Karthik
-
ఆర్మీ జవాన్ కార్తీక్ మృతికి వైయస్ జగన్ సంతాపం
-
జవాన్ కార్తీక్ మృతి పట్ల వైఎస్ జగన్ సంతాపం
సాక్షి, తాడేపల్లి: ఆర్మీ జవాన్ కార్తీక్ మృతిపై వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్(YS Jagan) సంతాపం తెలిపారు. కార్తీక్ చూపిన ధైర్యసాహసాలు, త్యాగానికి సెల్యూట్ అని ప్రశంసించారు. ఈ కష్ట సమయంలో కార్తీక్(Jawan Karthik) కుటుంబానికి అండగా నిలుద్దామని చెప్పారు.ఉత్తర జమ్మూలో సైన్యం, ఉగ్రవాదుల మధ్య జరిగిన కాల్పుల్లో కార్తీక్ మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కార్తీక్ మృతిపై వైఎస్ జగన్ సంతాపం వ్యక్తం చేశారు. కార్తీక్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు వైఎస్ జగన్. అలాగే, కార్తీక్ చూపిన ధైర్యసాహసాలు, త్యాగానికి సెల్యూట్ అంటూ ప్రశంసలు కురిపించారు. ఈ కష్ట సమయంలో కార్తీక్ కుటుంబానికి అందరం అండగా నిలుద్దాం అని వ్యాఖ్యానించారు. జమ్మూకాశ్మీర్లోని సొపోర్ జిల్లాలో ఉగ్రవాదులతో జరిగిన ఎదురు కాల్పుల్లో చిత్తూరు జిల్లా, ఎగువరాగిమాను పెంట గ్రామానికి చెందిన కార్తిక్ వీర మరణం పొందడం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, కార్తిక్ కుటుంబ సభ్యులకు దేవుడు ధైర్యం ప్రసాదించాలని… pic.twitter.com/9P1axvHTi9— YS Jagan Mohan Reddy (@ysjagan) January 21, 2025 -
కశ్మీర్లో ఎన్కౌంటర్ నేల కొరిగిన ఆంధ్రా జవాను
శ్రీనగర్/బంగారుపాళ్యం: జమ్మూకశ్మీర్లోని సొపోర్ జిల్లాలో ఉగ్రవాదులతో జరిగిన ఎదురుకాల్పుల్లో ఆంధ్రప్రదేశ్కు చెందిన ఒక జవాను ప్రాణాలు కోల్పోయారు. ఆదివారం జలూర గుజ్జర్పటి ప్రాంతంలో ఉగ్రవాదుల స్థావరాన్ని జవాన్లు చుట్టుముట్టారు. ఈ సందర్భంగా పంగల కార్తీక్(32) అనే జవాను బుల్లెట్ గాయాలతో తీవ్రంగా గాయపడ్డారు. వైద్యం కోసం తరలిస్తుండగానే ఆయన తుదిశ్వాస విడిచారని అధికారులు సోమవారం తెలిపారు. ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టిన బలగాలు ముష్కరుల కోసం కూంబింగ్ కొనసాగిస్తున్నాయన్నారు. కార్తీక్ వీరమరణంపై శ్రీనగర్ కేంద్రంగా పనిచేసే ఆర్మీ విభాగం చినార్ కార్ప్స్ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ‘విధి నిర్వహణలో ప్రాణాలను అర్పించిన కార్తీక్ యొక్క అత్యున్నత త్యాగానికి చినార్ కార్ప్స్ సెల్యూట్ చేస్తోంది చినార్ వారియర్స్ కార్తీక్ అపారమైన పరాక్రమానికి, త్యాగానికి వందనం చేస్తోంది. ఆయన కుటుంబానికి సానుభూతి తెలుపుతోంది. వారికి సంఘీభావంగా నిలుస్తుంది’అని ‘ఎక్స్’లో తెలిపింది. కాగా, కార్తీక్ది ఏపీలోని చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలం ఎగువరాగిమాను పెంట గ్రామం. వరద మందడి, సెల్వి దంపతుల రెండో కుమారుడైన కార్తీక్ పదేళ్ల క్రితం ఆర్మీలో చేరారు. ఈయన చనిపోయిన విషయం తెలియడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మంగళవారం రాత్రికల్లా మృతదేహం గ్రామానికి రావచ్చని చెబుతున్నారు. -
క్రికెట్ బెట్టింగ్ 140 కోట్లు!.. కూటమి ఎమ్మెల్యేల సహకారం?
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: క్రికెట్ బెట్టింగ్ ముఠా వ్యవహారంలో కూటమి నేతలదే కీలకపాత్ర అని తెలుస్తోంది. ప్రధాన నిందితులు లగుడు రవితో పాటు ప్రముఖ పాత్ర పోషిస్తున్న బొబ్బిలి రవి పరారీలో ఉన్నారు. వీరిద్దరూ జనసేన పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. క్రికెట్ బెట్టింగ్ వ్యవహారంలో విచారణ చేస్తున్న విశాఖ సిటీ పోలీసులు ఇప్పటి వరకు జరిగిన 80 బ్యాంకు అకౌంట్లను పరిశీలిస్తే కేవలం ఏడాది కాలంలోనే రూ.140 కోట్ల మేర లావాదేవీలు జరిగినట్టు గుర్తించారు. అయితే ఇంకా వందల్లో గుర్తించిన బ్యాంకు అకౌంట్లను పరిశీలించాల్సి ఉందని సమాచారం. వీటి లావాదేవీలను గమనిస్తే ఇంకా ఎన్ని వందల కోట్లకు చేరుతుందనేది ఊహకు కూడా అందడం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.క్రికెట్ బెట్టింగ్లో కీలకంగా ఉన్న లగుడు రవితో పాటు బొబ్బిలి రవి జనసేన పార్టీలో ప్రముఖ పాత్ర పోషిస్తున్నారు. ఇందులో బొబ్బిలి రవిని స్వయంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్తో పాటు నాగబాబు సమక్షంలో కండువా కప్పి పార్టీలో చేర్చుకున్నారు. వీరిని విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ చేర్చడం గమనార్హం. ఇప్పుడు ఈ ఫొటోలు వైరల్గా మారాయి. ఇక లగుడు రవి కూడా జనసేన పార్టీలో క్రియాశీలకంగా ఉన్నారు. ఇప్పటివరకు కేవలం లగుడు రవి ద్వారా వచ్చిన సమాచారంతో ఐదుగురిపై కేసులు నమోదు చేసిన సైబర్ క్రైం పోలీసులు.. తాజాగా మరో నలుగురిని అదుపులోకి తీసుకుని కోర్టులో ప్రవేశపెట్టారు. వీరి బ్యాంకు లావాదేవీలు పరిశీలిస్తే.. రూ.140 కోట్ల ఉండగా..ఇంకా మొత్తం అకౌంట్లు పరిశీలిస్తే ఇంకా ఎన్ని వందల కోట్లకు చేరుతుందోనని చర్చ సాగుతోంది.ఇంకా లెక్కతేలాల్సిందే..!వాస్తవానికి కొద్దిరోజుల క్రితం ఇసుకతోట, శివాజీపాలెం వద్ద జరుగుతున్న క్రికెట్ బెట్టింగ్ వ్యవహారంపై వచ్చిన సమాచారం మేరకు ఈ నెల ఆరో తేదీన టాస్క్ఫోర్స్ పోలీసులు జరిపిన దాడిలో లగుడు రవి కుమార్ను అదుపులో తీసుకున్నారు. అనంతరం జరిపిన విచారణలో ఇందులో మరో వ్యక్తి బొబ్బిలి రవి, త్రినాథ్, జిలానీ, కాకినాడకు చెందిన కార్తీక్ల పాత్ర కూడా తేలింది. ఇందులో ఇప్పటికీ బొబ్బిలి రవితో పాటు మిగిలిన వ్యక్తులు అందరూ పరారీలోనే ఉన్నారు. వీరి కుటుంబ సభ్యులు కూడా ఇళ్లు వదిలి వెళ్లిపోయినట్టు తెలుస్తోంది. ఇప్పటివరకు లగుడు రవిని విచారించిన తర్వాత 80 బ్యాంకు అకౌంట్లను పరిశీలించగా... ఏడాది కాలంలోనే ఈ అకౌంట్ల ద్వారా రూ. 140 కోట్ల మేర లావాదేవీలు జరిగినట్టు విశాఖ సిటీ పోలీసులు ప్రకటన విడుదల చేశారు. అయితే బొబ్బిలి రవిని, కాకినాడకు చెందిన కార్తీక్ను కూడా అదుపులోకి తీసుకుంటే ఇంకా ఎన్ని వందల సంఖ్యలో బ్యాంకు అకౌంట్లు ఉన్నాయో తెలిసే అవకాశం ఉంది. ఇదే జరిగితే మొత్తం క్రికెట్ బెట్టింగ్ ముఠా జరిపిన ఒక్క ఏడాది లావాదేవీలే మరిన్ని వందల కోట్లు ఉండే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.అదుపులోకి తీసుకోకుండా..!సుమారు 10 రోజుల క్రితం జరిగిన సంఘటనలో బొబ్బిలి రవి, త్రినాథ్లను అదుపులోనికి తీసుకోకుండా ఉండేందుకు కూటమి ఎమ్మెల్యేలు ప్రయత్నాలు చేసినట్టు విమర్శలున్నాయి. కూటమికి చెందిన ఎమ్మెల్యేతో పాటు పీఏలు కూడా అరెస్టు చేయవద్దంటూ సిఫారసులు చేశారనే ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలోనే బొబ్బిలి రవి పరారీలో ఉన్నారు. అంతేకాకుండా తన కుటుంబ సభ్యులను కూడా ఇంట్లో ఉండకుండా జాగ్రత్తపడినట్టు తెలుస్తోంది.మరోవైపు వీరికి ముందస్తు బెయిల్ కోసం కూడా కూటమి ఎమ్మెల్యేలు కొందరు ప్రయత్నిస్తున్నారనే విమర్శలున్నాయి. ఇప్పటికే ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేశారని.. దుకోసం ఒక ఎమ్మెల్యే పీఏ ఒక్కో వ్యక్తి నుంచి రూ.5 లక్షల నుంచి రూ. 10 లక్షల వరకూ వసూలు చేశారనే ప్రచారం ఆ పార్టీల్లోనే జరుగుతోంది. ఇదిలాఉండగా తెర వెనుక కూటమి ఎమ్మెల్యే చేస్తున్న వ్యవహారం నగర పోలీసు కమిషనర్ దృష్టికి వెళ్లడంతో వారి ఆటలు సాగడం లేదన్న ప్రచారం జరుగుతోంది. ఈ కేసులో ముందస్తు బెయిల్ సాధ్యం కాదని, వారిని కచ్చితంగా అదుపులో తీసుకుంటామని విశాఖ సిటీ పోలీసులు స్పష్టం చేస్తున్నారు.ఎవరీ కాకినాడ కార్తీక్!ఈ క్రికెట్ బెట్టింగ్ వ్యవహారంలో కీలకంగా ఉన్న కాకినాడ కార్తీక్ ఆచూకీ లభ్యం కాలేదు. కాకినాడకు వెళ్లి విచారించిన పోలీసులకు కార్తీక్ ఎవరనే విషయం మాత్రం బోధపడలేదని తెలుస్తోంది. కార్తీక్కు కాకినాడలో అనేక పేర్లతో వ్యవహారంలో ఉన్నాడని సమాచారం. ఒక్కొక్కరికి ఒక్కో పేరుతో కార్తీక్ పరిచయం కావడం గమనార్హం. అంతేకాకుండా పోలీసులు దర్యాప్తు కోసం వెళ్లే సమయానికే కుటుంబ సభ్యులతో కలిసి పరారయ్యారు. కార్తీక్కు విశాఖపట్నంతో పాటు హైదరాబాద్లో కూడా బెట్టింగ్ ముఠాతో సంబంధాలు ఉన్నట్టు తెలుస్తోంది. కార్తీక్ను కదిపితే బెట్టింగ్ మాఫియా వివరాలు మరిన్ని తెలిసే అవకాశం ఉంది. -
గేమ్ ఛేంజర్లో రామ్ చరణ్ 'నానా హైరానా'
రామ్ చరణ్- శంకర్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ సినిమా 'గేమ్ ఛేంజర్'. తాజాగా ఈ మూవీ నుంచి 'నానా హైరానా' అంటూ సాగే మెలొడీ సాంగ్ను మేకర్స్ విడుదల చేశారు. కార్తిక్, శ్రేయా ఘోషల్ ఆలపించిన ఈ పాటను రామజోగయ్య శాస్త్రి రచిస్తే.. సంగీత దర్శకుడు తమన్ అదిరిపోయే ట్యూన్స్ అందించారు. ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన రెండు మాస్ పాటలు ప్రేక్షకులను మెప్పిస్తే.. టీజర్కు భారీ రెస్పాన్స్ వచ్చింది.సంక్రాంతి కానుకగా జనవరి 10న విడుదల కానున్న 'గేమ్ ఛేంజర్' చిత్రంలో రామ్ చరణ్ ఎన్నికలను సజావుగా నిర్వహించే ఐఏఎస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. పొలిటికల్, యాక్షన్ నేపథ్యంలో సాగే పవర్ఫుల్ కథాంశంతో ఈ సినిమా రానుంది. ఇందులో కియారా అద్వానీ, అంజలి, శ్రీకాంత్, సునీల్, ఎస్.జె.సూర్య, సముద్రఖని, నవీన్చంద్ర తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్ సంయుక్తంగా దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. హర్షిత్ సహ నిర్మాత. ఈ మూవీకి తమిళ స్టార్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ కథను అందించారు. ఎస్.ఎస్.తమన్ సంగీతం అందిస్తుండగా సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ రాశారు.గేమ్ ఛేంజర్ సినిమా షూటింగ్ రెండు రోజుల క్రితం విజయవాడలో జరిగింది. ఎంజీ రోడ్డులోని పంచాయతీరాజ్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ కార్యాలయ ప్రాంగణంలో పోలింగ్ నిర్వహించిన సీన్స్ను చిత్రీకరించారు. అక్కడ ప్రజలు బారులు తీరి తమ ఓటు హక్కు వినియోగించుకునే సీన్స్తో పాటు పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసిన సన్నివేశాలను చిత్రీకరించారు.అయితే ఈ సన్నివేశాల్లో కేవలం జూనియర్ ఆర్టిస్ట్లు మాత్రమే పాల్గొన్నారు. -
ఎమ్మెల్యే కారు డ్రైవర్ నిర్బంధం
యశవంతపుర: చిత్రదుర్గకు చెందిన రేణుకాస్వామి హత్య కేసులో పోలీసులు కార్తీక్ పురోహిత్ అనే మరో నిందితున్ని అదుపులోకి తీసుకున్నారు. అతన్ని సోమవారం విచారించారు. గత శనివారం కూడా నాలుగైదు గంటల పాటు ప్రశ్నించినట్లు తెలిసింది. ఓ ఎమ్మెల్యే కారు డ్రైవర్గా పని చేస్తున్న కార్తీక్ పురోహిత్, రేణుకాస్వామి మృతదేహాన్ని పారేసిన తరువాత నిందితుడు ప్రదోశ్ను అక్కడ నుంచి తీసుకెళ్లినట్లు విచారణలో బయట పడింది. తన కారులోనే ప్రదోశ్ను గిరినగరకు తీసుకెళ్లాడు. ఆ రోజు ఏమి జరిగిందనేది కార్తీక్ నుంచి పోలీసులు వివరాలను సేకరించారు. పవిత్ర స్నేహితురాలు సమత విచారణ పవిత్రగౌడ ఆప్త స్నేహితురాలు సమతను ఈ కేసులో పోలీసులు విచారించారు. నిందితుడు ధనరాజ్కు ఆమె రూ. 3 వేలు పంపిన అధారాలను సేకరించారు. ఈ డబ్బులతో ధనరాజ్ ఎలక్ట్రిక్ షాక్ పరికరాన్ని కొన్నట్లు అనుమానిస్తున్నారు. బసవేశ్వరనగర ఠాణాలో సమతను ప్రశ్నించారు. మరోవైపు దర్శన్, పవిత్రతో పాటు 17 మంది నిందితులు జైళ్లలో కస్టడీలో ఉన్నారు. దర్శన్ బెయిలు కోసం ప్రయత్నాలు సాగిస్తున్నారు. -
నా పెళ్లి విషయం తెలిసి ఆ హీరో ఏడ్చాడు: ఖుష్బూ
ఒకప్పుడు హీరోయిన్గా తనదైన నటనతో ఆకట్టుకున్న ఖుష్భూ.. ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్గా,టీవీ యాంకర్గా బిజీ అయింది. అప్పట్లో ఖుష్భూకి తమిళ్లోనే కాదు టాలవుడ్లోనూ ఫుల్ ప్యాన్ ఫాలోయింగ్ ఉండేది. విక్టరీ వెంకటేశ్ హీరోగా నటించిన ‘కలియుగ పాండవులు’అనే చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. తొలి సినిమానే సూపర్ హిట్. ఆ తర్వాత తమిళ్లో వరుస సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్గా ఎదిగారు. తెలుగు, తమిళ్, మలయాళ, కన్నడ భాషల్లో దాదాపు 200పైగా సినిమాల్లో నటించారు. అప్పట్లో తమిళనాడులో అభిమానులు ఖుష్భూకి ఓ గుడినే కట్టించారంటే..ఆమె క్రేజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. అయితే సినిమాలతో బిజీగా ఉన్న సమయంలోనే 2000 సంవత్సరంలో డైరెక్టర్ సుందర్ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. సుందర్ దర్శకత్వం వహించిన తొలి సినిమా ‘ముఱై మామన్’లో ఖుష్బూ హీరోయిన్. ఆ సినిమా షూటింగ్ సమయంలోనే వీరిద్దరు ప్రేమలో పడ్డారు.ఈ దంపతులకు అవంతిక, అనంతిక అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఖుష్బూ తన పెళ్లిలో జరిగిన ఓ ఆసక్తికర సంఘటన గురించి చెప్పింది. ‘నేను, సుందర్ ప్రేమలో ఉన్న విషయం చాలా కాలం పాటు ఎవరికి చెప్పలేదు. మేమిద్దరం పెళ్లి చేసుకోబుతున్నామనే విషయం మొదటగా హీరో కార్తీక్కి సుందర్ చెప్పాడు. విషయం తెలిసిన వెంటనే కార్తీక్ నాకు ఫోన్ చేసి సంతోషంగా ఉందంటూ ఎమోషనల్ అయ్యారు. అలాగే మా పెళ్లికి కూడా వచ్చాడు. అప్పుడు మేమిద్దరం ఆయన కాళ్లపై నమస్కరించి ఆశిస్సులు తీసుకున్నాం. ఆ సమయంలో కార్తీక్ ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నాడు’ అని ఖుష్భూ చెప్పుకొచ్చింది. -
బ్రెజిల్ టు బెంగాల్ – ప్రేమకు దూరం తెలియదు
ఎక్కడి బ్రెజిల్? ఎక్కడి బెంగాల్? అయితే ప్రేమ బలంతో సుదూరప్రాంతాలు కూడా ఇరుగు పొరుగు గ్రామాలు అవుతాయి. వేలాది కిలోమీటర్లు ప్రయాణం చేసి బ్రెజిల్ అమ్మాయి పశ్చిమ బెంగాల్లోని తన ప్రియుడిని వెదుక్కుంటూ వచ్చింది. బెంగాల్లోని నాడియా జిల్లాకు చెందిన కార్తీక్కు నాలుగు సంవత్సరాల క్రితం సోషల్ మీడియాలో బ్రెజిల్కు చెందిన మాన్యులా డి సిల్వాతో పరిచయం అయింది. గూగుల్ సాక్షిగా ఆ పరిచయం ప్రేమగా మారడానికి ఎంతోకాలం పట్టలేదు. భాష సమస్య వల్ల కార్తీక్ తల్లిదండ్రులు మాన్యులాతో మాట్లాడడానికి గూగుల్ ట్రాల్సేలెట్ యాప్ను ఉపయోగించేవారు. ఈ యాప్లో బెంగాలీలో టైప్ చేసి మాన్యులా కోసం ఇంగ్లిష్లోకి కన్వర్ట్ చేసేవారు. పెళ్లికి ఇరు కుటుంబాల వారు అంగీకరించారు. కాబోయే అత్తారింటికి వచ్చిన డి సిల్వా ఇప్పుడిప్పుడే బెంగాలీ వంటకాల రుచులకు అలవాటు పడుతోంది. బెంగాలీ పదాలు నేర్చుకుంటోంది. బెంగాల్లో జరగబోయే కూతురు పెళ్లికి హాజరు కావడానికి బ్రెజిల్లోని మాన్యులా తల్లిదండ్రులు సన్నాహాలు చేసుకుంటున్నారు. -
కార్తీక్ తీడా రాసుకున్న రియల్ స్టోరీనే ‘తండేల్’
చందు మొండేటి దర్శకత్వంలో నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘తండేల్’. నాగ చైతన్య కెరీర్లోనే అత్యధిక బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే దాదాపు 70 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం చివరి షెడ్యూల్ శ్రీకాకుళంలో ప్లాన్ చేసింది. శ్రీకాకుళం ప్రాంతంలో జరిగిన రియల్ స్టోరీ కాబట్టి గత 2,3 రోజుల నుంచి రియల్ లొకేషన్స్ లో చిత్రీకరణ జరుగుతోంది. శ్రీకాకుళం ప్రాంతానికి చెందిన రచయిత కార్తీక్ తీడా ఎంతో రీసెర్చ్ ఈ రియల్ స్టోరీ రాశారట. ఫిషర్ మాన్స్ తో 2, 3 నెలలు స్వయంగా ఉండీ, వాళ్లతోనే తింటూ, వాళ్లలో ఒకడిగా ఉంటూ, వారితో ప్రయాణం చేస్తూ వారి జీవన శైలీని పూర్తిగా తెలుసుకొని స్టోరీ రాసినట్లు ఓ సందర్భంలో రచయిత కార్తీక్ తీడా చెప్పారు. సముద్రంలో వాళ్లకు ఎదురయ్యే సవాళ్లు, కస్టమ్స్ తో వాళ్లకున్న కష్టాలు, సవాళ్లు అన్ని పరిశీలించారట. అలా రాజు, బుజ్జిల కథను అత్యద్భుతంగా, సినిమాటిక్ విజన్ తో తీర్చిదిద్దారు. తర్వాత గీత ఆర్ట్స్ బ్యానర్ లో స్టోరీని వినిపించగా కథ నచ్చడంతో ఇప్పుడు రూపం దాల్చుకుంది. రచయిత కార్తీక్ తీడా ప్రముఖ క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణ వంశీ దగ్గర అసిస్టెంట్ గా పని చేశారు. ఈ తరుణంలోనే శ్రీకాకుళంలో జరిగిన యదార్ధ సంఘటనను సినిమాగా రాయాలి అనే సంకల్పంతో తండెల్ కథ మొదలుపెట్టి అత్యద్భుతంగా రాసుకొచ్చారు. ఈ చిత్రంలో రాజుగా నాగచైతన్య నటిస్తుండగా.. ఆయనకు జోడిగా బుజ్జి పాత్రలో సాయి పల్లవి కనిపించబోతుంది. -
కర్రలతో కొట్టి.. గాయాలపై కారం చల్లి
కొత్తగూడ: చోరీకి పాల్పడ్డాడనే అనుమానంతో ఓ దళిత యువకుడిని కర్రలతో చావకొట్టి.. రక్తం కారుతున్న గాయాలపై కారం చల్లి చిత్ర హింసలు పెట్టిన అమానవీయఘటనకు సంబంధించిన వీడియో శనివారం కలకలం రేపింది. బాధితుడి కథనం మేరకు.. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం జంగవానిగూడెం(రాంపూర్) గ్రామానికి చెందిన యువకుడు వంకాయల కార్తీక్ను అదే మండలం పొగుళ్లపల్లి గ్రామానికి చెందిన టెంట్హౌస్ యజమాని గద్ద అశోక్ పనికి పెట్టుకున్నాడు. ఈ క్రమంలో డీజే(సౌండ్ బాక్స్)లో ఉపయోగించే యాంప్లిఫైయర్ చోరీకి గురైందని, దాన్ని ఖానాపూర్లో విక్రయించారని యజమాని అశోక్ గుర్తించాడు. దీంతో అశోక్ కొందరు వ్యక్తులను తీసుకుని ఈ నెల 19వ తేదీన జంగవానిగూడెం వెళ్లి కార్తీక్తో పని ఉందని చెప్పి కారులో ఎక్కించుకుని పొగుళ్లపల్లి సమీప అటవీప్రాంతానికి తీసుకెళ్లి కర్రలతో చితకబాదారు. తప్పించుకుని పారిపోయే క్రమంలో మళ్లీ పట్టుకుని పొగుళ్లపల్లి గ్రామపంచాయతీ కార్యాలయం వద్దకు తీసుకువచ్చారు. ఒంటిపై షర్ట్ విప్పి కార్యాలయ కిటికీకి కట్టి కర్రలతో బాదారు. రక్తం కారుతుండగా గాయాలపై కారం చల్లుతూ చిత్రహింసలకు గురిచేశారు. ఈ ఘటనను మొత్తం వీడియో తీశారు. స్పృహ కోల్పోయిన కార్తీక్ను ఇంటి వద్ద వదిలేశారు. గాయాలతో మూలుగుతున్న యువకుడిని బంధువులు నర్సంపేట పట్టణంలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. కార్తీక్పై దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని ఈ నెల 20వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇరువర్గాలపై కేసులు టెంట్హౌస్ యజమాని ఫిర్యాదు మేరకు కార్తీక్పై చోరీ కేసు, కార్తీక్పై దాడి చేసిన ఘటనలో అశోక్తోపాటు మరికొంత మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కానీ విషయాన్ని గోప్యంగా ఉంచారు. సమాచారం తెలుసుకున్న దళిత సంఘాలు మహబూబాబాద్ డీఎస్పీకి ఫిర్యాదు చేయడంతో శుక్రవారం రాత్రి దాడి ఘటన వివరాలు బయటికి వచ్చాయి. -
హోలీ పండుగ మిగిల్చిన విషాదం!
