Nagaland
-
అంతర్జాతీయ ఆవాసం!
అవును. ఈ బుల్లి ఇల్లు నిజంగానే రెండు దేశాల పరిధిలో విస్తరించింది! ఈ గమ్మత్తైన ఇల్లు ఈశాన్య రాష్ట్రమైన నాగాలాండ్లోని లోంగ్వా గ్రామంలో ఉంది. ఇది కాస్త భారత్లో, మిగతా భాగం మయన్మార్ పరిధిలో ఉంటుంది! భారత్, మయన్మార్ సరిహద్దు సరిగ్గా ఈ గ్రామం నడుమగా పోవడమే దీనికి కారణం. ప్రధాన ద్వారానికి ఆ పక్క సగంపై నాగాలాండ్ (భారత్), ఈ పక్క సగంపై సగాయింగ్ (మయన్మార్) అని రాసి ఉంటుంది కూడా. ఇంటి బయట ఠీవిగా నుంచున్నది దాని యజమాని టోనెయ్ ప్వాంగ్. అన్నట్టూ, ఆయన స్థానిక కోన్యాక్ నాగా గిరిజన తెగ నాయకుడు కూడా. ఆరకంగా చూస్తే ఆయన నివాసం లోంగ్వా గ్రామం మొత్తానికీ రాజప్రాసాదం వంటిదన్నమాట. ఈ ఇంటికి 100 ఏళ్ల పై చిలుకు చరిత్ర ఉంది. అంతర్జాతీయ సరిహద్దు మాత్రం 1971లో పుట్టుకొచ్చింది. ప్వాంగ్ ఇంటిని రెండు దేశాలకూ చెందేలా విడదీసింది. ‘‘అంతర్జాతీయ సరిహద్దు 50 ఏళ్ల కింద పుట్టుకొచ్చింది. మా ఇల్లు అంతకు 50 ఏళ్ల ముందునుంచే ఉంది. సరిహద్దు భూభాగాన్ని విభజిస్తుందేమో గానీ ఇది మా పూరీ్వకుల ఆవాసం. ఇందులో ఉండేందుకు మాకు ఎలాంటి ఇబ్బందీ ఎదురవడం లేదు’’ అంటారు ప్వాంగ్. ఈ ఊళ్లోని వాళ్లంతా భారతీయులే. అందరికీ ఓటు హక్కు కూడా ఉంది. అయినా వారికి మయన్మార్ నుంచి పలు సంక్షేమ పథకాలు అందుతుండటం విశేషం! ఈ ఊళ్లో రెండు దేశాల సైన్యాలూ గస్తీ కాస్తుంటాయి. అంతేకాదు. ఈ ప్రాంతంలో భారత్, మయన్మార్ ప్రజలు వీసా తదితరాలేవీ అవసరం లేదు. -
గూగుల్ మ్యాప్తో పోలీసులు కాస్త దొంగలయ్యారు!
గూగుల్ మ్యాప్ మరోసారి హ్యాండిచ్చిన ఘటన ఇది. ఓ నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు గూగుల్ మ్యాప్ను నమ్ముకున్నారు. అయితే అది కాస్త దారుణ పరాభవానికి దారి తీసింది. పోలీసులను దొంగలుగా భావించి చితకబాదిన జనం.. రాత్రంతా కట్టేసి బందీలుగా ఉంచుకున్నారు. చివరకు అసలు విషయం తెలిసి సారీ చెప్పి వదిలేశారు. అసోంలోని జోరాత్ జిల్లాకు చెందిన 16 మందితో కూడిన పోలీసు బృందం నిందితుడిని పట్టుకునేందుకు బయలుదేరింది. ఈ క్రమంలో ఈ బృందం గూగుల్ మ్యాప్స్ను నమ్ముకుంది. మ్యాప్ అసోంలోని ఓ తేయాకు తోటను చూపించింది. నిజానికి అది నాగాలాండ్లోని నాగాలాండ్లోని మోకోక్చుంగ్ జిల్లా ప్రాంతం. అక్కడికి చేరుకున్న పోలీసులు నిందితుడి కోసం లోపలికి వెళ్లారు. అయితే.. వారి వద్దనున్న అధునాతన ఆయుధాలు చూసిన స్థానికులు వారిని దుండగులుగా పొరబడి చుట్టుముట్టి దాడి చేశారు. ఆపై వారిని బంధించారు. ఈ ఘటనలో ఒక పోలీసు గాయపడ్డారు. అయితే.. ఈ విషయం తెలుసుకున్న జోరాత్ పోలీసులు వెంటనే మోకోక్చంగ్ ఎస్పీతో మాట్లాడారు. దీంతో ఆయన స్థానికుల చేతుల్లో బందీలుగా ఉన్న పోలీసులను విడిపించేందుకు మరో బృందాన్ని పంపించారు. స్థానికులకు అసలు విషయం తెలియడంతో గాయపడిన పోలీసు సహా ఐదుగురిని విడిచిపెట్టారు. మిగిలిన 11 మందిని రాతంత్రా బందీలుగా ఉంచుకుని నిన్న ఉదయం విడిచిపెట్టడంతో కథ సుఖాంతమైంది. -
నాగాలాండ్లో 99.8 శాతం మాంసాహార ప్రియులు
-
గిరిజనుల ఐక్యతకు భారతీయ హార్న్బిల్
భారతదేశంలోని ఈశాన్యప్రాంతంలో ప్రతి డిసెంబర్లో నాగాలాండ్లోని రోలింగ్ కొండల మధ్య సుందరమైన కోహిమా ప్రాంతం నాగా తెగల సాంస్కృతిక వేడుకలకు కేంద్ర బిందువు అవుతుంది. అక్కడి గిరిజనులు తమ అరుదైన సంస్కృతిని ప్రదర్శించడానికి హార్న్బిల్ పండుగను అత్యంత వైభవంగా జరుపుకుంటారు. వివిధ తెగల మధ్య ఐక్యతకు, శాంతికి, సంస్కృతికి ప్రతీకగా పాతికేళ్లుగా ప్రతియేటా జరిగే ఈ వేడుకలో లక్షన్నరకు పైగా సందర్శకులు పాల్గొన్నారు. దీంతో ఈ వేడుక ప్రపంచమంతటినీ ఆకర్షించింది. పర్యాటకాన్ని ప్రోత్సహించడం, నాగా తెగల శక్తివంతమైన గుర్తింపును వెలుగులోకి తీసుకురావం ఈ వేడుక ముఖ్య ఉద్దేశ్యం. పండుగ సందర్భంగా ఇక్కడ ప్రతి తెగ దాని స్వంత సజీవ నృత్యాలు, పాటలు, ఆచారాలను ప్రదర్శించడమే కాదు నాగా వంటకాలు విభిన్న రుచులను అందిస్తాయి. స్థానిక కళాకారులు, హస్తకళాకారులు ప్రదర్శనలో భాగం అవుతారు. తద్వారా వారు ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి అవకాశం కల్పిస్తుంది. చేతితో నేసిన వస్త్రాలు, సాంప్రదాయ ఆభరణాలు, వివిధ హస్తకళలతో నిండిన స్టాల్స్ పండుగకు వెళ్లేవారికి సాంస్కృతిక ్ర΄ాముఖ్యతతో కూడిన సావనీర్లను ఇంటికి తీసుకెళ్లడానికి సరైన అవకాశాన్ని అందిస్తాయి. నిర్దిష్ట తెగలు, వారి విలక్షణమైన సంప్రదాయాలకు నివాళులు అర్పిస్తూ ప్రత్యేక నేపథ్య సాయంత్రాలను ప్లాన్ చేయవచ్చు. ఉదాహరణకు కొన్యాక్ తెగ వారు వారి సంప్రదాయ పచ్చబొట్లు, పాటలు, కథలు వారి జీవన విధానంపై అవగాహన కలిగిస్తాయి. మరొక తెగ వారి ప్రాచీన నృత్యాల ద్వారా చారిత్రక కథలను వివరిస్తాయి.ఇదీ చదవండి: టీ లవర్స్ : టీ మంచిదా? కాదా? ఈ వార్త మీకోసమే!వివిధ తెగల మధ్య శాంతిఈ ఫెస్టివల్ తెగల మధ్య ఐక్యతను పెం΄÷ందిస్తుంది. గిరిజన సంఘర్షణల చుట్టూ తరచుగా గందరగోళ చరిత్ర ఉన్నందున, ఈ పండుగ వివిధ వర్గాల మధ్య అంతరాలను తగ్గిస్తుంది. భవిష్యత్ తరాలకు దేశీయ సంస్కృతుల పరిరక్షణకు భరోసానిస్తూ, నాగా యువకులు తమ మూలాలతో మళ్లీ కనెక్ట్ అవ్వడానికి ఇది ఒక వేదికగా మారుతుంది. వివిధ ΄ోటీలను నిర్వహించి గిరిజన యువతలో గర్వం, ప్రేరణను సృష్టిస్తుంది. రాత్రి సమయాల్లో జరిగే కచేరీలకు వివిధ ప్రాంతాల నుండి బ్యాండ్ లను ప్రదర్శిస్తారు. ప్రతి రోజు ఉత్సాహభరితమైన శ్రావ్యమైన పాటలతో ముగుస్తుంది. స్థానికులు, పర్యాటకులు, ప్రదర్శకులు కలిసి ఆనందాన్ని పొందడానికి వీలు కల్పిస్తుంది. పాతికేళ్లుగా హార్న్బిల్ ఫెస్టివల్ నాగా సంస్కృతిని పరిరక్షించడమే కాకుండా దాని అభివృద్ధిని కూడా వాగ్దానం చేస్తుంది. భవిష్యత్ తరాలకు ఈ విలువైన సంప్రదాయాలను వారసత్వంగా, భాగస్వామ్యం చేయడానికి మార్గం సుగమం చేస్తుంది. ఇలాంటి సంప్రదాయ వేడుకలు మన భారతీయ సంస్కృతిని ఇంకా సుసంపన్నం చేస్తూనే ఉన్నాయి అనడానికి హార్నబిల్ ఓ ఉదాహరణగా నిలుస్తుంది. View this post on Instagram A post shared by Hornbill Festival Nagaland (@hornbillfestivalofficial) -
నాగాలాండ్పై హైదరాబాద్ ఘనవిజయం
అహ్మదాబాద్: దేశవాళీ వన్డే క్రికెట్ టోర్నమెంట్ విజయ్ హజారే ట్రోఫీలో హైదరాబాద్ జట్టు శుభారంభం చేసింది. గ్రూప్ ‘సి’లో భాగంగా శనివారం జరిగిన తమ తొలి పోరులో హైదరాబాద్ 42 పరుగుల తేడాతో నాగాలాండ్పై విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ 48.1 ఓవర్లలో 276 పరుగులకు ఆలౌటైంది. వికెట్ కీపర్ బ్యాటర్ అరవెల్లి అవనీశ్ (82 బంతుల్లో 100; 14 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీతో ఆకట్టుకోగా... ఓపెనర్ తన్మయ్ అగర్వాల్ (51; 4 ఫోర్లు, 3 సిక్స్లు), వరుణ్ గౌడ్ (57) హాఫ్ సెంచరీలతో రాణించారు. కెప్టెన్ తిలక్ వర్మ (0) విఫలమయ్యాడు. నాగాలాండ్ బౌలర్లలో ఇమ్లీవతి లెమ్టర్ 4, జొనాథన్ మూడు వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో నాగాలాండ్ 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 234 పరుగులు చేసింది. యుగంధర్ సింగ్ (80; 7 ఫోర్లు, 2 సిక్స్లు), జగదీశ సుచిత్ (66; 8 ఫోర్లు, 2 సిక్స్లు) అర్ధశతకాలతో పోరాడినా లాభం లేకపోయింది. హైదరాబాద్ బౌలర్లలో నిశాంత్, ముదస్సిర్ రెండేసి వికెట్లు తీశారు. అవనీశ్కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. తదుపరి మ్యాచ్లో సోమవారం ముంబైతో హైదరాబాద్ తలపడనుంది. -
Vijay Hazare Trophy: వన్డేల్లో కుర్రాళ్ల సత్తాకు పరీక్ష
న్యూఢిల్లీ: దేశవాళీ క్రికెట్లో టి20 సమరం ముగిసిన తర్వాత ఇప్పుడు వన్డే పోరుకు రంగం సిద్ధమైంది. విజయ్హజారే వన్డే టోర్నీలో భాగంగా నేటినుంచి దేశవ్యాప్తంగా వేర్వేరు నగరాలు వేదికలుగా మ్యాచ్లు జరగనున్నాయి. భారత వన్డే జట్టులో రెగ్యులర్ సభ్యులైన ఎక్కువ మంది ఆటగాళ్లు ప్రస్తుతం ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్లో ఉండగా...మున్ముందు వన్డే టీమ్లో స్థానం ఆశిస్తున్న ఆటగాళ్లు తమ సత్తా చాటేందుకు ఇది సరైన అవకాశం కానుంది. ఈ ఆటగాళ్ల కారణంగా టోర్నీపై ఆసక్తి పెరగడంతో పాటు తీవ్రమైన పోటీ కారణంగా మ్యాచ్లు హోరాహోరీగా సాగే అవకాశం కూడా ఉంది. బరోడా తరఫున ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా బరిలోకి దిగుతున్నాడు. టి20లో ఇప్పటికే తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న పలువురు పేస్ బౌలర్లు వన్డే టీమ్లో తమ అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. అర్‡్షదీప్ సింగ్ (పంజాబ్), అవేశ్ ఖాన్ (మధ్యప్రదేశ్), ఖలీల్ అహ్మద్ (రాజస్తాన్), ముకేశ్ కుమార్ (బెంగాల్), యశ్ దయాళ్ (యూపీ) తమ బౌలింగ్కు పదును పెడుతున్నారు. స్పిన్నర్లలో వరుణ్ చక్రవర్తి (తమిళనాడు), కుల్దీప్ యాదవ్ (యూపీ), రవి బిష్ణోయ్ (రాజస్తాన్) తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. బ్యాటర్లలో అందరి దృష్టీ శ్రేయస్ అయ్యర్పై ఉంది. వన్డే టీమ్లో తన స్థానాన్ని ఖాయం చేసుకున్న అతను తన స్థాయికి తగ్గ ప్రదర్శనతో చెలరేగేందుకు సిద్ధమయ్యాడు. హైదరాబాద్ బ్యాటర్ తిలక్ వర్మ కూడా టి20 మెరుపులను దాటి వన్డే టీమ్లో రెగ్యులర్గా మారే క్రమంలో ఈ టోర్నీ తగిన వేదిక కానుంది. భారత ఆటగాడు రింకూ సింగ్ ఉత్తరప్రదేశ్ కెపె్టన్గా బాధ్యతలు తీసుకుంటున్నాడు. సీనియర్ స్థాయిలో అతను తొలిసారి సారథిగా వ్యవహరించనుండటం విశేషం. భారత ఆటగాడు, ఐపీఎల్లో రాజస్తాన్ రాయల్స్ కెపె్టన్ అయిన సంజు సామ్సన్కు కేరళ జట్టులో చోటు లభించలేదు. తాము నిర్వహించిన శిక్షణా శిబిరంలో పాల్గొన్న ఆటగాళ్లనుంచే జట్టును ఎంపిక చేయాలని కేరళ క్రికెట్ సంఘం నిర్ణయం తీసుకోవడంతో సామ్సన్ పేరును పరిశీలించనే లేదు. కర్నాటక టీమ్ కూడా సీనియర్ బ్యాటర్ మనీశ్ పాండేకు ఉద్వాసన పలికింది. ఇక కొత్త ఆటగాళ్లకు అవకాశం ఇవ్వాల్సిన సమయం వచ్చిందని కర్నాటక అసోసియేషన్ స్పష్టం చేసింది. ముస్తాక్ అలీ ట్రోఫీలో 5 మ్యాచ్లలో కలిపి 117 పరుగులే చేసిన పాండే ప్రభావం చూపలేకపోయాడు. మరో వైపు ముస్తాక్ అలీ టి20 టోర్నీలో రాణించిన బెంగాల్ పేసర్, భారత సీనియర్ బౌలర్ మొహమ్మద్ షమీను వన్డే టీమ్లోకి కూడా తీసుకున్నారు.అయితే నేడు ఉప్పల్ స్టేడియం వేదికగా ఢిల్లీతో జరిగే మ్యాచ్లో మాత్రం షమీ ఆడకుండా విశ్రాంతి తీసుకుంటాడని బెంగాల్ క్రికెట్ వర్గాలు వెల్లడించాయి. హైదరాబాద్లోని జింఖానా మైదానంలో జరిగే మరో మ్యాచ్లో త్రిపురతో బరోడా తలపడుతుంది. అహ్మదాబాద్లో జరిగే గ్రూప్ ‘సి’ మ్యాచ్లో నాగాలాండ్తో తిలక్ వర్మ సార«థ్యంలోని హైదరాబాద్ తలపడుతుంది. గ్రూప్ ‘బి’లో భాగంగా ముంబైలో జరిగే మ్యాచ్లో రైల్వేస్ను శ్రీకర్ భరత్ సార«థ్యంలోని ఆంధ్ర జట్టు ఎదుర్కొంటుంది. -
రాహుల్ అనుచితంగా ప్రవర్తించారు: మహిళా ఎంపీ ఫిర్యాదు
న్యూఢిల్లీ: ప్రతిపక్షనేత రాహుల్గాంధీపై నాగాలాండ్కు చెందిన బీజేపీ ఎంపీ ఫగ్నాన్ కొన్యాక్ రాజ్యసభ చైర్మన్ ధన్ఖడ్కు ఫిర్యాదు చేశారు. పార్లమెంట్ బయట గురువారం(డిసెంబర్19) జరిగిన నిరసనల్లో తనకు రాహుల్ అత్యంత దగ్గరగా వచ్చి అసౌకర్యానికి కారణమయ్యారని ఆరోపించారు. గట్టిగా అరుస్తూ తనకు అత్యంత సమీపంలోకి వచ్చి తనతో అనుచితంగా ప్రవర్తించారని, ఇది తనను అసౌకర్యానికి గురి చేసిందని ఫిర్యాదు అనంతరం ఎంపీ కొన్యాక్ చెప్పారు. కాగా,పార్లమెంట్లో గురువారం గందరగోళం నెలకొంది. అంబేద్కర్ను అవమానించి కాంగ్రేస్సేనని బీజేపీ.. కాదు..కాదు బీజేపీ నేతలే రాజ్యాంగ నిర్మాతను అవమానించారంటూ అధికార, విపక్ష ఎంపీలు పార్లమెంట్ ముందు పోటా పోటీగా నిరసనలు చేపట్టారు. ఎంపీలు చేట్టిన నిరసనలో ఉద్రికత్త చోటు చేసుకుంది. కాంగ్రెస్, బీజేపీ ఎంపీల మధ్య తోపులాట జరిగింది. ఈ తోపులాటలో ఒడిశా బీజేపీ ఎంపీ ప్రతాప్ చంద్ర సారంగికి గాయాలయ్యాయి. దీంతో అప్రమత్తమైన పార్లమెంట్ సిబ్బంది ఎంపీ సారంగిని అత్యవసర చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. ఇదీ చదవండి: పార్లమెంట్లో గందరగోళం.. రేపటికి వాయిదా -
పండుగలకే పండుగ!
నాగాలాండ్లో జరిగే ‘హార్న్బిల్ ఫెస్టివల్’ను అక్కడి ప్రజలు ‘పండుగలకే పండుగ’గా అభివర్ణిస్తారు. పది రోజుల పాటు అత్యంత అట్టహాసంగా జరిగే పండుగ ఇది. ప్రతి ఏటా డిసెంబర్ 1 నుంచి 10వ తేదీ వరకు జరిగే ఈ పండుగ నాగాలాండ్ కళా సాంస్కృతిక వైవిధ్యానికి అద్దం పడుతుంది. పదిహేడు తెగలకు చెందిన ప్రజలు ఈ వేడుకలో పాల్గొంటారు. నాగాలాండ్ రాజధాని కోహిమాకు చేరువలోని కిసామా హెరిటేజ్ విలేజ్లో పది రోజుల పాటు రకరకాల ప్రదర్శనలు, పోటీలు జరుగుతాయి. ఈ వేడుకలలో పాల్గొనే పదిహేడు తెగల ప్రజలు ఇక్కడ తమ తమ సంప్రదాయ రీతుల్లో గుడారాలను వేసుకుని ఉంటారు. ఉదయం వేళల్లో ఆరుబయట మైదానంలోను, వీథుల్లోను వివిధ రీతులకు చెందిన సంప్రదాయ సంగీత నృత్య ప్రదర్శనలు, ఊరేగింపులు వంటి కార్యక్రమాలు జరుగుతాయి. మధ్యాహ్నం వేళ ఆరుబయట విందు భోజనాలు జరుగుతాయి. ఈ వేడుక జరిగినన్ని రోజులూ ఆహార మేళాలు ఉంటాయి. రాష్ట్రంలోని వివిధ తెగలకు చెందిన ప్రజల మధ్య సాంస్కృతిక స్నేహబాంధవ్యాలను పెంపొందించే ఉద్దేశంతో నాగాలాండ్ ప్రభుత్వం 2000 సంవత్సరం నుంచి రాష్ట్ర పర్యాటక శాఖ, కళా సాంస్కృతిక శాఖల ఆధ్వర్యంలో ఈ వేడుకలను నిర్వహించడం ప్రారంభించింది. ఈ వేడుకల్లో భాగంగా హస్తకళల ప్రదర్శనలు, స్థానిక పోరాట విద్యల ప్రదర్శనలు, రకరకాల ఆటల పోటీలు కూడా జరుగుతాయి. వేడుకలు జరిగే మైదానంలో ఆహారశాలలు, వనమూలికల విక్రయశాలలు, హస్తకళల ప్రదర్శనశాలలు వంటివి ఏర్పాటవుతాయి.ఈ వేడుకల్లో ప్రతిరోజూ సాయంత్రం నుంచి రాత్రి వరకు ఆరుబయట ఏర్పాటు చేసిన వేదికలపైన సంప్రదాయ, ఆధునిక సంగీత, నృత్య ప్రదర్శనలు, నాటక ప్రదర్శనలు వంటి సాంస్కృతిక కార్యక్రమాలు, ‘మిస్ నాగాలాండ్’ అందాల పోటీలు జరుగుతాయి. ఈ వేడుకల్లో భాగంగా ‘హార్న్బిల్ ఇంటర్నేషనల్ రాక్ ఫెస్టివల్’ కూడా జరుగుతుంది. ఇందిరాగాంధీ స్టేడియంలో జరిగే ఈ వేడుకల్లో స్థానిక, అంతర్జాతీయ రాక్ బ్యాండ్ బృందాలు వేడుక జరిగే పదిరోజులూ కచేరీలు చేస్తారు. నాగాలాండ్ ప్రభుత్వం ‘హార్న్బిల్ ఫెస్టివల్’ నిర్వహణను ప్రారంభించిన తర్వాత రాష్ట్ర పర్యాటక ఆదాయం గణనీయంగా పెరిగింది. -
అందాల అడవి రైతు.. హార్న్బిల్
పెద్దదోర్నాల: నల్లమల అభయారణ్యం విభిన్న వన్యప్రాణులకు నెలవు. ఇక్కడి అరుదైన పక్షులు, జంతు జాతులు పర్యావరణ ప్రేమికుల్ని అబ్బురపరుస్తాయి. పక్షిజాతుల్లో అత్యంత అరుదైన జీవనశైలి హార్న్బిల్ (ఫారెస్ట్ ఫార్మర్) పక్షుల సొంతం. వీటి స్వభావం అచ్చంగా మనుషుల్ని పోలి ఉంటుంది. మగ పక్షులు కుటుంబ బాధ్యతను మోస్తూ.. ఆడ పక్షులకు అవసరమైన తిండిని సంపాదిస్తూ.. వాటిని గూడు దాటకుండా బాధ్యతగా చూసుకుంటాయి. వీటిని అడవి రైతులుగా పిలుస్తుంటారు. పొడవైన ముక్కు, తోకలతో ఎంతో అందంగా, ఆకర్షణీయంగా కనపడతాయి. స్వచ్ఛమైన ప్రేమకు ప్రతిరూపం హార్న్బిల్ పక్షులు ఎత్తైన చెట్లలో సహజ సిద్ధంగా ఏర్పడ్డ గూళ్లలో నివసిస్తాయి. మగ పక్షులు పితృస్వామ్యాన్ని బాధ్యతగా నిర్వర్తిస్తూ కుటుంబ పోషణను చూసుకుంటాయి. తల్లి పక్షి గూడులో గుడ్లు పెట్టి పిల్లలను పొదుగుతుంది. పిల్లలతో కలిసి మూడు నెలలపాటు ఎటూ కదలకుండా గూట్లోనే ఉండిపోతుంది. మగ హార్న్బిల్ ఆ మూడు నెలలు ఆహారాన్ని సేకరించి.. గూట్లో ఉన్న తల్లి, పిల్ల పక్షులకు నోటిద్వారా అందిస్తుంది. ఆహారం కోసం తిరిగే సమయంలో మగ హార్న్బిల్ వేటగాళ్ల బారినపడినా.. ప్రమాదవశాత్తు మరణించినా గూటిలో ఉన్న తల్లి పక్షితోపాటు పిల్ల పక్షులు కూడా ఆకలితో చనిపోతాయే తప్ప ఇంకే ఆహారాన్ని ముట్టవు. దీంతోపాటు హార్న్ బిల్ పక్షుల దాంపత్య జీవనం ఎంతో పవిత్రంగా ఉంటుంది. ఇవి జీవితాంతం ఒకే పక్షితో జత కడతాయే తప్ప మరే పక్షిని దరిచేరనివ్వవు. నాగాలాండ్లో ఏటా ఉత్సవం హార్న్బిల్ పక్షుల జీవన విధానానికి ముగ్ధులైన నాగాలాండ్ వాసులు వాటి పేరిట ఏటా 10 రోజుల పాటు ఉత్సవాన్ని జరుపుకుంటారు. నాగాలాండ్ రాష్ట్ర రాజధాని కోహిమాకు 12 కిలోమీటర్లు దూరంలో గల కిసామాలోని గిరిజనులు హార్న్బిల్ ఉత్సవాన్ని సంప్రదాయంగా నిర్వహిస్తారు. డిసెంబర్ 1నుంచి 10వ తేదీ వరకు జరిగే ఈ ఉత్సవంలో చిన్నా పెద్డా తేడా లేకుండా అనేక సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించుకుంటారు.రెండు రాష్ట్రాల పక్షి అరుణాచల్ ప్రదేశ్, కేరళ రాష్ట్రాలు రాష్ట్ర పక్షిగా హార్న్బిల్ను గుర్తించాయి. ఈ పక్షుల జీవన కాలం 40 నుంచి 50 సంత్సరాలని అటవీశాఖ అధికారులు చెబుతున్నారు. వీటి పొడవు 95 నుంచి 120 సెంటీమీటర్లు కాగా.. రెక్కలు విప్పినప్పుడు వీటి వెడల్పు 151 సెంటీమీటర్ల నుంచి 178 సెంటీమీటర్లు ఉంటుందని పేర్కొంటున్నారు. ఇవి సుమారు 4 కేజీల బరువు ఉంటాయి.ఫారెస్ట్ ఫార్మర్ హార్న్బిల్ మగ పక్షి పండ్లను సేకరించి తల్లి, పిల్లలకు ఆహారంగా అందిస్తుంది. గూడుకు చేరుకున్న పక్షి పండ్ల గింజలను తొలగించి మరీ పిల్లలు, తల్లి నోటికి అందిస్తుంది. అలా అందిస్తున్నప్పుడు.. అది వదిలేసిన గింజలు నేలపై పడి.. అడవిలో మొలకెత్తి చెట్లుగా ఎదుగుతాయి. అందుకే.. ఈ పక్షిని అడవి రైతుగా పేర్కొంటారు. -
నాగాలాండ్ పౌర హత్యలు: ఆర్మీ సిబ్బందిపై క్రిమినల్ కేసు రద్దు
ఢిల్లీ: నాగాలాండ్ మోన్ జిల్లాలో 13 మంది పౌరుల హత్య కేసులో ఆర్మీ సిబ్బందిపై క్రిమినల్ ప్రొసీడింగ్స్ను సుప్రీంకోర్టు రద్దు చేసింది. ఈ కేసుపై మంగళవారం సుప్రీం కోర్టు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా.. ‘ఈ కేసుకు సంబంధించి ఎఫ్ఐఆర్లోని చేర్చిన ప్రొసీడింగ్స్ను రద్దు చేస్తున్నాం. ఇక.. ఈ కేసును ఓ తార్కిక ముగింపునకు తీసుకురావచ్చు. అదేవిధంగా సిబ్బందిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ఆర్మీకి సూచించాం’ అని సుప్రీంకోర్టు వెల్లడించింది.డిసెంబర్ 4, 2021న నాగాలాండ్లోని ఓటింగ్ గ్రామంలో మైనర్లను తీసుకెళ్తున్న ట్రక్కుపై ఆర్మీ సిబ్బంది కాల్పులు జరిపింద. అయితే ఆ ట్రక్కులో ఉన్నవాళ్లను ఆర్మీ సిబ్బంది మిలిటెంట్లుగా భావిసించి కాల్పులు జరిపింది.ఈ ఘటనలో ఆరుగురు మృతిచెందారు. దీంతో ఆ ప్రాంతంలో హింస చెలరేగడంతో భద్రతా బలగాలు కాల్పులు జరిపిన కాల్పుల్లో మరో ఏడుగురు పౌరులు మృతి చెందారు.చదవండి: ఢిల్లీ కొత్త సీఎంగా అతిషి.. ప్రకటించిన కేజ్రీవాల్ -
ఈ గ్రామం చాలా స్పెషల్!..కిచెన్ ఒక దేశంలో ఉంటే..బెడ్రూం ఏకంగా..
నాగాలాండ్లోని లాంగ్వా చాలా ప్రత్యేకతలు కలిగిన గ్రామం. ఈ గ్రామం స్పెషలిటీ వింటే నోరెళ్లబెట్టడం ఖాయం. ఇలాంటి గ్రామం మరొకటి ఉండే అవకాశం కూడా లేదన్నంత స్పెషాలిటీగా ఉంటుంది. ఎంత స్పెషల్ అంటే..ఒకే ఇంట్లో రెండు దేశాల సరిహాద్దును చూడొచ్చు. ఆ గ్రామం ఏ రాష్ట్రంలో ఉంది? అదెలా సాధ్యం అంటే..నాగాలాండ్లోని మోన్ జిల్లాలో ఉన్న అతిపెద్ద గ్రామాల్లో ఒకటి లాంగ్వా. ఇక్కడ 'కోన్యాక్ నాగా' అనే గిరిజన తెగ ఉంటుంది. ఈ గ్రామం మధ్యలోంచి ఇండియా, మయన్మార్ బోర్డర్ ఉంటుంది. అయితే ఇక్కడ ఈ బోర్డర్ గ్రామాన్ని విడదీయకపోవడం విశేషం. ఈ గ్రామ ప్రజలు హెడ్ హంటింగ్కు ప్రసిద్ధి. ఈ కోన్యాక్ తెగ ప్రజలు తమ శత్రువులపై యుద్ధం జరిపి.. విజయం సాధించిన గుర్తుగా శత్రువు తలని తీసి తమ గ్రామానికి అలంకరణగా ఉంచుతారు. ఇక్కడ ప్రజలు తమ ఇళ్లను ఏనుగు దంతాలు, హార్న్బిల్ ముక్కులు, మానవ పుర్రెలతో అలంకరించుకుంటారు. ఈ పుర్రెలు ఇలా గ్రామంలో ప్రతి ఇంటిపై ఉండటం వల్ల సంతానోత్పత్తి పెరుగుతుందనేది వారి నమ్మకం. ఈ గ్రామం నల్లమందు ప్రసిద్ధి. ఇక్కడ ఉన్న మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ లాంగ్వ్లోని కున్యాక్ నాగా తెగ పెద్దని అంఘ్ అని పిలుస్తారు. అతడిని అక్కడ ప్రజలు మహారాజుగా భావిస్తారు. అతని ఇల్లు ఇండో-మయన్మార్ సరిహద్దు గుండా వెళ్తుంది. చెప్పాలంటే అతడి ఇల్లుని రెండు భాగాలుగా విభజిస్తుంది. దీంతో అతడి కిచెన్ మయన్మార్లో ఉంటే బెడ్రూం ఏకంగా భారత్లో ఉంది. దాదాపు అక్కడ ఉండే ప్రజల ఇళ్లన్ని ఇలానే ఉంటాయి. ఆ గ్రామ పెద్దకి ఏకంగా 60 మంది భార్యలు. అతడి కృషి వల్ల లాంగ్వా గ్రామం ఎంతో అభివృద్ధి సాధించింది. అంతేగాదు ఇక్కడ ప్రజలకు రెండు దేశాల పౌరసత్వం లభిస్తుంది. ఒకప్పుడూ ఆ గ్రామంలో రహదారి సరిగా ఉండేది కాదు. బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్(బీఆర్ఓ) సిబ్బంది కొండలా ఎత్తుగా ఉండే ఆ రహదారిని చక్కగా చదును చేసి బాగు చేయడంతో చక్కటి రవాణా కనెక్టివిటీ ఏర్పడింది. ఈ గ్రామాన్ని సందర్శించడానికి అనువైన సమయం అక్టోబర్ నుంచి మార్చి నెల సమయం. ఆ సమయంలో లాంగ్వా గ్రామం పండుగ వాతావరణంతో కళకళలాడుతూ ఆహ్లాదంగా ఉంటుంది. (చదవండి: 'లంగ్స్ ఆఫ్ చత్తీస్గఢ్'ని కాపాడిన యోధుడు!ఏకంగా గోల్డ్మ్యాన్..) -
అనిశ్చితి కొనసాగితే అంతులేని నష్టం
ఏడాది తర్వాత కూడా మణిపుర్లో శాంతిభద్రతల పరిస్థితి మెరుగు పడలేదు. మణిపుర్ రాజధాని ఇంఫాల్తో నాగాలాండ్ను కలిపే జాతీయ రహదారి మీద ఉన్న వంతెనను దుండగులు పేల్చేశారు. మరో ఘటనలో ఇద్దరు సీఆర్పీఎఫ్ జవాన్లను చంపేశారు. అరాచకం ఎంత స్థాయికి వెళ్లిందంటే, న్యూఢిల్లీకి గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉందని భావించే శక్తులు ఉన్నాయి.పదునైన టీమ్ వర్క్ ఫలితంగా అస్సాంలో శాంతి యుగానికి నాంది పడింది. అస్సాంలో జరిగినట్లుగానే మణిçపుర్, నాగాలాండ్, దక్షిణ అరుణాచల్ ప్రదేశ్లకు ఏకీకృత కమాండ్ వ్యవస్థ (యూనిఫైడ్ కమాండ్ స్ట్రక్చర్)ను తక్షణమే ఏర్పాటు చేయడం మేలు. ప్రస్తుతం ఉన్న గందరగోళాన్ని, అనిశ్చితిని ఇలాగే కొనసాగనిస్తే, మణిపుర్ కోలుకోలేని విధంగా నష్టపోతుంది.హింస చెలరేగిన ఏడాది తర్వాత కూడా మణిపుర్లో శాంతిభద్రతల పరిస్థితి మరింత దారుణంగానే ఉంది. ఈ రాష్ట్రంలోని ప్రధాన శక్తులు ఏకతాటిపైకి వచ్చి తక్షణ దిద్దుబాటు కోసం ఒక మార్గాన్ని అన్వేషించడమే ఇప్పుడున్న ఏకైక పరిష్కారం.సైన్యం లక్ష్యంగా దాడిమణిపుర్లో ఇటీవల జరిగిన మూడు సంఘటనలను దృష్టిలో పెట్టుకోవాలి. ఏప్రిల్ 24న కాంగ్పోక్పి జిల్లాలోని జాతీయ రహదారి–2పై ఉన్న వంతెన మీద దుండగులు ఐఈడీ పేలుడుకు పాల్పడ్డారు. ఈ వంతెన ఇంఫాల్ను నాగాలాండ్లోని దిమాపూర్తో కలుపుతుంది. ఈ రహదారి రాష్ట్రానికి ప్రధాన జీవనాధారం. రాష్ట్రం నిలువునా చీలిపోయిన కారణంగా మణిపుర్ ప్రజలకు అవసరమైన సామగ్రిని తీసుకువెళ్లే 100కు పైగా ట్రక్కులు అక్కడ నిలిచిపోవాల్సి వచ్చింది.ఏప్రిల్ 27న బిష్ణుపూర్ జిల్లాలోని నారాన్సీనా వద్ద జరిగిన దాడిలో ఇద్దరు సీఆర్పీఎఫ్ జవాన్లు మరణించారు. సీఆర్పీఎఫ్ జవాన్లు విడిది చేసి ఉన్న ప్రాంతానికి 200 మీటర్ల దూరంలోనే ఇండియా రిజర్వ్ బెటాలియన్ క్యాంపు (ఐఆర్బీ) ఉంది. ఐఆర్బీలో సిబ్బంది ప్రధానంగా మైతేయి కమ్యూనిటీకి చెందినవారు. సీఆర్పీఎఫ్ సిబ్బంది తమ శిబిరాన్ని ఖాళీ చేసే పనిలో ఉన్నారనీ, అక్కడ ఒక ప్లాటూన్ మాత్రమే మిగిలి ఉందనీ తెలియవచ్చింది.దాడి చేసినవారు ఐఆర్బీలోని మైతేయి సభ్యులను లక్ష్యంగా చేసుకున్నారని భావించే అవకాశం ఉంది; రాత్రిపూట దాడి జరిగినందున, వారు సీఆర్పీఎఫ్ శిబిరాన్ని ఐఆర్బీ అని పొరపడి ఉండొచ్చు.అయితే, ఆ దాడి లక్ష్యం సీఆర్పీఎఫ్ కూడా అయి ఉండవచ్చు – 1990ల మధ్యకాలంలో, అస్సాంలోని హిందీ మాట్లాడే ప్రజలను యథేచ్ఛగా హతమార్చడానికి ప్రయత్నించిన తిరుగుబాటు బృందం యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అసోమ్ (ఉల్ఫా) కార్యాచరణను ఇది తలపింపజేస్తోంది. అప్పట్లో ఉల్ఫా కేంద్రప్రభుత్వ దృష్టిని ఆకర్షించడానికి గట్టిగా ప్రయత్నించింది. అందులో విజయవంతం అయింది కూడా. ఉత్తరప్రదేశ్, బిహార్ల నుండి కొంతమంది ఎంపీలు హిందీ మాట్లాడే తమ సోదరులకు సహాయం చేయడానికి వెంటనే అస్సాంలో దిగారు. బయటి వ్యక్తులు తమ రాష్ట్రంలో దుకాణాలు ఏర్పాటు చేయడాన్ని వ్యతిరేకించే ఒక వర్గం అస్సామీ జనాభాలో ఉండేది. అది ఇప్పటికీ అలాగే ఉంది.నారాన్సీనా ఘటనకు సంబంధించి, మణిçపుర్లో అరాచకం ఎంత తీవ్రస్థాయికి వెళ్లిందంటే, న్యూఢిల్లీకి గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉందని భావించే శక్తులు ఉన్నాయి. కాకపోతే సీఆర్పీఎఫ్, బీఎస్ఎఫ్ వంటి కేంద్ర పారామిలిటరీ బలగాలను వీరు గతంలో లక్ష్యంగా చేసుకోలేదని గమనించడం ముఖ్యం.ఒకే తాటిపైకి వస్తేనే...వంతెనపై ఐఈడీ పేలుడు, సీఆర్పీఎఫ్ క్యాంపుపై దాడికి సంబంధించిన అనుమానపు చూపు ప్రధానంగా కుకీ మిలిటెంట్ల వైపు మళ్లింది. అయితే, అది చేసింది ఎవరైనా కావచ్చు. 2023 మే 3 నుండి నియంత్రణ లేకుండా ఉన్న రాష్ట్రంలో, దాదాపు ప్రతి సమూహం సైనికీకరించబడింది.మూడో విషయం రాజకీయ అండదండలతో కొనసాగుతున్న అరాచకానికి సంబంధించినది. అక్రమ ఆయుధాలతో ఉన్న అరామ్బాయీ తెంగోల్ సభ్యులను పట్టుకున్న తర్వాత, సైన్యానికి చెందిన కాస్పిర్ వాహనాన్ని మీరా పైబీలు(మహిళా బృందాలు) అడ్డగించారు. వందలాది మంది మీరా పైబీలు కాస్పిర్ను చుట్టుముట్టి సైనికులను దూషించారు. ఆ సమయంలో గనక సైనిక సిబ్బంది సంయమనం కోల్పోయి ఉంటే రక్తపాతం జరిగి ఉండేది.పదునైన టీమ్ వర్క్ ఫలితంగా అస్సాం శాంతి యుగానికి నాంది పలికింది. అస్సాంలో జరిగినట్లుగానే మణిçపుర్, నాగాలాండ్, దక్షిణ అరుణాచల్ ప్రదేశ్లకు ఏకీకృత కమాండ్ వ్యవస్థ (యూనిఫైడ్ కమాండ్ స్ట్రక్చర్)ను తక్షణమే ఏర్పాటు చేయడం మేలు. ఇది రంగాపహాడ్(నాగాలాండ్) కేంద్రంగా పనిచేసే 3 కోర్కు చెందిన జనరల్ ఆఫీసర్ కమాండింగ్ మొత్తం నాయకత్వం కింద ఉండాలి. సహజంగానే సంప్రదింపుల తర్వాతే ఒక స్పష్టమైన స్వరం... శాంతి, సాధారణ స్థితికి రావడానికి కావాల్సిన వ్యూహాలు, మార్గాలు, సాధనాలపై దృష్టి పెట్టాలి. మణిçపుర్ విభజితమై ఉంది. రాష్ట్ర పోలీసు యంత్రాంగం దాదాపుగా పనిచేయడం లేదు. ఎటువంటి ఎదురూ లేని రాడికల్ మిలీషియా సంస్థకు పోలీస్ విభాగం తన బాధ్యతను వదిలేసుకుంది. కొంతమంది పోలీసులను ఆయుధాలు వదిలి వేయమని బలవంతం చేస్తూ అరామ్బాయీ తెంగోల్ ఒక డీఎస్పీని తీసుకెళ్లింది. ఇలాంటి తరుణంలో పోలీసులకు నాయకత్వం అవసరం. దురదృష్టవశాత్తు, అది పోలీసు శాఖ లోపల నుండి ఉద్భవించదు. దానిపై అధికారాన్ని 3 కోర్ జనరల్ ఆఫీసర్ కమాండింగ్ వంటి బలమైన సంస్థాగత మద్దతుతో కూడిన దృఢమైన నాయకుడికి అప్పగించాలి. అస్సాం రైఫిల్స్ అద్భుతంగా పని చేస్తోంది. కానీ అది పక్షపాత దృష్టితో ఉందని అన్యాయంగా ఆరోపణలు చేస్తున్నారు. మణిçపుర్ లోయ నివాసితులు దానిని తొలగించాలని కోరారు. మణిçపుర్లోని అనేక ప్రాంతాల నుండి సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టం తొలగించబడింది. దాంతో రాష్ట్రంలో ప్రభుత్వేతర శక్తులు చేస్తున్న చర్యలను ఎవరైనా చూడవచ్చు. అస్సాం రైఫిల్స్ ఇప్పటికే 3 కోర్ కార్యాచరణ కమాండ్ కింద ఉంది. కానీ దీనిని ఏకీకృత కమాండ్ వ్యవస్థ(యూసీఎస్)లో భాగం చేస్తే... ఆర్మీ, మణిపుర్ పోలీస్, కేంద్ర పారామిలిటరీ బలగాలతో దాని కార్యాచరణ కదలికలను క్రమాంకనం చేయడానికి అది వీలు కల్పిస్తుంది. అంతేగాక, యూసీఎస్ లోని ఇతర అంతిమ వినియోగదారులకు అనుగుణంగా పటిష్ఠమైన నిఘా వీలవుతుంది.అన్నీ కలగలిసే...మణిçపుర్, నాగాలాండ్, దక్షిణ అరుణాచల్లకు పరస్పరం ముడిపడి ఉన్న సమస్యలే దీనికి కారణం. ఉదాహరణకు, ప్రత్యేక అడ్మినిస్ట్రేటివ్ జోన్లను ఏర్పర్చిన తర్వాత, నేషనల్ సోషలిస్ట్ కౌన్సిల్ ఆఫ్ నాగాలాండ్– ఇసాక్– ముయివా (ఎన్ఎస్సీఎన్–ఐఎమ్) సహాయంతో లోయ–ఆధారిత తిరుగుబాటు గ్రూపులు మణిçపుర్లోకి ప్రవేశించే సమస్యనుంచి ఎవరూ తప్పించుకోలేరు. అలాగే, ‘ఈస్టర్న్ నాగా నేషనల్ గవర్నమెంట్’ నుండి ఎన్ఎస్సీఎన్–ఐఎమ్కు లభిస్తున్న మద్దతు వెలుగులోనే, దక్షిణ అరుణాచల్లోని తిరప్, చాంగ్లాంగ్, లాంగ్డింగ్ జిల్లాలలో జరిగే కుతంత్రాలను చూడాలి.భారత రాజ్యం, దాని సైన్యం చాలా శక్తిమంతమైనవి. అవి ఎలాంటి సవాలునైనా ఎదుర్కోగలవు. ఈ క్లిష్ట సమయంలో న్యూఢిల్లీ తీసుకోవాల్సిన ఏకైక చర్య తన బలగాలను బలోపేతం చేయడమే. అసాధ్యమైన వాటిని సాధించగల సామర్థ్యం సైన్యానికి ఉంది. ప్రస్తుతం ఉన్న గందరగోళాన్ని, అనిశ్చితిని ఇలాగే కొనసాగనిస్తే, మణిçపుర్ కోలుకోలేని విధంగా నష్టపోతుంది.- వ్యాసకర్త భద్రత – తీవ్రవాద వ్యవహారాల విశ్లేషకుడు (‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో)- జైదీప్ సైకియా -
ఆ ఆరు జిల్లాల్లో జీరో ఓటింగ్.. కారణమిదే?
నాగాలాండ్లోని ఆరు తూర్పు జిల్లాల్లో పోలింగ్ స్టేషన్ల వద్ద సిబ్బంది తొమ్మిది గంటల పాటు వేచి ఉన్నప్పటికీ ఒక్క ఓటరు కూడా ఓటు వేయలేదు. ‘ఫ్రాంటియర్ నాగాలాండ్ టెరిటరీ’ (ఎఫ్ఎన్టీ) బంద్ పిలుపుతో ఈ ప్రాంతంలోని నాలుగు లక్షల మంది ఓటర్లలో ఎవరూ ఓటు వేసేందుకు ముందుకు రాలేదు. తూర్పు నాగాలాండ్ పీపుల్స్ ఆర్గనైజేషన్ (ఈఎన్పీఓ)ఎఫ్ఎన్టీ డిమాండ్తో రాష్ట్ర ప్రభుత్వానికి ఎటువంటి సమస్య లేదని ముఖ్యమంత్రి నీఫియు రియో వ్యాఖ్యానించారు. ఎందుకంటే ఇప్పటికే ఈ ప్రాంతానికి స్వయంప్రతిపత్త అధికారాలను సిఫారసు చేశారన్నారు. కాగా 20 అసెంబ్లీ నియోజకవర్గాలతో కూడిన ప్రాంతంలోని 738 పోలింగ్ కేంద్రాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ సిబ్బంది ఉన్నారని నాగాలాండ్ అదనపు చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ అవ లోరింగ్ తెలిపారు. అయినప్పటికీ ఓటు వేసేందుకు ఎవరూ రాలేదని సీఈవో కార్యాలయ వర్గాలు తెలిపాయి. నాగాలాండ్లోని 13.25 లక్షల మంది ఓటర్లలో తూర్పు నాగాలాండ్లోని ఆరు జిల్లాల్లో 4,00,632 మంది ఓటర్లు ఉన్నారు. కాగా తౌఫెమాలో ఓటు వేసిన అనంతరం ముఖ్యమంత్రి విలేకరులతో మాట్లాడుతూ, ఎఫ్ఎన్టీకి సంబంధించిన ‘డ్రాఫ్ట్ వర్కింగ్ పేపర్’ను కేంద్ర హోంమంత్రికి అందజేసినట్లు చెప్పారు. గత ప్రభుత్వాలు అభివృద్ధి విషయంలో ఈ ప్రాంతాన్ని విస్మరించాయని ఆరోపిస్తూ ఈఎన్పీవో ఆరు జిల్లాలతో కూడిన ప్రత్యేక రాష్ట్రాన్ని డిమాండ్ చేస్తోంది. నాగాలాండ్లో లోక్సభ ఎన్నికలు ప్రారంభానికి కొన్ని గంటల ముందు ఈఎన్పీవో గురువారం సాయంత్రం 6 గంటల నుండి రాష్ట్రంలోని తూర్పు ప్రాంతంలో నిరవధిక బంద్ను ప్రకటించింది. -
నాగాలాండ్: ఆరు జిల్లాల్లో జీరో పోలింగ్
కోహిమా: లోక్సభ ఎన్నికల పోలింగ్ సందర్భంగా నాగాలాండ్లో అరుదైన రికార్డు నమోదైంది. రాష్ట్రంలో ఉన్న ఒకే ఒక ఎంపీ సీటుకు శుక్రవారం(ఏప్రిల్19) పోలింగ్ జరిగింది. అయితే ఈ పోలింగ్కు ఆరు జిల్లాల ప్రజలు దూరంగా ఉన్నారు. ఈ ఆరు జిల్లాల్లో ఉన్న నాలుగు లక్షల ఓటర్లలో ఒక్కరంటే ఒక్కరు కూడా ఒంటి గంటవరకు ఓటు వేయడానికి రాకపోవడం గమనార్హం. ఆరు జిల్లాలు కలిపి ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయాలన్న తమ డిమాండ్ను పరిష్కరించనందున ఓటింగ్కు దూరంగా ఉండాలని ద ఈస్టర్న్ నాగాలాండ్ పీపుల్స్ ఆర్గనైజేషన్(ఈఎన్పీవో) పిలుపునిచ్చింది. ఈ పిలుపుతో ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోలేదు. ఆరు జిల్లాల్లో ఈఎన్పీవో పబ్లిక్ ఎమర్జెన్సీని ప్రకటించింది. ఆరు జిల్లాలతో కలిపి ఫ్రాంటియర్ నాగాలాండ్ టెరిటరీ(ఎఫ్ఎన్టీ) ఏర్పాటు చేయాలని ఈఎన్పీవో పోరాడుతోంది. మొత్తం ఆరు గిరిజన సంఘాలు కలిసి ఈఎన్పీవోను ఏర్పాటు చేశాయి. ఇదీ చదవండి.. కొనసాగుతున్న లోక్సభ ఎన్నికల తొలివిడత పోలింగ్ -
నాగాలాండ్లో ఎన్నికల బహిష్కరణ? ఈఎన్పీవో నిర్ణయం?
లోక్సభ ఎన్నికలను నాగాలాండ్లోని ఒక వర్గం బహిష్కరిస్తున్నట్లు ప్రకటించింది. తూర్పు నాగాలాండ్ పీపుల్స్ ఆర్గనైజేషన్ (ఈఎన్పీవో) రాష్ట్రంలోని ఆరు జిల్లాలను కలిపి ప్రత్యేక పరిపాలన కేంద్రం లేదా రాష్ట్రంగా ఏర్పాటు చేయాలని ఎప్పటినుంచో డిమాండ్ చేస్తూవస్తోంది. వీటిని నెరవేర్చని పక్షంలో రాష్ట్రంలోని ఏకైక లోక్సభ స్థానానికి జరిగే ఎన్నికల్లో పాల్గొనబోమని తేల్చిచెప్పింది. ఈఎన్పీవోతో పాటు అపెక్స్ నాగా బాడీ, ఆరు జిల్లాల్లోని దాని అనుబంధ సంస్థలు ప్రత్యేక రాష్ట్రం కోరుతూ గత సంవత్సరం (ఫిబ్రవరి 27) అసెంబ్లీ ఎన్నికలను బహిష్కరించాలని పిలుపునిచ్చాయి. అయితే ఆ తరువాత ఈ విషయమై ప్రభుత్వం నుంచి హామీ వచ్చింది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సలహాదారు ఏకే మిశ్రా అధ్యక్షతన ముగ్గురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేశారు. అనంతరం కమిటీ సభ్యులు నాగాలాండ్ను అనేకసార్లు సందర్శించి, అక్కడి ప్రజల అభిప్రాయాలను సేకరించారు. మరోవైపు నాగాలాండ్లోని తూర్పు ప్రాంత ప్రజలకు స్వయంప్రతిపత్తి ప్రాంతాన్ని ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కేంద్రానికి సిఫార్సు చేసిందని నాగాలాండ్ ముఖ్యమంత్రి నీఫియు రియో ఇటీవల తెలిపారు. కాగా ఇఎన్పీవో ఇప్పటికే పబ్లిక్ ఎమర్జెన్సీని ప్రకటించింది. లోక్సభ ఎన్నికల ప్రచారానికి ఏ పార్టీకి అనుమతి ఇవ్వబోమని తేల్చిచెప్పింది. -
డాన్స్తో ట్రాఫిక్ కంట్రోల్.. వీడియో వైరల్!
మనిషన్నాక ఏదోఒక అభిరుచి ఉంటుంది. కొందరికి సింగర్ కావాలని, మరికొందరికి యాక్టర్ కావాలనివుంటుంది. అలాగే రచయిత కావాలని, క్రీడాకారులు కావాలని కూడా కొందరు కోరుకుంటారు. అయితే కొంతమంది తమ అభిరుచిని వదిలి వేరే పని చేయాల్సి వస్తుంది. అలాంటివారు వారి అభిరుచిని వదులుకోలేరు. ఒక ట్రాఫిక్ పోలీస్ విషయంలో ఇదే కనిపించింది. అతనికి సంబంధించిన వీడియో ఒకటి వైరల్గా మారింది. ఈ వీడియోలో సదరు ట్రాఫిక్ కానిస్టేబుల్ రోడ్డుపై ట్రాఫిక్ను నియంత్రించడాన్ని గమనించవచ్చు. అయితే అతను డ్యాన్స్ చేస్తూ, ట్రాఫిక్ను కంట్రోల్ చేయడాన్ని చూడవచ్చు. ఒకసారి మూన్వాక్తో, మరోమారు స్టెప్పులు వేస్తూ.. వాహనాలకు సిగ్నల్ ఇస్తూ కనిపిస్తున్నాడు. ఈ వీడియోను సోషల్ మీడియాలో విపరీతంగా లైక్ చేస్తున్నారు. ఈ వీడియోను నాగాలాండ్ ప్రభుత్వ పర్యాటక, ఉన్నత విద్యా శాఖ మంత్రి టెమ్జిన్ ఇమ్నా అలోంగ్ మైక్రో బ్లాగింగ్ ప్లాట్ఫామ్ ‘ఎక్స్’లో షేర్ చేశారు. ఈ వీడియోను ఇప్పటివరకూ 51 వేల మందికి పైగా నెటిజన్లు వీక్షించారు. వీడియోను చూసిన ఒక యూజర్ కామెంట్ బాక్స్లో.. ‘మా సింగం సార్.. ఇండోర్ నుండి వచ్చారు. నేను ఆయనను చూసేందుకు హైకోర్టు స్క్వేర్కి వెళ్తుంటాను’ అని రాశారు. మరొక యూజర్ ‘సూపర్’అని రాశారు. अपने Moves दिखाने के लिए सही Platform का इंतजार मत करो, Platform को सही खुद बना लो! 😉 pic.twitter.com/5WE4plySsH — Temjen Imna Along (@AlongImna) February 27, 2024 -
Hyd: 7 వికెట్లతో చెలరేగిన బౌలర్.. మనోళ్లదే ఆధిపత్యం
Ranji Trophy- Hyderabad vs Nagaland, Plate 1st Semi Final: రంజీ ట్రోఫీ- 2024 ప్లేట్ గ్రూపు తొలి సెమీ ఫైనల్లో హైదరాబాద్ ఆధిపత్యం కొనసాగిస్తోంది. నాగాలాండ్తో శుక్రవారం మొదలైన ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన హైదరాబాద్ తొలుత బ్యాటింగ్ చేసింది. తన్మయ్, తిలక్ సెంచరీలు ఓపెనర్ తన్మయ్ అగర్వాల్ (192 బంతుల్లో 164; 12 ఫోర్లు, 3 సిక్స్లు), కెప్టెన్ తిలక్ వర్మ (135 బంతుల్లో 101; 6 ఫోర్లు, 5 సిక్స్లు) సెంచరీలతో కదంతొక్కారు. రోహిత్ రాయుడు (59; 3 ఫోర్లు, 3 సిక్స్లు) అర్ధ సెంచరీ చేశాడు. తన్మయ్, రోహిత్ రాయుడు రెండో వికెట్కు 143 పరుగులు... తన్మయ్, తిలక్ మూడో వికెట్కు 155 పరుగులు జోడించారు. 462 డిక్లేర్డ్ ఇక రాహుల్ సింగ్ (5), రవితేజ (15) తక్కువ స్కోరుకే వెనుదిరిగారు. కె.నితీశ్ రెడ్డి 26, ప్రజ్ఞయ్ రెడ్డి 47 పరుగులు సాధించగా.. తనయ్ త్యాగరాజన్ 22 రన్స్ స్కోరు చేశాడు. ఈ క్రమంలో రెండో రోజు ఆటలో భాగంగా మొత్తంగా 107 ఓవర్ల ఆట ముగిసిన తర్వాత 8 వికెట్ల నష్టానికి 462 పరుగుల హైదరాబాద్ తమ తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. సాకేత్ 3, కార్తికేయ 12 పరుగులతో అజేయంగా నిలిచారు. ఈ క్రమంలో శనివారం బ్యాటింగ్ మొదలుపెట్టిన నాగాలాండ్కు హైదరాబాద్ బౌలర్లు చుక్కలు చూపించారు. 60.1 ఓవర్లలోనే నాగాలాండ్ ఆట కట్టించారు. తనయ్ త్యాగరాజన్ ఏడు వికెట్లతో చెలరేగగా.. రవితేజ రెండు, సాకేత్ ఒక వికెట్ దక్కించుకున్నారు. 206 పరుగులకే ఆలౌట్ చేసి.. ఫాలో ఆన్ నాగాలాండ్ బ్యాటర్లలో ఓపెనర్ జోషువా ఒజ్కుమ్ అర్ధ శతకం(50)తో రాణించగా.. కెప్టెన్ రాంగ్సెన్ జొనాథన్ 41, జగనాథ్ సినివాస్ 44, సుమిత్ కుమార్ 38 పరుగులు చేశారు. మిగతావాళ్లలో ఒక్కరు కూడా కనీసం 12 పరుగుల మార్కు కూడా అందుకోలేకపోయారు. ఈ క్రమంలో 206 పరుగులకే నాగాలాండ్ ఆలౌట్ కాగా.. హైదరాబాద్కు తొలి ఇన్నింగ్స్లో 256 పరుగుల ఆధిక్యం లభించింది. ఈ క్రమంలో నాగాలాండ్ను ఫాలో ఆన్ ఆడించేందుకు హైదరాబాద్ మొగ్గు చూపింది. ఫలితంగా మళ్లీ బ్యాటింగ్కు దిగిన నాగాలాండ్ శనివారం నాటి ఆట పూర్తయ్యే సరికి 5 ఓవర్లలో వికెట్ నష్టానికి 20 పరుగులు చేసింది. కాగా ఈ మ్యాచ్లో గెలిస్తే హైదరాబాద్ జట్టు మళ్లీ ఎలైట్ డివిజన్కు అర్హత సాధిస్తుంది. చదవండి: Ind vs Eng: గాయమా? నో ఛాన్స్.. అందుకే అయ్యర్పై వేటు! ఇప్పట్లో నో ఎంట్రీ -
Plate 1st Semi Final: తిలక్ వర్మ మెరుపు సెంచరీ
Ranji Trophy 2023-24- Hyderabad vs Nagaland, Plate 1st Semi Final: టీమిండియా యువ క్రికెటర్ తిలక్ వర్మ రంజీ ట్రోఫీ-2024లో జోరు కొనసాగిస్తున్నాడు. ఇప్పటికే రెండు శతకాలు బాదిన అతడు.. తాజాగా మరో సెంచరీ చేశాడు. ప్లేట్ గ్రూపు తొలి సెమీ ఫైనల్లో భాగంగా నాగాలాండ్తో మ్యాచ్లో.. హైదరాబాద్ కెప్టెన్ తిలక్ 101 పరుగులతో సత్తా చాటాడు. శతక్కొట్టిన తన్మయ్ ఉప్పల్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో శుక్రవారం మొదలైన మ్యాచ్లో టాస్ గెలిచిన హైదరాబాద్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో ఓపెనర్ తన్మయ్ అగర్వాల్ అద్భుత శతకం(164) బాదగా.. మరో ఓపెనర్ గహ్లోత్ రాహుల్ సింగ్(5) విఫలమయ్యాడు. తిలక్ వర్మ మెరుపు సెంచరీ వన్డౌన్ బ్యాటర్ రోహిత్ రాయుడు 59 పరుగులతో రాణించగా.. నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేసిన తిలక్ వర్మ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. 135 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 101 రన్స్ చేశాడు. మిగతావాళ్లలో తెలుకపల్లి రవితేజ 15 పరుగులకే పెవిలియన్ చేరగా.. కె.నితీశ్ రెడ్డి, వికెట్ కీపర్ ప్రజ్ఞయ్ రెడ్డి క్రీజులో ఉన్నారు. తొలిరోజు ఆట ముగిసే సరికి 90 ఓవర్లలో హైదరాబాద్ 5 వికెట్ల నష్టానికి 383 పరుగులు చేసింది. శుక్రవారం నాటి ఆట పూర్తయ్యే సరికి నితీశ్ రెడ్డి 21, ప్రజ్ఞయ్ రెడ్డి 12 పరుగులతో ఆడుతున్నారు. ఇక నాగాలాండ్ బౌలర్లలో కెప్టెన్ రాంగ్సెన్ జొనాథన్ రెండు, తహ్మీద్ రహ్మాన్, ఖ్రివిస్టో కెన్స్, ఇమ్లీవతి లెమ్య్టూర్ తలా ఓ వికెట్ దక్కించుకున్నారు. కాగా ఈ మ్యాచ్లో గెలిచి ఎలైట్ గ్రూపులో అడుగుపెట్టాలని హైదరాబాద్ పట్టుదలగా ఉంది. చదవండి: Ranji Trophy: రీ ఎంట్రీలో టీమిండియా ఓపెనర్ ధనాధన్ శతకం.. ఫోర్ల వర్షం -
Rahul Gandi: హాజరవడం కష్టమే
చిఫొబొజౌ(నాగాలాండ్): అయోధ్యలో రామ మందిరం ప్రాణప్రతిష్ఠ క్రతువు ఎన్నికల రంగులద్దుకుని ‘నరేంద్ర మోదీ, ఆర్ఎస్ఎస్–బీజేపీ’ ఫంక్షన్గా ముస్తాబవుతోందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. సోమవారం సాయంత్రం నాగాలాండ్లోకి అడుగుపెట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్ర మంగళవారం సైతం వేలాది మంది కాంగ్రెస్ కార్యకర్తలు, మద్దతుదారుల నడుమ కొనసాగింది. యాత్రను ముందుండి నడిపిస్తున్న రాహుల్ గాంధీ మంగళవారం రాష్ట్ర రాజధాని కోహిమాలో కాంగ్రెస్ కార్యకర్తలనుద్దేశించి ప్రసంగించారు. ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి అందిన ఆహా్వనాన్ని తమ పార్టీ అగ్రనేతలు సున్నితంగా తిరస్కరించడాన్ని ఆయన గట్టిగా సమరి్థంచారు. ‘‘ మందిరం ప్రారం¿ోత్సవానికి కాంగ్రెస్, విపక్షాల ‘ఇండియా’ కూటమి పారీ్టల నేతలు ఎవరు వెళ్లినా నేను మనసారా స్వాగతిస్తా. కానీ ఇప్పుడు ఆ కార్యక్రమం మొత్తం మోదీ, ఆర్ఎస్ఎస్ కేంద్రంగా తయారైంది. చక్కని వేడుకను ఆర్ఎస్ఎస్, బీజేపీలు రాజకీయ వేడుకగా మార్చేశాయి. అందుకే ఈ కార్యక్రమానికి వెళ్లొద్దని కాంగ్రెస్ చీఫ్ ఖర్గే, సోనియా గాం«దీ భావించి ఉంటారు. కాంగ్రెస్ పారీ్టకి అన్ని మతాలు, సంప్రదాయాలు సమానమే. 22న అయోధ్య జరిగే కార్యక్రమం.. రాజకీయ ఉత్సవంలా మారిందని స్వయంగా కొందరు హిందూ మత పెద్దలే బహిరంగంగా విమర్శించారు. ఇలా కొత్తరూపును సంతరించుకున్న ఈ కార్యక్రమానికి మేం వెళ్లడం కష్టం. అసాధ్యం కూడా’’ అని రాహుల్ వ్యాఖ్యానించారు. ‘‘ఇండియా కూటమి బలంగా ఉంది, రానున్న లోక్సభ ఎన్నికల్లో బీజేపీని ఓడిస్తుంది. తృణమూల్ కాంగ్రెస్ పారీ్టతో సీట్ల పంపకం విషయంలో నెలకొన్న విభేదాలు సమసి పోతాయి’’ అని రాహుల్ ధీమా వ్యక్తం చేశారు. -
ప్రధాని మోదీపై రాహుల్ గాంధీ విమర్శలు
కాంగ్రెస్ అగ్రనేత, వయినాడ్ ఎంపీ రాహుల్ గాంధీ ‘భారత్ జోడో న్యాయ యాత్ర’ కొనసాగుతోంది. నాగాలాండ్ రాజధాని కోహిమాలో రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై రాహుల్ విమర్శలు గుప్పించారు. అయోధ్యలో జనవరి 22న జరిగే రామ మందిర ప్రారంభోత్సవ కార్యక్రమం కేవలం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాజకీయ కార్యక్రమమని దుయ్యబట్టారు. బీజేపీ అనుబంధ సంస్థ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్), బీజేపీ జనవరి 22న జరిపే రామ మందిర ప్రారంభోత్సం పూర్తిగా నరేంద్ర మోదీ రాజకీయ కార్యక్రమమని మండిపడ్డారు. ఇది ఆర్ఎస్ఎస్ కార్యక్రమం కాబట్టి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే రామ మందిర కార్యక్రమానికి హాజరు కావటం లేదని ప్రకటించినట్లు గుర్తుచేశారు. తమకు అన్ని మతాలపై విశ్వాసం ఉందని, అన్ని మతాలను అంతే సమానంగా ఆచరిస్తామని పేర్కొన్నారు. హిందు మతాన్ని పాటిస్తూ ఉన్నత స్థానంలో మతాచార్యులు సైతం రామ మందిర ప్రారంభ ఉత్సవాన్ని ఒక రాజకీయ కార్యక్రమంగా అభివర్ణిస్తున్నారని అన్నారు. ఆర్ఎస్ఎస్, బీజేపీ పనిగట్టుకొని రాజకీయం కోసమే రామ మందిర ప్రారంభోత్సవం నిర్వహించటం సరికాదన్నారు. అటువంటి రాజకీయ ప్రారంభోత్సవానికి హాజరుకావద్దని తాము నిర్ణయించుకున్నట్లు తెలిపారు. చదవండి: ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్గా షర్మిల.. నియమించిన కాంగ్రెస్ హైకమాండ్ -
హైదరాబాద్ ఘన విజయం
దీమాపూర్: రంజీ ట్రోఫీ సీజన్ను హైదరాబాద్ భారీ విజయంతో మొదలు పెట్టింది. ‘ప్లేట్’ గ్రూప్లో రెండో రోజే ముగిసిన మ్యాచ్లో హైదరాబాద్ జట్టు ఇన్నింగ్స్, 194 పరుగుల తేడాతో నాగాలాండ్ను చిత్తు చేసింది. ఓవర్నైట్ స్కోరు 35/1తో ఆట కొనసాగించిన నాగాలాండ్ తమ తొలి ఇన్నింగ్స్లో 153 పరుగులకే ఆలౌటైంది. ఆర్ఎస్ జగన్నాథ్ శ్రీనివాస్ (49) టాప్ స్కోరర్గా నిలిచాడు. హైదరాబాద్ బౌలర్లలో తనయ్ త్యాగరాజన్ (5/43) ఐదు వికెట్లతో చెలరేగగా...సీవీ మిలింద్, కార్తీకేయ చెరో 2 వికెట్లు తీశారు. దాంతో హైదరాబాద్కు 321 పరుగుల ఆధిక్యం లభించింది. అనంతరం ‘ఫాలో ఆన్’లో రెండో ఇన్నింగ్స్ ఆడిన నాగాలాండ్ మళ్లీ పేలవ బ్యాటింగ్లో 127 పరుగులకే కుప్పకూలింది. సుమిత్ కుమార్ (62) అర్ధ సెంచరీ సాధించాడు. సీవీ మిలింద్ 4 వికెట్లు పడగొట్టగా, తనయ్ త్యాగరాజన్కు 3 వికెట్లు దక్కాయి. ఆంధ్ర 119/3 విశాఖ స్పోర్ట్స్: బెంగాల్తో జరుగుతున్న ‘ఎలైట్’ డివిజన్ రంజీ మ్యాచ్లో రెండో రోజు ఆట ముగిసే సరికి ఆంధ్ర తమ తొలి ఇన్నింగ్స్లో 3 వికెట్లు కోల్పోయి 119 పరుగులు చేసింది. ప్రశాంత్ కుమార్ (41), సీఆర్ జ్ఞానేశ్వర్ (33), షేక్ రషీద్ (32) వెనుదిరగ్గా...కెప్టెన్ హనుమ విహారి (6 నాటౌట్) క్రీజ్లో ఉన్నాడు. అంతకు ముందు ఓవర్నైట్ స్కోరు 289/4తో ఆట కొనసాగించిన బెంగాల్ 409 పరుగులకు ఆలౌటైంది. అభిషేక్ పొరేల్ (70) హాఫ్ సెంచరీ చేయగా, లలిత్ మోహన్కు 4 వికెట్లు దక్కాయి. ప్రస్తుతం ఆంధ్ర మరో 290 పరుగులు వెనుకబడి ఉంది. -
తిలక్ వర్మ కెప్టెన్సీ అదుర్స్.. టెస్టుల్లో అరంగేట్రానికి ‘సై’!
