఎలాంటి ఫుడ్ కావాలంటే అలాంటి ఫుడ్ లాగించేయొచ్చు. మొఘల్ నుంచి నిజాం కాలం వరకూ ఏ రకం ఫుడ్ కావాలన్నా ఇక్కడ దొరుకుతుంది. పత్తర్ కా ఘోష్ చాలా ఫేమస్. ఒక్కసారైనా ఈ వంటకాన్ని టేస్ట్ చేయాలని అనుకుంటారు. హైదరాబాద్ కా ఫేమస్ హలీమ్, షావర్మా, కోవా జిలేబీ, కోవా గులాబ్జామ్, షాదూద్ మలాయ్, మాషా అల్లా ఫలూదా, టర్కిష్ మరగ్, సీక్ కబాబ్, ఫిర్నీ, హోటల్ షాబాద్లో నాస్టా, ఖట్టి కిచిడీ, కీమా, భాజీ గుర్డా, ఇరానీ చాయ్ ఇలా చెప్పుకొంటూ పోతే జాబితాకు ముగింపే ఉండదు. తెల్లవారుజాము వరకూ ఇక్కడి ఫుడ్ స్టాల్స్ కిటకిటలాడుతుంటాయి. నైట్ లైఫ్కి ఐకాన్..నైట్ లైఫ్కు హైదరాబాద్ ఐకాన్గా మారుతోంది. చాలా ప్రాంతాల్లో లేట్ నైట్ వరకూ ఫుడ్ స్టాళ్లకు అనుమతులు ఇస్తుండటంతో యూత్ కూడా వీకెండ్స్లో నైట్ లైఫ్ ఎంజాయ్ చేస్తోంది. నలుగురైదుగురు ఫ్రెండ్స్ కలిసి బైక్లు, కార్లలో నగరాన్ని రాత్రి వేళల్లో చుట్టేస్తున్నారు. ఉదయం సమయంలో ట్రాఫిక్తో విసిగిపోయిన వారు.. అర్ధరాత్రి ప్రశాంతమైన నగరాన్ని చూస్తూ మైమరిచిపోతున్నారు. మొజంజాహీ మార్కెట్, రాంకీబండి, సికింద్రాబాద్, లోయర్ ట్యాంక్బండ్, ఉప్పల్ భగా యత్.. నైట్లైఫ్కు కేంద్రాలుగా ఉంటున్నాయి. ఇక్కడ దొరికే స్ట్రీట్ ఫుడ్ను లొట్టలేసుకుంటూ తింటూ.. ఫొటోలు, వీడియోలు తీసుకుంటూ లైఫ్టైం మెమరీస్ దాచిపెట్టుకుంటున్నారు.ఫుడ్ హబ్గా సచివాలయం.. స్ట్రీట్ ఫుడ్ అనగానే ఇప్పటికీ చారి్మనార్ పేరే గుర్తొస్తుంది. కానీ ఇటీవల కాలంలో సచివాలయం చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలు స్ట్రీట్ ఫుడ్ హబ్గా మారాయి. రాత్రి పొద్దుపోయే వరకూ ఇక్కడ ఫుడ్ లవర్స్ రోడ్డు పక్కన దొరికే తినుబండారాలను తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ఫ్రెండ్స్, ఫ్యామిలీతో.. విద్యుత్ కాంతుల్లోని సచివాలయం, అమరవీరుల జ్యోతి చుట్టు పక్కల ప్రదేశాలు సందర్శకులతో రద్దీగా మారతాయి. చాట్ నుంచి చాక్లెట్ కేక్ వరకూ.. వెనీలా, చాక్లెట్ కప్ కేక్స్, మల్బరీ, స్ట్రాబెర్రీ చాక్లెట్, పానీపూరీ, చాట్, బ్రెడ్ ఆమ్లెట్, కారం, ఉప్పు చల్లిన మామిడి, స్వీట్ కార్న్, మసాలా కార్న్, ఉడకబెట్టిన మొక్కజొన్న, ట్విస్టెడ్ పొటాటో, వెజ్, చికెన్, ఫ్రైడ్ మోమూస్, స్టీమ్ మోమూస్, చైనీస్ ఫుడ్ ఇలా ఒక్కటేంటి.. నగరంలో వివిధ ప్రాంతాల్లో దొరికే అన్ని రకాల ఆహారం ఇక్కడ అందుబాటులో ఉంటుంది. స్మైలీ, ఎగ్ దోశ, ఎగ్ ఆమ్లెట్ షావర్మా, చికెన్ కబాబ్స్, క్రిస్పీ స్పైసీ చికెన్, సమోలీ, కుబూస్, రుమాలీ షావర్మా, చాట్, పానీపూరీ చాలా తక్కువ ధరకే దొరుకుతుంది. హుస్సేన్ సాగర్ అందాలను చూసుకుంటూ ఎంచక్కా ఫుడ్ను ఎంజాయ్ చేయొచ్చు.అదిరే ఫుడ్ నెక్లెస్ రోడ్..! నెక్లెస్ రోడ్డులో అలా కారులో, బైక్పై వెళ్తుంటే అక్కడక్కడా వచ్చే సువాసనలు చూస్తుంటేనే ఆ ఫుడ్ లాగించేయాలని అనిపిస్తుంది. ఎంచక్కా కారు లేదా బైక్ ఆపి చక్కగా ఆర్డర్ చేసుకుని, తింటుంటే ఆ మజానే వేరు. ఇక, నెక్లెస్ రోడ్డులోని ఈట్ స్ట్రీట్ ఫుడ్ గురించి వేరే చెప్పాల్సిన పనే లేదు. అక్కడ దొరకని ఫుడ్ అంటూ లేదంటే అతిశయోక్తి లేదు. ఫుడ్తో పాటు చిన్న పిల్లలు, పెద్దలు ఆడుకునేందుకు అనేక రకాలా ఆటవస్తువులు, మంచి ఎంటర్టైన్మెంట్ అందుబాటులో ఉంటుంది.హైటెక్ సిటీ–మాదాపూర్.. సాఫ్ట్వేర్ ఉద్యోగుల అడ్డా అయిన హైటెక్ సిటీ, మాదాపూర్లో ఇటీవల స్ట్రీట్ ఫుడ్ కల్చర్ విపరీ తంగా పెరిగిపోయింది. చాలా మంది ఐటీ ఉద్యోగులకు నైట్ డ్యూటీలు ఉంటాయి. అర్ధరాత్రి ఆకలిగా అనిపించినా.. కాస్త బోర్ కొట్టినా కొలీగ్స్తో కలిసి ఎంచక్కా స్ట్రీట్ ఫుడ్ స్టాళ్ల దగ్గరికి వచ్చి డిఫరెంట్ ఫుడ్ ఎంజాయ్ చేస్తున్నారు. రెగ్యులర్ టిఫిన్లయిన ఇడ్లీ, దోశతో పాటు స్నాక్ ఐటెమ్స్ అయిన సమోసా, మిర్చీ, కట్లెట్, పానీపూరీ ఆహారం ఏదైనా అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా దొరుకుతుంది. హైదరాబాద్ యువతకు మాదాపూర్ స్ట్రీట్ ఫుడ్ ఫేవరెట్గా మారాయి. -
పెడల్ పవర్.. సైకిల్ ఫర్ ఎవర్
ఎటువైపు చూసినా ఆకాశమంత ఎత్తైన అద్దాల భవనాలు.. నిత్యం ట్రాఫిక్తో కిక్కిరిసిన రహదారులు.. కిలోమీటర్ల మేర బారులు తీరే వాహనాలు.. ఇది నగరంలోని రహదారుల పరిస్థితి.. దీంతో పాటు నగర శివారులోని టెక్ పార్కుల్లోనూ లక్షలాది మంది ఉద్యోగులతో ట్రాఫిక్ సమస్యలు తప్పడంలేదు. దీనికి ప్రత్యామ్నాయంగా ఇటీవల కొంత కాలంగా వీధుల్లో సైక్లింగ్ ట్రెండ్ నడుస్తోంది. రహదారులకు సమాంతరంగా సైక్లింగ్ ట్రాక్లను జీహెచ్ఎంసీ అభివృద్ధి చేసింది. దీంతో టెకీల్లో చాలా మంది సైక్లింగ్ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. వారంలో కొన్ని రోజులైనా సైకిల్పై కార్యాలయానికి వెళ్లాలని కొంత మంది రూల్ పెట్టుకుంటున్నారు. క్లబ్లుగా ఏర్పడి వారాంతాల్లో ప్రత్యేక కార్యక్రమాలుకు శ్రీకారం చుడుతున్నారు. ఫలితంగా ఆరోగ్యం మెరుగుపడటం, ట్రాఫిక్లో సమయం, డబ్బు ఆదా, వాతావరణ కాలుష్య నివారణకు ఈ విధానం సహాయపడుతోందని పలువురు అభిప్రాయపడుతున్నారు. టెక్కీలుగా స్థిరపడిన చాలా కుటుంబాల ఇళ్లల్లో కారు, మోటారు సైకిల్తో పాటు ఎలక్రి్టక్, గేర్, సాధారణ సైకిల్ తప్పనిసరిగా ఉంటోంది. మెట్రో స్టేషన్లకు, కూరగాయల మార్కెట్కు, వాకింగ్కో వెళ్లడానికి, ఐదు కిలో మీటర్ల లోపు పనులకు సైకిల్ను విరివిగా వినియోగిస్తున్నారు. వివిధ సైక్లింగ్ సంఘాల ఆధ్వర్యంలో ప్రత్యేక టూర్లను ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో ఒక్కో వారం ఒక్కో రకమైన థీమ్ ఉండేలా సెట్ చేసుకుంటున్నారు. వందలాది కిలోమీటర్లు సైకిల్పై ప్రయాణాలు చేస్తున్నారు. ఆపై ట్రెక్కింగ్ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇదిలా ఉంటే వారాంతంలో కుటుంబ సభ్యులతో కలసి టూర్ ప్లాన్ చేసుకున్నప్పుడు కూడా కారు వెనకన తమ సైకిల్ కట్టుకుని పోతున్నారు. రిసార్ట్, ఫాం హౌస్, ఇతర డెస్టినేషన్లో సైక్లింగ్ చేస్తున్నారు.డెడికేటెడ్ ట్రాక్స్ కోసం.. నగరంలోని సైక్లిస్టులంతా ప్రస్తుతం ఉన్న సైకిల్ ట్రాక్లను డెడికేటెడ్ ట్రాక్లుగా మార్చాలని డిమాండ్ చేస్తున్నారు. కేబీఆర్ పార్క్, హైటెక్ సిటీలోని కొన్ని ప్రాంతాల్లో సైకిల్ ట్రాక్లకు ప్రత్యేకంగా స్థలాన్ని కేటాయించారు. అయితే సాధారణ వాహనాలు సైతం ఈ సైకిల్ ట్రాక్పై నడిపిస్తున్నారు. కేబీఆర్ పార్క్ చుట్టూ ఉన్న ట్రాక్పై పదుల సంఖ్యలో వాహనాలు పార్కింగ్ చేస్తున్నారని ఆందోళణ వ్యక్తం చేస్తున్నారు. దీంతో ట్రాఫిక్తో నిండిన రహదారిపై సైకిల్ తొక్కాలంటే భయమేస్తుదని పలువురు అంటున్నారు. ప్రస్తుతం ఉన్న సైక్లింగ్ ట్రాక్స్కు బారికేడ్స్ ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. ఇలా చేయడంతో మోటారు సైకిళ్లు, ఇతర వాహనాలు సైకిల్ ట్రాక్పైకి వచ్చే అవకాశం ఉండదు. దీంతో సైక్లిస్టులు వేగంగా, ధైర్యంగా ముందకు సాగేందుకు వీలుంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఓఆర్ఆర్ సమీపంలో సోలార్ రూఫ్తో ఏర్పాటు చేసిన సైకిల్ ట్రాక్ దేశంలోనే ప్రత్యేకమైనదిగా గుర్తింపు తెచ్చుకుంది. ఆ తరహాలో నగరాన్ని సైక్లింగ్ సిటీగా తీర్చిదిద్దాలనే డిమాండ్ వినిపిస్తోంది.ఏడేళ్ల నుంచి సైక్లింగ్..చిన్న చిన్న ప్రయాణాలకు సైకిల్పైనే వెళతాను. ఏడేళ్ల నుంచి క్రమం తప్పకుండా సైక్లింగ్ చేస్తున్నాను. ప్రతి మహిళ సైక్లింగ్ చేయాలి. ఆరోగ్యం పరంగా చాలా ఉపయోగాలున్నాయి. ఇతరులపైఆధారపడకుండా స్వతహాగా బయటకు వెళ్లి కూరగాయలు, పాలు, ఇతర సామాగ్రి తెచ్చుకుంటా. ఆఫీస్కి వెళ్లేందుకు మెట్రో వరకూ సైకిల్పైనే వెళతాను. సరికొత్త మోడళ్లు..ప్రధానంగా టెక్ వీధుల్లో వివిధ మోడల్ సైకిళ్ల హవా కనిపిస్తోంది. మెట్రో స్టేషన్ల నుంచి తమతమ కార్యాలయాలకు వెళ్లేందుకు ఉద్యోగులు సైకిళ్లను వినియోగిస్తున్నారు. ఎత్తుపల్లాలు ఉన్నా సైక్లిస్టులకు ఇబ్బంది లేకుండా బ్యాటరీ, గేర్ సైకిళ్లు అందుబాటులో ఉంటున్నాయి. రహదారికి సమాంతరంగా ఉన్నపుడు సైకిల్ తొక్కడం, ఎత్తు ఉన్నపుడు బ్యాటరీతో నడిపిస్తున్నారు. ఈ విధానం చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. కొనుక్కోవడం ఇష్టం లేకుండా, తమకు నచ్చినప్పుడు సైకిల్ సవారీ చేయడానికి అద్దె ప్రాతిపదికన వందలాది సైకిళ్లు అందుబాటులో ఉన్నాయి. టైం పాస్ కోసం.. సైక్లింగ్ టైం పాస్ కోసం ప్రారంభించాను. 10 కిలో మీటర్లు సైకిల్పై వెళ్లడానికి కష్టంగా ఉండేది. క్రమంగా అసోసియేషన్ సభ్యులతో సంబంధాలు ఏర్పడ్డాయి. సైక్లింగ్ వల్ల లాభాలపై అవగాహన వచి్చంది. ఇప్పుడు 100 కిలో మీటర్ల వరకూ వెళ్లిపోతున్నాం. వీలైతే ట్రెక్కింగ్ చేస్తున్నాం. సొంతంగా ఎస్కేప్ అండ్ ఎక్స్ప్లోర్ క్లబ్ స్థాపించాను. వారాంతంలో టూర్ ప్లాన్ చేస్తుంటాం. – అశోక్, ఎస్కేప్ అండ్ ఎక్స్ప్లోర్ నిర్వాహకులు21 వేల మంది సభ్యులు.. 2011లోనే సైక్లింగ్ రివల్యూషన్ ప్రారంభించాము. సాఫ్ట్వేర్ కంపెనీల్లో పర్యావరణం, ఆరోగ్యం, సమయం, డబ్బు ఆదాపై అవగాహన కల్పించాం. హైదరాబాద్ బైస్కిల్ క్లబ్ను స్థాపించాం. ప్రస్తుతం ఇందులో 21 వేల మంది సభ్యులున్నారు. 60 ఏళ్ల వయసులో లండన్ నుంచి పారిస్ వరకూ 518 కిలోమీటర్లు సైకిల్పై వెళ్లాను. మూడున్నర రోజులు పట్టింది. ఢిల్లీ, ఛంఢీఘర్, చెన్నైలోనూ సైక్లింగ్ అసోసియేషన్స్ స్థాపించాం. సుమారు 6 వేల సైకిళ్లు అందుబాటులో ఉన్నాయి. ఏడేళ్ల క్రితం ఓఆర్ఆర్ సమీపంలో సైకిల్ ట్రాక్ కోసం ప్రభుత్వానికి ప్రతిపాదించాం. 23 కిలోమీటర్ల సోలార్ రూఫ్ ట్రాక్ సిద్ధమైంది. – మనోహర్, ప్రపంచ సైక్లింగ్ సమాఖ్య వైస్ ప్రెసిడెంట్ -
Hyderabad: సెలయేటికి చలో..
