India vs Zimbabwe
-
కపిల్ డెవిల్ ఇన్నింగ్స్.. క్రికెట్ చరిత్రలో చిరస్మరణీయం
వన్డేల్లో సెంచరీ చేస్తేనే గొప్ప అనుకునే రోజులవి. అలాంటిది ఓ భారత బ్యాటర్ ఆరో స్థానంలో బ్యాటింగ్కు దిగి ఏకంగా 175 పరుగులు చేశాడు. ఈ స్కోర్ చేసింది ఏదో ఆషామాషి మ్యాచ్లో కాదు. ప్రపంచకప్లో. అది కూడా జట్టు పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన సమయంలో. తదుపరి దశకు చేరాలంటే ఆ మ్యాచ్లో తప్పనిసరిగా గెలవాల్సిన పరిస్థితి.వివరాల్లోకి వెళితే.. అది జూన్ 18, 1983. ప్రుడెన్షియిల్ వరల్డ్కప్లో భారత్, జింబాబ్వే మ్యాచ్ జరుగుతున్న రోజు. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. 17 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. ఈ దశలో బ్యాటింగ్కు దిగాడు నాటి భారత కెప్టెన్ కపిల్ దేవ్. టాపార్డర్ బ్యాటర్లంతా పెవిలియన్కు చేరినా కపిల్ ఏమాత్రం భయం లేకుండా ప్రత్యర్ధి బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. రోజర్ బిన్నీ సహకారంతో బౌండరీలు, సిక్సర్ల వర్షం కురిపించాడు. 22 పరుగులు చేసిన అనంతరం రోజర్ బిన్నీ ఔట్ కావడంతో భారత్ మరోసారి కష్టాల్లో పడింది. ఈలోపు రవిశాస్త్రి (1) కూడా ఔటయ్యాడు. ఓ పక్క ఇన్నింగ్స్ పేకమేడలా కూలుతున్నా కపిల్ ఏమాత్రం వెనక్కు తగ్గలేదు. చివరి వరుస బ్యాటర్లు మదన్ లాల్ (17), సయ్యద్ కిర్మాణి (24 నాటౌట్) సాయంతో సెంచరీ పూర్తి చేశాడు. సెంచరీ పూర్తి చేశాక కపిల్ మరింత రెచ్చిపోయాడు. వచ్చిన బంతిని వచ్చినట్లు ఎడాపెడా వాయించి డబుల్ సెంచరీ దిశగా దూసుకెళ్లాడు. నిర్ణీత ఓవర్ల సంఖ్య కాస్త ఎక్కువగా ఉంటే ఆ రోజు కపిల్ డబుల్ సెంచరీ చేసుండేవాడు. ఆ రోజుల్లో వన్డే మ్యాచ్ 60 ఓవర్ల పాటు సాగేది. నిర్ణీత 60 ఓవర్లు పూర్తయ్యే సరికి భారత్ 8 వికెట్ల నష్టానికి 266 పరుగులు చేసింది. కపిల్ 138 బంతుల్లో 16 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 175 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అప్పటికి వన్డేల్లో అదే అత్యుత్తమ వ్యక్తిగత స్కోర్గా రికార్డైంది. చాలా రోజుల పాటు ఈ రికార్డు కపిల్ పేరిటే కొనసాగింది.అనంతరం 267 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన జింబాబ్వే.. భారత బౌలర్లు మూకుమ్మడిగా రాణించడంతో 57 ఓవర్లలో 235 పరుగులకు ఆలౌటై 31 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. మదన్ లాల్ 3, రోజర్ బిన్నీ 2, కపిల్, మొహిందర్ అమర్నాథ్, బల్విందర్ సంధు తలో వికెట్ పడగొట్టారు. జింబాబ్వే ఇన్నింగ్స్లో కెవిన్ కర్రన్ (73) టాప్ స్కోరర్గా నిలిచాడు. ఈ మ్యాచ్ ఇచ్చిన కాన్ఫిడెన్స్తో వారం రోజుల తర్వాత భారత్ తమ తొలి వన్డే ప్రపంచకప్ సాధించింది. ఈ మ్యాచ్కు సంబంధించిన లైవ్ కవరేజ్ అప్పట్లో జరగలేదు కానీ, జరిగి ఉండింటే తరతరాలకు గుర్తుండిపోయేది. -
అరుదైన ఘనత సాధించిన వాషింగ్టన్ సుందర్.. తొలి భారత ప్లేయర్గా రికార్డు
టీమిండియా స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ తాజాగా ముగిసిన జింబాబ్వే టీ20 సిరీస్లో ప్లేయర్ ఆఫ్ ద సిరీస్గా ఎంపికైన విషయం తెలిసిందే. ఈ సిరీస్లో అతను 5 మ్యాచ్ల్లో 8 వికెట్లు తీసి లీడింగ్ వికెట్ టేకర్గా నిలిచాడు. అలాగే రెండు సార్లు బ్యాటింగ్కు దిగి 28 పరుగులు చేశాడు. మూడో టీ20లో సుందర్ పొదుపుగా బౌలింగ్ చేయడంతో పాటు మూడు వికెట్లు తీసి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా ఎంపికయ్యాడు.సిరీస్ ఆధ్యాంతం బంతితో అద్బుతమైన ప్రదర్శన చేసినందుకు సుందర్ను ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు వరించింది. ఈ అవార్డు లభించడం సుందర్కు ఇది రెండో సారి. కెరీర్లో రెండో ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు లభించిన అనంతరం సుందర్ ఓ అరుదైన ఘనత సాధించాడు. టీ20ల్లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డుల కంటే ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డులు ఎక్కువగా గెలుచుకున్న తొలి భారత క్రికెటర్గా రికార్డు నెలకొల్పాడు.సుందర్ టీ20ల్లో ఒక్క ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డును.. అదీ ఇదే జింబాబ్వే సిరీస్లో గెలుచుకున్నాడు. ఈ ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డుకు ముందు సుందర్ ఓసారి ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు గెలుచుకున్నాడు.అంతర్జాతీయ టీ20ల్లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డుల కంటే ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డులు ఎక్కువగా గెలుచుకున్న ఆటగాళ్ల జాబితాలో సుందర్ నాలుగో స్థానంలో నిలిచాడు. సుందర్కు ముందు ముగ్గురు ఆటగాళ్లు ఈ ఘనత సాధించారు.రీజా హెండ్రిక్స్ (సౌతాఫ్రికా)- 3 ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డులు, 1 ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డుటిమ్ సీఫర్ట్ (న్యూజిలాండ్)- 3 ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డులు, 2 ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డుఅలెక్స్ కుసక్ (ఐర్లాండ్)- 2 ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డులు, 1 ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డుఇదిలా ఉంటే, జింబాబ్వేతో జరిగిన ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ను టీమిండియా 4-1 తేడాతో కైవసం చేసుకుంది. -
ఇదేందయ్యా ఇది.. టాస్ ఇలా కూడా వేయవచ్చా? వీడియో
హరారే వేదికగా ఆదివారం జింబాబ్వేతో జరిగిన ఐదో టీ20లో 42 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించింది. దీంతో ఐదు మ్యాచ్ల సిరీస్ను 4-1 తేడాతో టీమిండియా సొంతం చేసుకుంది. తొలి మ్యాచ్లో ఓటమి తర్వాత భారత్ దెబ్బతిన్న సింహంలా గర్జించింది.వరుసగా నాలుగు మ్యాచ్ల్లో ఆతిథ్య జట్టును గిల్ సేన చిత్తు చేసింది. కాగా ఆఖరి టీ20 టాస్ సందర్భంగా ఓ ఫన్నీ సంఘటన చోటు చేసుకుంది. మ్యాచ్కే ముందుకే జింబాబ్వే కెప్టెన్ సికిందర్ రజా అందరి దృష్టిని ఆకర్షించాడు. గత నాలుగు గేమ్లలో టాస్ ఓడిన రజా ఈసారి తన ఆదృష్టాన్ని మార్చుకోనేందుకు కాస్త విన్నూత్నంగా ప్రయత్నించాడు. అతడు టాస్ కాయిన్ను గాల్లోకి జంప్ చేస్తూ స్పిన్ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో నవ్వలు పూయిస్తోంది. టాస్ ఇలా కూడా వేయవచ్చా అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.చదవండి: వారంతా ఒక అద్బుతం.. దెబ్బతిన్న పులిలా పంజా విసిరారు: గిల్ pic.twitter.com/snhOXumMx4— Bangladesh vs Sri Lanka (@Hanji_CricDekho) July 14, 2024 -
వారంతా ఒక అద్బుతం.. దెబ్బతిన్న పులిలా పంజా విసిరారు: గిల్
జింబాబ్వే పర్యటనను టీమిండియా ఘనంగా ముగించింది. హరారే వేదికగా జరిగిన ఆఖరి టీ20లో 42 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించింది. దీంతో 4-1 తేడాతో ఐదు మ్యాచ్ల సిరీస్ను టీమిండియా సొంతం చేసుకుంది.168 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వే భారత బౌలర్ల దాటికి 125 పరుగులకే కుప్పకూలింది. భారత బౌలర్లలో ముఖేష్ కుమార్ 4 వికెట్లతో ఆతిథ్య జట్టు పతనాన్ని శాసించాడు. అతడితో పాటు శివమ్ దూబే రెండు, అభిషేక్, సుందర్, దేశ్పాండే తలా వికెట్ సాధించారు. జింబాబ్వే బ్యాటర్లలో డియాన్ మైర్స్(34) పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. టీమిండియా ఇన్నింగ్స్లో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్(58) హాఫ్ సెంచరీతో చెలరేగాడు. జింబాబ్వే బౌలర్లలో ముజ్బారనీ రెండు, రజా, నగర్వా, మవుటా తలా వికెట్ పడగొట్టారు. ఇక ఈ విజయంపై భారత కెప్టెన్ శుబ్మన్ గిల్ స్పందించాడు."ఇదొక అద్భుతమైన సిరీస్. తొలి మ్యాచ్లో ఓటమి తర్వాత మా బాయ్స్ దెబ్బతిన్న పులిలా పంజా విసిరారు. ఈ సిరీస్లో మా జట్టు ప్రదర్శన పట్ల చాలా సంతోషంగా ఉన్నాను. ఎందుకంటే మా జట్టులో చాలా మంది ఆటగాళ్లకు విదేశీ పరిస్థితుల్లో ఆడిన అనుభవం లేదు.అయినప్పటకి వారు ఆడిన విధానం నిజంగా అద్భుతం. ఎంత చెప్పుకున్న తక్కువే. ఇక శ్రీలంక పర్యటన కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నాను. ఇంతకుముందు ఆసియాకప్ కోసం శ్రీలంకకు వెళ్లాను" అని పోస్ట్మ్యాచ్ ప్రేజేంటేషన్లో గిల్ పేర్కొన్నాడు.చదవండి: 4–1తో ముగించారు -
చరిత్ర సృష్టించిన శుభ్మన్ గిల్
జింబాబ్వేతో జరిగిన ఐదో టీ20లో టీమిండియా 42 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేయగా.. ఛేదనలో చేతులెత్తేసిన జింబాబ్వే 18.3 ఓవర్లలో 125 పరుగులకు ఆలౌటైంది. సంజూ శాంసన్ (45 బంతుల్లో 58; ఫోర్, 4 సిక్సర్ల, రెండు క్యాచ్లు), ముకేశ్ కుమార్ (3.3-0-22-4), శివమ్ దూబే (12 బంతుల్లో 26; 2 ఫోర్లు, 2 సిక్సర్లు, 4-0-25-2) అద్భుతంగా రాణించి టీమిండియాకు ఘన విజయాన్నందించారు. ఈ గెలుపుతో భారత్.. ఐదు మ్యాచ్ల సిరీస్ను 4-1 తేడాతో కైవసం చేసుకుంది. ఈ సిరీస్లో జింబాబ్వే తొలి మ్యాచ్లో గెలవగా.. భారత్ వరుసగా నాలుగు మ్యాచ్ల్లో జయభేరి మోగించింది.చరిత్ర సృష్టించిన శుభ్మన్ గిల్ఈ సిరీస్లో నాలుగు టీ20లు గెలవడంతో టీమిండియా కెప్టెన్ శుభ్మన్ గిల్ చరిత్ర సృష్టించాడు. విదేశీ గడ్డపై ఓ ద్వైపాక్షిక సిరీస్లో నాలుగు టీ20లు గెలిచిన తొలి భారత కెప్టెన్గా రికార్డు నెలకొల్పాడు. శుభ్మన్.. కెప్టెన్గా తన తొలి సిరీస్లో ఈ భారీ రికార్డు సాధించాడు. కెప్టెన్గా తొలి మ్యాచ్ కోల్పోయిన గిల్.. ఆతర్వాత వరుసగా నాలుగు మ్యాచ్ల్లో జట్టును విజయపథాన నడిపించాడు.భారత టీ20 జట్టుకు 14వ కెప్టెన్ అయిన గిల్.. రోహిత్ శర్మ (50), ధోని (42), విరాట్ కోహ్లి (32), హార్దిక్ పాండ్యా (10), సూర్యకుమార్ యాదవ్ (5) తర్వాత అత్యధిక విజయాలు సాధించిన భారత కెప్టెన్గా రికార్డుల్లోకెక్కాడు. -
రాణించిన శాంసన్, ముకేశ్.. ఐదో టీ20లోనూ టీమిండియాదే విజయం
హరారే వేదికగా జింబాబ్వేతో జరిగిన ఐదో టీ20లో టీమిండియా 42 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేయగా.. ఛేదనలో చేతులెత్తేసిన జింబాబ్వే 18.3 ఓవర్లలో 125 పరుగులకు ఆలౌటైంది. సంజూ శాంసన్ (45 బంతుల్లో 58; ఫోర్, 4 సిక్సర్ల, రెండు క్యాచ్లు), ముకేశ్ కుమార్ (3.3-0-22-4) అద్భుతంగా రాణించి టీమిండియాకు ఘన విజయాన్నందించారు. ఈ గెలుపుతో భారత్.. ఐదు మ్యాచ్ల సిరీస్ను 4-1 తేడాతో కైవసం చేసుకుంది. ఈ సిరీస్లో జింబాబ్వే తొలి మ్యాచ్లో గెలవగా.. భారత్ వరుసగా నాలుగు మ్యాచ్ల్లో జయభేరి మోగించింది.బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడిన శాంసన్టాస్ ఓడి జింబాబ్వే ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్కు దిగిన భారత్.. ఆదిలోనే (5 ఓవర్లలో 40/3) వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో సంజూ శాంసన్ బాధ్యతాయుతంగా బ్యాటింగ్ చేసి టీమిండియా గౌరవప్రదమైన స్కోర్ సాధించడానికి దోహదపడ్డాడు. ఆఖర్లో శివమ్ దూబే (12 బంతుల్లో 26; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపులు మెరిపించడంతో భారత్ 150 పరుగుల మార్కును దాటింది. భారత ఇన్నింగ్స్లో యశస్వి జైస్వాల్ 12, శుభ్మన్ గిల్ 13, అభిషేక్ శర్మ 14, రియాన్ పరాగ్ 22 పరుగులు చేసి ఔట్ కాగా.. రింకూ సింగ్ (11), వాషింగ్టన్ సుందర్ (1) అజేయంగా నిలిచారు. జింబాబ్వే బౌలర్లలో ముజరబాని 2, సికందర్ రజా, రిచర్డ్ నగరవ, బ్రాండన్ మవుటా తలో వికెట్ పడగొట్టారు.విజృంభించిన ముకేశ్168 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన జింబాబ్వే.. ఏ దశలోనూ గెలుపు దిశగా సాగలేకపోయింది. తొలి ఓవర్లోనే వికెట్ కోల్పోయిన ఆ జట్టు క్రమ అంతరాల్లో వికెట్లు కోల్పోయి ఓటమిపాలైంది. జింబాబ్వే ఇన్నింగ్స్లో డియాన్ మైర్స్ (34) టాప్ స్కోరర్ కాగా.. మరుమణి (27), బ్రియాన్ బెన్నెట్ (10), , ఫరక్ అక్రమ్ (27) మాత్రమే రెండంకెల స్కోర్ చేయగలిగారు. భారత బౌలర్లలో ముకేశ్తో పాటు శివమ్ దూబే (4-0-25-2), తుషార్ దేశ్పాండే (3-0-26-1), వాషింగ్టన్ సుందర్ (2-0-7-1), అభిషేక్ శర్మ (3-0-20-1) వికెట్లు పడగొట్టారు. -
110 మీటర్ల భారీ సిక్సర్ బాదిన సంజూ శాంసన్
జింబాబ్వేతో జరుగుతున్న ఐదో టీ20లో టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్ సంజూ శాంసన్ 110 మీటర్ల భారీ సిక్సర్ బాదాడు. బ్రాండన్ మవుటా బౌలింగ్లో సంజూ కొట్టిన సిక్సర్ స్టేడియం బయట పడింది. ఈ భారీ సిక్సర్కు సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుంది. Sanju Samson Smashed 110M SIX 🤯 #ZIMvIND #CricketTwitter pic.twitter.com/fQLHkjZvaX— Mano (@manoj_tweezz) July 14, 2024ఈ మ్యాచ్లో సంజూ ఈ సిక్సర్తో పాటు మరో మూడు సిక్సర్లు బాదాడు. మొత్తంగా 45 బంతులు ఎదుర్కొన్న సంజూ.. నాలుగు సిక్సర్లు, బౌండరీ సాయంతో 58 పరుగులు చేసి ఔటయ్యాడు.ఈ మ్యాచ్లో సంజూ మినహా భారత బ్యాటర్లెవ్వరూ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేదు. శివమ్ దూబే 26, రియాన్ పరాగ్ 22, అభిషేక్ శర్మ 14, శుభ్మన్ గిల్ 13, యశస్వి జైస్వాల్ 12 పరుగులకు ఔట్ కాగా.. రింకూ సింగ్ 11, వాషింగ్టన్ సుందర్ 1 పరుగుతో అజేయంగా నిలిచారు. భారత్ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. ఈ మ్యాచ్లో జింబాబ్వే టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. జింబాబ్వే బౌలర్లు పొదుపుగా బౌలింగ్ చేయడంతో భారత్ నామమాత్రపు స్కోర్కే పరిమితమైంది. ముజరబాని 2, సికందర్ రజా, రిచర్డ్ నగరవ, బ్రాండన్ మవుటా తలో వికెట్ పడగొట్టారు.కాగా, ఐదు మ్యాచ్ల ఈ సిరీస్ను భారత్ ఇదివరకే 3-1 తేడాతో కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. సిరీస్ ఫలితం తేలిపోవడంతో ఈ మ్యాచ్ నామమాత్రంగా సాగనుంది. ఈ సిరీస్లో జింబాబ్వే తొలి మ్యాచ్ గెలవగా.. టీమిండియా వరుసగా రెండు, మూడు, నాలుగు మ్యాచ్లు గెలిచింది.తుది జట్లు..జింబాబ్వే: వెస్లీ మధేవెరే, తడివానాషే మారుమణి, బ్రియాన్ బెన్నెట్, డియోన్ మైయర్స్, సికందర్ రజా(కెప్టెన్), జోనాథన్ క్యాంప్బెల్, ఫరాజ్ అక్రమ్, క్లైవ్ మదాండే(వికెట్కీపర్), బ్రాండన్ మవుటా, రిచర్డ్ నగరవ, బ్లెస్సింగ్ ముజారబానీటీమిండియా: శుభ్మన్ గిల్(కెప్టెన్), యశస్వి జైస్వాల్, అభిషేక్ శర్మ, సంజు శాంసన్(వికెట్కీపర్), రియాన్ పరాగ్, రింకూ సింగ్, శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, తుషార్ దేశ్పాండే, ముఖేష్ కుమార్ -
IND Vs ZIM: చరిత్ర సృష్టించిన యశస్వి.. ఒక్క బంతి 13 పరుగులు
జింబాబ్వేతో జరుగుతున్న ఐదో టీ20లో టీమిండియా ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఎవరికీ సాధ్యం కాని అరుదైన ఘనతను సాధించాడు. ఈ మ్యాచ్ తొలి బంతికే రెండు సిక్సర్లు బాదిన యశస్వి ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. సికందర్ బౌలింగ్లో తొలి బంతి నో బాల్ కాగా.. ఆ బంతిని యశస్వి సిక్సర్గా మలిచాడు. ఆతర్వాతి బంతి ఫ్రీ హిట్ కావడంతో ఆ బంతిని కూడా స్టాండ్స్లో పంపాడు. నో బాల్తో లభించే అదనపు పరుగుతో కలుపుకుని తొలి బంతికి మొత్తం 13 పరుగులు వచ్చాయి. అంతర్జాతీయ టీ20ల చరిత్రలో ఇలా తొలి బంతికే 13 పరుగులు వచ్చిన దాఖలాలు లేవు.Yashasvi Jaiswal became the first batter in history to score 13 runs on the 1st ball of a T20i. 🌟pic.twitter.com/98j63xmtGu— Mufaddal Vohra (@mufaddal_vohra) July 14, 2024తొలి రెండు బంతులను సిక్సర్లుగా మలిచి మాంచి జోష్ మీదుండిన యశస్వి.. అదే ఓవర్ నాలుగో బంతికి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. సికందర్ రజా సంధించిన ఇన్ స్వింగర్ను తప్పుగా అంచనా వేసిన యశస్వి అనవసరంగా వికెట్ పారేసుకున్నాడు. యశస్వి ఔటైన అనంతరం అభిషేక్ శర్మ (14), శుభ్మన్ గిల్ (13) కూడా భారీ షాట్లకు ప్రయత్నించి పెవిలియన్ బాట పట్టారు. After conceding two sixes, Sikandar Raza took Yashasvi Jaiswal's wicket, and the celebration says it all.📸: SonyLIV pic.twitter.com/XpNkG19AhM— CricTracker (@Cricketracker) July 14, 2024వీరి తర్వాత క్రీజ్లో వచ్చిన సంజూ శాంసన్ (31 బంతుల్లో 38; 3 సిక్సర్లు), రియాన్ పరాగ్ (18 బంతుల్లో 20; సిక్స్) కుదురుగా ఆడుతున్నారు. 13 ఓవర్ల తర్వాత భారత్ స్కోర్ 101/3గా ఉంది. జింబాబ్వే బౌలర్లలో ముజరబాని, సికందర్ రజా, నగరవ తలో వికెట్ పడగొట్టారు.ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన జింబాబ్వే.. టీమిండియాను బ్యాటింగ్కు ఆహ్వానించింది. ఈ మ్యాచ్లో భారత్ రెండు మార్పులతో బరిలోకి దిగింది. ఖలీల్ అహ్మద్, రుతురాజ్ గైక్వాడ్ స్థానాల్లో ముకేశ్ కుమార్, రియాన్ పరాగ్ తుది జట్టులోకి వచ్చారు. మరోవైపు జింబాబ్వే ఓ మార్పు చేసింది. చటారా స్థానంలో బ్రాండన్ మవుటా తుది జట్టులోకి వచ్చాడు.కాగా, ఐదు మ్యాచ్ల ఈ సిరీస్ను భారత్ ఇదివరకే 3-1 తేడాతో కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. సిరీస్ ఫలితం తేలిపోవడంతో ఈ మ్యాచ్ నామమాత్రంగా సాగనుంది. ఈ సిరీస్లో జింబాబ్వే తొలి మ్యాచ్ గెలవగా.. టీమిండియా వరుసగా రెండు, మూడు, నాలుగు మ్యాచ్లు గెలిచింది.తుది జట్లు..జింబాబ్వే: వెస్లీ మధేవెరే, తడివానాషే మారుమణి, బ్రియాన్ బెన్నెట్, డియోన్ మైయర్స్, సికందర్ రజా(కెప్టెన్), జోనాథన్ క్యాంప్బెల్, ఫరాజ్ అక్రమ్, క్లైవ్ మదాండే(వికెట్కీపర్), బ్రాండన్ మవుటా, రిచర్డ్ నగరవ, బ్లెస్సింగ్ ముజారబానీటీమిండియా: శుభ్మన్ గిల్(కెప్టెన్), యశస్వి జైస్వాల్, అభిషేక్ శర్మ, సంజు శాంసన్(వికెట్కీపర్), రియాన్ పరాగ్, రింకూ సింగ్, శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, తుషార్ దేశ్పాండే, ముఖేష్ కుమార్ -
ఐదో టీ20లోనూ టీమిండియాదే విజయం.. చిత్తుగా ఓడిన జింబాబ్వే
హరారే వేదికగా జింబాబ్వేతో జరిగిన ఐదో టీ20లో టీమిండియా 42 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేయగా.. ఛేదనలో చేతులెత్తేసిన జింబాబ్వే 18.3 ఓవర్లలో 125 పరుగులకు ఆలౌటైంది. సంజూ శాంసన్ (45 బంతుల్లో 58; ఫోర్, 4 సిక్సర్ల, రెండు క్యాచ్లు), ముకేశ్ కుమార్ (3.3-0-22-4) అద్భుతంగా రాణించి టీమిండియాకు ఘన విజయాన్నందించారు. ఈ గెలుపుతో భారత్.. ఐదు మ్యాచ్ల సిరీస్ను 4-1 తేడాతో కైవసం చేసుకుంది. ఈ సిరీస్లో జింబాబ్వే తొలి మ్యాచ్లో గెలవగా.. భారత్ వరుసగా నాలుగు మ్యాచ్ల్లో జయభేరి మోగించింది. మూడో వికెట్ కోల్పోయిన జింబాబ్వే59 పరుగుల వద్ద జింబాబ్వే మూడో వికెట్ కోల్పోయింది. వాషింగ్టన్ సుందర్ బౌలింగ్లో మరుమణి (27) ఎల్బీడబ్ల్యూ అయ్యాడు. 9 ఓవర్ల తర్వాత జింబాబ్వే స్కోర్ 61/3గా ఉంది. మైర్స్ (18), సికందర్ రజా (1) క్రీజ్లో ఉన్నారు.టార్గెట్ 168.. రెండో వికెట్ కోల్పోయిన జింబాబ్వే15 పరుగుల వద్ద జింబాబ్వే రెండో వికెట్ కోల్పోయింది. ముకేశ్ కుమార్ బౌలింగ్లో శివమ్ దూబేకి క్యాచ్ ఇచ్చి బెన్నిట్ (10) ఔటయ్యాడు. టార్గెట్ 168.. తొలి వికెట్ కోల్పోయిన జింబాబ్వే168 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన జింబాబ్వే.. తొలి ఓవర్లోనే వికెట్ కోల్పోయింది. ముకేశ్ కుమార్ బౌలింగ్లో మధెవెరె (0) క్లీన్ బౌల్డ్ ఆయ్యాడు. రాణించిన జింబాబ్వే బౌలర్లు.. నామమాత్రపు స్కోర్కే పరిమితమైన టీమిండియాఈ మ్యాచ్లో జింబాబ్వే బౌలర్లు రాణించడంతో టీమిండియా నామమాత్రపు స్కోర్కే (167/6) పరిమితమైంది. ముజరబాని 2, సికందర్ రజా, రిచర్డ్ నగరవ, బ్రాండన్ మవుటా తలో వికెట్ పడగొట్టారు. భారత ఇన్నింగ్స్లో సంజూ శాంసన్ (58) మినహా ఎవరూ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేదు. శివమ్ దూబే 26, రియాన్ పరాగ్ 22, అభిషేక్ శర్మ 14, శుభ్మన్ గిల్ 13, యశస్వి జైస్వాల్ 12 పరుగులకు ఔట్ కాగా.. రింకూ సింగ్ 11, వాషింగ్టన్ సుందర్ 1 పరుగుతో అజేయంగా నిలిచారు. ఐదో వికెట్ కోల్పోయిన భారత్.. శాంసన్ ఔట్135 పరుగుల వద్ద (17.3వ ఓవర్) టీమిండియా ఐదో వికెట్ కోల్పోయింది. ముజరబాని బౌలింగ్లో మరుమణి క్యాచ్ పట్టడంతో శాంసన్ పెవిలియన్ బాట పట్టాడు. శివమ్ దూబే (10), రింకూ సింగ్ క్రీజ్లో ఉన్నారు. 105 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయిన టీమిండియా105 పరుగుల వద్ద టీమిండియా నాలుగో వికెట్ కోల్పోయింది. బ్రాండన్ మవుటా బౌలింగ్లో నగరవకు క్యాచ్ ఇచ్చి రియాన్ పరాగ్ (22) ఔటయ్యాడు.40 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన టీమిండియాతొలి ఓవర్లలో దూకుడుగా ఆడిన టీమిండియా ఆతర్వాత ఢీలా పడిపోయింది. జింబాబ్వే బౌలర్లు పుంజుకోవడంతో భారత్ 40 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. యశస్వి (12), శుభమన్ గిల్ (13), అభిషేక్ శర్మ (14) ఔట్ కాగా.. సంజూ శాంసన్ (16), రియాన్ పరాగ్ (5) క్రీజ్లో ఉన్నారు. 8.2 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 62/3గా ఉంది.తొలి వికెట్ కోల్పోయిన టీమిండియాసికందర్ రజా వేసిన తొలి ఓవర్లో తొలి రెండు బంతులను సిక్సర్లుగా మలిచిన యశస్వి జైస్వాల్ నాలుగో బంతికి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. తొలుత బ్యాటింగ్ చేయనున్న టీమిండియాహరారే వేదికగా జింబాబ్వేతో జరుగనున్న ఐదో టీ20లో టీమిండియా టాస్ ఓడింది. జింబాబ్వే కోరిక మేరకు భారత్ తొలుత బ్యాటింగ్ చేయనుంది. ఈ మ్యాచ్లో భారత్ రెండు మార్పులతో బరిలోకి దిగనుంది. ముకేశ్ కుమార్, రియాన్ పరాగ్ తుది జట్టులోకి వచ్చారు. మరోవైపు జింబాబ్వే ఓ మార్పు చేసింది. చటారా స్థానంలో బ్రాండన్ మవుటా తుది జట్టులోకి వచ్చాడు. ఐదు మ్యాచ్ల ఈ సిరీస్ను భారత్ ఇదివరకే 3-1 తేడాతో కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. సిరీస్ ఫలితం తేలిపోవడంతో ఈ మ్యాచ్ నామమాత్రంగా సాగనుంది. ఈ సిరీస్లో జింబాబ్వే తొలి మ్యాచ్ గెలవగా.. టీమిండియా వరుసగా రెండు, మూడు, నాలుగు మ్యాచ్లు గెలిచింది.తుది జట్లు..జింబాబ్వే: వెస్లీ మధేవెరే, తడివానాషే మారుమణి, బ్రియాన్ బెన్నెట్, డియోన్ మైయర్స్, సికందర్ రజా(కెప్టెన్), జోనాథన్ క్యాంప్బెల్, ఫరాజ్ అక్రమ్, క్లైవ్ మదాండే(వికెట్కీపర్), బ్రాండన్ మవుటా, రిచర్డ్ నగరవ, బ్లెస్సింగ్ ముజారబానీటీమిండియా: శుభ్మన్ గిల్(కెప్టెన్), యశస్వి జైస్వాల్, అభిషేక్ శర్మ, సంజు శాంసన్(వికెట్కీపర్), రియాన్ పరాగ్, రింకూ సింగ్, శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, తుషార్ దేశ్పాండే, ముఖేష్ కుమార్ -
IND VS ZIM 5th T20: టాస్ ఓడిన టీమిండియా.. తుది జట్టులో విధ్వంసకర వీరుడు
హరారే వేదికగా జింబాబ్వేతో జరుగనున్న ఐదో టీ20లో టీమిండియా టాస్ ఓడింది. జింబాబ్వే కోరిక మేరకు భారత్ తొలుత బ్యాటింగ్ చేయనుంది. ఈ మ్యాచ్లో భారత్ రెండు మార్పులతో బరిలోకి దిగనుంది. ఖలీల్ అహ్మద్, రుతురాజ్ స్థానంలో ముకేశ్ కుమార్, రియాన్ పరాగ్ తుది జట్టులోకి వచ్చారు. మరోవైపు జింబాబ్వే ఓ మార్పు చేసింది. చటారా స్థానంలో బ్రాండన్ మవుటా తుది జట్టులోకి వచ్చాడు. ఐదు మ్యాచ్ల ఈ సిరీస్ను భారత్ ఇదివరకే 3-1 తేడాతో కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. సిరీస్ ఫలితం తేలిపోవడంతో ఈ మ్యాచ్ నామమాత్రంగా సాగనుంది. ఈ సిరీస్లో జింబాబ్వే తొలి మ్యాచ్ గెలవగా.. టీమిండియా వరుసగా రెండు, మూడు, నాలుగు మ్యాచ్లు గెలిచింది.తుది జట్లు..జింబాబ్వే: వెస్లీ మధేవెరే, తడివానాషే మారుమణి, బ్రియాన్ బెన్నెట్, డియోన్ మైయర్స్, సికందర్ రజా(కెప్టెన్), జోనాథన్ క్యాంప్బెల్, ఫరాజ్ అక్రమ్, క్లైవ్ మదాండే(వికెట్కీపర్), బ్రాండన్ మవుటా, రిచర్డ్ నగరవ, బ్లెస్సింగ్ ముజారబానీటీమిండియా: శుభ్మన్ గిల్(కెప్టెన్), యశస్వి జైస్వాల్, అభిషేక్ శర్మ, సంజు శాంసన్(వికెట్కీపర్), రియాన్ పరాగ్, రింకూ సింగ్, శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, తుషార్ దేశ్పాండే, ముఖేష్ కుమార్ -
అభిషేక్ శర్మ ఆల్టైమ్ రికార్డు.. భారత క్రికెట్ చరిత్రలోనే
జింబాబ్వే టీ20 సిరీస్తో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన టీమిండియా యువ ఓపెనర్ అభిషేక్ శర్మ సత్తాచాటుతున్నాడు. తొలి మ్యాచ్లో విఫలమైనప్పటకి ఆ తర్వాత మ్యాచ్లోనే విధ్వంసకర సెంచరీతో మెరిశాడు.ఆ తర్వాత మూడో టీ20లో కేవలం 10 పరుగులు మాత్రమే చేసిన అభిషేక్కు.. నాలుగో టీ20లో బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. బ్యాటింగ్లో ఛాన్స్ రానప్పటకి బౌలింగ్లో మాత్రం తన మార్క్ చూపించాడు. ఈ మ్యాచ్లో 3 ఓవర్లు బౌలింగ్ చేసిన అభిషేక్ కేవలం 20 పరుగులు మాత్రమే ఓ కీలక వికెట్ పడగొట్టాడు. ఈ క్రమంలో అభిషేక్ శర్మ ఓ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఓ టీ20 సిరీస్లో సెంచరీతో పాటు వికెట్ సాధించిన తొలి భారత ప్లేయర్గా అభిషేక్ చరిత్రకెక్కాడు. ఇప్పటివరకు ఏ భారత క్రికెటర్ కూడా ఈ ఘనత సాధించలేదు. కాగా, ఓ సిరీస్లో సెంచరీతో పాటు వికెట్ ఘనతను భారత్ తరఫున టెస్టు ఫార్మాట్లో లాల్ అమర్నాథ్ (1933), వన్డేల్లో కపిల్ దేవ్ (1983) తొలిసారి సాధించారు. ఇక నాలుగో టీ20లో 10 వికెట్ల తేడాతో విజయం సాధించిన భారత్.. సిరీస్ను మరో మ్యాచ్ మిగిలూండగానే 3-1 తేడాతో సొంతం చేసుకుంది. -