ఆదిలాబాద్: పండుగ పూట ఆ కుటుంబంలో తీరని విషాదం నింపింది. హోలీ ఆడుకుని స్నేహితులతో కలిసి కాలువలో స్నానానికి వెళ్లి ఈత రాక ఇంటర్మీడియెట్ విద్యార్థి నీటమునిగి చనిపోయిన ఘటన దండేపల్లి మండలంలో చోటు చేసుకుంది. దండేపల్లి ఎస్సై స్వరూప్రాజ్ కథనం ప్రకారం.. జన్నారం మండలం ధర్మారం గ్రామానికి చెందిన గోపులపురం ప్రసాద్, అశ్విని దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. ప్రసాద్ ఉపాధి కోసం గల్ఫ్ దేశానికి వెళ్లాడు. ఇంటర్మీడియెట్ విద్యార్థి, పెద్ద కుమారుడు కార్తీక్(18) గత ఐదు రోజుల క్రితం తల్లి అశ్వినితో కలిసి దండేపల్లి మండలం పాత మామిడిపల్లిలోని అమ్మమ్మ ఇంటికి వచ్చారు. సోమవారం హోలీ సందర్భంగా స్నేహితులతో కలిసి ఆడుకున్నాడు. అనంతరం వారితో కలిసి తానిమడుగు వద్ద గూడెం ఎత్తిపోతల డెలివరీ పాయింట్ వద్ద కడెం ప్రధాన కాలువలో స్నానం చేసేందుకు వెళ్లాడు. దీంతో అతనికి ఈత రాకపోవడంతో నీటిలో మునిగిపోయాడు. గమనించిన స్నేహితులు వెంటనే అతన్ని బయటకు తీశారు. అపస్మారక స్థితిలో ఉన్న అతన్ని వెంటనే మేదరిపేటలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకువచ్చారు. పరీక్షించిన వైద్యులు మృతిచెందినట్లు నిర్ధారించారు. దీంతో శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం లక్సెట్టిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తల్లి ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెల్లడించారు. అమ్మమ్మ ఇంటికి వచ్చి.. ఇంటర్ పరీక్షలు ముగియడంతో, కాలేజీకి సెలవులు వచ్చాయి. కార్తీక్ తన తల్లి అశ్వినితో కలిసి ఐదు రోజుల క్రితం పాతమామిడిపల్లిలోని అమ్మమ్మ ఇంటికి వచ్చి సంతోషంగా స్నేహితులతో గడుపుతున్నాడు. ఇంతలో సోమవారం హోలీ పండుగ రావడంతో, స్నేహితులతో కలిసి హోలీ ఆడుకున్నాడు. స్నానం కోసం కాలువ వద్దకు వెల్లిన అతను స్నానం చేసేందుకు నీటిలో దిగాడు. ఈత రాక నీటిలో మునిగి చనిపోయాడు. కుటుంబీకులు కన్నీరు మున్నీరవుతున్నారు. కొడుకుపై పెట్టుకున్న ఆశలు అతని అకాల మృతితో ఆవిరయ్యాయి. ఆదిలాబాద్లో మరో విద్యార్థి.. పండుగ పూట స్నానానికి వెళ్లి వాగులో గల్లంతై విద్యార్థి మృతి చెందిన ఘటన జిల్లా కేంద్రంలో విషాదం నింపింది. ఆదిలాబాద్రూరల్ మండలం భీంసరి శివారులో గల వాగులో స్నానానికి వెళ్లి గుమ్ముల సాత్విక్ (14) అనే విద్యార్థి మృతి చెందాడు. ఎస్సై ముజాహిద్, స్థానికుల కథనం ప్రకారం.. ఆదిలాబాద్ పట్టణంలోని జై జవాన్నగర్ కాలనీకి చెందిన గుమ్ముల స్వర్ణలతకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. మృతుడి తల్లిదండ్రుల మధ్య మనస్పర్థలు రావడంతో వారికి కొన్నేళ్ల క్రితం విడాకులయ్యాయి. ఇద్దరి పిల్లలను తల్లి ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ పోషిస్తోంది. చిన్నారులిద్దరూ పట్టణంలోని తిర్పెల్లి ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు. సాత్విక్ సోమవారం హోలీ సంబరాలు చేసుకొని అనంతరం స్నానానికి మిత్రులతో కలిసి వాగుకు వెళ్లాడు. స్నేహితులంతా వాగు ఒడ్డున నిలబడి ఉండగా.. స్నానం చేస్తానని సాత్విక్ అందులోకి దూకాడు. ఈత రాకపోవడంతో గల్లంతయ్యాడు. ఈతగాళ్లు బయటకు తీసి చికిత్స నిమిత్తం రిమ్స్ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. ఇవి చదవండి: హోలీ వేళ.. నాలుగు కుటుంబాల్లో విషాదం! -
సైకలాజికల్ థ్రిల్లర్
హర్షివ్ కార్తీక్ హీరోగా నటించి, స్వీయ దర్శకత్వంలో నిర్మించిన సస్పెన్స్ అండ్ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ ‘బహుముఖం’. ‘గుడ్, బ్యాడ్ అండ్ ది యాక్టర్’ అనేది ట్యాగ్లైన్ . ఈ చిత్రంలో స్వర్ణిమ సింగ్, మరియా మార్టినోవా హీరోయిన్లుగా నటించారు. త్వరలోనే ఈ సినిమా విడుదల కానుంది. ఈ మూవీ టీజర్ రిలీజ్ వేడుకకి అతిథిగా హాజరైన డైరెక్టర్ శశి కిరణ్ తిక్క మాట్లాడుతూ– ‘‘బహుముఖం’ టీజర్ బాగుంది. టీజర్ చూస్తుంటే విజువల్స్తో పాటుగా సౌండ్కి ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ సినిమా కోసం కార్తీక్ చాలా కష్టపడ్డాడు. ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నా’’ అన్నారు. ‘‘అమెరికాలో చేసిన పక్కా తెలుగు సినిమా ఇది. ప్రేక్షకులకు గుర్తుండిపోవాలనే ఉద్దేశంతో ఈ చిత్రం చేశాం’’ అన్నారు హర్షివ్ కార్తీక్. చిత్ర సంగీత దర్శకుడు ఫణి కళ్యాణ్, నేపథ్య సంగీతం అందించిన శ్రీ చరణ్ పాకాల మాట్లాడారు. ఈ చిత్రానికి సహ–నిర్మాత అరవింద్ రెడ్డి. -
ఈ సినిమా చూసి నాకు ఒకరు మెయిల్ పెట్టారు
-
సస్పెన్స్ బహుముఖం
హర్షివ్ కార్తీక్ హీరోగా నటించి, రచించి, స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘బహుముఖం’. ‘గుడ్, బ్యాడ్ – యాక్టర్’ అనేది ట్యాగ్లైన్. క్రిస్టల్ మౌంటైన్ ప్రోడక్షన్స్పై రూపొందిన ఈ చిత్రంలో స్వర్ణిమా సింగ్, మరియా మార్టినోవా హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రం నుంచి హర్షివ్ కార్తీక్ ఫస్ట్ లుక్ని విడుదల చేశారు మేకర్స్. ఈ సందర్భంగా హర్షివ్ కార్తీక్ మాట్లాడుతూ– ‘‘సస్పెన్స్, డ్రామా, థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందిన చిత్రం ‘బహుముఖం’. ఈ చిత్రాన్ని త్వరలోనే విడుదల చేస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి సహ నిర్మాత: అరవింద్ రెడ్డి, కెమెరా: ల్యూక్ ఫ్లెచర్, నేపథ్య సంగీతం: శ్రీచరణ్ పాకాల, సంగీతం: ఫణి కల్యాణ్. -
సికింద్రాబాద్లో పుట్టి పెరిగా.. గత ఎన్నికల్లోనే నా మొదటి ఓటు.. సెలబ్రిటీ కామెంట్..
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్లో పుట్టి పెరిగిన నేను చిన్నప్పటి నుంచీ ఎన్నికల సందడిని ఆసక్తిగానే గమనించేవాణ్ని. నాకు గత ఎన్నికల్లోనే తొలిసారి ఓటుహక్కు వచ్చింది. ఓటేయడం అద్భుతంగా అనిపించింది. రాష్ట్రం తలరాతను మనమే నిర్ణయిస్తున్నంత ఫీల్. ఎన్నికల్లో ఓటు వేయడం మనకు అందివచ్చే ఒక గొప్ప అవకాశం. మొదటి నుంచీ రాజకీయాలను, నేతలను దగ్గర నుంచీ పరిశీలిస్తూ ఒక అభిప్రాయానికి వచ్చి ఉంటే చాలా చాలా గుడ్. కానీ అంత తీరిక అందరికీ ఉంటుందా అనేది సందేహమే. ఐదేళ్లూ మన చుట్టూ ఏం జరుగుతుందో మనం అంతగా పట్టించుకున్నా పట్టించుకోకపోయినా.. పోలింగ్కు కొన్ని రోజుల ముందైనా సరే ఒక్కసారి మన చుట్టూ జరిగిన మంచీ చెడూ బేరీజు వేసుకుని మేనిఫెస్టోల్ని విశ్లేషించుకుని ఓటు తప్పకుండా వేయడం అవసరం. గెలుపోటముల గురించి పక్కన పెట్టేద్దాం. పోలింగ్ రోజున ఓటు మాత్రం తప్పకుండా వేద్దాం. – కార్తీక్, సినీనటుడు, కేరాఫ్ కంచరపాలెం ఫేం -
250 కిలోల అభిమానం
అభిమానులు తమ అభిమాన హీరో, హీరోయిన్లకు గుడి కట్టడం కొత్త కాదు. అయితే ఆ గుడి బయట ఎక్కడో ఉంటుంది. తమిళనాడులోని మదురైకి చెందిన కార్తీక్... రజనీకాంత్కు వీరాభిమాని. తన ఇంటిలోని ఒక పోర్షన్ను రజనీ గుడిగా మలిచాడు. ఇందులో 250 కిలోల బరువు ఉన్న రజనీ విగ్రహం ఉంది. రోజూ ధూపదీప నైవేద్యాలు ఉంటాయి. ‘రజనీకాంత్ను దేవుడి స్థాయిలో ఆరాధిస్తున్నాను’ అంటున్నాడు కార్తీక్. -
ఇడ్లీ హై జపానీ... టేస్ట్ హై హిందుస్థానీ
‘దేశం కాని దేశంలో మన దేశ వంటకాలను చూస్తే ప్రాణం లేచి రావడమే కాదు బ్రహ్మాండంగా భరతనాట్యం కూడా చేస్తుంది’ అంటున్నాడు ప్రసన్న కార్తిక్. ఈ ట్విట్టర్ ఖాతాదారుడు ఏదో పని మీద జపాన్లోని క్యోటో నగరానికి వెళ్లాడు. అక్కడ కనిపించిన ‘తడ్క’ అనే రెస్టారెంట్ను చూసి ‘కలయా? నిజమా? అనుకున్నాడు. ఈ రెస్టారెంట్ దక్షిణ భారతీయ వంటకాలకు ప్రసిద్ధి. దోశ, ఇడ్లీలకు ఇక్కడ మంచి డిమాండ్ ఉంది. అయితే ఈ రెస్టారెంట్ నిర్వాహకులు భారతీయులు మాత్రం కాదు... జపానీయులే. వీరు ప్రతి ఆరునెలలకు ఒకసారి చెన్నైకి వచ్చి కొత్త వంటకాలు నేర్చుకొని వెళుతుంటారు. ‘దోశ అండ్ ఇడ్లీ అన్బిలీవబుల్ అథెంటిక్. రెస్టారెంట్లో భారతీయుల కంటే జపాన్ వాళ్లే ఎక్కువమంది కనిపించారు. జపాన్లో తినడానికి చాప్–స్టిక్స్ ఉపయోగిస్తారు. అయితే ఈ రెస్టారెంట్ వాళ్లు మాత్రం చేతితో తినడంలోని మజాను బాగానే ప్రమోట్ చేసినట్లు ఉన్నారు. ఎవరూ చాప్–స్టిక్స్ను ఉపయోగించడం లేదు’ అని ట్విట్టర్లో పోస్ట్ పెట్టాడు కార్తిక్. -
స్విగ్గీకి మరో షాక్.. వేరుకుంపటికి సిద్ధమైన సీనియర్ వైస్ ప్రెసిడెంట్!
ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ కార్తీక్ గురుమూర్తి కంపెనీని వీడనున్నట్లు తెలుస్తోంది. ఆయన ఇక్కడి నుంచి నిష్క్రమించి తన సొంత వెంచర్ను ప్రారంభించబోతున్నారని ఈ పరిణామాలు తెలిసిన వ్యక్తులను ఉటింకిస్తూ ‘మనీకంట్రోల్’ వార్తా సంస్థ కథనం ప్రచురించింది. గత మార్చిలో స్విగ్గీ ఇన్స్టామార్ట్ను ఏర్పాటు చేసిన గురుమూర్తి.. కొన్ని రోజులు తెరమరుగై మళ్లీ మే నెలలో స్విగ్గీ మాల్కు అధిపతిగా తిరిగి వచ్చారు. స్విగ్గీ మాల్ను గతంలో స్విగ్గి మ్యాక్స్ అని పిలిచేవారు. ఇది హైపర్లోకల్ ఆన్లైన్ షాపింగ్ విభాగం. కార్తీక్ గురుస్వామి ప్రారంభించనున్న వెంచర్ ఇప్పుడు స్విగ్గీ నిర్వహిస్తున్నలాంటిదే. అయితే ఇది ఆఫ్లైన్ స్పేస్లో ఉంటుంది. జర్మనీకి చెందిన సూపర్మార్కెట్ చైన్ ఆల్డీ లాంటి చవక ధరల భౌతిక దుకాణం మోడల్ను కార్తీక్ గురుస్వామి భారత్లో ప్రారంభించనున్నారు. కొన్ని నెలల క్రితం గురుమూర్తి తన వెంచర్ కన్వెనియోకు నిధుల కోసం మ్యాట్రిక్, యాక్సెల్ వంటి వెంచర్ క్యాపిటల్ సంస్థలను కలిశారు. ఈ వెంచర్ పేరునే ఆయన మార్చే అవకాశం ఉంది. అయితే దీనిపై గురుమూర్తి కానీ, స్విగ్గీ, మ్యాట్రిక్, యాక్సెల్ కంపెనీలు కానీ స్పందించలేదు. కాగా స్విగ్గీ మాల్కు అధిపతిగా దీపక్ కృష్ణమణిని నియమించింది. దీన్నిబట్టి గురుమూర్తి నిష్క్రమణకు సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది. గత నెలలో స్విగ్గీలో చేరిన కృష్ణమణి అంతకుముందు అమెజాన్లో దాదాపు ఏడేళ్లు, దానికిముందు మారికోలో తొమ్మిదేళ్లు పనిచేశారు. వరుస నిష్క్రమణలు స్విగ్గీలో టాప్-లెవల్ నిష్క్రమణలు కొనసాగుతున్నాయి. ఇప్పుడు జాబితాలో గురుమూర్తి కూడా చేరనున్నారు. కంపెనీ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ డేల్ వాజ్ కూడా తన సొంత వెంచర్ను ప్రారంభించడానికి నిష్క్రమించారు. కంపెనీ వైస్ ప్రెసిడెంట్, ఇన్స్టామార్ట్ రెవెన్యూ అండ్ గ్రోత్ హెడ్ నిషాద్ కెంక్రే కంపెనీ విడిచిపెట్టిన కొన్ని రోజులకే మే నెలలో వైస్ ప్రెసిడెంట్, బ్రాండ్ అండ్ ప్రొడక్ట్ మార్కెటింగ్ హెడ్ ఆశిష్ లింగంనేని కూడా కంపెనీని వీడారు. అదేవిధంగా, రెవెన్యూ అండ్ గ్రోత్ విభాగాన్ని నిర్వహించే సీనియర్ వైస్ ప్రెసిడెండ్ అనూజ్ రాఠి కూడా ఫిన్టెక్ కంపెనీ జూపిటర్లో చేరేందుకు స్విగ్గీ నుంచి నిష్క్రమించారు. -
వినోదాల ప్రేమ
కార్తీక్ రత్నం, సుప్యర్ద సింగ్ జంటగా ఆనంద్ బడా దర్శకత్వంలో రూపొందిన రొమాంటిక్ కామెడీ ఫిల్మ్ ‘లింగొచ్చా..’. ‘గేమ్ ఆఫ్ లవ్’ అనేది ఉపశీర్షిక. జె.నీలిమ సమర్పణలో యాదగిరి రాజు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 27న విడుదల కానుంది. ఈ సందర్భంగా దర్శకుడు ఆనంద్ బడా మాట్లాడుతూ– ‘‘హైదరాబాద్ నేపథ్యంలో సాగే లవ్ అండ్ రొమాంటిక్ కామెడీ డ్రామా ‘లింగొచ్చా..’’ అన్నారు. ఈ సినిమాకు సంగీతం: బికాజ్ రాజ్, సహ నిర్మాత: మల్లేష్ కంజర్ల. -
మరో గ్లోబల్ కంపెనీ సీఈవోగా భారతీయుడు కార్తీక్రావు
Karthik Rao Named CEO of Nielsen అంతర్జాతీయ దిగ్గజాలకు సారథ్యం వహిస్తున్న భారతీయుల సంఖ్య మరింతగా పెరుగుతోంది. తాజాగా అంతర్జాతీయ మార్కెట్ రీసెర్చ్ సంస్థ నీల్సన్కు సీఈవోగా కార్తీక్ రావు నియమితులయ్యారు. ఆయన నియామకం తక్షణం అమల్లోకి వస్తుందని కంపెనీ శుక్రవారం ప్రకటించింది. మరోవైపు 2018 నుంచి సీఈవోగా ఉన్న డేవిడ్ కెన్నీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా పదోన్నతి పొందారు. ఇదీ చదవండి: బాలీవుడ్లో మహదేవ్ బెట్టింగ్ స్కాం కలకలం: సెలబ్రిటీలకు ఈడీ షాక్ కార్తీక్ రావు సుదీర్ఘకాలంగా నీల్సన్లోని వివిధ విభాగాల్లో చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ తదితర హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. చెన్నైలనోని లయోలా యూనివర్సిటీలో డిగ్రీ (ఎకనామిక్స్) చదివిన కార్తీక్ రావు, అమెరికాలోని ఇలినాయిస్ స్టేట్ యూనివర్సిటీలో ఎంబీఏ పట్టా పొందారు. నీల్సన్ ప్రపంచవ్యాప్తంగా 55 కంటే ఎక్కువ దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. (ఆగస్టులో రిజిస్ట్రేషన్లు‘ భూమ్’! టాప్-5 లిస్ట్ ఇదే!) -
రవితేజ నిర్మించిన సినిమాలో హీరోగా చేయడం కలలా ఉంది: కార్తీక్ రత్నం
‘కేరాఫ్ కంచరపాలెం, నారప్ప’.. ఇలా నటుడిగా ఇప్పటివరకూ చాలా ఇంటెన్స్ క్యారెక్టర్స్ చేసిన నేను ‘ఛాంగురే బంగారురాజా’లో తొలిసారి ఓ కామెడీ రోల్ చేశాను. కామెడీ చేయడం కష్టం అంటుంటారు. కానీ మంచి స్క్రిప్ట్ ఉంటే కామెడీ చేయడం సులభమేనని నాకు అనిపించింది’ అన్నారు కార్తీక్ రత్నం. సతీష్ వర్మ దర్శకత్వంలో కార్తీక్ రత్నం, గోల్డీ నిస్సీ జంటగా నటించిన చిత్రం ‘ఛాంగురే బంగారురాజా’. ఫ్రేమ్ బై ఫ్రేమ్ పిక్చర్స్తో కలిసి హీరో రవితేజ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 15న విడుదల కానుంది. ఈ సందర్భంగా కార్తీక్ రత్నం మాట్లాడుతూ– ‘‘రంగస్థల నటుడిగా వందకుపైగా నాటకాలను ప్రదర్శించాను. మొదటి నాటకానికే నంది అవార్డు వచ్చింది. నాలా ఇండస్ట్రీకి వచ్చే కొత్తవారికి రవితేజ, నానీగార్లే స్ఫూర్తి. అలాంటిది రవితేజ నిర్మించిన సినిమాలో నేను హీరోగా నటించడం కలలా ఉంది. కొన్ని కొండ ప్రాంంతాల్లో లభించే విలువైన రంగు రాళ్ల నేపథ్యంలో ఈ సినిమా కథనం ఉంటుంది. ఇందులో మెకానిక్ బంగారు రాజా పాత్ర చేశాను. దర్శకుడు సతీష్వర్మగారికి రైటింగే బలం. స్పాట్లో ఆయన స్క్రిప్ట్ను ఇంప్రూవ్ చేస్తుంటారు. నేను నటించిన ‘శ్రీరంగ నీతులు’ విడుదలకు సిద్ధంగా ఉంది. అలాగే ప్రకాశ్రాజ్, దర్శకుడు ఏఎల్ విజయ్లు కలిసి నిర్మిస్తున్న ఓ ద్విభాషా (తెలుగు, తమిళం) చిత్రం ఒప్పుకున్నాను. మరో ఎగ్జైటింగ్ప్రాంజెక్ట్ను త్వరలోనే ప్రకటిస్తాను’’ అన్నారు. -
చెడు వ్యసనాలకు బానిసై కెరీర్ నాశనం చేసుకున్న స్టార్ హీరో
సినిమాల్లో బోలెడన్ని ట్విస్టులు ఉంటాయి. కొన్నిసార్లు రియల్ లైఫ్లో అంతకన్నా ఎక్కువ ట్విస్టులే ఉంటాయి. ఊహించని మలుపులతో జీవితమే ఒక కథగా మారుతుంది. సీనియర్ హీరో కార్తీక్ జీవితం కూడా ఇందుకు అతీతం కాదు. సౌత్లో 100కు పైగా సినిమాలు చేసిన ఆయన భార్య చెల్లెలినే పెళ్లి చేసుకున్నాడు. అందుకు గల కారణాలేంటి? తన కెరీర్లో చోటు చేసుకున్న ఊహించని పరిణామాలపై ప్రత్యేక కథనం.. తండ్రి నుంచి వారసత్వం.. మురళి కార్తికేయన్ ముత్తురామన్.. 1960 సెప్టెంబర్ 13న జన్మించాడు. తండ్రి ఆర్ ముత్తురామన్ గొప్ప నటుడు, మచ్చలేని మనిషి. ఆయన నుంచే నటనను పుణికి పుచ్చుకున్నాడు కార్తీక్. అలైగళ్ ఒవతిల్లై(1981) అనే తమిళ చిత్రంతో కార్తీక్ నట ప్రస్థానం మొదలైంది. తన లుక్స్, నటన చూసి డైరెక్టర్స్ తమతో సినిమాలు చేయమని వెంటపడ్డారు. తక్కువకాలంలోనే కోలీవుడ్లో స్టార్ హీరోగా మారాడు. సీతాకోక చిలుక సినిమాతో టాలీవుడ్లోనూ అడుగుపెట్టాడు. కోలీవుడ్లో స్టార్ హీరోగా బిజీబిజీ అన్వేషణ, అభినందన, గోపాలరావు గారి అబ్బాయి, ఓమ్ 3D సినిమాలతో తెలుగువారికీ దగ్గరయ్యాడు. తెలుగులో చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ హీరో కార్తీక్/మురళిగా బాగా ఫేమస్ అయ్యాడు. అభినందన సినిమాకు నంది స్పెషల్ జ్యూరీ అవార్డు అందుకున్నాడు. తమిళంలో ఏడాదికి 8-10 సినిమాలు చేస్తూ బిజీగా ఉండటంతో తెలుగులో ఎక్కువగా చిత్రాలు చేయలేకపోయాడు కార్తీక్. అప్పుడప్పుడూ తన గాత్రానికి పని చెప్తూ పాటలు సైతం ఆలపించాడు. స్టార్ హీరోగా క్రేజ్ తెచ్చుకున్న కార్తీక్ ఎప్పుడూ ఏదో ఒక హీరోయిన్తో ఎఫైర్ నడుపుతున్నట్లు వార్తలు వచ్చేవి. హీరోయిన్తో ప్రేమ.. పెళ్లి ఈ క్రమంలో హీరోయిన్ రాగిణిని ప్రేమించిన అతడు 1988లో ఆమెను పెళ్లి చేసుకున్నాడు. వీరికి గౌతమ్ కార్తీక్, జ్ఞాన్ కార్తీక్ అని ఇద్దరు పిల్లలు సంతానం. అయితే రాగిణి సోదరి రతిపైనా మనసు పారేసుకున్నాడు కార్తీక్. ఆమె కూడా అక్కతో పాటు అతడి ఇంట్లోనే ఉండటంతో.. తనతో ఎఫైర్ పెట్టుకున్నాడని.. దీంతో ఆమె గర్భం దాల్చిందని అప్పట్లో రూమర్స్ వినిపించాయి. ఇంతలో 1992లో రాగిణి సోదరి రతిని రెండో పెళ్లి చేసుకున్నాడు. వీరికి తిరన్ కార్తీక్ అనే కుమారుడు జన్మించాడు. అయితే భార్య ఉండగా ఆమె చెల్లెలిని పెళ్లి చేసుకున్నందుకు నటుడిపై తీవ్ర విమర్శలు వచ్చాయి. 2000వ దశకం నుంచి కార్తీక్ సినిమాల సంఖ్య తగ్గుతూ వచ్చింది. హీరో కాస్తా విలన్గా మారాడు. తనకున్న చెడు వ్యసనాల వల్లే కెరీర్ నాశనమైందని స్వయంగా అతడే గతంలో ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. రాజకీయ ప్రస్థానం.. 2006లో రాజకీయాల్లోనూ అడుగుపెట్టాడు. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీలో చేరిన అతడు తర్వాతి కాలంలో సొంతంగా పార్టీ స్థాపించాడు. అఖిల ఇండియా నాదలమ్ మక్కల్ కచ్చి అని దీనికి పేరు పెట్టాడు. తన పార్టీ నుంచి లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసిన అతడు దారుణంగా ఓడిపోయాడు. కార్తీక్కు కేవలం 15వేల ఓట్లు మాత్రమే వచ్చాయి. దీంతో అతడు 2018లో మనిత ఉరిమైగల్ కాక్కమ్ కచ్చి అనే మరో పార్టీని స్థాపించాడు. అయితే ఏఐఏడీఎమ్కే కూటమికి తన మద్దతును ప్రకటించాడు. తను చేసిన తప్పిదాల వల్లే కార్తీక్ కెరీర్ అతలాకుతలమైందని తమిళ ప్రజలు ఇప్పటికీ చెప్పుంటూ ఉంటారు. చదవండి: గుండెపోటుతో నటి మృతి అంటూ ట్వీట్.. వెంటనే డిలీట్.. కానీ అప్పటికే.. 'అమ్మాయితో చాటింగ్ చేయడం వల్లే అంతా'.. నెట్టింట వైరల్! -
నిర్మాతకు డబ్బులొస్తే చాలు: డైరెక్టర్
‘ఎంతో కష్టపడితే దర్శకుడిగా ‘’తో తొలి చాన్స్ వచ్చింది. సినిమా బ్లాక్బస్టర్ అయిందా లేదా అన్నది కాదు.. నిర్మాతకు డబ్బులొస్తే అదే పెద్ద సక్సెస్’’ అని సాయి సునీల్ నిమ్మల అన్నారు. యామిన్ రాజ్, విరాట్ కార్తీక్, ప్రియాంక రేవ్రి లీడ్ రోల్స్లో నటించిన చిత్రం ‘ప్రేమదేశపు యువరాణి’. సాయి సునీల్ నిమ్మల దర్శకత్వంలో ఆనంద్ వేమూరి, హరిప్రసాద్ సీహెచ్ నిర్మించిన ఈ చిత్రం నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ వేడుకకి అతిథులుగా హాజరైన నటులు అరవింద్ కృష్ణ, శివారెడ్డి మాట్లాడుతూ– ‘‘ఈ చిత్రం ట్రైలర్,పాటలు చాలా బాగున్నాయి. సినిమా హిట్టవ్వాలి’’ అన్నారు. ‘‘ఈ సినిమాలో ప్రేమ, కుటుంబ భావోద్వేగాలు, డ్రామా ఉన్నాయి’’ అన్నారు యామిన్ రాజ్. -
జబర్దస్త్ కమెడియన్ కెవ్వు కార్తీక్ ఇల్లు చూశారా? ఎంత బాగుందో!