చిన్ని చిన్ని ఆశ అంటూ పాతికేళ్ల క్రితం ఓ సినిమాలో హీరోయిన్ నీళ్లలో తడుస్తూ పరవశించి పాడినా, జల.. జల.. జలపాతం.. నువ్వు అంటూ ఇటీవల ఓ సినిమాలో హీరో కీర్తించినా.. ప్రకృతి అందాల్లో జలధారల ప్రత్యేకతే వేరు. అలాంటి నిలువెత్తు నీటి సౌందర్యాన్ని ఆస్వాదించాలంటే వాటర్ ఫాల్స్ని మించిన మార్గం లేదు. ఆ తెల్లని నీళ్ల సిరుల్ని కళ్లకు హత్తుకోవాలంటే.. మాన్సూన్ని మించిన సీజన్ లేదు. మిగిలిన అన్ని కాలాల్లోనూ పొడి పొడిగా సాదాసీదాగా కనిపించే ప్రాంతాలు.. వర్షాకాలంలో మాత్రం హర్షామోదాల కేరింతల నిలయాలుగా మారిపోతాయి. ఈ సీజన్లో నప్పే ట్రిప్స్గా జలధారల దారి పట్టేవారి కోసం మన నగరం నుంచి అందుబాటు దూరంలో ఉన్న కొన్ని జలపాతాల విశేషాలివి.. వాటర్ ఫాల్స్.. ఈ పేరు చెప్పగానే ప్రకృతి ప్రేమికులు ఎవరైనా వాటి అందాలను ఆస్వాదించేందుకు ఉవి్వళ్లూరుతారు.. చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకూ ఆ జలపాతం కింద తడిసి ముద్దవ్వాలనుకుంటారు. నగరం నుంచి దాదాపు 50 కిలోమీటర్ల దూరంలో పలు జలపాతాలు నగర వాసులను ఆకర్షిస్తున్నాయి. ముఖ్యంగా వర్షా కాలంలో కొండ కోనల్లో ప్రకృతి ఒడిలో గంగ పరవళ్లు.. సెలయేటి గలగలలు చెవులకు వినసొంపుగా వినిపిస్తాయి. భువనగిరికి దగ్గర్లో ఓ జలపాతం ఉంటుంది. చుట్టూ పచ్చదనం రాతి గుట్టలు ప్రకృతి ప్రేమికులకు కొత్త అనుభూతిని ఆస్వాదించే అవకాశాన్ని అందిస్తుంది. బొగత.. మన ఘనత..తెలంగాణ వాసులు సగర్వంగా చెప్పుకునే అద్భుత అందాల ఘనతగా బొగత జలపాతాన్ని చెప్పుకోవచ్చు. భద్రాచలం నుంచి 120 కిమీ దూరంలో నగరం నుంచి 329 కిమీ దూరంలో ఉందీ వాటర్ ఫాల్స్. ఖమ్మం జిల్లాలో, రాష్ట్రంలో రెండో అతిపెద్ద జలపాతం ఇదే. తెలంగాణ నయాగరగా పేరుగాంచి మాన్సూన్లో అత్యంత రద్దీగా ఉండే ప్రదేశం. ఇక్కడకు చేరుకోడానికి సందర్శకులు కొంత దూరం ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుంది. రాయకల్.. జలరాశుల్.. పోతపోసిన ప్రకృతి అందాల నిలయం రాయకల్ జలపాతం కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలోని రాయకల్ నుంచి 3 కిలోమీటర్ల దూరంలో పెద్దగట్లు, రాయకల్ జలపాతం ఉంటాయి. మార్గమధ్యంలో పచ్చని ప్రకృతిని ఆస్వాదిస్తూ ప్రయాణించొచ్చు. కొండమీది నుంచి రాసులు పోస్తున్నట్టు కిందకు దుమికే నీటి ధారలు రాయకల్ జలపాత దృశ్యం కనువిందు చేస్తుంది. మల్లెల తీర్థం.. అరణ్య మార్గం.. నగరానికి దాదాపు 185 కిమీ దూరంలో నల్లమల అరణ్యంలో ఉంది. ఈ జలపాతానికి చేరుకోడానికి, అడవి గుండా ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుంది. ఇది కొంతమేర సాహసోపేతమైన ప్రయాణం అనే చెప్పాలి.రాజేంద్రనగర్.. వాటర్ ఫాల్స్.. నగరానికి కేవలం 13.9 కిమీ దూరంలో ఈ సుందరమైన జలపాతం శీఘ్ర విహారానికి అనువైనది. సందర్శకులు ఒక చిన్న రైడ్ ద్వారా ఈ ప్రదేశానికి చేరుకోవచ్చు.జలజల.. కుంటాల.. తెలంగాణలోనే ఎత్తైన జలపాతం. నగరం నుంచి 564.9 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ జలపాతం ఆదిలా బాద్లో ఉంది. దాదాపు 200 అడుగుల ఎత్తు నుంచి కిందికి దూకుతూ వీక్షకులకు అద్భుతమైన అనుభూతిని అందిస్తుంది.వైజాగ్ వారి ఆతిథ్యం.. అందం ‘చందం’ నల్లగొండ నుంచి 65 కిలోమీటర్ల దూరంలో వైజాగ్ కాలనీ ఉంది. దేవరకొండ నియోజకవర్గంలోని చందం పేట మండలంలో కృష్ణానది బ్యాక్ వాటర్ ఆనుకుని ఉన్న కుగ్రామం ఇది. ఇక్కడి వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. నలువైపులా నల్లమల అడవులు, గుట్టలతో కప్పి ఉంటుంది. నాగార్జునసాగర్ ప్రాజెక్టు కడుతున్నప్పుడు వైజాగ్కు చెందిన కొన్ని కుటుంబాలు స్థిరపడడంతో దీనికి వైజాగ్ కాలనీగా పేరొచి్చంది. వీకెండ్లో టూరిస్టుల కోసం కాలనీ వాసులే వసతి ఏర్పాట్లు చేస్తుంటారు. బోటింగ్ సౌకర్యం కూడా ఉంది. కృష్ణానదిలో పట్టిన తాజా చేపల వంటకాలు ఇక్కడ ఫేమస్.ఎత్తిపోతల.. జలకళ.. సిటీకి 163.4 కిలోమీటర్ల దూరంలో చంద్రవంక నది సమీపంలో ఈ జలపాతం సందర్శకులను ఆకట్టుకుంటుంది. సమీపంలోని మొసళ్ల పెంపక కేంద్రం కూడా సందర్శనీయమే. నాగార్జున సాగర్ డ్యామ్ వైపు ఎన్హెచ్ 56 నుంచి డ్రైవింగ్ చేయడం ద్వారా జలపాతాన్ని, డ్యామ్ను చూడవచ్చు.భీముని పాదం.. ఆనందానికి ఆ‘మోదం’ దట్టమైన అటవీ ప్రాంతం, చుట్టూఎత్తయిన కొండలు, పక్షుల కిలకిలలు. సాయంత్రం వేళ అడవి జంతువుల అరుపులు, వర్షా కాలంలో ఎత్తయిన గుట్ట మీది నుంచి పాదం మధ్యలో జాలువారే నీటి సిరులు.. అస్వాదించాలంటే భీమునిపాదం జలపాతం దగ్గరికి పోవాల్సిందే. మానుకోట జిల్లాలో ఏకైక పర్యాటక ప్రాంతంగా దీన్ని చెప్పుకుంటారు.ఏడు బావుల.. వింతలా..బయ్యారం, గంగారం సరిహద్దుల్లో మిర్యాలపెంట సమీపంలో ఏడుబావుల జలపాతాలున్నాయి. పాండవుల గుట్టపై సహజసిద్ధంగా ఏర్పడ్డాయి. జలపాతం నుంచి కిందికి పడే నీళ్లు కొద్ది దూరం ప్రవహించి తరువాత అదృశ్యమవడం. దాదాపు 50 అడుగుల ఎత్తు నుంచి పాలధారలా నీళ్లు పడుతూ కనువిందు చేస్తుంది.పచ్చని నెచ్చెలి.. చెచ్చెర..ఉమ్మడి ఆదిలాబాద్లో ఎన్నో జలపాతాలున్నా ఎక్కువ మందికి పరిచయం లేని జలపాతం చెచ్చెర. కుమ్రం భీం అసిఫాబాద్ జిల్లా తిర్యాణి మండలంలోని కౌరగామ్ సమీపంలో దట్టమైన అటవీ ప్రాంతంలో ఉందీ జలపాతం. ఎత్తయిన కొండల మధ్యలో 200 అడుగుల ఎత్తు నుంచి కిందికి దూకే జలపాతాన్ని చూడటం కనువిందే. ఇక్కడి ఆదివాసీల సంస్కృతి, సంప్రదాయాలు, కట్టుబాట్లు ఆకట్టుకుంటాయి. -
డ్యాన్సింగ్ సిటీ.. హిప్హాప్ స్టెప్స్..
సాక్షి, సిటీబ్యూరో: అధునాతన జీవన శైలి, మోడ్రన్ ఫ్యాషన్ హంగులను అందిపుచ్చుకోవడంలో నగరం ఎల్లప్పుడూ ముందుంటుందని తెలిసిందే.. ముఖ్యంగా మోడ్రన్ ఆర్ట్స్కు నగరంలో విపరీతంగా క్రేజ్ పెరిగిపోతోంది. ఇందులో భాగంగానే సిటీలో ట్రెండీ డ్యాన్స్ స్టెప్పులను ఆహ్వానిస్తున్నారు.. ఆస్వాదిస్తున్నారు. దశాబ్ద కాలం క్రితంతో పోలిస్తే ప్రస్తుతం నగరంలో డ్యాన్సింగ్లో ఎన్నో మార్పులు, విభిన్న టెక్నిక్స్ రూపుదిద్దుకున్నాయి. డ్యాన్స్లో వెస్ట్రన్ స్టైల్స్కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. అయితే ప్రస్తుత తరుణంలో వేడుక ఏదైనా సరే.., అందులో స్టెప్పు లేనిదే కిక్కు రాదు. కార్పొరేట్ ఈవెంట్స్ మొదలు సినిమా ఫంక్షన్ల వరకు హిప్హాప్, జాజ్ వంటి ట్రెండీ స్టెప్పులతో నగరం నృత్యం చేస్తోంది. నృత్యాన్నే కెరీర్గా మార్చుకున్న ఎంతో మంది డ్యాన్సర్లకు ఈవెంట్స్ ఉపాధిగా మారాయి. ప్రైవేటు పార్టీలు మొదలు కొత్త సంవత్సర వేడుకల వరకు ఈ డ్యాన్స్ బృందాలకు డిమాండ్ పెరిగిపోయింది.టాలీవుడ్ టూ బాలీవుడ్..నగరం వేదికగా నిర్వహించే పలు ఈవెంట్లలో వెస్ట్రన్, బాలీవుడ్, టాలీవుడ్తో పాటు ఎలక్ట్రిక్ జాజ్, లాకింగ్ వంటి డ్యాన్స్ పర్ఫార్మెన్స్ కావాలని నిర్వాహకులు కోరుకుంటున్నారు. ఈ డ్యాన్స్ స్టెప్పులకు నగరవాసుల నుంచి వస్తున్న ఆదరణ అలా పెరిగిపోతుండటం విశేషం. ఇలాంటి డ్యాన్స్ నేరి్పంచడానికి నగరంలో ప్రత్యేకంగా డ్యాన్సింగ్ స్టూడియోలు సైతం నిర్వహిస్తున్నారు. న్యూ ఇయర్ వేడుకలు, హోలీ వంటి సంబరాల్లో భాగంగా పలు క్లబ్స్లో నిర్వహించే వేడుకల్లో, మ్యూజిక్ కన్సర్ట్స్ ముఖ్యంగా సినిమా ఆడియో ఫంక్షన్లు ఇతర కార్పొరేట్ కార్యక్రమాలకు ఈ డ్యాన్సర్లను ఆహా్వనిస్తున్నారు. స్థానికంగానే కాకుండా సీజన్లలో ముంబై, ఢిల్లీ వంటి నగరాల నుంచి ప్రత్యేకంగా ఈ నృత్యకారులను నగరానికి ఆహా్వనిస్తున్నారు. అంతేగాకుండా ఈ మధ్యకాలంలో ప్లాష్ మాబ్ కల్చర్ బాగా పెరిగిపోయింది. నగరంలోని పెద్ద పెద్ద మాల్స్లో విరివిగా ప్లాష్మాబ్స్ నిర్వహిస్తూ సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నారు. పేజ్ త్రీ పీపుల్ నిర్వహించే ప్రైవేట్ పార్టీల్లో సాల్సా వంటి డ్యాన్సులను ఆస్వాదిస్తున్నారు. సిటీ నుంచి.. గోవా ఫెస్టివల్స్కు..సినిమాల్లో సైడ్ డ్యాన్సర్లుగా చేస్తూనే మిగతా సమయాల్లో ఇలాంటి ఈవెంట్స్లో బిజీగా ఉంటున్నారు డ్యాన్స్ ప్రేమికులు. ఇదో ఉపాధిగానూ, అవకాశాలు కల్పించే ప్రత్యామ్నాయ వేదికగానూ డ్యాన్సర్లకు ఉపయోగపడుతుందని పలువురు డ్యాన్సర్లు పేర్కొన్నారు. నగరం నుంచి గోవా ఫిల్మ్ ఫెస్టివల్స్, నూతన సంవత్సర వేడుకలు తదితర కార్యక్రమాలకు వెళ్తున్నామని వారు తెలిపారు. నగరంలో ప్రత్యేకంగా నిర్వహించే మ్యూజిక్ కన్సర్ట్స్, నవరాత్రుల సందర్భంగా ఏర్పాటు చేసే దాండియా ఈవెంట్స్లో ఈ డ్యాన్సర్లను ముందస్తుగానే బుక్ చేసుకోవడం విశేషం. ఈ మధ్య కాలంలో సంగీత్స్లో డ్యాన్సర్లకు బాగా డిమాండ్ పెరిగింది. ప్రతీ సంగీత్లో కనీసం ఒక కొరియోగ్రాఫర్, తనతో పాటు నృత్య బృందం పాల్గొనడమే కాకుండా నిర్వాహకులకు శిక్షణ అందించి సంగీత్లో సందడి చేస్తున్నారు.అవకాశాలెన్నో.. గతంతో పోలిస్తే ప్రస్తుతం డ్యాన్సర్లకు విభిన్న వేదికల్లో అవకాశాలు పెరిగాయి. మోడ్రన్ స్టెప్స్తో ప్రేక్షకులను ఆకట్టుకోగలిగితే చాలు.., స్ట్రీట్ డ్యాన్సింగ్ నుంచి సినిమా ఫంక్షన్ల వరకు ఎన్నో అవకాశాలు. నగరం వేదికగా పలు సినిమా ఆడియో ఫంక్షన్లు, కార్పొరేట్ నైట్ ఈవెంట్స్తో పాటు తదితర లైఫ్ స్టైల్ ఈవెంట్లలో డ్యాన్సర్గా పాల్గొన్నారు. అంతేగాకుండా గోవా వేదికగా జరిగే డ్యాన్స్ ఫెస్టివల్స్లో పాల్గొన్నారు. ఇలాంటి వేదికలు మారుతున్న డ్యాన్స్ కల్చర్పైన అవగాహన పెంచుతాయి. ఇక్కడ వెస్ట్రన్ డ్యాన్స్కు ఆదరణ బాగా పెరిగింది. ఎలక్ట్రిక్ జాజ్, లాకింగ్ వంటి అధునాతన డ్యాన్సింగ్ స్టెప్పులు నగరానికి ఈ మధ్య వస్తున్నాయి. – శ్రీకాంత్, కొరియోగ్రాఫర్, శ్రీస్ డ్యాన్స్ స్టూడియోస్సాల్సా సైతం..20 ఏళ్లుగా నగరం వేదికగా డ్యాన్స్లో వస్తున్న మార్పులను గమనిస్తున్నాను. సిటీలో ఎక్కువగా టాలీవుడ్, బాలీవుడ్, హిప్హాప్కు క్రేజ్ ఉంది. నగరంతో పాటు బెంగళూరు వంటి నగరాల్లో అప్పుడప్పుడూ జాజ్, ఫ్రీక్ స్టైల్ వంటివి సందడి చేస్తున్నాయి. ఇవే కాకుండా ప్రత్యేకంగా సాల్సా, బచ్చాటా వంటి డ్యాన్సులను ఆస్వాదించే నగరవాసులున్నారు. కొంత కాలం పాటు క్లాసికల్ సమ్మిళితమైన బిబాయింగ్ వంటి డ్యాన్సులనూ నగరవాసులు చేసేవారు. డ్యాన్స్ లేకుండా ఈవెంట్స్ లేవు అనేంతలా డ్యాన్స్ పరిణామ క్రమం మారింది. ఈవెంట్స్తో పాటు ఫ్రీక్, హిప్ హాప్ వంటి డ్యాన్స్ ఫెస్టివల్స్ సైతం నిర్వహిస్తుంటారు. – నాగేంద్ర, కొరియోగ్రాఫర్, డ్యాన్సర్ఇవి చదవండి: మునుపటి కాలం కాదు ఇది, కానీ.. -
ఇంటి రూఫ్.. మొక్కలు సేఫ్..!