చరిత్ర సృష్టించిన గిల్-జైశ్వాల్ జోడీ.. ఎవరికీ సాధ్యం కాని రికార్డు
హరారే వేదికగా జింబాబ్వేతో జరిగిన నాలుగో టీ20లో 10 వికెట్ల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. దీంతో ఐదు మ్యాచ్ల సిరీస్ను మరో మ్యాచ్ మిగిలూండగానే 3-1 తేడాతో టీమిండియా కైవసం చేసుకుంది. 153 పరుగుల లక్ష్యాన్ని భారత ఓపెనర్లు శుబ్మన్ గిల్, యశస్వీ జైశ్వాల్ ఊదిపడేశారు.జింబాబ్వే బౌలర్లను చొతక్కొట్టారు. యశస్వీ 53 బంతుల్లో 13 ఫోర్లు, 2 సిక్స్లతో 93 పరుగులు చేయగా.. గిల్ 39 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్లతో 58 పరుగులు చేశాడు. ఈ క్రమంలో 156 పరుగుల ఆజేయ భాగస్వామ్యం నెలకొల్పిన గిల్-జైశ్వాల్ జోడీ ఓ అరుదైన రికార్డును తమ పేరిట లిఖించుకుంది.టీ20 క్రికెట్లో ఛేజింగ్లో భారత తరపున రెండు సార్లు 150 ప్లస్ పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన తొలి జోడీగా గిల్-జైశ్వాల్ నిలిచారు. వీరిద్దరూ టీ20ల్లో 150 పైగా భాగస్వామ్యం నెలకొల్పడం ఇదే రెండో సారి.ఇంతకుముందు 2023లో వెస్టిండీస్తో జరిగిన టీ20లో జైస్వాల్, గిల్ ఇద్దరూ 165 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఈ రెండు భాగస్వామ్యాలు కూడా ఛేజింగ్లో నెలకొల్పినివే కావడం విశేషం. ఈ క్రమంలోనే ఈ అరుదైన ఫీట్ను గిల్, జైశ్వాల్ తమ ఖాతాలో వేసుకున్నారు.టీ20 చరిత్రలో భారత్ తరఫున అత్యధిక ఓపెనింగ్ భాగస్వామ్యాలు ఇవే..165 - రోహిత్ శర్మ అండ్ కేఎల్ రాహుల్ వర్సెస్ శ్రీలంక, ఇండోర్, 2017165 - యశస్వి జైస్వాల్ అండ్ శుబ్మన్ గిల్ వర్సెస్ వెస్టిండీస్, లాడర్హిల్, 2023160 - రోహిత్ శర్మ అండ్ శిఖర్ ధావన్ వర్సెస్ ఐర్లాండ్, డబ్లిన్, 2018158 - రోహిత్ శర్మ అండ్ శిఖర్ ధావన్ వర్సెస్ న్యూజిలాండ్, ఢిల్లీ, 2017156* - యశస్వి జైస్వాల్ అండ్ శుబ్మన్ గిల్ వర్సెస్ జింబాబ్వే, హరారే, 2024 -
సంతోషం.. కానీ ఇంకో మ్యాచ్ మిగిలే ఉంది: గిల్
జింబాబ్వే పర్యటనలో యువ భారత జట్టు సత్తా చాటింది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, రవీంద్ర జడేజా రిటైర్మెంట్ తర్వాత ఆడిన తొలి టీ20 ద్వైపాక్షిక సిరీస్లోనే టీమిండియాకు ఘన విజయం అందించింది.టీ20 ప్రపంచకప్-2024 తర్వాత సీనియర్లు విశ్రాంతి తీసుకోవడంతో వచ్చిన అవకాశాన్ని యువ ఆటగాళ్లు పూర్తిగా సద్వినియోగం చేసుకున్నారు. తొలి టీ20లో పరాజయం పాలైనా.. పడిలేచిన కెరటంలా హ్యాట్రిక్ విజయాలతో జోరు ప్రదర్శించారు.హరారే వేదికగా శనివారం నాటి నాలుగో టీ20లో సమష్టిగా రాణించి జింబాబ్వేను పది వికెట్ల తేడాతో చిత్తు చేశారు. ఈ క్రమంలో కెప్టెన్గా తొలిసారి భారత జట్టు పగ్గాలు చేపట్టిన శుబ్మన్ గిల్ ఖాతాలో అరంగేట్రంలోనే సిరీస్ విజయం చేరింది.ఈ నేపథ్యంలో గిల్ హర్షం వ్యక్తం చేశాడు. ఈ అనుభూతి ఎంతో గొప్పగా ఉందని పేర్కొన్నాడు. ‘‘మొదటి టీ20లో మేము లక్ష్య ఛేదనలో విఫలమయ్యాం.అయితే, ఈరోజు విజయవంతంగా టార్గెట్ పూర్తి చేశాం. ఈ ఫీలింగ్ అద్భుతంగా ఉంది. అయినా.. ఇప్పుడే ఇంకా పని పూర్తి కాలేదు. ఇంకొక మ్యాచ్ మిగిలే ఉంది’’ అని పేర్కొన్నాడు.ఇక ప్రస్తుతం ఆడుతున్న జట్టు గొప్పగా ఉందన్న గిల్... తదుపరి మ్యాచ్లో మార్పులు చేర్పుల గురించి కోచ్తో ఇంకా చర్చించలేదని తెలిపాడు. కాగా టీమిండియా- జింబాబ్వే మధ్య నామమాత్రపు ఐదో టీ20 హరారే వేదికగా ఆదివారం జరుగనుంది.టీమిండియా వర్సెస్ జింబాబ్వే నాలుగో టీ20 స్కోర్లు:👉వేదిక: హరారే స్పోర్ట్స్ క్లబ్👉టాస్: టీమిండియా.. బౌలింగ్👉జింబాబ్వే స్కోరు: 152/7 (20)👉టీమిండియా స్కోరు: 156/0 (15.2)👉ఫలితం: పది వికెట్ల తేడాతో జింబాబ్వేపై టీమిండియా ఘన విజయం.. సిరీస్ సొంతం👉ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: యశస్వి జైస్వాల్ (53 బంతుల్లో 93 పరుగులు నాటౌట్, (13 ఫోర్లు, 2 సిక్సర్లు)).చదవండి: Ind vs Zim 4th T20: జైస్వాల్ విధ్వంసం.. గిల్ సూపర్ ఇన్నింగ్స్ -
Ind vs Zim: జైస్వాల్ విధ్వంసం.. గిల్ సూపర్ ఇన్నింగ్స్
జింబాబ్వేతో నాలుగో టీ20లో టీమిండియా ఘన విజయం సాధించింది. ఆతిథ్య జట్టును పది వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించింది. తద్వారా మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ను 3-1తో కైవసం చేసుకుంది.ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ కోసం జింబాబ్వే పర్యటనకు వెళ్లిన యువ భారత జట్టుకు శుబ్మన్ గిల్ కెప్టెన్గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తొలి మ్యాచ్లో ఓడిన టీమిండియా.. ఆ తర్వాత వరుసగా రెండు విజయాలు సాధించింది.రాణించినా రజా ఈ క్రమంలో శనివారం నాలుగో టీ20లోనూ ఆకాశమే హద్దుగా చెలరేగింది. హరారే వేదికగా టాస్ గెలిచిన భారత్ తొలుత బౌలింగ్ చేసింది. కెప్టెన్ నమ్మకాన్ని నిలబెడుతూ బౌలర్లు రాణించారు. జింబాబ్వేను నామమాత్రపు స్కోరుకు పరిమితం చేశారు.ఆతిథ్య జట్టు ఓపెనర్లలో వెస్లీ మెదెవెరె(25), మరుమానీ(32) ఫర్వాలేదనిపించగా.. కెప్టెన్ సికందర్ రజా 46 పరుగులు చేశాడు. ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో జింబాబ్వే ఏడు వికెట్ల నష్టపోయి 152 పరుగులు చేసింది.అరంగేట్ర బౌలర్కు ఒక వికెట్ టీమిండియా బౌలర్లలో పేసర్లు ఖలీల్ అహ్మద్ రెండు, అరంగేట్ర ఆటగాడు తుషార్ దేశ్పాండే, శివం దూబే ఒక్కో వికెట్ పడగొట్టగా.. స్పిన్నర్లు రవి బిష్ణోయి, వాషింగ్టన్ సుందర్, అభిషేక్ శర్మ తలా ఒక వికెట్ తీశారు.ఆకాశమే హద్దుగా జైస్వాల్ఇక జింబాబ్వే విధించిన 153 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా ఆడుతూ పాడుతూ ఛేదించింది. ఓపెనర్లు యశస్వి జైస్వాల్, శుబ్మన్ గిల్ అజేయ అద్బుత అర్ధ శతకాలతో ఆకట్టుకున్నారు. ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ జైస్వాల్ 93 పరుగుల(13 ఫోర్లు, 2 సిక్సర్లు) తో దుమ్మలేపగా.. గిల్ 58 పరుగులు (ఆరు ఫోర్లు, రెండు సిక్స్లు) సాధించాడు.వీరిద్దరి విజృంభణ కారణంగా 15.2 ఓవర్లలోనే భారత్ లక్ష్యాన్ని ఛేదించింది. ఏకంగా పది వికెట్ల తేడాతో జింబాబ్వేను చిత్తు చేసి సిరీస్ను కైవసం చేసుకుంది. ఇక కెప్టెన్గా శుబ్మన్ గిల్ తొలి సిరీస్లోనే ట్రోఫీ గెలవడం విశేషం.చదవండి: IND Vs ZIM 4th T20I: సికందర్ రజా వరల్డ్ రికార్డు -
Ind vs Zim: సికందర్ రజా వరల్డ్ రికార్డు
టీమిండియా నాలుగో టీ20లో జింబాబ్వే కెప్టెన్ సికందర్ రజా అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. సహచర ఆటగాళ్లు పెవిలియన్కు క్యూ కట్టినా పట్టుదలగా నిలబడి ధనాధన్ ఇన్నింగ్స్తో అలరించాడు.నాలుగో స్థానంలో బ్యాటింగ్కు వచ్చిన బ్యాటింగ్ ఆల్రౌండర్ మొత్తంగా 28 బంతులు ఎదుర్కొని 46 పరుగులు సాధించాడు. అయితే, భారత అరంగేట్ర బౌలర్ తుషార్ దేశ్పాండే బౌలింగ్లో భారీ షాట్కు యత్నించి రజా విఫలమయ్యాడు.అవుట్ సైడ్ ఆఫ్ దిశగా వెళ్తున్న బంతిని మోకాలి మీద కూర్చుని గాల్లోకి లేపాడు. అయితే, కవర్స్లో ఫీల్డింగ్ చేస్తున్న టీమిండియా కెప్టెన్ శుబ్మన్ గిల్ వేగంగా కదిలి బంతిని అందుకున్నాడు. ఫలితంగా సికందర్ రజా ఇన్నింగ్స్కు తెరపడింది.సికందర్ రజా వరల్డ్ రికార్డుఇదిలా ఉంటే.. హరారే వేదికగా శనివారం నాటి ఈ మ్యాచ్ సందర్భంగా సికందర్ రజా ప్రపంచ రికార్డు సాధించాడు. అంతర్జాతీయ టీ20లలో యాభైకి పైగా వికెట్లు తీయడంతో పాటు 2000 పరుగులు పూర్తి చేసుకున్న జింబాబ్వే తొలి క్రికెటర్గా చరిత్రకెక్కాడు. అంతేకాదు ప్రపంచంలో ఈ ఘనత సాధించిన ఐదో ఆల్రౌండర్గా రికార్డు సాధించాడు. కాగా కుడిచేతి వాటం బ్యాటర్ అయిన సికందర్ రజా.. రైటార్మ్ ఆఫ్ బ్రేక్ స్పిన్నర్ కూడా!అంతర్జాతీయ టీ20(పురుష క్రికెట్)లలో 2 వేలకు పైగా పరుగులు, యాభైకి పైగా వికెట్లు సాధించిన క్రికెటర్లు వీరే1. షకీబ్ అల్ హసన్ (బంగ్లాదేశ్)- 2551 రన్స్, 149 వికెట్లు2. మహ్మద్ నబీ(అఫ్గనిస్తాన్)- 2165 రన్స్, 96 వికెట్లు3. విరన్దీప్ సింగ్(మలేషియా)- 2320 రన్స్, 66 వికెట్లు4. మహ్మద్ హఫీజ్(పాకిస్తాన్)- 2514 రన్స్, 61 వికెట్లు5. సికందర్ రజా(జింబాబ్వే)- 2001 రన్స్,65 వికెట్లుమెరుగ్గా రాణించిటీమిండియాతో నాలుగో టీ20లో టాస్ ఓడిన జింబాబ్వే తొలుత బ్యాటింగ్ చేసింది. ఓపెనర్లు మెదెవెరె(25), మరుమానీ(32) ఫర్వాలేదనిపించగా.. సికందర్ రజా 46 పరుగులతో రాణించాడు. నిర్ణీత 20 ఓవర్లలో జింబాబ్వే ఏడు వికెట్ల నష్టానికి 152 పరుగుల మెరుగైన స్కోరు సాధించింది. ఇక ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ కోసం జింబాబ్వే వెళ్లిన భారత జట్టు 2-1తో ఆధిక్యంలో ఉంది. -
టీమిండియా ఘన విజయం.. సిరీస్ మనదే
Zimbabwe vs India, 4th T20I Updates: జింబాబ్వే పర్యటనలో భాగంగా టీమిండియా నాలుగో టీ20 ఆడుతోంది. ఇప్పటికే ఐదు మ్యాచ్ల సిరీస్లో 2-1తో శుబ్మన్ గిల్ సేన ఆధిక్యంలో ఉంది. శనివారం టీ20లో టాస్ గెలిచిన భారత్.. జింబాబ్వేను తొలుత బ్యాటింగ్కు ఆహ్వానించింది. నిర్ణీత 20 ఓవర్లలో జింబాబ్వే ఏడు వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో భారత్ విజృంభించింది. ఓపెర్లు యశస్వి జైస్వాల్, శుబ్మన్ గిల్ దంచికొట్టారు. జైస్వాల్ 93 పరుగులతో దుమ్మలేపగా.. గిల్ 58 పరుగులు సాధించాడు.వీరిద్దరి విజృంభణ కారణంగా 15.2 ఓవర్లలోనే భారత్ టార్గెట్ను పూర్తి చేసింది. ఏకంగా పది వికెట్ల తేడాతో గెలుపొంది సిరీస్ను కైవసం చేసుకుంది.భారత తుదిజట్టు: యశస్వి జైస్వాల్, శుబ్మన్ గిల్(కెప్టెన్), అభిషేక్ శర్మ, రుతురాజ్ గైక్వాడ్, సంజూ శాంసన్( వికెట్ కీపర్), రింకూ సింగ్, శివం దూబే, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, తుషార్ దేశ్పాండే, ఖలీల్ అహ్మద్.జింబాబ్వే తుదిజట్టు: వెస్లీ మెదెవెరె, తాడివానాషే మరుమానీ, బ్రియాన్ బెన్నెట్, డియాన్ మైయర్స్, సికందర్ రజా(కెప్టెన్), జోనాథన్ క్యాంప్బెల్, ఫరాజ్ అక్రమ్, క్లైవ్ మదాండే(వికెట్ కీపర్), రిచర్డ్ నగరవా, బ్లెస్సింగ్ ముజరాబానీ, టెండాయ్ చటారా.అప్డేట్స్14.1: గిల్ అర్ధ శతకం12 ఓవర్లలో టీమిండియా స్కోరు: 118/0 (12)జింబాబ్వే బౌలింగ్ను చిత్తు చేస్తూ టీమిండియా ఓపెనర్లు యశస్వి జైస్వాల్, శుబ్మన్ గిల్ ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నారు. 12వ ఓవర్ముగిసే సరికి జైస్వాల్ 75, గిల్ 39 పరుగులతో క్రీజులో ఉన్నారు.పది ఓవర్లలోనే టీమిండియా స్కోరు: 106-0శుబ్మన్ గిల్ 37, యశస్వి జైస్వాల్ 65 పరుగులతో క్రీజులో ఉన్నారు.6.3: 29 బంతుల్లో అర్థ శతకం పూర్తి చేసుకు న్న యశస్వి జైస్వాల్పవర్ ప్లేలో యశస్వి పరుగుల వరదఆరో ఓవర్ ముగిసే సరికి యశస్వి జైస్వాల్ 47(26), శుబ్మన్ గిల్ 13 పరుగులతో ఉన్నారు. టీమిండియా స్కోరు: 61/0 (6)దంచికొడుతున్న యశస్విజింబాబ్వే విధించిన 153 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో టీమిండియా ఘనంగా తమ ఇన్నింగ్స్ ఆరంభించింది. ఓపెనర్లు యశస్వి జైస్వాల్, శుబ్మన్ గిల్ ఆది నుంచే జింబాబ్వే బౌలర్లపై అటాక్ చేస్తున్నారు.మూడు ఓవర్లు ముగిసే సరికి యశస్వి 13 బంతుల్లోనే 31 పరుగులు సాధించగా.. గిల్ ఐదు బంతుల్లో 11 రన్స్ చేశాడు. దీంతో టీమిండియా వికెట్ నష్టపోకుండా 43 పరుగులు చేసింది. టీమిండియా టార్గెట్ 153ఆతిథ్య జట్టు ఓపెనర్లు వెస్లీ మెదెవెరె(25), మరుమానీ(32) సహా కెప్టెన్ సికందర్ రజా(46) రాణించారు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో జింబాబ్వే ఏడు వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది.భారత బౌలర్లలో పేసర్లు ఖలీల్ అహ్మద్ రెండు, తుషార్ దేశ్పాండే, శివం దూబే ఒక్కో వికెట్ తీయగా.. స్పిన్నర్లు రవి బిష్ణోయి, వాషింగ్టన్ సుందర్, అభిషేక్ శర్మ తలా ఒక వికెట్ పడగొట్టారు.ఆఖరి ఓవర్లో రెండు వికెట్లుఆఖరి ఓవర్లో టీమిండియా పేసర్ ఖలీల్ అహ్మద్ రెండు వికెట్లు తీశాడు. తొలి బంతికి మేయర్స్(12), ఆఖరి బంతికి మందాడే(7)ను పెవిలియన్కు పంపాడు.18.3: రజా హాఫ్ సెంచరీ మిస్ధనాధన్ ఇన్నింగ్స్తో అలరించిన జింబాబ్వే కెప్టెన్ సికందర్ రజా హాఫ్ సెంచరీ మిస్ చేసుకున్నాడు. తుషార్ దేశ్పాండే బౌలింగ్లో శుబ్మన్ గిల్కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు.అర్ధ శతకానికి నాలుగు పరుగుల దూరం(28 బంతుల్లో 46) నిలిచిపోయాడు. రజా రూపంలో జింబాబ్వే ఐదో వికెట్ కోల్పోయింది.జింబాబ్వే స్కోరు: 147/5 (19) పదిహేడు ఓవర్లు ముగిసే సరికి జింబాబ్వే స్కోరు: 129/4రజా 42, మేయర్స్ తొమ్మిది పరుగులతో ఆడుతున్నారు14.4: నాలుగో వికెట్ కోల్పోయిన జింబాబ్వేబ్యాటర్ల మధ్య సమన్వయ లోపం కారణంగా జింబాబ్వే నాలుగో వికెట్ కోల్పోయింది. రవి బిష్ణోయి బౌలింగ్లో సికందర్ రజా పరుగుకు యత్నించగా.. మరో ఎండ్లో ఉన్న క్యాంప్బెల్ వేగంగా కదలలేకపోయాడు.ఈ క్రమంలో బంతిని అందుకున్న బిష్ణోయి నాన్ స్ట్రైకర్ ఎండ్ వైపు విసరగా.. బాల్ వికెట్లను గిరాటేసింది. ఫలితంగా క్యాంప్బెల్(3) రనౌట్ అయ్యాడు. 13.4: మూడో వికెట్ డౌన్వాషింగ్టన్ సుందర్ బౌలింగ్లో బ్రియాన్ బెనెట్ యశస్వి జైస్వాల్కు క్యాచ్ ఇచ్చి మూడో వికెట్గా వెనుదిరిగాడు. పద్నాలుగు బంతులు ఎదుర్కొన్న ఈ వన్డౌన్ బ్యాటర్ తొమ్మిది పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద నిష్క్రమించాడు.జొనాథన్ క్యాంప్బెల్ క్రీజులోకి వచ్చాడు. సికందర్రజా 19 పరుగులతో క్రీజులో ఉన్నాడు. జింబాబ్వే స్కోరు: 93/3 (14).9.6: రెండో వికెట్ కోల్పోయిన జింబాబ్వేపేస్ బౌలింగ్ ఆల్రౌండర్ శివం దూబే బౌలింగ్లో జింబాబ్వే ఓపెనర్ వెస్లీ(25) పెవిలియన్ చేరాడు. బాల్ను తప్పుగా అంచనా వేసి గాల్లోకి లేపగా.. రింకూ సింగ్ క్యాచ్ పట్టుకున్నాడు. దీంతో వెస్లీ ఇన్నింగ్స్కు తెరపడింది.సికందర్ రజా 0, బ్రియాన్ బెనెట్ 3 పరుగులతో క్రీజులో ఉన్నారు. పది ఓవర్లలో జింబాబ్వే స్కోరు: 67-2.7.1: హాఫ్ సెంచరీ పూర్తి చేసుకు న్న జింబాబ్వేవాషింగ్టన్ సుందర్ బౌలింగ్లో మరుమానీ రెండు పరుగులు తీయగా.. జింబాబ్వే యాభై పరుగుల మార్కు అందుకుంది.పవర్ ప్లేలో జింబాబ్వే స్కోరు: 44/0ఆరు ఓవర్లు ముగిసే సరికి జింబాబ్వే వికెట్ నష్టపోకుండా 44 పరుగులు చేసింది. ఓపెనర్లు వెస్లీ 19, మరుమానీ 18 పరుగులతో క్రీజులో ఉన్నారు.కట్టుదిట్టంగా భారత్ బౌలింగ్బ్యాటింగ్కు దిగిన జింబాబ్వేను భారత బౌలర్లు కట్టడి చేస్తున్నారు. ఖలీల్ అహ్మద్ బౌలింగ్ అటాక్ ఆరంభించగా.. తన పేస్ పదనుతో జింబాబ్వేకు తొలి ఓవర్లో కేవలం నాలుగు పరుగులే ఇచ్చాడు.ఇక రెండో ఓవర్ వేసిన అరంగట్రే పేసర్ తుషార్ దేశ్పాండే 11 పరుగులు ఇచ్చుకున్నాడు. ఈ క్రమంలో రెండు ఓవర్లు ముగిసే సరికి జింబాబ్వే 15 పరుగులు చేసింది. ఓపెనర్లు వెస్లీ 12, మరుమానీ మూడు పరుగులతో క్రీజులో ఉన్నారు. టాస్ గెలిచిన భారత జట్టుశనివారం నాటి మ్యాచ్లో గెలిచి సిరీస్ను కైవసం చేసుకోవాలని భారత్ పట్టుదలగా ఉంది. హరారే వేదికగా జరుగనున్న ఈ టీ20లో టాస్ గెలిచిన భారత జట్టు కెప్టెన్ శుబ్మన్ గిల్ తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు.తుషార్ దేశ్పాండే అరంగేట్రంఈ మ్యాచ్ ద్వారా పేస్ బౌలర్ తుషార్ దేశ్పాండే అరంగేట్రం చేస్తున్నట్లు గిల్ తెలిపాడు. ఆవేశ్ ఖాన్ స్థానంలో అతడిని తుదిజట్టుకు ఎంపిక చేసినట్లు వెల్లడించాడు.మరోవైపు.. తాము ఒక మార్పుతో బరిలోకి దిగుతున్నట్లు జింబాబ్వే కెప్టెన్ సికందర్ రజా తెలిపాడు. వెల్లింగ్టన్ మసకజ్ద స్థానంలో ఫరాజ్ అక్రం జట్టులోకి వచ్చినట్లు పేర్కొన్నాడు. -
జింబాబ్వేతో నాలుగో టీ20.. ధోని శిష్యుడి ఎంట్రీ!
జింబాబ్వేతో టీ20 సిరీస్పై టీమిండియా కన్నేసింది. శనివారం హరారే వేదికగా జరగనున్న నాలుగో టీ20లో జింబాబ్వేతో భారత్ తలపడనుంది. ఇప్పటికే 2-1 ఆధిక్యంలో ఉన్న భారత్.. ఈ మ్యాచ్లో ఎలాగైనా గెలిచి సిరీస్ను సొంతం చేసుకోవాలని భావిస్తోంది.తొలి టీ20లో అనూహ్య ఓటమి చవిచూసిన గిల్ బ్రిగేడ్.. తర్వాత రెండు టీ20ల్లో మాత్రం ప్రత్యర్ధిని చిత్తు చేసింది. అదే జోరును నాలుగో టీ20లో కొనసాగించాలని యంగ్ టీమిండియా భావిస్తోంది.ధోని శిష్యుడి ఎంట్రీ?అయితే ఈ మ్యాచ్లో భారత తుది జట్టులో కీలక మార్పులు చోటు చేసుకోనున్నట్లు తెలుస్తోంది. ఈ మ్యాచ్కు పేసర్లు ఖాలీల్ అహ్మద్, అవేష్ ఖాన్లకు విశ్రాంతి ఇవ్వనున్నట్లు సమాచారం. ఖాలీల్ స్ధానంలో ముంబై స్టార్ బౌలర్, చెన్నై సూపర్ కింగ్స్ పేసర్ తుషార్ దేశ్పాండే అంతర్జాతీయ అరగేట్రం చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.ధోని శిష్యుడిగా పేరొందిన దేశ్పాండేకు టీ20ల్లో అద్బుతమైన రికార్డు ఉంది. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ముంబైకు, ఐపీఎల్లో సీఎస్కేకు గత రెండు సీజన్లలో లీడింగ్ వికెట్ టేకర్గా నిలిచాడు. ఐపీఎల్-2024లో 17 వికెట్లు పడగొట్టిన తుషార్.. సయ్యద్ ముస్తాక్ ఆలీ ట్రోఫీలో 16 వికెట్లు సాధించాడు. ఈ క్రమంలోనే అతడికి చోటు ఇవ్వాలని మెనెజ్మెంట్ భావిస్తున్నట్లు వినికిడి. అదేవిధంగా అవేష్ ఖాన్ స్ధానంలో పేసర్ ముఖేష్ కుమార్ తిరిగి జట్టులోకి వచ్చే అవకాశముంది.జింబాబ్వేతో నాలుగో టీ20కు భారత తుది జట్టు(అంచనా): శుబ్మన్ గిల్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, అభిషేక్ శర్మ, రుతురాజ్ గైక్వాడ్, సంజు శాంసన్ (వికెట్ కీపర్), శివమ్ దూబే, రింకూ సింగ్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, తుషార్ దేశ్పాండే, ముఖేష్ కుమార్. -
జింబాబ్వేతో మూడో టీ20.. గిల్పై అభిమానుల ఆగ్రహం
ఐదు మ్యాచ్ల సిరీస్లో భాగంగా జింబాబ్వేతో జరిగిన మూడో టీ20లో టీమిండియా 23 పరుగుల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్లో భారత కెప్టెన్ శుభ్మన్ గిల్ మెరుపు అర్దసెంచరీతో (49 బంతుల్లో 66; 7 ఫోర్లు, 3 సిక్సర్లు) సత్తా చాటి జట్టు విజయంలో ప్రధానపాత్ర పోషించాడు. గిల్ చాన్నాళ్ల తర్వాత ఈ మ్యాచ్తోనే ఫామ్లోకి వచ్చినా ఓ విషయంలో మాత్రం అభిమానుల నుంచి ఛీత్కారాలు ఎదుర్కొంటున్నాడు.విషయం ఏంటంటే.. శుభ్మన్ గిల్.. మూడో టీ20లో తాను ఓపెనర్గా బరిలోకి దిగడం కోసం రెండో టీ20లో ఓపెనర్గా వచ్చి సెంచరీ చేసిన అభిషేక్ శర్మను డిమోట్ చేశాడు. సూపర్ ఫామ్లో ఉన్న అభిషేక్ స్థానచలనం కలగడంతో ఈ మ్యాచ్లో కేవలం 10 పరుగులకే ఔటయ్యాడు. ఇదే అభిమానులకు గిల్పై ఆగ్రహం తెప్పించింది. గిల్ తన స్వార్దం కోసం జట్టు ప్రయోజనాలను గాలికి వదిలేయడంతో పాటు అభిషేక్ లయను దెబ్బ తీశాడని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మ్యాచ్ అనంతరం గిల్ ఈ విషయాన్ని కవర్ చేసుకునే ప్రయత్నం (అభిషేక్ స్పిన్నర్లను బాగా ఎదుర్కొంటాడని చెప్పాడు) చేసినా అభిమానులు అతన్ని టార్గెట్ చేస్తూనే ఉన్నారు. గిల్ మరో కోహ్లిలా (వ్యక్తిగత రికార్డుల విషయంలో) ఉన్నాడని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.మొత్తానికి యశస్వి జైస్వాల్ రాకతో టీమిండియాకు కొత్త చిక్కే (ఓపెనర్ల విషయంలో) వచ్చి పడింది. టీ20 వరల్డ్కప్ విన్నింగ్ టీమ్లో సభ్యుడైన యశస్వి లేటుగా (మూడో టీ20) జట్టుతో జతకట్టిన విషయం తెలిసిందే.కాగా, బ్యాటింగ్లో గిల్, రుతురాజ్ (49).. బౌలింగ్లో వాషింగ్టన్ సుందర్ (4-0-15-3), ఆవేశ్ ఖాన్ (4-0-39-2), ఖలీల్ అహ్మద్ (4-0-16-1) సత్తా చాటడంతో మూడో టీ20లో టీమిండియా జింబాబ్వేను చిత్తుగా ఓడించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేయగా.. ఛేదనలో పోటీపడలేకపోయిన జింబాబ్వే నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 159 పరుగులకే పరిమితమైంది. నాలుగో టీ20 జులై 13న జరుగనుంది. -
‘జడ్డూ వారసుడు’.. వాషింగ్టన్ సుందర్ రియాక్షన్ ఇదే
జింబాబ్వేతో టీ20 సిరీస్లో టీమిండియా యువ ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ నిలకడగా రాణిస్తున్నాడు. మొదటి మ్యాచ్లో 27 పరుగులు చేయడంతో పాటు.. కీలక సమయంలో రెండు వికెట్లు తీశాడు.ఆ మ్యాచ్ల్ భారత్ ఓడినా వాషీ మాత్రం ఆకట్టుకున్నాడు. ఇక రెండో టీ20లో టాపార్డర్ అదరగొట్టడంతో సుందర్కు బ్యాటింగ్ చేసే అవకాశమే రాలేదు. ఈ మ్యాచ్లో టీమిండియా 234 భారీ స్కోరు నెలకొల్పగా.. జింబాబ్వే 134 పరుగులకే కుప్పకూలింది.ఇందులో వాషింగ్టన్ సుందర్ కూడా తన వంతు పాత్ర పోషించాడు. జొనాథన్ కాంప్బెల్ వికెట్ దక్కించుకోవడంతో పాటు లోయర్ ఆర్డర్లో నిలదొక్కుకున్న ల్యూక్ జోంగ్వే ఇచ్చిన క్యాచ్ పట్టాడు.ఈ మ్యాచ్లో శుబ్మన్ గిల్ సేన 100 పరుగుల తేడాతో గెలుపొందింది. ఇక కీలకమైన మూడో టీ20లోనూ 23 పరుగుల తేడాతో జయభేరి మోగించింది. ఇందులో వాషింగ్టన్ సుందర్దే కీలక పాత్ర.హరారే వేదికగా బుధవారం నాటి మ్యాచ్లో టీమిండియా విధించిన 183 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో జింబాబ్వే తడబడింది. భారత బౌలర్ల దెబ్బకు నిర్ణీత 20 ఓవర్లలో 159 పరుగులకే పరిమితమైంది.వాషింగ్టన్ సుందర్ అద్భుత బౌలింగ్(3/15)తో రాణించి టీమిండియాను గెలిపించాడు. తద్వారా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు.ఈ నేపథ్యంలో విజయానంతరం వాషింగ్టన్ సుందర్ మాత్రం మాట్లాడుతూ.. దేశానికి ఆడటం తనకు ఎల్లప్పుడూ అద్భుతంగా అనిపిస్తుందని పేర్కొన్నాడు. తీవ్ర ఒత్తిడి నెలకొన్నా ప్రణాళికలను పక్కా అమలు చేసి గెలుపొందామని హర్షం వ్యక్తం చేశాడు.ఈ సందర్భంగా.. టీ20లలో స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా స్థానాన్ని భర్తీ చేసేందుకు సిద్ధంగా ఉన్నారా అంటూ వాషీకి ప్రశ్న ఎదురైంది. ఇందుకు బదులిస్తూ.. ‘‘జట్టు కోసం నేనేం చేయగలనో అన్నీ చేస్తాను.ప్రతీ మ్యాచ్ కోసం పూర్తి స్థాయిలో సన్నద్ధమవుతాను. ప్రతీసారి నా అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చేందుకు కృషి చేస్తాను. ఆ విషయంలో మాత్రం అస్సలు రాజీ పడను’’ అని వాషింగ్టన్ సుందర్ పేర్కొన్నాడు. తనకు అప్పజెప్పిన బాధ్యతలను పూర్తి చేయడంపై మాత్ర దృష్టి సారిస్తానని స్పష్టం చేశాడు.కాగా చెన్నైకి చెందిన వాషింగ్టన్ సుందర్ 2021లో టీమిండియా తరఫున అరంగేట్రం చేశాడు. లెఫ్టాండ్ బ్యాటర్ అయిన వాషీ.. రైటార్మ్ ఆఫ్ బ్రేక్ స్పిన్నర్.ఇప్పటి వరకు అంతర్జాతీయ క్రికెట్లో 4 టెస్టులు, 19వన్డేలు, 46 టీ20లు ఆడి 265, 265, 134 పరుగులు చేశాడు. అదే విధంగా ఆయా ఫార్మాట్లలో ఆరు, 18, 40 వికెట్లు తీశాడు వాషింగ్టన్ సుందర్. కాగా టీ20 ప్రపంచకప్-2024 ముగిసిన తర్వాత రవీంద్ర జడేజా అంతర్జాతీయ టీ20లకు గుడ్బై చెప్పిన విషయం తెలిసిందే. -
వారెవ్వా.. సూపర్ క్యాచ్! పక్షిలా ఎగురుతూ (వీడియో)
హరారే వేదికగా జింబాబ్వేతో జరిగిన మూడో టీ20లో టీమిండియా స్పిన్నర్ రవి బిష్ణోయ్ అద్భుతమైన క్యాచ్తో మెరిశాడు. కళ్లు చెదిరే క్యాచ్తో జింబాబ్వే బ్యాటర్ బ్రియాన్ బెన్నెట్ను బిష్ణోయ్ పెవిలియన్కు పంపాడు. జింబాబ్వే ఇన్నింగ్స్ మూడో ఓవర్ వేసిన పేసర్ అవేష్ ఖాన్.. తొలి బంతిని బెన్నట్కు ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్ దిశగా సంధిచాడు. ఈ క్రమంలో బెన్నట్ బ్యాక్వర్డ్ పాయింట్ దిశగా పవర్ ఫుల్ కట్షాట్ ఆడాడు.అయితే బ్యాక్వర్డ్ పాయింట్లో ఉన్న బిష్ణోయ్.. సూపర్మేన్లా గాల్లోకి జంప్ చేస్తూ సంచలన క్యాచ్ను అందుకున్నాడు. వెంటనే సహచర ఆటగాళ్లు అందరూ బిష్ణోయ్ వద్దకు వెళ్లి సెలబ్రేషన్స్ చేసుకున్నారు. ఈ క్యాచ్ చూసిన బ్యాటర్ బెన్నట్ కూడా బిత్తరపోయాడు. చేసేదేమి లేక బెన్నట్(4) పరుగులతో నిరాశతో మైదానాన్ని వీడాడు. ప్రస్తుతం ఈ సూపర్ క్యాచ్కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.ఇక ఈ మ్యాచ్లో జింబాబ్వేపై 23 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. దీంతో ఐదు మ్యాచ్ల సిరీస్లో 2-1 ఆధిక్యంలో భారత్ దూసుకెళ్లింది. ఇరు జట్ల మధ్య నాలుగో టీ20 జూలై 13న జరగనుంది. It's a bird ❌It's a plane ❌𝙄𝙩'𝙨 𝙍𝙖𝙫𝙞 𝘽𝙞𝙨𝙝𝙣𝙤𝙞 ✅Watch #ZIMvIND LIVE NOW on #SonyLIV 🍿 pic.twitter.com/yj1zvijSJu— Sony LIV (@SonyLIV) July 10, 2024 -
ఇది మాకు శుభసూచకం.. చాలా సంతోషంగా ఉంది: భారత కెప్టెన్
