murugadoss
-
వరుస ప్లాపులు అయిన నమ్ముతున్న స్టార్స్..
-
Salman khan: ఫైటింగ్కి రెడీ అయిన సల్మాన్ ఖాన్!
మేలో యాక్షన్ స్టార్ట్ చేయనున్నారు సల్మాన్ ఖాన్. తమిళ దర్శకుడు ఏఆర్ మురుగదాస్ తెరకెక్కించనున్న సినిమాలో సల్మాన్ ఖాన్ హీరోగా నటించనున్న సంగతి తెలిసిందే. ఈ యాక్షన్ థ్రిల్లర్ ఫిల్మ్ చిత్రీకరణ మేలో ముంబైలో ప్రారంభం కానుందని బాలీవుడ్ సమాచారం. ముందుగా ఓ యాక్షన్ సీక్వెన్స్ను చిత్రీకరించాలని ప్లాన్ చేస్తున్నారట మురుగదాస్. ఈ సినిమాలోఅదిరిపోయే యాక్షన్ సీక్వెన్స్లతో పాటు ఓ సామాజిక సందేశం కూడా ఉందని ఇటీవల మురుగదాస్ వెల్లడించిన సంగతి తెలిసిందే. సాజిద్ నడియాద్వాలా నిర్మించనున్న ఈ చిత్రం 2025 రంజాన్ సందర్భంగా విడుదల కానుంది. -
మృణాల్ తమిళ ఎంట్రీ.. ఆ స్టార్ హీరోతో కలిసి
Mrunal Thakur First Tamil Movie: హీరో-హీరోయిన్-డైరెక్టర్.. ఎవరైనా సరే ఒక్క హిట్ ఒకే ఒక్క హిట్ చాలు. కెరీర్ సాలీడ్గా సెటిల్ అయిపోతుంది. ఆ తర్వాత ఎన్ని హిట్, ఫ్లాప్స్ వచ్చినా అవి ఆటుపోటు లాంటివే, కొన్నాళ్లకు సర్దుకుంటాయి. నటి మృణాల్ ఠాకూర్ జీవితం ఇంతే. మోడలింగ్ నుంచి నటిగా ఎంట్రీ ఇచ్చిన ఈ భామ.. పలు యాడ్స్లో నటించింది. అనంతరం సినిమాల్లోకి వచ్చింది. పలు మరాఠీ , హిందీ చిత్రాల్లో నటించినా రాని క్రేజ్ 'సీతరామం' అనే ఒక్క తెలుగు చిత్రంతో వచ్చింది. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 23 సినిమాలు!) ప్రస్తుతం హిందీ, తెలుగు తదితర భాషల్లో నటిస్తూ మృణాల్ బిజీగా ఉంది. కాగా తెలుగులో నాని 'హాయ్ నాన్న' మూవీలో నటిస్తున్న ఈ బ్యూటీకి ఇప్పుడు కోలీవుడ్ నుంచి కాలింగ్ వచ్చింది. స్టార్ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ కొత్త సినిమాలో శివ కార్తికేయన్ హీరోగా నటించబోతున్నాడు. ఈ ప్రాజెక్ట్లో హీరోయిన్గా మృణాల్ని ఎంపిక చేసినట్లు తాజా సమాచారం. లైకా ప్రొడక్షన్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. అనిరుధ్ సంగీతం అందించబోతున్నాడు. శివకార్తికేయన్ 'మావీరన్' ఇటీవల విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం ఈ హీరో.. కమలహాసన్ నిర్మిస్తున్న సినిమాలో నటిస్తున్నారు. ఇందులో సాయి పల్లవి హీరోయిన్. ఇది పూర్తయిన తర్వాత శివకార్తికేయన్, మురుగదాస్ కాంబోలో చిత్రం మొదలు కానుంది. రజనీకాంత్తో చేసిన 'దర్బార్' ఫ్లాప్ దెబ్బతో మురుగదాస్ మరో మూవీ చేయలేదు. చాలా గ్యాప్ తర్వాత ఇప్పుడు శివకార్తికేయన్తో చేస్తున్నాడు. ఈ ఏడాది చివరిలో సెట్స్పైకి వెళ్లబోతన్న చిత్ర ఇతర వివరాలు త్వరలో వెల్లడిస్తారు. (ఇదీ చదవండి: వరుస రీమేక్స్పై క్లారిటీ ఇచ్చిన చిరంజీవి) -
డాటరాఫ్ రజనీకాంత్?
రజనీకాంత్ కొత్త చిత్రం గురించి రోజుకో న్యూస్ బయటకు వస్తోంది. లేటెస్ట్గా ఈ సినిమాలో రజనీ కుమార్తెగా నివేదా థామస్ కనిపించనున్నారని టాక్. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో రజనీ హీరోగా ఓ చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. లైకా ప్రొడ„ న్స్ నిర్మించనున్న ఈ చిత్రంలో నయనతార హీరోయిన్. ఇందులో రజనీకాంత్ పోలీస్ ఆఫీసర్గా కనిపించనున్నారు. ఇందులో సినిమాకి కీలకంగా నిలిచే రజనీకాంత్ కుమార్తె పాత్ర ఉంటుందట. ఈ పాత్ర కోసం నివేదా థామస్ను సంప్రదించారట చిత్రబృందం. ఆల్రెడీ ‘పాపనాశం’ (మలయాళ ‘దృశ్యం’ తమిళ రీమేక్) సినిమాలో కమల్ హాసన్ కుమార్తెగా నివేదా థామస్ కనిపించిన విషయం గుర్తుండే ఉంటుంది. ఆ సినిమా నివేదాకు పెద్ద ప్లస్ అయింది. మరి రజనీ కుమార్తెగా కూడా నటిస్తారా? అనే చర్చ జరుగుతోంది. ఈ సినిమాకు సంబంధించి ఇటీవల రజనీ లుక్ టెస్ట్ జరిగింది. ఆ స్టిల్స్ కొన్ని ఆన్లైన్లో లీక్ అయ్యాయి. ఏప్రిల్ 10న ముంబైలో షూటింగ్ స్టార్ట్ కానున్న ఈ చిత్రానికి అనిరుథ్ సంగీత దర్శకుడు. -
ముంబై ప్లాన్!
రజనీకాంత్ హీరోగా నటించిన, ‘కాలా’ చిత్రం మొత్తం ముంబై బ్యాక్డ్రాప్లో జరుగుతుంది. తాజాగా రజనీ చేయబోయే సినిమాలో కూడా అదే నేపథ్యం ఉంటుందని సమాచారం. ఎ.ఆర్. మురుగదాస్ దర్శకత్వంలో రజనీ హీరోగా ఓ చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా మేజర్ షూటింగ్ను ముంబైలో ప్లాన్ చేశారట దర్శకుడు. దాంతో కథ ముంబై నేపథ్యంలో ఉంటుందని చెన్నై కోడంబాక్కమ్ టాక్. ఎ.ఆర్. మురుగదాస్–విజయ్ కాంబినేషన్లో వచ్చిన ‘తుపాకీ’ సినిమాకి కూడా ముంబై టచ్ ఉంటుంది. మరి.. తాజా చిత్రకథను పూర్తిగా ముంబైలో నడిపిస్తారా లేక కథలో కీలక సన్నివేశాలు మాత్రమే ఆ మహానగరంలో ఉంటాయా? అనే చర్చ జరుగుతోంది. త్వరలో చిత్రబృందం ముంబై వెళ్లడానికి రెడీ అవుతోందట. చెన్నైలో ముంబై సెట్ వేసి కూడా కొన్ని సీన్స్ తీయాలనుకుంటున్నారట. ఇందులో రజనీకాంత్ డ్యూయెల్ రోల్ చేయబోతున్నారని భోగట్టా. రెండు పాత్రల్లో ఒకటి పోలీస్ పాత్ర అని ప్రచారం జరుగుతోంది. ఇందులో నయనయనతారను ఓ కథానాయికగా తీసుకోవాలని చిత్రబృందం భావిస్తోందట. మరో కథానాయికగా కీర్తీ సురేష్ పేరు పరిశీలనలో ఉందని సమాచారం. ఈ సినిమాకు అనిరుథ్ రవిచంద్రన్ సంగీతం అందిస్తారు. ఛాయాగ్రాహకుడిగా సంతోష్ శివన్ వ్యవహరిస్తారు. -
హాలీవుడ్ సినిమాకు మురుగదాస్ డైలాగ్స్!
సౌత్ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ ఓ హాలీవుడ్ సినిమా సంభాషణలు రాసేందుకు అంగీకరించాడు. తన సినిమాలకు కథ, డైలాగ్స్ తానే రాసుకునే ఈ స్టార్ డైరెక్టర్ ఇతర దర్శకుల సినిమాలకు ఇంతవరకు ఎప్పుడూ పనిచేయలేదు. అయితే ఓ హాలీవుడ్ నిర్మాణ సంస్థ కోరిక మేరకు డైలాగ్స్ రాసేందుకు అంగీకరించారట. సూపర్ హిట్ అడ్వంచర్ మూవీ సిరీస్ అవెంజర్స్ నుంచి కొత్త సినిమా ‘అవెంజర్స్ ఎండ్ గేమ్’ రాబోతోంది. ఈ సినిమాను భారత్లోనూ భారీగా రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్న నిర్మాతలు డబ్బింగ్ డైలాగ్స్ రాసేందుకు పలువురు ప్రముఖులను సంప్రదించారు. ఈ సినిమా తమిళ వర్షన్కు డైలాగ్స్ రాసేందుకు మురుగదాస్ అంగీకరించారు. తమిళ్తో పాటు తెలుగులో కూడా మంచి ఇమేజ్ ఉన్న మురుగదాస్ డైలాగ్స్ రాస్తుండటంతో అవెంజర్స్ ఎండ్ గేమ్కు సౌత్లో మంచి హైప్ వస్తుందన్న నమ్మకంతో ఉన్నారు చిత్రయూనిట్. -
30 ఏళ్ల తరువాత రజనీకాంత్..!
పేట సినిమాతో మరోసారి వింటేజ్ రజనీకాంత్ను గుర్తు చేసిన సూపర్ స్టార్ రజనీకాంత్, తన తదుపరి చిత్రంలోనూ అదే ఫార్ములాను కంటిన్యూ చేసే ఆలోచనలో ఉన్నాడు. ప్రస్తుతం పేట సక్సెస్ను ఎంజాయ్ చేస్తున్న రజనీ, నెక్ట్స్ సినిమా మురుగదాస్ దర్శకత్వంలో చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. సర్కార్ సినిమాతో మరో సూపర్ హిట్ను తన ఖాతాలో వేసుకున్న మురుగదాస్ కోసం మాస్ యాక్షన్ సినిమాను రెడీ చేస్తున్నాడు. ఈ సినిమాలో రజనీకాంత్ పోలీస్ అధికారిగా కనిపించనున్నారన్న టాక్ వినిపిస్తోంది. ఇటీవల ఎక్కువగా డాన్ తరహా పాత్రలు మాత్రమే చేస్తున్న రజనీ దాదాపు 30 ఏళ్ల తరువాత పోలీస్ డ్రెస్లో కనిపించనున్నారట. అంతేకాదు ఇది రజనీ చివరి చిత్రం అన్న ప్రచారం కూడా జరుగుతుండటంతో అభిమానులు మురుగదాస్, రజనీ కాంబినేషన్లో తెరకెక్కబోయే సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. -
సూపర్ స్టార్ మరో సినిమాకు ఓకె చెప్పాడా..?
2.ఓ సినిమాతో సంచనాలు నమోదు చేస్తున్న సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్ వరుసగా సినిమాలతో రెడీ అవుతున్నాడు. ఇప్పటికే కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో పేట్ట షూటింగ్ పూర్తి చేసిన రజనీ, మరో సినిమాకు ఓకె చెప్పినట్టుగా తెలుస్తోంది. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ దర్శకత్వంలో రజనీ 166వ చిత్రం తెరకెక్కనుంది. విజయ్ హీరోగా సర్కార్ సినిమాతో కమర్షియల్ సక్సెస్ను తన ఖాతాలో వేసుకున్న మురుగదాస్ తొలిసారిగా రజనీ హీరోగా సినిమాను తెరకెక్కిస్తున్నారు. దీంతో ఈ ప్రాజెక్ట్పై కోలీవుడ్తో పాటు దేశవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. త్వరలో ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెడుతున్న రజనీ, సామాజిక సమస్యల నేపథ్యంలో సినిమాలు చేసే మురుగదాస్ తోడైతే రజనీ పొలిటికల్ ఎంట్రీకి కూడా ప్లస్ అవుతుందంటున్నారు ఫ్యాన్స్. -
‘రంగస్థలం’ రికార్డ్ బ్రేక్ చేసిన ‘సర్కార్’
కోలీవుడ్ టాప్ స్టార్ విజయ్ హీరోగా మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా సర్కార్. నవంబర్ 6న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు తొలి షో నుంచే డివైడ్ టాక్ వచ్చినా కలెక్షన్ల పరంగా మాత్రం సత్తా చాటుతూ వస్తోంది. కేవలం రెండు రోజుల్లోనే 100 కోట్ల గ్రాస్ను సాధించి రికార్డ్ సృష్టించిన సర్కార్ ప్రస్తుతం ఈ ఏడాది సౌత్లోనే హైయ్యస్ట్ గ్రాసర్గా రికార్డ్ను సొంతం చేసుకుంది. రెండు వారాల్లో సర్కార్ 225 కోట్లకు పైగా గ్రాస్ సాధించి 2018లో సౌత్లో అత్యధిక గ్రాస్ సాధించిన సినిమాగా టాప్ ప్లేస్లో నిలిచింది. ఇన్నాళ్లు ఈ రికార్డ్ టాలీవుడ్ బ్లాక్బస్టర్ రంగస్థలం పేరిట ఉంది. రామ్ చరణ్, సమంత జంటగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన రంగస్థలం 218 కోట్లతో సర్కార్ రిలీజ్ కు ముందు వరకు టాప్ ప్లేస్లో ఉంది. విజయ్ సర్కార్ ఇప్పటికీ మంచి వసూళ్లు సాధిస్తుండటంతో ఫుల్ రన్ మరిన్ని రికార్డ్లు సాధించటం ఖాయం అంటున్నారు ఫ్యాన్స్. -
‘సర్కార్’కి స్టార్స్ మద్దతు
విజయ్, మురుగదాస్ల కాంబినేషన్లో తెరకెక్కిన సర్కార్ సినిమా దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. డివైడ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా కలెక్షన్ల పరంగా మాత్రం విజయ్ స్టామినాను మరోసారి ప్రూవ్ చేసుకుంది. పొలిటికల్ థ్రిల్లర్ కావటంతో సినిమా రిలీజ్ అయిన దగ్గర నుంచి వివాదాలు చుట్టుముట్టాయి. తమిళనాట అధికార పార్టీ వ్యతిరేకంగా సన్నివేశాలున్నాయంటూ విమర్శలు వినిపించాయి. అదే సమయంలో దివంగత నేత జయలలిత ను కించపరిచే విధంగా సన్నివేశాలున్నాయంటూ ఆందోళనలు చేపట్టారు. ఈ వివాదంలో సర్కార్ సినిమాకుకు అండగా స్టార్ హీరోలు మద్ధుతు తెలుపుతున్నారు. సూపర్ రజనీకాంత్ సినిమాపై వస్తున్న ఆరోపణలను ఖండించారు. సెన్సార్ బోర్డ్ అన్ని రకాల క్లియరెన్స్ ఇచ్చిన తరువాతే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయినా కొన్ని సీన్స్ తొలగించాలంటూ రాద్ధాంతం చేయటం, ప్రదర్శనలు అడ్డుకోవటం చట్ట వ్యతికేరం అన్నారు. మరో టాప్ స్టార్ కమల్ హాసన్ ‘తమిళనాట ఇలాంటి పరిస్థితి కొత్తేం కాదు. రాజకీయ క్రీడలో ఇది ఆనవాయితీగా వస్తోంది’ అంటూ ట్వీట్ చేశారు. మరో స్టార్ విశాల్ కూడా విజయ్ సినిమా మద్దతు పలికారు. ‘దర్శకుడు మురుగదాస్ ఇంట్లో పోలీసులు..? ఎందుకోసం..? ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగవనే ఆశిస్తున్నా. సినిమాకు సెన్సార్ క్లియరెన్స్ వచ్చింది. ఇప్పటికే చాలా మంది ప్రజలు సినిమా చూశారు. అయినా ఈ గొడవ, ఏడుపు ఎందుకు’ అంటూ ట్వీట్ చేశారు. தணிக்கைக்குழு தணிக்கை செய்து படத்தை வெளியிட்டபிறகு,அந்தப் படத்திலிருந்து சில காட்சிகளை நீக்கவேண்டும் என்று போராட்டம் நடத்துவதும், திரையிடத் தடுப்பதும்,படத்தின் பேனர்களை சேதப்படுத்துவதும், சட்டத்திற்குப் புறம்பான செயல்கள். இத்தகைய செயல்களை நான் வன்மையாகக் கண்டிக்கிறேன். — Rajinikanth (@rajinikanth) 8 November 2018 முறையாகச்சான்றிதழ் பெற்று வெளியாகியிருக்கும் சர்கார் படத்துக்கு,சட்டவிரோதமான அரசியல் சூழ்ச்சிகள் மூலம் அழுத்தம் கொடுப்பது இவ்வரசுக்கு புதிதல்ல.விமர்சனங்களை ஏற்கத்துணிவில்லாத அரசு தடம் புரளும்.அரசியல் வியாபாரிகள் கூட்டம் விரைவில் ஒழியும்.நாடாளப்போகும் நல்லவர் கூட்டமே வெல்லும். — Kamal Haasan (@ikamalhaasan) 8 November 2018 Police in Dir Murugadoss s home????? For Wat?? Hoping and really hoping that nothin unforeseen happens. Once again. Censor has cleared the film and the content is watched by public.den why all this hue and cry. — Vishal (@VishalKOfficial) 8 November 2018 -
‘సర్కార్’ మూవీ రివ్యూ
టైటిల్ : సర్కార్ జానర్ : యాక్షన్ డ్రామా తారాగణం : విజయ్, కీర్తీ సురేష్, వరలక్ష్మీ శరత్ కుమార్, యోగిబాబు సంగీతం : ఏఆర్ రెహమాన్ దర్శకత్వం : ఏఆర్ మురుగదాస్ నిర్మాత : కళానిధి మారన్ కోలీవుడ్లో టాప్ స్టార్గా ఓ వెలుగు వెలుగుతున్న విజయ్ తెలుగులో మాత్రం ఆస్థాయిలో ఆకట్టుకోలేకపోతున్నాడు. సూర్య, విశాల్, కార్తీ లాంటి హీరోలు తెలుగునాట కూడా మంచి మార్కెట్ సాధించినా విజయ్ మాత్రం ఇంత వరకు తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాడు. తుపాకి, అదిరింది లాంటి సినిమాలు టాలీవుడ్లో పరవాలేదనిపించినా విజయ్ స్థాయి సక్సెస్లు మాత్రం సాధించలేకపోయాయి. తాజాగా మరోసారి మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన సర్కార్ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు విజయ్. గతంలో వీరి కాంబినేషన్లో వచ్చిన తుపాకి, కత్తి సినిమాలు ఘనవిజయం సాధించటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మరి ఆ అంచనాలను సర్కార్ అందుకుందా..? ఈ సినిమాతో అయినా విజయ్ తెలుగు మార్కెట్లో జెండా పాతాడా..? స్పైడర్ సినిమాతో టాలీవుడ్కు షాక్ ఇచ్చిన దర్శకుడు మురుగదాస్, సర్కార్తో ఆకట్టుకున్నాడా..? కథ ; సుందర్ రామస్వామి (విజయ్) సంవత్సరానికి 1800 కోట్లు సంపాదించే బిజినెస్మేన్. తను ఏ దేశంలో అడుగుపెట్టిన అక్కడి కంపెనీలను దెబ్బతీసి, వాటిని మూసేయించే కార్పోరేట్ క్రిమినల్. అలాంటి సుందర్ భారత్కు వస్తుండన్నా సమాచారంతో ఇక్కడి కార్పోరేట్ కంపెనీలన్ని ఉలిక్కి పడతాయి. కానీ ఇండియా వచ్చిన సుందర్ కేవలం తన ఓటు హక్కును వినియోగించుకోవడానికే వచ్చానని చెప్పటంతో అంతా ఊపిరి పీల్చుకుంటారు. ఓటు వేయడానికి వెళ్లిన సుందర్కు తన ఓటును ఎవరో దొంగ ఓటు వేశారని తెలుస్తుంది. దీంతో తన ఓటు కోసం కోర్టును ఆశ్రయిస్తాడు. సుందర్ ఓటు హక్కు వినియోగించుకునే వరకు అక్కడ ఎలక్షన్ కౌంటింగ్ ఆగిపోతుంది. సుందర్ విషయం తెలిసి ఓటు వేయలేకపోయిన దాదాపు 3 లక్షల మందికిపైగా ప్రజులు అదే తరహాలో కేసుల వేస్తారు. దీంతో ఎలక్షన్లను రద్దు చేసి తిరిగి 15 రోజుల్లో ఎన్నికల నిర్వహించాలని కోర్టు తీర్పునిస్తుంది. తరువాత అధికారి పార్టీ నేతలతో గొడవల కారణంగా సుందర్ స్వయంగా ఎలక్షన్లలో పోటీ చేయాలని నిర్ణయించుకుంటాడు. కార్పోరేట్ క్రిమినల్గా పేరు తెచ్చుకున్న సుందర్ ఇక్కడి కరుడు గట్టిన రాజకీయనాయకులతోఎలా పోరాడాడు? పోటికి దిగిన సుందర్కు ఎదురైన సమస్యలేంటి.? అన్నదే మిగతా కథ. నటీనటులు ; కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ మరోసారి సూపర్బ్ యాక్టింగ్ తో ఆకట్టుకున్నాడు. గతంలో ఎన్నడూ కనిపించనంత స్టైలిష్ లుక్ లో కనిపించిన విజయ్, అభిమానులు తన నుంచి ఆశించే అని అంశాలను తెరపై చూపించాడు. ముఖ్యంగా యాక్షన్ సీన్స్లో విజయ్ పర్ఫామెన్స్ సూపర్బ్. మహానటిగా పేరు తెచ్చుకుంటున్న కీర్తి సురేష్కు ఈ సినిమాలో ఏమాత్రం ప్రాదాన్యం లేని పాత్రలో కనిపించింది. ఫస్ట్ హాఫ్లో ఒకటి రెండు సన్నివేశాలు తప్ప కీర్తి సురేష్ ఎక్కడా పెద్దగా కనిపించదు. మరో నటి వరలక్ష్మీ శరత్కుమార్ది కూడా చిన్న పాత్రే. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ సన్నివేశాల్లో ఆమె నటన ఆకట్టుకుంటుంది. రాజకీయ నాయకుడి పాత్రలో రాధారవి మరోసారి తన అనుభవాన్ని చూపించారు. సీఎం పుణ్యమూర్తిగా కనిపించిన కరుప్పయ్య కూడా ఆ పాత్రకు సరిగ్గా సరిపోయారు. ఇతర పాత్రల్లో కనిపించిన వారంతా తమిళ వారే కావటంతో తెలుగు ప్రేక్షకులు కనెక్ట్ అవ్వటం కాస్త కష్టమే. విశ్లేషణ ; కత్తి, తుపాకి లాంటి బ్లాక్బస్టర్స్ అందించిన కాంబినేషన్లో వస్తున్న సినిమా కావటంతో సర్కార్పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ఈ సారి మురుగదాస్, విజయ్లు ఆ స్థాయిలో అలరించలేకపోయారు. విజయ్ మార్క్ స్టైల్స్, మాస్ అప్పీల్ కనిపించినా.. మురుగదాస్ గత చిత్రాల్లో కనిపించి వేగం ఈ సినిమాలో లోపించినట్టుగా అనిపిస్తుంది. ఓ కార్పోరేట్ క్రిమినల్, రాజకీయాల్లో ఎలాంటి మార్పులు తీసుకొచ్చాడు అన్న ఇంట్రస్టింగ్ పాయింట్ను తీసుకున్న దర్శకుడు కథనాన్ని చాలా నెమ్మదిగా నడిపించాడు. ఫస్ట్హాఫ్ యాక్షన్ సీన్స్, పొలిటికల్ పంచ్ డైలాగ్లతో ఇంట్రస్టింగ్గా నడిపించిన మురుగదాస్.. సెకండ్ హాఫ్ను ఆ స్థాయిలో చూపించలేకపోయాడు. పొలిటికల్ థ్రిల్లర్ గా తెరకెక్కిన సినిమాలో ఏ మాత్రం థ్రిల్లింగ్ మూమెంట్స్ లేకుండా కథనం సాధాసీదాగా సాగుతుంది. ప్రీ క్లైమాక్స్ లో వచ్చే సన్నివేశాలు మరీ లాజిక్ లేకుండా సిల్లీగా అనిపిస్తాయి. అయితే విజయ్ అభిమానులను మాత్రం మురుగదాస్ పూర్తి స్థాయిలో అలరించాడనే చెప్పాలి. హీరో బిల్డప్, యాక్షన్ సీన్స్లో విజయ్ ఇమేజ్ను ఆకాశానికి ఎత్తేశాడు. కానీ తెలుగు ఆడియన్స్కు కనెక్ట్ కావటం మాత్రం కష్టమే. భారీ బడ్జెట్ సినిమా కావటంతో క్వాలిటీ పరంగా వంక పెట్టడానికి లేదు. ఆర్ట్, సినిమాటోగ్రఫి సినిమాకు రిచ్ లుక్ తీసుకువచ్చాయి. ఎడిటింగ్ విషయంలో ఇంకాస్త దృష్టి పెట్టాల్సింది. చాలా సీన్స్ నెమ్మదిగా సాగుతూ ఇబ్బంది పెడతాయి. ఏఆర్ రెహహాన్ సంగీతం కూడా ఆశించిన స్థాయిలో లేదు. ముఖ్యంగా పాటల్లో సాహిత్యం అర్థంకాకపోగా అసలే నెమ్మదిగా సాగుతున్న కథనంలో స్పీడు బ్రేకర్లల మారాయి. పాటలు నిరాశపరిచినా నేపథ్యం సంగీతం మాత్రం అలరిస్తుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. ప్లస్ పాయింట్స్ ; విజయ్ నటన యాక్షన్ సీన్స్ నేపథ్య సంగీతం మైనస్ పాయింట్స్ ; లాజిక్ లేని సీన్స్ స్లో నేరేషన్ సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్నెట్ డెస్క్. -
‘సర్కార్’కు షాక్
విజయ్, మురుగదాస్ కాంబినేషన్లో తెరకెక్కిన సర్కార్ సినిమాకు మరో చిక్కొచ్చిపడింది. భారీ బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా భారీగా రిలీజ్ చేస్తున్నారు. అంతేకాదు ఈ సినిమాకు తొలిరోజు భారీగా సంఖ్యలో షోస్ వేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. చెన్నైలోని పలు థియేరట్లలో 48 గంటల పాటు కంటిన్యూస్గా షోస్ వేసేలా ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ప్రభుత్వం విజయ్ అభిమానులకు షాక్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. కంటిన్యూస్ షోష్ కాదు.. కనీసం ఎర్లీ మార్నింగ్ షోస్కు కూడా అనుమతి ఇవ్వలేదట. దీపావళి పండుగ కావటంతో అవాంఛనీయ సంఘటనలు జరిగే అవకాశం ఉందని అదనపు షోలకు అనుమతి నిరాకరించినట్టుగా తెలుస్తోంది. దీంతో రెగ్యులర్ షోలతోనే విజయ్ తన మార్కెట్ స్టామినా ప్రూవ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. పొలిటికల్ థ్రిల్లర్గా తెరకెక్కిన ఈ సినిమాను సన్ పిక్చర్స్ సంస్థ భారీ బడ్జెట్తో నిర్మించింది. కేవలం తమిళ రైట్సే 80 కోట్లకు పైగా అమ్ముడయ్యాయి. విజయ్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో వరలక్ష్మీ శరత్కుమార్, రాధారవి, ప్రేమ్కుమార్, యోగిబాబు ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. -
‘సర్కార్ కథ బయటకు చెప్పినందుకే’
విజయ్ హీరోగా సౌత్ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ తెరకెక్కించిన సినిమా సర్కార్. దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాపై ఇటీవల పెద్ద ఎత్తున వివాదం చెలరేగింది. సర్కార్ కథ తనదే అంటూ వరుణ్ రాజేంద్రన్ అనే వ్యక్తి తమిళ రచయితల సంఘాన్ని ఆశ్రయించారు. అయితే విషయం అక్కడ పరిష్కారం కాకపోవటంతో కోర్డు వరకు వెళ్లాల్సి వచ్చింది. ఈ విషయంలో రచయితల సంఘం అధ్యక్షుడు భాగ్యరాజా కీలకంగా వ్యవహరించారు. రెండు కథల మధ్య పోలికలు ఉన్నట్టుగా నిరూపించేందుకు భాగ్యరాజా సర్కార్ సినిమా కథను కూడా బయట పెట్టాల్సి వచ్చింది. అందుకే నైతిక బాధ్యత వహిస్తూ భాగ్యరాజా రచయితల సంఘం అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. కారణమేదైన సినిమా కథను బయటపెట్టడం తప్పే అన్న భాగ్యరాజా ఇప్పటికే చిత్ర నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ను క్షమాపణ కోరినట్టుగా తెలిపాడు. -
సర్కార్ : 80 దేశాల్లో 3000 స్క్రీన్స్
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్, కమర్షియల్ చిత్రాల దర్శకుడు మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన పొలిటికల్ థ్రిల్లర్ సర్కార్. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్పై భారీ బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా దీపావళి కానుకగా నవంబర్ 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. వివాదాల కారణంగా సినిమా రిలీజ్పై అనుమానాలు ఏర్పడ్డా అన్ని క్లియర్ చేసుకొని అన్నుకున్న సమయానికి ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నారు సర్కార్ టీం. ఈ సినిమాను విజయ్ కెరీర్లోనే గతంలో ఎన్నడూ లేనంత భారీగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. దాదాపు 80 దేశాల్లో 3000లకు పైగా స్క్రీన్స్లో సర్కార్ సినిమా విడుదల కానుందని తమిళ సినిమా ఎనలిస్ట్ రమేష్ బాల వెల్లడించారు. తెలుగు నాట కూడా సర్కార్ 600 స్క్రీన్స్పై సినిమా రిలీజ్ అవుతుందని తెలుస్తోంది. ఈ సినిమా.. విజయ్ కెరీర్ లోనే కాదు, తమిళ సినిమా చరిత్రలోనే బిగెస్ట్రిలీజ్ గా రికార్డ్ సృష్టించనుందన్న టాక్ వినిపిస్తోంది. #Sarkar will release in 3,000 screens world-wide.. 80 countries.. Widest release for a Tamil movie.. pic.twitter.com/G1SkFidXfk — Ramesh Bala (@rameshlaus) October 31, 2018 -
‘సర్కార్’కి అంత వస్తుందా..?
కోలీవుడ్ టాప్ స్టార్ విజయ్ హీరోగా సౌత్ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా సర్కార్. దీపావళి కానుగా ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమాకు అడ్డంకులన్ని తొలిగిపోయాయి. దీంతో నవంబర్ 6 సినిమా ప్రేక్షకుల ముందుకు రావటం ఖాయం అయ్యింది. తమిళ్తో పాటు తెలుగులో కూడా భారీగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. తెలుగులో విజయ్కి పెద్దగా మార్కెట్ లేదు. విజయ్ హీరోగా తెరకెక్కిన తుపాకి సినిమా ఒక్కటి తప్ప వేరే ఏ సినిమా కూడా ఇక్కడ పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. అయితే సర్కార్కి ఉన్న క్రేజ్ దృష్ట తెలుగు డబ్బింగ్ రైట్స్ను దాదాపు 7 కోట్లకు సొంతం చేసుకున్నట్టుగా టాక్ వినిపిస్తోంది. అంటే ఈ సినిమా హిట్ అనిపించుకోవాలంటే అంతకు మించి కలెక్ట్ చేయాల్సి ఉంటుంది. మరి విజయ్ సర్కార్తో అయినా తెలుగు మార్కెట్లో సత్తా చాటుతాడేమో చూడాలి. ఈ సినిమా తమిళ వర్షన్ రైట్స్ 80 కోట్లకు పైగా అమ్ముడైనట్టుగా ప్రచారం జరుగుతోంది. విజయ్ ఇటీవల చేసిన సినిమాలన్నీ వంద కోట్లకు పైగా వసూళ్లు సాధించటంతో 80 కోట్లకు పైగా వసూళ్లు పెద్దగా కష్టమేమి కాదని భావిస్తున్నారు. విజయ్ సరసన కీర్తీ సురేష్ హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో వరలక్ష్మీ శరత్ కుమార్ మరో కీలక పాత్రలోనటించారు. -
సర్కార్ కథ కాపీనే..!
