IPL-8
-
సంబరాలు చేసుకుందాం రండి
ముంబై: రెండోసారి ఐపీఎల్ విజేతగా నిలిచిన ముంబై ఇండియన్స్ టీమ్ సొంతగడ్డపై సంబరాలకు రెడీ అయింది. టైటిల్ గెలిచి జోష్ మీదున్న రోహిత్ సేన సోమవారం రాత్రి వాంఖేడ్ స్టేడియంలో సంబరాలు చేసుకోనుంది. వేడుకల్లో పాల్గొనాలని అభిమానులను కోరింది. రాత్రి 8 గంటలు సంబరాలు ప్రారంభమవుతాయి. ముంబై ఇండియన్స్ జట్టు సభ్యులు, టీమ్ మెంటార్ సచిన్ టెండూల్కర్, అతడి కుటుంబ సభ్యులు, సహ యాజమాని నీతా అంబానీ పాల్గొంటారు. కోల్ కతా నుంచి రోహిత్ సేన సోమవారం సాయంత్రానికి ముంబై చేరుకుంటుందని అధికార వర్గాలు వెల్లడించాయి. సంబరాలు వీక్షించేందుకు వచ్చే అభిమానులను ఉచితంగా వాంఖేడ్ స్టేడియంలోకి అనుమతిస్తారు. ముందు వచ్చిన వారికి ప్రయారిటీ ఇస్తారు. -
ఇదో గొప్ప ప్రయాణం: రోహిత్ శర్మ
కోల్ కతా: ఐపీఎల్-8 టైటిల్ సాధించడం పట్ల ముంబై ఇండియన్స్ టీమ్ కెప్టెన్ రోహిత్ శర్మ ఆనందం వ్యక్తం చేశాడు. ఈ సీజన్ తమ ప్రయాణం గొప్పగా సాగిందని పేర్కొన్నాడు. ఐపీఎల్ విజేతగా నిలిచిన తన జట్టును ఇంకేమీ అడగబోనని అన్నాడు. ఆదివారం జరిగిన ఐపీఎల్ ఫైనల్లో చెన్నై సూపర్ కింగ్స్ ను 41 పరుగుల తేడాతో ఓడించి ముంబై టైటిల్ కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్ లో 26 బంతుల్లో 50 పరుగులు చేసిన రోహిత్ శర్మ 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' అందుకున్నాడు. 'ఇదో గొప్ప ప్రయాణం. దీనికి మించి ఇంకేమీ అడగను. టైటిల్ పోరులో మా ఆటగాళ్లు బాగా ఆడారు. మరిచిపోలేని విజయం అందించారు' అని రోహిత్ శర్మ అన్నాడు. వరుస ఓటముల నుంచి పుంజుకున్న తీరు అనూహ్యమని పేర్కొన్నాడు. -
18 వేల 332 పరుగులు!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 8వ సీజన్ లో స్కోరు బోర్డుపై నమోదైన మొత్తం పరుగులు ఎన్నో తెలుసా. అక్షరాల 18 వేల 332 పరుగులు. ఇందులో బౌండరీల ద్వారా వచ్చిన రన్స్ 10,58. ఇందులో 89 అర్ధ సెంచరీలున్నాయి. పరుగుల వీరులు 692 సిక్సర్లు బాదారు. 'సిక్సర' పిడుగు క్రిస్ గేల్ అత్యధికంగా 38 సార్లు బంతిని బౌండరీ దాటించాడు. అత్యధికంగా 108 మీటర్ల వరకు బంతి వెళ్లింది. ఈసారి ఐపీఎల్ లో686 వికెట్లు పడ్డాయి. ఫాస్టెస్ట్ బాల్ వేగం 151.11 కేపీహెచ్(మిచెల్ జాన్సన్) గా నమోదైంది. వయసు పెరిగినా తన బౌలింగ్ పదును తగ్గలేదని నిరూపించిన ఆశిష్ నెహ్రా బెస్ట్ బౌలింగ్ (4/10) గణాంకాలు తన పేరిట లఖించుకున్నాడు. 26 వికెట్లతో డ్వెన్ బ్రేవో టాప్ బౌలర్ గా నిలిచాడు. ఎలా బడితే అలా బాదేసే ఏబీ డివిలియర్స్ అత్యధిక వ్యక్తిగత స్కోరు(133) చేసిన ఆటగాడిగా నిలిచాడు. హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్( 562) టాప్ స్కోరర్ అయ్యాడు. ఈసారి ఇండియా ఆటగాళ్లు సెంచరీలు కొట్టలేకపోయారు. డివిలియర్స్, క్రిస్ గేల్, బ్రెండన్ మెక్ కల్లమ్, షేన్ వాట్సన్ మాత్రమే శతకాలు బాదారు. పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచిన పంజాబ్ చిత్తుగా ఓడిన రికార్డు సొంతం చేసుకుంది. బెంగళూరు చేతిలో 138 పరుగుల భారీ తేడాతో ఓటమి మూటగట్టుకుంది. గతేడాది లీగ్ దశలో 22 పాయింట్లతో టాప్'గా నిలిచిన కింగ్స్ ఎలెవన్ పంబాబ్ ఈసారి అట్టడుగు నుంచి 'ఫస్ట్'కు పతనమైంది. చివరి నుంచి రెండో స్థానంలో కుదురుకున్న ఢిల్లీ డేర్ డెవిల్స్ తలరాత ఈసారి కూడా మారలేదు. సన్ రైజర్స్ హైదరాబాద్ కు అదృష్టం కలిసి రాలేదు. డిపెండింగ్ చాంపియన్ కోల్ కతా నైట్ రైడర్స్ ప్లేఆప్ కు చేరకుండానే ఇంటిదారి పట్టింది. తన చివరి లీగ్ మ్యాచ్ లో గెలిచి ప్లేఆఫ్ కు వచ్చిన రాజస్థాన్ రాయల్స్ ఫైనల్ కు చేరలేకపోయింది. బెంగళూరు రాయల్ చాలెంజర్స్ కు మరోసారి నిరాశే ఎదురైంది. లీగ్ దశలో అగ్రస్థానంలో నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్ తుది పోరులో తడబడింది. ఆరంభంలో ఎదురైన వరుస ఓటముల నుంచి అనూహ్యంగా పుంజుకుని ముంబై ఇండియన్స్ టీమ్ టైటిల్ ఎగరేసుకు పోవడం ఊహించని పరిణమామం. ఈ ఐపీఎల్ లో ఎవరు బెస్ట్... స్ట్రైక్ రేట్: ఆండ్రీ రసెల్(192.89) బ్యాటింగ్ సగటు: అజింక్య రహానే(49.09) అర్ధసెంచరీలు: డేవిడ్ వార్నర్(7) సిక్సర్లు: క్రిస్ గేల్(38) ఫోర్లు: డేవిడ్ వార్నర్(65) వేగవంతం సెంచరీ: క్రిస్ గేల్(46 బంతుల్లో) అర్ధ సెంచరీ: రసెల్, హర్భజన్(19 బంతుల్లో) అత్యుత్తమం బౌలింగ్ సగటు: హెన్సిక్స్(14.36) బౌలింగ్ ఎకానమి: అశ్విన్(5.84) డాట్ బాల్స్: అశిష్ నెహ్రా( 170) మెయిడిన్లు: సందీప్ శర్మ(4) అవార్డులు మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్: ఆండ్రీ రసెల్ ఎమర్జింగ్ ప్లేయర్: శ్రేయస్ అయ్యర్ బెస్ట్ క్యాచ్: డ్వేన్ బ్రేవో ఫేయిర్ ప్లే అవార్డు: చెన్నై సూపర్ కింగ్స్ ఆరెంజ్ క్యాప్: డేవిడ్ వార్నర్(562 రన్స్) పర్పుల్ క్యాప్: డ్వేన్ బ్రేవో(26 వికెట్లు) -
రెండో ఓవర్ కొంప ముంచింది: ధోని
కోల్ కతా: మ్యాచ్ ను గెలిచిపించే వ్యక్తిగత ప్రదర్శన చేయకపోవడంతో ఐపీఎల్-8 ఫైనల్లో ఓడిపోయామని చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ సింగ్ ధోని అన్నాడు. తమ జట్టు పూర్తిస్థాయిలో రాణించక పోవడం కూడా ఓటమికి కారణమని విశ్లేషించాడు. మొహిత్ శర్మ వేసిన రెండో ఓవర్ తమ కొంప ముంచిందని వాపోయాడు. ముంబై పుంజుకోవడానికి, మ్యాచ్ తమ చేయి జారడానికి ఈ ఓవరే కారణమన్నాడు. ఈ ఓవర్ లో రోహిత్ శర్మ రెండు ఫోర్లు, సిక్సర్ తో 16 పరుగులు పిండుకున్నాడు. భారీ స్కోరును ఛేదించేందుకు బరిలోకి దిగిన తమకు శుభారంభం లభించకపోవడం దెబ్బతీసిందన్నాడు. డాషింగ్ ఓపెనర్ బ్రెండన్ మెక్ కల్లమ్ లేకపోవడం కూడా తమ విజయవకాశాలపై ప్రతికూల ప్రభావం చూపిందన్నాడు. ప్లే ఆప్ లో పుంజుకోలేకపోవడంతో టైటిల్ చేజారిందన్నాడు. మొత్తంగా చూసుకుంటే తమ జట్టు ప్రదర్శన సంతృప్తికరంగా ఉందని ధోని చెప్పాడు. -
'ఇప్పుడు క్రికెట్ ను ప్రేమిస్తున్నా'
కోల్ కతా: తమ జట్టు ఐపీఎల్-8 విజేతగా నిలవడం పట్ల ముంబై ఇండియన్స్ టీమ్ సహ యజమాని నీతా అంబానీ హర్షం వ్యక్తం చేశారు. తానిప్పుడు క్రికెట్ ను ప్రేమిస్తున్నానని చెప్పారు. ఐపీఎల్ మొదలైనప్పుడు తనకు అసలు క్రికెట్ గురించి తెలియదని వెల్లడించారు. ఫైనల్ మ్యాచ్ ముగిసిన తర్వాత ఆమె మీడియాతో మాట్లాడారు. 'మొదటి, రెండు ఐపీఎల్ వరకు క్రికెట్ గురించి అసలు అర్థం కాలేదు. కానీ ఇప్పుడు క్రికెట్ ను అభిమానిస్తున్నా. మా టీమ్ కు పెద్ద సంఖ్యలో మద్దతుగా నిలిచిన అభిమానులను ఇష్టపడుతున్నా' అని నీతా అంబానీ అన్నారు. వాంఖేడ్ మైదానంలో మొదటి క్వాలిఫయిర్ మ్యాచ్ లో చెన్నైని ఓడించిన తర్వాత తామే విజేతగా నిలుస్తామని నమ్మకం ఏర్పడిందని తెలిపారు. తమ జట్టు సాధించిన విజయాన్ని అభిమానులకు అంకితం చేశారు. ఈ క్రెడిట్ మొత్తం టీమ్ కే దక్కుతుందని నీతా అంబానీ కుమారుడు ఆకాశ్ అంబానీ అన్నారు. 10 మ్యాచుల్లో 9 విజయాలు సాధించడం చాలా గొప్ప విషయమని పేర్కొన్నారు. టైటిల్ సాధించేందుకు తమ ఆటగాళ్లు చాలా కష్టపడ్డారని అన్నారు. -
టాప్ ట్రెండింగ్ టీమ్ ముంబై
కోల్ కతా: క్రికెట్ అభిమానులను ఊర్రూతలూగించిన ఐపీఎల్-8 సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది. తమ అభిమాన క్రికెటర్లు, జట్ల సమాచారం తెలుసుకునేందుకు, తమ అభిప్రాయాలను పంచుకునేందుకు ఫ్యాన్స్ సామాజిక వెబ్ సైట్లను వేదికగా మలుచుకున్నారు. ఐపీఎల్-8పై దాదాపు 36 కోట్ల ట్వీట్లు వచ్చాయి. ఈ ఏడాది విజేతగా నిలిచిన 753,669 ట్వీట్లతో టాప్ ట్రెండింగ్ టీమ్ గా నిలిచింది. 'ఎక్స్ ప్రెసివ్' ఆటగాడు విరాట్ కోహ్లిపై అత్యధిక ట్వీట్లు వదిలారు. ధోని, గేల్, డీవిలియర్స్, రోహిత్ శర్మ తర్వాతి స్థానాల్లో ఉన్నారు. ఏప్రిల్ 9న ఢిల్లీ, చెన్నై జట్ల మధ్య చెపాక్ మైదానంలో జరిగిన మ్యాచ్ సందర్భంగా నిమిషానికో ట్వీట్ నమోదైంది. వాంఖేడ్ మైదానంలో ముంబై, చెన్నై జట్ల మధ్య జరిగిన మ్యాచ్ పైనా నెటిజన్లు సోషల్ మీడియాలో అమితాసక్తి చూపారు. -
ధోని, గౌతీ సరసన రోహిత్
కోల్ కతా: ఆరు వారాల పాటు క్రికెట్ అభిమానులకు అలరించిన ఐపీఎల్-8 ముగిసింది. అనూహ్యంగా పుంజుకున్న ముంబై ఇండియన్స్ టీమ్ విజేతగా నిలిచింది. అన్ని విభాగాల్లో పైచేయి సాధించి రెండోసారి టైటిల్ సొంతం చేసుకుంది. ఈ విజయంతో ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ... మహేంద్ర సింగ్ ధోని, గౌతమ్ గంభీర్ సరసన చేరాడు. రెండుసార్లు జట్టుకు ఐపీఎల్ టైటిల్ అందించిన కెప్టెన్ల జాబితాలో వీరు ముగ్గురూ ఉన్నారు. రాజస్థాన్, హైదరాబాద్ ఒక్కోసారి ఐపీఎల్ టైటిల్ అందుకున్నాయి. ఈ సీజన్ లో 16 మ్యాచ్ లు ఆడిన రోహిత్ 34.42 సగటుతో 482 పరుగులు సాధించాడు. ఇందులో మూడు అర్ధసెంచరీలు ఉన్నాయి. 17 మ్యాచ్ లు ఆడిన ధోని 31 సగటుతో 372 పరుగులు చేశాడు. గౌతమ్ గంభీర్ 13 మ్యాచుల్లో 25.15 సగటుతో 327 పరుగులు సాధించాడు. -
ఐపీఎల్ చాంపియన్ ముంబై ఇండియన్స్
-
ఐపీఎల్ చాంపియన్ ముంబై ఇండియన్స్
-
ముంబై ధూంధాం...
ఐపీఎల్ చాంపియన్ ముంబై ఇండియన్స్ ► ఫైనల్లో చెన్నై సూపర్ కింగ్స్పై ఘన విజయం ► చెలరేగిన రోహిత్, సిమ్మన్స్, పొలార్డ్ అదే వేదిక... అవే జట్లు... అదే కెప్టెన్లు... అదే ఫలితం... కేవలం సంవత్సరం మారిందంతే..! 2013 ఐపీఎల్ ఫైనల్ ఫలితం మరోసారి పునరావృతమైంది. ఈడెన్ గార్డెన్స్లో చెన్నై సూపర్ కింగ్స్ను చిత్తు చేసి ముంబై ఇండియన్స్ 2015 ఐపీఎల్ విజేతగా నిలిచింది. పటిష్టమైన చెన్నైని చెడుగుడు ఆడేస్తూ సిమ్మన్స్, రోహిత్, పొలార్డ్ పరుగుల జడివాన కురిపించారు. అటు ముంబై బౌలర్లూ మెరిశారు. ఫలితం... రోహిత్ సేన సగర్వంగా రెండోసారి ఐపీఎల్ టైటిల్ సొంతం చేసుకుంది. కోల్కతా : బ్యాటింగ్కు అనుకూలించే ఫ్లాట్ వికెట్... ఒత్తిడి ఉండే ఫైనల్ మ్యాచ్... సాధారణంగా ఏ కెప్టెన్ అయినా టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకుంటాడు. కానీ వ్యూహాల్లో దిట్టగా భావించే ధోని మాత్రం అనూహ్యంగా బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ తప్పిదం చెన్నైని వెంటాడింది. వరుస విజయాలతో జోరు మీద ఉన్న ముంబై బ్యాట్స్మెన్ ధాటికి చెన్నై కకావికలమైంది. బ్యాటింగ్లో సిమ్మన్స్ (45 బంతుల్లో 68; 8 ఫోర్లు, 3 సిక్సర్లు), రోహిత్ (26 బంతుల్లో 50; 6 ఫోర్లు, 2 సిక్సర్లు)ల వీరోచిత ఇన్నింగ్స్తో ఆదివారం జరిగిన ఫైనల్లో ముంబై 41 పరుగుల తేడాతో ధోనిసేనపై విజయం సాధించి రెండోసారి విజేతగా నిలిచింది. ఈడెన్ గార్డెన్స్లో జరిగిన ఈ మ్యాచ్లో... ముందుగా ముంబై 20 ఓవర్లలో 5 వికెట్లకు 202 పరుగులు చేసింది. పొలార్డ్ (18 బంతుల్లో 36; 2 ఫోర్లు, 3 సిక్సర్లు), రాయుడు (24 బంతుల్లో 36 నాటౌట్; 3 సిక్సర్లు) దుమ్మురేపారు. తర్వాత చెన్నై 20 ఓవర్లలో 8 వికెట్లకు 161 పరుగులకు మాత్రమే పరిమితమైంది. స్మిత్ (48 బంతుల్లో 57; 9 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్. రైనా (19 బంతుల్లో 28; 3 ఫోర్లు, 1 సిక్స్), మోహిత్ (7 బంతుల్లో 21 నాటౌట్; 1 ఫోర్, 2 సిక్సర్లు), ధోని (13 బం తుల్లో 18; 1 ఫోర్, 1 సిక్స్) మోస్తరుగా ఆడారు. కీలక భాగస్వామ్యం టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ముంబై ఇన్నింగ్స్ ఐదో బంతికే పార్థీవ్ (0) వికెట్ను కోల్పోయింది. అయితే వన్డౌన్లో వచ్చిన రోహిత్.. అచ్చొచ్చిన మైదానంలో విశ్వరూపం చూపాడు. సిమ్మన్స్తో కలిసి బౌండరీలు, సిక్సర్లతో రెచ్చిపోవడంతో ముంబై స్కోరు బోర్డు కదం తొక్కింది. వాయువేగంతో బ్యాటింగ్ చేసిన సిమ్మన్స్ 35 బంతుల్లో; రోహిత్ 25 బంతుల్లో అర్ధసెంచరీలు పూర్తి చేశారు. ఓవర్కు పదికిపైగా రన్రేట్తో పరుగులు సాధించడంతో రెండో వికెట్కు 67 బంతుల్లోనే 119 పరుగులు సమకూరాయి. అయితే రెండు బంతుల తేడాలో ఈ ఇద్దరూ పెవిలియన్కు చేరడంతో ముంబై స్కోరు 120/3గా మారింది. తర్వాత పొలార్డ్, రాయుడు కూడా చెన్నై బౌలర్లను ఆడుకున్నారు. నెహ్రా వేసిన ఇన్నింగ్స్ 17వ ఓవర్లో 23 పరుగులు రాబట్టిన పొలార్డ్... 19వ ఓవర్లో భారీ షాట్కు ప్రయత్నించి అవుటయ్యాడు. రాయుడుతో కలిసి నాలుగో వికెట్కు 40 బంతుల్లో 71 పరుగులు జోడించాడు. హార్థిక్ పాండ్యా (0) విఫలమైనా.. హర్భజన్ (6 నాటౌట్) సిక్సర్తో ముంబై స్కోరు 200 దాటింది. స్మిత్ మినహా అంతా విఫలం భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో చెన్నై ఓపెనర్ హస్సీ (4) తొందరగా అవుటయ్యాడు. స్మిత్, రైనాలు నెమ్మదిగా ఆడుతూ ఇన్నింగ్స్ను పునర్నిర్మించినా కావలసిన రన్రేట్ బాగా పెరిగింది. అప్పుడప్పుడూ ఫోర్లు బాదినా... తొలి 10 ఓవర్లలో చెన్నై వికెట్ నష్టానికి 67 పరుగులు మాత్రమే చేసింది. అయితే అర్ధసెంచరీ పూర్తి చేసుకున్న స్మిత్తో పాటు రైనాను వరుస ఓవర్లలో హర్భజన్ అవుట్ చేసి మ్యాచ్ను మలుపుతిప్పాడు. ఈ ఇద్దరు రెండో వికెట్కు 66 పరుగులు జోడించారు. తర్వాత ముంబై పేసర్లు విజృంభించి వరుస ఓవర్లలో బ్రేవో (9), ధోని, డు ప్లెసిస్ (1), నేగి (3), అశ్విన్ (2)లను అవుట్ చేశారు. చివరి 10 ఓవర్లలో చెన్నై 94 పరుగులు చేసి ఏడు వికెట్లు చేజార్చుకుని ఓడింది. మెక్లీనగన్ 3 వికెట్లు తీశాడు. మలింగ, హర్భజన్లకు రెండేసి వికెట్లు లభించాయి. భారీ బృందగానం! ముంబైని గెలిపించిన సమష్టితత్వం కలిసొచ్చిన దిగ్గజాల మార్గదర్శనం టోర్నీ మొదటి ఆరు మ్యాచ్లలో ఐదు పరాజయాలు...ఇక ఐపీఎల్-8లో ఆ జట్టు కథ ముగిసినట్లేనని అనిపించింది. అయితే ముంబై ఇండియన్స్ మరోసారి ఫీనిక్స్ పక్షిలా లేచింది. గత ఏడాది యూఏఈ అంచెలో ఇదే తరహాలో వెనకబడి కోలుకున్న రోహిత్ సేన ఇప్పుడు మరింత వేగంగా దూసుకొచ్చింది. ఆటగాళ్లంతా ఒకరితో మరొకరు పోటీ పడి మైదానంలో రాణిస్తే... మహామహులు వెనకనుండి వెన్ను తట్టి నిలవగా ముంబై ఇండియన్స్ రెండో సారి చాంపియన్షిప్ను సొంతం చేసుకుంది. రాత మార్చిన ఓపెనింగ్ ఆసీస్ స్టార్ ఫించ్ గాయంతో వెనుదిరగడంతో ఓపెనర్గా విండీస్ ఆటగాడు సిమన్స్ రావడం ముంబైకి కలిసొచ్చింది. మరో ఓపెనర్ పార్థీవ్తో కలిసి సిమన్స్ టోర్నీ రెండో అర్ధ భాగంలో చెలరేగాడు. వీరిద్దరు దాదాపు ప్రతీ మ్యాచ్లో శుభారంభం అందించడంతో తర్వాత వచ్చే బ్యాట్స్మన్ నేరుగా ఎదురుదాడికి అవకాశం కలిగింది. గత ఏడాది కూడా ముంబై టాప్ స్కోరర్ అయిన సిమన్స్ ఈ సారి 6 అర్ధ సెంచరీలతో టోర్నీలో మొత్తం 540 పరుగులు చేశాడు. రెండు అర్ధ సెంచరీలు చేసిన పార్థీవ్ కీపర్గా కూడా సమర్థంగా రాణించాడు. మూడో స్థానంలో రోహిత్ 482 పరుగులు చేయడంతో ముంబై బ్యాటింగ్కు నిలకడ వచ్చిం ది. ఫైనల్లో చేసిన అర్ధ సెంచరీ అతని ప్రత్యేక ప్రదర్శనగా నిలిచిపోతుంది. పొలార్డ్ మెరుపులు గతంలో చాలా మ్యాచ్లలో తగినన్ని బం తులు అందుబాటులో లేక ఆశించిన ప్రదర్శన ఇవ్వని పొలార్డ్, ఈ సీజన్లో మాత్రం బ్యాటింగ్ ఆర్డర్లో ముందుకు వచ్చి జట్టు విజయాల్లో కీలక పాత్ర (419 పరుగులు) పోషించాడు. ముఖ్యంగా కోల్కతాతో కీలక ఇన్నింగ్స్తో ప్లే ఆఫ్కు చేర్చిన అతను, తొలి క్వాలిఫయర్లో, ఆ తర్వాత ఫైనల్లోనూ చెలరేగిపోయాడు. ఇక కొత్త కుర్రాడు హార్దిక్ పాండ్యా అనూహ్య ప్రదర్శనతో ముంబై మిడిలార్డర్ ఒక్కసారిగా పటిష్టంగా మారిపోయింది. చెన్నైపై సిక్సర్లతో విరుచుకుపడ్డ అతను, కోల్కతాపై చక్కటి హాఫ్ సెంచరీ చేశాడు. ఆరంభ మ్యాచ్లలో రాణించని రాయుడు తర్వాత నిలదొక్కుకున్నాడు. ఫైనల్ మ్యాచ్లో అతని ప్రదర్శన ముంబై విజయంలో ప్రధాన పాత్ర పోషించింది. గన్ పేలింది... ఐపీఎల్ వేలంలో కోచ్ పాంటింగ్ పట్టుబట్టి మెక్లీన్గన్ (18వికె ట్లు)ను తీసుకున్నాడు. తొలి నాలుగు మ్యాచ్ల తర్వాత బరిలోకి దిగిన అతను అద్భుతంగా ప్రభావం చూపించాడు. ముఖ్యంగా ముంబై వికెట్పై చక్కటి బౌన్స్ రాబట్టిన అతను పేస్తో చెలరేగాడు. హైదరాబాద్తో తప్పక గెలవాల్సిన మ్యాచ్లో తొలి ఓవర్లో వార్నర్ను అవుట్ చేసి ఆటను మలుపు తిప్పాడు. మలింగ (24) ఎప్పటిలాగే తన పదునైన యార్కర్లతో ప్రత్యర్థి బ్యాట్స్మెన్ను పూర్తిగా కట్టి పడేశాడు. ఒకప్పటి హర్భజన్ ఈ టోర్నీలో మళ్లీ మెరిశాడు. 18 వికెట్లు తీసిన అతను తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టాడు. కనీసం ఒక్క ఫస్ట్ క్లాస్ అనుభవం కూడా లేని లెఫ్టార్మ్ స్పిన్నర్ సుచిత్ (10 వికెట్లు) కూడా ప్రభావం చూపించడంతో ముంబై తుది జట్టులో మార్పుల అవసరం లేకపోయింది. ఫుల్ ‘సపోర్ట్’ ’నేనిక్కడ ఉన్నది ఐపీఎల్ టైటిల్ అందించడానికే’ అని ఆత్మవిశ్వా సంతో ప్రకటించిన హెడ్ కోచ్ రికీ పాంటింగ్ దానిని చేసి చూపించాడు. దిగ్గజ ఆటగాడిగా, టాప్ టీమ్ కెప్టెన్గా అతనికి ఉన్న అనుభవం జట్టుకు బాగా ఉపయోగపడింది. ‘మీ కోసం కాదు జట్టు కోసం ఆడండి’ అంటూ అతను తమలో స్ఫూర్తి నింపాడంటూ ప్రతీ ఆటగాడు చెప్పుకొచ్చాడు. అదే విధంగా టీమ్ ఐకాన్గా సచిన్, చీఫ్ మెంటార్గా కుంబ్లే ఉన్నా...జట్టు ప్రయోజనాల కోసం అవసరమైతే సలహాలు ఇచ్చారు తప్పితే కోచ్ పాత్రను పరిమితం చేసి ఆధిక్యం ప్రదర్శించే పని చేయలేదు. దాంతో పాంటింగ్ మరింత స్వేచ్ఛగా వ్యవహరించాడు. అసిస్టెంట్ కోచ్ రాబిన్ సింగ్, బౌలింగ్ కోచ్ షేన్ బాండ్, ఫీల్డింగ్ కోచ్ జాంటీ రోడ్స్ అతనికి అండగా నిలిచారు. ఫలితమే ఐపీఎల్లో ముంబై జెండా మరోసారి ఎగిరింది. -సాక్షి క్రీడావిభాగం ఎవరికెంత డబ్బు... ముంబై ఇండియన్స్: రూ. 15 కోట్లు చెన్నై సూపర్కింగ్స్: రూ. 10 కోట్లు బెంగళూరు రాయల్చాలెంజర్స్: రూ. 5 కోట్లు రాజస్తాన్ రాయల్స్: రూ. 4 కోట్లు స్కోరు వివరాలు ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్ : సిమ్మన్స్ (సి) ధోని (బి) స్మిత్ 68; పార్థీవ్ రనౌట్ 0; రోహిత్ (సి) జడేజా (బి) బ్రేవో 50; పొలార్డ్ (సి) రైనా (బి) మోహిత్ 36; రాయుడు నాటౌట్ 36; హార్ధిక్ పాండ్యా (సి) రైనా (బి) బ్రేవో 0; హర్భజన్ నాటౌట్ 6; ఎక్స్ట్రాలు 6; మొత్తం: (20 ఓవర్లలో 5 వికెట్లకు) 202. వికెట్ల పతనం : 1-1; 2-120; 3-120; 4-191; 5-191. బౌలింగ్ : నెహ్రా 4-0-41-0; మోహిత్ 4-0-38-1; అశ్విన్ 2-0-21-0; జడేజా 2-0-26-0; నేగి 2-0-18-0; బ్రేవో 4-0-36-2; స్మిత్ 2-0-17-1. చెన్నై సూపర్కింగ్స్ ఇన్నింగ్స్ : స్మిత్ ఎల్బీడబ్ల్యు (బి) హర్భజన్ 57; హస్సీ (సి) సుచిత్ (బి) మెక్లీనగన్ 4; రైనా (స్టంప్) పార్థీవ్ (బి) హర్భజన్ 28; ధోని (బి) మలింగ 18; బ్రేవో (సి) సిమ్మన్స్ (బి) మెక్లీనగన్ 9; పవన్ నేగి (సి) హార్ధిక్ (బి) మలింగ 3; డు ప్లెసిస్ (సి) రోహిత్ (బి) వినయ్ 1; జడేజా నాటౌట్ 11; అశ్విన్ (సి) సుచిత్ (బి) మెక్లీనగన్ 2; మోహిత్ నాటౌట్ 21; ఎక్స్ట్రాలు 7; మొత్తం: (20 ఓవర్లలో 8 వికెట్లకు) 161. వికెట్ల పతనం : 1-22; 2-88; 3-99; 4-108; 5-124; 6-125; 7-134; 8-137. బౌలింగ్ : మలింగ 4-0-25-2; మెక్లీనగన్ 4-0-25-3: వినయ్ 4-0-39-1; హార్ధిక్ 4-0-36-0; హర్భజన్ 4-0-34-2 -
ఐపీఎల్ విజేత ముంబై
కోల్ కతా:ఐపీఎల్-8 ట్రోఫీని ముంబై ఇండియన్స్ కైవసం చేసుకుంది. చెన్నై సూపర్ కింగ్స్ తో ఆదివారం జరిగిన ఫైనల్ పోరులో ముంబై ఇండియన్స్ 41 పరుగుల తేడాతో విజయం సాధించి టైటిల్ ను చేజిక్కించుకుంది. 203 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై బ్యాటింగ్ లో తడబడి ఓటమి పాలైంది. చెన్నై ఆటగాళ్లలో డ్వేన్ స్మిత్(57)హాఫ్ సెంచరీ మినహా ఎవరూ చెప్పుకోదగ్గ స్కోరు చేయలేదు. మైక్ హస్సీ,(4), సురేష్ రైనా(28), బ్రేవో(9), మహేంద్ర సింగ్ ధోనీ(18) లు విఫలం చెందడంతో నిర్ణీత ఓవర్లలో8 వికెట్లు కోల్పోయి 161 పరుగులకే పరిమితమైన చెన్నై ఓటమి చెందింది. ఆద్యంతం ఏకపక్షంగా సాగిన కీలక పోరులో ఘనవిజయం సాధించిన ముంబై ఇండియన్స్ రెండో సారి ట్రోఫీని దక్కించుకోగా.. చెన్నై ఆరోసారి ఫైనల్లో చతికిలబడింది. ఇరు జట్లు మూడు సార్లు ఫైనల్లో తలపడగా.. ముంబై రెండు సార్లు పైచేయి సాధించింది. ముంబై బౌలర్లలో మెక్ లెనగాన్ మూడు, మలింగా, హర్భజన్ సింగ్ లు తలో రెండు వికెట్లు తీసి గెలుపులో కీలక పాత్ర పోషించారు. ముందు టాస్ గెలిచిన చెన్నై.. ముంబైను బ్యాటింగ్ ఆహ్వానించింది. దీంతో బ్యాటింగ్ చేపట్టిన ముంబై 20ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 202 పరుగులు చేసింది. పార్దీవ్ పటేల్ డకౌట్ రూపంలో ఆదిలో వెనుదిరిగినా.. కెప్టెన్ రోహిత్ శర్మ(50), సిమ్మన్స్(68) అద్భుతమైన ఆటతీరుతో ఆకట్టుకుని ముంబై భారీ స్కోరు చేయడంలో సహకరించారు. ఇరువురూ కలిసి రెండో వికెట్ కు 119 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. అయితే ఈ ఇద్దరు 120 పరుగుల వద్ద నిష్ర్కమించడంతో ముంబై స్కోరు కాస్త మందగించింది. అయితే మధ్యలో పొలార్డ్(36), అంబటి రాయుడు (36)పరుగులతో ఆకట్టుకున్నారు. -
చెన్నై విజయలక్ష్యం 203
కోల్ కతా: ఐపీఎల్-8 లో భాగంగా ఇక్కడ ఈడెన్ గార్డెన్ లో చెన్నై సూపర్ కింగ్స్ తో జరుగుతున్న ఫైనల్ పోరులో ముంబై ఇండియన్స్ 203 పరుగుల లక్ష్యాన్ని ప్రత్యర్థికి నిర్దేశించింది. పార్దీవ్ పటేల్ డకౌట్ రూపంలో ఆదిలో వెనుదిరిగినా.. కెప్టెన్ రోహిత్ శర్మ(50), సిమ్మన్స్(68) అద్భుతమైన ఆటతీరుతో ఆకట్టుకుని ముంబై భారీ స్కోరు చేయడంలో సహకరించారు. ఇరువురూ కలిసి రెండో వికెట్ కు 119 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. అయితే ఈ ఇద్దరు 120 పరుగుల వద్ద నిష్ర్కమించడంతో ముంబై స్కోరు కాస్త మందగించింది. అయితే మధ్యలో పొలార్డ్(36), అంబటి రాయుడు (36), హర్భజన్ సింగ్(6) పరుగులు చేయడంతో ముంబై నిర్ణీత ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 202 పరుగులు చేసింది. చెన్నై బౌలర్లలో బ్రేవోకు రెండు వికెట్లు లభించగా, డ్వేన్ స్మిత్ ,మోహిత్ శర్మ లకు తలో వికెట్ లభించింది. తొలుత టాస్ గెలిచిన చెన్నై.. ముంబై ఇండియన్స్ ను బ్యాటింగ్ కు ఆహ్వానించింది. -
ముంబై దూకుడు
కోల్ కతా: ఐపీఎల్-8 లో భాగంగా ఇక్కడ ఈడెన్ గార్డెన్ లో చెన్నై సూపర్ కింగ్స్ తో జరుగుతున్న ఫైనల్ పోరులో ముంబై ఇండియన్స్ దూకుడుగా బ్యాటింగ్ కొనసాగిస్తోంది. ఆదిలోనే పార్దీవ్ పటేల్ వికెట్ ను డకౌట్ రూపంలో కోల్పోయిన ముంబై బ్యాటింగ్ లో జోరును మాత్రం యథావిధిగా కొనసాగిస్తోంది. పది ఓవర్లు ముగిసే సరికి ముంబై ఇండియన్స్ వికెట్ నష్టానికి 98 పరుగులతో బ్యాటింగ్ కొనసాగిస్తోంది. ముంబై ఆటగాళ్లలో రోహిత్ శర్మ(39), సిమ్మన్స్ (56) లు వేగంగా స్కోరు బోర్డును ముందుకు పరుగులు పెట్టిస్తున్నారు. -
టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న చెన్నై
కోల్ కతా: ఐపీఎల్-8లో భాగంగా ముంబై ఇండియన్స్ తో జరుగుతున్న ఫైనల్ పోరులో చెన్నై సూపర్ కింగ్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. సంచలన విజయాలతో ఫైనల్ కు చేరిన ఇరు జట్లు తుదిపోరులో ఆమీతుమీ తేల్చుకోవడానికి సన్నద్ధమయ్యాయి. రెండు జట్ల బలబలాలను పరిశీలిస్తే చెన్నై కంటే ముంబై పటిష్టంగా ఉంది. కాగా, క్వాలిఫయర్ -2లో మైక్ హస్సీ బ్యాటింగ్ చలవతో బెంగళూర్ ను మట్టికరిపించి ఫైనల్ కు చేరిన చెన్నై ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతోంది. మరోవైపు క్వాలిఫయర్ -1లో చెన్నై ను ఓడించి ముంబై ఇండియన్స్ అదే ఫలితాన్ని పునరావృతం చేయాలని భావిస్తోంది. ఫైనల్ సమరానికి కోల్కతా ఈడెన్ గార్డెన్స్ వేదిక సిద్ధమైంది. ఈ రెండు జట్లు ఫైనల్లో రెండుసార్లు తలపడగా.. చెరోసారి విజయం సాధించాయి. ముంబై ఫైనల్ చేరిన ప్రతిసారీ చెన్నైతోనే తలపడింది. 2009లో ముంబైపై చెన్నై గెలవగా.. 2013లో చెన్నైపై ముంబై ఇండియన్స్ గెలిచింది. -
'డబుల్' కొడతారా.. 'రికార్డు' సృష్టిస్తారా?
హైదరాబాద్: ఐపీఎల్ -8లో భాగంగా ఆదివారం సాయంత్రం జరగబోయే ఫైనల్ మ్యాచ్లో ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్తో తలపడనుంది. ఈ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ గెలిస్తే.. ఐపీఎల్ లో రెండో టైటిల్ సాధించిన జట్ల సరసన చేరుతుంది. చెన్నై సూపర్ కింగ్స్ గెలిస్తే.. ఐపీఎల్ చరిత్రలో మూడుసార్లు చాంపియన్ గా నిలిచిన జట్టుగా సరికొత్త రికార్డు సృష్టించనుంది. ఫైనల్ సమరానికి కోల్కతా ఈడెన్ గార్డెన్స్ వేదిక సిద్ధమైంది. ఈ రెండు జట్లు ఫైనల్లో రెండుసార్లు తలపడగా.. చెరోసారి విజయం సాధించాయి. ముంబై ఫైనల్ చేరిన ప్రతిసారీ చెన్నైతోనే తలపడింది. 2010లో ముంబైపై చెన్నై గెలవగా.. 2013లో చెన్నైపై ముంబై ఇండియన్స్ గెలిచింది. తాజాగా మూడోసారి ఫైనల్లో అమీతుమీ తేల్చుకోనున్నాయి. మరోవైపు చెన్నై మాత్రం ఆరుసార్లు ఫైనల్ చేరగా.. మూడుసార్లు ముంబైతో (నేటి మ్యాచ్ కలిపి).. రాజస్థాన్ రాయల్స్, కోల్ కతా నైట్ రైడర్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్లతో ఒక్కోసారి తలపడింది. బలాబలాలు: ఈ సీజన్లో ఇప్పటిదాకా ముంబై ఇండియన్స్ అద్భుతమైన ఫామ్ కనబరుస్తోంది. ఆల్ రౌండర్ కీరన్ పొలార్డ్తో పాటు ఓపెనర్లు పార్థివ్ పటేల్, సిమ్మన్స్.. అదే విధంగా కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాటింగ్లో రాణిస్తున్నారు. మరోవైపు బంతితో లసిత్ మలింగ, హర్భజన్ సింగ్ ముంబై విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. చెన్నై జట్టులో ఓపెనర్ మెక్ కల్లమ్ లేకపోవటం ఆ జట్టుకు లోటు. మెక్ కల్లమ్ స్థానంలో జట్టులోకి వచ్చిన మైక్ హస్సీ కూడా బ్యాటింగ్లో అదరగొడుతున్నాడు. అంతేకాకుండా డ్వేన్ స్మిత్, డుప్లెసిస్, ఎంఎస్ ధోని, రైనా బ్యాటింగ్లో ఆకట్టుకుంటుండగా.. పవన్ నేగి, డ్వేన్ బ్రేవో తమ ఆల్ రౌండ్ ప్రదర్శనతో జట్టుకు విజయాన్ని అందిస్తున్నారు. బౌలింగ్ విషయంలో చెన్నై కాస్త బలహీనమే అని చెప్పాలి. పేసర్ అశిష్ నెహ్రాతో పాటు ఆల్ రౌండర్ బ్రేవో మాత్రమే రాణిస్తున్నారు. -
IPLని కుదిపేసిన ఫిక్సింగ్,సెక్స్స్కాండల్స్
-
క్లైమాక్స్కు రంగం సిద్ధం
-
వయసైపోయింది కదా...
ఈ ఏడాది ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్ ఆశిష్ నెహ్రా అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు. ఇప్పటికే 22 వికెట్లతో ధోనిసేన ఫైనల్కు చేరడంలో కీలక పాత్ర పోషించాడు. ఇంత అద్భుతంగా ఎలా బౌలింగ్ చేస్తున్నారని అడిగితే నెహ్రా కాస్త భిన్నంగా స్పందించాడు. ‘నేను గత 10 సంవత్సరాలుగా నిలకడగానే ఆడుతున్నాను. ఐపీఎల్లో అవకాశం లభించిన ప్రతి సీజన్లోనూ రాణించాను. కానీ ఎవరూ గుర్తించలేదు. ఇప్పుడు నా వయసు 36 సంవత్సరాలు. వయసైపోయిన వ్యక్తి వికెట్లు తీస్తున్నాడని ఇప్పుడు నన్ను గుర్తిస్తున్నారనుకుంటా’ అని అన్నాడు. -
క్లైమాక్స్కు రంగం సిద్ధం
►నేడు ఐపీఎల్ ఫైనల్ ►ముంబై ఇండియన్స్తో చెన్నై సూపర్ కింగ్స్ ఢీ ►ఫామ్లో రోహిత్ సేన ఆత్మవిశ్వాసంతో ధోని బృందం హోరాహోరీ పోరాటాలు... ఉత్కంఠభరిత మ్యాచ్లు... బౌండరీల హోరు, సిక్సర్ల జోరు... కళ్లుచెదిరే క్యాచ్లు... 47 రోజుల పాటు అభిమానులను ఉర్రూతలూగించిన టి20 వినోదానికి నేటితో తెరపడనుంది. ఈడెన్గార్డెన్స్లో భారీ క్లైమాక్స్కు రంగం సిద్ధమైంది. లీగ్ చరిత్రలోనే రెండు హై ప్రొఫైల్ జట్లు టైటిల్ కోసం తలపడుతున్నాయి. ఎనిమిదో సీజన్ ఐపీఎల్ ఫైనల్లో చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. కోల్కతా : మరోసారి ఆధిపత్య పోరుకు రంగం సిద్ధమైంది. ముంబై, చెన్నై జట్లు ఐపీఎల్లో ఎప్పుడు, ఎక్కడ మ్యాచ్ ఆడినా అది అభిమానులకు కన్నుల పండగే. ఇక అది ఫైనల్ అయితే ఆ ఉత్సాహమే వేరు. ఈ సీజన్లో ఇప్పటికే మూడుసార్లు తలపడిన ఈ రెండు జట్లు ఈసారి అన్నింటికంటే పెద్ద మ్యాచ్కు సిద్ధమయ్యాయి. చారిత్రక ఈడెన్గార్డెన్స్లో ఆదివారం జరిగే ఐపీఎల్ ఫైనల్లో ముంబై ఇండియన్స్తో చెన్నై సూపర్ కింగ్స్ తలపడనుంది. 2013లో ఇదే వేదికపై జరిగిన ఐపీఎల్-6 ఫైనల్లో ముంబై జట్టు చెన్నైపై గెలిచింది. ఈసారి లీగ్ దశలో తొలి ఆరు మ్యాచ్ల్లో ఐదు ఓడిపోయి... ప్రతి మ్యాచ్లోనూ చావోరేవో తరహాలో ఆడి... ఆఖరి లీగ్ మ్యాచ్లో విజయంతో ప్లేఆఫ్కు చేరింది ముంబై జట్టు. క్వాలిఫయర్-1లో చెన్నైని అలవోకగా ఓడించి నాలుగు రోజుల విశ్రాంతితో తాజాగా బరిలోకి దిగుతోంది. అటు చెన్నై జట్టు మిగిలిన అన్ని జట్ల కంటే ముందే ప్లే ఆఫ్కు చేరినా... ముంబై చేతిలో ఓటమితో కంగుతింది. కానీ భీకరమైన ఫామ్లో ఉన్న బెంగళూరును క్వాలిఫయర్-2లో ఓడించి మరోసారి ముంబైకి సవాల్ విసురుతోంది. ఎవరు గెలిచినా ఈ మ్యాచ్ ఆసక్తికరంగా సాగడం మాత్రం ఖాయం. అన్ని విభాగాల్లో ఫామ్లో... ముంబై ఇండియన్స్ జట్టు అన్ని విభాగాల్లోనూ భీకరమైన ఫామ్లో ఉంది. ముఖ్యంగా ఓపెనర్లు సిమ్మన్స్, పార్థీవ్ పటేల్ సంచలన ఆటతీరుతో జట్టుకు అద్భుతమైన భాగస్వామ్యాలు అందిస్తున్నారు. లీగ్ ఆరంభ దశలో బాగా ఆడిన రోహిత్ శర్మ ఆ తర్వాత కాస్త తడబడ్డాడు. అయితే ఈడెన్ అతనికి బాగా కలిసొచ్చిన మైదానం. ఇక్కడే కెప్టెన్గా తొలిసారి 2013లో ఐపీఎల్ టైటిల్ అందుకున్నాడు. అలాగే వన్డేల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరునూ ఇక్కడే నమోదు చేశాడు. ఈ ఏడాది ఆరంభ మ్యాచ్లో కోల్కతాపై అద్భుతంగా ఆడి సెంచరీకి చేరువలో ఆగాడు. కాబట్టి ఈ వేదికపై రోహిత్ ఆత్మవిశ్వాసంతో ఆడటం ఖాయం. అంబటి రాయుడు, యువ సంచలనం హార్దిక్ పాండ్యలతో పాటు పొలార్డ్ కూడా చెలరేగితే ముంబై భారీ స్కోరు సాధించడం ఖాయం. ఇక బౌలింగ్లో మెక్లీనగన్, మలింగ ఇద్దరూ అద్భుతంగా రాణిస్తున్నారు. గత సీజన్లో కోల్కతా తరఫున ఆడిన వినయ్ కుమార్ ఈసారి ముంబై తరఫున తన ఈడెన్ అనుభవాన్ని ఉపయోగించనున్నాడు. స్పిన్నర్ హర్భజన్ భారత జట్టులో పునరాగమనంతో రెట్టించిన ఉత్సాహంతో ఉన్నాడు. లెఫ్టార్మ్ స్పిన్నర్ సుచిత్ కూడా టోర్నీలో గణనీయమైన ప్రభావం చూపించాడు. మొత్తం మీద ముంబై జట్టు అన్ని విభాగాల్లో సమతూకంతో, మంచి ఫామ్లో ఉంది. రైనా, స్మిత్ రాణించాలి చెన్నై సీజన్లో నిలక డగా విజయాలు సాధించడానికి కారణం ఓపెనర్లు. మెకల్లమ్, డ్వేన్ స్మిత్ల సంచలన ఆరంభాలు ఆ జట్టును విజయాల బాటలో నడిపించాయి. అయితే మెకల్లమ్ వెళ్లిపోయాక ఆ లోటు కనపడకుండా మైక్ హస్సీ తన అనుభవాన్ని ఉపయోగించి ఆడుతున్నాడు. కానీ డ్వేన్ స్మిత్ ఫామ్ కోల్పోవడం చెన్నైని ఆందోళనలో పడేస్తోంది. ఇక సురేశ్ రైనా కూడా ఈ సీజన్లో ఒక్కసారి కూడా తన మార్క్ ఇన్నింగ్స్ ఆడలేదు. రైనా, స్మిత్ గాడిలో పడితే మాత్రం ఎలాంటి ప్రత్యర్థి అయినా భయపడాల్సిందే. డుప్లెసిస్తో పాటు ఆల్రౌండర్లు బ్రేవో, జడేజా, పవన్ నేగి కూడా రాణించాల్సి ఉంది. కెప్టెన్ ధోని ఫామ్ గురించి ఆందోళన లేదు. అయితే ఈ సీజన్లో ఇప్పటివరకూ చెన్నై మిడిలార్డర్ ఆకట్టుకోలేకపోయింది. చావోరేవో తేల్చుకోవాల్సిన ఈ మ్యాచ్లో అయినా మిడిలార్డర్ గాడిలో పడాలి. ఇక బౌలింగ్లో నెహ్రా, డ్వేన్ బ్రేవో ఇద్దరూ పోటాపోటీగా వికెట్లు తీస్తున్నారు. మోహిత్ శర్మ, అశ్విన్ల నుంచి వీరికి కావలసిన సహకారం లభిస్తోంది. జడేజా, నేగి కలిసి ఐదో బౌలర్ కోటాను పూర్తి చేస్తున్నారు. ముఖ్యంగా డెత్ ఓవర్లలో డ్వేన్ బ్రేవో బౌలింగ్ కీలకం. ధోని వ్యూహాలతో ఫామ్లో ఉన్న బెంగళూరును ఓడించి ఫైనల్కు చేరిన చెన్నై... మరోసారి తమ కెప్టెన్ వ్యూహాలపై నమ్మకంతో ఆత్మవిశ్వాసంతోనే ఫైనల్ ఆడబోతోంది. జట్లు(అంచనా) చెన్నై సూపర్ కింగ్స్ : ధోని (కెప్టెన్), డ్వేన్ స్మిత్, మైక్ హస్సీ, సురేశ్ రైనా, డుప్లెసిస్, డ్వేన్ బ్రేవో, రవీంద్ర జడేజా, పవన్ నేగి, అశ్విన్, ఆశిష్ నెహ్రా, మోహిత్ శర్మ. ముంబై ఇండియన్స్ : రోహిత్ శర్మ (కెప్టెన్), సిమ్మన్స్, పార్థీవ్ పటేల్, అంబటి రాయుడు, పొలార్డ్, హార్దిక్ పాండ్య, సుచిత్, హర్భజన్ సింగ్, వినయ్ కుమార్, మెక్లీనగన్, లసిత్ మలింగ. ఆసక్తికర సమరం సహజంగానే ఈడెన్ గార్డెన్స్ పిచ్ స్పిన్కు సహకరిస్తుంది. అందుకే ఈ సీజన్లో కోల్కతా తమ జట్టును స్పిన్నర్లతో నింపేసింది. ఫైనల్ కోసం కొత్త ట్రాక్ను వినియోగిస్తున్నామని, దీనిపై బౌన్స్ కూడా బాగానే ఉంటుందని క్యూరేటర్ చెబుతున్నారు. కాబటి ఆఫ్ స్పిన్నర్లు అశ్విన్, హర్భజన్ ఇద్దరూ చాలా కీలకం. ఇద్దరూ బంగ్లాదేశ్ వెళ్లే టెస్టు జట్టులో ఉన్నారు. కాబట్టి ఈ మ్యాచ్లో బాగా రాణించిన వాళ్లు తుది జట్టులో కచ్చితంగా ఉంటారు. 3 ముంబై రెండుసార్లు ఫైనల్కు చేరి ఒక్కసారి టైటిల్ గెలిచింది. రెండుసార్లు కూడా చెన్నైతోనే ఫైనల్లో ఆడింది. 2010లో చెన్నై చేతిలో 22 పరుగులతో ఓడి, 2013లో 23 పరుగులతో గెలిచింది. మూడోసారి కూడా ఫైనల్ చెన్నైతోనే ఆడబోతోంది. 6 చెన్నై జట్టు ఫైనల్కు చేరడం ఇది ఆరోసారి. గతంలో ఫైనల్కు చేరిన ఐదుసార్లలో రెండు సార్లు ధోనిసేన టైటిల్ గెలిచింది. -
ధోనీ నాయకత్వమే..