ఒక్కొక్కరిదీ ఒక్కో అభిరుచి.. కొందరికి రాయడం ఇష్టం.. కొందరికేమో పాడటం ఇష్టం.. పెయింటింగ్స్ వేయడం.. డ్యాన్స్ చేయడం, నటించడం.. ఇలా ఒక్కొక్కరికీ ఒక్కోటి నచ్చుతుంది. చాలామంది దాన్ని టైంపాస్గా భావిస్తారు. కానీ కళాకారులు మాత్రం వాటినే నమ్ముకుని అంచెలంచెలుగా ఎదుగుతుంటారు. అలా హాస్యాన్ని నమ్ముకుని, అందరినీ నవ్వించడమే పనిగా పెట్టుకున్నవాళ్లు ఎంతోమంది ఇండస్ట్రీలో వెలుగు వెలుగుతున్నారు. వారిలో ఒకరే జబర్దస్త్ కమెడియన్ కెవ్వు కార్తీక్. తన పంచులతో, స్కిట్లతో ప్రేక్షకులకు వినోదాన్ని పంచే కెవ్వు కార్తీక్ ఇటీవలే వైవాహిక బంధంలోకి అడుగుపెట్టాడు. ఏడాది క్రితం కొత్త ఇల్లు కొనుక్కున్న కార్తీక్ తాజాగా హోం టూర్ వీడియో చేశాడు. తన ఇంటి గేటు దగ్గరి నుంచి ప్రతీది ప్రత్యేకంగా డిజైన్ చేయించినట్లు తెలిపాడు. 'గతంలో అద్దె ఇంట్లో ఉన్నప్పుడు హోంటూర్ చేశాను. నేను సొంతంగా ఓ ఇల్లు కొనుకున్నాక మళ్లీ హోంటూర్ వీడియో చేయాలనుకున్నాను. ఏడాది క్రితమే ఈ ఇల్లు కొన్నప్పటికీ ఇంటీరియర్, వస్తువులు అన్నీ సమకూర్చుకునేసరికి ఇంత సమయం పట్టింది. ఇన్నాళ్లకు ఇల్లు పూర్తిగా రెడీ అవడంతో వీడియో చేశాను. గతంలో నేను కింద పడుకునేవాడిని. సోఫా కూడా ఉండేది కాదు. నాకంటూ సొంతిల్లు ఉన్నాకే అవన్నీ కొనుక్కోవాలనుకున్నాను. ఇప్పుడు అన్నీ మంచి క్వాలిటీతో ఉన్నవి కొనుక్కున్నాను' అంటూ ప్రతి గదిని క్షుణ్ణంగా చూపించాడు కార్తీక్. హాల్, పూజ గది, డైనింగ్ టేబుల్, కిచెన్, మూడు బెడ్రూమ్స్, బాల్కనీ అన్నింటినీ తనకు నచ్చినట్లుగా ఆర్గనైజ్ చేయించుకున్నాడు. తన అవార్డులు, గృహప్రవేశానికి వచ్చిన బహుమతులను సైతం చూపిస్తూ పోయాడు. తన బాల్కనీని మొత్తం గ్రీనరీతో నింపేశాడు. ఈ ఇంట్లో నెమళ్ల శబ్ధాలు కూడా వినిపిస్తుండటం విశేషం. కాంక్రీట్ జంగిల్లో కాకుండా కాస్త ప్రశాంత వాతావరణం ఉన్న ప్రదేశంలో కార్తీక్ తన ఇంటిని కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. అభిమానులు సైతం ఇల్లు చాలా బాగుందంటూ కామెంట్లు చేస్తున్నారు. చదవండి: రాజకీయాల్లోకి ఎంట్రీ.. ఎమ్మెల్యేగా పోటీ? స్పందించిన రాహుల్ -
Bigg Boss Keerthi Engagement: బిగ్బాస్ బ్యూటీ కీర్తి భట్- హీరో విజయ్ కార్తీక్ ఎంగేజ్మెంట్ (ఫోటోలు)
-
ప్రియుడు పెళ్లికి నిరాకరించడంతో ప్రియురాలు ఆందోళన
-
రాచర్లగొల్లపల్లిలో తల్లీ కుమారుడి అదృశ్యం
కరీంనగర్: మండలంలోని రాచర్లగొల్లపల్లికి చెందిన తల్లీకుమారుడు అదృశ్యమైనట్లు పోలీసులు తెలిపారు. ఎస్సై రమాకాంత్ వివరాల ప్రకారం.. రాచర్లగొల్లపల్లికి చెందిన కాటికాపల పోచమ్మ అనే యువతి గతేడాది భర్త నుంచి విడాకులు తీసుకుంది. అప్పటినుంచి తన ఐదేళ్ల కుమారుడు కార్తీక్తో కలిసి తల్లిగారింట్లో ఉంటోంది. ఈ క్రమంలో ఈ నెల 26న మధ్యాహ్నం 2 గంటలకు బస్టాండ్లో పని ఉందని చెప్పి, కుమారుడిని తీసుకొని వెళ్లి, కనిపించకుండా పోయింది. కుటుంబసభ్యులు రెండు రోజులు గాలించినప్పటికీ ఫలితం లేకపోవడంతో పోచమ్మ తల్లి దుర్గవ్వ శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని, తల్లీకుమారుడి కోసం గాలిస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. -
ఐఐటీ విద్యార్థి విషాదాంతం
మిర్యాలగూడ టౌన్: వారం రోజుల క్రితం అదృశ్యమైన ఐఐటీ విద్యార్థి కార్తీక్ సోమవారం రాత్రి విశాఖపట్నంలోని జోడుగుళ్లపాలెం బీచ్లో శవమై తేలాడు. సంగారెడ్డి జిల్లా కంది మండల కేంద్రంలోని ఐఐటీ హైదరాబాద్లో బీటెక్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న కార్తీక్ పరీక్షలో తప్పడంతో మనస్తాపానికి గురై బంగాళాఖాతంలో మునిగి ఆత్మహత్య చేసుకుని ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండలం వాటర్ట్యాంకు తండాకు చెందిన ధనావత్ ఉమ్లా నాయక్, సైదమ్మ దంపతులకు కుమారుడు ధనావత్ కార్తీక్ (20), కుమార్తె సాతి్వక ఉన్నారు. ఉమ్లా నాయక్ వ్యవసాయ పనులు చేస్తుండగా, సైదమ్మ చింతలపాలెంలోని కస్తూర్భా గాంధీ విద్యాలయంలో కాంట్రాక్ట్ ఉపాధ్యాయురాలిగా పని చేస్తున్నారు. కాగా కార్తీక్ ఇటీవల విడుదలైన సెమిస్టర్ ఫలితాల్లో రెండు సబ్జెక్టుల్లో ఫెయిల్ అయినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో ఈ నెల 17న రాత్రి క్యాంపస్ నుంచి బయటకు వెళ్లిన కార్తీక్ అప్పట్నుంచీ కన్పించకుండా పోయాడు. ఈ నెల 18న తల్లిదండ్రులు ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ అని వచ్చింది. దీంతో వారు కళాశాలకు వెళ్లి ఆరా తీశారు. కార్తీక్ బయటకు వెళ్లి తిరిగి రాలేదని సిబ్బంది చెప్పడంతో ఆందోళనకు గురైన కుటుంబసభ్యులు సంగారెడ్డి రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. జన్మభూమి ఎక్కి విశాఖలో దిగి.. దర్యాప్తులో భాగంగా పోలీసులు సీసీ టీవీ ఫుటేజీలు పరిశీలించగా..18వ తేదీ ఉదయం కార్తీక్ సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో విశాఖపట్నం వెళ్లే జన్మభూమి ఎక్స్ప్రెస్ రైలు ఎక్కినట్లు కన్పించింది. అతను అదేరోజు రాత్రి విశాఖలో దిగడం, రాత్రి 9.30 సమయంలో ఆర్కే బీచ్లోని ఓ బేకరీలో ఏవో కొనడం కూడా సీసీ టీవీ ఫుటేజీల ద్వారా గుర్తించారు. కార్తీక్ విశాఖపట్నంలో కన్పించినట్టు పోలీసులు ఇచ్చి న సమాచారంతో అతని తల్లిదండ్రులు అక్కడి తమ బంధువులకు విషయం చెప్పారు. 19వ తేదీ నుంచి కుటుంబసభ్యులు, బంధువులు గాలించినా ఆచూకీ దొరకలేదు. కాగా ఈ నెల 21న విశాఖ జోడుగుళ్లపాలెం బీచ్కు ఓ యువకుడి మృతదేహం కొట్టుకొచ్చింది. ఆరిలోవ పోలీసులు గుర్తు తెలియని శవంగా కేసు నమోదు చేసి కేజీహెచ్ మార్చురీలో భద్రపరిచారు. మంగళవారం ఉదయం మృతదేహాన్ని పరిశీలించిన కార్తీక్ తల్లిదండ్రులు అది తమ కుమారుడేనని గుర్తించారు. కార్తీక్ వారం రోజుల క్రితమే బంగాళాఖాతంలో దూకి ఆత్మహత్య చేసుకుని ఉంటాడని అనుమానిస్తున్నారు. అతడి మృతదేహం కుళ్లిపోయింది. సెల్ఫోన్ ఐఎంఈఐ నంబరు ద్వారా ఆ మృతదేహం కార్తీక్దే అని పోలీసులు నిర్ధారించారు. మృతదేహాన్ని జలచరాలు తినడంతో పోస్టుమార్టం చేసేందుకు కూడా వీలు కాలేదు. దీంతో శవాన్ని వెంటనే అంబులెన్సులో మిర్యాలగూడ వాటర్ ట్యాంకు తండాకు తరలించి సాయంత్రం వారి వ్యవసాయ క్షేత్రంలో ఖననం చేశారు. అమ్మకు బంగారం కొనిస్తానంటివయ్యా.. ‘ఉద్యోగం వచ్చి న తర్వాత అమ్మకు బంగారం కొనిస్తానంటివి.. అందరినీ మంచిగా చూసుకుంటా అంటివి.. ఇప్పుడు కనిపించకుండా పోయావా కొడుకా’అంటూ ఉమ్లానాయక్ కుమారుడి మాటలను గుర్తు చేసుకుంటూ రోదించిన తీరు అందరినీ కదిలించింది. -
కొడుకా..! ఎక్కడున్నావురా..?
నల్గొండ: కొడుకా.. ఎక్కడ ఉన్నావురా..మమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్లావు.. ఇంటికిరా.. అంటూ కన్నీరుమున్నీరవుతోంది.. ఆ గిరిజన కుటుంబం. పరీక్షలో తప్పావని దిగులు చెందకు కడుపులో పెట్టుకుని చూసుకుంటాం అంటూ ఉబికి వస్తున్న కన్నీళ్లతో అభయమిస్తోంది. వివరాల్లోకి వెళ్తే.. మిర్యాలగూడ మండలం వాటర్ ట్యాంకు తండాకు చెందిన ధనావత్ ఉమ్లా నాయక్ –సైదమ్మల దంపతులకు ఇద్దరు పిల్లలు. వీరిలో పెద్దవాడు ధనావత్ కార్తీక్, కుమార్తె సాత్విక. ధనావత్ ఉమ్లానాయక్ వ్యవసాయ పనులు చేసుకుంటుండగా తల్లి సైదమ్మ చింతలపాలెంలోని కస్తూరిబా గాంధీ విద్యాలయంలో కాంట్రాక్ట్ ఉపాధ్యాయురాలుగా పనిచేస్తోంది. రెండు సబ్జెక్టులు తప్పాడనేనా..? ధనావత్ కార్తీక్ సంగారెడ్డి జిల్లా కంది మండల కేంద్రంలోని ఐఐటీ హైదరాబాద్లో బీటెక్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. ఇటీవల విడుదలైన ద్వితీయ సంవత్సరం పరీక్ష ఫలితాల్లో కార్తీక్ రెండు సబ్జెక్టుల్లో ఫెయిల్ అయ్యాడు. అయితే, కార్తీక్ మనస్తాపం చెందాడో మరో కారణమో తెలియదు కానీ ఈ నెల 17న రాత్రి 7:40 గంటలకు కళాశాల హాస్టల్ నుంచి బయటికి వచ్చాడు. అనంతరం సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ చేరుకున్నాడు. రాత్రి అక్కడే ఉండి మరుసటి రోజు ఉదయం జన్మభూమి ఎక్స్ప్రెస్ ఎక్కి వైజాగ్ వెళ్లినట్లు సీసీ టీవీ ఫుటేజ్లు చూపిస్తున్నాయి. 18వ తేదీ రాత్రి 9: 30గంటలకు రైలు దిగి నడుచుకుంటూ ఆర్కే బీచ్ వరకు వెళ్లి సమీపంలో గల ఫేమస్ బేకరీలో 10:30గంటలకు తినుబండారాలు కొనుగోలు చేశాడు. అనంతరం తిరిగి బీచ్ వైపు వెళ్లి 2.38గంటల వరకు తిరిగినట్లు సీసీ ఫుటేజ్ చూయించింది. ఫోన్ స్విచ్ ఆఫ్ కావడంతో.. ఈ నెల 18న అర్ధరాత్రి దాటిన తర్వాత 2:58 గంటలకు బీచ్ సమీపంలోనే కార్తీక్ ఫోన్ స్విచ్ ఆఫ్ అయినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో అక్కడి నుంచి కార్తీక్ ఎక్కడికి వెళ్లాడనేది అంతుచిక్కకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. తమ కుమారుడి ఫోన్ స్విచ్ ఆఫ్ కావడంతో అనుమానం వచ్చిన తల్లిదండ్రులు ఈ నెల 19న సంగారెడ్డిలోని ఐఐటీ కళాశాలకు వెళ్లి విషయం ప్రిన్సిపాల్ దృష్టి తీసుకెళ్లినప్పటికీ ఎలాంటి స్పందన రాలేదు. దీంతో తల్లిదండ్రులు సంగారెడ్డిలోని కంది పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయగా మిస్సింగ్ కేసు నమోదు చేశారు. అప్పటికే వైజాగ్లో ఉన్న వారి బంధువులకు సమాచారం ఇచ్చిన ఉమ్లానాయక్–సైదమ్మలు 21న వైజాగ్కు వెళ్లారు. ఈ విషయంపై కుటుంబ సభ్యులు వైజాగ్ పోలీసులను ఆశ్రయించగా 60మంది బృందాలుగా ఏర్పడి కార్తీక్ కోసం ఐదు రోజులుగా ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. గుండెలు బాదుకుంటున్న నాయనమ్మ, తాతయ్య నాకు ఒక్కడే కుమారుడు, నా కుమారుడికి ఒక్కడే కుమారుడు అంటూ కార్తీక్ నాయనమ్మ–తాతయ్య ధర్మి, వాలు కన్నీరుమున్నీరవుతున్నారు. కార్తీక్ అదృశ్యం అయినప్పటి నుంచి బంధువులు వస్తుండటంతో వారి కన్నీటిని అపడం ఎవరితరం కావడం లేదు. మనుమడా ఎక్కడా ఉన్నా రా.. అయ్యా అంటూ గుండెలు బాదుకుంటూ రోదిస్తున్న తీరు పలువురిని కంటతడి పెట్టించింది. -
Kevvu Karthik : హనీమూన్ ఎంజాయ్ చేస్తున్న జబర్దస్త్ కెవ్వు కార్తిక్ (ఫొటోలు)
-
అమ్మాయిలతో ఫ్లర్టింగ్ ఎలా చేయాలో చెప్పిన కార్తీ
-
జబర్దస్త్ కమెడియన్ కెవ్వు కార్తీక్ పెళ్లి ఫోటోలు చూశారా? (ఫొటోలు)
-
‘తమ్ముళ్లే’ ఆ గంజాయి బాబులు!
సాక్షి, పుట్టపర్తి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వస్తున్న జనాదరణ చూసి ఓర్వలేక.. ఎన్నికల్లో ప్రత్యక్షంగా ఎదుర్కొనే దమ్ములేక టీడీపీ నేతలు విష సంస్కృతికి తెరలేపారు. శ్రీసత్యసాయి జిల్లా ముదిగుబ్బలో గంజాయి సేవించి హల్చల్ చేసిన యువకులు టీడీపీ కార్యకర్తలు అయినప్పటికీ వారు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అనుచరులని తప్పుడు ప్రచారం చేస్తూ బురదజల్లేందుకు ప్రయత్నిస్తున్నారు. రాప్తాడు నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్ పరిటాల సునీత కుమారుడు శ్రీరామ్కు సన్నిహితంగా ఉండే కార్తీక్.. ఈ నెల 23న తన స్నేహితులతో కలిసి గంజాయి సేవించి వాహనాలతో రోడ్లపై హడావుడి చేశారు. అడ్డొచ్చిన వాహనాలను ఢీకొట్టారు. ఎదురు మాట్లాడిన వ్యక్తిని చితకబాదారు. పోలీసులు పట్టుకుంటే ‘వైఎస్సార్సీపీ రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్రెడ్డి’ స్టిక్కర్ చూపించారు. తాము చేసిన అరాచకాన్ని అధికార పార్టీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్రెడ్డిపైకి నెట్టేందుకే ఈ స్టిక్కర్’ చూపించినట్లు తెలుస్తోంది. బురద జల్లేందుకే.. నిజానికి.. 2019 ఎన్నికల్లో రాప్తాడు నుంచి టీడీపీ తరఫున పోటీచేసి ఘోరంగా ఓడిపోయిన పరిటాల శ్రీరామ్.. రాజకీయంగా ఎదుర్కొనే సత్తాలేక ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్రెడ్డిపై బురదజల్లేందుకు ఆకతాయిలను రోడ్లపై వదిలినట్లు సామాజిక మాధ్యమాల్లో విస్తృత ప్రచారం జరుగుతోంది. గంజాయి మత్తులో వీరంగం చేయడంతో పాటు అధికార పార్టీ నేతలను లాగాలని చూడటం తెలుగు తమ్ముళ్లకు సరికాదని వైఎస్సార్సీపీ శ్రేణులు సోషల్ మీడియాలో కౌంటర్ ఇచ్చాయి. ఇక ముదిగుబ్బ పోలీసుల అదుపులో ఉన్న కార్తీక్ గురించి వైఎస్సార్సీపీ నేతలు ఆరా తీయగా పరిటాల శ్రీరామ్కు అత్యంత సన్నిహితుడిగా తేలింది. అదేవిధంగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్తో దిగిన అతని ఫొటోలూ సేకరించారు. -
ఓ ఇంటివాడైన జబర్దస్త్ కమెడియన్ కెవ్వు కార్తీక్ (ఫొటోలు)
-
పెళ్లి చేసుకున్న కమెడియన్ కెవ్వు కార్తీక్
బుల్లితెర కామెడీ షో 'జబర్దస్త్' ద్వారా పాపులర్ అయిన కమెడియన్ కెవ్వు కార్తీక్ ఓ ఇంటివాడు అయ్యాడు. కెవ్వు కార్తీక్, శ్రీలేఖల వివాహం గురువారం హైదరాబాద్లో ఘనంగా జరిగింది. వీరి పెళ్లి వేడుకకు బుల్లితెర నటులే కాకుండా పలువురు సినీ ప్రముఖులు కూడా హజరయ్యారు. జబర్దస్త్ ప్రోగ్రామ్ ద్వారా తనకు అత్యంత ఆప్త మిత్రుడు అయిన గెటప్ శ్రీను సహా పలువురు కమెడియన్లు హాజరయ్యారు. వారందరూ కొత్త దపంతులను ఆశీర్వదించారు. (ఇదీ చదవండి: టక్కర్ సినిమా ట్విటర్ రివ్యూ, టాక్ ఎలా ఉందంటే?) ఈ మేరకు కొత్త దంపతులతో దిగిన ఫోటోలను గెటప్ శ్రీను షోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. జీవితాంతం సంతోషంగా ఉండాలని ఆశిస్తున్నట్లు ఆయన తెలిపాడు. అయితే, గతంలో తన భార్యను సిరి అని సంబోధించాడు కార్తీక్. కానీ, గెటప్ శ్రీను మాత్రం పెళ్లికుమార్తె పేరు శ్రీలేఖ అని పేర్కొన్నాడు. బహుశా సిరి అనేది ముద్దుపేరేమో. వరంగల్లో పుట్టిన కార్తీక్ ఇంజినీరింగ్ పూర్తి చేసి సినిమాలపై మక్కువతో హైదరాబాద్ వచ్చాడు. ఇప్పటికే టీవీ షోలతో పాటు పలు సినిమాల్లోనూ నటించాడు. గతేడాది విడుదలైన ‘ముఖచిత్రం’, ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘నేను స్టూడెంట్ సర్’ చిత్రాలతో ఆయన ప్రేక్షకులను మెప్పించాడు. (ఇదీ చదవండి: టాలీవుడ్లో ప్రేమ పెళ్లి చేసుకున్న హీరోహీరోయిన్లు వీళ్లే!) -
ఆవారాకు సీక్వెల్ రెడీ...! ఫాన్స్ కు గుడ్ న్యూస్
-
పెళ్లికి సిద్ధమైన జబర్దస్త్ కమెడియన్ .. అమ్మాయి ఎవరో చెప్పేశాడు!
జబర్దస్త్ కమెడియన్ కెవ్వు కార్తీక్ త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్న సంగతి తెలిసిందే. కొద్ది రోజుల క్రితమే ఈ శుభవార్తను అతడే స్వయంగా ఇన్స్టాగ్రామ్లో వెల్లడించాడు. తనతో కొత్త జీవితాన్ని ఆరంభించేందుకు ఎంతగానో ఎదురుచూస్తున్నాను అంటూ నోట్ రాసుకొచ్చాడు. తను పెళ్లి చేసుకోబోయే అమ్మాయితో కలిసి దిగిన ఫోటోలను షేర్ చేశాడు. అయితే ఇందులో ఆ అమ్మాయి ముఖం కనిపించకుండా జాగ్రత్తపడ్డారు. అయితే తాజాగా మరోసారి తాను చేసుకోబోయే అమ్మాయిని పరిచయం చేస్తూ మరోసారి ఇన్స్టాలో ఫోటోలు పంచుకున్నారు. ఈ ఫోటోల్లో తనకు కాబోయే అమ్మాయి ముఖ పరిచయం చేశారు. అంతే కాకుండా ఫోటోలతో పాటు ఓ ఎమోషనల్ నోట్ రాసుకొచ్చారు కెవ్వు కార్తీక్. ఇది చూసిన పలువురు సినీ ప్రముఖులు ఈ జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు. (ఇది చదవండి: దుబాయ్ నుంచి తిరిగొచ్చిన యంగ్ టైగర్.. వీడియో వైరల్!) కార్తీక్ తన ఇన్స్టాలో రాస్తూ..'ఫైనల్గా నేను చేసుకోబోయే అమ్మాయి. పెళ్లిళ్లు స్వర్గంలో జరుగుతాయని విన్నా. కానీ ఆ సమయంలో నాకు అర్థం కాలేదు. రెండు భిన్నమైన మనసులు, భిన్నమైన జీవితాలు, భిన్నమైన అభిప్రాయాలు, విభిన్న ప్రపంచాలు జీవిత ప్రయాణమనే పుస్తకంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించేందుకు ఒకే హృదయంగా మారుతున్నాయి.. వెల్కమ్ టూ మై లైఫ్ సిరి.' అంటూ పోస్ట్ చేశారు. కాగా కెవ్వు కార్తీక్ ఎన్నో కష్టాలు దాటుకుని సెలబ్రిటీ స్థాయికి ఎదిగాడు. ఓ పక్క ఇంజనీరింగ్ చదువుతూనే మిమిక్రీలో డిప్లొమా పూర్తి చేసిన అతడు ఎంటెక్ చేసి ఉద్యోగం సంపాదించాడు. కానీ మిమిక్రీ, కామెడీపై ఉన్న ప్యాషన్తో ఉద్యోగానికి రాజీనామా చేశాడు. తర్వాత హైదరాబాద్ వచ్చి మిమిక్రీ ఆర్టిస్టుగా స్టేజీ షోలు చేశాడు. అనంతరం కామెడీ క్లబ్, జబర్దస్త్ షోలలో మెరిశాడు. జబర్దస్త్లో ఒక టీమ్లో సభ్యుడిగా మాత్రమే ఉన్న కార్తీక్ తర్వాత టీమ్ లీడర్గా మారాడు. (ఇది చదవండి: మరోసారి జంటగా లవ్ బర్డ్స్.. డేటింగ్పై మొదలైన చర్చ!) View this post on Instagram A post shared by Kevvu Kartheek (@kevvukartheek) -
అదే LSG కొంప ముంచింది ఇకనయినా కళ్ళు తెరవండి
-
తేజ్ గురించి చెప్తూ ఎమోషనల్ అయినా డైరెక్టర్ కార్తీక్..