సౌత్ స్టార్ డైరెక్టర్ మురుగదాస్, స్టార్ హీరో విజయ్ ల కాంబినేషన్లో సర్కార్ సినిమా రూపొందిన సంగతి తెలిసిందే. గతంలో వీరి కాంబినేషన్లో వచ్చిన తుపాకి, కత్తి సినిమాలు ఘనవిజయం సాధించటంతో ఈ సినిమాపై కూడా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. తాజాగా తెరమీదకు వచ్చిన వివాదం సినిమా రిలీజ్పై అనుమానాలు కలిగేలా చేసింది. వరుణ్ రాజేంద్రన్ అనే వ్యక్తి సర్కార్ కథ నాదే అని ఆరోపిస్తూ కోర్టును ఆశ్రయించారు. అయితే ఈ విషయంపై ముందుగా కోర్టులోనే తేల్చుకుంటామని చెప్పిన దర్శకుడు తరువాత మాట మార్చినట్టుగా వార్తలు వస్తున్నాయి. సర్కార్ కథ వరుణ్ రాజేంద్రన్దే అని అంగీకరించటంతో పాటు 30 లక్షల పారితోషికం, సినిమా టైటిల్స్లో వరుణ్కు క్రెడిట్ ఇచ్చేందుకు మురుగదాస్ అంగీకరించినట్టుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఈ వార్తలపై చిత్రయూనిట్ అధికారికంగా స్పందించాల్సి ఉంది. భారీ బడ్జెట్తో సన్ పిక్చర్స్ సంస్థ నిర్మించిన ఈ సినిమా దీపావళి కానుకగా నవంబర్ 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. చదవండి : కోర్టులోనే తేల్చుకుంటానన్న మురుగదాస్! -
విజయ్ కొత్త సినిమాకు ముహూర్తం ఫిక్స్
పాలించే తమిళుడి కోసం జనవరిలో ముహూర్తం జరుగుతోందన్నది తాజా సమాచారం. అంటే చాలా మందికి అర్థం అయిపోయి ఉంటుంది. అలాంటి టైటిల్స్కు ఇప్పుడు సరైన హీరో విజయ్నే అని చెప్పవచ్చు. ఈ స్టార్ హీరో తాజాగా నటించిన చిత్రం సర్కార్. ఏఆర్.మురుగదాస్ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ సంస్థ నిర్మించిన ఈ భారీ చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని పలు వివాదాల మధ్య దీపావళికి సందడి చేయడానికి సిద్ధం అవుతోంది. కీర్తీసురేశ్ నాయకిగా నటించిన ఈ సినిమాలో సంచలన నటి వరలక్ష్మీశరత్కుమార్ రాజకీయనాయకురాలిగా ముఖ్యపాత్రలో నటించింది. రాజకీయ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంపై భారీ అంచనాలే నెలకుంటాయని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇకపోతే విజయ్ తదుపరి చిత్రానికి రెడీ అయిపోతున్నారు. తదుపరి ఆయన్ని దర్శకత్వం చేసే అవకాశం ఎవరికి లభిస్తుంది. ఏ చిత్ర నిర్మాణ సంస్థకు కాల్షీట్స్ ఇవ్వనున్నారు అనే ఆసక్తి చిత్ర పరిశ్రమలో నెలకొంది. విజయ్ తదుపరి చిత్రం గురించి కొన్ని వివరాలు అనధికారికంగా సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. అందులో ముఖ్యంగా విజయ్ తదుపరి అట్లీ దర్శకత్వంలో నటించడానికి రెడీ అవుతున్నారన్నది. వారిది హిట్ కాంబినేషన్ అన్న విషయం తెలిసిందే. ఇంతకు ముందు తేరి, మెర్సల్ చిత్రాలు వచ్చి సంచలన విజయాన్ని సాధించాయి. తాజాగా విజయ్, అట్లీల కాంబినేషన్లో తెరకెక్కనున్న చిత్రాన్ని ఏజీఎస్ సంస్థ నిర్మించనున్నట్లు తెలిసింది. అంతేకాదు ఈ చిత్ర ప్రారంభానికి వచ్చే ఏడాది జనవరిలో ముహూర్తం పెట్టినట్లు సమాచారం. ఇక అన్నింటికంటే ముఖ్యం దీనికి ఆళపోరాన్ తమిళన్ అనే టైటిల్ను అనుకుంటున్నట్లు తెలిసింది. ఈ టైటిల్ను దర్శకుడు అట్లీ చాలా కాలం క్రితమే రిజిస్టర్ చేశారు. -
దసరా కానుకగా ‘సర్కార్’ టీజర్
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్, ప్రస్తుతం మురుగదాస్ దర్శకత్వంలో సర్కార్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను కూడా ప్రారంభించారు చిత్రయూనిట్. షూటింగ్ ప్రారంభమైన రోజే రిలీజ్ డేట్ను ప్రకటించిన చిత్రయూనట్ ప్రమోషన్ కార్యక్రమాలను కూడా పక్కా ప్లాన్ చేస్తున్నారు. చిత్ర టీజర్ను త్వరలోనే రిలీజ్ చేయనున్నట్టుగా ప్రటించారు యూనిట్. విజయదశమి కానుకగా అక్టోబర్ 19న విజయ్ సర్కార్ టీజర్ను రిలీజ్ చేస్తున్నట్టుగా చిత్రయూనిట్ అధికారికంగా వెల్లడించారు. పొలిటికల్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న సర్కార్ సినిమాను సన్ పిక్చర్స్ సంస్థ భారీ బడ్జెట్తో నిర్మిస్తోంది. విజయ్ సరసన కీర్తి సురేష్ నటిస్తుండగా మరో కీలక పాత్రలో నటి వరలక్ష్మీ శరత్ కుమార్ కనిపించనున్నారు. #SarkarTeaserOn19th@actorvijay @ARMurugadoss @arrahman @KeerthyOfficial @varusarath pic.twitter.com/je2qdA1g64 — Sun Pictures (@sunpictures) 10 October 2018 -
దీపావళి బరిలో ఇద్దరు టాప్ స్టార్లు
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్, టాప్ డైరెక్టర్ మురుగదాస్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న భారీ చిత్రం సర్కార్. గతంలో వీరి కాంబినేషన్లో తెరకెక్కిన తుపాకి, కత్తి చిత్రాలు ఘనవిజయం సాధించటంతో సర్కార్పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాను దీపావళి కానుకగా రిలీజ్ చేయనున్నారు. తాజాగా ఈ సినిమాతో పోటి పడేందుకు మరో స్టార్ హీరో రెడీ అవుతున్నాడు. సూర్య హీరోగా సెల్వరాఘవన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఎన్జీకే కూడా దీపావళికే రిలీజ్ కావాల్సి ఉంది. కానీ షూటింగ్ ఆలస్యం కావటంతో ఎన్జీకే వాయిదా పడింది. ఇప్పుడు అదే స్థానంలో ధనుష్ హీరోగా గౌతమ్ మీనన్ తెరకెక్కిస్తున్న ‘ఎన్నయ్ నొక్కి పాయుమ్ తోట్ట’ను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. శశికుమార్ మరో కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో ధనుష్ జోడిగా మేగా ఆకాష్ నటిస్తున్నారు. ధనుష్, విజయ్లు ఒకేసారి బాక్సాఫీస్ బరిలో దిగుతుండటంతో అభిమానులు దీపావళి కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. -
రెహమాన్ స్వరం.. విజయ్ గళం
కోలీవుడ్ టాప్ హీరో విజయ్ ప్రస్తుతం మురుగదాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. గతంలో వీరి కాంబినేషన్ లో వచ్చిన తుపాకి, కత్తి సినిమాలు ఘనవిజయం సాదించటంతో ఈ కాంబినేషన్పై మరింత క్రేజ్ ఏర్పడింది. ఏఆర్ రెహమాన్ సంగీతమందిస్తున్న ఈ సినిమాకు సంబంధించి మరో ఆసక్తికర అప్డేట్ కోలీవుడ్ లో హల్ చల్ చేస్తోంది. ఈ సినిమాలో హీరో విజయ్ ఓ పాటను ఆలపించనున్నారు. గతంలో విజయ్ పలు చిత్రాల్లో పాటలు పాడినా.. రెహమాన్ సంగీతదర్శకత్వంలో పాట పాడటం ఇదే తొలిసారి. విజయ్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్గా నటిస్తున్న ఈసినిమాలో వరలక్ష్మీ శరత్ కుమార్, ప్రేమ్ కుమార్, రాధారవిలు ఇతర కీలకపాత్రల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ఈ సినిమాను ఈ ఏడాది దీపావళి కానుకగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. -
ఈ నటి చాలా లక్కీ అట..!
సాక్షి, చెన్నై: ముంబై ముద్దుగుమ్మ సాయేషా సైగల్ ఇళయదళపతి విజయ్తో జత కట్టనుంది. ఈ లక్కీ నటికి అతి తక్కువ సమయంలోనే విజయ్ సరసన నటించే అవకాశం వచ్చింది. విజయ్ తన 62వ చిత్రంలోనూ ఇద్దరు ముద్దుగుమ్మలట. తెరి సినిమాలో సమంత, ఎమీజాక్సన్లతో యువళగీతాలు పాడేశారు. మెర్శల్ చిత్రంలో ఏకంగా సమంత ,కాజల్అగర్వాల్, నిత్యామీనన్లతో డ్యూయెట్లు పాడేశారు. ప్రస్తుతం తన 62వ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ కాంబినేషన్లో తుపాకీ, కత్తి చిత్రాలు తెరకెక్కిన విషయం తెలిసిందే. ఇందులో విజయ్కు జంటగా నటి కీర్తిసురేశ్ ఎంపికయ్యారు. ఈ బ్యూటీతో సన్నివేశాల చిత్రీకరణ కూడా మొదలైంది. ఈ చిత్రంలో మరో హీరోయిన్ ఉంటుందన్న సమాచారాన్ని చిత్ర యూనిట్ ఆలస్యంగా వెల్లడించింది. వనమగన్ చిత్రంలో తన నటనలో చక్కని అభినయాన్ని ప్రదర్శించి, డాన్స్తో దుమ్మురేపిన ముంబై చిన్నది సాయేషా సైగల్. ఈ లక్కీ నటికి అతి తక్కువ సమయంలోనే విజయ్తో నటించే అవకాశం తలుపు తట్టింది. ఇప్పటికే కార్తీ, విజయ్సేతుపతిల సరసన నటిస్తూ బిజీగా ఉన్న సాయేషాకు విజయ్తో భారీ చిత్రంలో నటించే అవకాశాన్ని దక్కించుకుంది. ఈ బ్యూటీది చిత్రంలో చాలా ప్రాధ్యానత ఉన్న పాత్ర అని సమాచారం. ఈ చిత్రానికి ఏఆర్.రెహ్మాన్ సంగీతం అందిస్తున్నారు. -
సీన్ రివర్స్.. ఛాన్స్ మిస్
వరుస విజయాలతో దూసుకెళ్తున్న రకుల్ ఇన్నాళ్లు కూల్గానే ఉంది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేనట్టుంది. ఈ అందాల భామకు అదృష్టంతో పాటు అందం కూడా బోలెడంత ఉంది. ఇప్పుడు ఈ భామకు వచ్చిన కష్టం ఏంటని అనుకుంటున్నారా? స్పైడర్ సినిమాతో తమిళంలో మంచి పేరు తెచ్చుకున్న ఈ అమ్మడు తరువాత కార్తీ సరసన ధీరన్ అధిగరం ఒండ్రు (తెలుగులో ఖాకీ)తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. తరువాత ఈ భామకు అవకాశాలు బాగా వస్తాయని అందరూ అనుకున్నారు. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. వచ్చిన అవకాశాలు ఒక్కొక్కటిగా వెనక్కి వెళ్లిపోతున్నాయి. తెలుగులో మొదటి సినిమా కెరటం నిరాశపరిచినా..రెండో సినిమా వెంకటాద్రి ఎక్స్ప్రెస్లో తన నటన, అందంతో తెలుగు ప్రేక్షకులను ముగ్ధుల్ని చేసింది. తరువాత చిన్న హీరోలతో నటిస్తూనే...పెద్ద హీరోల సరసన నటించే అవకాశాలు వచ్చాయి. అవి వరుసగా హిట్స్ అవడంతో లక్కి హీరోయిన్గా పేరు తెచ్చుకుంది. తన క్యూట్ లుక్స్తో, అందాల ఆరబోతతో కుర్రకారుకు మత్తెక్కించింది రకుల్ కూల్గా. లౌక్యం, పండుగచేస్కో, కిక్2 , నాన్నకు ప్రేమతో, సరైనోడు, ధ్రువ లాంటి వరుస హిట్లతో ఉన్న రకుల్ స్పీడుకి స్పైడర్ అడ్డుకట్ట వేసింది. ప్రస్తుతం అమ్మడి చేతిలో చెప్పుదగ్గ సినిమాలేవి లేవు. తమిళంలో వచ్చిన అవకాశాలు సైతం చేజారిపోతున్నాయి. విజయ్, మురుగదాస్ల కాంబినేషన్లో తెరకెక్కనున్న సినిమాలో మొదట రకుల్ని హీరోయిన్గా అనుకున్నారు. తర్వాత ఆ అవకాశం కీర్తిసురేశ్కు దక్కింది. అంతేకాదు సూర్య, సెల్వరాఘవన్ దర్శకత్వంలో నటిస్తున్న సినిమాలోనూ రకుల్నే మొదట హీరోయిన్గా అనుకున్నా.. ఆ ప్లేస్ లో సాయి పల్లవిని తీసుకున్నారు. ఇలా ర‘కూల్’గా ఉండాల్సింది పోయి ఇప్పుడు టెన్షన్ పడాల్సి వస్తోంది. సౌత్ లో నిరాశపరిచినా. త్వరలో ఓ బాలీవుడ్ సినిమాతో ఉత్తరాదిలో సత్తా చాటేందుకు రెడీ అవుతోంది రకుల్. -
స్టార్ హీరో సరసన మరో ఛాన్స్
టాలీవుడ్, కోలీవుడ్లలో వరుస సినిమాలతో దూసుకుపోతున్న కీర్తి సురేష్ మరో క్రేజీ ప్రాజెక్ట్లో ఛాన్స్ కొట్టేసింది. ఈ సంక్రాంతి రెండు భారీ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు రానుంది కీర్తి. తెలుగులో పవన్ కళ్యాణ్ సరసన నటించిన అజ్ఞాతవాసి సినిమాతో పాటు కోలీవుడ్లో సూర్య సరసన నటించిన గ్యాంగ్ సినిమాలు సంక్రాంతి బరిలోనే రిలీజ్ అవుతున్నాయి. తాజాగా మరోసారి కోలీవుడ్ టాప్ హీరో సరసన నటించే ఛాన్స్ కొట్టేసింది కీర్తిసురేష్. ఇలయదళపతి విజయ్ హీరోగా మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కనున్న భారీ చిత్రంలో కీర్తి సురేష్ ను హీరోయిన్ గా తీసుకున్నారు. గతంలో విజయ్ సరసన భైరవ సినిమాలో కలిసి నటించింది కీర్తి సురేష్. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. -
సూపర్ స్టార్ స్టామినా : 12 రోజుల్లో 150 కోట్లు
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా స్టార్ డైరెక్టర్ మురుగదాస్ తెరకెక్కించిన భారీ యాక్షన్ థ్రిల్లర్ స్పైడర్. తెలుగు తమిళ భాషల్లో ఒకేసారి తెరకెక్కిన ఈ సినిమాకు తొలి షో నుంచే డివైడ్ టాక్ వచ్చినా.. కలెక్షన్లు మాత్రం భారీగా వస్తున్నాయి. తెలుగు నాట పెద్దగా ఆకట్టుకోలేకపోయినా.. కోలీవుడ్ లో మాత్రం ఈ సినిమా మంచి రివ్యూస్ వచ్చాయి. దీంతో కలెక్షన్లు కూడా భారీగానే వస్తున్నాయి. తొలి రోజు రికార్డ్ కలెక్షన్లు సాదించిన స్పైడర్ కు ఇప్పటికే 150 కోట్ల గ్రాస్ వసూళు చేసినట్టుగా చిత్రయూనిట్ ప్రకటించారు. దాదాపు 125 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాలో మహేష్ బాబు సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించగా తమిళ నటుడు, దర్శకుడు ఎస్ జే సూర్య ప్రతినాయకుడిగా అలరించాడు. తమిళనాట ఈ వారం సినిమా రిలీజ్ లు ఆగిపోవటం కూడా స్పైడర్ కు కలిసొచ్చే అంశమనే చెప్పాలి. -
భారీ వసూళ్లతో దుమ్మురేపిన స్పైడర్!
ప్రముఖ డైరెక్టర్ మురుగదాస్ దర్శకత్వంలో మహేష్బాబు హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం 'స్పైడర్'. దసరా పండుగ సందర్భంగా గత బుధవారం ఈ సినిమా విడుదలైంది. సైకో థ్రిల్లర్గా తెరకెక్కిన ఈ సినిమాలో మహేష్ బాబు 'స్పై'గా నటించాడు. దర్శకుడు ఎస్జే సూర్య.. మనుష్యులు ఏడిస్తే చూసి ఆనదించే సైకోగా తన నటనతో ఆకట్టుకున్నాడు. ఈ సినిమాకు డివైడ్ టాక్ వచ్చిందని వినిపిస్తున్నా.. దసరా సెలవుల్లో రావడం.. మహేశ్బాబు-మురుగదాస్ కాంబినేషన్పై అంచనాలు ఉండటం ఈ సినిమాకు కలిసి వచ్చిందని అంటున్నారు. ఈ సినిమా టాక్ ఎలా ఉన్నా.. 'స్పైడర్' వసూళ్లు దుమ్మురేపేలా ఉన్నాయంటున్నారు చిత్ర దర్శక నిర్మాతలు. వారం మధ్యలో విడుదలైనప్పటికీ 'స్పైడర్'.. తొలిరోజే కళ్లుచెదిరేరీతిలో రూ. 51 కోట్లు వసూలు చేసింది. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిన ఈ సినిమా రెండురోజుల్లో రూ. 72 కోట్లు వసూలుచేసినట్టు చిత్రయూనిట్ శుక్రవారం ధ్రువీకరించింది. తొలి మూడురోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ. 85 కోట్ల గ్రాస్ వసూలు చేసిన.. స్పైడర్ వారాంతంలో రూ. 100 కోట్ల క్లబ్బులో చేరవచ్చునని భావిస్తున్నారు. మొత్తానికి తొలివారంలోనే ఈ సినిమాకు రూ. 100 కోట్లు ఖాయమనే విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. భారీ బడ్జెట్తో మురుగదాస్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాపై ఇప్పటికే సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రశంసల జల్లు కురిపించిన సంగతి తెలిసిందే. -
మురుగదాస్ భారీ ప్రాజెక్టు
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా స్పైడర్ సినిమాను తెరకెక్కించిన మురుగదాస్, తెలుగు ప్రేక్షకులను నిరాశపరిచినా కోలీవుడ్ లో మాత్రం సత్తా చాటాడు. అయితే త్వరలో ఈ స్టార్ డైరెక్టర్ ఓ భారీ ప్రయోగానికి రెడీ అవుతున్నాడన్న ప్రచారం జరుగుతోంది. కోలీవుడ్ విజయ్ హీరోగా వరుస బ్లాక్ బస్టర్స్ అందించిన మురుగదాస్.. మహేష్ బాబు, విజయ్ ల కాంబినేషన్ లో ఓ భారీ మల్టీ స్టారర్ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నాడు. ఈ విషయాన్ని స్పైడర్ తమిళ ప్రమోషన్ సందర్భంగా మురుగదాస్ ప్రకటించారు. అంతేకాదు ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి మరో ఆసక్తికరమైన వార్త కోలీవుడ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. తెలుగు తమిళ భాషల్లో ఒకేసారి తెరకెక్కనున్న ఈ సినిమాలో తెలుగు వర్షన్ కోసం మహేష్ బాబు హీరోగా, విజయ్ విలన్ గా నటిస్తే, తమిళ వర్షన్ లో విజయ్ హీరోగా మహేష్ బాబు విలన్ గా నటిస్తారట. మరి ఈ భారీ ప్రయోగం నిజంగానే సెట్స్ మీదకు వస్తుందేమో చూడాలి. -
బాలీవుడ్ లో స్పైడర్ రీమేక్..?
దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సూపర్ స్టార్ మహేష్ బాబు మూవీ స్పైడర్. తొలి సారిగా ఈ సినిమాతో కోలీవుడ్ కు పరిచయం అయిన మహేష్, మరోసారి బాక్సాఫీస్ ముందు సత్తా చాటాడు. తొలి రోజు డివైడ్ టాక్ తో స్టార్ట్ అయిన స్పైడర్ ఒక్క రోజులో 51 కోట్ల గ్రాస్ సాధించి మహేష్ కెరీర్ లోనే తొలి రోజు అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డ్ సృష్టించింది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరో ఇంట్రస్టింగ్ అప్ డేట్ సౌత్ ఫిలిం సర్కిల్స్ లో వినిపిస్తోంది. ఇప్పటికే బాలీవుడ్ లో సత్తా చాటిన మురుగదాస్, స్పైడర్ సినిమాను హిందీలో రీమేక్ చేసే ఆలోచనలో ఉన్నాడట. ముందుగా ఈ సినిమానే డబ్ చేసి రిలీజ్ చేయాలని భావించినా.. ఇప్పుడు పునరాలోచనలో పడ్డారన్న ప్రచారం జరుగుతోంది. అంతేకాదు బాలీవుడ్ రీమేక్ తో మహేష్ బాబును బాలీవుడ్ లో లాంచ్ చేసే బాధ్యతను కూడా మురుగదాస్ తీసుకోబోతున్నాడన్న ప్రచారం జరుగుతోంది. తమిళ నాట స్పైడర్ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తుండటంతో మురుగదాస్ దర్శకత్వంలో మరో సినిమా చేసేందుకు మహేష్ ఆసక్తి కనబరుస్తున్నాడట. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న స్పైడర్ బాలీవుడ్ రీమేక్ పై త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. -
'స్పైడర్' మూవీ రివ్యూ
టైటిల్ : స్పైడర్ జానర్ : క్రైమ్ థ్రిల్లర్ తారాగణం : మహేష్ బాబు, రకుల్ ప్రీత్ సింగ్, ఎస్ జే సూర్య, ప్రియదర్శి, భరత్ సంగీతం : హారిష్ జయరాజ్ దర్శకత్వం : ఏఆర్ మురుగదాస్ నిర్మాత : ఎన్వీ ప్రసాద్, ఠాగూర్ మధు, మంజుల స్వరూప్ బ్రహ్మోత్సవం లాంటి భారీ డిజాస్టర్ తరువాత మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన సినిమా స్పైడర్. ఈ సినిమాతో మహేష్ తొలిసారిగా కోలీవుడ్ లో అడుగుపెడుతుండటంతో స్పైడర్ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. సూపర్ స్టార్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుండటంతో పాటు సౌత్ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతుండం స్పైడర్ మీద అంచనాలను భారీగా పెంచేసింది. మరి ఆ అంచనాలను స్పైడర్ అందుకుందా..? బ్రహ్మాత్సవం తో డీలా పడిపోయిన సూపర్ స్టార్ అభిమానులు స్పైడర్ తో ఖుషీ అయ్యారా..? కథ : శివ (మహేష్ బాబు) ఇంటలిజెన్స్ బ్యూరోలో కాల్ టాపింగ్ డిపార్ట్ మెంట్ లో పని చేస్తుంటాడు. తన అర్హతలకు అంతకన్నా మంచి ఉద్యోగం వచ్చే అవకాశం ఉన్నా.. క్రైమ్ జరగటానికి ముందే ఆపే అవకాశం ఉండటంతో అదే ఉద్యోగాన్ని కోరి మరీ చేస్తుంటాడు. అలా ఎంతో మంది ఇబ్బందుల్లో పడకుండా ముందే తెలుసుకొని కాపాడతాడు. అయితే ఓ ఇంట్లో ఒంటరిగా ఉన్న అమ్మాయిని కాపాడే ప్రయత్నంలో ఉండగా ఆ అమ్మాయితో పాటు శివ స్నేహితురాలు కూడా హత్యకు గురవుతుంది. (సాక్షి రివ్యూస్) ఆ హత్యకు కారణం ఎవరో తెలుసుకునే ప్రయత్నంలో శివకు భయం కలిగించే నిజాలు తెలుస్తాయి. శాడిస్టిక్ పర్సనాలిటీ డిజార్డర్ అనే వ్యాదితో ఇబ్బంది పడే సైకో భైరవుడు (యస్ జే సూర్య) చిన్నతనం నుంచి ఎవరైన ఏడుస్తుంటే వారిని చూసి ఆనందపడటం భైరవుడి జబ్బు. అందుకోసం తానే హత్యలు చేయటం మొదలుపెడతాడు. చనిపోయిన వారి చుట్టూ జనం చేరి ఏడుస్తుంటే వారిని చూసి ఆనంద పడతుంటాడు. ఇలా వరుస హత్యలు చేస్తున్న భైరవుడు.. హైదరాబాద్ లో ఓ భారీ వినాశనానికి ప్లాన్ చేస్తాడు. భైరవుడు చేయాలనుకున్న వినాశనం ఏంటి..? ఆ ప్రమాదం నుంచి నగరాన్ని శివ కాపాడగలిగాడా..? అన్నదే మిగతా కథ. నటీనటులు : సూపర్ స్టార్ మహేష్ బాబు ఇంటలిజెన్స్ అధికారిగా ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా యాక్షన్ ఎమోషనల్ ఎపిసోడ్స్ లో మహేష్ నటన అద్భుతమనే చెప్పాలి. అయితే సినిమా అంతా సీరియస్ మూడ్ లో సాగటంతో మహేష్ మార్క్ ఎంటర్ టైన్మెంట్ ఆశించే వారికి మాత్రం నిరాశ తప్పదు. హీరోయిన్ గా రకుల్ ప్రీత్ ఆకట్టుకుంది. నటనకు పెద్దగా అవకాశం లేకపోయినా.. ఉన్నంతలో తనదైన నటనతో మెప్పించింది. పూర్తి యాక్షన్ జానర్ సినిమా కావటంతో ఆడియన్స్ కు రకుల్ గ్లామర్ రిలీఫ్ అనిపించటం ఖాయం. విలన్ గా ఎస్ జే సూర్య విశ్వరూపమే చూపించాడు. సైకోగా సూర్య నటన తెలుగు ప్రేక్షకులను కూడా మెప్పిస్తుంది. సాంకేతిక నిపుణులు : కమర్షియల్ సినిమాతోనూ స్ట్రాంగ్ మెసేజ్ ఇవ్వటంలో తనకు తిరుగులేదని దర్శకుడు మురుగదాస్ మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు. తొలిసారిగా సూపర్ స్టార్ ను డైరెక్ట్ చేసిన మురుగదాస్, మహేష్ ను స్టైలిష్ కాప్ గా చూపించాడు. అయితే తెలుగునాట మహేష్ ఇమేజ్ కు తగ్గ కథా కథనాలను ఎంపిక చేయటంలో తడబడ్డాడు. మహేష్ ను కోలీవుడ్ లో గ్రాండ్ గా లాంచ్ చేయటంలో మాత్రం మురుగదాస్ సక్సెస్ సాధించాడు. తొలి భాగం కాస్త స్లో అయినా.. ద్వితీయార్థం మాత్రం యాక్షన్ ఎపిసోడ్స్, ట్విస్ట్ లతో కథను పరిగెత్తించాడు. అయితే ఎక్కువ భాగం సినిమా తమిళ నేటివిటికి తగ్గట్టుగా తెరకెక్కించటం కాస్త నిరాశపరుస్తుంది. హారిష్ జయరాజ్ అందించిన పాటలు పెద్దగా ఆకట్టుకోకపోయినా.. విజువల్ గా బాగున్నాయి. (సాక్షి రివ్యూస్) బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో మాత్రం హారిష్ మ్యాజిక్ చేశాడనే చెప్పాలి. సంతోష్ శివన్ సినిమాటోగ్రఫి సినిమాకు మరో మేజర్ ప్లస్ పాయింట్. యాక్షన్ సీన్స్ లో సినిమాటోగ్రఫి సూపర్బ్. ఎడిటింగ్, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. ప్లస్ పాయింట్స్ : మహేష్, యస్ జే సూర్యల నటన యాక్షన్ ఎపిసోడ్స్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మైనస్ పాయింట్స్ : ఫస్ట్ హాఫ్ లో కొన్ని సీన్స్ తెలుగు నేటివిటి పెద్దగా కనిపించకపోవటం - సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్నెట్ డెస్క్ -
మహేష్ కు 'స్పైడర్' ఎందుకంత స్పెషల్..!
సూపర్ స్టార్ మహేష్ బాబు స్పైడర్ సినిమా విషయంలో గతంలో ఎన్నడూ లేనంత ఎగ్జైటింగ్ గా కనిపిస్తున్నారు. ఈ సినిమాతో తొలిసారిగా తమిళ ప్రేక్షకులకు పరిచయం అవుతున్న సూపర్ స్టార్ సినిమా సక్సెస్ మీద చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. గతంలో సినిమా ప్రచార కార్యక్రమాల్లో పెద్దగా పాల్గొనని మహేష్, ఇటీవల చాలా మారారు. తన సినిమాలను తానే స్వయంగా ప్రమోట్ చేస్తూ అభిమానులకు మరింత చేరువయ్యే ప్రయత్నం చేస్తున్నారు. ఈ సందర్భంగా సాక్షితో ప్రత్యేకంగా మాట్లాడిన సూపర్ స్టార్, స్పైడర్ సినిమా తన కెరీర్ కు ఎందుకు స్పెషలో వివరించారు. అంతేకాదు దర్శకుడు మురుగదాస్ తో తన అనుబంధం గురించి కూడా ఆసక్తికర విషయాలను వెల్లడించారు. దాదాపు పదేళ్లుగా మురుగదాస్ తో పరిచయం ఉందన్న మహేష్, స్పైడర్ కథ చెబుతున్నప్పుడే సినిమా ఎలా ఉంటుందో అర్థమయ్యిందన్నారు. అందుకే ఈ సినిమా చేసేందుకు అంగీకరించానని తెలిపారు. -
'స్పైడర్ సూపర్ డూపర్ హిట్ అవుతుంది'
సాక్షి, హైదరాబాద్: సూపర్ స్టార్ మహేశ్బాబు హీరోగా మురగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన స్పైథ్రిల్లర్ మూవీ 'స్పైడర్'. దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక నగరంలోని శిల్ప కళావేదికలో అట్టహాసంగా జరిగింది. సినీ పరిశ్రమకు చెందిన అతిరథ మహారథులు పాల్గొన్న ఈ వేడుకలో అలనాటి సూపర్ స్టార్ కృష్ణ మాట్లాడుతూ చిత్ర యూనిట్పై ప్రశంసల జల్లు కురిపించారు. 'మహేశ్ సినిమా సినిమాకు ఇంప్రూమెంట్ చూపిస్తున్నాడు. చాలా అద్భుతంగా చేస్తున్నాడు. చిన్నప్పటి నుంచి మద్రాస్లో ఉన్న మహేశ్ చాలా స్పష్టంగా తమిళ ఆర్టిస్టులాగే మాట్లాడాడు' అని కృష్ణ అన్నారు. గతంలో తమిళం నేర్చుకోలేకపోవడం వల్ల తనకు తమిళ సినిమాలో మొదట అవకాశం వచ్చినా చేయలేకపోయానని గుర్తుచేసుకున్నారు. చాలా గొప్ప దర్శకుడు మురగదాస్ దర్శకత్వంలో తమిళంలో మహేశ్ పరిచయం కావడం ఆనందంగా ఉందన్నారు. ఈ పిక్చర్ డెఫినెట్గా సూపర్ డూపర్ హిట్ అవుతుందని కృష్ణ ధీమా వ్యక్తం చేశారు. ఈ వేడుకలో కృష్ణ, విజయ నిర్మల, మహేశ్ బాబు, ఆయన సతీమణి నమ్రత, దర్శకుడు మురగదాస్, హీరోయిన్ రకుల్ప్రీత్ సింగ్ ఇతర చిత్రయూనిట్ సభ్యులు పాల్గొన్నారు. -
స్పైడర్.. సడన్ సర్ప్రైజ్
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న యాక్షన్ థ్రిల్లర్ స్పైడర్. తమిళ ప్రముఖ దర్శకుడు మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి చిత్ర యూనిట్.. అభిమానులకు ఓ సడెన్ సర్ప్రైజ్ ఇచ్చింది. టీజర్ ను ముందుగానే ఎనౌన్స్ చేసి భారీ ఎక్స్పెక్టేషన్స్ మధ్య రిలీజ్ చేసిన మూవీ టీం, ట్రైలర్ రిలీజ్ ను మాత్రం కేవలం ఒక గంట ముందే వెల్లడించి అభిమానులను ఆశ్చర్యంలో ముంచెత్తింది. ట్రైలర్ తో పాటు ‘అక్కడ ఉన్నాడు అనే’ మాస్ సాంగ్ ను కూడా విడుదల చేశారు. ఈ పాటకు రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించగా గీత మాధురి ఆలపించారు. మహేష్ క్యారెక్టరైజేషన్ తో పాటు సినిమా థీమ్ ను కూడా ఈ ట్రైలర్ లో చూపించారు. ఇప్పటికే భారీ అంచనాలు ఉండగా ట్రైలర్ రిలీజ్ తర్వాత అది మరింతగా పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా యాక్షన్ ఎపిసోడ్స్ సినిమాకు కీలకంగా ఉంటాయని తెలుస్తోంది. మహేష్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు హరీష్ జయరాజ్ సంగీతం అందించాడు. ఇప్పటికే చెన్నైలో ఆడియో వేడుకను ఘనంగా నిర్వహించగా ఇవాళ (శుక్రవారం) హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ఏర్పాట్లు చేస్తున్నారు. -
మహేష్ బాబు సూపర్ మాస్ సాంగ్
-
స్పైడర్.. సడన్ సర్ప్రైజ్
-
హమ్మయ్య.. స్పైడర్ షూటింగ్ పూర్తయ్యింది..!