Ranji Trophy 2023-24- Hyderabad Vs Nagaland: రంజీ ట్రోఫీ 2023-24 సీజన్ను హైదరాబాద్ ఘన విజయంతో ఆరంభించింది. నాగాలాండ్ను ఇన్నింగ్స్ 194 పరుగుల తేడాతో మట్టికరిపించి జయభేరి మోగించింది. కాగా ఈసారి రంజీ ట్రోఫీలో హైదరాబాద్ ‘ప్లేట్’ డివిజన్లో పోటీపడుతోంది . ఈ జట్టుకు కెప్టెన్గా టీమిండియా స్టార్ తిలక్ వర్మ వ్యవహరిస్తున్నాడు. తొలిరోజే పరుగుల వరద.. రాహుల్ డబుల్ ధమాకా ఈ క్రమంలో దీమాపూర్ వేదికగా నాగాలాండ్ జట్టుతో శుక్రవారం మొదలైన మ్యాచ్లో.. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్.. తొలిరోజే పరుగుల వరద పారించింది. ఆతిథ్య నాగాలాండ్ బౌలర్ల భరతం పట్టిన హైదరాబాద్ బ్యాటర్ రాహుల్ సింగ్ గహ్లోత్ ద్విశతకం(214)తో అదరగొట్టాడు. తిలక్ వర్మ అజేయ సెంచరీ తిలక్ వర్మ అజేయ శతకం (112 బంతుల్లో 100 నాటౌట్; 6 ఫోర్లు, 4 సిక్స్లు) నమోదు చేయగా... తన్మయ్ అగర్వాల్ (80; 12 ఫోర్లు) కూడా రాణించాడు. ఈ క్రమంలో 76.4 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 474 పరుగుల వద్ద హైదరాబాద్ తమ తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. ఈ క్రమంలో శుక్రవారం నాటి ఆట ముగిసే సమయానికి నాగాలాండ్ తొలి ఇన్నింగ్స్లో ఒక వికెట్ కోల్పోయి 35 పరుగులు సాధించింది. ఇక 35/1 ఓవర్నైట్ స్కోరుతో శనివారం ఆట మొదలుపెట్టిన నాగాలాండ్ 51.3 ఓవర్లలో 153 పరుగులకు ఆలౌట్ కాగా.. హైదరాబాద్ ఫాలో ఆన్ ఆడించింది. చిత్తుగా ఓడిన నాగాలాండ్ అయితే, ప్రత్యర్థి జట్టు బౌలర్ల ధాటికి తాళలేక రెండో ఇన్నింగ్స్లో 127 పరుగులకే చేతులెత్తేశారు నాగాలాండ్ బ్యాటర్లు. దీంతో ఇన్నింగ్స్ మీద 194 పరుగుల తేడాతో హైదరాబాద్ భారీ విజయం సాధించింది. రెండ్రోజుల్లోనే ఈ టెస్టు మ్యాచ్ ముగిసిపోయింది. ఇక నాగాలాండ్తో మ్యాచ్లో తిలక్ వర్మ సేనలోని బౌలర్లలో టి.త్యాగరాజన్ అత్యధికంగా ఎనిమిది వికెట్లు పడగొట్టగా.. చామా మిలింద్కు ఆరు వికెట్లు దక్కాయి. మిగతా వాళ్లలో తెలుకపల్లి రవితేజ రెండు, కార్తికేయ మూడు, రోహిత్ రాయుడు ఒక వికెట్ పడగొట్టారు. కాగా తిలక్ కెప్టెన్సీలో హైదరాబాద్ వరుస విజయాలు సాధించాలని.. బ్యాటర్గానూ రాణించి అతడు టీమిండియా తరఫున టెస్టుల్లో అరంగేట్రం చేయాలని ఈ సందర్భంగా అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. ఇక హైదరాబాద్ స్టార్ తిలక్ వర్మ ఇప్పటికే అంతర్జాతీయ టీ20, వన్డేలలో అడుగుపెట్టిన విషయం తెలిసిందే. చరిత్ర సృష్టించిన రాహుల్ సింగ్ గతంలో సర్వీసెస్ జట్టుకు ఆడిన రాహుల్ సింగ్ గహ్లోత్ 157 బంతుల్లో 23 ఫోర్లు, 9 సిక్స్లతో 214 పరుగులు చేసి అవుటయ్యాడు. అయితే, ఈసారి హైదరాబాద్కు ప్రాతినిథ్యం వహిస్తున్న అతడు 143 బంతుల్లో డబుల్ సెంచరీ సాధించాడు. ఈ క్రమంలో రవిశాస్త్రి తర్వాత రంజీ ట్రోఫీలో వేగవంతమైన డబుల్ సెంచరీ చేసిన రెండో ప్లేయర్గా రాహుల్ గుర్తింపు పొందాడు. చదవండి: BCCI: ఇంగ్లండ్తో తలపడే భారత్-‘ఏ’ జట్టు ప్రకటన.. కెప్టెన్ అతడే -
సెంచరీతో చెలరేగిన తిలక్ వర్మ.. ధనాధన్ ఇన్నింగ్స్
Ranji Trophy 2023-24 Hyd Vs NGL: రంజీ ట్రోఫీ 2023-24 సీజన్ ఆరంభ మ్యాచ్లో టీమిండియా యువ బ్యాటర్, హైదరాబాద్ కెప్టెన్ తిలక్ వర్మ దుమ్ములేపాడు. నాగాలాండ్తో జరుగుతున్న మ్యాచ్లో 112 బంతుల్లోనే శతకం పూర్తి చేసుకున్నాడు. ఆరు ఫోర్లు, నాలుగు సిక్సర్ల సాయంతో వంద పరుగుల మార్కును అందుకున్నాడు. కాగా దేశవాళీ టెస్టు ఫార్మాట్ టోర్నీ రంజీ ట్రోఫీ తాజా ఎడిషన్ శుక్రవారం ఆరంభమైంది. ఇందులో భాగంగా.. హైదరాబాద్ తమ తొలి మ్యాచ్లో నాగాలాండ్ జట్టుతో తలపడుతోంది. దిమాపూర్ వేదికగా మొదలైన ఈ టెస్టులో టాస్ గెలిచిన ఆతిథ్య నాగాలాండ్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్కు దిగిన హైదరాబాద్కు ఆరంభంలో షాక్ తగిలింది. ఓపెనర్ రోహిత్ రాయుడు 2 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఉండగా తొలి వికెట్గా వెనుదిరిగాడు. అయితే, అతడి స్థానంలో వన్డౌన్లో దిగిన గహ్లోత్ రాహుల్ సింగ్, మరో ఓపెనర్ తన్మయ్ అగర్వాల్(80)తో కలిసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. టీ20 తరహా బ్యాటింగ్ చేస్తూ 157 బంతుల్లో 136కు పైగా స్ట్రైక్రేటుతో ఏకంగా 214 పరుగులు సాధించాడు. రాహుల్ సింగ్ ఇన్నింగ్స్లో ఏకంగా 23 ఫోర్లు, 9 సిక్సర్లు ఉండటం విశేషం. ఇక నాలుగో స్థానంలో బ్యాటింగ్కు వచ్చిన తిలక్ వర్మ.. ఓవైపు వికెట్లు పడుతున్నా పట్టుదలగా నిలబడి కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. తొలి రోజు ఆట ముగిసే సరికి 100 పరుగులతో అజేయంగా నిలిచాడు. అతడికి తోడుగా తెలుకపల్లి రవితేజ 21 పరుగులతో క్రీజులో ఉన్నాడు. కాగా శుక్రవారం నాటి ఆట పూర్తయ్యేసరికి హైదరాబాద్ 76.4 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 474 పరుగులు చేసింది. నాగాలాండ్ బౌలర్లలో కరుణ్ తెవాటియా, నగాహో చిషి, ఇమ్లివటి లెమ్టూర్, క్రెవిస్టో కెన్సె, కెప్టెన్ రొంగ్సెన్ జొనాథన్ ఒక్కో వికెట్ తీశారు. -
అంతర్జాతీయ తెలుగు మహా సభలకు విచ్చేయన్ను నాగలాండ్ గవర్నర్
రాజమహేంద్రవరం: ఆంధ్ర సారస్వత పరిషత్ సంస్థ , చైతన్య విద్యా సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో అంధ్రమేవ జయతే! అన్న నినాదంతో తెలుగు భాషా వైభవాన్ని విశ్వవ్యాప్తం చేసే దిశగా తేదీలు5,6,7 జనవరి 2024 శ్రీ రాజరాజనరేంద్రుల వారి పట్టాభిషేక మహోత్సవ సహస్రాబ్ది సందర్భంగా సాంస్కృతిక రాజధాని రాజమహేంద్రవరం, గైట్ ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణం లో నిర్వహిస్తున్న అంతర్జాతీయ తెలుగు మహా సభలకు నాగాలాండ్ గవర్నర్ శ్రీ లా గణేషన్ విచ్చేయనున్నారని పరిషత్ అధ్యక్షులు డా.గజల్ శ్రీనివాస్, చైతన్య విద్యా సంస్థల వ్యవస్థాపకులు శ్రీ చైతన్య రాజులు తెలిపారు. 7 జనవరి 2024 మధ్యాహ్నం 2 గంటలకు జరిగే "ఆంధ్రమేవ జయతే " సభలో వారు ముఖ్య అతిధిగా పాల్గొంటారు. అంధ్ర వాఙ్మయ వైజయంతి ప్రత్యేక సంచికను ఆవిష్కరించి, సౌజన్యం అందించిన వదాన్యులను సత్కరిస్తారని డా.గజల్ శ్రీనివాస్ తెలిపారు. -డా.గజల్ శ్రీనివాస్,అధ్యక్షులు,9849013697 -
సార్.. ప్రేమలో పడ్డా కాస్త డబ్బు సర్దండి!
కోహిమా: రాజకీయ నాయకులకు తరచూ ఉద్యోగం, ఉపాధి, డబ్బు సాయం కావా లంటూ విజ్ఞాపనలు అందుతుండటం సహజంగా జరిగేదే. కానీ, ఓ యువకుడు మాత్రం తన కలల రాణితో ప్రేమ వ్యవ హారం సాగించేందుకు డబ్బు సర్దాలంటూ ప్రాధేయ పడ్డాడు. ఈ విడ్డూరం నాగాలాండ్లో చోటుచేసుకుంది. బీజేపీ నాగాలాండ్ అధ్యక్షుడు టెమ్జెన్ ఇమ్నా అలోంగ్ తనకు ఎదురైన అరుదైన అనుభవాన్ని స్వయంగా ‘ఎక్స్’లో వివరించారు. ఆయనకు అరవింద పాండా అనే ఓ యువకుడు పంపిన మెయిల్లో ఇలా ఉంది.. ‘సర్, ఈ నెల 31వ తేదీన నా గర్ల్ఫ్రెండ్తో మొద టిసారిగా డేటింగ్కు వెళ్తున్నాను. కానీ, ఇప్పటి వరకు నాకు ఉద్యోగం రాలేదు. దయవుంచి కొద్దిగా సాయం చేయండి. ఏదో ఒకటి చేయండి సార్’అని అందులో ఉంది. అందుకాయన, ‘ఎలాంటి సాయం కావాలో చెప్పండి’అంటూ బదులి చ్చారు. ‘ఎక్స్’లో అలోంగ్ పోస్టుకు నెటిజన్లు తమాషా వ్యాఖ్యలతో స్పందించారు. యువకు డితోపాటు డేటింగ్కు వెళ్లాలంటూ అలోంగ్కు ఒకరు సూచించగా, అతడికి డబ్బు సాయం చేయాలని మరొకరు కోరారు. లవర్ బోయ్ అరవింద పాండాకు ఎమ్మెల్యేగా అవకాశమి వ్వాలని, అతడికి ఉద్యోగమి వ్వాలని.. ఇలా రకరకాల సూచ నలు చేశారు. తల్లిదండ్రులు ఎంపిక చేసిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని మరొకరు ఆ యువకుడికి తెలిపారు. ఆ యు వకుడు జీవితంలో కఠినమైన పాఠా లను నేర్చు కోవాల్సిన అవసరం ఉన్నందున ఆ వినతిని పట్టించుకోవద్దని కొందరు పేర్కొన్నారు. -
ఇండియా ఫస్ట్ సన్రైజ్.. నాగాలాండ్ మంత్రి వీడియో వైరల్..
కోహిమా: నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ ఉండే నాగాలాండ్ మంత్రి టెమ్జెన్ ఇమ్నా అలోంగ్.. ఏదో ఒక కొత్త విషయంతో అభిమానుల ముందుకు వస్తుంటారు. కామెడీ, సందేశాత్మక, నాలెడ్జ్కు సంబంధించిన వీడియోలను పోస్టు చేస్తూ ఉంటారు. తాజాగా భారత దేశంలో సూర్యోదయం మొదట అయ్యే దృగ్విషయాన్ని వీడియో రూపంలో పోస్టు చేశారు. అరుణాచల్ ప్రదేశ్లోని డాంగ్ వ్యాలీని టెమ్జెన్ షేర్ చేశారు. అప్పుడే వెలుతురు వస్తుండగా.. అందమైన లోయ ప్రాంతాలు మనోహరంగా కనిపించాయి. మేఘాలు తాకుతున్న పర్వత శిఖరాల మధ్య నది పరవళ్లు, పచ్చని లోయ ప్రాంతాల్లో విహారాన్ని గుర్తు చేశారు. ఈశాన్య భారతం అందాలు సింపుల్గా ఒక్క వీడియోలో చూపించారు. గూగుల్ చేసి చూడండి అని ట్యాగ్ను జతచేసి వీడియోను పోస్టు చేశారు. భారత్లో మొదట సూర్యోదయం అయ్యే ప్రదేశంగా డాంగ్ లోయను చెప్పుకుంటారు. Google Kar Ke to Dekho 🤨 pic.twitter.com/FJYzzK9jYC — Temjen Imna Along (@AlongImna) September 13, 2023 ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అయింది. నెటిజన్లు కామెంట్లతో నింపేశారు. ప్రస్తుతం ఈశాన్య భారతం ట్రిప్లోనే ఉన్నా.. చాలా అందమైన ప్రదేశం అని ఓ యూజర్ కామెంట్ చేశారు. ఈ ప్రదేశాన్ని ఒక్కసారైనా తప్పకుండా చూడాలని మరో యూజర్ స్పందించారు. దేశంలో సూర్యుడు మొదట ముద్దాడే డాంగ్ లోయను మీరూ చూసేయండి మరి..! ఇదీ చదవండి: పార్క్లో సరదాగా.. -
Women : ఆడబిడ్డల ఆంధ్రా!
సాక్షి, అమరావతి: దేశంలో, రాష్ట్రంలో జననాల్లో బాలికల సంఖ్య పెరుగుతోంది. 2014–15 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే.. దేశంలో ప్రతి వెయ్యి మంది బాలురకు 2022–23లో బాలికల నిష్పత్తి 15కు పెరగ్గా, రాష్ట్రంలో 24కు పెరిగింది. దేశం మొత్తంతోపాటు చాలా రాష్ట్రాల్లో గతంలో కన్నా జననాల్లో బాలికల నిష్పత్తి పెరుగుతోందని, ఇది శుభపరిణామమని కేంద్ర మహిళా శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ పేర్కొంది. అయితే బిహార్తో పాటు మిజోరాం, నాగాలాండ్లలో గతం కన్నా బాలికల నిష్పత్తి తగ్గడం ఆందోళన కలిగిస్తోందని తెలిపింది. బేటీ బచావో బేటీ పఢావో పథకం ద్వారా బాలికలు, మహిళా సాధికారతకు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖతో కలిసి ప్రయత్నాలు చేస్తున్నట్టు కేంద్ర మహిళా శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ పథకం కింద జనన సమయంలో లింగ నిర్ధారణను గుర్తించే చర్యలను ప్రభుత్వం నిలుపుదల చేసిందని, ఆడపిల్లల జననాల పట్ల అవగాహన పెంచేందుకు చర్యలు చేపట్టిందని తెలిపింది. ఆడపిల్లల అభివృద్ధికి ప్రోత్సాహం ఆడపిల్లల విద్య, పెరుగుదల, అభివృద్ధి, హక్కులకు మద్దతుగా సానుకూల చర్యలను ప్రోత్సహించడానికి అన్ని స్థాయిల్లో ప్రయత్నాలు చేస్తున్నట్టు కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ వెల్లడించింది. ఇందుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు తగిన మార్గదర్శకాలతో కూడిన కార్యాచరణ క్యాలెండర్ జారీ అయినట్లు తెలిపింది. దానిని జాతీయ, రాష్ట్ర, జిల్లా స్థాయిలో అమలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు పేర్కొంది. లింగ నిష్పత్తి తగ్గకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖలు రాసినట్టు తెలిపింది. -
బిగ్ బ్రో.. హే చోటా బ్రో.. ఆనంద్ మహీంద్రా, నాగాలాండ్ మంత్రి ఫన్నీ ట్వీట్స్!
మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా (Anand Mahindra), నాగాలాండ్ మంత్రి, బీజేపీ నేత టెమ్జెన్ ఇమ్నా అలోంగ్ (Temjen Imna Along) మధ్య ఫన్నీ సంభాషణ జరిగింది. ఆనంద్ మహీంద్రాను మంత్రి అలోంగ్ బిగ్ బ్రో అని సంబోధించగా.. మంత్రిని ఆనంద్ మహీంద్రా చోటా బ్రో అంటూ సంబోధించారు. నాగాలాండ్ మంత్రి టెమ్జెన్ ఇమ్నా అలోంగ్ ఇటీవల ఎక్స్ (ట్విటర్)లో మహీంద్రా థార్ ఎలక్ట్రిక్ వాహన (Mahindra Thar.e) చిత్రాన్ని పోస్ట్ చేస్తూ మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రాను ట్యాగ్ చేశారు. ఈ ఎలక్ట్రిక్ ఎస్యూవీని ఆగస్టు 15న మహీంద్రా కంపెనీ ఆవిష్కరించింది. మహీంద్రా థార్ ఎలక్ట్రిక్ ఎస్యూవీని అలోంగ్ ప్రశంసిస్తూ ‘బిగ్ బ్రో ఆనంద్ మహీంద్రా.. కొత్త వాహనం నెక్ట్స్ లెవల్లో ఉంది’ అంటూ రాసుకొచ్చారు. వాహనాన్ని రూపొందించిన బృందానికి అభినందనలు తెలియజేశారు. అలోంగ్ ట్వీట్కు ఆనంద్ మహీంద్రా కూడా ప్రతిస్పదించారు. ‘హే చో బ్రో (చోటా బ్రో)’ అంటూ ఆప్యాయంగా సంబోధించారు. మహీంద్రా థార్.ఈ వాహనాన్ని ఉద్దేశిస్తూ ఇది మీ స్థాయికి చేరిందంటూ పేర్కొన్నారు. ఈ వాహనం లాంచ్ అయిన తర్వాత మిమ్మల్ని షికారుకు తీసుకెళ్తుందని అలోంగ్కు తెలియజేశారు. Hey Cho Bro (Chota Bro) @AlongImna Aakhir aapke level tak pahunch gaye! When this is launched, will take you for a spin in it… #TharE https://t.co/3eY8a24e9j — anand mahindra (@anandmahindra) August 20, 2023 -
నాడు కుక్క మాంసంపై నిషేధం.. నేడు ఎత్తివేత.. మధ్యలో ఏం జరిగింది?
రాష్ట్రంలో కుక్క మాంసం అమ్మకాలు, కొనుగోళ్లపై నిషేధం విధిస్తూ నాగాలాండ్ ప్రభుత్వం గతంలో విడుదల చేసిన నోటిఫికేషన్ను గౌహతి హైకోర్టు ఆమధ్య రద్దు చేసింది. హైకోర్టు సింగిల్ బెంచ్.. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్, 2011పై ఈ సందర్భంగా పలు ప్రశ్నలు లేవనెత్తింది. కుక్క మాంసం అమ్మకాల నిషేధం వెనుక.. నాగాలాండ్ ప్రభుత్వం2020, జూలై 4న కుక్క మాంసాన్ని నిషేధిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నోటిఫికేషన్ను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జారీ చేశారు. కుక్క మాంసం కొనుగోళ్లు, అమ్మకాలను నిషేధించారు. నోటిఫికేషన్లో తెలిపిన వివరాల ప్రకారం వాణిజ్య, రెస్టారెంట్లు వంటి ప్రదేశాలలో కూడా కుక్క మాంసం అమ్మకాలను నిషేధించారు. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఏఐ 2014 సర్క్యులర్ను అనుసరించి నాగాలాండ్ ప్రభుత్వం ఈ చర్య తీసుకుంది. ఇది ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ రెగ్యులేషన్, 2011లో పేర్కొన్న జంతువులు మినగా ఇతర జాతుల జంతువులను వధించడాన్ని నిషేధించింది. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ రెగ్యులేషన్, 2011లోని రూల్ 2.5.1(a)లోని వివరాల ప్రకారం గొర్రెలు, మేకలు, పందులు,పౌల్ట్రీ, చేపలను ఆహారంగా భావించి, వాటిని వధించేందుకు అనుమతి కల్పించారు. ‘ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు’ హైకోర్టులో జస్టిస్ మార్లీ వాన్కుంగ్ సింగిల్ జడ్జి ధర్మాసనం కేసును విచారిస్తూ ఆహార భద్రత, ప్రమాణాల నియంత్రణ- 2011లో కుక్క పేరు చేర్చకపోవడంలో ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని పేర్కొంది. ఎందుకంటే ఈశాన్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే కుక్క మాంసం కనిపిస్తుంది. ఈ పరిస్థితిలో దాని పేరును జాబితాలో చేర్చకపోవడం ఊహకు అతీతమేమీ కాదని వివరించింది. కుక్క మాంసం అంటే ఎంతో ఇష్టం నాగా ప్రాంతాల్లో నేటికీ కుక్క మాంసాన్ని ఇష్టంగా తింటున్నారని, ఇది శతాబ్దాలుగా కొనసాగుతోందని హైకోర్టు పేర్కొంది. ది అంగామి నాగాస్, ది ఏఓ నాగాస్ ది రెంగ్మా నాగాస్ తదితర పుస్తకాలు, వివిధ పత్రాలను పరిశీలిస్తే నాగాలాండ్లోని వివిధ గిరిజన సమూహాలలో కుక్క మాంసం వినియోగం శతాబ్దాలుగా వస్తున్నదని హైకోర్టు పేర్కొంది. ‘కుక్కలను హింసిస్తున్నారు’ విచారణ సందర్భంగా యానిమల్స్ అండ్ హ్యూమన్ సొసైటీ ఇంటర్నేషనల్/ఇండియా తరఫు న్యాయవాది తన వాదనలో కుక్కలను స్మగ్లింగ్ చేస్తున్న తీరు ఆందోళన కలిగిస్తున్నదన్నారు. కుక్కల కాళ్లకు తాడు కట్టి, దాని నోటికి కూడా తాడు కట్టి గోనె సంచిలో వేస్తారని పేర్కొన్నారు. వీటికి రోజుల తరబడి ఆహారం, నీరు ఇవ్వరని ఆరోపించారు. ఇది జంతువుల పట్ల క్రూరత్వం ప్రదర్శించడం కిందకు వస్తుందన్నారు. అయితే తాము కుక్క మాంసంపై నిషేధం విధించడాన్ని సమర్థించలేదని హైకోర్టు ముందు విన్నవించారు. దీనిపై స్పందించిన కోర్టు జంతువులపై క్రూరత్వానికి సంబంధించిన కేసుల్లో ఐపీసీని ఆశ్రయించవచ్చని తెలిపింది. ఇది కూడా చదవండి: బజరంగ్ దళ్ ఎప్పుడు, ఎలా ఆవిర్భవించింది? కాంగ్రెస్తో దీనికి కనెక్షన్ ఏమిటి? -
కేంద్రానికి సుప్రీంకోర్టు మొట్టికాయలు
న్యూఢిల్లీ: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు తీవ్రస్థాయిలో మండిపడింది. బీజేపీ పాలిత రాష్ట్ర ప్రభుత్వాలపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని కేంద్రాన్ని ప్రశ్నించింది. నాగాలాండ్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమవడంపై సర్వోన్నత న్యాయస్థానం స్పందిస్తూ.. కేంద్రానికి చీవాట్లు పెట్టింది. కాగా నాగాలాండ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వంతోపాటు రాష్ట్ర ఎన్నికల కమిషన్కు సుప్రీంకోర్టు గతంలో ఆదేశాలు ఇచ్చింది. అయితే వీటిని పాటించడం లేదంటూ దాఖలైన ధిక్కార పిటిషన్ విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు తాజాగా ఈ వ్యాఖ్యలు చేసింది. సొంత పార్టీ అధికారంలో రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఎందుకు వ్యవహరించడం లేదని ప్రశ్నించింది అత్యున్నత న్యాయస్థానం. ఇతర రాష్ట్ర ప్రభుత్వాలపై తీవ్ర నిర్ణయాలు తీసుకుంటారు. అదే రాష్ట్రంలో మీ(బీజేపీ) ప్రభుత్వం అధికారంలో ఉంటే ఏ చర్యలు ఉండవని సుప్రీం ఘాటు వ్యాఖ్యలు చేసింది. రిజర్వేషన్ అనేది నిశ్చయాత్మక చర్య అని, దీని ఆధారంగా మహిళా రిజర్వేషన్ ఉంటుందని కోర్టు పేర్కొంది. రాజ్యాంగ నిబంధనను ఉల్లఘించి ఎలా వ్యవహరిస్తారనేది అర్థం కావడం లేదని జస్టిస్ ఎస్కే కౌల్ అన్నారు. నాగాలాండ్ మహిళల విద్య, ఆర్థిక, సామాజిక స్థితిగతులు అత్యుత్తమంగా ఉన్న రాష్ట్రం అని.. మహిళలకు రిజర్వేషన్లు ఎందుకు అమలు చేయలేకపోతున్నారనేది అర్థం కావడం లేదని అన్నారు. విచారణ సందర్భంగా బీజేపీ పాలిత మణిపూర్లో జరిగిన హింసాకాండను కూడా ఆయన ప్రస్తావించారు. చదవండి: మణిపూర్లో మరోసారి ఇంటర్నెట్ వినియోగంపై ఆంక్షలు -
ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్కు భారీ ఎదురుదెబ్బ
ఎన్సీపీ అధినేత శరద్ పవార్కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. నాగాలాండ్లో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మొత్తం ఏడుగురు ఎమ్మెల్యేలు అజిత్ పవార్కు మద్దతు తెలుపుతున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. ‘నాగాలాండ్కు చెందిన పార్టీ నేతలంతా అజిత్ పవార్కు మద్దతు తెలుపుతున్నాం’ అని ఈశాన్య రాష్ట్రానికి చెందిన ఏడుగురు ఎన్సీపీ ఎమ్మెల్యేలు పేర్కొన్నారు. . కాగా, జూలై 2న ఎన్సీపీని రెండుగా చీల్చిన అజిత్ పవార్ 30-35 మంది ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే, ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వంలో చేరిన విషయం తెలిసిందే. అందులో అజిత్ పవార్ డిప్యూటీ సీఎంగా, మరో ఎనిమిది మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే తిరుగుబాటు అనంతరం కూడా అజిత్.. శరద్ పవార్తో రెండుసార్లు భేటీ కావడం విశేషం.. తన వర్గం నేతలతో కలిసి ముంబయిలోని శరద్ పవార్ నివాసానికి చేరుకొని, పార్టీని ఐక్యంగా ఉంచే విషయంపై ఆయనతో చర్చించారు. తమ విజ్ఞప్తిని విన్న శరద్ పవార్.. మౌనంగా ఉన్నారే తప్ప ఎలాంటి స్పందనా వ్యక్తం చేయలేదని రెబల్ ఎమ్మెల్యేలు వెల్లడించారు. చదవండి: మణిపూర్లో మహిళల నగ్న ఊరేగింపు.. ఆరోజు జరిగింది ఇదేనా! -
ఇది కదా లక్ అంటే.. గంటలో కోటి!
Nagaland State Lottery: ఏదో అదృష్టం కలిసి వస్తుందని చాలామంది లాటరీలు కొంటారు. మరికొందరైతే ఏళ్ల తరబడి లాటరీ టికెట్లు కొంటూనే ఉంటారు. ఆ బంపర్ఎ ప్రైజ్ తమకు ఎప్పుడు తగులుతుందా అని ఎదురు చూస్తూనే ఉంటారు. కానీ లాటరీ టిక్కెట్ కొన్న గంటకే కోటి రూపాయలు గెలుచుకోవడం గురించి విన్నారా? పంజాబ్లో ఒక వ్యక్తికి ఇలాంటి జాక్పాట్ తగిలింది. ఈ సంతోషంతో ఉక్కిరిబిక్కిరి కావడం అతని వంతైంది. వివరాలను పరిశీలిస్తే.. పంజాబ్, గురుదాస్పూర్ జిల్లాకు చెందిన రూపీందర్జిత్ సింగ్ అగ్రికల్చర్ డెవలెప్మెంట్ బ్యాంకులో క్లర్క్గా పనిచేస్తున్నాడు. అందరిలాగారే ఈయన కూడా గత ఏడాది కాలంగా లాటరీ టిక్కెట్లు కొంటూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు కానీ ఇంత తొందరగా లక్ష్మీ దేవి తన ఇంటికి నడిచి వస్తుందని మాత్రం అస్సలు ఊహించలేదు. (ఇషా అంబానీ దూకుడు.. అలియా భట్తో భారీ డీల్!) ఎప్పటిలాగే రూపీందర్జిత్ సింగ్ శనివారం మధ్యాహ్నం నాగాల్యాండ్ లాటరీ టిక్కెట్లు రూ.6 పెట్టి 25 టికెట్లను కొనుగోలు చేశాడు. ఆ తరువాత ఆఫీసుకెళ్లి తన పనిలో నిమగ్నమైపోయాడు. ఇంతలో దాదాపు గంట తరువాత లాటరీ ఏజెంట్ నుంచి ఫోన్ వచ్చింది. ఏకం రూ. కోటి గెలుచుకున్నట్టు సమాచారం అందించడంతో ఎగిరి గంతేశాడు రూపిందర్. ఇన్నళ్లకి తన కల నెలవేరిందని, ఈ డబ్బును తన పిల్లలు, కుటుంబం భవిష్యత్తు కోసం ఖర్చు చేస్తానన్నారు. అంతేకాదు ఆపదలో ఉన్న పేదలకు కూడా సాయం చేస్తానని చెప్పాడు రూపీందర్ కొండంత సంబరంతో. (ఐటీ ఉద్యోగులకు బ్యాడ్ న్యూస్: మరింత గడ్డు కాలం?) తన అలవాటే తనను కోటీశ్వరుడిని చేసిందని రూపిందర్జిత్ చెప్పాడు. లాటరీని గెలుచుకున్నందుకు బ్యాంకు సిబ్బంది అభినందించారు. కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులకు శుభాకాంక్షలు తెలుపుతూ ఫోన్లు చేశారు. కాగా గతంలో ఇదే ప్రాంతంలో కిరాణా దుకాణం యజమానికి రూ.2.5 కోట్ల లాటరీ బంపర్ ప్రైజ్ వచ్చింది. మరోసారి బంపర్ ప్రైజ్ గెలవడంతో డేరా బాబా నానక్ టౌన్ పేరు మరోసారి మారుమోగింది. ( -
భయంకర దృశ్యాలు.. కొండచరియలు విరిగి కార్లపైకి దూసుకొచ్చి..
నాగాలాండ్లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. భారీ వర్షాలకు కొండచరియలు విరిగి రోడ్డుపై పడటంతో ఆ దారిలో వెళ్తున్న రెండు కార్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఈ దుర్ఘటనలో ఇద్దరు మృతిచెందగా.. పలువురు గాయపడ్డారు. చుమౌకెడిమా జిల్లాలోని జాతీయ రహదారి 29పై మంగళవారం సాయంత్రం 5 గంటల సమయంలో ఈ ప్రమాదం వెలుగుచూసింది. భారీ వర్షాల కారణంగా దిమాపూర్ నుంచి కోహిమా మధ్యరోడ్డు మీద ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఈ క్రమంలో వాహనాలు నిలిచిపోయాయి. ఇంతలో పక్కనే ఉన్న ఎత్తైన కొండపై నుంచి భారీ బండరాయి రోడ్డు మీదకు దూసుకురావడంతో రెండు వాహనాలు దెబ్బతిన్నాయి. దీంతో కొహిమా నుంచి వస్తున్న రెండు కార్లు పూర్తిగా నుజ్జునుజ్జయ్యాయి. సంఘటన స్థలంలోనే ఓ వ్యక్తి మరణించగా.. ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా మరో వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. మరో ముగ్గురు గాయపడ్డారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన భయంకర దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. కాగా ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని ‘పాకలా పహార్’ అని పిలుస్తారని తెలుస్తోంది. అయితే ఆ ప్రదేశంలో ఎక్కువగా కొండచరియలు విరిగిపడటం, రాళ్లు జారిపడటం తరుచుగా జరుగుతుంటాయి. మరోవైపు ఈ దుర్ఘటనపై నాగాలాండ్ ముఖ్యమంత్రి నీఫియు రియో విచారం వ్యక్తం చేశారు. Un desprendimiento de rocas en Nagaland, India, deja 2 muertos y 3 heridos tras aplastar un coche. 😳😳 pic.twitter.com/3cCqKT0y0k — Momentos Virales (@momentoviral) July 4, 2023 ఈ మేరకు ట్విటర్లో స్పందిస్తూ.. ‘దిమాపూర్, కోహిమా మధ్యనున్న జాతీయ రహదారిపై మంగళవారం సాయంత్రం 5 గంటలకు బండరాయి పడిపోవడంతో ఇద్దరు మృతి చెందడంతోపాటు మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. క్షతగాత్రులకు అత్యవసర సేవలు, అవసరమైన వైద్య సహాయం అందించేందుకు మా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది. బాధిత కుటుంబాలకు రూ. 4 లక్షల ఆర్థిక సాయం ప్రకటిస్తున్నాం’ అని ట్వీట్ చేశారు. Oo god😭 #Nagaland pic.twitter.com/uzpnawW3Ej — Tradeholics (@Tradeholics) July 4, 2023 -
నాటు పాట పాడుతున్న నాగలాండ్ రైతులు
-
నాటు పాట మామూలుగా లేదు
-
వాహ్ క్యా పోజ్ హై.. రాహుల్ గాంధీపై బీజేపీ మంత్రి ప్రశంసలు
న్యూఢిల్లీ: రాహుల్ గాంధీ లండన్ టూర్పై కాంగ్రెస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం జరుగుతున్న సమయంలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. కమలం పార్టీ నేత, నాగాలాండ్ మంత్రి తెజ్మెన్ ఇమ్నా అలోంగ్ రాహుల్పై ప్రశంసల వర్షం కురిపించారు. దీంతో నెటిజన్లు అవాక్కయ్యారు. లండన్లోని ఛాథం హౌస్లో రాహుల్ గాంధీ మాటామంతీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన సూటు ధరించి జేబులో చేతులు పెట్టుకున్న ఫొటోను కాంగ్రెస్ ట్విట్టర్లో షేర్ చేసింది. 'మీరు ఒంటరిగా ఉన్నా సరే.. మీరు నమ్మినదాని కోసమే నిలబడండి' అని రాసుకొచ్చింది. దీనిపై స్పందించిన తెజ్మెన్ .. రాహుల్ ఫొటో చాలా బాగా వచ్చిందని, అందరూ దీన్ని ఒప్పుకోవాల్సిందేని ప్రశంసించారు. అలాగే ఆయన పోజు నెక్స్ట్ లెవల్ అని ఆకాశానికెత్తారు. Stand up for what you believe in, even if it means you stand alone. pic.twitter.com/dV3fG4NfB9 — Congress (@INCIndia) March 6, 2023 ఏంటీ ఈయన రాహుల్ను ఇంతలా పొగుడుతున్నారు అని అనుకునేలోపే అసలు ట్విస్ట్ ఇచ్చారు తెజ్మన్. ఈ ఫొటో బాగుంది కానీ, దీని క్యాప్షనే ఒరిజినల్ కాదని సైటర్లు వేశారు. కనీసం క్యాప్షన్ అయినా సొంతంగా రాసుకోవచ్చుగా అని ఎద్దేవా చేశారు. कम से कम Caption तो खुद लिखा करो 🙄 pic.twitter.com/YvHUyfKGZF — Temjen Imna Along (@AlongImna) March 8, 2023 చదవండి: త్రిపుర సీఎంగా డాక్టర్ మాణిక్ సాహా ప్రమాణం -
మేఘాలయ, నాగాలాండ్ ముఖ్యమంత్రులు ప్రమాణం
నాగాలాండ్, మేఘాలయా ముఖ్యమంత్రులుగా ఎన్డీపీపీ చెందిన నీఫియా రియో, నేఫనల్ పీపుల్స్ పార్టీకి చెందిన కాన్రాడ్ సంగ్మా మంగళవారం ప్రమాణం చేశారు. మొదటగా నేషనల్ పీపుల్స్ పార్టీ అధ్యక్షుడు కాన్రాడ్ కె సంగ్మా మేఘాలయ ముఖ్యమంత్రిగా వరుసగా రెండోసారి ప్రమాణ స్వీకారం చేశారు. ఈ వేడుకకు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా తోపాటు బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా హాజరయ్యారు. మంగళవారం సంగ్మా తోపాటు ఎన్పీపీకి చెందిన ప్రిస్టోన్ టిన్సాంగ్, స్నియావ్భలాంగ్ ధర్లు ఉప ముఖ్యమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. అలాగే బీజేపీకి చెందిన అలెగ్జాండర్ లాలూ హెక్, యుడీపీకి చెందిన పాల్ లింగ్డో, కిర్మెన్ షిల్లా, హెచ్ఎస్పీడీపీకి చెందిన షక్లియార్ వార్జ్రీ కూడా మంత్రులుగా ప్రమాణం చేశారు. ఈ మేరకు నేషనల్ పీపుల్స్ పార్టీకి చెందిన మొత్తం ఏడుగురు ఎమ్మెల్యేలలో యూడీపీ నుంచి ఇద్దరు, బీజేపీ, హెచ్ఎస్పీడీపీకి నుంచి ఒక్కొక్కరు సంగ్మా మంత్రివర్గంలో సభ్యులుగా గవర్నర్ ఫాగు చౌహాన్ ప్రమాణం చేయించారు. ఇదేరోజు నాగాలాండ్ ముఖ్యమంత్రిగా నేషనలిస్ట్ డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ (ఎన్డిపిపి)కి చెందిన నీఫియు రియో కూడా ప్రమాణ చేశారు. సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన నీఫియు ఐదోసారి ప్రమాణం చేశారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రులుగా టిఆర్ జెలియాంగ్, వై పాటన్ ప్రమాణ స్వీకారం చేయగా, రియో క్యాబినెట్లోని ఇతర సభ్యులు కూడా ప్రమాణ స్వీకారం చేశారు. అలాగే సోషల్ మీడియాలో కామెడీ చేస్తూ ఫేమస్ అయినా రాష్ట్ర బీజేపీ చీఫ్ టెమ్జెన్ ఇమ్నా అలోంగ్, నానాగాలాండ్ అసెంబ్లీకి తొలిసారిగా ఎన్నికైన ఇద్దరు మహిళల్లో ఒకరైన సల్హౌతుయోనువో క్రూసే మంత్రి మండలి సభ్యులుగా ప్రమాణం చేశారు. హోలీ తర్వాత రోజు గురువారం త్రిపురలో బీజేపీకి చెందిన మాణిక్ సాహా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఎన్నికల ప్రచారం ప్రారంభమైనప్పటి నుంచి ఎన్డీపీపీ, బీజేపీ రెండూ తన ముఖ్యమంత్రి అభ్యర్థిగా 72 ఏళ్ల రియోను ఎన్నుకున్నాయి. అలాగే రాష్ట్రంలోని అన్ని ఇతర పార్టీలు రియో నేతృత్వంలోని కూటమికి తమ మద్దతను ఇచ్చాయి. మేఘాలయాలో ఎన్పీపీ నేతృత్వంలోని కూటమి బీజేపీకి చెందిన ఇద్దరితో సహా మొత్తం 45 మంది ఎమ్మెల్యేల మద్దతుతో సీఎం కాన్రాడ్ సంగ్మా మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నారు. సంగ్మా ఫిబ్రవరి 27న జరిగిన ఎన్నికల్లో 26 సీట్లు గెలుచుకున్నారు. ఆయన మంగళవారం ఇతర క్యాబినేట్ మంత్రులతో కలిసి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కాగా, సోమవారం కొత్తగా ఎన్నికైన 58 ఎమ్మెల్యేలు అసెంబ్లీలో సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేయగా, ప్రొటెం స్పీకర్ తిమోతి షిరా వారితో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ వేడుకగా రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న సంగ్మా కూడా హాజరయ్యారు. కొత్తగా ఏర్పాటైన అసెంబ్లీకి స్పీకర్ను మార్చి9న ప్రత్యేక హౌస్లో సెషన్లో ఎన్నుకోనున్నట్టు సమాచారం. త్రిపురలో బీజేపీ నాయకుడు మాణిక్ సాహా ముఖ్యమంత్రి పదవిలో కొనసాగుతారని ఆ పార్టీ ప్రకటించింది. సోమవారం అగర్తలాలో జరిగిన బీజేపీ శాసనసభా పక్ష సమావేశంలో సాహాను ముఖ్యమంత్రిగా ఏకగ్రీవంగా ఎంపిక చేసినట్లు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు రాజీబ్ భట్టాచారీ తెలిపారు. అంతేగాదు బీజేపీ దాని మిత్ర పక్షాలు త్రిపుర, నాగాలాండ్లో అధికారాన్ని నిలుపుకోగా, మేఘాలయాలో నేషనల్ పీపుల్స్ పార్టీ అతి పెద్ద పార్టీగా అవతరించింది. (చదవండి: విమానం ల్యాండింగ్ అవుతుందనంగా.. ఎమర్జెన్సీ డోర్ తెరిచే యత్నం..) -
సిట్టింగ్ ఎమ్మెల్యేలను ఓడించి చరిత్ర సృష్టించిన మహిళా ఎమ్మెల్యేలు
కోహిమా: 60 ఏళ్ల నాగాలాండ్ చరిత్రలో తొలిసారిగా ఇద్దరు మహిళలు ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. అధికార ఎన్డీపీపీ టిక్కెట్పై పశ్చిమ అంగామీ స్థానం నుంచి హెకాని జకాలు, దిమాపూర్–3 స్థానం నుంచి సల్హోటనో క్రుసె విజయం సాధించారు. వారిద్దరూ సిట్టింగ్ ఎమ్మెల్యేలను ఓడించడం విశేషం. నాగాలాండ్లో ఎన్డీపీపీ–బీజేపీ హవా నాగాలాండ్లో అధికార నేషనలిస్ట్ డెమొక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ(ఎన్డీపీపీ)–బీజేపీ కూటమి మళ్లీ అధికార పీటం దక్కించుకుంది. 60 స్థానాలున్న అసెంబ్లీలో 37 స్థానాల్లో జయకేతనం ఎగురవేసింది. కూటమిలోని ఎన్డీపీపీకి 25, బీజేపీకి 12 సీట్లు దక్కాయి. ఇతర పార్టీ లేవీ రెండంకెల సీట్లు సాధించలేకపోయాయి. ఎన్సీపీ 7, నేషనల్ పీపుల్స్ పార్టీ(ఎన్పీపీ) 5 సీట్లు గెలుచుకున్నాయి. ఎల్జేపీ(రామ్విలాస్ పాశ్వాన్) 2, ఆర్పీఐ(అథవాలే) 2, ఎన్పీఎఫ్ 2 సీట్లలో గెలుపొందాయి. జేడీ(యూ) ఒక స్థానంలో విజయం సాధించింది. కాంగ్రెస్ పార్టీ కి ఒక్కటంటే ఒక్కటి కూడా దక్కలేదు. నలుగురు స్వతంత్ర అభ్యర్థులు గెలుపొందారు. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన అన్ని పార్టీ ల అభ్యర్థులకు ఎన్డీపీపీ నేత, సీఎం రియో అభినందనలు తెలిపారు. -
ఈశాన్యంలో కమల వికాసం
అగర్తలా/షిల్లాంగ్/కోహిమా: ‘మిషన్ నార్త్ఈస్ట్’ పేరిట ఈశాన్య రాష్ట్రాల్లో జెండా ఎగురవేయడమే లక్ష్యంగా పెట్టుకున్న భారతీయ జనతా పార్టీ కి నూతనోత్తేజం లభించింది. ఈశాన్య భారతంలో కమలం వికసించింది. త్రిపుర, నాగాలాండ్, మేఘాలయా శాసనసభ ఎన్నికల ఫలితాలు గురువారం వెలువడ్డాయి. త్రిపురలో బీజేపీకి సంపూర్ణ మెజార్టీ దక్కింది. 60 స్థానాలకు గాను సొంతంగా 32 స్థానాలు గెలుకొని, ఒక్కే ఒక్క స్థానంలో నెగ్గిన మిత్రపక్షం ఐపీఎఫ్టీతో కలిసి వరుసగా రెండోసారి ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవుతోంది. నాగాలాండ్లో 60 అసెంబ్లీ స్థానాలుండగా, నేషనలిస్ట్ డెమొక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ (ఎన్డీపీపీ)–బీజేపీ కూటమి 37 స్థానాల్లో పాగా వేసింది. ఎన్డీపీపీకి 25, బీజేపీకి 12 సీట్లు లభించాయి. రెండు పార్టీలు కలిసి మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాయి. 60 స్థానాలున్న మేఘాలయాలో ఒంటరిగా పోటీకి దిగి, కేవలం 2 సీట్లే గెలుచుకున్న బీజేపీ కింగ్మేకర్గా అవతరిస్తుండడం గమనార్హం. 26 సీట్లలో నెగ్గిన అధికార నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్పీపీ) బీజేపీ మద్దతుతో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించుకుంది. ప్రభుత్వంలో బీజేపీ మళ్లీ జూనియర్ భాగస్వామిగా చేరినా ఆశ్చర్యం లేదని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. మరోవైపు ఈ ఎన్నికల ఫలితాలు ప్రతిపక్ష కాంగ్రెస్కు చేదు అనుభవాన్నే మిగిల్చాయి. నాగాలాండ్లో 5, త్రిపురలో 3 సీట్లు గెలుచుకున్న ఆ పార్టీ మేఘాలయాలో సున్నా చుట్టేసింది. త్రిపురలో కొత్త పార్టీ తిప్రా మోథా ఏకంగా 13 సీట్లు తన ఖాతాలో వేసుకుంది. త్రివేణికే ఈ మొత్త్తం క్రెడిట్: మోదీ ఎన్నికల్లో బీజేపీ స్థిరంగా విజయాలు సాధిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. మేఘాలయా, నాగాలాండ్, త్రిపుర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఆయన స్పందించారు. గురువారం పార్టీ ప్రధాన కార్యాలయంలో నేతలు, కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. మూడు రాష్ట్రాల్లో పార్టీ పనితీరు పట్ల కార్యకర్తలకు అభినందనలు తెలియజేశారు. బీజేపీ గెలుపునకు గాను క్రెడిట్ మొత్తం ‘త్రివేణి’కే ఇవ్వాలన్నారు. బీజేపీ ప్రభుత్వాలు చేసిన అభివృద్ధి పనులు, ఆయా ప్రభుత్వాల పని సంస్కృతి, పార్టీ కార్యకర్తల అంకితభావం వల్లే విజయాలు లభిస్తున్నాయని స్పష్టం చేశారు. ఈశాన్య ప్రాంతం ఢిల్లీకి, దిల్(హృదయం)కి ఎక్కువ దూరంలో లేదన్న సంగతి ఈ ఫలితాలను బట్టి తెలుస్తోందన్నారు. త్రిపుర, నాగాలాండ్లో బీజేపీ కూటమి మళ్లీ అధికారం దక్కించుకోవడం పార్టీ కార్యకర్తలందరికీ గర్వకారణమని మోదీ ట్విట్టర్లో పేర్కొన్నారు. మర్ జా మోదీ(చనిపో మోదీ) అని ప్రతిపక్షాలు కోరుకుంటున్నాయని, ప్రజలు మాత్రం మత్ జా మోదీ(వెళ్లొద్దు మోదీ) అని నినదిస్తున్నారని ప్రధాని స్పష్టం చేశారు. ఫలితాలు నిరుత్సాహకరం:కాంగ్రెస్ త్రిపుర, నాగాలాండ్, మేఘాలయ అసెంబ్లీల ఎన్నికల ఫలితాలు నిరుత్సాహం కలిగించాయని కాంగ్రెస్ పేర్కొంది. అయితే, ఉప ఎన్నికల్లో మూడు అసెంబ్లీ సీట్లలో సాధించిన విజయం ప్రోత్సాహం నింపిందని తెలిపింది. ఈ ఫలితాలపై సమీక్ష జరిపి, పార్టీ సంస్థాగత బలోపేతానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ తెలిపారు. త్రిపురలో కాషాయం రెపరెపలు త్రిపురలో బీజేపీ–స్థానిక పీపుల్స్ ఫ్రంట్ ఆఫ్ త్రిపుర(ఐపీఎఫ్టీ) కూటమి రెండోసారి అధికారం దక్కించుకుంది. మొత్తం 60 సీట్లకు గాను ఎన్నికల్లో 33 సీట్లు గెలుచుకుంది. ప్రద్యోత్ కిశోర్ దేవ్వర్మ నేతృత్వంలోని తిప్రా మోథా పార్టీ 13 స్థానాలు గెలుచుకుంది. ఇక వామపక్షాలు–కాంగ్రెస్ కూటమికి 14 స్థానాలు లభించాయి. 28 స్థానాల్లో పోటీ చేసిన తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కనీసం ఖాతా తెరవలేక చతికిలపడింది. ఆ పార్టీ కి కేవలం 0.88 శాతం ఓట్లు లభించాయి. ‘నోటా’ కంటే తక్కువ ఓట్లు పడడం గమనార్హం. బీజేపీ, ఐపీఎఫ్టీకి 2018తో పోలిస్తే ఈసారి సీట్ల సంఖ్య తగ్గింది. తిప్రా మోథా పార్టీ గణనీయంగా పుంజుకోవడమే ఇందుకు కారణం. ఈసారి 55 స్థానాల్లో పోటీకి దిగిన బీజేపీకి 32 స్థానాలు గెలుచుకుంది. ఐపీఎఫ్టీకి కేవలం ఒక స్థానం లభించింది. 47 సీట్లలో పోటీ చేసిన సీపీఎం కేవలం 11 సీట్లను తన ఖాతాలో వేసుకుంది. ఫార్వర్డ్ బ్లాక్, సీపీఐ, ఆర్ఎస్పీకి ఒక్క సీటు కూడా దక్కలేదు. కాంగ్రెస్ పార్టీ టిక్కెట్పై 13 మంది పోటీ చేయగా, ముగ్గురు విజయం సాధించారు. టౌన్ బార్దోవాలీ స్థానంలో పోటీ చేసిన మాణిక్ సాహా తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి ఆశి‹Ùకుమార్ సాహాపై 1,257 ఓట్ల తేడాతో గెలుపొందారు. మిస్టర్ క్లీన్కే మళ్లీ కిరీటం! త్రిపురలో మిస్టర్ క్లీన్గా గుర్తింపు పొందిన సాహా వరుసగా రెండోసారి ముఖ్యమంత్రిగా గద్దెనెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. 10 నెలల క్రితం ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఆయన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని విజయపథంలో నడిపించారు. దంత వైద్యుడైన సాహా గతంలో కాంగ్రెస్లో పనిచేశారు. 2016లో బీజేపీలో చేరారు. 2020లో త్రిపుర బీజేపీ అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టారు. 2022 ఏప్రిల్ 3 నుంచి జూలై 4 దాకా రాజ్యసభ సభ్యుడిగా సేవలందించారు. గత ఏడాది జరిగిన టౌన్ బార్దోవాలీ నియోజకవర్గం ఉప ఎన్నికలో ఎమ్మెల్యేగా గెలిచారు. బీజేపీ విప్లవ్ దేవ్ స్థానంలో ఆయనను సీఎంగా నియమించింది. మాణిక్ సాహా నిజాతీయపరుడిగా, కష్టపడి పనిచేసే నాయకుడిగా ప్రజల మనసులు గెలుచుకున్నారు. నాగాలాండ్లో ఎన్డీపీపీ–బీజేపీ హవా నాగాలాండ్లో అధికార నేషనలిస్ట్ డెమొక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ(ఎన్డీపీపీ)–బీజేపీ కూటమి మళ్లీ అధికార పీటం దక్కించుకుంది. 60 స్థానాలున్న అసెంబ్లీలో 37 స్థానాల్లో జయకేతనం ఎగురవేసింది. కూటమిలోని ఎన్డీపీపీకి 25, బీజేపీకి 12 సీట్లు దక్కాయి. ఇతర పార్టీ లేవీ రెండంకెల సీట్లు సాధించలేకపోయాయి. ఎన్సీపీ 7, నేషనల్ పీపుల్స్ పార్టీ(ఎన్పీపీ) 5 సీట్లు గెలుచుకున్నాయి. ఎల్జేపీ(రామ్విలాస్ పాశ్వాన్) 2, ఆర్పీఐ(అథవాలే) 2, ఎన్పీఎఫ్ 2 సీట్లలో గెలుపొందాయి. జేడీ(యూ) ఒక స్థానంలో విజయం సాధించింది. కాంగ్రెస్ పార్టీ కి ఒక్కటంటే ఒక్కటి కూడా దక్కలేదు. నలుగురు స్వతంత్ర అభ్యర్థులు గెలుపొందారు. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన అన్ని పార్టీ ల అభ్యర్థులకు ఎన్డీపీపీ నేత, సీఎం రియో అభినందనలు తెలిపారు. చరిత్ర సృష్టించిన మహిళా ఎమ్మెల్యేలు 60 ఏళ్ల నాగాలాండ్ చరిత్రలో తొలిసారిగా ఇద్దరు మహిళలు ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. అధికార ఎన్డీపీపీ టిక్కెట్పై పశ్చిమ అంగామీ స్థానం నుంచి హెకాని జకాలు, దిమాపూర్–3 స్థానం నుంచి సల్హోటనో క్రుసె విజయం సాధించారు. వారిద్దరూ సిట్టింగ్ ఎమ్మెల్యేలను ఓడించడం విశేషం. మేఘాలయలో హంగ్! మేఘాలయ శాసనసభ ఎన్నికల్లో ఓటర్లు ఏ పార్టీ కీ స్పష్టమైన తీర్పు ఇవ్వలేదు. రాష్ట్రంలో హంగ్ పరిస్థితులు నెలకొన్నాయి. మేఘలయలో మొత్తం 60 అసెంబ్లీ స్థానాలుండగా, 59 స్థానాల్లో ఎన్నికలు నిర్వహించారు. సోహియోంగ్ నియోజకవర్గంలో యునైటెడ్ డెమొక్రటిక్ పార్టీ (యూడీపీ) అభ్యర్థి డొంకుపర్ రాయ్ లింగ్డో ఫిబ్రవరి 20న మృతిచెందడంతో పోలింగ్ వాయిదా పడింది. ఈ ఎన్నికల్లో 26 సీట్లు గెలుచుకున్న అధికార నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్పీపీ) అతిపెద్ద పార్టీ గా అవతరించింది. మెజార్టీ కి కొద్దిదూరంలోనే ఆగిపోయింది. కాన్రాడ్ సంగ్మా ప్రభుత్వంలో ఎన్పీపీ మిత్రపక్షంగా వ్యవహరించిన యునైటెడ్ డెమొక్రటిక్ పార్టీ (యూడీపీ) 11 స్థానాల్లో నెగ్గింది. కాంగ్రెస్ 5, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ 5 సీట్లు గెలుచుకున్నాయి. ఒంటరిగా పోటీ చేసిన జాతీయ పార్టీ బీజేపీ కేవలం రెండు సీట్లకే పరిమితమైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా, బీజేపీ అధినేత జేపీ నడ్డా వంటి అగ్రనేతలు ప్రచారంలో పాల్గొనప్పటికీ ఆశించిన ఫలితందక్కలేదు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఎన్పీపీ నేత, ముఖ్యమంత్రి కాన్రాడ్ కే సంగ్మా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మద్దతును కోరుతున్నారని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ వ్యాఖ్యానించడం ఆసక్తికరంగా మారింది. మేఘాలయలో ప్రభుత్వ ఏర్పాటుకు ఎన్పీపీకి సహకరించాలంటూ తమ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సూచించారని హిమంత బిశ్వ శర్మ వ్యాఖ్యానించారు. నూతన ప్రభుత్వ ఏర్పాటుకు వీలుగా ఎన్పీపీకి మద్దతు తెలియజేస్తూ లేఖ ఇవ్వబోతున్నామని మేఘాలయ బీజేపీ అధ్యక్షుడు ఎర్నెస్ట్ మారీ చెప్పారు. ముఖ్యమంత్రి సంగ్మా దక్షిణ తురా స్థానంలో గెలిచారు. -
కొండల్లో కాషాయ రాగం
‘ఎవడన్నా కోపంగా కొడతాడు, లేకపోతే బలంగా కొడతాడు... వీడేంట్రా చాలా శ్రద్ధగా కొట్టాడు!’ ఇది ఓ హిట్ సినిమాలో ఫైట్ చేసిన హీరోను ఉద్దేశించి ఓ ఛోటా విలన్ పాపులర్ డైలాగ్. సమయం, సందర్భం వేరైనా... గురువారం నాడు వెలువడ్డ మూడు ఈశాన్య రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ విజయాలకు ఇదే డైలాగ్ సరిగ్గా సరిపోతుంది. త్రిపుర అసెంబ్లీ స్థానాల్లో సగానికి పైగా గెలిచి, బీజేపీ ఆ రాష్ట్రాన్ని స్వీప్ చేసింది. నాగాలాండ్లో బీజేపీ సారథ్యంలోని ఎన్డీపీపీ కూటమి అధిక స్థానాలు సాధించి, సర్కారు ఏర్పాటు దిశగా అడుగులు వేస్తోంది. మిగిలిన మేఘా లయలో ఎన్పీపీ అధిక స్థానాలు దక్కించుకున్నా, అక్కడా ప్రస్తుత సీఎం కన్రాడ్ సంగ్మా చూపు నిన్నటి దాకా తమ ప్రభుత్వంలో భాగమైన బీజేపీని మళ్ళీ కలుపుకోవడం మీదే ఉంది. వెరసి, ముచ్చటగా మూడు రాష్ట్రాలూ బీజేపీ జేబులోనే! అదీకాక అటు సీపీఎం, ఇటు కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) తదితరుల్ని కనుమరుగు చేసి, కాషాయం రెపరెపలాడడం విశేషం. కొన్నేళ్ళ క్రితం ఈశాన్యంలో సీట్ల బలమే కాదు... ఓటర్ల బలగం కూడా లేని కాషాయ పార్టీ ఇప్పుడు అక్కడి రాష్ట్రాలన్నిటిలో కాంగ్రెస్ను తోసిపుచ్చి, తిరుగులేని శక్తిగా నిలవడం ఆషామాషీ కాదు. అందుకు ఆ పార్టీ దీర్ఘకాలిక వ్యూహం, ఎన్నికల లెక్కల్లో స్థానిక పొత్తులు వగైరా అనేకం ఉన్నాయి. గిరిజన జనాభా, క్రైస్తవులు ఎక్కువగా ఉండే ఈశాన్య రాష్ట్రాల్లో బీజేపీ స్వరం మార్చింది. మతపరమైన అంశాలు, గొడ్డుమాంసంపై నిషేధం లాంటి ప్రస్తావనలే తేకుండా తెలివిగా వ్యవహ రించింది. మైనారిటీల అభద్రతనూ, సెంటిమెంట్లనూ రెచ్చగొట్టే తెలివితక్కువ పనికి దిగలేదు. పైగా, కేంద్రంలోని అధికారపక్షంతో స్నేహంగా సాగాలని భావించే అభివృద్ధి ఆధారిత ప్రజాస్వా మ్యాన్ని ఈ సుదూర పర్వతప్రాంత రాష్ట్రాలు నమ్మడం సాధారణం. అందుకు తగ్గట్లే పొరుగునే బీజేపీ పాలిత అస్సామ్లోని అభివృద్ధి నమూనాను చూపి, ఓటర్లను బీజేపీ తన వైపు తిప్పుకొంది. త్రిపురలో కాంగ్రెస్, టీఎంసీ, కొత్తగా వచ్చిన ‘టిప్రా మోటా పార్టీ’లతో త్రిముఖ పోటీని ఎదుర్కొన్న కమలనాథులు వరుసగా రెండోసారీ గద్దెనెక్కడం విశేషం. వ్యతిరేకతను ఎదుర్కొంటున్న విప్లవ్దేవ్ను సరైన సమయంలో సీఎంగా పక్కకు తప్పించి, మాణిక్ సాహాకు కిరీటం పెట్టడమూ బీజేపీకి వ్యూహాత్మకంగా ఫలించింది. గతంలో వరుసగా 7 సార్లు త్రిపురను పాలించి, శాసించిన సీపీఎంకు ఆ రాష్ట్రంలో ఇది వరుసగా రెండో పరాజయం. పైగా ఓట్లు 42 శాతం నుంచి 24 శాతానికి పడిపోవడం ఆ పార్టీకి ప్రమాదఘంటిక. ‘టిప్రా’ కింగ్మేకర్గా ఆవిర్భవించకున్నా, కలసి బరిలోకి దిగిన సీపీఎం – కాంగ్రెస్ అవకాశాలను దెబ్బ తీసింది. బెంగాలీ ఓటర్లపై టీఎంసీ పెట్టుకొన్న ఆశ అడియాసైంది. 2018తో పోలిస్తే బీజేపీ కూటమికి 11 శాతం ఓట్లు తగ్గినా, కమల నాథులే సొంతంగా సర్కారు ఏర్పాటు చేసే స్థితికి చేరుకోవడం ప్రతిపక్షాల అనైక్యతకు ప్రతిఫలం! శుభవార్త ఏమంటే, అరవై ఏళ్ళ నాగాలాండ్ చరిత్రలో తొలిసారిగా మహిళలు ఎమ్మెల్యే లుగా ఎన్నిక కావడం! పితృస్వామ్య భావజాలం ప్రబలంగా ఉండే ఈ గడ్డపై గతంలో పట్టణ మునిసిపల్ ఎన్నికల్లో స్త్రీల రంగప్రవేశానికి ప్రయత్నం జరిగినా, హింస రేగి పోటీ నుంచి తప్పుకోవాల్సొచ్చింది. కానీ ఈసారి ఏకంగా ఇద్దరు మహిళలు గెలవడం గమనార్హం. ఇది మార్పు పవనాలకు ప్రతీక. ఇక, వివిధ రాష్ట్రాల పార్టీలు (జేడీ–యూ, లోక్జనశక్తి, శరద్ పవార్ ఎన్సీపీ, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా) నాగాలాండ్ బరిలో దిగడం చిత్రం. ఆరు సీట్లలో ఎన్సీపీ గెలవడం, పశ్చిమాన మహారాష్ట్ర నుంచి వచ్చి తూర్పున నాగాలాండ్లో సత్తా చాటి, పెద్ద ప్రతిపక్షంగా అవతరించడం విచిత్రం. ఈశాన్య రాష్ట్రాల్లో అంచనాలకు అల్లంత దూరంలో ఆగిన కాంగ్రెస్ దేశంలోని వివిధ రాష్ట్రాల్లో జరిగిన 6 ఉప ఎన్నికల్లో మాత్రం 3 చోట్ల విజయాలు సాధించింది. తమిళనాట ఈరోడ్ (ఈస్ట్), మహారాష్ట్రలోని కస్బాపేట్, బెంగాల్లో టీఎంసీ నుంచి చేజిక్కించుకున్న సాగర్దిఘీ స్థానాలు హస్తానికి కొంత ఊరట. ఈరోడ్ గెలుపు వెనుక అధికార డీఎంకెతో పొత్తు, కస్బాలో విజయానికి మహా వికాస్ ఆఘాడీ కూటమి మద్దతు, 2021 ఎన్నికల్లో ఖాతా తెరవలేకపోయిన బెంగాల్లో ఈసారి సీపీఎం అండ కాంగేయులకు కలిసొచ్చింది నిజమే. అయితే, 32 ఏళ్ళుగా కంచుకోటైన పుణేలోని కస్బాపేట్లో బీజేపీ ఓటమి ఆలోచన రేపుతోంది. అదే సమయంలో మిగతా 3 ఉప ఎన్నికల్లో బీజేపీ గెలవడం, అందులోనూ రామ్గఢ్ను కైవసం చేసుకోవడం విస్మరించలేం. ఒకరకంగా ఈ ఫలితాలు ప్రతిపక్షాలకు ఆత్మశోధన అవకాశం. ఏ మాటకా మాట – ఈశాన్య రాష్ట్రాల ఎన్నికలను బీజేపీతో పోలిస్తే కాంగ్రెస్ తదితర ప్రతిపక్షాలు ఏ మేరకు సీరియస్గా తీసుకున్నాయన్నది అనుమానమే. ప్రధాని, కేంద్ర హోమ్మంత్రి సహా పలువురు పదేపదే ఈశాన్యంలో పర్యటించారు. ప్రతిపక్షాలపై ప్రచారదాడి చేశారు. స్థానిక స్థితిగతులకు అనుగుణంగా వ్యాఖ్యలు, వ్యూహాలు మార్చుకున్నారు. ప్రతిపక్షాల్లో గెలిచితీరాలనే ఆ పట్టుదల, ఎన్నికల చాణక్యం కొరవ డ్డాయి. మరి రెండు నెలల్లో కర్ణాటక, ఆ వెంటనే మధ్యప్రదేశ్, రాజస్థాన్ – ఇలా అనేక రాష్ట్రాల్లో ఎన్ని కలు రానున్న వేళ ప్రతిపక్షాలకు ఈ ఫలితాలు ఓ మేలుకొలుపు. ఐక్యత, ఐడియాలజీ ఏదీ లేకుండా ఒక్క మోదీ వ్యతిరేక మంత్రమే ఫలిస్తుందనుకుంటే పొరపాటు. ప్రత్యర్థి బలవంతుడైనప్పుడు ప్రత్యామ్నాయ వ్యూహాలు, అజెండాలు లేకుండా సవాలు చేస్తే శృంగభంగం తప్పదు. ఇప్పటికైనా ప్రతిపక్షాలు మేలుకుంటే... కోలుకుంటాయి. లేదంటే, ఎన్నికలు ఏవైనా ఫలితాలు కాస్త అటూ ఇటుగా ఇలాగే ఉంటాయి. -
మహిళా ఎం.ఎల్.ఏలు చరిత్ర సృష్టించారు
నాగాలాండ్ ఏర్పడి 60 ఏళ్లు. 60 సీట్లు ఉన్న అసెంబ్లీలో ఇప్పటి వరకూ ఒక్క మహిళ కూడా అడుగుపెట్టలేదు. ఇప్పుడు ఆ ఘనతను ఇద్దరు ఎం.ఎల్.ఏలు దక్కించుకొని చరిత్ర సృష్టించారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో హెకాని జకాలు, సల్హౌటనో క్రుసె విజయం సాధించారు. గురువారం ఓట్ల లెక్కింపు జరగగా డిమాపూర్–3 నుంచి హెకాని, పశ్చిమ అంగమె నుంచి క్రుసె విజయం సాధించారు. అక్కడి పాలనాధికారంలో స్త్రీలప్రాతినిధ్యం మొదలైంది. ఇది ఆగదు. మహిళలను ‘ఆకాశంలో సగం’ అంటాం. వారికి అవకాశాలలో సగం దక్కాలన్న ఉద్యమాలు బయలుదేరి చాలా కాలం అయ్యింది. కాని ఇంకా కొన్నిచోట్ల వారికి అవాంతరాలు ఎదురవుతూనే ఉన్నాయి. పురుష భావజాలం స్త్రీలలో కూడా నాటుకు పోయి స్త్రీకి స్త్రీయే ప్రతికూలత సృష్టించేవరకూ వెళుతోంది. ఉదాహరణకు నాగాలాండ్లో పా లనాధికారంలో స్త్రీలు ఉండటాన్ని మొదటినుంచీ వ్యతిరేకించారు. అక్కడి మొత్తం ఓటర్లు 13 లక్షలు ఉంటే వారిలో దాదాపు ఆరున్నర లక్షల ఓటర్లు మహిళలే అయినా వారు ఒక్క మహిళనూ గెలిపించుకోలేదు. దానికి కారణం అక్కడ ఇంటి పెద్ద, సమూహం పెద్ద, ఊరి పెద్ద ఎవరికి ఓటెయ్యమంటే స్త్రీలు వారికే ఓటు వేయాలి. పురుషులే సంపా దనపరులు కనుక పురుషుల మాట వినాలని స్త్రీలు అనుకుంటారు. పురుషులు సహజంగానే స్త్రీల ్రపా తినిధ్యాన్ని అంగీకరించరు. కనుక 1963లో నాగాలాండ్ ఏర్పడితే... 13 సార్లు అసెంబ్లీ ఎన్నికలు జరిగితే కేవలం 20 మందికే సీట్లు దక్కాయి. కాని ఎవరూ గెలవలేదు. డిపా జిట్లు కూడా రాలేదు. 2018లో 5 మంది స్త్రీలు పోటీ చేస్తే వారిలో ఎవరూ గెలువలేదు. కాని ఈ ధోరణిలో ఇప్పుడు మార్పు వచ్చిందనే సంకేతాలు అందుతున్నాయి. 2023 ఎన్నికలలో మొత్తం 183 మంది అన్ని పా ర్టీల నుంచి బరిలో దిగగా వీరిలో నలుగురు స్త్రీలు ఉన్నారు. ఈ నలుగురిలో నేషనల్ డెమొక్రటిక్ ప్రో గ్రెసివ్ పా ర్టీ (ఎన్.డి.పి.పి) నుంచి ఇద్దరు మహిళలు హెకాని, క్రుసె గెలిచారు. బి.జె.పితో కలిసి ఎన్.డి.పి.పి అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. అందువల్ల ఈ ఇరువురిలో ఎవరైనా మంత్రి అయితే అదీ మరో చరిత్ర కాగలదు. ఏడు ఓట్లతో గెలిచిన క్రుసె నాగాలాండ్లోని పశ్చిమ అంగమి నియోజకవర్గంలో ఓట్ల లెక్కింపు ఉత్కంఠ భరితంగా సాగింది. చివరకు ఎన్.డి.పి.పి అభ్యర్థి, 56 సల్హౌటనో క్రుసె ఏడంటే ఏడే ఓట్లతో విజయం సాధించింది. పశ్చిమ అంగమెలో ఆమెకు ప్రత్యర్థిగా నిలిచిన నఖ్రో గతంలో నాగా పీపుల్స్ పా ర్టీలో ఉండేవాడు. ఆ తర్వాత ఎన్.డి.పి.పికి జంప్ చేశాడు. కాని ఈ ఎన్నికల్లో ఎన్.డి.పి.పి టికెట్ ఇవ్వక పోయేసరికి ఇండిపెండెంట్గా రంగంలో దిగాడు. అతణ్ణి ఓడించడానికి క్రుసె సర్వశక్తులు ఒడ్డి పోరాడాల్సి వచ్చింది. హోటల్స్ రంగంలో ఉన్న క్రుసె నాగాలాండ్లోని సామాజిక సంస్థలకు కలిసి పని చేస్తోంది. తన గిరిజన తెగ మహిళా విభాగానికి నాయకురాలిగా కూడా ఉంది. ఈమె గెలుపుతో అంగమిలో భారీ వేడుకలు మొదలయ్యాయి. జనం బారులు తీరి అభినందనలు తెలుపుతున్నారు. మొదటి విజేత హెకాని నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికలకు గురువారం జరిగిన ఫలితాల లెక్కింపులో ఆ రాష్ట్రంలో గెలిచిన మొదటి మహిళా ఎం.ఎల్.ఏగా ఎన్.డి.పి.పి అభ్యర్థి హెకాని జకాలు (47) మొదట డిక్లేర్ అయ్యింది. ఆ తర్వాతే రెండో మహిళా అభ్యర్థి క్రుసె గెలుపు ప్రకటితమైంది. అందువల్ల హెకాని విజయం విశేషంగా మారింది. డిమాపూర్–3 నియోజకవర్గంలో సిట్టింగ్ ఎం.ఎల్.ఏ జిమోమిని 1536 ఓట్లతో ఓడించింది హెకాని. అయితే ఈమెకు ఈ గెలుపు ఊరికే రాలేదు. సుదీర్ఘ కృషి ఉంది. డిమాపూర్లో పుట్టి పెరిగిన హెకాని ఢిల్లీలో చదువుకుంది. ఆ తర్వాత అమెరికాలో శాన్ఫ్రాన్సిస్కోలో లా చదివింది. నాగాలాండ్లో ‘యూత్నెట్ నాగాలాండ్’ అనే ఎన్.జి.ఓను స్థాపించి యువతీ యువకుల చదువుకు,ఉపా ధికి మార్గం చూపింది. ‘మేడ్ ఇన్ నాగాలాండ్’ పేరుతో వస్తు ఉత్పత్తి, ఆవిష్కరణల కోసం కోహిమాలో ఒక సెంటర్ నడుపుతోందామె. అందుకే ఆమెకు నారీశక్తి పురస్కారం లభించింది. ఈ ఎన్నికలలో ఆమె తన విజయం కోసం గట్టిగా పోరాడింది. స్త్రీల విద్య, ఉపా ధికి హామీలు ఇచ్చింది. ఆమె కోసం అస్సాం ముఖ్యమంత్రి బిశ్వ శర్మ ప్రచారం చేశాడు. -
త్రిపుర, నాగాలాండ్లో బీజేపీ ఘన విజయం.. మేఘాలయలో షాక్..