-
సుకుమార్ మాస్టర్ ప్లాన్ అక్కడి వరకే..
-
సైయంట్ సీఈవోగా కార్తీక్ నటరాజన్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సైయంట్ కొత్త సీఈవోగా కార్తీక్ నటరాజన్ నియమితులయ్యారు. ఆయన ప్రస్తుతం చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్గా, ఈడీగా ఉన్నారు. ఇప్పటివరకూ సీఈవోగా ఉన్న కృష్ణ బోదనపు ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్, ఎండీగా పదోన్నతి పొందారు. ఏరోస్పేస్ తదితర విభాగాల గ్లోబల్ హెడ్ ప్రభాకర్ అట్ల.. సీఎఫ్వోగా నియమితులయ్యారు. సంస్థను 2 విభాగాలుగా విడదీసే పునర్వ్యవస్థీకరణ ప్రణాళికను కూడా సైయంట్ డైరెక్టర్ల బోర్డు ఆమోదించింది. సైయంట్ డీఎల్ఎం(డిజైన్ లెడ్ మాన్యుఫాక్చరింగ్) వ్యాపార విభాగం పబ్లిక్ ఇష్యూకి వచ్చే దిశగా సెబీకి ప్రాస్పెక్టస్ను సమర్పించింది. సైయంట్ డీఎల్ఎంకి ఆంటోనీ మాంటల్బానో సీఈవోగా వ్యవహరిస్తారు. -
డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య
ఎల్కతుర్తి: ప్రాణస్నేహితులిద్దరూ చనిపోయారన్న బెంగతో ఒక డిగ్రీ విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలకేంద్రంలో సోమ వారం సాయంత్రం జరిగిన ఈ సంఘటనపై గ్రామస్తులు తెలిపిన వివరాలివి. తంగళ్లపెల్లి సంపత్, సుమలత దంపతులకు ఇద్దరు కుమారులున్నారు. కార్తీక్(21) హనుమకొండలో డిగ్రీ ప్రథమ సంవత్సరం, చిన్న కుమారుడు వినయ్ 8వ తరగతి చదువుతున్నారు. కార్తీక్ మేనమామ కుమారుడు అఖిల్ ఆరేళ్ల క్రితం క్యాన్సర్తో చనిపోయాడు. మరో స్నేహితుడు రాకేష్ రెండేళ్ల క్రితం మృతి చెందాడు. ఈ ముగ్గురు చిన్ననాటి స్నేహితులు కావడంతో.. వారు చనిపోయినప్పటి నుంచి కార్తీక్ దిగాలుగా ఉండేవాడు. తాను కూడా వారి వద్దకు వెళ్తానంటూ.. అప్పుడప్పుడు తల్లిదండ్రులకు చెప్పేవాడు. దీంతో వారు అధైర్యపడొద్దని కుమారుడికి సర్దిచెప్పేవారు. కాగా, కార్తీక్ సోమవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ‘నా చావుకు ఎవరూ కారణం కాదని’సూసైడ్ నోట్ రాసి ఉరి వేసుకున్నాడు. ఎస్ఐ పరమేశ్ కేసు నమోదు చేశారు. -
వివాహం చేసుకొని పోలీస్ స్టేషన్కు.. తల్లిదండ్రులను పిలిపించి..
సాక్షి, చెన్నై(అన్నానగర్): తిరుచ్చి సుబ్రమణ్యపురానికి చెందిన కార్తీక్ (23) బీఏ చదివి బిస్కెట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. అదే కంపెనీలో పని చేస్తున్న సెంతనీర్ పురం సమీపంలో ఉన్న వరగనేరి పిచ్చై పట్టణానికి చెందిన అంగుస్వామి కుమార్తె అభినయ(19)ను ప్రేమించాడు. వారిద్దరూ వేర్వేరు కులాలకు చెందిన వారు కావడంతో తల్లిదండ్రులు తమను విడదీస్తారనే భయంతో సమయపురంలోని ఆది మారియమ్మన్ ఆలయంలో వివాహం చేసుకున్నారు. అనంతరం సమయపురం పోలీసులను ఆశ్రయించారు. సబ్ ఇన్స్పెక్టర్ మోహన్ ఇరువురి తల్లిదండ్రులను పిలిపించి చర్చలు జరిపారు. రాజీ కుదరడంతో పెళ్లికూమార్తెను వరుడితో పాటు పంపించారు. చదవండి: (యువకుడితో వివాహేతర సంబంధం.. భర్త పలుమార్లు హెచ్చరించినా..) -
తన భార్య సొంత చెల్లిని పెళ్లాడిన స్టార్ హీరో.. కష్టాలతో జీవితం
Actor Karthik Married His Wife Younger Sister: సీనియర్ హీరో కార్తిక్ అంటే తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. కోలీవుడ్ హీరో అయిన కార్తిక్ సీతాకోక చిలుక వంటి క్లాసిక్ మూవీతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. తర్వాత అనుబంధం, అన్వేషణ, పుణ్యస్త్రీ, అభినందన, గోపాల్ రావు గారి అబ్బాయి, మగ రాయుడుతోపాటు కల్యాణ్ రామ్ ఓమ్ 3డి సినిమాల్లో నటించి ఆకట్టుకున్నాడు. కొద్ది రోజులు సినిమాలకు గ్యాప్ తీసుకున్న కార్తీక్ ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్లో విలన్గా రాణిస్తున్నాడు. అయితే కార్తీక తన జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలు చూశాడు. తెలుగు, తమిళ భాషల్లో కలిపి సుమారు 125కిపైగా చిత్రాల్లో నటించిన కార్తీక్ 1988లో సహనటి రాగిణిని వివాహం చేసుకున్నాడు. కార్తీక్, రాగిణి ఇద్దరూ సోలైకుయిల్ సిమాలో కలిసి నటించారు. వీరికి గౌతమ్ కార్తీక్, ఘైన్ కార్తీక్ కుమారులు ఉన్నారు. గౌతమ్ కార్తీక్ 'కడలి' మూవీతో ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. అనంతరం రాగిణి సోదరి రథిని 1992లో రెండో వివాహం చేసుకున్నాడు కార్తీక్. వీరిద్దరికి తిరన్ కార్తీక్ కొడుకు ఉన్నాడు. చదవండి: నా వల్లే భారతీయ రైల్వేస్కు ఆదాయం పెరిగింది: కరీనా కపూర్ అప్పటివరకు ఉజ్వలంగా సాగిన కార్తీక్ కెరీర్ 2000 సంవత్సరం తర్వాత ఒడిదొడుకులు ఎదుర్కొంది. 2005లో వచ్చిన నటుడు సత్యరాజ్ 'శివలింగం ఐపీఎస్' సినిమాలో తొలిసారి విలన్గా నటించాడు కార్తీక్. అయితే పలు అనివార్య కారణాల వల్ల ఆ చిత్రం మధ్యలోనే ఆగిపోయింది. తనకున్న చెడు అలవాట్ల వల్లే తన కెరీర్ నాశనం అయిందని ఒక సందర్భంలో స్వయంగా కార్తీక్ తెలిపాడు. చదవండి: ప్రభాస్ అంటే చాలా ఇష్టం, మేము ఫ్రెండ్స్ కూడా: పీవీ సింధు -
మళ్లీ కూసిన గువ్వ
వలస పక్షుల కిల.. కిల.. రావాలతో శేషాచలం కళకళలాడుతోంది. రంగురంగుల ఈకలు.. చూడచక్కని ముక్కులతో.. కొమ్మరెమ్మలపై ఎగురుతూ.. నింగిలో ఆహ్లాదకరమైన విన్యాసాలు చేస్తూ.. వినసొంపైన కిల..కిల.. రావాలతో శేషాచలం అడవులకు వలస పక్షులు మరింత అందం తీసుకొచ్చాయి. ఇప్పటికే శేషాచల కొండల్లో 215 రకాల పక్షి జాతులుండగా.. ఇప్పుడు వలస పక్షులు వాటికి తోడయ్యాయి. మూడేళ్లుగా వర్షాలు బాగా కురుస్తుండటంతో శేషాచల అడవుల్లోని జంతువులకు, పక్షులకు ఆహారం సమృద్ధిగా లభిస్తోంది. దీనివల్లే ఉత్తర భారతదేశంతో పాటు వివిధ ప్రాంతాలు, దేశాల నుంచి అరుదైన పక్షులు శేషాచలం బాట పట్టాయని శాస్త్రవేత్త కార్తీక్ చెప్పారు. వాటిలో కొన్నింటిని తన కెమెరాలో బంధించినట్లు తెలిపారు. –తిరుపతి అలిపిరి శేషాచలం చేరిన వాటిలో ప్రత్యేకమైనవి.. బ్లాక్ నేప్డ్ మోనార్క్ ఫ్లై క్యాచర్: సాధారణంగా ఈ రకంలో మగ పక్షులు బ్లూ కలర్లోనూ.. ఆడ పక్షులు గ్రే కలర్లోనూ ఉంటాయి. వీటికి సిగ్గు ఎక్కువ. స్ట్రీక్ త్రోటెడ్ ఉడ్పెకర్: ఇవి చాలా అరుదుగా కనిపిస్తాయి. పచ్చగానూ.. తలపై ఆరెంజ్ కలర్ జుట్టుతోనూ దర్శనమిస్తుంటాయి. భారతదేశంలోని 12 రకాల ఉడ్ పెకర్స్లో ఈ జాతి అరుదైనది. గ్రీన్ ఇంపీరియల్ పీజియన్: అనేక ఏళ్ల తర్వాత ఇది కళ్యాణి డ్యాం ప్రాంతంలో కనిపించింది. అరుదైన పావురాల్లో ఇది ఒకటి. చైనా, మలేసియా, ఫిలిప్పీన్స్, నేపాల్లలో ఇవి కనిపిస్తుంటాయి. ఏసియన్ పారడైజ్ ఫ్లైక్యాచర్: చిన్న తల, పొడవాటి తోక, ఆరెంజ్ కలర్లో ఉండే ఈ పక్షి శేషాచలంలో అరుదుగా కనిపిస్తుంటుంది. చామల రేంజ్లోని కోటకాడపల్లి ప్రాంతంలో కెమెరాకు చిక్కింది. మధ్య ఆసియా దేశాల్లో ఈ పక్షులు ఎక్కువగా సంచరిస్తుంటాయి. ఇండియన్ స్కాప్స్ ఔల్: దక్షిణ ఆసియాలో కనిపించే గుడ్లగూబ ఇది. దీని అరుపులు చాలా వింతగా>.. భయాందోళనకు గురి చేస్తుంటాయి. దీని కళ్లు పెద్దగా ఉంటాయి. కళ్యాణి డ్యాం ప్రాంతంలో ఇటీవల ఇది దర్శనమిచ్చింది. ఎల్లో త్రోటెడ్ బుల్బుల్: పసుపు పచ్చగా.. ముద్దుగా కనిపించే ఈ పక్షులు ఎక్కువగా ఉత్తర భారతదేశంలో కనిపిస్తుంటాయి. చాలా అరుదుగా ఇతర ప్రాంతాలకు వెళ్లే ఈ పక్షులు కపిలతీర్థం ప్రాంతంలో కనిపించడం విశేషం. టికెల్స్ బ్లూ ఫ్లైక్యాచర్: ఉత్తర భారతదేశం నుంచి వలస వచ్చిన అరుదైన జాతి పిట్ట ఇది. చిన్న ముక్కు, పసుపు రంగు గొంతు దీని ప్రత్యేకత. శేషాచలంలో ఈ పిట్టలు సందడి చేస్తున్నాయి. కాపర్ స్మిత్ బార్బెట్: ‘పిట్ట కొంచెం.. కూత ఘనం’తో కాపర్ స్మిత్ బార్బెట్ను పోల్చవచ్చు. కాపర్ ప్లేట్పై సుత్తితో కొడితే ఎలా సౌండ్ వస్తుందో.. ఈ పిట్ట అరిస్తే అలా ఉంటుంది. వివిధ వర్ణాల్లో ఉండే ఈ పిట్ట.. తన అందంతో మంత్రముగ్ధుల్ని చేస్తుంటుంది. బ్లాక్ హుడెడ్ ఓరియోల్: పసుపు, నలుపు రంగుల్లో అందంగా ఉండే ఈ పక్షి ప్రస్తుతం శేషాచలంలో దర్శనమిస్తోంది. ఆరెంజ్ హెడెడ్ త్రష్: ఆరెంజ్ కలర్లో ఉన్న ఈ పక్షి బ్రహ్మదేవ గుండంలో కనిపించింది. ఇది హిమాలయ ప్రాంతం నుంచి వచ్చినట్లుగా కార్తీక్ చెప్పారు. అనేక ఏళ్ల తర్వాత.. శేషాచలంలో ఇప్పటి వరకు 180 రకాల పక్షులను ఫొటోలు తీశాను. ఈ ఏడాది కళ్యాణి డ్యాం, కపిలతీర్థం, మామండూరు, బాలపల్లి, కలివిలేటి కోన, బ్రహ్మదేవ గుండం, మొగిలిపెంట, చామల రేంజ్లోని తలకోన, కోటకాడపల్లి తదితర ప్రాంతాల్లో అరుదైన పక్షులు కనిపించాయి. చాలా ఏళ్ల తర్వాత ఇక్కడ దర్శనమిచ్చాయి. – కార్తీక్, బర్డ్స్మెన్, తిరుపతి -
యువతికి గర్భం.. ఏప్రిల్ 8న వివాహానికి ఒప్పుకొని, తెల్లారేసరికి..
సాక్షి, హైదరాబాద్: ప్రేమ పేరుతో యువతిని మోసం చేసిన ఓ యువకుడిని రిమాండ్కు తరలించిన సంఘటన కుషాయిగూడ పోలీస్స్టేషన్ పరిధిలో వెలుగు చూసింది. పోలీసుల వివరాల ప్రకారం.. కాప్రా, గాంధీనగర్కు చెందిన గడ్డం కార్తీక్ (24), అదే కాలనీకి చెందిన ఓ యువతి (21), కొన్ని రోజులుగా ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలో యువతి గర్భం దాల్చింది. దీంతో యువతి తనను వివాహాం చేసుకోవాలని పలుమార్లు ఒత్తిడి చేస్తుండటంతో తప్పించుకుని తిరుగుతున్నాడు. ఈ విషయం యువతి తల్లిదండ్రులకు తెలవడంతో కార్తీక్ ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ఈ నెల 8న వివాహం చేస్తామని వారంతా ఒప్పుకున్నారు. తీరా మరుసటి రోజే ఇంటికి తాళం వేసుకొని పరారయ్యారు. కార్తీక్, అతడి కుటుంబ సభ్యుల ఆచూకీ కోసం వెతికిన ఫలితం లేకుండా పోయింది. ఈ క్రమంలో మనస్తాపం చెందిన యువతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా కుటుంబ సభ్యులు కాపాడారు. బాధితులు పోలీసులను ఆశ్రయించగా శనివారం కార్తీక్ను అదుపులోకి తీసుకొని రిమాండ్కు తరలించారు. చదవండి: (విషాదం: సంబంధాలు వస్తున్నాయి.. భూమి కొనడానికి ఎవరూ రాక..) -
చాలా కాలం తర్వాత హీరోగా రీ ఎంట్రీ ఇస్తున్న తమిళ నటుడు
తమిళసినిమా: సీనియర్ నటుడు కార్తీక్ తీ ఇవన్ చిత్రం కోసం ఫైట్ చేశారు. ఈయన చాలా కాలం తరువాత కథానాయకుడిగా రీ ఎంట్రీ ఇస్తున్న చిత్రం ఇది. మనిదన్ సినీ ఆర్ట్స్ పతాకంపై నిర్మలాదేవి జయమురుగన్ రూపొందిస్తున్న ఈ చిత్రానికి టి.ఎం.జయమురుగన్ కథ, కథనం, మాటలు, పాటలు, సంగీతం, దర్శకత్వం బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈయన ఇంతకుముందు రోజా మలరే, అడడా ఎన్న అళగు, సింధుబాద్ చిత్రాలను స్వీయ దర్శకత్వంలో నిర్మించారన్నది గమనార్హం. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి డబ్బింగ్ చెప్పిన నటుడు కార్తీక్ పేర్కొంటూ దర్శకుడు కథ చెప్పినప్పుడే అందులోని సత్తా తనకు అర్థం అయ్యిందన్నారు. తమిళ సంప్రదాయాన్ని, మన జీవన విధానాన్ని అందంగా తెరపై చూపించారన్నారు. చిత్రాన్ని ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా తెరకెక్కించారన్నారు. పాటల రూపకల్పన, చిత్రీకరణ తనను ఎంతగానో ఆకట్టుకున్నాయన్నారు. ఈ చిత్రం కోసం తాను నాలుగు పోరాట దృశ్యాల్లో నటించానని చెప్పారు. చాలా గ్యాప్ తరువాత నటించిన ఈ చిత్రం తన కెరీర్లో మంచి చిత్రాల్లో ఒకటిగా నిలుస్తుందని కార్తీక్ పేర్కొన్నారు. చదవండి: Andrew Garfield: బ్రేకప్ చెప్పుకున్న ప్రేమజంట, కారణమే విడ్డూరంగా ఉంది! -
‘ఎస్కేప్’ కార్తీక్ దొరికాడు.. 80 ఇళ్లలో చోరీ, 17వసారి అరెస్ట్
సాక్షి, బెంగుళూరు: చోరీ కేసులో అరెస్ట్ అవడం.. జైలు నుంచి లేదా, పోలీసుల అదుపులో నుంచి తప్పించుకొని మళ్లీ దొంగతనాలు చేయడం అతనికి అలవాటుగా మారింది. కర్ణాటకలోని కల్యాణ్ నగర్లో నివాసం ఉంటున్న 32 ఏళ్ల కార్తిక్ కుమార్ అలియాస్ (ఎస్కేప్ కార్తిక్)ను కామాక్షిపాళ్య పోలీసులు 17వసారి అరెస్ట్ చేశారు. ఇటీవల జరిగిన ఓ చోరీ కేసులో దర్యాప్తు చేసిన పోలీసులకు ఎస్కేప్ కార్తిక్ మళ్లీ పట్టుబడ్డాడు. అతని వద్ద ఉన్న సుమారు రూ.11లక్షలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 16 ఏళ్ల వయసు నుంచే కార్తిక్కు చోరీలు చేయటం అలవాటుగా మారిందని పోలీసులు పేర్కొన్నారు. సుమారు 80 ఇళ్లలో దొంగతనాలకు పాల్పడినట్లు పేర్కొన్నారు. రాత్రి వేళల్లో వీధుల గుండా తిరుగుతూ ముందుగానే రెక్కీ నిర్వహించిన ఇళ్లలోకి వెళ్లి చోరీలు చేస్తాడని పోలీసులు వివరించారు. 2008లో ఓ చోరీ కేసులో అరెస్టై పరప్పన అగ్రహార సెంట్రల్ జైలు ఉన్న సమయంలో భోజనం పంపిణీ చేసేందుకు వచ్చిన ఫుడ్ వ్యాన్లో దాక్కొని పారిపోయాడు. దీంతో అతనికి ‘ఎస్కేప్ కార్తీక్’ అనే పేరు వచ్చింది. పోలీసులు 45 రోజుల తర్వాత అతన్ని పట్టుకున్నారు. 2010లో మరోసారి కార్తిక్ పోలీసుల కస్టడీ నుంచి పారిపోయాడు. కామాక్షిపాళ్య పోలీసులు అతనిపై కేసు నమోదు చేసి.. బసవేశ్వర నగర్, కేపీ అగ్రహారాల్లో కూడా కేసులు నమోదైనట్లు గుర్తించారు. -
వ్యాయామం చేస్తూ కిందపడ్డ నటుడు, కాలికి గాయాలు
Karthik Hospitalised: సీనియర్ నటుడు కార్తీక్ బుధవారం ఆస్పత్రిలో చేరారు. కొంతకాలంగా కార్తీక్ రాజకీయాలకు స్వస్తి పలికి మళ్లీ సినిమాల్లో నటించడం మొదలెట్టారు. ఇటీవల ఆయన అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరి చికిత్స పొంది పూర్తి ఆరోగ్యంతో ఇంటికి చేరుకున్నారు. ఈ క్రమంలో బుధవారం ఉదయం ఇంట్లో వ్యాయామం చేస్తుండగా కిందపడిపోయారు. దీంతో ఆయన కాలికి బలంగా దెబ్బ తగలడంతో వెంటనే స్థానిక అడయార్లోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. ఇంతకుముందు ప్రమాదంలో తగిలిన కాలుకే దెబ్బ తగలడంతో వైద్యులు ఆయనకు అత్యవసర చికిత్స అందిస్తున్నారు. -
సీనియర్ నటుడికి అత్యవసర చికిత్స
చెన్నై: సీనియర్ నటులు కార్తీక్కు వైద్యులు అత్యవసర వైద్య చికిత్స అందిస్తున్నారు. బహుభాషా నటుడు కార్తీక్ చాలాకాలం క్రితమే రాజకీయ రంగప్రవేశం చేశారు. అయితే కొంతకాలం తర్వాత ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు. చాలా గ్యాప్ తర్వాత కార్తీక్ మళ్లీ సినిమాల్లో నటించడం మొదలు పెట్టారు. అలాంటిది ఇటీవల జరిగిన రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో ఆయన అన్నాడీఎంకే పార్టీకి ప్రచారం చేస్తారని ప్రకటించారు. అన్నట్టుగానే ప్రచారంలో పాల్గొన్న కార్తీక్ గత నెల 21న అనూహ్యంగా అనారోగ్యానికి గురయ్యారు. దీంతో ఆయన్ను కుటుంబ సభ్యులు స్థానిక ఒక ప్రైవేట్ హాస్పిటల్లో చేర్చారు. శ్వాస సంబంధిత సమస్యలతోపాటు, రక్తపోటు కారణంగా కార్తీక్ అనారోగ్యానికి గురైనట్లు వైద్యులు గుర్తించారు. దీంతో ఆయన కొన్ని రోజులు ఆస్పత్రిలోనే వైద్య చికిత్సలు పొంది ఆరోగ్యం చేకూరడంతో ఇంటికి వచ్చారు. ఆ తర్వాత కూడా కార్తీక్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. అలా ఇటీవల ప్రచార కార్యక్రమాలు ముగించుకొని తిరిగి రాగా మళ్లీ అనారోగ్యానికి గురయ్యారు. దీంతో కార్తీక్ను మళ్లీ ఆస్పత్రిలో చేర్చారు. ప్రస్తుతం ఆయన అత్యవసర చికిత్స వార్డులో చికిత్స పొందుతున్నారు. వైద్యులు ఆయనకు కరోనా పరీక్ష నిర్వహించగా నెగిటివ్ అని తేలింది. అయినా కార్తీక్ శ్వాసకోశ సమస్య తీవ్రత తగ్గలేదు. ప్రస్తుతం ఆయన వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు. చదవండి: మళ్లీ అనారోగ్యానికి గురైన సీనియర్ నటుడు కార్తీక్ -
మళ్లీ అనారోగ్యానికి గురైన సీనియర్ నటుడు కార్తీక్
చెన్నై: సీనియర్ నటుడు కార్తీక్ మరోసారి అనారోగ్యానికి గురయ్యారు. కార్తీక్ అనూహ్యంగా రాజకీయ రంగప్రవేశం చేసి సొంతంగా పార్టీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే కొంతకాలం తర్వాత రాజకీయాలకు దూరమైన ఆయన పార్టీని కూడా రద్దు చేశారు. ఇటీవల అన్నాడీఎంకే పార్టీకి మద్దతుగా ప్రచారం చేయనునట్లు ప్రకటించారు. కాగా కార్తీక్ అనూహ్యంగా అనారోగ్యానికి గురై గత నెల 21న చెన్నైలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేసిన వైద్యులు కార్తీక్ ను కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోవాల్సిందిగా సూచించారు. కార్తీక్ ఇటీవల మళ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. సోమవారం సాయంత్రం ప్రచారం ముగించుకుని ఇంటికి చేరుకున్న కార్తీక్ మరోసారి అనారోగ్యానికి గురయ్యారు. కుటుంబసభ్యులు వెంటనే ఆయన్ను అడయార్లోని ప్రైవేట్ హాస్పిటల్లో చేర్చారు. కార్తీక్ శ్వాసకోస సంబంధిత సమస్యతో పాటు, అధిక రక్తపోటుకు గురైనట్లు వైద్యులు తెలిపారు. చదవండి: కృతీ శెట్టి డ్యాన్స్ వీడియో చూశారా? -
ఆస్పత్రిలో సీనియర్ నటుడు
