-
టీమిండియా కెప్టెన్గా రిషబ్ పంత్.. సిక్సర్ల కింగ్లు ఎంట్రీ!?
ఈ ఏడాది జూన్లో అమెరికా, వెస్టిండీస్ల వేదికగా జరగనున్న టీ20 వరల్డ్కప్-2024 అనంతరం భారత జట్టు జింబాబ్వే పర్యటనకు వెళ్లనుంది. ఈ టూర్లో భాగంగా టీమిండియా ఆతిథ్య జింబాబ్వేతో ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో తలపడనుంది. ఈ సిరీస్ జూలై 6న ప్రారంభమై అదే నెల 14న ముగియనుంది. ఈ సిరీస్లో అన్ని మ్యాచ్లు హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగానే జరగనున్నాయి. అయితే ఈ జింబాబ్వే పర్యటనకు భారత తృతీయ శ్రేణి జట్టును బీసీసీఐ పంపించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. టీ20 వరల్డ్కప్లో భాగమయ్యే ఒకరిద్దరూ మినహా మిగతా భారత ఆటగాళ్లందరికి ఈ సిరీస్కు విశ్రాంతి ఇవ్వనున్నట్లు సమాచారం. అంతేకాకుండా గాయం నుంచి కోలుకుని రీ ఎంట్రీలో అదరగొడుతున్న వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్కు ఈ సిరీస్లో భారత జట్టు పగ్గాలు అప్పగించాలని అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ యోచిస్తుందంట. కాగా పంత్ సూపర్ ఫామ్లో ఉన్నాడు. పునరాగమనంలో కెప్టెన్గానే కాకుండా వ్యక్తిగత ప్రదర్శన పరంగా కూడా సత్తాచాటుతున్నాడు. ఇప్పటివరకు 7 మ్యాచ్లు ఆడిన పంత్ 210 పరుగులు చేశాడు. మరోవైపు ఐపీఎల్-2024లో దుమ్ములేపుతున్న రియాన్ పరాగ్, శశాంక్ సింగ్, అశుతోష్ శర్మ, సాయిసుదర్శన్, అభిషేక్ శర్మ వంటి యువ ఆటగాళ్లను ఈ సిరీస్కు ఎంపిక చేయనున్నట్లు పలు రిపోర్టులు పేర్కొంటున్నాయి. వీరితో పాటు రుతురాజ్ గైక్వాడ్, సంజూ శాంసన్, శివమ్ దూబే, అర్ష్దీప్ సింగ్, ముఖేష్ కుమార్ వంటి స్టార్ ఆటగాళ్లను సైతం జింబాబ్వే టూర్కు పంపించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. -
జింబాబ్వే పర్యటనకు టీమిండియా.. ఐదు మ్యాచ్ల సిరీస్.. షెడ్యూల్ ఇదే
టీ20 వరల్డ్కప్ 2024 ముగిసిన అనంతరం భారత క్రికెట్ జట్టు జింబాబ్వే పర్యటనకు వెళ్లనుంది. ఈ పర్యటలో భారత్ ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ ఆడనుంది. హరారే వేదికగా జులై 6, 7, 10, 13, 14 తేదీల్లో మ్యాచ్లు జరుగనున్నాయి. ఈ పర్యటన వివరాలను జింబాబ్వే క్రికెట్ బోర్డు కొద్ది సేపటి క్రితం వెల్లడించింది. బీసీసీఐతో సుదీర్ఘ సంప్రదింపుల అనంతరం ఈ సిరీస్ ఖరారైనట్లు తెలుస్తుంది. జింబాబ్వే క్రికెట్ చైర్మన్ తవెంగ్వా ముకుహ్లానీ ఈ విషయాన్ని అధికారికంగా ధృవీకరిస్తూ ట్వీట్ చేశాడు. మా దేశంలో ఈ సంవత్సరం జరిగే అతిపెద్ద అంతర్జాతీయ ఈవెంట్ ఇదే. టీమిండియాకు ఆతిథ్యమిస్తున్నందుకు మేము చాలా సంతోషిస్తున్నాము. మా దేశ పర్యటనకు ఒప్పుకున్నందుకు బీసీసీఐకి ధన్యవాదాలు అంటూ తవెంగ్వా ట్వీట్లో పేర్కొన్నాడు. కాగా, టీమిండియాకు ఆతిథ్యమివ్వడం వల్ల జింబాబ్వే క్రికెట్ బోర్డు ఆర్ధిక స్థితిగతుల్లో పెను మార్పులు సంభవించే అవకాశం ఉంది. ఆ దేశంలో భారత ద్వితియ శ్రేణి జట్టు పర్యటించినా జింబాబ్వే క్రికెట్ బోర్డుపై కాసుల వర్షం కురువడం ఖాయం. భారత్లో క్రికెట్కు ఉన్న ప్రజాధరణ వల్ల జింబాబ్వే క్రికెట్ బోర్డు దశ మారిపోతుంది. తమ క్రికెటర్లకు జీతాలు కూడా ఇవ్వలేని స్థితిలో జింబాబ్వే బోర్డుకు భారత పర్యటన ద్వారా భారీ లబ్ది చేకూరనుంది. -
IPL 2023: రాజస్తాన్ రాయల్స్కు భారీ షాక్.. టీమిండియా బౌలర్ దూరం
IPL 2023- Prasidh Krishna: టీమిండియా పేసర్ ప్రసిద్ కృష్ణ ఐపీఎల్-2023 సీజన్కు దూరమయ్యాడు. ఈ విషయాన్ని అతడు ప్రాతినిథ్యం వహిస్తున్న రాజస్తాన్ రాయల్స్ ధ్రువీకరించింది. గాయం కారణంగా ప్రసిద్ ఈసారి ఐపీఎల్ ఆడబోవడం లేదని తెలిపింది. త్వరగా కోలుకోవాలి ‘‘ప్రసిద్ గాయం నుంచి కోలుకోవడానికి కావాల్సిన ఏ సాయం చేసేందుకైనా సిద్ధంగా ఉన్నాం. కానీ.. అతడు ఇంకా పూర్తిగా కోలుకోలేదని వైద్య బృందం తెలిపింది. దురదృష్టవశాత్తూ ప్రసిద్ ఐపీఎల్-2023 మొత్తానికి దూరమయ్యాడు’’ అని రాజస్తాన్ యాజమాన్యం శుక్రవారం నాటి ప్రకటనలో పేర్కొంది. ప్రసిద్ కృష్ణ స్థానాన్ని భర్తీ చేయగల పేసర్ కోసం తాము అన్వేషిస్తున్నామన్న మేనేజ్మెంట్.. త్వరలోనే ఈ యువ బౌలర్ కోలుకోవాలని ఆకాంక్షించింది. కాగా గత సీజన్లో ప్రసిద్ కృష్ణ రాజస్తాన్ రాయల్స్ తరఫున మొత్తంగా 19 వికెట్లు( 8.28 ఎకానమీ) పడగొట్టి సత్తా చాటాడు. జట్టు ఫైనల్ చేరడంలో తన వంతు పాత్ర పోషించాడు. అయితే, గాయం కారణంగా ప్రస్తుత సీజన్కు అతడు దూరం కావడంతో రాజస్తాన్కు గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లయింది. అదే ఆఖరు జింబాబ్వేతో 2022లో హరారేలో జరిగిన వన్డే మ్యాచ్లో ఆఖరిసారిగా ప్రసిద్ టీమిండియా తరఫున బరిలోకి దిగాడు. ఆ తర్వాత వెన్నునొప్పి కారణంగా జట్టుకు దూరమయ్యాడు. జాతీయ క్రికెట్ అకాడమీలో పునరావాసం పొందుతున్న ఈ రైట్ ఆర్మ్ పేసర్ ఇంకా కోలుకోలేదు. ఇక టీమిండియా తరఫున ఇప్పటి వరకు 14 వన్డేలు ఆడిన ఈ కర్ణాటక బౌలర్.. 25 వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్ కెరీర్లో 51 మ్యాచ్లలో మొత్తంగా 49 వికెట్లు కూల్చాడు. చదవండి: Tom Blundell: కివీస్ బ్యాటర్ టామ్ బ్లండెల్ ప్రపంచ రికార్డు.. ఇంతవరకు ఎవరికీ సాధ్యం కాలేదు! BGT 2023: గాల్లోకి ఎగిరి ఒంటిచేత్తో రాహుల్ అద్భుత క్యాచ్.. బిత్తరపోయిన ఖవాజా.. వీడియో వైరల్ -
చరిత్ర సృష్టించిన భువనేశ్వర్ కుమార్
టీ20 వరల్డ్కప్-2022లో భాగంగా నిన్న (నవంబర్ 6) జింబాబ్వేతో జరిగిన మ్యాచ్లో టీమిండియా స్వింగ్ సుల్తాన్ భువనేశ్వర్ కుమార్ చరిత్ర సృష్టించాడు. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక మెయిడిన్ ఓవర్లు (10) సంధించిన బౌలర్గా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. జింబాబ్వేతో మ్యాచ్లో తొలి బంతికే వికెట్ తీసిన భువీ.. ఆ ఓవర్లో ఒక్క పరుగు కూడా ఇవ్వకుండా మొయిడిన్ చేశాడు. ఈ మ్యాచ్కు ముందు వరకు అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక మెయిడిన్ ఓవర్ల రికార్డును సహచరుడు జస్ప్రీత్ బుమ్రాతో కలిసి షేర్ చేసుకున్న భువీ.. తాజాగా ఈ అరుదైన రికార్డను తన పేరిట లఖించుకున్నాడు. ఓవరాల్గా పొట్టి ఫార్మాట్లో అత్యధిక మెయిడిన్ ఓవర్ల రికార్డు విండీస్ స్పిన్నర్ సునీల్ నరైన్ పేరటి ఉంది. నరైన్ టీ20ల్లో మొత్తం 27 మెయిడిన్ ఓవర్లు బౌల్ చేశాడు. అతని తర్వాతి స్థానంలో బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబ్ అల్ హసన్ ఉన్నాడు. షకీబ్ ఖాతాలో 23 మెయిడిన్ ఓవర్లు ఉన్నాయి. వీరి తర్వాత విండీస్ లెగ్ స్పిన్నర్ శ్యాముల్ బద్రీ (21), భువనేశ్వర్ కుమార్ (21) సంయుక్తంగా మూడో స్థానంలో ఉన్నారు. ఈ జాబితాలో టీమిండియా పేసు గుర్రం బుమ్రా 19 మెయిడిన్లతో ఆరో ప్లేస్లో ఉన్నాడు. ఇదిలా ఉంటే, నిన్న జింబాబ్వేపై గెలుపుతో టీమిండియా గ్రూప్-2లో అగ్రస్థానంతో సెమీస్కు చేరుకుంది. ఈ గ్రూప్ నుంచి సెమీస్కు చేరిన రెండో జట్టుగా పాక్ నిలిచింది. అటు గ్రూప్-1 నుంచి న్యూజిలాండ్, ఇంగ్లండ్ జట్లు తొలి రెండు స్థానాల్లో నిలిచి సెమీస్కు అర్హత సాధించాయి. నవంబర్ 9న జరిగే తొలి సెమీస్లో న్యూజిలాండ్-పాకిస్తాన్లు.. ఆమరుసటి రోజు (నవంబర్ 10) జరిగే రెండో సెమీఫైనల్లో భారత్-ఇంగ్లండ్ జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ రెండు మ్యాచ్ల్లో గెలిచిన జట్ల మధ్య నవంబర్ 13న ఫైనల్ జరుగుతుంది. -
T20 World Cup 2022: దర్జాగా సెమీస్కు...