సాక్షి, హైదరాబాద్: ఈశాన్య రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ భారీ విజయాన్ని అందుకుంది. త్రిపుర, నాగాలాండ్లో మెజార్టీతో మరోసారి అధికారంలోకి వచ్చింది. ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం నుంచే బీజేపీ పూర్తి ఆధిక్యం కనబరిచింది. దీంతో, రెండు రాష్ట్రాల్లో వికర్టీని అందుకుంది. - త్రిపురలో 60 స్థానాలకు గానూ 33 స్థానాల్లో బీజేపీ విజయం సాధించింది. మ్యాజిక్ ఫిగర్ 31ని అందుకోవడంతో మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. - ఇక, కాంగ్రెస్, లెప్ట్ కూటమి 14 స్థానాల్లో విజయం సాధించగా.. కొత్త పార్టీ టిప్రా మోథా 13 స్థానాల్లో జయభేరి మోగించి అధికార పార్టీకి ఝలక్ ఇచ్చింది. As per ECI, BJP leading on 33 seats out of 60 Assembly seats; Counting of votes underway#TripuraAssemblyElections2023 pic.twitter.com/uKPKZ0nzgP — ANI (@ANI) March 2, 2023 - నాగాలాండ్లో బీజేపీ, ఎన్డీపీపీ కూటమి భారీ విజయాన్ని అందుకుంది. 60 స్థానాలకు గానూ బీజేపీ కూటమి 37 స్థానాల్లో జయకేతనం ఎగురవేసింది ఎన్పీఎఫ్ రెండు స్థానాలు కైవసం చేసుంది. కాంగ్రెస్ ఖాతా తెరవలేకపోయింది. ఇతరులు 21 చోట్ల విజయం సాధించడం గమనార్హం. - ఇక్కడ కూడా మ్యాజిక్ ఫిగర్ 31ని క్రాస్ చేయడంతో బీజేపీ శ్రేణులు సంబురాలు చేసుకున్నాయి. మేఘాలయలో హంగ్... మరోవైపు.. మేఘాలయలో హంగ్ వచ్చింది. సీఎం కాన్రాడ్ సంగ్మా నేతృత్వంలోని నేషనల్ పీపుల్స్ పార్టీ 25 స్థానాల్లో గెలిచి అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ మ్యాజిక్ ఫిగర్ 31ని అందుకోలేకపోయింది. కాంగ్రెస్ ఐదు, బీజేపీ 4 సీట్లతో సరిపెట్టుకున్నాయి. ఇతరులు 25 స్థానాల్లో గెలుపొందారు. అయితే కాన్రాడ్తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు తాము సిద్ధమని బీజేపీ ప్రకటించింది. ఒకవేళ ఈ రెండు పార్టీలు కలిస్తే మేఘాలయ ప్రభుత్వంలో కూడా బీజేపీ భాగం కానుంది. ఫలితంగా మూడు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నట్లు అవుతుంది. ఇదిలా ఉండగా.. ఈశాన్య రాష్ట్రాల ఎన్నికల్లో కూడా గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ భారీ ఓటమిని చవిచూసింది. రెండు రాష్ట్రాల్లో సింగిల్ డిజిట్కే పరిమితమైంది. నాగాలాండ్లో అసలు ఖాతా తెరవలేకపోయింది. -
Election Results: మేఘాలయలో హంగ్.. బీజేపీ బిగ్ ప్లాన్!
► ఈశాన్య రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ భారీ విజయాన్ని అందుకుంది. త్రిపుర, నాగాలాండ్లో మెజార్టీతో మరోసారి అధికారంలోకి వచ్చింది. ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం నుంచే బీజేపీ పూర్తి ఆధిక్యం కనబరిచి రెండు రాష్ట్రాల్లో వికర్టీని అందుకుంది. త్రిపురలో 60 స్థానాలకు గానూ 33 స్థానాల్లో బీజేపీ విజయం సాధించింది. మ్యాజిక్ ఫిగర్ 31ని అందుకోవడంతో మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. కాంగ్రెస్, లెప్ట్ కూటమి 14 స్థానాల్లో విజయం సాధించగా.. కొత్త పార్టీ టిప్రా మోథా 13 స్థానాల్లో జయభేరి మోగించి అధికార పార్టీకి ఝలక్ ఇచ్చింది. ► నాగాలాండ్లో బీజేపీ, ఎన్డీపీపీ కూటమి భారీ విజయాన్ని అందుకుంది. 60 స్థానాలకు గానూ బీజేపీ కూటమి 37 స్థానాల్లో జయకేతనం ఎగురవేసింది ఎన్పీఎఫ్ రెండు స్థానాలు కైవసం చేసుంది. కాంగ్రెస్ ఖాతా తెరవలేకపోయింది. ఇతరులు 21 చోట్ల విజయం సాధించడం గమనార్హం. ఇక్కడ కూడా మ్యాజిక్ ఫిగర్ 31ని క్రాస్ చేయడంతో బీజేపీ శ్రేణులు సంబురాలు చేసుకున్నాయి ► మరోవైపు.. మేఘాలయలో హంగ్ వచ్చింది. సీఎం కాన్రాడ్ సంగ్మా నేతృత్వంలోని నేషనల్ పీపుల్స్ పార్టీ 25 స్థానాల్లో గెలిచి అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ మ్యాజిక్ ఫిగర్ 31ని అందుకోలేకపోయింది. కాంగ్రెస్ ఐదు, బీజేపీ 4 సీట్లతో సరిపెట్టుకున్నాయి. ఇతరులు 25 స్థానాల్లో గెలుపొందారు. అయితే కాన్రాడ్తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు తాము సిద్ధమని బీజేపీ ప్రకటించింది. ఒకవేళ ఈ రెండు పార్టీలు కలిస్తే మేఘాలయ ప్రభుత్వంలో కూడా బీజేపీ భాగం కానుంది. ఫలితంగా మూడు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నట్లు అవుతుంది. ► తమిళనాడులోని ఈరోడ్ ఉపఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ ఈవీకేఎస్ ఎలన్గోవన్ ఘన విజయం సాధించారు. ఈ ఉప ఎన్నికల్లో అధికార డీఎంకే కాంగ్రెస్కు మద్దతిచ్చింది. ఈ విజయం సీఎం ఎంకే స్టాలిన్ వల్లే సాధ్యమైందని ఎలన్గోవన్ పేర్కొన్నారు. ఎన్నికల హామీలను 80శాతం నెరవేర్చినట్లు చెప్పారు. వచ్చే ఏడాది జరిగే సార్వత్రిక ఎన్నికల్లో మొత్తం 40కి 40 ఎంపీ స్థానాలు డీఎంకే కూటమే కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. Credit of this victory goes to CM MK Stalin. He did 80% of the things that were promised by DMK in election manifesto. I feel proud to be a part of the Legislative Assembly which is headed by MK Stalin: DMK-backed Congress candidate EVKS Elangovan on his lead in #ErodeEastResults pic.twitter.com/J9XkJE70tT — ANI (@ANI) March 2, 2023 ► ఈశాన్య భారతంలో కాషాయ జెండా మరోసారి రెపరెపలాడింది. అసెంబ్లీ ఎన్నికలు జరిగిన మూడు రాష్ట్రాల్లో బీజేపీ సత్తా చాటింది. బీజేపీ.. త్రిపురలో రెండో సారి అధికారంలోకి రాగా.. నాగాలాండ్లో బీజేపీ-ఎన్డీపీపీ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. ► ఇక, మేఘాలయలో ఎన్పీపీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు బీజేపీ కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. ► రాత్రి 7 గంటలకు ఢిల్లీ బీజేపీ ఆఫీసుకు ప్రధాని నరేంద్ర మోదీ రానున్నారు. మూడు రాష్ట్రాల విక్టరీ వేడుకల్లో మోదీ పాల్గొననున్నారు. ► మహారాష్ట్రలోని పుణే జిల్లా కస్బా స్థానంలో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో కొనసాగుతోంది. దీంతో, కాంగ్రెస్ శ్రేణులు, మహా వికాస్ అగాడీ కార్యకర్తలు బాణాసంచా కాల్చుతూ సంబురాలు చేసుకుంటున్నారు. #WATCH | Maharashtra: Maha Vikas Aghadi (MVA) workers celebrate in Pune as official EC trends show Congress candidate Dhangekar Ravindra Hemraj leading in Kasba Peth assembly by-election. pic.twitter.com/Duxyvm9K15 — ANI (@ANI) March 2, 2023 ► త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సాహా అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించారు. బోర్దోవలి నియోజకవర్గం నుంచి పోటీ చేసిన సీఎం సాహా.. సీపీఎం అభ్యర్థి ఆశిష్కుమార్ సాహాపై విజయం సాధించారు. ► మేఘాలయలో హంగ్ దిశగా పోలింగ్ కౌంటింగ్ కొనసాగుతోంది. సీఎం కాన్రాడ్ సంగ్మా నేషనల్ పీపుల్స్ పార్టీ 17 స్థానాల్లో ఆధిక్యంగా ఉంది. #MeghalayaElections | As per official EC trends, CM Conrad Sangma's National People's Party leading on 17 of the total 59 seats so far. Counting of votes still underway, trends on 47 seats known. pic.twitter.com/GsLOUPGgSd — ANI (@ANI) March 2, 2023 ► తమిళనాడులోని ఈరోడ్ ఉప ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ అభ్యర్థి ముందంజలో కొనసాగుతున్నారు. కాగా, ఉప ఎన్నికల్లో అధికార డీఎంకే కాంగ్రెస్కు మద్దతిచ్చిన విషయం తెలిసిందే. Tamil Nadu | E.V.K.S.Elangovan of Congress leading in Erode East by-election pic.twitter.com/IQ08d1Tv4L — ANI (@ANI) March 2, 2023 ► పూణేలోని చించావద్ ఉప ఎన్నికల ఫలితాల్లో బీజేపీ లీడింగ్ కొనసాగుతోంది. Pune, Maharashtra | Counting of votes underway for Kasba Peth by-elections pic.twitter.com/CUp88aRSL3 — ANI (@ANI) March 2, 2023 ► పశ్చిమ బెంగాల్లోని సాగర్డిగీ ఉప ఎన్నికల్లో ఫలితాల్లో కాంగ్రెస్ ముందంజలో ఉంది. కాంగ్రెస్, టీఎంసీ మధ్య హోరాహోరి కొనసాగుతోంది. ► మేఘాలయలో ఫలితాలు హంగ్ దిశగా వెళ్తున్నాయి. ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ కనపించడం లేదు. ► నాగాలాండ్లో బీజేపీ, ఎన్డీపీపీ కూటమి భారీ ఆధిక్యంతో 50 స్థానాల్లో దూసుకుపోతోంది. ► త్రిపురలో 60 స్థానాలకు గానూ దాదాపు 39 స్థానాల్లో బీజేపీలో ఆధిక్యంలో కొనసాగుతోంది. మ్యాజిక్ ఫిగర్ 31ని క్రాస్ చేయడంతో మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. ► మేఘాలయలో ఎన్పీపీ 28, బీజేపీ 10 స్థానాల్లో ఆధిక్యం ► నాగాలాండ్లో బీజేపీ 21, ఎన్పీఎఫ్ ఒక స్థానంలో ఆధిక్యంలో ఉంది. ► త్రిపురలో బీజేపీ 24 స్థానాల్లో, ట్రిపా 10 స్థానాల్లో, లెఫ్ట్ 14 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ► అరుణాచల్ ప్రదేశ్లోని లూమ్లా, జార్ఖండ్లోని రామ్ఘర్, తమిళనాడులోని ఈరోడ్, పశ్చిమ బెంగాల్లోని సాగర్డిగి అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం Counting of votes for Tripura, Nagaland & Meghalaya elections begins Counting for by-elections for Lumla assembly seat of Arunachal Pradesh, Ramgarh (Jharkhand), Erode East (Tamil Nadu), Sagardighi (West Bengal) & Kasba Peth, Chinchwad assembly seats of Maharashtra also begins pic.twitter.com/mMlLV3ryfV — ANI (@ANI) March 2, 2023 ► మూడు రాష్ట్రాల్లో ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం ► ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా మేఘాలయలోని తూర్పు పశ్చిమ ఖాసీ హిల్స్ జిల్లాలో జిల్లా మేజిస్ట్రేట్ 144 సెక్షన్ విధించారు. Meghalaya | Section 144 imposed in Eastern West Khasi Hills district by the District Magistrate pic.twitter.com/JY8t1wHCp9 — ANI (@ANI) March 2, 2023 ► ముఖ్యంగా త్రిపుర అసెంబ్లీ ఫలితాలపై ఆసక్తి నెలకొంది. బీజేపీని ఓడించేందుకు లెఫ్ట్, కాంగ్రెస్ జట్టు కట్టి బరిలో దిగాయి. కొత్తగా తెరపైకి వచ్చిన టిప్రా మోతా కనీసం 15 స్థానాలకు పైగా గెలుచుకుని కింగ్మేకర్గా మారే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ► నాగాలాండ్, మేఘాలయలో కూడా ఫలితాలపై చర్చ నడుస్తోంది. Nagaland | The counting of votes for the #NagalandAssemblyElections2023 will begin at 8 am; Visuals from counting centre at Deputy Commissioner's office in Kohima pic.twitter.com/XdT0sWc4e9 — ANI (@ANI) March 2, 2023 న్యూఢిల్లీ: మూడు ఈశాన్య రాష్ట్రాలు త్రిపుర, నాగాలాండ్, మేఘాలయ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నేడు విడుదల కానున్నాయి. కాగా, మూడు రాష్ట్రాల్లో 60 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరిగింది. మ్యాజిక్ ఫిగర్ 30 దాటిన పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు. -
‘ఈశాన్య’ ఫలితాలు నేడే
న్యూఢిల్లీ: మూడు ఈశాన్య రాష్ట్రాలు త్రిపుర, నాగాలాండ్, మేఘాలయ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు గురువారం వెలువడనున్నాయి. ఈశాన్యాన మరింతగా విస్తరించాలన్న అధికార బీజేపీ ఆశలు ఏ మేరకు నెరవేరాయన్నది ఈ ఫలితాలతో తేలనుంది. ముఖ్యంగా ఈసారి అందరి దృష్టీ ప్రధానంగా త్రిపురపైనే నెలకొంది. అక్కడ పాతికేళ్ల వామపక్ష పాలనకు తెర దించుతూ అభివృద్ధి నినాదంతో బీజేపీ 2018లో సొంతంగా అధికారంలోకి రావడం తెలిసిందే. దాంతో ఈసారి బీజేపీని ఎలాగైనా నిలువరించేందుకు చిరకాల శత్రుత్వాన్ని పక్కన పెట్టి మరీ లెఫ్ట్, కాంగ్రెస్ జట్టు కట్టి బరిలో దిగాయి. ఇక నాగాలాండ్, మేఘాలయల్లో కూడా బీజేపీ అధికార సంకీర్ణంలో భాగస్వామిగా ఉంది. అయితే మేఘాలయలో ఎన్నికల ముందు అధికార నేషనల్ పీపుల్స్ పార్టీతో బంధం తెంచుకుని సంకీర్ణం నుంచి బయటికొచ్చింది. అంతేగాక తొలిసారిగా మొత్తం 60 స్థానాలకూ పోటీ చేసింది! నాగాలాండ్లో మరోసారి ఎన్డీపీపీతో కలిసి బరిలో దిగింది. అక్కడ బీజేపీ అధికారం నిలుపుకుంటుందని, త్రిపురలో ఏకైక పెద్ద పార్టీగా మెజారిటీకి చేరువగా వస్తుందని ఎగ్జిట్ పోల్స్ పేర్కొనడం తెలిసిందే. ఇక త్రిపురలో హంగ్ తప్పకపోవచ్చని అంచనా వేశాయి. కొత్తగా తెరపైకి వచ్చిన టిప్రా మోతా కనీసం 15 స్థానాలకు పైగా గెలుచుకుని కింగ్మేకర్గా మారొచ్చని జోస్యం చెప్పాయి. -
నాగాలాండ్, త్రిపురలో బీజేపీ హవా.. మేఘాలయలో మాత్రం!
న్యూఢిల్లీ: ఈశాన్యాన మళ్లీ కమల వికాసమేనని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. తాజాగా ఎన్నికలు జరిగిన మూడు రాష్ట్రాల్లో నాగాలాండ్, త్రిపురల్లో మళ్లీ బీజేపీ కూటమే అధికారంలోకి వస్తుందని, మేఘాలయలో హంగ్ తప్పదని జోస్యం చెప్పాయి. అక్కడ అధికార ఎన్పీపీ మరోసారి ఏకైక పెద్ద పార్టీగా నిలుస్తుందని చెప్పాయి. త్రిపురలో ఎన్నో ఆశలతో పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలను కొత్త పార్టీ టిప్రా మోర్చా గట్టి దెబ్బ కొట్టనుంది. అధికార బీజేపీ జైత్రయాత్రకూ అది కాస్త అడ్డుకట్ట వేసిందని ఎగ్జిట్ పోల్స్ అంచనా. త్రిపురలో ఫిబ్రవరి 16న, నాగాలాండ్, మేఘాలయల్లో సోమవారం పోలింగ్ పూర్తయింది. మేఘాలయ రాష్ట్రంలో ఈసారి హంగ్ తప్పకపోవచ్చని అన్ని ఎగ్జిట్ పోల్సూ చెప్పడం విశేషం! అధికార ఎన్పీపీకి 18 నుంచి 26 సీట్లకు మించకపోవచ్చని అవి పేర్కొన్నాయి. ఇక బీజేపీకి దక్కుతున్నది 4 నుంచి గరిష్టంగా 11 స్థానాలే. కాంగ్రెస్దీ అదే పరిస్థితి కాగా తృణమూల్కు మాత్రం ఎగ్జిట్ పోల్స్ 5 నుంచి 13 స్థానాల దాకా ఇచ్చాయి. యూడీపీకి ఇండియాటుడే, టైమ్స్ నౌ రెండూ 8 నుంచి 14 సీట్లిచ్చాయి. నాగాలాండ్ రాష్ట్రంలో ఎన్డీపీపీ–బీజేపీ కూటమి అధికారాన్ని నిలుపుకోనుందని ఎగ్జిట్ పోల్స్ ముక్త కంఠంతో పేర్కొన్నాయి. ఎన్డీపీపీకి 28–34 సీట్లు, బీజేపీకి 10 నుంచి 14 వస్తాయని ఇండియాటుడే అంచనా వేసింది. ఎన్పీఎఫ్కు 3 నుంచి 8 సీట్లు వస్తుండగా కాంగ్రెస్ 2 సీట్లకు పరిమితమవుతుందని పేర్కొంది. టైమ్స్ నౌ కూడా ఎన్డీపీపీకి 27–33 సీట్లు, బీజేపీకి 12–16 ఇవ్వగా ఎన్పీఎఫ్కు 6 సీట్లతో సరిపెట్టింది. త్రిపుర పాతికేళ్ల సీపీఎం కూటమి జైత్రయాత్రకు అడ్డుకట్ట వేస్తూ 2018లో బీజేపీ ఏకంగా 36 సీట్లతో మెజారిటీ సాధించి ఆశ్చర్యపరిచింది. దాంతో ఈసారి బీజేపీని ఎలాగైనా అడ్డుకునేందుకు సీపీఎం కూటమి తన చిరకాల ప్రత్యర్థి కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుంది. కానీ వాటి అవకాశాలకు కొత్తగా వచ్చిన టిప్రా మోతా భారీగా గండి కొట్టనుందని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. మోతా 9 నుంచి 16 సీట్లు దాకా గెలుచుకుంటుందని అంచనా వేశాయి. బీజేపీ మళ్లీ మెజారిటీ సాధిస్తుందని ఇండియాటుడే, జీ న్యూస్ అభిప్రాయపడగా 24 సీట్లకు పరిమితం కావచ్చని టైమ్స్ నౌ పేర్కొంది. కాంగ్రెస్–సీపీఎం కూటమికి ఏ ఎగ్జిట్ పోల్లోనూ గరిష్టంగా 21 సీట్లు దాటలేదు. బీజేపీకి 45 శాతం ఓట్లు రావచ్చని ఇండియాటుడే అంచనా వేసింది. లెఫ్ట్–కాంగ్రెస్ కూటమికి 32 శాతం, టిప్రా మోతాకు 20 శాతం వస్తాయని పేర్కొంది. హంగ్ నెలకొనే పక్షంలో ప్రత్యేక టిప్రా లాండ్ డిమాండ్కు జైకొట్టే పార్టీకే మద్దతిస్తామని టిప్రా మోతా అధ్యక్షుడు ప్రద్యోత్ కిశోర్ మాణిక్య దేవ్ బర్మ ఇప్పటికే ప్రకటించారు. నాగాలాండ్లో 83%, మేఘాలయలో 75% ఓటింగ్ షిల్లాంగ్/కోహిమా: నాగాలాండ్లో ఓటర్లు పోటెత్తారు. దాంతో సోమవారం జరిగిన పోలింగ్లో మధ్యాహ్నం మూడింటికే 83.63% ఓటింగ్ నమోదైంది! ఇక మేఘాలయలో సాయంత్రం ఐదింటికల్లా 75% ఓటింగ్ నమోదైంది. పోలింగ్ కేంద్రాల వద్ద భారీగా క్యూలు ఉండటంతో రెండు రాష్ట్రాల్లోనూ ఓటింగ్ శాతం మరింత పెరగనుంది. రెండు అసెంబ్లీల్లోనూ 60 స్థానాలకు గాను 59 సీట్లకు పోలింగ్ జరిగింది. కొన్ని బూత్ల్లో ఈవీఎంలతో సమస్య తలెత్తినా అధికారులు వెంటనే పరిష్కరించారు. -
ముగిసిన మేఘాలయ, నాగాలాండ్ ఎన్నికల పోలింగ్
Updates మేఘాలయ, నాగాలాండ్ రాష్ట్ర అసెంబ్లీలకు జరిగిన పోలింగ్ ముగిసింది. మేఘాలయలో 59 అసెంబ్లీ స్థానాలకు 3,419 పోలింగ్ స్టేషన్లలో ఓటింగ్ నిర్వహించగా.. నాగాలాండ్లో 59 నియోజకవర్గాలకు ఎన్నికలు జరిగాయి. మేఘాలయ, నాగాలాండ్తోపాటు ఫిబ్రవరి 16న జరిగిన త్రిపుర ఎన్నికల ఫలితాలు మార్చి 2న వెలువడనున్నాయి. ► నాగాలాండ్లో సాయంత్రం 5 గంటల వరకు 81.94% పోలింగ్ నమోదైంది. ► మేఘాలయలో సాయంత్రం 5 గంటల వరకు 74.32% పోలింగ్ నమోదైంది. ► నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికల్లో మధ్యాహ్నం 1 గంటల వరకు 60.51% ఓటింగ్ నమోదైంది. ►మేఘాలయ తృణమూల్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు చార్లెస్ పింగ్రోప్ షిల్లాంగ్లోని తన నియోజకవర్గం నోంగ్తిమ్మాయిలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. #MeghalayaElections2023 :TMC State President Charles Pyngrope voting in his Nongthymmai constituency in Shillong pic.twitter.com/mk4S553sl1 — All India Radio News (@airnewsalerts) February 27, 2023 ► నాగాలాండ్లో ఉదయం 11 గంటల వరకు 38.68 శాతం ఓటింగ్ నమోదు. ► ఓటు హక్కు వినియోగించుకున్న మేఘాలయ సీఎం కార్నాడ్ సంగ్నా. గారో హిల్స్లోని తురా పోలింగ్ స్టేషన్లో ఆయన ఓటు వేశారు. ఈ సందర్బంగా సీఎం సంగ్మా మాట్లాడుతూ.. భారీ సంఖ్యలో ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ప్రజాస్వామ్యంలో ఇది శుభపరిణామం. ఎన్నికల ఫలితాలు మాకు అనుకూలంగా వస్తాయని నా నమ్మకం అంటూ కామెంట్స్ చేశారు. Meghalaya CM Conrad Sangma cast his vote at Walbakgre -29 polling station in Tura, Garo Hills "People coming out in large no. to vote. This is good for democracy. I've not see this kind of voter turnout in the past. We are confident that it'll be in our favour," he says. pic.twitter.com/wFkELDuNpE — ANI (@ANI) February 27, 2023 9.00AM ► ఉదయం తొమ్మిది గంటల వరకూ మేఘాలయలో 12 శాతం, నాగాలాండ్లో 15.76 శాతం పోలింగ్ నమోదైంది నాగాలాండ్, మేఘాలయల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఈ రోజు(సోమవారం) ఉదయం గం. 7.00లకు పోలింగ్ ప్రారంభమైంది. ఇరు రాష్ట్రాల్లో సాయంత్రం నాలుగు గంటల వరకూ పోలింగ్ జరుగనుంది. అత్యంత కట్టుదిట్టమైన భద్రత నడుమ ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. కాగా, రెండు రాష్ట్రాల్లో 552 మంది బరిలో ఉన్నారు. 34 లక్షలకు పైగా ఓటర్లు వారి భవితవ్యాన్ని నిర్దేశించనున్నారు. మేఘాలయాలో 59 అసెంబ్లీ స్థానాలకు ఎన్నిక జరుగుతుండగా, బరిలో 369 మంది అభ్యర్థులు నిలిచారు. 21.6 లక్షల మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా 60 స్థానాలకుకు గాను 59 స్థానాల్లో పోటీ జరుగునుంది. ఇక్కడ ఒక స్థానాన్ని బీజేపీ ముందుగానే కైవసం చేసుకుంది. సిట్టింగ్ ఎమ్మెల్యే ఖతేజో కినిమి అకులుటో నియోజకవర్గం నుంచి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నాగాలాం్లో 183 మంది బరిలో ఉన్నారు. ఇక్కడ ఓటర్లు సంఖ్య 13లక్షలకుపైగా ఉంది. మేఘాలయాలో ఇప్పటిదాకా ఏపార్టీకి పూర్తి మెజార్టీ దక్కలేదు. నాగాలాండ్లో ఏ పార్టీ అన్నిచోట్లా పోటీకి దిగలేకపోయింది. ఇక తమిళనాడు, అరుణాచల్ ప్రదేశ్, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్లలో ఒక్కో అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరుగుతోంది. -
చిన్న పార్టీల చుట్టూ...
మేఘాలయలో ప్రాంతీయ పార్టీలే జోరు మీదున్నాయి. ప్రస్తుతమున్న పార్టీలతో పాటుగా మరో రెండు పార్టీలు కొత్తగా బరిలోకొచ్చాయి. వాయిస్ ఆఫ్ ది పీపుల్స్ పార్టీ (వీపీపీ) , కేఏఎం మేఘాలయ కూడా ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయి. వీపీపీ 18 సీట్లలోనూ కేఎంఎం 3 సీట్లలో మాత్రేమే పోటీ పడుతున్నప్పటికీ వాటి ప్రభావం బాగా ఉంటుందన్న అంచనాలున్నాయి. ఇతర పార్టీల్లా కాకుండా ఈ రెండు పార్టీలు స్వచ్ఛమైన రాజకీయాలు, అవినీతి రహిత ప్రభుత్వాలు అనే అంశాలపై దృష్టి సారించాయి. గత ఎన్నికల్లో హంగ్ అసెంబ్లీ ఏర్పడింది. ఈ సారి కూడా ఏ పార్టీకి మెజార్టీ దక్కే అవకాశాలైతే కనిపించడం లేదు. గత ఎన్నికల్లో ముకుల్ సంగ్మా సారథ్యంలో కాంగ్రెస్ పార్టీ అత్యధికంగా 21 సీట్లు సాధించి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించినప్పటికీ 19 సీట్లలో నెగ్గిన నేషనలిస్ట్ పీపుల్స్ పార్టీ (ఎన్పీపీ), రెండే స్థానాలు గెలిచిన బీజేపీతో పాటు ప్రాంతీయ పార్టీలైన యూడీఎఫ్, పీడీపీ, హిల్ స్టేట్ పీపుల్స్ డెమొక్రాటిక్ పార్టీ (హెచ్ఎస్పీడీపీ), మరికొందరు స్వతంత్రులతో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆ తర్వాత కొంత కాలానికి బీజేపీ, ఎంపీపీ మధ్య విభేదాలు ముదిరాయి. బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బెర్నార్డ్ ఆర్. మారక్ గారో హిల్స్లో బ్రోతల్ హౌస్ నడుపుతున్నారన్న ఆరోపణలపై రాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేయడం రాజకీయంగా ప్రకంపనలు సృష్టించింది. ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మా, మారక్ ఇరువురు తుర పట్టణానికి చెందిన వారైనప్పటికీ వారి మధ్య సయోధ్య లేదు. ఈ నేపథ్యంలో బీజేపీ ఈ సారి ఎన్నికల్లో మారక్కు పూర్తిగా స్వేచ్ఛనిచ్చింది. మారక్పై ఉన్న సానుభూతితో గారో హిల్స్లోని 24 అసెంబ్లీ స్థానాల్లో పాగా వేయాలని యోచిస్తోంది. సంగ్మా సర్కార్కు మద్దతు ఉపసంహరించాలని బీజేపీ స్థానిక నాయకులు ఒత్తిడి తెచి్చనప్పటికీ పార్టీ ఆచి తూచి అడుగులు వేస్తోంది. క్రిస్టియన్ జనాభా అధికంగా ఉన్న బీజేపీ గత ఎన్నికల్లో రెండు స్థానాలను గెలుపొంది ఇప్పుడు కనీసం డబుల్ డిజిట్పై దృష్టి పెట్టింది. అధికారంలో ఉన్న పార్టీలన్నీ ఎవరికి వారే పోటీ పడుతున్నట్టుగా ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. అధికార వ్యతిరేకత ఎన్పీపీపైనే ఉంటుందని ఇతర పార్టీలు ధీమాగా ఉన్నాయి. మరోవైపు ఎన్పీపీ కూడా బీజేపీ హిందుత్వ విధానాలు తమ పార్టీకి ఎదురు దెబ్బగా మారుతుందన్న ఆందోళనతోనే ఎన్నికలకు ముందు పొత్తు పెట్టుకోలేదు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ అన్ని పార్టీలకు సవాల్ విసిరినా ఈసారి అంతర్గత కుమ్ములాటలతోనే ఆ పార్టీ సతమతమవుతోంది. గత ఎన్నికల్లో పార్టీలో ప్రధానంగా ఉన్న ముకుల్ సంగ్మా ఈసారి తృణమూల్ కాంగ్రెస్లో చేరారు. ఈశాన్య రాష్ట్రాల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకుంటున్న టీఎంసీ ఈ సారి బలమైన పక్షంగా మారుతుందనే అంచనాలున్నాయి. మొత్తమ్మీద ఈ ముక్కోణపు పోటీలో మేఘాలయ ఎన్నికల చిత్రం ఎలా మారుతుందో చూడాలి. నాగాలాండ్లో మొత్తం 60 నియోజకవర్గాల్లో ఎవరూ అభ్యర్థుల్ని నిలబెట్టలేని పరిస్థితులున్నాయి. ఈ రాష్ట్రంలో కూడా ప్రాంతీయ పార్టీలదే హవా. జాతీయ పార్టీల ఉనికి నామ మాత్రంగానే ఉంది. నాగాలాండ్లో ప్రస్తుతం నేషనల్ డెమొక్రాటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ (ఎన్డీపీపీ) బీజేపీ కూటమి అధికారంలో ఉంది.ఎన్డీపీపీ 40 నియోజకవర్గాల్లో పోటీ చేస్తుంటే, బీజేపీ 19 నియోజకవర్గాల్లో బరిలో ఉంది. ఈ సారి ఎన్నికల్లో గ్రేటర్ నాగాలాండ్ డిమాండ్ ఎక్కువ ప్రభావం చూపించనుంది. ముఖ్యమంత్రి నిపుయో రియోకు సామాన్య ప్రజల్లో మంచి ఆదరణ ఉంది. 2018లో జరిగిన ఎన్నికల్లో 26 స్థానాల్లో గెలిచి అతి పెద్ద పార్టీగా నాగా పీపుల్స్ ఫ్రంట్ (ఎన్పీఎఫ్) అవతరించినప్పటికీ , బీజేపీతో ఎప్పట్నుంచో సంబంధాలున్నా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయింది. ఎన్డీపీపీతో కలిసి అధికారంలో ఉన్న బీజేపీ నాగా శాంతి చర్చలకు అత్యంత ప్రాధాన్యం ఇచి్చంది. ఈ సారి కూడా బీజేపీ ఎన్డీపీపీ కలిసి పోటీ చేయనున్నాయి. ఎన్డీపీపీ 40 స్థానాల్లో పోటీ చేస్తూ ఉంటే బీజేపీ 20 స్థానాలకే పరిమితమైంది. గ్రేటర్ నాగాలాండ్ డిమాండ్ను పరిశీలిస్తామన్న హామీతో బీజేపీ అత్యధిక సీట్లలో విజయం సాధించడానికి ప్రయత్నాలు చేస్తోంది. అప్పుడే ప్రభుత్వ ఏర్పాటు సమయంలో తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించవచ్చునన్న ఆశతో ఉంది. రాష్ట్ర జనాభాలో 88 శాతం క్రిస్టియన్లు ఉన్నారు. బీజేపీ అందరితోనూ రాజీపడుతూ నాగాలాండ్లో పట్టు బిగించాలని చూస్తోంది. క్రిస్టియన్ల ఓటు బ్యాంకుపైనే గంపెడాశలు పెట్టుకున్న కాంగ్రెస్ 23 సీట్లలో మాత్రమే పోటీకి దిగింది. గత రెండు సార్లు ఎన్నికల్ని పరిశీలిస్తే స్థానిక అంశాలపై అంతగా వ్యతిరేకత కనిపించడం లేదు. 2018లో పోటీకి దిగిన అధికార ఎమ్మెల్యేలలో 70 శాతం మంది మళ్లీ నెగ్గడం విశేషం. -
ఈశాన్య రాష్ట్రాలను కాంగ్రెస్ ఏటీఎంలా వాడుకుంది: ప్రధాని మోదీ
కోహిమా: ఈశాన్య రాష్ట్రాలను కాంగ్రెస్ ఏటీఎంలా వాడుకుందని తీవ్ర విమర్శలు గుప్పించారు ప్రధాని నరేంద్ర మోదీ. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నాగలాండ్లోని ఛుమౌకేదిమా జిల్లాలో ఆయన ర్యాలీలో పాల్గొన్నారు. కాంగ్రెస్ పాలనలో రాష్ట్రాన్ని ఢిల్లీ నుంచి రిమోట్ కంట్రోల్తో నడిపించేవారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ హయాంలో నాగలాండ్లో అస్థిరత్వం ఉండేదని మోదీ అన్నారు. అభివృద్ధిని పట్టించుకోకుండా వారసత్వ రాజకీయాలకే ఆ పార్టీ ప్రాధాన్యం ఇచ్చేదని విమర్శలు గుప్పించారు. నాగలాండ్ ప్రజల శ్రేయస్సు, శాంతి, పురోగతే బీజేపీ, ఎన్డీఏ ధ్యేయమని మోదీ అన్నారు. అందుకే తమ ప్రభుత్వంపై ప్రజల్లో నమ్మకం పెరుగుతోందన్నారు. రాష్ట్రంలో శాశ్వత శాంతిని నెలకొల్పేందుకే సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని ఎత్తివేసినట్లు చెప్పారు. Nagaland CM Neiphiu Rio felicitates PM Narendra Modi ahead of his public address, in Dimapur pic.twitter.com/fIs2IxvzRQ — ANI (@ANI) February 24, 2023 నాగలాండ్లో ఫిబ్రవరి 27న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. మార్చి 2న ఫలితాలు ప్రకటిస్తారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో నేషనలిస్ట్ డెమొక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ(ఎన్డీపీపీ)తో కలిసి పోటీ చేసింది బీజేపీ. దీంతో ఎన్డీఏ కూటమి దాదాపు అన్నిస్థానాల్లో గెలిచింది. ఎన్డీపీపీ నేత నీఫ్యూ రియో సీఎంగా బాధ్యతలు చేపట్టారు. మరోవైపు గత ఎన్నికల్లో కాంగ్రెస్ ఇక్కడ ఒక్క స్థానాన్ని కూడా కైవసం చేసుకోలేక చతికిలపడింది. చదవండి: పేపర్ లీక్ చేస్తే 10 ఏళ్ల జైలు శిక్ష.. రూ. కోటి జరిమానా! -
Nagaland election: ఆకాశంలో సగమైనా... నాగాలాండ్లో మాత్రం శూన్యం
ఎస్.రాజమహేంద్రారెడ్డి: ఆమె. ఎందులోనూ తక్కువ కాదు. ఆకాశంలో సగం. అన్నింటా కూడా సగం. ఇంటికే పరిమితమనేది గతించిన మాట. ఇప్పుడు అన్ని రంగాల్లోనూ పురుషులకు దీటుగా, ధాటిగా తనను తాను నిరూపించుకుంటోంది. మహిళలు అన్ని రంగాల్లోనూ గణనీయమైన పురోగతి సాధిస్తున్నారు. కానీ నాగాలాండ్లో మాత్రం మహిళలు ఒక విషయంలో మరీ వెనకబడ్డారు. ఇక్కడా తప్పు వారిది కాదు... అక్కడి పురుషాధిక్య సమాజానిది. ఆ రాష్ట్రంలో చదువులో, ఉద్యోగాల్లో లేని కట్టుబాటు రాజకీయాలకు వచ్చేసరికి మాత్రం పెద్ద అడ్డుకట్టగా మారింది. నాగాలాండ్ శాసనసభకు ఇప్పటిదాకా ఒక్క మహిళ కూడా ఎమ్మెల్యేగా ఎన్నిక కాలేదు! నాగాలాండ్ 1963లో రాష్ట్రంగా ఏర్పడ్డ తర్వాత ఇప్పటిదాకా శాసనసభకు 13 సార్లు ఎన్నికలు జరిగాయి. ఈ 13 సభల్లోనూ మహిళలకు అసలే ప్రాతినిధ్యం దక్కలేదు. 13 ఎన్నికల్లోనూ బరిలో దిగిన మహిళల సంఖ్య కేవలం 20 మాత్రమే. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధికంగా ఐదుగురు మహిళలు పోటీ చేశారు. కానీ వీరిలో ముగ్గురికి డిపాజిట్ కూడా దక్కలేదు. ఓవరాల్గా ఇప్పటిదాకా బరిలో దిగిన 20 మందిలో చాలామంది మహిళలకూ అదే ఫలితం దక్కింది! మహిళలు ప్రధాని అవడమే గాక ముఖ్యమంత్రి పదవి కూడా చేపట్టిన మన దేశంలో ఒక్క నాగాలాండ్లోనే ఎందుకీ దుస్థితి? అక్కడేమన్నా అక్షరాస్యత తక్కువగా ఉందా అంటే, ఆ సమస్యే లేదు. రాష్ట్రంలో మహిళల్లో కూడా అక్షరాస్యత ఏకంగా 76.11 శాతం. ఇది దేశ సగటు అక్షరాస్యత (64.6 శాతం) కన్నా ఎక్కువ. ఇంత అక్షరాస్యత ఉన్నా నాగా మహిళలు సాటి మహిళలకు ఓటేసేందుకు సుముఖంగా లేరు! రాష్ట్ర మొత్తం ఓటర్ల సంఖ్య 13.17 లక్షలు. వీరిలో మహిళా ఓటర్ల సంఖ్య దాదాపు సగం, అంటే 6.56 లక్షలు. అయినా ఎందుకీ చిన్నచూపు? ఎందుకీ వివక్ష? స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ 2017లో నాగాలాండ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వివాదాస్పదమై నిరసనలు, ఆందోళనల దాకా వెళ్లింది! అక్కడ మహిళలకు రాజకీయ ప్రాతినిధ్యంపై ఎంత వ్యతిరేక భావన ఉందో దీన్నిబట్టే అర్థమవుతోంది. ఈ రిజర్వేషన్లను నిరసిస్తూ పెద్ద ఎత్తున చెలరేగిన హింసలో ఇద్దరు ప్రాణాలు కూడా కోల్పోయారు! రాజ్యాంగంలోని 371 (ఎ) ఆర్టికల్లో పేర్కొన్న ప్రత్యేక హక్కులకు ఇది విరుద్ధమన్నది నిరసనకారుల వాదన. నిర్ణయాధికారాల్లో మహిళలకు ప్రాతినిధ్యం ఉండకూడదన్నది వారి డిమాండ్. నాగాలాండ్లో అత్యధిక శాతం ప్రజలు దీన్ని బలంగా విశ్వసిస్తారు. దీన్ని మార్చేందుకు మహిళల సాధికారత కోసం గళమెత్తే పలు స్వచ్ఛంద సంస్థలు ఎంత కృషి చేసినా లాభం లేకపోయింది. మహిళలకు సమాన హక్కులు కల్పించాలని ముఖ్యమంత్రి నిపూ రియో పదేపదే విజ్ఞప్తి చేస్తూనే ఉన్నా పెద్దగా ఫలితమైతే లేదు. ఆయన తన నేషనల్ డెమొక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ తరఫున ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఇద్దరు మహిళలకు టికెటిచ్చారు. కానీ మొత్తం 60 సీట్ల శాసనసభలో రెండే టికెట్లివ్వడం ఏ మేరకు సమన్యాయం చేసినట్టవుతుందో! కాంగ్రెస్, బీజేపీ అయితే మహిళలకు ఒక్కో టికెట్తోనే సరిపెట్టాయి. ప్రజలతో పాటు పార్టీలు కూడా మహిళల రాజకీయ ప్రాతినిధ్యానికి సరైన ప్రాధాన్యమివ్వడం లేదని ఈ సీట్ల కేటాయింపు చెప్పకనే చెబుతోంది. పార్లమెంటులో కూడా నాగాలాండ్ మహిళలకు దక్కిన ప్రాతినిధ్యం స్వల్పాతిస్వల్పం. అప్పుడెప్పుడో 1977లో రానో షైజా లోక్సభకు ఎన్నికవగా, తాజాగా 2022లో ఫంగ్నోన్ కొన్యాక్ రాజ్యసభకు ఎన్నికయ్యారు. ప్రజలతో పాటు పార్టీల వైఖరి కూడా మారినప్పుడు మాత్రమే నాగాలాండ్ అసెంబ్లీలో మహిళలకు సరైన ప్రాతినిధ్యం దక్కుతుంది. నాగాలాండ్ అసెంబ్లీకి మేఘాలయ, త్రిపురలతో పాటు ఈ నెలాఖర్లోగా పోలింగ్ పూర్తవుతుంది. త్రిపురకు ఫిబ్రవరి 16న, నాగాలాండ్, మేఘాలయ అసెంబ్లీలకు 27న పోలింగ్ జరగనుంది. కేవలం ఆరుగురు మహిళలు మాత్రమే నామినేషన్ వేశారు. వారిలో ఇద్దరు అధికార ఎన్డీపీపీ అభ్యర్థులు, బీజేపీ, కాంగ్రెస్ నుంచి ఒక్కో అభ్యర్థి మిగలగా మరో ఇద్దరు నామినేషన్ ఉపసంహరించుకున్నారు. ఆ నలుగురిలో ఒక్కరైనా నెగ్గి చరిత్ర సృష్టిస్తారో లేదో చూడాలి. కనీసం సగం మందైనా గెలిస్తే మహి ళల రాజకీయ ప్రాతినిధ్యంపై నాగాలాండ్ ప్రజ ల్లో ఉన్న విముఖత మెల్లమెల్లగా తొలగిపోతున్నట్టు భావించవచ్చు. ఈ ప్రశ్నకు సమాధానం మార్చి 2న వెలువడే ఫలితాల్లో లభిస్తుంది. -
కాంగ్రెస్కు బిగ్ షాక్.. బీజేపీ ఏకగ్రీవ గెలుపు
కోహిమా: భారత ఈశాన్య రాష్ట్రాల్లో ఎన్నికల నగారా మోగిన విషయం తెలిసిందే. త్రిపుర, నాగాలాండ్, మేఘాలయ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగునున్నాయి. కాగా, నాగాలాండ్లో ఫిబ్రవరి 27వ తేదీన పోలింగ్ జరగనుంది. మార్చి 2వ తేదీన ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. నాగాలాండ్ అసెంబ్లీలో 60 స్థానాలు ఉన్నాయి. రాష్ట్రంలో ప్రస్తుతం బీజేపీ అధికారంలో ఉన్నది. అయితే, ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా బరిలోకి దిగిన కాంగ్రెస్ పార్టీకి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. నాగాలాండ్లో అధికారం చేజిక్కించుకోవాలనుంటున్న కాంగ్రెస్ పార్టీకి హస్తం పార్టీ నేత షాకిచ్చారు. కాగా, అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా అకులుటో స్థానం నుంచి బరిలోకిదిగిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఖేకషే సుమీ తన నామినేషన్ను ఉపసంహరించుకున్నారు. నామినేషన్ల ఉపసంహరణకు చివరిరోజైన శుక్రవారం.. ఆఖరి క్షణాల్లో తాను పోటీనుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. అనంతరం, తన నామినేషన్ను విత్ డ్రా చేసుకున్నారు. దీంతో, కాంగ్రెస్ బిగ్ షాక్ తగలింది. ఇదిలా ఉండగా కాంగ్రెస్ నేత నామినేషన్ ఉపసంహరణ బీజేపీకి కలిసివచ్చింది. ఖేకషే సుమీ నామినేషన్ విత్ డ్రా కావడంతో ఆ స్థానంలో ఎన్నికల బరిలో ఉన్న బీజేపీ అభ్యర్థి కఝెటో కినిమీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బరిలో ఉన్న ఇద్దరిలో ఒకరు తప్పుకోవడంతో 68 ఏండ్ల కినిమీ యునానిమస్గా ఎన్నికైనట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. కినిమీ ఎమ్మెల్యేగా ఎన్నికవడం వరుసగా ఇది రెండోసారి. -
ఆ బుడ్డోడి కాన్ఫిడెన్స్కి మంత్రి ఫిదా!
చిన్నారులకు సంబంధించిన పలు వీడియోలు చూసి ఉంటాం. వాటిల్లో వాళ్ల అమ్మనాన్నలు లేదా గురువులు వారి చేత దగ్గరుండి పాడించటం లేదా డ్యాన్సులు చేయించడం వంటివి చేస్తారు. అప్పుడూ ఎవరైన ధైర్యంగా చేయడం వేరు. కానీ ఇక్కడొక బుడ్డోడు మాత్రం పాఠశాలలో తన క్లాస్మేట్స్ అందరి ముందు ఏ మాత్రం బెణుకులేకుండా భలే అద్భుతంగా పాట పాడాడు. అతను పాడే విధానం ఏదో ఒక పెద్ద స్టార్ సింగర్ మాదిరి ఓ రేంజ్లో మంచి కాన్ఫిడెన్స్తో పాడాడు. దీన్ని చూసి నాగాలాండ్ ఉన్నత విద్య, గిరిజన వ్యవహారాల మంత్రి టెమ్జెన్ ఇమ్నా అలోంగ్ ఫిదా అయ్యారు. ఇలాంటి ఆత్మవిశ్వాసమే జీవితంలో కావలని క్యాప్షెన్న్ జోడించి మరీ అందుకు సంబంధించిన వీడియోను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. దీంతో నెటిజన్లు ఆత్మివశ్వాసం అంటే భయం లేకపోవడం కాదు, దానిని ఎదుర్కొంటూ ముందుగు సాగే సామర్థ్యం! అని చెబుతూ ఆ పిల్లవాడికి హ్యాట్సాప్ అంటూ ప్రశంసిస్తూ.. ట్వీట్ చేశారు. Bas itna confidence chahiye life me. 😀 "ज़िन्दगी जीने के लिए नज़रो की नहीं ! नज़ारो की ज़रूरत होती है !!" pic.twitter.com/EcGrUnXtUi — Temjen Imna Along (@AlongImna) January 18, 2023 (చదవండి: మోదీ ఇలా అనడం తొలిసారి కాదు!: బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు) -
త్రిపుర, నాగాలాండ్, మేఘాలయ ఎన్నికల షెడ్యూల్ విడుదల
-
ఈశాన్య రాష్ట్రాల్లో మోగనున్న ఎన్నికల నగారా
-
Viral Video: ‘మయన్మార్లో తింటే.. భారత్లో పడుకుంటారు’
నాగాలాండ్ మంత్రి టెన్జెన్ ఇమ్నా ఓ ఆసక్తికర వీడియోను ట్విటర్లో పంచుకున్నారు. ఇది భారత్, మయన్మార్ సరిహద్దుల్లో ఉన్న ఓ ప్రత్యేకమైన గ్రామం గురించి తెలియజేస్తుంది. నాగాలాండ్లోని మోన్జిల్లాలో ఉన్న అతిపెద్ద గ్రామాల్లో లాంగ్వా ఒకటి. నాగాలాండ్ రాజధాని కొహిమాకు 380 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ గ్రామం భారత్, మయన్మార్ దేశాల సరిహద్దులుగా కలిగి ఉండటమే దీని ప్రత్యేకత లాంగ్వా గ్రామానికి ఓ వైపు మయన్మార్ దట్టమైన అడువులు ఉండగా.. మరోవైపు భారత్లోని వ్యవసాయ భూమి సరిహద్దుగా కలిగి ఉంది. 1970లో భారతదేశం, మయన్మార్ మధ్య సరిహద్దులు సృష్టించడానికి చాలా కాలం ముందే లాంగ్వా గ్రామం ఏర్పడింది. అధికారులు సరిహద్దు రేఖను గీస్తున్నప్పుడు, వారు తమ కమ్యూనిటీ విభజించేందుకు అంగీకరించలేదు. దీంతో గ్రామం గుండా సరిహద్దు గీశారు. అందుకే ఒక సరిహద్దు పిల్లర్పై బర్మీస్ బాషలో రాసి ఉంటే మరో పిల్లర్పై హిందీలో రాసి ఉంటుంది. లాంగ్వాలో కొన్యాక్ నాగా తెగకు చెందిన వారే అధికంగా నివసిస్తుంటారు. నాగాలాండ్లో గుర్తింపు పొందిన 16 గిరిజనుల్లో కొన్యాక్ తెగ అతి పెద్దది. కొన్యాక్ తెగకు ఆంగ్ అనే వ్యక్తి అధిపతిగా పిలవబడుతుంటాడు. లాంగ్వా గ్రామం భారత్, మయన్మార్ దేశాలను సరిహద్దులుగా కలిగి ఉన్నప్పటికీ ఓకే వ్యక్తి దీనిని పాలిస్తున్నాడు. అతని పాలన 75 గ్రామాలకు విస్తరించింది. ఇందులో కొన్ని మయన్మార్కు, మరికొన్ని అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్ర పరిధిలోకి వస్తాయి. ప్రభుత్వానికి తన ప్రజలకు ఆంగ్ వారధిగా వ్యవహరిస్తుంటారు. అంతేగాక మయన్మార్, భారత్ సరిహద్దు రేఖ ఇతని ఇంటి గుండా వెళుతుంది. ఇతని ఇళ్లు ఇండియా, మయన్మార్ను వేరు చేస్తుంది. ఇంట్లోని సగభాగం భారత్లో ఉంటే మిగిలిన సగం మయన్మార్కు చెందుతుంది. అంటే ఆంగ్ తమ కిచెన్ నుంచి బెడ్ రూమ్లోకి వెళ్లాడమంటే ఏకంగా దేశ సరిహద్దు దాటడమే అన్నట్లు. అంతేగాక ఈ సరిహద్దు లాంగ్వా ప్రజలను విభజించడానికి బదులు రెండు దేశాల పౌరసత్వాన్ని కలిగి ఉన్నారు. ఈ గ్రామం గుండా మొత్తం నాలుగు నదులు ప్రవహిస్తుండగా అందులో రెండు భారత్ భూభాగంలో ఉండగా.. మరో రెండు నదులు మయన్మార్ భూభాగం పరిధిలోకి వస్తాయి. దీనిని నాగాలాండ్ మంత్రి ట్విటర్లో షేర్ చేయడంతో వైరల్గా మారింది. దీంతో ఆ కుటుంబం ఇండియాలో నిద్రపోతే(బెడ్రూం).. మయన్మార్లో తింటారు(కిచెన్) అంటూ నెటిజన్లు సరదాగా వ్యాఖ్యానిస్తున్నారు. OMG | यह मेरा इंडिया To cross the border, this person just needs to go to his bedroom. बिलकुल ही "Sleeping in India and Eating in Myanmar" वाला दृश्य😃 @incredibleindia @HISTORY @anandmahindra pic.twitter.com/4OnohxKUWO — Temjen Imna Along (@AlongImna) January 11, 2023 -
రంజీ ట్రోఫీ చరిత్రలో నాలుగో అత్యల్పం.. నాగాలాండ్ చెత్త రికార్డు
రంజీ ట్రోఫీలో నాలుగో అత్యల్ప స్కోరు నమోదైంది. 2022-23 రంజీ ట్రోఫీలో భాగంగా నాగాలాండ్ జట్టు అత్యంత చెత్త రికార్డు నమోదు చేసింది. ఉత్తరాఖండ్తో జరిగిన మ్యాచ్లో నాగాలాండ్ 25 పరుగులకే ఆలౌటైంది. ఫలితంగా రంజీ చరిత్రలోనే నాలుగో అత్యల్ప స్కోరు చేసిన జట్టుగా రికార్డును సాధించింది. డిమాపుర్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో ఉత్తరాఖండ్ నిర్దేశించిన 200 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక 25 పరుగులకే కుప్పకూలింది. కేవలం 18 ఓవర్లు మాత్రమే ఆడింది. ఉత్తరాఖండ్ బౌలర్లు మయాంక్ మిశ్రా, స్పప్నిల్ సింగ్ ఇద్దరే నాగాలాండ్ పతనాన్ని శాసించారు. ఫలితంగా ఉత్తరాఖండ్ 174 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. మయాంక్ మిశ్రా 9 ఓవర్లు బౌలింగ్ చేసి కేవలం 4 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. ఇందులో 7 ఓవర్లు మెయిడెన్లు కావడం విశేషం, మరోపక్క స్వప్నిల్ సింగ్ 9 ఓవర్లు బౌలింగ్ చేసి 21 పరుగులిచ్చి 4 వికెట్లు తీశాడు. ఇందులో 5 మెయిడెన్లు ఉన్నాయి. వీరిద్దరూ కలిపి 9 వికెట్లు తీయగా.. నాగాలాండ్ ఓపెనర్ యుగంధర్ సింగ్ రనౌట్గా వెనుదిరిగాడు. ఆ జట్టు బ్యాటర్లలో నాగావో చిషి ఒక్కడే 10 పరుగులతో డబుల్ డిజిట్ స్కోరును అందుకోగలిగాడు. మిగిలివారంతా సింగిల్ డిజిట్కే పరిమితమయ్యారు. వీరిలో ఆరుగురు డకౌట్లుగా నిలవడం గమనార్హం. 1951-52 సీజన్లో ముంబయిపై సౌరాష్ట్రా చేసిన స్కోరును తాజాగా నాగాలాండ్ సమం చేసింది. ఇక రంజీ చరిత్రలో అత్యల్ప స్కోరు హైదరాబాద్ పేరిట ఉంది. 2010-11 సీజన్లో రాజస్థాన్తో మ్యాచ్లో 21 పరుగులకే ఆలౌటైంది. ఇక 1934-33 సీజన్లో నార్తర్న్ ఇండియాపై సదరన్ పంజాబ్ జట్టు 22 పరుగులతో రెండో అత్యల్ప స్కోరు నమోదు చేసింది. 23 పరుగులతో సింద్, జమ్మూ-కశ్మీర్ మూడో అత్యల్ప స్కోర్లు చేశాయి. ఇక ఫస్ట్ క్లాస్ క్రికెట్లో అత్యల్ప స్కోరు ఇంగ్లాండ్లో నమోదైంది. 1810లో లార్డ్స్ ఓల్డ్ గ్రౌండ్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో బీఎస్ జట్టు 6 పరుగులకే ఆలౌటైంది. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 10 కంటే తక్కువ స్కోరు నమోదు కావడం ఇదే మొదటిసారి. తాజాగా రంజీ క్రికెట్ చరిత్రలో అత్యల్ప స్కోర్లు నమోదు చేసిన జట్లలో నాగాలాండ్ కూడా చోటు దక్కించుకుంది. నాగాలాండ్ తన తదుపరి మ్యాచ్ను ఉత్తరప్రదేశ్, ఇలైట్ గ్రూప్-ఏతో ఆడనుంది. చదవండి: బిగ్బాష్ లీగ్లో సంచలనం..15 పరుగులకే ఆలౌట్ రోహిత్ కోసం సెంచరీ చేసినోడిని పక్కనబెడతారా? -
భారత్లో ఈ పర్యాటక ప్రాంతాలకు వెళ్లాలంటే అనుమతి తప్పనిసరి..