కోల్ కతా: ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ సక్సెక్ కు మహేంద్ర సింగ్ ధోనీ నాయకత్వమే కారణమని సహచర ఆటగాడు సురేష్ రైనా అభిప్రాయపడ్డాడు. గత ఎనిమిది ఎడిషన్లలో చెన్నై నిలకడగా ఆడటం వెనుక ధోనీదే ప్రధాన భూమిక అని స్పష్టం చేశాడు. శుక్రవారం బెంగళూర్ రాయల్ చాలెంజర్స్ పై చెన్నై మూడు వికెట్ల తేడాతో గెలిచి ఫైనల్ కు చేరిన అనంతరం ధోనీపై రైనా ప్రశంసల వర్షం కురిపించాడు. 'ధోనీ నిలకడైన కెప్టెన్. ఆ కెప్టెన్ చెన్నై కు ఉండటం అదృష్టం. ఎనిమిది ఐపీఎల్ సీజన్ లలో ఆరుసార్లు ఫైనల్ కు వెళ్లడమే ఇందుకు ఉదాహరణ' అని రైనా తెలిపాడు. అయితే మరోసారి ముంబై ఇండియన్స్ తో తుదిపోరుకు సిద్ధమవుతున్నట్లు రైనా తెలిపాడు. 2013లో ముంబై ఇండియన్స్ తో జరిగిన ఫైనల్ మ్యాచ్ ను చేజార్చుకున్న సంగతి ఇంకా తమ మదిలో ఉందని రైనా తెలిపాడు. -
ఆటగాళ్ల గదుల్లో అమ్మాయిలు
►2014 ఐపీఎల్లో ఇద్దరు చెన్నై క్రికెటర్ల నిర్వాకం ►యథేచ్ఛగా నిబంధనల ఉల్లంఘన ►పార్టీలతో ఓనర్ల సరదా గతేడాది ఐపీఎల్ చాలా ‘జాగ్రత్తగా’ జరిగింది. 2013లో స్పాట్ ఫిక్సింగ్ ఉదంతం నేపథ్యంలో 2014 సీజన్లో టోర్నీ నిర్వహణ కోసం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. టోర్నీ నిర్వహణ బాధ్యత గవాస్కర్కు అప్పగించారు. అడుగడుగునా అవినీతి నిరోధక అధికారులను ఏర్పాటు చేశారు. అయినా క్రికెటర్లు వీటిని లెక్కచేయలేదు. యథేచ్ఛగా నిబంధనలను ఉల్లంఘించారు. ఇద్దరు చెన్నై క్రికెటర్లు తమ గదుల్లో అమ్మాయిలతో రాత్రంతా గడిపారు. అటు యజమానులు కూడా క్రికెటర్లను పార్టీల పేరుతో బయటివాళ్లను కలవనిచ్చారు. గత సీజన్లో జరిగిన ఇలాంటి సంఘటనల గురించిన వివరాలు తాజాగా బయటకొచ్చాయి. ముంబై : గత ఏడాది ఐపీఎల్ (2014) పూర్తిగా విజయవంతమైందని, ఆట తప్ప మరో అంశం గురించి ఎక్కడా చర్చే జరగలేదని లీగ్ నిర్వాహకులు గర్వంగా చెప్పుకున్నారు. అయితే ఐపీఎల్నుంచి వివాదాలను దూరంగా ఉంచడం అంత సులువు కాదని గతేడాది జరిగిన కొన్ని ఘటనలు రుజువు చేశాయి. కోర్టు ఆదేశాల కారణంగా దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ నేతృత్వంలో ఐపీఎల్-7 జరిగింది. కానీ మైదానం బయటి సంఘటనలు మాత్రం ఆయన దృష్టికి చేరినట్లు లేదు. పార్టీలు కావచ్చు లేదా హోటల్ గదిలో సరసాలు కావచ్చు లేదా ఆటగాళ్ల చుట్టూ ఏజెంట్ల హల్చల్ కావచ్చు... ఇలాంటి పలు ఘటనలను బీసీసీఐ అవినీతి నిరోధక భద్రతా బృందం(ఏసీఎస్యూ) గుర్తించింది. ఈ వివరాలతో ఏసీఎస్యూ చీఫ్ రవి సవాని, బీసీసీఐకి లేఖ రాశారు. అడుగడుగునా సాగిన నిబంధనల ఉల్లంఘనను గుర్తు చేస్తూ సవాని గత ఐపీఎల్ సమయంలోనే పంపిన మెయిల్ ఇప్పుడు బయటకొచ్చింది. గత ఏడాది ఐపీఎల్ అవినీతిపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్న సమయంలోనే ఇవి చోటు చేసుకున్నాయి. అయితే దీనిపై ఏసీఎస్యూ ఆయా ఫ్రాంచైజీల వివరణ కోరిందని, దాంతో తాము సంతృప్తి చెందినట్లు కూడా బోర్డు ప్రకటించడం విశేషం! ఈ ఘటనల గురించి పంపిన మెయిల్పై పంజాబ్, ఢిల్లీ యాజమాన్యాలు వివరణ ఇవ్వగా, కోల్కతా, చెన్నై, హైదరాబాద్ యాజమాన్యాలు మాత్రం స్పందించలేదు. పంజాబ్ జట్టు సభ్యుల కోసం యజమాని ప్రీతి జింటా ముంబై సముద్ర తీరంనుంచి 2 కిలోమీటర్ల ఆవల పడవలో పార్టీ ఇచ్చింది. ఆమె మిత్రులు కొంత మంది దీనిని ఏర్పాటు చేశారు. అయితే 2013లో బెట్టింగ్కు సంబంధించి ఏసీఎస్యూ విచారించిన జాబితాలో ఉన్నవారే ఈ పార్టీ ఇవ్వడం గమనార్హం. కోల్కతా జట్టు కోసం షారుఖ్ ఖాన్ మిత్రులు కొందరు పార్టీ ఇచ్చారు. ఇది కూడా నిబంధనలకు విరుద్ధం. ఢిల్లీ జట్టు స్పాన్సరర్ ఒకరు టీమ్ కోసం ఇచ్చిన పార్టీలో 100 మందికి పైగా బయటి వ్యక్తులు హాజరై ఆటగాళ్లతో ఆత్మీయంగా కలిసిపోయారు. దీనిపై ముందుగా ఎలాంటి సమాచారం ఇవ్వని ఢిల్లీ... అతిథుల జాబితా కూడా ఇవ్వలేదు. ముంబైలోని ఒక హోటల్లో చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడితో ఒక అమ్మాయి రాత్రి 10 గంటలనుంచి ఉదయం 6 గంటల వరకు గడిపింది. విచారిస్తే ‘ఆమె నాకు మంచి స్నేహితురాలు’ అని మాత్రమే సదరు ఆటగాడు చెప్పాడు. చెన్నై సూపర్ కింగ్స్కే చెందిన మరో క్రికెటర్తో కూడా మరో అమ్మాయి ఇలాగే రాత్రినుంచి ఉదయం వరకు అతని గదిలోనే ఉంది. దీనిపై ప్రశ్నకు...‘ఆమె తనకు బాగా సన్నిహితురాలని, త్వరలోనే పెళ్లి చేసుకుంటున్నామని’ ఆ ఆటగాడు చెప్పాడు. అయితే గతంలోనూ ఆ అమ్మాయి శ్రీశాంత్ సహా పలువురు ఐపీఎల్ క్రికెటర్లతో సన్నిహితంగా మెలిగినట్లు, 2013లో ఆమెకు అక్రిడిటేషన్ కార్డు కూడా దక్కినట్లు ఏసీఎస్యూ విచారణలో వెల్లడైంది. ఇద్దరు సన్రైజర్స్ ఆటగాళ్లు ఏ నగరంలో ఉన్నా... వారి హోటల్ గదుల్లోకి వచ్చే సందర్శకుల సంఖ్య చాలా ఎక్కువగా ఉండేది. పంజాబ్ జట్టులోని ఒక సీనియర్ విదేశీ ఆటగాడి మిత్రుడు అతనితో పాటు గదిలో ఉన్నాడు. జట్టు ప్రాక్టీస్ సెషన్లలో తరచుగా కనిపించిన అతను టీమ్ బస్సులో కూడా ప్రయాణించాడు. ప్లేయర్ ఏజెంట్లు ఆటగాళ్ల హోటల్లోనే ఉంటూ నిబంధనలు ఉల్లంఘించారు. రక్త సంబంధీకులు/భార్య మినహా మరెవరూ అదే హోటల్లో బస చేయరాదు. కొంతమంది ఆటగాళ్లు మ్యాచ్ కోసం తమ సొంత నగరాలకు వచ్చినప్పుడు రాత్రికి తమ ఇళ్లకు వెళ్లిపోయేవారు. దీని వల్ల వారు బయట ఏం చేస్తున్నారో నిఘా పెట్టడం ఏసీఎస్యూకు సాధ్యం కాలేదు. -
ఫైనల్లో చెన్నై
-
కాచుకో... ముంబై
►ఐపీఎల్ ఫైనల్లో చెన్నై సూపర్కింగ్స్ ►నెహ్రా సూపర్ బౌలింగ్ ►క్వాలిఫయర్-2లో బెంగళూరుపై విజయం ►ఫైనల్లో రేపు ముంబై ఇండియన్స్తో ధోని సేన అమీతుమీ ధోని వ్యూహాల ముందు కోహ్లి దూకుడు పనిచేయలేదు. బెంగళూరు భారీ హిట్టర్లంతా... చెన్నై బౌలర్ల క్రమశిక్షణకు చేష్టలుడిగారు. గేల్, కోహ్లి, డివిలియర్స్ త్రయం కీలక మ్యాచ్లో విఫలం కావడంతో... క్వాలిఫయర్-2లో చెన్నై గెలిచింది. ఉత్కంఠగా సాగిన మ్యాచ్లో ధోనిసేన కాస్త తడబడ్డా నిలబడింది. రాయల్ చాలెంజర్స్పై నెగ్గిన సూపర్ కింగ్స్... ఇక ముంబై ఇండియన్స్తో రేపు జరిగే ఫైనల్లో అమీతుమీ తేల్చుకోనుంది. రాంచీ : మొదట్లో... ఆఖర్లో కాస్త తడబడినా... మైక్ హస్సీ (46 బంతుల్లో 56; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), ధోని (29 బంతుల్లో 26; 1 ఫోర్)ల సమయోచిత బ్యాటింగ్తో చెన్నై సూపర్కింగ్స్ ఐపీఎల్ ఫైనల్కు చేరింది. పటిష్టమైన బెంగళూరుకు పగ్గాలు వేసి ముంబైతో అమీతుమీకి సిద్ధమైంది. బ్యాటింగ్ వైఫల్యంతో ఇబ్బందులు ఎదుర్కొన్న కోహ్లిసేన కీలక మ్యాచ్లో తడబడింది. దీంతో శుక్రవారం జరిగిన మ్యాచ్లో చెన్నై 3 వికెట్ల తేడాతో బెంగళూరుపై నెగ్గింది. ఫలితంగా ఎనిమిది సీజన్లలో ఆరోసారి ఫైనల్కు చేరుకుంది. జేఎస్సీఏ అంతర్జాతీయ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో... మొదట బెంగళూరు 20 ఓవర్లలో 8 వికెట్లకు 139 పరుగులు చేసింది. గేల్ (43 బంతుల్లో 41; 2 ఫోర్లు, 3 సిక్సర్లు), సర్ఫరాజ్ (21 బంతుల్లో 31; 4 ఫోర్లు), దినేశ్ కార్తీక్ (26 బంతుల్లో 28; 4 ఫోర్లు) రాణించారు. తర్వాత చెన్నై 19.5 ఓవర్లలో 7 వికెట్లకు 140 పరుగులు చేసి నెగ్గింది. నెహ్రాకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ఒకే ఓవర్లో కోహ్లి, డివిలియర్స్... టాస్ గెలిచి ధోని బౌలింగ్ తీసుకున్నాడు. అయితే తొలి మూడు ఓవర్లలో ఓపెనర్లు గేల్, కోహ్లి (9 బంతుల్లో 12; 1 ఫోర్, 1 సిక్స్) వేగం గా పరుగులు చేశారు. కానీ ఐదో ఓవర్లో నెహ్రా... కోహ్లితో పాటు డివిలియర్స్ (1)నూ అవుట్ చేయడంతో ఆర్సీబీ ఇన్నింగ్స్ తడబడింది. దీంతో పవర్ప్లేలో బెంగళూరు 2 వికెట్లకు 29 పరుగులతోనే సరిపెట్టుకుంది. మన్దీప్ (4) నిరాశపర్చినా...గేల్, దినేశ్ కార్తీక్తో కలిసి ఇన్నింగ్స్ను నిలబెట్టే ప్రయత్నం చేశాడు. రైనా వేసిన 14వ ఓవర్లో రెండు భారీ సిక్సర్లు కొట్టిన ఈ కరీబియన్ స్టార్ నాలుగో వికెట్కు కార్తీక్తో 44 పరుగులు జోడించి అవుటయ్యాడు. తర్వాత సర్ఫరాజ్ వేగంగా ఆడినా.. రెండో ఎండ్లో వరుస విరామాల్లో కార్తీక్, వీస్ (12), హర్షల్ పటేల్ (2)లు అవుటయ్యారు. కార్తీక్, సర్ఫరాజ్లు ఐదో వికెట్కు 27 పరుగులు జోడించారు. తొలి 10 ఓవర్లలో 46 పరుగులు చేసిన బెంగళూరు చివరి 10 ఓవర్లలో 93 పరుగులు చేసింది. నెహ్రా మూడు వికెట్లు తీశాడు. హస్సీ యాంకర్ పాత్ర ఓపెనర్లలో స్మిత్ (12 బంతుల్లో 17; 3 ఫోర్లు) తొందరగా అవుటైనా... హస్సీ నిలకడగా ఆడాడు. వన్డౌన్లో డుప్లెసిస్తో కలిసి ఇన్నింగ్స్ను క్రమంగా నిర్మించాడు. ఈ ఇద్దరు రెండో వికెట్కు 40 పరుగులు జోడించాకా... స్పిన్నర్ చాహల్ చెన్నైని దెబ్బతీశాడు. మూడు బంతుల తేడాలో డు ప్లెసిస్, రైనా (0)ను అవుట్ చేశాడు. దీంతో తొలి 10 ఓవర్లలో సూపర్కింగ్స్ 3 వికెట్లకు 62 పరుగులు చేసింది. అయితే హస్సీతో జతకలిసిన కెప్టెన్ ధోని సమయోచిత ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నాడు. స్ట్రయిక్ను రొటేట్ చేస్తూ అవసరమైనప్పుడు భారీ షాట్లు ఆడారు. చివరి ఐదు ఓవర్లలో 49 పరుగులు చేయాల్సిన దశలో హస్సీ రెండు భారీ సిక్సర్లు కొట్టి అవుటయ్యాడు. ఈ ఇద్దరు నాలుగో వికెట్కు 47 పరుగులు జోడించారు. తర్వాత నేగి (12) కూడా చెలరేగి ఆడాడు. అయితే 12 బంతుల్లో 13 పరుగులు చేయాల్సిన దశలో వరుస బంతుల్లో నేగి, బ్రేవో (0) అవుటయ్యారు. ఇక 6 బంతుల్లో 5 పరుగులు కావాల్సిన సమయంలో ధోని నాలుగు పరుగులు చేసి అవుటైనా... అశ్విన్ (1 నాటౌట్) విజయాన్ని పూర్తి చేశాడు. చాహల్ 2 వికెట్లు తీశాడు. స్కోరు వివరాలు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్ : గేల్ (సి అండ్ బి) రైనా 41; కోహ్లి (సి) మోహిత్ (బి) నెహ్రా 12; డివిలియర్స్ ఎల్బీడబ్ల్యు (బి) నెహ్రా 1; మన్దీప్ (సి) హస్సీ (బి) అశ్విన్ 4; దినేశ్ కార్తీక్ (సి) మోహిత్ (బి) నెహ్రా 28; సర్ఫరాజ్ (సి) నేగి (బి) బ్రేవో 31; వీస్ (సి) బ్రేవో (బి) మోహిత్ 12; హర్షల్ రనౌట్ 2; స్టార్క్ నాటౌట్ 1; శ్రీనాథ్ అరవింద్ నాటౌట్ 0; ఎక్స్ట్రాలు 7; మొత్తం: (20 ఓవర్లలో 8 వికెట్లకు) 139. వికెట్ల పతనం : 1-23; 2-25; 3-36; 4-80; 5-107; 6-125; 7-138; 8-139. బౌలింగ్ : నెహ్రా 4-0-28-3; అశ్విన్ 4-0-13-1; మోహిత్ 4-0-22-1; రైనా 3-0-36-1; బ్రేవో 3-0-21-1; నేగి 1-0-4-0; జడేజా 1-0-13-0. చెన్నై సూపర్కింగ్స్ ఇన్నింగ్స్ : స్మిత్ (సి) స్టార్క్ (బి) అరవింద్ 17; హస్సీ (సి) పటేల్ (బి) వీస్ 56; డు ప్లెసిస్ (బి) చాహల్ 21; రైనా (సి) వీస్ (బి) చాహల్ 0; ధోని (సి) కార్తీక్ (బి) పటేల్ 26; నేగి రనౌట్ 12; బ్రేవో (బి) స్టార్క్ 0; జడేజా నాటౌట్ 0; అశ్విన్ నాటౌట్ 1; ఎక్స్ట్రాలు 7; మొత్తం: (19.5 ఓవర్లలో 7 వికెట్లకు) 140. వికెట్ల పతనం : 1-21; 2-61; 3-61; 4-108; 5-135; 6-135; 7-139. బౌలింగ్ : స్టార్క్ 4-0-27-1; అరవింద్ 4-0-25-1; హర్షల్ పటేల్ 3.5-0-26-1; వీస్ 4-0-30-1; చాహల్ 4-0-28-2. -
ప్రభుత్వం అనుమతిస్తేనే...
భారత ప్రభుత్వం అనుమతిస్తేనే పాకిస్తాన్తో క్రికెట్ సిరీస్ పునరుద్ధరిస్తామని ఐపీఎల్ చైర్మన్ రాజీవ్ శుక్లా చెప్పారు. పాక్ బోర్డుతో పరిష్కరించుకోవాల్సిన అంశాలు కూడా చాలా ఉన్నందున ఇప్పట్లో సిరీస్ జరగడం కష్టమేనని చెప్పారు. -
ఫైనల్లో చెన్నై
రాంచీ:ఇద్దరు టీమిండియా కెప్టెన్ల మధ్య జరిగిన ఉత్కంఠ పోరులో విరాట్ కోహ్లీపై మహేంద్ర సింగ్ ధోనీ పైచేయి సాధించాడు.ఐపీఎల్-8లో భాగంగా ఇక్కడ బెంగళూర్ రాయల్ చాలెంజర్స్ తో జరిగిన క్వాలిఫయర్-2లో చెన్నై సూపర్ కింగ్స్ మూడు వికెట్ల తేడాతో విజయం సాధించి ఫైనల్ కు చేరింది. బెంగళూర్ నిర్దేశించిన 140 పరుగుల విజయలక్ష్యాన్ని ఒక బంతి మాత్రమే మిగిలి ఉండగానే మాత్రమే ఛేదించిన చెన్నై.. ముంబై ఇండియన్స్ తో తుదిపోరుకు సిద్ధమైంది. స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై 61పరుగులకే మూడు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. డ్వేన్ స్మిత్(17),డుప్లెసిస్(21),సురేష్ రైనా(0) పెవిలియన్ కు చేరి చెన్నైను ఆందోళనకు గురిచేశారు. ఆ తరుణంలో మైక్ హస్సీ చూడచక్కని ఆటతో ఆకట్టుకున్నాడు. గత మ్యాచ్ ల్లో విఫలమై అనేక విమర్శలు ఎదుర్కొన్న హస్సీ కీలక సమయంలో ఫామ్ లో కి వచ్చి జట్టు విజయంలో సహకరించాడు. హస్సీ(46 బంతుల్లో 56;రెండు సిక్సర్లు, మూడు ఫోర్లు) చెలరేగి ఆడి నాల్గో వికెట్ రూపంలో వెనుదిరిగాడు. అప్పటికే చెన్నై దాదాపు ఖరారైంది. అయితే చివర్లో నేగీ(11), ధోనీ(26)లు వరుసగా పెవిలియన్ కు చేరి మరోసారి ఆందోళనకు గురి చేశారు. ఇంకా రెండు బంతుల్లో ఒక పరుగు చేయాల్సిన సమయంలో ధోనీ పెవిలియన్ చేరినా.. అశ్విన్ ఇన్నింగ్స్ ముగింపు షాట్ ను కొట్టి చెన్నై ఫైనల్ కు చేర్చాడు. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన బెంగళూర్ రాయల్ చాలెంజర్స్ 140 పరుగుల విజయలక్ష్యాన్ని ప్రత్యర్థికి నిర్దేశించింది. కెప్టెన్ విరాట్ కోహ్లీ(12) , ఏబీ డివిలియర్స్ (1) వెనువెంటనే వికెట్లను చేజార్చుకుని బెంగళూర్ ను ఆదిలోనే కష్టాల్లో నెట్టారు. అటుతరువాత బెంగళూర్ 36 పరుగుల వద్ద ఉండగా మన్ దీప్(4)ను కూడా నష్టపోవడంతో జట్టు స్కోరు మందగించింది. అయితే క్రిస్ గేల్ కాసేపు మెరుపులు మెరిపించడంతో బెంగళూర్ మధ్యలో పుంజుకుంది.గేల్(41) బ్యాట్ వేగం పెంచే క్రమంలో రైనా బౌలింగ్ లో పెవిలియన్ కు చేరాడు. ఆ తరువాత దినేష్ కార్తీక్ కు జతకలిసిన సర్ఫరాజ్ ఇన్నింగ్స్ ను మరమ్మత్తులు చేశాడు. కాగా, దినేశ్ కార్తీక్ (28) భారీ షాట్ కు యత్నించి నెహ్రా బౌలింగ్ లో అవుటైయ్యాడు. ఆ తరుణంలో సర్ఫరాజ్(31) ఆదుకోవడంతో బెంగళూర్ నిర్ణీత ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 139 పరుగులు చేసింది. -
చెన్నై విజయలక్ష్యం 140
రాంచీ: ఐపీఎల్-8లో భాగంగా ఇక్కడ చెన్నై సూపర్ కింగ్స్ తో జరుగుతున్న క్వాలిఫయర్ -2 మ్యాచ్ లో బెంగళూర్ రాయల్ చాలెంజర్స్ 140 పరుగుల విజయలక్ష్యాన్ని ప్రత్యర్థికి నిర్దేశించింది. టాస్ గెలిచిన చెన్నై తొలుత బెంగళూర్ ను బ్యాటింగ్ కు ఆహ్వానించింది. దీంతో బ్యాటింగ్ చేపట్టిన బెంగళూర్ ఆదిలోనే కెప్టెన్ విరాట్ కోహ్లీ(12) ను కోల్పోయింది.అనంతరం వెంటనే ఏబీ డివిలియర్స్ (1)పెవిలియన్ కు చేరడంతో బెంగళూర్ ఒక్కసారిగా కష్టాల్లో పడింది. బెంగళూర్ 36 పరుగుల వద్ద ఉండగా మన్ దీప్(4)ను నష్టపోవడంతో జట్టు స్కోరు మందగించింది. అయితే క్రిస్ గేల్ కాసేపు మెరుపులు మెరిపించడంతో బెంగళూర్ మధ్యలో పుంజుకుంది.గేల్(41) బ్యాట్ వేగం పెంచే క్రమంలో రైనా బౌలింగ్ లో పెవిలియన్ కు చేరాడు. ఆ తరువాత దినేష్ కార్తీక్ కు జతకలిసిన సర్ఫరాజ్ ఇన్నింగ్స్ ను మరమ్మత్తులు చేసే పనిలో పడ్డాడు. కాగా, దినేశ్ కార్తీక్(28) భారీ షాట్ కు యత్నించి నెహ్రా బౌలింగ్ లో అవుటైయ్యాడు. ఆ తరుణంలో సర్ఫరాజ్(31) ఆదుకోవడంతో బెంగళూర్ నిర్ణీత ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 139 పరుగులు చేసింది. చెన్నై బౌలర్లలో నెహ్రా మూడు వికెట్లు తీయగా, మోహిత్ శర్మ, రైనా, అశ్విన్ ,బ్రేవోలకు తలో వికెట్ దక్కింది. -
కష్టాల్లో బెంగళూర్
రాంచీ: ఐపీఎల్-8లో భాగంగా ఇక్కడ చెన్నై సూపర్ కింగ్స్ తో జరుగుతున్న క్వాలిఫయర్-2 మ్యాచ్ లో బెంగళూర్ రాయల్ చాలెంజర్స్ కష్టాల్లో పడింది. 36 పరుగులకే మూడు కీలక వికెట్లు కోల్పోయింది. పది ఓవర్లు ముగిసే సరికి బెంగళూర్ మూడు వికెట్ల నష్టానికి 50 పరుగులు చేసింది. క్రిస్ గేల్(21), దినేష్ కార్తీక్(3)పరుగులతో క్రీజ్ లో ఉన్నారు. అంతకుముందు విరాట్ కోహ్లీ(12), ఏబీ డివిలియర్స్(1) మన్ దీప్ సింగ్ (4)పరుగులు చేసి పెవిలియన్ కు చేరారు.చెన్నై బౌలర్లలో రెండు నె హ్రా వికెట్లు తీయగా, అశ్విన్ కు ఒక వికెట్ లభించింది. -
టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న చెన్నై
రాంచీ: ఐపీఎల్-8లో భాగంగా ఇక్కడ బెంగళూర్ రాయల్ చాలెంజర్స్ తో జరుగుతున్న క్వాలిఫయర్-2లో చెన్నై సూపర్ కింగ్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ టోర్నీలో ఇరు జట్ల మధ్య జరిగిన రెండు లీగ్ మ్యాచ్ ల్లో చెన్నై గెలిచిన సంగతి తెలిసిందే. అయితే కీలకమైన పోరుకు వచ్చేసరికి చెన్నై జట్టులో బ్రెండన్ మెకల్లమ్ గాయం కారణంగా వైదొలిగాడు. దాంతో చైన్నై ఒక్కసారిగా బలహీనపడినట్లు కనిపిస్తోంది. ప్రస్తుతం బెంగళూరు అన్ని విభాగాల్లోనూ చెన్నై కంటే మెరుగ్గా ఉంది. -
పైచేయి ఎవరిదో?
రాంచీ:ఐపీఎల్-8లో మరో అసలు సిసలు సమరానికి తెరలేవనుంది. క్వాలిఫయర్-2లో బెంగళూరు రాయల్ చాలెంజర్స్-చెన్నై సూపర్ కింగ్స్ లు ఆమి-తూమీకి సన్నద్ధమయ్యాయి. ఈ టోర్నీలో ఆద్యంతం ఆకట్టుకున్న ఇరు జట్లు తమ బలాబలాలను పూర్తి స్థాయిలో ప్రదర్శించడానికి సిద్ధమయ్యాయి. లీగ్ దశలో ఫలితాన్నే మరోసారి పునరావృతం చేయాలని చెన్నై భావిస్తుండగా, బ్రెండన్ మెకల్లమ్ లేని లోటును తమకు అనుకూలంగా మార్చుకోవాలని బెంగళూరు యోచిస్తోంది. లీగ్ దశలో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన చెన్నై... తొలి క్వాలిఫయర్లో ముంబై చేతిలో ఓడి బెంగళూరుతో పోరుకు రెఢీ అయ్యింది. ప్రస్తుతం బెంగళూరు జట్టు సూపర్ ఫామ్లో ఉండగా, చెన్నై కాస్త ఆత్మవిశ్వాసం సన్నగిల్లినట్లు కనబడుతోంది. అయితే ధోని స్వస్థలం రాంచీలో ఈ మ్యాచ్ జరుగుతున్నందున చెన్నైకు పూర్తి స్థాయిలో మద్దతు లభించనుంది. తొలి క్వాలిఫయర్ సాదా సీదాగా సాగినా.. ఐపీఎల్ రెండో క్వాలిఫయర్ మాత్రం భారత వన్డే జట్టు కెప్టెన్ ధోని, టెస్టు జట్టు కెప్టెన్ కోహ్లిల సారథ్యానికి పరీక్షగా నిలవనుంది. చెన్నై సూపర్ కింగ్స్.. లీగ్ దశలో సంచలన ఇన్నింగ్స్ ఆడిన మెకల్లమ్ వెళ్లిపోవడంతో చెన్నై డీలా పడిపోయింది. అతని స్థానంలో వచ్చిన వెటరన్ హస్సీ వరుస మ్యాచ్ ల్లో విఫలమైయ్యాడు. నేటి మ్యాచ్ లో డ్వేన్ స్మిత్తో కలిసి హస్సీ ఇచ్చే ఆరంభం చాలా కీలకం. అలాగే ఒంటిచేత్తో మ్యాచ్ లను గెలిపించే సురేష్ రైనా కూడా స్థాయికి తగ్గ ప్రదర్శన ఇవ్వడం లేదు. చెన్నై జట్టులో డు ప్లెసిస్ ఒక్కడే ఫామ్ లో కనిపిస్తున్నాడు. కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ, రవీంద్ర జడేజాలు పేలవమైన బ్యాటింగ్ చెన్నైకు ఆందోళన కలిగిస్తోంది. బౌలింగ్ విభాగంలో ఆశిష్ నెహ్రా, డ్వేన్ బ్రేవోలు ఆకట్టుకుంటున్నారు. అశ్విన్ కూడా సమయం చిక్కినప్పుడల్లా కీలక వికెట్లు తీసి చెన్నైకు అండగా నిలుస్తున్నా.. పెద్దగా ప్రభావం చూపడం లేదు. బెంగళూరు జట్టు .. గత ఐపీఎల్ లో కూడా ఆకట్టుకున్న బెంగుళూరుకు దురదృష్టం పాళ్లు కాస్త ఎక్కువగానే కనబడుతున్నాయి. కీలక మ్యాచ్ ల్లో ఆజట్టు చతికిలబడటం పరిపాటిగానే మారిపోయింది. అయితే టైటిల్ ను కైవసం చేసుకోవాలనే పట్టుదలతో ఉన్న బెంగళూరు ఈ సీజన్లో చాలావరకు నిలకడగా ఆడింది. ఒంటిచేత్తో మ్యాచ్లు గెలిపించగల గేల్, కోహ్లి, డి విలియర్స్ ముగ్గురూ రాణిస్త్తే మాత్రం బెంగళూరు టైటిల్ వేటలో తొలి అడ్డంకిని దిగ్విజయంగా అధిగమించే అవకాశం ఉంది. ఇక యువ సంచలనం మన్దీప్ సింగ్, సర్ఫరాజ్ కూడా బాగా ఆడుతున్నారు. ఐపీఎల్ -8లో స్పెషలిస్టు కీపర్ ఉండాలనే ఉద్దేశంతో దినేశ్ కార్తీక్ కు అత్యధిక ధర చెల్లించి మరీ బెంగళూరు కొనుగోలు చేసింది. కాగా, దినేష్ ఫామ్ మాత్రం బెంగళూరు కలవరపరుస్తుంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో మాత్రం చెన్నై కంటే బెంగళూరు మెరుగ్గా ఉందనే చెప్పాలి. పటిష్టమైన బెంగళూరును మట్టికరిపించేదుకు ధోనీ ఏమైనా వ్యూహాలు సిద్ధం చేశాడో?లేదో మరి కొద్ది గంటల్లో తేలిపోతుంది. -
ఐపీఎల్ బెట్టింగ్ కేసులో ఈడీ దాడులు
న్యూఢిల్లీ: ఐపీఎల్ బెట్టింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు దాడులు నిర్వహించారు. శుక్రవారం ఉదయం ఢిల్లీ, ముంబై, జైపూర్ సహా పలు నగరాల్లో అధికారులు సోదాలు చేశారు. ఐపీఎల్-8లో భాగంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, రాజస్థాన్ రాయల్స్ల మ్యాచ్లో బెట్టింగ్లో ప్రమేయమున్న అనూప్ మహాజన్ అనే బుకీని పఠాన్కోట్లో పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి దగ్గర నుంచి 3.3 లక్షల నగదు, మొబైల్స్, ఎల్సీడీ స్వాధీనం చేసుకున్నారు. బెట్టింగ్ కేసులో పోలీసులు మరో ఐదుగురిని కూడా అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. -
అందరినీ వేలంలోకి తేవాలి
ఐపీఎల్ ఫ్రాంచైజీల డిమాండ్ ముంబై : 2008లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ప్రారంభమైనప్పటి నుంచి ఎంఎస్ ధోని, విరాట్ కోహ్లి, సురేశ్ రైనా, అశ్విన్, మలింగ, హర్భజన్ సింగ్ తదితరులు ఆయా జట్ల తరఫునే ఆడుతూ వస్తున్న విషయం తెలిసిందే. వీరంతా రిటెన్షన్ పాలసీ ప్రకారం ఇన్నేళ్లుగా జట్లను మారకుండా ఆడుతున్నారు. అయితే ప్రస్తుత పరిస్థితులు గమనిస్తే వీరంతా కూడా ఆటగాళ్ల వేలానికి అందుబాటులో ఉండే అవకాశం లేకపోలేదు. తాజాగా గత వారం కొన్ని ఫ్రాంచైజీల యజమానులు... కొందరు ఆటగాళ్లను తమ దగ్గరే అట్టి పెట్టుకునే ఈ వెసులుబాటును వ్యతిరేకిస్తూ ఐపీఎల్ చైర్మన్ రాజీవ్ శుక్లా, బీసీసీఐ కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ను కలిశారు. ఈ పాలసీని సరిదిద్దాలని వారు డిమాండ్ చేశారు. 2014లో జరిగిన వేలంలో ఫ్రాంచైజీలు ఆటగాళ్లతో మూడేళ్ల ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఇందులోనే ఐదుగురు ఆటగాళ్లను అలాగే ఉంచుకోవడంతో పాటు ఆరో ఆటగాడిని ‘రైట్ టు మ్యాచ్’ ద్వారా పొందే అవకాశం కూడా జట్లకు కల్పించారు. నిజానికి ఈ పద్ధతితో చెన్నై జట్టు బాగా లబ్ధి పొందింది. ఇప్పుడు బోర్డులో అధికారం మారడంతో పలు ఫ్రాంచైజీలు గళం విప్పాయి. 2008లో లీగ్ ప్రారంభమైనప్పుడు ప్రతీ ఆటగాడు మూడేళ్ల అనంతరం వేలానికి అందుబాటులో ఉంటాడని నిబంధనల్లో పేర్కొన్నారు. అయితే 2011లో నలుగురు ఆటగాళ్లను తమ జట్టు తరఫునే ఉంచుకోవచ్చనే నిబంధనను తెచ్చారు. ఒకవేళ ప్రస్తుత డిమాండ్ను బీసీసీఐ అంగీకరిస్తే టాప్ స్టార్స్ అంతా వేలంలో కనిపిస్తారు. కానీ చెన్నై, ముంబై, బెంగళూరు మాత్రం ఈ డిమాండ్ను వ్యతిరేకిస్తున్నాయి. -
‘టెంపర్’ తగ్గదా..!
►మారని కోహ్లి వ్యవహారశైలి ►మైదానంలో ఆగ్రహావేశాలు ►నియంత్రణ కోల్పోతున్నభారత టెస్టు కెప్టెన్ బ్యాట్స్మన్గా విరాట్ కోహ్లి స్థాయి సచిన్కు తగ్గనిది... తన ప్రదర్శనతో తక్కువ సమయంలోనే దిగ్గజాల సరసన చోటు దక్కించుకున్న ఘనత అతనిది... కానీ మైదానంలో ప్రవర్తన విషయంలో మాత్రం నాటి స్టార్లతో పోలిస్తే అతనికి పడేది సున్నా మార్కులే. అంతర్జాతీయ స్థాయి క్రికెటర్గా, భారత్కు ప్రాతినిధ్యం వహిస్తున్నాననే స్పృహ లేకుండా కోహ్లి సృష్టిస్తున్న వివాదాలు అతని ఆటకు మచ్చ తెస్తున్నాయి. ఇకపై టెస్టు కెప్టెన్గా కూడా మరింత బాధ్యతగా వ్యవహరించాల్సిన కోహ్లి తన ఆగ్రహావేశాలు నియంత్రించుకోలేడా! సాక్షి క్రీడా విభాగం : దాదాపు పాతికేళ్ల కెరీర్లో సచిన్ ఎప్పుడైనా తోటి ఆటగాడిపై నోరు జారడం, దురుసుగా ప్రవర్తించడం చూశారా! కేవలం టన్నుల కొద్దీ పరుగులే కాదు వ్యక్తిత్వం కూడా సచిన్ను గొప్పవాడిగా నిలబెట్టింది. మరి సచిన్కు వారసుడు అంటూ కితాబులందుకున్న వ్యక్తి ఎంత హుందాగా ఉండాలి! ధోని స్థానంలో సారథిగా వచ్చే వ్యక్తి అతనిలాగే ఎంతటి నిగ్రహం చూపించాలి! కానీ విరాట్ కోహ్లి వల్ల మాత్రం ఇది కావడం లేదు. అది అండర్-19 స్థాయి అయినా, రంజీ ట్రోఫీ అయినా, ఐపీఎల్ అయినా, టెస్టు లేదా వన్డే అయినా కోహ్లి ‘మార్క్’ ఆగ్రహం మైదానంలో కనిపిస్తూనే ఉంటోంది. పట్టరాని సంతోషమైనా, పట్టలేని కోపమైనా కోహ్లి నోటి వెంట బూతు పురాణం వినిపిస్తూనే ఉంటోంది. తనను తాను నియంత్రించుకోలేని ఈ బలహీనత భవిష్యత్తులో భారత క్రికెట్కు ఎలాంటి ఉప(అప)కారం చేస్తుంది? మళ్లీ కోపమొచ్చింది ఇటీవల హైదరాబాద్లో సన్రైజర్స్తో జరిగిన మ్యాచ్లో కోహ్లి ఆగ్రహం మరోసారి బయట పడింది. వర్షం పడుతున్నా ఆటను కొనసాగించడంపై అతను అంపైర్లతో వాగ్వాదానికి దిగాడు. ఢిల్లీకే చెందిన అంపైర్ అనిల్ చౌదరి సముదాయించబోయినా అతను వినలేదు. ఆ వెంటనే బెంగళూరులో డ్రెస్సిం గ్ రూమ్ బయట అనుష్కతో ముచ్చట్లతో మరో వివాదం. కోహ్లి స్థాయిని బట్టి చూస్తే అతనికి నిబంధనలు తెలియకపోవడం అనేది ఉండదు. కానీ ఎవరేమనుకుంటే ఏమిటనే ఒక రకమైన లెక్కలేనితనంతో అతను ఈ రకంగా చేశాడనేది విమర్శ. రాజస్తాన్తో ఎలిమినేటర్ మ్యాచ్లో అయితే అలా వికెట్ పడిందో లేదో ఇలా నోటినుంచి బూతులు. మ్యాచ్ ఆరంభంనుంచి బెంగళూరు మంచి స్థితిలోనే ఉంది. అంతగా ప్రత్యర్థి ఆటగాళ్లపై నోరు పారేసుకోవాల్సిన అవసరం ఎక్కడా కనిపించలేదు. కానీ అతను తన ధోరణిలోనే సాగాడు. అంతకు ముందు ముంబైతో మ్యాచ్లోనూ పార్థివ్ను రనౌట్ చేసి ఇలాగే వ్యవహరించాడు. యువకుడు, ఇలాంటివి సహజం అంటూ గతంలో మద్దతు పలికిన గవాస్కర్లాంటి వారినుంచి కూడా ఇకపై అలాంటి మాటలు వినిపించకపోవచ్చు. ఎందుకంటే వయసు 27 ఏళ్లే కావచ్చు... కానీ 150కు పై గా వన్డేల అనుభవజ్ఞుడు, భారత జట్టుకు కెప్టెన్ ఇలా ఉంటానంటే కుదరదు. ఒకటా...రెండా... 2008లో భారత సీనియర్ జట్టులో చోటు దక్కించుకున్న కోహ్లి దాదాపు ప్రతీ ఏడాది వివాదాల్లోనే ఉన్నాడు. కెరీర్ ఆరంభంలోనే నాగపూర్లో మీడియా ఫొటోగ్రాఫర్తో వాగ్యుద్ధం, సిడ్నీలో ప్రేక్షకులకు వేలు చూపిన ఘటన, ఐపీఎల్ సందర్భంగా వాంఖడేలో ప్రేక్షకులపై ఆగ్రహం, అదే టోర్నీలో గంభీర్తో పెద్ద గొడవ, జింబాబ్వేతో మ్యాచ్లో అంపైర్లతో వాదన, ప్రపంచకప్ సమయంలో జర్నలిస్ట్పై తిట్ల దండకం...ఇలా ఒకటేమిటి ఎక్కడైనా కోహ్లినే. టెస్టు సిరీస్లో జాన్సన్, వార్నర్లతో పోటీగా ధాటిగా మాటలతో బదులిచ్చాడంటూ కొన్ని వర్గాలు మెచ్చుకున్నా...అదేమీ జట్టుకు ఉపకరించేది కాదు. ‘ఇప్పుడు భారత జట్టుకు కోచ్గా వచ్చే వ్యక్తి కోహ్లి ఆగ్రహాన్ని కూడా నియంత్రించగలగాలి. అతడిని సరైన దారిలో నడిపించాలి. కోహ్లి పదే పదే నియంత్రణ కోల్పోతున్నాడు. క్రికెట్ ఆట కబడ్డీ, ఖోఖోలాంటిది కాదు. సుదీర్ఘ కాలం ఆడాలంటే, జట్టును ముందుండి నడిపించాలంటే టెంపర్ను తగ్గించుకోవాలి’ అని స్పిన్ దిగ్గజం బిషన్ సింగ్ బేడి సూచించారు. ఎలాంటి స్థితిలోనూ అదుపు తప్పని ‘మిస్టర్ కూల్’గా ప్రశంసలు అందుకున్న ధోని నుంచి కెప్టెన్సీ బాధ్యతలు స్వీకరిస్తున్నాడు కాబట్టి ఇకపై కోహ్లి చేసే ప్రతీ పనిపై అందరి దృష్టి ఉంటుందని, మైదానంలో అతను జాగ్రత్తగా ఉండాలని ఆయన హెచ్చరించారు. భారత క్రికెట్ ప్రయోజనాల దృష్ట్యా కోహ్లి తన ప్రవర్తనను మార్చుకోవాల్సిన అవసరం ఉంది. బయటివాళ్లకంటే అతనికే దాని గురించి బాగా తెలుసు. కాబట్టి మానసిక కోణంలో చూస్తే స్వీయ నియంత్రణ అవసరం. ఏదైనా ఘటన వల్ల కోహ్లిపై నిషేధం పడితే అది జట్టుపై ఎంతో ప్రభావం చూపిస్తుంది. అరుదైన ప్రతిభ గల ఆటగాడికి తన కోపమే తన శత్రువుగా మారరాదు - బీపీ బామ్, ప్రముఖ స్పోర్ట్స్ సైకాలజిస్ట్ బోల్ట్ను మించిన మార్కెట్ ‘డిమాండ్’ లండన్ : వివాదాల సంగతిఎలా ఉన్నా... కోహ్లి వ్యాపార మార్కెట్లో దూసుకెళుతున్నాడు. మరో మూడేళ్లలో మార్కెట్ను బాగా ప్రభావితం చేయగల అథ్లెట్లలో కోహ్లి ఆరో స్థానంలో నిలిచాడు. బ్రిటిష్ స్పోర్ట్స్ బిజినెస్ మేగజైన్ ‘స్పోర్ట్స్ప్రో’ కథనం ప్రకారం 26 ఏళ్ల కోహ్లి.. జమైకన్ స్ప్రింటర్ ఉసేన్ బోల్ట్, ఫుట్బాల్ స్టార్ లియోనల్ మెస్సీ, క్రిస్టియానో రొనాల్డో కన్నా ముందున్నాడు. ఇక ఈ జాబితాలో ఫార్ములా వన్ చాంపియన్ లూయిస్ హామిల్టన్.. బ్రెజిల్ ఫుట్బాల్ సూపర్ స్టార్ నెయ్మార్ జూనియర్ మార్కెట్ వర్గాల్లో అత్యధిక ఆదరణ ఉన్నవారిలో తొలి రెండు స్థానాలు దక్కించుకున్నారు. జొకోవిచ్ 14, రొనాల్డో 16, మెస్సీ 22వ స్థానాల్లో కొనసాగుతున్నారు. క్రికెటర్లలో స్మిత్ 45వ స్థానంలో ఉన్నాడు. భారత్ నుంచి బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ 44వ స్థానంలో ఉంది. కొత్త ‘ట్రెండ్’ తెచ్చాడు... గతంలో భారత క్రికెట్ను శాసించిన ఆటగాళ్లు కూడా ఇంత బహిరంగంగా గర్ల్ఫ్రెండ్లతో మైదానంలో సరసాలాడలేదు. బ్యాట్నుంచి ముద్దుల సందేశాలు ఇవ్వలేదు. వారెవరైనా మ్యాచ్ చూడటానికి వచ్చినా, ఒక అతిథిగా మిగిలిపోయేవారు. ఏదో ఉందంటూ ఇద్దరి గురించి మీడియా ఏమైనా రాసుకోవడం వరకే. కానీ కోహ్లి వ్యవహారం మాత్రం అంతా బహిరంగమే. నిజానికి ఒక టూర్కు గర్లఫ్రెండ్ను అనుమతించడం కూడా కోహ్లితోనే మొదలైంది. ఎలాగూ బయటికి చెప్పేశాము కదా అంటూ విరాట్ కాస్త ఎక్కువగానే విచ్చలవిడితనం ప్రదర్శిస్తున్నాడు. విదేశీ క్రికెటర్లు తమ గర్ల్ఫ్రెండ్స్ను వెంట తెచ్చుకున్నా, ఇలా ఎవరూ ప్రవర్తించలేదు. కోహ్లి హంగామా చూసి మిగిలిన క్రికెటర్లు కూడా ఇదే బాట పట్టారు. దాదాపు యువ క్రికెటర్లంతా తమ గర్ల్ఫ్రెండ్స్ను స్టేడియానికి తీసుకొస్తున్నారు. కానీ వాళ్లెవరూ విరాట్ స్థాయిలో హడావుడి చేయడం లేదు. అయితే అనుష్క సినిమా హీరోయిన్ కావడం వల్ల మీడియా కూడా కాస్త ఉత్సాహం చూపిస్తోంది. ఏదేమైనా కోహ్లి ఇకపై కూడా ఇలాగే ఉంటానందే కుదరదు. బ్యాట్స్మన్గానే కాకుం డా జట్టును నడిపించే వ్యక్తిగా అటు మైదానంలోనూ, ఇటు మైదానం బయట కూడా హుందాగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. మరి కోహ్లి మారగలడా! -
‘సౌత్’ సమరం!