సాక్షి, చెన్నై: మనిద ఉరిమై కట్చి (మానవ హక్కుల పార్టీ) వ్యవస్థాపకుడు, సీనియర్ నటుడు కార్తీక్ అస్వస్థతకు లోనయ్యారు. ఆయనకు చెన్నైలోని ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. తెలుగు, తమిళ చిత్రాల్లో హీరోగా నటుడు కార్తీక్ సుపరిచితుడే. ఈయన వారసుడు సైతం ప్రస్తుతం సినిమాల్లోకి వచ్చారు. తాజాగా అప్పుడప్పుడు తెరపై కనిపించే కార్తీక్, ప్రస్తుతం రాజకీయ ప్రచారానికి సిద్ధమయ్యారు. మనిద ఉరిమై కట్చి వ్యవస్థాపకుడిగా ఉన్న కార్తీక్ తన మద్దతును అన్నాడీఎంకే–బీజేపీ కూటమికి ప్రకటించారు. ఈ పరిస్థితుల్లో ప్రచారం ముగించుకుని శనివారం రాత్రి ఇంటికి వెళ్లారు. అర్ధరాత్రి సమయంలో ఆయన అస్వస్థతకు లోనయ్యారు. శ్వాస సమస్య తలెత్తడంతో కుటుంబీకులు చెన్నై అడయార్లోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆయనకు చికిత్స అందిస్తున్నారు. కరోనా పరీక్ష నిర్వహించగా నెగటివ్ అని తేలింది. అయితే, ఆయనకు శ్వాససంబంధిత సమస్యలు ఉండడంతో పరీక్షలు నిర్వహించి చికిత్స అందిస్తున్నారు. సుధీష్కు పాజిటివ్.. డీఎండీకే నేత విజయకాంత్ బావ మరిది, ఆ పార్టీ సంయుక్త ప్రధాన కార్యదర్శి సుధీష్కు కరోనా పాజిటివ్ అని తేలింది. శనివారం రాత్రి ఆయన అస్వస్థతకు గురికావడంతో ఆస్పత్రికి తరలించారు. పరీక్షలో కరోనా నిర్ధారణ అయింది. దీంతో ఆయనతో సంప్రదింపుల్లో ఉన్న వారందరూ పరీక్ష చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. చదవండి: హీటెక్కిస్తున్న‘సీటీమార్’ పెప్సీ ఆంటీ సాంగ్ ఆలియా.. అచ్చం సాగర కన్య! -
ఉద్వేగం.. వినోదం
జగపతిబాబు ప్రధాన పాత్రలో, కార్తీక్, అమ్ము అభిరామి జంటగా బాల నటి సహశ్రిత మరో కీలక పాత్రలో నటించిన చిత్రం ‘ఫాదర్–చిట్టి–ఉమ–కార్తీక్’. విద్యాసాగర్ రాజు దర్శకత్వం వహించారు. శ్రీ రంజిత్ మూవీస్ ప్రొడక్షన్స్పై కె.ఎల్. దామోదర్ ప్రసాద్ నిర్మించారు. ఈ సినిమాను జనవరిలో విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా దామోదర్ ప్రసాద్ మాట్లాడుతూ– ‘‘కొంత విరామం తరువాత మళ్లీ వరుసగా సినిమాలు నిర్మించనున్నాను. ఇప్పటికే నాలుగు కథలను పూర్తి స్థాయిలో సిద్ధం చేయగా, వాటిలో ‘ఫాదర్–చిట్టి–ఉమ–కార్తీక్’ ఒకటి. కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన చిత్రమిది. కథానుసారమే టైటిల్ నిర్ణయించాం. థియేటర్లు ఇప్పుడిప్పుడే తెరుచుకుంటున్నాయి. మంచి చిత్రాలను కుటుంబ సమేతంగా థియేటర్లో చూసి ఆదరించే ప్రేక్షకుల నమ్మకాన్ని నిలబెట్టే విధంగా మా చిత్రం రూపొందింది’ అన్నారు. ‘‘ఫాదర్–చిట్టి–ఉమ–కార్తీక్ అనే పాత్రల మధ్య జరిగే ఈ చిత్రకథలో భావోద్వేగాలు, వినోదం సగటు సినిమా ప్రేక్షకుడిని అలరిస్తాయి’’ అన్నారు విద్యాసాగర్ రాజు. ఈ చిత్రానికి కెమెరా: శివ.జి, సంగీతం: భీమ్స్ సిసిరోలియో. -
ప్రేమ.. జీవితం.. పకోడి
కార్తీక్, సంచిత హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘లవ్..లైఫ్ అండ్ పకోడి’. ‘మధుర’ శ్రీధర్ సమర్పణలో జయంత్ గాలి స్వీయ దర్శకత్వంలో రూపొందించారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇటీవలే ఈ సినిమా ఫస్ట్ లుక్ను విడుదల చేశారు. ఈ సందర్భంగా జయంత్ గాలి మాట్లాడుతూ – ‘‘నేటి తరం యువతీయువకులు ఏ రిలేషన్ని అయినా కమిట్ కావడానికి భయపడతారు. కన్ఫ్యూజ్ అవుతారు. కరెక్టా? కాదా? అనే సందేహాల్లో ఊగిసలాడతారు. వారి మధ్య ఆకర్షణలు, ప్రేమలు ఉంటాయి. కానీ వారి బాండింగ్కి ఎలాంటి రిలేషన్తో ముడిపెట్టడానికి ఇష్టపడతారన్నదే మా సినిమా కథ. ఆధునిక సంస్కృతిలో యువతరం జీవనశైలిని ప్రతిబింబించే ఈ కథ తప్పకుండా యూత్కు కనెక్ట్ అవుతుందని నమ్ముతున్నాను. థియేటర్స్ రీ ఓపెన్ కాగానే మా సినిమా రిలీజ్ను ప్లాన్ చేసుకుంటాం’’ అని అన్నారు. ఈ సినిమాకు సంగీతం: పవన్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: వెంకట సిద్ధారెడ్డి. -
కార్తీక్ హత్య కేసు విచారణ వేగవంతం
సాక్షి, గద్వాల : జిల్లాలో సంచలనం సృష్టించిన కార్తీక్ హత్య.. మరో వివాహిత ఆత్మహత్య కేసు విచారణ వేగవంతమైంది. ఫిబ్రవరి 24న కార్తీక్ దారుణహత్య.. 27న వివాహిత ఆత్మహత్య ఈ రెండు ఘటనలకు కారణం వివాహేతర సంబంధంగా పోలీసులు తేల్చి చెప్పారు. అయితే కార్తీక్ హత్య కేసులో రిమాండ్కు వెళ్లిన నిందితులను గద్వాల పోలీసులు కోర్టు అనుమతితో అదుపులోకి తీసుకున్నారు. ఈమేరకు విచారణ అధికారి, శాంతినగర్ సీఐ వెంకటేశ్వర్లు, పట్టణ ఎస్ఐ సత్యానారాయణ విచారణ చేపట్టారు. కార్తీక్ హత్యకు గల కారణాలు ఏంటనే దానిపై విచారణ చేపట్టినట్లు విశ్వసనీయ సమాచారం. తనను బ్లాక్మెయిల్ చేస్తున్నాడని, ఎలాగైనా అడ్డుతొలగించుకోవాలని వివాహిత.. ఏ1 రవికుమార్కు చెప్పిందా? లేక అతనితో ఎందుకు చనువుగా ఉంటున్నావు అంటూ వివాహితను రవికుమార్ నిలదీయడం.. తదితర కారణాలు హత్యకు ప్రేరేపించాయా అన్నదానిపై విచారించినట్లు సమాచారం. ఈ అంశాలపై నిందితులైన ఏ1 రవికుమార్ అలియాస్ దొంగరవి, ఏ2 వసంత్, ఏ3 అనిల్, ఏ4 వీరేష్, ఏ5 సునీల్ను విచారించారించినట్లు తెలిసింది. నిర్మానుష్య స్థలంలో పూడ్చమని చెప్పిందెవరు? కార్తీక్ హత్యకు ముందు ఎవరెవరు ఎవరితో మాట్లాడారు, హత్య చేసిన క్రమంలో మృతదేహాన్ని నిర్మానుష్య స్థలంలో పూడ్చమని చెప్పిందెవరు అనే విషయాలపై విచారణ చేసినట్లు సమాచారం. కార్తీక్ కుటుంబ సభ్యులు చేసిన ఫిర్యాదుపై పెద్దపల్లి అజయ్కు మీకు (నిందితుల)కు సంబంధం ఏంటని ఆరా తీస్తున్నట్లు సమాచారం. గతంలోను రవికుమార్, పెద్దపల్లి అజయ్ మరికొంత మంది కార్తీక్ ఇంటికి వెళ్లి భయభ్రాంతులకు గురి చేశారనే అంశాలపై విచారించినట్లు తెలిసింది. మహబూబ్నగర్లోనూ విచారణ ఇదిలాఉండగా, హత్యకు ముందు కార్తీక్ను నిందితులు మహబూబ్నగర్లోని ఓ బార్ అండ్ రెస్టారెంట్లో కలిసిన విషయం విధితమే. మనం మనం మాట్లాడుకుందాం అంటూ.. కార్తీక్ను కారులో ఎక్కించుకొని గద్వాల పరిసరాలకు వచ్చాక హత్య చేసి పూడ్చి పెట్టారు. ఈమేరకు కేసు విషయంలో బార్ అండ్ రెస్టారెంట్ నిర్వాహకులను కలిసి ఆ రోజు మద్యం తాగేందుకు ఎంత మంది వచ్చారు, ఘర్షణ పడ్డారా అనే విషయమై వివరాలు రాబట్టారు. కార్తీక్ గ్రూప్లో నలుగురు, రవికుమార్ గ్రూప్లో నలుగురు మొత్తం 8 మంది అక్కడకు వచ్చరాని నిర్వాహకులు సమాధానం చెప్పినట్లు సమాచారం. దాడి చేసింది, సహకరించింది ఎవరెవరు అనే దానిపై పోలీసులు క్షుణ్ణంగా విచారణ చేస్తున్నారు. త్వరలో పూర్తి వివరాలు వెల్లడిస్తాం కార్తీక్ హత్య కేసుకు సంబంధిచిన విషయంలో కోర్టు అనుమతి మేరకు గురువారం రాత్రి ఐదుగురు నిందితులను కస్టడీలోకి తీసుకుని విచారించాం. కేసులోని పలు విషయాల నివృత్తి కోసం కస్టడీలోకి తీసుకున్నాం. అజయ్ ప్రాత్రపై ఇంకా తెలియాల్సి ఉంది. త్వరలో పూర్తి వివరాలు వెల్లడిస్తాం. ఐదుగురు నిందితులను శుక్రవారం సాయంత్రం గద్వాల కోర్టులో హాజరుపరచి రిమాండ్కు తరలించాం. మహబూబ్నగర్లోని బార్ అండ్ రెస్టారెంట్ నిర్వాహకుల నుంచి సైతం వివరాలు రాబట్టాం. – వెంకటేశ్వర్లు, సీఐ, శాంతినగర్ -
వీడిన కార్తీక్ హత్య కేసు మిస్టరీ
గద్వాల క్రైం: మహబూబ్నగర్, జోగుళాంబ గద్వాల జిల్లాలలో సంచలనం సృష్టించిన కార్తీక్ హత్య, రాగసుధ ఆత్మహత్య కేసు చిక్కుముడి వీడింది. వివాహేతర సంబంధం కారణంగానే కార్తీక్ హత్యకు గురయ్యాడని.. ఆ నేరం తనపైకి వస్తుందనే ఆందోళనతో రాగసుధ ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. గద్వాల డీఎస్పీ శ్రీనివాస్రెడ్డి శనివారం కేసు వివరాలు వెల్లడించారు. రాగసుధ, కార్తీక్ ఇంటర్లో క్లాస్మేట్స్.. రవి వీరి కంటే సీనియర్. కొన్నేళ్ల క్రితం రాగసుధకు మహబూబ్నగర్కు చెందిన ఉదయ్కుమార్తో వివాహమైంది. గతంలో రాగసుధకు కార్తీక్, రవితో ఉన్న పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారి తీసింది. అయితే రవితో చనువుగా ఉండటం గమనించిన కార్తీక్.. రాగసుధను వేధించసాగాడు. ఈ నేపథ్యంలో కార్తీక్ నుంచి తనకు విముక్తి కలిగించాలని రాగసుధ రవికి చెప్పింది. దీంతో అతను కార్తీక్ అడ్డు తొలగించాలనుకున్నాడు. ఫిబ్రవరి 24న కార్తీక్ రాగసుధకు ఫోన్ చేయగా.. ఆ విషయాన్ని ఆమె రవికి చెప్పింది. (ప్రాణాలు తీసిన ఫేస్బుక్ చాటింగ్) కార్తీక్ ఎక్కడున్నాడో ఫోన్ చేసి తెలుసుకున్న రవి.. అతనిని శ్రీనివాస్నగర్ కాలనీలోని ఓ బార్ అండ్ రెస్టారెంట్లో కలిశాడు. అక్కడ ఇద్దరూ ఘర్షణ పడ్డారు. ఆ తర్వాత అక్కడి నుంచి కార్తీక్తో పాటు మరో ఇద్దరు స్నేహితులు వసంత్, అనిల్ను రవి తన కారులో ఎక్కించుకుని రాత్రి ఒంటిగంట సమయంలో గద్వాల వెళ్లాడు. అక్కడ మరో మారు వాగ్వాదం జరిగింది. అప్పటికే మద్యం మత్తులో ఉన్న రవి.. కార్తీక్ తలపై ఇనుప రాడ్తో బలంగా కొట్టాడు. దీంతో స్పృహ తప్పిన కార్తీక్ను కారు డిక్కీలో వేసుకుని రవి నిర్వహిస్తున్న డెకరేషన్ షాప్ వద్దకు తీసుకెళ్లారు. తెల్లవారుజామున కార్తీక్ను లేపేందుకు ప్రయత్నించగా.. అప్పటికే చనిపోయినట్లు గుర్తించారు. దీంతో అదే కారులో మేలచెర్వు గుట్ట ప్రాంతానికి తీసుకెళ్లి పాతిపెట్టారు. మిస్సింగ్ కేసు నమోదుతో వెలుగులోకి.. కార్తీక్ 24వ తేదీన మహబూబ్నగర్కు వెళ్తున్నానని ఇంట్లో చెప్పి వెళ్లాడు. తమ కుమారుడు ఇంటికి రాకపోవడంతో అనుమానం వచ్చిన తండ్రి సూరిబాబు ఫిబ్రవరి 25న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన కుమారుడిని గద్వాలకు చెందిన కొంతమంది బెదిరిస్తున్నారని చెప్పడంతో సెల్ఫోన్ సిగ్నల్స్, కాల్డేటా ఆధారంగా అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారించారు. విచారణలో కార్తీక్ను హత్య చేసినట్లుగా రవికుమార్, వసంత్, అనిల్లు ఒప్పుకున్నారు. హత్యకు గురైన కార్తీక్ను పూడ్చిన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు మృతదేహాన్ని వెలికితీశారు. కుళ్లిన స్థితిలో ఉన్న మృతదేహానికి అక్కడే పోస్టుమార్టం చేసి, బంధువులకు అప్పగించారు. అయితే ఈ కేసులో మరో ఆరుగురు ఉన్నారని, వారిని కూడా త్వరలోనే అదుపులోకి తీసుకుంటామని డీఎస్పీ తెలిపారు. -
నలుగురు కుర్రాళ్ల కథ
హరీష్, వినోద్, కార్తీక్, వెంకట చరణ్ హీరోలుగా, గీత్ షా, సంజన, లాస్యశ్రీ హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘పంక్చర్’. చంద్రుడు క్రియేష¯Œ ్స సమర్పణలో శ్రీలక్ష్మి ప్రొడక్ష¯Œ ్స పతాకంపై శ్రీరంగం శేషశ్రీ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్నారు. ప్రేమికుల రోజు సందర్భంగా నిర్వహించిన ప్రెస్మీట్లో శ్రీరంగం శేషశ్రీ మాట్లాడుతూ– ‘‘ఇది నా మొదటి సినిమా. నలుగురు కుర్రాళ్ల మధ్య జరిగే పరిణామాల నేపథ్యంలోనే కథ ఉంటుంది. చక్కటి హాస్యంతో నిండిన కథతో రూపొందుతోంది’’ అన్నారు. ‘‘సమాజానికి ఉపయోగపడేలా మా సినిమా ఉంటుంది’’అన్నారు సమర్పకులు రాజు రాళ్లబండి. ‘‘ఈ సినిమాలో నాలుగు పాటలున్నాయి. చిన్న చిత్రాలను ప్రోత్సహించాలి’’ అన్నారు సంగీత దర్శకుడు అర్జున్. ‘‘వినోదంతో పాటు ఆలోచింపజేసే సినిమా ఇది’’ అన్నారు రచయిత సాయినాథ్. తనికెళ్ల భరణి, పోసాని కృష్ణమురళి, ఎల్బీశ్రీరామ్, జయప్రకాష్ రెడ్డి కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా:ఎస్. శ్రీనివాస్. -
రాజ్తరుణ్ కారు కేసు: కార్తీక్ రూ.3లక్షలకు బేరం
సాక్షి, అమరావతి: హీరో రాజ్తరుణ్ కారు ప్రమాదం వ్యవహారం కొత్త మలుపులు తిరుగుతోంది. నటుడు, రాజ్తరుణ్ మేనేజర్ రాజా రవీంద్ర తనపై వచ్చిన ఆరోపణలను తోసిపుచ్చారు. ఉద్దేశపూర్వకంగానే తనతో పాటు రాజ్తరుణ్పై కార్తీక్ తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడని ఆయన అన్నారు. ప్రమాదం జరిగిన తర్వాత వాట్సాప్ ద్వారా కార్తీక్ కొన్ని వీడియోలు పంపాడని, తనతో సంప్రదింపులు జరపాలని డిమాండ్ చేసినట్లు రాజా రవీంద్ర పేర్కొన్నారు. కార్తీక్ మొదట రూ.5 లక్షలు డిమాండ్ చేశాడని, ఆ తర్వాత రూ.3 లక్షలకు బేరం కుదుర్చుకున్నాడని అన్నారు. కార్తీక్ ఇప్పుడు ఉద్దేశపూర్వకంగానే తమపై ఆరోపణలు చేస్తున్నట్లు రాజా రవీంద్ర తెలిపారు. దీనిపై తాము న్యాయపరంగా ముందుకు వెళతామని ఆయన ... రాజ్తరుణ్ వీడియోలతో కార్తీక్ తమని బ్లాక్ మెయిల్ చేస్తున్నాడంటూ గురువారం సాయంత్రం మాదాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. చదవండి: రాజ్తరుణ్ కారు కేసులో కొత్త ట్విస్ట్ కాగా నార్సింగి పోలీస్స్టేషన్ పరిధిలోని అల్కాపూరిలో సోమవారం రాత్రి రాజ్ తరుణ్ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. అదే సమయంలో స్థానికంగా నివాసం ఉండే కార్తీక్ అనే యువకుడు తన సెల్ఫోన్లో చిత్రీకరించాడు. ప్రమాదం జరిగిన వెంటనే రాజ్ తరుణ్ కారు దిగి పరుగులు పెడుతున్నట్లు... అతడిని పట్టుకోగా...తాను మద్యం సేవించినట్టు, వదిలిపెట్టమని కోరిన దృశ్యాలు బయటకు వచ్చాయి. అయితే ఆ వీడియోలు ఇవ్వమని రాజా రవీంద్ర తనను ఫోన్లో బెదిరిస్తున్నాడంటూ కార్తీక్ మీడియా ముందుకు వచ్చాడు. తనకు ఐదు లక్షల రూపాయలు ఇస్తామని కూడా ప్రలోభపెట్టినట్లు చెప్పుకొచ్చాడు. అయితే ప్రమాదం జరిగి మూడు రోజులు గడిచినా.. రాజ్తరుణ్ను పోలీసులు విచారణ చేయలేదు. అంతేకాకుండా కేసు వివరాలను కూడా పోలీసులు పూర్తి స్థాయిలో వెల్లడించలేదు. అయితే తాను సీట్ బెల్ట్ పెట్టుకోవడం వల్లే కారు ప్రమాదం నుంచి బయటపడినట్లు రాజ్ తరుణ్ మీడియాకు ఓ మెసేజ్ పెట్టిన విషయం విదితమే. -
సినిమా థియేటర్లో హీరోపై దాడి..
బంజారాహిల్స్: జాతీయ గీతం ఆలపిస్తున్న సమయంలో సినిమా థియేటర్లో లేచి నిలబడలేదని తోటి ప్రేక్షకుడు ఓ యువకుడిపై దాడికి పాల్పడిన సంఘటన బంజారాహిల్స్ రోడ్ నెంబర్–2లోని ఆర్కే సినీప్లెక్స్ పీవీఆర్ సినిమాస్లో గురువారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. చిత్రపురి కాలనీకి చెందిన సినీనటుడు కార్తీక్ అడుసుమిల్లి గురువారం ఉదయం ఆర్కే సినీప్లెక్స్ పీవీఆర్ సినిమాస్లో హిప్పీ సినిమా చూసేందుకు వచ్చాడు.సినిమా ప్రారంభానికి ముందు జాతీయ గీతాన్ని ఆలపించగా ప్రతి ఒక్కరూ గౌరవ సూచకంగా లేచి నిలబడ్డారు. కార్తీక్ మాత్రం సీట్లోనే కూర్చున్నాడు. జాతీయ గీతం పూర్తయిన తర్వాత పక్క సీట్లో కూర్చున్న పద్మారావునగర్కు చెందిన వ్యాపారి ఆర్వీఎల్ శ్వేత్ హర్ష్ ఇదేం పద్ధతి అంటూ కార్తీక్ను నిలదీశాడు. దీన్ని సీరియస్గా తీసుకున్న కార్తీక్ అది తన ఇష్టమని, అడగడానికి నువ్వు ఎవరివంటూ అసభ్యంగా అతడిని దూషించాడు. దీంతో ఆగ్రహానికి లోనైన శ్వేత్ హర్ష్ కార్తీక్పై దాడి చేయడంతో ఇద్దరి మధ్య కొద్దిసేపు ఘర్షణ జరిగింది. దీంతో థియేటర్ నిర్వాహకులు, సెక్యూరిటీ గార్డులు అక్కడికి చేరుకొని వారిని శాంతింపజేశారు. ఐదు నిమిషాల తర్వాత కార్తీక్ మళ్లీ లేచి నన్నే కొడతావా అంటూ దూషించడంతో శ్వేత్ హర్ష్ మరోసారి అతడిపై దాడి చేయగా అక్కడే ఉన్న కార్తీక్ భార్య అతడిని అడ్డుకుంది. మాటామాటా పెరిగి వాగ్వాదం తీవ్రరూపం దాల్చడంతో ఉద్రిక్తత నెలకొంది. అనంతరం కార్తీక్ బంజారాహిల్స్ పోలీస్స్టేషన్కు వెళ్లి తనపై, తన భార్యపై దాడి చేసిన శ్వేత్ హర్ష్ పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశాడు. జాతీయ గీతం ఆలపిస్తున్న సమయంలో కూర్చోవడమే కాకుండా ఇదేమిటని అడిగినందుకు తనను దూషించిన కార్తీక్పై చర్యలు తీసుకోవాల్సిందిగా శ్వేత్ హర్ష్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇరువర్గాల ఫిర్యాదులను స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
నటుడి కుమారుడిపై బంజారాహిల్స్ పీఎస్లో ఫిర్యాదు
సాక్షి, హైదరాబాద్ : నటుడు ఆహుతి ప్రసాద్ కుమారుడు కార్తీక్ ప్రసాద్పై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు అందింది. ఆర్కే సినీప్లెక్స్లో చిత్ర ప్రారంభానికి ముందు జాతీయ గీతం వస్తుండగా కార్తీక్ ప్రసాద్ లేచి నిలబడలేదు. అక్కడున్న వారు జాతీయ గీతానికి గౌరవం ఇవ్వవా అని అడగడంతో కోపోద్రిక్తుడైన కార్తీక్ బూతులతో వారిపై మండిపడ్డాడు. దీంతో కార్తీక్ ప్రసాద్పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా, క్యాన్సర్తో ఆహుతి ప్రసాద్ నాలుగేళ్ల కిందటే మరణించిన విషయం తెలిసిందే. -
చెక్క పెట్టెలో చిన్నారుల మృతదేహాలు
సాక్షి, కాకినాడ : తూర్పు గోదావరి జిల్లా రాజవొమ్మంగి మండలం చిన్నయ్య పాలెం లో దారుణం చోటుచేసుకుంది. నాలుగు రోజుల క్రితం అదృశ్యమైన ఇద్దరు చిన్నారులు చివరికి చెక్క పెట్టెలో విగత జీవులుగా కనిపించారు. అనూహ్యంగా గ్రామంలోని పాడుబడిన పాఠశాలలో ఉన్న చెక్కపెట్టలో వీరిద్దరు శవాలుగా కనిపించారు. కాగా బేలెం ప్రశాంత్ కుమార్, చెడెం కార్తీక్ కనిపించడం లేదంటూ గత నెల 26న వారి తల్లిదండ్రులు జడ్డంగి పోలీసు స్టేషన్లో పిర్యాదు చేసారు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు కనిపించకుండా పోయిన చిన్నారుల గురించి వెతకటం ప్రారంభించారు. అయితే ఆడుకుంటూ వీరిద్దరూ పెట్టెలోకి దూరి ఉంటారని, మూత మూసుకుపోవడంతో బయటకు రాలేక చనిపోయి ఉంటారని భావిస్తున్నారు.పోలీసులు మృతదేహాలను పోస్ట్మార్టంకు తరలించారు. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి : అదృశ్యమైన ఇద్దరు చిన్నారులు పెట్టెలో.. -
అదృశ్యమైన ఇద్దరు చిన్నారులు పెట్టెలో..