వైవిధ్యమైన సంస్కృతికి, గొప్ప వారసత్వ సంపదకు నిలయం భారత్. పర్యాటకులను కట్టిపడేసే ఎన్నో ప్రకృతి సోయాగాలు మన దేశంలో ఉన్నాయి. అయితే భారత ఉపఖండంలోని మొత్తం 29 రాష్ట్రాలు, 7 కేంద్రపాలిత ప్రాంతాల్లో పర్యటించడం ఒకేలా ఉండదు. ముఖ్యంగా 6 పర్యాటక ప్రదేశాలకు వెళ్లాలంటే కచ్చితంగా ఇన్నర్ లోన్ పర్మిట్(ఐఎల్పీ) తీసుకోవాల్సి ఉంటుంది. ఇది లేకపోతే ఆ చోటుకు అసలు అనుమతించరు. ఐఎల్పీ పర్మిషన్ అంటే? ఇన్నర్ లోన్ పర్మిట్ అనేది కొత్తదేమీ కాదు. ఎప్పటి నుంచో అమల్లో ఉన్నదే. ఇతర దేశాలతో సరిహద్దు పంచుకునే సున్నితమైన ప్రాంతాల్లో పర్యటించేటప్పుడు మాత్రమే ఐఎల్పీ తీసుకోవాల్సి ఉంటుంది. తరచూ పర్యటనలకు వెళ్లేవారికి దీని గురించి తెలిసే ఉంటుంది. ఆదివాసీ తెగల సంక్షేమంతో పాటు పర్యాటకులకు భద్రత కల్పించడంలో ఇది ఉపయోగపడుతుంది. ఆరు ప్రదేశాలు ఇవే.. అరుణాచల్ ప్రదేశ్: గొప్ప సంస్కృతికి నిలయమైన ఈ ఈశాన్య రాష్ట్రం.. చైనా, భూటాన్, మయన్మార్ దేశాలతో సరిహద్దును పంచుకుంటోంది. అందుకే ఈ ప్రాంతంలో పర్యటించాలనుకునే సందర్శకులు కోల్కతా, ఢిల్లీ, షిల్లాంగ్, గువాహటి రెసిడెంట్ కమిషనర్ల నుంచి ఐఎల్పీ తీసుకోవాల్సి ఉంటుంది. దీనికోసం ఒక్కో సందర్శకుడు రూ.100 చెల్లించాలి. నెల రోజుల పాటు అనుమతి ఉంటుంది. నాగలాండ్.. సంప్రదాయ తెగలకు నిలయమైన ఈ రాష్ట్రం మయన్మార్తో సరిహద్దు కలిగి ఉంది. ఈ సున్నితమైన ప్రాంతంలో పర్యటించాలనుకునే వారు ఢిల్లీ, కోల్కతా, కోహిమా, దిమాపూర్, షిల్లాంగ్, మొక్కోచుంగ్ డిప్యూటీ కమిషనర్ల నుంచి అనుమతి తీసుకోవచ్చు. లక్షద్వీప్.. భారత్లోని ప్రముఖ పర్యాటక కేంద్రాల్లో ఇదీ ఒకటి. అందమైన బీచ్లు, రుచికరమైన ఆహారానికి నిలయం. ఈ ప్రాంతంలో పర్యటించాలంటే పోలీస్ క్లియరెన్స్తో పాటు స్పెషల్ పర్మిషన్ తీసుకోవాలి. మిజోరం.. ప్రకృతి సోయగాలకు నిలయమైన ఈ రాష్ట్రం మయన్మార్, బంగ్లాదేశ్తో ఉమ్మడి సరిహద్దు కలిగి ఉంది. ఆదివాసీలకు నిలయమైన ఈ ప్రాంతానికి వెళ్లాలంటే ఏఎల్పీ తప్పనిసరి. రాష్ట్ర ప్రభుత్వంతో పాటు సిల్చార్, కోల్కతా, షిల్లాంగ్, ఢిల్లీ, గువాహటి లీయాసోన్ అధికారుల నుంచి దీన్ని పొందాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు విమానంలో వెళ్తే.. ఎయిర్పోర్టులోని సెక్యూరిటీ ఆఫీసర్ నుంచి ప్రత్యేక పాసులు తీసుకోవాలి. సిక్కిం.. భారత్లోని అతిచిన్న ఈశాన్య రాష్ట్రాల్లో ఇదీ ఒకటి. హిమాలయాలకు ప్రవేశ ద్వారం. అందమైన పచ్ఛికభూములు, అద్భుతమైన వంటకాలు, అనేక మఠాలు, స్పటిక సరస్సులు, కట్టిపడేసే ప్రకృతి అందాలకు నిలయం. మునుపెన్నడూ పొందని అనుభూతిని పర్యాటకులు ఇక్కడ పొందుతారు. సిక్కింలోని సోమ్గో, బాబా మందిర్ ట్రిప్, సింగలీలా ట్రెక్, నాథ్లా పాస్, జోంగ్రీ ట్రెక్, తంగు చోప్తా వ్యాలీ ట్రిప్, యుమెసామ్డాంగ్, యమ్తాంగ్, జోరో పాయింట్ ట్రిప్ వంటి ఎత్తైన ప్రదేశాలకు వెళ్లాలంటే తప్పనిసరిగా ప్రత్యేక అనుమతి తీసుకోవాలి. లద్దాక్.. ప్రతి పర్యాటకుడు ఒక్కసారైనా సందర్శించాలనుకునే ప్రాంతం ఇది. ఐఎల్పీ లేనిదే ఇక్కడకు రానివ్వరు. నుబ్రా వ్యాలీ, ఖార్డంగ్ లా పాస్, తో మోరిరి సరస్సు, పాంగాంగ్ త్సో సరస్సు, దాహ్, హను విలేజ్, న్యోమా, టర్టక్, డిగర్ లా, తంగ్యార్ వంటి ప్రదేశాలకు వెళ్లాలంటే అనుమతి తప్పనిసరి. -
‘నా కళ్లు చిన్నగా ఉండొచ్చు.. కానీ’.. మరోమారు వార్తల్లోకి ఆ మంత్రి
కోహిమా: పరిస్థితులు ఎలా ఉన్నా సందర్భానుసారం నవ్వులు పూయించటంలో కొందరు నిష్ణాతులుంటారు. అలాంటి వారిలో నాగాలాండ్ మంత్రి టెమ్జెన్ ఇమ్నా అలోంగ్ ఒకరు అని చెప్పకతప్పదు. తనలాగే ఒంటరిగా ఉండండంటూ జనాభా పెరుగుదలపై చమత్కారమైన సలహా ఇచ్చి సోషల్ మీడియాలో ట్రెండింగ్గా మారు. అంతకు ముందు ఈశాన్య ప్రజలకు చిన్నకళ్లు ఉంటాయని జాత్యాహంకార వ్యాఖ్యలపైనా తనదైన శైలీలో సమాధానమిచ్చి వార్తల్లో నిలిచారు మంత్రి టెమ్జెన్. తాజాగా మరోమారు ‘చిన్న కళ్లు’ వ్యాఖ్యలతో వైరల్గా మారారు. తాజాగా తన ఫోటోను ట్విటర్లో షేర్ చేశారు మంత్రి టెమ్జెన్. తాను ఎల్లప్పుడూ ఫోటో పోజులకు రెడీ అని పేర్కొన్నారు. తనకు ఉన్న చిన్న కళ్లతోనే మైల్ దూరంలో ఉన్న కెమెరాలను గుర్తించగలనని చమత్కరించారు. ‘నా కళ్లు చిన్నగా ఉండొచ్చు.. కానీ, ఒక మైల్ దూరం నుంచి నేను కెమెరాను చూస్తాను. ఎల్లప్పుడూ పోజ్కు రెడీ. ఇది చదువుతున్నప్పుడు మీ పెదాలపై చిరునవ్వును చూస్తాను.’ అంటూ ట్వీట్ చేశారు. ఆదివారం ఉదయం ఫోటో షేర్ చేయగా కొన్ని గంటల్లోనే ఐదు వేల వరకు లైకులు, వందల కొద్ది కామెంట్లు వచ్చాయి. లాఫింగ్ ఎమోజీలతో కామెంట్ సెక్షన్ నిండిపోయింది. మీరు మమ్మల్ని ఎప్పుడూ సంతోషంగా ఉంచుతారనే దాంట్లో ఎలాంటి సందేశం లేదు అంటూ ఓ నెటిజన్ రాసుకొచ్చారు. దేశంలోనే అత్యంత వినోదభరితమైన మంత్రిగా మరొకరు పేర్కొన్నారు. My eyes may be small, but I can see the camera from a mile. Always pose ready. 📸 Also I can see you smile as you reading it! 😉 Good Morning pic.twitter.com/7ntWw5UMVx — Temjen Imna Along (@AlongImna) October 9, 2022 ఇదీ చదవండి: బార్కొలానా వీక్.. సముద్రంపై ‘తెరచాప’ పడవల పందెం -
నాలాగే ఒంటరిగా ఉండండి!... అంటూ పిలుపునిచ్చిన మంత్రి!
జులై 11 ప్రపంచ జనాభా దినోత్వం సందర్భంగా నాగాలాండ్ మంత్రి టెమ్జెన్ ఇమ్నా అలోంగ్ కుటుంబ నియంత్రణపై అవగాహన పెంపొందించుకోవాలంటూ ప్రజలకు పిలుపునిచ్చారు. అంతేకాదు పనిలో పనిగా జనాభా నియంత్రణ కోసం ఒక చిన్న పరిష్కార మార్గాన్ని కూడా సూచించారు. గత నెలలో ఈ శాన్య ప్రజలకు చిన్నకళ్లు ఉంటాయని అందరూ అంటారు గానీ వాటి వల్ల కలిగే ప్రయోజనాల గురించి చెప్పి వార్తల్లో నిలిచారు. మళ్లీ మరోసారి కుటుంబ నియంత్రణ అంశంపై చాలా చమత్కారమైన పరిష్కార మార్గం చెప్పి మరోసారి వార్తలో నిలిచారు. ఇంతకీ ఆయన ఏమన్నారంటే....ఇది చాలా సున్నితమైన విషయం. జనాభా పెరుగుదలను నియంత్రించటం కోసం మనం సరైన మార్గాన్ని ఎంచుకుందాం. లేదా నాలాగే సింగిల్గా ఉంటూ...అందరం కలసి స్థిరమైన భవిష్యత్తు కోసం పాటుపడదాం. ఈ రోజు నుంచే సింగిల్ ఉద్యమంలో పాల్గొనండి అని నాగాలాండ్ మంత్రి ట్వీట్ చేశారు. దీంతో నెటిజన్లు నాగాలాండ్ మంత్రికి చక్కటి హాస్య చతురత ఉందంటూ ప్రశంసిస్తూ ట్వీట్ చేశారు. On the occasion of #WorldPopulationDay, let us be sensible towards the issues of population growth and inculcate informed choices on child bearing. Or #StaySingle like me and together we can contribute towards a sustainable future. Come join the singles movement today. pic.twitter.com/geAKZ64bSr — Temjen Imna Along (@AlongImna) July 11, 2022 (చదవండి: రాష్ట్ర సీఎంను ఇలాగే ఆహ్వానిస్తారా?.. బీజేపీపై టీఎంసీ ఆగ్రహం) -
సాహసోపేత నిర్ణయం
అస్సాం, మేఘాలయ మధ్య సరిహద్దు ప్రాంతాల ఒప్పందం కుదిరిన నాలుగు రోజుల్లోనే ‘ఈశాన్యం’ నుంచి మరో మంచి కబురు వినబడింది. అస్సాం, నాగాలాండ్, మణిపూర్ రాష్ట్రాల్లో దశాబ్దాలుగా అమల్లో ఉంటున్న సాయుధ దళాల (ప్రత్యేకాధికారాల) చట్టాన్ని చాలా ప్రాంతాల్లో ఉపసంహరించుకుంటున్నారు. ఇందుకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల కావలసి ఉంది. అస్సాంలో మొత్తం 23 జిల్లాల్లో ఈ చట్టాన్ని పూర్తిగా, ఒక జిల్లాలో పాక్షికంగా ఉపసంహరించు కుంటున్నారు. గత డిసెంబర్లో సైన్యం ఒక వాహనంపై గురిచూసి కాల్పులు జరిపిన ఉదంతంలో 14 మంది కూలీలు ప్రాణాలు కోల్పోయాక ఈ చట్టం అమలు నిలిపేయాలంటూ ఉద్యమించిన నాగాలాండ్లో మూడు జిల్లాల్లో పూర్తిగా, నాలుగు జిల్లాల్లో పాక్షికంగా ఉపసంహరిస్తున్నారు. తరచి చూస్తే ఇక్కడ 25 శాతం ప్రాంతం మాత్రమే ఆ చట్టం నుంచి విముక్తి పొందుతుంది. మణిపూర్లో ఆరు జిల్లాల్లో పాక్షికంగా తొలగిస్తున్నారు. కొండ ప్రాంత జిల్లాలన్నీ ఈ చట్టం నీడలోనే ఉంటాయి. బయటినుంచి చూసేవారికి ఒక చట్టం అమలును పూర్తిగానో, పాక్షికంగానో తొలగించడం పెద్ద విశేషంగా అనిపించకపోవచ్చు. కానీ ఆ రాష్ట్రాల పౌరులకు మాత్రం ఇది ఊహకందని అసాధారణ పరిణామం. వారికిది అరవైయ్యేళ్లుగా గుండెల మీది కుంపటి. హక్కుల సంఘాల నేతలు భిన్న సందర్భాల్లో చెప్పినట్టు ఈ చట్టం మృత్యువు పడగనీడ లాంటిది. ఆ పరిధిలో జీవించేవారు ఎవరైనా చిత్రహింసలు అనుభవించాల్సి రావొచ్చు. ఏ పౌరుడి దగ్గరైనా ఆయుధాలున్నాయని లేదా మిలి టెంట్లు తలదాచుకుని ఉండొచ్చని సాయుధ దళాలకు ‘సహేతుక మైన సంశయం’ వస్తే వారెంట్ అవసరం లేకుండానే అరెస్టు చేయొచ్చు. ప్రమాదకర వ్యక్తిగా అనుమానిస్తే కాల్చి చంపొచ్చు. సైన్యా నికి మాత్రమే కాదు... ఆ మాదిరి విధులు నిర్వర్తించే పోలీసులకు సైతం ఈ అధికారాలన్నీ ఉంటాయి. చట్టంలోని సెక్షన్ 3 కింద ఒక ప్రాంతాన్ని కల్లోలిత ప్రాంతంగా ప్రకటించిన మరుక్షణం నుంచి ఈ అపరిమిత అధికారాలు దఖలు పడతాయి. అందుకే దీన్ని స్వాతంత్య్రానంతరం తీసు కొచ్చిన అత్యంత కఠినమైన చట్టంగా అభివర్ణిస్తారు. కల్లోలిత ప్రాంతాల్లో నకిలీ ఎన్కౌంటర్లు, మహిళలపై అత్యాచారాలు చోటుచేసుకుంటున్నాయని తరచు ఆరోపణలు రివాజు. ఇదెంతవరకూ వచ్చిందంటే 2004లో మణిపూర్లో తంగజం మనోరమ చాను అనే మహిళను అరెస్టుచేసి చంపేశా రని ఆగ్రహించిన మహిళలు సైనికులు బస చేసిన భవనం ముందు వివస్త్రలుగా నిరసనకు దిగారు. ఈ చట్టం రద్దు కోసమే మణిపూర్కు చెందిన ఇరోం షర్మిల పదహారేళ్లపాటు నిరాహార దీక్ష చేశారు. సుప్రీంకోర్టులో 2012లో బూటకపు ఎన్కౌంటర్లపై పిటిషన్ దాఖలైన తర్వాతే చట్టం ఎంత కఠినమైనదో దేశమంతటికీ అర్థమైందని చెప్పాలి. 1979 మే మొదలుకొని 2012 వరకూ జరిగిన నకిలీ ఎన్కౌంటర్లలో తమ ఆప్తులు 1,528 మంది బలయ్యారని ఆ పిటిషన్ దాఖలు చేసిన వివిధ కుటుంబాలవారు ఆరోపించారు. వీరంతా మణిపూర్కు చెందినవారు. ఇందులో వాస్తవాలు నిర్ధారిం చేందుకు సర్వోన్నత న్యాయస్థానం ఆరు ఉదంతాలను ఎంపికచేసి వాటిపై క్షుణ్ణంగా దర్యాప్తు జరపాలంటూ ఒక కమిషన్ను నియమించింది. ప్రాథమిక సాక్ష్యాధారాలను పరిశీలించాక ఆ ఉదం తాల్లో మరణించినవారు అమాయకులేనని కమిషన్ నిర్ధారించింది. సుప్రీంకోర్టు మాజీ న్యాయ మూర్తి జస్టిస్ సంతోష్ హెగ్డే నేతృత్వంలో మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్ జేఎం లింగ్డో, మాజీ ఐపీఎస్ అధికారి ఏకే సింగ్ అందులో సభ్యులు. సాయుధ దళాల చట్టంకింద విధులు నిర్వర్తిస్తుం డగా ఇవి చోటుచేసుకున్నాయి గనుక, తమపై దాఖలు చేసిన ఎఫ్ఐఆర్లు కొట్టేయాలని 350 మంది జవాన్లు ఆ తర్వాత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. శత్రువులని అనుమానం కలిగినంత మాత్రాన, ఆరోపణలొచ్చినంత మాత్రాన పౌరులను కాల్చిచంపడమంటే ప్రజాస్వామ్యం తీవ్ర ప్రమాదంలో పడినట్టేనని 2016లో ఇచ్చిన తీర్పులో సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. అధికారంలోకొచ్చాక చట్టాన్ని రద్దుచేస్తామని లేదా సరళీకరిస్తామని చెప్పిన యూపీఏ సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బీపీ జీవన్రెడ్డి ఆధ్వర్యంలో కమిషన్ ఏర్పాటు చేసింది. చట్టం రద్దు తక్షణావసరమని కమిషన్ సిఫార్సు చేసింది. అన్ని వర్గాలనుంచీ మద్దతు లభించినా సైన్యం కాదనడంతో యూపీఏ వెనకడుగేసింది. తొలుత 2015లో త్రిపురలో మాణిక్ సర్కార్ నేతృత్వంలోని సీపీఎం ప్రభుత్వం ఈ చట్టం అమలు నిలిపేసి చరిత్ర సృష్టించగా, తాజాగా మూడు రాష్ట్రాల్లో గణనీయమైన ప్రాంతాల్లో చట్టం ఉపసంహరించి కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది. తాము ఉపసంహరించాలనుకుంటున్నా సైన్యం వినడం లేదని యూపీఏ ఏలుబడిలో కేంద్ర హోంమంత్రిగా ఉన్న చిదంబరం సిగ్గు విడిచి చెప్పడం ఎవరూ మరిచిపోరు. సంకల్పశుద్ధి ఉంటే, ఆత్మవిశ్వాసం ఉంటే అన్ని పక్షాలనూ ఒప్పించడం అసాధ్యమేమీ కాదని కేంద్రం నిరూపించింది. చట్టాన్ని పౌరులు గౌరవించాలంటే ఆ చట్టం పౌరులపట్ల బాధ్యతాయుతంగా మెలగాలి. ఈశాన్య రాష్ట్రాల్లో దాదాపు అన్నిచోట్లా ప్రధాన మిలిటెంట్ బృందాల ప్రభావం మునుపటితో పోలిస్తే దాదాపు లేనట్టే. పైగా అవన్నీ కేంద్రంతో భిన్న సందర్భాల్లో శాంతి ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ఒకటి రెండు సంస్థలు ఉనికి చాటుకుంటున్నా వాటికి ప్రజాదరణ లేదు. ఈశాన్యంలో ఇతరచోట్లా, జమ్మూ, కశ్మీర్లోని కొన్ని ప్రాంతాల్లో సైతం సమీప భవిష్యత్తులో ఈ చట్టం రద్దుకు అనువైన పరిస్థితులు ఏర్పడ తాయనీ, ఆ దిశగా కేంద్రం చర్యలు తీసుకుంటుందనీ ఆశించాలి. -
చరిత్ర సృష్టించిన ధోని జట్టు.. ఏకంగా 1008 పరుగుల ఆధిక్యంతో..!
Jharkhand Sets World Record In First Class Cricket: రంజీ ట్రోఫీ 2022లో భాగంగా నాగాలాండ్తో జరిగిన ప్రీ క్వార్టర్ ఫైనల్ల్లో టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని సొంత జట్టు జార్ఖండ్ రికార్డుల మోత మోగించింది. ఏకంగా 1008 పరుగుల లీడ్ని సాధించి.. ఫస్ట్ క్లాస్ క్రికెట్ చరిత్రలో 1000కి పైగా లీడ్ సాధించిన ఏకైక జట్టుగా ప్రపంచ రికార్డు నెలకొల్పింది. ఈ క్రమంలో ముంబై (1948-49లో మహారాష్ట్రపై 958 పరుగుల లీడ్) రికార్డ్ని బద్ధలు కొట్టడంతో పాటు మ్యాచ్ను డ్రా చేసుకుని క్వార్టర్ ఫైనల్కు అర్హత సాధించింది. అయితే, ఈ మ్యాచ్ ద్వారా జార్ఖండ్ జట్టు పలు అపప్రదలను కూడా మూటగట్టుకుంది. తొలి ఇన్నింగ్స్లో 591 పరుగుల ఆధిక్యం లభించినప్పటికీ ప్రత్యర్థిని ఫాలో ఆన్ ఆడించకపోగా, రెండో ఇన్నింగ్స్ని కూడా డిక్లేర్ చేయకుండా ఆడి క్రికెట్ అభిమానుల చీత్కారాలను ఎదుర్కొంది. క్రీడాస్ఫూర్తికి విరుద్ధంగా.. కేవలం రికార్డుల కోసమే జార్ఖండ్ రెండో ఇన్నింగ్స్ ఆడిందని (ఫాలో ఆన్ ఇవ్వకుండా) నెటిజన్లు విమర్శిస్తున్నారు. ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్లో జార్ఖండ్ తొలి ఇన్నింగ్స్లో 880 పరుగులకు ఆలౌటైంది. జార్ఖండ్ సాధించిన ఈ స్కోర్ రంజీ చరిత్రలో నాలుగో అత్యధిక టీమ్ స్కోర్గా రికార్డుల్లోకెక్కింది. జార్ఖండ్ స్కోర్లో 3 శతకాలు, 3 అర్ధ శతకాలు నమోదయ్యాయి. వికెట్కీపర్ కుమార్ కుశాగ్రా (266) డబుల్ సెంచరీతో విరుచుకుపడగా, నదీమ్ (177), విరాట్ సింగ్ (107) శతకాలు బాదారు. అనంతరం నాగాలాండ్ తొలి ఇన్నింగ్స్లో 289 పరుగులకే కుప్పకూలడంతో జార్ఖండ్కు 591 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. ఈ క్రమంలో జార్ఖండ్.. నాగాలాండ్ను ఫాలో ఆన్కు ఆహ్వానిస్తుందని అంతా ఊహించారు. అయితే అందరి అంచనాలను తలకిందులు చేస్తూ జార్ఖండ్ రెండో ఇన్నింగ్స్ ప్రారంభించింది. మ్యాచ్ ముగిసే సమయానికి ఆ జట్టు రెండో ఇన్నింగ్స్లో 6 వికెట్ల నష్టానికి 417 పరుగులు చేసింది. దీంతో తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం 591 పరుగులు కలుపుకుని జార్ఖండ్కు 1008 పరుగుల ఆధిక్యం లభించింది. చదవండి: పేలిన జార్ఖండ్ డైనమైట్లు.. రంజీ చరిత్రలో భారీ స్కోర్ నమోదు -
పేలిన జార్ఖండ్ డైనమైట్లు.. రంజీ చరిత్రలో భారీ స్కోర్ నమోదు
రంజీ ట్రోఫీ చరిత్రలో నాలుగో అత్యధిక టీమ్ స్కోర్ నమోదైంది. 2022 సీజన్లో భాగంగా నాగాలాండ్తో జరుగుతున్న ప్రీ-క్వార్టర్ ఫైనల్స్ మ్యాచ్లో జార్ఖండ్ తొలి ఇన్నింగ్స్లో 880 పరుగుల భారీ స్కోర్ చేసి ఆలౌటైంది. టోర్నీ చరిత్రలో హైదరాబాద్ (1993/94 సీజన్లో ఆంధ్రపై 944/6) పేరిట అత్యధిక టీమ్ స్కోర్ రికార్డు ఉండగా, రెండో అత్యధిక టీమ్ స్కోర్ తమిళనాడు (912/6), మూడో అత్యధిక స్కోర్ మధ్యప్రదేశ్ (912/6) పేరిట నమోదై ఉంది. తాజాగా జార్ఖండ్ 31 ఏళ్ల కిందట (1990/91) ముంబై చేసిన 855/ 6 పరుగుల రికార్డును బద్దలు కొట్టి, టోర్నీ చరిత్రలో నాలుగో అత్యధిక స్కోర్ సాధించిన జట్టుగా రికార్డుల్లోకెక్కింది. ఝర్ఖాండ్ సాధించిన ఈ రికార్డు స్కోర్లో 3 శతకాలు, 3 అర్ధ శతకాలు నమోదు కాగా, ఇందులో ఓ ద్విశతకం, ఓ భారీ శతకం ఉంది. 17 ఏళ్ల యువ వికెట్కీపర్, 2020 భారత అండర్ 19 ప్రపంచకప్ జట్టు సభ్యుడు కుమార్ కుశాగ్రా డబుల్ సెంచరీ (270 బంతుల్లో 266; 37 ఫోర్లు, 2 సిక్సర్లు)తో విరుచుకుపడగా, నదీమ్ (304 బంతుల్లో 177; 22 ఫోర్లు, 2సిక్సర్లు), విరాట్ సింగ్ (153 బంతుల్లో 107; 13 ఫోర్లు)లు శతకాలు బాదారు. కుమార్ సూరజ్ (92 బంతుల్లో 69; 11 ఫోర్లు, సిక్స్), అంకుల్ రాయ్ (88 బంతుల్లో 59; 7 ఫోర్లు), రాహుల్ శుక్లా (149 బంతుల్లో 85 నాటౌట్; 7 ఫోర్లు, 6 సిక్సర్లు)లు అర్ధ సెంచరీలతో రాణించారు. వీరిలో రాహుల్ శుక్లా 11వ నంబర్ ఆటగాడిగా వచ్చి సుడిగాలి ఇన్నింగ్స్ ఆడి అజేయ అర్ధ సెంచరీ సాధించడం విశేషం. జార్ఖండ్ ఇన్నింగ్స్ అనంతరం బరిలోకి దిగిన నాగాలాండ్.. మూడో రోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్లో 4 వికెట్లు కోల్పోయి 130 పరుగులు చేసింది. చదవండి: శ్రీలంకను చిత్తు చేసిన టీమిండియా.. సిరీస్ కైవసం -
మేఘం వన్నె చిరుత.. సోషల్ మీడియాలో వైరల్
న్యూఢిల్లీ: మేఘం వన్నె చిరుతలు బయట కనిపించడం ఇప్పటి వరకు బహు అరుదు. సాధారణంగా తక్కువ ఎత్తులో ఉండే సతత హరిత అరణ్యాలలో కనిపించే ఈ రకమైన చిరుతలు మొట్టమొదటిసారిగా భారత్–మయన్మార్ సరిహద్దుల్లో నాగాలాండ్లోని 3,700 మీటర్ల ఎత్తైన పర్వత ప్రాంతా ల్లో కనిపించింది. 2020 జనవరి–జూన్ నెలల మధ్యలో పరిశోధకులు అమర్చిన 37 కెమెరాలు వీటి కదలికలను రికార్డు చేశాయి. భారత్లో ఇంత ఎత్తైన ప్రాంతాల్లో ఇవి కనిపించడం తొలిసారని పరిశోధకులు అంటున్నారు. ఈ రకం చిరుతలు ఇండోనేసియాతోపాటు హిమాలయ పర్వతాల్లో నివసిస్తుంటాయి. చాలా అరుదుగా కనిపిస్తుండటం తో వీటిని అంతరించిపోయే జాతిగా భావిస్తున్నారు. నాగాలాండ్లోని 65 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలోని థానమిర్ కమ్యూనిటీ అటవీ ప్రాంతం లోని 7 చోట్ల ఇటువంటి చిరుతలు రెండు పెద్దవి, రెండు కూనలు కనిపించినట్లు వైల్డ్లైఫ్ప్రొటెక్షన్ సొసైటీ ఆఫ్ ఇండియా(డబ్ల్యూపీఎస్ఐ) తెలిపింది. సుమారు 3,700 మీటర్ల ఎత్తయిన పర్వత ప్రాంతాల్లోనూ ఇవి మనుగడ సాగించగలవని తాజా పరిశీలనతో రుజువైందని డబ్ల్యూపీఎస్ఐ పేర్కొంది. -
తప్పు చేసినా శిక్షకు అతీతులా?
ఈశాన్య భారత రాష్ట్రమైన నాగాలాండ్లో సాయుధ దళాల (ప్రత్యేక అధికారాలు) చట్టాన్ని వెనక్కి తీసుకోవాలనే డిమాండ్ను పరిశీలించడానికి ఒక కమిటీని నియమించిన కేంద్రం కమిటీ నివేదిక ఇవ్వక ముందే ఆ రాష్ట్రంలో మరో ఆరు నెలలు చట్టాన్ని పొడిగిస్తున్నట్లు చేసిన ప్రకటన వివాదాస్పదమైంది. డిసెంబర్ 4న నాగాలాండ్లో 13 మంది అమాయక పౌరులను తీవ్రవాదులుగా భావించి సాయుధ దళాలు కాల్చి చంపిన ఘటనపై దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనలు వెల్లువెత్తాయి. ప్రభుత్వం ఇది పొరపాటున జరిగిన సంఘటన అని క్షమాపణలు చెప్పింది. నిజానికి ఇటువంటి సంఘటనలు ఈ చట్టం అమలులో ఉన్న ఈశాన్య భారతంలో సాధారణమే. తమను ఎవరూ శిక్షించలేరనీ, తాము శిక్షాతీతులమనీ భావిస్తున్న సైనిక దళాలు ఎన్నో అమానవీయ దురంతాలకు పాల్పడ్డాయి. ఒకప్పుడు రామ్వా గ్రామం వద్ద ఉన్న అస్సాం రైఫిల్స్ జవాన్లను ఆ గ్రామస్థులు క్రిస్మస్ వేడుకలకు ఆహ్వానించేవారు. అందుకే జవాన్లు ఈ ఏడాది కూడా రెండు కొత్త వాలీబాళ్లు, ఒక నెట్ బహుమతులుగా తీసుకొని రామ్వాకు వెళ్ళారు. కానీ గ్రామస్థులు ఆ బహుమతులను స్వీకరించడానికి నిరాకరించడంతో వారు విస్మయం చెందారు. తమతో ఫొటో దిగటానికి సైతం అక్కడి ఫుట్బాల్ క్రీడాకారులు నిరాకరిం చడం వారిని మరింత ఆశ్చర్యచకితులను చేసింది. గ్రామీణుల ఈ ప్రవర్తనకు అత్యంత ముఖ్యమైన కారణమే ఉంది. రామ్వా, మణిపూర్లోని ఉఖ్రుల్–ఇంఫాల్ రహదారిలో ఉన్న ఒక చిన్న గ్రామం. నాగాలాండ్లోని మోన్ జిల్లాలో డిసెంబర్ 4న భారత భద్రతా దళాలు జరిపిన కాల్పులకు నిరసనగా అస్సాం రైఫిల్స్ సిబ్బంది రాకను గ్రామస్థులు హర్షించలేకపోయారు. నాటి కాల్పుల్లో ఏడుగురు బొగ్గు గని కార్మికులతో సహా 13 మంది పౌరులు మరణిం చారు. మణిపూర్ నాగాలకు, నాగాలాండ్ నాగాలకు మధ్య కనిపిస్తున్న ఈ సంఘీభావం వారిలో సైనిక దళాల పట్ల పెరిగిపోతున్న క్రోధానికి, పరాయీకరణ భావానికి ప్రతిబింబం అనవచ్చు. కేంద్ర ప్రభుత్వం ఈ మొత్తం సంఘటనను ‘పొరపాటు’ పేరుతో దాటవేయడానికి ప్రయ త్నించింది. సాక్షాత్తు కేంద్ర హోంమంత్రి అమిత్ షా పార్లమెంటులో క్షమాపణ కూడా చెప్పారు. కానీ నాగాలు మోన్ కాల్పులను, అంతకు ముందు జరిగిన దురం తాల నుంచి వేరుగా చూడటం లేదు. శిక్ష పడుతుందనే భయం ఏ కోశానా లేని సైనిక దళాల సంస్కృతిలో ఒక భాగంగానే దీన్నీ చూస్తున్నారు. సీనియర్ కార్యకర్తగా, శాంతి ప్రక్రియలో దీర్ఘకాలం పాల్గొంటూ వచ్చిన డాక్టర్ అకుమ్ లాంగ్చారి... ‘‘భారత సైన్యంలోని 21వ పారా స్పెషల్ ఫోర్స్పై టిజిత్ పోలీస్ స్టేషన్ సుమోటో ఎఫ్ఐఆర్ నమోదుచేసింది. అందులో ‘ఎలాంటి రెచ్చగొట్టే చర్యలూ ఎదురుకాక పోయినా వాహనంపై భద్రతా దళాలు గుడ్డిగా కాల్పులు జరిపాయి, ఫలితంగా అనేక మంది ఒటింగ్ గ్రామస్థుల హత్యలు జరిగాయి. అలాగే చాలా మంది తీవ్రంగా గాయాలపాలయ్యార’’ని పేర్కొన్నారు. అందువల్ల భద్రతా దళాల ఉద్దేశం పౌరులను హత్యచేయడం, గాయ పరచడమేనని స్పష్టమవుతోందని ఆ ఎఫ్ఐఆర్ పేర్కొందని అన్నారు. గత 63 సంవత్సరాలుగా సాయుధ దళాల (ప్రత్యేక అధికారాలు) చట్టం (ఏఎఫ్ఎస్పీఏ) విపరిణామాలను పరిశీలిస్తే... తాము ఏం చేసినా తమకు వచ్చే ముప్పేమీ లేదనే ధైర్యంతో సైనిక దళాలు అనేక అకృత్యాలకు పాల్పడ్డాయని అర్థమవుతుంది. ఈ చట్టం అమలులోకి వచ్చిన 1958 నుండి 1979 వరకు, సాయుధ దళాలు ఈశాన్య ప్రాంతంలోని నాగాలు నివసించే ప్రాంతాల్లో తిరుగుబాటు వ్యతిరేక కార్యకలాపాలను నిర్వహించాయి. ఈ సమయంలో గ్రామాలు కాలి పోయాయి; కుటుంబాలు అడవుల్లో ఆకులు, అలములు తింటూ నివసించాయి; పురుషులు దారుణ హింసకు గురై మరణించారు. మహిళలు అత్యాచారానికి గుర య్యారు. ఇంత భారీ ఎత్తున మానవ హక్కుల ఉల్లంఘనలు కాకతా ళీయం కాదు. సైనిక శక్తిని ఉప యోగించి తిరుగు బాటును అణచివేసే విధానంలో భాగంగానే ఇన్ని దురంతాలు చోటుచేసుకున్నాయి. ఆ తర్వాత 1978–79లో నాగాలు మానవ హక్కుల కోసం నాగా పీపుల్స్ మూవ్మెంట్ను ఏర్పాటు చేసి, తమ బాధలన్నింటినీ డాక్యు మెంట్ చేయడం ప్రారంభించారు. దీంతో దేశమంతటికీ మొదటి సారిగా సాయుధ దళాల (ప్రత్యేక అధికారాల) చట్టం గురించి తెలి సొచ్చింది. 1982 ఆగస్టులో నేషనల్ సోషలిస్ట్ కౌన్సిల్ ఆఫ్ నాగాలాండ్ అనే కొత్త తిరుగుబాటు సంస్థ సైనిక దళాలపై మొదటి మెరుపుదాడి చేసింది. ఈ దాడిలో కొందరు సైనికులతో పాటు 21వ సిక్కు రెజి మెంట్ ఆఫీసర్ ఒకరు మరణించారు. మణిపూర్లోని ఉఖ్రుల్కు ఒక మహిళా నిజనిర్ధారణ బృందం వెళ్ళింది. సోషలిస్టు పార్లమెంటు సభ్యు రాలు ప్రమీలా దాదావతే నేతృత్వంలోని బృందంలో నేను కూడా సభ్యు రాలినే. మేము తిరిగి వచ్చి నివేదిక ఇస్తే ప్రచురణకు నోచుకోలేదు. 1983లో నాగా పీపుల్స్ మూవ్మెంట్ ఫర్ హ్యూమన్ రైట్స్ ఏఎఫ్ఎస్పీఏను సవాలు చేస్తూ పిటిషన్ దాఖలు చేసినప్పుడు, నేను కూడా పీపుల్స్ యూనియన్ ఫర్ డెమోక్రటిక్ రైట్స్ ప్రతినిధిగా సపోర్టింగ్ పిటిషన్ దాఖలు చేశాను. ఇంతకు ముందు మరో రెండు పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్లన్నింటినీ సుప్రీంకోర్టు రాజ్యాంగ బెంచ్కు పంపారు. కానీ 14 ఏళ్లపాటు అవి విచారణకు నోచుకోలేదు. చివరికి 1997లో సుప్రీంకోర్టు పిటిషన్లను విచారించి సాయుధ దళాల (ప్రత్యేక అధికారాలు) చట్టం చెల్లుబాటును సమ ర్థించింది. తద్వారా ఆ చట్టం ప్రకారం పనిచేస్తున్న సాయుధ దళాలు తప్పు చేయలేదని చెప్పింది. ఇంతలో, నేషనల్ సోషలిస్ట్ కౌన్సిల్ ఆఫ్ నాగాలాండ్ 1987 జూలైలో మణిపూర్ సేనాపతి జిల్లా ఓనామ్ గ్రామంలో అస్సాం రైఫిల్స్ పోస్ట్పై మరో మెరుపుదాడి చేసింది. తమ నుంచి తిరుగుబాటు దారులు దోచుకువెళ్లిన ఆయుధాలను తిరిగి పొందడానికి అస్సాం రైఫిల్స్ ‘ఆపరేషన్ బ్లూబర్డ్’ అనే కోడ్ నేమ్తో తిరుగుబాటు వ్యతిరేక ఆపరేషన్ను ప్రారంభించింది. ఇది మూడు నెలలకు పైగా కొన సాగింది. ఈ కాలంలో అస్సాం రైఫిల్స్ చేసిన దురాగతాలకు అంతే లేదు. ఇద్దరు గర్భిణీ స్త్రీలు సైనికుల ముందే బహిరంగంగా ప్రస వించవలసి వచ్చింది. ఆపరేషన్ బ్లూబర్డ్ బాధితుల తరఫున నేను కొందరు న్యాయవాదులతో కలసి 1988 నుంచి 1991 వరకు ఈ కేసుపై పోరాడాను. కేసు ముగిసే సమయానికి మానవ హక్కుల ఉల్లంఘనపై దాదాపు పది సంపుటాల సాక్ష్యాలు ఉన్నాయి. అయినా 25 ఏళ్లకు 2019లో హైకోర్టు ఫైళ్లు కనిపించకుండా పోయినందున తీర్పు ఇవ్వలేక పోతున్నట్లు తెలిపింది. మణిపూర్ మహిళల నుంచి ఏఎఫ్ఎస్పీఏకు కొన్ని ముఖ్యమైన సవాళ్లు ఎదురయ్యాయి. మొదటిది 2000 నవంబరులో ఇరోమ్ చాను షర్మిల నిరాహార దీక్ష రూపంలో ఎదురైంది. ఈ దీక్ష 16 ఏళ్లు సాగింది. అయినా ప్రభుత్వం చట్టాన్ని రద్దు చేయలేదు. తంగ్జాం మనోరమ అనే మహిళ కూడా ప్రభుత్వానికి సవాల్గా నిలవడంతో అస్సాం రైఫిల్స్... 32 ఏళ్ల మనోరమను అరెస్టు చేసి, హింసించి, ఆమె దేహాన్ని బుల్లెట్ లతో నింపి రోడ్డుపై పడవేసింది. ఆమె మరణంపై ఇచ్చిన న్యాయ మూర్తి నివేదిక ఎన్నడూ వెలుగు చూడలేదు. దీంతో సాయుధ దళ జవాన్లు తమను తాము శిక్షాతీతులుగా భావించుకుంటూ... ఆడ, మగ అనే తేడా లేకుండా అందరినీ నిర్భయంగా హత్య చేయడం, హింసిం చడం, అవమానించడం వంటి అమానవీయ చర్యలను కొనసాగించ డానికి వీలు కలుగుతున్నది. ఇలా ఈశాన్య భారతంలో సైనిక దళాల అకృత్యాలకు శిక్ష పడే అవకాశం లేకపోవడంతో అనేక విపరిణామాలు చోటుచేసుకున్నాయి. అందులో మొదటిది, ఈ చట్టం అమలులో ఉన్న ‘కల్లోలిత‘ ప్రాంతా లలో నివసిస్తున్న బాధితుల బాధలకు పరిష్కార వేదిక లేకుండా పోయింది. న్యాయానికి దూరమైన ప్రజలు కోపంతో ప్రభుత్వానికి దూరమవుతున్నారు. రెండవది, ఈ చట్టం రాజ్యాంగం హామీ ఇచ్చిన ప్రాథమిక హక్కులను కూడా దెబ్బతీసింది. మూడవది, 63 సంవత్స రాలుగా అంతర్గత భద్రత కోసం సాయుధ దళాలను ఉపయోగిం చడం వాటిని భ్రష్టు పట్టించడానికి దారితీసింది. 2021 డిసెంబర్లో 13 మంది పౌరుల హత్యల తరువాత, ఏఎఫ్ఎస్పీఏను నాగాలాండ్ నుండి ఉపసంహరించుకోవాలా వద్దా అని పరిశీలించడానికి హోంమంత్రి ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఆ కమిటీ నివేదిక ఇవ్వక ముందే నాగాలాండ్లో ఈ చట్టాన్ని ఆరు నెలల పాటు పొడిగిస్తున్నట్లు కేంద్రం డిసెంబర్ 30న ప్రకటించింది. ఈ చట్టం కింద తలెత్తుతున్న సమస్యలు కేవలం ఈశాన్య రాష్ట్రాలకు చెందినవి మాత్రమే అనుకోకుండా ఇదొక జాతీయ సమస్యగా దేశ మంతా చర్చ జరగాలి. సాయుధ దళాల (ప్రత్యేక అధికారాల) చట్టాన్ని రద్దు చేయాలి. – నందితా హక్సర్ మానవ హక్కుల న్యాయవాది, రచయిత -
నాగాలకు కేంద్రం షాక్
న్యూఢిల్లీ: అమాయక కూలీలపై ఆర్మీ కాల్పులతో రగిలిపోతున్న నాగాలాండ్ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం గురువారం షాకిచ్చింది. సైనిక బలగాలకు విస్తృత అధికారాలు, శిక్ష భీతిని లేకుండా చేస్తున్న ‘సాయుధ బలగాల ప్రత్యేకాధికారాల చట్టాన్ని (ఏఎఫ్ఎస్పీఏ) నాగాలాండ్లో మరో ఆరు నెలలు పొడిగిస్తూ కేంద్ర హోంశాఖ గురువారం ఆదేశాలు జారీచేసింది. నాగాలాండ్ను కల్లోలిత ప్రాంతంగా ప్రకటిస్తూ... అక్కడ పరిస్థితి ఇంకా ప్రమాదకరంగానే ఉందని పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగానికి అండగా నిలిచేందుకు సాయుధ బలగాల మొహరింపు తప్పనిసరని తెలిపింది. అందువల్ల ఏఎఫ్ఎస్పీఏ–1958 సెక్షన్ 3 కింద నాగాలాండ్ రాష్ట్రం మొత్తాన్ని కల్లోలిత ప్రాంతంగా ప్రకటించింది. డిసెంబరు 30 నుంచి ఆరునెలల పాటు ఏఎఫ్ఎస్పీఏ అమలులో ఉంటుందని స్పష్టం చేసింది. చొరబాటుదారులు వస్తున్నారనే సమాచారంతో ఈనెల 3వ తేదీన ఆర్మీ నాగాలాండ్లోని మోన్ జిల్లా ఓటింగ్ గ్రామ పరిసరాల్లో నిఘా పెట్టింది. పనులు ముగించుకొని ఒక ఓపెన్ జీపులో వస్తున్న బొగ్గుగని కార్మికులపైకి వారెవరనేది ధ్రువీకరించుకోకుండానే సైనికులు కాల్పు లు జరపడంతో ఆరుగురు కూలీలు ప్రాణాలు కోల్పోయారు. దీంతో కోపోద్రిక్తులైన స్థానికులు సైనికులపై దాడి చేయగా.. ఒక జవాను మరణించారు. వీరిని అదుపు చేసే ప్రయత్నంలో ఆర్మీ మళ్లీ కాల్పులు జరపడంతో ఎనిమిది మంది మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది. సైన్యానికి విస్తృత అధికారాలు కట్టబెడుతున్న ఏఎఫ్ఎస్పీఏను రద్దు చేయాలని ముఖ్యమంత్రి రిఫియూతో పాటు నాగాలాండ్లోని అన్ని రాజకీయపక్షాలూ, గిరిజన సంఘాలు డిమాండ్ చేశాయి. పార్లమెంటులో ఈ ఘటనను లేవనెత్తిన విపక్షాలు ఈ నిరంకుశ చట్టాన్ని ఉపసంహరించాలని గట్టిగా కోరాయి. కమిటీ వేసి... అంతలోనే 1958లో ఏఎఫ్ఎస్పీఏను తెచ్చారు. అప్పటినుంచీ నాగాలాండ్లో ఇది అమలవుతోంది. ఆరునెలలకు ఒకసారి పొడిగిస్తూ పోతున్నారు. ఓటింగ్ ఘటన తర్వాత నాగా ప్రజల్లో తీవ్ర ఆగ్రహావేశాలు పెల్లుబికాయి. దీన్ని గమనించిన నాగాలాండ్ ప్రభుత్వం డిసెంబరు 20న అసెంబ్లీ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసి... ఈ నిరంకుశ చట్టాన్ని ఉపసంహరించాలనే తీర్మానాన్ని ఆమోదించి కేంద్రానికి పంపింది. ఏఎఫ్ఎస్పీఏ ఉపసంహరణ సాధ్యాసాధ్యాలను పరిశీలించడానికి ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసిన కేంద్రం నాలుగురోజులు తిరగకముందే... దీన్ని పొడిగిస్తూ నిర్ణయం తీసుకొంది. ఆమోదయోగ్యం కాదు: కేంద్రం నిర్ణయం ఆమోదయోగ్యం కాదని నాగా గిరిజన సంఘాలు తేల్చిచెప్పాయి. కొన్నితరాల పాటు నాగాలను అణచివేయాలనే ఉద్దేశంతోనే కేంద్ర సర్కారు ఏఎఫ్ఎస్సీఏను పొడిగించిందని ఆగ్రహం వ్యక్తం చేశా యి. ‘నాగా ప్రజల ఆకాంక్షలను కేంద్రం పట్టించుకోలేదు. చట్టం ఉపసంహరణకు కేంద్రంపై ఒత్తిడి తెచ్చే క్రమంలో ఎంతదూరమైనా వెళతాం’ అని నాగా హోహో సంస్థ ప్రధాన కార్యదర్శి కె. ఎలు ఎన్ డాంగ్ స్పష్టం చేశారు. కేంద్ర నిర్ణయంపై చర్చించడానికి జనవరి 7న సమావేశాన్ని ఏర్పాటు చేశామని ఈఎన్పీవో అధ్యక్షుడు ఆర్.టి.సంగ్టామ్ తెలిపారు. -
ఏఎఫ్ఎస్పీఏ ఎత్తివేత పరిశీలనకు కమిటీ
కోహిమా/గువాహటి: సాయుధ బలగాల(ప్రత్యేక అధికారాల)చట్టం (ఏఎఫ్ఎస్పీఏ)–1958ను ఉపసంహరించుకునే విషయాన్ని పరిశీలించేందుకు ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్రం ప్రభుత్వం ఆదివారం ప్రకటించింది. రిజిస్ట్రార్ జనరల్, సెన్సస్ కమిషనర్ ఆఫ్ ఇండియా వివేక్ జోషి నేతృత్వంలోని ఈ కమిటీలో హోంశాఖ అదనపు కార్యదర్శి పీయూశ్ గోయల్ సభ్య కార్యదర్శిగా ఉంటారు. ఈ కమిటీ 45 రోజుల్లో తన నివేదికను కేంద్రానికి సమర్పించనుంది. ఈ కమిటీలో నాగాలాండ్ చీఫ్ సెక్రటరీ, పోలీస్ డైరెక్టర్ జనరల్తోపాటు అస్సాం రైఫిల్స్(నార్త్) ఇన్స్పెక్టర్ జనరల్, సీఆర్పీఎఫ్ నుంచి ఒక ప్రతినిధి ఉంటారు. ఈ కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా నాగాలాండ్కు కల్లోలిత ప్రాంతంగా గుర్తింపును కొనసాగించడం/ రాష్ట్రం నుంచి ఏఎఫ్ఎస్పీఏను ఉపసంహరించడంపై స్పష్టత వస్తుందన్నారు. ఇటీవల మోన్ జిల్లాలో భదత్రాబలగాలు జరిపిన కాల్పుల్లో 14 మంది పౌరులు మృతి చెందడంతో ఏఎఫ్ఎస్పీఏను ఉపసంహరించాలనే డిమాండ్ ఊపందుకుంది. కాల్పులకు బాధ్యులుగా అనుమానిస్తున్న వారిపై సస్పెన్షన్ వేటు పడిందన్నారు. -
మాకు న్యాయం కావాలి.. పరిహారం కాదు!
కోహిమా: నాగాలాండ్లో సామాన్యులపైకి కాల్పులు జరిపిన భద్రతా సిబ్బందిని చట్టం ముందు నిలబెట్టేదాకా ప్రభుత్వం అందించే పరిహారాన్ని తీసుకునేదిలేదని మృతుల కుటుంబాలు స్పష్టం చేశాయి. ఈ మేరకు ఓటింగ్ గ్రామస్తులు ఒక ప్రకటన విడుదల చేశారు. నాడు కాల్పుల్లో ఓటింగ్ గ్రామానికి చెందిన 14 మంది మృతి చెందడం తెల్సిందే. ‘వారి అంత్యక్రియల సమయంలో ఐదో తేదీన రాష్ట్ర మంత్రి కొన్యాక్, పోలీస్ డిప్యూటీ కమిషనర్ వచ్చి రూ.18.30లక్షలు ఇవ్వబోయారు. చదవండి: కశ్మీర్లో పోలీసుల బస్సుపై ఉగ్ర దాడి ఆ డబ్బును వారు ప్రేమతో ఇస్తున్నారని భావించాం. కానీ, అది ప్రభుత్వ పరిహారంలో మొదటి విడత అని మాకు తర్వాత తెలిసింది. సైనిక సిబ్బందిని ముందుగా చట్టం ఎదుట నిలబెట్టాలి. ఈశాన్య రాష్ట్రాల్లో భద్రతా బలగాల ప్రత్యేక చట్టాన్ని రద్దు చేయాలి. లేకుంటే ప్రభుత్వం అందించే ఎలాంటి పరిహారాన్ని మేం స్వీకరించబోం’ అని ఓటింగ్ గ్రామ కౌన్సిల్ తీర్మానం చేసింది. -
అలా చేసేందుకు ప్రయత్నించారు.. గొంతు విప్పిన ఓటింగ్ గ్రామస్తులు
కోహిమా: నాగాలాండ్ ఫైరింగ్ ఘటనలో భద్రతాదళాలు 13 మంది యువకులను చంపి, మిలిటెంట్లుగా చిత్రీకరించ చూశాయని మోన్ జిల్లా ఓటింగ్ గ్రామస్తులు తెలిపారు. మృతదేహాలను దాచి, బట్టలు మార్చి, పక్కన ఆయుధాలను పెట్టేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. ఘటన జరిగిన నాలుగు రోజుల తరువాత గ్రామస్తులు గొంతు విప్పారు. ఓటింగ్ సిటిజెన్స్ ఆఫీస్లో బుధవారం మీడియాతో మాట్లాడారు. ‘‘డిసెంబర్ 4న 3:30గంటల సమయంలో బొగ్గుగనుల్లో పనిచేసే ఎనిమిది మంది యువకులతో పికప్ ట్రక్ గని నుంచి తిరిగి గ్రామానికి వస్తోంది. తెల్లారితే ఆదివారం సెలవురోజు. సాయంత్రం నాలుగున్నరకు అందులో ఉన్న ప్రయాణికుల గురించి ఏ వివరాలు తెలుసుకోకుండానే ట్రక్ మీద భద్రతాదళాలు దాడి చేశాయి. చదవండి: Nagaland Tragedy: నాగాలాండ్ నరమేథం తరువాత రోడ్డును బ్లాక్ చేసి... ట్రాఫిక్ను పాత పయనీర్ రోడ్డు మీదుగా వెళ్లాలని సూచించాయి. ఎంతవరకూ పికప్ ట్రక్ గ్రామానికి రాకపోవడంతో ఆందోళనతో ఎదురుచూస్తున్నాం. తరువాత కాల్పులు జరిగాయని తెలిసింది. 8గంటలకు మేం వెళ్లేసరికి పికప్ ట్రక్ ఖాళీగా ఉంది. డ్రైవర్ సీటు ఎదురుగా అద్దానికి బుల్లెట్ దూసుకుపోయిన గుర్తులు కనిపించాయి. అంటే ట్రక్ను ఆపేందుకు వాళ్లు ముందుగా డ్రైవర్ను పాయింట్ బ్లాంక్లో కాల్చారు. తరువాత మోటార్బైక్లపై వెళ్లి భద్రతా బలగాల వాహనాలను పట్టుకునే ప్రయత్నం చేశాం. భద్రతా సిబ్బందిని అడిగితే తమకేమీ తెలియదన్నారు. అక్కడే ఓ టార్పాలిన్ కనిపించింది. దాన్ని తొలగించి చూస్తే... ఆరుగురు యువకుల మృతదేహాలు కనిపించాయి. వాళ్ల షర్ట్స్ తొలగించి ఉన్నాయి. మిలిటెంట్ల బట్టలు, బూట్లు వేసి ఆయుధాలను పెట్టే ప్రయత్నం చేశారు. ఇదే విషయమై ప్రశ్నిస్తే... మాపైనా దాడికి దిగారు. కాల్పులు ప్రారంభించి మరికొందరిని చంపేశారు. ఇంకొందరిని గాయపరిచారు. జనాభాలోనూ, ప్రాంతంలోనూ మేం తక్కువ కావొచ్చు. కానీ... పోరాటంలో మా ప్రాణాలు ఇవ్వడానికైనా, శత్రువుల తలలు తీయడానికైనా సిద్ధంగా ఉంటాం’’ అని గ్రామస్తులు ఉద్ఘాటించారు. ఈ ఘటనను సుమోటోగా తీసుకున్న నాగాలాండ్ పోలీసులు ఎస్పీఎఫ్ పైన ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కాగా ఇండియన్ ఆర్మీ ఈ ఘటనపై మేజర్ జనరల్ స్థాయి అధికారితో విచారణకు ఆదేశించింది. -
సైనికులపై హత్య కేసు
కోహిమా/న్యూఢిల్లీ: నాగాలాండ్లో సైనిక దళాల కాల్పుల్లో 14 మంది కూలీలు మరణించిన ఘటనపై పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. ఈ దారుణానికి బాధ్యులుగా గుర్తిస్తూ 21వ పారా స్పెషల్ ఫోర్స్ జవాన్లపై సోమవారం సుమోటోగా హత్య కేసు నమోదు చేశారు. ఈ మేరకు మోన్ జిల్లాలోని తిజిత్ పోలీసు స్టేషన్లో ఐపీసీ సెక్షన్ 302, 307, 34 కింద కేసు పెట్టారు. హత్యా, హత్యాయత్నం, నేరపూరిత చర్య అభియోగాల కింద ఈ కేసు నమోదయ్యింది. పరిస్థితి ఉద్రిక్తంగానే ఉండడంతో మోన్ పట్టణంలో 144 సెక్షన్ విధించారు. నాగాలాండ్ బంద్ ప్రశాంతం జవాన్ల కాల్పుల్లో 14 మంది అమాయక కూలీల మృతికి నిరసనగా పలు గిరిజన సంఘాలు, పౌర హక్కుల సంఘాలు, విద్యార్థి సంఘాలు సోమవారం నాగాలాండ్ రాష్ట్ర బంద్కు పిలుపునిచ్చాయి. రాష్ట్రవ్యాప్తంగా బంద్ ప్రశాంతంగా ముగిసింది. అక్కడక్కడా భద్రతా దళాలు, విద్యార్థుల మధ్య స్వల్పంగా ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఐదు రోజులపాటు సంతాప దినాలుగా పాటిస్తామని నాగా స్టూడెంట్స్ ఫెడరేషన్(ఎన్ఎస్ఎఫ్) ప్రకటించింది. వివాదాస్పద సైనిక దళాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని రద్దు చేయడమే కూలీల త్యాగానికి అసలైన నివాళి అవుతుందని ఎన్ఎస్ఎఫ్ నేతలు ఉద్ఘాటించారు. శనివారం, ఆదివారం జరిగిన కాల్పుల ఘటనల్లో మొత్తం 28 మంది గాయపడ్డారని అధికారులు చెప్పారు. హార్న్బిల్ ఫెస్టివల్ ఒక్కరోజు నిలిపివేత సందర్శకులతో సందడిగా కనిపించే నాగా సంప్రదాయ గ్రామం కిసామా సోమవారం ఎవరూ లేక బోసిపోయింది. ఇక్కడ జరుగుతున్న హార్న్బిల్ ఫెస్టివల్ను ప్రభుత్వం నిలిపివేయడమే ఇందుకు కారణం. కూలీల మరణానికి సంతాప సూచకంగా నాగాలాండ్ ప్రభుత్వం ఈ ఫెస్టివల్ను ఒక్కరోజు నిలిపివేసింది. దేశవిదేశీ పర్యాటకులను ఆకర్శించడమే లక్ష్యంగా ఈ వేడుకను ప్రతిఏటా 10 రోజులపాటు రాజధాని కోహిమా సమీపంలోని కిసామా గ్రామంలో వైభవంగా నిర్వహిస్తుంటారు. హార్న్బిల్ ఫెస్టివల్లో పాల్గొనబోమంటూ పలు గిరిజన సంఘాలు ఇప్పటికే ప్రకటించాయి. మృతిచెందిన 14 మంది కూలీల కుటుంబాలకు నాగాలాండ్ ప్రభుత్వం రూ.5 లక్షల చొప్పున పరిహారం చెల్లించింది. రాష్ట్ర రవాణా మంత్రి పైవాంగ్ కోన్యాక్ విలేజ్ కౌన్సిల్ చైర్మన్కు ఈ పరిహారం మొత్తాన్ని అందజేశారు. గాయపడిన వారికి రూ.50,000 చొప్పున పరిహారం ఇస్తామన్నారు. చనిపోయిన పౌరుల కుటుంబాలకు రూ.11 లక్షల చొప్పున, గాయపడిన వారికి రూ.లక్ష చొప్పున పరిహారం చెల్లిస్తామని కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చిందని రాష్ట్ర సీఎం నీఫియూ రియో చెప్పారు. జవాన్ల కాల్పుల్లో మరణించిన 14 మంది కూలీల అంత్యక్రియలను సోమవారం మోన్ జిల్లా కేంద్రంలోని హెలిప్యాడ్ గ్రౌండ్ వద్ద నిర్వహించారు. బలగాల కాల్పులపై మోన్లో స్థానికుల ఆందోళన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జాతీయ మానవ హక్కుల సంఘం(ఎన్హెచ్ఆర్సీ) సోమవారం కేంద్రం, నాగాలాండ్ ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. సైనికుల కాల్పులు, అమాయక కూలీల మృతిపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఈ సంఘటనపై మీడియాలో వచ్చిన వార్తలను ఎన్హెచ్ఆర్సీ సుమోటోగా విచారణకు స్వీకరించింది. ఆరు వారాల్లోగా నివేదిక అందజేయాలని ఆదేశిస్తూ రక్షణ శాఖ కార్యదర్శి, కేంద్రం హోంశాఖ కార్యదర్శి, నాగాలాండ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీకి నోటీసులు జారీ చేసింది. నాగాలాండ్లో సైన్యం కాల్పుల అనంతరం జనం ఎదురుదాడిలో మృతిచెందిన జవాను ఉత్తరాఖండ్ రాష్ట్రం తెహ్రా జిల్లా నౌలీ గ్రామానికి చెందిన గౌతమ్లాల్ అని అధికారులు వెల్లడించారు. అతడు ‘21 బెటాలియన్ ఆఫ్ పారాచూట్ రెజిమెంట్’లో పారాట్రూపర్గా పని చేస్తున్నాడని చెప్పారు. -
Nagaland Tragedy: నాగాలాండ్ నరమేథం
ఈశాన్య భారతంలో తిరుగుబాట్లను అణిచే పేరిట దశాబ్దాలుగా అమలవుతున్న సాయుధ బలగాల (ప్రత్యేకాధికారాల) చట్టం పౌరుల జీవితాల్లో ఎంతటి కల్లోలం సృష్టిస్తున్నదో తెలియడానికి శనివారం చోటుచేసుకున్న నాగాలాండ్ నరమేథమే తార్కాణం. ఆ రాష్ట్రంలోని మోన్ జిల్లాలో 13మంది పౌరులు, ఒక జవాను మరణించడానికి దారి తీసిన ఈ ఉదంతం అత్యంత విషాదకరమైనది. వాహ నంలోని వారిని తిరుగుబాటుదారులుగా పొరబడి కాల్పులు జరిపామని సైన్యం ఇస్తున్న సంజాయిషీ నేర తీవ్రతను తగ్గించలేదు. వారి ప్రకటన ప్రకారం నిషేధిత నేషనల్ సోషలిస్టు కౌన్సిల్ ఆఫ్ నాగా లాండ్ –ఖప్లాంగ్(ఎన్ఎస్సీఎన్–కే)లోని చీలిక వర్గం తిరుగుబాటుదారులు ఫలానా వాహనంలో వస్తున్నారని నిఘా సంస్థలు సమాచారం ఇచ్చాయి. దాని ఆధారంగా కాల్పులు జరిపామని సైన్యం అంటున్నది. తిరుగుబాటుదారుల గురించి అంత ఖచ్చితమైన సమాచారం అందించిన నిఘా సంస్థకూ, దాన్ని విశ్వసించిన సైన్యానికీ సమీపంలోని బొగ్గు గనిలో పనిచేస్తూ రోజూ అదే సమయా నికి వాహనంలో కూలీలు వెళ్తారన్న ఇంగితం లేకపోవడం, జాగరూకతతో వ్యవహరించాలన్న స్పృహ కొరవడటం క్షమార్హంకాదు. పద్ధతిగా అయితే ఇలాంటి దాడుల సమయంలో స్థానిక పోలీసుల సాయం తీసుకోవాలి. కానీ, అక్కడ కార్యకలాపాలు చూసే అస్సాం రైఫిల్స్కు కూడా చెప్పకుండా సైన్యంలోని ఒక ఎలైట్ యూనిట్ తనకు తానే నిర్ణయం తీసుకుని ఈ దాడికి పాల్పడిందని వస్తున్న కథనాలు ఆందోళనకరమైనవి. బలగాలమధ్య సమన్వయం లేదని దీన్నిబట్టి అవగతమవుతోంది. అసలు సైన్యం నిర్వహిస్తున్న ఆపరేషన్ల తీరుతెన్నులనే ఈ ఉదంతం ప్రశ్నార్థకం చేస్తున్నది. ఆ వాహనంలో నిజంగా తిరుగుబాటుదారులే వెళ్తున్నా అచ్చం వారి మాదిరే పొంచివుండి దాడి చేయాలనుకోవడం సరికాదు. గత నెలలో మణిపూర్లో అస్సాం రైఫిల్స్కు చెందిన ఒక కమాండింగ్ ఆఫీసర్నూ, మరో ఆరుగురినీ తిరుగుబాటుదారులు బలితీసుకున్ననాటినుంచీ సూత్రధారుల కోసం గాలింపు మొదలైంది. తిరుగుబాటుదారులను సజీవంగా పట్టుకుంటేనే ఆ అధికారి మరణానికి కారకులెవరో, వారి కార్యకలాపాలేమిటో తెలిసేది. అందుకు భిన్నంగా పొంచివుండి హఠాత్తుగా గుళ్ల వర్షం కురిపించడం వల్ల దేశ భద్రతకు కలిగే ప్రయోజనమేమిటి? కాస్తయినా ఆలోచించారా? వాహ నాన్ని ఆపడానికి బలగాలు ప్రయత్నించాయని, కానీ వారు ‘పారిపోయే ప్రయత్నం’ చేయడంతో అందులో తీవ్రవాదులు వెళ్తున్నారని భావించారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పార్లమెంటులో చేసిన ప్రకటన హేతుబద్ధంగా లేదు. తీవ్రవాదులు వాహనంలో ఉండుంటే మారణాయుధాలతో దాడికి దిగరా? వాహనం ఆపనంత మాత్రాన అందులో తీవ్రవాదులే ప్రయాణిస్తున్నారన్న నిర్ధార ణకు రావడం సబబేనా? నాగాలాండ్ పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలిన అంశాలు మరింత గుబులు పుట్టిస్తున్నాయి. ఘటన జరిగాక మృతదేహాలపై ఉన్న దుస్తులను తొలగించి, ఖాకీ దుస్తులు వేసేందుకు బలగాలు ప్రయత్నించాయని ఆ దర్యాప్తు చెబుతోంది. మరణించినవారు తీవ్రవాదులని కట్టుకథలల్లడానికి ఈ పని చేశారా అన్నది తేలాలి. ఆ రాష్ట్రంలో ఉన్నది ఎన్డీపీపీ–బీజేపీ కూటమి ప్రభుత్వం. కానీ బీజేపీ నేతలకే అక్కడ రక్షణ కరువు! ఘటనాస్థలికి బీజేపీ జెండాతో వెళ్తున్న తమ వాహనంపై కూడా బలగాలు కాల్పులు జరిపి, ఒకరి ప్రాణం తీశాయని, మరో ముగ్గురు గాయపడ్డా రని మోన్ జిల్లా బీజేపీ నేత అంటున్నారు. ఇదంతా వింటుంటే మనం ప్రజాస్వామ్య వ్యవస్థలోనే జీవిస్తున్నామా అనే సందేహం రాకమానదు తీవ్రవాదాన్ని అదుపు చేయడం, శాంతిభద్రతల్ని పరిరక్షించడం ప్రభుత్వాల కర్తవ్యం. మయ న్మార్కూ, చైనాకూ కూతవేటు దూరంలో ఉండే నాగాలాండ్ వంటిచోట అది మరింత అవసరం. కానీ కొండనాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిన చందంగా చట్టాలు ఉండకూడదు. రాజ్యాంగంలోని అధికరణలను సైతం అపహాస్యం చేసేలా సైన్యానికి అపరిమిత అధికారాలిస్తున్న సాయుధ బలగాల (ప్రత్యేకాధికారాల) చట్టం ఈ పోకడే పోతోంది. పర్యవసానంగా ఇది అమలవుతున్న ఈశాన్య రాష్ట్రాల్లో ఎక్కడో ఒకచోట నిత్యం మానవ హక్కుల ఉల్లంఘన సాగుతూనే ఉంది. అక్రమ నిర్బం ధాలు, అత్యాచారాలు, బూటకపు ఎన్కౌంటర్లు, మనుషుల్ని మాయం చేయడం వంటి ఆరోపణలు వస్తూనే ఉన్నాయి. మణిపూర్ ఎన్కౌంటర్ ఘటనలపై 2013లో దర్యాప్తు చేసిన జస్టిస్ సంతోష్ హెగ్డే కమిషన్ సాయుధ బలగాల చట్టం అశాంతికి కారణమవుతున్నదని తేల్చి చెప్పింది. చట్టవిరుద్ధ చర్య లకు పాల్పడిన భద్రతా బలగాలకు ఏ రక్షణా ఉండబోదని సుప్రీంకోర్టు ఒక కేసులో స్పష్టం చేసింది. జస్టిస్ బీపీ జీవన్ రెడ్డి కమిటీ ఆ చట్టాన్ని రద్దు చేయాలని 2005లో సూచించింది. నిర్భయ ఉదం తంలో నియమించిన జస్టిస్ జేఎస్ వర్మ కమిటీ నివేదిక సైతం ఈ చట్టాన్ని రద్దు చేయాలని చెప్పింది. అయినా ఆనాటి యూపీఏ సర్కారుకు పట్టలేదు. అది జరిగితే భద్రతా బలగాల నైతిక స్థైర్యం దెబ్బ తింటుందన్నదే ప్రభుత్వాల వాదన. మరి పౌరుల నైతిక స్థైర్యం సంగతేమిటి? నాగాలాండ్ ఉదం తంలో కారకుల్ని శిక్షిస్తామని సైన్యం అంటున్నది. కేంద్రం కూడా హామీ ఇస్తోంది. మంచిదే. కానీ ఇన్ని దశాబ్దాలుగా ఎంతమందిని శిక్షించారు... లెక్కలు తీస్తారా? సాయుధ బలగాల (ప్రత్యేకాధి కారాల) చట్టం అమల్లో ఉన్నంతకాలం ఇలాంటి ఉదంతాలు చోటుచేసుకుంటూనే ఉంటాయి. చట్టం రద్దు చేయాలన్న నాగాలాండ్, మేఘాలయ సీఎంల తాజా డిమాండ్ ముమ్మాటికీ సబబే. ఇప్పటికైనా కేంద్రం ఆలోచించాలి. ప్రజా శ్రేయస్సుకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవాలి. -
Amit Shah: పొరపాటు వల్లే కాల్పులు
న్యూఢిల్లీ: నాగాలాండ్లో తీవ్రవాదుల కదలికలపై విశ్వసనీయ సమాచారం ఉన్నప్పటికీ వారిని గుర్తించడంలో భద్రతా దళాలు పొరపాటు పడడం వల్లే కాల్పులు జరిగాయని కేంద్ర హోం మంత్రి అమిత్ షా చెప్పారు. ఈ ఘటనపై ప్రభుత్వం విచారం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. ఈ సంఘటనపై సిట్ నెల రోజుల్లోగా విచారణ పూర్తి చేస్తుందన్నారు. భవిష్యత్తులో తీవ్రవాదుల ఏరివేత ఆపరేషన్లు చేపట్టినప్పుడు ఈ ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని అన్ని భద్రతా దళాలకు సూచించారు. ఈ మేరకు షా సోమవారం లోక్సభలో ప్రకటన చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలియజేశారు. తృణమూల్ మినహా ప్రతిపక్షాల వాకౌట్ అమిత్ షా ప్రకటనపై కాంగ్రెస్, డీఎంకే, సమాజ్వాదీ పార్టీ, బీఎస్పీ, ఎన్సీపీ తదితర ప్రతిపక్షాలు అసంతృప్తి వ్యక్తంచేశాయి. మృతుల కుటుంబాలకు నష్ట పరిహారం, కాల్పులకు బాధ్యులైన వారిపై చర్యల గురించి ఆయన మాటమాత్రమైనా ప్రస్తావించలేదని మండిపడ్డాయి. షా ప్రకటనను నిరసిస్తూ సభను నుంచి వాకౌట్ చేశాయి. టీఎంసీ వాకౌట్ చేయలేదు. ఎలాంటి ప్రశ్నలకు ఆస్కారం ఇవ్వకుండా హోంమంత్రి ఏకపక్షంగా ప్రకటన చేసి వెళ్లిపోయారని లోక్సభలో కాంగ్రెస్ పక్ష నేత అధిర్ రంజన్ దుయ్యబట్టారు. అంతకుముందు నాగాలాండ్ ఘటనను ప్రతిపక్షాలు సభలో లేవనెత్తి కేంద్ర ప్రభుత్వం దీనిపై ప్రకటన చేయాలని డిమాండ్చేశాయి. (చదవండి: Maharashtra: ప్రేమించి, పారిపోయి పెళ్లి.. గర్భిణీ అక్క తల నరికిన తమ్ముడు.. తీసుకొని) హైదరాబాద్ నైపర్కు ‘జాతీయ’ హోదా బిల్లుకు లోక్సభ ఆమోదం హైదరాబాద్, అహ్మదాబాద్, గువాహటి, హాజీపూర్, కోల్కతా, రాయ్బరేలీలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫార్మాసూ్యటికల్ ఎడ్యుకేషన్, రీసెర్చ్(నైపర్)లకు ‘జాతీయ ప్రాధాన్యత కలిగిన సంస్థ’ హోదా కల్పించేందుకు ఉద్దేశించిన బిల్లుకు లోక్సభ ఆమోదం తెలియజేసింది. ఈ మేరకు నైపర్(సవరణ) బిల్లు–2021ను ఆరోగ్య మంత్రిæ మాండవియా సభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లు చట్టంగా మారితే నైపర్లకు ఒకేరకమైన జాతీయ హోదా లభిస్తుందని తెలిపారు. నార్కోటిక్స్ డ్రగ్స్, సైకోట్రోపిక్ సబ్స్టాన్సెస్(ఎన్డీపీఎస్) చట్టంలో దొర్లిన తప్పిదాన్ని సరిచేయడానికి సవరణ బిల్లు–2021ను కేంద్రం లోక్సభలో ప్రవేశపెట్టింది. రాజ్యసభలో అదే దృశ్యం రాజ్యసభ నుంచి 12 మంది సభ్యుల సస్పెన్షన్పై ప్రతిపక్షాలు పట్టు వీడటం లేదు. సోమవారం కూడా ఆందోళనకు దిగాయి. దీంతో నాలుగు సార్లు సభ వాయిదాపడింది. రాజ్యసభలో నినాదాల మధ్యే నాగాలాండ్ ఘటనపై షా ప్రకటన చేశారు. అనంతరం సభను మరుసటి రోజుకు వాయిదా వేస్తున్నట్లు డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్ ప్రకటించారు. చదవండి: నాగాలాండ్ రాష్ట్రం మోన్ జిల్లాలో దారుణం -
17 మంది అమాయకులు బలి.. ఇంకెన్నాళ్లీ చట్టం?