►నేడు ఐపీఎల్ క్వాలిఫయర్-2 ►వరుస విజయాల జోరులో కోహ్లి సేన ►రికార్డుపై నమ్మకంతో ధోని బృందం ఐపీఎల్ తొలి ఏడు సీజన్లలో గతేడాది మినహా ప్రతిసారీ కనీసం ఒక్క దక్షిణాది జట్టయినా ఫైనల్కు చేరింది. గత ఏడాది మాత్రం పంజాబ్, కోల్కతా తుది సమరానికి చేరాయి. ఈసారి కూడా సౌత్ జట్టు ఫైనల్కు చేరడం ఖాయం. నేడు చెన్నై, బెంగళూరు జట్ల మధ్య జరిగే క్వాలిఫయర్-2 విజేత... ఆదివారం ముంబైతో ఫైనల్లో తలపడుతుంది. వరుస విజయాలతో రాయల్ చాలెంజర్స్ మంచి జోరు మీదుంటే... లీగ్ దశలో బెంగళూరుపై రెండు మ్యాచ్లూ గెలిచిన సూపర్కింగ్స్ ఆత్మవిశ్వాసంతో ఉంది. మరి మిగిలేదెవరో? రాంచీ : భారత వన్డే జట్టు కెప్టెన్ ధోని, టెస్టు జట్టు కెప్టెన్ కోహ్లిల సారథ్యానికి పరీక్షగా అభివర్ణిస్తున్న ఐపీఎల్ రెండో క్వాలిఫయర్కు రంగం సిద్ధమైంది. జేఎస్సీఏ స్టేడియంలో శుక్రవారం జరిగే మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్తో బెంగళూరు రాయల్ చాలెంజర్స్ తలపడుతుంది. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు ఫైనల్కు చేరుతుంది. లీగ్ దశలో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన చెన్నై... తొలి క్వాలిఫయర్లో ముంబై చేతిలో ఓడింది. మూడో స్థానంలో నిలిచిన బెంగళూరు ఎలిమినేటర్లో రాజస్తాన్ను చిత్తు చేసింది. అలాగే లీగ్ దశలో రెండు జట్ల మధ్య జరిగిన రెండు మ్యాచ్ల్లో చెన్నై 27, 24 పరుగుల తేడాతో గెలిచింది. అయితే ప్రస్తుతం బెంగళూరు జట్టు సూపర్ ఫామ్లో ఉంది. ధోని స్వస్థలం రాంచీలో ఈ మ్యాచ్ జరుగుతున్నందున చెన్నై జట్టుకు అభిమానుల నుంచి భారీగా మద్దతు లభించడం ఖాయం. మంచి ఆరంభం కావాలి లీగ్ దశలో సంచలన ఇన్నింగ్స్ ఆడిన మెకల్లమ్ వెళ్లిపోయిన లోటు చెన్నైకి అప్పుడే తెలిసొచ్చింది. తన స్థానంలో వచ్చిన వెటరన్ హస్సీ గత మ్యాచ్లో విఫలమయ్యాడు. అయితే తన అనుభవాన్ని ఉపయోగించి డ్వేన్ స్మిత్తో కలిసి హస్సీ ఇచ్చే ఆరంభం చాలా కీలకం. అలాగే రైనా కూడా స్థాయికి తగ్గట్టుగా ఆడటం లేదు. డు ప్లెసిస్ ఫామ్లోనే ఉన్నా... ధోని, జడేజా బ్యాటింగ్లో నిరాశపరుస్తున్నారు. నిజానికి చెన్నైలోని ఆటగాళ్లంతా తమ స్థాయికి తగ్గట్లుగా రాణిస్తే బెంగళూరు కంటే బలమైన బ్యాటింగ్ లైనప్ ఉంది. ఇక బౌలింగ్లో నెహ్రా సూపర్ ఫామ్లో ఉన్నాడు. లీగ్లో అత్యధిక వికెట్లు తీసిన డ్వేన్ బ్రేవో స్లాగ్ ఓవర్లలో ఎలాంటి ప్రత్యర్థినైనా కట్టడి చేయగల దిట్ట. గేల్, కోహ్లి, డి విలియర్స్ లాంటి బలమైన బ్యాటింగ్ లైనప్ను నియంత్రించాలి కాబట్టి అశ్విన్కు ధోని కొత్త బంతి ఇచ్చే అవకాశం లేకపోలేదు. ఫామ్లో ఉన్న బెంగళూరు త్రయాన్ని నియంత్రించడానికి ధోని ఏదైనా మ్యాజిక్ చేయకపోతే మ్యాచ్లో నెగ్గడం కష్టం. టైటిల్ మీద గురితో... బెంగళూరు జట్టు ఈ సీజన్లో చాలావరకు నిలకడగా ఆడింది. దీనికి కారణం టాప్-3లో కనీసం ఇద్దరు ఆటగాళ్లు ఏదో ఒక ఇద్దరు ప్రతి మ్యాచ్లోనూ రాణిస్తున్నారు. ఒంటిచేత్తో మ్యాచ్లు గెలిపించగల గేల్, కోహ్లి, డి విలియర్స్ ముగ్గురూ సూపర్ ఫామ్లో ఉండటం ఈ జట్టుకు పెద్ద సానుకూలాంశం. ఇక యువ సంచలనం మన్దీప్ సింగ్ కూడా బాగా ఆడుతున్నాడు. దినేశ్ కార్తీక్ ఒక్కడే ఈ లైనప్లో ఫామ్లోలేని క్రికెటర్. ఇక కుర్రాడు సర్ఫరాజ్ కూడా తనకు లభించిన చిన్న చిన్న అవకాశాలను ఉపయోగించుకుంటున్నాడు. అయితే బ్యాటింగ్తో పాటు బెంగళూరు బౌలింగ్ కూడా సమతూకంతో ఉంది. స్టార్క్ నేతృత్వంలో శ్రీనాథ్ అరవింద్, వీస్, హర్షల్ పటేల్ అద్భుతాలు చేస్తున్నారు. ఇక లెగ్ స్పిన్నర్ చాహల్ ఒక్కడే స్పిన్ బాధ్యత మోస్తూ అవసరమైన సమయంలో వికెట్లతో జట్టును ఆదుకుంటున్నాడు. ఇప్పటివరకూ ఒక్కసారి కూడా టైటిల్ గెలవని బెంగళూరు ప్రస్తుతం ఉన్న ఫామ్తో ఈసారి గెలవగలమనే నమ్మకంతో ఉంది. ఆ కోరిక తీరాలంటే ముందు చెన్నై సవాల్ని అధిగమించాలి. జట్లు (అంచనా) చెన్నై సూపర్ కింగ్స్ ధోని (కెప్టెన్), డ్వేన్ స్మిత్, మైక్ హస్సీ, రైనా, డు ప్లెసిస్, జడేజా, డ్వేన్ బ్రేవో, పవన్ నేగి, అశ్విన్, నెహ్రా, మోహిత్ శర్మ. బెంగళూరు రాయల్ చాలెంజర్స్ కోహ్లి (కెప్టెన్), గేల్, డి విలియర్స్, మన్దీప్, దినేశ్ కార్తీక్, సర్ఫరాజ్, వీస్, స్టార్క్, శ్రీనాథ్ అరవింద్, చాహల్, హర్షల్. 5 ఐపీఎల్ లో చెన్నై మరే జట్టుకు సాధ్యం కాని విధంగా ఇప్పటికే ఐదుసార్లు (2008, 2010, 2011, 2012, 2013) ఫైనల్ ఆడింది. ఇందులో రెండు సార్లు టైటిల్ గెలిచింది. 2 బెంగళూరు గతంలో రెండు సార్లు (2009, 2011) ఫైనల్కు చేరింది. ఈ రెండు సార్లు రన్నరప్తోనే సరిపెట్టుకుంది. ‘చెన్నైతో మ్యాచ్ పెద్ద సవాల్. ఆ జట్టు బలమైంది. వారిని ఓడించటం అంత సులువు కాదు. ఈ మ్యాచ్లో గెలవడమే కాదు, తర్వాత టైటిల్ కూడా అందుకోవాలనేదే మా లక్ష్యం. ప్రస్తుతం రెండో క్వాలిఫయర్ మ్యాచ్పైనే దృష్టి పెట్టాం’ - డివిలియర్స్, బెంగళూరు బ్యాట్స్మన్ ‘ఈ దశలో మా ఆటగాళ్లు బాగా అలసిపోయి ఉన్నారు. అయితే విశ్రాంతి తీసుకునే పరిస్థితి లేదు. గత మ్యాచ్ ఓడినా మరోసారి మా సత్తా చాటే అవకాశం ఉండటం అదృష్టం. రాంచీలో మ్యాచ్ ఫలితం మాకు అనుకూలంగా ఉంటుందనే ఆశిస్తున్నా’ - ఫ్లెమింగ్, చెన్నై కోచ్ -
రాయల్గా గెలిచిన బెంగళూరు
-
ఇక వీళ్ల ‘సందడి’...
ముంబై : ఏడాది కాలంగా భారత క్రికెట్లో అనుష్క శర్మ గురించి విపరీతంగా చర్చ జరుగుతోంది. కారణం... విరాట్ కోహ్లి ఎక్కడుంటే అనుష్క అక్కడ కనిపిస్తూ సందడి చేస్తోంది. ఇక వీళ్ల బాటలోనే భారత క్రికెట్లో మరో కొత్త జంట సందడి మొదలైంది. వాంఖడేలో చెన్నై, ముంబై మ్యాచ్కు రోహిత్ శర్మ కాబోయే భార్య రితిక సజ్దే వచ్చి హడావుడి చేసింది. హర్భజన్ గర్ల్ఫ్రెండ్ గీతా బస్రాతో కలిసి వీఐపీ స్టాండ్లో కూర్చున్న రితిక... మ్యాచ్ అయిపోగానే రోహిత్ వైపు ప్రేమ సంకేతం చూపించింది. అతను కూడా దీనికి స్పందించి చేతులు చాచి నవ్వాడు. మ్యాచ్ ముగిశాక రితికతో కలిసి సెల్ఫీ తీసుకుని రోహిత్ ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. అందులో ముంబై ఇండియన్స్కు ‘అతి పెద్ద అభిమాని’ అని రాశాడు. ఆదివారం కోల్కతాలో జరిగే ఫైనల్కు కూడా రితిక వెళుతుందట. -
రాయల్స్పై రాయల్గా...
►క్వాలిఫయర్-2కు బెంగళూరు ►చెలరేగిన డివిలియర్స్, మన్దీప్ ►రాజస్తాన్పై కోహ్లిసేన విజయం ►చెన్నైతో రేపు అమీతుమీ ఐపీఎల్లో బెంగళూరు జైత్రయాత్ర కొనసాగుతోంది. లీగ్ దశలోనే కాదు... ఒత్తిడితో కూడిన నాకౌట్ మ్యాచ్లోనూ ఆ జట్టు పట్టు కోల్పోలేదు. బ్యాటింగ్లో డివిలియర్స్, మన్దీప్ మెరుపులకు తోడు బౌలర్లు సమష్టిగా రాణించడంతో... ఎలిమినేటర్లో రాజస్తాన్పై ‘రాయల్’గా గెలిచి క్వాలిఫయర్-2కు అర్హత సాధించింది. ఇక రేపు (శుక్రవారం) జరిగే మ్యాచ్లో చెన్నైతో కోహ్లిసేన అమీతుమీ తేల్చుకోనుంది. ఆ మ్యాచ్లో గెలిచిన జట్టు ఫైనల్కు చేరుతుంది. పుణే : ఐపీఎల్ తొలి ఐదు మ్యాచ్లలో వరుసగా విజయాలు సాధించి ఊపు మీద కనిపించిన రాజస్తాన్ చివరకు ప్లే ఆఫ్తోనే సరిపెట్టుకుంది. కెప్టెన్గా ఏ ఫార్మాట్లోనూ ఓటమి పాలవ్వని కెప్టెన్ స్మిత్ అదృష్టం కూడా ఆ జట్టు రాతను మార్చలేకపోయింది. బుధవారం ఇక్కడ ఏకపక్షంగా సాగిన ఎలిమినేటర్ మ్యాచ్లో బెంగళూరు రాయల్ చాలెంజర్స్ చేతిలో 71 పరుగుల తేడాతో రాజస్తాన్ చిత్తుగా ఓడింది. ముందుగా బ్యాటింగ్కు దిగిన బెంగళూరు 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. ఏబీ డివిలియర్స్ (38 బంతుల్లో 66; 4 ఫోర్లు, 4 సిక్సర్లు), మన్దీప్ సింగ్ (34 బంతుల్లో 54 నాటౌట్; 7 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధ సెంచరీలతో చెలరేగారు. వీరిద్దరు మూడో వికెట్కు 11.1 ఓవర్లలోనే 113 పరుగులు జోడించడం విశేషం. అనంతరం రాజస్తాన్ 19 ఓవర్లలో 109 పరుగులకే కుప్పకూలింది. అజింక్య రహానే (39 బంతుల్లో 42; 4 ఫోర్లు) మినహా అంతా విఫలమయ్యారు. శుక్రవారం రాంచీలో జరిగే రెండో క్వాలిఫయర్లో చెన్నైతో బెంగళూరు తలపడుతుంది. ఈ మ్యాచ్లో విజేతగా నిలిచే జట్టు ఫైనల్కు అర్హత సాధిస్తుంది. మెరుపు భాగస్వామ్యం తొలి 19 బంతుల్లో 16 పరుగులు, తర్వాతి 19 బంతుల్లో 50 పరుగులు...ఇన్నింగ్స్ను నెమ్మదిగా ఆరంభించి భారీ షాట్లతో డివిలియర్స్ తన జోరును పెంచిన తీరు ఇది. మన్దీప్ కూడా అతనితో దీటుగా, ధాటిగా ఆడటంతో ఎలిమినేటర్ మ్యాచ్లో బెంగళూరుకు భారీ స్కోరు సాధ్యమైంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న అనంతరం గేల్ (26 బంతుల్లో 27; 4 ఫోర్లు, 1 సిక్స్), కోహ్లి (12)లను ఐదు పరుగుల వ్యవధిలో ధావల్ కులకర్ణి అవుట్ చేయడంతో రాజస్తాన్ ఆధిక్యం ప్రదర్శించినా... డివి లియర్స్, మన్దీప్ భాగస్వామ్యం ఆర్సీబీని నిలబెట్టింది. ఆరంభంలో జాగ్రత్తగా ఆడిన వీరిద్దరు ఆ తర్వాత జోరు పెంచారు. అంకిత్ వేసిన ఇన్నింగ్స్ 15వ ఓవర్లో డివిలియర్స్ 2 సిక్స్లు, 1 ఫోర్తో చెలరేగడంతో 19 పరుగులు వచ్చాయి. ఇదే ఊపులో డివిలియర్స్ 34 బంతుల్లో అర్ధ సెంచరీని అందుకున్నాడు. చివర్లో డివిలియర్స్ రనౌటైనా...మరో వైపు దూకుడు కొనసాగించిన మన్దీప్ 32 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 14 ఓవర్లు ముగిసే సరికి 94 పరుగులే చేసిన బెంగళూరు ఏబీ, మన్దీప్ మెరుపులతో చివరి 6 ఓవర్లలో ఏకంగా 86 పరుగులు చేయడం విశేషం. టపటపా వికెట్లు భారీ లక్ష్యఛేదనలో రాజస్తాన్ ఏ దశలోనూ చెప్పుకోదగ్గ ఆటతీరు కనబర్చలేదు. నిరాశాజనకమైన ఆరంభం లభించగా, అది చివరి వరకు కొనసాగింది. వాట్సన్ (10), శామ్సన్ (5), స్మిత్ (12) తక్కువ వ్యవధిలోనే వెనుదిరగడంతో బెంగళూరుకు ప్రత్యర్థిపై పట్టు చిక్కింది. మరో వైపు రహానే పోరాడే ప్రయత్నం చేసినా లాభం లేకపోయింది. ఇతర బ్యాట్స్మెన్లలో ఎవరూ అతనికి సహకరించలేదు. నాయర్ (12), ఫాల్క్నర్ (4), బిన్నీ (0) విఫలమయ్యారు. చహల్ వేసిన 14వ ఓవర్లో చివరి బంతిని భారీ షాట్ ఆడబోయిన రహానే డీప్లో క్యాచ్ ఇవ్వడంతో రాజస్తాన్ విజయంపై ఆశలు వదిలేసుకుంది. బెంగళూరు బౌలర్లలో హర్షల్, అరవింద్, వీస్, చహల్ తలా 2 వికెట్లు తీశారు. స్కో రు వివరా లు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్ : గేల్ (బి) ధావల్ 27; కోహ్లి (సి) అండ్ (బి) ధావల్ 12; డివిలియర్స్ (రనౌట్) 66; మన్దీప్ (నాటౌట్) 54; కార్తీక్ (సి) రహానే (బి) మోరిస్ 8; సర్ఫరాజ్ (నాటౌట్) 1; ఎక్స్ట్రాలు 12; మొత్తం (20 ఓవర్లలో 4 వికెట్లకు) 180. వికెట్ల పతనం : 1-41; 2-46; 3-159; 4-177. బౌలింగ్ : మోరిస్ 4-0-42-1; ఫాల్క్నర్ 4-0-42-0; ధావల్ 4-0-28-2; వాట్సన్ 4-0-32-0; అంకిత్ 3-0-28-0; బిన్నీ 1-0-1-0. రాజస్తాన్ రాయల్స్ ఇన్నింగ్స్ : రహానే (సి) డివిలియర్స్ (బి) చహల్ 42; వాట్సన్ (సి) కార్తీక్ (బి) అరవింద్ 10; శామ్సన్ (సి) కార్తీక్ (బి) హర్షల్ 5; స్మిత్ (సి) డివిలియర్స్ (బి) వీస్ 12; నాయర్ (సి) కార్తీక్ (బి) హర్షల్ 12; హుడా (సి) స్టార్క్ (బి) వీస్ 11; ఫాల్క్నర్ (సి) అండ్ (బి) అరవింద్ 4; బిన్నీ (రనౌట్) 0; మోరిస్ (సి) చహల్ (బి) స్టార్క్ 0; అంకిత్ (నాటౌట్) 7; ధావల్ (బి) చహల్ 3; ఎక్స్ట్రాలు 3; మొత్తం (19 ఓవర్లలో ఆలౌట్) 109. వికెట్ల పతనం : 1-14; 2-33; 3-55; 4-79; 5-87; 6-92; 7-92; 8-95; 9-99; 10-109. బౌలింగ్ : స్టార్క్ 4-0-22-1; అరవింద్ 4-0-20-2; హర్షల్ 3-0-15-2; వీస్ 4-0-32-2; చహల్ 4-0-20-2. -
ధోనికి జరిమానా
అంపైర్ నిర్ణయంపై బహిరంగంగా వ్యాఖ్యలు చేసినందుకు చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్ ధోని మ్యాచ్ ఫీజులో 10 శాతం కోత విధించారు. ముంబై చేతిలో ఓటమి తర్వాత ధోని మాట్లాడుతూ ‘స్మిత్ ఎల్బీడబ్ల్యూ భయంకరమైన నిర్ణయం’ అన్నాడు. ఇది ఐపీఎల్ నియమావళిని ఉల్లంఘించడమేనని గవర్నింగ్ కౌన్సిల్ పేర్కొంది. -
రాయల్గా గెలిచిన బెంగళూరు
పూణే: అన్ని విభాగాల్లో సమిష్టిగా రాణించడంతో కీలకమైన ఎలిమినేటర్ మ్యాచ్లో 71పరుగుల తేడాతో బెంగళూరు ఘన విజయం సాధించింది. డివిలియర్స్, మన్దీప్ల ల తుఫాను ఇన్నింగ్స్కి తోడు బౌలర్లు కూడా రాణించడంతో బెంగళూరు సునాయాసంగా గెలుపొందింది. 181 పరుగుల విజయ లక్ష్యంతో బరిలో దిగిన రాజస్తాన్లో రహానే(39 బంతుల్లో 42; 4 ఫోర్లు) మినహా ఎవరూ ఆకట్టుకోలేక పోయారు.14 పరుగుల వద్ద వాట్సన్(10) అరవింద్ బౌలింగ్లో స్లిప్లోకి క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన శామ్సన్(5) వెంటనే హర్షల్ బౌలింగ్లో వెనుదిరిగాడు. స్మిత్(12), కరుణ్(12), ఫాల్క్నర్(4), బిన్నీ(0),మోరీస్(0), హుడా(11), కులకర్ణి(3) పరుగులకే అవుటయ్యారు. దీంతో రాజస్తాన్ 19 ఓవర్లలో109పరుగులు చేసి ఆలౌటైంది. చాహల్, అరవింద్, వీస్, హర్షల్లకు తలా రెండు వికెట్లు లభించగా, స్టార్క్కి ఒక వికెట్ లభించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్న బెంగళూరు 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 180 పరుగులు చేసింది. డివిలియర్స్(38 బంతుల్లో 66; 4 ఫోర్; 4 సిక్స్) , మన్దీప్ల(34 బంతుల్లో 54; 7 ఫోర్; 2 సిక్స్) జోడి మెరుపు ఇన్నింగ్స్ ఆడటంతో 181 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. వీరిజోడి 113 పరుగల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పడంతో బెంగళూరు భారీ స్కోరు చేసింది. ఓపెనర్లుగా వచ్చిన కోహ్లి, గేల్ల జోడీ 41 పరుగుల భాగస్వామ్యంతో శుభారంభం ఇచ్చింది. గేల్(26 బంతుల్లో27; 4 ఫోర్; 1 సిక్స్), కోహ్లి(12)లు వెంట వెంటనే అవుటవ్వడంతో స్కోరు వేగం తగ్గింది. ఒక దశలో బెంగళూరు స్కోరు 10 ఓవర్లకి 60/2 పరుగులు మాత్రమే ఉంది. మొదట్లో నిదానంగా ఆడిన డివిలియర్స్, మన్దీప్ల జోడి ఆ తర్వాత స్కోరు వేగం పెంచారు. ఏకంగా 113 పరుగుల భాగస్వామ్యంతో జట్టును ఆదుకున్నారు. 159 పరుగుల వద్ద రెండో రన్ కి ప్రయత్నించి డివిలియర్స్(66) ఔట్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన కార్తీక్(8) సిక్సర్ కి ప్రయత్నించి ఔటయ్యాడు. మన్దీప్ల(54), సర్ఫరాజ్(1) పరుగులతో నాటౌట్గా నిలిచారు. రాజస్తాన్ బౌలింగ్ లో కులకర్ణికి 2 వికెట్లు, మోరీస్ కు ఒక వికెట్ లభించింది. మెరుపు ఇన్నింగ్స్ తో బెంగళూరును ఆదుకున్నడివిలియర్స్కి మ్యన్ ఆఫ్ ది మ్యాచ్ లభించింది. ఈ విజయంతో శుక్రవారం జరిగే క్వాలిఫయర్-2లో చెన్నైతో బెంగళూరు తలపడనుంది. -
రాజస్తాన్ టార్గెట్ 181
పూణే: ఐపీఎల్-8 ఎలిమినేటర్ మ్యాచ్లో భాగంగా రాజస్తాన్తో జరుగుతున్న కీలక మ్యాచ్లో బెంగళూరు 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 180 పరుగులు చేసింది. మూడో వికెట్కి డివిలియర్స్(38 బంతుల్లో 66; 4 ఫోర్; 4 సిక్స్) , మన్దీప్ల(34 బంతుల్లో 54; 7 ఫోర్; 2 సిక్స్) జోడి మెరుపు ఇన్నింగ్స్ ఆడటంతో 181 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. వీరిజోడి 113 పరుగల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పడంతో బెంగళూరు భారీ స్కోరు చేసింది. టాస్ గెలిచిన బెంగళూరు తొలుత బ్యాటింగ్కు దిగింది. ఓపెనర్లుగా వచ్చిన కోహ్లి, గేల్ల జోడీ 41 పరుగుల భాగస్వామ్యంతో శుభారంభం ఇచ్చింది. రెండో ఓవర్లోనే రనౌట్ అయ్యే అవకాశం నుంచి తృటిలో తప్పించుకున్న గేల్(26 బంతుల్లో27; 4 ఫోర్; 1 సిక్స్) ఎక్కువసేపు క్రీజ్లో నిలువలేకపోయాడు. కులకర్ణి బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. కులకర్ణి వేసిన తరువాతి ఓవర్లోనే కోహ్లి(12) బౌలర్కే క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. వెంట వెంటనే వీరిద్దరూ అవుటవ్వడంతో స్కోరు వేగం తగ్గింది. ఒక దశలో బెంగళూరు స్కోరు 10 ఓవర్లకి 60/2 పరుగులు మాత్రమే ఉంది. మొదట్లో నిదానంగా ఆడిన డివిలియర్స్, మన్దీప్ల జోడి ఆ తర్వాత స్కోరు వేగం పెంచారు. 159 పరుగుల వద్ద రెండో రన్ కి ప్రయత్నించి డివిలియర్స్(66) ఔట్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన కార్తీక్(8) సిక్సర్ కి ప్రయత్నించి ఔటయ్యాడు. మన్దీప్ల(54), సర్ఫరాజ్(1) పరుగులతో నాటౌట్గా నిలిచారు. రాజస్తాన్ బౌలింగ్ లో కులకర్ణికి 2 వికెట్లు, మోరీస్ కు ఒక వికెట్ లభించింది. -
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నబెంగళూరు
పూణే: ఐపీఎల్-8 లో భాగంగా మహారాష్ర్ట క్రికెట్ సంఘం మైదానంలో బుధవారం రాజస్తాన్ రాయల్స్ తో జరుగుతున్న మ్యాచ్లో, బెంగళూరు రాయల్ చాలెంజర్స్ జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఎలిమినేటర్ మ్యాచ్ కావడంతో ఇరు జట్లు చావోరేవో తేల్చుకోనున్నాయి. ఆరంభంలో వరుస విజయాలతో చెలరేగిన రాజస్తాన్ రాయల్స్ టోర్నీ సాగేకొద్దీ క్రమంగా తడబడి చివరి మ్యాచ్లో విజయంతో ప్లే ఆఫ్కు చేరింది. మరోవైపు బెంగళూరు రాయల్ చాలెంజర్స్ కూడా ఒడిదుడుకులు ఎదుర్కొన్నా సునాయాసంగానే నాకౌట్ దశకు వచ్చింది. అయితే తమ ఆఖరి మ్యాచ్లో గెలిస్తే రెండో స్థానంలో నిలిచి తొలి క్వాలిఫయర్ ఆడే స్థితిలో ఉన్న కోహ్లి సేన... వర్షం కారణంగా మ్యాచ్ రద్దు కావడంతో మూడో స్థానంతో సరిపెట్టుకుని ఎలిమినేటర్ ఆడబోతోంది. గెలిచిన జట్టు రేసులో మిగులుతుంది. ఓడిన జట్టు ఇంటికి చేరుతుంది. నేడు జరిగే ఎలిమినేటర్లో గెలిచిన జట్టుతో శుక్రవారం జరిగే క్వాలిఫయర్-2లో ధోనిసేన తలపడుతుంది. రాజస్తాన్ రాయల్స్: స్మిత్ (కెప్టెన్), రహానే, వాట్సన్, శామ్సన్, నాయర్, ఫాల్క్నర్, హుడా, బిన్నీ, మోరిస్, కులకర్ణి, తాంబే. బెంగళూరు రాయల్ చాలెంజర్స్: కోహ్లి (కెప్టెన్), గేల్, డివిలియర్స్, మన్దీప్, కార్తీక్, సర్ఫరాజ్, వీస్, స్టార్క్, హర్షల్, చాహల్, అరవింద్. -
ధోనీకి జరిమానా
న్యూఢిల్లీ: చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్, కీపర్ మహేంద్ర సింగ్ ధోనీకి జరిమానా విధించారు. ఐపీఎల్-8 లో భాగంగా మంగళవారం రాత్రి ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్ ఓటమి అనంతరం అంపైర్ల నిర్ణయాలపై కామెంట్లు చేసినందుకు మ్యాచ్ ఫీజులో 10 శాతం కోత విధించారు. ఎప్పుడూ వివాదాలకు దూరంగా నిలిచే మహేంద్రుడు ముంబైతో మ్యాచ్ అనంతరం మాత్రం తన అసహనాన్ని వ్యక్తం చేసి జరిమానాకు గురవడం విశేషం. చెన్నై ఓపెనర్ డ్వేన్ స్మిత్ ముంబై ఇండియన్స్ బౌలర్ మలింగ బౌలింగలో అవుటయినట్లు ఇచ్చిన అంపైర్ల నిర్ణయాన్ని ధోనీ తప్పుబట్టాడు. రిప్లేలో చూసినట్లయితే ఆ బంతి లెగ్ సైడ్ కు దూరంగా వెళ్తోన్నట్లు స్పష్టంగా కనిపించింది. మ్యాచ్ ముగిసిన అనంతరం స్మిత్ ను ఔట్ అని ప్రకటించడాన్ని తప్పుపడుతూ ధోనీ ఈ కామెంట్ చేశాడు. బుధవారం రాజస్థాన్ రాయల్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్లలో గెలిచిన టీమ్తో శుక్రవారం క్వాలిఫయర్-2 మ్యాచ్ ఆడనుంది. అయితే ఈ మ్యాచ్ ధోనీ సొంత గ్రౌండ్ రాంఛీలో జరగనుండటం చెన్నైకి కలిసొచ్చే అంశం. మంగళవారం జరిగిన మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ ని 25 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్ చిత్తు చేసిన విషయం తెలిసిందే. -
ఫైనల్లో ముంబై ఇండియన్స్
-
ఫైనల్లో ముంబై ఇండియన్స్
-
‘రాయల్’గా నిలిచేదెవరో!
► నేడు ఐపీఎల్ ఎలిమినేటర్ ► రాజస్తాన్తో బెంగళూరు ఢీ క్రిస్ గేల్, డివిలియర్స్, కోహ్లి ఒకవైపు... రహానే, వాట్సన్, స్మిత్ మరోవైపు... ఐపీఎల్లో రెండు పటిష్టమైన టాప్ ఆర్డర్ల మధ్య నేడు పోరాటం జరగనుంది. ఓడిన జట్టు ఇంటికి వెళ్లాల్సిన పరిస్థితి కాబట్టి రెండు జట్లు సర్వశక్తులూ ఒడ్డుతాయి. మరి ‘రాయల్’గా మిగిలేదెవరో చూడాలి. పుణే : ఆరంభంలో వరుస విజయాలతో చెలరేగిన రాజస్తాన్ రాయల్స్ టోర్నీ సాగేకొద్దీ క్రమంగా తడబడి చివరి మ్యాచ్లో విజయంతో ప్లే ఆఫ్కు చేరింది. మరోవైపు బెంగళూరు రాయల్ చాలెంజర్స్ కూడా ఒడిదుడుకులు ఎదుర్కొన్నా సునాయాసంగానే నాకౌట్ దశకు వచ్చింది. అయితే తమ ఆఖరి మ్యాచ్లో గెలిస్తే రెండో స్థానంలో నిలిచి తొలి క్వాలిఫయర్ ఆడే స్థితిలో ఉన్న కోహ్లి సేన... వర్షం కారణంగా మ్యాచ్ రద్దు కావడంతో మూడో స్థానంతో సరిపెట్టుకుని ఎలిమినేటర్ ఆడబోతోంది. గెలిచిన జట్టు రేసులో మిగులుతుంది. ఓడిన జట్టు ఇంటికి చేరుతుంది. రెండు జట్లూ చావోరేవో తేల్చుకోవాల్సిన ఈ మ్యాచ్ మహారాష్ర్ట క్రికెట్ సంఘం మైదానంలో బుధవారం జరుగుతుంది. స్మిత్ సారథ్యంలోనే... ఆస్ట్రేలియా క్రికెటర్ స్టీవ్ స్మిత్ ఇప్పటివరకూ కెప్టెన్గా ఎక్కడా ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు. ఆస్ట్రేలియాకు, రాయల్స్కు కెప్టెన్గా వ్యవహరించిన అన్ని మ్యాచ్ల్లోనూ స్మిత్ జట్టే గెలిచింది. పైకి చెప్పకపోయినా ఆఖరి లీగ్ మ్యాచ్కు స్మిత్ను కెప్టెన్గా ఎంపిక చేయడానికి ఇదే కారణం కావచ్చు. వరుస ఓటములతో డీలా పడిన జట్టు కోల్కతాతో మ్యాచ్లో స్మిత్ను సారథిగా ఎంపిక చేసి విజయంతో ఊపిరి పీల్చుకుంది. ఇప్పుడు నాకౌట్ దశ కాబట్టి అదే సెంటిమెంట్ను కొనసాగిస్తూ మరోసారి స్మిత్ సారథ్యంలోనే బరిలోకి దిగనుంది. బ్యాటింగ్లో వాట్సన్ ఫామ్లోకి రావడం, రహానే టోర్నీ అంతటా నిలకడగా ఆడటం రాయల్స్కు కలిసొచ్చే అంశం. ఫాల్క్నర్ మెరుపులు పూర్తి స్థాయిలో బయటకు రాలేదు. శామ్సన్, దీపక్ హుడా, స్టువర్ట్ బిన్నీ, అభిషేక్ నాయర్ లాంటి బ్యాట్స్మెన్ ఎవరూ ఇప్పటివరకూ తమ సత్తా బయటపెట్టలేదు. ఈ మ్యాచ్లో వీళ్లు కుదురుకుంటే రాయల్స్కు సమస్య ఉండదు. బౌలింగ్లో మోరిస్, కులకర్ణి, ప్రవీణ్ తాంబే కీలకం. గత మ్యాచ్లో తాంబే ఆడలేదు. ఈ మ్యాచ్లో ఈ వెటరన్ లెగ్స్పిన్నర్ తుది జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. ఆ ముగ్గురిలో ఇద్దరు ఆడాలి బ్యాటింగ్లో బెంగళూరు బలం అంతా టాప్ ఆర్డరే. గేల్, డివిలియర్స్, కోహ్లి ముగ్గురూ మంచి ఫామ్లోనే ఉన్నారు. ఈ ముగ్గురిలో ఏ ఇద్దరు ఒక్క మంచి భాగస్వామ్యం నెలకొల్పినా బెంగళూరు పరుగుల వరద పారిస్తుంది. యువ క్రికెటర్ సర్ఫరాజ్, మన్దీప్ కూడా ఫర్వాలేదనిపిస్తున్నారు. అయితే దినేశ్ కార్తీక్ మాత్రం జట్టుకు భారంగానే కనిపిస్తున్నాడు. ఇప్పటివరకూ ఒక్కటి కూడా చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడలేదు. ఇక బౌలింగ్లో స్టార్క్ పైనే ప్రధానంగా ఆశలు ఉన్నాయి. లెగ్స్పిన్నర్ చాహల్తో పాటు ఆల్రౌండర్ వీస్, హర్షల్ పటేల్ కూడా నిలకడగానే రాణిస్తున్నారు. శ్రీనాథ్ అరవింద్ గాయం నుంచి కోలుకుంటే అశోక్ దిండా పెవిలియన్కు పరిమితం కావొచ్చు. జట్లు (అంచనా) రాజస్తాన్ రాయల్స్: స్మిత్ (కెప్టెన్), రహానే, వాట్సన్, శామ్సన్, నాయర్, ఫాల్క్నర్, హుడా, బిన్నీ, మోరిస్, కులకర్ణి, తాంబే. బెంగళూరు రాయల్ చాలెంజర్స్: కోహ్లి (కెప్టెన్), గేల్, డివిలియర్స్, మన్దీప్, కార్తీక్, సర్ఫరాజ్, వీస్, స్టార్క్, హర్షల్, చాహల్, అరవింద్/దిండా. సీజన్లో అహ్మదాబాద్లో జరిగిన మ్యాచ్లో బెంగళూరు 9 వికెట్లతో రాజస్తాన్పై గెలిచింది. బెంగళూరులో జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. -
ముంబై ‘విన్’డియన్స్
► ఐపీఎల్ ఫైనల్కు ముంబై ఇండియన్స్ ► క్వాలిఫయర్-1లో చెన్నైపై విజయం ► చెలరేగిన సిమ్మన్స్, పొలార్డ్ ఆ జట్టేనా ఇది..! టోర్నీలో వరుసగా ఆడిన తొలి నాలుగు మ్యాచ్లూ ఓడిన జట్టు... కోల్కతా చేతిలో ఓటమి అంచుల్లోంచి తేరుకుని ప్లే ఆఫ్ రేసులో నిలబడ్డ జట్టు... ఐపీఎల్లో ముందే ఫైనల్కు చేరింది. వరుస విజయాలతో జోరుమీదున్న ముంబై ఇండియన్స్... క్వాలిఫయర్-1లో పటిష్టమైన చెన్నైని మట్టికరిపించింది. సిమ్మన్స్, పొలార్డ్ల బ్యాటింగ్ మెరుపులకు... బౌలర్ల సమష్టి కృషి తోడవడంతో రోహిత్సేన ఆదివారం జరిగే ఫైనల్కు బెర్త్ ఖరారు చేసింది. అటు చెన్నై ఈ మ్యాచ్ ఓడినా ఫైనల్కు చేరే అవకాశం మిగిలే ఉంది. నేడు జరిగే ఎలిమినేటర్లో గెలిచిన జట్టుతో శుక్రవారం జరిగే క్వాలిఫయర్-2లో ధోనిసేన తలపడుతుంది. ముంబై : ఏమాత్రం ఉత్కంఠ లేదు.. నువ్వా? నేనా? అనే రీతిలో సాగుతుందనుకున్న సమఉజ్జీల సమరం పూర్తిగా ఏకపక్షంగా సాగింది. అనూహ్య ఆటతీరుతో అదరగొడుతున్న ముంబై ఇండియన్స్ సొంత మైదానంలో మరోసారి చెలరేగింది. ఆల్రౌండ్ షోతో సగర్వంగా టైటిల్ పోరుకు అర్హత సాధించింది. మంగళవారం వాంఖడే మైదానంలో జరిగిన తొలి ప్లే ఆఫ్ మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ను 25 పరుగుల తేడాతో మట్టికరిపించింది. టాస్ నెగ్గి బ్యాటింగ్కు దిగిన ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో ఆరు వికెట్లకు 187 పరుగులు చేసింది. లెండిల్ సిమ్మన్స్ (51 బంతుల్లో 65; 3 ఫోర్లు; 5 సిక్సర్లు), పార్థీవ్ పటేల్ (25 బంతుల్లో 35; 4 ఫోర్లు; 1 సిక్స్) రాణించగా... చివర్లో పొలార్డ్ (17 బంతుల్లో 41; 1 ఫోర్; 5 సిక్సర్లు) తుఫాన్ ఇన్నింగ్స్ ఆడాడు. బ్రేవోకు మూడు వికెట్లు దక్కాయి. అనంతరం బ్యాటింగ్కు దిగిన చెన్నై 19 ఓవర్లలో 162 పరుగులకు ఆలౌట్ అయ్యింది. డు ప్లెసిస్ (34 బంతుల్లో 45; 5 ఫోర్లు; 1 సిక్స్) టాప్ స్కోరర్. మలింగకు మూడు, హర్భజన్, వినయ్లకు రెండేసి వికెట్లు దక్కాయి. ఆరంభం, ముగింపు అదుర్స్: ముంబైకి ఓపెనర్లు శుభారంభం అందించారు. అశ్విన్ వేసిన ఐదో ఓవర్లో సిమ్మన్స్ రెండు భారీ సిక్స్లతో ఊపు తెచ్చాడు. నేగి వేసిన తొమ్మిదో ఓవర్లో పార్థీవ్ దూకుడుగా ఆడి 6,4,4తో మొత్తం 16 పరుగులు రాబట్టాడు. అటు సిమ్మన్స్ 38 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేశాడు. నిలకడగా ఆడుతున్న ఈ జోడీని డ్వేన్ బ్రేవో విడదీశాడు. స్లో బంతిని ఆడబోయిన పార్థీవ్ లాంగ్ ఆన్లో జడేజాకు చిక్కాడు. దీంతో తొలి వికెట్కు 90 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. కొద్ది సేపటికే సిమ్మన్స్ కూడా జడేజా బౌలింగ్లో అవుటయ్యాడు. బ్రేవో తన మరుసటి ఓవర్లో మరో స్లో బంతికి కెప్టెన్ రోహిత్ (14 బంతుల్లో 19; 1 ఫోర్; 1 సిక్స్)ను వెనక్కి పంపాడు. ఆ తర్వాతి ఓవర్లోనే హార్ధిక్ పాండ్యా (1)ను నెహ్రా అవుట్ చేయడంతో ముంబై ఇబ్బందుల్లో పడింది. అయితే పొలార్డ్ మాత్రం నేగి బౌలింగ్లో రెండు సిక్స్లు, బ్రేవో బౌలింగ్లో ఓ సిక్స్తో ఆకట్టుకున్నాడు. రాయుడు (8 బంతుల్లో 10; 1 ఫోర్) విఫలమైనా... పొలార్డ్ జోరుకు ఆఖరి మూడు ఓవర్లలో 46 పరుగులు వచ్చాయి. వరుస విరామాల్లో వికెట్లు : భారీ లక్ష్య ఛేదనకు బరిలోకి దిగిన చెన్నైకి తొలి ఓవర్లోనే అంపైర్ తప్పిదంతో షాక్ ఎదురైంది. మలింగ వేసిన బంతి లెగ్సైడ్కు ఆవల డ్వేన్ స్మిత్ ప్యాడ్లకు తగిలినప్పటికీ అంపైర్ దాన్ని ఎల్బీగా ప్రకటించాడు. ఇన్నింగ్స్ ఆరో ఓవర్లో వినయ్.. హస్సీ (11 బంతుల్లో 16; 1 ఫోర్; 1 సిక్స్)ని అవుట్ చేశాడు. మధ్య ఓవర్లలో ముంబై బౌలర్లు కట్టుదిట్టమైన బంతులకు పరుగులు రావడం కష్టమయ్యాయి. తొమ్మిదో ఓవర్లో రైనా సిక్స్, డు ప్లెసిస్ ఫోర్తో 13 పరుగులు వచ్చాయి. అయితే 11వ ఓవర్లో హర్భజన్ వరుస బంతుల్లో రైనా (20 బంతుల్లో 25; 2 సిక్సర్లు), ధోనిని పెవిలియన్కు చేర్చాడు. 14వ ఓవర్లో డు ప్లెసిస్ అవుట్ కావడంతో చెన్నై మ్యాచ్పై ఆశలు వదులుకుంది. చివరి ఐదు ఓవర్లలో 67 పరుగులు కావాల్సిన దశలో ఏమాత్రం పోరాడలేకపోయింది. అశ్విన్ (12 బంతుల్లో 23; 2 ఫోర్లు; 1 సిక్స్) కాసేపు పోరాడినా... ఈ సీజన్లో చెన్నై తొలిసారి ఆలౌట్ కాకుండా ఆపలేకపోయాడు. స్కోరు వివరాలు : ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: సిమ్మన్స్ (సి) నేగి (బి) జడేజా 65; పార్థీవ్ (సి) జడేజా (బి) బ్రేవో 35; రోహిత్ (సి) జడేజా (బి) బ్రేవో 19; పొలార్డ్ (సి) రైనా (బి) బ్రేవో 41; పాండ్య (సి) జడేజా (బి) నెహ్రా 1; రాయుడు (సి) రైనా (బి) మోహిత్ 10; హర్భజన్ నాటౌట్ 6; సుచిత్ నాటౌట్ 1; ఎక్స్ట్రాలు 9; మొత్తం (20 ఓవర్లలో ఆరు వికెట్లకు) 187. వికెట్ల పతనం : 1-90, 2-113, 3-137, 4-139, 5-164, 6-185. బౌలింగ్ : అశ్విన్ 3-0-22-0; నెహ్రా 4-0-28-1; నేగి 4-0-46-0; జడేజా 2-0-18-1; మోహిత్ 3-0-33-1; బ్రేవో 4-0-40-3. చెన్నై సూపర్ కింగ్స్ ఇన్నింగ్స్ : స్మిత్ ఎల్బీడబ్ల్యు (బి) మలింగ 0; హస్సీ (సి) పార్థీవ్ (బి) వినయ్ 16; డు ప్లెసిస్ (సి) వినయ్ (బి) సుచిత్ 45; రైనా (సి అండ్ బి) హర్భజన్ 25; ధోని ఎల్బీడబ్ల్యు (బి) హర్భజన్ 0; బ్రేవో (రనౌట్) 20; జడేజా (సి) సుచిత్ (బి) మెక్లెనెగాన్ 19; నేగి (సి) సబ్ ఉన్ముక్త్ (బి) వినయ్ 3; అశ్విన్ (సి) రాయుడు (బి) మలింగ 23; మోహిత్ నాటౌట్ 3; నెహ్రా (సి) సిమ్మన్స్ (బి) మలింగ 0; ఎక్స్ట్రాలు 8; మొత్తం (19 ఓవర్లలో ఆలౌట్) 162. వికెట్ల పతనం : 1-0, 2-46, 3-86, 4-86, 5-110, 6-119, 7-126, 8-147, 9-161, 10-162. బౌలింగ్ : మలింగ 4-0-23-3; మెక్లెనెగన్ 3-0-46-1; వినయ్ 3-0-26-2; హర్భజన్ 4-0-26-2; పొలార్డ్ 3-0-22-0; సుచిత్ 2-0-18-1. -
ఫైనల్లో ముంబై ఇండియన్స్
ముంబై:ఐపీఎల్-8లో భాగంగా ఇక్కడ చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన తొలి క్వాలిఫయర్ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ 25 పరుగుల తేడాతో విజయం సాధించి ఫైనల్ కు చేరింది. ముంబై విసిరిన 188 పరుగుల విజయలక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన చెన్నైకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. డ్వేన్ స్మిత్ డకౌట్ రూపంలో తొలి వికెట్ గా వెనుదిరిగి అభిమానుల్ని నిరాశపరిచాడు.ఆ తరువాత మైక్ హస్పీ(16)పరుగులు చేసి అదే బాటలో పయనించడంతో చెన్నైకు కష్టాల్లో పడింది. మైక్ హస్సీ అవుటయ్యే సరికి చెన్నై స్కోరు 46. ఆ తరుణంలో డుప్లెసిస్ కు జతకలిసిన సురేష్ రైనా చెన్నై ఇన్నింగ్స్ కు మరమ్మత్తులు చేపట్టాడు.వీరిద్దరు కలిసి 35 పరుగులు భాగస్వామ్యాన్ని నెలకొల్పిన అనంతరం రైనా(25)పరుగులు చేసి హర్బజన్ బౌలింగ్ లో వెనుదిరిగాడు. ఆ తదుపరి బంతికే కెప్టెన్ మహేంద్ర సింగ్ డకౌట్ రూపంలో పెవిలియన్ కు చేరాడు.అటు తరువాత ఎన్నో ఆశలు పెట్టుకున్న బ్రేవో (20), నేగీ (3), రవీంద్ర జడేజా(19) కూడా విఫలం చెందడంతో చెన్నై 19 ఓవర్లలో చెన్నై 162 పరుగులకే పరిమితమై ఓటమి పాలైంది. ముంబై బౌలర్లలో మలింగాకు మూడు వికెట్లు లభించగా, హర్భజన్ సింగ్, వినయ్ కుమార్ లు చెరో రెండు వికెట్లు, సుచిత్, మెక్ లాగాహన్ లకు తలో వికెట్ లభించింది. అంతకుముందు టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ 187 పరుగులు చేసింది. సిమ్మన్స్(65), పార్థీవ్ పటేల్(35)లు రాణించడంతో ముంబైకు శుభారంభం లభించింది. కాగా, అనంతరం పాండ్యా(1), రోహిత్ శర్మ(19) లు ఆకట్టుకోలేకపోయారు. మధ్యలో పొలార్డ్(41) ముంబై భారీ స్కోరు చేయడంలో సహకరించాడు. -
తొమ్మిది ఓవర్లలో చెన్నై స్కోరు 79/2
ముంబై:ఐపీఎల్-8 లో భాగంగా ఇక్కడ ముంబై ఇండియన్స్ తో జరుగుతున్న తొలి క్వాలిఫయర్ మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ తొమ్మిది ఓవర్లు ముగిసే సరికి రెండు కోల్పోయి 79 పరుగులు చేసింది. ముంబై విసిరిన 188పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన చెన్నైకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. డ్వేన్ స్మిత్ డకౌట్ గా వెనుదిరిగి అభిమానులను నిరాశపరిచాడు. తరువాత మైక్ హస్సీ(16)పరుగులు చేసి పెవిలియన్ కు చేరాడు. ఆ తరుణంలో డుప్లెసిస్ కు జత కలిసిన సురేష్ రైనా ఇన్నింగ్స్ మర్మమత్తులు చేపట్టాడు. ప్రస్తుత డు ప్లెసిస్ (39),రైనా(20)క్రీజ్ లో ఉన్నారు. -
చెన్నై విజయలక్ష్యం 188
ముంబై: ఐపీఎల్-8 లో భాగంగా ఇక్కడ చెన్నై సూపర్ కింగ్స్ తో జరుగుతున్న తొలి క్వాలిఫయర్ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ 188 పరుగుల లక్ష్యాన్ని ప్రత్యర్థికి నిర్దేశించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ముంబైకు ఓపెనర్లు శుభారంభం అందించారు. సిమ్మన్స్(65), పార్థీవ్ పటేల్(35)పరుగులు చేశారు. అనంతరం పాండ్యా(1), రోహిత్ శర్మ(19) లు ఆకట్టుకోలేకపోయారు. అయితే పొలార్డ్(41), అంబటి రాయుడు (10), హర్భజన్(6), సుచిత్(1) పరుగులు చేయడంతో ముంబై నిర్ణీత ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 187 పరుగులు చేసింది. చెన్నై బౌలర్లలో బ్రేవో మూడు వికెట్లు తీయగా, నెహ్రా, జడేజా,మోహిత్ శర్మలకు తలో వికెట్ లభించింది. -
దూకుడుగా ఆడుతున్న ముంబై
ముంబై:ఐపీఎల్-8 లో భాగంగా ఇక్కడ చెన్నై సూపర్ కింగ్స్ తో జరుగుతున్న తొలి క్వాలిఫయర్ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ దూకుడుగా ఆడుతోంది. 15 ఓవర్లు ముగిసే సరికి రెండు వికెట్లు కోల్పోయి 135 పరుగులు చేసింది, ముంబై ఓపెనర్లు సిమ్మన్స్(65), పార్థీవ్ పటేల్(35) పెవిలియన్ కు చేరారు. అనంతరం రోహిత్ శర్మ(17),పొలార్డ్(14) బ్యాటింగ్ కొనసాగిస్తున్నారు.ముంబై ఇండియన్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఇందులో విజేతగా నిలిచే జట్టు నేరుగా ఫైనల్ కు ప్రవేశిస్తుంది. -
పది ఓవర్లలో ముంబై స్కోరు 86/0
ముంబై:ఐపీఎల్-8 లో భాగంగా ఇక్కడ చెన్నై సూపర్ కింగ్స్ తో జరుగుతున్న తొలి క్వాలిఫయర్ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ పది ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టపోకుండా 86 పరుగులు చేసింది. ముంబై ఓపెనర్లు సిమ్మన్స్(50), పార్థీవ్ పటేల్(32)పరుగులతో క్రీజ్ లో ఉన్నారు. ముంబై ఇండియన్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఇందులో విజేతగా నిలిచే జట్టు నేరుగా ఫైనల్ కు ప్రవేశిస్తుంది. -
బ్యాటింగ్ ఎంచుకున్న ముంబై
ముంబై:ఐపీఎల్-8లో భాగంగా ఇక్కడ చెన్నై సూపర్ కింగ్స్ తో జరుగుతున్న తొలి క్వాలిఫయర్ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఇందులో విజేతగా నిలిచే జట్టు నేరుగా ఫైనల్ కు ప్రవేశిస్తుంది. .రెండు సార్లు చాంపియన్గా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్ మూడో టైటిల్ ను కైవశం చేసుకునే క్రమంలో తొలి అడ్డంకిని అధిగమించాలనే భావిస్తుండగా, చెన్నైను కట్టడి చేసి ఫైనల్ బెర్తును ముందుగానే ఖరారు చేసుకోవాలని ముంబై యోచిస్తోంది. -
ఫైనల్ కు చేరేదెవరో?