-
అందరూ కనెక్ట్ అవుతారు
‘‘తమిళంలో ఘనవిజయం సాధించిన చిత్రం ‘కణా’. ఈ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయాలనుకున్నప్పుడు దర్శకునిగా భీమనేని శ్రీనివాసరావు అయితే కరెక్ట్ అనిపించింది. తనను సంప్రదించగానే ఇష్టంతో ‘కౌసల్య కృష్ణమూర్తి’ సినిమా చేశాడు’’ అని చిత్ర సమర్పకులు కేయస్ రామారావు అన్నారు. ఐశ్వర్యా రాజేశ్ టైటిల్ రోల్లో, రాజేంద్రప్రసాద్, కార్తీక్ ముఖ్య పాత్రల్లో నటించిన చిత్రం ‘కౌసల్య కృష్ణమూర్తి’. క్రియేటివ్ కమర్షియల్స్ మూవీ మేకర్స్ పతాకంపై భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో కె.ఎ. వల్లభ నిర్మించారు. ఈ సినిమా మోషన్ పోస్టర్ని భీమనేని విడుదల చేశారు. ఈ సందర్భంగా కేయస్ రామారావు మాట్లాడుతూ– ‘‘అందరూ కనెక్ట్ అయ్యే క్రికెట్ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రమిది. ఎన్టీఆర్, ఏఎన్ఆర్గార్ల టైమ్లో ‘అమరసందేశం’ వంటి మంచిసినిమాలో హీరోగా నటించిన దివంగత హీరో అమర్నాథ్ మనవరాలు, హీరో రాజేశ్ కుమార్తె ఐశ్వర్య ఈ సినిమా ద్వారా తెలుగుకి పరిచయం అవుతున్నారు. తను చాలా మంచి నటి. తెలుగు ఇండస్ట్రీకి మరో మంచి హీరోయిన్ వస్తోంది. తనతో మరో సినిమా కూడా చేయబోతున్నా. మా సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి కావస్తోంది. జూన్ చివరి వారంలో లేదా జూలై మొదటి వారంలో ఈ చిత్రాన్ని విడుదల చేస్తాం’’ అన్నారు. భీమనేని శ్రీనివాసరావు మాట్లాడుతూ– ‘‘ప్రేక్షకులు ఎప్పుడూ కొత్త కథలు కోరుకుంటారు. అలాంటి వాటికోసం వెతుకుతున్న టైమ్లో ‘కణా’ సినిమా చూశా. ఈ చిత్రం తెలుగు రీమేక్ కోసం చాలా మంది ప్రయత్నిస్తుంటే నా వరకూ వస్తుందా? అనుకున్నా. ఓ రోజు రామారావుగారు ఫోన్ చేసి ‘కణ’ రీమేక్ హక్కులు కొన్నాను, మనం చేద్దామనగానే చాలా సంతోషంగా అనిపించింది. వెంటనే ఆయన్ని కలిసి ‘ఈ కథ అంటే నాకు చాలా ఇష్టం సార్ చేద్దా’మన్నాను. ఓ సాధారణ రైతు కుటుంబంలో పుట్టిన అమ్మాయి క్రికెట్ నేర్చుకుని, అంతర్జాతీయ స్థాయిలో ఎలా రాణించింది? అన్నదే చిత్రకథ. ఇందులో తండ్రి, కూతురు మధ్య మంచి ఎమోషన్స్ ఉంటాయి. కథానాయిక తండ్రి పాత్రలో రాజేంద్రప్రసాద్గారు నటించారు. తెలుగమ్మాయి అయిన ఐశ్వర్యారాజేష్ ఇతర భాషల్లో నటిగా నిరూపించుకుని మా సినిమాతో తెలుగుకి పరిచయం అవుతున్నారు. తనలో చాలా ప్రతిభ ఉంది. ఎమోషనల్ సీ¯Œ ్స తీస్తున్నప్పుడు ఒక్కరోజు కూడా గ్లిజరిన్ వాడలేదు. తను పిలిస్తే కన్నీళ్లు వచ్చేస్తాయి’’ అన్నారు. కెమెరామెన్ ఆండ్రూ, ఆర్ట్ డైరెక్టర్ శివ శ్రీరాములు పాల్గొన్నారు. -
కార్తీక్కు మూడో స్థానం
సాక్షి, హైదరాబాద్: బ్యాంకాక్ చెస్ క్లబ్ ఓపెన్ అంతర్జాతీయ టోర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్మాస్టర్ కార్తీక్ వెంకటరామన్ మూడో స్థానాన్ని సంపాదించాడు. థాయ్లాండ్లో ఆదివారం ముగిసిన ఈ టోర్నీలో తిరుపతికి చెందిన 20 ఏళ్ల కార్తీక్ ఏడు పాయింట్లు సాధించాడు. నిర్ణీత తొమ్మిది రౌండ్లపాటు జరిగిన ఈ టోర్నీలో కార్తీక్తోపాటు మరో ముగ్గురు కూడా ఏడు పాయింట్లు సాధించారు. అయితే మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా ర్యాంక్ను వర్గీకరించగా కార్తీక్కు మూడో స్థానం ఖాయమైంది. 17 గ్రాండ్మాస్టర్లతో కలిపి మొత్తం 150 మంది పాల్గొన్న ఈ టోర్నీలో భారత్కే చెందిన దీప్సేన్ గుప్తా, జాన్ గుస్తాఫ్సన్ (జర్మనీ) 7.5 పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచారు. టైబ్రేక్ ఆధారంగా ర్యాంక్ను వర్గీకరించగా గుస్తాఫ్సన్ చాంపియన్గా అవతరించాడు. దీప్సేన్ గుప్తా రన్నరప్తో సరిపెట్టుకున్నాడు. ఆంధ్రప్రదేశ్కే చెందిన మరో గ్రాండ్మాస్టర్ లలిత్ బాబు 6.5 పాయింట్లతో తొమ్మిదో ర్యాంక్లో నిలిచాడు. -
ప్రి ఫైనల్ టీమ్ ఇదే!
ప్రతిష్టాత్మక వన్డే వరల్డ్ కప్కు ముందు జరగబోతున్న ఆఖరి సిరీస్... ఇక్కడ ఎంపికైతే దాదాపుగా ఇంగ్లండ్ టికెట్ ఖరారైనట్లే... దాంతో ఆస్ట్రేలియాతో తలపడే భారత వన్డే జట్టుపై అందరి దృష్టీ నెలకొంది. అటు క్రికెట్ విశ్లేషకులు, ఇటు అభిమానుల అంచనాలకు అనుగుణంగానే ఎలాంటి సంచలనాలు లేకుండా టీమ్ను సెలక్టర్లు ప్రకటించారు. రెండో వికెట్ కీపర్గా అనుభవజ్ఞుడైన దినేశ్ కార్తీక్కంటే దూకుడైన రిషభ్ పంత్కే ఓటు వేయడం ఒక్కటే కొంత ఆశ్చర్యకర నిర్ణయం కాగా... లోకేశ్ రాహుల్ బ్యాటింగ్ సమర్థతపై కూడా సెలక్షన్ కమిటీ నమ్మకముంచింది. ఈ ఎంపిక ద్వారా లెఫ్టార్మ్ పేసర్, రెగ్యులర్ ఆఫ్ స్పిన్నర్ అవసరం లేదని తేల్చేయగా... ఏదో ఒక మూల ఆశలు పెంచుకున్న రహానేను పట్టించుకోలేదు. ప్రపంచ కప్కు ఇదే తుది జట్టు కాదంటూ ఎమ్మెస్కే ప్రసాద్ మాట వరసకు చెప్పే ప్రయత్నం చేస్తున్నా... గాయాల సమస్య లేకపోతే ఇక మార్పులు ఉండకపోవచ్చు. ముంబై: దాదాపు మూడేళ్ల విరామం తర్వాత వన్డే జట్టులోకి వచ్చిన అనంతరం 2017 నుంచి దినేశ్ కార్తీక్ 20 మ్యాచ్లు ఆడి ఫర్వాలేదనిపించే ప్రదర్శన కనబర్చాడు. ఎక్కువ సందర్భాల్లో సుదీర్ఘ ఇన్నింగ్స్లు ఆడే అవకాశం రాకపోయినా... జట్టు అవసరాలకు అనుగుణంగా అతను కీలక సమయాల్లో వేర్వేరు స్థానాల్లో రాణించాడు. 2018లో కార్తీక్ వరుసగా 21, 33, 31 నాటౌట్, 1, 44, 37, 12, 25 నాటౌట్, 38 నాటౌట్, 0 పరుగులు చేశాడు. ఫినిషర్గా తన పాత్రకు న్యాయం చేశాడు. అయితే ఇది వరల్డ్ కప్ జట్టులోకి ఎంపికయ్యేందుకు సరిపోదని సెలక్టర్లు భావించినట్లున్నారు. కేవలం 3 వన్డేల అనుభవమే ఉన్నా... దూకుడులో ఈతరం ప్రతినిధిగా కనిపిస్తున్న రిషభ్ పంత్పైనే వారు దృష్టి పెట్టారు. మిడిలార్డర్లో ఒక ఎడంచేతి వాటం బ్యాట్స్మన్ బాగుంటుందని భావించడం కూడా అతనికి అదనపు బలంగా మారింది. సొంతగడ్డపై ఆస్ట్రేలియాతో తలపడే ఐదు వన్డేల సిరీస్ కోసం ఎమ్మెస్కే ప్రసాద్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ శుక్రవారం 15 మంది సభ్యుల భారత జట్టును ప్రకటించింది. ఇందులో పంత్కు స్థానం లభించగా... ఇటీవల ఆసీస్, కివీస్ పర్యటనల్లో ఉన్న కార్తీక్పై వేటు పడింది. ఇదొక్కటే కాస్త చర్చనీయాంశంగా మారిన ఎంపిక. విశ్రాంతి అనంతరం కెప్టెన్ విరాట్ కోహ్లి, పేసర్ జస్ప్రీత్ బుమ్రా తిరిగి జట్టులోకి వచ్చారు. ముందుగా అనుకున్నట్లుగా వైస్ కెప్టెన్ రోహిత్ శర్మకు మాత్రం విశ్రాంతి ఇవ్వలేదు. రెండు టి20 మ్యాచ్ల సిరీస్ కోసం ఎంపికైన టీమ్లో పంజాబ్ లెగ్ స్పిన్నర్ మయాంక్ మార్కండే ఒక్కడే కొత్త ఆటగాడు. కుల్దీప్ యాదవ్కు విశ్రాంతినిస్తూ మార్కండేకు అవకాశం కల్పించారు. రాహుల్కు పిలుపు... ప్రధాన ఓపెనర్లు కాకుండా రిజర్వ్ ఓపెనర్గా లోకేశ్ రాహుల్పై సెలక్టర్లు నమ్మకముుంచారు. గత పది వన్డేల్లో రాహుల్ ఒకే ఒక అర్ధసెంచరీ చేసినా... అతని బ్యాటింగ్ శైలి, ఏ స్థానంలోనైనా ఆడగలిగే సత్తా కూడా ఎంపికకు కారణమైంది. టీవీ షో వివాదం తర్వాత మైదానంలో తిరిగి అడుగు పెట్టిన అనంతరం ఇంగ్లండ్ లయన్స్తో మ్యాచ్లలో రాహుల్ రెండు అర్ధ సెంచరీలు చేశాడు. ఆల్రౌండర్ విజయ్ శంకర్కు కూడా అదృష్టం కలిసొచ్చింది. కొన్నాళ్ల క్రితం వరకు కూడా అసలు సీన్లోనే లేని అతను ఇటీవలి పరిమిత ప్రదర్శనతోనే సెలక్టర్లను ఆకట్టుకున్నాడు. ఖలీల్పై వేటు... వరల్డ్ కప్లో వైవిధ్యం కోసం ఒక లెఫ్టార్మ్ పేసర్ ఉంటే బాగుంటుందని భావించిన సెలక్టర్లు ఇటీవల ఖలీల్ అహ్మద్కు రెండు ఫార్మాట్లలోనూ వరుసగా అవకాశాలు ఇచ్చారు. అయితే ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ సిరీస్లలో అతను భారీగా పరుగులు ఇచ్చి అంచనాలు నిలబెట్టుకోలేకపోయాడు. దాంతో అతడిని తప్పించగా... ప్రత్యామ్నాయంగా కనిపించిన జైదేవ్ ఉనాద్కట్ పేరును కూడా పరిశీలించలేదు. ఆస్ట్రేలియాతో వన్డేలు ఆడిన ఆల్రౌండర్ రవీంద్ర జడేజాను కూడా పరిగణనలోకి తీసుకోలేదు. టి20 సిరీస్తో పాటు తొలి రెండు వన్డేలకు భువనేశ్వర్కు విశ్రాంతినిచ్చి అతని స్థానంలో వన్డేలకు మాత్రం సిద్ధార్థ్ కౌల్ను ఎంపిక చేశారు. ఐపీఎల్తో గుర్తింపు... పంజాబ్కు చెందిన 21 ఏళ్ల మయాంక్ మార్కండేకు తొలిసారి భారత జట్టు పిలుపు లభించింది. దేశవాళీ జట్టు పంజాబే అయినా ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ తరఫున ఆడటంతోనే ఈ లెగ్ స్పిన్నర్కు ప్రత్యేక గుర్తింపు లభించింది. 2018 ఐపీఎల్లో 14 మ్యాచ్లు ఆడిన అతను 8.36 ఎకానమీతో 15 వికెట్లు పడగొట్టాడు. ఇటీవల భారత్ ‘ఎ’ తరఫున లయన్స్పై ఆడిన రెండు వన్డేల్లో 5 వికెట్లు తీసిన అతను... టీమిండియాకు ఎంపికైన రోజే 5 వికెట్లతో లయన్స్పై రెండో అనధికారిక టెస్టులో భారత్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. దినేశ్ కార్తీక్కు దారులు మూసుకుపోలేదు. దీనికి ముందు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ సిరీస్లలో అతడిని ఆడించాం. ఆ సమయంలో పంత్కు విశ్రాంతినిచ్చాం. ఆ తర్వాత ఇంగ్లండ్ లయన్స్పై పంత్ బాగా ఆడాడు. అందుకే టి20 సిరీస్కు పంపించాం. వరల్డ్ కప్పై తుది నిర్ణయం తీసుకునే ముందు పంత్ను అందుకే కొన్ని వన్డేలు ఆడించాలని భావిస్తున్నాం. ఇటీవల కివీస్తో విజయ్ శంకర్ బాగా ఆడటంతో మా కూర్పు మార్చుకోవాల్సి వచ్చింది. అతను ఎంతో ప్రభావవంతమైన ఆటగాడు. తర్వాతి మ్యాచ్లు ఎలా ఆడతాడో చూస్తాం. మెగా టోర్నీకి ముందు అందరినీ పరీక్షించాలనేదే మా ప్రయత్నం. మరోవైపు వరల్డ్ కప్ కోసం 18 మందిని షార్ట్ లిస్ట్ చేశాం. వీరికి తగినంత విశ్రాంతినిస్తూ మ్యాచ్లు ఆడించే అంశంపై ఐపీఎల్ ఫ్రాంచైజీలతో చర్చించబోతున్నాం. – ఎమ్మెస్కే ప్రసాద్,సెలక్షన్ కమిటీ చైర్మన్ ఆస్ట్రేలియాతో టి20లకు భారత జట్టు కోహ్లి (కెప్టెన్), రోహిత్ శర్మ (వైస్ కెప్టెన్), ధావన్, రాహుల్, పంత్, దినేశ్ కార్తీక్, ధోని, హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా, విజయ్ శంకర్, చహల్, బుమ్రా, ఉమేశ్ యాదవ్, సిద్ధార్థ్ కౌల్, మయాంక్ మార్కండే. ఆస్ట్రేలియాతో వన్డేలకు భారత జట్టు కోహ్లి (కెప్టెన్), రోహిత్ శర్మ (వైస్ కెప్టెన్), శిఖర్ ధావన్, అంబటి రాయుడు, లోకేశ్ రాహుల్, ధోని, కేదార్ జాదవ్, హార్దిక్ పాండ్యా, విజయ్ శంకర్, రిషభ్ పంత్, షమీ, జస్ప్రీత్ బుమ్రా, యజువేంద్ర చహల్, కుల్దీప్ యాదవ్, సిద్ధార్థ్ కౌల్ (తొలి 2 వన్డేలకు), భువనేశ్వర్ (చివరి 3 వన్డేలకు). -
మెరుపు వేగం.. గెలుపు దాహం!
ఆ కుర్రాడు బైక్ ఎక్కాడంటే వాయువేగంతో దూసుకుపోవాల్సిందే. ప్రత్యర్థులు చిత్తు కావాల్సిందే. చాంపియన్షిప్ కొట్టాల్సిందే. చిన్నవయసులోనే జాతీయ, అంతర్జాయతీ స్థాయిలో పోటీల్లో జయకేతనం ఎగరవేస్తూ తెలంగాణకే వన్నె తెస్తున్నాడు నగరానికి చెందిన కార్తీక్ మాతేటి. గల్లీలో ప్రారంభమైన అతని ప్రస్థానం అంతర్జాతీయ చాంపియన్షిప్ను కైవసం చేసుకునే స్థాయికి చేరింది. 19 ఏళ్ల వయసులో మూడు నేషనల్ చాంపియన్షిప్లు, ఇంటర్నేషనల్ చాంపియన్షిప్ను కైవసం చేసుకుని వారెవ్వా అనిపించుకున్నాడు కార్తీక్. హిమాయత్నగర్ :చింతల్కు చెందిన సతీష్కుమార్, విజయలక్ష్మి దంపతుల కుమారుడు కార్తీక్. ప్రస్తుతం సోమాజిగూడలోని రూట్స్ కాలేజీలో బీకాం ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. బైక్ రేసింగ్ అంటే చిన్నప్పటి నుంచి ఆసక్తి ఉండటంతో రేసర్ కావాలనే కలలు కన్నాడు. అతను ఉండే గల్లీలో నిదానంగా హోండా యూనికార్న్తో బైక్ నడపడం నేర్చుకున్నాడు. ప్రొఫెషనల్గా తయ్యారయ్యేందుకు మూడేళ్ల సమయం పట్టింది. గల్లీలో ప్రారంభమైన తన ప్రస్థానం ఇటీవల ఢిల్లీలో జరిగిన అంతర్జాతీయ బైక్ రేసింగ్లో భారత్ తరఫున పాల్గొని చాంపియన్షిప్ను కైవసం చేసుకున్నాడు. అంతర్జాతీయ రేసింగ్లో సత్తా.. గత ఏడాది నవంబర్లో ఢిల్లీలో జరిగిన ‘ఏషియన్ కప్ ఆఫ్ రోడ్స్ రేజింగ్’ చాంపియన్షిప్ పోటీల్లో జపాన్, ఆస్ట్రేలియా, శ్రీలంక, ఫిలిప్పీన్, థాయ్లాండ్ల నుంచి ఇద్దరేసి చొప్పున పాల్గొన్నారు. మన దేశం నుంచి అదీ తెలుగు రాష్ట్రాల నుంచి కార్తీక్, మిజోరం నుంచి కుల్స్వామిలుపాల్గొన్నారు. 5.5 కి.మీ రేసింగ్ ట్రాక్పై పోటీలు నిర్వహించగా.. కార్తీక్ విజయం సాధించాడు. దీంతో ‘ఏషియన్ కప్ ఆఫ్ రోడ్స్ రేసింగ్’ చాంపియన్షిప్ను కైవసం చేసుకుని తెలుగోడి సత్తాను చాటాడు. మూడు నేషనల్స్లోనూ టాప్.. దేశవ్యాప్తంగా నిర్వహించిన మూడు చాంపియషిప్లలో కార్తీక్ విజయ కేతనం ఎగరవేశాడు. గత ఏడాది ఫిబ్రవరిలో చెన్నైలో ‘ఎండ్యురెన్స్’ చాంపియన్షిప్లో 3.7 కి.మీ ట్రాక్పై 19 నిమిషాల పాటు ఏకధాటిగా రేసింగ్ చేసి టైటిల్ సాధించాడు. టీవీఎస్ వన్ మేక్ 150–సీసీ చాంపియన్షిప్ని, యమహా– ఆర్15 చాంపియన్షిప్ను సొంతం చేసుకున్నాడు. హైదరాబాద్ నగరంలో నిర్వహించిన పల్సర్ కప్లో వరసగా రెండేళ్లు రుయ్మంటూ మనోడే టాప్లో నిలిచాడు. స్ఫూర్తి వలంటీనో.. నాకు ఇటాలియన్ బైకర్ వలంటీనో అంటే చాలా ఇష్టం. అతని వీడియోస్ చూసి ఇన్స్పైర్ అయ్యాను. అతి పిన్న వయసులో మూడు నేషనల్ చాంపియన్షిప్లతో పాటు ఒక ఇంటర్నేషనల్ చాంపియన్షిప్ను కైవసం చేసుకున్నా. భవిష్యత్లో జరిగే ప్రతి ఇంటర్నేషనల్ చాంపియన్షిప్లో పాల్గొని తెలంగాణ సత్తా చాటుతా. – కార్తీక్ -
కొత్త పార్టీని ప్రారంభించిన కార్తీక్
పెరంబూరు(చెన్నై): సీనియర్ నటుడు కార్తీక్ కొత్త పార్టీని ప్రారంభించారు. ఇంతకుముందు, ఫార్వర్డ్ బ్లాక్ పార్టీలో చేరి ఆ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలను నిర్వహించారు. ఆ తరువాత నాడాళుమ్ మక్కళ్ కట్చి పేరుతో సొంత పార్టీని నెలకొల్పారు. అప్పుడు బీజేపీతో పొత్తు పెట్టుకుని ఎన్నికల్లో పోటీచేసి డిపాజిట్లు కోల్పోయారు. ఆ తరువాత కార్తీక్ కొన్ని సమస్యల కారణంగా రాజకీయాలకు దూరం అయ్యారు. ఇటీవలే మళ్లీ నటించడం మొదలుపెట్టిన కార్తీక్ మనిద ఉరిమై కాక్కుం కట్చి పేరుతో మరో రాజకీయ పార్టీని ప్రారంభించారు. ఈ విషయాన్ని ఆయనే శనివారం నెల్లైలో మీడియా సమావేశంలో వెల్లడించారు. ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ తరువాత తాను సొంతంగా ప్రారంభించిన నాడాళుం మక్కళ్ కట్చిలోని సభ్యులే తనకు వెన్నుపోటు పొడిచారని ఆరోపించారు. అందుకే ఆ పార్టీని రద్దు చేసినట్లు చెప్పారు. -
అడంగుమరుతో అత్తగారికి స్వాగతం
అడంగు మరు చిత్రంతో వెండి తెరకు నిర్మాతగా అత్తగారికి స్వాగతం పలుకుతున్నట్లు నటుడు జయంరవి పేర్కొన్నారు. ఈయన నటించిన తాజా చిత్రం అడంగుమరు. రాశీఖన్నా నాయకిగా నటించిన ఈ చిత్రం ద్వారా కార్తీక్ తంగవేల్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. శ్యామ్.సీఎస్ సంగీతాన్ని, సత్యన్ సూర్యన్ ఛాయాగ్రహణం అందించిన ఈ చితాన్ని హోమ్ మూవీ మేకర్స్ పతాకంపై సుజాతా విజయకుమార్ నిర్మించారు. ఇంతకు ముందు బుల్లితెరకు పలు టీవీ.సీరియళ్లను నిర్మించిన ఈమె తొలిసారిగా చిత్ర నిర్మాతగా పరిచయం అవుతున్న చిత్రం అడంగుమరు. సుజాత విజయ్కుమార్ నటుడు జయం రవికి స్వయానా అత్త అన్నది గమనార్హం. ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని 21వ తేదీన తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. ఈ సందర్భంగా శనివారం ఉదయం చెన్నైలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పాల్గొన్న చిత్ర కథానాయకి రాశీఖన్నా మాట్లాడుతూ జయంరవికి జంటగా నటించడం మంచి అనుభవంగా పేర్కొంది. ఆయన చాలా స్వీట్ పర్సన్ అని, సహ నటుడిగా ఈ చిత్రంలో చాలా సహకరించారని చెప్పింది. నిజం చెప్పాలంటే జయంరవి నుంచి తాను చాలా నేర్చుకున్నానని అంది. నటిగా అడంగుమరు చిత్రం తనకు చాలా ముఖ్యమైనదని పేర్కొంది. తన పాత్ర చాలా డిఫెరెంట్గా ఉంటుందని చెప్పింది. ఇంత మంచి అవకాశాన్ని కల్పించిన దర్శక నిర్మాతలకు, నటుడు జయం రవికి కృతజ్ఞతలు అని చెప్పుకుంటున్నానని అంది. కథానాయకుడు జయంరవి మాట్లాడుతూ దర్శకుడు కార్తీక్తంగవేల్ను తన అత్త సుజాత జయకుమార్ తన వద్దకు పంపి కథ చెప్పమనడంతో సరేనన్నానని, అయితే కార్తీక్తంగవేల్ చూడగానే అరే నువ్వా అని అన్నానన్నారు. కారణం తన తాను నటించిన ఇదయ తిరుడన్ చిత్రం ద్వారా సహాయ దర్శకుడిగా పరిచయమైన వ్యక్తి అని చెప్పారు. తన అత్త సుజాత విజయకుమార్ విన్న తొలి కథనే ఎలా ఒకే చేశారనే అనుమానంతోనే తానూ కథను విన్నానని చెప్పారు. అయితే దర్శకుడు కార్తీక్తంగవేల్ చెప్పిన కథ తనకు బాగా నచ్చిందన్నారు. అయితే కాస్త వయిలెన్స్ ఉండడంతో దానికి తేనె పూసినట్లు మార్చి రూపొందించినట్లు తెలిపారు. అడంగుమరు చిత్రం ద్వారా తన అత్తగార్ని వెండితెరకు పరిచయం చేస్తున్నందుకు సంతోషంగా ఉందని ఇందులో ఈ తరానికి అవసరమైన మంచి సందేశం ఉంటుందని చెప్పారని జయంరవి అన్నారు. -
స్పిన్తో ‘సిడ్నీ’ వశం