సాక్షి, నేషనల్ డెస్క్: వచ్చిందెవరో ధ్రువీకరించుకోకుండానే... వారి వద్ద ఆయుధాలున్నాయా? దాడికి ప్రయత్నిస్తున్నారా? అనేవి ఏవీ చూడకుండా పనులకెళ్లి తిరిగి వస్తున్న కూలీలపై ఆర్మీ జవాన్లు కాల్పులకు తెగబడటం విభ్రాంతికలిగించింది. బొగ్గు గనిలో పని పూర్తిచేసుకొని పాటలు పాడుకుంటూ వాహనంలో ఇళ్లకు తిరిగి వస్తున్న కార్మికులపై సైనికులు తుపాకులు ఎక్కుపెట్టారు. ఈ ఘటనలో మృతుల సంఖ్య 17కే చేరింది. అయితే ఈశాన్య రాష్ట్రాల్లో ఇలాంటి దారుణాలు కొత్తేమీ కాదు. సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టం (ఏఎఫ్ఎస్పీఏ) కట్టబెట్టిన అపరిమిత అధికారాలతోనే సైన్యం ఇలాంటి అతిక్రమణలకు, హక్కుల ఉల్లంఘనలకు పాల్పడుతోంది. తిరుగుబాట్లను, వేర్పాటువాదాన్ని, నిషేధిత ఉగ్రసంస్థలను అణచివేసే చర్యల పేరిట అమాయాకుల ఊచకోత, మహిళలపై సైన్యం అకృత్యాలు చేసిన దృష్టాంతాలెన్నో ఉన్నాయి. ఈ నిరంకుశ చట్టాన్ని ఉపసంహరించాలని ఇక్కడి పౌర సమాజం, హక్కుల కార్యకర్తలు, రాజకీయ నాయకులు ఎన్నో ఏళ్లుగా గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. ఈశాన్య రాష్ట్రాల్లో అశాంతిని, అలజడులను నియంత్రించడం రాష్ట్ర ప్రభుత్వాల యం త్రాంగాలకు సాధ్యం కాకపోవడంతో ఆరు దశాబ్దాల కిందట 1958లో కేంద్ర ప్రభుత్వం ‘ఏఎఫ్ఎస్పీఏ’ చట్టాన్ని తెచ్చింది. దీని ప్రకారం... ►కల్లోలిత ప్రాంతంగా ప్రకటించిన ప్రదేశాల్లో శాంతిభద్రతలను కాపాడే అధికారం సైనిక బలగాలకు దఖలు పడుతుంది. ►ఐదుగురికి మించి ఒకేచోట గుమిగూడకుండా ఆర్మీ నిషేధం విధించగలదు. ►ఎవరైనా ఈ ఆజ్ఞలను ఉల్లంఘించారని భావిస్తే బలప్రయోగం ద్వారా నియంత్రించొచ్చు. ముందస్తు హెచ్చరిక జారీచేసి కాల్పులూ జరపొచ్చు. ►సమంజసమైన అనుమానం ఉంటే వారెంటు లేకుండానే ఎవరినైనా అరెస్టు చేయవచ్చు. అరెస్టుకు కారణాలను వివరిస్తూ తర్వాత సమీపంలోని పోలీసుస్టేషన్లో సదరు వ్యక్తిని లేదా వ్యక్తులను అప్పగించవచ్చు. ►వారెంటు లేకుండానే ఎవరి ఇంట్లోకైనా ప్రవేశించి సోదాలు జరపొచ్చు. ►ఆయుధాలు కలిగి ఉండటాన్ని నిషేధించొచ్చు. ఏది కల్లోలిత ప్రాంతమంటే... భిన్న మతాలు, జాతులు, భాషలు, కులాలు, ప్రాంతాల ప్రజల మధ్య వైషమ్యాలు పెరిగి ఘర్షణలు తలెత్తితే... ఆ ఏరియాను ‘కల్లోలిత ప్రాంతం’గా ప్రకటించే వీలును ఏఎఫ్ఎస్పీఏ చట్టంలోని సెక్షన్–3 కల్పిస్తోంది. కేంద్ర ప్రభుత్వం (హోంశాఖ), లేదా రాష్ట్ర గవర్నర్ మొత్తం రాష్ట్రాన్ని లేదా కేంద్ర పాలిత ప్రాంతాన్ని కల్లోలిత ప్రాంతంగా ప్రకటించొచ్చు. శాంతిభద్రతలను కాపాడటానికి రాష్ట్ర యంత్రాంగానికి సైనిక బలగాల సాయం అవసరమైన చోట్ల ఈ చట్టాన్ని ప్రయోగించవచ్చు. కేంద్ర ప్రభుత్వం ఏఎఫ్ఎస్పీఏను ప్రయోగించే అధికారాన్ని రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయానికే వదిలివేయవచ్చు. ఎక్కడెక్కడ అమలులో ఉంది? అస్సాం, నాగాలాండ్, మణిపూర్ (మణిపూర్ మున్సిపల్ కౌన్సిల్ ఏరియాను మినహాయించి), అరుణాచల్ప్రదేశ్లోని చాంగ్లాంగ్, లాంగ్డింగ్, తిరప్ జిల్లాల్లో ఈ చట్టం అమలులో ఉంది. నాగాలాండ్లో డిసెంబరు 31 దాకా దీన్ని పొడిగిస్తూ ఈ ఏడాది జూన్ 30నే ఆదేశాలు జారీ అయ్యాయి. అస్సాంలో రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబరు 11న మరో ఆరునెలలు ఈ చట్టం అమలును పొడిగిస్తూ ఆదేశాలు జారీచేసింది. మేఘాలయలో ఏప్రిల్ 1, 2018న ఈ చట్టాన్ని కేంద్రం ఎత్తివేసింది. 16 ఏళ్ల పోరాటం ఇరోమ్ షర్మిల... మణిపూర్ ఉక్కుమహిళగా ఖ్యాతికెక్కిన ఈ పేరు చిరపరిచితమే. 2000 నవంబరులో మణిపూర్లోని మలోమ్ పట్టణంలో బస్సు కోసం వేచిచూస్తున్న 10 మంది సాధారణ పౌరులను అస్సాం రైఫిల్స్ దళం కాల్చి చంపింది. ఈ మలోమ్ ఊచకోతకు నిరసనగా, ఏఎఫ్ఎస్పీఏను ఉపసంహరించాలనే డిమాండ్తో 28 ఏళ్ల ఇరోమ్ షర్మిల నిరాహార దీక్షకు దిగారు. మూడు రోజులకే ఆత్మహత్యకు ప్రయత్నించిందనే అభియోగంపై ఆమెను పోలీసులు అరెస్టు చేశారు. 2000 నవంబర్ నుంచి 2016 ఆగస్టు దాకా పోలీసు కస్టడీలోనే ఇరోమ్ షర్మిల నిరాహారదీక్షను కొనసాగించారు. ఈ సమయంలో ట్యూబ్ ద్వారా ఆమెకు బలవంతంగా ద్రవాహారం అందించారు. కేంద్రం ఈ చట్టాన్ని ఎంతకీ ఉపసంహరించుకోకపోవడంతో ఆమె మనసు మార్చుకొని 2016 ఆగస్టు 9న తన దీక్షను విరమించారు. రాజకీయాల్లోకి అడుగుపెట్టిన ఇరోమ్ సొంత పార్టీ పెట్టి 2017 అసెంబ్లీ ఎన్నికల్లో ఆనాటి మణిపూర్ సీఎం ఓక్రమ్ ఇబోబీ సింగ్పై పోటీచేశారు. కేవలం 90 ఓట్లు మాత్రమే పడ్డాయి. తమ ప్రజలపై అకృత్యాలను ఎండగడుతూ... ప్రపంచం దృష్టిని అకర్షించి, ఏకధాటిగా 16 ఏళ్లు దీక్ష చేసినా... సొంత జనమే ఆదరించలేదు. సాయుధ బలగాల అకృత్యాలకు ఊతమిచ్చే ఈ నిరంకుశ చట్టం ఇంకా కొనసాగుతూనే ఉంది. -
అమాయక కూలీలపై పేలిన ఆర్మీ తూటా
కోహిమా/గువాహటి/న్యూఢిల్లీ: ఈశాన్య రాష్ట్రం నాగాలాండ్లో దారుణం జరిగింది. తీవ్రవాదుల ఏరివేత ఆపరేషన్ గురి తప్పింది. బొగ్గు గనిలో పని పూర్తిచేసుకొని పాటలు పాడుకుంటూ వాహనంలో ఇళ్లకు తిరిగి వస్తున్న కార్మికులపై సైనికులు తుపాకులు ఎక్కుపెట్టారు. కాల్పుల్లో ఆరుగురి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. సమయం గడుస్తున్నా ఇంటికి చేరుకోని తమవారిని వెతుకుతూ గ్రామస్థులు బయలుదేరారు. కొంతదూరం వెళ్లాక కంటిముందు కనిపించిన రక్తపాతాన్ని చూసి ఆగ్రహంతో రగిలిపోయారు. అక్కడే ఉన్న మిలటరీ వాహనాలను చుట్టుముట్టి, నిప్పు పెట్టారు. జవాన్లపై దాడికి దిగారు. అప్రమత్తమైన జవాన్లు ఆత్మరక్షణ కోసం తుపాకులకు మళ్లీ పనిచెప్పారు. ఈసారి మరో ఏడుగురు పౌరులు ప్రాణాలొదిలారు. గ్రామస్థుల దాడిలో ఒక జవాను మరణించాడు. సైనికుల కాల్పుల్లో మొత్తం 11 మంది గాయపడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు చెప్పారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందన్నారు. మోన్ జిల్లాలోని తిరూ ఏరియాలో ఓతింగ్ గ్రామం వద్ద శనివారం సాయంత్రం చోటుచేసుకున్న ఈ సంఘటన ఆదివారం వెలుగులోకి వచ్చింది. మరొకరి మృతి సైనికుల కాల్పులు, పేదల మరణంపై ఆదివారం నాగాలాండ్ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. జనం వీధుల్లోకి వచ్చారు. సైన్యం అకృత్యానికి వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు. 17 మందిని పొట్టనపెట్టుకున్న జవాన్లపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మోన్ జిల్లాలో కోన్యాక్ యూనియన్ ఆఫీసు, అస్సాం రైఫిల్స్ క్యాంపు కార్యాలయాన్ని ధ్వంసం చేశారు. కార్యాలయంలోని పలు భాగాలను దహనం చేశారు. వారిని అడ్డుకోవడానికి భద్రతా సిబ్బంది కాల్పులు జరపడంతో ఒకరు మృతిచెందారు. మరో ఇద్దరు గాయపడ్డారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో నాగాలాండ్ ప్రభుత్వం అప్రమత్తమయ్యింది. తప్పుడు సమాచారం, వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వ్యాప్తి చెందకుండా మోన్ జిల్లాలో మొబైల్, ఇంటర్నెట్ సర్వీసులపై నిషేధం విధిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. అయినప్పటికీ కార్యాలయాల విధ్వంసానికి సంబంధించిన కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో కనిపించాయి. రాష్ట్రవ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. 17 మంది మృతదేహాలకు మోన్ జిల్లా ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు. గాయపడిన వారిని ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నట్లు పేర్కొన్నారు. పరిస్థితి విషమంగా ఉన్న ఇద్దరిని మెరుగైన చికిత్స కోసం అస్సాంకు తరలించినట్లు చెప్పారు. ‘సిట్’ ఏర్పాటు తాజా సంఘటనపై విచారణ కోసం ఐదుగురు సభ్యులతో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్) నాగాలాండ్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ బృందానికి నాగాలాండ్ ఐజీ నేతృత్వం వహిస్తున్నారు. ఉన్నత స్థాయి దర్యాప్తు జరిపిస్తున్నామని, రాష్ట్ర ప్రజలంతా సంయమనం పాటించాలని సీఎం నీఫియూ రియో విజ్ఞప్తి చేశారు. శాంతి భద్రతకు విఘాతం కలిగించరాదని కోరారు. సైనికుల కాల్పుల ఘటనపై రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఆర్మీ చీఫ్ జనరల్ ఎం.ఎం.నరవణేకు ఉన్నతాధికారులు వివరణ ఇచ్చినట్లు తెలిసింది. 17 మంది మరణించడం పట్ల కేంద్ర హోం మంత్రి అమిత్ షా సంతాపం ప్రకటించారు. వారి కుటుం బాలకు ట్విట్టర్లో సానుభూతి తెలిపారు. బాధిత కుటుంబాలకు న్యాయం చేస్తామన్నారు. హార్న్బిల్ ఫెస్టివల్ బహిష్కరిస్తున్నాం పౌరులపై సైనికులు విచక్షణారహితంగా కాల్పులు జరపడాన్ని ఈస్ట్రర్న్ నాగాలాండ్ పీపుల్స్ ఆర్గనైజేషన్(ఈఎన్పీఓ) ఖండించింది. ఈ సంఘటనకు నిరసనగా హార్న్బిల్ ఫెస్టివల్ను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించింది. ఈ ఫెస్టివల్లో పాల్గొనరాదంటూ స్థానిక గిరిజన తెగలకు పిలుపునిచ్చింది. నల్లజెండాలు ఎగురవేసి నిరసన తెలపాలంది. దేశ విదేశీ పర్యాటకులను ఆకర్శించడానికి నాగాలాండ్ ప్రభుత్వం ప్రస్తుతం హార్న్బిల్ ఫెస్టివల్ నిర్వహిస్తోంది. మోన్ జిల్లా పొరుగు దేశమైన మయన్మార్తో అంతర్జాతీయ సరిహద్దును పంచుకుంటోంది. ఎన్ఎస్సీఎన్–కేలోని యుంగ్ ఆంగ్ ముఠా ఇక్కడి నుంచే కార్యకలాపాలు సాగిస్తోంది. అసలేం జరిగింది? నిషేధిత నేషనల్ సోషలిస్టు కౌన్సిల్ ఆఫ్ నాగాలాండ్–ఖప్లాంగ్(ఎన్ఎస్సీఎన్–కే) అనే తీవ్రవాద సంస్థలో ఒక భాగమైన యుంగ్ ఆంగ్ ముఠా సభ్యులు తిరూ ఏరియాలో సంచరిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం అందుకున్న సైనికులు గాలింపు చర్యలు ప్రారంభించారు. పని ముగించుకొని వాహనంలో వస్తున్న కార్మికులను ఎన్ఎస్సీఎన్–కే తీవ్రవాదులుగా భ్రమపడి, కాల్పులు జరిపారు. చిన్న పొరపాటు భారీ హింసాకాండకు దారితీసింది. రెండుసార్లు జరిగిన కాల్పుల్లో మొత్తం 17 మంది బడుగు జీవులు బలయ్యారు. ఒక జవాను సైతం ప్రాణాలు పోగొట్టుకోవాల్సి వచ్చింది. ఈ మొత్తం పరిణామాలపై ‘కోర్టు ఆఫ్ ఎంక్వైరీ’ కోసం ఆదేశాలు జారీ చేసినట్లు సైన్యం ప్రకటించింది. జనం దాడిలో తమ సైనికులు కొందరు తీవ్రంగా గాయపడ్డారని వెల్లడించింది. 17 మంది సాధారణ ప్రజలు చనిపోవడం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేసింది. ఇది దురదృష్టకర సంఘటన అని పేర్కొంది. కేంద్ర హోంశాఖ ఏం చేస్తోంది? ‘‘నాగాలాండ్లో సైన్యం కాల్పులపై కేంద్ర ప్రభుత్వం సరైన సమాధానం చెప్పాలి. సొంత దేశంలోనే పౌరులకు, భద్రతా సిబ్బందికి రక్షణ లేని పరిస్థితి ఉంటే కేంద్ర హోంశాఖ ఏం చేస్తోంది. 17 మంది పౌరుల మరణం నా హృదయాన్ని కలచివేసింది’’ – రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ ఎంపీ సమగ్ర దర్యాప్తు జరపాలి ‘‘నాగాలాండ్లో సైన్యం కాల్పుల్లో పౌరుల మృతిపై సమగ్ర దర్యాప్తు జరపాలి. బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలి. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నా’’ – మమతా బెనర్జీ, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి -
ఈశాన్యానికి లాంగ్మార్చ్?
సాక్షి, హైదరాబాద్: కీలక నేతల మరణాలు, లొంగుబాట్ల నేపథ్యంలో ఉనికి కోసం మావోయిస్టు పార్టీ వ్యూహం మారుస్తోందా? కేడర్ను కాపాడుకు నేందుకు ఈశాన్య రాష్ట్రాలకు ‘మార్చ్’ చేస్తోందా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. కొన్నాళ్ల పాటు ఛత్తీస్గఢ్, ఆంధ్రా–ఒడిశా సరిహద్దు (ఏవోబీ) ప్రాంతాలను వదిలేయాలని ఆ పార్టీ కేంద్ర కమిటీ నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఛత్తీస్గఢ్ మీదుగా పశ్చిమబెంగాల్ ద్వారా నాగాలాండ్ చేరువ వ్వాలని నిర్ణయించినట్టు విశ్వసనీయ సమాచారం. కార్యకలాపాల నిర్వహణకు ఏమాత్రం అను కూలంగా లేని వాతావరణం కావడంతో ఉన్న నేత లను, కేడర్ను కాపాడుకునే పనిలో మావోయిస్టు పార్టీ ఉన్నట్టు తెలుస్తోంది. ఏవోబీలో ఉన్న ఆరు కమిటీలను రెండు కమిటీలుగా, ఛత్తీస్గఢ్లో ఉన్న 4 కమిటీలను రెండు కమిటీలుగా మార్చేసిన మావో యిస్టు పార్టీ.. కేడర్ను కాపాడే పనిలో నిమగ్న మైంది. ఆర్కే మరణం, హిడ్మా ఆరోగ్య పరిస్థితి, పెద్దగా కార్యకలాపాలు లేని తెలంగాణ కమిటీ.. ఇలా అన్ని కమి టీలు దీనావస్థలో ఉండటంతో కేవలం ఆత్మరక్షణ కోసమే కార్యాచరణ రూపొందిం చుకున్నట్టు తెలిసింది. బలంగా ఉన్న అబూజ్మడ్ (ఛత్తీస్గఢ్)ను సైతం వదిలి వెళ్లక తప్పదనే కేంద్ర కమిటీ సూచనతో ఆత్మరక్షణ చర్యలు ప్రారంభించినట్టు సమాచారం. ఎందుకీ పరిస్థితి.. ఛత్తీస్గఢ్, ఏవోబీ స్పెషల్ జోనల్ కమిటీలపై బలగాలు రెండేళ్లుగా ప్రత్యేక దృష్టి సారించాయి. కేంద్ర హోంశాఖతోపాటు ఆయా రాష్ట్రాల పోలీస్ విభాగాలు సంయుక్తంగా ప్రతీ వ్యక్తి కదలికలపై నిఘా పెట్టాయి. ఆయా ప్రాంతాల్లో బేస్ క్యాంపులను పెంచుకొని ప్రత్యేక శాటిలైట్ ద్వారా కదలికలను ఎప్పటికప్పుడు గమనిస్తున్నాయి. దీంతో మావోయిస్టు పార్టీకి చేరాల్సిన ఆహార పదార్థాలు, నిత్యావసరాలు, మందులు, డబ్బులు, ఆయుధాలు.. ఇలా ప్రతీ వ్యవహారంసైనా కదలికలను బేస్ క్యాంపుల ద్వారా పసిగట్టి నియంత్రించారు. ప్రజలను ఇబ్బందులకు గురిచేయకుండానే ఇన్ఫార్మర్లు/కొరియర్లుగా వ్యవహరిస్తున్న వారిని నియంత్రించి సక్సెస్ అయ్యారు. మావో అగ్రనేత ఆర్కే మరణం కూడా ఇందులోభాగమే అని ఆ పార్టీ బహిరంగంగానే ఆరోపించింది. మందులు, ఇతర నిత్యావసరాలను అడ్డుకొని ఆరోగ్యం క్షీణించేలా చేశారని ఆర్కే భార్య కూడా ఆరోపించింది. వారసంతలపైనా నిఘా అబూజ్మడ్తోపాటు ఏవోబీలోని వారసంతలపైనా బలగాలు నిఘా పటిష్టం చేశాయి. ప్రతీ కుటుంబం ప్రతీ వారం కొనుగోలు చేసే వస్తువులపై నిఘా పెట్టింది. మునుపటి వారం కన్నా ఎక్కువ కొనుగోలు చేస్తే ఇంట్లో ఏదైనా శుభకార్యముందా? లేక మావోయిస్టు పార్టీకి అందించేందుకు కొనుగోలు చేశారా అన్నంత లోతుగా ఇన్ఫార్మర్ వ్యవస్థను ఏర్పాటుచేసుకున్నాయి. సర్జరీ ఆధారిత మందులు, పెయిన్ కిల్లర్లు, కరోనా మెడిసిన్స్.. ఇలా ఆయా ఏరియాల్లోని మందుల షాపుల్లో కొనుగోలు చేసే వ్యక్తులను గుర్తించి కౌన్సెలింగ్ సైతం చేసింది. కొనుగోలుదారుల కదలికలను పసిగట్టి కొరియర్లను తమవైపు తిప్పుకోవడంలో కేంద్ర బలగాలతోపాటు రాష్ట్ర బలగాలు సక్సెస్ అయినట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు స్పష్టంచేశాయి. దీనివల్లే అనారోగ్యం బారిన పడిన సీనియర్ నేతల మరణాలు జరిగినట్టు చెప్తున్నాయి. ఇదేకాకుండా రెండేళ్ల నుంచి జరిగిన రాష్ట్ర, కేంద్ర కమిటీ కీలక నేతల లొంగుబాట్లు ఆ పార్టీని మరింత అఘాతంలోకి నెట్టాయని భావిస్తున్నారు. విపత్కర పరిస్థితుల్లో రాష్ట్ర కమిటీలు అవలంబించే విధానాలు, వ్యూహాత్మక చర్యలను పసిగట్టి నిలువరించడంలో బలగాలు సఫలీకృతమైనట్టు తెలుస్తోంది. ఈనేపథ్యంలో కొన్నాళ్లపాటు ఈ రెండు ప్రాంతాలను వదిలి వెళ్లకతప్పని పరిస్థితి ఏర్పడినట్టు బలంగా వినిపిస్తోంది. ఎనిమిది నెలలుగా ఒక్క నియామకం లేదు... ఒకవైపు కీలక నేతల మరణాలు, మరోవైపు లొంగుబాట్లతో అతలాకుతలం అవుతున్న మావోయిస్టు పార్టీని కొత్త రక్తం లేక మరింత చీకట్లోకి నెట్టింది. ఛత్తీస్గఢ్, ఏవోబీ, తెలంగాణ, మహారాష్ట్రలో కొత్త నియామకాలు ఏమాత్రం జరగలేదు. ఎనిమిది నెలలుగా అంటే ఈ ఏడాదిలో దాదాపుగా రిక్రూట్మెంట్ లేకుండా చేయడంలో పోలీసులు పైచేయి సాధించారు. నియామకాలు జరగకపోవడంపై ఒక్క ఉదాహరణ మావోయిస్టు పార్టీ నుంచే వినిపిస్తోంది. ఆర్కే తీవ్ర అనారోగ్యానికి గురైన సందర్భంలో ఒక ప్లాటూన్ కేవలం ఆయన రక్షణ కోసమే పనిచేసింది. మంచానికే పరిమితమైన ఆర్కేను కంటికి రెప్పలా కాపాడేందుకు ఆయన చుట్టూ ఉన్న ప్లాటూన్ రక్షణ దళానికి కాపలాగా లోకల్ గెరిల్లా టీమ్ రక్షణ కవచంగా నిలిచింది. ఇలా మూడు నెలల పాటు ఎలాంటి కార్యకలాపాలు లేకుండా ఏవోబీ జోనల్ కమిటీ ఉండిపోవాల్సి వచ్చింది. ఈ సమయంలో ఆర్కే కీలక సూచనలు చేసినట్టు తెలిసింది. కేవలం తన కోసం రెండు వ్యవస్థలు కార్యకలాపాలు చేయకుండా ఉండిపోవడం పార్టీకి నష్టాన్ని కల్గిస్తుందని, కొంతమంది మినహా మిగతా బృందాలు కార్యకలాపాల్లో నిమగ్నమవ్వాలని సూచించారని తెలిసింది. నియామకాలను విస్తృతం చేయడంపై దృష్టి పెట్టాలని పదేపదే చెప్పినట్టు సమాచారం. కొద్దిరోజులు దూరంగా..! ప్రస్తుత కీలక పరిణామాలతో ఈ రెండు ప్రాంతాల నుంచి కొద్దిరోజులపాటు దూరంగా ఉండటం మంచిదని, అందుకు ఈశాన్య రాష్ట్రాలకు వలస వెళ్లకతప్పదని కేంద్ర కమిటీ భావిస్తున్నట్టు ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా తెలిసింది. ఛత్తీస్గఢ్, ఏవోబీలో ఉన్న కీలక నేతలు, ముఖ్య కేడర్ను పశ్చిమబెంగాల్ మీదుగా నాగాలాండ్కు చేరుకోవాలని కేంద్ర కమిటీ పిలుపునిచ్చినట్టు పార్టీలోనూ చర్చ జరుగుతున్నట్లు తెలిసింది. మావోయిస్టు పార్టీ ఉనికికే ప్రమాదం అన్న పరిస్థితుల్లో ఈ ప్రాంతాల్లో కార్యకలాపాలకు బ్రేక్ ఇచ్చి నాగాలాండ్ రావాల్సినట్టుగా ఆదేశాలున్నట్టు కూడా చర్చ జరుగుతోంది. ఈశాన్య రాష్ట్రాల్లో కార్యకలాపాల విస్తృతికి అక్కడి నుంచే పనిచేయాలన్న ఆలోచనలో కేంద్ర కమిటీ ఉన్నట్టు తెలుస్తోంది. -
కాఫీ క్లాసులు.. జమీర్ కృషి వృథా పోలేదు
వెనక్కి తిరిగి చూడకుండా ముందుకు వెళ్లడానికి మాత్రమే ప్రాధాన్యత ఇస్తారు కొందరు. కొందరు మాత్రం కాస్త ఆగి వెనక్కి చూసి ఆగిపోయిన వారికి ఆసరాగా నిలుస్తారు. అండగా నిలబడతారు. జకైట్సొనో జమీర్ రెండో కోవకు చెందిన మహిళ. ‘కాఫీ లేడీ ఆఫ్ నాగాలాండ్’గా పేరు తెచ్చుకున్న జమీర్ విజయవంతమైన వ్యాపారిగా ఎదగడం వెనుక కష్టాలు ఉన్నాయి. ఆ కష్టాలను తట్టుకొని నిలబడిన పట్టుదల ఉంది. కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగ లేకపోవడంతో చదువును మధ్యలోనే వదిలేయాల్సి వచ్చింది జమీర్కు. కుటుంబానికి ఆసరాగా నిలవడానికి ఏదైనా చిన్నవ్యాపారమో, ఉద్యోగమో చేయాలనుకుంది. కాని ఏం చేయాలి? అనే విషయంలో మాత్రం స్పష్టత లేదు. ఆ సమయంలోనే ఒక వర్క్షాప్కు హాజరైంది జమీర్. తోట నుంచి కప్పు వరకు కాఫీ ప్రస్థానాన్ని ఆ వర్క్షాప్లో చెప్పారు. కాఫీ రుచిగా ఉండడానికి ఎన్ని విషయాలు దోహద పడతాయో అనే విషయం తనకి ఆసక్తికరంగా అనిపించింది. కాఫీ ఎలా పుడుతుందో తెలుసుకున్న క్లాసులోనే ‘బిజినెస్ ఐడియా’ పుట్టింది! ఈ క్లాస్ల స్ఫూర్తితో ‘ఫార్మర్ స్క్వేర్’అనే కేఫ్ను దిమపూర్లో మొదలుపెట్టింది. అయితే మొదలుపెట్టిన కొన్ని నెలలకే ఆ కేఫ్ మూతపడింది. అనుకున్నది ఒకటి, అయ్యింది ఒకటి... అన్నట్లుగా తయారైంది పరిస్థితి. నిరాశ చీకట్లో కొట్టుమిట్టాడుతున్న రోజుల్లో తన కోసం మరో ద్వారం తెరుచుకుంది. జర్మనీకి సంబంధించిన ఒక డెవలప్మెంట్ కార్పోరేషన్ ఏజెన్సీ ‘హర్ అండ్ నౌ’ అనే సహాయక కార్యక్రమాన్ని చేపట్టింది. మరొకరైతే ‘కాఫీకో దండం. వ్యాపారం మనకు అచ్చిరాదు’ అని వెళ్లకుండా ఉండేవారేమో! కాని జమీర్ ఈ కార్యక్రమాల్లో భాగం కావడం ద్వారా తాను చేసిన తప్పులు, చేయకూడని తప్పులు, వ్యాపార వ్యూహం ఎలా ఉండాలి? మనదైన ప్రత్యేకత ఏమిటీ, ప్రాడక్ట్ మార్కెటింగ్ ప్లాన్స్ ఎలా ఉండాలి....ఇలా రకరకాల విషయాలు తెలుసుకుంది. ‘ఫార్మర్ స్క్వేర్’తో మరోసారి బరిలోకి దిగింది. ఈసారి మాత్రం తన కల తనని నిరాశ పరచలేదు. ‘లెస్ ఈజ్ మోర్’ అనేది తన కీలక వ్యాపార సూత్రంగా మారింది. తాజా గ్రౌండ్ కాఫీని అందించడంలో ‘ఫార్మర్ స్క్వేర్’ కేఫ్లకు మంచి పేరు వచ్చింది. పక్కన ఉన్న రాష్ట్రాలకు కూడా వ్యాపారం విస్తరించింది. తన విజయంతో సంతృప్తి పడకుండా తనలాంటి వారిని మరింత మందిని తయారుచేసే పనిలో ఉంది జమీర్. ఆర్థికంగా వెనకబడిన మహిళలకు కాఫీ నిపుణుల చేత వర్క్షాప్లు నిర్వహించడమే కాదు వ్యాపారం ఎలా చేయాలి? నష్టాలు రాకుండా ఎలా చూడాలి... ఇలా రకరకాల విషయాలు నేర్పిస్తుంది. మరోవైపు కాఫీ పంటల సాగులో మహిళలను ప్రోత్సహిస్తూ వారికి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తుంది. ‘క్వాలిటీ కాఫీ కల్చర్’ అనేది ఆమె ఎజెండాగా మారింది. ‘రకరకాల కారణాల వల్ల తీవ్రమైన నిరాశాæనిస్పృహల్లో ఉన్న సమయంలో, పెద్దగా ఆసక్తి లేకపోయినా సరే కాఫీ వర్క్షాప్కు వెళ్లాను. అక్కడ కేవలం సాంకేతిక విషయాలు మాత్రమే నేర్చుకున్నానంటే పొరపాటు. మనో బలాన్ని ఇచ్చే విషయాలు అనేకం విన్నాను. సొంతంగా వ్యాపారం మొదలుపెట్టి నన్ను నేను నిరూపించుకోవాలనే ఉత్సాహంలో ఉన్నాను’ అంటుంది నలభై రెండు సంవత్సరాల కికాన్. జమీర్ కృషి వృథా పోలేదు అని చెప్పడానికి ఇంతకంటే ఉదాహరణ ఏముంటుంది! చదవండి: Meenakshi Vashist: దీపం వెలిగింది -
అస్సాం, నాగాలాండ్ల మధ్య కీలక ఒప్పందం
దిమాపుర్/గువాహటి: అస్సాం, నాగాలాండ్ల మధ్య ముదిరిన సరిహద్దు వివాదానికి తాత్కాలిక బ్రేక్ పడే దిశగా ఇరు రాష్ట్రాలు కలసి నిర్ణయం తీసుకున్నాయి. అస్సాం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జిష్ణు బరువా, నాగాలాండ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జే ఆలంలు శనివారం భేటీ అయ్యారు. ఇరు రాష్ట్రాల బలగాలు మోహరించి ఉన్న దెసోయ్ లోయ అడవి/సురాంగ్కాంగ్ లోయ ప్రాంతాల నుంచి పరస్పరం వెనక్కు వెళ్లాలని ఒప్పందం చేసుకున్నారు. ఇరు రాష్ట్రాల సరిహద్దుల్లో వివాదాస్పదంగా ఉన్న పలు గ్రామాల నుంచి బలగాలను వెనక్కు పంపడం ద్వారా అక్కడ శాంతి నెలకొల్పే ప్రయత్నం జరుగుతోంది. 24 గంటల్లోగా బలగాలు వెనక్కు వెళ్లాలని ఇరు ప్రభుత్వాల నేతలు కలసి నిర్ణయించారు. నాగాలాండ్ డిప్యూటీ సీఎం వై పట్టాన్, అస్సాం విద్యా శాఖ మంత్రి రనోజ్ పెగు ఆధ్వర్యంలో ఈ భేటీ జరిగింది. ఇరు రాష్ట్రాలు కలసి మానవరహిత ఏరియల్ వెహికల్ (యూఏవీ) ద్వారా ఆయా ప్రదేశాలను మానిటర్ చేయనున్నారు. బలగాలను వెనక్కు తీసుకెళ్లే బాధ్యతలను సరిహద్దు (వివాదమున్న) జిల్లాల ఎస్పీలకు అప్పగించారు. వివాదాలను తగ్గించేందుకు అవసరమైన కీలక పరిష్కారం ప్రధాన కార్యదర్శుల భేటీ ద్వారా జరిగినట్లు అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ పేర్కొన్నారు. -
వైరల్: దుస్తులు చించేసి, మరీ ఘోరంగా..
‘‘ఐదుగురు రాక్షసులు ఒక అమ్మాయిని దుస్తులు చించేసి.. శారీరకంగా హింసించారు. ఆపై వీడియోలు తీసి షేర్ చేశారు. హింసించిన వాళ్లలో ఒక మహిళ కూడా ఉంది’’.. మానవత్వం తలదించుకునే రీతిలో జరిగిన ఈ ఘోరమైన ఘటన ఇప్పుడు సోషల్ మీడియలో దుమారం రేపుతోంది. అత్యాచార అవమానం తట్టుకోలేక ఆమె సూసైడ్ చేసుకుందని, ఘటనకు కారకులైనవాళ్లను కఠినంగా శిక్షించాలని #justiceforloviassumi హ్యాష్ట్యాగ్ ట్విటర్ను కుదిపేస్తోంది. ఇందులో వాస్తవమెంత ఉందంటే.. జోధ్పూర్(రాజస్థాన్) : ఇరవై ఐదేళ్ల లోవీ అస్సుమీ ఆత్మహత్య ఉదంతం ఇప్పుడు ఉత్తర భారతాన్ని కుదిపేస్తోంది. నాగాలాండ్కు చెందిన లోవి.. జోధ్పూర్లో ఓ రెస్టారెంట్లో పని చేస్తోంది. మే 23న తానుంటున్న గదిలో ఆమె ఉరి వేసుకుని సూసైడ్ చేసుకుంది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ లోపు ఇంటర్నెట్లో ఒక వీడియో రిలీజ్ అయ్యింది. నలుగురు వ్యక్తులు, ఓ మహిళ కలిసి ఓ అమ్మాయిని దుస్తులు చించేసి శారీరకంగా హింసించిన వీడియో అది. ఆ వీడియోను ఇంటర్నెట్లో ఉంచారు. కొందరు లోవీ అస్సుమీ ఉరికి వేలాడుతున్న ఫొటోలను, వేధింపుల వీడియోను, అందులోని స్క్రీన్ షాట్స్ను షేర్ చేశారు. ఆ వీడియోలో ఉంది లోవి అస్సుమీ అని, ఆ అవమాన భారం తట్టుకోలేకే ఆమె సూసైడ్ చేసుకుందని ప్రచారం మొదలైంది. దీంతో ఆమెకు న్యాయం జరగాలని సోషల్ మీడియా ఉద్యమిస్తోంది. వేర్వేరే ఘటనలు అయితే నాగాలాండ్ యువతి సూసైడ్కి, ఆ వీడియోలకు సంబంధం లేదని తెలుస్తోంది. ఈ మేరకు ఢిల్లీ అడిషినల్ డీజీపీ రాబిన్ హిబు కార్యాలయం నుంచి ఒక స్టేట్మెంట్ రిలీజ్ అయ్యింది. అవి రెండు వేర్వేరు ఘటనలని, ఈమేరకు జోధ్పూర్ డీజీపీతో సంప్రదించి ధృవీకరించినట్లు చెప్పారు. అంతేకాదు వీడియోలను నాగాలాండ్ యువతి సూసైడ్కి ముడిపెట్టి వైరల్ చేసిన వ్యక్తుల కోసం గాలిస్తున్నట్లు, ఈ మేరకు దర్యాప్తు జరపాలని గుజరాత్, మిజోరాం, రాజస్థాన్ పోలీసులకు సమాచారం అందించినట్లు తెలిపారు. ఈ సమాచారంతో కొందరు యూట్యూబర్లు ఈ వైరల్ వీడియోపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మృగాల్ని శిక్షించాల్సిందే! అయితే ఘటనలో ఉన్న బాధితురాలు ఎవరైనా సరే.. నిందితులను శిక్షించాల్సిందేనని కొందరు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు అస్సాం పోలీసులు ఫేస్బుక్లో ఒక ప్రకటన పోస్ట్ చేశారు. వీడియోలో ఐదుగురు ఉన్నారని, వాళ్ల ఆచూకీ చెబితే నజరానా అందిస్తామని తెలిపింది. ఘటన ఎప్పుడు, ఎక్కడ జరిగిందో తెలిదు. కానీ, నిందితుల సమాచారం అందిస్తే బాధితులకు న్యాయం జరిగేలా చూస్తాం అని అస్సాం పోలీసులు వెల్లడించారు. అయితే వీడియోల్లో ఆ గ్యాంగ్ ఇద్దరు అమ్మాయిలపై దాష్టీకానికి పాల్పడినట్లు గుర్తించామని కొందరు చెప్తున్నారు. -
నాలుగు బంతుల్లోనే మ్యాచ్ ఫినిష్..
ఇండోర్: దేశవాళీ మహిళల క్రికెట్లో ముంబై జట్టు అనితర సాధ్యమైన రికార్డును నమోదు చేసింది. సీనియర్ వన్డే ట్రోఫీలో భాగంగా ముంబై, నాగాలాండ్ జట్ల మధ్య జరిగిన వన్డే మ్యాచ్ కేవలం నిమిషాల వ్యవధిలో పూర్తయింది. తొలుత నాగాలాండ్ జట్టును 17 పరుగులకే ఆలౌట్ చేసిన ముంబై మహిళా జట్టు.. అనంతరం లక్ష్యాన్ని కేవలం 4 బంతుల్లోనే ఛేదించి చరిత్ర సృష్టించింది. ఇండోర్లోని హోల్కర్ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న నాగాలాండ్ జట్టు.. ముంబై కెప్టెన్, మీడియం పేసర్ సయాలీ సత్ఘరె (8.4 ఓవర్లలో 7/5) ధాటికి 17.4 ఓవర్లలో 17 పరుగలకే చాపచుట్టేసింది. సయాలీ ధాటికి నాగాలాండ్కు చెందిన ఒక్క బ్యాటర్ కూడా డబుల్ డిజిట్ స్కోర్ని నమోదు చేయలేకపోయారు. సయాలీకి తోడుగా దాక్షిణి (2/12), ఎస్. థాకోర్ (1/0) రాణించారు.అనంతర స్వల్ప లక్ష్య ఛేదనకు బరిలోకి దిగిన ముంబై కేవలం 4 బంతుల్లోనే విజయాన్ని నమోదు చేసింది. ఓపెనర్ ఇషా ఓజా, వృషాలీ భగత్ వరుసగా మూడు బౌండరీలు, ఒక సిక్సర్ బాదడంతో మరో 49.2 ఓవర్లు మిగిలుండగానే 10 వికెట్ల తేడాతో ముంబై గెలుపొందింది. అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న సయాలికి 'ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్' అవార్డు దక్కింది. -
కోవిడ్ టీకా: పడిపడి నవ్విన పోలీసు అధికారి
కోహిమా: మహమ్మారిని తరిమేందుకు దేశంలో కరోనా వైరస్ వ్యాక్సినేషన్ రెండవ దశ ముమ్మురంగా కొనసాగుతోంది. మొదటి దశలో ఫ్రంట్లైన్ వారియర్స్కి టికా ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వ్యాక్సిన్ వేసుకునేందుకు కోవిడ్ సెంటర్కు వచ్చిన ఓ పోలీసు అధికారి పడిపడి నవ్వుతున్న వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. సాధారణంగా వ్యాక్సిన్ వేసుకునే సమయంలో చాలా మంది భయపడటం మనం గమనించాము. కానీ ఐపీఎస్ అధికారి రూపిన్ శర్మ మంగళవారం ట్విటర్లో షేర్ చేసిన ఈ వీడియోలో టీకా వేసుకునేందుకు వచ్చిన నాగాలాండ్ పోలీసు అధికారి నవ్వుతూ కనిపించాడు. ఈ వీడియోలో వ్యాక్సినేషన్ సెంటర్కు వచ్చిన పోలీసు అధికారికి టీకా ఇచ్చేందుకు నర్సు అతని భజాన్ని తాకింది. దీంతో సదరు పోలీసు చెక్కిలిగింతలు పుట్టినట్లు ఒక్కసారిగా నవ్వుడం ప్రారంభించాడు. అలా అతడు ఎందుకు నవ్వుతున్నాడో అక్కడి వారికేవరికి అర్థం కాలేదు. ‘చివరికి అతడికి వ్యాక్సిన్ వేశారా లేదో తెలీదు. కానీ నర్సు అతడిని తాకగానే చెక్కిలిగింతలు పెట్టినట్లుగా అత్యుత్సాహంతో నవ్వడం ప్రారంభించాడు’ అంటూ ఆయన ఈ వీడియోను షేర్ చేశారు. #Covid19 #Vaccination gem apparently from #Nagaland. Not sure whether he had it finally but Looks like he was more anxious about the 'tickling' शायद सुई से नहीं , #स्पर्श की #गुदगुदी से हंगामा हो रहा था । pic.twitter.com/9ZTmX3URnc — Rupin Sharma IPS (@rupin1992) March 7, 2021 -
నాగాలాండ్లో అరుదైన దృశ్యం.. 58 ఏళ్ల తర్వాత
కోహిమా: శాసనాలు రూపొందించే చట్టసభలో దాదాపు 58 ఏళ్లుగా జాతీయ గీతం ఆలపించడం లేదు. దేశవ్యాప్తంగా ‘జనగణమన’ ఆలపించడం సంప్రదాయం. కానీ ఈశాన్య రాష్ట్రమైన నాగాలాండ్ అసెంబ్లీలో మాత్రం ఇంతవరకు జాతీయ గీతం ఆలపించలేదు. ఐదు దశాబ్దాల అనంతరం తొలిసారిగా ఇప్పుడు జనగణమనను సభ్యులు పాడారు. ఈ కొత్త సంప్రదాయం ప్రారంభమవడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. 1962లో నాగాలాండ్ రాష్ట్రం ఏర్పడగా రాష్ట్రం ఏర్పడిన అనంతరం తొలిసారిగా ఆ అసెంబ్లీలో జనగణమనను ప్రజాప్రతినిధులు ఆలపించారు. అసెంబ్లీ సమావేశాల ప్రారంభోత్సవం సందర్భంగా గవర్నర్ ఆర్ఎన్ రవి ప్రసంగం ప్రారంభానికి ముందు జాతీయ గీతం ఆలపించి కొత్త సంప్రదాయానికి తెర లేపారు. ఈ పరిణామం ఫిబ్రవరి 12వ తేదీన శుక్రవారం ప్రారంభమైంది. మంత్రి, ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు తేమ్జన్ ఇమ్నా ఈ పరిణామంపై హర్షం వ్యక్తం చేశారు. అయితే రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి అసెంబ్లీలో ఎందుకు జనగణమన గీతం ఆలపించడం లేదో తమకు తెలియదని అసెంబ్లీ అధికారులు చెప్పారు. ఏది ఏమైనా ఇప్పటికైనా ఈ కొత్త సంప్రదాయాన్ని వెలుగులోకి తీసుకురావడంపై దేశవ్యాప్తంగా హర్షం వ్యక్తమవుతోంది. స్పీకర్ షరిన్గైర్ లాంగ్కుమార్ నేతృత్వంలో నాగాలాండ్ ముఖ్యమంత్రి నెఫ్యూ రియో ఆధ్వర్యంలో ఈ పరిణామం జరిగింది. 58 years after Nagaland became a state, Jana Gana Mana played in the assembly for the first time. Members of the Assembly stand as the National Anthem “Jana Gana Mana” is played in the House for the very first time in the history of the Nagaland Legislative Assembly. pic.twitter.com/nHLauZhucv — Nandan Pratim Sharma Bordoloi 🇮🇳 (@NANDANPRATIM) February 19, 2021 -
వైరల్: గుడిసెకు కాళ్లు వచ్చాయా?
న్యూఢిల్లీ: ఏదైనా ఓ భారీ వస్తువును ఒక చోటు నుంచి మరో చోటుకు తీసుకువెళ్లాలంటే కొంతమంది సమిష్టిగా పని చేయాల్సిందే. ఎంత పెద్ద పనైనా బృందంగా ఏర్పడి చేస్తే ఎటువంటి అలసట లేకుండానే పూర్తవుతుంది. ఇటువంటి ఓ పనిని నాగాలాండ్లోని ఓ గ్రామ ప్రజలు చేయగా అది ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కొంతమంది స్థానికులు నాగాలాండ్లోని ఒక గ్రామంలో ఏకంగా ఓ గుడిసె ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి కాలినడకన చేతులపై మోస్తూ మార్చారు. ఆ గుడిసెను నాలుగు వైపుల పట్టుకొని అది ఉన్న ప్రదేశం నుంచి కొత్త ప్రదేశానికి మార్చారు. ఈ వీడియోను ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఆఫీసర్ సుధా రామెన్ తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ‘ఐక్యతమే మహా బలం అని నాగాలు మనకు చూపించే వీడియో ఇది. నాగాలాండ్లోని ఓ గ్రామంలో హౌస్ షిఫ్టింగ్ చాలా పురోగతిలో ఉంది’ అని కామెంట్ జత చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో సుమారు 9 వేల మంది నెటిజన్లు వీక్షించారు. ఈ వీడియోను చేసిన నెటిజన్లు ఆశ్చర్యపోతూ కామెంట్లు చేస్తున్నారు. ‘చక్రాలు లేకుండానే షిఫ్టింగ్.. అద్భుతం’, ‘వావ్.. ఇది టీం వర్క్ అంటే’, ‘గుడిసెకు కాళ్లు వచ్చాయా?’ అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. -
ఏకంగా ఇంటినే మోసేశారు..
నాగాలాండ్: ఐకమత్యంగా ఉంటే ఏదైనా సాధించగలమని నాగాలాండ్లోని గ్రామస్తులు మరోసారి నిరూపించారు. గ్రామస్తులు తలో చేయి వేసి ఏకంగా ఓ గుడిసెను ఓ చోటు నుంచి మరో చోటుకి తరలించారు. గ్రామస్తులు గుంపులుగా విడిపోయి గుడిసె నాలుగు దిక్కుల్లోని పునాదులను పైకి లేపి కాలి నడకనే గుడిసెను నూతన గమ్యానికి చేర్చారు. ఈ ఆసక్తికర సన్నివేశానికి సంబంధించిన వీడియోను ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్ అధికారి సుధా రామన్ తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఐకమత్యమే మహా బలమని ఈ నాగాలు మరోసారి నిరూపించారంటూ క్యాప్షన్ జోడించింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట చెక్కర్లు కొడుతోంది. పోస్ట్ చేసిన గంటలోనే ఏకంగా 9000 వ్యూవ్స్ను సొంతం చేసుకుంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. Yet another video where the Nagas show us that Unity is strength! House shifting in progress at village in Nagalandpic.twitter.com/XUGhiEGNe7 — Sudha Ramen IFS 🇮🇳 (@SudhaRamenIFS) February 5, 2021 -
వైరల్ వీడియో : యూనిటీ పవర్ ఏంటో చూపించారు
నాగాలాండ్ : ఐకమత్యం ఉంటే ఎంతటి అసాధ్యం అయినా సుసాధ్యం అవుతుంది. నాగాలాండ్లో జరిగిన ఓ సంఘటన సరిగ్గా దీనికి అద్దం పడుతుంది. వివరాల ప్రకారం..నాగాలాండ్లోని ఓ లోయలో ప్రమాదవశాత్తూ ఓ లారీ పడిపోగా పెద్ద పెద్ద ప్రొక్లెయిన్లతో లారీని బయటకు లాగేందుకు ప్రయత్నించినా సాధ్యపడలేదు. దీంతో వందలాది మంది అక్కడికి వచ్చి ఆ లారీని బయటకు లాగేందుకు ప్రయత్నించారు. వాహనానికి ఇరువైపులా తాళ్లు కట్టి ఎంతో శ్రమతో దాన్ని బయటకు లాగి ఐకమత్యంగా పనిచేస్తే ఎంతటి అసాధ్యాన్ని అయినా సుసాధ్యం చేయవచ్చు అని నిరూపించారు. ఈ వీడియోను సుప్రియా సాహూ అనే ఐఏఎస్ అధికారి ట్విట్టర్లో పోస్ట్ చేయడంతో ఇది కాస్తా వైరల్గా మారింది. టీం వర్క్ పవర్ ఏంటో నిరూపించారు అంటూ పలువురు నెటిజన్లు నాగాలాండ్ వాసులను అభినందిస్తున్నారు. -
‘వజ్రం’ దొరికిందని.. వేట మొదలెట్టేశారు!
కోహిమా: ఫ్రీగా వస్తే ఫినాయిలైనా తాగుతారని వింటుంటాం. అదే వజ్రమే దొరికితే ఎవరైనా తీసుకోకుండా ఉంటారా..? అదే జరిగితే ఒక్కరోజులోనే కోటీశ్వరులం అయిపోవచ్చని చాలా మంది కలలు కంటూ ఉంటారు. ఇందుకోసం ఎంత కష్టాన్నైనా భరించేందుకు సిద్ధపడతారు. అలాంటి ఆలోచనతోనే నాగాలాండ్ ప్రజలు ఇప్పుడో వేట మొదలు పెట్టారు. అదే వజ్రాల వేట... తాజాగా ఓ రైతుకు వజ్రాన్ని పోలిన రాయి దొరకడంతో, ఇప్పుడు కొండ ప్రాంతంలో అనేక మంది ప్రజలు చెట్టు చేమ అని చూడకుండా తవ్వడం మొదలు పెట్టారు. దొరికితే అదృష్టమే అన్నట్టుగా తవ్వుతున్న ఆ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ విషయం తెలుసుకున్న ప్రభుత్వం ఆ రాయి అసలు వజ్రమో కాదో కనుక్కునే పనిని భూ విజ్ఞాన శాస్త్రవేత్తలకు అప్పజెప్పింది. (చదవండి: తీరంలో కొనసాగుతున్న ‘పసిడి’ వేట) అబెంతంగ్ లోథా, లంగారికబా, కెనైలో రెగ్మా, డేవిడ్ లుఫోనియాలను త్వరగా రిపోర్ట్ అందించాలని నాగాలాండ్ జియాలజీ, మైనింగ్ డైరెక్టర్ మనేన్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ప్రాంతంలో పూర్వం నుంచి వజ్రాలకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లభించనందున ఆ రాయి అసలు వజ్రమని బృందం నమ్మడం లేదు. వీరు నవంబర్ 30న లేదా డిసెంబర్ 1న అక్కడికి చేరుకొని పరిశోధనలు చేపట్టనున్నారు. సోషల్ మీడియాలో పెడుతున్న పోస్టులను ఆపేయాలని, ఆ ప్రాంతంలో రాకపోకలు నిలిపేవేయాలని బృందం ఉత్తర్వులు జారీ చేసినట్టుగా జాతీయ మీడియా పేర్కొంది. -
వివాదంలో ఫ్లిప్కార్ట్ : క్షమాపణలు
సాక్షి, ముంబై: ఫెస్టివ్ సీజన్ లో బిగ్ బిలియన్ డేస్ సేల్ పేరుతో వినియోగదారుల ముందుకొచ్చిన ప్రముఖ ఈకామర్స్ సంస్థ ఫ్లిప్కార్ట్ పై పెద్దదుమారం రేగుతోంది. అయితే ఆ తరువాత సంస్థ తరపున జరిగిన తీవ్ర తప్పిదానికి ఫ్లిప్కార్ట్ వినియోగదారులకు క్షమాపణలు చెప్పింది. అయినప్పటికీ ఫ్లిప్కార్ట్ చేసింది ఘోర తప్పిదమంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. (నోకియా స్మార్ట్ టీవీలపై ఫ్లిప్కార్ట్ ఆఫర్లు) వివరాల్లోకి వెళితే.. ఫ్లిప్కార్ట్ సర్వీస్లు నాగాలాండ్ రాష్ట్రంలో అందుబాటులో లేకపోవడంతో కొహిమాకు చెందిన ఒక యూజర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు ఇంకా స్వాతంత్ర్యం లభించలేదా.. తమ రాష్ట్రంలో ఎందుకు డెలివరీ చేయడం లేదని ప్రశ్నించారు. ఫ్లిప్కార్ట్ అన్ని రాష్ట్రాలను ఒకేలా చూడాలంటూ ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. దీనికి ఫ్లిప్కార్ట్ ఉద్యోగి ఇచ్చిన సమాధానమే దుమారానికి కారణమైంది. ఫ్లిప్కార్ట్పై ఆసక్తి చూపించినందుకు ధన్యవాదాలు, కానీ తమ విక్రయదారులు ఇండియా బయట తమ సేవలను అందించలేరని పేర్కొన్నారు. ఈ సమాధానానికి షాకైన సదరు వినియోగదారులు తన చేదు అనుభవాన్ని సోషల్ మీడియా ద్వారా బహిర్గతం చేశారు. దీంతో ఫ్లిప్కార్ట్పై నెటిజన్లు అందరూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ తరువాత ఈ జవాబును తొలగించింప్పటికీ చాలామంది దీని స్క్రీన్ షాట్లను సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ చేశారు. వావ్..నాగాలాండ్ కు ఫ్లిప్కార్ట్ స్వాతంత్ర్యం ఇచ్చేసిందని ఒకరు వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. నాగాలాండ్ భవిష్యత్తును ముందే ఊహించారంటూ ప్రఖ్యాత నాగా సంగీతకారుడు అలోబో చమత్కరించారు. దురదృష్టవశాత్తు ఈ సంఘటన ఈశాన్యరాష్ట్రం గురించి ఎంత తక్కువ మందికి తెలుసు అనేవిషయాన్ని హైలైట్ చేస్తోంది.. నాగాలాండ్ ఎక్కడ ఉందో చాలామందికి తెలియదు. దీనికి విద్యావ్యవస్థ పూర్తి బాధ్యత వహించాలని తాను భావిస్తున్నానన్నారు. అంతేకాదు ఫ్లిప్కార్ట్తో కాకపోయినా, తనకూ ఇలాంటి అనుభవం ఎదురైదంటూ నాగాలాండ్ బోర్డర్స్ వ్యవహారాల డైరెక్టర్ జనరల్ రూపిన్ శర్మ పేర్కొన్నారు. నాగాలాండ్ ఇండియాలో భాగమన్నారు. ఈ వివాదంపై స్పందించిన ఫ్లిప్కార్ట్ యూజర్లను క్షమాపణలు కోరింది. ఇలా జరిగినందుకు విచారిస్తున్నామని, సాంకేతికంగా జరిగిన పొరపాటని పేర్కొంది. నాగాలాండ్లోనూ ఫ్లిప్కార్ట్ సేవలు అందిస్తుందని వివరణ ఇచ్చింది. To those who were questioning me ! Here is the @Flipkart reply ! Don’t shoot the messenger 💪 Nagaland and NE is India even if your heart may not think so pic.twitter.com/qocNMXqH3N — Pradyot_Tripura (@PradyotManikya) October 8, 2020 Although not with Flipkart, Even I had this experience once. Nagaland is India #Flipkart . pic.twitter.com/WDS7kodF94 — Rupin Sharma IPS (@rupin1992) October 8, 2020 -
క్రమశిక్షణతో కొమ్ములు వంచారు
అవన్నీ వెనుకబడిన రాష్ట్రాలు.. ప్రతీ రాష్ట్రానికి అంతర్జాతీయ సరిహద్దులున్నాయి.. చైనా, బంగ్లాదేశ్, భూటాన్, నేపాల్, మయన్మార్ ఇలా ఏదో ఒక దేశంతో సరిహద్దుల్ని పంచుకున్నాయి.. ఆరోగ్య సదుపాయాలు అంతంత మాత్రం అయినా కరోనాని కట్టడి చేశాయి.. ఎనిమిది రాష్ట్రాలకు గాను అయిదు రాష్ట్రాలు ఇప్పుడు కరోనా ఫ్రీ.. భారత్లో గోవా తర్వాత అందరూ ఈశాన్య రాష్ట్రాలవైపే చూస్తున్నారు. చైనా సహా అం తర్జాతీయ సరిహద్దులున్న అస్సాం, త్రిపుర, మేఘాలయ, సిక్కిం, మణిపూర్, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్, మిజోరం రాష్ట్రాల్లో పరిస్థితులు ఎలా ఉంటాయోనని మొదట్లో ఆందోళన ఉండేది. కానీ సిక్కిం, నాగాలాండ్లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. అస్సాంలో నాగాలాండ్ వాసి ఒకరు కరోనా బారిన పడ్డారు. కానీ సిక్కింవాసులెవరికీ ఈ వైరస్ సోకలేదు. ప్రభుత్వాలు అప్రమత్తంగా వ్యవహరించడం, ప్రజలు క్రమశిక్షణతో ప్రభుత్వం గీసిన గీత దాటకపోవడంతో అయిదు రాష్ట్రాలు కరోనా కొమ్ములు వంచాయి. అయితే ఇప్పు డు ఇతర రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో ఈ రాష్ట్రాలకు వస్తున్నాయి. దీనివల్ల ఎక్కడ కేసులు పెరుగుతాయా అన్న ఆందోళనైతే నెలకొంది. ఇక త్రిపురలో కేసులు పెరగడం, అస్సాంలో కూడా ప్రతీరోజూ కేసులు నమోదు అవుతూ ఉండడంతో తొలి కేసు నమోదైన దగ్గర్నుంచి 100 కేసులకి చేరడానికి 40 రోజులు పడితే కేవలం నాలుగు రోజుల్లోనే రెట్టింపై 200 దాటేశాయి. సిక్కిం కేసుల్లేవ్ ఈశాన్య రాష్ట్రాల్లో సిక్కిం గురించి ప్రధానంగా చెప్పుకోవాలి. ఇక్కడ ఒక్కటంటే ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు. సిక్కింకి చైనాతో పాటు భూటాన్, నేపాల్ సరిహద్దులుగా ఉన్నాయి. జనవరిలో భారత్లో తొలి కేసు నమోదవగానే కేంద్రం ఆదేశాల గురించి సిక్కిం వేచి చూడలేదు. సరిహద్దుల వెంబడి నాలుగు చెక్పోస్టులు ఏర్పాటు చేసి విదేశాల నుంచి వచ్చేవారిని క్వారంటైన్కి తరలించింది. మార్చి 5 నుంచే అంతర్జాతీయ సరిహద్దుల్ని మూసేసింది. విదేశీ పర్యాటకులెవరినీ రానివ్వలేదు. ముఖ్యంగా చైనాతో వాణిజ్యం జరిగే నాథులా మార్గాన్ని బంద్ చేసింది. మార్చి రెండోవారం నుంచి రద్దీ ఎక్కువగా ఉండే రెస్టారెంట్లు, థియేటర్లు, పార్కులు వంటివి మూసేసింది. ఇక పూర్తి స్థాయి లాక్డౌన్ మార్చి 25 నుంచి అమలు చేసింది. సిక్కిం ముఖ్యమంత్రి ప్రేమ్ సింగ్ తమాంగ్ స్వయంగా కోవిడ్ పరిస్థితుల్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఒక్క కేసు నమోదు కాకుండా చూసుకున్నారు. మిజోరం మిజోరం రాష్ట్రానికి మయన్మార్తో 510 కి.మీ. సరిహద్దు, బంగ్లాదేశ్తో 318 కి.మీ. సరిహద్దు ఉంది. అయినా మిజోరంలో కేవలం ఒకే ఒక్క కరోనా కేసు నమోదైంది. 45 రోజుల పాటు కరోనాతో పోరాటం చేసిన కరోనా రోగిని శనివారం డిశ్చార్జ్ చేశారు. 50 ఏళ్ల వయసున్న చర్చి ఫాదర్ అయిన అతను ఆమ్స్టర్డ్యామ్కి వెళ్లి వచ్చారు. ఏప్రిల్ 27న ఆయనకి కరోనా పా జిటివ్ వచ్చింది. ఆయన కోలుకోవడంతో మిజోరం కరోనా ఫ్రీ రాష్ట్రంగా అవతరించింది. సాధించింది ఇలా .. ► ఈశాన్య రాష్ట్రాల్లో ఉన్న భూభాగానికి 99శాతం చైనా, మయన్మార్, సహా వివిధ దేశాల సరిహద్దులున్నాయి. దీంతో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో అప్రమత్తంగా ఉన్నాయి. అంతర్జాతీయ సరిహద్దుల్ని దేశవ్యాప్త లాక్డౌన్కి చాలా రోజుల ముందే మూసేశాయి. ► ఈ ప్రాంత ప్రజల్లో క్రమశిక్షణ చాలా ఎక్కువ. ప్రభుత్వం నిర్దేశించిన లాక్డౌన్ నిబంధనల్ని ఎవరూ ఉల్లంఘించలేదు. ఇంటిపట్టునే ఉంటూ మరెక్కడ లేని విధంగా ప్రభుత్వాలకి ప్రజలు సహకరిస్తున్నారు. ► ఈశాన్య రాష్ట్రాలు అభివృద్ధికి నోచుకోకపోవడంతో ప్రకృతి విధ్వంసం జరగలేదు. ప్రజలంతా కాలుష్యం లేని గాలి పీలుస్తూ, కల్తీ లేని తిండి తింటూ ఆరోగ్యంగా ఉంటారు. సంప్రదాయాలను గౌరవిస్తూ శుచిగా శుభ్రంగా ఉంటారు. ► ఎనిమిది రాష్ట్రాలకి కలిపి కేంద్రంలో డెవలప్మెంట్ ఆఫ్ నార్త్ ఈస్ట్రన్ రీజియన్ అనే మంత్రిత్వ శాఖ ఉంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వాలతో పాటుగా కేంద్రం కూడా పరిస్థితుల్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ తగిన చర్యలు తీసుకుంటోంది. ► ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిని క్వారంటైన్కి తరలించడం వంటి చర్యలన్నీ అత్యంత పకడ్బందీగా అమ లు చేశారు. ఇతర రాష్ట్రాలన్నీ మొదట్లో 14 రోజుల క్వారంటైన్ అమలు చేస్తే ఈశాన్యంలో 21 రోజులు లాక్డౌన్ని అమలు చేశారు. -
కరోనా నుంచి బయటపడ్డ 5 రాష్ట్రాలు
న్యూఢిల్లీ: ఈశాన్య రాష్ట్రాల్లోని ఐదు రాష్ట్రాలు కరోనా మహమ్మారి బారి నుంచి బయటపడ్డాయని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. సిక్కిం, నాగాలాండ్, అరుణాచల్ప్రదేశ్, మణిపూర్, త్రిపుర కోవిడ్-19 లేని రాష్ట్రాలుగా నిలిచాయని ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ వెల్లడించారు. ఈశాన్య ప్రాంతంలోని మిగతా మూడు రాష్ట్రాలైన అసోం, మిజోరం, మేఘాలయా.. కరోనా ఫ్రీ కానప్పటికీ తాజాగా కోవిడ్ కేసులు నమోదు కాలేదని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన పటిష్టమైన చర్యల కారణంగానే ఈశాన్య రాష్ట్రాల్లో కరోనా ముప్పు తక్కువగా ఉందన్నారు. నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం గత ఆరేళ్ల నుంచి ఈశాన్య ప్రాంత అభివృద్ధికి ఎంతో కృషి చేసిందని చెప్పుకొచ్చారు. (కరోనా వైరస్.. మరో దుర్వార్త) ‘దేశవ్యాప్తంగా లాక్డౌన్ కొనసాగుతున్నప్పటికీ నిత్యవసర సరుకుల కొరత రాకుండా కార్గో విమానాల ద్వారా ఈశాన్య రాష్ట్రాలకు సరుకులు తరలిస్తున్నాం. ఎయిర్ ఇండియా, ఇండియన్ వాయుసేన ద్వారా ఈశాన్య రాష్ట్రాలతో పాటు జమ్మూకశ్మీర్, లద్దాఖ్లకు ప్రాధాన్యతా క్రమంలో సరుకులు పంపిస్తున్నామ’ని జితేంద్ర సింగ్ తెలిపారు. ఎనిమిది ఈశాన్య రాష్ట్రాల్లో కరోనా మహమ్మారి కట్టడికి షిల్లాంగ్లోని ఈశాన్య అభివృద్ధి మండలితో కలిసి సమన్వయంతో పనిచేస్తున్నామని పేర్కొన్నారు. లాక్డౌన్ కంటే ముందే కేంద్రం నుంచి ఈశాన్య రాష్ట్రాలకు ఆర్థిక సహాయం అందించామన్నారు. (లాక్డౌన్ సడలింపా.. అదేం లేదు: సీఎం) -
ఆ రాష్ట్రంలో మొదటి కరోనా కేసు
కోహిమా: దేశ్యాప్తంగా కరోనా వైరస్ రోజురోజుకు కోరలు చాస్తోంది. ఇప్పటి వరకు ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదు కాని నాగాలాండ్కు కూడా ఈ మహమ్మారి వ్యాపించింది. నాగాలాండ్లో మొట్టమొదటి కరోనా వైరస్ పాజిటివ్ కేసు నమోదైంది. నాగాలాండ్ దిమాపూర్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో అనారోగ్యంతో చేరిన రోగికి కోవిడ్-19 లక్షణాలు కనిపించడంతో అతనికి పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్ వచ్చినట్లు తేలింది. (మీరెవరో మీకైనా తెలుసా: ప్రధానిపై ఫైర్!) దీంతో అతడిని అస్సాంలోని గువాహటి మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ విషయాన్ని ఆరోగ్య శాఖ మంత్రి హిమాంత బిస్వా శర్మ ఆదివారం రాత్రి ట్విటర్లో వెల్లడించారు. అయితే ప్రస్తుతం బాధితుడి ఆరోగ్యం నిలకడగ ఉందని మంత్రి ట్వీట్లో పేర్కొన్నారు. కాగా బాధితుడు దిమాపూర్కు చెందిని వాడని, అతను మొదట ఆరోనాగ్యం కారణంగా స్థానిక ప్రైవేట్ ఆసుపత్రిలో చేరినట్లు అస్సాం ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. ఇక ఆ వ్యక్తికి కోవిడ్ -19 లక్షణాల కనిపించడంతో అతడిని గువాహటి మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించినట్లు వెల్లడించారు. ఇక ఆదివారం వరకూ నాగాలాండ్లో ఒక్క కరోనా కేసు నమోదు కాలేదు. అయితే అక్కడ ఆదివారం కరోనా పాజిటివ్ కేసు నమోదు కావడంతో అనుమానం ఉన్న మరో 74 మంది శాంపిల్స్ను తీసుకున్నట్లు అధికారుల తెలిపారు. కాగా ఈశాన్య భారతదేశంలో ఇంతవరకు ఒక్క కేసు కూడా నమోదు కాని రాష్ట్రంగా మేఘాలయ నిలిచింది. -
విద్యార్థులను అడ్డుకున్న స్టోర్ సిబ్బంది
సాక్షి, బెంగళూరు : కరోనా వైరస్ను కట్టడి చేసేందుకు దేశంలో లాక్డౌన్ విధించి అత్యవసర సేవలు మినహా మిగతా సేవలపై ఆంక్షల్ని విధించిన విషయం తెలిసిందే. దీంతో నిత్యావసరాల సరుకుల కోసం సూపర్ మార్కెట్ల వద్ద ప్రజలు క్యూ కడుతున్నారు. ఈ క్రమంలో జాతి వివక్షతను చూపుతూ ఈశాన్య భారత్ నుంచి వచ్చిన విద్యార్థులను సూపర్ మార్కెట్లోకి అనుమతించని ఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది. కోవిడ్ 19 పేరుతో ప్రజలను హింసించే వారిపై చర్యలు తీసుకోవాలని కేంద్ర హోంశాఖ మంత్రి అన్ని రాష్ట్రాలను కోరినప్పటికీ ఈ సంఘటన చోటుచేసుకోవడం గమనార్హం. (ఆ రెండు రాష్ట్రాల్లో 200 దాటిన కరోనా కేసులు) వివరాల ప్రకారం.. నాగాలాండ్కు చెందిన కొంతమంది విద్యార్థులు కర్ణాటకలో నివసిస్తున్నారు. ఇటీవల వీరు మైసూర్లోని సూపర్ మార్కెట్కు వెళ్లగా అక్కడ వారిని స్టోర్ సిబ్బంది అడ్డుకున్నారు. షాప్లోకి అనుమతించం అంటూ వారితో వాదించారు. దీంతో తమపై వివక్ష చూపుతున్నారని ఆవేదన వ్యక్తం చేసిన ఈశాన్య ప్రాంత విద్యార్థులు అక్కడి సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను డాలీ కికాన్ అనే వ్యక్తి ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. ‘ఈశాన్య భారతదేశం నుంచి వలస వచ్చిన వారిని కర్ణాటక వాసులు ఆహారం కొనడానికి అనుమతించడం లేదు. సిగ్గుచేటు. భారత్లో జాత్యహంకారం రోజువారీ వ్యవహారం’ అంటూ ట్విటర్ వేదకగా తన ఆవేదన వ్యక్తం చేశారు. (ఏప్రిల్ 14 వరకూ శ్రీవారి దర్శనం బంద్) కాగా ఈ ఘటన తమ దృష్టికి వచ్చిన వెంటనే కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. స్టోర్ మేనేజర్తోపాటు ఇతర సిబ్బందిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసు కమిషనర్ చంద్రగుప్తా తెలిపారు. లాక్డౌన్ కాలంలో ప్రజలు, దుకాణ యజమానులు, సిబ్బంది ఇలాంటి చర్యలకు దూరంగా ఉండాలని ఆయన కోరారు. అలాగే ఇలాంటి సంక్షోభ సమయంలో బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని సూచించారు. ఇక విషయంపై స్పందించిన బెంగళూరు పోలీస్ కమిషనర్ భాస్కర్ రావు ఆదివారం ట్వీట్ చేశారు. ‘ఈశాన్య రాష్ట్రాల నుంచి వచ్చిన మా సోదరులను కొంతమంది తప్పుదారి పట్టించి, కోవిడ్-19 పేరుతో అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఇలా తప్పుదారి పట్టించేవారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. నార్త్ ఈస్ట్ నుంచి వచ్చిన సోదర, సోదరీమణులు ఇక్కడ సురక్షితంగా ఉన్నారు. మీకు ఎక్కడైనా అన్యాయం జరిగితే సమీప పోలీస్టేషన్లో సంప్రదించండి లేదా నన్ను నేరుగా కలవండి’ అంటూ వారికి అండగా నిలిచారు. -
తిమ్మిని బమ్మిని 'జేసీ'..