సూపర్ స్టార్ మహేష్ బాబు స్టార్ డైరెక్టర్ మురుగదాస్ ల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న స్పైడర్ సినిమా షూటింగ్ పూర్తయ్యింది. దాదాపు ఏడాదికి పైగా షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా చివరి షాట్ పూర్తయినట్టుగా హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ తన ట్విట్టర్ లో వెల్లడించింది. షూటింగ్ తో పాటు నిర్మాణాంతర కార్యక్రమాలు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. ఈ నెల 27న తెలుగు తమిళ భాషల్లో భారీగా సినిమా రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నారు. తమిళ నటుడు, దర్శకుడు ఎస్ జే సూర్య ప్రతినాయక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో కోలీవుడ్ యంగ్ హీరో భరత్ మరో విలన్ గా కనిపించనున్నాడు. తమిళ నటుడు ఆర్జే బాలాజీ, పెళ్లి చూపులు ఫేం ప్రియదర్శి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తమిళనాట ఈ రోజు (09-09-2017) ఏర్పాటు చేసిన భారీ ఆడియో రిలీజ్ వేడకకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. సినిమా రిలీజ్ కు ముందు హైదరాబాద్ తో ఓ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారు. And a mandatory pic wd d captain himself @ARMurugadoss sir after d last shot. #SPYderOnSeptember27th pic.twitter.com/xdfQypaSh5 — Rakul Preet (@Rakulpreet) 9 September 2017 -
స్పైడర్ సీన్స్ లీక్పై క్లారిటీ..!
ఇటీవల కాలంలో స్టార్ హీరోల సినిమాలు లీక్ అవ్వటం కామన్ అయిపోయింది. అయితే తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న స్పైడర్ సినిమాకు సంబంధించిన కొన్ని సీన్స్ లీక్ అయ్యాయంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఈ విషయం పై స్పందించిన చిత్రయూనిట్ అలాంటిదేమి లేదంటూ కొట్టిపారేసింది. పుకార్లు నమ్మవద్దని విజ్ఞప్తి చేసిన స్పైడర్ టీం, కొంత మంది కావాలనే ఫేక్ వీడియోలను సర్క్యూలేట్ చేస్తున్నారని తెలిపింది. మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న స్పైడర్ సినిమాకు తమిళ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ దర్శకుడు. ఈ సినిమాతో మహేష్ తొలిసారిగా కోలీవుడ్ కు పరిచయం అవుతున్నాడు. హరీష్ జయరాజ్ సంగీతం అందిస్తుండగా రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటుడు దర్శకుడు ఎస్ జె సూర్య ప్రతినాయకుడిగా అలరించనున్నారు. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న స్పైడర్ సెప్టెంబర్ 27న రిలీజ్ కానుంది. Do NOT believe rumours about ANY leakage of #SPYder footage.Some elements are spreading Fake videos. — Spyder (@SpyderTheMovie) 3 September 2017 -
సెన్సార్ బోర్డ్కు 'స్పైడర్' టీం రిక్వెస్ట్..!
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా స్టార్ డైరెక్టర్ మురుగదాస్ దర్శకత్వంలో స్పైడర్ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. మహేస్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమా మరో రికార్డ్ సృష్టించేందుకు రెడీ అవుతోంది. గత కొంత కాలంగా సెన్సార్ బోర్డ్ ఆదేశాల మేరకు సినిమాల ప్రదర్శనకు ముందే ధూమపానం, మద్యపానానికి సంబంధించిన స్టాట్యూటరీ వీడియోను ప్లే చేస్తున్నారు. ప్రతీ సినిమాలో ఏదో ఒక సందర్భంగా ధూమపానం, మద్యపానానికి సంబంధించిన సన్నివేశాలు ఉంటాయి గనుక ఈ వీడియో తప్పనిసరి అయ్యింది. అయితే మహేష్ హీరోగా తెరకెక్కుతున్న స్పైడర్ సినిమాలో ఏ ఒక్క సీన్ లోనూ ధూమపానం, మద్యపానం చేస్తూ ఎవరూ కనిపంచరట. విలన్ పాత్రలో నటించిన ఎస్ జె సూర్య కూడా సినిమా అంతా గ్రీన్ టీ తాగుతూనే కనిపిస్తాడట. బ్యాక్ గ్రౌండ్ లోనూ ఇలాంటి విజువల్స్ లేవు కాబట్టి తమ సినిమాకు స్టాట్యూటరి వార్నింగ్ వీడియో లేకుండా ప్రదర్శించేందుకు అవకాశం ఇవ్వాలని సెన్సార్ బోర్డ్ ను కోరుతున్నారు స్పైడర్ యూనిట్. మరి సెన్సార్ బోర్డ్ మురుగదాస్ టీం అభ్యర్థనను ఎంత వరకు మన్నిస్తుందో చూడాలి. -
ప్రభాస్తో కోలీవుడ్ స్టార్ డైరెక్టర్..!
ప్రస్థుతం మహేష్ బాబు హీరోగా స్పైడర్ సినిమాను తెరకెక్కిస్తున్న కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ త్వరలో మరో టాలీవుడ్ స్టార్ హీరోతో సినిమా చేయనున్నాడట. కోలీవుడ్ తో పాటు టాలీవుడ్, బాలీవుడ్ లలోనూ మంచి ఫాలోయింగ్ ఉన్న మురుగదాస్ భారీ యాక్షన్ చిత్రాల స్పెషలిస్ట్ పేరు తెచ్చుకున్నాడు. సౌత్ స్టార్ హీరోలతో పాటు బాలీవుడ్ స్టార్స్ కూడా మురుగదాస్ సినిమాల్లో నటించేందుకు ఇంట్రస్ట్ చూపిస్తారు. స్పైడర్ తరువాత తమిళ స్టార్ విజయ్ హీరోగా ఓ సినిమా ప్లాన్ చేస్తున్నాడు మురుగదాస్. అయితే పలు బాలీవుడ్ సంస్థలు మురుగదాస్ దర్శకత్వంలో ఓ క్రేజీ ప్రాజెక్ట్ ను సెట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నాయన్న ప్రచారం జరుగుతోంది. బాహుబలి సినిమాతో జాతీయ స్థాయిలో క్రేజ్ తెచ్చుకున్న ప్రభాస్ హీరోగా మురుగదాస్ దర్శకత్వంలో సినిమా నిర్మించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రభాస్, మురుగదాస్ ఇప్పటికే కమిట్ అయిన ప్రాజెక్ట్స్ పూర్తి అయితే కాని ఈ కాంబినేషన్ పై మరింత క్లారిటీ వచ్చే అవకాశం లేదు. -
మహేష్ కోసం భారీ వేడుక..!
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం మురుగదాస్ దర్శకత్వంలో స్పైడర్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాతో మహేష్ బాబు కోలీవుడ్ కు పరిచయం అవుతున్నాడు. సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఇదే తొలి స్ట్రయిట్ తమిళ సినిమా. దీంతో మహేష్ ను గ్రాండ్ గా లాంచ్ చేసేందుకు నిర్మాతలు కష్టపడుతున్నారు. ఇప్పటివరకు స్పైడర్ సినిమాకు మురుగదాస్ పేరు మీదే కోలీవుడ్ లో బిజినెస్ జరిగింది. అందుకే మహేష్ బాబు కోలీవుడ్ జనాలకు సూపర్ స్టార్ గా ప్రజెంట్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. అందుకోసం త్వరలో ఓ గ్రాండ్ ఈవెంట్ నిర్వహించాలని భావిస్తున్నారు. స్టార్ వారసులను పరిచయం చేసేందుకు ఏర్పాటు చేసే వేడుక తరహాలో తమిళనాట భారీ వేడుకతో మహేష్ ను లాంచ్ చేసే ప్లాన్ లో ఉన్నారు నిర్మాతలు. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న స్పైడర్ సెప్టెంబర్ 27న రిలీజ్ కానుంది. మహేష్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తున్న తమిళ నటుడు దర్శకుడు ఎస్ జె సూర్య ప్రతినాయకుడిగా నటిస్తున్నాడు. -
'మహేష్ సినిమా కాబట్టే చేశా'
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం స్పైడర్. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాతో మహేష్ కోలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్నాడు. అందుకే సినిమాలో కీలక పాత్రలకు పలువురు కోలీవుడ్ నటులను ఎంపిక చేశారు. మెయిన్ విలన్ గా నటుడు దర్శకుడు ఎస్ జె సూర్య నటిస్తుండగా.. మరో విలన్ గా యంగ్ హీరో భరత్ నటిస్తున్నాడు. అయితే విలన్ రోల్ పై భరత్ ఆసక్తికరంగా స్పందించాడు. ఇది మహేష్ బాబు సినిమా కాబట్టే ప్రతినాయక పాత్రలో నటించానని మరే హీరో సినిమాలోనూ విలన్ గా చేయనని చెప్పాడు. ఈ సినిమాలో మహేష్, భరత్ ల మధ్య జరిగే ఓ ఫైట్ సీన్ ను రోలర్ కోస్టర్ పై దాదాపు 15 రోజుల పాటు చిత్రీకరించారు. పీటర్ హెయిన్స్ కంపోజ్ చేసిన ఈ ఫైట్ సీన్ సినిమాకే హైలెట్ అన్న టాక్ వినిపిస్తుంది. -
మహేష్ బాబు ఫ్యాన్స్కు సర్ప్రైజ్
హైదరాబాద్: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న మూవీ ‘స్పైడర్’. స్టార్ డైరెక్టర్ మురుగదాస్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లోనూ ఒకేసారి రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. మహేష్ అభిమానులకు సర్ప్రైజ్గా ‘బూమ్ బూమ్’ అనే పాట టీజర్ను ఆదివారం సాయంత్రం విడుదల చేయగా అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. యూట్యూబ్ లో పోస్ట్ చేసిన కొన్ని నిమిషాల్లోనే వేల వ్యూస్ తో దూసుకుపోతోంది. అయితే మొత్తం పాటను ఆగస్టు 2న సాయంత్రం 6 గంటలకు విడుదల చేయనున్నట్లు ఈ టీజర్ ద్వారా తెలిపారు. మహేష్ కు జోడీగా రకుల్ప్రీత్ సింగ్ నటిస్తున్నారు. ఎస్.జె. సూర్య విలన్ పాత్రలో కనిపించనున్నారు. ఒక్క పాట మినహా మొత్తం షూటింగ్ పూర్తయిన ఈ మూవీకి హ్యారిస్ జైరాజ్ సంగీతం అందించాడు. దాదాపు 8 నిమిషాల నిడివితో రూపొందుతున్న ఓ సీన్ కోసం ఏకంగా 20 కోట్లకు ఖర్చు పెట్టారన్న ప్రచారం జరుగడంతో మూవీపై అంచనాలు పెరిగిపోతున్నాయి. తెలుగు, తమిళ భాషల్లో సెప్టెంబరులో మూవీ విడుదల కానుంది. మూవీ మేకింగ్ వీడియో కోసం మహేష్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. -
మహేష్ బాబు ఫ్యాన్స్కు సర్ప్రైజ్
-
8 నిమిషాల సీన్ : 20 కోట్ల ఖర్చు
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం స్పైడర్. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లోనూ ఒకేసారి రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. అందుకు తగ్గట్టుగా భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా సినిమాను రూపొందిస్తున్నారు. ముందుగా 90 కోట్లతోనే సినిమా పూర్తి చేయాలని భావించినా ఇప్పుడు బడ్జెట్ 120 కోట్లు మించిపోయిందన్నా ప్రచారం జరుగుతోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఇంట్రస్టింగ్ అప్ డేట్ ఒకటి టాలీవుడ్ సర్కిల్స్ లో హల్ చల్ చేస్తుంది. మురుగదాస్ చిత్రాల్లో సినిమాకే హైలెట్ అనిపించే సీన్ ఒకటి తప్పకుండా ఉంటుంది. తుపాకీలో 12 మంది టెర్రరిస్ట్ లను ఒకేసారి చంపే సీన్, కత్తి సినిమాలో ముసలివాళ్లతో కలిసి సిటీకి వాటర్ సప్లయ్ ని అడ్డుకునే సీన్స్ హైలెట్ అయ్యాయి. తాజాగా స్పైడర్ సినిమాలోనూ ఆ తరహా సీన్ ఒకటి ప్లాన్ చేస్తున్నారట. దాదాపు 8 నిమిషాల నిడివితో రూపొందుతున్న ఈ సీన్ కోసం ఏకంగా 20 కోట్లకు ఖర్చు పెట్టారన్న ప్రచారం జరుగుతోంది. విలన్ అమాయక ప్రజలను చంపేందుకు చేసే ప్రయత్నాన్ని హీరో ఎలా అడ్డుకున్నాడన్నదే సీన్. పెద్ద సంఖ్యలో జూనియర్ ఆర్టిస్ట్ లతో పాటు భారీ విజువల్ ఎఫెక్ట్స్ తో రూపొందుతున్న ఈ సీన్, ఆడియన్స్ కన్నార్పకుండా చూసేలా ఉంటుందట. మరి ఈ వార్తపై అయినా చిత్రయూనిట్ అధికారికంగా స్పందిస్తుందేమో చూడాలి. -
స్పైడర్ టీజర్కు కొత్త డేట్..!
బ్రహ్మోత్సోవం సినిమా ఫెయిల్యూర్తో డీలా పడిపోయిన సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులు.. ఆ చేదు అనుభవాన్ని మరిపించే భారీ హిట్ కోసం ఎదురుచూస్తున్నారు. మహేష్ బాబు ప్రస్తుతం తమిళ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ దర్శకత్వంలో స్పైడర్ సినిమాలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన టీజర్ గ్లింప్స్, పోస్టర్స్కు భారీ రెస్పాన్స్ వచ్చింది. అయితే వీటిల్లో సినిమా థీమ్ ఏ మాత్రం రివీల్ కాకుండా జాగ్రత్త పడ్డ చిత్రయూనిట్, త్వరలో మరో టీజర్ను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం పాటల చిత్రీకరణ జరుగుతోంది. నిర్మాణాంతర కార్యక్రమాలు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. అయితే ఇంత వరకు ప్రచార కార్యక్రమాల్లో మాత్రం ఆ స్పీడు కనిపించటం లేదు. సెప్టెంబర్ లో సినిమా రిలీజ్ అంటూ గట్టిగా చెపుతున్నా ఇంతవరకు టీజర్ కూడా రాకపోవటంతో అభిమానులు నిరుత్సాహపడుతున్నారు. ఇటీవల జూలై 20 సర్ప్రైజ్ అన్న ప్రచారం జరగటంతో టీజర్ వస్తుందని భావించారు. కానీ మరోసారి అభిమానులకు నిరాశే ఎదురైంది. తాజాగా మహేష్ పుట్టిన రోజు సందర్భంగా ఆగస్ట్ 9న టీజర్ రిలీజ్ అంటూ ప్రచారం జరగుతోంది. మరి ఈ సారైన మహేష్ అభిమానుల కోరిక తీరుస్తాడేమో చూడాలి. -
కోలీవుడ్లో సత్తా చాటిన మహేష్..!
సూపర్ స్టార్ మహేష్ బాబు, కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ దర్శకత్వంలో స్పైడర్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మేజర్ పార్ట్ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాను సెప్టెంబర్ 27న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. మహేష్ కెరీర్లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రీరిలీజ్ బిజినెస్లో సత్తా చాటుతోంది. ఇప్పటికే స్పైడర్ తెలుగు రైట్స్ భారీ మొత్తానికి అమ్ముడైనట్టుగా వార్తలు వినిపిస్తుండగా, తాజాగా తమిళ రైట్స్ కూడా అదే స్థాయిలో అమ్ముడయినట్టుగా ప్రచారం జరుగుతోంది. మహేష్ తొలిసారిగా స్ట్రయిట్ తమిళ సినిమా చేస్తుండం, మురుగదాస్ లాంటి స్టార్ డైరెక్టర్ దర్శకత్వంలో సినిమా తెరకెక్కుతుండటంతో స్పైడర్ తమిళ రైట్స్ 23 కోట్లు పలికినట్టుగా వార్తలు వస్తున్నాయి. వందకోట్లకు పైగా బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా రిలీజ్ కు ముందే భారీ బిజినెస్ చేయడం ఖాయం అంటున్నారు ఫ్యాన్స్. -
రకుల్ ఖాతాలో మరో క్రేజీ ఆఫర్..!
టాలీవుడ్ కోలీవుడ్ లలో వరుస అవకాశాలతో దూసుకుపోతున్న రకుల్ ప్రీత్ సింగ్ మరో క్రేజీ ఆఫర్ ను సొంతం చేసుకుంది. ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో బిజీగా ఉన్న ఈ బ్యూటీ కోలీవుడ్ స్టార్ హీరో సరసన నటించేందుకు అంగీకరించింది. ప్రస్తుతం మహేష్ బాబుతో స్పైడర్ సినిమాను తెరకెక్కిస్తున్న మురుగదాస్ తరువాత విజయ్ తో మరో సినిమా చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు. ఇప్పటికే విజయ్ హీరోగా తుపాకీ, కత్తి లాంటి బ్లాక్ బస్టర్ హిట్స్ అందించిన మురుగదాస్, మరో బిగ్ హిట్ మీద కన్నేశాడు. అయితే ఈసినిమాకు ముందుగా సమంతను హీరోయిన్ గా తీసుకోవాలని భావించారు. అయితే సమంత డేట్స్ అడ్జస్ట్ చేయలేకపోవటంతో ఆ ఛాన్స్ రకుల్ చేతికి వెళ్లింది. ప్రస్తుతం మురుగదాస్ డైరెక్ట్ చేస్తున్న స్పైడర్ సినిమాలో రకుల్ హీరోయిన్ గా నటిస్తోంది. -
స్పీడు పెంచిన చెర్రీ
వరుసగా మూస మాస్ సినిమాలతో బోర్ కొట్టించిన చెర్రీ కొద్ది రోజులుగా సినిమాల సెలక్షన్ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. బ్రూస్ లీ తరువాత లాంగ్ గ్యాప్ తీసుకొని ధృవ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చెర్రీ, ఆ సినిమా తరువాత కూడా మరోసారి బ్రేక్ తీసుకున్నాడు. ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో రంగస్థలం 1985 లోనటిస్తున్న చరణ్ ఇప్పుడు స్పీడు పెంచాడు. రంగస్థలం 1985 సెట్స్ మీద ఉండగానే వరుసగా మూడు సినిమాలు లైన్ లో పెట్టాడు. సూపర్ హిట్ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో తన సొంతం నిర్మాణ సంస్థ కొణిదల ప్రొడక్షన్ కంపెనీలో ఓ సినిమా చేస్తున్నట్టుగా అధికారికంగా ప్రకటించాడు చెర్రీ. ఆ సినిమా తరువాత తమిళ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ దర్శకత్వంలో ఓ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ లో నటించేందుకు ప్లాన్ చేస్తున్నాడట. అంతేకాదు లెజెండరీ దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలోనూ చరణ్ సినిమా ఉంటుందన్న వార్త వినిపిస్తోంది. హీరోగా వరుస సినిమాలు చేస్తూనే నిర్మాతగానూ బిజీ అవుతున్నాడు మెగా పవర్ స్టార్. -
ఆరు దేశాల్లో స్పైడర్ పనులు..!
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం తమిళ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ దర్శకత్వంలో స్పైడర్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మేజర్ పార్ట్ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు సంబంధించిన మరో రెండు పాటల చిత్రీకరణ బ్యాలెన్స్ ఉంది. అయితే ఈ సినిమా ప్రొడక్షన్ వర్క్ పనులు ఏకంగా ఆరు దేశాల్లో జరుగుతున్నాయని చిత్ర నిర్మాతలు తెలిపారు. యాక్షన్ థ్రిల్లర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు గ్రాఫిక్స్ వర్క్ కూడా చాలా ఉందట. అందుకే అనుకున్న సమయానికి సినిమాను రిలీజ్ చేసేందుకు ఆరు దేశాల్లోని విజువల్ ఎఫెక్ట్స్ ఎక్స్పర్ట్స్ సినిమాకు గ్రాఫిక్స్ చేయిస్తున్నారు. అంతేకాదు బాహుబలి రిలీజ్ తరువాత స్పైడర్ను మరింత భారీగా రూపొందిస్తున్న చిత్రయూనిట్ మహేష్తో మరో షెడ్యూల్ స్పెషల్ గా షూటింగ్ చేశారు. మహేష్ బాబు సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 27న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్లో సాంగ్ షూటింగ్ జరుగుతోంది. మరో పాటను వచ్చే నెలలో షూట్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. -
మహేష్ అభిమానులకు గుడ్ న్యూస్..!
బ్రహ్మోత్సోవం సినిమా ఫెయిల్యూర్తో డీలా పడిపోయిన సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులు.. ఆ చేదు అనుభవాన్ని మరిపించే భారీ హిట్ కోసం ఎదురుచూస్తున్నారు. మహేష్ బాబు ప్రస్తుతం తమిళ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ దర్శకత్వంలో స్పైడర్ సినిమాలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన టీజర్, పోస్టర్స్కు భారీ రెస్పాన్స్ వచ్చింది. అయితే వీటిల్లో సినిమా థీమ్ ఏ మాత్రం రివీల్ కాకుండా జాగ్రత్త పడ్డ చిత్రయూనిట్, త్వరలో మరో టీజర్ను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం క్లైమాక్స్ షూటింగ్ జరుగుతోంది. వీలైనంత త్వరగా షూటింగ్ పూర్తి చేసి నిర్మాణాంతర కార్యక్రమాల మీద దృష్టి పెట్టే ఆలోచనలో ఉంది మురుగదాస్ టీం. అంతేకాదు సినిమా మీద అంచనాలు తారా స్థాయికి చేర్చేందుకు ఓ ఇంట్రస్టింగ్ టీజర్ రెడీ చేస్తుందట. దాదాపు 167 ఫ్రేమ్ లతో అద్భుతమైన టీజర్ను ప్లాన్ చేస్తున్నారు. ఈ టీజర్ మహేష్ బాబు రెండు డైలాగ్లు కూడా ఉంటాయట. సినిమాలో కీలకమైన సీన్కు సంబంధించిన షాట్స్ను టీజర్లో చూపించేందుకు ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ టీజర్ మహేష్ పుట్టిన రోజు సందర్భంగా ఆగస్ట్ 9న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. మహేష్ స్పైడర్ ఎలా ఉండబోతోందో తెలియాలంటే అప్పటి వరకు వెయిట్ చేయాల్సిందే. -
ష్..... స్పైడర్ టీజర్ వచ్చేసింది..!
-
ష్..... స్పైడర్ టీజర్ వచ్చేసింది..!
సూపర్ స్టార్ అభిమానులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న మహేష్ బాబు స్పైడర్ టీజర్ రిలీజ్ అయ్యింది. మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్, మురుగదాస్ గత చిత్రాల టీజర్ల మాదిరిగానే ఆసక్తికరంగా రూపొందింది. ముఖ్యంగా కథా కథనాలు ఎలా ఉండబోతున్నాయే ఏ మాత్రం రివీల్ కాకుంగా జాగ్రత్తలు తీసుకున్నారు. కేవలం మహేష్ అభిమానులను దృష్టిలో ఉంచుకొని గ్లింప్స్ ఆఫ్ స్పైడర్ పేరుతో హీరోయిజాన్ని ఎలివేట్ చేస్తూ టీజర్ను కట్ చేశారు. మహేష్ లుక్ తో పాటు సినిమా సైన్స్ ఫిక్షన్ జానర్ అన్న విషయాన్ని కూడా టీజర్ లో రివీల్ చేశారు. అద్భుతమైన బ్యాక్ గ్రౌండ్ స్కోర్, మహేష్ లుక్స్, గ్రాఫిక్స్ తో టీజర్ సూపర్బ్ గా ఉంది. ముందుగా ఈ టీజర్ ను మే 31న సూపర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజు సందర్భంగా రిలీజ్ చేయాలని భావించినా.. దర్శకరత్న దాసరి మరణించటంతో వాయిదా వేశారు. ఒక్క రోజు ఆలస్యంగా స్పైడర్ టీజర్ను రిలీజ్ చేశారు. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో మహేష్ బాబు ఇంటలిజెన్స్ ఆఫీసర్గా నటిస్తున్నాడు. తెలుగుతో పాటు తమిళ్ లోనూ తెరకెక్కిస్తున్న ఈ సినిమాను వంద కోట్లకు పైగా బడ్జెట్తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. మురుగదాస్కు బాలీవుడ్ లోనూ మంచి ఇమేజ్ ఉండటంతో స్పైడర్ను అక్కడ కూడా రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం ఆఖరి షెడ్యూల్ షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను దసరా కానుకగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. -
మహేష్ అభిమానులకు మరో షాక్..!
గత ఆరేళ్లుగా మహేష్ బాబు తన తండ్రి సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా తన లేటెస్ట్ సినిమా టీజర్ లేదా ఫస్ట్ లుక్ను రిలీజ్ చేస్తూ వస్తున్నాడు. అదే సాంప్రదాయాన్ని కంటిన్యూ చేస్తూ ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న స్పైడర్ సినిమా టీజర్ కూడా ఈ నెల 31న రిలీజ్ అవుతుందని భావించారు ఫ్యాన్స్. అయితే దర్శకుడు మురుగదాస్కు మాత్రం టీజర్ రిలీజ్ చేసే ఉద్దేశం లేదట. ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించిన టీజర్ను హడావిడిగా కట్ చేసి రిలీజ్ చేస్తే లాభం కన్నా నష్టమే ఎక్కువని భావించిన మురుగదాస్, టీజర్ రిలీజ్కు టైం తీసుకోవాలని నిర్ణయించాడు. అయితే ఆరేళ్లుగా కొనసాగుతున్న సాంప్రదాయాన్ని మురుగదాస్ బ్రేక్ చేయటం పై సూపర్ స్టార్ అభిమానులు ఫైర్ అవుతున్నారు. ఇంతకాలంగా షూటింగ్ జరుగుతున్నా టీజర్కు సరిపడా కంటెంట్ లేదా అంటూ కామెంట్ చేస్తున్నారు. మరి అభిమానుల కోసం టీజర్ రెడీ చేస్తారా..? లేక మరో పోస్టర్తో సరిపెడతారా..? తెలియాలంటే బుధవారం వరకు వెయిట్ చేయాల్సిందే. -
మహేష్ 'స్పైడర్' టీజర్ రిలీజ్ డేట్..?
సూపర్ స్టార్ మహేష్ బాబు, తమిళ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ దర్వకత్వంలో స్పెడర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. తెలుగు, తమిళ భాషల్లో భారీ బడ్జెట్తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం చివరి దశలో ఉంది. ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్కు మంచి రెస్పాన్స్ రావటంతో త్వరలో స్పైడర్ టీజర్ను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. సూపర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజు సందర్భంగా తన సినిమాల ఫస్ట్ లుక్ పోస్టర్లు, టీజర్లను రిలీజ్ చేయటం మహేష్ బాబుకు అలవాటు. మరోసారి అదే సెంటిమెంట్ను కంటిన్యూ చేస్తూ ఈ నెల 31న స్పైడర్ టీజర్ను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట. ప్రస్తుతానికి అఫీషియల్ ఎనౌన్స్మెంట్ లేకపోయినా.. టీజర్ రిలీజ్ మాత్రం కన్ఫామ్ అన్న ప్రచారం జరుగుతుంది. మహేష్ బాబు సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాను సెప్టెంబర్లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. -
సౌత్లో మరో భారీ సినిమా..!
బాహుబలి ఘనవిజయం సాధించటంతో ప్రముఖ నిర్మాణ సంస్థలు భారీ బడ్జెట్ చిత్రాలను ఎనౌన్స్ చేస్తున్నాయి. ఇప్పటికే మహేష్ బాబు స్పైడర్, రోబో సీక్వల్ సెట్స్ మీద ఉండగా సంఘమిత్ర ప్రారంభమైంది. అల్లు అరవింద్ రామాయణాన్ని భారీ బడ్జెట్తో తెరకెక్కిస్తున్నట్టుగా ప్రకటించాడు. తాజాగా మరో భారీ చిత్రంపై చర్చ మొదలైంది. ప్రస్తుతం మహేష్తో స్పైడర్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న మురుగదాస్, తరువాత కూడా భారీ బడ్జెట్ చిత్రాన్నే ప్లాన్ చేస్తున్నాడు. తుపాకీ, కత్తి లాంటి బ్లాక్ బస్టర్ హిట్స్ సాధించిన విజయ్ కాంబినేషన్లో భారీ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నాడు. బాహుబలి రచయిత విజయేంద్ర ప్రసాద్ ఈ సినిమాకు కథ అందిస్తున్నాడు. మురుగదాస్ మార్క్ సోషల్ ఎలిమెంట్తో పాటు విజయ్ స్టైల్ కమర్షియల్ ఎంటర్టైనర్గా ఈ సినిమాను రూపొందించనున్నారు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రారంభమైన ఈ సినిమాను సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తోంది. రోబో తరువాత సినిమా నిర్మాణానికి దూరమైన సన్ పిక్చర్స్ మురుగదాస్, విజయ్ సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీకి ప్లాన్ చేస్తోంది. దాదాపు 120 కోట్లతో ఈ సినిమాను తెరకెక్కించనున్నారు. -
బాహుబలి టీం కారణంగానే స్పైడర్ వాయిదా..?
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం తమిళ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ దర్శకత్వంలో స్పైడర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. మహేష్ ఇంటలిజెన్స్ అధికారిగా నటిస్తున్న ఈ సినిమాను భారీ బడ్జెట్తో తెలుగు తమిళ భాషల్లో ఒకేసారి తెరకెక్కిస్తున్నారు. చాలా రోజులుగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ముందుగా జూన్ 23నే రిలీజ్ చేయాలని భావించారు. తరువాత ఆగస్టుకు వాయిదా వేశారు. తాజా సమాచారం ప్రకారం స్పైడర్ ఆగస్టులోనూ రిలీజ్ అయ్యే చాన్స్ లేదట. దసరా కానుకగా అక్టోబర్లో సినిమాను రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. అయితే స్పైడర్ ఆలస్యం వెనుక బాహుబలి టీం ఉందన్న టాక్ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. బాహుబలి 2 సంచలనాలు నమోదు చేస్తుండటంతో స్పైడర్ సినిమా విషయంలో కూడా గ్రాఫిక్స్ మీద ఎక్కువ సమయం, బడ్జెట్ కేటాయించాలని నిర్ణయించారు యూనిట్. అందుకే కమల్ కణ్నన్ ఆధ్వర్యంలో మకుటతో గ్రాఫిక్స్ చేయిస్తున్నారు. అయితే బాహుబలి సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న మకుట, ప్రస్తుతం చేస్తున్న సినిమాల విషయంలో ఏ మాత్రం కాంప్రమైజ్ కావటంలేదు. ఎంత సమయమైనా కేటాయించి క్వాలిటీ గ్రాఫిక్స్ను రెడీ చేస్తున్నారు. ఇదే విషయాన్ని స్పైడర్ టీంకు కూడా చెప్పడంతో చేసేదేమి లేక సినిమాను వాయిదా వేయాలని భావిస్తున్నారు చిత్రయూనిట్. -
మహేష్ మరో షాక్ ఇస్తున్నాడా..?
బ్రహ్మోత్సవం సినిమాతో నిరాశపరిచిన మహేష్ బాబు నుంచి.. ఆ ఫ్లాప్ను మరిపించే హిట్ కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. అందుకు తగ్గట్టుగా మహేష్ కూడా భారీ చిత్రాన్నే చేస్తున్నాడు. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ దర్శకత్వంలో యాక్షన్ స్పై థ్రిల్లర్గా స్పైడర్ సినిమాను చేస్తున్నాడు. దాదాపు ఏడాది కాలంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ఇంత వరకు పూర్తి కాలేదు. క్లైమాక్స్ విషయంలో దర్శకుడు సంతృప్తిగా లేకపోవటంతో చివరి నిమిషంలో మార్పులు చేస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. అంతేకాదు ఇప్పటికే ఒకసారి వాయిదా పడిన స్పైడర్ రిలీజ్ను మరోసారి వాయిదా వేసే ఆలోచన చేస్తున్నారన్న టాక్ వినిపిస్తుంది. ముందుగా స్పైడర్ సినిమాను జూన్ 23న రిలీజ్ చేస్తామని ప్రకటించారు. తరువాత ఆగస్టు 11ను వాయిదా వేశారన్న టాక్ వినిపించింది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాను దసరా సందర్భంగా అక్టోబర్ లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. ఫస్ట్ లుక్ కోసమే నెలల తరబడి వెయిట్ చేయించిన స్పైడర్ టీం, ఇప్పడు రిలీజ్ విషయంలో కూడా వాయిదాల మీద వాయిదాలతో అభిమానులకు షాక్ ఇస్తున్నారు. -
స్పైడర్ వాయిదాకు కారణం అదేనా..?