జింబాబ్వేతో టీ20 సిరీస్లో టీమిండియా వరుసగా రెండో విజయం నమోదు చేసింది. హరారే వేదికగా జింబాబ్వేతో జరిగిన మూడో టీ20లో 23 పరుగుల తేడాతో విజయం సాధించిన భారత్.. ఐదు మ్యాచ్ల సిరీస్లో 2-1ఆధిక్యంలో దూసుకెళ్లింది.ఈ మ్యాచ్లో భారత్ ఆల్రౌండ్తో షో తో అదరగొట్టింది. తొలుత బ్యాటింగ్లో 182 పరుగులు చేసిన టీమిండియా.. అనంతరం బౌలింగ్లో ఆతిథ్య జట్టును 159 పరుగులకే కట్టడి చేసింది. ఇక ఈ విజయంపై మ్యాచ్ అనంతరం టీమిండియా స్టాండింగ్ కెప్టెన్ శుబ్మన్ గిల్ స్పందించాడు. ఆల్రౌండ్షో కనబరిచిన భారత జట్టుపై గిల్ ప్రశంసల వర్షం కురిపించాడు."సిరీస్లో 2-1 ఆధిక్యంలోకి వెళ్లడం చాలా సంతోషంగా ఉంది. ఇది మాకు చాలా కీలకమైన మ్యాచ్. ఈ మ్యాచ్లో బ్యాటింగ్, బౌలింగ్లో అద్బుతంగా రాణించాము. ఈ వికెట్లో డబుల్ పేస్, బాల్ గ్రిప్పింగ్ ఎక్కువ ఉంది. ఇటువంటి పిచ్పై లెంగ్త్ బాల్స్ను హిట్ చేయడం అంత ఈజీకాదు.కానీ మా బ్యాటర్లు ఇక్కడ పరిస్థితులను బాగా ఆర్ధం చేసుకున్నారు. అందుకు తగ్గట్టే బ్యాటింగ్ చేశారు. ఇక బౌలర్లతో కూడా అదే విషయం చర్చించాము. ఇక్కడ బంతి ఎక్కువగా గ్రిప్ప్ అవుతుండడంతో ఏది చేయాలన్న కొత్త బంతితో చేయాలని మా బౌలర్లకు చెప్పాను.బంతి పాతదయ్యే కొద్దీ స్కోర్ చేయడం సులభం అని మాకు తెలుసు. అందుకు తగ్గట్టుగానే మా బౌలర్లు కొత్త బంతితో అద్బుతాలు సృష్టించారు. వరుస క్రమంలో వికెట్లు పడగొట్టి ఆదిలోనే ప్రత్యర్థిని కష్టాల్లో నెట్టారు.జట్టు విజయంలో ప్రతీ ఒక్కరూ తమ వంతు పాత్ర పోషిస్తున్నారు. నిజంగా ఇది భారత క్రికెట్కు శుభసూచికమని" పోస్ట్మ్యాచ్ ప్రేజేంటేషన్లో గిల్ పేర్కొన్నాడు. -
చరిత్ర సృష్టించిన టీమిండియా.. ప్రపంచంలోనే తొలి జట్టుగా
హరారే వేదికగా జింబాబ్వేతో జరిగిన మూడో టీ20లో 23 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. దీంతో ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో 1-2 ఆధిక్యంలోకి టీమిండియా దూసుకెళ్లింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో కెప్టెన్ శుబ్మన్ గిల్(66) టాప్ స్కోరర్గా నిలవగా.. రుతురాజ్ గైక్వాడ్(49) పరుగులతో రాణించాడు. జింబాబ్వే బౌలర్లలో ముజర్బానీ, రజా తలా రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం 183 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వే నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 159 పరుగులకే పరిమితమైంది.జింబాబ్వే బ్యాటర్లలో మైర్స్(65) పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా.. మదండే(37) ఆఖరిలో మెరుపులు మెరిపించినప్పటికీ జట్టును మాత్రం గెలిపించలేకపోయాడు. భారత బౌలర్లలో వాషింగ్టన్ సుందర్ మూడు వికెట్లు పడగొట్టగా.. అవేష్ ఖాన్ రెండు, ఖాలీల్ ఆహ్మద్ ఒక్క వికెట్ సాధించారు.చరిత్ర సృష్టించిన భారత్..ఇక ఈ మ్యాచ్లో విజయం సాధించిన టీమిండియా ఓ అరుదైన ఘనతను తమ పేరిట లిఖించుకుంది. భారత్కు ఇది పొట్టిఫార్మాట్లో 150వ విజయం కావడం విశేషం. దీంతో అంతర్జాతీయ టీ20ల్లో 150 విజయాలు నమోదు చేసిన తొలి జట్టుగా టీమిండియా చరిత్రకెక్కింది.టీమిండియా ఇప్పటవరకు 230 మ్యాచ్లు ఆడి 150 విజయాలు సాధించింది. కాగా టీ20ల్లో అత్యధిక విజయాలు సాధించిన జాబితాలో భారత్(150) అగ్రస్ధానంలో కొనసాగుతుండగా.. పాకిస్తాన్(142), న్యూజిలాండ్(111) మూడో స్ధానంలో కొనసాగుతున్నాయి. -
సత్తా చాటిన శుభ్మన్, సుందర్.. మూడో టీ20లో టీమిండియా గెలుపు
ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో భాగంగా జింబాబ్వేతో ఇవాళ (జులై 10) జరిగిన మూడో టీ20 టీమిండియా 23 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. శుభ్మన్ గిల్ (49 బంతుల్లో 66; 7 ఫోర్లు, 3 సిక్సర్లు), రుతురాజ్ గైక్వాడ్ (28 బంతుల్లో 49; 4 ఫోర్లు, 3 సిక్సర్లు), యశస్వి జైస్వాల్(27 బంతుల్లో 26; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) సత్తా చాటడంతో నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. రెండో మ్యాచ్లో సెంచరీతో చెలరేగిన అభిషేక్ శర్మ ఈ మ్యాచ్లో 10 పరుగులకే ఔటయ్యాడు. సంజూ శాంసన్ (12), రింకూ సింగ్ (1) అజేయంగా నిలిచారు. శుభ్మన్ గిల్ ఆరు ఇన్నింగ్స్ల తర్వాత టీ20ల్లో హాఫ్ సెంచరీ చేశాడు. జింబాబ్వే బౌలర్లలో సికందర్ రజా, ముజరబాని తలో రెండు వికెట్లు పడగొట్టారు.అనంతరం ఓ మోస్తరు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన జింబాబ్వే.. 39 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి ఘోర ఓటమి దిశగా సాగింది. అయితే డియాన్ మైర్స్ (65 నాటౌట్), మదండే (37) జింబాబ్వేను దారుణ పరాభవం బారిన పడకుండా తప్పించారు. వీరిద్దరు ఆరో వికెట్కు 77 పరుగులు జోడించారు. ఓ దశలో (మైర్స్, మదండే క్రీజ్లో ఉండగా) జింబాబ్వే టీమిండియాకు షాకిచ్చేలా కనిపించింది. అయితే ఇన్నింగ్స్ ఆఖర్లో భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో జింబాబ్వేకు ఓటమి తప్పలేదు. ఆ జట్టు నిర్ణీత ఓవర్లు పూర్తయ్యే సరికి 6 వికెట్ల నష్టానికి 159 పరుగులు మాత్రమే చేయగలిగింది. భారత బౌలర్లలో వాషింగ్టన్ సుందర్ (4-0-15-3), ఆవేశ్ ఖాన్ (4-0-39-2), ఖలీల్ అహ్మద్ (4-0-15-1) అద్భుతంగా బౌలింగ్ చేశారు. ఈ మ్యాచ్లో గెలుపుతో భారత్ ఐదు మ్యాచ్ల సిరీస్లో 2-1 ఆధిక్యంలోకి వెళ్లింది. నాలుగో టీ20 జులై 13న జరుగనుంది. కాగా, తొలి మ్యాచ్లో జింబాబ్వే, రెండో మ్యాచ్లో టీమిండియా విజయం సాధించిన విషయం తెలిసిందే. -
రోహిత్ శర్మను దాటేసిన యశస్వి జైస్వాల్
జింబాబ్వేతో జరుగుతున్న మూడో టీ20లో మెరుపు ఇన్నింగ్స్ (27 బంతుల్లో 26; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) ఆడిన యశస్వి జైస్వాల్ ఈ ఏడాది అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్గా రికార్డుల్లోకెక్కాడు. యశస్వి ఈ ఏడాది 14 ఇన్నింగ్స్ల్లో (అన్ని ఫార్మాట్లలో) 65.23 సగటున, 85.82 స్ట్రయిక్రేట్తో 848 పరుగులు చేశాడు. యశస్వి తర్వాత ఈ ఏడాది అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా ఇబ్రహీం జద్రాన్ (ఆఫ్ఘనిస్తాన్) ఉన్నాడు. జద్రాన్ 27 ఇన్నింగ్స్ల్లో 33.76 సగటున, 80.76 స్ట్రయిక్రేట్తో 844 పరుగులు చేశాడు. యశస్వి ఈ ఏడాది హయ్యెస్ట్ రన్ స్కోరర్గా మారే క్రమంలో టీమిండియా సారధి రోహిత్ శర్మను అధిగమించాడు. హిట్మ్యాన్ ఈ ఏడాది మూడు ఫార్మాట్లలో 22 ఇన్నింగ్స్లు ఆడి 833 పరుగులు చేశాడు.జింబాబ్వే, భారత్ మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్లో టీమిండియా టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసింది. శుభ్మన్ గిల్ (49 బంతుల్లో 66; 7 ఫోర్లు, 3 సిక్సర్లు), రుతురాజ్ గైక్వాడ్ (28 బంతుల్లో 49; 4 ఫోర్లు, 3 సిక్సర్లు), యశస్వి జైస్వాల్ సత్తా చాటడంతో భారత్ నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. రెండో మ్యాచ్లో సెంచరీతో చెలరేగిన అభిషేక్ శర్మ ఈ మ్యాచ్లో 10 పరుగులకే ఔటయ్యాడు. సంజూ శాంసన్ (12), రింకూ సింగ్ (1) అజేయంగా నిలిచారు. శుభ్మన్ గిల్ ఆరు ఇన్నింగ్స్ల తర్వాత టీ20ల్లో హాఫ్ సెంచరీ చేశాడు. జింబాబ్వే బౌలర్లలో సికందర్ రజా, ముజరబాని తలో రెండు వికెట్లు పడగొట్టారు. కాగా, ఈ సిరీస్లో తొలి టీ20 జింబాబ్వే.. రెండో మ్యాచ్ భారత్ గెలిచిన విషయం తెలిసిందే. -
ఎట్టకేలకు ఫామ్లోకి వచ్చిన గిల్.. జింబాబ్వే టార్గెట్ 183
హరారే వేదికగా జింబాబ్వేతో జరుగుతున్న మూడో టీ20లో టీమిండియా ఓ మోస్తరు స్కోర్ చేసింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. శుభ్మన్ గిల్ (49 బంతుల్లో 66; 7 ఫోర్లు, 3 సిక్సర్లు), రుతురాజ్ గైక్వాడ్ (28 బంతుల్లో 49; 4 ఫోర్లు, 3 సిక్సర్లు), యశస్వి జైస్వాల్(27 బంతుల్లో 26; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) సత్తా చాటారు. రెండో మ్యాచ్లో సెంచరీతో చెలరేగిన అభిషేక్ శర్మ ఈ మ్యాచ్లో 10 పరుగులకే ఔటయ్యాడు. సంజూ శాంసన్ (12), రింకూ సింగ్ (1) అజేయంగా నిలిచారు. శుభ్మన్ గిల్ ఆరు ఇన్నింగ్స్ల తర్వాత టీ20ల్లో హాఫ్ సెంచరీ చేశాడు. జింబాబ్వే బౌలర్లలో సికందర్ రజా, ముజరబాని తలో రెండు వికెట్లు పడగొట్టారు. కాగా, ఈ సిరీస్లో తొలి టీ20 జింబాబ్వే.. రెండో మ్యాచ్ భారత్ గెలిచిన విషయం తెలిసిందే.తుది జట్లు..భారత్: యశస్వి జైస్వాల్, అభిషేక్ శర్మ, శుభమన్ గిల్(కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, సంజు శాంసన్(వికెట్కీపర్), శివమ్ దూబే, రింకూ సింగ్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అవేష్ ఖాన్, ఖలీల్ అహ్మద్జింబాబ్వే: తాడివానాషే మారుమణి, వెస్లీ మాధేవేరే, బ్రియాన్ బెన్నెట్, డియోన్ మైయర్స్, సికందర్ రజా (కెప్టెన్), జోనాథన్ కాంప్బెల్, క్లైవ్ మదాండే(వికెట్కీపర్), వెల్లింగ్టన్ మసకద్జా, రిచర్డ్ నగరవ, బ్లెస్సింగ్ ముజరబానీ, టెండై చతారా -
IND VS ZIM: మూడో టీ20లో టీమిండియా విజయం.. సిరీస్లో ఆధిక్యం
మూడో టీ20లో టీమిండియా విజయం.. సిరీస్లో ఆధిక్యంఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో భాగంగా జింబాబ్వేతో ఇవాళ (జులై 10) జరిగిన మూడో టీ20 టీమిండియా 23 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. శుభ్మన్ గిల్ (49 బంతుల్లో 66; 7 ఫోర్లు, 3 సిక్సర్లు), రుతురాజ్ గైక్వాడ్ (28 బంతుల్లో 49; 4 ఫోర్లు, 3 సిక్సర్లు), యశస్వి జైస్వాల్(27 బంతుల్లో 26; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) సత్తా చాటడంతో నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది.అనంతరం ఓ మోస్తరు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన జింబాబ్వే.. నిర్ణీత ఓవర్లు పూర్తయ్యే సరికి 6 వికెట్ల నష్టానికి 159 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఈ మ్యాచ్లో గెలుపుతో భారత్ ఐదు మ్యాచ్ల సిరీస్లో 2-1 ఆధిక్యంలోకి వెళ్లింది. నాలుగో టీ20 జులై 13న జరుగనుంది. కాగా, తొలి మ్యాచ్లో జింబాబ్వే, రెండో మ్యాచ్లో టీమిండియా విజయం సాధించిన విషయం తెలిసిందే. ఆరో వికెట్ కోల్పోయిన జింబాబ్వే16.3వ ఓవర్: 116 పరుగుల వద్ద జింబాబ్వే ఆరో వికెట్ కోల్పోయింది. సుందర్ బౌలింగ్లో రింకూ సింగ్కు క్యాచ్ ఇచ్చి మదండే (37) ఔటయ్యాడు. 39 పరుగులకే సగం వికెట్లు కోల్పోయిన జింబాబ్వే7.6వ ఓవర్: 183 పరుగుల లక్ష్య ఛేదనలో జింబాబ్వే 39 పరుగులకే సగం వికెట్లు కోల్పోయింది. 39 పరుగుల వద్ద సుందర్ బౌలింగ్లో సబ్స్టిట్యూట్ రియాన్ పరాగ్కు క్యాచ్ ఇచ్చి జోనాథన్ క్యాంప్బెల్ (1) ఔటయ్యాడు. 37 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయిన జింబాబ్వే6.2వ ఓవర్: 37 పరుగుల వద్ద జింబాబ్వే నాలుగో వికెట్ కోల్పోయింది. వాషింగ్టన్ సుందర్ బౌలింగ్లో రింకూ సింగ్కు క్యాచ్ ఇచ్చి సికందర్ రజా (15) ఔటయ్యాడు. 19 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన జింబాబ్వే3.1వ ఓవర్: 19 పరుగుల వద్ద జింబాబ్వే రెండు వికెట్లు కోల్పోయింది. 2.4వ ఓవర్లో ఖలీల్ అహ్మద్ బౌలింగ్లో శివమ్ దూబేకి క్యాచ్ ఇచ్చి మరుమణి (13) ఔట్ కాగా.. 3.1వ ఓవర్లో ఆవేశ్ ఖాన్ బౌలింగ్లో బిష్ణోయ్కు క్యాచ్ ఇచ్చి బ్రియాన్ బెన్నెట్ (4) పెవిలియన్కు చేరాడు. తొలి వికెట్ కోల్పోయిన జింబాబ్వే1.1వ ఓవర్: 9 పరుగుల వద్ద జింబాబ్వే తొలి వికెట్ కోల్పోయింది. ఆవేశ్ ఖాన్ బౌలింగ్లో అభిషేక్ శర్మకు క్యాచ్ ఇచ్చి మెదెవెరె (1) ఔటయ్యాడు.జింబాబ్వే టార్గెట్ 183టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్ 36, శుభ్మన్ గిల్ 66, అభిషేక్ శర్మ 10, రుతురాజ్ గైక్వాడ్ 49 పరుగులు చేసి ఔట్ కాగా.. సంజూ శాంసన్ (12), రింకూ సింగ్ (1) నాటౌట్గా మిగిలారు. జింబాబ్వే బౌలర్లలో సికందర్ రజా, ముజరబాని తలో రెండు వికెట్లు పడగొట్టారు.నాలుగో వికెట్ కోల్పోయిన టీమిండియా19.4వ ఓవర్: 177 పరుగుల వద్ద టీమిండియా నాలుగో వికెట్ కోల్పోయింది. ముజరబాని బౌలింగ్లో మధెవెరెకు క్యాచ్ ఇచ్చి రుతురాజ్ (49) ఔటయ్యాడు.మూడో వికెట్ కోల్పోయిన టీమిండియా17.5వ ఓవర్: 153 పరుగుల వద్ద టీమిండియా మూడో వికెట్ కోల్పోయింది. ముజరబాని బౌలింగ్లో సికందర్ రజాకు క్యాచ్ ఇచ్చి శుభ్మన్ గిల్ (66) ఔటయ్యాడు.రెండో వికెట్ కోల్పోయిన టీమిండియా10.3వ ఓవర్: 81 పరుగుల వద్ద టీమిండియా రెండో వికెట్ కోల్పోయింది. సికందర్ రజా బౌలింగ్లో మరుమణికి క్యాచ్ ఇచ్చి అభిషేక్ శర్మ (10) ఔటయ్యాడు.తొలి వికెట్ కోల్పోయిన టీమిండియా8.1వ ఓవర్: 67 పరుగుల వద్ద టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. సికందర్ రజా బౌలింగ్లో బ్రియాన్ బెన్నెట్కు క్యాచ్ ఇచ్చి యశస్వి జైస్వాల్ (36) ఔటయ్యాడు.హరారే వేదికగా జింబాబ్వేతో ఇవాళ (జులై 10) జరుగుతున్న మూడో టీ20లో టీమిండియా టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్లో టీమిండియా నాలుగు మార్పులతో బరిలోకి దిగనుంది. టీ20 వరల్డ్కప్ విన్నింగ్ టీమ్లోని సభ్యులు యశస్వి జైస్వాల్, సంజూ శాంసన్, శివమ్ దూబే ఈ మ్యాచ్కు అందుబాటులోకి వచ్చారు. ముకేశ్ కుమార్ స్థానంలో ఖలీల్ అహ్మద్ తుది జట్టులోకి వచ్చాడు. మరోవైపు జింబాబ్వే ఈ మ్యాచ్ కోసం రెండు మార్పులు చేసింది. ఇన్నోసెంట్ కాలా స్థానంలో మారుమణి.. లూక్ జాంగ్వే స్థానంలో నగరవ తుది జట్టులోకి వచ్చారు.తుది జట్లు..భారత్: యశస్వి జైస్వాల్, అభిషేక్ శర్మ, శుభమన్ గిల్(కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, సంజు శాంసన్(వికెట్కీపర్), శివమ్ దూబే, రింకూ సింగ్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అవేష్ ఖాన్, ఖలీల్ అహ్మద్జింబాబ్వే: తాడివానాషే మారుమణి, వెస్లీ మాధేవేరే, బ్రియాన్ బెన్నెట్, డియోన్ మైయర్స్, సికందర్ రజా (కెప్టెన్), జోనాథన్ కాంప్బెల్, క్లైవ్ మదాండే(వికెట్కీపర్), వెల్లింగ్టన్ మసకద్జా, రిచర్డ్ నగరవ, బ్లెస్సింగ్ ముజరబానీ, టెండై చతారా -
Ind vs Zim: ఆ ముగ్గురిపై వేటు.. దూబేకూ చోటు
జింబాబ్వేతో మూడో టీ20లో టీమిండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. హరారే వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్తో ప్రపంచకప్-2024 విజేత జట్టులోని ముగ్గురు స్టార్లు పునరాగమనం చేశారు.ఓపెనర్ యశస్వి జైస్వాల్, వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్, పవర్ హిట్టర్ శివం దూబే తుదిజట్టులో చోటు దక్కించుకున్నారు. వీరి రాకతో సాయి సుదర్శన్, ధ్రువ్ జురెల్లపై వేటు పడింది.అదే విధంగా.. పేసర్ ముకేశ్ కుమార్కు విశ్రాంతినిచ్చారు. ఈ నేపథ్యంలో టాస్ సందర్భంగా టీమిండియా కెప్టెన్ శుబ్మన్ గిల్ మాట్లాడుతూ.. వరల్డ్కప్ విన్నర్ల రాకతో తమ జట్టు మరింత పటిష్టమైందని పేర్కొన్నాడు.తుది జట్లు..భారత్: యశస్వి జైస్వాల్, అభిషేక్ శర్మ, శుభమన్ గిల్(కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, సంజు శాంసన్(వికెట్కీపర్), శివమ్ దూబే, రింకూ సింగ్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అవేష్ ఖాన్, ఖలీల్ అహ్మద్జింబాబ్వే: తాడివానాషే మారుమణి, వెస్లీ మాధేవేరే, బ్రియాన్ బెన్నెట్, డియోన్ మైయర్స్, సికందర్ రజా (కెప్టెన్), జోనాథన్ కాంప్బెల్, క్లైవ్ మదాండే(వికెట్కీపర్), వెల్లింగ్టన్ మసకద్జా, రిచర్డ్ నగరవ, బ్లెస్సింగ్ ముజరబానీ, టెండై చతారా. -
Ind vs Zim: యశస్వి, సంజూ ఎంట్రీ.. వాళ్లిద్దరికి నో ఛాన్స్!
జింబాబ్వేతో కీలకమైన మూడో టీ20కి టీమిండియా సన్నద్ధమైంది. హరారే వేదికగా ఇరు జట్ల మధ్య బుధవారం ఈ మ్యాచ్ జరుగనుంది. కాగా యశస్వి జైస్వాల్, సంజూ శాంసన్, శివమ్ దూబే చేరికతో భారత జట్టు మరింత పటిష్టంగా మారింది.అయితే, అదే సమయంలో తుదిజట్టు కూర్పు కూడా తలనొప్పిగా మారింది. ఇప్పటికే కెప్టెన్ శుబ్మన్ గిల్కు ఓపెనింగ్ జోడీగా అభిషేక్ శర్మ కుదురుకున్నాడు. తొలి టీ20లో అభిషేక్ విఫలమైనా.. రెండో టీ20లో అద్భుత సెంచరీతో జట్టును గెలిపించాడు.కాబట్టి ఈ పంజాబీ బ్యాటర్ను తప్పించేందుకు మేనేజ్మెంట్ సుముఖత చూపకపోవచ్చు. ఈ నేపథ్యంలో మరో ఓపెనింగ్ బ్యాటర్ యశస్వి జైస్వాల్ను ఆడించే విషయంలో సందిగ్దం నెలకొంది. ఈ క్రమంలో అతడిని జట్టులో చేర్చాలంటే కెప్టెన్ శుబ్మన్ గిల్ వన్డౌన్లో ఆడే అవకాశం కనిపిస్తోంది.వికెట్ కీపర్గా అతడికే ఛాన్స్యశస్వి- అభిషేక్ భారత ఇన్నింగ్స్ ఆరంభించనున్నట్లు సమాచారం. దీంతో బ్యాటర్ సాయి సుదర్శన్పై వేటు పడే అవకాశం ఉంది. మరోవైపు.. సంజూ శాంసన్ రాకతో వికెట్ కీపర్ బ్యాటర్ ధ్రువ్ జురెల్ స్థానం ప్రశ్నార్థకమైంది.అనుభవజ్ఞుడైన సంజూ శాంసన్ వైపే మొగ్గుచూపిన యాజమాన్యం.. వికెట్ కీపర్గా అతడికే ఛాన్స్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.కాగా టీ20 ప్రపంచకప్-2024 జట్టులో ఉన్నా ఆడే అవకాశం రాని యశస్వి, సంజూలను ఈ మ్యాచ్లో తప్పక ఆడించాలనే యోచనలో ఉన్న బీసీసీఐ.. శివం దూబేకు మాత్రం విశ్రాంతినివ్వనున్నట్లు తెలుస్తోంది.ఒకే ఒక్క మార్పుతోఇదిలా ఉంటే .. జింబాబ్వే ఒకే ఒక్క మార్పుతో బరిలోకి దిగన్నుట్లు సమాచారం. లెఫ్టార్మ్ పేసర్ రిచర్డ్ ఎన్గరవా ఫిట్నెస్ సాధిస్తే.. ల్యూక్ జాంగ్వేకు ఉద్వాసన పలుకనున్నట్లు తెలుస్తోంది. కాగా ఐదు మ్యాచ్ల సిరీస్లో ప్రస్తుతం 1-1తో ఇరు జట్లు సమంగా ఉన్న విషయం తెలిసిందే. ఇక మూడో టీ20 బుధవారం సాయంత్రం గం. 4:30 నుంచి సోనీ స్పోర్ట్స్లో ప్రత్యక్ష ప్రసారం కానుంది.పిచ్ స్వభావం, వాతావరణంహరారే పిచ్ బౌలర్లు, బ్యాటర్లకు సమంగా అనుకూలించనున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ మ్యాచ్కు వర్ష సూచన లేదు.జింబాబ్వేతో మూడో టీ20కి భారత తుదిజట్టు(అంచనా)యశస్వి జైస్వాల్, అభిషేక్ శర్మ, శుబ్మన్ గిల్ (కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, రియాన్ పరాగ్, రింకు సింగ్, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అవేశ్ ఖాన్, ముకేష్ కుమార్.జింబాబ్వే తుదిజట్టు(అంచనా)వెస్లీ మెదవెరె, ఇన్నోసెంట్ కైయా, బ్రియాన్ బెన్నెట్, సికందర్ రజా (కెప్టెన్), డియాన్ మైయర్స్, జోనాథన్ క్యాంప్బెల్, క్లైవ్ మాండే (వికెట్ కీపర్), వెల్లింగ్టన్ మసకజ్ద, ల్యూక్ జాంగ్వే/ రిచర్డ్ ఎన్గరవా, బ్లెస్సింగ్ ముజరాబానీ, టెండాయ్ చతారా. The #T20WorldCup-winning trio is in the house... 👏 👏... and they are 𝙍𝙖𝙧𝙞𝙣𝙜 𝙏𝙤 𝙂𝙤! 💪 💪#TeamIndia | #ZIMvIND | @IamSanjuSamson | @IamShivamDube | @ybj_19 pic.twitter.com/E0rNOkHmTz— BCCI (@BCCI) July 9, 2024 -
ఆరు ఇన్నింగ్స్ల్లో ఒక్క ఫిఫ్టి కూడా లేదు.. ఈ "గిల్" మనకు అవసరమా..?
టీ20 వరల్డ్కప్ విజయానంతరం భారత సెలెక్టర్లు సీనియర్లకు విశ్రాంతినిచ్చి శుభ్మన్ గిల్ నేతృత్వంలోని కుర్ర జట్టును జింబాబ్వే పర్యటనకు పంపారు. ఈ పర్యటనను భారత్ ఘోర ఓటమితో ప్రారంభించి, ఆతర్వాతి మ్యాచ్లో ఘన విజయం సాధించింది. తద్వారా ఐదు మ్యాచ్లో సిరీస్లో సమంగా నిలిచింది.రెండో టీ20లో అంతా బాగుంది అనుకున్నా, ఒక్క విషయం మాత్రం టీమిండియాను తెగ కలవరపెడుతుంది. కెప్టెన్ గిల్ పేలవ ఫామ్ అభిమానులతో పాటు యాజమాన్యాన్ని ఆందోళనకు గురి చేస్తుంది. గిల్ గత 10 టీ20 ఇన్నింగ్స్ల్లో కేవలం ఒకే ఒక హాఫ్ సెంచరీ చేసి తన టీ20 కెరీర్ను ఇబ్బందుల్లోకి నెట్టుకున్నాడు. గిల్ ఆడిన గత ఆరు ఇన్నింగ్స్ల్లో అయితే కనీసం ఒక్క హాఫ్ సెంచరీ కూడా లేదు.ఈ పేలవ ఫామ్ కారణంగానే అతను టీ20 వరల్డ్కప్ జట్టుకు కూడా ఎంపిక కాలేదు. గిల్.. జింబాబ్వే పర్యటనలో అయినా ఫామ్లో వస్తాడని యాజమాన్యం అతన్ని ఈ టూర్కు ఎంపిక చేసింది. గిల్ ఇదే పేలవ ఫామ్ను కొనసాగిస్తే భవిష్యత్తులో టీ20 జట్టు నుంచి కనుమరుగవడం ఖాయమని విశ్లేషకులు అంటున్నారు. జింబాబ్వే పర్యటనలో తదుపరి మ్యాచ్ల్లో రాణించకపోతే టీ20 జట్టు నుంచి శాశ్వతంగా తప్పించడం ఖాయమని వారు అభిప్రాయపడుతున్నారు. సోషల్మీడియాలో గిల్ విపరీతమైన ట్రోలింగ్ను ఎదుర్కొంటున్నాడు. ఈ గిల్ మనకు అవసరమా అని టీమిండియా అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.రేసులో నిలబడగలడా..?రోహిత్, కోహ్లి టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించినా ఓపెనింగ్ స్థానం కోసం చాలామంది రేసులో ఉన్నారు. రెండో టీ20లో సెంచరీతో విరుచుకుపడిన అభిషేక్ శర్మ కొత్తగా శుభ్మన్ గిల్కు పోటీగా వచ్చాడు. ఇప్పటికే యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్ రేసులో ఉన్నారు. వీరందరి నుంచి పోటీని తట్టుకుని గిల్ ఏ మేరకు రాణిస్తాడో వేచి చూడాలి.గత 10 టీ20 ఇన్నింగ్స్ల్లో గిల్ స్కోర్లు..జింబాబ్వేతో రెండో టీ20- 2 (4)జింబాబ్వేతో తొలి టీ20- 31 (29)ఆఫ్ఘనిస్తాన్తో తొలి టీ20- 23 (12)సౌతాఫ్రికాతో మూడో టీ20- 12 (6)సౌతాఫ్రికాతో రెండో టీ20- 0 (2)వెస్టిండీస్తో ఐదో టీ20- 9 (9)వెస్టిండీస్తో నాలుగో టీ20- 77 (47)వెస్టిండీస్తో మూడో టీ20- 6 (11)వెస్టిండీస్తో రెండో టీ20- 7 (9)వెస్టిండీస్తో తొలి టీ20- 3 (9) -
అభి"షేక్" శర్మ.. రసెల్, హెడ్ కూడా దిగదుడుపే..!
భారత యువ కెరటం అభిషేక్ శర్మ పొట్టి క్రికెట్లో సరికొత్త సంచలనంగా మారాడు. రెండ్రోజుల కిందట జింబాబ్వేతో జరిగిన మ్యాచ్లో మెరుపు సెంచరీ చేసిన శర్మ.. ఈ ఏడాది ఆరంభం నుంచే మెరుపు ఇన్నింగ్స్లు ఆడటం మొదలుపెట్టాడు.ఈ ఏడాది ఇప్పటివరకు 18 మ్యాచ్లు ఆడిన శర్మ.. 200కు పైగా స్ట్రయిక్రేట్తో 584 పరుగులు చేశాడు. ప్రపంచవ్యాప్తంగా పొట్టి క్రికెట్లో ఈ ఏడాది ఇంత స్ట్రయిక్రేట్ ఎవ్వరికీ లేదు. అభిషేక ముందు ఆండ్రీ రసెల్ (199.47), జేక్ ఫ్రేజర్ మెక్గుర్క్ (194.13), ట్రవిస్ హెడ్ (176.24), ఫిలిప్ సాల్ట్ (172.67) కూడా దిగదుడుపే.ఇదిలా ఉంటే, జింబాబ్వేతో జరిగిన రెండో టీ20లో అభిషేక్ శర్మ 47 బంతుల్లో 7 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో శతక్కొట్టాడు. ఈ మ్యాచ్లో అభిషేక్తో పాటు రుతురాజ్ గైక్వాడ్ (47 బంతుల్లో 77 నాటౌట్; 11 ఫోర్లు, సిక్సర్), రింకూ సింగ్ (22 బంతుల్లో 48 నాటౌట్; 2 ఫోర్లు, 5 సిక్సర్లు) కూడా చెలరేగడంతో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ భారీ స్కోర్ (2 వికెట్ల నష్టానికి 234 పరుగులు) చేసింది. అనంతరం ఛేదనలో చేతులెత్తేసిన జింబాబ్వే.. ముకేశ్ కుమార్ (3.4-0-37-3), ఆవేశ్ ఖాన్ (3-0-15-3), రవి బిష్ణోయ్ (4-0-11-2), వాషింగ్టన్ సుందర్ (4-0-28-1) ధాటికి 18.4 ఓవర్లలో 134 పరుగులకే కుప్పకూలి ఘోర పరాజయాన్ని (100 పరుగుల తేడాతో) మూటగట్టుకుంది. ఈ మ్యాచ్లో గెలుపుతో భారత్.. తొలి టీ20లో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకుంది. ప్రస్తుతం ఐదు మ్యాచ్ల ఈ సిరీస్లో భారత్, జింబాబ్వే చెరో విజయంతో సమంగా ఉన్నాయి. మూడో మ్యాచ్ జులై 10న జరుగనుంది. -
కోహ్లి, రోహిత్ లేని లోటు పూడ్చగలిగేది వాళ్దిద్దరే: మాజీ క్రికెటర్
టీ20 ప్రపంచకప్-2024తో టీమిండియాలో ఒక శకం ముగిసింది. దిగ్గజ బ్యాటర్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ అంతర్జాతీయ టీ20లకు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో పొట్టి ఫార్మాట్లో.. భారత జట్టులో ఈ ఇద్దరి మేటి ఆటగాళ్ల స్థానాన్ని భర్తీ చేయగల ఆటగాళ్లు ఎవరా అన్న చర్చ నడుస్తోంది. ఈ క్రమంలో జింబాబ్వే మాజీ క్రికెటర్ హామిల్టన్ మసకజ్ద ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.టీ20లలో విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ వారసులు వీరేనంటూ ఇద్దరు యువ తరంగాల పేర్లు చెప్పాడు. కాగా అమెరికా- వెస్టిండీస్ వేదికగా జరిగిన వరల్డ్కప్-2024లో భారత్ విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. పదకొండేళ్ల నిరీక్షణకు తెరదించుతూ రోహిత్ సేన ఐసీసీ ట్రోఫీని ముద్దాడింది.ఐపీఎల్ వీరులకు లైన్ క్లియర్ఈ క్రమంలో సౌతాఫ్రికాతో ఫైనల్లో విజయానంతరం కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లి, ఆల్రౌండర్ రవీంద్ర జడేజా అంతర్జాతీయ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించారు. దీంతో ఐపీఎల్ వీరులకు జాతీయ జట్టులో ఎంట్రీకి మార్గం సుగమమైంది.ఇందుకు తగ్గట్లుగా మెగా టోర్నీ ముగిసిన వెంటనే జింబాబ్వేతో టీ20 సిరీస్కు అభిషేక్ శర్మ, రియాన్ పరాగ్, సాయి సుదర్శన్ వంటి ఆటగాళ్లు తొలిసారిగా ఎంపికయ్యారు. అయితే, అనూహ్య రీతిలో జింబాబ్వేతో తొలి టీ20లో ఓటమి పాలైన యువ భారత జట్టు... రెండో టీ20లో మాత్రం సత్తా చాటింది.ఆతిథ్య జట్టును ఏకంగా వంద పరుగుల తేడాతో చిత్తు చేసి ఐదు మ్యాచ్ల సిరీస్ను ప్రస్తుతం 1-1తో సమం చేసింది. ఈ క్రమంలో టీమిండియా కెప్టెన్గా తొలిసారి వ్యవహరిస్తున్న శుబ్మన్ గిల్ ఖాతాలో విజయం చేరింది.కోహ్లి, రోహిత్ లేని లోటు పూడ్చగలిగేది వాళ్లిద్దరేఈ నేపథ్యంలో హామిల్టన్ మసకజ్ద చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. భారత జట్టులో విరాట్ కోహ్లి, రోహిత్ శర్మలకు ప్రత్యామ్నాయం శుబ్మన్ గిల్, యశస్వి జైస్వాల్ అని ఈ జింబాబ్వే మాజీ ఆటగాడు పేర్కొనడం విశేషం.‘‘భారత క్రికెట్ జట్టు పరివర్తన దశలో ఉంది. అందరి కంటే ఎక్కువగా శుబ్మన్ గిల్ నా దృష్టిని ఆకర్షిస్తున్నాడు. మూడు ఫార్మాట్లలో అతడు చాలా కాలంగా తనదైన శైలిలో రాణిస్తున్నాడు.మేటి ఆటగాళ్ల స్థానాన్ని భర్తీ చేయగల సత్తా అతడికి ఉంది.ఇక యశస్వి సైతం అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ను అద్భుతంగా సాగించలగలడనే నమ్మకం నాకు ఉంది. గిల్, యశస్వి.. వీళ్లిద్దరే వరల్డ్క్లాస్ క్రికెటర్ల నిష్క్రమణ వల్ల ఏర్పడిన శూన్యాన్ని పూడ్చగలరు’’ అని మసకజ్ద అభిప్రాయపడ్డాడు.చదవండి: BCCI: ద్రవిడ్కు రూ. 5 కోట్లు.. రోహిత్, కోహ్లి సహా వారందరికీ ఎంతంటే? -
రింకూ సింగ్ ఖాతాలో ప్రత్యేక రికార్డు.. ధోని, విరాట్ కంటే వేగంగా..!