సాక్షి, అమరావతి: అక్రమ ‘మార్గాల్లో’ దోచేయడంలో టీడీపీ నేతలైన జేసీ బ్రదర్స్ను మించిన వారు లేరని మరోమారు నిరూపితమైంది. పర్మిట్లు లేకుండా బస్సులు తిప్పినా.. ఫోర్జరీ పత్రాలతో లారీలు, బస్సులను విక్రయించినా తమకు అడ్డే లేదన్నట్లు వ్యవహరించారు. ఈ అక్రమాలను మించి రవాణా శాఖ నివ్వెరపోయేలా మరో అక్రమ బాగోతం బయటపడింది. కాలం చెల్లిన అమ్మకూడని లారీలను తయారీ సంస్థ స్క్రాప్ (తుక్కు) కింద అమ్మేస్తే.. వాటిని దక్కించుకుని ఏకంగా నాగాలాండ్లో రిజిస్ట్రేషన్లు చేయించుకుని యథేచ్ఛగా దేశవ్యాప్తంగా తిప్పుతూ దోపిడీ చేస్తున్నారు. ఈ వ్యవహారం రవాణా శాఖ విచారణలో తేలింది. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 70 లారీలను ఇలా అక్రమ మార్గాల్లో తిప్పుతుండటంపై అధికార వర్గాలే నిర్ఘాంతపోతున్నాయి. నేషనల్ ఫ్రాడ్గా ఈ వ్యవహారాన్ని రవాణా శాఖ పేర్కొనడం గమనార్హం. సుప్రీంకోర్టు తీర్పును బేఖాతరు చేసి మరీ.. కాలుష్యాన్ని వెదజల్లుతున్నాయని బీఎస్–3 వాహనాలను నిషేధిస్తూ 2017లో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ తీర్పుతో వాహన కంపెనీలు ఆ వాహనాల అమ్మకాలను నిలిపేశాయి. 2017లో చంద్రబాబు జమానాలో జేసీ బ్రదర్స్ 70 బీఎస్–3 వాహనాలను దక్కించుకుని నాగాలాండ్లో రిజిస్ట్రేషన్ చేయించారు. సాధారణంగా నాగాలాండ్ రిజిస్ట్రేషన్ అంటేనే రవాణా శాఖకు అనుమానాలు తలెత్తాలి. కానీ అధికారం అండ ఉండటంతో అప్పట్లో రవాణా శాఖ అధికారులు పట్టించుకోలేదు. దీంతో జేసీ బ్రదర్స్ ఆ కాలం చెల్లిన లారీలను అప్పటి నుంచి సుప్రీంకోర్టు తీర్పునకు వ్యతిరేకంగా రోడ్లపై తిప్పుతున్నారు. దీనిపై ఫిర్యాదులు రావడంతో రవాణా శాఖ అధికారులు రంగంలోకి దిగారు. లారీల ఛాసిస్, ఇంజన్ వివరాలను అశోక్ లేలాండ్ కంపెనీ ప్రతినిధులకు మెయిల్ చేశారు. ఈ లారీలను తాము స్క్రాప్ కింద అమ్మేశామని కంపెనీ ప్రతినిధులు స్పష్టం చేశారు. రవాణా శాఖ అధికారుల బృందం కొన్ని రోజుల క్రితం నాగాలాండ్కు వెళ్లింది. నిషేధించిన లారీల రిజిస్ట్రేషన్కు జేసీ బ్రదర్స్ బినామీలు ఏ పత్రాలు సమర్పించారని అక్కడి రవాణా అధికారులను అడగ్గా, వారు కొన్ని రిజిస్ట్రేషన్లకు సంబంధించిన వివరాలను అందజేశారు. వాటిని పరిశీలించిన రవాణా అధికారుల బృందం జేసీ బ్రదర్స్ నిషేధిత వాహనాలను తిప్పుతున్నారని నిర్ధారించింది. సుప్రీంకోర్టు తీర్పును ఉల్లంఘించిన వైనంపై క్రిమినల్ కేసుల్ని నమోదు చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ అక్రమ బాగోతంలో జేసీ బ్రదర్స్ బినామీ సంస్థ.. జటాధర ఇండస్ట్రీస్, జేసీ అనుచరుడు గోపాలరెడ్డి ఉన్నట్లు తేలింది. దీంతో 70 లారీలను సీజ్ చేయనున్నారు. వీటిలో 43 లారీలు అనంతపురం ప్రాంతంలో.. మరో 27 లారీలు బెంగళూరులో ఉన్నట్లు రవాణా అధికారులు గుర్తించారు. ఫోర్జరీ పత్రాలతో రెండు బస్సుల విక్రయం నకిలీ పత్రాలతో, పోలీసుల ఫోర్జరీ సంతకాలతో నిరభ్యంతరాల పత్రాలు చూపి ఆరు లారీలను బెంగళూరులో విక్రయించిన వైనంపై అనంతపురం జిల్లా తాడిపత్రి పోలీసులు కేసులు నమోదు చేసి జేసీ ట్రావెల్స్ ఉద్యోగులు ఇద్దరిని గురువారం అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే.. ఈ వ్యవహారమంతా దివాకర్ ట్రావెల్స్ యాజమాన్యం కనుసన్నల్లోనే సాగినట్టు వారిద్దరూ పోలీసుల విచారణలో వెల్లడించారు. లారీలనే కాకుండా రెండు బస్సులను కూడా ఇదే విధంగా అమ్మినట్లు అధికారులు గుర్తించారు. దీనిపైనా కేసు నమోదు చేశారు. జేసీ బ్రదర్స్ అక్రమాలకు రవాణా శాఖలో కొందరు మోటారు వెహికల్ ఇన్స్పెక్టర్లు ఊతమిచ్చారన్న విమర్శలున్నాయి. వీరిపైనా చర్యలు తీసుకునేందుకు రవాణా శాఖ ఉన్నతాధికారులు సన్నద్ధమయ్యారు. -
రూ.80 లక్షలు, ఫోర్డ్ కారు కోసం..
సాక్షి, న్యూఢిల్లీ : రూ 80 లక్షలు, ఫోర్డ్ కారు కోసం నాగాలాండ్ రాజకీయ నేతను చంపేందుకు ఒప్పందం కుదుర్చుకున్న గ్యాంగ్స్టర్పై సీబీఐ కేసు నమోదు చేసింది. గత ఏడాది మే 17న యూపీ రాజధాని లక్నోలో గ్యాంగ్స్టర్ విజయ్ ఫర్మానాను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేసిన అనంతరం రాజకీయ నేతను చంపేందుకు జరిగిన కుట్ర విషయం వెలుగుచూసింది. ఈ కేసును సీరియస్గా తీసుకున్న హోంమంత్రిత్వ శాఖ కేసు విచారణను చేపట్టాలని సీబీఐని కోరింది. లోక్సభ ఎన్నికల అనంతరం నాగాలాండ్ నేతను హతమార్చాలన్న ఒప్పందంలో భాగంగా ఈ ఏడాది ఏప్రిల్లో ఫర్మానా తన అనుచరులతో కలిసి నాగాలాండ్ వెళ్లినట్టు సీబీఐ విచారణలో వెల్లడైంది. కాగా, ఫర్మానా టార్గెట్ చేసిన నాగాలాండ్ రాజకీయ నేత ఎవరనేది వెల్లడించేందుకు సీబీఐ అధికారులు నిరాకరించారు. తనను ఈ హత్యకు ఎవరు పురమాయించారు, ఇది రాజకీయ కుట్రా కాదా అనే వివరాలు రాబట్టేందుకు ఫర్మానాను త్వరలో కస్టడీలోకి తీసుకుని ప్రశ్నిస్తామని సీబీఐ వర్గాలు పేర్కొన్నాయి. -
బంజారాహిల్స్ పీఎస్లో యువతి హల్చల్
సాక్షి, హైదరాబాద్: నగరంలో బంజారాహిల్స్ పోలీసు స్టేషన్లో ఓ యువతి హల్చల్ చేసింది. మద్యం మత్తులో ఓ పబ్బు బయట అపస్మారకంగా పడి ఉన్న ఆమెను బంజారాహిల్స్ పోలీసులు కాపాడి స్టేషన్కు తీసుకువచ్చారు. అయితే మెలుకువ వచ్చిన తరువాత ఆ యువతి పారిపోయేందుకు ప్రయత్నించగా మహిళా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఎస్సైని అసభ్యపదజాలంతో తిడుతూ ఓ కానిస్టేబుల్ చేతిని కొరికింది. మరో కానిస్టేబుల్ మెడపై రక్కింది. మహిళా పోలీసులు ఆమెను ఎట్టకేలకు అదుపు చేశారు. వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నించగా అంతు చూస్తానని ఆ యువతి పోలీసులను బెదిరించింది. సదరు యువతి నాగాలాండ్ నుంచి వచ్చిందని, ఆమె పేరు లీసా అని తెలుస్తోంది. మాదాపూర్ ప్రాంతంలోని ఓ ఐటీ కంపెనీలో ఆమె పని చేస్తోందని పోలీసులు గుర్తించారు. యువతి డ్రగ్స్ తీసుకుందా? లేక మద్యం మత్తులో ఉందా? అన్న విషయాన్ని తేల్చేందుకు రక్త పరీక్షలు నిర్వహిస్తున్నామని పోలీసులు తెలిపారు. యువతి తల్లిదండ్రులను పిలిపించి అప్పగిస్తామని పోలీసులు వెల్లడించారు. -
అతిథులను థ్రిల్కు గురి చేసిన కొత్తజంట
కోహిమ : పెళ్లి.. జీవితాంతం గుర్తుండిపోయే మధురానుభూతి. అయితే ఓ పెళ్లిలో వధూవరులు చేసిన పని.. వారికే కాకుండా ఆశీర్వదించడానికి వచ్చిన అతిథులకు కూడా థ్రిల్ని పరిచయం చేసింది. పెళ్లి వేడుకలో పూలు, పళ్లు, రకరకాల బహుమతులతో ఫొటోలకు పోజివ్వడం సరిపోదన్నట్టుగా ఓ జంట తుపాకులు చేతబూనారు. ఏకే 56, ఎం16 గన్లు పట్టుకుని ఫొటోలు దిగారు. దీంతో అక్కడికొచ్చిన అతిథులు ఆశ్చర్యానికి లోనయ్యారు. వివరాలు.. నాగా వేర్పాటువాద నాయకుడు బహతో కిబా కొడుకు వివాహం దిమాపూర్లో ఘనంగా జరిగింది. ఈ వేడుకలో నూతన దంపతులు ఆటోమాటిక్ రైఫిల్స్ ఏకే 56, ఎమ్16లను పట్టుకుని ఫొటోలకు ఫోజిచ్చారు. అయితే, తుపాకులు పట్టుకుని ఫొటోలు దిగడమేంటని అక్కడికి వచ్చిన జనం ముక్కున వేలేసుకున్నారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా అయ్యాయి. పబ్లిక్లో మారణాయుధాలతో ఫొటోలేంటని నెటిజన్లు విమర్శిస్తున్నారు. అయితే బహతో కిబాకు విమర్శలపాలడటం ఇదేం మొదటిసారి కాదు. గతంలోనూ జర్నలిస్టులను చంపుతానని బెదిరించి ఆయన పతాక శీర్షికల్లో నిలిచాడు. -
పదికి పది వికెట్లు.. పది మెయిడెన్లు
కోల్కతా: మేఘాలయ ఆఫ్ స్పిన్నర్ నిర్దేశ్ బైసోయా అసాధారణ ప్రదర్శనతో రికార్డులకెక్కాడు. అండర్–16 విజయ్ మర్చంట్ ట్రోఫీలో నాగాలాండ్తో జరుగుతున్న మ్యాచ్లో ఒకే ఇన్నింగ్స్లో పది వికెట్లను పడగొట్టాడు. 15 ఏళ్ల నిర్దేశ్ బుధవారం తొలిరోజు ఆటలో నాగాలాండ్ను తన స్పిన్తో చుట్టేశాడు. 21 ఓవర్లు వేసిన ఈ కుర్రాడు 51 పరుగులిచ్చి 10 వికెట్లు తీశాడు. ఇందులో 10 ఓవర్లను మెయిడెన్లుగా వేశాడు. దీంతో నాగాలాండ్ జట్టు 113 పరుగులకే ఆలౌటైంది. గత రెండేళ్లుగా నిర్దేశ్ అద్భుతంగా రాణిస్తున్నాడు. గత టోరీ్నలో ఆరు మ్యాచ్లాడిన అతను 33 వికెట్లు తీశాడు. తాజా టోర్నీలో నాలుగే మ్యాచ్లాడిన అతను 27 వికెట్లు పడేశాడు. నిజానికి నిర్దేశ్ సొంతూరు మీరట్... కానీ మేఘాలయ తరఫున ఆడుతున్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో 20 ఏళ్ల క్రితమే భారత మేటి స్పిన్నర్ అనిల్ కుంబ్లే (10/74) పాకిస్తాన్పై ఢిల్లీ టెస్టులో ఒకే ఇన్నింగ్స్లో 10 వికెట్లతో చరిత్రకెక్కాడు. దీంతో ఢిల్లీలో పాకిస్తాన్తో జరిగిన టెస్టులో భారత్ అద్వితీయ విజయాన్ని సాధించింది. గతేడాది మణిపూర్ పేసర్ రెక్స్ సింగ్ కూడా పదికి పది వికెట్లు తీసిన బౌలర్గా ఘనత వహించాడు. కూచ్ బెహర్ ట్రోఫీలో అతను చరిత్ర సృష్టించగా... పుదుచ్చేరి లెఫ్టార్మ్ స్పిన్నర్ సిదాక్ సింగ్ సీకే నాయుడు ట్రోఫీలో ఒకే ఇన్నింగ్స్లో 10 వికెట్లు పడగొట్టేశాడు. -
ఈ దూకుడే వర్తమాన వాస్తవమా?
1972 నుంచి 2014 మధ్య భారత జాతీయవాదం విస్తృతంగా వేళ్లూనుకుని, భద్రంగా సౌఖ్యమైన స్థితికి చేరుకుంది. చూడటానికి ఇదెంత అద్భుతంగా ఉందంటే ఏకకాలంలో మనం రెండు గేమ్స్ ఆడుతున్నాం. ఒకచోట ఒక ప్రాంతం జెండాను దించి దాన్ని జాతీయ వేడుకగా జరుపుకుంటున్నాం. మరొకచోట తమ జెండా కావాలంటున్న నాగాల డిమాండ్ను తోసిపుచ్చుతూనే వారి సాంస్కృతిక ఆకాంక్షలను జాతీయ పరిమితుల్లోనే గుర్తిస్తున్నాం. ఇతరుల భయం లేకుండా నువ్వు రాజకీయాలను ఎలా నడుపుతావన్నదే ముఖ్యం. భారత్ నేడు ఆ స్థితికి చేరుకున్నదనే చెప్పాలి. ఇవాళ చారిత్రకంగా, రాజకీయంగా, వ్యూహాత్మకంగా, సైనికపరంగా, ఆర్థికపరంగా భారత్ అత్యంత సురక్షిత స్థానంలో నిలబడింది. భారత్ను ప్రపంచదేశాల దృష్టిలో బలోపేతం చేసిన ఈ అతిశయ జాతీయవాదాన్ని మరింతగా దృఢపరచాల్సిన అవసరం ఉంది. నెపోలియన్ బతికి ఉంటే సింహాసనం అంటే ఏమిటి అనే ప్రశ్నను సంధించి దాన్ని తిరిగి ఎలా వదిలేసి ఉంటాడు అనే అంశానికి సంబంధించి గూగుల్ మరింత వైవిధ్యపూరితమైన ఊహను నాకు చెబుతోంది. 1970ల నాటి ప్రామాణిక నాటకం వాటర్లూ లో నటించిన రాడ్ సై్టగర్ ఈ ప్రశ్నకు చెప్పిన సమాధానం ఈ వారం నా మదిలో మెదులుతోంది. సింహాసనం అంటే ఏమిటి అనే ప్రశ్నకు రాడ్ చెప్పిన సింపుల్ సమాధానం ఇలా ఉంటుంది. అది ఫర్నిచర్కు చెల్లించిన అధికమొత్తం ధర మాత్రమే. 19వ శతాబ్దం మొదట్లో సింహాసనానికి ఇంకా ప్రాధాన్యత ఉండేది. అయితే ఆధునిక ప్రపంచంలో చాలాచోట్ల సింహాసనం ఇప్పుడు ఉనికిలో లేదు. ఇప్పుడు మన చైతన్యంలోంచి మరుగుపడిపోయిన జాతీయ రాజ్యం, సింహాసనాలు, కిరీటాలు, జాతీయ గీతాలు, జాతీయ పతాకాలు వంటి చిహ్నాలను నెపోలియన్ ఆలస్యంగానైనా సరే ఉపయోగించి అప్పట్లో జాతీయ స్ఫూర్తిని తిరిగి తీసుకొచ్చాడు. అయితే ఆ గత చరిత్రకు చెందిన చిహ్నాలు ఇప్పటికీ పూర్తిగా అంతరించిపోలేదు. చాంపియన్షిప్ పోటీల సందర్భంగా మన క్రీడాకారులు జాతీయ చిహ్నాలకు చాలా ప్రాధాన్యమిస్తుం టారు. అయితే ఆధునిక జాతీయ రాజ్యం మరింత స్థిరంగా, సురక్షితంగా పాతుకుపోయింది కాబట్టి అలాంటి గత చిహ్నాలకున్న విలువ ఇప్పుడు ఒక పురాజ్ఞాపకంగా మాత్రమే కొనసాగుతోంది. కాలం మారుతోంది, ప్రజలు మారుతున్నారు, చిహ్నాలు కూడా మారుతున్నాయి. జెండా అంటే ఏమిటి అనే అస్పష్టమైన ప్రశ్నకు ఇప్పటికీ మనం విలువ ఇస్తున్నందుకు కారణం ఉంది. ఎందుకంటే భారతదేశంలో చిరకాలం నుంచి కొనసాగుతున్న రక్తప్లావిత తీవ్రవాదం కొనసాగుతున్న నాగాలాండ్లో కొనసాగుతున్న శాంతి చర్చలు చివరికి ముగింపుకొస్తున్న తరుణంలో జెండా అంటే ఏమిటి అనే ప్రశ్నను తిరిగి వేసుకోవలసి వస్తోంది. తాము గతంలో భయంకరమైన తప్పులు చేశానని అటు భారత ప్రభుత్వం, ఇటు నాగాలు ఇప్పుడు అంగీకరిస్తున్నారు. హింస ఇంకా ఎంతోకాలం పనిచేయదని కూడా గ్రహించారు. అయితే నాగాలు తమ సొంత జెండాను ఇప్పటికీ కోరుకుంటున్నారు. కానీ మోదీ ప్రభుత్వం దానికి ఇష్టపడటంలేదు. అయితే ఇరుపక్షాల మధ్య చర్చలు ఏ స్థాయికి చేరుకున్నాయంటే, సాంస్కృతిక, జాతిపరమైన సందర్భాల్లో మీరు మీ జెండాను పట్టుకోవచ్చని ప్రభుత్వం ఇప్పడు అంగీకరిస్తోంది. అలాగయితే తమ జెండాకు ఏ ఎన్జీవో అయినా పెట్టుకునే సాధారణ జెండా గుర్తింపు మాత్రమే ఉంటుందని నాగాలు వాదిస్తున్నారు. అత్యుత్తమ చర్చ ఏదంటే రెండు పక్షాలు అతి తక్కువ అసంతృప్తితో మాత్రమే చర్చల బల్లనుంచి వెళ్లిపోగలగడమే. చర్చల ఫలి తంలో తమకు ప్రాధాన్యత లేనప్పటికీ ఇరు పక్షాలూ తాము ఏదో ఒకటి సాధించామని చెప్పుకోవడం అని దీనర్థం. కానీ ముయ్వా నాగాలకు జెండాను గుర్తించకుండా సంధిపై సంతకం చేయడమంటే పెద్ద అవమానంగా కనిపిస్తోంది. ఇక మోదీ ప్రభుత్వం ముందు ఉన్న చాయిస్ కూడా కఠినంగానే ఉంది. ఈ అక్టోబర్ 31 గురువారం నాడు కేంద్ర ప్రభుత్వం జమ్మూ కశ్మీర్ జెండాను దింపివేసి సర్దార్ పటేల్ జయంతి కూడా కలిసివస్తున్న సందర్భంగా ఆయనకు నివాళి అర్పిస్తూ వేడుకలు జరుపుకుంది. భారతజాతీయ వాదం ఎన్నడూ లేనంత బలోపేతంగా మారిన నేపథ్యంలో కేవలం 30 లక్షల మంది ప్రజలను మాత్రమే కలిగి ఉన్న ఒక ఆదివాసీ రాజ్యం ముందు కేంద్రం ఎలా తలొగ్గి ఉంటుంది మరి? అయితే మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వాన్ని దివంగత ప్రధాని వాజ్పేయి ప్రభుత్వంతో పోల్చడానికి కూడా వీల్లేదు. రాజ్యాంగ పరిధిలోనే చర్చలు కొనసాగాలని భారత్ పట్టుబడితే కశ్మీర్ వేర్పాటువాదులు ఎలా స్పందిస్తారు అని ప్రశ్నించినప్పుడు వాజ్పేయి తొణుకూ బెణుకూ లేకుండా సమాధానమిచ్చారు.. ‘మేం మానవత్వ పరామితులతో చర్చలు జరుపుకుంటాం’. కానీ మోదీ ప్రభుత్వం కాస్త కఠినవైఖరి వైపుకు మళ్లింది. పట్టువిడుపులు లేని దాని వైఖరికి మొరటు జాతీయవాదం కూడా కాస్త తోడైంది. అలాంటి జాతీయవాదం తన చిహ్నాల తొలగింపు పట్ల సుముఖత ప్రదర్శిం చదు. అందుకే ఒక రాష్ట్ర పతాకను దింపిపారవేసిన ఘటనకు గాను అది వేడుక చేసుకుంటోంది. సుప్రీంకోర్టు తన ఆదేశాన్ని ఉపసంహరించుకున్నప్పటికీ జాతీయ గీతాలాపనను నిలిపివేయడానికి దేశంలో ఏ సినిమా హాల్ కూడా ధైర్యం చేయడం లేదు. సినిమా హాళ్లలో జాతీయ గీతం ప్రదర్శించినప్పుడు లేచి నిలబడకుంటే అలాంటివారిని మూకుమ్మడిగా వేధిస్తున్నారు. ఇది ఎలా ఉందంటే నూతన తరం భారతీయులు తాము ఒట్టి దేశభక్తులం మాత్రమే కామని జాతీయ వాదులం కూడా అని నిరూపించుకుంటున్నట్లుగా ఉంది. భారతదేశం మొత్తంగా ఒకే రాజ్యాంగం, ఒకే చిహ్నం, ఒకే నేత ఉండాలనే తన సైద్ధాంతిక వ్యవస్థాపకుల దార్శనికతకు బీజేపీ చాలా సమీపంగా వచ్చినట్లు కనిపిస్తోంది. మీరు కూడా నాలాగే 1960లలో పుట్టిన వారే అయితే, ఆ దశాబ్దంలోకి వెళ్లి చూసినట్లయితే భారత్ నేడు చేరుకున్న స్థితి అసాధ్యం అనే భావించేవారు. 1961–71 మధ్య పదేళ్లలో మనం నాలుగు పూర్తి యుద్ధాలను చవిచూశాం. గత అయిదు దశాబ్దాలలో దేశం అన్ని తీవ్రవాద ఉద్యమాలను, వేర్పాటు రాజకీయ ఉద్యమాలను అణిచిపెట్టగలిగే స్థితికి చేరుకోగలుగుతుందని మనం అప్పట్లో ఊహించి ఉండేవారమా? ఆ ప్రమాదకరమైన దశాబ్దంలో భారత్ నిలువునా చీలిపోగలదని అమెరికన్ స్కాలర్ సెలిజ్ హారిసన్ గతంలో అభిప్రాయపడ్డారు. కానీ ఇలాంటి మేధావుల అభిప్రాయాలు తప్పని భారత్ నిరూపించింది. ఇవాళ చారిత్రకంగా, రాజకీయంగా, వ్యూహాత్మకంగా, సైనికపరంగా, ఆర్థికపరంగా భారత్ అత్యంత సురక్షిత స్థానంలో నిలబడింది. 2003 కాలానికి వెనక్కు వెళ్లి ఫోక్రాన్ అనంతరం భారత్ అనుసరించిన కఠిన దౌత్య పరిస్థితుల్లోకి వెళ్లి చూడండి. ఇక్కడే భారతీయ వ్యవస్థ మూలమలుపు తిరిగింది. తర్వాత 15 ఏళ్లలో భారత్ అత్యంత సురక్షిత స్థానంలో నిలిచేటట్టుగా పరిణతితో వ్యవహరించింది. ఈ క్రమాన్ని వెనక్కు తిప్పడం అంత సులభంకాదు. ఎవరినైనా పక్కకు నెట్టివేయగల శక్తి, ఏ భూభాగాన్నైనా ఆక్రమించుకునే బలం ఇప్పుడు భారత్కు ఉన్నాయి. ఈ భద్రతను భారతీయులమైన మనం అనుభవించడంతోపాటు, ఆ సౌఖ్యాన్ని కూడా అనుభవిస్తున్నాం. దీనికి భిన్నంగా మనం కొన్ని పాత అభద్రతా భావాలను లేవనెత్తుతున్నాం. మోదీ–షా నేతృత్వంలోని బీజేపీ రాజకీయాల్లో మీకు కారణాలు కనిపిస్తాయి. కశ్మీర్ సమస్యను అంతర్జాతీయం చేయడం, కొన్ని అనుకోని సంఘటనల ఆధారంగా విమర్శకులు ఈ ప్రభుత్వంపై దాడి చేస్తున్నారు. ఇది వాస్తవం. కానీ, దీన్ని ఎదుర్కోడానికి తగి నంత బలం భారత్కు ఉంది. ఆగస్టు 5న కశ్మీర్లో మౌలిక మార్పులు చేసి మూడు నెలలు గడుస్తున్నా, ఈ రోజు వరకూ ఎప్పుడూ విమర్శించే మూడు దేశాలు తప్ప ఏ ఇతర దేశం ఆ చర్యలను వెనక్కు తీసుకోమని భారత్ను కోరలేదు. అది భారతదేశపు అంతర్గత వ్యవహారంగా భావించే మిగిలిన దేశాలన్నీ మౌనం వహించాయి. అంతమాత్రాన, అది ఎప్పటికీ ఇలాగే కొనసాగదు. కశ్మీర్లో చాలా త్వరగానే సాధారణ పరిస్థితులు నెలకొంటాయి. అక్కడి రాజకీయ నాయకులను, ప్రముఖులను ఎంతో కాలం నిర్బంధంలో ఉంచరు. సమాచార నిర్బంధం కూడా తొలగిపోతుంది. లేకపోతే స్నేహపూరిత ప్రభుత్వాలు కూడా మనవైపు నిలిచే పరిస్థితి ఉండదు. సాధారణ స్థితి నెలకొంటే కశ్మీర్ కూడా జాతీయ వ్యవహారాల్లో బలమైన పాత్ర పోషిస్తుంది. నేడు కశ్మీర్ సమస్య అంటే పాక్ నుంచి ముప్పు, ఇస్లాం ఉగ్రవాదం, జిహాదీ తదితరాలు. ఇది జాతీయ భద్రతకు విచ్చిన్నపరిచే ప్రత్యక్ష ప్రమాదం. వీటిని దృఢంగా ఎదుర్కొంటున్న ఈ అతిశయిం చిన జాతీయవాదాన్ని మరింత బలోపేతం చేయాల్సిన అవసరం కూడా ఉంది. ఆ కోణం నుంచి చూస్తే మనం చాలా బలంగా ఉన్నాం అని చెప్పడానికి ఎన్నికల శాతాలు అవసరం లేదు. ఎందుకంటే, అప్పుడు ఇతరుల భయం లేకుండా నువ్వు రాజకీయాలను ఎలా నడుపుతావన్నదే ముఖ్యం. 1972 నుంచి 2014 మధ్య భారత జాతీయవాదం విస్తృతంగా వేళ్లూనుకుని, భద్రంగా సౌఖ్యమైన స్థితికి చేరుకుంది. చూడటానికి ఇదెంత అద్భుతంగా ఉందంటే ఏకకాలంలో మనం రెండు గేమ్స్ ఆడుతున్నాం. ఒకచోట ఒక ప్రాంతం జెండాను దించి దాన్ని జాతీయ వేడుకగా చేసుకుంటున్నాం. మరో చోట తమ జెండా కావాలనే వారి ఆకాంక్షలను పరిమితుల్లోనే గుర్తిస్తున్నాం. - శేఖర్ గుప్తా వ్యాసకర్త ద ప్రింట్ చైర్మన్, ఎడిటర్–ఇన్–చీఫ్ twitter@shekargupta -
తుది ఘట్టంలో ‘నాగా చర్చలు’
వలస పాలకులు వదిలివెళ్లిన సమస్యల్లో అత్యంత సంక్లిష్టమైన నాగాలాండ్ సమస్యపై కేంద్ర ప్రభుత్వం నాలుగేళ్లక్రితం ప్రారంభించిన శాంతి చర్చల ప్రక్రియ నేటితో ముగుస్తోంది. ఇంతవరకూ దేనిపైనా స్పష్టత లేనందువల్ల ఈ ప్రక్రియను మరికొంత కాలం కొనసాగించాలని నాగాలాండ్లోని భిన్న సంస్థలు కోరుతున్నాయి. కానీ కేంద్రం తన వైఖరేమిటో ఇంకా చెప్పలేదు. ఏడు దశాబ్దాలుగా నానుతూ, మూడు దశాబ్దాలుగా సంక్షోభాల మధ్యే భిన్న ప్రభుత్వాల హయాంలో శాంతి చర్చలు సాగుతూ ఈ నాగా సమస్య సవాలు విసురుతూనే ఉంది. తొలిసారి 1986లో ఆనాటి ప్రధాని రాజీవ్గాంధీ మిజో నేషనల్ ఫ్రంట్(ఎంఎన్ఎఫ్)తో శాంతి ఒప్పందంపై సంతకాలు చేశారు. ఆ తర్వాత 2015లో ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో అటువంటిదే కుదిరింది. దానిపై దాదాపు అన్ని పక్షాలూ హర్షం వెలిబుచ్చినా ఈశాన్య రాష్ట్రాల్లో... ముఖ్యంగా అస్సాం, మణిపూర్, అరుణా చల్ప్రదేశ్లలో ఆందోళనలు వ్యక్తమయ్యాయి. అయితే దాన్ని ఒప్పందం అనకుండా, ఒప్పందానికి సంబంధించిన స్వరూపం(ఫ్రేమ్వర్క్) అని అప్పట్లో కేంద్రం ప్రకటించింది. ఆ స్వరూపానికి అను గుణంగా స్పష్టమైన విధివిధివిధానాలతో, సవివరమైన నిబంధనలతో ఒప్పందం కుదర్చుకుంటా మని చెప్పింది. అయితే అప్పటినుంచీ చర్చలు సాగుతూనే ఉన్నా ఇంతవరకూ ఒప్పందం తుది మెరుగులు దిద్దుకుందన్న సూచనలెక్కడా లేవు. భిన్న పక్షాలతో తాను సాగిస్తున్న చర్చలు ముగింపు దశకొచ్చాయని కేంద్రం తరఫున వారితో మాట్లాడుతున్న నాగాలాండ్ గవర్నర్ ఆర్ఎన్ రవి ఇటీవల చెప్పారు. కానీ ఉన్నట్టుండి మ్యువా పక్షం చేసిన ప్రకటన పెనుతుపాను రేపింది. నాగాలాండ్కు ప్రత్యేక జెండా, ప్రత్యేక రాజ్యాంగం ఉండాలన్నదే తమ కృతనిశ్చయమని దాని సారాంశం. ఒకపక్క కశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తినిచ్చే 370 అధికరణను ఉండరాదనుకున్న కేంద్రం ఇలాంటి డిమాండ్లకు తలొగ్గుతుందని ఎవరూ అనుకోరు. కానీ ఈ డిమాండ్ పెట్టడంలోనే మ్యువా పక్షం కఠిన వైఖరి అర్ధమవుతుంది. పైగా భారతీయులకూ, నాగాలకూ మధ్య పరస్పర సహజీవనం ఎప్పటినుంచో ఉన్నదని, ఉమ్మడి ప్రయోజనాల కోసం ఇకముందూ అది కొనసాగుతుందని తెలిపి సంచలనం రేపింది. అయితే రవి అంటున్నట్టు కేవలం చర్చల ప్రక్రియను సాగదీయడం ఒక్కటే మ్యువా ప్రకటన వెనకున్న లక్ష్యమా లేక ఇతరత్రా ఉద్దేశాలున్నాయా అన్నది చూడాల్సి ఉంది. కానీ సమస్య ఎంత జటిలమైనదో, అది ఏ స్థాయిలో ప్రకంపనలు సృష్టిస్తున్నదో అటు మణిపూర్ ప్రభుత్వం, ఇటు అరుణాచల్ ప్రదేశ్లో వెలువడుతున్న ప్రకటనలే తార్కాణం. తమను ప్రభావితం చేసేలా ఎలాంటి నిర్ణయాలు ఉండటానికి వీల్లేదని ఆ రెండు రాష్ట్రాల్లోని విద్యార్థి సంఘాలు, ఇతర సంస్థలూ అంటు న్నాయి. ఎన్ఎస్సీఎన్–ఐఎం కోర్కెలు సాధారణమైనవి కాదు. నాగా ప్రజలు అధికంగా నివసిస్తున్న మణిపూర్లోని నాలుగు జిల్లాలు, అస్సాంలోని రెండు జిల్లాలు, అరుణాచల్ ప్రదేశ్లోని కొన్ని ప్రాంతాలూ కలిపి విశాలం నాగాలాండ్ ఏర్పాటు చేయాలని అది కోరుతోంది. ఈ ప్రాంతాలన్నిటా మొత్తంగా 12 లక్షలమంది నాగా ప్రజలున్నారు. ఇక్కడ మాత్రమే కాదు... పొరుగునున్న మయన్మార్లో సైతం ఆ జాతి ప్రజలున్నారు. వివిధ ప్రభుత్వాలు ప్రదర్శిస్తున్న వివక్ష వల్ల తమ జాతి జనం నానా ఇబ్బందులూ పడుతున్నారని, తమ చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలు ధ్వంసమవుతున్నా యని ఐఎం ఆరోపిస్తోంది. దీనిపై ఆ సంస్థ మొదటినుంచీ గట్టిగా పట్టుబడుతున్నందునే 2015లో ఒప్పందం కుదిరిందన్న ప్రకటన వెలువడినప్పుడు అస్సాంతోపాటు మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో అనేక అనుమానాలు తలెత్తాయి. ఇప్పుడున్న భౌగోళిక సరిహద్దులేవీ మారవని కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చినా అవి సమసిపోలేదు. కుదిరిన ఆ ఒప్పందంలోని అంశాలు బయటపెట్టాలని అప్పట్లో ఆ రాష్ట్రాలు కోరాయి. ఇప్పుడు ఆ మూడుచోట్లా బీజేపీ ప్రభుత్వాలు వచ్చాయి. కనుక ప్రభు త్వాలు మాట్లాడటం లేదుగానీ అక్కడి ప్రజా సంఘాలు డిమాండు చేస్తూనే ఉన్నాయి. అయితే సమస్య ఉన్నప్పుడు, అది అత్యంత సంక్లిష్టమైనది అయినప్పుడు పరిష్కార మార్గంలో అవరోధాలు ఉండటం సహజమే. అవి ఉన్నాయి కదా అని మొత్తం పరిష్కారం జోలికే పోకుండా ఉండటం మరిన్ని సమస్యలు తెచ్చిపెడుతుంది. ఏడు దశాబ్దాలుగా నాగాలాండ్ నెత్తుటి చరిత్రే దీనికి సాక్ష్యం. నాగాలాండ్లో ఎన్నో మిలిటెంట్ సంస్థలు ఆవిర్భవించాయి. అవి సాగించిన హింసవల్ల ఎందరో పౌరులు, మిలిటెంట్లు, భద్రతా బలగాలకు చెందినవారు మరణించారు. తరచు తెగల మధ్య ఘర్షణలు చెలరేగి వందలాదిమంది ఊచకోతకు బలయ్యారు. 60వ దశకంలో అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ తొలిసారి తిరుగుబాటుదార్లతో న్యూఢిల్లీలో చర్చలకు సిద్ధపడ్డారు. అయితే తమకు కేటాయించిన హోటల్ గదులను ఒక విదేశీ బృందం కోసం ఖాళీ చేయించడంతో ఆగ్రహించిన తిరుగుబాటుదార్లు చర్చలకు స్వస్తిచెప్పి నిష్క్రమించారు. కేంద్రం తమకు సమాన స్థాయినిచ్చి మాట్లాడకపోతే చర్చల సమస్యేలేదని అప్పట్లో తిరుగుబాటుదార్లు ప్రకటించారు. అటుపై మిలిటెంట్ సంస్థల మధ్య ఉన్న విభేదాలను ఉపయోగించుకుని ప్రభుత్వాలు వాటిని బలహీనపరచడానికి ప్రయత్నించాయి. అయితే పాత సంస్థలు కనుమరుగవుతున్నా అంతకు మించిన శక్తితో కొత్తవి పుట్టుకొస్తున్నాయి. కేంద్రం గత కొంతకాలంగా మ్యువా పక్షంతోనూ, ఏడెనిమిది సంస్థలకు ప్రాధాన్యం వహిస్తున్న నాగా నేషనల్ పొలిటికల్ గ్రూప్(ఎన్ఎన్పీజీ)తోనూ విడివిడిగా చర్చిస్తోంది. ఐఎం వంటి సంస్థను చర్చలకు ఒప్పించడమే కాదు...ఫ్రేమ్వర్క్పై సంతకం కూడా చేయించిన కేంద్రం ఇప్పుడు చివరి దశలో అన్ని పక్షాలనూ తన దారికెలా తెచ్చుకుంటుందన్నది చూడాల్సి ఉంది. చర్చల ఉద్దేశం శాంతి స్థాపన కనుక, అది సాధ్యపడే వరకూ వాటిని కొనసాగించడమే ఉత్తమం. అప్పుడు మాత్రమే దీర్ఘకాలంగా ఈశాన్యాన్ని పీడిస్తున్న సమస్యకు అర్ధవంతమైన పరిష్కారం సాధ్య పడుతుంది. -
నా సెంచరీని దోచుకున్నారు: క్రికెటర్ ఆవేదన
కోహిమా: ఒక క్రికెట్ మ్యాచ్లో ఆటగాడు సెంచరీ సాధిస్తే ఆ సంతోషమే వేరు. సెంచరీ చేసినా తన జట్టు ఓటమి పాలైతే ఆ బాధ కూడా ఎక్కువగానే ఉంటుంది. మరి సెంచరీ వర్షార్పణం అయితే ఆవేదన మాత్రమే మిగులుతుంది. ఇప్పుడు అదే ఆవేదనతో రగిలిపోతున్నాడు నాగాలాండ్ కెప్టెన్ రోంగ్సేన్ జోనాథన్. విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా రౌండ్-1లో మణిపూర్ జట్టుతో సెప్టెంబర్ 24వ తేదీన జరిగిన తొలి మ్యాచ్లో జోనాథన్ శతకం సాధించాడు. ఇది లిస్ట్-ఏ క్రికెట్లో జోనాథన్కు తొలి సెంచరీ. అయితే కుండపోతగా కురిసిన వర్షం కారణంగా ఆ మ్యాచ్ రద్దయ్యింది. నాగాలాండ్ 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 205 పరుగులు చేయగా, అనంతరం బ్యాటింగ్కు దిగిన మణిపూర్ 8.4 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 44 పరుగుల వద్ద ఉండగా భారీ వర్షం కురిసింది. దాంతో మ్యాచ్ను కొనసాగించడం సాధ్యం కాలేదు.అదే సమయంలో ఆ మ్యాచ్తో పాటు వర్షం కారణంగా రద్దయిన మ్యాచ్లను భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు రీ షెడ్యూల్ చేసింది. ఈ క్రమంలోనే తన సెంచరీ లెక్కల్లోకి రాకపోవడంతో జోనాథన్ తీవ్రంగా మధనపడుతున్నాడు. ‘ఇది నన్ను తీవ్రంగా వేధిస్తుంది. నా మనసుకు గాయం చేసింది. నా సెంచరీని దోచుకున్నారు’ అంటూ ఉద్వేగభరితమయ్యాడు. ‘ దాదాపు 60 శాతం మ్యాచ్ పూర్తయిన తరుణంలో మ్యాచ్ను రీ షెడ్యూల్ ఎలా చేస్తారు. రీ షెడ్యూల్పై నా అవగాహన అవగాహన ఉంది. కానీ మ్యాచ్లో ఫలితం రానప్పుడు ఆటగాళ్ల రికార్డులను రీ షెడ్యూల్ పేరుతో ఎలా దోచుకుంటారు. ప్లేయర్స్గా మేము చాలా కష్టపడతాం. కఠినంగా శ్రమిస్తాం. సీజన్లో తొలి మ్యాచ్లో సాధించిన రికార్డు ఇలా వృథా కావాల్సిందేనా. ఈ విషయం నన్ను కలిచి వేస్తోంది. నేను దీనిపై బీసీసీఐకి లేఖ రాశా. బీసీసీఐ క్రికెట్ ఆపరేషన్స్కు జనరల్ మేనేజర్గా ఉన్న సాబా కరీంను వివరణ అడిగా. కానీ ఇంతవరకూ ఎటువంటి స్పందనా లేదు. మా వ్యక్తిగత రికార్డులు ప్రయోజనం లేకుండా మిగిలి పోవడం బాధిస్తోంది. నార్త్-ఈస్ట్ నుంచి వచ్చిన క్రికెటర్లపై చులకన భావం ఉంది. అందుచేతే నేను రాసిన లేఖకు వివరణ ఇవ్వలేదు’ అని జోనాథన్ తన ఆవేదనను మీడియాకు తెలిపాడు. -
వర్షం రూపంలో అదృష్టం: రిక్షావాలకు 50 లక్షల లాటరీ
దిమాపూర్: పశ్చిమ బెంగాల్కు చెందిన గౌర్ దాస్ రిక్షావాలా.. పొరుగున ఉన్న నాగాల్యాండ్లోని దిమాపూర్ నగరంలో రిక్షా నడుపుకుంటూ.. బతుకు వెళ్లదీసే గౌర్ దాస్ దశ ఒక్కసారిగా తిరిగిపోయింది. నాగాల్యాండ్ ప్రభుత్వ లాటరీలో అతను తాజాగా రూ. 50 లక్షలు గెలుపొందాడు. దీంతో రిక్షావాలా కాస్తా ఓవర్నైట్ రిచ్వాలా అయిపోయాడు. ఆ రోజు వర్షమే రాకపోతే.. సెప్టెంబర్ 29వ తేదీన గౌర్ దాస్ తన తోటి రిక్షా యూనియన్ స్నేహితులతో కలిసి పిక్నిక్కు వెళ్లాలనుకున్నాడు. కానీ ఆ రోజు తెడతెరిపి లేకుండా వర్షం కురవడంతో పిక్నిక్ వెళ్లాలన్న ఆలోచన మానుకున్నాడు. ఈ తర్వాత ఇంటికి తిరిగొస్తుండగా ఓ వ్యక్తి ఎదురుపడి.. నాగాలాండ్ ప్రభుత్వ లాటరీ టికెట్లు కొనుమంటూ బతిమాలాడు. గౌర్ దాస్ వద్దు జేబులో 70 రూపాయలు మాత్రమే ఉన్నాయి. లాటరీ టికెట్టు ధర రూ. 30. లాటరీ కొనాలని లేకపోయినా.. అమ్మే వ్యక్తి పదేపదే బతిమాలి.. బలవంతం చేయడంతో దానిని కొన్నాడు. ఆ రోజు వర్షం పడకపోయి ఉంటే.. తాము పిక్నిక్కు వెళ్లేవాళ్లమని, లాటరీ టికెట్ను తాను కొని ఉండేవాడిని కాదని గౌర్ దాస్ ‘న్యూస్-18’కు తెలిపాడు. గత ఆదివారం లాటరీ ఫలితాలు వచ్చాయి. తనకు అంతగా నమ్మకం లేకపోయినా ఓ దుకాణం వద్దకు వెళ్లి ఫలితాలను చెక్ చేసిన గౌర్ దాస్ షాక్ తిన్నాడు. లాటరీ విజేతల్లో తన టికెట్ నంబర్ ఉంది. తనకు రూ. 50 లక్షలు వచ్చాయి. ఆనందంతో ఎగిరి గంతేసిన గౌర్ దాస్ తన భార్యకు మాత్రేమే ఈ విషయాన్ని చెప్పాడు. కానీ, సెక్యూరిటీ భయంతో ఇరుగు-పొరుగు వారికి చెప్పలేదు. మరునాడు బ్యాంకుకు వెళ్లి లాటరీ టికెట్ను డిపాజిట్ చేశాడు. ఈ లోపు ఈ వార్త మీడియాలో రావడంతో లాటరీ విజేతగా గౌర్ దాస్ స్థానికంగా ఫేమస్ అయిపోయాడు. -
ట్రక్కు 6.53 లక్షల జరిమానా
భువనేశ్వర్: ఒడిశాలోని సంభల్పూర్లో శనివారం నాగాలాండ్కు చెందిన ఓ లారీపై రూ.6.53 లక్షల జరిమానా విధించి పోలీసులు కొత్త రికార్డు సృష్టించారు. ట్రాఫిక్ నిబంధనలు ఏడింటిని ఉల్లంఘించారన్న కారణంగా ఇంతటి భారీ జరిమానా వేశారు. ఐదేళ్లుగా రోడ్ ట్యాక్స్ కట్టని కారణంగా ఎన్ఎల్ 08డీ 7079 నెంబరు ఉన్న ట్రక్పై రూ.6.40 లక్షల జరిమానా విధిస్తూ సంభల్పూర్ రీజనల్ ట్రాన్స్పోర్ట్ అధికారి చలాన్ రాశారు. వాహనాన్ని దిలీప్ కర్తా అనే డ్రైవర్ నడుపారు. యజమాని పేరు శైలేశ్ గుప్తా. దీంతోపాటు రూ.వంద సాధారణ జరిమానాగా, ఆదేశాలను ఉల్లంఘించినందుకు రూ.500, వాయు, శబ్ద కాలుష్య ఉల్లంఘనలకు రూ.1000, సరుకులు రవాణా చేయాల్సిన వాహనంలో ప్రయాణీకులను తీసుకెళుతున్నందుకు రూ.5000, పర్మిట్ లేకుండా వాహనం నడిపినందుకు రూ.5000, పర్మిట్ నిబంధనలను పాటించనందుకు రూ.1000 జరిమానా విధించినట్లు రసీదులో ఉంది. -
‘ఆ పోలీసుల సత్తా తెలుసు.. జాగ్రత్తగా ఉంటాను’
కోహిమ : సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే మహింద్ర గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహింద్రా ట్విటర్లో షేర్ చేసిన ఓ వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. రోడ్డు పక్కన గుంతలో ఇరుక్కుపోయిన మహింద్రా బొలెరో వాహనాన్ని నాగా బెటాలియన్కు చెందిన కొందరు మహిళా పోలీసులు బయటకు తీస్తున్న వీడియో అది. దట్టమైన అడవిగుండా వెళ్తున్న పోలీసులకు గుంతలో ఇరుక్కుపోయిన మహింద్రా బొలెరో వాహనం కనిపించింది. అసలే నిర్మానుష్య ప్రాంతం కావడంతో కొద్ది గంటల నుంచి దాన్ని బయటకు తీసేవారు లేక అక్కడే ఉండిపోయింది. ఎవరి సాయం దొరకక ఆ వాహనంలోని వారు అవస్థలు పడ్డారు. ఈ క్రమంలో అదే దారిగుండా వస్తున్న పోలీసులను సాయం కోరడంతో.. వారు బండి దిగొచ్చి తలో చేయి వేసి బండిని బయటకు తీశారు. ఇది జరిగి నెలలు కావొస్తున్నా.. వీడియో మాత్రం వైరల్ అయింది. ఎం.కికోన్ అనే వ్యక్తి ఈ వీడియోను తాజాగా పోస్టు చేయగా.. ఆనంద్ మహింద్రా షేర్ చేశాడు. ‘బొలెరో వాహనం అక్కడెలా కూరుకుపోయిందో తెలియదు. కానీ, దాన్ని బయటకు తీసినందుకు మహిళా పోలీసులకు థాంక్స్. వారితో తలపడాల్సి వస్తే జాగ్రత్తగా ఉంటాను. వారి సత్తా నాకు తెలుసు’ అని సరదాగా వ్యాఖ్యానించారు. -
‘ఈ వీడియో చూశాక జీవితంలో తేనె ముట్టను!’
సాక్షి, హైదరాబాద్: తేనె అంటే చిన్నవాళ్ల నుంచి పెద్దవాళ్ల వరకూ అందరికీ ఇష్టమే. ప్రస్తుత జీవనశైలిలో తేనె వాడకం చాలా పెరిగి పోయింది. ఎక్స్ట్రా హనీ కావాలంటూ అడగటం మనం వింటూనే ఉంటాం. అయితే కేంద్ర కీడ్రాశాఖ మంత్రి కిరణ్ రిజిజు షేర్ చేసిన వీడియో చూశాక జీవితంలో తేనె వాడమని అంటున్నారు పలువురు నెటిజన్లు. తేనెపట్టు సాధారణంగా చెట్లకు లేదా ఇంటి కప్పులకు వేలాడుతూ ఉండటాన్ని చూస్తుంటాం. కానీ ఓ వ్యక్తిపై ఉండరాని చోట ఉండటం చూసి అందరూ నోళ్లు వెళ్లబెడుతున్నారు. నాగాలాండ్లో ఓ వ్యక్తి బ్యాక్ సీట్పై తేనెపట్టు ఏర్పడింది. దీనికి సంబంధించిన వీడియోను కిరణ్ రిజిజు షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ నవ్వులు పూయిస్తోంది. అంతేకాకుండా నెటిజన్లు తమకు నచ్చినట్లు కామెంట్స్ చేస్తున్నారు. కేంద్ర మంత్రి షేర్ చేసిన వీడియో కొద్ది నిమిషాల్లోనే వైరల్గా మారింది. భారత షట్లర్ గుత్తా జ్వాలాతో సహా అనేక మంది నెటిజన్లు ఈ వీడియోపై కామెంట్ చేస్తున్నారు. ‘ఈ వీడియో చూశాక జీవితంలో తేనె ముట్టను’అని ఓ నెటిజన్ సరదాగా పేర్కొనగా.. ‘ఇంకా నయం జీన్స్ ప్యాంట్ వేసుకున్నావు కాబట్టి బతికిపోయావ్, లేదంటే? అంతే సంగతి’ అని మరొకరు వ్యంగ్యంగా స్పందించారు. అయితే మరికొంత మంది ఆ వ్యక్తిపై జాలి చూపించారు. తరువాత ఏమయిందని ఉత్సుకతతో అడుగుతున్నారు. ఇక తేనెటీగల పెంపకంలో నాగాలాండ్ రాష్ట్రం ప్రఖ్యాతి గాంచిన విషయం తెలిసిందే. -
గిన్నిస్కోసం..
వీరంతా నాగాలాండ్కు చెందిన కొన్యక్ తెగకు చెందిన మహిళలు. గిన్నిస్బుక్లో స్థానం సంపాదించేందుకు ఇలా అందరూ కలసి వారి సంప్రదాయ నృత్యమైన కొన్యక్ నృత్యాన్ని ప్రదర్శించారు. 4,700 మంది కొన్యక్ తెగ మహిళలు 5 నిమిషాల 1 సెకను పాటు సంగీత వాయిద్యాలను మోగిస్తూ నృత్య ప్రదర్శన చేశారు. ఇటీవల నాగాలాండ్లోని మోన్ జిల్లాలో ఈ నృత్య ప్రదర్శన జరిగింది. అత్యధిక మంది కలసి కొన్యక్ నృత్యప్రదర్శన చేసి రికార్డు కోసం ప్రయత్నించారు. అయితే గిన్నిస్ నిర్వాహకులు రాకపోయేసరికి.. ఈ ప్రదర్శన మొత్తాన్ని వీడియో తీసి వారికి పంపారు. త్వరలోనే ఇది గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కొచ్చు. -
నాగాలాండ్ గాంధీ కన్నుమూత
గువాహటి: నాగాలాండ్ గాంధీగా పేరు గాంచిన సామాజిక కార్యకర్త నట్వర్ ఠక్కర్(86) ఆదివారం మృతి చెందారు. మహాత్మాగాంధీ బోధనలు, భావాల వ్యాప్తికి ఆయన విశేష కృషి చేశారు. వృద్ధా ప్య సంబంధ అనారోగ్యంతో చికిత్స పొందుతూ గువాహటిలోని ప్రైవేటు ఆసుపత్రిలో ఆయన చనిపోయారు. 1932లో మహారాష్ట్రలో జన్మించిన ఠక్కర్.. తన 23 ఏళ్ల వయసులో నాగాలాండ్కు వచ్చి అక్కడే సమాజ సేవ కార్యక్రమాలు చేపట్టారు. చుచుయిమ్లాంగ్ అనే గ్రామంలో ‘నాగాలాండ్ గాంధీ ఆశ్రమం’ను స్థాపించారు. ఆయనకు భార్య, ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. నాగాలాండ్ గాంధీ చేసిన సేవలను గుర్తించిన ప్రభుత్వం 1994లో ఇందిరాగాంధీ జాతీయ సమైక్యత పురస్కారాన్ని, 1999లో పద్మశ్రీ అవార్డ్ను ప్రకటించింది. -
అస్సాం రైఫిల్స్పై మెరుపుదాడి
కోహిమా: నాగాలాండ్లోని మోన్ జిల్లాలో గుర్తు తెలియని సాయుధులు రెచ్చిపోయారు. ఆదివారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో అబోయ్ ప్రాంతంలో గస్తీలో ఉన్న ఆరుగురు అస్సాం రైఫిల్స్ జవాన్లపై కాపుకాసి దాడిచేశారు. దీంతో హవల్దార్ ఫతేసింగ్, సిపాయ్ హుంగ్నాగా కోన్యాక్ ఘటనా స్థలంలోనే చనిపోయారు. మిగిలిన వారికీ తీవ్రమైన బుల్లెట్ గాయాలయ్యాయని అస్సాం రైఫిల్స్ పీఆర్వో వెల్లడించారు. గాయపడిన వారికి కోహిమా ఆసుపత్రిలో చికిత్సనందిస్తున్నారు. అయితే ఇది నాగా తిరుగుబాటు దారుల పనేనని భావిస్తున్నారు. జవాన్ల ప్రతిఘటనలోనూ నాగా తిరుగుబాటుదారులు గాయపడి ఉండొచ్చని భావిస్తున్నట్లు పీఆర్వో తెలిపారు. -
4 ఎంపీ, 10 అసెంబ్లీ స్థానాలకు.. నేడు ఉప ఎన్నికలు
న్యూఢిల్లీ : నేడు దేశ వ్యాప్తంగా నాలుగు లోక్సభ, 10 అసెంబ్లీ స్థానా లకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. యూపీలోని కైరానా, మహారాష్ట్రలోని పాల్ఘర్, భండారా–గోండియా స్థానాలతో పాటు నాగాలాండ్లోని ఏకైక ఎంపీ స్థానానికి పోలింగ్ నిర్వహిస్తున్నారు. అలాగే నూపుర్(ఉత్తర ప్రదేశ్), షాకోట్(పంజాబ్), జోకిహట్(బిహార్), గొమియా, సిల్లీ(జార్ఖండ్), చెంగన్నూరు(కేరళ), పాలుస్ కడేగావ్(మహారాష్ట్ర), అంపటి (మేఘాలయ), థరాలి(ఉత్తరాఖండ్) మహేస్థల( పశ్చిమబెంగాల్) అసెంబ్లీ స్థానాలకు ఎన్నిక జరగనుంది. మే 31న లెక్కింపు చేపడతారు. బీజేపీ ఎంపీ హుకుం సింగ్ మరణంతో యూపీలోని కైరానాకు ఉప ఎన్నికలు జరుగుతుండగా.. ఆయన కుమార్తె మ్రిగాంకా సింగ్ బీజేపీ తరఫున పోటీలో ఉన్నారు. కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీ, బీఎస్పీ మద్దతుతో లోక్దళ్ అభ్యర్థి తబస్సుమ్ ఆమెపై తలపడుతున్నారు. గోరక్పూర్, పూల్పూర్ ఫలితాలు కైరానాలో పునరావృతమవుతాయని ప్రతిపక్షాలు ఆశాభావంతో ఉన్నాయి. మహారాష్ట్రలోని పాల్ఘర్లో బీజేపీ ఎంపీ చింతామన్ వంగర మరణంతో ఉప ఎన్నిక నిర్వహిస్తున్నారు. ఆశ్చర్యకరంగా వంగర కుమారుడు శ్రీనివాస్ శివసేన తరఫున బరిలో ఉండగా.. బీజేపీ నుంచి గవిట్ పోటీపడుతున్నారు. భండారా–గోండియా సిట్టింగ్ ఎంపీ ఆ స్థానానికి రాజీనామా చేసి కాంగ్రెస్లో చేరడంతో తాజా ఎన్నికలు అనివార్యమయ్యాయి. -
‘ఆ స్థానానికి ఆయనే కరెక్టు’
కోల్కత: మరో ఎన్నికల సమరానికి అంతా సిద్ధమైంది. రేపు (సోమవారం) అయిదు అసెంబ్లీ, ఒక లోక్సభ స్థానానికి ఉప ఎన్నికలు జరగనున్నాయి. పశ్చిమ బెంగాల్లోని మహెష్తల, జార్ఖండ్లోని గోమియా, సిల్లీ, బిహార్లోని జోకిహత్, మేఘాలయలోని అంపతి అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. కాగా, నాగాలాండ్ అసెంబ్లీకి ఫిబ్రవరిలో ఎన్నికలు జరగాయి. ఈ ఎన్నికల్లో విజయం సాధించి ఎన్డీపీపీ, బీజేపీలు భాగస్వాములుగా గల పీడీఏ కూటమి అధికారం చేపట్టింది. ముఖ్యమంత్రిగా నేషనలిస్ట్ డెమొక్రటిక్ ప్రొగ్రెసివ్ పార్టీ అధ్యక్షుడు నెఫ్యూ రియోని ఎన్నికున్నారు. ఆయన తన ఎంపీ స్థానానికి రాజీనామా చేయడంతో.. నాగాలాండ్లో ఉన్న ఏకైక లోక్సభ స్థానం ఖాళీ అయింది. దీంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. కాగా, నాగాలాండ్ లోక్సభ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నిక ప్రతిష్టాత్మకంగా మారింది. నాగా పీపుల్స్ ఫ్రంట్ అభ్యర్థికి, అధికార పీపుల్స్ డెమొక్రటిక్ అలయెన్స్ అభ్యర్థికి మధ్య ప్రధాన పోరు జరుగుతోంది. తమ అభ్యర్థులను గెలిపించుకోవడానికి ఇప్పటికే ఆయా పార్టీలు తీవ్రంగా శ్రమించాయి. ఎన్డీపీపీ, బీజేపీలు భాగస్వాములైన పీపుల్స్ డెమొక్రటిక్ అలయెన్స్ తమ అభ్యర్థిగా మాజీ మంత్రి టొకిహో యెప్తోమీని నిలబెట్టింది. నాగా పీపుల్స్ ఫ్రంట్ అభ్యర్థి కె. అపోక్ కుమార్కు కాంగ్రెస్ మద్దతు ప్రకటించింది. ‘మతోన్మాద శక్తుల ఆగడాలతో నాగాలాండ్లో అనిశ్చిత పరిస్థితులు తలెత్తాయి. అపోక్ కుమార్ తిరిగి రాష్ట్రంలో సాధారణ పరిస్థితులు నెలకొనేలా పనిచేస్తారని ఆశిస్తున్నాం. ఆయనే తగిన నాయకుడుగా భావిస్తున్నాం. అందుకనే మద్దతునిస్తున్నామ’ని నాగాలాండ్ కాంగ్రెస్ కమిటీ ప్రెసిడెంట్ కె. థెరీ అన్నారు. థెరీ వ్యాఖ్యలపై నాగాలాండ్ బీజేపీ అధికార ప్రతినిధి కె. జేమ్స్ విజో స్పందించారు. ఓటమి భయంతో కాంగ్రెస్ అనుచిత వ్యాఖ్యలు చేస్తోందని విమర్శించారు. -
అన్నింటా ముందే, అయినా ఇదేమీ శాపం!