సూపర్ స్టార్ మహేష్ బాబు, టాలెంటెడ్ డైరెక్టర్ మురుగదాస్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా స్పైడర్. మహేష్ ఇంటలిజెన్స్ ఆఫీసర్ గా నటిస్తున్న ఈ సినిమాను వందకోట్లకు పైగా బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. అయితే ఇటీవల ఈ భారీ చిత్రానికి సంబందించిన అప్ డేట్స్ సూపర్ స్టార్ అభిమానులను కలవరపెడుతున్నాయి. సినిమా క్లైమాక్స్ విషయంలో మహేష్ సంతృప్తిగా లేడని అందుకే రీషూట్ చేస్తురన్న ప్రచారం జరుగుతోంది. అయితే తాజాగా స్పైడర్ యూనిట్ తీసుకున్న నిర్ణయం ఈ ప్రచారానికి మరింత బలం చేకూరుస్తోంది. స్పైడర్ సినిమా జూన్ 23 రిలీజ్ అవుతుందని దర్శకుడు మురుగదాస్ అఫీషియల్ గా ప్రకటించాడు. అయితే సడన్ గా నిర్మాత సినిమా వాయిదా పడిందని కొత్త రిలీజ్ డేట్ ను త్వరలోనే ప్రకటిస్తామని తెలిపారు. అయితే కనీసం రెండు నెలలు వాయిదా పడుతుందన్న టాక్ వినిపిస్తోంది ఆగస్టు 11న సినిమా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ ఆలస్యానికి రీ షూట్ లే కారణమని భావిస్తున్నారు ఫ్యాన్స్. అసలు నిజమేంటో తెలియాలంటే యూనిట్ ను ప్రకటన వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే. -
మహేష్ డైరెక్టర్ మళ్లీ ఫైర్ అయ్యాడు..!
జాతీయ అవార్డుల వివాదం ఇప్పట్లో సద్దుమణిగేలా లేదు. గతంలో ఎన్నడూ లేని విధంగా సినీ జాతీయ అవార్డులు ఈ సారి వివాదాలకు తెరతీస్తున్నాయి. ప్రముఖ దర్శకుడు ప్రియదర్శన్ ఆధ్వర్యంలో తీసుకున్న నిర్ణయాలపై పలువురు సినీ ప్రముఖులు బహిరంగంగానే విమర్శలకు దిగుతున్నారు. తమిళ స్టార్ డైరెక్టర్ మురుగదాస్, విజేతల ఎంపికపై తన అభిప్రాయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. 'అవార్డుల కమిటీ, ఒత్తిళ్లకు తలొగ్గి పక్షపాత ధోరణితో విజేతలను ఎంపిక చేసిందంటూ విమర్శించారు'. అయితే ప్రతీ విమర్శకు వ్యక్తిగతంగా బదులిస్తున్న జ్యూరీ అధ్యక్షుడు ప్రియదర్శన్, 'అక్షయ్ కుమార్తో సినిమా చేయాలనకున్న దర్శకుడికి అక్షయ్ నో చెప్పాడు... అందుకే ఆయనకు అవార్డ్ రావడాన్ని తట్టుకోలేకపోతున్నాడు' అంటూ మురుగదాస్పై పరోక్షంగా విమర్శలు చేశాడు. ప్రియదర్శన్ కామెంట్స్ మురుగదాస్ కూడా ఘాటుగానే స్పంధించాడు. ' మిస్టర్ జ్యూరీ, ఇది కేవలం నా అభిప్రాయం కాదు. భారతీయ ప్రేక్షకులందరూ ఇదే అభిప్రాయంతో ఉన్నారు. వాధించటం కన్నా, నిజాన్ని బయటకు తీస్తే మంచిది' అంటూ కౌంటర్ ఇచ్చాడు. దక్షిణాది సినీ ప్రముఖులతో పాటు బాలీవుడ్ స్టార్స్ కూడా జ్యూరీ మీద గుర్రుగా ఉన్నారు. ముఖ్యంగా దంగల్ సినిమాకు అమీర్ ఖాన్ తప్పకుండా అవార్డ్ వస్తుందని భావించిన ఆయన అభిమానులు ప్రియదర్శన్ మీద సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు. #NationalAwards #Biased Mr. jury, It's nt only my opinion it's the voice of whole Indian audience, better nt to argue & dig out the truth — A.R.Murugadoss (@ARMurugadoss) 14 April 2017 -
'స్పైడర్' శాటిలైట్ రైట్స్కు భారీ ఆఫర్
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తమిళ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ దర్వకత్వంలో తెరకెక్కుతున్న సినిమా స్పైడర్. ఇప్పటికే 80 శాతానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా క్లైమాక్స్, రెండు పాటలు మినహా షూటింగ్ అంతా పూర్తయ్యింది. దాదాపు 100 కోట్ల బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా మహేష్, మురుగదాస్ల కాంబినేషన్పై జాతీయ స్థాయిలో చర్చ జరుగుతోంది.ఈ క్రేజ్ను క్యాష్ చేసుకునే పనిలో ఉంది చిత్రయూనిట్. ఇంకా షూటింగ్ కూడా పూర్తి కాకుండా బిజినెస్ స్టార్ట్ చేసేసింది స్పైడర్ యూనిట్. ఇప్పటి వరకు ఉన్న అంచనాల ప్రకారం ఈ సినిమా రిలీజ్కు ముందే 150 కోట్ల వరకు బిజినెస్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే తాజాగా మరో ఇంట్రస్టింగ్ వార్త ఒకటి టాలీవుడ్ సర్కిల్స్లో వినిపిస్తోంది. స్పైడర్ శాటిలైట్ రైట్స్ను భారీ మొత్తం చెల్లించి ఓ చానల్ సొంతం చేసుకుందన్న టాక్ వినిపిస్తోంది. తెలుగుతో పాటు తమిళ, హిందీ రైట్స్తో కలిపి 26 కోట్లు శాటిలైట్ రైట్స్ కోసం చెల్లించారట. అయితే ఈ ఆఫర్పై యూనిట్ సభ్యులు అధికారిక ప్రకటన చేయలేదు. -
స్పైడర్ : మహేష్ 23 లుక్ వచ్చేసింది..!
ఎన్నో రోజుల సూపర్ స్టార్ అభిమానుల ఎదురుచూపులకు తెరపడింది. మహేష్ బాబు హీరోగా మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ఫస్ట్ లుక్ ను చిత్రయూనిట్ రిలీజ్ చేసింది. తన ప్రతీ సినిమా ఫస్ట్ లుక్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకునే మురుగదాస్ ఈ లుక్ కోసం కూడా భారీ కసరత్తులే చేశాడు. అందుకు తగ్గట్టుగా అవుట్ పుట్ కూడా అదిరిపోయింది. మహేష్ ఇంటలిజెన్స్ ఆఫీసర్ గా నటిస్తున్న ఈసినిమాకు స్పైడర్ అనే టైటిల్ ను ఫైనల్ చేశారు. తమిళ నటుడు, దర్శకుడు ఎస్ జె సూర్య విలన్ గా నటిస్తుండగా రకుల్ ప్రీత్ సింగ్ తొలిసారిగా మహేష్ తో జత కడుతోంది. హీరో విలన్ మధ్య నడిచే ఎత్తులు పై ఎత్తులే ప్రధాన కథగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో యాక్షన్ ఎపిసోడ్స్ కోసం చాలా కష్టపడుతున్నారు. వంద కోట్ల బడ్జెట్ తో ప్రతిష్టాత్మకం తెరకెక్కుతున్న ఈ సినిమా జూన్ 23న రిలీజ్ అవుతోంది. #SPYderFirstLook https://t.co/ocDvwPaFbu #Mahesh23FLDay @urstrulyMahesh @ARMurugadoss @Rakulpreet @Shibasishsarkar @RelianceEnt @NVRCinema — SpyderTheMovie (@spyderthemovie) 12 April 2017 -
కొత్త బిజినెస్ స్టార్ట్ చేస్తోన్న మహేష్..?
టాలీవుడ్లో సూపర్ స్టార్గా తిరుగలేని ఇమేజ్ సొంతం చేసుకున్న హీరో మహేష్ బాబు. కెరీర్ స్టార్టింగ్ నుంచి ఎక్కువగా నటన మీదే దృష్టి పెట్టిన సూపర్ స్టార్, బిజినెస్ల జోలికి పెద్దగా వెళ్లలేదు. కానీ ఇటీవల శ్రీమంతుడు సినిమాతో తొలిసారిగా నిర్మాణం రంగంలోకి అడుగుపెట్టి ఘనవిజయం సాధించాడు. అదే బాటలో ఇప్పుడు మరో భారీ బిజినెస్ను ప్లాన్ చేస్తున్నాడు మహేష్. ప్రస్తుతం ఉన్న పరిస్థితులకు అనుగుణంగా థియేటర్ల బిజినెస్లోకి అడుగుపెట్టాలని భావిస్తున్నాడట. ఇప్పటికే ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఏసియన్ సినిమా అధినేత సునీల్ నారంగ్తో చర్చలు జరుపుతున్నట్టుగా సమాచారం. తొలి ప్రయత్నంగా తెలుగు రాష్ట్రాల్లో 25 మల్టీప్లెక్స్లను నిర్మించాలని భావిస్తున్నాడు. ప్రొడక్షన్ తరహాలోనే థియేటర్ బిజినెస్లోనూ సూపర్ స్టార్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నారు ఫ్యాన్స్. -
మహేష్కు పోటీగా మరో స్టార్..!
సూపర్ స్టార్ అభిమానులు ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న ప్రకటన వచ్చేసింది. ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న మహేష్, మురుగదాస్ల సినిమా ఫస్ట్ లుక్ను ఏప్రిల్ 12న సాయంత్రం 5 గంటలకు రిలీజ్ చేస్తున్నట్టుగా చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించారు. సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేయటంలో మురుగదాస్కు మంచి రికార్డ్ ఉంది. ముఖ్యంగా మురుగదాస్ సినిమాల టీజర్లు సంచలనాలు నమోదు చేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి. The Countdown Begins!Mark your Calendar!!Set your Time!!#Mahesh23 #ARM11 #FirstLook12Apr17@5pm @ARMurugadoss @urstrulyMahesh — NVR Cinema (@NVRCinema) 10 April 2017 అయితే ఇంతటి భారీ అంచనాల మధ్య రిలీజ్ అవుతున్న సూపర్ స్టార్ టీజర్కు పోటిగా మరో స్టార్ తన సినిమా టీజర్ను రిలీజ్ చేస్తున్నాడు. అదే రోజు అదే సమయానికి బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు కొత్త సినిమా 'కొబ్బరి మట్ట' సాంగ్ టీజర్ రిలీజ్ చేస్తున్నారు. సంపూర్ణేష్ బాబు మూడు విభిన్న పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాలో పాపరాయుడు సాంగ్ టీజర్ ను ఏప్రిల్ 12న సాయంత్రం 5 గంటలకు రిలీజ్ చేస్తున్నటుగా చిత్రయూనిట్ ప్రకటించారు. -
జాతీయ అవార్డుల జ్యూరీపై డైరెక్టర్ ఫైర్
సినీరంగానికి సంబంధించి ఇచ్చే అవార్డులు ఎప్పుడు వివాదాస్పదమవుతూనే ఉంటాయి. జ్యూరీ సభ్యులు తమకు సంబంధించిన వారికే అవార్డులు ఇచ్చారన్న వాదన ప్రధానంగా వినిపిస్తుంటుంది. ఇటీవల ప్రకటించిన జాతీయ అవార్డులపై కూడా ఇలాంటి విమర్శలే వినిపిస్తున్నాయి. కొంత మంది ప్రముఖులు జ్యూరీ నిర్ణయం పై సంతృప్తి వ్యక్తం చేయగా మరికొందరు వ్యతిరేకిస్తున్నారు. తమిళ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ మరో అడుగు ముందుకేసి జ్యూరీ సభ్యులు పక్షపాత బుద్ధితో వ్యవహరిస్తున్నారంటూ విమర్శలకు దిగారు. జాతీయ అవార్డుల ప్రకటన తరువాత తన సోషల్ మీడియా పేజ్ లో స్పందించిన మురుగదాస్ జ్యూరీ సభ్యులపై ఒత్తిళ్లు ఉన్నాయని, పక్షపాతం తోనే అవార్డుల ఎంపిక జరిగిందనట్టుగా స్పష్టమవుతుందని విమర్శించాడు. మురుగదాస్ ప్రస్తుతం మహేష్ బాబు హీరోగా ఓ యాక్షన్ థ్రిల్లర్ ను తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే 80 శాతానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈసినిమా జూన్ 23న రిలీజ్ అవుతోంది. #NationalAwards Can clearly witness the influence & partiality of people in jury, it's biased. — A.R.Murugadoss (@ARMurugadoss) 8 April 2017 -
హాట్ మోడల్తో మహేష్..?
ప్రస్తుతం మురుగదాస్తో చేస్తున్న సినిమాకు సంబంధించి ఎలాంటి అప్డేట్స్ ఇవ్వని మహేష్, తరువాత చేయబోయే సినిమాకు మాత్రం ఏర్పాట్లు చేసేసుకుంటున్నాడు. ప్రస్తుతం చేస్తున్న సినిమా ఇప్పటికే 80 శాతానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకుంది. జూన్ 23న తెలుగు, తమిళ్తో పాటు హిందీలోనూ ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా తరువాత కొరటాల శివ దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నాడు మహేష్. ఈ సినిమాలో హీరోయిన్గా బాలీవుడ్ బ్యూటీని తీసుకోవాలని నిర్ణయించారు. పరిణితీ చోప్రా, దిశాపటానీ లాంటి వారి పేర్లు వినిపించినా.. ఎవరినీ ఫైనల్ చేయలేదు. తాజాగా ఓ హాట్ మోడల్ను హీరోయిన్గా కన్ఫామ్ చేశారన్న టాక్ వినిపిస్తోంది. మాగ్జిమ్ మాగ్జైన్ ఫోటో షూట్తో ఆకట్టుకున్న కైరా అద్వానీని మహేష్, కొరటాల సినిమాకు హీరోయిన్గా తీసుకునేందుకు రెడీ అవుతున్నారు. ఫగ్లీ, ఎంఎస్ ధోని సినిమాల్లో హోమ్లీ క్యారెక్టర్స్తో ఆకట్టుకున్న కైరా, త్వరలో రిలీజ్కు రెడీ అవుతున్న మెషీన్ సినిమాలో గ్లామరస్ లుక్లో కనిపిస్తోంది. బాలీవుడ్లో స్టార్ ఇమేజ్ లేకపోయినా.. హాట్ ఫోటోషూట్స్తో మంచి పాపులారిటీ సొంతం చేసుకుంది. త్వరలోనే మహేష్, కొరటాల శివ సినిమా హీరోయిన్పై అఫీషియల్ ఎనౌన్స్మెంట్ వచ్చే అవకాశం ఉంది. -
కథ కోసం కోటి రూపాయలు..?
శ్రీమంతుడు లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తరువాత మహేష్ బాబు, కొరటాల శివ కాంబినేషన్లో మరో సినిమా తెరకెక్కనుందన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా మొదలైపోయాయి. మహేష్ ప్రస్తుతం మురుగదాస్ దర్శకత్వంలో ఓ యాక్షన్ డ్రామాలో నటిస్తున్నాడు. పేరు నిర్ణయించని ఈ సినిమాలో సూపర్ స్టార్ ఇంటిలిజెన్స్ ఆఫీసర్గా కనిపించనున్నాడు. ఈ సినిమా షూటింగ్ పూర్తయిన వెంటనే గ్యాప్ తీసుకోకుండా కొరటాల శివ సినిమాను ప్రారంభించాలని ప్లాన్ చేస్తున్నాడు. ఈ సినిమాకు భరత్ అను నేను అనే టైటిల్ను పరిశీలుస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. అయితే తాజాగా ఈ సినిమా కథకు సంబంధించిన ఇంట్రస్టింగ్ న్యూస్ ఒకటి టాలీవుడ్ సర్కిల్స్లో వినిపిస్తోంది. తన గత చిత్రాలను సొంత కథలతో తెరకెక్కించిన కొరటాల శివ, మహేష్ కోసం వేరే రచయిత నుంచి కథను తీసుకున్నాడు. తకిట తకిట, సత్యభామ లాంటి సినిమాలను తెరకెక్కించిన నాను శ్రీహరి, మహేష్ సినిమాకు కథ అందిస్తున్నాడు. కెరీర్లో ఒక్క హిట్ కూడా లేని ఈ దర్శకుడు మహేష్ సినిమా కథకు మాత్రం ఏకంగా కోటి రూపాయలు చార్జ్ చేశాడన్న ప్రచారం జరుగుతోంది. కథా కథనాలు ఆసక్తికరంగా ఉండటంతో ఎంత పెట్టైనా కథను తీసుకోవాలని నిర్ణయించారు. అంత భారీ ధర పలికిన ఈ కథ ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో చూడాలి. -
ఇంకాస్త ఓపిక పట్టండి : మహేష్ బాబు
-
ఇంకాస్త ఓపిక పట్టండి : మహేష్ బాబు
సూపర్ స్టార్ మహేష్ బాబు, తమిళ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ దర్శకత్వంలో ఓ యాక్షన్ థ్రిల్లర్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మేజర్ పార్ట్ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈసినిమాకు ఇంత వరకు టైటిల్ ను కూడా ఎనౌన్స్ చేయలేదు. చాలా పేర్లు ప్రచారంలో ఉన్నా, యూనిట్ సభ్యులు అఫీషియల్ గా కన్ఫామ్ చేయలేదు. డిసెంబర్ నుంచి ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చాలా సార్లు వాయిదా పడింది. దీంతో అభిమానులు కూడా నిరుత్సాహపడుతున్నారు. ఉగాది సందర్భంగా తప్పుకుండా ఫస్ట్ లుక్ రిలీజ్ అవుతుందని ఎదురుచూసిన అభిమానులకు మరోసారి నిరాశే ఎదురైంది. దీంతో అభిమానులను శాంతింప చేయడానికి మహేష్ బాబు రంగంలోకి దిగక తప్పలేదు. మురుగదాస్ మూవీపై తన సోషల్ మీడియా పేజ్ లో స్పందించిన మహేష్, అభిమానులు ఇంకాస్త ఓపిక పట్టాలని విజ్ఞప్తి చేశాడు. ' ప్రియమైన నా అభిమానులందరికీ, మీ అందరూ మహేష్ 23 సినిమా ఫస్ట్ లుక్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని నాకు తెలుసు. మా యూనిట్ రాత్రింబవళ్లు షూటింగ్ చేస్తుంది. త్వరలోనే ఫస్ట్ లుక్ రిలీజ్ అవుతుంది. అభిమానులు ఇంకాస్త ఓపిక పట్టాలని కోరుకుంటున్నా' అంటూ ట్వీట్ చేశాడు. మహేష్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తోంది. దాదాపు వంద కోట్ల బడ్జెట్ తో తెలుగు తమిళ భాషల్లో ఒకేసారి తెరకెక్కుతున్న ఈసినిమాలో మహేష్ బాబు ఇంటలిజెన్స్ ఆఫీసర్ గా నటిస్తున్నాడన్న ప్రచారం జరుగుతోంది. ఈ సినిమా టైటిల్స్ అంటూ ఎనిమి, సంభవామి, స్పైడర్ లాంటి పేర్లు చాలా వినిపించినా. యూనిట్ సభ్యులు మాత్రం ఇంతవరకు ఏ టైటిల్ ను కన్ఫామ్ చేయలేదు. To all my dearest fans, I know you have been eagerly waiting for the first look of #Mahesh23. Our team is shooting day & night for the film. — Mahesh Babu (@urstrulyMahesh) 30 March 2017 The first look will be out very soon...Requesting you all to be a little patient. Love you guys as always :) — Mahesh Babu (@urstrulyMahesh) 30 March 2017 -
మహేష్ 23 ఫస్ట్ లుక్ మళ్లీ వాయిదా
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం తమిళ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే 70 శాతానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు సంబంధించిన ఇంత వరకు అఫీషియల్ ఫస్ట్ లుక్ మాత్రం రిలీజ్ కాలేదు. అంతేకాదు ఇంత వరకు సినిమాకు టైటిల్ కూడా నిర్ణయించకపోవడంతో ప్రమోషన్ విషయంలో ఇబ్బందులు ఎదురవుతాయని అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే చాలా సార్లు వాయిదా పడ్డ మహేష్ 23 ఫస్ట్ లుక్ను ఎట్టి పరిస్థితుల్లో ఉగాది రోజున విడుదల చేస్తారన్న ప్రచారం జరిగింది. అయితే ఈ సారి కూడా ఈ లాంచ్ వాయిదా పడింది. ప్రస్తుతం వియత్నాంలో యాక్షన్ ఎపిసోడ్స్ షూటింగ్లో ఉన్న చిత్రయూనిట్ ఇండియాకు తిరిగి వచ్చాకే ఫస్ట్ లుక్ను లాంచ్ చేయాలని నిర్ణయించారట. ఏప్రిల్ 2న మహేష్ 23 యూనిట్ హైదరబాద్ తిరిగి వస్తోంది. ఆ తరువాతే ఫస్ట్ లుక్ లాంచ్ ఎప్పుడనే విషయాన్ని ప్రకటిస్తారని తెలుస్తోంది. మహేష్ ఇంటలిజెన్స్ ఆఫీసర్గా నటిస్తున్న ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్గా నటిస్తోంది. దాదాపు 100 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిస్తున్న ఈ సినిమా తెలుగు తమిళ భాషలతో పాటు హిందీలోనూ డబ్ చేసి రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. జూన్ 23న ఈ సినిమా రిలీజ్ అవుతుందని దర్శకుడు మురుగదాస్ ఇప్పటికే ప్రకటించాడు. -
సెంటిమెంట్ రిపీట్ చేస్తున్న హిట్ కాంబినేషన్
కోలీవుడ్ ఇండస్ట్రీలో వరుసగా రెండు సార్లు వందకోట్ల కలెక్షన్లు సాధించిన కాంబినేషన్ దర్శకుడు మురుగదాస్, హీరో విజయ్లది. తుపాకి, కత్తి సినిమాలతో రెండు భారీ విజయాలను అందుకున్న ఈ కాంబినేషన్లో ఇప్పుడు మూడో చిత్రం తెరకెక్కనుందట. ఈ సినిమాతో హ్యాట్రిక్ సక్సెస్ను సాధించాలని భావిస్తున్నారు. అందుకే పక్కా కథా కథనాలతో పాటు సెంటిమెంట్ను కూడా రిపీట్ చేయాలని ఫిక్స్ అయ్యారు. ఈ ఇద్దరి కాంబినేషన్లో తెరకెక్కిన రెండు సినిమాలు దీపావళి కానుకగా రిలీజ్ అయ్యాయి. తుపాకీ సినిమా 2012 దీపావళికి రిలీజ్ కాగా., కత్తి సినిమా 2014 దీపావళి సమయంలో రిలీజ్ అయ్యింది. ఈ రెండు సినిమాలు వంద కోట్లకు పైగా వసూళ్లు సాధించటంతో ఈ కాంబినేషన్లో రూపొందబోయే హ్యాట్రిక్ సినిమాను కూడా అదే సమయంలో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం మహేష్ బాబు హీరోగా భారీ యాక్షన్ థ్రిల్లర్ను తెరకెక్కిస్తున్న మురుగదాస్, ఆ సినిమా పూర్తయిన తరువాత విజయ్ హీరోగా తెరకెక్కబోయే సినిమాల పనులు ప్రారంభించనున్నాడు. విజయ్ కూడా ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా షూటింగ్ పూర్తి చేసి మురుగదాస్ సినిమాకు డేట్స్ కేటాయించేలా ప్లాన్ చేస్తున్నాడు. క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఈ సినిమాను 2018 దీపావళి రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. -
టెన్షన్ పెడుతున్న సూపర్ స్టార్ సెంటిమెంట్
ప్రస్తుతం మురుగదాస్ దర్శకత్వంలో ఓ యాక్షన్ థ్రిల్లర్లో నటిస్తున్న సూపర్ స్టార్ మహేష్ బాబు, ఆ తరువాత చేయబోయే సినిమాను కూడా లైన్లో పెట్టాడు. మురుగదాస్ సినిమా ఇప్పటికే 70 శాతానికి పైగా పూర్తయిపోవటంతో నెక్ట్స్ సినిమా పనులు ప్రారంభించాడు. కొరటాల శివ దర్శకత్వంలో ఓ పొలిటికల్ డ్రామాకు ఓకె చెప్పాడు మహేష్. త్వరలో సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ సినిమాకు కాస్టింగ్ ఫైనల్ చేసే పనిలో ఉన్నారు చిత్రయూనిట్. ఈ సినిమాలో మహేష్ సరసన హీరోయిన్గా కొత్త అమ్మాయిని తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నారట. ఈ ఆలోచనే ఇప్పుడు సూపర్ స్టార్ అభిమానులను కలవరపెడుతోంది. గతంలో మహేష్ సరసన కొత్త అమ్మాయిలను పరిచయం చేసిన సినిమాలన్నీ ఫ్లాప్ అయ్యాయి. వంశీ, టక్కరిదొంగ, అతిథి, 1 నేనొక్కడినే సినిమాల్లో కొత్త హీరోయిన్లతో జతకట్టాడు మహేష్. అయితే ఈ సినిమాలన్నీ మహేష్కు చేదు అనుభవాన్నే మిగిల్చాయి. అందుకే మరోసారి కొత్త భామతో కలిసి నటిస్తే సినిమా రిజల్ట్ ఎలా ఉంటుందో అన్న టెన్షన్లో ఉన్నారు సూపర్ స్టార్ అభిమానులు. -
టైటిల్ ఫైనల్ చేసిన మహేష్ మూవీ టీం..?
సూపర్ స్టార్ మహేష్ బాబు, తమిళ స్టార్ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో ఓ యాక్షన్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా 70 శాతానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకున్నా.. ఇంత వరకు టైటిల్, ఫస్ట్ లుక్లను రిలీజ్ చేయలేదు. కానీ మహేష్ మూవీ టైటిల్ ఇదేనంటూ చాలా పేర్లు తెరమీదకు వచ్చాయి. ఏజెంట్ శివ, సంభవామి, ఎనిమీ, మర్మం లాంటి పేర్లు ప్రముఖంగా వినిపించాయి. అయితే తాజా సమాచారం ప్రకారం మహేష్ మూవీ టైటిల్ విషయంలో చిత్రయూనిట్ ఒక నిర్ణయానికి వచ్చారట. ఈ సినిమాలో ఇంటర్నేషనల్ కౌంటర్ టెర్రరిజం ఆఫీసర్ అభిమాన్యుగా నటిస్తున్నాడు మహేష్. అందుకే సినిమాలో మహేష్ క్యారెక్టర్ పేరునే సినిమా టైటిల్గా పెడితే బెటర్ అని భావిస్తున్నారట. అభిమన్యు అనే టైటిల్ అయితే పవర్ఫుల్గా ఉంటుందని భావిస్తున్నారట. తెలుగు, తమిళ భాషల్లో ఒకే టైటిల్తో సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. త్వరలోనే టైటిల్ను ఫైనల్ చేసి అఫీషియల్ ఎనౌన్స్మెంట్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు చిత్రయూనిట్. -
సూపర్ స్టార్తో మెగాస్టార్
ప్రస్తుతం తమిళ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ దర్శతక్వంలో మహేష్ బాబు సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా సెట్స్ లో మెగాస్టార్ చిరంజీవి దర్శనమివ్వడంతో అభిమానులు ఖుషీ అవుతున్నారు. మీలో ఎవరు కోటీశ్వరుడు షో కోసం రెడీ అయిన మెగాస్టార్, మహేష్ బాబు, మురుగదాస్లతో కలిసి కనిపించారు. సినిమాటోగ్రాఫర్ సంతోష్ శివన్ ఈ ఫోటోను తన ట్విట్టర్ పేజ్లో పోస్ట్ చేయగా.. మురుగదాస్.. 'మా సెట్ను ఎవరు విజిట్ చేశారు చూడండి' అంటూ కామెంట్ చేశాడు. ప్రస్తుతం మహేష్, మురుగదాస్ల చిత్రం అన్నపూర్ణ స్టూడియోలో షూటింగ్ జరుపుకుంటుండగా.. అదే స్టూడియోలో మీలో ఎవరు కోటీశ్వరుడు షో షూట్ కూడా జరుగుతోంది. దీంతో కాలీ సమయంలో మెగాస్టార్ మహేష్ మూవీ సెట్లో సందడి చేశారు. మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన రమణ సినిమాను ఠాగూర్గా రీమేక్ చేసిన చిరు, తరువాత మురుగదాస్ టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన స్టాలిన్ సినిమాలో హీరోగా నటించాడు. తన రీ ఎంట్రీ కోసం కూడా మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన కత్తి సినిమానే ఎంచుకున్నాడు. మహేష్తో పాటు మురుగదాస్తో సాన్నిహిత్యం కారణంగా మెగాస్టార్ సూపర్ స్టార్ సెట్లో సందడి చేశాడు. Look who visited our set today -
సూపర్ స్టార్కు సైడ్ ఇచ్చాడు
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, తమిళ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ దర్శకత్వంలో ఓ యాక్షన్ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే 60 శాతానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాను జూన్ 23న రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించాడు మురుగదాస్. అయితే ఈ సినిమా రిలీజ్ డేట్ ప్రకటించిన దగ్గర నుంచి సూపర్ స్టార్ అభిమానుల్లో టెన్షన్ మొదలైంది. మహేష్ సినిమా రిలీజ్ అవుతున్న జూన్ 23నే కోలీవుడ్ టాప్ హీరో అజిత్ మూవీ, వివేగంను కూడా రిలీజ్ చేయాలని ప్లాన్ చేసింది చిత్రయూనిట్. అదే జరిగితే కోలీవుడ్ రిలీజ్కు ప్లాన్ చేస్తున్న మహేష్, మురుగదాస్ల సినిమాకు కష్టాలు తప్పవు. అయితే వివేగం టీం తాజా ప్రకటనతో సూపర్ స్టార్ అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. వివేగం సినిమాను ముందుగా అనుకున్నట్టుగా జూన్ 23న కాకుండా ఆగస్ట్ 12న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట. భారీ బడ్జెట్తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సినిమా కావటంతో పోస్ట్ ప్రొడక్షన్కు వీలైనంత ఎక్కువ సమయం కేటాయించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా చెబుతున్నారు. దీంతో మహేష్ బాబు, మురుగదాస్ల కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమాకు గ్యాప్ దొరికింది. -
రీ ఎంట్రీ వార్తలు రూమర్స్..!