జింబాబ్వేతో జరిగిన రెండో టీ20లో భారత అప్ కమింగ్ స్టార్ రింకూ సింగ్ ఓ ప్రత్యేకమైన రికార్డు నెలకొల్పాడు. ఈ మ్యాచ్లో 22 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 48 పరుగులు చేసి అజేయంగా నిలిచిన రింకూ.. భారత్ తరఫున టీ20ల్లో చివరి రెండు ఓవర్లలో అత్యధిక సిక్సర్లు (18) బాదిన ఆటగాళ్ల జాబితాలో నాలుగో స్థానానికి ఎగబాకాడు. ఈ జాబితాలో హార్దిక్ పాండ్యా (32 సిక్సర్లు) టాప్లో ఉండగా.. విరాట్ (24), ధోని (19) రెండు, మూడు స్థానాల్లో నిలిచారు. 32 సిక్సర్ల మార్కును చేరుకునేందుకు హార్దిక్కు 193 బంతులు, 24 సిక్సర్ల మార్కును చేరుకునేందుకు కోహ్లికి 158 బంతులు, 19 సిక్సర్ల మార్కును చేరుకునేందుకు ధోనికి 258 బంతులు అవసరం కాగా.. రింకూ కేవలం 48 బంతుల్లోనే 18 సిక్సర్ల మార్కును తాకాడు. రింకూ కెరీర్లో చివరి రెండు ఓవర్లలో 334.69 స్ట్రయిక్రేట్తో పరుగులు సాధించడం గమనార్హం. తన టీ20 కెరీర్లో ఇప్పటివరకు (13 ఇన్నింగ్స్లు) 25 సిక్సర్లు బాదిన రింకూ.. 178.76 స్ట్రయిక్రేట్తో 80.8 సగటున 404 పరుగులు చేశాడు. అంతర్జాతీయ స్థాయిలో కనీసం 15 మ్యాచ్లు ఆడిన ఆటగాళ్లలో ఇవే అత్యుత్తమ గణాంకాలు. రింకూ తన టీ20 కెరీర్లో చేసిన స్కోర్లు ఇలా ఉన్నాయ. 38(21), 37*(15), 22*(14), 31*(9), 46(29), 6(8), 68*(39), 14(10), 16*(9), 9*(9), 69*(39), 0(2), 48*(22)🚨 WHAT A SHOT, RINKU 🚨 pic.twitter.com/gNZKRjAYZ9— Johns. (@CricCrazyJohns) July 7, 2024జింబాబ్వేతో రెండో టీ20లో 15వ ఓవర్లో క్రీజ్లోకి వచ్చిన రింకూ.. తొలి 14 బంతుల్లో కేవలం 18 పరుగులు మాత్రమే చేశాడు. చివరి రెండు ఓవర్లలో గేర్ మార్చిన రింకూ.. 8 బంతుల్లో 4 సిక్సర్లు, ఓ బౌండరీ బాది టీమిండియా భారీ స్కోర్కు దోహదపడ్డాడు. ఈ మ్యాచ్లో రింకూ కొట్టిన ఓ సిక్సర్ స్టేడియం బయటపడింది.ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా.. యువ ఓపెనర్ అభిషేక్ శర్మ (47 బంతుల్లో 100; 7 ఫోర్లు, 8 సిక్సర్లు) శతక్కొట్టడంతో నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 234 పరుగులు చేసింది. అభిషేక్తో పాటు రుతురాజ్ గైక్వాడ్ (47 బంతుల్లో 77 నాటౌట్; 11 ఫోర్లు, సిక్సర్), రింకూ సింగ్ కూడా చెలరేగడంతో భారత్ భారీ స్కోర్ చేసింది. అనంతరం ఛేదనలో చేతులెత్తేసిన జింబాబ్వే.. ముకేశ్ కుమార్ (3.4-0-37-3), ఆవేశ్ ఖాన్ (3-0-15-3), రవి బిష్ణోయ్ (4-0-11-2), వాషింగ్టన్ సుందర్ (4-0-28-1) ధాటికి 18.4 ఓవర్లలో 134 పరుగులకే కుప్పకూలి ఘోర పరాజయాన్ని (100 పరుగుల తేడాతో) మూటగట్టుకుంది. ఈ మ్యాచ్లో గెలుపుతో భారత్.. తొలి టీ20లో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకుంది. ప్రస్తుతం ఐదు మ్యాచ్ల ఈ సిరీస్లో భారత్, జింబాబ్వే చెరో విజయంతో సమంగా ఉన్నాయి. మూడో మ్యాచ్ జులై 10న జరుగనుంది. -
‘నేను డకౌట్ అయ్యాను.. యువీ పాజీ సంతోషించాడు’
‘‘మొదటి మ్యాచ్ తర్వాత కూడా నేను ఆయనతో మాట్లాడాను. నేను డకౌట్ అయినా సరే ఆయన ఎందుకో చాలా సంతోషంగా కనిపించాడు. ‘మరేం పర్లేదు.. ఇది శుభారంభమే’ అని నాతో అన్నాడు. అయితే, ఇప్పుడు ఆయన నన్ను చూసి ఎంతగానో గర్విస్తున్నాడు.నా కుటుంబం ఎంతటి సంతోషంలో ఉందో పాజీ కూడా అంతే ఆనందపడుతున్నాడు. ఇదంతా కేవలం ఆయన చలవ వల్లే సాధ్యమైంది. నా కోసం ఎన్నో ఏళ్లుగా ఆయన కూడా కఠిన శ్రమకోరుస్తున్నాడు.నన్ను తీర్చిదిద్దడం కోసం ఎంతో కష్టపడుతున్నాడు. కేవలం క్రికెట్ పాఠాలు నేర్పించడమే కాదు.. మైదానం వెలుపలా నాకు ఎన్నో విలువైన విషయాలు నేర్పిస్తున్నారు’’ అని టీమిండియా యువ సంచలనం అభిషేక్ శర్మ ఉద్వేగానికి లోనయ్యాడు.డకౌట్.. వెను వెంటనే సెంచరీభారత దిగ్గజ క్రికెటర్ యువరాజ్ సింగ్ను ఉద్దేశించి ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు. కాగా పంజాబీ బ్యాటర్ అభిషేక్ శర్మ ఐపీఎల్-2024లో అదరగొట్టిన విషయం తెలిసిందే. సన్రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్గా విధ్వంసకర ఇన్నింగ్స్తో విరుచుకుపడ్డ ఈ లెఫ్టాండర్ టీమిండియా సెలక్టర్ల దృష్టిని ఆకర్షించాడు.ఈ క్రమంలో జింబాబ్వేతో టీ20 సిరీస్కు అభిషేక్ శర్మను ఎంపిక చేశారు. అయితే, అంతర్జాతీయ క్రికెట్ అరంగేట్రంలోనే అతడు డకౌట్గా వెనుదిరిగి పూర్తిగా నిరాశపరిచాడు.కానీ ఇరవై నాలుగు గంటల్లోనే తిరిగి అద్భుతం చేశాడు. వైఫల్యాన్ని మరిపిస్తూ సెంచరీతో కదం తొక్కాడు. జింబాబ్వేతో ఆదివారం నాటి రెండో టీ20లో ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపిస్తూ వంద పరుగులు సాధించాడు.తద్వారా జట్టు విజయంలో కీలక పాత్ర పోషించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. డకౌట్ అయిన చోటే శతకంతో సత్తా చాటి ప్రశంసలు అందుకుంటున్నాడు.గర్వంగా ఉంది. చాలా బాగా ఆడావుఈ క్రమంలో అభిషేక్ శర్మ తన మెంటార్ యువరాజ్ సింగ్కు కాల్ చేయగా.. ‘‘గర్వంగా ఉంది. చాలా బాగా ఆడావు. ఈ ప్రశంసలకు నువ్వు అర్హుడవు. ఇలాంటివి ఇంకెన్నో సాధించాలి. ఇది కేవలం ఆరంభం మాత్రమే’’ అని సంతోషం వ్యక్తం చేశాడు.ప్రస్తుతం అతడు వరల్డ్ చాంపియన్స్ ఆఫ్ లెజెండ్స్ లీగ్తో బిజీగా ఉన్నాడు. అయినప్పటికీ అభిషేక్ ఫోన్కు స్పందించి ఈ మేరకు అభినందించాడు. ఈ నేపథ్యంలో అభిషేక్ శర్మ యువీ గొప్పతనాన్ని, తన కెరీర్లో అతడి పాత్ర గురించి చెబుతూ భావోద్వేగానికి గురయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ సోషల్ మీడియాలో షేర్ చేసింది.చదవండి: బాబర్ ఆజంపై వేటు?.. పీసీబీ కీలక నిర్ణయం!Two extremely special phone 📱 calls, one memorable bat-story 👌 & a first 💯 in international cricket! 𝗗𝗢 𝗡𝗢𝗧 𝗠𝗜𝗦𝗦!A Hundred Special, ft. Abhishek Sharma 👏 👏 - By @ameyatilak WATCH 🎥 🔽 #TeamIndia | #ZIMvIND | @IamAbhiSharma4 pic.twitter.com/0tfBXgfru9— BCCI (@BCCI) July 8, 2024 View this post on Instagram A post shared by Yuvraj Singh (@yuvisofficial) -
టీమిండియా తరఫున ఎవరికీ సాధ్యం కాలేదు.. అభిషేక్ శర్మ సాధించాడు
జింబాబ్వేతో జరిగిన రెండో టీ20లో టీమిండియా యువ ఓపెనర్ అభిషేక్ శర్మ 47 బంతుల్లో (7 ఫోర్లు, 8 సిక్సర్లు) శతక్కొట్టిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్లో అభిషేక్తో పాటు రుతురాజ్ గైక్వాడ్ (47 బంతుల్లో 77 నాటౌట్; 11 ఫోర్లు, సిక్సర్), రింకూ సింగ్ (22 బంతుల్లో 48 నాటౌట్; 2 ఫోర్లు, 5 సిక్సర్లు) కూడా చెలరేగడంతో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ భారీ స్కోర్ (2 వికెట్ల నష్టానికి 234 పరుగులు) చేసింది. అనంతరం ఛేదనలో చేతులెత్తేసిన జింబాబ్వే.. ముకేశ్ కుమార్ (3.4-0-37-3), ఆవేశ్ ఖాన్ (3-0-15-3), రవి బిష్ణోయ్ (4-0-11-2), వాషింగ్టన్ సుందర్ (4-0-28-1) ధాటికి 18.4 ఓవర్లలో 134 పరుగులకే కుప్పకూలి ఘోర పరాజయాన్ని (100 పరుగుల తేడాతో) మూటగట్టుకుంది. ఈ మ్యాచ్లో గెలుపుతో భారత్.. తొలి టీ20లో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకుంది. ప్రస్తుతం ఐదు మ్యాచ్ల ఈ సిరీస్లో భారత్, జింబాబ్వే చెరో విజయంతో సమంగా ఉన్నాయి. మూడో మ్యాచ్ జులై 10న జరుగనుంది.𝙃𝙖𝙫𝙤𝙘 𝙞𝙣 𝙃𝙖𝙧𝙖𝙧𝙚 🌪️🏏@IamAbhiSharma4 smashes 100 in 47 balls 🥵💪#SonySportsNetwork #ZIMvIND #TeamIndia pic.twitter.com/hHYlTopD1V— Sony Sports Network (@SonySportsNetwk) July 7, 2024ఇదిలా ఉంటే, రెండో టీ20లో సుడిగాలి శతకంతో (46 బంతుల్లో) విరుచుకుపడిన అభిషేక్ శర్మ.. భారత క్రికెట్ చరిత్రలో ఎవరికీ సాధ్యం కాని ఓ అరుదైన ఫీట్ను సాధించాడు. కెరీర్లో కేవలం రెండో టీ20 ఆడుతున్న అభిషేక్.. సెంచరీ మార్కును హ్యాట్రిక్ సిక్సర్లతో (వెల్లింగ్టన్ మసకద్జ బౌలింగ్లో) అందుకున్నాడు. భారత క్రికెట్ చరిత్రలో ఏ క్రికెటర్ కూడా అంతర్జాతీయ శతకాన్ని హ్యాట్రిక్ సిక్సర్లతో అందుకోలేదు. ఈ మ్యాచ్లో అభిషేక్ తన పరుగుల ఖాతాను కూడా సిక్సర్తోనే ఓపెన్ చేయడం విశేషం. తన కెరీర్ తొలి మ్యాచ్లో డకౌట్ అయిన అభిషేక్ రెండో మ్యాచ్లోనే సెంచరీ చేసి పలు రికార్డులు కొల్లగొట్టాడు.అభిషేక్ సాధించిన రికార్డులు ఇవే..అంతర్జాతీయ టీ20ల్లో అత్యంత వేగంగా(ఇన్నింగ్స్ల పరంగా) సెంచరీ చేసిన భారత క్రికెటర్గా అభిషేక్ రికార్డులకెక్కాడు. అభిషేక్ కేవలం రెండు ఇన్నింగ్స్ల వ్యవధిలోనే తన మొదటి అంతర్జాతీయ సెంచరీని సాధించాడు.అభిషేక్కు ముందు ఈ రికార్డు దీపక్ హుడా పేరిట ఉండేది. హుడా తన కెరీర్ మూడో ఇన్నింగ్స్లో సెంచరీ చేశాడు.అంతర్జాతీయ టీ20ల్లో భారత్ తరపున సెంచరీ చేసిన ఐదో అత్యంత పిన్న వయస్కుడిగా అభిషేక్ నిలిచాడు. అభిషేక్ 23 ఏళ్ల 307 రోజుల వయస్సులో తన తొలి సెంచరీ నమోదు చేశాడు. ఈ జాబితాలో యశస్వీ జైశ్వాల్ (21 ఏళ్ల 279 రోజుల వయస్సులో) టాప్లో ఉన్నాడు.అంతర్జాతీయ టీ20ల్లో అత్యంత వేగంగా సెంచరీ చేసిన నాలుగో భారత బ్యాటర్గా అభిషేక్ శర్మ రికార్డు సృష్టించాడు. ఈ జాబితాలో రోహిత్ శర్మ(38 బంతులు) అగ్రస్ధానంలో ఉండగా.. సూర్యకుమార్ యాదవ్(45), కేఎల్ రాహుల్(46), అభిషేక్ శర్మ(46) తర్వాతి స్థానాల్లో నిలిచారు.ఈ ఏడాది ప్రొఫెషనల్ టీ20 క్రికెట్లో అత్యధిక సిక్స్లు బాదిన బ్యాటర్గా అభిషేక్ రికార్డులకెక్కాడు. ఈ ఏడాది టీ20ల్లో ఇప్పటివరకు 18 మ్యాచ్లు ఆడిన అభిషేక్.. 50 సిక్స్లు బాదాడు. అభిషేక్కు ముందు ఈ రికార్డు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ (25 మ్యాచ్ల్లో 46 సిక్స్లు) పేరిట ఉండేది.ఈ మ్యాచ్లో స్పిన్నర్ల బౌలింగ్లో 65 పరుగులు సాధించిన అభిషేక్.. అంతర్జాతీయ టీ20ల్లో స్పిన్నర్లపై అత్యధిక పరుగులు సాధించిన భారత క్రికెటర్గా రికార్డుల్లోకెక్కాడు. అభిషేక్కు ముందు ఈ రికార్డు యువరాజ్ సింగ్ (57 పరుగులు) పేరిట ఉండేది. -
IND vs ZIM: సంజూ వచ్చేశాడు.. అతడిపై వేటు! భారత తుది జట్టు ఇదే
హరారే వేదికగా జింబాబ్వేతో జరిగిన రెండో టీ20లో 100 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన టీమిండియా.. ఇప్పుడు మూడో టీ20కు సిద్దమవుతోంది. హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగానే మూడో టీ20లో జింబాబ్వేతో భారత్ తలపడనుంది.ఈ మ్యాచ్లో గెలిచి సిరీస్లో ఆధిక్యంలోకి దూసుకెళ్లాలని టీమిండియా భావిస్తోంది. ఈ మ్యాచ్కు ముందు భారత తుది జట్టు ఎంపిక చేయడం శుభ్మన్ గిల్, కోచ్ వీవీఎస్ లక్ష్మణ్కు తలనొప్పిగా మారింది. ఎందుకంటే జింబాబ్వేతో తొలి రెండు టీ20లకు వరల్డ్కప్ విన్నింగ్ సెలబ్రేషన్స్ కారణంగా యశస్వీ జైశ్వాల్, సంజూ శాంసన్, శివమ్ దూబే దూరమైన సంగతి తెలిసిందే. వారి స్ధానంలో సాయి సుదర్శన్, హర్షిత్ రాణా, జితేశ్ శర్మలను తాత్కాలికంగా బీసీసీఐ జింబాబ్వేకు పంపింది. అయితే ఇప్పుడు జైశ్వాల్, సంజూ, దూబే మిగిలిన మూడు మ్యాచ్ల కోసం జట్టుతో చేరారు. వీరి రావడంతో సాయి సుదర్శన్, హర్షిత్ రాణా, జితేశ్ శర్మలు జట్టును వీడనున్నారు.ఈ క్రమంలో జట్టు కూర్పు కొంచెం కష్టంగా మారింది. అభిషేక్ శర్మ ఓపెనర్గా దుమ్ములేపుతుండడంతో జైశ్వాల్ మూడో మ్యాచ్కు బెంచ్కే పరిమితమయ్యే ఛాన్స్ ఉంది. అదే విధంగా వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్ స్ధానంలో సంజూ శాంసన్ తుది జట్టులోకి రానున్నట్లు తెలుస్తోంది. తొలి మ్యాచ్లో జురెల్కు బ్యాటింగ్ చేసే అవకాశం వచ్చినప్పటికి తీవ్ర నిరాశపరిచాడు. ఈ క్రమంలోనే అతడిపై వేటు వేయాలని జట్టు మెనెజ్మెంట్ నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఇక రెండో టీ20కు జట్టులోకి వచ్చిన సాయిసుదర్శన్ స్ధానంలో ఆల్రౌండర్ శివమ్ దూబే జట్టులోకి రానున్నట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. ఈ రెండు మార్పులు మినహా మిగతా కాంబినేషన్లో ఎలాంటి మార్పులు జరగకపోవచ్చని క్రికెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.జింబాబ్వేతో మూడో టీ20.. భారత తుది జట్టు(అంచనా) శుభ్మన్ గిల్(కెప్టెన్), అభిషేక్ శర్మ, రుతురాజ్ గైక్వాడ్, రియాన్ పరాగ్, శివమ్ దూబే, రింకూ సింగ్, సంజూ శాంసన్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, ఆవేష్ ఖాన్, ముఖేష్ కుమార్. -
నా సెంచరీ సీక్రెట్ ఇదే.. అతడికి థ్యాంక్స్ చెప్పాలి: అభిషేక్ శర్మ
అరంగేట్రంలోనే డకౌటై విమర్శలు ఎదుర్కొన్న టీమిండియా యువ ఓపెనర్ అభిషేక్ శర్మ.. 24 గంటల వ్యవధిలోనే సంచలనం సృష్టించాడు. ఎక్కడైతే డకౌటయ్యాడో అక్కడే సెంచరీతో సత్తా చాటి శెభాష్ అనిపించుకుంటున్నాడు. హరారే వేదికగా జింబాబ్వేతో జరిగిన రెండో టీ20లో అభిషేక్ శర్మ అద్భుతమైన సెంచరీతో మెరిశాడు. జింబాబ్వే బౌలర్లను అభిషేక్ ఊచకోత కోశాడు. కేవలం 47 బంతుల్లో 7 ఫోర్లు, 8 సిక్స్లతో 100 పరుగులు చేసి ఔటయ్యాడు. తద్వారా అతి తక్కువ ఇన్నింగ్స్లో తొలి టీ20 అంతర్జాతీయ సెంచరీ అందుకున్న భారత ప్లేయర్గా అభిషేక్ నిలిచాడు. ఇక మ్యాచ్ అనంతరం బీసీసీఐ టీవీతో మాట్లాడిన అభిషేక్ ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించాడు. ఈ మ్యాచ్లో అభిషేక్ శర్మ తన బ్యాట్తో ఆడలేదంట. తన చిన్ననాటి స్నేహితుడు, ప్రస్తుత భారత జట్టు కెప్టెన్ శుభ్మన్ గిల్ బ్యాట్తో ఈ అద్భుత నాక్ ఆడినట్లు అభిషేక్ తెలిపాడు."ఓ విషయాన్ని అందరికీ చెప్పాలనుకుంటున్నాను. ఈ మ్యాచ్లో నేను శుబ్మన్ గిల్ బ్యాట్తో ఆడాడను. అతడి నుంచి బ్యాట్ను తీసుకుని ఆడటం చాలా కష్టం. అతడు తన బ్యాట్లను ఎవరికీ అంత ఈజీగా ఇవ్వడు. కానీ నేను మాత్రం మేము అండర్-14 క్రికెట్ ఆడే రోజుల నుంచి అతడి బ్యాట్ను ఉపయోగిస్తునే ఉన్నాను. నేను ఒత్తిడిలో ఉన్న ప్రతీ సారి గిల్ను తన బ్యాట్ ఇవ్వమని అడుగుతాను. నేను అతని బ్యాట్తో ఆడినప్పుడల్లా అద్భుతంగా రాణించాను . ఇప్పుడు కూడా అంతే. సరైన సమయంలో గిల్ తన బ్యాట్ను నాకు ఇచ్చాడు. నాతో పాటు జట్టుకు అవసరమైన ఇన్నింగ్స్ ఆడినందుకు చాలా సంతోషంగా ఉంది. థంక్యూ గిల్ అంటూ బీసీసీఐ టీవీతో అభిషేక్ పేర్కొన్నాడు. కాగా గిల్, అభిషేక్ చిన్ననాటి నుంచి మంచి స్నేహితులు. వీరిద్దరూ పంజాబ్ నుంచి భారత్కు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. -
వారిద్దరూ అద్భుతం.. ఎంతచెప్పుకున్న తక్కువే: టీమిండియా కెప్టెన్
జింబాబ్వేతో తొలి టీ20లో ఓటమికి టీమిండియా బదులు తీర్చుకుంది. హరారే వేదికగా జరిగిన రెండో టీ20లో జింబాబ్వేపై 100 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 234 పరుగుల భారీ స్కోర్ సాధించింది. భారత బ్యాటర్లలో ఓపెనర్ అభిషేక్ శర్మ(46 బంతుల్లో 7 బౌండరీలు, 8 సిక్స్లతో 100) సెంచరీతో చెలరేగగా.. రుతురాజ్ గైక్వాడ్(47 బంతుల్లో 11 ఫోర్లు, సిక్స్తో 77 నాటౌట్) హాఫ్ సెంచరీతో మెరిశాడు. ఆఖరిలో రింకూ సింగ్(22 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్స్లతో 48 నాటౌట్) మెరుపులు మెరిపించాడు.జింబాబ్వే బౌలర్లలో బ్లెస్సింగ్ ముజర్బానీ, వెల్లింగ్టన్ మసకడ్జా తలో వికెట్ వికెట్ పడగొట్టారు. అనంతరం భారీ లక్ష్య చేధనలో జింబాబ్వే భారత బౌలర్ల దాటికి 134 పరుగులకే కుప్పకూలింది. భారత పేసర్లు ముఖేష్ కుమార్, అవేష్ ఖాన్ తలా మూడు వికెట్లు పడగొట్టి జింబాబ్వే పతనాన్ని శాసించగా.. రవి బిష్ణోయ్, సుందర్ చెరో రెండు వికెట్లు సాధించారు. జింబాబ్వే బ్యాటర్లలో ఓపెనర్ వెస్లీ మధెవెరె(43) టాప్ స్కోరర్గా నిలిచాడు.ఇక ఈ విజయంపై మ్యాచ్ అనంతరం టీమిండియా స్టాండింగ్ కెప్టెన్ శుబ్మన్ గిల్ స్పందించాడు.ఈ మ్యాచ్లో సాధించినందుకు చాలా సంతోషంగా ఉంది. అభిషేక్ శర్మ, రుతురాజ్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచారు. ముఖ్యంగా పవర్ప్లేలో వారు ఆడిన విధానం గురుంచి ఎంత చెప్పుకున్న తక్కువే. ఎందుకంటే పవర్ప్లేలో ఆ విధంగా బ్యాటింగ్ చేయడం అంత ఈజీకాదు. "పవర్ప్లేలో కొత్త బంతి కాస్త ఎక్కువగా స్వింగ్ అవ్వడంతో బ్యాటర్లు ఇబ్బంది పడుతుంటారు. కానీ అభి, రుతు మాత్రం చాలా పరిపక్వతతో ఆడారు. ఇన్నింగ్స్ను అద్భుతంగా ముందుకు నడిపించారు. ఇది యువ భారత జట్టు. ఈ జట్టులో చాలా మంది ఆటగాళ్లు ప్రొఫిషనల్ టీ20 క్రికెట్లో ఆడిండవచ్చు గానీ అంతర్జాతీయ అనుభవం పెద్దగా ఎవరికి లేదు. తొలి టీ20లో ఒత్తడిని తట్టుకోలేక వరుస క్రమంలో పెవిలియన్కు క్యూ కట్టారు. అందుకే స్వల్ప లక్ష్యాన్ని కూడా చేధించలేక ఓడిపోయాం. కానీ ఇప్పుడు రెండో మ్యాచ్లో తిరిగి పుంజుకుని సంచలన విజయం సాధించాము. ఈ సిరీస్లో మాకు ఇంకా మూడు మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. వాటిలో కూడా గెలిచి సిరీస్ను సొంతం చేసుకునేందుకు ప్రయత్నిస్తామని" పోస్ట్మ్యాచ్ కాన్ఫరెన్స్లో గిల్ పేర్కొన్నాడు. -
చరిత్ర సృష్టించిన అభిషేక్ శర్మ.. తొలి భారత క్రికెటర్గా
హరారే వేదికగా జింబాబ్వేతో జరిగిన రెండో టీ20లో టీమిండియా యువ ఓపెనర్ అభిషేక్ శర్మ అద్బుతమైన సెంచరీతో చెలరేగాడు. తొలి మ్యాచ్లో విఫలమైన అభిషేక్.. రెండో మ్యాచ్లో మాత్రం ప్రత్యర్ధి బౌలర్లకు చుక్కలు చూపించాడు.తన రెండో అంతర్జాతీయ మ్యాచ్లోనే సెంచరీ చేసి ఔరా అన్పించాడు. కేవలం 47 బంతుల్లో 7 ఫోర్లు, 8 సిక్స్లతో 100 పరుగులు చేసి ఔటయ్యాడు. ఈ మ్యాచ్లో సెంచరీతో చెలరేగిన అభిషేక్ శర్మ పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు.అభిషేక్ సాధించిన రికార్డులు ఇవే..అంతర్జాతీయ టీ20ల్లో అత్యంత వేగంగా(ఇన్నింగ్స్ల పరంగా) తొలి సెంచరీ నమోదు చేసిన మొదటి భారత క్రికెటర్గా అభిషేక్ రికార్డులకెక్కాడు. అభిషేక్ శర్మ కేవలం రెండు ఇన్నింగ్స్ల వ్యవధిలోనే తన మొదటి అంతర్జాతీయ సెంచరీని అందుకున్నాడు. ఇంతకుముందు ఈ రికార్డు భారత క్రికెటర్ దీపక్ హుడా పేరిట ఉండేది. హుడా తను అరంగేట్రం నుంచి మూడో ఇన్నింగ్స్లో సెంచరీ చేశాడు. ఈ క్రమంలో కేవలం తన రెండో ఇన్నింగ్స్లోనే సెంచరీ చేసిన అభిషేక్.. హుడా ఆల్టైమ్ రికార్డును బ్రేక్ చేశాడు.అంతర్జాతీయ టీ20ల్లో భారత్ తరపున సెంచరీ చేసిన ఐదో అత్యంత పిన్న వయుష్కుడిగా అభిషేక్ నిలిచాడు. అభిషేక్ 23 ఏళ్ల 307 రోజుల వయస్సులో శర్మ తన తొలి సెంచరీని నమోదు చేశాడు. ఈ జాబితాలో భారత యువ ఓపెనర్ యశస్వీ జైశ్వాల్ ఉన్నాడు. జైశ్వాల్ 21 ఏళ్ల 279 రోజుల వయస్సులో సెంచరీ చేశాడు.అంతర్జాతీయ టీ20ల్లో అత్యంత వేగంగా సెంచరీ చేసిన నాలుగో భారత బ్యాటర్గా అభిషేక్ శర్మ రికార్డు సృష్టించాడు. ఈ జాబితాలో రోహిత్ శర్మ(38 బంతులు) అగ్రస్ధానంలో ఉండగా.. సూర్యకుమార్ యాదవ్(45), కేఎల్ రాహుల్(46), అభిషేక్ శర్మ(46) తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నారు.ఈ ఏడాది ప్రొఫెషనల్ టీ20 క్రికెట్లో అత్యధిక సిక్స్లు బాదిన బ్యాటర్గా అభిషేక్ రికార్డులకెక్కాడు. ఈ ఏడాది టీ20ల్లో ఇప్పటివరకు 18 మ్యాచ్లు ఆడిన అభిషేక్..50 సిక్స్లు బాదాడు. ఇప్పటివరకు ఈ రికార్డు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ పేరిట ఉండేది. రోహిత్ శర్మ 25 మ్యాచ్ల్లో 46 సిక్స్లు బాదాడు. తాజా మ్యాచ్తో హిట్మ్యాన్ను అభిషేక్ అధిగమించాడు.ఇక జింబాబ్వేతో జరిగిన రెండో టీ20లో 100 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. దీంతో ఐదు మ్యాచ్ల సిరీస్ను 1-1తో భారత్ సమం చేసింది. -
దెబ్బకు దెబ్బ.. టీమిండియా చేతిలో జింబాబ్వే చిత్తు
జింబాబ్వేతో రెండో టీ20లో యువ టీమిండియా అదరగొట్టింది. ఆతిథ్య జట్టును వంద పరుగుల తేడాతో మట్టికరిపించి ఘన విజయం సాధించింది. తొలి టీ20లో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకుంది.దెబ్బకు దెబ్బ కొట్టి ఐదు మ్యాచ్ల సిరీస్ను 1-1తో సమం చేసింది. ఇక ఈ గెలుపు ద్వారా టీమిండియా స్టార్ బ్యాటర్ శుబ్మన్ గిల్ ఖాతాలో కెప్టెన్గా తొలి విజయం నమోదైంది.దుమ్ములేపిన అభిషేక్.. రాణించిన రుతురాజ్హరారే వేదికగా ఆదివారం జరిగిన మ్యాచ్లో టాస్ గెలిచిన టీమిండియా తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్ శుబ్మన్ గిల్ 2 పరుగులు మాత్రమే చేసి నిరాశ పరిచాడు. అయితే మరో ఓపెనర్ అభిషేక్ శర్మ ఆకాశమే హద్దుగా చెలరేగి జింబాబ్వే బౌలింగ్ను చీల్చి చెండాడాడు.తొలి టీ20లో విఫలమైన ఈ పంజాబీ బ్యాటర్ తాజా మ్యాచ్లో సెంచరీ చేసి తన విలువ చాటుకున్నాడు. మొత్తంగా 47 బంతులు ఎదుర్కొని 7 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో సరిగ్గా 100 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు.అభిషేక్ శర్మకు తోడుగా వన్డౌన్ బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. అర్థశతకం (47 బంతుల్లో 77 పరుగులు) తో అజేయంగా నిలిచాడు. నాలుగో స్థానంలో బరిలోకి దిగిన రింకూ సింగ్ (22 బంతుల్లో 48 పరుగులు నాటౌట్, ఫోర్లు 2, సిక్సర్లు 5) రుతురాజ్తో కలిసి స్కోరు బోర్డును పరుగెత్తించాడు.ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో యువ భారత జట్టు కేవలం రెండు వికెట్లు నష్టపోయి ఏకంగా 234 పరుగులు సాధించింది. ఇక లక్ష్య ఛేదనకు దిగిన జింబాబ్వేకు భారత బౌలర్లు చుక్కలు చూపించారు.జోరుగా హుషారుగా వికెట్లు...ఓపెనర్ ఇన్నోసెంట్ కయా (4)ను ముకేష్కుమార్ ఆదిలోనే వెనక్కి పంపించాడు. అయితే, రెండో వికెట్ తీయడానికి భారత బౌలర్లు కాస్త శ్రమించాల్సి వచ్చింది. మరో ఓపెనర్ వెస్లే మెదెవెరె(43), వన్డౌన్ బ్యాటర్ బ్రియాన్ బ్యానెట్ (26) తేలికగా తలొగ్గలేదు.బ్యానెట్ను ముకేష్కుమార్ ఔట్ చేయగా.. రవి బిష్ణోయ్ వెస్లే పని పట్టాడు. ఇదే జోరును భారత బౌలర్లు కొనసాగించడంతో జింబాబ్వే మిడిల్ ఆర్డర్ చేతులెత్తేసింది. ఈక్రమంలో లోయర్ ఆర్డర్లో వచ్చిన ల్యూక్ జాంగ్వే 33 పరుగులు చేసి కాసేపు పోరాడాడు. ముకేష్ దెబ్బకు అతడుకూడా పెవిలియన్ చేరక తప్పలేదు.ఈక్రమంలో 18.4 ఓవర్లలోనే జింబాబ్వే కథ ముగిసింది. కేవలం 134 పరుగులు మాత్రమే చేసి 100 పరుగుల భారీ తేడాతో టీమిండియా చేతిలో చిత్తుగా ఓడింది.టీమిండియా బౌలర్లలో ముకేష్కుమార్, ఆవేశ్ఖాన్ చెరో మూడు వికెట్లు ఖాతాలో వేసుకోగా.. రవి బిష్ణోయ్ రెండు, వాషింగ్టన్ సుందర్ ఒక వికెట్ తీశారు. భారత్ బ్యాటర్ అభిషేక్ శర్మకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. ఇరు జట్ల మధ్య బుధవారం మూడో టీ20 మ్యాచ్ జరగనుంది. -