ముంబై: ఐపీఎల్లో సమ ఉజ్జీలుగా పరిగణించబడుతున్న ముంబై ఇండియన్స్ - చెన్నై సూపర్ కింగ్స్ ల మధ్య మరి కాసేపట్లో కీలక పోరుకు తెరలేవనుంంది. వాంఖడే స్టేడియంలో మంగళవారం ఇక్కడ జరిగే తొలి క్వాలిఫయర్లో ఈ రెండు జట్లు తలపడనున్నాయి. ఇందులో విజేతగా నిలిచే జట్టు నేరుగా ఫైనల్ కు ప్రవేశిస్తుంది. రెండు సార్లు చాంపియన్గా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్ మూడో టైటిల్ ను కైవశం చేసుకోవడానికి సమాయత్తమవుతుండగా, టోర్నీలో నిలకడగా రాణించిన ముంబై ముందుగా ఫైనల్ కు చేరాలని భావిస్తోంది. దీంతో ఇరు జట్ల మధ్య తొలి పోరు ఆసక్తిగా జరిగే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇరు జట్ల బలాబలాలను పరిశీలిస్తే.. చెన్నై సూపర్ కింగ్స్ : జట్టు బ్యాటింగ్ ప్రధానంగా డ్వేన్ స్మిత్, సురేష్ రైనా, డు ప్లెసిస్లపై ఆధార పడి ఉంది. వీరిలో స్మిత్, డు ప్లెసిస్ లు మంచి ఫామ్ లో ఉండగా, రైనా కూడా తనదైన రోజున ఆకట్టుకుంటున్నాడు. అయితే కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ మాత్రం ఇప్పటివరకూ పెద్దగా ప్రభావం చూపలేదు. ధోనీ సీజన్ మొత్తంగా రెండు సార్లు మాత్రమే 30కి పైగా స్కోర్లు నమోదు చేశాడు. మరో ఆటగాడు నేగీ చివర్లో కాస్త దూకుడుగానే ఆడుతున్నాడు. నేటి మ్యాచ్ లో బ్రెండెన్ మెకల్లమ్ లేకపోవడం చెన్నైకు తీరని నష్టంగా చెప్పవచ్చు.గాయం కారణంగా మెకల్లమ్ బెంచ్ కే పరిమితమవుతున్నాడు కాగా, అతని స్థానంలో జట్టులోకి వచ్చిన మైక్ హస్సీ రాణిస్తే మాత్రం చెన్నైవిజయం సాధించే అవకాశం ఉంది. పేస్ విభాగంలో నెహ్రాకు బ్రేవో అండగా నిలుస్తుండగా, స్పిన్లో నేగి, అశ్విన్ కీలకం కానున్నారు. ముంబై ఇండియన్ప్ : ఐపీఎల్ ఆరంభంలో పేలవంగా ఆడిన వరుస ఓటములు మూటగట్టుకున్న ముంబై ఆ తర్వాత నిలకడగా రాణించింది. బ్యాటింగ్, ఫీల్డింగ్, బౌలింగ్ విభాగాల్లో సూపర్ ఫామ్ ను కొనసాగిస్తున్న ముంబై ఈ మ్యాచ్ లో గెలిచి ఫైనల్ బెర్తును ఖరారు చేసుకోవాలని యోచిస్తోంది. సొంతగడ్డపై మ్యాచ్ జరుగుతుండటం ముంబై కు లాభించే అవకాశం ఉంది. ముంబై టీమ్ లో ఓపెనర్లు సిమన్స్, పార్థివ్ లు శుభారంభాన్నివ్వడం కూడా జట్టుక కలిసొచ్చేదిగా కనబడుతోంది. మిడిల్ ఆర్డర్ లో రోహిత్ శర్మ , అంబటి రాయుడు, పొలార్డ్లు ముంబై బ్యాటింగ్ లో కీలక పాత్ర పోషిస్తున్నారు. మరో ఆటగాడు హార్దిక్ పాండ్యా ఒక్కసారిగా జట్టులో కీలక ఆటగాడిగా మారాడు. వరుస రెండు మ్యాచ్ ల్లో రాణించిన పాండ్యా మరోసారి బ్యాట్ ఝుళిపించాలని ముంబై కోరుకుంటోంది. దీంతో పాటు ప్రధాన పేసర్లు మలింగ, మెక్లీన్గన్లు తమ అటాకింగ్ బౌలింగ్ తో ప్రత్యర్థులకు చెమటలు పట్టిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇరు జట్ల మధ్య జరిగే తొలి క్వాలిఫయర్ మ్యాచ్ రసవత్తరంగా సాగే అవకాశం ఉంది. ఓడిన జట్టుకు మరో అవకాశం.. తొలి క్వాలిఫయర్ లో ఓడిన జట్టుకు మరో అవకాశం ఉంది. ఒకవేళ ఈ మ్యాచ్ లో ఓడిన జట్టు తన తదుపరి మ్యాచ్ లో అదృష్టాన్ని పరిక్షించుకోవడానికి మరో వీలు ఉంది. బుధవారం బెంగళూర్ రాయల్ చాలెంజర్స్- రాజస్థాన్ ల మధ్య ఎలిమినేటర్ మ్యాచ్ జరుగనుంది. వీటిలో గెలిచిన జట్టు.. నేడు ఓడిన జట్టుతో తలపడి ఫైనల్ చేరుకుంటుంది. ఈ నేపథ్యంలో ముంబై-చెన్నై లు పెద్దగా ఒత్తిడి లేకుండానే ఆడటానికి వారికి ఇదొక సువర్ణావకాశం. -
నేడు IPL తొలి క్వాలిఫయర్
-
డామిట్...కథ అడ్డం తిరిగింది
ఆ నాలుగు జట్లదీ స్వయంకృతం నిలకడలేమి ప్రధాన సమస్య జట్ల ఎంపికలోనూ తప్పులు ఐపీఎల్లో లీగ్ దశ ముగిసింది. గతేడాది ఫైనలిస్ట్లు కోల్కతా నైట్రైడర్స్, పంజాబ్ కింగ్స్ ఎలెవన్లతో పాటు ఢిల్లీ డేర్డెవిల్స్, సన్రైజర్స్ జట్లు తట్టాబుట్టా సర్దుకున్నాయి. ఈ నాలుగు జట్లలో కోల్కతా, హైదరాబాద్ ఆఖరి మ్యాచ్ ఫలితం వచ్చే వరకూ రేసులో ఉన్నాయి. కానీ ఢిల్లీ, పంజాబ్ కాస్త తొందరగానే వైదొలిగాయి. అసలు ఈ నాలుగు జట్లు చేసిన తప్పులేంటి? బాగా ఆడలేదా? లేక వ్యూహాలు దెబ్బతీశాయా? లీగ్ దశతోనే సరిపెట్టుకున్న నాలుగు జట్లపై సమీక్ష. సన్రైజర్స్ హైదరాబాద్ ఈ ఏడాది ఆరంభంలో 11 మంది పాత ఆటగాళ్లను వదిలేసిన సన్రైజర్స్ పది మంది కొత్తవారిని చేర్చుకుంది. వార్నర్కు నాయకత్వ బాధ్యతలు అప్పగించి కొత్త ఉత్సాహంతో బరిలోకి దిగింది. ఆరంభంలో బాగా తడబడింది. వైజాగ్లో ఆడిన మూడు హోమ్ మ్యాచ్లలో రెండు ఓడిపోయింది. తొలి ఆరు మ్యాచ్ల్లో నాలుగింట ఓటమి ఎదురైంది. దీంతో ఈ జట్టు ప్లే ఆఫ్కు చేరడం కష్టమే అనిపించింది. అయితే ఆ తర్వాత అనూహ్యంగా పుంజుకుంది. వార్నర్తో పాటు మోర్గాన్, హెన్రిక్స్ బ్యాట్ ఝళిపించడంతో మూడు వరుస విజయాలతో ప్లే ఆఫ్కు చేరువైంది. ఆఖరి రెండు మ్యాచ్ల్లో ఒక్కటి గెలిచినా ప్లే ఆఫ్కు వెళ్లే స్థితిలో హైదరాబాద్లో ఆడిన చివరి రెండు హోమ్ మ్యాచ్లలోనూ ఓడిపోయి నిరాశను మూటగట్టుకుంది. ఒక్కడిపైనే భారం ఈ సీజన్ అంతా పూర్తిగా కెప్టెన్ వార్నర్ ఒక్కడే బ్యాటింగ్ భారం మోయాల్సి వచ్చింది. ఏడు మ్యాచ్లు గెలిస్తే అందులో నాలుగింట వార్నర్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్గా నిలిచాడు. శిఖర్ ధావన్ ఫర్వాలేదనిపించినా... మిడిలార్డర్ వైఫల్యం దారుణంగా దెబ్బ తీసింది. దేశవాళీ క్రికెటర్లలో మంచి హిట్టర్ లేకపోవడం ఈ జట్టుకు పెద్ద మైనస్ పాయింట్. ‘అకాడమీ’లా ఉన్నా... బౌలింగ్ విషయంలో సన్రైజర్స్కు ఓ పెద్ద అకాడమీయే ఉంది. స్టెయిన్ జట్టులో ఉండగానే బౌల్ట్ను తెచ్చారు. ఈ ఇద్దరిలో ఎవరిని తుది జట్టులో ఆడించాలో తెలియని అయోమయంతోనే సీజన్ అయిపోయింది. దేశవాళీ బౌలర్లలో భువనేశ్వర్ మినహా అందరూ విఫలమే. ముఖ్యంగా ఇషాంత్ శర్మ ప్రత్యర్థులకు పరుగులు ఇవ్వడానికే జట్టులో ఉన్నట్లు కనిపించాడు. గత రెండు సీజన్లలో సంచలన ప్రదర్శన చూపించిన కరణ్శర్మ ఈసారి దారుణంగా విఫలమయ్యాడు. మొత్తం మీద సరైన జట్టు కూర్పు లేకపోవడం ఈ జట్టుకు ప్రధాన సమస్య. వచ్చే సీజన్కైనా ఒకరిద్దరు దేశవాళీ హిట్టర్స్ను జట్టులోకి తేవడం అవసరం. కోల్కతా నైట్రైడర్స్ విజయంతోనే సీజన్ను ఆరంభించిన డిఫెండింగ్ చాంపియన్ ఆరంభ దశలో బాగానే ఆడింది. వర్షం కారణంగా సన్రైజర్స్తో మ్యాచ్లో ఓడిపోవడం, ఆ వెంటనే రాజస్తాన్తో మ్యాచ్ రద్దు కావడంతో ఈ జట్టు లయను దెబ్బతీసింది. దీనికి తోడు స్పిన్నర్ సునీల్ నరైన్ టోర్నీ మధ్యలో మరోసారి అనుమానాస్పద బౌలింగ్ శైలి కారణంగా పరీక్షను ఎదుర్కొన్నాడు. అయితే తిరిగి పుంజుకుని వరుసగా మూడు మ్యాచ్ల్లో గెలిచి... ఆఖరి రెండు మ్యాచ్ల్లో ఒక్క పాయింట్ సాధించినా ప్లే ఆఫ్కు చేరే స్థితిలో పటిష్టంగా నిలిచింది. కానీ ముంబైలో వరుసగా చివరి రెండు మ్యాచ్లూ ఓడి ఇంటికి చేరింది. బ్యాటింగ్ వైఫల్యం కోల్కతా బలం దేశవాళీ బ్యాట్స్మన్. గంభీర్, ఉతప్ప, యూసుఫ్ పఠాన్, సూర్యకుమార్ యాదవ్, మనీష్ పాండే అందరూ మ్యాచ్ విన్నర్లే. గత సీజన్లో ఈ జట్టు టైటిల్ గెలవడంలో వీరిది కీలక పాత్ర. కానీ ఈ సారి ఏ ఒక్కరూ పూర్తి స్థాయిలో నిలకడ చూపలేకపోయారు. రస్సెల్ సరిగా ఆడకపోయుంటే పరిస్థితి దారుణంగా ఉండేది. అంతమంది ఎందుకో? ఈసారి కోల్కతా బృందంలో ఏకంగా ఏడుగురు స్పిన్నర్లు ఉన్నారు. ప్రతి మ్యాచ్లోనూ తుది జట్టులో ముగ్గురు లేదా నలుగురు బరిలోకి దిగారు. ఇంతమంది ఎందుకనేది అంతుచిక్కని వ్యూహం. బౌలర్లను రకరకాలుగా మార్చడం కూడా ప్రతికూల ఫలితాన్నిచ్చింది. ముఖ్యంగా చావోరేవో తేల్చుకోవాల్సిన ఆఖరి మ్యాచ్లో నరైన్ను ఎందుకు ఆడించలేదనేది పెద్ద మిస్టరీ. ముంబై ఇండియన్స్తో లీగ్ మ్యాచ్లో చివరి ఓవర్లో బంతులు వృథా చేసిన పీయూష్ చావ్లా ఈ జట్టు కొంప ముంచాడు. వచ్చే సీజన్కు జట్టు కూర్పును సరిజేసుకోవాలి. ఢిల్లీ డేర్డెవిల్స్ ఈ జట్టు బాధ వర్ణనాతీతం. గత ఏడాది పీటర్సన్, రాస్ టేలర్, విజయ్, కార్తీక్లాంటి ఖరీదైన ఆటగాళ్లతో ఆడి ఆఖరి స్థానంలో నిలిచిన ఢిల్లీ ఈ సారి భారీగా మార్పులు చేసింది. రూ.16 కోట్లతో యువరాజ్ను, రూ.7.5 కోట్లతో మాథ్యూస్ను తెచ్చుకుంది. డుమినిని కెప్టెన్గా ఎంపిక చేసి కొత్త జట్టుతో బరిలోకి దిగింది. కానీ ఫలితం మాత్రం పెద్దగా మారలేదు. గత సీజన్తో పోలిస్తే కాస్త అదనంగా మ్యాచ్లు గెలిచినా ప్లే ఆఫ్ రేసులో మాత్రం నిలవలేకపోయింది. యువరాజ్ వైఫల్యం భారీగా ఖర్చు చేసి యువరాజ్ను తీసుకోవడం వల్ల స్పాన్సర్లను ఢిల్లీ జట్టు ఆకర్షించింది. కానీ మైదానంలో మాత్రం యువరాజ్ పూర్తిగా నిరాశపరిచాడు. 14 మ్యాచ్ల్లో 248 పరుగులు మాత్రమే చేశాడు. ఇందులో ఒక్క మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ కూడా లేదు. యువ సంచలనం శ్రేయస్ అయ్యర్, డుమిని ఇద్దరూ నిలకడగా ఆడారు. మిగిలిన బ్యాట్స్మెన్ దాదాపుగా విఫలమయ్యారు. సౌరవ్ తివారీ, మనోజ్ తివారీలను సరిగ్గా ఉపయోగించుకోలేదు. ఆల్బీ మోర్కెల్ తొలి మ్యాచ్లోనే సంచలన ఇన్నింగ్స్ ఆడినా... మాథ్యూస్ కోసం త్యాగం చేయించారు. బౌలింగ్ ఫర్వాలేదు కౌల్టర్ నైల్, జహీర్ ఖాన్, ఇమ్రాన్ తాహిర్, అమిత్ మిశ్రాల రూపంలో ఢిల్లీ లైనప్ బాగానే ఉంది. అయితే బ్యాట్స్మెన్ నుంచి భారీ స్కోర్లు రాకపోవడంతో వీరిపై ఒత్తిడి పెరిగింది. దీనికి తోడు బౌలింగ్ లైనప్లో రకరకాల ప్రయోగాలు చేశారు. జట్టు కూర్పు సరిగ్గా లేకపోవడం ఢిల్లీని దారుణంగా దెబ్బతీసింది. వచ్చే సీజన్కు కొంతమంది ఖరీదైన ఆటగాళ్లను వదిలేసి మళ్లీ వేలానికి వెళ్లే అవకాశం ఉంది. పంజాబ్ కింగ్స్ ఎలెవన్ ఈ జట్టు ప్రస్థానం మరీ ఘోరం. గత ఏడాది ప్రతి ప్రత్యర్థినీ వణికించిన పంజాబ్ ఈసారి చేతులెత్తేసింది. గత సీజన్లో 14 మ్యాచ్లకు మూడు మాత్రమే ఓడిన పంజాబ్... ఈసారి 14 మ్యాచ్లకుగాను మూడు మాత్రమే గెలిచింది. జట్టు మొత్తం భారీ హిట్టర్లున్నా ఒక్కరు కూడా ఆకట్టుకోలేకపోయారు. మార్ష్, పెరీరాల సేవలను సరిగా వినియోగించుకోలేదు. మ్యాక్స్వెల్కు ఏమైంది? ఈ సీజన్లో అందరికంటే ఎక్కువ నిరాశపరిచింది మ్యాక్స్వెల్. 11 మ్యాచ్ల్లో కేవలం 145 పరుగులు మాత్రమే చేశాడు. సెహ్వాగ్ కూడా ఆకట్టుకోలేకపోయాడు. డేవిడ్ మిల్లర్ ఒక్కడే ఫర్వాలేదనిపించినా తనని బ్యాటింగ్ ఆర్డర్లో ప్రమోట్ చేయలేదు. ఐదో స్థానంలో వచ్చి ఇన్నింగ్స్ను సరిదిద్దడానికే అతనికి సమయం సరిపోయింది. తనని ప్రమోట్ చేసి ఉంటే బాగుండేది. ఇక బెయిలీ కూడా విఫలమయ్యాడు. భారీ అంచనాలతో మురళీ విజయ్ను తీసుకురావడం ప్రతికూలంగా మారింది. గత ఏడాది హిట్ పెయిర్ వోహ్రా, సెహ్వాగ్లలో ఒకరు విజయ్ కోసం త్యాగం చేయాల్సి వచ్చింది. ఆ మెరుపులు మాయం గత ఏడాది పంజాబ్ అద్భుత ప్రదర్శనకు కారణం సందీప్ శర్మ, అక్షర్ పటేల్, జాన్సన్ల బౌలింగ్. ఈసారి ఈ ముగ్గురూ విఫలమయ్యారు. అనురీత్ సింగ్ మినహా ఒక్క బౌలర్ కూడా ఆకట్టుకోలేదు. దారుణంగా విఫలమైనా... ఈ జట్టును తక్కువ అంచనా వేయలేం. వచ్చే సీజన్లో కీలక క్రికెటర్లు ఫామ్లోకి వస్తే మళ్లీ పుంజుకుం టుంది. కెప్టెన్ కాకపోతే బెయిలీ జట్టులో ఉండటానికి కూడా అన ర్హుడేమో. కాబట్టి కెప్టెన్సీ గురించి ఆలోచించాలి. -
ముంబై జోరును ఆపతరమా!
ఐపీఎల్ మొదటి ఆరు మ్యాచ్లలో ఐదు పరాజయాలు...కానీ తర్వాతి ఎనిమిది మ్యాచ్లలో ఏడు విజయాలు, పాయింట్ల పట్టికలో ఏకంగా రెండో స్థానం. టోర్నీలో ముంబై ఇండియన్స్ జోరు ఎలా పెంచిందో వీటితో అర్థమవుతోంది. ఇంత భీకర ఫామ్లో ఉన్న జట్టు ఇప్పుడు సొంతగడ్డపైనే క్వాలిఫయర్ ఆడేందుకు సిద్ధమైంది. అవతలి వైపు కూడా చెన్నై రూపంలో పటిష్ట ప్రత్యర్థి ఉంది. ఎలాంటి స్థితిలోనైనా ఫలితాన్ని మార్చగల నాయకుడి మార్గదర్శనంలో ఆ జట్టు అగ్రస్థానంలో నిలిచింది. మరి ముంబై జోరు కొనసాగుతుందా, చెన్నై వ్యూహాలు పని చేస్తాయా...ఐపీఎల్-8లో తొలుత ఫైనల్కు చేరేదెవరు? రా.గం. 8 నుంచి సోనీ సిక్స్లో ప్రత్యక్ష ప్రసారం నేడు ఐపీఎల్ తొలి క్వాలిఫయర్ ⇒ ధోని నాయకత్వంపైనే చెన్నై ఆశలు ⇒ అద్భుత ఫామ్లో రోహిత్ బృందం ముంబై: ఐపీఎల్లో చిరకాల ప్రత్యర్థులైన రెండు ‘భారీ’ జట్లు మరో కీలక పోరుకు సన్నద్ధమయ్యాయి. మంగళవారం ఇక్కడి వాంఖడే స్టేడియంలో జరిగే తొలి క్వాలిఫయర్లో ముంబై ఇండియన్స్తో చెన్నై సూపర్ కింగ్స్ తలపడనుంది. ఇందులో విజేతగా నిలిచే జట్టు ఫైనల్కు అర్హత సాధిస్తుంది. ఓడిపోయిన జట్టుకు ఫైనల్ చేరేందుకు రెండో క్వాలిఫయర్ రూపంలో మరో అవకాశం ఉంటుంది. లీగ్ దశలో ఇరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్లలో చెరొకటి గెలిచాయి. ముందుగా ముంబైలో చెన్నై 6 వికెట్లతో విజయం సాధించగా...ఆ తర్వాత చెన్నైలో ముంబై 6 వికెట్లతో నెగ్గింది. అంతా ఫామ్లో... ఐపీఎల్ ఆరంభం దశలో ఆటుపోట్ల తర్వాత కోలుకున్న ముంబై జట్టులో ఆ తర్వాత ఆటగాళ్లంతా నిలకడగా రాణించారు. తుది జట్టులో పెద్దగా మార్పుల అవసరం లేకుండా టీమ్ కొనసాగుతోంది. ఓపెనర్లు సిమన్స్, పార్థివ్ చక్కటి ఆరంభాలు ఇస్తుండగా, ఆ తర్వాత రోహిత్, రాయుడు, పొలార్డ్లతో మిడిలార్డర్ పటిష్టంగా ఉంది. చెన్నైపై సిక్సర్ల మోత తర్వాత కోల్కతాతో కీలక ఇన్నింగ్స్తో జట్టును గెలిపించిన హార్దిక్ పాండ్యా ఇప్పుడు కీలక ఆటగాడిగా మారాడు. ప్రధాన పేసర్లు మలింగ, మెక్లీన్గన్ల ఎనిమిది ఓవర్లు మ్యాచ్పై ప్రభావం చూపనున్నాయి. సన్రైజర్స్తో ఆఖరి మ్యాచ్లో వీరిద్దరు కలిసి కేవలం 33 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టారు. వినయ్ కుమార్ కూడా పర్వాలేదనిపించగా, స్పిన్నర్లు హర్భజన్, సుచిత్ ప్రతీ మ్యాచ్లో ప్రభావం చూపించారు. ఇంగ్లండ్ ఆటగాడు అలెక్స్ హేల్స్ ముంబై జట్టుతో చేరినా...ప్రస్తుతం జట్టులో విదేశీ ఆటగాళ్ల ఫామ్ చూస్తే అతనికి తుది జట్టులో స్థానం లభించకపోవచ్చు. బ్యాట్స్మెన్దే భారం మరో వైపు రెండు సార్లు చాంపియన్గా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్ మూడో టైటిల్ వేటలో ఫైనల్పై గురి పెట్టింది. అయితే టోర్నీ మొత్తం ఆ జట్టుకు పెద్ద బలంగా నిలిచిన ఓపెనర్ బ్రెండన్ మెకల్లమ్ లేని లోటు గత మ్యాచ్లోనే కనిపించింది. అతని స్థానంలో ఆడిన హస్సీ విఫలమయ్యాడు. అయితే బ్యాటింగ్లో మరో ప్రత్యామ్నాయం లేకపోవడంతో హస్సీనే కొనసాగించవచ్చు. జట్టు బ్యాటింగ్ ప్రధానంగా డ్వేన్ స్మిత్, రైనా, డు ప్లెసిస్లపై ఆధార పడి ఉంది. సీజన్ మొత్తం రెండు సార్లు మాత్రమే 30కి పైగా స్కోర్లు చేసిన కెప్టెన్ ధోని, ఈ మ్యాచ్లోనైనా చెలరేగాలని చెన్నై కోరుకుంటోంది. డ్వేన్ బ్రేవో, నేగిలు చివర్లో మెరుపులు మెరిపిస్తే జట్టు భారీస్కోరుకు అవకాశముంటుంది. పేస్ విభాగంలో నెహ్రాకు బ్రేవో అండగా నిలుస్తుండగా, స్పిన్లో నేగి, అశ్విన్ కీలకం కానున్నారు. జట్ల వివరాలు (అంచనా) చెన్నై సూపర్ కింగ్స్: ధోని (కెప్టెన్), డ్వేన్ స్మిత్, హస్సీ, రైనా, ప్లెసిస్, ధోని, బ్రేవో, నేగి, జడేజా, అశ్విన్, నెహ్రా, పాండే/మోహిత్. ముంబై ఇండియన్స్: రోహిత్ (కెప్టెన్), సిమన్స్, పార్థివ్, రాయుడు, పొలార్డ్, పాండ్యా, హర్భజన్, సుచిత్, మెక్లీన్గన్, వినయ్, మలింగ. -
కోహ్లి గీత దాటాడు
-
అనుష్క ఐరన్ లెగ్ కాదు లక్కీ లేడీ..!
న్యూఢిల్లీ: ఇటీవల జరిగిన వన్డే ప్రపంచ కప్ సెమీస్లో టీమిండియా ఓటమికి (ఆస్ట్రేలియా చేతిలో) బాలీవుడ్ నటి, విరాట్ కోహ్లీ ప్రియురాలు అనుష్క శర్మే కారణమని నెటిజెన్లు ఆడిపోసుకున్నారు! అనుష్క మ్యాచ్ చూసేందుకు వెళ్లడం వల్లే విరాట్ కోహ్లీ విఫలమయ్యాడని, టీమిండియా ఓడిపోయిందని విమర్శలు ఎక్కుపెట్టారు. నెటిజెన్లు రకరకాల కామెంట్లు చేసి పాపం అనుష్కను ఏడిపించారు. తెలుగు అభిమానులయితే అనుష్కను ఐరన్ లెగ్ అనేశారు. అదే అనుష్కను ఇప్పుడు లక్కీ లేడీ అంటున్నారు. బెంగళూరు రాయల్ చాలెంజర్స్ కెప్టెన్ విరాట్ కోహ్లీకి అనుష్క రూపంలో అదృష్టం కలసివచ్చిందట! ఐపీఎల్లో బెంగళూరు మ్యాచ్లకు వర్షం నేనున్నానంటూ ప్రత్యక్షమైంది. ఆదివారం ఢిల్లీ డేర్ డెవిల్స్తో ఆడిన చివరి లీగ్ మ్యాచ్కు బెంగళూరుకు కీలకమైనది. ఈ మ్యాచ్ చూసేందుకు అనుష్క స్టేడియానికి వెళ్లింది. ఈ మ్యాచ్లోనూ వరుణుడు ప్రత్యక్షమయ్యాడు. తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ 187/5 భారీ స్కోరు చేసింది. బెంగళూరు లక్ష్యసాధనకు దిగగానే భారీ వర్షం రావడంతో మ్యాచ్ రద్దయ్యింది. ఇరు జట్లకు ఒక్కో పాయింట్ ఇచ్చారు. ఐపీఎల్-8లో బెంగళూరు మొత్తం 16 పాయింట్లతో మూడోస్థానంలో నిలిచి నాకౌట్ చేరింది. బెంగళూరుకు ప్లే ఆఫ్ బెర్తు ఖాయంకాగానే కోహ్లీ సంతోషంతో తన ప్రేయసి అనుష్క దగ్గరకు వెళ్లి మాట్లాడాడు. అనుష్క కూడా ముసిముసి నవ్వులతో ప్రియుడిని అభినందించింది. అనుష్క లక్కీ లేడి అని బెంగళూరు అభిమానులు మురిసిపోతున్నారు. -
ఐపీఎల్-8 నుండి నిష్క్రమించిన సన్రైజర్స్
-
ఫ్లేఆఫ్కు ముంబై
-
బెంగళూరుకు వాన దెబ్బ
► ఢిల్లీతో మ్యాచ్ రద్దు ► రెండో స్థానం అవకాశం కోల్పోయిన కోహ్లిసేన ► మూడో స్థానంతో ప్లేఆఫ్కు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు : ఎక్కడైనా వర్షం పడాలంటే బెంగళూరు జట్టును క్రికెట్ ఆడటానికి పిలిస్తే సరిపోతుందేమో. ఈ సీజన్లో వరుసగా మూడు మ్యాచ్ల్లో బెంగళూరుకు వర్షం ఎదురయింది. తొలుత మొహాలీలో పంజాబ్తో మ్యాచ్లో వర్షం కారణంగా ఓడిపోయిన కోహ్లిసేన... హైదరాబాద్లో సన్రైజర్స్ మ్యాచ్లో వర్షంలోనే గెలిచింది. ఇక సొంతగడ్డపై ఈ సీజన్లో చివరి మ్యాచ్ ఢిల్లీతో ఆడాల్సి ఉండగా... సగం మ్యాచ్ జరిగాక భారీ వర్షం ముంచెత్తింది. దీంతో ఈ మ్యాచ్ రద్దయింది. చిన్నస్వామి స్టేడియంలో జరిగిన మ్యాచ్లో.. ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ 20 ఓవర్లలో 5 వికెట్లకు 187 పరుగులు చేసింది. డికాక్ (39 బంతుల్లో 69; 9 ఫోర్లు, 3 సిక్సర్లు), డుమిని (43 బంతుల్లో 67 నాటౌట్; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) చెలరేగి ఆడారు. తర్వాత బెంగళూరు 1.1 ఓవర్లలో వికెట్లేమీ నష్టపోకుండా 2 పరుగులు చేసింది. కోహ్లి (1 నాటౌట్), గేల్ (1 నాటౌట్) ఆడుతున్నారు. ఈ దశలో ఎడతెరిపి లేకుండా వర్షం పడటంతో అంపైర్లు మ్యాచ్ను రద్దు చేశారు. ఫలితంగా ఇరుజట్లకు చెరో పాయింట్ కేటాయించారు. ప్రతి సీజన్లో ఒక్క మ్యాచ్లో గ్రీన్ డ్రెస్తో (పర్యావరణ పరిరక్షణ ప్రచారం కోసం) ఆడే బెంగళూరు సొంతగడ్డపై చివరి మ్యాచ్ ద్వారా ఆ సంప్రదాయాన్ని కొనసాగించింది. రాణించిన డికాక్, డుమిని టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ఢిల్లీకి ఓపెనర్లు డికాక్, శ్రేయస్ అయ్యర్ (18 బంతుల్లో 20; 1 ఫోర్, 1 సిక్స్) సరైన శుభారంభాన్నిచ్చారు. ఈ ఇద్దరు తొలి వికెట్కు 55 పరుగులు జోడించారు. వన్డౌన్లో కెప్టెన్ డుమిని యాంకర్ పాత్రతో ఆకట్టుకున్నాడు. రెండో ఎండ్లో డికాక్ భారీ హిట్టింగ్కు తెరలేపడంతో తొలి 10 ఓవర్లలో ఢిల్లీ వికెట్ నష్టానికి 91 పరుగులు చేసింది. ఈ దశలో డికాక్ మరో రెండు సిక్సర్లు, ఓ బౌండరీ బాది అవుటయ్యాడు. దీంతో రెండో వికెట్కు 55 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. తర్వాత చాహల్ వేసిన ఇన్నింగ్స్ 14వ ఓవర్లో డుమిని వరుసగా మూడు సిక్సర్లతో రెచ్చిపోయాడు. కానీ అవతలి ఎండ్లో స్వల్ప విరామాల్లో యువరాజ్ (11), కేదార్ జాదవ్ (0), మ్యాథ్యూస్ (1)లు అవుట్కావడంతో ఢిల్లీ ఇన్నింగ్స్ కుదుపునకు లోనైంది. అయితే సౌరభ్ తివారీ (13 నాటౌట్)తో కలిసి డుమిని మరోసారి విజృంభించడంతో చివరి మూడు ఓవర్లలో 36 పరుగులు సమకూరాయి. ఈ ఇద్దరు ఆరో వికెట్కు కేవలం 4.4 ఓవర్లలో అజేయంగా 46 పరుగులు జోడించడంతో ఢిల్లీ భారీ స్కోరు చేసింది. హర్షల్, చాహల్ చెరో రెండు వికెట్లు తీశారు. స్కోరు వివరాలు ఢిల్లీ డేర్డెవిల్స్ ఇన్నింగ్స్ : డికాక్ (సి) కోహ్లి (బి) చాహల్ 69; శ్రేయస్ (సి) గేల్ (బి) పటేల్ 20; డుమిని నాటౌట్ 67; యువరాజ్ (సి) స్టార్క్ (బి) చాహల్ 11; జాదవ్ (సి) కార్తీక్ (బి) పటేల్ 0; మ్యాథ్యూస్ రనౌట్ 1; సౌరభ్ తివారీ నాటౌట్ 13; ఎక్స్ట్రాలు 6; మొత్తం: (20 ఓవర్లలో 5 వికెట్లకు) 187. వికెట్ల పతనం : 1-55; 2-110; 3-137; 4-139; 5-141. బౌలింగ్ : స్టార్క్ 4-0-35-0; దిండా 3-0-39-0; హర్షల్ పటేల్ 4-0-30-2; వీస్ 4-0-39-0; గేల్ 2-0-15-0; చాహల్ 3-0-26-2. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్ : కోహ్లి నాటౌట్ 1; గేల్ నాటౌట్ 1; మొత్తం: (1.1 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా) 2. బౌలింగ్: జయంత్ 1-0-2-0; జహీర్ 0.1-0-0-0. -
నిరాశగా బై.. బై...
ఐపీఎల్ను నగర అభిమానులు విశేషంగా ఆదరించారు. ముంబై ఇండియన్స్, సన్రైజర్స్ జట్ల మధ్య ఆదివారం జరిగిన మ్యాచ్కూ అభిమానులు పోటెత్తారు. ప్లే ఆఫ్కు చేరడానికి చావోరేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్లో హైదరాబాద్ ఆటగాళ్లు చేతులెత్తేయడంతో నగర అభిమానులు నిరాశగా ఈ సీజన్కు గుడ్బై చెప్పారు. ప్రమాదం తప్పింది మ్యాచ్ ఆరంభానికి ముందు స్టేడియంలో చిన్నపాటి ప్రమాదం జరిగింది. సౌత్ పెవిలియన్ ఫస్ట్ ఫ్లోర్లో హెచ్సీఏ ప్రెసిడెంట్ బాక్స్ ముందు భారీ సైజు అద్దం కుప్పకూలింది. ఎలాంటి ఘటన లేకుండా, బలమైన వస్తువేదీ తగలకుండా అనూహ్యంగా అద్దం పగలటం దాని ముందు కూర్చున్నవారిని ఒక్కసారిగా ఆందోళనకు గురి చేసింది. వారు భయంతో పరుగెత్తారు. అప్పటికి మ్యాచ్ టాస్ కూడా వేయకపోవడంతో పెద్ద సంఖ్యలో ప్రేక్షకులు చేరలేదు. దాంతో పెద్ద ప్రమాదం తప్పింది. - సాక్షి, హైదరాబాద్ -
ముంబై మహాన్...