గత ఏడాది టి20 వరల్డ్కప్లో లీగ్ దశలోనే ఇంటికొచ్చిన భారత్ ఈసారి టోర్నీలో లీగ్ టాపర్గా సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. టీమిండియా చిన్న జట్లను తేలిగ్గా తీసుకోలేదు. పెద్ద జట్లతో గాభరా పడలేదు. ప్రతీ పోరు విలువైందన్నట్లుగానే ఆడింది. దక్షిణాఫ్రికాతో మ్యాచ్ మినహా ప్రతి మ్యాచ్లోనూ బ్యాటర్లు, బౌలర్లు చక్కగా రాణించారు. సమష్టి బాధ్యత కనబరిచారు. దీంతో టీమిండియా ఈ టోర్నీలో టైటిల్ ఫేవరెట్గా మారింది. గురువారం అడిలైడ్లో జరిగే రెండో సెమీఫైనల్లో ఇంగ్లండ్తో రోహిత్ శర్మ బృందం సమరానికి సై అంటోంది. మెల్బోర్న్: సూర్యకుమార్ యాదవ్ను సహచరులంతా అతని పేరులోని మూడక్షరాలతో స్కై (ఎస్కేవై) అంటారు. ఈ ప్రపంచకప్లో అతను కూడా ఆ పేరుకు (ఆకాశం) తగ్గట్లే హద్దేలేని ఇన్నింగ్స్లతో జట్టును గెలిపిస్తున్నాడు. అభిమానుల్ని అలరిస్తున్నాడు. జింబాబ్వేతో పోరులో అయితే ‘సూపర్ సండే’ స్పెషల్ ఇన్నింగ్స్ ఆడాడు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ సూర్య (25 బంతుల్లో 61; 6 ఫోర్లు, 4 సిక్స్లు) మెరుపుల సునామీతో... ‘సూపర్ 12’ గ్రూప్–2 చివరి లీగ్ మ్యాచ్లో భారత్ 71 పరుగుల తేడాతో జింబాబ్వేపై జయభేరి మోగించి 8 పాయింట్లతో ‘టాపర్’గా నిలిచింది. మొదట భారత్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 186 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ (35 బంతుల్లో 51; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) కూడా మెరిపించాడు. సీన్ విలియమ్స్కు 2 వికెట్లు దక్కాయి. తర్వాత జింబాబ్వే 17.2 ఓవర్లలో 115 పరుగులకే ఆలౌటైంది. బర్ల్ (22 బంతుల్లో 35; 5 ఫోర్లు, 1 సిక్స్), రజా (24 బంతుల్లో 34; 3 ఫోర్లు) మెరుగ్గా ఆడారు. అశ్విన్ (3/22), షమీ (2/14), హార్దిక్ పాండ్యా (2/16) ప్రత్యర్థిని మూకుమ్మడిగా దెబ్బకొట్టారు. సూర్య ప్రతాపం... ఓవరాల్గా ఈ మెగా ఈవెంట్లో ‘భారత 360’ సూర్య బ్యాటింగ్ ఓ లెవెల్లో వుంది. ఈ మ్యాచ్లో అది మరో స్థాయికి చేరింది. సూర్య 12 ఓవర్ ఆఖరిబంతికి క్రీజులోకి వచ్చాడు. అప్పుడు టీమిండియా స్కోరు (87/2) వందయినా కాలేదు. అతను రాగానే రాహుల్ అవుటయ్యాడు. అవకాశమిచ్చిన రిషభ్ పంత్ (3) చేజార్చుకున్నాడు. స్కోరు 101/4గా ఉన్న దశలో జింబాబ్వే సంచలనంపై ఆశలు పెట్టుకోకుండా సూర్యకుమార్ రెచ్చిపోయాడు. కొన్నిషాట్లయితే ఊహకే అందవు. ఆఫ్సైడ్కు దూరంగా వెళుతున్న బంతుల్ని ఆన్సైడ్లో సిక్సర్లుగా మలచడం అద్భుతం. 15 ఓవర్లలో 107/4గా ఉన్న స్కోరు అతని సునామీ ఇన్నింగ్స్తో 186/5గా మ్యాచ్ ఛేంజింగ్ ఫిగర్ అయ్యింది. ఆఖరి 5 ఓవర్లలో 79 పరుగులు వచ్చాయి. 16వ ఓవర్లో సూర్య వరుసగా 2 బౌండరీలు కొడితే పాండ్యా మరో ఫోర్ కొట్టాడు. 17వ ఓవర్ వేసిన ఎన్గరవా ఆఫ్సైడ్లో వేసిన వైడ్ యార్కర్లను 4, 6గా కొట్టడం మ్యాచ్కే హైలైట్. చటారా ఓవర్లో ఎక్స్ట్రా కవర్స్ మీదుగా బాదిన సిక్సర్, ఎన్గరవ ఆఖరి ఓవర్లో వరుసగా సూర్య 6, 2, 4, 6లతో మొత్తం 21 పరుగులు వచ్చాయి. 23 బంతుల్లో సూర్య (5 ఫోర్లు, 3 సిక్స్లు) ఫిఫ్టీ పూర్తయ్యింది. అంతకుముందు ఓపెనర్లలో రోహిత్ (15) విఫలమైనా... రాహుల్, కోహ్లి (25 బంతుల్లో 26; 2 ఫోర్లు)తో కలిసి స్కోరును నడిపించాడు. 34 బంతుల్లో (3 ఫోర్లు, 3 సిక్సర్లు) రాహుల్ అర్ధశతకం సాధించాడు. మన పేస్కు విలవిల జింబాబ్వే బ్యాటర్లు లక్ష్యఛేదనను అటుంచి... అసలు క్రీజులో నిలిచేందుకే కష్టపడ్డారు. టాప్, మిడిలార్డర్ భారత పేస్ బౌలింగ్కు విలవిల్లాడింది. ఓపెనర్లు మదెవెర్ (0)ను భువీ, ఇర్విన్ (13)ను హార్దిక్, చకబ్వా (0)ను అర్‡్షదీప్, సీన్ విలియమ్స్ (11)ను షమీ... ఇలా వరుసలోని నలుగురు బ్యాటర్స్ను నలుగురు బౌలర్లు దెబ్బకొట్టడంతో జింబాబ్వే ఓటమివైపు నడిచింది. సికిందర్ రజా, రియాన్ బర్ల్ చేసిన పరుగులు జట్టు వంద దాటేందుకు ఉపయోగపడ్డాయి. ఆఖరి వరుస బ్యాటర్స్ అశ్విన్ ఉచ్చులో పడటంతో ఆలౌట్ అయ్యేందుకు ఎంతోసేపు పట్టలేదు. స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్: రాహుల్ (సి) మసకద్జా (బి) సికందర్ 51; రోహిత్ (సి) మసకద్జా (బి) ముజరబాని 15; కోహ్లి (సి) బర్ల్ (బి) విలియమ్స్ 26; సూర్యకుమార్ (నాటౌట్) 61; పంత్ (సి) బర్ల్ (బి) విలియమ్స్ 3; పాండ్యా (సి) ముజరబాని (బి) ఎన్గరవ 18; అక్షర్ పటేల్ (నాటౌట్) 0; ఎక్స్ట్రాలు 12; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 186. వికెట్ల పతనం: 1–27, 2–87, 3–95, 4–101, 5–166. బౌలింగ్: ఎన్గరవ 4–1–44–1, చటార 4–0–34–0, ముజరబాని 4–0–50–1, మసకద్జా 2–0–12–0, బర్ల్ 1–0–14–0, సికందర్ రజా 3–0–18–1, సీన్ విలియమ్స్ 2–0–9–2. జింబాబ్వే ఇన్నింగ్స్: మదెవెర్ (సి) కోహ్లి (బి) భువనేశ్వర్ 0; ఇర్విన్ (సి అండ్ బి) పాండ్యా 13; చకబ్వా (బి) అర్‡్షదీప్ 0; విలియమ్స్ (సి) భువనేశ్వర్ (బి) 11; సికందర్ (సి) సూర్య (బి) పాండ్యా 34; టోని (ఎల్బీడబ్ల్యూ) (బి) షమీ 5; బర్ల్ (బి) అశ్విన్ 35; మసకద్జా (సి) రోహిత్ (బి) అశ్విన్ 1; ఎన్గరవ (బి) అశ్విన్ 1; చటార (సి అండ్ బి) అక్షర్ 4; ముజరబాని (నాటౌట్) 0; ఎక్స్ట్రాలు 11; మొత్తం (17.2 ఓవర్లలో ఆలౌట్) 115. వికెట్ల పతనం: 1–0, 2–2, 3–28, 4–31, 5–36, 6–96, 7–104, 8–106, 9–111, 10– 115. బౌలింగ్: భువనేశ్వర్ 3–1–11–1, అర్‡్షదీప్ 2–0–9–1, షమీ 2–0–14–2, పాండ్యా 3–0– 16–2, అశ్విన్ 4–0–22–3, అక్షర్ 3.2–0–40–1. 1: క్యాలెండర్ ఇయర్లో అంతర్జాతీయ టి20ల్లో 1,000 పరుగులు సాధించిన తొలి భారతీయ క్రికెటర్గా సూర్యకుమార్ యాదవ్ గుర్తింపు పొందాడు. ఈ ఏడాది సూర్య 28 టి20 మ్యాచ్లు ఆడి 1,026 పరుగులు చేశాడు. 21:ఈ ఏడాది రోహిత్ శర్మ కెప్టెన్సీలో టి20ల్లో భారత్ సాధించిన విజయాలు. క్యాలెండర్ ఇయర్లో అత్యధిక విజయాలు అందించిన కెప్టెన్గా బాబర్ ఆజమ్ (2021లో 20) పేరిట ఉన్న రికార్డును రోహిత్ అధిగమించాడు. -
కోహ్లికి మాత్రమే ఇలాంటివి సాధ్యం..
టి20 ప్రపంచకప్లో భాగంగా జింబాబ్వేతో మ్యాచ్లో కింగ్ కోహ్లి చిత్ర విచిత్రమైన హావభావాలతో మెరిశాడు. క్యాచ్ పట్టినప్పుడు ఒక ఎక్స్ప్రెషన్.. వికెట్ పడినప్పుడు మరొక ఎక్స్ప్రెషన్.. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. అయితే వీటన్నింటిలోకి బాగా వైరల్ అయింది మాత్రం జింబాబ్వే బ్యాటర్ వెస్లీ మాధవరే క్యాచ్ పట్టినప్పుడు కోహ్లి ఇచ్చిన ఎక్స్ప్రెషన్. జింబాబ్వే ఇన్నింగ్స్ తొలి ఓవర్ తొలి బంతికే భువనేశ్వర్ బౌలింగ్లో షాట్కు యత్నించిన మాధవరే కోహ్లి స్టన్నింగ్ క్యాచ్కు వెనుదిరిగాడు. ఈ సమయంలో మోకాళ్లపై కూర్చొని చిరునవ్వుతో కోహ్లి ఇచ్చిన ఎక్స్ప్రెషన్ హైలైట్ అయింది. కాగా కోహ్లి ఎక్స్ప్రెషన్పై క్రికెట్ అభిమానులు స్పందించారు. ''ఇలాంటివి కోహ్లికి మాత్రమే సాధ్యం.. ఎక్కడి నుంచి తెస్తావు ఈ వింత ఎక్స్ప్రెషన్స్'' అంటూ కామెంట్ చేశారు. ఇక మ్యాచ్లో కోహ్లి 26 పరుగులు చేసి ఔటయ్యాడు. ఈ ప్రపంచకప్లో టీమిండియా తరపున లీడింగ్ స్కోరర్గా కొనసాగుతున్న కోహ్లి ఐదు మ్యాచ్లు కలిపి 245 పరుగులు చేశాడు. ఇందులో మూడు అర్థసెంచరీలు ఉన్నాయి. జింబాబ్వేతో జరిగిన సూపర్-12 మ్యాచ్లో టీమిండియా 71 పరుగుల తేడాతో భారీ విజయాన్ని అందుకుంది. 1రియాన్ బర్ల్ 35 పరుగులతో టాప్ స్కోరర్ కాగా.. సికందర్ రజా 34 పరుగులు చేశాడు. టీమిండియా బౌలర్లలో అశ్విన్ 3, మహ్మద్ షమీ, హార్దిక్ పాండ్యాలు రెండు వికెట్లు తీశారు. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో రోహిత్ సేన 5 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. ఆకాశమే హద్దుగా చెలరేగిన సూర్యకుమార్ యాదవ్ 61 నాటౌట్, కేఎల్ రాహుల్ 51 రాణించారు. చదవండి: టి20ల్లో కెప్టెన్గా రోహిత్ శర్మ సరికొత్త రికార్డు అభిమానంతో రోహిత్ వద్దకు.. ఒక్క హగ్ అంటూ కన్నీటిపర్యంతం -
టి20ల్లో కెప్టెన్గా రోహిత్ శర్మ సరికొత్త రికార్డు