అభిషేక్, రుతురాజ్, రింకూ ఊచకోత.. జింబాబ్వే టార్గెట్ 235 పరుగులు
హరారే వేదికగా జింబాబ్వే జరుగుతున్న రెండో టీ20లో భారత బ్యాటర్లు విధ్వంసం సృష్టించారు. టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 234 పరుగుల భారీ స్కోర్ సాధించింది. భారత బ్యాటర్లలో ఓపెనర్ అభిషేక్ శర్మ విధ్వంసకర సెంచరీతో చెలరేగాడు.జింబాబ్వే బౌలర్లకు అభిషేక్ చుక్కలు చూపించాడు. మైదానం నలుమూలల బౌండరీల వర్షం కురిపించాడు. కేవలం 46 బంతుల్లోనే తన సెంచరీ మార్క్ను అందుకున్నాడు. సరిగ్గా 100 పరుగులు చేసి అభిషేక్ ఔటయ్యాడు. అతడి ఇన్నింగ్స్లో 7 ఫోర్లు, 8 సిక్స్లు ఉన్నాయి. అతడితో పాటు ఫస్ట్ డౌన్ బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. రుతురాజ్ 47 బంతుల్లో 11 ఫోర్లు,1 సిక్స్తో 77 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. రింకూ సింగ్( తన బ్యాట్కు పనిచెప్పాడు. రింకూ కేవలం 22 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్స్లతో 48 పరగులు చేసి నాటౌట్గా నిలిచాడు. ఇక జింబాబ్వే బౌలర్లలో ముజుబ్రానీ,మసకజ్డా తలా వికెట్ సాధించారు. -
అభిషేక్ శర్మ విధ్వంసకర సెంచరీ.. 7 ఫోర్లు, 8 సిక్స్లతో ఊచకోత
హరారే వేదికగా జింబాబ్వే జరుగుతున్న రెండో టీ20ల్లో టీమిండియా యువ ఓపెనర్ అభిషేక్ శర్మ విధ్వంసం సృష్టించాడు. తన అరంగేట్ర మ్యాచ్లో విఫలమై విమర్శలు ఎదుర్కొన్న అభిషేక్ శర్మ.. రెండో మ్యాచ్లో మాత్రం ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఈ మ్యాచ్లో అభిషేక్ అద్బుతమైన సెంచరీతో చెలరేగాడు. కేవలం 46 బంతుల్లోనే అభిషేక్ తన తొలి అంతర్జాతీయ సెంచరీ మార్క్ను అందుకున్నాడు. వీరేంద్ర సెహ్వాగ్ స్టైల్లో సిక్సర్లతో తన సెంచరీని అభిషేక్ పూర్తి చేసుకున్నాడు. జింబాబ్వే బౌలర్లను మాత్రం అభిషేక్ ఊచకోత కోశాడు. ఇన్నింగ్స్ ఆరంభం నుంచే అభిషేక్ బౌండరీలు వర్షం కురిపించాడు. సరిగ్గా 100 పరుగులు చేసి అభిషేక్ ఔటయ్యాడు. అతడి ఇన్నింగ్స్లో 7 ఫోర్లు, 8 సిక్స్లు ఉన్నాయి. అతడి ఇన్నింగ్స్కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. దీంతో అతడిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. శెభాష్ అభిషేక్ అంటూ పోస్ట్లు పెడుతున్నారు. Abhishek Sharma 🚀#ZIMvINDpic.twitter.com/1VkL1DCUL9— OneCricket (@OneCricketApp) July 7, 2024 -
జింబాబ్వే రెండో టీ20.. భారత జట్టులోకి యువ సంచలనం! తుది జట్లు ఇవే
జింబాబ్వేతో తొలి టీ20లో ఓటమి పాలైన టీమిండియా.. ఇప్పుడు రెండో టీ20కు సిద్దమైంది. హరారే వేదికగా భారత్-జింబాబ్వే జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన టీమిండియా తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్లో భారత్ ఒక మార్పుతో బరిలోకి దిగింది. ఎక్స్ట్రా బ్యాటర్తో ఆడుతోంది. పేసర్ ఖాలీల్ అహ్మద్ స్ధానంలో యువ బ్యాటర్ సాయిసుదర్శన్ తుది జట్టులోకి వచ్చాడు. సాయిసుదర్శన్కు భారత్ తరపున ఇదే తొలి టీ20 మ్యాచ్ కావడం గమనార్హం. సాయిసుదర్శన్ ఐపీఎల్లో అద్బుతంగా రాణించాడు. ఈ క్రమంలోనే సెలక్టర్లు అతడికి పిలుపునిచ్చారు. కాగా సుదర్శన్ ఇప్పటికే భారత తరపున వన్డేల్లో అరంగేట్రం చేశాడు. ఇక ఈ మ్యాచ్లో ఆతిథ్య జింబాబ్వే మాత్రం ఎటువంటి మార్పులు లేకుండా బరిలోకి దిగింది.తుది జట్లుజింబాబ్వే: వెస్లీ మాధేవెరే, ఇన్నోసెంట్ కైయా, బ్రియాన్ బెన్నెట్, సికందర్ రజా(కెప్టెన్), డియోన్ మైయర్స్, జోనాథన్ కాంప్బెల్, క్లైవ్ మదాండే(వికెట్ కీపర్), వెల్లింగ్టన్ మసకద్జా, ల్యూక్ జోంగ్వే, బ్లెస్సింగ్ ముజరబానీ, టెండై చతారాభారత్భారత్శుబ్మన్ గిల్(కెప్టెన్), అభిషేక్ శర్మ, రుతురాజ్ గైక్వాడ్, సాయి సుదర్శన్, రియాన్ పరాగ్, రింకూ సింగ్, ధ్రువ్ జురెల్(వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అవేష్ ఖాన్, ముఖేష్ కుమార్ -
IND vs ZIM: చరిత్ర సృష్టించిన జింబాబ్వే.. తొలి జట్టుగా
పసికూన జింబాబ్వే సంచలనం సృష్టించింది. హరారే వేదికగా టీమిండియాతో జరిగిన తొలి టీ20లో జింబాబ్వే అద్భుత విజయం సాధించింది. వరల్డ్ ఛాంపియన్ భారత్ను 13 పరుగుల తేడాతో జింబాబ్వే చిత్తు చేసింది. 116 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని జింబాబ్వే బౌలర్లు కాపాడుకున్నారు. జింబాబ్వే బౌలర్ల దాటికి భారత్ 102 పరుగులకే కుప్పకూలింది. జింబాబ్వే బౌలర్లలో కెప్టెన్ సికిందర్ రజా, చతరా తలా మూడు వికెట్లతో టీమిండియాను దెబ్బతీయగా.. బెన్నట్, మసకద్జా, జాంగ్వే తలా వికెట్ సాధించారు. భారత బ్యాటర్లలో కెప్టెన్ శుబ్మన్ గిల్(31) పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా.. వాషింగ్టన్ సుందర్(27) తన వంతు ప్రయత్నం చేశాడు.చరిత్ర సృష్టించిన జింబాబ్వే..ఇక ఈ మ్యాచ్లో అద్భుత విజయం సాధించిన జింబాబ్వే ఓ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకుంది. టీ20ల్లో భారత్పై అత్యల్ప టోటల్ను డిఫెండ్ చేసుకున్న జట్టుగా జింబాబ్వే నిలిచింది. ఇంతకుముందు ఈ రికార్డు న్యూజిలాండ్ పేరిట ఉండేది. 2016లో నాగ్పూర్ వేదికగా భారత్తో జరిగిన టీ20 మ్యాచ్లో 127 పరుగుల టార్గెట్ను కివీస్ డిఫెండ్ చేసుకుంది. తాజా మ్యాచ్తో కివీస్ ఆల్టైమ్ రికార్డును జింబాబ్వే బ్రేక్ చేసింది. -
ఇది అస్సలు ఊహించలేదు.. అదే మా కొంపముంచింది: శుబ్మన్ గిల్
టీ20 వరల్డ్కప్ ఛాంపియన్స్ టీమిండియాకు జింబాబ్వే ఊహించని షాకిచ్చింది. హరారే వేదికగా భారత్తో జరిగిన తొలి టీ20లో 13 పరుగుల తేడాతో జింబాబ్వే సంచలన విజయం సాధించింది. 116 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని చేధించడంలో భారత్ చతికల పడింది.జింబాబ్వే బౌలర్ల దాటికి భారత్ 102 పరుగులకే కుప్పకూలింది. జింబాబ్వే బౌలర్లలో కెప్టెన్ సికిందర్ రజా, చతరా తలా మూడు వికెట్లతో టీమిండియా నడ్డివిరచగా.. బెన్నట్, మసకద్జా, జాంగ్వే తలా వికెట్ సాధించారు. భారత బ్యాటర్లలో కెప్టెన్ శుబ్మన్ గిల్(31) పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు.కాగా టీ20ల్లో జింబాబ్వే చేతిలో భారత్ ఓటమి పాలవ్వడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఇక ఈ ఘోర ఓటమిపై మ్యాచ్ అనంతరం టీమిండియా స్టాండింగ్ కెప్టెన్ శుబ్మన్ గిల్ స్పందిచాడు. బ్యాటింగ్లో విఫలమవకావడంతోనే ఓటమిపాలైమని గిల్ తెలిపాడు."ఈ ఓటమి మమ్మల్ని తీవ్ర నిరాశపరిచింది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోవడం సరైన నిర్ణయమే. మేము తొలుత అద్భుతంగా బౌలింగ్ చేశాము. కానీ ఫీల్డింగ్లో మాత్రం మా మార్క్ చూపించలేకపోయాం. ఇక బ్యాటింగ్లో ప్రతీ ఒక్కరం పూర్తి స్వేఛ్చగా ఆడాలని నిర్ణయించుకున్నాము.కానీ అందుకు తగ్గ విధంగా ఆడలేకపోయాం. వరుస క్రమంలో వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడ్డాం. మా ఇన్నింగ్స్ సగం ముగిసే సరికి మేము 5 వికెట్లు కోల్పాయం. కానీ నేను ఇంకా క్రీజులో ఉండడంతో గెలుస్తామన్న నమ్మకం ఉండేది. కానీ దురదృష్టవశాత్తూ నేను కూడా పెవిలియన్కు చేరాల్సి వచ్చింది. నేను ఔట్ కావడంతో మ్యాచ్ స్వరూపమే మారిపోయింది. అయితే లక్ష్యం 115 పరుగులే కావడంతో ఆఖరి వరకు మాకు గెలుపు పై ఆశలు ఉండేవి. కానీ మేము అనుకున్నది జరగలేదు.ఎక్కడ తప్పు జరిగిందో మేము సమీక్షించుకుంటాము. తర్వాతి మ్యాచ్ల్లో ఇటువంటి తప్పిదాలు పునరావృతం కాకుండా ప్రయత్నిస్తామని" పోస్ట్మ్యాచ్ ప్రేజేంటేషన్లో గిల్ పేర్కొన్నాడు. -
టీమిండియాకు ఘోర పరాభవం .. జింబాబ్వే చేతిలో ఓటమి
అంతర్జాతీయ టీ20ల్లో టీమిండియాకు ఘోర పరాభవం ఎదురైంది. హరారే వేదికగా జింబాబ్వేతో జరిగిన తొలి టీ20లో13 పరుగుల తేడాతో భారత్ ఓటమి పాలైంది. 116 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని చేధించడంలో భారత బ్యాటర్లు విఫలమయ్యారు. స్వల్ప లక్ష్య చేధనలో భారత్.. జింబాబ్వే బౌలర్ల దాటికి కేవలం 102 పరుగులకే కుప్పకూలింది. జింబాబ్వే బౌలర్లలో కెప్టెన్ సికిందర్ రజా, చతరా తలా మూడు వికెట్లతో టీమిండియా పతనాన్ని శాసించగా.. బెన్నట్, మసకద్జా, జాంగ్వే తలా వికెట్ సాధించారు. భారత బ్యాటర్లలో కెప్టెన్ శుబ్మన్ గిల్(31) పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. అతడితో పాటు వాషింగ్టన్ సుందర్(27) పోరాడనప్పటకి జట్టును మాత్రం గెలిపించలేకపోయాడు. వీరిద్దరూ మినహా మిగితా భారత బ్యాటర్లంతా విఫలమయ్యారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన జింబాబ్వే భారత బౌలర్ల దాటికి 115 పరుగులకే జింబాబ్వే పరిమితమైంది. టీమిండియా స్పిన్నర్ రవి బిష్ణోయ్ 4 వికెట్లతో ఆతిథ్య జట్టు పతనాన్ని శాసించాడు. బిష్ణోయ్తో పాటు మరో స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్ రెండు వికెట్లు, అవేష్ ఖాన్,ముఖేష్ కుమార్ చెరో వికెట్ సాధించారు. జింబాబ్వే బ్యాటర్లలో మదండే(29), మైర్స్(23), బెన్నట్(23), పరుగులు చేశారు. కాగా టీ20ల్లో జింబాబ్వే చేతిలో భారత్ ఓటమి పాలవ్వడం 2016 తర్వాత ఇదే తొలిసారి కావడం గమనార్హం. -
అభిషేక్ శర్మ డకౌట్.. అరంగేట్ర మ్యాచ్లోనే చెత్త రికార్డు! వీడియో
టీమిండియా యువ ఆటగాడు అభిషేక్ శర్మ తన తొలి అంతర్జాతీయ మ్యాచ్లో తీవ్ర నిరాశపరిచాడు. హరారే వేదికగా జింబాబ్వేతో జరుగుతున్న తొలి టీ20తో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన అభిషేక్ శర్మ తనదైన మార్క్ చూపించలేకపోయాడు.ఓపెనర్గా వచ్చిన అభిషేక్ డకౌట్గా వెనుదిరిగాడు. భారత ఇన్నింగ్స్ తొలి ఓవర్ వేసిన స్పిన్నర్ బెన్నట్ బౌలింగ్లో మొదటి నాలుగు బంతులను డాట్ చేసిన అభిషేక్.. ఐదో బంతికి భారీ షాట్కు ప్రయత్నించి క్యాచ్ ఔటయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఇక మ్యాచ్లో డకౌట్ అయిన అభిషేక్ శర్మ ఓ చెత్త రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. అంతర్జాతీయ టీ20 అరంగేట్రంలో డకౌటైన నాలుగో భారత ఆటగాడిగా అభిషేక్ నిలిచాడు. ఈ చెత్త రికార్డు సాధించిన జాబితాలో రజా కంటే ముందు ఎంఎస్ ధోని, కేఎల్ రాహుల్, పృథ్వీ షా ఉన్నారు. pic.twitter.com/JIFGKCtDIV— Azam Khan (@AzamKhan6653) July 6, 2024 -
జింబాబ్వేతో తొలి టీ20.. ముగ్గురు మొనగాళ్ల అరంగేట్రం
భారత తరపున అంతర్జాతీయ క్రికెట్ ఆడాలన్న యువ క్రికెటర్లు అభిషేక్ శర్మ, రియాన్ పరాగ్ కల ఎట్టకేలకు నేరవేరింది. హరారే వేదికగా జింబాబ్వేతో జరుగుతున్న తొలి టీ20తో వీరిద్దరూ అంతర్జాతీయ అరంగేట్రం చేశారు. అదే విధంగా ఇప్పటికే టెస్టు క్రికెట్లో భారత తరపున డెబ్యూ చేసిన వికెట్ కీపర్ బ్యాటర్ ధ్రవ్ జురెల్.. ఇప్పుడు ఈ మ్యాచ్తో టీ20ల్లో అరంగేట్రం చేశాడు. వీరిముగ్గురూ భారత తత్కాలిక హెడ్ కోచ్ వీవీయస్ లక్ష్మణ్, సపోర్ట్ స్టాప్ చేతుల మీదగా డెబ్యూ క్యాప్ను అందుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు,వీడియోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. కాగా ఈ ముగ్గురు ఆటగాళ్లు ఐపీఎల్-2024లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచారు. సన్రైజర్స్ హైదరాబాద్కు ప్రాతినిథ్యం వహిస్తున్న అభిషేక్.. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లో విధ్వంసం సృష్టించాడు.ఐపీఎల్ చరిత్రలోనే సన్రైజర్స్ భారీ స్కోర్ చేయడంలో అభిషేక్ది కీలక పాత్ర. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లో 16 మ్యాచ్లు ఆడిన అభిషేక్ 32.27 సగటుతో 484 పరుగులు చేశాడు. మరోవైపు పరాగ్ కూడా తన ఆటతీరుతో అందరిని ఆకట్టుకున్నాడు. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లో 16 మ్యాచ్లు ఆడిన పరాగ్ 52.09 సగటుతో 573 పరుగులు చేశాడు. ఈ ఏడాది ఐపీఎల్లో రాజస్తాన్ తరపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా పరాగ్ నిలిచాడు. ఈ క్రమంలోనే సెలక్టర్లు అతడికి పిలుపునిచ్చారు.ఇక జురెల్ విషయానికి వస్తే.. ఇప్పటికే టెస్టుల్లో తన ఏంటో నిరూపించుకున్న ఈ రాజస్తాన్ వికెట్ కీపర్ బ్యాటర్, ఇప్పుడు టీ20ల్లో సత్తాచాటేందుకు సిద్దమయ్యాడు. టీ20ల్లో ఫినిషర్గా జురెల్కు మంచి రికార్డు ఉంది. -
IND vs ZIM 1st T20: భారత్కు బిగ్ షాక్.. జింబాబ్వే చేతిలో ఓటమి
India vs Zimbabwe, 1st T20 Live Updates and Highlights:భారత్కు బిగ్ షాక్.. జింబావ్వే చేతిలో ఓటమిటీమిండియాకు ఘోర పరాభవం ఎదురైంది. హరారే వేదికగా జింబాబ్వేతో జరిగిన తొలి టీ20లో13 పరుగుల తేడాతో భారత్ ఓటమి పాలైంది. 116 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని చేధించడంలో భారత బ్యాటర్లు విఫలమయ్యారు. స్వల్ప లక్ష్య చేధనలో భారత్.. జింబాబ్వే బౌలర్ల దాటికి కేవలం 102 పరుగులకే కుప్పకూలింది. జింబాబ్వే బౌలర్లలో కెప్టెన్ సికిందర్ రజా, చతరా తలా మూడు వికెట్లతో టీమిండియా పతనాన్ని శాసించగా.. బెన్నట్, మసకద్జా, జాంగ్వే తలా వికెట్ సాధించారు. భారత బ్యాటర్లలో కెప్టెన్ శుబ్మన్ గిల్(31) పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. అతడితో పాటు వాషింగ్టన్ సుందర్(27) పోరాడనప్పటకి జట్టును మాత్రం గెలిపించలేకపోయాడు. వీరిద్దరూ మినహా మిగితా భారత బ్యాటర్లంతా విఫలమయ్యారు.తొమ్మిదో వికెట్ డౌన్..టీమిండియా ఓటమికి చేరువైంది. ముఖేష్ కుమార్ రూపంలో భారత్ తొమ్మిదో వికెట్ కోల్పోయింది. టీమిండియా ఎనిమిదో వికెట్ డౌన్..అవేష్ ఖాన్ రూపంలో టీమిండియా ఎనిమిదో వికెట్ కోల్పోయింది. 16 పరుగులు చేసిన అవేష్ ఖాన్.. మజకజ్డా బౌలింగ్లో ఔటయ్యాడు. భారత్ విజయానికి 22 బంతుల్లో 31 పరుగులు కావాలి. క్రీజులో వాషింగ్టన్ సుందర్ ఉన్నాడు.టీమిండియా ఏడో వికెట్ డౌన్.. బిష్ణోయ్ ఔట్జింబాబ్వేతో జరుగుతున్న తొలి టీ20లో టీమిండియా ఓటమి దిశగా పయనిస్తోంది. రవి బిష్ణోయ్ రూపంలో భారత్ ఏడో వికెట్ కోల్పోయింది. భారత్ విజయానికి 39 బంతుల్లో 53 పరుగులు కావాలి. క్రీజులో వాషింగ్టన్ సుందర్(5) పరుగులతో ఉన్నారు.టీమిండియా ఆరో వికెట్ డౌన్.. శుబ్మన్ గిల్ ఔట్కెప్టెన్ శుబ్మన్ గిల్ రూపంలో టీమిండియా ఆరో వికెట్ కోల్పోయింది. 31 పరుగులు చేసిన గిల్.. సికిందర్ రజా బౌలింగ్లో క్లీన్ బౌల్డయ్యాడు. భారత విజయానికి 53 బంతుల్లో 63 పరగులు కావాలి. క్రీజులో వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్ ఉన్నారు.కష్టాల్లో టీమిండియా.. ఐదో వికెట్ డౌన్ధ్రువ్ జురెల్ రూపంలో టీమిండియా ఐదో వికెట్ కోల్పోయింది. 7 పరుగులు చేసిన జురెల్.. మజకజ్డా బౌలింగ్లో ఔటయ్యాడు. 10 ఓవర్లకు భారత్ స్కోర్: 43/5రింకూ సింగ్ ఔట్..టీమిండియా నాలుగో వికెట్ కోల్పోయింది. చతర బౌలింగ్లో రింకూ సింగ్ ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరాడు. 4 ఓవర్లకు భారత్ స్కోర్: 28/4. క్రీజులో శుబ్మన్ గిల్(19) పరుగులతో ఉన్నారు.నిరాశపరిచిన పరాగ్..భారత అరంగేట్ర ఆటగాడు రియాన్ పరాగ్ తీవ్ర నిరాశపరిచాడు. కేవలం 2 పరుగులు మాత్రమే చేసిన పరాగ్.. చతరా బౌలింగ్లో ఔటయ్యాడు.రెండో వికెట్ డౌన్..టీమిండియా రెండో వికెట్ కోల్పోయింది. 7 పరుగులు చేసిన రుతురాజ్ గైక్వాడ్.. ముజబారనీ బౌలింగ్లో ఔటయ్యాడు. క్రీజులోకి రియాన్ పరాగ్ వచ్చాడు. 4 ఓవర్లకు భారత్ స్కోర్: 16/2తొలి వికెట్ డౌన్.. అభిషేక్ శర్మ ఔట్116 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు ఆదిలోనే బిగ్ షాక్ తగిలింది. రియన్ బెన్నట్ వేసిన తొలి ఓవర్లో నాలుగో బంతికి అభిషేక్ శర్మ డకౌటయ్యాడు. మసకజ్డాకు క్యాచ్ ఇచ్చి అభిషేక్ శర్మ పెవిలియన్కు చేరాడు. క్రీజులోకి రుతురాజ్ గైక్వాడ్ వచ్చాడు.4 వికెట్లతో చెలరేగిన బిష్ణోయ్.. 115 పరుగులకే జింబాబ్వే పరిమితంహరారే వేదికగా జింబాబ్వేతో జరుగుతున్న తొలి టీ20లో భారత బౌలర్లు చెలరేగారు. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన జింబాబ్వే భారత బౌలర్ల దాటికి 115 పరుగులకే జింబాబ్వే పరిమితమైంది. ముఖ్యంగా టీమిండియా స్పిన్నర్ రవి బిష్ణోయ్ 4 వికెట్లతో ఆతిథ్య జట్టు పతనాన్ని శాసించాడు. బిష్ణోయ్తో పాటు మరో స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్ రెండు వికెట్లు, అవేష్ ఖాన్,ముఖేష్ కుమార్ చెరో వికెట్ సాధించారు. జింబాబ్వే బ్యాటర్లలో మదండే(29), మైర్స్(23), బెన్నట్(23), పరుగులు చేశారు.ఆలౌట్ దిశగా జింబాబ్వే.. 90 పరుగులకే 7 వికెట్లుటాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన జింబాబ్వే 90 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. 15వ ఓవర్ వేసిన వాషింగ్టన్ సుందర్ బౌలింగ్లో జింబాబ్వే వరుసగా రెండు వికెట్లు కోల్పోయింది. 23 పరుగులు చేసిన డియాన్ మైర్స్ సుందర్కు రిటర్న్ క్యాచ్ ఇచ్చి ఔట్ కాగా.. ఆ తర్వాత బంతికే మస్కజ్డా స్టంపౌటయ్యాడు. 13 ఓవర్లకు జింబాబ్వే స్కోర్: 77/5జింబాబ్వే వరుస క్రమంలో రెండు వికెట్లు కోల్పోయింది. 12 ఓవర్ వేసిన అవేష్ ఖాన్ బౌలింగ్లో ఐదో బంతికి సికిందర్ రజా ఔట్ కాగా.. ఆరో బంతికి క్యాంప్బెల్ రనౌటయ్యాడు. 13 ఓవర్లు ముగిసే సరికి జింబాబ్వే.. 5 వికెట్ల నష్టానికి 77 పరుగులు చేసింది.మూడో వికెట్ డౌన్..జింబాబ్వే మూడో వికెట్ కోల్పోయింది. 21 పరుగులు చేసిన మాధవరే.. రవి బిష్ణోయ్ బౌలింగ్లో క్లీన్ బౌల్డయ్యాడు. క్రీజులోకి మైర్స్ వచ్చాడు. 10 ఓవర్లు ముగిసే సరికి జింబాబ్వే 3 వికెట్ల నష్టానికి 69 పరుగులు చేసింది.రెండో వికెట్ డౌన్.. 40 పరుగుల వద్ద జింబాబ్వే రెండో వికెట్ కోల్పోయింది. 23 పరుగులు చేసిన బెన్నట్.. రవి బిష్ణోయ్ బౌలింగ్లో క్లీన్ బౌల్డయ్యాడు. ప్రస్తుతం క్రీజులో కెప్టెన్ సికిందర్ రజా, మాధవరే(17) పరుగులతో ఉన్నారు.తొలి వికెట్ కోల్పోయిన జింబాబ్వే..టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన జింబాబ్వే తొలి వికెట్ కోల్పోయింది. ముఖేష్ కుమార్ బౌలింగ్లో కయా క్లీన్ బౌల్డయ్యాడు. 2 ఓవర్లు ముగిసే సరికి జింబాబ్వే వికెట్ నష్టానికి 14 పరుగులు చేసింది. క్రీజులో బెన్నట్(8), మాధవరే(6) పరుగులతో ఉన్నారు.భారత్-జింబాబ్వే ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ ప్రారంభమైంది. హరారే వేదికగా జరుగుతున్న తొలి టీ20లో భారత్-జింబాబ్వే జట్లు తలపడతున్నాయి.ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన భారత్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్తో భారత తరపున యువ ఆటగాళ్లు అభిషేక్ శర్మ, రియాన్ పరాగ్, ధ్రువ్జురెల్ టీ20ల్లో అంతర్జాతీయ అరంగేట్రం చేశారు. కాగా సిరీస్కు సీనియర్ ఆటగాళ్లు దూరం కావడంతో యువ భారత జట్టుకు శుబ్మన్ గిల్ సారథ్యం వహిస్తున్నాడు.తుది జట్లుభారత్: శుభ్మన్ గిల్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, రుతురాజ్ గైక్వాడ్, రియాన్ పరాగ్, రింకూ సింగ్, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అవేష్ ఖాన్, ముఖేష్ కుమార్, ఖలీల్ అహ్మద్జింబాబ్వే: తడివానాషే మారుమణి, ఇన్నోసెంట్ కైయా, బ్రియాన్ బెన్నెట్, సికందర్ రజా (కెప్టెన్), డియోన్ మైయర్స్, జోనాథన్ కాంప్బెల్, క్లైవ్ మదాండే (వికెట్ కీపర్), వెల్లింగ్టన్ మసకద్జా, ల్యూక్ జోంగ్వే, బ్లెస్సింగ్ ముజరబానీ, టెండై చతారా -
Ind vs Zim: వికెట్ కీపర్గా అతడే.. భారత తుది జట్టు ఇదే!