► సన్రైజర్స్పై 9 వికెట్లతో విజయం ► ప్లే ఆఫ్కు రోహిత్ సేన ► లీగ్ దశతోనే సరిపెట్టుకున్న హైదరాబాద్ గత సీజన్ ఐపీఎల్లోనూ ఇంతే. అప్పుడు బ్యాట్స్మెన్... ఇప్పుడు బౌలర్లు... చావో రేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ విశ్వరూపం చూపించింది. బౌలర్ల సంచలన ప్రదర్శనకు బ్యాట్స్మెన్ నిలకడ తోడవడంతో 9 వికెట్ల తేడాతో సన్రైజర్స్ను చిత్తు చేసి సగర్వంగా ప్లే ఆఫ్కు చేరింది. 16 పాయింట్లతో బెంగళూరు, రాజస్తాన్తో సమానంగా నిలిచినా... విజయాల సంఖ్య (8) ఎక్కువగా ఉండటంతో ఏకంగా రెండో స్థానంలో నిలిచింది. మరోవైపు సన్రైజర్స్ కీలక మ్యాచ్లో పూర్తిగా చేతులెత్తేసింది. సాక్షి, హైదరాబాద్ : చావోరేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్లో సన్రైజర్స్ పూర్తిగా చల్లబడింది. టోర్నీ అంతటా జట్టుకు వెన్నెముకలా నిలిచిన ఓపెనర్లు విఫలం కావడంతో... మ్యాచ్ ప్రథమార్ధంలోనే పూర్తిగా చేతులెత్తేసింది. ఉప్పల్ స్టేడియంలో ఆదివారం ఏకపక్షంగా సాగిన ఐపీఎల్-8 చివరి లీగ్ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ 9 వికెట్ల తేడాతో సన్రైజర్స్ను చిత్తు చేసింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్కు దిగిన సన్రైజర్స్ 20 ఓవర్లలో 113 పరుగులకే కుప్పకూలింది. లోకేశ్ రాహుల్ (24 బంతుల్లో 25; 2 ఫోర్లు)దే అత్యధిక స్కోరు. ముంబై బౌలర్లలో మెక్లీన్గన్ (3 /16), మలింగ (2 /17) పేస్తో చెలరేగారు. అనంతరం ముంబై 13. 5ఓవర్లలో వికెట్ నష్టానికి 114 పరుగులు చేసి విజయాన్నందుకుంది. సిమన్స్ (44 బంతుల్లో 48; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), పార్థీవ్ పటేల్ (37 బంతుల్లో 51 నాటౌట్; 9 ఫోర్లు) తొలి వికెట్కు 106 పరుగులు జోడించి జట్టు గెలుపును సునాయాసం చేశారు. మరో 37 బంతులు మిగిలి ఉండగానే ముంబై గెలవడం విశేషం. సమష్టి వైఫల్యం రెండు బౌండరీల మధ్య ఒకసారి 23 బంతులు, మరో సారి 36 బంతుల విరామం వస్తే... ఇన్నింగ్స్ తొలి సిక్సర్ 14.5 ఓవర్లకు గానీ రాలేదు... ముంబైతో మ్యాచ్లో మెరుపులే లేని సన్రైజర్స్ బ్యాటింగ్ పరిస్థితి ఇది. సీజన్ మొత్తం శుభారంభాలు ఇచ్చిన హైదరాబాద్ ఓపెనింగ్ జోడి అసలు మ్యాచ్లో విఫలమైంది. ధావన్ (1), వార్నర్ (6) వరుస బంతుల్లో అవుట్ కావడం జట్టు ఇన్నింగ్స్పై తీవ్ర ప్రభావం చూపింది. మలింగ చక్కటి యార్కర్తో ధావన్ను బౌల్డ్ చేయగా, మెక్లీన్గన్ షార్ట్ బంతిని పుల్ చేయబోయి వార్నర్ క్యాచ్ ఇచ్చాడు. అంతే...ఆ తర్వాత రైజర్స్ ఏ దశలోనూ కోలుకోలేకపోయింది. ఒక్క బ్యాట్స్మన్ కూడా కుదురుగా క్రీజ్లో నిలబడలేకపోగా... కనీస స్థాయిలో కూడా ధాటిగా బ్యాటింగ్ చేయలేకపోయారు. మోర్గాన్ (9) వైఫల్యానికి తోడు కుర్ర స్పిన్నర్ సుజిత్ సన్ను దెబ్బ తీశాడు. అతను వేసిన చక్కటి బంతికి హెన్రిక్స్ (11) స్టంపౌట్ కాగా, తర్వాతి బంతికే నమన్ ఓజా (0) సునాయాస క్యాచ్ ఇచ్చాడు. మరో వైపు రాహుల్ కాస్త పోరాడే ప్రయత్నం చేయగా...చివర్లో స్టెయిన్ (11 బంతుల్లో 19 నాటౌట్; 3 ఫోర్లు) జట్టు స్కోరును 100 పరుగులు దాటించాడు. అలవోకగా ఓపెనర్లే... సునాయాస లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్కు ఓపెనర్లు సిమన్స్, పార్థివ్ శుభారంభం అందించారు. సన్ బౌలర్లను అలవోకగా ఎదుర్కొని చకచకా పరుగులు సాధించడంతో పవర్ప్లేలో జట్టు స్కోరు 38 పరుగులకు చేరింది. ఆ తర్వాత కూడా ఏ ఒక్క హైదరాబాద్ బౌలర్ కూడా ముంబై బ్యాట్స్మెన్ను ఇబ్బంది పెట్టలేకపోయాడు. తక్కువ స్కోరు కావడం వల్ల కాపాడుకోలేమని ముందే ఓటమికి సిద్ధమైనట్లు సన్ ఆటగాళ్లు కనిపించారు. ఏ దశలోనూ ఒత్తిడి పెంచలేకపోగా, ఫీల్డింగ్ వైఫల్యాలతో సునాయాస పరుగులు ఇచ్చారు. తొలి వికెట్కు పార్థీవ్, సిమ్మన్స్ 106 పరుగులు జోడించారు. చివర్లో సిమ్మన్స్ అవుటైనా... రోహిత్ వచ్చి లాంఛనం పూర్తి చేశాడు. -
ఫ్లేఆఫ్కు ముంబై
హైదరాబాద్: ఐపీఎల్-8 లో భాగంగా సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్లో 9 వికెట్ల వికెట్ల తేడాతో ముంబై గెలుపొంది ప్లేఆఫ్లో స్థానం సంపాదించింది. కీలక మ్యాచ్ లో అన్ని విభాగాల్లో విఫలం చెందడంతో హైదరాబాద్ లీగ్ దశలోనే ఇంటి దారి పట్టింది. ముంబై బౌలర్ల ధాటికి ముందుగా బ్యాటింగ్ కు దిగిన హైదరాబాద్ బ్యాట్స్మెన్లు చేతులెత్తేయడంతో 20 ఓవర్లలో 113 పరుగులు చేసి ఆలౌటైంది. ఆ తర్వాత బ్యాటింగ్ ఆరంభించిన ముంబై ఓపెనర్లు సిమ్మన్స్(48), పటేల్(51) ధాటిగా ఆడి 106 పరుగుల భాగస్వామ్యంతో మంచి శుభారంభాన్ని ఇచ్చారు. కరణ్ శర్మ బౌలింగ్లో సిమ్మన్స్(48) ధావన్కి క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. ఆ తర్వాత వచ్చిన రోహిత్(7), పార్థివ్ పటేల్తో కలిసి విజయానికి కావలసిన పరుగులని రాబట్టాడు. దీంతో ముంబై13.5 ఓవర్లలో వికెట్ నష్టానికి 114 పరుగులు లక్ష్యాన్ని సునాయాసంగా చేరుకుంది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న హైదరాబాద్ని ముంబై బౌలర్లు తక్కువస్కోరుకే పరిమితం చేశారు.7 పరుగుల వద్ద డేవిడ్ వార్నర్(6), ధావన్(1) వికెట్లని కోల్పోయింది. 23 పరుగుల వద్ద మూడో వికెట్ రూపంలో మోర్గాన్(9) వెనుదిరిగాడు. ఆ తర్వాత వరుసగా హెన్రిక్స్(11), ఓజా(0) లు వెనువెంటనే ఔటయ్యారు. నిలకడగా ఆడుతూ హైదరాబాద్ స్కోరుని పెంచే ప్రయత్నంలోనే రాహుల్(24) హర్భజన్ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆశిష్ రెడ్డి(17), , భవనేశ్వర్ కుమార్(0), కరణ్(15), ప్రవీణ్ కుమార్(4) పరుగులు చేసి ఔటయ్యారు. చివర్లో స్టెయిన్(17) ధాటిగా ఆడి పరుగులు రాబట్టి నాటౌట్గా నిలిచాడు. ముంబై బౌలింగ్లో మెక్ క్లెనఘన్ మూడు వికెట్లు తీసి రాణించగా, సుచిత్, మలింగాలు తలా రెండు వికెట్లు తీశారు. హర్భజన్, పోలార్డ్ లకి చెరో వికెట్ లభించింది. ముంబై బౌలింగ్లో మూడు వికెట్లు తీసి హైదరాబాద్ పరుగలకి ఆదిలోనే అడ్డుకట్ట వేసిన మెక్ క్లెనఘన్కి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ లభించింది. -
ముంబై టార్గెట్ 114
హైదరాబాద్: ఐపీఎల్-8 లో భాగంగా ముంబై ఇండియన్స్తో ఆదివారం రాత్రి జరుగుతున్న మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 113 పరుగులు చేసి అలౌటైంది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్కు దిగిన సన్ రైజర్స్ హైదరాబాద్ని ముంబై బౌలర్లు తక్కువ స్కోరుకే కట్టడి చేశారు. తొలుత బ్యాటింగ్కు దిగిన హైదరాబాద్ 7 పరుగుల వద్ద డేవిడ్ వార్నర్(6), ధావన్(1) వికెట్లని కోల్పోయింది. 23 పరుగుల వద్ద మూడో వికెట్ రూపంలో మోర్గాన్(9) వెనుదిరిగాడు. ఆ తర్వాత వరుసగా హెన్రిక్స్(11), ఓజా(0) లు వెనువెంటనే ఔటయ్యారు. నిలకడగా ఆడుతూ హైదరాబాద్ స్కోరుని పెంచే ప్రయత్నంలోనే రాహుల్(24) హర్భజన్ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆశిష్ రెడ్డి(17), భవనేశ్వర్ కుమార్(0), కరణ్(15), ప్రవీణ్ కుమార్(4) పరుగులు చేసి ఔటయ్యారు. చివర్లో స్టెయిన్(17) ధాటిగా ఆడి పరుగులు రాబట్టి నాటౌట్గా నిలిచాడు. ముంబై బౌలింగ్లో మెక్ క్లెనఘన్ మూడు వికెట్లు తీసి రాణించగా, సుచిత్, మలింగాలు తలా రెండు వికెట్లు తీశారు. హర్భజన్, పోలార్డ్ లకి చెరో వికెట్ లభించింది. -
బెంగళూరుకు బెర్తు.. కోల్కతా ఇంటికే
బెంగళూరు: ఐపీఎల్-8లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ప్లే ఆఫ్ బెర్తు సాధించింది. ఆదివారం ఢిల్లీ డేర్ డెవిల్స్, బెంగళూరుల మధ్య జరగాల్సిన చివరి లీగ్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయ్యింది. దీంతో ఇరు జట్లకు ఒక్కో పాయింట్ ఇచ్చారు. బెంగళూరు (16) నాకౌట్కు దూసుకెళ్లగా, ఢిల్లీ (11) ఇంతకు ముందే రేసు నుంచి వైదొలిగింది. ఈ మ్యాచ్ లో బెంగళూరు భారీ తేడా ఓడినట్టయితే కోల్ కతాకు అవకాశాలుండేవి. 15 పాయింట్లు సాధించిన కోల్ కతా ఇంటిదారి పట్టింది. చెన్నై, రాజస్థాన్ ప్లే ఆఫ్ బెర్తులు సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. మరో దాని కోసం హైదరాబాద్, ముంబై పోటీపడుతున్నాయి. ఈ రోజు రాత్రి ఈ రెండు జట్ల మధ్య జరిగే మ్యాచ్ విజేత అర్హత సాధిస్తుంది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ లో ఢిల్లీ డేర్ డెవిల్స్ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్లు నష్టపోయి 187 పరుగులు చేసింది. ఢిల్లీ ఓపెనర్లు క్వింటన్ డికాక్, శ్రేయాస్ అయ్యర్ దాటిగా ఆడటంతో ఆరు ఓవర్లలో ఆ జట్టు 54 పరుగులు చేసింది. అయితే జట్టు స్కోరు 55 పరుగుల వద్ద శ్రేయాస్ అయ్యర్ (20) ఔటయ్యాడు. క్వింటన్ డికాక్(39 బంతుల్లో 69: 9 ఫోర్లు, 3 సిక్సర్లు), జేపీ డుమిని (47 బంతుల్లో 67: 4 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడారు. బెంగళూరు బౌలర్లలో హర్షల్ పటేల్, చాహల్ రెండేసి వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్షసాధనలో బెంగళూరు 1.1 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 2 పరుగులు చేసింది. ఈ సమయంలో ఎడతెరిపి లేకుండా భారీ వర్షం వచ్చింది. మ్యాచ్ కొనసాగించే పరిస్థితి లేకపోవడంతో రద్దు చేశారు. -
బెంగళూరు, ఢిల్లీ మ్యాచ్ కు వర్షం అంతరాయం
బెంగళూరు:ఐపీఎల్-8లో భాగంగా బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో ఢిల్లీ డేర్ డెవిల్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్ కు వర్షం అంతరాయం కలిగించింది. ఢిల్లీ డేర్ డెవిల్స్తో జరుగుతున్న మ్యాచ్ లో 188 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన బెంగళూరుకు 2వ ఓవర్ ప్రారభం కాగానే వర్షం అంతరాయం కలిగించింది. దాంతో మైదానం మొత్తం కవర్లతో కప్పి ఉంచారు. 1.1 ఓవర్లలో బెంగళూరు 2 పరుగలు చేసి గేల్(1), కోహ్లీ(1)ల క్రీజ్ లో ఉన్నారు. అంతకు ముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ డేర్ డెవిల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు నష్టపోయి 187 పరుగులు చేసింది. -
బెంగళూరు టార్గెట్ 188
బెంగళూరు: ఐపీఎల్-8లో భాగంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్ లో ఢిల్లీ డేర్ డెవిల్స్ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్లు నష్టపోయి 187 పరుగులు చేసింది. బెంగళూరుకు 188 పరుగుల టార్గెట్ నిర్దేశించింది. ఢిల్లీ ఓపెనర్లు క్వింటన్ డికాక్, శ్రేయాస్ అయ్యర్ దాటిగా ఆడటంతో ఆరు ఓవర్లలో ఆ జట్టు 54 పరుగులు చేసింది. అయితే జట్టు స్కోరు 55 పరుగుల వద్ద శ్రేయాస్ అయ్యర్ (20) ఔటయ్యాడు. డికాక్ కేవలం 30 బంతుల్లోనే 8 ఫోర్లు, 1 సిక్స్ సాయంతో అర్ధ శతకం సాధించాడు. జట్టు స్కోరు పెంచే క్రమంలో క్వింటన్ డికాక్(39 బంతుల్లో 69: 9 ఫోర్లు, 3 సిక్సర్లు) ఔటయ్యాడు. జేపీ డుమిని (47 బంతుల్లో 67: 4 ఫోర్లు, 3 సిక్సర్లు) రాణించడంతో ఢిల్లీ 187 పరుగులు చేయగలిగింది. పది ఓవర్లలో 91/1 తో పటిష్ట స్థితిలో కనిపించిన ఢిల్లీ 141 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. యువరాజ్(11), కేదార్ జాద్(0) నిరాశ పరిచారు. ఏంజెలో మాథ్యుస్(1) కూడా త్వరగానే రనౌట్ రూపంలో నిష్క్రమించాడు. బెంగళూరు బౌలర్లలో హర్షల్ పటేల్, చాహల్ రెండేసి వికెట్లు పడగొట్టారు. -
జోరుగా ఢిల్లీ బ్యాటింగ్
బెంగళూరు: ఐపీఎల్-8లో భాగంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్ లో ఢిల్లీ డేర్ డెవిల్స్ తొలి 10 ఓవర్లలో వికెట్ నష్టపోయి 91 పరుగులు చేసింది. ఢిల్లీ ఓపెనర్లు క్వింటన్ డికాక్, శ్రేయాస్ అయ్యర్ దాటిగా ఆడటంతో ఆరు ఓవర్లలో ఆ జట్టు 54 పరుగులు చేసింది. అయితే జట్టు స్కోరు 55 పరుగుల వద్ద శ్రేయాస్ అయ్యర్ (20) ఔటయ్యాడు. డికాక్ కేవలం 30 బంతుల్లోనే 8 ఫోర్లు, 1 సిక్స్ సాయంతో అర్ధ శతకం సాధించాడు. ప్రస్తుతం డికాక్(33 బంతుల్లో 52), కెప్టెన్ జేపీ డుమిని(9 బంతుల్లో 15) క్రీజులో ఉన్నారు. బెంగళూరు బౌలర్ హర్షల్ పటేల్ ఒక్క వికెట్ తీశాడు. -
దినేశ్ కార్తీక్కు జరిమానా
హైదరాబాద్: రాయల్ చాలెంజర్స్ బెంగళూరు క్రికెటర్ దినేశ్ కార్తీక్కు మ్యాచ్ ఫీజులో 20 శాతం జరిమానాగా విధించారు. శుక్రవారం ఉప్పల్ స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్తో జరిగిన ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా దినేశ్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు మ్యాచ్ రెఫరీ రోషన్ మహానామా చర్యలు తీసుకున్నారు. ఐపీఎల్ ఈ మేరకు ఓ ప్రకటనలో వెల్లడించింది. 'దినేశ్ క్రమశిక్షణ ఉల్లంఘించినట్టు రోషన్ మహానామా గుర్తించారు. ప్రవర్తనా నియమావళి లెవెల్ 1 కింద అతనిపై చర్యలు తీసుకున్నారు' అని ఐపీఎల్ ఆ ప్రకటనలో తెలిపింది. -
'ఆ ఘనత టీమ్ కు దక్కుతుంది'
ముంబై: తమ జట్టు ఆల్ రౌండ్ షో కారణంగానే కీలక మ్యాచ్ లో విజయం సాధించామని రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ షేన్ వాట్సన్ అన్నాడు. కోల్ కతా నైట్ రైడర్స్ తో శనివారం జరిగిన మ్యాచ్ లో 9 పరుగులతో విజయం సాధించి ప్లేఆప్ కు చేరుకుంది. ఈ మ్యాచ్ లో వాట్సన్ సెంచరీ చేశాడు. 59 బంతుల్లో 104 పరుగులు బాదాడు. చావేరేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్ లో ఆల్ రౌండ్ షోతో విజయం సాధించామని వాట్సన్ పేర్కొన్నాడు. ఈ ఘనత టీమ్ కే దక్కుతుందన్నాడు. ధావల్ కులకర్ణి పట్టిన రెండు క్యాచ్ లు, క్రిస్ మోరిస్ తీసిన నాలుగు వికెట్లు ఎంతో కీలకమని చెప్పాడు. రహానే పట్టిన క్యాచ్ కూడా ముఖ్యమైనదే అన్నాడు. తాను ఫామ్ లోకి పట్ల సంతృప్తి వ్యక్తం చేశాడు. బౌలింగ్, బ్యాటింగ్ లో రాణించడానికి తాను పడిన కష్టం ఫలించిందని చెప్పాడు. -
టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న బెంగళూరు
బెంగళూరు: ఐపీఎల్-8లో భాగంగా ఆదివారం సాయంత్రం ఇక్కడి చిన్నస్వామి స్టేడియంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్లు తలపడుతున్నాయి. ఢిల్లీ డేర్ డెవిల్స్ తో జరగనున్న మ్యాచ్ లో టాస్ గెలిచిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ప్లే ఆఫ్ కు చేరాలంటే బెంగళూరుకు ఈ మ్యాచ్ చాలా కీలకం. లీగ్ దశలో ఇరు జట్లకు ఇదే చివరి మ్యాచ్. బెంగళూరు ఖాతాలో 15 పాయింట్లుండగా, ఢిల్లీ ఖాతాలో 10 పాయింట్లు ఉన్నాయి. -
మైదానంలో స్లెడ్జింగ్.. బయట డ్యాన్సింగ్
క్రికెట్ మైదానంలో ప్రత్యర్థులపై మాటల యుద్ధానికి దిగడంలో వెస్టిండీస్ స్టార్ డ్వేన్ బ్రేవో, భారత టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లి ఇద్దరూ ఇద్దరే. ఇక ఐపీఎల్లో ఈ ఇద్దరూ ప్రత్యర్థులుగా తలపడినప్పుడు కూడా ఇది సహజం. ఇటీవల చెన్నై, బెంగళూరుల మధ్య జరిగిన మ్యాచ్లో కోహ్లి బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఈ ఇద్దరి మధ్య స్వల్ప వాగ్వాదం జరిగింది. ఇంతవరకూ బాగానే ఉంది. కానీ ఆ మ్యాచ్ ముగిసిన వెంటనే తెల్లారి ఇద్దరూ కలిసి డ్యాన్స్ చేశారు. డ్వేన్ బ్రేవో ‘చలోచలో’ అనే పాటను తయారు చేస్తున్నాడు. బ్రేవో పాప్ సింగర్గా మారాలనే ఉద్దేశంతో ఈ పాటతో ఆల్బమ్ తయారు చేస్తున్నాడు. ఇందులో భాగంగా తయారు చేస్తున్న వీడియోలో బ్రేవో, కోహ్లి కలిసి డ్యాన్స్ చేశారు. మైదానంలో స్లెడ్జింగ్ చేసుకుని 24 గంటలు కూడా గడవకముందే సరదాగా కలిసి ఎంజాయ్ చేశారు. అన్నట్లు ఈ వీడియోలో ధోని, రవీంద్ర జడేజా, పొలార్డ్, స్యామీ, మెకల్లమ్, హస్సీ, రస్సెల్ల డ్యాన్స్ కూడా ఉంటుంది. -
రాజస్థాన్ రాయల్స్ విజయం
-
చావోరేవో...
► ముంబై, సన్రైజర్స్ మ్యాచ్ నేడు ► గెలిచిన జట్టు ప్లే ఆఫ్కు సాక్షి, హైదరాబాద్ : ఐపీఎల్ లీగ్ దశలో నేడు ఉత్కంఠభరిత క్లైమాక్స్ పోరు జరగబోతోంది. ఉప్పల్లో నేడు జరిగే లీగ్ మ్యాచ్లో సన్రైజర్స్ జట్టు ముంబై ఇండియన్స్తో తలపడుతుంది. రెండు జట్లూ ఇప్పటివరకూ 13 మ్యాచ్లు ఆడి 14 పాయింట్ల చొప్పున సాధించాయి. వార్నర్, ధావన్, హెన్రిక్స్ల ఫామ్తో సన్రైజర్స్ బ్యాటింగ్ లైనప్ పటిష్టంగా కనిపిస్తోంది. బెంగళూరు చేతిలో జరిగిన ‘పొట్టి’ మ్యాచ్లో అనూహ్య ఓటమిని మినహాయిస్తే సన్రైజర్స్ వరుస విజయాలతో జోరు మీదే ఉంది. గత మ్యాచ్ ఆడిన జట్టుతోనే సన్ బరిలోకి దిగే అవకాశం ఉంది. మరోవైపు ముంబై జట్టు డిఫెండింగ్ చాంపియన్ కోల్కతాపై అనూహ్య విజయంతో ప్లే ఆఫ్ రేసులో నిలబడింది. సిమ్మన్స్, పొలార్డ్, రోహిత్లతో పాటు కొత్త సంచలనం హార్దిక్ పాండ్యా ఆ జట్టుకు కీలకం. బౌలింగ్లో మలింగ, మెక్లీన్గన్లతో పాటు హర్భజన్ రాణించాల్సి ఉంది. మొత్తం మీద రెండు జట్లూ ఆత్మవిశ్వాసంతో ఉన్న నేపథ్యంలో చివరి లీగ్ మ్యాచ్ ఆసక్తికరంగా సాగే అవకాశం ఉంది. -
వారెవ్వా... రాజస్తాన్
♦ ప్లే ఆఫ్కు రాయల్స్ అర్హత ♦ వాట్సన్ అద్భుత సెంచరీ ♦ కోల్కతా అవకాశాలు సంక్లిష్టం ముంబై : ప్లే ఆఫ్కు చేరాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్లో రాజస్తాన్ రాయల్స్ దుమ్మురేపింది. తమకంటే ప్రత్యర్థి జట్టు పటిష్టంగా ఉన్నా... ఆల్రౌండ్ షోతో అదరగొట్టింది. షేన్ వాట్సన్ (59 బంతుల్లో 104 నాటౌట్; 9 ఫోర్లు, 5 సిక్సర్లు) వీరోచిత సెంచరీకి తోడు రహానే (22 బంతుల్లో 37; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) సమయోచితంగా ఆడటంతో శనివారం జరిగిన లీగ్ మ్యాచ్లో రాజస్తాన్ 9 పరుగుల తేడాతో కోల్కతాపై నెగ్గి ప్లే ఆఫ్ బెర్త్ ఖరారు చేసుకుంది. బ్రబౌర్న్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్లో... ముందుగా రాజస్తాన్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 199 పరుగులు చేసింది. టాప్ ఆర్డర్లో వాట్సన్, రహానే మినహా మిగతా వారు విఫలమయ్యారు. తర్వాత కోల్కతా 20 ఓవర్లలో 9 వికెట్లకు 190 పరుగులకే పరిమితమైంది. యూసుఫ్ పఠాన్ (35 బంతుల్లో 44; 5 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్. రస్సెల్ (20 బంతుల్లో 37; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించాడు. వాట్సన్ హవా... టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన రాజస్తాన్ ఇన్నింగ్స్కు వాట్సన్ వెన్నెముకగా నిలిచాడు. కోల్కతా బౌలర్లపై భారీ షాట్లతో విరుచుకుపడుతూ రహానేతో కలిసి మెరుపు ఆరంభాన్నిచ్చాడు. దీంతో తొలి వికెట్కు 80 పరుగులు సమకూరాయి. వన్డౌన్లో స్మిత్ (14) నిరాశపర్చినా.. వాట్సన్ జోరుకు రన్రేట్ 10కి పైగా నమోదైంది. ఫలితంగా తొలి 10 ఓవర్లలో రాజస్తాన్ ఒక వికెట్కు కోల్పోయి 107 పరుగులు చేసింది. ఈ దశలో రస్సెల్.... రాజస్తాన్ ఇన్నింగ్స్ జోరుకు కాస్త అడ్డుకట్ట వేశాడు. వరుసగా నాలుగు ఓవర్లు వేసిన అతను... క్రమం తప్పకుండా స్మిత్, శామ్సన్ (8), ఫాల్క్నర్ (6)ల వికెట్లు తీశాడు. దీంతో 15 ఓవర్లు ముగిసేసరికి జట్టు స్కోరు 146/4గా మారింది. కరుణ్ నాయర్ (16)తో కలిసి చివర్లో వాట్సన్ మళ్లీ బ్యాట్ ఝళిపించడంతో పరుగుల వరద పారింది. ఈ ఇద్దరు ఐదో వికెట్కు 40 పరుగులు జోడించాడు. ఈ క్రమంలో 57 బంతుల్లో సెంచరీ పూర్తి చేసిన వాట్సన్.. మోరిస్ (4)తో కలిసి ఆరో వికెట్కు 19 పరుగులు సమకూర్చాడు. యూసుఫ్ మినహా... భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో కోల్కతాకు సరైన ఆరంభం లభించలేదు. ఓపెనర్లు ఉతప్ప (14), గంభీర్ (1) స్వల్ప స్కోరుకే అవుటయ్యారు. తర్వాత మనీష్ పాండే (21 బంతుల్లో 21; 3 ఫోర్లు) సాయంతో యూసుఫ్ ఇన్నింగ్స్ను పునర్నిర్మించాడు. కానీ స్మిత్.. బౌలర్లను మార్చిమార్చి ప్రయోగించడంతో మూడో వికెట్కు 56 పరుగులు జోడించాక పాండే వెనుదిరిగాడు. ఈ దశలో రస్సెల్ భారీ హిట్టింగ్తో విరుచుకుపడ్డాడు. యూసుఫ్తో కలిసి నాలుగో వికెట్కు 55 పరుగులు జోడించాడు. అయితే మూడు బంతుల తేడాలో రస్సెల్, సూర్యకుమార్ (0)లతో పాటు కొద్దిసేపటికే యూసుఫ్ కూడా అవుట్కావడంతో కోల్కతా కోలుకోలేకపోయింది. చివర్లో షకీబ్ (13), ఉమేశ్ (11 బంతుల్లో 24 నాటౌట్; 4 ఫోర్లు, 1 సిక్స్) దడదడలాడించాడు. అయితే గెలుపునకు 12 బంతుల్లో 36 పరుగులు చేయాల్సిన దశలో కోల్కతా 26 పరుగులు మాత్రమే చేసి ఓడింది. మోరిస్ 4 వికెట్లు తీశాడు. మిగతా రెండు బెర్త్ల కోసం... ఈ మ్యాచ్లో విజయంతో రాజస్తాన్ 16 పాయింట్లతో ప్లే ఆఫ్కు చేరుకుంది. 15 పాయింట్లతో ఉన్న కోల్కతా అవకాశాలు దాదాపుగా మూసుకుపోయాయి. ఇక ఆదివారం తన ఆఖరి మ్యాచ్లో బెంగళూరు... ఢిల్లీపై గెలిస్తే సమీకరణాలతో అవసరం లేకుండా ప్లే ఆఫ్కు అర్హత పొందుతుంది. ఒకవేళ భారీ తేడాతో ఢిల్లీ గెలిస్తే మాత్రం కోల్కతాకు స్వల్ప అవకాశం ఉంటుంది. అయితే రన్రేట్లో ఆర్సీబీని కోల్కతా అధిగమించాలి. సన్రైజర్స్, ముంబైల్లో గెలిచిన జట్టు ప్లే ఆఫ్కు అర్హత సాధిస్తుంది. స్కోరు వివరాలు రాజస్తాన్ రాయల్స్ ఇన్నింగ్స్ : రహానే రనౌట్ 37; వాట్సన్ నాటౌట్ 104; స్మిత్ (సి) మోర్కెల్ (బి) రస్సెల్ 14; శామ్సన్ (సి) గంభీర్ (బి) రస్సెల్ 8; ఫాల్క్నర్ (సి) సూర్యకుమార్ (బి) రస్సెల్ 6; కరుణ్ నాయర్ (సి) ఉతప్ప (బి) ఉమేశ్ 16; మోరిస్ రనౌట్ 4; ఎక్స్ట్రాలు 10; మొత్తం: (20 ఓవర్లలో 6 వికెట్లకు) 199. వికెట్ల పతనం : 1-80; 2-110; 3-122; 4-140; 5-180; 6-199. బౌలింగ్ : అజర్ మహమూద్ 3-0-41-0; మోర్కెల్ 4-0-38-0; ఉమేశ్ 4-0-36-1; షకీబ్ 4-0-36-0; రస్సెల్ 4-0-32-3; చావ్లా 1-0-12-0. కోల్కతా నైట్రైడర్స్ ఇన్నింగ్స్ : ఉతప్ప (సి) స్మిత్ (బి) కులకర్ణి 14; గంభీర్ (సి) బిన్నీ (బి) మోరిస్ 1; మనీష్ (సి) మోరిస్ (బి) కులకర్ణి 21; యూసుఫ్ (సి) కులకర్ణి (బి) వాట్సన్ 44; రస్సెల్ (సి) కులకర్ణి (బి) మోరిస్ 37; సూర్యకుమార్ (సి) శామ్సన్ (బి) మోరిస్ 0; షకీబ్ (సి) స్మిత్ (బి) మోరిస్ 13; అజర్ (సి) రహానే (బి) ఫాల్క్నర్ 6; చావ్లా (సి) బిన్నీ (బి) వాట్సన్ 0; ఉమేశ్ నాటౌట్ 24; మోర్కెల్ నాటౌట్ 4; ఎక్స్ట్రాలు 26; మొత్తం: (20 ఓవర్లలో 9 వికెట్లకు) 190. వికెట్ల పతనం : 1-8; 2-21; 3-77; 4-132; 5-133; 6-146; 7-156; 8-159; 9-184. బౌలింగ్ : మోరిస్ 4-0-23-4; బ్రెండర్ స్రాన్ 3-0-35-0; ధవల్ కులకర్ణి 4-0-36-2; ఫాల్క్నర్ 4-0-45-1; వాట్సన్ 4-0-38-2; బిన్నీ 1-0-10-0. -
చెన్నై ‘టాప్’...
పంజాబ్పై అలవోక విజయం రాణించిన డుప్లెసిస్, రైనా అధికారికంగా ప్లేఆఫ్కు అంచనాలకు తగ్గట్టు రాణించిన చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్-8 సీజన్లో అగ్రస్థానంలో నిలిచింది. 18 పాయింట్లతో నంబర్వన్ హోదాతో అధికారికంగా ప్లేఆఫ్లో అడుగుపెట్టింది. విజయంతో ఆరంభించి... మరో చక్కటి గెలుపుతోనే ధోని సేన లీగ్ దశను ముగించింది. అటు గత సీజన్లో కేవలం మూడు మ్యాచ్లే ఓడిన పంజాబ్ ఈసారి మూడే గెలిచి ఆఖరి స్థానంతో తమ ప్రస్థానాన్ని ముగించింది. మొహాలీ : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో తమదెంత పటిష్ట జట్టో చెన్నై సూపర్ కింగ్స్ మరోసారి నిరూపించుకుంది. బౌలింగ్, బ్యాటింగ్లో అదరగొట్టే ఆటతీరుతో పంజాబ్ కింగ్స్ ఎలెవన్ను బెంబేలెత్తించింది. ఫలితంగా శనివారం ఏకపక్షంగా జరిగిన ఈ మ్యాచ్లో చెన్నై ఏడు వికెట్ల తేడాతో సునాయాస విజయం దక్కించుకుంది. దీంతో ప్లేఆఫ్కు వెళ్లిన తొలి జట్టుగా నిలిచింది. ముందుగా బ్యాటింగ్కు దిగిన పంజాబ్ కింగ్స్ ఎలెవన్ 20 ఓవర్లలో ఏడు వికెట్లకు 130 పరుగులే చేసింది. టాప్ ఆర్డర్ పూర్తిగా విఫలం కాగా... అక్షర్ పటేల్ (29 బంతుల్లో 32; 2 ఫోర్లు; 1 సిక్స్), రిషీ ధావన్ (20 బంతుల్లో 25 నాటౌట్; 1 ఫోర్; 2 సిక్సర్లు) టాప్ స్కోరర్లుగా నిలిచారు. పవన్ నేగికి రెండు వికెట్లు దక్కగా... స్పిన్నర్ అశ్విన్ (1/14) పొదుపైన బౌలింగ్తో ఆకట్టుకున్నాడు. అనంతరం ఈ లక్ష్యాన్ని చెన్నై సూపర్ కింగ్స్ 16.5 ఓవర్లలో మూడు వికెట్లకు 134 పరుగులు చేసి అధిగమించింది. డు ప్లెసిస్ (41 బంతుల్లో 55; 5 ఫోర్లు; 1 సిక్స్), రైనా (34 బంతుల్లో 41 నాటౌట్; 4 ఫోర్లు) నిలకడగా ఆడారు. చివర్లో ధోని (16 బంతు ల్లో 25 నాటౌట్; 2 ఫోర్లు; 2 సిక్సర్లు) దడదడలాడించాడు. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ గా నేగి నిలిచాడు. వికెట్లు టపటపా... టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన పంజాబ్ బ్యాట్స్మెన్ను చెన్నై బౌలర్లు ప్రారంభం నుంచే వణికించారు. ఏ దశలోనూ ఈ ఆటగాళ్ల మధ్య చెప్పుకోదగ్గ భాగస్వామ్యం ఏర్పడలేదు. తొలి రెండు ఓవర్లలో ఫోర్, సిక్స్తో టచ్లో కనిపించిన ఓపెనర్ వృద్ధిమాన్ సాహా (12 బంతుల్లో 15; 1 ఫోర్; 1 సిక్స్) మూడో ఓవర్లో పవన్ నేగికి చిక్కాడు. కొద్ది సేపటికే వరుస ఓవర్లలో బెయిలీ (7 బంతుల్లో 12; 2 ఫోర్లు)ని ఆశిష్ నెహ్రా.. వోహ్రా (7 బంతుల్లో 4) వికెట్ను ఈశ్వర్ పాండే తీయడంతో పంజాబ్ 35 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. పొదుపుగా బౌలింగ్ చేసిన స్పిన్నర్ అశ్విన్ తన రెండో ఓవర్లో ధోని స్టంపింగ్తో గురుకీరత్ (14 బంతుల్లో 15; 3 ఫోర్లు)ను పెవిలియన్కు పంపాడు. ఇది ఐపీఎల్లో ధోనికి 23వ స్టంపింగ్. దినేష్ కార్తీక్ (23) రికార్డును సమం చేశాడు. మ్యాక్స్వెల్, మిల్లర్ కూడా తక్కువ స్కోర్లకే అవుటవ్వడంతో పంజాబ్ భారీ స్కోరుపై ఆశలు వదులుకుంది. ఆదిలో తడబడినా.. స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నైకి పంజాబ్ తొలి ఓవర్లోనే ఝలక్ ఇచ్చింది. ఈ సీజన్లో తొలి మ్యాచ్ ఆడిన హస్సీ (1)ని సందీప్ అవుట్ చేశాడు. ఈ షాక్ నుంచి తేరుకునేలోగానే రెండో ఓవర్లో మెకల్లమ్ (6 బంతుల్లో 6; 1 ఫోర్)ని హెండ్రిక్స్ బౌల్డ్ చేయడంతో 10 పరుగులకే చెన్నై రెండు వికెట్లు కోల్పోయింది. అయితే ఎలాంటి సంచలనాలకు తావీయకుండా డు ప్లెసిస్, రైనా జోడి పంజాబ్ బౌలర్లను దీటుగా ఎదుర్కొంది. ఇరువురూ అడపాదడపా బౌండరీలతో చెలరేగారు. మధ్య ఓవర్లలో నిదానంగా సాగిన ఇన్నింగ్స్కు 12వ ఓవర్లో డు ప్లెసిస్ 6,4తో జోష్ నింపాడు. ఆ తర్వాతి ఓవర్లో రిషీ ధావన్ తనను బౌల్డ్ చేశాడు. మూడో వికెట్కు వీరిద్దరు 92 పరుగులు జత చేశారు. ఇక ధోని ధనాధన్ ఆటతో విజయం లాంఛనమే అయ్యింది. 17వ ఓవర్లో వరుసగా రెండు సిక్స్లు బాదాడు ఇందులో గాల్లోకి ఎగిరి గుండ్రంగా తిరిగి ఫైన్ లెగ్లో కొట్టిన సిక్స్ హైలైట్గా నిలిచింది. అదే ఓవర్లో రైనా ఓ ఫోర్తో మ్యాచ్ను ముగించాడు. స్కోరు వివరాలు పంజాబ్ కింగ్స్ ఎలెవన్ ఇన్నింగ్స్ : సాహా (సి) మెకల్లమ్ (బి) నేగి 15; వోహ్రా (సి) నెహ్రా (బి) పాండే 4; బెయిలీ (సి) ధోని (బి) నెహ్రా 12; మ్యాక్స్వెల్ (బి) జడేజా 6; గుర్కీరత్ సింగ్ (స్టంప్డ్) ధోని (బి) అశ్విన్ 15; మిల్లర్ (సి) జడేజా (బి) నేగి 11; పటేల్ (సి) ధోని (బి) బ్రేవో 32; రిషీ ధావన్ నాటౌట్ 25; హెండ్రిక్స్ నాటౌట్ 1; ఎక్స్ట్రాలు 9; మొత్తం (20 ఓవర్లలో ఏడు వికెట్లకు) 130. వికెట్ల పతనం : 1-16, 2-31, 3-35, 4-53, 5-55, 6-78, 7-122. బౌలింగ్ : నేగి 4-0-25-2; ఈశ్వర్ పాండే 3-0-22-1; నెహ్రా 3-0-17-1; అశ్విన్ 4-0-14-1; జడేజా 3-0-18-1; రైనా 1-0-8-0; బ్రేవో 2-0-20-1. చెన్నై సూపర్ కింగ్స్ ఇన్నింగ్స్ : మైక్ హస్సీ (సి) సాహా (బి) సందీప్ 1; మెకల్లమ్ (బి) హెండ్రిక్స్ 6; డు ప్లెసిస్ (బి) ధావన్ 55; రైనా నాటౌట్ 41; ధోని నాటౌట్ 25; ఎక్స్ట్రాలు 6; మొత్తం (16.5 ఓవర్లలో మూడు వికెట్లకు) 134. వికెట్ల పతనం : 1-2, 2-10, 3-102. బౌలింగ్ : సందీప్ శర్మ 2-0-9-1; హెండ్రిక్స్ 3-0-25-1; గురుకీరత్ 3-0-22-0; ధావన్ 2-0-12-1; మ్యాక్స్వెల్ 1-0-8-0; అక్షర్ 3-0-28-0; అనురీత్ 2.5-0-30-0. -
కీలక మ్యాచ్లో రాజస్థానే గెలిచింది
ముంబై: ఐపీఎల్-8లో జరిగిన కీలక మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ విజయం సాధించి ఫ్లేఆఫ్ పై ఆశలు సజీవంగా ఉంచుకుంది. 9 పరుగుల తేడాతో కోల్కతా పై రాజస్థాన్ రాయల్స్ గెలుపొందింది. తొలుత టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్కు దిగి నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 199 పరుగులు చేసింది. వాట్సన్(104) మెరుపు ఇన్నింగ్స్తో భారీ స్కోరు చేసింది. ఓపెనర్లుగా వచ్చిన రహానే(37), వాట్సన్(104)లు తొలి నుంచి ధాటిగా ఆడి రాజస్థాన్కి మంచి శుభారంభాన్ని ఇచ్చారు. వీరిద్దరూ తొలి వికెట్కి 80 పరుగుల భాగస్వామ్యన్ని జోటించారు. వేగంగా పరుగులు రాబడుతున్న సమయంలోనే రహానే(37) రనౌట్గా వెనుదిరిగాడు. ఆ తర్వాత వచ్చిన స్మిత్(14) పరుగుల వద్ద రస్సెల్ బౌలింగ్ లో క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. సామ్సన్(8) , ఫాల్క్నర్(6), కరుణ్(16) మోరీస్(4) పరుగులు చేసి ఔటయ్యారు. వాట్సన్(104) పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. కోల్ కతా బౌలింగ్లో రస్సెల్ రాణించి మూడు వికెట్లు తీయగా, ఉమేష్ యాదవ్కు ఒక వికెట్ లభించింది. భారీ లక్ష్యంతో బరిలో దిగిన కోల్కతాకి ఆదిలోనే ఎదురు దెబ్బ తగిలింది. 8 పరుగుల వద్ద మోరీస్ వేసిన మొదటి ఓవర్లోనే గౌతం గంభీర్(1) క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. 21 పరుగుల వద్ద ఉతప్ప(14) క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.77 పరుగుల వద్ద మనీష్ పాండే(14) భారీ షాట్ కి యత్నించి అవుటయ్యాడు. ఆ తర్వాత వచ్చిన యూసుఫ్ పటాన్(44)రస్సెల్(37)లు ధాటిగా ఆడి వేగంగా పరుగులు రాబట్టారు.132 పరుగుల వద్ద రస్సెల్ సిక్సర్ కి యత్నించి ఔటయ్యాడు. సూర్యకుమార్ యాదవ్(0), యుసుఫ్ పటాన్(44), అజార్ మహమూద్(6), పియూష్ చావ్లా(0) లు త్వరత్వరగా ఔటయ్యారు. చివర్లో 6 బంతుల్లో 16 పరుగులు అవసరమున్న కీలక సమయంలో షకీబ్(13) ఔటయ్యాడు...చివర్లో ఉమెష్ యాదవ్(24) వెగంగా ఆడినా లాభం లేకుండా పోయింది. మోర్కెల్(4),ఉమెష్ యాదవ్(24)లు నాటౌట్ గా నిలిచారు. రాజస్థాన్ బౌలింగ్ లో మోరీస్ 4 వికెట్లు తీసి మెరిపించాగా, కులకర్ణి, షేన్ వాట్సన్లు చేరో 2 వికెట్లు తీశారు. ఫాల్క్నర్ కి ఒక వికెట్ దక్కింది. -
కోల్కతా టార్గెట్ 200
ముంబై: ఐపీఎల్-8లో భాగంగా శనివారం రాత్రి జరుగుతున్న మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ ఎదుట రాజస్థాన్ 200పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ తొలుత బ్యాటింగ్కు దిగి నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 199 పరుగులు చేసింది. ఓపెనర్లుగా వచ్చిన రహానే(37), వాట్సన్(104)లు తొలి నుంచి ధాటిగా ఆడి రాజస్థాన్కి మంచి శుభారంభాన్ని ఇచ్చారు. వీరిద్దరూ తొలి వికెట్కి 80 పరుగుల భాగస్వామ్యన్ని జోడించారు. వేగంగా పరుగులు రాబడుతున్న సమయంలోనే రహానే(37) రనౌట్గా వెనుదిరిగాడు. ఆ తర్వాత వచ్చిన స్మిత్(14) పరుగుల వద్ద రస్సెల్ బౌలింగ్ లో క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. సామ్సన్(8) , ఫాల్క్నర్(6), కరుణ్(16) మోరీస్(4) పరుగులు చేసి ఔటయ్యారు. వాట్సన్(104)మెరుపు ఇన్నింగ్స్ ఆడి నాటౌట్ గా నిలిచారు. బౌలింగ్లోరస్సెల్ రాణించి మూడు వికెట్లు తీయగా, ఉమేష్ యాదవ్కు ఒక వికెట్ లభించింది. -
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాజస్థాన్
ముంబై: ఐపీఎల్-8 లో భాగంగా శనివారం రాత్రి 8 గంటలకు ప్రారంభమమ్యే మ్యాచ్ లో కోల్ కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడనున్నాయి. కోల్ కతాతో జరగనున్న మ్యాచ్ లో టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ షేన్ వాట్సన్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఇరు జట్లకు ఇదే చివరి లీగ్ మ్యాచ్. గెలిచిన జట్టు నేరుగా ప్లే ఆఫ్కు అర్హత సాధిస్తుంది. ప్రస్తుతం కోల్ కతా ఖాతాలో 15 పాయింట్లుడగా, రాజస్థాన్ ఖాతాలో 14 పాయింట్లున్నాయి. -
చెన్నై నంబర్ వన్
మొహాలీ: ఐపీఎల్ -8 లో భాగంగా కింగ్స్ ఎలెవన్ పంజాబ్తో జరిగిన మ్యాచ్లో చెన్నై7 వికెట్ల తేడాతో గెలుపొందింది. 16.5 ఓవర్లలో పంజాబ్ నిర్ధేశించిన లక్ష్యాన్ని ఛేదించింది. 131 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నైకి ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. 2 పరుగుల వద్ద హస్సీ(1), 10 పరుగుల వద్ద బ్రెండన్ మెకల్లమ్(6) వికెట్లను కోల్పోయింది. ఆ తర్వాత బ్యాటింగ్ కి దిగిన డుప్లెసిస్(55), రైనా(41)లు స్కోరు బోర్డుని పరుగులు పెట్టించారు. ఈ ఇద్దరు కలిసి 92 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పడంతో చెన్నై సునాయాసంగా గెలుపొందింది. అత్బుతంగా బౌలింగ్ చేసిన చెన్నై బౌలర్ పవన్ నేగికి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. 102 పరుగుల వద్ద డుప్లెసిస్ (55) రిషి ధావన్ వేసిన బంతికి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. చివర్లో బ్యాటింగ్ కు వచ్చిన ధోనీ(25) పరుగులు చేశాడు. పంజాబ్ బౌలర్లలో సందీప్ శర్మ, రిషి ధావన్, హెన్రిక్స్ లకు ఒక్కో వికెట్ దక్కింది. ఈ విజయంతో 18 పాయింట్లతో లీగ్ దశలో సూపర్ కింగ్స్ నంబర్ వన్ గా నిలిచింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ని చెన్నై బౌలర్లు 130 పరుగులకే కట్టడి చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 130 పరుగులు చేసింది. పంజాబ్ జట్టులో అక్షర్ పటేల్ (29 బంతుల్లో 32, 2 ఫోర్లు, 1 సిక్స్) మాత్రమే రాణించాడు. డేవిడ్ మిల్లర్ (11) తో కలిసి ఆరో వికెట్ కు 23 పరుగుల భాగస్వామ్యాన్ని, రిషి ధావన్ తో కలిసి 44 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి ఏడో వికెట్ గా వెనుదిరిగాడు. రిషి ధావన్ (20 బంతుల్లో 25) మాత్రమే పరవాలేదనిపించాడు. వృద్ధిమాన్ సాహా(16) , మనన్ వోహ్రా(4) లతో పాటు కెప్టెన్ జార్జీ బెయిలీ (12) నిరాశపరిచారు. రవిచంద్రన్ అశ్విన్ వేసిన ఇన్నింగ్స్ 9వ ఓవర్లో షాట్ ఆడటానికి క్రీజు వదిలి వెళ్లిన గురుకీరత్ సింగ్ (15)ను చెన్నై కీపర్ మహేంద్ర సింగ్ ధోనీ స్టంపౌట్ చేశాడు. గ్లెన్ మాక్స్ వెల్ (6) రవీంద్ర జడేజా బౌలింగ్ లో క్లీన్ బౌల్డయ్యాడు. చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్లలో పవన్ నేగి రెండు వికెట్లు పడగొట్టగా, అశ్విన్, ఆశీష్ నెహ్రా, ఈశ్వర్ పాండే, రవీంద్ర జడేజా, డ్వేన్ బ్రేవో ఒక్కో వికెట్ తీశారు. -
గెలిస్తేనే.. నిలుస్తారు
ముంబై: ఐపీఎల్-8 సీజన్లో మరో కీలక పోరు జరగబోతోంది. శనివారం రాత్రి 8 గంటల నుంచి జరిగే మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్, కోల్కతా నైట్ రైడర్స్ చావోరేవో తేల్చుకోనున్నాయి. ఇరు జట్లకు ఇదే చివరి లీగ్ మ్యాచ్. గెలిచిన జట్టు నేరుగా ప్లే ఆఫ్కు అర్హత సాధిస్తుంది. దీంతో ఈ మ్యాచ్ ఇరు జట్లకు కీలకం. ముఖ్యంగా రాజస్థాన్కు. రాజస్థాన్ నాకౌట్కు చేరాలంటే ఈ మ్యాచ్ గెలిచి తీరాలి. లేకుంటే ఇంటికే. ఈ మ్యాచ్లో కోల్కతా ఓడినా అవకాశాలు ఉంటాయి. అయితే రన్రేట్పై ఆధారపడి ఉంటుంది. పాయింట్ల పట్టికలో కోల్కతా (15) మూడో స్థానంలో ఉండగా, రాజస్థాన్ (14) ఆరో స్థానంలో ఉంది. ఈ సీజన్లో వాట్సన్ సారథ్యంలోని రాజస్థాన్ ఆరంభంలో వరుస విజయాలు సాధించినా ఆనక వెనకబడింది. ఇక గంభీర్ నాయకత్వంలోని కోల్కతా కీలక సమయంలో రాణించింది. -
చెన్నై బ్యాటింగ్
మొహాలీ: ఐపీఎల్ - 8 లో భాగంగా కింగ్స్ ఎలెవన్ పంజాబ్ నిర్దేశించిన 131 పరుగుల లక్ష్యంతో చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటింగ్ ప్రారంభించింది. మైక్ హస్సీ, బ్రెండన్ మెకల్లమ్ బ్యాటింగ్ ప్రారంభించారు. తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 130 పరుగులు చేసింది. -
చెన్నై విజయలక్ష్యం 131
మొహాలీ: ఐపీఎల్-8 లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్ తో శనివారం జరుగుతున్న మ్యాచ్ లో 131 పరుగుల టార్గెట్ ని కింగ్స్ ఎలెవన్ పంజాబ్ నిర్దేశించింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 130 పరుగులు చేసింది. పంజాబ్ జట్టులో అక్షర్ పటేల్ (29 బంతుల్లో 32, 2 ఫోర్లు, 1 సిక్స్) మాత్రమే రాణించాడు. డేవిడ్ మిల్లర్ (11) తో కలిసి ఆరో వికెట్ కు 23 పరుగుల భాగస్వామ్యాన్ని, రిషి ధావన్ తో కలిసి 44 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి ఏడో వికెట్ గా వెనుదిరిగాడు. రిషి ధావన్ (20 బంతుల్లో 25) పరవాలేదనిపించాడు. పంజాబ్ జట్టు 35 పరుగులకే ఓపెనర్లు వృద్ధిమాన్ సాహా(16) , మనన్ వోహ్రా(4) లతో పాటు కెప్టెన్ జార్జీ బెయిలీ (12) వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. పంజాబ్ స్కోరు 16 పరుగుల వద్ద సాహా వికెట్ కోల్పోయిన ఆ జట్టు వరుస విరామాల్లో వికెట్లను కోల్పోయింది. రవిచంద్రన్ అశ్విన్ వేసిన ఇన్నింగ్స్ 9వ ఓవర్లో షాట్ ఆడటానికి క్రీజు వదిలి వెళ్లిన గురుకీరత్ సింగ్ (15)ను చెన్నై కీపర్ మహేంద్ర సింగ్ ధోనీ స్టంపౌట్ చేశాడు. పదో ఓవర్లో గ్లెన్ మాక్స్ వెల్ (6) రవీంద్ర జడేజా బౌలింగ్ లో క్లీన్ బౌల్డయ్యాడు. చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్లలో పవన్ నేగి రెండు వికెట్లు పడగొట్టగా, అశ్విన్, ఆశీష్ నెహ్రా, ఈశ్వర్ పాండే, రవీంద్ర జడేజా, డ్వేన్ బ్రేవో ఒక్కో వికెట్ తీశారు. -
కష్టాల్లో పంజాబ్
మొహాలీ: ఐపీఎల్ - 8 లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్ తో శనివారం జరుగుతున్న మ్యాచ్ లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తొలి 10 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 56 పరుగులు చేసింది. పంజాబ్ జట్టు 35 పరుగులకే ఓపెనర్లు వృద్ధిమాన్ సాహా(16) , మనన్ వోహ్రా(4) లతో పాటు కెప్టెన్ జార్జీ బెయిలీ (12) వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. పంజాబ్ స్కోరు 16 పరుగుల వద్ద సాహా వికెట్ కోల్పోయిన వరుస విరామాల్లో వికెట్లను కోల్పోయింది. రవిచంద్రన్ అశ్విన్ వేసిన ఇన్నింగ్స్ 9వ ఓవర్లో షాట్ ఆడటానికి క్రీజు వదిలి వెళ్లిన గురుకీరత్ సింగ్ (15)ను చెన్నై కీపర్ మహేంద్ర సింగ్ ధోనీ స్టంపౌట్ చేశాడు. పదో ఓవర్లో గ్లెన్ మాక్స్ వెల్ (6) రవీంద్ర జడేజా బౌలింగ్ లో క్లీన్ బౌల్డయ్యాడు. చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్లలో అశ్విన్, ఆశీష్ నెహ్రా, ఈశ్వర్ పాండే, పవన్ నేగి, రవీంద్ర జడేజా ఒక్కో వికెట్ పడగొట్టారు. -
బ్యాటింగ్ ప్రారంభించిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్
మొహాలీ: ఐపీఎల్ - 8 లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్ తో శనివారం ఇక్కడి పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరగనున్న మ్యాచ్ లో టాస్ గెలిచిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ బ్యాటింగ్ ప్రారంభించింది. వృద్ధిమాన్ సాహా, మనన్ వోహ్రాలు ఓపెనర్లుగా వచ్చారు. అంతకుముందు టాస్ గెలిచిన పంజాబ్ కెప్టెన్ జార్జీ బెయిలీ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. చెన్నై ప్రస్తుతం పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉండగా, పంజాబ్ కేవలం 3 విజయాలతో ఆరు పాయింట్లతో పట్టికలో చివరి స్థానంలో ఉంది. ఇరు జట్లకు లీగ్ దశలో ఇది చివర్ మ్యాచ్ కాగా, ఈ మ్యాచ్ గెలిచి ప్లే ఆఫ్ స్థానాన్ని ఖరారు చేసుకునేందుకు చెన్నై బరిలో దిగింది. -