సాక్షి, సిటీబ్యూరో: టెర్రస్గార్డెన్.. హైదరాబాద్ నగరంలోని నివాసాల నుంచి పల్లెల వరకూ ఇప్పుడు ఇదే ట్రెండింగ్. పెరుగుతున్న కాలుష్యం ప్రజలను ప్రకృతి ఒడికి చేరువయ్యేలా చేస్తోంది. ఓ వైపు ఉష్ణోగ్రతల నుంచి ఉపశమనం కోసం.. మరోవైపు ఆహ్లాదకరమైన వాతావరణం కోసం ప్రతి ఒక్కరూ తమ నివాసాల్లో మొక్కలు పెంచుతున్నారు. నగరంలో స్థలాభావం కారణంగా మిద్దెలపై మొక్కలు పెంచడం వైపు ఆసక్తి చూపిస్తున్నారు. దీనికితోడు గ్రీన్ సిటీస్, గ్రీన్ హౌస్ అనే కాన్సెప్్టతో ఇప్పటికే అత్యాధునిక సౌకర్యాలతో బిల్డింగ్ డిజైన్లు వెలుస్తున్నాయి. దీంతో నగర వాసుల, ప్రకృతి ప్రేమికుల నివాసాలు పచ్చదనానికి ఆవాసాలుగా మారుతున్నాయి. అపార్ట్మెంట్, కాంప్లెక్స్ల నిర్వాహకుల నుంచి ఇండివీడ్యువల్ ఇళ్ల వరకూ గ్రీనరీకి ప్రధాన్యతనిస్తున్నారు.ఆరోగ్యం వెంట.. ఇంటి పంట..ఇటీవలి కాలంలో నగరంలో అధిక శాతం మంది భవనాలపై, టెర్రస్లో తమ సొంత కూరగాయలను ఆర్గానిక్ పద్ధతుల్లో పెంచేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇది వారికి ఆరోగ్యకరమైన తాజా ఉత్పత్తులను అందించడమే కాదు.. సొంతంగా పండించుకుంటున్నామనే గొప్ప సంతృప్తిని కూడా అందిస్తుంది. టెర్రస్ గార్డెన్ కేవలం పచ్చదనాన్ని పంచడం మాత్రమే కాకుండా ఆయా కమ్యూనిటీలు నిర్వహించుకునే ఈవెంట్లకు అద్భుతమైన అనువైన ప్రదేశంగా మారాయి. పండుగల నుంచీ బార్బెక్యూల దాకా వేడుకలుగా జరుపుకోడానికి ఇవి వేదికలవుతున్నాయి. నగర జీవితంలో హడావిడి నుంచి తప్పించుకోడానికి నివాసితులకు వీలు కల్పిస్తోంది. మిద్దెతోట.. పచ్చని బాట..నగరంలో స్థల పరిమితులు ఉండటంతో, స్థలాభావం ఉన్నప్పటికీ పచ్చదనానికి పట్టం కట్టాలని ఆరాటపడుతున్న వారికి.. అపార్ట్మెంట్ కాంప్లెక్స్లలోని టెర్రస్ గార్డెన్లు పరిష్కారాన్ని అందిస్తున్నాయి. నగరంలో అపార్ట్మెంట్, కాంప్లెక్సుల్లో టెర్రస్ గార్డెన్లు ప్రాచుర్యం పొందుతున్నాయి. ఒకప్పుడు భవనాల పైకప్పులపై ఖాళీగా ఉన్న స్థలాలు ఇప్పుడు పచ్చని ప్రదేశాలుగా మారి నగరవాసుల అభిరుచుల వైవిధ్యానికి నిదర్శనాలుగా మారుతున్నాయి.పచ్చని వాతావరణాన్ని అందించడమే కాకుండా కార్బన్ డయాక్సైడ్ను గ్రహించి గాలిలోకి ఆక్సీజన్ను విడుదల చేయడం ద్వారా మిద్దె తోటలు గాలి నాణ్యతను మెరుగుపరుస్తాయి. అంతేకాదు కూరగాయలు, మూలికలు, పండ్లను సైతం పెంచడానికి అనేక మార్గాలను అన్వేíÙస్తున్నారు ప్రకృతి ప్రేమికులు. ఇలా పర్యావరణానికి రక్షణగా నిలవడం.. తద్వారా ఆరోగ్యకరమైన ఆహారం తినడానికి అలవాటుపడుతున్నారు నగరవాసులు.రసాయనాల నుంచి విముక్తికి..‘పురుగుమందులు లేని సేంద్రీయ కూరగాయలకు పెరుగుతున్న డిమాండ్తో, తమ సొంత పెరట్లలో లేదా టెర్రస్లలో కూరగాయలు, పండ్లను పండించడం వైపు చాలా మంది ఆకర్షితులవుతున్నారు. అలాగే ఇంటి ఖర్చులో పొదుపు మార్గాలను అందిస్తుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో కనీసం 45,000 మంది టెర్రస్పై తోటలను పెంచేందుకు మా ప్రచారం తోడ్పడింది’ అని శ్రీనివాస్ చెప్పారు. హరిత ఉద్యాన వనాలను మెరుగుపరచడానికి కావాల్సిన విత్తనాలు, మాధ్యమాలు విడిభాగాలను కొనుగోలు చేయడానికి నిపుణుల సలహాలను పొందడంతో పాటు అన్ని రకాల సహకారం అందిస్తామని చెప్పారాయన.సిటీ ఆఫ్ టెర్రస్ గార్డెన్స్..ఆన్లైన్ వేదికగా మిద్దె తోటల పెంపకంపై చర్చోపచర్చలు, గ్రూపులు ఊపందుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే నగరానికి చెందిన సీనియర్ న్యాయవాది ఉద్యానవన ప్రియుడు శ్రీనివాస్ హర్కరా ‘సిటీ ఆఫ్ టెర్రస్ గార్డెన్’ స్థాపించారు. ఇప్పుడు ఇది అత్యధిక సంఖ్యలో నిపుణులు, సభ్యులను కలిగిన గ్రూప్స్లో ఒకటి. అటువంటి 16 గ్రూప్స్తో దాదాపు 25 వేల మంది సభ్యులతో టెర్రస్ గార్డెన్ హవా నడుస్తోంది. రూఫ్ గార్డెనింగ్, ఆర్గానిక్ కూరగాయలు, పండ్లను పండించడానికి సంబంధించిన అన్ని పరిష్కారాల కోసం వన్ స్టాప్ ప్లాట్ఫారమ్గా మారింది.గోడల నుంచి.. ఎలివేషన్స్ వరకూ..పచ్చదనం కోసం నగరవాసుల్లో పెరుగుతున్న ఆరాటం గోడల నుంచి ఎలివేషన్స్ వరకూ గతంలో ఉపయోగించని ప్రదేశాలను సైతం మొక్కలతో నింపేలా చేస్తోంది. ఈ క్రమంలోనే రూఫ్ గార్డెనింగ్, టెర్రస్, రూఫ్టాప్, పాటియో, బాల్కనీ, పోర్చ్, వరండా, సన్డెక్ వంటి ప్రదేశాల్లో మొక్కలు పెంచేస్తున్నారు. దీంతోపాటు హ్యాంగింగ్ గార్డెనింగ్ కూడా ప్రాచుర్యం పొందుతోంది.. బాల్కనీల్లో వైర్లు, బుట్టలు, కుండీలు వంటివి వేలాడదీస్తూ తీగ మొక్కలను పెంచుతున్నారు. తద్వారా ఉష్ణోగ్రతల నుంచి ఉపశమనం కూడా లభిస్తోంది.గ్రాండ్.. గార్డెన్ ట్రీట్స్..ఇంటి మిద్దెలు, టెర్రస్ గార్డెన్స్ ఇటీవలి కాలంలో గ్రాండ్ ట్రీట్స్కి వేదికలు అవుతున్నాయి. కుటుంబ సభ్యులు, స్నేహితులు, కమ్యూనిటీ మిత్రులు, ఆఫీస్ కొలీగ్స్తో కలిసి వీకెండ్స్, ఇతర ప్రత్యేక ఈవెంట్స్లో ట్రీట్స్ ఇచ్చుకోడానికి వీలుగా రూపుదిద్దుకుంటున్నాయి. అవుట్డోర్ సీటింగ్కు అనుగుణంగా బెంచ్లు, కురీ్చలు, ఊయల వంటివి ఏర్పాటు చేసుకుంటున్నారు. రట్టన్, వెదురు, కలప, లోహాలు మొదలైన వాటి నుండి ఆల్–వెదర్ ఫరి్నచర్ శ్రేణిలో రూఫ్ గార్డెన్స్ నిర్మాణమవుతున్నాయి.70 వేలకు పైగా సభ్యులు..నగరంలో టెర్రస్ గార్డెన్స్ ట్రెండ్ బాగా పెరుగుతోంది. ప్రస్తుతం మా సంస్థ ఆధ్వర్యంలో 26 గ్రూప్స్ ఉండగా, తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా దాదాపు 70వేల మందికిపైగా సభ్యులున్నారు. పర్యావరణ హితంగా, నగర వాతావరణాన్ని కాలుష్యం నుంచి కాపాడేందుకు ఈ ట్రెండ్ని మరింతగా ప్రోత్సహించాలి. నగరం కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న మా సంస్థ కృషికి ఇటీవలే కేంద్ర ప్రభుత్వం నుంచి గుర్తింపు వచి్చంది. – శ్రీనివాస్, వ్యవస్థాపకులు, సిటీ ఆఫ్ టెర్రస్ గార్డెన్స్.. (సీటీజీ)ఇవి చదవండి: ఆయిల్, గ్యాస్ బ్లాకుల కోసం పోటాపోటీ -
iSmart హోమ్స్
ఇప్పటి వరకూ ఐటీ, మాన్యుఫ్యాక్చరింగ్, హెల్త్, బ్యాంకింగ్ వంటి పలు రంగాలకే పరిమితమైన ఆటోమేషన్.. ఇప్పుడు నట్టింట్లోకి చేరిపోయింది. భద్రత, ఆదా, సౌకర్యం.. హోమ్ ఆటోమేషన్ లాభాలివే. దీంతో నివసించే నగరమే కాదు ఇళ్లు కూడా హైటెక్గా ఉండాలని యువతరం కోరుకుంటోంది. వీరి అభిరుచులకు తగ్గట్టుగానే డెవలపర్లు కూడా స్మార్ట్ హోమ్స్ను నిర్మిస్తున్నారు. ఇంటిలోని లైట్లు, ఫ్యాన్లు, ఏసీ, ఫ్రిజ్, గీజర్, టీవీ వంటి ప్రతీ ఎలక్ట్రానిక్ ఉపకరణాన్ని సెల్ఫోన్తోనే నిర్వహణ చేసే వీలుండటమే స్మార్ట్ హోమ్స్ ప్రత్యేకత. కరోనా తర్వాత నుంచి హోమ్ ఆటోమేషన్పై నగరవాసుల్లో ఆసక్తి పెరిగింది. ప్రతి ఒక్కరూ ఇల్లు ఆధునికంగా, సౌకర్యవంతంగా ఉండాలని కోరుకుంటున్నారు. పిల్లల నుంచి పెద్దల వరకూ ప్రతి ఒక్కరి జీవితంలో భాగమైపోయింది. రెండు దశాబ్దాలుగా స్మార్ట్ హోమ్స్ సేవలనేవి విలాసవంతమైన వసతుల నుంచి దైనందిన అవసరంగా మారిపోయాయి. దీంతో గతేడాదికి దేశంలో స్మార్ట్ హోమ్ మార్కెట్ రూ.90 వేల కోట్లుగా ఉందని, 2028 నాటికి రూ.1.40 లక్షల కోట్లకు చేరుతుందని రెడ్సీర్ నివేదిక అంచనా వేసింది. ఎలా పనిచేస్తాయంటే.. విప్రో, ఫిలిప్స్, హావెల్స్, ఎంఐ, క్రిస్టాన్, కేఎన్ఎక్స్, స్నైడర్, ల్యూట్రాన్, లెగ్గ్రాండ్, పెర్ట్ హోమ్, ఫైబరో వంటి కంపెనీలకు చెందిన వైర్లెస్, వైర్డ్ అనే రెండు రకాల హోమ్ ఆటోమేషన్ ఉత్పత్తులు మార్కెట్లో లభ్యమవుతున్నాయి. వైఫై, బ్లూటూత్, జెడ్ వేవ్, జిగ్బీ నాలుగు రకాల వైర్లెస్ ప్రొటోకాల్స్తో ఆటోమేషన్ ఉత్పత్తులు అనుసంధానమై ఉంటాయి. ఆయా ఉత్పత్తులకు చెందిన మొబైల్ యాప్లను డౌన్లోడ్ చేసుకొని, ఇంట్లోని ఎన్ని సెల్ఫోన్లకైనా అనుసంధానిచవచ్చు. కస్టమర్లు ఇష్టాన్ని బట్టి కేవలం తన వాయిస్ను మాత్రమే గుర్తించేలా ఆయా ఉపకరణాలను అనుసంధానించవచ్చు. లేదా ఇంట్లోని ప్రతి ఒక్కరి వాయిస్నైనా గుర్తించేలా ప్రోగ్రామింగ్ చేసుకోవచ్చు. స్మార్ట్ ప్లగ్తో పాత ఇళ్లకు కూడా.. పాత ఇళ్లను కూడా హోమ్ ఆటోమేషన్ చేయవచ్చు. సాధారణంగా మనం ఇళ్లలో వినియోగించే ఎక్స్టెన్షన్ బాక్స్లాగే ‘స్మార్ట్ ప్లగ్’తో ఇంటిని స్మార్ట్గా మార్చుకోవచ్చు. ఇంట్లో అల్రెడీ ఉన్న స్విచ్లో ఈ స్మార్ట్ ప్లగ్ను పెడితే చాలు.. 16 ఏఎంపీ వరకూ విద్యుత్ ఉపకరణాలను స్మార్ట్గా వినియోగించుకోవచ్చు. దీని ధర రూ.1,500 నుంచి రూ.5,000 వరకూ ఉంటుంది. లాభాలెన్నో.. హోమ్ ఆటోమేషన్తో విద్యుత్ వృథా ఉండదు. సాధారణ ఇళ్లతో పోలిస్తే స్మార్ట్ హోమ్స్లో 20–30 శాతం వరకూ విద్యుత్ ఆదా అవుతుంది. సమయం, డబ్బు ఆదా అవడంతో పాటు భద్రత మెరుగవుతుంది. ఎక్కడి నుంచైనా ఆపరేట్ చేసేలా సౌకర్యవంతంగా వినియోగించుకోవచ్చు. 1,500 చదరపు అడుగుల అపార్ట్మెంట్(ఫ్లాట్)లో వీడియో డోర్ బెల్, ఒక లైట్, ఫ్యాన్, ఏసీ, గీజర్తో కూడిన బేసిక్ హోమ్ ఆటోమేషన్కు రూ.50 వేలు ఖర్చవుతుంది. ఎలక్ట్రిషన్, ఇంజినీర్, నెట్వర్క్, సాంకేతిక నిపుణులు నలుగురు వ్యక్తులు 3–4 రోజుల్లో పూర్తిగా హోమ్ ఆటోమేషన్ పూర్తి చేస్తారు.ఐఓటీ, ఏఐతోనే..ఇంటి ముందు గేటు నుంచి మొదలుపెడితే తలుపులు, కిటికీ కర్టెన్లు, లైట్లు, ఫ్యాన్లు, టీవీ, ఏసీ, గీజర్, ఫ్రిడ్జ్, గ్యాస్, హోమ్ థియేటర్, గార్డెన్.. ఇలా ప్రతి ఒక్క దాన్నీ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్(ఐఓటీ), ఆరి్టఫీషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) వంటి ఆధునిక సాంకేతికతతో వినియోగించడమే హోమ్ ఆటోమేషన్. అలెక్సా, గూగుల్ హోమ్, సిరి ఈ మూడు వర్చువల్ అసిస్టెంట్ టెక్నాలజీలతో మనం ఎంపిక చేసిన సమయం ప్రోగ్రామింగ్ ప్రకారం ఆయా వస్తువులు పని చేస్తుంటాయి.సౌకర్యం కావాలంటున్నారుఆధునిక జీవనశైలిలో ప్రతి ఒక్కరూ సౌకర్యవంతం కోరుకుంటున్నారు. హోమ్ ఆటోమేషన్ ఉన్న ఇళ్ల కొనుగోలుకు యువతరం ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో ఈ తరహా ఇళ్లకు గిరాకీ పెరిగింది.– నర్సిరెడ్డి, ఎండీ, ఐరా రియల్టీస్మార్ట్ హోమ్స్కు డిమాండ్ కరోనా తర్వాతి నుంచి ఇల్లు స్మార్ట్గా ఉండాలని కోరుకుంటున్నారు. వాయిస్ కమాండ్స్, యాప్స్ ద్వారా పనిచేసే ఎలక్ట్రానిక్ ఉత్పత్తులను వినియోగిస్తున్నారు. అపార్ట్మెంట్లు, విల్లా ప్రాజెక్ట్లలో హోమ్ ఆటోమేషన్కు డిమాండ్ పెరిగింది.– మారుతీ రావు, వైస్ ప్రెసిడెంట్, పౌలోమీ ఎస్టేట్స్ -
పాత బస్తీ.. బైకర్స్ మస్తీ..