దిగ్గజ క్రికెటర్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ రిటైర్మెంట్ తర్వాత యువ టీమిండియా తొలిసారి టీ20 సిరీస్ ఆడేందుకు సిద్ధమైంది. ఈ స్టార్ బ్యాటర్ల నిష్క్రమణ తర్వాత శుబ్మన్ గిల్ కెప్టెన్సీలో జింబాబ్వేతో తలపడేందుకు హరారేకు వెళ్లింది.ఆతిథ్య జట్టుతో ఐదు మ్యాచ్ల సిరీస్లో భాగంగా శనివారం తొలి టీ20 ఆడనుంది. ఈ నేపథ్యంలో భారత మాజీ ఓపెనర్, ప్రముఖ కామెంటేటర్ ఆకాశ్ చోప్రా తన తుది జట్టును ఎంచుకున్నాడు.ఈ మేరకు యూట్యూబ్ చానెల్ వేదికగా తన అభిప్రాయాలు పంచుకుంటూ.. ‘‘టాపార్డర్లో శుబ్మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, అభిషేక్ శర్మ ఉండాలి. పరిస్థితులకు అనుగుణంగా ఈ ముగ్గురి ఆర్డర్ మారొచ్చు కానీ.. టాప్-3లో మాత్రం వీరే ఉండాలి.ఆ తర్వాతి స్థానంలో రియాన్ పరాగ్ బ్యాటింగ్కు రావాలి. ఇక వికెట్ కీపర్గా ధ్రువ్ జురెల్ను ఆడించాలి. బ్యాటింగ్ ఆర్డర్లో ఐదో స్థానం అతడిదే.ఆరో బ్యాటర్గా రింకూ సింగ్ బరిలోకి దిగాలి. లేదంటే జురెల్ కంటే ముందుగానే వచ్చినా పర్లేదు. జురెల్ కీపింగ్ చేస్తాడు కాబట్టి ఈసారి జితేశ్ శర్మకు నేనైతే అవకాశం ఇవ్వను.ఇక ఏడో స్థానంలో వాషింగ్టన్ సుందర్ను ఆడించాలి. ఆల్రౌండర్గా జట్టుకు తన సేవలు అవసరం. నలుగురు బౌలర్లను తీసుకోవాలి కాబట్టి స్పిన్నర్ కోటాలో రవి బిష్ణోయితో పాటు.. వాషింగ్టన్ కూడా అందుబాటులో ఉండటం కలిసి వస్తుంది.అభిషేక్ శర్మ కూడా పార్ట్టైమ్ లెఫ్టార్మ్ స్పిన్నర్గా ప్రభావం చూపగలడు. ఇక పేస్ విభాగంలో ఖలీల్ అహ్మద్, ఆవేశ్ ఖాన్, ముకేశ్ కుమార్ తమ బాధ్యతను సమర్థవంతంగా నెరవేర్చగలరు.నిజానికి హర్షిత్ రాణాను చోటివ్వాల్సింది. అయితే, బెంగాల్ ప్రొ టీ20 లీగ్లో ముకేశ్ కుమార్ అద్భుత ప్రదర్శన కనబరిచాడు. ఇక ఖలీల్ అహ్మద్, ఆవేశ్ ఖాన్ వరల్డ్కప్ ట్రావెలింగ్ టీమ్లో భాగం కాబట్టి.. ఈ ముగ్గురిని ఆడించవచ్చు. అందుకే హర్షిత్ రాణాకు ఈసారికి మొండిచేయి తప్పదు’’ అని ఆకాశ్ చోప్రా పేర్కొన్నాడు.ఇదిలా ఉంటే.. జింబాబ్వేతో టూర్కు ఎంపికైన సంజూ శాంసన్, యశస్వి జైస్వాల్, శివం దూబే తొలి రెండు మ్యాచ్లకు దూరం కానున్నారు. టీ20 ప్రపంచకప్-2024 విజయోత్సవాల్లో పాల్గొనేందుకు వీరు భారత్కు తిరిగి వచ్చిన విషయం తెలిసిందే.Watch out for those moves 🕺🏻 Wankhede was a vibe last night 🥳#T20WorldCup | #TeamIndia | #Champions pic.twitter.com/hRBTcu9bXc— BCCI (@BCCI) July 5, 2024 జింబాబ్వేతో టీ20 సిరీస్కు భారత జట్టు:శుబ్మన్ గిల్ (కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, అభిషేక్ శర్మ, రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్(వికెట్ కీపర్), రింకూ సింగ్, వాషింగ్టన్ సుందర్, అవేశ్ ఖాన్, ముకేశ్ కుమార్, ఖలీల్ అహ్మద్, రవి బిష్ణోయ్, సాయి సుదర్శన్, జితేశ్ శర్మ, తుషార్ దేశ్పాండే, హర్షిత్ రాణా.తొలి టీ20కి ఆకాశ్ చోప్రా ఎంచుకున్న జట్టు:శుబ్మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, అభిషేక్ శర్మ, రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్, రింకూ సింగ్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయి, ఖలీల్ అహ్మద్, ఆవేశ్ ఖాన్, ముకేశ్ కుమార్. -
IND vs ZIM: టీమిండియా ఓపెనర్గా అభిషేక్ శర్మ.. కన్మాఫ్ చేసిన కెప్టెన్
భారత్-జింబాబ్వే మధ్య ఐదు మ్యాచ్ల టీ20ల సిరీస్లకు సర్వం సిద్దమైంది. జూలై 5న హరారే వేదికగా ఇరు జట్ల మధ్య జరగనున్న తొలి టీ20తో ఈ సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్లో ఆతిథ్య జింబాబ్వే పూర్తిస్ధాయి జట్టుతో బరిలోకి దిగుతుండగా.. భారత్ మాత్రం పూర్తిగా యువ జట్టుతో ఆడనుంది. ఈ పర్యటనకు టీ20 వరల్డ్కప్-2024లో భాగమైన భారత ఆటగాళ్లకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ విశ్రాంతి ఇచ్చింది. దీంతో ఓపెనర్ శుబ్మన్గిల్కు జట్టు సారథ్య బాధ్యతలు అప్పగించారు. అదే విధంగా ఐపీఎల్-2024లో అద్భుత ప్రదర్శన కనబరిచిన అభిషేక్ శర్మ, రియాన్ పరాగ్, తుషార్ దేశ్పాండే, హర్షిత్ రానాలకు భారత సెలక్టర్లు తొలిసారి పిలుపునిచ్చారు.అభిషేక్ అరంగేట్రం..ఇక తొలిసారి భారత జట్టు ఎంపికైన అభిషేక్ శర్మ.. శనివారం జింబాబ్వేతో జరగనున్న తొలి టీ20తో అంతర్జాతీయ అరంగేట్రం చేయనున్నాడు. ఈ విషయాన్ని భారత కెప్టెన్ శుబ్మన్ గిల్ ధ్రువీకరించాడు. ఈ మ్యాచ్కు మీడియాతో మాట్లాడిన గిల్.. తనతో కలిసి అభిషేక్ శర్మ ఇన్నింగ్స్ను ప్రారంభించనున్నాడని చెప్పుకొచ్చాడు. అదే విధంగా ఫస్ట్ డౌన్లో రుతురాజ్ గైక్వాడ్ బ్యాటింగ్కు రానున్నాడని గిల్ తెలిపాడు. కాగా ఐపీఎల్-2024లో ఎస్ఆర్హెచ్కు ప్రాతనిథ్యం వహించిన అభిషేక్ శర్మ సంచలన ప్రదర్శన కనబరిచాడు. అభిషేక్ ఓపెనర్గా ట్రావిస్ హెడ్తో కలిసి భీబత్సం సృష్టించాడు. ఐపీఎల్ చరిత్రలోనే సన్రైజర్స్ భారీ స్కోర్ చేయడంలో అభిషేక్ది కీలక పాత్ర. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లో 16 మ్యాచ్లు ఆడిన అభిషేక్ 32.27 సగటుతో 484 పరుగులు చేశాడు. టీమిండియా దిగ్గజం యువరాజ్ సింగ్ గైడెన్స్లో రాటుదేలుతున్న అభిషేక్ శర్మ.. దేశీవాళీ క్రికెట్లో సైతం అదరగొడుతున్నాడు. -
జింబాబ్వేతో తొలి టీ20.. భారత తుది జట్టు ఇదే? విధ్వంసకర వీరుల ఎంట్రీ
విశ్వవిజేతలగా నిలిచిన అనంతరం భారత జట్టు తొలి టీ20 సిరీస్కు సిద్దమైంది. జింబాబ్వేతో ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో టీమిండియా తలపడనుంది. ఈ సిరీస్కు సీనియర్ ఆటగాళ్లు దూరం కావడంతో భారత జట్టుకు యువ ఓపెనర్ శుబ్మన్ గిల్ సారథ్యం వహించనున్నాడు. ఐపీఎల్ హీరోలు అభిషేక్ శర్మ, రియాన్ పరాగ్, సాయిసుదర్శన్, తుషార్ దేశ్పాండే, హర్షిత్ రానాలకు తొలిసారి భారత టీ20 జట్టులో చోటు దక్కింది. జూలై 6న హరారే వేదికగా జరగనున్న తొలి టీ20తో ఈ సిరీస్ ప్రారంభం కానుంది.ఈమ్యాచ్ కోసం గిల్ సారథ్యంలోని భారత జట్టు ఇప్పటికే హరారేకు చేరుకుంది. తొలి పోరు కోసం తీవ్రంగా యంగ్ టీమిండియా శ్రమించింది. ఈ క్రమంలో తొలి టీ20లో ఆడే భారత తుది జట్టుపై ఓ లూక్కేద్దం.అభిషేక్, పరాగ్ ఎంట్రీ..ఈ మ్యాచ్తో ఎస్ఆర్హెచ్ స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మ భారత తరపున అంతర్జాతీయ అరంగేట్రం చేసే అవకాశముంది. అతడు కెప్టెన్ శుబ్మన్ గిల్తో కలిసి భారత ఇన్నింగ్స్ను ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది.అదే విధంగా ఫస్ట్డౌన్లో రుతురాజ్ గైక్వాడ్ను బ్యాటింగ్ దింపే ఆలోచనలో జట్టు మెనెజ్మెంట్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇక అభిషేక్తో పాటు రియాన్ పరాగ్ కూడా డెబ్యూ చేయనున్నట్లు సమాచారం. అతడు మిడిలార్డర్లో బ్యాటింగ్ వచ్చే ఛాన్స్ ఉంది. వికెట్ కీపర్గా ధ్రువ్ జురెల్కు చోటు దక్కే అవకాశముంది. ఫినిషర్గా రింకూ సింగ్ ఎలాగో ఉంటాడు.ఆల్రౌండర్గా వాషింగ్టన్ సుందర్కు ఛాన్స్ ఇవ్వనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక బౌలర్లగా రవి బిష్ణోయ్, అవేష్ ఖాన్, ఖాలీల్ అహ్మద్, ముఖేష్ కుమార్ల స్ధానాలు దాదాపు ఖాయమైనట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి.భారత తుది జట్టు(అంచనా): అభిషేక్ శర్మ, శుబ్మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్, రింకూ సింగ్, వాషింగ్టన్ సుందర్,రవి బిష్ణోయ్, అవేష్ ఖాన్, ఖాలీల్ అహ్మద్, ముఖేష్ కుమార్ -
టీమిండియాతో టీ20 సిరీస్.. జింబాబ్వే క్రికెట్ కీలక నిర్ణయం
స్వదేశంలో టీమిండియాతో ఐదు మ్యాచ్ల టీ20ల సిరీస్కు జింబాబ్వే అన్ని విధాల సిద్దమైంది. జూలై 5(శనివారం) హరారే వేదికగా ఇరు జట్ల మధ్య జరగనున్న తొలి టీ20తో ఈ సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్కు ముందు జింబాబ్వే క్రికెట్ కీలక నిర్ణయం తీసుకుంది. తమ జట్టు బౌలింగ్ కోచ్గా మాజీ దక్షిణాఫ్రికా ఫాస్ట్ బౌలర్ చార్ల్ లాంగెవెల్ట్ను జింబాబ్వే క్రికెట్ నియమించింది. లాంగేవెల్ట్కు కోచ్గా అపారమైన అనుభవం ఉంది. గతంలో అతడు ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, దక్షిణాఫ్రికాకు బౌలింగ్ కోచ్గా పనిచేశాడు.ఇప్పుడు లాంగేవెల్ట్ జింబాబ్వే ప్రధాన కోచ్ జస్టిన్ సామన్స్, అసిస్టెంట్ కోచ్ డియోన్ ఇబ్రహీమ్లతో కలిసి పనిచేయనున్నాడు. కాగా జస్టిన్ సామన్స్, డియోన్ ఇబ్రహీమ్లను కూడా ఇటీవలే జింబాబ్వే క్రికెట్ ఎంపిక చేసింది. ఈ సిరీస్తోనే జింబాబ్వే పురుషల జట్టు కోచ్లగా వీరి ముగ్గరి ప్రయాణం ప్రారంభం కానుంది. జింబాబ్వే మాజీ బ్యాటర్ స్టువర్ట్ మట్సికెన్యేరి ఫీల్డింగ్ కోచ్గా పనిచేయనున్నాడు.జింబాబ్వేతో తొలి రెండు టీ20లకు భారత జట్టుశుభమాన్ గిల్ (కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, అభిషేక్ శర్మ, రింకు సింగ్, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), రియాన్ పరాగ్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అవేష్ ఖాన్, ఖలీల్ అహ్మద్, ముఖేష్ కుమార్, తుషార్ దేశ్పాండే, సాయి సుదర్శన్, జితేష్ శర్మ (వికెట్ కీపర్) , హర్షిత్ రాణాభారత్తో సిరీస్కు జింబాబ్వే జట్టుసికందర్ రజా (కెప్టెన్), ఫరాజ్ అక్రమ్, బ్రియాన్ బెన్నెట్, జోనాథన్ క్యాంప్బెల్, టెండై చటారా, ల్యూక్ జోంగ్వే, ఇన్నోసెంట్ కైయా, క్లైవ్ మదాండే, వెస్లీ మాధవెరె, తాడివానాషే మారుమణి, వెల్లింగ్టన్ మసకద్జా, బ్రాండన్ మవుటా, బ్లెస్సింగ్ ముజరబానీ, అన్టుమ్డ్ మైక్ర్స్రాబానీ, డి. మిల్టన్ శుంబా -
నా కల నెరవేరింది.. పాస్ పోర్ట్, ఫోన్ కూడా మర్చిపోయా: పరాగ్
టీ20 ప్రపంచకప్-2024 విజయం తర్వాత తొలి విదేశీ పర్యటనకు టీమిండియా సిద్దమైంది. జూలై 6 నుంచి జింబాబ్వేతో ప్రారంభం కానున్న ఐదు మ్యాచ్ల టీ20ల సిరీస్లో భారత జట్టు తలపడనుంది. అయితే ఈ సిరీస్కు సీనియర్ ఆటగాళ్లను విశ్రాంతి ఇచ్చిన బీసీసీఐ సెలక్షన్ కమిటీ.. యువ భారత జట్టును జింబాబ్వే పర్యటనకు ఎంపిక చేసింది. ఈ జట్టుకు స్టార్ ఓపెనర్ శుబ్మన్ గిల్ సారథ్యం వహించనున్నాడు. ఐపీఎల్-2024లో అదరగొట్టిన రియాన్ పరాగ్, అభిషేక్ శర్మ, తుషార్ దేశ్పాండే, హర్షిత్ రానాలకు భారత సెలక్టర్లు తొలిసారి పిలుపునిచ్చారు. ఇక ఇప్పటికే ఈ సిరీస్ కోసం శుబ్మన్ గిల్ సారథ్యంలోని యంగ్ ఇండియా టీమ్ జింబాబ్వే గడ్డపై అడుగుపెట్టింది.పాస్ పోర్ట్ కూడా మర్చిపోయా?ఇక తొలిసారి భారత జట్టు నుంచి పిలుపురావడంపై రాజస్తాన్ రాయల్స్ యువ ఆల్రౌండర్ రియాన్ పరాగ్ స్పందించాడు. "భారత జట్టుకు ఎంపిక కావడం చాలా సంతోషంగా ఉంది. ఈ రోజు కోసమే ఎన్నో ఏళ్లగా ఎదురుచూస్తున్నాను. ఇండియన్స్ జెర్సీ వేసుకోవడం వేరే ఫీల్. ఆ భావనను మాటల్లో వర్ణించలేను. అస్సా నుంచి వచ్చిన నేను భారత్కు అత్యున్నత స్ధాయిలో ప్రాతినిథ్యం వహించాలని కలలు కన్నాను. నా కలను ఎన్నాళ్లకు నెరవేర్చుకోగలిగాను. ఈ ఉత్సాహంలో పాస్పోర్టు, నా ఫోన్లు మరిచిపోయా. వాటిని పోగొట్టుకోలేదు కానీ ఎక్కడ పెట్టానో గుర్తుకు రాలేదు. అయితే సరైన సమయంలో నాకు మళ్లీ దొరికాయి. చిన్నప్పటి నుంచి ఇలాంటి ప్రయాణం చేయాలని కలలు కన్నా.ఇప్పటికే నేను చాలా మ్యాచ్లు విదేశాల్లో ఆడాను. కానీ భారత్ జెర్సీ ధరించి ప్రయాణించడం వేరు. జింబాబ్వేతో ప్రత్యేక అనుబంధం ఉంటుందని బీసీసీఐకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పరాగ్ పేర్కొన్నాడు. -
జింబాబ్వే చేరుకున్న యువ భారత జట్టు.. వీడియో
టీ20 వరల్డ్కప్-2024లో గెలిచి మంచి జోష్లో ఉన్న టీమిండియా.. వారం రోజుల తిరగక ముందే మరో పోరుకు సిద్దమైంది. జింబాబ్వేతో ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో భారత్ తలపడనుంది. అయితే ఈ సిరీస్కు టీ20 వరల్డ్కప్లో భాగమైన భారత ఆటగాళ్లకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ విశ్రాంతి ఇచ్చింది. 15 మంది సభ్యులతో కూడిన యువ భారత జట్టను జింబాబ్వే పర్యటనకు బీసీసీఐ పంపించింది. ఈ జట్టుకు స్టార్ ఓపెనర్ శుబ్మన్ గిల్ సారథ్యం వహించనున్నాడు. జూలై 6న హరారే వేదికగా జరగనున్న తొలి టీ20తో ఈ సిరీస్ ప్రారంభం కానుంది.జింబాబ్వేకు చేరుకున్న భారత జట్టు..ఇక ఈ సిరీస్ కోసం భారత జట్టు బుధవారం జింబాబ్వేలో అడుగుపెట్టింది. రాబర్ట్ గాబ్రియేల్ ముగాబే అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న భారత ఆటగాళ్లకు జింబాబ్వే క్రికెట్ ఘన స్వాగతం పలికింది. ఇందుకు సంబంధించిన వీడియోను జింబాబ్వే క్రికెట్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. జింబాబ్వే గడ్డపై అడుగుపెట్టిన భారత జట్టు జూలై 4న తమ తొలి ప్రాక్టీస్ సెషన్లో పాల్గోనుంది. ఇక కెప్టెన్ శుబ్మన్ గిల్ తన సహచర ఆటగాళ్ల కంటే ముందే న్యూయార్క్ నుంచి నేరుగా జింబాబ్వేకు చేరుకున్నాడు.జింబాబ్వే పర్యటనకు భారత జట్టు: శుభమన్ గిల్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్, అభిషేక్ శర్మ, రింకూ సింగ్, సంజు శాంసన్ (వికెట్ కీపర్), ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), నితీష్ రెడ్డి, రియాన్ పరాగ్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అవేష్ ఖాన్, ఖలీల్ అహ్మద్, ముఖేష్ కుమార్, తుషార్ దేశ్ పాండే.𝐖𝐞 𝐰𝐞𝐥𝐜𝐨𝐦𝐞 𝐓𝟐𝟎 𝐖𝐨𝐫𝐥𝐝 𝐂𝐮𝐩 𝐂𝐡𝐚𝐦𝐩𝐢𝐨𝐧𝐬 𝐈𝐧𝐝𝐢𝐚 🇮🇳 ! 🤗#ZIMvIND pic.twitter.com/Oiv5ZxgzaS— Zimbabwe Cricket (@ZimCricketv) July 2, 2024 -
ఐపీఎల్లో అదరగొట్టాడు.. భారత జట్టులో చోటు కొట్టేశాడు
కోల్కతా నైట్రైడర్స్ పేసర్ హర్షిత్ రానాకు జాక్ పాట్ తగిలింది. హర్షిత్ రానాకు భారత సెలక్టర్ల నుంచి తొలిసారి పిలుపువచ్చింది. జింబాబ్వేతో జరగనున్న టీ20 సిరీస్కు రానాను సెలక్టర్లు ఎంపిక చేశారు. జింబాబ్వే సిరీస్కు తొలుత ప్రకటించిన 15 మంది సభ్యుల భారత జట్టులో బీసీసీఐ తాజాగా స్వల్ప మార్పులు చేసింది. టీ20 వరల్డ్కప్-2024లో భాగమైన సంజూ శాంసన్, శివమ్ దూబే, యశస్వి జైస్వాల్లను జింబాబ్వే సిరీస్కు ముందు భారత జట్టు నుంచి బీసీసీఐ రిలీజ్ చేసింది. ఈ క్రమంలోనే రానాకు చోటు దక్కింది. రానాతో పాటు సాయిసుదర్శన్, జితేష్ శర్మలకు కూడా అవకాశం లభించింది.ఇప్పటికే భారత జట్టు జింబాబ్వేకు పయనం కాగా.. వీరు ముగ్గురు కాస్త ఆలస్యంగా జట్టుతో కలవనున్నారు. కాగా జితేష్ శర్మ ఇప్పటికే భారత్ తరపున టీ20ల్లో అరంగేట్రం చేయగా.. సాయిసుదర్శన్, రానాలకు భారత టీ20 జట్టులో చోటు దక్కడం ఇదే మొదటి సారి. అయితే సాయి మాత్రం భారత తరపున వన్డేల్లో మాత్రం డెబ్యూ చేశాడు.ఐపీఎల్లో అదుర్స్..ఐపీఎల్-2024లో హర్షిత్ రానా అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. తన బౌలింగ్తో ప్రత్యర్ధిలను ముప్పుతిప్పలు పెట్టాడు. పవర్ ప్లేలో బౌలింగ్ చేసి తన జట్టుకు అద్భుతమైన ఆరంభాన్ని ఇచ్చేవాడు. కేకేఆర్ ఛాంపియన్స్గా నిలవడంలో రానా కీలక పాత్ర పోషించాడు.ఓవరాల్గా ఈ ఏడాది ఐపీఎల్లో 13 మ్యాచ్లు ఆడిన రానా 19 వికెట్లు పడగొట్టి.. కేకేఆర్ తరపున లీడింగ్ వికెట్ టేకర్గా నిలిచాడు. ఫస్ట్క్లాస్ క్రికెట్లో కూడా 7 మ్యాచ్లు ఆడిన రానా.. 28 వికెట్లు పడగొట్టి సత్తాచాటాడు. అదేవిధంగా భారత-ఎ జట్టు తరపున కూడా రానా ఆడాడు. ఈ క్రమంలోనే అతడికి సెలక్టర్లు పిలుపునిచ్చారు. కాగా ఈ సిరీస్ జులై 6 నుంచి ప్రారంభం కానుంది. హరారే వేదికగా జులై 6, 7, 10, 13, 14 తేదీల్లో మ్యాచ్లు జరుగనున్నాయి.జింబాబ్వేతో తొలి రెండు టీ20లకు భారత జట్టుశుభమాన్ గిల్ (కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, అభిషేక్ శర్మ, రింకు సింగ్, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), రియాన్ పరాగ్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అవేష్ ఖాన్, ఖలీల్ అహ్మద్, ముఖేష్ కుమార్, తుషార్ దేశ్పాండే, సాయి సుదర్శన్, జితేష్ శర్మ (వికెట్ కీపర్) , హర్షిత్ రాణా -
జింబాబ్వేతో టీ20 సిరీస్.. భారత జట్టులో కీలక మార్పులు! సంజూ, దూబే ఔట్
జింబాబ్వేతో ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో తలపడేందుకు టీమిండియా సిద్దమైంది. టీ20 వరల్డ్కప్-2024లో భాగమైన ఆటగాళ్లందరికి దాదాపుగా జింబాబ్వే పర్యటనకు సెలక్టర్లు విశ్రాంతి ఇచ్చారు. దీంతో ఈ సిరీస్లో భారత జట్టుకు యువ ఓపెనర్ శుబ్మన్ గిల్ సారథ్యం వహించనున్నాడు. అభిషేక్ శర్మ, రియాన్ పరాగ్ వంటి యువ ఆటగాళ్లకు తొలిసారి భారత జట్టులో చోటు దక్కింది. ఇక ఈ సిరీస్ కోసం ఇప్పటికే శుబ్మన్ గిల్ సారథ్యంలోని భారత జట్టు జింబాబ్వేకు పయనమైంది.భారత జట్టులో కీలక మార్పులు..ఇక ఈ సిరీస్కు ముందు భారత జట్టులో పలు కీలక మార్పులు బీసీసీఐ చేసింది. టీ20 వరల్డ్కప్ 2024 భారత జట్టులో భాగమైన సంజూ శాంసన్, యశస్వీ జైశ్వాల్, శివమ్ దూబేలను జింబాబ్వే సిరీస్కు ఎంపిక చేసిన జట్టు నుంచి బీసీసీఐ రిలీజ్ చేసింది. వారి స్ధానంలో తొలి రెండు టీ20లకు హర్షిత్ రానా, సాయి సుదర్శన్, జితేష్ శర్మలను బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఎంపిక చేసింది. కాగా హర్షిత్ రానా, సాయిసుదర్శన్ తొలిసారి భారత జట్టుకు ఎంపికయ్యారు. కాగా ఈ సిరీస్ జులై 6 నుంచి ప్రారంభం కానుంది. హరారే వేదికగా జులై 6, 7, 10, 13, 14 తేదీల్లో మ్యాచ్లు జరుగనున్నాయి.జింబాబ్వేతో తొలి రెండు టీ20లకు భారత జట్టుశుభమాన్ గిల్ (కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, అభిషేక్ శర్మ, రింకు సింగ్, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), రియాన్ పరాగ్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అవేష్ ఖాన్, ఖలీల్ అహ్మద్, ముఖేష్ కుమార్, తుషార్ దేశ్పాండే, సాయి సుదర్శన్, జితేష్ శర్మ (వికెట్ కీపర్) , హర్షిత్ రాణా -
"ఆల్ ద బెస్ట్ టీమిండియా".. జింబాబ్వే పర్యటనకు బయల్దేరిన శుభ్మన్ గిల్ సేన
ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ ఆడేందుకు టీమిండియా జింబాబ్వే పర్యటనకు బయల్దేరింది. శుభ్మన్ గిల్ నేతృత్వంలోని యంగ్ ఇండియా నిన్న (జులై 1) సాయంత్రం ముంబై ఎయిర్పోర్ట్ నుంచి టేకాఫ్ అయ్యింది. టీ20 వరల్డ్కప్ 2024 అనంతరం సీనియర్లు విశ్రాంతి కోరడంతో సెలెక్టర్లు జింబాబ్వే సిరీస్కు యువ జట్టును ఎంపిక చేశారు. హెడ్ కోచ్గా రాహుల్ ద్రవిడ్ పదవీకాలం ప్రపంచకప్తో ముగియడంతో ఈ పర్యటనకు తాత్కాలిక కోచ్గా ఎన్సీఏ డైరెక్టర్ వీవీఎస్ లక్ష్మణ్ ఎంపికయ్యాడు. ఈ సిరీస్ జులై 6 నుంచి ప్రారంభం కానుంది. హరారే వేదికగా జులై 6, 7, 10, 13, 14 తేదీల్లో మ్యాచ్లు జరుగనున్నాయి.Team India off to Zimbabwe via Emirates flight from Mumbai. 🇮🇳- Good luck, boys! pic.twitter.com/0yJdocApUX— Mufaddal Vohra (@mufaddal_vohra) July 1, 2024సీనియర్లకు విశ్రాంతిఈ సిరీస్ కోసం భారత సెలెక్టర్లు సీనియర్లు హార్దిక్, సూర్యకుమార్, పంత్, అక్షర్ పటేల్కు విశ్రాంతి కల్పించారు. రోహిత్, కోహ్లి, జడేజా టీ20 ఫార్మాట్కు రిటైర్మెంట్ ప్రకటించిన నేపథ్యంలో వారిని పరిగణలోకి తీసుకోలేదు. సీనియర్ల గైర్హాజరీలో శుభ్మన్ గిల్ టీమిండియా కెప్టెన్గా వ్యవహరించనున్నాడు.TEAM INDIA HAS LEFT FOR ZIMBABWE FOR THE T20I SERIES.- Good luck, Team India. 🇮🇳 pic.twitter.com/iiQUVjlIKA— Tanuj Singh (@ImTanujSingh) July 2, 2024ఈ సిరీస్కు వరల్డ్కప్ ట్రావెలింగ్ రిజర్వ్ ప్లేయర్లలోని రింకూ సింగ్, ఆవేశ్ ఖాన్, ఖలీల్ అహ్మద్ ఎంపికయ్యారు. వరల్డ్కప్ జట్టులోని సభ్యులు యశస్వి జైస్వాల్, శివమ్ దూబే, సంజూ శాంసన్ కూడా జట్టులో చోటు దక్కించుకన్నారు. అభిషేక్ శర్మ, రియాన్ పరాగ్, తుషార్ దేశ్పాండే కొత్తగా జట్టులోకి వచ్చారు. ఈ సిరీస్ సోనీ స్పోర్ట్స్ టెన్ 3 (హిందీ) SD & HD, సోనీ స్పోర్ట్స్ టెన్ 4 (తమిళం/తెలుగు), మరియు సోనీ స్పోర్ట్స్ టెన్ 5 SD & HD ఛానల్లలొ ప్రత్యక్ష ప్రసారం కానుంది.జింబాబ్వే సిరీస్కు భారత జట్టు..శుభ్మన్ గిల్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్, రింకూ సింగ్, రియాన్ పరాగ్, శివమ్ దూబే, అభిషేక్ శర్మ, వాషింగ్టన్ సుందర్, సంజూ శాంసన్, దృవ్ జురెల్, రవి బిష్ణోయ్, ఆవేశ్ ఖాన్, ఖలీల్ అహ్మద్, ముకేశ్ కుమార్, తుషార్ దేశ్పాండే -
టీమిండియాతో టీ20 సిరీస్.. జట్టును ప్రకటించిన జింబాబ్వే
స్వదేశంలో భారత్తో జరగనున్న ఐదు మ్యాచ్ టీ20 సిరీస్కు 15 మంది సభ్యులతో కూడిన తమ జట్టును జింబాబ్వే క్రికెట్ ప్రకటించింది. ఈ జట్టుకు సికిందర్ రజా సారథ్యం వహించనున్నాడు. యువ బ్యాటర్ అంతుమ్ నఖ్వీకి తొలిసారి సెలక్టర్లు జాతీయ జట్టుకు ఎంపిక చేశారు. అయితే నఖ్వీ భారత్తో టీ20 సిరీస్కు అందుబాటులో ఉంటాడా లేదా? అన్నది ఇంకా క్లారిటీ లేదు. ఆస్ట్రేలియా పౌరసత్వం కలిగిన నఖ్వీ గతేడాది జింబాబ్వేకు మకాం మార్చాడు. ప్రస్తుతం జింబాబ్వే దేశీవాళీ క్రికెట్లో ఆడుతున్నాడు.ఈ క్రమంలో జింబాబ్వేకు అత్యున్నత స్థాయిలో ప్రాతినిధ్యం వహించాలని నఖ్వీ గట్టిగా ఫిక్స్ అయ్యాడు. దీంతో ఆ దేశ పౌరసత్వం కోసం నఖ్వీ దరఖాస్తు చేసుకున్నాడు. అయితే అతడి సిటిజన్షిప్ను ఇంకా అక్కడి ప్రభుత్వం అంగీకరించలేదు. ఏదేమైనప్పటికి దేశీవాళీ క్రికెట్లో అద్బుతంగా రాణిస్తుండడంతో సెలక్టర్లు అతడిని ఎంపిక చేశారు. కాగా అతడి పౌరసత్వంపై ఒకట్రెండు రోజుల్లో క్లియర్స్ వచ్చే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం. ఇక గత కొంత కాలంగా జట్టుకు దూరంగా ఉంటున్న వెస్లీ మాధవెరె,బ్రాండన్ మవుతా సెలక్టర్లు పిలుపునిచ్చారు. ఈ సిరీస్ జులై 6 నుంచి మొదలుకానుంది. అన్ని మ్యాచ్లు హరారే వేదికగానే జరగనున్నాయి. కాగా ఈ సిరీస్కు భారత జట్టును బీసీసీఐ ఇప్పటికే ప్రకటించింది. ఈ టూర్లో భారత జట్టు కెప్టెన్గా ఓపెనర్ శుబ్మన్ గిల్ వ్యవహరించనున్నాడు.భారత్తో సిరీస్కు జింబాబ్వే జట్టుసికందర్ రజా (కెప్టెన్), ఫరాజ్ అక్రమ్, బ్రియాన్ బెన్నెట్, జోనాథన్ క్యాంప్బెల్, టెండై చటారా, ల్యూక్ జోంగ్వే, ఇన్నోసెంట్ కైయా, క్లైవ్ మదాండే, వెస్లీ మాధవెరె, తాడివానాషే మారుమణి, వెల్లింగ్టన్ మసకద్జా, బ్రాండన్ మవుటా, బ్లెస్సింగ్ ముజరబానీ, అన్టుమ్డ్ మైక్ర్స్రాబానీ, డి. మిల్టన్ శుంబాజింబాబ్వేతో సిరీస్కు భారత జట్టుశుభ్మన్ గిల్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్, రింకూ సింగ్, రియాన్ పరాగ్, శివమ్ దూబే, అభిషేక్ శర్మ, వాషింగ్టన్ సుందర్, సంజూ శాంసన్, దృవ్ జురెల్, రవి బిష్ణోయ్, ఆవేశ్ ఖాన్, ఖలీల్ అహ్మద్, ముకేశ్ కుమార్, తుషార్ దేశ్పాండే -
Ind vs Zim: నితీశ్ రెడ్డికి చేదు అనుభవం.. శివం దూబేకు ఛాన్స్
ఆంధ్ర క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. ఈ యువ ఆల్రౌండర్ గాయం బారిన పడ్డాడు. ఫలితంగా జింబాబ్వేతో టీ20 సిరీస్కు దూరమయ్యాడు. ఈ క్రమంలో తీశ్ రెడ్డి స్థానంలో శివం దూబేను ఎంపిక చేశారు సెలక్టర్లు. ఈ విషయాన్ని భారత క్రికెట్ నియంత్రణ మండలి బుధవారం ప్రకటించింది.వైజాగ్ కుర్రాడుకాగా విశాఖపట్నానికి చెందిన పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి జింబాబ్వే పర్యటనకు ఎంపికైన విషయం తెలిసిందే. ఐపీఎల్-2024లో సన్రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) తరఫున అదరగొట్టిన ఈ 21 ఏళ్ల కుడిచేతి వాటం బ్యాటర్.. ‘ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ద సీజన్ 2024’ అవార్డు కూడా అందుకున్నాడు.జింబాబ్వే పర్యటన కోసంఈ సీజన్ ఆసాంతం నిలకడైన ప్రదర్శనతో ఆకట్టుకున్న నితీశ్ కుమార్ రెడ్డి టీమిండియా సెలక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. ఈ క్రమంలో సీనియర్లు విశ్రాంతి తీసుకుంటున్న జింబాబ్వే పర్యటన కోసం అతడిని ఎంపిక చేశారు.ఈ క్రమంలో టీమిండియా టీ20 జట్టుకు సెలక్ట్ అయిన తొలి ఆంధ్ర క్రికెటర్గా నితీశ్ రెడ్డి చరిత్రకెక్కాడు. అయితే, ప్రస్తుతం అతడు గాయంతో బాధపడుతున్నట్లు బీసీసీఐ వెల్లడించింది.అతడితో భర్తీనితీశ్ రెడ్డి చికిత్స నిమిత్తం ప్రస్తుతం బీసీసీఐ వైద్య బృందం పర్యవేక్షణలో ఉన్నట్లు తెలిపింది. ఈ క్రమంలో నితీశ్ రెడ్డి స్థానాన్ని ముంబై పేస్ ఆల్రౌండర్ శివం దూబేతో భర్తీ చేస్తున్నట్లు వెల్లడించింది.కాగా టీ20 ప్రపంచకప్-2024 తర్వాత సీనియర్లంతా విశ్రాంతి తీసుకోనున్న నేపథ్యంలో జింబాబ్వే టూర్కు యువ జట్టును ఎంపిక చేశారు. ఈ జట్టుకు శుబ్మన్ గిల్ కెప్టెన్గా వ్యవహరించనున్నాడు.ఇక జూలై 6 నుంచి టీమిండియా జింబాబ్వేతో ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ ఆడనుంది. ఈ మ్యాచ్లన్నింటికీ హరారే వేదిక.జింబాబ్వేతో టీ20 సిరీస్కు భారత జట్టు(రివైజ్డ్)శుబ్మన్ గిల్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్, అభిషేక్ శర్మ, రింకూ సింగ్, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), ధృవ్ జురెల్ (వికెట్ కీపర్), రియాన్ పరాగ్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అవేష్ ఖాన్, ఖలీల్ అహ్మద్, ముఖేష్ కుమార్, తుషార్ దేశ్పాండే, శివం దూబే.చదవండి: ఒకే ఓవర్లో 43 రన్స్.. 134 ఏళ్ల చరిత్రలో ఇదే తొలిసారి!Nitish Kumar Reddy: అప్పుడే నా కల పూర్తిగా నెరవేరుతుంది -
టీమిండియా కెప్టెన్గా అతడే సరైనోడు: సెహ్వాగ్