డ్వేన్ స్మిత్ ఔట్.. మైక్ హస్సీ ఇన్
మొహాలీ: ఐపీఎల్ - 8 లో భాగంగా శనివారం ఇక్కడి పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్లు తలపడుతున్నాయి. చెన్నై జట్టులో స్వల్ప మార్పులు జరిగాయి. డాషింగ్ ఓపెనర్ డ్వేన్ స్మిత్ ను చెన్నై సూపర్ కింగ్స్ పక్కనపెట్టింది. లీగ్ దశ చివరి మ్యాచ్ లో అతడి స్థానంలో మైకెల్ హస్సీ చెన్నై జట్టులో స్థానం సంపాదించాడు. -
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పంజాబ్
మొహాలీ: ఐపీఎల్ - 8 లో భాగంగా శనివారం ఇక్కడి పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్లు తలపడుతున్నాయి. టాస్ గెలిచిన పంజాబ్ కెప్టెన్ జార్జీ బెయిలీ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. చెన్నై ప్రస్తుతం పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉండగా, పంజాబ్ కేవలం 3 విజయాలతో ఆరు పాయింట్లతో పట్టికలో చివరి స్థానంలో ఉంది. ఇరు జట్లకు లీగ్ దశలో ఇది చివర్ మ్యాచ్ కాగా, ఈ మ్యాచ్ గెలిచి ప్లే ఆఫ్ స్థానాన్ని ఖరారు చేసుకునేందుకు చెన్నై బరిలో దిగనుంది. -
సన్రైజర్స్పై ఆర్సీబీ థ్రిల్లింగ్ విక్టరీ
-
బెంగళూరు విజయం
-
స్టేడియంలో కేసీఆర్
వానే ఓడింది... అభిమాని గెలిచాడు సన్రైజర్స్, బెంగళూరు మ్యాచ్కు తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు వచ్చారు. బెలూన్లు, పావురాలు ఎగరేసిన తర్వాత ఆటగాళ్లతో పరిచయ కార్యక్రమానికి సిద్ధమయ్యారు. ఈ లోగా భారీవర్షం వచ్చింది. కొద్దిసేపు నిరీక్షించి వెళ్లిపోయారు. -
కొత్త హీరోలు
హార్థిక్ హిమాన్షు పాండ్యా ఈసారి ఐపీఎల్ వేలంలో అన్ని ఫ్రాంచైజీలు స్టార్ ఆటగాళ్ల వైపు కాకుండా దేశవాళీ క్రికెటర్లను తీసుకునేందుకు ఎక్కువగా ఆసక్తి చూపాయి. ఆటలో అనుభవం అంతగా లేకపోయినా... కొంత మందిపై పెద్ద మొత్తంలోనే ఖర్చు చేశాయి. అలా అవకాశం దక్కించుకున్న వారిలో కొంత మందికి ఆడే అవకాశం రాకపోయినా.. వచ్చిన వారు మాత్రం దాన్ని చక్కగా సద్వినియోగం చేసుకున్నారు. వారిలో ముంబై ఇండియన్స్ కుర్రాడు హార్థిక్ పాండ్యా, ఢిల్లీ ఓపెనర్ శ్రేయస్ అయ్యర్లు ఈ సీజన్లో హాట్గా మారారు. సాక్షి క్రీడావిభాగం : ఈ ఐపీఎల్కు ముందు క్రికెట్ అభిమానులకు కనీసం పాండ్యా పేరు కూడా తెలియదు. 1993లో సూరత్లోని చోరాసిలో జన్మించిన పాండ్యా... బరోడా జట్టు తరఫున దేశవాళీ క్రికెట్ ఆడుతూ నాణ్యమైన ఆల్రౌండర్గా పేరు తెచ్చుకున్నాడు. 2013లో దేశవాళీలో ఓ మోస్తరు ప్రదర్శనతో తన ప్రతిభను బయటపెట్టినా.. 2013-14 సీజన్ ముస్తాక్ అలీ ట్రోఫీలో తనెంటో చూపెట్టాడు. బరోడాకు ట్రోఫీని అందించడంలో కీలక పాత్ర పోషించిన అతను ఫస్ట్క్లాస్ క్రికెట్లో కేవలం 6 మ్యాచ్లే ఆడి 285 పరుగులు చేశాడు. లిస్ట్-ఎలో నాలుగు మ్యాచ్లు ఆడాడు. ఓవరాల్గా 10 మ్యాచ్ల అనుభవంతో రూ. 10 లక్షల కనీస ధరతో ఐపీఎల్లో వేలంలోకి వచ్చిన అతన్ని ముంబై అదే ధరకు దక్కించుకుంది. అయితే ఈ లీగ్లో తొలి నాలుగు మ్యాచ్లకు డగౌట్కు పరిమితమైన పాండ్యా... ఆర్సీబీతో తొలి మ్యాచ్ ఆడాడు. కేవలం 16 పరుగులే చేసినా... తనలో ఆత్మ విశ్వాసాన్ని మాత్రం అమోఘంగా పెంపొందించుకున్నాడు. స్టార్లతో కళకళలాడే ముంబై జట్టులో అవకాశం దక్కడమే గొప్ప. అలాంటి పరిస్థితుల్లో వచ్చిన అవకాశాన్ని రెండు చేతులా ఒడిసిపట్టుకున్నాడు. ప్రస్తుతం అతను ముంబై జట్టులో సరికొత్త సంచలనం. పటిష్టమైన చెన్నైతో ఈనెల 8న జరిగిన మ్యాచ్లో కేవలం 8 బంతుల్లో 21 పరుగులు చేయడంతో పాటు మైదానంలో మెరుపు కదలికలతో మూడు కీలక క్యాచ్లు అందుకున్నాడు. ఫలితంగా కీలక మ్యాచ్లో చెన్నైపై ముంబై గెలిచింది. ప్లే ఆఫ్కు చేరాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్లో కోల్కతాపై 31 బంతుల్లోనే 61 పరుగులు చేసి ముంబైకి ఒంటిచేత్తో విజయాన్ని అందించాడు. ఈ సీజన్లో ఇప్పటివరకూ ఆడిన 6 మ్యాచ్ల్లో 111 పరుగులు సాధించాడు. చిన్నప్పట్నించి క్రికెట్ అంటే అమితాసక్తి చూపే శ్రేయస్ను 12 ఏళ్ల వయసులో జింఖానా శివాజీ పార్క్లో కోచ్ ప్రవీణ్ ఆమ్రే గుర్తించాడు. ఆరంభంలో కుర్రాడి ప్రతిభకు మెరుగులు దిద్దిన ఆమ్రే.. శ్రేయస్ క్రికెట్ కెరీర్కు చక్కని పునాది వేశాడు. బంతిని బలంగా బాదడంలో సిద్ధహస్తుడు కావడంతో శ్రేయస్ వయసు గ్రూప్ వాళ్లందరూ అతన్ని సెహ్వాగ్తో పోల్చేవారు. ప్రస్తుతం పొడర్ కాలేజీలో గ్రాడ్యుయేషన్ చేస్తున్న శ్రేయస్... కాలేజీ తరఫున చాలా టోర్నీలు ఆడాడు. అద్భుతమైన ప్రతిభతో తన జట్టుకు ట్రోఫీలను సాధించిపెట్టడంతో ఒక్కసారిగా అతని ప్రతిభ ముంబైని తాకింది. గతేడాది నవంబర్లో లిస్ట్-ఎ క్రికెట్లో అరంగేట్రం చేసిన శ్రేయస్... విజయ్ హజారే ట్రోఫీలో 273 పరుగులు సాధించి అందరి దృష్టిలో పడ్డాడు. డిసెంబర్లో ఫస్ట్క్లాస్ క్రికెట్లోకి అడుగుపెట్టాడు. 2014-15 రంజీ సీజన్లో ముంబై తరఫున రెండు సెంచరీలతో 809 పరుగులు సాధించాడు. ఫిబ్రరిలో జరిగిన వేలానికి రూ. 10 లక్ష బేస్ ప్రైస్తో వచ్చాడు. కానీ ఢిల్లీ అనూహ్యంగా రూ. 2.6 కోట్లకు శ్రేయస్ను తీసుకుంది. దీంతో టోర్నీలోనే అత్యధిక ధర పలికిన అన్క్యాప్డ్ ప్లేయర్గా రికార్డు సృష్టించాడు. లీగ్ ఆరంభం నుంచి ఢిల్లీ జట్టులో చోటు దక్కించుకున్న శ్రేయస్... బ్యాటింగ్లో నిలకడగా రాణిస్తున్నాడు. సన్రైజర్స్, ముంబై, కింగ్స్ ఎలెవన్, చెన్నైపై అర్ధసెంచరీలతో చెలరేగాడు. జట్టులో యువరాజ్, డుమిని, డికాక్లాంటి స్టార్ ఆటగాళ్లున్నా... వీళ్లందర్నీ మించి శ్రేయస్ పరుగుల వరద పారిస్తున్నాడు. ఈ సీజన్లో ఇప్పటివరకు ఆడిన 13 మ్యాచ్ల్లో 419 పరుగులు చేశాడు. ఎనిమిదేళ్ల క్రితం ఐపీఎల్ మొదలైనప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఒకరిద్దరు యువ క్రికెటర్లు సంచలన ప్రదర్శనతో వెలుగులోకి వస్తూనే ఉన్నారు. జడేజా, యూసుఫ్ పఠాన్ సహా అనేకమంది క్రికెటర్లను భారత్కు ఐపీఎల్ అందించింది. అలాగే ఈ సీజన్లోనూ ఇద్దరు యువ క్రికెటర్లు అద్భుతాలు చేస్తున్నారు. ఢిల్లీ తరఫున ఆడుతున్న శ్రేయస్ అయ్యర్, ముంబైకి ఆడుతున్న హార్థిక్ పాండ్య చాలా తొంద రలోనే భారత జట్టు తలుపు తట్టే అవకాశం ఉంది. -
ఫస్ట్క్లాస్ క్రికెట్ ముఖ్యం
యువ క్రికెటర్ల నైపుణ్యాన్ని వెలుగులోకి తేవడానికి ఐపీఎల్ మంచి వేదికే అయినా, ఫస్ట్ క్లాస్ క్రికెట్లో ప్రదర్శన ద్వారా క్రికెటర్ సత్తా బయటకు వస్తుందని, దానికే విలువ ఇవ్వాలని నైట్రైడర్స్ కెప్టెన్ గంభీర్ అన్నాడు. -
‘రాయల్’గా నిలిచారు
నాటకీయ మ్యాచ్లో బెంగళూరు సంచలన విజయం భారీ స్కోరు చేసినా ఓడిన సన్రైజర్స్ గేల్, కోహ్లి మెరుపులు ప్లే ఆఫ్ ఆశలు సజీవంగా నిలవాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్... వర్షం కారణంగా రకరకాలుగా మారుతున్న సమీకరణాలు... 6 ఓవర్లలో 81 పరుగుల లక్ష్యం... ఈ సవాల్ను బెంగళూరు ‘రాయల్’గా అధిగమించింది. సన్రైజర్స్పై గెలిచి ప్లేఆఫ్కు చేరువయింది. ఇటు హైదరాబాద్ జట్టు నాకౌట్కు చేరాలంటే కచ్చితంగా తమ చివరి మ్యాచ్లో ముంబైపై గెలవాల్సిందే. సాక్షి,హైదరాబాద్ : టి20 క్రికెట్లో ఉత్కంఠను పరాకాష్టకు చేర్చిన మ్యాచ్లో బెంగళూరు రాయల్ చాలెంజర్స్ జట్టు సన్రైజర్స్ హైదరాబాద్ను ఓడించింది. ఉప్పల్ స్టేడియంలో శుక్రవారం వర్షం కారణంగా రకరకాల సమీకరణాలతో జరిగిన మ్యాచ్లో బెంగ ళూరు ఆరు వికెట్లతో నెగ్గింది. వర్షం కారణంగా 11 ఓవర్లకు కుదించిన మ్యాచ్లో... తొలుత బ్యాటింగ్కు దిగన హైదరాబాద్ 11 ఓవర్లలో 3 వికెట్లకు 135 పరుగులు చేసింది. హెన్రిక్స్ (22 బంతుల్లో 57; 5 ఫోర్లు, 4 సిక్సర్లు), వార్నర్ (32 బంతుల్లో 52 నాటౌట్; 5 ఫోర్లు, 1 సిక్స్) అర్ధసెంచరీలు సాధించారు. హెన్రిక్స్, వార్నర్ రెండో వికెట్కు కేవలం 43 బంతుల్లోనే ఓవర్కు 14.37 రన్రేట్తో ఏకంగా 103 పరుగులు జోడించడం విశేషం. ఆ తర్వాత మళ్లీ వర్షం రావడంతో బెంగళూరుకు 6 ఓవర్లలో 81 పరుగుల లక్ష్యాన్ని డక్వర్త్ లూయిస్ పద్దతిలో నిర్దేశించారు. రాయల్ చాలెంజర్స్ 5.5 ఓవర్లలో 4 వికెట్లకు 83 పరుగులు చేసింది. కోహ్లి (19 బంతుల్లో 44 నాటౌట్; 3 ఫోర్లు, 3 సిక్సర్లు), గేల్ (10 బంతుల్లో 35; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) చెలరేగారు. హెన్రిక్స్ దూకుడు: టాస్ గెలిచిన సన్రైజర్స్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. హర్షల్ వేసిన రెండో ఓవర్ చివరి బంతిని వార్నర్ ఫోర్ బాదడంతో సన్ ఖాతాలో తొలి బౌండరీ చేరింది. అయితే వీస్ వేసిన మరుసటి ఓవర్లో ధావన్ (8) వెనుదిరిగాడు. స్పిన్నర్ చహల్ వేసిన ఓవర్లో 17, ఆ తర్వాత దిండా ఓవర్లో 18 పరుగులు వచ్చాయి. హర్షల్ పటేల్ వేసిన ఇన్నింగ్స్ ఏడో ఓవర్లో ఏకంగా 21 పరుగులు లభించాయి. 26, 46 పరుగుల వద్ద హెన్రిక్స్ ఇచ్చిన క్యాచ్లను బెంగళూరు ఫీల్డర్లు జారవిడవగా, 46 వద్ద సునాయాస రనౌట్ అవకాశం కూడా తప్పింది. ఈ జోరులో హెన్రిక్స్ 20 బంతుల్లోనే అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నారు. మరో వైపు 30 బంతుల్లో వార్నర్ హాఫ్ సెంచరీ కూడా పూర్తయింది. గేల్ మెరుపులు: 13.5 రన్రేట్తో విజయలక్ష్యంతో బరిలోకి దిగిన బెంగళూరుకు మెరుపు ఆరంభం లభించింది. స్టెయిన్ వేసిన తొలి ఓవర్లో గేల్ 4, 6 బాదితే కోహ్లి ఒక ఫోర్ కొట్టాడు. ఫలితంగా 17 పరుగులు....రెండో ఓవర్లోనైతే భువీ బౌలింగ్లో గేల్ వీరబాదుడు. ఏకంగా 2 సిక్సర్లు, 3 ఫోర్లుతో 24 పరుగులు బాదాడు. అయితే మూడో ఓవర్ వేసిన హెన్రిక్స్ వరుసగా రెండు బంతుల్లో 2 వికెట్లు తీసి ఉత్కంఠ రేపాడు. గేల్, డివిలియర్స్ (0) వరుస బంతుల్లో అవుటయ్యారు. అయితే 11 పరుగుల వద్ద అవుటయ్యే ప్రమాదంనుంచి తప్పించుకున్న కోహ్లి చివరి వరకూ నిలిచి జట్టును గెలిపించాడు. స్కోరు వివరాలు సన్రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్ : వార్నర్ (నాటౌట్) 52; ధావన్ (సి) దిండా (బి) వీస్ 8; హెన్రిక్స్ (సి) కార్తీక్ (బి) వీస్ 57; మోర్గాన్ (సి) మన్దీప్ (బి) స్టార్క్ 11; ఎక్స్ట్రాలు 7; మొత్తం (11 ఓవర్లలో 3 వికెట్లకు) 135. వికెట్ల పతనం : 1-19; 2-122; 3-135. బౌలింగ్ : స్టార్క్ 3-0-26-1; హర్షల్ 2-0-30-0; వీస్ 2-0-20-2; దిండా 2-0-23-0; చహల్ 2-0-34-0. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్ : గేల్ (సి) ధావన్ (బి)హెన్రిక్స్ 35; కోహ్లి (నాటౌట్) 44; డివిలియర్స్ (సి) స్టెయిన్ (బి)హెన్రిక్స్ 0; మన్దీప్ (సి) మోర్గాన్ (బి) ప్రవీణ్ 1; కార్తీక్ (రనౌట్) 2; సర్ఫరాజ్ (నాటౌట్) 0; ఎక్స్ట్రాలు 1; మొత్తం (5.5 ఓవర్లలో 4 వికెట్లకు) 83. వికెట్ల పతనం : 1-43; 2-43; 3-58; 4-69. బౌలింగ్ : స్టెయిన్ 1-0-17-0; భువనేశ్వర్ 1.5-0-39-0; హెన్రిక్స్ 1-0-3-2; కరణ్ 1-0-14-0; ప్రవీణ్ 1-0-10-1. -
బెంగళూరు విజయం
హైదరాబాద్: ఉత్కంఠభరిత పోరులో సన్ రైజర్స్ హైదరాబాద్ పై రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. చావోరేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్ లో కోహ్లి సేన సర్వశక్తులు ఒడ్డి గెలుపు అందుకుంది. డక్ వర్త్ లూయిస్ ప్రకారం 6 ఓవర్లలో నిర్దేశించిన 81 పరుగుల లక్ష్యాన్ని ఒక బంతి మిగులుండగానే చేరుకుంది. 5.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 83 పరుగులు చేసింది. క్రిస్ గేల్, విరాట్ కోహ్లి మెరుపు ఇన్నింగ్స్ తో బెంగళూరు విజయాన్ని అందుకుంది. గేల్ 10 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 35 పరుగులు చేశాడు. కోహ్లి కెప్టెన్ ఇన్నింగ్స్ తో జట్టును విజయతీరాలకు చేర్చాడు. 19 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 44 పరుగులు బాదాడు. ఒకే ఒక బంతి మ్యాచ్ ఫలితాన్ని మార్చేసింది. చివరి 2 బంతుల్లో 4 పరుగులు చేయాల్సిన దశలో కోహ్లి ఇచ్చిన క్యాచ్ ను బౌండరీ లైన్ దగ్గర ఒడిసిపట్టిన వార్నర్ వెనక్కి చూసుకోకుండా బౌండరీ లైన్ ను తాకాడు. తర్వాత చేతిలోని బంతిని మైదానంలోకి విసిరాడు. అయితే అప్పటికే అతడు బౌండరీ లైన్ ను తాకడంతో దాన్ని అంపైర్ సిక్స్ గా ప్రకటించాడు. దీంతో బెంగళూరు ఆటగాళ్లు ఆనందంతో గెంతులు వేశారు. హైదరాబాద్ ఆటగాళ్లు అవాక్కయ్యారు. హెన్రీక్స్, వార్నర్ మెరుపు అర్ధశతకాలతో అదరగొట్టడంతో ముందుగా బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ భారీ స్కోరు చేసింది. 11 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 135 పరుగులు చేసింది. ధావన్(8) తొందరగానే అవుటైనా హెన్రీక్స్, వార్నర్ విజృంభణతో హైదరాబాద్ భారీ స్కోరు చేసింది. హెన్రీక్స్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. 22 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సర్లతో 57 పరుగులు బాదాడు. వార్నర్ 32 బంతుల్లో 5 ఫోర్లు, సిక్సర్ తో 52 పరుగులు సాధించాడు. ఆట ఆరంభానికి ముందు వర్షం రావడంతో మ్యాచ్ ను 11 ఓవర్లకు కుదించారు. బ్యాటింగ్ లో మెరిసిన వార్నర్ ఒకే ఒక క్యాచ్ తో మ్యాచ్ ను జారవిడిచాడు. కోహ్లి 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' దక్కించుకున్నాడు. ఈ విజయంతో 15 పాయింట్లతో బెంగళూరు పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరుకుంది.సన్ రైజర్స్ నాలుగో స్థానానికి పడిపోయింది. -
బెంళూరు టార్గెట్ 6 ఓవర్లలో 81
హైదరాబాద్: సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరుగుతున్న మ్యాచ్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు లక్ష్యాన్ని 6 ఓవర్లలో 81 పరుగులుగా నిర్ధారించారు. డక్ వర్త్ లూయిస్ ప్రకారం టార్గెట్ పెట్టారు. ముందుగా బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ 11 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 136 పరుగులు చేసింది. వర్షం పదే పదే అంతరాయం కలిగించడంతో మ్యాచ్ ను ముందుగా 11 ఓవర్లకు కుదించారు. హైదరాబాద్ బ్యాటింగ్ ముగిసిన తర్వాత మరోసారి వర్షం రావడంతో బెంగళూరు బ్యాటింగ్ ను 6 ఓవర్లకు కుదించారు. -
హైదరాబాద్ భారీ స్కోరు
హైదరాబాద్: హెన్రీక్స్, వార్నర్ మెరుపు అర్ధశతకాలతో అదరగొట్టడంతో సన్ రైజర్స్ హైదరాబాద్ భారీ స్కోరు చేసింది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ముందు 136 పరుగుల టార్గెట్ ఉంచింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ 11 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 135 పరుగులు చేసింది. ధావన్(8) తొందరగానే అవుటైనా హెన్రీక్స్, వార్నర్ విజృంభణతో హైదరాబాద్ భారీ స్కోరు చేసింది. హెన్రీక్స్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. 22 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సర్లతో 57 పరుగులు బాదాడు. వార్నర్ 32 బంతుల్లో 5 ఫోర్లు, సిక్సర్ తో 52 పరుగులు సాధించాడు. మోర్గాన్ 11 పరుగులు చేశాడు. బెంగళూరు బౌలర్లలో వీసే 2 వికెట్లు పడగొట్టాడు. స్టార్క్ ఒక వికెట్ తీశాడు. వర్షం అంతరాయం కలిగించడంతో మ్యాచ్ ను 11 ఓవర్లకు కుదించారు. హైదరాబాద్ బ్యాటింగ్ ముగిసిన తర్వాత కూడా వర్షం ప్రారంభం కావడంతో మిగతా మ్యాచ్ జరుగుతుందా, లేదా అనేది అనుమానంగా మారింది. -
హెన్రీక్స్ మెరుపు ఇన్నింగ్స్
హైదరాబాద్: రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాట్స్ మన్ మోయిసెస్ హెన్రీక్స్ అర్ధ సెంచరీ సాధించాడు. 20 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో హాఫ్ సెంచరీ బాదాడు. ఆరంభం నుంచి దూకుడుగా ఆడిన బెంగళూరు బౌలర్లపై విరుచుకుపడ్డాడు. హెన్రీక్స్ వీరబాదుడుతో హైదరాబాద్ స్కోరు పరుగులు పెట్టింది. బెంగళూరు ఫీల్డర్ల వైఫల్యాన్ని సొమ్ము చేసుకుని అర్ధసెంచరీ పూర్తి చేశాడు. అతడు ఇచ్చిన రెండు క్యాచ్ లను ఆర్ సీబీ ఫీల్డర్లు వదిలేశారు. రనౌట్ నుంచి కూడా తప్పించుకున్నాడు. అటు వార్నర్ కూడా వేగంగా ఆడడంతో హైదరాబాద్ స్కోరు 100 పరుగులు దాటింది. -
ధావన్ విఫలం
హైదరాబాద్: ఐపీఎల్-8లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ దిగిన సన్ రైజర్స్ హైదరాబాద్ 19 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. ఓపెనర్ ధావన్(8) అవుటయ్యాడు. వీసే బౌలింగ్ లో దిండాకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. హైదరాబాద్ 6 ఓవర్లలో 68/1 స్కోరుతో ఆట కొనసాగిస్తోంది. వార్నర్ 28, హెన్రీక్స్ 26 పరుగులతో ఆడుతున్నారు. -
11 ఓవర్లకు మ్యాచ్ కుదింపు
హైదరాబాద్: వర్షం కారణంగా సన్ రైజర్స్ హైదరాబాద్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్ ను 11 ఓవర్లకు కుదించారు. రాత్రి 10.40 నిమిషాలకు మ్యాచ్ ప్రారంభమైంది. టాస్ గెలిచిన హైదరాబాద్ ముందుగా బ్యాటింగ్ కు దిగింది. అంతకుముందు ఉప్పల్ లో భారీ వర్షం కురవడంతో మైదానం నీళ్లతో నిండిపోయింది. వర్షం చాలాసేపు కురవడంతో మ్యాచ్ బాగా ఆలస్యమైంది. మ్యాచ్ జరగదేమోనని అభిమానులు ఆందోళన చెందారు. అయితే వర్షం తగ్గడంతో మ్యాచ్ ను 11 ఓవర్లకు కుదించారు. -
ఉప్పల్ లో భారీ వర్షం, మ్యాచ్ ఆలస్యం
హైదరాబాద్: సన్ రైజర్స్ హైదరాబాద్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్ కు వర్షం అడ్డంకిగా నిలిచింది. టాస్ వేసిన తర్వాత భారీ వర్షం ప్రారంభమైంది. దీంతో మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభమయ్యే అవకాశముంది. పిచ్ తడవకుండా కవర్లు కప్పివుంచారు. వర్షం ఇంకా కురుస్తూనే ఉంది. ఉప్పల్ మైదానంలోకి వర్షం నీరు చేరింది. మ్యాచ్ ను ప్రత్యక్షంగా తిలకించేందుకు వచ్చిన అభిమానులు తడిసి ముద్దయ్యారు. వర్షం తగ్గితేనే మ్యాచ్ ప్రారంభమవుతుంది. వర్షం ఆగిన తర్వాత మైదానం ఆరేందుకు ఎక్కువ సమయం పట్టేట్టు కనబడుతోంది. కాగా పూర్తి ఓవర్లు మ్యాచ్ జరగాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఎక్కువసేపు వర్షం కురిస్తే మ్యాచ్ ను కుదించే అవకాశముంది. ఒకవేళ మ్యాచ్ రద్దయితే ఇరు జట్లకు చెరో పాయింట్ లభిస్తుంది. టాస్ గెలిచిన హైదరాబాద్ బ్యాటింగ్ ఎంచుకుంది. -
బ్యాటింగ్ ఎంచుకున్న హైదరాబాద్
హైదరాబాద్: ఐపీఎల్-8లో భాగంగా శుక్రంవారం రాత్రి జరుగుతున్న 52వ లీగ్ మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడుతున్నాయి. టాస్ గెలిచిన హైదరాబాద్ బ్యాటింగ్ ఎంచుకుంది. సన్ రైజర్స్ రెండు మార్పులతో బరిలోకి దిగుతోంది. డే్ల స్టెయిన్, ప్రవీణ్ కుమార్ జట్టులోకి వచ్చారు. బెంగళూరు టీమ్ లో ఒక మార్పు జరిగింది. గాయపడిన ఎస్ అరవింద్ స్థానంలో అశోక్ దిండా టీమ్ లోకి వచ్చాడు. -
గెలుపు ఎవరిదో?
హైదరాబాద్: సొంత మైదానంలో వరుస విజయాలతో దూసుకుపోతున్న సన్ రైజర్స్ హైదరాబాద్ శుక్రవారం మరో పోరుకు సిద్ధమైంది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరును ఎదుర్కొనబోతోంది. రెండు జట్లకు ఈ మ్యాచ్ కీలకం. ఈరోజు మ్యాచ్ లో నెగ్గితే హైదరాబాద్ 16 పాయింట్లతో ప్లేఆఫ్ స్థానాన్ని ఖరారు చేసుకుంటుంది. ఇప్పటివరకు 12 మ్యాచ్ లు ఆడిన సన్ రైజర్స్ 7 విజయాలు సాధించి 14 పాయింట్లతో మూడో స్థానంలో కొనసాగుతోంది. కోహ్లి సేనకు ఈ మ్యాచ్ అత్యంత కీలకం. ఈ మ్యాచ్ లో ఓడితే ప్లేఆఫ్ అవకాశాలు సంక్లిష్టంగా మారతాయి. 13 పాయింట్లతో కొనసాగుతున్న బెంగళూరు ఈ మ్యాచ్ లోనూ, తర్వాతి మ్యాచ్ లోనూ విజయం సాధిస్తే ఎటువంటి సమీకరణాలకు పోకుండా నేరుగా ప్లేఆఫ్ లో అడుగు పెడుతుంది. బలాబలాల విషయంలో రెండు జట్లు సమానంగా ఉన్నాయి. కీలమైన ఈ మ్యాచ్ లో గెలుపు కోసం రెండు టీమ్ లు సర్వశక్తులు ఒడ్డనున్నాయి. -
ఆ ఓవరే మాకు అత్యంత కీలకం!
ముంబై: ఐపీఎల్-8లో భాగంగా గురువారం కోల్ కతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ ఆటగాడు కెవిన్ పొలార్డ్ వేసిన చివరి ఓవరే తమకు అత్యంత కీలకంగా మారిందని సహచర ఆటగాడు హార్థిక్ పాండ్య స్పష్టం చేశాడు. తాను చేసిన పరుగుల కంటే పొలార్డ్ వేసిన ఆ ఓవర్ తమ ప్లే ఆఫ్ ఆశలను నిలబెట్టిందన్నాడు. చివరి ఓవర్లో కోల్ కతా 12 పరుగులు చేయాల్సిన సమయంలో పొలార్డ్ అత్యంత తెలివిగా బౌలింగ్ చేశాడని పాండ్య తెలిపాడు. దీంతోనే ముంబై గెలిచిందని పొలార్డ్ పై ప్రశంసలు కురిపించాడు. పొలార్డ్ వేసిన చివరి ఓవర్ లో పఠాన్ను తొలి బంతికే అవుట్ చేయడంతో పాటు చివరి మూడు బంతుల్లో ఒక్క పరుగు కూడా ఇవ్వలేదు. దీంతో ఐదు పరుగులతో ముంబై గెలిచింది. పీయూష్ చావ్లా చివర్లో బంతులను వృథా చేసి కోల్కతా ఓటమికి కారణమయ్యాడు. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసి కష్టాల్లో పడ్డ ముంబైను హార్దిక్ పాండ్య తన విధ్వంసకర ఆటతో రక్షించాడు. కేవలం 31 బంతుల్లో 8 ఫోర్లు; 2 సిక్సర్లు సాయంతో 61 పరుగులతో నాటౌట్ నిలిచాడు. దీంతో ముంబై ఇండియన్స్ నిర్ణీత ఓవర్లలో 171 పరుగులు చేసింది. -
పీటర్సన్ రావట్లేదు
ఇంగ్లండ్ స్టార్ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ ఈ ఏడాది ఐపీఎల్కు పూర్తిగా దూరమైనట్లే. ఇంగ్లండ్ జాతీయ జట్టులో చోటు దక్కకపోవడంతో సన్రైజర్స్ జట్టుతో చేరాలనుకున్నాడు. అయితే కాలి గాయం కారణంగా రెండు వారాలు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. దీంతో పీటర్సన్ హైదరాబాద్ రావడం లేదు. -
ముంబై జట్టులో హేల్స్
న్యూఢిల్లీ : ఇంగ్లండ్ టి20 స్టార్ అలెక్స్ హేల్స్ ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ తరఫున బరిలోకి దిగబోతున్నాడు. గాయపడ్డ కోరీ అండర్సన్ స్థానంలో వచ్చిన తను ఆదివారం హైదరాబాద్లో జరిగే లీగ్ ఆఖరి మ్యాచ్లో ఆడే అవకాశం ఉంది. -
లీడర్
సాక్షి క్రీడావిభాగం : చాన్నాళ్ల క్రితం తాను ఏదో రోజు ఆస్ట్రేలియా వన్డే జట్టుకు కెప్టెన్ అవుతానని, తనలో నాయకత్వ లక్షణాలు ఉన్నాయని డేవిడ్ వార్నర్ బహిరంగంగా ప్రకటించాడు. కానీ ఆసీస్ దిగ్గజం షేన్వార్న్ను అమితంగా అభిమానించే వార్నర్, మైదానం బయట కూడా వార్న్ను ‘ఆదర్శం’గా తీసుకున్నాడు. ఫలితంగా వివాదాలు చుట్టుముట్టి కీలక సమయంలో కెప్టెన్సీ అవకాశాలు చేజార్చుకున్నాడు. అయితే బిగ్బాష్లో తాను కెప్టెన్గా వ్యవహరించిన ఏకైక మ్యాచ్లో సెంచరీతో సిడ్నీ జట్టును గెలిపించినప్పుడు మరోసారి తన కెప్టెన్సీ కోరికను బయటపట్టాడు. ఇది సన్రైజర్స్ యాజమాన్యం దృష్టికి కూడా వచ్చిందేమో వార్నర్పై నమ్మకం ఉంచి ఐపీఎల్-8 సీజన్ కోసం నాయకత్వ బాధ్యతలు అప్పగించింది. బ్యాటింగ్లో హవా సన్రైజర్స్ జట్టుకు తొలి సీజన్లో సంగక్కర, కామెరాన్ వైట్ కెప్టెన్లుగా వ్యవహరించారు. వీరిద్దరు బ్యాటింగ్లో ఘోరంగా విఫలమయ్యారు. గతేడాది ధావన్ సగం మ్యాచ్లు కెప్టెన్గా కాగా, తర్వాత స్యామీ వచ్చాడు. కెప్టెన్సీలో వీరిద్దరి ఆట కూడా దిగజారింది. అయితే ఈ సీజన్లో మాత్రం రైజర్స్ బ్యాటింగ్ మొత్తం కెప్టెన్ చుట్టే తిరుగుతోంది. 2014లో 14 మ్యాచ్లలో 528 పరుగులు చేసి లీగ్ టాప్స్కోరర్లలో ఒకడిగా నిలిచిన వార్నర్, ఈ సారి కూడా ఇప్పటికే 500 మార్క్ దాటాడు. అతని బ్యాటింగ్పై కెప్టెన్సీ ప్రభావం ఏ మాత్రం లేదనడానికి ఇదే సంకేతం. అతను అర్ధ సెంచరీ చేసిన ఆరు మ్యాచ్లలో ఐదింటిలో సన్ గెలిచింది. దాదాపు 157 స్ట్రైక్రేట్తో వార్నర్ ఇచ్చే శుభారంభమే జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తోంది. బలహీనంగా కనిపిస్తున్న సన్ మిడిలార్డర్కు వార్నర్ ఓపెనింగే వెన్నెముకగా నిలుస్తోంది. ‘వైజాగ్లో జరిగిన ఒక మ్యాచ్లో ఆరు బంతుల వ్యవధిలో నాతో సహా మూడు వికెట్లు పడ్డాయి. ఆ సమయంలో వికెట్ వద్ద నిలదొక్కుకొని ఆడాల్సిన నా బాధ్యత గుర్తుకొచ్చింది. కెప్టెన్సీ బాధ్యతలు గుర్తున్నా బ్యాటింగ్ చేసే సమయంలో నా శైలిలోనే ఆడతాను. అలా ఆడితేనే పరుగులు చేయగలను. ప్రతీ మ్యాచ్కు ఆడాల్సిన తీరుతో పాటు పిచ్ కూడా మారుతుంది. దానికనుగుణంగా నేను మారతాను’ అని తన బ్యాటింగ్ గురించి వార్నర్ విశ్లేషించాడు. కొత్త వ్యూహాలతో... ‘2014లో కెప్టెన్ కాకపోయినా జట్టు వ్యూహాల్లో దూసుకుపోయే తత్వం, అతని చురుకుదనం చూసిన తర్వాతే ఈ సారి కెప్టెన్గా చేయాలని నిర్ణయించాం. ప్రతీ సమావేశంలో అతను కీలక సూచనలిచ్చేవాడు. ఈ సారి మరింత బాధ్యతగా వ్యవహరిస్తున్నాడు. ఆటగాడిగానే కాకుండా వ్యక్తిగా కూడా వార్నర్ చాలా పరిణతి చెందాడు’... తమ కెప్టెన్ గురించి సన్రైజర్స్ మెంటర్ వీవీఎస్ లక్ష్మణ్ చేసిన వ్యాఖ్య ఇది. తగిన సమయంలో సేవలు ఉపయోగించుకుంటాం....లాంటి ఉపన్యాసాలు ఇవ్వకుండా స్టెయిన్ అవసరం ఇప్పుడు తమకు లేదంటూ వార్నర్ నిష్కర్షగా చెప్పడం అందరినీ ఆశ్చర్యపరచింది. జట్టుకు విదేశీ బ్యాట్స్మెన్ అవసరం కావడంతో ఒక మ్యాచ్లో స్టెయిన్, బౌల్ట్ ఇద్దరినీ బయటకూర్చోబెట్టే సాహసం చేశాడు. ముఖ్యంగా రాజస్థాన్, ఢిల్లీలతో మ్యాచ్లలో అతని ప్రణాళికలు అద్భుతంగా ఫలించాయి. వరుసగా విఫలమైనా మోర్గాన్, హెన్రిక్స్లపై అతను నమ్మకముంచాడు. కీలక సమయంలో వీరిద్దరు ఫామ్లోకి రావడం జట్టుకు కలిసొచ్చింది. హెన్రిక్స్ను టాప్ ఆర్డర్లోకి ప్రమోట్ చేయడం కూడా తన ఆలోచనే. వార్నర్ బాధ్యత ఇంతటితో ముగిసిపోలేదు. ప్లేఆఫ్కే కాదు...ఆ తర్వాత కూడా సన్రైజర్స్కు టైటిల్ అందించడమే అతను లక్ష్యంగా పెట్టుకున్నాడు. మరి వార్న్, గిల్లీల బాటలో మరో ఆస్ట్రేలియన్ ఐపీఎల్ ట్రోఫీ గెలిపించగలడా చూడాలి! మైదానంలోకి దిగాక తొలి బంతినుంచే దూకుడు.... మెరుపు షాట్లతో జట్టుకు శుభారంభం... టోర్నీలో ఏకంగా ఆరు అర్ధ సెంచరీలు, ఐదు వందలకు పైగా పరుగులు... బ్యాట్స్మన్గా డేవిడ్ వార్నర్ విలువేమిటో చెప్పేందుకు ఇది చాలు. ప్రపంచ నంబర్వన్ బౌలర్ను మొహమాటం లేకుండా తప్పించాలంటే... అద్భుత ఫామ్లో ఉన్న బౌలర్ను డగౌట్లో కూర్చోబెట్టాలంటే... ఎంతో ధైర్యం కావాలి. ఓటమి ఎదురైతే విమర్శలకు సమాధానం చెప్పాలి. వార్నర్ అందుకు వెనుకాడలేదు. తనదైన వ్యూహాలతో సన్రైజర్స్ను ప్లేఆఫ్కు చేరువ చేశాడు. -
ముంబై మ్యాజిక్
► ఉత్కంఠ పోరులో కోల్కతాపై విజయం ► ముంబై ఇండియన్స్ ప్లేఆఫ్ ఆశలు సజీవం ► చెలరేగిన పాండ్య రాణించిన పొలార్డ్ ఆహా... ఏం మ్యాచ్..! చావోరేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్లో ముంబై సంచలనాత్మకంగా ఆడింది. తొలుత బ్యాటింగ్లో తడబడ్డా... యువ పాండ్యా వీరోచిత బ్యాటింగ్తో భారీ స్కోరు చేసింది. ఆ తర్వాత ఓటమి అంచుల్లోంచి కోలుకుని ఆఖరి ఓవర్లో అద్భుతంగా గెలిచింది. ఫలితంగా ప్లే ఆఫ్ అవకాశాలను సజీవంగా నిలుపుకుని, కోల్కతానూ ఒత్తిడిలోకి నెట్టింది. ముంబై : ప్లే ఆఫ్ ఆశలు సజీవంగా నిలుపుకోవాలంటే కచ్చితంగా నెగ్గి తీరాల్సిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ అద్భుత పోరాటాన్ని ప్రదర్శించింది. యువ సంచలనం హార్థిక్ పాండ్య (31 బంతుల్లో 61 నాటౌట్; 8 ఫోర్లు; 2 సిక్సర్లు) మరోసారి అసమాన బ్యాటింగ్తో జట్టు భారీ స్కోరుకు బాటలు వేయగా.. బౌలింగ్లో చివరి ఓవర్లో పొలార్డ్ అద్భుతమే చేశాడు. ఫలితంగా వాంఖడే మైదానంలో గురువారం జరిగిన మ్యాచ్లో కోల్కతా నైట్రైడర్స్పై ముంబై ఐదు పరుగుల తేడాతో నెగ్గింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన ముంబై జట్టు నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లకు 171 పరుగులు చేసింది. పొలార్డ్ (38 బంతుల్లో 33 నాటౌట్; 1 ఫోర్; 1 సిక్స్), రోహిత్ (21 బంతుల్లో 30; 5 ఫోర్లు) రాణించారు. షకీబ్కు రెండు వికెట్లు పడ్డాయి. అనంతరం బ్యాటింగ్కు దిగిన కోల్కతా 20 ఓవర్లలో 7 వికెట్లకు 166 పరుగులు చేసింది. గంభీర్ (29 బంతుల్లో 38; 5 ఫోర్లు) ఫర్వాలేదనిపించాడు. పాండ్య హల్చల్ కోల్కతా బౌలర్లు ప్రారంభంలో కట్టుదిట్టమైన బౌలింగ్తో ముంబైకి ఆదిలోనే షాక్ ఇచ్చారు. ఉన్న కాసేపు వేగంగా ఆడిన ఓపెనర్ పార్థీవ్ (14 బంతుల్లో 21; 3 ఫోర్లు)ను షకీబ్ అవుట్ చేయగా మరుసటి ఓవర్లోనే లెండిల్ సిమ్మన్స్ (16 బంతుల్లో 14; 1 ఫోర్; 1 సిక్స్) ఓ సిక్స్ బాదిన అనంతరం మోర్కెల్కు చిక్కాడు. ఇక ఫామ్లో ఉన్న రాయుడు (2)ను షకీబ్ తన రెండో ఓవర్లో అవుట్ చేయడంతో ముంబై 47 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి ఇబ్బందుల్లో పడింది. ఈ సమయంలో కెప్టెన్ రోహిత్, పొలార్డ్ కలిసినా ఇన్నింగ్స్లో వేగం పెరగలేదు. 12వ ఓవర్లో నరైన్ అద్భుత బంతితో రోహిత్ను బౌల్డ్ చేశాడు. అయితే పాండ్యా రాకతో ముంబై ఇన్నింగ్స్కు అసలైన ఊపు వచ్చింది. అప్పటిదాకా నత్తనడకన సాగిన జట్టు ఆట తన బ్యాటింగ్తో రాకెట్ వేగంతో దూసుకెళ్లింది. పొలార్డ్ను మించి దూకుడును కనబరిచిన తను ఉమేశ్ వేసిన 17వ ఓవర్లో వరుసగా నాలుగు ఫోర్లతో రెచ్చిపోగా నరైన్ బౌలింగ్లో భారీ సిక్స్ బాదాడు. రస్సెల్ వేసిన 19వ ఓవర్లో 4,4,6తో 25 బంతుల్లోనే అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. చివరి ఐదు ఓవర్లలో 72 పరుగులు రాగా ఇందులో 50 పరుగులు పాండ్యావే కావడం విశేషం. ఈజోరుతో ఐదో వికెట్కు అజేయంగా 92 పరుగులు వచ్చాయి. పఠాన్ దూకుడు భారీ లక్ష్యంతో ఛేదనకు దిగిన కోల్కతా ఆరో ఓవర్లో రెండు వికెట్లు కోల్పోయింది. ఊపు మీదున్న ఉతప్ప (20 బంతుల్లో 25; 3 ఫోర్లు; 1 సిక్స్) భజ్జీ వేసిన ఆ ఓవర్లో సిక్స్ బాదినా ఆ తర్వాత బంతికి మలింగ క్యాచ్ ద్వారా అవుట్ అయ్యాడు. అటు మనీష్ పాండే (1) లేని పరుగు కోసం ప్రయత్నించి రనౌట్ అయ్యాడు. సుచిత్ బౌలింగ్లో యూసుఫ్ పఠాన్ భారీ సిక్స్ కొట్టగా అదే ఓవర్లో ఫోర్ బాదిన గంభీర్ మరుసటి బంతికే బౌల్డ్ అయ్యాడు. ఈ దశలో పఠాన్తో కలిసి షకీబ్ (15 బంతుల్లో 23; 3 ఫోర్లు) వేగంగా ఆడాడు. చక్కటి ఫోర్లతో ప్రమాదకరంగా మారుతున్న దశలో డీప్ మిడ్వికెట్లో పాండ్యకు క్యాచ్ ఇచ్చాడు. రస్సెల్ (2) విఫలమయ్యాడు. 17వ ఓవర్లో సూర్యకుమార్ రెండు ఫోర్లు, పఠాన్ ఓ ఫోర్తో 14 పరుగులు రాబట్టారు. చివరి ఓవర్లో 12 పరుగులు కావాల్సిన దశలో పొలార్డ్ అద్భుతమే చేశాడు. పఠాన్ను తొలి బంతికే అవుట్ చేయడంతో పాటు చివరి మూడు బంతుల్లో ఒక్క పరుగు కూడా ఇవ్వలేదు. దీంతో ఐదు పరుగులతో ముంబై గెలిచింది. పీయూష్ చావ్లా చివర్లో బంతులను వృథా చేసి కోల్కతా ఓటమికి కారణమయ్యాడు. రేసు మరింత రసవత్తరం ఇక మూడు రోజుల్లో ఐపీఎల్ లీగ్ మ్యాచ్లు ముగుస్తాయి. ఐదే మ్యాచ్లు మిగిలున్నాయి. కానీ ప్లేఆఫ్కు వెళ్లే జట్ల విషయంలో స్పష్టత రాలేదు. ప్రస్తుతం చెన్నై 16 పాయింట్లతో ప్లేఆఫ్కు చేరినట్లే. కోల్కతా (15), రాజస్తాన్(14), బెంగళూరు (13), ముంబై (14), సన్రైజర్స్ (14)... ఐదు జట్లూ మూడు బెర్త్ల కోసం రేసులో ఉన్నాయి. ఇందులో హైదరాబాద్, బెంగళూరు జట్లకు రెండేసి మ్యాచ్లు ఉన్నాయి. ప్లే ఆఫ్కు చేరాలంటే ఏ జట్టైనా కనీసం మరో మ్యాచ్ గెలవాలి. మొత్తం మీద లీగ్ ఆఖరి మ్యాచ్ (సన్రైజర్స్తో ముంబై)వరకు ప్లేఆఫ్కు చేరే జట్ల విషయంలో స్పష్టత రాదు. స్కోరు వివరాలు ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్ : సిమ్మన్స్ (సి) పాండే (బి) మోర్కెల్ 14; పార్థీవ్ (సి) పాండే (బి) షకీబ్ 21; రోహిత్ (బి) నరైన్ 30; రాయుడు (సి) రస్సెల్ (బి) షకీబ్ 2; పొలార్డ్ నాటౌట్ 33; పాండ్య నాటౌట్ 61; ఎక్స్ట్రాలు 10; మొత్తం (20 ఓవర్లలో 4 వికెట్లకు) 171. వికెట్ల పతనం : 1-29, 2-42, 3-47, 4-79. బౌలింగ్ : ఉమేశ్ యాదవ్ 3-0-37-0; మోర్కెల్ 4-0-27-1; షకీబ్ 4-0-22-2; చావ్లా 1-0-9-0; నరైన్ 4-0-38-1; రస్సెల్ 4-0-37-0. కోల్కతా నైట్రైడర్స్ ఇన్నింగ్స్ : ఉతప్ప (సి) మలింగ (బి) హర్భజన్ 25; గంభీర్ (బి) సుచిత్ 38; పాండే (రనౌట్) 1; పఠాన్ (సి) పార్థీవ్ (బి) పొలార్డ్ 52; షకీబ్ (సి) పాండ్య (బి) వినయ్ 23; రస్సెల్ (సి) పార్థీవ్ (బి) మలింగ 2; యాదవ్ (సి) రాయుడు (బి) మెక్లెనెగాన్ 11; చావ్లా నాటౌట్ 1; ఉమేశ్ నాటౌట్ 5; ఎక్స్ట్రాలు 8; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 166. వికెట్ల పతనం : 1-45, 2-46, 3-88, 4-118, 5-128, 6-144, 7-160. బౌలింగ్ : మలింగ 4-0-31-1; మెక్లెనెగాన్ 4-0-31-1; వినయ్ 4-0-33-1; హర్భజన్ 4-0-31-1; సుచిత 2-0-23-1; పాండ్య 1-0-10-0; పొలార్డ్ 1-0-6-1. గురువారం ముంబైలో ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా సచిన్, అమితాబ్లను ఇంటర్వ్యూ చేస్తున్న గవాస్కర్ -
కోల్కతా పై ముంబై గెలుపు
-
కోల్కతా పై ముంబై గెలుపు
ముంబై: ఐపీఎల్-8 లో భాగంగా కోల్కతా నైట్ రైడర్స్ తో ఉత్కంఠభరితంగా జరిగిన మ్యాచ్లో 5పరుగుల తేడాతో ముంబై గెలుపొందింది. ఆఖరి బంతి వరకు సాగిన ఈ మ్యాచ్లో కోల్కతా చివరి బంతికి సిక్సర్ కొట్టాల్సి ఉండగా పోలార్డు అద్భుతంగా బౌలింగ్ చేసి ముంబై జట్టుకి విజయాన్ని అందించాడు. టాస్ గెలిచిన కోల్కతా ఫీల్డింగ్ ఎంచుకోవడంతో తొలుత ముంబై బ్యాటింగ్కు దిగింది. ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 171 పరుగులు చేసింది. జట్టు 29 పరుగుల వద్ద ఓపెనర్గా పార్థీవ్ పటేల్(21) తొలి వికెట్ రూపంలో వెనుదిరిగాడు. ఆ తర్వాత సిమ్మన్స్ (14), అంబటి రాయుడు (2) వెంటవెంటనే అవుటయ్యారు. నిలకడగా పరుగులు రాబడుతున్న సమయంలోనే రోహిత్ శర్మ(30) నరైన్ బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వత క్రీజ్లోకొచ్చిన పోలార్డ్,పాండ్యాలు మొదట్లో నిదానంగా ఆడి చివర్లో మెరుపులు మెరిపించారు. యాదవ్ వేసిన 17 వ ఓవర్లో పాండ్యా వరుసగా నాలుగు బౌండరీలు బాది ఏకంగా 18 పరుగులు, రస్సెల్ వేసిన 19వ ఓవర్లో రెండు ఫోర్లు ఒక సిక్సర్ బాది 17 పరుగుల రాబట్టాడు..దీంతో ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 171 పరుగులు చేసింది. 172 పరుగుల విజయ లక్ష్యంతో బరిలో దిగిన కోల్కతా తొలి నుంచి దాటిగా ఆడింది. ఓపెనర్లుగా వచ్చిన గంబీర్, ఉతప్పలు తొలి వికెట్ కి 45 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించి శుభారంభాన్ని ఇచ్చారు. ఉతప్ప(25)పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఔటవ్వగా, ఆతర్వత వచ్చిన మనీష్ పాండే(1) వెంటనే రనౌట్ రూపంలో వెనుదిరిగాడు. 88 పరుగుల వద్ద గౌతం గంభీర్(38) మూడో వికెట్ రూపంలో వెనుదిరిగాడు.. షకీబ్ స్కోర్ పెంచే ప్రయత్నంలో ఔటయ్యాడు. ఆ తర్వత వచ్చిన రస్సెల్(2) వెంటనే వెనుదిరిగాడు. దూకుడుగా ఆడుతూ కనిపించిన సూర్యకుమార్ యాదవ్(11) సిక్సర్ కి ప్రయత్నించి ఆరో వికెట్ గా ఔట్ అయ్యాడు. యూసుఫ్ పటాన్(52) బాధ్యతయుతమైన ఇన్నింగ్స్ ఆడినా కీలకమైన చివరి ఓవర్లో అవుటయ్యాడు. చివరి ఓవర్లో పరుగులు రాబట్టడంలో చావ్లా విఫలం అవ్వడంతో కోల్కతా ఓటమి చెందింది. ఈ మ్యాచ్ గెలుపుతో ముంబై ప్లేఆప్ పై ఆశలు సజీవంగానే ఉంచుకున్నట్లయింది. -
కోల్కతా లక్ష్యం 172
ముంబై: ఐపీఎల్-8 లో భాగంగా కోల్కతా నైట్ రైడర్స్ తో జరుగుతున్న మ్యాచ్లో ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 171 పరుగులు చేసింది. పాండ్యా(61) మెరుపు ఇన్నింగ్స్ కు తోడు పోలార్డ్(33) సహకారంతో ముంబై, కోల్ కతా ఎదుట 172 పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశించింది. టాస్ గెలిచిన కోల్కతా ఫీల్డింగ్ ఎంచుకోవడంతో తొలుత ముంబై బ్యాటింగ్కు దిగింది. జట్టు 29 పరుగుల వద్ద ఓపెనర్గా వచ్చిన పార్థీవ్ పటేల్(21) తొలి వికెట్ రూపంలో వెనుదిరిగాడు. ఆ తర్వాత సిమ్మన్స్ (14), అంబటి రాయుడు (2) వెంటవెంటనే అవుటయ్యారు. నిలకడగా పరుగులు రాబడుతున్న సమయంలోనే రోహిత్ శర్మ(30) నరైన్ బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వత క్రీజ్లోకొచ్చిన పోలార్డ్,పాండ్యాలు మొదట్లో నిదానంగా ఆడి చివర్లో మెరుపులు మెరిపించారు.యాదవ్ వేసిన 17 వ ఓవర్లో పాండ్యా వరుసగా నాలుగు బౌండరీలు బాది ఏకంగా 18 పరుగులు, రస్సెల్ వేసిన 19వ ఓవర్లో రెండు ఫోర్లు ఒక సిక్సర్ బాది 17 పరుగుల రాబట్టాడు..దీంతో ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 171 పరుగులు చేసింది. -
10 ఓవర్లలో ముంబై స్కోరు 67/3
ముంబై: ఐపీఎల్-8 లో భాగంగా కోల్కతా నైట్ రైడర్స్ తో జరుగుతున్న మ్యాచ్లో ముంబై ఇండియన్స్ 10 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 67 పరుగులు చేసింది. టాస్ గెలిచిన కోల్కతా ఫీల్డింగ్ ఎంచుకోవడంతో తొలుత ముంబై బ్యాటింగ్కు దిగింది. ముంబై జట్టు 29 పరుగుల వద్ద పార్థీవ్ పటేల్(21) తొలి వికెట్ రూపంలో వెనుదిరిగాడు. ఆ తర్వాత సిమ్మన్స్ (14), అంబటి రాయుడు (2) వెంటవెంటనే అవుటయ్యారు. రోహత శర్మ(24),పోలార్డ్(3) లు క్రీజ్లో ఉన్నారు. షకీబ్ మూడు ఓవర్ల వేసి 2 వికెట్లు తీశాడు. -
టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న కోల్కతా
ముంబై: ఐపీఎల్-8లో భాగంగా ఇక్కడ వాంఖడే స్టేడియంలో గురువారం ముంబై ఇండియన్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో కోల్కతా నైట్ రైడర్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. గత మ్యాచ్ లో బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్ తో పోరాడి ఓడిన ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్ ఆశలను క్లిష్టంగా మార్చుకుంది. ఇప్పటికే చెన్నై సూపర్ కింగ్స్ ప్లే ఆఫ్ కు చేరగా, కోల్ కతా నైట్ రైడర్స్ మాత్రం లీగ్ దశను దాటడానికి ఒక్క మ్యాచ్ లో విజయం సాధిస్తే చాలు. ఈ క్రమంలో ముంబై-కోల్ కతాల మధ్య జరుగుతున్న మ్యాచ్ ఆసక్తికరంగా మారింది. పాయింట్ల పట్టికలో చెన్నై సూపర్ కింగ్స్ 16 పాయింట్లతో ప్లే ఆఫ్ బెర్త్ ను ఖరారు చేసుకోగా, కోల్ కతా 15 పాయింట్లతో ప్లే ఆఫ్ కు ఒక అడుగు దూరంలో ఉంది. మూడు, నాలుగు స్థానాల కోసం సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్, బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్, ముంబై ఇండియన్స్ ల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. -
'నేటి మ్యాచ్ మాకు ఫైనల్ తో సమానం'
ముంబై: గత మ్యాచ్ లో బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్ తో పోరాడి ఓడిన ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్ ఆశలను క్లిష్టంగా మార్చుకుంది. ఇప్పటికే చెన్నై సూపర్ కింగ్స్ ప్లే ఆఫ్ కు చేరగా, కోల్ కతా నైట్ రైడర్స్ మాత్రం లీగ్ దశను దాటడానికి ఒక్క మ్యాచ్ లో విజయం సాధిస్తే చాలు. ఈ క్రమంలో ముంబై-కోల్ కతాల మధ్య గురువారం నాటి మ్యాచ్ ఆసక్తికరంగా మారే అవకాశం ఉంది. ఈ సందర్భంగా ముంబై ఇండియన్స్ కోచ్ రికీ పాంటింగ్ మాట్లాడాడు. 'ఈ టోర్నమెంట్ లో నేటి మ్యాచ్ మాకు ఫైనల్ లాంటింది. డిఫెండింగ్ చాంపియన్ ను కోల్ కతాపై గెలవడానికి సన్నద్ధమవుతున్నాం. ఇక చావో రేవో తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. వంద శాతం ఆటను ప్రదర్శిస్తామని పేర్కొన్నాడు. పాయింట్ల పట్టికలో చెన్నై సూపర్ కింగ్స్ 16 పాయింట్లతో ప్లే ఆఫ్ బెర్త్ ను ఖరారు చేసుకోగా, కోల్ కతా 15 పాయింట్లతో ప్లే ఆఫ్ కు ఒక అడుగు దూరంలో ఉంది. మూడు, నాలుగు స్థానాల కోసం సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్, బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్, ముంబై ఇండియన్స్ ల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. -
సన్రైజర్స్కు ఆడేందుకు వస్తున్న పీటర్సన్
-
చెన్నై జట్టులో నలుగురు ఫిక్సర్లు!