సాక్షి, న్యూఢిల్లీ : ఈశాన్య రాష్ట్రాలైన త్రిపుర, నాగాలాండ్, మేఘాలయ అసెంబ్లీలకు గత నెల జరిగిన ఎన్నికల్లో దాదాపు 90 శాతం పోలింగ్ జరగడం విశేషం. ఓటర్లు సృష్టించిన ఈ తుపానుకు త్రిపురలో వామపక్ష ప్రభుత్వం తుడుచుపెట్టుకుపోగా, నాగాలాండ్లో నేషనలిస్ట్ డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ అనే కొత్త పార్టీతో పొత్తు పెట్టుకోవడం ద్వారా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది. మేఘాలయలో నేషనల్ పీపుల్స్ పార్టీ నాయకత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. త్రిపుర, నాగాలాండ్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా దెబ్బతిన్నది. ఈసారి పోలింగ్లో మహిళలు విశేషంగా పాల్గొన్నప్పటికీ ఎప్పటిలాగా కనిపించని మార్పు ఒక్కటే. అదే మహిళల ప్రాతినిధ్యం. త్రిపుర, మేఘాలయ రాష్ట్రాల్లో ముగ్గురేసి మహిళలు ఈ ఎన్నికల్లో విజయం సాధించగా, ఎప్పటిలాగే నాగాలాండ్లో ఒక్కరు కూడా విజయం సాధించలేదు. మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో 13 మంది స్వతంత్య్ర సభ్యులు సహా మొత్తం 60 మంది మహిళలు పోటీ చేశారు. వారు కేవలం ఆరుగురు మాత్రమే విజయం సాధించారు. మహిళల ప్రాతినిథ్యం విషయంలో మొదటి నుంచి ఈ రాష్ట్రాల పరిస్థితి అలాగే ఉంది. 1960వ దశకం నుంచి ఇప్పటి వరకు ఈ మూడు రాష్ట్రాల్లో 307 మంది మహిళలు పోటీ చేయగా, వారిలో 44 మంది మాత్రమే విజయం సాధించారు. 2013 సంవత్సరంతో పోలిస్తే త్రిపుర, మేఘాలయ రాష్ట్రాల్లో మహిళల ప్రాతినిథ్యం తగ్గింది. 2013లో తొమ్మిది మంది మహిళా ఎమ్మెల్యేలు ఉండగా, ఈసారి ఆరుగురు మహిళలు మాత్రమే విజయం సాధించారు. మేఘాలయలో మాజల్ అంపారిన్ లింగ్డో, దిక్కాంచిసిర అనే మహిళలు తమ స్థానాలను తిరిగి గెలుచుకోగా, మాజీ కేంద్ర మంత్రి పీఏ సంగ్మా కూతురు అగాథా సంగ్మా తొలిసారి అసెంబ్లీకి పోటీ చేసి విజయం సాధించారు. త్రిపురలో ప్రభుత్వం వ్యతిరేక ఓటును తట్టుకొని సీపీఎం తరఫున బిజితా నాథ్ అనే మహిళ మాత్రమే విజయం సాధించారు. మిగతా ఇద్దరు కళ్యాణి రాయ్, శంతన చక్మా బీజేపీ తరఫున పోటీచేసి విజయం సాధించారు. ఇక నాగాలాండ్లో ప్రధాన రాజకీయ పార్టీలేవీ మహిళలను పోటీకి నిలబెట్టలేదు. ఎక్కువ మంది స్వతంత్య్ర అభ్యర్థులుగా పోటీ చేశారు. ఒక్కరు కూడా విజయం సాధించలేదు. దేశవ్యాప్తంగా అసెంబ్లీ ఎన్నికల్లో మహిళల ప్రాతినిథ్యం అంతో ఇంతో పెరుగుతుండగా, ఈశాన్య రాష్ట్రాల్లో రానురాను తగ్గుతోంది. దేశవ్యాప్తంగా మహిళల ప్రాతినిథ్యం 7. 6 శాతం ఉండగా, నాగాలాండ్లో జీరో, హర్యానాలో అత్యధికంగా 14.4 శాతం ఉంది. ఈశాన్య రాష్ట్రాల్లో మహిళల ప్రాతినిధ్యం తగ్గిపోవడానికి రెండు కారణాలు చెబుతారు. ఒకటి రాజకీయాల్లో మహిళలకు తగిన అనుభవం లేదన్నది ఒక్కటైతే మగవాళ్లలో పోలిస్తే మహిళలకు రాజకీయాల్లో బలహీనులని, సరైన నిర్ణయాలు తీసుకోవడంలో, సమర్థపాలన అందించడంలో వారు పోటీ పడలేరన్నది రెండో కారణం. అయితే గత 15 ఏళ్లలో మహిళా ఎమ్మెల్యేల చేపట్టిన పనులను పరిశీలిస్తే వారే మగవారికన్నా ఎక్కువ రాణించారు. పలు నియోజక వర్గాల్లో మహిళా ఓటర్లే ఎక్కువ ఉన్నప్పటికీ, పలు ప్రచార ర్యాలీల్లో మహిళలే ఎక్కువ క్రియాశీలకంగా పాల్గొన్నప్పటికీ ఎన్నికల్లో ఎక్కువ మంది మహిళలు గెలవక పోవడం చిత్రమైన పరిస్థితి. అది వారికో శాపంలా పరిణమించింది. -
నాగాలాండ్ సీఎంగా రియో ప్రమాణస్వీకారం
కోహిమా : నాగాలాండ్ ముఖ్యమంత్రిగా ఎన్డీపీపీ వ్యవస్థాపక నాయకుడు నైఫ్యూ రియో ప్రమాణ స్వీకారం చేశారు. నాగలాండ్ గవర్నర్ పీబీ ఆచార్య సమక్షంలో ఆయన నాలుగోసారి ముఖ్యమంత్రి అయ్యారు. ఈ వేడుకకు బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, కేంద్ర మంత్రులు నిర్మాలా సీతారామన్, కిరణ్ రిజుజులు హాజరయ్యారు. భారతీయ జనతాపార్టీ–నేషనలిస్ట్ డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ కూటమి మద్దతుతో రియో ప్రభుత్వం నెలకొంది. డిప్యూటీ సీఎంతో పాటు 10 మంది మంత్రులు ప్రమాణస్వీకారం చేశారు. టీఆర్ జెలియాంగ్ కంటే ముందు వరుసగా 11 ఏళ్లపాటు మూడుసార్లు రియో ముఖ్యమంత్రిగా చేశారు. నాగా పీపుల్స్ ఫ్రంట్ తరఫున మూడోసారి ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించిన ఆయన అర్ధాంతరంగా సీఎం పదవిని వదిలిపెట్టి 2014లో ఎంపీగా లోక్సభకు వెళ్లిన విషయం తెలిసిందే. -
సంకెళ్ల మాటున రెక్కలు
ఆలోచనం వీరి ఒత్తిడికి తలొగ్గిన అసెంబ్లీ మున్సిపల్ చట్టానికి సవరణ చేసి రిజర్వేషన్లు కల్పించింది. దీనిని నాగా తెగలకు నాయకత్వం వహించే నాగా హోహో, ఈఎన్పీవో తీవ్రంగా వ్యతిరేకించాయి. మూడు ఈశాన్యరాష్ట్రాలు –నాగాలాండ్, మేఘాలయ, త్రిపుర ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. మాజీ ప్రధాని వాజ్పేయి చెప్పినట్టు ఈ మూడింటిలో విల క్షణ చరిత్ర కలిగిన నాగాలాండ్ పైన నా దృష్టి కేంద్రీకరించాను. అణచివేత ఎంత ప్రమాదకరమైనదో అర్థం చేసుకొని, స్వేచ్ఛకి అత్యంత ప్రాముఖ్యమిచ్చే నాగాల వ్యక్తిత్వం నా ఆసక్తికి ఒక కారణం కాగా, ఆ అసెంబ్లీలో మహిళా ప్రాతినిధ్యం గురించి జరుగు తున్న చర్చ ఇంకొక కారణం. 1963లో రాష్ట్రం ఆవిర్భవించినప్పటి నుండి 2013 వరకు జరిగిన 12 అసెంబ్లీ ఎన్నికలలో ఒక్క మహిళా అభ్యర్థి కూడా గెలుపొందలేదు. ఈ పన్నెండు ఎన్నికలలో 19 మంది మహిళలు మాత్రమే పోటీ చేశారు. 60 మంది శాసనసభ్యులు ఉన్న ఆ అసెంబ్లీకి ఈసారి 253 నామినేషన్లు దాఖలు కాగా, వారిలో మహిళలు ఐదుగురే. ఇప్పటి అధికార నాగా పీపుల్స్ ఫ్రంట్ మాతృక యునైటెడ్ డెమొక్రాటిక్ పార్టీకి అధ్య క్షురాలిగా పనిచేసిన రానో ఎం షైజా 1977లో లోక్ సభకు ఎన్నిక కావడం మినహా చట్టసభలకు నాగా మహిళల ప్రాతినిధ్యం శూన్యం. ఈ విషయం గురించి జర్నలిస్ట్ ఈప్సిత చక్రవర్తి ‘ఇదొక ఆసక్తికరమైన అభాస. ఎందుకంటే నాగా మహిళలు పురుషులతో పాటు సాయుధ పోరాటంలో చేయీ చేయీ కలిపి పోరాడారు, శాంతి ప్రక్రియలో భాగమయ్యారు, వివిధ పౌర సంఘాల్లో కూడా ఎంతో సంఘటితంగా పనిచేస్తున్నారు’ అంటారు. ఇతర ప్రాంతాలతో పోలిస్తే మహిళా అభివృద్ధి సూచికలలో నాగాలాండ్ ముందుంది. 2011 సెన్సస్ ప్రకారం దేశంలో చైల్డ్ సెక్స్ రేషియో 914 ఉంటే, నాగాలాండ్లో 943గా ఉంది. మహిళల్లో అక్ష రాస్యత దేశ సగటుకంటే పది శాతం పాయింట్లు ఎక్కువగా, 76% ఉంది. మహిళలపై జరిగే నేరాలు అతి తక్కువ. వీరి సాంప్రదాయక చట్టాల ప్రకారం రేపిస్ట్ని కొట్టి చంపవచ్చు. అత్యున్నత స్థాయి బ్యూరో క్రాట్లలో కూడా మహిళలు 305 వరకూ ఉన్నారు. అయితే నాగా మహిళా సామాజిక అభివృద్ధికి దోహదం చేసిన సంస్కృతీ సంప్రదాయాలే నేడు వారి రాజకీయ ఆకాం క్షలకు అడ్డంకిగా మారాయి. దేశంలోని వివిధ రాష్ట్ర అసెంబ్లీలలో మహిళా ప్రాతినిధ్యం సగటు శోచనీయంగా, 9% మాత్రమే. 73, 74 రాజ్యాంగ సవరణల తర్వాత స్థానిక సంస్థ లలో మాత్రం 33% రిజర్వేషన్లు అమలవుతున్నాయి. నాగాలాండ్ స్థానిక సంస్థలలో మహిళా రిజర్వేషన్ల గురించి పెద్ద యుద్ధమే జరుగుతున్నది. ఇందుకు నాగా మదర్స్ అసోసియేషన్ ఎన్నో ఏళ్లుగా పోరాడు తున్నది. వీరి ఒత్తిడికి తలొగ్గిన అసెంబ్లీ మున్సిపల్ చట్టానికి సవరణ చేసి రిజర్వేషన్లు కల్పించింది. దీనిని నాగా తెగలకు నాయకత్వం వహించే నాగా హోహో, ఈఎన్పీవో తీవ్రంగా వ్యతిరేకించాయి. అలాంటి చట్టాలు, రిజర్వేషన్లు అవసరం లేదని వారు వాదిం చటం మొదలుపెట్టారు. వీరి ఒత్తిడికి తలొగ్గిన ప్రభుత్వం నాగాలాండ్కి ఆర్టికల్ 371 ఇచ్చిన వెసులుబాటుని ఉపయోగించుకొని 73, 74 రాజ్యాంగ సవరణలు తమ సంస్కృతీ సంప్రదాయాలకు విఘాత మని తీర్మానించింది. అయితే మున్సిపాలిటీలు ఆధు నిక వ్యవస్థలని నాగా మదర్స్ అసోసియేషన్ వాదన. సుప్రీంకోర్టు ఈ వాదనతో ఏకీభవిస్తూ ఎన్నికలు నిర్వ హించమని ఆదేశించింది. ఎన్నికలు హింసాత్మకం కావడం, ఇద్దరు మరణించడం, ముఖ్యమంత్రి రాజీ నామా కారణంగాను ఎన్నికలు నిలిచిపోయాయి. ఈ మొత్తం పరిణామాల గురించి చర్చిస్తూ హెచ్సీయూ పొలిటికల్ సైన్స్ అధ్యాపకులు యువాన్ హాసింగ్ ఒక విషయం చెప్పారు. ప్రభుత్వం, యూన్ఎన్డీపీ నిర్వ హించిన సర్వేల ప్రకారం దాదాపు 805 మంది మహిళా రిజర్వేషన్లకు అనుకూలంగా ఉన్నారనీ పెద్ద మనుషుల పితృస్వామ్య భావజాలమే అసలు అడ్డంకి అనీ హాసింగ్ వ్యాఖ్యానించారు. దీనితో స్థానిక సంస్థల విషయం అటుంచితే ఈసారి అసెంబ్లీకి ఒక్క మహిళ అయినా గెలుస్తుందనే ఆశ కలిగింది. మోన్ జిల్లా అబోయి నియోజకవర్గం నుండి బరిలో ఉన్న అవాన్ కోన్యాక్ మొదట ఆధిక్యత కనబరిచినా చివరికి ఓడిపోయారు. నాగా ప్రతిఘటనకి మొట్టమొదటి రూపం నాగా క్లబ్. 1927లో సైమన్ కమిషన్కి ఇచ్చిన నివేదికలో వీరు ‘మమ్మల్ని మాకే వదిలి వేయండి. ఆదిమ కాలంలో ఏ విధంగా జీవించామో ఆ విధంగా జీవించ డానికి అవకాశం ఇవ్వండి’ అని అభ్యర్థించారు. నాగా ప్రతిఘటనోద్యమం విస్తరించడానికీ, తలల వేట వంటి ఆచారాలతో అనైక్యంగా ఉన్న తెగల, గ్రామాల మధ్య సామరస్యం నెలకొల్పి జాతీయవాదాన్ని పెంపొందించడానికీ క్రిస్టియానిటీ ఉపయోగపడింది. నాగాలాండ్లో వాహనాల మీద ‘జీసస్ సేవ్స్’ అనే నినాదం ఉంటుంది. కరుణామయుడూ, ప్రగతిశీ లుడూ, ప్రియమైన విప్లవకారుడూ, అసాధారణ అమ రవీరుడూ, పునరుత్థానం తరువాత మొదట మహిళకే దర్శనం ఇచ్చిన యేసుక్రీస్తును ఆకాశంలో సగమైన మా మహిళలకు అవనిలోనూ సగం, అసెం బ్లీలలోనూ సగం, పార్లమెంట్లోనూ సగం ఇవ్వమని వేడుకొను చున్నాను. ఆమెన్! సామాన్య వ్యాసకర్త ప్రముఖ రచయిత్రి 80196 00900 -
బీజేపీ చెబుతున్న మార్పు ఎక్కడ?
సాక్షి, న్యూఢిల్లీ : ‘మార్పు తీసుకొస్తాం, మార్పు కోసమే మా పోరాటం’ అంటూ నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతాపార్టీ–నేషనలిస్ట్ డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ కూటమి విస్తృతంగా ప్రచారం చేసింది. ఎన్నికల ఫలితాలు వెలువడడంతో ఎలాగైనా బీజేపీ అధికారంలోకి వస్తుందని తేలిపోయింది. కానీ రాష్ట్రంలో మార్పు వచ్చే సూచనలు మాత్రం శూన్యమే. ఎన్డీపీపీ పార్టీతో కలిసి రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని, 60 మంది సభ్యులు గల రాష్ట్ర అసెంబ్లీలో తమకు జేడీయూ, ఓ స్వతంత్య్ర అభ్యర్థితోపాటు మొత్తం 32 మంది సభ్యుల మద్దతు ఉందని బీజేపీ ప్రకటించింది. గవర్నర్ ఆహ్వానిస్తే ఎన్డీపీపీ వ్యవస్థాపక నాయకుడు నైఫ్యూ రియో ముఖ్యమంత్రి అవుతారు. ఆయన ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రి టీఆర్ జెలియాంగ్ కంటే ముందు వరుసగా 11 ఏళ్లపాటు మూడుసార్లు ముఖ్యమంత్రిగా ఉన్నారు. నాగా పీపుల్స్ ఫ్రంట్ తరఫున మూడోసారి ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించిన ఆయన అర్ధాంతరంగా సీఎం పదవిని వదిలిపెట్టి 2014లో ఎంపీగా లోక్సభకు వెళ్లారు. ఆ తర్వాత మళ్లీ రాష్ట్ర రాజకీయాల్లోకి వచ్చారు. జెలియాంగ్ ప్రభుత్వం హయాంలో వెలుగులోకి వచ్చిన అనేక అవినీతి కుంభకోణాలు నాటి రియో ప్రభుత్వంలో ప్రారంభమైనవే. రియో పార్టీతో కలిసి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినట్లయితే అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న గత శాసనసభ్యులకన్నా ఈసారి అవినీతి ఆరోపణలు ఎదుర్కొనే శాసనసభ్యుల సంఖ్య ఇంకా ఎక్కువగా ఉంటుందని ‘ప్రజాస్వామ్య సంస్కరణల సంఘం’ ఓ సర్వే ద్వారా తేల్చింది. నాగాలాండ్ ముఖ్యమంత్రి పదవికి తాను రాజీనామా చేయనని, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేంత బలం తనకూ ఉందని, తనకే అవకాశం కల్పించాలని ప్రస్తుత ముఖ్యమంత్రి టీఆర్ జెలియాంగ్ రాష్ట్ర గవర్నర్ను కోరిన విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో ఆయన్ని కూడా బీజేపీ చర్చలకు పిలిచింది. జెలియాంగ్ ప్రాతినిథ్యం వహిస్తున్న నాగా పీపుల్స్ ఫ్రంట్కు ఎన్నికల్లో 27 సీట్లు లభించాయి. 2013 ఎన్నికల్లో కేవలం ఒక్క సీటును మాత్రమే గెలుచుకొని ఈసారి ఏకంగా 12 సీట్లను గెలుచుకున్న బీజేపీ, నాగా పీపుల్స్ ఫ్రంట్కు మద్దతిస్తే మళ్లీ జెలియాంగ్ ప్రభుత్వమే ఏర్పడుతుంది. ప్రస్తుత జెలియాంగ్ ప్రభుత్వంలో కూడా బీజేపీ కొనసాగిన విషయం తెల్సిందే. బీజేపీ తరఫున 2013లో ఒక్కరే గెలిచినప్పటికీ ఆ తర్వాతా వారి సంఖ్య పార్టీ ఫిరాయింపులతో నాలుగుకు చేరింది. 2015 నుంచి ప్రతిపక్షంలో ఒక్కరు కూడా లేకుండానే జెలియాంగ్ ప్రభుత్వం కొనసాగింది. ప్రతిపక్ష పార్టీలన్నీ ప్రభుత్వంలో చేరిపోవడమే అందుకు కారణం. రియో నాయకత్వంలోని ఎన్డీపీపీతో కలిసే బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే రాష్ట్రంలోనే ధనిక ప్రభుత్వం అవుతుంది. ఇరుపార్టీలకు చెందిన శాసనసభ్యుల్లో 75 శాతం మంది కోటి రూపాయలకు పైగా ఆస్తులు కలిగిన వారే. అవినీతి కుంభకోణాలు రియో హయాంలో ప్రారంభమై ఆ కేసులు ఇప్పటికీ కొనసాగుతున్నందున బీజేపీ చెప్పే మార్పు ఎక్కడ వస్తుంది? ఇక జెలియాంగ్తో చేతులు కలిపితే మార్పు అనే పదానికే అర్థం ఉండదు. ఈసారి మార్పు వచ్చేదల్లా ఒక్కటే. బీజేపీ ఎవరితో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా అవతలి పక్షం ప్రతిపక్షం అవుతుంది. రియో పార్టీతో కలిసి బీజేపీ పోటీ చేసినందున ప్రభుత్వంలో ఆయన పార్టీ కూడా చేరిపోతే మళ్లీ ప్రతిపక్షం అనేది ఉండదు. ప్రజాస్వామ్య వ్యవస్థలో బలమైన ప్రతిపక్షం ఉన్నప్పుడే ప్రభుత్వ పాలన సవ్యంగా సాగుతుంది. -
నాగాలాండ్లో నేనంటే.. నేను!
కోహిమా: నాగాలాండ్ ప్రభుత్వం ఏర్పాటులో ఉత్కంఠ కొనసాగుతోంది. ప్రభుత్వం ఏర్పాటు చేస్తామంటూ నాగాలాండ్ డెమోక్రటిక్ ప్రొగ్రెసివ్ పార్టీ(ఎన్డీపీపీ) నేత నేఫియో రియో, నాగాలాండ్ పీపుల్స్ ఫ్రంట్(ఎన్పీఎఫ్)కు చెందిన టీఆర్ జెలియాంగ్ గవర్నర్ను కలవటంతో రాజకీయాలు కొత్త మలుపు తిరిగాయి. ఆదివారం ఉదయం ఎన్డీపీపీ నేత రియో గవర్నర్ పీబీ ఆచార్యను కలిసి తనకు 32 మంది సభ్యుల మద్దతు ఉందని చెప్పారు. అనంతరం ఆపద్ధర్మ ముఖ్యమంత్రి టీఆర్ జెలియాంగ్ కూడా గవర్నర్ వద్దకు వెళ్లి మెజారిటీ సభ్యుల మద్దతు ఉందని తెలిపారు. వీరితో సమావేశాల అనంతరం గవర్నర్ మాట్లాడుతూ.. ఇద్దరికీ 48 గంటల సమయం ఇచ్చాననీ, మెజారిటీ సభ్యుల మద్దతుతో లేఖలు ఎవరు తీసుకువస్తే వారినే ప్రభుత్వం ఏర్పాటు చేయాలని కోరతానన్నారు. రియో వెంట ఎన్డీపీపీ అధ్యక్షుడు చింగ్వాంగ్ కొన్యాక్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు విసాసోలీ లౌంగు, జనతాదళ్(యు) ఎమ్మెల్యే, మరో స్వతంత్ర ఎమ్మెల్యే ఉన్నారని గవర్నర్ చెప్పారు. రియోకు చెందిన ఎన్డీపీపీకి 18, బీజేపీకి 12 మంది సభ్యుల బలం ఉందని తెలిపారు. జెలియాంగ్కు చెందిన ఎన్పీఎఫ్కు 26 మంది సభ్యులుండగా ఇద్దరు నాగాలాండ్ పీపుల్స్ పార్టీ, ఒక జేడీయూ ఎమ్మెల్యే మద్దతు ఉందని చెప్పారన్నారు. అయితే ఇదే జేడీయూ ఎమ్మెల్యే రియోకు కూడా మద్దతు తెలిపారన్నారు. ఇలా ఉండగా, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి జెలియాంగ్ రాజీనామాకు నిరాకరించారు. నాగాలాండ్లో సంకీర్ణ ప్రభుత్వం: రామ్మాధవ్ ఎన్డీపీపీతో కలిసి నాగాలాండ్లో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటం ఖాయమని బీజేపీ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ తెలిపారు. 60 సీట్లున్న అసెంబ్లీలో రెండు పార్టీలతోపాటు జేడీయూ, ఇండిపెండెంట్ అభ్యర్థులతో కలిపి సాధారణ మెజారిటీ ఉందని తెలిపారు. -
లెఫ్ట్ కోట బద్ధలు.. త్రిపురలో బీజేపీ పాగా
-
నాగాలాండ్లో ఉత్కం‘టై’
కోహిమా: నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఊహించని ఫలితం. శనివారం ఉదయం నుంచి నువ్వా?నేనా? అన్నట్లు సాగిన ఓట్ల లెక్కింపు ప్రక్రియ తీవ్ర ఉత్కంఠ రేకెత్తించి, చివరికి ప్రధాన పక్షాల మధ్య సమంగా ముగిసింది. ఏ పార్టీ, కూటమికి స్పష్టమైన ఆధిక్యం లభించక అధికార నాగా పీపుల్స్ ఫ్రంట్ (ఎన్పీఎఫ్), బీజేపీ–నేషనలిస్ట్ డెమొక్రటిక్ ప్రొగ్రెసివ్ పార్టీ(ఎన్డీపీపీ) కూటము లు చెరో 29 స్థానాల్లో గెలుపొందాయి. దీంతో ఏ పార్టీ ప్రభుత్వం ఏర్పాటుచేసినా, అందులో బీజేపీ భాగస్వామిగా చేరడం ఖాయంగా కనిపిస్తోంది. ఎన్డీపీపీతో ఎన్నికల ముందస్తు పొత్తు పెట్టుకున్న బీజేపీ..అంతకు ముందు ఎన్పీఎఫ్ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంది. కాంగ్రెస్ ఖాతా తెరవకపోవడం గమనార్హం. ఇతరులు రెండు చోట్ల విజయం సాధించారు. ఎన్డీపీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నేఫియూ రియో ఉత్తర అంగామి 2 స్థానం నుంచి ఏకగ్రీవంగా గెలుపొందిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి, ఎన్పీఎఫ్ చీఫ్ టీఆర్ జెలియాంగ్ 5,432 ఓట్ల తేడాతో పెరెన్ స్థానం నుంచి గెలుపొందారు. బీజేపీ 20 స్థానాల్లో, మిత్ర పక్షం ఎన్డీపీపీ 40 స్థానాల్లో పోటీచేశాయి. 60 సీట్లున్న నాగాలాండ్ అసెంబ్లీలో ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన సాధారణ మెజారిటీ 31 కాగా, ఆ మార్కును ఏ పార్టీ, కూటమి చేరుకోలేక పోయింది. బీజేపీకి ఎన్పీఎఫ్ ఆహ్వానం.. తమతో కలసి ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకు రావాలని బీజేపీని సీఎం టీఆర్ జెలియాంగ్ ఆహ్వానించారు. ఎన్నికలకు కొంతకాలం ముందే బీజేపీ ఎన్పీఎఫ్తో తెగతెంపులు చేసుకుని, నేఫియూ రియో నేతృత్వంలో కొత్తగా ఏర్పడిన ఎన్డీపీపీతో జట్టుకట్టింది. ఇతర పార్టీలతో కలసి నాగాలాండ్లో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తామని కేంద్ర మంత్రి, రాష్ట్ర బీజేపీ ఇన్చార్జ్ కిరణ్ రిజిజు వెల్లడించారు. నాగాలాండ్ అసెంబ్లీకి ఒక్క మహిళ కూడా ఎన్నికకాలేదు. బరిలో నిలిచిన ఐదుగురు మహిళా అభ్యర్థులు ఓటమిపాలయ్యారు. -
ఈశాన్య రాష్ట్రాల ఫలితాలు..
సాక్షి, న్యూఢిల్లీ : ఈశాన్య రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాయి. త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్ రాష్ట్రాల అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఓట్ల లెక్కింపు పూర్తయింది. ఈ మూడు రాష్ట్రాల్లో రెండు రాష్ట్రాలను (త్రిపుర, నాగాలాండ్) బీజేపీ తన ఖాతాలో వేసుకుంది. మేఘాలయలో మాత్రం హంగ్ పరిస్థితి నెలకొంది. ఏ పార్టీ కూడా పూర్తి మెజార్టీని సాధించలేకపోయాయి. ఈ మూడు రాష్ట్రాల్లో కూడా ఒక్కో రాష్ట్రానికి మొత్తం 60 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. వాటిల్లో త్రిపురలో 59, మేఘాలయలో 59, నాగాలాండ్లో 60 స్థానాలకు ఎన్నికలుజరగడం కౌంటింగ్ పూర్తవడం జరిగింది. లెఫ్ట్ కోట బద్ధలు.. త్రిపురలో బీజేపీ పాగా దాదాపు 25 ఏళ్లుగా త్రిపురలో చక్రం తిప్పుతున్న వామపక్షాల కంచుకోటను బీజేపీ బద్ధలు కొట్టింది. త్రిపుర సీఎం మాణిక్ సర్కార్ ఈ ఎన్నికల్లో ఘోరపరాజయాన్ని చవి చూసింది. 2013లో లెఫ్ట్ పార్టీ సీపీఎం గతంలో మొత్తం 49 సీట్లు దక్కించుకోగా ఈసారి జరిగిన ఎన్నికల్లో కేవలం 16 సీట్లు మాత్రమే దక్కించుకోగలిగింది. అయితే, బీజేపీ మాత్రం భారీ విజయం అందుకుందనే చెప్పాలి. 2013లో అసలు ఖాతానే తెరవని బీజేపీ ఏసారి ఏకంగా 43సీట్లతో పూర్తి మెజార్టీ సాధించింది. మేఘాలయలో హంగ్.. కాంగ్రెస్కే ఛాన్స్ ఇప్పటి వరకు మేఘాలయలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా ఈసారి జరిగిన ఎన్నికల్లో మాత్రం హంగ్ పరిస్థితి నెలకొంది. 2013లో కాంగ్రెస్ పార్టీకి 28 స్థానాలు రాగా ఈసారి 21 స్థానాలు మాత్రమే వచ్చాయి. ఇక నేషనల్ పీపుల్స్ పార్టీకి(ఎన్పీపీ) 19 సీట్లు రాగా బీజేపీ కేవలం రెండు స్థానాలు మాత్రమే తన ఖాతాలో వేసుకోగలిగింది. ఇతరులు 17 స్థానాలు గెలుచుకున్నారు. బీజేపీ మద్దతిచ్చినా ఎన్పీపీకి 21 స్థానాలే వస్తాయి. మేజిక్ ఫిగర్ అందుకోవాలంటే మరో 9కిపైగా సీట్లు కావాల్సిందే. ఇలా చేయాలంటే ఇతరులపై ఎన్పీపీ ఆధారపడాలి కానీ, అది సాధ్యమయ్యేదిగా కనిపించడం లేదు. అయితే, గతంలో కాంగ్రెస్ పడిపోయే పరిస్థితుల్లో ఎన్పీపీ మద్దతు ఇచ్చినందున ఈసారి కూడా కాంగ్రెస్, ఎన్పీపీ భాగస్వామ్యంలో ప్రభుత్వం ఏర్పాటు చేయొచ్చని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. నాగాలాండ్ బీజేపీ ఖాతాలో.. నాగాలాండ్ కూడా బీజేపీ ఖాతాలో దాదాపు పడింది. ఇక్కడ బీజేపీ ఒంటరిగా కాకుండా వివిధ పార్టీలతో కలిసి నేషనల్ డెమొక్రటిక్ ప్రొగ్రెసివ్ పార్టీ (ఎన్డీపీపీ ప్లస్)గా పోటీ చేసింది. ఈ కూటమి మొత్తం 30 స్థానాలు కైవసం చేసుకుంది. కాంగ్రెస్ పార్టీ గతంలో ఇక్కడ 8 స్థానాలు గెలుచుకోగా ఈసారి మాత్రం ఖాతా కూడా తెరవలేకపోయింది. అయితే, నాగా పీపుల్ ఫ్రంట్ (ఎన్పీఎఫ్) మాత్రం 28 స్థానాలు గెలుచుకుంది. -
ఇక దేశం మొత్తం మాదే.. : అమిత్ షా
సాక్షి, న్యూఢిల్లీ : లెఫ్ట్ పార్టీ ఈ దేశానికి రైట్ (సరైనది) కాదని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా అన్నారు. బీజేపీకి ఇది చాలా సంతోషకరమైన రోజు అని, 21 రాష్ట్రాల్లో తాము అధికారంలోకి వచ్చామని చెప్పారు. ఒడిశా, పశ్చిమబెంగాల్, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో కూడా అధికారంలోకి వస్తే ఇక బీజేపీకి స్వర్ణయుగమే అని ఆయన అన్నారు. శనివారం త్రిపుర, నాగాలాండ్, మేఘాలయ రాష్ట్రాల ఎన్నికల ఓట్లు లెక్కింపు ప్రారంభమైంది. త్రిపుర, నాగాలాండ్ రాష్ట్రాల్లో బీజేపీ అధికారం దాదాపు ఖరారైన నేపథ్యంలో నేపథ్యంలో అమిత్షా మీడియాతో మాట్లాడారు. 'ఇది బీజేపీకి చారిత్రాత్మక రోజు. ప్రధాని మోదీ విధానాలకు అందిన విజయం ఇది. దేశంలోని అన్ని ప్రాంతాల్లో బీజేపీ జెండా ఎగురుతుంది. మూడు రాష్ట్రాల కార్యకర్తలకు హృదయపూర్వక ధన్యవాదాలు. 2013లో త్రిపురలో మాకు 1.3శాతం ఓట్లు మాత్రమే లభించాయి. ఇప్పుడు 43 స్థానాలు గెలుస్తున్నాం. త్రిపురలో పలువురు కార్యకర్తలు ప్రాణత్యాగాలు చేశారు. త్రిపుర వాసులు వామపక్షాల నుంచి విముక్తి కోరుకుంటున్నారు. త్రిపుర, నాగాలాండ్లో కాంగ్రెస్ ఖాతా కూడా తెరవలేక పోయింది. మాపై నమ్మకంతో ఓట్లు వేసిన త్రిపుర ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. గత ఎన్నికలతో పోల్చితే బీజేపీకి ఓటింగ్ శాతం పెరిగింది. ఇక కర్ణాటకలో భారీ మెజార్టీ లక్ష్యంగా బరిలోకి దిగుతాం. ఈశాన్య రాష్ట్రాల్లో శాంతి మాలక్ష్యం. దేశంలో 21 రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలోకి వచ్చింది. నాగాలాండ్లో కూడా అధికారంలోకి వస్తాం. దేశంలోని ఏ ప్రాంతానికి కూడా లెఫ్ట్ (వామపక్ష పార్టీలు) రైట్ (సరైనది) కాదు. త్రిపుర ఓటర్లు మార్పునకు పట్టంకట్టారు. మేఘాలయలో మెజార్టీ రాకున్నా అక్కడి ప్రజలు కూడా మార్పును కోరుకున్నారు. వచ్చే ఎన్నికలకు ఈ ఫలితాలు దిక్సూచిలాంటివి. నాలాంటి బీజేపీ కార్యకర్తలకు చాలా సంతోషకరమైన రోజు. దేశంలోని 21 రాష్ట్రాల్లో మేం అధికారంలో ఉన్నాం. ప్రతి రోజు ప్రధాని నరేంద్రమోదీ, ఆయన ప్రభుత్వానికి అనుకూలత పెరుగుతోంది. దేశంలో పశ్చిమ దిక్కున చాలా అభివృద్ధి చెందింది కానీ, అలాంటిది తూర్పు దిక్కు లేదని 2014లో ప్రధాని నరేంద్రమోదీ చెప్పారు. ఆ వెంటనే ఆయన 'యాక్ట్ ఈస్ట్ పాలసీ'ని ప్రారంభించారు. ఆయన విధానాలే ఈ భారీ విజయాన్ని అందించాయని మేం నమ్ముతున్నాము. ఇక ఒడిశా, బెంగాల్, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో కూడా మేం అధికారంలోకి వస్తే బీజేపీకి ఇక స్వర్ణయుగమే' అని అమిత్ షా అన్నారు. -
నాగాలాండ్లో బీజేపీ కూటమి హవా..!
సాక్షి, కోహిమా: త్రిపురలో అధికార సీపీఎంకు బీజేపీ షాకివ్వగా.. నాగాలాండ్లో తమ మిత్రపక్షంతో కలిసి అధికారం చేపట్టనుంది. నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్ ప్రక్రియ కొనసాగుతుండగా.. ప్రస్తుత ట్రెండ్స్ గమనిస్తే అధికార నాగా పీపుల్స్ ఫ్రంట్ అధికారం కోల్పోయేలా కనిపిస్తుంది. బీజేపీ-నేషనలిస్ట్ డెమొక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ (ఎన్డీపీపీ) కూటమి విజయం సాధించే అవకాశాలున్నాయి. ఎన్డీపీపీ-బీజేపీ కూటమి 32 స్థానాల్లో విజయం దిశగా దూసుకెళ్తుండగా, అధికార నాగా పీపుల్స్ ఫ్రంట్ పార్టీ 23 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. మరో 5 స్థానాల్లో ఇతరులు ఆధిక్యంలో కొనసాగుతుండటం గమనార్హం. ప్రభుత్వం ఏర్పాటుకు కావాల్సిన స్థానాలకు (31 సీట్లు) ఒకట్రెండు తక్కువ వచ్చినా స్వతంత్రుల మద్ధతుతోనైనా అధికారం హస్తగతం చేసుకోవాలని బీజేపీ-ఎన్డీపీపీ కూటమి భావిస్తోంది. నాగాలాండ్లో బీజేపీ, ఎన్డీపీపీతో జత కట్టగా.. ఎన్డీపీపీ 40 స్థానాల్లో, బీజేపీ 20 చోట్ల పోటీ చేసిన విషయం తెలిసిందే. కాగా, 18 స్థానాల్లోనే బరిలో దిగిన కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ పరాభవం తప్పడం లేదు. కనీసం ఒక్క స్థానంలోనూ నెగ్గేలా కనిపించడం లేదు. బీజేపీ నేత హిమాంత బిస్వా శర్మ జోస్యం చెప్పినట్లుగానే త్రిపురను బీజేపీ నేరుగా సొంతం చేసుకోనుండగా, నాగాలాండ్లో ప్రధాన మిత్రపక్షం ఎన్డీపీపీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. ఎన్డీపీపీ చీఫ్ నీఫి రియో ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం తెలిసిందే. మేఘాలయాలో మాత్రం బీజేపీకి ప్రతికూల ఫలితాలు వస్తున్నాయి. -
మరికొన్ని గంటల్లో 'ఈశాన్య' రాష్ట్రాల భవితవ్యం
అగర్తల/కోహిమా/షిల్లాంగ్: ఈశాన్య రాష్ట్రాలైన త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్లో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మరికొన్ని గంటల్లో వెలువడనున్నాయి. నేడు(శనివారం) ఉదయం 8 గంటలకు మూడు రాష్ట్రాల్లోనూ కౌంటింగ్ ప్రారంభమైంది. ఓట్ల లెక్కింపు నేపథ్యంలో ఈ మూడు రాష్ట్రాల్లో పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసినట్టు ఎన్నికల కమిషన్ అధికారులు తెలిపారు. త్రిపురలో ఫిబ్రవరి 18న, మేఘాలయ, నాగాలాండ్లో ఫిబ్రవరి 27న పోలింగ్ జరిగిన సంగతి తెలిసిందే. మూడు రాష్ట్రాల్లోనూ 60 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. వివిధ కారణాల వల్ల మూడింటిలోనూ 59 స్థానాలకే పోలింగ్ జరిగింది. త్రిపుర, మేఘాలయలో అభ్యర్థుల మరణం కారణంగా ఒక్కో స్థానానికి ఎన్నిక వాయిదా పడింది. ఇక నాగాలాండ్లో నేషనలిస్ట్ డెమొక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ(ఎన్డీపీపీ) చీఫ్ నీఫి రియో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మేఘాలయలో కాంగ్రెస్ పార్టీ 59 స్థానాల్లో అభ్యర్థులను బరిలోకి దింపింది. బీజేపీ తరపున 47 మంది పోటీలో ఉన్నారు. నాగాలాండ్లో బీజేపీ, ఎన్డీపీపీతో జత కట్టింది. ఇక్కడ ఎన్డీపీపీ 40 చోట్ల, బీజేపీ 20 చోట్ల పోటీ చేస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఇక్కడ 18 స్థానాల్లోనే బరిలో ఉంది. కమలం వికసించేనా..? త్రిపురలో 25 ఏళ్లుగా కొనసాగుతున్న వామపక్ష కూటమికి పరాభవం తప్పదని, ఇక్కడ బీజేపీ అధికారం కైవసం చేసుకునే అవకాశం ఉందని రెండు ఎగ్జిట్పోల్ సర్వేల్లో తేలింది. మిగతా రెండు రాష్ట్రాల్లోనూ బీజేపీ గట్టి పోటీ ఇస్తుందని పేర్కొంది. మేఘాలయలో కాంగ్రెస్ పార్టీ పదేళ్లుగా అధికారంలో ఉంది. 2008లో మూడు నెలల రాష్ట్రపతి పాలన మినహా నాగాలాండ్లో నాగా పీపుల్స్ ఫ్రంట్ (ఎన్పీఎఫ్) 2003 నుంచి అధికారంలో ఉంది. అస్సాం, మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్లో ప్రభుత్వాలను ఏర్పాటు చేసిన బీజేపీ మేఘాలయ, నాగాలాండ్, త్రిపురలోనూ విజయకేతనం ఎగురవేసి ఈశాన్య భారతంలో తమ స్థానాన్ని సుస్థిరం చేసుకోవాలని భావిస్తోంది. -
నాగాలాండ్, మేఘాలయలో 75 శాతం పోలింగ్
న్యూఢిల్లీ: నాగాలాండ్, మేఘాలయ అసెంబ్లీ ఎన్నికల్లో 75% పోలింగ్ నమోదైంది. మేఘాలయలో ఓటింగ్ ప్రశాతంగా ముగియగా నాగాలాండ్లో నాగా పీపుల్స్ ఫ్రంట్, బీజేపీ కార్యకర్తల మధ్య జరిగిన ఘర్షణల్లో ఒకరు చనిపోయారు. నాగాలాండ్ రాష్ట్రం అకులుటో నియోజకవర్గం జున్హెబోటో జిల్లాలో రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణల్లో ఒకరు చనిపోగా పలువురు గాయపడ్డారు. పరిస్థితి అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు గాలిలోకి కాల్పులు జరిపారని చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ (సీఈవో) అభిజిత్ సిన్హా తెలిపారు. మోన్ జిల్లా టిజిట్ నియోజకవర్గంలోని ఓ గ్రామంలోని పోలింగ్ స్టేషన్ సమీపంలో బాంబు పేలి ఒకరు గాయపడ్డారని చెప్పారు. సుధోస్డు, లాడిగఢ్లో పోలింగ్ స్టేషన్ల వద్ద ఉద్రిక్తతల కారణంగా ఎన్నిక నిలిపివేసినట్లు వివరించారు. క్రైస్తవ వ్యతిరేక పార్టీకి ఓటేయరాదంటూ మేఘాలయ రాజధాని షిల్లాంగ్లోని ఓ ప్రైవేట్ రేడియో స్టేషన్ జాకీ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ మండిపడింది. ఎన్నికలకు మతం రంగు పులిమేందుకు యత్నించిన ఆ స్టేషన్పై చర్యలు తీసుకోవాలంటూ ఎన్నికల సంఘాన్ని కోరింది. ఈనెల 18వ తేదీన ఎన్నికలు జరిగిన త్రిపురతోపాటు మేఘాలయ, నాగాలాండ్ ఓట్ల లెక్కింపు వచ్చే నెల 3న చేపట్టనున్నారు. -
మేఘాలయ, నాగాలాండ్లో నేడే ఓటింగ్
-
మేఘాలయ, నాగాలాండ్లో నేడే ఓటింగ్
షిల్లాంగ్/ కోహిమా: ఈశాన్య రాష్ట్రాలైన మేఘాలయ, నాగాలాండ్లో అసెంబ్లీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. నేటి ఉదయం 7 గంటలకు ప్రారంభంకానున్న పోలింగ్కు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశామని అధికారులు వెల్లడించారు. కొన్ని పోలింగ్ కేంద్రాలు మినహా మిగతా అన్ని చోట్లా సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. నాగాలాండ్లోని కొన్ని జిల్లాల్లో సాయంత్రం 3 వరకు మాత్రమే పోలింగ్ నిర్వహించనున్నారు. మేఘాలయ, నాగాలాండ్ సహా ఇప్పటికే ఎన్నికలు పూర్తైన త్రిపుర రాష్ట్రాల ఎన్నికల ఫలితాలను మార్చి 3న ప్రకటిస్తారు. రెండు రాష్ట్రాల్లో కలిపి మొత్తం 120 నియోజకవర్గాలకు గానూ 118 చోట్ల పోలింగ్ జరగనుంది. మేఘాలయలో విలియమ్ నగర్ ప్రాంతంలో తీవ్రవాదుల దాడిలో ఎన్సీపీ అభ్యర్థి జోనాథన్ ఎన్ సంగ్మా మరణించడంతో అక్కడ ఎన్నిక నిలిపివేశారు. ఇక నాగాలాండ్లో ఎన్డీపీపీ చీఫ్ నెఫ్యూ రియో ఉత్తర అంగామి–2 నియోజకవర్గం నుంచి ఏకగ్రీవంగా ఎన్నికవడంతో ఆ స్థానంలో ఎన్నిక జరగట్లేదు. మహిళల కోసం పోలింగ్ కేంద్రాలు.. మేఘాలయలో దాదాపు 18.4లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఈసారి రాష్ట్రంలో మహిళల కోసం ప్రత్యేకంగా 67 పోలింగ్ కేంద్రాలు సహా 61 మోడల్ పోలింగ్ కేంద్రాలను ఏర్పాటుచేశామని మేఘాలయ చీఫ్ ఎలక్ట్రోరల్ ఆఫీసర్ ఎఫ్ఆర్ ఖార్కోంగర్ వెల్లడించారు. అలాగే తొలిసారి అత్యధికంగా 32 మంది మహిళలు ఎన్నికల బరిలో ఉన్నట్లు తెలిపారు. ఇక నాగాలాండ్లో మొత్తం 11.91 లక్షల మంది ఓటర్లు ఓటింగ్లో పాల్గొననున్నారు. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు ఇప్పటికే కేంద్ర సాయుధ పోలీసు బలగాలు(సీఏపీఎఫ్) నాగాలాండ్ చేరుకున్నాయని రాష్ట్ర చీఫ్ ఎలక్ట్రోరల్ ఆఫీసర్ అభిజిత్ సిన్హా వెల్లడించారు. రెండు రాష్ట్రాల్లో హోరాహోరీగా జరిగిన ఎన్నికల ప్రచారం ఆదివారంతో ముగిసింది. -
వారిలో 60 శాతం మంది కరోడ్పతిలే...
సాక్షి, కొహిమా : నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్ధుల్లో 59 శాతం మంది కోటీశ్వరులేనని ఎన్నికల కమిషన్ (ఈసీ)కు వారు సమర్పించిన అఫిడవిట్లను విశ్లేషించగా వెల్లడైంది. 196 మంది అభ్యర్ధుల్లో 193 మంది అభ్యర్ధుల అఫిడవిట్లను పరిశీలించిన అసోసియేషన్ ఆఫ్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) సంస్ధ వారిలో 114 మంది అభ్యర్ధులు కరోడ్పతీలని తేల్చింది. జేడీ(యూ) అభ్యర్థి, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి లోథా అత్యధికంగా రూ 38.92 కోట్ల ఆస్తులు కలిగిఉన్నారని ఏడీఆర్ పేర్కొంది. వోఖా జిల్లా సనీస్ అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి ఆయన ఎన్నికల బరిలో నిలిచారు. ఇకపెరెన్ సీటు నుంచి నాగా పీపుల్స్ ఫ్రంట్ అభ్యర్థిగా పోటీలో ఉన్న నాగాలాండ్ సీఎం టీఆర్ జెలింగ్ తన ఆస్తులు కేవలం రూ 3.52 కోట్లుగా అఫిడవిట్లో పొందుపరిచారు. ఇక ఘస్పానీ సీటు నుంచి పోటీలో నిలిచిన ఆప్ అభ్యర్థి అకవి జిమోమి తనకు ఎలాంటి ఆస్తులు లేవని అఫిడవిట్లో పేర్కొన్నారు.కాగా ఫిబ్రవరి 27న నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. -
గెలిస్తే ఉచితంగా జెరూసలేం యాత్ర
న్యూఢిల్లీ: అధికారంలోకి వస్తే క్రైస్తవులను ఉచితంగా జెరూసలేం యాత్రకు పంపిస్తామంటూ నాగాలాండ్లో బీజేపీ ఎన్నికల హామీని ప్రకటించింది. మూడు ఈశాన్య రాష్ట్రాలైన నాగాలాండ్, త్రిపుర, మేఘాలయల్లో ఈ నెలలో ఎన్నికలు జరగనుండటం తెలిసిందే. నాగాలాండ్ జనాభాలో 88% మంది క్రైస్తవులే కావడంతో బీజేపీ ఈ హామీ ని ప్రకటించినట్లు తెలుస్తోంది. అయితే మేఘాలయలోనూ 75% జనాభా క్రైస్తవులే. దీంతో ఈ హామీని బీజేపీ నాగాలాండ్కు మాత్రమే పరిమితం చేస్తుందా లేక అన్ని ఈశాన్య రాష్ట్రాలకు వర్తింపజేస్తుందా లేక దేశంలోని క్రిస్టియన్లకందరికీ అవకాశమిస్తుందా అనే దానిపై స్పష్టత లేదు. ముస్లింలకు హజ్ యాత్ర రాయితీని కేంద్ర ప్రభు త్వం గత నెలలోనే రద్దు చేయడం తెలిసిందే. ఇప్పుడు క్రైస్తవులను మాత్రం ఉచితంగానే జెరూసలేంకు పంపిస్తామని బీజేపీ హామీనివ్వడంపై విమర్శలు వస్తున్నాయి. -
అక్కడ అభ్యర్థులే ముఖ్యం పార్టీలు కాదు!
సాక్షి, కోహిమా : ‘మాకు పార్టీలతో ప్రమేయం లేదు. నాయకుడు మంచి వాడా, కాదా ? అన్నదే మాకు ముఖ్యం’ అని ఈ నెల 27వ తేదీన ఎన్నికలు జరుగుతున్న నాగాలాండ్లోని రిఫ్యీమ్ విలేజ్ కౌన్సిల్ చైర్మన్ ఎన్. ప్యాటన్ చెప్పారు. ‘మాకు మంచి నీరు ఉంది. విద్యుత్ ఉన్నది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రమూ ఉంది. అంతేకాకుండా రెండు ప్రభుత్వ పాఠశాలలు, ఓ క్యాథలిక్ పాఠశాల ఉంది. ఇలాంటి ప్రాథమిక సౌకర్యాల కోసం కృషి చేసిన నాయకుడికే ఓటు వేస్తాం’ అని ఆయన అన్నారు. ఆయన మాటల్లో అక్షరాల నూటికి నూరుశాతం నిజముంది. దేశంలోని ఓటర్ల మనస్తత్వంతో పోలిస్తే ఈశాన్య రాష్ట్రాల ఓటర్ల మనస్తత్వమే కాస్త భిన్నంగా ఉంటుంది. వారితో పోలిస్తే నాగాలాండ్ ఓటర్ల మనస్తత్వం మరికాస్త భిన్నంగా ఉంటుంది. నాగాలాండ్ బాగా వెనకబడిన ప్రాంతం అవడం వల్ల నియోజకవర్గం అభివృద్ధి కోసం కృషి చేసిన నాయకుడికీ లేదా ఆ నాయకుడు చెప్పిన అభ్యర్థికే నాగాలు ఓట్లు వేస్తారు. వారు సాధారణంగా రాజకీయ పార్టీలను పట్టించుకోరు. అందుకే 60 సీట్లుగల నాగాలాండ్ అసెంబ్లీకి 2013లో జరిగిన ఎన్నికల్లో ఒకే ఒక్క సీటును గెలుచుకున్న భారతీయ జనతా పార్టీ ఈ సారి తన వ్యూహాన్ని మార్చుకొని, ప్రజల్లో గుర్తింపు ఉన్న వివిధ పార్టీలకు చెందిన నాయకులను తమ పార్టీలో చేర్చుకుంది. అలా చేరిన వ్యక్తే వై. ప్యాటన్. నాగా పీపుల్స్ ఫ్రంట్లో హోం మంత్రిగా మొన్నటి వరకు పనిచేసిన ఆయన తన శాసన సభ్యత్వానికి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. ఆయన 1998లో కాంగ్రెస్ తరఫున, 2008లో బీజేపీ తరఫున, 2013 నాగా పీపుల్స్ ఫ్రంట్ తరఫున పోటీ చేసి గెలిచారు. నాగా పీపుల్స్ ఫ్రంట్కు చెందిన మాజీ రాష్ట్ర ముఖ్యమంత్రి నీఫ్యూ రియోతో ఎన్నికల పొత్తు కుదుర్చుకోవడం కూడా అందులో భాగమే. బీజేపీయే ఆయనతోని ‘నేషనలిస్ట్ డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీని పెట్టించిందనే ప్రచారం కూడా ఉంది. కాంగ్రెస్ పార్టీ తరఫున అధికారంలోకి వచ్చి ఆ తర్వాత నాగా పీపుల్స్ ఫ్రంట్లో చేరిన రియో మూడు పర్యాయాలు ముఖ్యమంత్రిగా పనిచేశారు. నాగాలాండ్ మాజీ ముఖ్యమంత్రి కేఎల్ ఛిశీని కూడా బీజేపీ తన పార్టీలో చేర్చుకుంది. కాంగ్రెస్ పార్టీ తరఫున రాజకీయాల్లోకి వచ్చిన ఛిశీ, బాగా సంపన్నుడు కూడా. ఆయనకు 51 కోట్ల రూపాయలు ఉన్నాయని ప్రజలు బహిరంగంగా చెప్పుకుంటారు. నాగాలాండ్లో అభివృద్ధి పనుల ద్వారా ఆకట్టుకున్న నాయకులనే కాకుండా డబ్బున్న నాయకులను కూడా ప్రజలు గుర్తిస్తారు. డబ్బున్నట్లయితేనే ఆ డబ్బులో అంతో ఇంతో ఖర్చుపెట్టి తమ సమస్యలను తీరుస్తారన్నది ప్రజల విశ్వాసం. ఈ మధ్య తుపాకీ సంస్కృతిగల నాయకులను కూడా ప్రజలు గుర్తిస్తున్నారు. దోపిడీ దొంగలనే కాకుండా దురాగతాలకు పాల్పడే అరాచక శక్తులను అలాంటి నాయకులే అణచివేయగలరన్నది వారిలో ఉన్న మరో నమ్మకం. నాగాలాండ్లో అంగామీ, లట్టా బలమైన తెగలు. రియో అంగామీకి, ఛిశీ లట్టా తెగలకు చెందిన వారు. నాగాల్లో మరోగుణం కూడా వారు మెజారిటీ అభిప్రాయానికి విలువనిస్తారు. ఎన్నికల సమయంలో గ్రామాల వారిగా సమావేశమై తమ గ్రామాభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ఏ పార్టీకి ఓటు వేయాలో నిర్ణయిస్తారు. చాలా సందర్భాల్లో మెజారిటీ అభిప్రాయానికి కట్టుబడుతారు. సహజ సిద్ధంగా వారు పాపులర్ నాయకుడికే ఓటు వేయాలని నిర్ణయిస్తారు. అస్సాం, మేఘాలయాల్లో లాగా నాగాలాండ్ ప్రజలు కూడా కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీవైపే మొగ్గు చూపుతారు. అందుకే ప్రజాధరణ పొందిన నాయకులు కూడా కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీలోకి వలసపోతారు. గతంలో కాంగ్రెస్ విషయంలో, ఇప్పుడు బీజేపీ విషయంలో అదే జరిగింది. సారా తాగించి, డబ్బుల పంచే అభ్యర్థులకు ఓటేసే విష సంస్కతికి కూడా ఇప్పుడిప్పుడే తమ రాష్ట్రంలో వేళ్లూనుకుంటోందని నాగా బాప్టిస్ట్ చర్చి కౌన్సిల్ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ సంస్కృతిని నిర్మూలించే దృష్టితో పోటీచేసే అభ్యర్థులు, ఓటర్ల బాధ్యతలను గుర్తుచేస్తూ వారు పాటించాల్సిన నిబంధనలను తెలియజేస్తూ ఊరూరా పోస్టర్లను అతికించింది. నేషనలిస్ట్ డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీతో పొత్తుపెట్టుకుని రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా చరిత్ర సృష్టించాలని ఆశిస్తున్న బీజేపీ తన హిందుత్వ ఎజెండాను ఇక్కడ పక్కన పెట్టింది. గోమాంస అంశాన్ని అస్సలు ప్రస్తావించడం లేదు. నాగాలు దాదాపు అన్ని తెగలవారు ఎక్కువగా తినేదే గోమాంసం. -
ఇది పురుషుల అసెంబ్లీ!
కోహిమా: దేశవ్యాప్తంగా చట్టసభల్లో మహిళా శక్తి వెల్లి విరుస్తుంటే, నాగాలాండ్ అసెంబ్లీ మాత్రం అందుకు విరుద్ధమైన రికార్డు సొంతం చేసుకుంది. ఇప్పటివరకు ఆ రాష్ట్ర శాసనసభలో మహిళా సభ్యురాలే అడుగుపెట్టకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయం. జాతీయ అక్షరాస్యత (65 శాతం) కంటే నాగాలాండ్లో స్త్రీల అక్షరాస్యత (76 శాతం) ఎక్కువ. 2016 గణాంకాల ప్రకారం... ప్రభుత్వ ఉద్యోగాల్లో 23.5 శాతం, ప్రైవేట్రంగంలో 49 శాతం మహిళలు పనిచేస్తున్నారు. 1963లో రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు కేవలం 30 మంది మహిళలే పోటీ చేసినా అందులో ఒక్కరూ గెలుపొందలేదు. అయితే 1977 లోక్సభ ఎన్నికల్లో మాత్రం రానో ఎం షాజియా అనే మహిళ గెలుపొంది రాష్ట్రం నుంచి పార్లమెంట్కు వెళ్లిన ఏకైక మహిళగా నిలిచారు. ఈసారి బరిలో అయిదుగురే... ఈ నెల 27న నాగాలాండ్లో 60 శాసనసభా స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 227 మంది బరిలో నిలవగా వారిలో కేవలం అయిదుగురే మహిళా అభ్యర్థులున్నారు. బీజేపీ, ఆ పార్టీ మిత్రపక్షం నేషనల్ డెమొక్రాటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ (ఎన్డీపీపీ)ల నుంచి చెరో మహిళా అభ్యర్థిని పోటీ చేస్తున్నారు. నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్పీపీ) ఇద్దరిని బరిలో నిలపగా, స్వతంత్ర అభ్యర్థిగా మరొకరు పోటీచేస్తున్నారు. 2013 ఎన్నికల్లో ఇద్దరే మహిళలు పోటీ చేశారు. నాగాలాండ్లో గ్రామాభివృద్ధి బోర్డుల్లో మహిళలకు 25 శాతం రిజర్వేషన్లు ఉన్నా ముఖ్యమైన అంశాలపై వారు కీలకంగా వ్యవహరించ లేకపోతున్నారు. వారికి వారసత్వంగా ఆస్తులను పొందే హక్కు కూడా లేదు. రాష్ట్రంలో మహిళా రిజర్వేషన్ల సాధనకు ‘నాగా మదర్స్ అసోసియేషన్’ (ఎన్ఎంఏ) అనే మహిళా సంస్థ న్యాయపోరాటం చేస్తోంది. 2016లో ఈ సంస్థ పిటిషన్ పైనే స్పందించిన సుప్రీంకోర్టు 33 శాతం మహిళా రిజర్వేషన్లతో మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. పురుషుల ఆధిపత్యంలోని గిరిజన మండళ్లు వ్యతిరేకించడంతో పాటు ఆందోళనలు చెలరేగడంతో అది కార్యరూపం దాల్చలేదు. ‘ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో మేము ఆశించిన మార్పు వస్తుందని నమ్ముతున్నాం. కొందరే పోటీ చేస్తున్నా వారిలో కనీసం ఒకరు గెలుపొంది కొత్తమార్పునకు నాంది పలుకుతారని ఆశిస్తున్నాం ’ అని ఎన్ఎంఏ అధ్యక్షురాలు అబేయు మేరు చెప్పారు. -
ఎన్నికలు.. చివరిరోజు నామినేషన్ల వరద
సాక్షి, కోహిమ: నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల దాఖలకు చివరి తేదీ దగ్గర పడుతున్నా ఉలుకు పలుకూ లేకుండా ఉన్న నేతలు చివరి రోజు మాత్రం నామినేషన్ వేశారు. బుధవారం (ఫిబ్రవరి 7) చివరిరోజు కాగా.. అదే రోజు నాగా పీపుల్స్ ఫ్రంట్, నేషనలిస్ట్ డెమోక్రటిక్ ప్రొగ్రెసివ్ పార్టీ, కాంగ్రెస్, బీజేపీ, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, స్వతంత్రులు కలిపి 253 మంది నేతలు తమ నామినేషన్లు దాఖలు చేశారు. ఈ విషయాన్ని అధికారులు వెల్లడించారు. ఫిబ్రవరి 27న నాగాలాండ్ అసెంబ్లీకి ఎన్నికలు నిర్వహించనున్నారు. మంగళవారం అధికార నాగా పీపుల్స్ ఫ్రంట్ తొలి నామినేషన్ దాఖలు చేయగా, అదేరోజు సీఎం టీఆర్ జెలియాంగ్ తన నామినేషన్ పత్రాలు సమర్పించినట్లు సమాచారం. నాగాల తిరుగుబాటు గ్రూపులు గ్రేటర్ నాగాలాండ్ లేదా నాగాలిమ్ కోసం చేస్తున్న డిమాండ్లు, చర్చల కారణంగా మెజార్టీ నేతలు చివరిరోజు వరకూ నామినేషన్ వేయలేదని చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ అభిజిత్ సిన్హా తెలిపారు. నామినేషన్ పత్రాలను గురువారం పరిశీలించనుండగా, ఉపసంహరణకు ఫిబ్రవరి 12 చివరితేదీ అని చెప్పారు. ఉన్నతాధికారులతో నాగాలాండ్ సీఎం టీఆర్ జెలియాంగ్ నాగాలాండ్, మేఘాలయాల్లో ఫిబ్రవరి 27న, త్రిపురలో ఫిబ్రవరి 18న ఎన్నికలు జరగనున్నాయి. ఈ మూడు రాష్ట్రాల్లోనూ మార్చి 3న ఎన్నికల లెక్కింపు జరుగుతుంది. త్రిపుర, నాగాలాండ్, మేఘాలయాల్లో ఒక్కో రాష్ట్రంలో 60 అసెంబ్లీ స్థానాలు ఉండగా, ఎన్నికల్లో ఈవీఎంలకు వీవీ ప్యాట్ మిషన్లను ఏర్పాటు చేయనున్నట్లు ప్రధాన ఎన్నికల కమిషనర్ అచల్ కుమార్ జ్యోతి ఇదివరకే స్పష్టం చేశారు. -
నాగాలాండ్లో ఎవరిది విజయం?