టీ20 ప్రపంచకప్-2024 టోర్నీ ముగిసిన తర్వాత భారత క్రికెట్ జట్టు జింబాబ్వే పర్యటనకు వెళ్లనుంది. ఇరు జట్ల మధ్య ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ జరుగనుంది.జూలై 6, 7, 10, 13, 14వ తేదీల్లో హరారే వేదికగా జరుగనున్న ఈ సిరీస్కు టీమిండియా సీనియర్లంతా దూరంగా ఉండనున్నారు. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి యువ ఓపెనర్ శుబ్మన్ గిల్కు సారథ్య బాధ్యతలు అప్పగించింది.రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్ గైర్హాజరీ కారణంగా.. తొలిసారిగా ఈ పంజాబీ బ్యాటర్కు టీమిండియా కెప్టెన్గా వ్యవహరించే సువర్ణావకాశం లభించింది. ఈ నేపథ్యంలో భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ కీలక వ్యాఖ్యలు చేశాడు.రోహిత్ శర్మ తర్వాత అతడేరోహిత్ శర్మ వారసుడిగా శుబ్మన్ గిల్ సరైన ఎంపిక అంటూ సెలక్షన్ కమిటీ నిర్ణయాన్ని సమర్థించాడు. ఈ మేరకు క్రిక్బజ్ షోలో మాట్లాడుతూ.. ‘‘శుబ్మన్ గిల్కు ఎంతో భవిష్యత్తు ఉంది.మూడు ఫార్మాట్లలోనూ అద్భుతంగా ఆడగల సత్తా అతడికి ఉంది. గతేడాది తనకు గొప్పగా గడిచింది. అయితే, దురదృష్టవశాత్తూ టీ20 ప్రపంచకప్-2024 జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు.సరైన నిర్ణయంనా అభిప్రాయం ప్రకారం.. గిల్ను కెప్టెన్ చేయడం సరైన నిర్ణయం. రోహిత్ శర్మ వెళ్లిన తర్వాత శుబ్మన్ గిల్ మాత్రమే కెప్టెన్సీకి పూర్తి న్యాయం చేయగలుగుతాడు’’ అని వీరేంద్ర సెహ్వాగ్ గిల్ నైపుణ్యాలపై తనకు నమ్మకం ఉందని పేర్కొన్నాడు.అదే విధంగా.. జింబాబ్వేతో సిరీస్కు అభిషేక్ శర్మ, నితీశ్ కుమార్ రెడ్డి, తుషార్ దేశ్పాండే, రియాన్ పరాగ్ వంటి ఐపీఎల్ హీరోలను ఎంపిక చేయడం పట్ల సెహ్వాగ్ స్పందించాడు. దేశవాళీ క్రికెట్తో పాటు ఐపీఎల్ ద్వారా ఆటగాళ్లను ఎంపిక చేయడంలో తనకు తప్పేమీ కనిపించడం లేదన్నాడు.జింబాబ్వే టూర్కు టీమిండియాశుబ్మన్ గిల్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్, అభిషేక్ శర్మ, రింకు సింగ్, సంజు శాంసన్ (వికెట్ కీపర్), ధృవ్ జురెల్ (వికెట్ కీపర్), నితీష్ రెడ్డి, రియాన్ పరాగ్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అవేష్ ఖాన్, ఖలీల్ అహ్మద్, ముఖేష్ కుమార్ , తుషార్ దేశ్పాండే. -
అప్పుడే నా కల పూర్తిగా నెరవేరుతుంది: నితీశ్ కుమార్ రెడ్డి
టీమిండియాకు ఎంపిక కావడం పట్ల ఆంధ్ర క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డి హర్షం వ్యక్తం చేశాడు. ‘‘భారత జట్టుకు ఎంపికైనందుకు ఆనందంగా ఉంది. అయితే నా స్వప్నం 50 శాతమే సాకారమైంది. నేను టీమిండియా జెర్సీ వేసుకొని మైదానంలో దిగి సెంచరీతో జట్టును గెలిపించినపుడే నా పూర్తి కల నెరవేరుతుంది’’ అని ఈ విశాఖపట్నం కుర్రాడు అన్నాడు.‘‘నా కెరీర్ను తీర్చిదిద్దేందుకు నాన్న నా కోసం ఎన్నో త్యాగాలు చేశాడు. ఇప్పుడు ఆయన కళ్లలో ఆనందం చూస్తుంటే ఇదే కదా ఆయన లక్ష్యమని గర్వంగా ఉంది’’ అని హర్షం వ్యక్తం చేశాడు. కాగా ఆంధ్ర క్రికెట్ జట్టు ఆల్రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి టీమిండియా జెర్సీ ధరించేందుకు సిద్ధమైన సంగతి తెలిసిందే.ఈ సీజన్ ఐపీఎల్లో సన్రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) తరఫున చెలరేగిన అతను ‘ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ద సీజన్ 2024’ అవార్డు కూడా అందుకున్నాడు. ముఖ్యంగా ఈ ఐపీఎల్ అసాంతం నితీశ్ కనబరిచిన నిలకడ, కచ్చితత్వంతో కూడిన షాట్లు, మెరిపించిన మెరుపులు భారత సెలక్టర్లను ఆకట్టుకున్నాయి. దీంతో సీనియర్లు విశ్రాంతి తీసుకుంటున్న జింబాబ్వే పర్యటన కోసం అతన్ని భారత జట్టులోకి ఎంపిక చేశారు.శుబ్మన్ గిల్ సారథ్యంలోని ఈ జట్టులో రియాన్ పరాగ్, అభిషేక్ శర్మ, తుషార్ దేశ్పాండేలాంటి పలు కొత్తముఖాలకు తొలిసారి చోటు కల్పించింది. ప్రస్తుతం రెగ్యులర్ టీమిండియా జట్టు వెస్టిండీస్లో జరుగుతున్న టీ20 ప్రపంచకప్లో తదుపరి సూపర్–8 దశ మ్యాచ్ల్ని ఆడుతోంది. ఈ మెగా టోర్నీలో ముందుగా రోహిత్ బృందం అమెరికాలోనే మొత్తం లీగ్ మ్యాచ్ల్ని ఆడింది.ఇక ఈ టోర్నీ ముగిసిన వెంటనే జూలై 6 నుంచి జింబాబ్వే టూర్లో ద్వైపాక్షిక సిరీస్ మొదలవుతుంది. పూర్తిగా టి20 ఫార్మాట్కే పరిమితమైన ఈ పర్యటనలో భారత జట్టు జూలై 6, 7, 10, 13, 14వ తేదీల్లో హరారే వేదికగా ఐదు మ్యాచ్లు ఆడుతుంది. మెగా టోర్నీ కోసం ఎంపికైన యశస్వి జైస్వాల్, సంజూ సామ్సన్లు ఇద్దరే జింబాబ్వే పర్యటనకు కొనసాగుతున్నారు. స్టాండ్బైలుగా ఉన్న గిల్, రింకూ సింగ్, ఖలీల్, అవేశ్ ఖాన్లకు చోటిచ్చారు.సీనియర్ స్టార్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, హార్దిక్ పాండ్యా, బుమ్రా, రవీంద్ర జడేజా, చహల్, సిరాజ్లతో పాటు శివమ్ దూబే, అర్ష్దీప్, కుల్దీప్ యాదవ్ లకు కూడా విశ్రాంతినివ్వడం ఆశ్చర్యకరం. బహుశా సీనియర్ సెలక్షన్ కమిటీ దృష్టి అంతా 2026 టీ20 ప్రపంచకప్పైనే ఉండటం వల్ల పూర్తిస్థాయిలో రిజర్వ్ బెంచ్కే అవకాశం ఇచ్చినట్లు కనిపిస్తోంది. భారత టీ20 జట్టు: శుబ్మన్ గిల్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్, అభిషేక్ శర్మ, రింకూ సింగ్, సంజూ సామ్సన్, ధ్రువ్ జురెల్, నితీశ్ కుమార్ రెడ్డి, రియాన్ పరాగ్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అవేశ్ ఖాన్, ఖలీల్ అహ్మద్, ముకేశ్ కుమార్, తుషార్ దేశ్పాండే. -
టీమిండియాలో ఎంట్రీ.. నితీశ్ కుమార్ రెడ్డికి ఏసీఏ అభినందనలు
టీమిండియా టీ20 జట్టుకు ఎంపికైన యువ క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డికి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అభినందనలు తెలిపింది. ఆంధ్రప్రదేశ్ నుంచి పొట్టి ఫార్మాట్లో అంతర్జాతీయ జట్టుకు ఎంపికైన విశాఖపట్నం కుర్రాడిపై ప్రశంసలు కురిపించింది.కాగా సీనియర్ల గైర్హాజరీలో యువ భారత జట్టు జింబాబ్వే పర్యటనకు వెళ్లనుంది. జూలై 6 నుంచి మొదలుకానున్న ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్కు శుబ్మన్ గిల్ కెప్టెన్గా వ్యవహరించనున్నాడు.ఈ జట్టులో ఐపీఎల్ హీరోలు తెలుగు తేజం నితీశ్ కుమార్ రెడ్డి(సన్రైజర్స్ హైదరాబాద్)తో పాటు అభిషేక్ శర్మ(యోహానన్ ప్రధాన కోచ్గా), రియాన్ పరాగ్(రాజస్తాన్ రాయల్స్), తుషార్ దేశ్పాండే(చెన్నై సూపర్ కింగ్స్) తదితర యంగ్క్రికెటర్లు తొలిసారిగా చోటు దక్కింది.ఈ నేపథ్యంలో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు పి. శరత్ చంద్రా రెడ్డితో పాటు కార్యదర్శి ఎస్.ఆర్.గోపీనాథ్ రెడ్డి, అపెక్స్ మెంబర్స్ నితీశ్ కుమార్ రెడ్డికి అభినందనలు తెలియజేశారు. కాగా ఫస్ట్క్లాస్ క్రికెట్లో అరంగేట్రం చేసిన మూడేళ్ల వ్యవధిలోనే నితీశ్ రెడ్డి ఐపీఎల్లో స్థానం సంపాదించాడు.ఈ ఏడాది సన్రైజర్స్ హైదరాబాద్ తరఫున 13 మ్యాచ్లు ఆడి 303 పరుగులు చేశాడు. రైజర్స్ ఫైనల్ చేరడంలో తన వంతు పాత్ర పోషించిన ఈ పేస్ బౌలింగ్ ఆల్రౌండర్.. టీమిండియా సెలక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. ఈ క్రమంలో ఆంధ్ర నుంచి టీమిండియా టీ20 జట్టుకు ఎంపికైన తొలి ఆటగాడిగా చరిత్రకెక్కాడు.ఇక ఆంధ్ర ప్రీమియర్ లీగ్ వేలంలోనూ నితీశ్ రెడ్డి సరికొత్త రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే. రూ. 15.6 లక్షలకు ఈ యంగ్ సెన్సేషన్ను గోదావరి టైటాన్స్ యాజమాన్యం సొంతం చేసుకుంది. ఐపీఎల్-2024 వేలంలో భాగంగా నితీశ్ రెడ్డిని రూ. 20 లక్షల కనీస ధరకు సన్రైజర్స్ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ప్రధాన కోచ్గా యోహానన్నియామకంక్రికెట్ అడ్వైజరీ కమిటీ (సీఏసీ) 2024–25 సీజన్ కోసం పురుషులు, మహిళల ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) జట్లలోని పలు విభాగాలకు ప్రధాన కోచ్లను నియమించారు. 71 ఏళ్ల ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) చరిత్రలో గతంలో ఎప్పుడూ లేనివిధంగా అంతర్జాతీయ స్థాయిలో ఆడిన కేరళ రాష్ట్రానికి చెందిన భారతీయ మాజీ క్రికెటర్ టిను యోహానన్ను సీనియర్ పురుషుల విభాగానికి ప్రధాన కోచ్గా నియమించారు.అదే విధంగా అండర్ –23 పురుషుల విభాగానికి ప్రధాన కోచ్గా జె.క్రిష్ణారావు, సీనియర్ మహిళా విభాగానికి ఎం.ఎన్. విక్రమ్ వర్మ, అండర్–23 మహిళా విభాగానికి ఎస్.రమాదేవి, అండర్–19 మహిళా విభాగానికి ఎస్.శ్రీనివాసరెడ్డి, అండర్–15 మహిళా విభాగానికి ఎం.సవితను ప్రధాన కోచ్లుగా నియమించారు.ఇంటర్నేషనల్కు ఆడిన యోహానన్ను ప్రధాన కోచ్గా తీసుకొచ్చేందుకు ఏసీఏ అధ్యక్షుడు పి.శరత్ చంద్రారెడ్డి, కార్యదర్శి ఎస్.ఆర్.గోపినాథ్రెడ్డి తీవ్రంగా కృషి చేసినందుకు సీఏసీ చైర్మన్ ఎన్.మధుకర్ వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. యోహానన్ ప్రధాన కోచ్గా నియమించడం వల్ల రాష్ట్రానికి చెందిన ప్లేయర్లకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని ఎన్.మధుకర్ వెల్లడించారు.యోహానన్ గురించి..యోహానన్ 1979 ఫిబ్రవరి 18న జన్మించారు. టీమిండియా మాజీ క్రికెటర్. అతను కుడిచేతి వాటం కలిగిన ఫాస్ట్ మీడియం బౌలర్. కేరళ తరపున ఫస్ట్–క్లాస్ క్రికెట్ ఆడాడు.భారత్ తరపున టెస్ట్, వన్డే క్రికెట్ ఆడిన మొదటి కేరళ ఆటగాడు. అతను ప్రస్తుత కేరళ క్రికెట్ జట్టు కోచ్. 2000లో బెంగుళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీకి మొదటి ఇన్టేక్ కోసం ఎంపికయ్యాడు. డిసెంబర్ 2001లో ఇంగ్లండ్తో జరిగిన స్వదేశీ సిరీస్లో తన టెస్టు అరంగేట్రం చేశాడు.మొహాలీలో జరిగిన మొదటి టెస్టులో అతను ఇంగ్లండ్ ఓపెనర్లిద్దరినీ అవుట్ చేశాడు. అతను తన మొదటి ఓవర్ నాల్గవ బంతికి తన మొదటి టెస్ట్ వికెట్ సాధించారు. 2024–25 సీజన్ను విజయవంతంగా నిర్వహించాలని ఏసీఏ అధ్యక్షులు పి.శరత్ చంద్రారెడ్డి, కార్యదర్శి ఎస్.ఆర్.గోపినాథ్రెడ్డి కోరారు. -
జింబాబ్వేతో టీ20 సిరీస్.. భారత జట్టు ఇదే! ఐపీఎల్ హీరోలకు చోటు
జింబాబ్వేతో టీ20 సిరీస్కు భారత జట్టును బీసీసీఐ బుధవారం ప్రకటించింది. అజిత్ అగార్క్ సారథ్యంలోని భారత సెలెక్షన్ కమిటీ సోమవారం 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టు వివరాలను వెల్లడించింది.ఈ సిరీస్కు రెగ్యూలర్ కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు సీనియర్ ఆటగాళ్లు సెలక్టర్లు విశ్రాంతి ఇచ్చారు. దీంతో ఈ టూర్లో భారత జట్టుకు యువ ఓపెనర్ శుబ్మన్ గిల్ సారథ్యం వహించనున్నాడు.అదే విధంగా ఈ సిరీస్కు భారత జట్టులో ఐపీఎల్లో హీరోలకు చోటు దక్కింది. ఐపీఎల్-2024లో అదరగొట్టిన తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డి, ఎస్ఆర్హెచ్ విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మ, రాజస్తాన్ రాయల్స్ ఆటగాడు రియాన్ పరాగ్, సీఎస్కే పేసర్ తుషార్ దేశ్ పాండేలకు సెలక్టర్లు తొలిసారి జాతీయ జట్టులో చోటు కల్పించారు.నితీష్ కుమార్ ఐపీఎల్-2024లో సన్రైజర్స్ హైదరాబాద్కు ప్రాతినిథ్యం వహించిన నితీష్ కుమార్ రెడ్డి అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు. తన ఆల్రౌండ్ ప్రదర్శనతో ఈ ఆంధ్ర ఆటగాడు ఎస్ఆర్హెచ్ విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లో 13 మ్యాచ్లు ఆడిన నితీష్ కుమార్ 33.67 సగటుతో 303 పరుగులతో పాటు 3 వికెట్లు పడగొట్టాడు. అదేవిధంగా ఫస్ట్క్లాస్ క్రికెట్లోనూ అద్బుతంగా రాణిస్తుండడంతో సెలక్టర్లు తొలిసారి పిలుపునిచ్చారు.అభిషేక్ శర్మఐపీఎల్-2024లో అభిషేక్ శర్మ సైతం సంచలన ప్రదర్శన కనబరిచాడు. అభిషేక్ ఎస్ఆర్హెచ్ ఓపెనర్గా ట్రావిస్ హెడ్తో కలిసి భీబత్సం సృష్టించాడు. ఐపీఎల్ చరిత్రలోనే సన్రైజర్స్ భారీ స్కోర్ చేయడంలో అభిషేక్ది కీలక పాత్ర. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లో 16 మ్యాచ్లు ఆడిన అభిషేక్ 32.27 సగటుతో 484 పరుగులు చేశాడు. టీమిండియా దిగ్గజం యువరాజ్ సింగ్ గైడెన్స్లో రాటుదేలుతున్న అభిషేక్ శర్మ.. దేశీవాళీ క్రికెట్లో సైతం అదరగొడుతున్నాడు.రియాన్ పరాగ్..ఇక ఆస్సాం స్టార్ ఆల్రౌండర్ రియాన్ పరాగ్ సైతం ఐపీఎల్-2024లో అదరగొట్టాడు. ఓవరాక్షన్ స్టార్ అని అందరితో విమర్శలు ఎదుర్కొన్న పరాగ్.. ఈ ఏడాది సీజన్లో మాత్రం అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు. రాజస్తాన్ రాయల్స్కు ప్రాతనిథ్యం వహిస్తున్న పరాగ్ తన ఆటతీరుతో అందరిని ఆకట్టుకున్నాడు. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లో 16 మ్యాచ్లు ఆడిన పరాగ్ 52.09 సగటుతో 573 పరుగులు చేశాడు.ఈ క్రమంలో అతడికి టీ20 వరల్డ్కప్ జట్టులోకి చోటు దక్కుతుందని భావించారు. కానీ సెలక్టర్లు మాత్రం అతడిని ఎంపిక చేయలేదు. ఇప్పుడు జింబాబ్వే సిరీస్కు సీనియర్లు దూరం కావడంతో సెలక్టర్లు పరాగ్కు అవకాశమిచ్చారు. తుషార్ దేశ్పాండే..ఈ ఏడాది ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ పేసర్ తుషార్ దేశ్పాండే కూడా తన బౌలింగ్తో అందరని ఆకట్టుకున్నాడు. గత రెండు సీజన్ల నుంచి దేశ్పాండే మెరుగైన ప్రదర్శన చేస్తున్నాడు.ఐపీఎల్-2024లో 13 మ్యాచ్లు ఆడిన దేశ్పాండే 17 వికెట్లు పడగొట్టాడు. కేవలం ఐపీఎల్లో మాత్రం దేశీవాళీ క్రికెట్లో కూడా ముంబై తరపున దేశ్పాండే రాణిస్తున్నాడు. -
జింబాబ్వేతో టీ20 సిరీస్కు భారత జట్టు ప్రకటన.. కెప్టెన్గా శుబ్మన్ గిల్
టీ20 వరల్డ్కప్-2024 ముగిసిన తర్వాత టీమిండియా జింబాబ్వే పర్యటనకు వెళ్లనుంది. ఈ పర్యటనలో భాగంగా ఐదు టీ20ల సిరీస్లో ఆతిథ్య జట్టుతో భారత్ తలపడనుంది. ఈ నేపథ్యంలో జింబాబ్వేతో టీ20 సిరీస్కు 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును బీసీసీఐ సెలక్షన్ కమిటీ సోమవారం ప్రకటించింది. ఈ సిరీస్కు ప్రస్తుత టీ20 వరల్డ్కప్లో భాగమైన భారత ఆటగాళ్లంతా దాదాపుగా దూరమయ్యారు. సంజూ శాంసన్, యశస్వీ జైశ్వాల్ మినహా మిగితా ఆటగాళ్లందరికి సెలక్టర్లు విశ్రాంతి ఇచ్చారు. దీంతో ఈ పర్యటనలో భారత జట్టుకు యువ ఓపెనర్ శుబ్మన్ గిల్ సారథ్యం వహించనున్నాడు. ఇక ఐపీఎల్లో అదరగొట్టిన యువ ఆటగాళ్లు అభిషేక్ శర్మ, తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డి, రియాన్ పరాగ్, తుషార్ దేశ్ పాండేకు తొలిసారి భారత జట్టులో చోటు దక్కింది. జూలై 6న హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా జరగనున్న తొలి టీ20తో ఈ సిరీస్ ప్రారంభం కానుంది.జింబాబ్వే సిరీస్కు భారత జట్టుశుబ్మన్ గిల్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్, అభిషేక్ శర్మ, రింకు సింగ్, సంజు శాంసన్ (వికెట్ కీపర్), ధృవ్ జురెల్ (వికెట్ కీపర్), నితీష్ రెడ్డి, రియాన్ పరాగ్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అవేష్ ఖాన్, ఖలీల్ అహ్మద్, ముఖేష్ కుమార్ , తుషార్ దేశ్పాండే. -
టీమిండియా కెప్టెన్గా శుభ్మన్ గిల్..?
టీమిండియా వచ్చే నెలలో జింబాబ్వేలో పర్యటించనుంది. ఈ పర్యటనలో భారత్ ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్ కోసం టీమిండియాను త్వరలో ఎంపిక చేయనున్నారు. 20 మంది ప్రాబబుల్స్ జాబితాను ఇదివరకే ఎంపిక చేసినట్లు సమాచారం. అధికారిక ప్రకటన వెలువడటమే తరువాయి అని తెలుస్తుంది.అయితే ఈ పర్యటనకు కెప్టెన్గా ఎవరిని ఎంపిక చేస్తారనే విషయంపై గత కొద్ది రోజులుగా సందిగ్దత నెలకొంది. సెలెక్టర్లు సీనియర్లు రోహిత్, విరాట్, బుమ్రాలకు రెస్ట్ ఇవ్వాలని ముందే అనుకున్నారు. ఈ నేపథ్యంలో హార్దిక్ పాండ్యా లేక సూర్యకుమార్ యాదవ్లలో ఎవరో ఒకరు టీమిండియా సారధిగా వ్యవహరిస్తారని ప్రచారం జరుగుతుంది.తాజాగా ఈ ప్రచారంలో నిజం లేదని తేలిపోయింది. బీసీసీఐకి చెందిన కీలక వ్యక్తి అందించిన సమాచారం మేరకు శుభ్మన్ గిల్ జింబాబ్వే పర్యటలో టీమిండియా సారధిగా వ్యవహరిస్తాడని తెలుస్తుంది. ఈ పర్యటనకు ఎంపిక చేసే జట్టులో టీ20 వరల్డ్కప్ ట్రావెలింగ్ రిజర్వ్లు ఆవేశ్ ఖాన్, ఖలీల్ అహ్మద్, రింకూ సింగ్లతో పాటు ఐపీఎల్-2024 హీరోలు అభిషేక్ శర్మ, రియాన్ పరాగ్, నితీశ్ రెడ్డి, తుషార్ దేశ్పాండే, హర్షిత్ రాణా ఉంటారని సమాచారం.వీరితో పాటు టీ20 వరల్డ్కప్ రెగ్యులర్ జట్టులో సభ్యులైన సంజూ శాంసన్, యశస్వి జైస్వాల్ కూడా జింబాబ్వే పర్యటనకు ఎంపిక కానున్నారని తెలుస్తుంది. ప్రస్తుతానికి ఇది ప్రచారమే అయినప్పటికీ మరికొద్ది రోజుల్లో ఈ విషయమై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. -
టీమిండియా హెడ్ కోచ్గా వీవీఎస్ లక్ష్మణ్..?
టీ20 వరల్డ్కప్ 2024 తర్వాత భారత క్రికెట్ జట్టు జింబాబ్వే పర్యటనకు వెళ్లాల్సి ఉంది. ఈ పర్యటనలో భారత్ ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ ఆడనుంది. హరారే వేదికగా జులై 6, 7, 10, 13, 14 తేదీల్లో ఈ మ్యాచ్లు జరుగనున్నాయి. ఈ సిరీస్ కోసం భారత సెలెక్టర్లు సీనియర్లకు విశ్రాంతినిచ్చి ఐపీఎల్ స్టార్లకు (అభిషేక్ శర్మ, రియాన్ పరాగ్, మయాంక్ యాదవ్, హర్షిత్ రాణా, నితీశ్ రెడ్డి, విజయ్కుమార్ వైశాఖ్, యశ్ దయాల్) అవకాశం ఇస్తారని తెలుస్తుంది. సీనియర్లు రోహిత్, విరాట్, బుమ్రా తదితరులు ఈ సిరీస్కు దూరంగా ఉంటారని సమాచారం. రోహిత్ గైర్హాజరీలో హార్దిక్ పాండ్యా లేదా సూర్యకుమార్ యాదవ్లలో ఎవరో ఒకరు టీమిండియా సారథ్య బాధ్యతలు చేపట్టవచ్చు. జింబాబ్వే పర్యటన కోసం భారత జట్టును వచ్చే వారంలో ప్రకటిస్తారని సమాచారం. టీ20 వరల్డ్కప్ ట్రావెలింగ్ రిజర్వ్లు గిల్, ఆవేశ్ ఖాన్, రింకూ సింగ్, ఖలీల్ అహ్మద్ కూడా జింబాబ్వే సిరీస్కు ఎంపికవుతారని తెలుస్తుంది.మరోవైపు టీ20 ప్రపంచకప్ 2024తో టీమిండియా హెడ్ కోచ్గా రాహుల్ ద్రవిడ్ పదవీకాలం ముగియనున్న విషయం తెలిసిందే. భారత తదుపరి హెడ్ కోచ్గా గౌతమ్ గంభీర్ పేరు దాదాపుగా ఖరారైందని సోషల్మీడియాలో ప్రచారం జరుగుతుంది. అయితే ఈ మధ్యలో బీసీసీఐ అత్యున్నత వర్గాల నుంచి ఓ సమాచారం లీకైంది. కోచ్గా ద్రవిడ్ పదవీకాలం ముగిశాక భారత తాత్కాలిక హెడ్ కోచ్గా ఎన్సీఏ డైరెక్టర్ వీవీఎస్ లక్ష్మణ్ బాధ్యతలు చేపడతాడని సమాచారం. లక్ష్మణ్ ఎన్సీఏలో ఉన్న తన బృందంతో జింబాబ్వే పర్యటనకు వెళ్తాడని తెలుస్తుంది. పూర్తి స్థాయి హెడ్ కోచ్గా బాధ్యతలు చేపట్టేందుకు గంభీర్ కాస్త సమయం అడిగినందుకు లక్ష్మణ్ను జింబాబ్వే పర్యటనకు హెడ్కోచ్గా ఎంపిక చేయనున్నట్లు ప్రచారం జరుగుతుంది. -
టీమిండియాతో టీ20 సిరీస్.. జింబాబ్వే క్రికెట్ కీలక నిర్ణయం
టీమిండియాతో టీ20 సిరీస్కు ముందు జింబాబ్వే క్రికెట్ కీలక నిర్ణయం తీసుకుంది. తమ పురుషుల జట్టు హెడ్కోచ్గా దక్షిణాఫ్రికా మాజీ ఫస్ట్క్లాస్ క్రికెటర్ జస్టిన్ సామన్స్ను జింబాబ్వే క్రికెట్ బోర్డు నియమించింది.ఈ విషయాన్ని జింబాబ్వే క్రికెట్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. కాగా టీ20 ప్రపంచ కప్ 2024కి అర్హత సాధించడంలో విఫలం కావడంతో జింబ్వాబ్వే హెడ్ కోచ్ బాధ్యతల నుంచి డేవ్ హౌటన్ ఈ ఏడాది ఆరంభంలో తప్పుకున్నాడు. అప్పటి నుంచి జింబ్వాబ్వే ప్రధాన కోచ్లేకుండానే పలు టీ20 సిరీస్లు ఆడింది.ఈ నేపథ్యంలోనే తమ జట్టు కొత్త హెడ్ కోచ్గా సామన్స్ను జింబాబ్వే క్రికెట్ ఎంపిక చేసింది. సామన్స్తో పాటు ఆ దేశ మాజీ ఆటగాడు డియోన్ ఇబ్రహీమ్కు సైతం జింబాబ్వే క్రికెట్ కీలక బాధ్యతల అప్పగించింది. జింబాబ్వే అసిస్టెంట్ కోచ్గా డియోన్ ఇబ్రహీమ్ పనిచేయనున్నాడు. కాగా సామన్స్కు కోచ్గా అపారమైన అనుభవం ఉంది. సామన్స్ గతంలో సౌతాఫ్రికా హైఫెర్మెమెన్స్ సెంటర్లో కోచ్గా పనిచేశాడు. అదేవిధంగా 2021 నుంచి 2023 వరకు ప్రోటీస్ జట్టుకు బ్యాటింగ్ సలహాదారుని కూడా పనిచేశాడు.ఇక స్వదేశంలో భారత్తో 5 మ్యాచ్ల టీ20సిరీస్లో జింబ్వావ్వే తలపడనుంది. ఈ సిరీస్ జూలై 6న ప్రారంభమై జూలై 14తో ముగియనుంది. ఈ సిరీస్లోని అన్ని మ్యాచ్లు హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగానే జరగనున్నాయి. -
టీమిండియా కెప్టెన్గా రిషబ్ పంత్.. సిక్సర్ల కింగ్లు ఎంట్రీ!?
ఈ ఏడాది జూన్లో అమెరికా, వెస్టిండీస్ల వేదికగా జరగనున్న టీ20 వరల్డ్కప్-2024 అనంతరం భారత జట్టు జింబాబ్వే పర్యటనకు వెళ్లనుంది. ఈ టూర్లో భాగంగా టీమిండియా ఆతిథ్య జింబాబ్వేతో ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో తలపడనుంది. ఈ సిరీస్ జూలై 6న ప్రారంభమై అదే నెల 14న ముగియనుంది. ఈ సిరీస్లో అన్ని మ్యాచ్లు హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగానే జరగనున్నాయి. అయితే ఈ జింబాబ్వే పర్యటనకు భారత తృతీయ శ్రేణి జట్టును బీసీసీఐ పంపించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. టీ20 వరల్డ్కప్లో భాగమయ్యే ఒకరిద్దరూ మినహా మిగతా భారత ఆటగాళ్లందరికి ఈ సిరీస్కు విశ్రాంతి ఇవ్వనున్నట్లు సమాచారం. అంతేకాకుండా గాయం నుంచి కోలుకుని రీ ఎంట్రీలో అదరగొడుతున్న వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్కు ఈ సిరీస్లో భారత జట్టు పగ్గాలు అప్పగించాలని అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ యోచిస్తుందంట. కాగా పంత్ సూపర్ ఫామ్లో ఉన్నాడు. పునరాగమనంలో కెప్టెన్గానే కాకుండా వ్యక్తిగత ప్రదర్శన పరంగా కూడా సత్తాచాటుతున్నాడు. ఇప్పటివరకు 7 మ్యాచ్లు ఆడిన పంత్ 210 పరుగులు చేశాడు. మరోవైపు ఐపీఎల్-2024లో దుమ్ములేపుతున్న రియాన్ పరాగ్, శశాంక్ సింగ్, అశుతోష్ శర్మ, సాయిసుదర్శన్, అభిషేక్ శర్మ వంటి యువ ఆటగాళ్లను ఈ సిరీస్కు ఎంపిక చేయనున్నట్లు పలు రిపోర్టులు పేర్కొంటున్నాయి. వీరితో పాటు రుతురాజ్ గైక్వాడ్, సంజూ శాంసన్, శివమ్ దూబే, అర్ష్దీప్ సింగ్, ముఖేష్ కుమార్ వంటి స్టార్ ఆటగాళ్లను సైతం జింబాబ్వే టూర్కు పంపించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. -
జింబాబ్వే పర్యటనకు టీమిండియా.. ఐదు మ్యాచ్ల సిరీస్.. షెడ్యూల్ ఇదే
టీ20 వరల్డ్కప్ 2024 ముగిసిన అనంతరం భారత క్రికెట్ జట్టు జింబాబ్వే పర్యటనకు వెళ్లనుంది. ఈ పర్యటలో భారత్ ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ ఆడనుంది. హరారే వేదికగా జులై 6, 7, 10, 13, 14 తేదీల్లో మ్యాచ్లు జరుగనున్నాయి. ఈ పర్యటన వివరాలను జింబాబ్వే క్రికెట్ బోర్డు కొద్ది సేపటి క్రితం వెల్లడించింది. బీసీసీఐతో సుదీర్ఘ సంప్రదింపుల అనంతరం ఈ సిరీస్ ఖరారైనట్లు తెలుస్తుంది. జింబాబ్వే క్రికెట్ చైర్మన్ తవెంగ్వా ముకుహ్లానీ ఈ విషయాన్ని అధికారికంగా ధృవీకరిస్తూ ట్వీట్ చేశాడు. మా దేశంలో ఈ సంవత్సరం జరిగే అతిపెద్ద అంతర్జాతీయ ఈవెంట్ ఇదే. టీమిండియాకు ఆతిథ్యమిస్తున్నందుకు మేము చాలా సంతోషిస్తున్నాము. మా దేశ పర్యటనకు ఒప్పుకున్నందుకు బీసీసీఐకి ధన్యవాదాలు అంటూ తవెంగ్వా ట్వీట్లో పేర్కొన్నాడు. కాగా, టీమిండియాకు ఆతిథ్యమివ్వడం వల్ల జింబాబ్వే క్రికెట్ బోర్డు ఆర్ధిక స్థితిగతుల్లో పెను మార్పులు సంభవించే అవకాశం ఉంది. ఆ దేశంలో భారత ద్వితియ శ్రేణి జట్టు పర్యటించినా జింబాబ్వే క్రికెట్ బోర్డుపై కాసుల వర్షం కురువడం ఖాయం. భారత్లో క్రికెట్కు ఉన్న ప్రజాధరణ వల్ల జింబాబ్వే క్రికెట్ బోర్డు దశ మారిపోతుంది. తమ క్రికెటర్లకు జీతాలు కూడా ఇవ్వలేని స్థితిలో జింబాబ్వే బోర్డుకు భారత పర్యటన ద్వారా భారీ లబ్ది చేకూరనుంది. -
IPL 2023: రాజస్తాన్ రాయల్స్కు భారీ షాక్.. టీమిండియా బౌలర్ దూరం
IPL 2023- Prasidh Krishna: టీమిండియా పేసర్ ప్రసిద్ కృష్ణ ఐపీఎల్-2023 సీజన్కు దూరమయ్యాడు. ఈ విషయాన్ని అతడు ప్రాతినిథ్యం వహిస్తున్న రాజస్తాన్ రాయల్స్ ధ్రువీకరించింది. గాయం కారణంగా ప్రసిద్ ఈసారి ఐపీఎల్ ఆడబోవడం లేదని తెలిపింది. త్వరగా కోలుకోవాలి ‘‘ప్రసిద్ గాయం నుంచి కోలుకోవడానికి కావాల్సిన ఏ సాయం చేసేందుకైనా సిద్ధంగా ఉన్నాం. కానీ.. అతడు ఇంకా పూర్తిగా కోలుకోలేదని వైద్య బృందం తెలిపింది. దురదృష్టవశాత్తూ ప్రసిద్ ఐపీఎల్-2023 మొత్తానికి దూరమయ్యాడు’’ అని రాజస్తాన్ యాజమాన్యం శుక్రవారం నాటి ప్రకటనలో పేర్కొంది. ప్రసిద్ కృష్ణ స్థానాన్ని భర్తీ చేయగల పేసర్ కోసం తాము అన్వేషిస్తున్నామన్న మేనేజ్మెంట్.. త్వరలోనే ఈ యువ బౌలర్ కోలుకోవాలని ఆకాంక్షించింది. కాగా గత సీజన్లో ప్రసిద్ కృష్ణ రాజస్తాన్ రాయల్స్ తరఫున మొత్తంగా 19 వికెట్లు( 8.28 ఎకానమీ) పడగొట్టి సత్తా చాటాడు. జట్టు ఫైనల్ చేరడంలో తన వంతు పాత్ర పోషించాడు. అయితే, గాయం కారణంగా ప్రస్తుత సీజన్కు అతడు దూరం కావడంతో రాజస్తాన్కు గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లయింది. అదే ఆఖరు జింబాబ్వేతో 2022లో హరారేలో జరిగిన వన్డే మ్యాచ్లో ఆఖరిసారిగా ప్రసిద్ టీమిండియా తరఫున బరిలోకి దిగాడు. ఆ తర్వాత వెన్నునొప్పి కారణంగా జట్టుకు దూరమయ్యాడు. జాతీయ క్రికెట్ అకాడమీలో పునరావాసం పొందుతున్న ఈ రైట్ ఆర్మ్ పేసర్ ఇంకా కోలుకోలేదు. ఇక టీమిండియా తరఫున ఇప్పటి వరకు 14 వన్డేలు ఆడిన ఈ కర్ణాటక బౌలర్.. 25 వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్ కెరీర్లో 51 మ్యాచ్లలో మొత్తంగా 49 వికెట్లు కూల్చాడు. చదవండి: Tom Blundell: కివీస్ బ్యాటర్ టామ్ బ్లండెల్ ప్రపంచ రికార్డు.. ఇంతవరకు ఎవరికీ సాధ్యం కాలేదు! BGT 2023: గాల్లోకి ఎగిరి ఒంటిచేత్తో రాహుల్ అద్భుత క్యాచ్.. బిత్తరపోయిన ఖవాజా.. వీడియో వైరల్ -
చరిత్ర సృష్టించిన భువనేశ్వర్ కుమార్
టీ20 వరల్డ్కప్-2022లో భాగంగా నిన్న (నవంబర్ 6) జింబాబ్వేతో జరిగిన మ్యాచ్లో టీమిండియా స్వింగ్ సుల్తాన్ భువనేశ్వర్ కుమార్ చరిత్ర సృష్టించాడు. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక మెయిడిన్ ఓవర్లు (10) సంధించిన బౌలర్గా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. జింబాబ్వేతో మ్యాచ్లో తొలి బంతికే వికెట్ తీసిన భువీ.. ఆ ఓవర్లో ఒక్క పరుగు కూడా ఇవ్వకుండా మొయిడిన్ చేశాడు. ఈ మ్యాచ్కు ముందు వరకు అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక మెయిడిన్ ఓవర్ల రికార్డును సహచరుడు జస్ప్రీత్ బుమ్రాతో కలిసి షేర్ చేసుకున్న భువీ.. తాజాగా ఈ అరుదైన రికార్డను తన పేరిట లఖించుకున్నాడు. ఓవరాల్గా పొట్టి ఫార్మాట్లో అత్యధిక మెయిడిన్ ఓవర్ల రికార్డు విండీస్ స్పిన్నర్ సునీల్ నరైన్ పేరటి ఉంది. నరైన్ టీ20ల్లో మొత్తం 27 మెయిడిన్ ఓవర్లు బౌల్ చేశాడు. అతని తర్వాతి స్థానంలో బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబ్ అల్ హసన్ ఉన్నాడు. షకీబ్ ఖాతాలో 23 మెయిడిన్ ఓవర్లు ఉన్నాయి. వీరి తర్వాత విండీస్ లెగ్ స్పిన్నర్ శ్యాముల్ బద్రీ (21), భువనేశ్వర్ కుమార్ (21) సంయుక్తంగా మూడో స్థానంలో ఉన్నారు. ఈ జాబితాలో టీమిండియా పేసు గుర్రం బుమ్రా 19 మెయిడిన్లతో ఆరో ప్లేస్లో ఉన్నాడు. ఇదిలా ఉంటే, నిన్న జింబాబ్వేపై గెలుపుతో టీమిండియా గ్రూప్-2లో అగ్రస్థానంతో సెమీస్కు చేరుకుంది. ఈ గ్రూప్ నుంచి సెమీస్కు చేరిన రెండో జట్టుగా పాక్ నిలిచింది. అటు గ్రూప్-1 నుంచి న్యూజిలాండ్, ఇంగ్లండ్ జట్లు తొలి రెండు స్థానాల్లో నిలిచి సెమీస్కు అర్హత సాధించాయి. నవంబర్ 9న జరిగే తొలి సెమీస్లో న్యూజిలాండ్-పాకిస్తాన్లు.. ఆమరుసటి రోజు (నవంబర్ 10) జరిగే రెండో సెమీఫైనల్లో భారత్-ఇంగ్లండ్ జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ రెండు మ్యాచ్ల్లో గెలిచిన జట్ల మధ్య నవంబర్ 13న ఫైనల్ జరుగుతుంది. -
T20 World Cup 2022: దర్జాగా సెమీస్కు...