లలిత్ మోడి ఆరోపణ లండన్ : ఐపీఎల్ మాజీ కమిషనర్ లలిత్ మోడి మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. చెన్నై జట్టులోని నలుగురు ఆటగాళ్లు మ్యాచ్ ఫిక్సర్లని ట్వీట్ చేశారు. ‘సుప్రీంకోర్టు దగ్గర ఉన్న జాబితాలో ఫిక్సింగ్కు పాల్పడిన ఆటగాళ్ల జాబితా ఉంది. అది బయటపెడితే కనీసం నలుగురు చెన్నై ఆటగాళ్లు ఉంటారు’ అని మోడి పేర్కొన్నారు. భారత్తో పాటు విదేశీ క్రికెటర్ల పేర్లు కూడా ఆ జాబితాలో ఉన్నాయని ఐపీఎల్ మాజీ కమిషన్ లలిత్ మోడి అంటున్నారు. ప్రస్తుతం ఆయన లండన్లో నివసిస్తున్నాడు. -
బెంగళూరుకి షాకిచ్చిన పంజాబ్
-
ధోని కోసం ప్లాన్ చేశా
నా మీద నాకు నమ్మకం ఉంది: జహీర్ఖాన్ న్యూఢిల్లీ : 4-1-9-2... ఐపీఎల్లో ఇలాంటి గణాంకాలు సాధించడం ఏ బౌలర్కైనా పెద్ద ఘనత. ఏడాది కాలంగా క్రికెట్కు పూర్తిగా దూరంగా ఉన్న బౌలర్ ఇలాంటి గొప్ప బౌలింగ్ చేశాడంటే అతను కచ్చితంగా దిగ్గజమే. చెన్నైతో మ్యాచ్లో భారత మాజీ స్టార్ జహీర్ ఖాన్ అద్భుతమైన స్పెల్తో ఆకట్టుకున్నాడు. ఆరంభంలో స్మిత్, మెకల్లమ్లను పూర్తిగా కట్టడి చేసిన జహీర్... స్లాగ్ ఓవర్లలో తన తొలి బంతికే ధోనిని అవుట్ చేశాడు. ‘స్లాగ్ ఓవర్లలో ధోని ఎంత ప్రమాదకర ఆటగాడో అందరికీ తెలుసు. అతణ్ని నియంత్రించాలంటే కచ్చితంగా ఓ మంచి ప్లాన్తో రావాలి. నేను అదే చేశా’ అని జహీర్ చెప్పాడు. యువ బౌలర్లకు ఎప్పుడూ తన సహకారం ఉంటుందని తెలిపాడు. ‘నేను జాతీయ జట్టులోకి వచ్చిన కొత్తలో సీనియర్ బౌలర్ల దగ్గరకు వెళ్లి సలహాలు అడిగేవాడిని. ఇప్పుడు ఢిల్లీ జట్టులో సీనియర్ బౌలర్గా మిగిలిన వాళ్లకు సలహాలు ఇవ్వాల్సిన బాధ్యత నాపై ఉంది’ అని అన్నాడు. గాయాలు బాధిస్తున్న సమయంలో ఓపికగా నిరీక్షించాల్సిన అవసరం ఉందని జహీర్ అన్నాడు. ‘నేను ఏడాదిగా క్రికెట్కు దూరంగా ఉన్నా. నిజానికి ఇది చాలా అసహనాన్ని పెంచే అంశం. కానీ ఓపికగా ఎదురు చూడాలి. నా సామర్థ్యం మీద నాకు ఎప్పుడూ నమ్మకం ఉంది. నన్ను నేను నమ్ముతాను. కష్టపడతాను. అది కచ్చితంగా ఫలితాన్నిస్తుంది. పూర్తి ఫిట్నెస్తో ఉంటూ రెగ్యులర్గా ఆడటం మాత్రమే తన చేతుల్లో ఉందని, భారత జట్టులోకి రావడం తన చేతుల్లో లేదని చెప్పాడు. ‘ఫిట్నెస్ను కాపాడుకోవడంతో పాటు కొత్త అంశాలు నేర్చుకుంటూ అందుబాటులో ఉన్న మ్యాచ్లు ఆడటం మాత్రమే నా చేతుల్లో ఉంది. మిగతా అంశాలు నా పరిధిలోవి కాదు’ అని జహీర్ అన్నాడు. ఆటను ఆస్వాదిస్తూ క్రికెట్ పట్ల అంకితభావం ఉంటే రాణించవచ్చని యువ పేసర్లకు సూచించాడు. -
చీర్లీడర్స్ గదులపై పోలీసుల దాడి
రాయ్పూర్ : ఈసారి ఐపీఎల్లో చీర్లీడర్స్కు చేదు అనుభవం ఎదురైంది. రాయ్పూర్లోని ఓ హోటల్లో చీర్లీడర్స్ ఉన్న గదులపై స్థానిక పోలీసులు దాడి చేసి సుమారు గంటసేపు వారిని విచారించారు. అయితే ఇది తమ ‘రొటీన్’లో భాగమేనని పోలీసులు తెలిపారు. ఢిల్లీతో మ్యాచ్ కోసం వచ్చిన చెన్నై జట్టు చీర్లీడర్స్ ఉన్న గదులపై కోత్వాలీ అనే స్టేషన్కు సంబంధించిన పోలీసులు ఎలాంటి వారెంట్ లేకుండా దాడి చేశారు. దీంతో చీర్లీడర్స్ తమ ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ ప్రతినిధులకు ఫోన్ చేశారు. వీరంతా ఇంగ్లండ్, ఆస్ట్రేలియా దేశాలకు చెందిన వారు. ‘మేం వర్క్ పర్మిట్తో భారత్ వచ్చాం. మేం ఇక్కడ ఎలాంటి తప్పూ చేయడం లేదు. గతంలో మాకు ఎప్పుడూ ఇలాంటి అనుభవం ఎదురుకాలేదు. పోలీసులు మమ్మల్ని అతిగా వేధించారు’ అని ఓ చీర్లీడర్ తెలిపింది. అయితే తాము పద్ధతి ప్రకారమే బాధ్యతలు నిర్వర్తించామని పోలీసులు చెబుతున్నారు. ‘కొందరు విదేశీ మహిళలు ఓ హోటల్లో దిగారని మాకు సమాచారం వచ్చింది. దీంతో రొటీన్ ప్రకారం వెళ్లి వారు ఎవరో కనుక్కున్నాం’ అని రాయ్పూర్ పోలీసులు చెబుతున్నారు. -
ఆఖరి మ్యాచ్కు పీటర్సన్
ఐపీఎల్లో సన్రైజర్స్ ఆఖరి మ్యాచ్ (ఆదివారం)లో ఇంగ్లండ్ స్టార్ కెవిన్ పీటర్సన్ ఆడే అవకాశం ఉంది. శుక్రవారం సాయంత్రానికి తను హైదరాబాద్లో జట్టుతో చేరతాడు. మరోవైపు పీటర్సన్ కాలి గాయానికి సంబంధించి బుధవారం లండన్లో స్కానింగ్ చేయించుకున్నాడు. ఇది తీవ్రమైనదేం కాదని చెప్పాడు. -
బెంగళూరుపై ‘పంజా’బ్
► అక్షర్ పటేల్ ఆల్రౌండ్ షో ► రాణించిన సాహా ► కింగ్స్ ఎలెవన్కు ఊరట విజయం వరుస విజయాలతో ప్లే ఆఫ్కు చేరువైన దశలో బెంగళూరుకు భంగపాటు ఎదురైంది. తాము రేసునుంచి నిష్ర్కమించినా ఇతర జట్లను దెబ్బ తీస్తామని హెచ్చరించిన పంజాబ్ కెప్టెన్ బెయిలీ తొలి దెబ్బ కోహ్లి సేనపైనే వేశాడు. ఏడు పరాజయాల తర్వాత పంజాబ్కు ఊరటనిచ్చే విజయం దక్కగా... ఇప్పుడు బెంగళూరు కాస్త ఇబ్బందికర స్థితికి చేరింది. ఇక ప్లే ఆఫ్కు చేరాలంటే ఆ జట్టు మిగిలిన రెండు మ్యాచ్లలో తప్పనిసరిగా గెలవాల్సిందే. మొహాలీ : వర్షం బారిన పడిన మ్యాచ్లో బెంగళూరుకు అనూహ్య పరాజయం ఎదురైంది. బుధవారం ఇక్కడ జరిగిన మ్యాచ్లో పంజాబ్ 22 పరుగుల తేడాతో బెంగళూరుపై విజయం సాధించింది. వర్షం కారణంగా మ్యాచ్ను పదేసి ఓవర్లకు కుదించారు. టాస్ గెలిచిన బెంగళూరు ఫీల్డింగ్ ఎంచుకుంది. ముందుగా బ్యాటింగ్కు దిగిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ నిర్ణీత 10 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 106 పరుగులు చేసింది. ఓపెనర్గా వచ్చిన వృద్ధిమాన్ సాహా (12 బంతుల్లో 31; 5 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్గా నిలిచాడు. బెంగళూరు బౌలర్లలో హర్షల్ పటేల్ (2/12), యజువేంద్ర చహల్ (2/25) రాణించారు. అనంతరం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 10 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 84 పరుగులు చేసింది. ఆర్సీబీ జట్టులో ఎవరూ చెప్పుకోదగ్గ స్కోరు సాధించలేకపోయారు. అక్షర్ పటేల్కు 2 వికెట్లు దక్కాయి. సాహా మెరుపు ఇన్నింగ్స్ పది ఓవర్ల మ్యాచ్కు తగినట్లుగానే పంజాబ్ ఇన్నింగ్స్కు సాహా ఘనారంభం అందించాడు. స్టార్క్ తొలి ఓవర్లో రెండు ఫోర్లు బాదిన అతను, అరవింద్ వేసిన రెండో ఓవర్లో మరింతగా చెలరేగిపోయాడు. సాహా మూడు ఫోర్లు, 1 సిక్స్ కొట్టడంతో ఆ ఓవర్లో 20 పరుగులు వచ్చాయి. అయితే వీస్ వేసిన మూడో ఓవర్ తొలి బంతిని గాల్లోకి లేపి అతను అవుటయ్యాడు. వీస్ ఈ ఓవర్లో నాలుగు పరుగులే ఇచ్చాడు. నాలుగో ఓవర్లో అరవింద్ మరో 11 పరుగులు ఇచ్చాడు. అయితే ఆ తర్వాత కింగ్స్ ఎలెవన్ బ్యాటింగ్ తడబడింది. హర్షల్ పటేల్ వేసిన తొలి ఓవర్ ఆ జట్టును దెబ్బ తీసింది. రెండు బంతుల తేడాతో పటేల్ రెండు వికెట్లు తీసి బెంగళూరుకు సంతోషం పంచాడు. భారీ షాట్లు ఆడబోయి వోహ్రా (11), మ్యాక్స్వెల్ (10) డీప్లో ఫీల్డర్లకు చిక్కారు. తర్వాతి ఓవర్లో స్పిన్తో బెంగళూరు దెబ్బ కొట్టింది. లెగ్స్పిన్నర్ చహల్ వేసిన తొలి రెండు బంతులకు భారీ సిక్సర్లు బాదిన మిల్లర్ (4 బంతుల్లో 14; 2 సిక్సర్లు) అదే ఓవర్లో స్టంపౌటై వెనుదిరిగాడు. వీస్ వేసిన ఏడో ఓవర్లో 13 పరుగులు వచ్చినా... తర్వాత హర్షల్ పటేల్ ఐదు పరుగులే ఇచ్చి కట్టడి చేశాడు. ఆ వెంటనే బెయిలీ (13)ని చహల్ బౌల్డ్ చేయగా... మరో వైపు అక్షర్ పటేల్ (15 బంతుల్లో 20 నాటౌట్; 1 ఫోర్, 1 సిక్స్) మాత్రం కాస్త ధాటిగా ఆడే ప్రయత్నం చేశాడు. చివరి ఓవర్లో స్టార్క్ 6 పరుగులే ఇవ్వడంతో పంజాబ్ ఇన్నింగ్స్ 106 పరుగుల వద్దే ముగిసింది. సమష్టిగా వైఫల్యం లక్ష్యఛేదనలో బెంగళూరుకు గేల్ (17) మెరుపు ఆరంభం అందించాడు. సందీప్ వేసిన తొలి ఓవర్లో తనదైన శైలిలో భారీ సిక్సర్తో ఖాతా తెరిచిన అతను మరో ఫోర్ కొట్టడంతో పది పరుగులు వచ్చాయి. అయితే రెండో ఓవర్ను కట్టుదిట్టంగా బౌల్ చేసిన హెన్డ్రిక్స్ ఆరు పరుగులే ఇచ్చాడు. ఆ తర్వాతి ఓవర్లో చెలరేగిన కోహ్లి (9 బంతుల్లో 19; 2 ఫోర్లు, 1 సిక్స్) అదే జోరులో అవుటయ్యాడు. అనురీత్ వేసిన ఈ ఓవర్లో 2 ఫోర్లు, 1 సిక్స్ సహా 16 పరుగులు రాబట్టిన అతను చివరి బంతికి షాట్ ఆడబోయి క్లీన్బౌల్డయ్యాడు. అనంతరం రిషి ధావన్ చక్కటి బౌలింగ్తో ఆరు పరుగులే ఇవ్వడంతో బెంగళూరు కాస్త ఒత్తిడిలో పడింది. ఈ సారి సందీప్ చక్కటి బంతితో గేల్ను బోల్తా కొట్టించాడు. బౌన్సర్ను ఆడబోయిన గేల్, కీపర్ చేతికి చిక్కాడు. కొద్ది సేపటికే అక్షర్ పటేల్, ఆర్సీబీకి షాక్ ఇచ్చాడు. తనదైన శైలిలో ఫైన్ లెగ్ మీదుగా స్వీప్ ఆడబోయిన డివిలియర్స్ (10) సునాయాస క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. కార్తీక్ (2) విఫలం కాగా, కొద్ది సేపు పోరాడిన మన్దీప్ (14 బంతుల్లో 20; 2 ఫోర్లు) కూడా అక్షర్ బౌలింగ్లో అవుట్ కావడంతో బెంగళూరు ఆశలు సన్నగిల్లాయి. హెన్డ్రిక్స్ (1/9) పొదుపైన బౌలింగ్ కూడా పంజాబ్ విజయంలో కీలక పాత్ర పోషించింది. స్కోరు వివరాలు కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఇన్నింగ్స్ : సాహా (సి) మన్దీప్ (బి) వీస్ 31; వోహ్రా (సి) మన్దీప్ (బి) హర్షల్ పటేల్ 11; మ్యాక్స్వెల్ (సి) డివిలియర్స్ (బి) హర్షల్ పటేల్ 10; మిల్లర్ (స్టంప్డ్) కార్తీక్ (బి) చహల్ 14; బెయిలీ (బి) చహల్ 13; అక్షర్ పటేల్ (నాటౌట్) 20; గుర్కీరత్ (సి) కార్తీక్ (బి) స్టార్క్ 2; రిషి ధావన్ (నాటౌట్) 1; ఎక్స్ట్రాలు 4; మొత్తం (10 ఓవర్లలో 6 వికెట్లకు) 106. వికెట్ల పతనం : 1-34; 2-50; 3-54; 4-71; 5-99; 6-102. బౌలింగ్ : స్టార్క్ 2-0-20-1; అరవింద్ 2-0-31-0; వీస్ 2-0-17-1; హర్షల్ పటేల్ 2-0-12-2; చహల్ 2-0-25-2. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్ : గేల్ (సి) సాహా (బి) సందీప్ 11; కోహ్లి (బి) అనురీత్ 19; డివిలియర్స్ (సి) హెన్డ్రిక్స్ (బి) అక్షర్ పటేల్ 10; మన్దీప్ (సి) మిల్లర్ (బి) పటేల్ 20; కార్తీక్ (సి) మిల్లర్ (బి) హెన్డ్రిక్స్ 2; సర్ఫరాజ్ (సి) హెన్డ్రిక్స్ (బి) అనురీత్ 4; వీస్ (నాటౌట్) 4; హర్షల్ పటేల్ (నాటౌట్) 0; ఎక్స్ట్రాలు 8; మొత్తం (10 ఓవర్లలో 6 వికెట్లకు) 84. వికెట్ల పతనం : 1-33; 2-44; 3-67; 4-74; 5-77; 6-83. బౌలింగ్ : సందీప్ 2-0-20-1; హెన్డ్రిక్స్ 2-0-9-1; అనురీత్ 2-0-21-2; రిషి ధావన్ 2-0-18-0; అక్షర్ పటేల్ 2-0-11-2. -
బెంగళూరుకి షాకిచ్చిన పంజాబ్
మెహాలీ: పాయింట్ల పట్టికలో చివర్లో ఉన్న పంజాబ్ పటిష్టమైన బెంగళూరుకి షాక్ ఇచ్చింది. ఈ మ్యాచ్ లో గెలిచి ప్లే ఆఫ్ లో స్థానం పొందాలనుకున్న బెంగళూరు ఆశలపై నీల్లు చల్లింది. ఈ మ్యాచ్ వర్షం కారణంగా 10 ఓవర్లకి కుదించి, ఆలస్యంగా ప్రారంభమైంది. టాస్ గెలిచిన బెంగళూర్ ఫిల్డీంగ్ ఎంచుకుంది. ఐపీఎల్-8లో భాగంగా నేడు (బుధవారం) కింగ్స్ XI పంజాబ్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం అంతరాయం తర్వాత ఆలస్యంగా ప్రారంభమైంది. దీంతో మ్యాచ్ని 10 ఓవర్లకి కుదించారు. ముందుగా టాస్ గెలిచిన బెంగళూర్ ఫిల్డీంగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ కు దిగిన పంజాబ్ నిర్ణీత 10 ఓవర్లలో 106 పరుగులకి 6 వికెట్లు కోల్పోయింది. బెంగుళూరు ముందు 107 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. పంజాబ్ ఓపెనర్ గా వచ్చిన సాహా మొదట్లోనే 12 బంతుల్లోనే31 పరుగులు రాబట్టి ధాటిగా ఆడాడు. ఆ తర్వాత పరుగుల వేటలో పంజాబ్ వికెట్లు వరుసగా కోల్పోయింది... వోహ్రా(11), మిల్లర్(14), మ్యాక్స్ వెల్(10) బెయిలీ(13), మాన్ సింగ్(2)లు పరుగులు చేశారు. అక్సర్ పటేల్(20), రిషి ధావన్ (1)లు పరుగలు చేసి నాటౌట్ గా నిలిచారు. బెంగళూరు బౌలర్లు హర్ష పటేల్,ఛాహ్లాలు తలో రెండు వికెట్లు తీయగా, స్టార్క్, వీయిసేలు తలో వికెట్ తీశారు. 107 పరుగుల విజయ లక్ష్యంతో బరిలో దిగిన బెంగళూరు తడబడుతూ త్వరత్వరగా వికెట్లు కోల్పోయింది. దీంతో 10 ఓవర్లో 6 వికెట్లు కోల్పోయి 84 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో పంజాబ్ 22 పరుగుల తేడాతో బెంగళూర్ పై విజయం సాధించింది. -
బెంగళూరు లక్ష్యం 107 పరుగులు
మెహాలీ: ఐపీఎల్-8లో భాగంగా నేడు (బుధవారం) కింగ్స్ XI పంజాబ్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం అంతరాయం తర్వాత ఆలస్యంగా ప్రారంభమైంది. దీంతో మ్యాచ్ని 10 ఓవర్లకి కుదించారు. ముందుగా టాస్ గెలిచిన బెంగళూర్ ఫిల్డీంగ్ ఎంచుకుంది. ముందుగా బ్యాటింగ్ కు దిగిన పంజాబ్ నిర్ణీత 10 ఓవర్లలో 106 పరుగులకి 6 వికెట్లు కోల్పోయింది. బెంగుళూరు ముందు 107 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. పంజాబ్ ఓపెనర్ గా వచ్చిన సాహా మొదట్లోనే 12 బంతుల్లోనే31 పరుగులు రాబట్టి ధాటిగా ఆడాడు. ఆ తర్వాత పరుగుల వేటలో పంజాబ్ వికెట్లు వరుసగా కోల్పోయింది... వోహ్రా(11), మిల్లర్(14), మ్యాక్స్ వెల్(10) బెయిలీ(13), మాన్ సింగ్(2)లు పరుగులు చేశారు. అక్సర్ పటేల్(20), రిషి ధావన్ (1)లు పరుగలు చేసి నాటౌట్ గా నిలిచారు. బెంగళూరు బౌలర్లు హర్ష పటేల్,ఛాహ్లాలు తలో రెండు వికెట్లు తీయగా, స్టార్క్, వీయిసేలు తలో వికెట్ తీశారు. -
ఫిల్డీంగ్ ఎంచుకున్న బెంగళూర్
మెహాలీ: ఐపీఎల్-8లో భాగంగా నేడు (బుధవారం) కింగ్స్ XI పంజాబ్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం అంతరాయం తర్వాత ఆలస్యంగా ప్రారంభమైంది. టాస్ గెలిచిన బెంగళూర్ ఫిల్డీంగ్ ఎంచుకుంది. 10 ఓవర్ల మ్యాచ్ కావడంతో తొలుత ఫీల్డింగ్ ఎంచుకున్నట్టు కెప్టెన్ కోహ్లీ చెప్పారు. కుదించిన ఓవర్లతో మ్యాచ్ ప్రారంభమైంది. -
పంజాబ్, బెంగళూరు మ్యాచ్కు వర్షం అంతరాయం
మెహాలీ: ఐపీఎల్ -8లో భాగంగా నేడు (బుధవారం) కింగ్స్ XI పంజాబ్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరగాల్సిన మ్యాచ్కు వర్షం అంతరాయం కలిగించింది. దీంతో 8 గంటలకు ప్రారంభం కావాల్సిన మ్యాచ్ ఇంకా మొదలు కాలేదు. వర్షం కారణంగా టాస్ కూడా వేయలేదు. పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో ఇంకా వర్షం పడుతోంది. -
ఢిల్లీ డేర్ డెవిల్స్ విజయం
-
‘క్యాలిప్సో’ కేక...
► ఐపీఎల్లో కరీబియన్ల హవా ► ఆటతో పాటు ఉచిత వినోదం సాధారణంగా వెస్టిండీస్ క్రికెటర్లు చాలా సరదాగా ఉంటారు. ఎప్పుడూ నవ్వుతూ జోక్ లు వేస్తూ ఉంటారు. తమ దీవుల్లో ప్రఖ్యాత క్యాలిప్సో సంగీతాన్ని భారత్లోనూ అభిమానులకు ఆటతో రుచి చూపిస్తున్నారు. ఐపీఎల్ మొదటి సీజన్ నుంచి ఇప్పటిదాకా ప్రతిసారీ కరీబియన్లు ఆకట్టుకుంటూనే ఉన్నారు. ఈ సీజన్లోనూ వెస్టిండీస్ స్టార్స్ అటు ఆటతో ఇటు తమ చేష్టలతో ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తున్నారు. ఓ మ్యాచ్లో కాస్త ఆవేశంగా వ్యవహరిస్తే అంపైర్ హెచ్చరించడం సహజం. మిగిలిన ఆటగాళ్లైతే కామ్గా వెళ్లిపోతారు. లేదా బ్యాట్తోనో, బంతితోనో తమ కసిని చూపిస్తారు. కానీ పొలార్డ్ మాత్రం నోటికి ప్లాస్టర్ వేసుకున్నాడు. వెస్టిండీస్ క్రికెటర్లు ఎంత భిన్నంగా అభిమానులను అలరిస్తారో చెప్పడానికి ఇదో ఉదాహరణ. క్రిస్ గేల్ సిక్సర్ల సునామీ, డ్వేన్ బ్రేవో ఆల్రౌండ్ నైపుణ్యం, లెండిల్ సిమ్మన్స్ కళ్లుచెదిరే క్యాచ్లు... ఇలా ఈసారి ఐపీఎల్లోనూ కరీబియన్ స్టార్స్ తమ ముద్ర వేశారు. ఈసారి లీగ్లో అందరికంటే ఎక్కువగా ఆస్ట్రేలియా క్రికెటర్లు ఉన్నారు. వార్నర్, స్టీవ్ స్మిత్లాంటి ఒకరిద్దరు తప్ప మిగతావారు పెద్దగా ఆకట్టుకోలేకపోయారు. కానీ బరిలోకి దిగిన అర డజను వెస్టిండీస్ క్రికెటర్లు మాత్రం తమ ఆటతీరుతో తమ తమ జట్లకు కొత్త ఉత్సాహాన్ని ఇస్తున్నారు. -సాక్షి క్రీడావిభాగం క్రిస్ గేల్ (బెంగళూరు రాయల్ చాలెంజర్స్) ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత విధ్వంసకర బ్యాట్స్మన్ క్రిస్ గేల్. ఎనిమిది సీజన్లలో ఐదు సెంచరీలు కొట్టాడు. ఈసారి తొలి మ్యాచ్లో కేవలం నాలుగు పరుగుల తేడాతో శతకాన్ని కోల్పోయిన ఈ డాషింగ్ ఓపెనర్... పంజాబ్తో మ్యాచ్లో విశ్వరూపం చూపించాడు. మిషెల్ జాన్సన్కైతే చుక్కలు చూపించాడు. గత సీజన్లతో పోలిస్తే కాస్త జోరు తగ్గినా... బెంగళూరుకు అతనే ఇప్పటికీ కీలక బ్యాట్స్మన్. మ్యాచ్లు: 9; పరుగులు: 370; సెంచరీ 1; అర్ధసెంచరీలు : 2 కీరన్ పొలార్డ్ (ముంబై ఇండియన్స్) ముంబై మ్యాచ్లో లాంగాన్ లేదా లాంగాఫ్ ప్రాంతంలోకి బంతిని గాల్లోకి లేపాలంటే ఏ బ్యాట్స్మన్ అయినా ఒకటికి రెండుసార్లు ఆలోచించాలి. ఎందుకంటే అక్కడ పొలార్డ్ ఫీల్డింగ్ చేస్తుంటాడు. ఏ విన్యాసం చేసి బంతిని ఎలా అందుకుంటాడో అతనికే తెలియదు. తన ఫీల్డింగ్తోనే పొలార్డ్ అభిమానులను అలరిస్తాడు. ఇక బ్యాటింగ్లో అతను కాస్త ఆలస్యంగా క్రీజులోకి వస్తున్నాడు. అయితే ఈ సీజన్లో దాదాపు ప్రతి మ్యాచ్లోనూ ఒత్తిడిలో ఆడినా రాణించాడు. ముంబై జట్టు కోలుకోవడంలో పొలార్డ్ది కీలక పాత్ర. మ్యాచ్లు: 12; పరుగులు: 309; అర్ధసెంచరీలు: 2; క్యాచ్లు: 8 డ్వేన్ స్మిత్ (చెన్నై సూపర్ కింగ్స్) ఈ సీజన్లో చెన్నై విజయ రహస్యం ఓపెనర్లు రాణించడం. మెకల్లమ్తో పాటు డ్వేన్ స్మిత్ ఆరంభ ఓవర్లలో ప్రత్యర్థి బౌలర్లను ఊచకోత కోస్తున్నారు. ఈ సీజన్ ఆరంభంలో బాగా ఆడినా క్రమంగా కాస్త ఫామ్ కోల్పోయాడు. అయితే తన ఆటతీరులో దూకుడు తగ్గించి మెకల్లమ్కు కావలసిన సహకారం అందిస్తున్నాడు. మ్యాచ్లు: 13; పరుగులు: 325; అర్ధసెంచరీ: 1; క్యాచ్లు: 9 లెండిల్ సిమ్మన్స్ (ముంబై ఇండియన్స్) ముంబై ఈసారి ఆరోన్ ఫించ్ను తీసుకోవడం వల్ల టోర్నీ ఆరంభ మ్యాచ్లలో సిమ్మన్స్ బెంచ్కే పరిమితం కావాల్సి వచ్చింది. అయితే ఫించ్ గాయంతో వైదొలగడంతో అతనికి వెంటనే అవకాశం లభించింది. ఈసారి కూడా సిమ్మన్స్ తన విలువను నిరూపించుకున్నాడు. దాదాపు ప్రతి మ్యాచ్లోనూ ముంబైకి మంచి ఆరంభాన్ని ఇస్తున్నాడు. మ్యాచ్లు: 9; పరుగులు: 345; అర్ధసెంచరీలు: 4; క్యాచ్లు: 3 ఆండ్రీ రస్సెల్ (కోల్కతా నైట్రైడర్స్) ఈసారి కోల్కతా విజయాల్లో అత్యంత కీలక ఆటగాడు రస్సెల్. గత ఏడాది తుది జట్టులో అతనికి స్థానమే లేదు. అయితే ప్రపంచకప్లో ఫామ్ను చూసి ఈసారి మొదట్నించీ అన్ని మ్యాచ్ల్లోనూ ఆడించారు. తన సంచలన హిట్టింగ్తో మ్యాచ్ ఫలితాన్ని కోల్కతా వైపు తిప్పేస్తున్నాడు. ఇక బౌలింగ్లోనూ ఈసారి బాగా మెరుగుపడ్డాడు. ముఖ్యంగా డెత్ ఓవర్లలో చక్కటి బౌన్సర్లతో బ్యాట్స్మెన్ను నియంత్రిస్తూ కోల్కతాకు అత్యంత విలువైన క్రికెటర్గా ఎదిగాడు. మ్యాచ్లు: 11; పరుగులు: 287; అర్ధసెంచరీలు: 3; వికెట్లు: 11 డ్వేన్ బ్రేవో (చెన్నై సూపర్ కింగ్స్) మొత్తం వెస్టిండీస్ క్రికెటర్లందరిలో ఎక్కువ వినోదాన్ని ఇచ్చే క్రికెటర్ డ్వేన్ బ్రేవో. తన సంచలనాత్మక క్యాచ్లతో పాటు డెత్ ఓవర్లలో వైవిధ్యంతో కూడిన కట్టుదిట్టమైన బౌలింగ్, ఫీల్డింగ్తో మ్యాచ్ల దిశను మారుస్తున్నాడు. అందుకే చెన్నై కెప్టెన్ ధోని అతణ్ని నమ్మినంతగా ఎవరినీ నమ్మడు. 13 ఓవర్లు పూర్తయ్యాక చివరి ఏడు ఓవర్లలో నాలుగు బ్రేవోతో వేయిస్తున్నాడంటే ధోనికి ఎంత నమ్మకమో అర్థం చేసుకోవచ్చు. ఇక బ్యాటింగ్లోనూ బ్రేవో ఓ అద్భుతం. ఎంత ఒత్తిడిలో అయినా భారీ షాట్లు ఆడటం అతని ప్రత్యేకత . మ్యాచ్లు: 13; పరుగులు: 166; వికెట్లు: 19; క్యాచ్లు: 12 -
డివిలియర్స్లా ఆడాలి
క్రికెట్లో డివిలియర్స్ తరహాలో మైదానంలో అన్ని వైపులా షాట్లు ఆడటం కష్టమని, అలా బ్యాలెన్స్తో ఆడాలనే కోరిక తనకూ ఉందని న్యూజిలాండ్ స్టార్ బ్రెండన్ మెకల్లమ్ చెప్పాడు. ప్రస్తుత తరంలో డివిలియర్స్ దిగ్గజమని ప్రశంసించాడు. -
చెన్నైకి షాక్
వరుస విజయాలతో ఊపుమీదున్న చెన్నై సూపర్కింగ్స్కు ఐపీఎల్లో ఢిల్లీ డేర్డెవిల్స్ చెక్ పెట్టింది. ఆల్రౌండ్ షోతో అదరగొడుతూ.... పాయింట్ల పట్టికలో ‘టాప్’లో ఉన్న ధోని సేనకు కీలక మ్యాచ్లో షాకిచ్చింది. బ్యాటింగ్ వైఫల్యంతో స్వల్ప స్కోరుకే పరిమితమైన చెన్నై బౌలింగ్లోనూ పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. రాయ్పూర్ : పోయిన పరువు కొంతైనా నిలబడాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్లో ఢిల్లీ డేర్డెవిల్స్ సత్తా చాటింది. జహీర్ ఖాన్ (2/9), ఆల్బీ మోర్కెల్ (2/21) బౌలింగ్ మెరుపులకు తోడు బ్యాటింగ్లో శ్రేయస్ అయ్యర్ (49 బంతుల్లో 70 నాటౌట్; 10 ఫోర్లు, 1 సిక్స్), యువరాజ్ (28 బంతుల్లో 32; 4 ఫోర్లు, 1 సిక్స్) రాణించడంతో మంగళవారం జరిగిన లీగ్ మ్యాచ్లో ఢిల్లీ 6 వికెట్ల తేడాతో చెన్నైపై విజయం సాధించింది. షహీద్ వీర్ నారాయణ్ సింగ్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన చెన్నై 20 ఓవర్లలో 6 వికెట్లకు 119 పరుగులు చేసింది. టాప్ స్కోరర్ డు ప్లెసిస్ (23 బంతుల్లో 29; 3 ఫోర్లు), ధోని (24 బంతుల్లో 27; 3 ఫోర్లు, 1 సిక్స్)తో సహా అందరూ ఓ మోస్తరు స్కోరుకే పరిమితమయ్యారు. తర్వాత ఢిల్లీ 16.4 ఓవర్లలో 4 వికెట్లకు 120 పరుగులు చేసి నెగ్గింది. జహీర్కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. జహీర్ జోరు టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన చెన్నైని స్పిన్నర్ నదీమ్, పేసర్ జహీర్లు అద్భుతమైన బౌలింగ్తో అడ్డుకున్నారు. దీంతో ఓపెనర్లు స్మిత్ (24 బంతుల్లో 18; 2 ఫోర్లు, 1 సిక్స్), మెకల్లమ్ (21 బంతుల్లో 11; 1 ఫోర్) పరుగులు చేయడానికి ఇబ్బంది పడ్డారు. పవర్ప్లేలో 16 పరుగులు చేసిన చెన్నై.. మెకల్లమ్ వికెట్ను చేజార్చుకుంది. వన్డౌన్లో రైనా (11) విఫలంకాగా, స్మిత్ కూడా స్వల్ప వ్యవధిలో అవుటయ్యాడు. తర్వాత డు ప్లెసిస్, ధోనిలు నిలకడగా ఆడారు. రన్రేట్ తక్కువగా ఉండటంతో భారీ షాట్లకు పోకుండా వికెట్ను కాపాడుకునే ప్రయత్నం చేశారు. ఈ ఇద్దరు నాలుగో వికెట్కు 27 పరుగులు జోడించారు. ఈ దశలో డు ప్లెసిస్ అవుటైనా.. ధోని, బ్రేవో (8) చెరో సిక్సర్ బాదడంతో కాస్త ఊపు వచ్చింది. అయితే 5 బంతుల తేడాలో ఈ జోడి పెవిలియన్కు చేరడంతో చెన్నై 110 పరుగులకు 6 వికెట్లు కోల్పోయింది. ధోని, బ్రేవోలు ఐదో వికెట్కు 22 పరుగులు సమకూర్చారు. శ్రేయస్ నిలకడ లక్ష్యం చిన్నదే అయినా ఢిల్లీ ఇన్నింగ్స్ తడబాటుతో మొదలైంది. ఓపెనర్లలో డికాక్ (3)తోపాటు కెప్టెన్ డుమిని (6) వరుస విరామాల్లో అవుట్ కావడంతో ఢిల్లీ 24 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది. అయితే చెన్నై బౌలర్లపై ఆధిపత్యం చూపెట్టిన శ్రేయస్ నిలకడగా ఆడి ఇన్నింగ్స్ను గాడిలో పెట్టాడు. ఇన్నింగ్స్ ఏడో ఓవర్లో ఓ సిక్స్, ఫోర్ బాదగా, రెండో ఎండ్లో యువరాజ్ కూడా ఫోర్తో టచ్లోకి వచ్చాడు. దీంతో ఈ ఓవర్లో 20 పరుగులు వచ్చాయి. తర్వాత కూడా ఈ ఇద్దరు జోరు కనబర్చడంతో ఢిల్లీ ఇన్నింగ్స్ నిలకడగా సాగింది. ఈ క్రమంలో శ్రేయస్ 36 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేశాడు. 14వ ఓవర్లో నేగి బంతిని స్వీప్ చేయబోయి యువీ... మోహిత్ చేతికి చిక్కాడు. ఈ ఇద్దరు మూడో వికెట్కు 9.1 ఓవర్లలో 69 పరుగులు జోడించడంతో ఢిల్లీ విజయానికి చేరువగా వచ్చింది. తర్వాత మోర్కెల్ (8) సమయోచితంగా ఆడాడు. గెలుపునకు 23 పరుగులు కావాల్సిన దశలో అయ్యర్ రెండు ఫోర్లు కొట్టగా, మోర్కె ల్ భారీ సిక్స్ కొట్టి ఆ వెంటనే అవుటయ్యాడు. చివరకు జాదవ్ (1 నాటౌట్)తో కలిసి శ్రేయస్ జట్టుకు విజయాన్ని అందించాడు. 4 ఈ ఐపీఎల్ సీజన్లో శ్రేయస్ చేసిన అర్ధ సెంచరీలు 5 ఐపీఎల్ చరిత్రలో చెన్నైపై ఢిల్లీ నెగ్గిన మ్యాచ్ల సంఖ్య 19 ఈ మ్యాచ్లో జహీర్ ఖాన్ వేసిన డాట్ బాల్స్ స్కోరు వివరాలు చెన్నై సూపర్కింగ్స్: స్మిత్ ఎల్బీడబ్ల్యు (బి) మోర్కెల్ 18; మెకల్లమ్ (సి) డుమిని (బి) జహీర్ 11; రైనా (సి) డుమిని (బి) జయంత్ 11; డు ప్లెసిస్ (బి) మోర్కెల్ 29; ధోని (సి) నదీమ్ (బి) జహీర్ 27; బ్రేవో (సి) డుమిని (బి) సంధూ 8; నేగి నాటౌట్ 5; జడేజా నాటౌట్ 3; ఎక్స్ట్రాలు 7; మొత్తం: (20 ఓవర్లలో 6 వికెట్లకు) 119. వికెట్ల పతనం: 1-16; 2-34; 3-46; 4-83; 5-105; 6-110. బౌలింగ్: నదీమ్ 4-1-18-0; జహీర్ 4-1-9-2; సంధూ 4-0-33-1; మోర్కెల్ 3-0-21-2; జయంత్ 2-0-8-1; యువరాజ్ 3-0-23-0. ఢిల్లీ డేర్డెవిల్స్ ఇన్నింగ్స్: డికాక్ (సి) అశ్విన్ (బి) పాండే 3; శ్రేయస్ నాటౌట్ 70; డుమిని (బి) పాండే 6; యువరాజ్ (సి) మోహిత్ (బి) నేగి 32; మోర్కెల్ (సి) పాండే (బి) నేగి 8; జాదవ్ నాటౌట్ 1; ఎక్స్ట్రాలు 0; మొత్తం: (16.4 ఓవర్లలో 4 వికెట్లకు) 120. వికెట్ల పతనం: 1-16; 2-24; 3-93; 4-114. బౌలింగ్: ఈశ్వర్ పాండే 4-1-27-2; మోహిత్ 2-0-17-0; అశ్విన్ 4-0-24-0; జడేజా 2.4-0-16-0; రైనా 1-0-8-0; నేగి 3-0-28-2. -
చెన్నై పై ఢిల్లీ డేర్ డెవిల్స్ విజయం
రాయ్పూర్: ఐపీఎల్-8లో భాగంగా మంగళవారం రాత్రి చెన్నైతో జరిగన మ్యాచ్ లో ఢిల్లీ డేర్ డెవిల్స్ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. స్వల్ప లక్ష్యంతో బరిలో దిగిన ఢిల్లీ ఆదిలోనే 2 వికెట్లు కోల్పోయింది.ఆ తర్వాత అయ్యర్(70), యువరాజ్(32) పరుగుల సహాయంతో ఢిల్లీ సునాయాసంగా గెలుపొందింది. ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 119 పరుగులు చేసింది. ఓపెనర్లుగా దిగిన మెకల్లమ్ (11), డ్వేన్ స్మిత్ (18) పరుగులు చేసి వెనుదిరిగారు. ఆ తరువాత వచ్చిన మిగతా ఆటగాళ్లు రైనా (11), డుప్లెసిస్(29), బ్రేవో(8), ధోనీ(27)లు పరుగులు చేసి అవుట్ అయ్యారు. పవన్(5), జడేజా (3) పరుగులు చేసి నాటౌట్ గా నిలిచారు. ఢిల్లీ బౌలర్లు జహీర్, మెర్కెల్ లు తలా రెండు వికెట్లు తీయగా సంధూ,జయంత్ లు తలో వికెట్ తీశారు.. 120 పరుగుల విజయ లక్ష్యంతో బరిలో దిగిన ఢిల్లీ ఆదిలోనే డికాక్(3), డుమిని(6) ఔటయ్యారు. తర్వత బ్యాటింగ్ కు వచ్చిన యువరాజ్, అయ్యర్తో కలిసి 69 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. యువరాజ్ 32 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద అవుటవగా, ఆ తర్వత వచ్చిన మోర్కెల్(8) అవుటయ్యాడు. అయ్యర్ (70), జాదవ్(1) పరుగులతో నాటౌట్ గా నిలిచారు. నాలుగు ఓవర్లలో కేవలం 9 పరుగులు మాత్రమే ఇచ్చి 2 వికెట్లు తీసిన జహీర్ ఖాన్కి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ లభించింది. -
ఢిల్లీ లక్ష్యం 120 పరుగులు
రాయ్పూర్: ఐపీఎల్-8 లో భాగంగా మంగళవారం ఇక్కడ ఢిల్లీ డేర్ డెవిల్స్తో జరుగుతున్న మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 119 పరుగులు చేసింది. దాంతో ప్రత్యర్థి ఢిల్లీకి 120 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. తొలుత ఓపెనర్లుగా దిగిన మెకల్లమ్ (11), డ్వేన్ స్మిత్ (18) పరుగులు చేసి వెనుదిరిగారు. ఆ తరువాత వచ్చిన మిగతా ఆటగాళ్లు రైనా (11), డుప్లెసిస్(29), బ్రేవో(8), ధోనీ(27)లు పరుగులు చేసి అవుట్ అయ్యారు. పవన్(5), జడేజా (3) పరుగులు చేసి నాటౌట్ గా నిలిచారు. ఢిల్లీ బౌలర్లు జహీర్, మెర్కెల్ లు తలా రెండు వికెట్లు తీయగా సంధూ,జయంత్ లు తలో వికెట్ తీశారు.. -
పది ఓవర్లలో చెన్నై స్కోరు 46/3
రాయ్పూర్: ఐపీఎల్-8లో భాగంగా మంగళవారం రాత్రి ఢిల్లీ డేర్ డెవిల్స్తో జరుగుతున్న మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ప్రారంభించిన చెన్నై సూపర్ కింగ్స్ తొలి 10 ఓవర్లలో 3 వికెట్లు నష్టపోయి 46 పరుగులు చేసింది. చెన్నై స్కోరు 16 పరుగుల వద్ద జహీర్ బౌలింగ్ లో ఓపెనర్ బ్రెండన్ మెకల్లమ్ (11) ఔటయ్యాడు. 34 పరుగుల వద్ద డ్వేన్ స్మిత్ (18) అల్బీ మోర్కెల్ బౌలింగ్ లో తొలి బంతికి ఔటయ్యాడు. 46 పరుగుల వద్ద మూడో వికెట్ రూపంలో రైనా (11) ఔట్ అయ్యాడు.ప్రస్తుతం ధోనీ(0), డుప్లెసిస్ (6)లు క్రీజులో ఉన్నారు. ఢిల్లీ బౌలర్లలో జహీర్ ఖాన్, మోర్కెల్, జయంత్ యాదవ్ లు ఒక్కో వికెట్ తీశారు. -
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న చెన్నై
రాయ్పూర్ : ఐపీఎల్-8లో భాగంగా ఇక్కడి ఛత్తీస్గఢ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో మంగళవారం రాత్రి ఢిల్లీ డేర్ డెవిల్స్తో జరుగుతున్న మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. మంచి ఫామ్ లో ఉన్న సూపర్ కింగ్స్ ఇప్పటికే 16 పాయింట్లతో ప్లేఆఫ్కు దూసుకెళ్లి టైటిల్ ఫెవరెట్గా ఉంది. ఇక 8 పాయింట్లతో కొనసాగుతున్న ఢిల్లీ ఈ మ్యాచ్లో గెలిచి సత్తా చాటాలని చూస్తోంది. -
చెన్నైతో తలపడనున్న ఢిల్లీ
రాయ్పూర్: ఐపీఎల్-8లో భాగంగా ఇక్కడ ఛత్తీస్గఢ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో మంగళవారం ఢిల్లీ డేర్ డెవిల్స్తో జరుగుతున్న మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ తలపడనుంది. మంచి ఫామ్ లో ఉన్న సూపర్ కింగ్స్ ఇప్పటికే 16 పాయింట్లతో ప్లేఆఫ్కు దూసుకెళ్లి టైటిల్ ఫెవరెట్గా ఉంది. ఇక 8 పాయింట్లతో కొనసాగుతున్న ఢిల్లీ ఈ మ్యాచ్లో గెలిచి సత్తా చాటాలని చూస్తోంది. -
సొంతగడ్డపై సన్రైజర్స్ విజయం
-
ఈసారీ నో ఎంట్రీ
ముంబై ఇండియన్స్తో నైట్రైడర్స్ గురువారం ఆడే మ్యాచ్కు ఈ ఏడాది కూడా షారూఖ్ ఖాన్ను వాంఖడే స్టేడియంలోకి అనుమతించడం లేదని ముంబై క్రికెట్ సంఘం తెలిపింది. 2012లో భద్రతా సిబ్బందిపై చేయి చేసుకున్నందుకు షారూఖ్పై ఐదేళ్ల నిషేధం విధించారు. అయితే ముంబైలోని బ్రబౌర్న్ స్టేడియంలో శని వారం రాజస్తాన్తో మ్యాచ్ను నైట్రైడర్స్ యజమాని చూడొచ్చు. -
ఉఫ్... హమ్మయ్య!