కొద్ది రోజుల కిందట సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులకు కిక్ ఇచ్చే వార్త ఒకటి టాలీవుడ్ సర్కిల్స్లో తెగ హడావిడి చేసింది. ప్రస్తుతం మురుగదాస్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న భారీ చిత్రంలో నమ్రత గెస్ట్ అపియరెన్స్ ఇవ్వనుందన్న ప్రచారం జరిగింది. ఒకప్పుడు హీరోయిన్గా నటించిన నమ్రత, పెళ్లి తరువాత వెండితెరకు పూర్తిగా దూరమైంది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన అంజి నమ్రత చివరి సినిమా. ఇన్నేళ్ల తరువాత ఓ అతిథి పాత్రలో నమ్రత కనిపించే అవకాశం ఉందన్న టాక్ వినిపించటంతో మహేష్ ఫ్యాన్స్ ఖుషీ అయ్యారు. అయితే ఈ రూమర్స్పై స్పందించిన నమ్రత, అంతా ట్రాష్ అంటూ కొట్టిపారేసింది. మహేష్ డేట్స్, ఎండార్సమెంట్స్ చూడటంతో పాటు పిల్లల్ని తానే చూసుకోవాలన్న నమ్రత, తనకు సినిమా చేసే టైం లేదని.. ఆ ఆలోచన కూడా లేదని తేల్చి చెప్పింది. పెళ్లి తరువాత నార్త్లో ఐశ్వర్య, సౌత్లో జ్యోతిక లాంటి తారలు రీ ఎంట్రీలో దూసుకుపోతుంటే నమ్రత మాత్రం ఫ్యామిలీకే అంకితమవుతోంది. -
కత్తి రీమేక్లో హృతిక్
కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ మురుగుదాస్ దర్శకత్వంలో విజయ్ హీరోగా తెరకెక్కిన బ్లాక్ బస్టర్ మూవీ కత్తి. తమిళ నాట వంద కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ఈ సినిమాను మెగాస్టార్ చిరంజీవి తెలుగు రీమేక్ చేశాడు. మెగా రీ ఎంట్రీగా భారీ హైప్ క్రియేట్ చేసిన ఈ మూవీ టాలీవుడ్లో కూడా వంద కోట్లకు పైగా వసూళ్లు సాధించి సత్తా చాటింది. చాలా రోజులుగా కత్తి సినిమాను బాలీవుడ్లో రీమేక్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. కత్తి రిలీజ్ సమయంలోనే సల్మాన్ ఖాన్ హీరోగా కత్తి రీమేక్ ఉంటుందన్న వార్త వినిపించింది. అయితే సల్మాన్ ఈ ప్రాజెక్ట్ చేయడానికి ఇంట్రస్ట్ చూపించకపోవటంతో అక్షయ్ కుమార్ చేతికి వెళ్లిందన్న ప్రచారం జరిగింది. గతంలో మురుగదాస్ దర్శకత్వంలో తుపాకీ రీమేక్గా తెరకెక్కిన హాలీడే సినిమాలో నటించిన అక్షయ్ మరోసారి మురుగదాస్తో సినిమా చేయడానికి ఆసక్తి కనబరిచాడు. కానీ ఇప్పటికే చేతినిండా సినిమాలతో యమా బిజీగా ఉన్న అక్షయ్ కూడా ఇప్పట్లో ఈ ప్రాజెక్ట్ను పట్టా లెక్కించే పరిస్థితి కనిపించటం లేదు. దీంతో కత్తి రీమేక్ కథ ఇప్పుడు బాలీవుడ్ సూపర్ హీరో హృతిక్ రోషన్ దగ్గరికి వెళ్లిందన్న టాక్ వినిపిస్తోంది. ఇటీవల కాబిల్ సినిమాలో ఘన విజయం సాధించిన హృతిక్, ప్రస్తుతం ఏహై మొహబ్బతేన్ తో పాటు ఓ బయోపిక్ లో నటించేందుకు రెడీ అవుతున్నాడు. ఈ సినిమాలతో పాటు కత్తి రీమేక్ ను పట్టాలెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నాడట. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ప్రాజెక్ట్ పై త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. -
పెద్దదర్గా సన్నిధిలో ప్రముఖ దర్శకుడు మురుగదాస్
కడప సెవెన్రోడ్స్: ప్రముఖ సినీ దర్శకుడు మురుగదాస్ శుక్రవారం పెద్ద దర్గాను దర్శించుకున్నారు. తొలుత ఆయన జిల్లా మహేష్బాబు ఫ్యాన్స్ అధ్యక్షుడు సమద్ ఇంట్లో తేనేటి విందు స్వీకరించారు. అనంతరం దర్గాకు వచ్చిన ఆయనకు దర్గా కమి టీ కార్యదర్శి నయీమ్, ముజావర్ అమీర్ దర్గా గురువుల చరిత్ర, విశిష్టతలను వివరించారు. ఈ సందర్భంగా ఆయనకు సం ప్రదాయంగా పేటా చుట్టారు. మురుగదాస్ స్వయంగా పూలచాదర్ను తెచ్చి ప్రధాన మజార్ వద్ద సమర్పించారు. అనంతరం ఆయన దర్గాలోని ఇతర గురువుల మజార్లను కూడా దర్శించుకుని ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను ఇంతకుముందు కత్తి సినిమా షూటింగ్ కోసం గండికోటకు వచ్చిన సందర్భంగా దర్గా గురువులను దర్శించుకున్నానని, ఇక్కడికి రావడం ఇది రెండవసారి అని తెలిపారు. దర్గా ప్రార్థనల్లో తనకు ఆశావహ దృక్పథం, ఆత్మశక్తి లభించినట్లయిందన్నారు. ప్రస్తుతం గండికోటలో మహేష్బాబు హీరోగా చిత్రం షూటింగ్ చేస్తున్నామని, దర్గాలో ప్రార్థిస్తున్న సమయంలో దాన్ని జూన్ 23న విడుదల చేయాలని నిశ్చయించుకున్నట్లు తెలిపారు. అసిస్టెంట్ డైరెక్టర్లు మోహన్, సునీత, టెక్నిషియన్ కామత్, మి«థున్, పర్సనల్ అసిస్టెంట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
అతిథులకు ఆహ్వానం!
మహేశ్బాబు ఫ్యాన్స్కు ఓ గుడ్ న్యూస్. మహా శివరాత్రి సందర్భంగా దర్శకుడు మురుగదాస్ ఓ శుభవార్త చెప్పారు. మహేశ్–మురుగదాస్ కాంబినేషన్లో తెలుగు, తమిళ భాషల్లో ఓ చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం టైటిల్, ఫస్ట్ లుక్, టీజర్ కోసం ఎదురు చూస్తున్న అభిమానులకు సినిమా విడుదల తేదీ చెప్పేసి, మురుగదాస్ స్వీట్ షాక్ ఇచ్చారు. ‘‘జూన్ 23న సినిమాను రిలీజ్ చేయా లనుకుంటున్నాం. ఆ రోజు థియేటర్లలో మీరు (ప్రేక్షకులు) మా అతిథులు కావాలి’’ అని ఆయన ట్వీట్ చేశారు. ‘ఠాగూర్’ మధు, ఎన్వీ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో మహేశ్ సరసన రకుల్ కథానాయికగా నటిస్తున్నారు. -
సూపర్ స్టార్, ఈ ఏడాది కూడా ఒక్కటే..!
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు స్లో అండ్ స్టడీ సూత్రాన్ని ఫాలో అవుతున్నాడు. బ్రహ్మోత్సవం సినిమా తరువాత మురుగదాస్ దర్శకత్వంలో బైలింగ్యువల్ సినిమాను ప్రారంభించిన మహేష్.. ప్రస్తుతం ఆ సినిమాను పూర్తి చేసే పనిలో ఉన్నాడు. ఈ సినిమా మార్చి లోగా పూర్తి చేసి వెంటనే కొరటాల శివ దర్శకత్వంలో మరో సినిమాను ప్రారంభించాలని భావించాడు. ఆ సినిమాను కూడా ఈ ఏడాది దీపావళి నాటికి రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశాడు. అయితే మరోసారి మహేష్ అభిమానులకు నిరాశే మిగిలేలా ఉంది. మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ఆలస్యమవుతుండటంతో కొరటాల సినిమాను మరింత ఆలస్యంగా ప్రారంభించనున్నారు. దీంతో దీపావళికి అనుకున్న సినిమాను 2018 సంక్రాంతికి రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. దీంతో ఈ ఏడాది కూడా సూపర్ స్టార్ నుంచి కేవలం ఒక్క సినిమానే రానుంది. -
మహేష్ మూవీ టైటిల్పై క్లారిటీ వచ్చిందా..!
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం తమిళ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే చాలా భాగం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు సంబంధించి ఇంత వరకు ఫస్ట్ లుక్ గాని టైటిల్ లోగో కాని రిలీజ్ కాలేదు. అయితే చాలా టైటిల్స్ సినిమా పేరు ఇదే అంటూ ప్రచారంలోకి వచ్చాయి. చిత్రయూనిట్ మాత్రం ఏ టైటిల్ను అఫీషియల్గా ఎనౌన్స్ చేయలేదు. తాజాగా మహేష్ మూవీ టైటిల్పై ఓ క్లారిటీ వచ్చిందన్న ప్రచారం జరుగుతోంది. ఇటీవల విన్నర్ మూవీ ఆడియో రిలీజ్ సందర్భంగా నిర్మాత పీవీపీ చెప్పిన మాటలు సూపర్ స్టార్ అభిమానుల్లో జోష్ తీసుకువచ్చింది. విన్నర్ వేదిక మీద మాట్లాడిన పీవీపీ ఈ ఏడాది నిర్మాత ఠాగూర్ మధు మూడు చిత్రాలను రిలీజ్ చేస్తున్నాడు. ఆయన చేస్తున్న విన్నర్, మిస్టర్, సంభవామి యుగే యుగే చిత్రాలు ఘనవిజయం సాధించాలని కోరుకుంటున్నా అన్నాడు. ఇప్పటికే మహేష్ సినిమాకు సంభవామి అనే టైటిల్ పరిశీలనలో ఉందన్న ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతోంది. అదే సమయంలో మహేష్, మురుగదాస్ చిత్ర నిర్మాత సంభవామి యుగే యుగే అనే చిత్రాన్ని ఈ ఏడాది రిలీజ్ చేస్తున్నాడన్న క్లారిటీ రావడంతో మహేష్ సినిమా టైటిల్ ఇదే అని ఫిక్స్ అయిపోతున్నారు ఫ్యాన్స్. మహేష్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాను జూన్లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. -
మహేష్ తప్పు చేశాడా..?
ప్రస్తుతం స్టార్ హీరోలందరూ తన మార్కెట్ పరిధిని పెంచుకునే ఆలోచనలో ఉన్నారు. అందుకే ఇతర భాషల్లో కూడా తమ సినిమాలను రిలీజ్ చేస్తూ భారీ కలెక్షన్లను టార్గెట్ చేస్తున్నారు. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా అదే బాటలో నడుస్తున్నాడు. గతంలో మహేష్ హీరోగా తెరకెక్కిన అతడు, దూకుడు, వన్ నేనొక్కడినే లాంటి సినిమాలు తమిళ్ కూడా రిలీజ్ అయ్యాయి. ఇక ఇటీవల విడుదలైన బ్రహ్మోత్సవం సినిమాను తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి రిలీజ్ చేశారు. మహేష్కు తమిళ నాట కూడా మంచి మార్కెట్ ఏర్పడటంతో ప్రస్తుతం తమిళ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ దర్శకత్వంలో ఓ యాక్షన్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాను తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి రూపొందిస్తున్నారు. అయితే ఈ సమయంలో మహేష్ హీరోగా తెరకెక్కిన తొలి సినిమాను తమిళ్లో డబ్ చేసి రిలీజ్ చేశారు. దాదాపు 18 ఏళ్ల తరువాత మహేష్ హీరోగా పరిచయం అయిన రాజకుమారుడు సినిమాను కోలీవుడ్లో జనవరి 27న రిలీజ్ అయ్యింది. భారీ చిత్రంతో తమిళ ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అవుతున్న సూపర్ స్టార్, ఈ సమయంలో తన తొలి సినిమా డబ్బింగ్ వర్షన్ రిలీజ్కు అంగీకరించటం రిస్క్ అన్న టాక్ వినిపిస్తోంది. రాజకుమారుడు సినిమాలో మహేష్ లుక్స్, నటన అంత మెచ్యూర్డ్గా కనిపించవు దీంతో మురుగదాస్ సినిమాకు ముందు ఈ సినిమా చూసిన ఆడియన్స్కు నెగెటివ్ ఇంప్రెషన్ పడే అవకాశం ఉందన్న టాక్ వినిపిస్తోంది. అయినా మహేష్, రాజకుమారుడు రిలీజ్కు అంగీకరించడం ఇండస్ట్రీ వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది. -
మహేష్, మురుగదాస్ సినిమా వాయిదా..?
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, తమిళ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే సగానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా మహేష్ కెరీర్లోనే భారీ బడ్జెట్తో తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి రూపొందుతోంది. ముందుగా ఈ సినిమాను 2017 వేసవి కానుకగా ఏప్రిల్ నెలాఖరున రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. అందుకు తగ్గట్టుగా షూటింగ్ షెడ్యూల్స్ను ప్లాన్ చేసిన యూనిట్ సభ్యులు అనుకున్నట్టుగా సినిమాను తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ సినిమాను అనుకున్నట్టుగా ఏప్రిల్లో కాకుండా.. రెండు నెలలు ఆలస్యంగా రిలీజ్ చేయాలని భావిస్తున్నారట. ఏప్రిల్లో బాహుబలి రిలీజ్ అవుతుండటంతో అదే సమయంలో తన సినిమా రిలీజ్ చేయటం కరెక్ట్ కాదని భావించిన మహేష్ మురగదాస్లు సినిమాను వాయిదా వేయాలని నిర్ణయించుకున్నారు. అయితే మే నెల మహేష్కు కలిసిరాదన్న ఉద్దేశంతో ఏకంగా రెండు నెలలు వాయిదా వేసి సినిమాను జూన్ 23న రిలీజ్ చేయాలని భావిస్తున్నారు. -
'అద్భుతం చూడాలంటే వెయిట్ చేయాల్సిందే'
సూపర్ స్టార్ మహేష్ బాబు తమిళ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే 70 శాతానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు సంబంధించిన ఎలాంటి అధికారిక ప్రకటనా ఇంత వరకు రాలేదు. షూటింగ్ అప్ డేట్స్ లీక్ చేస్తున్నప్పటికీ.. సినిమా టైటిల్ ఏంటి.. ఫస్ట్ లుక్ ఎప్పుడు.. ఎలా ఉండబోతుంది అన్న విషయాలను మాత్రం వెల్లడించలేదు. ఇటీవల న్యూ ఇయర్ కానుకగా మహేష్ బాబు ఫస్ట్ లుక్ వస్తుందని భారీ ప్రచారమే జరిగింది. అంతేకాదు అదే రోజు సినిమా టైటిల్ కూడా ఎనౌన్స్ చేస్తారని భావించారు. అయితే ఇప్పట్లో ఫస్ట్ లుక్ గాని, టైటిల్ గాని ఎనౌన్స్ అయ్యే పరిస్థితి కనిపించటం లేదు. దీంతో మరోసారి సూపర్ స్టార్ అభిమానులకు నిరాశే ఎదురైంది. ఈ విషయం పై సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్న ప్రియదర్శి స్పందించాడు. పెళ్లి చూపులు సినిమాతో ఆకట్టుకున్న ప్రియదర్శి.. మహేష్, మురుగదాస్ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇటీవల మహేష్ అభిమానులతో తన అనుభవాలను పంచుకున్న ఈ యువనటుడు ఫస్ట్ లుక్ ఆలస్యం అవ్వటంపై స్పందించాడు. అద్భుతాన్ని చూడాలంటే కాస్త వెయిట్ చేయాలని.. సూపర్ స్టార్ అభిమానుల కోసం దర్శకుడు అద్భుతమైన విజువల్ వండర్ను సిద్ధం చేస్తున్నాడని తెలిపాడు. -
మహేష్ మూవీ సీక్వలా..?
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం మురుగదాస్ దర్శకత్వంలో యాక్షన్ డ్రామాలో నటిస్తున్న విషయం తెలిసిందే. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి తెరకెక్కిస్తున్న ఈ సినిమాను భారీ బడ్జెట్తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. మహేష్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్గా నటిస్తుండగా తమిళ నటుడు దర్శకుడు ఎస్ జె సూర్య ప్రతినాయక పాత్రలో కనిపించనున్నాడు. తాజాగా ఈ సినిమాకు సంబందించి మరో ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది. మహేష్ హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమా.. గతంలో విజయ్ హీరోగా నటించిన తుపాకి సినిమాకు సీక్వల్ అన్న టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా తమిళనాట ఈ ప్రచారం జోరుగా జరుగుతోంది. మరి ఈ ప్రచారం నిజమో కాదో తెలియాలంటే మాత్రం యూనిట్ సభ్యుల నుంచి అధికారిక ప్రకటన వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే. -
ఇంకెన్ని టైటిల్స్ చెప్తారో...!
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం తమిళ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్, యాక్షన్ థ్రిల్లర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు ఇంత వరకు టైటిల్ నిర్ణయించలేదు. కానీ సినిమా మొదలైన దగ్గరనుంచి ఈ సినిమాకు టైటిల్ ఇదేనంటూ చాలా పేర్లు తెర మీదకు వచ్చాయి. ఎనిమి, వాస్కోడగామ, అభిమన్యుడు, ఏజెంట్ శివ అనే టైటిల్స్ ప్రముఖంగా వినిపించాయి. అయితే తాజాగా మరో ఇంట్రస్టింగ్ టైటిల్ తెర మీదకు వచ్చింది. మహేష్ బాబు పోలీస్ ఆఫీసర్గా నటిస్తున్న ఈ సినిమాకు సంభవామీ అనే టైటిల్ను నిర్ణయించారట. ఈ సినిమా నిర్మాతలు ఈ టైటిల్ను రిజిస్టర్ చేయటంతో మహేష్ బాబు సినిమా కోసమే ఈ టైటిల్ను రిజిస్టర్ చేశారన్న టాక్ వినిపిస్తోంది. మరి నిజంగానే మహేష్ సినిమా కోసమే సంభవామి టైటిల్ను రిజిస్టర్ చేశారా..? లేక మరో ప్రాజెక్ట్ కోసమా..? అన్న సంగతి తెలియాలంటే అఫీషియల్ ఎనౌన్స్మెంట్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే. ఇప్పటికే 70 శాతానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్గా నటిస్తుండగా తమిళ నటుడు దర్శకుడు ఎస్ జె సూర్య విలన్ పాత్రలో కనిపిస్తున్నాడు. హారీష్ జయరాజ్ సంగీతం అందిస్తున్న ఈ యాక్షన్ డ్రామా 2017లో సమ్మర్ లో రిలీజ్ అవుతోంది. -
మహేష్, బిజినెస్ మొదలెట్టేశాడు..!
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం మురుగదాస్ దర్శకత్వంలో ఓ భారీ బడ్జెట్ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసందే. ఇప్పటికే రెండు షెడ్యూల్స్ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం అహ్మదాబాద్లో జరుగుతోంది. డిసెంబర్ 23 వరకు జరిగే ఈ షెడ్యూల్లో పలు కీలక సన్నివేశాలతో పాటు యాక్షన్ సీన్స్ కూడా చిత్రీకరించనున్నారు. ఇప్పటి వరకు పేరు నిర్ణయించని ఈ సినిమాకు సంబంధించి బిజినెస్ కూడా మొదలైపోయింది. దాదాపు 100 కోట్ల బడ్జెట్తో తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి తెరకెక్కుతున్న ఈ సినిమాను హిందీలోనూ రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. దీంతో ఈ మూవీ శాటిలైట్ రైట్స్ను ఓ ఛానల్ భారీ మొత్తానికి సొంతం చేసుకుందట. తెలుగు, హిందీ భాషల ప్రసార హక్కులు కలిపి 26 కోట్లకు సొంతం చేసుకున్నట్టు తెలుస్తోంది. ఈ విషయంపై యూనిట్ సభ్యుల నుంచి ఎలాంటి అధికారిక ప్రకటనా లేకపోయినా.. డీల్ పూర్తియినట్టుగా ప్రచారం మాత్రం జరుగుతోంది. మహేష్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో ప్రముఖ నటుడు దర్శకుడు ఎస్.జె.విలన్ రోల్లో కనిపించనున్నాడు. -
సూపర్ స్టార్తో మరో సినిమా
సూపర్ స్టార్ మహేష్ బాబు, తన సినిమాలకు ఎప్పుడు సాంకేతిక నిపుణులుగా ఒకే టీంను కంటిన్యూ చేస్తుంటాడు. అప్పటికే స్టార్ ఇమేజ్ ఉన్న టెక్నిషియన్స్తోనే కలిసి పనిచేసేందుకు ఇష్టపడే మహేష్, ఎక్కువగా తన సినిమాలకు మణిశర్మతో మ్యూజిక్ చేయించుకున్నాడు. ఆ తరువాత దేవీ శ్రీ ప్రసాద్ టాప్ పొజిషన్కు రావటంతో తనతో మ్యూజిక్ చేయించుకున్నాడు. కానీ థమన్ విషయంలో మాత్రం ముందే స్పందించాడు. తమన్ కెరీర్ స్టార్టింగ్లోనే దూకుడు సినిమా ఇచ్చిన మహేష్, తరువాత బిజినెస్మేన్, ఆగడు సినిమాలకు కూడా థమన్తో కలిసి పనిచేశాడు. అయితే తాజాగా మరోసారి థమన్, మహేష్ బాబు సినిమాకు సంగీతం అందిస్తున్నాడట. ఈ విషయాన్ని స్వయంగా ప్రకటించిన థమన్, ఏ సినిమాకు మహేష్తో కలిసి పనిచేయబోయేది మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. ప్రస్తుతం మహేష్, మురుగదాస్ల కాంబినేషన్లో రూపొందుతున్న సినిమాకు హరీష్ జయరాజ్ సంగీతం అందిస్తున్నాడు. ఆ తరువాత కొరటాల శివ దర్శకత్వంలో చేయబోయే సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్ చేస్తున్నాడు. ఈ రెండు సినిమాల తరువాత పీవీపీ బ్యానర్లో వంశీ పైడిపల్లి దర్శకత్వంలో సినిమా చేయనున్నాడు మహేష్. అయితే ఈ సినిమాకు మలయాళ సంగీత దర్శకుడు గోపిసుందర్ మ్యూజిక్ చేస్తాడన్న టాక్ వినిపిస్తోంది. అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. ప్రస్తుతం ప్రకటించిన సినిమాలకు సంగీత దర్శకుడు దాదాపుగా ఫిక్స్ అయిపోయారు, మరి థమన్ సంగీతం అందించే సినిమా ఎవరితో ఉంటుందో చూడాలి. -
మహేష్ మూవీకి ఏ టైటిల్ పెడతారో?
ప్రిన్స్ మహేష్ బాబు, తమిళ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ కాంబినేషన్ లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కున్న సినిమాకు టైటిల్ ఇంకా ఖరారు కాకపోయినప్పటికీ పలుపేర్లు తెరపైకి వస్తున్నాయి. తాజాగా మరో రెండు పేర్లు విన్పిస్తున్నాయి. చట్టంలో పోరాటం, ఎనిమీ(శత్రువు) టైటిల్స్ పరిశీలిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. అయితే చిత్రయూనిట్ అధికారికంగా టైటిల్ ప్రకటించలేదు. తెలుగు తమిళ భాషల్లో ఒకేసారి రూపొందుతున్న ఈ సినిమాకు ఇంతకుముందు వాస్కోడిగామా, అభిమన్యుడు, ఏజెంట్ శివ అనే పేర్లు వినిపించాయి. మహేష్ ఇంటలిజెన్స్ ఆఫీసర్గా నటిస్తున్న ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తోంది. హరీష్ జైరాజ్ సంగీతం అందిస్తున్నాడు. క్రేజీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ఏ పేరు పెడతారోనని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. -
ఛాన్స్ మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్
ప్రస్తుతం టాలీవుడ్లో ఫుల్ ఫాంలో ఉన్న యంగ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. చిన్న సినిమాలతో కెరీర్ ప్రారంభించి, ఇప్పుడు స్టార్ హీరోలతో వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది ఈ బ్యూటి. ప్రస్తుతం రాంచరణ్ హీరోగా తెరకెక్కుతున్న ధృవ సినిమాతో పాటు మురుగదాస్ మహేష్ బాబుల కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమాలోనూ హీరోయిన్గా నటిస్తోంది. అయితే మహేష్ సినిమా షూటింగ్ సందర్భంగా మురుగదాస్ చెప్పిన విషయం రకుల్ ను షాక్ కు గురిచేసిందట. మురుగదాస్ గతంలోనే తన సినిమాకు రకుల్ హీరోయిన్గా తీసుకోవాలని భావించాడట. అప్పట్లో రకుల్ చేసిన ఓ టివి కమర్షియల్ చూసిన మురుగ, తనను తుపాకీ సినిమాకు హీరోయిన్గా తీసుకోవాలని భావించాడు. అయితే రకుల్ కాంటాక్ట్ కోసం ఆ యాడ్ ఏజెన్సీని సంప్రదించగా, వారు ఆమెకు సినిమాల్లో చేసే ఇంట్రస్ట్ లేదని చెప్పారట. దీంతో తన ఆలోచనను విరమించుకొని కాజల్ను హీరోయిన్గా తీసుకున్నాడు మురుగదాస్. ఈ విషయం తెలిసిన రకుల్ ఇప్పుడు బాధపడిపోతోంది. -
నవంబర్ 9న మహేష్ కొత్త సినిమా ప్రారంభం
బ్రహ్మోత్సవం సినిమా తరువాత గ్యాప్ తీసుకున్న సూపర్ స్టార్ మహేష్ బాబు, ప్రస్తుతం మురుగదాస్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే 60 శాతానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాను 2017 వేసవిలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే మరో సినిమాను కూడా ప్రారంభించేస్తున్నాడు మహేష్. ఇప్పటికే ప్రకటించినట్టుగా కొరటాల శివ దర్శకత్వంలో తన నెక్ట్స్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాను ఈ నెల 9న లాంఛనంగా ప్రారంభించనున్నారు. తన సినిమాల ఓపెనింగ్ కార్యక్రమాలకు మహేష్ హాజరుకాడు. అదే సెంటిమెంట్ను కంటిన్యూ చేస్తూ కొరటాలతో చేయబోయే సినిమాను కూడా మహేష్ లేకుండానే మొదలు పెడుతున్నారు. డిసెంబర్ చివరకల్లా మహేష్, మురుగదాస్ల సినిమా పూర్తి కానుంది, ఆ తరువాత కొరటాల శివ సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ అవుతుంది. -
60 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న మహేష్ 23
సూపర్ స్టార్ మహేష్ బాబు, సౌత్ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ల కాంబినేషన్లో రూపొందుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబందించి 60 శాతం షూటింగ్ పూర్తయినట్టుగా సమాచారం. ఈ నెల 14 వరకు హైదరాబాద్ పరిసరా ప్రాంతాల్లో షూటింగ్ కంప్లీట్ చేసి తరువాతి షెడ్యూల్ కోసం అహ్మదాబాద్ వెళ్లనున్నారు. అహ్మదాబాద్లో జరగనున్న భారీ షెడ్యూల్తో దాదాపు సినిమా షూటింగ్ పూర్తి కానుంది. ఎన్ వి ప్రసాద్, ఠాగూర్ మధులు సంయుక్తంగా భారీ బడ్జెట్తో తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై అదే స్థాయిలో అంచనాలు కూడా ఉన్నాయి. మహేష్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్గా నటిస్తుండగా, తమిళ నటుడు, దర్శకుడు ఎస్ జె సూర్య విలన్గా నటిస్తున్నాడు. మహేష్ బాబు ఇంటలిజెన్స్ ఆఫీసర్గా నటిస్తున్న ఈ సినిమాను తమిళ సంవత్సరాది కానుకగా ఏప్రిల్ 14న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. -
మహేష్ బాబు షూటింగ్ స్పాట్లో అగ్ని ప్రమాదం
మహేష్ బాబు, మురుగదాస్ల కాంబినేషన్లో రూపొందుతున్న సినిమా షూటింగ్ స్పాట్లో ప్రమాదం చోటు చేసుకుంది. ప్రస్తుతం హైదరాబాద్ ఫిలింనగర్ రోడ్ నంబర్ 87లో వేసిన సెట్లో షూటింగ్ జరుగుతుండగా మంగళవారం ఉదయం సెట్లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. టపాకాయలు కాల్చిన నిప్పురవ్వలు పడటంతో లోకేషన్ లోని టెంట్లు ఇతర సామాగ్రికి నిప్పంటుకున్నట్టుగా తెలుస్తోంది. అయితే అప్పటికి షూటింగ్ మొదలు కాకపోవటంతో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. కానీ సెట్ పూర్తిగా కాలిపోవటంతో పెద్ద ఎత్తున ఆస్తి నష్టం జరిగింది. ప్రమాదానికి సంబందించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది. -
మహేష్-మురుగ: వాయిదాకు కారణం ఇదే!
మహేష్బాబు-మురుగదాస్ కాంబినేషన్లో వస్తున్న తాజా సినిమాపై ఇప్పటికీ భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటివరకు ఈ సినిమా ఫస్ట్లుక్గానీ, అఫీషియల్ అప్డేట్గానీ ఏమీ వెలువడకున్నా మహేష్ అభిమానులు మాత్రం ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో దీపావళికి మహేష్ ఫస్ట్లుక్ను విడుదల చేసి అభిమానుల్ని ఖుషీ చేయాలని చిత్రయూనిట్ భావించింది. అందుకు ఏర్పాట్లు కూడా జరిగినట్టు కథనాలు వచ్చాయి. కానీ, దీపావళి రోజున అలాంటిదేమీ విడుదల కాలేదు. సినిమా టైటిల్పై ఇప్పటికీ స్పష్టత రాకపోవడం వల్లే ఈ చిత్రం ఫస్ట్లుక్ను విడుదల చేయలేదని విశ్వసనీయంగా తెలుస్తోంది. మురుగదాస్ దర్శకత్వంలో ద్విభాష (తెలుగు-తమిళ) చిత్రంగా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం పలు టైటిళ్లు తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే, మెజారిటీ చిత్రయూనిట్ మాత్రం 'ఏజెంట్ శివ' టైటిల్కు మొగ్గుచూపుతున్నట్టు సమాచారం. ఒక్కసారి సినిమా టైటిల్పై స్పష్టత వస్తే వెంటనే ఫస్ట్లుక్ విడుదల చేయవచ్చునని వినిపిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్లో కొనసాగుతోంది. పూర్తిగా సరికొత్త రీతిలో ఈ సినిమాలో మహేష్ పాత్రను మురుగదాస్ తీర్చిదిద్దాడని సన్నిహిత వర్గాలు చెప్తున్నాయి. ఫస్ట్లుక్ విషయంలో త్వరలోనే మహేష్ అభిమానుల ఎదురుతెన్నులు ముగిసే అవకాశముందని ఆ వర్గాలు అంటున్నాయి. -
మహేష్ కోసం ముగ్గురు స్టంట్ మాస్టర్లు
మహేష్ బాబు, మురుగదాస్ల కాంబినేషన్లో రూపొందుతున్న కొత్త సినిమాకు సంబందించి రోజుకో వార్త అభిమానులను ఖుషీ చేస్తోంది. భారీ బడ్జెట్తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాను తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి తెరకెక్కిస్తున్నారు. యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఫైట్ సీన్స్ను కొత్తగా ప్లాన్ చేస్తున్నారు. అందుకే దేశంలోనే టాప్ స్టంట్ మాస్టర్లతో యాక్షన్స్ సీన్స్ను డైరెక్ట్ చేయిస్తున్నారు. మహేష్ బాబు రా ఏజెంట్గా నటిస్తున్న ఈ సినిమాకు ఇప్పటికే అనల్ అరసు, పీటర్ హెయిన్స్ లాంటి టాప్ ఫైట్ మాస్టర్లు పనిచేస్తున్నారు. తాజాగా వీరితో పాటు మరో స్టంట్ మాస్టర్ కూడా మహేష్ మూవీ టీంలో జాయిన్ అయ్యాడు. జయహో, రాజ్ కుమార్, అఖిల్ లాంటి సినిమాలకు యాక్షన్ కొరియోగ్రఫి చేసిన రవి వర్మ మహేష్ మూవీ కోసం పని చేస్తున్నాడు. మహేష్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమా 2017 ఏప్రిల్ లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. -
మహేష్ మూవీకి భారీ ఆఫర్
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తమిళ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ దర్వకత్వంలో యాక్షన్ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. భారీగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై అదే స్థాయిలో భారీ అంచనాలు కూడా ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్టుగానే సినిమా షూటింగ్ పూర్తి కాక ముందే బిజినెస్ పరంగా కూడా ఈ సినిమా రికార్డ్లు క్రియేట్ చేస్తుంది. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా స్టార్ట్ అయిపోయింది. అంతేకాదు సినిమా ఆడియో రిలీజ్తో పాటు శాటిలైట్ రైట్స్ను కలిపి ఓ టీవీ ఛానల్ భారీ మొత్తానికి సొంతం చేసుకుందన్న ప్రచారం జరుగుతోంది. అది కూడా బాహుబలి రెండో భాగంగా కన్నా మహేష్ సినిమాకు ఎక్కువ మొత్తం ఆఫర్ చేసి రైట్స్ సొంతం చేసుకున్నారట. ప్రస్తుతం షూటింగ్ దశలోనే ఉన్న మహేష్, మురుగదాస్ల సినిమా ఆడియో, శాటిలైట్ రైట్స్ కోసం ఓ టీవీ ఛానల్ 26 కోట్లు ఆఫర్ చేసిందట. మహేష్, మురుగదాస్ల కాంబినేషన్ పై ఉన్న అంచనాలతో పాటు ఈ సినిమా 100 కోట్ల భారీ బడ్జెట్తో తెరకెక్కుతుండటంతో ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా అదే స్థాయిలో జరుగుతోంది. ప్రస్తుతానికి అధికారిక ప్రకటన లేకపోయినా.. సూపర్ స్టార్ అభిమానులు మాత్రం ఈ వార్తలతో పండుగ చేసుకుంటున్నారు. -
మహేష్ మూవీ షూటింగ్లో గాయపడ్డ రకుల్
సూపర్ స్టార్ మహేష్ బాబు, మురుగదాస్ల కాంబినేషన్లో రూపొందుతున్న యాక్షన్ డ్రామాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది. ఈ సందర్భంగా యాక్షన్ సీన్స్ చిత్రీకరణలో పాల్గొన్న రకుల్ స్వల్పంగా గాయపడింది. రకుల్ వేలు ఫ్యాక్చర్ అయినట్టుగా వార్తలు రావటంతో ఆమె సన్నిహితులు అభిమానుల ఆందోళన చెందారు. ఈ విషయం పై స్పందించిన రకుల్ ప్రీత్ సింగ్, తన ట్విట్టర్ పేజ్ లో 'నా వేలు ఫ్యాక్చర్ కాలేదు. కేవలం బెణికింది. త్వరలోనే సెట్ అవుతుంది. ఈ విషయం స్పందించిన వారందరికీ కృతజ్ఞతలు' అంటూ ట్వీట్ చేసింది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న మహేష్, మురుగదాస్ ల సినిమా ఫస్ట్ లుక్ తో పాటు టైటిల్ ను దీపావళి సందర్భంగా రిలీజ్ చేయనున్నారు. 2017 వేసవిలో ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. Hey guys ! My finger is not fractured, it's a sprain. Should be fine soon. Thanku for all d messages n wishes — Rakul Preet (@Rakulpreet) 20 October 2016 -
మహేష్ మూవీ టైటిల్ లిస్ట్లో మరో పేరు
సూపర్ స్టార్ మహేష్ బాబు, తమిళ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. మహేష్ బాబు కెరీర్లోనే భారీ బడ్జెట్తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమా మొదలైన దగ్గర నుంచి మహేష్ మూవీ టైటిల్ ఇదేనంటూ చాలా పేర్లు తెర మీదకు వచ్చాయి. అయితే అవన్నీ రూమర్స్ అని చిత్రయూనిట్ కొట్టి పారేస్తూ వస్తున్న మళ్లీ మళ్లీ అలాంటి రూవర్సే వినిపిస్తున్నాయి. ఈ ప్రాజెక్ట్ మొదలైన సమయంలో మహేష్, మురుగదాస్ల మూవీ టైటిల్ ఎనిమి అంటూ భారీ ప్రచారం జరిగింది. తరువాత వాస్కోడిగామా, అభిమన్యుడు లాంటి పేర్లు కూడా వినిపించాయి. అయితే తాజాగా మరో ఇంట్రస్టింగ్ టైటిల్ తెర మీదకు వచ్చింది. తెలుగు తమిళ భాషల్లో ఒకేసారి రూపొందుతున్న ఈ సినిమాకు రెండు భాషల్లో కామన్ టైటిల్ ఉండే విధంగా ఏజెంట్ శివ అనే టైటిల్ను పరిశీలిస్తున్నారట. మహేష్ ఇంటలిజెన్స్ ఆఫీసర్గా నటిస్తున్న ఈ సినిమాకు ఈ టైటిల్ అయితేనే కరెక్ట్ అన్న ఆలోచనలో ఉన్నారు చిత్రయూనిట్. మరి ఈ టైటిల్పై అయినా అఫీషియల్ ఎనౌన్స్మెంట్ వస్తుందేమో చూడాలి. -
3 కోట్లతో భారీ ఫైట్ సీన్
సూపర్ స్టార్ మహేష్ బాబు, తమిళ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబందించి మరో ఆసక్తికరమైన వార్త బయటికి వచ్చింది. మహేష్ బాబు కెరీర్లోనే భారీ బడ్జెట్తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం ఓ ఫైట్ సీన్ను భారీగా తెరకెక్కిస్తున్నారట. ఈ సినిమాలో కీలక సన్నివేశంలో వచ్చే ఓ ఫైట్ సన్నివేశాన్ని దాదాపు 3 కోట్ల రూపాయిలతో తెరకెక్కిస్తున్నరట. ఈ సీన్లో భారీ కార్ చేజ్, బోట్ చేజ్తో పాటు కొంత యాక్షన్ ఎపిసోడ్ కూడా ఉందన్న టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతానికి షూటింగ్కు సంబందించిన అప్ డేట్స్ను చిత్రయూనిట్ సీక్రెట్గా ఉంచుతున్న, ఇలాంటి ప్రచారాలు మాత్రం పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. -
అభిమన్యుడు?