గత ఏడాది టి20 వరల్డ్కప్లో లీగ్ దశలోనే ఇంటికొచ్చిన భారత్ ఈసారి టోర్నీలో లీగ్ టాపర్గా సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. టీమిండియా చిన్న జట్లను తేలిగ్గా తీసుకోలేదు. పెద్ద జట్లతో గాభరా పడలేదు. ప్రతీ పోరు విలువైందన్నట్లుగానే ఆడింది. దక్షిణాఫ్రికాతో మ్యాచ్ మినహా ప్రతి మ్యాచ్లోనూ బ్యాటర్లు, బౌలర్లు చక్కగా రాణించారు. సమష్టి బాధ్యత కనబరిచారు. దీంతో టీమిండియా ఈ టోర్నీలో టైటిల్ ఫేవరెట్గా మారింది. గురువారం అడిలైడ్లో జరిగే రెండో సెమీఫైనల్లో ఇంగ్లండ్తో రోహిత్ శర్మ బృందం సమరానికి సై అంటోంది. మెల్బోర్న్: సూర్యకుమార్ యాదవ్ను సహచరులంతా అతని పేరులోని మూడక్షరాలతో స్కై (ఎస్కేవై) అంటారు. ఈ ప్రపంచకప్లో అతను కూడా ఆ పేరుకు (ఆకాశం) తగ్గట్లే హద్దేలేని ఇన్నింగ్స్లతో జట్టును గెలిపిస్తున్నాడు. అభిమానుల్ని అలరిస్తున్నాడు. జింబాబ్వేతో పోరులో అయితే ‘సూపర్ సండే’ స్పెషల్ ఇన్నింగ్స్ ఆడాడు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ సూర్య (25 బంతుల్లో 61; 6 ఫోర్లు, 4 సిక్స్లు) మెరుపుల సునామీతో... ‘సూపర్ 12’ గ్రూప్–2 చివరి లీగ్ మ్యాచ్లో భారత్ 71 పరుగుల తేడాతో జింబాబ్వేపై జయభేరి మోగించి 8 పాయింట్లతో ‘టాపర్’గా నిలిచింది. మొదట భారత్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 186 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ (35 బంతుల్లో 51; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) కూడా మెరిపించాడు. సీన్ విలియమ్స్కు 2 వికెట్లు దక్కాయి. తర్వాత జింబాబ్వే 17.2 ఓవర్లలో 115 పరుగులకే ఆలౌటైంది. బర్ల్ (22 బంతుల్లో 35; 5 ఫోర్లు, 1 సిక్స్), రజా (24 బంతుల్లో 34; 3 ఫోర్లు) మెరుగ్గా ఆడారు. అశ్విన్ (3/22), షమీ (2/14), హార్దిక్ పాండ్యా (2/16) ప్రత్యర్థిని మూకుమ్మడిగా దెబ్బకొట్టారు. సూర్య ప్రతాపం... ఓవరాల్గా ఈ మెగా ఈవెంట్లో ‘భారత 360’ సూర్య బ్యాటింగ్ ఓ లెవెల్లో వుంది. ఈ మ్యాచ్లో అది మరో స్థాయికి చేరింది. సూర్య 12 ఓవర్ ఆఖరిబంతికి క్రీజులోకి వచ్చాడు. అప్పుడు టీమిండియా స్కోరు (87/2) వందయినా కాలేదు. అతను రాగానే రాహుల్ అవుటయ్యాడు. అవకాశమిచ్చిన రిషభ్ పంత్ (3) చేజార్చుకున్నాడు. స్కోరు 101/4గా ఉన్న దశలో జింబాబ్వే సంచలనంపై ఆశలు పెట్టుకోకుండా సూర్యకుమార్ రెచ్చిపోయాడు. కొన్నిషాట్లయితే ఊహకే అందవు. ఆఫ్సైడ్కు దూరంగా వెళుతున్న బంతుల్ని ఆన్సైడ్లో సిక్సర్లుగా మలచడం అద్భుతం. 15 ఓవర్లలో 107/4గా ఉన్న స్కోరు అతని సునామీ ఇన్నింగ్స్తో 186/5గా మ్యాచ్ ఛేంజింగ్ ఫిగర్ అయ్యింది. ఆఖరి 5 ఓవర్లలో 79 పరుగులు వచ్చాయి. 16వ ఓవర్లో సూర్య వరుసగా 2 బౌండరీలు కొడితే పాండ్యా మరో ఫోర్ కొట్టాడు. 17వ ఓవర్ వేసిన ఎన్గరవా ఆఫ్సైడ్లో వేసిన వైడ్ యార్కర్లను 4, 6గా కొట్టడం మ్యాచ్కే హైలైట్. చటారా ఓవర్లో ఎక్స్ట్రా కవర్స్ మీదుగా బాదిన సిక్సర్, ఎన్గరవ ఆఖరి ఓవర్లో వరుసగా సూర్య 6, 2, 4, 6లతో మొత్తం 21 పరుగులు వచ్చాయి. 23 బంతుల్లో సూర్య (5 ఫోర్లు, 3 సిక్స్లు) ఫిఫ్టీ పూర్తయ్యింది. అంతకుముందు ఓపెనర్లలో రోహిత్ (15) విఫలమైనా... రాహుల్, కోహ్లి (25 బంతుల్లో 26; 2 ఫోర్లు)తో కలిసి స్కోరును నడిపించాడు. 34 బంతుల్లో (3 ఫోర్లు, 3 సిక్సర్లు) రాహుల్ అర్ధశతకం సాధించాడు. మన పేస్కు విలవిల జింబాబ్వే బ్యాటర్లు లక్ష్యఛేదనను అటుంచి... అసలు క్రీజులో నిలిచేందుకే కష్టపడ్డారు. టాప్, మిడిలార్డర్ భారత పేస్ బౌలింగ్కు విలవిల్లాడింది. ఓపెనర్లు మదెవెర్ (0)ను భువీ, ఇర్విన్ (13)ను హార్దిక్, చకబ్వా (0)ను అర్‡్షదీప్, సీన్ విలియమ్స్ (11)ను షమీ... ఇలా వరుసలోని నలుగురు బ్యాటర్స్ను నలుగురు బౌలర్లు దెబ్బకొట్టడంతో జింబాబ్వే ఓటమివైపు నడిచింది. సికిందర్ రజా, రియాన్ బర్ల్ చేసిన పరుగులు జట్టు వంద దాటేందుకు ఉపయోగపడ్డాయి. ఆఖరి వరుస బ్యాటర్స్ అశ్విన్ ఉచ్చులో పడటంతో ఆలౌట్ అయ్యేందుకు ఎంతోసేపు పట్టలేదు. స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్: రాహుల్ (సి) మసకద్జా (బి) సికందర్ 51; రోహిత్ (సి) మసకద్జా (బి) ముజరబాని 15; కోహ్లి (సి) బర్ల్ (బి) విలియమ్స్ 26; సూర్యకుమార్ (నాటౌట్) 61; పంత్ (సి) బర్ల్ (బి) విలియమ్స్ 3; పాండ్యా (సి) ముజరబాని (బి) ఎన్గరవ 18; అక్షర్ పటేల్ (నాటౌట్) 0; ఎక్స్ట్రాలు 12; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 186. వికెట్ల పతనం: 1–27, 2–87, 3–95, 4–101, 5–166. బౌలింగ్: ఎన్గరవ 4–1–44–1, చటార 4–0–34–0, ముజరబాని 4–0–50–1, మసకద్జా 2–0–12–0, బర్ల్ 1–0–14–0, సికందర్ రజా 3–0–18–1, సీన్ విలియమ్స్ 2–0–9–2. జింబాబ్వే ఇన్నింగ్స్: మదెవెర్ (సి) కోహ్లి (బి) భువనేశ్వర్ 0; ఇర్విన్ (సి అండ్ బి) పాండ్యా 13; చకబ్వా (బి) అర్‡్షదీప్ 0; విలియమ్స్ (సి) భువనేశ్వర్ (బి) 11; సికందర్ (సి) సూర్య (బి) పాండ్యా 34; టోని (ఎల్బీడబ్ల్యూ) (బి) షమీ 5; బర్ల్ (బి) అశ్విన్ 35; మసకద్జా (సి) రోహిత్ (బి) అశ్విన్ 1; ఎన్గరవ (బి) అశ్విన్ 1; చటార (సి అండ్ బి) అక్షర్ 4; ముజరబాని (నాటౌట్) 0; ఎక్స్ట్రాలు 11; మొత్తం (17.2 ఓవర్లలో ఆలౌట్) 115. వికెట్ల పతనం: 1–0, 2–2, 3–28, 4–31, 5–36, 6–96, 7–104, 8–106, 9–111, 10– 115. బౌలింగ్: భువనేశ్వర్ 3–1–11–1, అర్‡్షదీప్ 2–0–9–1, షమీ 2–0–14–2, పాండ్యా 3–0– 16–2, అశ్విన్ 4–0–22–3, అక్షర్ 3.2–0–40–1. 1: క్యాలెండర్ ఇయర్లో అంతర్జాతీయ టి20ల్లో 1,000 పరుగులు సాధించిన తొలి భారతీయ క్రికెటర్గా సూర్యకుమార్ యాదవ్ గుర్తింపు పొందాడు. ఈ ఏడాది సూర్య 28 టి20 మ్యాచ్లు ఆడి 1,026 పరుగులు చేశాడు. 21:ఈ ఏడాది రోహిత్ శర్మ కెప్టెన్సీలో టి20ల్లో భారత్ సాధించిన విజయాలు. క్యాలెండర్ ఇయర్లో అత్యధిక విజయాలు అందించిన కెప్టెన్గా బాబర్ ఆజమ్ (2021లో 20) పేరిట ఉన్న రికార్డును రోహిత్ అధిగమించాడు. -
కోహ్లికి మాత్రమే ఇలాంటివి సాధ్యం..
టి20 ప్రపంచకప్లో భాగంగా జింబాబ్వేతో మ్యాచ్లో కింగ్ కోహ్లి చిత్ర విచిత్రమైన హావభావాలతో మెరిశాడు. క్యాచ్ పట్టినప్పుడు ఒక ఎక్స్ప్రెషన్.. వికెట్ పడినప్పుడు మరొక ఎక్స్ప్రెషన్.. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. అయితే వీటన్నింటిలోకి బాగా వైరల్ అయింది మాత్రం జింబాబ్వే బ్యాటర్ వెస్లీ మాధవరే క్యాచ్ పట్టినప్పుడు కోహ్లి ఇచ్చిన ఎక్స్ప్రెషన్. జింబాబ్వే ఇన్నింగ్స్ తొలి ఓవర్ తొలి బంతికే భువనేశ్వర్ బౌలింగ్లో షాట్కు యత్నించిన మాధవరే కోహ్లి స్టన్నింగ్ క్యాచ్కు వెనుదిరిగాడు. ఈ సమయంలో మోకాళ్లపై కూర్చొని చిరునవ్వుతో కోహ్లి ఇచ్చిన ఎక్స్ప్రెషన్ హైలైట్ అయింది. కాగా కోహ్లి ఎక్స్ప్రెషన్పై క్రికెట్ అభిమానులు స్పందించారు. ''ఇలాంటివి కోహ్లికి మాత్రమే సాధ్యం.. ఎక్కడి నుంచి తెస్తావు ఈ వింత ఎక్స్ప్రెషన్స్'' అంటూ కామెంట్ చేశారు. ఇక మ్యాచ్లో కోహ్లి 26 పరుగులు చేసి ఔటయ్యాడు. ఈ ప్రపంచకప్లో టీమిండియా తరపున లీడింగ్ స్కోరర్గా కొనసాగుతున్న కోహ్లి ఐదు మ్యాచ్లు కలిపి 245 పరుగులు చేశాడు. ఇందులో మూడు అర్థసెంచరీలు ఉన్నాయి. జింబాబ్వేతో జరిగిన సూపర్-12 మ్యాచ్లో టీమిండియా 71 పరుగుల తేడాతో భారీ విజయాన్ని అందుకుంది. 1రియాన్ బర్ల్ 35 పరుగులతో టాప్ స్కోరర్ కాగా.. సికందర్ రజా 34 పరుగులు చేశాడు. టీమిండియా బౌలర్లలో అశ్విన్ 3, మహ్మద్ షమీ, హార్దిక్ పాండ్యాలు రెండు వికెట్లు తీశారు. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో రోహిత్ సేన 5 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. ఆకాశమే హద్దుగా చెలరేగిన సూర్యకుమార్ యాదవ్ 61 నాటౌట్, కేఎల్ రాహుల్ 51 రాణించారు. చదవండి: టి20ల్లో కెప్టెన్గా రోహిత్ శర్మ సరికొత్త రికార్డు అభిమానంతో రోహిత్ వద్దకు.. ఒక్క హగ్ అంటూ కన్నీటిపర్యంతం -
టి20ల్లో కెప్టెన్గా రోహిత్ శర్మ సరికొత్త రికార్డు
టి20 ప్రపంచకప్లో టీమిండియా సెమీస్లో అడుగుపెట్టింది. ఆదివారం ముగిసిన సూపర్-12 పోటీల్లో టీమిండియా జింబాబ్వేపై 71 పరుగుల తేడాతో నెగ్గి గ్రూప్-2 టాపర్గా సెమీస్కు చేరుకుంది. నవంబర్ 10(గురువారం) ఇంగ్లండ్తో సెమీఫైనల్-2లో టీమిండియా అమితుమీ తేల్చుకోనుంది. ఈ సంగతి పక్కనబెడితే టీమిండియా కెప్టెన్గా రోహిత్ శర్మ అరుదైన ఘనత సాధించాడు. జింబాబ్వేపై విజయం ఈ ఏడాది టి20ల్లో టీమిండియా కెప్టెన్గా రోహిత్ శర్మకు 21వది. ఈ నేపథ్యంలో ఒక ఏడాదిలో అత్యధిక టి20 విజయాలు అందుకున్న సారథిగా రోహిత్ శర్మ సరికొత్త రికార్డు నెలకొల్పాడు. 2021లో పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం(20 విజయాలు) అందుకున్నాడు. తాజాగా బాబర్ను వెనక్కి నెట్టిన హిట్మ్యాన్ తొలిస్థానంలో నిలిచాడు. 2018లో పాక్ మాజీ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ 18 టి20 విజయాలు అందుకోగా.. 2016లో ఎంఎస్ ధోనీ 15 విజయాలు అందుకున్నాడు. ► ఈ ఏడాది 50+ పరుగుల తేడాతో విజయం అందుకోవడం టీమిండియాకి ఇది 10వ సారి. ఇదే ఏడాది 6 సార్లు 50+ పరుగుల తేడాతో విజయం అందుకున్న న్యూజిలాండ్ రెండో పొజిషన్లో ఉంటే, 2018లో పాకిస్తాన్ 5 సార్లు ఈ ఫీట్ సాధించింది.. ► ఓవరాల్గా రోహిత్ శర్మకు ఆటగాడిగా ఇది 100వ టి20 విజయం. ఇంతకుముందు పాక్ సీనియర్ క్రికెటర్ 87 టి20 విజయాల్లో భాగం పంచుకోగా భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ 75 విజయాల్లో భాగస్వామిగా ఉన్నాడు. ► జింబాబ్వేతో జరిగిన టి20 మ్యాచ్లో సూర్యకుమార్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచిన సంగతి తెలిసిందే. కాగా ఈ ఏడాది సూర్యకుమార్కు ఇది ఆరో అవార్డు కావడం విశేషం. 2016లో విరాట్ కోహ్లీ 6 సార్లు టీ20ల్లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్లు గెలవగా ప్రస్తుతం సూర్య దానిని సమం చేశాడు. చదవండి: అభిమానంతో రోహిత్ వద్దకు.. ఒక్క హగ్ అంటూ కన్నీటిపర్యంతం ఏమా కొట్టుడు.. 'మిస్టర్ 360' పేరు సార్థకం -
అభిమానంతో రోహిత్ వద్దకు.. ఒక్క హగ్ అంటూ కన్నీటిపర్యంతం
జార్వో.. గుర్తున్నాడా. అరె ఈ పేరు ఎక్కడో విన్నట్లు ఉంది. 2021లో టీమిండియా ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లినప్పుడు పదే పదే మైదానంలోకి దూసుకొచ్చి హల్చల్ చేశాడు. జార్వో 69 టీషర్ట్ ధరించి సిరీస్లో పలుమార్లు అంతరాయం కలిగించాడు. దీంతో అతన్ని మైదానం నుంచి నిషేధం విధించినప్పటికి.. జైలుకి వెళ్లినప్పటికి అతని ప్రవర్తనలో మార్పు రాలేదు. అయితే మొత్తంగా మాత్రం తన చర్యలతో అప్పట్లో హాట్టాపిక్గా నిలిచాడు. తాజాగా టి20 ప్రపంచకప్లో భాగంగా టీమిండియా-జింబాబ్వే మధ్య జరిగిన మ్యాచ్లో ఒక అభిమాని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ వద్దకు దూసుకొచ్చాడు. జింబాబ్వే బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఒక టీనేజ్ అభిమాని సెక్యూరిటీ కళ్లు కప్పి క్రీజులోకి దూసుకొచ్చాడు. ఫీల్డింగ్ చేస్తున్న రోహిత్ శర్మ దగ్గరికి వచ్చి అతన్ని హత్తుకునే ప్రయత్నం చేశాడు. ఈలోగా సెక్యూరిటీ సిబ్బంది అతన్ని బయటికి లాక్కెళ్లారు. ఈ సమయంలో ఒక్క షేక్ హ్యాండ్ లేదా కనీసం హగ్ ఇవ్వాల్సిందిగా రోహిత్ వైపు చూస్తూ కన్నీళ్లు పెట్టుకోవడం కాస్త బాధను కలిగించింది. అయితే అనుమతి లేకుండా మైదానంలోకి దూసుకురావడం తప్పుగా పరిగణిస్తారు. ఎంత అభిమానం ఉన్న ఆటగాళ్లు కూడా తమ భద్రత దృశ్యా ఎవరిని దగ్గరికి రానియ్యరు. రోహిత్ కూడా అదే పద్దతిని ఫాలో అయ్యాడు. కాగా సెక్యూరిటీ నిబంధనలను ఉల్లంఘించి గ్రౌండ్లోకి ఎంటర్ అయినందుకు ఆ కుర్రాడికి క్రికెట్ ఆస్ట్రేలియా రూ.6 లక్షల 50 వేల భారీ జరిమానా విధించింది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. కాగా ఈ ప్రపంచకప్లో అభిమానులు మ్యాచ్ జరుగుతున్న సమయంలో గ్రౌండ్లోకి రావడం ఇది రెండో సారి. దీంతో ఆటగాళ్ల భద్రతపై క్రికెట్ ఆస్ట్రేలియా తీసుకుంటున్న చర్యలపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. చదవండి: ఏమా కొట్టుడు.. 'మిస్టర్ 360' పేరు సార్థకం అన్నీ కుదిరితే ఫైనల్లో టీమిండియా, పాకిస్తాన్! A fan entered into a stadium during India vs zim match....#INDvsZIM #T20worldcup22 #T20WorldCup #SuryakumarYadav #semis #RohitSharma𓃵 #ViratKohli𓃵 follow for more tweets pic.twitter.com/fWvKNIky63 — Santoshgadili (@Santoshgadili3) November 6, 2022 Little fan didn't get chance to meet Rohit Sharma... Nice gesture from Captain Rohit he talked with him...#RohitSharma𓃵 #T20worldcup22 #T20WorldCup pic.twitter.com/eQ4Pw6UJt2 — 𝖲𝖺𝗎𝗋𝖺𝖻𝗁🤍 (@Cricket_Gyaani_) November 6, 2022 A fan invaded the field today to meet Rohit Sharma, he was in tears when he came close to Rohit. The fan has been fined 6.5 Lakhs INR for invading the field. pic.twitter.com/CmiKIocTHf — Mufaddal Vohra (@mufaddal_vohra) November 6, 2022 -
'క్వాలిఫై అని ముందే తెలుసు..గ్రూప్ టాపర్గా వెళ్లాలన్నదే లక్ష్యం'
టి20 ప్రపంచకప్లో భాగంగా సూపర్-12 దశలో ఆఖరి మ్యాచ్లో టీమిండియా జింబాబ్వేపై 71 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి సెమీస్లో అడుగుపెట్టింది. ఐదు మ్యాచ్ల్లో నాలుగు విజయాలు, ఒక ఓటమితో 8 పాయింట్లు సాధించిన టీమిండియా గ్రూప్-1 టాపర్గా నిలిచి సెమీస్కు చేరుకుంది. తొలుత సూర్యకుమార్ సంచలన ఇన్నింగ్స్కు తోడు కేఎల్ రాహుల్ మరో అర్థశతకం మెరవడంతో టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. ఆపై భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడమే గాక వరుస విరామాల్లో వికెట్లు తీస్తూ జింబాబ్వేపై ఒత్తిడి తెచ్చారు. దీంతో జింబాబ్వే 115 పరుగులకే ఆలౌట్ కావడంతో టీమిండియా 71 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. ఇక మ్యాచ్ విజయం అనంతరం కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడాడు. ''మ్యాచ్కు ముందే మేము సెమీస్కు క్వాలిఫై అయ్యామని తెలుసు. కానీ గ్రూప్ టాపర్గా వెళ్లాలనేది మా లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇక జింబాబ్వేతో మ్యాచ్లో జట్టు ఆల్రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకుంది. కేఎల్ రాహుల్తో పాటు సూర్యకుమార్లు తమ ఫామ్ను కొనసాగిస్తూ బ్యాటింగ్ చేయడం మాక చాలా అనుకూలం. ఇక సూర్యకుమార్ రోజురోజుకు మరింత బలంగా తయారవుతున్నాడు. అతని కచ్చితమైన షాట్ల ఎంపిక ప్రతీ ఒక్కరిని ముగ్దులను చేస్తోంది. ఒత్తిడిని తట్టుకొని బ్యాటింగ్ చేయడమనేది సవాల్తో కూడుకున్నాది. కానీ సూర్యకుమార్ మాత్రం యథేచ్చగా బ్యాట్ను ఝులిపించడం కలిసొచ్చే అంశం. ఇక ఇంగ్లండ్ లాంటి బలమైన జట్టుతో సెమీఫైనల్ ఆడనున్న నేపథ్యంలో సూర్యకుమార్ మరోసారి కీలకంగా మారాడని చెప్పొచ్చు. కొన్ని రోజులుగా చూసుకుంటే ఇంగ్లండ్ మంచి క్రికెట్ ఆడుతూ వస్తున్నారు. వాళ్లను ఎదుర్కోవడం సవాల్ లాంటిదే అయినప్పటికి మంచి ప్రయత్నంతో వారిని ఓడగొట్టేందుకు ప్రయత్నిస్తాం. ఇప్పటివరకు మా ఆటతీరు బాగానే ఉంది. ఇకపై సెమీస్లో మరింత జాగ్రత్తగా ఆడాల్సి ఉంది. సూపర్-12 దశలో చేసిన తప్పులను కరెక్ట్ చేసుకొని సెమీస్ బరిలోకి దిగాలనుకుంటున్నాం. ఇక మ్యాచ్లు చూడడానికి వస్తున్న అభిమానులకు ప్రత్యేక కృతజ్ఞతలు. మేం ఎక్కడ మ్యాచ్లు ఆడినా అక్కడ స్టేడియం హౌస్ఫుల్ అయినట్లు కనిపిస్తుంది. ఇంతదూరం మాకు మద్దతిస్తూ వచ్చారు. సెమీస్లోనూ అదే సపోర్ట్ ఉంటుందని ఆశిస్తున్నా. జట్టు తరపున మీ అభిమానానికి ప్రత్యేకంగా కృతజ్ఞతలలు తెలుపుకుంటున్నా'' అంటూ ముగించాడు. చదవండి: జింబాబ్వేపై ఘన విజయం.. గ్రూప్-2 టాపర్గా సెమీస్కు టీమిండియా అన్నీ కుదిరితే ఫైనల్లో టీమిండియా, పాకిస్తాన్! -
జింబాబ్వేపై ఘన విజయం.. గ్రూప్-2 టాపర్గా సెమీస్కు టీమిండియా
టి20 ప్రపంచకప్లో టీమిండియా గ్రూప్-2 టాపర్గా సెమీస్లో అడుగుపెట్టింది. జింబాబ్వేతో జరిగిన సూపర్-12 మ్యాచ్లో టీమిండియా 71 పరుగుల తేడాతో భారీ విజయాన్ని అందుకుంది. 187 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వే టీమిండియా బౌలర్ల దాటికి ఏ దశలోనూ పోరాడలేకపోయింది. భారత బౌలర్లు కట్టుదిట్టమైన బంతులు విసరడంతో పాటు వరుస విరామాల్లో వికెట్లు తీయడంతో జింబాబ్వే ఒత్తిడిలో పడిపోయింది. రియాన్ బర్ల్ 35 పరుగులతో టాప్ స్కోరర్ కాగా.. సికందర్ రజా 34 పరుగులు చేశాడు. టీమిండియా బౌలర్లలో అశ్విన్ 3, మహ్మద్ షమీ, హార్దిక్ పాండ్యాలు రెండు వికెట్లు తీయగా.. భువనేశ్వర్, అర్ష్దీప్, అక్షర్ పటేల్ తలా ఒక వికెట్ తీశారు. ఈ విజయంతో టీమిండియా గ్రూప్-2 టాపర్గా సెమీస్లో అడుగుపెట్టింది. ఇక సెమీఫైనల్లో గ్రూప్-1లో రెండో స్థానంలో ఉన్న ఇంగ్లండ్తో అమితుమీ తేల్చుకోనున్నాయి. ఇక మరొక సెమీస్లో టోర్నీ ఫేవరెట్ న్యూజిలాండ్తో పాకిస్తాన్ ఆడనుంది. అన్ని కుదిరితే టీమిండియా, పాకిస్తాన్ ఫైనల్లో తలపడే అవకాశాలున్నాయి. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో రోహిత్ సేన 5 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. ఆకాశమే హద్దుగా చెలరేగిన సూర్యకుమార్ యాదవ్ 61 నాటౌట్, కేఎల్ రాహుల్ 51 రాణించారు. -
జింబాబ్వేపై టీమిండియా ఘన విజయం (ఫొటోలు)
-
Ind Vs Zim: రాక రాక వచ్చిన అవకాశం.. జింబాబ్వే చేతిలో కూడానా? ఏంటిది పంత్!
ICC Mens T20 World Cup 2022- India vs Zimbabwe: టీమిండియా వెటరన్ వికెట్ కీపర్ బ్యాటర్ దినేశ్ కార్తిక్ పునరాగమనం తర్వాత.. యువ ఆటగాడు రిషభ్ పంత్కు జట్టులో స్థానం కోసం అతడితో పోటీ నెలకొంది. టీ20 ప్రపంచకప్-2022 టోర్నీకి వీరిద్దరు ఎంపికైనప్పటికీ యాజమాన్యం సీనియారిటీకే ఓటు వేసింది. సూపర్-12లో భాగంగా వరుసగా నాలుగు మ్యాచ్లలో డీకేను ఆడించగా.. పంత్ బెంచ్కే పరిమితమయ్యాడు. ఇదిలా ఉంటే.. ఆదివారం నాటి మ్యాచ్లో నెదర్లాండ్స్ చేతిలో సౌతాఫ్రికా ఓడిపోవడంతో.. టీమిండియా సెమీస్ బెర్తు ఖరారైన విషయం తెలిసిందే. దీంతో ఆఖరిదైన జింబాబ్వేతో మ్యాచ్ భారత్కు నామమాత్రంగా మారిపోయింది. ఇక మ్యాచ్ ద్వారా వరల్డ్కప్ తాజా ఎడిషన్లో తొలిసారిగా తుది జట్టులోకి వచ్చాడు పంత్. పంత్ ఏంటిది? అయితే, డీకే స్థానంలో వికెట్ కీపర్ బ్యాటర్గా ఎంట్రీ ఇచ్చిన రిషభ్ పంత్ పూర్తిగా నిరాశపరిచాడు. ఐదో స్థానంలో బ్యాటింగ్కు దిగిన 5 బంతులు ఎదుర్కొన్న అతడు కేవలం మూడు పరుగులకే అవుటయ్యాడు. సీన్ విలియమ్స్ బౌలింగ్లో పంత్ షాట్కు యత్నించగా.. ర్యాన్ బర్ల్కు అద్భుత క్యాచ్ అందుకున్నాడు. ఈ నేపథ్యంలో తొందరగానే పెవిలియన్ చేరిన పంత్పై సోషల్ మీడియా వేదికగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ‘‘ఆస్ట్రేలియా పిచ్లపై బాగా ఆడతాడు. కాబట్టి డీకేను కాదని పంత్ను జట్టులోకి తీసుకోవాలంటూ రికీ పాంటింగ్ లాంటి దిగ్గజాలు చెబుతారు. కానీ నువ్వేమో రాక రాక వచ్చిన అవకాశాన్ని ఇలా చేజేతులా నాశనం చేసుకున్నావు. జింబాబ్వే బౌలర్లను కూడా ఎదుర్కోలేకపోతున్నావు. ఇంకా నయం నెదర్లాండ్స్ గనుక సౌతాఫ్రికాను ఓడించకపోతే నిన్ను నమ్మేవాళ్లు కాదేమో! నామమాత్రపు మ్యాచ్ కాబట్టి ఛాన్స్ ఇచ్చి ఉంటారు’’ అంటూ ట్రోల్ చేస్తున్నారు. కాగా గ్రూప్-2 నుంచి టీమిండియాతో పాటు పాకిస్తాన్ సెమీ ఫైనల్కు అర్హత సాధించిన విషయం తెలిసిందే. చదవండి: Shakib Al Hasan: ఇప్పటి వరకు ఇదే అత్యుత్తమ ప్రదర్శన.. కానీ నేనైతే: బంగ్లాదేశ్ కెప్టెన్ WC 2022: పాపం.. సౌతాఫ్రికా టోర్నీ నుంచి అవుట్! ఇందుకు కారణం ఆ రెండే! ముఖ్యంగా యూఏఈ! View this post on Instagram A post shared by ICC (@icc) -
జింబాబ్వేపై టీమిండియా ఘన విజయం.. సెమీస్లో ఇంగ్లండ్తో అమితుమీ
జింబాబ్వేపై ఘన విజయం.. గ్రూప్-2 టాపర్గా సెమీస్కు టీమిండియా టి20 ప్రపంచకప్లో టీమిండియా గ్రూప్-2 టాపర్గా సెమీస్లో అడుగుపెట్టింది. జింబాబ్వేతో జరిగిన సూపర్-12 మ్యాచ్లో టీమిండియా 71 పరుగుల తేడాతో భారీ విజయాన్ని అందుకుంది. 187 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వే టీమిండియా బౌలర్ల దాటికి ఏ దశలోనూ పోరాడలేకపోయింది. 17.2 ఓవర్లలో 115 పరుగులకే ఆలౌట్ అయింది. రియాన్ బర్ల్ 35, సికందర్ రజా 34 పరుగులు చేశారు. అశ్విన్ మూడు వికెట్లతో రాణించాడు. ఈ విజయంతో గ్రూప్-2 టాపర్గా సెమీస్లో అడుగుపెట్టిన టీమిండియా ఇంగ్లండ్తో అమితుమీ తేల్చుకోనుంది. అశ్విన్ మాయాజాలం.. తొమ్మిదో వికెట్ డౌన్ ► టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీసి జింబాబ్వేను దెబ్బతీశాడు. ప్రస్తుతం జింబాబ్వే 9 వికెట్ల నష్టానికి 111 పరుగులు చేసింది. రియాన్ బర్ల్(35) ఔట్.. ఆరో వికెట్ కోల్పోయిన జింబాబ్వే ► రియాన్ బర్ల్(35) రూపంలో జింబాబ్వే ఆరో వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం జింబాబ్వే 15 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 104 పరుగులు చేసింది. 42 పరుగులకే ఐదు వికెట్లు.. కష్టాల్లో పడిన జింబాబ్వే ► టి20 ప్రపంచకప్లో భాగంగా టీమిండియాతో మ్యాచ్లో జింబాబ్వే ఓటమి దిశగా పయనిస్తోంది. 187 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వే 41 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి తీవ్ర కష్టాల్లో పడింది. టీమిండియా బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో పాటు వరుస విరామాల్లో వికెట్లు తీస్తూ జింబాబ్వేపై ఒత్తిడి పెంచుతున్నారు. ప్రస్తుతం జింబాబ్వే ఐదు వికెట్ల నష్టానికి 42 పరుగులు చేసింది. రియాన్ బర్ల్ 3, సికందర్ రజా 3 పరుగులతో ఆడుతున్నారు. పవర్ ప్లేలో జింబాబ్వే స్కోరు- 28/3 (6) షమీ బౌలింగ్లో మూడో వికెట్గా విలియమ్స్ వెనుదిరిగాడు. రెండో వికెట్ కోల్పోయిన జింబాబ్వే అర్ష్దీప్ బౌలింగ్లో చకబ్వా బౌల్డ్ అయ్యాడు. స్కోరు: 2/2 (1.4) మొదటి వికెట్ డౌన్ టీమిండియా పేసర్ భువనేశ్వర్ కుమార్ భారత్కు శుభారంభం అందించాడు. మొదటి బంతికి జింబాబ్వే ఓపెనర్ మాధేవెరేను పెవిలియన్కు పంపాడు. మొదటి ఓవర్ ముగిసే సరికి జింబాబ్వే స్కోరు: 0-1 భారత్ స్కోరెంతంటే జింబాబ్వేతో మ్యాచ్లో టీమిండియా ఓపెనర్ కేఎల్ రాహుల్(51), మిడిలార్డర్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్(61) హాఫ్ సెంచరీలతో మెరిశారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో రోహిత్ సేన 5 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేయగలిగింది. వచ్చాడు.. హాఫ్ సెంచరీ కొట్టాడు సూర్యకుమార్ యాదవ్ అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. 23 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. ఐదో వికెట్ కోల్పోయిన టీమిండియా హార్దిక్ పాండ్యా(18) ఐదో వికెట్గా వెనుదిరిగాడు. సూర్య, అక్షర్ పటేల్ క్రీజులో ఉన్నారు. 18 ఓవర్లలో టీమిండియా స్కోరు- 152/4 సూర్య 37, పాండ్యా 11 పరుగులతో క్రీజులు ఉన్నారు. నిరాశపరిచిన పంత్ ఈ ఎడిషన్లో తొలిసారిగా తుది జట్టులో చోటు దక్కించుకున్న రిషభ్ పంత్ పూర్తిగా నిరాశపరిచాడు. 3 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. హార్దిక్, సూర్య క్రీజులో ఉన్నారు. రాహుల్ అవుట్ సిక్సర్తో అర్ధ శతకం పూర్తి చేసుకున్న కేఎల్ రాహుల్(51) రజా బౌలింగ్లో మూడో వికెట్గా వెనుదిరిగాడు. పంత్ క్రీజులోకి వచ్చాడు. స్కోరు: 98/3 (13) View this post on Instagram A post shared by ICC (@icc) రెండో వికెట్ కోల్పోయిన టీమిండియా కోహ్లి రూపంలో టీమిండియా రెండో వికెట్ కోల్పోయింది. పన్నెండో ఓవర్ ఆఖరి బంతికి విలియమ్స్ బౌలింగ్లో బర్ల్కు క్యాచ్ ఇచ్చి 26 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద కోహ్లి నిష్క్రమించాడు. 12 ఓవర్లలో స్కోరు: 89-2. కేఎల్ రాహుల్ (45), సూర్యకుమార్ యాదవ్ క్రీజులో ఉన్నారు. 10 ఓవర్లలో టీమిండియా స్కోరు: 79/1 రాహుల్ 41, కోహ్లి 22 పరుగులతో క్రీజులో ఉన్నారు. 9 ఓవర్లలో భారత్ స్కోరు: 71/1 కోహ్లి 20, రాహుల్ 35 పరుగులతో క్రీజులో ఉన్నారు. పవర్ ప్లేలో టీమిండియా స్కోరు: 46/1 (6) కోహ్లి 10, రాహుల్ 20 పరుగులతో క్రీజులో ఉన్నారు. తొలి వికెట్ డౌన్ జింబాబ్వేతో నామమాత్రపు మ్యాచ్లో టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. కెప్టెన్ రోహిత్ శర్మ(15) నాలుగో ఓవర్ ఐదో బంతికి అవుటయ్యాడు. ముజరబానీ బౌలింగ్లో మసకద్జాకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. కోహ్లి, రాహుల్ క్రీజులో ఉన్నారు. 4 ఓవర్లలో స్కోరు: 31-1 సెమీస్లో భారత్తో పాటు ఆ జట్టు ఇప్పటికే గ్రూప్-2 నుంచి సెమీస్ బెర్తు ఖరారు చేసుకున్న టీమిండియా సూపర్-12లో తమ ఆఖరి మ్యాచ్లో జింబాబ్వేతో తలపడుతోంది. మెల్బోర్న్ వేదికగా క్రెయిగ్ ఎర్విన్ బృందంతో నామమాత్రపు మ్యాచ్ ఆడనుంది. ఆదివారం నాటి ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన భారత కెప్టెన్ రోహిత్ శర్మ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఇక జింబాబ్వేతో మ్యాచ్తో టీమిండియా యువ వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్.. ఈ వరల్డ్కప్ ఎడిషన్లో తొలిసారిగా తుది జట్టులో చోటు దక్కించుకున్నాడు. కాగా అనూహ్య పరిస్థితుల్లో పసికూన నెదర్లాండ్స్ చేతిలో ఓడి సౌతాఫ్రికా ఇంటిబాట పట్టిన విషయం తెలిసిందే. దీంతో ఎలాంటి సమీకరణాలతో పనిలేకుండా భారత్ సెమీస్ చేరింది. ఈ క్రమంలో మరో కీలక మ్యాచ్లో పాకిస్తాన్.. బంగ్లాపై విజయం సాధించి.. దాయాది టీమిండియాతో పాటు సెమీస్లో అడుగుపెట్టింది. ఇండియా వర్సెస్ జింబాబ్వే తుది జట్లు ఇవే: భారత్: కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ(కెప్టెన్), విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, రిషబ్ పంత్(వికెట్ కీపర్), అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, భువనేశ్వర్ కుమార్, మహమ్మద్ షమీ, అర్ష్దీప్ సింగ్. జింబాబ్వే వెస్లీ మాధేవెరే, క్రెయిగ్ ఎర్విన్(కెప్టెన్), రెగిస్ చకబ్వా(వికెట్ కీపర్), సీన్ విలియమ్స్, సికందర్ రజా, టోనీ మునియోంగా, ర్యాన్ బర్ల్, టెండై చటారా, రిచర్డ్ నగరవ, వెల్లింగ్టన్ మసకద్జా, బ్లెస్సింగ్ ముజరబానీ చదవండి: Temba Bavuma: ఈ ఓటమిని అస్సలు జీర్ణించుకోలేకపోతున్నాం! ప్రధాన కారణం అదే