టి20 ప్రపంచకప్లో టీమిండియా సెమీస్లో అడుగుపెట్టింది. ఆదివారం ముగిసిన సూపర్-12 పోటీల్లో టీమిండియా జింబాబ్వేపై 71 పరుగుల తేడాతో నెగ్గి గ్రూప్-2 టాపర్గా సెమీస్కు చేరుకుంది. నవంబర్ 10(గురువారం) ఇంగ్లండ్తో సెమీఫైనల్-2లో టీమిండియా అమితుమీ తేల్చుకోనుంది. ఈ సంగతి పక్కనబెడితే టీమిండియా కెప్టెన్గా రోహిత్ శర్మ అరుదైన ఘనత సాధించాడు. జింబాబ్వేపై విజయం ఈ ఏడాది టి20ల్లో టీమిండియా కెప్టెన్గా రోహిత్ శర్మకు 21వది. ఈ నేపథ్యంలో ఒక ఏడాదిలో అత్యధిక టి20 విజయాలు అందుకున్న సారథిగా రోహిత్ శర్మ సరికొత్త రికార్డు నెలకొల్పాడు. 2021లో పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం(20 విజయాలు) అందుకున్నాడు. తాజాగా బాబర్ను వెనక్కి నెట్టిన హిట్మ్యాన్ తొలిస్థానంలో నిలిచాడు. 2018లో పాక్ మాజీ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ 18 టి20 విజయాలు అందుకోగా.. 2016లో ఎంఎస్ ధోనీ 15 విజయాలు అందుకున్నాడు. ► ఈ ఏడాది 50+ పరుగుల తేడాతో విజయం అందుకోవడం టీమిండియాకి ఇది 10వ సారి. ఇదే ఏడాది 6 సార్లు 50+ పరుగుల తేడాతో విజయం అందుకున్న న్యూజిలాండ్ రెండో పొజిషన్లో ఉంటే, 2018లో పాకిస్తాన్ 5 సార్లు ఈ ఫీట్ సాధించింది.. ► ఓవరాల్గా రోహిత్ శర్మకు ఆటగాడిగా ఇది 100వ టి20 విజయం. ఇంతకుముందు పాక్ సీనియర్ క్రికెటర్ 87 టి20 విజయాల్లో భాగం పంచుకోగా భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ 75 విజయాల్లో భాగస్వామిగా ఉన్నాడు. ► జింబాబ్వేతో జరిగిన టి20 మ్యాచ్లో సూర్యకుమార్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచిన సంగతి తెలిసిందే. కాగా ఈ ఏడాది సూర్యకుమార్కు ఇది ఆరో అవార్డు కావడం విశేషం. 2016లో విరాట్ కోహ్లీ 6 సార్లు టీ20ల్లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్లు గెలవగా ప్రస్తుతం సూర్య దానిని సమం చేశాడు. చదవండి: అభిమానంతో రోహిత్ వద్దకు.. ఒక్క హగ్ అంటూ కన్నీటిపర్యంతం ఏమా కొట్టుడు.. 'మిస్టర్ 360' పేరు సార్థకం -
అభిమానంతో రోహిత్ వద్దకు.. ఒక్క హగ్ అంటూ కన్నీటిపర్యంతం
జార్వో.. గుర్తున్నాడా. అరె ఈ పేరు ఎక్కడో విన్నట్లు ఉంది. 2021లో టీమిండియా ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లినప్పుడు పదే పదే మైదానంలోకి దూసుకొచ్చి హల్చల్ చేశాడు. జార్వో 69 టీషర్ట్ ధరించి సిరీస్లో పలుమార్లు అంతరాయం కలిగించాడు. దీంతో అతన్ని మైదానం నుంచి నిషేధం విధించినప్పటికి.. జైలుకి వెళ్లినప్పటికి అతని ప్రవర్తనలో మార్పు రాలేదు. అయితే మొత్తంగా మాత్రం తన చర్యలతో అప్పట్లో హాట్టాపిక్గా నిలిచాడు. తాజాగా టి20 ప్రపంచకప్లో భాగంగా టీమిండియా-జింబాబ్వే మధ్య జరిగిన మ్యాచ్లో ఒక అభిమాని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ వద్దకు దూసుకొచ్చాడు. జింబాబ్వే బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఒక టీనేజ్ అభిమాని సెక్యూరిటీ కళ్లు కప్పి క్రీజులోకి దూసుకొచ్చాడు. ఫీల్డింగ్ చేస్తున్న రోహిత్ శర్మ దగ్గరికి వచ్చి అతన్ని హత్తుకునే ప్రయత్నం చేశాడు. ఈలోగా సెక్యూరిటీ సిబ్బంది అతన్ని బయటికి లాక్కెళ్లారు. ఈ సమయంలో ఒక్క షేక్ హ్యాండ్ లేదా కనీసం హగ్ ఇవ్వాల్సిందిగా రోహిత్ వైపు చూస్తూ కన్నీళ్లు పెట్టుకోవడం కాస్త బాధను కలిగించింది. అయితే అనుమతి లేకుండా మైదానంలోకి దూసుకురావడం తప్పుగా పరిగణిస్తారు. ఎంత అభిమానం ఉన్న ఆటగాళ్లు కూడా తమ భద్రత దృశ్యా ఎవరిని దగ్గరికి రానియ్యరు. రోహిత్ కూడా అదే పద్దతిని ఫాలో అయ్యాడు. కాగా సెక్యూరిటీ నిబంధనలను ఉల్లంఘించి గ్రౌండ్లోకి ఎంటర్ అయినందుకు ఆ కుర్రాడికి క్రికెట్ ఆస్ట్రేలియా రూ.6 లక్షల 50 వేల భారీ జరిమానా విధించింది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. కాగా ఈ ప్రపంచకప్లో అభిమానులు మ్యాచ్ జరుగుతున్న సమయంలో గ్రౌండ్లోకి రావడం ఇది రెండో సారి. దీంతో ఆటగాళ్ల భద్రతపై క్రికెట్ ఆస్ట్రేలియా తీసుకుంటున్న చర్యలపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. చదవండి: ఏమా కొట్టుడు.. 'మిస్టర్ 360' పేరు సార్థకం అన్నీ కుదిరితే ఫైనల్లో టీమిండియా, పాకిస్తాన్! A fan entered into a stadium during India vs zim match....#INDvsZIM #T20worldcup22 #T20WorldCup #SuryakumarYadav #semis #RohitSharma𓃵 #ViratKohli𓃵 follow for more tweets pic.twitter.com/fWvKNIky63 — Santoshgadili (@Santoshgadili3) November 6, 2022 Little fan didn't get chance to meet Rohit Sharma... Nice gesture from Captain Rohit he talked with him...#RohitSharma𓃵 #T20worldcup22 #T20WorldCup pic.twitter.com/eQ4Pw6UJt2 — 𝖲𝖺𝗎𝗋𝖺𝖻𝗁🤍 (@Cricket_Gyaani_) November 6, 2022 A fan invaded the field today to meet Rohit Sharma, he was in tears when he came close to Rohit. The fan has been fined 6.5 Lakhs INR for invading the field. pic.twitter.com/CmiKIocTHf — Mufaddal Vohra (@mufaddal_vohra) November 6, 2022 -
'క్వాలిఫై అని ముందే తెలుసు..గ్రూప్ టాపర్గా వెళ్లాలన్నదే లక్ష్యం'
టి20 ప్రపంచకప్లో భాగంగా సూపర్-12 దశలో ఆఖరి మ్యాచ్లో టీమిండియా జింబాబ్వేపై 71 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి సెమీస్లో అడుగుపెట్టింది. ఐదు మ్యాచ్ల్లో నాలుగు విజయాలు, ఒక ఓటమితో 8 పాయింట్లు సాధించిన టీమిండియా గ్రూప్-1 టాపర్గా నిలిచి సెమీస్కు చేరుకుంది. తొలుత సూర్యకుమార్ సంచలన ఇన్నింగ్స్కు తోడు కేఎల్ రాహుల్ మరో అర్థశతకం మెరవడంతో టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. ఆపై భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడమే గాక వరుస విరామాల్లో వికెట్లు తీస్తూ జింబాబ్వేపై ఒత్తిడి తెచ్చారు. దీంతో జింబాబ్వే 115 పరుగులకే ఆలౌట్ కావడంతో టీమిండియా 71 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. ఇక మ్యాచ్ విజయం అనంతరం కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడాడు. ''మ్యాచ్కు ముందే మేము సెమీస్కు క్వాలిఫై అయ్యామని తెలుసు. కానీ గ్రూప్ టాపర్గా వెళ్లాలనేది మా లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇక జింబాబ్వేతో మ్యాచ్లో జట్టు ఆల్రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకుంది. కేఎల్ రాహుల్తో పాటు సూర్యకుమార్లు తమ ఫామ్ను కొనసాగిస్తూ బ్యాటింగ్ చేయడం మాక చాలా అనుకూలం. ఇక సూర్యకుమార్ రోజురోజుకు మరింత బలంగా తయారవుతున్నాడు. అతని కచ్చితమైన షాట్ల ఎంపిక ప్రతీ ఒక్కరిని ముగ్దులను చేస్తోంది. ఒత్తిడిని తట్టుకొని బ్యాటింగ్ చేయడమనేది సవాల్తో కూడుకున్నాది. కానీ సూర్యకుమార్ మాత్రం యథేచ్చగా బ్యాట్ను ఝులిపించడం కలిసొచ్చే అంశం. ఇక ఇంగ్లండ్ లాంటి బలమైన జట్టుతో సెమీఫైనల్ ఆడనున్న నేపథ్యంలో సూర్యకుమార్ మరోసారి కీలకంగా మారాడని చెప్పొచ్చు. కొన్ని రోజులుగా చూసుకుంటే ఇంగ్లండ్ మంచి క్రికెట్ ఆడుతూ వస్తున్నారు. వాళ్లను ఎదుర్కోవడం సవాల్ లాంటిదే అయినప్పటికి మంచి ప్రయత్నంతో వారిని ఓడగొట్టేందుకు ప్రయత్నిస్తాం. ఇప్పటివరకు మా ఆటతీరు బాగానే ఉంది. ఇకపై సెమీస్లో మరింత జాగ్రత్తగా ఆడాల్సి ఉంది. సూపర్-12 దశలో చేసిన తప్పులను కరెక్ట్ చేసుకొని సెమీస్ బరిలోకి దిగాలనుకుంటున్నాం. ఇక మ్యాచ్లు చూడడానికి వస్తున్న అభిమానులకు ప్రత్యేక కృతజ్ఞతలు. మేం ఎక్కడ మ్యాచ్లు ఆడినా అక్కడ స్టేడియం హౌస్ఫుల్ అయినట్లు కనిపిస్తుంది. ఇంతదూరం మాకు మద్దతిస్తూ వచ్చారు. సెమీస్లోనూ అదే సపోర్ట్ ఉంటుందని ఆశిస్తున్నా. జట్టు తరపున మీ అభిమానానికి ప్రత్యేకంగా కృతజ్ఞతలలు తెలుపుకుంటున్నా'' అంటూ ముగించాడు. చదవండి: జింబాబ్వేపై ఘన విజయం.. గ్రూప్-2 టాపర్గా సెమీస్కు టీమిండియా అన్నీ కుదిరితే ఫైనల్లో టీమిండియా, పాకిస్తాన్! -
జింబాబ్వేపై ఘన విజయం.. గ్రూప్-2 టాపర్గా సెమీస్కు టీమిండియా
టి20 ప్రపంచకప్లో టీమిండియా గ్రూప్-2 టాపర్గా సెమీస్లో అడుగుపెట్టింది. జింబాబ్వేతో జరిగిన సూపర్-12 మ్యాచ్లో టీమిండియా 71 పరుగుల తేడాతో భారీ విజయాన్ని అందుకుంది. 187 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వే టీమిండియా బౌలర్ల దాటికి ఏ దశలోనూ పోరాడలేకపోయింది. భారత బౌలర్లు కట్టుదిట్టమైన బంతులు విసరడంతో పాటు వరుస విరామాల్లో వికెట్లు తీయడంతో జింబాబ్వే ఒత్తిడిలో పడిపోయింది. రియాన్ బర్ల్ 35 పరుగులతో టాప్ స్కోరర్ కాగా.. సికందర్ రజా 34 పరుగులు చేశాడు. టీమిండియా బౌలర్లలో అశ్విన్ 3, మహ్మద్ షమీ, హార్దిక్ పాండ్యాలు రెండు వికెట్లు తీయగా.. భువనేశ్వర్, అర్ష్దీప్, అక్షర్ పటేల్ తలా ఒక వికెట్ తీశారు. ఈ విజయంతో టీమిండియా గ్రూప్-2 టాపర్గా సెమీస్లో అడుగుపెట్టింది. ఇక సెమీఫైనల్లో గ్రూప్-1లో రెండో స్థానంలో ఉన్న ఇంగ్లండ్తో అమితుమీ తేల్చుకోనున్నాయి. ఇక మరొక సెమీస్లో టోర్నీ ఫేవరెట్ న్యూజిలాండ్తో పాకిస్తాన్ ఆడనుంది. అన్ని కుదిరితే టీమిండియా, పాకిస్తాన్ ఫైనల్లో తలపడే అవకాశాలున్నాయి. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో రోహిత్ సేన 5 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. ఆకాశమే హద్దుగా చెలరేగిన సూర్యకుమార్ యాదవ్ 61 నాటౌట్, కేఎల్ రాహుల్ 51 రాణించారు. -
జింబాబ్వేపై టీమిండియా ఘన విజయం (ఫొటోలు)
-
Ind Vs Zim: రాక రాక వచ్చిన అవకాశం.. జింబాబ్వే చేతిలో కూడానా? ఏంటిది పంత్!