చార్మినార్ సమీపంలో జనసంచారం అరకొరగా ఉండే ప్లేస్ను వెదకాలంటే.. అది కేవలం అర్ధరాత్రుళ్లు తప్ప అసాధ్యం. అందుకే సిటీ బైకర్స్ తమ చిట్చాట్కు అదే టైమ్ను ఎంచుకుంటున్నారు. పబ్స్, కేఫ్స్లో చిల్ అవుట్ అవడం ఎలా ఉన్నా ఓల్డ్ సిటీలో నైట్ అవుట్ మజాయే వేరు అంటున్నారీ బైకర్స్. నగరంలో విభిన్న రకాల పేర్లతో పదుల సంఖ్యలో బైకర్స్ క్లబ్స్ ఉన్నాయి. జాయ్ రైడ్స్ నుంచి లాంగ్రైడ్స్కు, ప్రత్యేక సందర్భాల్లో సందేశాత్మక రైడ్స్కు సైతం పేరొందిన ఈ క్లబ్స్.. తరచూ తమ ఓల్డ్సిటీని చుట్టి వస్తుంటారు. ‘ఓల్డ్ సిటీలో కూర్చుని ముచ్చట్లు పెట్టుకోవడం అనేది నగరంలోని బైకర్స్కు ఒక సంప్రదాయంగా మారుతోంది. దీనికి తొలిసారి నగరంలో ఈ తరహా ట్రెండ్కు శ్రీకారం చుట్టిన క్లబ్స్ కారణం’అంటూ చెప్పారు నగరంలోని ఓ బైకర్స్ క్లబ్కు చెందిన శ్రీకాంత్.గరమ్ చాయ్.. బన్ మస్కా..సిటీలో ఎక్కడ చాయ్ తాగినా రాని కిక్ ఓల్డ్ సిటీలో ముచ్చట్లతో కలిపి పంచుకుంటే వస్తుందంటారు వాండరర్స్ క్లబ్కి చెందిన లలిత్ జైన్. నగరంలోని అత్యంత పాత క్లబ్స్లో ఒకటైన వాండరర్స్ తరపున పర్యాటక రంగ ప్రమోషన్స్ కోసం పాత బస్తీలో తరచూ రైడ్స్ నిర్వహిస్తుంటామని చెప్పారాయన. చాయ్తో పాటు ఉస్మానియా బిస్కెట్, బన్ మస్కా వంటివి ఓల్డ్సిటీకి మాత్రమే ఫేమస్ అయిన పలు హైదరాబాదీ ఫుడ్ ఐటమ్స్ను ఎంజాయ్ చేసేందుకు రద్దీ లేని వేళల్లో రైడ్స్ వేస్తుంటారు బైకర్స్. వెజ్, నాన్ వెజ్రైడర్స్ అందరూ ఎంజాయ్ చేసేందుకు అవసరమైన ఫుడ్ అక్కడ దొరుకుతుందని, దీంతో ఓల్డ్ సిటీ రైడ్ అంటే రైట్ అంటామని బైకర్ సిద్ధు చెబుతున్నాడు.ఓల్డ్ ఈజ్ గోల్డ్.. పాత బస్తీ అనేది ప్రతి హైదరాబాదీకి ఒక ఎమోషన్ అంటారు రాజ్దూత్ బైక్ మీద రైడ్స్ చేసే నగరవాసి ఛటర్జీ. సాధారణ సమయాల్లో విపరీతమైన రద్దీ వల్ల ఆ ప్రాంతాన్ని సరిగా ఆస్వాదించలేమని, అదే బాగా పొద్దుపోయాక వెళితే.. బైక్ లైట్స్ వెలుగులో మిలమిల మెరిసే చార్మినార్ పరిసరాల్ని వదిలి రాలేమని అంటున్నారాయన. ఆయన లాగే అనేక మంది నగరానికి చెందిన మధ్య వయసు్కలు తమ యుక్త వయసులోని పిల్లల్ని తీసుకుని మరీ రాత్రుళ్లు.. బైక్స్ మీద ఓల్డ్ సిటీ టూర్ వేస్తుండడం సర్వసాధారణం.అతిథి దేవోభవ..దేశ విదేశాల్లో పర్యటించే బైకర్స్.. కొన్ని నగరాలు, ప్రాంతాలకు తాము వస్తున్న సమాచారాన్ని తరచూ ఇచ్చి పుచ్చుకుంటుంటారు. తద్వారా ఆయా ప్రాంతాల్లో, ఊర్లలో ఉన్న బైకర్స్ వెంటనే వారికి ఎదురేగి స్వాగతాలు పలకడం, తమ ప్రాంత విశేషాలను గురించి వారికి వివరించడం చేస్తుంటారు. అదే క్రమంలో నగరానికి వచ్చే ఇతర ప్రాంతాల బైకర్స్కు తప్పకుండా సందర్శనీయ స్థలం పాత బస్తీయే అవుతుంటుంది. అలా తరచూ వచ్చే బైకర్స్ను స్వాగతించి వారు కోరిన విందు విహారాలతో అతిథి మర్యాదలకు స్థానిక బైకర్స్ పాత బస్తీనే ఎంచుకుంటారు.తెల్లవారు ఝాము దాకా.. అర్ధరాత్రి ప్రారంభించి తెల్లవారుఝామున బ్రేక్ఫాస్ట్తో ముగించడం దాకా అక్కడే గడిపే బైకర్స్ కూడా ఉన్నారు.. బిర్యానీ, క్యారామెల్ పుడ్డింగ్, జఫ్రాన్ టీ వంటి వెరైటీలకు పేరొందిన నయాబ్ హోటల్, మసాలా బ్లాక్ టీ, జిందా తిలిస్మాత్ బ్లాక్ టీలు లభించే చౌక్ ఏరియాలోని డికాక్షన్ పాయింట్, నిహారీ, పాయా, షోర్బాలకు పేరొందిన చౌహాముల్లా ప్యాలెస్ సమీపంలోని అల్హాముదులైలాహ్ హోటల్, జ్యూస్లు, సలాడ్స్ అంటే గుర్తొచ్చే చారి్మనార్ దగ్గర్లోని మిలాన్ జ్యూస్ సెంటర్, సిద్ధి అంబర్ బజార్లో ఇడ్లీ దోశలతో ఆహా్వనించే ప్రహ్లాద్, అన్నపూర్ణ టిఫిన్స్.. ఇంకేం కావాలి చెప్పండి అంటున్న బైకర్స్కు ఆయా హోటల్స్ యజమానులు అంతా చిరపరిచితులే. దీంతో కాస్త ముందుగా చెబితే చాలు వచ్చేవారి సంఖ్యకు తగ్గట్టు ఐటమ్స్ రెడీ చేసేస్తారు.నురానీ కేఫ్ నుంచి నాసిక్ హైవేకి.. రాత్రి 12 దాటిన తర్వాత పాతబస్తీలోని నురానీ కేఫ్లో చాయ్ తాగి కాసేపు ముచ్చట్లు పెట్టుకోవడం రొటీన్. మరింత లాంగ్రైడ్ కోసం అక్కడ నుంచి నాసిక్ హైవే పై 100 నుంచి 120 కిమీ, అలాగే అక్కడి నిమ్రా కేఫ్ కూడా తరచూ మా మీటింగ్ పాయింట్ అవుతుంటుంది. రాత్రి పూట బైక్ మీద చారి్మనార్కు అత్యంత సమీపానికి వెళ్లడం, అక్కడి చాయ్, చాట్ ఆస్వాదించడం బాగుంటుంది. బయట నుంచి వచి్చన బైకర్స్ను తప్పకుండా పాత బస్తీకి తీసుకువెళతాం. – అమర్, హిందూస్థాన్ రాయల్స్ బుల్లెటీర్స్ క్లబ్స్అడ్వెంచర్ ఫీల్ కోసం.. రైడ్స్ మధురమైన జ్ఞాపకాలను పోగు చేసుకోడానికే. అందులో రాత్రి పూట రైడ్స్ ప్రత్యేకమైనవి. నైట్ రైడ్ అడ్వెంచర్ ఫీల్ వస్తుంది. మా వాండరర్స్ తరచూ ఫుడ్ రైడ్స్ నిర్వహిస్తుంటాం. రాత్రి పూట హైవే మీది దాబాల లాగే పాత బస్తీలో వెరైటీ ఫుడ్ అందించే ప్రాంతాల్లో రైడ్స్ వేస్తుంటాం. నగరం మీదుగా పర్యటించే బైకర్స్ గురించి తెలుసుకుని ఆహా్వనిస్తాం. పాతబస్తీ చరిత్రతో పాటు ఆహారాన్ని రుచిచూపిస్తాం. మళ్లీ మళ్లీ ఓల్డ్సిటీకి రావాలని అనిపిస్తుందంటారు. – రాహుల్.వాండరర్స్ క్లబ్ -
Zumba Dance: జుంబా హాయిరే..
జుంబా ప్రస్తుతం నగరాల్లో ట్రెండింగ్ అవుతున్న పదం.. డ్యాన్స్లో ఇదో కొత్త తరహా అనే చెప్పాలి. అయితే సరదా కోసం వేసే డ్యాన్స్ కాదు.. ఆరోగ్యం కోసం, వెయిట్ లాస్ కోసం చేసేదే జుంబా. ఇటు డ్యాన్స్.. అటు ఎక్సర్ సైజ్ రెండూ ఇందులో మిళితమై ఉంటాయి. అందుకే నగరంలో ఎక్కువ మంది ప్రస్తుతం జుంబాకు ఆకర్షితులవుతున్నారు. జుంబాతో శరీరానికి, గుండెకు మేలు చేసి, మానసిక ప్రశాంతత ఇవ్వడమే కాకుండా ఎన్నో వ్యాధులు దరిచేరకుండా చేస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు. ఉదయం లేవగానే ఇంటి పనులు.. ఉద్యోగం కోసం పరుగులు.. ఆఫీస్ వర్క్.. టార్గెట్స్.. టెన్షన్స్.. సాయంత్రం పొద్దుపోయాక రావడం.. అలసిపోయి ఏదో తినేసి పడుకోవడం.. మళ్లీ ఉదయంతో షరా మామూలే.. అన్నట్లు మారిపోయింది. కనీసం ఆరోగ్యం గురించి కాస్త సమయం కేటాయించడానికి కూడా కష్టం అవుతోంది. దీంతో చిన్న వయసులోనే అనారోగ్యంతో పాటు మానసిక సమస్యలతో సతమతం అవుతున్నారు. ముఖ్యంగా హృద్రోగ సమస్యలు వెంటాడుతున్నాయి. అందుకే ప్రతి రోజు కాకపోయినా వారంలో రెండు, మూడు రోజులైనా ఓ గంట పాటు వ్యాయామం చేయాలని నిపుణులు చెబుతున్నారు. అయితే జిమ్కు వెళ్లడం అందరికీ సాధ్యం కాకపోవచ్చు. వెళ్లినా జిమ్ చేయడం అందరి శరీరాలకు సెట్ కాకపోవచ్చు. అందుకే నగరంలో చాలా మంది జుంబా డ్యాన్స్ను ఎంచుకుంటున్నారు. బరువు తగ్గేందుకు.. నగరంలో మారిన జీవన శైలి, ఆహారపు అలవాట్ల కారణంగా చాలా మందిలో ఊబకాయం, బరువు పెరగడం వంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు. దీంతో మానసికంగానే కాకుండా సామాజికంగా కూడా ఎన్నో సమస్యలు ఎదుర్కొంటారు. అందుకే చాలా మంది బరువు తగ్గేందుకు జిమ్లను కాకుండా జుంబా డ్యాన్స్ క్లాసులకు వెళ్తున్నారు. జుంబా అంటే ఒక రకమైన కార్డియో వ్యాసు్కలార్ ఎక్సర్సైజ్లలో ఒకటని చెప్పుకోవచ్చు. ఏరోబిక్ ఎక్సర్సైజ్ అని కూడా అనొచ్చు. రోజులో కనీసం గంట పాటు చెమటలు వచ్చేదాకా జుంబా డ్యాన్సులు చేయిస్తుంటారు. దీని ద్వారా శరీరంలో కేలరీలు కరిగి బరువు తగ్గుతుందని చెబుతున్నారు. ఈ జుంబా క్లాసుల్లో మ్యూజిక్ పెట్టి.. సాల్సా, కుంబియా, బచతా, మెరెంగ్యూ వంటి డ్యాన్స్ స్టెప్స్ వేయిస్తుంటారు. వీటితో పాటు సినిమా పాటలకు కూడా స్టెప్స్ వేయిస్తుంటారు. పైగా పది మందితో కలిసి డ్యాన్స్ చేస్తుంటారు కాబట్టి ఫన్ ఉంటుంది.హార్ట్కు మాంచి ఎక్సర్సైజ్.. జుంబా డ్యాన్స్ ఏరోబిక్ ఎక్సర్సైజ్ కావడంతో గుండెకు ఎంతో మేలు జరుగుతుంది. రక్త పీడనం (బ్లడ్ ప్రెషర్) తగ్గించడంతో పాటు హృద్రోగ సమస్యలు దరి చేరకుండా చూస్తుంది. శరీర బరువు తగ్గడంతో పాటు శరీరాకృతిని మెరుగుపరుస్తుంది. అంటే చక్కటి శరీరాకృతి వచ్చేలా చేస్తుంది. జుంబా డ్యాన్స్లో చేసే స్టెప్స్ ద్వారా శరీరం ఫ్లెక్సిబుల్గా మారుతుంది. అంతేకాకుండా కాన్ఫిడెన్స్ పెరిగేందుకు దోహదం చేస్తుంది. ఒత్తిడిని తగ్గించడమే కాకుండా మనసు ప్రశాంతంగా ఉండేలా చేస్తుంది. మరెన్నో లాభాలు.. జుంబా డ్యాన్స్ క్లాసులకు చాలా మంది వస్తుంటారు. వారితో తరచూ సంభాషిస్తుండటం.. కలిసి డ్యాన్సులు చేస్తుండటంతో స్నేహం పెరుగుతుంది. అలాగే మ్యూజిక్ వింటూ డ్యాన్స్ చేస్తుంటే మంచి మూడ్ పెంచే హార్మన్స్ విడుదల అవుతాయి. రోజంతా ఉల్లాసంగా ఉంటుంది. రోజులో చేయాల్సిన పనులను ఎంతో ఉత్సాహంగా చేస్తుంటాం. దీంతో ఉత్పాదకత కూడా పెరగుతుంది. ఆత్మ విశ్వాసం పెరుగుతుంది. మనపై మనకు నమ్మకం పెరుగుతుంది. డ్యాన్స్ వల్ల చెమటలు రావడంతో చర్మంపై ఉన్న రంధ్రాలు తెరుచుకుంటాయి. శరీరంలోని మలినాలు బయటకు వెళ్లి.. చర్మ సౌందర్యం కూడా పెరుగుతుంది. వయసుతో సంబంధం లేకుండా.. వయసుతో సంబంధం లేకుండా జుంబా డ్యాన్స్ ఎవరైనా చేయొచ్చని శిక్షకులు చెబుతున్నారు. ఆడవాళ్లు మాత్రమే జుంబా డ్యాన్స్ క్లాసులకు వెళ్తారనే అపోహ చాలా మందిలో ఉంది. అయితే ఆడవారితో పాటు మగ వారు కూడా జుంబా డ్యాన్స్ చేయొచ్చని పేర్కొంటున్నారు. నిపుణుల పర్యవేక్షణలో సరైన పద్ధతిలో, సరైన రీతిలో జుంబా డ్యాన్స్ చేస్తే ఎన్నో లాభాలు ఉంటాయని వివరిస్తున్నారు. ఎనిమిదేళ్లుగా శిక్షణ.. గత ఎనిమిది ఏళ్లుగా జుంబా డ్యాన్స్ నేరి్పస్తున్నాను. 10 ఏళ్ల నుంచి 60 ఏళ్ల వయసు వరకూ ఎంతో మంది క్లాసులకు వస్తుంటారు. కొందరు బరువు తగ్గడానికి వస్తుంటారు. చాలా మంది ఫిట్నెస్ కోసం వస్తుంటారు. జుంబా క్లాసులను బాగా ఎంజాయ్ చేస్తుంటారు. రెగ్యులర్గా జుంబా చేస్తే ఆరోగ్య పరంగా, మానసికంగా ఎన్నో లాభాలున్నాయి. – ప్రేమ్ శోతల్, జుంబా ట్రైనర్, డివైన్ స్టూడియో ఆహ్లాదం.. ఆరోగ్యం.. బరువు తగ్గడమంటే చాలా మంది ఎదో బర్డెన్లా చూస్తుంటారు. కానీ జుంబాతో ఇటు ఎంటర్టైన్మెంట్ అటు బరువు తగ్గే వీలుంటుంది. దీని ద్వారా శరీరంలోని కొవ్వు తగ్గిస్తుంది. ఫ్లెక్సిబిలిటీ పెరిగి, శరీరాకృతి మెరుగు పడుతుంది. ఆహారంలో పెద్దగా మార్పులు ఏం అవసరం లేదు. కాకపోతే ఇంట్లో ఆహారం సమయానికి, కాస్త తక్కువగా తింటే లాభాలు కనిపిస్తాయి. రెగ్యులర్గా జుంబా డ్యాన్స్ చేస్తుంటే అనుకున్న ఫలితాలు చూడొచ్చు. – బుద్ధరాజు పూజిత, జుంబా ట్రైనర్, వన్ ఆల్ ఎరేనా -