మహేశ్బాబు హీరోగా మురుగదాస్ దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రం గురించి ప్రస్తుతం ఫిలిం నగర్లో ఓ వార్త హల్చల్ చేస్తోంది. ఆ మధ్య ఈ చిత్రంలో కథానాయిక పాత్ర కోసం శ్రీదేవి కుమార్తె జాన్వీని అడిగారనీ, తను ఒప్పుకోలేదనీ ఓ వార్త ప్రచారమైంది. వాస్తవానికి ఈ చిత్రబృందానికి జాన్వీని తీసుకోవాలనే ఆలోచన లేదు. కానీ, ఎవరో పుట్టించిన ఈ గాసిప్ మాత్రం బాగానే నలుగురి నోళ్లల్లో నానింది. ఇప్పుడు నానుతున్న వార్త ఏంటంటే.. ఈ చిత్రానికి ‘అభిమన్యుడు’ అనే టైటిల్ పెట్టాలనుకుంటున్నారట.ఇందులో మహేశ్బాబు ఐబీ ఆఫీసర్ (ఇంటిలిజెన్స్ బ్యూరో ఆఫీసర్) పాత్ర చేస్తు న్నారు. అందుకే ఈ టైటిల్ అయితే యాప్ట్గా ఉంటుందనుకుంటున్నారట. మరి.. ఇది గాసిప్గానే మిగిలిపోతుందా? నిజమవుతుందా? అన్నది తెలియడానికి కొన్ని రోజులు పడుతుంది. -
మహేష్ మూవీ వాయిదా పడుతుందా..?
సూపర్ స్టార్ మహేష్ బాబు, ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. తెలుగు, తమిళ భాషల్లో భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ సినిమాను 2017 వేసవిలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేశారు. అది కూడా మహేష్ కెరీర్లో బిగెస్ట్ హిట్స్లో ఒకటిగా నిలిచి పోకిరి రిలీజ్ డేట్ అయిన ఏప్రిల్ 28ననే ఈ సినిమాను కూడా రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్నారు. అయితే ఇప్పుడు అదే సమయానికి మహేష్ మూవీ రిలీజ్ అవుతుందా.. లేదా..? అన్న అనుమానాలు కలుగుతున్నాయి. దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న బాహుబలి 2ను కూడా అదే రోజు రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. దీంతో మహేష్ తన సినిమాను వాయిదా వేసుకోక తప్పేలా లేదు. గతంలో కూడా బాహుబలి తొలి భాగం రిలీజ్ సమయంలో తన శ్రీమంతుడు సినిమాను నెల రోజుల పాటు వాయిదా వేశాడు మహేష్. మరి మరోసారి అదే బాటలో వాయిదా వేస్తాడా..? లేక బాహుబలి కన్నా ముందే థియేటర్లలోకి వస్తాడా..? చూడాలి. -
'మహేష్ బాబు స్టార్ పవర్ అపారం'
ప్రస్తుతం మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ డ్రామా షూటింగ్ లో పాల్గొంటున్న మహేష్ బాబుపై ఆ చిత్ర సినిమాటోగ్రఫర్ సంతోష్ శివన్ ప్రశంసల జల్లు కురిపించాడు. ఆయన స్టార్ పవర్ అపారం అని ఆయనతో కలిసి పనిచేయటం ఆనందంగా ఉందని తెలిపాడు. గత మూడు వారాలుగా చెన్నైలోని ఇవిపి వరల్డ్ లో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. మహేష్ బాబు ఇంటలిజెన్స్ ఆఫీసర్ గా నటిస్తుండగా మహేష్ ఆఫీస్ కు సంబందించిన కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. మహేష్ తో తొలిసారిగా వర్క్ చేస్తున్న సినిమాటోగ్రఫర్ సంతోష్ శివన్, సూపర్ స్టార్ ఎనర్జీ అద్భుతమంటూ ఆకాశానికెత్తేశాడు. మహేష్ ఇక్కడ షూటింగ్ చేయటం చెన్నై కే కొత్త ఎనర్జీ తీసుకొచ్చింది. ఇంత భారీ స్టార్ కాస్ట్ తో తెరకెక్కుతున్న సినిమా కమర్షియల్ గా కూడా సరికొత్త రికార్డ్ లు సృష్టించనుందన్నారు. మహేష్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో ప్రముఖ దర్శకుడు నటుడు ఎస్ జె సూర్య విలన్ గా నటిస్తున్నాడు. -
జ్యో అచ్యుతానంద సెట్లో మహేష్
నారా రోహిత్, నాగశౌర్య, రెజీనాలు ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన రొమాంటిక్ ఎంటర్టైనర్ జ్యో అచ్యుతానంద. ఇటీవల విడుదలైన ఈ సినిమా హిట్ టాక్ సొంతం చేసుకొని మంచి వపూళ్లతో దూసుకుపోతోంది. తాజాగా ఈ సినిమాకు సంబందించిన మరో వార్త టాలీవుడ్ సర్కిల్స్లో ఆసక్తి కలిగిస్తోంది. ఈ సినిమాలో హీరోల ఇంటి సెట్లో త్వరలో సూపర్ స్టార్ మహేష్ బాబు షూటింగ్ చేయనున్నాడట. గతంలో జనతా గ్యారేజ్ కోసం వేసిన గ్యారేజ్ సెట్లో మహేష్, ఓ పాటతో పాటు ఓ యాక్షన్ సీన్ కూడా షూట్ చేయనున్నాడన్న టాక్ వినిపించింది. తాజాగా జ్యో అచ్యుతానంద సెట్లోనూ మహేష్ సందడి చేయనున్నాడన్న వార్త హాట్ టాపిక్గా మారింది. 90లలోని మిడిల్ క్లాస్ ఇంటి తరహా సెట్ వేసే ఆలోచనలో ఉన్న మురుగదాస్, జ్యో అచ్యుతానంద సెట్ నచ్చటంతో అదే సెట్లో షూట్ చేసేందుకు ప్లాన్ చేసుకుంటున్నాడట. ప్రస్తుతం చెన్నైలో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా యూనిట్ త్వరలోనే హైదరాబాద్లో భారీ షెడ్యూల్ను ప్లాన్ చేస్తున్నారు. ఈ షెడ్యూల్ దాదాపు నెల రోజుల పాటు కొనసాగే అవకాశం ఉంది. మహేష్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్గా నటిస్తుండగా, తమిళ నటుడు, దర్శకుడు ఎస్ జె సూర్య విలన్ రోల్లో కనిపించనున్నాడు. -
తమిళ్లో సూపర్ స్టార్ ఓన్ డబ్బింగ్
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం తమిళ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి తెరకెక్కిస్తున్నారు. మహేష్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్గా నటిస్తుండగా, తమిళ నటుడు, దర్శకుడు ఎస్ జె సూర్య ప్రతినాయక పాత్రలో అలరించనున్నాడు. తాజాగా ఈ సినిమాకు సంబందించిన మరో వార్త సూపర్ స్టార్ అభిమానులకు కిక్ ఇస్తోంది. ఇటీవల మహేష్ హీరోగా తెరకెక్కిన శ్రీమంతుడు, బ్రహ్మోత్సవం సినిమాలు తమిళ నాట కూడా భారీగా రిలీజ్ అయ్యాయి. అయితే ఈ రెండు సినిమాల తమిళ వర్షన్లకు డబ్బింగ్ ఆర్టిస్ట్తో మహేష్ పాత్రకు డబ్బింగ్ చెప్పించారు. కానీ మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాకు మాత్రం తమిళ వర్షన్కు కూడా మహేష్ స్వయంగా డబ్బింగ్ చెప్పాలని భావిస్తున్నాడట. చెన్నైలోనే పుట్టి పెరిగిన ప్రిన్స్ తమిళంలో బాగా మాట్లాడగలడు. అందుకే మహేష్ సొంత గొంతుతో డబ్బింగ్ చెపితే సినిమాకు ప్లస్ అవుతుందని భావిస్తున్నారు. -
లెక్క తర్వాత తేలుస్తారు!
మహేశ్బాబు అభిమానులకు, ప్రేక్షకులకు దర్శకుడు ఏఆర్ మురుగదాస్ ఓ ప్రామిస్ చేస్తున్నారు. అందరికీ కొత్త మహేశ్ను చూపిస్తానంటున్నారు. మహేశ్ హీరోగా మురుగదాస్ దర్శకత్వంలో ‘ఠాగూర్’ మధు, ఎన్వీ ప్రసాద్ ఓ చిత్రం నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం చెన్నైలో చిత్రీకరణ జరుగుతోంది. గతంలోనే మహేశ్-మురుగదాస్ ఓ చిత్రం చేయాలనుకున్నారట. ఇప్పటికైనా కుదిరినందుకు మురుగదాస్ సంతోషం వ్యక్తం చేశారు. ‘‘మహేశ్ స్క్రీన్ ప్రెజెన్స్ ఎప్పుడూ బాగుంటుంది. కానీ, ఈసారి ప్రేక్షకులు విభిన్నమైన మహేశ్ను చూస్తారు’’ అని మురుగదాస్ తెలిపారు. సుమారు వంద కోట్లతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారనీ, మహేశ్ కెరీర్లోనే భారీ బడ్జెట్ చిత్రమిదనీ ప్రచారం జరుగుతోంది. ఇదే విషయం గురించి మురుగదాస్ని అడగ్గా... ‘‘చిత్రీకరణ ప్రారంభమైంది ఇప్పుడే కదా. అప్పుడే బడ్జెట్ గురించి చెప్పడం కష్టమే. ఆ లెక్క తర్వాత తేలుతుంది. దర్శకుడిగా మంచి చిత్రం ప్రేక్షకులకు ఇవ్వాలని ప్రయత్నిస్తాను. ఎప్పుడూ స్క్రిప్టే బడ్జెట్ను నిర్ణయిస్తుంది’’ అని చెప్పారు. రకుల్ప్రీత్ సింగ్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతోంది. తమిళ వెర్షన్కి మహేశ్బాబు స్వయంగా డబ్బింగ్ చెప్పనున్నారట. ఈ చిత్రంలో ప్రముఖ దర్శకుడు ఎస్.జె.సూర్య ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. -
జనతా గ్యారేజ్లో మహేష్
ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ సెన్సేషన్ జనతా గ్యారేజ్. ఇటీవల విడుదలైన ఈ సినిమాకు డివైడ్ టాక్ వచ్చినా.. కలెక్షన్ల పరంగా మాత్రం సంచలనాలు నమోదు చేస్తోంది. ఎన్టీఆర్, మోహన్ లాల్ల నటనతో పాటు ఈ సినిమాలో మేజర్ సీన్స్లో కనిపించిన జనతా గ్యారేజ్ సెట్కు కూడా మంచి మార్కులు పడ్డాయి. అందుకే టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, ఈ సినిమా సెట్లో షూటింగ్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తున్నాడు మహేష్. ఈ సినిమాలో కీలకమైన ఓ యాక్షన్ సీన్తో పాటు ఓ పాటను కూడా జనతా గ్యారేజ్ సెట్లో షూట్ చేసేందుకు ప్లాన్ చేశారు. అదే లుక్లో కాకుండా కొద్ది పాటి మార్పులతో ఈ సెట్ను మహేష్ సినిమా కోసం రెడీ చేస్తున్నారు. ప్రస్తుతం ఫారిన్ టూర్లో ఉన్న మహేష్ తిరిగొచ్చాక ముందుగా చెన్నై షెడ్యూల్లో పాల్గొనే అవకాశం ఉంది. ఆ తరువాతే జనతా గ్యారేజ్ సెట్లో మహేష్ షూటింగ్ మొదలవుతుంది. -
టీజర్ కోసం మహేష్, మురుగ ప్లాన్స్
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం తమిళ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ దర్వకత్వంలో నటిస్తున్నాడు. ఇప్పటికే రెండు షెడ్యూల్స్ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా యూనిట్ ప్రస్తుతం బ్రేక్ తీసుకుంది. మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన బాలీవుడ్ మూవీ అకీరా రిలీజ్ సందర్భంగా దర్శకుడు ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీ కావటంలో మహేష్ మూవీకి బ్రేక్ వచ్చింది. అయితే త్వరలో షూటింగ్ను తిరిగి ప్రారంభించనున్న దర్శకుడు టీజర్ కోసం ప్రత్యేకంగా ఒక రోజు షూటింగ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాడట. తన సినిమాలకు ఫస్ట్ లుక్ టీజర్తోనే భారీ హైప్ క్రియేట్ చేసే మురుగదాస్ మహేష్ సినిమా విషయంలో కూడా అదే ఫార్ములాను ఫాలో అవుతున్నాడు. 50 సెకండ్ల టీజర్తో మహేష్ అభిమానులకు ఫుల్ ట్రీట్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు. -
సూపర్ స్టార్కు స్టార్ డైరెక్టర్ కితాబు
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం తమిళ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. బ్రహ్మోత్సవం సినిమాతో నిరాశపరిచిన ప్రిన్స్, ఈ సారి అభిమానులను భారీ హిట్తో అలరించాలని భావిస్తున్నాడు. అందుకే మురుగదాస్ సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఇప్పటికే ఒక షెడ్యూల్ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా, షూటింగ్ సందర్భంగా దర్శకుడు మురుగదాస్ మహేష్పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అందగాడిగా, నటుడిగా సూపర్ స్టార్కు తిరుగులేదన్నది అందరికీ తెలిసిన విషయమే, అయితే అలాంటి సూపర్ స్టార్ సెట్లో ఎలా ఉంటాడు అన్న విషయాన్ని బయటపెట్టాడు, డైరెక్టర్ మురుగదాస్. మహేష్ చాలా స్టైలిష్, మ్యాన్లీ అంటూ పొగిడేసిన మురుగదాస్, సెట్లో ప్రిన్స్ దర్శకుడు చెప్పే విషయాలను ఆసక్తిగా వింటారని, ఎంతో డేడికేషన్తో వర్క్ చేస్తారని తెలిపాడు. ఈ మధ్యే రెండో షెడ్యూల్ షూటింగ్ మొదలైన ఈ సినిమాను తెలుగు తమిళ భాషల్లో ఒకేసారి తెరకెక్కిస్తున్నారు. -
మహేష్ మూవీ టైటిల్ ఎప్పుడంటే..!
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం తమిళ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ దర్శకత్వంలో ఓ యాక్షన్ డ్రామాలో నటిస్తున్నాడు. ఇటీవల మొదలైన ఈ సినిమా ప్రస్తుతం హైదరబాద్ పరిసర ప్రాంతంలో షూటింగ్ జరుపుకుంటోంది. మహేష్ పుట్టిన రోజు సందర్భంగా ఈ మూవీ ఫస్ట్ లుక్ను రిలీజ్ చేస్తారన్న టాక్ వినిపించినా.. ఇప్పట్లో అలాంటిదేమి లేదంటూ చిత్రయూనిట్ ప్రకటించారు. అయితే తాజాగా మరో ఆసక్తికరమైన వార్త సూపర్ స్టార్ అభిమానులకు కిక్ ఇస్తోంది. న్యాయ వ్యవస్థ లోని లోపాలపై తెరకెక్కుతున్న ఈ సినిమా టైటిల్ను దసర సందర్భంగా ప్రకటించనున్నారట. ఇప్పటికే ఈ సినిమాకు ఎనిమీ అనే టైటిల్ను పరిశీలిస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. అయితే దసర రోజున చిత్రయూనిట్ అధికారికంగా సినిమా టైటిల్ను ప్రకటించనున్నారు. ఇక మహేష్ లుక్ను మాత్రం సంగం షూటింగ్ పూర్తయిన తరువాత జనవరి రెండో వారంలో రివీల్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. -
సూపర్ స్టార్ క్రేజీ ప్రాజెక్ట్స్
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు వరుసగా క్రేజీ ప్రాజెక్ట్స్ను లైన్లో పెడుతున్నాడు. బ్రహ్మోత్సవం షాక్ నుంచి వెంటనే కోలుకున్న ప్రిన్స్, అభిమానుల కోసం వరుస సినిమాలను రెడీ చేస్తున్నాడు. ఇప్పటికే మురుగదాస్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ యాక్షన్ డ్రామాను ప్రారంభించాడు. తెలుగు తమిళ భాషల్లో ఒకేసారి తెరకెక్కుతున్న ఈ సినిమా రికార్డ్లను తిరగరాయటం కాయం అన్న నమ్మకంతో ఉన్నారు ఫ్యాన్స్. ఈ సినిమా తరువాత వంశీ పైడిపల్లి దర్శకత్వంలో పీవీపీ సినిమా బ్యానర్లో సినిమాకు ఓకె చెప్పేశాడు. ఊపిరి సినిమాతో మంచి సక్సెస్ సాధించిన వంశీ, మహేష్ కోసం స్టైలిష్ ఎంటర్టైనర్ను రెడీ చేశాడు. ఈ రెండు సినిమాలతో పాటు కొరటాల శివ దర్శకత్వంలోనూ మరో సినిమా చేసేందుకు అంగీకరించాడు. తనకు శ్రీమంతుడు లాంటి కెరీర్ బెస్ట్ అందించిన కొరటాలతో మరో సినిమా చేస్తే తన ఇమేజ్కు ప్లస్ అవుతుందని భావిస్తున్నాడు. -
మహేష్ సినిమాలో నమ్రత గెస్ట్ రోల్?
సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులకు కిక్ ఇచ్చే వార్త ఒకటి టాలీవుడ్ సర్కిల్స్లో తెగ హడావిడి చేస్తోంది. ప్రస్తుతం మురుగదాస్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న భారీ చిత్రంలో నమ్రత గెస్ట్ అపియరెన్స్ ఇవ్వనుందట. ఒకప్పుడు హీరోయిన్గా నటించిన నమ్రత, పెళ్లి తరువాత వెండితెరకు పూర్తిగా దూరమైంది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన అంజి నమ్రత చివరి సినిమా. ఇన్నేళ్ల తరువాత ఓ అతిథి పాత్రలో నమ్రత కనిపించే అవకాశం ఉందన్న టాక్ వినిపిస్తోంది. మహేష్ సినిమాలో కీలక పాత్రకు నమ్రత అయితేనే కరెక్ట్ అని భావించిన దర్శకుడు ఇప్పటికే ఆ ప్రపోజల్ను నమ్రత ముందు ఉంచాడట. అయితే నమ్రత తిరిగి సినిమాల్లో నటించేందుకు అంగకీరిస్తుందా..? లేదా..? అన్న విషయంపై క్లారిటీ రావాలంటే మాత్రం, అధికారిక ప్రకటన వచ్చే వరకు ఎదురుచూడాల్సిందే. -
కథ వినకుండానే మహేశ్ సినిమా ఒప్పేసుకున్నా!
‘వెంకటాద్రి ఎక్స్ప్రెస్’ తర్వాత రకుల్ ప్రీత్సింగ్ కెరీర్ ఎక్స్ప్రెస్ వేగంతో దూసుకెళుతోంది. ప్రస్తుతం తెలుగు పరిశ్రమలో ఏ స్టార్ హీరో సినిమా ఆరంభమవుతున్నా కథానాయికగా రకుల్ పేరు పరిశీలనలోకి తీసుకుంటున్నారు. డేట్స్ అడ్జస్ట్ చేయగలనన్ని సినిమాలు ఒప్పుకుంటూ రకుల్ కూడా బిజీ బిజీగా ఉంటున్నారు. ఇటీవల ఒప్పుకున్న మహేశ్బాబు సినిమాతో పాటు ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో ఐదారు సినిమాలున్నాయి. వాస్తవానికి ఈ సినిమా తనకు దక్కదనే అనుకున్నారట. ఆ విషయం గురించి రకుల్ మాట్లాడుతూ - ‘‘ఈ చిత్రంలో కథానాయికగా ఎవరు నటిస్తారనే చర్చ బాగా జరిగింది. పరిణీతి చోప్రాని తీసుకున్నారనే వార్త కూడా వచ్చింది. దాంతో ఈ సినిమా అవకాశం నాకు దక్కదనుకున్నా. కానీ, నా పేరుని పరిశీలిస్తున్నారని తెలిసింది. అది విని చాలా ఎగ్జైట్ అయ్యాను. ఈ సినిమాకి నన్ను అడిగినప్పుడు నేను కాశ్మీర్లో ఉన్నాను. హీరోయిన్గా నన్ను సెలక్ట్ చేశారనే ఫోన్ కాల్ వచ్చినప్పుడు ఆనందం పట్టలేకపోయాను. ఫోన్ మాట్లాడం పూర్తయ్యాక ఎగిరి గంతేసా. కథ కూడా వినకుండా ఒప్పేసుకున్నాను. మురుగదాస్ సామాన్యమైన కథలు తయారు చేయరు. ఆయన చాలా సెన్సిబుల్ డెరైక్టర్. మురుగదాస్ సినిమాలు అన్ని వయసులవాళ్లూ ఎంజాయ్ చేసే విధంగా ఉంటాయ్. మహేశ్బాబు సూపర్ స్టార్. ఈ ఇద్దరితో సినిమా చేయాలనుకునేదాన్ని. లక్కీగా ఒకే సినిమాకి అది నెరవేరింది. ఆ దేవుడికి నా కృతజ్ఞతలు’’ అని చెప్పారు. రెండు రోజుల క్రితం ఈ చిత్రం షూటింగ్ ప్రారంభమైంది. ఇంకా రకుల్ పాత్రకు సంబంధించిన చిత్రీకరణ ఆరంభం కాలేదు. ప్రస్తుతం తాను చేయబోయే పాత్రకు సంబంధించిన శారీరక భాష ఎలా ఉండాలి? అనే విషయం మీద రకుల్ వర్కవుట్ చేస్తున్నారు. త్వరలో ఈ షూటింగ్లో పాల్గొననున్నారు. -
మహేష్ లుక్ ఇదేనా..?
బ్రహ్మోత్సవం సినిమా తరువాత టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు చేస్తున్న కొత్త సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. తమిళ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈసినిమా ఇటీవలే ప్రారంభమైంది. అయితే కొద్ది రోజులుగా ఈ సినిమా కోసం లుక్ విషయంలో ప్రయోగం చేస్తున్నాడన్న టాక్ జోరుగా వినిపించింది. అయితే తాజాగా సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న ఫోటో ఒకటి ఈ గాసిప్స్ ఫుల్ స్టాప్ పెట్టేలా కనిపిస్తోంది. మురుగదాస్ మూవీలో మహేష్ లుక్ ఇదే నంటూ ఓ ఫోటో మీడియా సర్కిల్స్ లో సందడి చేస్తోంది. కేవలం కాస్ట్యూమ్స్ మాత్రమే కొత్తగా కనిపిస్తున్నాయి కానీ లుక్ విషయంలో మహేష్ ఎలాంటి ప్రయోగం చేయలేదు. చారల చొక్కా, ఇన్ షర్ట్ తో రాజకుమారుడు రాముడు మంచి బాలుడులా కనిపిస్తున్నాడు. ఇది నిజంగానే మహేష్ కొత్త సినిమా లుక్కేనా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. స్టైలిష్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తోంది. ప్రముఖ దర్శకుడు నటుడు అయిన ఎస్ జె సూర్య విలన్ గా నటిస్తున్నాడు. దాదాపు 90 కోట్ల బడ్జెట్ తో రూపొందిస్తున్న ఈ సినిమాను వచ్చే ఏడాది వేసవిలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. -
మహేష్కు నో చెప్పిన శ్రీదేవి కూతురు
సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన హీరోయిన్ ఛాన్స్ వస్తే ఎగిరి గంతేస్తారు వర్థమాన తారలు. సార్కున్న క్రేజ్ అలాంటిది మరి. కానీ మహేష్ సినిమాకు 'నో' చెప్పి అందరినీ ఆశ్చర్యపరచింది శ్రీదేవి పెద్ద కూతురు జాన్వి. తమిళ స్టార్ డైరెక్టర్ మురగదాస్.. మహేష్తో ఓ భారీ బడ్జెట్ సినిమాను ప్లాన్ చేసిన విషయం తెలిసిందే. శుక్రవారం సినిమా చిత్రీకరణ కూడా మొదలుపెట్టేశారు. అయితే మహేష్ హీరోయిన్ కోసం మురుగదాస్ చాలామంది పేర్లనే పరిశీలించాడు. శ్రీదేవి కూతురు జాన్విని ఈ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం చేయాలనే ప్రయత్నం కూడా చేశాడట. ఆ ప్రయత్నంలోనే మురగదాస్.. శ్రీదేవి, బోనీ కపూర్ లను సంప్రదించాడు. శ్రీదేవి దంపతులు కూడా మురుగదాస్ ప్రపోజల్కి సుముఖత వ్యక్తం చేశారు. అయితే జాన్వివి మాత్రం నో అనేసిందట. తను అప్పుడే సినిమాల్లోకి రావాలని అనుకోవడంలేదని, దానికి ఇంకాస్త ప్రిపరేషన్ కావాలని చెప్పిందట. తను నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయని, డ్యాన్స్లో మెళకువలు నేర్చుకునే పనిలో ఉన్నానని సెలవిచ్చిందట. ప్రస్తుతం జాన్వి లాస్ ఏంజిల్స్లోని ప్రముఖ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో శిక్షణ పొందుతోంది. పూర్తిగా శిక్షణ తీసుకున్న తరువాతే తెరంగేట్రం చేయాలనేది అమ్మడి ఆలోచన.. అది కూడా బాలీవుడ్ సినిమా ద్వారానే తొలిసారి తెర మీద కనిపించాలనేది జాన్వి కోరిక. దాంతో చేసేదేమీలేక మురుగదాస్ వెనక్కి రావాల్సి వచ్చింది. అనుకున్నది అనుకున్నట్లు జరిగుంటే ఈ వారం మహేష్తో కలిసి జాన్వి షూటింగ్లో పాల్గొనాల్సి ఉంది. ప్రస్తుతం రకుల్ అదే పనిలో బిజీగా ఉంది. -
పుట్టిన రోజున అభిమానులకు మహేష్ గిఫ్ట్
బ్రహ్మోత్సవం సినిమాతో నిరాశపరిచిన సూపర్ స్టార్ మహేష్ బాబు, ఆ షాక్ నుంచి అభిమానులను బయటకు తీసుకు వచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. ప్రస్తుతం మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమా.., ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న మహేష్, షూటింగ్ ప్రారంభం కావటానికి ముందే ఓ పోస్టర్ను రిలీజ్ చేయాలని భావిస్తున్నాడట. ఇప్పటికే ఈ సినిమాలో మహేష్ లుక్ కోసం ఫోటో షూట్ నిర్వహించారు. ఈ ఫోటో షూట్ ఫోటోలతో ఓ ప్రీ లుక్ను ఆగస్టు 9న రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నారు. ఆ రోజు మహేష్ పుట్టిన రోజు కావటంతో అభిమానులకు తన నెక్ట్స్ సినిమా ప్రీ లుక్ను గిఫ్ట్ గా ఇవ్వాలని భావిస్తున్నారట. త్వరలోనే ఈ ప్రీ లుక్కు సంబందించిన అధికారిక ప్రకటన వెలువడనుంది. -
మహేష్కు హీరోయిన్ ఫిక్స్ అయ్యింది
సూపర్ స్టార్ మహేష్ బాబు, సౌత్ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ కాంబినేషన్లో ఓ భారీ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. మురుగదాస్ మార్క్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాను తెలుగు, తమిళ భాషలతో పాటు హిందీలోనూ రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. అందుకు తగ్గట్టుగా భారీ బడ్జెట్తో ప్రతిష్టాత్మకంగా సినిమాను రూపొందిస్తున్నారు. ఈ సినిమాకు బాలీవుడ్ హీరోయిన్ అయితే బిజినెస్ పరంగా హెల్ప్ అవుతుందని భావించిన యూనిట్ సభ్యులు చాలా మంది బాలీవుడ్ భామలను సంప్రదించారు. ఒక దశలో పరిణితి చోప్రా ఫైనల్ అయ్యిందన్న వార్త కూడా వినిపించింది. అయితే ఈ బ్యూటి భారీ రెమ్యూనరేషన్ డిమాండ్ చేయటంతో మురుగదాస్ టీం వెనక్కు తగ్గారు. ఫైనల్గా టాలీవుడ్ నయా సెన్సేషన్ రకుల్ ప్రీత్ సింగ్కు ఫిక్స్ అయ్యారు. ఈ విషయాన్ని మురుగదాస్ అఫీషియల్గా కన్ఫామ్ చేశారు. ఇంతటి భారీ చిత్రంలో తనకు అవకాశం ఇచ్చినందుకు రకుల్ దర్శకుడు మురుగదాస్, హీరో మహేష్ బాబులకు కృతజ్ఞతలు తెలిపింది. @Rakulpreet plays the leading lady in my next with @urstrulyMahesh :) — A.R.Murugadoss (@ARMurugadoss) 14 July 2016 @ARMurugadoss @urstrulyMahesh Thanku so much sir. Such a privilege to be working with you and mahesh sir -
అందరికీ ఓకె చెప్పేస్తున్నాడు
బ్రహ్మోత్సవం సినిమాతో నిరాశపరిచిన మహేష్ బాబు తన నెక్ట్స్ సినిమాతో అభిమానులను అలరించడానికి రెడీ అవుతున్నాడు. ఈ మధ్య ఎక్కువగా ఫ్యామిలీ డ్రామాల మీద దృష్టి పెట్టిన సూపర్ స్టార్, ఇప్పుడు రూట్ మార్చి ఓ పక్కా యాక్షన్ ఎంటర్టైనర్ను సిద్ధం చేస్తున్నాడు. తమిళ దర్శకుడు మురుగదాస్ డైరెక్షన్లో మెసేజ్ ఓరియంటెండ్ కమర్షియల్ యాక్షన్ డ్రామాను రెడీ చేస్తున్నాడు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈ నెలాఖరున సెట్స్ మీదకు వెళ్లనుంది. మురుగదాస్ సినిమా ఇంకా మొదలు కాకముందే ఇతర దర్శకులకు కూడా కమిట్మెంట్స్ ఇచ్చేస్తున్నాడు. ఇప్పటికే బ్రహ్మోత్సవం నిర్మాతలైన పీవీపీ సంస్థ కోసం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి అంగీకరించాడు. తనకు పోకిరి బిజినెస్మేన్ లాంటి సూపర్ హిట్స్ అందించిన పూరి జగన్నాథ్ దర్శకత్వంలో జనగణమన సినిమా చేయనున్నాడు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్తో కూడా మరో సినిమాకు రెడీ అవుతున్నాడు. ఇక దర్శకధీరుడు రాజమౌళికి కూడా చాలా రోజుల క్రితమే సినిమా చేస్తానని మాట ఇచ్చాడు రాజకుమారుడు. మరి ఇన్ని సినిమాలు లైన్లో పెట్టిన మహేష్ బాబు, ఇవన్నీ ఎప్పటికీ పూర్తి చేస్తాడో. -
అకీరాగా సోనాక్షి అదుర్స్
బాలీవుడ్ స్టార్ హీరోయిన్లు ఇప్పుడు లేడి ఓరియంటెడ్ సినిమాల మీద దృష్టి పెడుతున్నారు. అయితే ఎక్కువ మంది ఎమోషనల్ డ్రామాలు చేయడానికి ఇంట్రస్ట్ చూపిస్తుంటే.., స్టార్ వారసురాలు సోనాక్షి సిన్హా మాత్రం యాక్షన్ అవతార్లో అదరగొడుతోంది. సౌత్ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ డైరెక్షన్లో తెరకెక్కిన బాలీవుడ్ యాక్షన్ డ్రామా అకీరా. సోనాక్షి సిన్మా లీడ్ రోల్లో తెరకెక్కిన ఈ సినిమా అఫీషియల్ ట్రైలర్ రిలీజ్ అయ్యింది. పూర్తిగా సోనాక్షిని యాక్షన్ స్టార్గా ప్రజెంట్ చేస్తూ రూపొందించిన ఈ ట్రైలర్కు మంచి రెస్పాన్స్ వస్తోంది. రిలీజ్ అయిన 15 గంటల్లో దాదాపు 9 లక్షల మందికి పైగా ప్రేక్షకులు ఈ ట్రైలర్ను వీక్షించారు. తమిళ్లో ఘనవిజయం సాధించిన మౌనగురు సినిమాలోనే హీరో పాత్రను లేడీ క్యారెక్టర్గా మార్చి... మురుగదాస్, ఈ సినిమాను తెరకెక్కించాడు. ప్రస్తుతం పొస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న ఈ సినిమా సెప్టెంబర్ 2న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతోంది. -
టాలీవుడ్ కన్నా ముందు బాలీవుడ్లో..?
టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి ఇమేజ్ సొంతం చేసుకున్న చాలా మంది నటులు బాలీవుడ్లో కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు. చిరంజీవి, వెంకటేష్, నాగార్జున లాంటి సీనియర్ హీరోలు కూడా ఈ ప్రయత్నం చేయగా, ఈ జనరేష్ హీరోలు కూడా అలాంటి ప్రయత్నాల్లోనే ఉన్నారు. ఇప్పటికే రామ్ చరణ్, రానా లాంటి వారు బాలీవుడ్లో అడుగు పెట్టాగా, మరికొంత మంది సరైన సమయం కోసం ఎదురుచూస్తున్నారు. అయితే తెలుగులో హీరోగా గుర్తింపు తెచ్చుకున్నా.. కమర్షియల్ సక్సెస్ సాధించటంలో ఫెయిల్ అవుతున్న యంగ్ హీరో నారా రోహిత్ కూడా బాలీవుడ్లో అడుగుపెట్టేందుకు రెడీ అవుతున్నాడట. చాలా కాలం క్రితం రోహిత్ హీరోగా శంకర సినిమా పూర్తయ్యింది. అయితే తెలుగులో ఇంత వరకు రిలీజ్కు నోచుకోని ఈ సినిమాను ఇప్పుడు బాలీవుడ్లో రిలీజ్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. తమిళ హిట్ సినిమా మౌనగురుకు రీమేక్గా రూపొందిన ఈ సినిమా థ్రిల్లర్ జానర్లో తెరకెక్కింది. అయితే ఇదే కథను కొద్ది పాటి మార్పులతో అకీరా పేరుతో బాలీవుడ్ తెరకెక్కించారు. తమిళ స్టార్ డైరెక్టర్ మురుగదాస్, అకీరా సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ సినిమా సెప్టెంబర్లో రిలీజ్కు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో నారా రోహిత్ బాలీవుడ్ ఎంట్రీ ఎంత వరకు సక్సెస్ అవుతుందో చూడాలి. -
బాలీవుడ్కి నారావారి అబ్బాయి..?
టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి ఇమేజ్ సొంతం చేసుకున్న చాలా మంది నటులు బాలీవుడ్లో కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు. చిరంజీవి, వెంకటేష్, నాగార్జున లాంటి సీనియర్ హీరోలు కూడా ఈ ప్రయత్నం చేయగా, ఈ జనరేష్ హీరోలు కూడా అలాంటి ప్రయత్నాల్లోనే ఉన్నారు. ఇప్పటికే రామ్ చరణ్, రానా లాంటి వారు బాలీవుడ్లో అడుగు పెట్టాగా, మరికొంత మంది సరైన సమయం కోసం ఎదురుచూస్తున్నారు. అయితే తెలుగులో హీరోగా గుర్తింపు తెచ్చుకున్నా.. కమర్షియల్ సక్సెస్ సాధించటంలో ఫెయిల్ అవుతున్న యంగ్ హీరో నారా రోహిత్ కూడా బాలీవుడ్లో అడుగుపెట్టేందుకు రెడీ అవుతున్నాడట. చాలా కాలం క్రితం రోహిత్ హీరోగా శంకర సినిమా పూర్తయ్యింది. అయితే తెలుగులో ఇంత వరకు రిలీజ్కు నోచుకోని ఈ సినిమాను ఇప్పుడు బాలీవుడ్లో రిలీజ్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. తమిళ హిట్ సినిమా మౌనగురుకు రీమేక్గా రూపొందిన ఈ సినిమా థ్రిల్లర్ జానర్లో తెరకెక్కింది. అయితే ఇదే కథను కొద్ది పాటి మార్పులతో అకీరా పేరుతో బాలీవుడ్ తెరకెక్కించారు. తమిళ స్టార్ డైరెక్టర్ మురుగదాస్, అకీరా సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ సినిమా సెప్టెంబర్లో రిలీజ్కు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో నారా రోహిత్ బాలీవుడ్ ఎంట్రీ ఎంత వరకు సక్సెస్ అవుతుందో చూడాలి. -
మహేష్ మూవీకి వెరైటీ టైటిల్
బ్రహ్మోత్సవం రిజల్ట్తో షాక్ తిన్న సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం తన తదుపరి సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు. సౌత్ ఇండియన్ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ దర్శకత్వంలో ఓ మెసేజ్ ఓరియంటెడ్ యాక్షన్ డ్రామాలో నటిస్తున్నాడు. మురుగదాస్ మార్క్తో తెరకెక్కుతున్న ఈ సినిమాను భారీ బడ్జెట్తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే కథ కథానాలు రెడీగా ఉన్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. అయితే ముందుగా ఈ సినిమాకు టైటిల్గా 'ఎనిమీ', 'చట్టంతో పోరాటం' అనే పేర్లు వినిపించాయి. అయితే ఇవన్నీ పక్కన పెట్టి ఇప్పుడు మరో ఇంట్రస్టింగ్ టైటిల్ను ఆలోచిస్తున్నారట చిత్రయూనిట్. గతంలో కథకు సంబందం లేకపోయినా గజిని టైటిల్తో సినిమాను తెరకెక్కించిన మురుగదాస్ మంచి విజయం సాధించాడు. అదే తరహాలో మహేష్ సినిమాకు 'వాస్కోడాగామ' అనే టైటిల్ను పెట్టాలని భావిస్తున్నాడట. ఇప్పటివరకు అఫీషియల్ ఎనౌన్స్మెంట్ లేకపోయినా దర్శకుడు మాత్రం ఇదే టైటిల్ను ఫైనల్ చేసే ఆలోచనలో ఉన్నాడన్న టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాలో మహేష్ సరసన బాలీవుడ్ బ్యూటీ పరిణీతి చోప్రా హీరోయిన్గా నటిస్తోంది. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి తెరకెక్కుతున్న ఈ సినిమాను హైదరాబాద్తో పాటు పుణె, రాజస్థాన్, ముంబైలలో చిత్రీకరించనున్నారు. -
మురుగదాస్ సినిమా రిలీజ్కు రెడీ
తమిళ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ తెరకెక్కించిన బాలీవుడ్ మూవీ అకీరా. గజిని, హలీడే లాంటి సినిమాలతో ఉత్తరాదిలో కూడా మంచి ఇమేజ్ సొంతం చేసుకున్న డైరెక్టర్ మురుగదాస్.. సోనాక్షి సిన్హా ప్రధాన పాత్రలో ఈ సినిమాను తెరకెక్కించారు. అంతేకాదు తొలిసారిగా ఓ రీమేక్ సినిమాను డైరెక్ట్ చేసిన మురుగదాస్, తమిళ సూపర్ హిట్ సినిమా మౌనగురు చిత్రానికి రీమేక్గా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. చాలాకాలం కిందటే షూటింగ్ ప్రారంభమైన ఈ సినిమా ఇప్పటికే రిలీజ్ కావాల్సి ఉంది. ఇటీవల కాలంలో ఈ సినిమాపై ఎలాంటి సమాచారం ఇవ్వని దర్శకుడు మహేష్తో తీసే సినిమా పనుల్లో బిజీ అయిపోయాడు. దీంతో అకీరా ఆగిపోయిందన్న టాక్ కూడా వినిపించింది. అలాంటి వదంతులకు చెక్ పెడుతూ సెప్టెంబర్ 2న అకీరా రిలీజ్ అవుతుందంటూ పోస్టర్ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. మురుగదాస్ స్వయంగా నిర్మిస్తున్న ఈ సినిమా కోసం సోనాక్షి సిన్హా కొన్ని యాక్షన్ ఎపిసోడ్స్లోనూ నటించింది. అందుకోసం మార్షల్ ఆర్ట్స్లో ప్రత్యేకంగా శిక్షణ తీసుకుంది. 2015 మార్చ్లో మొదలైన అకీరా ఏడాదిన్నర తరువాత ప్రేక్షకుల ముందుకు వస్తోంది. -
ఒక సినిమా, ఆరు నిర్మాణ సంస్థలు
ఇండస్ట్రీలో రోజు రోజుకు భారీ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా బడ్జెట్ పరిధులు దాటి పోతుండటంతో నిర్మాణ రంగంలో ఈ మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. భారీ బడ్జెట్ తో పాటు అంతర్జాతీయ స్థాయిలో సినిమాను ప్రేక్షకులకు చేరువ చేయటం కార్పోరేట్ కంపెనీలతో చేతులు కలుపుతున్నారు భారీ చిత్ర నిర్మాతలు. అదే బాటలో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఓ సినిమా కోసం ఏకంగా ఆరు నిర్మాణ సంస్థలు కలిసి పని చేస్తున్నాయి. మహేష్ బాబు హీరోగా తమిళ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ ఓ యాక్షన్ మూవీని చేస్తున్నాడు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తయిన ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. ఇప్పటికే ఈ సినిమాకు బడ్జెట్ 80 కోట్ల వరకు అవుతుందని అంచనాలు వేస్తున్నారు. ఇంత భారీగా తెరకెక్కుతున్న ఈ సినిమాకోసం ఆరు నిర్మాణ సంస్ధలు కలిసి పని చేయనున్నాయి. ముందు నుంచి చెపుతున్నట్టుగా ఠాగూర్ మధు, ఎన్వీప్రసాద్ లు నిర్మాతలుగా వ్యవహరిస్తారు. వీరితో పాటు రిలయన్స్ ఎంటర్ టైన్మెంట్స్, లియో ప్రొడక్షన్స్, మెగా సూపర్ గుడ్ ఫిలింస్, ఫాక్స్ స్టార్ స్టూడియోస్ లు నిర్మాణంలో భాగం పంచుకుంటాయి. ఇక హీరో మహేష్ బాబు కూడా నిర్మాణ భాగస్వామిగా వ్యవహరిస్తాడు. -
సూపర్ స్టార్తో నటించే అవకాశం
బ్రహ్మోత్సవం సినిమాతో నిరాశపరిచిన సూపర్ స్టార్ మహేష్ బాబు, తన అభిమానులను అలరించడానికి ఓ గిఫ్ట్ ఇవ్వనున్నాడు. ప్రస్తుతం ఫ్యామిలీతో కలిసి ఫారిన్లో హాలీడేస్ ఎంజాయ్ చేస్తున్న సూపర్ స్టార్ తిరిగి రాగానే తమిళ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న ఈ సినిమా జూలై నెలఖరుకి సెట్స్ మీదకు వెళ్లనుంది. మహేష్ కెరీర్లో భారీ బడ్జెట్తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో అభిమానులకు కూడా నటించే అవకాశం కల్పిస్తున్నారు చిత్రయూనిట్. ఇందుకోసం ప్రత్యేకంగా ఆడిషన్స్ నిర్వహించి మరీ నటీనటులను ఎంపిక చేసుకుంటున్నారు. ప్రస్తుతం హైదరాబాద్లోని సినీ నిర్మాణ సంస్థ ఆఫీస్లో ఈ ఆడిషన్స్ను నిర్వహిస్తున్నట్టుగా సమాచారం. ఎనిమి అనే వర్కింగ్ టైటిల్తో తెరకెక్కనున్న ఈ సినిమాలో పరిణీతి చోప్రా హీరోయిన్గా నటిస్తుండగా, హరీష్ జయరాజ్ సంగీతం అందిస్తున్నాడు. -
'కత్తి' కథ గొడవ ముగిసింది
మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమాగా తెరకెక్కుతున్న కత్తిలాంటోడు, కథ విషయంలో చాలా రోజులుగా వివాదం జరుగుతున్న సంగతి తెలిసిందే. తమిళ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ దర్శకత్వంలో కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ హీరోగా తెరకెక్కిన సినిమా కత్తి. ఈ సినిమా రిలీజ్ సమయంలోనే తెలుగు రచయిత ఎన్ నరసింహారావు, ఈ కథ నాదంటూ పోరాటం చేశాడు. అయితే అప్పట్లో ఆయన పోరాటం ఫలించలేదు. తరువాత చిరంజీవి రీ ఎంట్రీ సినిమాగా కత్తి సినిమాను రీమేక్ చేస్తున్నట్టుగా వార్తలు రావటంతో నరసింహారావు మరోసారి తన పోరాటాన్ని ప్రారంభించాడు. కత్తి సినిమా విడుదలకు ముందే తన కథను తెలుగు సినీ రచయితల సంఘంలో రిజిస్టర్ చేయించినట్టుగా ఆధారాలు చూపించాడు. ఈ ఆధారాలను పరిశీలించిన సీనియర్ దర్శకులు దాసరి నారాయణరావు అతడికి న్యాయం జరిగే వరకు చిరు సినిమా షూటింగ్కు కార్మికులు హాజరు కావద్దని తెలిపారు. దీంతో కొంత కాలంగా నరసింహారావుతో మెగా టీం సంప్రదింపులు జరుగుతోంది. ఫైనల్గా చర్చలు ఓ కొలిక్కి వచ్చాయన్న వార్త వినిపిస్తోంది. ఎన్ నరసింహారావు పేరును సినిమా టైటిల్స్లో కథాసహకారం అంటూ వేస్తాం అన్న హామితో పాటు 40 లక్షల రూపాయిల పారితోషికం కూడా ఇచ్చేందుకు కత్తిలాంటోడు సినిమా యూనిట్ అంగకీరించింది. యూనిట్ సభ్యులు చెప్పిన హామిలతో సంతృప్తి చెందిన నరసింహారావు. ఇక వివాదం ముగినట్టే అని ప్రకటించారు. -
మహేశ్బాబుకు జంటగా పరిణితిచోప్రా
టాలీవుడ్ సూపర్స్టార్ మహేశ్బాబుతో బాలీవుడ్ బ్యూటీ పరిణితిచోప్రా రొమాన్స్ చేయడానికి సిద్ధమవుతున్నారు. కోలీవుడ్కు చెందిన సూపర్స్టార్ రజనీకాంత్, విశ్వనాయకుడు కమలహాసన్ల నుంచి అజిత్, సూర్య, కార్తీల వరకూ పలువురి చిత్రాలు టాలీవుడ్ తెరపై వెలిగిపోతుంటాయి. వీరి చిత్రాల అనువాదపు హక్కులు కూడా కళ్లు తిరిగే స్థాయిలో ఉంటాయి. ఒక్క ఉదాహరణ చెప్పాలంటే రజనీకాంత్ తాజా చిత్రం తెలుగులో 34 కోట్లకు అమ్ముడు పోయిందన్నది సినీవర్గాల టాక్. ఇక తెలుగు చిత్రాలు తమిళంలోకి అనువాదం అయినా అంతగా లాభాలను అర్జించడం లేదు. అయితే ఇటీవల ద్విభాషా చిత్రంగా విడుదలైన బాహుబలి చిత్రం తమిళంలో కూడా విశేష ప్రజాదరణ పొందింది. ఇది ఒక్క కారణం కాదు టాలీవుడ్ స్టార్ హీరోలకు తమిళంలోనూ తమ ఇమేజ్ను పెంచుకోవాలన్న కోరిక చాలా కాలంగానే ఉంది. అలా బాహుబలి ముందంజ వేసినా తాజాగా మహేశ్బాబు తమిళసినీ ప్రేక్షకులకు నేరు చిత్రాల హీరోగా పరిచయం కావడానికి సిద్ధమవుతున్నారు. ఇందుకు ఆయన ఇక్కడి సూపర్ దర్శకుడు ఏఆర్.మురుగదాస్ను ఎంచుకున్నారు. తమిళం, తెలుగు భాషల్లో భారీ ఎత్తున తెరకెక్కనున్న ఈ చిత్రానికి ముహూర్తం కుదిరింది. జూలై 15న పాట చిత్రీకరణతో ప్రారంభం కానుంది. ఇందుకోసం హైదరాబాద్ అన్నపూర్ణా స్టూడియోలో బ్రహ్మాండమైన సెట్ తయారవుతోందని సమాచారం. ఈ చిత్రానికి సంతోష్శివన్ చాయాగ్రహణం, హరీష్జయరాజ్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇందులో ప్రిన్స్ మహేశ్బాబు సరసన నటించే హీరోయిన్ గురించి రకరకాల ప్రచారం జరిగింది. ఇలియానా,శ్రుతిహాసన్ పేర్లు చక్కర్లు కొట్టాయి.అయితే దర్శకుడు ఏఆర్.మురుగదాసన్ బాలీవుబ్ బ్యూటీ పరిణీతి చోప్రాను మహేశ్బాబుతో రొమాన్స్ చేయించడానికి సిద్ధం అయ్యారు. ఇంకాపేరు నిర్ణయించని ఈ చిత్రం ద్వారా పరిణితిచోప్రా తొలిసారిగా దక్షిణాది చిత్ర సీమకు దిగుమతి అవుతున్నారన్నమాట. -
మహేష్, పవన్ లతో ఒకేసారి
ఇద్దరు టాప్ హీరోలతో ఒకేసారి కలిసి పనిచేయటం ఎవరికైనా అరుదైన అవకాశమే. అలాంటి అరుదైన అవకాశాన్ని సొంతం చేసుకున్నాడు కోలీవుడు నటుడు, దర్శకుడు ఎస్ జె సూర్య. దర్శకుడిగా టాలీవుడ్, కోలీవుడ్లలో విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించాడు సూర్య. తరువాత తమిళ ఇండస్ట్రీలో హీరోగా మారి మంచి విజయాలు సాధించాడు. కేవలం హీరోగానే కాక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే కొంతకాలంగా తమిళనాట సక్సెస్ లేక ఇబ్బంది పడుతున్న ఎస్జె సూర్య ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ మీద దృష్టి పెట్టాడు. గతంలో ఖుషీ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ అందించిన పవన్ కళ్యాణ్ హీరోగా మరో సినిమాను తెరకెక్కించే పనిలో ఉన్నాడు. ఈ సినిమాను డైరెక్ట్ చేస్తూనే మరో తెలుగు స్టార్ హీరో మహేష్ సినిమాలో విలన్గా నటించే ఛాన్స్ కొట్టేశాడు. తమిళ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రంలో ఎస్ జె సూర్య విలన్గా నటిస్తున్నాడు. ఒకేసారి ఇలా ఇద్దరు టాప్ స్టార్స్తో కలిసి పనిచేసే అవకాశం రావటంపై సూర్య ఆనందంగా ఉన్నాడు. త్వరలోనే ఈ రెండు సినిమాలు సెట్స్ మీదకు వెళ్లనున్నాయి. -
మహేశ్తో అక్షయ్కుమార్ ఢీ?
రజనీకి విలన్గా ‘2.0’లో ఓ భయంకరమైన విలన్ పాత్రలో అక్షయ్కుమార్ లుక్ చాలా కాలం క్రితం వరకూ నెట్టింట్లో హల్చల్ చేసింది. సౌత్లోకి ‘రోబో’ సీక్వెల్లాంటి ఓ భారీ ప్రాజెక్ట్తో ఎంట్రీ ఇస్తున్న అక్షయ్కుమార్ మరో క్రేజీ మూవీలో నటించనున్నారనే వార్తలు గుప్పుమంటున్నాయి. మహేశ్బాబు హీరోగా మురుగదాస్ దర్శకత్వంలో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఓ చిత్రం రూపొందనున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో అక్షయ్కుమార్ విలన్గా నటిస్తారని సమాచారం. ఆ మధ్య ఈ చిత్రంలో విలన్గా తమిళ దర్శకుడు ఎస్.జె.సూర్యను అనుకున్నారట. కానీ, అనుకోని కారణాలతో ఆయన తప్పుకున్నారని బోగట్టా. మురుగదాస్కు అక్షయ్కుమార్తో మంచి అనుబంధమే ఉంది. అక్షయ్కుమార్ హీరోగా తమిళ చిత్రం ‘తుపాకీ’ని మురుగదాస్ హిందీలో రీమేక్ కూడా చేశారు. ఇప్పుడు మహేశ్కు విలన్గా అక్షయ్కుమార్ అయితే బాగుంటుందని ఆయన భావిస్తున్నారట. -
మరోసారి పోలీస్ పాత్రలో మహేష్?
సూపర్ స్టార్ మహేష్ బాబు మరోసారి పోలీస్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఇప్పటికే పోకిరి, దూకుడు, ఆగడు చిత్రాల్లో పోలీస్ గెటప్లో ఇరగదీసిన రాజకుమారుడు... త్వరలో సెట్స్ మీదకు వెళ్లబోతున్న మురుగదాస్ సినిమాలోనూ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్గా కనిపించబోతున్నాడట. రా తరహా కౌంటర్ ఇంటలిజెన్స్ అధికారి పాత్రలో మహేష్ కనిపిస్తాడన్న టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకొంటున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ పరిణీతి చోప్రా హీరోయిన్గా నటిస్తోంది. మురుగదాస్ టీంలో చాలాకాలంగా పనిచేస్తున్న ఆర్ట్ డైరెక్టర్ సునీల్, మహేష్ కోసం అద్భుతమైన సెట్స్ డిజైన్ చేస్తున్నాడట. ఇప్పటికే హైదరాబాద్ అన్నపూర్ణా స్టూడియోస్లో భారీ ఇంటెలిజెన్స్ ఆఫీస్ సెట్ వేసే పనిలో ఉన్నారు. సంతోష్ శివన్ సినిమాటోగ్రఫి, హారిస్ జయరాజ్ మ్యూజిక్ ఇలా టాప్ టెక్నిషియన్స్ మహేష్ - మురుగదాస్ల సినిమా కోసం పనిచేస్తున్నారు. త్వరలోనే చిత్రయూనిట్ ముంబైలో సమావేశమై ప్రొడక్షన్ షెడ్యూల్ను ఫైనల్ చేయనున్నారు. బ్రహ్మోత్సవం రిలీజ్ తరువాత ఫ్యామిలీతో కలిసి ఫారిన్ టూర్ వెళ్లిన మహేష్, తిరిగి రాగానే మురుగదాస్ సినిమా షూటింగ్లో పాల్గొంటాడు. -
మహేష్కు జోడిగా అలియా
బ్రహ్మోత్సవం సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో మహేష్ బాబు చేయబోయే నెక్ట్స్ సినిమా పనులు కూడా ఊపందుకున్నాయి. తమిళ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నట్టుగా ఇప్పటికే ప్రకటించిన మహేష్, ఆ సినిమాను భారీగా తెరకెక్కించేందుకు ప్లాన్ చేసుకుంటున్నాడు. తెలుగు, తమిళ్లో ఒకేసారి తెరకెక్కనున్న ఈ సినిమాను హిందీలో కూడా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు. అందుకే ఈ సినిమాలో హీరోయిన్గా నార్త్ బ్యూటిని నటింప చేయాలని ప్రయత్నిస్తున్నారు. బాలీవుడ్ హాట్ బ్యూటి పరిణీతి చోప్రా ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తుందటూ ప్రచారం జరిగింది. అయితే సౌత్ సినిమాలో నటించేందుకు పరిణీతి భారీ రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తుండటంతో ఆమెను పక్కన పెట్టేశారు చిత్రయూనిట్. తాజాగా క్యూట్ హీరోయిన్ అలియా బట్ను మహేష్కు జోడిగా ఫైనల్ చేశారన్న టాక్ వినిపిస్తోంది. యాక్షన్ డ్రామాగా భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ సినిమాను ఠాగూర్ మధు నిర్మిస్తున్నాడు. ఈ జూలై నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలవనుంది. గజిని, తుపాకీ లాంటి సినిమాలతో టాలీవుడ్లో కూడా మంచి క్రేజ్ సొంతం చేసుకున్న మురుగదాస్, మహేష్ సినిమాతో టాలీవుడ్లో కూడా స్టార్ డైరెక్టర్ అనిపించుకోవాలని ప్లాన్ చేస్తున్నాడు. -
ధనుష్ కు నో.. 'ప్రిన్స్'కు ఓకే
చెన్నై: 'ప్రిన్స్' మహేశ్ బాబు తర్వాతి సినిమాలో విలన్ గా తమిళ నటుడు, దర్శకుడు ఎస్ జె సూర్య ఖరారయ్యాడు. స్టార్ డైరెక్టర్ మురుగదాస్ దర్శకత్వంలో తెలుగు-తమిళ భాషల్లో తెరకెక్కనున్న సినిమాలో ప్రతినాయకుడిగా సూర్య కనిపించనున్నాడు. దీనికోసం ధనుష్ సినిమాను అతడు వదులుకున్నాడు. ధనుష్ తాజా చిత్రం 'ఎనాయ్ నొక్కి పాయుమ్' కోసం సూర్యను సంప్రదించారు. అయితే మహేశ్ సినిమాకు కమిట్ అవడంతో ఈ ఆఫర్ తిరస్కరించాడని చిత్రవర్గాలు వెల్లడించాయి. ఇప్పటికే పలుచిత్రాల్లో హీరోగా నటించిన సూర్య, ప్రస్తుతం విజయ్ సేతుపతి హీరోగా తెరకెక్కుతున్న 'ఇరైవి'లో విలన్గా చేస్తున్నాడు. మహేశ్-మురుగదాస్ సినిమా ఏప్రిల్ నెలాఖరుకల్లా సెట్స్ మీదకు వెళ్లనుంది. ఈ సినిమాలో మహేశ్ కు జోడీగా నటించే హీరోయిన్ కోసం అన్వేషణ కొనసాగుతోంది. తమిళనటి సాయి పల్లవి, కీర్తి సురేష్లతో పాటు, బాలీవుడ్ బ్యూటీ పరిణీతి చోప్రా పేరు కూడా తెరపైకి వచ్చాయి. -
అట్లీ డెరైక్షన్లో మహేశ్బాబు
కోలీవుడ్లో లేటెస్ట్గా ఒక కొత్త న్యూస్ హల్చల్ చేస్తోంది. యువ దర్శకుడు అట్లీ టాలీవుడ్ సూపర్స్టార్ మహేశ్బాబును డెరైక్ట్ చేయడానికి సిద్ధం అవుతున్నారన్నదే ఈ క్రేజీ వార్త. రాజారాణి చిత్రంతో దర్శకుడిగా పరిచయమైన ఈయన తొలి చిత్రంతోనే దక్షిణాది చిత్రపరిశ్రమ దృష్టి తన వైపు చూసేలా చేసుకున్నారు. స్టార్ దర్శకుడు శంకర్ శిష్యుడైన అట్లీకి రాజారాణి చిత్ర విజయం తరువాత పలు అవకాశాలు తలుపు తట్టాయి. ఆయన మాత్రం ఇళయదళపతి విజయ్ను దర్శకత్వం చేసే అవకాశాన్ని ఎంచుకున్నారు. వీరి కలయికలో కలైపులి ఎస్ థాను నిర్మించిన తెరి చిత్రం భారీ అంచనాల మధ్య రేపు(గురువారం) తెరపైకి రానుంది. అట్లీ తాజాగా మరో సూపర్స్టార్ మహేశ్బాబుకు గురి పెట్టారన్నది తాజా సమాచారం. ఇటీవల ఆయన హైదరాబాద్లో బ్రహ్మోత్సవం చిత్ర షూటింగ్లో ఉన్న మహేశ్బాబును కలసి కథ వినిపించినట్లు, ఆ కథ తెగ నచ్చేయడంతో నటించడానికి అంగీకరించిన మహేశ్బాబు దాన్ని డెవలప్ చేయమని చెప్పినట్లు కోలీవుడ్ మీడియాలో ప్రచారం హల్చల్ చేస్తోంది. ఈ మధ్య కోలీవుడ్పై ప్రత్యేక దృష్టి సారిస్తున్న మహేశ్బాబు తన చిత్రాలను తెలుగుతో పాటు తమిళంలోనూ ఏక కాలంలో రూపొందేలా ప్రణాళికను సిద్ధం చేసుకుంటున్నారు. అందులో భాగంగానే తాజా చిత్రం బ్రహ్మోత్సవం చిత్రం ద్విభాషాచిత్రంగా తెరకెక్కుతోంది. ఇక అట్లీ దర్శకత్వంలో నటించే చిత్రం అదే తరహాలో ఉంటుందని ఆశించవచ్చు. అయితే ఈ చిత్రానికి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడలేదన్నది గమనార్హం. -
ఆ దర్శకులతో సూపర్ స్టార్
ఇన్నాళ్లు తెలుగు సినిమా, తెలుగు టెక్నిషియన్లు అంటూ ఇక్కడే కాలం గడిపేసిన సూపర్ స్టార్ మహేష్ బాబు ఇప్పుడు రూట్ మార్చాడు. మార్కెట్ను విస్తరించుకునేందుకు పరభాషా దర్శకుల మీద దృష్టిపెడుతున్నాడు. ఇప్పటికే శ్రీమంతుడు సినిమాను తమిళ్లో కూడా రిలీజ్ చేసిన మహేష్. తన నెక్ట్స్ సినిమాను బైలింగ్యువల్గా తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి తెరకెక్కించడానికి రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో బ్రహ్మోత్సవం సినిమాలో నటిస్తున్న మహేష్, ఆ సినిమా పూర్తవ్వగానే తమిళ స్టార్ డైరెక్టర్ మురుగుదాస్ దర్శకత్వంలో ఓ భారీ బడ్జెట్ సినిమాకు రెడీ అవుతున్నాడు. ఈ సినిమా తరువాత కూడా తమిళ దర్శకులతోనే పనిచేసే ఆలోచనలో ఉన్నాడు ప్రిన్స్. విజయ్ హీరోగా తెరకెక్కిన తేరి సినిమాతో ఆడియన్స్ ముందుకు వస్తున్న అట్లీ దర్వకత్వంలో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడన్న టాక్ వినిపిస్తోంది. వీళ్లేకాదు తమిళ నాట మాస్ డైరెక్టర్గా పేరున్న లింగుసామి, మహేష్ హీరోగా ఓ యాక్షన్ డ్రామా తెరకెక్కించాలని చాలారోజులుగా ప్రయత్నిస్తున్నాడు. తనీఒరువన్ సినిమాతో నేషనల్ లెవల్లో గుర్తింపు తెచ్చుకున్న జయం రాజా దర్శకత్వంలో ఓ సినిమా చేస్తానంటూ మహేష్ స్వయంగా మాట ఇచ్చాడు. ఇలా వరుసగా తమిళ దర్శకులతోనే సినిమాలు ప్లాన్ చేస్తున్న మహేష్, మన దర్శకులకు టైం ఎప్పుడిస్తాడో మరి. -
కథలు వినడంలో బిజీ
‘బ్రహ్మోత్సవం’ చిత్రీకరణలో బిజీబిజీగా ఉన్న మహేశ్బాబు, ఓ పక్క తన తదుపరి సినిమాలకు స్క్రిప్ట్లు వింటూ ఓకే చేసేస్తున్నారా? వరుస చూస్తే అలానే ఉంది. ఇప్పటికే మురుగుదాస్ దర్శకత్వంలో ఓ చిత్రానికి గ్రీన్సిగ్నల్ ఇచ్చి అభిమానులకు ఓ క్లారిటీ ఇచ్చేశారు మహేశ్. తాజాగా మరో తమిళ దర్శకుడు చెప్పిన కథకు ఆయన ఇంప్రెస్ అయ్యారట. ‘రాజా-రాణి’ ఫేమ్ అట్లీ ‘పోలీసోడు’(తమిళంలో ‘తెరి’) చిత్రంతో ప్రేక్షకులను పలకరించడడానికి సిద్ధమవుతున్నారు. ఇటీవల హైదరాబాద్కు వచ్చిన అట్లీ ‘బ్రహ్మోత్సవం’ సెట్లోనే మహేశ్ను కలిసి, ఒక కథ వినిపించారట. ఆ కథ బాగా నచ్చేసి, స్క్రిప్ట్గా డెవలప్ చేసుకురమ్మని మహేశ్ గ్రీన్సిగ్నల్ ఇచ్చారట. మహేశ్ బాడీ లాంగ్వేజ్కు తగ్గట్టు రొమాంటిక్, హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ స్క్రిప్ట్ను తీర్చిదిద్దే పనిలో అట్లీ ఉన్నట్టు భోగట్టా. -
మహేష్, విజయ్ల మల్టీ స్టారర్
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలో కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటించనున్నాడు. ఊపిరి సినిమాతో నాగార్జున, కార్తీలు కలిసి నటించగా మరోసారి అదే ఫార్ములాతో భారీ వసూళ్లను టార్గెట్ చేస్తున్నారు ఈ స్టార్ హీరోలు. ప్రస్తుతం బ్రహ్మోత్సవం సినిమాలో హీరోగా నటిస్తున్న మహేష్ బాబు, ఆ సినిమా తరువాత తమిళ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ దర్శకత్వంలో సినిమా చేయనున్నాడు. భారీ బడ్జెట్తో బైలింగ్యువల్గా తెరకెక్కనున్న ఈ సినిమా కోసం ఇంట్రస్టింగ్ కాంబినేషన్ను సెట్ చేస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి రూపొందనున్న ఈ సినిమాలో కీలక పాత్ర కోసం తమిళ స్టార్ హీరో విజయ్ని సంప్రదిస్తున్నారు. ఇప్పటికే మురుగదాస్ దర్శకత్వంలో తుపాకీ, కత్తి లాంటి సినిమాల్లో నటించిన విజయ్, ఈ ప్రపోజల్ను కాదనడన్ననమ్మకంతో ఉన్నారు చిత్ర యూనిట్. అంతేకాదు తెలుగు మార్కెట్ కోసం చాలా రోజులుగా ఎదురుచూస్తున్న విజయ్, మహేష్ సినిమాలో గెస్ట్ రోల్లో నటిస్తే అది తనకే ప్లస్ అవుతుందని భావిస్తున్నారు. మహేష్ కూడా తమిళ మార్కెట్ మీద పట్టు సాధించాలంటే విజయ్ లాంటి స్టార్ హీరో సాయం అవసరమనే ఆలోచనలో ఉన్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న ఈ సినిమాను, మే లో సెట్స్ మీదకు తీసుకెళ్లాలని భావిస్తున్నారు. మరి ఈ సినిమాతో సౌత్ ఇండస్ట్రీలోనే భారీ మల్టీ స్టారర్ తెర మీదకు వస్తుందేమో చూడాలి. -
మహేష్కు విలన్గా సూర్య..?