ICC Mens T20 World Cup 2022- India vs Zimbabwe: టీమిండియా వెటరన్ వికెట్ కీపర్ బ్యాటర్ దినేశ్ కార్తిక్ పునరాగమనం తర్వాత.. యువ ఆటగాడు రిషభ్ పంత్కు జట్టులో స్థానం కోసం అతడితో పోటీ నెలకొంది. టీ20 ప్రపంచకప్-2022 టోర్నీకి వీరిద్దరు ఎంపికైనప్పటికీ యాజమాన్యం సీనియారిటీకే ఓటు వేసింది. సూపర్-12లో భాగంగా వరుసగా నాలుగు మ్యాచ్లలో డీకేను ఆడించగా.. పంత్ బెంచ్కే పరిమితమయ్యాడు. ఇదిలా ఉంటే.. ఆదివారం నాటి మ్యాచ్లో నెదర్లాండ్స్ చేతిలో సౌతాఫ్రికా ఓడిపోవడంతో.. టీమిండియా సెమీస్ బెర్తు ఖరారైన విషయం తెలిసిందే. దీంతో ఆఖరిదైన జింబాబ్వేతో మ్యాచ్ భారత్కు నామమాత్రంగా మారిపోయింది. ఇక మ్యాచ్ ద్వారా వరల్డ్కప్ తాజా ఎడిషన్లో తొలిసారిగా తుది జట్టులోకి వచ్చాడు పంత్. పంత్ ఏంటిది? అయితే, డీకే స్థానంలో వికెట్ కీపర్ బ్యాటర్గా ఎంట్రీ ఇచ్చిన రిషభ్ పంత్ పూర్తిగా నిరాశపరిచాడు. ఐదో స్థానంలో బ్యాటింగ్కు దిగిన 5 బంతులు ఎదుర్కొన్న అతడు కేవలం మూడు పరుగులకే అవుటయ్యాడు. సీన్ విలియమ్స్ బౌలింగ్లో పంత్ షాట్కు యత్నించగా.. ర్యాన్ బర్ల్కు అద్భుత క్యాచ్ అందుకున్నాడు. ఈ నేపథ్యంలో తొందరగానే పెవిలియన్ చేరిన పంత్పై సోషల్ మీడియా వేదికగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ‘‘ఆస్ట్రేలియా పిచ్లపై బాగా ఆడతాడు. కాబట్టి డీకేను కాదని పంత్ను జట్టులోకి తీసుకోవాలంటూ రికీ పాంటింగ్ లాంటి దిగ్గజాలు చెబుతారు. కానీ నువ్వేమో రాక రాక వచ్చిన అవకాశాన్ని ఇలా చేజేతులా నాశనం చేసుకున్నావు. జింబాబ్వే బౌలర్లను కూడా ఎదుర్కోలేకపోతున్నావు. ఇంకా నయం నెదర్లాండ్స్ గనుక సౌతాఫ్రికాను ఓడించకపోతే నిన్ను నమ్మేవాళ్లు కాదేమో! నామమాత్రపు మ్యాచ్ కాబట్టి ఛాన్స్ ఇచ్చి ఉంటారు’’ అంటూ ట్రోల్ చేస్తున్నారు. కాగా గ్రూప్-2 నుంచి టీమిండియాతో పాటు పాకిస్తాన్ సెమీ ఫైనల్కు అర్హత సాధించిన విషయం తెలిసిందే. చదవండి: Shakib Al Hasan: ఇప్పటి వరకు ఇదే అత్యుత్తమ ప్రదర్శన.. కానీ నేనైతే: బంగ్లాదేశ్ కెప్టెన్ WC 2022: పాపం.. సౌతాఫ్రికా టోర్నీ నుంచి అవుట్! ఇందుకు కారణం ఆ రెండే! ముఖ్యంగా యూఏఈ! View this post on Instagram A post shared by ICC (@icc) -
జింబాబ్వేపై టీమిండియా ఘన విజయం.. సెమీస్లో ఇంగ్లండ్తో అమితుమీ
జింబాబ్వేపై ఘన విజయం.. గ్రూప్-2 టాపర్గా సెమీస్కు టీమిండియా టి20 ప్రపంచకప్లో టీమిండియా గ్రూప్-2 టాపర్గా సెమీస్లో అడుగుపెట్టింది. జింబాబ్వేతో జరిగిన సూపర్-12 మ్యాచ్లో టీమిండియా 71 పరుగుల తేడాతో భారీ విజయాన్ని అందుకుంది. 187 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వే టీమిండియా బౌలర్ల దాటికి ఏ దశలోనూ పోరాడలేకపోయింది. 17.2 ఓవర్లలో 115 పరుగులకే ఆలౌట్ అయింది. రియాన్ బర్ల్ 35, సికందర్ రజా 34 పరుగులు చేశారు. అశ్విన్ మూడు వికెట్లతో రాణించాడు. ఈ విజయంతో గ్రూప్-2 టాపర్గా సెమీస్లో అడుగుపెట్టిన టీమిండియా ఇంగ్లండ్తో అమితుమీ తేల్చుకోనుంది. అశ్విన్ మాయాజాలం.. తొమ్మిదో వికెట్ డౌన్ ► టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీసి జింబాబ్వేను దెబ్బతీశాడు. ప్రస్తుతం జింబాబ్వే 9 వికెట్ల నష్టానికి 111 పరుగులు చేసింది. రియాన్ బర్ల్(35) ఔట్.. ఆరో వికెట్ కోల్పోయిన జింబాబ్వే ► రియాన్ బర్ల్(35) రూపంలో జింబాబ్వే ఆరో వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం జింబాబ్వే 15 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 104 పరుగులు చేసింది. 42 పరుగులకే ఐదు వికెట్లు.. కష్టాల్లో పడిన జింబాబ్వే ► టి20 ప్రపంచకప్లో భాగంగా టీమిండియాతో మ్యాచ్లో జింబాబ్వే ఓటమి దిశగా పయనిస్తోంది. 187 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వే 41 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి తీవ్ర కష్టాల్లో పడింది. టీమిండియా బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో పాటు వరుస విరామాల్లో వికెట్లు తీస్తూ జింబాబ్వేపై ఒత్తిడి పెంచుతున్నారు. ప్రస్తుతం జింబాబ్వే ఐదు వికెట్ల నష్టానికి 42 పరుగులు చేసింది. రియాన్ బర్ల్ 3, సికందర్ రజా 3 పరుగులతో ఆడుతున్నారు. పవర్ ప్లేలో జింబాబ్వే స్కోరు- 28/3 (6) షమీ బౌలింగ్లో మూడో వికెట్గా విలియమ్స్ వెనుదిరిగాడు. రెండో వికెట్ కోల్పోయిన జింబాబ్వే అర్ష్దీప్ బౌలింగ్లో చకబ్వా బౌల్డ్ అయ్యాడు. స్కోరు: 2/2 (1.4) మొదటి వికెట్ డౌన్ టీమిండియా పేసర్ భువనేశ్వర్ కుమార్ భారత్కు శుభారంభం అందించాడు. మొదటి బంతికి జింబాబ్వే ఓపెనర్ మాధేవెరేను పెవిలియన్కు పంపాడు. మొదటి ఓవర్ ముగిసే సరికి జింబాబ్వే స్కోరు: 0-1 భారత్ స్కోరెంతంటే జింబాబ్వేతో మ్యాచ్లో టీమిండియా ఓపెనర్ కేఎల్ రాహుల్(51), మిడిలార్డర్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్(61) హాఫ్ సెంచరీలతో మెరిశారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో రోహిత్ సేన 5 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేయగలిగింది. వచ్చాడు.. హాఫ్ సెంచరీ కొట్టాడు సూర్యకుమార్ యాదవ్ అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. 23 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. ఐదో వికెట్ కోల్పోయిన టీమిండియా హార్దిక్ పాండ్యా(18) ఐదో వికెట్గా వెనుదిరిగాడు. సూర్య, అక్షర్ పటేల్ క్రీజులో ఉన్నారు. 18 ఓవర్లలో టీమిండియా స్కోరు- 152/4 సూర్య 37, పాండ్యా 11 పరుగులతో క్రీజులు ఉన్నారు. నిరాశపరిచిన పంత్ ఈ ఎడిషన్లో తొలిసారిగా తుది జట్టులో చోటు దక్కించుకున్న రిషభ్ పంత్ పూర్తిగా నిరాశపరిచాడు. 3 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. హార్దిక్, సూర్య క్రీజులో ఉన్నారు. రాహుల్ అవుట్ సిక్సర్తో అర్ధ శతకం పూర్తి చేసుకున్న కేఎల్ రాహుల్(51) రజా బౌలింగ్లో మూడో వికెట్గా వెనుదిరిగాడు. పంత్ క్రీజులోకి వచ్చాడు. స్కోరు: 98/3 (13) View this post on Instagram A post shared by ICC (@icc) రెండో వికెట్ కోల్పోయిన టీమిండియా కోహ్లి రూపంలో టీమిండియా రెండో వికెట్ కోల్పోయింది. పన్నెండో ఓవర్ ఆఖరి బంతికి విలియమ్స్ బౌలింగ్లో బర్ల్కు క్యాచ్ ఇచ్చి 26 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద కోహ్లి నిష్క్రమించాడు. 12 ఓవర్లలో స్కోరు: 89-2. కేఎల్ రాహుల్ (45), సూర్యకుమార్ యాదవ్ క్రీజులో ఉన్నారు. 10 ఓవర్లలో టీమిండియా స్కోరు: 79/1 రాహుల్ 41, కోహ్లి 22 పరుగులతో క్రీజులో ఉన్నారు. 9 ఓవర్లలో భారత్ స్కోరు: 71/1 కోహ్లి 20, రాహుల్ 35 పరుగులతో క్రీజులో ఉన్నారు. పవర్ ప్లేలో టీమిండియా స్కోరు: 46/1 (6) కోహ్లి 10, రాహుల్ 20 పరుగులతో క్రీజులో ఉన్నారు. తొలి వికెట్ డౌన్ జింబాబ్వేతో నామమాత్రపు మ్యాచ్లో టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. కెప్టెన్ రోహిత్ శర్మ(15) నాలుగో ఓవర్ ఐదో బంతికి అవుటయ్యాడు. ముజరబానీ బౌలింగ్లో మసకద్జాకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. కోహ్లి, రాహుల్ క్రీజులో ఉన్నారు. 4 ఓవర్లలో స్కోరు: 31-1 సెమీస్లో భారత్తో పాటు ఆ జట్టు ఇప్పటికే గ్రూప్-2 నుంచి సెమీస్ బెర్తు ఖరారు చేసుకున్న టీమిండియా సూపర్-12లో తమ ఆఖరి మ్యాచ్లో జింబాబ్వేతో తలపడుతోంది. మెల్బోర్న్ వేదికగా క్రెయిగ్ ఎర్విన్ బృందంతో నామమాత్రపు మ్యాచ్ ఆడనుంది. ఆదివారం నాటి ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన భారత కెప్టెన్ రోహిత్ శర్మ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఇక జింబాబ్వేతో మ్యాచ్తో టీమిండియా యువ వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్.. ఈ వరల్డ్కప్ ఎడిషన్లో తొలిసారిగా తుది జట్టులో చోటు దక్కించుకున్నాడు. కాగా అనూహ్య పరిస్థితుల్లో పసికూన నెదర్లాండ్స్ చేతిలో ఓడి సౌతాఫ్రికా ఇంటిబాట పట్టిన విషయం తెలిసిందే. దీంతో ఎలాంటి సమీకరణాలతో పనిలేకుండా భారత్ సెమీస్ చేరింది. ఈ క్రమంలో మరో కీలక మ్యాచ్లో పాకిస్తాన్.. బంగ్లాపై విజయం సాధించి.. దాయాది టీమిండియాతో పాటు సెమీస్లో అడుగుపెట్టింది. ఇండియా వర్సెస్ జింబాబ్వే తుది జట్లు ఇవే: భారత్: కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ(కెప్టెన్), విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, రిషబ్ పంత్(వికెట్ కీపర్), అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, భువనేశ్వర్ కుమార్, మహమ్మద్ షమీ, అర్ష్దీప్ సింగ్. జింబాబ్వే వెస్లీ మాధేవెరే, క్రెయిగ్ ఎర్విన్(కెప్టెన్), రెగిస్ చకబ్వా(వికెట్ కీపర్), సీన్ విలియమ్స్, సికందర్ రజా, టోనీ మునియోంగా, ర్యాన్ బర్ల్, టెండై చటారా, రిచర్డ్ నగరవ, వెల్లింగ్టన్ మసకద్జా, బ్లెస్సింగ్ ముజరబానీ చదవండి: Temba Bavuma: ఈ ఓటమిని అస్సలు జీర్ణించుకోలేకపోతున్నాం! ప్రధాన కారణం అదే -