సమ్థింగ్ డిఫరెంట్
సరదాగా కాఫీనో, టీనో తాగడానికి కేఫ్స్కి వెళ్తున్నారా? ఇష్టమైన వంటకాలు రుచి చూడడానికి వెళ్తున్నారా? అయితే నగరంలో లేటెస్ట్ కేఫ్ కల్చర్ని మీరింకా టేస్ట్ చేయలేదన్నట్టే. ఇప్పుడు కేఫ్స్ అంటే ఆఫీస్.. కేఫ్స్ అంటే వెరైటీ ఈవెంట్లకు కేరాఫ్గా మారుతున్నాయి.. ఆధునిక కల్చర్కు అసలైన చిరునామాగా నిలుస్తున్నాయి నగరంలోని పలు కేఫ్లు. ఈవెంట్స్ నుంచి వెరైటీ మీట్స్ వరకూ కేఫ్లు వేదికలవుతున్నాయి. వర్క్ప్లేస్ల నుంచి వర్క్షాపుల వరకూ కేఫ్లు కేరాఫ్ అడ్రస్ అవుతున్నాయి. టాప్ క్లాస్ చిత్రకారుని చిత్రాలను వీక్షించడానికో.. ఓ బెస్ట్ సాక్సాఫోన్ ఆర్టిస్ట్ సంగీతాన్ని వినడానికో.. స్టోరీటెల్లర్ కథల విందుకో, సెలబ్రిటీల సక్సెస్ సీక్రెట్స్ వినేందుకో.. ఒకప్పుడైతే ఏదైనా కల్చరల్ సెంటర్కో లేదా వాటికి ప్రత్యేకించిన మరో చోటుకో వెళ్లేవారు. అయితే ఇప్పుడు వాటితో పాటు అవీ ఇవీ అనే తేడా లేకుండా అన్నీ ఒకే వేదికపై అందుకోడానికి ఒక్క కేఫ్కి వెళితే చాలు. ఫుడ్కీ, డ్రింక్స్కి మాత్రమే పరిమితమైతే కాదు.. రోజుకో ఈవెంట్తో తన వెంట తిప్పుకుంటేనే అది కేఫ్ అని పునర్ నిర్వచిస్తున్నాయి నగరంలోని నయా ట్రెండ్స్. మ్యూజిక్ ఈవెంట్ల.. పంట.. పేరొందిన రాక్ బ్యాండ్ సంగీత ప్రదర్శనలతో కేఫ్స్ హోరెత్తుతున్నాయి. బంజారాహిల్స్లోని హార్డ్రాక్ కేఫ్ లాంటివి అచ్చంగా వీటికే పేరొందాయి. డ్రమ్స్, ఫ్లూట్స్, సాక్సాఫోన్, వయోలిన్.. తదితర విభిన్న రకాల పరికరాలను పలికించడంలో నైపుణ్యం కలిగిన మ్యుజీషియన్స్ తరచూ కేఫ్ సందర్శకులకు వీనుల విందును పంచుతుంటారు. ఇక గజల్ గానామృతాలు, సినీ గాయకుల స్వరమధురిమల సంగతి సరేసరి. ఓ వైపు రుచికరమైన విందును, మరోవైపు పాటలతో వీనుల విందును సైతం అతిథులు ఆస్వాదిస్తున్నారు.కేఫ్స్లో నిర్వహించే ఈవెంట్స్లో మ్యూజిక్ తర్వాత కామెడీ షోస్కే ప్రాధాన్యత ఇస్తున్నారు. ముఖ్యంగా స్టాండప్ కామెడీకి అతిథుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. సిటీలో ఇప్పుడు పదుల సంఖ్యలో స్టాండప్ కమెడియన్స్ ఉన్నారంటే దానికి కారణం కేఫ్స్ యజమానులు వారికి కల్పిస్తున్న అవకాశాలే అని చెప్పొచ్చు. ఇతర నగరాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో పేరొందిన కమెడియన్స్, థియేటర్ ఆరి్టస్ట్స్, టీవీ షోస్ ద్వారా పాపులర్ అయినవారు, సోషల్ మీడియా సెలబ్రిటీలు కూడా సిటీ కేఫ్స్కు తరలివస్తున్నారు.వర్క్ప్లేస్లోనూ..ఒకప్పుడు సాయంత్రాల్లో, వారాంతాల్లో మాత్రమే కేఫ్స్ కళకళలాడేవి అయితే ఆ తర్వాత పగటి పూట, అలాగే అన్ని రోజుల్లోనూ చెప్పుకోదగిన సంఖ్యలోనే కస్టమర్స్ కనిపిస్తున్నారు. దీనికి ప్రధానంగా రెండు కారణాలను చెప్పొచ్చు. ఆఫీస్ స్పేస్ను కూడా కేఫ్స్ ఆఫర్ చేస్తుండడం ఇందులో ఒకటి. వర్క్ ఫ్రమ్ హోమ్, హైబ్రిడ్ తదితర కరోనా నేపథ్యంలో పుట్టుకొచ్చిన వర్క్ కల్చర్స్ వల్ల ఇప్పుడు కేఫ్స్లో కూర్చునే ఆఫీస్ వర్క్ చేసుకోవడం నగరవాసులకు అలవాటైంది. కేవలం ఐటీ నిపుణులు మాత్రమే కాకుండా విభిన్న రకాల వృత్తి వ్యాపకాల్లో ఉన్నవారు కూడా కేఫ్స్ను వర్క్ప్లేస్లుగా వినియోగిస్తున్నారు.వర్క్షాప్స్.. విందు వినోదాలకు మాత్రమే కాకుండా విభిన్న రకాల అంశాల్లో శిక్షణా తరగతులకు కూడా కేఫ్స్ నిలయంగా మారుతుండడం విశేషం. గత రెండేళ్లుగా ఈ ట్రెండ్ కేఫ్స్లో బాగా పెరిగిందని నగరానికి చెందిన ఫుడీస్ క్లబ్ నిర్వాహకులు సంకల్ప్ చెబుతున్నారు. పోటరీ వర్క్షాప్, పెయింటింగ్ వర్క్షాప్, కేక్ డెకరేటింగ్, రెసిన్ ఆర్ట్, క్యాండిల్ మేకింగ్, బేకింగ్ తదితర కళలకు సంబంధించిన వర్క్షాప్లతో నగరవాసులను ఆకర్షిస్తున్నాయి.డేటింగ్స్.. మీటప్స్.. పలు సంస్థలు, క్లబ్స్ తమ మీటప్ పాయింట్లుగా కేఫ్స్ను ఎంచుకుంటున్నాయి. నిర్వాహకులు వారి కార్యకలాపాలకు తగ్గట్టుగా థీమ్స్ను సిద్ధం చేసి మరీ ఆతిథ్యం అందిస్తున్నారు. అయితే ఇటీవలి కాలంలో నగరంలో ఊపందుకున్న డేటింగ్స్కు కూడా పలు కేఫ్స్ వారధిగా నిలుస్తున్నాయి. కొన్ని కేఫ్స్ ప్రత్యేకంగా ఒంటరి వ్యక్తుల కోసం ఒక రోజును కేటాయిస్తూ ఫ్రెండ్షిప్ ఈవెంట్స్, పెయిరింగ్ ఈవెంట్స్ తరహా థీమ్స్తో ఆకర్షిస్తున్నాయి. సహజంగానే ఇవి సోలో లైఫ్లో ఉన్నవారిని ఆకట్టుకుంటున్నాయి. -
హాయ్.. ఏఐ
కృత్రిమ మేధ.. సాంకేతిక విప్లవంలో మానవుడి ఆలోచనలకు అందనంత దూరం వెళ్లిపోయింది. మెషీన్ లెర్నింగ్, డీప్ లెరి్నంగ్ సాయంతో మనిషి కూడా చేయలేని ఎన్నో పనులకు పరిష్కారం చూపుతోంది. భవిష్యత్తు మొత్తం కృత్రిమ మేధదే అనడంలో ఎలాంటి సందేహం లేదు. తెలంగాణ ప్రభుత్వం కూడా కృత్రిమ మేధపై ఫోకస్ పెట్టింది. ముఖ్యంగా హైదరాబాద్లో ఏఐ సిటీ నిర్మించాలని ప్రణాళికలు కూడా రచిస్తోంది. యువత కూడా ఏఐలో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. తమ సృజనాత్మకతకు పదును పెడుతోంది. ఏఐతో నడిచే కొత్త కొత్త యాప్లను సృష్టించి.. ఎన్నో చిక్కుముడులను విప్పుతోంది. ఏదో ఒక ఉద్యోగం చేయడం కన్నా.. సొంతంగా స్టార్టప్లు స్థాపించి ఎన్నో అద్భుతాలు సృష్టిస్తున్నారు. సమాజానికి తమ చేతనైన సాయం చేస్తున్నారు. ఇప్పటికే టీ–హబ్ వేదికగా ఎన్నో ఏఐ ఆధారిత స్టార్టప్లు పురుడుపోసుకున్నాయి. ఎన్నో స్టార్టప్లకు టీ–హబ్ ప్రోత్సాహం అందిస్తోంది. సాధారణంగా మనుషుల జాతకం గురించి వినే ఉంటాం. కానీ వాహనాలకు కూడా జాతకం ఉంటుందా అనే కదా మీ అనుమానం. ఏఐతో వాహనం జాతకం గురించి చెప్పే యాప్ను చరణ్ సింగ్, మల్లికారెడ్డి అనే ఇద్దరు యంగ్ ఎంట్రప్రెన్యూర్స్ తీసుకొచ్చారు. వీళ్లు రూపొందించిన చిన్న పరికరం ఏఐ సాయంతో పనిచేస్తుంది. దాన్ని కనుక వాహనానికి అమర్చుకుంటే వాహనం కండీషన్ ఎలా ఉందో ఎప్పటికప్పుడు మన మొబైల్ ఫోన్కు సమాచారం అందిస్తుంది. ఎప్పుడు బ్రేక్డౌన్ అవుతుంది.. ఎప్పుడు సరీ్వసింగ్ చేయించాలి.. అన్న వివరాలను మనకు తెలుపుతూ ఉంటుంది. వాహనం ఆరోగ్యం ఎలా ఉందనే విషయాన్ని మనకు చెబుతుందన్న మాట. 2018లోనే ఈ ఐడియాతో ఓ స్టార్టప్ మొదలు పెట్టాలని భావించారు. చివరకు 2022లో దీన్ని ప్రారంభించి ఔరా అనిపించుకుంటున్నారు. సాధక్ అనే ఈ పరికరంతో వాహనాల లైఫ్టైం భారీగా పెంచుకోవచ్చని చరణ్ సింగ్ చెబుతున్నారు. ఏదైనా సమస్య వస్తుందని ముందే పసిగట్టి చెబుతుంది కాబట్టి అవసరమైన చిన్న చిన్న మరమ్మతులు చేయించుకోవడం లేదా జాగ్రత్తలు పాటించడం ద్వారా వాహనం షెడ్డుకు వెళ్లకుండా కాపాడుకోవచ్చని వివరించారు. వేక్.ఇన్ అనే పోర్టల్ ద్వారా వీరు సేవలు అందిస్తున్నారు.మూసీ పరిరక్షణలోనూ ఏఐ.. మూసీ ప్రక్షాళనకు ఎంత ప్రయత్నం చేసినా ప్రయోజనం కనిపించట్లేదు. అసలు సమస్య ఎక్కడ మొదలైందో కనుక్కొని ప్రయత్నాలు చేస్తే ఫలితం ఉంటుందని పలువురు చెబుతున్నారు. అయితే కృత్రిమ మేధతో పరిష్కారం చూపుతామని కొందరు ఇంజనీరింగ్ విద్యార్థులు ముందుకొచ్చారు. నాలుగు దశల్లో మూసీని పూర్తిగా పరిశుభ్రం చేయొచ్చని చెబుతున్నారు. తొలుత డ్రోన్ల సాయంతో మూసీ నదిలో, పరీవాహక ప్రాంతంలోని చెత్తను తొలగించాలని పేర్కొంటున్నారు. సెన్సార్ల ద్వారా మూసీలో చెత్త వేస్తే వెంటనే అధికారులకు సమాచారం అందిస్తుంది. అంతేకాదు.. వరదలు, విపత్తులను గుర్తించేందుకు ఎంతో ఉపయోగపడుతుంది. వరదలు రావడానికి ముందే ముప్పును పసిగట్టి స్థానికులకు సమాచారం అందజేస్తుంది. దీంతో ఎలాంటి నష్టం వాటిల్లకుండా సురక్షిత ప్రాంతాల్లో తలదాచుకునే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా అధికారులు త్వరగా సహాయక చర్యలు చేపట్టే వీలు కలి్పస్తుంది. అర్బన్ ప్లానింగ్లో కూడా కృత్రిమ మేధను వినియోగించుకుని, భవిష్యత్తు తరాలకు ఎలాంటి ఇబ్బందులూ లేకుండా ప్రణాళికలు రచించవచ్చని పేర్కొంటున్నారు. ఇక, ఎక్కడెక్కడ బ్రిడ్జిలు అవసరం ఉన్నాయనే విషయం కూడా కృత్రిమ మేధ చెప్పేస్తుందని చెబుతున్నారు. ట్రాఫిక్ ఉల్లంఘనలను పట్టేసేలా..ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించే వారిని సులువుగా గుర్తించేందుకు కృత్రిమ మేధ సాయంతో వినూత్నంగా కళ్లద్దాలను పర్వ్యూ ఎక్స్ అనే కంపెనీ అభివృద్ధిపరిచింది. వీటిని ధరించిన పోలీసు జస్ట్ అలా వాహనాన్ని తరచి చూస్తే చాలు.. కృత్రిమ మేధ సాయంతో సమాచారం మన ముందుంచుతుంది. డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్, అద్దాలు ఉన్నాయా లేదా ఇలా అన్ని వివరాలను ఫోన్కు పంపుతుంది. ఏవైనా ఉల్లంఘనలు జరిగితే వెంటనే చలాన్లు కూడా జెనరేట్ చేసి, వాహనదారుడికి పంపుతుంది. ఉన్నతాధికారులకు ఈ విషయాలను పంపుతుంది. వాయిస్ రూపంలో సదరు అధికారికి వివరాలను చెబుతోంది. అలాగే ట్రాఫిక్ ఎలా ఉందనే వివరాలను కూడా అంచనా వేసి, ట్రాఫిక్ నియంత్రణలో మేలు చేస్తుంది. చాలా కచి్చతత్వంతో వివరాలను నమోదు చేస్తుంది. అలాగే దీంతో కిందిస్థాయి సిబ్బంది ఎలాంటి అవకతవకలకు పాల్పడకుండా పారదర్శకత పెంపొందించేందుకు ఉపయోగపడుతుంది.భవిష్యత్తు ఏఐదే.. భవిష్యత్తులో మనం ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ఏఐ నిర్ణయించే రోజు వస్తుంది. మనం చేయాల్సిన ప్రతి పనినీ ఏఐ అ«దీనంలోకి తీసుకుంటుంది. కృత్రిమ మేధతో చాలా జాగ్రత్తగా ఉండాలి. భవిష్యత్తులో నిరుద్యోగం పెరిగే ప్రమాదం ఉంది. కాకపోతే ఏఐని సరైన క్రమంలో మలుచుకుని, స్కిల్స్ పెంచుకుంటే మాత్రం కృత్రిమ మేధ ద్వారా ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. – చరణ్సింగ్, వేక్ వ్యవస్థాపకుడుస్టార్టప్లో పనిచేస్తూ సొంతంగా.. స్టార్టప్ ఏర్పాటు చేసే ముందు ఏదైనా స్టార్టప్ కంపెనీలో పనిచేస్తే మంచిది. అందులో ఉండే కష్టనష్టాలు తెలుసుకోవడం ద్వారా భవిష్యత్తులో అలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా జాగ్రత్త పడితే.. నిర్వహణలో విజయం సాధించవచ్చు. నేను కూడా అలా ముందు ఓ కంపెనీలో పనిచేసి.. సొంతంగా స్టార్టప్ స్థాపించాను. ఇప్పుడు సక్సెస్ఫుల్గా సంస్థను నడిపిస్తున్నాను. మా బాబాయి మెకానిక్. ఆయన లాంటి మెకానిక్లకు ఉపయోగపడేలా ఏదైనా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో వేక్ను స్థాపించాను. – మల్లికారెడ్డి, వేక్ సహ వ్యవస్థాపకురాలు -