సాక్షి, న్యూఢిల్లీ : నాగాలాండ్లో అతిపెద్ద నగరమైన దిమాపూర్కు వెళితే అక్కడ రోడ్డు పక్కన మూడంతస్తుల భవనం, ఆ భవనంపై ‘నేషనలిస్ట్ డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ’ అని రాసి ఉన్న బ్యానర్ కనిపిస్తుంది. అదే బ్యానర్పైన కొంత చిన్న అక్షరాలతో ‘ప్యాక్టా నాన్ వెర్బా’, అంటే మాటలు కాదు, చేతలు అనే నినాదం కనిపిస్తుంది. ఆ భవనంలోకి వెళ్లి చూస్తే మెల్లగా మాట్లాడుకుంటున్న ఓ గుంపు మినహా మొత్తమంతా ప్రశాంతంగా కనిపిస్తోంది. మరో గదిలోకి వెళ్లే ముందు ఎంతో క్రమశిక్షణ కలిగిన రిసెప్షన్ డెస్క్ ఆహ్వానిస్తోంది. ఇప్పుడిప్పుడే ప్రాణం పోసుకున్న పార్టీకి అది ప్రధాన కార్యాలయం. ఆ పార్టీకి ప్రాణం పోసిన నాయకుడు నైఫ్యూ రియో వచ్చినప్పుడు మాత్రం పార్టీ కార్యాలయం సందడిగా ఉంటుంది. ఆయన మామూలు నాయకుడు కాదు. వరుసగా మూడు పర్యాయాలు ముఖ్యమంత్రిగా ఎన్నిక 11 ఏళ్లపాటు ఆ పదవిలో కొనసాగిన వ్యక్తి. మూడోసారి ముఖ్యమంత్రిగా ఎన్నికైనప్పుడు రియో ఏడాదికే తన పదవికి రాజీనామాచేసి ఎంపీగా పార్లమెంట్కు వెళ్లారు. అక్కడ కేంద్ర కేబినెట్ పదవిని ఆశించి అది అందక పోవడంతో వెనుతిరిగా రాష్ట్రానికి వచ్చి రాష్ట్ర రాజకీయాలపైనే దృష్టి పెట్టారు. నాగాలాండ్ పాలకపక్ష ‘నాగా పీపుల్స్ ఫ్రంట్’లో కొనసాగిన రియో గత మే నెలలోనే నేషనలిస్ట్ డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ’ని ఏర్పాటు చేశారు. అయినప్పటికీ కొత్త పార్టీపై పెద్దగా దృష్టి పెట్టకుండా, నాగా పీపుల్స్ ఫ్రంట్లో కొనసాగుతూ వచ్చారు. గత ఏడాది కాలంగా ఢిల్లీకే పరిమితమై అక్కడి బీజేపీ నాయకులతో ఎడతెరపి లేకుండా చర్చలు జరిపిన రియో గత జనవరి నెలలోనే నాగాలాండ్కు వచ్చి నాగా పీపుల్స్ ఫ్రంట్కు పూర్తిగా గుడ్బై చెప్పారు. సొంత పార్టీ అయిన ‘నేషనలిస్ట్ డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ’ అభివృద్ధిపై దృష్టిని కేంద్రీకరించారు. ఇంతలో నాగా అసెంబ్లీకి ఫిబ్రవరి 27వ తేదీన ఎన్నికలను ఎన్నికల కమిషన్ ప్రకటించింది. అప్పటి నుంచి నాగా పీపుల్స్ ఫ్రంట్ నుంచి రియో పార్టీలోకి వలసలు మొదలయ్యాయి. గత శుక్రవారం నాడు ఇరు పార్టీల మధ్య పొత్తు కుదిరినట్లు రియో పార్టీ, బీజేపీ పార్టీలు ప్రకటించాయి. అప్పటి నుంచి వలసలు మరీ ఊపందుకున్నాయి. నాగా అసెంబ్లీలోని 60 సీట్లకుగాను 40 సీట్లకు రియో పార్టీ, మిగతా 20 సీట్లకు బీజేపీ పోటీ చేస్తున్నట్లు ప్రకటించాయి. నాగా పీపుల్స్ ఫ్రంట్ నాయకత్వంలోని ‘డెమోక్రటిక్ అలయెన్స్ ఆఫ్ నాగాలాండ్’కు రియో పార్టీ, బీజేపీ కూటమికి మధ్యనే ప్రధానంగా పోటీ ఉంటుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. 2015 నుంచి ప్రతిపక్షమే లేకుండా నడుస్తున్న నాగా అసెంబ్లీలో మళ్లీ ప్రతిపక్షం ప్రత్యక్షం కానుంది. డెమోక్రటిక్ అలయెన్స్ ఆఫ్ నాగాలాండ్ ప్రభుత్వంలో మొదటి నుంచి బీజేపీ భాగస్వామిగా ఉండగా, ఎనిమిది శాసన సభ్యులను కలిగిన కాంగ్రెస్ పార్టీ కూడా అలయెన్స్లో చేరిపోవడంతో 2015 నుంచి ఆ రాష్ట్రంలో ప్రతిపక్షం అనేది లేకుండా పోయింది. కాంగ్రెస్, బీజేపీలో పాలకపక్షంలో చేరిన అరుదైన రికార్డు నాగాలాండ్కు దగ్గింది. ఇప్పుడు ఆ అలయెన్స్ను వీడి నాగా పీపుల్స్ పార్టీ సభ్యత్వాన్ని వదులుకొని రియో కొత్త పార్టీకి ప్రాణం పోయగా, ఎప్పటి నుంచో ఆయనతో తెరవెనక, తెర ముందు చర్చలు జరుపుతూ వస్తున్న బీజేపీ అలయెన్స్ను వీడి రియోతో చేతులు కలిపింది. నాగాలాండ్ శక్తివంతమైన ‘అంగామి నాగా’ తెగకు చెందిన రియో ఉత్తర అంగామి–2 నియోజక వర్గం నుంచి 2003లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి మొదటిసారి రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 2008, 2013లలో కూడా పోటీచేసి గెలవడమే కాకుండా మూడు పర్యాయాలు ముఖ్యమంత్రిగా పనిచేశారు. 2014లో డెమోక్రటిక్ అలయెన్స్ తరఫున పార్లమెంట్కు పోటీచేసి లోక్సభకు ఎన్నికయ్యారు. నాగాలాండ్కు ఏదైనా అభివృద్ధి జరిగిదంటే ఆయన మొదటిసారి ముఖ్యమంత్రిగా ఎన్నికైన తర్వాత నుంచే అని స్థానిక ప్రజలు ఆయన గురించి చెబుతున్నారు. అభివృద్ధితోపాటు అవినీతి కూడా పెరిగిందని రాజకీయ విశ్లేషకులు విమర్శిస్తున్నారు. రియో ఆధ్వర్యంలో నాగాలాండ్లో కొత్త ప్రభుత్వ భవనాలు వచ్చిన మాట నిజమేగానీ వాటిలో అవినీతి జరగడమే కాకుండా రాష్ట్రానికి అప్పులు కూడా పెరిగాయని విమర్శకుల ఆరోపణ. ‘రియో అవినీతి పరుడు అయితే కావచ్చు. పనులు మాత్రం చేస్తార’ని సెయిరియో అనే ఫ్రీలాన్స్ ఫొటోగ్రాఫర్ చెప్పారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో పొత్తు పెట్టుకున్నందున రియో కూటమికే విజయావకాశాలు ఎక్కువ ఉన్నాయని రాజకీయ విశ్లేషకుల అంచనా. -
ఆచితూచి అడుగేయాలి
సమస్య ఎదురైనప్పుడు సకాలంలో దాన్ని పరిష్కరించడానికి ప్రయత్నించకపోతే ఉన్నకొద్దీ అది జటిలంగా మారుతుంది. ఫిబ్రవరి 27న జరిగే నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికలను బహిష్కరించాలని మొన్న సోమవారం పాలక నాగా పీపుల్స్ ఫ్రంట్, బీజేపీ, కాంగ్రెస్లతోసహా 11 రాజకీయ పక్షాలు, వివిధ గిరిజన మండళ్లకు ప్రాతి నిధ్యంవహించే హోహో, ఇతర పౌర సమాజ సంస్థలు నిర్ణయించడం దీన్నే సూచిస్తోంది. ఈ ఉమ్మడి ప్రకటన నుంచి రాష్ట్ర బీజేపీ విభాగం ఆ తర్వాత తప్పుకుని, సమావేశానికి పార్టీ తరఫున వెళ్లిన ఇద్దరు నేతలను సస్పెండ్చేసి ఉండొచ్చుగానీ... అంతమాత్రాన పరిస్థితి తీవ్రత తగ్గదు. దాదాపు రెండున్నరేళ్ల క్రితం నాగాలాండ్ సమస్యపై కేంద్రం కుదుర్చుకున్న ఒప్పందానికి అనుగుణంగా ఎన్నికల్లోగా పరిష్కారాన్ని ప్రకటించాలన్నదే వారి ఏకైక డిమాండు. కేంద్రంలో అధికారంలోకొచ్చినవెంటనే ఎన్డీఏ ప్రభుత్వం నాగాలాండ్ సమస్యపై దృష్టి పెట్టి ఏడాది తిరగకుండానే 2015లో అక్కడి ప్రధాన మిలిటెంట్ సంస్థ నేషనల్ సోష లిస్టు కౌన్సిల్ ఆఫ్ నాగాలాండ్–ఇసాక్, మ్యూవా (ఎన్ఎస్సీఎన్–ఐఎం) వర్గంతో ఒప్పందం కుదుర్చుకున్నప్పుడు సర్వత్రా హర్షామోదాలు వ్యక్తమయ్యాయి. నిజాని కది పూర్తి స్థాయి ఒప్పందం కాదు. ఒప్పందానికి సంబంధించిన స్వరూపం (ఫ్రేమ్వర్క్) మాత్రమే. దీని ప్రాతిపదికన రాగలకాలంలో విస్పష్టమైన విధివిధానా లతో, సవివరమైన ఒప్పందం రూపొందుతుందని అప్పట్లో కేంద్ర ప్రభుత్వం ప్రక టించింది. కానీ ఇంతకాలమైనా ఆ ఫ్రేమ్వర్క్లోని అంశాలూ బయటకు రాలేదు. ఆ ప్రాతిపదికన ఒప్పందమూ ఖరారు కాలేదు. పర్యవసానంగా ఇప్పుడీ సంక్షోభం ఏర్పడింది. నాగాలాండ్ అసెంబ్లీ మొన్న డిసెంబర్ 14న ఎన్నికలకు ముందే నాగా రాజ కీయ సమస్యకు ‘గౌరవనీయమైన, ఆమోదయోగ్యమైన’ పరిష్కారాన్ని ప్రకటించా లని కేంద్రాన్ని కోరుతూ తీర్మానం చేసింది. ఆ తర్వాత జనవరిలో నాగా హోహో, ఇతర పౌర సమాజ సంస్థల ప్రతినిధులు ప్రధాని నరేంద్ర మోదీని కలిసి ఎన్నికలను కొద్దికాలం వాయిదా వేసి ముందుగా పరిష్కారాన్ని ఖరారు చేయాలని కోరారు. 2015 నుంచి ఇప్పటివరకూ అనేక దఫాలు కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులకూ, ఎన్ఎస్సీఎన్(ఐఎం) ప్రతినిధులకూ మధ్య చర్చలు జరిగినా కొలిక్కిరాని వ్యవ హారం కొన్ని రోజుల వ్యవధిలో తేలిపోతుందని అనుకోవడం సహేతుకం కాకపో యినా నాగా ప్రతినిధులకు కేంద్రం కనీసం నచ్చజెప్పే ప్రయత్నం చేయాల్సింది. ఎన్ఎస్సీఎన్–ఐఎంతో ఒప్పందం కుదిరినప్పుడు న్యూఢిల్లీలో నిర్వహించిన కార్యక్రమంలో స్వయంగా నరేంద్రమోదీ పాల్గొన్నారు. ‘ఇది ఒక సమస్యకు అంతం పలకడం మాత్రమే కాదు... నూతన భవిష్యత్తు దిశగా వేస్తున్న ముందడుగు కూడా...’ అని ఆ రోజు ఆయన వ్యాఖ్యానించారు. ఒప్పందానికి ముందు నరేంద్ర మోదీ కాంగ్రెస్, సీపీఎం, తృణమూల్తోసహా వివిధ పక్షాల నాయకులతో మాట్లా డారు. దురదృష్టవశాత్తూ అనంతరకాలంలో ఒప్పందం ఖరారుకు సంబంధించిన కార్యాచరణ కనబడలేదు. నాగాలాండ్ సమస్య అత్యంత క్లిష్టమైనదనడంలో సందేహం లేదు. ఇప్పుడున్న నాగాలాండ్కు తోడు నాగా ప్రజలు అధికంగా నివ సించే మణిపూర్లోని నాలుగు జిల్లాలు, అస్సాంలోని రెండు జిల్లాలు, అరుణా చల్ప్రదేశ్లోని కొన్ని ప్రాంతాలూ కలిపి విశాల నాగాలాండ్ కావాలని ఎన్ఎస్సీఎన్ (ఐఎం) కోరుతోంది. అంతేకాదు... మయన్మార్లో నాగాలు నివసించే ఒకటి రెండు ప్రాంతాలను కూడా దీంతో విలీనం చేయాలంటున్నది. ఈ ప్రాంతాల్లో తమ జాతి ప్రజలు 12 లక్షలమంది ఉన్నారని, వారు నిత్యం వివక్షను ఎదుర్కొంటున్నారని ఎన్ఎస్సీఎన్(ఐఎం) ఆరోపిస్తోంది. నాగా ప్రజలు నివసించే ప్రాంతాలను భారత్లో విలీనం చేసి విశాల నాగాలాండ్ ఏర్పాటుకు సహకరించమని మయన్మార్ను కోరడం అసాధ్యం. వారి వరకూ ఎందుకు... అస్సాం, మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్లను ఒప్పించడం కూడా కష్టతరమైన విషయం. అందుకే ఎన్ఎస్సీఎన్(ఐఎం)తో ఒప్పందం కుదిరి నట్టు ప్రకటన వెలువడినప్పుడు అందరూ సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు. ఒప్పందం వివరాలేమిటో చెప్పాలని మణిపూర్, అస్సాం, అరుణాచల్ప్రదేశ్ రాష్ట్రాల పార్టీలు, ఇతర సంస్థలు కోరినప్పుడు ఇప్పుడున్న భౌగోళిక సరిహద్దులు మారబోవని కేంద్రం హామీ ఇచ్చింది. అలా మారకుండా విశాల నాగాలాండ్ ఎలా సాధ్యమని అందరూ ఆశ్చర్యపోయారు. అటు ఎన్ఎస్సీఎన్(ఐఎం) నాయ కత్వం కూడా దీన్ని గురించి మాట్లాడలేదు. తమ దీర్ఘకాల డిమాండుకు ‘గౌర వనీయమైన పరిష్కారం’ లభించిందన్నదే వారి జవాబు. సమస్య ఇరుగు పొరుగు రాష్ట్రాలతో ముడిపడి ఉన్నది కనుక ఆ రాష్ట్రాల సీఎంలను కూడా చర్చల్లో భాగస్వాములను చేసి ఉంటే, నాగాల డిమాండులోని సహేతుకతను వారు గుర్తించేలా చేయగలిగితే బహుశా అలాంటి ‘గౌరవనీయమైన పరిష్కారం’ సాధ్యమయ్యేదేమో. ఒప్పందం ఖరారుకు ఇంత సమయం కూడా పట్టేది కాదేమో. ప్రస్తుతం అస్సాం, మణిపూర్, అరుణాచల్ప్రదేశ్లు బీజేపీ పాలిత రాష్ట్రాలు. ఆ రాష్ట్రాలకు చెందిన భూభాగాన్ని నాగాలాండ్కు ధారదత్తం చేస్తారని ఏమాత్రం అనుమానాలు తలెత్తినా అక్కడ రాజకీయంగా తీవ్ర నష్టం చవిచూడాల్సివస్తుందని బీజేపీ అగ్ర నాయకత్వానికి తెలుసు. అందుకే కేంద్ర ప్రభుత్వ ప్రతినిధి ఆర్ఎన్ రవికి, నాగా ప్రతినిధులకు మధ్య కొన్నాళ్లుగా సాగుతున్న చర్చల గురించి ఎవరూ నోరుజారలేదు. బ్రిటిష్ వలస పాలకుల హయాంలో రగుల్కొని స్వాతంత్య్రా నంతరం కూడా కొనసాగుతూ దశాబ్దాలుగా ఎంతో హింసను చవిచూసిన నాగా లాండ్ విషయంలో అన్ని పక్షాలూ పట్టువిడుపులతో వ్యవహరించాలి. ఎన్నికలు సజావుగా సాగడానికి నాగాలాండ్ లోని పార్టీలనూ, సంస్థలనూ ఒప్పించేందుకు... అది సాధ్యపడకపోతే కొద్దికాలం వాటిని వాయిదా వేయడానికి కూడా కేంద్రం వెన కాడకూడదు. సమస్యపై ఒప్పందం కుదిరి, దానికి కొనసాగింపుగా చర్చలు సాగు తున్న ఈ దశలో ఎవరు మొండి పట్టుదలకు పోయినా సమస్య మళ్లీ మొదటి కొస్తుందని మరువకూడదు. -
మూడు రాష్ట్రాలలో మోగిన ఎన్నికల నగరా
సాక్షి, న్యూఢిల్లీ: మూడు ఈశాన్య రాష్ట్రాల ఎన్నిక షెడ్యూల్ విడుదలైంది. కేంద్ర ఎన్నికల సంఘం గురువారం మేఘాలయ, నాగాలాండ్, త్రిపుర రాష్ట్రాలకు ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించింది. రెండు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. త్రిపురలో ఫిబ్రవరి 18, నాగాలాండ్, మేఘాలయాల్లో ఫిబ్రవరి 27 ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఎన్నికల కమిషన్ వెల్లడించింది. ఈ మూడు రాష్ట్రాల్లోనూ మార్చి 3న ఎన్నికల లెక్కింపు జరుగుతుంది. త్రిపుర, నాగాలాండ్, మేఘాలయాల్లో ఒక్కో రాష్ట్రంలో 60 అసెంబ్లీ స్థానాలు ఉండగా, ఎన్నికల్లో ఈవీఎంలకు వీవీ ప్యాట్ మిషన్లను ఏర్పాటు చేయనున్నట్లు ప్రధాన ఎన్నికల కమిషనర్ అచల్ కుమార్ జ్యోతి తెలిపారు. కాగా ఇప్పటికే అన్ని రాష్ట్రాల్లో ఓటర్ల నమోదు ప్రక్రియ పూర్తయిందని, సమస్యాత్మక ప్రాంతాల్లో భద్రత ఏర్పాటు చేశామన్నారు. ఇదిలావుండగా త్రిపురలో 1993 నుంచి సీపీఎం నేతృత్వంలోని లెఫ్ట్ ప్రభుత్వం అధికారంలో ఉంది. ఇక మేఘాలయలో కాంగ్రెస్, నాగాలాండ్లో నాగా పీపుల్స్ ఫ్రంట్ అధికారంలో ఉన్నాయి. త్రిపుర అసెంబ్లీ స్థానాలు - 60 సీపీఎం-50 సీపీఐ-01 బీజేపీ-07 కాంగ్రెస్-02 నాగాలాండ్ అసెంబ్లీ స్థానాలు - 60 ఎన్పీఎఫ్ - 45 బీజేపీ - 04 జేడీ(యూ) - 01 ఎన్సీపీ - 01 స్వతంత్రులు - 08 ఖాళీలు - 01 మేఘాలయ అసెంబ్లీ స్థానాలు - 60 ఐఎన్సీ - 24 యూడీపీ - 07 హెచ్ఎస్పీడీపీ 04 బీజేపీ - 02 ఎన్సీపీ - 02 ఎన్పీపీ- 02 ఎన్ఈఎస్డీపీ -01 స్వతంత్రులు - 01 ఖాళీలు - 09 -
నాగా అసెంబ్లీకి వచ్చేనెల ఎన్నికలు జరిగేనా?
సాక్షి, న్యూఢిల్లీ : నాగాలాండ్ అసెంబ్లీకి వచ్చే ఫిబ్రవరి నెలలో జరగాల్సిన ఎన్నికలు జరిగేనా? 2015లో నాగాలాండ్ సమస్యపై తమతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని అమలు చేయకుండా ఎన్నికలను నిర్వహించినట్లయితే ఆ ఎన్నికలు అర్థరహితం కావడమే కాకుండా కేంద్రం నిజాయితీని శంకించాల్సి వస్తుందని జాతీయ లౌకిక నాగాలిమ్ మండలి (ఎన్ఎస్సీఎన్–ఐఎం) వ్యాఖ్యానించింది. తరతరాల నుంచి నలుగుతున్న సమస్యకు నాగాలు పరిష్కారం ఆశిస్తున్న సమయంలో ఎన్నికలు నిర్వహించడం ఎంత మాత్రం సమంజసం కాదని ఎన్ఎస్సీఎన్ సాయుధ విభాగం మాజీ అధిపతి వీఎస్ ఆటెమ్ అభిప్రాయపడ్డారు. ఈ అభిప్రాయలను పట్టించుకోకుండా కేంద్రం ఏకపక్షంగా రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు ప్రకటిస్తే వాటిని బహిష్కరిస్తారా? అని ప్రశ్నించగా, ముందుగా ఎన్నికల కమిషన్ ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించనీయండి, ఆ తర్వాత చర్చించి ఓ నిర్ణయం తీసుకుంటామని ఆటెమ్ అన్నారు. ఎన్నికలను వాయిదా వేయాలన్న డిమాండ్ను తాము గట్టిగా సమర్థిస్తున్నామని పాలకపక్షం నాగా పీపుల్స్ ఫ్రంట్ తెలిపింది. తాము ముందుగా నాగాల సమస్యకు పరిష్కారాన్నే కోరుకుంటున్నామని రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి ఇమ్కాంగ్ ఇమ్చెన్ తెలిపారు. ముందుగా సమస్య పరిష్కారాన్ని వేగవంతం చేయండని కేంద్రాన్ని కోరుతూ డిసెంబర్ 15వ తేదీన తాము రాష్ట్ర అసెంబ్లీలో ఓ తీర్మానాన్ని ఆమోదించామని కూడా ఆయన చెప్పారు. ఎన్నికల నిర్వహణకే ప్రాధాన్యత ఇచ్చినట్లయితే మళ్లీ నాగా సమాజంలో అనేక చీలికలు ఏర్పడతాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. సమస్య పరిష్కారమై తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటయ్యే అవకాశం ఉన్నప్పుడు ఎన్నికలు నిర్వహించి లాభం లేదని కూడా ఆయన వ్యాఖ్యానించారు. సమస్యకు శాశ్వత పరిష్కారం కనుక్కోవడం, ఎన్నికలు నిర్వహించడం రెండు వేర్వేరు అంశాలని నాగా ప్రభుత్వంలో నాగా పీపుల్స్ ఫ్రంట్తో భాగస్వామిగా కొనసాగుతున్న భారతీయ జనతా పార్టీ వ్యాఖ్యానించింది. ‘మేము కూడా సమస్యకు సత్వర పరిష్కారం కోరుకుంటున్నాం. అయితే టైమన్నది మన చేతిలో లేదు. సమస్య పరిష్కారానికి ఎక్కువ సమయం పట్టవచ్చు. అలాంటప్పుడు ఎన్నికలు నిర్వహించడం మంచిదే. అయినా మేము కేంద్రంలోని ప్రభుత్వం, పార్టీ అధిష్టానానికి కట్టుబడి ఉంటాం’ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు వీ. లౌవుంగు అన్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా ఎన్నికలు నిర్వహించడాన్ని వ్యతిరేకిస్తోంది. అయితే కేంద్రం ఎన్నికలు నిర్వహిస్తే వాటిని బహిష్కరించకుండా పాల్గొంటామని తెలిపింది. నాగాలాండ్లో నాగా పీపుల్స్ ఫ్రంట్తో కలసి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన నేపథ్యంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం 60 ఏళ్లుగా కొనసాగుతున్న ప్రత్యేక నాగాలాండ్ లేదా గ్రేటర్ నాగాలాండ్ డిమాండ్ను పరిష్కరించేందుకు ముందుకు వచ్చింది. 2015లో పలు నాగా గ్రూపులకు ప్రాతినిథ్యం వహిస్తున్న ఎన్ఎస్సీఎన్తో ఒప్పందం కుదుర్చుకుంది. ఆ ఒప్పందం వివరాలు ఏమిటీ ఇప్పటికి కూడా బహిర్గతం కాలేదు. 1997లో కేంద్రంతో కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందంకు ముందు నాగాలు విస్తరించి ఉన్న ఇరుగు పొరుగు రాష్ట్ర ప్రాంతాలను కలిపి గ్రేటర్ నాగాలాండ్ను కేంద్రం ఏర్పాటు చేసేందుకు అంగీకరించిందని, అందులో భాగంగా భారత సార్వభౌమాధికారానికి లోబడి భారత రాజ్యాంగాన్ని గౌరవించేందుకు నాగా గ్రూపులు అంగీకరించాయన్నది ఒప్పందంగా సూచనప్రాయంగా తెల్సింది. దీన్ని ఇటు రాష్ట్ర, కేంద్ర వర్గాలు అవునంటూ ధ్రువీకరించలేదు. కాదని ఖండించనూ లేదు. -
ఈ ఏడాది ఎన్నికలే.. ఎన్నికలు; 8 రాష్ట్రాల్లో పోరు!
సాక్షి, న్యూఢిల్లీ: ఈ ఏడాది మొత్తం ఎనిమిది రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. రానున్న 2019 లోక్సభ ఎన్నికలకు ఈ ఎన్నికల అసలు-సిసలు సెమీఫైనల్ కానున్నాయి. రాజస్థాన్, మధ్యప్రదేశ్, కర్ణాటక, ఛత్తీస్గఢ్, నాగాలాండ్, మేఘాలయ, త్రిపుర, మిజోరం తదితర రాష్ట్రాల్లో ఎన్నికల పోరు జరగనుంది. ఈ ఎనిమిది రాష్ట్రాల నుంచి మొత్తం 99 మంది లోక్సభ ఎంపీలు ఉండటంతో ఈ ఎన్నికలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఈ ఏడాది జరగబోయే చాలా రాష్ట్రాల ఎన్నికల్లో ప్రధానంగా బీజేపీ-కాంగ్రెస్ మధ్య ద్విముఖ పోటీ ఉండనుంది. మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, నాగాలాండ్, త్రిపుర వంటి రాష్ట్రాల్లో బీజేపీ గెలిచే అవకాశమున్నా.. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న కర్ణాటకలో కమలదళానికి విజయం అంత సులువుగా కనిపించే అవకాశాలు కనిపించడం లేదు. రాజస్థాన్లోనూ బీజేపీకి గడ్డు పరిస్థితి ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా రైతుల్లో అశాంతి, నిరుద్యోగ సమస్య, గుజ్జర్ల ఆందోళన బీజేపీ సర్కారును కుదిపేస్తున్నాయి. ఇటీవలి రాజస్థాన్ సర్వేలు కూడా బీజేపీకి ఏమంత పెద్దగా అనుకూలంగా రాలేదు. ఇక, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లో శివ్రాజ్సింగ్ చౌహాన్, రమణ్సింగ్లు నాలుగోసారి తమకు అవకాశం కల్పించాలని ప్రజల ముందుకు వెళ్లబోతున్నారు. దీంతో సహజంగానే ఇక్కడ ప్రభుత్వ వ్యతిరేకత కొంత వ్యక్తమయ్యే అవకాశముందని భావిస్తున్నారు. మేఘాలయలో నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్పీపీ)తో బీజేపీ పొత్తు పెట్టుకునే అవకాశముంది. -
ఒకటి...రెండు...ఇన్నింగ్స్ ముగిసింది!
సాక్షి, గుంటూరు: 1, 0, 0, 0, 0, 0, 0, 0, 0, 0, 0 ఈ అంకెలేంటా అని ఆశ్చర్యపోతున్నారా... ఇవి ఓ క్రికెట్ మ్యాచ్లో బ్యాట్స్మెన్ వరుసగా నమోదు చేసిన స్కోర్లు! మొత్తం పదకొండు మంది కలిసి చేసింది ఒకే ఒక్క పరుగైతే మరో అదనపు పరుగుతో కలుపుకొని జట్టు మొత్తం స్కోరు రెండు. ఈ పరుగులు చేయడానికి ఆ టీం ఆడిన ఓవర్లు 17. అందులో 16 మెయిడిన్లు. క్రీజులోకి వచ్చిన తొమ్మిది మంది ఒక్క పరుగు కూడా చేయకుండానే వెనుదిరిగారు. ప్రత్యర్థి జట్టు బౌలర్లలో ఒక్కరు తప్ప మిగిలిన నలుగురు ఒక్కటంటే ఒక్క పరుగు కూడా ఇవ్వలేదు. ఈ స్వల్ప లక్ష్యాన్ని ఛేదించడానికి ప్రత్యర్థి జట్టుకు కేవలం ఒక్క బంతి సరిపోయింది. ఇవేవో గల్లీ క్రికెట్లో నమోదైన గణాంకాలు కావు. బీసీసీఐ అధికారికంగా నిర్వహిస్తున్న మహిళల జాతీయ అండర్–19 సూపర్ లీగ్ మ్యాచ్లోనివి. జేకేసీ కళాశాల మైదానంలో నాగాలాండ్–కేరళ జట్ల మధ్య శుక్రవారం జరిగిన 50 ఓవర్ల మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన నాగాలాండ్ జట్టు 17 ఓవర్లలో రెండు పరుగులకే కుప్పకూలింది. ఓపెనర్ మేనక ఓ పరుగు చేయగా.. మరో పరుగు వైడ్ రూపంలో లభించింది. మిగిలిన పది మంది సున్నాతో సరిపెట్టారు. కేరళ బౌలర్లలో కెప్టెన్ మిన్ను మణి 4, సౌరభ్య 2 వికెట్లతో నాగాలాండ్ వెన్ను విరిచారు. మూడు పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన కేరళ జట్టు తొలి బంతికే విజయాన్ని సొంతం చేసుకుంది. నాగాలాండ్ బౌలర్ దీపిక వేసిన తొలి బంతి వైడ్గా వెళ్లింది. ఆ మరుసటి బంతిని అన్సు ఫోర్ కొట్టడంతో.. ఆట పూర్తైంది. క్రికెట్ చరిత్రలో ఒక్క బంతికే లక్ష్యాన్ని ఛేదించడంతో పాటు అతి తక్కువ సమయం సాగిన మ్యాచ్ కూడా ఇదే కావడం విశేషం. ఇటీవల ఇదే టోర్నీలో మేఘాలయ జట్టు 17 పరుగులకే కుప్పకూలింది. బిహార్, సిక్కిం జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో సిక్కిం 18 పరుగులకే ఆలౌటై చెత్త ప్రదర్శన నమోదు చేసింది. -
క్రికెట్లో సంచలనం: తొమ్మిది మంది డకౌట్!
సాక్షి, గుంటూరు: దేశీయ క్రికెట్లో సంచలనం చోటు చేసుకుంది. తొలి బంతికే ఓ జట్టు విజయం సాధించింది. శుక్రవారం గుంటూరులోని జేకేసీ కాలేజీ మైదానంలో జరిగిన మహిళల అండర్-19 క్రికెట్ వన్డే లీగ్, నాకౌట్ టోర్నమెంట్ మ్యాచ్లో ఈ అద్భుతం జరిగింది. నాగాలాండ్ జట్టుపై కేరళ టీమ్ మొదటి బంతికే విజయాన్ని అందుకుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన నాగాలాండ్ జట్టు 17 ఓవర్లు ఆడి కేవలం 2 పరుగులకే ఆలౌటైంది. ఇందులో ఒక పరుగు వెడ్ ద్వారా రావడం విశేషం. ఓపెనర్ మేనక 18 బంతులు ఆడి మరొక పరుగు సాధించింది. తొమ్మిది మంది డకౌటయ్యారు. కేరళ కెప్టెన్ మిన్ను మణి నాలుగు ఓవర్లు వేసి ఒక్క పరుగు కూడా ఇవ్వకుండా 4 వికెట్లు పడగొట్టింది. మూడు పరుగుల లక్ష్యంతో తర్వాత బ్యాటింగ్కు దిగిన కేరళ టీమ్ తొలి బంతికే ఫోర్ కొట్టి సంచలన విజయం సాధించింది. తమ జట్టు అద్భుత విజయం సాధించడం పట్ల కేరళ కోచ్ సుమన్ శర్మ సంతోషం వ్యక్తం చేశారు. నాగాలాండ్ 40 పరుగుల వరకు చేస్తుందని అనుకున్నామని, కానీ ఊహించని విధంగా రెండు పరుగులకే కుప్పకూలిందన్నారు. ఈ ఘనత కెప్టెన్ మిన్ను, ఇతర క్రీడాకారిణులకు దక్కుతుందని వ్యాఖ్యానించారు. -
ఒకే మ్యాచ్లో 136 వైడ్లు
న్యూఢిల్లీ: ఒకే మ్యాచ్లో 136 వైడ్ బాల్స్ నమోదు అయ్యాయి. నాగాలాండ్, మణిపూర్ జట్ల మధ్య బుధవారం అండర్-19 మహిళల వన్డే మ్యాచ్ను బీసీసీఐ నిర్వహించింది. ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేపట్టిన నాగాలాండ్ 38 ఓవర్లలో 215 పరుగులకు ఆలౌట్ అయింది. ఈ పరుగుల్లో 94 వైడ్లు ఉన్నాయి. ఇద్దరు మాత్రమే రెండంకెల స్కోరును సాధించారు. తర్వాత బ్యాటింగ్కు దిగిన మణిపూర్ మహిళల జట్టు27.3 ఓవర్లలో 94 పరుగులకు ఆలౌట్ అయింది. ఈ ఇన్నింగ్స్లో 42 వైడ్లు నమోదయ్యాయి. ఈ మ్యాచ్ ధన్బాద్లోని నెహ్రూ స్టేడియంలో జరిగింది. ఈ మ్యాచ్లో ఏకంగా 136 వైడ్ బాల్స్ నమోదవ్వడంతో ఈశాన్య రాష్ట్రాల్లో క్రికెట్ ఇంకా మెరుగు పడాల్సిన అవసముందని నిర్వాహకులు అభిప్రాయపడ్డారు. -
8 రాష్ట్రాల్లో మైనారిటీలుగా హిందువులు!
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలోని ఎనిమిది రాష్ట్రాల్లో హిందువులను మైనారిటీలుగా గుర్తించాలని సుప్రీంకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం ఒక దాఖలైంది. ఆయా రాష్ట్రాల్లో నిత్యం హిందువులపై మానవహక్కుల ఉల్లంఘన జరుగుతోందని అందులో న్యాయవాదులు పేర్కొన్నారు. మైనారిటీ చట్టం 1992ను అనుసరించి ఎనిమిది రాష్ట్రాల్లో హిందువులును మైనారిటీలుగా గుర్తించాలని కోరుతూ బీజేపీ నేత, సీనియర్ అడ్వకేట్ అశ్వనీ కుమార్ ఉపాధ్యాయ సుప్రీంలో పిల్ దాఖలు చేశారు. దేశంలో ప్రస్తుతం మెజారిటీ, మైనారిటీ ప్రాతిపదిక మత రాజకీయాలు పెరిగిపోయాయని పేర్కొంటూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ, న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్లకు ఆయన లేఖ రాశారు. అంతేకాక ప్రస్తుతం కొనసాగుతున్నర బలవంతవు లౌకిక వ్యవస్థ.. ప్రజాస్వామ్యాన్ని ప్రమాదంలో పడేస్తుందని పేర్కొన్నారు. లక్షద్వీప్, మిజోరాం, నాగాలాండ్, మేఘాలయా, జమ్మూ కశ్మీర్, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, పంజాబ్లలో హిందువుల సంఖ్య చాలా తక్కువగా ఉందన్నారు. అందువల్ల ఆయా రాష్ట్రాల్లో హిందువులను మైనారిటీలుగా గుర్తించాలని సుప్రీంకోర్టును అశ్వనీ కుమార్ ఉపాధ్యాయ అభ్యర్థించారు. -
‘ఏ క్షణంలో అయినా నాగాలాండ్ మీద ఎటాక్’
కోహిమా : రోహింగ్యా అక్రమ వలసదారులతో దేశ భద్రత ప్రమాదంలో పడే అవకాశముందని నాగాలాండ్ ఇంటెలిజెన్స్ బ్యూరో కేంద్రానికి తెలిపింది. ఇప్పటికే దేశంలోకి అక్రమంగా వలస వచ్చిన రోహింగ్యాలకు పాకిస్తాన్, బంగ్లాదేశ్లోని ఉగ్రవాద సంస్థలతో సంబంధాలున్నాయని నిఘా వర్గాలు తెలిపాయి. ఇప్పటికే రోహింగ్యాలకు ఆయుధాలు అందించేలా బంగ్లాదేశ్లోని ఉగ్రవాద సంస్థలతో దిమాపూర్ ఇమామ్ చర్చలు జరిపినట్లు నాగాలాండ్ నిఘా వర్గాలు తెలిపాయి. సుమారు 2 వేల మంది రోహింగ్యాలకు రహస్య ప్రదేశంలో ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు ఆయుధ శిక్షణ ఇచ్చినట్లు నిఘా వర్గాలు ధృవీకరించాయి. బలమైన ఆయుధాలతో కూడిన రోహింగ్యాలు ఏ క్షణంలో అయినా నాగాలాండ్ మీద విరుచుకుపడే అవకాశం ఉందని నిఘా వర్గాలు కేంద్రానికి తెలిపాయి. ముఖ్యంగా నాగాలాండ్లోని హెబ్రాన్, ఖేచి క్యాంప్లపై ఆత్మాహుతి దాడి జరిగే అవకాశముందని నాగాలాండ్ నిఘా వర్గాలు తెలిపాయి. సరిహద్దులకు ఆవల ఉన్న రోహింగ్యా శరణార్థి శిబిరాలకు చేరుకున్న ఐఎస్ఐఎస్ తీవ్రవాదులు.. యువతకు మిలటరీ శిక్షణ ఇస్తున్నారని బీఎస్ఎఫ్ ఇన్స్పెక్టర్ జనరల్ (రిటైర్డ్) వీకే గౌర్ స్పష్టం చేశారు. పాకిస్తాన్ కేంద్రంగా పనిచేసే ఉగ్రవాద జమాత్ఘుద్ దవా, జమాత్ ఈ ఇస్లామీ, ఆల్ఖైదా, ఐఎస్ఐ వంటి సంస్థలు కూడా రోహింగ్య శరణార్థి శిబిరాల్లో ప్రవేశించాయని ఆయన తెలిపారు. భారత్-బంగ్లాదేశ్ సరిహద్దుల్లో అత్యంత కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. -
మీకు ఇక్కడ స్థానం లేదు?!
సాక్షి, గువాహటి : అక్రమ బంగ్లాదేశీయులకు మా గ్రామంలో స్థానం లేదు.. ఎవరూ ఇటు రాకండి అంటూ నాగాలండ్లోని ఒక గ్రామం శుక్రవారం తీర్మానం చేసింది. ఇప్పటికే నాగాలాండ్లోని పలు ప్రాంతాల్లో అక్రమ బంగ్లాదేశీ వలసదారులు పెరిగిపోవడం.. వాళ్లు చేసే వికృత చేష్టలను సహించలేక.. చుమ్కేడిమా గ్రామం ఈ విధంగా తీర్మానం చేసింది. తీర్మానం చేయడమేకాకుండా స్థానిక ప్రజల్లో అవగాహన పెంచే ఉద్దేశంతో గ్రామంలో ర్యాలీని సైతం నిర్వహించారు. ఇదిలా ఉండగా.. ఇప్పటికే గ్రామంలో స్థిరపడ్డ వారిలో.. నాగాలాండ్ వాసులు కాని వారిని గుర్తించేందుకు ఈ నెల 9 నుంచి 31 వరకూ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు గ్రామ పెద్దలు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో అక్రమ బంగ్లాదేశీ వలసదారులు బయటపడితే.. వారిని స్థానిక రాయబార కార్యాలయానికి అప్పగిస్తామని ప్రకటించారు. -
ఈశాన్యంలో సైన్యం దాడులు
పాకిస్తాన్తో ఉన్న నియంత్రణ రేఖ(ఎల్ఓసీ) వద్ద యుడి సెక్టార్లో సర్జికల్ దాడులు నిర్వహించి ఏడాది కావస్తుండగా మన సైన్యం బుధవారం వేకువజామున మయన్మార్ సరిహద్దుల వద్ద నేషనల్ సోషలిస్టు కౌన్సిల్ ఆఫ్ నాగాలాండ్ (ఎన్ఎస్సీఎన్)– కప్లాంగ్ వర్గం తీవ్రవాదుల శిబిరాలపై దాడులు నిర్వహించింది. అయితే అంతర్జాతీయ సరిహద్దులు దాటలేదని, ఇవి సర్జికల్ దాడులు కాదని సైన్యం చెబుతోంది. ఎన్ఎస్సీఎన్–కే స్థావరాలు సాధారణంగా మయన్మార్లో ఉంటాయి. కప్లాంగ్ వర్గం మాత్రం తామే సైన్యంపై దాడిచేసి ముగ్గురు జవాన్లను హతమార్చామని, తమపై సైన్యం చేసిన దాడుల్లో ఎలాంటి నష్టమూ లేదని చెప్పు కుంటోంది. 2015లో మన సైన్యం మయన్మార్ భూభాగంలో ఉన్న మణిపూర్ మిలి టెంట్ల స్థావరాలపై దాడులు చేసి పలువురు మిలిటెంట్లను హతమార్చింది. అయితే అనుమతి లేకుండా తమ భూభాగంలోకి చొరబడటం సరికాదని మయన్మార్ తప్పు బట్టింది. బహుశా అందుకే కావొచ్చు... ఈసారి సరిహద్దుకు ఈవలే దాడులు చేసి నట్టు ప్రభుత్వం ప్రకటించింది. స్వాతంత్య్రంతోపాటే సంక్రమించి ఇప్పటికీ కొరకరాని కొయ్యగా ఉన్న అనే కానేక సమస్యల్లో ఈశాన్య రాష్ట్రాల్లోని తీవ్రవాద సమస్య ఒకటి. ఈ ఏడు దశా బ్దాల్లోనూ అక్కడ నాగా గ్రూపులు భద్రతా బలగాలపైనా, పౌరులపైనా విచక్షణా రహితంగా దాడులు చేయడం, వాటికి జవాబుగా భద్రతా బలగాలు కూడా ఎదురు దాడులు చేయడం రివాజుగా కొనసాగుతోంది. వాటికి సమాంతరంగా వివిధ మిలి టెంట్ సంస్థలతో కేంద్ర ప్రభుత్వం చర్చలు సాగిస్తోంది. 1986లో తొలిసారి ఆనాటి ప్రధాని రాజీవ్గాంధీ మిజో నేషనల్ ఫ్రంట్(ఎంఎన్ఎఫ్)తో శాంతి ఒప్పందంపై సంతకాలు కూడా చేశారు. ఒప్పందం పర్యవసానంగా లాల్ డెంగా నేతృత్వంలోని ఆ సంస్థ సాయుధ పోరాటాన్ని విరమించినా ఇతర గ్రూపులు మాత్రం తమ హింసాయుత పంథాను విడనాడలేదు. ఆ తర్వాత సైతం వివిధ మార్గాల్లో ప్రయత్నాలు సాగుతూనే ఉన్నాయి. కానీ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకొచ్చాక రెండేళ్ల క్రితం ఎన్ఎస్సీఎన్(ఇసాక్–మ్యువా) వర్గంతో ఒడంబడిక కుదిరింది. ఆ ఒడంబడికకు కొన్ని నెలల ముందు కప్లాంగ్ వర్గం కేంద్రంతో 2001 నుంచి కొనసాగుతున్న కాల్పుల విరమణ ఒప్పందం నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించి, తిరిగి ‘స్వాతంత్య్ర సమరాన్ని’ ప్రారంభిస్తున్నట్టు ప్రకటించింది. నాగాలకు నాయ కత్వం వహించే ఏకైక సంస్థగా తమను మాత్రమే గుర్తించాలన్నది ఆ వర్గం అభి ప్రాయం. నిజానికి ఆ విషయంలో కేంద్రం జాగ్రత్తగా వ్యవహరించి ఉంటే సమస్య వచ్చేది కాదు. ఇసాక్–మ్యువా వర్గంతో సంబంధాలు ఏర్పడ్డాక కప్లాంగ్ వర్గానికి ప్రాధాన్యం తగ్గించారు. దీంతో ఆ మిలిటెంట్లకు ఆగ్రహం కలిగింది. ఇలా వేర్వేరు వర్గాల మధ్య సాగే ఆధిపత్య పోరు కూడా సమస్యను మొదటికి తెస్తోంది. నిజానికి నాగా సమస్య అంత సులభంగా పరిష్కారమయ్యేది కాదు. బ్రిటిష్ వలస పాలకులుండగానే అక్కడ తిరుగుబాట్లు రగుల్కొని విస్తరించాయి. ఇప్పటి మయన్మార్లోని కొంత ప్రాంతం, ఈశాన్యంలోని మరికొన్ని ప్రాంతాలనూ విలీనం చేసి ఆ భూభాగాన్ని ప్రత్యేక దేశంగా గుర్తించాలన్నది వారి ప్రధాన డిమాండు. వారి పోరాటాల ప్రభావం ఈశాన్యంలోని ఇతర జాతులపై కూడా పడింది. వారు కూడా తిరుగుబాటు మార్గాన్నే ఎంచుకున్నారు. నాగా ఉద్యమమైనా, ఈశాన్యంలోని మరే ఇతర తిరుగుబాటు ఉద్యమాలైనా కాలక్రమంలో చీలికలు పేలికలయ్యాయి. అయినా ఏదో ఒక వర్గం పలుకుబడి పెంచుకుని క్రమేపీ బలపడటం, భద్రతా బల గాలకు సవాలుగా మారడం ఈశాన్యంలో ఎప్పటినుంచో కనిపిస్తున్న ధోరణి. హత్యలు, కిడ్నాపులు, దాడులతో అక్కడ నిరంతర హింస సాగుతోంది. 1960లో నాగా సమస్య పరిష్కారానికి అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ తొలిసారి ప్రయత్నించారు. దాదాపు ఆరు దఫాలు చర్చలు సాగాయి. కానీ నాగా బృందానికి కేటాయించిన బసను వేరే అవసరం కోసం ఆదరాబాదరాగా ఖాళీ చేయించడంతో వారు దాన్ని అవమానంగా భావించారు. ఒక జాతి స్వేచ్ఛాస్వాతంత్య్రాల కోసం పోరా డుతున్న తమకు సమాన స్థాయి కల్పించి గౌరవిస్తే తప్ప చర్చలుండవని ఆ నాయ కులు స్పష్టం చేశారు. హింసాయుత చర్యలకు పాల్పడే వర్గాలను అదుపు చేయడానికి బల ప్రయోగం అవసరం కావొచ్చుగానీ అదే ఏకైక పరిష్కారం కాదు. దానికి సమాం తరంగా చర్చలు సాగించడం కూడా తప్పనిసరి. చర్చలు జరపడం, వారి అభిప్రాయాలేమిటో తెలుసుకోవడం, అందులోని లోటుపాట్ల గురించి తెలియ జెప్పడం నిరంతరంగా సాగవలసిన ప్రక్రియ. వారిలో హేతుబద్ధత తీసుకురా వడం, వారు సాగిస్తున్న పోరాటాల్లోని నిరర్ధకతను ఎత్తిచూపడం ఇందువల్ల సాధ్య మవుతుంది. అదే సమయంలో పాలనాపరంగా ఉన్న లోటుపాట్లను గుర్తించి సవ రణలు చేసుకోవడానికి ప్రభుత్వాలకూ వీలవుతుంది. నిరుడు యుడి సెక్టార్లో పాకి స్తాన్ భూభాగంలో ఉన్న ఉగ్రవాద శిబిరాలపై సర్జికల్ దాడులు చేసిన తర్వాత కూడా అటు నుంచి చొరబాట్లు ఆగలేదు. సరిహద్దుల్లో రెప్ప వాల్చని నిఘా, చొర బాట్లను ప్రోత్సహిస్తున్న పాక్ వైఖరిని ప్రపంచ దేశాల దృష్టికి తీసుకురావడం తదితర చర్యలే అంతిమంగా అక్కడ ఉగ్రవాదాన్ని నియంత్రించడానికి తోడ్పడ తాయి. నిజానికి మన దేశం ఐక్యరాజ్యసమితిలోనూ, వివిధ ప్రపంచవేదికలపైనా ఎప్పటికప్పుడు పాకిస్తాన్ తీరుతెన్నులను ఎండగట్టడం వల్లే ఆ దేశంపై అమెరికా తోసహా పలు దేశాల వైఖరి మారింది. ఈమధ్య జరిగిన బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశాల అనంతరం వెలువడిన ప్రకటన పాకిస్తాన్ ప్రాపకంతో కొనసాగుతున్న ఉగ్రవాద సంస్థలు లష్కరే తొయిబా, జైషే మహమ్మద్ల చర్యలను ఖండించడం మన దౌత్యం సాధించిన విజయమే. మిలిటెంట్లు హింసకు పాల్పడుతున్నప్పుడు, పాల నకు ఆటంకాలు సృష్టిస్తున్నప్పుడు చర్యలు తప్పవు. కానీ వాటిపైనే ఆధారపడ కుండా సమాంతరంగా చర్చలు సాగించడం కూడా అవసరం. కప్లాంగ్ వర్గాన్ని దారికి తీసుకొచ్చేందుకు ఆ మార్గంలో కూడా కేంద్రం కృషి చేయాలి. -
నాగాలాండ్ సీఎంగా జెలియాంగ్
ప్రమాణ స్వీకారం చేయించిన గవర్నర్ పీబీ ఆచార్య కోహిమా: ఈశాన్య రాష్ట్రం నాగాలాండ్లో నెలకొన్న రాజకీయ సంక్షోభం రోజుకో కొత్త మలుపు తీసుకుంటోంది. బుధవారం అసెంబ్లీలో షుర్హోజెలీ లీజిత్సు బల నిరూపణ పరీక్షను ఎదుర్కోవాల్సి ఉండ గా.. ఆయన హాజరుకాలేదు. దీంతో ప్రభు త్వ ఏర్పాటుకు నాగా పీపుల్స్ ఫ్రంట్ (ఎన్పీఎఫ్) నేత టీఆర్ జెలియాంగ్ను గవర్నర్ పీబీ ఆచార్య ఆహ్వానించారు. ఆ వెంటనే జెలియాంగ్తో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈనెల 22లోగా బల నిరూ పణ చేసుకోవాలని గవర్నర్ స్పష్టం చేశారు. ప్రమాణ స్వీకారం అనంతరం జెలియాంగ్ మాట్లాడుతూ, 21న అసెంబ్లీలో బల పరీక్షను ఎదుర్కొంటానని తెలిపారు. ఫ్లోర్ టెస్ట్ తర్వాతనే మంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తారని స్పష్టం చేశారు. మరో వైపు జెలియాంగ్ ప్రమాణ స్వీకారం చేసిన కొద్దిగంటల్లోనే ఆయన్ను పార్టీ నుంచి ఎన్పీఎఫ్ బహిష్కరించింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఆరో పిస్తూ ఆయనను తొలగించింది. బహిష్కరణపై జెలియాంగ్ స్పందిస్తూ.. పార్టీ నుంచి బహిష్కరించినంత మాత్రాన వచ్చిన నష్టమేమీ లేదని, అసెంబ్లీలో తన సభ్యత్వంపై ప్రభావం ఉండద న్నారు. సభలో ఎన్పీఎఫ్ నేతగానే కొన సాగుతా నని చెప్పారు. పురపాలక ఎన్నికల్లో మహిళ లకు 33% రిజర్వేషన్ కల్పించడంపై ఆం దోళనలు చెలరేగడంతో ఫిబ్రవరిలో సీఎం పదవికి జెలియాంగ్ రాజీనామా చేశారు. -
బలపరీక్షకు సీఎం డుమ్మా!
కోహిమా: పదవీగండాన్ని ఎదుర్కొంటున్న నాగాలాండ్ ముఖ్యమంత్రి షుర్హోజెలీ లీజీట్సు బుధవారం అసెంబ్లీ వేదికగా జరిగిన బలపరీక్షకు డుమ్మాకొట్టారు. ఆయన, ఆయన మద్దతుదారులు బలపరీక్షకు హాజరుకాకపోవడంతో స్పీకర్ సభను నిరవధికంగా వాయిదా వేశారు. అధికార నాగాలాండ్ పీపుల్స్ ఫ్రంట్ (ఎన్పీఎఫ్) ఎమ్మెల్యేలు సీఎం లీజీట్సుపై తిరుగుబాటు చేశారు. ముఖ్యమంత్రిపై వారు ఎదురుతిరగడంతో గవర్నర్ పీబీ ఆచార్య అసెంబ్లీ వేదిక విశ్వాసపరీక్ష నిర్వహించాలని స్పీకర్ ఇంటివపాంగ్కు ఆదేశించారు. ఈ మేరకు బుధవారం ఉదయం నిర్వహించిన బలపరీక్షకు మాజీ సీఎం టీఆర్ జెలియంగ్తోపాటు ఎన్పీఎఫ్ రెబల్ ఎమ్మెల్యేలు హాజరయ్యారు. సీఎం లీజీట్సు, ఆయన మద్దతుదారులు మాత్రం రాలేదు. దీంతో ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానాన్ని చేపట్టకుండానే స్పీకర్ అసెంబ్లీని నిరవధికంగా వాయిదా వేస్తూ సైన్ డై చేశారు. -
'13నాటికి సీఎం పదవికి రాజీనామా చేయమన్నారు'
కోహిమా: ఈశాన్య రాష్ట్రం నాగాలాండ్లో నెలకొన్న రాజకీయ సంక్షోభం మరో మలుపు తిరిగింది. ముఖ్యమంత్రి పదవి విషయంలో అధికార నాగాలాండ్ పీపుల్స్ ఫ్రంట్-ఎన్పీఎఫ్లో చీలిక ఏర్పడిన నేపథ్యంలో గవర్నర్ పీబీ ఆచార్య కీలక నిర్ణయం తీసుకున్నారు. బలం నిరూపించుకోవాలని సీఎం లీ జిట్సును గవర్నర్ ఆదేశించారు. ఈ నెల 15న అసెంబ్లీలో విశ్వాస పరీక్ష నిర్వహించాలని సూచించారు. కాగా నాగాలాండ్లో అధికార నాగా పీపుల్స్ ఫ్రంట్ (ఎన్పీఎఫ్) అధినేతగా ఉన్న షుర్హోజెలీ లీజియెట్సు కొత్త ముఖ్యమంత్రిగా మూడు నెలల కిందటే ఎంపికయ్యారు. మొత్తం 48 మంది ఎమ్మెల్యేలలో 42 మంది ఆయనకే మద్దతు పలకడంతో అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న టీఆర్ జెలియాంగ్ రాజీనామా చేశారు. స్థానిక సంస్థల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలన్న జెలియాంగ్ నిర్ణయంపై ఒక్కసారిగా ప్రజాప్రతినిధులు తిరగబడ్డ కారణంగా వారి ఒత్తిడికి తలొగ్గిన ఆయన రాజీనామా చేయడంతో 81 ఏళ్ల లీజియెట్సు పగ్గాలు చేపట్టారు. అయితే, అనూహ్యంగా ఎన్పీఎఫ్ ఎమ్మెల్యేలు రెబల్ అభ్యర్థులుగా మారి లిజియుట్సుకు ఎదురు తిరిగారు. జెలియాంగ్కు మద్దతు పలికారు. దీంతో తనకు మాత్రమే ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసే హక్కు ఉందని, ప్రస్తుతం తనకు 44మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని గవర్నర్కు ఫిర్యాదు చేశారు. మరో నలుగురు బీజేపీ ఎమ్మెల్యేల మద్దతు ఉందని కూడా చెప్పారు. ఈ నేపథ్యంలో లీజియెట్సుకు జూలై 13 వరకు గడువు ఇచ్చినట్లు జెలియాంగ్ తెలిపారు. -
నాగాలాండ్లో రాజకీయ సంక్షోభం
మాజీ సీఎం జెలియాంగ్కు 34 మంది ఎమ్మెల్యేల మద్దతు కోహిమా: ఈశాన్య రాష్ట్రం నాగాలాండ్లో ముఖ్యమంత్రి షుర్హోజెలీ లిజిట్సుపై అధికార ఎన్పీఎఫ్ శాసనసభ్యులు తిరుగుబాటు బావుటా ఎగరవేశారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని మాజీ ముఖ్యమంత్రి టీఆర్ జెలియాంగ్ గవర్నర్ పీబీ ఆచార్యను కోరారు. నాగాలాండ్ అసెం బ్లీలోని 59 మంది ఎమ్మెల్యేలకు గాను తనకు 41 మంది మద్దతుందని గవర్నరుకు పంపిన లేఖలో ఆయన పేర్కొన్నారు. 34 మంది ఎమ్మెల్యేలు నాగా పీపుల్స్ ఫ్రంట్ (ఎన్పీఎఫ్) శాసనసభా పక్ష నేతగా తనను ఎన్నుకున్నారని, ఎన్పీఎఫ్ ఎమ్మెల్యేలతో పాటు ఏడుగురు స్వతంత్ర ఎమ్మెల్యేల మద్దతుందని జెలియాంగ్ వెల్లడించారు. జెలియాంగ్కు మద్దతు పలికిన 34 మంది ఎమ్మెల్యేలు.. అస్సాంలోని కజిరంగా రిసార్ట్ లో క్యాంప్ చేశారు. శనివారం వారంతా సమావేశమై తాజా పరిస్థితులపై చర్చించా రని, నాగాలాండ్ ఎంపీ రియో కూడా ఈ క్యాంప్లోనే ఉన్నారని ఎన్పీఎఫ్ వర్గాలు చెప్పాయి. నలుగురు మంత్రుల్ని, 10 మంది పార్లమెంటరీ కార్యదర్శుల్ని ఆదివారం సీఎం లిజిట్సు తొలగించారు. రాష్ట్రంలో పరిస్థితిని ప్రధాని, కేంద్ర హోం మంత్రికి వివరించేందుకు జెలియాంగ్ ఢిల్లీకి వెళ్లారు. -
మరో రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం
కోహిమా: నాగాలాండ్ రాష్ట్ర ప్రభుత్వంలో ముసలం ముదిరింది. తాను పదవి నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేసిన 10 పార్లమెంటరీ సెక్రటరీలను ముఖ్యమంత్రి డాక్టర్ షురోజిలి లీజిత్సు తొలగించడంతో అధికార నాగా పీపుల్స్ ఫ్రంట్(ఎన్పీఎఫ్) ప్రభుత్వంలో అంతర్గత సంక్షోభం తీవ్రమైంది. మళ్లీ ముఖ్యమంత్రి పదవి చేపట్టేందుకు టీఆర్ జెలియాంగ్ ప్రయత్నిస్తుండడంతో ముసలం మొదలైంది. తనకు 33 మంది ఎన్పీఎఫ్ ఎమ్మెల్యేల మద్దతు ఉందని, ఏడుగురు స్వతంత్ర ఎమ్మెల్యేలు బలపరుస్తున్నారని గవర్నర్ పీబీ ఆచార్యకు శనివారం జెలియాంగ్ లేఖ రాశారు. ఈ నేపథ్యంలో సీఎం పదవి నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేసిన నలుగురు ఎమ్మెల్యేలు, ఆరుగురు స్వతంత్ర ఎమ్మెల్యేలను పార్లమెంటరీ సెక్రటరీ పదవుల నుంచి షురోజిలి లీజిత్సు తొలగించారు. వేటు పడిన వారిలో హెం, విద్యుత్, పర్యావరణ మంత్రులు ఉన్నారు. అలాగే జెలియాంగ్ను ఆర్థిక సలహాదారు పదవి నుంచి తప్పిస్తూ నాగాలాండ్ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీచేసింది. శనివారం సమావేశమైన ఎన్పీఎఫ్ క్రమశిక్షణ సంఘం 10 మంది ఎమ్మెల్యేలను పార్టీ ప్రాథమిక, క్రియాశీలక సభ్యత్వం నుంచి సస్పెండ్ చేసింది. మరోవైపు తన మద్దతు ఇస్తున్న 41 మంది ఎమ్మెల్యేలతో అసోంలోని కాజిరంగా నేషనల్ పార్క్లోని బార్గోస్ రిసార్ట్లో జెలియాంగ్ మంతనాలు జరుపుతున్నారు. జెలియాంగ్ను ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఆహ్వానించాలని, ఆయన నిర్ణయం కోసం వేచిస్తున్నామని ఉద్వాసనకు గురైన అటవీశాఖ మంత్రి ఇమ్కాంగ్ ఎల్ ఇమ్చిన్ తెలిపారు. -
నాగాలాండ్లో ఎన్కౌంటర్
ఆర్మీ మేజర్తో పాటు ముగ్గురు ఉగ్రవాదులు మృతి కోహిమా: నాగాలాండ్లోని మొన్ జిల్లాలోని లప్పా గ్రామంలో మంగళవారం అర్ధరాత్రి భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య ఎన్కౌంటర్ చోటుచేసుకుంది. ఈ దాడిలో ముగ్గురు ఉగ్రవాదులు మృతి చెందగా..భారత సైన్యాని కి చెందిన ఓ మేజర్ అమరులయ్యారు. నేష నలిస్ట్ సోషలిస్ట్ కౌన్సిల్ ఆఫ్ నాగాలాం డ్ (ఎన్ఎస్సీఎన్–కే), ఉల్ఫా ఉగ్రవాదుల కార్యకలాపాలపై భద్రతా బలగాలకు విశ్వసనీయ సమాచారం అందింది. దీంతో భారత సైన్యంతో పాటు 12 పారాచూట్ రెజిమెంట్ అస్సాం రైఫిల్స్తో కలిసి సంయుక్త ఆపరేషన్ నిర్వహించాయి. అయితే భద్రతా బలగాల కదలికల్ని పసిగట్టిన ఉగ్రవాదులు కాల్పులు ప్రారంభించారు. ఈ దాడిలో భారత సైన్యానికి చెందిన మేజర్ డేవిడ్ మన్లున్ అమరులయ్యారు. ప్రతిగా భద్రతా బలగాలు ముగ్గురు ఉగ్రవాదుల్ని హతమార్చాయి. సంఘటనా స్థలం నుంచి ఓ ఏకే–56 రైఫిల్తో పాటు రెండు చైనా తయారీ గ్రెనేడ్లు, మూడు ఐఈడీలు, 270 రౌండ్ల బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. -
అక్కడ పెద్దకూరపై నో నిషేధం: బీజేపీ
ఉత్తరప్రదేశ్లో నూతన బీజేపీ ప్రభుత్వం అక్రమ గోవధశాలలపై ఉక్కుపాదం మోపుతోంది. గోడ్డుమాంసం కబేళాలు, అక్రమ మాంసం దుకాణాలపై కఠిన చర్యలు తీసుకుంటున్నది. దీంతో ఈ ప్రభావం ఈశాన్య రాష్ట్రాలపైనా ప్రతిబింబిస్తున్నది. ఈశాన్య రాష్ట్రాలైన మేఘాలయా, మిజోరం, నాగాల్యాండ్లలో వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్నాయి. క్రైస్తవ మెజారిటీ ప్రజలున్న ఈ రాష్ట్రాల్లో పశుమాంసాన్ని అధికంగా తీసుకుంటారు. ఈ నేపథ్యంలో బీజేపీ ఇక్కడ అధికారంలోకి వస్తే బీఫ్పై నిషేధం తప్పదంటూ పెద్ద ఎత్తున వదంతులు చేలరేగుతున్నాయి. దీంతో ఈశాన్య రాష్ట్రాలలో తాము అధికారంలోకి వస్తే బీఫ్ నిషేధాన్ని అమలుచేసే ప్రసక్తే లేదని బీజేపీ తాజాగా క్లారిటీ ఇచ్చింది. ఈశాన్య రాష్ట్రాల్లో బీఫ్పై నిషేధం విధిస్తారన్న ప్రచారం వట్టిదేనని, స్వార్థరాజకీయ ప్రయోజనాలతోనే కొన్ని గ్రూపులు ఈ వదంతులను ప్రచారం చేస్తున్నాయని మేఘాలయా బీజేపీ చీఫ్ డేవిడ్ ఖర్సాటి స్పష్టం చేశారు. యూపీలో బీఫ్ నిషేధ ప్రభావం తమ రాష్ట్రాలపై ఉండబోదని, ఇక్కడ పశుమాంసంపై ఎలాంటి ఆంక్షలు ఉండవని నాగాలాండ్ బీజేపీ చీఫ్ విససోలీ లౌంగు మీడియాకు తెలిపారు. మేఘాలయా, మిజోరంలలో కాంగ్రెస్ అధికారంలో ఉండగా, నాగాలాండ్లో అధికార నాగా పీపుల్స్ ఫ్రంట్లో బీజేపీ మిత్రపక్షంగా ఉంది. -
టైమ్కు రావల్సిందే: నాగాలాండ్ సీఎం
కోహిమా: ప్రభుత్వ ఉద్యోగులందరు సమయపాలన పాటించాలని నాగలాండ్ నూతన ముఖ్యమంత్రి షురోజిలి లీజిత్సు ఆదేశించారు. ఉద్యోగులదరూ ఉదయం 9.30లోపు తమ కార్యాలయాలకు వెళ్లి విధులు నిర్వర్తించాలని సూచించారు. ట్రాఫిక్ సమస్యలుంటే కొంత ముందుగా బయలుదేరాలని సలహా ఇచ్చారు. ప్రభుత్వం నుంచి జీతాలు తీసుకుంటున్నారనే విషయాన్ని దృష్టిలో ఉంచుకోని ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలందించాలని తెలిపారు. ప్రజలకు ఇబ్బందులు ఎవరు కల్గించవద్దని, తను కూడా కల్గించనన్నారు. తన వల్ల ఏ ఒక్కరు ట్రాఫిక్లో ఇరుక్కోవడం ఇష్టం లేదని పేర్కొన్నారు. ప్రజల సేవకుడినని, నగరమంతా తిరుగుతూ సేవలందిస్తానని లీజిత్సు తెలిపారు. ప్రత్యేక పరిస్థితుల్లో మినహా తనని ప్రయివేటుగా కలుసుకోవడానికి అపాయింట్మెంట్ ఇవ్వద్దని, అధికారులకు సూచించారు. వారు మంత్రులు, ఎమ్మెల్యేలు అధికారులు ఎవరయినా అందరు సెక్రట్రియేట్కు రావలని, అక్కడ అందరికి అందుబాటులో ఉంటానని లీజిత్సు తెలిపారు. -
నాగాలాండ్ సీఎం రాజీనామా
కోహిమా: నాట కీయ పరిణామాల మధ్య నాగాలాండ్ సీఎం టీఆర్ ఝెలియాంగ్ ఆదివారం రాజీ నామా చేశారు. మహిళలకు స్థానిక ఎన్నికల్లో 33 శాతం రిజర్వేషన్ కల్పించాలన్న ప్రభుత్వం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ నాగాలాండ్లో పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్నాయి. శాంతిభద్రతల పరిస్థితి అదుపులోకి రాకపోవటంతో తప్పనిసరి పరిస్థిత్లులో ఝెలియాంగ్ రాజీనామా చేశారు. దీన్ని గవర్నర్ పీబీ ఆచార్య ఆమోదించారు. సోమవారం ఉదయం 11 గంటలకు డెమొక్రటిక్ అలయెన్స్ ఆఫ్ నాగాలాండ్ (డీఏఎన్ ) సమావేశమై కొత్త శాసనసభాపక్ష నేతను ఎన్నుకోనుంది. మాజీ సీఎం, రాష్ట్ర ఏకైక ఎంపీ నేఫియూ రియో తదుపరి సీఎంగా ఎన్నికయ్యే అవకాశాలున్నాయి. 60 మంది ఎమ్మెల్యేలున్న నాగా అసెంబ్లీలో రియోకు 49 మంది ఎమ్మెల్యేల బలముంది. కాగా, రెండ్రోజుల క్రితమే ఝెలియాంగ్ కేంద్ర హోం మంత్రి రాజ్నాథ్ను కలిశారు. -
ఎదురుతిరిగిన ఎమ్మెల్యేలు.. సీఎం రాజీనామా!
న్యూఢిల్లీ/గువాహటి: సొంత పార్టీ ఎమ్మెల్యేలే ఎదురుతిరగడంతో నాగాలాండ్ ముఖ్యమంత్రి టీఆర్ జెలియాంగ్ ఆదివారం తన పదవికి రాజీనామా చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనకు దిగిన గిరిజన గ్రూపులకు మద్దతుగా ఎన్పీఎఫ్ ఎమ్మెల్యేలు సీఎం జెలియాంగ్కు మద్దతు ఉపసంహరించుకున్నారు. దీంతో ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకుంటున్నట్టు జెలియాంగ్ ప్రకటించారు. సోమవారం ఉదయం 10 గంటలకు జరగనున్న ఎన్పీఎఫ్ పార్టీ శాసనసభ్యుల సమావేశంలో కొత్త నాయకుడిని ఎన్నుకోనున్నారని తెలిపారు. నాగా ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రిగా కొత్త నేతను ఎన్నుకునే ప్రక్రియను సజావుగా నిర్వహించాలని, ఈ కార్యక్రమంలో ఎన్పీఎఫ్ సభ్యులంతా పాల్గొనాలని ఆయన విజ్ఞప్తి చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్ కేటాయించాలన్న సీఎం జెలియాంగ్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ నాగాలాండ్ గిరిజన యాక్షన్ కమిటీ ఆందోళనకు దిగిన సంగతి తెలిసిందే. మహిళలకు రిజర్వేషన్ ఇవ్వడం తమ సంప్రదాయానికి విరుద్ధమంటూ గిరిజన గ్రూపులు ఆందోళనకు దిగడంతో నాగాలాండ్ గతకొన్నిరోజులుగా రాజకీయ సంక్షోభంతో అట్టుడుకుతోంది. ఈ నేపథ్యంలో అధికార ఎన్పీఎఫ్ ఎమ్మెల్యేలు కూడా గిరిజన గ్రూపులకు మద్దతు పలుకడంతో టీఆర్ జెలియాంగ్ సీఎం పదవి నుంచి తప్పుకొన్నారు. -
అట్టుడికిన నాగాలాండ్.. రంగంలోకి ఆర్మీ
-
అట్టుడికిన నాగాలాండ్.. రంగంలోకి ఆర్మీ
కోహిమా: మున్సిపల్ ఎన్నికల వ్యవహారం ప్రభుత్వానికి, నాగా గిరిజనులకు తలెత్తిన వివాదం హింసాత్మకంగా మారడంతో నాగాలండ్ అల్లర్లతో అట్టుడికిపోయింది. ముఖ్యమంత్రి టి.ఆర్. జెలియాంగ్ సన్నిహితుల ఇళ్లతోపాటు పలు ప్రభుత్వ భవనాలకు ఆందోళనకారులు నిప్పుపెట్టారు. పరిస్థితితి చేయిదాటుతున్న తరుణంలో ఆర్మీ రంగంలోకి దిగింది. అల్లర్లు వ్యాపించకుండా ముందు జాగ్రత్త చర్యగా మొబైల్ ఇంటర్నెట్ సేవలను నిలిపేశారు. ప్రభుత్వ అధాకారులు చెప్పిన వివరాల ప్రకారం.. నాగారలాండ్లోని 32 మున్సిపాలిటీల ఎన్నికలకు గత నెలలో నోటిఫికేషన్ జారీచేసిన ప్రభుత్వం.. మహిళలకు 33 శాతం రిజర్వేషన్ను కేటాయించింది. దీనిని మెజారిటీ నాగా గిరిజనులు వ్యతిరేకించారు. మహిళలకు కోటా ఇవ్వడం తమ ఆచార,సంప్రదాయాలకు విరుద్ధమని నాగాలు నిరసనలకు దిగారు. రాజ్యాంగంలోని 371(ఎ) అధికరణ తమకు ఆ(మహిళా కోటాను వ్యతిరేకించే హక్కును) కల్పిస్తున్నదని నాగాల వాదన. దీంతో ప్రభుత్వం వారితో చర్చలు జరిపింది. ఒక దశలో ఎన్నికల వాయిదాకు సరేనన్న జెలియాంగ్ సర్కారు.. చివరికి ఎన్నికల నిర్వహణకు పచ్చజెండా ఊపడంతో నాగాలు ఆగ్రహంతో ఊగిపోయారు. షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 1న 11 మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ వేలమంది నాగా గిరిజనులు రోడ్లెక్కారు. ఈ క్రమంలోనే పోలీసులకు, నాగాలకు మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. పోలీసుల కాల్పుల్లో ఇద్దరు నాగా యువకులు చనిపోయారు. చనిపోయిన యువకుల మృతదేహాలతో భారీ ర్యాలీ తీసిన నాగాలు.. గురువారం సాయంత్రం నుంచి రాజధాని కోహిమా సహా రాష్ట్రంలోని పలు ప్రాంతాలను దిగ్భంధించారు. ముఖ్యమంత్రి, ఆయన మంత్రివర్గం రాజీనామా చేయాలని, కాల్పులు జరిపిన పోలీసులను డిస్మిస్ చేయాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. రాత్రికి ఆందోళన కాస్తా హింసాత్మకంగా మారింది. కోహిమా మున్సిపాలిటీ కార్యాలయంతోపాటు ముఖ్యమంత్రి సన్నిహితుల ఇళ్లకు గుర్తుతెలియని వ్యక్తులు నిప్పుపెట్టారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు గురువారం అర్థరాత్రి తర్వాత సైన్యం రంగంలోకి దిగింది. ఐదు శ్రేణుల సైనిక బృందాలు కోహిమాను స్వాధీనం చేసుకుని, పరిస్థితిని అదుపులోకి తెచ్చాయి. ప్రస్తుతం నాగాలాండ్లో అల్లర్లేవీ కొనసాగడంలేదని అసోం రైఫిల్స్ అధికార ప్రతినిధి మీడియాకు చెప్పారు. అల్లర్లు వ్యాపించకుండా ముందుజాగ్రత్త చర్యగా రాష్ట్రమంతటా మొబైల్ ఇంటర్నెట్ సేవలను నిలిపేస్తున్నట్లు అధికారులు తెలిపారు. హింసాత్మక ఘటనల్లో ఎంతమంది చనిపోయింది, గాయపడింది తెలియాల్సిఉంది. -
సీఎం ఇంటికి నిప్పుపెట్టిన ఆందోళనకారులు
-
సీఎం ఇంటికి నిప్పుపెట్టిన ఆందోళనకారులు
కొహిమ : మున్సిపల్ ఎన్నికలు వాయిదా వేయాలన్న డిమాండ్కు ప్రభుత్వం దిగి రాకపోవడంతో నాగాలాండ్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనకారులు బీభత్సం సృష్టించారు. డిమపుర్లో సీఎం జిలియంగ్ నివాసంతోపాటూ కొహిమ మున్సిపల్ కౌన్సిల్ బిల్డింగ్కు ఆందోళనకారులు నిప్పుపెట్టారు.