జింబాబ్వేతో టీమిండియా ‘ఢీ’.. గెలిస్తే గ్రూప్ టాపర్గా రోహిత్ సేన
సరిగ్గా రెండు వారాల క్రితం మెల్బోర్న్ మైదానంలో భారత క్రికెట్ జట్టు ఒక అద్భుత విజయాన్ని అందుకుంది. పాకిస్తాన్పై సాధించిన ఈ గెలుపు అభిమానులందరికీ చిరస్మరణీయ జ్ఞాపకాన్ని అందించింది. ఇప్పుడు అదే వేదికపై లీగ్ దశను ముగించేందుకు టీమిండియా మళ్లీ మైదానంలోకి అడుగు పెడుతోంది. బలహీన ప్రత్యర్థిని ఓడించి గ్రూప్–1లో మొదటి స్థానంలో నిలవాలని రోహిత్ బృందం పట్టుదలతో ఉంది. అయితే స్టార్లు లేకపోయినా జింబాబ్వేను తక్కువగా అంచనా వేస్తే ప్రమాదమే! అలసత్వంతో అనూహ్య ఓటమిని ఎదుర్కొన్న పాకిస్తాన్ ఇప్పటికీ టోర్నీలో సెమీస్ స్థానం కోసం పోరాడుతోంది. ఈ నేపథ్యంలో మరో ఆదివారం మధ్యాహ్నం అభిమానులకు వినోదం ఖాయం. మెల్బోర్న్: పాకిస్తాన్, నెదర్లాండ్స్, బంగ్లాదేశ్లపై విజయాలు, దక్షిణాఫ్రికా చేతిలో ఓటమి తర్వాత భారత జట్టు టి20 వరల్డ్కప్ లీగ్ దశలో తమ చివరి పోరుకు సిద్ధమైంది. నేడు జరిగే పోరులో జింబాబ్వేతో భారత్ తలపడుతుంది. అధికారికంగా భారత్కు ఇంకా సెమీస్ స్థానం ఖరారు కాలేదు కానీ ఈ మ్యాచ్లో గెలిస్తే గ్రూప్ టాపర్గా భారత్ సెమీస్ చేరుతుంది. అదే జరిగితే ఈ నెల 10న అడిలైడ్లో ఇంగ్లండ్తో రెండో సెమీఫైనల్లో టీమిండియా తలపడుతుంది. టోర్నీ ఆసాంతం స్ఫూర్తిదాయక ప్రదర్శన కనబర్చిన జింబాబ్వే మరో సంచలనాన్ని ఆశిస్తోంది. పాక్తో మ్యాచ్ తరహాలోనే 90 వేలకు పైగా సామర్థ్యం ఉన్న ఎంసీజీలో ఈ పోరు కు కూడా అన్ని టికెట్లూ అమ్ముడవడం విశేషం. చహల్కు అవకాశం దక్కేనా... గత మ్యాచ్లో బంగ్లాదేశ్పై చివర్లో గట్టెక్కినా... తుది జట్టులో మార్పులు ఉండకపోవచ్చు. టాపార్డర్ బ్యాటర్ల నుంచి బౌలర్ల వరకు అందరూ సమష్టిగా రాణిస్తున్నారు. ఒక్క వికెట్ కీపర్ విషయంలోనే కాస్త సందేహాలు అనిపించాయి. బంగ్లాతో పోరులోనే కార్తీక్ బదులుగా పంత్ ఆడతాడని అనిపించినా, చివరకు అది జరగలేదు. అంటే ఫినిషర్గా కార్తీక్పైనే జట్టు మేనేజ్మెంట్ ఎక్కువగా నమ్మకముంచుతోంది. పేసర్లు షమీ, భువనేశ్వర్, అర్‡్షదీప్ ప్రతీ మ్యాచ్లో అంచనాలకు అనుగుణంగా రాణించారు. జింబాబ్వేపై కూడా ఈ ముగ్గురు ప్రభావం చూపగలరు. సమష్టిగా రాణిస్తే... పాకిస్తాన్పై విజయంతో ఒకదశలో జింబాబ్వే జట్టులో కూడా సెమీస్ ఆశలు రేగాయి. అయితే బంగ్లా, నెదర్లాండ్స్ చేతుల్లో పరాజయాలు ఆ జట్టును దెబ్బకొట్టాయి. ఈ రెండుసార్లు బ్యాటింగ్ వైఫల్యంతోనే జింబాబ్వే ఓడింది. సికందర్ రజా, విలియమ్స్పైనే జట్టు బ్యాటింగ్ ప్రధానంగా ఆధారపడి ఉంది. మరోవైపు జింబాబ్వే బౌలింగ్ కాస్త మెరుగ్గా కనిపిస్తోంది. పేసర్లు చటారా, ఎన్గరవ, ముజరబానిలను జట్టు నమ్ముకుంటోంది. ఈ ముగ్గురూ టోర్నీలో వేర్వేరు దశల్లో చక్కటి బౌలింగ్తో ఆకట్టుకున్నారు. పట్టుదలగా బౌలింగ్ చేస్తే వీరు భారత బ్యాటింగ్ను కొంత వరకు ఇబ్బంది పెట్టగలరేమో చూడాలి. పిచ్, వాతావరణం ఎంసీజీలో ఈ ప్రపంచకప్లో ఐదు మ్యాచ్లు షెడ్యూల్ కాగా, మూడు రద్దయ్యాయి. ఒక మ్యాచ్ను కుదించగా, భారత్–పాక్ మ్యాచ్ మాత్రమే పూర్తిగా సాగింది. ఆదివారం వర్ష సూచన లేకపోవడం సానుకూలాంశం. కొత్త పిచ్పై పేసర్లు కొంత ప్రభావం చూపగలరు కానీ ఓవరాల్గా బ్యాటింగ్కే అనుకూలం. 1: టి20 ప్రపంచకప్ చరిత్రలో భారత్, జింబాబ్వే మధ్య ఇదే తొలి మ్యాచ్. -
జింబాబ్వేతో కీలక మ్యాచ్కు ముందు టీమిండియాకు గుడ్ న్యూస్
సెమీస్ బెర్త్ ఖరారు చేసుకునే క్రమంలో రేపు (నవంబర్ 6) జింబాబ్వేతో జరుగబోయే కీలక మ్యాచ్కు ముందు టీమిండియాకు శుభవార్త అందింది. మ్యాచ్కు వేదిక అయిన మెల్బోర్న్లో వర్షం పడే సూచనలు లేవని అక్కడి వాతావరణ శాఖ ప్రిడిక్షన్లో పేర్కొంది. ఇదే వేదికపై గతవారం మూడు మ్యాచ్లు తుడిచిపెట్టుకుపోయిన నేపథ్యంలో టీమిండియాతో పాటు అభిమానుల్లోనూ ఆందోళన నెలకొని ఉండింది. అయితే వాతావరణ శాఖ ప్రకటనతో భారతీయులంతా ఊపిరి పీల్చుకున్నారు. మ్యాచ్ జరిగే సమయానికి (భారతకాలమానం ప్రకారం మధ్యాహ్నం 1:30 గంటలకు) మెల్బోర్న్లో వాతావరణం క్లియర్గా ఉంటుందని, టెంపరేచర్ 25 డిగ్రీల వరకు ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. ఇదిలా ఉంటే, టీ20 వరల్డ్కప్-2022 గ్రూప్-2 నుంచి సెమీస్ రేసులో టీమిండియా ముందున్న విషయం తెలిసిందే. భారత్ ఇప్పటివరకు ఆడిన 4 మ్యాచ్ల్లో 3 విజయాలతో 6 పాయింట్లు సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతుంది. రేపు జింబాబ్వేతో జరుగబోయే మ్యాచ్లో టీమిండియా గెలుస్తే.. ఈ గ్రూప్లో అగ్రస్థానంతో సెమీస్కు వెళ్తుంది. మరోపక్క టీమిండియాతో పాటు సెమీస్ రేసులో ఉన్న సౌతాఫ్రికా, పాకిస్తాన్ జట్లు సైతం రేపే తమ ఆఖరి సూపర్-12 మ్యాచ్లు ఆడనున్నాయి. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉన్న సౌతాఫ్రికా.. రేపు ఉదయం 5:30 గంటలకు నెదర్లాండ్స్తో తలపడనుంది. ఈ మ్యాచ్లో సౌతాఫ్రికా గెలిస్తే.. నేరుగా సెమీస్కు అర్హత సాథిస్తుంది. ఉదయం 9:30 గంటలకు జరుగబోయే మరో మ్యాచ్లో పాకిస్తాన్.. బంగ్లాదేశ్ను ఢీకొట్టనుంది. సెమీస్ రేసులో నిలవాలంటే ఈ మ్యాచ్లో పాక్ భారీ తేడాతో గెలవాల్సి ఉంటుంది. ఒకవేళ గెలిచినా దాయాది జట్టు సెమీస్ అవకాశాలు భారత్, దక్షిణాఫ్రికాల మ్యాచ్ల ఫలితాలపై ఆధారపడి ఉంటాయి. -
Ind vs Zim: జింబాబ్వేను తేలికగా తీసుకోలేము.. కాబట్టి: అశ్విన్
ICC Mens T20 World Cup 2022- India vs Zimbabwe: ‘‘ఏ జట్టును తక్కువగా అంచనా వేసే పరిస్థితి లేదు. ఎంత వీలైతే అంత దూకుడుగా ఉండాలి. ప్రత్యర్థి జట్టుపై ఏమాత్రం కనికరం చూపాల్సిన అవసరం లేదు. ఇప్పటికీ ఇంకా పోటీ ఉంది. కాబట్టి బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో అద్భుతంగా రాణించి ఆరంభం నుంచే ఒత్తిడి పెంచాలి. చావో రేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్లో మేటి జట్టు అద్భుత విజయం సాధిస్తేనే బాగుంటుంది. కచ్చితంగా గెలిచి తీరాల్సిన మ్యాచ్ కాబట్టి ఆది నుంచే దూకుడు ప్రదర్శించాలి. ఏ దశలోనూ ప్రత్యర్థి జట్టును కోలుకోనివ్వకూడదు’’ అని టీమిండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అన్నాడు. తేలికగా తీసుకుంటే అంతే సంగతి! టీ20 ప్రపంచకప్-2022 సూపర్-12లో భాగంగా భారత్ తమ ఆఖరి మ్యాచ్లో ఆదివారం జింబాబ్వేతో తలపడనుంది. ఈ మ్యాచ్లో గెలిస్తేనే ఎలాంటి సమీకరణాలతో పనిలేకుండా టీమిండియా సెమీస్ చేరుతుంది. అయితే, ఇటీవల సంచనాలు నమోదు చేస్తూ పటిష్టమైన జట్లకు షాకిస్తున్న జింబాబ్వేను తేలికగా తీసుకుంటే అనుకున్న ఫలితం రాకపోవచ్చు. వాళ్లను గౌరవిస్తాం ఈ నేపథ్యంలో జట్టులో భాగమైన