Nimrah Cafe: సిటీ స్పాట్స్.. సెల్ఫీ షాట్స్
మనిషి జీవనశైలిలో వచ్చిన అధునాతన మార్పుల్లో సెల్ఫీకి ప్రత్యేక స్థానముంది. ప్రస్తుత జీవన విధానంలో సోషల్ మీడియా కీలకపాత్ర పోషిస్తోంది. ముఖ్యంగా ఎక్స్, ఇన్స్టా, ఫేస్బుక్, వాట్సాప్.. ఇలా ఎన్నో వేదికలపై సెల్ఫీ అజరామరంగా వెలుగుతోంది. 2012 తర్వాత సెల్ఫీ అనే వ్యాపకం గ్లోబల్ వేదికగా తన ప్రశస్తిని పెంచుకూంటూ వస్తోంది. అయితే.. ప్రస్తుతం నగరంలోని ఓల్డ్ సిటీ సెల్ఫీ స్పాట్స్గా గుర్తింపు పొందుతోంది. తమని తాము మాత్రమే కాకుండా తమ వెనుక ఓ చారిత్రక కట్టడం, వారసత్వ వైభవాన్ని క్లిక్మనిపించడం ఈ తరానికి ఓ క్రేజీ థాట్గా మారింది. ఇందులో భాగంగానే పాతబస్తీలోని కొన్ని ప్రాంతాలు సెల్ఫీ స్పాట్స్కు హాట్స్పాట్స్గా మారాయి..! ప్రస్తుతం హైదరాబాద్ అంటే ఐటీ, మోడ్రన్ లైఫ్ వంటి విషయాలు మదికి వస్తాయేమో కానీ.., గతంలో మాత్రం చార్మినార్ గుర్తొచ్చేది. ఇప్పటికీ కూడా హైదరాబాద్ను మొదటిసారి సందర్శించిన ప్రతి ఒక్కరూ చార్మినార్ను చూడాలనే అనుకుంటారు. అనుకోవడమే కాదు.. నగరానికొచ్చి చార్మినార్తో సెల్ఫీ తీసుకోలేదంటే ఏదో అసంతృప్తి. ఇలా సిటీలో బెస్ట్ సెల్ఫీ స్పాట్గా చార్మినార్ అందరినీ దరిచేర్చుకుంటుంది. ఉదయం వాకింగ్ మొదలు అర్ధరాత్రి ఇరానీ ఛాయ్ ఆస్వాదించే వారి వరకు ఈ చార్మినార్తో సెల్ఫీ అనుబంధాన్ని కొనసాగిస్తున్నారు. ఓల్డ్సిటీ ఇప్పటికీ తన వైభవాన్ని సగర్వంగా నిలుపుకుంటుంది అంటే చార్మినార్ వల్లే అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ మధ్య కాలంలో అర్ధరాత్రి నగరవాసులు అతి ఎక్కువగా సందర్శిస్తున్న ప్రాంతాల్లో ఈ సెల్ఫీ స్పాట్ ఒకటి. ఓల్డ్సిటీ షాపింగ్ అంటే లక్షల క్లిక్కులే.. ఓల్డ్ సిటీ అంటే ఒక్క చార్మినార్ మాత్రమే కాదు.. ఇక్కడ దొరికే మట్టి గాజులకు అంతర్జాతీయ ఖ్యాతి ఉంది. షాపింగ్ అంటే నో చెప్పని యువతులు ఉన్నారంటే అతిశయోక్తి కాదేమో. యువతుల మనస్సును హత్తుకునే ఎన్నో అలంకరణ వస్తులు, గాజులు, డ్రెస్ మెటీరియల్స్ ఇక్కడ విరివిగా లభ్యమవుతాయి. రంజాన్ సీజన్లో ఇక్కడ షాపింగ్ చేయడానికి వివిధ ప్రాంతాల నుంచి సైతం రావడం విశేషం. ఈ సమయంలో ఇక్కడే లక్షలసెల్ఫీలు క్లిక్, క్లిక్మంటుంటాయి. చింత చెట్టు కింద సెల్ఫీ.. హైదరాబాద్ నగరంలో 1908లో వచ్చిన వరదలకు దాదాపు 15 వేల మందికి పైగా మరణించారు. ముఖ్యంగా మూసీ పరివాహక ప్రాంతాల్లో చాలా ప్రాణనష్టం జరిగింది. ఈ తరుణంలో అఫ్జల్గంజ్లోని ఉస్మానియా హాస్పిటల్కు సమీపంలో ఉన్న చింతచెట్టు దాదాపు 150 మంది ప్రాణాలను కాపాడింది. వరదల్లో చిక్కుకుని ప్రాణాపాయ స్థితిలో ఉన్న నగరవాసులు ఈ చెట్టు ఎక్కి తమ ప్రాణాలను దక్కించుకున్నాను. అయితే ఇప్పటికీ ఈ చెట్టు పటిష్టంగా ఉంది. ఈ చరిత్ర తెలిసిన వారు ఆ సమీపంలోకి వెళ్లినప్పుడు ఓ సెల్ఫీ తీసుకోవడం మాత్రం మరిచిపోరు. ఈ వీధులన్నీ సెల్ఫీలమయమే.. పాతబస్తీలోనే కొలువుదీరిన సాలార్జంగ్ మ్యూజియం, వందేళ్ల సిటీ కాలేజ్, హైకోర్టు పరిసర ప్రాంతాలు, పురానాపూల్, చార్మినార్ చౌరస్తా కేంద్రంగా నాలుగు దిక్కుల్లోని విధుల్లో నిర్మించిన కమాన్లు కూడా సెల్ఫీ స్పాట్లుగా మారాయి. మిడ్ నైట్ స్పాట్.. నిమ్హ్రా చార్మినార్ పక్కనే ఉన్న నిమ్హ్రా కేఫ్ కూడా ది బెస్ట్ సెల్ఫీ స్పాట్గా మారింది. ఇక్కడ టీ తాగుతూ సెల్ఫీ తీసుకోవడం, అది కూడా అర్ధరాత్రి ఛాయ్కి రావడం ఇక్కడి ప్రత్యేకత. పాతబస్తీకి వచ్చిన ప్రతి ఒక్కరినీ ఛాయ్ ఆహా్వనించడం నిమ్హ్రా కేఫ్ ప్రత్యేకత. ప్రముఖ బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్దికీ ఇదే కేఫ్లో సెల్ఫీ దిగి అక్కడే ఫోన్ మర్చిపోయి ఎయిర్పోర్ట్ వెళ్లాడు. అయితే అంతే జాగ్రత్తగా తన ఫోన్ తనకు తిరిగి రావడంతో నగరవాసులపై గౌరవం పెరిగిందని చెప్పుకున్నారు. దీనికి సమీపంలోని షాగౌస్ బిర్యాని తింటూ సెల్ఫీ తీసుకుని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ఓ ట్రెండ్. ఇలా పిస్తాహౌజ్, ఇరానీ ఛాయ్, పాయా సూప్ తదితర ఫుడ్ స్పాట్లు సెల్ఫీ స్పాట్లుగా మారాయి.మొదటి ‘సెల్ఫీ’.. సెల్ఫీ అనే పదాన్ని మొట్టమొదటిసారిగా ఆ్రస్టేలియాలోని ఓ న్యూస్ వెబ్సైట్లో వాడారు. కానీ సెల్ఫీ అనే పదం ప్రాచూర్యం పొందింది మాత్రం 2012 తర్వాతే అని చెప్పాలి. సోషల్ మీడియా ఊపందుకుంటున్న 2013లో ఈ సెల్ఫీ అనే కొత్త పదం విపరీతంగా చక్కర్లు కొట్టింది. ముఖ్యంగా ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో ఈ పదం బాగా ప్రాచూర్యంలోకి వచ్చింది. ఈ నేపథ్యంలో ఆక్స్ఫర్డ్ ఇంగ్లిష్ డిక్షనరీ సెల్ఫీ అనే పదాన్ని ‘వర్డ్ ఆఫ్ ది ఇయర్’గా ఎంపిక చేసింది. -
Ananthagiri Hills: కూల్ వెదర్..హాట్ స్పాట్..
ఉరుకుల పరుగుల జీవితంలో ఒత్తిడిని దూరం చేసుకునేందుకు నగర ప్రజలు, ఐటీ ఉద్యోగులు వారాంతాల్లో ప్రశాంతంగా గడపాలని కోరుకుంటున్నారు. అందుకు అనువైన ప్రదేశంగా హిల్ స్టేషన్లను ఎంపిక చేసుకుంటున్నారు. ట్రెక్కింగ్, రైన్ డ్యాన్స్, వాటర్ ఫాల్స్, ఫైర్ క్యాంప్, అడ్వెంచర్ గేమ్స్ పర్యాటకులను ఆకట్టుకుంటున్నాయి. ఇటీవల కురిసిన వర్షాలకు వాతావరణం చల్లబడింది. ఇటువంటి సందర్భాల్లో హిల్ స్టేషన్లలో ఫైర్ క్యాంప్తో ఎంజాయ్ చేయడానికి ఎక్కువ మంది ఇష్టపడుతున్నారని టూర్ ఆపరేటర్లు పేర్కొంటున్నారు. దీనికి తగ్గట్లు రిస్సార్ట్స్, హోటల్ యాజమాన్యాలు ఆకర్షణీయమైన ప్యాకేజీలను ప్రకటిస్తున్నారు. రానున్నది శీతాకాలం. కాబట్టి ఫిబ్రవరి వరకూ ఈ క్యాంపులకు ప్రజల నుంచి ఆదరణ లభిస్తుందని అంచనా వేస్తున్నారు.ఔటర్ చుట్టూ.. ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ వందల సంఖ్యలో ఫాం హౌస్లు, పదుల సంఖ్యలో స్టార్ హోటల్స్, రిసార్టులు ఉన్నాయి. పర్యాటకులను ఆకర్షించేందుకు నిర్వాహకులు ఇప్పటి నుంచే ప్రత్యేక ఏర్పాట్లు చేస్తూ సీజన్కు సిద్ధమవుతున్నారు. రానున్న శీతాకాలంలో సాయంత్రం మంచు కురిసే వేళలో వెచ్చగా ఫైర్ క్యాంప్ కల్చర్ వచ్చే ఐదు నెలలపాటు కొనసాగుతుంది. దీనికి తోడు పుట్టిన రోజు, వివాహ వార్షికోత్సవం, ఇతర ఫంక్షన్లు వంటి కార్యక్రమాలను కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులతో కలిసి సరదాగా కాలక్షేపం చేయాలని ఆకాంక్షిస్తున్నారు. ఎత్తైన హిల్ స్టేషన్లలో ఎక్కువ సమయం గడపడానికి ఆసక్తి చూపిస్తున్నారు. స్వచ్ఛమైన గాలి, చుట్టూ ప్రశాంతమైన వాతావరణం, వాయు, శబ్ధ కాలుష్యాలకు దూరంగా, ఇతర ఆటంకాలు ఉండని చోటు కోరుకుంటున్నారు. చల్లని వాతావరణంలో.. క్యాంప్ ఫైర్ చుట్టూ కూర్చుని చలికాచుకుంటూ, కబుర్లు చెప్పుకుంటూ స్వీట్ మెమొరీస్ను పదిలం చేసుకుంటున్నారు.ఆకర్షణగా అనంతగిరి హిల్స్.. హైదరాబాద్ సమీపంలో హిల్ స్టేషన్ అనగానే గుర్తుకొచ్చేది అనంతగిరి హిల్స్. పాల నురగలు కక్కుతూ జాలువారే వాటర్ ఫాల్స్, అనంత పద్మనాభస్వామి దేవాలయం, దట్టమైన అటవీ ప్రాంతం, పచ్చని కొండలు, ఆ పక్కనే పదుల సంఖ్యలో అత్యాధునిక వసతులతో కూడిన రిసార్ట్స్. ఉదయం లేత సూర్యకిరణాలు తాకుతున్న వేళ ట్రెక్కింగ్, సాయంత్రం చల్లని వాతావరణంలో వెచ్చగా ఫైర్ క్యాంపు, ఆపై రెయిన్ డ్యాన్స్లు, వాటర్ ఫాల్స్, వ్యూ పాయింట్లు, ఇంకా ఎన్నో ప్రత్యేకతలతో అనంతగిరి హిల్స్ పర్యాటకులను ఆకట్టుకుంటున్నాయి. రిసార్ట్స్కు రోజుకు రూ.3వేల నుంచి రూ.10 వేల వరకూ చెల్లించాల్సి ఉంటుంది. హైదరాబాద్లోని ప్రకృతి ప్రేమికులు, విద్యార్థులు, సాఫ్ట్వేర్ ఉద్యోగులు వారాంతపు డెస్టినేషన్ హిల్ స్టేషన్గా అనంతగిరి వెలుగొందుతోంది.రెండు సీజన్లలో క్యాంప్ ఫైర్.. రానున్న శీతాకాలం ఎక్కువ మంది క్యాంప్ ఫైర్, ట్రెక్కింగ్ అడుగుతుంటారు. పర్యాటకుల అభిరుచులకు అనుగుణంగా క్రీడలు, అడ్వెంచర్ గేమ్స్, రోప్ వే సంబంధిత కార్యక్రమాలు ప్లాన్ చేస్తున్నాం. ఎప్పటికప్పుడు కాలానుగుణంగా ప్యాకేజీలు మారుతుంటాయి. వేసవిలో వాటర్ స్పోర్ట్స్, రెయిన్ డ్యాన్స్, వర్షాకాలం, శీతాకాలంలో క్యాంప్ ఫైర్కు ఎక్కువ ఆదరణ ఉంటుంది. – పీ.గంగాథర్ రావు, హరివిల్లు రిస్సార్ట్స్ నిర్వాహకులు, వికారాబాద్ఆ వాతావరణం ఇష్టం..చల్లనివాతావరణంలో వెచ్చగా మంట కాగుతూ, పాటలు పాడుకుంటూ డ్సాన్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తాం. కొడైకెనాల్, కూర్గ్, వయనాడ్, వికారాబాద్ తదితర ప్రాంతాలకు స్నేహితులు, కుటుంబ సభ్యులతో వెళ్ళినప్పుడు అప్పటి వాతావరణ పరిస్థితులను బట్టి రిసార్ట్స్ యజమానులే క్యాంప్ ఫైర్ ఏర్పాటు చేసేవారు. బయటకు వెళ్లినప్పుడు ఒత్తిడిని మర్చిపోయి, హాయిగా గడపాలని అనుకుంటాం. ఎత్తయిన కొండ ప్రాంతాల్లో రాత్రి వేళ చుక్కలను చూసుకుంటూ, స్వచ్ఛమైన వాతావరణంలో మనసుకు హాయిగా ఉంటుంది. – జి.సిద్ధార్థ, ఉప్పల్ -
పెట్ పేరెంటింగ్.. నివాసంలో మూగజీవులతో సహవాసం