ఆస్ట్రేలియా గడ్డపై తొలి అంకాన్ని భారత్ విజయవంతంగా ముగించింది. దురదృష్టవశాత్తూ తొలి మ్యాచ్లో చేజారిన విజయం, రెండో మ్యాచ్ రద్దు తర్వాత తమ అసలు సత్తాను ప్రదర్శించి సిరీస్ను సమం చేసింది. ఆసీస్ గడ్డపై దాదాపు సొంత మైదానంలాంటి సిడ్నీలో 37,339 మంది ప్రేక్షకుల్లో సగానికంటే ఎక్కువ మంది టీమిండియాకు మద్దతు పలుకుతుండగా భారత్ గెలుపు తీరం చేరింది. ముందుగా కుల్దీప్ స్పిన్ను ఎదుర్కోలేక ఒత్తిడికి లోనైన ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్ మరో స్పిన్నర్ కృనాల్ పాండ్యాపై ఎదురుదాడి చేయబోయి నాలుగు వికెట్లు సమర్పించుకోవడంతో భారీ స్కోరుకు దూరమైంది. అనంతరం ఓపెనర్ల దూకుడుకు తోడు విరాట్ కోహ్లి తనదైన శైలిలో చివరి వరకు నిలిచి జట్టును గెలిపించాడు. కంగారూలు ఒక్క సిక్స్ కూడా కొట్టలేక పేలవంగా ఆడితే... భారత్ ఏకంగా ఎనిమిది సిక్సర్లు బాది ఇరు జట్ల మధ్య తేడా ఏమిటో చూపించింది. సిడ్నీ: భారత్, ఆస్ట్రేలియా మధ్య మూడు టి20 మ్యాచ్ల సిరీస్ 1–1తో సమంగా ముగిసింది. ఆదివారం ఇక్కడ జరిగిన చివరి మ్యాచ్లో భారత్ 6 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాపై ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. డార్సీ షార్ట్ (29 బంతుల్లో 33; 5 ఫోర్లు), ఆరోన్ ఫించ్ (23 బంతుల్లో 28; 4 ఫోర్లు) రాణించారు. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ కృనాల్ పాండ్యా (4/36), కుల్దీప్ యాదవ్ (1/19) ప్రత్యర్థి పతనాన్ని శాసించారు. అనంతరం భారత్ 19.4 ఓవర్లలో 4 వికెట్లకు 168 పరుగులు చేసింది. విరాట్ కోహ్లి (41 బంతుల్లో 61 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధ సెంచరీ సాధించగా, శిఖర్ ధావన్ (22 బంతుల్లో 41; 6 ఫోర్లు, 2 సిక్సర్లు) ధాటిని ప్రదర్శించాడు. రెండు ఇన్నింగ్స్లలో కలిపి 117 పరుగులు చేసిన ధావన్కు ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’ అవార్డు దక్కింది. ఈ పర్యటనలో టెస్టు సిరీస్కు ముందు భారత్ ఈ నెల 29 నుంచి ఇదే మైదానంలో జరిగే నాలుగు రోజుల మ్యాచ్లో క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) ఎలెవన్తో తలపడుతుంది. కుల్దీప్ కట్టడి... ఆస్ట్రేలియాకు ఓపెనర్లు షార్ట్, ఫించ్ శుభారంభం అందించారు. ప్రతీ ఓవర్లో వీరిద్దరు కనీసం ఒక ఫోర్ కొట్టడంతో పవర్ప్లే ముగిసేసరికి స్కోరు 49 పరుగులకు చేరింది. అనంతరం పాండ్యా వేసిన తొలి బంతికి ఫించ్ (22 వద్ద) ఇచ్చిన క్యాచ్ను లాంగాన్లో రోహిత్ వదిలేశాడు. ఆ ఓవర్లో ఆసీస్కు 12 పరుగులు లభించాయి. తొలి వికెట్కు 51 బంతుల్లో 68 పరుగులు జోడించిన తర్వాత కుల్దీప్ ఈ జోడీని విడదీశాడు. స్వీప్ షాట్ ఆడబోయి పాండ్యాకు ఫించ్ క్యాచ్ ఇచ్చాడు. అదే ఓవర్లో మ్యాక్స్వెల్ను అంపైర్ ఔట్గా ప్రకటించినా... రివ్యూలో అతను బతికి పోయాడు. అయితే తర్వాతి ఓవర్లో ఆసీస్ను పాండ్యా దెబ్బ తీశాడు. స్వీప్ షాట్లు ఆడబోయి వరుస బంతుల్లో షార్ట్, మెక్డెర్మట్ (0) వెనుదిరిగారు. పాండ్యా తన తర్వాతి ఓవర్లో మ్యాక్స్వెల్ (13)ను కూడా ఔట్ చేశాడు. అతని చివరి ఓవర్లో వరుస బంతుల్లో రెండు ఫోర్లు కొట్టిన అలెక్స్ కారీ (19 బంతుల్లో 27; 4 ఫోర్లు) తర్వాతి బంతికి డీప్లో క్యాచ్ ఇచ్చాడు. బుమ్రా చక్కటి ఫీల్డింగ్కు లిన్ (13) రనౌట్ కావడం ఆసీస్ పరిస్థితిని దిగజార్చింది. ఈ దశలో స్టొయినిస్ (15 బంతుల్లో 25 నాటౌట్; 3 ఫోర్లు), కూల్టర్నీల్ (7 బంతుల్లో 13 నాటౌట్; 2 ఫోర్లు) దూకుడుగా ఆడి జట్టుకు గౌరవప్రదమైన స్కోరు అందించారు. వీరిద్దరు చివరి 16 బంతుల్లో 33 పరుగులు రాబట్టారు. ఇన్నింగ్స్లో ఒక్క సిక్సర్ కూడా లేకుండా ఒక జట్టు సాధించిన అత్యధిక స్కోరు ఆసీస్దే కావడం గమనార్హం. ఓపెనర్ల జోరు... లక్ష్య ఛేదనలో భారత్ రెండుసార్లు ఒకే స్కోరు వద్ద రెండేసి వికెట్లు కోల్పోయినా... మొత్తంగా టాప్–3 ఆటగాళ్ల బ్యాటింగ్ ప్రదర్శనే మళ్లీ జట్టును గెలిపించింది. మరోసారి ఓపెనర్లు ధావన్, రోహిత్ (16 బంతుల్లో 23; 1 ఫోర్, 2 సిక్సర్లు) దూకుడుగా ఆటను మొదలు పెట్టారు. అయితే రెండేళ్ల తర్వాత తొలి అంతర్జాతీయ టి20 మ్యాచ్ ఆడుతున్న స్టార్క్ ఆరంభంలో కొంత ఇబ్బంది పెట్టాడు. అతని తొలి 11 బంతుల్లో భారత్ 7 పరుగులు మాత్రమే చేయగలిగింది. అయితే స్టార్క్ వేసిన మూడో ఓవర్ చివరి బంతికి ధావన్ అద్భుతమైన ఆఫ్డ్రైవ్తో ఫోర్ కొట్టడంతో జోరు మొదలైంది. తర్వాతి రెండు ఓవర్లలో జట్టు 4 సిక్సర్లు, 3 ఫోర్లతో ఏకంగా 42 పరుగులు రాబట్టడం విశేషం. కూల్టర్నీల్ ఓవర్లో రోహిత్ సిక్స్ బాదగా, ధావన్ వరుసగా 6, 4 కొట్టాడు. తొలి టి20 చివరి ఓవర్లో భారత్ను నిలువరించి హీరోగా మారిన స్టొయినిస్ను ఈసారి మన బ్యాట్స్మన్ చితక్కొట్టారు. అతను వేసిన ఏకైక ఓవర్లో రోహిత్ సిక్సర్, ధావన్ వరుసగా 6, 4, 4 కొట్టడంతో 22 పరుగులు లభించాయి. అయితే స్టార్క్ చక్కటి బంతితో ధావన్ను ఎల్బీగా ఔట్ చేయడంతో 67 పరుగుల (33 బంతుల్లో) తొలి వికెట్ భాగస్వామ్యానికి తెర పడింది. జంపా వేసిన తర్వాత ఓవర్లో వరుసగా నాలుగు డాట్ బంతులు ఆడిన రోహిత్ ఐదో బంతిని వికెట్లపైకి ఆడుకున్నాడు. భారీ సిక్సర్తో ఖాతా తెరిచిన రాహుల్ (20 బంతుల్లో 14; 1 సిక్స్) ఎక్కువసేపు నిలబడలేకపోగా, తొలి బంతికే రిషభ్ పంత్ (0) కూడా వెనుదిరిగాడు. ఈ దశలో భారత్ 41 బంతుల్లో 57 పరుగులు చేయాల్సి ఉండటంతో కొంత ఉత్కంఠ నెలకొంది. తర్వాతి 12 బంతుల్లో 6 పరుగులు మాత్రమే రావడంతో లక్ష్యం 29 బంతుల్లో 51 పరుగులుగా మారింది. అయితే ఛేజింగ్ మాస్టర్ కోహ్లి ప్రత్యర్థికి మరో అవకాశం ఇవ్వలేదు. టై ఓవర్లో వరుసగా 4, 6 కొట్టిన కోహ్లి తర్వాతి ఓవర్లో మరో సిక్సర్ బాదాడు. కార్తీక్ కూడా ఐదు బంతుల వ్యవధిలో సిక్స్, ఫోర్ కొట్టడంతో భారత్ పని సులువైంది. చివరి ఓవర్లో గెలిచేందుకు 6 పరుగులు కావాల్సి ఉండగా కోహ్లి వరుసగా రెండు ఫోర్లు కొట్టి రెండు బంతుల ముందే ఆట ముగించాడు. చివరి వరకు అండగా నిలిచిన దినేశ్ కార్తీక్ (18 బంతుల్లో 22 నాటౌట్; 1 ఫోర్, 1 సిక్స్)తో ఐదో వికెట్కు కోహ్లి 39 బంతుల్లోనే అభేద్యంగా 60 పరుగులు జత చేశాడు. స్కోరు వివరాలు ఆస్ట్రేలియా ఇన్నింగ్స్: షార్ట్ (ఎల్బీ) (బి) కృనాల్ 33; ఫించ్ (సి) కృనాల్ (బి) కుల్దీప్ 28; మ్యాక్స్వెల్ (సి) రోహిత్ (బి) కృనాల్ 13; మెక్డెర్మట్ (ఎల్బీ) (బి) కృనాల్ 0; కారీ (సి) కోహ్లి (బి) కృనాల్ 27; లిన్ (రనౌట్) 13; స్టొయినిస్ (నాటౌట్) 25; కూల్టర్నీల్ (నాటౌట్) 13; ఎక్స్ట్రాలు 12; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 164. వికెట్ల పతనం: 1–68; 2–73; 3–73; 4–90; 5–119; 6–131. బౌలింగ్: భువనేశ్వర్ 4–0–33–0; ఖలీల్ 4–0–35–0; బుమ్రా 4–0–38–0; కుల్దీప్ 4–0–19–1; కృనాల్ 4–0–36–4. భారత్ ఇన్నింగ్స్: రోహిత్ (బి) జంపా 23; ధావన్ (ఎల్బీ) (బి) స్టార్క్ 41; కోహ్లి (నాటౌట్) 61; రాహుల్ (సి) కూల్టర్ నీల్ (బి) మ్యాక్స్వెల్ 14; పంత్ (సి) కారీ (బి) టై 0; కార్తీక్ (నాటౌట్) 22; ఎక్స్ట్రాలు 7; మొత్తం (19.4 ఓవర్లలో 4 వికెట్లకు) 168. వికెట్ల పతనం: 1–67; 2–67; 3–108; 4–108. బౌలింగ్: స్టార్క్ 4–0–26–1; కూల్టర్నీల్ 3–0–40–0; స్టొయినిస్ 1–0–22–0; జంపా 4–1–22–1; మ్యాక్స్వెల్ 4–0–25–1; టై 3.4–0–32–1. సిరీస్ 1–1తో సమం చేయడాన్ని బట్టి చూస్తే ఇరు జట్లు ఎలా ఆడాయో అంచనా వేయవచ్చు. ఇది మా ప్రదర్శనను ప్రతిబింబిస్తోంది. మొత్తంగా ఈ రోజు మేం ఆస్ట్రేలియాపై అన్ని రంగాల్లో ఆధిపత్యం ప్రదర్శించాం. కనీసం 180 పరుగులు చేయాల్సిన ఈ పిచ్పై మిగిలిన ఆ 15 పరుగులను నిరోధించడంలోనే గెలుపు దాగి ఉంది. ఓపెనర్లు చెలరేగితే మా పని మరింత సులువు అవుతుంది. దినేశ్ కార్తీక్ కూడా చివర్లో చాలా బాగా ఆడాడు. –విరాట్ కోహ్లి 14: భారత్ తరఫున ఛేదనలో 14 సార్లు కోహ్లి నాటౌట్గా నిలవగా... అన్ని మ్యాచ్లలోనూ జట్టు నెగ్గింది. 1:ఆసీస్ గడ్డపై టి20ల్లో అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు (4/36) నమోదు చేసిన స్పిన్నర్గా కృనాల్ పాండ్యా గుర్తింపు పొందాడు. -
మనసున్న డాక్టర్
అనంతపురం, కదిరి: ఈ చిన్నారి పేరు కార్తీక్. వయస్సు 12ఏళ్లు. పుట్టుకతోనే బుద్ధిమాంద్యం, అంగవైకల్యంతో జన్మించాడు. చిన్నారికి రెండేళ్లు కూడా నిండకనే తల్లి భారతి కడుపునొప్పితో కన్నుమూసింది. తండ్రి మల్లికార్జున బేల్దారి పనిచేస్తూ ఇంటికి వారానికో 10 రోజులకో వచ్చి వెళ్తుంటాడు. పిల్లాడి బాధ్యతలన్నీ అవ్వ(నాన్మమ్మ) వెంకటమ్మ చూసుకుంటోంది. ఈమెకు 80 ఏళ్లు. తనకు వచ్చే రూ.1000 పింఛన్తోనే కుటుంబాన్ని పోషిస్తూ చిన్నారి బాగోగులు కూడా చూస్తోంది. 90 శాతం అంగవైకల్యం సర్టిఫికెట్ చేతబట్టుకొని మనవడికి పింఛను ఇప్పించాలని ఈ అవ్వ తొక్కని గడపంటూ లేదు. తిరగని కార్యాలయం అంటూ లేదు. ‘నీకు రూ.1000 పింఛను ఇస్తున్నాం కదా.. మళ్లీ నీ మనవడికి కూడానా..? అలా కుదరదు. నువ్వు చస్తే నీ మనవడికి పింఛన్ వస్తుంది. లేదంటే కుదరదు.’ అని తెలుగుదేశం పార్టీకి చెందిన ఓ స్థానిక నాయకుడు అన్నట్లు ఈ అవ్వ వాపోతోంది. ‘వాడి పింఛన్ కోసం నేను చావాలంట నాయనా.. నేను చస్తే వీడికి దిక్కెవరు? వీడికి అమ్మ లేదు. వీళ్ల నాయన అమావాస్యకో, పున్నానికో వస్తాడు..’ అని కన్నీరు పెట్టింది. ఈ పరిస్థితుల్లో ‘గుడ్మార్నింగ్ కదిరి’ కార్యక్రమంలో భాగంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కదిరి నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ పీవీ సిద్దారెడ్డి గురువారం అమీన్నగర్లో గడపగడపకూ వెళ్లి ప్రజల కష్టసుఖాలు తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఇదే సమయంలో తన కంటపడిన ఈ దివ్యాంగుడిని పలకరించాడు. అక్కడే ఉన్న ఓ మహిళ ‘సార్ పిల్లోడికి మాటలు రావు.. బుద్ధిమాద్యం’ అని చెప్పింది. పింఛన్ కోసం ఆ పిల్లోడి అవ్వ తిరిగి తిరిగి వేసారింది. ఎవ్వరూ పట్టించుకోలేదని ఆయన దృష్టికి తీసుకొచ్చింది. పిల్లాడికి సంబంధించిన అంగవైకల్యం సర్టిఫికెట్ను డాక్టర్ సిద్దారెడ్డి పరిశీలించారు. 90 శాతం అంగవైకల్యం ఉందే.. అంటూ పింఛన్ ఎందుకివ్వలేదని ఆరా తీశారు. ‘సరే.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఈ అబ్బాయికి నెలకు రూ.3 వేల పింఛన్ ఇప్పిస్తాం. అంత వరకు నేనే నెలకు రూ.2 వేలు చొప్పున పింఛన్ రూపంలో నగదు ఇస్తా’ అని హామీ ఇచ్చారు. సిద్ధారెడ్డి నిర్ణయం పట్ల ఆ వీధి ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ తామంతూ మీవెంటే ఉంటామని ఆశీర్వదించారు. -
నేటి నుంచే దేవధర్ ట్రోఫీ
న్యూఢిల్లీ: ఉనికి చాటేందుకు అటు సీనియర్లకు, సత్తా నిరూపించుకునేందుకు ఇటు కుర్రాళ్లకు మరో అవకాశం. ఢిల్లీ వేదికగా మంగళవారం నుంచే దేవధర్ ట్రోఫీ వన్డే టోర్నీ. టీమిండియా వన్డే జట్టులోకి పునరాగమనం ఆశిస్తున్న అజింక్య రహానే, రవిచంద్రన్ అశ్విన్, దినేశ్ కార్తీక్లకు ఈ టోర్నీ కీలకంగా మారనుంది. దీంతోపాటు న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లనున్న భారత్ ‘ఎ’కు ఎంపికయ్యేందుకు కుర్రాళ్లకూ ఓ వేదిక కానుంది. మంగళవారం జరిగే తొలి లీగ్ మ్యాచ్లో భారత్ ‘ఎ’తో భారత్ ‘బి’ తలపడుతుంది. ఈ టోర్నీలో భాగంగా ప్రతి జట్టు రెండేసి మ్యాచ్లు ఆడుతుంది. ఫైనల్ 27న జరుగుతుంది. అశ్విన్, పృథ్వీ షా, కరుణ్ నాయర్, కృనాల్ పాండ్యా, మొహమ్మద్ సిరాజ్లతో కూడిన భారత్ ‘ఎ’ జట్టుకు దినేశ్ కార్తీక్ సారథిగా వ్యవహరించనున్నాడు. శ్రేయస్ అయ్యర్ ఆధ్వర్యంలోని ‘బి’ జట్టులో మయాంక్ అగర్వాల్, హనుమ విహారి, రోహిత్ రాయుడు, దీపక్ చహర్లకు స్థానం దక్కింది. రహానే కెప్టెన్గా ఉన్న ‘సి’ జట్టులో సురేశ్ రైనా, అభినవ్ ముకుంద్, శుబ్మన్ గిల్, ఆర్. సమర్థ్, వాషింగ్టన్ సుందర్ తదితర ఆటగాళ్లున్నారు. -
హిమాచల్ టు పుణే
వరదల కారణంగా హిమాచల్ ప్రదేశ్ మనాలిలో షూటింగ్ షెడ్యూల్ను ‘దేవ్’ మూవీ టీమ్ రద్దు చేసుకున్న సంగతి తెలిసిందే. వరదల వల్ల చిత్రనిర్మాత లక్ష్మణ్కు దాదాపు కోటిన్నర నష్టం వాటిల్లిందట. కార్తీ హీరోగా రజత్ రవిశంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న తమిళ సినిమా ‘దేవ్’. ఇందులో రకుల్ప్రీత్ సింగ్ కథానాయికగా నటిస్తున్నారు. సీనియర్ నటుడు కార్తీక్, రమ్యకృష్ణ కీలక పాత్రలు చేస్తున్నారు. హిమాచల్ షెడ్యూల్ని ఆపేసిన నేపథ్యంలో తదుపరి పుణేలో ప్లాన్ చేశారు. ఇప్పుడీ టీమ్ అక్కడే ఉంది. ఈ షూట్లో జాయిన్ అయ్యారు రకుల్ప్రీత్ సింగ్. ఈ షెడ్యూల్లో హీరో, హీరోయిన్ల పై కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించడంతో పాటుగా ఓ సాంగ్ను కూడా షూట్ చేస్తారు. మనాలి షూటింగ్ క్యాన్సిల్ అవ్వడం వల్ల సినిమా షూటింగ్ ఆలస్యం అవ్వకూడదని అనుకున్న టైమ్లో కంప్లీట్ చేయాలని చిత్రబృందం రెట్టించిన ఉత్సాహంతో పని చేస్తోందట. -
అమ్మ బహుమతే ప్రపంచ స్థాయికి ప్రేరణ
చిత్తూరు, తిరుపతి సిటీ :ఎనిమిదేళ్ల ప్రాయంలో ఆ బాలుడికి తల్లి ఇచ్చిన పుట్టినరోజు బహుమతి ప్రపంచ స్థాయి క్రీడాకారునిగా ఎదిగేందుకు ప్రేరణ కలిగింది. ఆ ప్రేరణతోనే తిరుపతికి చెందిన 19 ఏళ్ల కార్తీక్ వెంకట్రామన్ చెస్ ఆటలో ‘గ్రాండ్ మాస్టర్’ (2,520 రేటింగ్) స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. మరో ఏడాది లోపు ‘సూపర్ గ్రాండ్ మాస్టర్’ రేటింగ్ తెచ్చుకోవాలన్నదే తన ముందున్న లక్ష్యమని తన మనసులోని మాటను చెప్పుకొచ్చాడు. చెస్ ఆటలో ఊహకందని ఎత్తులు వేస్తూ.. తనకంటే మెరుగైన బ్లిడ్జ్, ర్యాపిడ్, క్లాసికల్ విభాగాల్లో ఉన్న ఆటగాళ్లను చిత్తుచేస్తూ విజయాలను సొంతం చేసుకుంటూ వచ్చాడు. తాజాగా ఈ నెల 4 నుంచి 16వ తేది వరకు టర్కీలో జరిగిన చెస్ ప్రపంచ స్థాయి జూనియర్ చాంపియన్ షిప్ పోటీల్లో పాల్గొని 4వ గ్రాండ్ మాస్టర్ స్థానం దక్కించుకున్నాడు. ప్రస్తుతం తిరుపతిలోని ఒక ప్రయివేట్ డిగ్రీ కళాశాలలో బీకాం ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. కార్తీక్ వెంకట్రామన్ ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలు వెల్లడించాడు. సాక్షి : మీ కుటుంబ నేపథ్యమేంటి..? కార్తీక్ : మా తల్లిదండ్రులు ప్రవీణకుమారి, వెంకట్రామన్ పాకాల మండల కేంద్రంలోని సత్యమ్మగుడి వీధిలో నానమ్మ, తాతయ్యతో కలసి ఉండేవారు. అమ్మానాన్న మా చదువుల కోసం తిరుపతికి వచ్చి స్థిరపడ్డారు. నాన్న విజయభారతి టీవీఎస్ షోరూం, విజయభారతి టాటా కార్ల షోరూం అధినేతగా ఉన్నారు. అమ్మ గృహిణి. చెల్లాయి అనూష 10వ తరగతి చదువుతోంది. సాక్షి : చెస్ ఆటలో మీకు ప్రేరణ ఎవరు..? కార్తీక్ : నాకు ఏనిమిదేళ్ల వయసు వరకు చెస్ ఆటంటేనే తెలియదు. అమ్మ తన భర్తడే గిఫ్ట్గా చెస్ బోర్డును ఇచ్చింది. గేమ్ నియమనిబంధనలు చెప్పింది. అప్పట్నుంచి చెస్పై మక్కువ పెంచుకున్నా. సాక్షి : ఆ తర్వాత చెస్ ఆటలో ఎవరి వద్ద శిక్షణ తీసుకున్నారు..? కార్తీక్ :చెస్పై నాకున్న ఇంట్రస్ట్ చూసి నాన్న మొదట చెస్ సీనియర్ కోచ్ ఇంజం శివకేశవులు వద్ద కొన్ని నెలల పాటు శిక్షణ ఇప్పించారు. అనంతరం నవీన్ అనే కోచ్ చెస్ ఆటలో మెళకువలు నేర్పించి ప్రొత్సహించారు. తదుపరి మరింత మెరుగైన శిక్షణ కోసం వైజాగ్ నుంచి పి.రామకృష్ణ అనే కోచ్ను పిలిపించి 15 రోజుల పాటు శిక్షణ ఇప్పించారు నాన్న. ఆ తరువాత నేనే ఆటలోని మెళకువలను నేర్చుకుంటూ స్కూల్ గేమ్స్ స్థాయిలోనే చెస్ టోర్నమెంట్లకు వెళ్లేవాడిని. 5వ తరగతిలోనే టోర్నమెంట్లకు వెళుతూ 1606 ఇంటర్నేషనల్ ర్యాంకింగ్ తెచ్చుకున్నా. 7, 8, 9 తరగతుల సమయంలో చెస్ ఆటపైనే పూర్తిగా ఫోకస్ పెట్టా. ఆ సమయంలో రాష్ట్ర స్థాయి పోటీలకు వెళ్లి 1950 ఇంటర్నేషనల్ ర్యాకింగ్ సాధించా. 