అలవోకగా గెలవాల్సిన మ్యాచ్లో సన్రైజర్స్ ఉత్కంఠను ఎదుర్కొంది. డేవిడ్ మిల్లర్ సిక్సర్ల సునామీకి కొట్టుకుపోతుందేమో అని భయపడాల్సి వచ్చింది. చివరి ఓవర్లో విజయానికి 28 పరుగులు అవసరం కాగా... ఇషాంత్ వేసిన ఈ ఓవర్లో మిల్లర్ ఏకంగా 22 పరుగులు బాది కంగారుపెట్టాడు. మొత్తానికి పంజాబ్పై గెలిచిన సన్రైజర్స్ ఊపిరిపీల్చుకుని ప్లేఆఫ్కు చేరువయింది. సన్రైజర్స్ హ్యాట్రిక్ విజయం ⇒ చెలరేగిన వార్నర్ ⇒ మిల్లర్ పోరాటం వృథా ⇒ పంజాబ్ ఖాతాలో మరో ఓటమి సాక్షి, హైదరాబాద్: సొంతగడ్డపై చివరి మూడు మ్యాచ్ల్లో రెండు గెలిస్తే హైదరాబాద్ ప్లేఆఫ్కు వెళుతుంది. చివరి రెండు మ్యాచ్ల్లో బెంగళూరు, ముంబైలతో ఆడాలి. ఆ రెండు జట్లూ భీకరంగా ఆడుతున్నాయి. కాబట్టి ఫామ్లో లేని పంజాబ్పై కచ్చితంగా గెలిస్తే... తర్వాతి రెండు మ్యాచ్ల్లో ఒకటి ఓడినా ఇబ్బంది ఉండదు. ఇలాంటి నేపథ్యంలో సన్రైజర్స్ బ్యాట్స్మెన్ మరోసారి చెలరేగారు. కెప్టెన్ వార్నర్ ఫామ్ను కొనసాగిస్తూ మరోసారి హైదరాబాద్ను నిలబెట్టాడు. మిల్లర్ పోరాటంలో పంజాబ్ ఆతిథ్య జట్టుకు చెమటలు పట్టించినా... చివరకు సన్రైజర్స్ గట్టెక్కింది. ఉప్పల్లోని రాజీవ్గాంధీ స్టేడియంలో సోమవారం జరిగిన లీగ్ మ్యాచ్లో రైజర్స్ 5 పరుగుల తేడాతో కింగ్స్ ఎలెవన్ పంజాబ్పై ఘన విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్కు దిగిన సన్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది. కెప్టెన్ డేవిడ్ వార్నర్ (52 బంతుల్లో 81; 6 ఫోర్లు, 5 సిక్సర్లు) మళ్లీ హాఫ్ సెంచరీతో చెలరేగాడు. అనంతరం పంజాబ్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 180 పరుగులు చేయగలిగింది. డేవిడ్ మిల్లర్ (44 బంతుల్లో 89 నాటౌట్; 2 ఫోర్లు, 9 సిక్సర్లు) అద్భుతంగా చెలరేగి ఆడినా మిగతా బ్యాట్స్మెన్ అంతా విఫలమయ్యారు. హైదరాబాద్ బౌలర్లలో హెన్రిక్స్ 3, బిపుల్ 2 వికెట్లు పడగొట్టారు. వార్నర్కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. మెరుపు ఆరంభం టాస్ గెలిచిన సన్రైజర్స్ బ్యాటింగ్ ఎంచుకుంది. వరుసగా రెండు మ్యాచ్లు గెలిచినా...జట్టు మూడు మార్పులతో బరిలోకి దిగడం విశేషం. బొపారా, ప్రవీణ్, రసూల్ స్థానంలో బౌల్ట్, రాహుల్, బిపుల్ జట్టులోకి వచ్చారు. వార్నర్, ధావన్ (18 బంతుల్లో 24; 4 ఫోర్లు) ధాటిగా ఆడటంతో హైదరాబాద్ ఇన్నింగ్స్ జోరుగా సాగింది. రెండో ఓవర్లో 1 సిక్స్, 2 ఫోర్లతో వార్నర్ 14 పరుగులు రాబట్టాడు. హెన్డ్రిక్స్ వేసిన ఓవర్లో బ్యాట్స్మెన్ 2 ఫోర్లు, 1 సిక్స్ బాదడంతో 18 పరుగులు వచ్చాయి. ఫలితంగా సన్ పవర్ప్లేలో 56 పరుగులు చేసింది. అయితే తర్వాతి ఓవర్ తొలి బంతికే మ్యాక్స్వెల్ చక్కటి బంతితో ఈ జోడీని విడదీశాడు. ఈ దశలో వార్నర్తో జత కలిసిన హెన్రిక్స్ (24 బంతుల్లో 28; 4 ఫోర్లు) కూడా వేగంగా ఆడాడు. మరో వైపు దూకుడు తగ్గించని వార్నర్, పటేల్ ఓవర్లో రెండు భారీ సిక్సర్లు కొట్టి 36 బంతుల్లోనే ఈ సీజన్లో ఆరో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. వీరిద్దరు రెండో వికెట్కు 45 బంతుల్లోనే 65 పరుగులు జోడించిన అనంతరం హెన్రిక్స్ వెనుదిరిగాడు. ఆ తర్వాత మ్యాక్స్వెల్ ఓవర్లో వరుస బంతుల్లో 6,6,4 బాదిన మోర్గాన్ (7 బంతుల్లో 17; 1 ఫోర్, 2 సిక్సర్లు) తర్వాతి ఓవర్లో అవుటయ్యాడు. ఐపీఎల్-8లో 500 పరుగులు పూర్తి చేసుకున్న వార్నర్ మిడ్ వికెట్లో సునాయాస క్యాచ్ ఇచ్చి అవుటవగా, తర్వాతి బంతికి ఓజా (2) రనౌటయ్యాడు. చివర్లో రాహుల్ (17 నాటౌట్), కరణ్ (11 నాటౌట్) 16 బంతుల్లోనే 28 పరుగులు జత చేశారు. తొలి 10 ఓవర్లలో 86 పరుగులు చేసిన రైజర్స్ తర్వాతి 10 ఓవర్లలో 99 పరుగులు చేసింది. టపటపా వికెట్లు భారీ లక్ష్యఛేదనలో ఇన్నింగ్స్ను ధాటిగానే ఆరంభించిన పంజాబ్ ఆ తర్వాత చతికిల పడింది. బౌల్ట్ వేసిన రెండో ఓవర్లో 2 ఫోర్లు, 1 సిక్స్తో 15 పరుగులు రాబట్టిన విజయ్ (18 బంతుల్లో 24; 4 ఫోర్లు, 1 సిక్స్) అదే జోరులో అవుటయ్యాడు. పవర్ప్లేలో 47 పరుగులు చేసిన కింగ్స్ ఎలెవన్ తర్వాతి ఓవర్ తొలి బంతికే వోహ్రా (15 బంతుల్లో 20; 2 ఫోర్లు, 1 సిక్స్) వికెట్ కోల్పోయింది. అనంతరం ఏ దశలోనూ కోలుకోలేకపోయిన జట్టు సీజన్లో తమ చెత్త ఫామ్ను ఈ మ్యాచ్లోనూ కొనసాగించింది. నాలుగో స్థానంలో వచ్చిన మ్యాక్స్వెల్ (11) ప్రభావం చూపలేకపోగా, సాహా (5), బెయిలీ (6) కూడా కనీస ప్రదర్శన ఇవ్వలేదు. చివర్లో మెరుపు బ్యాటింగ్తో 31 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న మిల్లర్ సిక్సర్లతో విరుచుకు పడి తుదికంటా పోరాడాడు. స్కోరు వివరాలు:- సన్రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్: వార్నర్ (సి) గురుకీరత్ (బి) హెన్డ్రిక్స్ 81; ధావన్ (స్టంప్డ్) సాహా (బి) మ్యాక్స్వెల్ 24; హెన్రిక్స్ (సి) అనురీత్ (బి) గురుకీరత్ 28; మోర్గాన్ (సి) వోహ్రా (బి) హెన్డ్రిక్స్ 17; నమన్ ఓజా (రనౌట్) 2; రాహుల్ (నాటౌట్) 17; కరణ్ (నాటౌట్) 11; ఎక్స్ట్రాలు 5; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 185 వికెట్ల పతనం: 1-56; 2-121; 3-140; 4-157; 5-157. బౌలింగ్: సందీప్ 4-0-33-0; అనురీత్ 4-0-37-0; హెన్డ్రిక్స్ 4-0-40-2; గురుకీరత్ 3-0-27-1; మ్యాక్స్వెల్ 3-0-28-1; పటేల్ 2-0-19-0. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఇన్నింగ్స్: విజయ్ (సి) ధావన్ (బి) బిపుల్ 24; వోహ్రా (సి) భువనేశ్వర్ (బి) బిపుల్ 20; సాహా (సి) రాహుల్ (బి) హెన్రిక్స్ 5; మ్యాక్స్వెల్ (సి) నమన్ (బి) బౌల్ట్ 11; మిల్లర్ (నాటౌట్) 89; బెయిలీ (సి) వార్నర్ (బి) హెన్రిక్స్ 6; గురుకీరత్ (సి) మోర్గాన్ (బి) హెన్రిక్స్ 3; పటేల్ (సి) నమన్ (బి) భువనేశ్వర్ 15; హెన్డ్రిక్స్ (నాటౌట్) 0; ఎక్స్ట్రాలు 7; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 180. వికెట్ల పతనం: 1-42; 2-47; 3-60; 4-65; 5-81; 6-99; 7-158. బౌలింగ్: భువనేశ్వర్ 4-0-34-1; బౌల్ట్ 4-0-45-1; ఇషాంత్ 4-0-49-0; బిపుల్ 2-0-13-2; హెన్రిక్స్ 4-0-16-3; కరణ్ 2-0-20-0. -
యువరాజ్ది మార్కెట్ ఆధారిత రేటు
ఢిల్లీ డేర్డెవిల్స్ సీఈవో హేమంత్ దువా న్యూఢిల్లీ: ఐపీఎల్ ఆటగాళ్ల వేలంలో రూ.16 కోట్ల అత్యధిక ధరతో యువరాజ్ సింగ్ను కొనుగోలు చేసిన ఢిల్లీ డేర్డెవిల్స్కు ఈ ఏడాది ఇప్పటివరకు అతడి ద్వారా పెద్దగా ఒరిగిందేం లేదు. అయితే ఏమాత్రం రాణించలేకపోతున్న యువీపై అంత ధర పెట్టడంపై డీడీ స్పందించింది. అది ఐపీఎల్ మార్కెట్ను అనుసరించే జరిగిందని ఆ జట్టు సీఈవో హేమంత్ దువా అన్నారు. వేలం సమయంలో యువరాజ్కు ఉన్న డిమాండ్ అలాంటిదని, ఈ విషయంలో తమకు ఎలాంటి బాధా లేదన్నారు. ‘యువీకి సంబంధించిన రేటుపై అందరూ మాట్లాడుతున్నారు. అయితే ఈ ధరంతా అప్పటి అతడి మార్కెట్కు సంబంధించింది. అంత రేటును తానేమీ అడగనని యువరాజ్ గతంలోనే చెప్పాడు. నిజానికి తక్కువ రేటుకే మేం అతడిని కొనుగోలు చేయాలని భావించాం. కానీ వేలం ప్రారంభమయ్యాక మరో ఫ్రాంచైజీ కూడా పోటీ పడడంతో రేటు ఎక్కడికో వెళ్లింది. అందుకే తనది మార్కెట్ రేటు అని చెప్పాను. త్వరలోనే అతడు తన ఫామ్ను చాటుకుంటాడు’ అని దువా ఆశాభావం వ్యక్తం చేశారు. -
'సన్'కు మిల్లర్ స్ట్రోక్ తప్పింది
ఐపీఎల్-8లో భాగంగా ఉప్పల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు.. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ పై 5 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి ఎగబాకి.. ప్లే ఆఫ్ అవకాశాల్ని పటిష్ఠం చేసుకుంది. పంజాబ్ బ్యాట్స్మన్ మిల్లర్ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. 44 బంతుల్లో 9 సిక్సర్లు, రెండు ఫోర్లతో 89 పరుగులు చేశాడు. ఓక దశలో అసాధ్యమనిపించిన లక్ష్యాన్ని ఇట్టే సాధించినంత పనిచేశాడు. కానీ విజయం హైదరాబాద్ నే వరించింది. ఓపెనర్లు మురళి విజయ్ (24), సాహా (20) కొద్దిసేపు మెరిసి ఔటయ్యారు. భారీ అంచనాలతో బరిలోకి దిగిన మ్యాక్స్ వెల్.. కేవలం 11 పరుగులకే పెవిలియన్ చేరాడు. చివర్లో ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ (15) కాసేపు మెరిశాడు. రెగ్యులర్ ఇంటర్వెల్స్ లో వికెట్లు పడగొట్టడంలో హైదరాబాద్ బౌలర్లు సక్పెస్ అయ్యారు. హెన్రిక్స 3, బిపుల్ శర్మ 2, బౌల్ట్, భువనేశ్వర్ ఒక్కో వికెట్ తీశారు. అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నసన్ రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 185 పరుగులు చేసింది. 52 బంతుల్లో 81 పరుగులు చేసిన హైదరాబాద్ కెప్టెన్ వార్నర్.. టోర్నీలో అత్యధిక పరుగులు (504) సాధించి ఆరెంజ్ క్యాప్ ను సొంతం చేసుకున్నాడు. శిఖర్ దావన్ (24), హెన్రిక్స్ (28) పరుగులతో రాణించారు. ఏడు బంతులు ఎదుర్కొన్న మోర్గాన్.. 17 పరుగులు చేసి ఔటయ్యాడు. చివర్లలో రాహుల్ (17), కరణ్ శర్మ (11) తెలివిగా పరుగులు రాబట్టారు. పంజాబ్ బౌలర్లలో హెండ్రిక్స్ రెండు, మాక్స్వెల్, గుర్కీరత్ లకు చెరో వికెట్ దక్కింది. -
పంజాబ్ తడబాటు..
హైదరాబాద్: ఐపీఎల్- 8లో భాగంగా ఉప్పల్ స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్లో 186 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన పంజాబ్ పది ఓవర్లు ముగిసే సరికి నాలుగు వికెట్లు కోల్పోయి 70 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఓపెనర్లు మురళి విజయ్ (24), సాహా (20) కొద్దిసేపు మెరిసి ఔటయ్యారు. భారీ అంచనాలతో బరిలోకి దిగిన మ్యాక్స్ వెల్.. కేవలం 11 పరుగులకే పెవిలియన్ దారిపట్టాడు. సాహా ఐదు పరుగులుచేసి అవుటయ్యాడు. హైదరాబాద్ బౌలర్లలో బిపుల్ శర్మ రెండు, హెన్రిక్స్, బౌల్ట్ చెరో విట్ తీశారు. -
పంజాబ్ టార్గెట్ 186
హైదరాబాద్: ఐపీఎల్- 8లో భాగంగా ఉప్పల్ స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 185 పరుగుల భారీ స్కోరు సాధించింది. 52 బంతుల్లో 81 పరుగులు చేసిన హైదరాబాద్ కెప్టెన్ వార్నర్.. టోర్నీలో అత్యధిక పరుగులు (504) సాధించి ఆరెంజ్ క్యాప్ ను సొంతం చేసుకున్నాడు. శిఖర్ దావన్ (24), హెన్రిక్స్ (28) పరుగులతో రాణించారు. ఏడు బంతులు ఎదుర్కొన్న మోర్గాన్.. 17 పరుగులు చేసి ఔటయ్యాడు. చివర్లలో రాహుల్ (17), కరణ్ శర్మ (11) తెలివిగా పరుగులు రాబట్టారు. పంజాబ్ బౌలర్లలో హెండ్రిక్స్ రెండు, మాక్స్వెల్, గుర్కీరత్ లకు చెరో వికెట్ దక్కింది. -
రయ్ రయ్ రైజర్స్..
హైదరాబాద్: ఐపీఎల్- 8లో భాగంగా కింగ్స్ ఎలెవన్ పంజాబ్తో జరుగుతున్న మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ విజృంభిస్తోంది. ఓపెనర్లు వార్నర్, ధావన్ వీరబాదుడుతో పది ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 86 పరుగులు చేసింది. 18 బంతుల్లో నాలుగు ఫోర్ల సాయంతో 24 పరుగులు చేసిన ధావన్.. ఇన్నింగ్స్ ఏడో ఓవర్లో మ్యాక్స్వెల్ బౌలింగ్లో అవుటయ్యాడు. 28 బంతుల్లో రెండు సిక్సర్లు, నాలుగు ఫోర్లతో కెప్టెన్ వార్నర్ 39 పరుగులుచేశాడు. హెన్రిక్స్ (19) కూడా ధాటిగా ఆడే ప్రయత్నం చేస్తున్నాడు. -
బ్యాటింగ్ కు దిగిన హైదరాబాద్
హైదరాబాద్: ఐపీఎల్-8లో భాగంగా సోమవారం రాత్రి కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తో జరుగుతున్న లీగ్ మ్యాచ్ లో టాస్ గెలిచిన సన్ రైజర్స్ హైదరాబాద్ ముందుగా బ్యాటింగ్ కు దిగింది. డేవిడ్ వార్నర్, శిఖర్ ధావన్ ఇన్నింగ్స్ ఆరంభించారు. సందీప్ శర్మ తొలి బంతి విసిరాడు. మూడు మార్పులతో హైదరాబాద్ బరిలోకి దిగింది. బిపుల్ శర్మ, కేఎల్ రాహుల్, ట్రెంట్ బౌల్ట్ జట్టులోకి వచ్చారు. గత మ్యాచ్ ఆడిన ఆటగాళ్లతోనే పంజాబ్ ఆడుతోంది. -
'షారూఖ్ ఖాన్ ను రానీయం'
ముంబై: బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ వరుసగా మూడో ఏడాది వాంఖడే స్టేడియంలో మ్యాచ్ చూసే అవకాశాన్ని కోల్పోయాడు. 2012లో వాంఖడే స్టేడియంలో రభస చేయడంతో అతడిపై ఐదేళ్ల నిషేధం విధించారు. దీంతో ఈనెల 14న కోల్ కతా నైట్ రైడర్స్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య జరగనున్న కీలక మ్యాచ్ ను ప్రత్యక్షంగా చూసే అవకాశం లేకుండా పోయింది. షారూఖ్ ఖాన్ పై నిషేధం కొనసాగుతున్నందున, వాంఖడే స్టేడియంలోకి అతన్ని అనుమతించబోమని ముంబై క్రికెట్ అసోసియేషన్ అధికారి ఒకరు తెలిపారు. అయితే గతేడాది వాంఖడేలో ఫైనల్ మ్యాచ్ చూసేందుకు షారూఖ్ అనుమతినిచ్చింది. తర్వాత ఫైనల్ మ్యాచ్ వేదికను బెంగళూరుకు మార్చడంతో కింగ్ ఖాన్ ఇక్కడ మ్యాచ్ ను చూడలేకపోయాడు. వాంఖడేకు కూతవేటు దూరంలో ఉన్న బ్రాబోర్న్ స్టేడియం ఈనెల 16న కోల్ కతా, రాజస్థాన్ జట్ల మధ్య జరగనున్న మ్యాచ్ ను చూసేందుకు షారూఖ్ కు వీలుంది. -
హైదరాబాద్ బ్యాటింగ్
హైదరాబాద్ : ఐపీఎల్- 8 లో భాగంగా సోమవారం ఉప్పల్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో కింగ్ర్ ఎలెవన్ పంజాబ్తో జరుగుతున్న మ్యాచ్లో హోం టీమ్ సన్రైజర్స్ హైదరాబాద్ విజృంభిస్తోంది. ఓపెనర్లు వార్నర్, ధావన్ వీరబాదుడుతో పది ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 80 పరుగులు చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. టోర్నీలో ఏడో విజయం సాధించి ప్లే ఆఫ్ కు అర్హత సాధించాలని హైదరాబాద్ జట్టు ఉవ్విళ్లూరుతోంది. ఆటగాళ్ల ప్రదర్శనను పరిశీలిస్తే కెప్టెన్ డేవిడ్ వార్నర్ బ్యాట్ ఝుళిపించడం అన్ని మ్యాచ్ ల్లోనూ కీలకంగా మారింది. ఇయాన్ మోర్గాన్ ఫాంలోకి రావడం శుభపరిణామం. గత రెండు మ్యాచ్ ల్లో హైదరాబాద్ జట్టు ప్రత్యర్థి ముందు స్వల్పలక్ష్యమే ఉంచినప్పటికీ భువనేశ్వర్, ఇషాంత్, ప్రవీణ్ల పేస్కు తోడు హెన్రిక్స్, బొపారా మీడియం పేస్ సహకారంతో విజయతీరాలకు చేరింది. పసలేని పంజాబ్... కేవలం 2 విజయాలు... ఆడిన 11 మ్యాచ్లలో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ దుస్థితి ఇది. గతేడాది ప్రత్యర్థి జట్లకు వణుకు పుట్టించి ఫైనల్ చేరిన బెయిలీ సేన ఈసారి బేలగా మారిపోయింది. మొహాలీలో జరిగిన మ్యాచ్లో సన్కు తలవంచిన ఆ జట్టు పరిస్థితిలో ఈ రెండు వారాల్లో పెద్దగా మార్పేమీ రాలేదు. విజయ్, వోహ్రా, సాహా, మిల్లర్, బెయిలీల బ్యాటింగ్ బలం అంతంత మాత్రంగానే కనిపిస్తోంది. వరుసగా విఫలమైన మ్యాక్స్వెల్ ఫామ్లోకి రావడం మాత్రం వారికి కాస్త ఊరటనిచ్చింది. మొత్తంగా బలాబలాలు చూస్తే పరిస్థితి అంతా సన్రైజర్స్కు అనుకూలంగానే కనిపిస్తోంది. పంజాబ్ గెలిస్తే అది సంచలనమే కావచ్చు. -
యువీని తక్కువ ధరకు కొనాలనుకున్నాం కానీ..
న్యూఢిల్లీ: ఐపీఎల్ వేలంలో ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ 16 కోట్ల రూపాయల ధర పలకడానికి ఐపీఎల్ మార్కెటే కారణమని ఢిల్లీ డేర్ డెవిల్స్ సీఈఓ హేమంత్ దువా చెప్పారు. తాజా సీజన్లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్న యువీకి హేమంత్ మద్దతుగా నిలిచారు. 'యువీని వీలైనంత వరకు తక్కువ ధరకు కొనుగోలు చేయాలనుకున్నాం, 16 కోట్ల రూపాయలు ఇవ్వాలనుకోలేదు. వేలంలో యువీ ధర అమాంతం పెరిగిపోయింది. అతని కోసం ఫ్రాంచైజీలు పోటీపడి ధరను పెంచాయి. యువీ భారీ ధర పలకడానికి మార్కెటే కారణం' అని హేమంత్ చెప్పారు. యువీకి జట్టు అండగా ఉంటుందని, అతను మళ్లీ ఫామ్ అందుకుంటాడని విశ్వాసం వ్యక్తం చేశారు. క్రికెటర్లు కూడా మానవమాత్రులేనని, ఈ విషయం అర్థం చేసుకోవాలని అన్నారు. ఐపీఎల్-8లో ఢిల్లీకి ఆడుతున్న యువీ ఇప్పటి వరకు 12 మ్యాచ్ల్లో 18.63 సగటుతో 205 పరుగులు చేశాడు. ఢిల్లీ వరుస పరాజయాలతో ప్లే ఆఫ్ రేసు నుంచి దాదాపుగా వైదొలిగినట్టే. కాగా 16 కోట్ల మొత్తం పూర్తిగా చెల్లించాలని అడగనని యువీ చెప్పాడు. -
నంబర్ వన్ స్థానంలోనే ప్లే ఆఫ్ కు..
చెన్నై: ఐపీఎల్-8లో నంబర్ వన్ స్థానంలోనే ప్లే ఆఫ్ కు వెళ్లాలనుకుంటున్నట్లు చెన్నై సూపర్ కింగ్స్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ స్పష్టం చేశాడు. ఆదివారం రాజస్థాన్ రాయల్స్ పై మ్యాచ్ గెలిచిన అనంతరం ఫ్లెమింగ్ మాట్లాడుతూ..లీగ్ దశలో నంబర్ వన్ టీమ్ గానే ముగింపు పలకాలని కోరుకుంటున్నామన్నాడు. తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్టుల ప్రత్యేక అవకాశాలపై గురించి పెద్దగా ఆసక్తి లేకపోయినా.. సాధ్యమైనన్ని ఎక్కువ మ్యాచ్ లు గెలవడమే తమ ప్రధాన లక్ష్యమన్నాడు. రాజస్థాన్ తో జరిగిన మ్యాచ్ ను కైవశం చేసుకున్న చెన్నై.. పాయింట్ల పట్టికలో కోల్ కతాను వెనక్కు నెట్టి మళ్లీ టాప్ ప్లేస్ ను దక్కించుకున్న సంగతి తెలిసిందే. -
చెన్నై మళ్లీ టాప్
-
టార్గెట్ ‘ప్లే ఆఫ్’
సొంతగడ్డపై సన్రైజర్స్ సిద్ధం ►నేడు పంజాబ్తో మ్యాచ్ ►ఫామ్లో హైదరాబాద్ జట్టు ఐపీఎల్లో తొలి తొమ్మిది మ్యాచ్ల పాటు పడుతూ, లేస్తూ ముందుకు సాగిన సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు ఇప్పుడు కాస్త కుదురుకుంది. మొదటిసారి వరుసగా రెండు మ్యాచ్లు గెలవడంతో జట్టులో ఆత్మవిశ్వాసం పెరిగింది. ఇక లీగ్లో మిగిలిన మూడు మ్యాచ్లు కూడా సొంతగడ్డపైనే సన్ ఆడనుంది. రెండు మ్యాచ్లు గెలిస్తే ప్లే ఆఫ్ ఖాయం కాగల స్థితిలో ఇప్పుడు తొలి పోరుకు సిద్ధమైంది. మరోవైపు వరుస ఓటములతో కుంగిపోయిన బలహీన ప్రత్యర్థి ఏ మాత్రం పోటీనివ్వగలదో చూడాలి. సాక్షి, హైదరాబాద్ : ఏడాది క్రితం ఉప్పల్ స్టేడియం సన్రైజర్స్, పంజాబ్ జట్ల మధ్య మ్యాచ్. సన్ 205 పరుగుల భారీ స్కోరు సాధించింది. అయితే అప్పుడు భీకర ఫామ్లో ఉన్న పంజాబ్ మరో ఎనిమిది బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని అలవోకగా ఛేదించింది. అయితే ఇప్పుడు సీన్ మారింది. వరుస పరాజయాలతో కింగ్స్ ఎలెవన్ కుదేలు కాగా... హైదరాబాద్ ఒక్కసారిగా ఫామ్లోకి వచ్చింది. ఇదే జోరులో పంజాబ్ను చిత్తు చేయాలని పట్టుదలగా ఉన్న రైజర్స్ ఏడో విజయంపై దృష్టి పెట్టింది. నేడు (సోమవారం) ఉప్పల్ స్టేడియంలో జరిగే మ్యాచ్లో పంజాబ్తో హైదరాబాద్ తలపడనుంది. ఇరు జట్లు కూడా శనివారం మ్యాచ్లు ఆడినందున ఆదివారం ఆటగాళ్లు ప్రాక్టీస్ చేయకుండా విశ్రాంతి తీసుకున్నారు. అంతా ఫామ్లో... టోర్నీలో హైదరాబాద్ ఓడినప్పుడు బౌలింగ్లో స్టెయిన్, బౌల్ట్ల గురించి తీవ్ర చర్చ జరిగింది. కానీ వీరిద్దరు లేకుండానే సన్ రెండు మ్యాచ్లు గెలిచిన సమయంలో ఈ ఇద్దరు పేసర్లను అంతా మర్చిపోయారు. వీరు లేకుండా సన్ బౌలింగ్ పటిష్టంగా కనిపిస్తోంది. ఫలితంగా రెండు మ్యాచ్లలోనూ జట్టు లక్ష్యం కాపాడుకోగలిగింది. భువనేశ్వర్, ఇషాంత్, ప్రవీణ్ల పేస్కు తోడు హెన్రిక్స్, బొపారా మీడియం పేస్ ఫలితాన్నిచ్చింది. ఆల్రౌండర్లు కరణ్ శర్మ, రసూల్ గత మ్యాచ్లో తమ బాధ్యతను సమర్థంగా నిర్వర్తించారు. బ్యాటింగ్లో జట్టు ప్రధానంగా వార్నర్, ధావన్లపైనే ఆధారపడుతూ వచ్చింది. అయితే మోర్గాన్, హెన్రిక్స్లు ఆడిన ఇన్నింగ్స్లు బ్యాటింగ్పై ఉన్న భయాన్ని దూరం చేశాయి. కెప్టెన్గా కూడా వార్నర్ విజయవంతం అయ్యాడనే చెప్పవచ్చు. వీరంతా మరోసారి సమష్టిగా చెలరేగితే హైదరాబాద్ విజయం ఖాయం. తుది జట్టులో మార్పులు ఉండకపోవచ్చు కాబట్టి ఈ సారి హోం మ్యాచ్లో స్థానిక కుర్రాళ్లు విహారి, ఆశిష్ రెడ్డిలకు చోటు లభించే అవకాశం దాదాపుగా లేనట్లే. పసలేని పంజాబ్... కేవలం 2 విజయాలు... ఆడిన 11 మ్యాచ్లలో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ దుస్థితి ఇది. గతేడాది ప్రత్యర్థి జట్లకు వణుకు పుట్టించి ఫైనల్ చేరిన బెయిలీ సేన ఈసారి బేలగా మారిపోయింది. మొహాలీలో జరిగిన మ్యాచ్లో సన్కు తలవంచిన ఆ జట్టు పరిస్థితిలో ఈ రెండు వారాల్లో పెద్దగా మార్పేమీ రాలేదు. ఒకరితో మరొకరు పోటీ పడుతూ విఫలమయ్యారు. ఎన్ని ప్రయత్నాలు చేసిన ఆ జట్టుకు విజయం దక్కడం లేదు. ఫలితంగా టీమ్లో ఒక్కసారిగా నిరుత్సాహం ఆవరించింది. కోల్కతాతో గత మ్యాచ్లో ఎలాగోలా 183 పరుగులు చేయగలిగినా దానిని కాపాడుకోవడం పంజాబ్ వల్ల కాలేదు. అన్ని మ్యాచ్లలో కలిపి ఆ జట్టు బ్యాట్స్మెన్ కేవలం 4 అర్ధ సెంచరీలే నమోదు చేయడం పరిస్థితిని సూచిస్తోంది. తుది జట్టులో మార్పులు చేసినా, బ్యాటింగ్ ఆర్డర్ మార్చినా ఫలితంలో తేడా రావడం లేదు. బౌలింగ్లో మాత్రం అనురీత్ సింగ్, సందీప్ శర్మ, అక్షర్ పటేల్ ఆకట్టుకున్నారు. మరో వైపు విజయ్, వోహ్రా, సాహా, మిల్లర్, బెయిలీల బ్యాటింగ్ బలం అంతంత మాత్రంగానే కనిపిస్తోంది. వరుసగా విఫలమైన మ్యాక్స్వెల్ ఫామ్లోకి రావడం మాత్రం వారికి కాస్త ఊరటనిచ్చింది. మొత్తంగా బలాబలాలు చూస్తే పరిస్థితి అంతా సన్రైజర్స్కు అనుకూలంగానే కనిపిస్తోంది. పంజాబ్ గెలిస్తే అది సంచలనమే కావచ్చు. -
ప్లే ఆఫ్కు చెన్నై సూపర్ కింగ్స్
► రాజస్తాన్ రాయల్స్పై గెలుపు ► రాణించిన మెకల్లమ్, జడేజా, మోహిత్ ► బ్రేవో ఆల్రౌండ్ ప్రదర్శన చెన్నై : సొంతగడ్డపై తిరుగులేదని మరోసారి నిరూపించుకున్న చెన్నై సూపర్కింగ్స్ ఐపీఎల్లో ప్లే ఆఫ్ దశకు అర్హత సాధించింది. బ్యాటింగ్లో మెకల్లమ్ (61 బంతుల్లో 81; 7 ఫోర్లు, 4 సిక్సర్లు), బౌలింగ్లో రవీంద్ర జడేజా (4/11), మోహిత్ శర్మ (3/25)... బ్రేవో ఆల్రౌండ్ ప్రదర్శనతో దుమ్మురేపడంతో... ఆదివారం జరిగిన లీగ్ మ్యాచ్లో ధోనిసేన 12 పరుగుల తేడాతో రాజస్తాన్ రాయల్స్పై విజయం సాధించింది. చెపాక్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్లో చెన్నై 20 ఓవర్లలో 5 వికెట్లకు 157 పరుగులు చేసింది. మెకల్లమ్ యాంకర్ పాత్రకు తోడు డు ప్లెసిస్ (25 బంతుల్లో 29; 3 ఫోర్లు) రాణించాడు. బ్రేవో (8 బంతుల్లో 15 నాటౌట్; 2 ఫోర్లు), ధోని (7 బంతుల్లో 13 నాటౌట్; 1 ఫోర్, 1 సిక్స్) మోస్తరుగా ఆడారు. 15 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన చెన్నైని మెకల్లమ్, డు ప్లెసిస్లు మూడో వికెట్కు 12.4 ఓవర్లలో 101 పరుగులు జోడించి ఆదుకున్నారు. చివర్లో ధోని, బ్రేవో ఆరో వికెట్కు 15 బంతుల్లో అజేయంగా 28 పరుగులు జోడించడంతో సూపర్కింగ్స్ గౌరవప్రద స్కోరు చేసింది. మోరిస్ 3 వికెట్లు తీశాడు. తర్వాత రాజస్తాన్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 145 పరుగులకే మాత్రమే పరిమితమైంది. వాట్సన్ (30 బంతుల్లో 28; 2 ఫోర్లు) టాప్ స్కోరర్. రహానే (17 బంతుల్లో 23; 4 ఫోర్లు) ఫర్వాలేదనిపించాడు. ఈ ఇద్దరు తొలి వికెట్కు 37 పరుగులు జోడించారు. అయితే చెన్నై స్పిన్నర్లను ఎదుర్కొలేక వరుస విరామాల్లో వికెట్లు కోల్పోవడంతో రాజస్తాన్ కోలుకోలేకపోయింది. చివర్లో శామ్సన్ (17 బంతుల్లో 26; 1 ఫోర్, 2 సిక్సర్లు), ఫాల్క్నర్ (13 బంతుల్లో 16; 2 ఫోర్లు)లు ఆరో వికెట్కు 33 పరుగులు జోడించి విజయంపై ఆశలు రేపారు. అయితే గెలవాలంటే చివరి 12 బంతుల్లో 33 పరుగులు చేయాల్సిన దశలో రాజస్తాన్ 20 పరుగులు మాత్రమే చేయగలిగింది. స్కోరు వివరాలు చెన్నై సూపర్ కింగ్స్ ఇన్నింగ్స్ : స్మిత్ (సి) ఫాల్క్నర్ (బి) అంకిత్ 6; మెకల్లమ్ (సి) అంకిత్ (బి) మోరిస్ 81; రైనా (సి) ఫాల్క్నర్ (బి) మోరిస్ 3; డు ప్లెసిస్ రనౌట్ 29; నేగి (సి) స్మిత్ (బి) మోరిస్ 2; ధోని నాటౌట్ 13; బ్రేవో నాటౌట్ 15; ఎక్స్ట్రాలు 8; మొత్తం: (20 ఓవర్లలో 5 వికెట్లకు) 157. వికెట్ల పతనం : 1-12; 2-15; 3-116; 4-129; 5-129. బౌలింగ్ : మోరిస్ 4-0-19-3; వాట్సన్ 2-0-19-0; అంకిత్ 4-0-31-1; తాంబే 3-0-24-0; ఫాల్క్నర్ 4-0-40-0; భాటియా 3-0-23-0. రాజస్తాన్ రాయల్స్ ఇన్నింగ్స్ : రహానే (సి) బ్రేవో (బి) మోహిత్ 23; వాట్సన్ (సి) బ్రేవో (బి) జడేజా 28; స్మిత్ (బి) జడేజా 4; కరణ్ నాయర్ (సి) అశ్విన్ (బి) జడేజా 10; హుడా (సి) రైనా (బి) జడేజా 15; శామ్సన్ (సి) స్మిత్ (బి) బ్రేవో 26; ఫాల్క్నర్ (సి) బ్రేవో (బి) మోహిత్ 16; మోరిస్ నాటౌట్ 16; భాటియా (సి) డు ప్లెసిస్ (బి) మోహిత్ 0; అంకిత్ (సి) నెహ్రా (బి) బ్రేవో 0; తాంబే నాటౌట్ 1; ఎక్స్ట్రాలు 6; మొత్తం: (20 ఓవర్లలో 9 వికెట్లకు) 145. వికెట్ల పతనం : 1-37; 2-48; 3-63; 4-75; 5-90; 6-123; 7-130; 8-130; 9-143 బౌలింగ్ : నెహ్రా 4-0-29-0; మోహిత్ 4-0-25-3; నేగి 4-0-35-0; జడేజా 4-0-11-4; బ్రేవో 4-0-43-2. -
‘ఏబీ’ బాదుడు...
► 59 బంతుల్లోనే 133 పరుగులు చేసిన డివిలియర్స్ ► బెంగళూరు చేతిలో ముంబై చిత్తు ► రాణించిన కోహ్లి బెంగళూరు పంజాకు ఈసారి ముంబై ఇండియన్స్ బలయ్యింది. గత మ్యాచ్లో గేల్ దుమారంలో పంజాబ్ గల్లంతైతే... ఈసారి ఏబీ డివిలియర్స్ బాదుడుకు ముంబై హడలెత్తిపోయింది. ప్రతీ బంతిని కసికసిగా బాదిన అతను రోహిత్ బృందానికి చుక్కలు చూపించాడు. డివిలియర్స్ ఇన్నింగ్స్లో భారీ సిక్స్లు లేకపోయినా... దానికి ఏమాత్రం తీసిపోని రీతిలో చూడముచ్చటైన 19 ఫోర్లతో అదరగొట్టాడు. మొత్తంగా సిక్స్లు, ఫోర్లతోనే సరిగ్గా వంద పరుగులు సాధించిన ఈ దక్షిణాఫ్రికా బ్యాట్స్మన్ విధ్వంసం ఏ స్థాయిలో సాగిందో ఊహించుకోవచ్చు.ఓవరాల్గా అతను ఈ సీజన్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు (133 నాటౌట్) సాధించగా.. అటు కోహ్లి కూడా తన సహజ శైలిలో ధాటిగా ఆడి జట్టు స్కోరును భారీగా పెంచాడు. సిమ్మన్స్, పొలార్డ్ రూపంలో కొద్దిగా పోరాడినా ముంబై ఇండియన్స్కు ఓటమి తప్పలేదు. ముంబై : ముంబై ఇండియన్స్ వరుస ఐదు విజయాలకు సొంతగడ్డపైనే బ్రేక్ పడింది. వాంఖడే మైదానంలో ఆదివారం జరిగిన ఈ మ్యాచ్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు 39 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్ను చిత్తు చేసింది. ఏబీ డివిలియర్స్ (59 బంతుల్లో 133 నాటౌట్; 19 ఫోర్లు; 4 సిక్సర్లు) భీకరమైన ఆటతీరుతో విరుచుకుపడగా... కెప్టెన్ విరాట్ కోహ్లి (50 బంతుల్లో 82 నాటౌట్; 6 ఫోర్లు; 4 సిక్సర్లు) మెరిపించాడు. వీరిద్దరూ రెండో వికెట్కు అజేయంగా 215 పరుగుల టి20ల్లో రికార్డు భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో వికెట్ నష్టానికి 235 పరుగుల భారీ స్కోరు సాధించింది. గేల్ రూపంలో ఈ జట్టు కోల్పోయిన ఏకైక వికెట్ను మలింగ తీశాడు. అనంతరం కష్టసాధ్యమైన లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ముంబై ఇండియన్స్ తడబడింది. 20 ఓవర్లలో ఆ జట్టు ఏడు వికెట్లు కోల్పోయి 196 పరుగులు మాత్రమే చేయగలిగింది. లెండిల్ సిమ్మన్స్ (53 బంతుల్లో 68 నాటౌట్; 5 ఫోర్లు; 3 సిక్సర్లు) ఒంటరి పోరాటం చేశాడు. మధ్యలో కీరన్ పొలార్డ్ (24 బంతుల్లో 49; 6 ఫోర్లు; 2 సిక్సర్లు) తుఫాన్ ఇన్నింగ్స్తో అలరించాడు. మిగతా వారంతా విఫలమయ్యారు. హర్షల్ పటేల్, చాహల్లకు రెండేసి వికెట్లు పడ్డాయి. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్గా డివిలియర్స్ నిలిచాడు. ఇక ముంబై ప్లే ఆఫ్కు వెళ్లాలంటే మిగిలిన రెండు మ్యాచ్లను కచ్చితంగా గెలవాలి. మరోవైపు బెంగళూరు మిగిలిన తమ మూడు మ్యాచ్ల్లో రెండు గెలిస్తే నేరుగా ప్లే ఆఫ్కు చేరే అవకాశం ఉంది. బాదుడే బాదుడు : తొలి ఓవర్లో సిక్స్ కొట్టిన క్రిస్ గేల్ (12 బంతుల్లో 13;1 ఫోర్; 1 సిక్స్) ఎక్కువ సేపు క్రీజులో నిలదొక్కుకోలేకపోయాడు. నాలుగో ఓవర్లో ఆఫ్ సైడ్ ఆడిన బంతిని లెండిల్ సిమ్మన్స్ అద్భుత రీతిలో ఎడమవైపు గాల్లోకి ఎగిరి అందుకోవడంతో తన ఇన్నింగ్స్ ముగిసింది. అంతకుముందు ఓవర్లో గేల్, కోహ్లి క్యాచ్లను ఫీల్డర్లు విఫలం చేశారు. ఇక డివిలియర్స్ రాకతో అసలైన ఆట ప్రారంభమైంది. మలింగ బౌలింగ్లో వరుసగా ఐదు బంతుల పాటు పరుగు తీయలేకపో యినా సుజిత్ బౌలింగ్లో వరుసగా రెండు ఫోర్లు బాది టచ్లోకి వచ్చిన ఏబీ ఇక రాకెట్ వేగంతో దూసుకెళ్లాడు. భజ్జీ బౌలింగ్లో ఫోర్, సిక్స్తో జోరు కనబరిచాడు. ఇదే వేగంతో 29 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేశాడు. హార్దిక్ పాండ్య వేసిన 15వ ఓవర్లో డివిలియర్స్ వరుసగా మూడు ఫోర్లు కొట్టాడు. అటు కోహ్లి కూడా వేగంగా ఆడుతూ 39 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేశాడు. 17వ ఓవర్ నుంచి ఇరువురు ఆటగాళ్లు పూనకం వచ్చినట్టుగా చెలరేగారు. బుమ్రా వేసిన ఆ ఓవర్లో డివిలియర్స్ వరుసగా రెండు సూపర్ సిక్స్లతో ఈ సీజన్లో తొలి సెంచరీ (47 బంతుల్లో)ని అందుకున్నాడు. కోహ్లి కూడా ఫోర్, సిక్స్ కొట్టడంతో 25 పరుగులు వచ్చాయి. 18వ ఓవర్లో 4,6,4తో డివిలియర్స్ చెలరేగాడు. చివరి ఓవర్లో కోహ్లి వరుసగా 4,4,6తో దూసుకెళ్లడంతో 17 పరుగులు వచ్చాయి. ఓవరాల్గా ముంబై బౌలర్లను చీల్చి చెండాడిన ఈ జోడి చివరి 10 ఓవర్లలో 147 పరుగులు సాధించగా ఇందులో 72 పరుగులు ఆఖరి నాలుగు ఓవర్లలోనే వచ్చాయి. సిమ్మన్స్ ఒంటరి పోరాటం ఆరంభంలో నిదానంగా సాగిన ముం బై ఇన్నింగ్స్కు నాలుగో ఓవర్లో ఝలక్ తగిలింది. ఫామ్లో ఉన్న పార్థీవ్ (11 బంతుల్లో 19;3 ఫోర్లు) రనౌట్గా వెనుదిరిగాడు. ఆ తర్వాత రోహిత్ (13 బంతుల్లో 15; 1 ఫోర్; 1 సిక్స్) కూడా తక్కువ స్కోరుకే అవుటయ్యాడు. ఈ దశలో సిమ్మన్స్తో కలిసి పొలార్డ్ స్కోరును పరిగెత్తించాడు. భారీ షాట్లతో బెంగళూరు బౌలర్లను బేజారెత్తించాడు. దీంతో 12 ఓవర్లలోనే స్కోరు వంద పరుగులు దాటింది. అయితే ప్రమాదకరంగా మారిన తనను శ్రీనాథ్ అరవింద్ వెనక్కి పంపాడు. మూడో వికెట్కు 6.1 ఓవర్లలోనే వీరి మధ్య 70 పరుగులు వచ్చాయి. ఆ తర్వాత సిమ్మన్స్ అడపాదడపా బౌండరీలు బాదినా ఫలితం లేకపోయింది. మరోవైపు వచ్చిన ప్రతీ బ్యాట్స్మన్ భారీ షాట్ల కోసం ప్రయత్నించి పెవిలియన్కు చేరడంతో పరాజయం ఖాయమైంది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్ : గేల్ (సి) సిమ్మన్స్ (బి) మలింగ 13; కోహ్లి నాటౌట్ 82; డివిలియర్స్ నాటౌట్ 133; ఎక్స్ట్రాలు 7; మొత్తం (20 ఓవర్లలో వికెట్ నష్టానికి) 235 ; వికెట్ల పతనం: 1-20. బౌలింగ్ : మెక్లెనగాన్ 4-0-40-0; మలింగ 4-1-27-1; బుమ్రా 4-0-52-0; సుచిత్ 3-0-35-0; హర్భజన్ 2-0-30-0; పాండ్య 3-0-51-0. ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్ : పార్థీవ్ (రనౌట్) 19; సిమ్మన్స్ నాటౌట్ 68; రోహిత్ (సి) మన్దీప్ (బి) పటేల్ 15; పొలార్డ్ (సి) స్టార్క్ (బి) శ్రీనాథ్ 49; పాండ్య (స్టంప్డ్) కార్తీక్ (బి) చాహల్ 8; రాయుడు (సి) డివిలియర్స్ (బి) పటేల్ 14; హర్భజన్ (సి) కోహ్లి (బి) స్టార్క్ 3; సుచిత్ (సి) కార్తీక్ (బి) చాహల్ 4; మెక్లెనగాన్ నాటౌట్ 12; ఎక్స్ట్రాలు 4; మొత్తం (20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి) 196. వికెట్ల పతనం : 1-29, 2-63, 3-133, 4-143, 5-174, 6-178, 7-184. బౌలింగ్ : స్టార్క్ 4-0-41-1; శ్రీనాథ్ 4-0-29-1; వీస్ 4-0-38-0; పటేల్ 4-0-36-2; చాహల్ 4-0-51-2.