లేడికి లేచిందే పరుగు.. అన్నట్టు ఆలోచన వచి్చందే తడవు ఇంటికి తెచ్చేసుకుని మరీ భౌ¿ౌలూ, మ్యావ్ మ్యావ్లూ, కిచకిచలూ.. వింటూ ఆనందించేద్దాం అనుకుంటే సరిపోదు.. కొనడం నుంచి పెంచడం దాకా పెట్స్ పేరెంటింగ్ కూడా ఒక కళే అంటున్నారు నిపుణులు. దీంతో పాటు వాటికి అనువైన ప్రదేశం ఉండేలా చూసుకోవాలి. తరచూ వాటికి ఇవ్వాల్సిన టీకాలు ఇప్పించడం, వాటి నుంచి సంక్రమించే వ్యాధులకు తగిన చికిత్సలు తీసుకోవడం చాలా ముఖ్యమని చెబుతున్నారు.. నగరంలో పెంపుడు జీవులను మచ్చిక చేసుకోవడం... వాటి పెంపకం పట్ల హాబీ ఇంతింతై వటుడింతై అన్నట్టుగా పెరుగుతోంది. అయితే ఏవి కొనాలి? ఎలా పెంచాలి? ఎలా ఉంచాలి? వంటి కీలక విషయాల పట్ల అవగాహన లేకుండానే ఇంటికి తెచ్చేసుకుంటూ ఇబ్బందులు పడుతున్నవారు తక్కువేం కాదు. ఈ నేపథ్యంలో నిపుణులు అందిస్తున్న సూచనలివి... కొనేముందు.. పెంపుడు జీవిగా శునకమైనా, పిల్లులైనా, పక్షులైనా.. తెచ్చు‘కొనే’ముందు తమ ఇంటి పరిస్థితులను విశ్లేషించుకోవాలి. కుటుంబ జీవనశైలి, మనకు అందుబాటులో ఉన్న స్థలం వంటి అంశాలపై ఆధారపడి పెట్ని ఎంపిక చేసుకో వాలి. అలాగే సదరు జీవి స్వభావం, దాని శక్తి స్థాయిలు, దానికి అందించాల్సిన సంరక్షణ అవసరాలను కూడా పరిగణనలోకి తీసుకోవడం చాలా ముఖ్యం. ఇంట్లోని పిల్లలు/వృద్ధుల వయస్సు, వారి ఆరోగ్య పరిస్థితులను కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఇలాగైతే బాగు ‘భౌగు’..శునకాలు, పిల్లులు, పక్షులకు సరిపడేలా, సౌకర్యవంతమైన స్థలాన్ని అందించాలి. అలాగే ఫుడ్కీ, ఆటలకీ తగిన టైమ్ కోసం షెడ్యూల్ సెట్ చేసుకోవాలి. వాటికి ఇవ్వాల్సిన ఆహారం తదితరాల గురించి అలాగే టీకాల షెడ్యూల్ గురించి డాక్టర్ నుంచి సరైన మార్గదర్శకాలు తీసుకోవాలి.. అలాగే జనన నియంత్రణ శస్త్రచికిత్స ఎప్పుడు నిర్వహించాలి వంటివి తెలుసుకోవాలి. శునకాలకు సోషల్ లైఫ్ ముఖ్యం. చుట్టుపక్కల వారితో, సాటి జీవులతో స్నేహపూర్వక బంధం ఏర్పడడం కోసం అవకాశం ఇవ్వాలి. శునకం 4–5 నెలలకు చేరుకున్నప్పుడు వాటికి పలు అంశాల్లో శిక్షణ ఇప్పించడం అవసరం. అదే విధంగా 3 నెలల వయసు వరకూ ఫోమ్ బాత్/డ్రై బాత్, 4–6 నెలల వయసులో 15 రోజులకు ఒకసారి, 6 నెలలు దాటిన తర్వాత వారానికోసారి స్నానం తప్పనిసరి. దాంతో పాటే హెయిర్ కోట్ను క్రమం తప్పకుండా బ్రష్ చేయడం ముఖ్యం. హెయిర్ కట్, గోర్లు కత్తిరించడం చెవి శుభ్రపరచడం ఆసన గ్రంథులు శుభ్రపరచడం అవసరమే. బ్రీడ్.. గుడ్.. శునకాలను కొనుగోలు చేసేముందు వాటి బ్రీడ్స్ను పరిశీలించడం మంచిది. సహనం, ఉల్లాసభరితమైన స్నేహపూర్వక స్వభావంతో పిల్లలున్న కుటుంబాలకు, లాబ్రడార్ రిట్రీవర్లు, గోల్డెన్ రిట్రీవర్లు బీగల్స్ వంటివి, అలాగే అపార్ట్మెంట్స్కు పగ్స్, షిహ్ త్జుస్ వంటి చిన్న బ్రీడ్స్ నప్పితే, ఫార్మ్ హౌస్ల కోసం డాబర్మ్యాన్, రోట్వెల్లర్.. ఇలా ప్రత్యేకించిన బ్రీడ్స్ కూడా ఉన్నాయి. ఇండియన్ పరియా డాగ్ వంటి స్థానిక భారతీయ జాతులు మన వాతావరణానికి బాగా సరిపోతాయి కావలీర్ కింగ్, చార్లెస్ స్పానియల్స్, బాక్సర్లు కూడా పిల్లలతో ఆప్యాయంగా ఉండడానికి పేరొందాయి.మ్యావ్.. మ్యాచ్.. ఇటీవల పిల్లులను పెంచుకుంటున్నవారు బాగా పెరుగుతున్నారు. పెట్స్గా పిల్లులను ఎంచుకున్నవారు వాటి కోసం ఇంట్లో సరైన ప్రదేశాన్ని కనుగొనాలి. నులిపురుగుల నివారణకు వైద్య సలహాలు తీసుకోవాలి. పిల్లులకు రెగ్యులర్గా టీకా వేయడం వల్ల దానికి మాత్రమే కాదు పెంచుకునే వారికీ మంచిది. పిల్లులకు మూత్ర, మల విసర్జనలకు ఉపయోగించేందుకు లిట్టర్ బాక్స్ తప్పనిసరి. వాటికి లిట్టర్ శిక్షణ ఇవ్వడం చాలా ముఖ్యం. సంవత్సరం కంటే తక్కువ వయసున్న పిల్లులుకు వైరల్ ఇన్ఫెక్షన్లకు ఎక్కువ అవకాశం ఉంది. కాబట్టి వైరల్ సంక్రమణను నివారించడానికి ఇతర వీధి పిల్లులతో సంబంధాన్ని నివారించాలి. మగ ఆడ పిల్లుల హార్మోన్ల మార్పులు గురించి అవగాహన ఉండాలి. చాలా మంది పిల్లి యజమానులు ఈ సమయంలో వాటిని చూసి పిల్లికి ఏదో అనారోగ్యం ఉందని అనుకుంటారు. పిల్లులకు తరచూ వస్త్రధారణ అవసరం లేదు అలాగే పిల్లులు తమను తాము శుభ్రం చేసుకుంటాయి కానీ నెలకు ఒకసారి మాత్రం శుభ్రపరచడం తప్పనిసరి..వండని మాంసాన్ని ఇవ్వకూడదు.. పక్షులను పంజరంలో ఉంచవద్దు. వీలైనంత వరకూ పక్షులను బందిఖానాలో ఉంచడం వాటికి హానికరం. ఇది వాటికి తీవ్రమైన కఠినమైన పరిస్థితిగా మారుతుంది. పోషకాహార లోపం, సరిపడని వాతావరణం, ఒంటరితనం, నిర్బంధంలో ఉన్న ఒత్తిడి వంటి సమస్యలకు దారి తీస్తుంది. పక్షులు ఎగురుతూ ఇతర పక్షులతో కలిసి జీవించాలి. ఓపెన్ స్కై కింద. వాటిని చిన్న ప్రదేశాల్లో ఉంచినప్పుడు, స్వభావ ప్రకోపాలు మానసిక కల్లోలాలకు గురవుతాయని నిపుణులు చెబుతున్నారు.పెంపకంలో అలక్ష్యం వద్దు.. పెట్స్ని పెంచుకునేవారు నగరంలో బాగా పెరుగుతున్నారు. అలాగే ఏ మాత్రం అవగాహన లేకుండా వాటిని తెచ్చుకుంటూ ఇబ్బందులు పడుతున్నవారూ పెరుగుతున్నారు. రకరకాల అనారోగ్యాలతో మా దగ్గరకు తమ పెట్స్ను తీసుకొచ్చే కేసుల్లో చాలా సందర్భాల్లో యజమానుల అవగాహన లోపమే కారణంగా తెలుస్తోంది. తరచూ వాటి బాగోగులు పర్యవేక్షించడం, నిరంతరం వైద్యులతో సంభాషించడం. చేస్తూ జాగ్రత్తగా చూసుకోవాలి. –డా.బి.యమున, శునకాల, పిల్లుల వైద్య నిపుణులు -
అన్లైన్ ఫ్యాషన్.. సేవల ఓషన్
శ్రీనగర్కాలనీలో నివసించే దివ్య గచ్చిబౌలిలోని బొటిక్లో డ్రెస్ స్టిచ్చింగ్ కి ఇచ్చారు.. స్టిచ్చింగ్ పూర్తయ్యాక వాళ్ల ఇంటికి ర్యాపిడో ద్వారా పంపారు. తీరా ఇంటికి వచ్చిన డ్రెస్ ధరించి చూస్తే కొన్ని ఆల్టరేషన్స్ అవసరం అని అర్థమైంది.. బొటిక్ వారిని సంప్రదిస్తే.. తమకు ఆ డ్రెస్ని ఇస్తే ఆల్టరేషన్స్ చేసి మరో రెండు రోజుల్లో పంపిస్తామన్నారు. కానీ దివ్య అదే రోజు ఫంక్షన్కు వెళ్లాల్సి ఉంది.. మరేం చేయాలి? ‘ఇలాంటి సమస్య మాతో రాదు మేం డ్రెస్ని మాత్రమే ఇంటికి పంపం. టైలర్, కుట్టుమిషన్తో సహా పంపిస్తాం. ఏవైనా మార్పు చేర్పులు ఉంటే క్షణాల్లో చేసేసి ఇస్తాం’ అంటోంది ఓ ఆన్లైన్ స్టిచ్చింగ్ సంస్థ. అమెరికాలో ఉంటున్న నగరవాసికి సిటీలోని ఓ ప్రముఖ వస్త్ర షోరూమ్లో ఓ చీర నచ్చింది. అయితే అది కొని తన దగ్గరకు పంపించినా, ఆ చీరకు మ్యాచింగ్ బ్లౌజ్, సీకో వర్క్ వగైరాల కోసం అమెరికాలో వెదకడానికి సమయంతో పాటు వ్యయం కూడా ఎక్కువే..! మరేం చేయాలి? ‘అంత కష్టం మీకక్కర్లేదు. ఆ షోరూమ్లో మీరు కొన్న చీర నేరుగా మాకే వస్తుంది. దానికి అవసరమైన బ్లౌజ్, వర్క్స్ పూర్తి చేసి భద్రంగా అమెరికా చేర్చే బాధ్యత మాదే’ అంటోంది మరో స్టిచ్చింగ్ సంస్థ. ఒకటా రెండా.. దుస్తులు/ఫ్యాబ్రిక్స్ కొనడం, వాటిని కుట్టించడం, అంతేనా.. అందంగా చీర కట్టించడం.. దాకా కాదు ఏ సేవాకు ఆన్లైన్లో అసాధ్యం అంటున్నాయి నగరంలో పుట్టుకొచి్చన పలు ఆన్లైన్ ఫ్యాషన్ బ్రాండ్స్. దాదాపు రెండేళ్ల క్రితం ప్రారంభమైన ఆన్లైన్ టైలరింగ్ సేవలు ఇంతింతై వటుడింతై అన్నట్టు విజృంభిస్తూ.. అనూహ్యమైన రీతిలో దూసుకుపోతున్నాయి. ఈ తరహా ఆన్లైన్ విప్లవాలకు సారథ్యం వహిస్తున్న సంస్థల్లో అత్యధిక భాగం మహిళల ఆధ్వర్యంలోనే ఉండడం విశేషం. యాప్లోని మార్కెట్ ప్లేస్ ద్వారా.. ‘పలు చోట్ల పరిమిత విస్తీర్ణంలో ఎక్స్క్లూజివ్ బ్రాండెడ్ ఔట్లెట్స్ ఏర్పాటు చేశాం. వీటిలో ఒక డిజైనర్, ఒక కుట్టుమిషన్ వగైరాలు అందుబాటులోకి తెచ్చాం. కస్టమర్లు నేరుగా సంప్రదింపులు చేసి అక్కడే ఆర్డర్స్ ఇచ్చి వెళ్లొచ్చు. చిన్న చిన్న ఆల్టరేషన్స్ కూడా చేయించుకోవచ్చు.. ఇలాంటివెన్నో కస్టమైజ్డ్ డ్రెస్సింగ్కు జత చేస్తున్నాం. అలాగే కస్టమర్స్ మా యాప్లోని మార్కెట్ ప్లేస్ ద్వారా నగరంలోని పలు షోరూమ్స్ నుంచి కొనుగోలు చేసిన చీరలు, డ్రెస్మెటీరియల్స్ మాకు చేరిపోతాయి. వాటికి అవసరమైన హంగులన్నీ జతచేసి తిరిగి కస్టమర్కు చేరవేసే బాధ్యత మాది. చీరకు బ్లౌజ్ వగైరాలు కుట్టడం మాత్రమే కాదు, అవసరమైతే చీర కట్టడం కూడా మా సిబ్బందే చేస్తారు.. విభిన్న రకాల శారీ డ్రేపింగ్స్ సైతం చేస్తారు. అంటూ నగరవాసులకు తాము అందిస్తున్న సేవల జాబితాను ‘సాక్షి’కి వివరించారు సుషి్మత. నగరవ్యాప్తంగా దాదాపుగా 80కిపైగా డిజైనర్లు, పదుల సంఖ్యలో షోరూమ్స్తో కలిసి పనిచేస్తున్నామని చెప్పారామె. నగరంలో మాత్రమే కాకుండా బెంగళూరు, చెన్నై తదితర నగరాల్లోనూ క్లౌడ్ టైలర్ సేవలు అందుబాటులో ఉన్నాయన్నారు.సాఫ్ట్వేర్ నుంచి డిజైనర్ వేర్ దాకా.. ‘ఐటీ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇప్పుడు ఏ సంస్థ లేదండీ. అలా చూస్తే ఇప్పుడు అన్నీ సాఫ్ట్వేర్ కంపెనీలే’ అంటారు సుషి్మత. మంచి ఆదాయాన్నిచ్చే కార్పొరేట్ ఉద్యోగాన్ని వదులుకుని, అంతకు మించిన ఆత్మసంతృప్తిని ఆశిస్తూ.. ఓ రెండేళ్ల క్రితం నగరంలో క్లౌడ్ టైలర్ పేరిట టైలరింగ్ సేవల్ని ప్రారంభించా. ఇంటి దగ్గరకే వచ్చి కొలతలు తీసుకుని ఫ్యాబ్రిక్స్ తీసుకెళ్లి, స్టిచి్చంగ్ పూర్తి చేసి తిరిగి ఇంటికే తెచ్చి ఇవ్వడం అనే ఏకైక సేవతో వేసిన తొలి అడుగుకే అద్భుతమైన స్పందన వచి్చంది. దీంతో ఇనుమడించిన ఉత్సాహంతో మా సేవల్ని కూడా విస్తరించాం. – సుష్మిత లక్కాకుల, ఫ్యాషన్ డిజైనర్కుట్టుమిషన్తో సహా పంపిస్తాం.. విదేశాల్లో ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్ బిజినెస్లు చేసిన అనుభవం ఉన్న రుహిసుల్తానా.. నగరానికి వచ్చి ఆన్లైన్ టైలరింగ్ సేవల్ని అర్బన్ సిలాయీ పేరుతో ప్రారంభించారు. అనతికాలంలోనే పెద్ద సంఖ్యలో కస్టమర్లకు చేరువయ్యారు.. పిక్, స్టిచ్, డెలివర్ అనే కాన్సెప్్టతో ఆమె ప్రారంభించిన ఈ సంస్థ పూర్తిగా ఆన్లైన్ ద్వారా తమ కార్యకలాపాలు నిర్వర్తిస్తున్నారు. ‘ఇప్పుడీ రంగంలో మరికొందరు కూడా ఉన్నారు. అయితే చెప్పిన సమయానికి ఏ మాత్రం తేడా రాకుండా ఖచ్చితత్వంతో ఇచ్చే డెలివరీలో మాకు సాటి లేదు. అదే విధంగా ఇంటికి డ్రెస్ మాత్రమే కాదు ఆల్టరేషన్స్ అవసరమైతే కస్టమర్ కళ్ల ముందే దాన్ని కంప్లీట్ చేయడానికి ఓ మాస్టర్ని కుట్టుమిషన్తో సహా పంపిస్తాం’ అంటూ చెప్పారు. బంజారాహిల్స్లో ఓ కార్యాలయాన్ని నిర్వహిస్తున్నా.. విదేశాల్లో సైతం మాకు కస్టమర్స్ ఉన్నారు. వారికి షిప్పింగ్ ద్వారా సేవలు అందిస్తున్నాం. త్వరలోనే ఇతర నగరాలకూ విస్తరించనున్నాం. – రుహిసుల్తానా, అర్బన్ సిలాయీ నిర్వాహకురాలు -
ఆర్గానిక్ అ'డ్రెస్'!