అశ్విన్ మ్యాచ్కు ముందు మీడియాతో మాట్లాడుతూ ఈ మేరకు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. చిన్న జట్టు కాబట్టి జింబాబ్వేను తక్కువ అంచనా వేయకూడదని పేర్కొన్నాడు. ‘‘టీ20 వరల్డ్కప్లో ప్రతి మ్యాచ్లాగే ఇది కూడా తప్పక గెలవాల్సిందే. జింబాబ్వే ఇటీవల అద్భుతంగా ఆడుతోంది. అలాంటి జట్టును ఈజీగానే పడగొట్టేస్తామని మేము అనుకోవడం లేదు. వాళ్లు బ్యాటింగ్, బౌలింగ్ విభాగంలో పటిష్టంగా కనిపిస్తున్నారు. వాళ్లను తక్కువ అంచనా వేసి మూల్యం చెల్లించే పరిస్థితి లేదు’’ అని అశ్విన్ అన్నాడు. కాగా స్టార్ ప్లేయర్ సికిందర్ రజా అద్భుత ప్రదర్శనతో పాకిస్తాన్ మీద ఒకే ఒక్క పరుగుతో జింబాబ్వే విజయం సాధించిన విషయం తెలిసిందే. తద్వారా సెమీస్ రేసులో ఇతర జట్ల ఫలితాలను ప్రభావితం చేయగల పరిస్థితికి చేరుకుంది. చదవండి: Ind Vs Ban: ఇండియా క్రికెట్ పవర్హౌజ్.. అయినా కూడా: ఆఫ్రిదికి బీసీసీఐ బాస్ కౌంటర్ Ind Vs Zim: భారత్తో మ్యాచ్.. అంచనాలు తలకిందులు చేసే ఛాన్స్ ఎలా వదులుకుంటాం: జింబాబ్వే కెప్టెన్ Virat Kohli- Anushka Sharma Love Story: అప్పుడప్పుడు నటించేవాడు కూడా.. ‘బ్యాడ్ జోక్’తో మాట కలిపి! ఇప్పుడేమో ఇలా var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4911494512.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
WC 2022: అంచనాలు తలకిందులు చేసే ఛాన్స్ ఎలా వదులుకుంటాం: జింబాబ్వే కెప్టెన్
ICC Mens T20 World Cup 2022- India vs Zimbabwe: టీ20 ప్రపంచకప్-2022 సూపర్-12లో ఇప్పటి వరకు ఆడిన నాలుగు మ్యాచ్లలో మూడు విజయాలు.. అత్యుత్తమ బ్యాటర్ విరాట్ కోహ్లి పరుగుల మోత.. మిడిలార్డర్లో రాణిస్తూ జట్టును ఆదుకుంటున్న సూర్యకుమార్ యాదవ్.. టోర్నీ తాజా ఎడిషన్లో 220 రన్స్తో టాప్లో.. జయవర్ధనే రికార్డు బద్దలు కొట్టి ఓవరాల్గా టాప్ రన్ స్కోరర్గా కోహ్లి.. బంగ్లాదేశ్తో మ్యాచ్ సందర్భంగా టీ20 ర్యాంకింగ్స్లో నంబర్ 1గా అవతరించిన సూర్య.. ఇక బౌలర్లు సరేసరి.. అటు సీనియర్ భువనేశ్వర్ కుమార్.. ఇటు యువ పేసర్ అర్ష్దీప్ సింగ్.. ప్రత్యర్థి బ్యాటర్లకు చుక్కలు చూపిస్తున్నారు.. ఫీల్డింగ్లోనూ లోపాలు సరిదిద్దుకుని మరింత పటిష్టమైన జట్టుగా టీమిండియా.. సవాల్ విసిరిన జింబాబ్వే కెప్టెన్! ఇలా అన్ని విభాగాల్లో బలంగా ఉన్న రోహిత్ సేన సూపర్-12లో తమ ఆఖరి మ్యాచ్లో జింబాబ్వేతో తలపడనుంది. మేటి జట్టు.. వరల్డ్క్లాస్ బ్యాటర్లు.. మరి ప్రత్యర్థి భయపడటం సాధారణమే కదా! అయితే, గొప్ప జట్టుతో పోటీపడటం తమకే లాభిస్తుందంటున్నాడు జింబాబ్వే కెప్టెన్ క్రెయిగ్ ఎర్విన్. పాకిస్తాన్తో ఉత్కంఠ మ్యాచ్లో ఒక్క పరుగు తేడాతో గెలుపొంది సంచలనం సృష్టించిన జింబాబ్వే.. నెదర్లాండ్స్ చేతిలో 5 వికెట్ల తేడాతో ఓడిపోయి చతికిలపడింది. అయితే, టీమిండియాతో మ్యాచ్లో మాత్రం కచ్చితంగా బ్యాటర్లను కట్టడి చేసేందుకు తమ బౌలర్లు సంసిద్ధంగా ఉన్నారంటూ క్రెయిగ్ సవాల్ విసరడం విశేషం. గ్రూప్-2లో ఆఖరి మ్యాచ్లో భారత జట్టుతో ఆదివారం(నవంబరు 6) జింబాబ్వే తలపడనున్న నేపథ్యంలో జింబాబ్వే సారథి క్రెయిగ్ ఎర్విన్ శనివారం మీడియాతో ముచ్చటించాడు. ఈ సందర్భంగా అతడు మాట్లాడుతూ.. ‘‘టీమిండియా బ్యాటర్లను ఎదుర్కోవడానికి మా బౌలర్లు సిద్ధంగా ఉన్నారు. అంచనాలు తలకిందులు చేసే ఛాన్స్! ప్రపంచంలోనే గొప్ప బ్యాటర్లకు బౌలింగ్ చేయడం కంటే అదృష్టం, అవకాశం మరొకటి ఉండదు. కాబట్టి మా వాళ్లు తప్పకుండా వందకు వంద శాతం అత్యుత్తమ ప్రదర్శన కనబరిచేందుకు సన్నద్ధమయ్యారు. విరాట్ కోహ్లి వికెట్ తీసే అవకాశం ఎంత మందికి వస్తుంది? అలాంటి అరుదైన, అంచనాలు తలకిందులు చేసే ఛాన్స్ను ఎవరు మాత్రం వదులుకుంటారు! రేపటి మ్యాచ్లో మా ఫాస్ట్ బౌలర్లు కచ్చితంగా తమ సత్తా చాటుకుంటారు’’ అని తాము ఆత్మవిశ్వాసంతో ఉన్నట్లు వెల్లడించాడు. అలాంటివి వర్కౌట్ కావేమో! ఇక కోహ్లి అత్యుత్తమ ఆటగాడు అంటూ కొనియాడిన 37 ఏళ్ల ఎర్విన్.. అతడి కోసం ప్రత్యేకంగా ప్రణాళికలేమీ రచించలేదన్నాడు. పరిస్థితులకు తగ్గట్లుగా సమయస్ఫూర్తితో బ్యాటింగ్ చేసే మేటి బ్యాటర్ల విషయంలో స్పెషల్ ప్లాన్స్ పెద్దగా వర్కౌట్ కావు గానీ తమ బౌలర్లు మాత్రం పట్టుదలగా పోరాడటం ఖాయమని చెప్పుకొచ్చాడు. కాగా మెల్బోర్న్లో టీమిండియా- జింబాబ్వే మ్యాచ్ ముగిసిన తర్వాత గ్రూప్-2 నుంచి ఏ రెండు జట్లు సెమీస్కు చేరతాయన్న అంశం తేలనుంది. చదవండి: Virat Kohli- Anushka Sharma Love Story: అప్పుడప్పుడు నటించేవాడు కూడా.. ‘బ్యాడ్ జోక్’తో మాట కలిపి! ఇప్పుడేమో ఇలా T20 WC 2022: వర్షంతో మ్యాచ్ రద్దయినా టీమిండియాకే మేలు -
వర్షంతో మ్యాచ్ రద్దయినా టీమిండియాకే మేలు
టి20 ప్రపంచకప్లో ఆదివారం గ్రూప్-2లో అన్ని జట్లు తమ చివరి మ్యాచ్లు ఆడనున్నాయి. ముందుగా సౌతాఫ్రికా, నెదర్లాండ్స్ మ్యాచ్ జరగనుంది. ఆ తర్వాత పాకిస్తాన్, బంగ్లాదేశ్లు పోటీ పడనున్నాయి. ఇక టోర్నీలో చివరి లీగ్ మ్యాచ్ టీమిండియా, జింబాబ్వే మధ్య జరుగుతుంది. ఇక్కడ ఆసక్తికర విషయమేంటంటే.. టీమిండియా మ్యాచ్ ఆడే సమయానికి ఎవరు సెమీస్ చేరుతున్నారనే దానిపై ఒక క్లారిటీ వస్తుంది. ఎందుకంటే సెమీస్ రేసులో ఉన్న సౌతాఫ్రికా, పాకిస్తాన్లు తమ మ్యాచ్లు పూర్తి చేసుకుంటాయి. సౌతాఫ్రికా నెదర్లాండ్స్పై గెలిస్తే నేరుగా సెమీస్కు చేరుకుంటుంది.. పాకిస్తాన్ బంగ్లాదేశ్పై గెలిస్తే టీమిండియా ఫలితం వరకు ఆగాల్సిందే. అటు సౌతాఫ్రికా కూడా గ్రూప్ టాపర్గా వెళుతుందా లేక రెండో స్థానమా అనేది కూడా టీమిండియా, జింబాబ్వే మ్యాచ్ తర్వాతే స్పష్టత రానుంది. దీన్నిబట్టి టీమిండియా, జింబాబ్వే మ్యాచ్ పూర్తయ్యే వరకు సెమీస్ రేసులో ఎవరుంటారనేది ఫ్రశ్నార్థకమే. మరి ఒకవేళ టీమిండియా, జింబాబ్వే మ్యాచ్కు వరుణుడు అడ్డుపడి రద్దు అయితే అప్పుడు ఏం జరుగుతుందని సగటు అభిమాని ప్రశ్నలు వేస్తున్నారు. వర్షం పడి మ్యాచ్ రద్దయితే ఒక రకంగా టీమిండియాకే మేలు జరుగుతుంది. ప్రస్తుతం టీమిండియా నాలుగు మ్యాచ్ల్లో మూడు విజయాలు, ఒక ఓటమితో ఆరు పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. ఒకవేళ మ్యాచ్లో టీమిండియా విజయం సాధిస్తే 8 పాయింట్లతో ఎవరితో సంబంధం లేకుండా గ్రూప్-2 టాపర్గా నేరుగా సెమీస్లో అడుగుపెడుతుంది. అలా కాకుండా వర్షం కారణంగా జింబాబ్వేతో మ్యాచ్ ఒక్క బంతి పడకుండా రద్దైతే టీమిండియా ఖాతాలో ఒక పాయింట్ వచ్చి చేరుతుంది. అప్పుడు కూడా టీమిండియా ఏడు పాయింట్లతో సెమీస్కు చేరుకుంటుంది. ఒకవేళ పాకిస్తాన్ బంగ్లాదేశ్పై నెగ్గినప్పటికి ఆరు పాయింట్లే ఉంటాయి కాబట్టి ఆ జట్టు నిష్క్రమించక తప్పదు. ఒకవేళ సౌతాఫ్రికాకు నెదర్లాండ్స్ షాకిస్తే అప్పుడు ప్రొటిస్ జట్టు ఐదు పాయింట్లు.. అదే సమయంలో పాక్ బంగ్లాదేశ్పై గెలిస్తే ఆరు పాయింట్లతో సెమీస్ చేరుతుంది. అయితే బంగ్లాదేశ్ గెలిస్తే మాత్రం.. టీమిండియా, బంగ్లా సెమీస్కు.. పాక్, సౌతాఫ్రికాలు ఇంటిబాట పట్టనున్నాయి. ఒకవేళ జింబాబ్వే చేతిలో టీమిండియా ఓడిపోతే మాత్రం దక్షిణాఫ్రికాతో పాటు పాకిస్తాన్, బంగ్లాదేశ్ మధ్య మ్యాచ్ విజేత సెమీస్లో అడుగుపెడుతుంది. కాగా లీగ్ దశలో వర్షం కారణంగా మ్యాచ్ రద్దు అయితే రిజర్వ్ డే ఆప్షన్ లేదు. కేవలం సెమీఫైనల్స్, ఫైనల్కు మాత్రమే రిజర్వ్ డే ఉందన్న విషయం గుర్తుంచుకోవాలి. అలా వర్షంతో మ్యాచ్ రద్దయినా కూడా టీమిండియాకు మేలు జరగనుందనే చెప్పొచ్చు. చదవండి: డిఫెండింగ్ చాంపియన్కు కష్టమే.. ఇంగ్లండ్ ఓడితేనే పాక్కు మరోసారి టీమిండియానే దిక్కు var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4911494512.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
WC 2022: పాపం ప్రొటిస్.. నెదర్లాండ్స్ చేతిలో గనుక ఓడితే!