ప్రస్తుతం శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో బ్రహ్మోత్సవం సినిమాలో నటిస్తున్న మహేష్ బాబు.. తన నెక్ట్స్ సినిమాను భారీగా ప్లాన్ చేస్తున్నాడు. ఇప్పటికే తమిళ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ యాక్షన్ ఎంటర్టైనర్లో నటిస్తున్నట్టుగా ప్రకటించాడు మహేష్. ఇప్పుడు ఆ సినిమా కోసం ఇంట్రస్టింగ్ కాంబినేషన్లను సెట్ చేసే పనిలో ఉన్నాడు. ఇప్పటికే కథా కథనాలు రెడీ అయిన ఈ సినిమా ఏప్రిల్ నెలాఖరుకల్లా సెట్స్ మీదకు వెళ్లనుంది. తెలుగు, తమిళ్తో పాటు హిందీలో కూడా ఒకేసారి తెరకెక్కుతున్న ఈ సినిమాలో విలన్ పాత్రకు తమిళ నటుడు, దర్శకుడు ఎస్ జె సూర్యను తీసుకోవాలని భావిస్తున్నారట. ఇప్పటికే పలుచిత్రాల్లో హీరోగా నటించిన సూర్య, ప్రస్తుతం విజయ్ సేతుపతి హీరోగా తెరకెక్కుతున్న ఇరైవిలో విలన్గా చేస్తున్నాడు. అదేబాటలో మహేష్ సినిమాకు సూర్యను తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలో మహేష్కు జోడీ కోసం కూడా భారీ కసరత్తు చేస్తున్నారు. తమిళనటి సాయి పల్లవి, కీర్తి సురేష్లతో పాటు, బాలీవుడ్ బ్యూటీ పరిణీతి చోప్రా పేరు కూడా పరిశీలిస్తున్నారు. -
మహేష్ మూవీలో బాలీవుడ్ బ్యూటీ
శ్రీమంతుడు సినిమాతో వంద కోట్ల కలెక్షన్లు సాధ్యం చేసి చూపించిన సూపర్ స్టార్ మహేష్ బాబు, తన నెక్ట్స్ సినిమాల విషయంలో మరింత భారీగా ఆలోచిస్తున్నాడు. ప్రస్తుతం శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో బ్రహ్మోత్సవం సినిమాలో నటిస్తున్న రాజకుమారుడు, ఆ సినిమాలో ముగ్గురు భామలతో ఆడిపాడుతున్నాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తి కావచ్చింది. వేసవి కానుకగా మేలో బ్రహ్మోత్సవం సినిమాను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. బ్రహ్మోత్సవం సినిమా తరువాత మరోభారీ చిత్రానికి రెడీ అవుతున్నాడు ప్రిన్స్. సౌత్ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్టైనర్ చేయడానికి రెడీ అవుతున్నాడు. ఈ సినిమాను మహేష్ కెరీర్లోనే భారీ బడ్జెట్తో రూపొందించడానికి ప్లాన్ చేస్తున్నారు దర్శక నిర్మాతలు. తెలుగు తమిళ భాషల్లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కనున్న ఈ సినిమా కోసం ఓ బాలీవుడ్ బ్యూటీని హీరోయిన్గా సెలెక్ట్ చేశారు. గతంలో ప్రీతిజింటా, నమ్రతా శిరోద్కర్, బిపాషాబసు, లిసారే, అమృత రావ్ లాంటి బాలీవుడ్ భామలతో జోడీ కట్టిన మహేష్, ఈసారి పరిణీతి చోప్రాను హీరోయిన్గా సెలెక్ట్ చేసుకున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న ఈ సినిమా ఏప్రిల్లో సెట్స్ మీదకు వెళ్లనుంది. -
మరో తమిళ దర్శకుడితో మహేష్
సూపర్ స్టార్ మహేష్ బాబు తమిళ మార్కెట్ మీద దృష్టి పెట్టాడు. ఇప్పటికే శ్రీమంతుడు సినిమాతో తమిళ్లో కూడా మంచి విజయం సాధించిన మహేష్ బాబు ఇప్పుడు వరుసగా తమిళ దర్శకులతో పనిచేయడానికి రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో బ్రహ్మోత్సవం సినిమాలో నటిస్తున్న మహేష్, ఈ సినిమాను కూడా తెలుగుతో పాటు తమిళంలోనూ రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు. ఈ సినిమా తరువాత తమిళ దర్శకుడు మురుగదాస్ డైరెక్షన్లో భారీ బడ్జెట్ సినిమా చేస్తున్నాడు మహేష్. తెలుగు తమిళ భాషల్లో ఒకేసారి రూపొందుతున్న ఈ సినిమాతో అక్కడ కూడా స్టార్ ఇమేజ్ కోసం ప్రయత్నిస్తున్నాడు. అంతేకాదు మురుగదాస్ సినిమా తరువాత కూడా మరోసారి తమిళ దర్శకుడితోనే సినిమాకు రెడీ అవుతున్నాడు రాజకుమారుడు. కోలీవుడ్తో పాటు టాలీవుడ్లో కూడా స్టైలిష్ డైరెక్టర్గా మంచి పేరున్న గౌతమ్ మీనన్, దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి అంగీకరించాడు. ఈ సినిమాను భారీ చిత్రాల నిర్మాత అశ్వనిదత్ నిర్మించనున్నారు. ఈవిషయాన్ని స్వయంగా ప్రకటించిన అశ్వనీదత్, ఎప్పుడు సెట్స్ మీదకు వెళుతుందన్న విషయంలో మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. -
నారా రోహిత్ 'తుంటరి' ఫస్ట్లుక్ టీజర్
ప్రతినిథి, రౌడిఫెలో, అసుర సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యంగ్హీరో నారా రోహిత్ మరో ఇంట్రస్టింగ్ సినిమాతో ఆడియన్స్ ముందుకు వస్తున్నాడు. తమిళంలో ఘనవిజయం సాధించిన 'మాన్ కరాటే' సినిమాను తుంటరి పేరుతో రీమేక్ చేస్తున్నాడు. సౌత్ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ కథ అందించిన ఈ సినిమా రోహిత్ కెరీర్కు మంచి బ్రేక్ ఇస్తుందన్న నమ్మకంతో ఉన్నారు చిత్రయూనిట్. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలో బిజీగా ఉంది. ఫిబ్రవరి చివర్లో ఆడియోను, మార్చిలో సినిమాను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు ఇందులో భాగంగా తుంటరీ ఫస్ట్ లుక్ టీజర్ రిలీజ్ అయ్యింది. పూర్తి యాక్షన్ సీన్స్తో రిలీజ్ అయిన ఈ ట్రైలర్లో హీరోతో పాటు విలన్ పాత్రలో నటించిన కబీర్ దుహన్ సింగ్ను కూడా రివీల్ చేశారు. తన సినిమాలతో మంచి నటుడిగా గుర్తింపు తెచ్చకున్న రోహిత్, తుంటరిగా అయిన స్టార్ ఇమేజ్ అందుకుంటాడేమో చూడాలి. -
నారా రోహిత్ 'తుంటరి' ఫస్ట్లుక్ టీజర్
-
మురుగదాస్ దర్శకత్వంలో 'మహేష్'
-
చిరంజీవి 150వ సినిమాకు అడ్డంకులు?
-
చిరంజీవి 150వ సినిమాకు కొత్త అడ్డంకులు?
మెగా ఫ్యామిలీ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న చిరంజీవి రీ ఎంట్రీ సినిమాకు కొత్త అడ్డంకులు ఎదురవుతున్నాయి. చాలా రోజులుగా రీ ఎంట్రీ సినిమాపై కసరత్తులు చేస్తున్న చిరంజీవి, ఇటీవలే తమిళ సూపర్ హిట్ సినిమా 'కత్తి'ని రీమేక్ చేయాలని నిర్ణయించారు. వివి వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. మెగా తనయుడు రామ్ చరణ్, లైకా ప్రొడక్షన్స్తో కలిసి ఈ భారీ చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నాడు. అయితే ఇంకా పట్టాలెక్కని ఈ సినిమా నిర్మాణంపై కథా హక్కుల వేదిక ఆంక్షలు విధించింది. కత్తి కథ తనదేనంటూ రచయిత ఎన్ నరసింహారావు పోరాడుతుండటంతో ఆయనకు న్యాయం చేసిన తరువాతే సినిమా నిర్మాణం చేపట్టాలని కథా హక్కుల వేదిక చైర్మన్ దాసరి నారాయణరావు తీర్మానించారు. అప్పటివరకు దర్శకుల సంఘం, సినీ కార్మికుల ఫెడరేషన్ సహాయ నిరాకరణ చేయడానికి నిర్ణయించారు. మురుగదాస్ స్వయంగా రాసుకొని తెరకెక్కించిన కత్తి కథను రీమేక్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్టుగా మెగా క్యాంప్ చెపుతోంది. ఈ సినిమాను తమిళ్లో నిర్మించిన లైకా ప్రొడక్షన్స్, తెలుగులోనూ నిర్మిస్తుండటంతో హాక్కుల విషయంలో ఎలాంటి సమస్యలు వచ్చే అవకాశం లేదు. మరి ఇలాంటి సమయంలో కథా హక్కుల వేదిక ఆంక్షలు ఎంతవరకు ఫలితాన్నిస్తాయో చూడాలి. -
మహేష్ సరసన ఛాన్స్ కొట్టేసింది..?
తొలి సినిమాతోనే టాలీవుడ్లో మంచి క్రేజ్ సొంతం చేసుకున్న మలయాళీ భామ కీర్తి సురేష్. రామ్ హీరోగా తెరకెక్కిన 'నేనూ శైలజ' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది కీర్తి సురేష్. గతంలోనే విజయనిర్మల మనవడు హీరోగా తెరకెక్కిన 'ఐనా ఇష్టం నువ్వు' అనే సినిమాలో కీర్తి హీరోయిన్గా నటించినా.., ఆ సినిమా ఇంత వరకు రిలీజ్ కాలేదు. దీంతో రెండో సినిమాతో తొలిసారిగా టాలీవుడ్లో మెరిసిన ఈ భామ స్టార్ హీరోల దృష్టిని ఆకర్షించింది. ఇప్పటికే రామ్చరణ్ హీరోగా తెరకెక్కుతున్న తమిళ సూపర్ హిట్ సినిమా తనీ ఒరువన్ రీమేక్లో కీర్తి సురేష్ను హీరోయిన్గా తీసుకోవాలని భావిస్తుండగా, ఇప్పుడు మరో క్రేజీ ఆఫర్ ఈ అమ్మడిని వరించింది. ప్రస్తుతం బ్రహ్మోత్సవం సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న మహేష్ బాబు, ఆ సినిమా తరువాత తమిళ దర్శకుడు మురుగదాస్ డైరెక్షన్లో ఓ భారీ చిత్రానికి రెడీ అవుతున్నాడు. ఈ చిత్రంలో హీరోయిన్గా చాలామంది బాలీవుడ్ తారల పేర్లు వినిపించినా, ఫైనల్గా కీర్తి సురేష్నే ఫైనల్ చేశారట. ఇప్పటి వరకు అఫీషియల్ ఎనౌన్స్మెంట్ లేకపోయినా ఈ రెండు సినిమాలు కన్ఫామ్ అయితే మాత్రం కీర్తి సురేష్ టాలీవుడ్లో టాప్ హీరోయిన్గా జెండా పాతేస్తుందంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. -
మహేష్ కథపై మురుగదాస్ క్లారిటీ
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, సౌత్ ఇండియన్ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ల కాంబినేషన్లో ఓ సినిమా రూపొందనుందన్న విషయం తెలిసిందే. అయితే త్వరలో సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ సినిమాపై ఇటీవల ఓ వార్త ప్రిన్స్ అభిమానులను కలవర పరిచింది. మురుగదాస్ ముందుగా అజిత్తో సినిమా చేయటం కోసం కథ రెడీ చేసుకున్నాడని. ఆ కథను అజిత్ కాదనటంతో ఇప్పుడు అదే కథతో మహేష్తో సినిమా చేస్తున్నాడన్న టాక్ వినిపించింది. అయితే ఈ వార్తలను దర్శకుడు మురుగదాస్ ఖండించాడు. ఎవరి ఇమేజ్కు తగ్గట్టుగా వారికి కథలు రాసుకుంటామని, మహేష్ కోసం రాసిన కథ తన కోసం ప్రత్యేకంగా తయారు చేశానని క్లారిటీ ఇచ్చాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ సినిమా ఫిబ్రవరిలో మొదలు కానుంది. ఆరు నెలల్లోనే ఈ సినిమాను పూర్తి చేయడానికి ప్లాన్ చేస్తున్నారు చిత్రయూనిట్. సంతోష్ శివన్, హారిస్ జయరాజ్ లాంటి టాప్ టెక్నిషియన్స్ పని చేస్తున్న ఈ సినిమాను ఠాగూర్ మధు, ఎన్ వి ప్రసాద్లు భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. -
మహేష్ బాబు 'ఎనిమీ' అట..?
శ్రీమంతుడు సక్సెస్ తరువాత మహేష్ బాబు వరుస సినిమాలకు రెడీ అవుతున్నాడు. గతంలో ఎప్పుడూ ఒక సినిమా సెట్స్ మీద ఉండగా మరో సినిమా గురించి ఆలోచించని ప్రిన్స్, ఈసారి మాత్రం బ్రహ్మోత్సవం షూటింగ్ జరుగుతుండగానే నెక్ట్స్ ప్రాజెక్ట్ పనులు పూర్తి చేస్తున్నాడు. ఇప్పటికే కథాకథనాలు కూడా ఫైనల్ కావటంతో త్వరలోనే ఆ సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లడానికి రెడీ అవుతున్నాడు. ఈ ప్రాజెక్ట్ తెలుగు, తమిళ భాషల్లో భారీగా రూపొందించడానికి ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో బ్రహ్మోత్సవం సినిమాలో నటిస్తున్న మహేష్ బాబు నెక్ట్స్ ప్రాజెక్ట్ మాస్ ఆడియన్స్ను ఆకట్టుకునేలా ఉండాలని ప్లాన్ చేసుకుంటున్నాడు. శ్రీమంతుడు, బ్రహ్మోత్సవం సినిమాలు క్లాస్ సినిమాలే కావటంతో ఈ సారి పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ మీద దృష్టి పెట్టాడు. అందుకే తమిళ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ దర్శకత్వంలో ఓ యాక్షన్ ఎంటర్టైనర్కు రెడీ అవుతున్నాడు. ఈ సినిమాను తెలుగు, తమిళ భాషల్లో భారీ బడ్జెట్తో తెరకెక్కించడానికి ప్లాన్ చేస్తున్నారు. మురుగదాస్ రెగ్యులర్ స్టైల్లో సందేశాత్మకంగా తెరకెక్కనున్న ఈ సినిమా టైటిల్ విషయంలో కూడా రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. న్యాయవ్యవస్థ మీద పోరాటం చేసే కథతో తెరకెక్కుతున్న ఈ సినిమాకు 'చట్టానికి కళ్లు లేవు' అనే టైటిల్ పెట్టాలని భావిస్తున్నారన్న టాక్ వినిపించింది. అయితే తాజాగా ఈ సినిమాకు 'ఎనిమీ' అనే టైటిల్ను పరిశీలిస్తున్నారన్న వార్త టాలీవుడ్లో చక్కర్లు కొడుతోంది. ఇదే కనుక ఫైనల్ అయితే పోకిరీ తరువాత నెగెటివ్ టైటిల్తో వస్తున్న మహేష్ సినిమా ఇదే అవుతోంది. అదే సెంటిమెంట్ కూడా వర్క్ అవుట్ అవుతుందని నమ్ముతున్నారు ఫ్యాన్స్. -
వణికించే చలిలో సూపర్స్టార్ షూటింగ్
ప్రస్తుతం శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో 'బ్రహ్మోత్సవం' సినిమా షూటింగ్లో పాల్గొంటున్న మహేష్ బాబు, ఆ సినిమా షూటింగ్ను జెట్ స్పీడులో పూర్తిచేయాలని భావిస్తున్నాడు. ఇటీవల మహేష్ బాబు, శ్రీకాంత్ అడ్డాల మధ్య విభేదాలు వచ్చాయంటూ వస్తున్న వార్తలను ఖండించిన చిత్రయూనిట్, తాజాగా ఊటీలో భారీ షెడ్యూల్ను ప్రారంభించింది. పివిపి సంస్థ భారీగా నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్ను మార్చి నాటికల్లా ఎట్టి పరిస్థితుల్లో పూర్తి చేయాలని భావిస్తున్నాడు మహేష్. ప్రస్తుతం ఊటీలో చలి తీవ్రత ఎక్కువగా ఉంది. దీంతో షూటింగ్ వాయిదా వేద్దామని యూనిట్ సభ్యులు వారించినా, మహేష్ మాత్రం అంగీకరించటం లేదట. మురుగుదాస్ దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రం ఏప్రిల్ 14 నుంచి ప్రారంభం కానుంది. ఈలోగా ఎట్టి పరిస్థితుల్లో ఈ సినిమాను పూర్తి చేయాలి. అందుకే వణికించే చలిలోనూ షూటింగ్ చేస్తున్నాడు మహేష్. నిర్మాతలకు కూడా అనుకున్న సమయానికి సినిమా పూర్తి చేయలని గట్టిగా చెప్పాడట. మురుగదాస్ ప్రస్తుతం సోనాక్షి సిన్హా లీడ్ రోల్లో నటిస్తున్న బాలీవుడ్ మూవీ అకీరా పనుల్లో బిజీగా ఉన్నాడు. 2016 ఫిబ్రవరి నాటికల్లా ఈ సినిమాను పూర్తిచేసి మహేష్తో చేయబోయే సినిమా ప్రీ ప్రొడక్షన్ను ప్రారంభించనున్నాడు. తెలుగు తమిళ భాషల్లో ఒకేసారి తెరకెక్కుతున్న ఈ భారీ బడ్జెట్ యాక్షన్ ఎంటర్ టైనర్లో శృతిహాసన్ హీరోయిన్గా నటించనుంది. సంతోష్ శివన్, రసూల్ పోకుట్టి లాంటి అవార్డ్ విన్నింగ్ టెక్నీషియన్స్ ఈ సినిమా కోసం పనిచేస్తున్నారు. -
హాలీవుడ్ రేంజ్లో మహేష్ మూవీ
ప్రస్తుతం లోఫర్ సినిమాతో బిజీగా ఉన్న పూరి జగన్నాథ్, ఆ తరువాత కూడా తను చేయబోయే సినిమాలను లైన్లో పెట్టాడు. లోఫర్ తరువాత రోగ్ పేరుతో బైలింగ్యువల్ సినిమా చేస్తున్న పూరి, మహేష్ బాబుతో భారీ సినిమాలకు ప్లాన్ చేస్తున్నాడు. ఆ సినిమాలో మహేష్తో పాటు పలువురు హాలీవుడ్ స్టార్లు కూడా నటించేలా ప్లాన్ చేస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే ఓ బాలీవుడ్ నిర్మాణ సంస్థ భారీ బడ్జెట్తో ప్రతిష్టాత్మకంగా ఈసినిమాను నిర్మించడానికి రెడీ అవుతోంది. మహేష్ బాబు, ప్రస్తుతం శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో బ్రహ్మోత్సవం సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా తరువాత మురుగదాస్ దర్శకత్వంలో తమిళ, తెలుగు భాషల్లో తెరకెక్కనున్న సినిమాకు రెడీ అవుతున్నాడు. ఈ రెండు సినిమాలు పూర్తి కావటానికి దాదాపు ఏడాది సమయం పడుతుంది. ఈ లోగా పూరి కూడా తన చేతిలో ఉన్న ప్రాజెక్ట్స్ను పూర్తి చేసి మహేష్ సినిమాకు పక్కా స్క్రీప్ట్తో రెడీ అవ్వాలని భావిస్తున్నాడు. 2017లో పూరి మహేష్ల హ్యాట్రిక్ సినిమా పట్టాలెక్కే ఛాన్స్ కనిపిస్తోంది. -
మహేష్, మురుగదాస్.. అంతా ఓకే
ఇన్నాళ్లు టాలీవుడ్ సర్కిల్స్లో వినిపించిన, మహేష్ బాబు తదుపరి సినిమా ఓకే అయ్యింది. సౌత్ ఇండియన్ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ దర్శకత్వంలో భారీ బడ్జెట్తో తెరకెక్కనున్న ఈ సినిమా వచ్చే ఏడాదిలో ప్రారంభించనున్నారు. ప్రస్తుతం బ్రహ్మోత్సవం సినిమా షూటింగ్తో బిజీగా ఉన్న మహేష్, దాని తరువాత మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాను మొదలుపెట్టనున్నాడు. మహేష్, మురుగదాస్ల కాంభినేషన్లో తెరకెక్కనున్న సినిమాను వచ్చే ఏడాది ప్రారంభిస్తున్నట్టు, ఆ సినిమా సినిమాటోగ్రఫర్ సంతోష్ శివన్ ప్రకటించాడు. ఇన్నాళ్లు అఫీషియల్ ఎనౌన్స్మెంట్ కోసం ఎదురుచూస్తున్న మహేష్ అభిమానుల కోసం తన ట్విట్టర్ పేజ్పై 'వచ్చే ఏడాది ప్రారంభం కానున్న మహేష్ బాబు, మురుగదాస్ల సినిమా కోసం ఎదురుచూస్తున్నా' అంటూ ట్వీట్ చేశాడు. మురుగదాస్ కూడా ప్రస్తుతం సోనాక్షి సిన్హా ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న అకీరా షూటింగ్లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా పూర్తయిన తరువాత మహేష్తో తెరకెక్కబోయే సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులను ప్రారంభించనున్నాడు. ఈ సినిమాను 120 కోట్ల భారీ బడ్జెట్తో తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నారు చిత్రయూనిట్. Looking forward to doing the film with Murugodoss , Mahesh Babu, next year — SantoshSivanASC. ISC (@santoshsivan) November 26, 2015 -
మురుగదాస్ దర్శకత్వంలో ప్రిన్స్: సంతోష్
చెన్నై : ప్రముఖ దర్శకుడు ఎ.ఆర్.మురుగదాస్ దర్శకత్వంలో ప్రిన్స్ మహేశ్ బాబు ఓ చిత్రం చేయనున్నారు. ఆ చిత్రం 2016లో షూటింగ్ జరుపుకోనుంది. ఈ మేరకు ప్రముఖ ఛాయగ్రాహకుడు సంతోష్ శివన్ గురువారం ట్విట్టర్లో వెల్లడించారు. ఇప్పటికే ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు హరీశ్ జైరాజ్ సంగీతాన్ని అందించనున్నారు. అయితే ఇదే చిత్రాన్ని తమిళంలో విజయతో చిత్రీకరించనున్నారని సమాచారం. మురుగుదాస్ దర్శకత్వంలో తమిళ హీరో విజయ్ గతంలో రెండు చిత్రాలలో నటించిన సంగతి తెలిసిందే. కాగా ప్రస్తుతం మురుగదాస్... సోనాక్షి సిన్హా నటిస్తున్న అకీరాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. దాదాపు దశాబ్దం తర్వాత మురుగుదాస్ తెలుగు చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. -
అక్షయ్ కుమార్ చేతిలో 'కత్తి'
టాలీవుడ్ ఇండస్ట్రీ పెద్దలు కత్తి సినిమాను రీమేక్ చేయాలా..? వద్దా..? అన్న ఆలోచనలో ఉండగానే, బాలీవుడ్ స్టార్స్ ఈ సినిమాను మొదలెట్టేసేలా ఉన్నారు. బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ కత్తి సినిమాను హిందీలో రీమేక్ చేయడానికి ప్రయత్నాలు ప్రారంభించాడు. గతంలో విజయ్ హీరోగా తెరకెక్కిన తుపాకి సినిమాను హాలీడే పేరుతో రీమేక్ చేసి భారీ విజయాన్ని నమోదు చేశాడు. మరోసారి అదే మ్యాజిక్ను రిపీట్ చేయడానికి రెడీ అవుతున్నాడు అక్షయ్. తమిళ్లో మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా హిందీ వర్షన్కు ఆయన శిష్యుడు జగన్ దర్శకత్వం వహించనున్నాడు. లైకా మూవీస్ బ్యానర్పై మురుగుదాస్ స్వయంగా ఈ సినిమాను నిర్మించనున్నాడు. ప్రస్తుతం సోనాక్షి సిన్హా లీడ్ రోల్లో అఖీరా సినిమాను తెరకెక్కిస్తున్న మురుగుదాస్, ఈ సినిమా తరువాత అక్షయ్ హీరోగా కత్తి రీమేక్ పనులు మొదలెట్టనున్నాడు. -
మళ్లీ... ‘మెమెంటో ’
‘గజిని’ సినిమాలో సూర్య పాత్ర సంజయ్ రామస్వామి విలన్ల దాడిలో గతాన్ని మర్చిపోతే వారి మీద పగతీర్చుకోవడానికి ఒంటి నిండా పేర్లు మొత్తం రాసుకుంటాడు. మురుగదాస్ దర్శక త్వంలో తమిళ, తెలుగు, హిందీ భాషల్లో తెరకెక్కిన ఈ చిత్రం హాలీవుడ్ మూవీ ‘మెమంటో’ ఆధారంగా అల్లుకున్నారు. హాలీవుడ్ ప్రఖ్యాత దర్శకుడు క్రిస్టఫర్ నోలన్ దర్శకత్వంలో దాదాపు 15 ఏళ్ల క్రింత తెరకెక్కిన ‘మెమంటో’ చిత్రం హాలీవుడ్ ఆల్టైమ్ హిట్స్లో స్థానం సంపాదించుకుంది కూడా. ఇప్పుడు ఈ సినిమాకు మరో హాలీవుడ్ రీమేక్ వచ్చే సూచనలున్నాయి. హాలీవుడ్ నిర్మాణ సంస్థ ఆంబి పిక్చర్స్ ఈ చిత్రం రీమేక్ హక్కులను దక్కించుకుంది. -
మహేష్ కు అమీర్ మాటసాయం
గతంలో బాలీవుడ్ కు, రీజనల్ సినిమాకు చాలా దూరం ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. తెలుగు సినిమా స్థాయి పెరగటంతో బాలీవుడ్ తో సంబంధాలు బలపడుతున్నాయి. ముఖ్యంగా టాలీవుడ్ స్టార్ హీరోలు, బాలీవుడ్ టాప్ హీరోలు మంచి స్నేహబంధాన్ని కొనసాగిస్తున్నారు. ఇప్పటికే సల్మాన్ మెగా, అక్కినేని కుటుంబాలతో తనకున్న స్నేహాన్ని సినిమాల ద్వారా చూపించాడు. తాజాగా ఈ లిస్ట్ లోకి మరో బాలీవుడ్ హీరో చేరబోతున్నాడు. మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్.. తాజాగా మహేష్ బాబు సినిమాకు మాసాయం చేయనున్నాడట. మహేష్ సినిమాకు అమీర్ చేసే మాట సాయం ఏంటి అనుకుంటున్నారా..? ప్రస్తుతం బ్రహ్మోత్సవం సినిమా షూటింగ్ లో పాల్గొంటున్న మహేష్, ఆ సినిమా తరువాత మురుగదాస్ దర్శకత్వంలో ఓ భారీ ప్రాజెక్ట్ చేయబోతున్నాడు. వంద కోట్లకు పైగా బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లోనూ ఒకేసారి తెరకెక్కించడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాకు తెలుగు, తమిళ భాషల్లో స్వయంగా డబ్బింగ్ చెప్పుకుంటున్న మహేష్.. హిందీలో మాత్రం వేరే ఎవరితో అయినా డబ్బింగ్ చెప్పిస్తే బాగుంటుందని ఫీలయ్యాడట. ఇటీవల సల్మాన్ హీరోగా తెరకెక్కిన సినిమాకు రామ్ చరణ్ డబ్బింగ్ చెప్పటంతో అదే ఫార్ములాను మహేష్ మూవీ కోసం ఫాలో అవుతున్నారు. మహేష్, మురుగదాస్ ల కాంభినేషన్ లో తెరకెక్కనున్న సినిమాకు అమీర్ ఖాన్ తో డబ్బింగ్ చెప్పించే ఆలోచనలో ఉన్నారట. గతంలో మురుగదాస్ డైరెక్షన్ లో గజిని లాంటి సూపర్ హిట్ సినిమాలో నటించిన అమీర్, మహేష్ పాత్రకు డబ్బింగ్ చెప్పేందుకు తప్పకుండా అంగీకరిస్తారన్న నమ్మకంతో ఉన్నారు చిత్రయూనిట్.