సాక్షి, సిటీబ్యూరో: తినే తిండిలో మాత్రమే కాదు మనం ధరించే దుస్తుల్లోనూ రసాయనాల వినియోగం మితిమీరుతోంది. స్వచ్ఛంగా మెరిసిపోయే తెల్లని కాటన్ వస్త్రం తయారీలో కూడా ఆ రంగు కోసం కెమికల్స్ వాడతారని బహుశా చాలా మందికి తెలియకపోవచ్చు. అయితే ఆహారం తరహాలోనే ఆహార్యంపై కూడా పెరుగుతున్న శ్రద్ధ.. నగరవాసుల్లో ఆర్గానిక్ దుస్తుల పట్ల ఆసక్తికి కారణమవుతోంది.తిరిగే ప్రదేశం సహజమైన ప్రకృతి అందాలతో ఉండాలి తినే తిండి కూడా సహజమైనదే అయి ఉండాలి.. ధరించే దుస్తులు కూడా సహజసిద్ధమైన రీతిలో రూపొందించినవి కావాలి. లేకపోతే అనారోగ్యాలు ఎటు నుంచి దాడిచేస్తాయో తెలీదు.. ఈ స్పహ ఆధునికుల్లో పెరుగుతోంది. దీనికి అనుగుణంగా ఇప్పటికే కొన్ని బ్రాండెడ్ దుస్తులు మార్కెట్లో కనిపిస్తుండగా.. ఇప్పుడిప్పుడే దేశవ్యాప్తంగాæ డిజైనర్లు కూడా ఆర్గానిక్ దుస్తులకు అడ్రస్గా మారుతున్నారు. అలాంటివారిలో సిటీ డిజైనర్ సంతోష్ ఒకరు. గతంలో పూణె ఫ్యాషన్ వీక్లో వీటిని ప్రదర్శించారాయన.కాస్ట్ లీ కాదు.. ధనవంతులు మాత్రమే సస్టెయినబుల్ ఫ్యాషన్ ను కొనుగోలు చేయగలరని అభిప్రాయం ఏర్పడింది. అయితే తెలివిగా షాపింగ్ చేయాలనుకునే ఎవరికైనా ఈ తరహా దుస్తులు అందుబాటులోనే ఉంటాయని అంటున్నారు డిజైనర్లు. ‘అందరూ అనుకున్నట్టు ఆర్గానిక్ ఫ్యాషన్ దుస్తులు మరీ ఖరీదైనవి ఏమీ కాదు. ఉత్పత్తి వ్యయం కూడా మీటర్కి రూ.వెయ్యిలోపే అవుతుంది. అయితే వీటి వాడకంపై ఫ్యాషన్ ప్రియుల్లో మరింత అవగాహన పెరగాల్సి ఉంది’ అంటూ చెప్పారు నగరానికి చెందిన డిజైనర్ నయన్. సేంద్రియ పద్ధతిలో తయారు.. ఆధునిక వినియోగదారులు పర్యావరణ అనుకూల డిజైన్ ట్రెండ్లను అనుసరిస్తుండటంతో హానికరమైన రసాయనాలు, పురుగు మందులు లేకుండా ఉంటాయి సేంద్రియ పద్ధతిలో తయారైన వ్రస్తాలకు డిమాండ్ విస్తరిస్తోంది. ఉత్పత్తిదారులు సరళమైన, తటస్థ–రంగు దుస్తులు రూపొందిస్తున్నారు. వీటిలో తెలుపు, నలుపు క్రీం రంగులు కీలకమైనవి. కార్క్, వెదురు, జనపనార, ఆర్గానిక్ కాటన్, రీసైకిల్ కాటన్ లినెన్ సస్టెయినబుల్ ఫ్యాషన్ ఉత్పత్తిలో కీలకమైన ముడి పదార్థాలుగా మారాయి. సేంద్రియ పద్ధతిలో పత్తి లేదా జనపనార వంటి పర్యావరణ అనుకూల పదార్థాలతో రూపొందించిన జీన్స్ దుస్తులు కూడా మార్కెట్లో లభ్యమవుతున్నాయి. శీతాకాలంలో వెచ్చదనాన్ని అందించే స్వెటర్ల కోసం, ఉన్ని లేదా అల్పాకాతో తయారు చేసినవి అందుబాటులోకి వచ్చాయి.వ్యర్థాల రీసైక్లింగ్.. ఫ్యాషన్ పరిశ్రమలో వ్యర్థాలను తగ్గించడానికి అప్సైక్లింగ్ రీసైక్లింగ్ పద్ధతులు అనుసరిస్తున్నారు. డిజైనర్లు కొత్త ప్రత్యేకమైన దుస్తుల వెరైటీల సృష్టి కోసం పాత వ్రస్తాలు, స్క్రాప్లు, దుస్తుల తయారీలో వాడగా మిగిలిపోయిన వాటిని సృజనాత్మకంగా పునర్నిరి్మస్తున్నారు. ఇది వ్రస్తాల జీవితచక్రాన్ని పొడిగించడంలో, వ్యర్థాలను తగ్గించడంలో సహాయపడుతోంది. అలాగే స్లో ఫ్యాషన్ మూవ్మెంట్.. స్లో ఫ్యాషన్ అనే భావన పెరిగింది. వినియోగదారులు తమ ఫ్యాషన్ ఎంపికల విషయంలో కంటికి ఇంపుగా ఉండే దుస్తుల కన్నా ఒంటికి మేలు చేసేవే మిన్న అనే భావనకు వస్తున్నారు. ఎక్కువ కాలం ధరించగలిగే శాశ్వతమైన, మన్నికైన దుస్తులను ఎంచుకుంటున్నారు. మరో వైపు ఇది సంప్రదాయ హస్తకళ స్థానిక కళాకారులకు ఇది ఊతమిస్తోంది. సంప్రదాయ నేయడం, అద్దకం, ఎంబ్రాయిడరీ పద్ధతులను సంరక్షించడానికి ప్రోత్సహించడానికి బ్రాండ్లు కళాకారులతో కలిసి పనిచేస్తున్నాయి. ఇది సంప్రదాయ కళలను పునరుజ్జీవింపజేయడమే కాకుండా హస్తకళాకారుల పురోభివృద్ధి అవకాశాలను కూడా పెంచుతోంది."రసాయన రహితంగా పూర్తి ఆర్గానిక్ దుస్తుల తయారీ అనేది ఇప్పటికీ కొంత సాహసంతో కూడిన ప్రయోగమే అని చెప్పాలి. ఎందుకంటే పూర్తిగా ఆర్గానిక్ ఫ్యాబ్రిక్, డైతో తయారు చేసినవి తక్కువ షేడ్స్లో మాత్రమే లభ్యమవుతాయి. దేశంలో ఇప్పటికే కొన్ని బ్రాండ్స్ నాచురల్ డైస్తో చేసిన దుస్తులు విక్రయిస్తున్నప్పటికీ.. అవి కూడా పూర్తిగా 100శాతం ఆర్గానిక్ అని చెప్పలేం. ఆర్గానిక్ దుస్తులకు కాటన్, లినెన్, పట్టు.. ఫ్యాబ్రిక్స్ మాత్రమే నప్పుతాయి. అలాగే ఈ దుస్తుల తయారీకి మిగిలిన వాటి తయారీతో పోలిస్తే పట్టే సమయం కూడా బాగా ఎక్కువ. ‘నేను రూపొందించిన ఆర్గానిక్ దుస్తుల తయారీలో ఫ్యాబ్రిక్ మొత్తం చేనేతలనే వినియోగించాను. సిద్ధిపేటలోని ఆదర్శ్ సొసైటీ ఆధ్వర్యంలో డాక్టర్ సునంద ఈ ఫ్యాబ్రిక్స్ తయారీ చేయించారు. అదేవిధంగా ఉల్లిపాయ, పసుపు వంటి దినుసులతో పాటు చెట్ల ఆకులు, కాండం, వేర్లు.. వీటిని ఉపయోగించి ఆకుపచ్చ, విభిన్న రకాల బ్లూషేడ్స్, ఎల్లో, బ్రిక్ షేడ్స్తో కలర్స్ సృష్టించాం. కొంచెం డల్ ఫినిష్ ఉండే ఫ్యాబ్రిక్కి అత్యాధునిక డిజైనింగ్ వర్క్ జత చేసి ఆకట్టుకునేలా డ్రెసెస్ క్రియేట్ చేశాం. మొత్తం 20 డ్రెస్సెస్ క్రియేట్ చేస్తే.. 16 రకాల డిజైన్లను ఈ షోలో ప్రజెంట్ చేశాను’ అంటూ చెప్పారు సిటీ డిజైనర్ సంతోష్."నేచురల్ డై తయారీ యూనిట్ స్థాపించి..సింథటిక్ వంటి వ్రస్తాలు ఎంచుకుంటే అది పర్యావరణానికి హానికరమని, మన ఆరోగ్యానికి కూడా చేటు చేస్తుందనే స్పృహ నగరవాసుల్లో ఇప్పుడిప్పుడే వస్తోంది. అలాగే దుస్తుల తయారీలో వాడే కొన్ని మెటీరియల్స్ ఆక్సిజన్ నాణ్యతను కూడా దెబ్బతీస్తాయి. అంతేగాకుండా కెమికల్ డైలను నివారించాల్సిన అవసరం ఉంది. కొన్ని రకాల ఆకులు తదితర సహజోత్పత్తుల ద్వారా తయారైన రంగుల వినియోగం పెంచాలి. నేచురల్ డైతో తయారైన.. పూర్తి సహజసిద్ధమైన ఫ్యాబ్రిక్ను అందించేందుకు సిటీ శివార్లలో మా సొంత డైయింగ్ యూనిట్ను ప్రారంభించాం. – మమత తుళ్లూరి, డిజైనర్ఇవి చదవండి: ఇది.. మైక్రోకరెంట్ ఫేస్ లిఫ్ట్ డివైస్! -
లోకల్ హిట్టర్స్..
ఒకప్పుడు ఆదివారం వస్తే చాలు ఉదయం చాయ్ తాగి ఇంట్లో నుంచి బయటకు వెళ్తే సాయంత్రం ఆరు గంటల వరకూ కూడా ఇంటికి రాకుండా క్రికెట్ ఆడిన రోజులు పాత తరం యువతకు చాలామందికి అనుభవమే. అలాగే క్రికెట్ చూడాలంటే కనీసం 5 నుంచి 7 కి.మీ. ప్రయాణించి టీవీ చూసి వచ్చిన రోజులూ ఉన్నాయి.. క్రికెట్ అంటే అంత పిచి్చ.. అంత అభిమానం ఉండేది. ఇప్పుడు కూడా ఆ అభిమానం అస్సలు మారలేదు. కానీ రూపు మార్చుకుంది. గల్లీ క్రికెట్ కాస్త పోష్ క్రికెట్ అయ్యింది. అకాడమీల్లో గంటకు కొంత డబ్బులు చెల్లించి ప్రొఫెషనల్ క్రికెట్ ఆడుతున్నారు. అంతేనా లోకల్ మ్యాచ్ల నుంచి జాతీయ స్థాయి మ్యాచ్ల స్థాయికి చేరుతున్నారు. రోజుకు కనీసం 8 గంటల పాటు ప్రాక్టీస్ మెళకువలతో పాటు ఫిట్నెస్పై దృష్టి బౌండరీలు దాటుతున్న లోకల్ టాలెంట్ ఐపీఎల్ వరకూ ఎదిగేందుకు అడుగులు క్రికెట్.. భారతదేశంలో ఒక మతం. దేశంలో క్రికెట్ను ఆరాధించని వారు లేరంటే అతిశయోక్తి కాదు. క్రికెట్ మ్యాచ్ వస్తుందంటే చాలు చిన్నా పెద్దా, ఆడా మగ తేడా లేకుండా టీవీలకు అతుక్కుపోతుంటారు. క్రికెట్ ఆడటం అంటే చిన్నప్పటి నుంచే క్రేజ్. గల్లీ క్రికెట్లో ఆడుతూ మంచి షాట్ కొడుతూ తమను తామే సచిన్ టెందుల్కర్, విరాట్కోహ్లి అనుకుంటూ సంబరపడిపోతుంటారు. అయితే ఒకప్పుడు క్రికెట్ అంటే కేవలం వినోదం కోసం చూడటమో.. ఆడటమో చేస్తుండేవారు. కానీ నేటి తరం క్రికెట్ను కూడా తమ కెరీర్గా మార్చుకుంటున్నారు. క్రికెట్ కాస్త ఖరీదైన వ్యవహారమే అయినా.. ఎలాగైనా కష్టపడి రంజీ లేదా ఐపీఎల్ ఆడి తమ సత్తా చూపాలని తాపత్రయపడుతున్నారు. అందుకోసం చిన్నతనం నుంచే గ్రౌండ్లో చెమటలు చిందిస్తున్నారు. ఎప్పటికైనా జాతీయ స్థాయిలో ఆడకపోతామా అనే ధీమాతో ముందుకు వెళ్తున్నారు. క్రికెట్ను కెరీర్గా చేసుకునే వారికి చాలా నిబద్ధతతో శిక్షణ ఇచ్చే కోచింగ్ సెంటర్లు నగరంలో భారీగా వెలిశాయి. అసలు కోచింగ్ సెంటర్లు పిల్లలను క్రికెటర్లుగా ఎలా మలుస్తున్నాయి.. ఎన్ని గంటల పాటు వారికి శిక్షణ ఇస్తున్నాయి.. ఎలా కష్టపడితే ఐపీఎల్ లేదా జాతీయ స్థాయిలో ఆడేందుకు అవకాశం వస్తుంది.. అనే విషయాలను తెలుసుకుందాం..! ఏడో యేటనుంచే.. సాధారణంగా క్రికెట్ ఆకాడమీల్లో పిల్లలు ఏడేళ్ల వయసు నుంచే చేరుతుంటారు. అందరూ క్రికెట్ను కెరీర్గా మలచుకునేందుకు చేరరు. కొందరు తల్లిదండ్రులు తమ పిల్లలు ఫిట్గా ఉండాలనే ఉద్దేశంతో చిన్నతనంలోనే క్రికెట్ అకాడమీల్లో చేరి్పస్తుంటారు. మిగిలిన వారంతా క్రికెటర్లుగా చూడాలనే ఉద్దేశంతోనే అకాడమీల్లో చేరి్పస్తుంటారు. మొదటి రెండేళ్ల వరకూ టెన్నిస్ బాల్, ప్లాస్టిక్ బాల్తో ఆడిస్తారు. 12 ఏళ్లు దాటిన తర్వాత లెదర్ బాల్తో నెట్స్లో ఆడిస్తుంటారు. ఈ సమయంలోనే బ్యాచ్లుగా వేరు చేసి, వారి ఆట తీరునుబట్టి తరీ్ఫదు ఇస్తుంటారు. కష్టపడితే ఎన్నో అవకాశాలు.. క్రికెట్లో రాణించడం ఒకప్పుడు డబ్బులపైనే ఆధారపడి ఉండేది. కానీ ప్రస్తుతం పరిస్థితులు మారాయి. కష్టపడి మంచి ఆటతీరు కనబరిస్తే ఎంతో ఎత్తుకు వెళ్లే అవకాశాలు ఉంటాయని పలువురు కోచ్లు చెబుతున్నారు. టాలెంట్ ఉన్న వారికి అవకాశాలు ఎదురుచూస్తూనే ఉంటాయని, ఎట్టిపరిస్థితుల్లో కుంగిపోకుండా ముందుకు వెళ్లాలని చెబుతున్నారు.ఒక్కో రోజు ఒక్కో సెషన్.. సాధారణంగా క్రికెట్ ఆడాలంటే బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ ఇలా అన్ని అంశాల్లో ప్రత్యేకంగా శిక్షణ పొందాల్సి ఉంటుంది. రోజుకో అంశంలో పిల్లలకు కోచ్ శిక్షణ ఇస్తుంటారు. ఒక రోజు బ్యాటింగ్ అయితే మరో రోజు బౌలింగ్, ఇంకో రోజు నాకింగ్, ఫీల్డింగ్లో ప్రాక్టీస్ చేయిస్తుంటారు. క్యాచ్లు పట్టే విధానంలో కూడా మెళకువలు నేరి్పస్తుంటారు. దీంతో పాటు క్రికెట్ ఫిట్నెస్ కూడా ముఖ్యం. ఇందులో భాగంగా జంపింగ్స్, ఫాస్ట్ రన్నింగ్, డ్రిల్స్ చేయిస్తుంటారు.అకాడమీ ఎంచుకునే ముందు..చాలా అకాడమీలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. ఈ ట్రెండ్ను క్యాష్ చేసుకునేందుకు కొందరు ప్రయతి్నస్తున్నారు. ఇలాంటి వారి వద్ద చేరితే సమయంతో పాటు డబ్బు కూడా వృథా అవుతుంది. కమర్షియల్గా, బాక్స్ క్రికెట్ మాదిరిగా ఉండే అకాడమీలు కూడా ఉన్నాయి. అందుకే అకాడమీల్లో చేరేముందు అది ఎలాంటి అకాడమీ.. వాళ్లు ఎలాంటి శిక్షణ ఇస్తున్నారు.. ఎంత సమయం ప్రాక్టీస్ చేయిస్తారు అనే విషయాలు ముందే చూసుకుని చేరి్పస్తే మంచిదని పలువురు శిక్షకులు సూచిస్తున్నారు.భారత్ తరపున ఆడించాలనే లక్ష్యంతో.. ప్రతి అకాడమీ కూడా తమ పిల్లలను భారత జట్టులో చూసుకోవాలన్నదే లక్ష్యంగా పెట్టుకుంటాయి. అందుకోసం వారు మెళకువలు నేర్చుకోవడంతో పాటు వాటిని పిల్లలకు నేరి్పస్తుంటారు. ప్రతి వారం మ్యాచ్లు పెట్టి వారి ఆటతీరును పరిశీలిస్తుంటారు. సీజనల్ మ్యాచ్లు అంటే జూన్–జులైలో జరిగే వన్ డే, టూడే, త్రీడే లీగ్ మ్యాచ్లకు కూడా వెళ్లి పాల్గొంటారు. హెచ్సీఏ నుంచి జరిగే లీగ్ మ్యాచ్లలో బాగా ఆడితే అండర్–14, –16, –19 స్టేట్ టీమ్స్కు ఆడే అవకాశం వస్తుంది. అక్కడ ఎవరైనా మంచి పెర్ఫార్మెన్స్ చేస్తే రంజీ ఆడే అవకాశం ఉంటుంది.రోజుకు ఎనిమిది గంటల ప్రాక్టీస్ క్రికెట్ అకాడమీల్లో చాలావరకూ ఉదయం 5– 5.30 గంటల నుంచే దినచర్య ప్రారంభం అవుతుంది. రెండు గంటల పాటు ప్రాక్టీస్ చేస్తుంటారు. ఆ తర్వాత కాసేపు బ్రేక్ ఫాస్ట్ చేసిన తర్వాత మళ్లీ ప్రాక్టీస్ చేస్తుంటారు. మళ్లీ మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత కాసేపు విశ్రాంతి తీసుకుని మళ్లీ రాత్రి 7 గంటల వరకూ ప్రాక్టీస్ చేస్తుంటారు. బౌలింగ్ మెషీన్స్, నెట్ సెషన్స్, సైడ్ ఆర్మ్ ప్రాక్టీస్ చేస్తుంటారు. వీరి వెన్నంటే ఉండే కోచ్లు ఎప్పటికప్పుడు వారికి ఆటలో తప్పులు అర్థం చేసుకుని ఆటగాళ్లు ఆడే విధానంలో మార్పులు చేస్తుంటారు. ఎక్కడైనా టోర్నమెంట్స్కు వెళ్లినప్పుడు వేరే అకాడమీ లేదా వేరే జట్టు ఆటగాళ్లు ఆడే తీరును కూడా పరిశీలించి.. తమ అకాడమీ పిల్లల ఆటలో ఎలాంటి మార్పులు చేస్తే బాగుంటుందనే విషయాలను వారికి చెబుతుంటారు. ఇలా రోజులో కనీసం 8 నుంచి 9 గంటల పాటు గ్రౌండ్లోనే ప్రాక్టీస్ చేస్తూ ఎప్పటికప్పుడు తమ ఆటతీరును అప్డేట్ చేసుకుంటారు. క్వాలిఫైడ్ ట్రైనర్స్తో.. క్రికెట్ కోసం చాలా మంది అకాడమీకి వస్తుంటారు. ఉదయం నుంచి సాయంత్రం వరకూ శిక్షణ ఇస్తుంటాం. దాదాపు 15 మంది మా అకాడమీ నుంచి రాష్ట్ర స్థాయికి సెలెక్ట్ అయ్యారు. వారికి ఎప్పటికప్పుడు ఆటలో మెళకువలు నేర్పించేందుకు క్వాలిఫైడ్ ట్రైనర్స్ ఉంటారు. మానసికంగా కూడా వారికి కావాల్సిన మద్దతు ఇస్తుంటాం. – కల్యాణ్, క్రికెట్ కోచ్, కూకట్పల్లి ఆసక్తి చూపుతున్న అమ్మాయిలు.. ఇటీవల కాలంలో అమ్మాయిలు కూడా క్రికెట్పై ఎంతో ఆసక్తి చూపుతున్నారు. వారికి కూడా అబ్బాయిలతో పాటు సమానంగా అకాడమీ నుంచి శిక్షణ ఇస్తుంటాం. కావ్యశ్రీ అనే అమ్మాయి ఇటీవల సీనియర్ వుమెన్స్ రంజీ ట్రోఫీలో ఆడుతున్నారు. ఆమెతో పాటు మరో నలుగురు అమ్మాయిలు, ముగ్గురు అబ్బాయిలు స్టేట్ లెవల్ టీమ్స్లో ఆడే అవకాశం దక్కించుకున్నారు. వారిలో ఒకరినైనా ఇండియా జట్టులో చూడాలనేదే మా ఆశ. – తలకంటి సతీశ్రెడ్డి, ఎంఎస్డీ క్రికెట్ అకాడమీ, మేడిపల్లి