ICC Mens T20 World Cup 2022- Semi Final Scenario: టీ20 ప్రపంచకప్-2022లో సూపర్–12 ఆఖరి మజిలీ రసవత్తరం అవుతోంది. గ్రూప్–2లో దక్షిణాఫ్రికా ఓటమి పాకిస్తాన్కే కాదు... బంగ్లాదేశ్కూ ఊపిరిలూదింది. దీంతో గ్రూప్–1లాగే ‘2’లో కూడా ప్రధాన జట్లన్నీ సెమీఫైనల్ రేసులో ఉన్నాయి. మొత్తం మీద నాలుగు సెమీస్ బెర్తుల కోసం తొమ్మిది జట్లు పోటీలో ఉండటం విశేషం. ఆదివారం అసలు మ్యాచ్లు! గ్రూప్–1లో న్యూజిలాండ్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, శ్రీలంక, ఐర్లాండ్... గ్రూప్–2లో భారత్, దక్షిణాఫ్రికా, పాకిస్తాన్, బంగ్లాదేశ్ జట్లు సై అంటే సై అంటున్నాయి. గ్రూప్–2 నుంచి సెమీఫైనల్ చేరే రెండు జట్లేవో ఆదివారం ఒకే రోజున జరిగే మూడు మ్యాచ్లు ముగిసిన తర్వాతే (దక్షిణాఫ్రికా–నెదర్లాండ్స్; పాకిస్తాన్–బంగ్లాదేశ్; భారత్–జింబాబ్వే) తేలనుంది. ఒకవేళ సౌతాఫ్రికా గనుక ఓడితే నెదర్లాండ్స్తో మ్యాచ్లో దక్షిణాఫ్రికా గెలిస్తే ఎలాంటి సమీకరణాలతో సంబంధం లేకుండా సెమీఫైనల్ బెర్త్ను ఖాయం చేసుకుంటుంది. ఒకవేళ నెదర్లాండ్స్ చేతిలో దక్షిణాఫ్రికా ఓడిపోతే మాత్రం ఆ జట్టు నిష్క్రమిస్తుంది. కాగా ఈ ఐసీసీ టోర్నీలో సఫారీలను దురదృష్టం వెంటాడుతున్న విషయం తెలిసిందే. తొలుత జింబాబ్వేతో మ్యాచ్లో గెలిచే అవకాశం ఉన్నా మ్యాచ్ వర్షార్పణమైంది. ఆ తర్వాత బంగ్లాదేశ్, టీమిండియాలపై విజయం సాధించినా.. పాక్తో మ్యాచ్లో పరాభవం తప్పలేదు. కాగా మెగా టోర్నీల్లో ఆఖరి వరకు పోరాడి అసలు సమయం వచ్చే సరికి చేతులెత్తే జట్టు(చోకర్స్)గా ప్రొటిస్కు అపవాదు ఉంది. ఇక బ్యాటర్గా కెప్టెన్ తెంబా బవుమా వైఫల్యం, కీలక ఆటగాడు కిల్లర్ మిల్లర్ గాయం బారిన పడటం సఫారీలను కలవరపెడుతున్నాయి. మరి డచ్ జట్టుతో మ్యాచ్లో ఏం జరుగుతుందో చూడాలి! పాక్ గెలుపొందినా మరోవైపు.. పాకిస్తాన్ తదుపరి మ్యాచ్లో బంగ్లాదేశ్తో తలపడనుంది. పటిష్టమైన టీమిండియాతో పోరును ఆఖరి బంతి వరకు తీసుకువచ్చిన బంగ్లాదేశ్పై పాక్కు గెలుపు అంతతేలికేమీ కాదు. ఒకవేళ ఆ జట్టుపై పాకిస్తాన్ నెగ్గినా.. బాబర్ ఆజం బృందం సెమీఫైనల్ బెర్త్ మాత్రం భారత్–జింబాబ్వే మ్యాచ్ ముగిశాకే ఖరారవుతుంది. చేజేతులా పాక్.. ఒక్క విజయంతో.. భారత్తో గొప్పగా పోరాడి ఓడిన జట్టు పాకిస్తాన్. జింబాబ్వే చేతిలో చెత్తగా ఓడిన జట్టు పాకిస్తాన్. ముందుకెళ్లే అవకాశాల్ని అత్యంత క్లిష్టం చేసుకున్న జట్టు పాకిస్తానే! ఇంతటి ఒత్తిడిలో కూరుకుపోయిన ఆ జట్టు పటిష్టమైన దక్షిణాఫ్రికాపై ఏం గెలుస్తుందనే విమర్శలు ఇంటాబయట ఉక్కిరిబిక్కిరి చేశాయి. కానీ ‘ఆల్రౌండ్ షో’తో సఫారీని కంగుతినిపించిన పాక్... ఒక్క విజయంతో రేసులోకి దూసుకొచ్చింది. గ్రూప్–2 సెమీస్ ముఖచిత్రాన్నీ మార్చింది. టి20 ప్రపంచకప్లో గురువారం జరిగిన గ్రూప్–2 ‘సూపర్–12’ మ్యాచ్లో పాక్ డక్వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం 33 పరుగులతో దక్షిణాఫ్రికాను ఓడించిన విషయం తెలిసిందే. మొదట పాక్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 185 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ షాదాబ్ ఖాన్ (22 బంతుల్లో 52; 3 ఫోర్లు, 4 సిక్స్లు), ఇఫ్తికార్ (35 బంతుల్లో 51; 3 ఫోర్లు, 2 సిక్స్లు) చెలరేగారు. నోర్జే 4 వికెట్లు తీశాడు. తర్వాత వర్షం వల్ల దక్షిణాఫ్రికా లక్ష్యాన్ని 14 ఓవర్లలో 142 పరుగులుగా సవరించారు. కానీ దక్షిణాఫ్రికా 9 వికెట్ల నష్టానికి 108 పరుగులే చేసి ఓడింది. కెప్టెన్, ఓపెనర్ బవుమా (19 బంతుల్లో 36; 4 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్. షాహిన్ అఫ్రిది (3/14) పేస్తో, షాదాబ్ ఖాన్ (2/16) స్పిన్తో జట్టును గెలిపించి రేసులో నిలబెట్టారు. ఆరంభంలో తడబడి... పాక్ బ్యాటింగ్కు దిగిన తొలి ఓవర్లోనే రిజ్వాన్ (4) అవుటయ్యాడు. పవర్ ప్లేలో కెప్టెన్ బాబర్ ఆజమ్ (6)తో పాటు జోరుమీదున్న హారిస్ (11 బంతుల్లో 28; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) వికెట్లను కోల్పోయింది. మరో 3 బంతుల వ్యవధిలో షాన్ మసూద్ (2) ఆట ముగిసింది. 43/4... ఇదీ పాక్ స్కోరు. ఇలాంటి దశలో 150 స్కోరే గగనం. కానీ ఇఫ్తికార్ అహ్మద్, నవాజ్ (22 బంతుల్లో 28; 4 ఫోర్లు, 1 సిక్స్) పట్టుదల పాక్ దిశను మార్చితే... షాదాబ్ సిక్సర్ల ఉప్పెన దక్షిణాఫ్రికా పాలిట భారీలక్ష్యాన్ని నిర్దేశించేలా చేసింది. ఇఫ్తికార్, షాదాబ్ ఆరో వికెట్కు 5.5 ఓవర్లలోనే 82 పరుగులు జోడించం విశేషం. ఆఖరి 8 బంతుల్లో పాక్ 4 వికెట్లను కోల్పోయింది. లేదంటే 200 స్కోరు నమోదయ్యేది. సఫారీకి ఆది నుంచే... పెద్ద లక్ష్యం ఎదురైన సఫారీ జట్టు 16 పరుగులకే కీలకమైన డికాక్ (0), రోసో (7) వికెట్లను కోల్పోయింది. బవుమా, మార్క్రమ్ (14 బంతుల్లో 20; 4 ఫోర్లు) ధాటిగా ఆడటంతో కోలుకున్నట్లే కనిపించిన సఫారీని స్పిన్తో షాదాబ్ చావుదెబ్బ తీశాడు. ఒకే ఓవర్లో ఇద్దరిని అవుట్ చేయడంతో 66 పరుగుల వద్ద 4 వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది. తర్వాత వర్షం పడటంతో లక్ష్యాన్ని మార్చగా, బ్యాటింగ్ కొనసాగించిన సఫారీ పాకిస్తాన్ బౌలర్ల పట్టుదలకు తలవంచింది. నసీమ్ షా (1/19), హారిస్ రవూఫ్ (1/44), మొహమ్మద్ వసీమ్ (1/13) తలా ఒక దెబ్బ కొట్టడంతో చిత్రంగా 9 పరుగుల వ్యవధిలో 5 వికెట్లను కోల్పోయింది. 94/4 నుంచి 103/9 స్కోరుకు పడిపోయి ఓటమిని ఆహ్వానించింది. చదవండి: SMAT 2022: శ్రేయస్ అయ్యర్ మెరుపు ఇన్నింగ్స్! ఫైనల్లో ముంబై T20 WC 2022: జింబాబ్వే చేతిలో ఓడిపోవద్దు.. కష్టాలు కొనితెచ్చుకోవద్దు -
టీమిండియాను జింబాబ్వే ఓడిస్తే అతన్ని పెళ్లి చేసుకుంటా: పాకిస్తాన్ నటి
ICC Mens T20 World Cup 2022 - India vs Zimbabwe: పాకిస్తాన్ నటి సెహర్ షిన్వారీ భారత్- జింబాబ్వే మ్యాచ్ నేపథ్యంలో సంచలన వ్యాఖ్యలు చేసింది. టీ20 వరల్డ్ కప్ 2022లో భాగంగా నవంబర్ 6న ఇరు జట్లు తలపడనున్నాయి. అయితే ఈ మ్యాచ్లో టీమిండియాను చిత్తుగా జింబాబ్వే ఓడిస్తే ఆ దేశపు వ్యక్తిని పెళ్లాడతానని వ్యాఖ్యానించింది. ఈ మేరకు ఆమె ట్వీట్ చేసింది. ‘తదుపరి మ్యాచ్లో జింబాబ్వే అద్భుతంగా భారత్ను ఓడించినట్లయితే.. నేను ఆ దేశానికి చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకుంటాను’ అని తెలిపింది. ఇదిలా ఉండగా ఈ పాకిస్తాన్ నటి గతంలో కూడా టీమిండియాపై అక్కసు వెళ్లగక్కుతూ వివాదాస్పద ట్వీట్లతో వార్తల్లో నిలిచింది. బంగ్లాదేశ్- భారత్ మ్యాచ్ సందర్భంగా కూడా రోహిత్ సేన ఓడిపోవాలని పదే పదే కోరుకుంటూ ట్వీట్ చేసింది. అంతకుముందు.. స్వదేశంలో టీ20 సిరీస్లో భాగంగా ఆస్ట్రేలియా చేతిలో టీమిండియా నాలుగు వికెట్ల తేడాతో ఓడిపోయినపుడు కూడా భారత జట్టుపై విమర్శలు గుప్పించింది. I'll marry a Zimbabwean guy, if their team miraculously beats India in next match 🙂 — Sehar Shinwari (@SeharShinwari) November 3, 2022 కాగా పాకిస్తాన్ నటి చేసిన ఈ ట్వీట్లు నెట్టింట్లో విమర్శలకు దారి తీసింది. క్రికెట్ లవర్స్, భారత్ అభిమానులు ఓ రేంజ్లో విరుచుకుపడుతున్నారు. భారత్- బంగ్లాదేశ్ మ్యాచ్ సమయంలో ఆమె అంచనాలు తలకిందులయ్యాయి. ఇప్పుడు కూడా అదే తప్పు చేస్తున్నారు. పాపం మీ జీవితమంతా పెళ్లి లేకుండా ఒంటరిగా ఎలా జీవిస్తారో తలుచుకుంటేనే బాధగా ఉంది’ అంటూ పలువురు ట్రోల్ చేస్తున్నారు. మరికొంతమంది జింబాబ్వేను భారత్ ఓడిస్తే మీరు మీ ట్విటర్ను డిలీట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. జింబాబ్వే ఒక్క పరుగుతో ఓడించడానికి మాది పాకిస్తాన్ జట్టు కాదంటూ సెటైర్లు వేస్తున్నారు. చదవండి: Ind Vs Ban: కోహ్లి ఫేక్ ఫీల్డింగ్.. అంపైర్లు సహకరించారు.. వరుణుడు కాపాడాడు..! -
'ఆ జట్టుతో భారత్ జాగ్రత్తగా ఉండాలి.. లేదంటే అంతే సంగతి'
టీ20 ప్రపంచకప్-2022లో అదరగొడుతున్న జింబాబ్వే పై భారత మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ ప్రశంసల వర్షం కురిపించాడు. జింబాబ్వే అద్భుతమైన ఫామ్లో ఉందని, ఆ జట్టులో మ్యాచ్ విన్నింగ్ ఆటగాళ్లు ఉన్నారు అని గవాస్కర్ కొనియాడు. అదే విధంగా భారత్ కూడా జింబాబ్వేతో జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. కాగా ఆక్టోబర్ 27న పెర్త్ వేదికగా జరిగిన మ్యాచ్లో పాకిస్తాన్పై జింబాబ్వే సంచలన విజయం తెలిసిందే. ఈ క్రమంలో గవాస్కర్ ఇండియా టుడేతో మాట్లాడుతూ.. "ఈ మెగా టోర్నీ నుంచి పాకిస్తాన్ దాదాపు నిష్క్రమించినట్లే. వారు తమ మిగిలిన మూడు మ్యాచ్ల్లో భారీ విజయం సాధించాలి. ముఖ్యంగా పాక్ జట్టు దక్షిణాఫ్రికాపై గెలవడం అంత సులభం కాదు. దక్షిణాఫ్రికా భీకర ఫామ్లో ఉంది. అదే విధంగా భారత్ కూడా దక్షిణాఫ్రికా వంటి అగ్రశ్రేణి జట్టుతో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక పాకిస్తాన్ను కంగుతినిపించిన జింబాబ్వేను కూడా భారత్ తేలికగా తీసుకోకూడదు. జింబాబ్వే జట్టులో మ్యాచ్ విన్నింగ్ ఆటగాళ్లు ఉన్నారు. పాకిస్థాన్పై గెలిచి జింబాబ్వే అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది" అని పేర్కొన్నాడు, టీ20ల్లో ఏమైనా జరగొచ్చు "పాకిస్తాన్ అద్భుతమైన జట్టు ఆనడంలోఎటువంటి సందేహం లేదు. కానీ టీ20ల్లో ఏమైనా జరగొచ్చు. పాక్ జట్టులో నాణ్యమైన బ్యాటర్లు, బౌలర్లు ఉన్నారు. కానీ ఈ మెగా ఈవెంట్లో వారు తమ స్థాయికి తగ్గట్టు రాణించలేక పోతున్నారు" అని గవాస్కర్ తెలిపాడు. కాగా టీమిండియా తమ తదుపరి మ్యాచ్లో ఆక్టోబర్30న దక్షిణాఫ్రికాతో తలపడుతోంది. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1971406958.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); చదవండి: T20 WC 2022: శ్రీలంకతో మ్యాచ్.. కివీస్కు గుడ్ న్యూస్! అతడు వచ్చేస్తున్నాడు -
Asia Cup 2022: అంటే మీరు కేఎల్ రాహుల్ని తప్పించాలని చెప్తున్నారా?