10వ తరగతి బెంగళూరులోని స్టాండర్డ్ ఇంటర్నేషనల్లో చది వాను. అప్పటికే 2,305 రేటింగ్లో ఉన్నా. అనంతరం తమిళనాడులోని వేళమ్మాల్ కళాశాలలో ఇంటర్మీడియట్ ఎంఈసీ గ్రూప్ చదివి 95 శాతం పైగా(1141/1200) మార్కులు సాధించా. అటు చదువులోనూ, ఇటు చెస్లోనూ రాణిస్తూ వచ్చా. సాక్షి : ఇతర దేశాల ఆటగాళ్లతో మీ ఆటతీరు..? కార్తీక్ :మనదేశ ఆటగాళ్లు, యూరప్, యూఎస్, టర్కీ ఆటగాళ్ల ఆటతీరులో చాలా వ్యత్యాసం ఉంటుంది. మన ఆటగాళ్లు సేఫ్, పొజిషనల్గా ఆడుతారు. అదే వాళ్లైతే అగ్రస్సివ్గా, అటాకింగ్ స్టైల్లో ఆడతారు. సాక్షి : ఇతర దేశాల ఆటగాళ్లను ఎలా ఎదుర్కొంటారు..? కార్తీక్ : ఇతర దేశాల ఆటగాళ్లతో ఆడేటప్పుడు ముందుగా వారి ఆటతీరును ఆన్లైన్లో పరిశీలిస్తా. అందుకు సంబంధించిన బుక్స్ చదువుతా. ఇతర దేశాల్లో పోటీలు ఉన్నçప్పుడు ప్రతిరోజు అయిదారు గంటల పాటు ప్రాక్టీస్ చేస్తా. సాక్షి : చెస్కు ఆదరణ ఉందంటారా..? కార్తీక్ : మన రాష్ట్రంలో చెస్ ఆటలో అప్కమింగ్ ప్లేయర్స్ రావటం లేదు. అండర్–19లో ఇంటర్నేషనల్ ప్లేయర్స్ కొద్దిమంది మాత్రమే ఉన్నారు. చెస్ క్రీడను ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. సాక్షి : 5వ గ్రాండ్మాస్టర్గా నిలిచినందుకు ఎలా ఫీలవుతున్నారు? కార్తీక్: ఆంధ్రప్రదేశ్ నుంచి గ్రాండ్మాస్టర్ హోదాలో హరికృష్ణ, కోనేరు హంపి, హారిక, లలిత్బాబు సరసన 5వ ప్లేయర్గా నిలవడం సంతోషంగా ఉంది. సాక్షి : గ్రాండ్మాస్టర్ హోదాలో సీఎంను కలిశారా..? కార్తీక్ : లేదు. త్వరలో సీఎం చంద్రబాబునాయుడును కలవనున్నాం. చెస్ జిల్లా, రాష్ట్ర అసోషియేషన్ ప్రతినిధులతో కలసి వెళ్లేందుకు సిద్ధం అవుతున్నాం. సీఎం క్రీడలను బాగా ప్రోత్సహిస్తున్నారు. ప్రభుత్వ ప్రోత్సాహం ఉంటే ఏడాదిలోపే సూపర్ గ్రాండ్ మాస్టర్ హోదా సాధిస్తాననే నమ్మకం ఉంది. సాక్షి : క్రీడాకారులకు మీరిచ్చే సూచనలు..? కార్తీక్ : ఆటలో ఓటమి చెందినా నిరుత్సాహ పడకూడదు. ఆటను మరింత మెరుగుపరచుకోవాలి. ఆటలోని తప్పులను సరిదిద్దుకుని ముందుకెళ్లాలి. మనదేశంలో టోర్నమెంట్లు తక్కువ. అదే యూరప్ లాంటి దేశాల్లో టోర్నమెంట్లు ఎక్కువగా నిర్వహిస్తారు. ఇతర రాష్ట్రాల్లో ఇంటర్నేషనల్ ఆటగాళ్లను అసోషియేషన్లు, ప్రభుత్వాలు ప్రొత్సహిస్తున్నాయి. మన రాష్ట్రంలో ఆటగాళ్లను మరింత ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. జీఎం టైటిల్కు సంబంధించిన వివరాలు.. ♦ 2017 ఆగస్టులో బార్సిలోనాలో జరిగిన అంతర్జాతీయ ఓపెన్ చెస్ పోటీల్లో తొలి జీఎంను కైవసం చేసుకున్నాడు. ♦ 2018లో జూన్ ఒడిశాలోని భువనేశ్వర్లో జరిగిన కిట్ అంతర్జాతీయ టోర్నమెంట్లో ప్రథమ స్థానం సాధించి రెండవ జీఎం నార్మ్ సాధించాడు. ♦ ఈ ఏడాది ఆగస్టు 16న ఇటలీలో జరిగిన స్పిలిమ్బర్గ్ ఓపెన్లో 6 పాయింట్లు సాధించి 3వ జీఎం నార్మ్ కూడా పొంది గ్రాండ్మాస్టర్ హోదా సొంతం చేసుకున్నాడు. ♦ ఈ నెల 4 నుంచి 16వ తేది వరకు టర్కీ దేశంలో జరిగిన ప్రపంచ స్థాయి జూనియర్ చాంపియన్షిప్ పోటీల్లో 4వ గ్రాండ్మాస్టర్ స్థానం కైవసం చేసుకున్నాడు. కార్తీక్ సాధించిన విజయాలు.. ♦ అండర్–13 రాష్ట్ర చాంపియన్, అండర్–17 2017లో జాతీయ స్థాయిలో ద్వితీయ స్థానం ♦ అండర్–17 జాతీయ స్థాయి స్కూల్ గేమ్స్లో బంగారు పతకం ♦ అండర్–19 జాతీయ స్కూల్ గేమ్స్ పోటీల్లో సిల్వర్ మెడల్ ♦ ఏపీ స్టేట్ అండర్–9 గ్రూపులో ద్వితీయ స్థానం సాధించిన పతకాలు.. ♦ 2019లో తిరుపతి జూనియర్ చాంబర్ ఆధ్వర్యంలో చైల్డ్ ప్రాడిజీ అవార్డు ♦ 2010లో గోవాలో జరిగిన ఏపీ ఇన్ నేషనల్ స్కూల్ గేమ్స్ పోటీల్లో కాంస్య పతకం ♦ 2010లో శ్రీలంకలో జరిగిన ఏషీయన్ స్కూల్ గేమ్స్లో అండర్–11 విభాగంలో బంగారు పతకం సాధించి పోలెండ్లో జరిగిన అంతర్జాతీయ పోటీలకు అర్హత సాధించాడు. ♦ శ్రీలంకలో జరిగిన టీమ్ ఏషియన్ స్కూల్ గేమ్స్లో టీమ్ మెడల్ సాధించి సింగపూర్లో జరిగిన అంతర్జాతీయ పోటీలకు అర్హత ♦ 2018 జూలైలో జరిగిన కామన్వెల్త్ గేమ్స్లో గోల్డ్ మెడల్ -
నిజమైన ప్రేమ
సూరజ్, అఖిల్ కార్తీక్ హీరోలుగా, సోనియా, ఫర హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం ‘టు ఫ్రెండ్స్’. ‘ట్రూ లవ్’ అనేది ఉపశీర్షిక. శ్రీనివాస్ జి.ఎల్.బి దర్శకత్వంలో ముళ్లగూరు లక్ష్మీదేవి సమర్పణలో ముళ్లగూరు అనంతరాముడు, ముళ్లగూరు రమేష్ నాయుడు నిర్మించారు. ఈ చిత్రం ట్రైలర్ను నిర్మాత సి.కల్యాణ్ విడుదల చేసి, మాట్లాడుతూ– ‘‘నేను నిర్మాత అయ్యేందుకు కారకులైన నారపురెడ్డి మిత్రులు ముళ్లగూరు ఆనంతరాముడుగారు నిర్మించిన ‘టు ఫ్రెండ్స్’ ట్రైలర్ విడుదల చేసే అవకాశం నాకు రావడం చాలా ఆనందంగా ఉంది. ఈ చిత్రం ఘన విజయం సాధించాలి’’ అన్నారు. ‘‘విద్య, వ్యవసాయం, స్థిరాస్తి, ఫైనాన్స్.. వంటి పలు రంగాల్లో విజయాలు సాధించిన నేను సినిమా రంగంలోనూ విజయం సాధిస్తాననే నమ్మకం ఉంది. భవిష్యత్తులోనూ మరిన్ని మంచి సినిమాలు తీస్తా’’ అన్నారు ముళ్లగూరు అనంతరాముడు. ‘‘ఖర్చుకు వెనకాడకుండా నిర్మాతలు అందించిన సహాయ సహకారాల వల్లే ఈ సినిమా బాగా వచ్చింది’’ అన్నారు శ్రీనివాస్ జి.ఎల్.బి. -
మైండ్ గేమ్
‘‘ఈ రోజుల్లో సినిమాలు ఒకసారి రిలీజ్ కావడమే కష్టంగా ఉంది. అలాంటిది ‘సూపర్ స్కెచ్’ చిత్రాన్ని రీ–రిలీజ్ చేస్తున్నాం. సినిమాపై మాకు ఉన్న నమ్మకమే ఇందుకు కారణం’’ అన్నారు నటుడు ఇంద్ర. నర్సింగ్, ఇంద్ర, సమీర్ దత్తా, కార్తీక్, చక్రి, మాగంటి ముఖ్య పాత్రల్లో రవి చావలి దర్శకత్వంలో తెరకెక్కిన ‘సూపర్ స్కెచ్’ సినిమాని ఇవాళ రీ–రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమాలో విలన్ పాత్ర పోషించిన ఇంద్ర మాట్లాడుతూ– ‘‘నేను కరాటే ప్రొఫెషనల్ని. వారియర్ కరాటే ఇంటర్న్షనల్ ఫౌండేషన్ ద్వారా కరాటే శిక్షణ ఇస్తున్నాం. సినిమాలపై ఆసక్తితో ఇండస్ట్రీకి వచ్చా. మొదట్లో ఇబ్బందులు పడ్డా. ‘సై, సైనికుడు, ధృవ, శ్రీమన్నారాయణ’ వంటి సినిమాల్లో నటించాను. సోలో హీరోగా ‘పుత్రుడు, కుర్ కురే’ సినిమాలు చేశా. ‘సూపర్ స్కెచ్’ సినిమాలో విలన్గా నటించాను. మైండ్ గేమ్ బ్యాక్డ్రాప్లో తెరకెక్కిన చిత్రమిది. ఆద్యంతం ఉత్కంఠభరితంగా ఉంటుంది. ఈ సినిమా నటుడిగా పూర్తి సంతృప్తినిచ్చింది. ప్రస్తుతం ‘సైరా’ సినిమాలో ఓ పాత్ర చేస్తున్నా’’ అన్నారు. -
దైవ శక్తితో క్షుద్ర శక్తి పోరు
‘‘సంగకుమార్ అన్నీ తానై వరుసగా నాలుగు సినిమాలు నిర్మించడం ఆనందంగా ఉంది. థ్రిల్లర్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ‘తాంత్రిక’ సినిమా హిట్ అవ్వాలి. యూనిట్కి మంచి పేరు తీసుకురావాలి’’ అని నిర్మాత సాయి వెంకట్ అన్నారు. సంగకుమార్ నటించి, నిర్మించిన చిత్రం ‘తాంత్రిక’. రాజ్కాంత్, కార్తీక్, మనీష, సంజన, గీతాషా, ఆర్య ముఖ్య పాత్రల్లో ఎం. శ్రీధర్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. జాన్, నాగవంశీ స్వరపరచిన ఈ చిత్రం పాటలను నిర్మాత సాయి వెంకట్ విడుదల చేశారు. సంగకుమార్ నటించిన ‘పౌరుషం, నరసింహా ఏసీపీ, శివతాండవం’ సినిమాల ట్రైలర్స్ని కూడా ఇదే కార్యక్రమంలో రిలీజ్ చేశారు. నటుడు, నిర్మాత సంగకుమార్ మాట్లాడుతూ –‘‘ దైవ శక్తికీ, క్షుద్ర శక్తికీ మధ్య జరిగే పోరాటం నేపథ్యంలో ఈ సినిమా ఉంటుంది. ప్రేక్షకులకు మా చిత్రం నచ్చుతుంది’’ అన్నారు. డైరెక్టర్ ఎం. శ్రీధర్, నటులు రాజ్కాంత్, సంజన మేరీ, ఎస్ఎస్ పట్నాయక్ పాల్గొన్నారు. -
గేమ్ ఆడండి..బహుమతి పట్టండి
తమిళసినిమా: మీ మొబైల్లో గేమ్ ఆడండి. బహుమతి పట్టండి అయితే అందుకు మా ప్రశ్నలకు సమాధానం చెప్పాలి అంటున్నారు మిస్టర్ చంద్రమౌళి చిత్ర యూనిట్. నటుడు కార్తీక్ ఆయన కొడుకు గౌతమ్ కార్తీక్ హీరోలుగా కలిసి నటించిన చిత్రం మిస్టర్ చంద్రమౌళి. నటి రెజీనా హీరోయిన్గా నటించిన ఇందులో నటి వరలక్ష్మీశరత్కుమార్ కీలక పాత్రను పోషించారు. సతీష్, దర్శకుడు మహేంద్రన్, అగస్థ్యిన్ ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రానికి శ్యామ్ సీఎస్ సంగీతం అందించారు. బోఫ్టా మీడియా వర్క్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ అధినేత ధనుంజయన్, క్రియేటివ్ ఎంటర్టెయిన్మెంట్స్ సంస్థ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి తిరు దర్శకత్వం వహించారు. చిత్రం జూలై 6న విడుదలకు ముస్తాబవుతోంది. ఈ సందర్భంగా చిత్ర ప్రచారంలో భాగంగా దర్శక, నిర్మాతలు ప్రేక్షకులకు ఒక మొబైల్ గేమ్ను ప్రవేశ పెట్టారు. ఆ గేమ్ను సోమవారం సాయంత్రం స్థానిక సాలిగ్రామంలోని ప్రసాద్ల్యాబ్లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గేమ్ వివరాలను నిర్మాత ధనుంజయన్ తెలుపుతూ ఇది మూవీ క్విజ్ తరహా మొబైల్ యాప్ గేమ్ అని తెలిపారు. ఈ గేమ్లో రోజూ మిస్టర్ చంద్రమౌళి చిత్రానికి సంబంధించిన 10 ప్రశ్నలు ఉంటాయన్నారు. ఈ గేమ్ను ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని రెండు నిమిషాల్లో ఆ 10 ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పిన వారికి వివో మొబైల్, వాచ్, టీషర్ట్, సినిమా టిక్కెట్స్లో ఏదో ఒకటి బహుమతిగా అందిస్తామని చెప్పారు. ఈ గేమ్ మంగళవారం నుంచి మొదలవుతుందని చెప్పారు. సమాధానాలు చెప్పిన వారు తమ వాట్సాప్ మొబైల్ఫోన్ నెంబర్ను రిజిస్టర్ చేయాలని చెప్పారు. ఎక్కువ మంది కరెక్ట్ సమాధానాలు చెబితే డ్రా విధానంలో రోజూ ఒకరికి బహుమతులను అందిస్తామన్నారు. ఈ గేమ్ను జూలై 6 వరకూ ఆడి బహుమతులను గెలుసుకోవచ్చునని నిర్మాత తెలిపారు. కార్యక్రమంలో నటుడు గౌతమ్కార్తీక్, నటి రెజీనా, వరలక్ష్మీ, సతీష్, దర్శకుడు తిరు చిత్ర వర్గాలు పాల్గొన్నాయి. -
మైండ్ గేమ్
‘శ్రీమన్నారాయణ, సామాన్యుడు, దగ్గరగా దూరంగా, విక్టరీ, ప్యార్ మే పడిపోయానే, ది ఎండ్’.. వంటి చిత్రాలు తెరకెక్కించిన రవి చావలి దర్శకత్వంలో రూపొందిన తాజా చిత్రం ‘సూపర్ స్కెచ్’. నర్సింగ్ మక్కల, ఇంద్ర, సమీర్ దత్, కార్తీక్, చక్రి మాగంటి, అనిక, సుభాంగీ, విదేశీ నటులు సోఫియా, గ్యారీ టాన్ టోనీ (ఇంగ్లాండ్) ముఖ్య తారలు. యు అండ్ ఐ– ఫ్రెండ్స్ ఫిల్మ్ అకాడమీ సహకారంతో బలరామ్ మక్కల నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 29న విడుదల కానుంది. బలరామ్ మాట్లాడుతూ– ‘‘జస్టిస్ ఈజ్ ఇన్ యాక్షన్ అనే కాన్సెప్ట్తో రూపొందిన చిత్రమిది. ఆద్యంతం ఉత్కంఠభరితంగా మైండ్ గేమ్తో సాగే సస్పెన్స్ థ్రిల్లర్. ‘సూపర్ స్కెచ్’ టైటిల్ కథకు చక్కగా సరిపోతుంది. తొలి కాపీ సిద్ధమైంది. మా సినిమా ప్రేక్షకులకు నచ్చుతుందనే నమ్మకం ఉంది. రవి చావలి కెరీర్లో మరో హిట్ చిత్రం ఖాయం. సురేందర్ రెడ్డి ఛాయాగ్రహణం, కార్తీక్ కొడకండ్ల సంగీతం సినిమాకు హైలైట్గా నిలుస్తాయి’’ అన్నారు. -
స్పెల్లింగ్ బీ విజేత హైదరాబాదీ
హ్యూస్టన్: అమెరికాలో ఏటా నిర్వహించే ప్రతిష్టాత్మక ‘స్క్రిప్స్ నేషనల్ స్పెల్లింగ్ బీ’ పోటీలో భారత సంతతికి చెందిన కార్తీక్ నెమ్మాని(14) విజేతగా నిలిచాడు. టెక్సాస్లోని మెక్కిన్నీకి చెందిన కార్తీక్ ప్రస్తుతం ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. కార్తీక్ తండ్రి కృష్ణ నెమ్మాని హైదరాబాద్ నుంచి అమెరికాకు వలసవెళ్లారు. కార్తీక్ తుది పోరులో భారత సంతతికే చెందిన నయాసా మోదీ అనే బాలికతో పోటీపడి విజయం సాధించాడు. తుదిపోరులో 'koinonia' అనే పదానికి సరైన స్పెల్లింగ్ చెప్పి కార్తీక్ విజేతగా నిలిచాడు. టైటిల్ గెలిచిన కార్తీక్కు 40 వేల డాలర్లు, ట్రోఫీని ఇస్తారు. కార్తీక్కు మరియం–వెబ్స్టర్ నుంచి 2,500 డాలర్లు, న్యూయార్క్, హాలీవుడ్లలో ఉచితంగా పర్యటించే చాన్స్ ఇస్తారు. ఈ సారి పోటీలో మొత్తం 516 మంది విద్యార్థులు పోటీపడగా, ఫైనల్కు 16 మంది చేరుకున్నారు. వీరిలో 9 మంది బాలికలు, ఏడుగురు బాలురు ఉన్నారు. గత 11 ఏళ్లుగా భారత సంతతి విద్యార్థులే ఈ పోటీల్లో గెలుస్తున్నారు. -
కోల్కతా దర్జాగా...
మాజీ చాంపియన్ కోల్కతా నైట్రైడర్స్ చావోరేవోలాంటి మ్యాచ్లో చెలరేగింది. బ్యాటింగ్కు అనుకూలించిన పిచ్పై ఆతిథ్య జట్టును చిత్తు చేసి దర్జాగా ప్లే ఆఫ్స్కు అర్హత సాధించింది. పనిలో పనిగా సొంతగడ్డపై సన్రైజర్స్ చేతిలో ఎదురైన పరాజయానికి బదులు తీర్చుకుంది. ప్రస్తుత సమీకరణం ప్రకారం చెన్నై మ్యాచ్ తర్వాత కూడా కోల్కతా మూడో స్థానంలోనే ఉంటుంది. దీంతో నైట్ రైడర్స్ తమ సొంత మైదానం ఈడెన్ గార్డెన్స్లోనే ఎలిమినేటర్తోపాటు గెలిస్తే రెండో క్వాలిఫయర్ కూడా అదే వేదికపై ఆడుతుంది. సాక్షి, హైదరాబాద్: ఐపీఎల్–11లో ప్లేఆఫ్స్కు చేరిన మూడో జట్టుగా కోల్కతా నైట్రైడర్స్ నిలిచింది. ఉప్పల్ స్టేడియంలో శనివారం జరిగిన తమ ఆఖరి లీగ్ మ్యాచ్లో ఆ జట్టు 5 వికెట్ల తేడాతో సన్రైజర్స్ హైదరాబాద్ను ఓడించింది. ఫలితంగా 16 పాయింట్లతో ప్లే ఆఫ్కు అర్హత సాధించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్కు దిగిన సన్రైజర్స్ హైదరాబాద్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. శిఖర్ ధావన్ (39 బంతుల్లో 50; 5 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీ సాధించగా, కేన్ విలియమ్సన్ (17 బంతుల్లో 36; 1 ఫోర్, 3 సిక్సర్లు), శ్రీవత్స్ గోస్వామి (26 బంతుల్లో 35; 4 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. ప్రసిధ్ కృష్ణ 30 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. అనంతరం కోల్కతా 19.4 ఓవర్లలో 5 వికెట్లకు 173 పరుగులు చేసింది. క్రిస్ లిన్ (43 బంతుల్లో 55; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ధ సెంచరీతో పాటు రాబిన్ ఉతప్ప (34 బంతుల్లో 45; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) ఇన్నింగ్స్ జట్టు విజయంలో ప్రధాన పాత్ర పోషించాయి. చివర్లో కెప్టెన్ దినేశ్ కార్తీక్ (22 బంతుల్లో 26 నాటౌట్; 1 ఫోర్, 1 సిక్స్) ఒత్తిడిలో మరో కీలక ఇన్నింగ్స్ ఆడి గెలిపించాడు. ఒకే ఓవర్లో నలుగురు ఔట్... తొలి బంతికే ధావన్ కొట్టిన ఫోర్తో హైదరాబాద్ ఇన్నింగ్స్ ప్రారంభమైంది. మరోవైపు సీజన్లో తొలిసారి బ్యాటింగ్ చేసే అవకాశం లభించిన గోస్వామి చక్కటి షాట్లతో ఆకట్టుకున్నాడు. ఒక పరుగు వద్ద రసెల్ బౌలింగ్లో అంపైర్ ఔట్గా ప్రకటించినా... గోస్వామి రివ్యూ కోరిన తర్వాత అది హెల్మెట్కు తగిలిందని తేలింది. ఈ అవకాశాన్ని బాగా ఉపయోగించుకున్న గోస్వామి అదే ఓవర్లో ఒక సిక్సర్, 2 ఫోర్లతో చెలరేగాడు. ఓపెనర్లు ఇద్దరూ దూకుడుగా ఆడటంతో పవర్ప్లే ముగిసేసరికి సన్రైజర్స్ స్కోరు 60 పరుగులకు చేరింది. అయితే కుల్దీప్ చక్కటి బంతితో 79 పరుగుల (52 బంతుల్లో) తొలి వికెట్ భాగస్వామ్యానికి తెర దించాడు. అనంతరం విలియమ్సన్ కూడా తన ఫామ్ను కొనసాగించడంతో రైజర్స్ దూసుకుపోయింది. కుల్దీప్ బౌలింగ్లో భారీ సిక్స్ కొట్టిన అతను, ఆ తర్వాత సియర్ల్స్ ఓవర్లో మరో రెండు సిక్సర్లు బాదాడు. అయితే అదే ఊపులో మరో భారీ షాట్కు ప్రయత్నించి అదే ఓవర్లో వెనుదిరిగాడు. 45 పరుగుల వద్ద నరైన్ క్యాచ్ వదిలేసిన అనంతరం ధావన్ అర్ధ సెంచరీ (38 బంతుల్లో) పూర్తయింది. చివర్లో మనీశ్ పాండే (22 బంతుల్లో 25; 2 ఫోర్లు, 1 సిక్స్) కొన్ని పరుగులు జోడించగా, తర్వాతి ఆటగాళ్లు అంతా విఫలమయ్యారు. చివరి ఓవర్లో ప్రసి«ధ్ కృష్ణ 3 వికెట్లు పడగొట్టగా, మరో రనౌట్ కలిపి హైదరాబాద్ నాలుగు వికెట్లు కోల్పోయింది. లిన్ మెరుపులు... ఛేదనలో ఎప్పటిలాగే తనదైన శైలిలో సునీల్ నరైన్ (10 బంతుల్లో 29; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) ధనాధన్ షాట్లతో మొదలు పెట్టాడు. సందీప్ శర్మ వేసిన రెండో ఓవర్లో వరుసగా మూడు ఫోర్లు కొట్టిన అతను, చివరి బంతికి సిక్సర్ బాదాడు. ఆ తర్వాత షకీబ్ ఓవర్లోనూ వరుసగా 4, 6 కొట్టిన అనంతరం తర్వాతి బంతికి నరైన్ ఔటయ్యాడు. లిన్ కూడా ధాటిగా ఆడటంతో కోల్కతా రన్రేట్ దూసుకుపోయింది. పవర్ప్లేలో కేకేఆర్ 66 పరుగులు చేసింది. లిన్, ఉతప్ప మరో అర్ధ సెంచరీ భాగస్వామ్యంతో కోల్కతా ఇన్నింగ్స్ చకచకా సాగింది. 11 పరుగుల వద్ద భారీ షాట్ ఆడే ప్రయత్నంలో ఉతప్ప ఇచ్చిన క్యాచ్ను రషీద్ వదిలేయగా... దీనిని వాడుకున్న ఉతప్ప... షకీబ్ ఓవర్లో 6,4 తో జోరు ప్రదర్శించాడు. సందీప్ బౌలింగ్లో కొట్టిన భారీ సిక్స్తో 36 బంతుల్లో లిన్ హాఫ్ సెంచరీ పూర్తయింది. అయితే లిన్, ఉతప్పలతో పాటు రసెల్ (4), నితీశ్ రాణా(7) వెనుదిరిగినా కెప్టెన్ దినేశ్ కార్తీక్ మిగతా పనిని పూర్తి చేశాడు. స్కోరు వివరాలు సన్రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్: ధావన్ ఎల్బీడబ్ల్యూ (బి) ప్రసిధ్ 50; గోస్వామి (సి) రసెల్ (బి) కుల్దీప్ 35; విలియమ్సన్ (సి) రసెల్ (బి) సియర్ల్స్ 36; మనీశ్ పాండే (సి) సబ్–రింకూ సింగ్ (బి) ప్రసిధ్ 25; యూసుఫ్ పఠాన్ (సి) ఉతప్ప (బి) నరైన్ 2; బ్రాత్వైట్ (సి) కార్తీక్ (బి) రసెల్ 3; షకీబ్ (సి) నరైన్ (బి) ప్రసిధ్ 10; రషీద్ ఖాన్ (సి) కార్తీక్ (బి) ప్రసిధ్ 0; భువనేశ్వర్ రనౌట్ 0; కౌల్ నాటౌట్ 0; ఎక్స్ట్రాలు 11; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 172. వికెట్ల పతనం: 1–79, 2–127, 3–141, 4–147, 5–161, 6–168, 7–172, 8–172, 9–172. బౌలింగ్: నితీశ్ రాణా 1–0–5–0, ప్రసిధ్ 4–0–30–4, రసెల్ 3–0–31–1, నరైన్ 4–0–23–1, చావ్లా 2–0–19–0, కుల్దీప్ 4–0–35–1, సియర్ల్స్ 2–0–24–1. కోల్కతా నైట్రైడర్స్ ఇన్నింగ్స్: లిన్ (సి) పాండే (బి) కౌల్ 55; నరైన్ (సి) పాండే (బి) షకీబ్ 29; ఉతప్ప(సి) గోస్వామి (బి) బ్రాత్వైట్ 45; కార్తీక్ నాటౌట్ 26; రసెల్ (సి) పాండే (బి) కౌల్ 4; రాణా (సి) భువనేశ్వర్ (బి) బ్రాత్వైట్ 7; గిల్ నాటౌట్ 0; ఎక్స్ట్రాలు 7; మొత్తం (19.4 ఓవర్లలో 5 వికెట్లకు) 173. వికెట్ల పతనం: 1–52, 2–119, 3–149, 4–160, 5–172. బౌలింగ్: భువనేశ్వర్ 4–0–33–0, సందీప్ శర్మ 2–0–30–0, కౌల్ 4–0–26–2, షకీబ్ 3–0–30–1, రషీద్ ఖాన్ 4–0–31–0, బ్రాత్వైట్ 2.4–0–21–2.