Asia Cup 2022 India Vs Hong Kong- Suryakumar Yadav- KL Rahul: టీమిండియా వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్కు.. స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ అండగా నిలిచాడు. రాహుల్ ఇప్పుడిప్పుడే గాయం నుంచి కోలుకున్నాడని.. తన స్థాయికి తగ్గ ప్రదర్శన ఇవ్వడానికి కాస్త సమయం పడుతుందన్నాడు. అప్పటి వరకు కాస్త ఓపికగా వేచిచూడాలంటూ హితవు పలికాడు. కాగా దక్షిణాఫ్రికాతో స్వదేశంలో టీ20 సిరీస్కు ముందుకు గాయపడ్డ కేఎల్ రాహుల్.. సుదీర్ఘ విరామం తర్వాత జింబాబ్వేతో టూర్కు ఎంపికైన విషయం తెలిసిందే. బ్యాటర్గా విఫలం.. ఇందులో భాగంగా మూడు మ్యాచ్ల వన్డే సిరీస్కు రాహుల్ కెప్టెన్గా వ్యవహరించాడు. సారథిగా జట్టును ముందుకు నడిపి క్లీన్స్వీప్ చేసినా బ్యాటర్గా మాత్రం పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. ఈ సిరీస్లో మొదటి వన్డేలో రాహుల్కు బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. ఇక రెండు, మూడో మ్యాచ్లలో అతడు నమోదు చేసిన స్కోర్లు వరుసగా 1(5 బంతులు), 30(46 బంతుల్లో). ఇక జింబాబ్వే పర్యటన తర్వాత ఆసియా కప్-2022 టీ20 ఆడేందుకు నేరుగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కు చేరుకున్న ఈ టీమిండియా వైస్ కెప్టెన్.. పాకిస్తాన్తో ఆరంభం మ్యాచ్లో ఘోరంగా విఫలమయ్యాడు. పాక్ అరంగేట్ర బౌలర్ 19 ఏళ్ల నసీమ్ షా బౌలింగ్లో గోల్డెన్ డక్గా వెనుదిరిగాడు. జట్టుకు భారం అంటూ..! అదే విధంగా హాంగ్ కాంగ్తో రెండో మ్యాచ్లో రాహుల్ ఓపెనర్గా బరిలోకి దిగి 36 పరుగులు చేశాడు. కానీ.. అందుకోసం 39 బంతులు తీసుకున్నాడు. దీంతో రాహుల్ ఆట తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. టీ20 మ్యాచ్లో టెస్టు ఇన్నింగ్స్ ఆడే రాహుల్ జట్టుకు భారం అంటూ నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. రాహుల్ను తప్పించాలంటున్నారా? ఈ నేపథ్యంలో హాంగ్ కాంగ్తో విజయం నేపథ్యంలో.. మీడియాతో ముచ్చటించిన ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ సూర్యకుమార్ యాదవ్కు ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. మీరు ఓపెనర్గా వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారా అంటూ విలేకరులు ప్రశ్నించారు. ఇందుకు..‘‘అంటే మీరు కేఎల్ భాయ్ను జట్టు నుంచి తప్పించాలని చెబుతున్నారా’’ అంటూ తనదైన శైలిలో సూర్య కౌంటర్ ఇచ్చాడు. కాస్త సమయం పడుతుంది! అదే విధంగా.. గాయం నుంచి కోలుకున్న రాహుల్కు కాస్త సమయం ఇస్తే.. తనదైన ఆట తీరుతో చెలరేగగలడని విశ్వాసం వ్యక్తం చేశాడు. అయితే, జట్టు ప్రయోజనాల దృష్ట్యా తాను ఏ స్థానంలో బ్యాటింగ్కు రావడానికి సిద్ధంగానే ఉన్నానని సూర్య మరోసారి స్పష్టం చేశాడు. ఈ విషయం గురించి ఇప్పటికే కోచ్, కెప్టెన్కు చెప్పానని.. బ్యాటింగ్ ఆర్డర్లో తన స్థానం ఏదైనా తనకు సౌకర్యంగానే ఉంటుందని చెప్పుకొచ్చాడు. కాగా ఇటీవల వెస్టిండీస్తో టీ20 సిరీస్లో సూర్యకుమార్ యాదవ్ ఓపెనర్గా వచ్చిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్లో సూర్యకుమార్ యాదవ్ 26 బంతుల్లో 68 పరుగులతో అజేయంగా నిలిచాడు. #SuryakumarYadav on #KLRahul #INDvsHK pic.twitter.com/QHdziB8oHg — DD Sports (@Mahesh13657481) September 1, 2022 చదవండి: Ind Vs HK: 'నీ బౌలింగ్కు ఓ దండంరా అయ్యా.. నీకన్నా కోహ్లి బెటర్' Asia Cup 2022: నాడు కోహ్లి వర్సెస్ సూర్య! ఇప్పుడు సూర్యకు విరాట్ ఫిదా! తలవంచి మరీ! వైరల్ View this post on Instagram A post shared by Star Sports India (@starsportsindia) -
ICC Rankings: అదరగొట్టిన శుబ్మన్ గిల్.. ఏకంగా 93 స్థానాలు ఎగబాకి..!
ఐసీసీ వన్డే బ్యాటర్ల ర్యాంకింగ్స్లో టీమిండియా యువ ఆటగాడు శుబ్మన్ గిల్ అదరగొట్టాడు. తాజాగా ప్రకటించిన ర్యాంకింగ్స్లో గిల్ ఏకంగా 93 స్థానాలు ఎగబాకి 38వ స్థానానికి చేరుకున్నాడు. ఇటీవల జింబాబ్వేతో జరిగిన వన్డే సిరీస్లో గిల్ అద్భుతమైన ప్రదర్శన చేశాడు. ఈ సిరీస్లో మూడు మ్యాచ్లు ఆడిన గిల్ 245 పరగులు సాధించాడు. హరారే వేదికగా జింబాబ్వేతో జరిగిన మూడో వన్డేలో గిల్(130) అద్భుతమైన సెంచరీ సాధించాడు. అదే విధంగా గత కొన్ని సిరీస్ల నుంచి భీకర ఫామ్లో ఉన్న జింబాబ్వే స్టార్ ఆల్రౌండర్ సికిందర్ రజా నాలుగు స్థానాలు ఎగబాకి 25వ స్థానానికి చేరుకున్నాడు. భారత్తో జరిగిన మూడో వన్డేలో రజా సెంచరీతో చేలరేగాడు. కాగా అతడు ఆడిన గత ఆరు ఇన్నింగ్స్లో మూడు సెంచరీలు ఉండడం గమనార్హం. మరోవైపు నెదార్లాండ్స్తో జరిగిన వన్డే సిరీస్లో విఫలమైన పాకిస్తాన్ ఓపెనర్ ఇమామ్ ఉల్ హక్ రెండో స్థానం నుంచి నాలుగో స్థానానికి దిగజారాడు. ఇక ఓవరాల్గా వన్డే ర్యాంకిగ్స్లో 890 పాయింట్లతో బాబర్ ఆగ్రస్థానంలో కొనసాగుతండగా.. రెండు మూడు స్థానాల్లో వరుసగా ప్రోటీస్ ఆటగాళ్లు రాస్సీ వాన్ డెర్ డస్సెన్ (789), క్వింటన్ డి కాక్ (784) నిలిచారు. చదవండి: Asia Cup 2022: జింబాబ్వే సిరీస్లో అదరగొట్టాడు.. ప్రమోషన్ కొట్టేశాడు! -
టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్కు కరోనా
-
ఏంటి చాహర్ ఇది..? అశ్విన్ను చూసి నేర్చుకున్నావా! వీడియో వైరల్
హరారే వేదికగా జింబాబ్వేతో జరిగిన మూడో వన్డేలో భారత్ 13 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్ ప్రారంభంకు ముందు ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా.. అతిథ్య జట్టుకు 290 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. అనంతరం 290 పరుగుల లక్ష్యాన్ని చేధించేందుకు జింబాబ్వే ఓపెనర్లు ఇన్నోసెంట్ కైయా, కైటినో బరిలోకి దిగారు. అయితే భారత పేసర్ దీపక్ చాహర్ తొలి ఓవర్ వేసే క్రమంలో నాన్ స్ట్రైక్లో ఉన్న కైయాను మన్కడింగ్(రనౌట్) చేసే ప్రయత్నం చేశాడు. కాగా చాహర్ బెయిల్స్ పడగొట్టే సమయానికి.. కైయా క్రీజు నుంచి దూరంగా ఉన్నాడు. అయితే చాహర్ బెయిల్స్ పడగొట్టినప్పటికీ రనౌట్కు మాత్రం అప్పీల్ చేయలేదు. ఒక వేళ చాహర్ అప్పీల్ చేసి వుంటే మాత్రం కచ్చితంగా రనౌట్గానే అంపైర్ ప్రకటించే వాడు. కాగా ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ క్రమంలో నెటిజన్లు ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. చహర్ను టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్తో పోలుస్తున్నారు. ఇక ఇదే విషయంపై ఓ నెటిజన్ స్పందిస్తూ.. "ఏంటి చాహర్ ఇది.. అశ్విన్ను చూసి నేర్చుకున్నావా..?" అంటూ కామెంట్ చేశాడు. కాగా 2012లో శ్రీలంకపై, 2019 ఐపీఎల్ సీజన్లో జోస్ బట్లర్ను ఈ విధంగానే అశ్విన్ ఔట్ చేశాడు. అయితే బట్లర్ను మన్కడింగ్ చేసిన అశ్విన్ అప్పట్లో తీవ్ర విమర్శల పాలయ్యాడు. కాగా భారత క్రికెట్ దిగ్గజం వినూ మన్కడ్ పేరు మీద ఉన్న ‘మన్కడింగ్’ ఔట్ ను సాధారణ రనౌట్ గా చేస్తూ ఈ ఏడాది మార్చిలో మెరిల్బోర్న్ క్రికెట్ క్లబ్ (ఎంసీసీ) నిర్ణయం తీసుకుంది. Deepak Chahar didn't Appeal on Mankad 😂 pic.twitter.com/4ihfnljbMl — Keshav Bhardwaj 👀 (@keshxv1999) August 22, 2022 Shades of Ashwin in Deepak Chahar. Kaia was almost Mankad had he appealed. — Gagan Thakur (@gagan_gt) August 22, 2022 చదవండి: Ind Vs Pak- Virat Kohli: పాక్తో మ్యాచ్లో ఫిఫ్టీ కొడితే ఆ నోళ్లన్నీ మూతపడతాయి!
Pagination
T20 World Cup 2024: భారత్ చేతిలో ఓటమి.. వెక్కి వెక్కి ఏడ్చిన పాక్ ప్లేయర్
మళ్లీ 2014 నాటి అరాచక పాలన రిపీట్ అవుతుందా?
ఏపీ రాజధానిగా అమరావతి: చంద్రబాబు
సెన్సేషన్ సోఫియా.. తండ్రిపై అవినీతి కేసు, ఇంట్రెస్టింగ్ బ్యాక్గ్రౌండ్
ఏపీలో కుప్పకూలిన రాజ్యాంగ వ్యవస్థలు: వైఎస్ జగన్
యానిమల్ బ్యూటీ కొత్త బంగ్లా.. ధరెంతో తెలుసా?
భూకంపాన్ని తట్టుకునే ఇల్లు.. ఇది కదా అసలైన టెక్నాలజీ అంటే!
పాయే.. మళ్లీ చైనా పరువు పాయే!
మనుషుల మధ్య ఏలియన్స్
విధ్వంసమే విధానమా..?
Gunshot: ఇదికదా YS జగన్ స్టామినా.. పర్ఫెక్ట్ విశ్లేషణ
నా భర్తతో హోటల్ రూమ్లో ఆ హీరోయిన్.. అందుకే విడాకులు: శ్రీదేవి
48 గంటల్లో మూడో ప్రపంచ యుద్ధం?
యశ్ ‘ టాక్సిక్ ’లో ముగ్గురు భామలు.. కరీనా ప్లేస్లో నయనతార!
పంఘాల్ పంచ్..
ఇలాంటివి మనమెందుకు చేయడం లేదు!.. ఆనంద్ మహీంద్రా ట్వీట్
చంద్రబాబుపై కొట్టు సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు
ఆపరేషన్ చిరుత సక్సెస్
Advertisement